breaking news
Vizianagaram District Latest News
-
పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయండి
● జేసీ ఎస్.సేతుమాధవన్ విజయనగరం అర్బన్: ‘గుడ్ ఫర్ ప్రింటింగ్’ దశకు చేరిన పాస్ పుస్తకాలను సిద్ధం చేసి, జూలై నెలలో లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని జేసీ ఎస్.సుతుమాధవన్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, భూముల రీసర్వే, మ్యుటేషన్ దరఖాస్తుల పరిష్కారంపై రెవెన్యూ అధికారులతో కలెక్టరేట్ సమావేశమందిరంలో మంగళవారం సమీక్షించారు. వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు భూసేకరణ, రికార్డుల ధ్రువీకరణ ప్రగతపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లా పట్టా దారు పాస్ పుస్తకాల ముద్రణ, పంపిణీ, ఈకేవైసీ కార్యక్రమాల పురోగతిపై సంతృప్తి వ్యక్తంచేశారు. భూ రికార్డుల మార్పులు, వారసత్వ బదిలీలు, కొనుగోలు, విక్రయాలకు సంబంధించిన మ్యుటేషన్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డీఓలు సుధాసాగర్, సుధారాణి, సర్వే ఏడీ విజయకుమార్, వర్చువల్ విధానంలో తహసీల్దార్లు హాజరయ్యారు. రేపు డీఆర్సీ విజయనగరం అర్బన్: రాష్ట్ర హోం మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన ఈ నెల 2న జిల్లా సమీక్షా కమిటీ (డీఆర్సీ) సమావేశం జరగనుందని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరుగుతుందన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్తోపాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారన్నారు. జిల్లాలో ప్రస్తుతం కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చిస్తారన్నారు. -
లారీ, కారు ఢీకొని వ్యక్తి మృతి
పూసపాటిరేగ: మండలంలోని సీహెచ్ అగ్రహారం సమీపంలో ఆగి ఉన్న లారీని కారు బలంగా ఢీకొట్టడంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. విశాఖలోని మధురవాడకు చెందిన బాడితమాని ఉమామహేశ్వర్రావు శ్రీకాకుళంలో బంధువుల ఇంట్లో జరుగుతున్న శుభకార్యానికి మంగళవారం మధ్యాహ్నం కారులో వెళ్లి తిరుగుప్రయాణంలో వస్తుండగా ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఉమామహేశ్వర్రావుకు భార్య మాధురి ఉంది. ఓ ప్రైవేట్ మెడికల్ ఏజెన్సీలో ఉమామహేశ్వర్రావు పని చేస్తున్నాడు. కారు ముందుభాగం లారీలో ఇరుక్కోవడంతో కారు నుంచి మృతదేహాన్ని అతికష్టం మీద పోలీసులు బయటకు తీశారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. -
ఉమ్మడి విజయనగరం జిల్లాలోని మామిడి రైతులకు ఇది చేదువార్త. వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ఏర్పాటుచేసిన మామిడి మార్కెట్ యార్డును చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు సంస్థకు లీజుకిచ్చేసింది. రైతుల మేలును మరచి మార్కెట్యార్డును ప్రైవేటు సంస్థకు కట్టబెట్టడంపై ఆందోళన వ్
ఇది దుర్మార్గం మామిడి ఎగుమతుల కోసం ఏర్పాటు చేసిన మార్కెట్ యార్డును ఇతర అవసరాలకు మార్చడం దుర్మార్గం. మామిడి ఎగుమతులు పెంచడానికి అవసరమైన చర్యలు చేపట్టాలి. అదనంగా గోదాములు, కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు ఏర్పాటు చేయాలి. – బుద్దరాజు రాంబాబు, జిల్లా రైతు సంఘం కార్యదర్శి ప్రభుత్వాస్తులను ప్రైవేటుకు కట్టబెట్టడం దారుణం ప్రైవేటు సంస్థలకు మేలు చేకూర్చే విధంగా చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ భూమిని రైతులు సంక్షేమానికి ఉపయోగించాలి కానీ, ప్రైవేటు సంస్థలకు అప్పగించడం ఎంతవరకు సమంజసం. – కె.శ్రీనివాస్, రైతు సంఘం నాయకుడు, గంట్యాడ జీఓ విడుదలైంది వీటీ ఆగ్రహారం–చిల్లపేటరోడ్డులో ఉన్న మామిడి మార్కెట్ యార్డులో ఒక గోదామును, 6.72 ఎకరాల భూమిని యసశ్రీ విరోహా ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అప్పగించినట్టు జీఓ విడుదలైనట్టు తెలిసింది. ఉన్నతాధికారులు ఇంకా సమాచారం ఇవ్వలేదు. – బి.రవికిరణ్, ఏడీ, మార్కెటింగ్శాఖవిజయనగరం ఫోర్ట్: విజయనగరం పట్టణంలోని వి.టి.ఆగ్రహారం–చిల్లపేట రోడ్డులో మామిడి మార్కెట్ యార్డు ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో రైతులకు మేలుచేసేలా మార్కెట్యార్డును నిర్మించారు. ఇప్పుడు ఇందులో 8,648.23 చదరపు అడుగులు గల గోదాముతో పాటు 6.72 ఎకరాల ఖాళీ భూమిని విశాఖపట్నానికి చెందిన యశశ్రీ విరోహా ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు లీజుకిస్తూ చంద్రబాబు ప్రభుత్వం జీఓ నంబర్ 576ను జారీ చేసింది. విషయం తెలిసిన రైతులు మండిపడుతున్నారు. మామిడి మార్కెట్ యార్డు వద్ద ఎకరం భూమి ధర సుమారుగా రూ.20 కోట్ల నుంచి రూ.22 కోట్ల మధ్య పలుకుతోంది. 6.72 ఎకరాల భూమి విలువ సుమారుగా రూ.130 కోట్ల పైబడి ఉంటుంది. గోదాం విలువ సుమారుగా రూ.20 కోట్ల వరకు ఉంటుంది. మొత్తంగా రూ.150 కోట్ల విలువైన ఆస్తిని నెలకు రూ.5.51 లక్షలకు (6.72 ఎకరాల భూమికి నెలకు రూ.5.04 లక్షలు, గోదాముకు రూ.47,565లు) లీజుకు కట్టబెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం రెండేళ్ల గడువుతో లీజు ఒప్పందం కుదిరినా క్రమేణా లీజు గడువు పొడిగిస్తారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ స్థలం కాస్తా ప్రైవేటు సంస్థ చేతుల్లోకి వెళ్లిపోతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రైతుల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ స్థలాన్ని వినియోగించకుండా ప్రైవేటు సంస్థకు అప్పగించడంపై ఆందోళన, అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గోదాములు లేక ఇబ్బందులు పడుతున్నా.. జిల్లా రైతులు వరి, మొక్కజొన్న, పత్తి వంటి పంటలను ఎక్కువగా సాగుచేస్తారు. వరి పంట ఖరీఫ్లో లక్ష హెక్టార్లలోను, మొక్కజొన్న 18 వేలు హెక్టార్లు, పత్తి 6 వేల హెక్టార్లలో సాగవుతోంది. మొక్కజొన్న గింజలను నిల్వ చేసుకోవడానికి గోదాములు లేక రైతులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రాని సమయంలో పంటను నిల్వ చేసేందుకు వసతులు లేక అతి తక్కువ ధరకు దళారులకు విక్రయిస్తున్నారు. పత్తి రైతులదీ అదే పరిస్థితి. మద్దతు ధర లేనప్పుడు నిల్వచేసుకోలేని దుస్థితి. టీడీపీ సర్కార్ రైతులకు ఉపయోగపడే గోదాములు, కోల్డ్ స్టోరేజ్లు వంటివి నిర్మిస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఆ దిశగా ఆలోచన చేయకుండా ఉన్న గోదాములు, మార్కెట్ యార్డులను లీజుకు ఇచ్చేస్తుండడంపై రైతులు మండిపడుతున్నారు. వైఎస్సార్ హయాంలో మార్కెట్ యార్డు ఏర్పాటు జిల్లా రైతుల మామిడి, జీడి మామిడి, అరటి, బొప్పాయి పంటలు విస్తారంగా సాగుచేస్తారు. ముఖ్యంగా మామిడి 45 వేల హెక్టార్లలో సాగవుతోంది. ఏటా జిల్లా నుంచి కోల్కతా, చైన్నె, ముంబయి, ఢిల్లీ, ఒడిశా వంటి ప్రాంతాలకు మామిడి ఉత్పత్తులను ఎగుమతిచేస్తారు. ఈ నేపథ్యంలో రైల్వే ట్రాక్కు అనుకుని ఉన్న స్థలంలో అప్పటి సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి మామిడి మార్కెట్ యార్డు ఏర్పాటు చేశారు. రైతులకు మేలుచేయాలన్న గొప్ప సంకల్పంతో మార్కెట్ యార్డును రైతులకు అందుబాటులోకి తెచ్చారు. దీనిని టీడీపీ ప్రభుత్వం లీజు పేరిట ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడంపై రైతాంగం ఆందోళన చెందుతోంది. టీడీపీ సర్కార్ తీరుపై మామిడి రైతుల ఆగ్రహం రూ.150 కోట్లు విలువైన మార్కెట్ యార్డు స్థలాన్ని ప్రైవేటు సంస్థకు అప్పగింత గోదామునూ లీజుపేరిట కట్టబెట్టిన వైనం ప్రైవేటు సంస్థలపై ఉన్న ప్రేమ రైతులపై లేదనే విమర్శలు కొత్త గోదాములు నిర్మించకుండా ఉన్నవి లీజుకు ఇవ్వడంపై ఆందోళన -
గడ్డి మందు తాగి రైతు ఆత్మహత్య
రామభద్రపురం: మండలంలోని ఆరికతోటలో గడ్డి మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కోట వెంకట్రావు (40)కు రోజూ మద్యం తాగే అలవాటు ఉంది. మూడు రోజుల నుంచి విపరీతంగా మద్యం తాగుతూ భార్యాపిల్లలను పట్టించుకోకపోవడంతో భార్య పార్వతి మందలించింది. దీంతో 29వ తేదీ మధ్యాహ్నం పొలంపనికి వెళ్లి వస్తానని భార్యకు చెప్పి పొలంలొకి వెళ్లాడు. కొద్ది సేపటి తర్వాత భార్య కూడా పొలానికి వెళ్లింది.అప్పటికే పురుగు మందు తాగిన వెంకట్రావు వాంతులు చేసుకుంటున్నాడు. అలాగే నోటి ద్వారా నురగలు వస్తున్నాయి. ఏమైందని భార్య అడగగా గడ్డి మందు తాగానని చెప్పాడు. వెంటనే భార్య పార్వతి, మరిదితో కలిసి ప్రథమ చికిత్స నిమిత్తం బాడంగి సీహెచ్సీకి తరలించారు. ఆరోగ్యం విషమించడంతో విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు హెచ్సీ నరసింహమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళ ఆత్మహత్య? సాలూరు రూరల్: మండలంలోని తోణాం గ్రామానికి చెందిన మహిళ మామిడి హయిజమ్మ (40) మంగళవారం తెల్లవారు జామున ఆమె నివాసం ఉంటున్న ఇంట్లో అనుమానాస్పద స్థితిలో శ్లాబ్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని రూరల్ ఎస్సై రవీంద్ర తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఆమె పెళ్లి అయి విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటోంది. తల్లిదండ్రులు చెప్పిన ప్రకారం ఆమె సోమవారం సాలూరు పట్టణానికి వెళ్లి వచ్చిన తరువాత 9 గంటల వరకు వారితో కలిసి ఉంది. తెల్లవారు జామున చూసేసరికి తాడుకు వేలాడుతూ కనిపించడంతో పోలీసులకు అందిన సమాచారం మేరకు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
అతివేగమే యువకుడి ప్రాణం తీసింది
● 13 రోజుల తరువాత వెలుగులోకి ప్రమాదం ● బైక్ నంబర్ ఆధారంగా కుటుంబ సభ్యులను గుర్తించిన పోలీసులు గరుగుబిల్లి: ఒడిశా రాష్ట్రంలోని రాయగడకు చెందిన పారసిల్లి నర్సింగరావు(24)రహదారి ప్రమాదంలో ఈనెల 17న మృతి చెందిన ఘటన 13రోజుల తరువాత మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై స్థానిక ఎస్సై షేక్ ఫకృద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం జూన్ 17న తోటపల్లి దేవస్థానం నుంచి ఖడ్గవలస వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్న నర్సింగరావు కుదమ మట్టి రోడ్డు సమీపంలో మలుపువద్ద అతివేగం కారణంగా బైక్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో వాహనం రోడ్డు పక్కన ఉన్న చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నర్సింగరావుకు వెంటనే వైద్య సహాయం అందకపోవడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశం పొదల్లో ఉండడంతో ఈ ఘటన ఎవరి దృష్టికి రాలేదు. మంగళవారం ఆ ప్రాంతంలో దుర్గంధం వెదజల్లడంతో స్థానికులు పరిశీలించి పోలీసులకు సమాచారం అందించారు. బైక్ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా మృతుడి వివరాలను గుర్తించిన పోలీసులు రాయగడలోని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.రేపటివలస తోటల్లో ఏనుగుల గుంపుసీతానగరం: మండలంలోని సూరంపేట కేంద్రంగా రెండు వారాలుగా మామిడి తోటల్లో సంచరిస్తున్న 8 ఏనుగుల గుంపు మంగళవారం తెల్ల వారు జామునుంచి తామరఖండి పంచాయతీ రేపటివలస పనస, మామిడితోటల్లో సంచరిస్తున్నాయి. నేటికి రెండువారాలుగా సీతా నగరం మండలంలో గజరాజులు రోజుకో తోటను ఎంపిక చేసుకుని సంచరిస్తున్నాయి. ఈ మేరకు గజ రాజుల కదలికలను గుర్తించి పరిసర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని అటవీఖాఖ బీట్ అధికారి సత్యనారాయణ తెలియజేశారు. 60 మంది ఎంఎస్పీలు పోలీస్ శాఖకు అటాచ్ విజయనగరం క్రైమ్: గత ప్రభుత్వ హయాంలో నియమించిన మహిళా సంరక్షణ పోలీసులు జిల్లాలో ఉన్న 60 మంది ఈ నెల 3 వ తేదీన ఎస్పీ ముందు హాజరు కావాలంటూ జిల్లా వ్యాప్తంగా పంచాయతీ రాజ్, మున్సిపల్, సచివాలయాల్లో పని చేస్తున్న మహిళా సంరక్షణ పోలీసులకు కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎలక్షన్స్, ఎన్యూమరేషన్, సెన్సెస్ లాంటి పనులకు సిబ్బంది తక్కువగా ఉన్నారన్న సమాచారాన్ని చంద్రబాబు ప్రభుత్వం సేకరించింది. వాస్తవానికి ఎంఎస్పీలకు జాబ్చార్ట్ రూపకల్పన ఇంతవరకు చంద్రబాబు సర్కార్ చేయలేదు సరికదా..కొంత మంది మమ్మల్ని పంచాయతీ రాజ్ శాఖకు బదిలీ చేయాలని కోర్టుకు వెళ్లారు. ఆ విషయంపై హైకోర్టులో కేసు నడుస్తుండగానే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 వేల మంది సిబ్బందిని ఉన్న పళంగా హోం శాఖకు బదిలీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే జిల్లాలో పని చేస్తున్న ఎంఎస్పీలతో ఈ నెల 3 వ తేదీన ఎస్పీ సమావేశం నిర్వహించాలని హోం శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడడం విశేషం. -
సేవలో సరిలేరు మీకెవ్వరు.!
● ప్రాణం నిలిపే దేవుడు వైద్యుడు ● వృత్తిలో దైవసమానులు ● నేడు వైద్యుల దినోత్సవంగౌరవప్రదమైన వృత్తి వైద్యవృత్తి ఎంతో పవిత్రమైంది. వృత్తిలో ఎప్పటికప్పుడు నైపుణ్యం పెంచుకోవడంతో పాటు సేవాభావం, గౌరవప్రదంగా మెలగాలి. వైద్యుడు వారి వద్దకు వచ్చే రోగికి ఇచ్చే మానసిక ధైర్యం ఎంతో కీలకం. డాక్టర్లపై ఒత్తిడి లేనప్పుడు మరింత మెరుగైన సేవలు అందిస్తారు. సమాజంలో ఎంతో గౌరవమైన ఈ వృత్తిలో ప్రతి రోగిని ఆరోగ్యవంతుడిగా తీర్చిదిద్దగలితేనే వృత్తిపరమైన సంతప్తి ఉంటుంది. దానికి వెలకట్టలేం. ఈ వృత్తిని ఎంతో ఇష్టం, ప్రేమతో చేస్తున్నాం. – వి.శివశంకర్, వైద్యుడు, ఎంఎస్ పురం, పాలకొండ మండలంసేవ చేయాలనే తపన చిన్నప్పటి నుంచి వైద్య వత్తి అంటే ఎంతో మక్కువ. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వైద్యవృత్తిని స్వీకరించాను. కష్టమైన స్థితిలో కూడా చలించిపోకుండా రోగి ప్రాణాలు కాపాడడంలో వైద్యులు ఎంతో తపన చెందాల్సి ఉంటుంది. రోగికి ప్రాణాపాయం తప్పినప్పుడు వారి కళ్లల్లో కనిపించే కతజ్ఞతాభావం వృత్తిపరమైన సంతప్తిని ఇస్తుంది. ఓపిక, సహనం ఉంటేనే వైద్యుడిగా గుర్తింపు లభిస్తుంది. – కడియం చిరంజీవి సూపరింటెండెంట్, ఏరియా ఆస్పత్రి, పాలకొండపాలకొండ రూరల్: కనిపించని దేవుడి కన్నా మనిషికి సుస్తీ చేసినప్పుడు ప్రాణాలను నిలబెట్టే ప్రత్యక్ష దైవం వైద్యుడు. అందుకే ఆరోగ్య సమస్యలతో అవస్థలు పడుతున్నవారు, వారి బంధువులు వైద్యుడిని భగవంతుడిలా చూస్తారు. అహర్నిశలు కష్టించి సూక్ష్మదృష్టితో, ఆప్యాయమైన పలకరింపుతో రోగిలో మానసిక ధైర్యాన్ని నింపే వైద్యుడికి సమాజంలో ఏ మూలకు వెళ్లినా ఎంతో ప్రాధాన్యతతో కూడిన విశిష్ట స్థానముంటుంది. ఎటువంటి విపత్కర స్థితిలోనైనా క్షతగాత్రులు, ఇతర సమస్యలతో బాధపడుతున్న రోగుల ప్రాణాలు కాపాడే శక్తి వైద్యుడికి మాత్రమే ఉంటుంది. గతంలో ముట్టుకుంటే ప్రాణాలను హరించే కోవిడ్ సమయంలో వైద్యులు తమ వృత్తిని దైవంగా భావించి ఎందరో ప్రాణాలను కాపాడారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపారు. శారీరక సంకట స్థితిలో ఎంతటి గొప్ప వారికై నా ఆ భగవంతుడి సాక్షాత్కారమే వైద్యుడని చెప్పక తప్పదు. శాంతికి చిహ్నమైన తెలుపురంగు వస్త్రాలతో ఆత్మీయ పలకరింపుతో ఆస్పత్రికి వచ్చే రోగులు, వారి బంధువులకు స్వాంతన చేకూర్చడంలో వైద్యులు అహర్నిశలు కష్టిస్తున్నారు. ఎవరో ఒకరిద్దరు వత్తిరీత్యా చేస్తున్న తప్పులను పక్కనపెడితే సమాజంలో వైద్యుడికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. వైద్య వృత్తికి మూలాలు మానవ జీవన పరిణామక్రమంతో పాటు ప్రస్తుత యాంత్రిక యుగంలో అధునాతన, వైజ్ఞానిక, శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. దీంతో వైద్యవృత్తిలో, సేవల్లో పోటీ తత్వం నెలకొంది. ప్రపంచ వైద్య శాస్త్ర మూలాలు భారతదేశ సంస్కృతిలోనే దాగి ఉన్నాయని చరిత్ర చెబుతోంది. ఆంగ్ల వైద్యంతో పాటు అలనాడు మన పూర్వీకులు రచించిన ఆయుర్వేద వైద్యవిధానం ఇప్పటికీ ఎంతో ప్రాచుర్యంలో ఉంది. చరకుడు, శుశ్రూతుడు, ధన్వంతరి వంటి ఎందరో అపార మేధోవిజ్ఞాన సంపత్తి కలిగిన వైద్యులు భరతమాత బిడ్డలే. భారతదేశంలో తొలి శస్త్ర చికిత్స నిపుణుడిగా గుప్తుల కాలంనాటి శుశ్రూతుడ్ని ఇప్పటికీ చరిత్రకారులు ఉటంకిస్తున్నారు. కనిష్కుని ఆస్థానంలో వైద్యుడిగా పనిచేసిన చరకుడు ఆయుర్వేద వైద్యానికి ఆద్యుడు. ఆయన రాసిన చరక సంహిత నేటికీ ఆయుర్వేద వైద్య విద్యకు మూలగ్రంథంగా పేర్కొంటారు. జిల్లాలో ప్రధాన వైద్య కేంద్రంతో పాటు మూడు ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు మూడుతో పాటు 37 ప్రాథమిక వైద్య కేంద్రాలు, మరో వందవరకూ ప్రైవేట్ వైద్యశాలలు ఉన్నాయి. వాటిద్వారా దాదాపు 550మంది పై చిలుకు వైద్యులు జిల్లా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. -
4న అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు
విజయనగరం టౌన్: అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని జూలై 4వ తేదీన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలుగు భాషా పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం వాల్పోస్టర్లను మాన్సాస్ కరస్పాండెంట్ డాక్టర్ కేవీ లక్ష్మీపతిరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు అల్లూరి సీతారామరాజు వంటి దేశభక్తుల గురించి వారి పోరాట పటిమ గురించి తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, అటువంటి మహనీయుల జీవిత విశేషాలు తెలుసుకోవడం ద్వారా విద్యార్థులు స్ఫూర్తిని పొందుతారన్నారు. కోటలో ఉన్న స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్లో కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో సమైఖ్య భారతి సమన్వయకర్త పి.కన్నయ్య, ఆర్యవైశ్యసంఘం కంటోన్మెంట్ శాఖ అధ్యక్షుడు డిమ్స్ రాజు, వాకర్స్ క్లబ్ డిప్యూటీ గవర్నర్ ముళ్లపూడి సుభద్రాదేవి, ప్రపంచ ఆర్యవైశ్యమహాసభ జిల్లాశాఖ మహిళా విభాగం అధ్యక్షురాలు గిరిజా ప్రసన్న, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ హరికృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
రైల్వే ట్రాక్పై గుర్తు తెలియని మృతదేహం
కొత్తవలస: మండలంలోని కొతవలస–హౌరా రైల్వే లైన్లో కంటకాపల్లి–అలమండ రైల్వే స్టేషన్ల మధ్య విద్యుత్ స్తంభాల వద్ద సుమారు 55 సంత్సరాల వయస్సుగల వ్యక్తి మృతదేహాన్ని రైల్వే పోలీసులు మంగళవారం కనుగొన్నారు. ఈ మేరకు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ వి.అశోక్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు రైలు నుంచి జారిపడినట్లు ఉందన్నారు. కుడికాలు తొడ వరకు తెగిపడి ఉన్నట్లు చెప్పారు. మృతుడి పక్కన తెలుపు, నలుపు, నీలం రంగుల గల పువ్వుల చొక్కా, కాఫీ కలర్ చొక్కాలు పడి ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు శవ పంచనామా నిర్వహించి మృతేదేహాన్ని విజయనగరం తరలించినట్లు తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు ఫోన్ 9247585742,6301365605 నంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతి సాలూరు: గడిచిన మూడు నెలలుగా సాలూరు పట్టణ పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేసుకుంటూ రోడ్లపై తిరుగుతున్న గుర్తు తెలియని మహిళను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించింది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గాంధీనగర్ జంక్షన్ వద్ద మంగళవారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో గుర్తుతెలియని వాహనం ఆ మహిళను ఢీకొట్టడంతో తలకు తీవ్రగాయమై ప్రమాదస్థలంలోనే మరణించింది. ఈ ఘటనపై కేసు నమోదుచేశామని చనిపోయిన మహిళ వివరాలు ఎవరికై నా తెలిస్తే పట్టణ పోలీస్స్టేషన్కు వచ్చి సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. -
ఏఓబీలో ఎకై ్సజ్ విస్తృత దాడులు
● 7200 లీటర్ల పులిసిన బెల్లం ఊట ధ్వంసంకురుపాం: నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో ఆంధ్ర–ఒడిశా ఎకై ్సజ్ శాఖ సిబ్బంది సంయుక్తంగా మంగళవారం దాడులు నిర్వహించినట్లు కురుపాం సర్కిల్ ఎకై ్సజ్శాఖ సీఐ పి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎకై ్సజ్ శాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎ.సంతోష్ ఆధ్వర్యంలో ఒడిశా సరిహద్దులో రామన్నగూడ పోలీస్స్టేషన్ పరిధిలో గల రాష్ట్ర సరిహద్దు(కేదారిపురం –ఇందిరాకాలనీ సరిహద్దు)ల్లో సారా తయారీ స్థావరాలైన దాబాగూడ, ఇందిరాకాలనీ గ్రామాల్లో దాడులు నిర్వహించి సారా తయారీ కోసం సిద్ధంగా ఉంచిన 7200 లీటర్ల పులిసిన బెల్లపు ఊటను గుర్తించి అధికారుల సమక్షంలో ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో అనిల్ శతపతి, సుశాంత్ శబరి, టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ వీవీఎస్ శేఖర్బాబు, విజయనగరం ఎన్ఫోర్స్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్ రమణ, సిబ్బంది పాల్తోన్నారు. సారా తయారీ రవాణా, అమ్మకాలు చేసే వారిపై ప్రజలు ఫోన్ 6302936599 నంబర్కు ఫిర్యాదు చేసి తెలియ జేయాలని ఈ సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. -
విత్తనాల్లో చిలక్కొట్టుడు..!
శృంగవరపుకోట: అధికార బలంతో పచ్చపార్టీ అధినేత నుంచి కిందిస్థాయి కార్యకర్త వరకు ఎవరి స్థాయిలో వారు దందా సాగిస్తున్నారు. అధినేత కమీషన్ల రూపంలో రూ.వేలకోట్లు కొల్లగొడుతుండగా.. చోటా నాయకులు, కార్యకర్తలు యూరియా బస్తాలు, విత్తనాల రూపంలో చిలక్కొట్టుడు కార్యక్రమాలకు దిగుతున్నారు. దీనికి ఎస్.కోట మండలం పోతనపల్లిలో జరిగిన ఘటనే నిలువెత్తు నిదర్శనం. రైతులకు పంపిణీ చేసేందుకు సోమవారం ఎంటీయూ1121రకం విత్తనాలు 334 బస్తాలు వచ్చాయి. మంగళవారం ఉదయం చూస్తే 280 బస్తాలే ఉండడంతో మిగిలిన 54 బస్తాలు ఎక్కడకు తరలించారంటూ మాజీ సర్పంచ్ కె.వెంకటరావుతో పాటు రైతులు ఆందోళనకు దిగారు. రాత్రికి రాత్రి విత్తన బస్తాలు ఎక్కడికి తరలించారంటూ వీఏఏ లావణ్య, జగన్లను నిలదీశారు. గతంలో 20 యూరియా బస్తాలు కూడా ఇలాగే పట్టుకుపోయారని, తాము డబ్బుచెల్లించామని, విత్తనాలు ఏమయ్యాయో తెలియడం లేదంటూ పొంతనలేని సమాధానం ఇచ్చారు. రైతులు గట్టిగా నిలదీయడంతో వేరొక గదిలో టీడీపీ నాయకుడు దాచిన 20 బస్తాలను తెచ్చారు. మిగిలిన 34 బస్తాల లెక్క ఏంటి అంటూ గ్రామస్తులు నిలదీయడంతో సాయంత్రం నాలుగు గంటల సమయంలో సీతారాంపురం గ్రామం నుంచి ఆటోలో 20 విత్తన బస్తాలను రప్పించారు. విత్తన బస్తాలను వేరొక గదిలో ఉన్న 20 బస్తాలపై ఉంచి తాళం వేయడంతో మాజీ సర్పంచ్ వెంకటరావు మరొక తాళం వేశారు. మిగిలిన 14 విత్తన బస్తాల లెక్క తేల్చాలంటూ నిలదీశారు. ఇదే విషయమై ఏఓ కె.రవీంద్రను వివరణ కోరగా గ్రామంలో విత్తన పంపిణీ జరిగిందని, ఇరువర్గాలు మనస్పర్థల వల్ల కొంత ఇబ్బంది వచ్చిందని, గ్రామంలోకి వెళ్లి సమస్యలేకుండా చూస్తానని చెప్పారు. 54 బస్తాలు మాయం రైతుల ఆందోళనతో దిగొచ్చిన నాయకులు వెనక్కి తెప్పించిన 40 బస్తాలు 14 బస్తాలకు పద్దు లేదు -
మర్యాదపూర్వక కలయిక
విజయనగరం: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డిని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, జిల్లా పబ్లిసిటీ వింగ్ అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వలిరెడ్డి శ్రీనివాసనాయుడు జగన్మోహన్రెడ్డికి దుశ్శాలువతో సత్కరించి ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని అందజేశారు. స్టీల్ప్లాంట్ బాధితులకు న్యాయం చేయాలి విజయనగరం గంటస్తంభం: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.కోటి, క్షతగాత్రులకు రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని, ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని విజయనగరం జిల్లా ఆల్ ట్రేడ్ యూనియన్స్ డిమాండ్ చేసింది. జూలై 3న ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ వద్ద నిర్వహించే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నాయకులు పిలుపునిచ్చారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. పింఛన్ డబ్బుల్లో కోత.. కొత్తవలస: ఒకటో తేదీ ఉదయం ఆరు గంటలకే ఇంటి తలుపు తట్టి మరీ పింఛన్ ఇస్తాం అంటూ చెప్పుకొస్తున్న కూటమి ప్రభుత్వం పంపిణీలో చేతులెత్తేస్తోంది. కొత్తవలస మండలంలోని 21 గ్రామసచివాలయాలు ఉండగా, 3 సచివాలయాలకు అందజేయాల్సిన పింఛన్ సొమ్ములో కోత విధించింది. దేశపాత్రునిపాలెం సచివాయం పరిధిలో రూ.లక్షా24వేల750లు, చింతలపాలెం సచివాలయానికి రూ.5,843, దేవాడకు 8,700 తక్కువగా చెల్లించింది. లక్కవరపుకోట మండలంలోని జమ్మాదేవిపేట సచివాలయానికి రూ. 8వేలు, లచ్చింపేట, ఖాసాపేట సచివాలయాలకు రూ.4వేలు చొప్పున, లక్కవరపుకోట సచివాలయానికి రూ.34,500 చొప్పున కోతపెట్టింది. దీంతో సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. జిందాల్ నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం ● రైతులతో సమావేశంలో హోం మంత్రి అనిత వెల్లడి మద్దిలపాలెం: జిందాల్ ప్రాజెక్టు నిర్వాసిత రైతుల సమస్యలు పరిష్కరిస్తామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత హామీ ఇచ్చారు. మంగళవారం విశాఖలోని హోంమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆమెతో పాటు జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఎమ్మెల్యే లలిత కుమారి, ఎమ్మెల్సీ రఘురాజు, జిందాల్ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్న ఈ భేటీలో నిర్వాసితులకు అనుకూలంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటివరకు పరిహారం అందని 82 మంది రైతులకు షేర్ అమౌంట్ పంపిణీ చేయడంతో పాటు, కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించనున్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి బంధవలసలో మూడు సెంట్ల ఇళ్ల స్థలం, భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు అదనంగా రూ.2.5 లక్షల ప్రత్యేక ఆర్థిక సాయం అందించనున్నారు. అలాగే చీడిపాలెంలో ఐదుగురికి పరిహారం, 18 మంది రైతుల పీవోటీ అంశాల పునఃపరిశీలన, మూలబుడ్డవరంలో అర్హులకు డీ–పట్టాల మంజూరుకు ఆమోదం తెలిపారు. -
కార్యకర్తలే వైఎస్సార్సీపీ బలం
విజయనగరం: అధికారంలో ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల పక్షాన నిలుస్తూ, వారి సంక్షేమం కోసం పాటుపడే వైఎస్సార్సీపీకి కార్యకర్తలే ప్రధాన బలమని ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్, వైఎస్సార్సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు. తండ్రికి తగ్గ తనయునిగా, మాట తప్పని, మడమ తిప్పని నేతగా రాజకీయాల్లో రాణిస్తున్న మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. రెండేళ్ల కిందట అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజావ్యతిరేకత మొదలైందన్నారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 31వ డివిజన్కు చెందిన టీడీపీ మాజీ ప్రధాన కార్యదర్శి మేడిశెట్టి రమేష్ నాయుడు, మాజీ యువజన విభాగం అధ్యక్షుడు పప్పల రాజు, మాజీ జాయింట్ సెక్రెటరీ బూరపు నాగరాజు, పలు కుటుంబాలు మాజీ కార్పొరేటర్ ఎన్ని లక్ష్మణరావు నేతృత్వంలో మంగళవారం వైఎస్సార్సీపీలో చేరారు. వారికి కోలగట్ల వీరభద్రస్వామి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో నగర పరిధిలోని 62 డివిజన్లలో పోటీ చేయనున్న వైఎస్సార్సీపీ అభ్యర్థులను నిండు మనస్సుతో ఆశీర్వదించి విజయపథంలో నడిపించాలన్నారు. 31వ డివిజన్కు చెందిన టీడీపీ మాజీ ప్రధాన కార్యదర్శి మేడిశెట్టి రమేష్ నాయుడు మాట్లాడుతూ 35 ఏళ్లు పార్టీ కోసం కష్టపడి పని చేసినా తగిన గుర్తింపు లేదన్నారు. టీడీపీలో కష్టపడి పని చేసే కార్యకర్తలకు గుర్తింపు లేదని, కేవలం ఒక సామాజిక వర్గానికే నాయకత్వం వత్తాసు పలుకుతుందన్నారు. ఆ సామాజిక వర్గం ముందు సామాన్యులు నిలవలేరన్నారు. టీడీపీలో జరుగుతున్న అన్యాయాన్ని తెలుసుకుని వైఎస్సార్సీపీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ నగర పార్టీ అధ్యక్షుడు ఆశపు వేణు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సంగంరెడ్డి బంగారునాయుడు ఉపాధ్యక్షుడు అవనాపు లక్ష్మణరావు, పార్టీ నాయకులు బైక్ రమేష్, పిన్నింటి సూర్యనారాయణ, రెడ్డి గురుమూర్తి, కాళ్ల సూరిబాబు, బోడసింగి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి వైఎస్సార్సీపీలో చేరిన 31వ డివిజన్ టీడీపీ కార్యకర్తలు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించిన కోలగట్ల -
మెరుగైన సేవలందించాలి
చికెన్● ఉద్యోగోన్నతి పొందిన ఎస్సైలకు ఎస్పీ దిశానిర్దేశంవిజయనగరం క్రైమ్: సీనియార్టీ ప్రాతిపదికన ఎస్సైలుగా పదోన్నతి పొందిన 8 మంది ఎస్పీ దామోదర్ను ఆయన చాంబర్లో మంగళవారం కలిశారు. పోలీసుశాఖలో సుమారు 35 ఏళ్లు పైబడి సర్వీస్లో ఉంటూ ఎస్సైలుగా ఉద్యోగోన్నతి పొందిన వారికి ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు. శాఖలో వస్తున్న మార్పులను గమనిస్తూ, సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. మారుతున్న నేరాలకు అనుగుణంగా చట్టాలపట్ల అవగాహన పెంచుకోవాలని, దర్యాప్తు మెలకువలను అందిపుచ్చుకోవాలని చెప్పారు. గతంలో పోలీసు శాఖలో రికార్డు వర్క్ కు ఎక్కువగా ప్రాధాన్యం ఉండేదని, ప్రస్తుతం వాటి స్థానంలో కంప్యూటర్లు, సీసీటీఎన్ఎస్, సీసీ కెమెరాలు, డ్రోన్స్కు ప్రాధాన్యం పెరిగిందన్నారు. స్టేషన్, పోలీసు సిబ్బంది మేనేజ్మెంట్ పట్ల అవగాహన కలిగి, వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు పాల్గొని, ఉద్యోగోన్నతి పొందిన అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. -
కొండను తవ్వితే ఖబడ్దార్
విజయనగరం రూరల్: మండలంలోని కొండకరకాం రెవెన్యూ సర్వే నంబర్ 198లో ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా గ్రావెల్ క్వారీ తవ్వకాలపై మంగళవారం ప్రజాగ్రహం పెల్లుబికింది. క్వారీ అనుమతు లు పొందిన నిర్వాహకులు మంగళవారం ఉదయం పోలీసుల అండతో చేపట్టిన తవ్వకాలను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే తిష్టవేసి వంటా వార్పుకు సిద్ధమయ్యారు. దీంతో చేసేది లేక నిర్వాహకులు, రెవెన్యూ, మైనింగ్ అధికారులతో పోలీసులు మాట్లాడి సాయంత్రం ఐదు గంటల సమయంలో అక్కడ తవ్వకాలను నిలుపుదల చేసి యంత్రాలను, లారీలను తరలించడంతో గ్రామస్తులు శాంతించారు. ఇష్టారాజ్యంగా అనుమతులు... మండలంలోని కొండకరకాం గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 198లో బొంతుకొండ ఉంది. కొండ దిగువన జెడ్పీ ఉన్నత పాఠశాల, గ్రామం ఉంది. కొండకు దక్షిణ భాగాన ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉంది. కొండపైన శివాలయం ఉంది. చంద్రబాబు సర్కారు సంపద సృష్టిలో భాగంగా ప్రజారోగ్యాన్ని తాకట్టుపెట్టి, ప్రజాదర్బార్ (గ్రామసభ) నిర్వహించకుండానే రెవెన్యూ శాఖ నివేదికను ఆధారంగా చేసుకుని 2025లో క్వారీ తవ్వకాలకు నంబూరి శిరీషకు 3.55 ఎకరాలు, వెంకట మురుగన్ స్టోన్ క్రషర్ సంస్థ (గోగినేని కృష్ణ చైతన్య)కు 4 హెక్టార్లు కెటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. క్వారీ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందన్న సమాచారంతో గ్రామస్తులు పలుమార్లు ఆందోళనలు చేపట్టారు. కలెక్టర్కు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు కూడా చేశారు. తవ్వకాలు జరిపేందుకు క్వారీ వద్దకు పలుమార్లు వచ్చిన నిర్వాహకులను అడ్డుకున్నారు. అయినా, అధికారులు, నిర్వాహకులు వెనక్కి తగ్గకుండా పోలీసు బందోబస్తు మధ్య తవ్వకాలు జరిపేందుకు వస్తూనే ఉన్నారు. క్వారీకి అనుమతి ఇచ్చిన స్థలానికి ఆనుకుని గతంలో పట్టణ పేదలకు 2,500 వరకు ఇళ్ల పట్టాలను మంజూరు చేశారు. ఇవేవి పరిగణలోకి తీసుకోకుండా, ప్రజాభిప్రాయం తీసుకోకుండా గ్రావెల్ క్వారీ తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం ఏంటని కొండకరకాం గ్రామస్తులు ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి క్వారీ అనుమతులు రద్దు చేయాలని, లేకుంటే పోరాటం కొనసాగిస్తామని గ్రామస్తులు స్పష్టంచేశారు. పోలీస్ బందోబస్తు నడుమ జేసీబీలతో తవ్వకాలకు సిద్ధమైన నిర్వాహకులు గ్రామసభ లేకుండానే అనుమతులు ఎలా ఇచ్చారు? తవ్వకాలను అడ్డుకున్న కొండకరకాం గ్రామస్తులు చంద్రబాబు ప్రభుత్వ తీరుపై నిప్పులు -
విజయనగరం జిల్లాలో 700 మంది వైద్యులు
వైద్యవృత్తి ఉన్నతమైనది వైద్యవృత్తి ఎంతో ఉన్నతమైనది. ప్రజలు డాక్టర్ను గౌరవించాలి. వైద్యం కోసం వచ్చే వారితో ప్రేమగా, అప్యాయంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని అవసరమైన వైద్యాన్ని వైద్యుడు అందించాలి. వైద్య వృత్తిని చేపట్టినందుకు అదృష్టంగా భావించాలి. ప్రతిరోగిని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలి. – డాక్టర్ అల్లు పద్మజ, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిసేవాభావం ఉండాలి ఓపిక, సహనం ఉంటేనే వైద్య వృత్తిని చేపట్టాలి. సేవాదృక్పథంతో వైద్యసేవలు అందించాలి. సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి వైద్యులు కృషి చేయాలి. ఆధునాతన వైద్య సేవలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. రోగులు వైద్యులను గౌరవించాలి. – డాక్టర్ ఎస్.జీవనరాణి, డీఎంహెచ్ఓవిజయనగరం ఫోర్ట్: జిల్లాలో 50 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ)లు, 18 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఉన్నాయి. అదేవిధంగా 300 వరకు ప్రైవేట్ ఆస్పత్రులు ఉన్నాయి. వాటిలో సుమారు 700 మంది వరకు వైద్యులు పనిచేస్తున్నారు. -
వివాదాల పరిష్కారానికి శాశ్వత లోక్అదాలత్
విజయనగరం లీగల్: శాశ్వత లోక్అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని కక్షిదారులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత పిలుపునిచ్చారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం శాశ్వత ప్రజాన్యాయ అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా బబిత మాట్లాడుతూ శాశ్వత ప్రజాన్యాయ పీఠం అందించే సేవలను వివరించారు. బీమా, బ్యాంకింగ్, ఆర్థిక సంస్థలు, విద్య, విద్యాసంస్థలకు సంబంధించిన తగాదాలు, నివాసాలు, వాస్తవ ఆస్తికి సంబంధించిన సేవలు, ఉపాధి హామీ పథకం సంబంధించిన తగాదాలు, రోడ్డు, వాయు, జల రవాణా, పోస్టల్, టెలిఫోన్, టెలిగ్రాఫ్, విద్యుత్, కాంతి, నీటి సరఫరా, ప్రజారక్షణ, పారిశుద్ధ్యం, ఆస్పత్రి, నర్సింగ్హోం సేవల్లో తగాదాలను శాశ్వత లోక్ అదాలత్లో ఉచితంగా పరిష్కరించుకోవచ్చన్నారు. రెగ్యులర్ కోర్టులో కాకుండా శాశ్వత లోక్అదాలత్లో కేసులు త్వరితగతిన పరిష్కారమవుతాయన్నారు. కార్యక్రమంలో శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ దుర్గయ్య, మూడవ అదనపు న్యాయమూర్తి అప్పలస్వామి, నాల్గవ అదనపు న్యాయమూర్తి శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు. -
ఇన్సర్వీస్ టీచర్లకు ‘టెట్’ నుంచి మినహాయింపు ఇవ్వాలి
● కేంద్ర విద్యాశాఖ మంత్రికి ఎమ్మెల్సీ డాక్టర్ గాదె వినతివిజయనగరం అర్బన్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) అమలులోకి రాకముందు నియామకమైన ఇన్సర్వీస్ టీచర్లకు ‘టెట్’ నిబంధన నుంచి శాశ్వత మినహాయింపు ఇవ్వాలని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి సభ్యుడు డాక్టర్ గాదె శ్రీనివాసులు నాయుడు కోరారు. ఈ మేరకు మంగళవారం జిల్లాలోని భోగాపురం వచ్చిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఆర్టీఈ యాక్ట్ 2009 అమలు కాకముందు నుంచే విధుల్లో ఉన్న ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించేందుకు వీలుగా కేంద్రప్రభుత్వం తక్షణమే చట్ట సవరణ చేయాలని ఎమ్మెల్సీ కోరారు. ఎన్నో ఏళ్లుగా విద్యాబోధన చేస్తున్న ఇన్ సర్వీస్ టీచర్లకు ఈ నిబంధన వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఈ సమస్యను మానవీయ కోణంలో పరిశీలించి కేంద్ర విద్యాశాఖ తగిన నిర్ణయం తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. అలాగే 2010వ సంవత్సరానికి ముందు నియామకమైన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిబంధన నుంచి శాశ్వత మినహాయింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం జిల్లాలోని భోగాపురం వచ్చిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ను సంఘం ప్రతినిధులు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో సంఘం రాష్ట్ర కార్యదర్శి ఇజ్జురోతు రామునాయుడు, జిల్లా అధ్యక్షుడు కొవ్వాడ శ్రీనివాసరావు, ప్రధానకార్యదర్శి బల్లా శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. -
మడ్డువలసకు ఇన్ఫ్లో నిల్
వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టుకు ఇన్ఫ్లో పూర్తిగా ఆగిపోయింది. సువర్ణముఖి, వేగావతి నదుల నుంచి ప్రాజెక్టులోకి చుక్కనీరు రాకపోవడంతో నీటిమట్టం డెడ్ లెవెల్ స్థాయికి చేరింది. ప్రాజెక్టు వద్ద సోమవారం 62.39 మీటర్ల నీటిమట్టం నమోదైంది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 65 మీటర్లు కాగా, 3.37 టీఎంసీల నీరు నిల్వకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 1.30 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఖరీఫ్ సీజన్కు కుడి, ఎడమ కాలువల ఆయకట్టు పరిధిలో 31 వేల ఎకరాలకు సాగునీరందించాలంటే వర్షాలు కురిసేవరకు వేచి ఉండాల్సిందేనని ప్రాజెక్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆరుగురు ఉద్యోగులపై వేటువిజయనగరం అర్బన్: ఎన్నికల విధుల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వహించి, ఉద్దేశపూర్వకంగా విధులను విస్మరించినట్లు తేలడంతో జిల్లాకు చెందిన ఆరుగురు ప్రభుత్వ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్కు గురైన ఉద్యోగులలో భారత కర్నాయిన్ (వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శి, లచ్చయ్యపేట సచివాలయం, రాజాం మండలం), సవిరిగాన శివకృష్ణ (పంచాయతీ క్యాదర్శి హొంజరాం గ్రామం, సంతకవిటి మండలం), పి.విజయ (మహిళా సంరక్షణ కార్యదర్శి, చుక్కవలస, గరవిడి మండలం), వీఎస్ఎస్ప్రకాశ్రావు (పంచాయతీ కార్యదర్శి దబ్బిరాజుపేట గ్రామం, వేపాడ మండలం), కె.గంగాధర్ (పంచాయతీ కార్యదర్శి, చిన్నగుడిపాల, వేపాడ మండలం), కేజీఎల్మాధురి (ఇంజినీరింగ్ అసిస్టెంట్, జడ్డేటివలస, జామి మండలం) ఉన్నారు. ఎన్నికల విధుల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. నిబంధనలకు లోబడి, అత్యంత బాధ్యతాయుతంగా తమ విధులను నిర్వర్తించాలని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిష్పాక్షికంగా సాగాలన్నారు. ఇందులో ప్రతి ఉద్యోగి భాగస్వామ్యం కావాలని అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించని వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. 1న డీఈఈసెట్–2026 ప్రవేశ పరీక్షలువిజయనగరం అర్బన్: జిల్లాలో డీఈఈసెట్ ప్రవేశ పరీక్షలను జూలై 1వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి యు.మాణిక్యంనాయుడు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గాజులరేగలో గల సీతం ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలోని ఐయాన్ డిజిటల్ జోన్ పరీక్షా కేంద్రంలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలను ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహిస్తున్నట్లు డీఈఓ పేర్కొన్నారు. అభ్యర్థులు పరీక్షకు హాజరేయ్యేటపుపడు తప్పనిసరిగా తమ హాల్ టికెట్, చెల్లుబాటయ్యే ఏదైనా ఒక ఫొటో గుర్తింపుకార్డు వెంట తీసుకురావాలి. పరీక్షా కేంద్రంలో అమలులో ఉన్న నిబంధనలు, సూచనలను అభ్యర్థులు కచ్చితంగా పాటించవలసి ఉంటుంది. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర నిషేధిత వస్తువులను పరీక్ష కేంద్రంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. అభ్యర్థులందరూ ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంత వాతావరణంలో నిబంధనలకు అనుగుణంగా పరీక్షను విజయవంతంగా రాసేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని డీఈఓ సూచించారు. పరీక్షకు సంబంధించిన ఇతర పూర్తి వివరాల కోసం డైట్ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ డి.అప్పలనాయుడు ఫోన్ 9440338045 నంబర్ను సంప్రదించవ్చని తెలియజేశారు. గంజాయి కేసులో ముద్దాయికి మూడేళ్ల జైలువిజయనగరం క్రైమ్: విజయనగరం వన్ టౌన్ పీఎస్లో 2023లో నమోదైన గంజాయి కేసులో నగరానికి చెందిన ముద్దాయి బొంతు వెంకటేశ్వరరావు (38)కు మూడేళ్లు జైలు శిక్ష రూ.30 వేల జరిమానా విధిస్తూ విజయనగరం ఫస్ట్ క్లాస్ ఏడీజే, ఎన్డీపీఎస్ స్పెషల్ జడ్జి కె.విజయ కల్యాణి తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ సోమవారం తెలిపారు. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం మండలం చెల్లూరుకు చెందిన బొంతు వెంకటేశ్వర రావు ప్రస్తుతం నగరంలోని గోకపేటలో నివాసం ఉంటూ అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో గుర్తు తెలియని వ్యక్తుల వద్ద 5 కిలోల గంజాయి కొనుగోలు చేసి, చిన్న పొట్లాలుగా చేసి, 2023లో ఆర్అండ్బీ జంక్షన్ వద్ద విక్రయించేందుకు సిద్ధపడుతుండగా విజయనగరం వన్ టౌన్ పోలీసులకు వచ్చిన కచ్చితమైన సమాచారంతో అరెస్టు చేశారు. ఈ కేసు విచారణలో నిందితుడిపై నేరం నిరూపణ కావడంతో జడ్జి ముద్దాయికి పై విధంగా శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారన్నారు. జరిమానా చెల్లించలేని పక్షంలో మరో 6 మాసాలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నట్లుగా ఎస్పీ దామోదర్ తెలిపారు. -
నేడు మంత్రుల జిల్లా పర్యటన
గరివిడి ఫేకర్లో కొత్త ప్రాజెక్టు భోగాపురం ఏపీ మోడల్ స్కూల్లో అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ రాంసుందరరెడ్డి, తదితరులు చీపురుపల్లిరూరల్(గరివిడి): గరివిడి ఫేకర్ ఎల్లాయీస్ లిమిటెడ్ పరిశ్రమ స్థానంలో కొత్త పరిశ్రమ ఏర్పాటుకు భారతీయ రైల్వే గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. గతిశక్తి కార్గో టెర్మినల్ (జీసీటీ) విధానం కింద ఫేకర్ ఎల్లాయీస్ ప్రస్తుత రైల్వే సైడింగ్ను గతిశక్తి కార్గోటెర్మినల్గా అభివృద్ధి చేసేందుకు తూర్పుతీర రైల్వే సూత్రప్రాయ అనుమతి తెలిపినట్టు ఫేకర్ అధ్యక్షుడు వినోద్ షరాఫ్ సోమవారం తెలిపారు. ఇప్పుడున్న పరిశ్రమ స్థానంలో దాదాపు రూ.100 కోట్ల వ్యయంతో నాలుగు సంవత్సరాల్లో కొత్త పరిశ్రమను దశల వారీగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఆధునిక రైల్వే సైడింగ్, యాంత్రీకృత సరుకు నిర్వహణ వ్యవస్థలు, అత్యాధునిక భద్రతా సదుపాయాలు, సిగ్నలింగ్ వ్యవస్థలు, మెరుగైన రైల్వే అనుసంధాన ఉత్పత్తులు ఇక్కడ నుంచి ఉత్పత్తి అవుతాయన్నారు. రైల్వేశాఖ సూచనల మేరకు సాధ్యతా నివేదిక, సాంకేతిక ప్రణాళికలు సిద్ధంచేసిన అనంతరం తుది అనుమ తులు లభించాక కొత్తప్రాజెక్టు అమలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. భోగాపురం మోడల్ స్కూల్ను పరిశీలించనున్న మంత్రులు ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ రాంసుందర రెడ్డి -
దాడులు దారుణం
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు విజయనగరం: అమరావతిలో కూటమి ప్రభుత్వం బలవంతపు భూ సమీకరణకు పాల్పడుతోందని, రైతుల కష్టాలు వినేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నాయకులపై కూటమి ప్రభుత్వం దాడులు చేయించడం దారుణమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అమరావతి అక్రమాలపై వైఎస్సార్సీపీ ప్రశ్నిస్తూనే ఉంటుందని, చంద్రబాబు అరాచకాలకు చరమగీతం పాడే రోజు దగ్గరలోనే ఉందన్నారు. అమరావతిలో రైతులు పడుతున్న కష్టాలు బయట ప్రపంచానికి తెలియనివ్వకూడదని, చంద్రబాబు చేసిన అవినీతి వెలుగులోకి రాకూడదన్న ఉద్దేశంతోనే దాడులు చేయిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడికై నా వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకునే హక్కు రాజకీయపార్టీలకు ఉంటుందన్న విషయం గమనించాలన్నారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన ప్రభుత్వమే దాడులకు ఉసిగొల్పడం అప్రజాస్వామికమన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో చంద్రబాబు ప్రభుత్వం పాలన సాగిస్తోందని ధ్వజమెత్తారు. ఒకప్పుడు పోలవరంను ఏటీఎంగా వాడుకున్న చంద్రబాబు ఇప్పుడు అమరావతిని ట్రిపుల్ ఏటీఎంగా వాడుకుంటున్నారని విమర్శించారు. ప్రజల ప్రయోజనాలు కాపాడడానికి వైఎస్సార్సీపీ ఎప్పటికీ వెనుకడుగు వేయదని చిన్నశ్రీను ఆ ప్రకటనలో ఉద్ఘాటించారు. -
పదవి కావాలంటే.. ప్యాకేజీ ఇవ్వాల్సిందే..!
