breaking news
Vizianagaram District Latest News
-
అర్జీలకు 48 గంటల్లో పరిష్కారం చూపాలి
● కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్పార్వతీపురం: పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలకు 48 గంటల్లో పరిష్కారం చూపాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ అధికారులకు సూచించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక, ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాత్సవ, డీఆర్ఓ కె. హేమలత, కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి.ధర్మచంద్రారెడ్డి, డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణిలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 122 మంది అర్జీ దారుల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో వచ్చిన వినతులను నాణ్యతతో కూడిన పరిష్కారం చూపించేలా అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పోలీస్ వ్యవస్థను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యం పార్వతీపురం రూరల్: పోలీస్ వ్యవస్థ ప్రజలకు మరింత చేరువ అయ్యేలా చేయడమే తమ శాఖ లక్ష్యమని ఎస్పీ ఎస్వీ. మాధవ్ రెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి 8 అర్జీలను స్వీకరించి, వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీసీఆర్బీ ఎస్సై ఫకృద్దీన్ తదితర సిబ్బంది ఉన్నారు. ఐటీడీఏ పీజీఆర్ఎస్కు 24 వినతులు సీతంపేట: స్థానిక ఐటీడీఏలో పీఓ సి.యశ్వంత్కుమార్ రెడ్డి సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 24 వినతులు వచ్చాయి. తుంబలి గ్రామానికి చెందిన కొండలరావు విద్యుత్ స్తంభాలు తమ గ్రామంలో వేయాలని కోరారు. కుంబిడి ఇచ్ఛాపురానికి చెందిన మండంగి బాలకృష్ణ ఫారెస్టు భూమి రీసర్వే చేయాలని విజ్ఞప్తి చేశాడు. సింగిడి గ్రామస్తుడు సూర్యవర్మ తమకు శాశ్వత ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేశారని చర్యలు తీసుకోవాలని కోరారు. పవర్ టిల్లర్ మంజూరు చేయాలని పలువురు రైతులు వినతులు ఇచ్చారు. కోదుల వీరఘట్టంకు చెందిన త్రినాథరావు తమ ఇద్దరి పిల్లలకు తల్లికి వందనం రాలేదని ఫిర్యాదు చేశాడు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీఓ చిన్నబాబు, ఈఈ కుమార్, డిప్యూటీ ఈఓ రామ్మోహన్రావు, జీసీసీ మేనేజర్లు దాసరి కృష్ణ, గొర్లె నరసింహులు, వ్యవసాయాధికారి వాహిని, ఏపీడీలు సన్యాసిరావు, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. -
18.8 మెట్రిక్ టన్నుల ఎరువుల సీజ్
తెర్లాం: మండలంలొని తెర్లాం, సుందరాడ గ్రామాల్లో గల ఎరువుల దుకాణాల్లో అనుమతి పత్రాలులేకుండా నిల్వఉంచిన 18.8మెట్రిక్ టన్నుల ఎరువులను జిల్లా వ్యవసాయధికారి వి.తారకరామారావు సీజ్చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన మండలంలోని తెర్లాం, సుందరాడగ్రామాలలో గల ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా ఎరువుల దుకాణాల్లో నిల్వ ఉన్న ఎరువు లను, స్టాక్ రికార్డులు, అనుమతిపత్రాలను పరిశీలించారు. సుందరాడ లోని సూర్యచంద్ర ట్రేడర్స్లో నిల్వ ఉన్న 8.5 మెట్రిక్ టన్నుల యూరియాకు సంబంధించిన పత్రాలు లేకపోవడంతో వాటిని సీజ్చేశారు. అలాగే తెర్లాంలోని శ్రీరామ ట్రేడర్స్లో నిల్వ ఉన్న 10.3మెట్రిక్ టన్నుల యూరియాకు ఎటువంటి ఆనుమతిపత్రాలు లేకపోవడంతో వాటిని కూడా సీజ్ చేశారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో గల ఎరువుల దుకాణాల్లో విక్రయిస్తున్న ఎరువులకు సంబంధించిన ఆనుమతి పత్రాలు లేకపోతే సంబంధిత డీలర్లపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. కృత్రిమ కొరత సృష్టించినా.. అధిక ధరలకు విక్రయించినా లైసెన్సులు రద్దుచేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో ప్రస్తుతం ఎరువుల కొరతలేదని, రైతుసేవా కేంద్రాల్లో నిల్వలు ఉంచామని చెప్పారు. ఆయనతో పాటు ఏఓ బొత్స శ్రీనివాస రావు ఉన్నారు. తెర్లాం, సుందరాడలోఎరువుల దుకాణాల తనిఖీ -
తక్కువ వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టు ఇదే
పెదంకలాం ప్రాజెక్టును రూ.1.30 కోట్ల వ్యయంతో 8వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టారు. కాలువల ఆధునికీకరణకు హుద్హుద్ తుఫాన్ సమయంలో జైకా నిధులు మంజూరు చేసినప్పటికీ కాంట్రాక్టర్ పూర్తిస్థాయిలో కాలువల ఆధునీకీకరణ పనులు నిర్వహించని కారణంగా కాలువల ద్వారా సాగునీరు సరఫరా కాని పరిస్థితి నెలకొంది. ప్రతి ఏటా సాగునీటి కోసం ఆందోళనే తప్పా సమస్యకు శాశ్వత పరిష్కారం కావడం లేదు. – సింహాద్రి నాయుడు, రైతు కూలీసంఘం జిల్లా నాయకుడు, పార్వతీపురం● -
జంట హత్యల కేసులో యావజ్జీవ కారాగార శిక్ష
పార్వతీపురం రూరల్/ మక్కువ: జంట హత్యల నేరం కేసులో ముద్దాయి గిన్నిపల్లి సింహాద్రికి పా ర్వతీపురం మన్యం జిల్లా రెండవ అదనపు కోర్టు న్యాయమూర్తి ఎస్.దా మోదరరావు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.1000లు జరిమానా విధించినట్లు ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన మాట్లాడుతూ జిల్లా పరిధిలోని మక్కువ పోలీస్స్టేషన్లో 2018లో నమోదైన జంట హత్యల కేసులో పలికివలస గ్రామానికి చెందిన ఒమ్మి పైడిరాజు ఫిర్యాదు మేరకు అదే గ్రామానికి చెందిన గిన్నిపల్లి సింహాద్రి ముద్దాయిగా రుజువైందన్నారు. భూ వివాదంలో భాగంగా పైడిరాజు తల్లిదండ్రులు పొలంలో మేకలు మేపుతున్న సమయంలో సింహాద్రి హత్య చేయడంతో మృతుల కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం కోర్టు విచారణలో నిందితుడిపై నేరారోపణలు రుజువు కావడంతో రెండవ అదనపు జిల్లా జడ్జి శిక్ష ఖరారు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్, పోలీసు సిబ్బందికి ఎస్పీ మాధవ్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు. -
రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు జిల్లా జట్టు సిద్ధం
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న అండర్–17 బాల, బాలికల చెస్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా జట్టు సిద్ధమైంది. ఈ మేరకు చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన పోటీల్లో నలుగురు క్రీడాకారులు అంతర్ జిల్లాల పోటీలకు అర్హత సాధించారు. ఈ పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి 78 మంది క్రీడాకారులు పాల్గొనగా..జిల్లా జట్టులో స్థానం దక్కించుకునేందుకు క్రీడాకారులు పోటీపడ్డారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిలో బాలుర విభాగంలో కాండ్రేగుల సోమనాధ్, వీర్రాజు వర్మలు ఉండగా..బాలికల విభాగంలో బోరా ప్రవల్లిక, సాయి జాహ్నవిశ్రీ ఉన్నారు. అదేవిధంగా బత్తుల జస్మిక, ఇషిక వర్మ తదితరులు కన్సొలేషన్ బహుమతులు దక్కించుకున్నారు. జిల్లా స్థాయి పోటీల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులను త్వరలో కాకినాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి అండర్–17 బాల, బాలికల చెస్ చాంపియన్షిప్కు పంపించనున్నట్లు చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం కార్యదర్శి కేవీ జ్వాలాముఖి తెలిపారు. ఈ పోటీలను సీనియర్ నేషనల్ ఆర్బిటర్ రానా, అర్చన, పద్మావతిలు పర్యవేక్షించారు. -
అర్జీల పరిష్కారానికి ప్రాముఖ్యం ఇవ్వాలి
● ఇన్చార్జ్ కలెక్టర్ సేతు మాధవన్విజయనగరం అర్బన్: ప్రజా వినతుల పరిష్కార వేదికకు వచ్చే అర్జీదారుల వినతులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి పరిష్కరించాలని ఇన్చార్జ్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ తెలిపారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో ఇన్చార్జ్ కలెక్టర్తో పాటు డీఆర్ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, డిప్యూటీ కలెక్టర్స్ మరళి, వెంకటేశ్వరరావు, ప్రమీలా గాంధీ ప్రజల నుంచి 165 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అర్జీలు పునరావృతం కాకుండా నాణ్యతతో పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీదారుల సమస్యల పరిష్కారంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదని, అర్జీదారు సంతృప్తిచెందేలా సమస్యలను వేగంగా పరిష్కరించాలని సూచించారు. ఎస్పీ గ్రీవెన్స్ సెల్కు 44 ఫిర్యాదులు విజయనగరం క్రైమ్: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు ’ప్రజా సమస్యల పరిష్కార వేదిక‘ (పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రెసల్ సిస్టం) కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఈ మేరకు ప్రజల నుంచి 44 ఫిర్యాదులను ఎస్పీ వకుల్ జిందల్తో పాటు ఏఎస్పీ సౌమ్యలత ఫిర్యాదులను స్వీకరించారు, వారి సమస్యలను శ్రద్ధగా విని, సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలను సంబంధిత అధికారులకు వివరించారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, డీసీఆర్బీ సీఐ బి.సుధాకర్, ఎస్సై ప్రభావతి, సిబ్బంది పాల్గొన్నారు. -
ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్లకు నష్టం
విజయనగరం గంటస్తంభం: లైసెన్స్ ఉన్న ప్రతి డ్రైవర్కు వాహన మిత్ర రూ.15,000 తక్షణమే చెల్లించాలని కోరుతూ..విజయనగరం జిల్లా శ్రీ కనకదుర్గ ఆటో మోటార్ ట్రాన్స్ఫోర్ట్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కో–కన్వీనర్ ఎ.జగన్మోహన్రావు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు వి.లక్ష్మి, నగర కార్యదర్శి బి.రమణ, ఉపాధ్యక్షుడు రెడ్డి శంకర్రావు మాట్లాడుతూ..కరోనా తర్వాత ఆటో, టాటా ఏసీ మ్యాక్సీ క్యాబ్ వాహన డ్రైవర్లు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ, తమిళనాడులో అనుభవాలను పరిశీలించి ఇక్కడ నష్టపోతున్న డ్రైవర్లకు ప్రత్యామ్నాయ చూపాలని డిమాండ్ చేశారు. లైసెన్స్ ఉన్న ప్రతి డ్రైవర్కు వాహన మిత్ర రూ.15,000 వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వాహన రెన్యువల్ ఫిట్నెస్, రిజిస్ట్రేషన్, లైసెన్స్ ఆర్టీవో అధికారులు చేయాలని, వేదాంత ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్ను రద్దు చేయాలని, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ చాలానా లు, పెట్టి కేసులు ఆపాలని, ఆటోల నిలుపుదలకు పార్కింగ్ స్ధలాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఆటో ప్రజల జీవన విధానంలో భాగంగా మారిందని అత్యవసర, నిత్యావసర సర్వీసులన్నీ అందిస్తున్నామని ఈ రంగాన్ని ఆదాయ వనరుగా భావించకుండా సర్వీస్ రంగంగా గుర్తించి ఆటోల కొనుగోలుకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని కోరారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు బి.పాపారావు, జి.కూర్మారావు, రామారావు, భాస్కరరావు, ప్రసన్న, లక్ష్మణరావు, రాజు, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్ వద్ద హమాలీల ధర్నా
విజయనగరం గంటస్తంభం: హమాలీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ..ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం కలెక్టరేట్ వద్ద హమాలీలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ముల్లు నర్సింహులు మాట్లాడుతూ..విజయనగరం జిల్లాలో గల 8 ఎంఎల్ఎస్ పాయింట్లలో సుమారు 200 మంది హమాలీలు 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. అప్పటికీ, ఇప్పటికీ పని భారం పెరుగుతూనే ఉంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒక్కసారి కూలి రేట్లు పెంచుతున్నా వచ్చే కూలితో తమ కుటుంబాలు గడవడం చాలా కష్టంగా ఉందని హమాలీలు వాపోయారు. మా పనిలో ప్రధానంగా చాలా సమస్యలున్నాయని, అందులో ముఖ్యంగా ప్రతినెలా స్టేజ్–2 బిల్లు 10వ తేదీలోపు ఇప్పించాలని, అన్లోడింగ్ బిల్లు కాంట్రాక్టర్ పేరుతో కాకుండా మా ఖాతాలోనే జమ చేసి, 15వ తేదీ లోపు ఇప్పించాలని కోరారు. అన్లోడింగ్ పనిని 30ఏళ్లుగా మేమే చేస్తున్నాం కాబట్టి మమ్మల్నే కొనసాగిస్తూ..మోత కూలి పెంచాలని డిమాండ్ చేశారు. హమాలీలకు చదువు లేనందున బయోమెట్రిక్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, వారానికి ఒకరోజు తప్పనిసరిగా సెలవు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలను తీర్చని యెడల ఉద్యమం తీవ్రం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి పి.కామేశ్వరరావు, హమాలీ సంఘం కార్మికులు పాల్గొన్నారు. -
శ్మశాన వాటిక అభివృద్ధి నిధులను ఎలా మళ్లిస్తారు?
బొబ్బిలి: గత ప్రభుత్వం శ్మశాన వాటిక అభివృద్ధికోసం మంజూరు చేసిన రూ.10లక్షల నిధుల ను దారి మళ్లించడం ఎంతవరకు సబబని పలు ఎస్సీ కుటుంబాలు బొబ్బిలి కమిషనర్ ఎల్.రామలక్ష్మిని నిలదీశారు. ఆ నిధులతో శ్మశాన వాటిక అభివృద్ధి చేయాలని బొబ్బిలి పదో వార్డు గొల్లపల్లికి చెందిన తుట్ట తిరుపతి, రమ ణ, కూర్మారావు, రమేష్, డోల వెంకటరమణ తదితరులు కమిషనర్కు సోమవారం వినతిపత్రాన్ని అందజేశారు. దీనికి ఆమె సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా గొల్లపల్లి వాసులు మాట్లాడుతూ శ్మశాన వాటిక లేదని అప్పటి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు దృష్టికి తీసుకెళ్తే ఆయన స్థలాన్ని కేటాయించడంతోపాటు అభివృద్ధి కోసం రూ. 10లక్షలు మంజూరు చేయించారన్నారు. అంబేడ్కర్ యువజన సంఘం సభ్యులు, స్థానిక యువత, పెద్దలంతా కలిసి రూ.6 లక్షల సొంత నిధులతో కొంత అభివృద్ధి పనులు చేశామన్నా రు. గత ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు ఇతర పనులకు కేటాయించిన విషయాన్ని తెలుసుకుని కమిషనర్కు వివరించామన్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయాలి డెంకాడ: వ్యవసాయ విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పెండింగ్లో లేకుండా మంజూరు చేయాల ని ఆ శాఖాధికారులకు విద్యుత్శాఖ మంత్రి గొట్టి పాటి రవికుమార్ సూచించారు. డెంకాడ మండలం పెదతాడివాడ వద్ద రూ.2,08 కోట్ల వ్యయంతో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖమంత్రి కొండపల్లి శ్రీనివాస్ కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 78వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశామన్నారు. ఏడాదిలో జిల్లాలో 6 విద్యుత్ సబ్స్టేషన్లను ప్రారంభించామని చెప్పారు. మరో 3 నిర్మాణంలో ఉన్నాయన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద దేశ వ్యాప్తంగా కోటి సోలార్ విద్యుత్ యూని ట్లు లక్ష్యం కాగా రాష్ట్రానికి 20 లక్షలు కేటాయించ డం గర్వకారణమని తెలిపారు. తీరగ్రామాల్లో విద్యుత్ సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి విన్నపంపై మంత్రి స్పష్టంచేశారు. కార్యక్రమంలో తూర్పుప్రాంద విద్యుత్ సంస్థ సీఎండీ పృద్విరాజ్ రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవులు, జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎస్.సేతుమాధవన్, ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ ఎం.లక్ష్మణరా వు, ఈఈ జి.సురేష్బాబు, ఆర్డీఓ డి.కీర్తి, ఎంపీపీ బంటుపల్లి వాసుదేవరావు పాల్గొన్నారు. -
వ్యాధులు ఉద్ధృతం
పారిశుద్ధ్యం అధ్వానం.. విజయనగరం: పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మా రింది విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిస్థితి. నగరంలో ప్రజారోగ్యం గాలిలో దీపంలా మారింది. పన్నుల వసూళ్ల కోసం ప్రజలపై ఒత్తిడి తీసుకువస్తున్న యంత్రాంగం ప్రజలకు అవస రమై న సేవలందించడంలో విఫలమవుతోంది. గడిచిన ఏడాది పాలనలో కార్పొరేషన్ అభివృద్ధిపై దృష్టిసారించేవారే కరువయ్యారు. వందలాది కిలోమీటర్ల మేర రోడ్లు, కాలువలు శుభ్రం చేయడంలో అలస త్వం ప్రభావం ప్రజల ఆరోగ్యంపై చూపుతోంది. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభంలోనే తోటపాలెం, పూల్బాగ్కాలనీ, వీటి అగ్రహారం ప్రాంతాల్లో డెంగీ, మలేరియా వంటి విష జ్వర కేసులు నమోదయ్యాయంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలంటూ అధికారులు చేస్తున్న హడావిడి కేవలం ప్రకటనలకే పరిమితమ వుతోంది. దోమల నివారణ చర్యలు ఆశించిన స్థా యిలో జరగడం లేదు. నగరంలోని ఏదో ఒక ప్రాంతంలో వారానికి ఒకసారి ఫాగింగ్ చేపడుతున్నా కొద్ది రోజుల వ్యవధిలోనే పరిస్థితి యథాస్థితికి చేరుకుంటోంది. పర్యవేక్షణ లోపం నగర పరిధిని 245 పోకెట్లుగా విభజించి పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నారు. 300 నుంచి 350 ఇళ్లను ఒక పోకెట్గా తీసుకున్నారు. ఒక్కోదానిలో 2.5 కార్మికులు ఉండాల్సి ఉంది. ఇక్కడ 800 మంది వర కు కార్మికుల అవసరం కాగా, ప్రస్తుతం 611 మంది ఉన్నారు. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరగడం లేదు. పారిశు ధ్య సిబ్బందిలో కొందరు రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటూ బదిలీ కార్మికులను నియమించుకుని వేరే కార్యకలాపాలు చూసుకుంటున్నారు. వచ్చిన బదిలీ కార్మికుడు తనకు తగ్గట్టుగానే పనులు చేసుకుని వెళ్లిపోతున్నారు. ఇదే విషయమై కౌన్సిల్ సమావేశాల్లో కార్పొరేటర్లు ప్రస్తావిస్తున్నా సమస్యలకు పరిష్కా రం లభించకపోవడం గమనార్హం. తాజాగా 45 మందిని ఒప్పంద ప్రాతిపదికన కార్మికులను తీసుకునేందుకు కౌన్సిల్ ఆమోదించినప్పటికీ ఇప్పటికీ ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. సమస్య తలెత్తితేనే... నరగం విస్తరిస్తున్నా ఆ మేరకు సదుపాయాల కల్పనలో యంత్రాగం విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వర్షాలు కురిసి రోడ్లపై మురుగునీరు ప్రవహిస్తే తప్ప పూడికలు తొలగించాలన్న ధ్యాస కార్పొరేషన్ యంత్రాంగానికి, స్థానిక ప్రజాప్రతినిధులకు కలగకపోవడం పట్టణ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఏడాది సుమారు రూ.10 లక్షల ఖర్చుతో పలు ప్రధాన కాలువులను శుభ్రం చేసినట్టు అధికారులు చెబుతుండగా... మిగిలిన ప్రాంతాల్లో ఉన్న కాలువల పరిస్థితి ఏమిటన్నది ప్రజల ప్రశ్న. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పారిశుద్ధ్య పనులు సక్రమంగా సాగడంలేదు. చిన్నపాటి వర్షానికి నగరంలో వరద నీరు పోటెత్తి లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ప్రాంతం: విజయనగరం కార్పొరేషన్ విస్తీర్ణం : 51.62 చదరపు కిలోమీటర్లు మొత్తం డివిజన్లు : 50 సచివాలయాలు : 61 నివాసాలు : 90 వేలు జనాభా: 3.04 లక్షలు పారిశుద్ధ్య కార్మికుల లెక్కలు ఇలా... కార్మికుల మంజూరు : 837 ప్రస్తుతం ఉన్న వారు : 609 పారిశుద్ధ్యపనులు కాకుండా ఇతర విభాగాల్లో ఉన్న వారు : 100 బదిలీ వర్కర్లను పెట్టుకున్న వారు : 100కు పైగానే రోజూ శుభ్రం చేయాల్సిన రోడ్ల పరిధి : 399 కిలోమీటర్లు పూడికలు తీయాల్సిన కాలువల విస్తీర్ణం : 466 కిలోమీటర్లు పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి నగరంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. కాలువలను శుభ్రం చేయిస్తున్నాం. దోమల నియంత్రణకు ఆయిల్ బాల్స్ సిద్ధం చేశాం. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య సిబ్బందికి ఆదేశించాం. – పల్లి నల్లనయ్య, కమిషనర్, విజయనగరం -
విజయనగరం
మంగళవారం శ్రీ 29 శ్రీ జూలై శ్రీ 2025పరిష్కరించండి బాబూ... ●మా సమస్యలివి.. ఇలా వదిలి.. అలా నిలిపేసి..! పెదంకలాం ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు సాగునీరు విడుదల చేసిన వెంటనే నిలిపివే యడంపై రైతులు మండిపడుతున్నారు. కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. –8లోవిజయనగరం కలెక్టరేట్ వివిధ వర్గాల ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు, ధర్నాలతో సోమవారం దద్దరిల్లింది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ వివిధ వర్గాల ప్రజలు అధికారులను వేడుకున్నారు. గోడును వినిపించారు. ఫిర్యాదులు, వినతిపత్రాలు అందజేశారు. ●30 మంది విద్యార్థులు చదువుతున్న పాఠశాలకు సొంతభవనం లేదు.. పిల్లలకు బోధించేందుకు ఇద్ద రు టీచర్లు ఇబ్బంది పడుతున్నారు. వర్షం కురిస్తే పాఠశాలకు సెలవు తప్పడం లేదు. గత ప్రభుత్వం నాడు–నేడు కింద మంజూరు నిధులను వేరే పాఠశాల పనులకు మళ్లించారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి దృష్టికి సమస్యను తీసుకెళ్లినా పట్టించుకోలేదు. అధికారులు స్పందించి మా బడికి భవనం నిర్మించాలంటూ మెంటాడ మండలం రెడ్డివానివలస గ్రామస్తులు, పిల్లలు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. ప్లకార్డులతో తమ నిరసన గళం వినిపించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు డి.రాము, సహాయ కార్యదర్మి ఆర్. శిరీషతో కలిసి ఇన్చార్జి కలెక్టర్ సేతమాధవన్కు వినతిపత్రం అందజేశారు. ●బొబ్బిలి నియోజకవర్గంలోని రామభద్రపురం మండలం కాకర్లవలస, కారేడువలస గ్రామాల గిరిజనుల సాగు భూములు లాక్కుని ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేస్తే సహించబోమని సీపీఎం జిల్లా కార్యదర్మి తమ్మినేని సూర్యనారాయణ హెచ్చరించారు. ఆయా గ్రామాల గిరిజనులతో కలిసి ఆందోళన చేశారు. సాగు భూములు లాక్కోవద్దని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ●మున్సిపాలిటీల్లో ఆప్కాస్ కార్మికులుగా విధులు నిర్వహిస్తూ మరణించిన, రిటైర్ అయిన కార్మిక కుటుంబసభ్యులకు తక్షణమే ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ఇన్చార్జి కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. – విజయనగరం గంటస్తంభం న్యూస్రీల్ -
ప్రత్యేక హోదా ఏదీ?
