breaking news
Vizianagaram District Latest News
-
నేడు వైఎస్సార్సీపీ కార్యాలయంలో స్వాతంత్య్ర వేడుకలు
విజయనగరం: వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో శనివారం స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహించనున్నట్టు జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 8.30 గంటలకు దాసన్నపేట రింగ్రోడ్డు కూడలిలోని పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొనాలని కోరారు. గవర్నర్ ఎట్ హోమ్కు ఆహ్వానం విజయనగరం గంటస్తంభం: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని లోక్భవన్లో గవర్నర్ నిర్వహించే ఎట్ హోమ్ కార్యక్రమానికి విజయనగరం జిల్లాకు చెందిన ఇద్దరికి ప్రత్యేక ఆహ్వానం లభించింది. పర్యావరణ పరిరక్షణలో విశేష కృషి చేసిన ఫారెస్ట్ రేంజ్ అధికారి బిర్లంగి రామనరేష్, ఒలింపిక్స్ విజేతల విభాగంలో వల్లూరి అజయ్బాబుకు ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపిక చేశారు. ఆగస్టు 15న సాయంత్రం 4 గంటలకు లోక్భవన్లో జరిగే ఎట్హోమ్ కార్యక్రమానికి వీరిద్దరూ హాజరుకానున్నారు. యువత భవితకు ‘మై భారత్’ బాట విజయనగరం గంటస్తంభం: యువత ఉజ్వల భవిత కోసం మై భారత్ పోర్టల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎన్నో అవకాశాలు కల్పిస్తోందని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) సత్తిబాబు తెలిపారు. కలెక్టరేట్లో మై భారత్ జిల్లా సమన్వయ కమిటీ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మై భారత్ జిల్లా యువజన అధికారి ప్రేమ్ భరత్కుమార్ జిల్లాలో చేపడుతున్న యువజన కార్యక్రమాలను వివరించారు. జిల్లాలోని యువతీయువకులు మై భారత్ పోర్టల్లో వివరాలు నమోదు చేసుకుని, నైపుణ్యాభివృద్ధి, ఇతర అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
జాతీయ అథ్లెటిక్ పోటీలకు గుమ్మలక్ష్మీపురం విద్యార్థులు
గుమ్మలక్ష్మీపురం: జాతీయ స్థాయి అథ్లెటిక్ పోటీలకు గుమ్మలక్ష్మీపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థినులు బిడ్డిక స్పందన, ఆరిక దివ్య, చోడిపల్లి ప్రశాంతి ఎంపికై నట్లు పీడీ పత్తిక చంద్రమోహన్, కోచ్ ఆరిక జోగులు తెలిపారు. ఈ మేరకు విద్యార్థినులను శుక్రవారం ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఈనెల 11, 12, 13వ తేదీల్లో తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ స్టేడియంలో (తారకరామ) జరిగిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ పోటీల్లో తమ కళాశాలకు చెందిన విద్యార్థినులు పాల్గొన్నారన్నారు. అండర్ – 20 విభాగంలో 800 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందెంలో బిడ్డిక స్పందన ఉత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించిందని తెలిపారు. అలాగే అండర్ – 18 విభాగం హెప్టాథ్లాన్ పోటీల్లో పాల్గొన్న ఆరిక దివ్య కూడా గోల్డ్ మెడల్ను కై వశం చేసుకుందన్నారు. అండర్ – 20 విభాగం లాంగ్జంప్లో పాల్గొన్న చోడిపల్లి ప్రశాంతి బ్రాంజ్ మెడల్ సాధించి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 6 వరకు పుదుచ్చేరిలో జరగనున్న జాతీయ స్థాయి అథ్లెటిక్ పోటీల్లో వీరు పాల్గొంటారన్నారు. -
జి.అగ్రహారంలో మాంగనీసు దొంగలు
చీపురుపల్లి: అందరూ నిద్రపోయేవేళ చీపురుపల్లి మేజర్ పంచాయతీ పరిధిలోని జి.అగ్రహారం గ్రామ పొలిమేరలో దొంగలు పడ్డారు. జేసీబీలతో వచ్చి మాంగనీసు తవ్వకాలకు ఉపక్రమించారు. ఒకే సారి రూ.లక్షల సొమ్ము జేబులో వేసుకునేందుకు సిద్ధపడ్డారు. చకచకా తవ్వకాలు చేపట్టి ఏడు లారీల్లో మాంగనీసు ఖనిజాన్ని తరలించారు. అయితే, గ్రామస్తులు మేల్కొని తవ్వకాలను అడ్డుకోవడం, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అధికార బలం ఉన్న బడా దొంగలు తోకముడిచి పరారయ్యారు. పక్కా స్కెచ్తో... చీపురుపల్లి మేజర్ పంచాయతీ పరిధిలోని జి.అగ్రహారం పరిసరాల్లో డంపింగ్ యార్డు ఉంది. మేజర్ పంచాయతీ నుంచి వచ్చే వ్యర్థాలు అక్కడే పారబోస్తారు. అదే డంపింగ్ యార్డు కిందన మాంగనీసు గనులు ఉన్నాయని తెలుసుకున్న బడా దొంగలు వాటిని కొల్లగొట్టేందుకు స్కెచ్ వేశారు. దీంతో గురువారం అర్థరాత్రి జేసీబీ, యంత్రాలతో పాటు ఏడు లారీలు ఏర్పాటు చేసి మాంగనీసు అక్రమ తవ్వకాలు ప్రారంభించారు. దాదాపు ఏడు లారీల్లో మాంగనీసు అక్రమ రవాణా జరిపారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అర్థరాత్రి సమయంలోనే అక్కడకు వెళ్లి మాంగనీసు అక్రమ తవ్వకాలు అడ్డుకున్నారు. అంతేకాకుండా పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసు సిబ్బంది వెళ్లడంతో బడా దొంగలు వాహనాలతో పాటు పరారయ్యారు. ఇదే విషయంపై ఎస్ఐ ఉమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మాంగనీసు అక్రమ తవ్వకాలపై అందిన సమాచారం మేరకు సిబ్బందిని పంపించామన్నారు. అప్పటికే ఖాళీ వాహనాలు అటువైపుగా వెళ్తున్నాయని, వారిని తమ సిబ్బంది విచారించగా కిరాయికి వెళ్లి వస్తున్నట్లు చెప్పారని, అందులో ఎలాంటి మాంగనీసు లేదని స్పష్టం చేశారు. జేసీబీతో తవ్వకాలు అర్థరాత్రి వేళ జేసీబీలతో అక్రమ తవ్వకాలు ఏడు లారీలతో తరలింపు స్థానికుల సమాచారం మేరకు పోలీసుల రాకతో పరార్ -
రావిపల్లికి అరుదైన గౌరవం
విజయనగరం క్రైమ్: సాహితీ స్రవంతి సభ్యుడు రావుపల్లి వాసుదేవరావుకు మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం లభించింది. ఆయన రచించిన బాలగేయాలను మహారాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ధృవీకరించి, ఆ రాష్ట్రంలోని మూడు, నాలుగో తరగతి తెలుగు పాఠ్యపుస్తకాలలో ప్రచురించింది. పూసపాటిరేగ మండలం తిప్పలవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా పనిచేస్తున్న రావిపల్లి వాసుదేవరావు, సాహిత్యంపై ఉన్న మక్కువతో ఇప్పటివరకు 250కి పైగా బాల గేయాలు, 40కి పైగా కథలు రాశారు. ఆయన సాహిత్య కృషికి గుర్తింపుగా 2024 సంవత్సరానికి గాను విజయనగరం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును కూడా అందుకున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లో తన గేయాలు ప్రచురితం కావడంపై వాసుదేవరావు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి చీకటి దివాకర్, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ జీవీఎస్ జయపాలరావు, ప్రధాన కార్యదర్శి పాయల మురళీకృష్ణ, కె. శ్రీనివాసరావు, చీకటి చంద్రికరాణి రచయిత వాసుదేవరావుకు అభినందనలు తెలియజేశారు. -
నిరుద్యోగుల నిరసన
● కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య 10వేలకు పెంచాలంటూ ఆందోళన విజయనగరం: ఎన్నికలకు ముందు లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తాం... ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం.. జాబ్ వచ్చేవరకు నిరుద్యో గభృతి కింద నెలకు రూ.3వేలు చెల్లిస్తామన్నారు.. రెండేళ్లుగా మొండి చేయి చూపుతున్నారంటూ చంద్రబాబు సర్కారుపై నిరుద్యోగులు నిప్పులుచెరిగారు. ఏపీ నిరుద్యోగ, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం విజయనగరం జిల్లా కేంద్రంలో ఆందోళన చేశారు. పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీచేయాలని, పోస్టుల సంఖ్యను 10 వేలకు, వయోపరిమితిని 35 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. కోట కూడలిలో ప్లకార్డులు ప్రదర్శించారు. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ రామచంద్ర మాట్లాడుతూ తాజాగా కేవలం 2,500 పోలీసు ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేస్తామని హోం మంత్రి అనిత ప్రకటించడం నిరుద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. రాష్ట్రంలో 19,999 పోలీస్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, పోలీస్ సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని హోంమంత్రి స్వయంగా అసెంబ్లీలో చేసిన ప్రకటనను గుర్తుచేశారు. వేల సంఖ్యలో ఖాళీలు ఉన్నప్పటికీ, అన్ని కేటగిరీలు కలుపుకొని కేవలం 2,500 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామని ప్రకటించడం సమంజసం కాదన్నారు. కార్యక్రమంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న నిరుద్యోగ యువత పాల్గొన్నారు. -
త్రివర్ణపతాక స్ఫూర్తి.. ఉప్పొంగిన దేశభక్తి
● 150 అడుగుల పతాకంతో స్వాతంత్య్ర ర్యాలీ ● పంద్రాగస్టు వేడుకలకు ఏర్పాట్లు పూర్తి విజయనగరం గంటస్తంభం/టౌన్/క్రైమ్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు విజయనగరం ముస్తాబైంది. జిల్లా కేంద్రంలో శుక్రవారం సాగిన 150 అడుగుల త్రివర్ణ పతాక ప్రదర్శన దేశభక్తిని చాటింది. మన దేశం–మన బాధ్యత నినాదంతో సాగిన ర్యాలీని రాష్ట్ర ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గురజాడ అప్పారావు చెప్పిన దేశమంటే మట్టి కాదోయ్..దేశమంటే మనుషులోయ్ స్ఫూర్తి వ్యాక్యాన్ని వినిపించారు. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర–2047 లక్ష్యాల సాధనకు సమష్టిగా కృషి చేయాలని కోరారు. స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల సేవలను స్మరించుకోవాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి సూచించారు. దేశానికి యువతే వెన్నెముక అని, దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కోరారు. కార్యక్రమంలో డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, ఆర్డీఓ సుధాసాగర్, మున్సిపల్ కమిషనర్ బాలస్వామి, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ పాణి, డీఎస్డీఓ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
ఇవేం పరీక్షలు బాబోయ్..
రామభద్రపురం: ఈ నెల 17వ తేదీ నుంచి ప్రస్తుత విద్యాసంవత్సరం ఫార్మేటివ్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దీంతో బాబోయ్ పరీక్షల కష్టాలు వచ్చి పడ్డాయ్ అంటూ ఉపాధ్యాయులు బెంబేలెత్తిపోతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలతో విద్యావ్యవస్థను అస్తవ్యస్తంగా మార్చిందని విమర్శలు వెల్లువెత్తున్నాయి. తాజాగా ఫార్మేటివ్, సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలను బుక్లెట్ విధానంలో నిర్వహించనుండడంతో అటు విద్యార్థులు, ఇటు ఉపాధ్యాయులకు ఇబ్బందులు తప్పవు. ప్రాథమిక విద్యలో ఇప్పుడిప్పుడే అక్షరాలు నేర్చుకుంటున్న చిన్నారులకు సైతం బుక్లెట్ ఇవ్వడంపై ఉపాధ్యాయ సంఘాలు విస్తుపోతున్నాయి. జిల్లాలో 1766 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వీటిలో సుమారు 1.10 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థి అభ్యసనా సామర్థ్యం మదింపు కోసం ఏటా నాలుగు ఫార్మేటివ్ అసెస్మెంట్, రెండు సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు నిర్వహిస్తారు. అయితే మొదటి పరీక్ష జూన్, జూలై సిలబస్కు సంబంధించి విద్యార్థుల సామర్థ్యాలపై ఈ నెల 17 నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే ఈ పరీక్షలను మూల్యంకన అసెస్మెంట్ పుస్తకంలో రాయించి, మార్కులను ఆన్లైన్ చేయించాలి. ఇదిలా ఉంటే ప్రశ్నలు పాఠ్యాంశాలలో ఉన్న అంశాల నుంచే కాకుండా, బయట నుంచి విద్యార్థి స్థాయిని మించిన అంశాలు ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రాథమిక స్థాయిలో అక్షరాలే సరిగా రాయలేని పిల్లలకు ప్రశ్నపత్రాలు ఇచ్చి బుక్లెట్లో రాయమంటే ఎలా అని విద్యావంతులు మండిపడుతున్నారు. టీచర్లపై అదనపు భారం.. విద్యాశాఖ ప్రతి ఏడాదీ సర్కారు బడుల్లో విద్యార్థులకు నిర్వహించే త్రైమాసిక, అర్ధ, వార్షిక పరీక్షలను ఎఫ్ఏ 1,2,3,4.. ఎస్ఏ 1,2 లుగా నిర్వహిస్తారు. ఈ పరీక్షలను మూల్యాంకనం పుస్తకాల్లో రాసేందుకు వీలుగా 1,2 తరగతులకు మూడు పుస్తకాలు.. 3,4,5 తరగతులకు నాలుగు పుస్తకాలు.. 6,7 తరగతులకు ఆరు పుస్తకాలు.. 8,9,10 తరగతులకు 7 పుస్తకాలు చొప్పున అందజేస్తున్నారు. ఏడాదిలో జరిగే అన్ని పరీక్షల వివరాలను ఈ మూల్యంకన పుస్తకంలో నమోదు చేసేందుకు ఏడాదంతా ఈ పుస్తకాన్ని టీచర్లు భద్రంగా ఉంచాలి. అయితే గతంలో పరీక్షలు విద్యార్థులు తెల్లకాగితాలపై రాస్తే ఉపాధ్యాయులు ఇంటికి తీసుకెళ్లి మూల్యాంకనం చేసేవారు. తర్వాత మార్కుల నమోదుతో ప్రక్రియ పూర్తయ్యేది. ప్రస్తుతం బుక్లెట్లో రాస్తుండడంతో వీటని ఇంటికి తీసుకెళ్లలేని పరిస్థితి. తప్పనిసరిగా పాఠశాలల్లోనే దిద్దాల్సి ఉంటుంది. దీంతో తరగతి గదిలో సమయం అంతా వృథా అవుతుండడంతో సిలబస్ పూర్తి చేయలేని పరిస్థితులు నెలకొంటాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఒకే బుక్లెట్లో పరీక్షలు రాయాల్సి రావడంతో త్రైమాసిక పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలు.. అర్ధ సంవత్సరం పరీక్షల్లో కూడా ఇస్తే విద్యార్థులు గతంలో తాము రాసిన సమాధానాలనే తిరిగి చూసి రాసుకునే అవకాశం ఉంటుంది. ఈ నెల 17 నుంచి ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు ప్రారంభం బుక్లెట్ విధానంతో అటు విద్యార్థులు, ఇటు ఉపాధ్యాయులకు ఇబ్బందులే పాత విధానమే మేలంటున్న ఉపాధ్యాయులువిద్యార్థులకు ఉపయోగమే.. సమగ్ర మూల్యాంకనం పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తున్నాం. మూల్యాంకన పుస్తకంలో జవాబులు రాయడం వల్ల విద్యార్థులకు ఎంతో ఉపయోగం. ఒక విద్యార్థికి సంబంధించి అన్ని సబ్జెక్టుల మార్కులతో పాటు విద్యార్థి వివరాలన్నీ మూల్యాంకన పుస్తకంలో నమోదు చేసేలా ఉన్నత విద్యాశాఖ అసెస్మెంట్ బుక్లెట్ డిజైన్ చేసింది. టీచర్లు భారం అంటే ఎలా అవుతుంది. విద్యార్థి సౌలభ్యం కోసం కొంత కష్టపడాల్సిందే. – ఎ. తిరుమలప్రసాద్, ఎంఈఓ, రామభద్రపురం -
గాంధీకి గుడి కట్టిన దేశభక్తులు
రాజాం: రాజాం పట్టణంలో స్వాతంత్య్ర సాధనకు చిహ్నంగా మహాత్మాగాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించి శెగిడి వీధిలో గుడి కట్టారు. ఆ వీధికి గాంధీ వీధిగా నామకరణం చేశారు. 1996లో దాత దొంతంశెట్టి రమణ సాయంతో పైడిరాజు, డి.మలయ్య గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఏటా స్వాతంత్య్రవేడుకలతో పాటు గాంధీ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తారు. జాతీయోధ్యమ స్ఫూర్తిని వీధివాసులకు వివరిస్తారు. రాజాం సిటీ: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజాం పట్టణ పరిధి కస్సావీధికి చెందిన సూక్ష్మ చిత్రకళాకారుడు ముగడ జగదీష్ రూపొందించిన సూక్ష్మ వెండి భారతదేశం పలువురిని ఆకట్టుకుంది. 2.200 మిల్లీ గ్రాముల వెండితో 3 సెంటీమీటర్ల పొడవు, 3 సెంటీ మీటర్ల వెడల్పుతో భారతదేశ చిత్రపటం, అందులో జాతీయ జెండాను రూపొందించారు. దీనిని తయారుచేయడానికి మూడు గంటల సమయం పట్టిందని ఆయన తెలిపారు. గాంధీ గుడిఆకట్టుకున్న వెండి భారత్ -
దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఫ్యాటీ లివర్
● సర్వజన ఆస్పత్రి సూపరింటిండెంట్ పద్మజ విజయనగరం ఫోర్ట్: ధీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం, కొలెస్ట్రాల్ సమస్యలు, హైపో థైరాయిడిజం వంటి మెటబాలిక్ రిస్క్ ఫ్యాక్టర్లు ఉన్నవారిలో ఫ్యాటీ లివర్, కాలేయ ఫైబ్రోసిస్ వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటిండెంట్ అల్లు పద్మజ అన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ‘మెటబాలిక్ సిండ్రోమ్ – ఫ్యాటీ లివర్’పై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడుతూ.. ఫైబ్రోస్కాన్ ద్వారా కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం, ఫైబ్రోసిస్ స్థాయిని అంచనా వేయవచ్చునని తెలిపారు. ఫ్యాటీలివర్ను కేవలం కాలేయానికి సంబంధించిన వ్యాధిగా మాత్రమే చూడకూడదన్నారు. మెటబాలిక్ సిండ్రోమ్ చికిత్సలో ఫిజీషియన్ పాత్ర అత్యంత కీలకమని చెప్పారు. బీపీ, సుగర్, థైరాయిడ్, ఊబకాయం, ఫ్యాటీలివర్ ఉన్నవారు కాలేయ ఆరోగ్యంతో పాటు మొత్తం మెటబాలిక్ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. కార్యక్రమంలో జనరల్ మెడిసిన్ హెచ్ఓడీ డాక్టర్ సుదర్శి, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మీసౌజన్య, జనరల్ సర్జరీ విభాగం వైద్యులు చైతన్యబాబు, డాక్టర్ వెంకటనాయుడు, డాక్టర్ హర్షవర్థన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
జెండా అండగా మద్యం దందా
రాజాం: ఏ పార్టీ జెండానైనా సాధించిన విజయాలు, అందించిన సంక్షేమ పథకాలు, తమ సిద్ధాంతాలకు మద్దతుగా ప్రదర్శించడం పరిపాటి. టీడీపీ జెండాలను మాత్రం అక్రమ సంపాదనకు, వ్యాపారానికి అడ్డు పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. విజయనగరం జిల్లా రాజాం మండలం ముద్దాడజోగివలస (ఎం.జె.వలస) గ్రామంలో ప్రధాన రహదారికి ఆనుకుని ఓ టీడీపీ కార్యకర్త పసుపు జెండా సాక్షిగా బెల్టుషాపు నిర్వహిస్తూ అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నాడు. అధికారుల దాడులు ఉండకూడదని బడ్డీకొట్టుకు టీడీపీ జెండా కట్టాడు. రాత్రి, పగలు తేడాలేకుండా విక్రయాలు జరుపుతున్నాడు. గ్రామంలో ఏడాదిపాటు మద్యం విక్రయించుకునేందుకు రూ.1.50 లక్షలకు ఈ వ్యాపారి వేలం పాడుకున్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు. ఒక్కో బాటిల్పై రూ.50లు వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు తెలిపారు. దర్జాగా బెల్టుషాపు నిర్వహణబెల్టుషాపుపై టీడీపీ జెండాబెల్టుషాపులో మద్యం విక్రయాలు -
ఒడిశాలో చంపి.. ఆంధ్రాలో పాతిపెట్టి..
గజపతినగరం రూరల్: ప్రేమ పేరుతో సహజీవనం సాగించిన యువతిని హతమార్చి, మృతదేహాన్ని మండలంలోని మరుపల్లి గ్రామ సమీపంలో గల మామిడి తోటలో పాతిపెట్టిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఒడిశాలో నమోదైన హత్య కేసు దర్యాప్తులో భాగంగా మరుపల్లి సమీపంలోని మామిడి తోటలో పాతిపెట్టిన యువతి మృతదేహాన్ని శుక్రవారం పోలీసులు వెలికితీశారు. ఈ కేసుకి సంబంధించి గజపతినగరం ఎస్సై కె. కిరణ్కుమార్నాయుడు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రం సిమ్లిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో హత్య కేసు నమోదు కాగా.. కేసు దర్యాప్తులో భాగంగా అక్కడి పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ అజిత ఆధ్వర్యంలో సిబ్బంది గజపతినగరం పోలీసులను ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఒడిశాలో నమోదైన హత్య కేసు వివరాలను స్థానిక పోలీసులకు వివరించారు. నిందితుడు మోహన్ కిల్లా ఇచ్చిన సమాచారంతో ఒడిశా, గజపతినగరం పోలీసులు సంయుక్తంగా మండలంలోని మరుపల్లి సమీపంలోగల మామిడి తోటలో మృతదేహాన్ని పాతిపెట్టిన స్థలాన్ని గుర్తించారు. గజపతినగరం తహసీల్దార్, పోలీసులతో పాటు ఒడిశా నుంచి వచ్చిన పోలీస్ అధికారులు, ప్రాంతీయ ఫోరెన్సిక్ అధికారులు, మృతురాలి కుటుంబ సభ్యుల సమక్షంలో మృతదేహాన్ని బయటకు తీశారు. రెండేళ్లుగా సహజీవనం.. పోలీసుల వివరాల ప్రకారం..ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా దశవంతుపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని డంబో – తునకల్ గ్రామానికి చెందిన అల్బీన గరుడ (22) రెండేళ్లుగా సునాబెడాకు చెందిన మోహన్ కిల్లాతో సహజీవనం సాగించింది. ఈ క్రమంలో జూలై 28న ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన మోహన్ కిల్లా ప్రియురాలు అల్బీనాను హత్య చేశాడు. మరుచటి రోజు మృతదేహాన్ని గజపతినగరం మండలం మరుపల్లి సమీపంలోని మామిడి తోటకు తీసుకొచ్చి పాతిపెట్టాడు. ప్రియురాలిని చంపిన ప్రియుడు ప్రియుడి దొంగ నాటకం.. హత్య అనంతరం మోహన్ కిల్లా సునాబేడకు వెళ్లి, ఆగస్టు 1న అల్బీన గరుడ కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అల్బీన తండ్రి బెనూధర్ గరుడకు..మోహన్ కిల్లాపై అనుమానం రావడంతో అతడే తన కుమారైను హత్యచేసి ఉంటాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మోహన్ కిల్లాను అదుపులోకి తీసుకుని విచారించగా, హత్య చేసినట్లు ఒడిశా పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించాడు. ఒడిశా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రూపాయికే సిమ్ కార్డు
● బీఎస్ఎన్ఎల్ డిప్యూటీ జీఎం సత్యప్రసాద్ విజయనగరం క్రైమ్ : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రూపాయికే బీఎస్ఎన్ఎల్ సిమ్కార్డు అందజేస్తున్నట్లు ఆ శాఖ డిప్యూటీ మేనేజర్ సత్యప్రసాద్ తెలిపారు. శుక్రవారం స్థానిక టెలికం భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వన్ రూపీ సిమ్ వేసుకుంటే రోజుకు వన్ జీబీ డేటా, వంద ఎస్ఎంఎస్లు, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ 24 రోజుల వ్యాలిడిటీ ఉంటుందన్నారు. మారుమూల గ్రామాలకు సైతం బీఎస్ఎన్ఎల్ సేవలు విస్తరిస్తున్నట్లు చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా పూర్తి స్వదేవీ పరిజ్ఞానంతో 4జీ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఏజీంఎం సేల్స్ హెడ్ శ్రీధర్, నెట్వర్క్ హెడ్ మురళీధర్, డీఈలు శారద, దాలినాయుడు, శ్రీనివాసరావు, శ్రీనివాసరావు, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి నియోజకవర్గంలో జంతు ఆశ్రమం
విజయనగరం గంటస్తంభం: జంతు సంక్షేమాన్ని మరింత బలోపేతం చేసేందుకు గాను ప్రతి నియోజకవర్గంలో జంతు ఆశ్రమం నెలకొల్పాలని జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్ సత్తిబాబు ఆదేశించారు. శుక్రవారం స్థానిక డీఆర్ఓ చాంబర్లో జిల్లా స్థాయి ఎస్పీసీఏ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జంతు హింసకు చెక్ పెట్టాలన్నారు. ఈ మేరకు పాఠశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. వీబీ జీ రామ్ జీ పథకంలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో జంతు ఆశ్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. రక్షించిన జంతువులకు ఆహారం, వైద్యం, పునరావాసం కల్పించేలా షెల్టర్లను అభివృద్ధి చేయాలని సూచించారు. పోలీస్, పశుసంవర్థక, రవాణా, మున్సిపల్, పంచాయతీ శాఖల సమన్వయంతో పశువుల అక్రమ రవాణాను అరికట్టాలన్నారు. పాఠశాలల్లో యానిమల్ కై ండ్నెస్ క్లబ్స్ ఏర్పాటు చేసి విద్యార్థుల్లో జంతువుల పట్ల దయ, కరుణ ఏర్పడేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో పశుసంవర్థక శాఖ జేడీ డా.ఎస్.మన్మధరావు, జెడ్పీ సీఈఓ ఎ.లవరాజు, డీపీఓ డీవీ మల్లికార్జునరావు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ కె.సాంబమూర్తి, బొబ్బిలి డీఎస్పీ ఆర్.గోవిందరావు, డీఈఓ, సూపరింటిండెంట్ ఎస్.సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్ సత్తిబాబు -
టీడీపీ బెదిరింపులకు భయపడం..
సాలూరు: టీడీపీ నేతల ప్రలోభాలకు, ఒత్తిడులకు భయపడేది లేదని.. ప్రాణం పోయేవరకూ వైఎస్సార్సీపీతోనే ఉంటామని గిరిజన నాయకులు స్పష్టం చేశారు. మండలానికి చెందిన మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, ముఖ్య నాయకులు మండలంలోని తోణాం సమీపంలో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొరను ఆహ్వానించారు. ఈ సందర్భంగా పలువురు గిరిజన నాయకులు మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల నుంచి టీడీపీలోకి చేరికలు జరుగుతున్నాయంటూ వస్తున్న ప్రచారాల్లో వాస్తవం లేదన్నారు. టీడీపీలోకి వస్తే రుణాలు ఇప్పిస్తామని, ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందిస్తామని టీడీపీ నాయకులు ప్రలోభాలకు గురి చేస్తున్న మాట వాస్తవమే అయినప్పటికీ ఎవ్వరం పార్టీ మారబోమని స్పష్టం చేశారు. ఎక్కడో ఒకరిద్దరు ఒత్తిడికి భయపడి పార్టీ మారితే.. వందల సంఖ్యలో చేరినట్లు టీడీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని చెప్పారు. గిరిజనులమంతా ఐక్యంగా ఉండి వైఎస్సార్సీపీని మరింత బలోపేతం చేస్తామన్నారు. అనంతరం రాజన్నదొర మాట్లాడుతూ.. నేటి ఆధునిక సమాజంలో గిరిజనులను ఎవ్వరు బెదిరించలేరని.. ఒకవేళ ఎవరైనా బెదిరించాలనుకున్నా భయపడేవారే లేరన్నారు. గిరిజనులకు వైఎస్సార్సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. టీడీపీ మోసపూరిత హామీలతో గిరిజనులను మోసం చేస్తే, వైఎస్సార్సీపీ సంక్షేమ పథకాలతో అండగా నిలిచిందని చెప్పారు. డీఎస్సీపై చర్చకు బాధిత అభ్యర్థులే సిద్ధంగా ఉన్నారని, వారితో చర్చకు వెళ్లి టీడీపీ నాయకులు తమ చిత్దశుద్ధి నిరూపించుకోవాలని సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు మువ్వల ఆదయ్య, దండి శ్రీనివాసరావు, చోడిపల్లి బీసు, గమ్మెల బీసు, కొండపల్లి సింహాచలం, రాజారావు, గమ్మెల సుబ్బు, నెమలిపిట్ట కల్యాణ్, కొండగొర్రి ఉదయ్, జయసింహ, తదితరులు పాల్గొన్నారు. ప్రాణం పోయే వరకూ వైఎస్సార్సీపీతోనే ఉంటాం స్పష్టం చేసిన గిరిజన ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలు గిరిజనులకు అండగా ఉంటాం: మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర -
దబ్బిరాజుపేటలో చోరీ
● ఐదు తులాల బంగారు ఆభరణాలు, రూ. 97 వేల నగదు అపహరణ వేపాడ: మండలంలోని వల్లంపూడి పోలీస్స్టేషన్ పరిధి దబ్బిరాజుపేటలో చోరీ జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుదర్శన్ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన వానపల్లి సూర్యకుమారి (అంగన్వాడీ కార్యకర్త ) 15 రోజుల కిందట ఇంటిలోని బీరువాలో ఐదు తులాల బంగారు ఆభరణాలు, రూ. 97 వేల నగదు పెట్టంది. శుక్రవారం ఉదయం ఏడున్నర గంటలకు వాటిని తీద్దామని బీరువా తెరిస్తే బంగారు ఆభరణాలు, నగదు కనిపించలేదు. ఎప్పుడు చోరీ జరిగిందో కూడా అర్థం కావడం లేదని బాధితురాలు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విజయనగరం నుంచి క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ను రప్పించి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. త్వరలోనే కేసును ఛేదిస్తామని ఎస్సై తెలిపారు. -
ఉపాధ్యాయుల మెరుపు ధర్నా
బొబ్బిలి/బొబ్బిలి రూరల్: ఉప ఖజానా కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం సాయంత్రం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వివిధ సంఘాల నాయకులు మెరుపు ధర్నాకు దిగారు. ఎంటీఎస్ ఉపాధ్యాయుల జీతాల బిల్లులు పెట్టేందుకు రూ.10వేల లంచం అడుగుతూ ఎస్టీఓ మోకాలొడ్డుతున్నారని ఎస్టీఓ జిల్లా అధ్యక్షుడు కురమాన జోగారావు ఆరోపించారు. లంచం అడగడంపై ప్రశ్నించినందుకు తనను, ఎంఈఓలను దూషించారని, తనపై పోలీసు ఫిర్యాదు ఇచ్చారన్నారు. ఎస్టీఓ పనితీరు బాగులేని ఆరోపించారు. ఎస్టీఓ అక్రమాలు, అవినీతిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ ఎం.శ్రీనుకు వినతిపత్రం అందజేశారు. -
నత్తనడకగా రీ సర్వే..!
● నాడు చకచకా.. నేడు తికమకగా... ● సర్వేపై రైతుల్లో ఆందోళన ● జాయింట్ ఎల్పీఎంలతో తప్పని తిప్పలు విజయనగరం గంటస్తంభం: జిల్లాలో భూముల సమగ్ర సర్వే రెండేళ్లుగా నత్తనడకగా సాగుతోంది. రైతన్నలను ఆందోళనకు గురిచేస్తోంది. దేశంలోనే వందేళ్ల తర్వాత గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా చేపట్టిన శాశ్వత భూహక్కు–భూరక్ష సమగ్ర రీ–సర్వే ప్రక్రియ విజయనగరం జిల్లాలో ఒక విప్లవంగా సాగింది. డ్రోన్లు, రోవర్లు వంటి అత్యాధునిక సాంకేతికతతో జిల్లా పరిధిలోని వందలాది గ్రామాల్లో సకాలంలో పనులు పూర్తి చేసి, వేలాది మంది రైతులకు క్యూఆర్ కోడ్తో కూడిన ఆధునిక భూహక్కు పత్రాలను అందించారు. ఉచితంగా మ్యుటేషన్లు, ల్యాండ్ పార్సెల్ మ్యాప్లతో పాటు రైతుకు రూపాయి ఖర్చు లేకుండా సరిహద్దు వివాదాలకు ముగింపు పలికారు. అయితే, నేడు చంద్రబాబు ప్రభుత్వం ఏలుబడిలో ఆ పరిస్థితి తలకిందులైంది. నాడు అత్యంత వేగంగా సాగిన రీ–సర్వే ప్రక్రియ నేడు నత్తనడకగా సాగుతోంది. ఇప్పటికే పూర్తికావాల్సిన ప్రక్రియ ఇంకా కొనసాగుతుండడం, భూహద్దు సమస్యలు పరిష్కరిస్తూ హద్దురాళ్లు వేయకపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ● గడువులన్నీ గాలికి... విజయనగరం జిల్లాలో మొత్తం 27 మండలాల పరిధిలోని 983 రెవెన్యూ గ్రామాల్లో రీ–సర్వే పూర్తి చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 2 మండలాల్లో మాత్రమే ప్రక్రియ తుదిదశకు చేరింది. 639 గ్రామాల్లో పనులు సాగుతున్నాయని చెబుతున్నా రికార్డులు సరిగ్గా వెబ్ల్యాండ్లో నమోదుకాలేదు. 344 గ్రామాల్లో రైతుల భూ రికార్డులు ఇంకా గాలిలోనే ఉన్నాయి. సర్వే పురోగతి 65 శాతంగా ఉంది. సర్వే బృందాలను కుదించడమే కాకుండా, ప్రతి దశకు నిర్ణయించిన గడువులను కూటమి సర్కారు నీరుగార్చింది. డ్రాఫ్ట్ పాస్బుక్ల జారీ, తహసీల్దార్ పరిశీలన, జేసీ ఆమోదం వంటి కీలక దశల్లో ఫైళ్లు నెలల తరబడి మగ్గిపోతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ● జాయింట్ ఎల్పీఎంలతో తిప్పలు.. రీ–సర్వేలో ప్రధాన సమస్యగా జాయింట్ ఎల్పీఎంల వ్యవహారం మారింది. జిల్లాలో 1,35,465 జాయింట్ ఎల్పీఎంలు ఉండగా 1,07,835 పూర్తయ్యాయి. ఇంకా 27,630 పరిష్కరించాల్సింది. ఒకే భూమిపై పలువురి పేర్లు ఉండడం, వారసత్వం, విభజన తదితర కారణాలతో వీటి పరిష్కారానికి సమయం పడుతోంది. ఫలితంగా రైతులు తమ వాటా, హక్కులు స్పష్టంగా రికార్డుల్లో నమోదయ్యే వరకు ఎదురుచూడాల్సి వస్తోంది. ● పేరు మారింది.. సమస్య తీరిందా? భూ రికార్డులను ఆధునీకరించి రైతులకు స్పష్టమైన హక్కులు కల్పించాలనే లక్ష్యంతో గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రీ–సర్వేను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. డ్రోన్లు, ఆధునిక సర్వే పరికరాలు, డిజిటల్ రికార్డుల అనుసంధానంతో ప్రక్రియను ముందుకు తీసుకెళ్లింది. ప్రభుత్వం మారిన తర్వాత కొంతకాలం నిలిచిపోయిన ప్రక్రియ.. ఇప్పుడు రీ–సర్వే 2.0 పేరుతో కొనసాగుతోంది. అయితే, పేరు మార్చినంత వేగంగా పనులు జరగడం లేదని రైతులు విమర్శిస్తున్నారు. -
పాము కాటుతో వ్యక్తి మృతి
వంగర: మండల పరిధి మగ్గూరు గ్రామానికి చెందిన మూడడ్ల బాలకృష్ణ (46) పాముకాటుతో గురువారం మృతి చెందినట్లు ఎస్సై షేక్ శంకర్ తెలిపారు. ఈ నెల 9వ తేదీ రాత్రి కాలకృత్యాలు తీర్చుకోవడానికి బయటకు వచ్చిన బాలకృష్ణకు పాము కరిచింది. వెంటనే కుటుంబ సభ్యులు స్పందించి బాధితుడ్ని రాజాం సీహెచ్సీకి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారన్నారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య గౌరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలి ‘సర్’
విజయనగరం గంటస్తంభం: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్–2026) ప్రక్రియను ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోగా పూర్తిచేయాలని జిల్లా ఎన్నికల అధికారులు, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, బీఎల్ఓలకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్యాదవ్ సూచించారు. జిల్లా ఎన్నికల అధికారులతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ఆయన మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 1847 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి బీఎల్ఓ, బీఎల్ఏ సమావేశాల మినిట్స్ను బీఎల్ఓ యాప్లో శతశాతం అప్లోడ్ చేశామని, ముసాయిదా ఓటర్ల జాబితాలు, ఏఎస్డీడీ జాబితాలు అందుబాటులో ఉంచామన్నారు. జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా 1,93,733 నోటీసులు జనరేట్ చేయగా, వాటిలో 66,428 నోటీసులు పంపిణీ అయ్యాయని, మిగిలిన నోటీసులు ఈ నెల 20వ తేదీలోగా అందజేస్తామన్నారు. సెప్టెంబర్ 14వ తేదీలోగా విచారణ పూర్తిచేస్తామని చెప్పారు. జిల్లాలో ఫారం–6లు 5,056, ఫారం–7లు 134, ఫారం–8లు 3,603 అందాయని, వీటిని నిబంధనల ప్రకారం పరిశీలించి నిర్దేశిత గడవులోగా పరిష్కరిస్తామన్నారు. సర్పై అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో ప్రత్యేక ప్రచారదినాలు నిర్వహిస్తామని, ఆయా రోజుల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కేంద్రాల్లో బీఎల్ఓలు, రాజకీయ పార్టీల ఏజెంట్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. చికిత్స పొందుతూ వివాహిత మృతి దత్తిరాజేరు: మండలంలోని వంగర పంచాయతీ మధుర గ్రామమైన ముద్దనపేట గ్రామానికి చెందిన పిట్ట అశ్విని (33) చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. పెదమానాపురం ఎస్సై కళాధర్ తెలియజేసిన వివరాల మేరకు.. అశ్విని పదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఎంతమంది వైద్యులను సంప్రదించినా ఫలితం లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ నెల పదో తేదీన ఇంటిలో ఉన్న పురుగు మందు తాగింది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను విజయనగరం సర్వజన ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందింది. మృతిరాలి భర్త ఒడిశా రాష్ట్రంలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. ఆమె మామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి.. పూసపాటిరేగ: మండలంలోని నక్కానపేట సాయిస్తూపం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా, మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. పూసపాటిరేగ గ్రామానికి చెందిన తిరుమలరాజు సాయివర్మ (29) తన స్నేహితుడితో కలిసి గురువారం సాయంత్రం చింతపల్లి నుంచి పూసపాటిరేగకు బుల్లెట్పై వస్తుండగా.. సరిగ్గా సాయి స్తూపం వద్దకు వచ్చేసరికి లారీ ఢీ కొనడంతో సాయివర్మ అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న అతని స్నేహితుడికి స్వల్ప గాయాలయ్యాయి. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం కేంద్రాస్పత్రికికి తరలించారు. పూసపాటిరేగ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఘనంగా వార్షిక ఇంటర్ డ్రిల్ పోటీలు
విజయనగరం రూరల్: కోరుకొండ సైనిక పాఠశాలలో వార్షిక ఇంటర్ డ్రిల్ పోటీలు – 2026 ఘనంగా నిర్వహించారు. ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రిన్సిపాల్, గ్రూప్ కెప్టెన్ ఎస్ఎస్ శాస్త్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సైనిక క్రమశిక్షణ, కచ్ఛితత్వం, మిలటరీ శైలి, జట్టు స్ఫూర్తి, పాఠశాల సాంప్రదాయాన్ని చాటిచెప్పేలా ఈ పోటీలు జరిగాయి. జూనియర్, సీనియర్ విభాగాలకు చెందిన అన్ని హౌస్ల క్యాడెట్లు ఈ పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపారు. జూనియర్ విభాగంలో కాకతీయ హౌస్ ఉత్తమ మార్చింగ్ ట్రూప్గా ఎంపిక కాగా, హౌస్ కెప్టెన్ జి.గౌతమ్ ఉత్తమ ట్రూప్ కమాండర్ అవార్డును అందుకున్నారు. సీనియర్ విభాగంలో గజపతి హౌస్ ఉత్తమ మార్చింగ్ ట్రూప్గా నిలవగా.. కెప్టెన్ సాయిలోహిత్ ఉత్తమ అవార్డును అందుకున్నారు. అవార్డులను ప్రిన్సిపాల్ ఎస్ఎస్ శాస్త్రి విజేతలకు అందజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ వింగ్ కమాండర్ కిరణ్.వి, కెప్టెన్ సెంథిల్కుమార్, సుబేదార్ రవీందర్ కుమార్, హవల్దార్ శ్రవణ్కుమార్ సింగ్లు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. -
డీఎస్సీ అక్రమాలతో లోకేశ్కు సంబంధం లేదు
● ‘స్వతంత్ర’ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు ● మంత్రి లోకేశ్ను కాపాడేందుకే ఈ వ్యాఖ్యలంటూ విమర్శలు విజయనగరం అర్బన్: స్పోర్ట్స్ కోటా జీఓ ఆధారంగా డీఎస్సీ–2025లో జరిగిన నియామకాలకు, విద్యాశాఖ మంత్రి లోకేశ్కు ఎలాంటి సంబంధంలేదని.. అదంతా క్రీడల శాఖ మంత్రి, స్పోర్ట్స్ అథారిటీ పరిధిలోనే జరిగిందని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ స్వతంత్ర ఎమ్మెల్సీ డాక్టర్ గాదె శ్రీనివాసులునాయుడు వ్యాఖ్యానించారు. స్పోర్ట్స్ కోటాలో 430 నుంచి 460 వరకు ఉపాధ్యాయ పోస్టుల కేటాయింపు, సర్టిఫికెట్ల పరిశీలనలో తీవ్ర మార్పులు, చేర్పులు జరిగాయని బాధిత అభ్యర్థులు పెద్దఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రశ్నపత్రం లీకేజీ, నియామకాల్లో నకిలీ పత్రాలు, అక్రమాలు చోటుచేసుకున్నందున ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తుంటే.. శ్రీనివాసులునాయుడు మాత్రం ‘అందులో తప్పులు జరిగి ఉంటే అది క్రీడల శాఖది తప్ప, మంత్రి లోకేశ్ది కాదు’ అని చెప్పడం చర్చనీయాంశమవుతోంది. ఎమ్మెల్సీ వ్యాఖ్యలతో అక్రమాలు జరగడం వాస్తవమేనని, కాకపోతే ఆ నిందను లోకేశ్పై పడకుండా క్రీడా శాఖపైకి నెట్టేసే కుట్ర జరుగుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, తుది ఫలితాల్లో తీవ్ర అన్యాయం జరిగిందని లక్షలాది మంది డీఎస్సీ అభ్యర్థులు రోడ్డెక్కుతుంటే, ఇవేవీ పట్టని ఎమ్మెల్సీ ప్రభుత్వం ఇచ్చే స్క్రిప్ట్ను యథాతథంగా చదివేస్తూ ఉపాధ్యాయ సమాజానికి ద్రోహం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్సీతో ప్రెస్మీట్లు పెట్టించి అక్రమాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటని బాధిత డీఎస్సీ అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. -
పింఛన్ల పంపిణీపై లబ్ధిదారుల సంతృప్తి తెలుసుకోవాలి
● కలెక్టర్ రాంసుందర్ రెడ్డి విజయనగరం ఫోర్ట్: పింఛన్ల పంపిణీలో లబ్ధిదారుల సంతృప్తినే సేవల నాణ్యతకు అసలైన కొలమానంగా తీసుకోవాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పింఛన్ల పంపిణీ, ఐవీఆర్ఎస్లో నమోదువుతున్న ప్రజాభిప్రాయం, సచివాలయల పనితీరుపై గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్లో అధికారులతో సమీక్షించారు. ఇంటి వద్ద పింఛన్ల పంపిణీ అంశంపై 85.64 శాతం సానుకూల స్పందన నమోదైందని, ఇది గత ఆరు నెలల సగటు 88.49 శాతంలో పోలిస్తే 2.85 శాతం పాయింట్లు తగ్గిందన్నారు. మొదటి రోజే ఇంటి వద్ద పింఛన్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. పింఛన్ అనేది ప్రభుత్వ హక్కు అని, దానికోసం లబ్ధిదారులు ఎవరికీ ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. 75 శాతం కంటే తక్కువ సంతృప్తి ఉన్న సచివాలయాలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ శ్రీనివాసపాణి, జెడ్పీ సీఈఓ లోవరాజు, తదితరులు పాల్గొన్నారు. -
బ్యాంక్ ఉద్యోగుల నిరసన
విజయనగరం అర్బన్: ఐదు రోజుల పనిదినాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్బీయూ) పిలుపు మేరకు దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఇందులో భాగంగా పట్టణంలోని ఎస్బీఐ కోట బ్రాంచ్ వద్ద బుధవారం బ్యాంక్ ఉద్యోగులు, నాయకులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. 12వ బైపార్టెడ్ సెటిల్మెంట్లో కుదిరిన ఒప్పందం ప్రకారం వారానికి 5 రోజుల పనిదినాల నిబంధనను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. కార్యక్రమంలో విజయనగరం జిల్లా యూఎఫ్బీయూ కన్వీనర్ మురళీశ్రీనివాస్, జిల్లా బ్యాంక్ ఎంప్లాయీస్ కో–ఆర్డినేషన్ కమిటీ ప్రెసిడెంట్ బీవీప్రసాద్, ఎస్బీఐ ఉద్యోగుల సంఘం రీజినల్ సెక్రటరీ ఎం.రమేష్కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఐవీరమణమూర్తి, అమరావతి సర్కిల్ ఓబీసీ అసోషియేషన్ ప్రెసిడెంట్ పి.సంతోష్కుమార్, వివిధ బ్యాంకులకు చెందిన నాయకులు శ్రవణ్కుమార్, భానోజీరావు, రవికుమార్, అశోక్ నాయక్, నాగభూషణరావు, శ్రీనివాస్ రావు, చిన్నారావు, మనోజ్ వర్మ, అచ్యుత్, మురళి తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా ఎంపిక పోటీలు
పార్వతీపురం రూరల్: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘అమరావతి చాంపియన్న్షిప్–2026’ జిల్లా స్థాయి ఎంపిక పోటీలు బుధవారం ఉత్సాహంగా సాగాయి. స్థానిక శ్రీ వేంకటేశ్వర డిగ్రీ కళాశాల, డీఎస్ ఇండోర్ స్టేడియం, ఆఫీసర్స్ క్లబ్ వేదికగా జరిగిన ఈ క్రీడా సంగ్రామంలో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల నుంచి 280 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.అండర్–17, అండర్–23 విభాగాల్లో నిర్వహించిన బాక్సింగ్, చదరంగం, ఖో–ఖో, యోగా, వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో యువత తమ ప్రతిభ చాటారు. అండర్–17 చెస్లో బాలుర విభాగంలో జి.చైతన్య, టి.గిరి ప్రకాష్, బాలికల విభాగంలో వి.మహాలక్ష్మి, వి.చిరుమనస అగ్రస్థానాల్లో నిలిచారు. ఖో–ఖో (బాలురు, బాలికలు) రెండు విభాగాల్లోనూ పాలకొండ జట్లు ప్రథమ, కురుపాం జట్లు ద్వితీయ స్థానాలను కై వసం చేసుకున్నాయి. బాక్సింగ్లో రోహిత్, పుష్కర్, తేజస్విని, మనీషా..యోగాలో జి.భారత్ అఖిల్, పి.గాయత్రి, పి.జాహ్నవి సత్తా చాటారు. అండర్–23 విభాగంలో చెస్లో ఎస్.దేవా, బి.సూర్య..యోగాలో కె.స్వాతి, కె.సాయిసుధ విజేతలుగా నిలిచారు.వివిధ క్రీడాంశాల్లోని 23 కేటగిరీలకు గాను రాష్ట్రస్థాయికి జిల్లా జట్లను ఎంపిక చేసినట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (డీఎస్డీఓ) కె.శ్రీధరరావు వెల్లడించారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.రామకృష్ణ, ఎస్జీఎఫ్ కార్యదర్శి పి.మురళితో పాటు పలువురు ఇనన్చార్జులు, క్రీడా ప్రాధికార సంస్థ కోచ్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
శుభకార్యాలకు వేళాయె..!