చీపురుపల్లి: ఎన్నో సిద్ధాంతాలతో వ్యవస్థలను మార్చేందుకే జనసేన పుట్టిందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చెబుతుండగా... నామినేటెడ్ పదవి కోసం రూ.లక్షల్లో వసూలు చేశారంటూ పార్టీ సొంత క్యాడర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ అధినేత నుంచి కిందిస్థాయి వరకు అందరూ ప్యాకేజీ స్టార్లేనన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. నామినేటెడ్ పోస్టులను డబ్బులకు అమ్మేస్తున్న అంశం జిల్లాలో దుమారం రేపుతోంది. జనసేన పార్టీ సంస్థాగతంగా బలోపేతం కాకపోయినప్పటికీ ఉన్న కొద్దిమంది కార్యకర్తలు కూడా పదవి కోసం డబ్బులు ఇచ్చుకోవాల్సి రావడంతో పార్టీ క్యాడర్లో నైరాశ్యం అలముకుంది. తీగలాగితే డొంక కదిలినట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి కోసం డబ్బులు కాజేశారని పార్టీ జిల్లా ప్రచార కో ఆర్డినేటర్ కోట్ల కష్ణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తరుణంలో అదే పోస్టుకు మరో ఇద్దరి నుంచి కూడా డబ్బు లావాదేవీలు జరిగినట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చసాగుతోంది. ప్యాకేజీయే ప్రధానం... జనసేన పార్టీలో నామినేటెడ్ పదవి కోసం డబ్బులిచ్చి మోసపోయిన జాబితాలో చీపురుపల్లికి చెందిన కోట్ల కష్ణతో పాటు మరో ఇద్దరు ఉన్నట్టు సమాచారం. విజయనగరానికి చెందిన ఓ బాబు ఏకంగా బ్లాంక్ చెక్ ఇచ్చాడని, మెరకముడిదాం మండలానికి చెందిన ఓ వీర మహిళ రూ.6 లక్షలు ముట్టజెప్పినట్టు ఆ పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. అక్కడ అధినేత, ఇక్కడ నాయకులు కిందిస్థాయి కార్యకర్తలు, చోటా నాయకులను ప్యాకేజీలతో మోసంచేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విషయం వెలుగు చూడడంతో... తనకు పదవి ఎలాగూ ఇప్పించలేకపోయారు.. తను ఇచ్చిన డబ్బులైనా తిరిగి ఇవ్వాలని ఐదారు నెలలుగా తూర్పు కాపు కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవలస యశస్విని కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా స్పందనలేదు. అందుకే ఈనెల 22న పోలీసులకు ఫిర్యాదు చేశాను. స్పందన లేకపోవడంతో మళ్లీ 28న చీపురుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు మీడియాకు కృష్ణతెలిపాడు. అదే సమయంలో ఫిర్యాదు ఇవ్వొద్దని, డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చాయని, తన బ్యాంకు ఖాతాకు తీసుకున్న డబ్బుల నుంచి రూ.1.5 లక్షలు జమచేసినట్టు వెల్లడించాడు. మేరకముడిదాం మండలానికి చెందిన వీర మహిళకు కొద్ది రోజుల కిందటే రూ.6 లక్షలు సెటిల్మెంట్ చేసినట్లు సమాచారం. అయితే, తను ఎవ్వరి వద్ద పదవుల పేరిట డబ్బులు తీసుకోలేదంటూ తూర్పు కాపు కార్పోరేషన్ చైర్మన్ పాలవలస యశస్విని సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు. కావాలనే టార్గెట్ చేస్తున్నారని అందులో పేర్కొన్నారు. ఇదే అంశంపై బాధితుడు కృష్ణ మీడియాతో మాట్లాడుతూ డబ్బులు తీసుకోకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వొద్దని ఫోన్లు ఎందుకు చేస్తున్నారని, రూ.1.5 లక్షలు ఎందుకు తిరిగి ఇచ్చారని ప్రశ్నించారు. జిల్లా నాయకులు అందరికీ సమాచారం ఇచ్చిన తర్వాతే ఫిర్యాదుచేశానన్నారు. పార్టీ అధిస్థానం మద్దతు ఉందని, అన్యాయం జరిగితే ప్రశ్నించమని పార్టీ అధినేత చెప్పారన్నారు. జనసేనలో పదవుల పేరిట డబ్బుల కలెక్షన్! ఒకే పదవిని ముగ్గురికి ఆశ చూపి డబ్బులు దందా ఒకరి నుంచి బ్లాంక్ చెక్, మరొకరి నుంచి రూ.12 లక్షలు, ఇంకొకరి నుంచి రూ.6 లక్షలు వసూలు రచ్చకెక్కుతోందని తెలిసి వీర మహిళకు రూ.6 లక్షలు సెటిల్మెంట్ పోలీస్ స్టేషన్కు వెళ్లిన కోట్ల కష్ణ ఖాతాలో రూ.1.5 లక్షలు జమ తానెవ్వరి దగ్గర డబ్బులు తీసుకోలేదంటున్న యశస్విని డబ్బుతీసుకోకపోతే రూ.1.5లక్షలు ఎందుకిచ్చారంటూ ప్రశ్నించిన కోట్ల కష్ణ -
మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలి
● అధికారులను కోరిన మృతుడి కుమారుడు పార్వతీపురం రూరల్: సాలూరు మండలం బొర్ర పనుకువలసకు చెందిన చిక్కుడు సరుబు(66) అనుమానాస్పద మృతి కేసులో దర్యాప్తు వేగవంతం చేయాలని, పోస్టుమార్టం నివేదికలో జాప్యం లేకుండా చూడాలని మృతుడి కుమారుడు చిరంజీవి అధికారులను కోరాడు. వైద్యం కోసం వెళ్లి తిరుగు ప్రయాణంలో సరుబు మృతి చెందడం, ఆయన మృతదేహం పసుపువానివలస సమీపంలోని సువర్ణముఖి నది ఒడ్డున దొరకడం స్థానికంగా కలకలం రేపింది. మృతదేహంపై ముఖం నల్లబడడం, నోరు, ముక్కు నుంచి రక్తస్రావం కావడం వంటి గాయాలు స్పష్టంగా ఉండడంతో, ఇది ముమ్మాటికీ అనుమానాస్పద మృతేనని కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. అయితే, ఈ ఘటన జరిగి నెలలు గడుస్తున్నా..దర్యాప్తు ప్రక్రియలో ఆశించిన వేగం లేదని, పోస్టుమార్టం నివేదిక రాకలో జరుగుతున్న ఆలస్యంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తండ్రి మరణానికి గల కారణాలను తెలుసుకోవడానికి తాము వేచి చూస్తున్నామని, అధికారుల నుంచి సరైన స్పందన కరువైందని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశాడు. తమ తండ్రి మృతిపై సమగ్ర దర్యాప్తు జరిపి, వాస్తవాలను వెలికితీయాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్లో విన్నవించాడు. త్వరితగతిన పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేసి, నివేదికను అందజేయాలని విజ్ఞప్తి చేశాడు. -
పన్ను కట్టక తప్పదిక..!
● ఇకపై ఏఎంసీల్లో ఈ పర్మిట్ ● జూలై ఒకటి నుంచి అమల్లోకి ● సిబ్బంది అక్రమ వసూళ్లకు చెక్విజయనగరం ఫోర్ట్: వ్యవసాయ ఉత్పత్తుల రవాణాలో మాన్యువల్ పర్మిట్ విధానానికి మార్కెటింగ్శాఖ స్వస్తి పలికింది. దాని స్థానంలో ఈ – ట్రాన్స్పోర్ట్ పర్మిట్ విధానాన్ని తీసుకొచ్చింది. జూలై ఒకటో తేదీ నుంచి దీన్ని జిల్లాలో అమలు చేయనున్నారు. జిల్లాలో ఉన్న అన్ని మార్కెట్ కమిటీల పరిధిలో ఈ విధానం అమల్లోకి రానుంది. ఇప్పటివరకు వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు మార్కెటింగ్శాఖ సిబ్బంది చేతితో రాసిన పర్మిట్ పేపర్ను ఇచ్చేవారు. దీని వల్ల నకిలీ పర్మిట్లు కూడా కొంతమంది సృష్టించేవారు. అంతేకాకుండా పర్మిట్ లేకుండా కూడా కొంతమంది సిబ్బందితో కలిసి వ్యవసాయ ఉత్పత్తులు రవాణా చేసేవారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. నూతనంగా తీసుకొచ్చిన ఈ–ట్రాన్స్పోర్ట్ పర్మిట్ విధానంలో అటువంటి వాటికి ఆస్కారం ఉండదు. వ్యాపారులు ఆన్లైన్లో ఈ–పర్మిట్ తీసుకోవాలి వచ్చే నెల ఒకటో తేదీ నుంచి వ్యవసాయ ఉత్పత్తులు రవాణా చేసే ప్రతి వ్యాపారి ఆన్లైన్ ద్వారా పర్మిట్ పొందాల్సి ఉంటుంది. మార్కెట్ ఫీజు డిజిటల్ పద్ధతిలో చెల్లించిన వెంటనే ప్రత్యేక క్యూఆర్ కోడ్తో కూడా ఈ–ట్రాన్స్పోర్ట్ పర్మిట్ జారీ అవుతుంది. ఈ ఽవిధానం వల్ల గతంలో లాగా రైతులు, వ్యాపారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. వ్యవసాయ చెక్ పోస్టుల వద్ద ఈ–పర్మిట్ పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే పర్మిట్ ధ్రువీకరణ జరుగుతుంది. దీని వల్ల రైతుల ఉత్పత్తులు మార్కెట్లకు చేరే పక్రియ సులభతరమవుతుంది. సిబ్బంది అక్రమాలకు చెక్ వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సమయంలో చెక్ పోస్టుల వద్ద సిబ్బంది అక్రమాలకు పాల్పడేవారనే ఆరోపణలు ఉన్నాయి. చెక్పోస్టు సిబ్బందికి కొంతముట్టజెప్పడం ద్వారా అక్రమంగా సరుకు రవాణా అయ్యేదనే విమర్శలు ఉన్నాయి. వ్యవసాయ ఉత్పత్తులు పర్మిట్ లేకుండా అక్రమంగా రవాణా చేయడం వల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీలకు రావాల్సిన ఆదాయానికి కూడ గండి పడేది. ఈ– పర్మిట్ విధానం వల్ల సిబ్బంది చేతివాటానికి పూర్తి స్థాయిలో చెక్ పడే అవకాశం ఉంది. జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు 8 ఉన్నాయి. వ్యవసాయ చెక్ పోస్టులు 12 ఉన్నాయి. విజయనగరం, బొబ్బిలి, గజపతినగరం, చీపురుపల్లి, కొత్తవలస, పూసపాటిరేగ, మెరకముడిదాం, రాజాంలలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. జిల్లాలో ధాన్యం, మొక్కజొన్న, పెసర, మినుము ఉత్పత్తులు రవాణా చేస్తారు. 357 మంది వ్యాపారులు జిల్లా వ్యాప్తంగా ఉన్న 8 వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలో వ్యవసాయ ఉత్పత్తులు రవాణా చేసే లైసెన్స్ కలిగిన వ్యాపారులు 357 మంది ఉన్నారు. వారంతా తప్పనిసరిగా ఆన్లైన్లో తమపేర్లు నమోదు చేసుకుని ఈ– ట్రాన్స్పోర్ట్ పర్మిట్ను పొందాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ ఆన్లైన్ పర్మిట్ లేకుండా వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేసే వాటిని చట్టవిరుద్ధంగా పరిగణించి రవాణాను పూర్తిగా నిషేధించనున్నారు. బ్యాంకుల ద్వారా పన్ను చెల్లించడానికి 15 రోజులు సమయం ఉంటుంది. ఈ లోపు డబ్బులు చెల్లించకపోతే ఆన్లైన్ పక్రియ నిలిచిపోతుంది. చెక్ పోస్టుల వద్ద ట్రేడ్ లైసెన్స్ లేకుండా పంట దిగుబడులను తరలించే వారిని నాన్ ట్రేడర్స్ కింద పరిగణించి పన్ను వసూలు చేస్తారు. అయితే లైసెన్స్ లేకుండా రవాణా చేయడానికి మూడు సార్లు మాత్రమే అవకాశం ఉంటుంది. ఈలోగా సదరు వ్యాపారి లైసెన్స్ చేయించుకోవాలి. మూడు సార్లు దాటిన తర్వాత లైసెన్స్ లేకుండా రవాణా చేస్తే పెద్ద మొత్తంలో జరిమానా విధిస్తారు. మార్కెట్ ఫీజు ఎగవేత కుదరదు: ఈ–ట్రాన్స్పోర్ట్ పర్మిట్ వల్ల మార్కెట్ ఫీజు (పన్ను) ఎగవేయడానికి కుదరదు. ఆన్లైన్ చేయడం వల్ల చెక్ పోస్టుల వద్ద ఎక్కువ సేపు నిరీక్షించాల్సిన పని ఉండదు. జూలై ఒకటో తే దినుంచి ఈపర్మిట్ విధానం అమల్లో రానుంది. బి.రవికిరణ్, మార్కెటింగ్శాఖ ఎ.డి -
జిల్లా రైతుసంఘం నాయకుడికి ఘనంగా వీడ్కోలు
రేగిడి: జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు నారు జనార్దనరావు మృతిచెందిన సందర్భంగా సోమవారం రేగిడి మండలంలోని సంకిలి గ్రామంలో జనార్దనరావు పార్థివదేహంపై రైతు సంఘం జెండా కప్పి పూలమాలలువేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి బుడితి అప్పలనాయుడు, విజయనగరం, పార్వతీపురం సీపీఐ కార్యదర్శులు ఒమ్మి రమణ, కూరంగి మన్మథరావులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. కామ్రేడ్ జనార్దనరావు నీటి సంఘం అధ్యక్షుడిగా ఉంటూ సాగునీటి సమస్యలు, సంఘ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడమే కాకుండా చెరకు రైతుల సమస్యలపై పోరాటం చేసి రైతులకు ఎంతో మేలు చేసిన వ్యక్తి అని కొనియాడారు. కార్యక్రమంలో మన్యం జిల్లా అధ్యక్షుడు కిమిడి రామ్మూర్తినాయుడు, సీపీఐ రాజాం నియోజకవర్గ కార్యదర్శి ఉల్లాకుల నీలకంఠేశ్వరయాదవ్, సంఘ నాయకులు పాలవలస రామినాయుడు, పిట్ట రమణ, కర్రి పోలినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ఆలస్యం చేస్తే సహించేది లేదు
విజయనగరం అర్బన్: సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం లేదా ఆలస్యం వహిస్తే సహించేది లేదని జేసీ సేతు మాధవన్ అధికారులను హెచ్చరించారు. అలాగే వినతుల పరిష్కారంలో అధికారులు వేగంగా స్పందించాలని, పెండింగ్లో ఉన్న అర్జీలను వెంటనే పరిష్కరించి డిస్పోజ్ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్లోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)’ ‘రెవెన్యూ క్లినిక్’ కార్యక్రమాలకు జిల్లాలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై వినతి పత్రాలు, ఫిర్యాదులను అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలకు మొత్తం 197 వినతులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా 103 వినతులు ఒక్క రెవెన్యూ శాఖకు సంబంధించినవే కావడం గమనార్హం. శాఖల వారీగా వచ్చిన వినతులను పరిశీలిస్తే రెవెన్యూ శాఖకు 103, డిఆర్డీఏకు 24, ఇతర శాఖలు 21, పంచాయితీ రాజ్కు 14, విద్యాశాఖకు 12, విద్యుత్ శాఖకు 7, మున్సిపాలిటీ కి 7, జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు, గ్రామ సచివాలయ శాఖకు చెరో 4 వినతులు అందాయి. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సేతుమాదవన్ మాట్లాడుతూ ముఖ్యంగా భూమి, సర్వే వంటి రెనెన్యూ సమస్యలపై సత్వర చర్యలు చేపట్టాలన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా తమ శాఖకు వచ్చిన వినతులను పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. పీజీఆర్ఎస్పై డిజిటల్ పర్యవేక్షణ 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా వచ్చే కాల్స్ పట్ల అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని జేసీ అన్నారు. సంబంధిత అధికారులు అర్జీదారుని స్వయంగా కలిసి, మాట్లాడిన తర్వాతే ఎండార్స్మెంట్ ఇవ్వాలని ఆదేశించారు. అర్జీదారుతో మాట్లాడిన తేదీ సమయాన్ని కూడా తమ రిపోర్ట్లో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. ప్రజలకు 1100 టోల్ ఫ్రీ నంబర్పై మరింత అవగాహన కల్పించాలని ఈ నంబర్ ద్వారా వచ్చే ఫిర్యాదులకు సైతం అధికారులు సరైన రీతిలో సమాధానం ఇస్తూ సమస్యల సత్వర పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని జేసీ ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) సీహెచ్.సత్తిబాబు, పీజీఆర్ఎస్ జిల్లా నోడల్ అధికారి ఈ.మురళి, జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్.వెంకటేశ్వరరావు, ఆర్డీఓలు, జిల్లా సర్వే శాఖ సహాయ సంచాలకులు ఆర్.విజయకుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదు దారులకు చట్టపరిధిలో న్యాయం విజయనగరం క్రైమ్: తాము ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అర్జీలతో వచ్చిన ప్రతి ఫిర్యాదు దారుని ఆవేదనను సిబ్బంది అర్థం చేసుకోవాలని ఎస్పీ దామోదర్ అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన తన చాంబర్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా అర్జీలను స్వీకరించారు. ఇలా స్వీకరించిన ఫిర్యాదులపై సంబంధిత ఎస్హెచ్ఓలతో మాట్లాడారు. వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని, పరిష్కారానికి చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని అధికారులను ఎస్పీ ఏఆర్.దామోదర్ ఆదేశించారు. కార్యక్రమంలో మొత్తం 37 ఫిర్యాదులు స్వీకరించగా వాటిలో భూతగాదాలు18, కుటుంబ కలహాలు1, చీటింగ్ 7, ఇతర అంశాలకు సంబంధించి 11 ఫిర్యాదులు ఉన్నాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై సంబంధిత ఎస్హెచ్ఓలు ఏడు రోజుల్లో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. వాటి వివరాలను స్టేట్మెంట్ రూపంలో డీపీఓకు పంపాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపుఎస్పీ పి.సౌమ్యలత, డీసీఆర్బీ సీఐ కె.కుమార స్వామి, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, ఎస్సై ప్రభావతి సిబ్బంది పాల్గొన్నారు. జేసీ సేతు మాధవన్ -
ఖైదీల పట్ల వివక్ష చూపరాదు
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం బబిత ● ఆహార పదార్థాలను రుచిచూసి పరీక్షించిన కలెక్టర్ విజయనగరం లీగల్: జైలు సిబ్బంది కానీ, తోటి ఖైదీలు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఖైదీల పట్ల వివక్ష చూపకూడదని, ఇటువంటి చర్యలకు పాల్పడితే సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత హెచ్చరించారు. ఈ మేరకు భారత సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు సోమవారం ఏర్పాటు చేసిన ’బోర్డ్ ఆఫ్ విజిటర్స్ ఫర్ ప్రిజనర్స్’లో భాగంగా, విజయనగరం సబ్ జైలులో సమీక్షా సమావేశంతో పాటు తనిఖీ నిర్వహించారు. ఈ మేరకు జైలు సూపరింటెండెంట్ వద్ద వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జైలులో నిర్వహిస్తున్న ’లీగల్ ఎయిడ్ క్లినిక్’ పనితీరును, పారా లీగల్ వలంటీర్లు, న్యాయవాదుల సేవలను పర్యవేక్షించారు. ఖైదీలకు సకాలంలో న్యాయ సహాయం అందించేందుకు ఈ క్లినిక్లను ఏర్పాటు చేశామని, వాటిని సక్రమంగా కొనసాగించాలని సూచించారు. రిమాండ్లో ఉన్న ఏ ఒక్క నిందితుడు న్యాయవాది లేకుండా ఉండకూడదని, అట్టి వారికి జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయవాదిని అందిస్తామని స్పష్టం చేశారు. తనిఖీల్లో భాగంగా జైలులోని వంటగది, భోజనశాల, స్టోర్ రూమ్లను పరిశీలించి, ఆహార పదార్థాలు, పప్పు దినుసులు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఖైదీలకు ఇస్తున్న ఆహారాన్ని కలెక్టర్ రాంసుందర్రెడ్డి స్వయంగా రుచి చూసి పరీక్షించారు. కార్యక్రమంలో జేడీఏ వి.టి.రామారావు, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవన రాణి, విజయనగరం డీఎస్పీ రాఘవులు, ఆర్డీఓ సుధాసాగర్, సోషల్ వెల్ఫేర్ డీడీ అన్నపూర్ణ, పరిశ్రమలశాఖ జీఎం కరుణాకర్, జిల్లా ఉపాధి అధికారి రవీంద్రకుమార్ తదితర కమిటీ సభ్యులు, జైలు సూపరింటెండెంట్, ఇతర పోలీసు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
పెరిగిన నిమ్మ దిగుబడి
సీతంపేట: మన్యంలో ఈ ఏడాది నిమ్మ దిగుబడులు బాగా పెరిగాయి. ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి నిమ్మకాయలను గిరిజన రైతులు తెచ్చి విక్రయిస్తున్నారు. అంతగా పెట్టుబడులు అక్కర్లేక పోయినప్పటికీ ఏజెన్సీలో సుమారు 2 ఎకరాల వరకు పంటను కొండపోడు వ్యవసాయంలో భాగంగా పండిస్తారు. సీతంపేట ఏజెన్సీలో ఈ సంవత్సరం అధికంగా దిగుబడులు ఉన్నాయి. కావిడ నిమ్మకాయలు అంటే 30 నుంచి 40 కిలోలు సరాసరి రూ.400 నుంచి రూ. 500 వరకు విక్రయిస్తున్నామని గిరిజనులు తెలిపారు. గతేడాది ఇదే సీజన్లో ఒక్కో కావిడ రూ. 600 వరకు విక్రయించేవారమని గిరిజనులు చెబుతున్నారు. ఒక్కో నిమ్మ పండు మైదాన ప్రాంతాల్లో రెండురూపాయల వరకు విడిగా విక్రయిస్తారు. ఇక్కడ ఒక్కో పండు అర్ధరూపాయికి సరాసరి కారుచౌకగా కొనుగోలు చేసిన వ్యాపారులు పట్టణాల్లో అధికంగా విక్రయించి లాభాలను ఆర్జిస్తారు. మైదాన వ్యాపారులదే హవా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఒడిశా ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఇక్కడికి వచ్చి నిమ్మకాయలు కొనుగోలు చేస్తారు. సీతంపేటలో సోమవారం, మర్రిపాడులో బుధవారం, గురువారం దోనుబాయి, కుశిమి, పొల్ల గ్రామాల్లో శనివారం వారపు సంతలు జరుగుతాయి. ఈ సంతలకు వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తారు. గిరిజన రైతులు చెప్పిన ధర కాకుండా వ్యాపారులు సిండికేట్గా మారి ధర నిర్ణయిస్తారు. దీంతో వారు చెప్పిన ధరలకు ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని గ్రామాల్లో గిరిజనులు ముందుగా దళారీ వ్యాపారుల నుంచి అడ్వాన్స్ తీసుకుంటారు. పంట పక్వానికి వచ్చే సమయంలో ఆ పంటను వ్యాపారులకు ఇస్తారు. ఇలా కూడా గిరిజనులు నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. కావిడ రూ.400 నుంచి 500 వరకు విక్రయం ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు తరలింపు కొండపోడులో సాగుచేస్తున్న రైతులు వారపు సంతల్లో విక్రయాలుశ్రమకు తగ్గ ఫలితం లేదుశ్రమకు తగ్గ ఫలితం లేదు. కావిడలు మోసుకుని తీసుకువస్తాం. తీరా వాటిని తక్కువ ధరలకు విక్రయించాల్సి వస్తుంది. ప్రత్యేక మద్దతు ధరలు లేవు. దీంతో వ్యాపారులు నిర్ణయించిన ధరలకు అమ్మకాలు చేయాల్సిన పరిస్థితి ఉంది. బాలరాజు,పొంజాడ సేకరణ చాలా కష్టం కొండలపై పండే ఈ పంటను సేకరించడం చాలా కష్టసాధ్యమైన పని. ఇంటిల్లిపాది సేకరణకు వెళ్తే రోజుకు ఒక కావిడ వరకు మాత్రమే సేకరించగలం. అయితే ఆరుగాలం శ్రమించి పండించిన ఈ పంటకు మద్దతు ధరలు పెద్దగా ఉండడం లేదు. ఎస్.బాపన్న, అక్కన్నగూడ -
విషాద తీరం
సంతబొమ్మాళి: కుమారులు ఉన్నత చదువులు చదువుతారని ఆ తల్లిదండ్రులు ఆశించి ఉంటారు.. చక్కగా చదువుకుని భవిష్యత్కు బంగారు బాటలు వేసుకుంటారని ఆకాంక్షించి ఉంటారు.. కానీ ఆ తల్లిదండ్రుల ఆశలు అడియాసలయ్యాయి. ఆకాంక్షలు తీరకుండాపోయాయి. భావనపాడు తీరంలో మునిగి ఇద్దరు విద్యార్థులు ఆదివారం మృతి చెందారు. టెక్కలి ఐతం ఇంజినీరింగ్ కళాశాలలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న గోరివంకల అగస్త్య, సారిపెంట యశ్వంత్లతో పాటు జర్జన అభిలాష్, రాగాల హేమంత్, కాడి నరేంద్ర, పట్నాన గోవింద్, మామిడి రాకేష్లు ఆదివారం భావనపాడు సముద్ర తీరానికి వచ్చారు. సముద్రంలో సరదాగా స్నానానికి దిగారు. అలల ఉద్ధృతికి అగస్త్య, యశ్వంత్లు ఇద్దరూ సముద్రం లోపలకు వెళ్లిపోయారు. మిగతా వారు వారిని కాపాడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. భావనపాడు తీరంలో ఒక మృతదేహం తేలగా, మరో మృతదేహం దేవునల్తాడ తీరానికి చేరుకుంది. సంఘటనా స్థలానికి మైరెన్ సీఐ రాము, నౌపడ ఎస్ఐ జి.నారాయణస్వామి చేరుకుని వివరాలను సేకరించారు. మృతదేహాలను టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో అగస్త్య స్వగ్రామం విశాఖపట్నం జిల్లా కశింకోట. ఐతం కళాశాలలో ఫస్ట్ ఇయర్ ఐటీ చదువుతున్నాడు. సారపెంట యశ్వంత్ స్వగ్రామం విజయనగరం జిల్లా మెరకముడిదాం. ఫస్ట్ ఇయర్ ఈసీఈ చదువుతున్నాడు. -
వేతనదారులు ఆందోళన చెందాల్సిన పనిలేదు..
జూలై ఒకటో తేదీ నుంచి వీబీజీ రామ్జీ పథకం అమలులోకి రానుంది. ఉపాధిహామీ పథకంగా ఉన్న పేరును వీబీజీరామ్జీ పథకంగా మార్పు చేశారు. ఇప్పటి వరకు ఎలా పనులు జరిగాయో ఇకపై కూడా అలానే జరుగుతాయి.ప్రస్తుతం ఉపాధి వేతనదారులకు పనులు ఆపే ప్రసక్తి లేదు. నిరంతర ప్రక్రియ. అయితే వేతనాలకు, గ్రామాల అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు 60 శాతం కేంద్రం ప్రభుత్వం,40 రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చనున్నాయి. వేతనదారులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. నిబంధనల ప్రకారం పనిచేసిన తర్వాత 15 రోజులలోపు వేతనాలు చెల్లించాల్సి ఉంది. ఎస్.శారదాదేవి,డ్వామా పీడీ, విజయనగరం -
జజ్జనకరి జనారే..!
కొమరాడ: ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉదయించిన జానపద గళం కాళ్లకు గజ్జెలు కట్టి జజ్జనకరి జనారే అంటూ శ్రోతలను ఓలలాడిస్తోంది. చేతిలో చిల్లిగవ్వ లేకున్నా బతకడానికి దారి దీపం చూపిన జానపద గాన మాధుర్యం వేలాదిమంది అభిమానాన్ని మూటగట్టి వందల పురస్కారాలు సాధించింది. ఈ ఖ్యాతి సాధనలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా ధైర్యంగా ఎదురొడ్డి నిలిచిన తెలుగు పండితుడు దామోదర గణపతిరావు పార్వతీపురం జిల్లా ముద్దు బిడ్డ కావడం గర్వకారణం. ఉమ్మడి విజయనగరం జిల్లా కొమరాడ మండలం వన్నాం గ్రామంలో జన్మించిన గణపతిరావు బాల్యం, విద్యాభ్యాసం స్వగ్రామంతో పాటు శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో జరిగాయి. తర్వాత బాపట్ల జిల్లాలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. ఆంధ్రాయూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రెండు ఎంఏలు చదువుకున్నారు. విజయవాడలో ఓ దినప్రతికలో రిప్రెజెంటేటివ్గా చేరి ఇంటింటికీ వెళ్లి పేపరు బుక్ చేసేవారు. ఓ కాలేజీలో పార్ట్టైమ్ అధ్యాపకుడిగా పనిచేశారు. ఇలా చిరుద్యోగాలు చేస్తూనే మరోవైపు ఉత్తరాంధ్రాలో నేర్చుకున్న ప్రబలమైన జానపద బాణీలతో తనదైన శైలిలో దూసుకుపోయారు. ప్రజా గాయకుడు వంగపడు ప్రసాదరావు, విప్లవ జానపద గాయకుడు గద్దర్, సహజ కవి, పాటల తూటా గంట్యాడ గౌరినాయుడు శిష్యరికంలో ఉమ్మడి రాష్ట్రంతోపాటు దేశ, విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. ఇందుకోసం 11మంది శిష్యలను తయారు చేసుకుని ఈ మహాయజ్ఞంలో భాగస్వాములను చేశారు. ముంబై, బెంగళూరు, చైన్నె, అహ్మదాబాద్, పూణె, రాయగడ, కోల్కతా, హోసూర్, లక్నో నగరాల్లో ప్రదర్శనలిచ్చి తెలుగు వెలుగులు నింపారు. కువైట్, దుబాయ్, మలేషియా దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. కరోనా సమయంలో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు ఆనందాన్ని ప్రపంచమంతటా కలిగించారు. ఆ సమయంలో ఆన్లైన్ వేదికగా జానపద గళం వినిపించేశారు. 1994లో కృష్ణా జిల్లా వెలగలేరు పాఠశాలలో భాషా పండితుడిగా చేరిన గణపతిరావు మాతృభాషా వైభవాన్ని చాటుతూ ప్రత్యేక ప్రదర్శనలిస్తూ తన లక్ష్యం నెరవేర్చుకుంటున్నారు. ప్రస్తుతం గన్నవరం మండలం ముస్తాబాద్ జెడ్పీ హైస్కూల్లో పనిచేస్తున్నారు. ’నాటకాల్లోనూ ప్రతిభ నాటకాల్లోనూ దామోదర గణపతిరావు ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రముఖ కళాకారుడు, నంది అవార్డు గ్రహీత పీవీఎన్ కృష్ణ ఆహ్వానం మేరకు ఆయన నాటక రంగ ప్రవేశం చేశారు. 2007లో నెల్లూరులో జరిగిన నంది నాటకోత్సవాల్లో బంగారు నందిని పొందిన 1857 ప్రథమ స్వాతంత్య్ర మహాసంగ్రామం, 2008లో ఖమ్మంలో రజిత నంది పొందిన ‘శ్రీఖడ్గతిక్కన’ 2009లో నంద్యాలలో కాంస్య నంది పొందిన ‘ఉషా పరిణయం’ వంటి నాటకాల్లో ఆయన ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటివరకు వందకు పైగా నాటకాల్లో నటించారు. జీ తెలుగు వారి ‘షిరిడీ జైసాయిరాం, దూరదర్శన్ లోని ‘వజ్రభారతి’, శ్రీవెంకటేశ్వర భక్తి చానల్లో ‘పురాణగాథలు’ సీరియల్లో నటించారు. ఈయనను ఆకాశ వాణి బి గ్రేడ్ జానపద గాయకుడిగా, నటుడిగా గుర్తించింది. బిరుదులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కతిక శాఖ జానపద కళారత్న, అవనిగడ్డ గాంధీక్షేత్రం వ్యవస్థాపకుడు మండలి బుద్ధప్రసాద్ నుంచి ‘ఆంధ్రా గద్దర్, పాలకొల్లు కళాలయ సాంస్కృతిక సంస్థ ‘కవిగాయక నటచక్రవర్తి’ బిరుదులు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ జానపద కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా, యూటీఎఫ్ రాష్ట్ర సాంస్కృతిక కమిటీ సభ్యుడిగా, సంస్కార భారతి జిల్లా కార్యదర్శిగా, కృష్ణవేణి జానపద గాయక బృందం వ్యవస్థాపక కార్యదర్శిగా ప్రస్తుతం ఆయన పనిచేస్తున్నారు. మార్మోగుతున్న ఉత్తరాంధ్ర జానపదగళం జానపద కళాకారుడు దామోదర గణపతిరావును వరించిన పురస్కారాలు -
లారీ ఢీకొని యువకుడి మృతి
గజపతినగరం రూరల్: మండలంలోని మరుపల్లి 26వ నంబర్ జాతీయ రహదారి వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం మోసూరు గ్రామానికి చెందిన ఇప్పిలి శ్రీనివాస్ (38) స్వగ్రామం నుంచి బైక్పై వైజాగ్ వెళ్తుండగా, వెనుక నుంచి వస్తున్న ఐరన్ లోడ్ లారీ మరుపల్లి జాతీయ రహదారి దగ్గరకు వచ్చేసరికి బలంగా ఢీకొంది. దీంతో బైక్ పై వెళ్తున్న శ్రీనివాస్ శరీర భాగాలు నుజ్జునుజ్జు కాగా అక్కడికక్కడే తుది శ్వాస విడిచాడు. శ్రీనివాస్కు భార్య, 6 సంవత్సరాల కుమార్తె ఉన్నారు. భార్య శ్రావణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గజపతినగరం ఎస్సై కె.కిరణ్ కుమార్ నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం శ్రీనివాస్ మతదేహాన్ని గజపతినగరం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
పిడుగుపాటుతో ఆవు, దూడ మృతి
బాడంగి: మండలంలో ఆదివారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి పిడుగుపడి వాడాడ గ్రామానికి చెందిన గొట్టాపు త్రినాథరావు ఆవు, దూడ మృతిచెందాయి. రోజూమాదిరిగా ఆవును, దూడను గ్రామం బయట ఉన్న మంచినీటికోనేరు గట్టుపై మేతకు వదిలిపెట్టగా మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో పిడుగుపడి మేస్తున్న ఆవు, దూడలు అక్కడికక్కడే మృతి చెందినట్లు బాధిత రైతు వాపోయాడు. పశువైద్యాధికారికి సమాచారమివ్వగా డాక్టర్ వచ్చి పోస్టుమార్టం చేసినట్లు చెప్పాడు. 32 గొర్రెలు, మేకలు..తెర్లాం: మండలంలోని నందిగాం గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం పిడుగు పడడంతో 32 మేకలు, గొర్రెలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన కోరాడ చిన్నప్పడు, నీలబోను సూర్యనారాయణ, మొగుడు పైడియ్యలు తమ గొర్రెలు, మేకలను మేత కోసం నందిగాం పొలాల్లోకి తోలుకొని వెళ్లారు. మధ్యాహ్న సమయంలో మేకలు, గొర్రెలు మేత మేస్తున్న ప్రదేశంలో పెద్ద శబ్ధంతో పిడుగు పడడంతో మందలోని 32 గొర్రెలు, మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి. అంతవరకు మేత మేస్తున్న జీవాలన్నీ ఒక్కసారి మృత్యువాత పడడంతో రైతులు లబోదిబోమంటూ విలపించారు. పిడుగుపాటుకు మృతి చెందిన గొర్రెల రైతులను తెర్లాం పీఏసీఎస్ అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వరరావు, నందిగాం మాజీ సర్పంచ్ సత్యంనాయుడు, స్థానిక వైఎస్సార్సీపీ, టీడీపీ నాయకులు పరామర్శించారు. సాయిలక్ష్మికి సాయంవేపాడ: ఆగిపోతున్న గుండెసవ్వడిని నిలుపుకోవడానికి ఆపన్నుల సాయం కోసం ఆరాటపడుతున్న సాయిలక్ష్మికి సాయం అందివ్వాలని యువజన సంఘం సంకల్పించింది. సాక్షి పత్రికలో ‘ఒక పరికరం..ఒక ప్రాణం’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి వేపాడ మండలంలోని వల్లంపూడి గ్రామానికి చెందిన సీతారామా యువజన సేవా సంఘం సభ్యులు స్పందించారు. సాయిలక్ష్మికి వైద్య సాయం కోసం సంఘం సభ్యులంతా తలా ఒకింత వేసుకుని రూ.17000లు పోగేశారు. ఆదివారం సంఘం సభ్యులు బల్లంకి గ్రామంలో సాయిలక్ష్మి ఇంటికి వెళ్లి ఆమెకు రూ.17వేల నగదును అందించారు. తమకు చేతనైనంత మేర సాయం అందేలా కృషి చేస్తామని, సాయిలక్ష్మి కోలుకుంటుందని, ఆమె తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారు. అలాగే రాజాం దగ్గర సంతకవిటి మండలానికి చెందిన వల్లేరు శ్రీనివాసరావు సాయిలక్ష్మి తండ్రి శ్రీనివాసరావుకు రూ. 5 వేలు ఫోన్పే చేశారు. బాధితురాలిని ఆదుకునేందుకు మరింత మంది దాతలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. -
ఘనంగా ఒలింపిక్ రన్
విజయనగరం: జిల్లా కేంద్రంలో ఒలింపిక్ రన్ అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఈ రన్కు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా కోట వద్ద చిన్నారితో బెలూన్ ఎగర వేయించి క్రీడాజ్యోతి వెలిగించి, క్రీడాకారులు క్రీడాభిమానులతో కలిసి అడుగులు వేస్తూ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చైతన్యం నింపుతూ నగరంలోని కోట దగ్గర నుంచి మూడు లాంతర్లు, గంటస్తంభం, మెయిన్ రోడ్డు, మార్కెట్ సెంటర్, రాజీవ్ స్టేడియం వరకు ఒలింపిక్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడా రంగంలో జిల్లాకు గుర్తింపు తీసుకువస్తున్న జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు వల్లూరి శ్రీనివాసరావు, బంగారు ఉష, పల్లవిలతోపాటు కోచింగ్ ఇచ్చి ప్రోత్సహిస్తున్న పి.సతీష్, జి.నరసింగరావు, కృష్ణారెడ్డి, శాంతారావు, ఎక్స్ ఆర్మీ మేన్ రామారావులను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..క్రీడల్లో రాణించి జిల్లాకు మరింత ఖ్యాతి తీసుకురావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని, గ్రామీణ స్థాయి నుంచే ప్రతిభ కలిగిన ప్లేయర్లను ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని స్పష్టం చేశారు. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి క్రీడా స్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు గురాన అయ్యలు, కార్యదర్శి సీహెచ్. వేణుగోపాలరావు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు అవనాపు విజయ్, సత్య కాలేజీ ప్రిన్సిపాల్ సాయిదేవమణి, జిల్లా స్కూల్గేమ్స్ కార్యదర్శి గోపాల్, మల్లేశ్వరరావు, ఖోఖో అసోసియేషన్ ప్రతినిధి ఏఎన్ఎం కమలనాభరావు, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రతినిధి పి.లీలాకృష్ణ శ్రీనివాసరావు, డీఎస్ఏ శిక్షకులు, వివిధ క్రీడా సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, కోచ్లు, వందలాది మంది క్రీడాకారులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. -
‘సమగ్ర శిక్ష’లో అక్రమాలపై.. హైలెవెల్ విచారణ
విజయనగరం అర్బన్: సమగ్ర శిక్ష అభియాన్లో సివిల్ వర్క్స్ విభాగంలో ఏళ్ల తరబడి సాగుతున్న వసూళ్ల దందాలు, కమీషన్ల లూటీ విషయం ఎట్టకేలకు జిల్లా యంత్రాంగంతో పాటు రాష్ట్ర విద్యా శాఖ దృష్టికి వెళ్లింది. టెండర్లు లేకుండా, చివరకు కలెక్టర్ కళ్లుగప్పి ‘నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవాసీయ విద్యాలయం’ ఆధునికీకరణ పేరిట రూ.9 లక్షలు డ్రా చేసిన వ్యవహారం, బిల్లుల కోసం కాంట్రాక్టర్లను పీడిస్తున్న వైనంపై ఉన్నతాధికారులు స్పందించారు. ఈ మెగా స్కా మ్పై సమగ్ర విచారణ జరిపేందుకు ఉన్నతాధికా రుల బృందం రంగంలోకి దిగుతోంది. పలువురు కాంట్రాక్టర్లు, పట్టణానికి చెందిన ఎంఎస్ శ్రీనివాసరావు సమగ్ర శిక్ష విభాగంలో బరితెగింపులు, వేధింపులపై కలెక్టర్, ప్రభుత్వానికి లిఖిత పూర్వక ఫిర్యా దులు చేశారు. అనాథ పిల్లల విద్యాలయాల పను ల్లో సైతం టెండర్లు లేకుండా లక్షల రూపాయలు బొక్కేయడం, సైట్ ఇంజినీర్ల ఇష్టారాజ్యంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని ఫిర్యాదులో గట్టిగా డిమాండ్ చేశారు. నిధుల దుర్వినియోగానికి పాల్ప డిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు. కమిషనర్కు కలెక్టర్ కీలక లేఖ ఫిర్యాదుదారులు ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన కలెక్టర్.. తక్షణ చర్యలకు ఉపక్రమించారు. ఈ వ్యవహారంపై కేవలం స్థానిక విచారణ సరిపోదని భావించిన కలెక్టర్, రాష్ట్ర ఎడ్యుకేషన్ కమిషనర్కు లేఖ రాశారు. సమగ్ర శిక్ష విభా గంలో జరిగిన ఆర్థిక అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై నిష్పక్షపాతంగా నిజాలు బయటకు రావా లంటే.. ‘రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల బృందం’తో సంయుక్త విచారణ జరిపించాలని ఆ లేఖలో కోరారు. కలెక్టరే చైర్మన్గా ఉన్న కమిటీని పక్కనపెట్టి నిధులు డ్రా చేసిన తీరుపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఉచ్చు బిగుస్తున్న వేళ.. అధికారుల్లో వణుకు ఈ వ్యవహారంపై ఇప్పటికే విద్యా శాఖ ప్రాంతీయ సంచాలకులు (ఆర్జేడీ) విజయభాస్కర్ రహస్య విచారణ జరపగా దాని పర్యావసనం సమగ్ర శిక్ష జిల్లా కార్యాలయంలోని సూపరింటెండెంట్పై పడింది. మాతృ శాఖకు సరెండర్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు నేరుగా ఎడ్యుకేషన్ కమిషనర్ పరిధిలో ఉన్నతాధికారుల బృందం జిల్లాకు రానుండడంతో అవినీతి చక్రం తిప్పిన సదరు సైట్ ఇంజినీర్, డీఈఈలతో పాటు లంచాలు ఇచ్చుకోమంటూ కాంట్రాక్టర్లకు సలహా ఇచ్చిన ఉన్నతాధికారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. భవనాల ఆధునికీకరణ పనుల్లో రికార్డుల మాయాజాలం, సీఎఫ్ఎంఎస్ డ్రా వివరా లు, ఆటిజం కేంద్రాల బిల్లుల నిలిపివేత వెనుక ఉన్న అసలు దందాను ఈ కమిటీ నిశితంగా పరిశీలించనుంది. కలెక్టర్ తీసుకున్న నిర్ణయంతో సమగ్ర శిక్ష విభాగంలో ఏళ్ల తరబడి తిష్ట వేసిన అవినీతి తిమింగలాల ఆట కట్టవుతుందని బాధితులైన కాంట్రాక్టర్లకు న్యాయం జరుగుతుందని జిల్లా ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
ఇన్ సర్వీస్ టీచర్లకు ‘టెట్’ నుంచి మినహాయింపు ఇవ్వాలి
విజయనగరం అర్బన్: సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇన్–సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి అయిన పరిస్థితి ఏర్పడినందున, విద్యా హక్కు చట్టం–2009లో అవసరమైన సవరణలు చేసి వారికి టెట్ నుంచి మినహాయింపు కల్పించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) నాయకులు కోరారు. రాష్ట్ర ఫ్యాప్టో పిలుపు మేరకు ఆదివారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నాయకుల బృందం మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే పి.అదితి విజయలక్ష్మి గజపతిని మర్యాద పూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో నాయకులు మాట్లాడుతూ చట్ట సవరణ జరిగే వరకు రాష్ట్ర ప్రభుత్వ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్ నిర్వహించేలా తక్షణ నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయుల సుదీర్ఘ సర్వీసును దృష్టిలో ఉంచుకుని ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకునేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజాప్రతినిధులను కలిసిన వారిలో జిల్లా చైర్మన్ పాల్తేరు శ్రీనివాస్, సెక్రటరీ జెనరల్ సీహెచ్ భాస్కరరావు, ఆర్థిక కార్యదర్శి డి.శ్యామ్, వివిధ సంఘాల ప్రతినిధులు డి.ఈశ్వరరావు, ఎన్వీ పైడిరాజు, టి.సన్యాసిరాజు, ఎస్.శివప్రసాద్, వి.రమణ, ఎస్.భాస్కరరావు, వెంకటనాయుడు, మట్టా అప్పారావు, బుఖారీ బాబు, పలువురు ఉపాధ్యాయులు ఉన్నారు. -
విజయనగరం
సోమవారం శ్రీ 29 శ్రీ జూన్ శ్రీ 2026మన్యంలో ఈ ఏడాది నిమ్మ దిగుబడులు బాగా పెరిగాయి. గిరిజన రైతులు ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి నిమ్మకాయలను తెచ్చి విక్రయిస్తున్నారు. –8లోఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉదయించిన జానపద గళం కాళ్లకు గజ్జెలు కట్టి జజ్జనకరి జనారే అంటూ శ్రోతలను ఓలలాడిస్తోంది. –8లోఉన్న చోటే పనులు కల్పించాలన్న సదుద్దేశంతో 2006లో అప్పటి కాంగ్రెస్ హయాంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని అమలులోకి తెచ్చింది. –8లోజిల్లాలో ఎస్.కోట, గజపతినగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల, తదితర నియోజకవర్గాల్లో కూటమి నేతల కనుసన్నల్లో ఎంఆర్పీకి మించి మద్యం విక్రయాలు జరుగుతున్నా.. అబ్కారీ శాఖ అధికారులు దుకాణాల వైపు కన్నెత్తి చూడటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు భయపడి అధికారులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ఎంఆర్పీకి మించి విక్రయాలు, బెల్టు దుకా ణాలు, సమయపాలన పాటించకపోవడం, అక్రమ మద్యం సరఫరా కేసులు రెండేళ్లలో 1520 నమోదయ్యాయి. వాస్తవానికి చాలా చోట్ల అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు అటువైపు చూడడం లేదన్న విమర్శలు లేకపోలేదు. జిల్లాలో ఎంఆర్పీ ధరలకు మించి మద్యం అమ్మకాలు జరిగినట్లు నా దృష్టికి రాలేదు. ఎక్కడైనా ఎంఆర్పీకి మించి విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. బెల్టు దుకాణాలను అరికట్టడానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేస్తాం. – బి.శ్రీనాధుడు, ఎకై ్సజ్ సూపరిండెండెంట్ విజయనగరం జిల్లాలో లైసెన్స్డ్ మద్యం దుకాణాలు ఎన్ని ఉంటే అంతకు పదింతలు బెల్టు దుకాణాలు ఉన్నాయి. గ్రామాల్లో ఉదయం 6 గంటల నుంచే మద్యం అందుబాటులో ఉందంటే మద్యం సరఫరా ఏ స్థాయిలో జరుగుతుందోనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతోనే మద్యం విక్రయాలు విపరీతంగా పెరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. విజయనగరం రూరల్: తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టించి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చుదిద్దుతామని ఎన్నికల్లో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి ఊరూరా మద్యం అమ్మకాలు పెంచి సంపద సృష్టిస్తుందని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతేగాకుండా గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు నిర్వహిస్తే, చంద్రబాబు సర్కారు తెలుగు తమ్ముళ్ల సంపద పెంచడానికి మద్యం దుకాణాలను ప్రైవేటు పరం చేసేసింది. దీంతో ఊరూరా మద్యం దుకాణాలకు పోటీగా బెల్టు దుకాణాలు వెలసి తెల్లవారుజాము నుంచి అర్థరాత్రి వరకు మద్యం అందుబాటులో ఉండేలా చేశారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు తమ్ముళ్లు, వారి నేతల కనుసన్నల్లో జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో ఎంఆర్పీకి మించి మద్యం అమ్మకాలు చేపట్టి రూ.కోట్ల సంపద పోగేసుకుంటున్నారని మందుబాబులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా రూ.1500 కోట్ల పైమాటే.. జిల్లాలో ఏ– 4 లైసెన్స్డ్ మద్యం దుకాణాలు 169 ఉండగా బార్ అండ్ రెస్టారెంట్లు 31 ఉన్నాయి. 2024లో చంద్రబాబు సర్కారు నూతన మద్యం పాలసీలో భాగంగా మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు కేటాయిస్తూ లైసెన్స్లు జారీ చేసింది. ఆ ఏడాది 17 లక్షల 45 వేల 215 ఐఎంఎల్ కేసులు, 6 లక్షల 33 వేల 709 బీరు కేసుల విక్రయాల ద్వారా ప్రభుత్వానికి రూ.1568.17 కోట్లు ఆదాయం చేకూరింది. 2025– 26 ఆర్థిక సంవత్సరానికి 18 లక్షల 36 వేల 156 ఐఎంఎల్ కేసులు, 9 లక్షల 35 వేల 838 బీరు కేసుల అమ్మకాల ద్వారా రూ.1475.75 కోట్లు ఆదాయం లభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి రెండు నెలల్లో(ఏప్రిల్, మే)నే రూ. 261.69 కోట్లు ఆదాయం లభించింది. రెండేళ్లలోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పినట్లు అతి చిన్న జిల్లా అయిన విజయనగరం నుంచే రూ.3305 కోట్లకు పైగా ఆదాయంతో సంపద సృష్టించారని పలువురు పేర్కొంటున్నారు. -
పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం : కలెక్టర్
విజయనగరం ఫోర్ట్: పోలియో రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి పేర్కొ న్నారు. పల్స్పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం కణపాక యూత్ హాస్టల్లో ఏర్పాటు చేసిన పోలియో బూత్లో ఆయన చిన్నారులకు పోలియో చుక్కల మందు వేశా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐదేళ్లలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించాలని తెలిపారు. పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించడం మన బాధ్యత అని గుర్తు చేశారు. జిల్లాలో 1,99,386 మంది ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నట్టు తెలిపారు. ఆదివారం పోలియో చుక్కలు వేయించుకోని పిల్లలకు ఈ నెల 29, 30 తేదీల్లో ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. జిల్లాలో పోలియో చుక్కలు వేయడానికి 1180 కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కార్యక్రమాన్ని 128 మంది సూపర్వైజర్లు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. మత్య్సకార గ్రామా లు, కొండ ప్రాంతాలు, హైరిస్క్ ఏరియాల్లోని పిల్లలకు పోలియో చుక్కలు వేయడానికి 66 మొబైల్ బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి, డీఐఓ డాక్టర్ అచ్చుతకుమారి, డీఎస్ఓ డాక్టర్ వంశీకృష్ణ పాల్గొన్నారు. చీపురుపల్లి : జనసేన పార్టీలో సొంత కేడర్కే జరిగిన మోసం ఉదంతం పోలీస్స్టేషన్ మెట్లు ఎక్కింది. నామినేటెడ్ పదవి ఇప్పిస్తానంటూ తన వద్ద రూ.12 లక్షలు కాజేశారని జనసేన పార్టీకి చెందిన తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్వినిపై అదే పార్టీకి చెందిన జిల్లా ప్రచార కో–ఆర్డినేటర్ కోట్ల కృష్ణ చీపురుపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆదివారం రాత్రి ఫిర్యాదును ఎస్ఐ ఉమామహేశ్వరరావుకు అందజేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిని తనకు ఇప్పిస్తానని 2025 జూన్ 15న తన నుంచి రూ.10లక్షల నగదు, రూ.2లక్షల చెక్కును పాలవలస యశస్వినితో పాటు ఆమె అనుచరులు సారిక మురళీమోహన్, మోపాడ అనీల్, రామతోట రాజేష్ కాజేసారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏడాది కాలంగా పదవి లేదు సరికదా తన డబ్బులు కూడా తిరిగి ఇవ్వడం లేదని, మోసం చేశారని కేసు నమోదు చేసి న్యాయం చేయాలని కోరారు. సూరంపేటలో ఏనుగుల గుంపుసీతానగరం: మండలంలోని సూరంపేట కేంద్రంగా 10 రోజులుగా మామిడి తోటల్లో 8 ఏనుగులు సంచరిస్తున్నాయి. సూరంపేట గ్రామానికి సమీపంలో ఉన్న జీడి మామిడి తోటలను స్థావరంగా చేసుకుని ఉన్న గజరాజులు అప్పయ్యపేట, గుచ్చిమి, తాన్నసీతారాంపురం గ్రామాల్లో తిరుగాడుతున్నాయి. జీడిమామిడి తోటల్లో కొమ్మలు విరగొట్టడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
ఎరువు.. ధరవు..!
అన్నదాతకు సాగు కష్టంగా మారుతోంది. సాగునే నమ్ముకొని ఉన్న ఊరిలో ప్రశాంతంగా జీవిద్దామని రైతు భావిస్తుంటే ఆ దిశగా అడుగులు వేయనీయకుండా ప్రభుత్వమే నిలువరిస్తోంది. ఇదేంటో... అందరికీ అన్నం పెట్టే అన్నదాత విషయంలో ప్రభుత్వ తీరు విమర్శలకు తావిస్తోంది. ఓ వైపు సకాలంలో విత్తు, ఎరువులు దొరక్క బాధపడే పరిస్థితులుంటే.. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందాన మరోవైపు ఎరువుల ధరలు, సాగు యంత్రాల ధరలు అమాంతం పెంచేస్తున్నారు. వీటిని నియంత్రించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా కనీసం ఆలోచించడం లేదని అన్నదాత ఆవేదన చెందుతున్నాడు. ఈ పరిస్థితులు సాగుపై తీవ్ర ప్రభావం చూపేలా ఉన్నాయి. నెల్లిమర్ల రూరల్: ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో ఎరువుల కంపెనీలు ధరల మోత మోగిస్తున్నాయి. ఒక బస్తాపై సుమారు రూ.200 నుంచి రూ.450 వరకు అదనంగా ధరలు పెంచడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పంటల సాగు భారమై పీకల్లోతు కష్టాల్లో ఉన్న రైతులు ఎలా బతకాలంటూ కన్నీటి పర్యంతమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఖరీఫ్ సీజన్ మొదలై ఈ సారి పంటల ఎలా సాగు చేయాలనే విచారంలో రైతులు ఉన్నారు. అమెరికా, ఇరాన్, ఇజ్రాయిల్ దేశాల్లో యుద్ధం నేపథ్యంలో ఎరువుల తయారీ, ముడి సరుకుల ధరలు భారీగా పెరిగాయని, అందుచేత ఎరువుల ధరలు పెంచక తప్పడం లేదని కంపెనీలు చెబుతుంటే, దానికి ప్రభుత్వాలు వత్తాసు పలుకుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అస్తవ్యస్త విధానాలతో ఎరువుల ధరల్లో నియంత్రణ లేకుండా పోతోందని రైతులు చెబుతున్నారు. ధరలు పెరిగినంత వేగంగా, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు పంటలు వేయాలా.. లేదా అనే పరిస్థితికి వస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఒక్కొక్క కాంప్లెక్స్ ఎరువుల బస్తాపై రూ.200 నుంచి రూ.450 వరకూ ధర పెరిగింది. వ్యవసాయ యంత్రాలపై అదనపు ఖర్చు అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సాగును మరింత భారంగా మార్చా యి. ప్రస్తుతం వ్యవసాయంలో వినియోగించే 90 శాతం యంత్రాలు డీజిల్తోనే నడుస్తున్నాయి. దుక్కి దున్నే ట్రాక్టర్ మొదలు పంట నూర్పిడి యంత్రాలు, ఎరువులు, పంటల రవాణాకు వినియోగించుకునే ఆటోలు, ట్రాక్టర్లకు డీజిల్ కావాల్సిందే. ఈ పరిస్థితుల్లో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో ట్రాక్టర్ల అద్దె, విత్తనాలు, ఎరువుల రవాణా ఖర్చు లు, కోత యంత్రాల ఖర్చులు భారీగా పెరిగాయి. మరోవైపు ఈ ఏడాది ఎలినినో భయం కూడా వెంటాడుతోంది. ఏరువాకకు అంతా సిద్ధమవుతుండ గా, వర్షాలు తక్కువగా కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు అన్నదాతను కలవర పెడుతు న్నాయి. వర్షాధార పంటలైన పత్తి, మొక్కజొన్న, వరి సాగు చేసే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం నెలకొంది.వివిధ కారణాలు చూపి స్తూ ఎరువుల ధరలను ఏడాదికి రెండుసార్లు ఆయా కంపెనీల యాజ మాన్యాలు పెంచుకుంటూ పోతున్నాయి. స్పందించాల్సిన ప్రభుత్వాలు కంపెనీలకు వత్తాసు పలకడం బాధాకరం. మరోవైపు ఎరువులను కృత్రిమ కొరత సృష్టించి డీలర్లు భారీగా రైతుల నుంచి అదనంగా వసూలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం యూరి యా, డీఏపీ అంగట్లో కనిపించడం గగనమైంది. యూరియాను అధిక ధరలతో బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన దుస్థితి రైతులకు ఏర్పడింది. ఎంఆర్పీకే విక్రయించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. – కిల్లంపల్లి రామారావు, వ్యవసాయ కార్మిక సంఘ నేత ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఎరువుల ధరలను నియంత్రించి సరసమైన ధరలకే ఎరువులు అందుబాటులోకి తీసుకురావాలి. ప్రస్తుతం విపరీతంగా సాగు ఖర్చులు పెరిగిపోయాయి. పెరిగిన డీజిల్ ధరల కార ణంగా యంత్రాలతో వ్యవసాయ పనులు చేయాలంటే కష్టంగా మారుతోంది. అవసరమై న కాంప్లెక్స్ ఎరువులు ధరలు తగ్గించే ఏర్పాట్లు చేస్తే రైతులకు మేలు చేసిన వారవుతారు. – చందక బలరాం, రైతు, సతివాడ గ్రామం -
విద్యార్థులకు.. మిత్రద్రోహం..!
