breaking news
Vizianagaram District Latest News
-
తీరప్రాంత భద్రత దేశ రక్షణకు కీలకం
భోగాపురం: దేశరక్షణలో తీరప్రాంత భద్రత అత్యంత కీలకమని ఎస్పీ ఏఆర్ దామోదర్ పేర్కొన్నారు. ఈ మేరకు భోగాపురం మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) అధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా సైకిల్ ర్యాలీని శుక్రవారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తీరప్రాంత భద్రతపై ప్రజల్లో ముఖ్యంగా విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు సీఐఎస్ఎఫ్ సిబ్బంది చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కోస్టల్ సెక్యూరిటీ, నేషనల్ యూనిటీ (జాతీయ సమైక్యత) నేషనల్ ప్రైడ్ గురించి స్కూళ్లు, కాలేజీ విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం సీఐఎస్ఎఫ్ సిబ్బంది రెండు బృందాలుగా విడిపోయి కోల్కతా, గుజరాత్ల నుంచి ప్రారంభించిన మెగా సైకిల్ ర్యాలీని కేరళ వరకు కొనసాగించనున్నట్లు చెప్పారు. సుమారు 100 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఒక టీమ్గా ఏర్పడి ఈ యాత్రను చేపట్టారన్నారు. ఈ క్రమంలో భోగాపురం చేరుకున్న ర్యాలీ బృందంతో కలిసి భాగస్వాములు కావడం, వారికి భద్రత ఏర్పాట్లను కల్పించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వారి యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ, జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో సీఐ కె.దుర్గాప్రసాద్, ఎస్సై వి.పాపారావు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ ఏఆర్ దామోదర్ -
మన్యంలో సికిల్ సెల్ సెగ..!
పార్వతీపురం రూరల్: గిరిజన హృదయాల్లో ప్రాణాంతక సికిల్సెల్ ఎనీమియా నిశ్శబ్దంగా మృత్యుఘంటికలు మోగిస్తోంది. మన్యం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తూ, గిరిపుత్రుల ప్రాణాలను హరిస్తోంది. జన్యుపరంగా సంక్రమించే ఈ మహమ్మారి బారిన పడి పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు విలవిలలాడుతుంటే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. గతంలో బాధితులకు కొండంత అండగా నిలిచిన ప్రత్యేక వైద్యసేవలు నేడు ’బాబు ’ పాలనలో అటకెక్కాయి. ఐటీడీఏ నిధుల విడుదలలో చూపుతున్న జాప్యం, పాలకుల అలసత్వం వెరసి..గిరిజనుల రక్తం తెల్లబారుతోంది. పంజా విసురుతున్న సికిల్సెల్ జిల్లాలోని ఎనిమిది మండలాల్లో నాలుగు పూర్తిగా నాలుగు పాక్షికంగా ఏజెన్సీ పరిధిలో ఉండగా, ఇక్కడ సికిల్సెల్ రక్కసి పంజా విసురుతోంది. ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల్లో ఏకంగా 304 మందికి వ్యాధి నిర్ధారణ కాగా, మరో 4,808 మందిని ఈ వ్యాధి వాహకులుగా గుర్తించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. వారికి ప్రతి నెలా రక్తమార్పిడి, నిరంతర వైద్య పర్యవేక్షణ ప్రాణావసరం. కానీ, దురదృష్టవశాత్తు జిల్లాలో ఉన్న ఏకై క ప్రత్యేక ’డే కేర్ సెంటర్’ నిధులు లేక రెండేళ్లుగా మూతపడి ఉండడం గమనార్హం. గతంలో ప్రత్యేక వైద్యులు, సిబ్బందితో సేవలు అందించేందుకు ఉన్న కేంద్రం, నేడు పాలకుల నిర్లక్ష్యం వల్ల వెలవెలబోతోంది. జనరల్ వార్డుల్లో పడి ఉండాల్సిన దుస్థితి ఒకప్పుడు బాధితులకు నేరుగా రక్తమార్పిడి, ఉచిత మందులు, సలహాలు అందించే ఈ వ్యవస్థను ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. ఇప్పుడు బాధితులు సాధారణ రోగుల మాదిరిగా జనరల్ వార్డుల్లో పడి ఉండాల్సిన దుస్థితి నెలకొంది. ప్రత్యేక విభాగం లేకపోవడంతో గర్భిణులు, కౌమార బాలికల ఆరోగ్యం తీవ్ర ప్రమాదంలో పడింది. నెలకు కేవలం రూ. 30 లక్షల నిధులు కేటాయించలేక, గిరిజనుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు సర్కారు, ఏజెన్సీలో కొడిగడుతున్న ప్రాణాలను కాపాడడంలో ఎందుకు విఫలమవుతోందని గిరిజన సంఘాలు నిలదీస్తున్నాయి. తక్షణమే ఐటీడీఏ నిధులు విడుదల చేసి, ప్రత్యేక చికిత్స కేంద్రాన్ని పునఃప్రారంభించాలని కోరుతున్నాయి. గిరిజనుల ప్రాణం..గాలిలో దీపం మూతపడిన ఏకై క భరోసా కేంద్రం.. పట్టించుకోని చంద్రబాబు సర్కారు నిధులు నిలిపివేత..వైద్యం అందక గిరిపుత్రుల విలవిల జిల్లాలో 304 మంది వ్యాధిగ్రస్తులు.. మరో 4,808 మంది వాహకులు రక్తమార్పిడి లేక..మందులు దొరక్క నరకయాతన కేంద్రాస్పత్రిలో అవసరమైన సేవలు జిల్లా కేంద్రాస్పత్రిలో సికిల్సెల్ బాధితులకు అవసరమైన అన్ని వైద్య సేవలు నిరంతరం అందుతున్నాయి. వ్యాధి నిర్ధారణ పరీక్షల అనంతరం రక్తమార్పిడి అవసరమైన వారికి కేంద్రాస్పత్రిలో సేవలు అందుతున్నాయి. డే కేర్ సెంటర్కు ప్రతిపాదనలు పంపించాం. చికిత్స అందించడంలో ఎలాంటి జాప్యం చేయడం లేదు. వ్యాధిగ్రస్తులకు క్షేత్రస్థాయిలోనే పరీక్షలు నిర్వహించి, సకాలంలో వైద్యం అందేలా పర్యవేక్షణ చేస్తున్నాం. డా.ఎం.వినోద్ కుమార్ ప్రత్యేకాధికారి -
ఈ ఏడాదైనా పాట పాడతారా?
వండువ పంచాయతీలోని జీడి తోటల నుంచి గత కొనేళ్లుగా ఫలసాయం అందుతోంది. ఏటా పూత సమయంలో అటవీ శాఖాధికారులు వేలం నిర్వహిస్తున్నారు.అలా వచ్చిన మొత్తంలో 60 శాతం పంచాయతీకి, 40 శాతం అటవీ శాఖకు చెందుతుంది. అయితే మూడేళ్లుగా వేలంపాట జరగకపోవడంతో పంచాయతీ ఆదాయానికి గండి పడుతోంది. రెండేళ్ల క్రితం ఫలసాయం రూ.1.26 లక్షలు రావడంతో ఇందులో 60 శాతం వాటా కింద రూ.75 వేలను వండవ పంచాయతీకి అటవీశాఖ అధికారులు జమచేశారు. గతేడాది వేలం పాటకు ఎవరూ ముందుకు రాకపోవడంతో అటవీశాఖ అధికా రులే పర్యవేక్షణ చేశారు. 510 కిలోల జీడి పిక్కలు దిగుబడి వచ్చింది. అంటే గతేడాది ధర ప్రకారం కేవలం రూ.59 వేలు మాత్రమే ఆదా యం వచ్చింది. ఈ ఏడాది ఎలాగైనా వేలం పాట నిర్వహించి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుతామని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.ఏం జరుగుతుందో వేచి చూడాలి మరి. ●జిల్లాలోని వీరఘట్టం మండలం వండవ కొండపై ఉన్న 150 ఎకరాల్లో ఉన్న 1302 జీడి మొక్కలకు ఫిబ్రవరి 10న పార్వతీపురం మన్యం జిల్లా అటవీశాఖ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు వేలం పాట నిర్వహిస్తారు. ఈ వేలం పాటలో తోటలు లీజుకు వెళ్లకపోతే మళ్లీ ఫిబ్రవరి 20న వేలం పాట నిర్వహిస్తారు. ●వేలం పాటలో పాల్గొనే వా రు ముందుగా వారు పాడబో యే తోటలను చూసుకోవాలి. ●ప్రతి పాటదారు ధరావత్తు సొమ్ము రూ.5000తో పాటు రూ.25వేలు నగదు చెల్లించి వేలంపాటలో పాల్గొనాలి. ●పాట ముగిసిన వెంటనే నగదు సాల్వెన్సీ కాకుండా ధరావత్తు సొమ్ముతో కలిపి 1/3 వంతు అదే రోజు విధిగా చెల్లించాలి. ●పాట ఖరారైన వ్యక్తికి పాన్కార్డు, ఆధార్కార్డు తప్పకుండా కలిగి ఉండాలి. వీరఘట్టం: మార్కెట్లో జీడి పిక్కల ధర ప్రస్తుతం కిలో రూ.140 నుంచి రూ.150 ధర పలుకుతోంది. గతేడాది సీజన్లో రూ.160 వరకు ధర పలికింది. అదే జీడి పప్పు ప్రస్తుతం నాణ్యతను బట్టి కిలో రూ.820 నుంచి రూ.870 ధర పలుకుతోంది. ఈ తరుణంలో ఎకరా జీడితోటలో పంట బాగా పండితే ఆ రైతుకు కనకవర్షం కురుస్తుంది. అయితే వీరఘట్టం మండలంలోని వండువ కొండపై 150 ఎకరాల జీడి తోటలు ఉన్నా జిల్లా అటవీశాఖకు మాత్రం గడిచిన మూడేళ్లుగా అరకొర ఆదాయం మాత్రమే వస్తోంది. గతంలో ప్రతి ఏటా జీడితోటలకు వేలం జరిగే సమయంలో దళారులు రంగప్రవేశం చేసి ధర తగ్గించేసి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేవారు. గడిచిన మూడేళ్లుగా ఎవరూ వేలం పాటకు ముందుకు రాకపోవడంతో అటవీశాఖ అధికారులే సాగు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్లీ సీజన్ మొదలు కావడంతో ఈనెల 10న పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో జీడితోటలు వేలం వేసేందుకు జిల్లా అటవీశాఖాధికారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరఘట్టం మండలంలోని వండువ కొండల్లో 1980లో 62.5 ఎకరాల్లో జీడితోటలు వేశారు. మళ్లీ 1982లో 87.5 ఎకరా ల్లో జీడితోటలు వేశా రు. మొత్తం 150 ఎకరా ల్లో సుమారు 3750 జీడిమొక్కలను వేసి ఈ కొండలో సాగుచేశా రు. మొక్కలు వేసిన ఐదేళ్ల తర్వాత ఫలసాయం బాగా రావడంతో అటవీశాఖకు, గ్రా మ పంచాయతీకి బాగానే ఆదాయం వచ్చేది. కాలక్రమేణా ప్రకృతి వైపరీత్యాలు, తుపాన్లు, ఈదురుగాలుల ధాటికి వాటిలో రెండు వంతుల మొక్కలు నేలమట్ట మయ్యాయి. ప్రస్తుతం 1302 జీడి మొక్కలు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు.ఈ మొక్కలకు మాత్రమే వేలం పాట నిర్వహించనున్నారు. క్రమేపీ వండువ కొండల్లో ఉన్న జీడి మొక్కల సంఖ్య తగ్గుతోంది. 1980–82 మధ్య కాలంలో సుమా రు 3750 మొక్కలు వేస్తే ప్రస్తుతం 1302 మొక్కలే ఉన్నాయి. ప్రతి ఏటా సీజన్లో ఉపాధిహామీ పథ కం ద్వారా సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అలాగే కొత్త మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలి. అప్పు డు పాత మొక్కలు నేలమట్టమైనా కొత్త మొక్కలతో ఫలసాయం పెరుగుతుంది. నాణ్యమైన పంట దిగుబడి వస్తుంది. అయితే ఈ కొండల్లో జీడి తోటలపై సస్యరక్షణ చర్యలు చేపట్టక, నిర్వహణ లేక ఏటా ఫలసాయం తగ్గుతోంది. ఇలాగే వదిలేస్తే మరో మూడేళ్లలో ఉన్న మొక్కలు కూడా కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. ప్రభుత్వానికి, పంచాయతీకీ ఆదాయం రావాలంటే అధికారులు సమన్వయంతో ఇక్కడ జీడితోటల పెంపకంపై దృష్టి సారించాల్సి ఉంది.జీడి తోటల వేలానికి గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా వేలం పాటను పక్కాగా నిర్వహిస్తాం. వేలం పాటను సిండికేట్ చేస్తే రద్దు చేస్తాం. ప్రభుత్వ ఆదాయానికి గండిపడేలా ఎవరైనా లోపాయికారీగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. –టీవీ రమణమూర్తి, డిప్యూటీ రేంజర్, వీరఘట్టం -
వడ్డీ రాయితీని వెంటనే విడుదల చేయాలి
ప్రభుత్వం వడ్డీరాయితీ చెల్లిస్తుందని గత ఏడాది బ్యాంకులకు చెల్లించలేదు. ఇటీవల రుణం కోసం బ్యాంకుకు వెళ్తే ప్రభుత్వం వడ్డీ రాయితీ విడుదల చేయలేదని అక్కడి అధికారులు చెప్పి గత ఏడాది తీసుకున్న రుణంపై వడ్డీ వసూలు చేశారు. అధికారంలోకి వస్తే రైతును రాజును చేస్తామని గొప్పలు చెప్పడం తప్ప, పథకాలకు నిధులు కేటాయించకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రభుత్వం వెంటనే వడ్డీ రాయితీ బకాయిలను విడుదలచేసి రైతులను ఆదుకోవాలి. – బంటుపల్లి వెంకటేశ్వర్లు, రైతు, మెరకముడిదాం -
వెట్టిచాకిరీ నిర్మూలనకు కృషి చేయాలి
● కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ ప్రసాదరావు విజయనగరం ఫోర్ట్: వెట్టిచాకిరీ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ ఎస్డీవీ ప్రసాదరావు కోరారు. వియనగరం యూత్ హాస్టల్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం (1976లో) వచ్చాక వెట్టి చాకిరీ తగ్గిందన్నారు. సమావేశంలో నేచర్ సంస్థ ప్రతినిధులు దుర్గ, చైతన్య, బంగారుబాబు, గౌరీ శంకర్, సీహెచ్ చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు. శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యం ● ఆర్జేడీ విజయ్భాస్కర్ బొండపల్లి: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదోతరగతి విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా విద్యాప్రణాళిక అమలుచేస్తున్నామని ఆర్జేడీ విజయ్ భాస్కర్ తెలిపారు. బొండపల్లి ఎంఈఓ కార్యాలయాన్ని శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రిజియన్ పరిధిలోని ఆరుజిల్లాల్లోని విద్యార్థులకు గతేడాది డిసెంబర్ 6 నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ పదోతరగతి పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నామన్నారు. ఈ ఏడాది విజయనగరం జిల్లా నుంచి 14,744 మంది, పార్వతీపురం మన్యం జిల్లా నుంచి 5,117 మంది, శ్రీకాకుళం జిల్లా నుంచి 19,370 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు. పోలమాంబ హుండీల ఆదాయం రూ.25.47 లక్షలు మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి ఆలయ హుండీల ఆదాయాన్ని దేవదాయశాఖ ఆధ్వర్యంలో చదురుగుడిలో శుక్రవారం లెక్కించారు. చదురుగుడిలోని ఆరు హుండీల నుంచి రూ.18,47,354లు, వనంగుడిలోని ఆరు హుండీల నుంచి రూ.7,00,065లు కలిపి రూ.25,47,419లు ఆదాయం వచ్చినట్టు ఈఓ శ్రీనివాస్ తెలిపారు. 27 గ్రాముల 520 మిల్లీ గ్రాముల బంగారం, 243 గ్రాముల వెండి లభించిందన్నారు. హుండీల ఆదాయం లెక్కింపులో పార్వతీపురం మన్యం జిల్లా దేవదాయశాఖ అధికారి ఎస్.రాజారావు, ఆలయ చైర్మన్ నైదాన చిన్నతిరుపతి, సర్పంచ్ వి.సింహాచలమమ్మ, ఎంపీటీసీ సభ్యుడు టి.పోలినాయుడు, ఉప సర్పంచ్ అల్లు వెంకటరమణ, సేవకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. స్పందించిన సర్వజన ఆస్పత్రి అధికారులు విజయనగరం ఫోర్ట్: సర్వజన ఆస్పత్రిలో వసతులు చాలక రోగులు ఇబ్బంది పడుతున్నారనే అంశంపై ‘అమాత్యా కాస్త ఇటు చూడండి..!’ అనే శీర్షికన ఈనెల 2వ తేదీన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి అధికారులు స్పందించారు. మూలనపడిన వీల్చైర్లు, స్ట్రెచర్స్ను శుక్రవారం బాగుచేయించారు. -
రైలు ప్రయాణికులకు మెరుగైన వసతి లక్ష్యం
విజయనగరం టౌన్: రైలు ప్రయాణికులకు మెరుగైన వసతి, సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ఈస్ట్కోస్ట్ రైల్వే పనిచేస్తోందని డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా పేర్కొన్నారు. ఈ మేరకు విజయనగరం రైల్వేస్టేషన్ ఒకటో నంబర్ ఫ్లాట్ఫామ్లో ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటుచేసిన ఏసీ డార్మిటరీ, రిటైరింగ్ రూమ్లను శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం వీఐపీ లాంజ్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ పీఎన్ఆర్ కలిగి ఉన్న ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలను అతి తక్కువ ఖర్చుకే అందజేస్తున్నామన్నారు. ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనూ బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పించామని తెలిపారు. పారదర్శకత, యాక్సెస్, డిజిటల్ సౌలభ్యం ఉందన్నారు. రైలు ప్రయాణం చేసే ప్రయాణికులకు దీర్ఘకాలం వేచి ఉండేవారికి, సీనియర్ సిటిజన్లకు, పిల్లలతో ప్రయాణించే కుటుంబాలకు ఐఆర్సీటీసీ ద్వారా క్యాటరింగ్, హాస్పిటాలిటీ సేవలను లైసెన్స్డ్ మెస్సర్స్ గుడ్పుడ్ క్యాటరింగ్ సర్వీసులను అందజేస్తుందని చెప్పారు. అనంతరం నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్ కుమార్, ఐఆర్సీటీసీ రీజనల్ మేనేజర్ అనూజ్ దత్తా తదితరులు పాల్గొన్నారు. డీఆర్ఎం లలిత్ బోహ్రా -
ఫీజుల భారం మోయలేం
విజయనగరం గంటస్తంభం: ప్రైవేట్, కార్పొరేట్, డీమ్డ్ యూనివర్సిటీల్లో విద్యార్థులను ఆర్థికంగా దోచుకుంటున్నారు.. ఫీజులు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారు... ఈ ఫీజుల భారం మోయలేమంటూ విద్యార్థులు కదం తొక్కారు. విద్యాహక్కును వ్యాపారంగా మార్చుతున్న విధానాలపై నిరసన తెలిపారు. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మయూరి కూడలి నుంచి విజయనగరం కాంప్లెక్స్ వరకు శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కాంప్లెక్స్ వద్ద మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్మి డి.రాము, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్మి నాగభూషణ్ మాట్లాడుతూ... విద్యార్ధుల భవిష్యత్తును తాకట్టుపెట్టేలా జరుగుతున్న అక్రమ ఫీజుల వసూళ్లను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. విద్య అనేది హక్కు తప్ప లాభసాటిగా మార్చే వస్తువు కాదని, పేద–మధ్యతరగతి విద్యార్థులు చదువు కొనసాగించలేని స్థితికి నెట్టబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజురీయింబర్స్ మెంట్ బకాయిల చెల్లింపులో జాప్యం తగదన్నారు. విద్యార్థుల కన్నీళ్లు, తల్లిదండ్రుల కష్టాన్ని పట్టించుకోని పాలక విధానాలకు వ్యతిరేకంగా ఈ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మోహన్బాబు యూనివర్సిటీకి ఇచ్చిన అనుమతులను రద్దు చేసి, యూనివర్సిటీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఎస్ఎఫ్ఐ నాయకుల కిడ్నాప్ ఘటనలో బాధ్యులైన నటుడు మోహన్బాబు, విష్ణు, పీఆర్ఓ సతీష్లను వెంటనే అరెస్టు చేయాలని, విద్యార్ధుల నుంచి అక్రమంగా వసూలు చేసిన డబ్బును పూర్తిగా తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు శిరీష, భారతి, జయ, వంశీ, సూరిబాబు, ఏఐఎస్ఎఫ్ నాయకులు రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. రోడ్డెక్కిన విద్యార్థులు విజయనగరంలో ఆందోళన మోహన్బాబు యూనివర్సిటీపై చర్యలు తీసుకోవాలి ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ డిమాండ్ -
రుణాలు చెల్లించినా అందని వడ్డీరాయితీ
ఏటా పంట రుణాలు సక్రమంగా చెల్లిస్తున్నా వడ్డీ రాయితీ అందడంలేదు. రెండేళ్లుగా ఇదే పరిస్థితి. బ్యాంకులు తిరిగి రుణాలిస్తున్నాయే తప్ప రాయితీ విషయం ప్రస్తావించడంలేదు. బ్యాంకు అధికారులు ఒత్తిడి తెస్తుండడంతో మరో గత్యంతరం లేక వడ్డీ కూడా చెల్లిస్తున్నాం. రైతులకు ఉపయోగపడే పథకాల్లో కోతలు పెట్టడం ప్రభుత్వానికి తగదు. రైతులకు ఇచ్చే రుణాలకు సున్నావడ్డీ పథకాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. – గంట్యాడ జనార్దనరావు, ఎం.పాలెం, మెరకముడిదాం మండలం -
గ్రంథాలయాల అభివృద్ధికి కృషి అవసరం
● మంత్రులు శ్రీనివాస్, సంధ్యారాణి ● జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా డొంకాడ రామకృష్ణ విజయనగరం టౌన్: జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేయాలని మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి గ్రంథాలయాల సిబ్బందికి సూచించారు. గ్రంథాలయాలను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఉమ్మడి విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా డొంకాడ రామకృష్ణ శుక్రవారం ప్రమాణం స్వీకారం చేశారు. జిల్లా కేంద్ర గ్రంథాలయం ప్రాంగణంలోని గురజాడ కళాభారతిలో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రులు ముఖ్య అతిఽథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞానగనులని, వాటి అభివృద్ధికి తమవంతు కృషిచేస్తామని హామీ ఇచ్చారు. అన్నిదానాల్లో కెల్లా విద్యాదానం శాశ్వతమని పేర్కొన్నారు. జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి తనవంతు కృషిచేస్తానని సంస్థ చైర్మన్ రామకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అదితి విజయలక్ష్మిగజపతిరాజు, బేబీనాయన, తోయక జగదీశ్వరి, రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు కె.మల్లేశ్వరరావు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ రౌతు రామ్మూర్తి, జిల్లా గ్రంథాలయ సంస్ధ కార్యదర్శి లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
చూసెయ్ జాగా.. వేసెయ్ పాగా..!
నోటీసులు ఇచ్చాం రాజాం: వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుతున్న రాజాంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ప్రధాన రహదారి పక్కన ఉన్న స్థలాలకు మంచి డిమాండ్ ఉంది. ఇదే అదునుగా ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారు. అధికార బలంతో ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలాలను ఆక్రమించేస్తున్నారు. నిన్నమొన్నటి వరకూ మురుగుకాలువలను సైతం మూసేసిన ఆక్రమణదారులు... ఇప్పుడు ఏకంగా దేవదాయశాఖ భూములను కబ్జాచేస్తున్నారు. అనధికారికంగా నిర్మాణాలు చేపడుతున్నారు. ● 20 ఎకరాల మేర ఆక్రమణ.. రాజాంలోని పాలకొండ ప్రధాన రహదారిని ఆనుకుని డోలపేట పరిధిలో రూ.కోట్ల విలువచేసే దేవదాయశాఖ భూములు ఉన్నాయి. డోలపేటలోని ఉమామహేశ్వర లక్ష్మీనారాయణస్వామి ఆలయానికి సంబంధించి సర్వే నంబర్ 8లో 20.56 ఎకరాల భూమి ఉంది. ఈ భూములు మొత్తం ఆక్రమణదారుల చేతుల్లో ఉంది. కొంతమంది ఈ భూములు జీవితకాలపు లీజుకు తీసుకున్నామంటూ హైకోర్టులో కేసులు వేయడం గమనార్హం. మరికొంత మంది ఎమ్మెల్యే చెప్పారని, ఎంపీ చెప్పారని చిన్నచిన్న షెడ్లువేసి రాత్రికిరాత్రే శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారు. ఇక్కడ సెంటు భూమి ధర రూ.15 లక్షల నుంచి రూ.18 లక్షలు పలుకుతుండడంతో ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారు. ● మమ్మల్ని అడగొద్దు.. రాజాం పట్టణంలో ఇళ్లు, భవంతుల నిర్మాణాలకు మున్సిపల్ ప్లాన్ అప్రూవుల్ ఉండాలి. పక్కా జిరాయితీ స్థలాలైతేనే వీటికి పర్మిషన్ ఇస్తారు. అవి కూడా జీ ప్లస్ నిర్మాణాలు చేయాల్సి ఉంది. లేకుంటే టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్మాణాలను అడ్డుకోవాలి. రాజాంలో మాత్రం దీనికి పూర్తి భిన్నం. మామ్మూళ్లు ఇస్తే చాలు... కొందరు అధికారులు, ఉద్యోగులు అక్రమ మార్గంలో అనుమతులు ఇచ్చే దారి చూపుతారట. విద్యుత్ మీటర్లు కూడా మంజూరు చేయిస్తారు. ఇక్కడి మున్సిపల్ కార్యాలయంలో దీనికోసం ప్రత్యేక దళారీ వ్యవస్థే నడుస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు దేవదాయశాఖ అధికారులు తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. అధికారుల అడ్డంకులు లేకపోవడంతో రాత్రికి రాత్రే భూములు మాయమవుతున్నాయి. రాజాంలో ఆక్రమణల జోరు దేవదాయశాఖ భూముల దురాక్రమణ అధికార బలంతో నిర్మాణాలు నోటీసులు ఇచ్చినా ఫలితం సున్నా ఆక్రమణల గుప్పిట్లో విలువైన ఆస్తులు Æ>gê…ÌZ §ólÐ]l§é-Ķæ$Ô>Q ¿¶æ*Ñ$° GMýSP-yìlMýS-MýSPyól B{MýS-Ð]l$-׿Ë$ ^ólçÜ$¢-¯é²Æý‡$. ´ëÌSMö…yýl Æøyýl$zÌZ §ólÐ]l-§é-Ķæ$Ô>Q ¿¶æ*Ñ$ B{MýS-Ð]l$-׿-ÌSOò³ ¯øsîæ-çÜ$Ë$ C^éa…. Æð‡Ððl¯]l*Å A«¨-M>-Æý‡$-ÌSMýS$ íœÆ>ŧýl$^ólÔ>…. ^èlÆý‡ÅË$ ¡çÜ$-MýS$¯ól…§ýl$MýS$ GÐ]lÆý‡* Ð]l¬…§ýl$MýS$-Æ>-Ìôæ§ýl$. B{MýS-Ð]l$׿Ë$ BVýSyýl… Ìôæ§ýl$. E¯]l²-™é«¨-M>-Æý‡$ÌSMýS$ ™ðlÍ-Ķæ$-gôæ-Ô>…. B{MýS-Ð]l$׿-§éÆý‡$-ÌSOò³ MøÆý‡$tÌZÏ MóSçÜ$Ë$ ÐólçÜ$¢-¯é²…. MýSv¯]l ^èlÆý‡ÅË$ ¡çÜ$-Mø-ÐéÌS° hÌêÏ A«¨M>-Æý‡$-ÌS¯]l$ MøÆ>…. ˘ – బి.వి.మాధవరావు, దేవదాయశాఖ ఈఓ, రాజాం -
డాక్టర్ల నిర్లక్ష్యంతోనే బాలుడి మృతి
బొబ్బిలి: చిన్న పిల్లాడిని కుక్క కరిచింది చూడండి బాబూ అంటే వాక్సిన్లు వేసిన వైద్యులు తిరగబెట్టిందని మళ్లీ వస్తే కేజీహెచ్కు తీసుకెళ్లమన్నారు. ఇక్కడే చికిత్స చేయడమో లేక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకుపొమ్మనో చెబితే మా కుమారుడు బతికేవాడని దిబ్బగుడ్డివలస గ్రామానికి చెందిన మృతుడు రామవరపు రమణ (9) తల్లిదండ్రులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుక్కకాటుతో గత నెల 8వ తేదీన స్థానిక సీహెచ్సీలో తల్లిదండ్రులు రమణను వైద్యానికి చేర్చారు. వైద్యులు వ్యాక్సిన్ వేసి ఆస్పత్రిలో ఉంచారు.అంతా నయమైపోయిందని 13వ తేదీన ఇంటికి వెళ్లిపోవచ్చని డాక్టర్లు చెప్పడంతో తల్లిదండ్రులు కృష్ణవేణి, సంగమేశ్వర్రావులు కుమారుడిని తీసుకుని ఇంటికి చేరుకున్నారు. ఇంతలో తెల్లవారుజామున జ్వరం రావడంతో తల్లిదండ్రులు బాలుడు రమణను మళ్లీ సీహెచ్సీకి తరలించారు. దీంతో వైద్యులు పరీక్షించి ఇక్కడ నయం కాదని విజయనగరం జీజీహెచ్కు రిఫర్ చేశారు.అక్కడి డాక్టర్లు బాలుడి పరిస్థితి గమనించి కేజీహెచ్కు తీసుకువెళ్లాలని రిఫర్ చేశారు. కేజీహెచ్కు తరలిస్తుండగా బాలుడు మృత్యువాత పడ్డాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇదంతా స్థానిక సీహెచ్సీ డాక్టర్ల నిర్లక్ష్యం, రిఫర్ కారణంగా జరిగిందని వాపోతున్నారు. రోగులను పట్టించుకోవడం లేదని, అందరినీ వేరే ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారని, మాలాంటి పేదోళ్లకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించే స్థోమత లేదని ప్రభుత్వాస్పత్రిలో వైద్యాన్ని నమ్ముకుంటే తమ పిల్లాడు బలైపోయాడని అల్లాడిపోయారు. ఎమ్మెల్యేకు చెప్పి ఆవేదన: గ్రామంలో మరో నలుగురికి కుక్క కరిస్తే వారు ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం తీసుకోవడంతో బతికిబట్టకట్టారని, మాలాంటి పేదోళ్లం ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లలేక కొడుకును బలిచ్చామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో జరుగుతున్న నిర్లక్ష్యం, చికిత్సను అందించక ప్రైవే టు ఆస్పత్రులకు వెళ్లాలని రిఫర్ చేస్తున్నారని బాలుడి తల్లిక్రి కృష్ణవేణి ఆస్పత్రి కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే బేబినాయన ముందు వాపోయింది. మావైద్యం మేం చేశాంబాలుడి మృతిపై సీహెచ్సీ సూపరింటెండెంట్ శశిభూషణరావు వివరణ కోరగా బాలుడికి అవసరమైన చికిత్సనంతా అందించామన్నారు. బాలుడి పరిస్థితి విషమించడంతోనే జీజీహెచ్, కేజీహెచ్లకు రిఫర్ చేశామని చెప్పారు. -
బ్యాంకర్లు ఆర్థిక వృద్ధికి తోడ్పడాలి
పార్వతీపురం: ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, రుణాల మంజూరు ప్రక్రియలో బ్యాంకర్లు ఉత్సాహంగా పాల్గొని జిల్లా ఆర్థిక వృద్ధికి తోడ్పడాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బ్యాంకర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ పాల్గొని బ్యాంకర్లకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా యంత్రాంగంతో బ్యాంకర్లు నిరంతరం సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. ప్రజల్లో ఆర్థిక క్రమశిక్షణ, ఆర్థిక అక్షరాస్యతపై బ్యాంకర్లు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి ఒక్కరికీ బ్యాంకింగ్ సేవలు అందేలా చూడాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉందన్నారు. ఈ సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎస్.సోమశేఖర్, డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణి, డీటీఓ బి.ప్రసాదరావుతో పాటు వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి -
వడ్డీ రాయితీ ఇవ్వాలిలా..
అన్నదాతకు ఎంతో మేలు చేసే సున్నావడ్డీ పథకానికి 2004లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్రెడ్డి శ్రీకారం చుట్టారు. పంట రుణాలను సకాలంలో చెల్లిస్తే 4 శాతం వడ్డీ రాయితీని తిరిగి రైతులకు చెల్లిస్తామని ప్రకటించారు. ఆచరణలోకి తెచ్చారు. పథకం కింద రుణాలు తీసుకున్న రైతుల నుంచి ఏడాదికి వసూలు చేసే వడ్డీలో కేంద్ర ప్రభుత్వం 3 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 4 శాతం భరించాలి. ఒక రైతు రూ.లక్ష పంట రుణం తీసుకుంటే ఏడాదికి సుమారు 7 వేలు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. సకాలంలో రైతు రుణం చెల్లిస్తే... సున్నావడ్డీ కింద కేంద్రం రూ.3 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ 4 వేలు చొప్పున బ్యాంకులకు చెల్లిస్తాయి. దీనివల్ల రైతుపై వడ్డీభారం పడదు. ఈ సున్నావడ్డీ పథకం రైతుకు ఆర్థికంగా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. సాగుకు ఊతంగా మారుతుంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతులకు ఐదేళ్లూ పూర్తి వడ్డీ రాయితీ అందించి అండగా నిలిచిందని రైతులు చెబుతున్నారు. 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం సున్నావడ్డీ పఽథకం అమలును పూర్తిగా విస్మరించడంపై ఆందోళన చెందుతున్నారు. -
అక్రమ వడ్డీలపై పోలీసుల నిఘా
● నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు ● వడ్డీ వ్యాపారులతో పట్టణ సీఐ సమావేశంపార్వతీపురం రూరల్: అనుమతి లేకుండా వడ్డీ వ్యాపారం సాగించినా, పరిమితికి మించి వడ్డీలు వసూలు చేస్తూ ప్రజలను వేధించినా చట్టపరమైన చర్యలు తప్పవని పార్వతీపురం పట్టణ సీఐ వెంకట్రావు హెచ్చరించారు. ఈ నెల 5న సాక్షి దినపత్రికలో వెలువడిన అప్పుల ఊబిలో చిరు వ్యాపారులు శీర్షికపై ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం పట్టణ పోలీస్ స్టేషన్లో వడ్డీ వ్యాపారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. లైసెన్స్ లేకుండా వ్యాపారం చేయడం నేరమని, అప్పుల పేరుతో సామాన్యులను ఇబ్బందులకు గురిచేయకూడదని స్పష్టం చేశారు. నిబంధనల పరిధిలోనే వ్యాపారాలు నిర్వహించాలని, వేధింపులపై ఫిర్యాదులు అందితే కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. అధిక వడ్డీల కోరల్లో చిక్కిన బాధితులు ధైర్యంగా పోలీసులను ఆశ్రయించాలని కోరారు. సమావేశంలో పట్టణ ఎస్సైలు ప్రయోగమూర్తి, గోవింద్, సిబ్బంది పాల్గొన్నారు. -
జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు చర్యలు
పూసపాటిరేగ: జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను ఆయన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీస్స్టేషన్ పరిసరాలను ఆహ్లాదకరంగా ఉంచాలని, అలాగే పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని, వారి చెప్పే సమస్యలను శ్రద్ధగా విని పరిష్కరించాలన్నారు. స్టేషన్ పరిధిలో ఎక్కువగా సీసీ కెమెరాలు అమర్చాలని, గస్తీ, జాతీయ రహదారిపై పెట్రోలింగ్ వంటి చర్యలను కట్టుదిట్టం చేయాలన్నారు. అనంతరం పోలీస్స్టేషన్ రికార్డులు, సీడీ ఫైల్స్, హిస్టరీ సీట్లు, నాన్బెయిలబుల్ వారెంట్లపై సమీక్షించారు. మహిళలు, బాలలు, సైబర్ నేరాలు, రహదారి భద్రత పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేలా అవగాహన సదస్సులు నిర్వహించాలని చెప్పారు. డయల్ యువర్ 100, 112 ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, సంఘటన స్థలానికి వెంటనే చేరుకుని సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అలాగే పూసపాటిరేగ మండలంలోని కొండగుడ్డిలో జరిగిన హత్య వివరాలను రూరల్ సీఐ రామకృష్ణను అడిగి తెలుసుకున్నారు. ఆ కేసులో నిందితుడికి శిక్ష పడేలా సాక్ష్యాలను సేకరించాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని తెలిపారు. ఆయన వెంట ఎస్బీ సీఐ ఎ.వి.లీలారావు, పూసపాటిరేగ ఎస్ఐ ఐ.దుర్గాప్రసాద్ తదితరులు ఉన్నారు. -
పూరిల్లు దగ్ధం
నెల్లిమర్ల రూరల్: మండలంలోని ఒమ్మి గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ పూరిల్లు దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన లెంక కసవయ్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలి భారీగా మంటలు వ్యాపించి పూరిల్లు కాలిబూడిదైంది. స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. బీరువాలో ఉన్న సుమారు రూ.30వేల నగదు, తులం బంగారం, దుస్తులు అగ్నికి ఆహుతై బాధిత కుటుంబం కట్టుబట్టలతో మిగిలింది. నిరుపేద కుటుంబం కావడంతో ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రెవెన్యూ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆకట్టుకున్న అశ్వాల దౌడులక్కవరపుకోట: మండలంలోని జమ్మాదేవిపేట గ్రామంలో శ్రీనందీశ్వరస్వామి తీర్ధం మహోత్సవం సందర్భంగా గుర్రాల పరుగు పందెం పోటీలను శుక్రవారం నిర్వహించారు. ఈ పోటీల్లో విశాఖపట్నం, అనకాపల్లి, విజయనరగం జిల్లాల నుంచి 13 గుర్రాలు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో అలమండ శ్రీనురాజుకు చెందిన గుర్రం మొదటి స్థానం సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన అశ్వాల యజమానులకు నిర్వాహకులు నగదు బహుమతులను అందజేశారు. బొబ్బిలి: స్థానిక రైల్వే స్టేషన్ను అనుసరించి ఉన్న రైలుపట్టాలపై అనుమానాస్పదంగా సంచరిస్తూ ఆత్మహత్య కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తిని పట్టుకుని కౌన్సెలింగ్ చేసి బంధువులకు అప్పగించిన ఆర్పీఎఫ్ సిబ్బందిని పలువురు అభినందిస్తున్నారు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం నారాయణపురం గ్రామానికి చెందిన పొదిలాపు రాంబాబు(32) అనే వ్యక్తి బొబ్బిలి శివారులో సీతానగరం స్టేషన్ మధ్యలో ప్లాట్ఫాం నంబర్ 1 లైన్లో ఉన్న పట్టాలపై అనుమానాస్పదంగా సంచరిస్తున్నాడు. ఆ వ్యక్తిని గమనించిన రైల్వే ఏఎస్సై హెచ్కే పాణిగ్రహి, హెచ్సీ బి.ఈశ్వర రావు, సిబ్బంది వెంటనే వెళ్లి పట్టుకుని రైల్వేపోస్టుకు తీసుకువచ్చారు. అతనిని విచారణ చేయగా కుటుంబ, వైవాహిక పరయిన సమస్యలతో తాను ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పడంతో కుటుంబసభ్యులు, బంధువుల నంబర్లకు సమాచారమందించి రప్పించి ఆ వ్యక్తిని అప్పగించారు. 8న రా.ర.వే సమావేశం రాజాం సిటీ: ఈ నెల 8న స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాజాం రచయితల వేదిక సమావేశం నిర్వహించనున్నామని వేదిక నిర్వాహకు ఛిజీ గార రంగనాథం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నల్లా రవికుమార్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ‘మనుషులు మాయమయే కాలం’ అనే నవలపై పొదిలాపు శ్రీనివాస్ ముఖ్య ప్రసంగం చేయనున్నారని పేర్కొన్నారు. సమావేశానికి భాషాభిమానులు, రచయితలు, సాహిత్యాభిమానులు, కవులు హాజరుకావాలని కోరారు. భక్తిశ్రద్ధలతో లలితాదేవి పారాయణం రాజాం సిటీ: స్థానిక సంతమార్కెట్ ఆవరణలో వెలిసిన మల్లికార్జున స్వామి దేవాలయంలో శుక్రవారం లలితా పారాయణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అర్చకుడు ధూపం యశ్వంత్స్వామి ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
రైతన్నపై వడ్డీ ఒత్తిడి
మెరకముడిదాం: రైతు సంక్షేమమే ధ్యేయమన్నారు... సాగును బంగారు మయం చేస్తామన్నారు.. పెట్టుబడి సాయం ఠంచన్గా ఇస్తామంటూ హామీ ఇచ్చారు... తీరా అధికారంలోకి వచ్చాక రైతన్న నడ్డి విరిచేలా పంట రుణాలు తీసుకున్న రైతులపై వడ్డీ భారం మోపుతున్నారు. 19 నెలలుగా సున్నా వడ్డీ రాయితీని వర్తింపజేయకుండా ఆవేదనకు గురిచేస్తున్నారు. ఇప్పటికే ఉచిత పంటల బీమా పథకానికి చంద్రబాబు ప్రభుత్వం మంగళం పాడేసింది. పంటలకు అవసరమైన యూరియా అందకుండా రైతన్నను ఆవేదనకు గురిచేస్తోంది. విత్తు నుంచి పంట విక్రయం వరకు అడుగడుగునా అడ్డంకులు అధిగమించాల్సిన దుస్థితి. ఏడాదిన్నరగా సున్నావడ్డీ రాయితీని అందజేయకుండా జిల్లాలోని లక్షలాది మంది రైతులను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. ● రైతులపై వడ్డీ భారం... విజయనగరం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) పరిధిలో 24 బ్రాంచ్లు ఉండగా, వారి పరిధిలో 94 ప్రాథమిక వ్యవసాయ సహకార సరసతి సంఘాలు (సొసైటీలు) ఉన్నాయి. వీటి పరిధిలో లక్ష మంది వరకూ సభ్యులున్నారు. ప్రస్తుతం వీరికి ఏటా రూ.320 కోట్లు వరకూ బ్యాంకు అధికారులు పంట రుణాలు మంజూరు చేస్తున్నారు. డీసీసీబీతో పాటు పలు వాణిజ్య బ్యాంకులు కూడా రైతులకు కనిష్టంగా రూ.లక్ష నుంచి గరిష్టంగా రూ.3 లక్షల వరకూ పంట రుణాలను ఇస్తున్నాయి. లక్ష రూపాయలు రుణం తీసుకున్న రైతులకు వడ్డీ రాయితీ పథకం వర్తిస్తుంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం రాయితీకి ఎగనామం పెట్టడంతో వాణిజ్య బ్యాంకులతో పాటు సొసైటీల నుంచి తీసుకున్న రుణాలకు సంబంధించి అసలుతో పాటు మొత్తం వడ్డీని రైతులే చెల్లించాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఏటా రుణాలు సక్రమంగా చెల్లించే ప్రతి రైతుకు క్రమం తప్పకుండా రూ.3వేలు చొప్పున వడ్డీ రాయితీ ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన వాటా కింద ఇవ్వాల్సిన 4శాతం వడ్డీ రాయితీని గత 19 నెలలుగా ఇవ్వడం లేదు. జిల్లాలో సుమారు రూ.120 కోట్లు మేర వడ్డీ రాయితీ చెల్లించాల్సి ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల వల్ల ప్రతిరైతు ఏటా దాదాపు రూ.8వేల వరకు నష్టపోవాల్సి వస్తోంది. పంట రుణాలపై ప్రభుత్వం 19 నెలలుగా వడ్డీ రాయితీ ఇవ్వకపోవడంతో ఆ భారం రైతులపైనే పడుతోంది. ప్రభుత్వం వడ్డీ రాయితీ విడుదల చేస్తే ఆ మొత్తాన్ని తిరిగి జమ చేస్తామని చెబుతూ, వాణిజ్య బ్యాంకులతో పాటు సొసైటీలు కూడా రైతుల నుంచి వడ్డీ వసూలు చేస్తున్నాయి. ఎవరైనా రైతులు వడ్డీ చెల్లించకపోతే వారికి రుణాలిచ్చేందుకు ఆయా బ్యాంకులు నిరాకరిస్తున్నాయి. రుణం చెల్లింపులో ఏడాదిలో ఒక్కరోజు దాటినా 13 శాతం వడ్డీతో వసూలు చేస్తున్నాయి. వడ్డీల భారం భరించలేక రైతులు తల్లడిల్లుతున్నారు. రైతన్నకు సున్నం.. సర్కారుకు వడ్డీ లాభం సున్నావడ్డీ రుణాలకు చంద్రబాబు ప్రభుత్వం ఎసరు! తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించినా సున్నావడ్డీని అందించని వైనం సమయానికి సున్నావడ్డీ వాటాను చెల్లిస్తున్న కేంద్రప్రభుత్వం 19 నెలలు కావస్తున్నా సున్నావడ్డీ ఊసెత్తని చంద్రబాబు సర్కారు ఏటా రూ.120 కోట ్లవరకు వడ్డీభారం ఆవేదనలో రైతాంగం -
డిఫెన్స్ అకాడమీలో విద్యార్థి అత్మహత్య
కొత్తవలస: మండలంలోని విజయనగరం రోడ్డులో గల ఒక డిఫెన్స్ అకాడమీలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి ముడికి వికాస్(16) తీవ్రమైన తలనొప్పితో బాధ భరించలేక బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై సీఐ సీహెచ్.షణ్ముఖరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాకినాడ జిల్లా కాజులూరు మండలం పల్లెపాలెం గ్రామానికి చెందిన వికాస్ స్థాని డిఫెన్స్ అకాడమీలో ఇంటర్మీడియట్లో ప్రస్తుత విద్యాసంవత్సరంలో చేరాడు. కాగా కొద్ది నెలలుగా వికాస్ తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నట్లు తండ్రి సుబ్రహ్మణ్యంతో పాటూ తోటి విద్యార్థులు తెలిపారు.ఈ క్రమంలో బుధవారం మరోమారు తీవ్రమైన తలనొప్పి రావడంతో కళాశాల సిబ్బంది వికాస్ తండ్రికి ఫోన్లో సమాచారం అందించారు. ఇంటికి పంపించేస్తామని చెప్పగా ఇప్పడు బయల్దేరితే ఇంటికి వచ్చేసరికి అర్ధరాత్రి అవుతుందని, మరుసటిరోజు పంపించాలని కళాశాల సిబ్బందిని మృతుడి తండ్రిని కోరాడు. కాగా తోటి విద్యార్థులు డ్రిల్ కోసం మైదానంలోకి వెళ్లగా హాస్టల్ రూమ్లో ఎవరూ లేని సమయంలో బెడ్షీట్తో ఫ్యాన్కు ఊరివేసుకున్నాడు. తోటి విద్యార్థులు రూమ్కు వచ్చి చూసేసరికి ఫ్యాన్కు వేలాడుతూ కనిపించడంతో వెంటనే కళాశాల సిబ్బంది సహాయంతో కిందికి దించి స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కాగా ఒక్కగానొక్క కొడుకు అర్ధాంతరంగా తనువు చాలించడంతో తండ్రి లబోదిబోమంటూ రోదించాడు. -