వీరఘట్టం: సకల శుభాల శ్రావణ మాసం వచ్చేసింది. పూజలు, నోములు, వ్రతాలకు నెలవైన శ్రావణమాసం ఈనెల 13 నుంచి ప్రారంభం కానుంది. ఈ మాసంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు, పవిత్రోత్సవాలు, కృష్ణాష్టమి వేడుకల నేపథ్యంలో ఆలయాల్లో భక్తుల సౌలభ్యం కోసం ఆలయ నిర్వహణ కమిటీలు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ మాసంలో ఇంటింటా శ్రావణ శోభ కనిపిస్తుంది. అయితే ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి ఓ విశిష్టత ఉంది. అందుచేత మహిళలు ఈరోజును ఎంతో పవిత్రమైన రోజుగా భావిస్తారు.గత నెల రోజులుగా ఆషాడం కావడంతో ముహూర్తాలు లేవు. ఈనెల 13 నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుండడంతో మహిళలు శ్రావణ లక్ష్మీ వ్రతాలను ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 14న మొదటి శుక్రవారం కావడంతో తమ ఇళ్లల్లో, ఆలయాల్లో శ్రావణ లక్ష్మికి పూజలు చేసేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. పౌర్ణమినాడు చంద్రుడు శ్రవణా నక్షత్రం మీద సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణం అనే పేరు వచ్చింది. ఈ నెలలో వచ్చే శుక్రవారాలను వ్రతాలకు, నోములకు కేటాయించడం వెనుక పెద్ద కథే ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి నక్షత్రం కూడా శ్రవణమే. కావున ఆయన భార్య లక్ష్మీదేవికి, సోదరి గౌరికి శ్రావణ శుక్రవారాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు.శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాలు చేస్తారు. శ్రావణమాసానికి అత్యంత ప్రాధాన్యం సకల సుఖాలను ఒసగే శ్రావణ మాసం జ్ఞానస్ధితిని అందిస్తుంది.హరిహర భేదం లేదని నిరూపించే శ్రావణమాసంలో వైష్ణవారాధనతో పాటు మహాశివునికి పెద్ద ఎత్తున రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు.ముఖ్యంగా వివాహాది శుభకార్యాలకు శ్రావణ మాసంలో మంచిముహూర్తాలు ఉన్నాయి. నేటినుంచి శ్రావణం మాసం ప్రారంభం ఆగస్టు 21న వరలక్ష్మీ వ్రతం 28న రాఖీ పండగ సెప్టెంబర్ 4న శ్రీకృష్ణ జన్మాష్టమి పూజలు చేసుకునేందుకు సిద్ధమవుతున్న మహిళలుపురోహితులు శ్రావణ మాసాన్ని నోముల మాసంగా లెక్కిస్తారు.శ్రావణంలో మంగళగౌరీ వ్రతం, వరలక్ష్మి వ్రతాలను ఆచరిస్తారు. మంగళగౌరి వ్రతాన్ని శ్రావణంలో వచ్చే ఏ మంగళవారమైనా చేయవచ్చు. ఈ వ్రతాన్ని యువతులు పైళ్లెన తర్వాత ఏడాది వరకు ఆచరిస్తారు.వరలక్ష్మీ వ్రతాన్ని పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం జరుపుకుంటారు.ఈ వ్రతాన్ని జీవితాంతం ఆచరిస్తారు. ముఖ్యమైన పండగలు.. శ్రావణ మాసమంతా పండగల సందడి ఉంటుంది.ఈ నెల 14న తొలి శుక్రవారం ఆగస్టు 21న రెండవ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం,ఆగస్టు 28న మూడవ శుక్రవారం రాఖీ పండగ, అదే రోజు జంధ్యాల పౌర్ణమి, అంతేకాకుండా అదే రోజు హయగ్రీవ జయంతి, సంతోషిమాత జన్మదినం కూడా. సెప్టెంబర్ 4న నాల్గవ శుక్రవారం, అదే రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వంటి ముఖ్యమైన పండగలు శ్రావణ మాసంలో ఉన్నాయి.సెప్టెంబర్ 11న ఐదవ శుక్రవారంతో శ్రావణ మాసం ముగుస్తుంది.శ్రావణం పూర్తయిన వెంటనే ప్రారంభమయ్యే భాద్రపదం మాసం ఈ ఏడాది సెప్టెంబర్ 14న జరగనున్న వినాయకచవితితో ప్రారంభం కానుంది. శ్రావణ మాసంలో వ్రతాలతో పాటు పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, శుభాకార్యాలకు మంచి రోజులు కావడంతో శుభకార్యాలు చేపట్టేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఆగస్టు నెలలో 14,15,16,17,20,21,22,23,26,27,28,30,31 అలాగే సెప్టెంబర్లో 4,5,6,7 తేదీల్లో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. -
ఘనంగా జాతీయ గ్రంథాలయదారుల దినోత్సవం
విజయనగరం రూరల్: గ్రంథాలయ శాస్త్ర పితామహుడు, ఆధునిక గ్రంథాలయ ఉద్యమ మార్గదర్శకుడు ఎస్.ఆర్.రంగనాథన్ 134వ జయంతిని పురస్కరించుకుని స్థానిక జేఎన్టీయూ–జీవీలో బుధవారం జాతీయ గ్రంథాలయదారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జేఎన్టీయూ – జీవీ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలోని డాక్టర్ వైఎస్ఆర్ కేంద్ర గ్రంథాలయంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కోట చంద్రభూషణరావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ముందుగా ఎస్ఆర్ రంగనాథన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ పుస్తక పఠనం వ్యక్తిత్వ వికాసానికి, ఆలోచనా విధానానికి, జ్ఞానాభివృద్ధికి, ఉన్నతమైన వృత్తి నిర్మాణానికి ఎంతో దోహదపడుతుందన్నారు. విద్యార్థులు ప్రతిరోజూ కనీసం ఒక గంట సమయాన్ని గ్రంథాలయంలో గడిపి పుస్తకాలు చదవడాన్ని అలవాటుగా చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి డీడీవీ శివరామ్ రోలంగి, గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. కేంద్రియ గిరిజన విశ్వవిద్యాలయంలో.. స్థానిక కేంద్రియ గిరిజన విశ్వవిద్యాలయంలో జాతీయ గ్రంథాలయదారుల దినోత్పవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి ఉపకులపతి టి.శ్రీనివాసన్ తొలుత డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సీటీయూ గ్రంథాలయాధికారి డాక్టర్ కె.శంకర్రెడ్డి, ముక్కామల శరత్చంద్రబాబు, డాక్టర్ దాసరి నారాయణ, పి.శ్రీదేవి, అనిరుధ్కుమార్, సురేష్బాబు, బొంతు కోటయ్య, ఎన్వీఎస్ సూర్యనారాయణ, దివ్య, తారకేశ్వరరావు పాల్గొన్నారు. -
వెదురు సాగు పెంచేందుకు బేంబూ మిషన్
● ప్రణాళికను రూపొందించాలని ఆదేశించిన కలెక్టర్విజయనగరం గంటస్తంభం: బేంబూ మిషన్ లో భాగంగా జిల్లాలో వెదురుసాగును పెంచేందుకు వారం రోజుల్లో కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. జిల్లాలో బేంబూ మిషన్ అమలుకు ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ సభ్యులైన పార్వతీపురం ఐటీడీఏ పీఓ ఆర్.వైశాలి, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస పాణి, జిల్లా అటవీశాఖ అధికారి సోమసుందర్ తో, కలెక్టర్ తన చాంబర్ నుంచి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం జిల్లాలో వెదురు సాగు పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెదురు సాగు చేపట్టేందుకు అనుగుణమైన భూములను గుర్తించాలని ఆదేశించారు. అటవీ భూముల్లో ఖాళీ స్థలాలను, చెట్లను నరికివేసిన స్థలాలను, అదనంగా సాగు చేయదలచిన స్థలాలను గుర్తించి, వెదురు సాగు చేపట్టాలని సూచించారు. ఐటీడీఏ ద్వారా మెంటాడ, ఎస్.కోట మండలాల్లో, డీఆర్డీఏ ద్వారా మైదాన ప్రాంతాల్లో వెదురు సాగును ప్రోత్సహించనున్నట్లు చెప్పారు. సాగుకు ప్రణాళికను తయారు చేసి, ప్రతిపాదనలను ముందుగానే పీసీసీఎఫ్కు అనుమతికోసం పంపించాలని కలెక్టర్ సూచించారు. -
పశువులపై సర్కారు పగ..!
రామభద్రపురం: ఏటా ప్రకృతి వైరీత్యాలతో పంటలను నష్టపోతున్న అన్నదాతలను ఆదుకునేది పాడి పరిశ్రమే. అందుకే పల్లెల్లో ప్రతి ఇంటా దాదాపు 80 శాతం రైతులు పాడి పశువుల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నారు. అయితే పశుసంపద, పాడి ఉత్పత్తులపై ఎల్నినో తీవ్ర ప్రభావం చూపించనుందనే ఆందోళన వ్యక్తమమవుతోంది.గడ్డి లేక పశువులు, జీవాలు అలమటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందంటూ నాలుగు నెలలుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వంలో పశుసంవర్థకశాఖ ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో జంతుజాలానికి కష్టకాలం దాపురించే ప్రమాదం లేకపోలేదు. జిల్లాలో ఆవులు, ఎద్దులు 3,28,891, గేదె జాతి 81,648, గొర్రెలు 52,232, మేకలు 1,50,613 ఉన్నాయి. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులు గమనిస్తే పశువులు,జీవాలు ఎల్నినో గండం నుంచి గట్టెక్కడం కష్టంగానే కనిపిస్తోంది. రెండు నెలలకు పైగా తీవ్ర వర్షాభావం నెలకొనడంతో పచ్చికబయళ్లు ఎండిపోతున్నాయి. కొండలు, గుట్టలు, వాగులు, వంకలు బోసిపోతున్నాయి. వాటికి తోడు పంటల విస్తీర్ణం తగ్గిపోతుడండంతో పశుగ్రాసం లభ్యత అంతంతమాత్రంగానే ఉన్నట్లు కనిసిస్తోంది. దీంతో మేత, నీళ్లు లేక పశువులు, మూగజీవాల మనుగడకు విఘాతం ఏర్పడే ప్రమాదం ఉందని ఆయా రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సబ్సిడీపై అందని దాణా ఎల్నినో ప్రభావంతో ఎండుతున్న పచ్చిక బయళ్లు ఆర్ఎఎస్కేలలో వైద్యం దూరం పశుసంతతి, పాడి తగ్గుముఖం పట్టే ప్రమాదం -
యువ వెయిట్లిఫ్టర్కు ఘనంగా స్వాగతం
నెల్లిమర్ల రూరల్: ఉజ్బెకిస్థాన్లోని తాష్కెంట్లో ఇటీవల జరిగిన జూనియర్ ఆసియా వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్షిప్–2026లో నెల్లిమర్ల మండలం చంద్రంపేట గ్రామానికి చెందిన యువ వెయిట్లిఫ్టర్ శనపతి గురునాయుడు రెండు రజత పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. విజయం అనంతరం స్వగ్రామానికి విచ్చేసిన ఆయనకు గ్రామస్తులు, యువత ఘనంగా స్వాగతం పలికారు. బుధవారం విజయనగరం రైల్వే స్టేషన్ వద్దకు వెళ్లి గురునాయుడికి వీరతిలకం దిద్ది అభినందనలు తెలిపారు. అనంతరం అక్కడి నుంచి నెల్లిమర్ల మీదుగా చంద్రంపేట గ్రామం వరకు విజయోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పెద్దలు, క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఎంఆర్పీకే మద్యం విక్రయాలు జరగాలి
● అబ్కారీశాఖ డిప్యూటీ కమిషనర్ వై.శ్రీనివాస చౌదరి విజయనగరం రూరల్: నూతన మద్యం విధానం అమల్లో భాగంగా జిల్లాలో అన్ని మద్యం దుకాణాల్లో ఎంఆర్పీకే మద్యం విక్రయాలు జరిగేలా చూడాల్సిన బాధ్యత ఆయా ఎకై ్సజ్ స్టేషన్ అధికారులదేనని అబ్కారీశాఖ డిప్యూటీ కమిషనర్ వై.శ్రీనివాస చౌదరి అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన తన కార్యాలయంలో జిల్లాలోని 11 ఎకై ్సజ్స్టేషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా అనధికార మద్యం విక్రయాలు జరగకుండా కట్టుదిట్టంగా చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో బెల్టు దుకాణాల నిర్వహణ, వాటికి సంబంధించి వేలంపాటలు నిర్వహిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సారా తయారీ, నిల్వ, రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా ఉంచి, నిరంతర దాడులు చేపట్టాలని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం రవాణా జరగకుండా జిల్లా సరిహద్దుల్లో విస్తృత తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఎస్.కోట మండలం బౌడార చెక్పోస్టు వద్ద గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక త నిఖీలు నిర్వహించి అప్రమత్తంగా వ్యవహరించాలన్నా రు. జిల్లాలోని బార్ ఆండ్ రెస్టారెంట్లు, మద్యం దుకాణా లు లైసెన్స్ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. రెవెన్యూ పెంపుపై ప్ర త్యేక దృష్టి సారించి లక్ష్యాలను సాదించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అబ్కారీశాఖ ఈఎస్ బమ్మిడి శ్రీనాథుడు, ఏఈఎస్ ఎ.శ్రీరంగం దొర, ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు. -
15లోగా పంటల బీమా నమోదు పూర్తి చేయాలి
విజయనగరం ఫోర్ట్: పంటల బీమా నమోదు పక్రియను ఈ నెల 15వ తేదీలోగా పూర్తిచేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులకు సూచించారు. పంటల బీమా, ఈ–క్రాప్ నమోదు, ఎరువుల పంపిణీపై అధికారులతో టెలికాన్ఫరెన్స్లో బుధవారం మాట్లాడారు. ఎరువుల కొరత, అక్రమ నిల్వలు, అధిక ధరలకు విక్రయాలు జరగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో వర్షపాతం లోటు, నీటి లభ్యత తగ్గే ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటలు ప్రోత్సహించాలన్నారు. నేటి నుంచి డైట్లో రెండో విడత కౌన్సెలింగ్ నెల్లిమర్ల: డీఈఈసెట్–26లో అర్హత సాధించిన వారికి వేణుగోపాలపురంలోని డైట్లో రెండో విడత కౌన్సెలింగ్, వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు నిర్వహిస్తామని ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రామకృష్ణారావు బుధవారం తెలిపారు. అభ్యర్థులు నమోదుచేసిన వెబ్ ఆప్షన్ల ఆధారంగా ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు సీట్ల కేటాయింపు ప్రక్రియ సాగుతుందన్నారు. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు సంబంధిత ప్రభుత్వ డైట్ కళాశాలలో ఒరిజినల్ సర్టిఫికెట్లను సమర్పించి, ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది ప్రవేశపత్రం పొందాలన్నారు. డీఎల్ఎడ్ మొదటి సంవత్సరం తరగతులు ఈ నెల 27 నుంచి ప్రారంభమవుతాయని చెప్పారు. కార్మికుల పిల్లలకు ఉచిత స్కిల్ శిక్షణ విజయనగరం గంటస్తంభం: డిగ్రీ, డిప్లమా, బీటెక్, తదితర కోర్సులు చదువుతున్న భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇండస్ట్రీ రెడీ ఆన్లైన్ స్కిల్ అప్గ్రేడేషన్ ట్రైనింగ్ ప్రొగ్రాం నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి బుధవారం తెలిపారు. దీనికి సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు. ఉచిత శిక్షణలో చేరి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రీ–రికార్డెడ్ వీడియోల ద్వారా ఇంటి నుంచే మొబైల్లో శిక్షణ పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ సుజాత, అధికారులు, శిక్షణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. 14న తిరంగా ర్యాలీ విజయనగరం గంటస్తంభం: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 14న జిల్లా స్థాయిలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించనున్నట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 7.30 గంటలకు కోట కూడలి నుంచి ర్యాలీ ప్రారంభమై మూడు లాంతర్లు మీదుగా గంటస్తంభం వరక కొనసాగుతుందన్నారు. ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా 150 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శిస్తామని చెప్పారు. ర్యాలీలో అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కాలువ కాదు రోడ్డే..!సీతంపేట: ఈ చిత్రంలో కనిపిస్తున్నది కాలువ అనుకుంటే పొరబడినట్లే. ఇది వంబరెల్లి రహదారి దుస్థితి. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు కొట్టుకుపోయి ఇలా తయారైంది. పలుమార్లు ఇంజినీరింగ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోయిందని గిరిజనులు వాపోతున్నారు. ఈ రహదారిపై ప్రయాణం నరకప్రాయమని ఆవేదన వెళ్లగక్కుతున్నారు. గిరిజనులు తమ అటవీఉత్పత్తులను విక్రయాలకు తీసుకువెళ్లాలన్నా, రోగులను ఆస్పత్రికి తరలించాలన్నా అవస్థలు పడాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
విద్యార్థుల కస్సుబుస్సు..
ఆర్టీసీ బస్సు ముందు విద్యార్థుల ధర్నా రాజాం: కళాశాలలు, పాఠశాలలకు వెళ్దామంటే బస్సులు ఆపడంలేదు... అప్పటికే ఫుల్ అయిపోయాయన్న నెపంతో ముందుకు పోనిస్తున్నారు... గంటల తరబడి రోడ్డుపైనే నిల్చోవాల్సి వస్తోంది... సకాలంలో విద్యాలయాలకు చేరుకోలేకపోతున్నాం... గతంలో ఉన్న బస్సు సర్వీసులు కూడా ఇప్పుడు లేవు... పాస్లు తీసుకున్నా ప్రజయోజనం లేదు.. ఇదెక్కడి అన్యాయం..? విద్యార్థులు చదువుకోవద్దా... ఫీజురీయింబర్స్మెంట్ లేదు.. వసతిగృహాల్లో నాణ్యమైన భోజనాలు పెట్టరు.. ఇంత ఘోరం ఎన్నడూ లేదు... విద్యార్థుల బస్సు కష్టాలు తీర్చాలని, అదనపు సర్వీసులు నడపాలని కోరుతూ రాజాం–శ్రీకాకుళం రోడ్డులోని పొగిరి సెంటర్లో విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి చంద్రబాబు సర్కారు తీరుపై నిరసన తెలిపారు. బస్సులు నిలుపుదల చేయపోవడంపై ఆర్టీసీ బస్సు డ్రైవర్లను నిలదీశారు. సీ్త్రశక్తి పథకం పెట్టిన ప్రభుత్వం అందుకు తగ్గ బస్సులు నడపకపోవడం వల్లే విద్యార్థులకు ప్రతిరోజూ కష్టాలు ఎదురవుతున్నాయంటూ వాపోయారు. ఆర్టీసీ సర్వీసులు తగ్గడం వల్లే ఈ సమస్య ఉందని ఆర్టీసీ సిబ్బంది చెప్పడంతో విద్యార్థులు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. పొగిరి కూడలి నుంచి రాజాం మండలం పొగిరి, జి.సిగడాం మండలం పెంట, సీతంపేట, గేదెలపేట, జి.సిగడాం, లింగాపురం ప్రయాణికులు, విద్యార్థులు అటు శ్రీకాకుళం, ఇటు రాజాం, మరో వైపు జి.సిగడాం ప్రయాణిస్తారని, ఇక్కడ బస్సులు నిలుపుదల చేయకపోవడం విచారకరమన్నారు. బస్సులు నిలుపుదల చేయకపోవడంతో తిరిగి ఇంటికి వెళ్లిపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. సమస్య పరిష్కరించేవరకు ఆందోళన విరమించేది లేదని తేల్చిచెప్పారు. సమాచారం అందుకున్న రాజాం పట్టణ సీఐ డి.నవీన్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యార్థులతో మాట్లాడారు. రాకపోకల సమస్య పరిష్కరిస్తేనే ఆందోళన విరమిస్తామని విద్యార్థులు స్పష్టంచేయడంతో ఆర్టీసీ అధికారులతో మాట్లాడారు. ఆర్టీసీ సర్వీసులు ఉదయం, సాయంత్రం సమయాల్లో పెంచడంతో పాటు ప్రతి ఆర్టీసీ బస్సును విద్యార్థుల కోసం పొగిరి కూడలిలో నిలుపుదచేయాలని, ఎంత రద్దీగా ఉన్న బస్సును ఆపాలని కోరారు. దీనికి ఆర్టీసీ ఉన్నతాధికారులు అంగీకరించడంతో నిరసన కార్యక్రమం తాత్కాలికంగా సద్దుమణిగింది. బ ఆర్టీసీ బస్సులు నిలుపుదల చేయకపోవడంపై ఆందోళన పొగిరి సెంటర్లో ధర్నా రోడ్డుపై బైఠాయించి నిరసన నిలిచిన రాకపోకలు పోలీసులు సర్దిచెప్పడంతో శాంతించిన విద్యార్థులు -
పుస్తెల తాడు దొంగల అరెస్ట్
దత్తిరాజేరు: మండలంలోని పెదమానాపురంలో రైల్వే వంతె కింద పాన్ షాప్ నడుపుతున్న కె.కృష్ణకుమారి మెడలో ఉన్న పుస్తెల తాడును తెంచుకుని వెళ్లిన దొంగను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ విషయంపై పెదమానాపురం పోలీస్స్టేషన్లో గజపతినగరం సీఐ సన్యాశినాయుడు, ఎస్సై కళాధర్లు బుధవారం మాట్లాడుతూ చైయిన్ స్నాచింగ్ కేసులో నిందితుడైన దత్తిరాజేరు మండలం ఆర్. రామచంద్రాపురానికి చెందిన కేతల దుర్గారావును (ప్రస్తుతం శివశక్తి నగర్ కొమ్మాది వైజాగ్ నివాసి) నిందితుడికి సహకరించిన శ్రీకాకుళం జిల్లా మొళియాపుట్టి మండలానికి చెందిన పైడి వసుంధర, శ్రీకాకుళానికి చెందిన మల్లెపు అనసూయలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచామని చెప్పారు. యువత హెచ్ఐవీపై అవగాహన కల్పించుకోవాలి● జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ప్రాజెక్టు మేనేజర్ గౌరి విజయనగరం ఫోర్ట్: యువత హెచ్ఐవీపై అవగాహన కల్పించుకోవాలని జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ప్రాజెక్టు మేనేజర్ కె. గౌరి అన్నారు. ఈ మేరకు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హెచ్ఐవీ ఎయిడ్స్పై రూపొందించిన వాల్ పోస్టర్స్ ఆవిష్కరణ కార్యక్రమం, అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిఒక్కరూ హెచ్ఐవీ, క్షయ వ్యాధి గురించి తెలుసుకోవాలని సూచించారు. హెచ్ఐవీ రోగుల పట్ల వివక్ష చూపరాదని, వివక్షచూపితే చట్ట ప్రకారం శిక్షర్హాలవుతారన్నారు. హెచ్ఐవీ రోగుల పట్ల ప్రేమ, అప్యాయత చూపించాలని కోరారు. హెచ్ఐవీ రోగులు క్రమం తప్పకుండా మందులు వాడి, మంచి పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా జీవితకాలాన్ని పెంచుకోవచ్చునని సూచించారు. కార్యక్రమంలో కశాశాల ప్రిన్సిపాల్ రేఖ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గంజాయి కేసులో నిందితులకు ఏడాది జైలువిజయనగరం టౌన్: గంజాయి కేసులో ఇద్దరు నిందితులకు ఏడాది జైలుశిక్ష, రూ.పది వేల జరిమానా విధిస్తూ ఫస్ట్ క్లాస్ ఏడీజే కమ్ ఎన్డీపీఎస్ యాక్ట్ స్పెషల్ జడ్జి కె.విజయ కల్యాణి బుధవారం తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ ఏఆర్.దామోదర్ పేర్కొన్నారు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన పవన్ కుమార్, మోహన్ శ్యామ్ అనే ఇద్దరు వ్యక్తులు రెండు కిలోల గంజాయితో బొబ్బిలి రైల్వేస్టేషన్ వద్ద 2025 డిసెంబరు 18న అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు వచ్చిన కచ్చితమైన సమాచారంతో బొబ్బిలి పోలీసులు తనిఖీ చేపట్టి, ఇద్దరినీ అదుపులోకి తీసుకుని కేసు నమోదుచేశారు. అప్పటి బొబ్బిలి సీఐ కె.సతీష్ కుమార్ నిందితులను రిమాండ్కు తరలించారు. ప్రస్తుత బొబ్బిలి సీఐ కె.నారాయణరావు నిందితులపై న్యాయస్ధానంలో అభియోగపత్రాలు దాఖలు చేసి, ప్రాసిక్యూషన్ త్వరితగతిన పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టారు. కేసు విచారణలో ఇద్దరు నిందితులపై నేరం రుజువు కావడంతో పై విధంగా శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారని ఎస్పీ వివరించారు. కారు ఢీకొని వ్యక్తి మృతిడెంకాడ: మండలంలోని మోదవలస వద్ద కారు ఢీకొనడంతో ఉత్తరప్రదేశ్కు చెందిన సంజయ్ యాదవ్(41) మరణించాడు. ఈ ప్రమాదానికి సంబంధించి ఎస్సై ఎ.సన్యాసి నాయుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సంజయ్ యాదవ్ కుటుంబంతో కలిసి దాకమర్రి వద్ద ఉంటున్నాడు. ఆయన మోపాడ గ్రామం సమీపంలో ఉన్న ప్లైవుడ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కంపెనీలో విధులు నిర్వహించేందుకు మంగళవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లారు. మోదవలస పంచాయతీ పరిధిలోని టీటైమ్ వద్ద జాతీయ రహదారిని దాటుతుండగా విశాఖ నుంచి విజయనగరం వస్తున్న కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో సంజయ్ యాదవ్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య అనితాదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ఎ.సన్యాసినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తాగునీరు సురక్షితమేనా..?
● తాగునీటి పథకాల్లో క్లోరినేషన్ సక్రమంగా జరగడం లేదనే ఆరోపణలు ● తాగునీటి కుళాయిల నుంచి బురదనీరు సరఫరా తాగునీటి పథకంవిజయనగరం ఫోర్ట్: జిల్లాలో తాగునీటి పథకాలు 981 ఉన్నాయి. వీటిలో ఒక్క గ్రామానికి తాగునీరు అందించే పథకాలు 951, ఒకటి కంటే ఎక్కువ గ్రామాలకు తాగునీరు అందించే పథకాలు 30 ఉన్నాయి. చాలా గ్రామాల్లో కుళాయిల నుంచి బురదనీరు సరఫరా అవుతుండడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. తాగునీటి పథకాలను శుభ్రం చేయడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కుళాయిల నుంచి సరఫరా అవుతున్న కలుషిత నీటిని తాగితే అనారోగ్యం బారిన పడుతామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుర్లలో గతేడాది కలుషిత నీరు తాగడం వల్లే డయేరియా ప్రబలి 14 మంది వరకు మృత్యువాత పడ్డారు. అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే సురక్షితమైన నీటిని అందించాలని కోరుతున్నారు. క్లోరినేషన్ తప్పనిసరి ప్రతిరోజు క్లోరినేషన్ చేసి తాగునీరు సరఫరా చేయాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి వాటర్ ట్యాంక్లను క్లీన్చేయాలి. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడైనా వ్యవహరిస్తే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. – కవిత, ఎస్ఈ, ఆర్డబ్ల్యూఎస్ -
జెండాయే స్ఫూర్తి..
ఉప్పొంగిన దేశభక్తి జెండాయే స్ఫూర్తిగా తెర్లాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు బుధవారం తిరంగా ర్యాలీ నిర్వహించారు. 150 అడుగుల జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ దేశభక్తిని చాటారు. బస్టాండ్ వద్ద వృత్తాకారంలో జాతీయ జెండాను ప్రదర్శించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆర్.ధనం, డీటీ సత్యనారాయణ, ఎంపీడీఓ కార్యాలయ ఏఓ వెంకటరమణ, ఎస్ఐ సాగర్బాబు, ఎంఈఓలు త్రినాథరావు, పాపారావు, హైస్కూల్ హెచ్ఎం రమేష్, వివిధ శాఖల మండలాధికారులు పాల్గొన్నారు. – తెర్లాం తెర్లాంలో 150 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థుల తిరంగా ర్యాలీ -
క్యాడర్ కుయ్యో మొర్రో...
● వాడేసి పక్కన పడేసిన ఎమ్మెల్యే ● ఆయనను నమ్ముకున్న క్యాడర్ కుయ్యోమొర్రో ● పోయాం మోసం అని లోలోన ఆవేదన ● జగదీశ్వరి నిజరూపం తెలిసొచ్చిందని లోలోన మంట ఇదిలా ఉండగా వీరేష్ తండ్రి ప్రదీప్ కాలం నుంచి కురుపాం కోటతో సంబంధం ఉన్న కొద్దిమంది నాయకులు ఇప్పటికీ ఈ కుటుంబానికి విధేయులుగా ఉంటూ ఆ నమ్మకంతోనే వీరేష్ వెంట నడిచారు. జగదీశ్వరి గెలిస్తే వీరేష్ గెలిసినట్లే అని, ఆయన ఎమ్మెల్యే అయినట్లే.. మండలంలో.. నియోజకవర్గంలో తమ పెద్దరికం సాగుతుందని ఆశిస్తూ పనిచేసిన చాలామంది టీడీపీ నాయకులూ ఇప్పుడు సైలెంట్ అయ్యారు. వీరేష్ను పట్టించుకోని ఎమ్మెల్యే ఇక తమను ఏం చూస్తుంది.. అలాగని ఈ అవమానం.. వాడకం మీద ఎవరినీ ఏమీ అడగలేని, ప్రశ్నించలేని దైన్యంలో టీడీపీ నాయకులు మింగలేక కక్కలేక ఊరుకున్నారు. మరోవైపు ఎమ్మెల్యే మాత్రం సమర్తి భోజనాలకు సైతం చందాలు వసూలు చేస్తూ దందా చేస్తున్నారన్న కడుపుమంటతో క్యాడర్ లోలోన మదనపడుతున్నారు. నామినేటెడ్ పోస్టులు.. బదిలీలు, పోస్టింగులు.. ఇలాంటి పనులు కూడా తమ నాయకుడి చేసే పరిస్థితి లేకపోవడంతో టీడీపీ క్యాడర్ పోయాం మోసం.. పోయాం మోసం అనుకుంటూ వెర్రి నవ్వులు నవ్వుకుంటున్నారు. ‘ఒక వ్యక్తి నిజరూపం తెలియాలంటే అధికారం ఇచ్చి చూడాలి’ అనే అబ్రహం లింకన్ సూక్తి కురుపాంలో అక్షరాలా అమలవుతుండడాన్ని కళ్లారా చూస్తున్నాం అని క్యాడర్లో చర్చసాగుతోంది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: కబోదికి కళ్లు రాగానే ముందుగా పక్కనపడేసేది అంతవరకూ తనను నడిపించిన వాకింగ్ స్టిక్నే. అవిటి వానికి కాళ్లొస్తే ముందుగా విసిరేసేది ఊతకర్రనే. చెవిటివానికి వినికిడిలోపం నివారణ అయితే సౌండ్ మిషన్ వెళ్లేది చెత్త డబ్బాలోకే.. అచ్చం రాజకీయాల్లోనూ ఇదే పరిస్థితి. జీరో నాలెడ్జ్తో రాజకీయాల్లోకి వచ్చిన ఎంతోమంది నాయకులు... తమను నడిపించి.. నిలబెట్టి.. ఎమ్మెల్యేలుగా గెలిపించిన ఊతకర్రల్లాంటి నాయకులను తాము నడకనేర్వగానే పక్కన పడేస్తున్నారు. కురుపాంలో కూడా అచ్చం ఇదే జరిగిందన్న చర్చ జోరుగా సాగుతోంది. ● గెలిపించిన వారికే రాజకీయాలకు పూర్తిగా కొత్త అయిన జగదీశ్వరికి అనుకోకుండా కురుపాం ఎమ్మెల్యే టిక్కెట్ దక్కింది. వాస్తవానికి ఆమెకు రాజకీయాలు కాదు సరికదా నియోజకవర్గ సరిహద్దులు.. మండలాలు.. సామాజిక సమీకరణాలు గురించి కూడా పెద్దగా తెలియదనేది ఆ నియోజకవర్గ ప్రజల మాట. అప్పట్లో కురుపాం సంస్థానానికి చెందిన మాజీ కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్, ఆయన సోదరుడు ప్రదీప్దేవ్ల ఆశీస్సులతో ఆమె రంగంలోకి దిగారు. దీంతో వారు ప్రదీప్చంద్రదేవ్ కుమారుడు అయిన వీరేష్దేవ్ అనే యువకుడిని రంగంలోకి దించి జగదీశ్వరి గెలుపు బాధ్యతలు అప్పగించారు. కుర్రవాడు.. రాజకీయాల్లో రాణించాలన్న ఉత్సాహం ఉన్నవాడు.. కుటుంబ వారసత్వం.. నియోజకవర్గంలో విస్తృత పరిచయాలు ఉన్నవాడు కావడం.. అవినీతి మకిలి అంటని ఫ్యామిలీ కావడంతో కొద్దికాలంలోనే నియోజకవర్గంలో త్వరగానే పట్టు సాధించారు. ఆమెను కాదు మా ఫ్యామిలీని చూడండి అంటూ ఆయన జగదీశ్వరిని వెంటబెట్టుకుని ఊరూరా తిరిగి గెలిపించండి.. పనులు కావాలంటే నన్ను అడగండి.. మీకు నేను భరోసా అన్నట్లుగా క్యాడర్కు, ప్రజలకు హామీలు ఇచ్చారు. మొత్తానికి ఆమె గెలిచేశారు. గెలిచాక కొద్దిరోజులు ఆమె వీరేష్ కనుసన్నల్లో మెలిగారు. కొత్తలో ఆయనపట్ల అభిమానం.. విధేయత చూపారో.. నటించారో తెలియదు కానీ కొన్నాళ్లు సవ్యంగానే సాగింది. అబ్బో ఎమ్మెల్యే... మా వీరేష్కు బాగానే ప్రాధాన్యం ఇస్తున్నారన్న భ్రమలు క్యాడర్లో కలిగాయి. వీరేష్ కూడా ఉన్నంతలో నిజాయితీగా ఆమెను వేలు పట్టుకుని నడిపించారు. రాజకీయం.. పాలనాపరమైన పలు అంశాల్లో సలహాలు ఇస్తూ ముందుకు నడిపించారు. బాగానే ఉంది.. కానీ ఎన్నాళ్లని ఒకరి అడుగులో అడుగు వేస్తాం.. మనం సొంతంగా నడవలేమా.. ఎన్నాళ్లని ఆయన కళ్లతో చూస్తాం.. మనకళ్లతో మనం చూడలేమా..? మన బుర్రతో మనం ఆలోచించలేమా..? అనే ఆలోచన మొదలైన జగదీశ్వరి భర్తను పీఏగా పెట్టుకున్నారు. పనులు, పథకాలు.. పదోన్నతులు, పోస్టింగులు.. బదిలీలు ఎక్కడ ఏది అవకాశం దొరికితే అక్కడ చందా దందా మొదలెట్టారన్నది ఆరోపణ. కొద్దిరోజుల్లేనే అధికారం రుచి తెలిసింది. మెల్లగా స్వతంత్రంగా ఆలోచించడం మొదలైంది. ఇవన్నీ తాము సొంతంగా చేసుకునేటప్పుడు పక్కన వీరేష్ ఎందుకు అనే ఆలోచన మొదలవడంతో మెల్లగా ఆయనను దూరం పెట్టడం మొదలుపెట్టారు. ఆయన సలహాలు సూచనలు తీసుకోవడం తగ్గించారు. ఎక్కడ ఎవరికి పోస్టింగ్ ఇవ్వాలి.. బదిలీలు చేయాలి.. ఏ పోస్టింగ్కు ఎంత రేటు అనేది తమ అంతరంగికులు ఇద్దరు ముగ్గురితో చర్చించుకుంటూ ఫైనల్ చేసేస్తున్నారు. వీరేష్ నుంచి రిఫరెన్స్ వస్తే అందులో ఏమీ పైసలు రావు.. పైగా తమ ప్రయోజనాలు .. స్వలాభం కుదరదు.. అందుకే ఆయన చెప్పినా మెల్లగా ఏదో సాకుతో మాట దాటేస్తున్నారు. దీంతో విషయం అర్థమై వీరేష్ కూడా మెల్లగా సైలెంట్ అయిపోయారు. ఉండీలేనట్లు.. ఉన్నా లేనట్లు కురుపాంలో జరిగే పార్టీ కార్యక్రమాల్లో అప్పుడప్పుడు పాల్గొనడం తప్ప ఎమ్మెల్యేకు సలహాదారుడు పాత్ర నుంచి మెల్లగా తప్పుకున్నారు. పీఏగా ఉన్న భర్త , ఓ మాజీ జెడ్పీటీసీ, ఓ యువనేతతో కలిపి ఎమ్మెల్యే సొంతంగా తమ రీతిలో పాలన సాగిస్తూ వీరేష్ను మెల్లగా సైడ్ చేసేశారని నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది. కుర్చీ వేయలేదా? ఇటీవల గుమ్మలక్ష్మీపురం సామజిక ఆస్పత్రి అదనపు భవనాల ప్రారంభోత్సవానికి వెళ్లిన వీరేష్ను కనీసం వేదిక మీదకు పిలవలేదట. దీంతో ఆయన సభికుల మధ్య ఎక్కడో కూర్చున్నారట. అందరూ వేదిక ఎక్కాక.. ఎవరో గుర్తు చేస్తే కిందనున్న ఒక కుర్చీని తీసుకెళ్లి వేదిక మీద వేసి ఆయనను చివర్లో పిలిచి కూర్చోబెట్టడాన్ని చూసి ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తంచేశారు. వీరేష్ పరిస్థితి ఇలా అయిపోయిందా అంటూ నిట్టూర్చారు. -
పంటలకు కాలుష్యం కాటు
● సంకిలి గ్రామ రైతుల ఆందోళన రేగిడి: మండల పరిఽధిలోని సంకిలి వద్ద ఉన్న ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారం వ్యర్థాలతో పంటపొలాలు పాడవతున్నాయని సంకిలికి చెందిన పలువురు రైతులు బుధవారం ఆందోళన చేశారు. గ్రామానికి చెందిన నాయుడు చెరువు ఆయకట్టు పరిధిలో 60 ఎకరాలు డ్రమ్ సీడర్ విధానంలో వరి పంట వేశామని, జలకాలుష్యం వల్ల విత్తనాలు మొలకెత్తలేదన్నారు. సమస్యపై స్పందించిన కర్మాగారానికి చెందిన హెచ్ఆర్ మేనేజర్ ప్రవీణ్ వర్మ పంట పొలాల్లోకి వెళ్లి పరిశీలించారు. మొలకెత్తని విత్తనాలను రైతులు ఆయనకు చూపించారు. ఈ సమస్యను యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లి రైతులకు నష్టం వాటిల్లకుండా చూస్తామన్నారు. న్యాయం చేయకపోతే జిల్లా యంత్రాంగం దృష్టికి సమస్యను తీసుకెళ్తామని రైతులు గంగు కృష్ణారావు, పి.గోపాల్, పప్పల సూర్యారావు, ఇప్పలి పట్టాభి, బి.హరినాథ్, తదితరులు స్పష్టంచేశారు. -
తూకాల్లో తేడాలు వస్తే చర్యలు
● లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ వి.రామారావు ● మండలంలోని పలు రేషన్ దుకాణాల తనిఖీరామభద్రపురం: వినియోగదారులకు రేషన్ పంపిణీలో తూకాల్లో తేడాలొస్తే చర్యలు తప్పవని లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ వి.రామారావు హెచ్చరించారు. రేషన్ దుకాణాల్లో లబ్ధిదారులకు కోత విధిస్తూ డీలర్లు ఇస్టానుసారం పేదలకు బియ్యం పంపిణీ చేస్తున్నారనే అంశంపై ఈ నెల 10వ తేదీన ‘కేజీకి 900 గ్రాములే’..! శీర్షికన సాక్షి కథనం ప్రచురించింది. ఆ కథనంపై స్పందించిన లీగల్ మెట్రాలజీ డిప్యూటీ కంట్రోలర్ బి.మనోహర్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ కంట్రోలర్ వి.రామారావు, లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ బి.మధు సంతోష్లతో కూడిన బృందం మండలంలోని ఆరికతోట, ముచ్చర్లవలస, మండలకేంద్రంలోని పలు రేషన్ దుకాణాలను మంగళవారం అకస్మికంగా తనిఖీ చేశారు. తూనికలు,కొలతలు పరికరాల పనితీరు, నిబంధనల అమలును పరిశీలించారు. అలాగే డీలర్లకు లీగల్ మెట్రాలజీ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లబ్ధిదారులకు నష్టం జరగకుండా రేషన్ డీలర్లు తూకాల్లో తేడా లేకుండా బియ్యం తూకం వేసి ఇవ్వాలని సూచించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు జిల్లాలోని వివిధ వ్యాపార రంగాలపై లీగల్ మెట్రాలజీ శాఖ ద్వారా విస్తృత తనిఖీల్లో భాగంగా 308 కేసులు నమోదు చేసి రూ.13,36,00 రాజీ రుసుం వసూలు చేశామన్నారు. అలాగే ఇందులో భాగంగా 8 రేషన్ దుకాణాలపై కేసులు నమోదు చేసి రూ.25 వేలు రాజీ రుసుం వసూలు చేశామన్నారు. తూనికలు, కొలతల్లో మోసాలను అరికట్టడానికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎక్కడైనా తూనికలు, కొలతల్లో మోసాలు లేదా నిబంధన ఉల్లంఘనను గుర్తించినట్లయితే వినియోగదారులు టోల్ ఫ్రీ నంబర్ 1967కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ సత్యనారాయణ పాల్గొన్నారు. -
కంటైనర్ ఢీకొని వ్యక్తి మృతి
గుర్ల: విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్ల మండలంలోని కలవచర్లకు చెందిన గుమ్మిడి సూర్యనారాయణ (50) మృతిచెందాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కలవచర్లకు చెందిన సూర్యనారాయణ సముద్రపు చేపల వ్యాపారం చేస్తుంటాడు. ప్రతిరోజూ విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్కు వెళ్లి చేపలు కొనుగోలు చేసి గుర్ల తీసుకువచ్చి చిరు వ్యాపారులకు అమ్ముతుంటాడు. రోజులోగానే చేపలు కొనుగోలు చేయడానికి వెళ్తుండగా ఎండాడ నుంచి ఫిషింగ్ హార్బర్ మధ్యలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సూర్యనారాయణను వెనుక నుంచి వస్తున్న కంటైనర్ బలంగా ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. సూర్యనారాయణ మృతితో కలవచర్లలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య సత్యవతి, కుమార్తె ధరణి, కుమారుడు సాయి శ్రీనివాస్ ఉన్నారు. పొలంపనికి వెళ్లి మృత్యువాతమక్కువ: మండలంలోని గోపాలపురం గ్రామానికి చెందిన మత్స జగదీశ్వరరావు(45) మంగళవారం పొలంపనులు చేస్తూ కుప్పకూలి మతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పొలంలో పంటకు నీరుకట్టుకుని వస్తానని జగదీశ్వరావు మంగళవారం ఉదయం ఇంటిలో చెప్పి వెళ్లాడు. మధ్యాహ్నం 1.30 సమయం దాటుతున్నప్పటికీ భోజనానికి రాకపోవడంతో, కుటుంబసభ్యులు వెళ్లి చూడగా, జగదీశ్వరరావు పొలంలో విగతజీవుడిగా పడి ఉన్నాడు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. మతునికి భార్య సుజాత, పాప సంధ్య ఉన్నారు. హైదరాబాద్లో చింతాడ వాసి మృతిబొబ్బిలిరూరల్: మండలంలోని చింతాడ గ్రామానికి చెందిన మరడాన వెంకటనాయుడు(53) హైదరాబాద్లోని బోయిన్పల్లివద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో మృతిచెందాడు. పాలప్యాకెట్ కోసం వెంకటనాయుడు తెల్లవారు జామున నడుచుకుంటూ వెళ్తుండగా టిప్పర్ ఢీకొనడంతో ప్రమాదం జరిగి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. కొన్నేళ్లుగా సూరారంలో ఓ ప్రైవేట్ కంపెనీని నిర్వహిస్తున్న వెంకటనాయుడు అక్కడే స్థిరపడ్డాడు. వెంకటనాయుడుకు భార్య రాజేశ్వరి, కుమారులు నిఖిల్, వినయ్లు ఉన్నారు. ప్రమాదంపై బోయినపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న చింతాడ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బుధవారం నాటికి వెంకటనాయుడి భౌతిక కాయాన్ని స్వగ్రామం చింతాడకు తీసుకు వచ్చేందుకు బంధువులు ప్రయత్నిస్తున్నారు. నేడు దివ్యాంగుల క్రికెట్ క్రీడాకారుల ఎంపికవిజయనగరం రూరల్: అమరావతి ఇన్క్లూజివ్ క్రికెట్ కప్– 2026 టోర్నమెంట్కు సంబంధించి డీసీసీఏపీ, డీఏసీఏ సంయుక్త ఆధ్వర్యంలో దివ్యాంగుల క్రికెట్ క్రీడాకారుల ఎంపిక పోటీలు బుధవారం నిర్వహించనున్నట్లు జిల్లా దివ్యాంగుల క్రికెట్ అసోసియేషన్ కన్వీనర్ మజ్జి గణేష్, ఆర్గనైజర్ జి.నరేష్వర్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలపారు. జిల్లా కేంద్రంలోని ప్రదీప్నగర్లో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఇంటి సమీపంలో ఉన్న ఎలైట్ క్రికెట్ అకాడమీ నెట్స్లో ఉదయం 8 గంటల నుంచి ఎంపికలు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు వారి వ్యక్తిగత క్రికెట్ కిట్తో పాటు ఆధార్ కార్డు, సదరం ధ్రువీకరణ పత్రం, యూడీఐడీ కార్డుల జిరాక్స్ కాపీలు, రెండు పాస్పోర్టు సైజు ఫొటోలను ఎంపిక కమిటీకి అందించాలని సూచించారు. శారీరక దివ్యాంగులైన క్రికెట్ క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వేధింపుల కేసులో భర్తకు ఏడాది జైలుశిక్షపాలకొండ: భార్యను వేధించిన కేసులో భర్తకు ఏడాది జైలు శిక్ష, రూ.5వేలు జరిమానాను స్థానిక జూనియర్ సివిల్ జడ్జి చందక హరిప్రియ విధించారని ఎస్సై డోల వెంకన్న తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన మొద్దంశెట్టి ఈశ్వరరావుపై పాలకొండ పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన మొద్దం శెట్టి నాగమణి తన భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని నవంబర్ 18, 2019లో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అప్పటి ఎస్సై వాసునారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దర్యాప్తులో పూర్తి ఆధారాలను సేకరించి కోర్టుకు అందించారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుధారాణి తమ వాదనలు వినిపించారు. నేరం రుజుం కావడంతో ముద్దాయికి పై విధంగా శిక్ష విధిస్తూ జూనియర్ సివిల్ జడ్జి మంగళవారం తీర్పు వెల్లడించారు. -
పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
భామిని: పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన మండలంలోని పెద్దదిమిలికి చెందిన నిద్దాన గోవిందరావు(35) శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ మేరకు బత్తిలి పోలీసులు మంగళవారం తెలిపారు. ఈ నెల 8వ తేదీన మద్యం మత్తులో పురుగుమందు తాగిన నిద్దాన గోవిందరావు(35) అపస్మారక స్థితిలోకి చేరుకోవడంతో కొత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రాథమిక వైద్య సేవల అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మద్యానికి బానిసైన గోవిందరావుతో భార్య నాగమణి గొడవ పడి ఇద్దరు కూతుళ్లను తీసుకుని రాజమండ్రిలోని కన్నవారి ఇంటికి వవెళ్లిపోయింది. భర్త మృతి వార్త తెలుసుకుని వచ్చిన భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. బాడంగి: మండలంలోని పినపెంకి గ్రామానికి చెందిన ఈదుబిల్లి సింహాచలం(56)పురుగు మందు తాగి బొబ్బిలి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం మృతిచెందింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సింహాచలం పక్షవాతంతో బాధపడుతుండేది. మందులు వేసుకోనిదే నిద్రపట్టేదికాదని చనిపోతే బాగుండునని తరచూ బెదిరిస్తూ ఉండేది. ఆమె భర్త అప్పలనాయుడు పొలంపనికి వెళ్లిపోవడంచూసి ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగి అపస్మారక స్థితిలో ఇంటి ముందుపడిపోయింది. భర్తఇంటికి వచ్చేసరికి భార్య పడిపోయి నురగలు కక్కడంతో వెంటనే బొబ్బిలి ఆస్పత్రికి తరలించాడు. అక్కడి వైద్యులు ప్రథమ చికిత్సచేసి పురుగుమందు కక్కిస్తూ తమ పర్యవేక్షణలో ఉంచగా ఉదయం 11గంటల ప్రాంతంలో మృతిచెందింది. ఆమె కుమారుడు రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదుచేసి దర్యాప్తుచేస్తున్నామని ఎస్సై సూర్యకుమారి చెప్పారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువువులకు అప్పగించారు. పార్వతీపురం రూరల్: తీవ్రమైన తలనొప్పి బాధను తాళలేకపోయిన ఓ వివాహిత ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సీతానగరం మండలం నిడగల్లు గ్రామంలో జరిగిన ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే..గ్రామానికి చెందిన పొదిలాపు స్రవంతికి సుమారు 20 ఏళ్ల క్రితం గరుగుబిల్లి మండలం వల్లరిగుడబ గ్రామానికి చెందిన చెన్నంనాయుడుతో వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్తతో మనస్పర్థల కారణంగా గత 15 ఏళ్లుగా ఆమె పుట్టింట్లోనే తల్లి అనసూయ వద్ద ఉంటోంది. కొంతకాలంగా స్రవంతిని తీవ్రమైన పార్శ్వపు తలనొప్పి వేధిస్తుండడంతో మందులు వాడుతోంది. ఈ క్రమంలో మంగళవారం వేకువజామున 3:30 గంటల ప్రాంతంలో తలనొప్పి తీవ్రరూపం దాల్చడంతో, ఆ వేదన భరించలేక ఇంట్లోని ఫినాయిల్ తాగేసింది. తీవ్ర అస్వస్థతకు గురైన బాధితురాలిని గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన కారులో జిల్లా కేంద్రాస్పత్రికి తరలించగా ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. -
నిఘా నేత్రం..112