విజయనగరం అర్బన్: ఊరి బడిపై సర్కారు చిన్నచూపు చూస్తుందా అంటే జిల్లాలో అవుననే సమాధానం వినిపిస్తోంది. బడి తెరిచిన రోజే విద్యార్థికి అందాల్సిన విద్యామిత్ర కిట్లు నేటికీ పూర్తి స్థాయిలో అందలేదు. షూస్, బ్యాగులు, దుస్తులు, పుస్తకాలు... ఇలా అన్నింటా కోత పెట్టడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఏ పాఠశాలలో చూసినా పాతవి, చిరిగిన బ్యాగుల్లోనే చిన్నారులు పుస్తకాలు తీసుకెళ్లేందుకు సతమతమవుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థుల కోసం 1,11,190 జతల షూస్ కోసం విద్యాశాఖ అధికారులు ఇండెంట్ పెట్టగా, అందినవి కేవలం 37,910 జతలు మాత్రమే. అంటే ఏకంగా 73,289 మంది విద్యార్థులకు షూస్ అందలేదు. మొత్తం 27 మండలాలకు కేవలం 21 మండలాలకే విద్యామిత్ర కిట్లు అరకొరగా సరఫరా కావడం గమనార్హం. ప్రభుత్వం విద్యామిత్ర పేరుతో పేదకుటుంబాల చిన్నారులకు మిత్రద్రోహం చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ● చిరిగిన సంచుల్లోనే పుస్తకాలు... బ్యాగుల కథ మరింత దారుణంగా ఉంది. 1,11,199 బ్యాగులకు గాను కేవలం 62,316 మాత్రమే వచ్చాయి. దాదాపు 50 వేల మంది విద్యార్థుకు స్కూల్ బ్యాగులు ఇప్పటికీ అందలేదు. 27 మండలాల్లో కేవలం 16 మండలాలకే ఇవి పరిమితం కావడం విశేషం. మిగిలిన 11 మండలాల పిల్లలు చిరిగిన పాత సంచులతోనే తరగతులకు వెళ్తున్నారు. యూనిఫారంలు కూడా సగమే. మొత్తం 1,11,199 దుస్తుల ఇండెంట్కుగాను 1,06,568కి మాత్రమే సరఫరా అయ్యాయి. వేలాది మంది విద్యార్థులు ఇంకా కొత్త బట్టల కోసం ఎదురుచూస్తున్నారు. గగనంగా మారిన విద్యామిత్ర కిట్లు గతంలో పాఠశాలలు ప్రారంభమైన రోజే విద్యార్థుల చేతికి విద్యాకానుకలు ఈ ఏడాది 73 వేల మంది బూట్లకు నోచుకోని వైనం 50 వేల మందికి అందని బ్యాగులు ఇండెంట్ పెట్టినా సరఫరా చేయని దుస్థితి -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
● పరారీలో కారు డ్రైవర్ బొండపల్లి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివా రం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్సై యు.మహేష్ తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి.. గజపతినగరం మండలంలోని బూడిపేట గ్రామానికి చెందిన తిమినాని సత్యం (58) సైకిల్పై పాలు తీసుకుని (జాతీయ రహదారి 21పై ) గజపతినగరం వైపు వస్తుండగా.. బోడిసింగిపేట గ్రామం వద్దకు వచ్చేసరికి విశాఖ నుంచి ఒడిశా వైపు వెళ్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సత్యం అక్కడికక్కడే మృతి చెందగా.. కారు డ్రైవర్ పరారయ్యాడు. స్థానికుల ద్వారా సమా చారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థ లానికి చేరుకుని శవపంచనామ చేపట్టి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గజపతినగరం ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధిత కు టుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై మహేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స పొందుతూ యువతి.. గుమ్మలక్ష్మీపురం: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువతి తోయక సత్యవతి (19) విజయనగరంలోని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. లుంబేసు పంచాయతీ వాడబాయి గ్రామానికి చెందిన సత్యవతి తాడికొండ పంచాయతీ చాపరాయి జంగిడి భద్రలో ఈనెల 20న జరిగిన వివాహ వేడుకకు వెళ్లి.. పెండ్లి కుమార్తెను దిగబెట్టేందుకు పెండ్లి కుమార్తెతో పాటు ఆటోలో వెళ్తుండగా చాపరాయి – జండిగిభద్ర సమీపంలోని రెండో ఘాట్రోడ్డు వద్ద ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ మండంగి జిలికి అక్కడికక్కడే మృతిచెందగా, మరో 11 మందకి తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలైన సంఘటన తెలిసిందే. వారిలో తీవ్రంగా గాయపడ్డ సత్యవతిని మెరుగైన వైద్యం కోసం భద్రగిరి సీహెచ్సీకి అక్కడి నుంచి పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి, అక్కడి నుంచి విజయనగరంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సత్యవతి కన్నుమూసింది. మృతురాలికి తల్లి ఆలమ్మ, తండ్రి గోపిలతో పాటు ఇద్దరు చెల్లెల్లు, ఒక తమ్ముడు ఉన్నాడు. సత్యవతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు కుటుంబ సభ్యులకు శనివారం మృతదేహాన్ని అప్పగించారు. సత్యవతి మృతితో వాడబాయి గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. జీవితం మీద విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య మక్కువ : జీవితం మీద విరక్తి చెంది ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మక్కువ మండలం కన్నంపేట గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. కన్నంపేట గ్రామానికి చెందిన రాగల సతీష్ (32) శుక్రవారం రాత్రి మద్యం మత్తులో తన అనారోగ్యానికి సంబంధించి వాడుతున్న మాత్రలను అధిక మోతాదులో వేసుకుని అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి సతీష్ను బొబ్బిలి పట్టణంలోని ఆస్పత్రికి తరలించగా..అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. సతీష్ కొన్నాళ్లుగా లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఎంతకీ నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది అధిక మోతాదులో మందులు మింగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు,కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై వెంకటరమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జన సైనికుల దందా బట్టబయలు
చీపురుపల్లి: చేగువేరా సిద్ధాంతాలతో మార్పు కోసం పుట్టిందని ఊగిపోతూ చెప్పిన పవనన్న గ్లాసు పార్టీలో వసూళ్ల దందా బట్టబయలు అయ్యింది. ఆ పార్టీ అధినేత ప్రసంగాలు చూసి ప్రభావితులై ఆ పార్టీలో చేరి కష్టపడి జెండా మోసే క్యాడర్కే మోసం జరుగుతోందంటే ఇక ప్రజలకు ఆ పార్టీ ఎలాంటి మేలు చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా రాజకీయ పార్టీల్లో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఇస్తూ నామినేటెడ్ పదవులు ఇస్తుంటారు. కానీ జనసేన పార్టీలో అదంతా కుదరదు అంటూ నామినేటెడ్ పదవి కోసం డబ్బులు సమర్పించుకోవాలట. సరే ఏదో బాధ పడి అప్పుజేసి మరీ డబ్బులిచ్చుకున్నా.. పదవి రావడం లేదట. దీంతో పార్టీ క్యాడర్ మోసపోవాల్సి వస్తుంది. విజయనగరం జిల్లా జనసేన పార్టీలో ప్రస్తుతం అదే జరుగుతోందని చెప్పడానికి సాక్షాత్తు ఆ పార్టీ జిల్లా ప్రచార కోఆర్డినేటర్ కోట్ల కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. ఆలస్యంగా వెలుగుజూసిన ఈ ఫిర్యాదు వీడియోలు, ఫిర్యాదు పత్రాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. నామినేటెడ్ పదవి కోసం రూ.12 లక్షలు గాజు గ్లాస్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి చీపురుపల్లికి చెందిన విద్యావంతుడైన కోట్ల కృష్ణ తన ఉద్యోగాన్ని సైతం వదులుకుని పని చేస్తున్నాడు. అయితే ఆయనకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి ఇప్పిస్తామంటూ రూ.10 లక్షలు నగదు, రూ.2 లక్షలు చెక్ను తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్విని, ఆమె అనుచరుల ద్వారా తీసుకున్నట్టు కోట్ల కృష్ణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. విసిగిపోయి పోలీసులకు ఫిర్యాదు జనసేన కేంద్ర కార్యాలయంలో పేరు సిద్ధంగా ఉందని రూ.12 లక్షలు ఇస్తే అపాయింట్మెంట్ లెటర్ వస్తుందని జనసేన జిల్లా ప్రచార కోఆర్డినేటర్ కోట్ల కృష్ణను నమ్మించి జూలై 15, 2025న తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్విని అనుచరులు సారిక మురళి, మోపాడ అనిల్, రామతోట రాజేష్ తన వద్ద రూ.10 లక్షలు నగదు, రూ.2 లక్షలు చెక్ తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే డబ్బులు మేడం గారికి చేరినట్లు పాలవలస యశస్విని పీఏ మీసాల శ్రీకాంత్ తనకు ఫోన్లో ధ్రువీకరించాడని ఫిర్యాదులో వివరించారు. రచ్చ కెక్కిన గ్లాసు పార్టీ నామినేటెడ్ పదవుల కోసం ఇష్టారాజ్యంగా సొంత క్యాడర్ నుంచే రూ.లక్షల్లో వసూళ్ల దందాకు తెర తీయడంపై జిల్లాలో గ్లాసు పార్టీ రచ్చ కెక్కింది. తాజాగా ఈ అంశం జిల్లాలోని అన్ని సోషల్ మీడియాల్లో హల్చల్ చేస్తోంది. రాత్రింబవళ్లు పార్టీ కోసం పని చేసే క్యాడర్కు సొంత పార్టీలోని మోసం జరుగుతుంటే ఇక ఈ పార్టీను నమ్ముకుని ఉండటంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేయలేదని తెలుస్తోంది. ఈ విషయమై సీఐ శంకరరావు వద్ద సాక్షి ప్రస్తావించగా తన దృష్టికి వచ్చిందని, ఎస్ఐకు ఫిర్యాదు కాపీని ఇవ్వాలని చెప్పినట్టు తెలిపారు. పదవుల పేరిట భారీగా వసూళ్లు డబ్బులిచ్చి మోసపోయిన క్యాడర్ విసిగిపోయి పోలీసులకు ఫిర్యాదు రచ్చకెక్కిన గ్లాసు పార్టీ నామినేటెడ్ పదవి కోసం రూ.12 లక్షలు లంచం పదవి ఇస్తానంటూ లంచం కాజేసిన తూర్పుకాపు కార్పొరేషన్ చైర్మన్, అనుచరులు -
కుల వివక్షత పాటిస్తే కఠిన చర్యలు
● రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం విజయనగరం టౌన్: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులు, భూ సమస్యలు, అత్యాచార ఘటనలు నిరోధించేందుకు తీసుకువచ్చిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టాన్ని జిల్లాలో పటిష్టంగా అమలుపరుస్తామని.. కుల వివక్షత పాటిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం స్పష్టం చేశారు. శనివారం స్థానిక యూత్ హాస్టల్లో దళిత బహుజన శ్రామిక యూనియన్, పారా సంస్థల ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం శనివారంతో ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీతారాం మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీల సంరక్షణకు ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలపై అవగాహన పెంపొందించుకునేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. దళిత బహుజన శ్రామిక్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.చిట్టిబాబు మాట్లాడుతూ.. అట్రాసిటీ చట్టంలో సెక్షన్ 15 ద్వారా బాధితులు, సాక్షులకు ప్రత్యేకమైన హక్కులు ఇవ్వబడ్డాయని, వాటిని అమలుపరచడం ప్రభుత్వ ప్రధానమైన బాధ్యతన్నారు. అనంతరం అట్రాసిటీ చట్టం అమలు సమాచారాన్ని సమాచార హక్కు చట్టం ద్వారా ఎలా సేకరించవచ్చో సీహెచ్ ఆదినారాయణ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కేసీహెచ్.బంగారురాజు, జిల్లా కార్యదర్శి ఎంపి.రాజు, సియాదుల పార్వతి, కోరుకొండ వరలక్ష్మి, సీనియర్ అడ్వకేట్ గంటా మోహనరావు, మాజీ కార్పొరేటర్ దాసరి సత్యం, బవిరెడ్డి శంకరరావు, గిరిజన సంఘ నాయకులు నరసింహదొర, మల్లయ్య, దళిత సంఘాల నాయకుడు ఆదాడ మోహనరావు, బహుజన సమాజ్ పార్టీ నాయకుడు బోని కృష్ణ పాల్గొన్నారు. -
చోరీ కేసులో నిందితుల అరెస్ట్
వేపాడ: మండలంలోని నీలకంఠరాజపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఐఎఫ్బీ ప్యానల్ను దొంగిలించిన కేసులో వల్లంపూడి పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వల్లంపూడి స్టేషన్లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్.కోట రూరల్ సీఐ అప్పలనాయుడు మాట్లాడుతూ.. నీలకంఠరాజపురం హైస్కూల్లో ఈ నెల 23 అర్ధరాత్రి 9వ తరగతి గది తాళం పగులకొట్టి ఐఎఫ్బీ ప్యానల్ను కొందరు దొంగిలించారని, పాఠశాల ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయుడు జీవీ ఉదయ్కుమార్ ఫిర్యాదు చేశారన్నారు. దీంతో వల్లంపూడి ఇన్చార్జ్ ఎస్సై జె. రామకృష్ణ దర్యాప్తు చేపట్టగా.. కుమ్మపల్లి జంక్షన్ వద్ద ముగ్గురు నిందితులు శనివారం పట్టుబడ్డారని తెలిపారు. పట్టుబడిన వారిలో అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం గవరపాలెంనకు చెందిన కొలుసు కృష్ణ అలియాస్ శివ, వేపాడ మండలం పెదగుడిపాలలో తాతగారి ఇంటి వద్ద ఉంటున్న సబ్బవరపు రాకేష్, వేపాడ మండలం బల్లంకికి చెందిన వనుముల దుర్గాప్రసాద్ పట్టుబడగా.. మరో వ్యక్తి పరారయ్యాడని చెప్పారు. నిందితుల నుంచి ఐఎఫ్బీ ప్యానల్ను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆటోను సీజ్ చేశామన్నారు. నిందితులను కొత్తవలస కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. -
సైబర్ భద్రత ఎంతో కీలకం..
● లెండి కళాశాలలో స్మార్ట్ మైక్రోగ్రిడ్ల భద్రతపై సదస్సులో నిపుణులు ● దేశ వ్యాప్తంగా పాల్గొన్న నిపుణులు, అధ్యాపకులుడెంకాడ: ఆధునిక సాంకేతిక ప్రపంచంలో విద్యుత్ వ్యవస్థల సురక్షిత నిర్వహణకు సైబర్ భద్రత ఎంతో కీలకమని లెండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నిపుణులు స్పష్టం చేశారు. కళాశాలలోని ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘ సైబర్ అండ్ ఫిజికల్ సిస్టమ్, సైబర్ అండ్ సెక్యూరిటీ ఫర్ స్మార్ట్ మైక్రో అండ్ గ్రిడ్స్’ అనే అంశంపై ఆరు రోజులుగా నిర్వహిస్తున్న ఆనన్లైన్ అధ్యాపక శిక్షణ కార్యక్రమం (ఎఫ్డీపీ) శనివారంతో విజయవంతంగా ముగిసింది. భవిష్యత్లో మేధోపరమైన, సురక్షిత విద్యుత్ వ్యవస్థల రూపకల్పనే ధ్యేయంగా ఈ సదస్సు సాగింది. ఈ ఆరు రోజుల శిక్షణ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యావేత్తలు, పరిశోధకులు, పరిశ్రమ నిపుణులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా సైబర్–ఫిజికల్ సిస్టమ్స్, స్మార్ట్ మైక్రోగ్రిడ్ల నిర్వహణ, కృత్రిమ మేధస్సు (ఏఐ), ఆధారిత ఎనర్జీ మేనేజ్మెంట్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డిజిటల్ కమ్యూనికేషన్, ఆధునిక విద్యుత్ వ్యవస్థల్లో ఎదురవుతున్న సైబర్ భద్రతా సవాళ్లు వంటి అత్యాధునిక అంశాలపై నిపుణులు ప్రత్యేక ఉపన్యాసాలు ఇచ్చారు. ఈ కార్యక్రమం అధ్యాపకులు, విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో లెండి కళాశాల అధ్యాపక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
జాగ్రత్తలే శ్రీరామరక్ష..
● వర్షాకాలంలో మూగజీవాలకు పొంచి ఉన్న ముప్పు ● వ్యాధి నిరోధక టీకాలు వేయాలి : పశు వైద్యాధికారులుతీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ● వర్షాకాలంలో పశువులు, మేకలు, గొర్రెలను పాకల్లోనే ఉంచాలి. ● బురద, చిత్తడి నేలల్లో తిరగకుండా చూడాలి. ● పరిశుభ్రమైన నీరు తాగించాలి. పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూడాలి. ● లేగ దూడలను వ్యాధి ప్రబలిన పశువులకు దూరంగా ఉంచాలి. ● మేత, దాణా తగు మోతాదులో ఇవ్వాలి. ● ఎటువంటి వ్యాధి లక్షణాలున్నా వెంటనే సంబంధిత పశువైద్యాధికారిని సంప్రదించి నివారణకు తగు చర్యలు తీసుకోవాలి. ● ముందు జాగ్రత్తగా పవువులకు యాంటీ బయాటిక్స్ టీకాలు వేయించాలి. సీతంపేట: వర్షాకాలం వచ్చేసింది. ఈ కాలంలో పశువులు, గొర్రెలు, మేకలకు పలు వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. ఈదురుగాలులు, వర్షాలకు పశువులు నీరసించిపోతాయి. జోరీగలు, దోమల వల్ల గొంతువాపు, జబ్బవాపు, గాలికుంటు, తదితర వ్యాధుల బారిన పడతాయి. కేవలం ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారానే పశువులను, జీవాలను రక్షించుకోవచ్చని పశు వైద్యాధికారులు చెబుతున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా పాడి సంపదను కోల్పోక తప్పదు. సకాలంలో వ్యాధి లక్షణాలు గుర్తించి పశువైద్యులను సంప్రదించడం ద్వారా పశువులు, జీవాలను సంరక్షించుకోవచ్చు. చిటుక వ్యాధి.. దీన్ని యాంటీ రోటాక్సిమియా అని కూడా అంటారు. ఇది క్లాస్ట్రీడియం అనే సూక్ష్మక్రిమి వల్ల వ్యాపిస్తుంది. తొలకరి చినుకులు పడిన తర్వాత వచ్చిన పచ్చికను గొర్రెలు, మేకలు మేసినప్పుడు గడ్డితో పాటు ఈ వ్యాధిని కలుగజేసే సూక్ష్మక్రిములు వాటి కడుపులోనికి ప్రవేశించి కొన్ని విష పదార్థాలను విసర్జించడం వల్ల ఈ వ్యాధి కలుగుతుంది. వ్యాధి సోకిన గొర్రెలు చెంగున ఎగిరి హఠాత్తుగా మరణిస్తాయి. వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నపుడు గొర్రెలు పలుచగా పారుకోవడం, కాళ్లు బిగిసి నడవడం, ఫిట్స్ వచ్చినట్టు పడిపోవడం, తల వెనుకకు లాగుతూ కనిపిస్తాయి. ఆ తర్వాత ఊపిరాడక అవి మరణిస్తాయి. వ్యాధి నివారణకు .. నాలుగు నెలలు పైబడిన గొర్రె పిల్లలకు ప్రతి సంవత్సరం ఈ సీజన్లో చిటుక రోగ నిరోధక టీకాలు వేయించాలి. ఈ టీకాలు వేసే సమయానికి నెల రోజులు ముందుగా విధిగా గొర్రెలన్నింటికి నట్టలు, బద్దె పురుగు నివారణ మందులు తాగించాలి. టీకాలు వేసిన గొర్రెలకు ఒక సంవత్సరం వరకు ఈ వ్యాధి రాదు. ఈ టీకా ప్రతి పశువైద్యశాలలో ఉచితంగా లభిస్తుంది. పీపీర్ వ్యాధి.. వైరస్ వల్ల గొర్రెలు, మేకల్లో ఈ వ్యాధి వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన పశువులు 90 శాతం వరకు మృత్యువాత పడతాయి. వ్యాధి సోకిన గొర్రెల్లో 106 డిగ్రీల జ్వరం వస్తుంది. ముక్కు నుంచి నీరు కారడం, నోటిలో పుండ్లు ఏర్పడడం గమనించవచ్చు. దుర్గంధంతో కూడిన విరేచనాలు కలుగుతాయి. పశువు ఆహారం తీసుకోక మృతి చెందుతుంది. నివారణకు పీపీఆర్ టీకా మందును ముందస్తుగా వేయించినట్లయితే వ్యాధి రాకుండా నివారించవచ్చు. వర్షంలో తడవనీయరాదు.. పశువులను వర్షంలో తడవనీయకూడదు. అలాగే పిడుగులు పడే సమయాల్లో కూడా పశువులను శాలల్లోనే ఉంచాలి. మేతకు తీసుకెళ్లే సమయంలో తుప్పలు, డొంకల దగ్గర పురుగులు, విషసర్పాలు లేకుండా చూసుకోవాలి. పశువు ల ఆస్పత్రుల్లో లభించే వ్యాధి నిరోధక టీకాలు ముందస్తుగా వే యించాలి. – శ్రీనివాసరావు, పశుసంవర్థక శాఖ ఎ.డి, సీతంపేట గొంతువాపు వ్యాధి.. వర్షాకాలంలో పశువులకు సోకే వ్యాధుల్లో గొంతువాపు ప్రధానమైనది. దీన్నే గురక వ్యాధి అని అంటారు. శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. గొంతు, మెడ వాస్తాయి. శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. చికిత్స: సల్ఫాడిపోజిన్ ఇంజిక్షన్ బాగా పనిచేస్తుంది. నివారణ: ప్రతి ఏడాదీ తొలకరిలోనే ముందు జాగ్రత్తగా టీకాలు వేయించుకోవాలి -
నేడు పల్స్ పోలియో
విజయనగరం ఫోర్ట్: ఐదేళ్లలోపు పిల్లలకు ఆదివారం పోలియో చుక్కల మందు వేయించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో కోరారు. తల్లిదండ్రులు తమ పిల్లలను సమీప పోలియో కేంద్రానికి తీసుకువెళ్లి పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. జిల్లాలో 1180 పల్స్ పోలియో బూత్లను, 21 ట్రాన్సిట్ బృందాలను, 66 మొబైల్ బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సత్య కళాశాలలో పూల్ క్యాంపస్ డ్రైవ్ రేపు విజయనగరం అర్బన్: పట్టణంలోని సత్య డిగ్రీ, పీజీ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 29న భారీ పూల్ క్యాంపస్ డ్రైవ్ నిర్వహించనున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీ సాయిదేవమణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ‘అజికో బయోఫోర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ సహకారంతో ఈ నియామకాలు జరగనున్నాయి. డ్రైవ్కు యువతీ యువకులు హాజరు కావచ్చనని, ఎంపికైన అభ్యర్థులకు సంస్థ తరఫున ఉచిత క్యాంటీన్, రవాణా సౌకర్యం కల్పించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. 2025, 2026 సంవత్సరాలలో బీఎస్సీ కెమిస్ట్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ప్రొడక్షన్ డిపార్టుమెంట్ పోస్టులకు అర్హులని తెలిపారు. క్లీన్ రూమ్ ఆపరేటర్స్ పోస్టుల కోసం ఏదైనా డిగ్రీ, ఇంటర్మీడియట్ లేదా 10వ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు హాజరుకావచ్చునని పేర్కొన్నారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు మాట్లాడుతూ పూల్ క్యాంపస్ డ్రైవ్ ద్వారా నిరుద్యోగ యువతకు మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని, అర్హులైన అభ్యర్థులకు కంపెనీ వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందజేస్తారని తెలిపారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు తమ రెజ్యూం, విద్యార్హతల ధ్రువపత్రాలు, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో ఈ నెల 29వ తేదీన ఉదయం 9 గంటలకు కళాశాల ప్రాంగణానికి నేరుగా హాజరు కావాలని సూచించారు. రిజిస్ట్రేషన్, ఇతర వివరాల కోసం 9063603888 నంబరును సంప్రదించాలని సూచించారు. ఓపీ కోసం బీపీ వచ్చేలా... విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఓపీ చీటీ కోసం రోగులు నిరీక్షించి బీపీ వచ్చేలా పరిస్థితి నెలకొంది. గంటల తరబడి నిలబడి అవస్థలు పడుతున్నారు. ఓపీ కౌంటర్లలో సిబ్బంది కొరతతో పాటు ప్రింటర్లు కొరత వల్ల రోగులకు సకాలంలో ఈ చీటీలు అందని పరిస్థితి ఉంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆస్పత్రిలో ఓపీ నిర్వహిస్తారు. అయితే ఓపీ చీటీ కోసం రోగులు కనీసం రెండు మూడు గంటలు ఉండాల్సి రావడంతో వైద్య సేవలు మరింత ఆలస్యంగా అందుతున్నాయి. ఆస్పత్రిలో ఆరు ఓపీ కౌంటర్లు ఉన్నా సిబ్బంది తక్కువగా ఉండడం వల్ల ఒకటి రెండు కౌంటర్లు ఖాళీగా ఉంటున్నాయి. ముఖ్యంగా వయో వృద్ధుల కౌంటర్ సిబ్బంది లేక మూసి వేస్తున్నారు. దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ వద్ద ప్రస్తావించగా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఖాళీ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయిందని, నాలుగైదు రోజుల్లో సిబ్బంది వస్తారని చెప్పారు. దీంతో ఓపీ కౌంటర్లలో ఇబ్బందులు తీరుతాయని తెలిపారు. -
ఒక పరికరం.. ఒక ప్రాణం
చికెన్● పేస్మేకర్ కోసం పరితపిస్తున్న ఓ కుటుంబం ● కుమార్తెను కాపాడుకునేందుకు తల్లడిల్లిపోతున్న తల్లిదండ్రులు ● దాతల కోసం ఎదురుచూపువేపాడ: ఆ తల్లిదండ్రులకు ఐదుగురు సంతానం కాగా అందులో నలుగురు చిన్నప్పుడే చనిపోయారు. ఉన్న ఒక్క కుమార్తె కూడా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆ చిన్నారిని కాపాడుకునేందుకు కన్నవారు చేయని ప్రయత్నం అంటూ ఏమీ లేదు. 25 సంవ్సతరాలుగా లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తూ చిన్నారిని బతికించుకుంటూ వస్తున్న తల్లిదండ్రులకు తాజాగా మరో కష్టం వచ్చింది. గుండెలో ఓ పరికరం అమర్చాల్సి రావడంతో లక్షలాది రూపాయల అవసరం ఏర్పడింది. దీంతో ఆదుకునే ఆపన్నహస్తం కోసం ఆ పేద తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని బల్లంకి గ్రామానికి చెందిన కొత్త శ్రీనివాసరావు, మంగమ్మ దంపతులు గ్రామంలో టీ దుకాణం పెట్టుకుని జీవిస్తున్నారు. 2001లో వీరికి సాయిలక్ష్మి అనే చిన్నారి పుట్టింది. అంతకుముందు ముగ్గురు బిడ్డలు పుట్టి వెంటనే చనిపోయారు. సాయిలక్ష్మి తర్వాత కూడా ఓ బిడ్డ పుట్టి కన్నుమూసింది. దీంతో తల్లిదండ్రుల ఆశలన్నీ సాయిలక్ష్మిపైనే ఉన్నాయి. అయితే ఈ సమయంలోనే వారికి పెద్ద కష్టం వచ్చి పడింది. చిన్నారిని అనారోగ్యం సోకడంతో పలు ఆస్పత్రులకు తిప్పారు. ఈ క్రమంలో విశాఖ కేజీహెచ్కు తీసుకెళ్లగా పాప గుండెకు రంధ్రం ఉందని నిర్ధారించడంతో అక్కడ నుంచి కేర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. 2005లో చిన్నారికి కేర్ ఆస్పత్రిలో ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. అయినప్పటికీ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో 2006లో హైదరాబాద్లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. దీంతో అక్కడి వైద్యులు సాయిలక్ష్మికి పేస్మేకర్ పరికరం అమర్చాలని సూచించారు. అయితే ఆర్థికంగా అంత స్థోమత లేని తల్లిదండ్రులు దాతల సహాయంతో సుమారు రూ. 2.25 లక్షలు సేకరించి 2007లో చిన్నారికి హైదరాబాద్ కేర్లో పేస్మేకర్ అమర్చారు. మరోసారి ప్రాణాపాయం.. పేస్మేకర్ అమర్చిన తర్వాత కొద్దికాలం బాగానే ఉన్న సాయిలక్ష్మి 2010లో మళ్లీ ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో ఆస్పత్రి వైద్యులు 30 రోజుల్లో పేస్మేకర్ మార్చాలనడంతో అప్పట్లో బాధిత తల్లిదండ్రులు సాక్షిని ఆశ్రయించారు. సాక్షి టీవీ, సాక్షి పత్రికల్లో వచ్చిన కథనాలకు దాతలు స్పందించి సహకరించడంతో సాయిలక్ష్మికి పేస్మేకర్ మార్చారు. దీంతో చిన్నారి చక్కగా చదువు కొనసాగించి, ప్రస్తుతం చినముషిడివాడలో బీఎస్సీ నర్సింగ్ చేస్తోంది. 2016లో పేస్మేకర్ మార్పు.. సాయిలక్ష్మికి 2007, 2010, 2016 సంవత్సరాల్లో దాతలు, ఆరోగ్యశ్రీ సహకారంతో హైదారాబాద్లో సింగిల్ నీడ్ పేస్మేకర్ అమర్చినట్లు సాయిలక్ష్మి తండ్రి శ్రీనివాసరావు తెలిపారు. అయితే 2024లో విశాఖలో మెడికవర్ ఆస్పత్రిలో డబుల్ నీడ్ పేస్మేకర్ అమర్చగా.. ఎనిమిదేళ్లు పనిచేయాల్సిన పేస్మేకర్ పనితీరు సాంకేతిక లోపంతో మందగించింది. దీంతో ఈ ఏడాది జూన్ 17న హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న ఏఐజీ ఆస్పత్రికి సాయిలక్ష్మిని తీసుకెళ్లగా ఆరు నెలల్లో లీడ్లెస్ పేస్మేకర్ ఏర్పాటు చేయాలని.. ఇందుకు రూ.పది లక్షలు అవసరమవుతుందని తెలిపారు. దీంతో ఏం చేయాలో తెలియక తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. సంప్రదించాల్సిన నంబర్ -
పేరుకే మాణిక్యం
విజయనగరంవాస్తవానికి.. ఆదివారం శ్రీ 28 శ్రీ జూన్ శ్రీ 2026నిబంధనల ప్రకారమే.. సమగ్ర శిక్ష విభాగంలోని ఇటీవల చేపట్టిన 8 సెక్టోరియల్ పోస్టుల నియామకాలు నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం ఎంపిక ప్రక్రియ జరిగింది. ఎలాంటి అక్రమాలు జరగలేదు. 8 పోస్టులలో రెండు పోస్టులకు అర్హత లేని కారణంగా భర్తీ చేయలేదు. మిగిలిన ఆరు పోస్టులకు ఎంపిక పూర్తయింది. వారంతా బాధ్యతలు తీసుకున్నారు. – యు.మాణిక్యం నాయుడు, డీఈవో సాక్షి ప్రతినిధి, విజయనగరం: విద్యల జిల్లా విజయనగరానికి ఒక మాణిక్యం దొరికింది... అలాంటిలాంటి మాణిక్యం కాదు.. తన శాఖలోని ఎక్కడెక్కడో ఇరుక్కుపోయిన వాళ్లకు టైం చూసి బ్రేక్ ఇస్తారు. ఎవరూ గుర్తించని వాళ్లకు ఆయన ఒక ఆలంబన...ఆయన మాటలు సూక్తులు చూస్తే ఆహ.. ఏమి విలువలు.. ఏమి మాటలు.... ఈయన మట్టిలో మాణిక్యం అనిపిస్తుంది. ఇదంతా నాణేనికి ఓ వైపు.. రెండో వైపు చూస్తే.. విద్యా శాఖలో దందా చేస్తున్న ఈ పెద్దాయన దెబ్బకు అర్హులైన టీచర్లు అల్లాడిపోతున్నారు. ప్రైవేటు స్కూళ్ల వసూళ్ల వరకు అన్నీ సొంతంగానే బేరాలు కుదుర్చుకునే ఈయన కనీసం సొంత శాఖకు చెందిన వారిని డెప్యూటేషన్ మీద వేసేటప్పుడైనా వెనుకా.. ముందూ చూసుకోవాలి కదా.. అదేం లేదు.. క్యాష్ కొట్టు... పోస్టింగ్ పట్టు అనే పాలసీ మీద కథ నడిపించేస్తున్నారు. జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయంలో ఖాళీగా ఉన్న కీలక పోస్టుల భర్తీ కోసం తాజాగా జారీ చేసిన డెప్యుటేషన్ ఉత్తర్వులు విద్యా శాఖలో చర్చనీయాంశంగా మారాయి. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం పలువురు ఉపాధ్యాయులను ఒక సంవత్సరం కాల పరిమితికి ఫారిన్ సర్వీస్ నిబంధనలు, షరతుల కింద జిల్లా సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ (ఎంపీసీ ) కార్యాలయానికి డెప్యుటేషన్పై నియమించారు. ఈ నియామకాల వెనుక జరిగిన ఎంపిక ప్రక్రియపై ఉపాధ్యాయ వర్గాల్లో గగ్గోలు మొదలైంది. ఇంటర్వ్యూలు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) ఆధ్వర్యంలో నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేశారు. దీని ప్రకారం పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ నియామక ఉత్తర్వులు ఇచ్చారు. అయితే ఎంపికలో అర్హతలు, అనుభవం, సీనియారిటీ వంటి ప్రమాణాలను పక్కనబెట్టి ముందే నిర్ణయించిన అభ్యర్థులను సెలెక్ట్ చేసి పంపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ● ఎంపికతో సరా... సెకండరీ గ్రేడ్ టీచర్లకు ఉన్నత స్థానాలు ఎంపిక చేసేసారు సరే.. వీళ్లు తమకన్నా సీనియర్లు.. ఉన్నతాధికారులైన ఎంఈవోలతో సమన్వయం చేసుకోవడం.. వారికి కొన్ని సందర్భాల్లో మార్గదర్శనం చేయడం కుదిరే పనేనా.. పోస్టింగ్ ఇచ్చేశాం అంటే సరికాదు.. వారు ఎవరితో కలిసి పని చేయాలి.. ఎలాంటి ఫలితాలు సాధించాలనే దాన్ని బట్టి కదా పోస్టింగులు ఇవ్వాలి. సరిగ్గా ఇదే అంశం టీచర్లలో చర్చకు తావిస్తోంది. దీంతో పాటు రెండు అసిస్టెంట్ సెక్టోరియల్ అధికారి (ఏఎస్ఓ) పోస్టులకు మరో ఇద్దర్ని ఎంపిక చేసి రాష్ట్ర కార్యాలయానికి పేర్లు పంపగా వారికి కంప్యూటర్ పరిజ్ఞానం లేదని వారి పేర్లను తిరస్కరించారు. అంటే తలా.. మొలా.. చూసుకోకుండా కేవలం బరువు చూసి పేర్లు పంపేయడం ద్వారా జిల్లా యంత్రాంగం రాష్ట్ర స్థాయిలో పరువు పోగొట్టుకున్నట్లు అయింది. దీంతో మొత్తం ఎనిమిది పోస్టులకు లిస్ట్ పంపితే ఆరు మాత్రమే ఖరారయ్యాయి. అందులోనూ అన్నీ లొసుగులు కావడం మన మాణిక్యం దూరదృష్టికి తార్కాణం అని టీచర్లు గోల పెడుతున్నారు. పర్యవేక్షణ బాధ్యతలకు సరిపోతుందా? పోస్టింగులు ముందే ఫిక్స్ చేసారా.. ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ప్రకారం, అర్హులైన అభ్యర్థులు లేనప్పుడు మాత్రమే తక్కువ స్థాయి హోదాలో ఉన్న వారికి అవకాశం కల్పించవచ్చు. కానీ ఈ సందర్భంలో ఉన్నత అర్హతలు కలిగిన నలుగురు స్కూల్ అసిస్టెంట్లు ఇంటర్వ్యూకు హాజరైనప్పటికీ వారిని పూర్తిగా విస్మరించడం అనుమానాలకు తావిస్తోంది. వాస్తవానికి ఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చేటపుడే మన మాణిక్యం టాలెంట్ చూపించి ఎవరైనా దరఖాస్తు చేస్తుకోవచ్చు అని సన్నాయి నొక్కులు నొక్కారు. అంటే సెకండరీ గ్రేడ్ టీచర్లతో పాటు సీనియర్లు స్కూల్ అసిస్టెంట్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ క్రమంలో స్కూల్ అసిస్టెంట్లకు అర్హతలు.. అనుభవాన్ని బట్టి మార్కులు కొన్ని జమ అవుతాయి. అవన్నీ కలిపి ఇంటర్వ్యూ మార్కులను కలిపి చివరి మెరిట్ ప్రకారం పోస్టింగులు వేయాలి. కానీ అవేం లేకుండా ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు అనే లైన్ మీద ఈయన తనకు నచ్చిన వాళ్లను ముందే సెలెక్ట్ చేసేసి పోస్టింగులు ఇచ్చేశారు. దీంతో సీనియారిటీ.. ఎంఈడీ, ఎమ్మేస్సీ వంటి ఉన్నత అర్హతలు ఉన్నవాళ్లు నష్టపోయారు. మొత్తానికి ఈ ఎపిసోడ్లో ఆయన లాభపడ్డారు. గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులో మతలబు ఈ పోస్టుకు నిర్వహించిన ఇంటర్వ్యూకు ఐదుగురు మహిళా ఉపాధ్యాయులు హాజరవగా వారిలో నలుగురు స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) హోదాలో పని చేస్తున్నవారు కాగా, ఒకరు మాత్రం సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ). అయితే ఉన్నత అర్హతలు, సుదీర్ఘ అనుభవం కలిగిన స్కూల్ అసిస్టెంట్లను పక్కనబెట్టి గుర్ల మండలం కొమ్మనపేట ఎంపీపీఎస్లో పని చేస్తున్న ఒక ఎస్జీటీ ఉపాధ్యాయురాలిని జీసీడీవోగా ఎంపిక చేయడం తీవ్ర చర్చకు దారి తీసింది.జీసీడీవో పోస్టు కేవలం కార్యాలయ పరిపాలనా బాధ్యతలకు మాత్రమే పరిమితం కాదు. జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల (కేజీబీవీ) పనితీరు, విద్యా ప్రమాణాలు, బాలికల సంక్షేమ కార్యక్రమాల అమలును పర్యవేక్షించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అనేక కేజీబీవీల్లో ఇంటర్మీడియట్ స్థాయి విద్య కూడా కొనసాగుతోంది. అక్కడ పని చేసే స్కూల్ అసిస్టెంట్లు, ప్రిన్సిపాళ్లు, వార్డెన్ల పనితీరును సమీక్షించే బాధ్యతలు జీసీడీవోపై ఉంటాయి. ఇలాంటి బాధ్యతలు నిర్వహించే పోస్టుకు అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లు అందుబాటులో ఉన్నప్పటికీ వారిని పక్కనబెట్టి ఎస్జీటీ స్థాయి అభ్యర్థిని ఎంపిక చేయడం వెనుక అసలు కారణాలేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నియామకాల్లో కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ (సీఎంవో), ఆల్టర్నేటివ్ స్కూలింగ్ కో–ఆర్డినేటర్, అసిస్టెంట్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ (ఏపీవో), అసిస్టెంట్ అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ (రెండు పోస్టులు), గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. వీటి ఎంపికలో అభ్యర్థుల విద్యార్హతలు, సేవా అనుభవం, సీనియారిటీ, గత పనితీరు వంటి అంశాలను పక్కనబెట్టి డబ్బులిచ్చిన ఇచ్చిన వాళ్లకు పోస్టింగులు ఇచ్చేశారన్న ఆవేదన సీనియర్ టీచర్లలో వెల్లువెత్తుతోంది. విద్యాశాఖ వర్గాల సమాచారం ప్రకారం, ఇంటర్వ్యూలు నిర్వహించినప్పటికీ ఎంపిక ప్రక్రియకు సంబంధించిన మార్కుల వివరాలు, ఎంపిక ప్రమాణాలు, మెరిట్ జాబితాలు బయటకు రాలేదు. ఫైనల్ పోస్టింగులు జాబితా మాత్రం బయటకు ఇచ్చేసి చేతులు దులిపేసుకున్నారు. అక్రమార్కులకు అందలం పోస్టింగులు... డెప్యూటేషన్లు.. అన్నిటికీ ఒక రేటు.. అదే అయన రూటు అర్హతలు బుట్టదాఖలు... పేమెంట్ చేస్తే పోస్టింగ్ -
నీటి డ్రమ్ములో పడి చిన్నారి మృతి
బొబ్బిలి రూరల్: నీటి డ్రమ్ములో పడి చిన్నారి మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి కారాడ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఒడిశా రాష్ట్రం రాయగడ సమీపంలోని చిన్న అసిరి గ్రామానికి చెందిన సుబరి బంధు, రాజకుమారి దంపతులు కారాడ గ్రామ సమీపంలోని పామాయిల్ తోటలో పని చేస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. బంధు, రాజకుమారి తోటలో గల ఇంటి వద్ద ఫ్యాన్ బాగు చేసుకుంటుండగా.. చిన్నకుమార్త మానస ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ నీటి డ్రమ్ములో పడిపోయింది. కొద్దిసేపటి తర్వాత చిన్నారి గురించి వెతికిన తల్లిదండ్రులకు నీటి డ్రమ్ములో కనిపించింది. వెంటనే చిన్నారిని బొబ్బిలి సీహెచ్సీ తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చిన్నారి మృతదేహం వద్ద తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. హెచ్సీ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఫీల్డ్ అసిస్టెంట్పై విచారణ
గుర్ల: మండలంలోని సొలిపిసోమరాజుపేట ఫీల్డ్ అసిస్టెంట్ రామకృష్ణపై వచ్చిన ఆరోపణలపై గ్రామ సచివాలయం వద్ద ఉపాధి హమీ విజిలెన్స్ అధికారి వెంకటరమణ శనివారం విచారణ చేపట్టారు. విచారణ ప్రారంభంలోనే గ్రామంలోని వేతనదారులు 400 మంది ఒక్కసారిగా సచివాలయం వద్దకు రావడంతో ఉద్రిక్త నెలకొంది. కొంతమంది ఫీల్డ్ అసిస్టెంట్కు అనుకూలంగా, మరికొంత మంది వ్యతిరేకంగా వ్యవహరించడంతో తోపులాట చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న ఎస్సై పి.నారాయణరావు సచివాలయం వద్దకు చేరుకుని ఇరువర్గాలను వేరుచేసి ప్రశాంత వాతావరణంలో విచారణ జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఇదిలా ఉంటే పనుల్లో ఎటువంటి అవినీతి జరగకపోయినా టీడీపీ నాయకులు కావాలనే విచారణ పేరుతో ఫీల్డ్ అసిస్టెంట్ను తొలగించడానికి ప్రయత్నిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. విచారణలో ఏపీఓ రత్నమాల, ఉపాధి హమీ సిబ్బంది ఉన్నారు. తోసుకున్న వేతనదారులు -
కేంద్ర మంత్రికి ఆహ్వానం
విజయనగరం రూరల్: ఈ నెల 30 నిర్వహించనున్న కేంద్రియ గిరిజన విశ్వవిద్యాలయం (సీటీయూ) ప్రథమ స్నాతకోత్సవానికి కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను ఆహ్వానిస్తూ ఢిల్లీలో శుక్రవారం ఆహ్వానపత్రికను అందజేసినట్టు సీటీయూ ఉపకులపతి టి.శ్రీనివాసన్ ఫోన్లో తెలిపారు. కార్యక్రమానికి హాజరయ్యేందుకు సమ్మతి తెలిపారన్నారు. విశ్వవిద్యాలయంలో జరుగుతున్న విద్యా, అభివృద్ధి కార్యక్రమాలను ఆయనకు వివరించినట్టు పేర్కొన్నారు. బొండపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఉద్యోగుల కొరత బొండపల్లి: బొండపల్లి తహసీల్దార్ కార్యాలయంలో కీలక పోస్టుల్లో ఉద్యోగులు లేకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. ఇక్కడ డిప్యూటీ తహసీల్దార్గా పని చేసిన వైకుంఠంరాజేశ్వరరావు వీరఘట్టం తహసీల్దార్గా ఉద్యోగోన్నతిపై నెల రోజుల కిందట బదిలీ అయ్యింది. సీనియర్ అసిస్టెంట్ దాసరి అప్పలరాజు గతేడాది ఉద్యోగవిరమణ పొందినా ఆ స్థానంలో ఎవరినీ భర్తీ చేయలేదు. ఆర్ఐ హరికృష్ణకు గత నెల ఆర్డీఓ కార్యాలయానికి బదిలీ చేశారు. జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న అజిత మూడు నెలలు పిల్లల సంరక్షణ పేరుతో లీవు పెట్టారు. జూనియర్ అసిస్టెంట్, ఏఎస్ఓ, మండల సర్వేయరే కార్యాలయంలో మిగిలారు. తహసీల్దార్ రాజేశ్వరరావు కూడా ఈ నెల 24 నుంచి 15 రోజులు సెలవుపెట్టడంతో గజపతినగరం డీటీ చిరంజీవిరావుకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. కార్యాలయంలో రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో వివిధ పనులపై వచ్చిన వారికి నిరాశ తప్పడంలేదు. మరోవైపు మంత్రి అనుచరుల వేధింపులు భరించలేక ఇక్కడ పనిచేసేందుకు ఉద్యోగులు ఆసక్తి చూపడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం.. చిన్నారులకు శాపం! కొత్తవలస: మండలంలోని పాతసుంకరపాలెం గ్రామంలో అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ భవనం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తోంది. గత ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమంలో రూ.13.50 లక్షలతో అంగన్వాడీ భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. 70 శాతం పైబడి పనులు పూర్తిచేసింది. ఇంతలో ప్రభుత్వం మారడంతో ఎక్కడిపనులు అక్కడ నిలిచిపోయాయి. రెండేళ్లుగా భవనం వైపు కన్నెత్తి చూసేవారు కరువయ్యారు. దీంతో చిన్నారులు ఇరుకుగా ఉన్న అద్దెభవనంలో ఆటపాటలతో కూడిన విద్యాభ్యాసనకు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి భవనాన్ని వినియోగంలోకి తీసుకురావాలని చిన్నారుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
ఓటర్ల డిజిటలైజేషన్లో నత్తనడక!
జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 1,847 మంది బూత్ లెవెల్ అధికారులు (బీఎల్ఓలు) క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నారు. మొత్తం 15,78,949 మంది ఓటర్లు ఉండగా... అధికారులు ఇప్పటి వరు 15,63,394 ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసి, రికార్డు స్థాయిలో 99.01 శాతం పూర్తి చేశారు. అయితే, సేకరించిన ఫారాలను కంప్యూటర్లలో నమోదుచేసే ప్రక్రియలో యంత్రాంగం చేతులెత్తేసింది. జిల్లా వ్యాప్తంగా 1,73,759 ఫారాలు మాత్రమే ఆన్లైన్ అయ్యాయి. అంటే దాదాపు 14 లక్షల మంది ఓటర్ల డేటా ఇంకా కార్యాలయాల్లోని ఫైళ్లలోనే మగ్గుతోంది. పంపిణీ‘భేష్’... డిజిటలైజేషన్ ‘ఫ్లాప్’ విజయనగరం అర్బన్: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియ (సర్–2026) క్షేత్రస్థాయిలో తీవ్ర గందరగోళంగా మారింది. ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ చేయడంలో చూపిన ఉత్సాహం... వాటిని ఆన్లైన్ పోర్టల్లో నమోదు (డిజిటలైజేషన్) చేయడంలో అధికారులు, సిబ్బంది పూర్తిగా విస్మరించారు. గురువారం సాయంత్రం వరకు అందిన అధికారిక గణాంకాలే ఇందుకు నిదర్శనం. జిల్లా వ్యాప్తంగా లక్షలాది ఫారాలు సేకరించి కార్యాలయాల్లో మూలపడేసినా... వాటి కంప్యూటరీకరణ ప్రక్రియ మాత్రం దారుణంగా వెనుకబడి కేవలం 11 శాతానికే పరిమితమైంది. ఇదే అలసత్వం కొనసాగితే రాబోయే ముసాయిదా జాబితా తప్పుల తడకగా మారే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లా కేంద్రంలోనే ఘోర వైఫల్యం అధికారుల కళ్లెదుటే ఉంటే విజయనగరం నియోజకవర్గంలోనే డిజిటలైజేషన్ అత్యంత దారుణంగా ఉంది. ఇక్కడ అత్యధికంగా 2,61,300 మంది ఓటర్లు ఉండగా 2,51,492 ఫారాలను పంపిణీ చేశారు. కానీ, డిజిటలైజేషన్ కేవలం 4.70 శాతంతో 12,270 ఫారాలు మాత్రమే పూర్తయింది. జిల్లాలోనే ఇది అత్యల్పం. పట్టణ సరిహద్దులోనే ఉన్న నెల్లిమర్ల నియోజకవర్గంలో కూడా ఆందోళనకరంగా ఉంది. 2,13,904 ఫారాలు పంపిణీ జరిగితే... అన్లైన్ నమోదు కేవలం 6.02 శాతం మాత్రమే కావడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. గజపతినగరం నియోజకవర్గంలో 99.97 శాతం పంపిణీ జరిగినా... డిజిటలైజేషన్ కేవలం 8.59 శాతం వద్దే నిలిచిపోయింది. ఓటర్లలో రేకెత్తుతున్న అనుమానాలు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీలో టాప్ పొజిషన్లో ఉన్న రాజాం నియోజవర్గంలో కూడా కేలవలం 17.45 శాతం మాత్రమే డిజిటలైజేషన్ పూర్తి కావడం గమనార్హం. ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువు ముంచుకొస్తున్నా డేటా ఎంట్రీ ప్రక్రియ ఇంత మందకొడిగా సాగడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సర్వేల పేరుతో సేకరించిన సమాచారాన్ని ఆన్లైన్లో సకాలంలో నమోదు చేయకపోకతే, అర్హులైన ఓటర్ల పేర్లు, ముసాయిదా జాబితా నుంచి గల్లంతయ్యే ప్రమాదం ఉందని రాజకీయ పార్టీల ప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికై నా స్పందించి కేవలం ఫారాల పంపిణీ టార్గెట్లకే పరిమితం కాకుండా ... ప్రత్యేక సిబ్బందిని (డేటా ఎంట్రీ ఆపరేటర్లను) నియమించి యుద్ధప్రాతిపదికన డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలన్న వాదన వినిపిస్తోంది. లేనిపక్షంలో సామాన్య ఓటరు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని పరిశీలకుల ఆందోళన పడుతున్నారు. జిల్లాలో వెనుకబడిన ఎన్యూమరేషన్ ఫారాల ఆన్లైన్ నమోదు పంపిణీ 99 శాతమైనా.. కంప్యూటరీకరణ కేవలం 11 శాతమే చిట్టచివరి స్థానంలో జిల్లా కేంద్రం విజయనగరం 4.7 శాతం అధికారుల పర్యవేక్షణా లోపంపై సర్వత్రా విమర్శలు -
ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పార్టీ కార్యాలయ నిర్మాణం
విజయనగరం రూరల్: జిల్లా కేంద్రం, మహారాణిపేట సర్వే నంబర్ (టీఎస్) 569లో అన్ని అనుమతులు, ప్రభుత్వ నిబంధనల మేరకే వైఎస్సార్ సీపీ కార్యాలయం నిర్మిస్తున్నట్టు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు స్పష్టంచేశారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలను తప్పదోవ పట్టించేవిధంగా ఇటీవల కొన్ని మీడియా ఛానళ్లు, పత్రికల్లో వైఎస్సార్ సీపీ కార్యాలయ నిర్మాణంపై తప్పుడు కథనాలు ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు. ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయం ఉండాలనే ఆలోచనతో, పార్టీ ఆదేశాల మేరకు 2021లో అధికారులకు దరఖాస్తు చేశామన్నారు. నాటి అధికారులు ఎకరా స్థలాన్ని గుర్తించి, ప్రభుత్వానికి నివేదిక పంపించారని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 2022 జనవరి 12న కార్యాలయం నిర్మాణానికి స్థలం కేటాయిస్తూ 340 జీఓను జారీ చేసిందన్నారు. ఈ జీఓను అనుసరించి స్థలం కేటాయింపునకు నాటి తహసీల్దార్ విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ అనుమతులు కోరుతూ లేఖ రాయగా, మున్సిపల్ కార్పొరేషన్ ఆమోదముద్ర ఇచ్చిందన్నారు. అదే ఏడాది మే 18న కలెక్టర్ స్థలం కేటాయింపునకు ఉత్తర్వులు జారీ చేసినట్టు వెల్లడించారు. కలెక్టర్ ఉత్తర్వుల మేరకు తహసీల్దార్ 2022 జూన్ 6న ప్రభుత్వ నిబంధనల మేరకు పొజిషన్ సర్టిఫికెట్ మంజూరు చేశారని స్పష్టంచేశారు. అన్ని నిబంధనలు అనుసరించి టీఎస్ నంబర్ 569లో 33 ఏళ్ల లీజు ప్రాతిపదికన ఎకరా స్థలం కేటాయించారన్నారు. అన్ని అనుమతులు లభించిన మీదట 2023 జనవరి 28న పార్టీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్టు వెల్లడించారు. నాడు కార్యాలయ నిర్మాణానికి సంబంధించి సంబంధిత శాఖల అనుమతులు కోరుతూ దరఖాస్తు చేశామన్నారు. రెండేళ్ల నుంచి సాగుతున్న నిర్మాణ పనులు చివర దశకు చేరుకున్నాయని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక... చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చాక అక్కసుతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న వైఎస్సార్ సీపీ కార్యాలయాలకు నోటీసులు అందించే కార్య క్రమం చేపట్టిందన్నారు. దీనిలో భాగంగా తాడేపల్లిగూడెంలో ఉన్న కార్యాలయానికి అనుమతులు లేవన్న నెపంతో కూలగొట్టిందని, దీనిపై పార్టీ హైకోర్టును ఆశ్రయించినట్టు వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని భవన నిర్మాణానికి ప్రాథమిక అనుమతులు ఉన్నా, ఒకటి రెండు శాఖల అనుమతులు, వీఎంఆర్డీఏ అనుమతి లేదని నోటీసులు అందించారని తెలిపారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించగా, పూర్తి స్థాయి అనుమతులు ఉంటే భవన నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోర్టు చెప్పిందని తెలిపారు. అయితే 2026లో అగ్నిమాపక శాఖ అనుమతి లేదని మున్సిపల్ కమిషనర్ తెలపగా, నిబంధనల ప్రకారం ఎన్ఓసీ అవసరం లేదని తెలిపారన్నారు. వీఎంఆర్డీఏ నిబంధనల ప్రకారం ఓపెన్ స్థలం 14 శాతం ఉండాలన్నారని, అయితే ఆ నిబంధన కార్యాలయ నిర్మాణానికి వర్తించదని నోటీసులకు జవాబు ఇచ్చినట్టు స్పష్టంచేశారు. కొద్ది రోజుల కిందట అశోక్గజపతిరాజు కుటుంబం నుంచి స్థలం విషయంలో సమస్య లేవనెత్తి ఫిర్యాదు చేశారని, దీనిని తహసీల్దార్కు పంపించారన్నారు. ఆయన వివరణ రాగానే అప్పగిస్తామని నగరపాలక సంస్థ నుంచి నోటీసు పంపించారని వివరించారు. ఇప్పటికే కార్యాలయంలో కార్యకలాపాలు జరుగుతున్నాయని, గత నాలుగేళ్లుగా నిర్మాణం జరుగుతున్నా ఎప్పుడు లేవనెత్తని అభ్యంతరాలు ఇటీవల మీడియాలోనే చూడడం జరిగిందన్నారు. మీడియాలో వచ్చిన కథనాలు పూర్తి నిరాధారమైనవని, కనీస వివరణ తీసుకోకుండా అసత్య కథనాలు ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు. రాజకీయ పార్టీలకు పార్టీ కార్యాలయ నిర్మాణాలకు ప్రభుత్వాలకు దరఖాస్తు చేసుకుంటే నిబంధనలు అనుసరించి కేటాయించడం జరుగుతుందని, ఇటీవల తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి 66 ఏళ్ల లీజుతో రెండెకరాలు ప్రభుత్వం కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో, నిబంధనలకు లోబడి, ప్రభుత్వ జీఓ అనుసరించి, అధికారుల అన్ని అనుమతులతోనే పార్టీ కార్యాలయ నిర్మాణం చేపట్టినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నెక్కల నాయుడుబాబు, పీరుబండి జైహింద్కుమార్, గొర్లె రవికుమార్, తదితరులు పాల్గొన్నారు. తప్పుదోవ పట్టించే కథనాలు ప్రచురితం చేయడం దురదృష్టకరం నిబంధనలు, ప్రభుత్వ జీఓ ప్రకారమే ఎకరా స్థలం కేటాయింపు మీడియా సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు -
● తవ్వుకో.. దోచుకో..