● ఏఐసీసీ జాయింట్ సెక్రటరీ పాలక్ వర్మ విజయనగరం ఫోర్ట్: కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకహోదా అడగకుండా రాష్ట్రానికి చెందిన కూట మి నేతలు ప్రజలను మోసం చేస్తున్నారని ఏఐసీసీ జాయింట్ సెక్రటరీ పాలక్ వర్మ ఆరోపించారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆమె స్థానిక డీసీసీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో కూడా చంద్రబాబు బీజేపీతో పొత్తుపెట్టుకుని ప్రజలను మోసంచేశారన్నారు. దేశం కోసం రాహుల్ గాంధీ పాటుపడుతున్నారని, పార్టీ బలోపేతం కోసం బూత్లెవల్ కమిటీల ను నియమించాలన్నారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు విద్యాసాగర్ పాల్గొన్నారు. -
రైతుల పక్షానే ఉంటాం
శృంగవరపుకోట: వైఎస్సార్సీపీ పూర్తిగా రైతుల పక్షమని, సందేహాలకు తావులేదని మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఎస్.కోట లోని ఓ కల్యాణ మండపంలో పార్టీ నేతలతో కలిసి సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిందాల్ నిర్వాసిత రైతులకు అండగా ఉంటామని, వారి కుటుంబాల్లోని యువ తకు ఉపాధికల్పనే లక్ష్యంగా ఎంఎస్ఎంఈ పార్కు కు గత ప్రభుత్వం జీఓ ఇచ్చిందన్నారు. అయితే, నిర్వాసితులందరికీ పూర్తిస్థాయి పరిహారం ముట్టలేదని, సాగులో ఉన్నవారికి సొమ్ములు అందలేదని, ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ అమలు కాలేదని, ఉద్యోగాలు ఇవ్వలేదని, తాటిపూడి నీటి లభ్యతపై మరింత స్పష్టత కావాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ దృష్టికి తనతో పాటు అప్పటి గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య తీసుకెళ్లారన్నా రు. ఈ సమస్యలను పూర్తిగా అధ్యయనం చేసి రైతు లకు న్యాయం చేసిన తర్వాతనే ముందుకెళ్లాలని నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి బొత్స చెప్పడంతో ఎంఎస్ఎంఈ పార్కు శంకుస్థాపన వాయిదా వేసినట్టు తెలిపారు. జిందాల్ రైతాంగ సమస్యలపై మాజీ మంత్రి బొత్సను కలవగా భూములిచ్చిన గ్రామాల్లో బాధిత రైతుల వివరాలు సేకరించాలని చెప్పారని, ప్రస్తుతం అదే పనిలో ఉన్నామన్నారు. జిల్లా మంత్రి ఎంఎస్ఎంఈ పార్కు ఆలోచన లేనప్పుడు తాటిపూడి నీటి ప్రస్తావన ఎందుకంటారు.. ఎమ్మెల్యే, కలెక్టర్లు ఎంఎస్ఎంఈని అడ్డుకోవద్దంటారు... మరో డీసీఎంఎస్ చైర్మన్ ఎక్కడి నుంచో యువకులను తెచ్చి కంపెనీ లు కావాలని ఉద్యమాలు చేయిస్తారు... పోలీసులు రైతులపై కేసులు పెడుతూ, సెక్షన్ 30 పక్కనపెట్టి ఒక వర్గానికి మద్దతిస్తారు... ఇన్ని గేమ్స్ ఎందుకు ఆడుతున్నారని నిలదీశారు. రైతులకు న్యాయం చేసేందుకు జిందాల్తోనైనా, ప్రభుత్వంతో అయి నా పోరాటానికి సిద్ధమన్నారు. మాజీ ఎమ్మెల్యే హైమావతి మాట్లాడుతూ నాడు భూములిప్పించి రైతుల్ని మోసం చేసిన నేతలే నేడు మళ్లీ రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. రైతుల్ని రోడ్డున పడేసి మంత్రి ఒక మాట, ఎమ్మెల్యే మరొక మాట చెప్పడం సరికాదన్నారు. రైతులకు అన్యాయం చేస్తే ఏ పోరాటానికై నా సిద్ధమని ప్రకటించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు మోపాడ కుమార్, జెడ్పీటీసీ మమ్ములూరి వెంకటలక్ష్మి, వైస్ ఎంపీపీ పినిశెట్టి వెంకటరమణ, వాకాడ రాంబాబు, షేక్ రహ్మాన్, సర్పంచ్ తగరంపూడి రమణ, పదాల ధర్మారావు, కె.అప్పయ్య, కె.జయశంకర్, ఎం.శంకర్, మజ్జి శేఖర్, జె.భాస్కర్రావు, కె.రంగా, అప్పల ఈశ్వరరావు, షేక్ స్వామి, యలమంచిలి అప్పారావు, వాకాడ సతీష్, రమేష్, చక్రి, పెంట గణేష్, శివాజీ తదితరులు పాల్గొన్నారు. ● మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు -
కార్పొరేట్ శక్తుల చేతుల్లో దేశ సంపద
బొబ్బిలి: మతోన్మాదంతో కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను కట్టబెడుతున్న బీజేపీని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. రెండు రోజుల సీపీఐ జిల్లా మహాసభల ముగింపు సభలో ఆదివారం ఆయన మాట్లాడారు. పేద, మధ్య తరగతి ప్రజలతో పాటు రైతులు, ఆదివాసీలను సంక్షేమ రంగంలో పయనించేలా బీజేపీ యేతర పాలన రావాలన్నారు. అద్వానీ రామ జన్మభూమి రధయాత్రలో కమలం గుర్తును ప్రచారం చేశారని గుర్తు చేశారు. మూడోసారి అధికారం కోసం ప్రచారంలో పవిత్ర గంగాజలం పేరుతో రూ.10, రూ.20లకు అమ్మకం చేసి రామశిలపై బొట్లు పెట్టి రాజకీయాలకు వాడుకున్నారన్నారు. బీజేపీ చేస్తున్న దుర్మార్గాలను ఎండగట్టాలన్నారు. పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం 80 శాతం పక్కదారి పడుతున్నా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యాన్ని పంపిణీ చేయాలన్నారు. పన్నుల ధనాన్ని కూడా వృథా చేస్తున్నారన్నారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ జనసేన నాయకుడు పవన్కల్యాణ్ గతంలో చేగువేరానని, కమ్యూనిస్టుని అని చెప్పుకుని మతోన్మాద బీజేపీలో చేరాక హరిహర వీరమల్లు చిత్రం తీసి తన మతోన్మాదం చూపారన్నారు. సీపీఐ గొంతులేని వాళ్లకు గొంతు ఇస్తుందన్నారు. కార్మికులు రక్తతర్పణం చేసి సాధించుకున్న 44 చట్టాలను లేబర్కోడ్స్గా మార్పు చేసి కార్మికుల కడుపు కొట్టార్టరన్నారు. రాష్ట్రంలో టీడీపీ మరోసారి అధికారంలోకి రాకుండా ప్రజలు ముందుకు రావాలన్నారు. ఓంకార్ థియేటర్ వద్ద ప్రతినిధుల సభను నిర్వహించారు. ఈ సందర్భంగా అమరులకు సంతాపం ప్రకటిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.కామేశ్వరరావు, జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ, సహాయ కార్యదర్శులు బుగత అశోక్, అలమండ ఆనందరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు కోట అప్పన్న, నియోజకవర్గ కార్యదర్శి కండాపు ప్రసాదరావు, పట్టణ కార్యదర్శి మునకాల శ్రీనివాసరావు, పలువురు కామ్రేడ్లు పాల్గొన్నారు. మతోన్మాద బీజేపీని వచ్చే ఎన్నికల్లో ఓడించండి సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగేశ్వరరావు చేగువేరానని చెప్పుకునే పవన్కల్యాణ్ బీజేపీలో చేరాకే హరిహర వీరమల్లు తీశారు ముగిసిన సీపీఐ జిల్లా మహాసభలు -
ఎరువుల విక్రయాల నిలిపివేత
● ఫారం ఓ లేకపోవడంతో నిలిపివేసిన అధికారులు ● తనిఖీల్లో బయటపడ్డ లోపాలు తెర్లాం: తెర్లాంలోని శ్రీరామ ట్రేడర్స్లో ఎరువుల విక్రయానికి సంబంధించి ఫారం–ఓ లేకపోవడంతో 23 టన్నుల ఎరువుల విక్రయాలను నిలిపివేయాలని సంబంధిత డీలర్కు నోటీసులు జారీ చేసినట్టు బొబ్బిలి ఏడీఏ ఎం.మధుసూధన్ తెలిపారు. తెర్లాంలోని ఎరువుల దుకాణాల్లో బొబ్బిలి ఏడీఏ, మండల వ్యవసాయ అధికారి బి.శ్రీనివాసరావు ఆదివారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఎరువుల దుకాణాల్లో ఎరువుల నిల్వలను, రికార్డులను పరిశీలించారు. స్థానిక శ్రీరామ ట్రేడర్స్లో లైసెన్స్కు ఫారం–ఓ లేకపోవడంతో ఎరువుల దుకాణంలో నిల్వ ఉన్న 23టన్నుల ఎరువులను విక్రయించకుండా డీలర్కు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ డీలర్లు ఎరువుల కొరత సృష్టిస్తే చర్యలు తీసుకునేందుకు వెనుకాడేది లేదన్నారు. రైతులకు అవసరమైన ఎరువులను సరఫరా చేయాలని సూచించారు. ఎరువుల దుకాణాల్లో నిల్వ ఉన్న, విక్రయిస్తున్న ఎరువులకు సంబంధించి అన్ని రికార్డులు సక్రమంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఎరువుల దుకాణాల ద్వారా విక్రయించే ఎరువులకు సంబంధించి బిల్లు పుస్తకాలు, స్టాక్ రిజిస్టర్లు, ఇతర సంబంధిత పత్రాలు డీలర్లు ఉంచుకోవాలన్నారు. ఎరువుల దుకాణాల డీలర్లు రైతులకు ఏవిధంగా ఎరువులు విక్రయించాలో వివరించారు. ఆయనతో పాటు మండల వ్యవసాయ అధికారి బి.శ్రీనివాసరావు, ఏఈవో వెంకటేష్ ఉన్నారు. -
విజయనగరం
సోమవారం శ్రీ 28 శ్రీ జూలై శ్రీ 2025ఆరోగ్యశ్రీలో ప్రసవానికి.. పిల్లల్లో తగ్గుతున్న పెరుగుదల..! అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ఉన్న పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. వేలాది మంది పిల్లలు పౌష్టికాహార లోపానికి గురవుతున్నారు. –8లోఆండ్ర రిజర్వాయర్ నుంచి నీటి విడుదల మెంటాడ: ఆండ్ర రిజర్వాయరు నుంచి సాగునీటిని మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మ డి సంధ్యారాణి ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడు తూ రిజర్వాయర్ మరమ్మతులకు రూ.2కోట్లు, ప్రాజెక్టు అభివృద్ధికి రూ.కోటిన్నర నిధులు విడుదల చేసినట్టు చెప్పారు. మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ గుర్ల గెడ్డ, హైలెవల్ కెనాల్ పనులు పూర్తి చేయిస్తామన్నారు. సూపర్ 6 హామీలు అమలు చేస్తామన్నారు. పథకాలు అమలు చేయడం లేదని గ్రామాల్లో తిరుగుతు న్న వైఎస్సార్సీపీ నాయకులను చొక్కాలు పట్టుకొని ప్రశ్నించండని రెచ్చగొట్టారు. నియోజకవర్గ పునర్విభజనలో మెంటాడ మండలం గజపతినగరంలోకి వస్తే పరవాలేదని, లేకుంటే పార్వతీపురం జిల్లాలో కలిపేలా చేస్తానన్నారు. ప్రాజెక్టు చైర్మన్ కోడి సతీష్, తహసీల్దార్ అరు ణకుమారి, ఎంపీడీవో భానుమూర్తి తదితరు లు పాల్గొన్నారు. నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక విజయనగరం అర్బన్: కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్ర మం నిర్వహించి ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరిస్తామని ఇన్చార్జి కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను డివిజన్, మండల, మున్సిపల్ స్థాయిలకు ప్రభుత్వం వికేంద్రీకరించినట్టు ఆయన తెలిపారు. ప్రజా సమ స్యల పరిష్కార వేదికను ‘మీ కోసం కాల్ సెంటర్ నెంబర్ 1100’కు ప్రజలు ఎవరైనా సరే కాల్ చేసి అర్జీ నమోదు చేసుకోవడంతో పాటు వారి అర్జీ స్థితిని తెలుసుకోవచ్చని పేర్కొన్నా రు. అర్జీదారులు ‘మీకోసం.ఏపీ.జీఓవి.ఐఎన్’ వెబ్ సైట్లో వారి అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలని సూచించారు. అందరి భాగస్వామ్యంతోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి రాజాం సిటీ: వెనుబాటుకు గురైన ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధనకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి కమిటీ కన్వీనర్ ఎ.అజశర్మ అన్నారు. స్థానిక ఓ పాఠశాలలో జనవిజ్ఞాన వేదిక డివిజన్ స్థాయి సమావేశం ఆదివారం నిర్వహించారు. సమావేశంలో ‘ఉత్తరాంధ్ర వెనుకబాటు–శాసీ్త్రయ పరిశీలన’ అనే అంశంపై ఆయన మాట్లాడా రు. ఉత్తరాంధ్రలో నీటి పారుదల ప్రాజెక్టులు నిర్వహణ లోపం, అటవీ సంపద సద్వినియోగలోపం, అక్షరాస్యతలో రాష్ట్రం అట్టడుగు స్థానంలో ఉండడం, సముద్రతీర సంపదను కార్పొరేట్ శక్తులు చేతిలోకి వెళ్లిపోవడం, పర్యావరణ పరిరక్షణ లోపం, జమిందారీ వ్యవస్థ వంటి అనేక కారణాల వలన ఉత్తరాంధ్ర ఇప్పటికీ వెనుకబాటు తనానికి గురైందని అన్నారు. వీటన్నింటిపై ప్రజలను చైతన్యపరిచి భాగస్వాములుగా చేయడం ద్వారా ఉత్తరాంధ్రను అభివృద్ధి వైపు తీసుకువెళ్లే అవకాశం ఉందని తెలిపారు. జేవీవీ అధ్యక్షుడు ఎంవీఎన్ వెంకటరావు మాట్లాడుతూ సెప్టెంబర్ 13, 14తేదీల్లో విజయనగరంలో జరగనున్న రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జేవీవీ సభ్యులు జె. నీలయ్య, మక్క అప్పలనాయుడు, గట్టి పాపారావు పాల్గొన్నారు. విజయనగరం పట్టణానికి చెందిన సంధ్య అనే గర్భిణి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రసవం చేయించుకోవాలని కొద్ది రోజుల క్రితం పట్టణంలోని ఓ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రికి వెళ్లింది. అక్కడికి వెళ్లిన రెండు రోజుల ముందే అన్ని రకాల వైద్య పరీక్షలు, స్కాన్ తీయించుకున్నారు. అయినప్పటికీ నెట్వర్క్ ఆసుపత్రి వైద్యురాలు తమ ఆసుపత్రిలో మళ్లీ వైద్య పరీక్షలు, తాము సూచించిన స్కానింగ్ సెంటర్లో స్కానింగ్ చేయించుకోవాలని చెప్పింది. అలా అయితేనే తమ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా కాన్పు జరిపిస్తామని చెప్పడంతో గత్యంతరం లేక మళ్లీ వైద్య పరీక్షలు చేసుకున్నారు. ఇందుకోసం రూ.3 వేలు వరకు వెచ్చించారు. విజయనగరం ఫోర్ట్: జిల్లాలో అనేక మంది గర్భిణులకు ఇటువంటి పరిస్థితులే ఎదురవుతున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అయితే ఉచితంగా ప్రసవం జరిపించుకోవ చ్చు అని గర్భిణులు భావిస్తారు. అయితే కొన్ని నెట్వర్క్ ఆసుపత్రులు పెట్టిన నిబంధనల వల్ల గర్భిణులకు చేతిచమురు వదులుతుంది. అందులోనూ రూ.వేలల్లో ఖర్చు అవుతుంది. నిరుపేద గర్భిణుల కు ఇది అదనపు భారం అయినప్పటకీ తప్పని పరిస్థితి. అవస్థలు పడుతున్న గర్బిణులు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా గర్భిణులు ప్రసవం జరిపించుకోవాలంటే 3వ నెల, 6వ నెల, 9వ నెలల్లో చేయించుకున్న మెడికల్ రిపోర్ట్స్, స్కానింగ్ రిపో ర్టులు, టిఫా స్కాన్ రిపోర్టులు ఉండాలి. అయితే గర్భిణులు ఈ రిపోర్టులు అదే ఆసుపత్రుల్లో చేయించుకున్న రిపోర్టులై ఉండాలని వైద్యులు నిబంధన పెడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోగాని, ఇతర ప్రైవేటు ఆసుపత్రుల్లోని వైద్య పరీక్షలు, స్కానింగ్ రిపోర్టులు ఉన్నా అవి పనికిరావని తెగేసే చెప్పేస్తున్నారు. అంతేకాకుండా నెట్వర్క్ ఆసుపత్రిలో ఒక టి రెండు రోజులు ముందు చేయించిన రిపోర్టులు కూడా పనికిరావని చెప్పడం గమనార్హం. అన్నింటి కంటే ముఖ్యంగా నెట్వర్క్ ఆసుపత్రి వారు చెప్పిన స్కానింగ్ సెంటర్కు సంబంధించిన రిపోర్టు ఉన్నప్పటకీ వారి లెటర్ హెడ్పై రాసిచ్చి మళ్లీ స్కానింగ్ తీయించుకోమంటున్నారు. ఇదంతా స్కానింగ్ కేంద్రాల వారు ఇచ్చే కమిషన్ల కోసమే అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ప్రైవేట్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు జిల్లాలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అభినవ్ ఆసుప త్రి, కొలపర్తి, సాయి పీవీఆర్, సాయి సూపర్ స్పె షాలిటీ, వెంకటరామ, ఆంధ్ర, మారుతి, పీజీ స్టా ర్,స్వామి ఐ ఆసుపత్రులు ఉన్నాయి. వీటితో పాటు నెప్రోఫ్లస్ ఆసుపత్రి, మిమ్స్, మువ్వ గోపాల, కాస్వి, క్వీన్స్ ఎన్ఆర్ఐ, గాయిత్రి, పుష్పగిరి, తిరుమల మెడికవర్, శ్రీనివాస్ నర్సింగ్ హోమ్, పిలిడోపియా ఆసుపత్రి, అమృత, సంజీవిని, శ్రీ బాపుజీ, సంజీవిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, సాయికృష్ణ, విజయ మల్టీ స్పెషాలిటీ, వెంకట పద్మ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ప్రసవాలు చేయించుకోవచ్చు. ఏడాదిలో 20 వేల వరకు ప్రసవాలు జిల్లాలో ఏడాదికి 20 వేల వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. ఇందులో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 11 వేల వరకు జరగగా, ప్రైవేటు ఆసుపత్రుల్లో 9 వేలు వరకు జరుగుతున్నాయి. అధిక శాతం ఆరోగ్యశ్రీ పథకం ద్వారానే ప్రసవాలు జరుగుతున్నాయి. న్యూస్రీల్ వైద్య పరీక్షలన్నీ చేసుకున్నా.. మళ్లీ చేసుకోవాలని నిబంధన పెడుతున్న నెట్వర్క్ ఆసుపత్రులు ఫలితంగా గర్భిణులకు చేతి చమురు వదులుతున్న వైనం వైద్య పరీక్షలు, స్కానింగ్ కోసం రూ.వేలల్లో ఖర్చు జిల్లాలో ఏడాదికి 20 వేల వరకు ప్రసవాలు జిల్లాలో 26 ప్రైవేటు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు సరికాదు.. వైద్య పరీక్షలు, స్కానింగ్ రిపోర్టులు ప్రసవం జరిగే నెలలోవే అయితే వాటిని పరిగణనలోకి తీసుకోవాలి. మళ్లీ వైద్య పరీక్షలు, స్కానింగ్ చేయించుకోవాలని చెప్పడం సరికాదు. అటు వంటి ఆసుపత్రులపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆసుపత్రిపై ఫిర్యా దు చేస్తే వారు ప్రసవం జరిపిస్తారో.. లేదోనని.. భయం వద్దు. అదే ఆసుపత్రిలో ప్రసవం జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ కుప్పిలి సాయిరాం, ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ -
జిందాల్ తెచ్చిన తంటా..
శృంగవరపుకోట: జిందాల్ నిర్వాసితుల సమస్యలపై ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం ఎంపీడీవోకు సస్పెన్షన్ హెచ్చరికకు దారితీసింది. దీంతో చేసేది లేక సమావేశం మధ్యలోనే నిలిపేసి ప్రజా సంఘాల నేతలు కార్యాలయం విడిచి వెళ్లారు. తరువాత కార్యాలయం బయట నిరసన తెలిపారు. తాను దళితుడిని కావడం వల్లే పై అధికారులు చిన్నచూ పు చూస్తున్నారని ఎంపీపీ ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. జిందాల్ నిర్వాసితుల సమస్యలపై ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించేందుకు రైతు సంఘాల నేతలు సిద్ధమయ్యారు. సమావేశ నిర్వహణకు ఎంపీడీవో అభ్యంతరం చెప్పడంతో ఎంపీపీ చాంబర్లో ఎంపీపీ సోమేశ్వరరావు రైతు సంఘాలు, ప్రజా సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమయంలో ఎంపీడీవో సతీష్ వచ్చి ‘జిందాల్కు సంబంధించి చర్చలు, సమావేశాలు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించడం సరికాదంటున్నారు.. మీరు ఖాళీ చేసి వెళ్లకుంటే నన్ను సస్పెండ్ చేస్తానంటున్నారు.. సార్’ అంటూ ఎంపీపీకి తన గోడు విన్నవించుకున్నారు. దీనిపై ఎంపీపీ మాట్లాడుతూ తాను ఇక్కడి వాడినని.. నిర్వాసితుల ప్రాంతం నుంచి ఎంపీటీసీగా ఎన్నికై ఎంపీపీ అయ్యాను.. వాళ్ల సమస్యలపై నా చాంబర్లో మాట్లాడకూడదా... అంటూ అడిగారు. దీనిపై ఎంపీడీవో మాట్లాడుతూ.. జిల్లా అధికారులు అంగీకరించ డం లేదు సార్.. అని చెప్పడంతో ప్రజా సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు ఎంపీపీ చాంబర్ నుంచి వెళ్లిపోయారు. ఎంపీడీవో కార్యాలయం బయ ట ప్రజా సంఘాల నేతలు బైఠాయించి నిరసన తెలిపారు. ఎక్కడా... మాట్లాడనివ్వరు... సమస్య చెప్పనివ్వరు.. ఇదేమి నియంతృత్వ పాలన అంటూ నిరసన తెలిపారు. ఎంపీడీవో కార్యాలయం ఆవరణ ఖాళీ చేయాలని బతిమలాడడంతో అంతా కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోయా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రఘురాజు, న్యాయవాది బి.రామకృష్ణ, వేదిక వ్యవస్థాపకుడు డి.సూర్యారావు, చల్లా జగన్, పదాల మణిబాబు, మద్ది కృష్ణ, వర్మరాజు తదితరులు మాట్లాడుతూ జిందాల్ తీరును, వెనకేసుకొస్తున్న అధికారుల తీరును తప్పుబట్టారు. నిర్వాసితుల పోరాటానికి తమ సంఘీభావం తెలిపారు. దళితుడిని కావడం వల్లే.. ఎంపీపీ సోమేశ్వరరావు విలేకరులతో మాట్లాడా రు. తాను దళితుడిని కావడం వల్లే నాకు స్వేచ్ఛ, స్వాతంత్య్రం, హక్కుల్లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీపీ అన్న గౌరవం లేకుండా చేశారు. తన చాంబర్లో నా ప్రాంతానికి చెందిన నాయకులతో మాట్లాడకూడదా.. సమస్యలు చెప్పేందుకు వచ్చిన వాళ్లతో కూర్చోకూడదట.. ఇదేమి అన్యాయం అంటూ ప్రశ్నించారు. తాను సమావేశం ఆపకపోతే ఎంపీడీవోని సస్పెండ్ చేస్తానంటూ కలెక్టర్ బెదిరించడం అన్యాయం కా దా.. ఇదేనా.. సామాజిక న్యాయం అంటూ ప్రశ్ని ంచారు. ఎంపీడీవోకు సస్పెన్షన్ హెచ్చరిక దళితుడిననే చిన్న చూపు : ఎంపీపీ -
సబ్జెక్టు టీచర్లతో లాంగ్వేజీల బోధన
● అర్థం కాక తలులు పట్టుకుంటున్న విద్యార్థులు ● బోధించలేమని చేతులెత్తేస్తున్న ఉపాధ్యాయులు ● విద్యార్థుల జీవితాలతో కూటమి అటలు!రామభద్రపురం: కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటోంది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రభుత్వ యూపీ స్కూల్స్ను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతోంది. ఇటీవల ప్రభుత్వ పాఠశాలల టీచర్లకు బదిలీలు చేపట్టిన ప్రభుత్వం యూపీ స్కూళ్లలో ఉన్న తెలుగు, హిందీ పండిట్లను ఎల్ఎఫ్ఎల్, ఎంపీఎస్ హెచ్ఎంలుగా బదిలీ చేసింది. యూపీ స్కూల్స్లో లాంగ్వేజ్ పండిట్లు లేకుండా చేసింది. పాఠశాలలో ఉన్న టీచర్లలో ఎవరో ఒకరు లాంగ్వేజ్లు బోధించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలిసింది. అయితే టీచర్లు ఉపాధ్యాయ విద్య చదివినా లాంగ్వేజ్ బోధన నైపుణ్యాలపై వారికి అవగాహన ఉండడం లేదు.సోషల్ టీచర్ను హిందీ చెప్పమంటే ఏం చెప్పగలరన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో సుమారు 158 యూపీ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో ప్రభుత్వం విద్యార్థుల సంఖ్యకు తగ్గట్లు ఉపాధ్యాయులను నియమించడంలో నిర్లక్ష్యం చూపడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ తీరుతో కొత్త పిల్లలను జాయిన్ చేయడం మాట దేవుడెరుగు ఉన్న పిల్లలను ఎలా కాపాడుకోవాలా? అని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. చదివేదొకటి..చెప్పేదొకటి.. ప్రభుత్వం తీరు వల్ల బీఈడీలో చదివేదొకటి, పాఠశాలల్లో చెప్పేదొకటి అన్నచందంగా ఉందని టీచర్లు అంటున్నారు.యూపీ పాఠశాలల్లో లాంగ్వేజ్ పండిట్లను పీస్ హెచ్ఎంలుగా బదిలీ చేయడంతో సోషల్, బయాలజీ, గణితం సబ్జెక్టు చెబుతున్న టీచర్లు తెలుగు, హిందీ లాంగ్వేజ్లు చెప్పాల్సిన దుస్థితి నెలకొంది. ఇలా చేస్తే విద్యా ప్రమాణాలు మెరుగుపడడం దేవుడెరుగు. అసలు సంబంధం లేని పాఠాలను ఎలా బోధిస్తారనే జ్ఞానం ఉండదా? అని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. ఉపాధ్యాయుల కొరత మూలంగా విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుండంతో ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రామభద్ర పురం మండలంలోని కోటశిర్లాం యూపీ పాఠశాలలో 6,7,8 తరగతులలో 28 మంది విద్యార్థులుండగా ఇద్దరు టీచర్లు మాత్రమే మొత్తం ఆరు సబ్జెక్టులు బోధిస్తున్నారు. ఇందులో తెలుగు, ఇంగ్లీషు, హిందీ లాగ్వేజ్లు ఒక్క టీచరే బోధిస్తున్నారు. దీంతో విద్యార్థుల్లో 8 మంది తమకు సరిపడా టీచర్లు లేరని, సరైన విద్యాబోధన అందడం లేదన్న ఉద్దేశంతో టీసీలు తీసుకుని వేరే పాఠశాలలకు వెళ్లియారు. మిగిలిన వారు కూడా ఇలాగే పరిస్థితి ఉంటే తాము కూడా ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లిపోతామంటున్నారు.లాంగ్వేజ్ టీచర్ల కొరత వాస్తవమే..యూపీ స్కూల్స్లో ఉన్న మిగులు ఉపాధ్యాయులను ఎల్ఎఫ్ఎల్, ఎంపీఎస్ హెచ్ఎంలుగా బదిలీచేశారు. దాంతో లాంగ్వేజ్ టీచర్ల కొరత ఉంది. ప్రస్తుత క్లస్టర్ స్కూల్స్లో ఉన్న ఎంటీఎస్లను వినియోగించుకోవాలి. డీఎస్సీ నియామకాలు చేపడితే కొత్త టీచర్లను నియమిస్తారు. కె.మోహనరావు, డిప్యూటీ డీఈవోసరిగ్గా అర్థం కావడం లేదు.. మా పాఠశాలలో తెలుగు, హిందీ లాంగ్వేజ్లను బయాలజీ, ఇంగ్లీషు టీచర్లు బోధిస్తున్నారు. మాకు సక్రమంగా అర్థం కావడం లేదు. దీంతో నాణ్యమైన విద్య అందడం లేదు. ఇలా అయితే ప్రభుత్వ స్కూల్స్లో చదవలేం. తీరు మారకుంటే టీసీలు పట్టుకుని వేరే పాఠశాలకు వెళ్లిపోతాం. బి.మేఘన, 8వ తరగతి,యూపీ స్కూల్, ఇట్లా మామిడిపల్లి యూపీ పాఠశాలలు కనుమరుగయ్యే ప్రమాదం..యూపీ స్కూల్స్లలో తెలుగు, హిందీ బోధించే ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులకు పూర్తిస్థాయిలో విద్య అందడంలేదు. లాంగ్వేజ్ల బోధన లేక 6,7,8 తరగతుల విద్యార్థులు చేరడం లేదు. ప్రభుత్వ విద్యాసంస్కరణలతో పాఠశాల విద్య అస్తవ్యస్తంగా ఉంది. భవిష్యత్లో యూపీ పాఠశాలలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. జేసీ రాజు, ఏపీటీఎఫ్ రాష్ట్ర అకడమిక్ కన్వీనర్ -
రాధికారాణికి జాతీయ పురస్కారం
విజయనగరం టౌన్: నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ ప్రతి ఏటా ఇచ్చే జాతీయ స్థాయి పురస్కారాల్లో భాగంగా విజయనగరానికి చెందిన ప్రముఖ నృత్య కళాకారిణి, నర్తనశాల డ్యాన్స్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ భేరి రాధికారాణిని జాతీయ పురస్కారంతో సత్కరించారు. ఈ మేరకు ఆదివారం ఆమె మాట్లాడుతూ హైదరాబాద్లోని త్యాగరాయ గానసభలో శనివారం రాత్రి నిర్వహించిన వేడుకల్లో తన నాట్య కౌశలం, అభినయం, నర్తనశాల అకాడమీ డైరెక్టర్గా నాట్యరంగానికి సుమారు మూడు దశాబ్దాలుగా అందిస్తున్న సేవలను గుర్తించి అవార్డును తనకు అందజేసినట్లు తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి, మల్కాజ్గిరి కోర్టు న్యాయమూర్తి మధుసూదనరావుల చేతులమీదుగా పురస్కారం అందుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు జిల్లాకు చెందిన పలు సాంస్కృతిక సస్థల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. -
ఎరువుల దుకాణాల తనిఖీ
విజయనగరం ఫోర్ట్: విజయనగరం మన్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఎరువుల దుకాణాల్లో వ్యవసాయ అధికారులు ఆదివారం తనిఖీ నిర్వహించారు. జిల్లా వ్యవసాయ అధికారి వి. తారకరామారావు, సహాయ సంచాలకుడు నాగభూషణరావు, ఇన్చార్జి మండల వ్యవసాయ అధికారి నీలిమ తనిఖీలు నిర్వహించి స్టాక్ రిజిస్టర్లు, బిల్లు పుస్తకాలు, ఎరువుల భౌతిక నిల్వలు, కంపెనీ ఇన్వాయిస్ గోదాములను పరిశీలించారు. ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 21.55 మెట్రిక్ టన్నుల ఎరువులను సీజ్ చేశారు. సీజ్ చేసిన ఎరువుల విలువ రూ.3,74,588 ఉంటుందని జిల్లా వ్యవసాయ అధికారి తారకరామరావు తెలిపారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్మొత్తానికి 25,443 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ప్రస్తుతానికి 20, 629 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంచామని అమ్మకాలు పోగా 5467మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. ఎంఆర్పీకి మించి ఎరువులు ఎక్కడైనా విక్రయించినట్లయితే ఫోన్ 8331056279 నంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. 21.55 మెట్రిక్ టన్నుల ఎరువుల సీజ్ -
మేతకు వెళ్లిన 18 గొర్రెల మృతి
పార్వతీపురం రూరల్: మండలంలోని బందలుప్పి గ్రామ సమీపంలో బందలుప్పి నుంచి తాళ్లబురిడి గ్రామానికి వెళ్లే మట్టి రోడ్డు మార్గంలో మధ్యలో ఉన్న నీలగిరి తోటల్లోకి మేతకు వెళ్లిన 18 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. బాధిత గొర్రెల కాపరులు నీలబోను గోవింద, చందపు సింహాద్రి తెలిపిన వివరాల ప్రకారం..ఎప్పటిలాగానే తాము పెంచుకుంటున్న గొర్రెలు, మేకలను ఆదివారం సాయంత్రం శ్రీనివాసరావు అనే రైతు నీలగిరి తోటకు తరలించామని, ఆ తోటకు క్రిమిసంహారక మందులు, యూరియా పిచికారీ చేయడంతో ఈ విషయం గమనించకుండా పశుగ్రాసం కోసం మేకలు, గొర్రెలను విడిచిపెట్టామన్నారు. అవి తోటలోకి ప్రవేశించిన కొద్దిసేపటికే ఒకసారిగా 18 గొర్రెలు మృత్యువాత పడడంతో గమనించి స్థానిక పశు వైద్యుడికి సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు పశువైద్యుడు రెడ్డి రమేష్ చేరుకుని గొర్రెలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. గొర్రెల మృతి కారణంగా తీవ్రంగా నష్టపోవడంతో కాపరులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. మరో 20 గొర్రెలకు అస్వస్థత -
11 మంది మందుబాబులపై కేసులు
విజయనగరం క్రైమ్ : జిల్లా వ్యాప్తంగా బహిరంగంగా మద్యం తాగుతున్న వారిపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. గత వారమే జామి పోలీస్ స్టేషన్ పరిధి అలమండలో పోలీసులు మందుబాబులను అరెస్ట్ చేయగా ఈ ఆదివారం పెదమానాపురం పోలీస్ స్టేషన్ పరిధి సంత శివార్లలో బహిరంగ మద్యపానం చేస్తున్న 11మందిపై కేసులు నమోదు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న వారని ఉపేక్షించేది లేదని ఎస్పీ వకుల్ జిందల్ స్పష్టం చేశారు. వారం వారం జరుగుతున్న సంతలలో మందుబాబుల ఆగడాలను అరికట్టేందుకే డ్రోన్స్ ను ఆయా సంతలలో వినియోగిస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే ఆకస్మికంగా డ్రోన్స్ తో దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పెద మానాపురం ఎస్సై ఆర్.జయంతి ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేశారని ఎస్పీ తెలిపారు. దాడుల్లో పెద మానాపురం ఎస్ఐ తో పాటు డ్రోన్ పైలట్ వెంకటేష్, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.పోలీసుల అదుపులో పందాల రాయుళ్లు● రెండు పొట్టేళ్లు స్వాధీనం గరుగుబిల్లి: పొట్టేళ్ల పందెం నిర్వహిస్తున్న పందెం రాయుళ్లను అదుపులోకి తీసకుని రెండు పొట్టేళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ఎం. రమేష్ నాయుడు తెలిపారు. ఈ మేరకు ఆదివారం మండలంలోని రావివలస గ్రామ పరిసరాల్లో పందానికి సిద్ధం చేసిన రెండు పొట్టేళ్లను, నలుగురు పందెం రాయుళ్లతోపాటు రూ. 620 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. పందెం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు తమ సిబ్బందితో దాడులు చేసినట్లు చెప్పారు. ఎక్కడైనా జూదం గాని, పొట్టేళ్లు, కోళ్ల పందాలు నిర్వహిస్తే శాఖాపరమైన చర్యలు చేపట్టనున్నట్లు హెచ్చరించారు. పందెం రాయుళ్లపై కేసు నమోదు చేసి తదుపరి చర్యల నిమిత్తం పార్వతీపురం మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు. దాడుల్లో సిబ్బంది ఉమా మహేశ్వరరావు, కృష్ణమోహన్ పాల్గొన్నారు. బైక్ అదుపుతప్పి ఇద్దరు యువకులకు గాయాలురేగిడి: మండల పరిధిలోని అప్పాపురం గ్రామ సమీపంలో ఆదివారం బైక్ అదుపు తప్పి జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయాలపాలయ్యారు. పాలకొండ మండలం మంగళాపురం గ్రామానికి చెందిన మడపాల సాయి, సంతకవిటి మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన కె.యోగేష్లు కె.వెంకటాపురంలోని తమ మిత్రుడిని కలిసేందుకు బైక్పై వెళ్తుండగా అప్పాపురం సమీపంలో బైక్ అదుపుతప్పడంతో ఇద్దరూ రోడ్డుపై పడిపోగా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు 108కు సమాచారం అందించడంతో వాహనంతో వచ్చిన 108 ఈఎంటీ మీసాల ఈశ్వరరావు, పైలెట్ గర్భాపు నారాయణరావులు క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించారు. బాధితుల కాళ్లు, చేతులకు గాయాలు కావడంతో మెరుగైన వైద్యంకోసం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
రహదారి నిర్మాణం పూర్తి
పార్వతీపురం రూరల్: మండలంలోని బాగుజోల నుంచి చిలకమెండంగి వరకు రహదారి పనులు పూర్తయినట్లు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. రూ.2.50 కోట్ల వ్యయంతో ఈ రహదారి పనులు చేశామని తెలిపారు. రోడ్డుకు ఇరువైపులా రఫ్ స్టోన్ ప్యాకింగ్, తారు రహదారిగా మార్చే పనులు పూర్తి కావాల్సి ఉందన్నారు. రహదారి సౌకర్యం లేని గిరిజన ప్రాంతాలకు రహదారులు కల్పించే దిశగా గత ఏడాది డిసెంబర్ 20న మక్కువ మండలం బాగుజోలలో పలు రహదారులకు ఉపముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఈ రోడ్డు ద్విచక్ర వాహనాలు, అంబులెన్న్సులు, జీపులు, కార్లు వంటి వాహనాలు తిరిగేందుకు అనువుగా ఉన్నట్లు కలెక్టర్ వివరించారు. రెండు కోట్ల రూపాయల విలువ మేరకు పనులు జరిగాయని, ఇందులో రూ.56 లక్షలు చెల్లింపు జరిగిందని తెలియజేశారు. మిగిలిన మొత్తం చెల్లింపు చేయాల్సి ఉందన్నారు. గుమ్మలక్ష్మీపురం మండలంలో రూ.360 లక్షల వ్యయంతో పాములగీసడ నుంచి మంత్రజోల వరకు 3.60 కి.మీ మేర బీటీ రోడ్డు పనులు ప్రగతిలో ఉన్నాయన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ మొదటి వారంలోగా పూర్తిచేయనున్నట్లు చెప్పారు. 8 కిలోమీటర్ల వరకు మట్టి రహదారి నిర్మాణం జరిగిందన్నారు. సాలూరు మండలం బాగుజోల నుంచి సిరివర వరకు 6.60 కిలో మీటర్ల మేర తారు రహదారి వేసేందుకు ప్రభుత్వం రూ.9 వందల లక్షలు మంజూరు చేసిందని, మట్టి రహదారి నిర్మాణం పూర్తయినట్లు తెలిపారు. వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి రహదారి నిర్మాణం పూర్తవుతుందన్నారు. పాచిపెంట మండలం అల్లూరు నుంచి రిట్టపాడు వరకు గల రహదారి రూ.నాలుగు వందల లక్షలతో తారు రహదారిగా నిర్మించేందుకు మంజూరైందని, అటవీ అనుమతులు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ -
పిల్లల్లో తగ్గుతున్న పెరుగుదల..!