సచివాలయంలో పాఠశాల
● శిథిలావస్థకు చేరుకున్న పాఠశాల భవనాలు ● ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు చీపురుపల్లిరూరల్(గరివిడి): ఆ పాఠశాలలో 11 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆ విద్యార్థులకు సరైన తరగతి భవనాలు, కనీసం మరుగుదొడ్ల సదుపాయం లేదు. ఎన్నో ఏళ్లుగా తరగతి భవనాలు శిథిలావస్థకు చేరుకున్నా సరే నాడు–నేడులో ఎలాంటి నిర్మాణాలు చేయలేదు. అయినా సరే ఆ శిథిల భవనాల్లోనే ఉపాధ్యాయులు బోధన చేసేవారు. చివరికి ఐదు నెలల క్రితం వచ్చిన మోంథా తుఫాన్ ప్రభావానికి శిథిలావస్థలో ఉన్నా భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వర్షం వల్ల శ్లాబ్ నుంచి లీకై న నీరు తరగతి భవనాల్లోకి ప్రవేశించి విద్యార్థలు కూర్చునే గచ్చులు బురదమయంగా తయారయ్యాయి. ఆ భవనాలు ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి. ఈ క్రమంలో గత్యంతరం లేక ప్రత్నామ్నాయంగా విద్యార్థులకు బోధన చేసేందుకు స్థానికంగా ఉన్న సచివాలయాన్ని కేటాయించారు. గరివిడి మండలంలోని ఏనుగువలస ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రస్తుతం స్థానిక సచివాలయమే పాఠశాలగా మారింది. స్థానికంగా ఉపాధ్యాయులకు, విద్యార్థులకు పాఠశాల లేకపోవడంతో వారంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గడిచిన ఐదు నెలలుగా సచివాలయంలో బోధన చేస్తున్నప్పటికీ పాఠశాల వాతావరణం ఏమాత్రం కనిపించదు. విద్యార్థులు ఆడుకునేందుకు ఆటస్థలం లేదు. పాఠశాల ఉన్నట్లయితే సరిపడా తరగతి భవనాలతో పాటు విద్యార్థులు ఆడుకునేందుకు ఆటస్థలం ఉంటుంది. పాఠశాలకు వెళ్లాలనే ఆసక్తి విద్యార్థుల్లో పెరుగుతుంది. పాఠశాలలో ఉండే సౌకర్యాలు, సదుపాయాలు, ఆటస్థలం లాంటివి సచివాలయంలో లేనందున పిల్లల్లో పాఠశాలకు వెళ్లాలని, పంపించాలని తల్లిదండ్రుల్లో నిరాసక్తి కలుగుతోంది. ప్రస్తుతం గ్రామంలో విద్యార్థులు చదువుకునేందుకు సరైన తరగతి భవనాలు లేకపోయిన కారణంగా పిల్లలను పాఠశాలల్లో చేర్పించడం లేదన్న విమర్శలు గ్రామస్తుల నుంచి వస్తున్నాయి. ఈ కారణంగా పిల్లలు తక్కువగా ఉన్నారని, తరగతి భవనాలు నిర్మించి ఉంటే పిల్లల అడ్మిషన్లు పెరుగుతాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఎన్నో ఏళ్లుగా భవనాలు శిథిలావస్థకు చేరుకున్నా సంబంధిత శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పాఠశాల అభివృద్ధికి నోచుకోలేదని వాపోతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాడు–నేడు కార్యక్రమం పేరుతో ఎన్నో పాఠశాలలు రూపుదిద్దుకున్నాయి. ఆ పాఠశాలల మాదిరిగా ఈ పాఠశాల తరగతి భవనాలను అభివృద్ధి చేయాల్సి ఉండగా నిర్లక్ష్యంతో వదిలేశారని ఆరోపిస్తున్నారు. ఈ నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థులు సచివాలయానికి వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఇప్పటికై నా విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా పాఠశాల తరగతి భవనాలను నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
12న జాబ్ మేళా
● జేఎన్టీయూ జీవీ వీసీ వీవీ సుబ్బారావు విజయనగరం రూరల్: స్థానిక జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయంలో ఈ నెల 12న జాబ్ ఫెయిర్–2026 నిర్వహించనున్నట్లు ఉపకులపతి వీవీ సుబ్బారావు తెలిపారు. జాబ్ ఫెయిర్ను పురస్కరించుకుని వాల్పోస్టర్ను విశ్వవిద్యాలయం డైరెక్టర్లతో కలిసి గురువారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జేఎన్టీయూ జీవీ, నిర్మాణ్ ఆర్గనైజేషన్–ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 12న ఉదయం 9 గంటలకు ఈ జాబ్ ఫెయిర్ను నిర్వహించనున్నామన్నారు. బీటెక్, డిగ్రీ, డిప్లమో, ఐటీఐ చదివిన నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా జాబ్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ జాబ్ ఫెయిర్లో మేధా సర్వో, రాయల్ ఎన్ఫీల్డ్, టాటా ఎలక్ట్రానిక్స్, వోల్టాస్, కియా మోటార్స్, హ్యుండయ్, యోకోహామా వంటి ప్రతిష్టాత్మక కంపెనీలు పాల్గొని ట్రైనీ, అసెంబ్లీ ఆపరేటర్, ఆపరేటర్, ఎన్ఏపీఎస్ ట్రైనీ ఉద్యోగాలు అందిస్తున్నాయన్నారు. ఉద్యోగ స్థానాలు ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఉంటాయని పేర్కొన్నారు. జీతభత్యాలు నెలకు రూ.11 వేల నుంచి రూ. 21 వేలు ఉంటాయని తెలిపారు. జేఎన్టీయూలో ఓరియంటేషన్ అభ్యర్థులను ఇంటర్యూలు, ఎంపిక ప్రక్రియలకు సిద్ధం చేయడానికి ఈ నెల 9 నుంచి 11 వరకు జేఎన్టీయూలో ఓరియంటేషన్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆసక్తిగల అభ్యర్థులు రూ.100 రిజిస్ట్రేషన్ రుసుం చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు వారి విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు బయోడెటాతో జతచేసి అందించాలని, విజయనగరం, సమీప జిల్లాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలరని కోరారు. -
సివిల్ సర్వీసెస్ కబడ్డీ పోటీలకు భాను
డెంకాడ: ఈనెల 9 నుంచి 12వ తేదీ వరకూ చండీగఢ్లో జరగనున్న ఆలిండియా సివిల్ సర్వీసెస్ కబడ్డీ నేషనల్ పోటీలకు రఘుమండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయిని కుర్మాన భాను ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా జట్టు తరఫున ఆమె కబడ్డీ పోటీల్లో పాల్గొంటారు. జాతీయ పోటీలకు ఎంపికై న ఆమెను పాఠశాల హెచ్ఎం బమ్మిడి ఇందిరాదేవి, కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు కోరాడ ప్రభావతి, దొర, ఐవీపీ రాజు, ఉపాధ్యాయులు అభినందించారు. సచివాలయం ఉద్యోగి శంకర్రావు నెల్లిమర్ల: ఆలిండియా సివిల్ సర్వీస్ ఉద్యోగుల కబడ్డీ పోటీలకు సచివాలయం ఉద్యోగి కాళ్ల శంకర రావు ఎంపికయ్యారు. మొయిద సచివాలయంలో సంక్షేమ, విద్యా సహాయకుడిగా పని చేస్తున్న కాళ్ల శంకర రావు ఈ నెల 9 నుంచి 14వరకు పంజాబ్ రాజధాని చండీగఢ్లో జరగబోయే జాతీయస్థాయి సివిల్ సర్వీస్ ఉద్యోగుల కబడ్డీ చాంపియ్ షిప్లో ఆంధ్ర సివిల్ సర్వీస్ ఉద్యోగుల జట్టు తరఫున ఎంపికయ్యారు. అలాగే జరజాపుపేటకు చెందిన కాళ్ల శంకర రావు జాతీయ పోటీలకు 4వ సారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శంకర రావు జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికవడం పట్ల ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్ బాబు, ఎంపీడీఓ కె. రామకృష్ణ రాజు, జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారులు, రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ బొమ్మన రామారావు, జరజాపుపేట, మొయిద గ్రామ పెద్దలు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ పెద్దలు అభినందించారు. -
వ్యక్తి ఆత్మహత్య
సాలూరు: పట్టణంలోని డబ్బివీధిలో నివాసముంటున్న బొబ్బిలి పరమేశు(37) తన ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గురువారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పరమేశు మూర్ఛవ్యాధితో బాదపడుతున్నాడు. దీంతో మనస్తాపానికి గురై తన ఇంటిలో ఉరివేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒలింపియాడ్లో శ్రీజన్ విద్యార్థుల ప్రతిభపార్వతీపురం రూరల్: సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 33వ సర్ సీవీ రామన్ యంగ్ జీనియస్ ఒలింపియాడ్ (2025–26)లో పార్వతీపురంలోని శ్రీజన్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో గురువారం జరిగిన కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ పోటీల్లో నాలుగో తరగతి విద్యార్థిని పి.చందనశ్రీ రాష్ట్రస్థాయిలో బంగారు పతకం సాధించింది. జిల్లా స్థాయిలో ఎం.లాలిత్య (3వ తరగతి), పి.మోక్షితాప్రియ (4వ తరగతి), కె.పార్థసారథి (5వతరగతి) ప్రథమ బహుమతులు, డి.రుత్ (4వ తరగతి), వి.ఉమామహేశ్ (7వ తరగతి) ద్వితీయ బహుమతులు అందుకున్నారు. -
జూలై 15 కి ఆస్పత్రుల భవన నిర్మాణాలు పూర్తి చేయాలి
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో వేర్వేరు ఇంజినీరింగ్ ఏజెన్సీల ద్వారా నిర్మాణంలో ఉన్న ఆస్పత్రుల భవనాలన్నీ జూలై 15లోగా పూర్తి చేసి అప్పగించాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, ఇంజినీరింగ్ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. హెల్త్ క్లినిక్ భవనాలు, పీఎం హెల్త్ మిషన్ కింద మంజూరైన భవనాలు, 15వ ఆర్థిక సంఘం నిధులతో మంజూరైన 24 హెల్త్ క్లినిక్ భవనాలు, ఇప్పటికే పూరైన వాటిని డీఎంహెచ్ఓకు అప్పగించాలని స్పష్టం చేశారు. ఇంకా శ్లాబ్ లెవెల్లో ఉన్న వాటిని పూర్తి చేయాలని, ప్రారంభం కాని వాటికి వెంటనే టెండర్లు పిలవాలని తెలిపారు. స్థలం లేని వాటి వివరాలు ఇస్తే స్థలం కేటాయించనున్నామన్నారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి, డీసీహెచ్ఎస్ డాక్టర్ పద్మశ్రీ రాణి, ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ భారతి, పంచాయతీ రాజ్ ఈఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
రెవెన్యూ వసూళ్లలో వెనుకబాటు
● కీలకశాఖల్లో లక్ష్యాలకు దూరంగా ప్రగతి ● సమీక్షలో గుర్తించిన కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి విజయనగరం అర్బన్: జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ శాఖల రెవెన్యూ వసూళ్ల పురోగతిపై కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి గురువారం తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో పలుశాఖల్లో తీవ్ర లోటుపాట్లు ఉన్నట్లు స్పష్టమైంది. శాఖల వారీగా నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా వసూళ్లు జరగకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలో 98.29 శాతం పురోగతి నమోదైనప్పటికీ ఇంకా పూర్తి లక్ష్యసాధన జరగకపోవడంపై గుర్తుచేశారు. ఫిబ్రవరి నెలలో అదనపు భారం పడనున్న నేపథ్యంలో వసూళ్లపై మరింత శ్రద్ధ చూపి లక్ష్యాలను సాధించుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ అసహనం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖలో రూ.1,373.10 కోట్ల లక్ష్యానికి గాను ఇప్పటివరకు రూ.1,275.01 కోట్లు మాత్రమే వసూలవడంతో దాదాపు రూ.98 కోట్ల లోటు నెలకొంది. ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటున్నప్పటికీ వసూళ్లలో ఆశించిన వేగం లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. వాణిజ్యపన్నుల శాఖలో జనవరి వరకు రూ.322.20 కోట్ల లక్ష్యానికి గాను కేవలం రూ.238.20కోట్లు మాత్రమే వసూలవడం వల్ల 73.92 శాతానికి పురోగతి పరిమితమైంది. ఇతర శాఖలతో సమన్వయం లోపించకుండా చూసుకుని లక్ష్యాలను సాధించుకోవాలని సూచించారు. గనులు, భూగర్భశాఖలో రూ.124 కోట్ల లక్ష్యానికి రూ.71.93 కోట్లు మాత్రమే వసూలవడం ద్వారా పెద్దస్థాయిలో ఆదాయ లోటు స్పష్టమైంది. లే అవుట్లు, లీజులు, రవాణా అంశాలపై పర్యవేక్షణ బలహీనంగా ఉండడమే ఇందుకు కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ పరిధిలో డిటెక్షన్, క్వార్టర్లీ లైఫ్ ట్యాక్స్, ఫీజుల వసూళ్లలోనూ నిర్లక్ష్యం కనిపిస్తోందని సమీక్షలో అధికారులపై అసంతృప్తి కలెక్టర్ వ్యక్తం చేశారు. అటవీశాఖ ద్వారా జనవరి వరకు రూ.35.857 లక్షలు మాత్రమే వసూలవడం కూడా ఆశించిన స్థాయికి తగ్గిందని సమీక్షలో వెల్లడైంది. దీంతో అక్రమ కార్యకలాపాల నియంత్రణలో రోజువారీ పర్యవేక్షణలో లోపాలు ఉన్నాయని జిల్లా యంత్రాంగం స్వయంగా అంగీకరించిన పరిస్థితి నెలకొంది. సమావేశంలో జీఎస్టీ జాయింట్ కమిషనర్ జి.నిర్మలజ్యోతి, జిల్లా అటవీశాఖ అధికారి ఆర్.కొండలరావు, చిట్స్ రిజిస్ట్రార్ ఎస్ఎస్రేవతి, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఎ.శ్రీరంగందొర, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డి.మణికుమార్, మైన్స్ అండ్ జియోలజీ జిల్లా అధికారి సీహెచ్.సూర్యచంద్రరావు, ఎంవీఐ దుర్గాప్రసాద్ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
సినీ ఆర్టిస్ట్ జయవాహిని మృతి
● పుట్టి పెరిగింది విజయనగరంలోనే ● కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి ● సంతాపం వ్యక్తం చేసిన సినీ, టీవీ ఆర్టిస్టులువిజయనగరం టౌన్: విజయనగరంలోని పూల్బాగ్ కాలనీలో జన్మించి, మహారాజా కళాశాలలో విద్యాభ్యాసం పూర్తిచేసుకుని, సినీ ఇండస్ట్రీపై మక్కువతో మద్రాస్ వెళ్లి అంచెలంచెలుగా ఎదిగి, తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న నటి పద్మక్కగా పిలుచుకునే జయవాహిని కొంతకాలంగా ప్రాణాంతక కేన్సర్ వ్యాధితో బాధపడుతూ బుధవారం రాత్రి విజయనగరంలోనే తుదిశ్వాస విడిచారు. ఆమె మృతిచెందారన్న వార్త విన్న సినీ, టీవీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఆమె సన్నిహితురాలు విజయనగరం వాసి, మూవీ, టీవీ ఆర్టిస్ట్ కరాటే కల్యాణి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయనగరంలో పద్మక్కగా పిలుచుకునే వాళ్లమని, కరాటే విద్య నేర్చుకున్నారని, అప్పట్లో పద్మక్కను రాంబో అని అందరూ పిలుచుకునేవాళ్లమన్నారు. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో సహాయనటిగా, టెలివిజన్, సినీరంగాల్లో చిన్న పాత్రలతో తన నట ప్రస్ధానాన్ని ప్రారంభించి ప్రేక్షకుల అభిమానం చూరగొన్నారన్నారు. రఘుపతి వెంకయ్యనాయుడు చిత్రంలో కథానాయికగా నటించి ప్రశంసలు పొందారన్నారు. చివరిగా బహిర్భూమి, పోలీస్ వారి హెచ్చరిక సినిమాల్లో నటించారని తెలిపారు. టీవీ సీరియల్స్లో నిన్నే పెళ్లాడతా, నాగమ్మ, జయం, అభిమానం వంటి వాటిలో తనదైన శైలిలో ప్రతిభ చూపి అందరి మన్ననలు పొందారన్నారు. విజయనగరంలోని దాసన్నపేట సింగపూర్ సిటీలో డాల్పిన్ హైట్స్లో ఉన్న ఆమె స్వగృహం వద్ద విషాదఛాయలు అలముకున్నాయి. రోటరీ స్వర్గధామంలో ఆమె అంత్యక్రియలను కుటుంబసభ్యులు పూర్తిచేశారు. టీవీ,సినీ ఆర్టిస్ట్లు, కుటుంబ సభ్యులు, అభిమానులు తమ సంతాపం వ్యక్తం చేశారు. -
మైనింగ్ భూముల సర్వే
మెరకముడిదాం: మండలంలోని కొత్తకర్ర, బుదరాయవలస, చినరవ్యాం, చినబంటుపల్లి గ్రామాల రెవెన్యూ పరిధిలో ఐరన్ఓర్ మైనింగ్ తవ్వకాలకు సంబంధించిన భూములను ఆర్ఐ డి.రామ్కుమార్, సర్వేయర్ రామకృష్ణలు గురువారం సర్వే చేశారు. అయితే ఆయా గ్రామాల్లో మైనింగ్ తవ్వకాలను జరుపుకునేందుకు గతంలో తమ సంస్థలకు ప్రభుత్వం భూములు కేటాయిస్తూ అనుమతులను ఇచ్చిందని, అందులో కొంత భూమిలో మాత్రమే మైనింగ్ తవ్వకాలు జరిపామని, అప్పట్లో తవ్వకుండా వదిలేసిన మిగులు భూముల్లో ఇప్పుడు తవ్వకాలకు అనుమతులను ఇవ్వాలని ప్రభుత్వాన్ని సంబంధిత యాజమాన్యాలు కోరాయి. దీంతో ఈ భూములను పూర్తిస్థాయిలో సర్వే చేసి తనకు నివేదికను అందజేయాలని కలెక్టర్ రామసుందరరెడ్డి స్థానిక తహసీల్దార్ సులోచనారాణిని అదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక రెవెన్యూ అధికారులు ఆర్ఐ డి.రామ్కుమార్, సర్వేయరు రామకృష్ణలు గురువారం ఆయా గ్రామాల రెవెన్యూపరిధిలో గతంలో మైనింగ్తవ్వకాలకు అనమతులు ఇచ్చిన భూములను సర్వే చేశారు. దీనిపై పూర్తిస్థాయి నివేదికను త్వరలో జిల్లా అదికారులకు అందజేయనున్నట్టు రెవెన్యూ అధికారులు తెలిపారు. -
షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం
పార్వతిపురం రూరల్: పట్టణంలోని 29వ వార్డు రామాపురం కాలనీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఓ ఇల్లు గురువారం అగ్నికి ఆహుతైంది. స్థానిక నివాసి చింతల రమణమ్మ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఫ్రిడ్జ్, బీరువా, దుస్తులతో పాటు రూ.10 వేల నగదు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. సర్వం కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితురాలు వేడుకుంటోంది. గుండెపోటుతో హెడ్కానిస్టేబుల్ మృతివంగర: స్థానిక పోలీస్స్టేషన్లో హెడ్కానిస్టేబుల్గా పనిచేస్తున్న నడిపిల్లి సత్యనారాయణ(55) గురువారం గుండెపోటుతో మృతిచెందారు. ఎని మిది నెలలుగా ఆయన వంగర పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. రెండు రోజుల క్రితం గుండె సంబంధిత సమస్య రావడంతో విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. గురువారం ఒక్కసారిగా గుండెపోటు రావడంతో మృతిచెందారు. విజయనగరానికి చెందిన ఆయనకు భార్య క్రాంతిసౌజన్య ఉన్నారు. ఆయన మృతి పట్ల సీఐ హెచ్ ఉపేంద్రరావు, ఎస్సై షేక్ శంకర్, పోలీస్ సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు. పొట్టేళ్ల పందాలపై పోలీసుల దాడులువీరఘట్టం: మండలంలోని కడకెల్ల గ్రామ శివారులో జరుగుతున్న పొట్టేళ్ల పందాలపై ఎస్సై ఎస్.షణ్ముఖరావు తన సిబ్బందితో గురువారం దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.1500 స్వాధీనం చేసుకున్నారు. అలాగే పందెంలో ఉపయోగించిన రెండు పొట్టేళ్లను స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యంవిజయనగరం క్రైమ్ : విజయనగరం రైల్వే స్టేషన్ సమీపంలోని పోలీస్ అవుట్ పోస్ట్ వద్ద గుర్తు తెలియని మృతదేహాన్ని వన్టౌన్ పోలీసులు గురువారం కనుగొన్నారు. మృతుడి వయస్సు 55 ఉంటుందని చామన ఛాయ రంగుతో నీలం రంగు షార్ట్, వైట్ కలర్ ఫుల్హ్యాండ్స్ బనియన్ వేసుకున్నాడని ఏఎస్సై, రైటర్ జగన్మోహన్ తెలిపారు. హెచ్సీ రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారన్నారు. ఇద్దరికి గాయాలుగజపతినగరం: స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రగాయాలపాలయ్యారు. దత్తిరాజేరు మండలం రాజుల రామచంద్రపురం గ్రామానికి చెందిన వెంకటరమణ జాతీయ రహదారి దాటుతుండగా కొరాపుట్కు చెందిన సిద్దూరాత్ తన ద్విచక్రవాహనంతో ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈఘటనలో గాయపడిన ఇద్దరిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వెంకటరమణ పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎస్సై కిరణ్ కుమార్ నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చేపల చెరువు వ్యాపారి ఆత్మహత్యబలిజిపేట: చేపల చెరువు వ్యాపారంలో నష్టం రావడంతో మండలంలోని గౌరీపురం గ్రామానికి చెందిన ఎస్.సత్యనారాయణ(48) తట్టుకోలేక గుళికలు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై సింహాచలం తెలిపారు. గ్రామానికి చెందిన సత్యనారాయణ వృత్తిరీత్యా చేపల చెరువు లీజుకు తీసుకుని నిర్వహిస్తున్నాడు. దీనిలో రూ.5లక్షలు నష్టం రావడంతో భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుమారుడు నాగరాజు ఇచ్చిన ఫిర్యాదుమేర కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
జాతర ఖర్చుల సంగతేంటి?
● సమన్వయ సమావేశంలో ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు ● స్పందించని ఎమ్మెల్యే కళావెంకటరావు, ఆలయ కమిటీ చీపురుపల్లి: కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర నిర్వహణకు సుమారు రూ.40 లక్షల వరకు ఖర్చు అవుతుంది.. ఆ డబ్బులను ఎక్కడి నుంచి పోగుచేస్తారో ఆలయ కమిటీ సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు సమక్షంలో గురువారం జరిగిన జాతర సమన్వయ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, పౌరసరఫరాల కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గద్దే బాబూరావు ప్రశ్నించారు. దీనికి ఎమ్మెల్యే ‘కళా’తో సహా ఆలయ కమిటీ సభ్యులు ఒక్కరూ స్పందించలేదు. సమాధానం ఇవ్వలేదు. అక్కడే ఉన్న దేవదాయశాఖ ఈఓ తమ శాఖ నుంచి రూ.15 లక్షలు ఇస్తామని వెల్లడించారు. మిగిలిన డబ్బు గురించి ఆయన పదేపదే ప్రశ్నించినా సమాధానం లేకపోవడంతో ఎమ్మెల్యే, కమిటీ సభ్యులే జాతర నిర్వహణ చూసుకోవాలంటూ ప్రసంగాన్ని ముగించారు. జాతర విజయవంతానికి ప్రతీ ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎస్.రాఘవులు, సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.శంకరావు, తహసీల్దార్ డి.ధర్మరాజు, ఎంపీడీఓ ఐ.సురేష్, ఆలయ కమిటీ చైర్మన్ గవిడి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలు ప్రశ్నిస్తేచాలు... ఇదిగో పనులు పూర్తి చేసేస్తామంటూ టీడీపీ నేతలు ప్రకటనలు చేస్తారు.. వాటిని ప్రజలు నమ్మేలే ఎల్లోమీడియా వార్తలు వడ్డిస్తుంది. వంతెన పూర్తయినట్టే అన్న రీతిలో కథనాలతో మభ్యపెడుతుంది. తీరా క్షేత్రస్థాయిలో చూస్తే.. పనుల ఆనవాళ్లు కనిపించవు.
గత ప్రభుత్వం బలసల రేవు వంతెన కోసం నిర్మించిన పిల్లర్లు పునఃప్రారంభిస్తాం వాల్తేరు వద్ద నాగావళి నదిపై వంతెన నిర్మాణం పనులు తాత్కాలికంగా నిలిచాయి. కాంట్రాక్టర్కు నోటీసులు ఇచ్చాం. త్వరలో పనులు ప్రారంభిస్తాం. ఇక్కడి వంతెన ఆవశ్యకతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. వంతెన నిర్మాణం వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటాం. – బీవీ నాయక్, ఆర్అండ్బీ ఏఈ, బలసలరేవు వంతెన విభాగం రాజాం/సంతకవిటి: సంతకవిటి మండలంలోని వాల్తేరు గ్రామం వద్ద నాగావళి నదిపై తలపెట్టిన బలసలరేవు వంతెన... 50 గ్రామాల ప్రజల రాకపోకల కష్టాలను తీర్చే వారధి. వంతెన నిర్మాణం ఆవశ్యకత, దశాబ్దాలుగా ప్రజల పోరాటాన్ని గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గుర్తించింది. ఆర్అండ్బీ నుంచి రూ.87 కోట్లు మంజూరు చేయించి వంతెన పనులను ప్రారంభించింది. పిల్లర్ల స్థాయి వరకు నిర్మాణం పూర్తిచేసింది. ఇంతలో ఎన్నికలు రావడం.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వంతనె నిర్మాణం ‘ఎక్కడవేసిన గొంగలి అక్కడే’ అన్న చందంగా మారింది. ఏడాదిన్నరగా వంతెనవైపు కన్నెత్తి చూసేవారే కరువయ్యారు. పనులు ఒక్కడుగు కూడా ముందుకు కదలలేదు. చిన్న ఇసుకరేణువు పనికూడా చేపట్టలేదు. ఇప్పటికే అందుబాటులోకి రావాల్సిన వంతెన పనులు నిలిచిపోవడంతో ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ప్రయాణ కష్టాలు యథాతథంగా మారిపోయాయంటూ వాపోతున్నారు. ● బాబు చేతిలో మోసపోతున్న ప్రజలు సంతకవిటి మండలం వాల్తేరు వద్ద 1998లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనే వంతెన నిర్మా ణానికి నిధులు మంజూరు చేసినట్లు చంద్రబాబునాయుడు ప్రకటించారు. కానీ ఒక్క పైసా కూడా మంజూరు చేయలేదు. అప్పటి నుంచి వాల్తేరు గ్రామస్తులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు వంతెన కోసం పోరుబాట సాగించారు. అధికారులు, పాలకులకు వినతులు అందజేశారు. 2014లో రెండేళ్ల పాటు నిరవధిక నిరాహార దీక్షలు కొనసాగించారు. అయినా, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కనికరించలేదు. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజల వంతెన సమస్యను గుర్తించింది. నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించింది. 560 మీటర్ల పొడవున నిర్మించే వంతెనకు 16 పిల్లర్లకు తొలుత నాగావళి నదీ గర్భంలోని 8 పిల్లర్లను స్లాబ్ స్థాయివరకు పూర్తిచేసింది. రెండు వైపులా వంతెన అప్రోచ్ రోడ్డు నిర్మాణం కోసం రైతుల నుంచి 14 ఎకరాల భూమిని సేకరించింది. వంతెన పూర్తవుతుందని, కొద్దినెలల్లో ప్రయాణ కష్టాలు తొలగుతాయని ప్రజలు సంతోషించిన వేళ.. ఎన్నికలు రావడం.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. పనులు పూర్తిచేసేందుకు శ్రద్ధచూపే నాథుడే కరువయ్యారు. పూర్తయితే ప్రయోజనం వంతెన నిర్మాణం పూర్తయితే సంతకవిటి నుంచి ఆమదాలవలస, శ్రీకాకుళం ప్రాంతాలకు రహదారి సౌకర్యం కలుగుతుంది. వాల్తేరు, పనసపేట, గారన్నాయుడపేట, చిత్తారిపురం, కావలి, గోకర్ణపల్లి, సిరిపురం, జీఎన్పురం, జానకీపురం, శేషాద్రిపురం, అప్పలఅగ్రహారం, బూరాడపేట, మంతిన, మల్లయ్యపేట, రామారాయపురం, మల్లయ్యపేట, చింతలపేట, మందరాడ, మండాకురిటి తదితర గ్రామాలతో పాటు ఆమదాలవలసలో పలు మండలాలుకు రహదారి సౌలభ్యం కలుగుతుంది. దూరం తగ్గుతుంది. నాటుపడవలపై నదిని దాటాల్సిన అవసరం ఉండదు. పనులు సాగువు.. కష్టాలు తీరవు..! వాల్తేరు వద్ద నాగావళి నదిపై వంతెన నిర్మించాలని దశాబ్దాలుగా ప్రజల పోరాటం అధికారంలోకి రాగానే రూ.87 కోట్లతో పనులు ప్రారంభించిన గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పిల్లర్ల స్థాయి వరకు నిర్మాణం అప్పట్లో చకచకా సాగిన పనులు ఏడాదిన్నరగా పనులను పట్టించుకోని చంద్రబాబు సర్కారు నీరుగారిన డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ హామీ ఆవేదనలో 50 గ్రామాల ప్రజలు -
11 బార్లకు లైసెన్సుల మంజూరు
● కలెక్టర్ రాంసుందర్ రెడ్డి చేతుల మీదుగా లాటరీ ప్రక్రియ ● ప్రభుత్వానికి రూ.3.10 కోట్ల ఆదాయం విజయనగరం రూరల్: జిల్లాలో మిగిలిపోయిన 11 బార్లకు లైసెన్స్లు మంజూరయ్యాయి. కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి లాటరీతీసి బార్లు కేటాయించారు. జిల్లాలోని 31 బార్లకు గతంలోనే 20 బార్లకు లైసెన్సులు మంజూరు చేయగా మిగిలిన 11 బార్లకు ఎకై ్సశాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. బార్ల లైసెన్సులకు 62 మంది దరఖాస్తు చేసుకోగా, దరఖాస్తు ఫీజు రూపంలోనే ప్రభుత్వానికి రూ.3.10 కోట్లు ఆదాయం లభించింది. లాటరీ ప్రక్రియ నిర్వహణకు ఆడిటోరియంలో 6 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్ వద్ద తహసీల్దార్, ఒక సీఐను నియమించారు. రిజర్వ్ 1, రిజర్వ్ 2 దరఖాస్తుదార్ల పేర్లను సైతం లాటరీలో ఎంపిక చేశారు. రెండు రౌండ్లలో లాటరీ ప్రక్రియ ముగించారు. కార్యక్రమంలో అబ్కారీశాఖ డీసీ వై.శ్రీనివాసచౌదరి, ఈఎస్ బి.శ్రీనాథుడు, ఏఈఎస్ ఎ.శ్రీరంగందొర, ఎకై ్సజ్ సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
డిప్యూటీ సీఎం ఎక్కడ?
డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇక్కడ వంతెన నిర్మాణం నిమిత్తం ప్రజలు పోరాటాన్ని చూసి సంఘీభావం తెలిపారు. వంతెన పోరాట కమిటీ ఏర్పాటుచేసిన నిరవధిక దీక్షల్లో భాగంగా 2018 అక్టోబర్ 20న పవన్ వాల్తేరుకు వచ్చి దీక్షలో పాల్గొన్నారు. తమకు అధికారం వచ్చిన తరువాత ఇక్కడ వంతెన ఎందుకు నిర్మాణం జరగదో చూస్తామంటూ ప్రగల్బాలు పలికారు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. ప్రజలను వంచించడం సబబుకాదని చంద్రబాబుకు అల్టిమేటం ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా బలసలరేవు వంతెన పరిస్థితిని కనీసం పట్టించుకోవడంలేదు. ఈయన కూడా చంద్రబాబు బడిలో చేరడంతో వంతెన నిర్మాణంపై నమ్మకం సన్న గిల్లుతోందన్న వ్యాఖ్యలు ఈ ప్రాంత ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. -
రోడ్లు ఇలా.. భక్తులు వచ్చేది ఎలా?
● దుమ్మధూళితో నిండిన రామతీర్థం ● ఈ ఏడాది శివరాత్రి ఉత్సవాలకు ఇబ్బందులు తప్పవంటూ భక్తుల నిట్టూర్పు ఆలయానికి వెళ్లే ప్రధాన రోడ్డులో కొనసాగుతున్న పనులు నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని రాములోరి ఆలయంలో ఈ నెల 15 నుంచి రెండు రోజుల పాటు శివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. వీటికి రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. ఉత్సవాలు సమీపిస్తున్నా రోడ్డు విస్తరణ పనులు పూర్తిచేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. నెల్లిమర్ల–రణస్థలం రోడ్డులో నెల్లిమర్ల నుంచి రామతీర్థం మీదుగా ఎంబేరేయగుళ్లు వరకు రెండు నెలలే కిందట ప్రారంభించిన విస్తరణ పనులు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో జరగనున్న శివరాత్రి ఉత్సవాలకు అవస్థలు తప్పేలా లేవని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేవస్థానానికి వెళ్లే రోడ్డు అసంపూర్తిగా వదిలేయడంపై అసహనం వ్యక్తంచేస్తున్నారు. రెండు నెలల కిందట ప్రారంభించిన పనులు పూర్తి కాకపోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా మట్టి కుప్పలు వేయడంతో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోందని, జాతరకు విచ్చేసే భక్తులు ఇబ్బందులు పడే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. శివరాత్రి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని పనులు చకచకా పూర్తిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికే రామతీర్థం పరిసర ప్రాంతాలు అస్తవ్యస్తంగా మారాయని, రోడ్డంతా దుమ్ముధూళితో దర్శనమిస్తోందని, జాతర నాటికి ఈ పరిస్థితులను చక్కదిద్దాలని అధికార యంత్రాంగానికి భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. కొనసాగుతున్న విస్తరణ పనులు... నెల్లిమర్ల నుంచి రామతీర్థం మీదుగా సతివాడ వరకు రోడ్డు విస్తరణ పనులకు గత ప్రభుత్వంలోనే నిధులు మంజూరయ్యాయి. పనులు కూడా అప్పట్లో చకచకా జరిగాయి. రహదారికి ఇరువైపులా బెర్ముల ఏర్పాటు చేయడంతో పాటు సుమారు ఎనిమిది చోట్ల మినీ కల్వర్టులు నిర్మించారు. ప్రభుత్వం మారడంతో విస్తరణ పనులకు బ్రేకులు పడ్డాయి. 16 నెలల సుదీర్ఘ విరామం తరువాత విస్తరణ పనులు ఇటీవల పునఃప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా సంక్రాంతికి ముందు తంగుడుబిల్లి కూడలి నుంచి నెలివాడ ఆలయం వరకు సుమారు కిలోమీటరు మేర మాత్రమే తారుపోసి వదిలేశారు. అనంతరం రామతీర్థం ప్రధాన రోడ్డులో ప్రధాన కాలువ పనులు ప్రారంభించారు. నిర్మాణం పూర్తయిన చోట కాలువలపై పలకలువేస్తూ కొందరు రోడ్డును ఆక్రమిస్తుండడంతో రోడ్డు విస్తరణ చేపట్టినా ప్రయోజనం శూన్యంగా కనిపిస్తోందని స్థానికులు వాపోతున్నారు. -
పైడితల్లి హుండీల ఆదాయం రూ.7,08,473లు
డెంకాడ: మండలంలోని జొన్నాడ పైడితల్లి అమ్మవారి హుండీల ఆదాయాన్ని దేవదాయ శాఖ అధికారులు గురువారం లెక్కించారు. ఈనెల 2 నుంచి 5వ తేదీ వరకు జరిగిన జాతరలో భక్తులు సమర్పించిన కానుకల రూపంలో రూ.7లక్షల 8వేల 473లు వచ్చినట్టు ఈఓ శ్రీనివాస్ తెలిపారు. సిద్ధమవుతున్న వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయం ● త్వరలో ప్రారంభం... ఇక అక్కడి నుంచే కార్యకలాపాలు సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం రింగురోడ్డులో దాసన్నపేట వద్ద చేపట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభానికి ముస్తాబవుతోంది. తుది నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్నశ్రీను) నిరంతరం పనులను పర్యవేక్షిస్తున్నారు. ఉగాది నాటికి అన్ని పనులూ పూర్తిచేసుకుని ప్రారంభానికి సిద్ధం చేస్తామని ఆయన తెలిపారు. ప్రారంభోత్సవం తరువాత నుంచి పార్టీ కార్యకలాపాలన్నీ ఇక్కడ నుంచే కొనసాగిస్తామన్నారు. మీడియా సమావేశాలు, పార్టీ కార్యకర్తలకు శిక్షణ, జిల్లా స్థాయి విస్తృత సమావేశాలు ఇక్కడే నిర్వహిస్తామని చెప్పారు. మీడియాసెల్ కూడా ఇక్కడే ఉంటుందని, పార్టీ పరమైన సమాచారం మీడియాకు అందించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని, మీడియాకోసం ప్రత్యేక రూమ్ కేటాయిస్తామని తెలిపారు. జిల్లాలో ఎస్సీ కమిషన్ సభ్యుడి పర్యటన రేపు విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం ఈ నెల 7వ తేదీన జిల్లాలో పర్యటించనున్నట్టు ఆధికారులు తెలిపారు. ఆయన శనివారం ఉదయం 9.30 గంటలకు విజయనగరానికి చేరుకుంటారు. స్థానిక జెడ్పీ గృహం వద్ద షెడ్యూల్డ్ కులాల సామాజిక వర్గానికి చెందిన ప్రజల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యల పరిష్కారంపై సంబంధిత అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం ఉదయం 11 గంటలకు విజయనగరం నుంచి బయలుదేరి చీపురుపల్లి వెళ్లనున్నారు. అక్కడి నుంచి రాజాం నియోజకవర్గంలో పర్యటించి ఎస్సీ వర్గాల సమస్యలను ప్రత్యక్షంగా తెలుకుంటారు. లంక దినకర్ జిల్లాకు రాక రేపు విజయనగరం అర్బన్: 20 సూత్రాల ప్రణాళిక చైర్మన్ లంక దినకర్ శనివారం ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందింరలో కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టుల అమలు తీరుపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు కలెక్టరేట్లో పత్రికా సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు కూటమి నాయకులతో సమావేశమై తిరిగి విశాఖపట్నం బయలుదేరి వెళ్తారని అధికారులు తెలిపారు. 7న జాబ్మేళా విజయనగరం అర్బన్: జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల7న పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐలో జాబ్మేళా నిర్వహిస్తామని జిల్లా ఉపాధిఅధికారి ఆర్.వహీదా తెలిపారు. ఫెనెస్ట్రీ విండోస్ అండ్ డోర్స్, టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేటు లిమిటెడ్, ఫ్లిప్కార్ట్, యాజాకి ఇండియూ ప్రైవేట్ లిమిటెడ్, ద్వారకా ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, జెఫ్టో తదితర ప్రైవేటు సంస్థలు పాల్గొని వివిధ విభాగాల్లో ఉద్యోగనియామకాలు చేపడతాయన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, పీజీ అర్హతలు కలిగిన అభ్యర్థులు జాబ్మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తిగల అభ్యర్థులు ముందుగా ‘ఎంప్లాయిమెంట్.ఏపీ.జీఓవీ.ఐఎన్’ వెబ్సైట్లో జాబ్ సీకర్ లాగిన్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. -
ఆస్పత్రిలో అధ్వానంగా పారిశుధ్యం
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో పారిశుధ్యం ఆధ్వానంగా తయారైంది. వివిధ విభాగాల నుంచి దుర్వాసన వస్తోందని రోగులు, వారి బంధువులు చర్చించుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేలో ఈవిషయాన్ని రోగులు వెల్లడించారు. మిగతా సేవల కంటే పారిశుధ్యం బాగోలేదని ఎక్కువ శాతం మంది తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. పారిశుధ్యం నిర్వహణ కోసం అధిక మొత్తంలో వెచ్చిస్తున్నప్పటికీ పారిశుధ్యం ఆధ్వానంగా ఉండడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఐవీఆర్ఎస్ సర్వేలో పారిశుధ్యం బాగోలేదని రోగులు అధిక సంఖ్యలో చెప్పినప్పటికీ అధికారులు మాత్రం 100కి 96 శాతం పారిశుధ్యం బాగున్నట్లు స్కోర్ ఇవ్వడం గమనార్హం. పారిశుధ్యంతో పాటు మిగతా సేవల పట్ల కూడా పలువురు రోగులు పెదవివిరిచారు. 37.05 శాతం మంది పారిశుధ్యం బాగోలేదని వెల్లడి 2025 డిసెంబర్ నెలలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో వివిధ సేవలపై 2882 మందిని ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా సర్వే చేశారు. ఇందులో 37.05 శాతం మంది పారిశుధ్యం బాగోలేదని తెలిపారు. డ్రైనేజేల వద్ద మురుగు నీరు నిల్వ ఉండడంతో దుర్వాసన వస్తుంది. అదేవిధంగా చెత్తాచెదారం సేకరణ కూడా సక్రమంగా జరగడం లేదని రోగులు గుసగుసలు ఆడుకుంటున్నారు. సర్వజన ఆస్పత్రిలో పారిశుధ్య నిర్వహణకు నెలకు రూ. 19.96 లక్షలు చెల్లిస్తారు. అయినప్పటికీ పారిశుధ్యం మెరుగుపడకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. మిగతా సేవల పట్ల కూడా అసహనం పారిశుధ్యం నిర్వహణతో పాటు మిగతా సేవల పట్ల కూడా ఐవీఆర్ఎస్ కాల్స్లో రోగులు పెదవివిరిచారు. వైద్యులు ఓపీల్లో అందుబాటులో ఉంటున్నారా? అన్ని అడగ్గా 22.83 శాతం మంది వైద్యులు అందుబాటులో ఉండడం లేదని తెలిపారు. వైద్యులు రాసిచ్చిన మందులు ఉచితంగా అందుతున్నాయా? అన్న దానిపై 24.68 శాతం మంది మందులు ఉచితంగా అందడం లేదని, ప్రైవేట్ దుకాణాల్లో కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. వైద్య సేవలు పొందడానికి ఎవరైనా డబ్బులు అడుగున్నారా? అన్న దానిపై 23.54 శాతం మంది అడుతున్నారని వెల్లడించారు. అన్ని విభాగాల సేవలకు సంబంధించి 27 శాతం మంది సేవలు బాగా అందడం లేదని తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. సర్వజన ఆస్పత్రిలో కొంతమంది వైద్యులు ఆస్పత్రికి వచ్చినప్పటికీ టీ, కాఫీ పేరుతో మధ్యలో క్లినిక్లకు వెళ్లివస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మధ్యాహ్నం 3 గంటలనుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీల్లో వైద్యులు అందుబాటులో ఉండాలి. అయితే కొంతమంది వైద్యులు మధ్యాహ్నం 12, 12:30 గంటలకు వెళ్లిపోయి సాయంత్రం నాలుగు గంటలకు వచ్చి బయోమెట్రిక్ వేస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా కొంతమంది వైద్యులు ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చిన రోగులను వారి క్లినిక్లకు తరలించి అక్కడ చికిత్స అందించి ఫీజులు తీసుకున్నట్లు కూడా ఆరోపణులు వినిపిస్తున్నాయి. డ్రెస్సింగ్ చేయడానికి, ఆపరేషన్ థియేటర్స్ల్లో సిబ్బంది చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పారిశుధ్యం మెరుగుపడేలా చర్యలు పారిశుధ్యం మినహా మిగతా సేవల్లో బాగున్నట్లు ఐవీఆర్ఎస్ సర్వేలో రోగులు వెల్లడించారు. పారిశుధ్యం కూడా మెరుగుపడేవిధంగా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ అల్లు పద్మజ, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి పారిశుధ్యం బాగోలేదని ఐవీఆర్ఎస్ సర్వేలో వెల్లడి మిగతా సేవల పట్ల కూడ పెదవి విరుపు అయినప్పటికీ పారిశుధ్యానికి 96 శాతం స్కోర్ ఇచ్చేసిన అధికారులు నెలకు పారిశుధ్య నిర్వహణకు లక్షల్లో చెల్లింపు -
రైతన్నకు దన్నేది..?