● ఒక్క కాల్ చేస్తే తక్షణమే పోలీసుల స్పందన ● బాధితులు సద్వినియోగం చేసుకోవాలి ● ఎస్పీ ఏఆర్ దామోదర్విజయనగరం టౌన్: ప్రమాదాల్లో చిక్కుకున్నారా? అసాంఘిక శక్తుల కార్యకలాపాలను గమనించారా? ఎప్పుడైనా..ఎక్కడైనా సరే ఒక్క ఫోన్ చేస్తే చాలు. ఎందరికో సహాయపడినవారవుతారు. ఎప్పుడైనా ప్రమాదాలు సంభవించినప్పుడు, ఆరాచక శక్తులు చెలరేగిపోతున్నప్పుడు కంటపడితే ఉపేక్షించనక్కర్లేదు. వెంటనే డయల్ 112కి పోన్ చేసి వివరించండి ఇది పూర్తిగా ఉచిత సదుపాయం అంటోంది జిల్లా పోలీసు యంత్రాంగం. అసాంఘిక శక్తుల ఆటకట్టించేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, వ్యాపారస్తులు, ఇలా అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలి. అప్పుడే పూర్తిస్థాయిలో ప్రమాదాలను అరికట్టగలుగుతాం. నేరరహిత జిల్లాగా మార్చేందుకు ప్రజలు తమవంతు బాధ్యతగా సహకరించాలి. అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణా, అనధికార బెల్ట్ దుకాణాలు, గంజాయి తదితర మాదక ద్రవ్యాల అమ్మకాలు..ఇలా ఏది కంటపడినా 112కి సమాచారమందించవచ్చు. భారీగా ఫోన్కాల్స్.. కేసులు నమోదు ఈ ఏడాది ఇప్పటివరకూ (జూలై 2026) మొత్తం 6889 ఫోన్కాల్స్112కి వచ్చాయి. వాటిపై 101 వరకూ ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. మహిళలకు సంబంధించి 1642 కాల్స్, 305 ప్రమాదాలు, 29 ఆత్మహత్యలు, 2548 న్యూసెన్స్, 1586 ఇతర పబ్లిక్ను ఇబ్బందులు పెట్టే వారిపై చర్యలు తీసుకోవాలని కాల్స్ వచ్చాయి. సమాచారం తెలిస్తే .. సహకరించండి జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణాపై సమాచారం తెలిస్తే వెంటనే డయల్ 112కి సమాచారమివ్వండి. వచ్చిన సమాచారం బట్టి దాడులు విస్తృతం చేస్తాం. నిందితులను కఠినంగా శిక్షిస్తాం. ఎటువంటి సమాచారమందించినా అప్రమత్తమవుతాం. దొంగతనాలు, దోపిడీలు, అరాచకాలు, బెల్ట్ దుకాణాలు, తదితర సమాచారన్నిచ్చి పోలీసులకు సహకరించండి ఏఆర్ దామోదర్, ఎస్పీ, విజయనగరం -
తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యం
విజయనగరం ఫోర్ట్: తల్లీబిడ్డల ఆరోగ్య పరిక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. 102 తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ 11 నూతన వాహనాలను కలెక్టరేట్ వద్ద జెండా ఊపి ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన బాలింతలు, నవజాత శిశువులను సురక్షితంగా 102 వాహనాల ద్వారా ఉచితంగా ఇళ్లకు చేర్చనున్నట్లు తెలిపారు. ప్రయాణ సమయంలో తల్లితో పాటు ఇద్దరు సహాయకులు, కుటుంబ సభ్యులు కూడా వాహనంలో ప్రయాణించే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి, డీసీహెచ్ఎస్ డాక్టర్ పద్మశ్రీ రాణి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ, ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ సాయిరాం. డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రాంసుందర్ రెడ్డి -
తపాలా ‘రాఖీ’ సంబరం
పార్వతీపురం రూరల్: రాఖీ పౌర్ణమి (ఆగస్టు 28) సందర్భంగా విదేశాల్లోని తోబుట్టువులు, బంధుమిత్రులకు రాఖీలు, కానుకలను సురక్షితంగా చేరవేసేందుకు ’‘ఇండియా పోస్ట్’ అంతర్జాతీయ పార్సిల్, స్పీడ్ పోస్ట్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు అన్ని ప్రధాన, ఉప, గ్రామీణ తపాలా కార్యాలయాల్లో ప్రత్యేక రాఖీ కవర్లను సిద్ధం చేసినట్లు పార్వతీపురం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి. బాబురావు తెలిపారు. కుటీర, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు, అంకుర సంస్థలు, మహిళా స్వయం సహాయక సంఘాలు, చేతివృత్తుల కళాకారులు రూపొందించిన ఉత్పత్తులను విదేశాలకు పంపేందుకు పార్వతీపురం ప్రధాన తపాలా కార్యాలయంలో ‘డాక్ ఘర్ నిర్యాత్ కేంద్రం’ సదుపాయం కల్పించినట్లు పేర్కొన్నారు. ఈ కేంద్రం ద్వారా పంపే పార్సిళ్లకు ‘సమన్వయ వస్తు సేవల పన్ను’ (ఐజీఎస్టీ) రిఫండ్ వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఖాతాదారులు, ప్రజలు ఈ తపాలా సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హోంగార్డ్ కుటుంబానికి చేయూతవిజయనగరం టౌన్: జిల్లా పోలీసుశాఖలో హోంగార్డ్గా పనిచేసి, ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన హోంగార్డ్ సీహెచ్.చిట్టినాయుడికి చేయూతనందించేందుకు హోంగార్డ్ సిబ్బంది పోగుచేసిన ఒక్కరోజు డ్యూటీ అలవెన్స్ రూ.3 లక్షల 69వేల 300 చెక్కును ఎస్పీ ఏఆర్.దామోదర్ మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసుశాఖలో పనిచేస్తూ ప్రమాదశాత్తు, అనారోగ్యంతో మరణించిన, ఉద్యోగవిరమణ చేసిన హోంగార్డ్ల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు హోంగార్డ్స్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, ఒక్కరోజు డ్యూటీ అలవెన్స్ మొత్తాన్ని పోగుచేసి, వారి కుటుంబాలకు చేయూతగా అందజేయడం అభినందనీయమన్నారు. ఈ తరహా చర్యలు చేపట్టడం వల్ల పోలీసు ఉద్యోగుల్లో ఐకమత్యం పెరగడంతో పాటు, వారి కుటుంబాలకు అండగా నిలిచామన్న భరోసా లభిస్తుందన్నారు. కార్యక్రమంలో హోంగార్డ్ ఇన్చార్జ్ ఆర్ఐ ఆర్.రమేష్ కుమార్, ఆఫీస్ సూపరింటెండెంట్ వి.లలిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అట్రాసిటి కేసులు త్వరగా పరిష్కరించాలి
● 13న విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం ● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డివిజయనగరం గంటస్తంభం: ఎస్సీ, ఎస్టీలపై జరిగే దాడులు, వివక్షకు సంబంధించి నమోదైన కేసుల్లో బాధితులకు చట్టపరమైన రక్షణతో పాటు సకాలంలో పరిహారం, పునరాహసం అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. ఎస్సీ,ఎస్టీ(అత్యాచారాల నిరోధక) చట్టం–1989, పౌర హక్కుల పరిరక్షణ చట్టం–1955 అమలుపై 2026–27 ఆర్ధిక సంవత్సరం రెండో త్రైమాసికానికి సంబంధించిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం ఈనెల 13వ తేదీ ఉదయం 11 గంటలకు కలెక్టరేట్లోని ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఈ చట్టాల కింద నమోదైన కేసుల ప్రస్తుత పరిస్థితి, దర్యాప్తు, ప్రాసిక్యూషన్ పురోగతి, బాధితులకు అందించిన ఆర్థిక సహాయం, ఉపశమనం, పునరాహస చర్యలను సమీక్షించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. -
పైడితల్లి అమ్మవారి జాతర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి
విజయనగరం అర్బన్: రానున్న పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవంలో అందరి సమన్వయంతో ప్రజలకు మరిన్ని మెరుగైన సౌకర్యాలను అందించి నగరపాలక సంస్థకు మంచిపేరు తీసుకురావాలని మున్సిపల్ కమిషనర్ బాలస్వామి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఆయన తన చాంబర్లో అన్ని విభాగాల అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. గత సంవత్సరంలో జరిగిన చిన్న చిన్న లోటుపాట్లు పునరావృత్తం కాకుండా తగు జాగ్రత్తలు వహిచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. గతంలో అమ్మవారి జాతర నిర్వహణ తీరు, నగరపాలక సంస్థ తరఫున చేపట్టిన పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జాతర ఏర్పాట్లపై ఇప్పటి నుంచే ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. నగరంలోని అన్ని వీధుల్లో కాలువల పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ గతం కంటే మరింత మెరుగ్గా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 14వ తేదీన నిర్వహించనున్న ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నగరంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ఈ నెల 14వ తేదీన ఒకే రోజు వెయ్యి మొక్కలు నాటేలా బృహత్తర హరిత కార్యక్రమాన్ని చేపట్టాలని ఇందుకు సంబంధించి తగిన ఏర్పాట్లు చేయాలని ఉద్యాన శాఖ అధికారి పీవీసంతోష్కుమార్ను ఆదేశించారు. సమీక్షా సమావేశంలో ఈఈ ప్రసాద్, ప్రజారోగ్య అధికారి డాక్టర్ కొందపల్లి సాంబమూర్తి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ రమణమూర్తి, రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు, డీఈ శ్రీనివాసరావు, టీపీఎస్ అనిత, వివిధ విభాగాల ఏఈలు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ బాలస్వామి -
రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం
● మరో విద్యార్థికి తీవ్ర గాయాలు తగరపువలస: భీమిలి మండలం తాళ్లవలస పంచాయతీ పరిధిలో ఆర్టీసీ బస్సు బైక్ను ఢీకొనడంతో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా, మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా రాజాంలోని జీఎంఆర్ఐటీ కళాశాలలో బీటెక్ చదువుతున్న ఆర్.గౌతమ్ (22), పోతురాజు రవికిరణ్ (21) భీమిలిలోని ఒక హోటల్లో ఇంటర్న్షిప్ కోసం వచ్చారు. మంగళవారం సాయంత్రం వీరు బైక్పై జేవీ అగ్రహారం నుంచి తాళ్లవలస వైపు వెళ్తుండగా, భీమిలి–క్రాస్రోడ్డు రహదారి దాటుతున్న సమయంలో విశాఖ నుంచి భీమిలి వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు వీరి బైక్ను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో గౌతమ్ అక్కడికక్కడే మృతి చెందగా, రవికిరణ్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని వెంటనే విశాఖలోని ఒక కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించారు. గౌతమ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు గౌతమ్ స్వస్థలం పెందుర్తి కాగా, గాయపడిన రవికిరణ్ విజయనగరం జిల్లా తెర్లాం మండలం గంగన్నపాడుకు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుడు రవికిరణ్ -
ఉత్తమ నినాదానికి నగదు బహుమతి
విజయనగరం గంటస్తంభం: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆకర్షణీయమైన, సముచితమైన నినాదం ఎంపిక ప్రక్రియను పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తున్నామని కలెక్టర్ రాంసుందర్రెడ్డి తెలిపారు. విద్యార్థులకు నిర్వహించిన నినాదాల పోటీల్లో 6199 నినాదాలు అందాయని, వీటిలో 2,355 నినాదాలు ఈమెయిల్లోను, 3,844 నినాదాలు వాట్సాప్లో అందాయన్నారు. వీటిలో ఉత్తమ నినాదాన్ని ఆగస్టు 14న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అధికారికంగా ప్రకటిస్తామని, నగదు బహుమతిని సీఎంఆర్, విజయనగరం మేనేజింగ్ డైరెక్టర్ మావూరి వెంకటరమణ సమకూర్చుతారన్నారు. ప్రతి ఇంటిపైనా జాతీయ జెండా ఎగురవేయాలి విజయనగరం గంటస్తంభం: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశం కోసం ప్రాణాలర్పించిన వారి త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఇంటిపైనా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, స్వాతంత్య్ర సమరయోధుల పేర్లు, వ్యక్తులు ఎంతమందనేది తెలియకపోయినా, వారి అందరి ప్రాతినిథ్యానికి ప్రతీక అయిన త్రివర్ణ పతాకాన్ని ప్రతి ఇంటిపై ఎగురవేసి వారి త్యాగాలను స్మరించుకోవాలని కోరారు. ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు ప్రతి మండలం, డివిజన్లు, జిల్లా కేంద్రాల్లో తిరంగా ర్యాలీలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ప్రతి ఒక్కరూ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా దేశం కోసం తాము ఏం సాధించాలనుకుంటున్నాం, 2047 నాటికి మన రాష్ట్రం, దేశం ఎలా ఉండాలనే అంశాలపై అభిప్రాయాలను పంచుకోవాలని, దీనికోసం 30 సెకన్ల సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో ఆప్లోడ్ చేసి మన ఆలోచనలను సమాజానికి తెలియజేయాలని కలెక్టర్ కోరారు. ఊరు దాటాలంటే గెడ్డ దాటాల్సిందే..గుమ్మలక్ష్మీపురం: కురుపాం మండలం ఉదయపురం పంచాయతీ కంఠుగూడ గ్రామస్తులకు గెడ్డపై వంతెన లేకపోవడంతో రాకపోకలకు అవస్థలు తప్పడం లేదు. గ్రామంలో 13 కుటుంబాలకు చెందిన 60 మంది గిరిజనులు దశాబ్దాలుగా జీవనం సాగిస్తున్నారు. ఈ గ్రామానికి నేటికీ రోడ్డు సౌకర్యం లేదు. దీంతో ఈ గ్రామస్తులంతా పొలం గట్లపై నుంచి కాలినడకన వెళ్తూ నడుము లోతు (1.2 మీటర్లు) ప్రవహించే గెడ్డను దాటుకుంటూ 2 కిలోమీటర్ల దూరాన ఉన్న డెప్పిగూడ గ్రామం వరకూ వెళ్తూ ఇతర గ్రామాలకు చేరుకోవాల్సిన పరిస్థితి. పెద్దల పరిస్థితి ఎలా ఉన్నా.. గ్రామంలో పాఠశాల, అంగన్వాడీ సెంటర్ లేకపోవడంతో అక్కడి విద్యార్థులు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాటిశీలకు, అంగన్వాడీ చిన్నారులు మాషిడిగూడకు ఆ గెడ్డవాగునే దాటుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సీజన్లో వర్షాలు పడితే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రాకపోకలు సాగించాల్సి వస్తోదంటూ..పాఠశాలకు వెళ్లిన పిల్ల లు వచ్చేంత వరకూ గుండె కొట్టుకోవడం ఆగదంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని, అలాగే గెడ్డ మీద వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయమై భద్రగిరి గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ శాఖ ఏఈ ఎస్.అప్పారావు వద్ద ప్రస్తావించగా..కంఠుగూడ గ్రామాన్ని సందర్శించామని, ఈ గ్రామానికి వెళ్లే రహదారిలో సీసీ రోడ్డు, గెడ్డ మీద వంతెన నిర్మించాల్సిన అవసరం ఉందని, అందు నిమిత్తం రూ.2.60 కోట్లతో ప్రతిపాదనలు సిధ్ధం చేశామని తెలియజేశారు. పార్వతీపురంలో ఆయుధాగారం పార్వతీపురం రూరల్: పోలీస్ సిబ్బంది భద్రత, ప్రజారక్షణే లక్ష్యంగా అత్యవసర సమయాల్లో ఆయుధాలు త్వరితగతిన సమకూరేలా పార్వతీపురం రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో నూతనంగా నిర్మించిన ‘బెల్ ఆఫ్ ఆర్మ్స్’ (ఆయుధాగారం)ను విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఆయుధాల సంరక్షణ, సాంకేతిక నిర్వహణ అత్యంత కీలకమని స్పష్టం చేశారు. సామగ్రి నిర్వహణలో అలసత్వానికి తావులేకుండా నిబంధనల ప్రకారం నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్పీ ఎస్.వి.మాధవ్రెడ్డి, అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, సీఐలు రమణమూర్తి, వెంకట్రావు, ఆర్ఐలు నాయుడు, రాంబాబు, ఆదినారాయణ పాల్గొన్నారు. -
చదువుతోనే ఉజ్వల భవిత
● విజయనగరం కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ విజయనగరం రూరల్: కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని, ఉజ్వల భవిత సొంతమవుతుందని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అన్నారు. విజయనగరం శివారు డబుల్ కాలనీ వద్ద ఉన్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని (కేజీబీవీ) మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. బోధనా తీరు, అభ్యసనా సామర్థ్యాలను పరీక్షంచారు. పదోతరగతి, ఇంటర్ విద్యార్థులకు రసాయన శాస్త్రం, జీవశాస్త్రం సబ్జెక్టులపై పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. చక్కగా చదువుకోవాలని సూచించారు. పదో తరగతిలో 594 మార్కులు సాధించిన గంగూబూడి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఉమాపార్వతిని అభినందించేందుకు స్వయంగా ఆమె ఇంటికి వెళ్లానని, విద్యార్థిని భవిష్యత్కు పూర్తి భరోసా కల్పిస్తూ ఆమెను విజయవాడలోని ఒక మంచి కళాశాలలో చేర్పించామని తెలిపారు. భవిష్యత్తులో ఎయిమ్స్లో సీటు సాధించాలన్న ఆ బాలిక లక్ష్య సాధనకు జిల్లా యంత్రాంగం తరఫున తమవంతు పూర్తి సహకారాన్ని అందిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం విద్యాలయంలో సదుపాయాలు, మెనూ అమలు తీరును ప్రిన్సిపాల్ సుజాతకుమారిని అడిగి తెలుసుకున్నారు. -
3 లక్షల జనాభా.. 309 ఖాళీలు!
విజయనగరం అర్బన్: కాగితాలపై నగరపాలక సంస్థగా స్థాయి పెరిగింది. జనాభా ముచ్చటగా మూడు లక్షలు దాటిపోయింది!.. కానీ, నగరంలో పారిశుద్ధ్యనిర్వహణ, ప్రజల ఆరోగాన్ని పర్యవేక్షించాల్సిన ‘మెడికల్ అండ్ హెల్త్’ విభాగం మాత్రం ఇప్పటికీ 30 ఏళ్లనాటి పాతకాలం నాటి అంకెల్లోనే బందీగా ఉండిపోయింది. 1996 సంవత్సరంలో కేవలం లక్ష జనాభాను ప్రాతిపదికగా తీసుకుని కేటాయించిన రెగ్యులర్ పోస్టులతోనే నేటికీ నెట్టుకొస్తుండడం పాలకుల ఘోర నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ● 1996 నాటి ప్లానింగ్తో 2026లో సేవలా? 30 ఏళ్ల కిందటి నాటి పోస్టుల మంజూరు ప్రకారం లక్ష జనాభాకు సరిపడా రెగ్యులర్ పోస్టులను అప్పట్లో ఇచ్చారు. అయితే, మూడు రెట్లు పెరిగిన జనాభాకు తగ్గట్టుగా ఆరోగ్య విభాగంలో పోస్టుల సంఖ్యను పెంచాల్సింది పోయి, ఉన్న రెగ్యులర్ పోస్టుల ఖాళీలను కూడా భర్తీ చేయకపోవడం వెనుక అధికారుల అలసత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పెరిగిన జనాభా ప్రాతిపదికన కొత్తగా పర్మినెంట్ పోస్టులను మంజూరు చేయడంతో పాటు ప్రస్తుతం ఉన్న 309 ఖాళీలను వెంటనే భర్తీచేసి పని ఒత్తిడి తగ్గించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. తాత్కాలిక, అవుట్ సోర్సింగ్ పద్ధతులపై ఆధారపడడం మానేసి పారిశుద్ధ్య రంగానికి పటిష్టమైన మౌలిక సదుపాయాలు కల్పించి రోగాల భారినుంచి కాపాడాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. ● అవుట్సోర్సింగ్తో అత్తెసర పాలన! రెగ్యులర్ సిబ్బందిని భర్తీ చేయకుండా అరకొర జీతాలతో ఆప్కాస్, టెండర్ కార్మికులతో నగర పారిశుద్ధ్యాన్ని నెట్టుకొస్తున్నారు. హెల్త్ వర్కర్ల కొరత తీవ్రంగా ఉండటంతో ప్రధాన మార్కెట్లు, బస్టాండ్, నివాస ప్రాంతాల్లో రెగ్యులర్గా ప్రతిరోజూ చెత్త ఎత్తకపోవడం సమస్యగా మారింది. చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయి. కాలువల శుభ్రతకు, ఫాగింగ్ చేయడానికి తగినంత సిబ్బంది లేకపోవడంతో డెంగీ, మలేరియా వ్యాధులు నగరవాసులను భయపెడుతున్నాయి. క్షేత్రస్థాయి పరిశీలన చేయాల్సిన సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్ల ఖాళీల వల్ల ప్రైవేటు టెండర్దారులు నామమాత్రంగానే పనిచేసి చేతులు దులుపుకుంటున్నారు. చెత్తకుప్పలతో దోమలు వృద్ధిచెంది నగరవాసులపై దాడిచేస్తున్నాయి. అనారోగ్యానికి కారణమవుతున్నాయి. పట్టణంలో ఉన్న ప్రభుత్వ ప్రైవేటు ఆస్పత్రుల్లో రోజుకు 10 నుంచి 15 వేల మంది అనారోగ్యం బారిన పడుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. భర్తీకాని పోస్టులు నగర ఆరోగ్య విభాగంలో మంజూరైన రెగ్యులర్ పోస్టుల్లో ఏకంగా 309 పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. పారిశుద్ధ్య వ్యవస్థకు వెన్నెముక లాంటి పబ్లిక్ హెల్త్ వర్కర్ల (రోజూ చెత్త ఊడ్చే కార్మికులు) కేటాయించిన 379 రెగ్యులర్ పోస్టుల్లో 209 ఖాళీగా ఉన్నాయి. ఫీల్డ్ లెవల్లో తనిఖీలు చేయాల్సిన శానిటరీ ఇన్స్పెక్టర్లు 6 పోస్టులకు 3 ఖాళీలే. ఆరోగ్య కార్యదర్శులు (వార్డ్ హెల్త్ సెక్రటరీలు) 61 పోస్టులకు 25 ఖాళీగా ఉన్నాయి. డ్రైవర్లు, క్లీనర్లు, శానిటేషన్ సెక్రటరీ శాఖల సంఖ్య కొండలా పేరుకుపోయింది. కుంటుపడుతున్న విజయనగరం ఆరోగ్య విభాగం పరిస్థితి పేరుకే నగరపాలక సంస్థ.. అధ్వానంగా పారిశుద్ధ్య నిర్వహణ రోగాల బారిన నగర ప్రజలు -
108కు ఆంక్షల సంకెళ్లు..!
విజయనగరం ఫోర్ట్: ప్రజారోగ్యంపై చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం చూపుతోందంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అందిన ఫ్యామిలీ డాక్టర్ సేవలు ఇప్పుడు ఎండమావిగా మారాయి. ఇంటింటికీ వైద్యులు వెళ్లి సేవలు అందించే పరిస్థితి కనిపించడం లేదు. తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ ప్రయాణ ఖర్చులు అమాంతం పెంచేసి తమ అనుకూలమైన కాంట్రాక్టర్కు కట్టబెట్టింది. కమీషన్ల రూపంలో ప్రజాధనం లూటీకి స్కెచ్ వేసింది. ఆరోగ్య ఆసరాకు మంగళం పాడేసింది. ఇప్పుడు అత్యవసర వేళ ఆదుకునే 108 వాహనాల వంతు వచ్చింది. అంబులెన్స్ సేవలకు ఆంక్షల కళ్లెం వేసి... ఆపద వేళ సేవలను అందని ద్రాక్షగా మార్చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ● రోగుల తరలింపులో ఆంక్షలు... గత కొద్ది రోజులుగా 108 అంబులెన్సులకు రోగుల తరలింపు విషయంలో ఆంక్షలు పెట్టినట్టు సమాచారం. ఏ మండలంలో ఉన్న అంబులెన్సు అదే మండలంలో ఉన్న రోగులను మాత్రమే తరలించాలని, పక్క మండలానికి చెందిన రోగులను తరలించడానికి వీలులేదంటూ ఉద్యోగులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. వీటిని బయటపెడితే ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తామని 108 సేవల జిల్లా అధికారి ఒకరు హెచ్చరికలు జారీచేశారట. పీహెచ్సీ నుంచి సీహెచ్సీకి, సీహెచ్సీ నుంచి సర్వజన ఆస్పత్రికి, సర్వజన ఆస్పత్రి నుంచి కేజీహెచ్కు తరలింపు విషయంలో ఆంక్షలు పెట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయా ఆస్పత్రి పరిధి లో ఉన్న 108 అంబులెన్సులు రోగులను రిఫరల్ ఆస్పత్రికి తరలించినప్పుడు మరొక కేసు వస్తే ఆ కేసును ఆస్పత్రిలో చేర్పించిన తర్వాత మళ్లీ వచ్చి తీసుకుని వెళ్లాల్సిందే తప్ప పక్క మండలంలో ఉన్న 108 అంబులెన్సు తీసుకుని వెళ్లడానికి వీలు లేనివిధంగా నిబంధన పెట్టినట్టు సమాచారం. సర్వజన ఆస్పత్రి నుంచి కేజీహెచ్కు 108 అంబులెన్సు వెళ్లి వచ్చేసరికి మూడున్నర నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. సర్వజన ఆస్పత్రిలో రోగు లు అధికంగా ఉండడం వల్ల ఎప్పుడు ఎవరికి ఎటువంటి అత్యవసరం అవుతుందో తెలియదు. ఉన్న ఒక్క అంబులెన్సు వెళ్లి రావాలంటే ఈలోగా రోగుల పరిస్థితి విషమం మారే ప్రమాదం ఉంది. దీంతో ఆస్పత్రుల వైద్యాధికారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రుల అధికారుల గ్రూపుల్లో కూడా ఇదే చర్చ జరుగుతోంది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారిని సకాలంలో ఆస్పత్రికి చేర్చకపోతే ప్రాణాలు ఏ విధంగా కాపాడగలమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే విద్య, వైద్యంను ప్రైవేటు పరం చేస్తున్న చంద్రబాబు సర్కారు... 108 వాహనాల భారాన్ని సైతం తగ్గించుకోవాలని చూస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సర్వజన ఆస్పత్రి వద్ద ఉన్న 108 అంబులెన్సు ప్రైవేటు అంబులెన్సులే గతి జిల్లాలో 108 అంబులెన్సులు 28 ఉన్నాయి. రోగులను తరలించడానికి ఆంక్షలు పెట్టడం కారణంగా అత్యవసర పరిస్థితుల్లో రిఫరల్ ఆస్పత్రికి వెళ్లడానికి రోగులు ప్రైవేటు ఆస్పత్రులను అశ్రయించాల్సిన పరిస్థితి. ఇదే అదునుగా ప్రైవేటు అంబులెన్సుల నిర్వాహకులు దోపిడీకి తెరలేపుతున్నారు. ఉచితంగా ఆస్పత్రికి వెళ్లాల్సిన రోగులు వేలాది రూపాయలు ఖర్చుపెట్టి ఆస్పత్రికి వెళ్లాల్సిన దుస్థితి. దీని వల్ల 108 అంబులెన్సుల ఏర్పాటు చేసిన లక్ష్యానికి తూట్లు పడుతున్నాయన్న వాదన వినిపిస్తోంది. ఆపద సమయంలో ఉన్న రోగులను ఉచితంగా ఆస్పత్రికి చేర్పించి ప్రాణాలు కాపాడాలనే సదుద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి 108 అంబులెన్సులను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు ఆ సేవలకు కోత పెట్టడంపై జనం మండిపడుతున్నారు. అప్పుడు లేని నిబంధనలు ఇప్పుడే.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అరవిందో సంస్థ 108 వాహనాలను నిర్వహించేది. అత్యవసర కేసులను తరలించడానికి ఆ మండలంలో 108 అంబులెన్సు అందుబాటులో లేకపోతే పక్క మండలంలో ఉన్న అంబులెన్సును పంపించి రోగులను తరలించేవారు. రోగుల తరలింపులో ఎటువంటి ఆంక్షలు, నిబంధనలు ఉండేవికావు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంబులెన్సుల నిర్వహణ బాధ్యతలను భవ్య సంస్థకు అప్పగించింది. ఆపదవేళ ఆదుకోవాల్సిన వాహనానికి ఆంక్షలు పెట్టడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అవసరం లేని కేసులు రిఫర్ చేస్తున్నారు.. అంబులెన్సులో తరలించడానికి అవసరం లేని కేసులను కూడా ఆస్పత్రులు రిఫర్ చేస్తున్నారు. అంబులెన్సు అనేది అత్యవసర కేసులు తరలించడానికి కదా. అత్యవసరం అనుకున్న కేసులను తరలించడం జరుగుతుంది. – మన్మథనాయుడు, 108 జిల్లా మేనేజర్ 108 నిర్వహణ సంస్థ కొత్త నిబంధనలు! ఏ మండలానికి కేటాయించిన అంబులెన్సు ఆ మండలం రోగులనే తరలించాలన్న షరతు.. అత్యవసరమైనా నిరీక్షించాల్సిందే.. జిల్లాలో 108 అంబులెన్సుల సంఖ్య 28 -
ఫిబ్రవరి నాటికి రీ సర్వే పూర్తి కావాలి
–8లో● రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం హోంగార్డ్ కుటుంబానికి చేయూతపోలీసుశాఖలో హోంగార్డ్గా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన చిట్టినాయుడికి హోంగార్డ్ సిబ్బంది ఒక్కరోజు డ్యూటీ అలవెన్స్ రూ.3.69 లక్షల చెక్కును ఎస్పీ అందజేశారు.విజయనగరం గంటస్తంభం: జిల్లాలో రీ–సర్వే ప్రక్రియ వచ్చే ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో రెవెన్యూ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్షలో రీ–సర్వే, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, 22ఏ, మ్యుటేషన్లు, రెవెన్యూ, పీజీఆర్ఎస్ అంశాలపై చర్చించారు. రీ–సర్వే, పాసుపుస్తకాల పంపిణీ పూర్తయితే భూ సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయని తెలిపారు. సుమారు 1.30 లక్షల జాయింట్ ఎల్పీఎంలలో అత్యధికం విడదీయడంతో ఫిర్యాదులు తగ్గాయని, మిగిలిన వాటిని కూడా వేగంగా పూర్తి చేయాలని సూచించారు. సెప్టెంబర్ నెలాఖరుకు 50 గ్రామాల్లో రీ–సర్వే పూర్తి చేయాలని జేసీ సేతు మాధవన్ ఆదేశించారు. ఫేజ్–4, 5లో పెండింగ్ పనులను వేగవంతం చేయాలని, పీపీబీల పంపిణీని పూర్తి చేయాలన్నారు. సమీక్ష సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) సీహెచ్.సత్తిబాబు, విజయనగరం ఆర్డీఓ సుధాసాగర్, సర్వే ఏడీ విజయ్కుమార్ ప్రత్యక్షంగా హాజరుకాగా, ఆన్లైన్లో ఇతర ఆర్డీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
దగా డీఎస్సీపై మెగా పోరు
సాక్షిప్రతినిధి, విజయనగరం: డీఎస్సీ అక్రమాలపై యువత సమరభేరి మోగించింది. ఉప్పెనగా ఉద్యమించింది. ప్రశ్నపత్రం లీకేజీ, పోస్టుల నియామకాల్లో అవకవతకలపై నిగ్గుతేల్చాలంటూ సోమవారం విజయనగరం జిల్లాలోని ఏడు నియోజకవర్గ కేంద్రాల్లో వేలాది మంది రోడ్డు ఎక్కారు. విద్యాశాఖ మంత్రి నారాలోకేశ్ సారథ్యంలో జరిగిన డీఎస్సీ రిక్రూట్మెంట్ మొత్తం అవకతవకల మయమని, మెరిట్ను.. రోస్టర్ పాయింట్లను పక్కనపెట్టి ఇష్టానుసారం పోస్టులు అమ్ముకొని ప్రతిభావంతులకు అన్యాయం చేశారని నిలదీశారు. మెగా డీఎస్సీ పేరిట దగా చేసి, నిరుద్యోగ యువతను నిండా ముంచేసిన చంద్రబాబు సర్కారుపై నిరసన తెలిపారు. అయితే, డీఎస్సీ అవినీతి ప్రజల్లోకి వెళ్లిందని, కచ్చితంగా దీనిపై భారీగా ప్రజా ఉద్యమం ఉంటుందన్న సమాచారం ముందే అందుకున్న ప్రభుత్వం పోలీసు వర్గాలను ఆదివారం రాత్రి నుంచే అప్రమత్తం చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు యువత, ఉద్యమకారులపై లాఠీలు గురిపెట్టించింది. నాయకులను హౌస్ అరెస్టు చేయడమే కాకుండా.. నోటీసులు ఇస్తూ కేసులు పెడతామని బెదిరించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లవద్ద, పార్టీ కార్యాలయాల వద్ద భారీ ఎత్తున పోలీసులను మోహరించి ఉద్యమాన్ని ముందుకు కదలనివ్వకుండా ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించింది. అయితేనేం పోలీసులను దీటుగా ఎదుర్కొన్న యువత, పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేశారు. డీఎస్సీ అక్రమాలపై నిగ్గుతేల్చాలంటూ నినదించారు. ● అడుగడుగునా ఆంక్షలు విజయనగరం జిల్లా కేంద్రంలోని రామారాయుడు రోడ్డు (పీడబ్ల్యూ మార్కెట్) నుంచి ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి నాయకత్వంలో భారీ నిరసన ర్యాలీకి సన్నాహాలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ముందస్తు నోటీసులు లేకుండానే భారీగా మోహరించి ర్యాలీకి అనుమతి లేదని అడ్డుకున్నారు. నిరుద్యోగుల ఆందోళనకు మద్దతుగా నగర పరిధిలోని పలు విభాగాలు, గ్రామాల నుంచి పార్టీ శ్రేణులు, యువత ఉదయం 11 గంటలకే పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రభుత్వ దమనకాండపై నిరసన తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసుల ఆదేశాలను గౌరవిస్తూ ర్యాలీని విరమిస్తున్నట్లు కోలగట్ల ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ చేపట్టిన రిలే దీక్షలు, ప్రజా ఉద్యమాలను చూసి భయపడే పోలీసులతో అడ్డుకుందన్నారు. ఊరూవాడా ఏకం కావడంతో సర్కారు బేజారు శాంతియుత ర్యాలీలపై పోలీస్ ఆంక్షలు నాయకుల హౌస్ అరెస్ట్.. అయినా వెనక్కి తగ్గని యువత ఉద్యమాన్ని ముందుకు నడిపిన నాయకులు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామాకు డిమాండ్ -
● నిరసన హోరు
డీఎస్సీ నిర్వహణలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ బొబ్బిలి నియోజకవర్గ సమన్వయకర్త శంబంగి వెంకట చినఅప్పలనాయుడు ఆధ్వర్యంలో సోమవారం భారీ ర్యాలీ తలపెట్టారు. బలిజిపేట కూడలిలో దివంగత వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించి ర్యాలీ ప్రారంభించగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రశాంతంగా, ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపే హక్కు కూటమి ప్రభుత్వంలో లేదా అని సీఐలను మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. డీఎస్సీ అక్రమాలపై నిగ్గుతేల్చాలంటూ నినదించారు. మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శంబంగి వేణుగోపాల నాయుడు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
●నెల్లిమర్లలో నోటీసులు, నిర్బంధాలు
డీఎస్సీ అక్రమాలకు నిరసనగా నెల్లిమర్లల్లో చేపట్టిన శాంతియుత ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ముందుగానే నాయకులకు నోటీసులు ఇచ్చారు. కొందరిని గృహనిర్బంధం చేశారు. నెల్లిమర్ల పట్టణ పరిధిలోని జరజాపుపేట శ్రీరాజబంగారమ్మ గుడి ప్రాంగణంలో నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీ సురేష్బాబు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీకి సన్నాహాలు చేశారు. అక్కడకు పోలీసులు చేరుకుని ర్యాలీని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు, వైఎస్సార్సీపీ శ్రేణులు నినదించారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు నెక్కల నాయుడుబాబు, పార్టీ మండలాధ్యక్షులు గేదెల సన్యాసినాయుడు, పతివాడ అప్పలనాయుడు, తమ్మునాయుడు, ఉప్పాడ సూర్యనారాయణరెడ్డి, పట్టణ అధ్యక్షుడు చిక్కాల సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు. -
పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
జియ్యమ్మవలస రూరల్: మండలంలోని అలమండ పంచాయతీ నిడగల్లు గూడ గ్రామానికి చెందిన బిడ్డిక సుబ్బారావు (42) మద్యానికి బానిసై రోజంతా మందు తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాడని భార్య గౌరి, కుమారుడు ప్రదీప్ మందలించడంతో మనస్తాపం చెంది ఆదివారం సాయంత్రం గడ్డి మందు తాగేశాడు. ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు రామభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లగా, అక్కడ వైద్యులు చికిత్స అందించి పరిస్థితి విషమంచడంతో మెరుగైన చికిత్స కోసం చినమేరంగి సామాజిక ఆరోగ్య కేంద్రానికి రిఫర్ చేశారు. ఈ మేరకు 108లో తీసుకువెళ్తుండగా మార్గమధ్యంలో సుబ్బారావు మృతి చెందాడు. ఈ ఘటనపై భార్య కుమారుల ఫిర్యాదు మేరకు జియ్యమ్మ వలస ఎస్సై ఎన్.ప్రశాంత్ కుమార్ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.దుర్గాదేవి గుడిలో చోరీదత్తిరాజేరు: మండలంలోని కోమటిపల్లి ఆటో స్టాండ్ వద్ద ఉన్న దుర్గాదేవి ఆలయంలో సోమవారం తెల్ల వారు జామున హుండీ చోరీకి గురైనట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ విషయంపై పెదమానాపురం పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి పరిసర ప్రాంతాలను శీలించినట్లు తెలిపారు. హుండీలో సుమారు రూ.20 వేల వరకు భక్తులు వేసిన నగదు ఉంటుందని చెప్పారు. ఈ విషయమై పెదమానాపురం ఎస్సై కళాధర్ వద్ద ప్రస్తావించగా దొంగలు ఎటువైపు నుంచి వచ్చారో తెలియడానికి దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించనున్నట్లు తెలిపారు. ఆటోస్టాండ్ వద్ద తెల్ల వారు జామున ప్రయాణికుల కోసం ఉంచిన ఆటోలో కొంత నగదు రెంచీలు దొంగలు తీసుకుని పోయినట్లు ఆటో డ్రైవర్లు చెబుతున్నారు. కాలువలో పడి బాలిక మృతిగరుగుబిల్లి: బట్టలు ఉతికేందుకు వెళ్లిన బాలిక తోటపల్లి ప్రాజెక్టు కుడి ప్రధానకాలువలో ప్రమాదవశాత్తు కాలుజారి పడి మృతిచెందింది. ఈ సంఘటన గరుగుబిల్లి మండలంలోని దళాయివలస పంచాయతీ మధుర శివరాంపురం గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన ఆకుల నిషా(15) గ్రామ సమీపంలోని కాలువ వద్ద బట్టలు ఉతుకుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయింది. కాలువ ప్రాంతానికి వెళ్లిన కుమార్తె ఇంటికి చేరుకోక పోవడంతో కాలువ ప్రాంతంలో పరిశీలించగా అందులో పడి మృతి చెందిందని నిర్ధారణకు వచ్చిన తండ్రి రాజు, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చేపట్టారు. కొద్దిసేపటి అనంతరం బాలిక మృతదేహన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. తన కుమార్తె నిషాకు మతిస్థిమితం లేదని తండ్రి చెప్పాడు. తమకు ఉన్న ఇద్దరు కుమార్తెల్లో పెద్దకుమార్తె నిషా చిన్న వయస్సులోనే మృతి చెందడంతో తల్లిదండ్రులు రాజు, ఇందుతో పాటు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై ఫకృద్దీన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
న్యాయం జరిగేంతవరకు పోరాడతాం
మొత్తం భూమిపై కోర్టులో కేసు నడుస్తోంది బాడంగి, డొంకినవలస రెవెన్యూ పరిధిలోని మొత్తం 32ఎకరాలభూములపైన కోర్టులో కేసు నడుస్తోంది. మాభూములు మాకు ఇప్పించాలంటూ కోర్టువారిని కోరాం. తీర్పువచ్చేంతవరకు ఎవరూ ఆక్రమణలు చేయడానికి వీలులేదు. – గండిశంకరరావు, రైతు, గ్రామపెద్ద, డొంకినవలస కోర్టులో కేసు ఉండగా దౌర్జన్యం తగదు ఉద్యోగం, ఉపాధి కల్పిస్తామంటేనే భూములిచ్చాం డొంకినవలసలో రైతుల ధర్నా -
దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలి
● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పిలుపు ● ‘అనే నేను’ ప్రచార కార్యక్రమానికి శ్రీకారంవిజయనగరం గంటస్తంభం: దేశ స్వాతంత్య్ర స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దేశ నిర్మాణంలో భాగస్వాములు ‘అనే నేను’ ప్రచార కార్యక్రమాలను ఆగస్టు 10 నుంచి 15వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. స్వాతంత్య్ర దిన వేడుకల్లో ప్రజలు కేవలం ప్రేక్షకులుగా కాకుండా దేశ నిర్మాణంలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించేలా కార్యక్రమాలను రూపొందించినట్లు పేర్కొన్నారు. ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై, వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండాను ఎగురవేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఆగస్టు 14న జిల్లా వ్యాప్తంగా భారీగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రజలు తమ ఇళ్ల వద్ద లేదా ప్రముఖ ప్రదేశాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. అలాగే ప్రభుత్వ భవనాలు, బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, ముఖ్య కూడళ్లను జాతీయ రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించాలని సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో ‘అనే నేను’ కార్యక్రమాన్ని నిర్వహించి, దేశ భవిష్యత్తు కోసం తాము చేయగలిగే కృషిపై విద్యార్ధులతో ప్రతిజ్ఞ చేయించాలని తెలిపారు. యువత, విద్యార్ధులు, ప్రముఖలు, క్రీడాకారులు, పౌరులు జాతీయ జెండాను చేతబట్టి ‘అనే నేను...దేశ అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తాను’ అంటూ 30 నుంచి 60 సెకన్ల స్వీయ వీడియోలను రూపొందించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయాలని కలెక్టర్ కోరారు. అభివృద్ధి చెందిన భారత్, స్వర్ణాంధ్ర–2047 లక్ష్యాల సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఆలోచిద్దాం..ఆచరిద్దాం..అభివృద్ధి చెందిన భారత్ను నిర్మిద్దాం అనే స్ఫూర్తితో ముందుకు సాగాలని జిల్లా ప్రజలకు, అధికారులకు కలెక్టర్ పిలుపునిచ్చారు. -
● నిరుద్యోగులకు అన్యాయం చేయొద్దు
చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తోందని, డీఎస్సీలో అక్రమాలకు పాల్పడి అర్హులకు అన్యాయం చేసిందని గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య విమర్శించారు. చంద్రబాబు పాలనపై యువత తిరుగుబాటు ఆరంభమైందన్నారు. ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేయడం, ఫీజురీ యింబర్స్మెంట్ చెల్లించకపోవడంపై యువత పోరుకు సిద్ధమైందన్నారు. గజపతినగరం జూనియర్ కాలేజీ వద్ద ప్రారంభమైన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంపై ఆయన అసహనం వ్యక్తంచేశారు. డీఎస్సీలో నిరుద్యోగ అభ్యర్థులకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తే ప్రభుత్వం పోలీసులతో నోళ్లు నొక్కించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో నియోజకవర్గం పరిశీలకుడు సిరిపురపు జగనన్మోహనరావు పాల్గొన్నారు. -
● కోటలో నిరసన గళం
డీఎస్సీ అక్రమాలపై నిగ్గుతేల్చాలంటూ ఎస్.కోట ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలిలో మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు నేతృత్వంలో నిరసన సభ, ర్యాలీ నిర్వహించారు. దేవీ కూడలి వరకు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా సీఐ నారాయణమూర్తి నేతృత్వంలోని పోలీసు బలగాలు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. శాంతియుతంగా చేపట్టే ర్యాలీని అడ్డుకునేలా సర్కారు పెట్టిన ఆంక్షలపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ పరిశీలకురాలు కె.భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే శోభ హైమావతి, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
ఎయిడ్స్పై అవగాహన కల్పించాలి
విజయనగరం ఫోర్ట్: హెచ్ఐవీ, ఎయిడ్స్పై అవగాహన కల్పించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి వైద్యసిబ్బందికి సూచించారు. హెచ్ఐవీ, ఎయిడ్స్పై అవగాహన కల్పించడం కోసం రూపొందించిన ఇంటిన్సైఫెడ్ ఐఈసీ క్యాంపైన్ కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం తన చాంబర్లో ప్రారంభించారు. వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రచార కార్యక్రమం జిల్లాలో రెండు నెలలు పాటు కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ ఎస్.జీవనరాణి, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ దేవీమాధవి, సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ అల్లు పద్మజ, డీఎల్ఓ రాణి పాల్గొన్నారు. కార్పొరేషన్ తీరుపై నమ్మకం లేదా? ● కమిషనరేట్ కార్యాలయంలో పీజీఆర్ఎస్కు ఒక అర్జీ ● కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్కు మున్సిపల్ సమస్యలపై 15 అర్జీలు విజయనగరం అర్బన్: నగర పాలక సంస్థ అధికారులు, పాలకవర్గంపై నగర ప్రజలకు నమ్మకం లేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సమస్యలను కార్పొరేషన్ అఽధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకలపోవడంతో నగరవాసులు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తున్నారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా వినతుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)’ కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన కరువైంది. ఏకంగా నగరవ్యాప్తంగా కేవలం ఒక్కటంటే ఒక్క వినతి పత్రం మాత్రమే రావడం గమనార్హం. అయితే, మున్సిపల్ పరిధిలోని సమస్యలపై కలెక్టర్ వేదికలో ఏకంగా 15 వినతి పత్రాలు సమర్పించారు. స్థానిక కార్పొరేషన్ అధికారులపై నమ్మకం సన్నగిల్లడం వల్లే నగరవాసులు కలెక్టరేట్ బాటపడుతున్నట్టు స్పష్టమవుతోంది. మున్సిపల్ కార్యాలయంలో ప్రజారోగ్య విభాగానికి సంబంధించి వచ్చిన ఆ ఒక్క వినతిని కమిషనర్ బాలస్వామి స్వీకరించి, అధికారులకు బదిలీ చేశారు. పంటల బీమా నమోదులో జాప్యం వద్దు విజయనగరం ఫోర్ట్: పంటల బీమా నమోదు లో జాప్యంచేయొద్దని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్ నుంచి వ్యవసాయశాఖ ఏడీలు, ఎంపీడీఓలు, మండల వ్యవసాయ అధికారులతో సోమవారం సాయంత్రం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు 15,600 హెక్టార్లకు మాత్రమే పంటల బీమా జరిగిందని, బీమా కేవలం నాలుగు రోజుల సమయం ఉన్నందున రైతులు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. జిల్లాలో ఎలినినో పరిస్థితుల దృష్ట్యా రైతులతో తక్షణమే పంటల బీమా నమోదు చేయించాలన్నారు. -
సమాధానం చెప్పలేక సంకెళ్లు
చంద్రబాబు సర్కారు డీఎస్సీ అక్రమాలపై సమాధానం చెప్పలేక.. నిరసన తెలిపిన వారికి సంకెళ్లు వేస్తోందని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని ఉక్కుపాదంతో పూడ్చిపెట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు. చీపురుపల్లి–గరివిడి ప్రధాన రహదారిలోని మామిడికాయలశాల వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులను పోలీసులు బారికేడ్లు, తాళ్లతో మోహరించి అడ్డుకోవడంపై నిలదీశారు. అక్కడే బైఠాయించి సర్కారు తీరును ఎండగట్టారు. డీఎస్సీ అక్రమాలపై సమాధానం చెప్పాలని, దీనికి బాధ్యత వహిస్తూ మంత్రి లేకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
కేజీకి 900 గ్రాములే..!