వేగవతి నదిలో ఇసుక లోడింగ్ బొబ్బిలిలో ఇసుక అక్రమ వ్యాపారం జోరందుకుంది. పారాది, అలజంగి, భోజరాజపురం తదితర గ్రామాల తీరంలో వేగావతి నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు రాత్రీ పగలు తేడాలేకుండా సాగుతున్నాయి. ఇసుకాసురులు నదిని గుల్లచేస్తున్నారు. గోతులమయంగా మార్చుతున్నారు. ఇసుక తవ్వకాల విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు. మరో విశేషమేమిటంటే దొంగలు ఊళ్లు పంచుకున్నట్టు గ్రోత్సెంటర్లోని కంపెనీలకు అవసరమైన ఇసుకను సరఫరా చేసేందుకు ఒక్కోగ్రామ టీడీపీ నాయకుడు ఒక్కో కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. నదిలో ఇసుకను తవ్వుతూ గ్రోత్సెంటర్లోని కంపెనీలకు తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. ఉదయానికే గ్రోత్ సెంటర్కు ఇసుక ట్రాక్టర్లు క్యూ కడుతున్నా అటువైపు చూసేవారు లేకపోవడం గమనార్హం. రాజులపాలనలో ఇసుక అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోందని, నేతలందరికీ వాటాలు అందుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇసుక అక్రమతవ్వకాల అంశాన్ని బొబ్బిలి తహసీల్దార్ ఎం.శ్రీను వద్ద ప్రస్తావించగా ఇసుకతో వ్యాపారం చేసేవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. దాడులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇటీవల మూడు ట్రాక్టర్లను పట్టుకుని జరిమానా విధించామని చెప్పారు. – బొబ్బిలి ఇసుక తవ్వకాలతో నదిలో ఏర్పడిన గోతులు -
టెట్ను ఆఫ్లైన్లో నిర్వహించాలి
విజయనగరం అర్బన్: రాష్ట్రంలో టెట్ పరీక్షను పూర్తిగా ఆఫ్లైన్ విధానంలోనే నిర్వహించాలని, ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) డిమాండ్ చేసింది. స్థానిక అమర్ భవనంలో శుక్రవారం నిర్వహించిన సంఘం జిల్లా ద్వితీయ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానించింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నూతన పీఆర్సీ కమిషన్ను తక్షణమే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల టెట్ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలన్నారు. ఉపాధ్యాయులకు సుదీర్ఘకాలంగా రావాల్సి ఉన్న పెండింగ్ బకాయిలన్నింటినీ సకాలంలో పూర్తి స్థాయిలో విడుదల చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా అధ్యక్షుడు వై.అప్పారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర నాయకుడు కేవీ శేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి డి.శ్యామ్, జిల్లా ఆర్థిక కార్యదర్శి శ్రీనివాస్ దొర, రాష్ట్ర కౌన్సిలర్ వి.గోవిందరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు అప్పలనాయుడు, మహేష్, సునీత, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఎస్టీయూ డిమాండ్ -
ప్రమాదవశాత్తు విద్యుత్ శాఖ ఉద్యోగి మృతి
వంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములనాయుడు ప్రాజెక్ట్ ప్రధాన గేట్లు దిగువ భాగంలో విద్యుత్ శాఖ ఉద్యోగి కోమటిపల్లి సూర్యనారాయణ(60) ప్రమాదవశాత్తు మృతి చెందినట్టు హెడ్ కానిస్టేబుల్ నీలం శ్రీనివాసరావు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాలు.. రేగిడి మండల విద్యుత్ శాఖలో లైన్ ఇన్స్పెక్టర్గా సూర్యనారాయణ విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 25న విధులు ముగించుకుని ఆయన ఇంటికి రాలేదు. ప్రధాన గేట్లు దిగువ భాగంలో మృతదేహం ఉన్నట్లు గ్రామస్తులు గుర్తించి శుక్రవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి నీటిలో ఉన్న మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చిన అనంతరం వివరాలు సేకరించారు. రాజాంలోని అమ్మవారి కాలనీలో నివాసముంటున్న సూర్యనారాయణగా గుర్తించారు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి మడ్డువలస వైపు రాగా ప్రాజెక్ట్ దిగువ భాగం లోతుగా ఉండడంతో కాలు జారి నీటిలో పడిపోయి ఉంటాడని, ఈ క్రమంలో ప్రమాదవశాత్తు పడిపోయి ఉంటాడని ఆయన భార్య స్వర్ణలత ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. మృతదేహాన్ని రాజాం సీహెచ్సీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు హెచ్సీ తెలిపారు. చెరువులో దూకి వ్యక్తి.. విజయనగరం క్రైమ్ : నగరంలోని పెద్ద చెరువులో లంకేన సత్యనారాయణ(36) దూకి మృతి చెందినట్టు వన్ టౌన్ ఎస్ఐ రవి శుక్రవారం తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం కొత్తవలసకు చెందిన లంకేన లక్ష్మి తన భర్త సత్యనారాయణను విశాఖలోని మానసిక ఆరోగ్య సంరక్షణ కేంద్రానికి చికిత్స కోసం తీసుకువెళ్తుంది. ప్రయాణంలో భాగంగా విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్కు బస్సు రాగానే మతి స్థిమితం లేని సత్యనారాయణ బస్సు దిగి కనిపించకుండా పోయాడు. దీంతో స్థానిక పోలీస్స్టేషన్లో లక్ష్మి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో స్థానికుల సమాచారంతో ఓ వ్యక్తి పెద్ద చెరువులో పడి ఉన్నట్టు గుర్తించారు. విషయం తెలుసుకొని లక్ష్మి అక్కడకు వెళ్లగా అక్కడ తన భర్త చెప్పులు, తువ్వాలును గుర్తించినట్టు ఎస్ఐ తెలిపారు. భర్తకు ఉన్న మానసిక అనారోగ్యం వల్ల పెద్ద చెరువులో దూకి చనిపోయి ఉంటాడని భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
మూటల్లోనే... మట్టి నమూనాలు
● భూసార పరీక్షలపై నిర్లక్ష్యం! ● నిధులు విదల్చని టీడీపీ ప్రభుత్వం ● పరీక్షలకు నోచుకోని మట్టి నమూనాలు విజయనగరం ఫోర్ట్: వ్యవసాయ రంగానికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని చంద్రబాబు సర్కారు గొప్పలు చెబుతుంది. వాస్తవ పరిస్థితి క్షేత్ర స్థాయిలో అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. ప్రతీ రైతు భూసార పరీక్షల ఆధారంగా పంటలు సాగు చేయాలని ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. కానీ భూసార పరీక్షలు చేసేందుకు అవసరమైన నిధులు మాత్రం విదల్చకుండా చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. దీంతో పరీక్షల కోసం సేకరించిన మట్టి నమూనాలు మూటల్లోనే వ్యవసాయ పరిశోధన కార్యాలయాల్లో మూలుగుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వేలాది మట్టి నమూనాలు ఏడాది కాలంగా మూటల్లో ఉన్నాయి. భూసార పరీక్షల కోసం నిధులు విడుదల చేయకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని సర్వత్రా విమర్శలు రేగుతున్నాయి. అయినా ప్రభుత్వానికి పట్టడం లేదు. నిధుల్లేకే.. 2025 –26 సంవత్సరానికి సంబంధించి ప్రకృతి వ్యవసాయం(ఎన్ఎంఎన్ఎఫ్) కింద 33,104 మట్టి నమూనాలు సేకరించాలన్నది లక్ష్యం. ఇందుకుగాను వ్యవసాయ సిబ్బంది 32,046 మట్టి నమూనాలు సేకరించి విజయనగరంలోని భూసార పరీక్ష కేంద్రానికి పంపించారు. ఒక్కో మట్టి నమూనా పరీక్షించి కార్డు ఇచ్చేందుకు రూ.180లు ఖర్చవుతుంది. ఈ లెక్కన 33,104 మట్టి నమూనాల పరీక్షలకు రూ.59.58 లక్షలు అవసరం. 2026 ఖరీఫ్ సీజన్ వచ్చేసినా ఇంత వరకు చంద్రబాబు ప్రభుత్వం ఒక్క పైసా కూడా విదల్చలేదు. దీంతో మట్టి నమూనాలు మూటల్లోనే మూలిగే పరిస్థితి దాపురించింది. వాస్తవంగా మట్టి నమూనాలను ఏ సీజన్లో సేకరిస్తారో ఆ సీజన్ ఆరంభం నాటికి రైతులకు అందజేస్తే ప్రయోజనం ఉంటుంది. భూసార పరీక్షల ఆధారంగా పంటలు సాగు చేస్తే రైతులకు అధిక దిగుబడులు సాధించేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఆ దిశగా ప్రభుత్వం ఎటువంటి చర్యలూ చేపట్టడం లేదు. దీంతో రైతులు నష్టపోతున్నారు. ప్రోత్సాహం ఇలాగేనా.. రసాయనిక ఎరువుల వాడకానికి స్వస్తి పలికి ప్రతీ రైతు ప్రకృతి వ్యవసాయ సాగు పద్ధతిలో సాగు చేపట్టాలని చంద్రబాబు ప్రభుత్వం చెబుతుంది. ఇందుకోసమే వ్యవసాయ అధికారులు భూసార పరీక్షలు చేయిస్తున్నారు. వాటి ఫలితాలు ఆధారంగా పంటలు ప్రకృతి వ్యవసాయ సాగు పద్ధతిలో సాగు చేస్తున్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం భూసార పరీక్షలకు నిధులు ఇవ్వకపోవడంతో మట్టి పరీక్షల ఫలితాలు లేకుండానే సాగు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రతీ నమూనాకు 13 రకాల పరీక్షలు సేకరించిన ప్రతి మట్టి నమూనాకు 13 రకాల పరీక్షలు చేస్తారు. నేల స్వభావం, ఉదజని సూచిక(పీహెచ్), లవణ సూచిక(ఈసీ), సేంద్రియ కర్బనం (ఓసీ) లభ్య నత్రజని(ఎన్), లభ్య భాస్వరం, లభ్య పోటాష్, లభ్య గంధకం తదితర పరీక్షలు చేస్తారు. ఈ ఫలితాల సూచికగానే ప్రకృతి వ్యవసాయ సాగును ప్రోత్సహిస్తారు. కానీ ఈ పరీక్షలు జరపనపుడు ఏం ప్రయోజనం. చంద్రబాబు సర్కారు చెప్పిందొకటి.. చేసేదొకటి.. అన్న చందంగా వ్యవసాయంలో తన తీరును కనబరుస్తుంది. దీంతో సాగులో రైతులకు అవస్థలు తప్పడం లేదు. నిధులు ఇంకా రాలేదు.. 2025 – 26 సంవత్సరానికి సంబంధించి 33,104 భూసార పరీక్షలు చేయాలన్నది లక్ష్యం. భూసార పరీక్షల చేయడానికి అవసరమైన రూ.59.58 లక్షల నిధులు ఇంతవరకు రాలేదు. – ఎ.నిర్మలజ్యోతి , సహాయ సంచాలకులు, భూసార పరీక్ష కేంద్రం -
ఎత్తుకు పై ఎత్తులు
● అండర్–19 చెస్ పోటీలకు స్పందన విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరగనున్న అండర్ – 19 బాల, బాలికల చెస్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపికలు శుక్రవారం ముగిసాయి. చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం, ఫైర్ చెస్ స్కూల్ సంయుక్తంగా నిర్వహించిన పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి 50 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఎంపిక పోటీలో ఓపెన్ విభాగంలో ఎం.కృష్ణసాయి సూరజ్, ఎం.అరవన్, రొంగలి ప్రేమ్కుమార్, కె.హిమాంస్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న వారిలో ఉన్నారు. బాలికల విభాగంలో ఆర్వి.మాధురి మోక్షిత, కొండేటి నితీషా, ఇజ్జరోతు భావన, బైరెడ్డి షణ్ముక ప్రియ జిల్లా జట్టులో స్థానం దక్కించుకున్న వారిలో ఉన్నారు. ఎంపికైన క్రీడాకారులు జూలై నెలలో అనకాపల్లిలో జరగనున్న అండర్–19 చెస్ పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించనున్నట్టు చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం జిల్లా ప్రతినిధి కెవి.జ్వాలాముఖి తెలిపారు. పోటీలకు న్యాయ నిర్ణేతులుగా ఎ.హేమబిందు, ఉషారాణి వ్యవహరించారు. 29న నైరెడ్లో ఉచిత శిక్షణకు ఇంటర్వ్యూలు రాజాం సిటీ: స్థానిక జీఎంఆర్ నైరెడ్లో ఈ నెల 29న ఉచిత శిక్షణకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నామని డైరెక్టర్ రాజేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన 19 నుంచి 50 సంవత్సరాలలోపు సీ్త్ర, పురుషులు అర్హులని పేర్కొన్నారు. సీ్త్రలకు హోమ్ నర్సింగ్ (30 రోజులు), ఫొటో అండ్ వీడియో గ్రఫీ (31 రోజులు)లలో శిక్షణ ఉంటుందని అన్నారు. పురుషులకు సెల్ఫోన్ రిపేరింగ్ అండ్ సర్వీసింగ్ (30 రోజులు), ఫొటోగ్రఫీ అండ్ వీడియో గ్రఫీ (31 రోజులు), ఏసీ, రిఫ్రిజిరేషన్ (75 రోజులు), సీసీ టీవి ఇన్స్టాలేషన్ (13 రోజులు)లలో శిక్షణ ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు పదో తరగతి పాసై ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, విద్యార్హతల సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. శిక్షణా కాలంలో వసతి, భోజన సదుపాయం కల్పించనున్నామని, వివరాలకు 9491741129, 9866913371 నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
కనీస వేతనం పెంపునకు డిమాండ్
● ఉద్యోగ భద్రత కల్పించాలి ● సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బారావమ్మ పార్వతీపురం రూరల్ : రాష్ట్ర వ్యాప్తంగా షెడ్యూల్డ్ రంగాల్లోని పరిశ్రమలు, సంస్థల్లో పని చేస్తున్న 50 లక్షల మంది కార్మికులకు కనీస వేతనాలు పెంచాలని, నాన్ పర్మినెంట్ కార్మికులను పర్మినెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బారావమ్మ డిమాండ్ చేశారు. స్థానిక సుందరయ్య భవనంలో ‘కనీస వేతనాల సాధన’ సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత 12 ఏళ్లుగా నిత్యావసరాలు, విద్యా, వైద్య ఖర్చులు పెరుగుతున్నా కార్మికుల వేతనాలు మాత్రం పెరగలేదన్నారు. ప్రతి ఆరు నెలలకోసారి వేతనాలు సవరించాల్సి ఉన్నా.. ఆ దిశగా చర్యలు లేకపోవడంతో ప్రైవేటు సంస్థల్లో పని చేసే వారికి నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. తక్షణమే కనీస వేతనాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో జూలై నెలంతా కార్మికుల్లో విస్తృత ప్రచారం నిర్వహించి.. జూలై 30, 31 తేదీల్లో అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ఆందోళనలు చేపడతామని తెలిపారు. సదస్సులో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు డి.రమణారావు, కార్యదర్శి వై.మన్మధరావు, ఉపాధ్యక్షులు వి.ఇందిర, జి.జ్యోతి, ఎం.శివాని, వై.శాంతి కుమారి, ఇతర కార్యదర్శులు బి.వి.రమణ, ఎన్.వై.నాయుడు, ఆర్.రాము, కోశాధికారి గొర్లి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
త్యాగం, ధర్మం, మానవతా విలువలకు ప్రతీక మొహరం
పార్వతీపురం: మొహరం పర్వదినం సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు శుక్రవారం తెలిపారు. మొహరం త్యాగం, ధర్మం, మానవతా విలువలకు ప్రతీకగా నిలిచే పవిత్ర పర్వదినమని పేర్కొన్నారు. సమాజంలో శాంతి, సామరస్యం, పరస్పర గౌరవం, సోదరభావం మరింత బలోపేతం కావడానికి ఇటువంటి పండుగలు దోహదపడతాయని అన్నారు. ప్రజందరూ మోహరం పర్వదినాన్ని ప్రశాంత వాతావరణంలో పరస్పర గౌరవంతో జరుపుకోవాలని కోరారు. ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు, శాంతి, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ మొహరం శుభాకాంక్షలను తెలిపారు. స్పెషల్ క్యాంపెయిన్ డేస్గా నేడు, రేపు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(ఎస్ఐఆర్–2026) కార్యక్రమంలో భాగంగా ఈ నెల 27, 28 తేదీలను ‘స్పెషల్ క్యాంపెయిన్ డేస్’గా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.ఎన్.ప్రభాకరరెడ్డి శుక్రవారం తెలిపారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటరు నమోదు ప్రక్రియలో సేకరించిన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ను వేగవంతం చేసేందుకు జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో బూత్ లెవెల్ అధికారులు ఈ రెండు రోజులు ప్రత్యేకంగా అందుబాటులో వుండి కార్యక్రమం చేపడతారని చెప్పారు. -
చట్టబద్ధ పశు రవాణాకు రక్షణ కల్పించాలి
● లీగల్ లైవ్స్టాక్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు భరత్ విజయనగరం ఫోర్ట్: చట్టబద్ధ్ద పశు రవాణకు రక్షణ కల్పించాలని లీగల్ లైవ్స్టాక్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు భరత్ అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల నుంచి ప్రతి రోజూ పశువులను రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు చట్టబద్ధంగా రవాణ చేస్తున్నామని తెలిపారు. ఈ రవాణా కోసం ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రత్యేకంగా రుపొందించిన లైవ్ స్టాక్ వాహనాలను వినియోగిస్తున్నామని తెలిపారు. వాహనాల్లో వెంటేషన్, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సౌకర్యం, జంతువుల సంక్షేమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారుల ద్వారా జారీ చేయబడిన డిజిటల్ రూల్ 96 వెటర్నరీ హెల్త్ సర్టిఫికెట్స్ సంబంధిత అధికారుల అనుమతులు, రవాణ శాఖ ధృవీకరణలు, రాష్ట్ర స్థాయి అధికారుల అనుమతులతోనే పశువుల రవాణ నిర్వహిస్తున్నామన్నారు. అయినప్పటకీ మా వాహనాలను కొంతమంది అడ్డుకుంటున్నారని తెలిపారు. అక్రమ వసూళ్లుకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు రాఘవ, నవీన్ గణేష్, నానాజీ, నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
పోయిన మొబైల్ ఫోన్ల అప్పగింత
రాజాం సిటీ: గతంలో పోగొట్టుకున్న ఆరు మొబైల్ ఫోన్లను బాధితులకు పోలీసులు శుక్రవారం అందజేశారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన శెట్టి సురేష్, ధీరజ్కుమార్, పేర్ల పవన్కుమార్, కలిగి ఝాన్సీ, ఎర్ర శంకరరావు, బల్ల మహేష్ గతంలో ఫోన్లు పోగొట్టుకుని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారని సీఐ కె. అశోక్కుమార్ తెలిపారు. వాటిని సీఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసి బాధితులకు అందజేశామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరైన సెల్ ఫోన్ పోగొట్టుకుంటే సంబంధిత ఫోన్ కొనుగోలు చేసిన బిల్లు, ఆధార్ కార్డుతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. -
మాట నిలబెట్టుకోండి..
● మంత్రి గారూ.. సాలూరు: ‘మీ ఉద్యోగాలు తొలగించం.. అందరి ఉద్యోగాలు ఉంటాయి.. డీఎస్సీ–2025 వల్ల గిరిజన గురుకుల పాఠశాలల్లో అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఏ ఒక్కరికీ అన్యాయం జరగదంటూ హామీ ఇచ్చారు... తీరా కొత్తవారిని నియమించారు.. పాఠశాలలు ప్రారంభమై రోజులు గడుస్తున్నా తమ ఉద్యోగాల కొనసాగింపునకు రెన్యువల్ ఉత్తర్వులు ఇవ్వలేదు’... దీనికి సమా ధానం చెప్పాలంటూ రాష్ట్రవ్యాప్తంగా గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సాలూరులోని గిరిజన, సీ్త్ర సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఇంటిముందు శుక్రవారం ఆందోళన చేశారు. అక్కడే బైఠాయించి న్యాయం చేయాలంటూ నినదించారు. న్యాయం చేసేవరకు ఇక్కడ నుంచి కదిలేది లేదంటూ భీష్మించుకు కూర్చున్నారు. ప్రాణాలైనా విడుస్తామని, ఉద్యోగాలను వదలుకోలేమని స్పష్టంచేశారు. గిరిజన గురుకులాల్లో 15 ఏళ్లుగా సేవలందిస్తున్న వారిని ఉన్నఫళంగా రోడ్డున పడేయడంపై ఆందోళన వ్యక్తంచేశారు. కొత్త ఉద్యోగాలు కల్పించకుండా, ఉన్న ఉద్యోగాలు తొలగించడంపై ఆందోళన వ్యక్తంచేశారు. తమ ఉద్యోగాలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. మంత్రి ఇంటివద్దకు టీచర్లు ఒక్కొక్కరుగా చేరుకుని ఆందోళనకు దిగడంతో పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు విధులు నిర్వహించారు. ఎండలోనే గురువుల నిరసన.. మంత్రి ఇంటిముందు గంటల తరబడి ఉపాధ్యాయులు ఎండలోనే నిరసన కొనసాగించారు. టీచర్లు ఆందోళన విరమించకపోవడంతో మంత్రి సంధ్యారాణి దిగివచ్చారు. తన ఇంటి ఎదురుగా ఉన్న టీడీపీ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఉపాధ్యాయుల నుంచి ఒక్కసారి ప్రశ్నల వర్షం కురవడంతో అసహనం వ్యక్తంచేస్తూ ఇంటిలోకి వెళ్లిపోయారు. ఆందోళనకారులను తరలించేందుకు పోలీసులు సన్నాహాలు చేసే క్రమంలో... ఘటన పెద్దదవుతుందన్న ఉద్దేశంతో మంత్రి మళ్లీ ఉపాధ్యాయ సంఘ నాయకులతో మాట్లాడారు. సుమారు 216 మందికి నాన్ టీచింగ్లో సర్దుబాటు చేస్తున్నామని, మిగిలిన వారి కోసం ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు ఫైల్ పెట్టామని, ముఖ్యమంత్రి, విద్యాశాఖామంత్రితో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1456 మందికి రెన్యువల్ ఉత్తర్వులు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘ నాయకులు కోరారు. మంత్రి హామీ అమలుకు కొద్దిరోజులు సమయం ఇస్తామని, లేదంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామంటూ నాయకులు స్పష్టంచేస్తూ ఆందోళన విరమించారు. మంత్రి సంధ్యారాణి ఇంటి ముందు గురుకుల అవుట్సోర్సింగ్ టీచర్ల ధర్నా ఉద్యోగాలు తొలగించమన్న హామీని నిలబెట్టుకోవాలంటూ నినాదాలు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ -
బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్లో దొంగల హల్చల్
● బస్సెక్కుతుండగా మహిళ పుస్తెలతాడు చోరీ బొబ్బిలి: బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్లో గురువారం దొంగలు హల్చల్ చేశారు. బస్సెక్కుతున్న మహిళ మెడలోని మూడు తులాల పుస్తెలతాడుతో పాటు మరో ప్రయాణికుడి జేబులోని రూ.7వేలను కాజేశారు. బొబ్బిలి స్వామివారి వీధికి చెందిన బోరసింగి అచ్చియ్యమ్మ తల్లి, చెల్లితో కలిసి విజయనగరంలో జరుగుతున్న బంధువుల శుభకార్యానికి బయలుదేరింది. ఆర్టీసీ కాంప్లెక్స్కు వచ్చి పార్వతీపురం నుంచి విశాఖ వెళ్తున్న ఆర్టీసీ బస్సెక్కుతున్నారు. అప్పటికే అక్కడ నక్కిఉన్న దొంగ బస్సు ఎక్కుతున్న సమయంలో అచ్చియ్యమ్మ మెడలోని పుస్తెల తాడును తెంపుకు పోయాడు. ఆమె గగ్గోలు పెట్టినా ఫలితం లేకపోయింది. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదే బస్సులో ప్రయాణించేందుకు బస్సెక్కుతున్న బలిజిపేటకు చెందిన గోపాలం అనే ప్రయాణికుడి జేబులోంచి రూ.7వేలను కొట్టేశారు. ఆ సమయంలో బస్సును నిలుపుదల చేసి తనిఖీలు చేసినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న సీఐ కె.నారాయణరావు ఆర్టీసీ కాంప్లెక్స్ సీసీ ఫుటేజీలు పరిశీలించారు. ప్లాట్ఫాం పక్కనే బస్సును నిలపకుండా కొంచెం దూరంగా పెట్టడం, ఆ సమయంలోనే మరోబస్సు అటుగా వచ్చినిలపడంతో సీసీ ఫుటేజీల్లో స్పష్టత కానరావడం లేదన్నారు. పాత నేరస్తులను పట్టుకుని విచారిస్తామన్నారు. -
విజయనగరం
శోభాయమానంగా.. శిఖర ప్రతిష్ఠశుక్రవారం శ్రీ 26 శ్రీ జూన్ శ్రీ 2026మంత్రి ఇలాకాలో మట్టి మాఫియా..! మర్యాదపూర్వక కలయిక విజయనగరం క్రైమ్: గోవా రాష్ట్ర గవర్నర్ అశోక్ గజపతిరాజును అశోక్ బంగ్లాలో ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. పూలబొకేను అందజేశారు. పల్స్పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయండి విజయనగరం ఫోర్ట్: జిల్లాలో ఈ నెల 28న నిర్వహించనున్న పల్స్పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు. పల్స్పోలియో కార్యక్రమంపై గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్లో అధికారులతో మాట్లాడారు. జిల్లాలో 1180 పల్స్పోలియో బూత్లు, 21 ట్రాన్సిట్ బృందాలు, 66 మొబైల్ బృందాలు, 2,360 ఇంటింటి సర్వే బృందాలు, 5068 మంది వ్యాక్సినేటర్లు, 129 మంది సూపర్ వైజర్లు కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. 2,273 మంది హైరిస్క్ చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు అందేలా చూడాలన్నారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో నివారణ చుక్కలు వేయాలన్నారు. సమావేశంలో ఇన్చార్జి డీఎంహెచ్ఓ కె.రాణి, డీఐఓ రెడ్డి అచ్చుతకుమారి, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. ఏసీబీ వలలో ఎం.కొత్తవలస వీఆర్వో జామి/విజయనగరం క్రైమ్: జామి మండలం ఎం.కొత్తవలస వీఆర్వో కొత్తలి వీరన్న ఏసీబీ వలకు గురువారం చిక్కారు. భూమి మ్యుటేషన్ కోసం సునీత అనే మహిళా రైతు నుంచి రూ.14వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే... ఎం.కొత్తవలస గ్రామానికి చెందిన జంకల సూర్యనారాయణ, సునీత దంపతులకు 21 సెంట్లు భూమి వారసత్వంగా వచ్చింది. రీ సర్వేలో 22సెంట్ల30 లింకులు నమోదైంది. సెంటు 30 లింకులను ఆన్లైన్లో రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసేందుకు వీఆర్వో రూ.25వేలు లంచం డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేమని రైతు దంపతులు ప్రాథేయపడడంతో రూ.18000కు ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్స్గా రూ.4వేలు తీసుకున్నారు. మిగిలిన సొమ్ము ఇచ్చుకోలేని రైతు కుంటుంబం ఏసీబీని ఆశ్రయించింది. దీంతో ఏసీబీ అధికారులు వలపన్ని మహిళా రైతు సునీత నుంచి వీఆర్వో వీరన్న డబ్బులు తీసుకుని లెక్కపెడుతుండగా పట్టుకున్నారు. హెచ్ఎం గదిలో నాగుపాము వంగర: మండలంలోని అరసాడ జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుని గదిలో గురువారం నాగుపాము కలకలం సృష్టించింది. హెచ్ఎం గదిలోని బీరువా కింద ఉన్న పామును చూసి హెచ్ఎం ఖండాపు జగదీశ్వరితో పాటు ఉపాధ్యాయులు ఉలిక్కిపడ్డారు. స్నేక్ క్యాచర్కు సమాచారం ఇచ్చారు. ఆయన పాఠశాలకు చేరుకుని పామును పట్టుకొని సమీప తోటల్లో విడిచిపెట్టడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు.విజయనగరం గంటస్తంభం: అధికార బలంతో ఉమ్మడి విజయనగరం జిల్లాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. ఇసుక, మట్టి, గ్రావెల్ను అక్రమంగా తరలిస్తూ సొమ్ముచేసుకుంటోంది. వచ్చిన సొమ్మును వాటాలు వేస్తూ.. సహజవనరులను కొల్లగొడుతోంది. మాఫియా దాటికి కొండలు తరగిపోతున్నాయి. నదీ తీరాలు గోతులమయంగా మారుతున్నాయి. చెరువు గర్భాలు రూపం కోల్పోతున్నాయి. గంట్యాడ మండలం పెదవేమలి రాతి చెరువులో సాగుతున్న మట్టి అక్రమతవ్వకాలే దీనికి నిలువెత్తు నిదర్శనం. రాత్రీ పగలు తేడాలేకుండా వారం రోజులుగా యంత్రాలతో మట్టితవ్వకాలు చేపడుతూ ట్రాక్టర్లతో తరలిస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. అధికార బలంతో స్థానిక నేతలు యథేచ్ఛగా చెరువు గర్భాన్ని గుల్లచేస్తున్నారు. ప్రశ్నించిన కిందిస్థాయి సిబ్బందికి మంత్రి పేరు చెప్పి బెదిరిస్తున్నట్టు సమాచారం. ● ఆందోళనలో రైతులు రాతి చెరువులో మట్టితవ్వకాలపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇష్టారాజ్యంగా చెరువు గర్భాన్ని తవ్వేస్తే ఆయకట్టుకు సాగునీరు అందదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మట్టి తవ్వకాలను నిలిపివేయాలంటూ కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. ట్రాక్టర్లు, యంత్రాల నంబర్లు, తవ్వకాల ఫొటోలతో కూడిన ఆధారాలు సమర్పించారు. కలెక్టర్ స్పందించి తవ్వకాలను పరిశీలించాలని ఆదేశాలిచ్చినా కిందిస్థాయి అధికారులు పట్టించుకోవడంలేదని రైతులు వాపోతున్నారు. మైనింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. దీనికి అధికార పార్టీ నేత ఒత్తిడే కారణమని ఆరోపిస్తున్నారు. మట్టితవ్వకాలతో వచ్చిన సొమ్ములో వాటా వెళ్తుండడంతో పైస్థాయి అధికారుల నుంచి ఒత్తిడి లేకుండా తన పదవిని అడ్డుపెడుతున్నట్టు సమాచారం. కలెక్టర్, విజిలెన్స్ అధికారులు స్పందించకుంటే ఆందోళన చేస్తామని గ్రామస్తులు చెబుతున్నారు. విజయనగరం టౌన్: సిరుల తల్లి సాక్షాత్కరించింది. అమ్మవారిని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. జై పైడిమాంబ నినాదాలతో చదురుగుడి ప్రాంతమంతా భక్తిభావం నెలకొంది. శిఖరప్రతిష్ఠ మహోత్సవంలో ఆలయ అనువంశిక ధర్మకర్త, గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబసభ్యులతో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింహాచల దేవస్ధానం ఆగమ పాఠశాల శైవాగమ పండితులు కాళ్లకూరి సుబ్రహ్మణ్యశర్మ నేతృత్వంలో వేదపండితులు వేదమంత్రోచ్చారణలతో సంప్రదాయరీతిలో క్రతువు పూర్తిచేశారు. అనంతరం సాధారణ భక్తులకు మధ్యాహ్నం నుంచి అమ్మవారి దర్శనభాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా గోవా గవర్నర్ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపైనా ఉండాలని ఆకాంక్షించారు. విస్తరణ పనులు విజయవంతంగా పూర్తిచేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కేవలం ఆరు నెలల వ్యవధిలోనే ఆలయ విస్తరణ పనులు పూర్తిచేయడం అభినందనీయమన్నారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ అమ్మవారి ఆలయ పునఃప్రారంభ మహోత్సవాల్లో పాల్గొనడం తన పూర్వజన్మసుకృతమన్నారు. ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మీగజపతిరాజు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల కల ఇన్నాళ్లకు నెరవేరిందన్నారు. ఆలయం వద్దనున్న ఖాళీస్థలంలో భక్తులకు అవసరమైన వసతులను కల్పించనున్నామని చెప్పారు. కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్, దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్, ఆలయ ఈఓ కె.శిరీష, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ● కనుల పండువగా మహోత్సవం అమ్మవారి ఆలయ శిఖర ప్రతిష్ఠ మహోత్సవం కనులపండుగగా జరిగింది. పూసపాటి వంశీయులు శిఖరంపై ప్రతిష్ఠించిన కలశాలకు పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు శిఖరంపై ఉన్న కలశాలను దర్శనం చేసుకునే అవకాశం కల్పించారు. దీంతో భక్తులు కలశాలను తాకి తన్మయత్వం చెందారు. కలశంపై వేసిన బూరెలను తీసుకునేందుకు బారులు తీరారు. అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలను భక్తులు స్వీకరించారు. రామభద్రపురం: పాఠశాలలు ఆరంభమై పక్షం రోజులైనా పిల్లలకు విద్యామిత్ర కిట్లు పూర్తిస్థాయిలో అందలేదు. కాళ్లకు ష్యూస్ లేకుండా, పాతవి, చిరిగిన బ్యాగుల్లో పుస్తకాలు తీసుకుని తరగతులకు హాజరవుతున్నారు. మరోవైపు డొక్కా సీతమ్మ మధ్యాహ్నభోజన పథకంలో విద్యార్థులకు శనగ చిక్కీలు ఇవ్వడం లేదు. జిల్లా వ్యాప్తంగా 1766 ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 1.15 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి ప్రభుత్వం అమలు చేసిన మెనూ ప్రకారం రోజూ వండి పెడుతున్న మధ్యాహ్నభోజనంతో పాటు సోమవారం, బుధవారం, శుక్రవారాలు వేరుశనగ చిక్కీ, మంగళవారం, గురువారం, శనివారాలు రాగిజావ ఇవ్వాల్సి ఉంది. పాఠశాలలు పునఃప్రారంభం నుంచి ఇప్పటి వరకు వేరుశనగ చిక్కీలు ఏ పాఠశాలలోనూ ఇవ్వలేదు. రాగి జావ కొన్ని పాఠశాలల విద్యార్థులకే పరిమితమైంది. పోషక విలువలతో కూడిన ఆహారం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, పేద కుటుంబాలు చదువుతున్న పాఠశాలలపై శ్రద్ధ కరువైందని తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. ఏ పాఠశాలకు వెళ్లినా పిల్లలు ఏమని అడుగుతాం..వేరుశనగ చిక్కీ లు ఒక్కరోజు కూడా ఇవ్వడంలేదని చెబుతున్నారు. ఇదే విషయాన్ని రామభద్రపురం ఎంఈవో తిరుమలప్రసాద్ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా శనగ చిక్కీలు పాఠశాలలకు రాలేదన్నారు. ఉన్నతాదికారుల దృష్టిలో పెట్టామని, రాగిజావను మెనూ ప్రకారం పిల్లలందరకూ వడ్డించాలని, లేదంటే ఆయా పాఠశాలల హెచ్ఎంలపై చర్యలు తీసుకుంటామన్నారు. కొట్టక్కి మోడల్ ప్రాథమిక పాఠశాలలో శనగ చిక్కీలేని మధ్యాహ్నభోజనం తింటున్న విద్యార్థులు కార్యక్రమంలో మాట్లాడుతున్న పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి పార్వతీపురం రూరల్: అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్వతీపురంలో ‘నిషాముక్త్ భారత్ సప్తాహ్’ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఇందులో భాగంగా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి, ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి జెండా ఊపి మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పార్వతీపురం మన్యం జిల్లాను మత్తురహిత జిల్లాగా మార్చేందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. గతంలో 50 శాతంగా ఉన్న జిల్లా అక్షరాస్యత ప్రస్తుతం 86 శాతానికి చేరిందని, విద్యాపరంగా జిల్లా అగ్రస్థానంలో కొనసాగుతోందని వివరించారు. ఈ క్రమంలో యువత గంజాయి తదితర మత్తుపదార్థాల బారిన పడకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. మాదకద్రవ్యాల అక్రమరవాణా, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. మత్తు పదార్థాలకు సంబంధించి అనుమానాస్పద కార్యకలాపాలు ఎక్కడ కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. పట్టణ ప్రధాన వీధుల గుండా సాగిన ర్యాలీలో అధికారులు, పోలీసులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొని.. డ్రగ్స్కు బానిస కాబోమంటూ సామూహిక ప్రతిజ్ఞ చేశారు. భక్తిశ్రద్ధలతో పైడితల్లి ఆలయ పునఃప్రారంభం తొలిపూజలు నిర్వహించి, దర్శనం చేసుకున్న పూసపాటి వంశీయులు మధ్యాహ్నం నుంచి సాధారణ భక్తులకు దర్శనభాగ్యం గంట్యాడ మండలం రాతిచెరువులో మట్టి అక్రమ తవ్వకాలు ఆందోళనలో ఆయకట్టు రైతులు పీజీఆర్ఎస్లో ఫిర్యాదుచేసినా ఆగని మట్టి దందా మాఫియా వెనుక కీలకనేత అండదండలు ఆందోళనకు సిద్ధమవుతున్న పెదవేమలి గ్రామస్తులు అనుమతులు లేవు... చర్యలు తీసుకుంటాం... పెదవేమలి రాతి చెరువులో మట్టి తవ్వకాలకు సంబంధించి ఇరిగేషన్ శాఖ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. పర్మిషన్ లేకుండా చెరువుల్లో తవ్వకాలు జరపడం చట్టవిరుద్ధం. మా శాఖ అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా గ్రావెల్ తరలిస్తున్న వారిపై, అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారుల ఆదేశాలతో తక్షణమే విచారణ జరిపి నివేదిక సమర్పిస్తాం. – కె.శంకర్, ఇరిగేషన్ జేఈ, గంట్యాడ మండలం మంత్రి పేరు చెప్పి దోచేస్తున్నారు... పెదవేమలి రాతి చెరువులో వారం రోజులుగా రాత్రీపగలూ తేడా లేకుండా పొక్లెయిన్తో మట్టి అక్రమంగా తవ్వేస్తున్నారు. ట్రాక్టర్లతో తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. స్థానిక టీడీపీ నాయకులు మంత్రి పేరు చెప్పుకుని ఈ దోపిడీకి పాల్పడుతున్నారు. దీనిపై అన్ని ఆధారాలతో కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసినా మైనింగ్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. ఇప్పటివరకు పర్యవేక్షించలేదు. ఇది మంత్రి సొంత మండలం కావడంతో అధికారులు పూర్తిగా ఒత్తిళ్లకు లొంగిపోయారు. ఉన్నతాధికారులు రైతుల ఆవేదనను అర్థం చేసుకుని తవ్వకాలను అడ్డుకోవాలి. – వర్రి పాపునాయుడు, మాజీ సర్పంచ్, పెదవేమలి పాఠశాలల పిల్లలకు అందని శనగ చిక్కీలు ప్రభుత్వ నిర్లక్ష్యంతో అరకొర భోజనం సర్కారు తీరుపై మండిపడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఎల్నినోపై అవగాహన అవసరం పార్వతీపురం: ఎల్నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగి, నేలలో తేమ తగ్గే అవకాశం ఉందని, రైతు లు ముందస్తు ప్రణాళికలతో పంటలు సాగుచేయా లని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి సూచించారు. కలె క్టరేట్లో రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాబురావునాయుడుతో కలిసి ఎల్నినో అవగాహన కరపత్రాలను గురువారం విడుదల చేశారు. ఎల్నినో ప్రభావంతో వరి, మొక్కజొన్న, పత్తి, పప్పుధాన్యాల దిగుబడులు తగ్గే అవకాశం ఉందని, పశుగ్రాసం కొరత ఏర్పడవచ్చన్నారు. ప్రకృతి వ్యవ సాయ పద్ధతులు, దేశీ విత్తనాలతో బహుళ పంటల సాగు, తక్కువ నీటితో పంటల సాగు, పశుగ్రాస ఉత్పత్తి వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులు అవగాహన కరపత్రాల్లోని సూచనలు పాటించి నష్టాలను నివారించుకోవాలన్నారు. ‘మార్ట్’తో మార్పు.. గిరిజన రైతాంగాన్ని సుసంపన్నం చేయడమే లక్ష్యంగా 2026–31 కాలానికి మన్యం అగ్రి రూరల్ ట్రాన్స్ఫర్మేషన్(మార్ట్) కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. కలెక్టరేట్లో మార్ట్ ప్లాగ్షిప్ కార్యక్రమంపై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లా డారు. థాయ్లాండ్ తరహా ఆయిల్ పామ్, కొబ్బరి, కోకో, మిరియాలు వంటి అంతర పంటల సాగు, గట్టు మీద చెట్టు వంటి వినూత్న కార్యక్రమాలతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని అధికారులకు సూచించారు. -
గెడ్డపువలసలో మైనింగ్ దందా
భారీ స్థాయిలో జరిపిన మైనింగ్ చీపురుపల్లిరూరల్(గరివిడి): గరివిడి మండలం గెడ్డపువలస గ్రామ సమీపంలో భారీ స్థాయిలో అక్రమ మైనింగ్ దందా సాగుతోంది. గత కొన్ని నెలలుగా మైనింగ్ దందా సాగుతున్నా అటువైపు రెవెన్యూ, మైనింగ్ అధికారులు కన్నెత్తి చూడడంలేదు. ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరరావు అండదండలతో స్థానిక తాజా మాజీ సర్పంచ్, టీడీపీ నాయకుడు అక్రమ మైనింగ్ క్వారీ నిర్వహిస్తున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. సుమారు మూడు ఎకరాల విస్తీర్ణంలో 300 మీటర్ల లోతు వరకు తవ్వేశారు. ఖనిజాన్ని తరలించేందుకు సుమారు 2వందల మీటర్ల పొడువును సొరంగంలాంటి మార్గాన్ని ఏర్పాటుచేశారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ కోట్లాది రూపాయల విలువైన ఖనిజాన్ని తరలిస్తున్నారు. జేబులు నింపుకుంటున్నారు. మైనింగ్ అధికారులు వెంటనే స్పందించి అక్రమ తవ్వకాలు పరిశీలిస్తే వాస్తవాలు వెలుగుచూస్తాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని మైనింగ్ ఏడీ సూర్యచంద్ర వద్ద ప్రస్తావించగా విజిలెన్సు అఽధికారులను పంపించి పరిశీలిస్తామని, అక్రమ మైనింగ్ జరిపిన వారిపై చర్యలు చేపడతామని తెలిపారు. మూడు ఎకరాల డీ పట్టా భూముల్లో మైనింగ్ నిర్వహణ ఎమ్మెల్యే అండదండలతోనే తవ్వకాలు చోద్యం చూస్తున్న రెవెన్యూ, మైనింగ్ అధికారులు -
ఏఎన్ఎంలకు కలిసొచ్చిన జీఎన్ఎం శిక్షణ
● గత ప్రభుత్వ నిర్ణయంతో ఏఎన్ఎంలకు లబ్ధి ● జీఎన్ఎంలుగా ఉద్యోగోన్నతి విజయనగరం ఫోర్ట్: వైద్యారోగ్యశాఖలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఏఎన్ఎంలకు గొప్ప మనసుతో గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ రోజు లబ్ధి చేకూర్చింది. జీఎన్ఎం శిక్షణ తీసుకోవడానికి ఆసక్తి ఉన్న ఏఎన్ఎంలకు రెండేళ్ల పాటు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో శిక్షణ ఇప్పించారు. జిల్లాలో 88 మంది 2022 నుంచి 2024 మార్చి నెలఖారు వరకు శిక్షణ పొందారు. వీరిలో 38 మందికి జీఎఎన్ఎంలుగా నియామక ఉత్తర్వులు వచ్చాయి. వీరిలో 30 మంది జీఎంఎన్ఎంలుగా మూమెంట్ ఆర్డర్స్ కోసం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి బుధవారం వచ్చారు. అధికారులు వారికి మూమెంట్ ఆర్డర్స్ ఇవ్వడంతో కేజీహెచ్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిల్లో జీఎన్ఎంలుగా చేరారు. గత ప్రభుత్వం ఇప్పించిన శిక్షణ అవకాశం వల్లే తమకు ఉద్యోగోన్నతి లభించిందంటూ సంతోషం వ్యక్తంచేశారు. -
ఏకగ్రీవంగా విశ్రాంత ఉద్యోగుల సంఘ జిల్లా కార్యవర్గం
బొబ్బిలి: బొబ్బిలిలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ కార్యాలయంలో బుధవారం విశ్రాంత ప్రభు త్వ ఉద్యోగుల సంఘం జిల్లాశాఖ ఎన్నికలు నిర్వహించారు. సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా రౌతు రామమూర్తినాయుడు, రెడ్డి కృష్ణమూర్తి నాయుడు ఎన్నికయ్యారు. అసోసియేట్ అధ్యక్షులుగా లచ్చుపతుని జగన్నాథం, పోల సత్యంనాయుడు, ఉపాధ్యక్షులుగా ఎ.వెంకటనాయుడు, బి.కృష్ణమ్మ, ఎం.సుధాకరరావు, ఆర్.నాగేశ్వరరావును ఎన్నుకున్నారు. మరో నలుగురు కార్యదర్శులు, ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నుకుని ప్రమాణ స్వీకారం చేయించారు. రూ.60 కోట్లతో పవర్ ప్లాంట్ బొబ్బిలి: మండలంలోని నారాయణప్పవలస, కాశిందొరవలస మధ్యలో సుమారు రూ.60 కోట్లతో 18 మెగావాట్ల పవర్ప్లాంట్ను నిర్మించనున్నట్టు ఈపీడీసీఎల్ డైరెక్టర్ (ఆపరేషన్స్) టీవీ సూర్యప్రకాష్ తెలిపారు. ప్టాంట్ నిర్మాణ స్థలాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. 55 ఎకరాల స్థలంలో ప్లాంట్ను నిర్మిస్తామన్నారు. పవర్ప్లాంట్ నిర్మాణం వల్ల బొబ్బిలి ప్రాంత విద్యుత్ వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరాకు వీలుకలుగుతుందన్నారు. అనంతరం ఆయన ఈఈ కార్యాలయాన్ని సందర్శించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎస్ఈ లక్ష్మణరావు, ఈఈ బి.రఘు, ఏడీఈలు శ్రీనివాస్, భానునాయుడు పాల్గొన్నారు. -
అవినీతి దిశగా పాలన
విజయనగరం అర్బన్: జిల్లాలో అవినీతి ‘దిశ’గా పాలన సాగుతోందని, ఉపాధిహామీ నిధుల కై ంకర్యం పెద్ద ఎత్తున జరుగుతున్నా చర్యలు లేవని, అవినీతి పరులకు పాలకులే రక్షణ కవచంగా నిలుస్తున్నారంటూ పలువురు సభ్యులు ధ్వజమెత్తారు. జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును పర్యవేక్షించాల్సిన ‘దిశ’ సమీక్షా సమవేశం కూటమి నాయకుల దాటవేత ధోరణికి, అవినీతి సంరక్షణకు వేదికగా మారడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అధ్యక్షతన బుధవారం జరిగిన దిశ సమీక్ష సమావేశంలో కూటమి ప్రభుత్వ డొల్లతనం బయటపడింది. వివిధ అభివృద్ధి పనులకు కేంద్రం మంజూరు చేస్తున్న నిధులను మింగేస్తున్న అవినీతి తిమింగలాలకు సాక్షాత్తు అధికార పక్ష పెద్దలే రక్షణ కవచంగా నిలుస్తున్నారన్న దానికి సమావేశం సజీవ సాక్ష్యంగా నిలిచింది. విజయనగరం ఎంపీపీ మామిడి అప్పలనాయుడు ఆధారాలతో సహా అవినీతిని బట్టబయలు చేసినా.. ఎంపీ కనీసం బాధ్యతగా సమా ధానం చెప్పలేక చేతులెత్తేయడం గమనార్హం. విజయనగరం మండల పరిధిలో ఉపాధి హామీ పనుల్లో జరిగిన రూ.41.80 లక్షల భారీ అక్రమాలను విజయనగరం ఎంపీపీ మామిడి అప్పలనాయుడు దిశ సమావేశం దృష్టికి తెచ్చారు. ఈ నిధుల లూటీకి ఎంపీడీఓ ప్రధాన కారకుడని విచారణలో సైతం రుజువైందన్నారు. ఈ అవినీతి వ్యవహారం శాసన మండలిలో ఎమ్మెల్సీ పీవీవీ సూర్యనారాయణరాజు ప్రస్తావించినప్పుడు స్వయంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ స్పందిస్తూ సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు కూడా జారీ చేశారని గుర్తు చేశారు. ఆరు మాసాలు గడుస్తున్నా.. సదరు అవినీతి ఎంపీడీఓపై చర్యలు తీసుకోకుండా జిల్లా అధికారులు ఎందుకు తాత్సారం చేస్తున్నారని ఎంపీపీ నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, ప్రణాళిక రూపకల్పనలో స్థానిక ప్రజాప్రతినిధుల సూచనలను విస్మరిస్తున్నారన్నారు. దీనిపై ఎంపీ సమాధానం చెప్పలేక ‘ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే మీ మండల పరిషత్ సమావేశంలో చూసుకోండి’ అంటూ దాటవేశారు. అవినీతిపై చర్యలు తీసుకోమంటే మండల స్థాయికి నెట్టేయడం చూస్తుంటే... తప్పు చేసిన అధికారులను కాపాడటానికే ఈ సమీక్షలు నిర్వహిస్తున్నారా? అంటూ పలువురు సభ్యులు గుసగుసలాడారు. సమీక్ష సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ పి.సూర్యనారాయణ రాజు, ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి, జిల్లా పరిషత్ సీఈఓ నాగలక్ష్మి, సీపీఓ పి.బాలాజీ, వివిధ శాఖ జిల్లా అధికారులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం ఆదేశాలకే దిక్కులేదు సభ దృష్టికి జరజాపుపేట తాగునీటి సమస్య ఉపాధి హామీలో రూ.41.80 లక్షల స్వాహాపై ఎంపీపీ ధ్వజం అవినీతి ఎంపీడీఓపై చర్యలెందుకు తీసుకోలేదని నిలదీత మండలంలో చూసుకోమంటూ ఎంపీ కలిశెట్టి దాటవేత కేంద్ర పథకాల సమీక్ష సమావేశంలో ప్రజాప్రతినిధుల మాటకు దక్కని గౌరవం -
ముగిసిన విద్యుత్ ఉద్యోగుల క్రీడా పోటీలు
విజయనగరం: విద్యుత్ ఉద్యోగుల రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో విజయవాడ క్రీడాకారులు సత్తా చాటారు. వాలీబాల్, అథ్లెటిక్స్ విభాగాల్లో విజేతలుగా నిలిచారు. ఏపీ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్స్ స్పోర్ట్స్ కౌన్సిల్ నేతృత్వంలో ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు రాజీవ్ క్రీడా మైదానంలో నిర్వహించిన ఇంటర్ సర్కిల్ పురుషుల వాలీబాల్, అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలు బుధవారంతో ముగిశాయి. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన పోటీల్లో వాలీబాల్ పోటీల్లో విజయవాడ జట్టు విజేతగా నిలవగా.... ద్వితీయ, తృతీయ స్థానాలను విశాఖ, ఆతిధ్య విజయనగరం జట్లు చేజిక్కించుకున్నాయి. అథ్లెటిక్స్లో ఓవరాల్ ఛాంపియన్ షిప్ను విజయవాడ జట్టు దక్కించుకోగా.. రెండు, మూడుస్థానాల్లో తిరుపతి, విజయనగరం జట్లు నిలిచాయి. దాసన్నపేట విద్యుత్ భవనం ప్రాంగణంలో విజేతలకు ఏపీఈపీడీసీఎల్ ఆపరేషన్స్ డైరెక్టర్ టి.వి.సూర్యప్రకాష్, ఫైనాన్స్ డైరెక్టర్ ఎస్.హరిబాబు, ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఎస్ఈ మువ్వల లక్ష్మణరావు, పార్వతీపురం–మన్యం జిల్లా ఎస్ఈ పెద్దింటి త్రినాథరావులు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా టి.వి.సూర్యప్రకాష్, ఎస్.హరిబాబు మాట్లాడుతూ నిరంతరం విధి నిర్వహణలో ఒత్తిడి జీవనం సాగించే విద్యుత్ ఉద్యోగులకు క్రీడా పోటీలు ఉపశమనం కలిగించడంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదపడతాయని పేర్నొన్నారు. కార్యక్రమంలో విజయనగరం డివిజన్ ఈఈ పి.హరి, ఏపీ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్స్ స్పోర్ట్స్ కౌన్సిల్ సభ్యుడు వడివేలు, స్పోర్ట్స్ కౌన్సిల్ కార్యదర్శి మోహనరావు, తదితరులు పాల్గొన్నారు. వాలీబాల్ విజేత విజయవాడ జట్టు ద్వితీయ, తృతీయ స్థానాల్లో విశాఖ, విజయనగరం జట్లు అథ్లెటిక్స్ ఓవరాల్ ఛాంపియన్షిప్ కై వసం చేసుకున్న విజయవాడ రెండ, మూడు స్థానాల్లో తిరుపతి, విజయనగరం క్రీడాకారులు -
శరవేగంగా పారాది బ్రిడ్జి పనులు
● మరో నెలరోజుల్లో ప్రయాణికులకు అందుబాటులోకి.. ● వైఎస్సార్సీపీ ప్రభుత్వం చొరవతో పూర్తికావచ్చిన వంతెన నిర్మాణంబొబ్బిలి రూరల్: బొబ్బిలి మండలం పారాది వద్ద వేగావతి నదిపై గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో తలపెట్టిన నూతన వంతెన నిర్మాణ పనులు చివరిదశకు చేరుకున్నాయి. మరో నెలరోజుల్లో వంతెన నిర్మాణం పూర్తి కానుంది. వాహనచోదకులకు అందుబాటులోకి రానుంది. గత ప్రభు త్వం వంతెన నిర్మాణానికి పరిపాలనా అనుమతులతో పాటు రూ.10 కోట్లను మంజూరు చేసింది. అప్పటి ఎమ్మెల్యే శంబంగి వెంకటచినప్పలనాయుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు చొరవతో పారాది వద్ద వేగావతి నదిపై పాత వంతెన స్థానంలో కొత్త వంతెన నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. 2023లోనే బ్రిడ్జి నిర్మాణ పనులకు జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఇంతలో ప్రభుత్వం మారడంతో జీఎస్టీ నిధులు మరో రూ.3.5 కోట్లను కలిపి కాంట్రాక్టర్కు పనులు అప్పగించారు. 7 పిల్లర్లు, 8 స్లాబ్ల నిర్మాణంతో దాదాపు బిడ్జి, అప్రోచ్ రోడ్ల నిర్మాణం పూర్తికావచ్చాయి. దశాబ్దాలుగా వంతెనపై ఎదుర్కొంటున్న రాకపోకల కష్టాలు కొద్దిరోజుల్లో తొలగనున్నాయి. -
రేకుల షెడ్డు కూలి తొమ్మిది మందికి గాయాలు
వంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు సమీపంలో కొట్టిశ చేపల రేవు వద్ద రేకుల షెడ్డు కూలి బుధవారం తొమ్మిది మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఎనిమిది మంది కొట్టిశ గ్రామస్తులు కాగా, ఒకరు లక్ష్మీపేట గ్రామానికి చెందిన రైతు. కొట్టిశ సమీపంలో ఒకటిన్నర కిలోమీటరు దూరంలో ఉన్న మడ్డువలస ప్రాజెక్టులో ఏడుగురు మత్స్యకారులు చేపలు వేట చేయడానికి పడవల సహాయంతో వలలు వేసి తిరిగి ఒడ్డుకు చేరుకున్నారు. వారిలో కొట్టిశ గ్రామానికి చెందిన మత్స్యకారులు చేడిగ రామన్నదొర, యందవ సింహాచలం, కుప్పిలి వెంకయ్య, కుప్పిలి అప్పయ్య, పత్తిగూడ రాంబాబు, గంటా గౌరు, కల్లూరు సూర్యనారాయణతో పాటు సమీప పంట పొలాల్లో పశువులు మేతకు తీసుకువెళ్లిన రైతులు కొట్టిశ గ్రామానికి చెందిన రాము, లక్ష్మీపేట గ్రామానికి చెందిన కొనిశ తిరుపతిలు ఒకే ప్రదేశంలో ఉన్నారు. ఇంతలో భారీ గాలులతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఒడ్డుకు చేరుకున్న మత్స్యకారులతోపాటు రైతులు మొత్తం తొమ్మిది మంది రేకుల షెడ్డులో తలదాచుకున్నారు. ఇంతలో భారీ వర్షంతో పాటు గాలులు బీభత్సం సృష్టించగా వారు తలదాచుకున్న రేకుల షెడ్డు సుమారు 50 మీటర్లు దూరం కొట్టుకుపోయింది. అందులో ఉన్న ఈ తొమ్మిది మందికి తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న మరో మత్స్యకారుడు ఉత్తరావెల్లి చిన్నంనాయుడు, పలువురు మత్స్యకారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. డోలీల సహాయంతో క్షతగాత్రులను గ్రామ సమీపంలోకి తీసుకువచ్చారు. జరిగిన సంఘటన వివరాలను స్థానిక ఎంపీపీ ఉత్తరావెల్లి సురేష్ముఖర్జీకి వివరించారు. 108 వాహనాలకు సమాచారం అందించారు. హుటాహుటిన వంగర పీహెచ్సీకి క్షతగాత్రులను తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం 108 వాహనంలో రాజాం సీహెచ్సీకి తొమ్మిది మందిని తరలించి వైద్యసేవలందిస్తున్నారు. రాజాం సీహెచ్సీకి వంగర ఎంపీపీ ఉత్తరావెల్లి సురేష్ముఖర్జీ వెళ్లి, వైఎసా్స్ర్సీపీ రాజాం నియోజకవర్గ ఇన్చార్జ్ తలే రాజేష్ వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. కొట్టిశ చేపల రేవు వద్ద ఘటన -
సర్కారు సదరంగం
విజయనగరం ఫోర్ట్: ఏరు దాటినంత వరకు ఓడ మల్లన్న..ఏరు దాటాక బోడిమల్లన్న చందాన ఉంది సర్కారు తీరు. పనిచేయించు కోవడం, ఆ తర్వాత విస్మరించడం టీడీపీ సర్కార్కు పరిపాటిగా మారిపోయింది. సదరం సర్టిఫికెట్స్ రీవెరిఫికేషన్ చేసిన వైద్యుల పరిస్థితే ఇందుకు నిదర్శనం. రీవెరిఫికేషన్ పూర్తయి ఏడాదిన్నర అవుతున్నా వైద్యులకు టీఏ, డీఏల రూపంలో ఇవ్వాల్సిన డబ్బులు ఇంతవరకు ఇవ్వకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైద్యులు డబ్బులు కోసం గళమెత్తితే ప్రభుత్వ ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందేమోనని లోలోన మధనపడుతున్నారు. తమకు అప్పగించిన పనిని పూర్తి స్థాయిలో చేసినప్పటికీ వారికి ఇవ్వాల్సిన టీఏ, డీఏలు ఇవ్వకుండా జాప్యం ఎందుకని వైద్యులు వాపోతున్నారు. దివ్యాంగుల పింఛన్ వెరిఫికేషన్ చంద్రబాబు సర్కార్ అధికారం చేపట్టిన తర్వాత దివ్యాంగులకు పింఛన్ వెరిఫికేషన్ పేరిట సదరం క్యాంపులు నిర్వహించింది. అయితే ఈ క్యాంపులకు సర్టిఫికెట్ ఇచ్చిన వైద్యులను కాకుండా ఇతర జిల్లాల నుంచి, ఇతర ఆస్పత్రులనుంచి వైద్యులను నియమించి సదరం సర్టిఫికెట్లు రీవెరిఫికేషన్ చేయించింది. ఇందుకోసం శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలతో పాటు రాజాం, పార్వతీపురం గజపతినగరం, చీపురుపల్లి ఆస్పత్రులకు చెందిన వైద్యులు సదరం క్యాంపులకు తమ సొంత డబ్బులు పెట్టుకుని హాజరయ్యారు. సదరం క్యాంపులకు రీవెరిఫికేషన్ నిమిత్తం వచ్చిన దివ్యాంగులకు పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్స్ అప్లోడ్ చేశారు. 2025 జనవరిలో పరీక్షలు ప్రారంభం 2025 జనవరి నెలలో సదరం రీఅసెస్మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం పూర్తి కూడా అయిపోయింది. వారంలో మూడు రోజుల పాటు దివ్యాంగులకు రీ అసెస్మెంట్ చేసేవారు. బుధ, గురు, శుక్రవారరాల్లో ఆయా ఆస్పత్రుల్లో వైద్యులు రీ అసెస్మెంట్ నిర్వహించారు. 30 మంది వైద్యులు రీ అసెస్ మెంట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. 30, 867 మందికి దివ్యాంగులకు పరీక్షలు జిల్లాలో వేలాది మంది దివ్యాంగులకు వైద్యులు రీఅసెస్మెంట్ చేశారు. దివ్యాంగులకు అవసరమైన పరీక్షలు నిర్వహించి రీ అసెస్ మెంట్ సర్టిఫికెట్స్ ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. ఎముకలు, ఈఎన్టీ, మానసిక, న్యూరో విభాగాలకు సంబంధించి 35,867మంది దివ్యాంగులకు వైద్యులు రీ అసెస్మెంట్ నిర్వహించారు. రీఅసెస్మెంట్ చేసినందుకు గాను వైద్యులకు సుమారు రూ.15 లక్షలు చెల్లించాల్సి ఉంది. వైద్యులకు దివ్యాంగుల రీవెరిఫికేషన్ డబ్బులు ఇవ్వరా? నెలలు గడుస్తున్నా ఇవ్వకుండా జాప్యం రీవెరిఫికేషన్లో పాల్గొన్న వైద్యులు 30 మంది వారికి రావాల్సిన బకాయి సుమారు రూ.15 లక్షలు 35,867మంది దివ్యాంగులకు పరీక్షల నిర్వహణబిల్లులు పంపించాం దివ్యాంగులకు రీ అసెస్మెంట్ నిర్వహించడానికి వచ్చిన వైద్యులకు సంబంధించిన టీఏ, డీఏ బిల్లులు ప్రభుత్వానికి పంపించాం. ఫైనాన్స్లో బిల్లు ప్రాసెస్లో ఉందని తెలిపారు. వైద్యుల ఖాతాలకే నేరుగా డబ్బులు జమ అవుతాయి. శ్రీనివాసపాణి, పీడీ, డీఆర్డీఏ -
దేదీప్యమానం..పైడితల్లి గ్రామోత్సవం
● యాగశాలలో విశిష్ట యాగ ప్రక్రియ ● ఆకట్టుకున్న విచిత్ర వేషధారణలువిజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం పునః ప్రారంభోత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న నూతన శిఖర ప్రతిష్ట, మహా కుంభాభిషేక మహోత్సవాల్లో బుధవారం వేకువజామునుంచే అమ్మవారి యాగశాలలో విశిష్ట పూజలు నిర్వహించారు. సింహాచల క్షేత్రం నుంచి వచ్చిన వేదపండితులు అమ్మవారికి విఘ్నేశ్వరపూజ, పంచగవ్య పూజాదికాలు, సోమ కుంభత్యాది ఆవాహనలు, ప్రాతరౌపాసనలు, దిగ్దేవతా బలిహరణలు, పునః పూజలు, వాస్తుహోమం, వాస్తు బలిహరణ, పర్యగ్నికరణము, జలాదివాసం, తదితర పూజాకార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. దేవదాయశాఖ జిల్లా సహాయ కమిషనర్, ఆలయ ఈఓ కె.శిరీష స్వీయ పర్యవేక్షణ చేశారు. సాయంత్రం 4 గంటల నుంచి ధాన్యాదివాసం, బింబశుద్ధి మంటపార్చన, పంచ శయ్యాదివాసం, మూర్తన్యాసం, వివిధ రకాల హోమాలు, అనంతరం స్వస్తివాచకములు నిర్వహించారు. ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆకట్టుకున్న పైడితల్లి గ్రామ ప్రదక్షిణ పైడితల్లి అమ్మవారి చదురుగుడి ఆలయ పునఃప్రారంభ మహోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం నిర్వహించిన గ్రామ ప్రదక్షిణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారి ఉత్సవ విగ్రహంతో పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. డప్పువాయిద్యాలు, కోలాట ప్రదర్శనలు, పులివేషాలు, బిందె డ్యాన్సులు, వేదపండితుల మంత్రోచ్చారణలతో ఆధ్యాత్మిక వాతావనరణం నెలకొంది. నేడు ఆలయ శిఖర ప్రతిష్ట పైడితల్లి అమ్మవారి ఆలయ నూతన శిఖర ప్రతిష్ట మహోత్సవం గురువారం ఉదయం సుమూర్తం ప్రకారం ఉదయం 10.47 గంటలకు సింహల్నగమందు యంత్ర, శిఖర ప్రతిష్టాపన ఉంటుంది. పూర్ణాహుతి, ప్రాణ ప్రతిష్ట, జీవ కళాన్యాసములు, కుంభ దర్శనము, తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ శిరీష తెలిపారు. భక్తులందరూ అమ్మవారిని దర్శించి, తరించాలని కోరారు. -
పొలంబడి పరిమితం..!