అగ్రి టెస్టింగ్ ల్యాబ్లో ఏర్పాటు చేసిన విత్తన పరీక్ష పరికరాలు విజయనగరం ఫోర్ట్: రైతులకు ఉపయోగపడే అగ్రిల్యాబ్లు నిర్వీర్యమవుతున్నాయా అంటే... జిల్లాలో అవుననే సమాధానం వినిపిస్తోంది. జిల్లాలో ఉన్న ఏడు అగ్రిల్యాబ్లలో జిల్లాస్థాయి ల్యాబ్ను ఇంకా అందుబాటులోకి తేకపోవడం.. మరోవైపు సారిక, గజపతినగరంలోని ల్యాబ్లలో విత్తన, ఎరువుల పరీక్షలు నిలిచిపోవడం రైతన్నను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సాగుకు దన్నుగా ఉండే ల్యాబ్లపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యవసాయంపై చంద్రబాబు ప్రభుత్వం చిన్నచూపుచూస్తోందని, రైతుసేవా కేంద్రాల్లో గతంలో వలే సాగు సేవలు అందడంలేదని, ఉచిత పంటల బీమా పథకానికి మంగళం పాడేసిందని, విపత్తుల సమయంలో పరిహారం అందడంలేదని, పెట్టుబడి సాయం కూడా సకాలంలో అందని పరిస్థితి నెలకొందంటూ రైతులు వాపోతున్నారు. వ్యవసాయం దండగన్న ధోరణిలో యూరియా కూడా అందించడంలేదని ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడు అగ్రిల్యాబ్లను కుదించి సేవలను అందని ద్రాక్షగా మార్చుతోందని ఆరోపిస్తున్నారు. రైతులకు ఉపయోగకరం... రాష్ట్రంలోని తిరుపతి, తాడేపల్లి గూడెం, అమరావతి, విశాఖపట్నంలో ఉన్న రీజనల్ కోడింగ్ సెంటర్స్ నుంచి జిల్లాలోని అగ్రి టెస్టింగ్ ల్యాబ్లకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులకు సంబంధించి శాంపిల్స్ వస్తాయి. వీటిని పరీక్షలు చేసిన తర్వాత వాటి ఫలితాలను ఆన్లైన్లో సంబంధిత వ్యవసాయ శాఖ కార్యాలయానికి పంపిస్తారు. విత్తనాలకు సంబంధించి మొలక శాతం, తేమశాతం, ప్యూరిటీ పరీక్షలు, ఎరువులకు సంబంధించి ఎరువు బస్తాపై తెలిపిన విధంగా నత్రజని, పొటాష్, పాస్పరస్, ప్రీపాస్పరిక్ యాసిడ్స్ ఉన్నాయో లేదో పరీక్షిస్తారు. జిల్లాలో ఉన్న రైతులు తమ సమీపంలోని ల్యాబ్లను నేరుగా శాంపిల్స్ను తీసుకెళ్లి పరీక్షలు చేయించుకోవచ్చు. భూ సార పరీక్షల ఫలితాలను తెలుసుకోవచ్చు. ల్యాబ్లను కుదించే యత్నం.. జిల్లాలో ఉన్న అగ్రి టెస్టింగ్ ల్యాబ్లను చంద్రబాబు ప్రభుత్వం కుదించే ప్రయత్నం చేస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజయనగరం నియోజకవర్గం పరిధిలోని సారిక గ్రామంలో ఉన్న నియోజకవర్గ స్థాయి అగ్రి టెస్టింగ్ ల్యాబ్ను, చీపురుపల్లిలో ఉన్న అగ్రి టెస్టింగ్ ల్యాబ్లలో సేవలు నిలిచిపోయినట్టు సమాచారం. విత్తనాలు, ఎరువులకు సంబంధించిన పరీక్షలు కూడా నిలిపివేయడంపై రైతులు ఆవేదన చెందుతున్నారు. నెలివాడ వద్ద నిర్మించిన జిల్లాస్థాయి ల్యాబ్ను అందుబాటులోకి తేవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని రైతులు ప్రశ్నిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. రైతులకు ఉపయోగపడే ల్యాబ్ల నిర్వహణపై ప్రభుత్వం కినుక నిర్వీర్యంచేసే ఎత్తుగడ జిల్లాలో ఏడు అగ్రి ల్యాబ్లు ఇప్పటికీ అందుబాటులోకి రాని జిల్లాస్థాయి ల్యాబ్ గత ప్రభుత్వ హయాంలో ఒక్కోల్యాబ్ రూ.62 లక్షలతో నిర్మాణం పరికరాలకు మరో రూ.60 లక్షల వరకు ఖర్చు సాగుకు భరోసాగా ల్యాబ్ల ఏర్పాటు ల్యాబ్లను తగ్గించాలని ఆదేశాలొచ్చాయి... జిల్లాలో ఆరు నియోజకవర్గ స్థాయి, ఒకటి జిల్లా స్థాయి అగ్రిటెస్టింగ్ ల్యాబ్లు ఉన్నాయి. నెలివాడ వద్ద ఉన్న జిల్లా స్థాయి ల్యాబ్ ఇంకా ప్రారంభించలేదు. ఈ ఖరీఫ్ సీజన్కు అందుబాటులో తెచ్చేందుకు చర్యలు తీసుకుంటాం. కొన్ని నియోజకవర్గ స్థాయి ల్యాబ్లను తగ్గించాలని ఆదేశాలు వచ్చాయి. – వి.తారకరామారావు, జిల్లా వ్యవసాయ అధికారి రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, భూసార పరీక్ష ఫలితాలు అందించి వారికి అన్నివిధలా అండగా నిలవాలనే గొప్ప సంకల్పంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నియోజకవర్గానికో అగ్రిల్యాబ్లను ఏర్పాటు చేసింది. విజయనగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల, రాజాం, బొబ్బిలి, కొత్తవలసల్లో నియోజకవర్గ స్థాయి అగ్రి టెస్టింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేయగా, గజపతినగరం నియోజకవర్గంలోని బొండపల్లి మండలం నెలివాడ వద్ద జిల్లా స్థాయి అగ్రిల్యాబ్ను నిర్మించింది. ఒక్కోల్యాబ్ ఏర్పాటుకు రూ.62 లక్షలు వెచ్చించించింది. మరో రూ.60 లక్షల వరకు వెచ్చించి పరికరాలు సమకూర్చింది. సాగును లాభసాటిగా మార్చడంలో అగ్రిల్యాబ్లు రైతుకు దన్నుగా నిలవాలన్నది ప్రధాన లక్ష్యం. సకాలంలో భూ పరీక్ష ఫలితాలు అందడం వల్ల నేలకు తగ్గట్టుగా పంటలు పండించేందుకు... భూ లోపాలను సరిచేసుకునేందుకు రైతుకు అవకాశం కలుగుతుంది. అధిక దిగుబడుల సాధనకు వీలుకలుగుతుంది. నాణ్యమైన విత్తనాలు, ఎరువులను వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇంతటి ప్రయోజనం ఉన్న అగ్రిల్యాబ్ల పట్ల చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం చేస్తుందని రైతులు వాపోతున్నారు. అగ్రిటెస్టింగ్ ల్యాబ్లను పట్టించుకోవడం మానేసిందని రైతులు ఆరోపిస్తున్నారు. -
పట్టుబట్టి పతకం పట్టాడు
శృంగవరపుకోట: స్వయంకృషి, పట్టుదలతో సాధన చేశాడు. ఫలితంగా పసిడి పతకం సాధించాడు. ఎస్.కోట పట్టణానికి చెందిన కోన రమణ జాతీయస్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో పసిడి పతకం సాధించాడు. ఛత్తీస్గఢ్లోని దల్లీరాజ్హరా జిల్లాలో జనవరి 1 నుంచి ఫిబ్రవరి 2వరకూ జరిగిన సీఎం ట్రోఫీ, ఓపెన్ నేషనల్ బాడీ బిల్డింగ్ చాంపియన్షిప్ పోటీల్లో 75కిలోల విబాగంలో రమణ 3వ స్థానం సాధించి పసిడి పతకాన్ని, ప్రశంసా పత్రాన్ని, జ్ఞాపికను కై వసం చేసుకున్నారు. 13రాష్ట్రాలకు చెందిన సుమారు 350మంది పోటీదారులు పాల్గొన్న జాతీయస్థాయి పోటీల్లో తొలిసారి పసిడి పతకం సాధించడం ఆనందంగా ఉందని బాడీబిల్డర్ కోన రమణ చెప్పాడు. అలాగే మార్చి నెలలో ఉత్తరప్రదేశ్లో జరగనున్న జాతీయ స్థాయి బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొంటున్నట్టు తెలిపాడు. విజయనగరం క్రైమ్: నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు అత్యంత కీలమని ఎస్పీ దామోదర్ అన్నారు. ప్రజల భద్రతలో అవి ముఖ్య భూమిక అని చెప్పారు. ఈ మేరకు బుధవారం ఆయన మాట్లాడుతూ పబ్లిక్, ప్రైవేట్ స్థలాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో చోరీలు, చైన్ స్నాచింగ్స్ వంటి ఘటనలు జరగకుండా నియంత్రించవచ్చునన్నారు. ఒకవేళ నేరం జరిగితే ఆ తీరును సీసీ ఫుటేజ్ ద్వారా కేసుల దర్యాప్తు చేపట్టడం సులభతరమ వుతుందన్నారు. కొన్ని సందర్భాల్లో సీసీ ఫుటేజ్ లే సాక్ష్యాల సేకరణకు, ఉపయక్తంగా ఉంటున్నాయన్నారు. పాఠశాలలు, ఆసుపత్రుల్లోను, ముఖ్య కూడళ్లు, వాణిజ్య సముదాయాలు, అపార్ట్మెంట్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం వల్ల భద్రతకు భరోసా లభిస్తుందని అభిప్రాయ పడ్డారు. స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని విజయనగరం డీఎస్పీ ఆర్.గోవిదరావు, బొబ్బిలి డీఎస్పీ జి.భవ్యరెడ్డి, చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులును ఎస్పీ ఆదేశించారు. -
కనకమహాలక్ష్మి హుండీల ఆదాయం రూ.2,42,060
చీపురుపల్లి: భక్తుల కొంగుబంగారం, శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో హుండీల ద్వారా రూ.2,42,060 ఆదాయం లభించినట్లు దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ జి.శ్యామ్ప్రసాద్ చెప్పారు. ఈ మేరకు పట్టణంలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో బుధవారం హుండీల ఆదాయం లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. 2025 డిసెంబర్ 10 నుంచి 2026 ఫిబ్రవరి 4 వరకు ఆదాయం లెక్కింపు జరగ్గా భక్తులు మొక్కుబడులు, కానుకల ద్వారా హుండీల నుంచి రూ.2,42,060 లభించింది. కార్యక్రమంలో దేవస్థానం ఈఓ ఎస్.నానాజీబాబు, ఆలయ కమిటీ చైర్మన్ గవిడి నాగరాజు, సభ్యులు ఇప్పిలి పార్వతి, లెంక చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. పోలీసులకు ‘సేఫ్టీ డ్రైవింగ్’పై అవగాహనపార్వతీపురం రూరల్: సేఫ్టీ డ్రైవింగ్పై జిల్లా పోలీసు సిబ్బందికి బుధవారం అవగాహన తరగతులు నిర్వహించారు. ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో విజయనగరం ఆర్టీసీ రీజినల్ సేఫ్టీ డ్రైవింగ్ ఇన్న్స్పెక్టర్ సీహెచ్ వేణు శిక్షణ ఇచ్చారు. విధి నిర్వహణలో భాగంగా వాహనాలు నడిపే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బ్రేకులు, లైట్లు, టైర్ల పనితీరును తనిఖీ చేసుకోవడంపై సిబ్బందికి వివరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, హెల్మెట్, సీటుబెల్ట్ ధరించడం ద్వారా ప్రమాదాలను ఎలా నివారించవచ్చో తెలిపారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, ఆర్ఐ నాయుడు, ఆర్ఎస్సైలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. రేబిస్తో బాలుడి మృతిబొబ్బిలిరూరల్: మండలంలోని దిబ్బగుడ్డివలస గ్రామానికి చెందిన రామవరపు రమణ(9) కుక్కకాటు వచ్చిన రేబిస్తో మృతి చెందాడు. సంక్రాంతి పండగ సందర్భంగా గ్రామంలోని పిచ్చికుక్క రమణ ముఖంపై కాటువేసింది. అప్పట్లో బొబ్బిలి సీహెచ్సీకి తరలించి వ్యాక్సిన్ వేయించి చికిత్స అందించారు. మంగళవారం మళ్లీ జ్వరం రావడంతో స్థానిక వైద్యులు పరిశీలించి మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్కు తరలించగా రమణ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతిచెందినట్లు తల్లిదండ్రులు వెంకటరత్నం,తండ్రి సంగమేశ్వర్రావులు తెలిపారు.కుక్క కాటు కారణంగా రేబిస్ వ్యాధి సోకడంతోనే విద్యార్థి రమణ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని తల్లిదండ్రులు చెప్పారు. రమణ స్థానిక ప్రభుత్వ ఎలిమెంటరీ పాఠశాలలో మూడోతరగతి చదువుతున్నాడు. విజయనగరం లీగల్: జిల్లా న్యాయసేవా అధికార సంస్థలో ఖాళీగా ఉన్న రికార్డ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ కో–ఆర్డినేటర్ పోస్టుల భర్తీకి ఈ నెల 9వ తేదీన రాత పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అధ్యక్షురాలు ఎం.బబిత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలు విజయనగరం కోటలోని మోతీమహల్, ఎంఆర్ కాలేజీ (అటానమస్) వేదికగా జరుగుతాయని పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం.. రికార్డ్ అసిస్టెంట్ పోస్టుకు ఉదయం 10గంటల నుంచి 11:30 గంటల వరకు, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు మధ్యాహ్నం 1గంట నుంచి 2 గంటల వరకు, ఫ్రంట్ ఆఫీస్ కో–ఆర్డినేటర్ పోస్టుకు మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నామని, దరఖాస్తుతో పాటు స్టాంపులు అంటించిన కవర్లు పంపిన అభ్యర్థులకు హాల్ టిక్కెట్లను రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఇప్పటికే పంపించినట్లు తెలిపారు. అభ్యర్థులు జిల్లా కోర్టు అధికారిక వెబ్సైట్ (httpr://vizianagaram. dcourts.gov.in) నుంచి హాల్టెకెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. హాల్ టికెట్లపై ఫొటో అటెస్టేషన్ లేని వారు వెంటనే గెజిటెడ్ అధికారితో ధ్రువీకరణ చేయించుకోవాలని, అభ్యర్థులు పరీక్షా సమయానికి కనీసం గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. -
అణువణువూ గాలింపు
● అద్దె ఇల్లు, లాడ్జిల్లో ఆరా.. ● జీఎంఆర్ఐటీ పరిసర ప్రాంతాల్లో కార్మికుల వివరాలు సేకరణ రాజాం: జీఎంఆర్ఐటీ క్వార్టర్స్లో జరిగిన భారీచోరీ పోలీసులకు సవాల్గా మారింది. ఓ డాక్టర్, మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇళ్లలో నాలుగురోజుల కిందట దొంగలు చొరబడి సుమారు కేజీన్నర బంగారం, కిలో వెండిని దోచుకుపోయిన ఘటన తెలిసిందే. క్వార్టర్స్లోని ఓ సీసీ కెమెరాలో కనిపించిన ఆనవాళ్లు మినహా ఎక్కడా ఎటువంటి జాడ లేకుండా దొంగలు జాగ్రత్తపడ్డారు. ఈ దొంగతనాన్ని ఛేదించే పనిలో జిల్లా పోలీస్ యంత్రాంగం నిమగ్నమైంది. సంఘటనా స్థలంలో లభించిన చిన్నచిన్న ఆధారాలతో పాటు అనుమానిత వ్యక్తులు, గతంలో ఇటువంటి చోరీలు జరిగిన ప్రదేశాల్లో పట్టుబడిన దొంగలు, రాజాం పరిసర ప్రాంతాల్లో దొంగతనాలకు సంబంధించిన నేరస్తుల వివరాలపై పోలీసులు దృష్టిసారించారు. బృందాలుగా ఏర్పడి అనుమానిత వ్యక్తులు, ప్రాంతాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పనులకు వచ్చేవారి వివరాల సేకరణ.. జీఎంఆర్ఐటీ క్వార్టర్స్లో పనిచేసే కార్మికుల వివరాలు, వారి బంధువుల వివరాలతో పాటు క్వార్టర్స్లో నివాసముంటున్న ఉద్యోగుల వివరాలు మొత్తం పోలీసులు తీసుకున్నారు. ఐటీ క్వార్టర్స్లోకి ఇతర వ్యక్తుల రాకపోకలను అక్కడి సెక్యూరిటీ నిషేధించింది. ఆయా క్వార్టర్స్లోకి ఉదయం వచ్చి వెళ్లే వారి వివరాలతో పాటు ఐటీలో భవనాలు మరమ్మతులు, నిర్మాణాల్లో పనిచేస్తున్న కార్మికుల వివరాలు నమోదుచేస్తున్నారు. మరోవైపు చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులతో పాటు రాజాం రూరల్ సీఐ ఉపేంద్రలు సంఘటనకు సంబంధించి బాధితులు నుంచి మరిన్ని వివరాలు సేకరించడంతో పాటు మరోమారు ఆయా ప్రాంతాలను పరిశీలించారు. చోరీకి పాల్పడిన దొంగలను పట్టుకుని బాధితులకు న్యాయం చేసేదిశగా ముమ్మర చర్యలు చేపట్టినట్టు డీఎస్పీ వెల్లడించారు. అద్దె ఇల్లు, లాడ్జిల్లో వివరాల పరిశీలన రాజాంతో పాటు పరిసర గ్రామాల్లో రెంటెడ్ హౌస్ల వివరాలను పోలీసులు బుధవారం సేకరించారు. ఇప్పటివరకూ అద్దెకు ఉండి ఆకస్మికంగా ఖాళీ చేసినవారి వివరాలు, దూర ప్రాంతాల నుంచి ఇక్కడకు వివిధ పనుల నిమిత్తం వచ్చి అద్దెకు ఉంటున్నవారి వివరాలు సేకరిస్తున్నారు. రాజాం పట్టణంలోని పలు లాడ్జిల్లో గత కొద్ది రోజులుగా మకాంవేసి, ఖాళీ చేసిన వారి వివరాలపై ఆరా తీస్తున్నారు. అనుమానిత ప్రాంతాల్లో వాహన తనిఖీలు, వాహనచోదకుల వివరాలపై ఆరాతీస్తున్నారు. -
ముగిసిన దివ్యాంగ విద్యార్థుల కళా సాంస్కృతిక పోటీలు
విజయనగరం అర్బన్: స్థానిక యూత్ హాస్టల్లో విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో రెండురోజుల పాటు దివ్యాంగ విద్యార్థులకు నిర్వహించిన కళలు–సాంస్కృతిక పోటీలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దివ్యాంగ విద్యార్థుల దేశభక్తి, జానపద, భక్తిగీతాలకు నృత్యప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. లఘునాటికలు, ఏకపాత్రాభినయాలతో అలరించారు. పలువురు విద్యార్థులు గీతాలాపన చేయగా కార్యక్రమం మొత్తం ఉత్సాహభరితంగా సాగి ఆహూతులను మంత్రముగ్ధులను చేసింది. రెండోరోజున జిల్లా సమగ్ర శిక్ష ఏపీపీ డాక్టర్ ఎ.రామారావు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయన్నారు. జిల్లా సహిత విద్య సమన్వయకర్త ఎస్.సూర్యారావు, సహ సమన్వయకర్త ఎం.భారతి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారులు, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దివ్యాంగ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సహిత విద్య ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
‘ఉపాధి’ పథకానికి గాంధీ పేరు మార్చకూడదు
విజయనగరం ఫోర్ట్: ఉపాధి హామీ పథకానికి మహాత్మాగాంధీ పేరు మార్చకూడదని డీసీసీ అధ్యక్షుడు మరిపి విద్యాసాగర్ అన్నారు. ఈ మేరకు ఉపాధిహామీ పథకానికి మహాత్మాగాంధీ పేరు మార్చడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేదలకు ఎంతో ఆసరాగా ఉంటూ ఎన్నో కుటుంబాలకు మేలు చేసిందన్నారు. అలాంటి పథకాన్ని ప్రస్తుత కేంద్రప్రభుత్వం ఖూనీ చేస్తోందని విమర్శించారు. ఈ పథకాన్ని నిలిపివేయాలని కుట్రలు చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి నెలనెలా అప్పులు చేస్తోందని, మరి ఏ విధంగా 40 శాతం నిధులు రాష్ట్రప్రభుత్వం భరించగలదని ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకంలో గ్రామసభల ద్వారా గ్రామాలకు ఏం కావాలనే నిర్ణయం తీసుకునేవారని, కొత్త చట్టంలో గ్రామాల్లో చేపట్టే పనులు ఢిల్లీలో నిర్ణయిస్తారట అని ఎద్దేవా చేశారు. జిల్లా నుంచి వలసలు పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి పేరు మార్చడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్, ఐశ్వర్య, రామచంద్రరాజు, తిరుపతి, దుర్గాప్రసాద్, కరీం, రామారావు, శ్రీనివాస్మోహన్ తదితరులు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుడు విద్యాసాగర్ -
పాఠశాలను సందర్శించిన కలెక్టర్
పూసపాటిరేగ: స్థానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ రాంసుందర్రెడ్డి బుధవారం సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడారు. పదో తరగతిలో శతశాతం ఫలితాలు సాధించాలని సూచించారు. పాఠ్యాంశాలను సులభ పద్ధతుల్లో బోధించాలని, చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధచూపాలని ఉపాధ్యాయులను కోరారు. అనంతరం మధ్యాహ్నభోజన పథకం వంటలను పరిశీలించారు. కుమిలి గ్రామంలో అంగన్వాడీ కేంద్రం–5ను పరిశీలించారు. చిన్నారుల బరువు నమోదు, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారంపై ఆరా తీశారు. అదే గ్రామంలోని సచివాలయం, వెల్నెస్ సెంటర్ను తనిఖీచేశారు. ప్రజలకు అందుతున్న సేవల్లో జాప్యంపై కలెక్టర్ అసహనం వ్యక్తంచేశారు. పాఠ్యపుస్తక రచనకు గడిముడిదాం పాఠశాల టీచర్ రాజాం సిటీ: టీచర్స్ ట్రైనింగ్కు రిసోర్స్పర్సన్గా వ్యవహరించిన రాజాం మండలం గడిముడిదాం ఎంపీపీ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయిని వడ్డి ఉషారాణి రాష్ట్ర విద్యాపరిశోధనా శిక్షణ మండలిలో పాఠ్యపుస్తక రచనకు ఎంపికై ంది. నూతన జాతీయ విద్యావిధానం–2023కు అనుగుణంగా వచ్చే విద్యాసంవత్సరానికి 1 నుంచి 8వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలు మారనున్నాయి. ఇందులో భాగంగా పరిసరాల విజ్ఞానం సెమిస్టర్–1 పాఠ్యపుస్తకం, వర్క్బుక్ రచనకు తనను ఎంపిక చేశారని ఆమె బుధవారం తెలిపారు. గతంలో ఏపీ ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగ విలువలు పుస్తకరచనలో కూడా పాల్గొన్నట్లు పేర్కొన్నారు. ఆమెను ఎంఈఓలు పి.ప్రవీణ్కుమార్, వై.దుర్గారావు, ఉపాధ్యాయులు అభినందించారు. స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకు త్వరలో నియామకాలు ● డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున విజయనగరం అర్బన్: జిల్లాలోని డీసీసీబీ శాఖల్లో ఖాళీగా ఉన్న స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం త్వరలో నియామక పక్రియ చేపడతామని ఆ బ్యాంక్ చైర్మన్ కిమిడి నాగార్జున ప్రకటించారు. తన చాంబర్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 40 మంది సీనియర్లు ఏజీఎం, జీఎం వంటి పోస్టుల్లో నియమితులయ్యారన్నారు. వివిధ బ్రాంచిలలో ఖాళీగా ఉన్న 25 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీపై దృష్టిపెట్టామన్నారు. పంటల నమోదు వేగవంతం చేయాలి రాజాం సిటీ: రబీ సీజన్లో రైతులు సాగుచేసిన పంటల వివరాల నమోదును వేగవంతం చేయాలని జిల్లా వ్యవసాయశాఖ జేడీ వీటీ రామారావు తమ సిబ్బందిని ఆదేశించారు. అంతకాపల్లి గ్రామంలో బుధవారం చేపట్టిన ఈక్రాప్ నమోదును పరిశీలించారు. రైతులంతా ఈ నెల 20లోగా పంటల నమోదుచేయించుకోవాలని సూచించారు. ఈ ఏడాది రైతులే తమ పంటల వివరాలను నమోదుచేసుకునే ఫార్మర్ రిజిస్ట్రీ యాప్ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు. పీఎం కిసాన్ మిగిలిన విడతల నగదు పడాలంటే రిజిస్ట్రేషన్ త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. రాజాం మండలంలో 88 మంది రైతులు పెండింగ్లో ఉన్నారని, వారంతా సంబంధిత వీఏఏల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏడీఏ కె.చంద్రరావు, ఏఓ సీహెచ్.హరనాథ్, వీఏఏ లక్ష్మీనారాయణ, రైతులు పాల్గొన్నారు. -
కేన్సర్ పట్ల అవగాహన అవసరం
విజయనగరం ఫోర్ట్: కేన్సర్ పట్ల అవగాహన అవసరమని డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి అన్నారు. ఈ మేరకు వరల్డ్ కేన్సర్ డే సందర్భంగా బుధవారం స్థానిక జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయం వద్ద నిర్వహించ తలపెట్టిన ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేన్సర్ను త్వరగా గుర్తించగలిగితే నయం చేయవచ్చని తెలిపారు. 40 ఏళ్లు దాటిన మహిళలు ఏడాదికి ఒకసారి వైద్యపరీక్షలు చేసుకోవాలని సూచించారు. పురుషులు గొంతుకేన్సర్, నోటి కేన్సర్ రాకుండా ఖైనీ, గుట్కా వంటి వాటికి దూరంగా ఉండాలని హితవు పలికారు. మహిళలు గర్భాశయ, రొమ్ముకేన్సర్ రాకుండా జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎన్సీడీ పీఓ డాక్టర్ బి.సుబ్రహ్మణ్యం, డీఐఓ డాక్టర్ అచ్యుతకుమారి తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్. జీవనరాణి -
ఐసీడీఎస్ పీడీకి బదిలీ
● శ్రీకాకుళం వికలాంగుల శాఖ ఎ.డిగా నియామకంవిజయనగరం ఫోర్ట్: ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ టి.విమలారాణికి వికలాంగులు, వయోద్ధులు, ట్రాన్స్జెండర్స్శాఖ (శ్రీకాకుళం)కు అసిస్టెంట్ డైరెక్టర్ (ఎ.డి)గా బదిలీ అయినట్లు సమాచారం. అయితే బదిలీ ఉత్తర్వులు వచ్చి నెలరోజులు కావస్తున్నా ఇప్పటి వరకు ఆమె బదిలీ అయిన శాఖలో చేరలేదు. ఐసీడీఎస్ పీడీగానే కొనసాగుతున్నారు. వికలాంగులశాఖకు ఫారిన్ సర్వీస్ కింద డిప్యుటేషన్పై బదిలీ చేయాలని ఆమె గతంలో దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. దీంతో అశాఖ ఉన్నతాధికారులు ఆమె అభ్యర్ధనను అమోదిస్తూ వికలాంగుల శాఖకు ఎ.డిగా బదిలీ చేశారు. ఫారిన్ సర్వీస్ కింద బదిలీ కావాలని కోరిన ఆమె ఉత్వర్వులు వచ్చిన తర్వాత వెళ్లక పోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదేవిషయాన్ని ఐసీడీఎస్ పీడీ టి.విమలారాణి వద్ద సాక్షి ప్రస్తావించగా పీడీగా బాధ్యత చేపట్టిన తొలినాళ్లలో ఫారిన్ సర్వీసెస్ కోసం దరఖాస్తు చేసిన మాట వాస్తవమేనన్నారు. అయితే పీడీగా ఇక్కడే కొనసాగాలని ఉన్నతాధికారులు చెప్పినందున కొనసాగుతున్నట్లు తెలిపారు. -
భూముల హక్కుదారులకే పాస్పుస్తకాలు ఇవ్వాలి
● ఫిబ్రవరి, మార్చిలో పంపిణీ వేగవంతం చేయాలి ● కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డివిజయనగరం అర్బన్: ఆయా భూముల హక్కుదారులకే పట్టాదారు పాస్పుస్తకాలను అందజేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్ నుంచి జిల్లా రెవెన్యూ అధికారులు, సర్వేయర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీ, రెవెన్యూ క్లినిక్, రీసర్వే, ఐవీఆర్ఎస్ సర్వే, జాయింట్ ఎల్పీఎంఎస్, స్వమిత్వ, రైస్ మిల్లుల తనిఖీలు తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టాదారు పాస్పుస్తకాలను పంపిణీ చేసేటప్పుడు వీలైనంతవరకు వాటిని అసలు హక్కుదారుకే అందజేయాలని స్పష్టం చేశారు. ప్రతినెలా 9వ తేదీలోపు పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. 10 నుంచి 14వ తేదీ వరకు మ్యుటేషన్ (ఫారం–8) ప్రక్రియను చేపట్టాలని సూచించారు. అలాగే 15 నుంచి 17వ తేదీ వరకు సుమోటో కరెక్షన్లు పూర్తి చేయాలన్నారు. మ్యుటేషన్ ప్రక్రియలో ట్రాన్జాక్షన్, కరెక్షన్, డెడ్ కరెక్షన్స్గా విభజించి పనులు చేయాలని, ప్రతి నెలా 30వ తేదీలోపు అన్ని దిద్దుబాట్లను పూర్తి చేసి, ఈ–కేవైసీ అనంతరం తప్పులు లేని పట్టాదారు పాస్పుస్తకాలను పంపిణీ చేయాలని వివరించారు. మ్యుటేషన్ దరఖాస్తులు పునఃసమీక్షించాలి జిల్లాలో పెండింగ్లో ఉన్న రెవెన్యూ అంశాలు, భూసర్వేలు, ప్రభుత్వ ప్రాధాన్యత పథకాల అమలుపై కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఫిబ్రవరి నెలకు సంబంధించి 12 గ్రామాల్లో, మార్చి నెలకు సంబంధించి 61 గ్రామాల్లో పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. తిరస్కరించిన మ్యుటేషన్ దరఖాస్తులను పునఃసమీక్షించాలని, పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ ద్వారా వచ్చిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలను సమర్పించాలని సూచించారు. రీ–సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, జాయింట్ ఎల్పీఎంల విభజన, ఆన్లైన్ సేవలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కాన్ఫరెన్స్లో జిల్లా కేంద్రం నుంచి డీఆర్ఓ ఈ.మురళి, సర్వేశాఖ ఎ.డి విజయకుమార్తో పాటు ఆర్డీఓలు, డీఎల్డీఓలు, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. -
చదువుతోనే గౌరవం
● డీఈఓ యు.మాణిక్యంనాయుడు సంతకవిటి: చదువుతోనే జీవితంలో గౌరవం లభిస్తుందని జిల్లా విద్యాశాఖాధికారి యు.మాణిక్యంనాయుడు అన్నారు. మండలంలోని సంతకవిటి జెడ్పీ హైస్కూల్, ప్రాథమిక పాఠశాల, మందరాడ, జీఎస్ పురం జెడ్పీ హైస్కూల్ను బుధ వారం సందర్శించారు. పదోతరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న 100 రోజుల ప్రణాళికలో విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను పరీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సెల్ఫోన్లు చూడకూడదని, బాగా చదువుకుంటే ఎవరికాళ్లపై వారు ఉన్నతంగా నిలవగలరన్నారు. -
మీటర్ రీడర్స్కు స్మార్ట్ గుబులు..!
● ఉపాధికి గండి పడుతుందని ఆందోళన ● కొద్ది రోజులుగా సమ్మెబాట ● జిల్లాలో ఏడు లక్షలపైగా విద్యుత్ కనెక్షన్లు మీటర్ రీడర్స్ డిమాండ్స్ విద్యుత్సంస్థలోకి విద్యార్హతను బట్టి ఔట్సో ర్సింగ్ ఉద్యోగులుగా తీసుకోవాలి ● ఉద్యోగ భద్రత కల్పించాలి ● ఖాళీ సమయాల్లో పని కల్పించాలివిజయనగరం ఫోర్ట్: ఏరు దాటిందాకా ఏటి మల్ల న్న..ఏరు దాటాక బోడి మల్లన్న అన్న చందంగా తయారైంది కూటమి ప్రభుత్వం పరిస్థితి. ఎన్నికల ముందు తమ్ముళ్లూ స్మార్ట్మీటర్లు బిగిస్తే బద్దలుగొట్టండి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు విద్యుత్ వినియోగదారులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అదే నోటితో స్మార్ట్ మీటర్లు బిగించుకోండని చెబుతున్నారు. దీంతో విద్యుత్ వినియోగదారులు విస్తుపోతున్నారు. టీడీపీ నేతల రెండు నాలుకల ధోరణి పట్ల మండిపడుతున్నారు. జిల్లాలో విద్యుత్ వినియోగదారులకు బిగిస్తున్న స్మార్ట్ మీటర్లు మీటర్ రీడర్స్ గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. స్మార్ట్ మీటర్లు పూర్తి స్థాయిలో బిగించినట్లయితే తమకు ఉద్యోగ భద్రత ఉండదని మీటర్ రీడర్స్ మధనపడుతున్నారు. ఇప్పటికే జిల్లాలో వేలాది స్మార్ట్ మీటర్లు బిగించేశారు. దీంతో తమ ఉద్యోగాలకు ఎసరు వస్తుందని ఉద్యోగ భద్రత కల్పించాలని గడిచిన ఏడు రోజులుగా మీటర్ రీటర్స్ సమ్మె చేస్తున్నారు. రీడర్ తీసే రీడింగ్ 3,500 నుంచి 4 వేలు జిల్లాలో 170 మంది మీటర్ రీడర్స్ ఉన్నారు. ప్రతినెల ఒకటో తేదీ నుంచి 10 వతేదీ లోగా ఇంటింటికీ వెళ్లి వారు మీటర్ రీడింగ్ తీస్తారు. సర్వీసులు ఎక్కువ ఉన్నచోట 12 వతేదీ వరకు కూడా పడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో మీటర్కు రూ.3.25, పట్టణ ప్రాంతాల్లో రూ.3 చొప్పున చెల్లిస్తారు. 91,224 స్మార్ట్ మీటర్ల లక్ష్యం జిల్లాలో 91,224స్మార్ట్ మీటర్లు బిగించాలని విద్యుత్శాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ఇప్పటివరకు 40 వేల స్మార్ట్ మీటర్లు బిగించేశారు. స్మార్ట్ మీటర్ల వల్ల మీటర్ రీడర్స్కు పని ఉండదు స్మార్ట్ మీటర్లు బిగించడం వల్ల సంబంధిత వినియోగదారుడి సెల్కు విద్యుత్ బిల్లు ఎంత అనేది మేసేజ్ వచ్చేస్తుంది. ప్రత్యేకించి రీడింగ్ తీయాల్సిన పని ఉండదు. దీనివల్ల మీటర్ రీడర్స్ అవసరం ఉండదు. దీంతో తమకు ఉద్యోగం ఉండదనే ఆందోళన వారిలో నెలకొంది. టీడీపీ సర్కార్ తీరు పట్ల మీటర్ రీడర్స్ పెదవి విరుస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా , అధికారంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నారు. నారాలోకేష్ యువగళం పాదయాత్రలో మీటర్ రీడర్స్ కలిసినప్పుడు అధికారంలోకి వస్తే ఉద్యోగ భద్రత కల్పిస్తామని మాట ఇచ్చారు. అయితే స్మార్ట్ మీటర్లు బిగించడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం తమ పొట్ట కొడుతోందని మీటర్ రీడర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీటర్ రీడర్స్కు కనీస వేతనాలు అమలు కావడం లేదు. ఉద్యోగ భద్రత కూడా లేదు. నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉండడం వల్ల డిగ్రీచదివిన వారు సైతం కొందరు మీటర్ రీడర్స్గా చేస్తున్నారు. 10, 15 ఏళ్లుగా మీటర్ రీడర్స్గా పనిచేస్తున్నారు. ఆందోళనలో వినియోగదారులు: ప్రతి నెలా 10 వతేదీ లోగా మీటర్ రీడర్స్ రీడింగ్ తీస్తారు. ఒక్కరోజు ఆలస్యం అయినా వినియోదారులపై భారం పడుతుంది. మరింతజాప్యం జరిగితే మీటర్రీడింగ్ మారిపోయి చెల్లించాల్సిన టారిఫ్ భారీగా పెరిగిపోతుందని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. గృహ వినియోగదారులకు ఫర్వాలేదుకాని వాణిజ్య వినియోగదారులకు మరింతగా భారం పడే అవకాశం ఉంది. జిల్లాలో విద్యుత్ కనెక్షన్ల వివరాలుకేటగిరి విద్యుత్ కనెక్షన్ల సంఖ్య కేటగిరి–1 5,99,932 కేటగిరి–2 65,383 కేటగిరి–3 2513 కేటగిరి–4 14,356 కేటగిరి–5 41,007 హెచ్టీ –సర్వీస్ 434మీటర్ రీడింగ్కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మీటర్ రీడర్స్ గత నెల 29వతేదీ నుంచి సమ్మె చేస్తున్నారు.మీటర్ రీడింగ్ తీసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. 91 వేల స్మార్ట్ మీటర్లు బిగించాలన్నది లక్ష్యం కాగా ఇంతవరకు 40 వేలు బిగించాం. మువ్వల లక్ష్మణరావు, ఎస్.ఈ, ఏపీఈపీడీసీఎల్ -
ప్రాణాలు పోతున్నా లెక్కలేని తనం
● కేన్సర్ రోగులకు ద్రోహం చేసిన టీడీపీ ప్రభుత్వం ● యువగళం హామీలు మరిచిన నారాలోకేశ్ ● తక్షణమే ఆస్పత్రిని నిర్మించాలని డిమాండ్ విజయనగరం గంటస్తంభం: శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలో కేన్సర్ రోగుల సంఖ్య పెరుగుతోందని, వైద్యం అందక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వానికి లేక్కేలేదని లోక్సత్తా పార్టీ అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కేన్సర్కు వైద్యం అందించేలా ఆస్పత్రిని ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. ప్రపంచ కేన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా జిల్లా పౌరవేదిక, ప్రభుత్వ కేన్సర్ ఆస్పత్రి సాధనసమితి ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ప్రజాసంఘాలతో కలిసి బుధవారం శాంతియుత నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా భీశెట్టి మాట్లాడుతూ... రాష్ట్రంలో ఏటా లక్షలాది కేన్సర్ కేసులు నమోదవుతున్నాయని, అందులో విజయనగరం జిల్లా అగ్రస్థానంలో ఉందన్నారు. మహిళల్లో గర్భాశయ, రొమ్ము కేన్సర్లు, యువతలో గొంతు, బ్లడ్ కేన్సర్లు పెరిగి కుటుంబాలను ఆర్థికంగా నాశనం చేస్తున్నాయని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లాకు ప్రభుత్వ కేన్సర్ ఆస్పత్రి మంజూరు చేస్తామని యువగళం పాదయాత్రలో చంద్రబాబు తనయుడు, మంత్రి నారాలోకేశ్ ఇచ్చిన హామీ ఇప్పటివరకు అమలుకాలేదని విమర్మించారు. ప్రజల ప్రాణాలపై నిర్లక్ష్యం చేయడం తగదని, జిల్లాకు ప్రభుత్వ కేన్సర్ ఆస్పత్రిని మంజూరుచేయాలని డిమాండ్ చేశారు. -
గోల్డెన్ అవర్లో ధైర్యమే ప్రాణదాత
పార్వతీపురం రూరల్: ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు ప్రాణాన్ని నిలబెట్టేది..ఆస్తి నష్టాన్ని నివారించేది కేవలం అవగాహన మాత్రమేనని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి అన్నారు. విపత్తు సమయాల్లో భయం వీడి, బాధితులకు అభయమివ్వాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం ఆయన పార్వతీపురం మండలంలోని ఎమ్మార్నగరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖ, రెడ్ క్రాస్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రెస్క్యూ అండ్ ఫైర్ ఫైటింగ్’ విన్యాసాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..ప్రమాదం జరిగిన మొదటి కొన్ని నిమిషాలు (గోల్డెన్ అవర్) అత్యంత కీలకమని, ఆ సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే ప్రాణాపాయం నుంచి గట్టెక్కవచ్చని పేర్కొన్నారు. మంటలు ఎగిసిపడినప్పుడు ప్రాణాలను పణంగా పెట్టి అగ్నిమాపక సిబ్బంది చేసే సాహసాలను ప్రత్యక్షంగా తిలకించిన విద్యార్థులు అబ్బురపడ్డారు. గ్యాస్ సిలిండర్ల మంటలను అదుపు చేయడం, ఎత్తైన భవనాల్లో చిక్కుకున్న వారిని తాడు సాయంతో సురక్షితంగా వెలికితీయడం వంటి విన్యాసాలు నేత్రపర్వంగా సాగాయి. ఆధునిక రెస్క్యూ పరికరాల పనితీరుపై విద్యార్థులకు సిబ్బంది అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అగ్నిమాపక అధికారి పి.సింహాచలం, ప్రిన్సిపాల్ ఉదయ్కుమార్, నైపుణ్యాభివృద్ధి అధికారి సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రభాకర రెడ్డి -
ఉద్యోగ బకాయిల చెల్లింపునకు ఏపీజీఈఏ డిమాండ్
విజయనగరం అర్బన్: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల బకాయిలు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) డిమాండ్ చేసింది. ఇప్పటికే మంజూరైన వివిధ రకాల ఆర్థిక ప్రయోజనాలు దాదాపు రూ.35 వేల కోట్లకు చేరినప్పటికీ, ఇంకా మంజూరు కావాల్సిన బకాయిలు ఉన్నాయని, వాటిని రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపు చేయాలని కోరింది. తమ తరఫున ప్రభుత్వానికి విన్నవించాలని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణకు బుధవారం వినతిపత్రాన్ని అందజేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలను అందజేసే కార్యక్రమాన్ని ఆ సంఘ సభ్యులు చేపట్టారు. ఇందులో భాగంగా బకాయిలను, ఇతర ఆర్థిక అంశాలకు సంబంధించి 2026–27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టే రాష్ట్ర బడ్జెట్లో తగిన కేటాయింపులు చేయాలని కోరారు. ఈ అంశాన్ని శాసనసభ, శాసన మండలిలో బలంగా ప్రస్తావించి ప్రభుత్వం సానుకూలంగా స్పందించేలా చూడాలని విజ్జప్తి చేశారు. దీనిపై స్పందించిన బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఉద్యోగుల బకాయిలకు సంబంధించి పద్దులవారీగా పూర్తి వివరాలు సేకరించిన అనంతరం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఫైనాన్స్బిల్లు వచ్చిన సమయంలో అవసరమైన సందర్భాల్లో ఈ అంశాన్ని సభలో ప్రస్తావిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీని కలిసిన వారిలో సంఘం జిల్లా అధ్యక్షుడు పువ్వల శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి లెంక సత్తిబాబుతో పాటు శైలాడ ఈశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు సీహెచ్ వెంకటసతీష్, మహిళా విభాగం అధ్యక్షురాలు వి.రాజేశ్వరి, పెన్షనర్ల విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు. బడ్జెట్లో నిధులు కేటాయించాలి తమ తరుఫున పోరాటం చేయాలని శాసన మండలి విపక్షనేత బొత్సకు ఏపీజీఈఏ వినతి -
బొద్దాం చోరీ కేసుపై డీఎస్పీ విచారణ
వేపాడ: మండలంలోని బొద్దాం గ్రామంలో సోమవారం పట్టపగలు జనపరెడ్డి వెంకటరమణ ఇంటిలో జరిగిన దొంగతనం కేసుపై ఇన్చార్జి డీఎస్పీ ఆర్.గోవిందరావు గ్రామంలో విచారణ చేశారు. చోరీ విషయంపై పలువురు స్థానికులను ఆరా తీశారు. డీఎస్పీతో పాటు ఎస్.కోట రూరల్ సీఐ ఎల్.అప్పలనాయుడు, ఎస్.కోట ఎస్సై నారాయణ మూర్తి బొద్దాంలో చోరీకి గురైన గృహాన్ని, పరిసరాలు పరిశీలించి దర్యాప్తు నిర్వహించారు. 20 లీటర్ల సారాతో నిందితుడి అరెస్టుకురుపాం: మండలంలోని పూతికవలస గ్రామ పరిసరాల్లో ద్విచక్రవాహనంపై 20 లీటర్ల సారా తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ టి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ కన్నపుదొరవలస గ్రామానికి చెందిన బొత్స ప్రవీణ్ ద్విచక్రవాహనంపై సారా తరలిస్తుండగా పూతికవలస వద్ద దాడులు నిర్వహించి సారాను సీజ్చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అక్రమంగా మద్యం, సారా తరలించినా, విక్రయించినా చట్టపరమైన చర్యలు చేపట్టనున్నట్లు హెచ్చరించారు. 838 లీటర్ల సారా ధ్వంసంజియ్యమ్మవలస: మండలంలోని చినమేరంగి పోలీస్ స్టేషన్ పరిధిలో 21 కేసుల్లో పట్టుబడిన 838 లీటర్ల సారాను ధ్వంసం చేశామని చినమేరంగి ఎస్సై పి.అనీష్ తెలిపారు. అలాగే నాలుగు కేసుల్లో పట్టుబడిన 85 మద్యం సీసాలను కూడా ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ సమక్షంలో దాడులు నిర్వహించామన్నారు. 4.45క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్బొబ్బిలి రూరల్: మండలంలోని పారాదిలో పసుమర్తి నాగరాజు అనే వ్యక్తి ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని పౌరసరఫరాల ఉప తహసీల్దార్ రెడ్డి సాయికృష్ణ తెలిపారు. మంగళవారం ఉదయం అక్రమ బియ్యం వ్యవహారానికి సంబంధించిన సీఎస్డీటీకి సమాచారం రాగానే సిబ్బందితో కలిసి వెళ్లి ఇంట్లో నిల్వ ఉంచిన బియ్యాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. సీజ్ చేసిన బియ్యాన్ని మరో డీలర్కు అప్పగించి కేసు నమోదు చేసినట్లు సీఎస్డీటీ చెప్పారు. కోడి పందాలపై పోలీసుల దాడిలక్కవరపుకోట: మండలంలోని దాసుళ్లపాలెం గ్రామం సమీప తోటల్లో రహస్యంగా నిర్వహిస్తున్న కోడిపందాలపై ఎస్సై నవీన్పడాల్ ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం దాడి చేశారు. ఈ సందర్భంగా పందాలు ఆడుతున్న ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.12,600 నగదు, రెండు కోడిపుంజులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఏపీ జేఏసీ అమరావతి జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవం● చైర్మన్గా తాడ్డి గోవింద్ విజయనగరం అర్బన్: ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో జిల్లా నూతన కమిటీ 2026–29 పదవీకాలానికి సంబంధించిన ఎన్నికలు మంగళవారం స్థానిక రెవెన్యూ హోమ్లో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో జిల్లా చైర్మన్గా తాడ్డి గోవింద, అసోసియేట్ చైర్మన్గా ఎస్.రామకృష్ణ, వైస్చైర్మన్–1గా బాల మహేశ్, వైస్ చైర్మన్–2గా ఎ.అప్పలనాయుడు, వైస్చైర్మన్–3గా పి.చంద్రశేఖర్రాజు, వైస్చైర్మన్ 4 గా డాక్టర్ డి.సురేష్, ప్రధాన కార్యదర్శిగా పి.భానుమూర్తి, సెక్రటరీ–1గా కె.సురేష్, సెక్రటరీ–2గా వి.సత్యనారాయణ, సెక్రటరీ–3గా వై.గోవిందరావు, సెక్రటరీ–4గా ఎం.నాగేశ్ కుమార్, కోశాధికారిగా సీహెచ్వీ అప్పారావు ఎంపికయ్యారు. అనంతరం నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకున్నారు. -
పోలీసు బలగాలకు ‘పునశ్చరణ’
● ఆయుధాల వినియోగం, ● సైబర్ నేరాలపై అవగాహనపార్వతీపురం రూరల్: జిల్లా పోలీసు సాయుధ బలగాలకు 15 రోజుల పునశ్చరణ (మొబిలైజేషన్) తరగతులు మంగళవారం కొనసాగాయి. ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి ఆదేశాల మేరకు సిబ్బందికి శారీరక దారుఢ్యం, ఆయుధాల నిర్వహణపై శిక్షణ ఇస్తున్నారు. ఉదయం వేళ వ్యాయామాలు, రన్నింగ్, ఫిట్నెస్ డ్రిల్స్తో పాటు 9ఎంఎం పిస్టల్ వంటి ఆయుధాలను క్లిష్ట సమయాల్లో వేగంగా, సురక్షితంగా ఉపయోగించే విధానంపై మెలకువలు నేర్పిస్తున్నారు. అనంతరం సైబర్ సెల్ ఎస్సై రవీంద్ర రాజు డిజిటల్ నేరాలపై అవగాహన కల్పించారు. ఆనన్లైన్ మోసాలు, ఫిషింగ్, సోషల్ మీడియా నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్ క్రైమ్ పోర్టల్ను ఎలా వినియోగించాలో వివరించారు. ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి మాట్లాడుతూ..సిబ్బంది నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు, విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండేందుకు ఈ శిక్షణ దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్ఐ నాయుడు, ఆర్ఎస్సైలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన
● శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి ● రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి రేగిడి: రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది.. శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయి.. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని రాష్ట్రపతి పాలన విధించాలని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, రాజాం నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తలే రాజేష్ కోరారు. రేగిడి మండలం ఉణుకూరు గ్రామంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ప్రజా సంక్షేమం, అభివృద్ధిపై దృష్టిసారించలేదని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఇళ్లపై పెట్రోల్ బాంబ్లతో దాడులు చేయించి వారిని జైళ్లకు పంపించడమే పనిగా పెట్టుకుందన్నారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులు చేయడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అరాచకానికి తెగబడుతోందని విమర్శించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను నిర్దాక్షిణ్యంగా రద్దుచేసిందన్నారు. 50 ఏళ్లకు పింఛన్ ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని తుంగలో తొక్కిందని, కనీసం 60 ఏళ్లు పైబడిన వారికి కూడా పింఛన్ మంజూరుచేయడంలేదన్నారు. ఉచిత పంటల బీమా పథకానికి మంగళం పాడేయడంతో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు టంకాల అచ్చెన్నాయుడు, మాజీ వ్యవసాయ సలహా మండలి చైర్మన్ గేదెల వెంకటేశ్వరరావు, పార్టీ మండల కన్వీనర్ వావిలపల్లి జగన్మోహనరావు పాల్గొన్నారు. -
దివ్యాంగ విద్యార్థులకు జిల్లాస్థాయి కళాపోటీలు ప్రారంభం
విజయనగరం అర్బన్: స్థానిక యూత్ హాస్టల్లో మంగళవారం విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్ధులకు జిల్లా స్థాయి కళలు, సాంస్కృతిక కార్యక్రమాల పోటీలు ప్రారంభమ య్యాయి. రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఈ పోటీలకు ముఖ్యఅఽతిధిగా హాజరైన సమగ్రశిక్ష ఏపీపీ డాక్టర్ ఎ.రామారావు మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, పోటీతత్వం పెంపొందించడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. విద్యార్థులు ఎంతో క్రమశిక్షణతో పరస్పరం పోటీ పడి, మంచి ఇతివృత్తంతో కూడిన చిత్రాలను రూపొందించడం అభినందనీయమన్నారు. తొలిరోజు పోటీ ప్రదర్శనలో కళాంశాలు పలువురిని ఆకట్టుకున్నాయి. జిల్లా సహిత విద్య సమన్వయకర్త ఎస్.సూర్యారావు, సహ సమన్వయకర్త ఎం.భారతి పర్యవేక్షణలో జరిగిన సమగ్రశిక్ష సెక్టోరియల్ అధికారులు, సిబ్బంది, 70 మంది దివ్యాంగ విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు, సహిత విద్య ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ప్రాజెక్టుల భూసేకరణను వేగంగా పూర్తి చేయాలి
● రెవెన్యూ అధికారులకు కలెక్టర్ ఆదేశంవిజయనగరం అర్బన్: జిల్లాలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం చేపట్టిన భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రాజెక్టుల భూసేకరణపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తారకరామ తీర్థసాగర్, తోటపల్లి ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, మూడో రైల్వేలైన్, కొత్తవలస–విజయనగరం నాలుగో రైల్వే లైన్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తదితర కీలం ప్రాజెక్టుల భూసేకరణ పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. ఆయా ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిని తెలుసుకుని, ప్రతి ప్రాజెక్టుకు భూసేకరణ దశలను పూర్తి చేయడానికి నిర్ణీత గడువు విధించారు. అలాగే భోగాపురం ఎయిర్పోర్టుల రహదారి, ఎస్టీపీల నిర్మాణం, ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు, మామహామాయ పరిశ్రమ విస్తరణ తదితర అంశాలపై కూడా చర్చించారు. ఈ అన్ని పనులకు సంబంధించిన భూసేకరణను త్వరితగతిన పూర్తి చేసి సంబంధిత శాఖల అధికారులకు అప్పగించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్, డీఆర్ఓ ఈ.మురళి, ఆర్డీఓలు డి.కీర్తి, రామ్మోహన్, ఎస్డీసీలు కళావతి, ప్రమీలాగాంధీ, ఆర్అండ్బీ ఎస్ఈ కాంతిమతి, పరిశ్రమల శాఖ జీఎం కరుణాకర్తో పాటు ఇరిగేషన్, జాతీయ రహదారులు, రైల్వే ఖాఖ అధికారులు, తహసీల్దార్లు, మున్సిల్ కమిషనర్లు, ఎల్ఏ యూనిట్ల డీటీలు పాల్గొన్నారు. -
తూనికల్లో వర్తకుల మోసం
● జీసీసీ మేనేజర్ రాములుసాలూరు రూరల్: గిరిజనుల ఉత్పత్తుల కొనుగోలులో వర్తకులు తూనికల్లో మోసం చేస్తారని జీసీసీ మేనేజర్ సిహ్.ఆములు అన్నారు. ఈ మేరకు సాలూరు మండలంలోని నేరెళ్ల వలస వారపు సంతలో మంగళవారం ఆయన గిరిజనులకు జీసీసీ కొనుగోళ్లపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చింతపండును కిలో రూ.36కు జీసీసీ కొనుగోలు చేస్తుందన్నారు. వర్తకులు ఎక్కువ డబ్బులు ఇస్తామని ఆశ చూపుతారని గిరిజనులు వర్తకులకు చింతపండు అమ్మకాలు చేసి మోసపోవద్దని సూచించారు. అలాగే ఎవరైనా గిరిజనులను మోసం చేసి చింతపండు కొనుగోలు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్దతు ధర రూ.50 చేస్తే మంచిది చింతపండు మద్దతు ధర రూ.50 జీసీసీ చెల్లిస్తే బాగుంటుందని నేరెళ్ల వలసకు చెందిన వంతల గోపాల్తో పాటు ఎగువ సెంబి, దిగువసెంబి, కుంబిమడకు చెందిన గిరిజనులు కోరారు. వర్తకులు కిలోకి రూ.50 చెల్లిస్తున్నారని ప్రభుత్వం గమనించి చింతపండు మద్దతు ధర పెంచాలన్నారు. కార్యక్రమంలో ప్రాథమిక కొనుగోలు కేంద్రం ఇన్చార్జి రమేష్కుమార్ జీసీసీ సిబ్బంది పాల్గొన్నారు. -
జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు షణ్ముఖ రావు
విజయనగరం: జాతీయస్థాయిలో జరగనున్న పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల అథ్లెటిక్స్ పోటీలకు విజయనగరానికి చెందిన ఎం.షణ్ముఖరావు ఎంపికయ్యాడు. జనవరి 28 నుంచి 30వ తేదీ వరకు తిరుపతిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో 800 మీటర్ల పరుగుపందెంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రజత పతకం సాధించాడు. ప్రస్తుతం డిప్లమో విద్యనభ్యసిస్తున్న షణ్ముఖ్ మార్చి నెలలో కేరళలో జరగనున్న ఆలిండియా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్ధుల పోటీలకు అర్హత సాధించాడు. రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనరబచడంతో పాటు జాతీయస్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారుడితో పాటు విజ్జి స్టేడియంలో శిక్షణ ఇచ్చిన కోచ్ ఎ.నర్సింగరావును జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లీలాకృష్ణ, కార్యదర్శి శ్రీకాంత్, కోశాధికారి ఆనంద్ కిషోర్లు అభినందించారు. -
రాజాంలో చోరీపై ముమ్మర దర్యాప్తు