రామభద్రపురం: చంద్రబాబు పాలనలో వ్యవస్థలు గాడి తప్పుతున్నాయని వాటిని పరిష్కరించే నాథుడు కరువయ్యాడని పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా రేషన్ సరుకుల పంపిణీ వ్యవస్థలో జరుగుతున్న లోపాలు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చర్చించే ఆహార సలహా సంఘాలు కానరావడంలేదు. దీంతో రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్న నిత్యావసర సరుకులు ఇష్టానుసారం సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. బియ్యం పంపిణీలో డీలర్ల ఇష్టారాజ్యం జిల్లాలో రేషన్ 1254 దుకాణాలు ఉండగా వాటి పరిఽథిలో ఉన్న 5,70,980 కార్డులకు 9,02,06 మెట్రిక్ టన్నులు బియ్యం 11 ఎంఎల్ఎస్ గోదాముల నుంచి సరఫరా అవుతున్నాయి. అయితే చౌకదుకాణాల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్ బియ్యం పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయని లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. డీలర్లు తూకాల్లో కిలోకి 100 గ్రాముల పైడి కోత విధించి బియ్యం ఇస్తున్నారని వాపోతున్నారు. మరి కొన్నిచోట్ల 20 కిలోలకు గాను సుమారు 3 కిలోల వరకు తక్కువ ఇస్తున్నట్లు తెలిసింది.ఈ విషయమై డీలర్లను ప్రశ్నిస్తే..ఎంఎల్ఎస్ గోదాంల నుంచే తూకాలు తక్కువ చేసి బియ్యం సరఫరా చేస్తున్నారని చెబుతున్నారు. వాటిని పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. నిల్వ కేంద్రాల్లోనూ తక్కువగా.. ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న బియ్యాన్ని ఎంఎల్ఎస్ గోదాముల నుంచి డీలర్లు తీసుకుని రేషన్ దుకాణాల ద్వారా కార్డు దారులకు పంపిణీ చేస్తారు.అయితే గోదాముల నుంచి సరఫరా అవుతున్న బియ్యంలో పెద్ద తేడా కనపడుతోందని డీలర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గోదాము నుంచి 50 కిలోల బస్తా తీసుకుంటే 48 కిలోలే వస్తున్నాయని డీలర్లు వాపోతున్నారు. ఇదే విషయమై ఇటీవల జిల్లాలో రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు బి.కాంతారావు రేషన్ దుకాణాల్లో అకస్మిక తనిఖీలు చేస్తున్న సమయంలో జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచే తూకంలో తేడాలు వస్తున్నాయని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.తూకాల్లో తేడాలు వస్తే నిల్వ కేంద్రాల నుంచి బియ్యం తీసుకునేటప్పుడు డీలర్లు ఎందుకు అడగడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ భారాన్ని గోదాము నిర్వాహకులు, డీలర్లు కలిసి కార్డుదారుల మీదకు నెడుతున్నారని, ఇరు పక్షాలు కలిసి పేదల పొట్ట కొడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నెత్తి చూడని లీగల్మెట్రాలజీ అధికారులు తూకాల్లో వ్యత్యాసాన్ని పరిశీలించాల్సిన లీగల్ మెట్రాలజీ అధికారులు లబ్ధిదారులు నష్టపోతున్నా కనీసం కన్నెత్తి చూడడం లేదని, మామూళ్ల మత్తులో కార్యాలయాలకే పరిమమతమవుతున్నారని లబ్ధిదారుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.ఈ ఏడాది మార్చి నెలలో రేషన్ డీలర్లకు చెందిన కాటాలను పరిశీలించి సీళ్లు వేశారు. అందుకు ఒక్కో డీలర్ నుంచి కాటా సీలుకు రూ.600, ఎప్పుడైనా కాటా రిపేరు వస్తే మరమ్మతు చేయడానికి రూ.400లు మొత్తం రూ.1000 తీసుకుని తాత్కాలిక రసీదు ఇచ్చి వెళ్లిపోయారు. ఇప్పటివరకు ఒరిజినల్ లీగల్ మెట్రాలజీ ధ్రువీకరణ పత్రం ఇవ్వలేదు. మూడు నెలలకో, ఆరు నెలలకో ఒకసారైనా తనిఖీలు చేపట్టకపోవడంతో డీలర్లు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది. పేదలకు ప్రభుత్వం అందించే నిత్యావసర సరుకుల పంపిణీని అధికారులు కూడా తనిఖీ మానేశారనే విమర్శలు లేకపోలేదు. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆర్డీవో అధ్యక్షతన ప్రజా సంఘాలు, అన్ని వర్గాలు, రాజకీయ పార్టీప్రతినిధులతో ఏర్పాటు చేసిన ఆహార సలహా సంఘం సభ్యులతో ప్రతి మూడు నెలలకోసారి సమావేశం నిర్వహించి దీర్ఘకాలికంగా ఉన్న ప్రజా సమస్యలపై చర్చించాల్పి ఉంది. అయితే అధికారులు ఆహార సలహా కమిటీల ఏర్పాటు గాని, సమావేశాలు ఏవీ నిర్వహించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. అధికారుల పర్యవేక్షణతో పాటు తనిఖీలు చేయకపోవడంతో పాటు ఆహార సలహా కమిటీ కానరాకపోవడంతో పేదలకు నిత్యావసర సరుకుల సరఫరా ఇష్టానుసారం చేస్తున్నట్లు ఆరోపణలు వినపడుతున్నాయి. ఇష్టాను సారం పేదలకు రేషన్ డీలర్ల బియ్యం పంపిణీ లబ్ధిదారులకు కోత విధిస్తున్న రేషన్ డీలర్లు ఎంఎల్ఎస్ గోదాం నిర్వాహకులు ఇవ్వడం లేదంటున్న డీలర్లు పర్యవేక్షించని ఉన్నతాధికారులు తనిఖీలు చేయని లీగల్ మెట్రాలజీ అధికారులు ఇటీవల అకస్మికంగా గుర్తించిన రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు -
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ● పీజీఆర్ఎస్–రెవెన్యూ క్లినిక్లో 210 వినతుల స్వీకరణవిజయనగరం గంటస్తంభం: ప్రజాసమస్యల పరిష్కారంలో అధికారులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్),రెవెన్యూ క్లినిక్లో వచ్చిన ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కరించాలని సూచించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో నిర్వహించిన పీజీఆర్ఎస్–రెవెన్యూ క్లినిక్లో మొత్తం 210 వినతులు స్వీకరించగా..అందులో రెవెన్యూ శాఖకు సంబంధించినవే 95 అర్జీలు ఉన్నాయి. భూ, సర్వే సమస్యలను కేవలం కార్యాలయం స్థాయి నివేదికలకే పరిమితం చేయకుండా అవసరమైన చోట క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. సంబంధిత వ్యక్తులతో మాట్లాడి, రికార్డులను పరిశీలించిన తర్వాత వాస్తవ పరిస్థితుల ఆధారంగా సమస్యకు పరిష్కారం చూపాలని సూచించారు. ఇప్పటికే పెండింగ్లో ఉన్న అర్జీలను ప్రాధాన్యతతో పరిష్కరించి, ప్రజలు ఒకే సమస్యపై పదేపదే కార్యాలయాల చూట్టూ తిరిగే పరిస్థితి లేకుండా చూడాలని ఆదేశించారు. మాట్లాడాకే ఎండార్స్మెంట్.. పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అర్జీదారుతో నేరుగా మాట్లాడిన తర్వాతే ఎండార్స్మెంట్ ఇవ్వాలి. వారితో మాట్లాడిన తేదీ, సమయాన్ని నివేదికలో తప్పనిసరిగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. కేవలం కాగితాలపై నివేదికలు ఇవ్వకుండా సమస్య వాస్తంగా పరిష్కారమైందా లేదా నిర్ధారించుకోవాలని సూచించారు. 1100 ఫిర్యాదులపైనా దృష్టి 1100 టోల్ఫ్రీ సేవల ద్వారా వచ్చే ఫిర్యాదులను కూడా నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. అర్జీదారుతో మాట్లాడి సమస్యను పూర్తిగా తెలుసుకున్న తర్వాతే నివేదిక ఇవ్వాలని సూచించారు. 1100 సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, డీఆర్వో సీహెచ్.సత్తిబాబు, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి ఇ.మురళి, ఆర్డీవోలు, వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ గ్రీవెన్స్సెల్కు 36 ఫిర్యాదులు విజయనగరం టౌన్: ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి వారికి చట్టపరిధిలో న్యాయం చేయడానికి గ్రీవెన్స్సెల్ నిర్వహిస్తున్నామని ఎస్పీ ఏఆర్.దామోదర్ పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించి బాధితులతో స్వయంగా మాట్లాడి, సమస్యలను విని, వెంటనే సంబంధిత అధికారులతో చర్చించి సమస్యలకు తక్షణ పరిష్కారమందించాలని సూచించారు. గ్రీవెన్స్సెల్లో భాగంగా 36 పిర్యాదులను స్వీకరించారు. భూతగాదాలకు సంబంధించి 12, కుటుంబ తగాదాలకు సంబంధించి ఆరు, చీటింగ్కు సంబంధించి నాలుగు, ఇతర అంశాలకు సంబంధించి 14 ఫిర్యాదులు అందాయి. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీసీఆర్బీ సీఐ కుమారస్వామి, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, ఎస్సై ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు సర్కారుపై తిరుగుబాటు
● స్కీమ్ వర్కర్ల ధర్నాతో దద్దరిల్లిన కలెక్టరేట్ ● కనీస వేతనాల కోసం కార్మికుల సమరం ● పోలీసులు, కార్మికుల మధ్య తోపులాట ● సొమ్మసిల్లిన మహిళలు విజయనగరం గంటస్తంభం: చంద్రబాబు సర్కారుపై అంగన్వాడీ, ఆశ, స్కీమ్ వర్కర్లు తిరుగుబాటు ప్రకటించారు. హామీల అమలులో అలసత్వం, సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంపై సమరభేరి మోగించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం చలో కలెక్టరేట్ నిర్వహించారు. వేలాది మంది కార్యకర్తలు గూడ్స్ షెడ్ కూడలి నుంచి ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకున్నారు. కనీస వేతనం నెలకు రూ.26,000 చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, 12 గంటల పనిదినాలను ఉపసంహరించుకుని లేబర్ కోడ్లను రద్దు చేయాలని, 15 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న వేతన సవరణ వెంటనే చేపట్టి ఆశ, అంగన్వాడీ, స్కీమ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని నినదించారు. స్టీల్ ప్లాంట్, ఆర్టీసీ ప్రైవేటీకరణ ఆలోచనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశౠరు. ఆశ వర్కర్లకు రాత్రి డ్యూటీలను రద్దు చేయాలని కోరారు. అధికారులకు గోడు వినిపించేందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పలువురు ఆశ వర్కర్లు సొమ్మసిల్లిపోయారు. సీఐటీయూ నాయకులు 13 మందిని పోలీసులు అరెస్టు చేసి డెంకాడ, విజయనగరం పట్టణ స్టేషన్లకు తరలించారు. ఈ ఆందోళనలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ నర్సింగరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.ఎం.శ్రీనివాస్, జిల్లా అధ్యక్ష, కార్యదర్ములు కె.సురేష్, టి.వి.రమణ, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు వి.లక్ష్మి, శ్రామిక మహిళా నాయకురాలు ఎం.ఉమామహేశ్వరి, సీఐటీయూ నాయకులు గౌరినాయుడు, పి.శంకరరావు, లక్ష్మి, ఎ.జగన్మోహన్రావు, రామారావు, వెంకటేష్, వీఆర్ఏలు, ఏఎన్ఎంలు, మున్పిపల్ కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లు, కాంట్రాక్ట్–ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, మధ్యాహ్న భోజన పథకం వర్కర్లు వేలాదిగా పాల్గొన్నారు. ఆందోళనలో స్పృహతప్పి పడిపోయిన మహిళా కార్మికురాలికి నీళ్లు తాగిస్తున్న దృశ్యం పోలీసుల నెట్టివేతతో కిందపడిపోయిన సీఐటీయూ నాయకుడు -
సంస్కృతభాష పరిరక్షణకు విద్యార్థులకు పోటీలు
విజయనగరం టౌన్: సంస్కృత భాషను భావితరాలకు అందించే బాధ్యత మనందరిపైనా ఉందని వాగ్దేవి సమారాధనం స్వచ్ఛంద సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్ష్యురాలు, రాజాం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెన్నేటి స్వప్న హైందవి పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక గురజాడ స్వగృహంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో సంస్కృత భాషా దినోత్సవ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాగ్దేవి, తెలుగు భాషా పరిరక్షణ సేవా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 28న నిర్వహించనున్న సంస్కృతభాషా దినోత్సవానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు పలు రకాల పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రశంసాపత్రాలు అందిస్తామని చెప్పారు. అందుకు తగ్గట్టుగా సంస్థ ప్రతినిధులందరికీ బాధ్యతలు అప్పగించామన్నారు. వ్యాసరచన, వక్తృత్వం, శ్రీరామాయణ పాత్రలు, సంస్కృతభాషా వైశిష్ట్యం, శ్రీమద్భగవద్గీత పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ 7032494988 నంబర్ను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో సముద్రాల గురుప్రసాద్, రాంభట్ల సన్యాసిరాజు, అల్లం సూర్యరాజేశ్వరశర్మ, భోగరాజు సూర్యలక్ష్మి, మానాప్రగడ సాహితి, దాసరి పద్మ, కర్రి సంతోషలక్ష్మి, కె.సావిత్రి, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
విజయనగరం
సోమవారం శ్రీ 10 శ్రీ ఆగస్టు శ్రీ 2026సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఆర్థిక కష్టాలు తప్ప డం లేదు. నెలవారీ జీతాలు అందక పోవడంతో వారి జీవనం కష్టంగా మారింది.ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేసే కేంద్రంనోటీసులు జారీ చేశాం.. ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీని ప్రభుత్వం ఏటీఎస్ అనే సంస్థకు అప్పగించింది. ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ అంతా అక్కడే జరుగుతుంది. స్కూల్ బస్సుల తనిఖీలో 90 వరకు బస్సుల్లో లోపాలు ఉన్నట్టు గుర్తించాం. వారికి నోటీసులు కూడా జారీ చేశాం. వారు కూడా లోపాలను సరిదిద్దుకున్నట్టు తెలియజేశారు. – మణికుమార్, డిప్యూటీ ట్రాన్స్ఫోర్ట్ కమిషనర్ వాహనాలు అధ్వానంగా ఉన్నా.. ఎఫ్సీలు ఇచ్చేస్తున్నారనే ఆరోపణలు జిల్లాలో 580 స్కూలు బస్సులు 90 బస్సుల్లో లోపాలు ఉన్నట్టు గుర్తించిన రవాణ శాఖ అధికారులు -
అడ్మిట్ అయితేనే.. ఎంఆర్ఐ స్కాన్!
● ఓపీ రోగులకు స్కాన్ లేదంట! ● సర్వజన ఆస్పత్రి వైద్యాధికారుల వింత తీరు ● అవస్థలు పడుతున్న రోగులుఅవును నిజమే... ఎంఆర్ఐ స్కాన్ దుర్వినియోగం అవుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. అందువల్లే ఇన్పేషెంట్లకు తీయాలని నిబంధన పెట్టాం. – డాక్టర్ అల్లు పద్మజ, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రివిజయనగరం ఫోర్ట్: టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రోగులకు కష్టాలు ఎక్కువయ్యాయి. థైరాయిడ్, షుగర్ వంటి వ్యాధుల నిర్ధారణకు చేసే హెచ్బీఏ1సీ పరీక్షలు సర్వజన ఆస్పత్రిలో అందుబాటులో లేవు. వీటికి తోడు ఎంఆర్ఐ స్కాన్కు కూడా కొత్త నిబంధనలు పెట్టడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. ఇదేం చోద్యం అంటూ రోగులు విస్తుపోతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా వైద్య సేవలు అందుతాయని వస్తే వైద్యాధికారుల పెట్టిన నిబంధనలు వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుల తరబడి... ఏదైనా వ్యాధి నిర్ధారణ ఎంఆర్ఐ స్కాన్లో కచ్చితంగా వస్తుంది. దీంతో వైద్యులు ఎంఆర్ఐ స్కాన్ అవసరమైన వారికి ఆస్పత్రిలో ఉన్న గదికి వెళ్లి చేయించుకోవాలని చీటి రాసి ఇస్తారు. కొద్ది రోజుల క్రితం వరకు ఓపీ(ఔట్ పేషెంట్) రోగులకు కూడా ఎంఆర్ఐ స్కాన్ తీసేవారు. స్కాన్లో ఏదైనా సమస్య ఉన్నట్టయితే దానికి సంబంధించిన చికిత్స రోగులకు అందించేవారు. కానీ ఇటీవల ఆస్పత్రి అధికారులు ఔట్ పేషెంట్లకు ఎంఆర్ఐ స్కాన్ రాయొద్దని వైద్యులకు సూచించారు. ఇన్పేషెంట్లుగా ఆస్పత్రిలో చేరిన వారికి మాత్రమే ఎంఆర్ఐ స్కాన్ రాయాలని సూచించడంతో వైద్యులు కూడా ఆస్పత్రిలో చేరిన వారికి మాత్రమే ఎంఆర్ఐ స్కాన్ తీస్తున్నారు. భారం తగ్గించుకునేందుకే.. ఆస్పత్రిలో ఎంఆర్ఐ, సీటీ స్కాన్ నిర్వహణను ఎన్ఆర్ఐ సంస్థ నిర్వహిస్తుంది. రోగులకు తీసే ఎంఆర్ఐ స్కాన్కు రూ.1500 వరకు ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే ఎక్కువ స్కాన్లు తీస్తే ఎక్కువ మొత్తం ఎన్ఆర్ఐ సంస్థకు చెల్లించాల్సి వస్తుందని భారం తగ్గించుకోవడం కోసం చంద్రబాబు ప్రభు త్వం ప్రయత్నిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నా యి. ఇన్పేషెంట్లు అయితే తక్కువ మంది మాత్రమే ఉంటారు. ఓపీ అయితే ఎక్కువ మంది ఉంటారు. వీరికి స్కాన్ తీస్తే ఎక్కువ స్కాన్లు తీయాల్సి వస్తుంది. అందువల్లే ఇన్పేషెంట్లకు మాత్రమే స్కాన్ తీస్తామని నిబంధన తీసుకొ చ్చారని రోగులు గుసగుసలాడుకుంటున్నారు. గంట్యాడ మండలానికి చెందిన సూర్యనారాయణ హైబీపీతో పాటు, తల తిరుగుతూ కింద పడిపోతుండడంతో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ వైద్యులు ఆస్పత్రిలో అడ్మిట్ (ఇన్పేషేంట్) అయితేగాని ఎంఆర్ఐ స్కాన్ రాయనని చెప్పడంతో చేసేది లేక అడ్మిట్ అయ్యాడు. విజయనగరం పట్టణానికి చెందిన చైతన్య తీవ్రమైన నడుం నొప్పి రావడంతో సర్వజన ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు అతన్ని అడ్మిట్ చేసి ఎంఆర్ఐ స్కాన్ తీశారు. -
‘మీ పోలీస్–మీకు తెలుసా’ పరీక్షకు విశేష స్పందన
పార్వతీపురం రూరల్: చట్టాలపై అవగాహన పెంచుకుందాం.. బాధ్యతగల పౌరులుగా మెలుగుదాం అనే నినాదంతో మన్యం జిల్లా పోలీసులు చేపట్టిన ‘మీ పోలీస్–మీకు తెలుసా’ కార్యక్రమం విజయవంతమైంది. 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఎస్పీ ఎస్.వి.మాధవ్రెడ్డి ఆదేశాలతో పార్వతీపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆదివారం నిర్వహించిన అవగాహన పరీక్షకు విశేష స్పందన లభించింది. అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో జరిగిన ఈ పరీక్షలో 21 ఏళ్లలోపు వయసున్న సుమారు 800 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.సైబర్ నేరాల ఉచ్చు..గంజాయి, మాదకద్రవ్యాల మత్తు..ట్రాఫిక్ నిబంధనలు తదితర సమకాలీన అంశాలతో పాటు మహిళలపై నేరాల నివారణ, మానవ అక్రమ రవాణా నిరోధం వంటి కీలక చట్టాలపై 30 బహుళైచ్ఛిక (ఆబ్జెక్టివ్) ప్రశ్నలతో ఈ పరీక్షను రూపొందించారు. విద్యార్థులు ఆసక్తిగా సమాధానాలు గుర్తించి డ్రాప్ బాక్స్లో వేశారు. పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి మూడు స్థానాల విజేతలకు ఎస్పీ చేతులమీదుగా బహుమతులు ప్రదానం చేయనున్నారు. అలాగే పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఆనన్లైన్ సర్టిఫికెట్లు అందజేశారు. పట్టణ సీఐ బి.వెంకట్రావు, ఎస్సై గోవింద్, పోలీసు సిబ్బంది ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. పాల్గొన్న 800 మంది విద్యార్థులు -
హాస్టళ్లలో విద్యార్థి సంఘాలపై నిషేధం ఎత్తివేయాలి
విజయనగరం గంటస్తంభం: సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థి సంఘాలను నిషేధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి.రాము డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం విజయనగరం కాంప్లెక్స్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. విద్యార్థులను కలవకుండా వారి సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ బిల్లులు పెంచాలని కోరారు. సర్క్యులర్ను వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఐదు బ్యాటరీలు రికవరీవేపాడ: మండలంలోని పలు గ్రామాల్లో ట్రాక్టర్ల బ్యాటరీలు చోరీకి గురైన ఘటనలో నిందితులను పట్టుకుని ఐదు బ్యాటరీలను రికవరీ చేసినట్లు ఎస్సై సుదర్శన్ ఆదివారం తెలిపారు. బొద్దాం, పాటూరు, జాకేరు గ్రామాల్లో ఐదు ట్రాక్టర్లకు సంబంధించిన బ్యాటరీ లు చోరీకి గురైనట్లు గురువారం పాటూరుకు చెందిన పి.వేణుగోపాల్ ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్సై చెప్పారు. ఆదివారం పాటూరు జంక్షన్ వద్ద బొద్దాం గ్రామానికి చెందిన సయ్యద్ అబ్దుల్లా, గుడిసె తిరుపతిరావు జనపరెడ్డి మోహన్లను అదుపులోకి తీసుకుని వారి నుంచి ఐదు ట్రాక్టర్ బ్యాటరీలను రికవరీ చేసి తదుపరిచర్యలు తీసుకున్నట్లు ఎస్సై సుదర్శన్ చెప్పారు. 42 కేజీల గంజాయి స్వాధీనంపాచిపెంట: మండలంలోని కుడుమూరు సమీపంలో పెద్దగెడ్డ జలాశయం బట్టి కుడికాలువ వద్ద తమిళనాడు రిజిస్ట్రేషన్తో ఉన్న కారులో తరలిస్తున్న 42 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పాచిపెంట ఎస్సై ఎల్.అర్జున్ ఆదివారం వివరాలు వెల్లడించారు. పెద్దగెడ్డ జలాశయం బట్టి కుడికాలువ వద్ద అనుమానాస్పదంగా నిలిపి ఉన్న కారును సమాచారం మేరకు తనిఖీ చేసి కారులో 22 ప్యాకెట్లలో గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకునామని ఎస్సై పేర్కొన్నారు. గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి కేసు నమోదు చేసి సాలూరు రూరల్ సీఐ రామకృష్ణ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితులను త్వరలోనే గుర్తించి అదుపులోకి తీసుకుంటామని, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. అక్రమ రవాణాకు సంబంధించి సమాచారం తెలిసిన వారు వెంటనే సమీప పోలీస్స్టేషనన్కు తెలియజేయాలని కోరారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యంగంట్యాడ: మండలంలోని కొర్లాం గ్రామంలో ఆదివారం గుర్తుతెలియని ఓ వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. చెరుకు కాటా నుంచి గింజేరు వెళ్లే ప్రధాన రహదారి పక్కన మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి మృతుడు పసుపు రంగు దుస్తులు ధరించి ఉన్నట్లు తెలిపారు. మృతదేహం నుంచి కుళ్లిన వాసన వస్తుండడంతో రెండు, మూడు రోజుల క్రితమే మృతి చెంది ఉండొచ్చని భావిస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయికృష్ణ తెలిపారు. -
తగ్గుతున్న పత్తి సాగు
తెల్ల బంగారంగా పేరొందిన పత్తి సాగు జిల్లాలో క్రమేణా తగ్గుతోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఓ వైపు ఇబ్బంది పెడుతుంటే.. దిగుబడి వచ్చాక తగిన గిట్టుబాటు ధర లభ్యం కాకపోవడం కూడా రైతులను సాగు నుంచి దృష్టి మళ్లించేలా చేస్తుంది. ప్రభుత్వం నుంచి కూడా తగిన ప్రోత్సాహం కూడా లేకపోవడం మరింత ఇబ్బందులు పెడుతుంది. ఫలితంగా గడిచిన రెండేళ్లుగా పత్తి సాగు తగ్గుముఖం పడుతోంది.● గతేడాది కంటే తగ్గిన సాగు ● కిట్టని గిట్టుబాటు ధర ● దళారుల బారిన పడి ధర కుదేలురాజాం: పత్తి పంట సాగు తగ్గుతోంది. తెల్ల బంగారంగా పిలుచుకునే పత్తికి గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో డిమాండ్ ఉంది. అక్కడ కాటన్ మిల్లులు అధికంగా ఉండడంతో పాటు సకాలంలో కొనుగోలు చేస్తుంటారు. ఇక్కడ కొనుగోలు కేంద్రాలు నామమాత్రం కాగా, దళారీలు అధిక లాభాలు ఆశించి, సిండికేట్గా మారుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే పత్తి పంట దిగుబడి గత ఏడాది భారీగా పడిపోయింది. ఎకరాకు 8 నుంచి 9 క్వింటాళ్లు రావల్సి ఉండగా, కేవలం 3 నుంచి 4 క్వింటాళ్లు మధ్య మాత్రమే వచ్చింది. క్వింటా పత్తి ధర రూ.8110లుగా ప్రభుత్వం ప్రకటించింది. గతేడాది కొనుగోలు కేంద్రాల వద్ద నాణ్యత పేరుతో రైతులను ముప్పతిప్పలు పెట్టారు. జిల్లాలో 50 క్వింటాళ్లు మేర పత్తిని కొనుగోలు చేయాల్సి ఉండగా, కొనుగోలు కేంద్రాల వద్ద 25 వేల క్వింటాళ్లు కొనుగోలు మాత్రమే నమోదైంది. ఈ ఏడాది ఆ ప్రభావం సాగుపై పడింది. గతంలో కంటే సాగు తగ్గుముఖం పట్టింది.ఇబ్బందులు ఉన్నాయి.. గతంలో మా పొలాల్లో పత్తి పంట వేసేవాళ్లం. మంచి ఆదాయం ఉండేది. ఇప్పుడు తగ్గించేశాం. పత్తిని సకాలంలో కొనుగోలు చేయడం లేదు. రాజాం మార్కెట్ యార్డుకు తరలిస్తే అక్కడి నుంచి రామభద్రపురం వెళ్లమంటున్నారు. అక్కడ ఏవేవో సాకులు చెప్పి దళారీలను బెత్తాయిస్తున్నారు. ఈ ఏడాది పత్తిపంట సాగును తగ్గించడమే కాకుండా, మిగిలిన భూమిని ఖాళీగా ఉంచేశాం. – ఎస్.వెంకటనాయుడు, రైతు, పొనుగుటివలస, రాజాం మండలం -
‘సమగ్ర శిక్ష’లో.. జీతాలకు జాగారం..!
● రెండు నెలలుగా నిలిచిన వేతనాలు ● జిల్లాలో 800 మంది ఉద్యోగులు ● కుటుంబ పోషణకు ఆర్థిక కష్టాలు సీతంపేట: సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఆర్థిక కష్టాలు తప్ప డం లేదు. నెలవారీ జీతాలు అందక పోవడంతో వారి జీవనం కష్టతాయకంగా మారింది. రెండు నెలలుగా వేతనాలు రాకపోవడంతో కుటుంబ పోషణ కు సతమతం అవుతున్నారు. పార్వతీపురం జిల్లా లో సుమారు 800 మంది ఉద్యోగులకు వేతనాలు నిలిచిపోయాయి. దీంతో ఇంటి అద్దె నుంచి పిల్లల చదువులు, నిత్యావసరాల నుంచి వైద్య ఖర్చులు భారంగా మారాయి. మరోవైపు చాలీచాలని జీతాల తో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బంది పరిస్థితి మరింత దయనీయంగా మారింది. 800 కుటుంబాలు సతమతం.. జిల్లాలో ఎల్ఈఆర్పీలు 29, ఎంఐఎస్ కోఆర్డినేట ర్లు 15, సీఆర్ఎం టీచర్లు 108, డాటా ఎంట్రీ ఆపరేటర్లు 15, 14 కేజీబీవీల్లో టీచింగ్ అండ్ నాన్టీచింగ్ సిబ్బంది 345.. మొత్తం 512 మంది పని చేస్తున్నా రు. మెసేంజర్లు, అక్కౌంట్ సిబ్బంది, ఫిజియోథెర ఫిస్టులు, పార్ట్టైం ఇన్స్ట్రక్లర్లు మరో 300 మంది వరకు పని చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వీరందరికీ జీతాలు పెరిగాయి. చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్క రూపాయి అధికం కాకపోగా.. నెలనెలా జీతాలు ఇవ్వడం లదేని సిబ్బంది నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. హామీ అమలు ఎక్కడ?.. ఎన్నికల ప్రచార సమయంలో రెగ్యులర్ ఉద్యోగుల తో పాటు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యో గులందరికీ ప్రతి నెల ఒకటో తేదీన తప్పనిసరిగా జీతాలు జమ అయ్యేలా తాము బాధ్యత తీసుకుంటామని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారని ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఆ హామీ అమలులో కనిపించడం లేదని మండి పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాకార్యక్రమాల అమలు, కేజీబీవీల నిర్వహణ, పిల్లలకు సేవ లు, విద్యాసర్వేలు, డేటా నిర్వహణ, శిక్షణా కార్యక్రమాల అమలు వంటి కీలక విధులు నిర్వర్తిస్తున్నా రు. వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ విధులకు హాజరై తమ బాధ్యత లు నిర్వర్తిస్తున్నామని ఉద్యోగులు చెబుతున్నారు. వేతనాలు సక్రమంగా చెల్లించడం లేదని పలుమా ర్లు సంబంధిత అధికారులను కలిసి వినతి పత్రాలు సమర్పిస్తున్నా.. శాశ్వత పరిష్కారం లేదని సంబంధిత సంఘాల నాయకులు చెబుతున్నారు. ఓఎస్పీ సర్వేలతో తిప్పలు... సీఆర్ఎం టీచర్లను తమ విధులతో పాటు అదనంగా ఓఎస్పీ(అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్) సర్వేలు చేపట్టాలని, ప్రతి గ్రామాన్ని సందర్శించి ఓఎస్సీ సర్వే చేసి తిరిగి పాఠశాలల్లో చేర్పించాలనే పని అప్పగించారు. అంతేకాకుండా ప్రతి పాఠశాలకు వెళ్లి సర్వేపల్లి రాథాకృష్ణన్ కిట్లు 100 శాతం అందజే సే విధంగా పంపిణీ చేయాలని ఆదేశాలు ఉన్నా యి. వీటికి ప్రత్యేక అలవెన్సులు వంటివి లేకపోవడం, వాహన సదుపాయాలు వారే సమకూర్చుకుని వెళ్లాలంటే పెట్రోల్ తదిర ఖర్చులు కూడా వీరే భరించుకోవాలి. ఈ క్రమంలో జీతాలు లేకుండా పనిచేస్తున్న తమకు అదనపు భారం పరిణమించిందని వారు వాపోతున్నారు. ఈ విషయమై సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డి నేటర్(ఏపీసీ) రాజ్కుమార్ వద్ద సాక్షి ప్రస్తావించగా.. త్వరలోనే జీతాలు చెల్లించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. కొత్త బడ్జెట్ రావడం ఆలస్యం అవడంతో ఈ సమస్య ఉత్పన్నమైందన్నారు. -
పిల్లలందరికీ దేశ నాయకుల పేర్లు
● కమ్యూనిస్టు వాది చింతల తిరుపతి రావు అభిమానం ● పెద్దకుమారుడు హోచ్మన్ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటురామభద్రపురం: మండలకేంద్రానికి చెందిన కమ్యూనిస్టు వాది చింతల తిరుపతిరావు తన పిల్ల లందరికీ వివిధ దేశాల నాయకుల పేర్లు పెట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఆయనకు ఐదుగురు పిల్లలు కాగా వారిలో ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. మొదటి కుమారుడికి హోచ్మన్, రెండవ కుమారుడికి లెనిన్, మూడవ కుమారుడికి భగత్ సింగ్, మొదటి కుమార్తెకు ఇందిరాగాంధీ, రెండవ కుమార్తెకు ఝాన్సీలక్ష్మి అని పెర్లు పెట్టారు. దేశ నాయకుల పేర్లు ఎందుకు పెట్టారో ఆయన మాటల్లో.. హోచ్మన్: దండయాత్ర చేసి దోచుకుందాం అన్న దురుద్దేశంతో అమెరికా దాడి చేసి వియత్నం దేశాన్ని రెండుముక్కలుగా ఉత్తరవియత్నం, దక్షిణ వియత్నంగా విడగొట్టింది. దక్షిణ వియత్నాం ఆ యుద్ధంలో అమెరికాకు మద్దతు పలికింది. ఉత్తర వియత్నాం నాయకుడు హోచ్మన్ అగ్ర రాజ్యమైన అమెరికాపై తిరుగుబాటు చేసి స్వాతంత్య్రాన్ని సంపాదించి కమ్యూనిస్టు రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ప్రజాస్వామ్య యుతంగా ఉన్న భారతదేశాన్ని ఆదర్శంగా తీసుకుని అమెరికా నుంచి రాజ్యాన్ని సంపాందించి మంచి పేరు తెచ్చుకోవడంతో పెద్దకుమారుడికి పేరు హోచ్మన్ అని పెట్టాను. లెనిన్: రష్యాదేశంలో నిరంకుశంగా పరిపాలన చేస్తున్న ఆ దేశ రాజులపై లెనిన్ ప్రజా తిరుగుబాటు చేసి కమ్యూనిస్టు ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసి మంచి పేరుతెచ్చుకోవడంతో రెండవ కుమారుడికి లెనిన్ అని పేరు పెట్టాను. భగత్సింగ్: బ్రిటిష్ వారికి తలొగ్గకుండా భారత స్వాతంత్య్రం కోసం తృణప్రాయంగా తన ప్రాణాలొడ్డిన వ్యక్తి భగత్ సింగ్. భారతదేశ విముక్తి కోసమే తన ప్రాణాలను అర్పించాడు కాబట్టి మూడవ కుమారుడికి భగత్సింగ్ అని నామకరణం చేశాను. ఇందిరాగాంధీ: అలీన దేశాధ్యక్షురాలిగా,దేశ ప్రధాన మంత్రిగా ఉండి మంచి పరిపాలన అందించి ప్రపంచస్థాయిలో మంచి పేరు సంపాదించినందుకు గాను మొదటి కుమార్తెకు ఇందిరాగాంధీ అనిపేరు పెట్టాం. ఝాన్సీలక్ష్మి: సామ్రాజ్య వాదులైన బ్రిటిష్ వారితో పోరాడి వీరవనితగా ప్రాణాలు వదిలింది కాబట్టి రెండవ కుమార్తెకు ఝాన్సీలక్ష్మి అని పేరు పెట్టాం. గాంధీ విగ్రహం ఏర్పాటు.. పెద్దకుమారుడు హోచ్మన్ తన తండ్రికి ఉండే ఆదర్శభావాలను నిరూపించుకుంటూ మండలకేంద్రంలోని బైపాస్రోడ్డు కూడలిలో తన సొంత నిధులతో 1999లో గాంధీ విగ్రహం స్థాపించారు. ఈ ప్రాంతంలో ఇదే మొదటి విగ్రహం కావడం విశేషం. -
ఏనుగుల సంచారంపై అప్రమత్తం
బొబ్బిలిరూరల్: మండలంలోని పక్కి,రాముడు వలస, శివడవలస పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తుండడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖాధికారులు సూచిస్తున్నారు.రాత్రిపూట వాటి సంచారం ఎక్కువగా ఉంటుందని, ఎప్పుడు ఏ గ్రామంలోకి ప్రవేశిస్తాయో గమనించడం కష్టంగా మారిందిదని, రాత్రివేళ ఎవరూ బయట తిరగరాదని తెలియజేశారు. ఆదివారం ఆయా గ్రామాల్లోని చెరకు, మొక్కజొన్న పంటలను ఏనుగులు నాశనం చేసి రైతులకు తీరని నష్టం చేకూర్చాయి. కాగా ఏనుగుల గుంపును సీతానగరం మండలంలోని జోగింపేట ఎలిఫెంట్ జోన్కు తరలించేందుకు రెండు కుంకీ ఏనుగులైన జయంత్, అభిమన్యులను రంగంలోకి దించినా పొలాల్లో సంచరిస్తున్న ఏనుగుల గుంపువద్దకు అవి చేరే అవకాశం లేక ఆ చర్యలు ఫలించలేదు. కుంకీ ఏనుగులను ఏనుగుల గుంపు వద్దకు తరలించడంలో అధికారుల చర్యలు విఫలమయ్యాయి. ఎప్పటికప్పుడు అవి తమ గమ్యస్థానాన్ని మార్చుకోవడంతో వాటి ఆచూకీ తెలుసుకోవడం కష్టంగా ఉండడంతో ఫారెస్ట్ అధికారులు చేసేది లేక పక్కి గ్రామంలో కుంకీ ఏనుగులను ఉంచి పర్యవేక్షిస్తున్నారు. ఏనుగుల గుంపు రాముడువలస, ముత్తాయివలస మీదుగా తెర్లాం మండలం నందబలగ కొండపైకి చేరుకున్నాయని రేంజర్ రామనరేష్ తెలిపారు.ఏనుగుల కదలికలపై ఎప్పటికప్పుడు డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నామని,త్వరలో వాటిని ఎలిఫెంట్ జోన్కు తరలిస్తామని మన్యం జిల్లా అటవీశాఖాధికారి ప్రసన్న తెలిపారు.అంతవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,కవ్వింపు చర్యలకు పాల్ప డవద్దని సూచించారు. అటవీ శాఖాధికారుల సూచన -
భీమసింగి పరిశ్రమను కాపాడాలి
● సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ విజయనగరం గంటస్తంభం: ప్రభుత్వ విధానాల కారణంగానే భీమసింగి చక్కెర పరిశ్రమ మూతపడే పరిస్థితి ఏర్పడిందని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ అన్నారు. పరిశ్రమను ఏపీఐఐసీకి అప్పగించే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఎల్బీజీ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 1960లో ప్రారంభమైన ఈ పరిశ్రమ ఆరు దశాబ్దాలుగా వేలాది మంది రైతులు, కార్మికులకు ఉపాధి కల్పించిందన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడం, ఇతర ప్రాంతాల నుంచి చక్కెర దిగుమతులు వంటి విధానాల వల్లే పరిశ్రమ నష్టాల్లోకి వెళ్లిందని ఆరోపించారు. చెరకు కొరత వల్లే పరిశ్రమ మూతపడిందన్న వాదన సరికాదన్నారు. పరిశ్రమకు చెందిన విలువైన భూములు, ఆస్తులను విక్రయించే ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరారు. పరిశ్రమను పునరుద్ధరించి రైతులు, కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రైతులు, ప్రజలను సమీకరించి ఉద్యమిస్తామని హెచ్చరించారు. -
కోటదుర్గమ్మకు సంబరాలు
పాలకొండ రూరల్: ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవం పాలకొండ కోటదుర్గమ్మ దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. ఆషాడమాస పూజల్లో భాగాంగా ఆదివారం ప్రత్యేక సంబరాలు చేపట్టారు. ముర్రాటలు, ఘటాలతో దేవస్థానానికి చేరుకుని మొక్కులు చెల్లించారు. ఈ క్రమంలో స్థానిక గురువు గారి వీది, రజకవీధికి చెందిన మహిళలు సామూహికంగా అమ్మవారికి సారె సమర్పించారు. దేవస్థానం ప్రధాన అర్చకుడు దార్లపూడి లక్ష్మి ప్రసాదశర్మ నేతృత్వంలో భక్తులు సమర్పించిన సారె అమ్మవారికి నివేదన చేసి, ప్రత్యేక పూజలు చేపట్టారు. పట్టణంతోపాటు మండల పరిధి భక్తులు ఈ పూజల్లో పాల్గొన్నారు. -
చోరీ కేసు ఛేదించిన పోలీసులు
● ముగ్గురు నిందితుల అరెస్ట్ ● బంగారం, నగదు, వాహనాలు స్వాధీనంపాచిపెంట: సాలూరు పట్టణంలోని గుమడాంలో ఏప్రిల్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 3 తులాల బంగారు ఆభరణాలు, రెండు ద్విచక్ర వాహనాలు, మూడు సెల్ఫోన్లు, రూ.19 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. చోరీ కేసు దర్యాప్తులో భాగంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు సాలూరు టౌనన్ సీఐ అప్పలనాయుడు తెలిపారు. -
దారి దోపిడీ..