రామభద్రపురం: చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటయ్యాక రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఖరీఫ్ సాగుకు సిద్ధమైన కర్షకులను టీడీపీ కూటమి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు మరింత కలవర పెట్టేలా ఉన్నాయి. ఇప్పటికే ఉచిత పంటల బీమా, కౌలు రైతులకు అన్నదాత సుఖీభవకు మంగళం పాడిన ప్రభుత్వం ఇప్పడు రైతులకు ఏటా ఆర్బీకేల వారీగా వ్యవసాయ విజ్ఞానాన్ని పెంచే పొలంబడి కార్యక్రమాలను నామమత్రం చేసింది. ప్రకృతి వైపరీత్యాలు, పెరుగుతున్న సాగు ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న రైతులకు వివిధ రకాల ఎరువుల ధరలను పెంచి ప్రభుత్వం షాక్ మీద షాక్లు ఇచ్చింది. ఇప్పుడేమో పొలంబడులు పరిమితం చేసి రైతులకు వ్యవసాయం సేద్యంపై అవగాహన పెంచే కార్యక్రమాలు లేవని తెలియడంతో మరింత షాక్ తగిలినట్లయింది. జిల్లాలో 13మండలాల్లో మాత్రమే పొలంబడి.. జిల్లాలోని 14 మండలాల్లో పొలంబడి కార్యక్రమాల నిర్వహణకు మంగళం పాడినట్లు తెలిసింది. వ్యవసాయ డివిజన్కు రెండు , చొప్పున మండలానికి ఒక్కొక్కటి చప్పున 13 మండలాలను పొలంబడి నిర్వహణకు ఎంపికచేశారు.అందులో బొబ్బిలి డివిజన్లో రామభద్రపురం, తెర్లాం చీపురుపల్లి డివిజన్లో చీపురుపల్లి ,మెరకముడిదాం, గజపతినగరం డివిజన్లో గజపతినగరం, మెంటాడ, విజయనగరం డివిజన్లో డెంకాడ, గంట్యాడ, కొత్తవలస డివిజన్లో నాలుగు పొలంబడి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.ఇందులో కొత్తవలస,ఎల్కోట, ఎస్కోట, వేపాడ మండలాలు ఉన్నాయి. అలాగే రాజాం డివిజన్లో రేగిడి అమదాలవలస మండలంలో మాత్రమే ఒకటి నిర్వహించనున్నారు. అయితే జిల్లాలో ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న, కంది, కూరగాయల పంటలు సాగు చేయనున్నారు.ఈ పంటలకు రసాయన ఎరువులు పురుగు మందుల వినియోగం, పంటల దిగుబడి, ఏ పొంలంలో ఏఏ పంటలు సాగుచేయాలి, ఆయా పంటల సస్యరక్షణ చర్యలపై విజ్ఞానాన్ని పెంపొందించేందుకు నిర్వహించే పొలంబడి కార్యక్రమాలను అంతంతమాత్రమే చేయడం పంటలు సేద్యం చేసే అన్నదాతను చంద్రబాబు ప్రభుత్వం మరింత ఆందోళనకు గరిచేస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. పంటల సాగు పడిపోయే ప్రమాదం ఇప్పటికే వరుస పంటనష్టాలు, వాతావరణ పరిస్థితులు, ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల కారణంగా ఈ ఏడాది ఖరీఫ్లో పంటల సాగు విస్తీర్ణం పడిపోయే ప్రమాదం లేకపోలేదని అన్నదాతలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు గడిచిన రెండేళ్లు ఖరీఫ్ సీజన్లో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, రైతులకు కాలం కలిసి రాక పంటల పెట్టుబడులు దక్కకపోవడం, ప్రభుత్వం నుంచి కనీస సహకారం లేకపోవడంమేనని రైతులు విమర్శిస్తున్నారు.ఈ ఏడాది ఎల్నినో ప్రమాదం పొంచి ఉండడం రైతులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. వర్షాలు పడతాయో లేదోనని, పడినా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్న ఉద్దేశంతో విత్తుకు రైతులు ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. వర్షాధార పంటలకే కాకుండా నీటి ఆధారిత పంటల సాగుకూ గడ్డుకాలం తప్పని పరిస్థితి.ఈ నేపథ్యంలో తక్కువ తేమతో సాగుకు అవకాశం ఉన్న స్వల్పకాలిక పంటలు సాగు,పంట మార్పిడి, ప్రత్యామ్నాయ పంటల సాగు చేసుకోవాలనే సూచనలు సలహాలకు పొలంబండులు కార్యక్రమాలు ఉపయోగపడతాయని, ఈ కార్యక్రమాలను నామమాత్రం చేసి రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదని మండిపడుతున్నారు.అలాగే గతేడాది ఖరీఫ్లో ఒక్క బస్తా యూరియా కోసం అన్నదాతలు గంటల తరబడి క్యూలో ఉండి నానా అవస్థలు పడ్డారు.చాలా చోట్ల రైతులకు అందాల్సిన యూరియా టీడీపీ నాయకులు దౌర్జన్యంగా తరలించుకుపోయారు.ఈ ఏడాది ఎరువుల ధరలు అధికంగా పెరగడంతో పాటు ఎరువులు యాప్ ద్వారా పంపిణీ అంటూ పరిమితులు అమలు చేయడం వల్ల ఖరీఫ్ పంటలు సాగు చేస్తారా? లేదా? అన్నది ప్రశ్నార్ధకంగా మారుతోంది. 14 మండలాల్లో కార్యక్రమం నిర్వహణకు మంగళం కూటమి నిర్ణయంతో కర్షకుడిలో కలవరం రైతులకు ఏటా వ్యవసాయ విజ్ఞానాన్ని పెంచే కార్యక్రమాన్ని పక్కన పెట్టిన ప్రభుత్వం పంటల సాగు పడిపోయే ప్రమాదంవైఎస్ఆర్సీపీ హయాంలో ఇలా.. వ్యవసాయంలో రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించేందుకు, పంటల సాగు సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించి నాణ్యమైన పంటలను పండించేందుకు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతులకు ఏటా ప్రతి ఆర్బీకే వారీగా వ్యవసాయ విజ్ఞానాన్ని పెంచే పొలంబడి కార్యక్రమాలను నిర్వహించింది.ఈ కార్యక్రమం ద్వారా వ్యవసాయ, ఉద్యానశాఖాధికారులతో పాటు వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులు పండించే పొలంలోకి నేరుగా వెళ్లి అక్కడ రైతులతో సమావేశం ఏర్పాటు చేసి పంటల సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించేవారు. రైతులు పండించిన పంటలు అధిక దిగుబడులు సాధించేలా సూచనలు సలహాలు ఇచ్చేవారు, దీంతో రైతులు తాము పండించిన పంటలు మార్కెట్ ధరకంటే అధిక ధరకు అమ్ముకుని లబ్ధిపొందేవారు.పొలంబడి తగ్గింపుతో రైతులకు ఇబ్బందిలేదు పొలంబడులు తగ్గించినా రైతులకు వ్యవసాయ సాగులో ఏ ఇబ్బంది ఉండదు. గ్రా మ, మండల వ్యవసాయ, ఉద్యాన అధికారులతో పాటు ఏడీఏ,డీడీలు కూడా నిత్యం రైతులకు పంటల సాగు సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పిస్తారు.పొలంబడులతో సంబంధం లేకుండా రైతులకు వ్యవసాయ విజ్ఞానాన్ని పెంచేందుకు చ ర్యలు తీసుకుంటాం.వీటీ రామారావు, జిల్లా వ్యవసాయశాఖాధికారి, విజయనగరం -
జాతీయ పోటీలకు జీఎంఆర్ ఐటీడీయూ విద్యార్థులు
రాజాం సిటీ: స్థానిక జీఎంఆర్ ఐటీ డీమ్డ్ యూనివర్సిటీ విద్యార్థులు జాతీయ స్థాయి పవర్లిఫ్టింగ్ పోటీలకు ఎంపికయ్యారని పీడీ బి.అరుణ్కుమార్ బుధవారం తెలిపారు. ఇటీవల జగ్గయ్యపేటలో నిర్వహించిన పోటీలో ఆంధ్రప్రదేశ్ తరఫున కళాశాలకు చెందిన ఎస్.అశ్రిత (69 కేజీల విభాగం), ఎం.సాయిహర్షిణి (52 కేజీల విభాగం), ఎస్.జీవన్ (83 కేజీల విభాగంలో)లు ఎంపికయ్యారన్నారు. ఈ పోటీలు ఈ నెల 25 నుంచి 30 వరకు హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగనున్నాయన్నారు. విద్యార్థుల ఎంపికపట్ల జీఎంఆర్ ఐటీ డీయూ వీసీ డాక్టర్ జె.గిరీష్, ఎగ్జిక్యూటివ్ డీన్ డాక్టర్ సీఎల్వీఆర్ఎస్వీ ప్రసాద్, స్టూడెంట్స్ డీన్ డాక్టర్ శశికుమార్, విద్యార్థులు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.శృంగవరపుకోట: మండలంలోని ధారపర్తి పంచాయతీ పరిధిలో మరో గిరిజన యువకుడిని మృత్యువు కాటేసింది. పంచాయతీ పరిధి గూనపాడు గ్రామానికి చెందిన దూసరి సోమయ్య(40) సకాలంలో వైద్యం అందక బుధవారం మృత్యువు పాలయ్యాడు. కొన్నిరోజులుగా మలేరియాతో గ్రామంలో గిరిజనం అవస్థల పాలవుతున్నారు. జ్వరంతో అవస్థ పడుతున్న సోమయ్యను ఆస్పత్రికి తరలించేందుకు గ్రామస్తులు అవస్థలు పడ్డారు. గ్రామం నుంచి డోలీ కట్టి, కిందికి మోసుకొచ్చి అక్కడి నుంచి ఆటోలో ఎస్.కోట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే సోమయ్య మృతి చెందాడని, ఆస్పత్రికి రావడం ఆలస్యమైందని వైద్యులు తేల్చిచెప్పారు. సోమయ్య మృతితో భార్య, ముగ్గురు పిల్లలు దిక్కులేక రోడ్డున పడ్డారు. దారపర్తి పంచాయతీ పరిధిలో గిరిశిఖర గ్రామాలకు గత ప్రభుత్వం హయాంలో రోడ్డు మంజూరు చేసి, నిధులు కేటాయించారు. కాగా కూటమి సర్కారు రోడ్డు నిర్మాణానికి నిధులు విడుదల చేయక గిరిజనం ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. గుమ్మలక్ష్మీపురం: ప్రేమ వివాహానికి ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోలేదని మనస్తాపం చెందిన ఓ గిరిజన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుమ్మలక్ష్మీపురం మండలంలో బుధవారం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని దుడ్డుఖల్లు పంచాయతీ కొత్తవలస గ్రామానికి చెందిన కొండగొర్రి శివ(24) ఓ యువతిని కొన్నాళ్లుగా ప్రేమిస్తున్నాడు. ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి కుటుంబసభ్యులు నిరాకరిచండంతో మంగళవారం రాత్రి కుటుంబసభ్యులతో వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన శివ గ్రామ సమీపంలోని జీడిమామిడి తోటకు వెళ్లి ఉరివేసుకున్నాడు. కొంతసేపటికి శివ ఆచూకీ కోసం గాలించిన కుటుంబసభ్యులు జీడితోటలో ఉరివేసుకుని ఉన్న శివను గుర్తించి హుటాహుటిన కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బుధవారం జిల్లా ఆస్పత్రికి తరలించి ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎల్విన్పేట పోలీసులు తెలిపారు. -
వైభవంగా పైడితల్లి ఆలయ పునఃప్రారంభోత్సవం
విజయనగరం టౌన్: మంగళవాయిద్యాలు, భక్తుల జయజయధ్వానాలు, వేదపండితుల మంత్రోచ్ఛరణాల నడుమ పైడితల్లి అమ్మవారి చదురుగుడి పునఃప్రారంభోత్సవాలు మంగళవారం వైభవంగా ఆరంభమయ్యాయి. దేవదాయశాఖ సహాయ కమిషనర్, ఆలయ ఈఓ కె.శిరీష నేతృత్వంలో మూడురోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు మంగళవారం వేదపండితులు స్వస్థివాచకములతో యాగశాల ప్రదక్షణ, పంచభూతములకు బలిహరణ, యాగశాల ప్రవేశం, పరిషత్, ప్రతిష్టా సంకల్పం, విఘ్నేశ్వరపూజ పుణ్యాహవచనం, పంచగవ్యప్రాసనలు, రుత్విక్ వరుణలు జరిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మిగజపతిరాజు పాల్గొని కంకణధారణ చేసి, అమ్మవారికి ప్రత్యేకపూజాధికాలను నిర్వహించారు. కలశాలకు అభిషేకాలు చేసి పూజాకార్యక్రమాలను ప్రారంభించారు. సాయంత్రం 4 గంటల నుంచి వేదపండితులు మత్సంగ్రహణ, అంకురారోపణ, అగ్నిప్రతిష్టాపన, ఆవరణ హోమం, సింహహోమం, మూలమంత్ర హోమాలు, పూర్ణాహుతి, భేరీపూజలు, నీరాజన మంత్రపుష్పాలను సమర్పించారు. అనంతరం ఈఓ శిరీషా మాట్లాడుతూ మూడు రోజులపాటు నిర్వహించే ఆలయ ప్రారంభోత్సవాల్లో భక్తులందరూ పాల్గొనాలని కోరారు. 25న ఆలయ శిఖర ప్రతిష్ట, మహా కుంభాభిషేక మహోత్సవాలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, ఆలయ ధర్మకర్తలు కె.టి.రావు, ఆనందరావు, స్వాతి, కుమారి, పద్మావతి, వెంకటలక్ష్మి, గోపాలరెడ్డి, కృష్ణమూర్తిరాజు, వై.వి.రమణ, రామయ్య పంతులు, తులసి, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
గురుదేవా సేవలు భేష్
● రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ చైర్మన్కొత్తవలస: మండలంలోని మంగళపాలెం గ్రామం సమీపంలో గల గురుదేవా చారిటబుల్ ట్రస్టు దివ్యాంగులు, అభాగ్యులకు అందిస్తున్న సేవలు భేష్గా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు, వయోజన వృద్ధుల కార్పొరేషన్ చైర్మన్ జి.నారాయణస్వామి కితాబిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురష్కరించుకుని ట్రస్టు ఆవరణలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు దివ్యాంగులు తమ ప్రతిభను కనబరుస్తూ వివిధ రకాల యోగాసనాలు వేసి అబ్బురపరిచారు. అనంతరం ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేన్సర్ హాస్పిటల్ను, కృత్రిమ అవయవాల తయారీ యూనిట్ను నారాయణస్వామి పరిశీలించారు. అవయవాల తయారీ విధానాన్ని ట్రస్టు చైర్మన్ రాపర్తి జగదీష్బాబు ఆయనకు వివరించారు. అనంతరం 50 మంది వృద్ధులకు పింఛన్లు, బియ్యం పంపిణీ చేశారు. అలాగే పలువురు దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను అందజేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిజేబుల్ వెల్ఫేర్ చంద్రిక, ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు. -
మ్యుటేషన్లలో అలసత్వం వద్దు
● జేసీ సేతుమాధవన్ విజయనగరం అర్బన్: భూ రికార్డుల మార్పులు, వారసత్వ బదిలీలు, కొనుగోలు, విక్రయాలకు సంబంధించిన మ్యుటేషన్ దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం చూపొద్దని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ అధికారులను అదేశించారు. రెవెన్యూ అధికారులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు జరిగిన పట్టాదారు పాస్ పుస్తకాల ముద్రణ, పంపిణీ, ఈకేవైసీ కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి దరఖాస్తును నిర్ణీత కాలవ్యవధిలో క్షుణ్ణంగా పరిశీలించి, అర్హత కలిగిన వాటిని వెంటనే పరిష్కరించడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని తెలిపారు. పెండింగ్లో ఉన్న ఖాతాలకు డిజిటల్ సంతకాలను త్వరితగతిన పూర్తిచేసి, పాస్ పుస్తకాల జనరేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ‘గుడ్ ఫర్ ప్రింటింగ్’ దశకు చేరుకున్న పాస్ పుస్తకాలను సిద్ధంచేసి, వచ్చే జూలై నెలలో రైతులకు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. రీ–సర్వే కార్యక్రమాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జేసీ స్పష్టం చేశారు. సర్వే పూర్తయిన గ్రామాల్లో రికార్డుల ధ్రువీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఈ ప్రక్రియలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో డీఆర్వో సత్తిబాబు, ఆర్డీఓలు సుధాసాగర్, సుధారాణి, సర్వే ఏడీ విజయకుమార్ పాల్గొన్నారు. -
హోరాహోరీ.. విజయమే గురి
● ఉత్కంఠ భరితంగా సాగిన విద్యుత్ ఉద్యోగుల క్రీడా పోటీలువిజయనగరం: విజయనగరం వేదికగా నిర్వహిస్తున్న విద్యుత్ ఉద్యోగుల క్రీడా పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ ఆధ్వర్యంలో నగరంలోని రాజీవ్ క్రీడామైదానం ప్రాంగణంలో మూడు రోజుల పాటు నిర్వహించతలపెట్టిన పోటీలు రెండవ రోజు మంగళవారం ఉత్కంఠ భరితంగా సాగాయి. వాలీబాల్, అథ్లెటిక్స్ క్రీడాంశాల్లో నిర్వహిస్తున్న పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు బుధవారం స్థానిక దాసన్నపేట విద్యుత్ భవనంలో ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతి ప్రదానోత్సవం చేయనున్నట్లు ఎస్ఈ మువ్వల లక్ష్మణరావు తెలిపారు. ఇదిలా ఉండగా రెండోరోజు మంగళవారం వాలీబాల్ క్రీడాంశంలో జరిగిన పోటీల్లో క్వార్టర్ ఫైనల్స్ పోటీలకు విజయనగరం, నెల్లూరు, విశాఖ, విజయవాడ జట్లు చేరుకున్నాయి. పోటీలను ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ స్పోర్ట్స్ కౌన్సిల్ ప్రధానకార్యదర్శి పి.హరి, కార్యదర్శి మోహన్, ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ కౌన్సిల్సభ్యులు వడివేలు, పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు పర్యవేక్షించారు. అథ్లెటిక్స్ పోటీల్లో విజేతలు.. షాట్ఫుట్ విభాగంలో కె.శ్రీనివాస్ (ఎన్టీటీపీఎస్), ఎస్.పోతులయ్య (అనంతపురం), కె.స్వామి మణికంఠ (రాజమండ్రి)లు మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. జావెలిన్ త్రోలో ఏఎస్. రామకృష్ణ (అనంతపురం), కె.శ్రీనివాస్ (ఎన్టీటీపీఎస్), సీహెచ్బీవీవీ పుల్లారావు (ఏలూరు) విజేతలుగా నిలిచారు. డిస్క్త్రోలో ఆంజనేయులు (విజయనగరం), పి.కుమార్ (తిరుపతి), కె.శ్రీనివాస్ (ఎన్టీటీపీఎస్) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నారు. లాంగ్జంప్లో ఆర్.బాలాజీ (తిరుపతి), కె.మణిబాబు (విజయనగరం), కె.భాస్కరరావు (శ్రీకాకుళం)లు సత్తా చాటగా..హైజంప్లో ఆర్.బాలాజీ (తిరుపతి), బీఎస్ ఇంతియాజ్ (అన్నమయ్య), కె.స్వామిమణికంఠ (రాజమండ్రి) ట్రిపుల్ జంప్లో ఆర్.బాలాజీ (తిరుపతి), కె.భాస్కరరావు (శ్రీకాకుళం), ఎన్.సాయికుమార్ (విజయనగరం) మొదటి మూడు స్థానాలు కై వసం చేసుకున్నారు. 5000 మీటర్ల పరుగు పోటీలో కేవీ నాగులు (విజయవాడ), ఎం.లక్ష్మణ్నాయక్ (అనంతపురం), ఎన్.వినీల్ (విజయవాడ)..10000 మీటర్ల పరుగు పోటీలో కేవీ నాగులు (విజయవాడ), ఎస్.జయరాజ్ (విజయనగరం), ఎన్.వినీల్ (విజయవాడ)లు..100 మీటర్ల పరుగు పోటీలో ఆర్.బాలాజీ (తిరుపతి), కేవీ నాగులు (విజయవాడ), ఎ.దివాకర్ (అనంతపురం) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. 200 మీటర్ల పరుగు పోటీలో ఆర్.బాలాజీ (తిరుపతి), పి.అనిల్కుమార్ (విజయనగరం), కేవీ నాగులు (విజయవాడ), 400 మీటర్ల పరుగు పోటీలో కేవీ నాగులు (విజయవాడ), ఎం.లక్ష్మణ్ నాయక్ (అనంతపురం) కె.లి విబాబు (విజయవాడ), 800 మీటర్ల పరుగు పోటీలో కేవీ నాగులు (విజయవాడ), ఎస్.జయరాజ్ (విజయనగరం), ఎం.లక్ష్మణ్ నాయక్ (అనంతపురం)లు విజేతలుగా నిలిచారు. -
ప్రత్యేక బస్సులు నడపండి
● ఏఐఎస్ఎఫ్ వినతి విజయనగరం గంటస్తంభం: సుదూర ప్రాంతాల నుంచి కళాశాలలకు వచ్చే విద్యార్థుల కోసం ప్రత్యేక స్టూడెంట్స్ స్పెషల్ బస్సులు నడపాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎ.చరణ్ తేజ ఆధ్వర్యంలో ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ కె.సుమిత్రకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. బస్సుల్లో రద్దీ కారణంగా సమయానికి కళాశాలలకు చేరుకోలేకపోతున్నామన్నారు. గజపతినగరం, ఎస్.కోట, నెల్లిమర్ల, పూసపాటిరేగ, భోగాపురం, పద్మనాభం తదితర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు నడపాలని కోరారు. బస్సులు వేయకుంటే ఆందోళన చేస్తామని స్పష్టంచేశారు. కార్యక్రమంలో రాము, గణేష్, ప్రకాష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బాక్సింగ్ జట్టుకు సహకారం అందించండి శృంగవరపుకోట: బాక్సింగ్ క్రీడలో జాతీయస్థాయిలో రాణిస్తున్న జిల్లా జట్టుకు తగిన ప్రోత్సాహం అందించాలని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.భరణిని విజయనగరం జిల్లా బాక్సింగ్ అసోసి యేషన్ ప్రధాన కార్యదర్శి ఇందుకూరి అశోక్రాజు కోరారు. ఎస్.కోట మండలం భవానీనగర్ వద్ద ఉన్న ఓ రిసార్ట్లో శాప్ ఎం.డి భరణిని మంగళవారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిసి దుశ్శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా అశోక్రాజు మాట్లాడుతూ జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ విజయాలు సాధిస్తున్నారని వివరించారు. క్రీడాకారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఆధునిక శిక్షణ అవకాశాలు, తగిన ప్రోత్సాహకాలు అందించాలని విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో డీఎస్డీఓ వెంకటేశ్వర్లు, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణంరాజు, బ్యాడ్మింటన్ కోచ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. అంతర్జాతీయ చెస్ పోటీల్లో జ్వాలాముఖి ప్రతిభవిజయనగరం: అంతర్జాతీయ స్థాయిలో జరిగిన చెస్ పోటీల్లో విజయనగరానికి చెందిన కేవీ.జ్వాలాముఖి తన ప్రతిభతో సత్తా చాటాడు. హైదరాబాద్లోని సరోవర్ ఇండోర్ స్టేడియంలో మూడు రోజుల పాటు నిర్వహించిన డేనిస్ ఇంటర్నేషనల్ ఫీడ్ రేటెడ్ చెస్ టోర్నమెంట్లో పీహెచ్సీ విభాగంలో ప్రాతినిధ్యం వహించిన జ్వాలాముఖి ద్వితీయ బహుమతి సాధించి రూ.6000 నగదుతో పాటు ట్రోఫీని కూడా గెలుచుకున్నారు. ఈ టోర్నమెంట్లో అమెరికా, స్వీడన్, జపాన్ , భారతదేశం నుంచి 680 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతర్జాతీయ చెస్ పోటీల్లో పాల్గొని ద్వితీయ స్థానం దక్కించుకున్న జ్వాలాముఖిని జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు కేకే.జగన్నాఽథం, కార్యదర్శి ప్రసాద్తో పాటు ఇతర కార్యవర్గ సభ్యులు, సీనియర్ చెస్ క్రీడాకారులు అభినందించారు. మరిన్ని బహుమతులు సాధంచాలని ఆకాంక్షించారు. -
సీ్త్రనిధి రుణ లక్ష్యం రూ.594 కోట్లు
కొత్తవలస: జిల్లాలోని పొదుపుసంఘాల్లో ఉన్న 61వేల మంది మహిళలకు 2026–27 ఆర్థిక సంవత్సరంలో రూ.594 కోట్లు రుణాలు అందజేయాలన్నది లక్ష్యమని సీ్త్ర నిధి ఏజీఎం బి.సత్యనారాయణ తెలిపారు. కొత్తవలస వెలుగు కార్యాలయంలో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు 8,400 మహిళలకు రూ.82 కోట్ల రుణం మంజూరు చేశామని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.283 కోట్లు రుణాలు అందజేయగా 99.96 శాతం రికవరీ అయ్యిందన్నారు. జిల్లాలోని 10 సంఘాల్లోని మహిళలు సుమారు రూ.48లక్షల రుణాన్ని సక్రమంగా చెల్లించలేదన్నారు. ఏ గ్రేడ్ సంఘానికి రూ.కోటీ80లక్షలు, బి–గ్రేడ్కు రూ.కోటీ30 లక్షలు, సీ–గ్రేడ్కు రూ.కోటి, డీ గ్రేడ్ సంఘానికి రూ.70 లక్షల వరకు రుణ పరపతిని పెంచామన్నారు. కార్యక్రమంలో ఏపీఎం ఎ.వెంకటరమణ, సీసీలు అప్పలనాయుడు, అప్పలస్వామి పాల్గొన్నారు. నవధాన్యాలతో నేల సారవంతం డెంకాడ: నవధాన్యాలు విత్తిన 30 నుంచి 40 రోజుల తర్వాత నేలలో కలియదున్నడం వల్ల భూ సారం పెరుగుతుందని జిల్లా వ్యవసాయాధికారి వి.టి.రామారావు తెలిపారు. సింగవరం గ్రామంలో ఎల్నినో ప్రభావం, పంట మార్పిడిపై రైతులకు సోమవారం అవగాహన కల్పించారు. ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని, రైతులు వరి సాగును తగ్గించి చిరుధాన్యాల సాగును పెంచాలన్నారు. ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త కె.లక్ష్మణ్ మాట్లాడుతూ రసాయన ఎరువు ఏపీఐఎంఎస్ యాప్ ద్వారా మాత్రమే రైతులకు అందిస్తామని తెలిపారు. పంట పొలాల గట్లపై వేయడానికి వంద శాతం రాయితీపై కంది విత్తనాలు ఇస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చంద్రశేఖరరావు, ఏఓ సంగీత, ఏఈఓ బి.రామకోటి, ఏఏఓ జయలక్ష్మి పాల్గొన్నారు. కాపుల సంక్షేమాన్ని గాలికొదిలేశారు ● ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ రేగిడి: రాష్ట్రంలో కాపుల సంక్షేమాన్ని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ ధ్వజమెత్తారు. కాపు కార్పొరేషన్కు చంద్రబాబు బకాయిపెట్టిన రూ.9వేల కోట్లు నిధులు విడుదలచేయాలని డిమాండ్ చేశారు. సోమవారం రేగిడి వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో కాపునేస్తం సహా ఎన్నో పథకాలను కాపులకు అందించారని గుర్తు చేశారు. చంద్రబాబుకు ఎన్నికలప్పుడే కాపులు గుర్తుకు వస్తారని విమర్శించారు. కాపు కులంలో ఉన్నవారంతా రౌడీలా!, అధికార పార్టీనేతల అరాచకాలు చంద్రబాబు కళ్లకు కనిపించడంలేదన్నారు. తగిన గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు టంకాల అచ్చెన్నాయుడు, పార్టీ మండల కన్వీనర్ వావిలపల్లి జగన్మోహనరావు, కింజరాపు సురేష్, కరణం శ్రీనివాసరావు, కెంబూరు వెంకటేశ్వరరావు, ఎర్నేన అప్పలనాయుడు, బాలి తవిటినాయుడు, బెవర అనంతనాయుడు పాల్గొన్నారు. అలసత్వం వద్దు విజయనగరం అర్బన్: ప్రభుత్వ పథకాల అమలు, ప్రజాసేవల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే క్షేత్రస్థాయి అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జేసీ ఎస్.సేతుమాధవన్ హెచ్చరించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో ఎఫ్ లైన్ సర్వే, మ్యుటేషన్, రేషన్ పంపిణీ, ఐవీఆర్ఎస్ సర్వే ఫలితాల్లో వెనుకబడిన అధికారులతో ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఐవీఆర్ఎస్ సర్వేలో ప్రజల నుంచి సానుకూల స్పందన తక్కువగా రావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్నారు. -
● కూలిబతుకులపై అక్కసు ఎందుకు?
జిల్లాలోని 11 ఎంఎల్ఎస్ పాయింట్లలో దాదాపు 40 ఏళ్లుగా పనిచేస్తున్నాం... పాత అగ్రిమెంట్ గడువు ముగిసినా, కొత్త కూలిరేట్ల ప్రకారం ఒప్పందం చేయకపోవడం దుర్మార్గం... 300 మంది హమాలీల బతుకులు అగమ్యగోచరంగా మారాయి.. కూలి బతులకుపై అంత అక్కసు ఎందుకంటూ ఏపీ సివిల్ సప్లై హమాలీస్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించింది. యూనియన్ నాయకులు ముల్లు నర్సింహులు, కండిపల్లి భీముడు, పి.కామేశ్వరరావు మాట్లాడుతూ, ప్రతినెలా 10వ తేదీలోపు బిల్లులు చెల్లించాలని, స్టేజ్–2లో సరుకులు బట్వాడా చేయాలని, అన్లోడింగ్ చార్జీలు నేరుగా అకౌంట్లలో వేయాలని, చనిపోయిన, విశ్రాంత పొందిన కలాసీలకు పీఎఫ్ వెంటేనే చెల్లించాలని డిమాండ్ చేశారు. -
అడ్డగోలు కౌన్సెలింగ్పై.. భగ్గుమన్న గురువులు
విజయనగరం అర్బన్: విజయనగరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ఎంటీఎస్ టీచర్ల బదిలీ కౌన్సెలింగ్ తీవ్ర ఉద్రిక్తతల నడుమ సాగింది. అధికారుల ఏకపక్ష నిర్ణయాలు, ఖాళీల ప్రదర్శనలో సాగిన మాయాజాలంపై ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఉపాధ్యాయులకు అనుకూలంగా తీసుకొచ్చిన జీఓ 27ను ప్రస్తుత ప్రభుత్వం తుంగలోకి తొక్కడంతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వందలాది మంది ఉపాధ్యాయులు కౌన్సెలింగ్ కేంద్రం వద్దే బైఠాయించి ఆందోళనకు దిగారు. దాదాపు మూడు గంటలపాటు కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తిగా స్తంభించి పోయింది. రాత్రికి రాత్రే ఖాళీలు మాయం! విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల పరిధిలోని 431 మంది ఎంటీఎస్ ఉపాధ్యాయుల కోసం అధికారులు తొలుత (కౌన్సెలింగ్కు ముందురోజు) 520 ఖాళీ పోస్టులను వెల్లడించారు. తీరా సోమవారం కౌన్సెలింగ్ ప్రారంభించే సమయానికి సీన్ రివర్స్ అయింది. 1:1 నిష్పత్తిలో కేవలం 431 ప్లేసులను మాత్రమే స్క్రీన్పై ప్రదర్శించారు. అందులోనూ ఉపాధ్యాయులకు అనూకూలంగా ఉండే కేటగిరీ–1, 2 ప్రాంతాల స్కూళ్లలోని ఖాళీలను పూర్తిగా తొక్కిపెట్టి, కేవలం మారుమూల ప్రాంతాలను మాత్రమే చూపించడంతో ఉపాధ్యాయులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. గురువుల గోడు వినిపించుకోకుండానే... ఉపాధ్యాయులు సుమారు మూడు గంటల పాటు కౌన్సెలింగ్ హాల్ను దిగ్భందించి నిరసన తెలిపినప్పటికీ అధికారులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను పట్టించుకోకుండా అదే మొండి వైఖరితో యథాతథంగా కౌన్సెలింగ్ ప్రక్రియను ముగించడంతో ఉపాధ్యా య లోకం తీవ్ర నిరాశతో వెనుతిరిగింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఎంటీఎస్ ఉపాధ్యాయుల ఇబ్బందులను గుర్తించి, వారి నివాస ప్రాంతాలకు సమీపంలోని మండలాల్లోనే పోస్టింగ్లు ఇచ్చేలా జీఓ నంబర్27ను అమలు చేశారు. దీనివల్ల ఎంతో మంది మహిళా సీనియర్ ఉపాధ్యాయులకు ప్రయాణ కష్టాలు తొలగాయి. సమీపంలో ఖాళీలున్నా.. మారుమూల ప్రాంతానికేనా? ముందురోజు చూపించిన 520 ఖాళీలు రాత్రికి రాత్రే ఎలా మాయమయ్యాయి? సమీప మండలాల్లో స్పష్టమైన ఖాళీలు ఉన్నప్పటికీ వాటిని ఎవరి కోసం దాచారు? గత ప్రభుత్వం ఇచ్చిన జీఓ 27ను అమలు చేయడానికి ఈ ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏంటి? కేవలం 1:1 నిష్పత్తిలోనే పోస్టులు చూపిస్తే మాకు నచ్చిన స్థానాన్ని ఎంచుకునే ‘కౌన్సెలింగ్ హక్కు’ ఎక్కడుంది? అంటూ కొందరు ఉపాధ్యాయులు అధికారులను ప్రశ్నించారు. దూర ప్రాంతాలకు వేయడంతో కన్నీటి పర్యంతమయ్యారు. జెడ్పీ చైర్మన్కు గోడువినిపించిన ఉపాధ్యాయులు కౌన్సెలింగ్ను బహిష్కరించిన ఉపాధ్యాయ ప్రతినిధులు నేరుగా జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావును ఆయన చాంబర్లో కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని తెలియజేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ వైఎస్సార్సీపీ హయాంలో ఉపాధ్యాయులకు సమీప మండలాలు కేటాయించేలా తెచ్చిన జీఓ 27ను ఇప్పుడెందుకు అమలు చేయడం లేదని విద్యాశాఖ అధికారులను చైర్మన్ ప్రశ్నించారు. డీఈఓ యు.మాణిక్యంనాయుడు స్పందిస్తూ రాష్ట్ర స్థాయి నిబంధనల మేరకు కౌన్సెలింగ్ జరుగుతోందని, జిల్లాస్థాయిలో తాము ఎలాంటి మార్పులు చేయలేమని స్పష్టంచేశారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 431 మంది ఎంటీఎస్లకు కౌన్సెలింగ్ చేపట్టాలని, వారికి సరిపడే ఖాళీలను చూపించామన్నారు. ఖాళీ పోస్టులలో 57 మాత్రమే క్లియర్ వేకెన్సీ ఉన్నాయని, మిగిలినవి క్లస్టర్ పరిధిలో క్లస్టర్ టీచర్గా పనిచేస్తారన్నారు. 431 మందిలో 2008 డీఎస్సీ టీచర్లు 97 మందికాగా, మిగిలిన వారు 1998 డీఎస్సీకి చెందిన వారు. ఎంటీఎస్ టీచర్ల కౌన్సెలింగ్లో ‘ఖాళీల’ మాయాజాలం ముందు 520 పోస్టులు చూపి... కౌన్సెలింగ్ సమయానికి 431కి పరిమితం కేటగిరీ –1, 2 ఖాళీలను తొక్కిపెట్టిన అధికారులు నిరసనలతో స్తంభించిన జెడ్పీ ప్రాంగణం 3 గంటలపాటు నిలిచిన ప్రక్రియ జీఓ 27ను తుంగలో తొక్కిన కూటమి సర్కార్ ఉపాధ్యాయుల గోడు వినని వైనం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు వద్దకు చేరిన పంచాయితీ మొండిగా ముందుకెళ్లిన విద్యాశాఖ అధికారులు ఎంటీఎస్ టీచర్ల సమస్యలను పరిష్కరించాలి ఎంటీఎస్ ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయ ప్రతినిధులు ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. సోమవారం ఆయన చాంబర్లో కలిసి ఉపాధ్యాయులు తమ ఆవేదనను వ్యక్తపరిచారు. కౌన్సెలింగ్ ప్రక్రియలో కేటగిరీ–1 ఓపెన్ వేకెన్సీలను విడుదల చేయకపోవడం వల్ల అనేక మంది ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. కౌన్సెలింగ్ ప్రక్రియలో సరైన స్పష్టత లేకపోవడం వల్ల అర్హత కలిగిన టీచర్లకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత విద్యాశాఖ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని ఈ సమస్యను పరిస్కరించేలా చొరవచూపాలని వారు కోరారు. దీనిపై జెడ్పీ చైర్మన్ స్పందిస్తూ విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి పూర్తి న్యాయబద్ధమైన రీతిలో కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగేలా కృషిచేస్తానని తెలిపారు. -
రెవెన్యూ రికార్డుల తప్పులపై రైతుల ఆగ్రహం
విజయనగరం అర్బన్: జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం నత్తనడకన సాగుతుండడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలకు జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రభుత్వ విభాగాల చుట్టూ తిరిగినా పనులు కాకపోవడంతో కలెక్టరేట్ అర్జీలతో పోటెత్తింది. ఈ రోజు ఒక్కరోజే మొత్తం 252 వినతులు రావడం జిల్లాలో పెండింగ్ సమస్యల తీవ్రతకు అద్దం అడుతోంది. ఇందులో కేవలం రెవెన్యూశాఖకు సంబంధించే అత్యధికంగా 123 ఫిర్యాదులు రావాడం గమనార్హం. రీ–సర్వే అభాసుపాలు..రైతుల ప్రదక్షిణలు జిల్లాలో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హుక్కు–భూ రక్ష (రీ–సర్వే) కార్యక్రమం క్షేత్రస్థాయిలో అభాసుపాలవుతోందనడానికి కలెక్టరేట్కు వస్తున్న ఫిర్యాదులే నిదర్శనం. రీ–సర్వే పూర్తయిన గ్రమాల్లో సరిహద్దు వివాదాలు తీవ్రమవడం, రికార్డుల్లో భారీగా తప్పులు దొర్లడం, వెబ్ల్యాండ్లో విస్తీర్ణ వ్యత్యాసాలు తలెత్తడంతో రైతులు లబోదిబోమంటున్నారు. తహసీల్దార్ కార్యాలయాల్లో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. విజయనగరం, బొబ్బిలి, చీపురుపల్లి రెవెన్యూ డివిజన్ల పరిధిలో మ్యుటేషన్లు, భూ వివాదాలు, రీ–సర్వే సమస్యలు భారీగా పెండింగ్లో ఉండడంపై కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించిన ఆయన, ఆర్డీఓలు క్షేత్రస్థాయిలో వివాదాస్పద భూములను స్వయంగా పరిశీలించాలని ఆదేశించారు. 1100 టోల్ ఫ్రీ దరఖాస్తులపై తప్పుడు నివేదికలు? రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా వచ్చే ఫిర్యాదుల పరిష్కారంలోనూ అధికారులు చేతులెత్తేస్తున్నట్లు తెలుస్తోంది. అర్జీదారులతో మాట్లాడకుండానే క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే నివేదికలు సమర్పిస్తున్నట్లు ఆరోపణలు వస్తునాయి. దీనిపై మాట్లాడిన తేదీ, సమయాన్ని రికార్డు చేయాలని కలెక్టర్ అధికారులను గట్టిగా హెచ్చరించారు. అర్జీల వెల్లువ – శాఖల వారీగా వివరాలు స్వీకరించిన 252 వినతుల్లో అత్యధికంగా రెవెన్యూ శాఖ (భూసమస్యలు)కు 123, పంచాయతీరాజ్కు 24, డీఆర్డీఏకు 22, విద్యాశాఖకు 20, విద్యుత్ శాఖకు 5, గ్రామ సచివాలయాలకు 4, వైద్యారోగ్యశాఖకు ఒకటి ఇతర విభాగాలకు 41 అర్జీలు అందాయి. ప్రజా సమస్యల పరిష్కారంలో జవాబుదారీతనం లోపించిందని, పెండింగ్లో ఉన్న అర్జీలను ఇప్పటికై నా కాలపరిమితిలో పూర్తి చేసి ప్రజలకు న్యాయం చేయాలని కలెక్టర్ అధికారులను మందలించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్, జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్.సత్తిబాబు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎస్పీ పీజీఆర్ఎస్ కు 29 ఫిర్యాదులు విజయనగరం క్రైమ్: స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 29 ఫిర్యాదులు అందాయి. బాధితుల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను ఎస్పీ దామోదర్ పరిశీలించి సంబంధిత ఎస్హెచ్ఓలతో మాట్లాడి, సమస్యలను వివరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఆదేశించారు. ఏడు రోజుల్లో ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డ డీసీఆర్మీ సీఐ కె.కుమార స్వామి, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, ఎస్సైలు ప్రభావతి, పద్మావతి సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టరేట్లో పెండింగ్ దరఖాస్తుల గుట్టలు అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి -
తాత ఒడి నుంచి మృత్యుకౌగిలికి...
ప్రమాదంలో దెబ్బతిన్న కారుపూసపాటిరేగ: ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు శ్రీకాకుళం జిల్లా కంచిలి నుంచి విశాఖపట్నానికి సోమవారం ఉదయం కారులో సంతోషంగా బయలుదేరారు. తాత, అమ్మమ్మ, మనవలు, కుమార్తె కబుర్లులో మునిగిపోయారు. అల్లుడే డ్రైవింగ్ చేస్తుండడంతో నిశ్చింతగా ప్రయాణిస్తున్నారు. ఏమైందో తెలియదు... భోగాపురం మండలం పోలిపల్లి ఫ్లైఓవర్పై కనురెప్పపాటులో కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని ఆవలవైపు ఉన్న రోడ్డుపైకి చేరింది. అంతే... అదే సమయంలో శ్రీకాకుళం వైపు వస్తున్న లారీ కారును బలంగా ఢీకొని 80 మీటర్ల మేర ఈడ్చుకుపోయింది. ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందగా, నలుగురు గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... కంచిలిలో నివసిస్తున్న మన్యాల సూరిబాబు (60), లక్ష్మి ఇంటికి అల్లుడు రాపాక కిశోర్కుమార్, కుమార్తె ఉమామహేశ్వరి, మనవడు రాపాక సాత్విక్ రిహాన్సుహాసన్ (ఏడాదిన్నర), మరో మనవరాలు, అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు చెందిన కొయ్యనేహశ్రీ ఇటీవల కారులో వచ్చారు. అక్కడ పనులు ముగించుకుని రాజమండ్రిలో శుభకార్యానికి హాజరయ్యేందుకు అందరూ బయలుదేరారు. తొలుత విశాఖపట్నం మధురవాడలో నివసిస్తున్న కిశోర్కుమార్ ఇంటికి చేరుకుని అక్కడ కాసేపు సేదతీరాక రాజమండ్రి వెళ్లాలని ప్రణాళిక వేసుకున్నారు. మరో అరగంటలో ఇంటికి చేరుకుందామన్న సమయంలో పోలిపల్లి వద్ద జాతీయరహదారిపై ఉన్న ఫ్లైఓవర్పై జరిగిన ప్రమాదంలో సూరిబాబు, మనవడు సాత్విక్రిహాసుహాసన్ దుర్మరణం చెందారు. మిగిలిన నలుగురు గాయపడ్డారు. ● హాహాకారాలు... కారును లారీ ఈడ్చుకుపోయే సమయంలో ఆ ప్రాంతమంతా హాహాకారాలతో మృత్యుఘోష వినిపించింది. స్థానికులు పరుగున వచ్చేసరికి ప్రమాదం జరిగిపోయింది. కారులో ఇరుక్కున్న రాపాక కిశోర్కుమార్ను బయటకు తీసేందుకు పోలీసులు, స్థానికులు శ్రమించారు. గ్యాస్ కట్టర్తో ఇనుపరాడ్లను కట్చేశారు. గాయపడిన వారిని సుందరపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహాలకు శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రికి తీసుకెళ్లారు. రోడ్డు మధ్య ఇరుక్కున కారును క్రేన్ సహాయంతో సీఐ కూన దుర్గాప్రసాదు, ఎస్ఐ వావిలాల పాపారావులు పక్కకు తీయించారు. అప్పటివరకు వాహనాలను సర్వీస్రోడ్డులోకి మళ్లించారు. సీఐ కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు. ● మృత్యుమార్గం పోలిపల్లి వద్ద ఉన్న ఫ్లై ఓవర్ మృత్యుమార్గంగా మారింది. వరుసగా ప్రమాదాలు జరుగుతుండడంతో వాహన చోదకులు భయాందోళన చెందుతున్నారు. ఇటీవల అదే ప్రదేశంలో జరిగిన నాలుగు ప్రమాదాల్లో 8 మంది మృత్యువాత పడగా 10 మంది వరకు క్షతగాత్రులుగా మిగిలారు. పోలిపల్లి ఫ్లై ఓవర్పై వరుస ప్రమాదాలు జరగడంతో డిజైన్లో లోపం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైవే అధికారులు రహదారిని పరిశీలించి ప్రమాదాల నివారణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పోలిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం అదుపుతప్పిన కారు డివైడర్ను దాటి వెళ్లడంతో ఢీకొన్న లారీ ఇద్దరు దుర్మరణం, నలుగురికి గాయాలు కారులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసిన పోలీసులు రోడ్డు ప్రమాదంలో ముందు సీటులో కూర్చున్న తాత, మనవడు మరణించారు. అప్పటివరకు వెనుక సీటులో ఉన్న మనవడు సాత్విక్ రిహాన్సుహాసన్ తాతవద్దకు వెళ్తానంటూ మారాం చేశాడు. దీంతో తల్లి ఉమామహేశ్వరి తండ్రి సూరిబాబుకు సాత్విక్ను అందించింది. కాసేపటికే ప్రమాదం జరగడం, మృత్యు ఒడికి చేరడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. వెనుక సీటులో ఉన్న సూరిబాబు భార్య, కుమార్తె, మరో మనుమరాలు గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. -
● డీఎస్సీ–2025లో పారదర్శకత ఎక్కడ?