రాజాం: రాజాంలోని జీఎంఆర్ ఐటీ క్వార్టర్స్లో ఆదివారం రాత్రి జరిగిన కిలోన్నర బంగారం, కిలో వెండి చోరీ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. జీఎంఆర్ఐటీ సమీపంలోని గ్రామాల్లో మంగళవారం ఆరాతీశారు. ఐటీ సమీపంలో బుచ్చింపేట రోడ్డులో ఓ వ్యక్తికి చెందిన పల్సర్ బైక్ చోరీ జరిగిన రాత్రి అపహరణకు గురికావడంపై కేసు నమోదుచేశారు. ఆ బైక్ దొంగతనానికి, ఈ చోరీకి మద్య ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. దొంగలను పట్టుకునేందుకు పది బృందాలు గాలిస్తున్నట్టు రాజాం రూరల్ సీఐ ఉపేంద్ర తెలిపారు. చోరీకి గురైన బైక్ను గుర్తించినవారికి పారితోషకం ఇస్తామని ప్రకటించారు. భద్రతలో వైఫల్యమా... పెద్దపెద్ద సెమినార్లు, కాన్వొకేషన్లు జరిగినప్పుడు కూడా బయట వ్యక్తులకు లోపలకు రానివ్వని జీఎంఆర్ఐటీ ప్రాంగణంలో ఇంత పెద్ద దొంగతనం ఎలా జరిగిందని ప్రస్తుతం మిస్టరీగా మారింది. సీసీ కెమెరాల నిఘా ఏమైంది.. సెక్యూరిటీ సిబ్బంది నిద్రపోతున్నారా అన్న చర్చ జోరందుకుంది. జీఎంఆర్ ఐటీ ప్రాంగణం 30 ఎకరాలకు పైగా విస్తరించి ఉంది. అక్కడే జీఎంఆర్ కేర్ డాక్టర్లకు, ఇటు జీఎంఆర్ ఐటీ ప్రొఫెసర్లకు క్వార్టర్స్ ఇచ్చారు. ఈ క్వార్టర్స్, కాలేజీలోకి వెళ్లాలంటే అడుగడుగునా జీఎంఆర్ ప్రైవేట్ సెక్యూరిటీ నిఘా ఉంటుంది. అయితే, తక్కువ ఎత్తులో ఉన్న ప్రహరీని దూకి క్వార్టర్స్లోకి దొంగలు ప్రవేశించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీసీ కెమెరాలేవీ? జీఎంఆర్ కేర్ ఆస్పత్రితో పాటు ఐటీ కాలేజీలు వద్ద సీసీ కెమెరాలు నిఘా ఉంది. ఈ క్వార్టర్స్ వద్ద ఈ సీసీ కెమెరాలు లేవు. రెండు ప్లాట్లులో చోరీ జరగగా ఒక ప్లాట్ వద్ద మాత్రమే సీసీ కెమెరా ఉంది. అందులో ముసుగుతో ఉన్నట్లు దొంగలు కనిపించారు. భారీగా బంగారం చోరీ జరిగిన రస క్వార్టర్స్ వద్ద మాత్రం ఒక్క సీసీ కెమెరా కూడా లేదు. ఆ క్వార్టర్సే కాకుండా చుట్టు పక్కల కూడా సీసీ కెమెరాలు లేకపోవడం గమనార్హం. సెక్యూరిటీ ఏమైంది? జీఎంఆర్ ఐటీ మెయిన్ గేట్, కాలేజీ బ్లాకులు, హా స్టల్స్, డీఏవీ స్కూల్స్ వద్ద జీఎంఆర్ రక్షా సెక్యూరిటీ ఉంటుంది. ఈ క్వార్టర్స్ వద్ద ఆ సెక్యూరిటీ గార్డులు ఉన్నారా? లేదా? అన్నది బయటకు రానివ్వలేదు. సెక్యూరిటీ గార్డులు అక్కడ ఉండి ఉంటే ఇంతటి చోరీ జరిగేదికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒక్కో క్వార్టర్లో 20 వరకూ గదులు ఉన్నా యి. ఈ గదులు అన్నీ ఒకదానికి ఒకటి ఆనుకుని ఉంటాయి. వీటిలో మనుషులు లేని ఇండ్లను దొంగలు ఎలా గుర్తించారు... అక్కడే ఎలా దొంగతనానికి దిగారు... గుప్చప్గా ఎలా మాయమయ్యారన్నది పోలీసులకు సైతం అంతుచిక్కడంలేదు. ఇక్కడే గంజాయి విక్రయాలు.. జీఎంఆర్ ఐటీ సమీపంలోని బుచ్చింపేట రోడ్డులో గంజాయి విక్రయాలు జోరుగా జరిగేవి. ప్రధాన రహదారులపై గంజాయి బ్యాచ్లు గొడవలు వంటివి చోటుచేసుకున్నాయి. ఈ సమీపంలోనే ఇప్పుడు పెద్దచోరీ జరుగడం పలు అనుమానాలకు తావిస్తోంది. గతంలో చిన్నచిన్న దొంగతనాలకే భయబ్రాంతులకు గురయ్యే పట్టణవాసులు ఇప్పుడు ఈ భారీ చోరీని తలుచుకుని ఆందోళనచెందుతున్నారు. -
● బంగారు కొండలు
● రాష్ట్రస్థాయి పోటీల్లో 15మంది విద్యార్థులకు గోల్డ్మెడల్స్ ● అభినందించిన హెచ్ఎం, సిబ్బందిచీపురుపల్లి: రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఆర్ట్స్ అండ్ క్రాప్ట్స్ పోటీల్లో మండలంలోని మెట్టపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 15 మంది విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో మెట్టపల్లి విద్యార్థులు 15 మంది బంగారు పతకాలు సాధించారు. దీంతో మంగళవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హెచ్ఎం విజ య్కుమార్, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలోని మండపేటలో మదర్ థెరీసా ఫైన్ ఆర్ట్స్ అకాడమీ నిర్వహించిన ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ పోటీలకు మెట్టపల్లి జెడ్పీ పాఠశాల విద్యార్థులు వెళ్లినట్లు చెప్పారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 14 మంది విద్యార్థులు చిత్రలేఖనం పోటీల్లో బంగారు పతకాలు సాధించగా ఒక విద్యార్థి క్రాఫ్ట్ విభాగంలో బంగారు పతకం సాధించినట్లు చెప్పారు. బంగారు పతకాలు సాధించిన విద్యార్థులను మిగిలిన వారు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆర్ట్ టీచర్ ఎ.కుమార్, క్రాఫ్ట్ టీచర్ పి.వేదలక్ష్మిలను అభినందించారు. -
విద్యార్థి నేతల కిడ్నాప్ దారుణం
● మోహన్బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలి ● విద్యార్థి సంఘాల డిమాండ్విజయనగరం గంటస్తంభం: విద్యార్థి సంఘం నాయకులను కిడ్నాప్ చేయించిన ఘటనలో సినీనటుడు మోహన్ బాబుపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, మోహన్బాబు యూనివర్సిటీ గుర్తింపును వెంటనే రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు మంగళవారం విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట నిర్వహించిన నిరసనలో మోహన్బాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, తిరుపతి జిల్లాలోని మోహన్బాబు యూనివర్సిటీలో అక్రమంగా అధిక ఫీజులు వసూలు చేసినందుకు గతంలో రూ.26 కోట్లను తల్లిదండ్రులకు తిరిగి చెల్లించాలని, రూ.16 లక్షల జరిమానా విధించినా యాజమాన్యం దోపిడీ కొనసాగిస్తోందని ఆరోపించారు. ఫీజుల దోపిడీకీ వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న విద్యార్థి నేతలను బౌన్సర్లతో కిడ్నాప్ చేయించడం సిగ్గుచేటని పేర్కొంటూ, తక్షణమే చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. -
పేదలను మోసం చేసిన చంద్రబాబు
చీపురుపల్లి: ఎన్నికల ముందు ఇచ్చిన ఎన్నో హామీలను అమలుచేయకుండా రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేశారని, ఆయన ఉత్తుత్తి హామీల పుణ్యమా అని పేదలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. చీపురుపల్లి మండలం గొల్లలములగాం గ్రామంలో మంగళవారం రాత్రి వైఎస్సార్సీపీ గ్రామ కమిటీలు నియామక ప్రక్రియలో పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా రాష్ట్రంలో ఒక్క కొత్త పింఛన్ కూడా ఇవ్వలేదన్నారు. ఎంతో మంది అర్హత కలిగిన లబ్ధిదారులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారన్నారు. వైఎస్సార్సిపి ప్రభుత్వంలో ప్రతీ ఆరు నెలలకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించి కొత్త పింఛన్లు మంజూరుచేసిన విషయాన్ని గుర్తుచేశారు. 50 ఏళ్లు దాటితే పింఛన్ ఇస్తామన్నారని, ఇప్పుడు 60 ఏళ్లు దాటిన వారు వేలాదిమంది ఉన్నా పింఛన్ మంజూరుకాని పరిస్థితి నెలకొందన్నారు. వలంటీర్లకు రూ.10 వేలు జీతం ఇచ్చారా? గ్రామ వలంటీర్లకు నెలకు రూ.10 వేలు జీతం ఇస్తామని చెప్పారని... జీతం ఇస్తున్నారా లేదా అంటూ గతంలో పనిచేసిన వలంటీర్లను ఆయన ప్రశ్నించారు. దీనికి వలంటీర్లు మాట్లాడుతూ రూ.10 వేలు జీతం లేదు సరికదా ఉన్న ఉద్యోగం కూడా లేదు సార్ అంటూ బదులిచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితులే ఉంటాయన్నారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం చంద్రబాబుకు అలవాటు లేదన్నారు. వలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు పేదలకు మెరుగైన సౌకర్యాలు అందాయన్నారు. కార్యక్రమంలో బొత్స కుమార్తె బొత్స అనూష, వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పిలి అనంతం, జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, పార్టీ మండలాధ్యక్షుడు మీసాల వరహాలనాయుడు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ, వైస్ ఎంపీపీ కరుమజ్జి వెంకటరమణమ్మ, సర్పంచ్ కరుమజ్జి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. 18 నెలల్లో ఒక్క కొత్త పింఛన్ ఇవ్వలేదు వలంటీర్లకు ఉపాధిలేకుండా చేశారు.. పింఛన్ లబ్ధిదారుల కోసం పోరాటం చేస్తాం శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ -
గురుకులాల్లో ప్రవేశాలకు పిలుపు
నెల్లిమర్ల: మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశాలకు అధికారులు ప్రకటన విడుదల చేశారు. 2026–27 విద్యా సంవత్సరంలో ఐదోతరగతి, ఇంటర్లో ప్రవేశాలకు ప్రతిభా పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న ఏడు పాఠశాలల్లో మొత్తం 440 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించారు. ఈ నెల 4వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలను అధికారులు తాజాగా ప్రకటించారు. నెల్లిమర్ల బాలికలు, గజపతినగరం బాలురు, గంట్యాడ బాలికలు, బొబ్బిలి బాలుర పాఠశాలల్లో ఐదోతరగతి ప్రవేశానికి 80 చొప్పున సీట్లు అందుబాటులో ఉన్నాయి. నెల్లిమర్ల మత్స్యకార బాలురు, విజయనగరం బాలురు, కొత్తవలస బాలికల పాఠశాలల్లో 40 చొప్పున సీట్లున్నాయి. నెల్లిమర్ల బాలికల కళాశాలలో ఇంటర్లో ప్రవేశానికి 180 సీట్లు కేటాయించారు. వాటిలో ఎంపీసీ–60, బైపీసీ –40, సీఈసీ–40, ఎంఈసీ–40 సీట్లు కేటాయించారు. ప్రతిభ ఆధారంగానే ప్రవేశాలు గురుకుల పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐదో తరగతి, ఇంగ్లిష్ మీడియంలో ప్రవేశాలకు ప్రతిభ పరీక్ష నిర్వహించనున్నారు. గతంలో లాటరీ పద్ధతిలో ప్రవేశాలు కల్పించేవారు. 4వ తరగతి స్థాయిలో పరీక్ష ఉంటుంది. తెలుగు–10, ఇంగ్లిష్–10, లెక్కలు–15, సైన్స్, సోషల్ కలిపి 15 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. పరీక్షకు రెండు గంటల సమయం కేటాయిస్తారు. విద్యార్థులు జవాబులను ఓఎంఆర్ షీట్లో గుర్తించాల్సి ఉంటుంది. జిల్లా అంతా ఒక యూనిట్గా ప్రవేశాలకు ఎంపిక నిర్వహిస్తారు. అవకాశాన్ని వినియోగించుకోవాలి జిల్లాలోని ఎంజేపీఏపీ గురుకుల పాఠశాలలు పదోతరగతి పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణతను సాధిస్తున్నాయి. నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నాం. పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో ఐదో తరగతిలో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేశాం. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రతిభ పరీక్ష ఆధారంగానే ప్రవేశాలు కల్పిస్తాం. నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు ఐదోతరగతికి, పదోతరగతి విద్యార్థులు ఇంటర్లో ప్రవేశానికి ఈ నెల 4నుంచి మార్చి 4 తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. – డాక్టర్ కేబీబీ రావు, గురుకులాల జిల్లా కన్వీనర్, విజయనగరం దరఖాస్తుకు అర్హతలు గురుకులాల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ప్రస్తుత విద్యాసంవత్సరంలో నాలుగో తరగతి చదువుతూ ఉండాలి. జిల్లాలో ఏదైనా ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో నిరంతరాయంగా (2024–25, 2025–26) చదివి ఉండాలి. బీసీ, ఈబీసీ విద్యార్థులు 01–09–2015–31–08–2017 మధ్య జన్మించి, 9 నుంచి 11 సంవత్సరాల మధ్య వయసు వారై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 01–09–2014– 31–08–2018 మధ్య జన్మించి, 9 నుంచి 13 సంవత్సరాల వయసు వారై ఉండాలి. విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకుల సంవత్సర ఆదాయం ఏడాదికి రూ.లక్షకు మించరాదు. అర్హులు రూ.100 ఫీజు చెల్లించి హెచ్టీటీపీఎస్://ఎంజేపీఏపీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఐఎన్ అనే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంజేపీఏపీ బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల జిల్లాలో మూడు బాలికలు, నాలుగు బాలుర పాఠశాలలు 440 మంది విద్యార్థులకు ఐదో తరగతిలో ప్రవేశాలకు అవకాశం నెల్లిమర్లలో ఇంటర్లో ప్రవేశానికి 180 సీట్లు నేటి నుంచి మార్చి 4వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ -
పోలీసులపై డీఆర్ఓకు ఫిర్యాదు
విజయనగరం క్రైమ్: నా భర్తపై అక్రమంగా గంజాయి కేసు నమోదు చేసి పోలీసులు ఇబ్బందులకు పెట్టారంటూ విజయనగరంలోని పూల్బాగ్కు చెందిన సన్యాసిరావు భార్య మంగళవారం వాపోయింది. ఈ మేరకు బంధువులతో కలిసి కలెక్టరేట్ ముందు మంగళవారం ఆందోళన చేసిన ఆమె ఫిర్యాదు చేసేందుకు డీఆర్ఓను కలవగా కోర్టు పరిధిలో ఉన్నందున తామేమీ చేయలేమని ఆయన చెప్పడంతో నిశ్చేష్టురాలైంది. అన్యాయంగా తన భర్త సన్యాసిరావుపై కేజీన్నర గంజాయి తరలిస్తున్నాడంటూ తప్పుడు కేసు పెట్టి ఇంట్లో ఉన్న ఆయనను రూరల్ పోలీసులు బలవంతంగా తీసుకెళ్లిపోయారని ఫిర్యాదులో పేర్కొంది.నాలుగు రోజుల పాటు తన భర్త సన్యాసిరావు కోసం స్టేషన్ చుట్టూ తిరిగానని ఆవేదన వ్యక్తం చేసింది. ఇద్దరు పిల్లలతో ఉన్న తమ కుటుంబంపై అన్యాయంగా పోలీసులు ముద్ర వేశారని పేర్కొంది. బంధువులు, స్నేహితుల సాయంతో తన భర్త బెయిల్పై వచ్చాడని తనకు న్యాయం కావాలని డిమాండ్ చేసింది. -
పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునుంచి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. చదురుగుడి వద్దనున్న బాలాలయంలోనూ, రైల్వేస్టేషన్ వద్దనున్న వనంగుడిలో అమ్మవారిని పుష్పాలతో లంకరించారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమాలను ఆలయ ఈఓ కె.శిరీష పర్యవేక్షించారు. ఇంటి వివాదంలో ఒకరిపై దాడి పార్వతీపురం రూరల్: ఇంటి కొనుగోలు వ్యవహారంలో తలెత్తిన వివాదం దాడికి దారితీసింది. పార్వతీపురం మండలం పెదబొండపల్లిలో మంగళవారం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అరసాడ ఆనందరావు మూడేళ్ల క్రితం సవర కుమార్ వద్ద ఒక ఇంటిని కొనుగోలు చేశాడు. ఆ ఇంటి ముందున్న దుకాణాన్ని తొలగించే విషయంలో గతంలో పెద్దల సమక్షంలో పంచాయితీ జరగ్గా, సంక్రాంతి తర్వాత ఖాళీ చేస్తానని కుమార్ అంగీకరించాడు. అయితే గడువు ముగిసినా దుకాణం తొలగించకపోవడంతో మంగళవారం ఉదయం ఇంటిలో సామాన్లు సర్దుతున్న ఆనందరావు, కుమార్ల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కుమార్, అతని భార్య లక్ష్మమ్మ కలిసి కర్రతో దాడి చేయడంతో ఆనందరావు తల, దవడ భాగాల్లో గాయాలయ్యాయి. బాధితుడు ప్రస్తుతం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
దాగుడుమూతలు..!
సాక్షి, పార్వతీపురం మన్యం: దాగుడుమూతా దండాకోర్ ఆటలా ఉంది జిల్లా కేంద్రంలోని అధికార యంత్రాంగం, ఆక్రమణ దారుల తీరు. చేసిందే కోట్ల రూపాయల విలువైన వరహాల గెడ్డ ఆక్రమణ..చేయించుకున్నదే తప్పుడు రిజిస్ట్రేషన్..ఆపై దర్జాగా విశాఖకు చెందిన వ్యాపారికి విక్రయం..ఇది చాలదన్నట్లు భయం, బెరుకు లేకుండా హెచ్చరిక బోర్డుల తొలగింపు. కర్ర విరగకుండా, పాము చావకుండా అన్నట్లు బోర్డులు పాతుతున్న అధికారులు..ఆక్రమణదారులను సుతిమెత్తగా మందలిస్తున్నారు. ‘అబ్బో..ఆపాటి గౌరవం మేమెందుకెవ్వం?’ అంటూ నాలుగు రోజులు ఆగి, వేసిన బోర్డును పీకేస్తున్నారు ఆక్రమణ దారులు. వరహాలగెడ్డ విషయంలో అధికారులు, ఆక్రమణదారుల తీరు హెచ్చరిక బోర్డు’ పెట్టి సుతిమెత్తగా మందలిస్తున్న అధికారులు నాలుగు రోజులు ఊరుకుని.. పీకి పడేస్తున్న ఆక్రమణదారులు -
కానిస్టేబుల్ సతీమణికి కారుణ్య నియామకం
పార్వతీపురం రూరల్: జిల్లా పోలీసు శాఖలో ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) కానిస్టేబుల్గా పనిచేస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన జి.పోలిరాజు సతీమణి స్వాతికి మంగళవారం కారుణ్య నియామక ఉత్తర్వులను ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి అందజేశారు. ప్రభుత్వం ఆమెను పాలకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ (టైపిస్ట్)గా నియమించింది. జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ..మృతి చెందిన సిబ్బంది కుటుంబానికి రావాల్సిన శాఖాపరమైన ప్రయోజనాలు త్వరగా అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, ఆర్ఐ నాయుడు పాల్గొన్నారు. -
ఫిజియోథెరపిస్ట్కు హెచ్చరిక నోటీస్
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వచ్చిన రోగులను ఓ ఫిజియో థెరపిస్టు క్లినిక్కు తరలిస్తున్నట్టు వచ్చిన ఆరోపణలపై విచారణకు ముగ్గురు వైద్యులతో కూడిన కమిటీని నియమించారు. జనరల్ సర్జరీ హెచ్ఓడీ పి.ఏ.రమణి. రేడియాలజీ ప్రొఫెసర్ శివశ్రీధర్, సీఎస్ ఆర్ఎంఓ ఆనంద్కుమార్ ఫిజియో థెరపిస్ట్ దీపక్ వర్దన్పై విచారణ జరిపారు. విచారణలో క్లినిక్కు తరలించడం వాస్తవమేని రోగి ఒకరు విచారణ కమిటీ అధికారులకు చెప్పడంతో దీపక్వర్దన్కు హెచ్చరిక నోటీసుల జారీచేసినట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ తెలిపారు. కపై ఇటువంటివి పునరావృతం అయితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యలు పరిష్కరించండి విజయనగరం అర్బన్: రాష్ట్రంలోని ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఏపీజీఈఏ జిల్లా కమిటీ సభ్యులు జిల్లాలోని ప్రజాప్రతినిధులందరికీ వినతి పత్రాలను అందజేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా మంగళవారం ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ డాక్టర్ గాదె శ్రీనివాసులునాయుడును విజయనగరంలో కలిసి వినతిపత్రం అందజేశారు. దీనిపై ఎమ్మెల్సీ స్పందిస్తూ ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యలపై ప్రభుత్వంతో చర్చించి ఆర్థిక సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్సీని కలిసిన సంఘనాయకుల్లో జిల్లా అధ్యక్షుడు పువ్వల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శులు బాలభాస్కర్, లెంక సత్తిబాబు, విజయనగరం పట్టణ అధ్యక్షులు సీహెచ్ వెంకటసతీష్, పి.చంద్రశేఖర్, మహిళా విభాగం అధ్యక్షులు వి.రాశేశ్వరి తదితరులు ఉన్నారు. విజయనగరం ఎమ్మెల్యే పి.అదితిగజపతిరాజుకు కూడా వినతి పత్రాన్ని అందజేశారు. 47 మంది హెల్త్ అసిస్టెంట్లకు రీ పోస్టింగ్ విజయనగరం ఫోర్ట్: వైద్య,ఆరోగ్య శాఖకు చెందిన 47 మంది హెల్త్ అసిస్టెంట్లను 14 నెలలుగా విధులు నుంచి తొలగించారు. వారంతా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విధుల నుంచి తొలగించడం సరికాదని, తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఆ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హెల్త్ అసిస్టెంట్స్కు మంగళవారం రీ పోస్టింగ్ ఆర్డర్స్ను డీఎంహెచ్ఓ ఎస్.జీవనరాణి అందజేశారు. -
టీడీపీ నాయకుల దాడులు, దుష్ప్రచారాలపై చర్యలు తీసుకోండి
● పోలీసులకు వైఎస్సార్ సీపీ నాయకుల ఫిర్యాదు బొబ్బిలి: రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ నెయ్యి దుష్ప్రచారంపై విచారణ సంస్థలు, సుప్రీం కోర్టు తీర్పునిచ్చినప్పటికీ టీడీపీ కూటమి నాయకులు అదేపనిగా దుష్ప్రచారం చేస్తున్నారని, దీనివల్ల రాష్ట్రంలోని ప్రజలు, భక్తులు రెండు వర్గాలుగా విడిపోయి ఆన్లైన్, ఆఫ్లైన్లో ఒకరిపై మరొకరు పోస్టులు, వాగ్వాదాలు, ఆరోపణలతో కొట్టుమిట్టాడుతున్నారని వైఎస్సార్ సీపీ పట్టణ, మండలాధ్యక్షులు చోడిగంజి రమేష్ నాయుడు, తమ్మిరెడ్డి దామోదరరావు పోలీసు స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు కాపీని బొబ్బిలి సీఐ కె.నారాయణరావుకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా వెళ్తున్న వైఎస్సార్సీపీ రాష్ట్ర మాజీ మంత్రులు, నాయకుల ఇళ్లపై సైతం దాడులు చేస్తున్నారని, ఇది సహేతుకం కాదన్నారు. ఇటువంటి దురాగతాలు, దాడులు, దుష్ప్రచారాలు ఇక కొనసాగకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రచార కార్యదర్శి బొద్దల సత్యనారాయణ, నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు నడిమింటి సత్యం నాయుడు, న్యాయవాది రుంకాన ప్రసాదరావు, తాట్రాజు రామకృష్ణ, గొట్టాపు సూర్యనారాయణ, అప్పారావు, తదితరులు పాల్గొన్నారు. -
శివరాత్రి ఉత్సవాలకు క్యూలు పటిష్టంగా ఉండాలి
● దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ శోభారాణి నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో ఈ నెల 15 నుంచి జరగనున్న శివరాత్రి ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్(సీఎఫ్ఓ) కె.శోభారాణి ఆదేశించారు. రామతీర్థంలో శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను సోమవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందితో మాట్లాడుతూ ఉత్సవాల్లో ఎటువంటి తోపులాటలకు ఆస్కారం ఉండకూడదన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని క్యూలను పటిష్టంగా ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తులు దర్శనానికి వెళ్లే మార్గంతో పాటు దర్శనం అనంతరం వచ్చే మార్గం వేర్వేరుగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఆలయ ప్రాంగణంలో ఎటువంటి తాత్కాలిక షాపులు లేకుండా చూసుకోవాలని, అడ్డుగా ఉండే వాటిని తక్షణమే తొలగించాలని ఆదేశించారు. దేవస్థానం పరిసర ప్రాంతాలన్నీ శుభ్రంగా ఉండాలని కోరారు. భక్తుల రద్దీ ఒకే చోట ఉండకుండా చర్యలు చేపట్టాలన్నారు. భక్తుల సౌకర్యార్థం తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేసి రన్నింగ్ వాటర్ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఉత్సవాల విజయవంతానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఈఓలు వై.శ్రీనివాసరావు, ప్రసాదరావు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. -
పీజీఆర్ఎస్కు పోటెత్తిన అర్జీదారులు
● 380 వినతుల స్వీకరణ ● వినతులు సకాలంలో పరిష్కరించాలి ● జేసీ సేతు మాధవన్విజయనగరం అర్బన్: ప్రజల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’(పీజీఆర్ఎస్), ‘రెవెన్యూ క్లినిక్’ కార్యక్రమాలకు భారీ స్పందన లభించినప్పటికీ, రెవెన్యూ శాఖ వైఫల్యాలు మరింత స్పష్టంగా బయటపడ్డాయి. సోమవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చి తమ ఫిర్యాదులు, వినతులు సమర్పించారు. కలెక్టరేట్ ప్రాంగణం అంతా అర్జీదారులతో కిటకిటలాడింది. ఇది ప్రజల్లో పేరుకుపోయిన అసంతృప్తి, సమస్యల పరిష్కారంలో జాప్యం ఎంత తీవ్రంగా ఉన్నాయో సూచిస్తోంది. మొత్తం 380 వినతులు అందగా వాటిలో అత్యధికంగా దాదాపు 50 శాతం 188 వినతులు రెవెన్యూశాఖకు సంబంధించినవే ఉన్నాయి. భూముల మ్యుటేషన్లు, అడంగల్, వన్–బీ సర్టిఫికెట్లు, పట్టాదార్ పాస్బుక్లు, భూమి రికార్డుల సరిదిద్దులు వంటి సాధారణ రెవెన్యూ సమస్యలే ఈ వినతుల్లో ఎక్కువ భాగం ఆక్రమించాయి. మరో వైపు వాటిలో రీఓపెన్ వినతులు కూడా అధికంగానే ఉన్నాయి. అదేవిధంగా ఐటీ పార్కులు, పరిశ్రమలు అంటూ ఇష్టాను సారం భారీ విస్తీర్ణంలో భూముల సేకరణను వ్యతిరేకిస్తున్న రైతుల నుంచి వినతులున్నాయి. ఈ పరిస్థితి రెవెన్యూ విభాగంలోని పనితీరు, సమస్యల పరిష్కార వేగంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని స్పష్టం చేస్తోంది. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలపై వచ్చిన వినతులను సకాలంలో పరిష్కరించాలని ఆలస్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. రెవెన్యూ అధికారులు, సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అన్ని శాఖలు ఈపీటీఎస్ పద్ధతిలో తమ రికార్డులు, ప్రొసీడింగ్స్, సర్క్యులర్లు, కోర్టు తీర్పులు, నోటీఫికేషన్లు, ప్రగతి సమాచారం వంటివి ప్రతిరోజూ తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని శాఖలు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శాఖల వినతులు కూడా గణనీయంగా ఉన్నాయని, గ్రామ సచివాలయ శాఖకు 53, డీఆర్డీఏకు 48, పంచాయితీరాజ్కు 25 వినతులు అందాయి. 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా వచ్చిన కాల్స్పై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అర్జీదారులతో నేరుగా మాట్లాడిన తర్వాతే ఎండార్స్మెంట్ ఇవ్వాలని మాట్లాడిన తేదీ, సమయం రిపోర్టులో నమోదు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. వినతులు స్వీకరణ ప్రక్రియలో డీఆర్ఓ ఈ.మురళి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు డి.వెంకటేశ్వరరావు, రాజేశ్వరి, ప్రమీల గాంధీ, శాంతి, ఆర్డీఓలు దాట్ల కీర్తి, సత్యవాణి, రామ్మోహనరావు, సీసీఓ పీ.బాలాజీ, వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు. -
వృద్ధుడి ఆత్మహత్య
విజయనగరం క్రైమ్: స్థానిక ఇందిరా నగర్ లో ఏడు పదుల వయస్సున్న ఓ వృద్ధుడు సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై విజయనగరం వన్ టౌన్ పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. నగరంలోని ఇందిరానగర్ లో ఆర్కే సదన్ అపార్టెమెంట్ వాచ్మన్గా పనిచేస్తున్న అల్లు త్రినాథ్ (70) భార్య భవానీతో ఉంటున్నాడు. కొడుకు, కూతుళ్లకు పెళ్లిళ్లు చేసిన త్రినాథ్ ఆదివారం రాత్రి యాసిడ్ తాగేశాడు. గమనించిన భార్య హుటాహుటిన హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.లైంగిక దాడి కేసులో ముద్దాయికి 14 ఏళ్ల జైలు శిక్షవిజయనగరం క్రైమ్: 2021వ సంవత్సరంలో రామభద్రపురం పీఎస్ లో లైంగికదాడికి పాల్పడినట్లు నమోదైన కేసులో పాతరేగకు చెందిన ముద్దాయి గునపు సింహాద్రికి విజయనగరం మహిళా కోర్టు, 5వ ఏడీజే కోర్టు జడ్జి ఎన్.పద్మావతి 14 ఏళ్ల కారాగార శిక్ష, రూ.10వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ ఏఆర్.దామోదర్ సోమవారం తెలిపారు. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే పాతరేగకు చెందిన గునపు సింహాద్రి అదే గ్రామానికి చెందిన ఒక మహిళపై బలవంతంగా పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో రామభద్రపురం పోలీస్స్టేషన్ లో 2021లో అప్పటి ఎస్సై ఎస్.కృష్ణమూర్తి కేసు నమోదు చేశారు. అప్పటి సాలూరు రూరల్ సీఐ ఎల్.అప్పల నాయుడు దర్యాప్తు చేపట్టి, నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించి, నిందితుడిపై న్యాయ స్థానంలో అభియోగ పత్రం దాఖలు చేశారు. కోర్టులో నిందితుడు గునపు సింహాద్రి నేరానికి పాల్పడినట్లు సాక్ష్యాలు నిరూపితం కావడంతో విజయనగరం మహిళా కోర్టు పై విధంగా తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ తెలిపారు. ఇద్దరికి గాయాలుపార్వతీపురం రూరల్: గరుగుబిల్లి మండలంలోని నందివానివలస సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు రైతులు గాయపడ్డారు. గ్రామం నుంచి తమ టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై రైతులు పొలం పనులకు వెళ్తుండగా, వెనుక నుంచి వస్తున్న కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. 2,407 లీటర్ల సారా ధ్వంసంపార్వతీపురం రూరల్: వివిధ కేసుల్లో పట్టుబడిన సుమారు 2,407.95 లీటర్ల సారాను స్థానిక ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో సోమవారం అధికారులు ధ్వంసం చేశారు. డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ సూపరింటెండెంట్ పర్యవేక్షణలో, మధ్యవర్తుల సమక్షంలో ఈ సారాను పారబోసి నిర్వీర్యం చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఎ.సంతోష్ కుమార్, ఎకై ్సజ్ సీఐ ఎస్.శిరీష, తదితర సిబ్బంది పాల్గొన్నారు. -
సీతం కళాశాలకు ఐఎస్ఓ సర్టిఫికేషన్
విజయనగరం అర్బన్: పట్టణంలోని సీతం కళాశాలకు ఐఎస్ఓ సర్టిఫికేషన్ లభించింది. ఈ గౌరవప్రదమైన సర్టిఫికెట్ను సోమవారం జేఎన్టీయూ జీవీ ప్రొఫెసర్ వీవీసుబ్బారావు చేతుల మీదుగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీరామమూర్తి, వైస్ప్రిన్సిపాల్ సీహెచ్వెంకటలక్ష్మి అందుకున్నారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ సీతం కళాశాల మరిన్న విజయాలను సాధించి, మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఐఎస్ఓ ప్రమాణాలకు అనుగుణంగా కళాశాల పనిచేస్తున్నట్లు ఇది సానుకూల సూచన అని డేటా సమగ్రత, నిజాయితీ, నాణ్యతా ప్రమాణాలకు కట్టుబడి ఉండడం కళాశాల బలమని ఆయన అభిప్రాయ పడ్డారు. ఈ విజయాన్ని సాధించిన కళాశాల బృందాన్ని డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు అభినందించారు. -
సర్టిఫికెట్, డిప్లమో కోర్సులకు నోటిఫికేషన్
విజయనగరం టౌన్: మహారాజా సంగీత, నృత్య కళాశాలలో పలు కోర్సులకు సంబంధించిన సర్టిఫికెట్, డిప్లమో కోర్సులకు నోటిఫికేషన్ విడుదలైనట్టు కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ శాస్త్రి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. నోటిఫికేషన్లో తెలిపిన కోర్సులకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుదారులు జూన్ 30 నాటికి 14 ఏళ్లు నిండినవారై ఉండాలన్నారు. ఈ నెల 28 వరకూ అభ్యర్థులు సాధారణ రుసుంతో పరీక్ష ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. వివరాలకు నేరుగా కళాశాల సమయవేళల్లో కానీ, 08922–223751 నంబర్ను సంప్రదించాలని కోరారు. శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల లక్ష్యం ● ఎస్పీ ఏఆర్ దామోదర్ ● డీపీఓలో ఏఆర్ పోలీసులకు పునశ్చరణ తరగతులు ● 12 రోజుల పాటు ఆయుధాల వినియోగం, నిర్వహణపై ప్రత్యేక శిక్షణ ● ఈనెల 13వ తేదీ వరకు తరగతులు విజయనగరం క్రైమ్: శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల లక్ష్యం కావాలని, యూనిఫాం ధరించిన తరువాత ప్రజల ధన, మాన, ప్రాణాల రక్షణకే పునరంకితం కావాలని ఏఆర్ పోలీస్ సిబ్బందికి ఎస్పీ ఏఆర్ దామోదర్ సూచించారు. ఏఆర్ సిబ్బంది బలమైన శక్తిగా, మాతృశాఖకు వెన్నెముకగా నిలుస్తున్నారన్నారు. స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో సోమవారం ప్రారంభించిన పోలీస్ పునశ్చరణ తరగతులకు ఆయన హాజరై మాట్లాడారు. ఈ నెల 13వ తేదీ వరకు నిర్వహించే తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. విధులను నిష్పక్షపాతంగా, అంకిత భావంతో నిర్వర్తించాలన్నారు. శారీరక దారుఢ్యం పెంచేందుకు, వివిధ ఆయుధాల ఉపయోగాలను, ముఖ్యమైన బందోబస్తులలో విధులను ఏవిధంగా నిర్వహించాలో శిక్షణ ఇస్తామన్నారు. ఫైరింగ్ ప్రాక్టీస్, బాంబు స్క్వాడ్, మస్కట్రీ శిక్షణ, అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్పై ప్రత్యేకంగా శిక్షణ అందించనున్నట్టు ఎస్పీ వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సీఐ ఎ.వి.లీలారావు, ఆర్ఐలు ఎన్.గోపాలనాయుడు, ఆర్.రమేష్ కుమార్, టి. శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
పోలమాంబ మారుజాతరకు పూర్తికావచ్చిన ఏర్పాట్లు
● 15వేలు లడ్డూ ప్రసాదం తయారీ ● 30మంది దేవాదాయసిబ్బంది ● 170మందితో పోలీస్ బందోబస్తుమక్కువ: ఉత్తరాంఽధ్రుల ఇలవేల్పు శంబరపోలమాంబ అమ్మవారి మారుజాతర నేడు జరగనుంది. జాతరకొచ్చే భక్తుల సౌకర్యార్థం ఈవో బి.శ్రీనివాస్, ట్రస్ట్బోర్డు సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తిచేశారు. జాతరలో భక్తుల అవసరార్థం 15వేల లడ్డూప్రసాదాన్ని దేవాదాయశాఖ తయారుచేయించింది. అవసరమైన మేరకు పులిహోర భక్తులకు అందించనున్నట్లు ఈవో తెలిపారు. జాతరకొచ్చే భక్తులకు సేవలందించేందుకు 30మంది దేవాదాయశాఖ సిబ్బంది శంబర గ్రామానికి చేరుకున్నారు. హెల్మెట్ ధరించి జాతరకు రావాలి ద్విచక్రవాహనాలపై జాతరకు చేరుకునే భక్తులు తప్పక హెల్మెట్ ధరించాలని సీఐ రామకృష్ణ భక్తులకు విజ్ఞప్తి చేశారు. జాతరలో 170మంది పోలీస్బందోబస్తు విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. మద్యంతాగి ఆలయానికి రావద్దన్నారు. ఎటువంటి గొడవలకు తావివ్వకుండా, ఆధ్యాత్మిక భావనతో భక్తులు అమ్మవారి ఆలయానికి చేరుకుని దర్శించుకోవాలని సూచించారు. -
రాములోరికిపుష్పార్చన సేవ
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థానంలో స్వామివారి తిరుక్కల్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి సోమవారం పుష్పార్చన సేవ వైభవంగా నిర్వహించారు. సీతారాములను స్వర్ణాభరణాలతో అలంకరించి ద్వాదశ ఆరాధన, సప్తావరణ సేవ జరిపారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. పని ఒత్తిడి తగ్గించాలి విజయనగరం అర్బన్: ఆర్టీసీ ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించాలని, అవకతవకలతో ఉద్యోన్నతలు కల్పించే ప్రక్రియను ఆపకపోతే ఉద్యమం తప్పదని ఆర్టీసీ గ్యారేజ్ ఉద్యోగులు, వర్క్షాప్ సిబ్బంది హెచ్చరించారు. జాల్లా పరిషత్ మినిస్టీరియల్ సిబ్బంది సమావేశ మందిరంలో సోమవారం జరిగిన జోన్–1 గ్యారేజీ ఉద్యోగుల, వర్క్షాప్ సిబ్బంది సమావేశంలో పలువురు మాట్లాడారు. సీనియర్లను పక్కన పెట్టి జూనియర్లకు ఉద్యోగోన్నతులు కల్పించడం యాజమాన్య కుతంత్రమేనని వ్యాఖ్యానించారు. తక్షణమే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఎన్ఎంయూ జోనల్ కార్యదర్శి బీఎస్రాములు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శి పీజీరాఫెల్, అధ్యక్షుడు దుర్గారాజు, డీపో కార్యదర్శి చంద్రమౌళి, గ్యారేజ్ ఉద్యోగులు పాల్గొన్నారు. -
81.90 కేజీల గంజాయి స్వాధీనం
చికెన్పూసపాటిరేగ: మండలంలోని గోవిందపురం విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో 81.90 కేజీలు గంజాయి, మూడు కార్లు, ఒక కంటైనర్ను సీజ్ చేసి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు భోగాపురం రూరల్ సీఐ జి. రామకృష్ణ ఆదివారం తెలిపారు. ఈ ఘటనపై ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రంలోని సిమిలిగూడ నుంచి ఏడు బస్తాల్లో 81.90 కిలోలు గంజాయిని కంటైనర్లో తరలిస్తుండగా పోలీసులు వెంబడిస్తున్నారనే సమాచారంతో గోవిందపురం విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో కంటైనర్ నుంచి కారులోకి గంజాయిని ఎక్కిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షామిలి జిల్లాకు చెందిన అక్రమ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హత్రాస్ జిల్లాకు చెందిన రాహుల్కుమార్, విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన మేడబోయిన తులసీదాస్లను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.4.10 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. కార్యక్రమంలో ఎస్సై ఐ.దుర్గాప్రసాద్, ఏఎస్సై సురేష్, పోలీసు సిబ్బంది ఉన్నారు. మూడు కార్లు, ఒక లారీ సీజ్ పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు కంటైనర్ నుంచి కారులోకి గంజాయి బస్తాలు మారుస్తుండగా పట్టివేత -
భారీగా బంగారం చోరీ
ఫిర్యాదువచ్చింది. ఆ బ్లాక్లో నివాసముంటున్న జీఎంఆర్ఐటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ జి.మాధవకృష్ణారెడ్డి తన ఇంట్లో దొంగతనం జరిగినట్లు పోలీసులకు సమాచారం అందించారు. తాను ఆదివారం పాలకొండ వెళ్లానని, పక్క బ్లాక్లో దొంగతనం జరిగిందని తెలిసి హుటాహుటిన ఇంటికి వచ్చి చూడగా తన ఇంట్లో కూడా దొంగతనం జరిగినట్లు గుర్తించానని వెల్లడించారు. తన బీరువాలో భద్రపరిచిన 291 గ్రాముల బంగారాన్ని(25 తులాలు) దొంగలు పట్టుకుపోయినట్లు బాధితుడు ఫిర్యాదుచేశాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ ఈ విషయం ఎస్పీ ఏఆర్ దామోదర్కు తెలియడంతో ఆయన హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించారు. ప్రొఫెసర్ ఇంటి బ్లాక్ వద్ద సీసీ కెమెరాలు పరిశీలించారు. ఆ కెమెరాల్లో ముగ్గురు దొంగలు చోరీకి వచ్చినట్లు గుర్తించారు. ఈ బ్లాక్ల పక్కనే ఉన్న ప్రహరీ నుంచి వారు లోపలకు చొరబడి చోరీకి పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ప్రొఫెషనల్స్గా అనుమానిస్తున్నాం.. ఈ సందర్భంగా ఎస్పీ ఏఆర్ దామోదర్ విలేకరులతో మాట్లాడుతూ జీఎంఆర్ఐటీ క్వార్టర్స్లో జరిగిన చోరీకి సంబంధించి దొంగలు ఎటువంటి ఆనవాళ్లు లేకుండా జాగ్రత్తపడ్డారన్నారు. చేతులకు గ్లౌజులు పెట్టి చోరీకి పాల్పడ్డారని, ఆధారాలు లేకుండా జాగ్రత్తలు పాటించారని వెల్లడించారు. గతంలో దొంగతనాలకు పాల్పడి తెలివిగా తప్పించుకునే దొంగలముఠాకు చెందినవారే ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారన్నారు. వారు ఎక్కడ ఉన్నా పట్టుకుని బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు.రాజాం: రాజాంలోని జీఎంఆర్ఐటీ క్వార్టర్స్లో ఆదివారం రాత్రి భారీగా బంగారం చోరీ జరిగింది. ప్రొఫెషనల్ దొంగలు ఈ చోరీకి పాల్పడి రెండిళ్లలోని బంగారం, వెండి పట్టుకుపోయారు. ఎటువంటి ఆధారాలు లేకుండా జాగ్రత్తలు పడడంతో ఈ దొంగతనం ప్రొఫెషనల్ దొంగల ముఠాదిగా పోలీసులు భావిస్తున్నారు. ఒకచోట 1250 గ్రాములు, మరో చోట 291 గ్రాముల బంగారంతో పాటు కిలో వెండిని అపహరించుకుపోయారు. ఈ చోరీలపై పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. చిల్డ్రన్ స్పెషలిస్ట్ ఇంట్లో.. రాజాం జీఎంఆర్కేర్ ఆస్పత్రిలో చిల్ట్రన్ స్పెషలిస్ట్గా వైద్యసేవలు అందిస్తున్న డాక్టర్ వీడీ నగేష్ జీఎంఆర్ఐటీ కాలేజీలోని రస బ్లాక్లోని క్వార్టర్స్లో ఉంటున్నారు. ఆయన ఆదివారం విశాఖపట్నం వెళ్లి సోమవారం ఉదయం తిరిగి వచ్చారు. ఇంటి తలుపులు తెరుస్తుండగా అప్పటికే తలుపు తెరిచి ఉండడంతో అనుమానంతో వెంటనే బెడ్రూమ్లోని బీరువాను చూడగా, బీరువా తెరిచి ఉండడంతో పాటు పలురకాల వస్తుసామగ్రి చెల్లాచెదురుగా పడిఉండడంతో ఇంట్లో దొంగలుపడినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా రాజాం రూరల్ సీఐ హెచ్.ఉపేంద్ర, సంతకవిటి ఎస్సై గోపాలరావులు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ఆరాతీశారు. తన బీరువాలో భద్రపరిచిన 1250 గ్రాముల బంగారం(106 తులాలు)తో పాటు కిలో వెండి దొంగతనానికి గురైనట్లు డాక్టర్ వీడీ నగేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయనగరం నుంచి డాగ్ స్క్వాడ్తో పాటు ఫింగర్ ఫ్రింట్ సీఐ మురళీమోన్, క్లూస్ టీం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనా స్థలంలో ఫింగర్ ప్రింట్స్ నమోదుచేయడంతో పాటు క్వార్టర్స్లో పనిచేస్తున్న సిబ్బందిని, చుట్టుపక్కల వారిని వివరాలు అడిగితెలుసుకున్నారు. డాక్టర్ నగేష్ ఇచ్చిన ఫిర్యాదుమేరకు ఆ ఇంట్లో రూ. 2 కోట్లు విలువచేసే 1250 గ్రాముల బంగారంతో పాటు రూ. 50 లక్షలు విలువచేసే కిలో వెండి పోయినట్లు గుర్తించి కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇంతలో మరో చోరీ ఫిర్యాదు.. డాక్టర్ నగేష్ ఇంటి వద్ద దొంగతనానికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించకముందే పక్కనే ఉన్న లయ బ్లాక్లో కూడా చోరీ జరిగినట్లు పోలీసులకు జీఎంఆర్ఐటీ క్వార్టర్స్లోని రెండిళ్లలో బంగారం అపహరణ ఒకచోట 1,250 గ్రాములు, మరో చోట 291 గ్రాముల బంగారం, కిలో వెండి కూడా మాయం సీసీఫుటేజీల్లో దొంగల జాడ రూ.3 కోట్ల మేర నష్టం సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ దామోదర్ -
మా ఊరు.. మా భూమి.. మా హక్కు
విజయనగరం గంటస్తంభం: భూమి అంటే కేవలం ఎకరాల లెక్క కాదు... అది రైతు జీవితం.. పిల్లల చదువుల ఆశ.. వృద్ధులకు భరోసా.. అలాంటి భూములను ఐటీపార్క్ పేరుతో లాక్కోవాలన్న తెలుగుదేశం ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా విజయనగరం కలెక్టరేట్ వద్ద రైతులు సోమవారం ఆందోళన చేశారు. డెంకాడ గ్రామ పోరాట కమిటీ ఆధ్వర్యంలో డెంకాడ, పెడాడ, బంటుపల్లి, గుణుపూరు గ్రామాలకు చెందిన రైతులు ‘మా భూమి మా హక్కు’ అంటూ నినదించారు. ప్రాణాలు తీసినా భూమిని ఇచ్చేదిలేదంటూ జ్యోతిరావుపూలే విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు మహిళలు, రైతులు, కూలీలు ర్యాలీ నిర్వహించారు. ఏపీఐఐసీ ప్రతిపాదించిన ఐటీ పార్క్కోసం 100 శాతం జిరాయితీ సాగుభూముల సేకరణ రైతు జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. సుమారు వెయ్యి మంది చిన్న, సన్నకారు రైతులకు చెందిన వెయ్యి ఎకరాల భూములు కోల్పోతే వలసతప్పదంటూ వాపోయారు. డెంకాడ ఓపెన్ హెడ్ చానెల్, గొడ్డుపాలెం రిజర్వాయర్ నీటితో రెండు పంటలు పండిస్తూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు. సాగుభూములు కోల్పోతే ఉపాధి, జీవితం రెండూ దెబ్బతింటాయని, అభివృద్ధి పేరుతో రైతులను నష్టపెట్టడం సరికాదన్నారు. ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నప్పుడు సాగు భూములను ఎంపిక చేయడాన్ని తప్పుబట్టారు. భూసేకరణను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. పేద రైతుల కన్నీళ్లపై నడిచే తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి మోడల్కు నిదర్శనమని నాయకులు విమర్మించారు. రైతు చేతిలో ఉన్న భూమిని లాక్కొని కార్పొరేట్లకు కట్టబెట్టడమే అభివృద్ధి అన్నట్లుగా టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ ఆందోళనకు వామపక్ష పార్టీలైన సీఐటీయూ, సీపీఐ, ఏఐటీయూసీ సంఘీభావం ప్రకటించాయి. కార్యక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షుడు ప్రదీప్ రాజు, వైఎస్సార్సీపీ నాయకుడు రొంగలి కనక సింహాచలం, నాని రాజు, సిరికి అప్పారావు, రైతులు పాల్గొన్నారు. ఐటీపార్క్ ముసుగులో రైతుల భూముల దోపిడీ వద్దు టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతుల ఆందోళన కలెక్టరేట్ ఎదుట నిరసన -
మా భూములు లాక్కోవద్దు ‘బాబూ’
అభివృద్ధి పేరుతో సాగుభూములను లాక్కోవడం ప్రభుత్వానికి తగదని, జీవనాధారాన్ని దూరం చేయొద్దంటూ భోగాపురం మండలం ముంజేరు గ్రామ రైతులు విజ్ఞప్తిచేశారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్లో అధికారులకు వినతులు అందజేసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వినతుల సామూహిక నమోదు వీలుకాదని సిబ్బంది అడ్డుకోవడంతో, వారంతా వ్యక్తిగతంగా ఫిర్యాదులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇంతలోనే సాంకేతిక సమస్య అంటూ ఫిర్యాదుల నమోదును వాయిదా వేశారు. దీనిపై అసహనం వ్యక్తంచేస్తూ మహిళలు, రైతులు కలెక్టరేట్ పోర్టుకో ఎదుట ఆందోళన చేశారు. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. భోగాపురం విమానాశ్రయానికి మా పరిసరస ప్రాంతాల రైతులు చాలావరకు భూములు కోల్పోయి జీవనాధారం లేక ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పుడు తమకు అదే పరిస్థితి తేవద్దంటూ నినదించారు. తరతరాలుగా సాగుచేసుకుంటున్న భూములను వదులుకునేందుకు సిద్ధంగా లేమని స్పష్టంచేశారు. – విజయనగరం అర్బన్ -
విజయనగరం
భారీగా బంగారం చోరీ రాజాంలోని జీఎంఆర్ఐటీ క్వార్టర్స్లో ఆదివారం రాత్రి దొంగలు దూరారు. రెండిళ్లలో కేజీన్నర బంగారం, కేజీ వెండిన దోచుకుపో యారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ పరిశీలించారు.మంగళవారం శ్రీ 3 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026ఈ ఫొటోలో నడవలేని స్థితిలో ఉన్న వృద్ధురాలి పేరు పి.ఆదమ్మ. ఈమెది విజయనగరం మండలం జొన్నవలస గ్రామం. తనకు ఇచ్చే 5 కేజీల రేషన్ బియ్యం తెచ్చుకునేందుకు రేషన్ షాపునకు వెళ్లి వచ్చేందుకు అపసోపాలు పడింది. ఇంటికి వెళ్లే మార్గంలో నడవలేక వంగిపోయి, నిలబడిపోయి అవస్థలు పడింది. గత ప్రభుత్వంలో ఇంటి ముంగిటకే రేషన్ బండిని తెచ్చి బియ్యం ఇచ్చేవారని, ఇప్పుడు కష్టాలు తప్పడంలేదంటూ వాపోయింది. రేషన్ సరుకులకోసం నిరీక్షిస్తున్న లబ్ధిదారులుఈ ఫొటోలో బియ్యంతో నిలబడిన వృద్ధిరాలి పేరు టి.అప్పయ్యమ్మ. ఈమెది కూడా జొన్నవలస గ్రామం. బియ్యం తెచ్చుకునేందుకు అష్టకష్టాలు పడింది. ఇంటికి వెళ్లే మార్గంలో పలు మార్లు ఆగుతూ వెళ్లింది. ఇంటి వద్దకు అందని సరుకులు బియ్యం ఇంటికి తెచ్చుకునేందుకు అష్టకష్టాలు జిల్లాలో 5.71 లక్షల రైస్ కార్డులు ఇంటికి రేషన్ అందించాల్సింది 69వేల మందికి... జిల్లాలో 5.71 లక్షల రైస్ కార్డులు -
కిడ్నీ రోగులకు ఉచిత డయాలసిస్ లక్ష్యం
● వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శృంగవరపుకోట: రాష్ట్రంలో మూత్రపిండ వ్యాధి గ్రస్థులకు ఉచిత డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్యాదవ్ చెప్పారు. ఈ మేరకు సోమవారం ఆయన ఎస్.కోటలో 100పడకల ప్రభుత్వాస్పత్రి అదనపు భవనాలను, డయాలసిస్ కేంద్రాలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే లలితకుమారిలతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డయాలసిస్ రోగులకు ఉచితంగా మెరుగైన వైద్యం అందివ్వడం కోసం ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి సీహెచ్సీలో పూర్తిస్థాయి వైద్యం అందివ్వాలని ఆరు నెలల్లో పెండింగ్ పనులు పూర్తి చేసి మంచి వైద్యం అందించేందుకు ప్రభుత్వం పనిచేసిందన్నారు. మెరుగైన ఆరోగ్యసేవలు ఇవ్వాలని ఎన్సీడీ హెల్త్ కాంపులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యే లలితకుమారి మాట్లాడుతూ తన అభ్యర్థనను మన్నించిన ఆరోగ్యశాఖ మంత్రి ఆస్పత్రి పూర్తికావడానికి సహకారం అందించారన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి, ఆర్డీవో కీర్తి, దాసరి కార్పొరేషన్ చైర్మన్ పీవీ రత్నాజీ, జనసేన ఇన్చార్జ్ ఒబ్బిన సత్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ సీహెచ్.మల్లునాయుడు, బీజేపీ నేత రాకేష్ వర్మ, రెడ్డి పావని, డోకుల అచ్చింనాయుడు, కె.ఈశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్, పీఏసీఎస్ చైర్మన్ జీఎస్.నాయుడు, వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ ఎం.శ్రీలక్ష్మి, దాసరి కార్పొరేషన్ డైరెక్టర్లు ఎన్.రమణాజీ, జి.బంగారునాయుడు తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారమే లక్ష్యం
● కలెక్టర్ డా.ఎన్ ప్రభాకర రెడ్డిపార్వతీపురం రూరల్: ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన పాల్గొని బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారం కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అర్జీదారులు సంతృప్తి చెందేలా శాశ్వత పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. పీజీఆర్ఎస్ పోర్టల్లో నమోదైన ఫిర్యాదులు పెండింగ్లో ఉండకూడదని, గడువు ముగియక ముందే సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఒకవేళ వినతులను తిరస్కరించాల్సి వస్తే, అందుకు గల సరైన కారణాలను బాధితులకు లిఖితపూర్వక సమాచారం ద్వారా తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా మొత్తం 143 దరఖాస్తులు అందగా, అందులో 91 రెవెన్యూ విభాగానికి చెందినవి కాగా, 52 సాధారణ దరఖాస్తులు ఉన్నాయి. వీరఘట్టం మండలం కూరాకుల వీధి అంగనన్వాడీ కేంద్రంలో విధులకు ఆటంకం, మెనూ అమలులో వైఫల్యంపై బాలింతలు ఫిర్యాదు చేయగా..కురుపాం గ్రీన్ అంబాసిడర్లు తమ 11 నెలల బకాయి వేతనాల కోసం విన్నవించుకున్నారు. ఉపాధి అవకాశాలు, వృద్ధాప్య, వికలాంగ పింఛన్లు, లోన్ల మంజూరుతో పాటు తోటపల్లి బ్యారేజీ నిర్వాసితుల నష్టపరిహారం, భూ ఆక్రమణలు, రీ–సర్వేలో తప్పుల సవరణపై పలువురు కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. బాధితులకు భరోసా..సమస్యలకు పరిష్కారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ’ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ బాధితులకు కొండంత అండగా నిలిచింది. ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి స్వయంగా బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ఫిర్యాదుదారులతో ఆయన ముఖాముఖి మాట్లాడారు. ప్రధానంగా భూ వివాదాలు, కుటుంబ కలహాలు, సైబర్ నేరాలు, వేధింపులు, అలాగే ఆన్లైన్ మోసాలకు సంబంధించి మొత్తం 16 ఫిర్యాదులు అందాయి. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించిన ఎస్పీ..అక్కడికక్కడే సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఫిర్యాదుల పూర్వాపరాలను ఆరా తీసి, బాధితులకు చట్ట పరిధిలో తక్షణమే న్యాయం చేయాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా, తీసుకున్న చర్యలపై నివేదికను సమర్పించాలని స్పష్టం చేశారు. ప్రజలు తమ గోడును నేరుగా పోలీసు ఉన్నతాధికారులకు వివరించేందుకు ఈ వేదిక ఒక చక్కని అవకాశమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాలకొండ డీఎస్పీ రాంబాబు, డీసీఆర్బీ సీఐ ఆదాం, సిబ్బంది పాల్గొన్నారు. -
ఉద్యోగుల ప్రాణాలతో చెలగాటమా?