పాచిపెంట: ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన అధికారుల కళ్ల ముందే ప్రభుత్వ రహదారి ఆక్రమణకు గురైంది. పాచిపెంట మండలంలోని పోతులగెడ్డ సమీపంలో పిండ్రంగివలసకు వెళ్లే పీఆర్ (పీఐయూ) శాఖకు చెందిన బీటీ రహదారిని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి తన లేఅవుట్లో కలిపేశాడు. దీంతో ఏళ్లుగా ప్రజలు వినియోగిస్తున్న పాత రహదారి ఆనవాళ్లు లేకుండా పోయింది. దానికి బదులుగా ప్రభుత్వ భూమిలో కొత్త రహదారిని ఏర్పాటు చేశారు. సుమారు పది ఎకరాల వ్యవసాయ భూమిలో లేఅవుట్ అభివృద్ధి చేసే క్రమంలోనే ఈ వ్యవహారం జరిగినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ రహదారిని లేఅవుట్లో కలిపేయడంతోపాటు, ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ భూమిలో రహదారి ఏర్పాటు చేయడంతో అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. గతంలోనూ ఈ విషయంపై వార్తలు వచ్చినా సంబంధిత రెవెన్యూ, పీఆర్(పీఐయూ) అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ రహదారిని లేఅవుట్లో కలిపేసిన వారిపై చర్యలు తీసుకోవడంతోపాటు.. ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన కొత్త రహదారికి అనుమతులు ఉన్నాయా? అనే దానిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వ రోడ్డునే మింగేసిన రియల్ ఎస్టేట్ నిర్వాహకుడు లేఅవుట్లో కలిపేసిన పీఆర్(పీఐయూ) శాఖ బీటీ రోడ్డు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ భూమిలో కొత్తదారి అధికారుల మౌనంపై విమర్శలు -
జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలివ్వాలి
● ఐయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అప్పలనాయుడుబొబ్బిలి: వర్కింగ్ జర్నలిస్టులు, డెస్క్ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలను వెంటనే ఇవ్వాలని ఇండిపెండెంట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు జి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. యూనియన్ శాఖ నిర్మాణం కోసం ఆదివారం బొబ్బిలి వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులు వేరే ఉపాధి పొందలేక, స్థిరమైన ఆదాయం లేక అవస్థలు పడుతున్నారన్నారు. వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇళ్ల స్థలాలు, గుర్తింపు కార్డులున్న అందరికీ అక్రిడిటేషన్లను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరికీ ఉచిత వైద్యం అందజేయాలని కోరారు. ఈ సందర్భంగా బొబ్బిలి నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సోరు సాంబయ్యను ఎంపిక చేశారు. జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని సాంబయ్య అన్నారు. కార్యక్రమంలో నాయకుడు పి.యోగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. -
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
విజయనగరం గంటస్తంభం: ప్రజల సమస్యలకు వేగవంతమైన, పారదర్శక పరిష్కారం అందించేందుకు సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు పాల్గొని ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించి పరిష్కారానికి చర్యలు చేపడతారన్నారు. అర్జీదారులు తమ పేరు, చిరునామా, మొబైల్ నంబర్తో పాటు సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆధార పత్రాలను జత చేయాలని సూచించారు. గతంలో ఫిర్యాదు చేసిన వారు పాత అర్జీ రశీదును వెంట తీసుకురావాలన్నారు. ఫిర్యాదుల స్థితిగతులను ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉందని, సమస్య పరిష్కారమైన అనంతరం సంబంఽధిత ఉత్తర్వులు, ఎండార్స్మెంట్లను వాట్సాప్, రిజిస్టర్డ్ పోస్టు ద్వారా పంపిస్తామని తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లో ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నామని, ఇందులో ఆర్డీఓలు, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది అందుబాటులో ఉంటారని చెప్పారు. భూ వివాదాలు, మ్యుటేషన్లు, సర్వేలు, ఇతర రెవెన్యూ సమస్యలపై రైతులు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కలెక్టరేట్కు హాజరు కాలేని వారు 1100 టోల్ఫ్రీ నంబర్ ద్వారా లేదా మీకోసం వెబ్సైట్లో ఆన్లైన్లో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని, మండల, మున్సిపల్ కార్యాలయాల్లోనూ అర్జీలు సమర్పించవచ్చని కలెక్టర్ తెలిపారు. -
● వరండా చదువులు..!
పాఠశాల వరండాలోనే విద్యార్థులకు బోధిస్తున్న ఉపాధ్యాయినిమెరకముడిదాం మండలం బుధరాయవలస జెడ్పీ పాఠశాల విద్యార్థులకు వరండాలే తరగతి గదులయ్యాయి. ఇక్కడ ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు 195 మంది విద్యార్థులున్నారు. వీరికి అవసరమైన మేరకు తరగతి గదుల్లేవు. దీంతో ఐదు తరగతులకు వరండాల్లోనూ, కళావేదికపైన బోధించాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో అదనపు తరగతి గదులు నిర్మించేందుకు పునాదులు వేసినా వాటి నిర్మాణ పనులు అక్కడే నిలిచిపోయాయి. దీంతో విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. – మెరకముడిదాం -
మంత్రి వస్తే.. మాకేంటి..!
దత్తిరాజేరు: మండలంలోని వింద్యవాసి గ్రామంలో శనివారం జరిగిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి రైతులు ముఖం చాటేయడంతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామంలోని రామమందిరం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి వచ్చే సమయానికి కేవలం ముగ్గురు నలుగురు రైతులు తప్ప ఎవరూ హాజరు కాలేదు. దీంతో చేసేది లేక పోలీసులు అక్కడక్కడ ఉన్న వారందరిని పిలిచినా రాకపోవడంతో ఇతర గ్రామాల నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలే కుర్చీల్లో కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. మంత్రి వేదిక మీద కూర్చునే సమయానికి కూడా రైతులను అందుబాటులో ఉంచలేకపోయారని ఆర్డీఓపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని ఒక సమయంలో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి గ్రామస్తులకు పథకాలు అందకపోవడంతో బాయ్కాట్ చేశారని కొందరు చర్చించుకోవడం గమనార్హం. ఇదిలా ఉండగా గ్రామంలో రీసర్వే చేసిన తన పేరున ఉండాల్సిన భూమి తక్కువగా ఉందని రైతు కోలా జగదీశ్వరరావు నిలదీయడంతో మంత్రి తరువాత మాట్లాడుదామని రైతుని కూర్చోమని సముదాయించారు. రీసర్వే ప్రొఫైల్ తేలేదని.. రైతులను తీసుకురాలేకపోయారని తహసీల్దార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా గొభ్యంలో జరిగిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో గ్రామ నాయకుల మధ్య మంత్రి ఉంటుండగానే తీవ్ర వాగ్వాదం జరగడంతో మంత్రి చేసేది లేక రెండు గృహాలు వద్ద ఫొటోలు తీసుకొని కాసేపు రామమందిరంలో సేదదీరి వెనుదిరిగారు. ముందుగా దత్తిరాజేరు కేజీబీవీ ఆవరణలో డార్మెటరీ గదులను, ఎంఈఓ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఎస్.తాత, తహసీల్దార్ హరికిరణ్, ఎంఈఓ వెంకటరావు, సుధాకర్, సర్వశిక్ష అభియాన్ ఈఈ మురళి, డీఈ ప్రసాద్, ఏఈ ఉపేంద్ర, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. వింద్యవాసిలో పాస్ పుస్తకాల పంపిణీకి ముఖం చాటేసిన రైతులు అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి కొండపల్లి -
హక్కుల కోసం రోడ్డెక్కిన క్రైస్తవులు
విజయనగరం క్రైమ్: దళిత క్రైస్తవులపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలని, హక్కులను పరిరక్షించాలని దక్షిణ భారత బాప్టిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, సంఘమిత్ర డాక్టర్ ఆర్.ఎస్.జాన్ డిమాండ్ చేశారు. దళిత క్రైస్తవుల పట్ల జరుగుతున్న అన్యాయాలు, వివక్షకు నిరసనగా అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం విజయనగరంలో భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. కోట కూడలి నుంచి మూడు లాంతర్లు, గంటస్తంభం, కన్యకాపరమేశ్వరి ఆలయం వీధి మీదుగా కంటోన్మెంట్ బాప్టిస్ట్ చర్చి వరకు ర్యాలీ సాగింది. మతం మారినంత మాత్రాన కులం మారదు, దళితులు ఎదుర్కొంటున్న సామాజిక అసమానతలు తొలగిపోవు అంటూ నినదించారు. మతం పేరిట దళిత ముస్లింలు, క్రైస్తవుల ప్రాథమిక హక్కులను రద్దుచేసే రాజ్యాంగ విరుద్ధ చర్యలను తక్షణమే నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
ప్రారంభోత్సవం పేరిట ప్రజాధనం లూటీ!
పారిశుద్ధ్య కార్మికులకు అన్యాయం జీవీఎంసీ, విజయనగరం, శ్రీకాకుళం, బొబ్బిలి, రాజాం, పార్వతీపురం పట్టణాల నుంచి దాదాపు 1,130 మంది కార్మికులను రప్పించి రాత్రింబవళ్లు పనిచేయించుకున్నారు. వీరికి భోజనాల ఏర్పాట్లు ప్రజారోగ్య విభాగం అధికారి పర్యవేక్షణలో జరిగింది. అయితే, భోజనం అత్యంత నాసిరకంగా తినడానికి వీలులేని విధంగా ఉందనే విమర్శలు కార్మికుల నుంచి వ్యక్తమయ్యాయి. అంతే కాకుండా శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఇతర సిబ్బందికి ‘తాత్కాలిక ఖర్చులు’ పేరుతో రూ.10 లక్షల రొక్కం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ సోమ్ములు ఏ లెక్కన ఖర్చుచేశారో, ఎవరి జేబుల్లోకి వెళ్లిందో తెలియాల్సి ఉంది. విజయనగరం అర్బన్: భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ వేడుక... కొంతమంది అధికారులు, కాంట్రాక్టర్ల సిండికేట్కు ‘కమీషన్ల పండుగ’గా మారింది. ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, కనీస సౌకర్యాల కల్పన పేరిట పిలిచిన టెండర్లలో భారీస్థాయిలో అక్రమాలు జరిగినట్లు స్పష్టమవుతోంది. క్షేత్రస్థాయిలో సేవలు అరకొరగా అందించడమే కాకుండా, నిబంధనలను తుంగలోతొక్కి ముందస్తు ప్రణాళికతో ప్రజాధనాన్ని లూటీచేసేలా స్కెచ్ వేశారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కాగితాలపై అంకెల గారడీ చూపి, రూ.కోట్లలో బిల్లులు మంజూరు చేసుకునేందుకు సర్వం సిద్ధంచేశారన్న అంశం చర్చనీయాంశంగా మారింది. అంచనా పెంపు... టెండర్లలో గారడీ! సాధారణంగా ప్రభుత్వ నిర్వహణ పనుల్లో పోటీతత్వం పెంచి, ప్రజాధనాన్ని ఆదా చేసేందుకు బహిరంగ టెండర్లు నిర్వహిస్తుంటారు. కానీ, విమానాశ్రయం ప్రారంభోత్సవ వ్యవహారంలో విజయనగరం నగరపాలక సంస్థకు చెందిన ఒక కీలక అధికారి నేతృత్వంలో వింత ధోరణి నడిచిందనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. గతంలో ఇవే తరహా మొబైల్ టాయిలెట్లు, నీటి సరఫరా పనులకు కాంట్రాక్టర్లు 20 నుంచి 25 శాతం తక్కువ ధరకే పోటీపడి టెండర్లు దాఖలు చేసేవారు. అయితే, ఈ సారి ముందస్తుగా కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం కేవలం 2 శాతం తగ్గింపునకే టెండర్లను ఖరారు చేయడం వెనుక ఉన్న అంతరార్ధం స్పష్టంగా కనిపిస్తోంది. అధికారికంగా టెండర్లు పిలిచినప్పటికీ, లోపాయికారీ ఒప్పందాలతో తమకు కావాల్సిన కాంట్రాక్టులకే పనులు దక్కేలా షార్ట్ టెండర్ల ప్రక్రియను వినియోగించుకున్నారని తెలుస్తోంది. జిల్లా అధికారుల పరిధి నుంచి దాదాపు రూ.కోటి నిధులను ముందస్తుగా తెప్పించి కాంట్రాక్టర్లకు అందించడం వెనుక ఉన్న వేగం క్షేత్రస్థాయి పనుల్లో ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. దర్యాప్తునకు పెరుగుతున్న డిమాండ్ ప్రజాధనం నీళ్లలా ఖర్చయిపోతున్నా, క్షేత్రస్థాయిలో సౌకర్యాలు కల్పించడంలో దారుణంగా విఫలమయ్యారనడానికి ఇక్కడి పరిస్థితులే నిదర్శనం. పనులు సరిగ్గా జరగకపోయినా, అధికార బలాన్ని ఉపయోగించి 100 శాతం బిల్లులు చెల్లించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. విమానాశ్రయం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పేరు చెప్పి నిర్వహించిన వేడుకల్లో, సేవలు అందించకుండా బిల్లు బొక్కేసేందుకు ప్రయత్నిస్తున్న అధికారుల, కాంట్రాక్టర్ల సిండికేట్పై సమగ్ర విచారణ జరిపించాలని, దుర్వినియోగమైన ప్రజాధనాన్ని రికవరీ చేయాలని స్థానిక ప్రజలు, సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిధుల కేటాయింపు ఇలా.. పారిశుద్ధ్య విభాగం లెక్కల ప్రకారం ఏకంగా రూ.3 కోట్లు నిధులు వ్యయమైనట్లు చూపుతున్నారు. అందులో రూ.1.74 కోట్లు కేవలం మరుగుదొడ్లు, నీటి డ్రమ్ములు, ట్యాంకర్ల సరఫరాకే కేటాయించారు. విమానాశ్రయం ప్రారంభోత్సవం పేరిట నిధుల దుర్వినియోగం పారిశుద్ధ్య విభాగానికి కేటాయించిన రూ.3 కోట్లలో మరుగుదొడ్లు, నీటి సరఫరాకే రూ.1.74 కోట్లు అంచనా పెంపు... టెండర్లలో గారడీ! దర్యాప్తు చేయాలని జనం డిమాండ్ -
ఒడిశా టు నెల్లూరు
● పశువుల అక్రమ రవాణాబొబ్బిలి: పశువుల రవాణా గుట్టు చప్పుడు కాకుండా కాదు.. బహిరంగంగా తరలిస్తున్నారు. ఒడిశా నుంచి పార్వతీపురం అక్కడి నుంచి పట్టణం గుండా పశువులను వధ శాలకు జోరుగా తరలిస్తున్నారు. వీటిని నెల్లూరు తరలిస్తున్నట్టు చెబుతున్నా ఎక్స్పోర్టు చేస్తున్నట్టు తెలుస్తోంది. పార్వతీపురం, ఒడిశా నుంచి పశువులను చిన్న వాహనాల్లో తరలించడంతో అవి ఆకలి, దాహానికి అలమటించడం బయటకు కూడా కనిపిస్తోంది. చిన్న వాహనంలో ఐదారు పశువులను తరలిస్తున్నా అటు పోలీసులు కానీ, ఇటు ఇతర శాఖల అధికారులు కానీ పట్టించుకోవడం లేదు. బొబ్బిలి సంత ఉండేటప్పుడు అక్కడి నుంచి తరలించేవారు. ఇప్పుడు పట్టణ శివారు గుండా తరలిస్తూ అక్రమ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. చిన్న వాహనాల నుంచి పెద్ద వాహనాల్లోకి వీటిని మార్చేందుకు రామభద్రపురం, బొబ్బిలిలోని రహస్య ప్రదేశాలకు తరలిస్తున్నారు. ఓ వైపు ఎస్పీ అన్ని దారులూ మూసేశామని చెబుతున్నా అక్రమార్కులు పోలీసుల కళ్లుగప్పి సెలవు దినాల్లోనూ, పండగ రోజులు, ప్రముఖుల పర్యటనల సమయాలను ఎంచుకుని మరీ రవాణా జరుపుతున్నారు. అధికారులు కూడా చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. -
సాగని రిజిస్ట్రేషన్లు
రీసర్వే పూర్తయినా..● సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కనిపించని వివరాలు ● రెండేళ్లుగా రైతుల అవస్థలు ● కొందరికి అందని పాస్ పుస్తకాలుబలిజిపేట: రీ సర్వే ప్రక్రియ పూర్తయింది.. అయినా పలు గ్రామాల భూముల వివరాలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కనిపించడం లేదు.. దీంతో ఆయా గ్రామాలకు చెందిన భూములు క్రయ విక్రయాలు జరగడం లేదు. దీంతో ఆ గ్రామాల రైతులు తీవ్ర వేదనకు గురవుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తమ భూములను విక్రయించి కష్టాల నుంచి గట్టెక్కుదామంటే కుదరడం లేదు. రెండేళ్లుగా ఇలా సమస్య నలుగుతూనే ఉంది తప్ప పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఇటు పాలకులుగాని.. అటు అధికారులుగాని దీన్ని పరిష్కరించేందుకు చొరవ చూపడం లేదని ఆ రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే... బలిజిపేట మండలం పలగర, తుమరాడ, వెంగాపురం, శివరాంపురం గ్రామాలకు చెందిన రైతుల భూములు రిజిస్ట్రేషన్లు జరగక క్రయ, విక్రయాలకు నోచుకోవడం లేదు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద పోర్టల్లో రీసర్వేకు సంబంధించిన వివరాలు కనిపించకపోవడంతో రిజిస్ట్రేషన్ చేసేందుకు అధికారులు నిరాకరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఓ వైపు రీసర్వే పూర్తయింది. పాస్ పుస్తకాలు కూడా కొద్ది మందికి తప్ప అందరికీ వచ్చేశాయి. అయితే వాటిలో తప్పులు సరి చేసుకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. అయితే సరిగా ఉన్న వారి భూములను క్రయ విక్రయాలు జరపాలంటే కుదరడం లేదు. దీంతో అత్యవసర ఖర్చుల నిమిత్తం భూములను అమ్ముదామంటే కుదరడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రీసర్వే పూర్తయి రెండేళ్లు అవుతున్నా.. ఈ పరిస్థితి ఏంటని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రీసర్వేకు సంబంధించి అధికారులు చెబుతున్న దానికి క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని వారు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా తమ భూములు క్రయ విక్రయాలు జరిగేలా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. -
మెప్పు కోసమే పాశవిక దాడులు
రామభద్రపురం: వెన్నుపోటు పార్టీ నాయకత్వం మెప్పు కోసమే వైఎస్సార్సీపీ చేపట్టిన శాంతియుత నిరసన దీక్షలపై విజయవాడలో టీడీపీ శ్రేణులు పాశవిక దాడులకు పాల్పడ్డాయని మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు మండిపడ్డారు. పార్టీ మండల కార్యాలయంలో విలేకరులతో శనివారం వారు మాట్లాడారు. ఇటీవల కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం సంతాప సభకు హాజరైన బొండా ఉమను వెన్నుపోటు పార్టీ అధినాయకత్వం ప్రశ్నించడంతో అధిష్టానం వద్ద మార్కులు కొట్టేందుకు ఇటువంటి నీచమైన సంస్కృతికి తెరతీశారని ధ్వజమెత్తారు. పోలీసుల సమక్షంలోనే దీక్షా శిబిరాలపై కోడి గుడ్లు, టమాటాలు, నీళ్ల బాటిళ్లు విసిరి బీభత్సం సృష్టించడం హేయమైన చర్యని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు, నిరుద్యోగులకు భృతి, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని వైఎస్సార్సీపీ నేతృత్వంలో శాంతియుత దీక్షలు కొనసాగుతుంటే ప్రజాదరణను చూసి ఓర్వలేక దీక్షా శిబిరాలపై పచ్చమూకలు దాడులకు పాల్పడుతున్నాయని విమర్శించారు. మహిళలు, చిన్నారుల భద్రత కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దిశ చట్టాన్ని తీసుకువస్తే వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం ఉపసంహరించుకోవడం అత్యంత హేయమైన చర్యగా భావిస్తున్నామన్నారు. మంత్రి వర్గ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారి వెంట ఎంపీపీ చొక్కాపు లక్ష్మణరావు, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి శంబంగి వేణుగోపాలనాయుడు, జెడ్పీటీసీ అప్పికొండ సరస్వతి, మండల జేసీఎస్ కన్వీనర్ చింతల సింహాచలంనాయుడు, తెర్లాం మండల పార్టీ అధ్యక్షుడు తెంటు సత్యంనాయుడు తదితరులు ఉన్నారు. దిశ చట్టాన్ని ఉపసంహరించు కోవడం హేయమైన చర్య మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే శంబంగి -
తాష్కెంట్లో రాణించిన గురునాయుడు
● ఆసియా వెయిట్లిఫ్టింగ్ పోటీల్లో హ్యాట్రిక్ నెల్లిమర్ల రూరల్: ఉజ్బెకిస్థాన్లోని తాష్కెంట్లో జరుగుతున్న జూనియర్ ఆసియా వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్–2026 పోటీ ల్లో విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం చంద్రంపేట గ్రామానికి చెందిన యువ వెయిట్లిఫ్టర్ శనపతి గురునాయుడు సత్తాచాటాడు. శనివారం జరిగిన 60 కేజీల విభాగంలో స్నాచ్లో 119 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్లో 146 కేజీల బరువును ఎత్తి రెండు విభాగాల్లోనూ వెండి పతకాలు సాధించాడు. మొత్తం 265 కేజీల బరువును స్కోర్చేసి ఆ విభాగంలోనూ మరో వెండి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. దీంతో, ఒకే పోటీలో మూడు వెండి పతకాలు సాధించి తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ వేదికపై అద్భుత ప్రతిభ కనబర్చడంతో గ్రామస్తులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తంచేశారు. మన్యం బంద్ విజయవంతం సీతంపేట: ఆదివాసీ హక్కుల పరిరక్షణకు గిరిజన సంఘం ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన మన్యంబంద్ విజయవంతమైంది. సీతంపేటలో ఉదయం నుంచే షాపులు తెరచుకోలేదు. 11 గంటల వరకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గిరిజనులపై ప్రభుత్వ తీరుకు నిరసనగా గిరిజన సంఘం కార్యాలయం నుంచి సీతంపేట వారపు సంతవరకు ర్యాలీ చేశారు. అనంతరం కొద్ది సేపు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. గిరిజన హక్కులను కూటమి ప్రభుత్వం హరిస్తోందని, జీఓ నంబర్ 3ను చట్టం చేయాలని, గిరిజనులకు ఉద్యోగాలు కల్పించాలని, 1/70 చట్టం పకడ్బందీగా అమలుచేయాలని డిమాండ్ చేశారు. నాన్షెడ్యూల్డ్ గ్రామాలను షెడ్యూల్డ్ ఏరియాలో చేర్చాలని నినదించారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎ.అశోక్, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.లక్ష్మణరావు, గిరిజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.తిరుపతిరావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దావాల రమణారావు, నాయకులు కె.భాస్కరరావు, శ్రీరాములు, బి.అప్పారావు, గంగాధర్, పి.సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు. కుంకీ ఏనుగుల తరలింపు సీతానగరం: మండలంలోని జోగింపేట ఏనుగుల సంరక్షణ కేంద్రంలో ఉన్న కుంకీ ఏనుగులను తెర్లాం మండలం రామినాయుడువలస ప్రాంతంలో ఉన్న ఏనుగులను మచ్చిక చేసేందుకు వీలుగా జిల్లా అటవీ శాఖ అధికారి జీఏపీ ప్రసూన పర్యవేక్షణలో ఆ ప్రాంతానికి శనివారం తరలించారు. జయంత్, అభిమన్యు కుంకీ ఏనుగులను చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రధాన రహదారిపైకి రావడంతో ట్రాకర్స్ ముందస్తు హెచ్చరికలు చేశారు. ఏళ్లుగా ఈ ప్రాంతంలో తిరుగాడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఏనుగుల గుంపును కుంకీ ఏనుగులు ఏ మేరకు మచ్చిక చేసుకొని ఈ ప్రాంతం నుంచి తీసుకుపోతాయోనని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. -
చెరకు రైతుకు చేదువార్త..!
వాస్తవం: రెండేళ్లలో జిల్లాకు ఒక్క కొత్త పరిశ్రమ రాలేదు. తేలేదు. ఇప్పుడు భీమసింగి చక్కెర కర్మాగారాన్ని శాశ్వతంగా మూసివేస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ‘విజయనగరం జిల్లా జామి మండలంలోని భీమసింగి చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తాం. చెరకు సాగును ప్రోత్సహిస్తాం. రైతులకు పూర్వ వైభవం తీసుకొస్తాం. 2024 సార్వత్రిక ఎన్నికల సభల్లో ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడు, ఎంఎస్ఎం, సెర్ప్, ఎన్ఆర్ఐ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఇచ్చిన హామీ. భీమసింగి సుగర్ ఫ్యాక్టరీ విజయనగరం ఫోర్ట్: చెరకు రైతులకు చేదువార్త ఇది. 1961 ఫిబ్రవరి 9న విజయనగరం జిల్లా జామి మండలంలోని భీమసింగి గ్రామంలో స్థాపించిన చక్కెర కర్మాగారాన్ని శాశ్వతంగా మూసివేస్తూ చంద్రబాబు సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. వేలాదిమంది చెరకు రైతులకు అండగా, వందలాది మందికి ఉపాధి కల్పించిన కర్మాగారాన్ని కాలగర్భంలో కలిపేసేందుకు పూనుకుంది. ఇది ఉమ్మడి విజయనగరం జిల్లా రైతులను, కార్మికులను ఆందోళనకు గురిచేస్తోంది. ఎన్నికల సమయంలో భీమసింగి సుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామంటూ హామీ ఇచ్చిన టీడీపీ నేతలు... ఇప్పుడు అదే ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసివేసేందుకు ఉత్తర్వులు జారీచేయడంపై రైతాంగం భగ్గుమంటోంది. ఓ వైపు తెల్ల అన్నంను ఎవరూ తినడంలేదని, వరి పంటను సాగుచేయొద్దని, ధాన్యంను ప్రభుత్వం కొనుగోలు చేయలేదని ప్రకటనలు చేస్తున్న వ్యవసాయ శాఖమంత్రి అచ్చెన్నాయుడు... వరికి ప్రత్యామ్నాయంగా చెరకు సాగును ప్రోత్సహించాల్సిన సమయంలో సుగర్ ఫ్యాక్టరీ మూసివేతకు చర్యలు తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూతపడిన సుగర్ ఫ్యాక్టరీని తెరిపించి రైతులను ఆదుకోవాల్సిన సర్కారు శాశ్వతంగా ఫ్యాక్టరీని లేకుండా చేసేందుకు పూనుకోవడంపై రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వ చర్యలతో చెరకు పంట పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ● షేర్ హోల్డర్స్గా రైతులు భీమసింగి సుగర్ ఫ్యాక్టరీలో వేలాది మంది రైతులు షేర్ హోల్డర్స్గా ఉన్నారు. ఒక వేల సుగర్ ఫ్యాక్టరీ గురించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మహాజన సభ ఏర్పాటుచేసి రైతులందరి ఆమోదంతోనే నిర్ణయం తీసుకోవాలి. అయితే, చంద్రబాబు సర్కారు రైతుల ఆమోదం లేకుండా నిర్ణయం తీసుకోవడంపై రైతుల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతోంది. పెద్దఎత్తున ఉద్యమిస్తాం భీమసింగి సుగర్ ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసివేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రైతులతో కలిసి పెద్దఎత్తున ఉద్యమం చేపడతాం. సుగర్ ఫ్యాక్టరీ రైతుల ఆస్తి. ప్రభుత్వ ఆస్థి కాదు. రైతుల ఆమోదం లేకుండా మూసివేత ఉత్తర్వులు ఎలా ఇస్తారు. సుగర్ ఫ్యాక్టరీని తెరిపించి చెరకు రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం మూసివేతకు ఉపక్రమించడం దారుణం. – బుద్దరాజు రాంబాబు, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూసివేయడం సరికాదు భీమసింగి సుగర్ ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసివేయడం సరికాదు. ఈ ఫ్యాక్టరీకి ఎంతో చరిత్ర ఉంది. మా ప్రాంతంలో వరి కంటే ఎక్కువగా చెరకు సాగుచేసేవారం. చెరకు పంటను ఫ్యాక్టరీకి విక్రయించేవారం. ఫ్యాక్టరీ మూత పడడంతో చెరకు పంట సాగు చేయడం మానివేశాం. వరి సాగుచేయొద్దని వ్యవసాయ శాఖమంత్రి అచ్చెన్నాయుడు బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారు. అలాంటి సమయంలో సుగర్ ఫ్యాక్టరీని తెరిపించి చెరకు సాగును ప్రోత్సహించాలి. అలాకాకుండా ఫ్యాక్టరీ మూసివేతకు చర్యలు తీసుకోడం విచారకరం. – కె.రాజు, రైతు, కోరుకొండపాలెం, విజయనగరం మండలం 2004లో ఫ్యాక్టరీని తెరిపించిన వైఎస్సార్ 2004కు ముందు సుగర్ ఫ్యాక్టరీ మూతపడింది. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం మూతపడిన సుగర్ ఫ్యాక్టరీని తెరిపించే ప్రయత్నం చేయలేదు. 2004లో పాదయాత్ర సమయంలో రైతులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని కలిసి ఫ్యాక్టరీని తెరిపించాలని విన్నవించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్సార్ సుగర్ ఫ్యాక్టరీని తెరిపించారు. రాయితీలు కల్పించారు. ఆయన హయాంలో సుగర్ ఫ్యాక్టరీ బాగానే నిర్వహించారు. ఆయన మరణానంతరం ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు అందక మళ్లీ సుగర్ ఫ్యాక్టరీ మూత పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుగర్ ఫ్యాక్టరీని తెరిపించలేదు. ఎప్పటికై నా సుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం తెరిపిస్తుందని ఆశతో రైతులు ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వారి ఆశలపై నీళ్లు చల్లేలా శాశ్వతంగా ఫ్యాక్టరీని మూసివేస్తున్నట్టు ఉత్తర్వులు జారీచేయడం రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నాటి అండ నేడు ఏదీ? జిల్లా వ్యాప్తంగా గతంలో సుమారు 50వేల హెక్టార్లలో చెరకు పంట సాగయ్యేది. పండించిన చెరకును భీమసింగి సుగర్ ఫ్యాక్టరీకి రైతులు తరలించేవారు. ముందుగా జిల్లాలోని ఎస్. కోట, కొర్లాం, బొబ్బిలి, గజపతినగరం తదితర ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన చెరకు కాటాల వద్ద తూకం వేశాక లారీలపై భీమసింగి చక్కెర కర్మాగారానికి పంటను తీసుకెళ్లేవారు. భీమసింగి ఫ్యాక్టరీ మూతపడ్డాక చెరకు సాగు విస్తీర్ణం క్రమేణా తగ్గింది. ప్రస్తుతం జిల్లాలో 2,200 హెక్టార్లకే చెరకు సాగు పరిమితమైంది. పండించిన చెరకును బెల్లం క్రషర్ల్కు రైతులు విక్రయిస్తున్నారు. మద్దతు ధర రాకపోయినా గత్యంతరం లేక రైతులు విక్రయిస్తున్నారు. సుగర్ ప్యాక్టరీ టీడీపీ సర్కారు హయాంలోనే మూతపడింది. దీంతో వందలాదిమంది రెగ్యులర్, కాంట్రాక్టు కార్మికులు ఉపాధి కోల్పోయారు. భీమసింగి సుగర్ ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసివేతకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం నెరవేరని మంత్రి హామీ ఆవేదనలో రైతాంగం -
రోడ్డు ప్రమాదంలో పీఏసీఎస్ డైరెక్టర్ దుర్మరణం
నెల్లిమర్ల రూరల్: మండలంలోని కొండగుంపాం గ్రామానికి చెందిన తుమ్మలపేట పీఏసీఎస్ డైరెక్టర్ పతివాడ గోవింద్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శుక్రవారం మధ్యాహ్నం సారిపల్లి జంక్షన్ వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన పల్సర్ బైక్ వాహనం బలంగా ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం తొలుత స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి, అనంతరం విజయనగరంలో మరో ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందాడు. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. గోవింద్ మృతితో స్వగ్రామమైన కొండగుంపాంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఎమ్మెల్యే నాగమాధవి, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, మార్కెఫెడ్ చైర్మెన్ కర్రోతు బంగార్రాజు, తదితరులు గోవింద్ పార్ధివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పక్కిలో ఏనుగుల గుంపు బొబ్బిలి రూరల్: పార్వతీపురం మన్యం జిల్లా నుంచి వచ్చిన ఎనిమిది ఏనుగుల గుంపు బొబ్బిలి, తెర్లాం, మెరకముడిదాం మండలాల్లోని పంట చేలు, మొక్కజొన్న, చెరుకు పంటలను నాశనం చేస్తున్నాయి. శనివారం పక్కి గ్రామ సమీపంలోని పంట పొలాల్లో సంచరిస్తున్నాయి. అక్కడే ఉన్న ఓ మామిడి తోటలో తిష్టవేశాయి. గత రెండు రోజులుగా మండలంలోని రాముడువలస, శివడవలస, పక్కి పరిసర ప్రాంతాల్లోని వరినారు, మొక్కజొన్న పంటలను నాశనం చేశాయి. ఏనుగుల గుంపును ఇక్కడి నుంచి సీతానగరం మండలం జోగింపేట ఎలిఫెంట్ జోన్కు తరలించేందుకు కుంకీ ఏనుగును శనివారం పక్కి గ్రామానికి తీసుకువచ్చారు. ఆ కుంకీ ఏనుగు ద్వారా ఏనుగుల గుంపును తరలించేందుకు ఫారెస్ట్ అధికారులు చర్యలు చేపట్టారు. మరో రెండు రోజుల్లో ఏనుగులను ఈ ప్రాంతం నుంచి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఫారెస్ట్ అధికారులు తెలియజేశారు.విద్యుత్ షాక్కు గురై ఆవు మృతి మెరకముడుదాం: మండలంలోని చిన బంటుపల్లి గ్రామంలో శనివారం విద్యుత్ షాక్కు గురై పాడి ఆవు మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన పల్లి లక్ష్మీనారాయణ ఆవులు మేస్తుండగా గ్రామానికి తాగునీటి సరఫరా చేస్తున్న బోరుబావి ప్యానెల్ బోర్డు విద్యుత్ వైర్లు ప్రమాదవశాత్తు ఆవుకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో లక్ష్మీనారాయణ తనకు జీవనాధారమైన రూ.50 వేల విలువ చేసే ఆవు మృతి చెందడంతో జీవనాధారం కోల్పోయానని బోరున విలపిస్తున్నాడు. తనను ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు. -
తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
పార్వతీపురం రూరల్: ఆన్లైన్ బెట్టింగ్లు, జల్సాలకు బానిసై రాత్రి వేళల్లో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా గుట్టుచప్పుడు కాకుండా చోరీలకు పాల్పడుతున్న ఓ పాత నేరస్తుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అతని నుంచి సుమారు రూ.71.40 లక్షల విలువైన 42 తులాల బంగారు ఆభరణాలను నూటికి నూరు శాతం రికవరీ చేసినట్లు ఎస్పీ ఎస్.వి.మాధవ్రెడ్డి వెల్లడించారు. స్థానిక మెట్టువీధికి చెందిన సువ్వాడ సతీష్ ఓ టిఫిన్ సెంటర్లో పని చేస్తుంటాడు. సంపాదన చాలక, జల్సాల కోసం దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఇందులో భాగంగా ఈ నెల 2, 3 తేదీల్లో సీతానగరానికే చెందిన కుర్మదాసు కిశోర్, వక్కలగడ్డ సురేష్ల ఇళ్ల తాళాలను ఇనుప రాడ్డుతో పగులగొట్టి మొత్తం 42 తులాల బంగారం అపహరించాడు. ఈ వరుస చోరీలతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. బాధితుల ఫిర్యా దుతో రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీటీవీ పుటేజీ, సాంకేతిక ఆధారాలను విశ్లేషించి దొంగ కదలికలను పసిగట్టారు. శనివారం ఉదయం స్థానిక హనుమాన్ జంక్షన్ వద్ద దొంగిలించిన బంగారాన్ని విక్రయించేందుకు వెళ్తుండగా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. సతీష్ ఇంట్లో దాచిన మంగళసూత్రాలు, గాజులు, నెక్లెస్లు తదితర 42 తులాల స్వర్ణాభరణాలను సీజ్ చేసి, అతడిని కోర్టు రిమాండ్కు తరలించారు. రూ. 71.40 లక్షల విలువైన 42 తులాల బంగారం స్వాధీనం ఆన్లైన్ బెట్టింగ్ల కోసమే దొంగతనాల బాట -
ఆదివాసీలకు మాజీ ఎమ్మెల్యే శుభాకాంక్షలు
సీతంపేట: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గంలోని గిరిజన సోదర, సోదరీమణులకు పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు, జీవన విధానం దేశ సాంస్కృతిక వైవిద్యానికి ప్రతీకలన్నారు. గిరిజనుల అభ్యున్నతికి విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు, ఉపాది వంటి మౌలిక సదుపాయాలు మరింత మెరుగు పడాల్సిన అవసరం ఉందన్నారు. మారుమూల గిరిజన గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు పాలకులు దృష్టి సారించాలని కోరారు. ఆదివాసీల హక్కుల పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. -
ముగిసిన నైపుణ్యాభివృద్ధ్ధి శిక్షణ
విజయనగరం అర్బన్: స్థానిక మహారాజా కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఇంటర్నల్ క్వాలిటీ అష్యూరెన్స్ సెల్ సహకారంతో ప్రయోగశాల సాంకేతిక నిపుణులు, సహాయక సిబ్బందికి ‘ప్రయోగశాల విధానాలు, భద్రత, దసీ్త్రకరణ, నాణ్యతా వ్యవస్థలు’ అనే అంశంపై నిర్వహించిన ఒక రోజు నైపుణ్యాభివృద్ది శిక్షణా కార్యక్రమం శనివారం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రామయ్య మాట్లాడుతూ.. ప్రయోగశాలల్లో భద్రతా ప్రమాణాలు, నాణ్యతా విధానాలు, ప్రామాణిక కార్యాచరణ పద్ధతులను పక్కాగా అమలు చేయడం వల్ల పనితీరు, విశ్వసనీయత పెరుగుతాయని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సీఎంఎస్ లాబొరేటరీస్ క్వాలిటీ కంట్రోల్ హెడ్ కె.లీలాకిరణ్కుమార్, ఎంఐఎంఎస్ క్వాలిటీ అక్రిడిటేషన్ కో ఆర్డినేటర్ జె.విజయ్కుమార్ పాల్గొని ప్రయోగశాల నిర్వహణ, భద్రతపై దిశా నిర్దేశం చేశారు. శిక్షణలో ల్యాబ్ సెక్యూరిటీ, రసాయనాల సురక్షిత నిల్వ, పరికరాల నిర్వహణ, అగ్ని ప్రమాదాల నివారణ, జీవ భద్రత, అత్యవసర పరిస్థితుల ఎదుర్కోవడం వంటి ప్రమాదాల నివారణ వంటి పలు అంశాలపై నిపుణులు ప్రాయోగిక అవగాహన కల్పించారు. వివిధ విద్యా సంస్థలకు చెందిన ప్రయోగశాల సాంకేతిక సిబ్బంది పాల్గొన్నారు. -
భీమసింగి ఫ్యాక్టరీని ఏపీఐఐసీకి అప్పగిస్తే ఉద్యమిస్తాం
రాజాం: జిల్లాలో భీమసింగి సహకార చక్కెర ఫ్యాక్టరీని మూసేసి, ఆ భూములను ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్ట్రాస్టక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్)కు ప్రభుత్వం కట్టబెడితే ఊరుకునేది లేదని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాజాంలో శనివారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భీమసింగిలో ఉన్నది కోపరేటివ్ సుగర్ ఫ్యాక్టరీ అని, విజయరామగజపతి కోపరేటివ్ సుగర్స్ లిమిటెడ్ కింద 1969లో రైతుల అంతా సొసైటీగా ఏర్పడి ఏర్పాటుచేశారన్నారు. 1977లో పరిశ్రమలో చక్కెర తయారీ ప్రారంభమైందన్నారు. ఇది రైతుల భాగస్వామ్యంతో సాధ్యమైందని గుర్తుచేశారు. ఉమ్మడి విజయనగరం, విశాఖపట్నం జిల్లాలోని 18 మండలాల్లోని 16 వేల మంది రైతులు ఇందులో సభ్యులుగా కొనసాగుతూ వస్తున్నారన్నారు. 1999లో చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక ఫ్యాక్టరీని పట్టించుకోకపోవడంతో 2002లో మూతపడిందని వెల్లడించారు. 2004లో వైఎస్సార్ పాదయాత్ర సమయంలో ఫ్యాక్టరీ పరిస్థితిని రైతులు వివరించారని, ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్యాక్టరీ తెరిపించారన్నారు. మళ్లీ ఫ్యాక్టరినీ వినియోగంలోకి తేవాలని వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కోపరేటివ్తో కమిటీని ఏర్పాటుచేశారని గుర్తుచేశారు. ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పిన చంద్రబాబు ఏపీఐఐసీకి ఆ భూములు బదిలీచేసేందుకు తీర్మానాలు చేయడం రైతులను మోసగించడమేనని దుయ్యబట్టారు. ప్రైవేటీకరణ చేయడం, భూములు అమ్మడం చంద్రబాబు సర్కారుకు నిరంతర ప్రక్రియగా మారిపోయిందన్నారు. 65 ఎకరాల పరిధి ఉన్న ఖరీదైన భీమసింగి ఫ్యాక్టరీ భూమిని అమ్మకానికి పెట్టడం దుర్మార్గమన్నారు. ఫ్యాక్టరీకి 2 కిలోమీటర్ల దూరంలో హైవే గ్రీన్ఫీల్డ్ రోడ్డు ఉందని, పది కిలోమీటర్లు దూరంలో విజయనగరం ఉందని, 40 కిలోమీటర్లు దూరంలో పోర్టు ఉందని, పక్కనే రైల్వే లైన్ ఉందని గుర్తుచేశారు. ఇన్ని పారిశ్రామిక సౌకర్యాలు ఉన్న ఫ్యాక్టరినీ పునఃఉత్పాదనకు సిద్ధం చేయకుండా ఇలా భూములు అమ్మేస్తామని సొంత నిర్ణయాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఫ్యాక్టరీలో భాగస్వామ్యమైన రైతుల అభిప్రాయాలు తీసుకోకుండా, పబ్లిక్ హియరింగ్ పెట్టకుండా మీ ఇష్టమొచ్చినట్లు వ్యవహరించడం సబబుకాదని హితవుపలికారు. ఈ విషయాన్ని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణతో పాటు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పోరాడుతామని స్పష్టంచేశారు. ఫ్యాక్టరీ పూర్తిగా సహకార సంఘంతో ఉందని, ఆరోజు ప్రతి రైతు రూ.111లు చెల్లించి 16వేల మంది సభ్యులుగా ఉన్నారని, ఇప్పుడు ఇది రూ.40 కోట్లు షేర్ కేపిటల్గా ఉందని, రూ.32 కోట్ల వరకు ప్రభుత్వ ఈక్విటీ, మిగిలినది రైతుల ఈక్విటీగా ఉందని వివరించారు. అప్పట్లో ఇక్కడ రైతులే భూ సేకరణ చేశారన్నారు. విజయనగరం జిల్లాలోని 15 మండలాలతో పాటు భీమిలి నియోజకవర్గంలోని పద్మనాభపురం, ఆనందపురం, భీమిలి మండలాల రైతులకు ఈ ఫ్యాక్టరే ఆధారమని వివరించారు. ఫ్యాక్టరీని కాపాడుకునేందుకు రైతులు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సంకిలి ఫ్యాక్టరీ మూసేస్తే ఒప్పుకోం.. సంకిలిలోని ప్రైవేట్ సుగర్ ఫ్యాక్టరీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, ప్రభుత్వం ఆదుకోవాలని జెడ్పీ చైర్మన్ కోరారు. ఫ్యాక్టరీ పరిస్థితిని ఇప్పటికే ఎమ్మెల్సీలు బొత్స సత్యనారాయణ, పాలవలస విక్రాంత్లు మండలి సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని గుర్తుచేశారు. ఫ్యాక్టరీని యాజమాన్యం ఆకస్మికంగా నిలుపుదలచేస్తే పోరాటం సాగిస్తామని హెచ్చరించారు. ఆ రోజు సంకిలి సుగర్ ఫ్యాక్టరీ నిర్మాణానికి బొత్స సత్యనారాయణ, పాలవలస రాజశేఖరం, సాంభశివరాజు తదితరులు ఎంతో కష్టపడ్డారని గుర్తుచేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, రాజాం నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తలే రాజేష్, జెడ్పీ వైస్ చైర్మన్ సిరిపురపు జగన్మోహనరావు, మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య, నియోజకవర్గ పరిశీలకులు కె.వి.సూర్యనారాయణరాజు, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు టంకాల అచ్చెన్నాయుడు, తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం ఫ్యాక్టరినీ తెరవాల్సిందే స్థానిక మంత్రి, ముఖ్యమంత్రులదే ఆ బాధ్యత మీడియా సమావేశంలో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు -
రోల్ మోడల్ ఆస్పత్రిగా తీర్చిదిద్దాలి
గుమ్మలక్ష్మీపురం: మెరుగైన వైద్యసేవలు అందించి భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని రోల్ మోడల్ ఆస్పత్రిగా తీర్చిదిద్దాలని జిల్లా ఇన్చార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. ఈ మేరకు నాబార్డ్ – 225 నిధులు రూ.8.95 కోట్లతో భద్రగిరిలో నిర్మించిన 50 పడకల నూతన ఆస్పత్రి భవనాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రికి వచ్చే రోగులను ఇతర ఆస్పత్రులకు రిఫర్ చేస్తూ ఉంటే ప్రయోజనం ఏం ఉంటుందని, కావున రిఫర్ చేయకుండా సాధ్యమైనంత వరకూ స్థానిక ఆస్పత్రిలోనే ప్రజలకు వైద్య సేవలు అందివ్వాలని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో అన్నారు. అవే అబద్దాలు.. ఎన్నికల ముందు చెప్పిన అబద్దాలనే జిల్లా ఇన్చార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు మళ్లీ ఈ సమావేశంలోనూ కొనసాగించారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ. 10.50 లక్షల కోట్లు అప్పు చేసిందని ఓ సారి, రూ.13 లక్షల కోట్లు అప్పు చేసిందని మరోసారి నిడకడలేని మాటలు చెప్పుకొచ్చారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చాం.. అధికారంలోకి వచ్చాక హామీలన్ని అమలు చేయాలన్న ఉద్దేశంతో రివ్యూ చేస్తే గత ప్రభుత్వం చేసిన అప్పులు చూసి గుండె దడ పుట్టిందన్నారు. అన్ని హామీలు అమలు చేయాలంటే డబ్బుల్లేవంటూనే ఒకటి రెండు తప్ప సూపర్ 6 హామీలన్నీ అమలు చేస్తున్నామన్నారు. ప్రధాన మంత్రి మోదీ సహకారం అందిస్తుండంతోనే రాష్ట్రాన్ని అభివృధ్ధి పథంలో నడిపిస్తున్నామన్నారు. దీనికి ముందు ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ భద్రగిరి ఆస్పత్రిని 50 పడకల నుంచి 100 పడకల ఆస్పత్రిగా మార్పు చేయాలంటూ ఇన్చార్జ్ మంత్రికి వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎన్.ప్రభాకర్రెడ్డి, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, ఆర్డీఓ మాధురి, డీసీహెచ్ఎస్ నాగభూషణరావు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాల పట్ల అప్రమత్తం
● సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి ● విద్యుత్ శాఖ ఎస్ఈ మువ్వల లక్ష్మణరావు విజయనగరం: వర్షాకాలం కారణంగా ప్రమాదాలు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సోలార్ విద్యుత్ కోసం సబ్సిడీ ద్వారా అమలవుతున్న పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. రెండున్నరేళ్లలో రూ.539 కోట్లతో జిల్లాలో విద్యుత్ అభివృద్ధి పనులు చేయించామని విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ మువ్వల లక్ష్మణరావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్ శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ధ్యేయంగా పని చేస్తున్నామన్నారు. ప్రధానంగా జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని సేవలు జాప్యం అవుతున్నట్లు పత్రికలు ద్వారా వస్తున్నాయని వాటిని ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ప్రతి నెలా 2 తేదీన విద్యుత్ సేఫ్టీ దినోత్సవం జరుపుకుంటున్నట్లు తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలు అక్కడక్కడ జరుగుతున్నాయని వాటిని నివారించేందుకు పోలీసుల సహకారంతో కృషి చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో ఎగ్జిక్యూటివ్ ఇంజి నీర్ పి.హరి, గోపాలరావు నాయుడు, ఈఈ టెక్నికల్ జి.శంకరరావు, సీనియర్ అకౌంటెంట్ ఎస్.అప్పలనాయుడు పాల్గొన్నారు. -
తూకంలో తేడా... నిర్వహణలో నిర్లక్ష్యం
రామభద్రపురం: రేషన్ డిపోలకు సరుకులు సరఫరా చేస్తున్న ఎంఎల్ఎస్ పాయింట్ నిర్వాహకులు, రేషన్ డీలర్లు కుమ్మకై ్క లబ్ధిదారులకు అన్యాయం చేయడంపై రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు బి.కాంతారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. జాతీయ ఆహార భద్రత పథకం అమలులో భాగంగా శుక్రవారం ఆయన రామభద్రపురం మండలంలోని పలు అంగన్వాడీ కేంద్రాలు, రేషన్ దుకాణాలు, ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీ, సాంఘిక సంక్షేమ బాలుర వలసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ ఉన్న స్టాక్ను పరిశీలించారు. వసతి గృహం, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు వడ్డించే గుడ్డు బరువు, అరటి పండ్ల నాణ్యతపై సిబ్బందిని ప్రశ్నించగా ఎవ్వరికీ తెలియదని సమాధానం ఇవ్వడంతో అసహనం వ్యక్తంచేశారు. మహంతి వీధిలోని రేషన్ దుకాణాన్ని పరిశీలించారు. తూనికలు, కొలతలకు సంబంధించి లీగల్ మెట్రాలజీ ధ్రువీకరణ పత్రం ఇవ్వకపోవడంపై ఇన్స్పెక్టర్ మధుసంతోష్పై ఆగ్రహం వ్యక్తంచేశారు. రేషన్ దుకాణాల జిల్లా అధ్యక్షుడు చొక్కాపు రామారావు డీలర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతుండగా ఫుడ్ కమిషన్ మెంబరు మాట్లాడుతూ ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి బియ్యం ఎన్నికిలోలు తెస్తున్నారు? ఎందుకు తక్కువ తూస్తున్నారు? గోదాం నిర్వాహకులను ఎందుకు ఎదిరించి అడగడం లేదని ప్రశ్నించారు. గోదాం నిర్వాహకులు తూకంలో తక్కువ ఇచ్చిన బియ్యంను తీసుకొచ్చి ఇక్కడ లబ్ధిదారులకు తూకంలో తక్కువ తూసి వారిని నష్టపరుస్తున్నారన్నారు. ● రామభద్రపురంలోని 5వ అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలిస్తూ రికార్డుల నిర్వహణ బాగాలేదని, కేంద్రం నిర్వాహకురాలికి మెమో ఇవ్వాలని సీడీపీఓను ఆదేశించారు. ● రామభద్రపురం సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని సందర్శించి సరుకుల గోదాం పరిశీలించారు. అక్కడ బియ్యం స్టాకు బుక్లో కంటే సుమారు 30 కిలోలు ఎక్కువగా ఉన్నందున హాస్ట్ల్ నిర్వాహకులకు మెమో జారీ చేయాలని సాంఘిక సంక్షేమశాఖ డీడీని ఆదేశించారు. ● శ్రీరాంనగర్కాలనీలోని పాఠశాలను సందర్శిస్తుండగా పిల్లలకు మధ్యాహ్నభోజనం వండేందుకు సరిపడా గ్యాస్ ఇవ్వడం లేదని అక్కడి హెచ్ఎం ఫిర్యాదు చేశారు. పాఠశాలకు గ్యాస్ ఇవ్వకపోతే డీఎస్ఓ దృష్టికి తీసుకెళ్లాలని హెచ్ఎంకు సూచించారు. రేషన్ డిపోను పరిశిలీస్తూ కొంత అదనపు బియ్యం పౌరసరఫరాల శాఖ ఇచ్చిన గోనె సంచిలో కాకుండా ప్లాస్టిక్ సంచిలో నిల్వ ఉండడాన్ని గుర్తించి డీలర్ను ప్రశ్నించారు. దీనిపై డీలర్ పొంతన లేని సమాధానం చెప్పడంతో ఆమెకు మెమో ఇచ్చి చర్యలు తీసుకోవాలని డీఎస్ఓ మురళీనాథ్ ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలను ఎవ్వరూ గౌరవించడం లేదని, నిబంధనలపై నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో డీఎస్ఓ మురళీనాథ్, సీఎస్డీటీ సాయికృష్ణ, ఎంఈఓలు తిరుమలప్రసాద్, పెంటయ్య, సీడీపీఓలు ఉమాభారతి, సుజాత, తదితరులు పాల్గొన్నారు. ఎంఎల్ఎస్ పాయింట్ నిర్వాహకులు, డీలర్ల కుమ్మకై ్క లబ్ధిదారులకు నష్టం రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు బి.కాంతారావు ఒక రేషన్ డిపో డీలర్, అంగన్వాడీ కార్యకర్త, ఎస్సీ హాస్టల్ వార్డెన్లకు మెమోలు జారీకి ఆదేశం -
కామన్వెల్త్ విజేతకు ఘనంగా స్వాగతం
● అజయ్బాబుపై అపూర్వ అభిమానం చూపిన గ్రామస్తులునెల్లిమర్ల రూరల్: కామన్వెల్త్ గేమ్స్లో వెండి పతకం సాధించి జిల్లాకు గుర్తింపు తీసుకువచ్చిన వెయిట్లిఫ్టర్ వల్లూరి అజయ్ బాబు శుక్రవారం తన స్వగ్రామం కొండవెలగాడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. విజయనగరం ఎత్తు బ్రిడ్జి వద్ద నుంచి అజయ్ బాబును ర్యాలీగా కొండవెలగాడకు తీసుకువెళ్లారు. దారిపొడవునా అభిమానులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని అజయ్కు అభినందనలు తెలిపారు. జెడ్పీటీసీ గదల సన్యాసి నాయుడు, ఎంపీటీసీ మొయిద అక్కోజీ, చంద్రంపేట సర్పంచ్ కర్రోతువెంకట రమణ తదితరులు అజయ్ బాబును సత్కరించి అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి పతకం సాధించడం జిల్లాకు, స్వగ్రామానికి గర్వకారణమని వారు పేర్కొన్నారు. గ్రామానికి చేరుకున్న అజయ్ బాబుకు అభిమానులు ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.విజయనగరంలో సత్కారం విజయనగరం: గ్లాస్గోలో ఇటీవల జరిగిన కామన్వెల్త్ గేమ్స్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో రజత పతకం సాధించి దేశానికి, రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన జిల్లా క్రీడాకారుడు వల్లూరి అజయ్ బాబుకు ఘన స్వాగతం లభించింది. పోటీలు ముగించుకుని శనివారం జిల్లా కేంద్రానికి చేరుకున్న అజయ్ను జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుశ్శాలువాతో సత్కరించారు. అదేవిధంగా జిల్లా క్రీడాఫ్రాధికార సంస్థ అధికారి ఎస్ వెంకటేశ్వరరావు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. -
ఆండ్ర జలాశయాన్ని పరిశీలించిన కేంద్ర బృందం
మెంటాడ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నదుల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా ఒడిశాలోని మహానది జలాలను ఆంధ్రప్రదేశ్ మీదుగా గోదావరికి అనుసంధానించే ప్రతిపాదిత మార్గంలో ఉన్న ఆండ్ర జలాశయాన్ని జాతీయ, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల బృందం శుక్రవారం సందర్శించింది. జాతీయ నీటి అభివృద్ధి సంస్థ ఇంజినీరు దేవానందరావు, అంతరరాష్ట్ర జలవనరుల విభాగం చీఫ్ ఇంజినీరు టి.గోవిందరావు నేతృత్వంలోని ఈ బృందం జలాశయం ప్రస్తుత స్థితిగతులను, ఇక్కడ చేపడుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. రూ. 54,019 కోట్ల మెగా ప్రాజెక్టు సుమారు రూ. 54,019 కోట్ల అంచనా వ్యయంతో నదుల అనుసంధానం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నట్లు బృంద అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఒడిశాలోని మహానది జలాలను శ్రీకాకుళం జిల్లాలోని హిరమండలం గొట్టా బ్యారేజీ రిజర్వాయర్కు, అక్కడి నుంచి పార్వతీపురం మన్యం జిల్లాలోని జంఝావతి జలాశయానికి, విజయనగరం జిల్లాలో ఉన్న ఆండ్ర, తాడిపూడి జలాశయాలకు అనుసంధానిస్తారు. ఆపై అనకాపల్లి జిల్లాలోని రైవాడ రిజర్వాయర్కు గోదావరి నది జలాలను మళ్లిస్తామని వివరించారు. తొలివిడత క్షేత్రస్థాయి పరిశీలన నదుల అనుసంధాన ప్రక్రియలో భాగంగా ప్రధాన కాలువ ఆండ్ర జలాశయం మీదుగా వెళ్లనుందని, ఈ ప్రాంత భౌగోళిక స్థితిగతులు, సాంకేతిక అంశాలను అధ్యయనం చేయడానికి తొలి పరిశీలన చేపట్టినట్లు అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఆరా తీసి, ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు. ఈ సందర్శనలో నార్త్ కోస్ట్ చీఫ్ ఇంజినీరు వేణుగోపాల్, ఎస్ఈ అప్పలనాయుడు, ఈఈ గోవిందరావు, ఆండ్ర రిజర్వాయర్ డీఈ రామునాయుడు, ఏఈ కృపాంద్, తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడి మృతి
రాజాం సిటీ: విధులకు హాజరై ఇంటికి తిరిగి వస్తు న్న ఓ యువకుడిని బస్సు రూపంలో మృత్యువు కాటేసింది. పొందూరు మండలం అంతకాపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయ సమీపంలో మలుపువద్ద రాజాం నుంచి శ్రీకాకుళం వైపు వె ళ్తున్న ఆర్టీసీ బస్సు బైక్ను ఢీకొనడంతో ఒడిశా రాష్ట్రంలోని బరంపురానికి చెందిన యువకుడు సమ్మ సా యిసురేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. బరంపురానికి చెందిన సమ్మ సాయిసురేష్ (30) కుటుంబంతో సహా ఏడాది క్రితం రాజాం వచ్చాడు. తండ్రి సతీష్బాబు అనారోగ్యానికి గు రికావడంతో రాజాంలో బజాజ్ ఫైనాన్స్లో సేల్స్మేనేజర్గా జాయిన్ అయ్యాడు. ప్రతిరోజూ ఉదయం 9గంటలకు విధులకు వెళ్లి వివిధ ప్రాంతాల్లో సందర్శించి రాత్రి 9గంటల సమయంలో ఇంటికి చేరేవాడు. ఎప్పటిలాగే శుక్రవారం విధులకు హాజరైన సురేష్ పొందూరు వెళ్లి తిరుగు ప్రయాణంలో బైక్పై వస్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో సంఘట నా స్థలంలోనే మృతిచెందాడు. ఈ విషయాన్ని సహోద్యోగి పి.ప్రకాశరావు కుటుంబసభ్యులకు తెలపడంతో సంఘటనా స్థలానికి చేరుకుని భోరున విలపించారు. మృతునికి తల్లి ధనలక్ష్మి, తండ్రి సతీష్బాబు, ఓ సోదరి ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజాం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి ధ నలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చే స్తున్నామని ఎస్సై మహ్మద్ సల్మాన్ బేగ్ తెలిపారు. -
ప్రత్యేక జీఓలతో డీఎస్సీలో అక్రమాలు
విజయనగరం: ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రత్యేక జీఓలతో డీఎస్సీలో అక్రమాలను ప్రోత్సహించిందని, అర్హులకు అన్యాయం చేసిందని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనిసరావు విమర్శించారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు చేసిన మొదటి సంతకానికి ఇదేనా విలువ అని ప్రశ్నించారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సమగ్రవిచారణ జరపకుంటే నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమం తరహాలో రాష్ట్రంలో మహా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన రెండవ రోజు రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్న మహిళలకు బత్తాయిరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయపాలనకు వ్యతిరేకంగా, యువత, విద్యార్థులకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టినట్టు వెల్లడించారు. ప్రజస్వామ్య ప్రభుత్వంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, డీఎస్సీలో జరిగిన అక్రమాలపై శాంతియుతంగా నిరసన చేపడుతున్న వైఎస్సార్సీపీ శ్రేణులపై దౌర్జన్యకాండకు పాల్పడడం దుర్మార్గమన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలో 10 మందికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం వచ్చిన వారిలో ఒకరిని ప్రశ్నిస్తే నిజం బట్టబయలైందని, కర్రాబిల్లా అట ఆడిన వ్యక్తికి ఎలా ఉద్యోగం వచ్చిందో తమకు తెలియదంటూ చుట్టపక్కల వారు చెప్పడం గమనార్హమని పేర్కొన్నారు. సదరు అభ్యర్థితో పాటు తల్లిదండ్రులతో తామే నేరుగా మాట్లాడితే స్థానిక ఎమ్మెల్యేకు తమ ఇబ్బందులు చెప్పుకుంటే ఈ ఉద్యోగం ఇప్పించారంటూ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. జిల్లాలో 10 మందికి ఉద్యోగాలు వస్తే ఎన్ని పారదర్శకంగా జరిగాయే ప్రభుత్వ పెద్దలకు, ప్రజలకు తెలియాలన్నారు. బాధ్యతగల ప్రతిపక్షంగా యువత కోసం చేపడుతున్న పోరుబాటలో భాగంగా ఈ నెల 10న నియోజకవర్గ కేంద్రాల్లో చేపట్టబోయే నిరసన ర్యాలీల్లో యువత, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ● ఇదెక్కడి రక్షణ.. మహిళల రక్షణ, భద్రత కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమల్లోకి తెచ్చిన దిశ చట్టం రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర కేబినేట్ నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమని జెడ్పీ చైర్మన్ అన్నారు. చట్టాలను మరింత సమర్ధవంతంగా అమలు చేయాల్సింది పోయి వాటిని నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేయడం అన్యాయమన్నారు. మహిళలంటే గౌరవం ఉంటే చట్టాన్ని అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు ఆశపు వేణు, జిల్లా యువజన విభాగం నాయకులు జి.ఈశ్వర్ కౌశిక్, తదితరులు పాల్గొన్నారు. లోకేశ్ రాజీనామా చేయాలి డీఎస్సీలో జరిగిన అక్రమాలపై తక్షణమే సీబీఐతో విచారణ జరిపించాలని, అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హమీల మేరకు నిరుద్యోగులకు ఇస్తామన్న రూ.3వేల నిరుద్యోగ భృతి అమలు చేయాలన్నారు. ఫీజురీయింబర్స్మెంట్ పథకం బకాయిలు రూ.9,500 కోట్ల తక్షణమే విడుదల చేయాలన్నారు. పేదకుటుంబాల పిల్లలు ఉన్నత చదువులు అభ్యసించాలనే సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం సరికాదన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. తమ అనుకూల మీడియాతో అబద్ధాలను వాస్తవాలుగా వక్రీకరించడం తగదన్నారు. సమగ్ర విచారణ జరిపి యువతకు న్యాయం చేయకుంటే ఉద్యమం తప్పదు ఢిల్లీలోని జంతర్మంతర్ వేదిక తరహాలో ఉద్యమం చేపడతాం స్పష్టంచేసిన జెడ్పీచైర్మన్ మజ్జి శ్రీనివాసరావు -
కార్మిక సంక్షోభం..!
విజయనగరం గంటస్తంభం: భవన నిర్మాణ కార్మికులు, గిగ్ వర్కర్లు, ఫ్లాట్ ఫామ్ వర్కర్ల భద్రతను చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలేంది. కొత్త పథకాలను అమలు చేయకపోగా, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమలైన సంక్షేమ పథకాలకు సైతం మంగళం పాడేసింది. సంక్షేమాన్ని విస్మరిస్తూ సంక్షోభంలోకి నెట్టేయడంపై కార్మికలోకం ఆవేదన వ్యక్తంచేస్తోంది. ఇదీ పరిస్థితి.. ఉమ్మడి విజయనగరం జిల్లాలో దాదాపు 6,09,096 మంది అసంఘటిత రంగ భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. ఇప్పటి వరకు కార్మిక శాఖలో నమోదైన భవన నిర్మాణ కార్మికులు 1,22,502 మంది మాత్రమే. వీరిలో ఎక్కువ మంది నిర్మాణ రంగంపై ఆధారపడిన తాపీ మేసీ్త్రలు, కూలీలు, రాడ్ బెండర్లు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, వడ్రంగులు, పెయింటర్లు, మట్టి పని చేసేవారు, ఇటుక బట్టీ వర్కర్లు ఉన్నారు. ఎన్నికల సమయంలో భవన నిర్మాణ బోర్డును పునరుద్ధరిస్తామని, సాధికార సంస్థ ఏర్పాటు చేస్తామని టీడీపీ మేనిఫెస్టోలో చంద్రబాబు హామీ ఇచ్చారు. అన్ని వర్గాల కార్మికులకు ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని హామీల వర్షం కురిపించారు. అధికారంలోకి వచ్చి నేటి వరకు ఆ హామీల ఊసే ఎత్తకపోవడంతో కార్మిక లోకం తీవ్ర నిరాశలో మునిగిపోయింది. అందని సాయం.. ఆవేదనలో కార్మికలోకం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో అత్యద్భుతంగా అమలైన వైఎస్సార్ బీమా పథకాన్ని చంద్రన్న బీమాగా పేరు మార్చారు. అంతకు మించి పథకం అమలుపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. గత ప్రభుత్వంలో వైఎస్సార్ బీమా పథకం కింద విజయనగరం జిల్లాలో దాదాపు లక్షలాది కుటుంబాలకు ఆర్థిక సాయం అందింది. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో ఆ సాయం పూర్తిగా నిలిచిపోయింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అందించిన సాయం ఇలా.. ౖవెఎస్సార్ కల్యాణమస్తు: భవన, ఇతర నిర్మాణ కార్మికుల పిల్లల పెళ్లిళ్లకు రూ.20,000 చొప్పున లబ్ధి. ౖవెఎస్సార్ బీమా (ప్రమాద మరణం): బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం. సహజ మరణం, వైకల్యం: సహజ మరణానికి రూ.1 లక్ష, ప్రమాదంలో వైకల్యం సంభవిస్తే రూ.5 లక్షలు. రిజిస్టర్ కాని కార్మికులకు సైతం: రిజిస్టర్ కాని కార్మికులు ప్రమాదాల్లో మరణిస్తే రూ.5 లక్షలు, వైకల్యానికి రూ.2.5 లక్షల సాయం. ఆరోగ్యశ్రీ వైద్య సేవలు: అసంఘటిత రంగ కార్మిక కుటుంబాలు అనారోగ్యం బారిన పడితే ఆరోగ్యశ్రీ కింద ఏకంగా రూ.25 లక్షల వరకు పూర్తి ఉచిత వైద్యం. ప్రస్తుతం వివాహ కానుక కింద రూ.20 వేలు, ప్రసూతి సహాయం కింద రూ.20వేలు, సహజ మరణం సహాయం రూ.50వేలు, దహన సంస్కారాల ఖర్చులు రూ.20వేలు మాత్రమే కార్మికులకు అందుతున్నాయి. ప్రమాద బీమాను గాలికొదిలేసిన చంద్రబాబు సర్కారు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పథకాలకు సైతం గండి మొత్తం 6,09,096 మంది కార్మికులకు దక్కని భద్రత సార్వత్రిక ఎన్నికల హామీలకు మంగళం! వైఎస్సార్ బీమాను చంద్రన్న బీమాగా పేరు మార్చడమే తప్ప సాయం సున్నా అవగాహన లేక వేలాది మంది రెన్యువల్కు దూరం -
లారీ బీభత్సం
● మూడు విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్, బైక్ ధ్వంసం భామిని: రోడ్డుపై వాహనాల రాకపోకలు, పొలాల్లో వ్యవసాయ పనుల్లో రైతులు, వరితీతలో వలస కూలీలు. అందరూ చూస్తుండగానే శుక్రవారం ఓ లారీ బీభత్సం సృష్టించింది.భామిని మండలం నేరడి బ్యారేజీ సమీపంలో ఏబీ రోడ్డుపై బత్తిలి నుంచి భామిని వైపు వస్తున్న సిమెంట్ బస్తాల ఖాళీ లారీ రోడ్డుపై కుడివైపు మితిమీరిన వేగంతో వస్తూ రోడ్డు సైడ్న ఆపి ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొని ఈడ్చుకుంటూ వెళ్లి కొత్తగా వేసిన భారీ రౌండ్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. అనంతరం రోడ్డుపక్కనే ఉన్న రెండు విద్యుత్ స్తంభాలపై గల పాత ట్రాన్స్ఫార్మర్ను పడగొట్టింది. ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేక పోవడంతో ప్రాణనష్టం తప్పిందని పొలంలో పనిచేస్తున్న అంతా ఊపిరిపీల్చుకున్నారు. రోడ్డుపక్కనే బైక్ను నిలిని పొలం పనులు చేస్తున్న నేరడికి చెందిన రైతు పాతపట్నం కోదండ రావు బైక్ ప్రమాదంలో తునాతునకలైంది. కొద్ది దూరంలో పోలంలోని రైతులు కేకలు వేయడంతో ప్రమాదానికి కారణమైన లారీ నిలిపివేసి డ్రైవర్ పరుగులు తీశాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. జనసేన నాయకుడిపై దాడివిజయనగరం రూరల్: నగరానికి చెందిన జనసేన నాయకుడు గురాన అయ్యలుపై కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. నగరంలోని మంగలివీధిలో ఉన్న నూకాలమ్మ ఆలయానికి సంబంధించి జనసేన నేతకు, స్థానికుల మధ్య నెలకొన్న పాత గొడవల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య శుక్రవారం జరిగిన వాగ్వాదం కొట్లాటకు దారితీసింది. దీంతో స్థానికులు కొందరు అయ్యలుపై దాడి చేసి గాయపరిచారు. దీంతో ఆయన జిల్లా కేంద్రాస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నారు. దాడి విషయంపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
పాఠశాలల్లో గుడ్ల పరిశీలన
రాజాం: మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి పంపిణీ చేస్తున్న కోడిగుడ్లను ఎంఈఓ యాగాటి దుర్గారావు శుక్రవారం పరిశీలించారు. పెనుబాక, కంచరాం, బొద్దాం తదితర పాఠశాలల్లో గుడ్ల పరిమాణంపై ఆరాతీశారు. వంట ఏజెన్సీతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలకు ఇస్తున్న గుడ్ల పరిమాణం చిన్నదిగా ఉండడంపై ఈనెల 7న సాక్షిలో ‘గుడ్డు చిన్నబోయింది’ శీర్షికతో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. ఎంఈఓ పలు పాఠశాలలో వాటిపై ఆరాతీయడంతో పాటు ఏజెన్సీతో మాట్లాడారు. గుడ్డు పరిమాణం తగ్గితే బిల్లులు నిలుపుదల చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా జట్ల ఎంపికవిజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న అమరావతి చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా జట్ల ఎంపిక పోటీలు శుక్రవారం జరిగాయి. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నగర శివారులో గల విజ్జీ స్టేడియంలో బాస్కెట్బాల్, అథ్లెటిక్స్, షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాంశాల్లో నిర్వహించిన పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి 600 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీలను జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి ఎస్.వెంకటేశ్వరరావు ప్రారంభించారు. అండర్–17, 23 వయస్సుల విభాగాల్లో బాలబాలికలకు నిర్వహించిన ఎంపిక పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు తిరుపతిలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తారని జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి ఎస్.వెంకటేశ్వరరావు తెలిపారు. ఎంపిక పోటీలను పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు, శాప్కోచ్లు పర్యవేక్షించారు. సెంచూరియన్లో ‘వికసిత్ భారత్ హ్యూమన్ క్యాపిటల్ కాన్క్లేవ్’నెల్లిమర్ల రూరల్: మండలంలోని టెక్కలి సెంచూరియన్ యూనివర్సిటీలో ‘వికసిత్ భారత్ హ్యూమన్ క్యాపిటల్ కాన్క్లేవ్–2026’ శుక్రవారం నిర్వహించారు. భవిష్యత్ నైపుణ్యాలు, కత్రిమ మేధస్సు, పరిశోధనలు, ఆవిష్కరణలు, పరిశ్రమ–విద్యా భాగస్వామ్యంపై నిపుణులు చర్చించారు. ఏఐతో సాంకేతిక రంగంలో వేగంగా మార్పులు వస్తున్న నేపథ్యంలో విద్యార్థులు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు పెంపొందించుకోవాలని అపిటోరియా ఫార్మా ప్లాంట్ హెడ్ డాక్టర్ కె. సాంబిరెడ్డి సూచించారు. పరిశోధనలు, స్టార్టప్లకు మరింత ప్రోత్సాహం అవసరమని సీఐఐ చైర్మన్ జి.కృష్ణమోహన్ తెలిపారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, పారిశ్రామిక దృక్పథాన్ని పెంపొందించడం విద్యాసంస్థల బాధ్యతను వీసీ ప్రొఫెసర్ ప్రశాంత్ కుమార్ మహంతి పేర్కొన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె. వెంకట రవికుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రెండు బైక్లు ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలుబొబ్బిలి: పట్టణంలోని వేణుగోపాల స్వామి ఆలయం జంక్షన్లో శుక్రవారం రాత్రి రెండు బైక్లు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. మండలంలోని కృష్ణాపురానికి చెందిన చొక్కాపు ఈశ్వర రావు ఆలయం రోడ్డు నుంచి మెయిన్ రోడ్డులోకి బైక్పై వెళ్తున్నాడు.అదే సమయంలో మెయిన్రోడ్డులో బైక్పై వస్తున్న పట్టణానికి చెందిన బి. వెంకట్రావు, డి.అప్పలనాయుడులను ఈశ్వర రావు ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ముగ్గురూ గాయపడ్డారు. వారిని స్థానికులు సీహెచ్సీకి తరలించగా సిబ్బంది ప్రాథమిక చికిత్స చేశారు. తీవ్ర గాయాల పాలైన ఈశ్వర రావును విజయనగరం కేంద్ర ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సీఐ కె. నారాయణ రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
విజయనగరం: జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యా య అవార్డు–2026ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి యు.మాణిక్యంనాయుడు శుక్రవారం తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, డైట్లలో పదేళ్ల వృత్తి అనుభవం ఉన్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అవార్డులకు అర్హులని పేర్కొన్నారు. దరఖాస్తులను ఈ నెల 17 నుంచి 22వ తేదీలోగా ఉపవిద్యాశాఖాధికారి, మండల విద్యాశాఖాధికారి కార్యాలయాల్లో అందజేయాలని కోరారు. ఖరీఫ్ రుణ లక్ష్యం రూ.2,400 కోట్లు ● డీసీసీబీ జీఎం కేవీవీఆర్ఎన్ సత్యనారాయణ రామభద్రపురం: జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్లో రూ.2,400 కోట్లు రుణాలు మంజూరు చేయాలన్నది లక్ష్యమని డీసీసీబీ జీఎం కేవీవీఆర్ఎన్ సత్యనారాయణ తెలిపారు. మండలకేంద్రంలోని డీసీసీబీ బ్రాంచ్ను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు రూ.1980 కోట్లు రుణాలు ఇచ్చామన్నారు. ఈ ఏడాది రూ.380 కోట్ల నుంచి రూ.600 కోట్ల వరకు డిపాజిట్లు సేకరించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. డీసీసీబీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. డిపాజిట్లపై అన్ని బ్యాంకుల కంటే డీసీసీబీలో 0.5 శాతం వరకు అధిక వడ్డీ ఇస్తున్నామన్నారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభా వంతో వర్షపాతం తక్కువగా నమోదు కానుందని వాతావరణ శాఖాధికారుల హెచ్చరికల నేపథ్యంలో ఖాతాదారులంతా ఈ నెల 15వ తేదీలోపు పంటల బీమా ప్రీమియం చెల్లించాలన్నారు. ఐబీబీఎస్ ద్వారా కొత్తగా 25 మంది సిబ్బందిని నియమిస్తామని తెలిపారు. కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ కర్రి జానకి, సూపర్వైజర్ తెంటు రమేష్, తదితరులు పాల్గొన్నారు. పొటాష్ ఎరువు ధరలు తగ్గించాలి ● రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్కు విన్నవించిన రైతులు డెంకాడ: పొటాష్ ఎరువు ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్ డాక్టర్ మనాజీర్ జిలానీసమూన్కు విన్నవించారు. డెంకాడ మండలం సింగవరంలో ఆయన శుక్రవారం పర్యటించారు. వరి ఉభాలు చేస్తున్న పొలాలను పరిశీలించారు. పంటకు మేలు చేసే అజోస్పిరిల్లమ్ అనే జీవరసాయనిక ఎరువును చల్లించారు. ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఏర్పాటు చేసిన స్టాల్ను పరిశీలించారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో వ్యవసాయ పరిస్థితులు, సాగునీటి లభ్యత, ఎరువుల పంపిణీ, వ్యవసాయ యాంత్రీకరణ తదితర వాటిపై రైతులతో ముచ్చటించారు. ఆయిల్ ఇంజిన్లు, నీటిని తరలించే పైపులు రైతులకు అందించాలని రైతులు కోరారు. వర్షాభావం ఇలాగే కొనసాగితే అపరాలు, కొర్రలు, సజ్జలు వంటి చిరుధాన్యాలు సాగు చేయాలని ఆయన రైతులకు సూచించారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకోని రైతులు ఈ నెల 15వ తేదీలోగా పంటల బీమా ప్రీమియం చెల్లించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, ఎమ్మెల్యే లోకం నాగమాధవి, వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు వీటీ రామారావు, డీడీఏ ఎం.రామారావు, డీపీఎం విజయ్కుమార్, శాస్త్రవేత్త తేజేశ్వరరావు, ఇన్చార్జి ఏడీఏ సంగీత, ఉద్యాన, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు. 11న సీతంపేట ఐటీడీఏలో ఆదివాసీ దినోత్సవంసీతంపేట: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని సీతంపేట ఐటీడీఏలో ఈనెల 11న నిర్వహించనున్నట్లు పాలకొండ సబ్కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జ్ పీఓ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని రాష్ట్రస్థాయిలో అమరావతిలో ప్రభుత్వం నిర్వహిస్తున్నందున అక్కడికి మంత్రులు,ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఐటీడీఏలో 9వ తేదీకి బదులు 11న నిర్వహించనున్నామని పేర్కొన్నారు. గిరిజన ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. -
జాతీయ బాలల విజ్ఞాన కాంగ్రెస్కు ప్రాజెక్టుల ఆహ్వానం
● నమోదుకు ఈ నెల 15 చివరి తేదీ ● జిల్లా విద్యాశాఖ అధికారి యూ.మాణిక్యం నాయుడువిజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజ్ఞాన, సాంకేతిక మండలి (ఏపీసీఓఎస్టీ) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 32వ జాతీయ బాలల విజ్ఞాన కాంగ్రెస్ (ఎన్సీఎస్సీ–2026)కు సంబంధించిన ప్రాజెక్టుల నమోదు ప్రక్రియ ప్రారంభమైందని జిల్లా విద్యాశాఖ అధికారి యూ.మాణిక్యంనాయుడు తెలిపారు. జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సైన్స్ ఉపాధ్యాయులు తమ పాఠశాలల విద్యార్థుల నమోదును తక్షణమే పూర్తి చేయాలని సూచించారు. అర్హత కలిగిన విద్యార్థుల వివరాలను అధికారిక వెబ్సైట్ లో ‘స్టూడెంట్స్/చిల్డ్రన్ సైంటిస్ట్స్ అండ్ గైడ్స్’ విభాగం ద్వారా నమోదు చేయవచ్చని తెలిపారు. ప్రతి ప్రాజెక్టులో ఇద్దరు విద్యార్ధులు మాత్రమే పాల్గొనాలి. ఒకరిని ‘గ్రూప్ లీడర్’గా, మరొకరిని ‘గ్రూప్ మెంబర్’గా నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ శీర్షిక ఎంపిక చేసిన ఉపాంశానికి అనుగుణంగా ఉండాలి. నమోదు సమయంలో విద్యార్ధుల ఫోటోలు, ప్రధానోపాధ్యాయులు జారీ చేసిన జనన ధ్రువీకరణ పత్రాలు, మొబైల్ నంబర్లు, ఈ–మెయిల్ చిరునామాలను తప్పులు లేకుండా నమోదు చేయాలి. విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం, సృజనాత్మకత, పరిశోధన నైపుణ్యాలు, సమస్య పరిష్కార సామర్థ్యాలను పెంపొందించేందుకు ఈ జాతీయస్థాయి క్యాక్రమం ఎంతో తోడ్పడుతుందని డీఈఓ పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి పాఠశాల ఇందులో చురుగ్గా పాల్గొని అధిక సంఖ్యలో ప్రాజెక్టులను నమోదు చేయాలని, విజయనగరం జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టాలని పిలుపునిచ్చారు. ప్రాజెక్టుల నమోదుకు ఈ నెల 15వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. నమోదు సమయంలో ఏవైనా సాంకేతిక సమస్యలు లేదా సందేహాలు ఉంటే జిల్లా కో–ఆర్డినేటర్ టి.రాజేష్ (ఫోన్: 9440444674), జిల్లా అకడమిక్ కో ఆర్డినేటర్ జి.సన్యాసినాయుడు (ఫోన్:940009294)లను సంప్రదించాలని సూచించారు. -
దిశ చట్టం రద్దుపై.. మహిళల తిరుగుబాటు
ప్లకార్డులతో నిరసన విజయనగరం: మహిళల భద్రత, రక్షణకోసం గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టం రద్దు నిర్ణయంపై మహిళలు భగ్గుమన్నారు. చంద్రబాబు ప్రభుత్వ మహిళా భద్రత వ్యతిరేక పాలనపై నిరసన తెలిపారు. దిశ చట్టం రద్దుచేస్తే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. కేబినెట్లో తీసుకున్న దిశ చట్టం రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా విజయనగరం జిల్లా కేంద్రంలో శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. మహిళలంటే చంద్రబాబుకు ఎందుకంత చులకన అని నిలదీశారు. సీఎం డౌన్డౌన్ అంటూ నినదించారు. దిశ చట్టం రద్దు నిర్ణయ ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ ఆడబిడ్డలకు రక్షణ కవచం లాంటి చట్టాన్ని రద్దు చేసేందుకు పూనుకోవడం దుర్మార్గమన్నారు. దిశ చట్టం వచ్చిన తరువాత 21 రోజుల్లో శిక్ష పడేలా చర్యలు తీసుకోవడం వల్ల మహిళల్లో ధైర్యం పెరిగిందని, బాధిత మహిళలకు న్యాయం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు చేస్తున్న అకృత్యాలు మద్దతుగా చట్టాన్ని రద్దు చేస్తే మహిళాలోకం నుంచి తిరుగుబాటు తప్పదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గదుల సత్యలత, నగర పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు పిన్నింటి కళావతి, మాజీ మేయర్ వి.విజయలక్ష్మి పాల్గొన్నారు. -
ఇది ప్రభుత్వ నిర్ణయం
పార్వతీపురంలో ఉన్న సీఆర్బీ వైన్స్ రెస్టారెంట్ అండ్ బార్ను వీరఘట్టంలో పెట్టుకునేందుకు బార్ యజమాని దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తు మేరకు బార్ను వీరఘట్టం తరలించేందుకు అనుమతులు వచ్చాయి.ఇది ప్రభుత్వ నిర్ణయం. బార్ ఏర్పాటుకు ప్రజల నుంచి అభ్యంతరాలు వస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం. కె.సహదేవ, ఎకై ్సజ్ సూపరింటెండెంట్, పార్వతీపురం మన్యం జిల్లా బార్ ఏర్పాటు చేస్తే గొడవలు పెరుగుతాయివీరఘట్టంలో ప్రస్తుతం ఉన్న మూడు మద్యం దుకాణాల వల్ల చీకటి పడితే రోడ్లపై నిత్యం ఏదో ఒక తగాదా జరుగుతూనే ఉంది. ఆ సమయంలో మహిళలు రోడ్డుపై తిరగలేని పరిస్థితి ఏర్పడింది. ఇక బార్ ఏర్పాటు చేస్తే మరిన్ని తగాదాలు ఏర్పడతాయి. బార్ ఏర్పాటును అడ్డుకుంటాం. వీరఘట్టం పట్టణ అభివృద్ధికి ఏదో ఒక మంచి పనిచేయండి తప్ప బార్లు ఏర్పాటు చేసి తగాదాలను పెంచవద్దు. జె.అమర్నాథ్, వీరఘట్టం -
ప్రజాచైతన్య యాత్ర
విజయనగరం గంటస్తంభం: ప్రజాసమస్యల పరిష్కారం, ప్రజల్లో చైతన్యం కల్పించడమే లక్ష్యంగా సీపీఐ చేపట్టిన ప్రజా చైతన్య పాదయాత్ర విజయనగరం పట్టణంలో గురువారం ప్రారంభమైంది. తొలుత అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అనంతరం ఫైనల్ వీధి, రాళ్లమాలపల్లి, సంజీవయ్యనగర్, బీటీఆర్ నగర్, సాయి కాలనీ, మార్క్స్నగర్, శాంతినగర్ తదితర ప్రాంతాల్లో ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీపీఐ జిల్లా కార్యదర్మి ఒమ్మి రమణ మాట్లాడుతూ, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే పాదయాత్ర ఉద్దేశమన్నారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ, రైతులకు చట్టబద్ధమైన కనీస మద్ధుతు ధర, ఉచిత విద్య, వైద్యం, నిరుద్యోగ యువతకు శాశ్వత ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ప్రజలు ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 15 వరకు విజయనగరం నియోజకవర్గ వ్యాప్తంగా ఇంటింటికీ ప్రచారం కొనసాగుతుందని తెలిపారు. -
డీఎస్సీ దగాపై నిరసన దీక్ష
డీఎస్సీ అక్రమాలకు నిరసనగా విజయనగరంలో వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి విభాగం నాయకులు, నిరుద్యోగుల రిలే నిరాహార దీక్ష డీఎస్సీ–2025లో జరిగిన అక్రమాలపై చంద్రబాబు సర్కారును నిలదీస్తూ నిరుద్యోగులు కదంతొక్కారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో సమరశంఖం పూరించారు. విజయనగరం జిల్లాలోని ఏడు నియోజకవర్గ కేంద్రాల్లో గురువారం రిలే నిరాహార దీక్షలు ఆరంభించారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యతవహిస్తూ కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్రప్రదాన్ రాజీనామా చేశారని, రాష్ట్రంలో డీఎస్సీ అక్రమాలకు నారా లోకేశ్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రశ్నపత్రం లీకేజీ, నియామకాల్లో అవకతవకల వల్ల వేలాది మంది నిరుద్యోగుల జీవితాలు తారుమారయ్యాయని, ఎంత కష్టపడి చదివినా నిరుద్యోగులుగానే మిగిలిపోయామని వాపోయారు. చంద్రబాబు ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల నిరుద్యోగులకు కష్టాలు తప్పడంలేదన్నారు. జాబ్ క్యాలెండర్ లేదని, ఉద్యోగం వచ్చేవరకు నిరుద్యోగులకు నెలకు ఇస్తామన్న రూ.3వేలు భృతిహామీ నెరవేర్చలేదని, విద్యార్థుల చదువులకు ఆధారమైన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలలో జాప్యం చేస్తున్నారని జెన్జీ యువత మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేశారన్నారు. చంద్రబాబు పాలనకు రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. రిలే నిరాహార దీక్షలకు చీపురుపల్లిలో జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖరరావు, బొబ్బిలిలో మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, ఎస్.కోటలో మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, విజయనగరంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి, నెల్లిమర్లలో మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, గజపతినగరంలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య, రాజాంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలేరాజేష్, పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపేవరకు నిరుద్యోగుల తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టంచేశారు. నాలుగు రోజుల పాటు చేపట్టే రిలే నిరాహార దీక్షల్లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని పిలుపునిచ్చారు. డీఎస్సీ అక్రమాలపై నిగ్గుతేల్చేలా జెన్–జీ యువత పోరాటం సాగించాలన్నారు. – సాక్షి నెట్వర్క్ ఉపాధ్యాయ వ్యవస్థకే సిగ్గుచేటు డీఎస్సీ అంటే ఆంధ్రా సివిల్స్ అనేవారు. అంత కష్టపడి చదివితేనే ఉపాధ్యాయ ఉద్యోగం వస్తుంది. అటువంటి డీఎస్సీ ఉద్యోగాలను ఈ ప్రభుత్వం హేలనచేసింది. గతంలో ఉపాధ్యాయులుగా చేరి సర్వీసులో ఉన్నవారికి టెట్ తప్పనిసరిగా రాయాలని నిబంధనలు పెట్టి వారి జీవితాలతో చెలగాటం ఆడుతోంది. ఈ ప్రభుత్వం వస్తే బాగుంటుందని సంబరపడిన ఉపాధ్యాయులు దగా పడ్డారు. డీఎస్సీలో ఎటువంటి టెట్ లేకుండా అనర్హులకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వడం దారుణం. ఎన్నో కోట్లరూపాయల కుంభకోణంలా అనిపిస్తోంది. తపస్సు చేసి చదివిన టీచర్ ట్రైనీ అభ్యర్థులకు అన్యాయం జరిగింది. న్యాయం జరిగేవరకూ ఈ రిలే దీక్షలు చేస్తాం. – మరిశర్ల గంగారావు, వైఎస్సార్సీపీ ఉపాధ్యాయ విభాగం జిల్లా అధ్యక్షుడు, రాజాం -
జిల్లాలో ఐదు సీహెచ్సీల ఏర్పాటు
● లైవ్లీ హుడ్ ప్రాజెక్టు మేనేజర్ ఎస్.రాజ్కుమార్రామభద్రపురం: జిల్లాలో రైతులకు ఉపయోగపడే విధంగా రూ.75 లక్షలతో ఐదు కస్టమ్స్ హైరింగ్ సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని జిల్లా లైవ్లీ హుడ్ ప్రాజెక్టు మేనేజర్ ఎస్.రాజ్కుమార్ అన్నారు. ఈ మేరకు మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో సీహెచ్సీ షెడ్డు నిర్మాణానికి అవసరమైన స్థల పరిశీలన గురువారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు 27 కస్టమ్ హైరింగ్ సెంటర్లు మంజూరు కాగా మొదటి విడతలో రామభద్రపురం, దత్తిరాజేరు, గజపతినగరం, గంట్యాడ, ఎల్కోట మండలాల్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. అయితే ఈ సీహెచ్సీలలో రైతుల వ్యవసాయ సాగుకు అవసరమైన ట్రాక్టర్లు, రొటొవేటర్లు, పవర్ ట్రిల్లర్స్, స్ప్రేయర్స్ దమ్ము సెట్లు తదితర వ్యవసాయ పనిముట్లు అందుబాటులో ఉంచుతూ ఎఫ్పీవోల ద్వారా తక్కువ ధరలకు అద్దెకు ఇవ్వనున్నారన్నారు.ఈ నెల 15 లోగా అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అలాగే జిల్లాలోని 117 ఎకరాల్లో మునగసాగు వేసేలా చర్యలు తీసుకుంటా మన్నారు. పెరియా కులం యూనివర్సిటీ నుంచి పీకేఎం మునగ విత్తనం తెప్పిస్తున్నామని తెలిపారు. ఈ మునగ పంట నుంచి కాయలు కాకుండా ఆకులు కోసి బాగా ఆరబెట్టి పొడి తయారు చేసి విక్రయించనున్నారన్నారు. దత్తిరాజేరు మండలంలో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అలాగే 5 మండలాల్లో 406 మంది రైతులతో వెదురు సాగు చేసేందుకు ఎంపిక చేశామన్నారు. మునగ, వెదురు సాగు చేసే రైతులకు వీబీజీ రామ్జీ పథకం నుంచి ఆర్థిక సాయం అందిచనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఏపీఎం సత్యవతి పాల్గొన్నారు. -
ఎల్నినో ప్రభావంపై అవగాహన
● ఆత్మ సౌజన్యంతో కార్యక్రమం ● క్షేత్రస్థాయిలో వరిసాగును పరిశీలనవేపాడ: ఖరీఫ్ సీజన్పై ఎల్నినో ప్రభావం వల్ల కలిగే నష్టాలను అధిగమించేందకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యాజమాన్య పద్ధతులపై జిల్లా శాస్త్రవేత్త లక్ష్మణ్ రైతులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో అవగాహన కల్పించారు. ఈ మేరకు గురువారం వేపాడ మండలంలోని చినదుంగాడలో వ్యవసాయశాఖ మండల ఏఓ స్వాతి ఆధ్వర్యంలో ఆత్మ సౌజన్యంతో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా శాస్త్రవేత్త లక్ష్మణ్ రైతు శిక్షణ కేంద్రం అధికారిణి నిర్మల మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా ఉంటాయని దీనికి ప్రత్యామ్నాయంగా చోడి, కొర్ర తక్కువ నీరు అవసరం ఉన్న పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని సూచించారు. సైంటిస్ట్ లక్ష్మణ్ మాట్లాడుతూ ఎల్నినో వల్ల వర్షాలు లేక నారుమడి ఎక్కడైనా ఎండిపోయినట్లయితే 19.19.19ని 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి నారుమడి అంతా పిచికారీ చేసినట్లయితే నీటి ఎద్దడి నుంచి వరి నారును కాపాడుకోవచ్చునని వరి పంటలో స్వల్పకాలిక రకాలు వెద పద్ధతిలో సాగుచేసుకోవాలని తెలిపారు. సెప్టెంబర్ మొదటి వారం కూడా వర్షాలు లేకపోతే చోడి, కొర్ర లాంటి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని చెప్పారు. అలాగే పచ్చిరొట్ట విత్తనాలు వేసుకోవడం వల్ల 6–8 టన్నుల సేంద్రియ ఎరువు భూమిలో చేరి 50% వరకు ఎరువుల వాడకం తగ్గించుకోవచ్చునన్నారు. కొత్తవలస ఏడీఏ భానులత మాట్లాడుతూ ఇన్సూరెన్స్ చేసుకోవాలని వరి పంటకు ఎకరాకు రూ.200 చొప్పున చెల్లిస్తే రూ.40,000 వరకు ఇన్సూరెనన్స్ కవర్ అవుతుందని, నారు వేసిన వారు, వెద పద్ధతిలో సాగు చేసిన వారు ఈ అవకాశం ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వేపాడ, వీలుపర్తి, కుమ్మపల్లి వీఏఏలు వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
ఉద్యోగాల పేరుతో టోకరా ..