డీఎస్సీ–2025 నియామక ప్రక్రియలో ప్రభుత్వం పారదర్మకతను తిలోదకాలిచ్చిందని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) మండిపడింది. పార్టీ రాష్ట్ర కార్యదర్మి సోమ రాంబాబు, జిల్లా అధ్యక్షులు బొచ్చ బుద్దుడు మాస్టారు ఆధ్వర్యంలో నిరుద్యోగులు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్మి గాలి చైతన్యకుమార్ మాట్లాడుతూ కేటగిరీ వైజ్ కటాఫ్ మార్కులు, పూర్తి మెరిట్ లిస్ట్ను పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా దాచాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. లక్షలాది మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అభ్యర్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని, సంఖ్యలతో ప్రచారం చేసుకోవడం ఆపి, నిజాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. -
గిరిజన వర్సిటీ పనులు
తుది దశలోగిరిజన యూనివర్సిటీకి శంకుస్థాపన అనంతరం మరడాం సభకు వస్తున్న అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి (ఫైల్)దత్తిరాజేరు: కేంద్రియ గిరిజన విశ్వ విద్యాలయానికి 2023 ఆగస్టు 25వ తేదీన అప్పటి, ఇప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రదాన్, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేసిన చోట శాశ్వత క్యాంపస్ పనులు రోజురోజుకు శరవేగంగా జరుగుతుండడంతో ఈప్రాంత ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. గిరిజనుల జీవితాల్లో కాంతులు నింపాలంటే ఈ విద్యాదీపం నిబంధనల ప్రకారం వారి చెంతనే ఉంచాలన్న కృతనిశ్చయంతో మాజీ మంత్రి, ప్రస్తుత శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొరలు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కలిసి మంజూరు చేయించారు. ప్రస్తుతం విజయనగరం శివారు గాజులరేగ వద్ద ఏయూ స్టడీ సెంటర్లో తాత్కాలికంగా యూనివర్సిటీ కొనసాగుతోంది. ఈ ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థను ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన సాలూరు పరిధిలోని మెంటాడ మండలం చినమేడపల్లి గజపతినగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలం మర్రివలస రెవెన్యూలలో 561.88 ఎకరాల విస్తీర్ణంలో సువిశాలమైన ప్రకృతి రమణీయతతో చక్కని ప్రాంతంలో విద్యా సౌరభాలు విర బూయనున్నాయని ఈ ప్రాంతప్రజలు విద్యావేత్తలు, మేధావులు ఆనందోత్సాహాలతో ఉన్నారు. 120 అడుగుల వెడల్పు రోడ్ల పనులతో పాటు తరగతి భవనాలు(అకడమిక్ బ్లాక్)పరిపాలన భవనం(అడ్మిన్ బిల్డింగ్)బాలికలు, బాలుర వసతి గృహాలు రానున్న 2027 విద్యా సంవత్సరానికి పూర్తి చేయడానికి జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు ఆరా తీస్తుండడంతో పనులు చక,చకా జరుగుతున్నాయని సిబ్బంది చెబుతున్నారు. ఎక్కడ చూసినా నాయకుల కృషి పైనే చర్చ ఉత్తరాంధ్రకు పెద్ద దిక్కు అయిన మాజీ మంత్రి, ప్రస్తుత రాష్ట్ర శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, అప్పటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర కలిసి వెనుకబడిన ప్రాంతంలో గిరిజన నియోజకవర్గానికి గిరిజన వర్సిటీ రావాలని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని ఒప్పించడంతో నేడు ఉమ్మడి విజయనగరం జిల్లాలో యూనివర్సిటీ నిర్మాణం జరగడం శుభ పరిణామమని పలువురు ప్రశంసిస్తున్నారు. గిరిజన యూనివర్సీటికి వైజాగ్, భోగాపురం ఎయిర్ పోర్ట్లు దగ్గరగా ఉండడం, విజయనగరం, కోమటిపల్లి, బొబ్బిలి రైల్వే స్టేషన్లు దగ్గరగా ఉండడంతో పాటు జల రవాణాకు కూడా వైజాగ్ దగ్గరవడంతో రవాణా కూడా సులభతరంగా ఉండడంతో దూర ప్రాంతాల నుంచి విద్యార్థులు ఇక్కడికి రావడం సులభంగా ఉంటుంది. -
బియ్యం షాపులో లూటీ
కొత్తవలస: నిత్యం జనసంచారం కలిగిన కొత్తవలస జంక్షన్లో దొంగలు పేట్రేగి పోయి చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కొత్తవలస జంక్షన్ నుంచి విజయనగరం రోడ్డులో గల విన్నకోటి దేదీప్య బియ్యం, నూకలు షాపులో శనివారం రాత్రి సుమారు ఒంటిగంట ప్రాంతంలో దొంగలు షట్టర్ల తాళాలు విరగ్గొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. ఆదివారం సెలవు కావడంతో షాపు యజమాని విన్నకోటి గౌతం సోమవారం ఉదయం షాపు తెరిచేందుకు వచ్చి చూడగా షట్టర్ విరగ్గొట్టి, తాళాలు కట్ చేసిన ఉన్నట్లు గుర్తించారు. వెంటనే షాపులోకి వెళ్లి చూడగా కౌంటర్లో గల రూ 20వేలు నగదు, కొన్ని బియ్యం బస్తాలు దోచుకుపోయినట్లు గుర్తించాడు. షాపు బయట, లోపల గల సీసీ కెమెరాలను పరిశీలించగా ఇద్దరు దొంగలు దొంగతనానికి పాల్పడినట్లు సీసీ ఫుటేజ్లో ఉంది. ఈ మేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
కలెక్టరేట్ వేదికగా గరం గరం
● పట్టణానికి నీళ్లు.. పల్లెకు కన్నీళ్లా? ఇప్పటికే పది ఊట బావుల నుంచి విజయనగరానికి తాగునీటిని సరఫరా చేస్తున్నారు... ఇప్పుడు మళ్లీ కొత్తగా ఊటబావులు తవ్వేందుకు సన్నాహాలు చేయడం తగదంటూ గంట్యాడ మండలం మధుపాడ గ్రామస్తులు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. ఊటబావుల తవ్వకం, నీరు మళ్లింపుతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయని, గతంలో 40 అడుగులకే లభించిన నీరు.. ఇప్పుడు 100 అడుగులకు పైగా బోర్లు తీసినా లభించడంలేదంటూ వాపోయారు. చెరువులు, వ్యవసాయ బావులు, బోర్లు ఎండిపోతున్నాయని, భవిష్యత్తులో గ్రామానికి నీటిముప్పు పొంచి ఉందని, పశు పెంపకం భారమవుతుందని, ఊటబావులు తవ్వొద్దంటూ కలెక్టర్కు విన్నవించారు. గ్రామసభ నిర్వహించకుండా, ప్రజల అభిప్రాయాన్ని పక్కనపెట్టి నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. -
● ఆర్టీసీ ప్రైవేటీకరణ యత్నాలపై నిరసన
● ఆర్టీసీని ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలి ● కలెక్టరేట్ వద్ద వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ ఆందోళన విజయనగరం: ఆర్టీసీ ప్రైవేటీకరణ ప్రయత్నాలను విరమించుకోవాలని, ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలని వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు సింగంపల్లి గణేష్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. పేదవాని వాహనం ఆర్టీసీని నిర్వీర్యం చేయోద్దంటూ నినదించారు. అనంతరం కలెక్టర్ రాంసుందర్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. నిరసన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి నెక్కల నాయుడుబాబు, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు పీరుబండి జైహింద్కుమార్లు మాట్లాడుతూ ఓవైపు ప్రజలను, మరో వైపు ఆర్టీసీ ఉద్యోగులను ఆందోళనకు గురిచేసేలా ఆర్టీసీ ప్రైవేటీకరణ ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలతో ఇప్పటికే జిల్లాలో ఎన్నో పరిశ్రమలు మూతపడి ఉపాధి అవకాశాలు కుంటుపడుతున్నాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వైద్యం, విద్యతో పాటు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తుండడంతో వెనుకబడిన విజయనగరం జిల్లా ప్రజల ఇబ్బందులు మళ్లీ మొదటికొస్తున్నాయని వాపోయారు. కార్యక్రమంలో పలువురు వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. -
● హాస్టళ్లు, స్కూళ్లలో సదుపాయాలేవి?
ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలని, విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్ఎస్యూ) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఆర్ఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్మి శాంతి మాట్లాడుతూ, ప్రభుత్వ హాస్టళ్లలో తాగునీరు, మరుగుదొడ్లు, నాణ్యమైన భోజనం లేక విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజనంలో కనీస నాణ్యత లేదని, విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న వేలాది టీచర్, లెక్చరర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యాసంస్థలకు 100 మీటర్ల పరిధిలో ఉన్న మద్యం దుకాణాలను తక్షణమే తొలగించాలని కోరారు. -
ఆలయ పునఃప్రారంభ మహోత్సవం
నేటి నుంచి పైడితల్లి ● మూడురోజుల పాటు ఉత్సవాలు ● 25న శిఖర ప్రతిష్ట మహోత్సవం ● ఏర్పాట్లు పూర్తి : ఆలయ ఈఓ కె.శిరీషవిజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు ఆలయ పునఃప్రారంభ మహోత్సవాలు మూడురోజుల పాటు నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. మంగళవారం నుంచి మూడురోజుల పాటు ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసినట్లు ఆలయ ఈఓ కె.శిరీష సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానిక మూడులాంతర్లు వద్దనున్న అమ్మవారి చదురుగుడి ఆలయ పునః ప్రారంభం నిమిత్తం గతేడాది నవంబరు నెలలో ఏర్పాట్ల పనులను ప్రారంభించామన్నారు. రానున్న పండగ నేపథ్యంలో ముందస్తుగా విస్తరణ పనులు పూర్తిచేయగలిగామని చెప్పారు. మూడురోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 23న మంగళవారం యాగశాల ప్రదక్షిణ, పంచభూతాలకు బలిహరణ, యాగశాల ప్రవేశం, పరిషత్, ప్రతిష్టా సంకల్పం, విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, పంచగవ్యప్రాసన, రుత్విక్వరుణులు, అఖండ దీపారాధన, క్షీరాభిషేకం, సాయంత్రం 4 గంటల నుంచి మత్సంగ్రహణ, అంకురారోపణ, మూలమంత్ర హోమాలు, పూర్ణాహుతి, 24న బుధవారం విఘ్నేశ్వరపూజ, వాస్తు బలిహరణ, జలాదివాసం, సాయంత్రం 4 గంటల నుంచి గ్రామ ప్రదక్షిణ, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు, మేళతాళాలతో వైభవంగా నిర్వహిస్తామన్నారు. 25న ఉదయం 7.35 గంటల నుంచి విఘ్నేశ్వరపూజ, ఉదయం 10.47 గంటలకు సింహలగ్నంలో యంత్ర,శిఖర ప్రతిష్ట స్ధాపన, పూర్ణాహుతి, ప్రతిష్టాఫలస్వీకరణ, అగ్నిప్రదక్షిణ, ప్రాణ ప్రతిష్ట, జీవ కల్యాన్యాసములు, కుంభదర్శనం, గోదర్శనం, దీక్షా విమోచనం, అన్నసమారాధన ఉంటుందన్నారు. భక్తులందరూ అమ్మవారి ఆలయ పునఃప్రారంభ మహోత్సవాల్లో పాల్గొని తరించాలని కోరారు. -
ప్రభుత్వ కళాశాల విద్యార్థినికి వీఐటీలో ఉచిత సీటు
నెల్లిమర్ల: స్థానిక సీకేఎం ప్రభుత్వ జూనియర్ కళా శాల విద్యార్థిని షేక్ షేరున్నిసా ప్రతిష్టాత్మక అమరావతి వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 100% ఉచిత ఇంజినీరింగ్ సీటు సాధించి రికార్డు సృష్టించింది. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఆమె 1000 మార్కులకు గాను 984 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచింది. దీంతో వీఐటీ సంస్థ గ్రామీణ విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన ’స్టార్స్’ పథకం కింద ఆమెకు ఈ ఉచిత సీటును కేటాయించారు. ఈ పథకం ద్వారా నాలుగేళ్ల ఇంజినీరింగ్ ట్యూషన్ ఫీజుతో పాటు హాస్టల్, భోజన వసతి ఖర్చులను కూడా వీఐటీ సంస్థే పూర్తిగా భరించనుంది. కార్పొరేట్ సంస్థలకు దీటుగా ఉచిత సీటు సాధించిన షేరున్నిసాను, ఆమె తల్లిదండ్రులను కళాశా ల ప్రిన్సిపాల్ మజ్జి సత్యనారాయణ, అధ్యాపక బృందం ప్రత్యేకంగా అభినందించారు. 6.5కేజీల గంజాయి పట్టివేతవిజయనగరం క్రైమ్: స్థానిక రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాంలపై జీఆర్పీ, ఆర్పీఎఫ్లు సోమవారం తనిఖీ నిర్వహిస్తుండగా సుమారు రూ.3లక్షల 25వేల విలువ గల 6.5కేజీల గంజాయి పట్టుబడింది. ఈ తనిఖీలో తమిళనాడు రాష్ట్రం టెంకశి జిల్లాకు చెందిన శంకలి పండా అనే వ్యక్తి ఒడిశా రాష్ట్రం బ్రహ్మపుర నుంచి సొంత గ్రామానికి గంజాయిని తరలిస్తుండగా పట్టుబడ్డాడని జీఆర్పీ ఎస్సై బాలాజీరావు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు అనంతరం అరెస్ట్ చేసి విశాఖ రైల్వే కోర్టు కు తరలించామని ఎస్సై తెలిపారు. -
చీపురుపల్లిలో పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ ప్రారంభం
చీపురుపల్లిరూరల్: పట్టణంలోని ఎస్వీఆర్ డిగ్రీ కళాశాల ఆవరణలో విజయనగరం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెపెక్స్ట్రిమ్ జిమ్ నిర్వహణలో రెండు జిల్లాల స్థాయి క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్–2026 పోటీలు ఘనంగా సోమవారం ప్రారంభమయ్యాయి. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ మాస్టర్స్ విభాగాల్లో పురుషులు, మహిళలకు ప్రత్యేకంగా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనువాసులు నాయుడు మాట్లాడుతూ చీపురుపల్లిలో ఇలాంటి క్రీడాపోటీలు నిర్వహించడం అభినందనీయమ న్నారు. ఈ ప్రాంత యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. యువత క్రీడలపై ఆసక్తి పెంచుకుని జిల్లా,రాష్ట్రస్థాయి,జాతీయస్థాయిలో ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిమ్ నిర్వాహకుడు ప్రసాద్, అసోషియేషన్సభ్యులు, క్రీడాకారులు, నాయకులు మీసాల బాలు,గవిడి సురేష్,కర్రోతు ప్రసాద్,సాయి తదితరులు పాల్గొన్నారు.40 లీటర్ల సారా స్వాధీనం● ముగ్గురిపై కేసు నమోదు కురుపాం: కురుపాం పోలీస్స్టేషన్ పరిధిలో అక్రమంగా సారా తరలిస్తున్నట్లు అందిన ముందస్తు సమాచారం మేరకు ఆదివారం నిఘా పెట్టి మీసాల శ్రీకాంత్ అనే నిందితుడిని మూలిగూడ జంక్షన్ వద్ద 40 లీటర్ల సారా, ఒక ద్విచక్రవాహనంతో పట్టుకుని అరెస్టు చేసినట్లు కురుపాం ఎస్సై పి.నారాయణరావు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ దర్యాప్తులో భాగంగా అక్రమంగా సారా తరలింపులో ప్రమేయం ఉన్న మరో ఇద్దరు నిందితులు వెలగాడ చిన్నరాయుడు, మీసాల దిలీప్లను గుర్తించి అరెస్టు చేసి ముగ్గురు నిందితులను న్యాయస్థానం ఎదుట హాజరు పరచగా న్యాయస్థానం రిమాండ్ విధించిందన్నారు. మద్యం అక్రమ తయారీ, నిల్వ, రవాణా, విక్రయాలపై జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు కొనసాగిస్తుందని, ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. ఈ దాడుల్లో ఏఎస్సై రమణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. రైల్వే ట్రాక్పై మృతదేహంసీతానగరం/బొబ్బిలి: సీతానగరం–బొబ్బిలి రైల్వే లైన్లో సోమవారం సాయంత్రం గుర్తు తెలి యని వ్యక్తి(40) మృతదేహం లభ్యమైందని జీ ఆర్పీ ఎస్సై వి.బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలియజేశారు.మృతుడి శరీరంపై ఎరుపురంగు చారలు కలిగిన షర్టు, కాఫీరంగు ఫ్యాంట్, సిమెంట్ రంగు నిక్కరు, నలుపురంగు బూట్లు ఏదైనా కంపెనీలో చేసేవిగా ఉన్నాయని పేర్కొన్నారు. ఎవరైనా గుర్తుపట్టినట్లయితే రైల్వే ఎస్సై వి.బాలాజీ రావు, వియనగరం ఫోన్ 9247585742నంబర్ లేదా జీఆర్పీ హెచ్సీ సెల్ 8309901038 నంబర్కు తెలియజేయాలని కోరారు. కొత్తవలసలో గుర్తు తెలియని మృతదేహంవిజయనగరం క్రైమ్: కొత్త వలస రైల్వే స్టేషన్ యార్డ్ వద్ద సుమారు 30 నుంచి 35 ఏళ్ల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్నట్లు జీఆర్పీ హెచ్సీ శ్రీనివాస్ ప్రసాద్ సోమవారంతెలిపారు. రైల్వే ట్రాక్ వద్ద ఎలక్ట్రికల్ పోల్ పక్కనే మృతదేహాన్ని గుర్తించామన్నారు. 5.6 అంగుళుల పొడవు, చామన ఛాయ రంగు, కుడి చేతిపై ప్రసాద్, మాయ, ఎస్పీజే అనే ఆంగ్ల అక్షరాలతో పచ్చబొట్టు ఉందన్నారు. శరీరంపై నలుపు రంగు ఫుల్ హ్యాండ్స్ షర్ట్, వైలెట్ కలర్ గల లోయర్ ధరించి ఉన్నాడని చెప్పారు. మృతదేహాన్ని గుర్తించిన వారు ఫోన్9247585742, 9440170317 నంబర్లను సంప్రదించాలని జీఆర్పీ హెచ్సీ శ్రీనివాస్ ప్రపాద్ కోరారు. -
టి.సీతారాంపురం తోటలో 8 గజరాజులు
సీతానగరం: మండలంలోని సూరంపేట కేంద్రంగా మామిడి తో టల్లో 8 ఏనుగులు సంచరిస్తున్నాయి. పగటి పూటంతా మామిడి తోటల్లో స్థావరం ఉంటూ సాయంత్రం తాన్న సీతారాంపుం గ్రామ శివారులో ఉన్న చెరువులో నీరుతాగి బీటీరోడ్డు మీదుగా ఏర్పర్చుకున్న స్థావరానికి తరలిపోతున్నాయి. జీడిమామిడి తోటల్లో కొమ్మలు విరగ్గొట్టడం, మామిడి కాయలు రాల్చడంతో రైతులు, తోటకాపరులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే 8 గజరాజులను చూసేందుకు ప్రజలు తరలివస్తున్న సమయంలో అటవీశాఖ అధికారులు, సిబ్బందితో వచ్చి వాటి దగ్గరకు వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారు. ఐదురోజులుగా స్థానికంగా ఉన్నప్పటికీ ఎటువంటి ప్రమాదం జరకుండా అటవీశాఖ అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలతో జాగ్రత్తలు చెబుతున్నారు. గుచ్చిమి, సీతారాంపురం,చిన్నారాయుడుపేట, రేపటివలస గ్రామాల ప్రజలు రాకపోకల సమయంలో జాగ్రత్తలు పాటించాలని అటవీశాఖ అధికారులు కోరుతున్నారు. -
ప్రభుత్వ కళాశాలలో ప్రవేశాలు తగ్గకూడదు
● జిల్లా వృత్తి విద్య అధికారి ఎస్.తవిటి నాయుడుగజపతినగరం: ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గకుండా చూసుకోవాలని జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి, రీజనల్ ఇన్స్పెక్షన్ అధికారి ఎస్.తవిటి నాయుడు అన్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం గజపతినగరం ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రానురాను గజపతినగరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో న్యూ అడ్మిషన్ల సంఖ్య ఎందుకు తగ్గుతూ వస్తోందని అలా తగ్గడానికి గల కారణాలు ఏమిటని స్థానిక ఉపాధ్యాయ సిబ్బందిని ఆరా తీశారు. గజపతినగరంలో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల హవా ఎక్కువగా ఉందని, దీంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ కళాశాలలో చేర్పించేందుకు ముందుకు రావడం లేదని, విద్యార్థులు కూడా ప్రైవేట్ కళాశాలల వైపే మొగ్గు చూపుతున్నారని సిబ్బంది చెప్పారు. అందువల్ల ప్రభుత్వ కళాశాలలు మరుగున పడాల్సి వస్తోందని చెప్పడంతో దీనికి ఆయన స్పందించి ఇక నుంచి అలా జరగకుండా ప్రిన్సిపాల్తో పాటు ఉపాధ్యాయ సిబ్బంది గడపగడపకు వెళ్లి విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించి అడ్మిషన్ల సంఖ్య పెరిగేలా చూసుకోవాలని ఆదేశించారు.అలాగే న్యూ అడ్మిషన్లను ఎలా చేయాలి? విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఎలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి? ఎలా మోటివేట్ చేయాలన్న అంశాలపై ఉపాధ్యాయ సిబ్బందికి తవిటి నాయుడు వివరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రకాశ రావు పట్నాయక్తో పాటు పలువురు ఉపాద్యాయ సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యుత్ ఉద్యోగుల క్రీడా సందడి
● ప్రారంభమైన ఇంటర్ సర్కిల్ వాలీబాల్, అథ్లెటిక్స్ పోటీలువిజయనగరం: ప్రజలకు అవసరమైన అత్యవసరమైన సేవల్లో ఒక్కటైన విద్యుత్ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు మానసిక ఆరోగ్యం ముఖ్యమని, అది క్రీడల ద్వారానే సాధించగలమని ఏపీఈపీడీసీఎల్ ఆపరేషన్స్ అండ్ హెచ్ఆర్ డైరెక్టర్ టి.వనజ ఉద్ఘాటించారు. ఈ మేరకు ఏపీ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్స్ స్పోర్ట్స్ కౌన్సిల్ నేతృత్వంలో ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహించతలపెట్టిన ఇంటర్ సర్కిల్ పురుషుల వాలీబాల్, అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలను సోమవారం ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని రాజీవ్ క్రీడామైదానంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముందుగా ఆమె వివిధ ఆపరేషన్ సర్కిల్స్ నుంచి వచ్చిన క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వాలీబాల్ పోటీలను తొలి సర్వ్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోటీల్లో పాల్గొనే ఉద్యోగులంతా క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించి విజయవంతం చేయాలని కోరారు. ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఎస్ఈ మువ్వల లక్ష్మణరావు మాట్లాడుతూ వివిధ సర్కిల్స్ నుంచి పోటీల్లో పాల్గొనేందుకు విచ్చేసిన క్రీడాకారులకు అవసరమైన భోజన, వసతి సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. 23 జట్లు... 350 మంది క్రీడాకారులు.. ఇదిలా ఉండగా మూడు రోజుల పాటు నిర్వహించతలపెట్టిన విద్యుత్ ఉద్యోగుల ఇంటర్ సర్కిల్ వాలీబాల్, అథ్లెటిక్స్ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సర్కిల్స్ నుంచి 23 జట్లకు చెందిన 350 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. మొత్తం రెండు క్రీడాంశాల్లో నిర్వహించే పోటీల్లో వాలీబాల్ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో ఫ్లడ్ లైట్ల వెలుగులో పోటీలు నిర్వహించనున్నారు. అదేవిధంగా అథ్లెటిక్స్ క్రీడాంశంలో పాల్గొనే క్రీడాకారులకు రన్స్, త్రోస్, జంప్స్ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు 24వ తేదీన బహుమతులు ప్రదానం చేయనున్నారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి ఎస్.వెంకటేశ్వరరా వు, విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఈఈ పి.హరి, ఏపీ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్స్ స్పోర్ట్స్ కౌన్సిల్ సభ్యుడు వడివేలు తదితరులు పాల్గొన్నారు. -
అడవి బిడ్డలం.. అక్షర జ్ఞానం కల్పించండి
శృంగవరపుకోట: ‘అడవి బిడ్డలమైన మాకు అక్షర జ్ఞానం కల్పించండి’ అంటూ మండలంలోని దారపర్తి పంచాయతీ కురిడి గ్రామానికి చెందిన విద్యార్థులు కలెక్టర్ను వేడుకున్నారు. గిరిశిఖర గ్రామమైన కురిడిలో 100 కుటుంబాలు ఉండగా 30 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. వీరంతా గ్రామంలో పాఠశాల లేకపోవడంతో నిత్యం ఆరు కిలోమీటర్లు కొండలు, గుట్టలు, వాగులు దాటి గూనపాడు గ్రామంలోని పాఠశాలకు వెళ్తున్నారు. నిత్యం అంత దూరం నడవలేక వారంలో రెండు మూడు రోజులు మాత్రమే వెళ్లగలుగుతున్నారు. మా పిల్లల విద్యాభ్యాసానికి వీలుగా గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేయండి లేదా మాస్టర్ను పంపి తమ బిడ్డలకు అక్షరాలైనా నేర్పించండి అంటూ గ్రామస్తులు కోరుతున్నారు. విద్యా ర్థుల వెతలను గుర్తించిన గిరిజన సంఘం నేత జె.గౌరీష్ దీన్ని వీడియో చేసి కలెక్టర్ను వేడుకుంటున్న దృశ్యాలను కలెక్టర్కు, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. జిల్లా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని గిరిజన సంఘం ప్రతినిధులతో పాటు గ్రామస్తులు కోరుతున్నారు. విజయనగరం అర్బన్: జిల్లా ప్రజల సమస్యల ను త్వరితగతిన పరిష్కరించేందుకు సోమవా రం కలెక్టరేట్ ఆడిటోరియంలో ‘ప్రజా సమస్య ల పరిష్కార వేదిక’ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు పాల్గొని నేరుగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తారని పేర్కొన్నారు. అర్జీదారులు దరఖాస్తుల్లో పేరు, చిరునామా, ఫోన్ నంబర్ వంటి పూర్తి వివరా లను స్పష్టంగా నమోదు చేయాలని, సమస్య కు సంబంధించిన ఆధారాలను జత పరచాలని సూచించారు. గతంలో ఫిర్యాదు చేసిన వారు పాత అర్జీ రశీదును తప్పనిసరిగా తీసుకురావా లని తెలిపారు. కలెక్టరేట్కు రాలేని వారు 1100 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయడం ద్వారా లేదా ‘మీకోసం.ఏపీ.జీఓవి.ఐఎన్’ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ‘రెవెన్యూ క్లినిక్’ నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. పార్వతీపురం రూరల్: జిల్లాలోని ప్రతి పాఠశాల విద్యార్థికి సూర్య నమస్కారాలను తప్పనిసరి చేసిన తొలి జిల్లాగా పార్వతీపురం మన్యం రికార్డు సృష్టించిందని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. ఆయుష్ శాఖ, జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదా నంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్స వం ఆదివారం నిర్వహించారు. కలెక్టర్తో పాటు అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. -
నీట్ ప్రశాంతం
విజయనగరం అర్బన్: జిల్లాలో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల ప్రవేశ పరీక్ష నీట్–యూజీ 2026 ఆదివారం ప్రశాంత వాతావరణంలో ముగిసింది. పట్టణంలో ఏర్పాటు చేసిన 6 పరీక్ష కేంద్రాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 1,901 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా 1,867 మంది హాజరై పరీక్ష రాశారు. 34 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్ష నిర్వహణను పర్యవేక్షించేందుకు నియమితులైన జాయింట్ కలెక్టర్ (నోడల్ అధికారి) సేతుమాధవన్ పరీక్ష కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు పోలీస్, విద్యా శాఖ సహా సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేసినట్లు అధికారులు తెలిపారు. పటిష్ట పోలీసు భద్రత నడుమ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్టు ఎస్పీ దామోదర్ వెల్లడించారు. నగరంలో ఏపీ మోడల్ స్కూల్, పాలిటెక్నిక్ కళాశాల, కస్పా హైస్కూల్, కేంద్రీయ విద్యాలయం, జేఎన్టీయూ కేంద్రాల్లో జరిగిన పరీక్షలను ఎస్పీ సందర్శించి భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్ష రాసేందుకు వస్తున్న విద్యార్థిని -
అనారోగ్యంతో కేజీబీవీ విద్యార్థిని మృతి
● కడుపునొప్పి, పిట్స్ రావడంతోనే... ● ఆస్పత్రికి తరలించినా.. ఫలితం దక్కలేదు.. ● కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు ● బక్కునాయుడుపేట కస్తూర్బాలో కలకలం వేపాడ: మండలంలోని బక్కునాయుడుపేట కస్తూర్బా బాలికల విద్యాలయంలో తొమ్మిది తరగతి చదువుతు న్న వారాది బిందు కడుపునొప్పి, పిట్స్ రావడంతో మృతి చెందిన సంఘట న కలకలం రేపింది. బిందు మృతికి సంబంధించి ఉపాధ్యాయులు, పీహెచ్సీ వైద్యులు అందించిన వివరాలు.. మండలంలోని జాకేరు గ్రామాని కి చెందిన వారాది గణపతి, మంగ దంపతుల కుమార్తె బిందు. బక్కునాయుడుపేట కేజీబీవీలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆదివారం ఉదయం 6.30 గంటల సమయంలో బిందు కడుపునొప్పిగా ఉందని తోటి విద్యార్థులకు చెప్పగానే నైట్ డ్యూటీలో ఉన్న మేడమ్ రోహిణీకి సమాచారం ఇచ్చారు. మేడమ్ వెళ్లిచూడగా కడుపునొప్పితో పాటు నోటి నుంచి కొంచెం సొంగలు రావడంతో ఎంపీహెచ్డబ్ల్యూ బి.అరుణ వచ్చి చూశారు. పిట్స్లా ఉందని వెంటనే వేపాడ పీహెచ్సీకి ఆటోలో తరలించారు. బిందు తల్లిదండ్రులకు, ప్రిన్సిపాల్కు ఉపాధ్యాయులు సమాచారం ఇచ్చారు. వేపాడ ఆస్పత్రికి రాగానే స్టాఫ్నర్సు తనిఖీ చేసి సీరియస్గా ఉందని ఎస్.కోట తరలించేందుకు అంబులెన్స్లో ఎక్కించి ప్రధమ చికిత్స అందించే సమయానికి బిందు మరణించినట్టు గుర్తించారు. దీంతో ఆస్పత్రికి చేరుకున్న బిందు తల్లిదండ్రులు తమ గ్రామం జాకేరుకు మృతదేహాన్ని తీసుకువెళ్లారు. సమాచారం తెలుసుకున్న ప్రిన్సిపాల్ కిరణ్మయి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో డీఈఓ మాణిక్యంనాయుడు, జీసీడీఓ మాలతి, జీసీడీఓ చైర్మన్ సన్యాసిరాజు జాకేరు వచ్చి తమ సంతాపం తెలిపారు. తల్లిదండ్రులను ఓదార్చారు. బిందుకు తల్లిదండ్రులతో పాటు ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. 15 రోజులు క్రితమే... మృతి చెందిన బిందు 15 రోజుల కిందటే రజస్వల కావడంతో ఈ నెల 7వ తేదీన జాకేరులో వాణి ఫంక్షన్ చేశారు. ఇంతలోనే బిందు మృతి చెందడంతో తల్లిదండ్రులతో పాటు బంధువులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. బిందు తండ్రి గణపతి కేజీబీవీ పాఠశాల ఎస్ఎంసీలో ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. బిందు మృతిపై వేపాడ పీహెచ్సీ వైద్యాధికారిణి డా.ప్రేరణ వద్ద ప్రస్తావించగా తాను యోగా వద్ద ఉన్నానని, విధుల్లో ఉన్న స్టాఫ్నర్సు తనిఖీ చేయగా అప్పటికే పల్స్ పడిపోయినట్టు గుర్తించి ఎస్.కోట తరలించేందుకు అంబులెన్స్ సిద్ధం చేశారని, ప్రధమ చికిత్సకు సిద్ధం చేసినా ప్రయోజనం లేకపోయిందన్నారు. కేజీబీవీ సిబ్బంది బిందు దహన ఖర్చులకుగాను కుటుంబీకులకు రూ.10వేలు అందజేశారు. బిందు మృతితో కేజీబీవీలోని తోటి విద్యార్థినులు కలత చెందారు. కన్నీరుమున్నీరై విలపించారు. -
పైసా వసూల్..!
● సర్వజన ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్లో రూ.వేలల్లో అక్రమ వసూళ్లు! ● ఆరోగ్యశ్రీ వర్తించినా.. వసూళ్లుకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు ● విస్తుపోతున్న రోగులు రామతీర్థంలో యోగా సాధనలో ఆలయ ఈఓ, అర్చకులు, భక్తులువిజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్లో గతానికి భిన్నంగా పైసలు వసూళ్లు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా రోగులను వార్డుకు తరలించడానికి, వార్డు నుంచి ఆపరేషన్ థియేటర్కు తీసుకువెళ్లేందుకు సిబ్బంది రూ.500 నుంచి వెయ్యి వరకు తీసుకుంటారనే అపవాదు ఎటూ ఉంది. కానీ ఇప్పుడు పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కొందరు ఆర్ఎంపీలతో థియేటర్ సిబ్బంది ఒప్పందం కుదుర్చుకుని ఇటీవల కాలంలో రోగుల నుంచి అధిక మొత్తంలో వసూలు చేసినట్టు విమర్శలు ఉన్నాయి. రూ.వేలల్లో వసూళ్లు.. రోగులకు శస్త్రచికిత్సలు చేయడానికి రూ.వేలల్లో సిబ్బంది వసూళ్లకు పాల్పడుతున్నట్టు పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. శస్త్రచికిత్స చేయించినందుకుగాను వేల రూపాయిల్లో అక్రమంగా వసూలు చేస్తున్నట్టు జోరుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా ఈ దందా జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే వైద్యాధికారులకు ఈ విషయం తెలియదా.. తెలిసినా తెలియనట్టు నటిస్తున్నారా? అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. బోధనాస్పత్రి కావడంతో నిత్యం శస్త్రచికిత్సలు బోధనాస్పత్రి కావడంతో నిత్యం అధిక సంఖ్యలో రోగులు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వస్తారు. రోడ్డు ప్రమాదాల్లో కాలు, చేతులు విరిగిన వారికి, చెవి, ముక్కు సమస్యలు ఉన్న వారికి, కడుపునొప్పి, హెర్నియా, మూల వ్యాధి, కడుపులో కణితులు ఉన్న వారికి, తలలో రక్తం గడ్డకట్టిన వారికి, తలలో రక్త స్రావం అయిన వారికి, కిడ్నీ సమస్యలు ఉన్న రోగులకు శస్త్రచికిత్సలు చేస్తారు. సర్వజన ఆస్పత్రిలో ప్రతీ రోజు చిన్న, పెద్ద శస్త్రచికిత్సలు 10 నుంచి 20 వరకు జరుగుతాయి. ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా వైద్య సేవలు అందుతాయని వస్తే ఇక్కడ కూడా డబ్బులు వెచ్చించాల్సి వస్తుందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడిగినంత ఇవ్వకపోతే తదుపరి చికిత్స కోసం వచ్చేటప్పుడు చికిత్స అందించడంలో నిర్లక్ష్యం వహిస్తారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం మండలానికి చెందిన ఓ వ్యక్తికి కడుపునొప్పి రావడంతో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వెళ్లాడు. ఆస్పత్రికి చెందిన ఓ ఉద్యోగి నీకు ప్రైవేటు ఆస్పత్రిలో రూ.2 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇక్కడ నీకు తక్కువ ఖర్చుతో ఆపరేషన్ బాగా చేయిస్తామని చెప్పారు. అతని వద్ద రూ.వేలల్లో తీసుకుని ఆపరేషన్ చేయించినట్టు తెలిసింది. ఆపరేషన్ థియేటర్లో డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్న విషయంపై విచారణ చేయించి చర్యలు తీసుకుంటాం. సర్వజన ఆస్పత్రిలో అన్ని సేవలు ఉచితంగానే అందిస్తున్నాం. అక్రమ వసూళ్లకు పాల్పడినట్టు రోగుల నుంచి ఫిర్యాదు వస్తే తీవ్ర చర్యలు తప్పవు. – డాక్టర్ అల్లు పద్మజ, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి -
జల్ జీవన్కు మేము అర్హులం కాదా..!
● ఇంటింటికి కుళాయి ఏర్పాటు చేయాలి ● ఖాళీ బిందెలతో మహిళల నిరసన ● పట్టించుకోని పాలకులు సంతకవిటి: బాబూ.. మేము ఇంటింటికి కుళాయిలకు అర్హులం కాదా.. అంటూ ఓ గ్రామస్తులంతా ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ఖాళీ బిందెలతో పాలకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని మండవకురిటి గ్రామంలో ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేయాలని ఆదివారం సాయంత్రం మహిళలు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. తమ గ్రామంలో పాడైపోయిన బావి నుంచి మంచినీటిని ఓవర్ హెడ్ ట్యాంక్ ద్వారా అందిస్తున్నారని, ఆ బావిలో చెత్త చెదారం నిండి శిథిలావస్థకు చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నీరు తాగడం వల్ల రోగాల బారిన పడే అవకాశం ఉందని, అది కూడా ఎప్పుడు వస్తుందో తెలియడం లేదని మహిళలు మండిపడ్డారు. ‘కావాలి.. కావాలి... ఇంటింటికి కుళాయి కావాలి..’ అని నినదిస్తూ గ్రామంలో భారీ ర్యాలీ చేశారు. రామమందిరం వద్ద రోడ్డుపై ఖాళీ బిందెలతో బైఠాయించారు. స్థానిక ఎమ్మెల్యే, కూటమి నాయకులు స్పందించి తమ గ్రామంలో ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని, లేకుంటే నిరసన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మా గ్రామంలో ఇంటింటి కుళాయిలు లేకపోవడంతో గ్రామస్తులం తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఓ బావి నుంచి తాగునీరు సరఫరా చేస్తున్నారు. అది కూడా ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. జల్ జీవన్ ద్వారా గ్రామంలో ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేయాలి. – కొప్పుశెట్టి శ్రీనివాసరావు, మండవకురిటి ఇంటింటి కుళాయిలు ఏర్పాటు చేయాలి. మా గ్రామంలో ఉన్న సామూహిక కుళాయిల వద్ద తాగు నీరు ఎప్పుడో వస్తుందో తెలియక నీటి కోసం ఎదురు చూడడంతోనే రోజు ముగుస్తుంది. అధికారులు, పాలకులు స్పందించాలి. –పడాల జ్యోతి, మండవకురిటి -
పాపం పండింది..!
రామభద్రపురం: మండలంలో 2015–16లో జరిగిన నీరు–చెట్టు అక్రమాల పాపం పండింది. అక్రమాలు చేసేసి..అంతలోనే గట్టెక్కిపోయాం అనుకున్న అప్పటి అధికారపార్టీ నాయకుల గుండెల్లో మళ్లీ రైళ్లు పరుగెడుతున్నాయి. రామభద్రపురం మండలంలో ఉపాధిహామీ, జలవనరుల శాఖ ఆధ్వర్యంలో రూ.5.7కోట్లతో 102 పనులు చేపట్టారు. అయితే అప్పట్లో అధికారం అండతో పాటు జలవనరుల శాఖ అధికారుల సహకారంతో పనులు చేయకుండానే ఫోర్జరీ సంతకాలు చేసి బిల్లులు చేసుకోవడం..తక్కువ పనిచేసి ఎక్కువగా నమోదుచేయడం..తూతూ మంత్రంగా పనులు చక్కబెట్టేసి సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారుల బృందం క్షేత్ర స్థాయిలో పరిశీలించి మొత్తం 102 పనులు పూర్తి స్థాయిలో జరగలేదని, కొన్ని పనులు పూర్తిగా చేయకుండానే చేసినట్లు, మరికొన్ని పనులు నాణ్యతలేకుండా చేయడం, చెక్డ్యాంలు,మదుములు, చప్టాలకు టెక్నికల్ మంజూరు లేకుండా పనులు జరిపినట్లు, నాశిరకంగా నిర్మించడంతో పాటు ఉపయోగంలేని పనులు చేయడం, పోర్జరీ సంతకాలు చేసినట్లు గుర్తించారు.అలాగే మొత్తం నిధులలో సుమారు రూ.2.40 కోట్ల వరకు అవకతవకలు జరిగి నిధులు స్వాహా అయినట్లు నిర్ధారించారు, అప్పట్లో మండలంలో మొత్తం 22 పంచాయతీల చెక్ పవర్ల రద్దు, ఇరిగేషన్ అధికారులతో పాటు మరికొంత మంది మండల అధికారులు 24 మందిపై సస్పెన్సన్ వంటి అక్రమాలతో రామభద్రపురం మండలం రాష్ట్రంలోనే చర్చనీయాంశమవడం తెలిసిందే. ఏసీబీ అధికారుల నోటీసులు అప్పట్లో విజిలెన్స్ అధికారులు అక్రమాలకు పాల్పడిన వారిని విచారణ కూడా చేశారు. అధికారం అండదండలు ఉండడంతో పూర్తిగా విచారణ జరగలేదు. దీంతో విజిలెన్స్ అధికారులు ఈ కేసును ఏసీబీకి అప్పగించారు.సుమారు 8 ఏళ్లు అవడంతో అప్పటి అక్రమాలపై మరేమీ ఉండదు..గట్టెక్కిపోయాం అనుకున్నారు. కానీ వదల బొమ్మాళీ..నిన్నొదలా అన్నట్లు అక్రమాలకు పాల్పడినట్లు అభియోగం ఉన్న అప్పటి జలవనరుల శాఖ అధికారులతో పాటు నాయకులకు కూడా నాలుగు రోజుల క్రితం ఏసీబీ అధికారుల నుంచి నోటీసులు వచ్చినట్లు తెలిసింది. అప్పట్లో ఎందుకు అక్రమాలకు పాల్పడాల్సి వచ్చింది? స్వాహా చేసినట్లు విజిలెన్స్ బృందం నిర్ధారించిన సొమ్ము తిరిగి చెల్లించాలని, ఎప్పటికి చెల్లిస్తారో చెప్పాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలిసింది. అలాగే ఇరిగేషన్ ఈఈ, డీఈ, ఏఈలతో పాటు నాయుడువలస, తారాపురం, కోటశిర్లాం, మామిడివలస గ్రామాల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై పోలీసు కేసులు నమోదైనట్లు సమాచారం. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు 2015–16లో నీరు చెట్టు పనుల్లో అక్రమాలకు పాల్పడిన అధికార పార్టీ నాయకులు రూ.2.40 కోట్లు అవకతవకలు జరిగినట్లు విజిలెన్స్ అధికారుల నిర్ధారణ కేసు ఏసీబీకి అప్పగింత అప్పట్లో అక్రమాలకు పాల్పడిన వారందరికీ ఇప్పుడు ఏసీబీ నోటీసులు -
ఆస్తులున్నా పస్తులే..!
వీరఘట్టం: మండలంలోని చిదిమి రోడ్డులో ఉన్న ప్రైవేట్ భూములను ఏడాదికి ఒక ఎకరా భూమిని రూ.35 వేల నుంచి రూ.40 వేలుకు కొందరు కౌలుదారులు లీజుకు తీసుకుని కాయగూరల వ్యవసాయం చేస్తున్నారు. ఇదే రోడ్డులో కొంత దూరంలో ఉన్న వీరఘట్టం శ్రీ జగన్నాథస్వామి ఆలయ భూములు సుమారు 24.5 ఎకరాలు ఉన్నాయి. వాటిి ని అధికారులు ఎకరా భూమికి రూ.10 వేల నుంచి రూ.12 వేలకు లీజుకు ఇచ్చారు. ఈ గుడికి వీరఘట్టం, పాలకొండ, వంగర మండలాల్లో సుమారు 49 ఎకరాలకు పైబడి భూములున్నాయి. ఈ భూములన్నింటికీ వాస్తవంగా అయితే లీజులు ఏడాదికి రూ.15 లక్షల వరకు రావాలి.అయితే ఈ లీజులు కనీసం రూ.5 లక్షలు కూడా రావడం లేదు. ఈ ఆలయ భూములపై వస్తున్న అరకొర రాబడి కూడా సక్రమంగా దేవుడికి చేరడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఎవరికి కష్టం వచ్చినా ఆదుకునే దేవుడి ఆస్తులనే ఆక్రమణ చేస్తుంటే పాపం ఏమీ చేయలేని దుస్థితిలో దేవుడు చిక్కుకున్నాడు. తనకు ప్రతినిధులుగా ఉన్న దేవాదాయశాఖ అధికారులు కళ్లకు గంతలు కట్టి ఆక్రమణదారులకు అండగా నిలుస్తుంటే ఇక చెప్పుకోలేక తిప్పలు పడే స్థితి దేవుడికి ఏర్పడింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏళ్ల తరబడి తనభూములకు సక్రమంగా కౌలు రాక, తాను నిత్యం ధూపదీప నైవేద్యాలకు నోచుకోక దేవుడు బిక్కమొహం వేస్తున్నాడు. వీరఘట్టం జగన్నాథ స్వామి ఆలయానికి ఉన్న సుమారు 49 ఎకరాల దేవదాయ భూములు కొన్ని ఆక్రమణల్లో ఉండగా, మిగిలిన వాటికి నామమాత్రపు లీజులు చెల్లిస్తున్నారు.ఫలితంగా ఆస్తులు ఉన్నా ఆదాయం లేక జగన్నాథుని ఆలయాల నిర్వహణ దయనీయంగా మారింది. ఇదీ దేవుడి దుస్థితి వీరఘట్టం జగన్నాథుని స్తిరాస్తులు 49 ఎకరాలు ఆ భూములు ఎక్కడ ఉన్నయో తెలియని పరిస్థితి నామమాత్రపు లీజులతో అరకొర ఆదాయం ఇటీవల గుట్టుగా జరిగిన లీజు ఒప్పందాలు కేవలం 38.75 ఎకరాలకు మాత్రమే లీజు ఒప్పందం మిగిలిన 10.25 ఎకరాలు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి ఇదీ వీరఘట్టంలో ఉన్న జగన్నాథస్వామి ఆలయ భూముల పరిస్థితి -
సూరంపేటలో ఏనుగుల సంచారం
సీతానగరం: మండలంలోని సూరంపేట మామిడి తోటలో ఏనుగుల గుంపు సంచరిస్తోంది. గత నాలు గు రోజులుగా ఇదే పరిసర ప్రాంతాల్లో గజరాజులు తిరుగుతుండడం స్థానికులు బెంబేలెత్తుతున్నారు. పార్వతీపురం మండలంలోని పులిగుమ్మి ప్రాంతం నుంచి సూరంపేటకు చేరుకున్న ఏనుగులు..సీతారాంపురం, గుచ్చిమి, మరిపివలస ప్రాంతాల పొలాల్లో తిరుగుతున్నాయి. ఆదివారం ఉదయం సూరంపేట కాలువ గట్టు ఆనుకుని ఉన్న ఓ మామి డి తోటలో ఏనుగుల గుంపు తిరుగుతూ కనిపించ గా అవి ఎక్కడ మామిడి కాయలు తినేస్తాయోనని తోటల యజమానులు, కాపలాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి నష్టం జరగకముందే వాటిని ఇక్కడి నుంచి తరిమేయాలని కోరుతున్నారు. ఏనుగుల సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు తెలిపారు. -
నేలబావిలో యువకుడి మృతదేహం
రేగిడి: మండల పరిధిలోని మజ్జిరాముడుపేట గ్రామసమీపంలోని పంటపొలాల్లో ఉన్న బావిలో ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. . ఆదివారం అటుగా వరి విత్తనాలు పోసేందుకు వెళ్తున్న రైతులు మృతదేహాన్ని చూసి వీఆర్వో దుర్గారావుకు సమాచారం అందించారు. దీంతో వీఆర్వో ఆ సమాచారాన్ని పోలీసులకు అందజేశారు. ఈ మేరకు ఎస్సై వి.బాలకృష్ణ, ఏఎస్సై గౌరినాయుడులు సంఘటనా స్థలం వద్దకు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. ఈ నెల 17న తప్పిపోయిన అక్కన్న అగ్రహారం గ్రామానికి చెందిన అల్లెన అశోక్ (22)గా గుర్తించారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి పరిశీలించి మృతదేహం తమ కుమారుడిదేనంటూ భోరున విలపించారు. ఈ నెల 16న ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడని, అప్పటి నుంచి కనిపించకపోవడంతో పోలీసులకు ఈ నెల 17న ఫిర్యాదు చేశామని మృతుడి గవరయ్య విలేకరులకు తెలిపారు. శోకసంద్రంలో కుటుంబంఅల్లెన అశోక్ డిగ్రీ చదువుకున్నాడు. తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ కుటుంబానికి సహాయపడుతుండేవాడని తల్లిదండ్రులు గవరయ్య చిన్నమ్మలు భోరున విలపిస్తున్నారు. మృతుడికి తమ్ముడు ఉన్నాడు. మృతదేహం ఉబ్బిపోవడంతో సంఘటనా స్థలం వద్ద వైద్యులు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై బాలకృష్ణ తెలిపారు. -
ప్రజా పోరాటాలకు అండగా ఓపీడీఆర్
విజయనగరం అర్బన్: స్థానిక ఎన్జీవో హోమ్లో ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ (ఓపీడీఆర్) ఏపీ 15వ మహాసభలు ఆదివారం నిర్వహించారు. కామ్రేడ్ పెద్దింటి సూర్యానారాయణ ప్రాంగణం నామకరణంతో జరిగిన ఈ సభ ప్రాంగణాన్ని బీవీఎస్ పట్నాయక్ ప్రారంభించారు. ఆనాటి చారిత్రాత్మక శ్రీకాకుళం గిరిజన ఉద్యమ కాలం నుంచి నేటి వరకు వివిధ వర్గాల ప్రజాపోరాటాలకు, హక్కుల పరిరక్షణకు ఓపీడీఆర్ ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ వస్తోందని వక్తలు తెలిపారు. అనంతరం ఓపీడీఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బారెడ్డి నివేదికను సభలో ప్రవేశపెట్టారు. సమాజంలోని పలు కీలక సమస్యలపై ఈ సభలో చర్చించి, చేసిన తీర్మానాలను సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. గిరిజన, గ్రామీణ, పట్టణ పేద ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, రాష్ట్రంలో కొనసాగుతున్న భూస్వామ్య దందాలు అరికట్టాలని, పేదలందరికీ ఉచిత, నాణ్యమైన విద్య, వైద్యం అందించాలని, రైతులు పండిస్తున్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా చూడాలని తీర్మానం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఓపీడీఆర్ అధ్యక్షుడు డాక్టర్ జితిన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్లాిస్టిక్ దుకాణం దగ్ధం
కురుపాం: మండల కేంద్రంలోని రావాడ కూడలిలో ఉన్న ఒక ప్లాస్టిక్ దుకాణంలో ఆదివారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో దుకాణంలో ఉన్న ప్లాస్టిక్ సామగ్రి, వ్యవసాయ పరికరాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమయానికి అగ్నిమాపక వాహనం రాక పోవడంతో పక్కనున్న షాపులకు సైతం మంటలు వ్యాపించే క్రమంలో ఎస్సై పి.నారాయణరావు చొరవతో స్థానికులు వాటర్ ప్యాకెట్స్ విసిరి మంటలను అదుపులోకి తేవడంతో ఇతర షాపులకు మంటలు వ్యాపించలేదు. కానీ ప్లాస్టిక్ దుకాణం యజమాని కందుల విశేశ్వరరావుకు ఈ ప్రమాదంలో దుకాణం పూర్తిగా దగ్ధం కావడంతో సుమారు రూ.ఐదు లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరుతున్నాడు. సుమారు రూ.ఐదు లక్షల నష్టం -
పంచాయతీలకు కార్యదర్శుల కొరత
● ఒకొకక్కరికి రెండేసి పంచాయతీల విధులు ● ఒత్తిడి గురవుతున్న కార్యదర్శులుడెంకాడ: గ్రామస్థాయిలో ప్రజలకు సేవలందించే పంచాయతీలను కార్యదర్శుల కొరత వేధిస్తోంది. ప్రతి కార్యదర్శి రెండేసి పంచాయతీల్లో విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మధ్యలో ఏవరైనా సెలవు పెడితే ఎవరో ఒకరికి ఆ పంచాయతీ బాధ్యతులు అప్పగిస్తే మూడు పంచాయతీల్లో విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సర్పంచ్లకు పదవీ కాలం పూర్తి కాగా ఎన్నికలు జరగకపోవడంతో పంచాయతీలు ప్రత్యేకాధికారుల పాలనలో సాగుతున్నాయి. ఉదయం ఆరున్నర, ఏడు గంటల నుంచి ఆయాగ్రామ పంచాయతీలకు కార్యదర్శులు చేరుకుని సేవలందించాల్సిన పరిస్థితి ఉండడంతో అదనపు పంచాయతీ బాధ్యతలతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని వాపోతున్నారు. వీటికి తోడు రాజకీయ ఒత్తిళ్లతో సతమతమవుతున్నారు. నిత్యం రాజకీయ చట్రంలో పని చేయాల్సిన పంచాయతీ కార్యదర్శులు ఎంత ఒత్తిడి ఉన్నా నేరుగా బయటకు తమ బాధను చెప్పులేని దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇన్చార్జ్ల పాలనలో.. డెంకాడ మండలంలో 26 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 17 గ్రామ సచివాలయ కేంద్రాలు. మండల కేంద్రమైన డెంకాడ గ్రామ సచివాయం కూడా ఇన్చార్జ్ కార్యదర్శితోనే కాలం వెళ్లదీస్తున్నారు. మోదవలస, చింతలవలస–2, రఘుమండ, గుణుపూరుపేట,సింగవరం గ్రామ సచివాలయాలు ఇన్చార్జ్ పాలనలోనే నడుస్తున్నాయి. డి.తాళ్లవలస, ఆకులపేట, డి.కొల్లాం, పంచాతీయలకు కూడా కార్యదర్శులు లేరు. గుణుపూరు కార్యదర్శి సెలవుపై వెళ్లడంతో అది కూడా ఇన్చార్జ్ పాలనలోనే నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మోదవలస సచివాలయంలో విధులు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ఆ పంచాయతీ బాధ్యతలు మాకు వద్దని మండల అధికారులను కార్యదర్శులు వేడుకుంటున్నారు. ఉదయం ఆరున్నర నుంచే గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య పనుల్లో భాగంగా రిక్షాబళ్లపై చెత్తను సేకరిస్తున్న కార్మికుల వద్దకు వెళ్లి వారిని పర్యవేక్షించాలి. అక్కడ వారితో తెల్లవారుజామున ఆరున్నర,ఏడు గంటలకు ఫొటో తీసి పైవారికి పెట్టాలి. ఇక్కడి నుంచి పంచాయతీ కార్యదర్శి విధులు ప్రారంభమవుతున్నాయని వారు చెబుతున్నారు. గ్రామంలో పారిశుధ్య నిర్వహణ, తాగునీరు సరఫరా, వీధి దీపాల పనితీరు తదతర వాటిపై నిత్యం ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ ప్రజలకు వస్తాయి. వాటిలో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేయాలి. లేకపోతే పంచాయతీ కార్యదర్శి పని తీరు సక్రమంగా లేదని పైవారు భావిస్తారట. దీంతో వాటి కోసం నిరంతరం పని చేయాల్సి ఉంది. కొందరు కార్యదర్శులను బీఎల్ఓలుగా కూడా నియమించారు. వీరు ఓటర్ల సవరణ ప్రక్రియను పరిశీలించాలి. వాటికి తోడు సెన్సెస్ ప్రక్రియ వేరే చెప్పనక్కర్లేదు. గ్రామ సచివాలయంలో ప్రజలకు నిరంతరం అందించాల్సిన సేవలు అందించాల్సిన బాధ్యతల్లో పంచాయతీ కార్యదర్శి పాత్ర చాలా కీలకమని వారు చెబుతున్నారు. ఇన్ని పనులు ఒక పంచాయతీలో నిర్వహించిన కార్యదర్శులకు మరిన్ని పంచాయతీల బాధ్యత అంటే చాలా ఒత్తిడి గురిచేయడమే అని ఆవేదన చెందుతున్నారు.అధికారులు అన్ని పంచాయతీలకు కార్యదర్శులను నియమించి మాపై పని ఒత్తిడి తగ్గించాలని కోరుతున్నారు. పంచాయతీ కార్యదర్శులు లేరుమండలంలో పది గ్రామ సచివాలయాలు, పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శులు లేరు. దీంతో ఉన్నవారికే పది పంచాయతీలకు ఇన్చార్జ్లుగా నియమిస్తున్నాం. మోదవలస పంచాయతీలో విధులు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.ఇదో సమస్యగా మారింది. ఉన్నత వారితో పంచాయతీల్లో ఇబ్బందులు లేకుండా పని చేయిస్తున్నాం. దేవానంద్, ఇన్చార్జ్ ఎంపీడీఓ, డెంకాడ -
రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా ప్రాజెక్టు
వంగర: మండల పరిధి ఎం.సీతారాంపురం జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన శివ్వాల నిఖిల అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. 2024–25 విద్యా సంవత్సరంలో ఆన్లైన్ ద్వారా ప్రదర్శించిన ‘ఆటోమేటిక్ వ్యవసాయ క్షేత్ర పర్యవేక్షణ వ్యవస్థ’ అనే ప్రాజెక్టును జిల్లా స్థాయిలో ప్రదర్శించి ప్రతిభ కనబరచడంతో ఈ ప్రాజెక్టు రాష్ట్ర స్థాయికి ఎంపికై ంది. ఇన్స్పైర్ మనక్ పోటీలకు జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం పట్ల హెచ్ఎం కోటేశ్వరరావు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు నిఖిలను అభినందించారు. అందుబాటులోకి కల్చర్ పరీక్షలు విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో యూరిన్ కల్చర్, బ్లడ్ కల్చర్ పరీక్షలు నిలిచిపోవడం వల్ల రోగులు ఇబ్బందులు పడుతున్న అంశంపై సాక్షిలో ఈ నెల 13న ‘సర్వజన ఆస్పత్రిలో నిలిచిన కల్చర్ పరీక్షలు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. శనివారం నుంచి కల్చర్ పరీక్షలు అందుబాటులోకి తెచ్చారు. గంజాయితో ఇద్దరి అరెస్టు విజయనగరం క్రైమ్: రూరల్ పోలీస్స్టేషన్ పరి ధి కోరాడపేట వద్ద గంజాయి రవాణ చేస్తున్న ఇద్దరిని శనివారం అరెస్టు చేశామని విజయనగరం రూరల్ పోలీస్స్టేషన్ ఎస్ఐ అశోక్ తెలిపారు. అరకుకు చెందిన పాంగి పీతూరు, కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన కర్నేటి విజయ 11 కేజీల గంజాయితో కోరాడపేట వద్ద ఉన్నట్టు అందిన సమాచారంతో తనిఖీలు చేసినట్టు చెప్పారు. వీరి నుంచి సుమారు 22 వేల రూపాయల విలువ గల 11 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. వీరిని అరెస్టు చేసి కోర్టుకు తరలించగా రిమాండ్కు తరలించినట్టు ఎస్ఐ తెలిపారు. మద్యం సీసాలు తరలిస్తున్న వ్యక్తి అరెస్టు బొబ్బిలి: మద్యం సీసాలు తరలిస్తున్న రామభ్రపురం మండలం అప్పలరాజుపేట గ్రామానికి చెందిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం తరలించినట్టు ఎకై ్సజ్ శాఖ బొబ్బిలి సీఐ పి.చిన్నంనాయుడు తెలిపారు. బొబ్బిలి పట్టణంలోని మద్యం షాపుల నుంచి ఏడు మద్యం సీసాలతో తమ గ్రామానికి వెళ్తుండగా పారాది గ్రామం వద్ద అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామన్నారు. అనధికారికంగా మద్యం సీసాలను తరలిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. -
అధికారుల ఆదేశాలు బేఖాతరు...!