● ప్రభుత్వతీరుపై సచివాలయ ఉద్యోగుల ఆందోళన ● ఉద్యోగుల మృతికి కన్నీటి నివాళి ● కొవ్వొత్తులు వెలిగించి నిరసన విజయనగరం గంటస్తంభం: చంద్రబాబు ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులపై కక్షపూరితంగా వ్యవహరిస్తోంది.. పరిమితిలేని పని గంటలు అప్పగిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతోందని పలువురు ఉద్యోగులు వాపోయారు. సచివాలయాల్లో పనిఒత్తిడిని తట్టుకోలేక, ఇతర కారణాలతో బలవంతపు మరణాలకు గురైన ఉద్యోగులను స్మరిస్తూ ఏపీఎన్జీఓ హోమ్లో సోమవారం కొవ్వొ త్తులు వెలిగించి నివాళులర్పించారు. మృతికి కారణమైన ప్రభుత్వ విధానాలపై డీయూ సేవ (డిస్ట్రిక్ అర్బన్ సచివాలయం ఎంప్లాయీస్ విజయనగరం అసోసియేషన్) ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘ నాయకులు పలువురు మాట్లాడుతూ సర్వేలు, ప్రత్యేక డ్యూటీలు, సంబంధం లేని శాఖల పనులు, మొబైల్ యాప్స్ భారం వల్ల సచివాలయ ఉద్యోగులు శారీరకంగా, మానసికంగా కుంగిపోతున్నారన్నారు. ఉద్యోగుల సమ యం పూర్తయిన తరువాత కూడా పనిచేయాల్సి రావడం వల్ల కుటుంబానికి సమయం కేటాయించలేని పరిస్థితి నెలకొందని, ఈ ఒత్తిడి కారణంగా హార్ట్ స్ట్రోక్లు, మానసిక రుగ్మతలకు ఉద్యోగులు బలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పని ఒత్తిడితో మరణించిన సచివాలయ ఉద్యోగులకు కనీస బెనిఫిట్స్ లేకపోవడం అత్యంత అమానుషమన్నారు. జీవించే హక్కు మాకు ఉందని, ఛిదిమేసే హక్కు మీకు ఎక్కడ ఉందంటూ ప్రశ్నించారు. ఉద్యోగులకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బలవంతపు మరణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీయూ సేవా అధ్యక్షుడు బి.శ్రీను, ఉద్యోగులు పాల్గొన్నారు. -
టీడీపీలో పరువు కరువు
● ఎస్.కోటలో ప్రొటోకాల్ కుంపటి ● కనీస గౌరవం లేదంటూ మీడియా ముందు వాపోయిన టీడీపీ నాయకులు శృంగవరపుకోట: మాకు రెస్పెక్ట్ లేదా.. మాకు రెస్పెక్ట్ ఇవ్వారా.. అంటూ పలువురు టీడీపీ నాయకులు ఎస్.కోట వేదికగా సోమవారం గగ్గోలుపెట్టారు. టీడీపీలో పరువు కరువైందంటూ వాపోయారు. ఎస్.కోటలో ఆస్పత్రి భవనాల ప్రారంభోత్సవానికి ఆరోగ్యశాఖ మంత్రి, ఎంఎస్ఎంఈ శాఖల మంత్రులు వచ్చారు. దీనికి నియోజకవర్గంలోని పలువురు టీడీపీ నాయకులకు పిలుపు అందలేదు. దీనిపై ఎంపీపీ సోమేశ్వరరావు, మాజీ ఎంపీపీ అప్పారావు, తదితరులు మీడియాతో మాట్లాడుతూ ‘నాడు ఐ.వి.ఎన్.రాజు హయాంలో, తర్వాత ఒంటి అప్పారావు నేతృత్వంలో ఆస్పత్రి భవనాలకు ఎంపీడీఓ కార్యాలయం స్థలం ఇచ్చాం... భవనాల ప్రారంభోత్సవానికి అధికారుల నుంచి కనీసం పిలుపు అందలేదు.. ప్రొటోకాల్ పాటించలేదు.. మేము రాజ్యాంగం ప్రకారం ఎన్నికై న వాళ్లం కాదా’ అంటూ వాపోయారు. ఇంతటి దౌర్బాగ్య స్థితి ఎక్కడా ఉండదని, పార్టీలో చేరినప్పుడు రండి..రండి అంటూ ఇప్పుడు పొమ్మని పొగపెడుతున్నారని వాపోయారు. ఆస్పత్రి భవనం ప్రారంభోత్సవానికి డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణకు కూడా పిలుపు అందలేదు. ఆహ్వాన పత్రికల్లో ఆయన పేరు ప్రస్తావించలేదు. ఫ్లెక్సీలలో ఎక్కడా ఆయన ఫొటో లేదు. దీనిపై ఆయన కలెక్టర్ రాంసుందర్రెడ్డికి ఫిర్యాదు చేశారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో, రాత్రికి రాత్రే శిలాఫలకంపై గొంప కృష్ణ పేరును ఇరికించారు. -
చెరకు రైతుకు ప్రోత్సాహకాలు అందించాలి
● చెరకు రైతులు, కర్మాగార ప్రతినిధుల సమావేశంలో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విజయనగరం అర్బన్: రైతులు చెరకు సాగుపై మక్కువ చూపేలా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందజేయాలని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కోరారు. చెరకు రైతుకు అన్ని రాష్ట్రాల్లోనూ రవాణా చార్జీల రూపంలో ప్రోత్సాహక నగదు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమచేస్తున్నట్టు తెలిపారు. తమిళనాడు రాష్ట్రంలో టన్నుకు రూ.450 వరకు ఇస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంలో ఆ దిశగా ప్రోత్సాహక ప్రతిపాదనలు అమలు చేస్తున్నారని తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ‘చెరకు సాగు, రైతుల పరిస్థితుల’పై సంకిలి చెక్కర కర్మాగారం ప్రతినిధులు, చెరకు సాగుచేసే ప్రాంతాల ప్రజాప్రతినిధులు, రైతులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ చెరకు రైతుకు, కర్మాగారానికి రెండింటికీ లబ్ధి చేకూరేలా ప్రభుత్వ ప్రణాళికలు ఉండాలని తెలిపారు. పంటల మార్పిడి దిశగా రైతులను ప్రోత్సహిస్తూ అవగాహన కల్పించాలన్నారు. ప్రస్తుతం మూడు జిల్లాల్లో సుమారు 4 వేల హెక్టార్లలో చెరకు సాగు జరుగుతుండగా దాన్ని కనీసం 10 వేల హెక్టార్లకు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. మంత్రి కొండపల్లి మాట్లాడుతూ గతంలో జిల్లాలో చెరకు విరివిగా పండేదని, చెక్కర కర్మాగారాలు పనిచేసిన కాలంలో రైతులు ఆ పంటవైపు మొగ్గు చూపేవారని గుర్తుచేశారు. ఇప్పుడు ఆ స్థితిని తిరిగి తీసుకురావాలని, రైతులకు చెరకు సాగు లాభాదాయకమనే భరోసా కల్పిస్తే వారు ముందుకు వస్తారని అభిప్రాయపడ్డారు. సంకిలి చక్కెర కార్మగారం ఈ ఏడాది మూసివేస్తారనే వదంతులు వ్యాప్తి చెందాయని, అది ఉత్తరాంధ్రకు తీవ్ర నష్టమని విమర్శించారు. ఈ ఏడాది కర్మాగారానికి కనీసం 4 లక్షల టన్నుల చెరకు సరఫరా అయ్యేలా రైతులకు అవగాహన కల్పిస్తామని కర్మాగారం నుంచి అవసరమైన ఇన్పుట్స్ అందించే విషయంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. సంకిలి కర్మాగారం ప్రతినిధులు మాట్లాడుతూ విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో చెరకు సాగు క్రమంగా తగ్గిపోతోందని వివరించారు. చెరకు నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉండడం, చెల్లింపులు ఆలస్యంగా జరగడం వల్ల రైతులు మొక్కజొన్న, ఆయిల్పామ్ వంటి ఇతర పంటల వైపు మళ్లుతున్నారని తెలిపారు. కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి మాట్లాడుతూ రైతు, కర్మాగారం ఇద్దరికీ లాభం చేకూరేలా చర్యలు తీసుకోవాలని, పంటల మార్పిడిని పోత్రహిస్తూనే చెరకు సాగును పెంచాలని సూచించారు. ఎమ్మెల్యేలు బగ్గు రమణమూర్తి (నరసన్నపేట), కోండ్రు మురళీమోహన్ (రాజాం), బేబీ నాయన (బొబ్బలి) మాట్లాడుతూ రైతులకు భరోసా కల్పించాలని, సకాలంలో కటింగ్, మంచి సీడ్, ఆర్థిక సహాయం అందించాలని కర్మాగార ప్రతినిధులను కోరారు. సమావేశంలో జేసీ సేతు మాధవన్, శ్రీకాకుళం, మన్యం జేసీలు వర్చువల్గా పాల్గొన్నారు. మూడు జిల్లాల వ్యవసాయ శాఖ జేడీలు రామారావు, అన్నపూర్ణ, త్రినాథస్వామి, కేన్ డిప్యూటీ కమిషనర్ సత్యనారాయణ పాల్గొన్నారు. -
నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు
విజయనగరం అర్బన్: జిల్లాలో ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ మరియు థియరీ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు ఆదివారం నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు డీవీఈఓ ఎస్.తవిటినాయుడు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షలకు జిల్లాలో మొత్తం 15,370 మంది విద్యార్థులు హాజరు కానున్నట్టు తెలిపారు. జిల్లాలో 98 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రానికి ఒక చీఫ్ సూపరిండెంట్తో పాటు సంబంధిత ప్రాక్టీకల్ ఎగ్జామినర్లను నియమించామని వెల్లడించారు. పరీక్షల పర్యవేక్షణ కోసం రెండు ఫ్లయింగ్ స్క్వాడ్లను కూడా నియమించినట్టు తెలిపారు. ఇంటర్మీడియెట్ థియరీ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 18వ తేదీ వరకు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ పరీక్షలకు జిల్లాలో మొత్తం 39,037 మంది విద్యార్థులు హాజరు కానున్నట్టు వెల్లడించారు. మొదటి సంవత్సరం మొత్తం 19,759 మందిలో జనరల్ 17,421 మంది, ఒకేషనల్ 2,334 మంది ఉన్నారు. రెండవ సంవత్సరం మొత్తం 19,278 మందిలో జనరల్ 16,811 మంది, ఓకేషనల్ 2,467 మంది ఉన్నారు. ఇందుకోసం జిల్లాలో 66 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షల్లో అవకతవకలకు తావులేకుండా ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటి నిఘాలోనే పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణలో కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి కమిషనర్గా వ్యవహరించనున్నారు. -
మత సామరస్యానికి ప్రతీక ఉరుసు మహోత్సవం
విజయనగరం టౌన్: స్థానిక బాబామెట్టలో ఉన్న హజరత్ ఖాదర్వలీబాబా 67వ సుగంధ మహోత్సవాలు మూడో రోజు శనివారం అంగరంగ వైభవంగా ముగిశాయి. కార్యక్రమంలో విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పాల్గొన్నారు. దర్గా, దర్బార్ ముతవల్లి డాక్టర్ ఖలీలుల్లా షరీప్ దర్బార్ సంప్రదాయం ప్రకారం ఆయనకు స్వాగతం పలికారు. ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ఉరుసు సందర్భంగా బాబా సన్నిధిలో ఏర్పాటు చేసిన పరమ పవిత్ర అన్న సమారాధనను జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ప్రారంభించారు. భక్తులకు స్వయంగా వడ్డించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాబా సన్నిధిలో నిత్య అన్న సమారాధన నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆకలితో వచ్చే వారికి ఇక్కడ నిరంతరం భోజనం లభించడం గొప్ప సేవా కార్యక్రమమని అన్నారు. జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఇటువంటి ఉత్సవాలు సమాజంలో సోదర భావాన్ని పెంపొందిస్తాయన్నారు. కార్యక్రమంలో దర్గా ముతవల్లి డాక్టర్ ఖలీల్బాబు, గుర్ల మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సన్యాసినాయుడు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు జైహింద్కుమార్, దర్గా కమిటీ సభ్యులు, వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు -
రోడ్డు ప్రమాదాల్లో ఏటా 960 మంది మృతి
● బాధిత కుటుంబాల జీవితాలు చిన్నాభిన్నం : కలెక్టర్ విజయనగరం అర్బన్: జిల్లాలో రోడ్డు ప్రమాదాల కారణంగా ఏటా సగటున 960 మంది ప్రాణాలు కోల్పోతున్నారని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఒక వ్యక్తి మరణిస్తే అతని జీవితం అక్కడితో ముగిసిపోతుందని కానీ ఆ కుటుంబం ఎదుర్కొనే ఆవేదనను జీవితాంతం భరించాల్సి వస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు, భార్యా పిల్లలు పడే బాధ మాటల్లో చెప్పలేనిదన్నారు. కలెక్టరేట్లో రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమం శనివారం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో గాయపడి ఆస్పత్రి పాలైనప్పుడు అయ్యే వైద్య ఖర్చులు ఆయా కుటుంబాలపై తీరని ఆర్థిక భారాన్ని మోపుతున్నాయని తెలిపారు. ఈ కారణంగా అనేక కుటుంబాలు చిన్నాభిన్నమవుతుండగా ప్రమాదాల్లో మరణించిన వారి పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారుతోందని ఉద్దాటించారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపి తన కుటుంబాన్నే ప్రమాదంలోకి నెట్టే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ రహదారి భద్రతా అవగాహన కార్యక్రమాలు ఒక వారం లేదా ఒక నెలతో ముగిసేవి కాదని, ఇది నిరంతర ప్రక్రియ కావాలన్నారు. జిల్లాను ప్రమాద రహిత జిల్లాగా మార్చేందుకు రవాణా, పోలీస్, వైద్య, రెవెన్యూ శాఖలు సమన్వయంతో కృషి చేస్తున్నాయని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారిని గోల్టెన్ అవర్లో ఆస్పత్రికి చేర్చిన వారికి రూ.5 వేలు నగదు పారితోషికం అందిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా రహదారి భద్రతా మాసోత్సవాల్లో విశిష్ట సేవలు అందించిన రోడ్ సేఫ్టీ ఎన్డీఓ అధ్యక్షులు మజ్జి అప్పారావు, డాక్టర్ సాయికుమార్లకు కలెక్టర్ ప్రశంసాపత్రాలను అందించారు. వివిధ పాఠశాలల్లో రోడ్డు భద్రతపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలు పద్మిక, మురళీచరణ్, హేమతేజ, సాయి, హర్హవర్ధన్లకు కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. అలాగే రహదారి భద్రతా నిబంధనలు పాటిస్తూ వాహనాలను సక్రమంగా నడుపుతున్న కలెక్టర్ డ్రైవర్ కృష్ణ, ఎస్పీ డ్రైవర్ ఆనందరావు, వివిధ శాఖల జిల్లా అధికారుల డ్రైవర్లు ప్రతాప్ వర్మ, సాయి, నరేంద్ర ఆలీలను అభినందించారు. కార్యక్రమంలో ఉప రవాణా కమిషనర్ మణికుమార్, జిల్లా రెవెన్యూ అధికారి మురళి, రహదారుల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ కాంతిమణి, అధిక సంఖ్యలో ఎన్సీసీ క్యాడెట్లు, కళాశాలల విద్యార్ధులు పాల్గొన్నారు. -
మహిళా స్వయం సహాయ సంఘాల అభ్యున్నతికి కృషి
విజయనగరం టౌన్: దీనదయాల్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్లోని ఉప పథకం కింద అజీవిక గ్రామీణ ఎక్స్ప్రెస్ యోజన పథకం అమలవుతుందని, గ్రామీణ ప్రాంతాలలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు జీవనోపాధి కల్పించడం జరుగుతుందని డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ పాణి పేర్కొన్నారు. స్థానిక టీటీడీసీలో ఉన్న కార్యాలయం ఆవరణలో లబ్దిదారులకు, సంఘ ప్రతినిధులకు దీనిపై శనివారం అవగాహన కల్పించారు. గ్రామీణ ప్రాంతాలలో రవాణా సౌకర్యాలను మెరుగుపర్చడం, ఎస్హెచ్జీ సభ్యులు తమ ఉత్పత్తులను పట్టణ మార్కెట్లకు తరలించడానికి సహాయపడటం పాఠశాలలు, ఆస్పత్రులు, ఇతర ప్రజా సేవలను మారుమూల గ్రామాల ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. సెర్ప్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ శ్రీనివాసరెడ్డి, భాస్కరరావు, జిల్లా సమైఖ్య అధ్యక్షురాలు మాధవి, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన డీపీఎంలు, ఏపీఎంలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. -
ప్రయోగ పరీక్షలకు వేళాయె..
రాజాం సిటీ: ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం సైన్స్ విద్యార్థులతో పాటు ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ విద్యార్థుల ప్రయోగ పరీక్షలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే అన్ని కేంద్రాల్లో అధికారులు ప్రయోగ పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రాక్టికల్స్కు హాజరయ్యే విద్యార్థులకు ఆయా కేంద్రాల్లో ప్రిన్సిపాల్స్, సైన్స్ అధ్యాపకులను సన్నద్ధం చేశారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు జనరల్ సైన్స్ విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రతి కేంద్రాన్ని ఆర్ఐఓ నేతృత్వంలో డెక్ మెంబర్లు పర్యవేక్షణ చేపట్టనున్నారు. ఆన్లైన్లో మార్కులు పోస్టింగ్ గత విధానంలో లోపాలను సవరించేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లోని విద్యార్థులు రాసే పరీక్షలకు సంబంధించి మార్కులను ఆన్లైన్లో పోస్టింగ్ చేసేలా చర్యలు చేపట్టారు. మార్కులను పరీక్ష అయిన వెంటనే కంప్యూటరీకరించేలా సూచనలు చేశారు. నేటి నుంచి జనరల్ విద్యార్థులకు పరీక్షలు సీసీ కెమెరా నిఘాలో ప్రాక్టికల్ పరీక్షలు జిల్లాలో హాజరుకానున్న 19697 మంది విద్యార్థులు 98 కేంద్రాల్లో జనరల్ ప్రయోగ పరీక్షలు -
వైభవంగా కొండడాబాల యాత్ర
● జ్ఞానాపురం నుంచి వేలాది మంది భక్తుల పాదయాత్ర ● ముగిసిన నవదిన పూజలుకొత్తవలస: మండలంలోని కొండడాబాల వ్యాకులమాత యాత్ర శనివారం వైభవంగా ప్రారభమైంది. విశాఖపట్నం జిల్లా జ్ఞానాపురం నుంచి వేలాది మంది భక్తులు పాదయాత్రగా కొండడాబాలకు చేరుకున్నారు. కనికరమాతను ప్రత్యేక వాహనంపై అలకంరించి తోడ్కుని వచ్చారు. ఎంతో చరిత్ర గల ఈ యాత్రకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటూ ఒడిశా, చత్తీస్ఘడ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తున్నారు. ఆదివారం ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించి యాత్ర ముగుస్తుందని కొండడాబాల విచారణ కర్త గొంగాడ రాజు తెలిపారు. ముగిసిన నవదిన ప్రార్ధనలు వ్యాకులమాత పుణ్యక్షేత్రంలో గడిచిన తొమ్మిది రోజులుగా నిర్వహిస్తున్న నవదిన ప్రార్ధనలు శనివారం రాత్రితో ముగిశాయి. యాత్ర ప్రారంభం కావడంతో కొండడాబాల ప్రాంతం అంతా పోలీస్ల ఆధీనంలోకి తీసుకున్నారు. 147 మంది సిబ్బంది, ఆరుగురు ఎస్ఐలు, ఇద్దరు సీఐలతో స్థానిక సీఐ షణ్ముఖరావు ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ట్రాఫిక్కు ఎక్కడా అంతరాయం లేకుండా తగ జాగ్రత్తలను తీసుకున్నారు. వాహనాల పార్కింగ్ ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. -
డైరీల ఆవిష్కరణ
విజయనగరం ఫోర్ట్: కలెక్టరేట్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ అధికారుల సంఘం 2026 డైరీని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శనివారం ఆవిష్కరించారు. వ్యవసాయ అధికారులకు తమ విధి నిర్వహణలో ఈ డైరీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వి.తారకరామారావు, జిల్లా వ్యవసాయ అధికారుల సంఘం అధ్యక్షులు కె.ప్రకాష్, సెక్రటరీ మజ్జి శ్యాంసుందర్, సంఘం కోశాధికారి బి.శ్యామ్కుమార్, వ్యవసాయ అధికారులు సుధ, మాధవి పాల్గొన్నారు. డైరీని ఆవిష్కరించిన కమాండెంట్ రవిశంకర్రెడ్డి డెంకాడ: రాష్ట్ర పోలీస్ అసోషియేషన్ డైరీని చింతలవలస ఐదవ ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ వై.రవిశంకర్రెడ్డి ఆవిష్కరించారు. బెటాలియన్లోని కమాండెంట్ కార్యాయలంలో శనివారం జరిగిన కార్యక్రమంలో డైరీని ఆయన ఆవిస్కరించారు. కార్యక్రమంలో అడిషినల్ కమాండెంట్ సి.రాజారెడ్డి, అసిస్టెంట్ కమాండెంట్లు ప్రభాకర్, లక్ష్మీనారాయణ, బాపూజీ, గోపాలకృష్ణ, ఆర్ఐలు రవీంద్ర, గణేష్, రామజోగినాయుడు, శ్రీను, చంద్రశేఖర్, సమర్పణరావు, సుధాకర్బాబు, బెటాలియన్ అసోషియేషన్ అధ్యక్షుడు మిత్తిరెడ్డి అప్పలనాయుడు, ట్రెజరర్ పీవీఆర్ మూర్తి, జాయింట్ సెక్రెటరీ సత్యనారాయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శులు రాంబాబు, రవి తదితరులు పాల్గొన్నారు. -
కురుపాంలో దొంగల హల్చల్
● ఒకే రాత్రి రెండిళ్లలో చోరీ ● మరో ఇంట్లో చోరీకి ప్రయత్నం ● ఉలిక్కిపడిన కురుపాంకురుపాం: కురుపాంలో తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా దొంగలు చెలరేగిపోయారు. శుక్రవారం రాత్రి మూడిళ్లలో చోరీకి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. కురుపాం పోలీస్స్టేషన్ ముందు, భారతీయ స్టేట్ బ్యాంకు ఎదురుగా ఉన్న రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ కొత్తకోట మల్లికార్జునరావు ఇంటి ముందు గేటు తీసి ఇంటి సేఫ్టీ గేటు తాళం బద్దలుకొట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం చేసిన దొంగలు చెక్క తలుపులు తాళం తీయలేకపోయారు. తరువాత మెయిన్ రోడ్డులో నివాసం ఉంటున్న జామి దేవీప్రసాద్ ఇంటి తాళం తీసి లోపలికి ప్రవేశించిన దొంగలు బీరువా పగలగొట్టి అందులో నగదు, నగలు దోచుకున్నారు. అలాగే ప్యాలెస్రోడ్డులో ఉన్న కందుల శ్రీనివాసరావు ఇంటి తాళం బద్దలు కొట్టి బీరువాలో నగలన్నీ దోచుకోపోయారు. బాధితులు కురుపాంలో అందుబాటులో లేకపోవడంతో ఎంత విలువైన బంగారు నగలు, వెండి, నగదు దోచుకుపోయిందీ తెలియరాలేదు. కురుపాం ఎస్ఐ పి.నారాయణరావు, ఎల్విన్పేట సీఐ హరి సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల సమాచారంతో కురుపాం చేరుకున్న క్లూస్ టీం వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించింది. ఆధారాలు సేకరిస్తున్నామని సమగ్ర దర్యాప్తు చేస్తామని సీఐ హరి తెలిపారు. -
రథంపై ఊరేగిన రాములోరు
● రామతీర్థంలో ఘనంగా శ్రీరామచంద్రమూర్తి రథయాత్ర ● స్వామివారి సన్నిధిలో వైభవంగా పండిత పరిషత్తు ● కనులారా తిలకించి భక్తజనం నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శనివారం శ్రీరామనామస్మరణతో మార్మోగింది. సీతాసమేత శ్రీరామచంద్రస్వామి వారి రథయాత్ర మహోత్సవం కనులపండువగా సాగింది. ఏటా స్వామివారి తిరుక్కల్యాణం అనంతరం మూడోరోజు నిర్వహిస్తున్న రథయాత్రను కనులారా తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ బలిహరణం చేపట్టి శ్రీరాముడి సన్నిధిలో శ్రీమద్రామాయణ పారాయణ, వేద పఠనం, వైదిక సదస్యం, తదితర కార్యక్రమాలను జరిపించారు. వివిధ రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో శ్రీరామచంద్రమూర్తిని సుందరంగా అలంకరించారు. సాయంత్రం 6 గంటలకు వేద పండితులంతా పండిత పరిషత్ నిర్వహించి నాలుగు వేదాలను భక్తి శ్రద్ధలతో పఠించారు. అనంతరం పండిత పరిషత్ ఎంతో వైభవంగా జరిగింది. ఈ పరిషత్లో సీతారాముల గుణగణాలను వివరించేందుకు వేద పండితుల పోటీపడిన సన్నివేశం భక్తులను ఆకట్టుకుంది. కార్యక్రమం అనంతరం వేద పండితులను దేవస్థాన అధికారులు ఘనంగా సన్మానించారు. రథంపై తిరువీధుల్లో ఊరేగిన రాములోరు... స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలనంతరం మంగల వాయిద్యాల నడుమ సీతారామచంద్రస్వామి వారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక పల్లకిలో ఆలయం చుట్టూ ప్రదక్షణ చేశారు. అనంతరం స్వామివారిని రథంపై ఆసీనులను చేసి విశేష అర్చనలు జరిపారు. రాత్రి 10 గంటలకు వేద పండితుల వేద మంత్రోచ్ఛారణ, భక్తుల జయజయ ధ్వానాల మధ్య సీతారామ లక్ష్మణులు రామతీర్థం పురవీధుల్లో ఊరేగి భక్తులకు కనువిందు చేశారు. సుమారు రెండు గంటల పాటు సాగిన రథయాత్రతో రామతీర్థం పులకించింది. ఆలయ ప్రతిష్ట జరిగిన నాటి నుంచి ఆనవాయతీగా వస్తోన్న సీతారామునిపేట, జగ్గరాజుపేట, గొర్లిపేట గ్రామస్తులు రథాన్ని లాగి కార్యక్రమాన్ని ఘనంగా జరిపించారు. ఆలయం సమీపంలోని ప్రధాన రహదారి వద్ద ప్రారంభమైన రథయాత్ర కుమ్మరిఖానా, బ్రాహ్మణ వీఽధి మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. అనంతరం ఉత్సవ విగ్రహాలను ఆలయంలోకి తీసుకువెళ్లి వెండి మండపంలో ఆసీనులు చేశారు. రథయాత్రలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఈఓ వై.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
7న ముఖ్యమంత్రి వన్నలి రాక !
● స్థల పరిశీలనలో అధికారులు రేగిడి: మండలంలో ఈ నెల 7న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటించనున్నట్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డి.ప్రమీలాగాంధీ తెలిపారు. వన్నలి గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటనకు సభాస్థలంతో పాటు హెలిప్యాడ్ స్థలాన్ని తహసీల్దార్ ఐ.కృష్ణలతతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కలెక్టర్ రామ్సుందర్రెడ్డి ఆదేశాలతో గ్రామాన్ని పరిశీలించేందుకు వచ్చామన్నారు. పర్యటన వివరాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. ఆమె వెంట డీటీ బి.ఈశ్వరరావు, ఆర్ఐ కె.గిరి, సర్వేయర్ చంద్రరావు, విలేజ్ సర్వేయర్ గంగాధరరావు, పంచాయతీ కార్యదర్శి రామారావు, తదితరులు పాల్గొన్నారు. గ్రూప్–1లో మెరిసిన ‘మెస్సీ’ విజయనగరం అర్బన్: ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన గ్రూప్–1 ఫలితాల్లో డెంకాడ మండలం తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న ఆర్.సహజ మెస్సీ ఇవాంజెలిన్ విజేతగా నిలిచారు. ఆమె జిల్లా ఉపాధి అధికారిగా నియామకమయ్యారు. బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేసిన ఆమె 2019లో విజయనగరం మండలం దుప్పాడ గ్రామ సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్గా పనిచేశారు. తండ్రి ఆర్ఏఎస్ కుమార్ జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అకౌంట్స్ ఆఫీసర్గా, తల్లి కె.శోభారాణి జిల్లాలోని బొండపల్లి ఎంఈఓ–1గా సేవలందిస్తున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, సహకారం, స్వయం కృషితో విజయం సాధించినట్టు ఆమె తెలిపారు. మా జీవనాధారం లాక్కోవద్దు ● మంత్రి కొండపల్లికి భోగాపురం రైతుల విజ్ఞప్తి విజయనగరం అర్బన్: అభివృద్ధి పేరుతో జీవనాధారమైన సాగుభూములను లాక్కోవద్దని భోగాపురం మండలంలోని పలు గ్రామాల రైతులు డిమాండ్ చేశారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద మంత్రి కొండపల్లి శ్రీనివాస్ను శనివారం కలిసి గోడు వినిపించారు. ఇప్పటికే విమానాశ్రయం కోసం చాలావరకు భూములు ఇచ్చామని, మళ్లీ అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో ఉన్న కాస్త భూములు లాక్కుంటే మా పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. తరతరాలుగా సాగు చేసుకుంటున్న తమ భూములను వదులుకునేందుకు సిద్ధంగాలేమని స్పష్టంచేశారు. వినతిపత్రం అందుకున్న మంత్రి ఎలాంటి సమాధానం చెప్పకుండానే కలెక్టరేట్లోకి వెళ్లిపోవడంతో రైతులు ఆవేదన చెందారు. మౌలిక హక్కులకు దూరంగా వీధిబాలలు ● జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కృష్ణప్రసాద్ విజయనగరం ఫోర్ట్: వీధి బాలలు విద్యా, ఆరోగ్యం, పోషణ, రక్షణ వంటి మౌలిక హక్కులకు దూరంగా ఉంటున్నారని జిల్లా న్యాయ సేవాఽధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్ అన్నారు. అంతర్జాతీయ వీధి బాలల దినోత్సవం సందర్భంగా శనివారం వీటీ ఆగ్రహారంలో నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. బాలకార్మికత్వం, దోపిడీ, హింసకు గురవుతున్నారు. ప్రతి బాలుడికి సురక్షితమైన జీవితం, విద్య, ప్రేమతో కూడిన వాతావరణం కల్పించడం సమాజం సామూహిక బాధ్యతగా పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యాశాఖ, ప్రజలు కలిసి వీధి బాలల పునరావాసం, విద్యా అవకాశాలు, ఆరోగ్య సేవలు అందించేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో సర్వశిక్ష అభియాన్ కో ఆర్డినేటర్ సీహెచ్ జగన్మోహన్, ఎంఈఓ ఆనందమూర్తి, వీటీ ఆగ్రహారం హైస్కూల్ హెచ్ఎం లూథర్, తదితరులు పాల్గొన్నారు. -
వేంకటేశ్వరస్వామిపై రాజకీయాలు తగవు
● శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ విజయనగరం రూరల్: తిరుమల లడ్డూ వివాదం విషయంలో ఇప్పటికే సుప్రీంకోర్టు క్లీన్చిట్ ఇచ్చినా మళ్లీ అదే విషయంపై రాజకీయం చేయడం మాను కోవాలని వైఎస్సార్సీపీ శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరంలోని మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన ప్రజలకు ఇబ్బందికరంగా మారిందన్నారు. ప్రతిపక్షాలు ప్రజల సమస్యలపై చెప్పడం, అడగడం పరిపాటిగా మారిందన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనపై దృష్టి పెట్టకుండా, ఉన్నది లేనట్లుగా అలజడి సృష్టించి, రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పుతోందన్నారు. చేతులెత్తి కోరుతున్నాను.. రాష్ట్రంలో ప్రజలందరికీ వేంకటేశ్వరస్వామి ఇలవేల్పు అని, అటువంటి దేవ దేవుడిని వివాదంలోకి తీసుకురావడం చాలా అపచారమన్నారు. దర్యాప్తు సంస్థ సిట్ వివరణ ఇచ్చిందని, అంతటితో సమసిపోకుండా అధికారంలో ఉన్న నాయకులు, టీటీడీ దేవస్థానం చైర్మన్ ఆ విషయంపై మాట్లాడి వివాదాస్పదం చేయడం దారుణమన్నారు. కల్తీ నెయ్యి పరీక్షలకు మరోసారి ల్యాబ్కు పంపిస్తారని చెప్పి, అలజడి సృష్టించే ప్రయత్నం చేయడం మానుకోవాలన్నారు. ముఖ్యమంత్రి జంతు కొవ్వు ఉందని విమర్శలు చేస్తే... సుప్రీంకోర్టు స్పందించి సీబీఐతో విచారణ జరిపించిందని, దర్యాప్తులో ఎటువంటి జంతు కొవ్వు కలవలేదని తేలిందన్నారు. సింహాచలం దేవస్థానంలో నెయ్యి కలుషితమైందని పత్రికల్లో అశోక్ గజపతిరాజు ఫొటోతో వార్త ప్రచురితమైందన్నారు. మేము ఏమైనా అశోక్ గజపతిరాజు రాజీనామా చేయాలని అడిగామా అని ప్రశ్నించారు. అత్యుత్తమ న్యాయస్థానం ఇచ్చిన రిపోర్టును గౌరవించకుండా, ప్రజల మనోభావాలతో ఆటలాడుకోవడం సరికాదన్నారు. వాల్పోస్టర్లు, ఫ్లెక్సీలు వేయడం సమంజసం కాదన్నారు. ధైర్యం ఉంటే వాటి కింద మీ పార్టీ పేరు రాసుకోవచ్చు కదా అని మండిపడ్డారు. ఏమైనా తప్పు జరిగితే ట్రస్టు బోర్డు మీద, అధికారులు మీద చర్యలు తీసుకోవాలని ప్రకటించకుండా, మళ్లీ పవిత్రతను పోగొట్టేలా చైర్మన్ మాట్లాడ డం సరికాదన్నారు. ఈ వివాదానికి టీటీడీ ముగింపు పలకాలన్నారు. తప్పుడు నివేదిక ఇచ్చిన ఈఓను సరెండర్ చేయాలని డిమాండ్ చేశారు. దేవాలయాలకు వెళ్లకూడదని పోలీసులు నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రజల్లో విశ్వాసం ఉందా? పోయిందా? అనేది మూడేళ్ల తర్వాత తెలుస్తుందన్నారు. గీతంకు ఏ ప్రాతిపదికన భూమి కేటాయిస్తారు.. ప్రజలకు ఉపయోగపడితే ఏ సంస్థకై నా భూములివ్వడంలో అభ్యంతరం లేదని, గీతం అనేది ప్రైవేటు సంస్థ, ఇప్పటికే 78 ఎకరాలు ప్రభుత్వ భూమి ఇచ్చారు.. మరో 54 ఎకరాలకు పైగా తమ ఆధీనంలో ఉందని గీతం విద్యా సంస్థల అధినేత, ఎంపీ భరత్ స్వయంగా చెప్పారు.. అది భూ కబ్జా కాకపోతే ఏమిటని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. సుమారు రూ.5వేల కోట్ల విలువ చేసే భూమిని వేలంవేస్తే వచ్చే డబ్బులతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పీపీపీకి ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. సమావేశంలో ఆయనతో పాటు ఎమ్మెల్సీ సురేష్బాబు పాల్గొన్నారు. -
విధులకు డుమ్మా..!