● 6 ఏళ్ల లోపు పిల్లలు 67,381 ● బరువు తక్కువగా ఉన్న పిల్లలు 3,569 ● ఎత్తు తక్కువ ఉన్న పిల్లలు 7,316 ● పౌష్టికాహార లోపం ఉన్న పిల్లలు 2,410 విజయనగరం ఫోర్ట్: అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ఉన్న పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. వేలాది మంది పిల్లలు పౌష్టికాహార లోపానికి గురవుతున్నారు. పౌష్టికాహార లోపంతో పాటు ఎత్తుకు తగ్గ బరువు, వయసుకు తగ్గ ఎత్తు లేని పిల్లలు అధికంగా ఉన్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంటోంది. పౌష్టికాహార లోపం బారిన పడడం వల్ల పిల్లలు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. గర్భం దాల్చినప్పటి నుంచి మాతాశిశు ఆరోగ్యానికి చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతున్న మాటలు ఫలితం ఇవ్వడం లేదు. పుట్టే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, పుట్టినట్లయితే సమస్యలు ఉండవు. పౌష్టికాహార లోపం వల్ల పిల్లలు అనేక అనారోగ్య సమస్యలతో పుడుతున్నారు. తల్లులు బలహీనంగా ఉండడం, గర్భస్థ సమయంలో అనారోగ్యానికి గురికావడం, తక్కువ వయస్సులో వివాహాలు చేయడం, మహిళల్లో రక్తహీనత తదితర కారణాల వల్ల పుట్టే పిల్లల్లో కొంతమంది పౌస్టికాహార లోపం, బరువు తక్కువగా పుడుతున్నారు. జిల్లాలో 11 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటి పరిధిలో 2499 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 292 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాల పరిధిలో 67,381 మంది ఆరేళ్ల లోపు పిల్లలు ఉన్నారు. ఎత్తు తక్కువగా ఉన్న పిల్లలు 7,316 మంది జిల్లాలో ఉన్న ఆరేళ్ల లోపు పిల్లల్లో 7,316 మంది ఎత్తు తక్కువగా ఉన్నారు. అదేవిధంగా బరువు తక్కువగా ఉన్న వారు 3,569 మంది ఉన్నారు. 2410 మంది పిల్లలు పౌష్టికాహార లోపంతో ఉన్నారు. ఎత్తు, బరువు తూనిక: పిల్లల బరువు, ఎత్తు తెలుసుకునేందుకు అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న పరికరాల ద్వారా తూనిక వేస్తారు. బరువు, ఎత్తు తక్కువగా ఉన్న పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి ప్రత్యేక పౌష్టికాహారం 6 నెలల లోపు పిల్లలు బరువు తక్కువగా ఉన్నా, పౌష్టికాహార లోపం ఉన్నా తల్లిపాలు ఆరు నెలలు పాటు తాగించాలని అంగన్వాడీ కార్యకర్త పిల్లవాడి ఇంటికి వెళ్లి తల్లికి చెబుతారు. 6 నెలలు దాటిన పి ల్లలకు అయితే తల్లిపాలతో పాటు బాలామృతం, 100 ఎంఎల్ పాలు, గుడ్డు ఇస్తారు. ఇటువంటి వారికి ఆహారాన్ని రోజులో 8 సార్లు ఇస్తారు. ప్రత్యేక శ్రద్ధఅంగన్వాడీ కేంద్రాల పరిధిలో ఉన్న పౌష్టికాహార లోపం, బరువు, ఎత్తు తక్కువగా ఉన్న పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాం. వయసుకు తగ్గ ఎత్తు, బరువు లేని పిల్లలను పౌష్టికాహార లోపం ఉన్నట్లు గుర్తించి వారికి ప్రత్యేకమైన పౌష్టికాహారాన్ని అందిస్తాం. సాధారణంగా ప్రతి వ్యక్తి రోజులో మూడు సార్లు ఆహారంగా తీసుకుంటారు. కాని పౌష్టికాహార లోపం ఉన్న పిల్లలకు రోజులో 8 సార్లు ఆహారాన్ని అందించే విధంగా చర్యలు తీసుకుంటాం. టి.విమలారాణి, ప్రాజెక్టు డైరెక్టర్, ఐసీడీఎస్ -
చిన్నారులంటే అంత అలుసా..
● అంగన్వాడీ చిన్నారులకు ఇంతవరకు పంపిణీ చేయని ప్రీ స్కూల్ కిట్లు ● అందని ఆటపాటలతో కూడిన విద్యవిజయనగరం ఫోర్ట్: అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలను పంపిస్తే ఆటపాటలతో కూడిన విద్య అందుతుందని తల్లిదండ్రుల నమ్మకం. అయితే ఆటపాటలతో కూడిన విద్యను అందించేందుకు అవసరమైన వస్తువులతో కూడిన ప్రీ స్కూల్ కిట్లను ఇంతవరకు కూటమి ప్రభుత్వం సరఫరా చేయలేదు. చిన్నారులంటే మరీ ఇంత అలుసా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని కూటమి సర్కారు గొప్పలు చెప్పుకుంటోంది. కాని పిల్లల చదువుకు అవసరమైన స్కూల్ కిట్లను మాత్రం ఇంతవరకు సరఫరా చేయలేదు. అసలే అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్య అంతంత మాత్రంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో స్కూల్ కిట్లు అందివ్వకపోవడం.. ఆటపాటలతో కూడిన విద్య అందకపోతే కేంద్రాల మనుగడే ప్రశ్నార్థమవుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 11 ప్రాజెక్ట్లు.. జిల్లాలో ఐసీడీఎస్ ప్రాజెక్టులు 11 ఉన్నాయి. వీటి పరిధిలో 2,499 అంగన్వాడీ కేంద్రాలుండగా..మెయిన్ కేంద్రాలు 2,206 కాగా 293 మినీ అంగన్వాడీ కేంద్రాలు. ఆయా కేంద్రాల పరిధిలో ఏడు నెలల నుంచి మూడేళ్ల లోపు పిల్లలు 42,161 మంది.. మూడు నుంచి ఆరేళ్ల లోపు చిన్నారులు 21,543 మంది ఉన్నారు. సరఫరా మాటేమిటి..? అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు ప్రీ స్కూల్ కిట్లు (ఆట వస్తువులతో కూడిన మెటీరియల్) అందించాలి. కార్యకర్తలు వీటతోనే చిన్నారులకు బోధన అందిస్తారు. కిట్లో బిల్డింగ్ బ్లాక్స్, బాల్స్, బ్యాట్, రింగ్స్, బొమ్మలు, అక్షరాలతో కూడిన కార్డులు, స్లేట్స్ ఉంటాయి. వీటిని చిన్నారులకు చూపిస్తూ ఆహ్లాదకర వాతావరణంలో బోధన అందించాల్సి ఉంది. ఇంతటి ఉపయోగం ఉన్న కిట్లను కూటమి సర్కారు పంపిణీ చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా రాలేదు.. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేయాల్సిన ప్రీ స్కూల్ కిట్లు ఇంకా రాలేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వచ్చిన వెంటనే కేంద్రాలకు పంపిణీ చేస్తాం. – టి. విమలారాణి, ప్రాజెక్ట్ డైరెక్టర్, ఐసీడీఎస్ -
చోరీ చేసిన బైక్లపై తిరుగుతూ..
● పోలీసులకు చిక్కిన కేటుగాడు ● ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనంభోగాపురం: నిర్మానుష్య ప్రాంతాల్లో ఉండే ద్విచక్ర వాహనాలే ఆ కేటుగాడి టార్గెట్.. ఏ బండైనా సరే కనురెప్ప పాటులో చోరీ చేయగలిగే టాలెంట్ వాడి సొంతం.. బైక్ నచ్చితే చాలు అది మాయమైనట్లే...ఏడాది కాలంగా దొంగతనాలు చేయడం..ఎంచక్కా దొంగలించిన బైకులపైనే చక్కెర్లు కొట్టడం అలవాటుగా మార్చుకున్నాడు.. చివరకు పోలీసుల నిఘా నుంచి మాత్రం తప్పించుకోలేకపోయాడు.. దొంగలించిన ద్విచక్ర వాహనంపైనే భోగాపురం రోడ్లపై తిరుగుతుండగా పోలీసులకు పట్టుబడ్డాడు. డీఎస్పీ పి. శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తవలస మండలం మంగళపాలెం గ్రామానికి చెందిన రాపేటి సూర్యప్రకాష్ గతేడాది పోలిపల్లిలో ద్విచక్రవాహనం దొంగలించాడు. శనివారం అదే బైక్పై భోగాపురంలో తిరుగుతుండగా పోలీసులకు అనుమానం వచ్చి నంబర్ను తనిఖీ చేయగా దొంగలించిన బండిగా గుర్తించారు. తమదైన శైలిలో పోలీసులు విచారణ చేయగా ఏడాది కాలంలో చేసిన చోరీ వివరాలను చెప్పాడు. పోలిపల్లిలో–1, పూసపాటిరేగలో–1, బొండపల్లిలో–1, పద్మనాభంలో–2 చొప్పున ద్విచక్రవాహనాలను చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడి నుంచి ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని కోర్టుకు అప్పగించినట్లు డీఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో సీఐ దుర్గాప్రసాద్, ఎస్సైలు పాపారావు, సూర్యకుమారి, తదితరులు పాల్గొన్నారు. -
ఎరుపెక్కిన బొబ్బిలి..
బొబ్బిలి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోమ్ మినిస్టర్ అమిత్షాలకు ఖరీదైన విమానాల్లో విదేశాల్లో తిరగడానికి ఉన్న శ్రద్ధ మనదేశంలో మణిపూర్లో దాడులకు గురైన మహిళలను పరామర్శించేందుకు లేకపోవడం దురదృష్టకరమని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక తాండ్ర పాపారాయ జంక్షన్లో సీపీఐ జిల్లా మహాసభల సందర్భంగా బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాగేశ్వరరావు మాట్లాడుతూ.. మణిపూర్ మహిళలపై దారుణంగా హింసలు చోటు చేసుకుంటుంటే హోం మంత్రి, ప్రధాని ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కేంద్రంలో మోదీ, అమిత్షా తీసుకున్న నిర్ణయాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ వత్తాసు పలుకుతున్నారన్నారు. గతంలో ఇంటింటికీ రేషన్ అందితే ఇప్పుడు షాపుల వద్ద ప్రజలంతా గుమిగూడి లైన్లలో నిలబడి రేషన్ కోసం అవస్థలు పడుతున్నారన్నారు. ఆదివాసీ హక్కుల కోసం సీపీఐ పోరాడుతోందన్నారు. కేంద్ర, రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం సీపీఐకి అధికారమివ్వాలని పిలుపునిచ్చారు. కోట చుట్టూ ఉన్న దుకాణదారుల బతుకులు మారాలి.. బొబ్బిలి ఎమ్మెల్యే కోటలో ఉండడం గొప్ప కాదని.. ఆ కోట చుట్టూ ఉన్న దుకాణదారుల బతుకులు మారేలా పాలన సాగించాలని హితవు పలికారు. గిరిజనులు సాగు చేస్తున్న భూములకు పట్టాలివ్వాలని కోరితే ఆరు నెలల్లో సమస్య పరిష్కరిస్తామన్న ఎమ్మెల్యే బేబీనాయన ఆ దిశగా చర్యలు తీసుకోలేదన్నారు. అలాగే పట్టణంలోని వెలమదొరలు వందలాది ఎకరాలు ఆక్రమిస్తుంటే వారిపై చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. బొబ్బిలి జూట్మిల్లు తెరిపిస్తామన్న హామీ కూడా నెరవేర్చలేకపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టే రోజులు వచ్చాయన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ నల్ల చట్టాలపై వస్తున్న నిరసనలను అణిచివేసే క్రమంలో సుమారు 750 మంది రైతులు మృతి చెందారన్నారు. అటవీ సంపదను అదానీ, అంబానీలకు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ సృష్టించి మావోలను, ఆదివాసీలను హతమార్చుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా మహాసభల సందర్భంగా జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ ఆధ్వర్యంలో ముందుగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణమంతా ఎర్ర జెండాలతో ఎరుపెక్కింది. అనంతరం తాండ్రపాపారాయ జంక్షన్ వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి అలమండ ఆనందరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు కోట అప్పన్న, జిల్లా నాయకుడు బుగత అశోక్, రాజాం కార్యదర్శి ఉల్లాకుల నీలకంఠ యాదవ్, బొబ్బిలి నియోజకవర్గ ఇన్చార్జ్ కండాపు ప్రసాదరావు, మహిళా సమాఖ్య నాయకులు బాయి రమణమ్మ, తదితరులు పాల్గొన్నారు. విదేశాల్లో తిరగడానికి ఉన్న శ్రద్ధ మణిపూర్ మహిళల పరామర్శకు లేదా? మోదీ నిర్ణయాలకు చంద్రబాబు, పవన్ల వత్తాసు పేదల బతుకులు మారాలి సీపీఐ జిల్లా మహాసభలో రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు -
తల్లి సంవత్సరీకానికి వెళ్తూ కుమార్తె మృతి
భామిని: తల్లి సంవత్సరీకంలో పాల్గొనేందుకు వెళ్తూ కుమార్తె మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. పాలకొండ మండలం అన్నవరం గ్రామానికి చెందిన కొండేటి తవిటమ్మ భర్త జనార్దనరావుతో కలిసి ద్విచక్ర వాహనంపై ఒడిశాలోని గుణుపూర్కు బయలుదేరింది. సరిగ్గా భామిని మండలం ఘనసర వద్దకు వచ్చేసరికి తవిటమ్మ చీర ద్విచక్ర వాహనంలో చిక్కుకుపోవడంతో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఈ ప్రమాదంలో తవిటమ్మకు తీవ్రగాయాలు కాగా భర్తకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను సీతంపేట ఏరియా ఆస్పత్రికి 108 వాహనంలో తరలించారు. అయితే అప్పటికే తవిటమ్మ (47) మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బత్తిలి ఎస్సై జి.అప్పారావు ఆధ్వర్యంలో ఏఎస్సై కొండగొర్రి కాంతారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై చెప్పారు. మృతురాలికి ఇద్దరు కుమారులున్నారు. ద్విచక్ర వాహనంలో చీర చిక్కుకోవడంతో ప్రమాదం -
కాలువలో పడి వ్యక్తి మృతి
● ఐదు రోజుల కిందట అదృశ్యమైన వ్యక్తి..శవమై కనిపించాడు ● కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు తెర్లాం: మోటార్ సైకిల్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కాలువలో పడిపోవడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన ఐదు రోజుల కిందట చోటు చేసుకుంది. ఎస్సై సాగర్బాబు శనివారం తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కూనాయవలస గ్రామానికి చెందిన గిడిజాల చందు (25) ఈ నెల 22వ తేదీ రాత్రి ఆమిటి నుంచి స్వగ్రామానికి వస్తుండగా ప్రమాదవశాత్తూ రోడ్డుపక్కనున్న కాలువలో పడిపోయాడు. ద్విచక్ర వాహనం కింద ఉండిపోవడం.. కాలువలో నీరు పారుతుండడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడికి భార్య స్వాతి, కుమార్తెలు ధన్యశ్రీ, మౌనిక, తల్లిదండ్రులు శ్రీను, విజయ ఉన్నారు. కనిపించడం లేదంటూ ఫిర్యాదు.. తన భర్త రెండు రోజులుగా కనిపించడం లేదని చందు భార్య స్వాతి, అతని కుటుంబ సభ్యులు ఈ నెల 24న స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు కూడా కనిపించకుండా పోయిన వ్యక్తి ఆచూకీ కోసం పలు ప్రాంతాల్లో గాలిస్తున్నారు. అయితే కనిపించకుండా పోయిన వ్యక్తి చివరకు శవమై కనిపించడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. చందు కార్పెంటర్గా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఆదుకోవాల్సిన కుమారుడు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దుర్వాసన రావడంతో... స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాల విద్యార్థులు విరామ సమయంలో రోడ్డు పక్కకు రాగా దుర్వాసన వచ్చింది. దీంతో కాలువలోకి చూడగా.. మోటార్ సైకిల్ కింద ఓ వ్యక్తి పడిపోయి ఉన్నట్లు గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్సై సాగర్బాబు సిబ్బందితో సహా సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ముందుగా గుర్తు తెలియని మృతదేహంగా భావించినప్పటికీ, కునాయివలసకు చెందిన వ్యక్తి అదృశ్యంపై వచ్చిన ఫిర్యాదు మేరకు వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో చందు కుటుంబ సభ్యులు వచ్చి నిర్దారించడంతో శవపంచనామ నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాడంగి సీహెచ్సీకి తరలించారు. -
దోపిడీ కేసులో నలుగురు నిందితుల అరెస్ట్
● ముగ్గురు మైనర్లు కావడంతో జువైనల్ హోమ్కు తరలింపు ● పరారీలో మరొక నిందితుడు ● పట్టుబడిన నిందితుడిపై మరో ఎనిమిది కేసులువిజయనగరం: నగరంలోని చెల్లూరు – గొట్లాం వద్ద ఈ నెల 19న జరిగిన దోపిడీ కేసుకు సంబంధించి విజయనగరం రూరల్ పోలీసులు నలుగురు నిందితులను శనివారం అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ శ్రీనివాస్ స్థానిక రూరల్ పోలీస్స్టేషన్లో వెల్లడించారు. ఆయన తెలియజేసిన వివరాల మేరకు.. సాహుగర్ సంతోష్కుమార్ అనే వ్యక్తి సరుగుడు కర్రల లోడ్తో విశాఖ నుంచి రాయగడ వైపు లారీలో వెళ్తుండగా.. ఐదుగురు నిందితులు చెల్లూరు రోడ్డులో గల భాను దాబా వద్ద లారీని అడ్డగించి సంతోష్కుమార్పై దాడి చేశారు. అతని వద్ద గల 1200 రూపాయలను అపహరించి పోరిపోయారు. అనంతరం బాధితుడు చికిత్స కోసం సమీప ఆస్పత్రికి వెళ్లగా.. ఆస్పత్రి సిబ్బంది రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రూరల్ సీఐ లక్ష్మణరావు ఆదేశాల మేరకు ఎస్సై అశోక్కుమార్ తన బృందంతో గాలించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇందులో ముగ్గురు మైనర్లు కావడంతో వారిని జువైనల్ హోమ్కు తరలించారు. ఒకరు పరారీలో ఉండగా.. ప్రధాన నిందితుడు చెన్న అఖిల్ పట్టుబడ్డారు. ఇదిలా ఉంటే ఇతనిపై గతంలో ఎనిమిది దొంగతనం కేసులున్నాయి. ఈ క్రమంలో నిందితుడి నుంచి నాలుగు స్కూటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ లక్ష్మణరావు, ఎస్సై అశోక్, తదితరులను డీఎస్పీ అభినందించారు. -
ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుందాం..
పార్వతీపురం టౌన్: ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి. రామ్మోహన్ అన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ఏపీఎన్జీఓ హోమ్లో ఎస్ఎఫ్ఐ 32వ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ముందుగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు టి.అఖిల్ సంఘ లక్ష్యాలతో కూడిన జెండాను ఆవిష్కరించారు. అనంతరం రామ్మోహన్, తదితరులు భగత్సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే ఈ మధ్యకాలంలో మరణించిన ఎస్ఎఫ్ఐ మాజీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్, తదితరులకు ప్లీనరీ ప్రతినిధులు సంతాపం తెలియజేశారు. ఎస్ఎఫ్ఐ ప్రతినిధులు సంధ్య, బి.అనిల్, సీహెచ్ సింహాచలం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రామ్మోహన్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న నూతన విద్యా విధానం వల్ల ప్రభుత్వ విద్యా విధానం అతలాకుతలం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు గతంలో కంటే నేడు మరో రూపంలో దాడికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనంలో నాణ్యత లేదని ఆరోపించారు. అలాగే తల్లికివందనం పథకంలో లేనిపోని షరతులు పెట్టి ఎక్కువ మంది చిరుద్యోగులను దూరం చేశారన్నారు. సంక్షేమ హాస్టళ్లల్లో మౌలిక సదుపాయాలు కరువయ్యాయని ఆరోపించారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా నేటికే డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించక పోవడం దారుణమని మండిపడ్డారు. పలు తీర్మానాలు ఆమోదం.. పార్వతీపురం, పాలకొండ, గమ్మలక్ష్మీపురం కేంద్రాల్లో పీజీ సెంటర్లో ఏర్పాటు చేయాలని.. డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించాలని.. జిల్లా కేంద్రంలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని.. గరుగుబిల్లి, సీతంపేట మండలాల్లో జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయాలని.. సంక్షేమ హాస్టళ్లలో రెగ్యులర్ ఏఎన్ఎంలను నియమించాలని చేసిన తీర్మానాలను ఆమోదించారు. అనంతరం ఎస్ఎఫ్ఐ నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా బిడ్డిక అనిల్, కార్యదర్శిగా తిర్లంగి అఖిల్, కోశాధికారి కె.డేవిడ్, ఉపాధ్యక్షులుగా ఎ.గంగారం, సీహెచ్ సింహాచలం, సహయ కార్యదర్శులుగా సంధ్య, సూర్యతో పాటు మరో పది మందిని జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామ్మోహన్ -
వంగర ఘాట్రోడ్డుకు గండి
గుమ్మలక్ష్మీపురం: ఇటీవల కురిసిన వర్షాలకు మండలంలోని కేదారిపురం మీదుగా వంగర వెళ్లే ఘాట్రోడ్డు కోతకు గురికావడంతో గండి పడింది. దీంతో వంగర మీదుగా కేసర వరకు నడిపే ఆర్టీసీ బస్సు సర్వీస్ను సైతం నిలిపివేశారు. ఏడాది కిందట కూడా ఇదే ప్రాంతంలో గండి పడడంతో సీసీ రోడ్డు నిర్మించి, ఓ వైపు రక్షణ గోడ నిర్మించారు. అయినప్పటికీ మళ్లీ అదే ప్రాంతంలో గండి పడడంతో వంగర, కేసర, డోలుకోన, సంధిగూడ గ్రామాల గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కారుణ్య నియామకం విజయనగరం క్రైమ్ : పోలీస్ శాఖలో కానిస్టేబుల్గా పనిచేసి అనారోగ్య కారణాల వల్ల ఉద్యోగ విరమణ చేసి అనంతరం మృతి చెందిన సీహెచ్ ఈశ్వరరావు కుమారుడు సీహెచ్ తేజను జిల్లా పోలీస్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా నియమించారు. ఈ మేరకు ఎస్పీ వకుల్ జిందల్ శనివారం స్థానిక పోలీస్ కార్యాలయంలో నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నీతి, నిజాయితీ, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) పి.సౌమ్యలత, డీపీఓ సూపరింటిండెంట్ వెంకటలక్ష్మి, జూనియర్ సహాయకురాలు చాముండేశ్వరి, పోలీసు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పోక్సో కేసు నమోదు నెల్లిమర్ల రూరల్: మండలంలోని బుచ్చన్నపేట గ్రామానికి చెందిన బొంతు భాస్కరరావు అనే వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేశామని ఎస్సై గణేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 ఏళ్లు నిండని ఓ బాలికను ప్రేమ పేరుతో శారీరకంగా వంచించి పెళ్లి చేసుకుంటానని చెప్పి తల్లిదండ్రుల సంరక్షణ నుంచి విజయవాడ తీసుకువెళ్లిపోయాడన్నారు. బాధితుల ఫిర్యాదు తో సదరు భాస్కరరావుపై పోక్సోతో పాటు కి డ్నాప్ కేసు కూడా నమోదు చేశామని తెలిపారు. గోముఖి నదిలోకి నీరు విడుదల మక్కువ: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు మండలంలోని శంబర గ్రామ సమీపంలో ఉన్న గోముఖి రిజర్వాయర్లోకి వరద నీరు చేరుతుండడంతో శనివారం సుమారు వంద క్యూసెక్కుల నీటిని రిజర్వాయర్ నుంచి గోముఖి నదిలోకి విడిచి పెట్టారు. ఈ సందర్భంగా రిజర్వాయర్ జేఈ ప్రశాంత్కుమార్ మాట్లాడుతూ.. వరదలు ఎక్కువైతే నదిలోకి మరింత నీరు విడిచిపెడతామని చెప్పారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యం విజయనగరం క్రైమ్: అరుకు – సిమిలిగూడ మధ్య గుర్తు తెలియని మృతదేహం లభ్యమైందని జీఆర్పీ ఎస్సై బాలాజీరావు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. మృతుడి వయసు సుమారు 50 సంవత్సరాలు ఉంటుందన్నారు. ఐదు అడుగుల ఆరంగుళాల పొడవుండి తెలుపు రంగు ఫుల్హ్యాండ్ షర్ట్, నలుపు రంగు ఫ్యాంట్ ధరించి ఉన్నాడని తెలిపారు. షర్ట్పై ముదురు ఆకుపచ్చ జర్కిన్ ధరించాడని, దానిపై కోడ్ అనే ఇంగ్లిష్ అక్షరాలున్నాయని చెప్పారు. మృతుడి వివరాలు ఎవరికై నా తెలిస్తే 94906 17089, 63013 65605 నంబర్లకు సంప్రదించాలని తెలిపారు. ఆయనతో పాటు కానిస్టేబుల్ అశోక్ ఉన్నారు. -
హాస్టల్ విద్యార్థులకు.. అరకొర సౌకర్యాలు
రాజాం ఎస్సీ పోస్టు మెట్రిక్ బాలుర వసతిగృహంలో నేలపైనే నిద్రిస్తున్న విద్యార్థులు నేలపైనే నిద్ర... ● కొన్ని వసతిగృహాల్లో నీరు తాగేందుకు గ్లాసులు కూడా లేవు. బొబ్బిలి పట్టణంలోని ఎస్సీ కళాశాల వసతిగృహంలో గత ప్రభుత్వం ఏర్పాటుచేసిన మినరల్ వాటర్ ప్లాంట్ మరమ్మతులకు గురైంది. దానిని బాగుచేయకపోవడంతో మూలకు చేరింది. దీంతో అక్కడ చదువుతున్న 70 మంది విద్యార్థులకు తాగునీటి సమస్య వెంటాడుతోంది. మోటారు బావిలోని నీటినే తాగుతున్నారు. ఒక వేళ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే ట్యాంకులోని నీరే గతి. ఇక్కడి విద్యార్థులు ఆడుకునేందుకు పరికరాలు కూడా లేకపోవడంతో ఉల్లిపాయల సంచులను కోసి వాటిని నెట్గా మార్చి ప్లాస్టిక్ బాల్ (ముంతబాలు)తో ఆడుకుంటున్నారు. వార్డెన్ కూడా ఇటీవల కొంత కాలంగా ఇక్కడ లేకపోవడంతో కుక్, కమాటీ, వాచ్మన్లే వసతి గృహాన్ని నిర్వహిస్తున్నారు. బొబ్బిలి డివిజన్లో ఉన్న 14 ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో మరమ్మతులకు సుమారు రూ.2 కోట్లను ఖర్చు చేసినట్టు రికార్డులు చెబుతున్నా ఆ మరమ్మతులేవీ వసతి గృహాల్లో కనిపించడం లేదు. ● సంతకవిటి మండలంలోని హాస్టల్స్లో విద్యార్థుల హాజరు అంతంతమాత్రమే. చాలామంది విద్యార్థులు భోజనం చేసి ఇంటికి వెళ్లిపోతున్నారు. రాత్రిపూట వార్డెన్ పర్యవేక్షణ ఉండడంలేదు. ● దత్తిరాజేరు మండలం కె.కొత్తవలస మహాత్మాజ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలలో సుమారు 400 మంది విద్యార్థులు ఉండగా, వీరు భోజనం చేసేందుకు వసతిసమస్య వెంటాడుతోంది. ● దత్తిరాజేరు బీసీ హాస్టల్కు ప్రహరీలేకపోవడంతో విద్యార్థులను విషసర్పాల భయం వెంటాడుతోంది. రాజాం/బొబ్బిలి/సంతకవిటి/దత్తిరాజేరు: వివిధ సంక్షేమ హాస్టల్స్లో ఉంటూ చదువులు సాగిస్తున్న విద్యార్థులను సమస్యలు వెంటాడుతున్నాయి. కనీస సదుపాయాలు కల్పించకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. కొన్ని వసతిగృహాల్లో మరుగుదొడ్లు, స్నానపుగదులు కూడా లేకపోవడంతో చెరువులు, కాలువలు, గెడ్డల వైపు వెళ్లాల్సిన పరిస్థితి. చక్కగా చదువుకుని భవితను బంగారుమయం చేసుకోవాలన్న ఆశతో తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్స్లో చేరిన విద్యార్థులపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ● రాజాం పట్టణంలో ఐదు సంక్షేమ వసతిగృహాలు ఉన్నాయి. మూడు బాలికలకు, రెండు బాలురకు సంబంధించినవి కాగా శ్రీకాకుళం రోడ్డులోని సాంఘిక సంక్షేమ పోష్టుమెట్రిక్ బాలుర వసతిగృహంలో విద్యార్థులు బయటనుంచి భోజనాలు, టిఫిన్స్ తెప్పించుకుంటున్నారు. రాత్రిళ్లు విద్యుత్ సమస్య వెంటాడుతోంది. వార్డెన్తో పాటు సిబ్బంది ఉండకపోవడంతో విద్యార్థులకు పర్యవేక్షణలోపం వెంటాడుతోంది. విద్యార్థులకు మంచాలు లేకపోవడతో నేలపైనే నిద్రపోతున్నారు. వసతిగృహం చుట్టూ ప్రహరీ లేకపోవడంతో విషసర్పాల భయం వెంటాడుతోంది. సారథి రోడ్డులోని బాలికల పోస్టుమెట్రిక్ వసతిగృహంతో పాటు మాధవబజార్లోని అద్దె భవనంలో ఉంటున్న వసతిగృహంలో బాలికలకు మరుగుదొడ్లు, స్నానపు గదుల సమస్య వెంటాడుతోంది. జిల్లాలోని పలు వసతిగృహాల విద్యార్థులు అసౌకర్యాల నీడలో చదువులు సాగిస్తున్నారు. పరుపులు లేక నేలపైనే నిద్రపోతున్నారు. సరిపడా మరుగుదొడ్లు, స్నానపు గదులు లేక ఇబ్బంది పడుతున్నారు. మెనూ అమలుకాక అనారోగ్యం బారిన పడుతున్నారు. కిటీలకు డోర్లు, ప్రహరీలు లేకపోవడంతో విషసర్పాల భయం వెంటాడుతోంది. ఇన్వెర్టర్లు లేకపోవడంతో విద్యుత్ సరఫరా అంతరాయం సమయంలో అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నారు. కాస్మోటిక్, డైట్ చార్జీలు అందక ఆవేదన చెందుతున్నారు. విద్యార్థుల సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం విస్మరించిందంటూ గగ్గోలు పెడుతున్నారు. ఆందోళనలు చేస్తున్నారు. నేలపైనే నిద్ర ప్రహరీలు లేకపోవడంతో చొరబడుతున్న విషసర్పాలు కిటికీలకు డోర్లులేని వైనం విద్యార్థుల సంక్షేమం గాలికి గ్లాసులూ కరువే.. -
‘మీ కోసం’ కాల్ సెంటర్ ఏర్పాటు
విజయనగరం అర్బన్: ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజిఆర్ఎస్) అర్జీదారులు మీ కోసం కాల్ సెంటర్– 1100 సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఇన్చార్జి కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ తెలిపారు. తమ అర్జీలు ఇప్పటివరకు పరిష్కారం కాకపోయినా, తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్కు కాల్ చేయవచ్చన్నారు. అర్జీదారులు వారి అర్జీల నమోదుకు ‘మీకోసం.ఏపీ.జీఓవీ.ఐఎన్’ వెబ్సైట్ను సంప్రదించాలన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగంచేసుకొని సమస్యలకు పరిష్కారం పొందాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. నేటి నుంచి డిపార్ట్మెంటల్ పరీక్షలు విజయనగరం అర్బన్: జిల్లాలో ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభం కానున్న డిపార్ట్మెంటల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని వివిధ శాఖల అధికారులను డీఆర్వో ఎస్.శ్రీనివాసమూర్తి ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై తన చాంబర్లో శనివారం వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎటువంటి లోటుపాట్లు రాకుండా చూడాలని కోరారు. ఉదయం పరీక్షకు 8.30 నుంచి 9.15 గంటల మధ్య, మధ్యాహ్నం పరీక్షకు 1.30 నుంచి 2.15 మధ్యన మాత్రమే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించాలన్నారు. సీతం ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలోని ఐయాన్ డిజిటల్ సెంటర్, లెండి ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్షలు జరుగుతాయన్నారు. సమావేశంలో ఏపీపీఎస్సీ సెక్షన్ ఆఫీసర్లు పి.వి.నవజ్యోతి, ఎ.నాగలక్ష్మి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ భాస్కరరావు, డీఎస్పీ ఎం.వీరకుమార్, డాక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు. జిందాల్ నిర్వాసితులకు సంఘీభావం శృంగవరపుకోట: భూములు కోల్పోయి నెలరోజులుగా పోరాటాలు చేస్తున్న జిందాల్ నిర్వాసిత రైతులకు మానవహక్కుల సంఘం చైర్మన్ డాక్టర్ సంపత్కుమార్ సంఘీభావం తెలిపారు. ఆయన బొడ్డవరలో నిర్వాసితులతో శనివారం సమావేశమయ్యారు. జిందాల్ నిర్వాసితులు 37 రోజులుగా చేస్తున్న పోరాటాలు గమనిస్తున్నామన్నారు. ఈ వ్యవహారంపై హెచ్ఆర్సీ గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రఘురాజు, రైతు సంఘం నేత చల్లా జగన్, తదితరులు పాల్గొన్నారు. -
వీడని వరద కష్టాలు
అధికారులు స్పందించాలి ఏటా సాయన్నగెడ్డ పొంగి ప్రవహిస్తోంది. పొలాలను వరదనీరు ముంచెత్తుతోంది. వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఇది రైతుల దీర్ఘకాలిక సమస్యగా మారింది. అధికారులు స్పందించాలి. సాయన్నగెడ్డలో పూడికలు తొలగించాలి. పొలాలను ముంచెత్తుతున్న వరదనీరు కిందకు మళ్లించేందుకు మదుములు నిర్మించాలి. – యెన్ని శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్, రామారాయపురం సంతకవిటి: ఆ గ్రామాల పొలాలకు ఓ వైపు నారాయణపురం కుడి ప్రధాన కాలువ, మరోవైపు సాయన్నగెడ్డ ఉంది. వర్షం కురిస్తే చాలు... ఈ రెండు కాలువలకు మధ్యన ఉన్న పొలాల్లో నీరు పోటెత్తుతోంది. వరద నీరు వెళ్లే మార్గం ఉండదు. ఎగువన ఉన్న నారాయణపురం కుడి ప్రధాన కాలువ నీరు సాయన్నగెడ్డలో కలిసే అవకాశం ఉండదు. గెడ్డ కింద నుంచి పొల్లాలోని వరదనీటిని నాగావళి నదికి మళ్లించేందుకు అనువుగా ఎలాంటి మదుములు లేవు. ఫలితం.. రెండు కాలువల మధ్యన ఉన్న సంతకవిటి మండలంలోని మల్లయ్యపేట, రామారాయపురం, హొంజరాం, బూరాడపేట, మల్లయ్యపేట, మంతిన, పనసపేట, గెడ్డబూరాడపేట గ్రామాల పరిధిలోని పంట పొలాలు నీటమునుగుతున్నాయి. ఏటా రైతన్నకు పంట నష్టాన్ని మిగుల్చుతున్నాయి. పంట సాగుచేయడమే తప్ప అది ఇంటికి వస్తుందన్న నమ్మకం ఉండడం లేదు. వరద కష్టాలు తీర్చాలంటూ రైతులు గోడు వినిపిస్తున్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదు. రైతుకు నష్టాలు తప్పడంలేదు. ముంపునకు కారణం ఇదీ... రేగిడి మండలం సంకిలిహెడ్చానల్ నుంచి సంతకవిటి మండలం వాల్తేరు వరకు సాయన్నగెడ్డ విస్తరించి ఉంది. సంకిలి హెడ్చానల్ వద్ద షట్టర్లు పాడవ్వడంతో నాగావళి నదికి వరద పోటెత్తినప్పుడు సాయన్నగెడ్డ ఉగ్రరూపం దాల్చుతుంది. గెడ్డ నుంచి నీరు కిందకు వెళ్లేందుకు ఎక్కడా ఎలాంటి మదుములు లేకపోవడం, గెడ్డలో పూడికలు పేరుకుపోవడంతో వరదనీరు పొలాలను ముంచెత్తుతోంది. నెలల తరబడి నీరు నిల్వ ఉండడంతో సుమారు రెండు వేల ఎకరాల్లో పంటనష్టం జరుగుతోంది. ఇది అధికారులు, పాలకులకు తెలిసినా పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. ఎన్నికల సమయంలో హామీలు ఇస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ముంపునకు గురవుతున్న రెండు గెడ్డల మధ్య పొలాలు మదుములు లేకపోవడం, గెడ్డల్లో పూడికలే కారణం పట్టించుకోని అధికార యంత్రాంగం -
మోసం చేయడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య
చీపురుపల్లి: ప్రజలను మోసం, దగా చేయడం చంద్రబాబునాయుడుకు వెన్నతో పెట్టిన విద్య అని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ విమర్శించారు. చీపురుపల్లి మండలం దేవరపొదిలాం, నిమ్మలవలస గ్రామాల్లో శనివారం సాయంత్రం బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిమ్మలవలస గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గడిచిన ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఎన్నో హామీలిచ్చి ఒక్క హామీనీ సంపూర్ణంగా అమలు చేయలేదన్నారు. ఆడబిడ్డ నిధి పథ కాన్ని అమలు చేయాలంటే వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ఏకంగా ఆంధ్రప్రదేశ్ను అమ్మే యాలని చెబుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వంలో లంచాలు వ్యవస్థ పెరిగిపోయిందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మోసాలను నమ్మరాదని చెప్పారు. అంతకుముందు దేవరపొదిలాం, నిమ్మలవలస గ్రామాల్లో వైఎస్సార్సీపీ మండల నాయకులు ఇంటింటికీ తిరిగి బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పిలి అనంతం, జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, పార్టీ మండలాధ్యక్షుడు మీసాల వరహాలనా యుడు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ, మేధావి వర్గం అధ్యక్షుడు ఎంవీఎస్ఎన్ రాజు, గవిడి సురేష్, ఎంపీటీసీ, సర్పంచ్లు అధికార్ల శ్రీనుబాబు, చింతాడ లక్ష్మణ, తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎంపీ ‘బెల్లాన’ -
ఇంటర్ విద్యలో సంస్కరణలపై అవగాహన కల్పించాలి
విజయనగరం అర్బన్: ఇంటర్ విద్యలో ఈ విద్యాసంవత్సరం నుంచి కొత్తగా తీసుకొస్తున్న సంస్కరణలపై విద్యార్థులు, తల్లిదండ్రులకు కళాశాలల అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు అవగాహన కల్పించాలని ఇంటర్మీడియట్ ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి ఎస్.తవిటినాయుడు అన్నారు. విజయనగరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాల ప్రిన్సిపాళ్లకు ఇంటర్ విద్య నూతన సంస్కరణలపై శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సిలబస్, సబ్జెక్టుల కలయిక, ప్రశ్నపత్రంలో మార్పులను వివరించారు. గ్రూపు సబ్జెక్టులతో పాటు పార్ట్–1గా ఇంగ్లిష్, పార్ట్–2లో ద్వితీయ భాషగా తెలుగు, సంస్కృతం, ఉర్దూ, అరబిక్, తమిళ్, కన్నడ, ఒడియా, పర్షియన్, ఫ్రెంచ్ లేదా ప్రధాన సబ్జెక్టులైన గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ లేదా మైనర్ సబ్జెక్టులైన జాగ్రఫీ, లాజిక్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మోడర్న్ లాంగ్వేజ్ ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూలో ఒక సబ్జెక్టును ఎంపిక చేసుకోవచ్చన్నారు. ఎంపీసీ విద్యార్థులు అడిషనల్గా ఆరవ సబ్జెక్టు ఆప్షన్గా బయాలజీ, బైపీసీ విద్యార్థులు అడిషనల్ సబ్జెక్టుగా గణితంను ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు. గణితం–ఏ,బీలను విలీనం చేసి ఒక సబ్జెక్టుగా, బోటనీ, బయా లజీ సబ్జెక్టులను విలీనం చేసి బయాలజీ సబ్జెక్టుగా ఈ ఏడాది మొదటి సంవత్సరం విద్యార్థులకు అమలు చేస్తారన్నారు. ద్వితీయ సంవత్సరంలో ఎలాంటి మార్పులు ఉండవన్నారు. ఆర్ఐఓ ఎస్.తవిటినాయుడు -
సంతృప్తికర సేవలందించా..
