భద్రత కట్టుదిట్టం
విజయనగరం క్రైమ్: సీఎం పర్యటన 1200 మంది పోలీసుల భద్రత నడుమ కట్టుదిట్టంగా సాగింది. రోడ్లన్నీ మూసేశారు. సీఎం కాన్వాయ్ వెళ్లేవరకు ప్రధాన కూడళ్లలో రాకపోకలు నిలిపివేశారు. దీంతో అత్యవసర వేళ వెళ్లేవారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పింఛన్ల సొమ్ములో చిరిగిన నోట్లు
వంగర: మండలంలోని వివిధ గ్రామాల్లో పెన్షన్లు పంపిణీలో చిరిగిన నోట్లు బయటపడ్డాయి. మద్దివలస, ఎం.సీతారాంపురం, శివ్వాం, తలగాం తదితర గ్రామాల్లో రూ.500 నోట్లు కట్టల్లో చిరిగిన నోట్లు ఉండడంతో వాటిని తీసుకునేందుకు లబ్ధిదారులు ససేమిరా అన్నారు. అధిక సంఖ్యలో నోట్లు సరిగ్గా లేకపోవడంతో పెన్షన్ సొమ్మును సోమవారం ఇస్తామని సచివాలయాల ఉద్యోగులు లబ్ధిదారులకు తెలియజేశారు.
భద్రత కట్టుదిట్టం
భద్రత కట్టుదిట్టం