● ఉదయం 11:30 గంటలకు టెలిమెడిసిన్ విభాగం ఖాళీ విజయనగరం ఫోర్ట్: జిల్లా కేంద్రంలోని ఘోషా ఆస్పత్రిలోని టెలిమెడిసిన్ హబ్ వైద్యులు శనివారం ఉదయం విధులకు డుమ్మాకొట్టారు. ఉదయం11:30 గంటల ప్రాంతంలో ఒక్క వైద్యుడు కూడా టెలిమెడిసిన్ హబ్లో లేరు. కుర్చీలు, కంప్యూటర్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. ఈ హబ్లో ఎంబీబీఎస్ వైద్యులు ఇద్దరు, జనరల్ మెడిసిన్ ఒకరు, పిడియాట్రిసిన్ ఒకరు, గైనికాలజిస్ట్ ఒకరు పనిచేస్తున్నారు. ఉదయం 9 నుంచి సాయింత్రం 4 గంటల వరకు విధులు నిర్వహించాలి. విలేజ్ హెల్త్ క్లినిక్లు, పీహెచ్సీల వైద్య సిబ్బంది దగ్గరకు వచ్చిన రోగుల్లో స్పెషలిస్ట్ వైద్యం అవసరమైన వారికి టెలిమెడిసిన్ హబ్లో ఉన్న వైద్యులకు వీడియో కాల్ చేస్తారు. సంబంధిత రోగికి జనరల్ మెడిసిన్, పిడియాట్రిసిన్, గైనికాలజీ విభాగాల్లో సేవలందిస్తారు. అయితే హబ్లో ఒక్కరూ లేకపోవడంతో సేవలు అందని ద్రాక్షగా మారాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని డిప్యూటీ డీఎంహెచ్ఓ సూర్యనారాయణ స్పందిస్తూ టెలిమెడిసిన్ హబ్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు విధులు నిర్వహించాలని, అందుబాటులో లేని వైద్యులపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. -
సుజుకీ ఈ యాక్సిస్ స్కూటీ ఆవిష్కరణ
విజయనగరం: ద్విచక్ర వాహన రంగంలో వినియోగదారుల అవసరాలగా అనుగుణంగా ముందడుగు వేసే సుజుకీ మోటారు సైకిల్ సరికొత్త ఎలక్రిక్ట్ స్కూటీని అందుబాటులోకి తీసుకువచ్చింది. సుజుకీ ఈ యాక్సిస్ పేరిట మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటీ వినియోగదారులకు అందించేందుకు సిద్ధమైంది. విజయనగరంలోని జిల్లా కోర్టు ఎదురుగా గల సుజుకీ షోరూంలో నూతన సుజుకీ యాక్సిస్ ఎలక్ట్రిక్ స్కూటీని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ సురేష్బాబు, చీఫ్ మేనేజర్ ప్రధాన్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్విచక్ర వాహన రంగంలో సుజుకీ సంస్థ నూతన సంస్కరణలు వినియోగదారుల మన్ననలు పొందుతాయని ఆకాంక్షించారు. సుజుకీ కంపెనీ అసిస్టెంట్ సేల్స్ మేనేజర్ సురేంద్ర మాట్లాడుతూ సుజుకీ ఈ యాక్సిస్ స్కూటీ వైట్, బ్లూ, గ్రీన్, బ్లాక్ కలర్స్లో అందుబాటులో ఉంటాయన్నారు. వాహనాన్ని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 95 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని, వాహనం కొనుగోలు చేసిన 3 సంవత్సరాల్లో తిరిగి విక్రయించే వారికి బై బ్యాక్ ఆఫర్లో 60 శాతం మొత్తం చెల్లిస్తామన్నారు. రాష్ట్రంలో మొదటిసారిగా గుంటూరులో ఈ నూతన స్కూటీ అందుబాటులోకి రాగా... విజయనగరంలో మాత్రమే విక్రయాలకు సిద్ధంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో సుజుకీ షోరూం ఎండీ అభిరామ్, జనరల్ మేనేజర్ ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వెల్లివిరిసిన ఆధ్యాత్మికత
చికెన్● ఘనంగా సూఫీ సుగంధ ఉరుసు మహోత్సవం ● ఖాదర్బాబా చిత్రపటంతో పురవీధుల్లో భారీ ఊరేగింపు ● ఖాదర్బాబాను దర్శించుకున్న ప్రముఖులు విజయనగరం టౌన్: ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. బాబామెట్ట భక్తిభావంతో నిండిపోయింది. జన సందోహంతో కోలాహలంగా మారింది. సూఫీ ఆధ్యాత్మిక ధృవతార హజరత్ బాబా సయ్యద్ ఖాదర్ అవులియా 67వ ఉరుసు మహోత్సవాల వేడుకలలో భాగంగా రెండో రోజు బాబాను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో బాబామెట్ట జనసందోహంగా మారిపోయింది. శుక్రవారం వేకువజాము నుంచి ఖాదర్బాబా శయన మందిరం దర్గాలో ఖురాన్ పఠనం నిర్వహించారు. హజరత్ ఖాదర్బాబా ప్రియశిష్యులు, అలుపెరగని అన్నదాత హజరత్ అతావుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ బాగ్దాదీ బాబా కుమారులు, సూఫీ పరంపర అభిషక్తులైన విజయనగరం ఖాదర్బాబా దర్గా, దర్బార్ షరీఫ్ ధర్మకర్త ముతవల్లి డాక్టర్ మహమ్మద్ ఖలీలుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ సాబిరీ (ఖలీల్బాబు) నేత్రత్వంలో ఉత్సవాలను సందడిగా నిర్వహించారు. బాబా జీవించిన కాలం నుంచే అనాదిగా వస్తున్న చిత్రపటాన్ని రథంపై ఎక్కించి సందల్ (ఊరేగింపు) నిర్వహించారు. భాజాభజంత్రీలతో, మేళతాళాలతో, ఫకీరు కవ్వాళీలతో విజయనగరం బాబామెట్ట నుంచి ప్రారంభమైన ఊరేగింపు నల్లచెరువు, కాటవీధి, ఆబాద్వీధుల మీదుగా అంబటిసత్రం, ప్రెస్క్లబ్, మూడులాంతర్లు, మెయిన్రోడ్డు, గంటస్తంభం, బాలాజీకూడలి, కోట జంక్షన్, అయ్యకోనేరు గట్టు, రింగురోడ్డు రైతు బజార్, బాబామెట్ట ఏడుకోవెళ్లు మీదుగా తిరిగి ఖాదర్బాబా దర్గాకు చేరుకుంది. అనంతరం మెట్టపై ఉన్న దర్గాలో ఖాదర్బాబాకు నూతన సుగంధ, చాదర్ సమర్పించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో పవిత్ర పూజలు నిర్వహించారు. దర్గా కింద ఉన్న దర్బార్ లంగర్ ఖానాలో వేలాది మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ప్రభుత్వ, రాజకీయ ప్రముఖులు, రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులు, సామాజిక సేవా ప్రముఖులు, ఖాదర్బాబా దర్శనార్ధం దర్గా, దర్బార్కు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్బార్ సంప్రదాయం ప్రకారం ముతవల్లి డాక్టర్ ఖలీల్బాబు వారికి స్వాగతం పలికారు. వేలాది మంది భక్తులు బాబాను దర్శించి, తరించారు. -
సంపూర్ణ అభియాన్ 2.0 ప్రారంభోత్సవం
గుమ్మలక్ష్మీపురం: మండలంలోని కుశ గ్రామంలో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో చేపట్టిన సంపూర్ణ అభియాన్ 2.0 కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమానికి రాష్ట్ర సీ్త్ర శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలోనే ఎంతో అందమైన కుశ ప్రాంతంలో ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వెనుకబడిన ప్రాంతాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే లక్ష్యంతో నీతి ఆయోగ్ ఈ సంపూర్ణ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో సంపూర్ణ అభియాన్ పథకం కింద మరుగుదొడ్లు, తాగునీటి వసతులు కల్పిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ యశ్వంత్ రెడ్డి, ఐటీడీఏ పీఓ జగన్నాథ్, ఐసీడీఎస్ పి.డి కనకదుర్గ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రామకృష్ణ, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
పోలీసులకు ‘పునశ్చరణ’
● 15 రోజుల పాటు సాయుధ దళాలకు ప్రత్యేక శిక్షణ ● ప్రారంభించిన ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డిపార్వతీపురం రూరల్ : జిల్లా పోలీసు వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే ఆర్మడ్ రిజర్వు (ఏఆర్) పోలీసుల వృత్తి నైపుణ్యానికి పదును పెట్టేందుకు మొబిలైజేషన్ (పునశ్చరణ) తరగతులు ప్రారంభమయ్యాయి. స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో శుక్రవారం ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి ఈ శిక్షణా కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు 15 రోజుల పాటు సాగే ఈ శిబిరంలో సిబ్బందికి సర్వతోముఖాభివృద్ధిపై తర్ఫీదు ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. క్రమశిక్షణకు డ్రిల్ ప్రాణవాయువు వంటిది అని పేర్కొంటూ, విధుల్లో చురుకుదనం, శారీరక దారుఢ్యం పెంపొందించుకోవడమే ఈ మొబిలైజేషన్ ముఖ్య ఉద్దేశమని వివరించారు. వివిధ రకాల ఆయుధాల వినియోగం, ఫైరింగ్ ప్రాక్టీస్, బాంబు స్క్వాడ్ పనితీరు మరియు బందోబస్తు విధుల్లో మెలకువలపై ఈ సందర్భంగా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. కేవలం వృత్తిపరమైన అంశాలే కాకుండా, పోలీసుల వ్యక్తిగత సంక్షేమంపై కూడా ఈసారి దృష్టి సారించారు. విధుల్లో ఎదురయ్యే మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు యోగా, వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కల్పించనున్నారు. ఆర్థిక క్రమశిక్షణ, సర్వీసు నిబంధనల పట్ల సిబ్బందికి దిశానిర్దేశం చేయనున్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరావు, ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, ఆర్.ఐలు నాయుడు, రాంబాబు, శ్రీనివాసరావు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
అక్రమ సస్పెన్షన్పై ఎస్డబ్ల్యూఎఫ్ ఆందోళన
విజయనగరం అర్బన్/గంటస్తంభం: ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిపై విధించిన అక్రమ సస్పెన్షన్ను తక్షణమే రద్దు చేయాలని ఆ సంఘం జిల్లా రాష్ట్ర కార్యదర్శి వి.రాములు డిమాండ్ చేశారు. స్థానిక ఎల్పీజీ భవనంలో శుక్రవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. అక్రమ సస్పెన్ష్న్కు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ఈ నెల 17న విజయవాడలో మాస్ ధర్నా నిర్వహిస్తామని ప్రకటించింది. ధర్నాకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులను సంఘం పిలుపునిచ్చింది. ఎలాంటి విధులు కేటాయించనప్పటికీ పెట్రోల్ బంకుకు సంబంధించిన అవకతవకల కేసులో అసలు బాధ్యులను వదిలేసి కక్ష సాధింపు ధోరణితో అక్రమంగా సస్పెండ్ చేశారని సంఘం ఆరోపించింది. ఆయన పని చేసే స్థలం వేరైనా డిపోలో విధులు నిర్వహిస్తున్నట్టు కాపీ పేస్టు విధానంలో సస్పెన్షన్ ఆర్డర్ జారీ చేయడం న్యాయ ప్రమాణాలకు విరుద్ధమని పేర్కొంది. అక్రమ, చట్ట విరుద్ధమైన రాజ్యాంగ విరుద్ధమైన ఈ సస్పెన్షన్ను బేషరతుగా రద్దు చేసే వరకు దశలవారీ ఉద్యమాలు కొనసాగిస్తామని జిల్లా కమిటీ ప్రకటిందించి. కార్యక్రమంలో వివిధ ప్రజా, కార్మిక సంఘాల ప్రతినిధులు బి.లక్ష్మి, పి.భూషణరావు, ఎ.జగన్మోహన్, వి.రాము, సీహెచ్.వెంకటరావు, ఎస్కె.రోటి తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 17న విజయవాడలో మాస్ ధర్నా -
భక్తుల కొంగు బంగారం వ్యాకులమాత
● కొండడాబాల వ్యాకులమాత యాత్ర రేపు ● భారీ బందోబస్తు ● దేశంలోనే ఎత్తైన గొర్రెల కాపరి క్రీస్తు స్వరూపంకొత్తవలస : మండలంలోని కొండడాబాల వ్యాకులమాత పుణ్యక్షేత్రం భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. దక్షిణ భారతదేశంలోనే అతి పురాతన పుణ్యక్షేత్రం ఇది. దీన్ని 1817 సంవత్సరంలో ఏర్పాటు చేసినట్టు చరిత్ర చెబుతోంది. ఇక్కడ రోమన్ కేథలిక్ మిషనరీ పద్ధతిలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇక్కడ ఏటా ఫిబ్రవరి నెలలో వచ్చే మొదటి ఆదివారం మహా యాత్రను నిర్వహిస్తుంటారు. పుణ్యక్షేత్రం చరిత్ర ఈస్టిండియా కంపెనీ పాలనలో 1876లో సంభవించిన భారీ తుఫాన్ వల్ల విశాఖపట్నం జిల్లా జ్ఞానాపురం దగ్గర గల చర్చిలు దెబ్బతిన్నాయి. అక్కడి క్రైస్తవ భక్తులు తమ సొంత గ్రామమైన లక్కవరపుకోట మండలం గనివాడ, నిడిగట్టు గ్రామాలకు చేరుకున్నారు. 1877లో ఫాదర్ అలిక్స్రీకాగా సాయంతో కొత్తవలస మండలం గొల్లలపాలెం సమీపంలో గల కొండపై పెద్ద కమ్మలశాలను ఏర్పాటు చేసి అప్పట్లో చర్చి నిర్వహించారు.1890లో కొండను చదును చేసి బిషప్ జేఎం టిస్సో చేతుల మీదుగా గ్రీకు ప్రాంకోశైలిలో చర్చి నిర్మాణ పనులు ప్రారంభించి వ్యాకులమాతగా నామకరణం చేశారు. కొండపై పెద్ద డాబాలను నిర్మించారు. నాటి నుంచి కొత్తవలసను కొండడాబాలుగా పిలుస్తున్నారు. ఫ్రాన్స్ నుంచి తెచ్చిన మేరీమాత విగ్రహం ప్రతిష్ట 1914వ సంవత్సరంలో ఫాదర రోస్పియోన్ సుమారు రూ.6వేలు వెచ్చించి ఫ్రాన్స్ దేశం నుంచి ప్రత్యేకంగా తెప్పించిన మేరీమాత విగ్రహాన్ని ప్రతి ష్ఠించారు. తల్లి ఒడిలో బిడ్డ పార్ధీవదేహాన్ని పెట్టుకొని మనోవేదనను తన గుండెల్లో దాచుకున్న వ్యాకులమాత(కనికరమాత)గా ఇక్కడి స్వరూపం ప్రత్యేకత. కొండడాబాల వ్యాకులమాత చర్చిని అన్ని వసతులతో పూర్తి స్థాయిలో నిర్మించి 2020 నాటికి 130 సంవత్సరాలైంది. ఇందుకు గుర్తుగా భారతదేశంలోనే అత్యంత ఎత్తైన భారీ గొర్రెలకాపరి క్రీస్తు స్వరూపం ఏర్పాటు చేశారు. క్రీస్తు జీవించిన కాలం ఆధారంగా 331/2 అడుగుల ఎత్తులో భారీ విగ్రహాన్ని నిర్మించారు. ఇది ఈ క్షేత్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఫిబ్రవరి నెల మొదటి ఆదివారం యాత్ర ఇక్కడ ఏటా ఫిబ్రవరి నెల మొదటి ఆదివారం యాత్రను నిర్వహించడం ఆనవాయితీ. తొమ్మిది రోజుల ముందు నుంచి నవదిన పూజా ప్రార్ధనలు నిర్వహిస్తారు. ఒడిశా, తెలంగాణ, చత్తీస్ఘడ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. ఆంధ్రాలోనే అతిపెద్ద బోర్డింగ్ పాఠశాల రోమన్ కేథలిక్ మిషన్ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో విద్యాభివృద్ధికి 1913వ సంవత్సరంలో తొలిసారిగా బోర్డింగ్ పాఠశాలను ఏర్పాటు చేశారు. ఫాదర్స్ శిక్షణ విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు చేశారు. ఏర్పాట్లు పూర్తి కొండడాబాలు వ్యాకులమాత యాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. నాలుగు రాష్ట్రాల నుంచి లక్ష మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. యాత్రికులకు ఎటువంటి ఇబ్బందుల్లేకుండా అన్ని చర్యలు చేపట్టాం. – డాక్టర్ గొండాడ రాజు, కొండడాబాల విచారణకర్త భారీ బందోబస్తు వ్యాకులమాత యాత్ర సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశాం. డీఎస్పీ ఆధ్వర్యంలో నలుగురు సీఐలు, 16 మంది ఎస్ఐలు, 220 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నాం. ఇక్కడకు వచ్చే వాహనాలు కొత్తవలస జంక్షన్ నుంచి రైల్వే అండర్ బ్రిడ్జి కింద నుంచి రాజపాత్రునిపాలెం మీదుగా వెళ్లి తిరుగు ప్రయాణం కొత్తగా నిర్మించిన గ్రీన్ఫీల్డ్ హైవే మీదుగా నరపాం, తుమ్మికాపల్లి మీదుగా వెళ్లాలి. – సీహెచ్ షణ్ముఖరావు, సీఐ, కొత్తవలస -
ఉత్తరాంధ్ర నృత్య పోటీలకు ఆహ్వానం
రాజాం సిటీ: ఉత్తరాంధ్ర ఇలవేల్పు పోలిపల్లి పైడితల్లి అమ్మవారి 100వ జాతరను పురష్కరించుకుని సలాది వెంకటరమణ కళాపరిషత్ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర స్థాయి సాంప్రదాయ నృత్య పోటీలు నిర్వహించనున్నామని కళాపరిషత్ అధ్యక్షులు సలాది తులసీదాస్ తెలిపారు. శుక్రవారం ఆలయ ఆవరణలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 22 నుంచి జరగనున్న జాతరను పురష్కరించుకుని 22 సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ పోటీలు నిర్వహించనున్నామ న్నారు. ఆసక్తి ఉన్న వారు ఈ పోటీలకు సంబంధించి ఫిబ్రవరి 10లోగా ఎంట్రీలు పంపించాలని అన్నారు. ఆర్నెపల్లి వెంకటనాయుడు, కళాపరిషత్ ప్రధాన కార్యదర్శి, అమ్మవారికాలనీ, రాజాం పేరిట ఎంట్రీలు పంపించాలని కోరారు. పోటీల్లో విజేతలకు నగదు బహుమతులు అందించనున్నామని తెలిపారు. వివరాలకు 6303215996 నంబరును సంప్రదించాలని సూచించారు. సమావేశంలో మక్క అప్పలనాయుడు, బీవీ అచ్యుత్కుమార్, గట్టి పాపారావు, పెంకి గౌరీశ్వరరావు, ఎం.జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
సంతృప్తికరమైన వైద్య సేవలు అందించాలి : కలెక్టర్
విజయనగరం ఫోర్ట్: ప్రజలు సంతృప్తి చెందే విధంగా వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్ నుంచి శుక్రవారం పీహెచ్సీ వైద్యాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగుల పట్ల వైద్యులు మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. ఆస్పత్రుల్లో మందులు కొరత లేకుండా చూడాలన్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. రోగులు సంతృప్తి చెందే విధంగా సేవలు మెరుగు పడాలని తెలిపారు. మాతృ, శిశు మరణాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని, గర్భిణులకు ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిపించాలని తెలిపారు. క్షేత్ర స్థాయిలో పారిశుధ్యంపై నిఘా ఉంచాలని తెలిపారు. ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయాలని తెలిపారు. డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి తదితరులు పాల్గొన్నారు. గోవులను తరలిస్తున్న వాహనం సీజ్ సాలూరు: గోవులను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పట్టణ పరిధిలో శుక్రవారం సీజ్ చేసినట్టు పట్టణ సీఐ అప్పలనాయుడు తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు పట్టణ శివారులో వాహన తనిఖీలు చేపట్టగా గోవులను తరలిస్తున్న లారీని పట్టుకున్నామని చెప్పారు. 27 గోవులను ఒక లారీలో తరలిస్తుండగా చట్టబద్దమైన పత్రాలు లేకపోవడంతో సంబంధిత వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేసినట్టు తెలిపారు. గోవులను సురక్షిత సంరక్షణ కేంద్రాలకు తరలించినట్టు తెలిపారు. జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ నెల్లిమర్ల రూరల్: చండీఘర్లో జరుగుతున్న ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో మండలంలోని గరికిపేట గ్రామానికి చెందిన సీనియర్ వెయిట్లిఫ్టర్ బెల్లాన నాని సత్తా చాటింది. 77 కేజీల విభాగంలో శుక్రవారం పోటీల్లో పాల్గొన్న ఆమె రెండో స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఆమెను పలువురు అభినందించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు పాచిపెంట: మండలంలోని తంగలాం గ్రామానికి చెందిన గెమ్మెల సురేష్ ఇంటికి విద్యుత్ పనుల నిమిత్తం అరకు వ్యాలీ కందులగుడా గ్రామానికి చెందిన వంతల రాజారావు ఈ నెల 28న వెళ్లాడు. ఈ నెల 29న సురేష్ ఇంటి ముందే రాజారావు మృతి చెందగా ఆయన కుటుంబ సభ్యులకు సురేష్ సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న రాజారావు కుటుంబ సభ్యులు ఆయన మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ అర్జున్ సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు హెచ్సీ కృపారావు తెలిపారు. -
జిల్లాలో మీడియా అక్రిడిటేషన్ కార్డులకు ఆమోదం
విజయనగరం అర్బన్: జిల్లాలోని పెద్ద, చిన్న, దిన, మాస పత్రికలు, శాటిలైట్ టీవీ ఛానళ్లు, కేబుల్, ఫైబర్ నెట్, ప్రభుత్వ మీడియాకు చెందిన మొత్తం 407 మందికి మీడియా అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ నిర్ణయించింది. జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్, కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అధ్యక్షతన శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి కన్వీనర్గా జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి పి.గోవిందరాజులు వ్యవహరించారు. కమిటీ సభ్యులు సమావేశంలో అక్రిడిటేషన్ కార్డుల మంజూరుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. సమావేశంలో జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఎక్స్ ఆఫీసియో సభ్యులు, సీపీఓ పి.బాలాజీ, కమిటీ సభ్యులు పి.శ్రీనివాసరావు, పీఎస్ఎస్ఎస్వీ ప్రసాదరావు, టి.రాధాకృష్ణ, కె.రమేష్నాయుడు, మహాపాత్రో వెంకటేశ్వర, బీజీఆర్ పాత్రో, ఎం.శివకుమార్, పంచాది అప్పారావు, బూరాడ శ్రీనివాసరావు, బి.నాగేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా లెప్రసీ అండ్ టీబీ కంట్రోల్ అధికారిణి డాక్టర్ కె.రాణి, హౌసింగ్ పీడీ మురళీమోహన్, డీపీఈఓ జె.శ్రీనివాసరావు, కార్మిక శాఖ ఏసీ జి.ఎల్లాజీరావు, డివిజనల్ పౌర సంబంధాల అధికారి ఎస్.జానకమ్మ, సహాయ కార్య నిర్వహక సమాచార ఇంజినీర్ పి.మల్లేశ్వరరావు, ఏపీఆర్ఓ సీహెచ్ ప్రభుదాస్ తదితర అధికారులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ను జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు సత్కరించారు. -
రాములోరి రథయాత్ర నేడు
–8లోనెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థానంలో శ్రీరామచంద్రస్వామి రథయాత్ర మహోత్సవం శనివారం కనులపండువగా జరగనుంది. దీనికోసం దేవస్థానం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏటా కల్యాణోత్సవం అనంతరం రామతీర్థంలో రథయాత్ర ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. శనివారం వేకువజామున ప్రాతఃకాలార్చన, బాలభోగం నిర్వహించిన తరువాత యాగశాలలో విశేష హోమాలు జరిపిస్తారు. ఉదయం 8 గంటలకు శ్రీ మద్రామాయణ పారాయణం, వైదిక సదస్యం, తదితర కార్యక్రమాలను జరిపిస్తారు. సాయంత్రం 6 గంటలకు పండిత సదస్సు నిర్వహించి పలువురు వేద పండితులకు సన్మాన మహోత్సవం జరిపిస్తారు. అనంతరం సీతారామచంద్రస్వామి ఉత్సవ మూర్తులకు వివిధ రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో సుందరంగా అలంకరించి మంగల వాయిద్యాల నడుమ సీతారామచంద్రమూర్తిని ఊరేగింపుగా ఉత్తర రాజగోపురం సమీపంలో ఏర్పాటు చేసిన రథంపై ఆసీనులు చేస్తారు. రథంపై విశేష పూజలు నిర్వహించిన తరువాత రాత్రి 10 గంటలకు రథయాత్ర ప్రారంభమవుతుంది. ఆలయం నుంచి కుమ్మరి ఖానా మీదుగా తిరిగి దేవస్థానం తూర్పు రాజగోపురం వద్దకు స్వామివారి రథాన్ని తీసుకువస్తారు. సమీప గ్రామాలైన జగ్గరాజుపేట, సీతారామునిపేట, గొర్లిపేట గ్రామాలకు చెందిన భక్తులు ఎప్పటిలాగే రథాన్ని ముందుకు నడిపిస్తారు. రథయాత్రలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు సుమారు 40 మంది పోలీసులతో ఆ శాఖ బందోబస్తు ఏర్పాట్లు చేసింది. ఉత్సవ విజయవంతానికి భక్తులు సహకరించాలని ఈఓ శ్రీనివాసరావు కోరారు. రాత్రి 10 గంటలకు రథంపై ఊరేగనున్న సీతారామచంద్రస్వామి ఏర్పాట్లు పూర్తిచేసిన దేవస్థానం అధికారులు -
వేంకటేశ్వరస్వామే నిజాలు బయటపెట్టారు
విజయనగరం: కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంలో కూటమి నేతల కల్తీ ఆరోపణలపై ఆ వేంకటేశ్వరస్వామే నిజాలు బయటపెట్టారని ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్, వైఎస్సార్సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కూటమి నేతలు దుష్ప్రచారం చేయడం వారి నీచ రాజకీయాలకు పరాకాష్టగా పేర్కొన్నారు. సీబీఐ విచారణలో నెయ్యిలో ఏ విధమైన జంతువుల కొవ్వు కలవలేదని తేలిందని, అప్పట్లో బాధపడిన భక్తులు, ఉద్యోగులకు ఎవరు జవాబు చెబుతారని ప్రశ్నించారు. చంద్రబాబు, కూటమి నేతలు ఏ ప్రజలనైతే మభ్యపెట్టారో... తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించారో వారికి బహింరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తన నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూటమి కుట్రలపై కోలగట్ల మండిపడ్డారు. అతి పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ఆరోపణలు రావడంతో కోట్లాదిమంది భక్తులతో పాటు ప్రసాదం తయారుచేసే సిబ్బంది మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. కూటమి నేతల కల్తీ ఆరోపణలు నిజం కాదని సీబీఐ విచారణలో తేలిందన్నారు. ఇచ్చిన హమీలు అమలు చేయలేమన్న భయంతో లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిదంటూ ప్రచారం చేసి ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ముందుడుగు వేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రజల నుంచి దూరం చేసేందుకు చంద్రబాబు అండ్ కో ఇటువంటి నీచరాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. భగవంతుని దయవల్ల వాస్తవాలు ప్రజలందరికీ తెలిశాయన్నారు. ● దైవ కార్యక్రమాల్లో కూటమి నిర్లక్ష్యాలు వరుసుగా బయటపడుతున్నాయని కోలగట్ల అన్నారు. ఇటీవల అన్నవరం ప్రసాద విక్రయకేంద్రంలో ఎలుకలు సంచారంతో పాటు, సింహచలంలో గోడకూలి పలువురు మృత్యువాత పడిన సంఘటనలు కూటమి హయాంలో చోటుచేసుకోవడం నిజంకాదా అని ప్రశ్నించారు. తిరుమలలో గతేడాది వైకుంఠ ఏకాదశి సందర్భంగా నెలకొన్న రద్దీలో భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు. ● ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు కూటమి నాయకులు ఎన్నికలకు ముందు ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకున్నారని కోలగట్ల ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ అమలుపై తప్పుడు ప్రచారాలు చేసి జగన్మోహన్రెడ్డి ప్రజల భూములు తీసుకుంటాడని భయపెట్టి ఓట్లు దండుకున్న చంద్రబాబు.. నేడు భూములు రీ సర్వే ఎందుకు చేస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన ఆ యాక్ట్ను రద్దు చేశామని ప్రకటించి ఇప్పుడెలా సర్వేపేరిట ప్రజల్లోకి వెళ్తున్నారని ప్రశ్నించారు. మద్యం కల్తీ విషయంలో నిజాలు త్వరలోనే నిగ్గు తేలుతాయన్నారు. వేలాది కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి.. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో సంక్షేమ పథకాలు అమలు కోసం అప్పు చేస్తే.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 20 నెలల కాలంలో చేసిన వేలాది కోట్లు అప్పులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో చెప్పాలన్నారు. కూటమి చేసిన అప్పులు తీర్చే భారం ప్రజలపై పడుతుందన్న విషయాన్ని మేధావులు, విద్యార్థులు, యువత గమనించాలన్నారు. ఫిబ్రవరిలో జరిగే సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వైఎస్సార్సీపీ హయాంలో చేసిన అప్పులు, కూటమి ప్రభుత్వంలో చేసిన అప్పుల వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. కూటమి చేస్తున్న ఆరాచకాలను అడ్డుకుంటామని, ప్రజా పక్షాన వైఎస్సార్సీపీ ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. సమావేశంలో కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ శెట్టివీరవెంకట రాజేష్, ఎంపీపీ మామిడి అప్పలనాయుడు, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సంగంరెడ్డి బంగారునాయుడు, పార్టీ నగర అధ్యక్షుడు ఆశపు వేణు, పార్టీ మండలాధ్యక్షుడు కె.త్రినాథ్, జిల్లా ఉద్యోగులు, పెన్షనర్ల విభాగం అధ్యక్షుడు డోల మన్మథకుమార్, జిల్లా యువజన విభాగం నాయకులు జి.ఈశ్వర్కౌశిక్, పలువురు కార్పొరేటర్లు, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. భూములు ధారాదత్తం చేస్తే ఉద్యమిస్తాం రూ.5వేల కోట్ల విలువచేసే 54 ఏకరాల భూములను విశాఖ ఎంపీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తోడల్లుడు భరత్కు చెందిన గీతం విద్యా సంస్థలకు ధారాదత్తం చేసేందుకు చంద్రబాబు చేస్తున్న కుట్రలను ఆడ్డుకుంటామని కోలగట్ల హెచ్చరించారు. విశాఖలో శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో భూములు పరిశీలించి నిరసన చేపట్టడం జరి గిందని, ఇప్పటికై నా ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామన్నారు. జూ ఏమైనా పవన్ కల్యాణ్ సొంత జాగీరా...? రాజకీయ దురుద్దేశంతోనే అప్పట్లో టీడీపీ నేతలు కల్తీ లడ్డూ ప్రచారం సీబీఐ విచారణతో బట్టబయలైన చంద్రబాబు, కూటమి నేతల కుట్రలు భక్తులు, సిబ్బంది మనోభావాలకు ఎవరు జవాబు చెబుతారు తప్పుదోవ పట్టించిన ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి భూములు దారాదత్తం చేస్తే ఉద్యమిస్తాం ఏపీ శాసనసభా మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉన్నారంటూ విశాఖ జూలోకి సందర్శకులను అనుమతించకపోవడం దారుణమన్నారు. అదేమైనా పవన్కల్యాణ్ సొంత ఇల్లా అంటూ మండిపడ్డారు. జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో తన పర్యటనల్లో బారీకేడ్లు పెట్టుకుంటారు.. పరదాలు కట్టుకుంటారు అంటూ ఆరోపణలు చేసిన నాయకుడు నేడు అరగంట పర్యటన కోసం సొంత జాగీరులా వాడుకోవడం ఎంత వరకు సబబు అని నిలదీశారు. -
మరియగిరి.. భక్తసిరి
● కనుల పండువగా మరియగిరి యాత్ర ● మేరిమాత దర్శనానికి తరలివచ్చిన భక్తులు ● దివ్యపూజల్లో పాల్గొన్న భక్తలోకం వీరఘట్టం: శ్రీకాకుళం మేత్రాసన పాలక పునీతురాలు.. క్రైస్తవుల సహాయమాత మేరీమాత మహోత్సవం శుక్రవారం కనులపండువగా జరిగింది. వీరఘట్టం మండలం యు.వెంకమ్మపేట వద్ద ఉన్న మరియగిరి కొండపై వెలసిన మరియమ్మ దర్శనానికి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చారు. టెంకాయలు కొట్టి, తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. శ్రీకాకుళం మేత్రాసనం పీఠాధిపతి రాయరాల విజయకుమార్ ఆధ్వర్యంలో సాగిన ప్రత్యేక దివ్యపూజల్లో పాల్గొన్నారు. మేరిమాతకు వందనం.. అభివందనం.. మానవాళికి నీవే తల్లివంటూ కీర్తించారు. ఏసు శాంతి సందేశాలను వినిపించారు. మరియగిరి వద్ద నూతనంగా నిర్మించిన సింహద్వారాన్ని, మేరిమాత విగ్రహాన్ని విజయ్కుమార్తో కలిసి విశాఖపట్నం బిషప్ ఉడుమల బాల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇద్దరు బిషప్లను ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలతో పాటు ఒడిశా రాష్ట్రం నుంచి వచ్చిన సుమారు 50 వేలమంది భక్తులు దివ్యపూజలో పాల్గొన్నారు. మరియగిరి యాత్ర సందర్భంగా వీరఘట్టం, చిట్టపుడివలస, సివిని, పార్వతీపురం, బెలగాం, గరుగుబిల్లి, తూడి, పాలకొండ, వంగర, తలవరం, సంకిలి, నవగాం, పాలవలస తదితర గురుమండలాల్లో ఇటీవల నిర్వహించిన బైబిల్, ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి శ్రీకాకుళం, విశాఖపట్నం బిషప్లు బహుమతులు ప్రదానం చేశారు. యాత్రకు ఎలాంటి అంతరాయం కలగకుండా పాలకొండ డీఎస్పీ ఎం.రాంబాబు ఆధ్వర్యంలో పాలకొండ సీఐ ఎ.ప్రసాదరావు, వీరఘట్టం ఎస్ఐ ఎస్.షణ్ముఖరావు, సీతంపేట, దోనుబాయి, చినమేరంగి ఎస్ఐలు, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ప్రయాణికుల సౌకర్యార్ధం పాలకొండ, పార్వతీపురం, శ్రీకాకుళం డిపోల నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడిపారు. మేరీమాతను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కళావతి మరియగిరి కొండపై వెలసిన మేరీమాతను పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి దర్శించుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రజలందరినీ చల్లగా చూడు తల్లీ అంటూ ప్రార్థన చేశారు. కొవ్వొత్తులు వెలిగించి, టెంకాయ కొట్టి మొక్క తీర్చుకున్నారు. ఆమెతో పాటు జెడ్పీటీసీ సభ్యురాలు జంపు కన్నతల్లి, వండువ సర్పంచ్ మిడితాన కళ్యాణి మేరిమాతను దర్శించుకున్నారు. -
రెవెన్యూ రికార్డుల్లోని తప్పులను సరిదిద్దాలి
● కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి రాజాం సిటీ: జిల్లాలోని రెవెన్యూ రికార్డుల్లో దొర్లిన తప్పులను సరిదిద్దడంతో పాటు భూ వివాదాలులేని జిల్లాగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యమని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అన్నారు. పాలకొండ రోడ్డులోని ఓ ప్రైవేటు కన్వెన్షన్ హాల్లో చీపురుపల్లి డివిజన్ అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రికార్డుల సవరణ ప్రక్రియను ఉద్యమంలా చేపట్టాలన్నారు. రీసర్వేలో అత్యంత పారదర్శకంగా రికార్డుల ప్రక్షాళన జరగాలని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో వీఆర్వోలు, సర్వేయర్లు సంయుక్తంగా ప్రతి భూమిని పరిశీలించి, రైతులతో నేరుగా మాట్లాడి ఈకేవైసీ పూర్తిచేయాలన్నారు. వివరాలన్నీ కచ్చితంగా ఉన్నాయని నిర్దారించుకున్న తరువాతే పాస్పుస్తకాలు ప్రింటింగ్కు పంపాలని సూచించారు. పెండింగ్లో ఉన్న 3,896 పాస్ పుస్తకాలను తక్షణమే సరిదిద్ది 10 రోజుల్లో రైతులకు అందజేయాలని ఆదేశించారు. జేసీ ఎస్.సేతుమాధవన్ మాట్లాడుతూ పట్టాదారు పాసుపుస్తకాల్లోని తప్పులను సరిదిద్దడం, సీసీఎల్ఏ ఇచ్చిన తాజా ఆదేశాలపై అవగాహనతోపాటు రీసర్వే ప్రక్రియపై కొత్తమార్గదర్శకాలు, సర్వేశాఖ అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటుచేశామని అన్నారు. పాత రికార్డుల్లోని తప్పులను సవరించేందుకు ప్రభుత్వం తాజాగా తహసీల్దార్లు, ఆర్డీఓలకు సుమోటో అధికారాలు కల్పించిందన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని క్షేత్రస్థాయి వాస్తవాల ఆధారంగా రికార్డులు సిద్ధం చేయాలన్నారు. రెవెన్యూ క్లినిక్లకు వచ్చే ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఆర్డీఓ ప్రమీలగాంధీ, సర్వేశాఖ ఏడీ విజయ్కుమార్, డివిజన్లోని అన్ని మండలాల తహసీల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు. -
ముగిసిన భద్రతా మాసోత్సవాలు
● ప్రమాద రహిత డ్రైవర్లకు సత్కారం విజయనగరం అర్బన్: ఆర్టీసీ ఆధ్వర్యంలో నెలరోజుల పాటు నిర్వహించిన ‘రోడ్డు భద్రతా మాసోత్సవాలు–2026’ శుక్రవారంతో ముగిశాయి. డీపో ప్రాంగణంలో జరిగిన ముగింపు సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎస్పీ ఏఆర్దామోదర్ మాట్లాడుతూ రవాణా నియమాలు పాటించడమే ప్రమాదాల నివారణకు మార్గ మని అన్నారు. ప్రమాద రహితంగా విధులు నర్వహించిన విజయనగరం, ఎస్.కోట డిపో డ్రైవర్లను ప్రశంసాపత్రాలు, నగదు బహుమతులతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రజా రవాణా అధికారి జి.వరలక్ష్మి, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ హెచ్.దివ్య, డిపో మేనేజర్ జె.శ్రీనివాసరావు, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆ డైరీనే కీలకం విజయనగరం క్రైమ్: విజయనగరం గోకపేటలో నివసిస్తున్న హోంగార్డు నెట్టి శ్రీనివాసరావు ఇంట్లో రెండో రోజు శుక్రవారం ఏసీబీ డీఎస్పీ రమ్య అధ్వర్యంలో అధికారులు సోదాలు నిర్వహించారు. పలు కీలకమైన డాక్యుమెంట్లు, భూ పట్టాలు, రిజిస్ట్రేషన్ పత్రాలతో పాటు ఓ డైరీని స్వాధీనం చేసుకున్నారు. ఆ డైరీలో తనవల్ల లబ్ధిపొందిన అధికారుల ఫోన్నంబర్లు, లబ్ధి వివరాలు ఉన్నట్టు సమాచారం. ఎక్కువగా రిజిస్ట్రార్ల పేర్లు, ఫోన్ నంబర్లు ఉన్నట్టు తెలిసింది. -
యూరియా కోసంరోడ్డెక్కిన రైతులు
ఉన్నతాధికారులు స్పందించాలి ఆరుగాలం శ్రమించి పంటలు సాగుచేసే రైతుకు సకాలంలో యూరియా అందడం లేదు. ఆర్ఎస్కే మార్పుతో కష్టాలు ఎక్కువయ్యాయి. సమస్యను మండలాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. జిల్లా అధికారులు స్పందించి రైతులకు యూరియా అందేలా చూడాలి. – బూరి మధుసూదనరావు, సర్పంచ్, విజయరాంపురం ప్రైవేటు వర్తకుల దగ్గర కొనుగోలు చేసుకున్నాం గత ఖరీఫ్ సీజన్ నుంచి ఇంతవరకు గ్రామంలోని ఒక్కో రైతుకు ఒకబస్తా యూరియా మాత్రమే వ్యవసాయ అధికారులు ఇచ్చారు. పంటకు కావాల్సిన యూరియా ప్రైవేటు వర్తకుల వద్ద అధిక ధరలకు కొనుగోలు చేసుకొని పంటలకు వేసుకున్నాం. తమ సమస్యను ఎన్నిసార్లు సంబంధిత అధికారులకు చెప్పినా పట్టించుకోదు. యూరియా కోసం తాము పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. – బూరి చిన్నారావు, రైతు, విజయరాంపురం ఇదెక్కడి అన్యాయం యూరియా కోసం విజయరాంపురం గ్రామ రైతులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీకావు. బస్తా యూరియా కోసం రోజుల తరబడి తిరుగుతున్నాం. అధిక ధరలకు ప్రైవేటు వర్తకుల వద్ద కొనుగోలు చేస్తున్నాం. రైతులకు యూరియా అందేలా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలి. – బూరి వెంకునాయుడు, రైతు, విజయరాంపురంతెర్లాం: యూరియా కోసం తెర్లాం మండలంలోని విజయరాంపురం గ్రామ రైతులు రోడ్డెక్కారు. ఖరీఫ్ సీజన్ నుంచి ఇంతవరకు రైతుకు కేవలం ఒకబస్తా యూరియా మాత్రమే వ్యవసాయ అధికారులు పంపిణీ చేయడంపై మండిపడ్డారు. పంటల సాగుకు కావాల్సిన యూరియా సరఫరా చేయలేని చంద్రబాబు ప్రభుత్వ తీరును దుమ్మెత్తి పోశారు. తెర్లాం వ్యవసాయ కార్యాలయం వద్ద ప్లకార్డులతో శుక్రవారం నిరసన తెలిపారు. గ్రామ సర్పంచ్ బూరి మధుసూదనరావు, రైతులు మాట్లాడుతూ విజయరాంపురం గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని నెమలాం ఆర్ఎస్కేలో ప్రభుత్వం విలీనం చేసిందన్నారు. విజయరాంపురం గ్రామానికి చెందిన భూములు సుందరాడ, నెమలాం ఆర్ఎస్కేల పరిధిలో ఉన్నాయని తెలిపారు. అక్కడకు యూరి యా వచ్చినా విజయరాంపురం రైతులకు అందజేయడం లేదని, అక్కడి టీడీపీ నేతలు తమ అనుచరులకు పంపిణీ చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇదే విషయాన్ని ఏఓని కలిసి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని, మండల సర్వసభ్య సమావేశంలో మండలాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని వాపోయారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు దుకాణాల వద్ద అధిక ధరకు యూరియా కొనుగోలు చేయాల్సి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తంచేశారు. యూరియా అందజేయాలంటూ తహసీల్దార్ జి.హేమంత్కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఏడాదిగా రైతుకు ఒక బస్తా యూరియా సరఫరాపై మండిపాటు తెర్లాంలో విజయరాంపురం రైతుల ధర్నా ప్రభుత్వం తీరును దుమ్మెత్తిపోసిన రైతులు -
మాజీ సైనికోద్యోగులకు న్యాయ అవగాహన సదస్సు
విజయనగరంలీగల్: జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ న్యూఢిల్లీ ఉత్తర్వుల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలతో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి డాక్టర్ ఎ.కృష్ణ ప్రసాద్ విజయనగరంలో ఉన్న జిల్లా సైనిక సంక్షేమ శాఖ లో మాజీ సైనికుకోద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు గురువారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మాజీ సైనికోద్యోగులకు అలాగే సైనికోద్యోగుల కోసం ప్రత్యేకంగా న్యాయ సేవల శిబిరాన్ని జిల్లా సైనిక సంక్షేమ బోర్డులో ఏర్పాటు చేశారని, ఈ న్యాయ సేవల ముఖ్య ఉద్దేశం సైనికులకు, అలాగే వారి కుటుంబ సభ్యులకు న్యాయ సేవను అందించడమేనని తెలియజేశారు. ఈ సేవల శిబిరంలో ఒక ప్యానల్ లాయర్ను, ఒక పారా లీగల్ వలంటీర్ను నియమించామని ఎవరికై నా న్యాయ సలహాలు సేవలు అవసరమైతే ప్యానల్ లాయర్ను సంప్రదించవచ్చని తెలియజేశారు, వారికి ఏ విధమైన న్యాయ అవసరాలు ఉన్నా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థను సంప్రదించి సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలియజేశారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన మాజీ సైనికోద్యోగులతో ముఖాముఖి చర్చించి వారికి తగిన న్యాయ సలహాలను సూచనలు అందజేశారు. కార్యక్రమంలో పానల్ లాయర్ పి.ధనుంజయ్ రావు జిల్లా సైనిక సంక్షేమ అధికారి కేవీఎస్ ప్రసాద్ మాజీ సైనికోద్యోగుల కుటుంబసభ్యులు పాల్గొన్నారు. -
బాల్య వివాహం చేస్తే రెండేళ్ల జైలుశిక్ష
విజయనగరం ఫోర్ట్: బాల్య వివాహం చేసినా, ప్రోత్సహించినా బాధ్యులకు 2 సంవత్సరాల జైలుశిక్ష, లక్ష రుపాయల జరిమానా విధించనున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు గురువారం సీ్త్ర, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిలుపుదలపై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రచార రథాన్ని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ విమలారాణి, డీసీపీయూ లక్ష్మి, యూత్ క్లబ్ బెజ్జిపురం స్వచ్ఛంద సంస్థ పీడీ ప్రసాదరావు, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ హిమబిందు, వన్స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేట ర్ పి.సాయి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రాంసుందర్ రెడ్డి -
కుష్ఠుపై దృష్టి అవసరం
● వ్యాధిని త్వరగా గుర్తిస్తే దరిచేరని అంగవైకల్యం ● జిల్లాలో 248 కేసులు ● నేడు కుష్ఠు నివారణ దినోత్సవంకుష్ఠు వ్యాధిపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని జిల్లా రెవెన్యూ అధికారి ఈ. మురళి అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్థంతి సందర్భంగా ఈనెల 30 నుంచి పిబ్రవరి 13 వరకు అవగాహన కార్యక్రమాలు జిల్లా అంతటా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది వివక్షను అంతం చేయడం, గౌరవాన్ని కాపాడడం అనే నినాదంతో లెప్రసీ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. కుష్ఠు వ్యాధిని ముందుగా గుర్తించడం ద్వారా అంగవైకల్యం రాకుండా చూడవచ్చన్నారు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే సమీప పీహెచ్సీలో వైద్యుడి వద్ద చూపించుకోవాలని పిలుపునిచ్చారు. వ్యాధి నిర్ధారణ అయితే ఉచితంగా మందులు, చికిత్స అందించనున్నట్లు తెలిపారు. చర్మంపై స్పర్శ లేని మచ్చలు, మందమైన మెరిసే జిడ్డుగల చర్మం, చెవులు, వీపుపై మెడపై బొడిపెలు, కనురెప్పల వెంట్రుకలు రాలిపోవడం, వంటి లక్షణాలు ఉన్నా చల్లని, వేడి వస్తువులను గుర్తించకపోవడం, కాళ్లకు చెప్పులు జారిపోవడం తెలియకుండానే కాళ్లు బొబ్బలు రావడం, చేతి, కాలివేళ్లు వంకర్లు తిరిగి అంగ వైకల్యం పొందడం వంటి లక్షణాలు కలిగిన వారు వెంటనే పరీక్ష చేయించుకోవాలని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జీవనరాణి, డీఎల్ఓ డాక్టర్ రాణి, జిల్లా పరిషత్ సీఈఓ సత్యనారాయణ పాల్గొన్నారు. విజయనగరం ఫోర్ట్: కుష్ఠు వ్యాధిగ్రస్తులను గతంలో వివక్షతో చూసేవారు. వారివైపు కూడా వెళ్లడానికి ఇష్టపడేవారుకాదు. సొంత కుటుంబసభ్యులు కూడా వారికి సపర్యలు చేయడానికి ఇష్టపడేవారు కాదు. వారికి ప్రత్యేకంచి తినడానికి ప్లేట్లు, గ్లాసులు పెట్టేవారు. అయితే ప్రస్తుతం సమాజంలో మార్పు వచ్చింది. కుష్ఠు వ్యాధి సోకినప్పటికీ వైద్యుల సలహా ప్రకారం చికిత్స తీసుకుంటే వ్యాధి నయం అవడంతో వ్యాధి సోకిన వారు చికిత్స తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. కుటుంబసభ్యులు కూడా వారికి చికిత్స చేయిస్తున్నారు. కుష్ఠు వ్యాధి తగ్గిందని అందరూ భావించారు. అయితే వ్యాధి మాత్రం ఇంకా సమాజాన్ని పీడిస్తూనే ఉంది. జిల్లాలో కేసులు నమోదవుతునే ఉన్నాయి. చాప కింద నీరులా వ్యాధి వ్యాపిస్తోంది. కుష్ఠు వ్యాధి మచ్చలు ఉన్నప్పటికీ అవి సాధారణ మచ్చలు అనుకుని చాలా మంది పట్టించుకోవడం లేదు. దీని వల్ల కేసులు నమోదవుతున్నాయి. వ్యాధి పట్ల అప్రమత్తం కుష్ఠు వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్పర్శ, నొప్పి లేని మచ్చలు కుష్ఠు వ్యాధి లక్షణాలుగా గుర్తించి వ్యాధి నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలి. వ్యాధిని సకాలంలో గుర్తించగలిగితే అంగవైకల్యం బారిన పడకుండా కాపాడవచ్చు. వ్యాధి పట్ల నిర్లక్ష్యం చేస్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కుష్ఠులో రెండు రకాలు కుష్ఠు వ్యాధిలో రెండు రకాలు ఉన్నాయి. పాసిబాసిలరీ(పీబీ), మల్టీ బాసిలరీ(ఎంబీ) ఉన్నాయి. ఐదు మచ్చల కంటే తక్కువగా ఉంటే పీబీ కుష్ఠు వ్యాధి అంటారు. దీనికి 6 నెలల పాటు మల్టీ డ్రగ్ థెరపీ(ఎండీపీ) మందులు వాడాల్సి ఉంటుంది. ఐదు కంటే ఎక్కువ మచ్చలు ఉంటే ఎంబీ కుష్ఠు వ్యాధిగా పరిగణిస్తారు. దీనికి 12 నెలల పాటు మందులు వాడాల్సి ఉంటుంది. మందులు పూర్తి స్థాయిలో వాడితే వ్యాధి నయం అవుతుంది. 248 కేసుల నమోదు జిల్లాలో 2025–26 సంవత్సరంలో 248 కుష్ఠు వ్యాధి కేసులు నమోదయ్యాయి. వాటిలో ఎంబీ కేసులు 122 కాగా పీబీ కేసులు 126 ఉన్నాయి. బాధితుల్లో మగవారు131 మంది కాగా, 112 మంది మహిళలు, ఐదుగురు పిల్లలు ఉన్నారు. వ్యాధిపై అవగాహన కల్పిస్తాం జనవరి 30 నుంచి ఫిబ్రవరి 13వతేదీ వరకు కుష్ఠు వ్యాధిపై అవగాహన కల్పించనున్నాం. కుష్ఠు వ్యాధిని ఎండీటీ చికిత్స ద్వారా పూర్తి స్థాయిలో నివారించవచ్చు. మందులు పూర్తి స్థాయిలో రోగులు వాడాలి. మధ్యలో మానివేయకూడదు. వ్యాధి లక్షణాలు ఉన్న వెంటనే వ్యాధి నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలి. డాక్టర్ కె.రాణి, జిల్లా కుష్ఠు నివారణ అధికారి -
కరుణించు మేరీమాత..!
వీరఘట్టం: వీరఘట్టం సమీపంలోని యు.వెంకమ్మపేట వద్ద గల మరియగిరి కొండపై వెలసిన శ్రీకాకుళం మేత్రాసన పాలక పునీతురాలు, క్రైస్తవుల సహాయమాత మరియమ్మ మహోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఏటా జనవరి 30న మరియగిరి యాత్ర ఆనవాయితీగా జరుగుతోంది. కులమతాలకు అతీతంగా భక్తులు వచ్చి పూజలు చేస్తుంటారు. కొబ్బరికాయలు కొట్టి, తలనీలాలు అర్పించి మొక్కులు తీర్చుకుంటారు. ఈ ఏడాది వాతావరణం అనుకూలంగా ఉండడంతో భక్తులు అధికసంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున గతంలో కంటే వైభవంగా మహోత్సవాన్ని జరిపేందుకు మరియగిరి ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేసింది. భక్తులు మరియమ్మను దర్శించుకునేందుకు కొండపైన క్యూలు ఏర్పాటు చేశారు. కొండ దిగువన శ్రీకాకుళం మేత్రాసనం పీఠాధిపతి రాయిరాల విజయకుమార్ ఆధ్వర్యంలో జరగనున్న దివ్యపూజకు హాజరయ్యే భక్తుల సౌకర్యార్థం ప్రార్థనా మందిరాన్ని సిద్ధం చేశారు. యాత్ర ప్రాంగణంలో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశారు. 33 ఏళ్లుగా శ్రీకాకుళం మేత్రాసనం ఆధ్వర్యంలో.. పూర్వకాలం నుంచి మరియగిరి యాత్ర ఇక్కడ జరిగేది. అయితే గడిచిన 33 ఏళ్ల నుంచి శ్రీకాకుళం మేత్రాసనం ఆధ్వర్యంలో మరియగిరి యాత్ర జరుగుతోంది. ఈ ఏడాది మరియగిరి యాత్రను అత్యంత వైభవంగా నిర్వహించడానకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నూతనంగా నిర్మించిన మరియగిరి ముఖద్వారాన్ని బిషప్ శుక్రవారం ఉదయం ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఇప్పటికే పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని పలు చర్చిల ఫాదర్లు, మఠకన్యలు హాజరై ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. 120 మంది పోలీస్ సిబ్బంది.. మరియగిరి యాత్రకు ఏడుగురు ఎస్సైలు, ఒక సీఐతో పాటు 120 మంది పోలీస్ సిబ్బందిని నియమిస్తున్నట్లు పాలకొండ డీఎస్పీ ఎం.రాంబాబు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన పాలకొండ సీఐ ఎ.ప్రసాదరావు, వీరఘట్టం ఎస్సై ఎస్.షణ్ముఖరావుతో కలిసి మరియగిరి ప్రాంగణాన్ని పరిశీలించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు బృందాలను నియమించారు. వాహనదారులు, ముఖ్యంగా ఆటోలు నిబంధనలు పాటించి సురక్షిత ప్రయాణాలు చేయాలని కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. పార్కింగ్ స్ధలాల్లో మాత్రమే వాహనాలను నిలుపుదల చేయాలని కోరారు. ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు మరియగిరి యాత్రకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తులు తరలి రానున్నారు. వారి కోసం పార్వతీపురం, పాలకొండ, శ్రీకాకుళం ఆర్టీసీ డిపోల నుంచి ప్రతి 10 నిమిషాలకు మరియగిరి స్పెషల్ బస్సులు నడపనున్నట్లు ఆయా డిపోల మేనేజర్లు తెలిపారు. సుమారు 50 వేలమంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మరియగిరి వద్ద ప్రత్యేక ఆర్టీసీ కంట్రోల్ పాయింట్ను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా రవాణాశాఖాధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. నేడు మరియగిరి యాత్ర ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తి 120 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు పాలకొండ, పార్వతీపురం, శ్రీకాకుళం నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులుగట్టి బందోబస్తు ఏర్పాటు చేయండి: సబ్ కలెక్టర్ వీరఘట్టం: మరియగిరి వద్ద శుక్రవారం జరగనున్న మేరీమాత ఉత్సవానికి గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ సూచించారు. ఈ మేరకు గురువారం ఆయన యాత్ర ప్రాంగణాన్ని పరిశీలించారు. బందోబస్తు ఏర్పాట్లపై ఎస్సై షణ్ముఖరావుతో మాట్లాడారు.యాత్రకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మరియగిరి ఫాదర్స్కు సూచించారు. భక్తుల కోసం చేపడుతున్న ఏర్పాట్లపై నిర్వాహకులతో చర్చించారు.మరియమ్మ దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లుమేరీమాత దర్శనం కోసం కొండపైకి వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేశాం. కొండ దిగువన, కొండపైన టెంకాయలు కొట్టేందుకు, కొవ్వొత్తులు వెలిగించి ఆరాధన చేసేందుకు ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే అన్ని ప్రాంతాల నుంచి మఠకన్యలు, ఫాదర్లు మరియగిరి వద్దకు చేరుకుని ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. భక్తులు ప్రశాంతంగా మేరీమాతను దర్శించుకునేలా ఏర్పాట్లు చేశాం. భక్తులు కూడా సహకరించాలి. ఫాదర్ విజయ్రెడ్డి, మరియగిరి -
బాల్య వివాహలు చేస్తే ఖబడ్దార్..!