విజయనగరం అర్బన్: ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన సిఫార్సులతో సంతృప్తికర సేవలందించినట్టు రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు తెలిపారు. ఈ నెల 27వ తేదీతో ఆయన పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో విజయనగరం జెడ్పీ అతిథిగృహంలో మీడియాతో శనివారం మాట్లాడారు. తనపై ఎంతో నమ్మకం ఉంచి రాజ్యాంగపరమైన బాధ్యతగల ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవి అప్పగించిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రెండేళ్ల పదవీ కాలంలో ఆదివాసీల వివిధ స్థాయిలోని సమస్యల పరిష్కారానికి విశేషంగా కృషిచేసినట్టు చెప్పారు. గిరిశిఖర గ్రామాల ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. గిరిజనుల హక్కులు కాపాడేందుకు ప్రయత్నించామన్నారు. ఆదివాసీల నుంచి ఏ సమయంలో, ఏ రూపంలో వినతులు వచ్చినా స్వీకరించేవాడినని తెలిపారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాలో నిర్వహిస్తున్న వెట్టిచాకిరీపై పత్రికల్లో వచ్చిన వార్తలను సుమోటోగా స్వీకరించి దానిని నిర్మూలించేందుకు కృషి చేశామన్నారు. మైదాన ప్రాంతంలోని ఆదివాసీల సమస్యల పరిష్కారానికి కమిషన్ పనిచేసిందని వివరించారు. ఎస్టీ కమిషన్ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చేసిన ముఖ్యమైన సిఫార్సులను ప్రకటించారు. ● నేటితో ముగియనున్న చైర్మన్ పదవీ కాలం●● రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు -
ఒక ఉపాధ్యాయుడు.. ఒక విద్యార్థి
చిత్రంలో ఒక విద్యార్థి, ఒక ఉపాధ్యాయుడు ఉన్నది వేపాడ మండలం వావిలపాడు పంచాయతీ కడకొండ గిరిజన గ్రామ ప్రాథమిక పాఠశాల. 40 కుటుంబాలు, 175 మంది జనాభా కలిగిన గ్రామంలో బడిఈడు పిల్లలు లేరు. చాలా కుటుంబాలు వలస వెళ్లిపోవడం, గతేడాది ఐదో తరగతి చదివిన నలుగురు విద్యార్థులు ఈ ఏడాది ఆరో తరగతిలో చేరడంతో పాఠశాలను మూసివేయాల్సిన పరిస్థితి. అయితే, అంగన్వాడీ కేంద్రం నుంచి మోక్షజ్ఞ అనే చిన్నారి ఒకటో తరగతిలో చేరడంతో బోధన కోసం డిప్యూటేషన్పై సోంపురం క్లస్టర్కు చెందిన ఉపాధ్యాయుడు కె.నవీన్ను ఈ నెల 07న నియమించారు. ఆ ఒక్క చిన్నారి చేరడంతో పాఠశాల మూతపడలేదని ఎంఈఓ బాలభాస్కరరావు తెలిపారు. – వేపాడ -
రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు
● అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి ● ఇన్చార్జి కలెక్టర్ సేతు మాధవన్ విజయనగరం అర్బన్: రానున్న 24 గంటల్లో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఇన్చార్జి కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, మత్స్యకారులు వేటకు వెళ్లకుండా సూచనలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సచివాలయ సిబ్బంది క్షేత్రస్థాయిలోనే ఉండి పరిస్థితుల్ని అంచనా వేయాలని, ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూడాలన్నారు. జలాశయాల్లో నీటినిల్వలపై కలెక్టరేట్ డి–సెక్షన్కు నివేదికలు అందజేయాలని జలవనరులశాఖ అధికారులకు సూచించారు. మంచి గుడ్లు సరఫరాకు ఆదేశం బొబ్బిలి: స్థానిక మున్సిపాలిటీ, బొబ్బిలి మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్నభోజనంలో వడ్డించేందుకు కుళ్లిన గుడ్లు సరఫరా చేశారు. ఇదే అంశంపై ఈ నెల 24న ‘కుళ్లిన గుడ్లు.. పప్పు అన్నమే పరమాన్నం’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. కుళ్లిన గుడ్లు స్థానంలో మంచి గుడ్లు సరఫరా చేసినట్టు ఎంఈఓ గొట్టాపు వాసు శుక్రవారం తెలిపారు. జయప్రకాష్ పాఠశాలలో కుళ్లిన 34 గుడ్లను రీప్లేస్ చేయించామన్నారు. కుళ్లిన గుడ్లు సరఫరా చేసిన కాంట్రాక్టర్కు నోటీసు ఇచ్చామన్నారు. పలు పాఠశాలల హెచ్ఎంలు, నిర్వాహకులు తెలిపిన సమాచారం మేరకు మంచి గుడ్లను అందించామన్నారు. -
డయేరియా బాధితులకు తక్షణ వైద్యం
విజయనగరం ఫోర్ట్: డయేరియాతో బాధపడుతున్న వారిని గుర్తించి తక్షణ వైద్య సేవలు అందించాలని, ఐదేళ్లలోపు వయస్సుగల పిల్లల్లో డయేరియా మరణాలు సంభఽవించకుండా చర్యలు తీసుకోవాలని ఇన్చార్జి కలెక్టర్ సేతుమాధవన్ వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో వైద్యారోగ్యశాఖాధికారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్ 1 నుంచి జూలై 31 వరకు జిల్లాలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. గ్రామాల్లో తాగునీటిని క్లోరినేషన్ చేయాలని, నీటి ట్యాంక్లను పరిశుభ్రం చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో వేడివేడి ఆహారాన్ని, పరిశుభ్రమైన తాగునీటిని సరఫరా చేయాలని సూచించారు. అనంతరం డయేరియా వ్యాధిపై అవగాహన కల్పిస్తూ రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ ఎస్.జీవనరాణి, డీసీహెచ్ఎస్ ఎన్.పి.పద్మశ్రీరాణి, డీఈఓ రెడ్డి అచ్చుతకుమారి, గిరిజన సంక్షేమ అధికారి శ్రీనివాస్, రాజాం మున్సిపల్ కమిషనర్ అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
160 మంది వ్యాధిగ్రస్తులు
రామభద్రపురం మండలం ఏనుబరువు గ్రామంలో సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిస్క్రీనింగ్ పరీక్షల కోసం బ్లడ్ శ్యాంపిల్ తీస్తున్న వైద్య సిబ్బంది ● జిల్లాలో అందుబాటులో లేని సికిల్సెల్ ఎనీమియా వ్యాధినిర్ధారణ పరీక్షలు ● ప్రభుత్వ వైద్యకళాశాల ఉన్నా అక్కరకురాని సేవలు ● అవస్థలు పడుతున్న బాధితులు ● జిల్లాలో 160 మంది సికిల్సెల్ ఎనీమియా వ్యాధిగ్రస్తులు ● కొత్తగా మరో 3 కేసుల నమోదు ● మరో నలుగురికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఇక్కడ స్క్రీనింగ్ పరీక్షలు మాత్రమే.. సికిల్సెల్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు కేజీహెచ్లోనే చేస్తారు. అక్కడే వ్యాధి నిర్ధారణ సర్టిఫికెట్ కూడా ఇస్తారు. జిల్లాలో అందుబాటులో లేదు. స్క్రీనింగ్ పరీక్షలు మాత్రమే జిల్లాలో నిర్వహిస్తున్నాం. – డాక్టర్ కె.రాణి, జిల్లా అదనపు వైద్యారోగ్యశాఖాధికారి●విజయనగరం ఫోర్ట్: సికిల్సెల్ ఎనీమియా వ్యాధి జిల్లా ప్రజలను భయపెడుతోంది. వ్యాధి నిర్ధారణ సౌకర్యం జిల్లాలో అందుబాటులో లేక పోవడం రోగులకు శాపంగా మారింది. వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నవారు వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం విశాఖపట్నం జిల్లాలోని కేజీహెచ్కు వెళ్లాల్సిన పరిస్థితి. ప్రభుత్వ వైద్యకళాశాల అందుబాటులోకి వచ్చినప్పటికీ వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరగడం లేదు. వ్యాధి సోకిన వారికి తరచూ రక్తం తగ్గిపోతూ ఉంటుంది. ఆ సమయంలో రక్తం ఎక్కిస్తేనే ప్రాణాలు నిలబడతాయి. ఇంతటి ప్రమాదకరమైన వ్యాధికి వైద్యపరీక్షలు అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో 160 మంది సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిగ్రస్తులు ఉన్నట్టు ఆస్పత్రి రికార్డులు చెబుతున్నాయి. తాజాగా మరో ముగ్గురికి వ్యాధి నిర్ధారణ అయింది. మరో నలుగురికి వ్యాధి లక్షణాలు ఉండడంతో వారికి కేజీహెచ్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. గిరిజన ప్రాంతంలో అధికం సికిల్సెల్ ఎనీమియా వ్యాధిగ్రస్తులు మైదాన ప్రాంతం కంటే గిరిజన ప్రాంతంలో అధికంగా ఉన్నారు. జిల్లాలో 40 ఏళ్లు లోపు వయసు కలిగిన గిరిజనులు 28 వేల మంది ఉన్నారు. వీరిలో వైద్య సిబ్బంది ఇప్పటి వరకు 24 వేల మందికి సికిల్ సెల్ ఎనీమియా స్క్రీనింగ్ నిర్వహించారు. ఇంకా నాలుగువేల మందికి స్క్రీనింగ్ చేయాల్సి ఉంది. వైద్యసేవలు అందించడంలో కూటమి కినుక జిల్లాలో సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు వైద్యసేవలు అందుబాటులో లేవు. ప్రైవేటు స్కానింగ్ సెంటర్లలో వ్యాధి నిర్ధారణ చేసుకోవాలంటే అధిక మొత్తంలో ఖర్చు అవుతుంది. ఇది పేద, మధ్య తరగతి ప్రజలకు తలకు మించిన భారం. వ్యాధిగ్రస్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తానున్నామని కూటమి సర్కారు గొప్పలు చెబుతోందే తప్ప మెరుగైన వైద్యసేవలందించేందుకు చర్యలు తీసుకోవడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు జిల్లాలో అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. వ్యాధి లక్షణాలు ఇలా... రక్తహీనత, ఆయాసం, పొట్ట నొప్పి, ప్రతీ జాయింట్ దగ్గర పెయిన్స్, నీరసం, కాలు మీద పుండ్లు, రక్త ప్రసరణ ఆగిపోవడం జరుగుతుంది. సికిల్సెల్ వ్యాధి వారసత్వంగా వచ్చే ఎర్ర రక్త కణాలు రుగ్మత. ఇది తల్లిదండ్రుల నుంచి అనువంశికంగా సంక్రమిస్తుంది. సామాన్యంగా సాధారణ ఆరోగ్యకరమైన ఎర్రరక్త కణాలు గుండ్రంగా ఉంటే , సికిల్సెల్ వ్యాధిలో కొడవలి వలే అర్ధ చంద్రాకారంలో ఉంటాయి. కళ్లు పసుపు రంగులోకి మారుతాయి. శ్వాసతీసుకోవడం ఇబ్బంది. అలసట, తరచుగా వచ్చే అంటువ్యాధులు, గర్భధారణ సమయంలో సమస్యలు, అవయవ వైఫల్యం, పెరుగుదల లోపం వంటివి వ్యాధి లక్షణాలు. -
శ్రావణ శోభ
విజయనగరం టౌన్: శ్రావణమాసం తొలి శుక్రవారం భక్తులు ఆధ్యాత్మిక చింతనతో గడిపారు. ఆలయాలను దర్శించారు. అమ్మవార్లను వివిధ రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. పసుపుకుంకుమలు సమర్పించారు. ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం పైడితల్లి అమ్మవారు పుష్పాలంకరణలో దర్శనమిచ్చారు. చదురుగుడి, వనంగుడిలో కొలువైన అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయమంతా పుష్పశోభితమైంది. వాసవీ కన్యకపరమేశ్వరి శాకంబరిగా దర్శనమిచ్చారు. మయూరీ కూడలి వద్దనున్న సంతోషిమాత ఆలయంలో అమ్మవారికి విశిష్ట కుంకుమార్చనలు జరిపారు. శ్రీక్షేత్రంలో కొలువైన అష్టలక్ష్మీ సమేత ఐశ్వర్య వెంకటేశ్వరస్వామిదేవాలయంలో పంచామృతాలతో అభిషేకాలు చేశారు. -
2027 డిసెంబర్ నాటికి రీసర్వే పూర్తి
విజయనగరం అర్బన్: రీ సర్వే ప్రక్రియను రాష్ట్రంలో 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించామని రెవెన్యూ జిల్లా ప్రత్యేక అధికారి, ఎస్ఎస్ఎల్ఆర్ అదనపు సంచాలకుడు ఆర్.గోవిందరావు తెలిపారు. జిల్లాలో ఆయన క్షేత్రస్థాయి పర్యటన అనంతరం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రీ సర్వే, రెవెన్యూ అంశాలపై అధికారులతో శుక్రవారం సమీక్షించారు. ఇళ్ల స్థలాలు రీ వెరిఫికేషన్, రెగ్యులరైజేషన్, పీజీఆర్ఎస్, శ్మశాన వాటికలకు స్థలాల కేటాయింపు, కులాల వెరిఫికేషన్ తదితర అంశాలపై ఆరా తీశారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి సర్వే పూర్తిచేయాలన్నారు. ఆగస్టు 5వ తేదీనాటికి గ్రామ సరిహద్దులు గుర్తింపు, సెప్టెంబర్ 15 నాటికి రెవెన్యూ రికార్డుల స్వచ్ఛీకరణ, నవంబర్ ఐదు నాటికి ప్రభుత్వ స్థలాల గుర్తింపు ప్రక్రియలు పూర్తి చేయాలని తెలిపారు. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల స్థలం అందజేసేందుకు వెరిఫికేషన్ పూర్తిచేసి నివేదిక అందజేయాలన్నారు. ఇన్చార్జి కలెక్టర్ సేతుమాధవన్ మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న రీ సర్వే వివరాలను తెలియజేశారు. పీజీఆర్ఎస్ అర్జీలకు సంబంధించి ఐదు ప్రశ్నలతో అర్జీదారుల నుంచి ప్రజాభిప్రాయం సేకరిస్తున్నామన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి, రెవెన్యూ డివిజనల్ అధికారులు దాట్ల కీర్తి, మోహనరావు, ఆశయ్య, సర్వే శాఖ సహాయ సంచాలకులు రమణమూర్తి, కలెక్టరేట్ ఏఓ గోవింద్, తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. రెవెన్యూ జిల్లా ప్రత్యేక అధికారి గోవిందరావు -
● రాములోరి చెంత ప్రకృతి పులకింత
విజయనగరం జిల్లా రామతీర్థంలోని బోడికొండపైకి ఎక్కేవారికి ప్రకృతి అందాలు మైమరిపిస్తాయి. ఓ వైపు దట్టమైన పొదలతో కూడిన కొండలు... మరోవైపు కనుచూపు మేర పచ్చని పొలాలు.. పుడమికి పచ్చబొట్టు పెట్టేలా ఉభాలకు సిద్ధంగా ఉన్న నారుమడులు.. పొలాల మధ్యగుండా సన్నని రేఖలా కనిపించే దారులు కొత్త అనుభూతిని పంచుతాయి. ఆహ్లాదాన్ని, అనందాన్ని కలిగిస్తాయి. మనసును హత్తుకుంటాయి. రాములోరి సాక్షిగా కనిపించే ప్రకృతి సోయగాలకు శుక్రవారం కనిపించిన ఈ చిత్రమే సాక్ష్యం. – సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం -
హాస్టల్ విద్యార్థుల నిరసన
విజయనగరం టౌన్: విజయనగరం బీసీ కాలనీలో ఉన్న పోస్టుమెట్రిక్ బాయ్స్ ట్రైబల్ హాస్టల్కు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ పీడీఎస్ఓ ఆధ్వర్యంలో విద్యార్థులు శుక్రవారం ఆందోళన చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం తీరుపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పీడీఎస్ఓ జిల్లా అధ్యక్షుడు కె.సోమేశ్వరరావు మాట్లాడుతూ హాస్టల్ ప్రాంగణంలో నిల్వ ఉన్న మురుగునీటి సమస్యను పరిష్కరించాలని అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయిందన్నారు. మంచినీటిని కిలోమీటరు దూరంలోని వాటర్ప్లాంట్ నుంచి కొనుగోలు చేసుకోవాల్సి వస్తోందన్నారు. తక్షణమే హాస్టల్లో ఆర్వో ప్లాంట్ ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. మరుగుదొడ్ల తలుపులు బాగుచేయాలని కోరారు. కార్యక్రమంలో పీడీఎస్ఓ సభ్యులు వినయ్, కిరణ్, తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ సబ్ స్టేషన్ వాచ్మన్ అదృశ్యం
విజయనగరం క్రైమ్: దాసన్నపేట విద్యుత్ సబ్ స్టేషన్ లో వాచ్ మన్గా పని చేస్తున్న కె.రమణయ్య కనిపించడం లేదని ఆయన భార్య సత్యవతి శుక్రవారం చేసిన ఫిర్యాదు మేరకు టూటౌన్ ఎస్సై కనకరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కొన్నాళ్లుగా తాగుడుకు బానిసైన రమణయ్య జీతం వచ్చినప్పుడు ఇంట్లో కాస్త ఇచ్చి ఊరెళ్తున్నానని భార్యకు చెప్పేవాడు. అయితే గడిచిన నాలుగు నెలల నుంచి భర్త ఇంటికి రాకపోవడంతో స్థానికులు, బంధువుల ఇళ్లకు వెళ్లి భార్య సంప్రదించింది. ఏపీ ట్రాన్స్ కో సిబ్బంది కూడా వాచ్మన్ రమణయ్య గురించి వాకబు చేసి..డ్యూటీకి రావడం లేదని భార్యకు చెప్పారు. దీంతో ఆమె తన భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేసినట్లు ఎస్సై కనకరాజు వివరించారు. -
గిరిజనులకు అన్యాయం చేస్తే సహించం
బొబ్బిలి: నియోజకవర్గంలోని రామభద్రపురం మండలం కాకర్ల వలస, కారేడువలస గ్రామాల గిరిజనుల సాగు భూములు లాక్కుని ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేస్తే సహించబోమని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ తదితరుఅఉ హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ మువ్వల శ్రీనివాసరావు మాట్లాడుతూ కొట్టక్కి రెవెన్యూ పరిధిలో ఏపీఐఐసీ ఏర్పాటు చేస్తున్న ఎంఎస్ఎంఈ పార్కు బాధితులకు మద్దతుగా ఉంటామన్నారు. కారేడు వలస, కాకర్ల వలస గ్రామాల్లో నివాసముంటున్న గిరిజనులు ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వం ఇచ్చిన భూమిని సాగు చేస్తున్నారని ఆ భూముల ఆధారంగా జీవనం పొందుతున్న గిరిజనుల నుంచి ప్రభుత్వం అన్యాయంగా భూమిని లాక్కోవడం సరికాదన్నారు. కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా భూమిని లాక్కోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. గిరిజనులు వేసుకున్న మామిడి, జీడి మొక్కలను, మొక్కజొన్న పంటలను ధ్వంసం చేయడం పద్ధతేనా అని ప్రశ్నించా రు. ఏళ్ల తరబడి జీవనోపాధి పొందుతున్న భూమికి పరిహారం ఇవ్వకుండా ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేస్తే ఊరుకునేది లేదన్నారు. ఖాళీగా ఉన్న భూముల జోలికి వెళ్లకుండా వాటి పక్కనే ఉన్న గిరిజనులకు చెందిన భూములను తీసుకుంటామనడం ఎంత వరకూ సబబని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అత్యంత దుర్మార్గమన్నారు. ధ్వంసం చేసిన పంటకు పరిహారం ఇవ్వాలి గిరిజనుల భూములను వెంటనే వారికి వదిలేసి, ధ్వంసం చేసిన పంటలకు పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భూములను తీసుకుని వాటికి ప్రత్యామ్నాయంగా వేరే చోట భూములు ఇవ్వాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఆర్డీఓ జేవీఎస్ఎస్ రామమోహన రావుకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో మిర్తి వలస సర్పంచ్ మజ్జి రాంబాబు, సీపీఎం రామభద్రపురం మండల కార్యదర్శి బలస శ్రీనివాసరావు, కాంగ్రెస్ నాయకులు రామకృష్ణ, గిరిజనులు పాల్గొన్నారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా -
చికెన్
బ్రాయిలర్ లైవ్ డెస్డ్ స్కిన్లెస్ శ్రీ107 శ్రీ184 శ్రీ194లింగ నిర్ధారణ వెల్లడిస్తే చర్యలు● డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి విజయనగరం ఫోర్ట్: లింగ నిర్ధారణ వెల్లడించే స్కానింగ్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి హెచ్చరించారు. ఈ మేరకు స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గర్బస్థ, పిండ పక్రియ 1994 అమలుపై నియమించిన జిల్లా స్థాయి, ఉప జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోగ్రాం అధికారులు వారి పరిధిలో ఉన్న స్కానింగ్ సెంటర్స్ను పరిశీలించాలని ఆదేశించారు. ఆడపిల్లల సంఖ్య తక్కువగా ఉన్న మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. సమావేశంలో డీఐఓ డాక్టర్ రెడ్డి అచ్యుతకుమారి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ ఆధ్వర్యంలో ‘పోలీస్ వెల్ఫేర్ డే’విజయనగరం క్రైమ్: జిల్లా పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి ఎస్పీ వకుల్ జిందల్ శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ‘పోలీసు వెల్ఫేర్ డే’ను నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది నుంచి విజ్ఞాపనలు స్వీకరించి వారి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ‘పోలీసు వెల్ఫేర్ డే’లో భాగంగా సిబ్బంది ఒక్కొక్కరిని ఎస్పీ వకుల్ జిందల్ తన చాంబర్లోకి పిలిపించుకుని వారి వ్యక్తిగత, వృత్తిపరమైన, శాఖాపరమైన సమస్యలను అడిగి తెలుసుకుని, వారి నుంచి విజ్ఞాపనలు స్వీకరించారు. సిబ్బంది తెలిపిన వ్యక్తిగత, శాఖాపరమైన సమస్యలను ఎస్పీ స్వయంగా పరిశీలించి, పరిష్కరించేందుకు త్వరితగతిన చర్యలు చేపడతానని తెలిపారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి గాయాలురేగిడి: మండలంలోని ఉంగరాడమెట్ట సమీపంలో గురువారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని మతిస్థిమితంలేని వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటనను చూసిన పోలీసులు 108కు సమాచారం అందించడంతో ఈఎంటీ మీసాల ఈశ్వరరావు, పైలెట్ గంగు జగన్నాథరావులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయాలపాలైన వ్యక్తికి ప్రథమ చికిత్స అందించారు. పూర్తిగా బురద, రక్తంతో తడిచిపోయిన క్షతగాత్రుడిని పోలీసుల సహాయంతో శుభ్రం చేయడంతో పాటు కొత్త దుస్తులు వేసి రాజాం సామాజిక ఆస్పత్రికి మెరుగైన చికిత్సనిమిత్తం తరలించారు. మానవత్వంతో 108 సిబ్బంది అందించిన సేవలను పలువురు అభినందించారు. బాగెంపేటలో చోరీవంగర: మండల పరిధిలోని బాగెంపేట గ్రామానికి చెందిన పశుమర్తి శంకరరావు ఇంట్లో గురువారం అర్ధరాత్రి చోరీ జరిగింది. శంకరరావు కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్ వెళ్లారు. ఈ విషయం గమనించిన దొంగలు అర్ధరాత్రి ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాను తెరిచారు. ఈ విషయం శుక్రవారం ఉదయం గమనించిన చుక్కపక్కల వారు ఇంటి యజమానితో పాటు పోలీసులకు సమాచారం అందించారు. ఇన్చార్జి ఎస్సై పి.నీలావతి, క్లూస్టీం సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్టీం బృందం పలుచోట్ల వేలిముద్రలు సేకరించింది. ఈ విషయంపై వంగర పోలీసులను సంప్రదించగా హైదరాబాద్ నుంచి ఇంటి యజమాని ఫ్లైట్లో వస్తున్నాడని, ఆయనను ఫోన్లో సంప్రదించగా సుమారు 20తులాల బంగారం పోయినట్లు తెలిపాడన్నారు. ఈ ఘటనకు సంబంధించి బాధితుడు వచ్చి పరిశీలించిన తరువాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు చేస్తామని ఎస్సై తెలిపారు. -
గుర్రుమీదున్న గురువులు
● ఐఆర్, పీఆర్సీ పెండింగ్ డీఏలపై నోరుమెదపని సర్కారు ● ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులైజేషన్ గాలికి ● సమస్యలపై ఉద్యమానికి సిద్ధమవుతున్న ఉద్యోగులు ● నేడు కలెక్టరేట్ వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నారామభద్రపురం: చంద్రబాబుతో జతకట్టిన పవన్ కల్యాణ్ సైతం సార్వత్రిక ఎన్నికల సమయంలో అన్ని వర్గాల ప్రజలకు హామీల వర్షం కురిపించారు.ఆ వర్షంలో తడిసి ముద్దయిన వారిలో ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులూ ఉన్నారు. మాకు అధికారం ఇచ్చి చూడండి. ఉద్యోగ, ఉపాధ్యాయులకు మెరుగైన పీఆర్సీ ఇస్తాం. పెండింగ్ బకాయిలన్నింటినీ ఒకేసారి చెల్లిస్తాం, సకాలంలో జీతాలు, పెన్షన్లు, ఇతర ఆర్థిక ప్రయోజనాలను అందించే ఏర్పాట్లు చేస్తాం. ఉద్యోగుల బదిలీలు, పదోన్నతుల కోసం రాజకీయ నాయకుల చట్టూ తిరిగే పని లేకుండా చేస్తాం. ఉద్యోగుల పని భారం తగ్గిస్తాం అంటూ ఇలా ఎన్నో అలవిగాని హామీలతో చంద్రబాబు ఉద్యోగులకు ఒక బహిరంగ లేఖ కూడా రాశారు.అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇంతవరకూ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. దీంతో ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు కూటమి సర్కారుపై కోపంగా ఉన్నారు. తమకు ఇచ్చిన హామీలను నేరవేర్చకపోతే ఉద్యమాలకు సిద్ధం అంటూ కూటమి సర్కారుకు హెచ్చరికలు జారీచేస్తున్నారు. ఇంకెన్నాళ్లు ఎదురు చూపు.. రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరిగిన ప్రతిసారి తమ సమస్యలపై ఏమైనా చర్చిస్తారేమోనని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఏడాదిగా ఎంతో ఆశతో ఎదురుచూస్తూ వస్తున్నారు.ఈ 24వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా కనీసం ఆ ఊసేఎత్తలేదు. ఇప్పటికే ఉద్యోగులకు మూడు డీఏలు పెంగింగ్లో ఉండగా జూలైతో ఆ సంఖ్య నాలుగుకు చేరింది.అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అదీ లేదు. పీఆర్సీ కమిషన్ రాజీనామా చేస్తే ఆ స్థానంలో ఇప్పటి వరకూ కొత్త కమిషన్ను నియమించలేదు. కొత్త పీఆర్సీ వస్తే జీతాలు పెంచాల్సి వస్తుందని సాగదీస్తున్నారని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఓపీఎస్పై నోరుమెదపని సర్కారు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో తీసుకొచ్చిన గ్యారంటీ పెన్షన్ స్కీమ్ను తీసేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్(ఓపీఎస్)ను తీసుకొస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ఉద్యోగులకు మాటిచ్చారు. ఏడాది కాలంలో ఏనాడూ ఈ అంశంపై నోరు మెదపలేదు. ఈ విషయంలోనూ కూటమి సర్కారు ఉద్యోగులకు వెన్నుపోటు పొడించింది. గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి క్యాబినెట్ సమావేశంలోనే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ మంజూరు చేసిన విషయాన్ని పలు ఉద్యోగ సంఘాల నాయుకులు గుర్తుచేసుకుంటున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ లేనట్లేనా? తాము అధికారంలోకి రాగానే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణతో పాటు మినిమం టైమ్ స్కేల్ ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. మాటలు చెప్పేవాళ్లం కాదు. చేసి చూపిం చేవారిమని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 12 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారని అంచనా. వారిలో 15 ఏళ్లకు పైబడి విధులు నిర్వర్తిస్తున్న వారు కూడా ఉన్నారు.అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాది కాలంలో ఏనాడూ కూటమి ప్రభుత్వం వారికిచ్చిన హామీపై చర్చించిన దాఖలాలు లేవు. దీనికి భిన్నంగా జనవరి 6న జీవో నంబర్–2 ప్రకారం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో ప్రభుత్వ పథకాల్లో ఉండే ఉద్యోగులకు కూడా మినిమం టైమ్ స్కేల్ ఇవ్వడం జరగదని నిర్ణయం తీసుకుని కూటమి ప్రభుత్వం మోసం చేసిందని ఆయా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వీరు కూడా ఆందోళన బాట పట్టాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఉద్యమ బాట తప్పదు..ఏటా జనవరి, జూలై మాసాల్లో ప్రతి ఆరు నెలలకోసారి కేంద్ర ప్రభుత్వం కరువు భత్యం ప్రకటిస్తోంది. దానిని అనుసరించి రాష్ట్రం డీఏలు ఇవ్వాల్సి ఉంది. కానీ కూటమి ప్రభుత్వం ఒక్క డీఏ కూడా ఇవ్వలేదు. ఈ జూలై మాసంతో పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలు వెంటనే ఇవ్వకపోతే ఉద్యమబాట పట్టాల్సి వస్తుంది. యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సమస్యలపై ఽశనివారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేయనున్నాం. ప్రసన్నకుమార్, యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షుడు -
పాత పట్టాదారు పాస్పుస్తకాలు రద్దు