ప్రస్తుత సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చారు. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగభృతి అంటూ మాలాంటి బీఈడీ చదివిన విద్యార్థులకు ఆశపెట్టారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తుండగా మెగా డీఎస్సీ అంటూ ఏమీ వేయలేదు. గతేడాది భర్తీచేసిన డీఎస్సీ పోస్టులు సైతం గతంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ప్రకటించినవే. కొత్తగా కొన్ని పోస్టులు కలిపినా, వాటిని అనర్హులు ఇచ్చి, సొమ్ముచేసుకున్నారు. డీఎస్సీ కోసం చదివిన అభ్యర్థులంతా దగా పడ్డారు. – కె.శ్రీరామ్, బీఎస్సీబీఈడీ, రాజాం -
సహజ ఆహారమే పిల్లలకు శ్రీరామరక్ష
పార్వతీపురం: పిల్లల ఆరోగ్యవంతమైన భవిష్యత్కు సహజమైన పౌష్టికాహారమే శ్రీరామ రక్ష అని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన ఐసీడీఎస్ సమీక్షా సమవేశంలో ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో అందుతున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని, బిడ్డపుట్టిన గంటలోపు ముర్రుపాలు ఇవ్వడం, రెండేళ్లవరకు తల్లిపాలు అందించడం అత్యవసరమని సూచించారు. రెండేళ్లలోపు పిల్లలకు చక్కెర, అధిక ఉప్పు, మసాలాలు, కూల్డ్రింక్స్, ప్రోపెస్ చేసిన జ్యూస్లకు దూరంగా ఉంచి పండ్లు, కూరగాయలు, సహజ ఆహారాన్ని అలవాటు చేయాలని తెలిపారు. పిల్లలకు బలవంతంగా ఆహారం తినిపించకుండా స్వయంగా తినే అలవాటు పెంపొందించాలని సూచించారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ టి.కనకదుర్గ, సీడీపీఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రతి కుటుంబ ఆదాయం రెట్టింపు లక్ష్యంగా కార్యాచరణ జిల్లాలోని ప్రతి కుటుంబం కనీసం రూ. 5లక్షల వార్షిక ఆదాయం సాదించేలా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి డీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఒక కొత్త ఆదాయ వనరుల యూనిట్ను ఏర్పాటు చేయాలని, మహిళా సంఘాల రుణాలను ఉత్పాదక రంగాలకే వినియోగించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న ఉచిత విద్య, వైద్య సేవలను సద్వినియోగం చేసుకొని కుటుంబ వ్యయాలను తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. చిన్నపాటి అనారోగ్యాలకు ఆర్ఎంపీలను ఆశ్రయించకుండా ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించాలని సూచించారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ సీహెచ్.ప్రభావతి, సీసీలు, వీఓఏలు తదితరులు పాల్గొన్నారు. -
స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు సామర్థ్య శిక్షణ
● 2027 నాటికి తలసరి ఆదాయం రూ.55 లక్షలకు చేరేలా కృషి చేయాలి విజయనగరం గంటస్తంభం: స్వర్ణాంధ్ర–2047 లక్ష్యాల సాధనలో భాగంగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసేందుకు అధికారులు సమష్టిగా, చిత్తశుద్ధితో పనిచేయాలని ప్రత్యేక కార్మదర్మి శాంతిప్రియ పాండే సూచించారు. 2027 నాటికి రాష్ట్రంలో తలసరి ఆదాయాన్ని రూ.55 లక్షలకు చేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రణాళికా విభాగం, పాలే ఇండియా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులకు గురువారం సామర్థ్యపెంపు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీఎస్డీపీ), జిల్లా స్థూల ఉత్పత్తి పెంపుపై క్షేత్రస్థాయి అధికారులకు స్పష్టమైన అవగాహన అవసరమన్నారు. ప్రాథమిక, పారిశ్రామిక, సేవారంగాల్లో ఉత్పత్తి, పెట్టుబడులు, ఆదాయ వృద్ధిపై దృష్టి సారించి ఆర్ధికాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. స్వర్ణాంధ్ర–2047 లక్ష్యంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2.4 ట్రిలియన్ డాలర్లకు చేర్చే దిశగా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రణాళికా శాఖ డిప్యూటీ స్టాటిస్టకల్ అధికారి రమేష్, ధార్వాడ ఐఐటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ మహేష్ ఉత్పత్తి, పెట్టుబడి, రాబడి తదితర ఆర్థిక అంశాలపై అధికారులకు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ సేఽతుమాధవన్, సీపీఓ బాలాజీతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
● వీరు మారరంతే..
ఓ వైపు ప్రమాదాలు జరుగుతున్నా.. వాహన చోదకుల్లో మార్పు రావడం లేదు.. నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణాలు చేస్తూ ప్రమాదాలకు గురవుతూ కన్నవారికి కన్నీరు మిగిలిస్తున్నారు.. ముఖ్యంగా యువత ప్రయాణాల్లో నిబంధనలు పాటించడం లేదు.. ద్విచక్ర వాహనాలపై పరిమితికి మించి వెళ్తున్నారు.. పైగా హెల్మెట్ కూడా పెట్టుకోవడం లేదు.. పోలీసులు, ఆర్టీఏ అధికారులు ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టి, అవగాహన కల్పిస్తున్నా వారిలో మార్పు రాకపోవడం బాధాకరం. మండల కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో గురువారం మధ్యాహ్నం ఓ ద్విచక్ర వాహనంపై నలుగురు, మరో వాహనంపై ముగ్గురు హెల్మెట్లు పెట్టుకోకుండా ప్రయాణిస్తూ సాక్షి కంటపడ్డారు. – గజపతినగరం -
నేడు స్వగ్రామానికి కామన్వెల్త్ రజత విజేత రాక
● ఘనస్వాగతానికి ఏర్పాట్లు నెల్లిమర్ల రూరల్: గ్లాస్గోలో ఇటీవల జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో వెయిట్లిఫ్టింగ్ విభాగంలో రజత పతకం సాధించి దేశానికి, రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన జిల్లా క్రీడాకారుడు వల్లూరి అజయ్బాబు శుక్రవారం ఆయన స్వస్థలమైన నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామానికి వస్తున్నారు. అంతర్జాతీయ వేదికపై భారత పతాకాన్ని రెపరెపలాడించిన అజయ్కు అపూర్వ స్వాగతం పలికేందుకు క్రీడా సంఘాలు, గ్రామస్తులు, యువత సిద్ధమయ్యారు. సాధారణ కుటుంబం నుంచి కఠోర శ్రమ, క్రమశిక్షణ, పట్టుదలతో ప్రపంచ స్థాయి క్రీడాకారుడిగా ఎదిగిన అజయ్బాబు.. కామన్వెల్త్ క్రీడల్లో పతకం సాధించడం ద్వారా జిల్లా చరిత్రలో అరుదైన ఘనతను నమోదు చేశారు. దేశ ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, తదితర ప్రముఖుల మన్ననలు అందుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు విజయనగరం ఎత్తు బ్రిడ్జి నుంచి నెల్లిమర్ల మీదుగా కొండవెలగాడ గ్రామం వరకు ర్యాలీ ఉంటుందని అజయ్బాబు తండ్రి, సీనియర్ వెయిట్లిఫ్టర్ వల్లూరి శ్రీనివాసరావు తెలిపారు. -
గుడ్డు చిన్నబోయింది
ఈ ఫొటోలోని గుడ్డు చూసి ఇదేదో కోడి పొల్లు గుడ్డు అనుకుంటే పొరబడినట్టే. రాజాం పట్టణంతో పాటు నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు పంపిణీచేస్తున్న కోడిగుడ్లు సైజు ఇలా చిన్నగా మారిపోయింది. సాధారణంగా గుడ్డు 50 గ్రాముల నుంచి 65 గ్రాముల బరువు ఉంటుంది. అంతకంటే తక్కువ ఉంటే నాణ్యతలేనట్టుగా భావిస్తారు. పాఠశాలలకు వచ్చే గుడ్లు 50 గ్రాములు కంటే తక్కువగా ఉంటున్నాయి. నాణ్యతతో పాటు సాధారణ పరిమాణం లేని గుడ్లను ఏజెన్సీలు సరఫరా చేస్తున్నా వంట నిర్వాహకులు ఎదిరించలేక విద్యార్థులకు వండిపెడుతున్నారు. కొన్నిసార్లు గుడ్లు పాడవ్వడంతో విద్యార్థులకు వడ్డించలేని పరిస్థితి తలెత్తుతోందని వాపోతున్నారు. – రాజాం -
కంపుకొట్టిన ‘గుడ్డు కూర’
సంతకవిటి: మధ్యాహ్నభోజనంలో నాణ్యత కొరవడింది. పర్యవేక్షణ లోపించింది. ఫలితం.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు భోజన కష్టాలు తప్పడం లేదు. ఇటీవల అంగన్వాడీ సెంటర్లకు పిల్లలు వచ్చిన గుడ్లును సరఫరా చేసిన విషయం మరువకముందే.. సంతకవిటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కుళ్లిన గుడ్లును వడ్డించే ఘటన గురువారం చోటుచేసుకుంది. కంపు కొట్టిన గుడ్డు కూరను తినేందుకు విద్యార్థులు ఇష్టపడలేదు. కూరతో పాటు అన్నంను పారబోశారు. ఇంటర్ విద్యార్థులకు గుడ్డుకూర బదులు మిక్చర్ తెప్పించినప్పటికీ చాలామంది భోజనం చేసేందుకు నిరాకరించారు. అప్పటికప్పుడు ఉప్మా తయారు చేయించి వడ్డించారు. పాఠశాల విద్యార్థులకు మరే ఇతర ఏర్పాట్లు చేయక పోవడంతో చాలామంది పస్తులున్నారు. వీరికి సాయంత్రం నాలుగు గంటల సమయంలో బిస్కెట్ ప్యాకెట్లు అందజేశారు. తరచూ పాడైన గుడ్లునే సరఫరా చేస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారని విద్యార్థులు, భోజన నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై ఎంఈఓ 2 భాస్కరరావు స్పందిస్తూ విద్యార్థులకు వండిన గుడ్డుకూర కంపు కొట్టిందని తమ దృష్టికి వచ్చిన వెంటనే పాఠశాలను సందర్శించామన్నారు. పీడీ మొదట భోజనం చేసి కూర బాగోలేదని తెలపడంతో ఎవరికీ వడ్డించలేదన్నారు. పాడైన గుడ్లే కారణమన్న భోజన నిర్వాహకులు పస్తులతో విద్యార్థులు బిస్కెట్ ప్యాకెట్లు అందజేసిన ఉపాధ్యాయులు ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఉప్మా వడ్డింపు -
చిన్నారుల ప్రాణాలతో చెలగాటమా?
విజయనగరం టౌన్: స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ(ఎస్ఎంఎ) టైప్–1 అనే ఒక తీవ్రమైన, జన్యుపరమైన నరాల కండరాల వ్యాధికి సంబంధించిన ఇంజక్షన్కు రూ.కోట్లలో ఖర్చుచేయాల్సి ఉంది. లక్షల్లోనే తట్టుకోలేని నిరుపేద కుటుంబాలకు కోట్లు ఖర్చు అంటే ఆశలు వదులుకోవాల్సిందే. అటువంటి వారికి పునర్విక విషయంలో ప్రపంచమంతా స్పందించడం విశేషం. తాజాగా విజయనగరం జిల్లా కేంద్రంలో పూల్బాగ్ కాలనీలో నివాసం ఉంటున్న లిటిల్ కృష్ణ అనే బాబు ఇదే వ్యాధితో బాధపడుతున్న సంగతి విదితమే. ఆ బాబును కాపాడేందుకు అన్ని వర్గాల ప్రజలు తమవంతు బాధ్యతగా సాయమందించారు. ఎందరో సమాజ సేవకులు రోడ్లెక్కి డబ్బులు సేకరించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. ఇదిలా ఉంటే సామాజిక మాధ్యమాల్లో లక్షల మంది సభ్యులుగా ఉన్న కొందరు ఇన్ప్లూయన్సర్స్ ఇదే అదునుగా తీసుకుని డబ్బులు దోచుకోవడానికి తమ ప్రణాళికను సిద్ధం చేసుకుని పని పూర్తికానిచ్చేశారు. అందుకోసం వారు బాబు తల్లిదండ్రులను సైతం మభ్యపెట్టి, డబ్బులు వచ్చే మార్గాలను, ప్రజలను నేరుగా మోసం చేసే ప్రక్రియలో సగటు మనిషిని పూర్తిగా తమ మానవత్వానికి కల్పిత కథలు జోడించి, ఆ వీడియోలను వారు అనుకున్న పథకం ప్రకారం సోషల్ మీడియోలో పోస్టులు పెడుతూ బాబు ఇంజక్షన్కు కావాల్సిన కోట్లరూపాయల టార్గెట్ను పూర్తిచేసుకున్నారు. బాబు తల్లిదండ్రుల నుంచి వాటా వసూలు ఇంతవరకూ బాగానే ఉన్నప్పటికీ బాబుకు కావాల్సిన ఇంజక్షన్కు కోట్ల రూపాయలను సమకూర్చడంలో తమకు రావాల్సిన వాటాను సైతం బాబు తల్లిదండ్రుల దగ్గర నుంచి వసూలు చేసినట్లు భోగట్టా. చెక్కుల రూపంలో, నగదు రూపంలో సుమారు రూ. 50 లక్షలపైనే గుంజేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయ్యోపాపమంటూ ఇప్పుడిప్పుడే ప్రజల్లో మంచి పేరుతెచ్చుకుంటున్న సింగర్స్, యాక్టర్స్ సైతం వీరు చేసిన పాపాలకు నెటిజన్లకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ తంతు అంతా గమనించిన విజయనగరానికి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ వ్యవహారాన్ని వెలికి తీయగా అసలు విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దోచుకున్న వారంతా రోజుకో కొత్త వెర్షన్లో సమాధానాలు చెబుతుండడంతో కథ రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఒక్క విజయనగరమే కాదు..ఏకంగా ఉభయ రాష్ట్రాల్లోనే ఎంతో మంది వద్ద ఇన్ఫ్లూయన్సర్స్ భారీగా దోచుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒకడు బైక్ అమ్మేశానని, మరొకరు ఇల్లు, కారు అమ్మేశానని, మరికొందరు తన బంగారం సైతం అమ్మేసి డబ్బులు పంపించానని కట్టుకథలే అల్లారా ? అసలు ఏది నిజం ? చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడడం, శవాలపైన డబ్బులు ఏరుకోవడం, ఈజీమనీ సంపాదించడంలో ఇటువంటి మోసాలకు పాల్పడడం పట్ల నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. భవిష్యత్తులో ఎవరికై నా సాయమందించాలంటే అందులో వాస్తవమెంత ఉందో కూడా అర్థం కాని పరిస్ధితి తలెత్తింది. ఇదిలా ఉంటే తాజాగా దత్తిరాజేరు మండలానికి చెందిన ఓ ఇద్దరు దంపతులు తమ బిడ్డకు ఇంజ్షన్ కోట్లలో ఖర్చవుతుందని సాయమందించాలని కోరారు. విజయవాడలో రిషి అనే చిన్నారి ఇదే వ్యాధితో బాధపడుతున్నాడు. ఇప్పుడు ఇటువంటి చిన్నారుల పరిస్ధితి ఏంటి? ఇటువంటి వాటికి అడ్డుకట్ట వేయాలంటే చేపట్టాల్సిన చర్యలను రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా రంగంలోకి దిగి సమస్య పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎస్ఎమ్ఏ వ్యాధి నివారణకు రూ.కోట్లలో ఇంజక్షన్ డబ్బులు దోచుకునేందుకేనే ఇన్ప్లూయన్సర్స్ సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్గా మారిన వైనం ఎవరినీ ఉపేక్షించేది లేదు: ఎస్పీ -
మద్యంతర ఉత్తర్వులు..!
వీరఘట్టం: ఎవరేమనుకుంటే మనకేమి? మన పని జరిగిపోతే చాలని భావిస్తోంది టీడీపీ మద్యం సిండికేట్. గతంలో జారీ చేసిన నోటిఫికేషన్ను ఉల్లంఘిస్తూ నిబంధనలకు విరుద్ధంగా ఎకై ్సజ్శాఖ అడ్డుగోలుగా నిర్ణయం తీసుకోవడం వెనుక మద్యం సిండికేట్ హస్తం ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్వతీపురం మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన ఒక బార్ను వీరఘట్టం పంచాయతీ పరిధిలోకి మార్చేందుకు అనుమతి ఇస్తూ ఎకై ్సజ్శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఎకై ్సజ్శాఖ వర్గాలే విస్తుపోయేలా ఉన్న ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నోటిఫికేషన్ లైసెన్స్ పార్వతీపురంలో.. గతంలో బార్ల ఏర్పాటుకు విధివిధానాలను ఖరారు చేస్తూ ఎకై ్సజ్ పాలసీని ప్రభుత్వం జారీ చేసింది. ఆ ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో మాత్రమే బార్లు ఏర్పాటు చేయాలని నిబంధనలు విధించింది. ఆ నిబంధనల మేరకు గతంలో పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో బార్ల ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం టెండర్లు దాఖలు చేసిన వారికి లాటరీ విధానంలో బార్ల లైసెన్సులు కేటాయించారు. ఆ విధంగా పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో బార్లు ఏర్పాటయ్యాయి. అయితే ఇదిలా ఉండగా..ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. నిబంధనలను తోసిరాజని వీరఘట్టానికి బదిలీ పార్వతీపురంలో ఏర్పాటు చేసిన ఒక బార్ను వీరఘట్టం పంచాయతీకి మార్చాలని టీడీపీ సిండికేట్ భావించింది. కానీ వీరఘట్టం పంచాయతీ పరిధిలో బార్ ఏర్పాటు చేసేందుకు నిబంధనలు అంగీకరించవు. ఇదే విషయాన్ని ఎకై ్సజ్శాఖ స్పష్టం చేసింది. అయినా సరే టీడీపీ సిండికేట్ రాజధాని స్థాయిలో పావులు కదిపింది. పార్వతీపురంలో ఉన్న బార్ను నిబంధనలకు విరుద్ధంగా నైనా సరే వీరఘట్టం పంచాయతీ పరిధిలోకి మార్చేందుకు ఏకంగా ఎకై ్సజ్శాఖ స్వయంగా ఉత్తర్వులు జారీ చేసేలా కథ నడిపించింది. టీడీపీ మద్యం సిండికేట్తో కుమ్మకై ్కన ఎకై ్సజ్శాఖ ఉన్నతాధికారులు ఈ అడ్డగోలు జీఓ జారీ చేశారని ఎకై ్సజ్శాఖ వర్గాలే విమర్శిస్తున్నాయి. పంచాయతీల్లో అసాంఘిక పరిస్థితులు ఏర్పడకుండా ఉండేందుకు, శాంతి భద్రతల పరిరక్షణకు బార్లు ఏర్పాటు చేయకూడదన్నది గతంలో తీసుకున్న నిబంధన. అయినా సరే ఆ నిబంధనలను ఉల్లంఘిస్తూ టీటీపీ మద్యం సిండికేట్ దోపిడీకి ప్రభుత్వం తలుపులు తెరచింది.దీనిపై వీరఘట్టం ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.బార్ ఏర్పాటును అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. పంచాయతీ పరిధిలోకి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న బార్ తరలింపు ఉత్తర్వులు జారీ చేసిన ఎకై ్సజ్ శాఖ అధికారులు బార్ ఏర్పాటును అడ్డుకుంటామంటున్న వీరఘట్టం ప్రజలు -
ఉసురు తీస్తున్న ఉపాధి
బొబ్బిలి: రాష్ట్రాలు విడిచి వచ్చి ఉపాధి కోసం బొబ్బిలిలోని గ్రోత్ సెంటర్లో పనిచేస్తున్న కార్మికులకు సౌకర్యాలు, వేతనాల కన్నా యజమానుల నిర్లక్ష్యం వల్ల వారి ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. చుట్టుపక్కల ఎంత మంది నిరుద్యోగులున్నా గతంలో జీఓలు విడుదల చేసినప్పటికీ స్థానికులను యాజమాన్యాలు చేర్చుకోవడం లేదు. గ్రోత్ సెంటర్లో ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకువస్తున్నారు. అదేవిధంగా వివిధ స్కిల్డ్, అన్స్కిల్డ్ తో పాటు ఉన్నతోద్యోగాలు చేసేవారు కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారు. వారైతే తక్కువ వేతనం, ప్రమాదాలు జరిగినా అంతదూరం నుంచి వచ్చి అల్లరి చేయరు. పైగా 10 గంటల నుంచి 12 గంటల వరకూ పనిచేయించుకోవచ్చు. ఏమైనా అయితే కంపెనీలకు నచ్చినంత పరిహారం ఇచ్చినా గమ్మునుంటారనే తీరు గ్రోత్సెంటర్లో నడుస్తోంది. స్థానిక గురుదత్త కంపెనీలో మంగళవారం మృతి చెందిన బికాస్ అనే యువకుడికి ఎంతో భవిష్యత్తున్నప్పటికీ చిన్నతనంలోనే ఇక్కడ జరిగిన ప్రమాదంలో మృతి చెంది కుటుంబ సభ్యులను అనాథలను చేయడంలో అధికారులు, యజమానుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. బెర్రీలో ఐదుగురు ఒకేసారి బెర్రీ ఫెర్రో ఎల్లాయీస్లో నాలుగేళ్ల క్రితం ఇరుకు గదిలో ఉంటున్న 14 మంది గ్యాస్ సిలిండర్ పేలి ఐదుగురు బీహార్కు చెందిన యువకులే కాలిన గాయాలతో మృతి చెందారు. అలాగే ఇక్కడున్నపెట్రోల్ బంకులో ముగ్గురు మృతి చెందారు. ఫర్నేస్ కాలిపోయి బాలాజీ కంపెనీలో నలుగురు మృతి చెందారు. సుమారు 12 సంవత్సరాల క్రితం సంక్రాంతి సమయంలో జరిగిన బెర్రీ కంపెనీ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ.లక్ష చొప్పున దహన సంస్కారాలకు, పరిహారం కింద ఏడు లక్షలు చొప్పున పరిహారం ముట్టజెప్పారు. అదే గ్రోత్ సెంటర్లో ప్రమాదాల వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు అందించిన అత్యధిక పరిహారమంటే ఆశ్చర్యం లేదు. ఇప్పుడు కూడా ఎవరైనా మృతిచెందితే రూ.2లక్షల నుంచి రూ.నాలుగు లక్షల వరకు పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. వీరు కాక గ్రోత్ సెంటర్లోని పలు పరిశ్రమల్లో ఇప్పటివరకూ దాదాపు 20 నుంచి 30 మంది ప్రాణాలు విడిచి ఉంటారని కార్మికులే చెబుతున్నారు. గ్రోత్సెంటర్లో పరిశ్రమల కన్నా యజమానుల నిర్లక్ష్యమే అధికం తక్కువ వేతనంతో ఎక్కువ పని.. మృతి చెందితే సెటిల్మెంట్లు ఇక్కడ పనిలో బిహార్, ఎంపీ ప్రాంతాల వారురక్షణ లేదు.రక్షణ పరికరాలివ్వరు ఇక్కడి కంపెనీల్లో పనిచేసే కార్మికులకు కనీస సౌకర్యాలు లేకపోవడంతోపాటు రక్షణ పరికరాలు ఉండడం లేదు. దీంతో ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేసే వారు మృత్యువాత పడుతున్నారు. కంపెనీల భవనాలు కూడా నాణ్యత లేకుండా ఉంటున్నాయి. కొన్నాళ్ల క్రితం ఓ కంపెనీ గోడ కూలి మేకల పెంపకదార్లు ఇద్దరు మృతి చెందారు. కంపెనీలపై కేసులుండడం లేదు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు సెటిల్మెంట్లు చేస్తున్నారే తప్ప కేసులు ఉండడం లేదు. దీని వల్ల కార్మిక శాఖ, కంపెనీల తరపున రావాల్సిన నాణ్యమైన పరిహారం ఆయా కుటుంబాలకు అందడం లేదు. పైగా మధ్యవర్తులు తలదూర్చి డబ్బులు చేతులు మారుతున్నాయి. దీని వలన ఆయా కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో వారి రక్తసంబంధీకులను ఇక్కడే దహనం చేసి కన్నీళ్లతో తిరిగి వెళ్లిపోతున్నారు. కంపెనీలపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. సోరు సాంబయ్య, అంబేడ్కర్ పోరాట సమితి, బొబ్బిలి ఎదిరించి అడిగితే ముడుపులు ఇచ్చి కామ్ చేస్తారు గ్రోత్ సెంటర్ కార్మికులకు అసౌకర్యాలున్నాయని, భద్రత లేదని, ఇరుకు గదుల్లో పెట్టి ఉంచుతున్నారని ప్రశ్నించిన వారికి ముడుపులు ఇచ్చి కామ్ చేస్తున్నారు. ఏపీఐఐసీ ఎం.డి కాని, స్థానిక పాలకులు కాని ఏనాడైనా గ్రోత్సెంటర్లోని పరిశ్రమలు, సౌకర్యాలపై ఆరా తీశారా? ప్రెస్మీట్లు పెట్టారా? అంటే అదీ లేదు. మరి కంపెనీల యాజమాన్యాలు నిర్లక్ష్యం ఎందుకు వీడుతాయి.? పొట్నూరు శంకర రావుఅధికారులెవరూ ఉండరు గ్రోత్ సెంటర్లో పరిపాలన భవనం దాదాపు ఓ కలెక్టరేట్ను తలపిస్తుంది. కానీ ఇక్కడ అధికారులు ఎవరూ ఉండడం లేదు. ఓ కంప్యూటర్ ఆపరేటర్, వాచ్మన్ మాత్రమే ఉంటారు. వారానికో రెండు వారాలకో వచ్చే అధికారులు ఓ సారి తూతూమంత్రంగా పరిశీలించి వెళ్లిపోతున్నారు. అత్యవసరంగా అధికారుల అవసరం ఉందంటే విజయనగరం లేదా శ్రీకాకుళం వెళ్లాల్సి ఉంటుంది. -
నేడు జాతీయ చేనేత దినోత్సవం
విజయనగరం గంటస్తంభం: జాతీయ చేనేత దినోత్సవాన్ని శుక్రవారం జిల్లాలో ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకురాలు వి.పద్మ తెలిపారు. ఉదయం 10 గంటలకు మహారాజా ప్రభుత్వ ఆస్పత్రి నుంచి కలెక్టరేట్ ఆడిటోరియం వరకు హ్యాండ్లూమ్ వాక్ నిర్వహించి, అనంతరం చేనేత దినోత్సవ సభ జరపనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా చేనేత వస్త్రాల ప్రదర్మనతో పాటు సీనియర్ చేనేత కార్మికులను సత్కరించనున్నామన్నారు. మై హ్యాండ్లూమ్..మై ప్రైడ్ నినాదంతో చేనేత వస్త్రాలను వినియోగించి చేనేతకు చేయూతనివ్వాలని ఆమె పిలుపునిచ్చారు. అవగాహనతోనే రోడ్డు ప్రమాదాల నియంత్రణ ● ఎస్సీ ఏఆర్ దామోదర్ విజయనగరం టౌన్: రహదారి భద్రత పట్ల అవగాహన, ఆచరణతోనే ప్రమాదాల నియంత్రణ సాధ్యమవుతుందని ఎస్పీ ఏఆర్.దామోదర్ స్పష్టం చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ 2026లో ఇప్పటివరకూ మోటారు వెహికల్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 20,138 ఈ–చలానాలను విధించామన్నారు. వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని, హెల్మెట్లను విధిగా ధరించాలని కోరారు. ప్రతిరోజూ డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టి కేసులు నమోదు చేస్తున్నట్టు తెలిపారు. భామిని: ఏనుగుల దాడిలో ఆస్తులు కోల్పోయిన బాధితులందరికీ తగిన పరిహారం అందించనున్నట్లు జిల్లా అటవీశాఖాదికారి జీఏపీ ప్రసూన గురువారం తెలిపారు. ఈ మేరకు భామిని మండలం పాలవలస గిరిజన గ్రామంలో నాలుగు ఏనుగుల దాడిలో సర్వం కోల్పోయిన గిరిజన బాధితులను ఆమె కలిసి ఓదార్చారు. నష్టాలనుంచి బయట పడడానికి నింబంధనల మేరకు సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. తమ గ్రామంలో తిష్ఠ వేసిన ఏనుగుల గుంపు తరలింపుపై బాధిత గిరిజనులు ఆమెకు మొర పెట్టుకున్నారు. తమ ప్రాణాలకు ఎప్పుడైనా ముప్పు వాటిల్లుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. డీఎఫ్ఓ ప్రసూన వెంట సబ్ డీఎఫ్ఓ సంజయ్ ఎల్లా, ఎఫ్ఆర్ఓ మణికంఠేష్, ఎఫ్ఎస్ఓ రామకృష్ణ, ఎఫ్బీఓ కేశవరావు, ట్రాకర్స్ ఉన్నారు. -
దుప్పాడలోని భూమి దేవదాయ శాఖదే
● ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు ● అసిస్టెంట్ కమిషనర్ శిరీష హెచ్చరికవిజయనగరం క్రైమ్: మండల పరిధిలోని దుప్పాడలో ఉన్న 4 ఎకరాల 62 సెంట్ల భూమి దేవదాయ శాఖకు చెందిందని దేవదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ శిరీష బుధవారం స్పష్టం చేశారు. సదరు భూమిని కొందరు కంచె వేసి ఆక్రమించుకున్నారని ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఫిర్యాదు రావడంతో, కలెక్టర్ ఆదేశాల మేరకు వన్ టౌన్ పోలీసుల సహాయంతో ఆ స్థలాన్ని నేరుగా పరిశీలించినట్లు ఆమె తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఈ స్థలం దుప్పాడ గ్రామస్తుల సంక్షేమానికి ఉద్దేశించినదని, గ్రామస్తులు మినహా వేరెవరైనా ఈ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆక్రమణలను తొలగించి, సదరు స్థలంలో రామాలయం నిర్మించాలని దుప్పాడ గ్రామస్తులు నిర్ణయించారని.. వారి నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. -
కుళ్లిన కోడిగుడ్ల కలకలం!
మోడల్ స్కూల్లో● మధ్యాహ్న భోజనంలో దారుణం ● నిర్వాహకుల ఆగ్రహం ● కాంట్రాక్టర్లపై చర్యలకు డిమాండ్ విజయనగరం: పాఠశాలల్లో పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం మళ్లీ బయటపడింది. విజయనగరంలోని పూల్బాగ్ ఏపీ మోడల్ పాఠశాలలో సరఫరా చేసిన కోడిగుడ్లు కుళ్లిపోయి ఉండటం బుధవారం తీవ్ర కలకలానికి దారితీసింది. పాఠశాలలో విద్యార్థులకు వడ్డించేందుకు సిద్ధం చేసిన గుడ్ల స్టాక్ను పరిశీలించగా, అందులో ఎక్కువ గుడ్లు కుళ్లిపోయి తీవ్ర దుర్వాసన వస్తున్నట్లు భోజన నిర్వాహకులు గుర్తించారు. ఉడకబెట్టిన తర్వాత గుడ్లు రంగు మారి, నాణ్యత లేకుండా ఉండటంతో నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యంతో ఆడుకుంటున్న బాధ్యతారహిత కాంట్రాక్టర్లపై, పర్యవేక్షణ లోపించిన సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. -
ఆదాయవృద్ధికి పకడ్బందీ చర్యలు : కలెక్టర్
విజయనగరం గంటస్తంభం: ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని పెంచేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో వివిధ ఆదాయ సముపార్జన శాఖల అధికారులతో ఆయన బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ లక్ష్యాలను సాధించడంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని, నిర్దేశిత లక్ష్యాలను కచ్చితంగా అధిగమించాలని స్పష్టం చేశారు. శాఖల వారీగా వసూళ్ల పురోగతిని సమీక్షించి, ఆదాయాన్ని పెంచాలని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా రిజిస్ట్రార్ ఎస్.మోహన్రావు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మణికుమార్, భూగర్భ గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ సూర్యచంద్రరావు, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనాథుడు, జీఎస్టీవో శివరావు తదితరులు పాల్గొని తమ శాఖల ద్వారా సమకూరుతున్న ఆదాయ వివరాలను కలెక్టర్కు వివరించారు. జిల్లాలో జలశక్తి అభియాన్ పథకం అమలు, వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ చాంబర్లో జిల్లా అధికారులతో బుధవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ రంగ పరిస్థితులు, వర్షాధార భూములకు సాగునీరు అందించేందుకు కార్యాచరణ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. జిల్లాలో జరుగుతున్న జలశక్తి – జలహారతి పనులపై సమీక్షించారు. భూగర్భ జల మట్టాలను మరింతగా పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, నీటి వనరుల పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని తెలిపారు. ఉద్యాన పంటల సాగు విస్తరణకు తగిన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో సీపీఓ పి.బాలాజీ, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు వి.తారకరామారావు, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్.శారదాదేవి, ఇరిగేషన్ ఈఈ గోవిందరావు, భూగర్భ జల శాఖ డిప్యూటీ డైరెక్టర్ దినకర్ తదితర అధికారులు పాల్గొన్నారు. -
10,645 హెక్టార్లకే వరి పరిమితం
విజయనగరం మండలం జొన్నవలసలో నారుమడిని ట్యాంకర్ల నీటితో తడుపుతున్న రైతులు విజయనగరం ఫోర్ట్: జిల్లాలో ప్రధాన ఆహార పంట వరి సాగు ప్రశ్నార్ధకంగా మారింది. ఖరీఫ్ సీజన్లో సాగయ్యే పంటల్లో అధిక శాతం సాగయ్యేది వరి పంటే. ఎలినినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో వరితో పాటు మిగతా పంటలు కూడా సాగయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఎలినినో ప్రభావం క్రమేణ తీవ్రమవుతుండడంతో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. వరి పంట వేయొద్దని చంద్రబాబు ప్రభుత్వం చెబుతుండడంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. ఆహార పంట పండించకపోతే ఎలాగని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం చెబుతున్నట్టు రైతులు ఆ దిశగా అడుగులు వేస్తే ఆహార సంక్షోభం తప్పదని వారు పేర్కొంటున్నారు. ఎలినినో ప్రభావం అన్ని పంటల సాగుపై కనిపిస్తుంది. జిల్లాలో అధిక శాతం పంటల సాగు వర్షాధారంపైనే ఆధారపడి ఉంది. వర్షాభావం వల్ల చెరువులు, గుంతలు ఎండిపోయాయి. ఉన్న కొద్దిపాటి నీటిని ఆయిల్ ఇంజిన్లు, ట్యాంకర్ల ద్వారా తోడయ్యేడంతో అవి కూడా ఎండిపోయాయి. మరోవైపు భూగర్భ జలాలపై కూడా ఎలినినో ప్రభావం పడుతోంది. గతంలో కరువు పరిస్థితులు వచ్చినా ఇంత దారుణ పరిస్థితులు లేవని రైతులు చెబుతున్నారు. కనీసం 40 నుంచి 50 శాతం వరకు పంటలు చేతికొచ్చేవని గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదని, కనీసం పది శాతం పంటలు కూడా వచ్చేలా లేవని, ముఖ్యంగా వరి పంట పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో వరికి ప్రత్యామ్నాయంగా 26,253 హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటల కోసం వ్యవసాయ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకోసం 6,415 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. మినుము పంట 13,570 హెక్టార్లకుగాను 2,996 క్వింటాళ్ల విత్తనాలు, పెసర పంట 9,576 హెక్టార్లకుగాను 2023 కింటాళ్ల విత్తనాలు, చోటి 1161 హెక్టార్లకుగాను 83 క్వింటాళ్ల విత్తనాలు, మొక్కజొన్న 1805 హెక్టార్లకుగాను 775 క్వింటాళ్లు విత్తనాలు, వేరుశనగ 205 హెక్టార్లకుగాను 455 క్వింటాళ్లు, ఉలవ పంట 206 హెక్టార్లకుగాను 83 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ప్రభుత్వం వరి సాగు చేయవద్దని చెప్పడంతో దళారులు, మిలర్లు గతంలో వారు కొనుగోలు చేసిన ధాన్యాన్ని బ్లాక్ చేస్తున్నారు. కృత్రిమ కొరత సృష్టించడం వల్ల నిత్యావసర ధరలు బాగా పెరిగిపోయాయి. బియ్యం, వంట నూనెలు, పంచదార ఇలా అన్ని ధరలు పెరిగిపోయాయి. సాంబమసూరి 25 కేజీల బస్తా కు రూ.200 నుంచి 250 వరకు పెరిగింది. రిఫైండ్ ఆయిల్ ధర రూ.190కు చేరింది. పంచదార రూ.50 దాటింది. కందిపప్పు రూ.135 నుంచి రూ.140కు చేరింది. ప్రత్యామ్నాయ ప్రణాళిక ఎలినినో ప్రభావం నేపథ్యంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వరికి ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను సిద్ధం చేశాం. 26,523 హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. – వి.టి.రామారావు, జిల్లా వ్యవసాయ అధికారిధాన్యాన్ని బ్లాక్ చేస్తున్న మిల్లర్లు, దళారీలు జిల్లాలో వరి పంట సాగు గణనీయంగా తగ్గిపోయింది. వరి పంట సాధారణ విస్తీర్ణం 1,00,251 హెకార్లు కాగా కేవలం 10,645 హెక్టార్లకే సాగు పరిమితమైంది. ఇందులో కూడా 9787 హెక్టార్లలో వెద పద్ధతిలో సాగు చేసిందే కావడం గమనార్హం. 858 హెక్టార్లు మాత్రమే నాట్లు వేసింది. మిగిలిన పంటల పరిస్థితి కూడా అలానే ఉంది. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో అన్ని పంటల సాధారణ విస్తీర్ణం 1,23,608 హెక్టార్లు. ఇప్పటి వరకు సాగైంది కేవలం 24,294 హెక్టార్లు మాత్రమే. జిల్లాలో 10,645 హెక్టార్లకే వరి సాగు పరిమితం వరి సాధారణ విస్తీర్ణం 1,00,251 హెక్టార్లు ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేసిన వ్యవసాయ శాఖ -
ఒక మలుపు.. రెండు ప్రాణాలు
● బీచ్ రోడ్డులో ఘోర ప్రమాదం ● ఇద్దరి దుర్మరణం, మరో వ్యక్తికి గాయాలు కొమ్మాది: ఆ పేద కుటుంబంలో పిల్లలను ప్రయోజకులను చేయాలన్న ఆ తల్లి ఆశలు బీచ్రోడ్డు ప్రమాదంలో చిధ్రమయ్యాయి. స్నేహితులను కలిసి సంతోషంగా ఊరికి తిరుగుపయనమైన యువకుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. కారు డ్రైవర్ చేసిన తప్పు.. రెండు కుటుంబాల్లో కోలుకోలేని విషాదాన్ని నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా జామికి చెందిన ఎం.పుష్పారావు, గ్రంధి సూరి బుధవారం ఉదయం విశాఖలోని మిత్రులను కలిసేందుకు వచ్చారు. రోజంతా సరదాగా గడిపి, సాయంత్రం బైక్పై స్వగ్రామానికి తిరుగుపయనమయ్యారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో.. బీచ్రోడ్డు మీదుగా వెళ్తుండగా తిమ్మాపురం జంక్షన్ వద్ద నగరం వైపు నుంచి వస్తున్న రాజమండ్రికి చెందిన నాగేశ్వరరావు కారును ఒక్కసారిగా ఎడమవైపునకు తిప్పేశాడు. దాంతో వెనుక నుంచి వస్తున్న బైక్ అదుపుతప్పి కారును బలంగా ఢీకొట్టి, అక్కడే ఉన్న సీసీ కెమెరా స్తంభాన్ని, ఆపై రోడ్డు దాటేందుకు నిలబడి ఉన్న కాసరపు కృష్ణవేణిపైకి దూసుకుపోయింది. ఈ దారుణ ఘటనలో బైక్ వెనుక కూర్చున్న యువకుడు సూరి తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. బైక్ నడుపుతున్న పుష్పారావు అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పిల్లల చదువుల కోసం వెళ్తూ.. జీవీఎంసీ 4వ వార్డు పరిధిలోని తిమ్మాపురానికి చెందిన కాసరపు కృష్ణవేణి (43) దిగువ మధ్యతరగతి గృహిణి. భర్త ధనరాజు క్యాబ్ డ్రైవర్గా పని చేస్తుండగా.. కొడుకు చాణుక్య ఐటీఐ, కూతురు మీనాక్షి 8వ తరగతి చదువుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా పిల్లలను గొప్పగా చదివించుకోవాలన్న ఆరాటంతో కృష్ణవేణి రుషికొండలోని ఒక హోటల్లో పనికి వెళుతున్నారు. బుధవారం సాయంత్రం డ్యూటీకి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా మృత్యువు బైక్ రూపంలో కబళించింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ కన్ను మూసింది. అమ్మ లేదని తెలిసి ఆ పిల్లలు కన్నీరుమున్నీరవుతున్న తీరు స్థానికులను తీవ్రంగా కలచివేసింది. ఈ ప్రమాదానికి రాజమండ్రికి చెందిన కారు డ్రైవర్ నాగేశ్వరరావు అతివేగం, నిర్లక్ష్యమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎస్సై లీలాదిత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
యువత పక్షాన వైఎస్సార్సీపీ పోరాటం
చీపురుపల్లి: యువత, నిరుద్యోగులకు టీడీపీ ప్రభుత్వం చేస్తున్న మోసాలపై యువత పక్షాన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ పోరాడుతుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. గరివిడిలోని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ క్యాంప్ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెగా డీఎస్సీ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగులను దగా చేసిందన్నారు. డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటాకు సంబంధించి నకిలీ ధ్రువపత్రాలు సమర్పించిన టీడీపీ అనుయాయులకు, డబ్బులు ఇచ్చిన వారిని అడ్డగోలుగా ఉద్యోగాలకు ఎంపిక చేశారన్నారు. జిల్లాలో 10 మందికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వచ్చాయని అందులో ఒక్కరికీ కూడా అర్హత లేదన్నారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. రాష్ట్రంలో 14 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చంద్రబాబు, లోకేష్ ఆటలాడుకున్నారన్నారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల వైజాగ్ నుంచి రోడ్డు మార్గంలో శ్రీకాకుళం వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనను ప్రభుత్వం ఎంతగా అడ్డుకోవాలని చూసినా ఆయన వెంట వచ్చిన జన ప్రభంజనం చూస్తే 2029లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టమైందన్నారు. జిల్లాలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరాహార దీక్షలు డీఎస్సీ నియామకాల్లో అవినీతి, అక్రమాలకు సంబంధించి విద్యా శాఖ మంత్రి లోకేష్ రాజీనామా, సీబీఐ విచారణతో పాటు నిరుద్యోగులకు భృతి, ఫీజు రీయింబర్సుమెంట్ నిధులు విడుదల డిమాండ్లతో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నాలుగు రోజులు రిలే నిరాహార దీక్షలు ద్వారా నిరసన చేపట్టనున్నట్లు చెప్పారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ ఈ నెల 6న గురువారం నుంచి 9వ తేదీ వరకు రిలే నిరహార దీక్షలు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రతీ రోజు నియోజకవర్గ కేంద్రంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిలే నిరహార దీక్షలు చేయాలన్నారు. అనంతరం ఈ నెల 10న నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ, పీఏసీ మెంబర్ బెల్లాన చంద్రశేఖర్, బొత్స అనూష, నియోజకవర్గ పరిశీలకులు శోభా స్వాతిరాణి తదితరులు పాల్గొన్నారు. మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీ టీడీపీ అనుయాయులకు, డబ్బులిచ్చిన వారికి ఉద్యోగాలు నిరసనగా నేటి నుంచి నాలుగు రోజులు జిల్లాలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరాహార దీక్షలు లోకేష్ రాజీనామా చేయాలి, సీబీఐతో విచారణ జరిపించాలి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు -
విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు
● సైనిక పాఠశాల ప్రిన్సిపాల్ కెప్టెన్ ఎస్ఎస్ శాస్త్రివిజయనగరం రూరల్: విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని కోరుకొండ సైనిక పాఠశాల ప్రిన్సిపాల్ కెప్టెన్ ఎస్.ఎస్.శాస్త్రి అన్నారు. పాఠశాల ఇన్వెస్టిచర్ మహోత్సవాన్ని సైనిక పాఠశాలలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని వివిధ హౌస్లకు విద్యార్థి నాయకుల నియామకాలను చేపట్టి, వారికి ర్యాంక్ బ్యాడ్జీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్ధేశించి మాట్లాడు తూ.. క్రమశిక్షణ, అంకితభావం, నిబద్ధతతోనే ఉన్నత స్థాయికి చేరుకోగలమన్నారు. ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలిచి తమ నాయకత్వ పటిమను పెంపొందించుకోవాలన్నారు. అనంతరం పాఠశాల వార్షిక మ్యాగజైన్ ‘సైకోరియన్’ను ప్రిన్సిపాల్తో పాటు ఆయన సతీమణి రిచాశాస్త్రి ఆవిష్కరించారు. అలాగే 2025 – 26 సంవత్సరానికి ఎన్డీఏ ట్రోఫీని గజపతి హౌస్కు అందించగా, మొఘల్ హౌస్ చాంపియన్స్ ఆఫ్ ఛాంపియన్స్ కాక్ హౌస్ బ్యానర్ను కై వసం చేసుకోగా, హౌస్మాస్టర్ కేవీ రవికుమార్కు ట్రోఫీని అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. ఎల్ఐసీ ఉద్యోగుల నిరసనవిజయనగరం క్రైమ్: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)లో కేంద్ర ప్రభుత్వం తన వాటాలను మరింత విక్రయించాలని తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ (ఎల్ఐసీఈయూ) ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన తెలిపారు. బుధవారం స్థానిక ట్యాంక్ బండ్ రోడ్డులోని ఎల్ఐసీ కార్యాలయం వద్ద లంచ్ అవర్లో నిర్వహించిన కార్యక్రమంలో సుమారు 30 మంది ఉద్యోగులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకుడు శరత్కుమార్ మాట్లాడుతూ.. ఈ నెల 3న కేంద్ర ప్రభుత్వం ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ఎల్ఐసీ ఈక్విటీలో 2.5 శాతం వాటాలను విక్రయిస్తామని ప్రకటించిందని తెలిపారు. దీని ప్రకారం మొత్తం విక్రయం విలువ 6.5 శాతానికి చేరుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగాలను బలోపేతం చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇలా చేయడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ప్రైవేటీకరణ విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. -
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయండి
విజయనగరం గంటస్తంభం: పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీని పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో రెవెన్యూ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని, తొలుత భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ విజయవంతానికి కృషి చేసిన అధికారులు, సిబ్బందిని అభినందించారు. అనంతరం భూముల రీసర్వే, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, 22–ఎ దరఖాస్తులు, రెవెన్యూ వన్, పీజీఆర్ఎస్ వినతుల పరిష్కారం వంటి వాటిపై సమీక్షించారు. ఆగస్టు నెలకు సంబంధించి పట్టాదారు పాసుపుస్తకాలను మూడు రోజుల్లోగా పంపిణీ చేయాలని, సెప్టెంబరు నెలాఖరులోపు 50 గ్రామాల్లో భూముల రీసర్వే పూర్తి కావాలని, ఫేజ్–3లో పెండింగ్లోని పాస్పుస్తకాల పంపిణీని కూడా వెంటనే చేపట్టాలన్నారు. ప్రజాసమస్యలను పరిష్కరించాలి.. జీవో నంబరు 444 కింద వీఆర్వో, ఎంపీడీవో లాగిన్లలో ఉన్న 22–ఎ దరఖాస్తులను ఈ నెలలోనే పరిష్కరించాలని, ఏ దరఖాస్తు పెండింగ్లో ఉండకూడదని అధికారులకు జేసీ స్పష్టంచేశారు. రెవెన్యూ వన్ స్కానింగ్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా ఐదో స్ధానంలో ఉందని, మిగిలిన ప్రక్రియను పూర్తి చేసి, మరింత మెరుగైన ర్యాంకు సాధించాలన్నారు. పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లకు వచ్చిన వినతులను సత్వరమే పరిష్కరించాలన్నారు. సమావేశానికి డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, సర్వే ఏడీ విజయ్కుమార్, ఆర్డీవోలు, తహసీల్దార్లు ఆన్లైన్లో హాజరయ్యారు. పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీని పూర్తి చేయాలి అధికారులతో సమీక్ష సమావేశంలో జేసీ ఎస్.సేతుమాధవన్ -
రెవెన్యూ వసూళ్లను ముమ్మరం చేయాలి
● వీడియో కాన్ఫరెన్స్లో ఆర్డీఎంఏ రవీంద్ర విజయనగరం అర్బన్: నగరంలో మున్సిపల్ రెవెన్యూ వసూళ్లను వేగవంతం చేయాలని రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (ఆర్డీఎంఏ) రవీంద్ర అధికారులు, సిబ్బందికి ఆదేశించారు. మంగళవారం ఆయన మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక మొత్తంలో పన్ను బకాయిలు ఉన్న వారి నుంచి వసూలు చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందడుగు వేయాలని స్పష్టం చేశారు. వివిధ అంశాలపై అధికారులకు దిశా నిర్దేశం చేస్తూ పలు కీలక సూచనలు అందించారు. వీడియో కాన్ఫరెన్స్లో విజయనగరం మున్సిపల్ కమిషనర్ బాలస్వామి, ప్రజారోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ రమణమూర్తి, రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు, టీపీఓ అప్పలరాజు, టీపీఎస్ అనిత, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, ఇతర విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్గా సుజాత విజయనగరం గంటస్తంభం: విజయనగరం కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్(ఎఫ్ఏసీ)గా టి.సుజాత మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు ఈమె అనకాపల్లి జిల్లాలో కార్మిక శాఖ సహాయ కమిషనర్గా విధులు నిర్వహించారు. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా విజయనగరానికి నియమితులయ్యారు. విజయనగరం కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్గా పని చేసిన ఎస్డీవీ ప్రసాదరావు పదవీ విరమణ చేయడంతో, ఆయన స్థానంలో టి.సుజాత బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా శాఖ అధికారులతో సమావేశమైన ఆమె, కార్మిక సంక్షేమానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలను సమర్ధవంతంగా అమలు చేయడంతో పాటు ప్రజలకు వేగవంతమైన సేవలు అందించేలా కృషి చేస్తామని తెలిపారు. శ్రీవారికి రూ. 5 లక్షల విరాళం రాజాం: పట్టణంలోని ఆదర్శనగర్కు చెందిన బాదం చంద్రశేఖర్ అనే భక్తుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.5 లక్షల విరాళం అందించి తన భక్తిని చాటుకున్నాడు. టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్రకి ఈ విరాళాన్ని మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ను టీటీడీ అధికారులు అభినందించి వెంకటేశ్వర స్వామి చిత్రపటంతో పాటు తీర్ధ ప్రసాదాలు అందించి సత్కరించారు. ఈ విరాళంతో భక్తులకు అన్నదానం చేయాలని భక్తుడు ఈ సందర్భంగా కోరాడు. 10న ఆశా వర్కర్ల చలో కలెక్టరేట్ విజయనగరం ఫోర్ట్: ఆశా వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని, గ్రూప్ ఇన్సూరెన్సు రూ.10 లక్షలు, అర్హులైన వారికి ఏఎన్ఎంలుగా ప్రమోషన్లు ఇవ్వాలంటూ ఈ నెల 10న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఆ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు మహలక్ష్మి తెలిపారు. రాకోడు యూపీహెచ్సీ, అర్బన్ మెడికల్ ఆఫీసర్లకు మంగళవారం నోటీసు అందజేశారు. అనంతరం సంఘ నాయకులు మాట్లాడుతూ ఆశా వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని, రిటైర్డ్ బెనిఫిట్స్ తదితర డిమాండ్లపై ధర్నాలో పాల్గొంటున్నట్టు తెలిపారు. వినతిపత్రం అందజేసిన వారిలో నాగమ్మ, ఆదిలక్ష్మి, మంగమ్మ, అప్పయమ్మ తదితరులు పాల్గొన్నారు. -
బ్లేడ్తో గొంతు కోసుకొని..