● నిలిచిన అన్నదాన కార్యక్రమం ● తోటపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయంలో వివాదాస్పద నిర్ణయాలుగరుగుబిల్లి: తోటపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ట్రస్టు కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని దేవదాయ శాఖ అధికారులు ఈ నెల 4న జారీ చేసిన ఆదేశాలు పట్టించుకోకుండా దేవస్థానం పరిధిలో కార్యక్రమాలను కొనసాగించడం వివాదస్పదంగా మారింది. తోటపల్లి గ్రామంలో ముగ్గురు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు బయటకు చెబుతున్నా.. ట్రస్టు సభ్యుల కనుసన్నల్లోనే అన్నదానం జరుగుతుందని పలువురు చెబుతున్నారు. దీని నిర్వహణపై ఆలయాన్ని శనివారం ఫుడ్ ఇన్స్పెక్టర్లు సందర్శించి పరిశీలించారు. ఆహార పదార్ధాల తయారీ, పంపిణీ, పరిశుభ్రత ప్రమాణాలు పాటించకపోవడం, అనుమతి లేకుండా ఇతరులు వంట గదుల్లోకి ప్రవేశించడం తదితర అంశాలను గుర్తించారు. ఆహార భద్రతకు సంబంధించి ప్రాధమిక నిబంధనలు సైతం పాటించకపోవడంతో అధికారులు విస్మయానికి గురయ్యారు. అన్నదాన నిర్వహణపై అధికారులు నిర్వాహకులను ప్రశ్నించడంతో ట్రస్టు సభ్యులు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇచ్చిన పత్రాలను సభ్యులు చించేసి అధికారులను అవమానకరంగా దూషించారు. అన్నదాన కార్యక్రమాన్ని అడ్డుకోవడంపై ఆలయ ఈఓను ప్రశ్నించారు. దేవస్థానం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలను నిర్వహించకుండా.. దాతల సహకారంతో నిర్వహిస్తే ఒప్పుకోకుండా ఏంటీ పరిస్థితి అని నిలదీశారు. భక్తులు ఆకలితో ఉండాలా? అని పలువురు భక్తులు ప్రశ్నించారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఆదేశాలను పక్కనపెట్టి ట్రస్టు కార్యకలాపాలను కొనసాగించడం, అన్నదాన కార్యక్రమాల్లో ఆహార భద్రత ప్రమాణాలను విస్మరించడం, విధి నిర్వహణలో ఉన్న అధికారులతో అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.ప్రస్తుతం అన్నదాన కార్యక్రమాల్లేవు.. ఆలయంలో ప్రస్తుతం ఎటువంటి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం లేదు. దీనికి దేవదాయ శాఖ ఉన్నతాధికారుల అనుమతులు, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్ట్స్’ అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతుల్లేవు. భక్తులు, యాత్రికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలి. ఫుడ్ సేఫ్టీ అధికారులపై అనుచితంగా ప్రవర్తించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. – వీవీ సూర్యనారాయణ, ఇన్చార్జ్ ఈఓ, తోటపల్లి దేవస్థానం -
నింపిన విషాదం
ఈత సరదా.. గంట్యాడ: ఈత సరదా ఓ కుటుంబంలో విషాదం నింపింది. సరదగా డ్యాంలో ఈతకు దిగిన ఓ యువకుడు అదృశ్యమయ్యాడు. అంతలోనే శవమై తేలాడు. దీంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతుంది. వివరాల్లోకి వెళ్తే.. సీతారాంపురం గ్రామానికి చెందిన కొల్లి దశరధరామునాయుడు(30) తన మామయ్యతో కలిసి తాటిపూడి డ్యాం సందర్శనకు శుక్రవారం వెళ్లాడు. మధ్యాహ్నం భోజనం అనంతరం మామయ్య విశ్రాంతి తీసుకుంటుండగా.. దశరధరామునాయుడు డ్యాం కింద నీటిలో సరదాగా ఈతకు దిగాడు. కొంతసేపటి తరువాత మామయ్య మేల్కొని చూడగా నాయుడు కనిపించలేదు. అక్కడే చెప్పులు, సెల్ఫోన్ ఉండడంతో స్థానికంగా గాలించారు. ఆచూకీ లభించలేదు. శనివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి మళ్లీ వెతకగా డ్యాం గేటు కింద గోస్తనీ నదికి వెళ్లే కాలువలో మృతదేహం తేలింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
కొత్తగా ఒక్కరైతుకు అందని పెట్టుబడి సాయం
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతుపేరు దివిలి శ్రీనివాసరావు. ఇతనిది మెంటాడ మండలం లోతుగెడ్డ గ్రామం. రెండున్నర ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. టీడీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాత సుఖీభవ పథకం కింద ఒక్క రూపాయికూడా ఇతనికి సాయం అందించలేదు. ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు కరకనాయుడు. ఇతనిది గంట్యాడ మండలం పెదవేమలి గ్రామం. ఇతను రెండు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇతనికి రైతు భరోసా పథకం కింద ఏటా ఠంచన్గా ఆర్థిక సాయం అందేది. టీడీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరూపాయి పెట్టుబడి సాయం అందించలేదు. విజయనగరం ఫోర్ట్: వీరు ఇద్దరు రైతులే కాదు. జిల్లాలో వేలాదిమంది కౌలు రైతులు, కొత్తగా దరఖాస్తు చేసిన వారిది ఇదే పరిస్థితి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత సీఎం చంద్రబాబు గత ప్రభుత్వం కంటే రైతులకు ఎక్కువ మేలు చేస్తామని గొప్పలు చెప్పారు. అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి కేంద్రం ఇచ్చే సాయంతో సంబంధం లేకుండా రూ.20 వేలు పెట్టుబడి సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంతో ఇచ్చే సాయంతోనే రూ.20 వేలు ఇస్తామని మాటమార్చేశారు. ఆ సాయం కూడా రైతులందరికీ అందుతందంటే లేదనే సమాధానమే వినిపిస్తోంది. రెండేళ్లుగా కౌలు రైతులకు పైసా పెట్టుబడి సాయం అందడంలేదు. విపత్తుల సమయంలో పంట నష్టపరిహారం ఇవ్వడంలేదు. రాయితీలు ఎండమావిగా మారాయి. సాగు కష్టాలను ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కౌలు రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. కౌలు రైతులను టీడీపీ సర్కారు పూర్తిగా పక్కన పెట్టేసింది. కౌలు రైతులకు గుర్తింపు లేకుండా చేసింది. రాయితీలు అందక, పెట్టుబడి సాయం లేక వడ్డీలకు అప్పులుచేసి పంటలు సాగుచేయాల్సిన దుస్థితి నెలకొంది. కౌలు రైతుల పట్ల ప్రభుత్వం నిర్ధయతో వ్యవహరిస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రెండేళ్లుగా రూపాయి సాయం అందకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సాధారణ రైతులతో పాటు కౌలు రైతులకు వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద రూ.13,500 ఆర్థిక సాయాన్ని అందించేవారు. ఇప్పుడా పరిస్థితి లేకపోవడం ఆవేదనకు లోనవుతున్నారు. ముందుకు సాగేదెలా..? లబ్ధిదారుల కుదింపు.. కౌలురైతుకు అందని అన్నదాత సుఖీభవ కొత్తగా నమోదైన వారికి ఒక్కరికీ విదల్చని పెట్టుబడి సాయం గతం కంటే 45వేల మంది తగ్గింపు 2025–26లో అన్నదాత సుఖీభవ సాయం కింద చంద్రబాబు సర్కార్ జిల్లాలో 2,27,770 మందికి సాయం అందించారు. 2026–27లో తొలివిడతగా శనివారం అందించిన సాయంలోనూ ఆ సంఖ్య మారలేదు. కొత్తగా వేలాది మంది పథకం కోసం దరఖాస్తు చేసినా ఒక్కరైతుకూ సాయం అందించిన దాఖలాలు లేవు. ఈ రెండేళ్లలో వారసత్వంగా, భూములు కొనుగోలు చేయడం ద్వారా అనేక మంది భూ యాజమానులుగా నమోదయ్యారు. గతంలో వివిధ కారణాల వల్ల అనేక మందికి అన్నదాత సుఖీభవ సాయం అందలేదు. వారి భూ, సాంకేతిక సమస్యలు పరిష్కరించినా ఈ ఏడాది పెట్టుబడి సాయం అందలేదు. వేలాది మందికి అన్నదాత సుఖీభవ సాయాన్ని దూరం చేయడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్నకు సమాధానం చెప్పేవారే కరువయ్యారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్ధిదారుల్లో భారీగా కోత విధించింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద జిల్లాలోని 2.72 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందేది. టీడీపీ సర్కారు ఆ సంఖ్యను 2.27 లక్షల మందికి తగ్గించేసింది. 45 వేల మంది లబ్ధిదారులకు సాయం అందడం లేదు. జిల్లాలో రూ.88 కోట్ల సాయాన్ని ఎగ్గొట్టేయడంపై రైతులు మండిపడుతున్నారు. ఎక్కడైనా ఏటా రైతుల సంఖ్య పెరుగుతుంది కానీ... సర్కారు సాయం అందించడంలో సంఖ్య తగ్గుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
యోగా ఆరోగ్య ఔషధం
● కలెక్టర్ రాంసుందర్రెడ్డి ● చింతపల్లి బీచ్లో యోగాంధ్రపూసపాటిరేగ: మానసిక ప్రశాంతతకు, శారీరక ఆరోగ్యానికి యోగా దివ్య ఔషధమని, ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకోవాలని కలెక్టర్ రాంసుందర్రెడ్డి అన్నారు. ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన చింతపల్లి బీచ్ వేదికగా యోగాంధ్ర కార్యక్రమాన్ని శనివారం ఉత్సాహంగా నిర్వహించారు. కలెక్టర్ రాంసుందర్రెడ్డి, జాయంట్ కలెక్టర్ సేతుమాధవన్ స్వయంగా యోగాసనాలు వేసి ఆకట్టుకున్నారు. సముద్రపు గాలి, అలలు హోరు మధ్య చింతపల్లి బీచ్ ప్రాంగణం సుమారు రెండు వేల మంది యోగా సాధకుల యోగాసనాలతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ సందర్భంగా కలెక్టర్ రాంసుందర్రెడ్డి మాట్లాడుతూ యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పొందవచ్చునన్నారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో యోగా కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ప్రతీ ఒక్కరు దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ కోసం రోజుకు కనీసం 30 నిమిషాలు పాటు యోగా కోసం కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డ్వామా పీడీ శారద, జిల్లా పర్యాటక శాఖ అధికారి పిఎన్వి.లక్ష్మీనారాయణ, యోగాంధ్ర నోడల్ అధికారి వరప్రసాద్, తహసీల్దార్ ఎన్వి.రమణ, ఎంపీడీఓ ఎం.రాధిక, డెప్యూటీ తహసీల్దార్ సంజీవ్కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మాధురితో పాటు ఉద్యోగులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
శరత్బాబు కుటుంబానికి ఆర్థిక అండ
కొమరాడ: ఇటీవల గుండెపోటుతో వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు నంగిరెడ్డి శరత్బాబు అకాల మరణం పార్టీతో పాటు వ్యక్తిగతంగా తమకు తీరని లోటని పార్టీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్రాజు, మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి పేర్కొన్నారు. రాజ్యలక్ష్మీపురం గ్రామానికి చెందిన శరత్బాబు కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఫోన్లో పరామర్శించారు. అనంతరం అండగా ఉంటామని ప్రకటించారు. ఈ మేరకు రూ. 3లక్షల చెక్కును పరీక్షిత్రాజు, పుష్పశ్రీవాణి శనివారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు, నాయకులకు జగన్మోహన్రెడ్డి ఎల్లప్పుడూ అండగా ఉంటారన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ ద్వారపురెడ్డి జనార్దనరావు, జిల్లా ఉపాధ్యక్షుడు కళింగ మల్లేశ్వరరావు, మరడాన సూరపు నాయుడు, మరడాన సింహాచలంనాయడు, మాజీ సర్పంచ్ కెంగువ పోలినాయుడు, ఏగిరెడ్డి సింహాచలం, కొల్లి సింహాచలం, వైఎస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
నిమిషం ఆలస్యమైనా అనుమతించం..
విజయనగరం అర్బన్: జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించనున్న జాతీయ అర్హత, ప్రవేశ పరీక్షకు (రీ–నీట్ యూజీ) జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ..పరీక్షను పారదర్శకంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఆరు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 1901 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 వరకు పరీక్ష నిర్వహించనున్నామన్నారు. అభ్యర్థులను ఉదయం 11 గంటల నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని చెప్పారు. అయితే నిర్ణీత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించమని స్పష్టం చేశారు. అఽభ్యర్థులు అడ్మిట్ కార్డుతో పాటు రెండు కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు, ఒక పోస్టుకార్డు సైజు కలర్ ఫొటో, ప్రభుత్వం జారీ చేసిన ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డు తీసుకురావాలని సూచించారు. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, బ్లూ టూత్ పరికరాలు, కాలిక్యులేటర్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు హ్యాండ్ బ్యాగులు, బెల్ట్లు, ఆభరణాలు, లోహపు వస్తువులు, అదనపు కాగితాలను అనుమతించమన్నారు. అభ్యర్థులు సాధారణ దుస్తులు, చెప్పులతో మాత్రమే హాజరుకావాలని సూచించారు. అభ్యర్థుల సందేహాల నివృత్తి కోసం పరీక్ష రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6.15 గంటల వరకు 08922–236947 హెల్ప్లైన్ నంబర్ అందుబాటులో ఉంటుందన్నారు. రీ నీట్ యూజీ పరీక్షకు పక్కాగా ఏర్పాట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి -
ఎరువుల దుకాణంపై విజిలెన్స్ దాడులు
మెరకముడిదాం: మండలంలోని చినబంటుపల్లి పంచాయతీ మధుర గ్రామమైన సింగవరం గ్రామంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా అనధికారికంగా విత్తనాలు, ఎరువులు విక్రయాలు జరుపుతున్న తాల్లపూరి అప్పలనాయుడుకు చెందిన దుకాణంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు ఎస్ఐ రామారావు, ఏఓ ఎం.అనురాధతో కలిసి శనివారం దాడులు నిర్వహించారు. దాడుల్లో రూ.3 లక్షల విలువ చేసే ఎంటీయూ 1121 విత్తనాలు 35 బ్యాగులు, మొక్కజొన్న విత్తనాలు 96 ప్యాకెట్లు, సుమారు రూ.70 వేల విలువ చేసే 20 – 20 – 0 – 13 కోరమండల్ ఎరువుల బస్తాలు 48 స్టాకు ఉన్నట్టు గుర్తించారు. వీటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని విజిలెన్స్ అధికారులు తెలిపారు. తదుపరి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు షాపు నిర్వాహకుడిపై చట్టపరమైన చర్యలు చేపడతామని అధికారులు వెల్లడించారు. దాడుల్లో వ్యవసాయ విస్తరణ అధికారి సుధీర్ తదితరులు పాల్గొన్నారు. సుమారు రూ.3లక్షల విలువైన విత్తనాలు, రూ.72 వేల విలువైన ఎరువులు సీజ్ విత్తనాలు, ఎరువులను స్వాధీనం చేసుకున్న అధికారులు -
అమ్మగారి స్థానంలో.. అయ్యవారు..!
ఈ చిత్రం చూశారా... నెల్లిమర్ల మండలం సతివాడలో శనివారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ నిధుల చెక్కు పంపిణీ కార్యక్రమం. స్థానిక ఎమ్మెల్యే లోకం నాగమాధవి కార్యక్రమానికి హాజరవుతారని వ్యవసాయశాఖ అధికారులు ప్రకటించారు. చివరికి ఆమె స్థానంలో ఏ అర్హత లేని ఆమె భర్త లోకం ప్రసాద్ హాజరై అన్నీ తానై వ్యవహరించారు. ఆయన తీరును చూసి అక్కడి అధికారులు నివ్వెరపోయారు. టీడీపీ నేత, ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గేదెల గాయత్రి వ్యవసాయశాఖ కీల పదవుల్లో ఉంటూ సమావేశానికి గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. – నెల్లిమర్ల రూరల్ -
జిల్లాలో1969 పోలింగ్ కేంద్రాలు
● రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ రాంసుందర్ రెడ్డి విజయనగరం అర్బన్: ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా, ఓటర్లకు సౌకర్యవంతంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్.రాంసుందర్రెడ్డి అన్నారు. ‘ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) 2026’ లో భాగంగా జిల్లాలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 1,200 మందికి పైగా ఓటర్లున్న కేంద్రాలను విభజించి, అదనపు కేంద్రాలు ఏర్పాటు చేయ నున్నట్లు చెప్పారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 1847 పోలింగ్ కేంద్రాలుండగా.. విభజన తర్వాత ఆ సంఖ్య 1969కు చేరుకుంటుందన్నారు. ఈ ప్రతిపాదనపై రాజకీయ పార్టీల నుంచి ఎటువంటి అభ్యంతరాలు రాకపోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్.సత్తిబాబు, ఆర్డీఓలు, సహాయ ఎన్నికల అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు. -
నటుడు, దర్శకుడు గెద్ద వరప్రసాద్ ఇకలేరు..
విజయనగరం టౌన్: విజయనగరం కళాకారుడు, నటుడు, దర్శకుడు, నటరత్న నాటక పరిషత్ కార్యదర్శి గెద్ద వరప్రసాద్ గుండెపోటుతో శనివారం కన్నుమూశారు. ఆయన ఇకలేరనే విషయాన్ని తెలుసుకున్న సినీ, సాహిత్య, అభిమానలోకం విస్తుపోయింది. ఆదివారం శివాలయం వీధిలో ఉన్న ఆయన స్వగృహం వద్ద పార్ధివదేహాన్ని ఉంచుతామని, మధ్యాహ్నం 12గంటలలోపు అంత్యక్రియలు పూర్తి చేస్తామని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. నాటకమే నవనాడుల్లో నింపిన వరప్రసాద్ ఇక లేరంటే ఊహించడం అత్యంత బాధాకరమని డాక్టర్ మీగడ రామలింగస్వామి పేర్కొన్నారు. మంచి వ్యక్తిని కోల్పోయామని సినీనటి పడాల కళ్యాణి సామాజిక మాధ్యమాల ద్వారా తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వారిలో పెద్దింటి అప్పారావు, తరిణి మహేశ్వరరావు, నటి రాజేశ్వరి, హైదారాబాద్ నుంచి డాక్టర్ పివి.రామకుమార్, కళారాధన సాంస్కృతిక సంస్ధ (నంద్యాల) కార్యదర్శి ఎస్ఆర్ఎస్.ప్రసాద్, ఆర్.సూర్యపాత్రో, సీనియర్ జర్నలిస్ట్ దిమిలి అచ్యుతరావు, ఆరిపాక బ్రహ్మానందం నాటక పరిషత్, జరజాపుపేటకు చెందిన ఆరిపాక శ్రీనివాసరావుతో పాటూ వందలాది మంది కళాకారులు, అభిమానులు ఆయన ఆత్మకు సద్గతులు సంప్రాప్తించాలని, వారి కుటుంబానికి ప్రగాడ సానుభూతిని వ్యక్తం చేశారు. -
సమావేశాలకు అధికారులు హాజరు తప్పనిసరి : కలెక్టర్
విజయనగరం అర్బన్: మండల స్థాయిలో జరుగుతున్న బ్యాంకర్ల సమావేశాలకు క్షేత్ర స్థాయి అధికారులంతా తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన అధ్యక్షతన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పశు సంవర్ధక శాఖల ప్రగతిపై సుదీర్ఘంగా సమీక్షించారు. బ్యాంకుల అధికారులు, ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ లబ్ధిదారులకు మేలు జరిగేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. జిల్లాలో ఈ ఏడాదికి కనీసం 4 వేల పశుకిసాన్ క్రెడిట్ ఖాతాలను ఓపెన్ చేయించాలని పశుసంవర్ధక శాఖ జేడీని ఆదేశించారు. ‘ఎల్నినో’ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని పశు సంపదను పెంచుకోవాల్సిన అసరం ఎంతైనా ఉందన్నారు. రైతులకు ఉపకరించేలా విరివిగా పశువుల రుణాలను అందజేయాలని బ్యాంకు అధికారులకు సూచించారు. రైతులందరూ ‘కృషికా’ యాప్ను డౌన్లోడ్ చేసుకుని, తమ ఆధార్ నంబర్తో లింక్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. దీని ద్వారా పంట రుణాల ప్రక్రియ ఆన్లైన్లో చాలా సులువుగా జరుగుతుందని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి వేలుగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలు తమ వార్షిక లక్ష్యాలు, ప్రణాళికలు, వ్యూహాల వివరాలను వెంటనే నాబార్డుకు అందించాలని కలెక్టర్ సూచించారు. ఈ వివరాల ఆధారంగా ఆయా శాఖలకు ఎంత మేరకు రుణ ప్రణాళిక అవసరమవుతోందో అంచనా వేయడం జరుగుతుందని పేర్కొన్నారు. సమావేశంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ వీవీ రమణమూర్తి, నాబార్డ్ డీడీ ఎం.నాగార్జున, మెప్మా, డీఆర్డీఏ పీడీ, వ్యవసాయ, పశుసంవర్ధక శాఖల జాయింట్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఘనంగా రెవెన్యూ దినోత్సవం విజయనగరం అర్బన్: ప్రజల నిత్య జీవితంలో రెవెన్యూ శాఖ ఒక కీలక భాగమని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి తెలిపారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన రెవెన్యూ దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం సిబ్బంది, అధికారులతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిటైర్ అయిన ఉద్యోగుల అనుభవాలను తెలుసుకొని సమర్ధతను పెంచుకోవాలని తెలిపారు. ప్రజాసేవే పరమావధిగా రాష్ట్ర అభివృద్ధికి, ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించడంలో రెవెన్యూ శాఖ కీలకపాత్ర పోషిస్తోందన్నారు. రెవెన్యూ శాఖలో రిటైర్ అయిన అటెండర్ నుంచి డిప్యూటీ కలెక్టర్ల వరకు పలువురిని ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్, డీఆర్ఓ సీహెచ్ సత్తిబాబు, ఏపీజేఏసీ ప్రెసిడెంట్ పి.ఆదిలక్ష్మి, రాష్ట్ర ఉపాధ్యక్షులు సీహెచ్ బంగార్రాజు, ఏపీఆర్ఎస్ఏ ట్రెజరర్ కె.జోగినాయుడు, జిల్లాలోని తహసీల్దార్లు, కలెక్టర్ సూపరింటెండెంట్లు, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
‘నారాయణ’లో పుస్తక విక్రయాలు
● అడ్డుకున్న ఎస్ఎఫ్ఐ ● విద్య కాదు..వ్యాపారం!విజయగనరం గంటస్తంభం: కార్పొరేట్ విద్యా సంస్థల్లో పుస్తక విక్రయాల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను ఆర్థికంగా దోచుకుంటున్నారని ఆరోపిస్తూ ఎస్ఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు నారాయణ విద్యా సంస్థ ఎదుట శనివారం నిరసన తెలిపారు. శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలోని నారాయణ పాఠశాలలో పుస్తకాల విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారంతో ఎస్ఎఫ్ఐ నాయకులు అక్కడకు చేరుకుని విక్రయాలను అడ్డుకుని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు జి.సూరిబాబు, కార్యదర్శి ఇ.వంశీ మాట్లాడుతూ ప్రభుత్వం కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాని విమర్శించారు. అధిక ఫీజులతో పాటు పుస్తకాలు, యూనిఫాంలు తప్పనిసరి చేస్తూ తల్లిదండ్రులై అదనపు భారం మోపుతున్నారని ఆరోపించారు. విద్యను సేవగా కాకుండా వ్యాపారంగా మార్చి విద్యార్థుల కుటుంబాలను నిలువునా దోచుకుంటున్న విద్యా సంస్థలపై సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా గర్ల్స్’ కో – కన్వీనర్ భారతి, పట్టణ కమిటీ సభ్యులు మురళి, సతీష్, కృష్ణ, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. -
వాయుస్తంభన విద్య
బొబ్బిలి: యోగ విద్యలో వాయుస్తంభన విద్యకు అధిక ప్రాధాన్యం ఉందని యోగవిద్యోపాసకుడు వంగపండు శ్రీరాములు అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా బొబ్బిలి పట్టణంలోని కళాభారతి మున్సిపల్ ఆడిటోరియంలో శనివారం వాయు స్తంభన విద్యను ప్రదర్శించారు. 3 గంటల పాటు ఇసుకలో ఉండి అబ్బురపరిచారు. పతంజలి యోగ శాస్త్రంలో హఠయోగ కష్టతరం, ధైర్య సాహసాలతో కూడిందన్నారు. హఠయోగంలో జల, వాయు, త్రిజల స్తంభన విద్యలున్నాయని, ఇవి కేవలం హిమాలయాల్లో ఉన్న యోగా గురువులు మాత్రమే చేయగలరని, హిమాలయాల్లో ఉండే యోగానంద భారతి స్వామీజీ వద్ద ఈ విద్య నేర్చుకున్నట్టు శ్రీరాములు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ ప్రముఖులు ఆయనను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పట్టణ యోగా శిక్షకురాలు సత్య, ఎంపీడీఓ పోతుల రవికుమార్, కళాభారతి అధ్యక్షుడు నంబియార్ వేణుగోపాలరావు, పుల్లెస శ్రీనివాసరావు, డీవీ అప్పారావు, రంపా రాఘవరావు, రౌతు వాసుదేవరావు, తదితరులు పాల్గొన్నారు. -
శివారు ప్రాంతాలకు సాగునీరు
● అధికారులను ఆదేశించిన ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి, చీఫ్ ఇంజినీర్ స్వర్ణకుమార్ రాజాం: తోటపల్లి సాగునీటి కాలువల ద్వారా రాజాం నియోజకవర్గంలో శివారు ప్రాంతాలకు సాగునీటిని అందించాలని ఇరిగేషన్ ఇంజినీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి, విశాఖపట్నం నార్త్ కోస్ట్ చీఫ్ ఇంజినీర్ స్వర్ణకుమార్ డీఈఈలు, ఏఈలను ఆదేశించారు. మండలంలోని చీకటిపేట నుంచి బొద్దాం వరకున్న తోటపల్లి ప్రాజెక్ట్ కుడి ప్రధాన కాలువను శనివారం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా సమస్యాత్మకంగా మారిన రీచ్లు, గట్లు, స్లూయీస్లపై ఆరా తీశారు. పాడైన వాటికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. కాలువలో వెంటనే పూడికలు తొలగించాలన్నారు. ఖరీఫ్ సీజన్లో ఆయకట్టులో ఏ ఒక్క ప్రాంతానికి నీరు అందకపోయినా చర్యలు తప్పవన్నారు. ప్రాజెక్ట్ కుడి కాలువ పరిధిలో ఆయకట్టు బ్లూ ప్రింట్ పరిశీలించి, రైతులతో మాట్లాడారు. అన్ని ప్రాంతాల్లోని ఆయకట్టు రైతులకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఈఈ గన్నిరాజు, డీఈఈలు సుబ్బారావు, లావణ్య, ప్రియదర్శిని, శంకరరావు, ఏఈలు పాల్గొన్నారు. -
రైళ్లలో ఆకస్మిక తనిఖీలు
పార్వతీపురం రూరల్: మత్తు పదార్థాల అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. రైల్వే మార్గాల ద్వారా సాగుతున్న మత్తు పదార్థాల రవాణాపై ఉక్కుపాదం మోపేలా ఈగల్ సెల్ రంగంలోకి దిగింది. పార్వతీపురం మన్యం జిల్లాలో శనివారం ఈగల్ సెల్, రైల్వే, స్థానిక పోలీసు బలగాలు సంయుక్తంగా రైళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. ఐజీపీ (ఈగల్) ఏకే రవికృష్ణ, జిల్లా ఎస్పీ ఎన్.మాధవ్రెడ్డి ఆదేశాల మేరకు ఈ ఆపరేషన్ చేపట్టారు. భవానీపట్నం నుంచి విశాఖపట్నం వెళ్లే ప్యాసింజర్ రైలు (నెం. 58503) ఎక్కిన బృందాలు.. పార్వతీపురం నుంచి విజయనగరం వరకు ప్రయాణిస్తూ అణువణువూ జల్లెడ పట్టాయి. ఈగల్ సెల్ ఎస్ఐ, కొమరాడ పోలీసులు, జీఆర్పీ, ఆర్పీఎఫ్తో పాటు డాగ్ స్క్వాడ్, డ్రోన్ బృందాలు రైలు బోగీలను, ప్రయాణికుల సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించాయి. ఈ తనిఖీల్లో ఎక్కడా ఎలాంటి మత్తు పదార్థాలు లభించలేదని అధికారులు వెల్లడించారు. మత్తు పదార్థాల రవాణా, ఇతర అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేలా.. జిల్లాలో ప్రజా రవాణా వ్యవస్థలైన రైళ్లు, బస్సుల్లో ఇకపై నిరంతరంగా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని ఈగల్ సెల్ అధికారులు స్పష్టం చేశారు. -
వీడని డోలీ కష్టాలు
శృంగవరపుకోట: మండలంలోని దారపర్తి పంచాయతీ పరిధి కురిడి గిరిజన గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో డోలీ కష్టాలు వీడడం లేదు. గ్రామానికి చెందిన సర్వేల సన్యాసిరావు (35) అనే గిరిజనుడు తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో శనివారం ఉదయం గ్రామస్తులు డోలీలో 10 కిలోమీటర్ల మేర మోసుకుంటూ మెట్టపాలెం వరకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి 108లో ఆస్పత్రికి తరలించారు. ‘అడవి తల్లి బాట’ పథకం కింద గిరిజన ఆవాసాలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తామని ప్రభుత్వాల ప్రకటనలు చేయడం తప్ప గిరిజనానికి ఒరిగేదేమీ లేదని, ఇప్పటికై నా కూటమి పాలకులు కళ్లు తెరిచి తమ కష్టాలు చూడాలంటూ గిరిజనులు కోరుతున్నారు. -
జేఎన్టీయూలో ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’
విజయనగరం రూరల్: స్థానిక జేఎన్టీయూ జీవీలో శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమం శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో జేఎన్టీయూ – జీవీ ఉప కులపతి (వీసీ) వి.వి.సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఎన్టీయూ ప్రాంగణంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ పేరుతో ప్రత్యేక పారిశుధ్య నిర్వహణ, చెత్త తొలగింపు కార్యక్రమం చేపట్టారు. అనంతరం వీసీ సుబ్బారావు మాట్లాడుతూ పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణ నిర్మాణంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. పరిసరాల పరిశుభ్రతతో సమాజాభివృద్ధిని సాధించవచ్చని తెలిపారు. రిజిస్ట్రార్ డి.రాజ్యలక్ష్మి మాట్లాడుతూ పరిశుభ్రత నిత్య జీవితంలో భాగంగా మార్చుకోవాలని అన్నారు. విశ్వవిద్యాలయాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని అన్నారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం ఆచార్యులు, అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తథ్యం
● ఆర్టీసీ ఎన్ఎంయూ జిల్లా కార్యదర్శి రాఫెల్ హెచ్చరికవిజయనగరం అర్బన్: ఆర్టీసీ జోన్ పరిధిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే సమ్మెకు వెళ్తామని ఆర్టీసీ ఎన్ఎంయూ జిల్లా కార్యదర్శి పీజీ రాఫెల్ హెచ్చరించారు. స్థానిక డిపో ఎదుట శనివారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆర్టీసీలో ఎదుర్కొంటున్న సమస్యలపై వివరించారు. జోనల్ మేనేజర్కు పలుమార్లు మెమోరాండంలు ఇచ్చినప్పటికీ కేంద్ర కార్యాలయం సర్క్యులర్లను పాటించకుండా ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లతో కూడిన 18 అంశాల మెమోరాండంను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కు అందజేసినట్లు తెలిపారు. డిమాండ్లలో ‘సీ్త్ర శక్తి’ పథకం అమలు ద్వారా ఎదురైన సమస్యలు, సిక్ లీవ్స్ జీతాల చెల్లింపులు, సర్క్యులర్ల అమలు, డ్రైవర్ల వేధింపుల నిలిపివేత, ఏకపక్ష చర్యల నిరసన, కొత్త టిమ్స్, ఖాళీల భర్తీ అండ్ ప్రమోషన్ల భర్తీ వంటివి ఉన్నాయి. జోనల్ కమిటీ సభ్యులు బి.రామారావు అధ్యక్షత వహించిన కార్యక్రమంలో డిపో నాయకులు యు.సంజీవరావు, కె.బంగార్రాజు, వి.అప్పలరాజు, శకుంతల, భారతి, సుజాత తదితరులు పాల్గొన్నారు. -
ప్రణాళికాబద్ధంగా చదివితే ఉత్తమ ఫలితాలు
● డీఈఓ మాణిక్యంనాయుడు గజపతినగరం రూరల్: పదోతరగతి విద్యార్థులు విద్యా సంవత్సరం ఆరంభం నుంచి ప్రణాళికాయుతంగా చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి యు.మాణిక్యంనాయుడు అన్నారు. మండలంలోని మరుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆ తర్వాత కేజీబీవీ, ఏపీ మోడల్ స్కూల్, ప్రాథమిక పాఠశాలలను శనివారం ఆకస్మికంగా సందర్శించారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులతో మాట్లాడారు. వివిధ సబ్జెక్టులపై ప్రశ్నలు వేసి విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను పరీక్షించారు. ప్రతిరోజు ప్రణాళికా బద్ధంగా చదివితే, పరీక్షల సమయంలో ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయగలుగుతారని సూచించారు. పాఠశాలల సంసిద్ధత కార్యక్రమాలను, సర్వేపల్లి రాధాకష్ణ విద్యా మిత్ర కిట్ల పంపిణీపై ఆరా తీశారు. కార్యక్రమంలో ఎంఈఓ–2 బి.సాయిచక్రధర్, ప్రధానోపాధ్యాయులు నాగమణి, జి.ఈశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. పరీక్ష కేంద్రాల పరిశీలన విజయనగరం క్రైమ్: జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న నీట్ పరీక్షలో భాగంగా జేఎన్టీయూ కేంద్రాన్ని కలెక్టర్ రామసుందర్రెడ్డి, ఎస్పీ ఎ.ఆర్.దామోదర శనివారం సందర్శించారు. జిల్లాలో మొత్తం ఆరు సెంటర్లలో నీట్ పరీక్ష జరగనుందని, ఆయా మార్గాల్లో అభ్యర్థులు సకాలంలో చేరుకునేందుకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు. పెన్సిల్ ముల్లుపై యోగా ముద్ర కొత్తవలస: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని దెందేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల డ్రాయింగ్ టీచర్ జి.పరమేశ్వరరావు శనివారం పెన్సిల్ ముల్లుపై యోగాసనం, యోగా ముద్ర చెక్కి అబ్బురపరిచారు. ఆయనను పాఠశాల హెచ్ఎం బి.సునీతతో పాటు తోటి ఉపాధ్యాయులు అభినందించారు. రైతుల ఖాతాల్లోకి రూ.83.03 కోట్లు పార్వతీపురం: కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన ‘అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్’ తొలి విడత నిధులను కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి విడుదల చేశారు. జిల్లాలో 1,22,260 మంది రైతులకు అన్నదాత సుఖీభవ కింద రూ.61.13 కోట్లు, 1,09,511మంది రైతులకు పీఎం కిసాన్ కింద రూ.21.90కోట్లు రైతుల ఖాతాలలో జమ కానున్నట్లు తెలిపారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. ఇండక్షన్ స్టవ్ల పంపిణీ జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల ఆధునీకరణలో భాగంగా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి, ఐసీడీఎస్ పీడీ టి.కనకదుర్గతో కలిసి అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్లను పంపిణీ చేశారు. పిల్లలు, గర్భిణులకు సురక్షితంగా, త్వరితగతిన పౌష్టికాహరం తయారు చేయడానికి ఈ స్టవ్లు ఉపయోగపడతాయని తెలిపారు. కార్యక్రమంలో సీడీపీఓలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. స్టవ్ల పంపిణీపై కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల నిరసన పాలకొండ రూరల్: సీ్త్ర శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ సేవలు అందించేందుకు అవసరమైన బస్సులు లేవు... కాలం చెల్లిన టిమ్ పరికరాలతో నరకం చూస్తున్నాం అంటూ ఎన్ఎంయూ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు పాలకొండ డిపో వద్ద శనివారం ఆందోళన చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నూతన టిమ్ యంత్రాలు మంజూరు చేయాలని, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలని నినదించారు. కార్యక్రమంలో ఎన్ఎంయూ నాయకులు వి.కె.రావు, పి.ఎల్.రావు, ఎస్టీ రావు, బీఎస్ రావు, డీజీ రావు, ఎం.ఆర్.మూర్తి, తదితరులు పాల్గొన్నారు. -
పశువుల లారీ సీజ్
దత్తిరాజేరు: ఎలాంటి నుమతులు లేకుండా 40 పశువులను కుక్కి తరలిస్తున్న లారీని శుక్రవారం పట్టుకున్నట్లు పెదమానాపురం ఎస్సై కళాధర్ తెలిపారు.పశువులు అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం అందడంతో సిబ్బందితో కలిసి స్టేషన్ సమీపంలో లారీ నిలిపి పరిశీలించగా అందులో కొన ప్రాణంతో ఉన్న 40 పశువులను గుర్తించి పట్టుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు పశువుల యజమానిపై కేసు నమోదు చేసి లారీని సీజ్ చేశామన్నారు. వ్యక్తి ఆత్మహత్యగజపతినగరం రూరల్ : మండలంలోని మధుపాడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఒంటరితనం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన ఈ సంఘటనపై పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అవివాహితుడు కలిగిట్ల సురేంద్ర తల్లిదండ్రులు కొద్దికాలం క్రితం మరణించగా, అక్కాచెల్లెళ్లు ఇద్దరు వివాహాలు చేసుకుని అత్తవారింటికి వెళ్లిపోవడంతో సురేంద్ర గ్రామంలోని తన ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. రోజువారీ కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ ఒంటరితనాన్ని భరించలేక శుక్రవారం తెల్లవారుజామున తన ఇంటిలోనే ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం సురేంద్ర ఎంతకీ తలుపులు తీయకపోవడంతో పక్కింట్లో ఉంటున్న బంధువు శ్రీనివాస్కు అనుమానం వచ్చి చూడగా బెడ్ షీట్ తో ఉరివేసుకుని ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. వెంటనే సురేంద్రను కిందకు దించగా అప్పటికే మృతిచెంది ఉన్నాడు. వెంటనే విశాఖపట్నంలో ఉంటున్న అక్క రజినికి సమాచారం చేరవేశారు. అక్క రజిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు గజపతినగరం ఎస్సై కె.కిరణ్ కుమార్ నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల విడుదలవిజయనగరం అర్బన్: జిల్లాలో నిర్వహించిన 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు, ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం 10వ తరగతి, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ మేరకు డీఈఓ యూ.మాణిక్యం నాయుడు ఫలితాలను ప్రకటించారు. జిల్లాకు సంబంఽధించిన ఫలితాల వివరాలు, రీ–కౌంటింగ్, రీ–వెరిఫికేషన్ మార్గదర్శకాలను డీఈఓ తెలియజేశారు. పరీక్షకు హాజరైన 2,113 మందిలో 86.80 శాతంతో 1,834 మంది ఉత్తీర్ణులు కాగా వారిలో హాజరైన 1,209 మంది బాలురలో 84.95 శాతంతో 1,027 మంది, 904 మంది బాలికల్లో 89.27 శాతంతో 807 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. రీ–కౌంటింగ్, రీ–వెరిఫికేషన్ వివరాలు: ఫలితాలపై అసంతృప్తి ఉన్న విద్యార్థులు అధికారిక వెబ్సైట్ ‘బీఎస్ఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్’ ద్వారా ఆన్లైన్లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు స్వీకరిస్తారు. రీ–కౌంటింగ్ ఫీజు సబ్జెక్టుకు రూ.500, రీ–వెరిఫికేషన్ ఫీజు సబ్జెక్టుకు రూ.వెయ్యిగా ప్రకటించారు. సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) ఫలితాలు ఆంధ్రప్రదేశ్ స్వారత్రిక విద్యాపీఠం మే–2026 నిర్వహించిన సప్లిమెంటరీ ఫలితాలలో జిల్లా విద్యార్ధులు మంచి ప్రతిభ కనపరిచారు. ఓపెన్ టెన్త్ ఫలితాలలో జిల్లా రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలవగా ఓపెన్ ఇంటర్ ఫలితాలలో 18వ స్థానంలో నిలిచింది. ఓపెన్ టెన్త్ పరీక్షకు హాజరైన 370 మందిలో 90 శాతంతో 333 మంది ఉత్తీర్ణులయ్యారు. ఓపెన్ ఇంటర్ పరీక్షకు హాజరైన 620 మందిలో 410 మంది పాసయ్యారు. ఫలితాలను వెంటనే విద్యార్థులకు తెలియజేయాలని ప్రధానోపాధ్యాయులను, ఓపెన్ స్కూల్ ఏఐ కోఆర్డినేటర్లను డీఈఓ ఆదేశించారు. మార్కుల జాబితాలను మరో నాలుగు రోజుల్లో వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. -
కపట నాటకం..!
విజయనగరం గంటస్తంభం: నమ్మించడం.. లబ్ధిపొందడం.. అనంతరం మోసం చేయడం.. ఎదురు తిరిగిన వారి మైండ్ను ఉత్తుత్తి పథకాలు, ఎల్లోమీడియాలో ప్రచారాలతో డైవర్షన్ చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నది రాజకీయ విశ్లేషకులు తరచూ చెప్పేమాట. నిరుద్యోగులను మోసం చేయడంలో ఆయన సఫలమయ్యారు. ఏటా జాబ్ క్యాలెండర్ అంటూ ఊరించారు. లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఊదరగొట్టారు. ఉద్యోగాలు కల్పించకుంటే నెలకు రూ.3వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇవేవీ ఆచరణ సాధ్యం కాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత ఆరంభమైంది. ఇది గమనించిన సర్కారు ‘కౌశలం’ (స్కిల్ టెస్ట్) పేరుతో కపట నాటకానికి తెర తీసింది. ఇంజినీరింగ్ పట్టభద్రులకు స్కిల్ టెస్ట్ నిర్వహించి, ప్రతిభ చూపిన వారికి అందుకు తగ్గట్టుగా ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఊదరగొట్టింది. దీనిని నమ్మిన జిల్లాకు చెందిన వేలాది మంది నిరుద్యోగ యువత రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో స్కిల్ టెస్ట్కు సన్నద్ధమవుతున్నారు. అయితే, జిల్లాలో 51,447 మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇప్పటివరకు కేవలం 3,600 మందికే స్కిల్ టెస్ట్ నిర్వహించగా, అందులో 47 మందికి మాత్రమే ఉద్యోగాలు రావడంతో నిరుద్యోగు లు గగ్గోలు పెడుతున్నారు. ఇదెక్కడి కౌశలం పరీక్ష అంటూ నిట్టూర్చుతున్నారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ కలిసికట్టుగా తమ గొంతుకోసేశారంటూ కన్నీరుపెడుతున్నారు. వెయ్యి మందిలో ఒక్కడికి కూడా ఉద్యోగం ఇవ్వలేని నాయకత్వ నైపుణ్యానికి నిరుద్యోగులు జోహార్లు పలుకుతున్నారు. అంతా భ్రమల ప్రపంచమేనా? ఐటీ కంపెనీలు లైన్లు కడతాయని, ఇంటి నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలతో రూ.లక్షలో సంపాదించుకోవచ్చని విద్యాశాఖమంత్రి లోకేశ్ బాబు చెప్పిన కాకమ్మ కథలు నమ్మి మోసపోయామని నిరుద్యోగులు లబోదిబోమంటున్నారు. కౌశలం పేరుతో కొత్త పథకం ప్రారంభించి మోసం చేశారని వాపోతున్నారు. అబద్ధాల కూటమికి ఓటేసి గెలిపించినందుకు మా చేతులు మేమే నరుక్కోవాలంటూ జిల్లా యువత విరక్తితో శాపనార్ధాలు పెడుతోంది. కౌశలం కార్యక్రమం విజయనగరం జిల్లాలో నిరంతరాయంగా కొనసాగుతున్న ప్రక్రియ. తొలి విడతలో కొంతమంది అభ్యర్ధులకు మాత్రమే పరీక్షలు నిర్వహించాం. మిగిలిన 47,800 మంది అభ్యర్థులకు త్వరలోనే విడతల వారీగా పరీక్షలు పూర్తిచేస్తాం. అనంతరం మెరి ట్, నైపుణ్యాల ఆధారంగా మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడతాయి. – ఎం.రోజారాణి, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారిణి(డీడీఓ), జీఎస్డబ్ల్యూఎస్, విజయనగరం -
లారీ ఢీ కొని కూరగాయల వ్యాపారి మృతి
రామభద్రపురం: మండలకేంద్రంలోని బైపాస్ రోడ్డులో శుక్రవారం రాత్రి 8.20 సమయంలో లారీ ఢీ కొని కూరగాయల వ్యాపారి మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన చలమల చిన్న (63) రామభద్రపురం అంతరరాష్ట్ర కూరగాయల మార్కెట్లో దాదాపు మూడు దశాబ్దాలుగా కూరగాయల వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు.అయితే రోజూ మాదిరిగానే శుక్రవారం మార్కెట్ నుంచి ఇంటికి సైకిల్మీద వెళ్తుండగా జాతీయ రహదారి నుంచి కృష్ణాఫార్మసీ పక్కనుంచి కాలనీ లింక్ రోడ్డుకు సైకిల్ తిప్పుతున్న సమయంలో విజయనగరం నుంచి ఎదురుగా వస్తున్న లారీ వెనుకభాగాన ఢీ కొట్టింది. అలాగే మృతదేహాన్ని కృష్ణాఫార్మసీ నుంచి స్టార్ అన్నపూర్ణ రెస్టారెంట్ వరకు సుమారు 100 అడుగులు పైబడి లారీ ఈడ్చుకెళ్లింది. రోడ్డు ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే సీఐ శ్రీనివాసరావు, ఎస్సై జ్ఞానప్రసాద్లు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాడంగి సీహెచ్సీకి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చిన్నారుల కోసం గణిత యంత్రం
రాజాం: సంతకవిటి మండలం శంకరునిఅగ్రహారం(శంకరపేట) గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు యడ్ల జనార్దననాయుడు తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. గత 18 ఏళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో సెకండరీగ్రేడ్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆయన ప్రస్తుతం శ్రీకాళహస్తిలో విధులు నిర్వహిస్తున్నారు. ఏడాదికాలంగా ఎంతో శ్రమించి మేథమెటిక్ మిషన్ను కనిపెట్టారు. ఒకటి నుంచి 5వ తరగతి విద్యార్థులకు సులభంగా గణిత పాఠాలు బోధించేందుకు ఈ మిషన్ ఉపయోగపడుతోంది. ఎటువంటి క్లిష్ట సమస్యనైనా సులువుగా ఈ మిషన్ ద్వారా పరిష్కరించవచ్చు. విద్యార్థులకు నేరుగా ప్రత్యక్ష పద్ధతిలో లెక్కలు బోధించేందుకు ఉపయోగపడే ఈ మిషన్ ప్రపంచంలోనే తొలి మిషన్గా ఆ ఉపాధ్యాయుడు వివరాలు వెల్లడించారు. తాను తయారుచేసిన ఈ మిషన్కు గణితంలో 108 కాన్సెప్ట్లు బోధించవచ్చని వివరించారు. విద్యార్థులకు కాన్సెప్ట్లెర్నింగ్, సెల్ఫ్ లెర్నింగ్, ఎక్సర్సైజ్ అండ్ ఎవల్యూషన్కు ఈ మిషన్ ఉపయోగపడుతోందన్నారు. ఈ మిషన్కోసం కష్టపడి పేటెంట్ హక్కులు తీసుకున్న ఆయన ప్రపంచంలోనే తొలి గణిత రీసెర్చ్ మిషన్ అని వివరించారు. విజయనగరం టు అమరావతి జనార్దనరావు మాష్టరు గత విద్యాసంవత్సరంలో వ్యక్తిగత కారణాలతో అంతర్ జిల్లాల బదిలీలో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలో వరదయ్యపాలెం మండలం నాగనందాపురం ప్రభుత్వ పాఠశాలకు బదిలీపై వెళ్లారు. అంతకుముందు సంతకవిటి మండలంలో చిత్తారిపురం, ఇజ్జిపేట, సంతకవిటి, బూరాడపేట పాఠశాలల్లోనూ, వంగర మండలం కొప్పరకొత్తవలస పాఠశాలల్లో పనిచేశారు. ఆయన తయారీచేసిన మిషన్ తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారులు తెలుసుకుని ఏపీ విద్యాశాఖ సెంట్రల్ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. దీంతో విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా జనార్దనరావును అమరావతి పిలిపించి శుక్రవారం అక్కడి విద్యాభవన్లో మిషన్ వినియోగంపై ఆరాతీశారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్తో పాటు ప్రాక్టికల్గా తరగతి గదిలో ఎలా పాఠాలు బోధించవచ్చో, గణిత లెక్కలు, క్లిష్ట సమస్యల పరిష్కారాన్ని చిన్నారులకు అర్థమయ్యే రీతిలో టీఎల్ఎం మాదిరి ఎలా బోధించవచ్చో వివరించారు. ఈ మిషన్ పనితీరు అద్భుతమని కమిషనర్ కితాబిచ్చినట్లు జనార్దననాయుడు మాస్టారు తెలిపారు. ఈ మిషన్పై రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి, అన్ని పాఠశాలలకు ఈ మిషన్ వినియోగంపై చర్చిస్తామని, భవిష్యత్తులో ఇదొక కంప్యూటర్ పరికరం మాదిరిగా ప్రతి పాఠశాలలో ఉపయోగపడుతుందని వెల్లడించినట్లు జనార్దనరావు అన్నారు. ఈ సందర్భంగా జనార్దనరావును పలువురు అభినందించారు. మేథ్మెటిక్ మిషన్ కనిపెట్టిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఏపీ విద్యాభవన్లో ప్రెజెంటేషన్ మిషన్ వినియోగంలోకి తెచ్చేయోచనలో విద్యాశాఖ -
పచ్చదనంపై గొడ్డలి పోటు..!