విజయనగరం అర్బన్: వైఎస్ఆర్సీపీ హయాంలో రీసర్వే ప్రక్రియ పూర్తయిన గ్రామాల్లో భూ రికార్డులకు పంపిణీ చేసిన పట్టాదారుల పాస్ పుస్తకాలను రద్దు చేసి వాటి స్థానంలో కొత్తగా రూపొందించిన పుస్తకాలు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో రెండు విడతల్లో దాదాపు 360 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసి పట్టాదారు పాస్ పుస్తకాలను కూడా పలు గ్రామాల్లో పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల ముందు రీసర్వే ప్రక్రియపై ప్రజల్లో తీవ్రస్థాయిలో అపోహలు కల్పించిన కూటమి ప్రభుత్వం వచ్చాక వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన రీసర్వే విధానాన్నే అవలంబిస్తున్న విషయాన్ని కప్పిపుచ్పుకోవడానికి ఇప్పటికే పూర్తయిన రీసర్వే గ్రామాల్లో కాలయాపన చేయడం కోసం మరోసారి రీసర్వే చేపట్టింది. గత ప్రభుత్వం పూర్తి చేసిన రీసర్వేలను సరిచూసుకోవడం మినహా కొత్త గ్రామాల రీసర్వే మూడో విడత పనులు జరగలేదు. ఆగస్టు 15న పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ భూ హక్కుదారులకు పట్టాదారు పాస్ పుస్తకాలను ప్రభుత్వం కొత్తగా రూపొందించిందని, ఇటీవల సవరించిన రీసర్వే పనులు పూర్తయిన అన్ని గ్రామాలకు సంబంధించి భూహక్కు పట్టాదారు పాస్ పుస్తకాలు జిల్లాకు వస్తున్నాయని విజయనగరం ఆర్డీఓ దాట్ల కీర్తి శుక్రవారంతెలిపారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ తొలి విడతగా విజయనగరం డివిజన్ పరిఽధిలోని 39 గ్రామలకు చెందిన భూహక్కుదారులకు వచ్చే నెల 15న పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయనునున్నామని, వాటికి సంబంధించి ఇప్పటికే రీసర్వే సవరణ ప్రక్రియ పూర్తయిందని, వెబ్ల్యాండ్లో సమాచారం ఆధారంగా సరిపోయిన వారికి పుస్తకాలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. విజయనగరం డివిజన్ పరిధిలో ఇళ్ల పథకం కింద 11 వేల మంది దరఖాస్తు చేసుకోగా వాటిని 30 రోజుల్లో పరిశీలన పూర్తి చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం లబ్ధిదారులకు మంజూరు చేసిన పట్టాలపై మరో సారి సర్వే చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందించామన్నారు. రాష్ట్రంలో ఎక్కడా సొంత ఇంటి స్థలం లేనివారు, లబ్ధిదారు కుటుంబంలో ఏ ఒక్కరూ గతంలో ప్రభుత్వ గృహనిర్మాణ పథకాల ద్వారా లబ్ధిపొందని మహిళలు అర్హులవుతారన్నారు. ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న గృహాల క్రమబద్ధీకరణ కోసం వచ్చిన 175 దరఖాస్తులను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 15న కొత్త పుస్తకాల పంపిణీ -
రామతీర్థానికి శ్రావణ శోభ
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానానికి శ్రావణమాస శోభ సంతరించుకుంది. శ్రావణమాసం తొలి శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మి అమ్మవారితో పాటు ఉమా సదాశివాలయంలో ఉన్న కామాక్షి అమ్మవారికి అర్చకులు విశేష పూజలు జరిపించారు. మహాలక్ష్మి అమ్మవారిని చందనంతోను, కామాక్షి అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించి కుంకుమ పూజలు నిర్వహించారు. తొలి శుక్రవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఈఓ వై శ్రీనివాసరావు, అర్చకులు పాల్గొన్నారు.వైభవంగా పూర్ణాహుతి రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో పూర్ణాహుతి హోమాన్ని ఆలయ అర్చకులు శుక్రవారం వైభవంగా జరిపించారు. వేకువజామున స్వామిని ప్రాతఃకాలార్చన, బాలభోగం నిర్వహించిన అనంతరం యాగశాలలో పూర్ణాహుతి చేపట్టారు. తరువాత వెండి మంటపంలో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని వేడుకగా జరిపించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయంత్రం స్వామి సన్నిధిలో సహస్ర దీపాలంకరణ కార్యక్రమం కనుల పండువగా జరిపించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు -
ఇన్స్పైర్ మనక్ అవార్డు కోసం నామినేషన్ల ప్రక్రియ
పార్వతీపురం టౌన్: 2025–26 విద్యాసంవత్సరానికి ఇన్స్పైర్ మనక్ అవార్డు కోసం ప్రాజెక్ట్ల నామినేషన్ ప్రక్రియ ఆన్లైన్లో మొదలైందని పార్వతీపురం మన్యం జిల్లా విద్యా శాఖ అధికారి బి.రాజ్కుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సెప్టెంబర్ 15 వ తేదీలోగా అన్ని పాఠశాలల నుంచి ప్రాజెక్టు సబ్మిట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్స్, ప్రధానోపాధ్యాయులను ఆదేశించామన్నారు. ప్రతి మండల పరిధిలో ఉండే అన్ని పాఠశాలల నుంచి పూర్తిస్థాయిలో పరిశీలన చేసి జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో ప్రాజెక్టులు నామినేట్ అయ్యే విధంగా చూడాలని మండల విద్యాశాఖాధికారులను ఆదేశించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి 6–12 తరగతులకు ఇన్స్పైర్ మనక్లో అవకాశం కల్పించారని తెలిపారు. ప్రతి ఉన్నత పాఠశాల నుంచి 5 ప్రాజెక్ట్స్ హైస్కూల్ ప్లస్ నుంచి 7 ప్రాజెక్ట్స్ httpr://www.inspireawards&drt.gov.in అనే లింక్ ఓపెన్ చేసి ప్రాజెక్టు సబ్మిట్ చేయాలని సూచించారు. ప్రాజెక్ట్ సబ్మిషన్, ఇతర సాంకేతిక సహకారానికి జిల్లా సైన్స్ అధికారి జి.లక్ష్మణరావు ఫోన్ నంబర్ 8978077156ను సంప్రదించవచ్చని కోరారు. -
డిసెంబర్ లోగా ఇళ్లనిర్మాణం పూర్తిచేయాలి
విజయనగరం టౌన్: ప్రభుత్వం ఇచ్చిన స్ధలాల్లో ఇళ్ల నిర్మాణాలను సగంలో ఆపేసిన వారంతా డిసెంబర్ నెల లోగా పూర్తిచేయాలని ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ (అడ్మిన్), విజయనగరం, పార్వతీపురం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లాల ప్రత్యేకాధికారి వెంకటరమణ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం గుంకలాం జగనన్న లేఅవుట్ను ఆయన డీఈ రంగారావుతో కలిసి సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో త్వరితగతిన రూప్కాస్ట్ నిర్మాణాలు చేయాల్సి ఉందన్నారు. జిల్లాలో మొత్తం 2091 ఇళ్లు రూఫ్ లెవల్స్ వరకూ వచ్చాయని, నాలుగు వారాల్లో వాటిని పూర్తిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశామన్నారు. వాటిలో సుమారు 1161 మంది లబ్దిదారులకు అదనపు బెనిఫిట్స్ అందజేశామని తెలిపారు. బీసీలకు రూ.50వేలు, ఎస్సీలకు రూ.75వేలు, ప్రిమిటెవ్ ట్రయ్ గ్రూప్స్కు రూ.లక్ష అందజేశామని చెప్పారు. మిగతా వారెవరికై నా డబ్బులు రాలేదని ముందుకువస్తే హౌసింగ్ అధికారులతో కలిసి వారికి సాయమందిస్తామని చెప్పారు. 1500 వరకూ ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయడం టార్గెట్గా ఉంచామని, లబ్ధి డిసెంబరు నెలాఖరువరకే ఉందన్నారు. డిసెంబరు లోపు ఇళ్లు కట్టకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు అందవన్నారు. ప్రస్తుతం చిన్న చిన్న కాంట్రాక్టర్లు కట్టిస్తున్న ఇళ్లపై ఆన్లైన్ వర్క్ చేసేందుకు ఎమినిటీస్ ఇక్కడికి రావడం లేదని. కచ్చితంగా వారు కనీసం వారానికి రెండుసార్లు అయినా వచ్చి ఇళ్ల నిర్మాణాలపై దృష్టిపెట్టాలని సూచించారు. దీనిపై కలెక్టర్కు నివేదిస్తామన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
జిల్లా మహాసభలను విజయవంతం చేయండి
బొబ్బిలి: సీపీఐ 14వ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఒమ్మిరమణ కోరారు. శనివారం నుంచి రెండు రోజుల పాటు జరగనున్న మహాసభల సభా ప్రాంగణం ఏర్పాట్లను ఆయన కార్యవర్గంతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాసభలకు ముఖ్య అతిథులుగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వర రావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు గుజ్జల ఈశ్వరయ్యలు హాజరవుతారన్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులు కోట అప్పన్న, పట్టణ కార్యదర్శి మునకాల శ్రీనివాసరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ -
కేసుల దర్యాప్తులో సాంకేతికతను వినియోగించాలి
విజయనగరం క్రైమ్: కేసుల దర్యాప్తులో సాంకేతికతను వినియోగించాలని, అలాగే స్కూల్స్, కాలేజీల్లో శక్తి వారియర్ టీమ్స్ ను నియమించాలని డీఎస్పీలతో పాటు అన్ని స్టేషన్ల హౌస్ ఆఫీసర్స్ను ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి శుక్రవారం ఆయన జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా అడ్మిన్ ఏఎస్పీ సౌమ్యలతతో కలిసి పోలీస్ అధికారులతో మాట్లాడి ఆదేశాలు జారీ చేశారు. శక్తి టీమ్స్ పనితీరు, రిపీటెడ్ నిందితులు, మహిళల అదృశ్యం, గంజాయి కేసులు, ఫైనాన్షియల్ దర్యాప్తు, నాన్ బెయిలబుల్ వారంట్ల ఎగ్జిక్యూషన్ను సమీక్షించారు.అలాగే పోలీసు అధికారులు, సిబ్బంది నిర్వహించాల్సిన విధులు, సాంకేతికత వినియోగం గురించి దిశా నిర్దేశం చేశారు. ఇప్పటికే హిస్టరీ షీట్లు కలిగిన నిందితులపై గత కేసుల ప్రస్తుత స్థితి, కోర్టు విచారణలో ఉన్న కేసుల్లో ప్రాసిక్యూషన్ జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు గమనిస్తుండాలని సూచించారు. కేసుల మిస్టరీని ఛేదించాలి ఇక నాన్ బెయిలబుల్ వారంట్లు, పోయిన వాహనాలు, మిస్సింగ్ వ్యక్తులను గుర్తించేందుకు, సైబర్ క్రైం, గంజాయి కేసుల్లో లభించిన చిన్న చిన్న ఆధారాలతో సాంకేతికతను వినియోగించి కేసుల మిస్టరీని చేధించాలని ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. ఏడేళ్లకు పైబడి శిక్షలు విధించిన అన్ని కేసుల్లో రికార్డు చేసిన వీడియోలు, ఫొటోలను ఈ సాక్ష్య యాప్లో అప్లోడ్ చేయాలని ఈ సాక్ష్య యాప్ను ప్రతి దర్యాప్తు అధికారి వినియోగించాలని ఆదేశించారు. నాన్ బెయిలబుల్ వారంట్లను ఎగ్జిక్యూట్ చెయ్యాలని, పరారీలో ఉన్న ఎన్బీడబ్ల్యు వ్యక్తులకు ష్యూరిటీగా నిలిచిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. శివారు ప్రాంతాలపై నిఘా అసాంఘిక కార్యకలాపాలు జరిగేందుకు అవకాశం ఉన్న పాత బిల్డింగులు, శివారు ప్రాంతాలను గుర్తించి నిఘా పెట్టాలని ఆయా ప్రాంతాల్లో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు చేపట్టాలని, సంబంధిత లయన్స్ డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడి లైటింగ్ ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. జూమ్ మీటింగులో డీఎస్పీలు ఎం.శ్రీనివాసరావు, జి.భవ్యారెడ్డి, ఎం.వీరకుమార్, ఆర్.గోవిందరావు, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, డీసీఆర్బీ సీఐ బి.సుధాకర్, ఎస్సై ప్రభావతి, పలువురు సీఐలు, ఎస్సైలు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ అధికారలతో ఎస్పీ జూమ్ కాన్ఫరెన్స్ -
ఈగల్ టీమ్కు చిక్కిన గంజాయి నిందితులు
విజయనగరం క్రైమ్ : మూడు కార్లలో 120 కేజీల గంజాయిని రవాణా చేస్తున్న ఎనిమిది మందిని రాజాపులోవ జంక్షన్ వద్ద ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో పట్టుకున్నట్టు ఎస్పీ వకుల్ జిందల్ వెల్లడించారు. డీపీవోలోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈగల్ టీమ్ సీఐ కల్యాణితో కలిసి వివరాలు వెల్లడించారు. ఈగల్ పోలీసులకు అందిన కచ్చితమైన సమాచారంతో విజయనగరం నుంచి మూడు కార్లలో వస్తున్న ఎనిమిది మందిని రాజాపులోవ వద్ద అదుపులోకి తీసుకొని వారి నుంచి 47 ప్యాకెట్లలో ఉన్న 120 కేజీల గంజాయిని, తొమ్మిది సెల్ఫోన్లను సీజ్ చేశామన్నారు. పట్టుబడిన ఎనిమిది మంది నిందితుల్లో ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా లంతాపూర్ బ్లాక్ బెల్ట్కు చెందిన కొర్రా కిరణ్(21), మనోజ్ బిసాయి(2), ఢిల్లీలోని పాత సీంపూర్కు చెందిన పాజిల్(30), యూపీలోని హాపూర్ జిల్లా లక్ష్మణపురకు చెందిన బిజేంద్ర(46), బుదాన్ జిల్లా సక్రి జంగిల్కు చెందిన ముఖ్తర్ అహ్మద్(43), అహిర్వారాకు చెందిన రామ్మోహన్(21), కాశగాని జిల్లా కుల్లికి చెందిన సోను (34), శిల్పి(30)గా విచారణలో గుర్తించామన్నారు. నిందితులు గంజాయిని ఉత్తరప్రదేశ్, ఢిల్లీకు రవాణా చేయాలనే ఉద్దేశంతో ఒడిశా రాష్ట్రంకు చెందిన గంజాయి వ్యాపారులతో సంబంధాలు పెట్టుకున్నారని తెలిపారు. మరో నిందితుడు అజిత దడక అలియాస్ ఒజి అలియాస్ మహేష్ దడక పరారయ్యాడని, త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు. వీరంతా ఒడిశాలోని గంజాయి వ్యాపారుల వద్ద కొనుగోలు చేసి రైళ్లు, కార్లలో తరలించేందుకు ప్రణాళిక రూపొందించుకున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో కార్లలో విజయనగరం మీదుగా విశాఖపట్నం తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారన్నారు. వీరిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గంజాయిని పట్టుకోవడంలో చురుగ్గా వ్యవహరించిన భోగాపురం సీఐ కె.దుర్గాప్రసాద్, ఈగల్ సీఐ టి.కల్యాణి, ఎస్ఐ పి.పాపారావు, ఇతర పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఆయనతో పాటు డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు పోలీసు అధికారులు ఉన్నారు. పట్టుబడిన వారిలో యూపీకి చెందిన దంపతులు -
పీఎం జన్మన్ గృహ నిర్మాణాలు వేగవంతం కావాలి
గుమ్మలక్ష్మీపురం: జిల్లాలో పీఎం జన్మన్ గృహ నిర్మాణాలు వేగవంతం కావాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ గృహ నిర్మాణ శాఖ అధికారులు, లబ్ధిదారులకు సూచించారు. గుమ్మలక్ష్మీపురం మండలంలోని కన్నయ్యగూడ, కురుపాం మండలంలోని తోటగూడ గ్రామాల్లోని పీఎం జన్మన్ ఇళ్లను గురువారం ఆయన పరిశీలించారు. ఇళ్ల నిర్మాణ ప్రగతిని పరిశీలించారు. బిల్లుల చెల్లింపులపై లబ్ధిదారులతో మాట్లాడారు. కన్నయ్యగూడ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం, ఎంపీపీ స్కూల్ను పరిశీలించారు. పాఠశాలకు అదనపు తరగతి గది మంజూరు చేస్తామన్నారు. అలాగే భద్రగిరి సీహెచ్సీని సందర్శించి వైద్యులకు పలు సూచనలు చేశారు. నిర్మాణ దశలో ఉన్న ఆసుపత్రి భవనాన్ని పరిశీలించారు. ఆపై గుమ్మలక్ష్మీపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, భద్రగిరి ఏపీటీడబ్ల్యూఆర్ గర్ల్స్ స్కూల్ను సందర్శించి మార్గదర్శకాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన గుమ్మలక్ష్మీపురంలో విలేకర్లతో మాట్లాడుతూ పీఎం జన్మన్ కింద జిల్లాకు 5వేల గృహాలు మంజూరు కాగా, 1600 గృహాలు వివిధ దశల్లో ఉన్నాయని, 130 గృహాలు పూర్తయ్యాయన్నారు. మిగిలిన గృహాలు డిసెంబర్ నెలాఖరులోగా పూర్తికావాల్సి ఉందన్నారు. అందులో భాగంగానే క్షేత్ర స్థాయి సమస్యలను తెలుసుకునేందుకు పర్యటించినట్టు చెప్పారు. భద్రగిరి సీహెచ్సీలో సీజనల్ వ్యాధులు, వైరల్ ఫీవర్స్ ఎక్కువగా నమోదవుతున్న తరుణంలో బెడ్లు సరిపోవడం లేదని, నిర్మాణ దశలో ఉన్న కొత్త ఆసుపత్రి భవనాలు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించినట్టు తెలిపారు. బంగాళాఖాతంలో నెలకొన్న అల్పపీడనం వలన కలిగే తుఫాన్ను ఎదుర్కొనేందుకు రెవెన్యూ, పోలీస్ల సహకారంతో ముందస్తు చర్యలు తీసుకున్నామని తెలిపారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థులకు గ్రామ సచివాలయం ఏఎన్ఎం, ఎంపీహెచ్డబ్ల్యూలతో వైద్య సేవలందించడం జరుగుతుందన్నారు. ఆయన వెంట కేఆర్ఆర్సీ ప్రత్యేక ఉప కలెక్టర్ డా.పి.ధర్మ చంద్రారెడ్డి, ఐసీడీఎస్ పీడీ టి.కనకదుర్గ, ఐటీడీఏ డీడీ ఆర్.కృష్ణవేణి, గుమ్మలక్ష్మీపురం ఎంపీడీవో పి.త్రివిక్రమరావు, తహసీల్దార్ ఎన్.శేఖర్, ఎంఈవో బి.చంద్రశేఖర్, హౌసింగ్ డీఈ ఎం.వెంకటరావు తదితరులు ఉన్నారు. కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ -
రామతీర్థంలో పునర్వసు పట్టాభిషేకం
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో పునర్వసు పట్టాభిషేక మహోత్సవాన్ని ఆలయ అర్చకులు గురువారం వైభవంగా జరిపించారు. వేకువజామున స్వామికి ప్రాతః కాలార్చన, బాలభోగం నిర్వహించిన తరువాత యాగశాలలో సుందరకాండ హవన హోమం జరిపించారు. అనంతరం స్వామి వెండి మండపంలో సీతారామస్వామి కల్యాణ మహోత్సవాన్ని వేడుకగా జరిపించి.. ఉత్సవ మూర్తులకు రామాయణంలో పట్టాభిషేకం సర్గ విన్నవించారు. అనంతరం స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి వివిధ రకాల ఫల రసాలతో అభిషేకం, పునర్వసు పట్టాభిషేకాన్ని జరిపించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో అర్చకులు సాయిరామాచార్యులు, నరసింహాచార్యులు, వర ప్రసాద్, పవన్, రామగోపాల్ తదితరులు పాల్గొన్నారు. సీతారామస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు -
ఘర్షణలో ఇద్దరికి గాయాలు
విజయనగరం క్రైమ్ : నగరంలోని పోలీసు కార్యాలయానికి సమీపంలో ఉన్న కంటోన్మెంట్ సమీపంలో ఉన్న ఓ బిర్యానీ పాయింట్ వద్ద ఇద్దరు వ్యక్తుల మధ్య గురువారం సాయంత్రం ఘర్షణ జరిగింది. ఇది కాస్త కొట్లాటకు దారితీసింది. దీనికి సంబంధించి వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు.. బిర్యానీ పాయింట్ వద్ద ఉమర్, నజీర్ అనే వ్యక్తుల మధ్య మసీదు అభివృద్ధి విషయమై వివాదం తలెత్తింది. అది కాస్త వారిద్దరి మధ్య కొట్లాటకు దారితీసింది. విషయం కంట్రోల్ రూమ్కు తెలియడంతో విజయనగరం వన్టౌన్ సీఐ ఆర్వీకే చౌదరి, ఎస్ఐలు రామ్గణేష్, లక్ష్మీప్రసన్నకుమార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ఇద్దరినీ విజయనగరం సర్వజన ఆసుపత్రిలో చేర్పించారు. ఈ వివాదం నేపథ్యంలో బిర్యానీ పాయింట్ వద్ద, మసీదు వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
సాగు భూమిని ఏపీఐఐసీకి ఎలా కేటాయిస్తారు..!
● తహసీల్దార్ను ప్రశ్నించిన కాకర్లవలస గిరిజన రైతులు ● పట్టా లేకుండా సాగు చేసే హక్కు లేదు.. ● వదిలి వెళ్లిపోవాలని తేల్చి చెప్పిన తహసీల్దార్ రామభద్రపురం: డి పట్టా భూమి అయిన.. దశాబ్దాల కాలంగా మా సాగులో ఉన్న భూమిని ఏపీఐఐసీకి ఎలా కేటాయిస్తారని కాకర్లవలస గిరిజన రైతులు తహసీల్దార్ అజురఫిజాన్ను ప్రశ్నించారు. మండలంలోని కొట్టక్కి రెవెన్యూ, మిర్తివలస పంచాయతీ పరిధిలోని కాకర్లవలస, కారేడువలస గ్రామాల మధ్య 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం సుమారు 187.08 ఎకరాల భూమిని రూ.7.48 కోట్లకు ఏపీఐఐసీకి విక్రయించింది. అయితే ఆ భూమిలో ఏపీఐఐసీ ఇప్పటి వరకు కనీసం ఒక్క పరిశ్రమ పెట్టలేదు సరికదా, భూమి ఎక్కడుందో? ఎలా ఉందో, ఎవరు ఆక్రమించుకున్నారో.. కనీసం కన్నెత్తి చూడలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏపీఐఐసీకి సంబంధించిన భూమిలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు కోసం కొంత భూమిని కేటాయిస్తూ ముందుగా రోడ్లు అభివృద్ధి కోసం రూ.7 కోట్లు నిధులు విడుదల చేయడంతో నెల రోజుల క్రితం మంత్రి కొడపల్లి శ్రీనివాపరావు, ఎమ్మెల్యే బేబీనాయన, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శంకుస్థాపన కూడా చేసిన విషయం విదితమే. అయితే సంబంధిత కాంట్రాక్టర్ ఇప్పుడు రోడ్లు అభివృద్ధి కోసం పనులు ప్రారంభించారు. ఈ క్రమంలో ఏపీఐఐసీకి సంబంధించిన భూమే కదా అని ప్రస్తుతం సాగులో ఉంటూ పత్తి, మొక్కజొన్న, మామిడి, జీడి తోటలు సాగు చేస్తున్న గిరిజన రైతులకు కనీసం నోటీసు ఇవ్వకుండా జేసీబీతో ధ్వంసం చేశారు. దాంతో తమ సాగులో ఉన్న భూములలో ఎలా రోడ్లు వేస్తారని వారు ప్రశ్నించారు. ఈ క్రమంలో తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ అజూరఫీజాన్ ఽఆధ్వర్యంలో ఏపీఐఐసీ జేఈ రాజేష్కుమార్, ఎస్ఐ వి.ప్రసాదరావు, మిర్తివలస సర్పంచ్ మజ్జి రాంబాబు, సీపీఎం నాయుకుడు బలస శ్రీనివాసరావు, గిరిజన రైతులు సమావేశమయ్యారు. సమావేశంలో భూ రికార్డులు పరిశీలించారు. తహసీల్దార్ మాట్లాడుతూ కాకర్లవలసలో ఉన్న మొత్తం సుమారు 462 ఎకరాల డి పట్టాతో పాటు, ఫారెస్టుకు సంబంధించిన భూమి ఉందని, అందులో గిరిజన రైతులకు 266 ఎకరాల భూమి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు కింద ఇచ్చామన్నారు. అలాగే 187.8 ఎకరాలు రూ.7.48 కోట్లకు ఏపీఐఐసీకి విక్రయించిందన్నారు. కొండ పక్కన ఉన్న ప్రాంతంలో మీకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇస్తే ఏపీఐఐసీకి కేటాయించిన భూమిలో మీరు ఎలా సాగు చేస్తారని? ఇది డి పట్టా భూమి అని మీరు సాగు చేస్తే కుదరదని, వదిలి వెళ్లిపోవల్సిందేనని తేల్చి చెప్పేశారు. భూమి ఎక్కడ ఇచ్చారో అక్కడకు వెళ్లి సాగు చేసుకోవాలని ఆదేశించారు. అనంతరం గిరిజన రైతులు మాట్లాడుతూ సాగులో ఉన్న భూములను ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు అంటూ పెద్దల స్వార్ధం కోసం మా పేదల భూములు లాక్కోవడం సమంజసం కాదని ఆందోళన వ్యక్తం చేశారు. చావనైనా చస్తాం.. కానీ భూములు వదిలే ప్రసక్తి లేదని గిరిజన రైతులు తేల్చి చేప్పేశారు. మాకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. సర్పంచ్ మజ్జి రాంబాబు మాట్లాడుతూ మిర్తివలస పంచాయతీ పరిధిలో ఉన్న సర్పంచ్గాని, గ్రామ ప్రజల సంతకాలు లేకుండా కొట్టక్కి రెవెన్యూ పరిధిలో ఉన్నంత మాత్రాన ఆ సర్పంచ్ సంతకంతో తీర్మానం ఎలా చేస్తారు? నోటిఫికేషన్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. గిరిజన రైతులకు న్యాయం జరిగే వరకు వారికి మద్దతుగా తాము నిలబడతామన్నారు. మండల సర్వేయర్ వి.సాయికుమార్, కొట్టక్కి వీఆర్వో మహేష్, వైఎస్సార్సీపీ నాయకుడు భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
రాజాం సిటీ: మండల పరిధి పొగిరి గ్రామ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన శాసపు రమణ (59) మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. రమణ రాజాంలోని శ్రీకాకుళం రోడ్డులో గ్యాస్ ఏజెన్సీలో డెలివరీ బాయ్గా పని చేస్తున్నాడు. ఎప్పటిలాగే ఉదయం 7.30గంటల సమయంలో విధులకు టీవీఎస్ ఎక్సెల్పై బయలుదేరాడు. పొగిరి పీహెచ్సీ ఎదురుగా వచ్చేసరికి కళ్లు తిరగడంతో బైక్ అదుపుతప్పి ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు పీహెచ్సీకి తీసుకువెళ్లారు. అక్కడ నుంచి 108 సహాయంతో రాజాం సామాజిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని చెప్పడంతో కుటుంబ పెద్దను కోల్పోయామని, తమకెవరు దిక్కని కుటుంబీకులు రోదించారు. మృతునికి భార్య సీతమ్మ, కుమారుడు చిరంజీవి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుని కుమారుడు చిరంజీవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ కె.అశోక్కుమార్ తెలిపారు. కేరళలో కోన యువకుడు ఆత్మహత్య మక్కువ: మండలంలోని కోన గ్రామానికి చెందిన మడక గోవర్ధనరావు( 30) కేరళ రాష్ట్రంలో గురువారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు..గోవర్ధనరావు కేరళ రాష్ట్రంలోని కాసరగోడ్ జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఏమైందో తెలియదుగాని తాను అద్దెకుంటున్న గదిలో ఫ్యాన్కు ఉరి వేసుకొని మృతి చెందాడు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. గోవర్ధనరావు మృతి చెందాడన్న వార్త తెలిసిన తల్లిదండ్రులు రామకృష్ణ, చిన్నమ్మలు కన్నీరుమున్నీరయ్యారు. -
యథేచ్ఛగా పచ్చని జీడి చెట్ల నరికివేత
భామిని: మండలంలోని పచ్చని జీడి తోటలు నేలమట్టం అవుతున్నాయి. రైతులకు ఆదాయ వనరులు కల్పించే జీడిమామిడి తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్న తరుణంలో కొందరు అక్రమార్కుల చేతిలో ఈ చెట్లు కలప దుంగలుగా మారుతున్నాయి. అనంతగిరి వద్ద జీడి తోటలను గురువారం నరికేసి అక్రమ రవాణా చేశారు. పచ్చని చెట్లు నరికివేతకు గురై వంట చెరకుగా తరలిపోతున్నాయి. వాల్టా చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. లారీలు, వ్యాన్లతో జీడి చెట్లను నరికివేసి కలప దుంగలుగా మార్చి ఇక్కడ నుంచి తరలిస్తున్నారు. మండలంలోని ఎక్కువగా బురుజోల, బిల్లుమడ గ్రామాల్లో జీడి తోటలు నేలమట్టం అవుతున్నాయి. శివాలయంలో చోరీ బొబ్బిలి రూరల్: మండలంలోని పెంట గ్రామంలో నగిరేశ్వర శివాలయంలో బుధవారం రాత్రి చోరీ జరిగింది. భక్తులు కానుకలను సమర్పించే గుడిలోని హుండీని పగులగొట్టి సుమారు పదివేల రూపాయిల వరకు నగదు, ఇతర ఆభరణాలను దొంగలు కొల్లగొట్టినట్టు ఆలయ పూజారి కొండేటి చందు గురువారం గ్రామపెద్దలకు తెలియజేశారు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికి ఇది మూడో సారి జరిగిన దొంగతనమని దొంగలను పట్టుకోవాలని గ్రామస్తులు పోలీసులను కోరారు. మరోమారు పునరావృతం కాకుండా పోలీసులు గట్టి చర్యలు చేపట్టాలని గ్రామస్తులు, భక్తులు పోలీసులను కోరారు. సెల్ఫోన్ల దొంగ అరెస్టు విజయనగరం క్రైమ్ : విజయనగరం రైల్వే పోలీసులు సెల్ఫోన్ల దొంగను గురువారం అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి జీఆర్పీ ఎస్ఐ బాలాజీరావు మాట్లాడుతూ ఆర్పీఎఫ్ సిబ్బందితో రైల్వే ప్లాట్ఫాంలపై తనిఖీలు చేస్తుండగా ఓ వ్యక్తి పట్టుబడ్డారన్నారు. పట్టుకుని విచారిస్తే ఆ వ్యక్తి వద్ద నాలుగు సెల్ఫోన్లు ఉండటంతో తమదైన రీతిలో విచారించారు. దీంతో రైళ్ల కోసం వేచి ఉన్న ప్రయాణికుల నుంచి సెల్ఫోన్లను దొంగలించానని ఒప్పుకున్నట్టు తెలిపారు. నిందితుడి నుంచి రూ.లక్ష విలువ గల నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్ నిమిత్తం విశాఖపట్నం రైల్వే కోర్టులో హాజరు పరిచినట్టు ఎస్ఐ తెలిపారు. -
శ్రీరస్తు...శుభమస్తు..