● వంగర పోలీస్స్టేషన్ వద్ద తలగాం వాసి ఆత్మహత్యాయత్నంవంగర: స్థానిక పోలీస్స్టేషన్ వద్ద తలగాం గ్రామానికి చెందిన కిమిడి సునీల్ గొంతు కోసుకొని మంగళవారం ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఎస్ఐ షేక్ శంకర్ తెలిపిన వివరాలిలా.. కొన్నాళ్ల క్రితం సునీల్ ఎం.సీతారాంపురానికి చెందిన శ్రీలతను వివాహం చేసుకున్నాడు. భర్త సునీల్, అత్తమామలు కలిసి అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని శ్రీలత వంగర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె భర్త సునీల్తో పాటు ఆమె అత్తమామలపై కూడా కేసు నమోదు చేశామన్నారు. ఈ కేసులో భార్యాభర్తలకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ఇరువర్గాలను మంగళవారం పోలీస్స్టేషన్కు పిలిపించగా ఇరువర్గాలకు కౌన్సిలింగ్ ఇస్తుండగా ఈ కేసులో పోలీసులు తమకు అన్యాయం చేస్తున్నారంటూ స్టేషన్లోనే సునీల్ బ్లేడుతో గొంతు, చేయి భాగం కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బంధువులు అతడిని రాజాంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల వేధింపుల తాళ లేకనే సునీల్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు బంధువుల ఆరోపణ. -
ఇబ్బందులకు గురవుతున్నారు..
డీఎస్సీ అమలు నాటి నుంచి కాకుండా మధ్యలో ఇలాంటి నిబంధన తెరపైకి తీసుకురావడం సరైంది కాదు. దీని వల్ల ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురవుతారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం 2011కు ముందు టెట్ అమలులో లేదు. ఉపాధ్యాయులు తప్పనిపరిగా టెట్ పరీక్ష రాసి ఉత్తర్ణత సాధించాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తే బాగుండేది. ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. – జేసీ రాజు, ఏపీటీఎఫ్ రాష్ట్ర అకడమిక్ కన్వీనర్, బొబ్బిలి -
యువ గుండెకు ఏమైంది?
యువత గుండె అకస్మాత్తుగా ఆగిపోతోంది..దృఢంగా ఉన్న వారు సైతం కుప్పకూలిపోతున్నారు. క్షణాల్లో గుండెపోటు బారినపడి ప్రాణాలు విడుస్తున్నారు. ఇటీవల గుండెపోటు మరణాల్లో యువత సంఖ్య అధికంగా ఉండడం ఆందోళనకు గురిచేస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా జీవన విధానం, ఆహారపు అలవాట్లే హార్ట్ ఎటాక్కు కారణం కాగా జీవనశైలిలో స్వల్ప మార్పులు చేసుకుంటే హృదయాన్ని పదిలంగా ఉంచుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.విజయనగరం ఫోర్ట్: విజయనగరం మండలానికి చెందిన లక్ష్మి అనే 35 ఏళ్ల మహిళ గుండెపోటుకు గురికావడంతో బంధువులు వెంటనే జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఇదిలా ఉంటే ఇదే విజయనగరానికి చెందిన గోపి అనే 34 ఏళ్ల వ్యక్తి కొద్దిరోజుల క్రితం ఉదయం 9 గంటల సమయంలో గుండెపోటు బారినపడ్డాడు. బంధువులు అప్రమత్తమై విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వారం రోజుల పాటు చికిత్స అనంతరం డిశార్జ్ అయ్యారు. హార్ట్ఎటాక్ లక్షణాలు ఇవీ.. గుండెపోటుకు గురైన సమయంలో ఛాతిలో నొప్పి విపరీతంగా ఉంటుంది. అలాగే ఎక్కువగా చెమట పడుతుంది. వాంతులు వచ్చే భావన కలుగుతుంది. ఒక్కోసారి వాంతి కూడా అవుతుంది. కళ్లు బైర్లు కమ్ముతాయి. కాళ్లూ చేతులు చల్లబడతాయి. గుండె ఆగి ఆగి కొట్టుకున్నట్లు అనిపిస్తుంది. ఛాతిలో అసౌకర్యంగా ఉన్నా ఏదో బరువు ఛాతిపై పెట్టినట్లు అనిపిస్తున్నా..శ్వాస ఆడడానికి ఇబ్బందిగా ఉన్నా అది గుండెపోటు సూచనగానే భావించాలి. ఛాతిలో వచ్చిన నొప్పి.. ఎడమ చేయి భుజంలోకి పాకుతున్నా, విపరీతంగా చెమట వస్తున్నా హార్ట్ ఎటాక్గానే అనుమానించాలి. కింద దవడ నుంచి బొడ్డు వరకు ఎక్కడ నొప్పి అనిపించినా గుండెజబ్బుగా భావించి వెంటనే వైద్యులను సంప్రదించాలి. గుండెపోటుకు గురవుతున్న యువత పెరుగుతున్న ఆకస్మిక మరణాలు జీవనశైలిలో స్వల్ప మార్పులతో హృదయం పదిలం: వైద్య నిపుణులు అంతా 25 నుంచి 35 ఏళ్లలోపు వారే.. జిల్లాలో తక్కువ వయసులో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య ఇటీవల ఎక్కువగా కనిపిస్తోంది. గతంలో 50 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు గుండెపోటుకు గురియ్యేవారు. ప్రస్తుతం 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు వారు అధికంగా గుండె జబ్బుల బారినపడుతున్నారు. గతంలో పౌష్టికాహార విలువలు ఉన్న ఆహారాన్ని తినేవారు. ఇప్పుడు పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఫాస్ట్ఫుడ్, జంక్ఫుడ్కు అలవాటు పడుతున్నారు. ఫలితంగా శరీరంలో కొవ్వు శాతం పెరిగి హార్ట్ ఎటాక్(గుండెపోటు)కు గురవుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. -
పనసవలస విద్యార్థికి గోల్డ్ మెడల్
రేగిడి: మండలంలోని పారంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి కడగల కార్తీక్కు రాష్ట్రస్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్(స్వర్ణ పతకం) లభించినట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి.సునీత ఓ ప్రకటనలో మంగళవారం తెలిపారు. ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి రన్నింగ్, షూటింగ్, స్విమ్మింగ్ విభాగాల్లో విద్యార్థి పాల్గొని, విశేష ప్రతిభ కనబరచడంతో స్వర్ణ పతకం వరించిందన్నారు. ఇదిలా ఉంటే ఇటీవల గుజరాత్లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లోనూ రాణించి, ఐదో స్థానంలో నిలిచాడని పేర్కొన్నారు. ఈ మేరకు పాఠశాల సిబ్బంది, తోటి విద్యార్థులంతా సదరు విద్యార్థిని అభినందించారు. అదనపు ఎస్పీ పరిశీలన సీతానగరం: మండల కేంద్రంలోని మెయిన్రోడ్డును ఆనుకుని ఉన్న వక్కలగడ్డ సురేష్ ఇంట్లో ఇటీవల చోరీ జరిగి బంగారు ఆభరణాలు అపహరణకు గురికాగా ఆ ఇంటిని జిల్లా అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు మంగళవారం సాయంత్రం పరిశీలించారు. చోరీ జరిగిన తీరును ఇంటి యజమానిని అడిగి తెలుసుకున్నారు. నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తామని, నిత్యం జనసంచారం ఉండే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే నేరస్తులను సులభంగా పట్టుకోవచ్చన్నారు. ఆయన వెంట ఎస్ఐ హేమలత తదితరులు ఉన్నారు. ‘హోటల్ మేనేజ్మెంట్’లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానంవిజయనగరం క్రైమ్: హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా టూరిజం ఇన్చార్జ్ శివరామకృష్ణ ఓ ప్రకటనలో మంగళవారం తెలిపారు. కేంద్ర, రాష్ట్ర పర్యాటక శాఖలు సంయుక్తంగా తిరుపతిలోని స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కేటరింగ్ టెక్నాలజీ, అప్లైడ్ న్యూట్రిషన్ సంస్థలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను వివిధ కోర్సులకు దరఖాస్తులు కోరుతున్నట్లు స్పష్టం చేశారు. బీఎస్సీ(హెచ్హెచ్ఏ) మూడేళ్ల కోర్సుకు ఇంటర్మీడియట్లో కనీసం 40 శాతం మార్కులు సాధించిన వారు అర్హులన్నారు. క్రాఫ్ట్ కోర్సుకు పదో తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీస్కు ఆరు నెలల సర్టిఫికెట్ కోర్సు అందుబాటులో ఉందని, ఈ కోర్సులో ప్రవేశానికి ఎటువంటి వయోపరిమితి లేదన్నారు. ఆయా కోర్సులు పూర్తి చేసిన వారికి ఏపీ పర్యాటక హోటళ్లు, ఫైవ్స్టార్ హోటళ్లలో ఉద్యోగావకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు బ్యాంకు లోన్ సదుపాయం ఉంటుందని, బాలబాలికలకు వేర్వేరుగా వసతి సదుపాయం కల్పించడం జరుగుతుందన్నారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 10వ తేదీలోపు దరఖాస్తులను కళాశాలకు అందజేయాలని, మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్లు 9701343846, 9100558006, 9700440604లను సంప్రదించాలని కోరారు. ఆరుతడి పంటల సాగుపై దృష్టిసారించాలి● జిల్లా వ్యవసాయాధికారి టి.భవానీశంకర్పార్వతీపురం రూరల్: ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి, వరినాట్లకు నీటి కొరత ఏర్పడిందని, రైతులు తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి టి.భవానీ శంకర్ ఓ ప్రకటనలో మంగళవారం సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 28,883 హెక్టార్లలో వివిధ పంటల సాగు జరుగుతోందని, ప్రస్తుతం నారుమడులు సిద్ధంగా ఉన్నప్పటికీ, దమ్ము చేసి వరినాట్లు(ఉభాలు) వేయడానికి తగినంత నీరు లేదన్నారు. ఎల్నినో వల్ల ఏర్పడిన ఈ వర్షాభావ పరిస్థితుల్లో రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టిసారించాలన్నారు. మెట్టు, కాలువ చివరి భూముల్లో రాగులు, కొరల్రు, మినుము, పెసర వంటి పంటలు వేసుకోవాలన్నారు. అనుమానాస్పదంగా వివాహిత మృతి విజయనగరం టౌన్: అనుమానాస్పదంగా ఓ మహిళ మృతి చెందిన విషాద ఘటన స్థానిక పట్టణంలోని కేఎల్ పురంలో మంగళవారం జరిగింది. ఒకటో పట్టణ పోలీస్స్టేషన్ సీఐ చౌదరి తెలిపిన వివరాలిలా ఉన్నాయి..కేఎల్ పురంలో నివాసం ఉంటున్న మేడపల్లి లావణ్య(31) ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోయిందని, ఆమె మరణానికి గల కారణాలు తెలియరాలేదన్నారు. మృతురాలి భర్త వృత్తి రీత్యా దుబాయ్లో ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతురాలి తల్లి రమణి ఫిర్యాదు మేరకు ఒకటో పట్టణ ఏఎస్ఐ రామలక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
ప్రాణాలను నిలబెట్టే అవయవదానం : ఎస్పీ
విజయనగరం టౌన్: మనిషి ప్రాణాలను నిలబెట్టే మహోన్నతమైన దానమే అవయవదానమని ఎస్పీ ఎఆర్.దామోదర్ పేర్కొన్నారు. అవయవదానంపై రూపొందించిన వాల్పోస్టర్లను జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక వ్యక్తి అవయవదానం చేయడం ద్వారా పలువురుకి పునర్జన్మ లభించే అవకాశం ఉంటుందన్నారు. మరణాంతరం కూడా ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపే గొప్ప దాతృత్వ కార్యమన్నారు. సమాజంలో అవయవదానంపై ఉన్న అపోహలను తొలగించి, శాసీ్త్రయ అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి కుటుంబం అవయవదానంపై సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకోవాలని, యువత, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, వైద్య సిబ్బంది ఈ అంశంపై ప్రజల్లో విస్త్రత ప్రచారం నిర్వహించాలన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడే ప్రతి కార్యక్రమానికి పోలీస్ శాఖ పూర్తి సహకారమందిస్తుందన్నారు. కార్యక్రమంలో అఖిల భారత శరీర అవయవదాతల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షిణగం శివాజీ, సంఘం జిల్లా అధ్యక్షుడు గెద్ద చిరంజీవి, సలహాదారు మమ్ముల తిరుపతిరావు, కోశాధికారి గొర్లె చిన్నమనాయుడు, కార్యవర్గ సభ్యులు డాక్టర్ లెంక రాణికుమారి తదితరులు పాల్గొన్నారు. -
గడువులోగా భూసేకరణ పూర్తి చేయాలి : జేసీ
విజయనగరం గంటస్తంభం: జిల్లాలో చేపట్టనున్న ప్రధాన అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి, ప్రభుత్వానికి సకాలంలో నివేదికలు సమర్పించాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ, సర్వే, ఇంజినీరింగ్ శాఖల అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆయన ప్రాజెక్టుల వారీగా భూసేకరణ పురోగతిని పరిశీలించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి నాలుగు లైన్ల రహదారి, ఓబెరాయ్–మేఫైర్ హోటళ్ల అనుసంధాన రహదారులు, పెందుర్తి–బౌడార ఎన్హెచ్–516బి, విజయనగరం–సంబల్పూర్, కొత్తవలస – విజయనగరం రైల్వే లేన్లు, తారకరామ తీర్థసాగరం, తోటపల్లి బ్యారేజ్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలకు సంబంధించిన భూసేకరణ స్థితిగతులను సమీక్షించారు. భూ యాజమానులకు చట్టప్రకారం పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని, అవార్డుల ప్రక్రియ, సర్వేలు, భూ రికార్డుల పరిశీలన, అభ్యంతరాల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని సూచించారు. ప్రతి ప్రాజెక్టుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, శాఖల మధ్య సమన్వయంతో పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. సమస్యలు ఎదురైతే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసురావాలని సూచించారు. -
డీఎస్సీలో అక్రమాలపై సమరభేరి
విజయనగరం: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిర్వహించిన డీఎస్సీలో జరిగిన అక్రమాలపై బాధ్యత గల ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సమరభేరి నిర్వహిస్తామని, నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి ఉద్ఘాటించారు. తన నివాసంలో పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు డీఎస్సీ నియామకాల్లో యువతకు జరిగిన అన్యాయంపై మంగళవారం నిర్వహించిన టౌన్ హాల్ సమావేశంలో ఏపీ జెన్ జీ వార్ పేరిట చేపట్టబోయే నిరసన కార్యక్రమాల వివరాలు వెల్లడించారు. ఈ మేరకు విజయనగరం నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కోలగట్ల వీరభధ్రస్వామి మాట్లాడుతూ బాధ్యత గల ప్రతిపక్షంగా కూటమి ప్రభుత్వం సాగిస్తున్న దురాగత పాలనలో యువతకు జరిగిన అన్యాయంపై ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు విజయనగరం జిల్లా కేంద్రంలో నియోజకవర్గ స్థాయిలో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని, సీబీఐ విచారణ జరిపించి కష్టపడి చదివిన నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ 6వ తేదీన నియోజకవర్గ యువజన, విద్యార్థి విభాగాల సారధ్యంలో, 7న మహిళా విభాగం సారధ్యంలో, 8న నగర పార్టీ/అనుబంధ విభాగాల సారధ్యంలో, 9న మండల పార్టీ సారధ్యంలో రిలే దీక్షలు జరుగుతాయని వెల్లడించారు. 10వ తేదీన నియోజకవర్గ స్థాయిలో భారీ నిరసన ర్యాలీ చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి అధిక సంఖ్యలో భాగస్వాములను చేయటం ద్వారా విజయవంతం చేయాల్సిన బాధ్యత వైఎస్సార్సీపీ శ్రేణులపై ఉందని సూచించారు. హమీల అమలుపై ప్రమాణం చేయగలరా..? ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రకటించిన సూపర్ సిక్స్ హమీలు 100 శాతం అమలు చేశామంటూ శాసనసభ సాక్షిగా చేస్తున్న ప్రకటనలపై కలియుగ దైవం వెంకటేశ్వరస్వామిపై ప్రమాణం చేయాలని కోలగట్ల వీరభద్రస్వామి సవాల్ విసిరారు. రాష్ట్రంలో ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని విస్మరించిన ప్రభుత్వం అరాచకాలు, అవినీతికి పాల్పడుతున్నాయని ధ్వజమెత్తారు. ఏం చేయకున్నా.. అన్నీ తామే చేశామంటూ అబద్ధపు ప్రచారాలు చేసుకుంటూ నమ్మి ఓట్లేసిన ప్రజలను మోసగించటం దుర్మార్గమమన్నారు. ప్రభుత్వం చేస్తున్న చేష్టలపై ప్రజల్లో సందర్భం వచ్చినపుడు చర్చించి వారిని చైతన్యవంతులను చేయాలని కోరారు. సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి, ఎంపీపీ మామిడి అప్పలనాయుడు, మాజీ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ శెట్టి వీరవెంకట రాజేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి సంగంరెడ్డి బంగారునాయుడు, నగర పార్టీ అధ్యక్షుడు ఆశపు వేణు, మండల పార్టీ అధ్యక్షుడు కెల్ల త్రినాధరావు, యువజన విభాగం నాయకులు జి.ఈశ్వర్ కౌశిక్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గదుల సత్యలత, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు పిన్నింటి కళావతి, జిల్లా పెన్షనర్లు, ఉద్యోగుల విభాగం అధ్యక్షుడు డోలా మన్మధకుమార్ పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి అవకతవకలపై తక్షణమే సీబీఐ దర్యాప్తు జరిపించాలి 6 నుంచి 9 వరకు నియోజకవర్గ స్థాయిలో రిలే నిరాహార దీక్షలు 10న విజయనగరం జిల్లా కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి -
అసంక్రమిత వ్యాధులతో బాధపడే వారిని గుర్తించండి
మక్కువ: అసంక్రమిత వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు నిర్వహిస్తున్న ఎన్సీడీ సర్వేను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా ఆర్బీఎస్కే అధికారి డాక్టర్ టి.జగన్మోహనరావు సూచించారు. మండలంలోని శంబర, మక్కువ ప్రాంతాల్లోని పీహెచ్సీ(ప్రాథమిక ఆరోగ్య కేంద్రం)ల్లో వైద్యారోగ్య సిబ్బందితో మంగళవారం సమావేశమైన ఆయన..వైద్యసేవలు, ఆరోగ్య కార్యక్రమాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. 4డీ లక్షణాల గుర్తింపు లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో ఆర్బీఎస్కే 2.0 స్క్రీనింగ్ పక్కాగా చేపట్టాలన్నారు. క్షేత్రస్థాయిలో గుండె జబ్బు, కేన్సర్, మధుమేహం వంటి అసంక్రమిత వ్యాధులతో బాధపడే వారిని గుర్తించి, తగిన చికిత్స, వైద్య సలహాలు అందేలా చూడాలన్నారు. సంచార చికిత్స శిబిరాలతో పాటు గ్రామగ్రామాన వైద్య శిబిరాలు నిర్వహించి, ప్రజలకు అవసరమైన వైద్యసేవలు అందించాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు ఎల్.శివాజీనాయుడు, ఆర్.చంద్రశేఖర్, బి.ఫణీంద్ర, సీహెచ్వో సరోజిని తదితరులు పాల్గొన్నారు. -
టీచర్లకు టెట్ కష్టాలు!
రామభద్రపురం: విద్యార్హత, వృత్తి సామర్థ్యాలను పరీక్షించి నాణ్యమైన అభ్యర్థులను ఎంపిక చేయాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ఉత్తీర్ణత నిరుద్యోగ బీఈడీ, డీఈడీ అభ్యర్థులతో పాటు టీచర్లకు ప్రభుత్వం తప్పనిసరి చేసింది. టీచర్లు ప్రస్తుత సర్వీసు కొనసాగించాలన్నా.. ఉద్యోగోన్నతి పొందాలన్నా టెట్ పరీక్ష తప్పకుండా రాసి ఉత్తీర్ణత సాధించాల్సి ఉంది. దీంతో ఏమి చేయాలో అర్థంకాక అయ్యవార్లు తలలు పట్టుకుంటున్నారు. ఐదేళ్లకు పైబడి సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు రెండేళ్ల లోపు టెట్ రాసి ఉత్తీర్ణులవ్వాలని సూచించడంతో 20, 25 ఏళ్ల కిందట ఉపాధ్యాయులుగా ఎంపికై న వారంతా ఈ వయస్సులో టెట్ రాసి ఉత్తీర్ణత ఎలా సాధిస్తామంటూ ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కూడా కనీసం పట్టించుకోకుండా, కోర్టులో అప్పీలు చేయకుండా, టీచర్లకు టెట్ కష్టాలు తెచ్చిపెట్టిందని ఉపాధ్యాయులు, సంఘాల నాయకులు మండిపడుతున్నారు. సవాల్గా మారిన టెట్జిల్లాలో 12,358 మంది అభ్యర్థులు.. జిల్లాలో టెట్ అర్హత లేని ఉపాధ్యాయులతో పాటు నిరుద్యోగ బీఈడీ, డీఈడీ అభ్యర్థులు సుమారు 12,358 మంది టెట్ పరీక్షలు రాయనున్నారు. ఈ నెల 5 నుంచి 16వ తేదీ వరకు 3 పరీక్ష కేంద్రాలలో పరీక్షలు నిర్వహించనున్నారు. రోజూ రెండు సెషన్స్లో జరగనున్న టెట్ పరీక్షలను మొదటి సెషన్ ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ ద్వారా పరీక్షలు నిర్వహించనున్నారు. -
నూతన పెట్టుబడుల అవకాశాలపై సెమినార్
విజయనగరం అర్బన్: స్థానిక చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో చాంబర్ ఆఫ్ కామర్స్, రోటరీ క్లబ్ సెంట్రల్, బీఎన్ఐ సంయుక్త ఆధ్వర్యంలో నూతన పెట్టుబడుల అవకాశాలపై సెమినార్ మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సింబోసిస్ టెక్నాలజీస్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో డాక్టర్ ఒ.నరేష్కుమార్ మాట్లాడుతూ విజయనగరం జిల్లాలోని భోగాపురంలో కొత్తగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభం కావడంతో ఉత్తరాంధ్రలో పెట్టుబడులకు అవకాశాలు విస్తృతంగా ఏర్పడ్డాయన్నారు. ముఖ్యంగా విజయనగరంలో సరికొత్త పెట్టుబడులు పెట్టే వారికి విస్తృత అవకాశాలు ఉన్నాయని, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశం అన్నారు. సరికొత్త పారిశ్రామిక టెక్నాలజీ ప్రాజెక్టులపై గీతం యూనివర్సిటీ అసిస్టెంట్ మేనేజర్ డాక్టర్ రమాదేవి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కాపుగంటి శ్రీనివాస్, రోటరీ క్లబ్ అధ్యక్షుడు జి.జగదీష్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రధాని మోదీ వరాలేవీ?
విజయనగరం గంటస్తంభం: భోగాపురంలో కొత్తగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ఇటీవల వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరాంధ్ర వాసులకు ఎలాంటి హామీలు ఇవ్వకుండానే వెనుదిరిగారని, ఉత్తరాంధ్ర అభివృద్ధికి పెద్దపీట వేయడమంటే ఇదేనా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ప్రశ్నించారు. మంగళవారం విజయనగరానికి వచ్చిన ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి, కాసేపు మాట్లాడారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చివరకు ఈ ప్రాంత ప్రజల ఆశలను నీరుగార్చిందని విమర్శించారు. భోగాపురంలో నిర్మించిన విమానాశ్రయానికి భోగాపురం పేరు కాకుండా వైజాగ్–జీఎంఆర్ పేరు పెట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. ఎయిర్పోర్టు ప్రారంభోత్సవ సభ ఆద్యంతం పరస్పర ప్రొగడ్తలకే పరిమితమైందన్నారు. విజయనగరం జిల్లా వాసుల మనోభావాలు దెబ్బతీయకుండా విమానాశ్రయానికి భోగాపురం పేరును కొనసాగించాలని కోరారు. ప్రజా సమస్యలు పట్టని ప్రభుత్వాలు.. ఉత్తరాంధ్రలో నాగావళి–వంశధార నదుల వివాదం, కొటియా గ్రామాల సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులు, మూతపడిన పరిశ్రమలు, నిరుద్యోగం వంటి కీలక అంశాలపై ప్రధాని మోదీ స్పందించ లేదన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రజలు డోలీల్లో రోగులను తరలించే పరిస్థితులు కొనసాగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవం పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేసి, మోదీని పొగిడేందుకే కార్యక్రమం పెట్టినట్లు ఉందని ఎద్దేవా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ప్రజా సమస్యలు ఏమాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తుండడం దురదృష్టకరమన్నారు. ఆయన వెంట సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.కామేశ్వరరావు, జిల్లా కార్యదర్మి ఒమ్మి రమణ, నాయకులు బుగత అశోక్, అలమండ ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధాని వచ్చి ఎలాంటి హామీలు ఇవ్వలేదు.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎలాంటి హామీలిస్తారోనని వేచి చూసిన వారికి తీవ్ర నిరాశ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య -
మాజీ సీఎం జగన్ను కలిసిన ఎమ్మెల్సీ విక్రాంత్
వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పాలకొండకు చెందిన ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్..తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకుని, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. – పాలకొండ రూరల్ నకిలీ వైజాగ్ టీఎంటీపై హెచ్చరికవిజయనగరం: వైజాగ్ టీఎంటీ పేరుతో మార్కెట్లో నకిలీ, నాసిరకం టీఎంటీ రీబార్లు విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని విశాఖ ఉక్కు కర్మాగారం(ఆర్ఐఎన్ఎల్) వెల్లడించింది. గృహ నిర్మాణదారులు, బిల్డర్లు, కాంట్రాక్టర్లు, వినియోగదారులు అసలైన వైజాగ్ టీఎంటీ ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేసింది. నాసిరకం ఉక్కు బీఐఎస్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండకపోవడంతో భవనాల భద్రత, బలం, మన్నికపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రతి అసలైన రీబార్పై వైజాగ్ టీఎంటీ బ్రాండింగ్తో పాటు ఆర్ఐఎన్ఎల్ గుర్తు స్పష్టంగా ఉంటుందని, కొనుగోలు సమయంలో వాటిని తప్పనిసరిగా పరిశీలించాలన్నారు. ఉత్పత్తి అసలు ధనంపై సందేహాలుంటే సమీప ఆర్ఐఎన్ఎల్ మార్కెటింగ్ కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపింది. ప్రజల భద్రత దృష్ట్యా నకిలీ ఉత్పత్తులకు మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. -
రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ సత్తా చాటండి
విజయనగరం అర్బన్: రాష్ట్ర స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు ‘ది నేషనల్ స్కూల్’కు చెందిన పలువురు విద్యార్థులు ఎంపికై నట్లు ఆ పాఠశాల కరెస్పాడెంట్ బి.రామారావు ఓ ప్రకటనలో మంగళవారం తెలిపారు. ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి జావెలిన్ త్రో పోటీల్లో పదో తరగతి విద్యార్థి ఎస్.అఖిల్ ప్రథమ స్థానంలో, అదే తరగతికి చెందిన కె.గౌతమ్ 600 మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ స్థానంలో నిలిచి సత్తా చాటారు. దీంతో వారిద్దరూ ఆగస్టు 11 నుంచి 13వ తేదీ వరకు తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ మైదానంలో జరగనున్న రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారన్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ‘ది నేషనల్ స్కూల్’ కరెస్పాండెంట్ అండ్ ప్రిన్సిపాల్ బి.రామారావు, డైరెక్టర్ డాక్టర్ ఎంవీఎన్ వెంకటరావు, వ్యాయామ ఉపాధ్యాయుడు కె.శ్రీనివాసరావు, ఎల్.మహేష్ అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ సత్తా చాటి, తమకు, జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు ‘ది నేషనల్ స్కూల్’ విద్యార్థులు ఆగస్టు 11 నుంచి తిరుపతిలో జరిగే పోటీల్లో జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం -
ఎయిర్పోర్టు ప్రారంభం రాజకీయ ఆర్భాటమే
విజయనగరం గంటస్తంభం: భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రచార వేదికగా మార్చిందని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ విమర్శించారు. రైతుల భూములతో నిర్మించిన విమానాశ్రయానికి విజయనగరం జిల్లా పేరు పెట్టకుండా విశాఖపట్నం పేరు పెట్టడం అన్యాయమన్నారు. నిర్వాసిత రైతులకు పూర్తి పరిహారం, పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాలు ఇప్పటికీ కల్పించలేదని ఆరోపించారు. ప్రారంభోత్సవానికి అధికార యంత్రాంగాన్ని వినియోగించి భారీగా ప్రజాధనం ఖర్చు చేయడం అధికార దుర్వినియోగమన్నారు. ఉపాధి కల్పన, స్ధానిక యువతకు ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళిక వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో ప్రజలను తప్పుదారి పట్టించడం మానుకోవాలని సూచించారు. సమావేశంలో సీపీఎం నాయకులు రెడ్డి శంకరరావు, టీవీ రమణ పాల్గొన్నారు. -
వినతుల పరిష్కారంలో జాప్యం తగదు
● పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లో 189 వినతుల స్వీకరణవిజయనగరం గంటస్తంభం: ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 189 వినతులు స్వీకరించారు. ఇందులో 78 వినతులు రెవెన్యూ శాఖకు సంబంధించినవే కావడం గమనార్హం. ప్రతి వినతిని నిర్దేశిత గడువులో పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న అర్జీలను ప్రాధాన్యంతో విచారణ చేసి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజలతో మాట్లాడిన తర్వాతే నివేదికలు సమర్పించాలని స్పష్టం చేశారు. ఫిర్యాదుదారులతో మాట్లాడిన తేదీ, సమయాన్ని నివేదికల్లో నమోదు చేయాలని సూచించారు. భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి భూ వివాదాలు, సర్వే సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నందున క్షేత్రస్ధాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. పీజీఆర్ఎస్ పోర్టల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను నిరంతరం సమీక్షించాలని సూచించారు. 1100 ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయొద్దు రాష్ట్ర ప్రభుత్వ 1100 టోల్ఫ్రీ ద్వారా వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతాయుతంగా పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ప్రజల్లో ఈ సేవలపై మరింత అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. శాఖల వారీగా వినతులు పంచాయతీరాజ్–30, డీఆర్డీఏ– 18, గ్రామ సచివాలయ శాఖ– 15, విద్య–13, ఇతర శాఖలు–12, విద్యుత్–9, మున్సిపల్–8, వైద్య ఆరోగ్య శాఖ–5, డీసీహెచ్ఎస్–1. చట్టపరిధిలో సత్వరన్యాయం: 21 ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ దామోదర్ విజయనగరం టౌన్: చట్టపరిధిలో బాధితులకు సత్వరన్యాయం చేసేందుకు జిల్లా పోలీస్ శాఖ అహర్నిశలూ శ్రమిస్తుందని, బాధితులెవరూ భయపడాల్సిన అవసరం లేదని ఎస్పీ ఏఆర్.దామోదర్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్సెల్ నిర్వహించారు. ఈ సందర్భంగా 21 మంది బాధితుల నుంచి పిర్యాదులు స్వీకరించారు. ప్రజలు చెప్పిన సమస్యలను శ్రద్ధగా విని వాటికి సంబంధించిన అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి, పరిష్కారానికి తగు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీచేశారు. తమ పరిధిలో ఉన్న పోలీసు స్టేషన్లకు వచ్చే బాధితుల పట్ల మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని, సమస్యలను పూర్తిగా విని, వాటి పరిష్కారానికి చట్టపరిధిలో చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని పోలీస్ అధికారులకు ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో ఎస్సై ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. -
పోగొట్టుకున్న బంగారం అప్పగింత
రాజాం సిటీ: ఏమరపాటుగా ఉన్న ప్రయాణికులను టార్గెట్గాచేసుకుని చోరీకి పాల్పడిన నిందితులను రాజాం పోలీసులు పట్టుకున్నారు. ఐదు నెలల క్రితం చీపురుపల్లి నుంచి రాజాం మీదుగా స్వగ్రామానికి ఆటోలో ప్రయాణిస్తున్న భార్యాభర్తల దగ్గర బంగారు నగలు చోరీచేసి పరారైన వారిని సీసీ కెమెరాల ఆధారంగా పట్టుకుని సంబంధిత బాధితులకు సోమవారం బంగారం అప్పగించారు. ఇందుకు సంబంధించిన టౌన్ సీఐ డి.నవీన్కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తెర్లాం మండలం సతివాడ గ్రామానికి చెందిన మరిశర్ల భాగ్యలక్ష్మి, భర్త సూర్యనారాయణలు ఈ ఏడాది మార్చి 3న సికింద్రాబాద్ నుంచి రైలులో వస్తూ చీపురుపల్లిలో దిగారు. అక్కడి నుంచి రాజాం మీదుగా స్వగ్రామం వెళ్లేందుకు ఆటో ఎక్కారు. రాజాం చేరుకుని ఆటో దిగి వారితో తీసుకువచ్చిన బ్యాగును చూసుకున్నారు. అందులో ఉన్న ఆరు తులాల బంగారు నగలు కనిపించకపోవడంతో ఆందోళన చెంది పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి సీసీ పుటేజీలను పరిశీలించి నిందితులను ఉత్తరప్రదేశ్కు చెందిన మెహర్వాన్ ఆలీ, ఇర్షాద్ ఆలీగా గుర్తించారు. రాజాం ఎస్సై మహ్మద్ సల్మాన్ బేగ్, విజయనగరం సీసీఎస్ బృందంతో కలిసి ఉత్తరప్రదేశ్ వెళ్లి నిందితులను అరెస్టుచేసి వారి నుంచి బంగారునగలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సంబంధిత బాధితులకు సోమవారం బంగారం నగలను అప్పగించామని సీఐ తెలిపారు. -
అలసత్వం వద్దు
ప్రజా సమస్యల పరిష్కారంలో పార్వతీపురం: ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శించకుండా ప్రతి ఫిర్యాదును బాధ్యతగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారం అందించాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి ఆదేశించారు. ఈ మే రకు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ ప్రత్యేక ఉపకలెక్టర్ డి.వెంకటేశ్వరరావు, ఎస్డీసీ డి. ధర్మరాజులతో కలిసి మొత్తం 69 వినతులను స్వీకరించారు. వాటిలో 16 రెవెన్యూకు సంబంధించినవి కాగా 53 ఇతర శాఖలకు సంబంధించినవి ఉన్నాయి. ప్రతి అర్జీ వెనుక ఒక కుటుంబం ఆశలు ఉంటాయని గుర్తుంచుకుని, సాంకేతిక కారణాలతో కేసులను మూసివేయకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్ సూచించారు. ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో ధ్రువీకరించి, ఫిర్యాదుదారు సంతృప్తి చెందిన తరువాతే పీజీఆర్ఎస్ పోర్టల్లో పరిష్కరించినట్లు నమోదు చేయాలని ఆదేశించారు. మండల స్థాయి అధికారుల పనితీరుపై జిల్లా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు. రోడ్డు నాణ్యత, రైతుభరోసా, విద్యుత్ బిల్లు, గోకులం షెడ్ల బకాయిలు, భూ ఆక్రమణలు, పట్టాదారు పాస్పుస్తకాలు, భూ వివాదాలకు సంబంధించిన వినతులను స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, పీజీఆర్ఎస్ నోడల్ అధికారులు పాల్గొన్నారు. గడువులోగా ఫిర్యాదుల పరిష్కారం: ఎస్పీ పార్వతీపురం రూరల్: ’ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (పీజీఆర్ఎస్) ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను చట్టపరిధిలో, నిర్దిష్ట గడువులోగా సత్వరమే పరిష్కరించాలని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి ముఖాముఖి మాట్లాడారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించిన ఎస్పీ..అక్కడికక్కడే సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఫిర్యాదుల్లోని వాస్తవాలను విచారణ చేసి తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఆ నివేదికలను జిల్లా కార్యాలయానికి పంపాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ సీఐ జీఏవీ రమణ, ఎస్సై శిరీష, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఐటీడీఏ పీజీఆర్ఎస్కు 15 వినతులు సీతంపేట: ప్రతి వారం పీజీఆర్ఎస్కు వచ్చే సమస్యలు తక్షణం పరిష్కరించాలని పాలకొండ సబ్కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జ్ పీఓ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ అన్నారు. ఈ మేరకు సోమవారం స్థానిక ఐటీడీఏలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులు ఇచ్చిన వినతులు ఎంతవరకు పరిష్కారమయ్యాయనేది వారికి ఫోన్ చేసి అడగాలన్నారు. క్యూఆర్ కోడ్ కూడా ప్రారంభించామన్నారు. అనంతరం మొత్తం 15 వినతులు స్వీకరించారు. కుక్ ఉద్యోగం నుంచి అటెండర్ ఉద్యోగానికి ప్రమోట్ చేయాలని ఎస్ఎస్ మణుగుకు చెందిన కె.శ్రీరాములు కోరాడు. మర్రిపాడు, పూతికవలస రహదారి మరమ్మతులు చేయాలని, బస్సు సర్వీస్ పునరుద్ధరించాలని పత్తిక కుమార్ వినతిపత్రం అందజేశాడు. పవర్టిల్లర్లు ఇప్పించాలని పెద్దగూడకు చెందిన సవర సాంబయ్య, సుక్కయ్యలు కోరారు. కార్యక్రమంలో ఏపీఓ చిన్నబాబు, డీపీఎం ఎం.వి.రమణ, స్పోర్ట్స్ ఇన్చార్జ్ జాకాబ్ దయానందం తదితరులు పాల్గొన్నారు. -
రేకుల షెడ్.. మట్టి గచ్చు...
ఈ చిత్రం చూశారా.. ఇది సాలూరు మండలం పట్టుచెన్నూరు పంచాయతీ నిమ్మలపాడు ప్రాథమిక పాఠశాల. ఈ చిన్న రేకుల షెడ్డే పాఠశాల పక్కా భవనం. తుడిచిన నేలే చిన్నారులకు టైల్స్ గచ్చు. ఇక్కడే ఒకటి నుంచి ఐదు తరగతుల విద్యార్థులకు విద్యాబోధన. సాక్షాత్తు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో గిరిజన పిల్లల చదువు కష్టాలకు ఈ చిత్రమే సజీవసాక్ష్యం. ప్రధాని మోదీ మెప్పుకోసం గిరిజన పిల్లలను మండే ఎండలో థింసా నృత్యం చేయించి సంబరపడిపోయే పాలకులు... పిల్లల చదువు కష్టాలపై దృష్టిసారించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. – సాలూరు రూరల్ -
కరువు ముప్పు..!
కనుచూపు మేరలో..బొబ్బిలి: జిల్లాలో సుమారు 1.20 లక్షల ఎకరాల్లో ఏటా వరి సాగు కావాల్సి ఉంది. ఈ ఏడాది దాదాపు 30 శాతం కూడా ఉభాలు కాలేదు.వరి నారు వేసిన 21 రోజుల్లో నాట్లు వేసుకోవాల్సి ఉన్నా ఇప్పటికే చాలా చోట్ల 35 నుంచి 40 రోజులుగా వరి నారు ముదిరి పోతోంది. కాలువలు, బావుల్లో నీరు ఇంకిపోతోంది. వరి నారును కొంతమంది మళ్లీ వేసుకున్నారు. అదీ పనికి వచ్చేలా లేదు. కరువు పొంచి ఉంది. రెండు నెలలుగా రైతులు వర్షం కోసం కంటిమీద కునుకులేకుండా ఎదురు చూస్తున్నారు. అల్పపీడనాలు, వాయుగుండాలు వచ్చి వెళ్లిపోతున్నాయే తప్ప చుక్క నీరు రాల్చడం లేదు. ఇటీవల వచ్చిన తుఫాన్ వర్షాలు కూడా అంతే. రెండు రోజులు మేఘావృతమై పూలజల్లులు కురవడం, మరుసటి రోజంతా మాడు పగిలే ఎండలుకాయడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. జిల్లా సగటు వర్షపాతం తక్కువగా నమోదవుతోంది. సాగునీటి ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు తరిగిపోతున్నాయి. రైతులను ఆదుకుని కరువునుంచి గట్టెక్కించే చర్యలుతీసుకోవాలి కానీ అదిశగా కనీసం అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు.జిల్లాలో గడిచిన రెండునెలల్లో వర్షపాతం వివరాలు(మి.మీలలో) నెల సాధారణ కురిసిన జూన్ 123.5 96.3జూలై 100.5 41.9 బోర్ల వద్ద ఎండుతున్న వరిపైరు వీఆర్ఎస్, పాల్తేరు చానళ్లలో కానరాని సాగునీరు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయని ప్రభుత్వం ఆగస్టు వచ్చేసినా 30శాతం కూడా పడని వరినాట్లు