● ఇళ్ల ప్లాట్ల కోసం ప్రకృతి విధ్వంసం.. ● ప్లాస్టిక్ వాడకంతో శ్మశానంగా మారుతున్న భూమాతచెట్లను నరకడం వల్లే పిడుగుల తీవ్రత గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పొడవాటి తాటి, రావి చెట్లు సహజసిద్ధమైన లైట్నింగ్ అరస్టర్లుగా పనిచేస్తాయి. లేఅవుట్లు, భవనాల కోసం వాటిని విచక్షణారహితంగా నరికేయడం వల్లే పిడుగులు నేరుగా మనుషులపై పడుతున్నాయి. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. చెట్లను అక్రమంగా నరికితే కఠిన చర్యలు తీసుకుంటాం. – బి.రామ్ నరేష్, జిల్లా ఫారెస్ట్ రేంజ్ అధికారి, విజయనగరం పర్యావరణాన్ని కాపాడుకోకపోతే మనుగడ కష్టం ప్లాస్టిక్ వ్యర్థాలు, వాహన కాలుష్యం వల్ల గాలిలో విషవాయువులు విపరీతంగా పెరిగిపోయి హరితగృహ ప్రభావం ఏర్పడుతోంది. దీనివల్లే అసాధారణ ఎండలు, అకాల వర్షాలు, పిడుగుపాట్లు సంభవిస్తున్నాయి. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నియంత్రించకపోతే మానవ మనుగడకే వాటిల్లుతుంది. – పి.వీ.ఎస్.రామకృష్ణ, పర్యావరణ నిపుణుడు విజయనగరం గంటస్తంభం: ప్రకృతి ఒడిలో బతికినంత కాలం మనిషికి ఎలాంటి లోటూ లేదు. కానీ, ఎప్పుడైతే మనిషికి స్వార్థం ముదిరి తనను సాకుతున్న ప్రకృతి గుండెలపైనే గొడ్డలితో వేటు వేయడం మొదలుపెట్టాడు. అభివృద్ధి, ఆధునికత, లేఅవుట్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారాల పేరిట..ప్రాణవాయువునిచ్చే పచ్చటి మహావృక్షాలను నిలువునా నరికేస్తున్నాడు. భూమిని కాంక్రీట్ అడవిగా మారుస్తూ మనిషి చేస్తున్న ఈ దారుణ ద్రోహానికి..ప్రకృతి ఇప్పుడు ఎదురుదాడి చేస్తోంది. ఆ ఆక్రోశమే..నేడు అకాల వర్షాలు, భానుడి అసాధారణ భగభగలు, ఆకాశం నుంచి పడుతున్న నిప్పుల పిడుగులు, ఇటీవల మే, జూన్ నెలల్లో విజయనగరం జిల్లా పరిధిలో సంభవించిన ప్రాణ నష్టాలే ఇందుకు సజీవ సాక్ష్యాలు. నాడు చెట్లు పిడుగులను మోశాయి.. నేడు నేరుగా మనుషుల మీదే పాత రోజుల్లో ఎంత పెద్ద వాన పడినా, ఉరుములు ఉరిమినా మనుషులపై నేరుగా పిడుగులు పడి చనిపోయిన సంఘటనలు చాలా అరుదుగా ఉండేవి. దానికి కారణం నాటి కాలంలో ప్రతి ఊరి పొలిమేరల్లో, చెరువు గట్లపై, పొలాల గట్లపై ఆకాశాన్ని తాకేలా పెద్ద పెద్ద తాటి చెట్లు, రావి చెట్లు, వేప చెట్లు, మర్రి చెట్లు ఉండేవి. ఆకాశంలో మేఘాల ఘర్షణ వల్ల పుట్టే ఘోరమైన విద్యుదాఘాతాన్ని(పిడుగును) ఆ ఎత్తైన వృక్షాలు తమ గుండెలపైకి లాక్కునేవి అలా లాక్కుని, ఒక ఎర్త్లా పనిచేసి ఆ ప్రమాదకర విద్యుత్ను భూమిలోకి పంపేసేవి. తమ ప్రాణాలను పణంగా పెట్టి మనుఘలను, పశువులను కాపాడేవి. కానీ ఈ రోజు? భూముల వ్యాపారం కోసం, కోట్ల రూపాయల లాభాల కోసం ఆ ఎత్తైన చెట్లన్నింటినీ నరికేశారు. రోడ్ల విస్తరణ కోసం, లేఅవుట్ల కోసం వందల ఏళ్ల నాటి వృక్షాలను నేలకూల్చారు. ఇప్పుడు ఆకాశానికి, భూమికి మధ్య రక్షణగా నిలిచే అడ్డుగోడలే లేవు. ఫలితంగా, ఆకాశం నుంచి పడే పిడుగులు అడ్డులేకుండా..పొలాల్లో కష్టపడే అమాయక రైతులపై, రెక్కాడితే గానీ డొక్కాడని పేద కూలీలపై, మైదానాల్లో ఆడుకునే పసిపిల్లలపై నేరుగా పడి క్షణాల వ్యవధిలో వారి ప్రాణాలను బూడిద చేస్తున్నాయి. నోరులేని పశువులు, గొర్రెలు, మేకలు కూడా ఈ పిడుగుల ధాటికి మాడిపోతున్నాయి.ఇప్పటికై నా మేల్కొని చెట్లను నాటుదాంఒకప్పుడు ప్లాస్టిక్ వాడకం తక్కువగా ఉండడం వల్ల భూమి పచ్చగా, స్వచ్ఛంగా ఉండేది. కానీ నేడు ఏ వస్తువు కొన్నా ప్లాస్టిక్కే. భూమిలో కలవడం అసాధ్యమైన ఈ ప్లాస్టిక్ వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకడం లేదు. మరోవైపు అడ్డగోలుగా పెరుగుతున్న వాహనాలు, ఫ్యాక్టరీల నుంచి కార్బన్మోనాకై ్సడ్, కార్బన్డయాకై ్సడ్ వంటి వ్యర్థ వాయువులు విపరీతంగా రిలీజ్ అవుతున్నాయి. చెట్లే ఉంటే ఆ పొల్యుషన్ను పీల్చుకుని స్వచ్ఛమైన ఆక్సిజన్ను విడిచిపెట్టేవి. కానీ చెట్లను నరికేయడం వల్ల గాలి మొత్తం విషపూరితమైపోయింది. ఇదే నిర్లక్ష్యం కొనసాగితే మనిషి వీపున ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకుని తిరిగే దౌర్భాగ్య పరిస్థితి వస్తుంది. అభివృద్ధి చెందినప్పుడు ప్రకృతిని ఎంత విధ్వంసం చేస్తున్నామో, అంత ప్రకృతిని తిరిగి సృష్టించగలిగితేనే పర్యావరణాన్ని సమతుల్యం చేయగలం. -
విపత్తులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి
విజయనగరం అర్బన్: ౖనెరుతి రుతుపవనాలు ప్రవేశిస్తున్న తరుణంలో వర్షాలు, వరదల వల్ల తలెత్తే ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి సన్నద్ధతతో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. విపత్తుల నిర్వహ ణ శాఖ డైరెక్టర్ ప్రఖర్ జైన్ అమరావతి నుంచి జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల అధిపతులతో వీడియా కాన్ఫరెన్స్లో శుక్రవారం మాట్లాడా రు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ ముందస్తు జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. రెవెన్యూ, ఆర్అండ్బీ, నీటిపారుదల, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ లు, విద్యుత్, వైద్య ఆరోగ్య, అగ్ని మాపక, విద్యాశాఖలతోపాటు అన్ని అనుబంధ శాఖలు విపత్తు నిర్వహణపై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్వో సీహెచ్.సత్తిబాబు, జిల్లా వ్యవసాయ అధికారి వి.టి.రామారావు, ఉద్యానవన శాఖ అధికారి కె.చిట్టిబాబు, ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ ఎం.లక్ష్మణరావు, కలెక్టరేట్ సెక్షన్ అధికారులు పాల్గొన్నారు. విజయనగరం: జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో కొత్తగా ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్గా ఎన్నికై న కంది వెంకటరమణ..జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావును శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రెడ్క్రాస్ నూతన చైర్మన్ సహా కొత్తగా ఎన్నికై న సభ్యులను జెడ్పీ చైర్మన్ దుశ్శాలువాలతో సత్కరించి, అభినందనలు తెలిపారు. జిల్లాలో రక్త నిల్వలు పెంచేందుకు రక్తదాన శిబిరాలు నిర్వహించాలని, రక్తదానంపై ప్రజలకు ఉన్న అపోహలు పోగొట్టి, ప్రతిఒక్కరూ రక్తదానానికి ముందుకువచ్చేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జెడ్పీ చైర్మన్ సూచించారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ సొసైటీ కోశాధికారి పొగిరి విశ్వేశ్వరరావు, మేనేజింగ్ కమిటీ సభ్యులు వెన్నెల చంద్రశేఖర్, ముమ్మల తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల నిజాయితీ పాలకొండ రూరల్: విజయవాడ నుంచి పాలకొండ వస్తున్న సూపర్ లగ్జరీ బస్సు డ్రైవర్లు నిజాయితీ చాటుకున్నారు. బస్సులో ప్రయాణిస్తున్న ఉట్టిగుట్ట నాగేశ్వరరావు తన బ్యాగ్ను మరిచిపోయి విశాఖపట్నంలో దిగిపోయాడు. బ్యాగ్ గమనించిన డ్రైవర్లు పాలకొండ డిపోలో అందించారు. బ్యాగ్లో లక్ష రూపాయల నగదుతోపాటు వ్యక్తిగత వస్తువులు ఉన్నట్లు డిపో యాజమాన్యం గుర్తించింది. వెంటనే సెల్ ఫోన్లో బాధితులకు డిపో మేనేజర్ బీఎస్ఎన్మూర్తి సమాచారం అందించారు. నాగేశ్వరరావు కుమార్తె జ్యోతి శుక్రవారం పాలకొండ డిపోకు చేరుకోవడంతో ఆర్టీసీ యాజమాన్యం బ్యాగ్తోపాటు మిగిలిన వస్తువులను అందజేసింది. విధి నిర్వహణలో నిజాయితీ చాటుకున్న డ్రైవర్లు బంగారునాయుడు, రమేష్లను యాజమాన్యం అభినందించింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణికులతో పాటు వస్తులకు కూడా భద్రత ఉంటుంద న్నారు. -
రుణం బంగారమాయె..!
● రుణ మంజూరు, రెన్యువల్స్లో కొత్తమార్గదర్శకాలు ● రెన్యువల్కు పూర్తిమొత్తం చెల్లించాలన్న నిబంధన ● తిరిగి బంగారంపై తక్కువ రుణమొత్తం ● ఆవేదనలో రైతులు, చిరువ్యాపారులు, మధ్యతరగతి ప్రజలు నెల్లిమర్ల రూరల్: ఒకప్పుడు ఇంట్లో బంగారం ఉంటే అత్యవసర పరిస్థితుల్లో అది ఆ కుటుంబానికి ఆర్థిక భరోసాగా ఉండేది. ఆస్పత్రి ఖర్చులు, పిల్లల చదువులు, వ్యాపార అవసరాలు, వ్యవసాయ పెట్టుబడులు.. ఇలా ఏ అవసరం వచ్చినా బ్యాంకులో బంగారాన్ని తాకట్టుపెట్టి రుణం తీసుకుని గట్టెక్కెవారు. గడువు ముగిసినప్పుడు వడ్డీ చెల్లించి రుణాన్ని రెన్యువల్ చేసుకునేవారు. ఏడాది కాలంగా బంగారు రుణాలపై అమలవుతున్న కొత్త విధానాలు లక్షలాది మంది రుణ గ్రహీతల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, చిన్న వ్యాపార వర్గాలు, మహిళా స్వయం సహాయక సంఘాల్లో ఈ అంశంపై చర్చ జరుగుతోంది. ఇంతక ముందు బంగారంపై తీసుకునే రుణం గడువు పూర్తయిన తర్వాత వడ్డీ లేదా కొంత మొత్తాన్ని చెల్లించి రుణాన్ని రెన్యువల్ చేసుకునే వెసులుబాటు ఉండేది. బంగారం బ్యాంక్లో ఉండేదే తప్ప రుణగ్రహీతకు అదనపు ఒత్తిడి ఉండేది కాదు. ప్రస్తుతం కొన్ని బ్యాంకులు, ఆర్ధిక సంస్థల్లో పాత రుణాన్ని పూర్తిగా క్లోజ్ చేసిన తర్వాతే కొత్త రుణం మంజూరు చేస్తున్నారు. దీంతో ఒకేసారి లక్షల రూపాయలు సమకూర్చుకుని రుణం చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. వడ్డీలకు అప్పుచేసి రుణం చెల్లిస్తున్నారు. తిరిగి బంగారం కుదవపెడుతున్నారు. చిన్న వ్యాపారులు బంగారం రుణాలను వర్కింగ్ క్యాపిటల్గా వినియోగించుకోవడం సర్వ సాధారణం. కిరాణాషాపులు, కూరగాయల వ్యాపారులు, చిన్న హోల్సేల్ వ్యాపారులు, కాంట్రాక్టర్లు తరచూ బంగారు రుణాలతోనే నగదు అవసరాలు తీర్చుకుంటారు. రెన్యువల్ ప్రక్రియ కఠినతరం కావడంతో వ్యాపార నిర్వహణకు అవసరమైన నగదు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల ప్రజలు, రైతులు తమ పిల్లల చదువులు, వైద్యావసరాలు, వివాహాల ఖర్చులు, పంట పెట్టుబడికి బంగారాన్ని తాకట్టుపెట్టి రుణం తీసుకుంటారు. ఇప్పుడు వీరందరికీ రుణ నిబంధనలు అవరోధంగా మారాయి. కొన్ని బ్యాంకుల్లో ఎంత బంగారం ఉన్నా రూ.2.5 లక్షలకు మించి రుణం ఇవ్వడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే, కొన్ని ప్రత్యేక రుణ కేటగిరీలు, అంతర్గత బ్యాంక్ విధానాలు, రిస్క్ అంచనాల కారణంగా ఇలాంటి పరిస్థితులు ఉండొచ్చన్న వాదన బ్యాంకు వర్గాల నుంచి వినిపిస్తోంది. వ్యవసాయ పనుల ఖర్చుల కోసం గతంలో బంగారం బ్యాంకులో తాకట్టుపెట్టి రుణం తీసుకునేవారం. వ్యవసాయం కలిసిరాకుంటే వడ్డీకట్టి రుణాన్ని రెన్యువల్ చేసుకునేవారం. ఇప్పుడు బ్యాంకుకు వెళ్తే పూర్తిగా రుణం డబ్బులు కట్టమని చెబుతున్నారు. ఇలా అయితే నగదు సర్దుబాటు చేసుకోవడం కష్టం. – చందక బలరాం, రైతు, నెల్లిమర్ల మండలం బంగారాన్ని తాకట్టుపెట్టి తీసుకున్న రుణాల రెన్యువల్ ప్రక్రియను సరళీకరించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అవసరాలను దృష్టిలో ఉంచుకుని బంగారు రుణ విధానాల్లో సమతుల్యత పాటించాలి. – సురేష్, ఒమ్మి గ్రామం, నెల్లిమర్ల మండలం నా కుమార్తె పెళ్లి అవసరాల నిమిత్తం బ్యాంకులో బంగా రం కుదవ పెట్టి గతంలో రూ.5లక్షల వరకు రుణం తీసుకున్నాను. ఆ తరువాత రూ.2లక్షలు చెల్లించి కొంత బంగారం విడిపించుకున్నాను. మళ్లీ రుణం కోసం బ్యాంక్ అధికారు లను సంప్రదిస్తే నిబంధనలు మారడం వల్ల ఇవ్వలేమని చెప్పేశారు. కావాలంటే ఇంకో వ్యక్తి పేరుపై తీసుకోవాలని చెప్పారు. చేసేదిలేక బయట ఎక్కువ వడ్డీకు అప్పుకు తీసుకోవాల్సి వచ్చింది. మా లాంటి పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఈ విధానం సరికాదు. – సునీత, సతివాడ గ్రామం, నెల్లిమర్ల మండలం ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం గోల్డ్ లోన్స్ ఉండాల్సిన దాని కంటే చాలా ఎక్కువగా ఉన్నా యి. బంగారం కంటే లోన్ డబ్బులు అధికంగా ఉండడం వల్ల ఎప్పుడైనా గోల్డ్ క్రాస్ అయితే బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. దీంతో బ్యాంకులన్నింటికీ ఆర్బీఐ కొత్త మార్గదర్శకాల ను జారీ చేసింది. వ్యవసాయానికి, ఇంటి అవస రాలకు రూ.2.50లక్షలు ఉపయోగించుకోవచ్చు. వ్యాపారం నిమిత్తం అదనంగా అవసరమైతే నిబంధనల ప్రకారం ఐటీ రిటర్న్స్, ఇతర పత్రా లు చూపించాల్సి ఉంటుంది. మారిన మార్గదర్శకాలను ప్రజలు గమనించి సహకరించాలి. – రవికుమార్, బ్యాంక్ మేనేజర్, ఏపీజీవీబీ, నెల్లిమర్ల -
పీఎం వీబీఆర్వైతో ఉపాధి, సామాజిక భద్రత
విజయనగరం అర్బన్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన్ (పీఎం–వీబీఆర్వై)తో యువతకు ఉపాధి అవకాశాలు, సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యమని ప్రాంతీయ ఈపీఎఫ్ఓ కమిషనర్ కణితి అవినాష్కుమార్ అన్నారు. విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా రూ.2,400 కోట్ల ప్రోత్సాహకాలను డీబీటీ విధానంలో విడుదల చేసిన కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంగా వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం రీజియన్లో పీఎం–వీబీఆర్వై కింద 705 రిజస్ట్రేషన్లు నమోదయ్యాయ న్నారు. తొలుతగా 2,073 మంది ఉద్యోగార్థులు, 474 మంది మహిళలకు పార్ట్–ఏ కింద రూ.61.12 లక్షలు, పార్ట్–బి కింద రూ.10.66 కోట్ల ప్రోత్సాహకాలు మంజూరైనట్లు వెల్లడించారు. సంఘటిత రంగంలో తొలిసారి ఉద్యోగాల్లో చేరి నెలకు రూ.1 లక్షలోపు వేతనం పొందే యువతకు గరిష్టంగా రూ.15 వేల వరకు ఆర్థిక ప్రోత్సాహకం అందజేస్తామన్నారు. కొత్త ఉద్యోగాలు కల్పించే సంస్థలకు ప్రతి ఉద్యోగిపై నెలకు రూ.3 వేల వరకు ప్రోత్సాహకాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమ శాఖ జనరల్ మేనేజర్ ఎం.వి.కరుణాకర్, జిల్లా కార్మిక శాఖ ఉప కమిషనర్ ఎస్.డి.వి.ప్రసాదరావు, సహాయ కమిషనర్లు జి.ఎల్లాజీరావు, ఇన్సెపెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సుధాకర్, లేబర్ ఎన్ఫోర్సుమెంట్ ఆఫీసర్ రుబల్ సింగ్, సోమేంధ్రకుమార్ సాహూ పాల్గొన్నారు. -
104లో మందుల కొరత
● బీపీ, థైరాయిడ్, దగ్గు, ఆయాసం బాధితులకు అందని మందులు ● వైద్య శిబిరాలకు వచ్చి నిరాశతో వెనుదిరుగుతున్న వైనం విజయనగరం ఫోర్ట్: ●జామి మండలానికి చెందిన రాములమ్మ అనే వృద్ధురాలు గత కొంత కాలంగా బీపీతో బాధపడుతోంది. బీపీ మందుల కోసం ఆమె 104 శిబిరానికి వెళ్తే మందులు లేవని చెప్పడంతో నిరాశతో వెనుదిరిగారు. ●గంట్యాడ మండలానికి చెందిన సింహాచలం అనే వృద్ధురాలు బీపీతో బాధపడుతోంది. ఎమ్లాడోఫిన్ మాత్రల కోసం 104 వాహన శిబిరం వద్దకు వెళ్తే లేవని చెప్పడంతో నిరాశతో వెనుదిరిగారు. జిల్లాలో 104 వాహన వైద్య శిబిరాలకు వచ్చే రోగులకు మందుల కొరత వెంటాడుతోంది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు అవసరమైన మందులు లభించడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాహన నిర్వహణ బాధ్యతలు తీసుకున్న భవ్య సంస్థ... ప్రజా వైద్యంపై నిర్లక్ష్యం చూపుతోందని రోగులు విమర్శిస్తున్నారు. శిబిరాల్లో బీపీ, షుగర్, హిమోగ్లోబిన్ వంటి ప్రాథమిక స్థాయి వైద్య పరీక్షలు చేయడం, ఉచితంగా మందులు ఇవ్వడం, గర్భిణులు, చిన్న పిల్లల ఆరోగ్య పరిశీలన, ఆరోగ్య అవగాహన కార్యక్రమాల నిర్వహణ, అవసరాన్ని బట్టి రోగులను సమీప పీహెచ్సీలకు రిఫర్ చేయడం, దగ్గర్లో ఆస్పత్రి సౌకర్యం లేని ప్రజలు, గర్భణులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల ఆరోగ్య సంరక్షణ, పర్యవేక్షణకు 104 వాహన శిబిరాలే ఆధారం. జిల్లాలో 104 వాహనాలు 46 ఉన్నాయి. వీటిలో చాలా వాహనాల్లో మందుల కొరత నెలకొంది. బీపీ రోగులు వినియోగించే టెల్మా, ఎమ్లాడోఫిన్, ఎటిన్లాల్, యాంటీ బయాటిక్ మందులు అయిన మెట్రోజెల్, నారఫ్లాక్సిన్, ఎమాక్సిలిన్–625, ఎమాక్సిలిన్–500 ఎంజి, ఎమాక్సిలిన్ 250 ఎంజీ మాత్రలు, థైరాయిడ్ వ్యాధికి ఉపయోగించే థైరాయిడ్ 100 ఎంజీ మాత్రలు, థైరాయిడ్ 50 ఎంజీ, థైరాయిడ్ 25 ఎంజీ మాత్రలు, గాయాలు తగ్గడానికి ఉపయోగించే ప్రొవిడెన్ ఆయింట్ మెంట్, విప్రోసిన్, ఫంగల్ ఇన్ఫెక్షన్కు ఉపయోగించే క్లోట్రోమైజోల్ ఆయింట్ మెంట్స్, దగ్గుకు ఉపయోగించే సాల్బాటమాల్ సిరప్, ఎంబ్రాక్సిల్ సిరప్లు 104 వాహనాల్లో లేవని రోగులు చెబుతున్నారు. మందుల కోసం పీహెచ్సీలకు, జిల్లా ఆస్పత్రికి వెళ్లాల్సివస్తోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గతంలో అన్ని రకాల మందులు, వైద్య పరీక్షలు అందుబాటులో ఉండేవని, ఇప్పుడా పరిస్థితి లేదని చెబుతున్నారు. 104 వాహనాల్లో మందులు కావాలని ఇండెంట్ పెడుతున్నారు. ఆ మేరకు సరఫరా చేస్తున్నాం. ప్రస్తుతం మందులు వచ్చాయి. వాటిని వాహనాలకు సరఫరా చేస్తాం. – కె.శ్రీకాంత్, 104 జిల్లా మేనేజర్ -
‘ఎంవీజీఆర్’ ఏఏఓకు ఉత్తమ అవార్డు
డెంకాడ: గీతం యూనివర్సిటీ (విశాఖపట్నం) వేదికగా ఈ నెల 8 నుంచి 17వ తేదీ వరకు జరిగిన కంబైన్న్డ్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్–5 (సీఏటీసీ)లో డెంకాడ మండల పరిధిలోని చింతలవలస ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాల అసోసియేట్ ఎన్సీసీ ఆఫీసర్ (ఏఏఓ) లెఫ్టినెంట్ ఎన్.మెహర్ వాసు ప్రతిష్టాత్మకమైన ‘ఉత్తమ ఏఎన్ఓ’ అవార్డును కై వసం చేసుకున్నారు. ఎన్సీసీ శిక్షణలో ఆదర్శప్రాయమైన నాయకత్వ పటిమను కనబరుస్తూ, క్యాడెట్ల సర్వతోముఖాభివృద్ధికి ఆయన చేసిన కృషికి గాను ఈ విశిష్ట గౌరవం దక్కింది. విశాఖపట్నం 2(ఏ) సీటీఆర్ ఎన్సీసీ యూనిట్ (ఆర్మీ వింగ్) కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ కార్తీక్ నేతృత్వంలో శుక్రవారం నిర్వహించిన ఈ ముగింపు వేడుకల్లో యూనిట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ జి. భద్రయ్య చేతుల మీదుగా లెఫ్టినెంట్ మెహర్ వాసు ఈ అవార్డును, ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. క్యాంప్ నిర్వహణలోను, క్రమశిక్షణను పెంపొందించడంలోనూ ఆయన చూపిన అంకితభావం తోటి అధికారుల ప్రశంసలు అందుకుంది. జాతీయ స్థాయిలో సంస్థకు కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చిన లెఫ్టినెంట్ ఎన్. మెహర్ వాసును ఎంవీజీఆర్ కళాశాల యాజమాన్యం శుక్రవారం ఘనంగా సత్కరించింది. కార్యక్రమంలో ఎన్సీసీ పీఐ సిబ్బంది, వివిధ విభాగాల ఏఏఓలు, క్యాడెట్లు పాల్గొన్నారు. -
ఆటోసర్వీస్ నగదు లావాదేవీల్లో వ్యక్తి హత్య
మక్కువ: ఆటో భాగస్వామ్యం సర్వీస్ నగదు లావాదేవీలపై జరిగిన గొడవ కారణంగా ఓ యువకుడు హత్య కు గురయ్యాడు. పార్వతీపురం మన్యం జిల్లా, మక్కువ మండలం కొండబుచ్చమ్మపేట గ్రామంలో జరిగిన ఈ హత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కొండబుచ్చమ్మపేట గ్రామానికి చెందిన మరడ శ్రీనివాసరావు(27) ఆటోను, అదే గ్రామంలో నివాసముంటున్న దత్తి అచ్యుతరావు ఆదాయ భాగస్వామ్యం పద్ధతిలో నడుపుతున్నాడు. ఆటో సర్వీస్ ద్వారా వచ్చిన నగదు లావాదేవీల పై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈనెల 12వ తేదీన ఆటో ఓనర్ శ్రీనివాసరావు, తన భాగస్వామ్యుడైన అచ్యుతరావును ఇంటికి రమ్మనగా, ఇద్దరూ ఇంటి మేడపైకి వెళ్లి మాట్లాడుకుంటుండగా, గొడవ తలెత్తింది. ఈ నేపథ్యంలో శ్రీనివాసరావును, అచ్యుతరావు ప్రహరీకి వాటర్ ట్యాంకుకు గుద్దించి, రెండు చేతులతో గొంతు నొక్కి శ్రీనివాసరావును హత్య చేశాడు. 13వ తేదీన తెల్లవారు జామున మేడపై శ్రీనివాసరావు విగతజీవిలా పడి ఉండడాన్ని కుటుంబసభ్యులు గుర్తించారు. శ్రీనివాసరావు గుండెపోటు, మద్యం అధికంగా తాగడం వల్ల మృతి చెందినట్లు కుటుంబ సభ్యులను, గ్రామస్తులను నిందితుడు అచ్యుతురావు నమ్మించాడు. అంతేకాకుండా శ్రీనివాసరావు అంత్యక్రియల్లో కూడా చురుగ్గా పాల్గొన్నాడు. శ్రీనివాసరావు ముఖంపై గాయాలు గుర్తించిన కుటుంబసభ్యులు గ్రామస్తులు, అచ్యుతరావును నిలదీయగా గ్రామం నుంచి పరారయ్యాడు. మృతుడు శ్రీనివాసరావు అన్నయ్య మరడ వెంకటేష్ ఈనెల 16వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తుండగా, అదే గ్రామానికి చెందిన గ్రామ పెద్ద ధనంజయరావు ద్వారా, నిందితుడు అచ్యుతరావు నేరం అంగీకరించి పోలీసులకు లొంగిపోయాడు. నిందితుడు అచ్యుతరావు వాంగ్మూలాన్ని రెవెన్యూ అధికారుల సమక్షంలో పోలీసులు సేకరించారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్సై వెంకటరమణ శుక్రవారం తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు -
యోగాతో ఆరోగ్యకర సమాజం
● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి విజయనగరం రూరల్: ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో యోగా కీలకపాత్ర పోషిస్తుందని, భారతదేశం ప్రపంచానికి అందించిన అద్భుతవరం యోగా అని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక క్షేత్రమైన రామనారాయణం వేదికగా యోగాంధ్ర కార్యక్రమాన్ని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి గురువారం ప్రారంభించారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్లతో పాటు జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, స్వయం సహాయక సంఘాల మహిళలు యోగాసనాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు రోజుకు 30 నిమిషాలు యోగాకు కేటాయించాలన్నారు. అనంతరం యోగా గురువులను సత్కరించారు. కార్యక్రమంలో జేసీ ఎస్.సేతుమాధవన్, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస పాణిలతో పాటు జిల్లా అధికారులు, ఎన్సీఎస్ ట్రస్టీ నారాయణం సీతారామయ్య, నోడల్ అధికారి డాక్టర్ వరప్రసాద్, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. మహిళలకు తప్పని ఇబ్బందులు యోగాంధ్ర కార్యక్రమానికి జన సమీకరణకు కింది స్థాయిసిబ్బంది అవస్థలు పడ్డారు. డీఆర్డీఏ, ఐసీడీఎస్ పరిధిలోని అధికారులు జన సమీకరణకు కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో స్వయం సహాయక సంఘాల మహిళలు, ఉపాధి హామీ వేతనదారులను యోగాంధ్ర కార్యక్రమానికి తరలించారు. యోగాసనాలు వేసేందుకు అనువైన ప్రదేశం లేకపోవడంతో మహిళలు ఇబ్బందులు పడ్డారు. -
చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
● 23 తులాల బంగారం, 73తులాల వెండి స్వాధీనం విజయనగరం క్రైమ్: గత నెల 30వ తేదీన విజయనగరం టూటౌన్ పరిధి వైఎస్ఆర్ నగర్లోని శ్రీసత్య నగర్లో జరిగిన దొంగతనం కేసులో విశాఖ జిల్లా మధురవాడకు చెందిన షేక్ అజీజ్ ను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ కేసు అంశాలను ఎస్పీ దామోదర్ వెల్లడించారు. మధుర వాడకు చెందిన షేక్ అజీజ్ ఇప్పటివరకు పలు జిల్లాల్లో 50 దొంగతనాలు చేశాడు. ఈ క్రమంలో గత నెల 30న పొట్టా వీర వెంకట స్వామి తన భార్యతో అన్నవరం దర్శనం చేసుకుని మర్నాడు 31 వ తేదీన సాయంత్రం ఇంటికి వచ్చేసరికి తాళం తెరిచి ఉంది. ఇంటి లోపల అన్ని తలుపుల గడియలు తీసి ఉండడం ఆపై బెడ్ రూమ్ లో బీరువా లాకర్ తెరిచి ఉండటం మంచంపై బీరువాలో సామగ్రి పడి ఉండడం లాకర్లో 23న్నర తులాల బంగారం, 73 తులాల వెండి వస్తువులు కనిపించకపోవడంతో లబోదిబో మంటూ ఆ రోజు రాత్రి టూటౌన్ పోలీస్స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. జరిగిన దొంగతనాన్ని సీరియస్ గా తీసుకున్న ఎస్పీ దామోదర్ పది క్రైమ్ బృందాలను రంగంలోకి దించారు. పోలీసులకు అందిన సమాచారంతో నిందితుడు షేక్ ఆజీజ్ కాకినాడలో ఉండడంతో వారంట్ తీసుకుని అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా టూటౌన్ సీఐ శ్రీనివాస్ నిందితుడు షేక్ ఆజీజ్ ను తమదైన శైలిలో విచారణ చేసి చోరీ కేసులో పోయిన ఆభరణాలను,నగదును రికవరీ చేశారని ఎస్పీ వివరించారు. -
మళ్లీ పుడతామా ఏంటి... ఇప్పుడే దందా చేద్దాం!
సాక్షిప్రతినిధి, విజయనగరం: మళ్లీ పుడతామా ఏంటి.. ఏటి చేసిన ఇప్పుడే చేసియ్యాల అంటాడు పెద్దిగాడు... ఇప్పుడు పార్వతీపురం నియోజకవర్గ నేత కూడా.. గెలిచీగెలవగానే ఆబగా వ్యవస్థల మీద దాడి చేస్తున్నారు. తాను చెప్పింది చెప్పినట్లు చేయాలని.. చెప్పకపోతే జిల్లాలో ఉంచేది లేదు.. జిల్లా మొత్తానికి తానే సర్వంతర్యామిని అన్నట్లుగా ‘విజయ’హాసం చేస్తూ.. రెవెన్యూ, మున్సిపాలిటీ, పంచాయతీరాజ్, ఉపాధి హామీ.. ఇలా అన్ని రంగాల ఉద్యోగులను బెదిరిస్తున్నారు. ఆఖరికి ప్రైవేట్ ఆస్తులపై కూడా కన్నేసి తన దారికి రాకపోతే వాటిని లిటిగేషన్లో పెట్టేసి వివాదాల్లోకి నెట్టేసి అందినంత దండుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. దీనికోసం జిల్లాస్థాయి రెవెన్యూ అధికారులను సైతం బెదిరిస్తున్నారు. తొలిసారి గెలవగానే ఓ అర్ధరాత్రి మహిళా ఎమ్మార్వోకు ఫోన్చేసి తను చెప్పినట్లుగా చేయా లని ఆదేశించే స్థాయికి ఆయన ఎదిగిపోయారు అంటే ఆయన రూపాలు ఎలా ఉందో ఇప్పటికే అర్థం అవుతుంది. ఇప్పుడు కూడా అదే జోరులో ఏకంగా వెంకంపేటలోని ఓ ప్రైవేటు ల్యాండ్ మీదకు ఎగబడిపోయి.. అన్ని పత్రాలు ఉన్నా ఆ ల్యాండ్ యజ మానిని బెదిరించి.. కొంత ప్రైవేట్ సెటిల్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నించి.. ఆఖరికి భంగపడడం చూసి పార్వతీపురం ప్రజలు నివ్వెరపోతున్నారు. ఒక్కసారి గెలిస్తేనే ఇలా ఉంది.. రెండోసారి గెలిపిస్తే ఇంకేముంది అనే భీతి జనంలో మొదలైంది. ఆ ట్రాక్టర్లు మనవే.. ఒగ్గేయాలమ్మా పోలీసులు జిల్లాలో ఇసుక ట్రాక్టర్లు.. మైనింగ్.. గ్రావెల్ ఎక్కడ ఉన్నా మన ఎమ్మెల్యే తాలూకా సీసర బుడ్డి అక్కడికి వాలిపోవడమే.. ఒక్కో వాయికి ఇంత అని స్పాట్ కలెక్షన్తో వెళ్లిపోవడమే. ఇసుక ట్రాక్టర్ను ఎవరైనా ఎస్సై పట్టుకుంటే వెంటనే అది మనోళ్లదే.. ఒగ్గేయాలి అంటూ ఫోన్లు.. ప్రతి ఫోన్ కాల్కు ఒక రేటు.. ఇదే ఆయన రూటు.. నియోజకవర్గంలో మొన్నటివరకు నియోజకవర్గంలో కంకర.. గ్రావెల్ ధరలు ఒక లెక్కలో ఉండేవి.. ఇప్పుడు ఆ రేటు పెరిగింది.. ఇదేంటి అంటే ఒక్కో ట్రాక్టరుకు రూ.300 చొప్పున ఆయనకు ఇవ్వాలి కాబట్టి ఆ రేటు కూడా ఇందులోనే అంటున్నారు వ్యాపారులు. మరిపివలస క్వారీ.. మామూళ్లతో సరి సీతానగరం మండలం మరిపివలసలో కంకర క్వారీ వద్దకు వెళ్లి ఫొటోలు దిగి హడావుడి చేశారు.. ఏంటి సంగతి. ప్రజా ఆస్తులు.. వనరుల విధ్వంసం.. పర్యావరణం అంటూ పెద్దపెద్ద డైలాగులు మాట్లాడారు. వారం తరువాత నెలవారీ మామూళ్లకు బేరం సెట్ అయిపోవడంతో ఇక అవన్నీ మాఫీ అయిపోయాయి. మూసేసిన క్వారీలనూ వదల్లేదు.. తినమరిగిన బేపి.. తలుపు మూసేసినా వంటిల్లు చుట్టూ తిరిగినట్లు.. నెలవారీ ఆదాయానికి అలవాటు పడిన సదరు నేత నిడగల్లు.. మరిపోవలసల్లోని స్టోన్ క్రషర్ల వద్దకు వెళ్లి ఫొటోలతో హడావుడి చేసి మరి నాకేం లేదా అన్నారు.. ఆల్రెడీ క్వారీలు మూసేసి ఉన్నవి కనిపిస్తున్నాయి కదా.. ఇంకేం ఇస్తాం వెళ్లండి అన్నారు వాళ్లు.. సర్లే వచ్చినందుకు దారిఖర్చులు అయినా సర్దండి అని బెదిరించి కొంత దండుకుని నియోజకవర్గంలో సీసీ రోడ్ల పనులన్నీ వాళ్లకే ఇస్తున్నారు. మొత్తానికి వెనుకబడిన నియోజకవర్గాన్ని పరుగులుపెట్టిస్తున్నారో.. డబ్బుల కోసం ఈయనే గుమ్మాల వెంట తిరుగుతున్నారో కానీ ఈయనను మాత్రం జనం అసహ్యించుకుంటున్నారు. మళ్లీ గెలిపిస్తే కష్టమే అంటూ కామెంట్లు చేస్తున్నారు. భళిభళిరా బడిదేవరకొండ పార్వతీపురం మండలంలోని కోరె పంచాయతీ వెలగవలస గ్రామ పరిధిలోని బడిదేవరకొండపై గతంలో మైనింగ్కు అనుమతులు ఇచ్చిన వ్యవహారంపై కొత్తలో ప్రజాప్రతినిధి గుర్రుమన్నారు.. ఇదేం ఘోరం.. కొండలు కొట్టేస్తే. వాగులు వంకలు ఎలా? కొండకింద ఉన్న గ్రామాల పొలాలకు నీళ్లు ఎలా అని నిప్పులుగక్కారు. ఊరిని కాపాడడం.. జిల్లాను రక్షించడానికి ప్రాణాలు తెగిస్తాను.. ఇన్నాళ్లూ ఒక లెక్క.. ఇక నుంచి ఇంకో లెక్క అంటూ పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు.. పోన్లే ఇన్నాళ్లకు ఊరికి ఒక రక్షకుడు.. సేవకుడు వచ్చాడు అని ప్రజలు కళ్లుమూసుకున్నారు.. సీన్ కట్ చేస్తే ఆ మైనింగ్ పర్మిషన్ ఇంకొకరి చేతుల్లోకి వెళ్లిపోగా ఈయన వెళ్లి ఏం మాట్లాడుకున్నారో ఏమో.. తెలియదు.. ఇప్పుడు అంతా సైలెంట్.. ప్రశాంతంగా కొండమీద మైనింగ్ సాగిపోతోంది. ఇదంతా మామూలే అంటూ జనం కూడా సైలెంట్ అయ్యారు. అధికా రులు మిన్నకున్నారు. మున్సిపాలిటీపై పెత్తనం కుదరడం లేదే.. పట్టణాల్లో ప్రజాపాలన ముగిసిపోయి స్పెషల్ అధికారుల పాలన వచ్చింది. దీంతో పార్వతీపురానికి కలెక్టర్ ప్రత్యేకాధికారిగా నియమితులయ్యారు. దీంతో అక్కడ పట్టణంలో నియోజకవర్గ నేత పెత్తనం కుదరడంలేదు. కమీషన్ల కోసం ఇష్టానుసారం పనులు గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేసి కలెక్టర్కు పంపించి పనులు మంజూరు చేయించడానికి రంగం సిద్ధం చేశారు. అయితే, దీనికి కలెక్టర్ నిబంధనలు.. సామాజిక అవసరాలు.. ప్రాధాన్యాలు.. బడ్జెట్ వెసులుబాటు ఇవన్నీ చూసుకుని వాటిని వ్యతిరేకిస్తున్నారు. దీంతో తన ఆదాయానికి గండిపడిందన్న దుగ్ధతో అధికారయంత్రాంగంపై చిరాకుపడుతూ అధికారులు గాడిదలు కాస్తున్నారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆయనకు అభివృద్ధిమీద అంత ప్రేమ.. మోజు.. శ్రద్ధ ఉంటే ప్రభుత్వంతో మాట్లాడుకుని భారీగా నిధులు తెచ్చుకోవాలి కానీ ఇక్కడ వీధుల్లో వీరంగం చేస్తే మేమేం చేయాలి అని అధికారులు లోలోన మదనపడుతున్నారు. గతంలో మున్సిపాలిటీలో కాలువలలో చెత్త తొలగింపు పేరిట అడ్డగోలు బిల్లులతో లక్షలు కొట్టేసిన అనుభవాన్ని ఇప్పుడు గుర్తుతెచ్చుకుంటున్నారు. మాటికి అలాగే చేద్దాం అంటే ఎలా అనే అనుమానాలు వస్తున్నాయి. పార్వతీపురాన్ని దున్నేద్దాం బాస్ అధికారులపై రుబాబు.. ప్రైవేటు ఆస్తులపై నియోజకవర్గ నేతకన్ను! లిటిగేషన్ సృష్టించి డబ్బులు డిమాండ్ దారికి రాకుంటే బెదిరింపు -
తుప్పు పట్టిన షట్టర్లు..!
ఎడమకాలువ ద్వారా వృథాగా పోతున్న నీరువీరఘట్టం: తోటపల్లి ప్రాజెక్టు పరిధిలో ఉన్న పాత ఆయకట్టుకు సాగునీరు పంపిణీ చేసే కుడి,ఎడమకాలువల రెగ్యులేటర్లు దయనీయ స్థితికి చేరుకున్నాయి.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చేపట్టిన కాలువల ఆధునికీకరణ పనులు 25 శాతం లోపు జరిగాయనే సాకు చూపించి చంద్రబాబు ప్రభుత్వం ఆధునికీకరణ పనులను రద్దు చేసింది. అయితే గత రెండేళ్లుగా కుడి,ఎడమ కాలువల రెగ్యులేటర్లు మరమ్మతుల బారిన పడడంతో షట్టర్లు తుప్పుపట్టి పనిచేయడం లేదు. దీంతో గతేడాది నవంబర్లో ఖరీఫ్ సీజన్ ముగిసినా సాగునీరు వృథాగా పోతోంది. ఈ షట్టర్లు బాగుచేసేందుకు సుమారు రూ.46 లక్షలు ఖర్చు అవుతుందని జలవనరులశాఖ అధికారులు అంచనా వేశారు. ప్రతిపాదనలు సిద్ధం చేసి ఏడాది క్రితం ప్రభుత్వానికి నివేదించారు.అయితే ప్రభుత్వం కనీసం చిల్లిగవ్వ కూడా షట్టర్లు బాగు చేసేందుకు నిధులు విదల్చ లేదు. ఫలితంగా నిధుల లేమితో షట్టర్లు బాగుచేయించలేక జలవనరులశాఖ అధికారులు బేలచూపులు చూస్తున్నారు.మరో వైపు ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తోంది. సాగునీటి పంపిణీ ఎలా చేయాలిరా దేవుడా అంటూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రైతుల సమస్యలు గుర్తించిన ఎమ్మెల్సీ విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే కళావతిలు రైతులతో కలిసి గతంలో తోటపల్లి పాత రెగ్యులేటర్లు పరిశీలించారు. సాగునీటి పంపిణీలో తలెత్తిన ఇబ్బందులు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. టెండర్లకు ముందుకు రాని కాంట్రాక్టర్లు.. ప్రస్తుతం తోటపల్లి జలాశయం పరిధిలోని పాత కుడి,ఎడమకాలువల రెగ్యులేటర్లు మొరాయిస్తుండడంతో నీటి సరఫరాను కంట్రోల్ చేయలేకపోతున్నామని అధికారులు అంటున్నారు.వాస్తవానికి ఈ షట్టర్ల మరమ్మతులకు రూ.18 లక్షలతో గతేడాది అక్టోబర్లో అధికారులు టెండర్లు పిలిచారు.అయితే ఈ ఎవరూ టెండర్లకు ముందుకు రాలేదు.దీంతో షట్టర్లు బాగవకపోవడంతో లక్షల కూసెక్కుల నీరు వృథాగా పోతోంది.రైతులకు అవసరం వచ్చినప్పుడు నీరందించలేకపోతున్న జలవనరులశాఖ అధికారులు, రైతులకు నీటి అవసరం లేకపోయినప్పటికీ పంట పొలాల్లోకి నీరు వస్తుండడండపై రైతులు మండిపడుతున్నారు. ఇటీవల ఇదే విషయంపై ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి అచ్చెంనాయుడిని కలిసి ఈ ప్రాంత రైతుల సమస్యలను వివరించారు.ఆధునీకీకరణ పనులను రద్దు చేయడం చాలా అన్యాయమని,కనీసం పాత కాలువ రెగ్యులేటర్లు అయినా బాగు చేయించాలని మంత్రిని కోరారు. కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాంతోటపల్లి ప్రాజెక్టు వద్ద పాత రెగ్యులేటర్లు మరమ్మతులకు గురయ్యాయి. దీంతో నీటి నిలుపుదలచేయడం సాధ్యం కావడం లేదు.షట్టర్లు తుప్పుపట్టాయి.ఈ షట్టర్లు బాగు చేసేందుకు రూ.46 లక్షల నిధులు అవసరం ఉంది.పూర్తి వివరాలతో ఓ నివేదికను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాం.నిధులు మంజూరైతే షట్టర్లు బాగు చేయిస్తాం. డీవీ రమణ, కుడి, ఎడమకాలువల కార్యనిర్వహణ ఇంజినీర్ వృథాగా సాగునీరు..గత ఆరు నెలలుగా తోటపల్లి ప్రాజెక్టు పరిధిలోని ఎడమకాలువ ద్వారా 3.06 టీఎంసీల నీరు వృథాగా ప్రవహిస్తోందని గణాంకాలు చెబుతున్నాయి.పాత ఆయకట్టులోని ఎడమ కాలువ ద్వారా 200 క్యూసెక్కుల నీరు విడిచిపెడుతున్నారు.ఈ లెక్కన నెల రోజులకు 0.51టీఎంసీల నీరు ఆరు నెలలకు గాను 3.06 టీఎంసీల నీరు వృథాగా పోతోంది.తోటపల్లి ప్రాజెక్టు నీటి సామర్థ్యం 2.5 టీఎంసీలు కాగా గురువారం నాటికి నీటి నిల్వ 1.723 టీఎంసీలు ఉంది. -
హైవేలపై అనధికార పార్కింగ్ను అరికట్టాలి
● రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ విజయనగరం అర్బన్: జాతీయ రహదారులపై పలుచోట్ల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న అనధికార వాహన పార్కింగ్ను అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. రహదారి భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ అంశాలపై వివిధ శాఖల అధికారులతో గురువారం వీడియా కాన్ఫరెన్స్లో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారుల పక్కన ఉన్న హోటళ్లు, టీ దుకాణాల వద్ద వాహనాలను ఇష్టానుసారంగా నిలిపివేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అనధికార పార్కింగ్ను నివారించడంతోపాటు, హోటల్ యాజమాన్యాలను బాధ్యులుగా చేయాలని సూచించారు. అవసరమైతే వాహనాల నిలుపుదల ప్రాంతాలను సూచించే బోర్డులు, పోల్స్ను ఆయా మాజమాన్యాలే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని పాఠశాలల పరిసర ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, హైబీమ్ లైట్ల వినియోగాన్ని నియంత్రించాలని సూచించారు. రహదారి భద్రత కోసం టాస్క్ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల వివరాలను వివిధ శాఖలకు ఒకేసారి చేరవేసే కేంద్ర ప్రభుత్వ డిజిటల్ వేదిక ‘ఈ–డార్’ అమలులో విజయనగరం జిల్లా దేశంలో మూడో స్థానంలో దక్షిణ భారత దేశంలో తోలిస్థానంలో ఉందని కలెక్టర్ తెలిపారు. ఈ వ్యవస్థను మరింత సమర్ధవంతంగా అమలు చేయాలని కోరారు. రద్దీ సమయాల్లో విద్యార్ధులు బస్సు ప్రయాణంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అవసరమై మార్గాల్లో అదనపు బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. సమాశంలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మణికుమార్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలి
● ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ రేగిడి: గ్రామాల్లో బీఎల్ఓలు నిర్వహిస్తున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో బీఎల్ఏలు పాల్గొని నిశితంగా పరిశీలించాలని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. గురువారం రేగిడి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి బీఎల్ఏ అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో నమోదై ఉండేలా చూడాలని సూచించారు. ఎటువంటి లోపాలు, అవకతవకలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటరు జాబితా పునాది వంటిదని, సవరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించుకోవాలని పేర్కొన్నారు. ఈ సమయంలో ఓటు హక్కు కోల్పోతే తిరిగి పొందడం చాలా కష్టమని, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుకు ఎంతో విలువ ఉందని పేర్కొన్నారు. ఆయన వెంట ఎంపీపీ దార అప్పలనర్సమ్మ, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు టంకాల అచ్చెన్నాయుడు, పార్టీ మండల కన్వీనర్ వావిలపల్లి జగన్మోహనరావు, మండల యూత్ కన్వీనర్ మజ్జి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. తెలుగు విద్యాయాప్ను ప్రారంభించిన డీఈఓ విజయనగరం అర్బన్: భోగాపురం మండలం ముంజేరు ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆర్.సూర్యప్రకాశ్రావు రూపొందించిన తెలుగు విద్యాయాప్ను డీఈఓ యు.మాణిక్యంనాయుడు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ 6 నుంచి 10వ తరగతి వరకు తెలుగు బోధించే ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఈ యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. తెలుగు భాషాబోధనను సులభతరం చేయడంతోపాటు విద్యార్థుల అభ్యాసనా నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు యాప్ దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో ఎస్యూటీ జిల్లా అధ్యక్షుడు వై.అప్పారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి డి.శ్యామ్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎన్ని అప్పలనాయడు, భాస్కరరావు, తదితరులు పాల్గొని సూర్యప్రకాశ్ను అభినందించారు. ముచ్చర్ల ఉన్నత పాఠశాలకు భూ దానం ● దాత సూర్యనారాయణరాజు ఔదార్యం గజపతినగరం రూరల్: మండలంలోని ముచ్చర్ల ఉన్నత పాఠశాలకు అదే గ్రామానికి చెందిన వెలగాడ సూర్యనారాయణరాజు 14 సెంట్ల ఖరీదైన భూమిని దానంచేసి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. పాఠశాలకు అదనపు తరగతి గదులు నిర్మించుకునేందుకు స్థలం లేకపోవడంతో పక్కనే గల సూర్యనారాయణ రాజు స్థలంలో కొంత స్థలాన్ని దానం చేయా లని జెడ్పీటీసీ గార తవుడు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేశారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. పాఠశాలలో గురువారం అందరి సమక్షంలో భూమిని ఇస్తున్నట్టు ప్రకటించారు. భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ శుక్రవారం పూర్తిచేసి, విద్యాశాఖకు సంబంధిత పత్రాలు అందజేస్తానని తెలిపారు. ఖరీదైన స్థలాన్ని తన తండ్రి పేరిట దానం చేసిన సూర్యనారాయణరాజు ఔదార్యాన్ని అందరూ అభినందించారు. కార్యక్రమంలో దాత, జెడ్పీటీసీతో పాటు మాజీ ఎంపీటీసీ సభ్యురాలు కరుమజ్జి కృష్ణ, మాజీ ఉప సర్పంచ్ మీసాల సన్యాసినాయుడు, సూర్యనారాయణ, శనపతి ఈశ్వరావు, గిరడ అచ్చెన్నాయుడు, బైరెడ్డి తవుడు, రుంకాన నాగరాజు, భాస్కరరావు, ప్రధానోపాధ్యాయులు ప్రసాద్, ప్రభాకరరావు, తదితరులు పాల్గొన్నారు. -
బంగారం దోపిడీ కేసు ఛేదించిన పోలీసులు
● ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితుల అరెస్టు ● రూ.90 వేల నగదు స్వాధీనంపార్వతీపురం రూరల్: ఈ నెల 7న అడ్డూరివలస వద్ద జరిగిన చౌక బంగారం దోపిడీ కేసును పార్వతీపురం రూరల్ పోలీసులు ఛేదించారు. తక్కువ ధరకు బంగారం ఇస్తామని నమ్మించి బాధితుడిపై దాడి చేసి నగదు అపహరించిన అంతర్రాష్ట్రట్ర ముఠాకు చెందిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు ఏఎస్పీ మనీషా రెడ్డి గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. విజయవాడకు చెందిన శ్రీనివాసరావుకు తక్కువ ధరకు బంగారు కడ్డీలు ఇప్పిస్తామని నమ్మించిన ఒడిశాకు చెందిన రాజు, అతని అనుచరులు ఈ నెల 7న అడ్డూరివలస వద్ద అతనిపై కర్రలతో దాడి చేసి రూ.2 లక్షల నగదును దోచుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పార్వతీపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు ఒడిశా సరిహద్దుల్లో నిందితుల కోసం గాలించాయి. బుధవారం సాయంత్రం కొత్తవలస వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా దొరికిన ఒడిశాలోని కొరాపుట్ జిల్లాకు చెందిన మీనక నారాయణరావు అలియాస్ రాజు, హోబిక సన్నులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు తాజా దోపిడీతో పాటు జనవరిలో జరిగిన మహిమగల నాణెం మోసం, గత నెలలో బట్టల వ్యాపారిపై జరిగిన దోపిడీ కేసుల్లోనూ తామే పాల్గొన్నట్లు అంగీకరించారు. నిందితుల నుంచి తాజా కేసుకు సంబంధించిన రూ.60 వేలు, పాత కేసులకు సంబంధించిన రూ.30 వేలు కలిపి మొత్తం రూ.90 వేల నగదుతో పాటు నేరానికి ఉపయోగించిన రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుల్లో ప్రమేయం ఉన్న మరో ముగ్గురు ఒడిశా నిందితులు మీనక మహేష్, తడాంగి కాసు, తడాంగి టాస్కు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు. -
టెట్ మినహాయింపుపై చట్ట సవరణ చేయాలి
● ప్రధానమంత్రి, ముఖ్యమంత్రికి ఆపస్ వినతిపత్రంవిజయనగరం అర్బన్: 2010 టెట్ నోటిఫికేషన్కు ముందు నియామకం పొందిన ఉపాధ్యాయులను టెట్ తప్పనిసరి ఉత్తీర్ణత నిబంధన నుంచి మినహాయించేలా ఆర్టీఈ చట్టంలో సవరణలు చేపట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) జిల్లా శాఖ వినతి పత్రం సమర్పించింది. జిల్లా రెవెన్యూ అఽధికారి సీహెచ్.సత్తిబాబు ద్వారా ప్రధాన మంత్రి, కేంద్ర మానవవనరుల అభివృద్ది శాఖ మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ వినతిపత్రాలను పంపినట్లు సంఘం నాయకులు తెలిపారు. ఇటీవల సుప్రీంకోర్టు 2010 టెట్ నోటిఫికేషన్కు ముందు నియామకం పొందిన ఉపాధ్యాయులు కూడా తప్పనిసరిగా ఉపాధ్యాయ అర్హత (టెట్)లో ఉత్తీర్ణత సాధించాలని లేనిపక్షంలో ఉద్యోగ భద్రతపై ప్రభావం పడే అవకాశం ఉందని తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈ విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. ఈ తీర్పు వల్ల వేలాది మంది ఉపాధ్యాయుల ఉద్యోగ, భద్రత, పదోన్నతులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. టెట్ తప్పనిసరి అర్హత నిబంధనను 2010లో టెట్ నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి మాత్రమే అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలని కోరారు. డీఆర్ఓను కలిసిన వారిలో ఆపస్ జిల్లా అధ్యక్షుడు కొవ్వాడ శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బల్లా శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి ఇజ్జిరోతు రామునాయుడు, వీవీజే సుబ్రహ్మణ్యం, ఏజీ తాతారావు, ఎం.వెంకటనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
నేడు పీఎంవీబీఆర్వై జిల్లా స్థాయి కార్యక్రమం
చికెన్● కొత్త ఉద్యోగులకు నియమామక పత్రాల పంపిణీవిజయనగరం అర్బన్/విజయనగరం టౌన్: ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన జిల్లాస్థాయి కార్యక్రమాన్ని శుక్రవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో నిర్వహిస్తామని ప్రాంతీయ ఈపీఎఫ్కమిషనర్ కణిత అవినాష్కుమార్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఈపీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఉపాధి అవకాశాలను పెంచడం, యువతను వ్యవస్థీకృత ఉద్యోగ రంగంలోకి తీసుకురావడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో దేశవ్యాప్తంగా సుమారు 200 కేంద్రాల్లో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. పథకం కింద కొత్తగా ఉద్యోగాల్లో చేరిన తొలితరం ఉద్యోగులకు ఒక నెల జీతానికి సమానంగా గరిష్టంగా రూ.15 వేల వరకు ప్రోత్సాహకాన్ని కేంద్ర ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. అదనపు ఉద్యోగావకాశాలు కల్పించే యజమానులకు కూడా ఆర్ధిక ప్రోత్సాహకాలు అందించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో నిర్వహించే కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, ఈపీఎఫ్, కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ అధికారులు, యాజమానులు, ఉద్యోగులు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొననున్నట్లు తెలిపారు.