విజయనగరం: శ్రావణ మాసం శుక్రవారం ఆరంభం కానుంది. మంచిరోజులు రావడంతో పల్లెలు, పట్టణాల్లో పెళ్లి బాజాలు మోగడంతో పాటు ఇతర శుభకార్యాలు జోరందుకోనున్నాయి. మే 24 నుంచి మంచి ముహూర్తాలు లేకపోవడంతో శుభకార్యాలు చేసుకునే వారు ఇప్పటివరకు నిరీక్షించారు. ఈ నెల 24తో ఆషాఢం ముగిసింది. 25 నుంచి శ్రావణం ప్రారంభం కానుండడంతో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు తదితర శుభకార్యాలకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 26, 30, 31, ఆగస్టు 1, 3, 4, 6, 10, 13, 15, 17, 18 తేదీల్లో శుభ ముహూర్తాలున్నట్లు పండితులు చెబుతున్నారు. ఆ మేరకు కల్యాణ మండపాలు, ఆలయాల ప్రాంగణాలను ముస్తాబు చేస్తున్నారు. అమ్మవారి వ్రతాలకు శుభసమయం పెళ్లిళ్లతో పాటు ఇళ్లలో నోములు, మంగళగౌరి, వరలక్ష్మి వ్రతాలకు శ్రావణమాసం శుభసమయం. ఇదే నెలలో అమ్మవార్లకు ఒడి బియ్యం సమర్పిస్తారు. మహిళలు అత్యంత భక్తితో అమ్మవారిని ఆరాధించే పూజల మాసమని దీనికి ప్రసిద్ధి. ఇంటినే దేవాలయంగా భావించి మామిడికొమ్మలతో అలంకరిస్తారు. అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి వ్రతాలు ఆచరిస్తారు. చీరలు, నగలతో సుందరంగా అలంకరిస్తారు. అమ్మవార్లకు పసుపుకుంకుమలు సమర్పిస్తారు. వివిధ రకాల వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఉపవాసం చేస్తూ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. వారికి మంచి కాలం ఇది... శ్రావణమాసం పలు వర్గాలకు సిరులు కురిపిస్తుంది. పెళ్లిళ్లకు అవసరమైన ఫంక్షన్ హాళ్లు, టెంట్లు, సౌండ్ సిస్టం, బ్యాండ్ పార్టీలు, పెళ్లిపందిళ్ల అలంకరణ వంటి వ్యాపారాలకు డిమాండ్ పెరుగనుంది. పత్రికలు, క్యాటరింగ్, ఫొటో, వీడియోగ్రాఫర్లకు డబ్బులు వచ్చేకాలం ఇది. ఆగస్టు 23 వరకు మంచి ముహూర్తాలు ఈ నెల 25 నుంచి ఆగస్టు 23 వరకు శ్రావణ మాసం శుభకార్యాలు చేసుకునేందుకు యోగ్యమైనది. పెళ్లిళ్లు, కేశఖండనం, గృహ ప్రవేశాలు వంటివి జరుపుకోవచ్చు. ఈ మాసం శుభకరమైనది. – కామేశ్వరశర్మ, వేదపండితుడు – నేటి నుంచి ప్రారంభం కానున్న శ్రావణ మాసం – నెలరోజుల పాటు పెళ్లిళ్లు, నోములు, వ్రతాలతో సందడే సందడి – పుంజుకోనున్న అనుబంధ వ్యాపారాలు -
● మూతపడిన మరో బడి
విజయనగరం జిల్లాలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాది కాలంలో ఎనిమిది ప్రాథమిక పాఠశాలలు మూతపడగా, తాజాగా దత్తిరాజేరు మండలం వంగర పంచాయతీ మధుర గ్రామమైన ముద్దానపేట ప్రాథమిక పాఠశాలకు తాళంపడింది. సుమారు 30 కుటుంబాలు నివసిస్తున్న గ్రామంలో గతేడాది వరకు ఇద్దరు విద్యార్థులు (3వ తరగతి, ఒకటో తరగతి) చదివేవారు. వారు కూడా మూడురోజుల కిందట టీసీలు తీసుకుని వెళ్లిపోవడంతో పాఠవాలకు తాళం వేసినట్టు ఎంఈఓ–2 సుధాకర్ తెలిపారు. ఇక్కడ పనిచేసిన ఉపాధ్యాయుడిని ఎమ్మార్సీకి పంపించామని, ఉపాధ్యాయులు సెలవు పెట్టిన చోట ఆయనను బోధనకు పంపిస్తామన్నారు. – దత్తిరాజేరు -
● కళ తప్పిన సచివాలయం
చిత్రంలో కనిపిస్తున్నది వేపాడ మండలంలోని నీలకంఠరాజపురం సచివాలయం. గతంలో ఇక్కడ 11 మంది సిబ్బంది విధులు నిర్వర్తించేవారు. వ్యవసాయ, సంక్షేమ, పశుసంవర్థక, రక్షక, సాంకేతిక, విద్యాసంబంధ, రెవెన్యూ, వైద్య తదితర సేవలు గ్రామస్తులకు అందేవి. ఇప్పుడు 11 పోస్టుల్లో ఆరు ఖాళీగా ఉన్నాయి. ఇంజినీరింగ్ అసిస్టెంట్ ప్రసూతి సెలవులో ఉండడంతో ముగ్గురు సిబ్బంది, ఒక పంచాయతీ కార్యదర్శి మాత్రమే అందుబాటులో ఉన్నారు. వీఆర్ఏ, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, రైతుసేవా కేంద్రంలో వీఏఏ, వీఈఏ, వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పంచాయతీ కార్యదర్శితో పాటు ఏఎన్ఎం, మహిళా పోలీస్, సర్వేయర్ మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. కూటమి ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు పూనుకుందని, అందుకే సిబ్బంది సంఖ్యను తగ్గిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. – వేపాడ -
ఊరిస్తూ.. ఉసూరుమనిపిస్తూ...
రామభద్రపురం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు పూర్తయింది. ఇప్పటివరకు ఏ సంక్షేమ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలుచేసిన దాఖాలా లేవు. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ అంటూ హామీలిచ్చిన కూటమి నేతలు ఇప్పుడు పథకాల అమలులో చేతులెత్తేస్తున్నారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగభృతి, అన్నదాతసుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు, 50 ఏళ్లకే పింఛన్ వంటి పథకాలు అటకెక్కగా.. భర్తలు కోల్పోయిన మహిళలను ఆదుకోవడంలోనూ కూటమి ప్రభుత్వం విఫలమైంది. పింఛన్ ఇస్తామని ఊరిస్తూ ఉసూరుమనిపిస్తోంది. దరఖాస్తు చేసి నెలలతరబడి ఎదురుచూస్తున్నా పింఛన్ డబ్బులు చేతికందని పరిస్థితి. 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 మధ్య సామాజిక పింఛన్దారు మరణిస్తే వారి భార్యలకు స్పౌజ్ కేటగిరీలో పింఛన్ మంజూరుకు అర్హులుగా నిర్ధారించారు. జిల్లా వ్యాప్తంగా 3,419 మందికి స్పౌజ్ కేటగిరీలో పింఛన్లు మంజూరు చేశారు. వీరికి జూన్ 12వ తేదీన కూటమి ప్రభుత్వం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పింఛన్లు అందజేస్తామని ప్రకటించారు. అయితే, అనివార్యకాారణాలతో పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. జూలై 1న పంపిణీ చేయాలని రూ.1,36,76,000 నిధులు విడుదలచేసినా లబ్ధిదారుల చేతికి అందలేదు. తిరగి ఆ నిధులను ప్రభుత్వం వెనుకకు తీసుకోవడంతో నిరాశ తప్పలేదు. గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో అర్హత మేరకు ప్రతి ఆరునెలలకోసారి కొత్తపింఛన్లు మంజూరయ్యేవని, పింఛన్ డబ్బులు ఠంచన్గా అందేవని, ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో ప్రతీ పథకం అమలులోనూ కుతంత్రమే కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పింఛన్ డబ్బుల కోసం వితంతువుల ఎదురుచూపు జిల్లా వ్యాప్తంగా 3,419 మందికి మంజూరైన స్పౌజ్ పింఛన్లు జూలై నెలలో అందని డబ్బులు వచ్చేనెలా అందుతాయోలేదోనన్న బెంగ కూలికి వెళ్తున్నా.. భర్త మంగయ్య ఏడాదిన్నర కిందట చనిపోయాడు. పిల్లలు లేరు. ఒంటరిదాన్ని అయ్యాను. పింఛన్ ఇస్తామని చెబుతున్నారే తప్ప ఇవ్వడం లేదు. ఆకలి తీర్చుకునేందుకు కూలికి వెళ్తున్నా. పింఛన్ వస్తే కాస్త ఆర్థిక భరోసా కలుగుతుంది. – పొగందర తవిటమ్మ, కొండకెంగువ త్వరలోనే పంపిణీ చేస్తాం.. స్పౌజ్ పింఛన్ల లబ్ధిదారులకు జూలై నెలలో పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అనివార్య కారణాలతో మళ్లీ డేట్ ఇస్తామని పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. ఉన్నతాధికారుల ఆదేశానుశారం త్వరలోనే స్పౌజ్ పింఛన్లు పంపిణీ చేస్తాం. – సీహెచ్ రత్నం, ఎంపీడీఓ, రామభద్రపురం -
అదును దాటుతున్నా.. అందని ఎరువు!
● బొండపల్లి మండలంలో 16 రైతు సేవా కేంద్రాలు ( రైతు భరోసా కేంద్రాలు) ఉన్నాయి. ఇందులో ఐదు రైతు సేవా కేంద్రాలకు ఎరువులు వచ్చాయి. మిగిలిన 11 ఆర్ఎస్కేలకు ఎరువులు సరఫరా కాలేదు. ● దత్తిరాజేరు మండలంలో 17 రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఆరు కేంద్రాలకే ఎరువులు సరఫరా అయ్యాయి. మిగిలిన కేంద్రాలకు సరఫరాకాలేదు. రైతులు ప్రైవేటు దుకాణాల్లో కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి. ● వంగర మండలంలో రైతు సేవా కేంద్రాలకు ఇంకా ఎరువులు చేకపోగా ప్రైవేటు డీలర్ల వద్ద మాత్రం దొరుకుతున్నాయి. ● మెంటాడ మండలంలో 19 రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. ఏ రైతు సేవా కేంద్రానికి కూడా ఎరువులు రాలేదు. -
మార్గదర్శుల కోసం బతిమలాట..!
● పేదోడి మెడకు ‘బంగారు’ ఉరితాడు ● పేదలను సంపన్నుల్ని చేయకుండానే..పీ 4 పేరుతో ‘సంక్షేమం’ కట్ ● సంక్షేమం ఇవ్వకుండా.. సంపన్నుల మోచేతి కింద పేదోడి బతుకులు ● ఇప్పటికే ప్రకటించిన 64 వేల కుటుంబాల గుర్తింపుపై మరో సర్వే ● మార్గదర్శులుగా చేరాలంటూ సంపన్నులపై జిల్లా యంత్రాంగం ఒత్తిళ్లు ● ముందుకొచ్చిన మార్గదర్శుల నమోదుపై అస్పష్టత విజయనగరం అర్బన్: పేదరికం లేని సమాజం నిర్మిస్తామనే హామీతో కూటమి ప్రభుత్వం రూపొందించిన పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టనర్షిప్ (పీ 4) కార్యక్రమంలో మోసపూరిత ఆలోచనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాల కోసం అట్టడుగున ఉన్న పేద కుటుంబాల గుర్తింపు సర్వే నుంచి వాళ్లను ఆదుకోవాల్సిన మార్గదర్శుల స్వచ్ఛంద నమోదు ప్రక్రియ వరకు జరుగుతున్న చర్యలన్నీ నాటకీయంగానే కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలు దఫాలుగా సర్వేలు నిర్వహించి.. గుర్తించిన కుటుంబాల ఎంపికలో పారదర్శకత లేదని మళ్లీ అందులో వడపోయాలని కాలయాపన కోసం తాజాగా నిర్ణయించింది. మరోవైపు పేదల్ని ఆదుకునేందుకు మార్గదర్శులు రావాలంటూ ప్రభుత్వం పిలుపునిస్తున్నా.. కూటమి సర్కార్పై నమ్మకంలేని సంపన్నులు ముందుకు రావడం లేదు. నిజానికి ఉగాది నాటికే బంగారు కుటుంబాల్లో వెలుగులు నింపుతానని చంద్రబాబు మాటలు పలికారు. ఉగాది వెళ్లి మూడు నెలలు గడిచినా అసలు బంగారు కుటుంబాల ఎంపికే పూర్తి కాలేదు. ● గుర్తించిన 64 వేల కుటుంబాలపై మరో సర్వే ఆదాయంలో అట్టడుగున ఉన్న 20 శాతం కుటుంబాల (బంగారు కుటుంబాలు)ను అర్థికంగా వృద్ధి చెందిన 10 శాతం మంది (మార్గదర్శులు) ఆగస్టు 15 నాటికి దత్తత తీసుకోవాలని పిలుపునిచ్చారు. గడువు నాటికి బంగారు కుటుంబాలను గుర్తించేందుకు తొలిత జిల్లా వ్యాప్తంగా మార్చి 20 నుంచి క్షేత్ర స్థాయిలో అధికారులు సర్వే చేశారు. సచివాలయ ఉద్యోగులు తమ క్లస్టర్ పరిధిలోని కుటుంబాలను 27 అంశాల ప్రశ్నలు అడిగి సమాచారం తీసుకున్న నేపథ్యంలో జిల్లాలో 64,066 మందిని అట్టడుగున ఉన్న 20 శాతం కుటుంబాల (బంగారు కుటుంబాలు)ను గుర్తించినట్టు జిల్లా అధికారులు ప్రకటించారు. అయితే ఈ ఎంపిక ప్రక్రియలో పారదర్శకత లోపించిందని గుర్తించి తాజాగా మరోసారి క్షేత్ర స్థాయిలో సర్వే చేపడుతుంది. ఈ నెల 28వ తేదీలోగా పూర్తి చేయాల్సిన ఈ సర్వేలో నిరుపేదలుగా గుర్తించిన ఐదు అంశాలను ప్రమాణంగా తీసుకొని మరోసారి బంగారు కుటుంబాల జాబితాను విడుదల చేయనున్నారు. ● ముందుకొచ్చిన మార్గదర్శుల నమోదుపై అస్పష్టత జిల్లాలో చేపట్టిన సర్వే ద్వారా 20 శాతం నమోదైన 64,066 మంది బంగారు కుటుంబాలకు కనీసం 10 శాతం అంటే కనీసం 6,406 మంది మార్గదర్శకులు అవసరం ఉంటుంది. మార్గదర్శులను వెతకడం జిల్లా అధికారులకు తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో ఇంతవరకు కేవలం 2,321 మంది వరకే మార్గదర్శులుగా ముందుకు వచ్చినట్టు తాజా ఆన్లైన్ నివేదికలు చెబుతున్నాయి. వీరిలో చాలా మంది పూర్తి అవగాహనతో నమోదు చేసుకోలేదని తెలుస్తుంది. మార్గదర్శులుగా ఎందుకు చేరాలో చేరిన తరువాత ఏం చేయాలో తెలియని వారున్నారని ఉద్యోగులే చెబుతున్నారు. ● ముందుకు రాని అధికార పార్టీ ప్రతినిధులు ఇప్పటికే 264 కుటుంబాలకు మంత్రి ప్రకటించిన విషయం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గం పరిధిలో కేవలం 264 కుటుంబాలకే మంత్రి దత్తత తీసుకుంటే మిగిలిన కుటుంబాలు వ్యతిరేకత చూపవా అంటూ నియోజకవర్గ, గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్గదర్శకులుగా దత్తత తీసుకునే సామర్థ్యం ఉన్నా ముందుకు రావడానికి అధికార పార్టీ ప్రతినిధులు జంకుతున్నారని సమాచారం. దీంతో ఇంతవరకు నమోదైన మార్గదర్శులు జాబితాలో అధికార పార్టీ ప్రతినిధులు లేని పరిస్థితి వచ్చిందని తెలుస్తోంది. జిల్లా, మండల స్థాయిలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రైవేటు భాగస్వాముల మధ్య సమన్వయం సరిగ్గా లేకపోవడం ఒక ప్రధాన సమస్యగా ఉందని కొందరు అధికారులే చెబుతున్నారు. సంపన్నులపై అధికారుల ఒత్తిళ్లు కూటమి ప్రభుత్వం అమలులోకి తెస్తున్న పీ–4 లక్ష్యాలు సాధించడంలో జిల్లా యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. జిల్లాలోని ఉపాధ్యాయ, ఉద్యోగుల నుంచి వైద్యుల వరకు వివిధ వృత్తులు, వ్యాపార సంస్థల సంపన్న వర్గాలను మార్గదర్శులుగా నమోదు చేసుకోవాలని వాళ్లకు నేరుగా ఆదేశాలు పంపాలని కూటమి ప్రభుత్వం హుకుం జారీ చేసింది. వాళ్ల చిరునామాలను సేకరించి ఇళ్లకు ఆదేశాలను జిల్లా యంత్రాంగం పంపుతుంది. ప్రభుత్వ వైఖరిపై నమ్మకం లేని సంపన్నులు ముందుకు రావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులే మార్గదర్శులుగా మారాలనే ఒత్తిడితో జిల్లా యంత్రాంగం సతమతమవుతుందని తెలుస్తుంది. -
ఏం అమ్మాలనుకుని ఎన్నికల్లో హామీలిచ్చారు..!
విజయనగరం: ఎన్నికలకు ముందు అధికార దాహంతో హమీలు గుప్పించిన కూటమి నేతలు నేడు వాటిని అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలంటూ వాఖ్యలు చేయటం సిగ్గుచేటని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. అలాంటప్పుడు అమలుకు సాధ్యం కాని హమీలు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ఆడబిడ్డ నిధి పథకం అమలుపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన వాఖ్యలను తప్పు పట్టారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఘోర వైఫల్యం చెందిందని వారి తప్పులను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టిని మళ్లించేందుకు అక్రమ అరెస్టులు చేస్తోందని ధ్వజమెత్తారు. ధర్మపురిలోని సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మజ్జి శ్రీనివాసరావు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుందని చెప్పారు. పాలన మరిచిన ప్రజాప్రతినిధులు రెడ్బుక్ రాజ్యాంగం పేరిట కక్ష సాధింపులు చేపట్టే పనిలో నిమగ్నమయ్యారని మండిపడ్డారు. ఇచ్చిన హమీలను ఎగ్గొట్టేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారని, వాటిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. జరగని లిక్కర్ స్కామ్ జరిగినట్టు చిత్రీకరించి తన అనుకూల మీడియాతో అబద్దాన్ని నిజం చేసేలా విష ప్రచారం చేయించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. తమకు అనుకూలంగా లేని మీడియా ప్రసారాలను నిలిపివేసి అక్కసు వెల్లగక్కుతున్నారని దుమ్మెత్తిపోశారు. మూడుసార్లు ఎంపీగా గెలిచిన పెద్దిరెడ్డి మిథున్రెడ్డిపై లిక్కర్ స్కామ్ పేరిట అక్రమంగా కేసు బనాయించటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బాధ్యత గల అధికార పక్షంలో ఉన్న వారు పూర్తి ఆధారాలతో చర్యలు తీసుకోవాలే తప్పా తప్పుడు కేసులు పెట్టి వైఎస్సార్సీపీ నాయకులను ఇబ్బందులకు గురి చేయటం సమంజసం కాదన్నారు. ఇటువంటి కక్షపూరిత రాజకీయాలకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేసేంత వరకు ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని హెచ్చరించారు. కూటమి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో వైఫల్యాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని మజ్జి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇందుకు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో చేపడుతున్న బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాలే వేదికగా నిలుస్తున్నాయని చెప్పారు. బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం ఇచ్చిన హమీలు అమలుపై ప్రశ్నిస్తే ప్రజలంతా తప్పు చేశామన్న భావనను వ్యక్తం చేస్తున్నారన్నారని తెలిపారు. విజయనగరం జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాలు దిగ్విజయవంతంగా సాగుతున్నాయన్నారు. అధికార పక్షం చేపడుతున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని మొక్కుబడిగా సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మూడేళ్ల పాటు ప్రతిపక్ష నాయకులు కనీసం రోడ్లపై కనిపించలేదని, ఇప్పటి కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత రావడంతో ఏడాదికే పోరుబాట పట్టాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. ప్రజల దృిష్టి మళ్లించేందుకు అక్రమ అరెస్టులు పాలన గాలికొదిలి రెడ్బుక్ రాజ్యాంగం పేరిట కక్ష సాధింపు చర్యలు జరగని లిక్కర్ స్కామ్ జరిగినట్టు చిత్రీకరణ కూటమి ఏడాది పాలనలో వైఫల్యాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత హామీలు అమలు చేసే వరకు ప్రజల పక్షాన పోరాడుతాం వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో అన్ని రంగాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మజ్జి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. 14 నెలలు గడుస్తున్నా ఒక్క కొత్త పింఛను మంజూరు చేయకపోవటంతో అర్హులైన లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పటం లేదన్నారు. ఉన్న పాత పింఛన్లను సదరం రీ సర్వే పేరిట ఇబ్బందులు పెడుతున్నారని, 50 ఏళ్లకే పింఛను ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి వెన్నెముకగా ఉండే రైతన్న వెన్ను విరుస్తున్నారని మండిపడ్డారు. గత రెండేళ్లుగా అన్నదాత సుఖీభవ మంజూరు చేయకపోవటంతో రైతాంగం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖరీఫ్ సాగుకు అవసరమైన యూరియా అందుబాటులో లేదని, దీనిపై ప్రజాప్రతినిధులు కనీసం సమీక్ష నిర్వహించారా? అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ పోరాటంతో అమలైన తల్లికి వందనం కార్యక్రమం కొందరికే జమ చేసి చేతులు దులుపుకున్నారని ధ్వజమెత్తారు. రాజాంలో ఒక పాఠశాలలో 205 మంది విద్యార్థులుంటే వారిలో ఐదుగురికే ఆ పథకాన్ని వర్తింప జేయటంతో వారంతా అధికారులు చుట్టూ తిరుగుతున్నారన్నారు. బాడంగి మండలంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ ప్రైవేటు ల్యాబ్ నిర్వహిస్తూ వైద్యం కోసం వచ్చే రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని, ఇదీ వైద్య రంగంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని నిరూపిస్తుందన్నారు. పలు ఆసుపత్రుల్లో బెడ్లు చాలక ఒకే బెడ్పై ఇద్దరు నుంచి ముగ్గురు రోగులకు వైద్యం అందించే దీన పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఒక్క ఏడాదిలో 9000 డ్రాపౌట్స్ ఉన్నాయంటే విద్యారంగం ఏ విధంగా నిర్వీర్యం అవుతుందో అవగతమవుతుందన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ విజయనగరం పార్లమెంటరీ జిల్లా కార్యదర్శి నెక్కల నాయుడుబాబు, పార్టీ అధికార ప్రతినిధి కనకల రఘురామారావు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్కుమార్ పాల్గొన్నారు. -
కుళ్లిన గుడ్లు.. పప్పు అన్నమే పరమాన్నం
బొబ్బిలి: పట్టణంలోని పలు మున్సిపల్ పాఠశాలల్లో గత నాలుగు రోజులుగా కుళ్లిన కోడిగుడ్ల సరఫరా జరుగుతోంది. బుధవారం కూడా కుళ్లిన గుడ్లు సరఫరా చేయడంతో కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం గుడ్లు లేకుండానే మధ్యాహ్న భోజనం పెట్టారు. దీంతో విద్యార్థులు నిరుత్సాహం చెందారు. పట్టణంలోని తాండ్ర పాపారాయ ప్రాధమిక పాఠశాల, జయప్రకాష్ మున్సిపల్ ప్రాధమిక పాఠశాలకు సరఫరా చేసిన గుడ్లు కుళ్లిపోయాయి. వారానికి నాలుగు రోజుల పాటు గుడ్లు సరఫరా చేయాల్సి ఉండగా ప్రతీసారి కలర్ కోడ్తో గుడ్లు ఇస్తుంటారు. అయితే గత నాలుగు రోజులుగా తాండ్ర పాపారాయ పాఠశాలలో 24 మంది విద్యార్థులకు కనీసం నాలుగుకు తగ్గకుండా గుడ్లు కుళ్లిపోతున్నాయని ఉపాధ్యాయురాలు కె.శాంతి తెలిపారు. జయప్రకాష్ మున్సిపల్ పాఠశాలలో 79 మంది విద్యార్థులకు 64 మంది హాజరు కాగా అన్ని గుడ్లూ కుళ్లిపోయినట్టు హెచ్ఎం సీహెచ్ మోహనరావు, భోజన నిర్వాహకులు పెట్ల విజయలక్ష్మి, భాగ్యలక్ష్మి తెలిపారు. కుళ్లిపోయి నల్లగా మారిన ఈ గుడ్లను విద్యార్థులకు పెట్టవద్దని పారబోయాలని హెచ్ఎం ఆదేశించడంతో విద్యార్థులకు పప్పన్నం, కొన్ని పాఠశాలల్లో ప్లెయిన్ బిర్యానీ పెట్టారు. మండలంలోని మెట్టవలసలో కూడా కోడి గుడ్లు కుళ్లిపోయినట్టు విద్యాశాఖాధికారులకు సమాచారం వచ్చింది. ఇలా నిత్యం విద్యార్థుల సంఖ్యను బట్టి పది నుంచి 50 వరకూ గుడ్ల వరకూ కుళ్లి పోతున్నాయని, ఫొటోలు అప్లోడ్ చేస్తున్నట్టు ఆయా పాఠశాలల సిబ్బంది చెప్పారు. ఈ సంఘటనపై ఎంఈవో గొట్టాపు వాసును వివరణ కోరగా కుళ్లిన గుడ్ల స్థానంలో మళ్లీ గుడ్లు ఇస్తారని తెలిపారు. మరి గుడ్లు మళ్లీ ఇచ్చాక విద్యార్థులకు పాత వాటితో కలిపి రెండేసి గుడ్లు ఇస్తారేమో చూడాలి! మున్సిపల్ పాఠశాలల్లో విద్యార్థులకు భోజన అవస్థలు -
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన తప్పనిసరి
విజయనగరం అర్బన్: సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిస్థితుల్లో అందుకు అనుగుణంగా విద్యార్థులకు అవగాహన తప్పనిసరి అని కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ ఇన్చార్జ్ వీసీ ప్రొఫెసర్ టి.శ్రీనివాసన్ అన్నారు. స్థానిక కేంద్రీయ గిరిజన యూనివర్సిటీలో సోషల్ వర్క్ విభాగం ఆధ్వర్యంలో ‘మీరు కార్పొరేట్కు సిద్ధంగా ఎలా మారగలరు..?’ అనే అంశంపై బుధవారం జరిగిన ఒక రోజు సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తొలిత సదస్సును జ్యోతి ప్రజ్వలన చేసి ఇన్చార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జితేంద్ర మిశ్రా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక నైపుణ్యాల అందిపుచ్చుకోవడానికి లెర్నింగ్, అన్లెర్నింగ్, రీలెర్నింగ్ వంటి ధోరణి కీలకమని పేర్కొన్నారు. కార్పొరేట్ రంగ అవసరాలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు అవసరమైన శిక్షణ ఎంతో ముఖ్యమని, విద్యార్థులు తమ నైపుణ్యాలను కంపెనీల అవసరాలకు అనుగుణంగా మెరుగుపరచుకోవాలని సూచించారు. రీసోర్స్పర్సన్గా అసోసియేట్ డైరెక్టర్ (లెర్నింగ్ అండ్ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్) ఎ.సెంతిల్కుమార్ కార్పొరేట్ నైపుణ్యాలపై విద్యార్థులకు అవగాహన పరిచారు. కార్యక్రమంలో కన్వీనర్ డాక్టర్ నాగేష్.ఎం, అసిస్టెంట్ ప్రొఫెసర్, సోషల్ వర్క్ విభాగం అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీకి చెందిన మూడవ సెమిస్టర్ ఎంబీఏ విద్యార్థి నానిబాబు మరియు ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ మూడవ సెమిస్టర్ విద్యార్థిని సింధుప్రియ, యూజీసీ సెట్ అర్హత సాధించిన విద్యార్థులను అభినందించారు. -
బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలి : కలెక్టర్
విజయనగరం అర్బన్: పేదరిక నిర్మూలనే పీ–4 కార్యక్రమం ప్రధాన లక్ష్యమని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్పష్టం చేశారు. బంగారు కుటుంబాలను దత్తత తీసుకొని వారిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడానికి పారిశ్రామిక వేత్తలు మార్గదర్శులుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో బుధవారం జిల్లాలోని పారిశ్రామిక వేత్తలతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు పేర్కొన్నారు. ఇప్పటి వరకు పారిశ్రామిక వేత్తలు సీఎస్ఆర్ ద్వారా ప్రజలకు పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి చేశారని అన్నారు. ఇకనుంచి పేద కుటుంబాలను వ్యక్తిగతంగా దత్తత తీసుకొని, పేదరికం నుంచి వారు శాశ్వతంగా బయట పడే విధంగా చైతన్య పరచడం, అవసరమైన విద్య, ఇతరత్రా సహకారాన్ని అందించడం చేయాల్సి ఉంటుందన్నారు. బంగారు కుటుంబాల తుది జాబితాను తయారు చేసేందుకు ఈ నెల 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు మరోమారు గ్రామ సభలను నిర్వహిస్తున్నామని తెలిపారు. సమావేశంలో సీపీవో పి.బాలాజీ, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ కరుణాకర్, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సరిత, వివిధ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ప్రాక్టికల్ శిక్షణకు పదిమంది ఎస్సైలు