పార్వతీపురం: బాల్యవివాహాలు చేస్తే క్రిమినల్ చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లోని సమావేశమందిరంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి వివాహనికి తహసీల్దార్ అనుమతి తీసుకోవాలన్నారు. పెళ్లికి సంబంధించి అనుబంధసంస్థల యజమానులతో సమావేశం నిర్వహించి బాల్య వివాహాలపై అవగాహన కల్పించాలని కోరారు. వివాహనికి వయస్సు నిర్ధారణ ధ్రువీకరణ పత్రాన్ని తయారుచేయాలని ఐసీడీఎస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్పీ ఎస్వీ.మాధవరెడ్డి, జేసీ సి.యశ్వంత్కుమార్రెడ్డి, ఏఎస్పీ మనీషారెడ్డి, ఐసీడీఎస్ పీడీ టి.కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు. బాలకార్మిక నిర్మూలన మనందరి బాధ్యత బాలకార్మికుల నిర్మూలన మనందరి బాధ్యత అని కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి అన్నారు. బాలకార్మిక నియంత్రణ చట్టం ప్రకారం 14 ఏళ్ల లోపు ఉన్న పిల్లలను పనిలో చేర్చుకోవడం నేరమన్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు మండలస్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి పోలీస్స్టేషన్ ఆవరణలో బాలకార్మిక వ్యవస్థ నియంత్రణకు అవగాహన కార్యక్రమాలను చేపట్టాలన్నారు. పిల్లలను పాఠశాలలకు పంపేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. రహదారి భద్రత నియమాలు పాటించాలి రహదారి భద్రత నియమాలను ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు రహదారి భద్రతపై కలెక్టర్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో ప్రజలకు అవగాహన పెంపొందించాలన్నారు. నెలరోజులపాటు జిల్లా వ్యాప్తంగా ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ సేవలను వినియోగించుకుని రహదారి భద్రత ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సూచించారు. కుష్ఠువ్యాధి నివారణకు అవగాహన కుష్ఠు వ్యాధి నిర్మూలనపై గురువారం నుంచి ఫిబ్రవరి 13వ తేదీవరకు జిల్లాలోని ప్రతి పంచాయతీ కార్యాలయం, పాఠశాల, వసతి గృమాల వద్ద సర్పంచ్ల అధ్యక్షతన అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కుష్ఠువ్యాధిపై అవగాహన కార్యక్రమాల వాల్పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. కలెక్టర్ హెచ్చరిక -
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి
పార్వతీపురం: ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ అధికారుల సంఘం డైరీని, ప్రకృతి వ్యవసాయ విభాగానికి సంబంధించిన లిటరేచర్ సంక్షిప్త మార్గదర్శిని, ప్రకృతి వ్యవసాయంలో పీఎండీఎస్ సాగు, ప్రయోజనాలు, పెరటి తోటల పెంపకం, ప్రకృతి వ్యవసాయంకోసం తొమ్మిది సార్వత్రిక సూత్రాల పుస్తకాన్ని, పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రసాయన రహిత పద్ధతుల్లో పంటలను సాగు చేసే ప్రకృతి వ్యవసాయంవల్ల రైతుల ఆర్థికాభివృద్ధికి, ప్రజల ఆరోగ్య రక్షణకు, పర్యావరణ సమతుల్యతకు దోహదపడు తుందన్నారు. రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకం వల్ల నేల ఉత్పత్తి శక్తి తగ్గిపోతుందని, దానిని తిరిగి పునరుద్ధరించడానికి జీవామృతం, బీజామృతంవంటి సహజ పద్ధతులు అనుసరించడం అవసరమని సూచించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్వీ.మాధవ రెడ్డి, జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి రెడ్డి అన్నపూర్ణ, సంఘం ప్రెసిడెంట్ కె.రత్న కుమారితోపాటు సంఘం సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి -
8 ఏళ్ల తర్వాత ఇంటికి చేరాడు
● గుర్ల పోలీసులను అభినందించిన సీఐ శంకరరావు గుర్ల: తల్లిదండ్రులు చూసిన వివాహం ఇష్టం లేక గుర్ల మండలంలోని చింతలపేటకు చెందిన పాలూరి పైడిరాజు ఏనిమిదేళ్ల క్రితం పెళ్లి ముందురోజు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. పోలీసులు ఫిర్యాదు చేసినప్పటికీ పైడిరాజు తల్లిదండ్రులు రమణ, రామయ్యమ్మలు కుమారుడి కోసం వెతకని ప్రదేశం లేదు. ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు మిస్సింగ్ కేసుల వివరాలు మళ్లీ ప్రయత్నించగా కొత్తగా వచ్చిన టెక్నాలజీని అందిపుచ్చికుని సీ–ట్రేస్, గూగుల్ మ్యాప్ ద్వారా పైడిరాజు జోగులాంబ గద్వాల్ జిల్లాలోని ఐజ మండల కేంద్రంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో గుర్ల పోలీసులు అక్కడికి వెళ్లి పైడిరాజును గుర్ల పోలీస్స్టేషన్కు తీసుకువచ్చి కుటుంబసభ్యులకు గురువారం అప్పగించారు. ఎనిమిదేళ్లుగా తల్లిదండ్రులకు దూరంగా ఉన్న వ్యక్తిని పట్టుకుని గుర్ల పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించిన ఎస్సై పి.నారాయణరావు, కానిస్టేబుల్ ఎం.మురళి, మీసాల సురేష్కు పైడిరాజు కుటుంబసభ్యులలు ధన్యావాదాలు తెలియజేశారు. మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందిని సీఐ శంకరరావు అభినందించారు. ట్రాక్టర్ తొట్టెల దొంగ అరెస్టుశృంగవరపుకోట: ట్రాక్టర్ తొట్టెలు, వాటర్ ట్యాంకులు మాయం చేస్తున్న దొంగను ఎస్.కోట పోలీసులు గురువారం అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఈ మేరకు సీఐ వి.నారాయణమూర్తి చెప్పిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని సీతారాంపురం గ్రామానికి చెందిన ఎస్.కన్నారావు తన ట్రాక్టర్ తొట్టె, వాటర్ ట్యాంక్ను దొంగిలించారని ఇచ్చిన ఫిర్యాదుపై ఎస్.కోట పోలీసులు దర్యాప్తు చేపట్టగా గంట్యాడ మండలం గింజేరు గ్రామానికి చెందిన ఎం.ఎర్నాయుడు చోరీలకు పాల్పడినట్లు ఎస్సై చంద్రశేఖర్, సిబ్బంది గుర్తించారు. దీంతో ఎర్నాయుడును అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో వాస్తవాలు వెలుగుచూశాయి. ఎర్నాయుడు గతంలో మోటార్ సైకిల్స్ చోరీ చేసేవాడు. వేర్వేరు పోలీస్స్టేషన్లలో 7కేసులు నమోదయ్యాయి. నిందితుడిని అరెస్ట్ చేసి రెండు ట్రాక్టర్ తొట్టెలు, ఒక వాటర్ ట్యాంక్ను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరు పరచగా, మెజిస్ట్రేట్ రిమాండ్ నిమిత్తం సబ్జైలుకు పంపుతూ తీర్పు ఇచ్చారని సీఐ తెలిపారు. ధాన్యం నిల్వల పరిశీలనసీతానగరం: జిల్లాలోని రైస్మిల్లుల్లో ఇప్పటివరకూ ఉన్న ధాన్యం నిల్వలు, పౌరసరఫరాల శాఖ ఎఫ్సీఐ గోదాంలకు పంపిణీ చేసిన బియ్యానికి సంబంధించిన రికార్డులు సమగ్రమైన సమాచారంతో ఉండాలని పౌరసరఫరాలశాఖ జిల్లా అధికారి బండి అశోక్ అన్నారు. ఈ మేరకు సీతానగరం మండలంలోని పాపమ్మవలస, అప్పయ్యపేట, లక్ష్మీపురం గ్రామాల్లో గల రైస్మిల్లుల్లో ధాన్యం, బియ్యం నిల్వల రికార్డులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అప్పయ్యపేటలోని సత్యమోడరన్ బాయిల్డ్ అండ్ రా రైస్మిల్లును పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లాలో 112 రైస్మిల్లులున్నాయని ఆయా మిల్లుల యాజమాన్యాలు పీఏసీఎస్ల ద్వారా ఈ ప్రొక్యూర్మెంట్ చేసినట్లు చెప్పారు. నిర్దేశించిన గడువులోగా ఈ క్రాప్ చేసిన రైతుల నుంచి ధాన్యం సేకరించామన్నారు. మిల్లర్లు నిబంధనల ప్రకారం ఎప్సీఐ గోదాంలకు బియ్యం పంపిణీ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో నిత్యావసర సరుకులు, రేషన్ డిపోలద్వారా బియ్యం పంపిణీ తదితర అంశాలపై సమీక్షించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కె.ప్రసన్నకుమార్, రైస్మిల్లు యాజమాన్య ప్రతినిధి మున్నా, ఆర్ఎస్డీటీ పైడిరాజు, ఆర్ఐ ఎన్. శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
సూఫీ సుగంధ మహోత్సవాలు ప్రారంభం
● వందలాది మంది భక్తులకు అన్నప్రసాదం పంపిణీ ● ఖాదర్బాబా చిత్రపటంతో భారీ ఊరేగింపు నేడువిజయనగరం టౌన్: బాబామెట్టలో ఉన్న ఆధ్యాత్మిక సూఫీ చక్రవర్తి హజరత్ సయ్యద్ షహిన్ షా బాబా ఖాదర్వలీ బాబా 67వ సూఫీ సుగంధ ఉరుసు మహోత్సవాలను గురువారం భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా ప్రారంభించారు. దర్బార్ నిర్వాహకులు ముతవల్లి డాక్టర్ ఖలీలుల్లా షరీఫ్, సూఫీ ీపీఠాధిపతి ఖ్వాజా మొహియుద్దీన్ల ఆధ్వర్యంలో వందలాది మంది భక్తుల సమక్షంలో దర్గాలో ఖురాన్ పఠనంతో ఉరుసు ఉత్సవాలను ప్రారంభించారు. రాత్రి బాబావారికి శుద్ధిస్నానం (గుషుల్) నిర్వహించారు. లంగర్ ఖానాలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా దర్బార్ నిర్వాహకులు మాట్లాడుతూ ఉత్సవాల మూడురోజుల పాటు అన్నసమారాధన నిర్విరామంగా కొనసాగుతుందని చెప్పారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఉత్సవంలో ప్రధాన ఘట్టమైన సందల్ అంటే బాబా చిత్రపటంతో ఊరేగింపు నగరవీధుల్లో సందడిగా జరుగుతుందన్నారు. ఊరేగింపు తర్వాత దర్గాపై బాబావారికి సుగంధ, చాదర్, పరిమళ ద్రవ్యాల సమర్పణ చేస్తామని చెప్పారు. మూడురోజుల పాటు భక్తులందరికీ బాబా వారి శేష వస్త్రాలు, తబురుక్ (ప్రసాదం) పంపిణీ కార్యక్రమాలతో ఉత్సవాలు ముగుస్తాయని వివరించారు. -
ప్రాణాలు తీసినా భూములు ఇవ్వం
● స్పష్టం చేసిన భోగాపురం, ముంజేరు రైతులు ● భూసేకరణ నిలిపివేయాలంటూ తహసీల్దార్కు వినతి భోగాపురం: మా ప్రాణాలు తీసినా సరే ప్రభుత్వానికి ఒక్క సెంటు భూమి కూడా ఇచ్చేది లేదని భోగాపురం, ముంజేరు గ్రామాల రైతులు తేల్చిచెప్పారు. బలవంతంగా నోటికాడ కూడును లాక్కో వద్దంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం ఐటీపార్క్, డేటా సెంటర్, ఎడ్యుకేషన్ హబ్ల పేరుతో భూసేకరణ కోసం చేపడుతున్న సర్వేలను వ్యతిరేకిస్తూ రైతులందరూ కలిసి గురువారం నిరసన తెలిపారు. సర్వేలను నిలిపివేయాలంటూ సర్పంచ్ పూడిక నూకరాజుతో కలిసి తహసీల్దార్ రమణమ్మకు వినతిపత్రం అందజేశారు. తరతరాలుగా వరి, వేరుశనగ, కొబ్బరి తోటలు సాగుచేస్తూ సాగిపోతున్న మా జీవితాల్లో ప్రభుత్వం భూసేకరణ పేరుతో చిచ్చు పెడుతోందని వాపోయారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణం కోసం సుమారు మూడువేల ఎకరాల భూములను ఇచ్చామని, ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా అక్కడ ఎవరికీ ఉపాధి కల్పించలేదని, ఇప్పుడు మళ్లీ అభివృద్ధి కంపెనీల ఏర్పాటు పేరుతో ఉన్న భూములను లాక్కోవడం అన్యాయమని మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు మా భూములకు కొట్లాది రూపాయలు ఇచ్చేందుకు ముందుకు వచ్చినా మట్టిని నమ్ముకున్న మేము భూమిని మాత్రం అమ్ముకోలేదని, అలాంటిది ఇప్పుడు ప్రభుత్వం చేపడుతున్న సర్వేలు, బలవంతపు సేకరణను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేశారు. సంవత్సరానికి మూడు పంటలు పండే సారవంతమైన భూములను ప్రభు త్వం కంపెనీలకు ధారాదత్తం చేయడం భావ్యం కాదని, ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వినతిపత్రంలో పేర్కొన్నారు. -
ఊరేగింపుగా పెళ్లికి పయనం...
సీతారామస్వామివారి ఉత్సవ విగ్రహాలకు పట్టు వస్త్రాలతో అర్చకులు సుందరంగా అలంకరించారు. వివిధ రకాల స్వర్ణాభరణాలతో ముస్తాబుచేసి రాత్రి 7 గంటలకు హంస, అశ్వ, గరుడు వాహనాలపై రామతీర్థం పుర వీధుల్లో ఊరేగింపుగా తీసుకువెళ్లి మూడు వాహనాల సేవను జరిపించారు. ఈ ఊరేగింపులా భాగంగా సీతమ్మ తల్లి వాహనం, శ్రీరాముడి వాహనాలు ఎదురుపడినప్పుడు అర్చకులు వేద మంత్రాలతో తిరుక్కల్యాణ విశిష్టతను భక్త జనులకు చాటి చెప్పారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను కల్యాణ మండపానికి తీసుకువచ్చి స్వామివారి వివాహమహోత్సవాన్ని ప్రారంభించారు. ఆచారంగా పూసపాటిరేగ మండలం కుమిలి గ్రామానికి చెందిన ఏకుల కుటుంబీకులు తెచ్చిన పట్టువస్త్రాలను స్వామివారికి సమర్పించారు. -
భూ రికార్డుల్లో తప్పులవల్లే రైతులకు ఇబ్బందులు
● ఈకేవైసీ పరిశీలించాకే పాస్పుస్టకాలు ప్రింటింగ్కు ఇవ్వాలి ● కలెక్టర్ రామసుందర్ రెడ్డి బొబ్బిలి: క్షేత్రస్థాయిలో రైతుల భూములకు ఈకేవైసీ చేయించాక, సరిచూసుకున్నాకే పట్టాదారు పాస్పుస్తకాలను ప్రింటింగ్కు ఇవ్వాలని కలెక్టర్ ఎస్.రాంసుందరరెడ్డి అన్నారు. పట్టణంలోని శ్రీ కళాభారతి మున్సిపల్ ఆడిటోరియంలో రెవెన్యూ అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. భూ సమస్యలులేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు రెవెన్యూ అధికారులంతా సంసిద్ధం కావాలన్నారు. భూ రికార్డుల్లో తప్పులు ఉండడం వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా రెండు దశల్లో 499 గ్రామాల్లో రీసర్వే పూర్తయిందని, 423 గ్రామాల్లో 2.03 లక్షల పట్టాదారు పాస్పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. సుమారు 8,015 పాస్ పుస్తకాలకు 3,896 పుస్తకాలను సరిదిద్దాల్సి ఉందన్నారు. తప్పులు సరిదిద్ది ఫిబ్రవరి 10లోగా పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతినెలా 2 నుంచి 9వతేదీ లోగా రికార్డులు సరిదిద్దే చర్యలు చేపట్టాలన్నారు. రెవెన్యూ క్లినిక్లకు వచ్చే అర్జీలను పది రోజుల్లోగా పరిష్కరించాలన్నారు. జిల్లాలో పలు సమస్యలకు కారణమైన జాయింట్ ఎల్పీఎంలను సరిదిద్దాలన్నారు. జేసీ సేతుమాధవన్ మాట్లాడుతూ పాస్ పుస్తకాల్లోని తప్పులను సరిదిద్దేందుకు తాజాగా తహసీల్దార్లకు, ఆర్డీఓలకు అధికారం అప్పగించామన్నారు. సమావేశంలో ఆర్డీఓ జేవీవీఎస్ రామ్మోహనరావు, సర్వే ఏడీ విజయకుమమార్, బొబ్బిలి, బాడంగి, రామభద్రపురం, తెర్లాం తహసీల్దార్లు ఎం.శ్రీను, వరప్రసాద్, అజూ రఫీజాన్, జి.హేమంత్ కుమార్, సర్వేయర్లు, వీఆర్వోలు పాల్గొన్నారు. మెట్టవలస సచివాలయం సందర్శన బొబ్బిలి రూరల్: మండలంలోని మెట్టవలస సచివాలయాన్ని కలెక్టర్ రాంసుందర్రెడ్డి గురువారం సందర్శించారు. సిబ్బందితో మాట్లాడి పలు అంశాలపై ప్రశ్నించి సమాధానాలు రాబట్టారు. ఆర్ఎస్కే, వెల్నెస్ సెంటర్, సచివాలయ సిబ్బంది విధుల తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఈకేవైసీ, రీసర్వే ప్రక్రియలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. -
సచివాలయ వ్యవస్థ నిర్వీర్యానికి.. కూటమి కుట్ర!
విజయనగరం అర్బన్: గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సిద్ధించేలా... ఊరిపొలిమేర దాట కుండానే ప్రజలకు ప్రభుత్వ సేవలన్నీ అందేలా గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన సచివాలయ వ్యవస్థపై కూటమి కక్షగట్టింది. నిర్వీర్యం చేసేందుకు కుట్రపూనింది. ఉద్యోగులను వివిధ సర్వేల పేరుతో వేధింపులకు గురిచేస్తోంది. వారి సమస్యలను పట్టించుకోకుండా... సదుపాయాలు కల్పించకుండా ఆవేదనకు గురిచేస్తోంది. మరోవైపు సచివాలయాల కుదింపుతో పాటు మిగులు ఉద్యోగుల పేరుతో సచివాలయ ఉద్యోగులను ఇతర శాఖల్లో సర్దుబాటుచేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కూటమి ప్రభుత్వ చర్యలపై సచివాలయ ఉద్యోగులు భగ్గుమంటున్నారు. ఇప్పటికే సర్వేయర్లు ఆందోళన బాట పట్టారు. ఇప్పుడు మిగిలిన విభాగాల ఉద్యోగులు కూడా ఆందోళనకు సిద్ధమవుతున్నారు. వ్యవస్థను నీరుగార్చేలా... ప్రజల ఇంటి ముందే పాలన అనే భావనతో 2019–20 మధ్య ఏర్పాటైన సచివాలయ వ్యవస్థను 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసేలా మార్పులు చేస్తోంది. రేషనలైజేషన్ పేరుతో సిబ్బంది సర్దుబాట్లు చేస్తోంది. ప్రస్తుతం జిల్లాలో 777 పంచాయతీలకు సంబంధించి 626 సచివాలయాలు ఉండగా 5,781 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన రేషనలైజేషన్, ఫేషియల్ అటెండెన్స్, పేరు మార్పు వంటి సంస్కరణలు సేవలకు మెరుగు పరుస్తాయని అధికారులు చెబుతున్నప్పటికీ... ప్రజలు, ఉద్యోగుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రస్తుత పాలక పక్ష ఎమ్మెల్యేల వాఖ్యలు, ప్రఽభుత్వం చేపడుతున్న విధాన మార్పులు, వ్యవస్థను నిర్వీర్యం చేసేలా మారాయి. సిబ్బంది, సచివాలయాల రేషనలైజేషన్ చర్యలతో వ్యవస్థపై ప్రభుత్వానికి స్పష్టమైన దృక్పథం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నిబంధనల కత్తి... 2,500 మంది కంటే తక్కువ జనాభా ఉన్న సచివాలయాల్లో 6 మంది, 3,500 వరకు ఉంటే 8 మంది ఉద్యోగులే పనిచేయాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది. రేషనలైజేషన్ పేరుతో అన్ని కేటగిరీలు కలిపి జిల్లాలో వెయ్యమందిని మిగులు చూపారు. వాళ్లను మరో శాఖలకు పంపడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విమర్శలు వస్తున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 140 మంది మిగులు ఉద్యోగులతో దేవదాయ శాఖలో ఖాళీలను భర్తీచేయాలని తాజాగా జీఓ కూడా విడుదల చేసి తొలిప్రయత్నంగా ప్రకటించింది. బదిలీలు, ప్రమోషన్లలో అన్యాయాలు, అధికారుల వేధింపుల వల్ల ఆరోగ్య సమస్యలు, ఒత్తిడి పెరిగాయని కొందరు ఉద్యోగులు అభిప్రాయ పడుతున్నారు. ఉద్యోగుల గౌరవంపై దాడే సచివాలయాలు, సిబ్బంది కుదింపు చర్యలు మిగులు ఉద్యోగులపేరుతో ఇతర శాఖలకు సర్దుబాటు యత్నాలు సచివాలయాలు దరిద్రాలయాలుగా వ్యాఖ్యలు కూటమి తీరును దుమ్మెత్తిపోస్తున్న ఉద్యోగులు ప్రభుత్వ సేవలను ప్రజల దరిచేరుస్తూ కీలక పాత్ర వహిస్తున్న సచివాలయ/వార్డు సిబ్బంది సమస్యలను ప్రభుత్వం పట్టంచుకోకపోవడం అన్యాయం. ప్రభుత్వాలు తమ అన్ని కార్యక్రమాలను సచివాలయ సిబ్బందిచే అమలు చేయించుకుంటూ మరోవైపు వారిని, ఆ వ్యస్థను అవమానించే వ్యాఖ్యలను ప్రభుత్వం ఉపేక్షించడం సరైన పాలనాధోరణి కాదు. ఉద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా ప్రజాసేవ వ్యవస్థపై ప్రజల్లో అనవసరమైన అపోహలను సృష్టిస్తున్నారు. – బూసర్ల శ్రీను, జిల్లా అధ్యక్షుడు, అర్బన్ సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ -
అధికారులే అవాక్కయ్యేలా...
విజయనగరం క్రైమ్/గుర్ల: ఆయన చేసేది హోంగార్డు ఉద్యోగం... సంపాదించింది రూ.20 కోట్లు పైబడి. ఆయన ఆస్తులను చూసి ఏసీబీ అధికారులే నివ్వెరపోయారు. ఇళ్లు, స్థలాల డాక్యుమెంట్లను చూసి బిత్తరపోయారు. విజయనగరం గోకపేటలోని లక్ష్మీనివాస్ అపార్ట్మెంట్లో నివసిస్తున్న నెట్టి శ్రీనివాసరావు ఆదాయానికి మించిన ఆస్తుల చిట్టాను గురువారం జరిపిన దాడుల్లో బహిర్గతం చేశారు. వివరాల్లోకి వెళ్తే... విజయనగరం ఏసీబీ విభాగంలో సుమారు పదిహేనేళ్ల కిందట నెట్టి శ్రీనివాసరావు హోంగార్డుగా విధుల్లో చేరారు. ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారన్న సమాచారాన్ని ముందుగానే సంబంధిత అధికారులు, ఉద్యోగులకు చేరవేసేవారు. ఇలా వాళ్లను సేఫ్ జోన్లోకి నెట్టి.. ఆ వ్యక్తుల నుంచి రూ.వేలు, రూ.లక్షల్లో నగదు, వివిధ ఆస్తుల రూపంలో లబ్ధిపొందినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బందితో లోపాయికారి ఒప్పందంతో సంబంధాలు నెరిపేవాడు. ఆయన వైఖరిపై అనుమానం వచ్చిన అధికారులు ఏడాదిన్నర కిందట ఎస్పీ ఆఫీస్కు బదిలీ చేయించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న సమాచారం మేరకు విజయనగరంలోని శ్రీనివాసరావు ఇల్లు, గుర్ల మండలం నడుపూరు, విశాఖపట్నంలోని బంధువుల ఇళ్లలో ఏసీబీ డీఎస్పీ రమ్య ఆధ్వర్యంలోని అధికార బృందాలు ఏకకాలంలో దాడులు చేశాయి. ఆయన అక్రమాస్తులను గుర్తించాయి. రెండు ప్లాట్లు, ఒక ఆర్సీసీ బిల్డింగ్, నాలుగు ఇళ్ల స్థలాలు, 166 గ్రాముల బంగారం, రూ.60వేల నగదు, రూ.7.07 లక్షల బ్యాంకు బ్యాలెన్స్, ఒక కారు, బైక్ తదితర ఆస్తులను సీజ్చేశాయి. ఆయనను అరెస్టు చేశామని, విశాఖలోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని అధికారులు తెలిపారు. హోంగార్డు అక్రమ సంపాదన రూ.20 కోట్ల విలువైన ఆస్తులు పదుల సంఖ్యలో ఇళ్ల స్థలాల డాక్యుమెంట్లు విలాసవంతమైన జీవనం -
డ్రైవర్లకు కంటిచూపు పరీక్షలు తప్పనిసరి
● ఉపరవాణా కమిషనర్ డి.మణికుమార్ విజయనగరం టౌన్: వాహనాలు నడిపే డ్రైవర్లందరూ తప్పనిసరిగా కంటిచూపు పరీక్షలు చేయించుకోవాలని ఉపరవాణా కమిషనర్ డి.మణికుమార్ పేర్కొన్నారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలను పురస్కరించుకుని గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యాలయం ఆవరణలో డ్రైవర్లకు ఆరోగ్య, కంటిచూపు పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు యు.దుర్గాప్రసాద్, ఎం.శశికుమార్, శ్రావ్య, రమేష్కుమార్, నవీన్ కుమార్, ఐశ్వర్య, ప్రభుత్వాస్పత్రి వైద్యులు పాల్గొన్నారు. అభా యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ● అదనపు డీఎంఈ (అకడమిక్) డాక్టర్ వెంకటేశ్వరావు విజయనగరం ఫోర్ట్: అభాయాప్లో రోగుల వివరాలు రిజిస్ట్రేషన్ తప్పనిసరని అదనపు డీఎంఈ (అకడమిక్) డాక్టర్ వెంకటేశ్వరావు అన్నారు. విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని లెక్చర్ గ్యాలరీలో వైద్యులకు, సిబ్బందికి గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అభాయాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల రోగ నిర్ధారణ, ప్రయోగశాల పరీక్షలు, డిశార్జ్ సంబంధిత సమాచారం పొందడానికి సహాయపడుతుందన్నారు. కార్యక్రమంలో ఎన్ఐసీ డైరెక్టర్ కె.శ్యామలరావు, నోడల్ అధికారి అనూరాధ, సూపరింటెండెంట్ అల్లు పద్మజ, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ సరోజనీదేవి, డిప్యూటీ సూపరింటెండెంట్ పి.ఎ.రమణి, సీఎస్ఆర్ఎంఓ ఎల్. ఆనంద్కుమార్, ఆర్ఎంఓ కామేశ్వరావు, ఎ.డి. పీఎన్ అప్పారావు, ఏఓ ఎర్రాజీరావు తదితరులు పాల్గొన్నారు. క్రైమ్ స్పాట్స్ వాహనాలు ప్రారంభం 30 మందికి మెరిట్ స్కాలర్ షిప్లు విజయనగరం అర్బన్: గాజులరేగ పరిధిలోని సీతం ఇంజినీరింగ్ కళాశాలలో చదువులో ప్రతిభ చూపుతున్న 30 మంది విద్యార్థులకు బొత్స గురునాయుడు మరియు మజ్జి రామారావు మెమోరియల్ మెరిట్ స్కాలర్షిప్ కింద రూ.5లక్షల నగదు, మెడల్, ప్రశంసా పత్రాలను మాజీ ఎంపీ డాక్టర్ బొత్స ఝాన్సీలక్ష్మి చేతుల మీదుగా గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడమే మెరిట్ స్కాలర్షిప్ల ప్రధాన లక్ష్యమన్నారు. విద్యతోపాటు క్రమశిక్షణ, నైతిక విలువలు విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయని పేర్కొన్నారు. మామయ్య, తండ్రి జ్జాపకార్థం కళాశాల స్థాపించిన నాటి నుంచి ప్రతిభావంత విద్యార్థులకు మెరిట్ స్కాలర్ షిప్లు అందజేస్తున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీరామమూర్తి, బొత్స చైతన్యబాబు, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
వేడుకగా పోలమాంబ అనుపోత్సవం
● వనంగుడికి చేరిన అమ్మవారి ఘటాలు ● అమ్మవారిని దర్శించుకున్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర ● ఫిబ్రవరి 3న మారుజాతర మక్కువ: ఉత్తరాంధ్ర ఇలవేల్పు, భక్తుల ఆరాధ్యదైవం శంబర పోలమాంబ అమ్మవారి అనుపోత్సవం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. మంగళవారం సాయంత్రం 3.35 నిమిషాలకు జన్నివారి ఇంటి వద్ద పూజలందుకున్న అమ్మవారి ఘటాలను తిరువీధి కార్యక్రమానికి బయలు దేరి గిరిడ వారింటికి, పూడి, కుప్పిలి వారిళ్లకు వెళ్లి తొలి పూజలందుకొని అనంతరం గ్రామంలో అన్ని వీధులలో అమ్మవారి ఘటాల ఊరేగింపు నిర్వహించారు. తిరిగి మంగళవారం అర్ధరాత్రి 12గంటల ప్రాంతంలో ప్రధాన రహదారి వద్ద అమ్మవారి గద్దెకు ఘటాలు చేరుకున్నాయి. కాసేపు అమ్మవారు సేదతీరి తిరిగి తిరువీధికి బయలుదేరి, బుధవారం ఉదయం 10 గంటలకు అమ్మవారి ఘటాలు ప్రధానాలయం సమీపంలో ఉన్న యాత్రా స్థలానికి చేరుకున్నాయి. అమ్మవారి గద్దె వద్ద పూజలు నిర్వహించి, భక్తుల మధ్య అమ్మవారికి ఉయ్యాలు కంబాలు కార్యక్రమం నిర్వహించారు. అక్కడ నుంచి వనంగుడికి బయలు దేరిన అమ్మవారి ఘటాలకు అడుగడుగునా భక్తులు నీరాజనాలు పలికారు. యాత్రా స్థలం నుంచి సుమారు కిలోమీటరు దూరంలో ఉన్న వనంగుడికి కాలినడకన అమ్మవారి ఘటాలు బయలుదేరగా, వెనుకన వేలాది మంది భక్తులు తరలివచ్చారు. యువత కేరింతలు, మేళతాళాలు, తప్పెడుగుళ్లు భక్తులను ఆకట్టుకున్నాయి. వనంగుడి వద్దకు చేరుకున్న ఘటాలను ఆలయం చుట్టూ మూడుసార్లు ప్రదక్షణలు చేసి అనంతరం వనంగుడిలో అమ్మవారి ఘటాలను ఉంచారు. అనంతరం పూజారి జన్ని పేకాపు భాస్కరరావు, అలియాస్ జగదీశ్వరరావు ఆలయం చుట్టూ మూడుసార్లు తిరిగి కట్టువేశారు. వందలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని, ఘటాలకు పూజలు చేశారు. సిరిమానోత్సవం కార్యక్రమం అనంతరం చదురుగుడి సమీపంలో నేలపై తిరగేసిన సిరిమాను బండికి భక్తులు పూజలు జరిపారు. వచ్చే నెల 3వ తేదీన పోలమాంబ అమ్మవారు మారు జాతర కార్యక్రమం నిర్వహించనున్నారు. పోలమాంబను దర్శించుకున్న రాజన్నదొర పోలమాంబ అమ్మవారిని బుధవారం మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు పీడి క రాజన్నదొర దర్శించుకున్నారు. సాంప్రదాయ పద్ధతిలో రాజన్నదొరను ఈఓ బి.శ్రీనివాస్ స్వాగతించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించా రు. మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొరకు దుశ్శాలువతో సత్కరించారు. మక్కువ, సాలూరు, పాచిపెంట వైఎస్సార్సీపీ నాయకులు అల్లు వెంకటరమణ, జర్జాపు శ్రీను, ముదరాపు శ్రీనివాసరావు పాల్గొన్నారు. ముత్యాలమ్మ పండగకు హాజరైన రాజన్నదొర కవిరిపల్లి గ్రామదేవత ముత్యాలమ్మ పండగకు, గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు పెంట సంజీవునాయుడు ఆహ్వానం మేరకు మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర హాజరయ్యారు. ఆయన వెంట పార్వతీపురం, కురుపాం నియోజకవర్గ పరిశీలకులు మావుడి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు మావుడి రంగునాయుడు, బూత్ కమిటీ ఇన్చార్జ్ మావుడి తిరుపతినాయుడు హాజరయ్యారు. -
ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె
● కేంద్ర కార్మిక సంఘాల పిలుపు విజయనగరం గంటస్తంభం: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయపద్రం చేయాలని కేంద్ర కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక ఎన్పీఆర్ భవనంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సమ్మె వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్మి టి.వి.రమణ, ఏఐసీసీటీయూసీ జిల్లా కన్వీనర్ యం.అప్పలరాజు, ఐఎఫ్టీయూ, ఐఎన్టీయూసీ నాయకులు మాట్లాడుతూ, నాలుగు లేబర్ కోడ్స్ కార్మికులను కట్టు బానిసలుగా మార్చే ప్రమాదం ఉందన్నారు. పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మిక హక్కులను కాలరాస్తున్నారని విమర్మించారు. లేబర్ కోడ్స్ రద్దుతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించాలని, ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకం వంటి స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. సమ్మె విజయవంతానికి ఫిబ్రవరి 1న రౌండ్ టేబుల్ సమావేశం, 9న బైక్ ర్యాలీ, 10, 11 తేదీల్లో ప్రచారం చేపడతామని తెలిపారు. ఫిబ్రవరి 12న కోట జంక్షన్ నుంచి గాంధీ విగ్రహం వరకు భారీ ప్రదర్శన నిర్వహించనున్నట్టు ప్రకటించారు. అన్ని రంగాల కార్మికులు సమ్మెలో పాల్గొన్నాలని పిలుపునిచ్చారు. సమావేశంలో శంకర్రావు, ఎ.జగన్మోహనరావు, బి.రమణ, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. -
2025 మార్చి నాటికే పూర్తి కావాల్సిన భవనాలు
● చంద్రబాబు ప్రభుత్వానికి పట్టని ఏపీవీపీ ఆస్పత్రులు ● ఆస్పత్రుల ఆధునీకరణకు నిధులు మంజూరు చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ● నాలుగు ఆస్పత్రులకు రూ.42.83 కోట్లు మంజూరు ● బిల్లులు మంజూరు చేయకుండా జాప్యం చేస్తున్న చంద్రబాబు సర్కార్ ● రూ.20.91 కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టిన వైనం గడువు ముగిసింది.. బిల్లులు అప్లోడ్ చేయడానికి గడువు ముగిసింది. నాబార్డు వారు బిల్లులు అప్లోడ్ చేయడానికి గడువు పెంచాల్సి ఉంది. ప్రభుత్వం ఇతర నిధులు కేటాయించినా బిల్లులు అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. – భారతి,ఈఈ, ఏపీఎంఎస్ఐడీసీ విజయనగరం ఫోర్ట్: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చింది. అందరికీ ఆరోగ్యం అనే నినాదాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్షరాలా అమలు చేసి చేతల్లో చూపించారు. నాడు–నేడు ద్వారా ఆస్పత్రుల రూపు రేఖలు మార్చేసారు. కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ఆస్పత్రులను తీర్చిదిద్దారు. వైద్య రంగంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా జీరో వేకేన్సీ పాలసీ ద్వారా ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేశారు. ఏళ్ల తరబడి అప్గ్రేడేషన్కు నోచుకోని సామాజిక ఆస్పత్రులను అప్గ్రేడేషన్ చేసింది. అంతేకాకుండా వాటికి అవసరమైన అదనపు భవనాలను కూడా మంజూరు చేసింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు సేవలు అందించే ప్రభుత్వ ఆస్పత్రుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏరియా ఆస్పత్రులు, సామజిక ఆరోగ్య కేంద్రాల పట్ల చంద్రబాబు ప్రభుత్వం అలసత్వం వహిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వైద్య విధాన్ పరిషత్ పరిధిలోని ఏరియా ఆస్పత్రులు, సీహెచ్సీలు నాలుగింటికి అదనపు భవనాలను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందుకోసం రూ.కోట్లు నిధులను కేటాయించింది. గజపతినగరం సీహెచ్సీని ఏరియా ఆస్పత్రిగా 30 పడకల నుంచి 100 పడకల ఆస్పత్రిగా అప్గ్రేడేషన్ చేసింది. ఇందుకోసం అదనపు భవనాల నిర్మాణానికి రూ.17 కోట్లు మంజూరు చేసింది. ఎస్.కోట సీహెచ్సీని ఏరియా ఆస్పత్రిగా మార్చి 50 పడకల నుంచి 100 పడకల ఆస్పత్రిగా అప్గ్రేడేషన్ చేశారు. అదనపు భవనాల నిర్మాణం కోసం రూ.12.60 కోట్లు మంజూరు చేశారు. బాడంగి సీహెచ్సీని 30 పడకల నుంచి 50 పడకల ఆస్పత్రిగా అప్గ్రేడేషన్ చేశారు. ఇందుకోసం రూ. 8.81 కోట్లు మంజూరు చేశారు. నెల్లిమర్ల సీహెచ్సీ 30 పడకల ఆస్పత్రి ఆధునీకరణ, భవనాల నిర్మాణం కోసం రూ.4.42 కోట్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వం మంజూరు చేసింది. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన ఏపీవీపీ ఆస్పత్రుల భవనాల నిర్మాణం, ఆధునీకరణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా అలసత్వం జాప్యం చేస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాలుగు ఆస్పత్రులకు సంబంధించి రూ.20.91 కోట్లు బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఏపీవీపీకి చెందిన నాలుగు ఆస్పత్రులకు భవనాలు మంజూరు రూ.20.91 కోట్ల బిల్లులు పెండింగ్ 2020లో అప్పటి వైఎస్సార్సీసీ ప్రభుత్వం ఆస్పత్రులను అప్గ్రేడేషన్ చేయడంతో పాటు అప్గ్రేడేషన్కు తగ్గట్టుగా వసతుల కల్పన, అదనపు భవనాల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసింది. భవనాల నిర్మాణం, ఆధునీకరణ పనులను 2025 మార్చి నెలఖారు నాటికి పూర్తి చేయాల్సి ఉంది. గడువు దాటి 10 నెలలు అయినా ఇంకా భవనాలు నిర్మాణం పూర్తి కాలేదు. -
నేడు రామతీర్థంలో శ్రీరామచంద్రస్వామి కల్యాణం
● ఏర్పాట్లు పూర్తి చేసిన దేవస్థాన అధికారులు ● స్వామి కల్యాణానికి వైభవంగా ధ్వజారోహణం నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ సీతారామస్వామి దేవస్థానం మరో వేడుకకు ముస్తాబైంది. ఇందుకు సంబంధించి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్వామి కల్యాణోత్సవంలో భాగంగా బుధవారం దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. సాయంత్రం 5 గంటలకు విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, దీక్షాధారణ, అంకురారోపణం, అగ్ని ప్రతిష్టాపన, బలిహరణ, తదితర కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. స్వామి కల్యాణ ఘట్టంలో ప్రధాన ఘట్టమైన ధ్వజారోహణ కార్యక్రమాన్ని వైఖాసన ఆగమ శాస్త్రం ప్రకారం జరిపించారు. వేద మంత్రోచ్ఛారణ, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజస్తంభంపైకి గరుత్మంతుడి చిత్రపఠాన్ని ఎగుర వేసి సమస్త దేవతా మూర్తులను స్వామి కల్యాణానికి ఆహ్వానం పలికారు. నేడు స్వామివారి తిరుక్కల్యాణ మహోత్సవం స్వామి సన్నిధిలో సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవం గురువారం వైభవంగా జరగనుంది. ఉదయం 8 గంటలకు ఆలయంలో శ్రీమద్రామాయణ పారాయణం, వేద పఠనం నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు శ్రీ స్వామివారి మూడు వాహనాలు(హంస, హస్వ, గరుడ) వాహనాల్లో స్వామి వారు రామతీర్థం పుర వీధుల్లో ఊరేగనున్నారు. కార్యక్రమంలో భాగంగా బ్రాహ్మణ వీధిలో ఎదుర సన్నాహా మహోత్సవాన్ని జరిపిస్తారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను దేవాలయానికి తీసుకువచ్చి స్వామి కల్యాణ ఘట్టాన్ని ప్రారంభిస్తారు. సరిగ్గా రాత్రి 10 గంటలకు స్వామి వారి కల్యాణ మహోత్సవం కనుల పండువగా జరిపిస్తారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయాన్ని విద్యుత్ కాంతులతో సుందరంగా తీర్చి దిద్దారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్సై గణేష్ తెలిపారు. -
ఉగాదికి గృహ నిర్మాణాలు పూర్తి చేయాలి : కలెక్టర్
విజయనగరం అర్బన్: ఉగాది పండుగ నాటికి జిల్లాలో మంజూరైన అన్ని గృహాల నిర్మాణాలు పూర్తి చేసి గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందుకోసం మండల స్థాయి అధికారులకు వారం వారీ లక్ష్యాలను నిర్దేశించామని, ఇకపై ప్రతి వారం గృహ నిర్మాణాల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. నిర్ణయించిన లక్ష్యాలను విధిగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మండల స్థాయి అధికారులు, నియోజకవర్గాల ప్రత్యేకాధికారులతో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాలో హౌసింగ్ పథకాల పురోగతిని సమీక్షించారు. కొన్ని మండలాల్లో గృహ నిర్మాణాల పురోగతి సంతృప్తికరంగా ఉండగా మరికొన్ని మండలాలు వెనుకబడి ఉన్నాయని పేర్కొని సంబంధిత అధికారులు వేగం పెంచాలని సూచించారు. గృహ నిర్మాణాలకు అవసరమైన ఇసుక, సిమెంట్, స్టీల్ తదితర నిర్మాణాలకు అవసరమైన మౌలిక వసతులపై ఎంపీడీఓలు హౌసింగ్ పీడీకి నోటు పెట్టాలని ఆదేశించారు. మున్సిపాలిటీల పరిధిలో కూడా కౌన్సిలర్లతో సమన్వయం చేసుకొని గృహనిర్మాణాలను వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గృహనిర్మాణాల రోజువారీ పురోగతి నివేదికలను తనకు సమర్పించాలని హౌసింగ్ పీడీకి కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో హౌసింగ్ పీడీ గండి మురళీమోహన్, నియోజకవర్గాల ప్రత్యేకాధికారులు, మండల ప్రత్యేకాధికారులు, మండల అభివృద్ధి అధికారులు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, హౌసింగ్ డీఈలు, ఏఈలు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. సవరించిన పాస్ పుస్తకాలు ఫిబ్రవరిలో పంపిణీ కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలలో ఉన్న తప్పులను సరి చేయడానికి తహసీల్దార్ల లాగిన్లో ప్రత్యేక ఆప్షన్ అందుబాటులోకి తీసుకొచ్చామని కలెక్టర్ తెలిపారు. తప్పులు సరిచేసిన తరువాత పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయడానికి తహసీల్దార్లు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. బుధవారం కలెక్టర్ తహశీల్దార్లతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించి ఈ అంశంపై చర్చించారు. జిల్లాలో ఎంపిక చేసిన 12 గ్రామాల్లో పట్టాదారు పాస్ పుస్తకాలను వెరిఫికేషన్ చేసి, లోపాలను సవరించి ఫిబ్రవరి నెలలో పంపిణీ చేయాలని కలెక్టర్ సూచించారు. -
అందుబాటులో ఉన్నా.. కేటాయింపే!
బొబ్బిలి: జిల్లాలో పరిశ్రమల కోసం అదనంగా భూముల కేటాయింపే తప్ప పరిశ్రమలు ఏర్పాటు చేయని పరిస్థితి నెలకొంది. గతంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంఎస్ఎంఈ పార్కులను నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేస్తామనడమే తప్ప ఏర్పాటు చేయని టీడీపీ ప్రభుత్వం మరోసారి కూటమిగా అధికారంలోకి వచ్చినా అదే తరహాలో భూముల కేటాయింపునకే ప్రాధాన్యతనిస్తోంది తప్ప ఉన్న భూముల్లో పరిశ్రమలను తీసుకువచ్చే చర్యలు చేపట్టలేదు. జిల్లాలో అతి పెద్ద, చిన్న తరహా పారిశ్రామిక వాడగా గుర్తింపు పొందిన బొబ్బిలి గ్రోత్ సెంటర్లో 1200 ఎకరాల భూములున్నాయి. చిన్న, పెద్ద కలిపి 350 ఎకరాల్లో 145 పరిశ్రమలు ఏర్పాటు చేశారు. ఇందులో సుమారు 60 పరిశ్రమల వరకూ మూతపడ్డాయి. మరో 220 ఎకరాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ఏళ్ల తరబడి ఏపీఐఐసీ వద్ద ఆయా స్థలాలను రెన్యువల్ చేసుకుంటున్నారు. మిగిలిన 430 ఎకరాలు పూర్తిగా ఏపీఐఐసీ వద్దే ఉన్నాయి. ఈ భూములు ఇంత పెద్ద విస్తీర్ణంలో(కేటాయించని, కేటాయించి రద్దు చేసినవి)ఉన్నప్పటికీ మరే పరిశ్రమలకూ కేటాయించలేదు. అలాగని దరఖాస్తు చేసుకున్న ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకూ ఇవ్వడం లేదు. ఎవరయినా దరఖాస్తు చేసుకుంటే మాత్రం కూటమి ప్రభుత్వం వేరే చోట కేటాయిస్తోంది. దీనిపై జిల్లాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ ఎకనమిక్ రీజియన్ పేరిట 1100 ఎకరాలు జిల్లాలో పరిశ్రమలు లేకపోయినా విశాఖ ఎకనమిక్ రీజియన్ పేరిట ఇక్కడ బడా బాబులకు పరిశ్రమల కోసం భూములను కేటాయించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఐటీ పరిశ్రమలు, జీఎంఆర్, టాయ్స్ పరిశ్రమల పేరిట డెంకాడ, కొత్తవలస, భోగాపురం మండలాల్లో సుమారు 1100 ఎకరాలు కేటాయించేందుకు రంగం సిద్ధమయింది. మరో పక్క బొబ్బిలి నియోజకవర్గంలోని బాడంగి, కొట్టక్కి ప్రాంతాల్లో కూడా భూములను వేరే ప్రాజెక్టుల కింద భూములను కేటాయించారు. ఇదిగో అదిగో అంటూ... పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాం.. ఇదిగో అదిగో అంటూ గ్రోత్ సెంటర్లో భూములను బడా పారిశ్రామిక వేత్తలకు గతంలో కేటాయించారు. ఇందులో ప్రధానంగా బీకే స్టీల్స్ అంటూ సుమారు 230 ఎకరాలు పైబడి ఆ పరిశ్రమకు కేటాయించారు. ఇదే భూమిని పలుమార్లు ఆ సంస్థ యాజమాన్యం హక్కులను రెన్యువల్ చేయించుకుంది. చివరికి అది వెనక్కి వెళ్లిపోయింది. అలాగే స్టీల్ ఎక్స్ఛేంజ్ పరిశ్రమకు 80 ఎకరాలు కేటాయించారు. ఇదీ ఏర్పాటు కాలేదు. అలాగే మోయిల్ అనే కేంద్ర ప్రభుత్వ పరిశ్రమకు 112 ఎకరాలు కేటాయించారు. అదీ ఇంకా కానరాలేదు. ఇలానే భూములను కేటాయించాక ఇదిగో అదిగో అంటూనే బొబ్బిలి ప్రాంత వాసులను ఊరించి ఉస్సురనిపిస్తున్న పరిశ్రమల యజమానులెంతో మంది ఉన్నారు. గ్రోత్ సెంటర్లో పారిశ్రామిక వేత్తల నుంచి వెనక్కి తీసుకున్న భూముల్లో కొత్తగా ఔత్సాహికులకు కేటాయిస్తే కాస్త నమ్మకంగా ఉంటుందని స్థానిక యువత వ్యాఖ్యానిస్తున్నారు. గ్రోత్ సెంటర్లో పరిశ్రమలు ఏర్పాటు కాక మిగిలి ఉన్న భూములు 430 ఎకరాలు అయినా పరిశ్రమల కోసమంటూ జిల్లాలో మరో 1100 ఎకరాల కేటాయింపు విశాఖ ఎకనమిక్ రీజియన్ పేరిట కార్పొరేట్లకు భూముల పందేరం జిల్లాలో పరిశ్రమలకు మాత్రం చర్యలు చేపట్టని కూటమి ప్రభుత్వం -
అజిత్ పవార్ మృతికి సంతాపం
విజయనగరం రూరల్: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఆకస్మిక మరణం పట్ల జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహారాష్ట్ర రాజకీయ దిగ్గజం, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బారామతి వద్ద జరిగిన విమాన ప్రమాదంలో ఆకస్మికంగా మరణించడం పట్ల జెడ్పీ చైర్మన్ సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అజిత్ పవార్ మహారాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని, ఆయన మరణం ఆ రాష్ట్రానికే కాకుండా దేశ రాజకీయాలకు తీరని లోటని పేర్కొన్నారు. ఈవీఎం గొడౌన్ తనిఖీపార్వతీపురం రూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలోని ఈవీఎం గోదామును కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర్రెడ్డి బుధవారం తనిఖీ చేశారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా గోదాము సీళ్లను, భద్రతా ఏర్పాట్లను నిశితంగా పరిశీలించి, పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేశారు. భద్రత విధులపై పోలీసులకు, అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, డీఆర్వో కె.హేమలత, సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి తదితరులు పాల్గొన్నారు.గొంతుకోసుకున్న వ్యక్తివిజయనగరం క్రైమ్: నగరంలోని అంబటిసత్రానికి చెందిన సంతోష్ (40) బుధవారం గొంతు కోసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు హటాహుటిన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై టూటౌన్ పీఎస్లో కేసు నమోదు కాగా ఎస్సై కృష్ణమూర్తి విచారణ చేస్తున్నారు. మతిస్థిమితం లేని కారణంగా సంతోష్ కత్తితో గొంతుకోసుకున్నట్లు అందిన ప్రాథమిక సమాచారమని సీఐ శ్రీనివాస్ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని విచారణ చేస్తున్నామని తెలిపారు. ఆటో దగ్ధంపార్వతీపురం రూరల్: కష్టార్జితంతో కొనుక్కున్న ఆటోయే కొండంత అండ. కానీ దుండగుల దుశ్చర్య ఆ బతుకు బండిని బుగ్గిపాలు చేసింది. పట్టణంలోని 17వ వార్డు బెలగాం రైల్వేగేట్ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు భద్రగిరి సత్తిబాబు అనే వ్యక్తికి చెందిన ఆటోను తగులబెట్టారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన సత్తిబాబు, ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సొంత ఇల్లు కూడా లేని తనకు, జీవనాధారమైన బండి అగ్నికి ఆహుతి కావడంతో బాధితుడు కన్నీరుమున్నీరవుతున్నాడు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు నిందితులను గుర్తించి, కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. -
గజపతినగరంలో ఇద్దరు..