పార్వతీపురం రూరల్: ఇటీవల శిక్షణ పూర్తి చేసుకున్న ప్రొబేషనరీ సివిల్ ఎస్సైలను ప్రాక్టికల్ శిక్షణ నిమిత్తం పార్వతీపురం మన్యం జిల్లాకు పది మందిని కేటాయించినట్లు విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న 49 మంది ఎస్సైలు ఐదు నెలల ప్రాక్టికల్ శిక్షణకు వెళ్లేముందు బుధవారం విశాఖలో డీఐజీని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డీఐజీ వారితో మాట్లాడుతూ పోలీస్ విభాగంలో విధి నిర్వహణలో నిబద్ధత, నిజాయితీ, సేవా తత్పరత అత్యంత ముఖ్యమని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేర పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానం సాధన, పోలీసులు ఎదుర్కొనే సవాళ్లను అధిగమించడానికి ఎప్పటికప్పుడు అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్లలో విధులు, రికార్డులు, స్థానిక చట్టాలు, భౌగోళిక పరిస్థితులపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేశారు. సహచర ఉద్యోగులు, ప్రజలతో విశ్వాసపూర్వక సంబంధాలు ఏర్పరిచినప్పుడు సమర్థవంతమైన పోలీసింగ్ సాధ్యమవుతుందని చెప్పారు. కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడితో పాటు ఏఎస్ఆర్, విజయనగరం జిల్లాల ఎస్పీలు మరికొందరు అధికారులు, ప్రొబేషనరీ ఎస్సైలు పాల్గొన్నారు. -
పెంచిన సినిమా టికెట్ ధరలు తగ్గించాలి
విజయనగరం గంటస్తంభం: రాష్ట్ర ప్రభుత్వం హర హర వీరమల్లు సినిమా కోసం టికెట్ ధరలు పెంచుతూ తీసుకున్న ఉత్తర్వులు తక్షణమే రద్దు చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట అప్పన్న డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ ఇప్పటికే సామాన్యులకు అన్నింటా అధిక ధరల పెంపుతో చుక్కలు చూపిస్తున్న ప్రభుత్వం చివరికి వినోదం కోసం సినిమా వీక్షించేందుకు థియేటర్లకు వెళ్లినా వదలడం లేదన్నారు. సినిమా విడుదలకు ఒక రోజు ముందు బెనిఫిట్ షో పేరుతో రూ.700 నుంచి రూ.1000 వరకు వసూలు చేయడం దారుణమన్నారు. బెనిఫిట్ షో పేరుతో ప్రేక్షకులను దోపిడీ చేసే విధానాన్ని అదుపు చేయాలని డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కోట అప్పన్న -
అద్దె భవనాల్లో అంగన్వాడీ కేంద్రాలు
● జిల్లాలో 2499 కేంద్రాలు ● వాటిలో మినీ కేంద్రాలు 293 ● ఏడాదికి అద్దె రూపేణా రూ.6 కోట్ల చెల్లింపుత్వరగా పూర్తయ్యేలా చర్యలు అంగన్వాడీ కేంద్రాల భవన నిర్మాణాలు త్వరితగతిన చేపట్టాలని ఆదేశాలు ఇచ్చాం. సంబంధిత సీడీపీఓలను కూడా పర్యవేక్షించాలని చెప్పాం. త్వరితగతిన నిర్మాణం పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం. – టి.విమలారాణి, పీడీ, ఐసీడీఎస్విజయనగరం ఫోర్ట్: అంగన్వాడీ కేంద్రం భవనాల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. భవనాలు మంజూరై ఏళ్లు గడుస్తున్నా వాటి నిర్మాణం పూర్తి కాకపోవడం వల్ల అంగన్వాడీలకు సొంత గూడు కరువవుతోంది. దీంతో అద్దె భవనాల్లోనే అంగన్వాడీ కేంద్రాలను నిర్వహించాల్సిన పరిస్థితి. వివిధ పథకాల కింద జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు భవనాలు మంజూరైనప్పటికీ వాటి నిర్మాణం పూర్తి చేయడంలో అలసత్వం కారణంగా అంగన్వాడీలకు తిప్పలు తప్పడం లేదు. వసతులు లేక, ఇరుకు గదుల్లోనే కేంద్రాలను నిర్వహించాల్సిన దుస్థితి. దీనివల్ల కేంద్రాల్లో చదివే పిల్లలు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో 2499 కేంద్రాలు జిల్లాలో 2499 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వాటిలో 2206 మెయిన్ కేంద్రాలు , 293 మినీ కేంద్రాలు. వాటిలో సొంత భవనాల్లో నడుస్తున్న కేంద్రాలు 792 ఉన్నాయి. అద్దె రహిత భవనాల్లో 494 కేంద్రాలు నిర్వహిస్తున్నారు. అద్దె భవనాల్లో 1213 కేంద్రాలు నిర్వహిస్తున్నారు. అద్దె కేంద్రాలు కూడా ఇరుకుగా ఉండడంతో పిల్లలకు ఆటపాటలతో కూడిన విద్య అందడం లేదు. ఏడాదికి రూ.6 కోట్ల అద్దె చెల్లింపు జిల్లాలోని అద్దె భవనాల్లో అంగన్వాడీ కేంద్రాలకు ఏడాదికి కోట్లాది రుపాయలు అద్దె చెల్లిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాలకు అద్దె రూ.2 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 6 వేల వరకు చెల్లిస్తున్నారు ఏడాదికి వాటికి సుమారు రూ.6 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు అవుతోంది. సొంత భవనాలు మంజూరైనప్పటికీ అద్దె చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. వివిధ పథకాల కింద 919 కేంద్రాలకు భవనాలు జిల్లాలో వివిధ పథకాల కింద 919 అంగన్వాడీ కేంద్రాలకు భవనాలు మంజూరయ్యాయి. వాటిలో 364 భవనాల నిర్మాణం పూర్తయింది. 262 భవనాలకు ఇంకా పునాది రాయి పడలేదు. 288 భవనాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఉపాధి హామీపథకం –1, 2 కింద భవనాల నిర్మాణానికి ఒక్కో దానికి రూ.7.50 లక్షలు, ఆర్డీఎఫ్ కింద ఒక్కో భవనానికి రూ.12 లక్షలు, ఆర్ఐడీఎఫ్–23 పథకం కింద ఒక్కో భవనానికి రూ.11.20 లక్షలు, ఆర్ఐడీఎఫ్–24 కింద ఒక్కో భవనానికి రూ.12 లక్షలు ఎంబీఎంబీ పథకం కింద ఒక్కో భవనానికి రూ. 16 లక్షలు చొప్పన మంజూరయ్యాయి. -
తిరుపతిలో విజయనగరం కళాకారుల ఖ్యాతి
విజయనగరం టౌన్: అభినయ ఆర్ట్స్ అసోసియేషన్ తిరుపతిలో నిర్వహించిన 25వ వార్షిక జాతీయ పద్యనాటకంలో విజయనగరం జిల్లాకు చెందిన శ్రీ శ్యామలాంబ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ అద్భుతమైన ప్రతిభను కనబరిచింది. సత్యానందం నిర్వహణలో ఈపు విజయకుమార్ దర్శకత్వంలో 25 మంది నటీనటులు ఆదికవి నన్నయభట్టు పద్యనాట కాన్ని మహతి ఆడిటోరియంలో ప్రదర్శించి ఆహూతుల మన్ననలు పొందారు. నన్నయ్యగా కె.సూర్యనారాయణ, నారాయణ భట్టుగా సుబ్రహ్మణ్యం, సోమిదమ్మగా పద్మ, రాజరాజనరేంద్రుడిగా సత్యం మాస్టారు, డిండిమభట్టుగా నల్ల శివరాంనాయు డు, దుర్యోధనుడిగా తిరుపతినాయుడు, శకునిగా లింగరాజు, విదురుడుగా రమణారావు, దృతరాష్ట్రుడిగా కృష్ణ గణేష్, సేనాధిపతిగా ఆర్.సూర్యపాత్రో, సామంత రాజుగా ఎల్. వెంకటేశ్వర్లు, వార్తాహరుడిగా పైడినాయుడు, వేద వ్యాసుడిగా వీవీఎస్.ఎస్. గుప్త, భటుడిగా కోండ్రు కృష్ణారావు, సంగీతం త్రినాథ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్వాహకులు టీమ్ను దుశ్సాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లాకు చెందిన కళాకారులు హర్షం వ్యక్తం చేశారు. -
30 కిలోల గంజాయితో ముగ్గురి అరెస్ట్
విజయనగరం క్రైమ్: విజయనగరం రైల్వేస్టేషన్ రోడ్డులోని ఎంఆర్ లాడ్జి ఎదురుగా ముగ్గురు వ్యక్తులు 30 కిలోల గంజాయితో పోలీసులకు పట్టుబడ్డారు. ఈ మేరకు వన్ టౌన్ స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నెల 22న వన్ టౌన్ పోలీసులకు వచ్చిన కచ్చితమైన సమాచారంతో రైల్వేస్టేషన్ రోడ్డులో మాటు వేసి ఉండగా, ముగ్గురు వ్యక్తులు రెండు ట్రాలీ సూట్ కేసులను తోసుకుంటూ ఎంఆర్ లాడ్జి ఎదురుగా వచ్చేసరికి, అనుమానంతో వన్ టౌన్ పోలీసులు సోదా చేశారన్నారు. ఒక ట్రాలీ సూట్ కేసులో 13కిలోలు, మరో సూట్ కేసులో 17కిలోల గంజాయి, నాలుగు ఆండ్రాయిడ్ ఫోన్లు, రెండు కీ ప్యాడ్ ఫోన్లు, రూ.4000 నగదు లభించినట్లు చెప్పారు. పట్టుబడిన నిందితులను (ఎ1) ఒడిశాలోని కలహండి జిల్లా ఉచ్చలకు చెందిన పితాంబర్ నాగ్ (42) (ఎ2) కలహండి జిల్లా బిరుమలకు చెందిన చంద్ర కరుణ్ (35) (ఎ3) చార్బహల్కు చెందిన ప్రదీప్ నాయక్ (40)లుగా గుర్తించామన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచనున్నామని తెలిపారు. -
ఆదర్శ పాఠశాలలో పురుగుల బియ్యం మార్పు
దత్తిరాజేరు: మండలంలోని షికారుగంజి ఆదర్శ పాఠశాలకు వచ్చిన పురుగుల బియ్యంపై బుధవారం సాక్షిలో వచ్చిన కథనంపై పౌర సరపరాల శాఖ అధికారులు స్పందించారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శాంతి ఆదేశాల మేరకు పౌర సరఫరాల శాఖ టెక్నికల్ అసిస్టెంట్ మహేష్ వచ్చి బియ్యాన్ని పరిశీలించి పురుగులు ఉన్నట్లు నిర్ధారించారు. వెంటనే బియ్యాన్ని వ్యాన్లోకి ఎక్కించి కొత్తగా 25 కేజీల బియ్యం ప్యాకెట్లను 32 బస్తాలను ప్రిన్స్పాల్ ఈశ్వరావుకు అందజేశారు. ఇలాంటి పొరప్లాట్లు ఇంకెక్కడా జరగకుండా ముందు జాగ్రత్తలు పాటించనున్నట్లు ఆయన సాక్షితో అన్నారు.పత్రికలో వచ్చిన కథనంతో పురుగుల బియ్యం మార్చి మంచి బియ్యం పాఠశాలకు అందజేయడంతో విద్యార్థులు, తల్లి తండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
మా భూములు మాకివ్వండి
శృంగవరపుకోట: జిందాల్ కర్మాగారం అన్యాయం చేసిన రైతులను ఆదుకోవాలని కేఆర్సీసీ డిప్యూటీ కలెక్టర్ ఇ.మురళిని జిందాల్ నిర్వాసిత రైతులు కోరారు. కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వాసితుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఆయన బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. దీంతో జిందాల్ నిర్వాసితులు ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ నేతృత్వంలో డిప్యూటీ కలెక్టర్ మురళిని కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాడు కంపెనీ ఏర్పాటు చేస్తాం. ఉద్యోగాలిస్తాం. ఉపాధి కల్పిస్తాం. పరిహారం ఇస్తాం. షేర్లు ఇస్తాం. కంపెనీలో వాటాలు ఇస్తామని నమ్మబలికి భూములు కాజేశారన్నారు. 18యేళ్లయినా కంపెనీ ఏర్పాటు చేయనందున మా భూములు మాకు ఇవ్వండని డిమాండ్ చేశారు. అడ్డగోలుగా మిషన్లు తెచ్చి, చెట్లు కూల్చేసి, పంటలు తీసేసి దౌర్జన్యంతో ధ్వంసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు జిందాల్కు కాపలా కాస్తూ, మాపై కేసులు పెడుతున్నారని వాపోయారు. మా భూములు మాకు ఇచ్చి న్యాయం చేయండి అంటూ డిప్యూటీ కలెక్టర్ మురళికి వినతిపత్రం అందజేశారు. జిందాల్ నిర్వాసిత రైతుల డిమాండ్ -
పీ 4 పేరుతో ‘సంక్షేమం’ కట్
పేదల్ని సంపన్నుల్ని చేస్తానంటే అమాయకులైన పేదలు నమ్మి ఐదేళ్లుగా సంక్షేమ పథకాలిచ్చి కుటుంబ ఆర్థిక స్థితి మెరుగుపరిచిన వైఎస్ జగన్మోహన్రెడ్డిని కాకుండా చంద్రబాబును గెలిపించారు. మహిళా లోకానికి ‘ఆడబిడ్డ నిధి’ని ఏర్పాటు చేసి 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడపడుచుకూ నెలకు రూ.1,500 ఇస్తామనడం నుంచి 50 ఏళ్ల మహిళలకు పింఛన్, నిరుద్యోగ భృతి, పొదుపు సంఘాల ఆర్థిక సహాయం వంటి సంక్షేమ పథకాలను ఈ పీ–4 కార్యక్రమానికి జోడించినట్టు చంద్రబాబు ప్రకటించారు. సంపన్నులను చేయడం అంటే ఉన్న సంక్షేమ పథకాలను కత్తిరించి సంపన్నుల మోచేతి కింద బతకడం అని నిరుపేదలకు స్పష్టత ఏర్పడింది. దీంతో ప్రజల నుంచి క్షేత్ర స్థాయిలో వ్యతిరేకత మొదలైంది. -
పిడుగుపాటుతో రైతు మృతి
రేగిడి: రేగిడి మండల పరిధిలోని జాడపేట గ్రామంలో బుధవారం పిడుగుపాటుకు గురై గ్రామానికి చెందిన రైతు అల్లబోయిన శ్రీను (50) మృతిచెందాడు. తన పొలంలో తోటి రైతులతో కలిసి నారు తీస్తున్న సమయంలో ఆయన భార్య నీలవేణి పనులు చేస్తున్న రైతులకు భోజనాలు తీసుకువెళ్లింది. నారు తీసిన అల్లబోయిన శ్రీనుతోపాటు మిగిలిన రైతులు భోజనాలు చేసుకునేందుకు చేతులు శుభ్రం చేసుకుంటున్న సమయంలోనే పిడుగుపడింది. దీంతో సంఘటనా స్థలంలోనే శ్రీను మృతిచెందాడని కుటుంబసభ్యులు తెలిపారు. పక్కనే ఉన్న రైతులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వెంటనే పరిసరాల్లోని రైతులు ఘటనా స్థలానికి వచ్చి అస్వస్థతకు గురైనవారికి సపర్యలు చేశారు. మృతదేహాన్ని రాజాం సామాజిక ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పి.నీలావతి విలేకరులకు తెలిపారు. మరో గ్రామంలో ఆవు.. గుర్ల: మండలంలోని కోటగండ్రేడులో బుధవారం సాయంత్రం కురిసిన చిరు జల్లులతో పాటు పాటు పిడుగులు పడడంతో అదే గ్రామానికి చెందిన ముద్దాడ అప్పలనాయుడి ఆవు మృతి చెందింది. పశువుల శాల పక్కన చెట్టు వద్ద ఉన్న ఆవుపై పిడుగు పడి మృతి చెందడంతో రైతు కన్నీరుమున్నీరవుతున్నాడు. -
పోగొట్టుకున్న బ్యాగ్ లభ్యం
విజయనగరం క్రైమ్: పార్వతీపురం మన్యం జిల్లా నుంచి విజయనగరం వచ్చిన ఓ మహిళ తన బ్యాగ్ పోయిందని వన్టౌన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనతికాలంలోనే ట్రేస్ చేసి ఆ బ్యాగ్ ను బాధితురాలికి పోలీసులు అప్పగించారు. ఈ ఘటనపై వన్ టౌన్ సీఐ చౌదరి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం రావుపల్లికి చెందిన పల్లెం లక్ష్మి తన కుమార్తెను చూసేందుకు బుధవారం విజయనగరం వచ్చి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆటో ఎక్కి, ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ వద్ద దిగిపోయింది. తరువాత ఆటోలో బ్యాగు మర్చిపోయినట్లు గుర్తించి, వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు వన్ టౌన్ సీఐ ఆర్వీఆర్కే చౌదరి ఆదేశాలతో టౌన్ క్రైమ్ ఎస్సై సురేంద్ర నాయుడు, సిబ్బంది ఆటోను ట్రేస్ చేసి ఆటోలో లభించిన బ్యాగ్ను స్వాధీనం చేసుకున్నారు. ఆ బ్యాగులో ఉన్న రెండున్నర తులాల నల్ల పూసల తాడు, రూ.1300 నగదుతో బాధితురాలు లక్ష్మికి సీఐ అప్పగించారు. బాధితురాలికి అందజేసిన పోలీసులు -
వీఆర్ఏల వేతన యాతన
వీరఘట్టం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైనా తమ వేతనాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని వీఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సమాన పనికి సమాన వేతనం అమలు చేయాల్సి ఉన్నా ఇప్పటి దాకా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. రెవెన్యూ శాఖ ద్వారా రాష్ట్రం లేదా కేంద్ర ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా గ్రామస్థాయిలో అది విజయవంతం కావాలంటే దానికి విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్(వీఆర్ఏ)లే కీలకంగా ఉంటారు. కలెక్టర్ నుంచి గ్రామ స్ధాయి వీఆర్వో వరకు ఏ పని జరగాలన్నా దానికి కావాల్సింది వీఆర్ఏలే. రాత్రీపగలు తేడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు డ్యూటీలు వేస్తే మారు మాట్లాడకుండా ఎంత దూరాభారమైనా వెళ్లి రావాల్సిందే తప్ప..ఇదేంటి అని అడిగే అధికారం ఉండదని వీఆర్ఏలు అంటున్నారు. టైం జాబ్గా ప్రారంభమై ఇప్పుడు సమయమే లేని ఉద్యోగంగా తయారైంది. ఎప్పుడు పిలిచినా రావాలి. ఏం చెప్పినా చేయాలనే చందాన అధికారులు వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు. రోజుకు రూ.370 భత్యంతో నెలకు రూ.10,000 నుంచి రూ.11,085 జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు.పేస్కేల్ అమలు చేసి ప్రతి నెలా రూ.18,000 జీతం ఇవ్వాలని ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. సిబ్బంది తక్కువ పని ఎక్కువ.. పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా 15 మండలాల్లో వీఆర్ఏల కొరత తీవ్రంగా ఉంది. మండలానికి కనీసం 45 మంది వీఆర్ఏలు ఉండాల్సి ఉండగా కేవలం 20 నుంచి 35 మంది మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 415 మంది వీఆర్ఏలు ఉండగా సుమారు 100 రెవెన్యూ గ్రామాల్లో వీఆర్ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా రీ–సర్వే, రేషన్ కార్డుల సర్వే, రెవెన్యూ కార్యక్రమాలు ఇతర ఏరకమైన పనులు ఉన్నా వారితోనే చేయించడంతో తీవ్ర పని ఒత్తిడికి లోనవుతున్నారు. తమ పని తాము చేసుకోవడమే చాలా కష్టంగా ఉందని ఇప్పడు రీ–సర్వే పేరుతో ఇతర గ్రామాలకు కూడా పంపించి పని చేయిస్తున్నారని దానివల్ల మాకు కనీస ప్రతిఫలం లేదని వాపోతున్నారు. మంత్రి లోకేష్కు వినతి పత్రం ఇచ్చినా.. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు వీఆర్ఏలకు న్యాయం చేస్తామని ఆనాటి కూటమి నాయకుల వాగ్దానాలు నమ్మి మోసపోయామని వీఆర్ఏలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి జీతాలు పెంచాలని కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీఆర్ఏల సంఘం నాయకులు మంత్రి నారా లోకేష్ను ఒకసారి కలిసి తమ సమస్యలు విన్నవించినప్పటికీ ఎటువంటి ఫలితం లేకుండా పోయిందని మండిపడుతున్నారు. ప్రమోషన్లు ఇవ్వాలి కూటమి ప్రభుత్వంలో మాకు తగిన గుర్తింపు ఇవ్వాలి. వీఆర్ఏలుగా ఎన్నో ఏళ్ల సీనియారిటీ కలిగిన వారిని గుర్తించి ప్రభుత్వం పదోన్నతులు కల్పించాలి. డీఏలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి. చాలీచాలని జీతంతో కుటుంబం గడవాలంటే కష్టంగా ఉంది. ఇప్పటికై నా మా జీతాలు పెంచాలి. – జి.జగన్, వీఆర్ఏ, కంబర కూటమి వచ్చి ఏడాదైనా జీతాలు పెంచలేదని ఆవేదన -
అగ్రిగోల్డు భూముల మ్యుటేషన్ ప్రక్రియ పూర్తిచేయండి
● జేసీ సేతు మాధవన్ విజయగనరం అర్బన్: ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో అగ్రిగోల్డు భూముల మ్యుటేషన్ ప్రక్రియను వెంటనే పూర్తిచేయాలని రెవెన్యూ అధికారులను జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ ఆదేశించారు. అగ్రిగోల్డు భూములకు సంబంధించి జిల్లాస్థాయి కమిటీ సమావేశం జేసీ చాంబర్లో మంగళవారం జరిగింది. రామభద్రపురం, మెంటాడ, గజపతినగరం, విజయనగరం మండలాల్లో ఉన్న అగ్రిగోల్డు సంస్థ ఆస్తులు, వాటి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. భూముల రీ సర్వే, భౌతిక పరిశీలనపై ఆరా తీశారు. మర్కెట్ విలువను లెక్కించి ఇవ్వాలని జిల్లా రిజిస్ట్రార్కు సూచించారు. బుధవారం సాయంత్రంలోగా వ్యవసాయ భూముల మ్యుటేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. భూముల మ్యుటేషన్ పూర్తయిన తరువాత వేలం వేస్తామని చెప్పారు. సమావేశంలో డీఆర్వో ఎస్.శ్రీనివాసమూర్తి, సీఐడీ డీఎస్పీ ఎం.ఎన్.భూపాల్, నాలుగు మండలాల తహసీల్దార్లు, వివిధ శాఖల ప్రతినిధులు, సీఐడీ ఇన్స్పెక్టర్లు, కలెక్టరేట్ అధికారులు పాల్గొన్నారు. పోలీస్ సేవలను మరింత చేరువ చేస్తాం ● ఎస్పీ వకుల్ జిందల్ గంట్యాడ: పోలీస్ సేవలను మరింత చేరువచేసేందుకు పోలీస్ అవుట్పోస్టును ఏర్పాటుచేసినట్టు ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. గంట్యాడ మండలం తాటిపూడి గ్రామంలో ఏర్పాటుచేసిన పోలీస్ అవుట్ పోస్టును మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ కల్పించడం కోసం అవుట్ పోస్టును ప్రారంభించామన్నారు. తాటిపూడి జలాశయం చూసేందుకు, బోటింగ్కు పర్యాటకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని, ఈ ప్రాంతంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. జలాశయంలో బోటింగ్కు వెళ్లే సమయంలో టూరిస్టులు తప్పనిసరిగా లైఫ్ జాకెట్స్ను వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సౌమ్యలత, విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, ఎస్బీ సీఐ ఎ.వి.లీలారావు, విజయనగరం రూరల్ సీఐ బి.లక్ష్మణరావు, ఎస్ఐ డి.సాయికృష్ణ, తదితరులు పాల్గొన్నారు. అంతిమ యాతన..! వేపాడ: మండలంలో వీలుపర్తి గ్రామంలో కొన్ని కులాలకు కేటాయించిన శ్మశానానికి వర్షాకాలంలో వెళ్లాలంటే నరకయాతన తప్పదు. గ్రామానికి చెందిన గుమ్మలగోవింద అనే మహిళ అనారోగ్యంతో మంగళవారం చనిపోయారు. మృతదేహాన్ని తరలించేందుకు రోడ్డు మార్గంలేకపోవడంతో కనుమలచెరువులో నడుంలోతు నీటిలో దిగి తీసుకెళ్లారు. అధికారులు స్పందించి శ్మశానానికి రోడ్డు సదుపాయం కల్పించాలని గుమ్మాల రమణ, లక్ష్మణ తదితరులు కోరారు. -
ఆందోళనలో రైతులు
అర్ధన్నపాలెం, వీరభద్రపురం, చింతలపాలెం గ్రామాల్లో కొండపోరంబోకు భూములు ఉన్నాయి. ఆ భూములు ప్రస్తుతం రైతుల సాగులో ఉన్నాయి. పెదరావుపల్లి గ్రామంలోని సర్వేనంబర్ 48 నుంచి 62 వరకు ఉన్న భూముల్లో సుమారు 60 మంది రైతులు తమ పూర్వీకులనుంచి మామిడి తోటలు సాగుచేస్తున్నారు. ఈ తోటలపై వచ్చే ఆదాయంతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. ఈ భూములపై హక్కులు కల్పించాలని 1986 సంవత్సరంలో రైతులు ఎస్.కోట కోర్టును ఆశ్రయించారు. వారికి అనుకూలంగా 1996లో తీర్పువచ్చినా అప్పటి టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. 2016లో మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా రైతులకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా అధికారులు పట్టించుకోలేదు. 2019 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2022లో గ్రామంలో సమగ్ర రీ సర్వే నిర్వహించి రైతులందరికీ డీ పట్టాలను అందజేసింది. రైతులకు శాశ్వత హక్కులను కల్పిస్తూ పట్టాదారు పుస్తకాలను కూడా జారీచేసింది. -
‘ఆడబిడ్డ నిధి’కి ఎగనామం!
ఎన్నికల సమయంలో ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన పేదకుటుంబాల మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని విస్మరించేలా.. పథకం అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ను అమ్మేయాలన్న వ్యవసాయశాఖమంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై మహిళాలోకం భగ్గుమంటోంది. కూటమి తీరును వైఎస్సార్సీపీ నేతలు దుయ్యబట్టారు. – రాజాం/బొబ్బిలి/దత్తిరాజేరు మహిళలంటే చిన్నచూపు కూటమి ప్రభుత్వానికి మహిళలంటే చిన్నచూపు. ఎన్నికల్లో 18 ఏళ్లు నిండిన అర్హులైన మహిళలందరికీ ఆడబిడ్డ నిధి పథకం కింద నెలకు రూ.1500 ఇస్తామని నమ్మించారు. తీరా పథకం అమలుచేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలంటూ మంత్రి అచ్చెన్నాయుడు మాటలు చూస్తుంటే మహిళలను మోసం చేసేందుకు సిద్ధమైనట్టే కనిపిస్తోంది. దీనిపై మహిళలు ఉద్యమించాలి. నాయకులను ప్రశ్నించాలి. – బొత్స అప్పలనరసయ్య, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే ఆ రోజు ఈ లెక్కలు ఏమయ్యాయి గెలుపే లక్ష్యంగా చేసుకుని లేని పోని హామీలు ఇవ్వడం టీడీపీ నేతలకు వెన్నతో పెట్టిన విద్య. ఈ దఫా సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతలు ఎంతగా ఓటర్లను మోసగించారో ఇప్పుడిప్పుడే ప్రజలు గమనిస్తున్నారు. అర్హులైన మహిళలందరికీ నెలకు రూ. 1500 చొప్పున ఆడబిడ్డ నిధి ఇస్తామని చెప్పి, ఇప్పుడు పథకం అమలుచేయలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని చెప్పడం విచారకరం. ఎన్నికలముందు సూపర్సిక్స్ హామీలు ఇచ్చినప్పుడు ఈ లెక్కలు ఏమయ్యాయో అచ్చెన్నాయుడే చెప్పాలి. – డాక్టర్ తలే రాజేష్, వైఎస్సార్ సీపీ రాజాం నియోజకవర్గ ఇన్చార్జ్ రాష్ట్రాన్ని అమ్మి పథకాలిస్తామని నాడు హామీ ఇచ్చారా? ప్రజలకు ఏ పథకాలు అమలు చేస్తే సుభిక్షంగా ఉంటారో ఆలోచించి పార్టీలు వారి మేనిఫెస్టోను ప్రచారం చేస్తాయి. మాటమీద నిలబడి వాటిని ఎంత కష్టమైనా అమలు చేస్తాయి. టీడీపీ అధికారంలోకి వస్తే అమలు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను అమలు చేయడానికి రాష్ట్రాన్ని అమ్మేయాలని అనడం దారుణం. ప్రజలకు పార్టీల మీద, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం పోయే విధంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడటం దారుణం. ఆడబిడ్డ నిధి అమలు చేయకపోగా దానిని అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలని మహిళల సాక్షిగా వెకిలి నవ్వులు నవ్వుతూ ప్రసంగించడం అన్యాయం. అసలు మీరు రాష్ట్రాన్ని అమ్మేసి పథకాలు అమలు చేస్తామని గద్దెనెక్కారా? అప్పుడు అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ అమలు చేసి చూపించడంతో మరిన్ని పథకాలు అమలు చేస్తామన్నారు. సంపద సృష్టిస్తామన్నారు. ఇప్పుడు అమ్మేయాలంటున్నారు. ఏంటో మీ విధానాలు? ప్రజలంతా గమనిస్తున్నారు. త్వరలోనే మీరు పుట్టిమునిగే పరిస్థితులు వస్తాయి. – శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, మాజీ ఎమ్మెల్యే, బొబ్బిలి -
దేవదాయశాఖ భూముల పరిరక్షణకు చర్యలు
రాజాం: దేవదాయ, ధర్మాదాయశాఖకు చెందిన భూములను పరిరక్షిస్తామని ఆ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ కె.శిరీష తెలిపారు. రాజాం పట్టణంలో జీఎంఆర్ కేర్ ఆస్పత్రి రోడ్డులోని దేవదాయశాఖ భూములను మంగళవారం పరిశీలించారు. అక్రమ నిర్మాణాలు చేపట్టినవారిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. నెలరోజుల్లో అంతా ఖాళీచేయాలని ఆక్రమణదారులకు నోటీసులు జారీచేశామని, మరో వారం రోజులు గడువు ఇస్తున్నామని, ఖాళీ చేయకుంటే మొత్తం తొలగిస్తామని హెచ్చరించారు. డోలపేటలోని శ్రీ ఉమామహేశ్వర, లక్ష్మీనారాయణ స్వామి దేవాలయాలకు చెందిన భూముల స్వాధీనానికి కోర్టు ఆదేశాలిచ్చిందన్నారు. ఆక్రమణదారులు ధర్మంగా ఖాళీ చేస్తే మంచిదని, లేదంటే చట్టపరమైన శిక్ష తప్పదన్నారు. దేవదాయశాఖ భూముల్లోని దుకాణాలన్నింటిని వారంరోజులు తర్వాత తమ ఆధీనంలోకి తీసుకుని, మరో 15 రోజులు తర్వాత వేలంపాట వేసి అప్పగిస్తామన్నారు. జీఎంఆర్ ఐటీ కళాశాల పక్కన దేవదాయశాఖ భూమిలో వెలసిన దుకాణాలను సీజ్ చేశారు. రాజాం పట్టణంలో సారధిలో పలు వీధుల్లో నిషేధిత జాబితాలో ఉన్న భూములు పరిశీలించారు. కస్పావీధి, ఠాణావీధి, ఆశపు వీధి, అగ్రహారం వీధి ప్రాంతాల్లోని దేవదాయశాఖ భూములను సర్వేయర్ సత్యనారాయణ సమక్షంలో సర్వేచేయించారు. నివేదికలు ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. ఆమె వెంట ఈఓ మాధవరావు, వాకచరల్ల రాజా, అమర్, శంకర్, శ్రీరాములు, మురళీ తదిరుల ఉన్నారు. ఆక్రమణదారులకు నోటీసులు వ్యాపారులకు హెచ్చరికలు జారీచేసిన దేవదాయశాఖ ఏసీ శిరీష -
ఎర్ర చందనం..!