గజపతినగరం: మండలంలోని తుమికాపల్లి గ్రామానికి చెందిన గుంట్రోతు విశ్వేశ్వరరావుకు గ్రూప్–2 ఫలితాల్లో ఎకై ్సజ్ ఎస్సైగా ఉద్యోగం వచ్చినట్లు స్థానిక సర్పంచ్ బెల్లాన త్రినాథరావు, కుటుంబసభ్యులు తెలిపారు. తల్లిదండ్రులు సూర్యనారాయణ, పైడిరాజులు వ్యవసాయం చేస్తూ తనని చదివించారని వాకి కృషి వల్ల ఈఉద్యోగం సాదించినట్లు విశ్వేశ్వరరావు చెప్పాడు. ఎకై ్సజ్ ఎస్సై ఉద్యోగం సాధించిన టీచర్గజపతినగరం మండలంలోని వేమలి గ్రామానికి చెందిన కొప్పల లక్ష్మణరావు ఎకై ్సజ్ ఎస్సైగా గ్రూప్–2 ఫలితాల్లో ఉద్యోగం సాధించాడు. లక్ష్మణరావు ఇటీవల మెగా డీఎస్సీలో మూడు టీచర్ పోస్టులు సాధించగా ప్రస్తుతం పులిగెడ్డ గురుకుల పాఠశాలలో పీజీటీ గణితం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. -
నెల్లిమర్ల మండలంలో..
నెల్లిమర్ల: నెల్లిమర్ల నగర పంచాయతీ జరజాపుపేట (లక్ష్మీదేవిపేట)కు చెందిన విసినిగిరి గౌరీ శంకర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్ఓ)గా ఎంపిక య్యాడు. ప్రాథమిక విద్య ఉన్నత పాఠశాల విద్య జరజాపుపేట లో పూర్తి చేసిన గౌరీ శంకర్ ఏలూరులో ఇంటర్ విద్య పూర్తి చేశాడు. అనంతరం 2003లో ఎయిర్ఫోర్స్ ఉద్యోగానికి ఎంపికై 2023లో ఉద్యోగ విరమణ చేశాడు. తాజాగా గ్రూప్ 2 ఉద్యోగానికి ఎంపికయ్యాడు. గౌరీ శంకర్ తండ్రి విసినిగిరి అప్పలనాయుడు నెల్లిమర్ల జూట్ కార్మికుడిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. తల్లి లక్ష్మి గృహిణి. -
మక్కువ మండలంలో ఇద్దరు
మక్కువ: మండలంలోని శంబర గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు గ్రూప్–2 ఉద్యోగాలు సాధించారు. గ్రామానికి చెందిన ఆర్నిపల్లి సంతోష్కుమార్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్గా ఉద్యోగం సాధించడంతో గ్రామానికి చెందిన ఉద్యోగసంఘం సభ్యులు స్వీట్లు తినిపించి, అభినందనలు తెలిపారు. అలాగే అదే గ్రామానికి చెందిన గంట భానుప్రసాద్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా ఉద్యోగం సాధించడంతో, ఆయన తల్లిదండ్రులను గ్రామానికి చెందిన ఉద్యోగసంఘం సభ్యులు దుశ్శాలువాతో సన్మానించారు. దత్తిరాజేరు మండలంలో ఇద్దరు..దత్తిరాజేరు: మండలంలోని కోమటిపల్లి గ్రామానికి చెందిన సుంకరి సురేష్ గ్రూప్ 2 ఫలితాల్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్ఓ)గా ఎంపికయ్యాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన సురేష్ తండ్రి అప్పన్న ఇటీవల మృతి చెందిగా తల్లి లక్ష్మితో కలిసి కోమటిపల్లిలో నివాసం ఉంటున్నాడు. అలాగే ఎస్.చింతలవలస గ్రామానికి చెందిన అల్తివాసు డిప్యూటీ తహసీల్దార్గా ఎంపికయ్యాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన వాసును తల్లి రామలమ్మ కష్టపడి చదివించడంతో ఉన్నత స్థానానికి చేరుకున్నాడు. 2019లో కానిస్టేబుల్, 2022లో రైల్వేలో ఉద్యోగాలు సాధించి తొలి ప్రయత్నంలోనే వచ్చిన ఉద్యోగాలను వదులుకుని మరింత పట్టుదలతో చదవడంతో డిప్యూటీ తహసీల్దార్గా ఎంపికయ్యాడు. -
లక్ష్యం సాధించారు..!
● గ్రూపు–2లో సత్తా చాటిన జిల్లా అభ్యర్థులు● ఉద్యోగాలు సాధించిన పలువురు యువత● అభినందిస్తున్న కుటుంబసభ్యులు, గ్రామస్తులుసాక్షి నెట్వ ర్క్:జీవితంలో ఏదో సాధించాలన్న లక్ష్యం ఏర్పరుచుకుని కష్టపడి చదివి పోటీ పరీక్షల్లో విజయం సాధించిన పలువురు జిల్లా అభ్యర్థులు ఏపీపీఎస్సీ తాజాగా విడుదల చేసిన గ్రూప్–2 ఫలితాల్లో సత్తా చాటి ఉద్యోగాలు సాధించాచు. చీపురుపల్లి మండలంలోని పెదనడిపల్లి గ్రామానికి చెందిన టొంపల రాంబాబు గ్రూప్–2లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఎకై ్సజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం రాంబాబు ఇదే మండలంలోని నిమ్మలవలసలో బీపీఎంగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే రాంబాబు తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ చదివించారు. అలాగే మండలంలోని దేవరపొదిలాం గ్రామానికి చెందిన గుణిదపు సురేష్ గ్రూప్–2లో ప్రతిభ చూపి డిప్యూటీ తహసీల్దార్ పోస్టు సాధించాడు. సురేష్ తల్లిదండ్రులు వెంకటలక్ష్మి, సింహాచలం రైతుకూలీలు. అన్నయ్యలు వేణు, భాస్కర్లు ఒకరు ఫార్మా కంపెనీలో, మరొకరు గ్రామ సచివాలయంలో పని చేస్తున్నారు. బొండపల్లిలో ఎకై ్సజ్ ఎస్సైలుగా ముగ్గురు బొండపల్లి: ఏపీపీఎస్సీ గ్రూప్2 ఫలితాల్లో బొండపల్లి మండలంలోని మూడు గ్రామాలకు చెందిన ముగ్గురు యువత ప్రతిభ కనబరిచి ఎకై ్సజ్ ఎస్సైలుగా ఎంపికయ్యారు. మండలంలోని బిల్లలవలస గ్రామానికి చెందిన చందక ఇందు తొలి ప్రయత్నంలోనే గ్రూప్2 ఎగ్జామ్స్ రాసి ఎకై ్సజ్ ఎస్సైగా ఎంపికై ంది. ఆమె తల్లిదండ్రులు చందక రాజ్యలక్ష్మి, మృత్యుంజయరావులు వంట పని చేస్తూ తమ ఇద్దరు కూతుళ్లను చదివించగా కుటుంబంతో పాటు గ్రామానికి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చిందని పలువురు అభినందిచారు. అలాగే మండలంలోని ముద్దూరు గ్రామానికి చెందిన బాలి సత్యనారాయణతో పాటు, నెలివాడ గ్రామానికి చెందిన కొమ్మ అనూరాధ ఎకై ్సజ్ ఎస్సైలుగా పోస్టులు సాధించారు. మండలంలోని ముగ్గురు ఎకై ్సజ్ ఎస్సైలుగా ఎంపిక కావడంతో అయా గ్రామాల్లో ఆనందం వెల్లివిరిసింది. -
గార్రాజు చీపురుపల్లి యువకుడి సత్తా
రాజాం: గ్రూపు–2 ఫలితాల్లో రాజాం మండలంలోని గార్రాజుచీపురుపల్లి గ్రామానికి చెందిన తుర్ల దుర్గారావు ఏపీ సెక్రటరీయేట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా ఎంపికయ్యాడు. బీటెక్లో కంప్యూటర్ సైన్స్ ఉత్తీర్ణత చెందిన ఈ యువకుడు సివిల్స్కు సన్నద్ధమయ్యాడు. గత రెండేళ్లుగా సివిల్స్పై దృష్టిసారించిన యువకుడు తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఆయన తల్లిదండ్రులు తుర్ల సూరమ్మ, అప్పన్నలు వ్యవసాయ కూలీలు. రైతు కుటుంబానికి చెందిన దుర్గారావు సివిల్స్ సాధించడం పట్ల గ్రామస్తులు అభినందనలు తెలిపారు.మెంటాడ మండలంలో నలుగురు మెంటాడ: మండలానికి చెందిన నలుగురు అభ్యర్థులు గ్రూప్ 2 లో విజయం సాధించారు. పిట్టాడగ్రామానికి చెందిన సిరిపురం రేణుక డిప్యూటీ తహసీల్దార్గా ఎంపికై ంది. ఆమె గతంలో వెల్ఫేర్ అసిస్టెంట్గా పనిచేసింది, జీటీపేటకు చెందిన కెల్ల సత్యవతి ఎకై ్సజ్ సబ్ ఇన్స్పెక్టర్గా ఎంపిక కాగా ఆమె గతంలో జగనన్న ప్రభుత్వంలో వలంటీర్గా పని చేసింది. మీసాలపేటకు చెందిన లెంక అరుణ కుమారి డీజీపీ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం సాధించింది. ఆమె ఇంటర్ అయ్యాక ఆర్థిక ఇబ్బందులతో మూడు సంవత్సరాలు చదువు ఆపేసింది. అన్న బంగారు నాయుడు ప్రోత్సాహంతో డిగ్రీ చదివి ఉద్యోగం సాధించింది. అలాగే కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లయిస్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా చింతలవలసకు చెందిన పిన్నింటి శ్రీపతి ఉద్యోగం సాధించాడు. ఈ సందర్భంగా మండలంలోని పలువురు ప్రజలు, నాయకులు వారిని అభినందించారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
కొత్తవలస: మండలంలోని తుమ్మికాపల్లి పంచాయతీ జగన్నాథ లేఅవుట్ లో గల సాయిసంపత్ అపార్ట్మెంట్లో రాజుపాత్రునిపాలెం గ్రామానికి చెందిన వానపల్లి సోమేశ్వరరావు (36) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బుధవారం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. సోమేశ్వర రావు గాజువాక సమీపంలో గల ఒక టైర్ల షాపులో పనిచేస్తూ రోజు ఇంటి నుంచే రాకపోకలు సాగిస్తుంటాడు. మంగళవారం తన తల్లి దగ్గర డబ్బులు తీసుకుని బస్ పాస్ చేయించుకునేందుకు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో వెతకడం ప్రారంభించారు. కాగా మంగళవారం రాత్రి తన తల్లికి ఫోన్ చేసి తన మిత్రుడు కె.ఆశోక్కుమార్ అపార్ట్మెంట్లో నిద్రిస్తానని చెప్పి అపార్ట్మెంట్కు వెళ్లిపోయాడు. కాగా ఉదయం మిత్రుడు లేపేందుకు ప్రయత్నించగా కదలిక లేకపోవడంతో చెంతనే గల ఆర్ఎంపీ డాక్టర్కు చూపించగా అప్పటికే మృతి చెందినట్లు ఆర్ఎంపీ ధ్రువీకరించాడు. సోమేశ్వరారావు మృతి అనుమానంగా ఉందని మృతుడి తల్లిదండ్రులు, సోదరులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ షన్ముఖరావు తెలిపారు. గజపతినగరం: మండలంలోని బూడిపేట గ్రామానికి చెందిన మజ్జి పెంటయ్య (75)ఆయాసం, బీపీ, సుగర్, కీళ్ల నొప్పులు తదితర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తీవ్ర మానసిక ఒత్తడికి గురై 2నెల 26న పురుగు మందు తాగేశాడు. దీంతో పెంటయ్యను కుటుంబసభ్యులు విజయనగరం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. పెంటయ్యకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. అలాగే సాలిపేట గ్రామానికి చెందిన కొడిసి ఆదినారాయణ (46) ఈనెల 26న చింత చెట్టు ఎక్కి చింతబొట్లు రాలుస్తూ ప్రమాదవశాత్తు చెట్టునుంచి కిందకు జారి పడడంతో నడుమ వద్ద తీవ్ర గాయం కాగా కుటుంబసభ్యులు విశాఖ కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిరణ్ కుమార్ నాయుడు తెలిపారు. -
డిప్యూటీ తహసీల్దార్గా రాంమనోహర్
బొబ్బిలి రూరల్: మండలంలోని కారాడ గ్రామానికి చెందిన పీవీఎస్ రాంమనోహర్ గ్రూప్–2 ఫలితాల్లో డిప్యూటీ తహసీల్దార్గా ఎంపికయ్యారు. రాంమనోహర్ బాడంగి ఎంఈఓగా విధులు నిర్వహిస్తున్న పి లక్ష్మణదొర కుమారుడు. ఏఎస్ఓగా రాంబాబు పాలకొండ రూరల్: మండలంలోని వాటపాగు గ్రామానికి చెందిన గొర్లె రాంబాబు గ్రూప్–2 ఫలితాల్లో ఏపీ సెక్రటేరియట్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా ఎంపికయ్యారు. రాంబాలు తల్లిదండ్రులు వ్యవసాయ కుటుంబీకులు. తన విజయంలో ఇద్దరు అన్నదమ్ములతో పాటు భార్య మహాలక్ష్మి ఎంతగానో ప్రోత్సహించినట్లు రాంబాబు తెలిపారు. -
ఎల్.కోట మండలంలో ఒకరు
లక్కవరపుకోట: మండలంలోని చందులూరు గ్రామానికి చెందిన గనివాడ సతీష్ బుధవారం విడుదలైన గ్రూప్–2 పరీక్షా ఫలితాల్లో ఎంపికయాడు. సతీష్ ఇంటర్ తరువాత బీఫామ్ చేసి ప్రస్తుతం ఒక కళాశాలలో ప్రైవేట్గా లెక్చరర్గా పనిచేస్తున్నారు. సతీష్ తండ్రి సూరిదేముడు విశ్రాంత ఉపాధ్యాయుడు. మొదటి ప్రయత్నంలోనే గ్రూప్–2కి ఎంపికై న సతీస్కు గ్రామస్తులు అభినందనలు తెలిపారు. ఏఎస్ఓగా పతివాడ మనీష్ విజయనగరం అర్బన్: ఏపీ గ్రూప్–2 పోస్టుల ఎంపికలో అరుంధతి నగర్ కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన పతివాడ మనీష్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్ఓ)గా ఎంపికయ్యారు. తండ్రి గోవిందరావు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి గృహిణి. ఏఎస్ఓగా టీచర్ ఎంపిక చీపురుపల్లిరూరల్(గరివిడి): గరివిడి మండలం కుమరాం పాలవలస గ్రామానికి చెందిన గదుల సాయమ్మ గ్రూప్ 2 ఫలితాల్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగం సాధించారు. ఆమె ప్రస్తుతం నెల్లిమర్ల మండలం పారసాం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. 17 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో అంకితభావంతో సేవలు అందిస్తున్న ఆమె ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పటికీ తన లక్ష్యాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. ఆమె భర్త గదుల వెంకటరమణ కూడా ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. డిప్యూటీ తహసీల్దార్గా జగదీశ్వర రావు రేగిడి: మండల పరిధిలోని మజ్జిరాముడుపేట గ్రామానికి చెందిన నెల్లి జగదీశ్వరరావు డిప్యూటీ తహసీల్దార్గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఆయన కాశీబుగ్గ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన తండ్రి నెల్లి సూర్యనారాయణ మెడికల్ ప్రాక్టీస్నర్. డిప్యూటీ తహసీల్దార్గా ఆదివాసీ యువకుడు భామిని: మండలంలోని మనుమకొండకు చెందిన ఆదివాసీగిరిజన యువకుడు కుంబిరిక జయప్రకాష్ గ్రూప్–2 ఫలితాల్లో డిప్యూటీ తహసీల్దార్గా ఎంపిక కావడంపై సర్వత్రా హర్షం వెల్లువెత్తుతోంది. నిరుపేద ఆదివాసీ దంపతులు కుంబిరిక రమణ, సైంబీర్ల వ్యవసాయ కూలీలు వారి తనయుడు శ్రమించి చదివి ఉద్యోగం సాధించాడు. -
ఫలించిన అధికారుల కృషి
దారులన్నీ జనసంద్రమే.. ఎటు చూసినా కనుచూపు మేర ‘శంబర’మే. చల్లని తల్లి, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి.. గిరిజనుల కొంగుబంగారం పోలమాంబ... వనాన్ని వీడి, జనంలోకి వచ్చింది. తన భక్తజనం జేజేలు చూసి మురిసింది. 30 అడుగుల సిరిమానుపై పూజారి రూపంలో ఠీవీగా ఆసీనులై, పురవీధుల్లో ఊరేగింది. చల్లని చూపుతో ఆశీర్వచనాలు అందజేసింది. ఈ అపురూప ఘట్టాన్ని కనులారా తిలకించిన భక్తకోటి ఆనందంతో పులకించిపోయింది. సాక్షి, పార్వతీపురంమన్యం/మక్కువ/పార్వతీపురం రూరల్: ఉత్తరాంధ్రుల కల్పవల్లి, చల్లనితల్లి శంబర పోలమాంబ అమ్మవారి సిరిమానోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా భక్తుల విశ్వాసం చూరగొన్న పోలమాంబను చూసి తరించడానికి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాలలతో పాటు పొరుగున్న ఉన్న ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు ఆర్టీసీ బస్సులతోపాటు, ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చారు. మక్కువ మండలం శంబర గ్రామంలో వెలసిన పోలమాంబ అమ్మవారి సిరిమానోత్సవాన్ని కనులారా తిలకించేందుకు దాదాపు రెండు లక్షల మంది భక్తులు తరలిరాగా.. భక్తులు జయజయధ్వానాల నడుమ శంబర గ్రామం పులకించింది. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో సిరిమానోత్సవాన్ని ప్రారంభించాలని భావించిన అధికారులు.. అనుకున్న సమయానికి సిరిమానోత్సవం మొదలయ్యేలా చేయలేకపోయారు. గ్రామపెద్దలు, ఆలయ కమిటీ సభ్యుల మధ్య సమన్వయం లోపించడంతో ఘటాలను తీసుకురావడంలో జాప్యమైంది. సాయంత్రం 4.20 నిమిషాలకు పూజారి జన్నిపేకాపు భాస్కరరావు అలియాస్ జగదీశ్వరరావు సిరిమానును అధిరోహించారు. దీంతో ఏటా నిర్వహించిన సమయం కంటే సుమారు గంట సమయం ఆలస్యంగా ఈ ఏడాది ఉత్సవం మొదలైంది. పురవీధుల్లో ఊరేగిన అనంతరం సాయంత్రం 6 గంటలకు ప్రధానాలయం సమీపంలోకి సిరిమాను చేరుకుంది. ముందుగా జన్నివారి ఇంటి నుంచి ఘటాలను అమ్మవారి ఆలయంలోకి తీసుకొచ్చి, పూజలు నిర్వహించారు. అనంతరం సిరిమాను ఉండే ప్రదేశానికి తీసుకువచ్చారు. ప్రధానాలయం నుంచి అమ్మవారు వచ్చే మార్గంలో నేలపై చీరలను పరిచి.. వాటిపై చిన్నారులను పడుకోబెట్టారు. వారిపై అమ్మవారి ఘటాలు దాటుతూ వెళ్లడంతో భక్తులు పులకించిపోయారు. జన్నివారి ఇంటి నుంచి అమ్మవారి ఘటాలను గిరడ వారింటికి, ఆ తర్వాత మునసబు, కరణం ఇళ్లకు తీసుకువెళ్లి పూజలు జరిపించారు. రాత్రంతా అమ్మవారి ఘటాలు గ్రామంలో తిరువీధి చేసి, బుధవారం ఉదయం 10 గంటల సమయానికి ప్రధాన రహదారి వద్ద అమ్మవారి గద్దెకు చేరుకుంటాయి. ఆ ప్రదేశంలో అమ్మవారి ఘటాలకు ఉయ్యాల కంబాల కార్యక్రమం నిర్వహించి, అనుపోత్సవంలో భాగంగా అమ్మవారి ఘటాలను వనంగుడికి తీసుకువెళ్తారు. అమ్మవారి జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ చోటుచేసుకోకుండా ఎస్పీ మాధవ్రెడ్డి పర్యవేక్షణలో 683 మంది పోలీసు సిబ్బందిని బందోబస్తుకు వినియోగించారు. రోప్ పార్టీ, స్పెషల్ పార్టీ, క్రైమ్ పార్టీలు ఎవరికి వారిగా విధులు కేటాయించారు. డ్రోన్ కెమెరాలతో పాటు.. 40 చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సిరిమాను వద్ద రోప్ పార్టీ.. భక్తుల తోపులాటలు జరగకుండా నివారించగలిగింది. పోలమాంబ అమ్మవారికి మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను సమర్పించారు. తొలుత ఆలయానికి చేరుకున్న మంత్రికి దేవస్థానం అధికారులు పూర్ణకుంభంతో స్వాగతించి, ప్రత్యేక పూజలు జరిపించారు. ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, సాలూరు మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్దేవ్, వైఎస్సార్సీపీ పార్వతీపురం, కురుపాం నియోజకవర్గ పరిశీలకులు మావుడి శ్రీనివాసరావు, సాలూరు ఏఎంసీ చైర్పర్సన్ దండి అనంతకుమారి, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి దండి శ్రీనివాసరావు, మండలాధ్యక్షుడు మావుడి రంగునాయుడు తదితరులు అమ్మవారిని దర్శించుకుని పూజలు జరిపారు. పోలమాంబకు సమర్పించేందుకు పట్టువస్త్రాలు తీసుకుని వస్తున్న మంత్రి సంధ్యారాణి సంప్రదాయం ప్రకారం ఘటాలకు పూజలుతల్లీ.. కరుణించమ్మా..గతం మాదిరిగానే ఈ ఏడాది కూడా అధికారులు సమన్వయంతో పనిచేసి క్యూలైన్లు ఏర్పాటు, బస్సుల రాకపోకలు, ట్రాఫిక్ మళ్లింపు వంటి చర్యలు పక్కాగా అమలు చేశారు. ఉదయం 9.30 గంటల తర్వాత భక్తులు అధిక సంఖ్యలో రావడంతో క్యూలైన్లు సరిపడక భక్తులు ఎండలో బారులు తీరడం కనిపించింది. భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుందని అధికారులు ముందే ఊహించి, తగిన సౌకర్యాలు కల్పించడంలో అధికారులు సఫలీకతమయ్యారు. మొత్తంగా 220 వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసింది. బస్సులన్నీ కిక్కిరిసిపోయాయి. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి, ఎస్పీ ఎస్.వి.మాధవ్రెడ్డి, అడిషనల్ ఎస్పీ ఎం.వెంకటేశ్వరావు, సబ్కలెక్టర్లు ఆర్.వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్, ఏఎస్పీ వి.మనీషారెడ్డి ఆద్యంతం పర్యవేక్షిస్తూ అధికారులకు తగు సూచనలు చేశారు. క్యూలైన్లకు సమీపంలో తలనీలాలు సమర్పించే శిబిరం, అక్కడకు కొద్దిదూరంలోనే కోళ్లు, గొర్రెలు మొక్కులు తీర్చుకొనే ప్రదేశాన్ని కేటాయించారు. పులకించిన భక్త జనం ఉత్సవాన్ని తిలకించడానికి రాష్ట్రంలోని నలుమూలలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గతేడాది కంటే.. ఈ సారి అధికారుల అంచనాలను మించి భక్తుల తాకిడి పెరిగింది. 10 వారాల వరకు అమ్మవారి జాతర జరగనున్నప్పటికీ.. ఉచిత బస్సు కారణంతో తొలివారం బాగా భక్తుల రద్దీ పెరిగింది. తెల్లవారు జాము నుంచి ఉదయం 9.30 గంటల వరకు భక్తుల తాకిడి తక్కువగా కనిపించింది. తర్వాత ఇతర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో శంబర గ్రామం కిటకిటలాడింది. గ్రామంలోని రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. ఇసుక వేస్తే రాలనంతగా జనసంద్రం కనిపించింది. పటిష్ట పోలీసు బందోబస్తు అంబరాన్నంటిన..సిరిమాను శంబరం గంట ఆలస్యంగా ప్రారంభమైన సిరిమానోత్సవం కనుల పండువగా పోలమాంబ సిరిమానోత్సవం శంబర జాతరకు తరలివచ్చిన లక్షలాది మంది భక్తజనం అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి సంధ్యారాణి శంబరలో సిరిమాను తిరువీధి (ఇన్సెట్లో) సిరిమాను అధిరోహించిన పూజారి భాస్కరరావు -
రహదారి భద్రత నియమాలు పాటించండి
విజయనగరం క్రైమ్: ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని ఎస్పీ దామోదర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విజయనగరంలోని రింగ్ రోడ్లో గల పీఎస్ఆర్ స్కూల్లోని యోగా సెంటర్లో యోగా భారత్ అధ్వర్యంలో మంగళవారం జరిగిన అవగాహన కార్యక్రమానికి ఎస్పీ ఏఆర్.దామోదర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న ఆందోళన, మానసిక ఒత్తిడి మధ్య ధ్యానం ఒక శక్తివంతమైన సాధనంగా నిలుస్తుందన్నారు. నిత్యం చేస్తున్న యోగా ద్వారా ఏకాగ్రత పెరుగుతుందని, భావోద్వేగం సమతుల్యమై, ఆరోగ్యకరమైన జీవన విధానం అలవడుతుందన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు అందరికీ ధ్యానం సమానంగా ఉపయోగకరమని ఎస్పీ తెలిపారు. ప్రతి ఒక్కరూ రోజూ కొంత సమయం ధ్యానానికి కేటాయించి, శాంతియుతమైన, ఆరోగ్యకరమైన జీవనాన్ని అలవరుచుకోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ముఖ్యంగా మహిళలు, రిటైర్ అయిన వారిని, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని కొంతమంది సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కాల్స్ చేసి డిజిటల్ అరెస్టు చేస్తున్నామని చేసే బెదింరింపు కాల్స్ కు భయపడవద్దన్నారు. ఇటువంటి నేరగాళ్లు చెప్పే మాయమాటలు నమ్మవద్దని, ఎవరైనా ఈ తరహాలో ఫోన్ చేస్తే సమాచారాన్ని డయల్ 100/112 లేదా 1930కు అందించాలని సూచించారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా ఎస్పీ పోస్టర్ను ఆవిష్కరించి, అందరితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో యోగా టీచర్ ఎస్.వి.కృష్ణారెడ్డి, జాతీయ స్వచ్ఛ భారత్ అవార్డు గ్రహీత ఎం.రామ్మోహన్, ఉపాధ్యాయులు రవి, సత్యనారాయణ, జేఎన్టీయూ ప్రిన్సిపాల్ రాజేశ్వరరావు, డాక్టర్ రమణ గార్లు, విజయనగరం టూటౌన్ సీఐ టి.శ్రీనివాసరావు, ట్రాఫిక్ సీఐ సీహెచ్.సురినాయుడు పాల్గొన్నారు. -
ఉపాధి హామీపై దాడి
● దశల వారీ పోరాటాలకు సీపీఎం పిలుపు విజయనగరం గంటస్తంభం: ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా దశల వారీ పోరాటాలు చేపడుతున్నామని సీపీఎం జిల్లా కార్యదర్మి తమ్మినేని సూర్యనారాయణ తెలిపారు. ఈ మేరకు మంగళవారం స్థానిక ఎల్బీజీ భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో పోరాటాల షెడ్యూల్ను విడుదల చేశారు. వామపక్షాల పోరాట ఫలితంగా ఏర్పడిన ఉపాధి హామీ చట్టాన్ని మోదీ ప్రభుత్వం పథకంగా మార్చి కోట్లాది మంది కూలీల ఉపాధిని దెబ్బతీస్తోందని ఆయన విమర్శించారు. గ్రామాల్లో సర్వేలకు వెళ్లే సిబ్బందిని ప్రజలే నిలదీస్తున్న పరిస్థితి నెలకొందన్నారు. ఈనెల 30న గాంధీ విగ్రహాల వద్ద ప్రతిజ్ఞ కార్యక్రమాలు, ఫిబ్రవరి 2న సచివాలయాల వద్ద నిరసనలు, వినతులు, 5న మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే మార్చిలో చలో లోక్ భవన్ చేపడతామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా ఉపాధి హామీ వంటి ప్రజల సమస్యలను విస్మరించి సీఎం దావోస్ వెళ్లడంపై తమ్మినేని ప్రశ్నించారు. నిజంగా పెట్టుబడులు రావాలంటే ప్రజలకు పనికల్పించి వారి ఆదాయాలు పెంచాలన్నారు. -
వైభవంగా ఉమాసదాశివుని కల్యాణం
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానం క్షేత్ర పాలకుడిగా విరాజిల్లుతున్న ఉమా సదాశివ స్వామి ఆలయంలో శివ పార్వతుల వార్షిక కల్యాణం మంగళవారం రాత్రి వైభవంగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకుడు రేజేటి మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగాయి. ముందుగా గణపతి ఆరాధన అనంతరం, ఉమా సదాశివస్వామికి ప్రత్యేక అభిషేకాలు జరిపించారు. వివిధ రకాల పుష్ఫాలు, స్వర్ణాభరణాలతో స్వామివారి ఉత్సవ విగ్రహాలను సుందరంగా అలంకరించి మంగళవాయిద్యాల నడుమ గ్రామ పుర వీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయానికి తీసుకువచ్చి వేద మంత్రోచ్చారణ నడుమ శివ పార్వతుల కల్యాణాన్ని కనుల పండువగా జరిపించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఈఓ వై శ్రీనివాసరావు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
ప్రజల్లోకి టీడీపీ వైఫల్యాలు
చీపురుపల్లిరూరల్(గరివిడి): ఎన్నికల సమయంలో హామీలిచ్చి..అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న టీడీపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు గరివిడిలో గల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామస్థాయి రాజకీయ పరిణామాలు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు వారి కష్టాలను తెలుసుకోవాలనే ఆలోచనతో గ్రామస్థాయిలో కమిటీలను సమర్థవంతంగా ఏర్పాటు చేయాలనేదే జగన్మోహన్రెడ్డి ఆలోచన అన్నారు. ఇందులో భాగంగానే ప్రతి నియోజకవర్గం స్థాయిలో సమావేశాలు జరుగుతాయని, ముందుగా చీపురుపల్లి నియోజకవర్గ స్థాయిలో సమావేశం ఏర్పాటు చేశామని, సమర్థవంతంగా గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేసి అన్ని నియోజకవర్గాలకు ఆదర్శంగా నిలవాలని కోరారు. నియోజకవర్గంలో 27 క్లస్టర్లు ఏర్పాటు చేశామని, వీరితో పాటు రెండు గ్రామాలకు ఇద్దరు చొప్పున 69 మంది క్లస్టర్ ఇన్చార్జ్లు ఉంటారని, వారంతా ముందుండి పార్టీని నడిపిస్తారన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక తోటపల్లి సాగునీరు వస్తోందా? లేదా? అని ప్రశ్నించగా ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా ఉన్నందున నీరు వచ్చిందని, సాధారణంగా తోటపల్లి సాగునీరు వచ్చే పరిస్థితి లేదని నాయకులు ఆయనకు తెలియజేయగా ఇలాంటి సమస్యలపై రైతులతో మాట్లాడాలని సూచించారు. విద్యార్థులకు ఫీజు రియింబర్స్మెంట్ ఇవ్వకుండా మోసం చేస్తున్నారనే విషయం అందరీకి తెలిసిందేనన్నారు. గ్రామంలోకి వెళ్లినప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి ఫీజు రియింబర్స్ మెంట్ ప్రభుత్వం ఇస్తోందా? లేదా అని అడిగి తెలుసుకోవాలి. అదే విధంగా ఉపాధి హామీ పథకం పనులు జరుగుతున్నాయా? ఉపాధి బిల్లులు వస్తున్నాయా? లేదా? ఇలా అన్ని సమస్యలపై స్థానిక ప్రజలతో మాట్లాడాలని సూచించారు. ప్రజల మేలు కోసం వైఎస్సార్సీపీ తరఫున ప్రజల సమస్యలను ప్రశ్నిస్తేనే మంచి జరుగుతుందన్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న మంచి కార్యక్రమాలతో మళ్లీ అధికారంలోకి వస్తామనే నమ్మకం జగన్మోహన్రెడ్డిలో ఉందని, తప్పనిసరిగా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. గ్రామ స్థాయి కమిటీల నియామకం సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీ దిశానిర్దేశం మేరకు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోనే క్లస్టర్ ఏర్పాటు, గ్రామస్థాయి కమిటీల నియామకం జరుగుతోందన్నారు. గ్రామస్థాయిలో అన్ని విభాగాల వారీగా కమిటీల నియామకం కావాలన్నారు. మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ పార్టీలో ఉత్సాహంగా ఉన్న వారిని ఎంపిక చేసి ప్రాధాన్యం కల్పిస్తే పార్టీ మరింత పటిష్టంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువ నాయకురాలు బొత్స అనూష, వైఎస్సార్సీపీ గరివిడి మండల అధ్యక్షుడు మీసాల విశ్వేశ్వరరావు, జెడ్పీటీసీ వాకాడ శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ కొణిశ కృష్ణంనాయుడు, వైఎస్సార్సీపీ చీపురుపల్లి మండల అధ్యక్షుడు మీసాల వరహాల నాయుడు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పిలి అనంతం, జిల్లా ప్రచారవిబాగం అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనువాసులు నాయుడు, యువజన విభాగం అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ, మెరకముడిదాం మండల నాయకులు డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎస్వీ.రమణరాజు, పార్టీ మండల అధ్యక్షుడు తాడ్డి వేణు, మాజీ జెడ్పీటీసీ కోట్ల విశ్వేశ్వరరావు, గుర్ల మండల నాయకుడు, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కేవీ సూర్యనారాయణరాజు, జెడ్పీటీసీ సీర అప్పలనాయుడు, పార్టీ మండల అధ్యక్షుడు పొట్నూరు సన్యాసినాయుడు, నాలుగు మండలాల పీఏసీఎస్ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. సమర్థంగా గ్రామస్థాయి కమిటీల నిర్వహణ గ్రామస్థాయిలోనే ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలకు ప్రశ్నలు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గరివిడిలో వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశం -
తప్పులు లేని పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీకి శ్రీకారం
● భూ సమస్యల పరిష్కారానికి జిల్లాలో స్పెషల్ డ్రైవ్విజయనగరం అర్బన్: జిల్లాలో భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంతవరకు నిర్వహించిన భూ రీ–సర్వేలో వచ్చిన తప్పులను సరిదిద్దడం, తప్పులు లేని రెవెన్యూ రికార్డులను రూపొందించడం, అర్హులైన రైతులందరికీ కచ్చితమైన పట్టాదారు పాస్పుస్తకాలను పంపిణీ చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మంగళవారం విజయనగరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, సర్వేయర్లు, వీఆర్ఓలు, గ్రామ సర్వేయర్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి యజమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అత్యంత పారదర్శకంగా తప్పులు లేని రెవెన్యూ రికార్డులను రూపొందించాలని సిబ్బందిని ఆదేశించారు. రికార్డులను జిల్లా స్థాయిలో సరిదిద్దుకునే అవకాశం ప్రభుత్వం ఇచ్చిందని, దాన్ని సద్వినియోగం చేసుకుని కచ్చితమైన వివరాలతో రికార్డులను తయారు చేయాలని సూచించారు. రీ సర్వే పూర్తయిన భూముల సంబంధిత రికార్డులను అప్డేట్ చేసి అర్హులైన రైతులందరికీ పట్టాదారు పాస్పుస్తకాలను పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో రీ సర్వే పూర్తయిన 432 గ్రామాల్లో సుమారు 2.03 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయాల్సి ఉందన్నారు. ప్రతి నెల 2 నుంచి 9వ తేదీ వరకు పాస్ పుస్తకాల పంపిణీ జరుగుతుందని, నెలవారీ లక్ష్యాలు కేటాయించినట్లు తెలిపారు. ఈ నెలకు 12 గ్రామాల్లో 7,993 ఖాతాలను పరిశీలించాల్సి ఉందని ఏప్రిల్ నెలకు 14 గ్రామాలు ఎంపిక చేశామని చెప్పారు. రెవెన్యూ క్లినిక్లకు పదే పదే వినతులు వస్తున్నాయని వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్, డీఆర్ఓ ఈ.మురళి, ఆర్డఓ దాట్ల కీర్తి, సర్వే శాఖ ఎ.డి విజయకుమార్, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసులు, ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
ఉత్తమ ఫలితాలు సాధించాలి
● డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకులాల రాష్ట్ర అదనపు కార్యదర్శి వంగర: పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకులాల రాష్ట్ర అదనపు కార్యదర్శి సునీల్ రాజ్కుమార్ అన్నారు. వంగర మండలం మడ్డువలసలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ బాలికల గురుకులాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు, సిబ్బంది పనితీరు, డార్మిటరీ, తరగతి గదులు, డైనింగ్హాల్ పరిశీలించారు. వంటశాల, కూరగాయల నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థినులతో కలిసి భోజ నం చేశారు. అనంతరం సిబ్బందితో నిర్వ హించిన సమావేశంలో మాట్లాడారు. విద్యా ర్థినులు విద్యపై ప్రత్యేక దృష్టిసారించాలని తెలిపారు. ప్రత్యేక తరగతుల నిర్వహణతో పాటు, చదువులో వెనుకబడిన విద్యార్థినులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. రానున్న పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు తగిన తర్ఫీదునివ్వాలని సూచించారు. చదువులో రాణిస్తున్నవారిని మరింత ప్రోత్సహించాలన్నారు. సులభ పద్ధతుల్లో బోధన సాగించాలని సూచించారు. బాలికల ఆరోగ్యం, భద్రత, పరిశుభ్రత వంటి అంశాలపై ప్రత్యేక బాధ్యత తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జంపా రాధిక, ఉపాధ్యాయినులు, అధ్యాపకులు, గురుకులం సిబ్బంది పాల్గొన్నారు. -
మార్కెట్ భూమ్
● ఫిబ్రవరి 1 నుంచి పొలాలకు కొత్త ధర ● గెజిట్ విడుదల చేసిన ప్రభుత్వం ● ప్రాంతాన్ని బట్టి మారనున్న రేట్లు వీరఘట్టం/పాలకొండ: భూముల మార్కెట్ విలువ పెంపునకు రిజిస్టేషన్ శాఖ ప్రతిపాదనలు సిధ్ధం చేస్తోంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా పాలకొండ సబ్రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని ఎల్.ఎన్.పేట, బూర్జ, రేగిడి, సంతకవిటి, పాలకొండ, వీరఘట్టం, భామిని మండలాలు ఉన్నాయి.ఈ ఏడు మండలాలకు సంబంధించి 350 రెవెన్యూ గ్రామాలున్నాయి.ఈ గ్రామాల్లో సుమారు 20 శాతం వరకు భూముల మార్కెట్ విలువ పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నూతనంగా సవరించనున్న మార్కెట్ విలువ ప్రకారం పాలకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో రూ.35 కోట్ల వరకు అదనంగా ఆదాయం పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతిపాదన ఇలా.. ప్రస్తుతం పాలకొండ నగర పంచాయతీలో ఎకరా భూమి మార్కెట్ ధర రూ.17 లక్షలు ఉంది. కొత్త నిబంధనల ప్రకారం 20 శాతం పెరుగుతుంది. అంటే ఎకరాకు అదనంగా రూ.3.40 లక్షలు పెరుగుతుంది. ఈ మేరకు ఫిబ్రవరి 1 నుంచి పాలకొండ నగర పంచాయతీలో భూమి ఎకరా మార్కెట్ ధర 20.40 లక్షలకు పెరిగే అవకాశం ఉంది. ఇలా అన్ని మండలాల్లో ఉన్న భూముల మార్కెట్ ధరలు ప్రభుత్వ లెక్కల ప్రకారం పెరగనున్నాయి.అయితే ప్రాంతాన్ని బట్టి ఈ భూముల మార్కెట్ ధరలు మారుతాయి. పెరగనున్న రిజిస్ట్రేషన్ చార్జీలు.. ప్రస్తుతం భూముల రిజిస్ట్రేషన్కు భూమి ధరలో 7.5 శాతం వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు భూమి ధర రూ.1 లక్ష ఉంటే 7.5 శాతం రిజిస్ట్రేషన్ అంటే రూ.7,500లు చెల్లించాలి. ఫిబ్రవరి 1 నుంచి 20 శాతం భూమి ధర పెరుగుతుంది.అంటే మార్కెట్ ధర రూ.1.20 లక్షలు అవుతుంది. దీనికి 7.5 శాత రిజిస్ట్రేషన్ చార్జీలు అంటే రూ.9వేలు చెల్లించాలి. అదనంగా మరో రూ.1500 రిజిస్ట్రేషన్ చార్జీ భారం ప్రజలపై పడనుంది.భూముల ధరలు పెంచేసి రిజిస్ట్రేషన్ ఫీజుల భారం ప్రజలపై మోపేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. సవరణ పనులిలా.. భూముల మార్కెట్ ధరలు పెంచేందుకు ఈ నెల 23న మార్కెట్ విలువల సవరణ నమూనాను నోటీసు బోర్డులో ప్రదర్శించారు.ఈనెల 24న సంబఽంధిత కమిటీల ద్వారా తాత్కాలిక అనుమతులు, 25న వెబ్సైట్లో డేటా ప్రదర్శించారు. ఈనెల 27 వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు,సూచనలు కోరడం, 29న డేటా ఎంట్రీ పూర్తి, చెక్ లిస్ట్ జనరేషన్, ఫారం–1, 4 పరిశీలన, 30న అభ్యంతరాల పరిష్కారం, 31న మార్కెట్ విలువల సవరణ కమిటీల ద్వారా తుది అనుమతులు, పిబ్రవరి 1న పెరిగిన విలువ అమల్లోకి తీసుకురానున్నట్లు సబ్రిజిస్ట్రార్ కార్యాలయం పేర్కొంది.ప్రణాళిక సిధ్ధంభూముల మార్కెట్ విలువలను సవరించి వచ్చే నెల 1 నుంచి అమలు చేస్తారు. దీనిపై ఇప్పటికే సవరణకు సంబంధించి ప్రక్రియ చేపట్టాం.మా కార్యాలయం పరిధిలోని మండలాలు, గ్రామాలు, రుడా పరిధిలో ఉన్న దృష్ట్యా అక్కడ కూడా భూముల మార్కెట్ విలువ పెరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్కరు గమనించాలి.దీనికి సంబంధించిన ప్రణాళిక సిధ్ధం చేశాం. కె.శ్రీరామమూర్తి, సబ్ రిజిస్ట్రార్, పాలకొండ -
పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునుంచి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్, నేతేటి ప్రశాంత్లు అమ్మవారికి కుంకుమార్చన జరిపించారు. మూడులాంతర్లు వద్దనున్న బాలాలయంలోను, రైల్వేస్టేషన్ వద్దనున్న వనంగుడిలో అమ్మవారికి మహిళలు పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. కార్యక్రమాలను ఆలయ ఈఓ కె.శిరీష పర్యవేక్షించారు.మధ్యవర్తిత్వంతో కేసుల పరిష్కారం సులభం● జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత విజయనగరం లీగల్: మధ్యవర్తిత్వంలోని మెలకువలను నేర్చుకోవడం ద్వారా కేసులను చాలా సులభంగా పరిష్కరించవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత అన్నారు. 40 గంటల మీడియేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా మొదటి రోజు శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం కేసుల పరిష్కారానికి ఉపయోగపడుతుందని, వ్యాజ్యాలను మానవతా దృక్పథంతో పరిశీలించి ఉభయ పార్టీల ద్వారానే పరిష్కారం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న ఉమ్మడి జిల్లా న్యాయవాదులను శిక్షణ కార్యక్రమం గురించి అడిగి తెలుసుకున్నారు. శిక్షణను అందిస్తున్న మాస్టర్ ట్రైనీస్తో మాట్లాడి కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణ ప్రసాద్, ట్రైనీ మీడియేటర్స్ పాల్గొన్నారు. రైతన్నకు యూరియా కష్టాలువంగర: మండల పరిధి అరసాడ మన గ్రోమోర్ సెంటర్లో యూరియా కోసం రైతులు మంగళవారం బారులు తీరారు. ఈ సెంటర్కు 12టన్నుల (266 బస్తాలు) యూరియా మంజూరైంది. రెండు రోజుల పాటు అరసాడ, బాగెంపేట, నీలయ్యవలస గ్రామాలతో పాటు రేగిడి మండలంలోని ఉణుకూరు, ఒప్పంగి, కోడిశ, కొండవలస గ్రామాల్లోని రైతులకు ఒక పాస్పుస్తకానికి ఒక యూరియా బస్తా చొప్పున మండల వ్యవసాయాధికారులు రెండు రోజులుగా టోకెన్లు జారీ చేశారు. అయితే వచ్చిన యూరియా తక్కువ కావడం, డిమాండ్ ఎక్కువ ఉండడంతో ఆయా గ్రామాల అన్నదాతలు మన గ్రోమోర్ సెంటర్ వద్ద క్యూ కట్టారు. వెయ్యి బస్తాల యూరియా డిమాండ్ ఉన్నప్పటికీ 266 బస్తాలు మంజూరు చేయడం పట్ల రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం యూరియా సమస్య పట్ల నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఏవో తట్టికోట కన్నబాబు వద్ద సాక్షి వివరణ కోరగా అవసరం మేరకు యూరియాను తెప్పించి సరఫరా చేస్తామని వెల్లడించారు. -
వారానికి ఐదు పని దినాలు అమలు చేయాలి
● బ్యాంకు ఉద్యోగుల డిమాండ్ ● జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీవిజయనగరం అర్బన్: ఇండియన్ బ్యాంకింగ్ పరిశ్రమలో వారానికి ఐదు పనిదినాల విధానాన్ని అమలు చేయాలని, ప్రస్తుతం బ్యాంకులకు సెలవులుగా ఉన్న రెండవ, నాల్గవ శనివారాలతో పాటు అన్ని శనివారాలను సెలవులుగా ప్రకటించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని బ్యాంకు ఉద్యోగులు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా మంగళవారం చేపట్టిన ఒకరోజు సమ్మెలో భాగంగా జిల్లాలోని 400కు పైగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల సిబ్బంది పట్టణంలోని కోట వద్ద ఎస్బీఐ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం కోట జంక్షన్ నుంచి మూడులాంతర్ల కూడలి, గంటస్తంభం జంక్షన్ మీదుగా ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ కూడలి వరకు భారీ ల్యారీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ (ఐబీఏ) సిఫార్సుల ఆధారంగా ఐబీఏ–యూఎఫ్బీయూ మధ్య 2023 డిసెంబర్ 2న కుదిరిన అవగాహన ఒప్పందం, 2024 మార్చి 8న కుదిరిన సెటిల్మెంట్/జాయింట్ నోట్ ప్రకారం ఈ డిమాండ్ అమలు చేయాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఆర్బీఐ, సెబీ, ఎల్ఐసీ, ఐఆర్డీఏ తో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో వారానికి ఐదు పని దినాల విధానం అమలులో ఉందని అదే విధానాన్ని బ్యాంకింగ్ రంగంలో కూడా అమలు చేయాలని కోరారు. స్తంభించిన రూ.500కోట్ల లావాదేవీలు సమ్మె కారణంగా జిల్లా వ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు స్తంభించాయి. జిల్లాలోని 400కు పైగా ఉన్న పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ల కార్యాలయాలలో దాదాపు 3 వేల మంది ఉద్యోగులు విధులు నిర్వహించకపోవడం వల్ల దాదాపు రూ.500 కోట్ల లావాదేవీలు జరగలేదని ఆయా బ్యాంకింగ్ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో యూఎఫ్బీఐ కన్వీనర్ మురళీశ్రీనివాస్, ప్రాంతీయ కార్యదర్శి (ఎస్బీఐఎస్యూఏసీ, ఎన్సీబీఈ) ఎం.రమేష్కుమార్, జిల్లా బ్యాంక్స్ కో ఆర్డినేషన్ కమిటీ ప్రతినిధి బి.ప్రసాద్, ఎస్బీఐఓఏ విజయనగరం రీజియన్కు చెందిన డి.మృదుల, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ పెన్షన్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ అరసాడ వెంకటరావు, జాయింట్ సెక్రటరీ కొండపల్లి సురేష్, యూవీమురళీవెంకట కృష్ణ, కొప్పిలి వెంకట శ్రీనివాసరావుతోపాటు వివిధ బ్యాంక్ల సిబ్బంది ఐవీరమణమూర్తి, శ్రావణ్, భానోజీ, చంద్రశేఖర్, సంతోష్, బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు.