అందానికి అందంభామిని: కళ్లు చెదిరే ధర..మన్నికకు మన్నిక..ఇంట్లో ఉంటే శుభకరం.. ఏజెన్సీ ప్రాంతాల్లో పెరుగుతున్న ఎర్రచందనం తోటలు అందానికి అందంగా ఉంటూ స్థిరాస్తిగా మొక్కల సాగు చేపడుతున్నారు. ఎర్ర చందనం ప్రత్యేకతలెన్నో దీని శాసీ్త్రయ నామం టేరోకార్పస్ శాంటాలినస్. దీని కాండంలోని చేవ(ముదిరిన భాగం)కుంకుమ రంగులో ఉండడంతో రక్త చందనంగా పిలుస్తారు. చెట్టును నరికే సమయంలో సువాసన వెదజల్లుతుంది. శాఖోపశాఖలు లేకుండా నిటారుగా చెట్లు పెరుగుతాయి. దీని కాండం సుమారు 50 నుంచి 150 సెంటీమీటర్లు మాత్రమే విస్తరిస్తుంది. 20 నుంచి 30 అడుగుల వరకు చెట్లు నిటారుగా పెరుగుతాయి. పొలం గట్లు, ఇతర పంటలలో సాగుచేసినా పంటలకు నష్టం ఉండదు. దశాబ్దాల కాలంలో చెట్లు చేవదేరుతాయి. కొట్టేసిన చెట్లు మొదళ్ల నుంచి మళ్లీ మొలకలు పుట్టి చెట్లుగా ఎదగడం దీని ప్రత్యేకత. ఎర్రచందనం కలప దుంగల సాంద్రత నీటి స్పెసిపిక్ గ్రావిటీ కంటే తక్కువ కావడంతో నీటిలో మునుగుతాయి. ఏజెన్సీల్లో విస్తరణ.. రెడ్శాండిల్ తోటలు పార్వతీపురం మన్యం జిల్లా సరిహద్దు ఏజెన్సీ ప్రాంతాలకు పాకుతున్నాయి. భామిని, సీతంపేట, పాలకొండ, పార్వతీపురం, కొమరాడ, మక్కువ, కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాల్లో రెడ్ శాండిల్ తోటలు విస్తరిస్తున్నాయి. ప్రధానంగా తివ్వాకొండ పరిసరాల్లో గిరిజనులు సైతం సాగు చేస్తున్నారు. కడియం నర్సరీ నుంచి అంటుకట్టిన మొక్కలు సులభంగా గ్రామాలకు చేరుతున్నాయి. చివరికి అటవీశాఖ నిర్వహించే సామాజిక నర్సిరీలలోనూ రెడ్శాండిల్ మొక్కలు పెంచి పంపిణీ చేస్తున్నారు. కొండ ప్రాంతాలతో పాటు పల్లపు ప్రాంతాల్లోనూ, రియల్ ఎస్టేట్ రంగంలో శాండిల్ సిటీలు వ్యాప్తి చెందుతున్నాయి. విద్యాసంస్థలలో సుందరంగా రక్త చందనం చెట్లు తోపులుగా పెరుగుతున్నాయి. సాగుకు ప్రోత్సాహం.. అంతరించిపోతున్న వృక్ష,జంతు జాతుల వాణిజ్యంపై అంతర్జాతీయ ఒడంబడిక(సైట్స్) గతంలో విధించిన నిషేధాన్ని సడలించింది. ఎర్రచందనంతో తయారు చేసిన సంగీత వాయిద్యాలు, పరికరాలు, రసాయనాలు, రంగుల వంటి విలువ ఆధారిత ఉత్పత్తుల ఎగుమతులకు అనుమతులు ఇవ్వడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. ఔషధ గుణాలు మిన్న స్థిరాస్తిగా సాగు తరాలుగా చెక్కుచెదరని దృఢత్వం యథేచ్ఛగా మొక్కల అమ్మకం -
సుపరిపాలన తొలిఅడుగు విఫలం
చికెన్బ్రాయిలర్ లైవ్ డెస్డ్ స్కిన్లెస్ శ్రీ105 శ్రీ180 శ్రీ190రేగిడి: కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. గ్రామాల్లోకి కూటమి ప్రభుత్వ నాయకులు వెళ్లేటప్పుడు స్పందన కరువవడంతోనే ఈ కార్యక్రమం విఫలమైందన్నారు. ఈ మేరకు మంగళవారం రేగిడి వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చకపోవడంతో గ్రామాల్లోకి వెళ్తున్న నాయకులను ప్రజలు నిలదీస్తుండడంతో నాయకులు కూడా ఈ కార్యక్రమంలో తూతూ మంత్రంగా పాల్గొంటున్నారన్నారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు చంద్రబాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని గ్రామాల్లోకి వెళ్లి నిర్వహిస్తుంటే ప్రజల నుంచి మంచి విశేష స్పందన వస్తోందన్నారు. 2024 జనవరి నెలలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొత్త పింఛన్లు మంజూరుచేస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఒక్క కొత్త పింఛన్ కూడా మంజూరుచేయలేదని ఎద్దేవా చేశారు. కొత్త పింఛన్ల కోసం వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు ఎదురు చూస్తున్నారని అన్నారు. తల్లికి వందనం ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని కలెక్టర్ గ్రీవెన్స్కు వస్తున్న ఫిర్యాదులను ప్రభుత్వం గమనించాలని సూచించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు టంకాల అచ్చెన్నాయుడు, పార్టీ మండల అధ్యక్షుడు వావిలపల్లి జగన్మోహనరావు, ఉపాధ్యక్షుడు కెంబూరు వెంకటేశ్వరరావు, కరణం శ్రీనివాసరావు, కెల్ల మన్మథరావు, కింజరాపు సురేష్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ -
జగనన్న ప్రభుత్వం హక్కులు కల్పించింది
ఏళ్ల తరబడి భూ హక్కుల కోసం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకపోయింది. గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం భూముల రీ సర్వేలో మాకు శాశ్వత హక్కులు కల్పించింది. ఏళ్లతరబడి సాగుచేస్తున్న భూములను ఏవో కొత్తకొత్త ప్రాజెక్టుల పేర్లు చెప్పి కాజేసేందుకు కూటమి పెద్దలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే మా గ్రామంలో సగం భూములను కారుచౌకగా పతంజిలి సంస్థకు కట్టబెట్టారు. మరో మారు మా భూములు ఇచ్ఛే ప్రసక్తేలేదు. – కిలపర్తి పరిదేశినాయుడు, ఎంపీటీసీ, పెదరావుపల్లి గ్రామం బలవంతంగా లాక్కుంటారా? దశాబ్దాలుగా సాగుచేస్తున్న మా భూములకు గత ప్రభుత్వం హక్కులు కల్పించింది. ఇప్పడు కూటమి ప్రభుత్వం లాక్కునేందుకు చూస్తోంది. ఇప్పటికే మేము చాలా నష్టపోయాం. ప్రభుత్వ పెద్దలు గ్రహించాలి. – కిలపర్తి రామకృష్ణ, రైతు, పెదరావుపల్లి గ్రామం -
రైతు ఇంట్లో చోరీ
పార్వతీపురం రూరల్: పట్టణ పరిధి శివారు ప్రాంతంలో ఉన్న ఆశాజ్యోతి ఆశ్రమం సమీపంలో ఓ రైతు ఇంట్లో మంగళవారం చోరీ జరిగినట్లు పట్టణ ఎస్సై జగదీష్ నాయుడు తెలిపారు. ఈ మేరకు ఆయన వివరాలు వెల్లడిస్తూ ఆశాజ్యోతి ఆశ్రమం సమీపంలో నివాసం ఉంటున్న వంగపండు తిరుపతి రావు అనే వ్యక్తి భార్యతో కలిసి మంగళవారం వేకువజామున నాలుగు గంటల సమయంలో పొలం పనుల నిమిత్తం వెళ్లి పనులు ముగించుకుని మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఇంటికి వెళ్లి చూడగా బీరువా తెరచి ఉన్నట్లు గమనించారని, బీరువాలో ఉన్న నాలుగున్నర తులాల బంగారంతో పాటు రూ.20 వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించిన బాధితుడు తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఐదో సారీ..!
నాపై కక్ష సాధింపు కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నాపై కక్ష సాధింపు జరుగుతోంది. ఇప్పటికే ఐదుసార్లు ఎలాంటి కారణం లేకుండానే సస్పెన్షన్ విధించారు. నాలుగు సార్లు హైకోర్టును ఆశ్రయించి ఉత్తర్వులు తెచ్చుకున్నాను. అయినప్పటికీ మళ్లీ నా పొట్టకొట్టేందుకు సిద్ధపడ్డారు. మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయం కోసం పోరాటం చేస్తాను. – నీలకంఠం, రేషన్ డిపో డీలర్, పత్తికాయవలస, చీపురుపల్లి మండలంఫిర్యాదు మేరకు చర్యలు పత్తికాయవలస డీలర్పై పీజీఆర్ఎస్లో ఫిర్యాదులు అందాయి. వృద్ధులు, దివ్యాంగుల వేలిముద్రలు వేయించుకుని సరుకులు ఇవ్వడం లేదని ఫిర్యాదులు ఉన్నాయి. దీనిపై సీఎస్డీటీ నేతృత్వంలో విచారణ నిర్వహించాం. దీంతో పాటు డిపోలో సరుకుల నిల్వలో కూడా తేడాలు ఉన్నట్లు సీఎస్డీటీ, క్షేత్రస్థాయి అధికారులు గుర్తించి రిపోర్టు సమర్పించారు. దీనిపై విచారణ చేసి రేషన్ డిపో స్వాధీనం చేసుకుని పక్క గ్రామం డీలర్కు అప్పగించాం. పూర్తి నివేదికను ఆర్డీఓకు సమర్పిస్తున్నాం. ఆర్డీఓ నేతృత్వంలో తదుపరి చర్యలు తీసుకోనున్నారు. – డి.ధర్మరాజు, తహసీల్దార్, చీపురుపల్లి -
ఏం తిని బతకాలి
ఇప్పటికే సగానికి పైగా పరిశ్రమల పేరిటి మా భూములను గతంలో తెలుగుదేశం ప్రభుత్వం తీసేసుకుంది. ఆ భూముల్లో పరిశ్రమలు కట్టారా అంటే అదీలేదు. మరో మారు ఉన్న భూములు కూడా తీసేసుకుంటామంటే ఏం తినిబతకాలి. పచ్చపార్టీవారికి మా భూములే కనిపిస్తున్నాయా?. – పోలిపర్తి అప్పారావు, రైతు, పెదరావుపల్లి గ్రామం వీఎంఆర్డీకి నివేదికలు పంపాం ప్రస్తుతానికి చింతలపాలెం గ్రామం రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 103లో సుమారు 50 ఎకరాలకు సంబంధించిన నివేదికలను వీఎంఆర్డీకి పంపించాం. ఆ భూమి పూర్తిగా కొండపోరంబోకు. రైతుల అనుభవంలో లేనట్టు గుర్తించాం. మిగిలిన గ్రామాల్లోని భూముల వివరాలను సేకరిస్తున్నాం. వాటి వివరాలను త్వరలోనే నివేదిస్తాం. – పి.అప్పలరాజు, తహసీల్దార్, కొత్తవలస -
రోజుకో పంచలో పాఠశాల
సాలూరు రూరల్: మండలంలోని గంగన్న దొరవలస ప్రాథమిక పాఠశాలను రోజుకో పంచలో ఉపాధ్యాయులు నిర్వహిస్తున్నారు. పాఠశాల పాతభవనం శిథిలావస్థకు చేరుకోవడంతో దాని స్థానంలో కొత్తభవనం నిర్మాణానికి గత ప్రభుత్వంలో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా నిధులు మంజూరు చేశారు. అయితే అప్పట్లో పనులు ప్రారంభించినప్పటికీ ఎన్నికల కారణంగా మధ్యలో భవన నిర్మాణం నిలిచిపోవడంతో విద్యార్థులకు నీడలేకుండా పోయింది. నిర్మాణంలో ఉన్న భవనం పక్కన చిన్న రేకుల షెడ్డులో 1,2 తరగతులు నిర్వహిస్తున్నారు. అలాగే 3,4,5 తరగతులు గ్రామంలో ఎవరి గడప ఖాళీగా ఉంటే వారి గడపలో తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితి ఏడాదిగా కొనసాగుతున్నా ఇంతవరకు కూటమి ప్రభుత్వం పాఠశాల భవనానికి నిధులు మంజూరై ఉన్నప్పటికీ పనులు కొనసాగించకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడాల్సి వస్తోంది. కూటమి ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యం ఇస్తామని ఒక వైపు ఊకదంపు డు ప్రచారం చేస్తుంటే మరోవైపు గ్రామాల్లో విద్యార్థులకు నిలువ నీడలేకుండా పోతోంది. మంత్రికి విన్నవించినా స్పందన శూన్యం 5 నుంచి పది సంవత్సరాల వయసు ఉన్న విద్యార్థులు తమకు విద్యాబోధనకు ఒక చిన్న భవనాన్ని నిర్మించండి. రోజుకో పంచలో మా చదువులు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితి ఏడాది కాలంగా జరుగుతోందని ఇటీవల కురుకూటి గ్రామంలో జరిగిన కూటమి ప్రభుత్వం తొలిఅడుగు సుపరిపాలన కార్యక్రమానికి వెళ్తున్న మంత్రి సంధ్యారాణి కాన్వాయిని అడ్డుకుని గ్రామస్తులతో పాటు విద్యార్థులు విన్నవించుకున్నారు. అయితే ఆ సమయంలో వినతిపత్రం ఇస్తున్నట్లు సెల్ఫోన్లో తీసిన ఫొటోలను మంత్రి సంధ్యారాణి దగ్గరుండి మరీ తొలగించినట్లు ఆ పార్టీ కార్యకర్తలే చెప్పుకుంటున్నారు. వినతి పత్రం ఇస్తున్నట్లు తీసిన ఫొటోలు తొలగించడంపై గ్రామంలో ఉన్న ఆ పార్టీ నాయకులే ముక్కున వేలేసుకుంటున్నారు. గోడు వెళ్లబోసినా పట్టించుకోని మంత్రి సంధ్యారాణి -
● పైడితల్లికి ఆషాఢం సారె
ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారికి మంగళవారం సాయంత్రం శ్రీ సింహాశైల సేవా సమితి ప్రతినిధి, టీటీడీ ధార్మిక కమిటీ సభ్యురాలు ఎన్.హరిలక్ష్మి ఆధ్వర్యంలో ఆషాఢం సారెను భక్తులు సమర్పించారు. విజయనగరం లయన్స్ క్లబ్ వద్ద నుంచి కోట కూడలి మీదుగా మేళతాళాలు, కోలాట ప్రదర్శనలు, పులివేషధారణలు, భక్తుల భజనల నడుమ ఊరేగింపుగా సారెను తీసుకెళ్లారు. అమ్మవారికి పసుపు, కుంకుమలు, పువ్వులు, వివిధ రకాల స్వీట్లు, పండ్లను సమర్పించారు. ఆలయ అధికారులు, సిబ్బంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు. – విజయనగరం టౌన్ -
వ్యాధులు ప్రబలకుండా చూడాలి
సీతానగరం: గ్రామాల్లో ఆరోగ్య సర్వేలు పక్కాగా చేపట్టి ప్రజలు రోగాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి.జగన్ మోహనరావు పేర్కొన్నారు. ఈ మేరకు బూర్జ గ్రామంలో నిర్వహించిన సంచార చికిత్స వైద్య శిబిరాన్ని సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య తనిఖీలు, అందజేస్తున్న చికిత్స వివరాలు ఈ సందర్భంగా రికార్డుల్లో పరిశీలించారు. అనారోగ్య సమస్యలను స్పష్టంగా నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ రమ్య, సీహెచ్ఓ గాయత్రి, 104 సిబ్బంది, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
అర్జీదారులు సంతృప్తిచెందేలా పరిష్కారం
● కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్విజయనగరం అర్బన్: ప్రజావినతుల పరిష్కార వేదికకు వచ్చే అర్జీదారుల వినతులను వారు సంతృప్తిచెందే విధంగా సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, డిప్యూటీ కలెక్టర్లు మురళి, ప్రమీలా గాంధీ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజలు అందజేసిన అర్జీలపై సంబంధిత అధికారులకు వెంటనే కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలు పునరావృతం కాకుండా నాణ్యతతో పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీదారుల సమస్యల పరిష్కారంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదని అర్జీదారు సంతృప్తిచెందేలా సమస్యలను వేగంగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. సోమవారం పీజీఆర్ఎస్కు ప్రజల నుంచి వచ్చిన వినతుల్లో పీజీఆర్ఎస్ పోర్టర్లో ఆన్లైన్లో నమోదు చేస్తూ స్వీకరించినవి 178 ఉన్నాయి. వాటిలో అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి భూ సమస్యల అర్జీలు 86 వరకు ఉన్నాయి. పింఛన్లు మంజూరు చేయాలని తదితర అంశాలపై డీఆర్డీఏకు 27, మున్సిపాలిటీకి 11, విద్యాశాఖకు 10, విద్యుత్, పంచాయతీ రాజ్ శాఖలకు చెరో 6, వైద్యశాఖకు రెండు వినతులు వచ్చాయి. అదే విధంగా సచివాలయ సిబ్బంది ఆఫ్లైన్లో స్వీకరించిన ఫిర్యాదుల్లో ‘తల్లికి వందనం’ పథకానికి అర్హులమైనా మంజూరు కావడం లేదన్న అందిన వినతులు మరో 120 వరకు ఉన్నాయి. ఎస్పీ పీజీఆర్ఎస్కు 39 ఫిర్యాదులు విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్పీ వకుల్ జిందల్ బాధితుల నుంచి 39 ఫిర్యాదులు స్వీరించారు. కార్యక్రమంలో వారి సమస్యలను శ్రద్ధగా విని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్స్తో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఫిర్యాదుదారుల సమస్యలను సంబంధిత సిబ్బందికి వివరించారు. మొత్తం 39 ఫిర్యాదులు రాగా అందులో భూతగాదాలకు సంబంధించి 11, కుటుంబ కలహాలకు సంబంధించి 5, మోసాలకు పాల్పడినట్లు 5, ఇతర అంశాలకు సంబంధించి 18 ఫిర్యాదులు ఉన్నాయి. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, డీసీఆర్బీ సీఐ బి.సుధాకర్, ఎస్సై ప్రభావతి, సిబ్బంది పాల్గొన్నారు. -
వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు
పార్వతీపురం రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అధికారులకు తేల్చిచెప్పారు. అర్జీలపై సత్వరమే స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు సోమవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక, ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాత్సవ, డీఆర్ఓ కె.హేమలత, ఎస్డీసీ ధర్మచంద్రారెడ్డి, డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణిలు 148 వినతులను వివిధ వ్యక్తిగత, సామాజిక సమస్యలపై స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అధికారుతో మాట్లాడుతూ అర్జీలను పరిశీలించి నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్జీదారు సంతృప్తి చెందేలా వేగంగా పరిష్కరించినపుడే అధికారులపై విశ్వాసం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఫిర్యాదులపై సత్వరమే పరిష్కారం ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తన వద్దకు వచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించేందుకు సంబంధిత స్టేషన్ అధికారులకు ఫోన్లో ఆదేశాలు జారీ చేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించి, వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకుని ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు. వచ్చిన ఫిర్యాదుల్లో ప్రధానంగా కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, భర్త/అత్తారింటి వేధింపులు, భూ–ఆస్తి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ఆన్లైన్ మోసం, ప్రేమ పేరుతో మోసం, ఇతర సమస్యలపై ఫిర్యాదుదారులు స్వేచ్ఛగా విన్నవించు కోగా, వారి సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో స్వయంగా ఫోన్లో ఎస్పీ మాట్లాడి ఫిర్యాదు అంశాలను పరిశీలించి, వాస్తవాలైతే చట్టపరిధిలో తక్షణ చర్యలు చేపట్టాలని, తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను జిల్లా పోలీసు ప్రదాన కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. కార్యక్రమంలో మొత్తం 10 ఫిర్యాదులు అందగా ఎస్బీ సీఐ రంగనాథం, డీసీఆర్మీ సీఐ ఆదాం, ఎస్సై ఫకృద్దీన్, సిబ్బంది పాల్గొన్నారు. ఐటీడీఏ పీజీఆర్ఎస్కు 95 అర్జీలు సీతంపేట: స్థానిక ఐటీడీఏలో పీఓ సి.యశ్వంత్కుమార్ రెడ్డి సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల వేదికకు 95 వినతులు వచ్చాయి. మండలంలోని పులిపుట్టి పంచాయితీ కొత్తగూడకు చెందిన సవర ప్రశాంత్కుమార్ అటవీపట్టా ఇప్పించాలని అర్జీ ఇచ్చారు. తమకు కుట్టుమిషన్లు మంజూరు చేయాలని అనిత,అశ్విని, సంధ్యారాణిలు విన్నవించారు. పులిగుమ్మికి చెందిన కూర్మారావు డైరీఫారం మంజూరు చేయాలని కోరగా సిరికొండ ఒబ్బంగికి చెందిన ఊర్లక శారద ఆశవర్కర్ పోస్టు కావాలని కోరింది. ఆశ్రమపాఠశాలలో అవుట్సోర్సింగ్ పోస్టు ఇప్పించాలని దీనబంధు, భూమి ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని వాబ గ్రామానికి చెందిన శంకరరావు వినతి ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీఓ చిన్నబాబు, పీహెచ్వో ఎస్వీ గణేష్, ఏపీడీ సన్యాసిరావు, జీసీసీ మేనేజర్లు డి.కృష్ణ, జి.నరసింహులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ -
పలు సమస్యలపై జేసీకీ ఎస్ఎఫ్ఐ వినతి
విజయనగరం గంటస్తంభం: భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) విజయనగరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమంలో పలు సమస్యలపై జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి.రాము, సీహెచ్ వెంకటేష్ లు మాట్లాడుతూ జిల్లాలో బీసీ సంక్షేమ హాస్టల్స్లో పరిస్థితి అగమ్య గోచరంగా ఉందన్నారు. ప్రధానంగా పూసపాటి రేగ మండలంలో బీసీ కాలేజ్ హాస్టల్లో ఇప్పటికీ తాగునీరు సదుపాయం లేదని, అక్కడ ఉన్న విద్యార్థులు తాగడానికి మురుగునీరే శరణ్యమైందని విమర్శించారు. గతంలో ఎస్ఎఫ్ఐ ఆమరణ నిరాహారదీక్షలు చేసినప్పుడు సాక్షాత్తు కలెక్టర్ ఆ హాస్టల్ కు ఆర్వో ప్లాంట్ హామీ ఇచ్చారని నేటికి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు ఆ హామీ నెరవేర్చలేదని విమర్శించారు. తక్షణమే పూసపాటి రేగ మండల కేంద్రంలో ఉన్న బీసీ కాలేజ్ హాస్టల్కు ఆర్వో వాటర్ ప్లాంట్ సదుపాయం కల్పించాలని కోరారు. భోగాపురం మండలంలో శిథిలావస్థలో బీసీ చిన్నపిల్లల హాస్టల్ ఉందని అది శిథిలావస్థకు చేరుకుని మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు పక్కా భవనం నిర్మాణం చేయలేదన్నారు. దాని కారణంగా 100కు పైగా ఉండే విద్యార్థులు ఇప్పుడు 20కు పడిపోయారన్నారు. తక్షణమే జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి ఆ హాస్టల్ నిర్మాణానికి నిధులు విడుదల చేసి నిర్మాణం ప్రారంభించాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఒకే ఒక్క బీసీ అమ్మాయిల కాలేజ్ హాస్టల్ ఉందని ఆ హాస్టల్ నందు దాదాపు 260 మంది విద్యార్థులు వసతి పొందడం ప్రభుత్వం దౌర్భాగ్య పరిస్థితిని చూపెడుతోందని విమర్శించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరో బీసీ అమ్మాయిల కాలేజ్ హాస్టల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఒ.రవికుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.రమేష్, కె.రాజు పాల్గొన్నారు. -
వ్యాధులపై అవగాహన కల్పించేందుకే కళాజాతా
పార్వతీపురం: గిరిజన గ్రామాల్లో సీజనల్ వ్యాధుల గురించి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు కళాజాతాను ఏర్పాటు చేస్తున్నట్లు ఐటీడీఏ పీఓ, పార్వతీపురం సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అన్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం స్థానిక ఐటీడీఏ కార్యాలయం ప్రాంగణంలో కళాజాతా ప్రదర్శన తీరును ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ జ్వరాలపై జాగ్రత్తలు, అందుబాటులో ఉన్న వైద్యసేవలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కళాజాతాలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. గిరిజన గ్రామాల్లో షెడ్యూల్ వారీగా ప్రదర్శన చేయాలని కోరారు. కళాజాతాపై గ్రామాల్లో ముందు రోజు తెలియజేయాలని సూచించారు. వసతి గృహ విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిసారించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీఓ పి.మురళీధర్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.కేవీఎస్.పద్మావతి, డీఐఓ డా.జగన్మోహన్రావు, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ హెచ్సీ మృతి
డెంకాడ: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ చింతలవలస ఐదవ ఏపీఎస్పీ బెటాలియన్ హెడ్కానిస్టేబుల్, ఏపీ పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోరాడ రామునాయుడు(49) సోమవారం మరణించారు. గత నెల 23న చింతలవలస ఐదవ ఏపీఎస్పీ బెటాలియన్ మెయిన్ గేట్ సమీపంలో విజయనగరం–విశాఖ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో హెచ్సీ రామునాయుడు తీవ్ర గాయపడ్డారు. గాయపడిన ఆయనను విశాఖలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మరణించారు. రామునాయుడు మృతదేహాన్ని విజయనగరంలోని కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తీసుకువచ్చారు. పోస్టుమార్టం అనంతరం రామునాయుడు పార్థివ దేహాన్ని స్వగ్రామమైన విశాఖపట్నం జిల్లాలోని పద్మనాభం మండలంలోని కోరాడ గ్రామానికి తరలించారు. రామునాయుడు మరణించడంతో గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది. మృతుడు హెచ్సీకి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మృతుడి భార్య సూర్యకాంతం డెంకాడ మండలంలోని మోపాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్నర్స్గా విధులు నిర్వహిస్తున్నారు. పెద్దకుమార్తె మౌనిషసాయి ఎంబీబీఎస్ చదువుతుండగా చిన్నపాప దాషిని ఇంటర్ పూర్తి చేసింది. కోరాడ రామునాయుడు మరణవార్త బెటాలియన్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రగాఢ సంతాపం మరణించిన హెచ్సీ కోరాడ రామునాయుడు కుటుంబానికి పలువురు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. విజయనగరం కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో హెచ్సీ కోరాడ రామునాయుడు మృతదేహాన్ని నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు సందర్శించి నివాళి అర్పించారు. బెటాలియన్ అదనపు కమాండెంట్ సి.రాజారెడ్డి, పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది, బెటాలియన్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు ఎం.అప్పలనాయుడు, డెంకాడ, పద్మనాభం మండలాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. -
మందు పిచికారీచేసిన గడ్డినితిని ఏడు మేకల మృతి
మక్కువ: మండలంలోని డి.శిర్లాం, గోపాలపురం గ్రామాల సమీపంలోని ఓ పామాయిల్తోటలో గడ్డి నివారణ కోసం మందును రైతు పిచికారీచేయడంతో, పంటపొలంలోని ఆ గడ్డిని తిని ఏడు మేకలు సోమవారం మృతిచెందాయి. గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు మేతకోసం సుమారు 200గొర్రెలు, మేకలను పంటపొలాల వైపు తరలించారు. పామాయిల్ తోటలో గడ్డిని మేకలు మేస్తుండగా, ఒక్కసారిగా అస్వస్థతకు గురి కాగా వాటిలో ఏడు మేకలు అక్కడికక్కడే మృతిచెందాయి. విషయం తెలుసుకున్న పశువైద్యసిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని అస్వస్థతకు గురైన మేకలకు వైద్యచికిత్స అందించారు. మృతిచెందిన ఏడు మేకల విలువ సుమారు రూ.2లక్షల వరకు ఉంటుందని గొర్రెల కాపరులు లబోదిబోమన్నారు. -
నిబంధనలు పాటించని కళాశాలలపై చర్యలు తీసుకోండి
విజయనగరం గంటస్తంభం: జిల్లాలో నిబంధనలు పాటించని కళాశాలలు ఉన్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఎన్.నాగభూషణం డిమాండ్ చేశారు. ఇదే విషయమై ఆయన తమ సంఘ నాయకులతో కలెక్టరేట్కు సోమవారం వెళ్లి, డీఆర్వో శ్రీనివాసమూర్తిని కలిసి వినతిపత్రం అందజేశారు. కొన్ని ప్రైవేటు కళాశాలలు విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తూనే నీట్, ఐఐటీ అని కోచింగ్ల పేరిట పెద్దమొత్తంలో డబ్బులు తీసుకుంటూ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని తెలిపారు. సెలవు రోజుల్లోనూ తరగతులు నిర్వహిస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారన్నారు. చర్యలు తీసుకుంటామని డీఆర్వో హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మహిళా ప్రతినిధులు భాను, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో డీఆర్వో శ్రీనివాసమూర్తికి ఏఐఎస్ఎఫ్ వినతి -
రిటైర్డ్ ఎస్సైపై యువకుల దాడి
విజయనగరం క్రైమ్: నగరంలోని అయ్యప్పనగర్కు చెందిన రిటైర్డ్ ఎస్సై ముని బుచ్చిరాజుపై దాడి చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రిటైర్డ్ ఎస్సై మునిబుచ్చిరాజు తన కొడుకును ఈ నెల 19 వ తేదీ రాత్రి రైల్వేస్టేషన్లో దింపి తిరిగి ఇంటికి బయల్దేరారు. మార్గమధ్యంలో బైక్ ట్రబుల్ ఇవ్వడంతో పాతబస్టాండ్లో బైక్ ఉంచేసి నడుచుకుంటూ ఇంటికి బయల్దేరారు. ఆ సమయంలో బొండపల్లి మండలం గుమడాం గ్రామస్తులు పవన్, రాజేష్, అలాగే హుకుంపేటకు చెందిన సాయి(18) రిటైర్డ్ ఎస్సై రాజుపై దాడి చేసి జేబులో ఉన్న రూ.3 వేల నగదు దోచుకుని పరారయ్యారు. అతి కష్టం మీద రిటైర్డ్ ఎస్సై రాజు ఇంటికి చేరుకుని స్థానికుల సహాయంతో హాస్పిటల్కు వెళ్లి చికిత్స చేయించుకుని 20 వ తేదీన టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఎస్సై కృష్ణమూర్తి కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను సోమవారం అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. -
గిరిజనుల విద్యపై నిర్లక్ష్యం తగదు
విజయనగరం అర్బన్: గిరిజనులకు మెరుగైన విద్య నందించేందుకు అందరూ కృషిచేయాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీశంకరరావు సోమవారం అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో కొన్ని గిరిజన పాఠశాలలకు ఉపాధ్యాయులు గైర్హాజరు కావడం పట్ల రాష్ట్ర ఎస్టీ కమిషన చైర్మన్ డాక్టర్ డివీజీశంకరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల తీరుపై పత్రికలలో వచ్చిన కథనాలపై ఆయన స్పందించారు. వివిధ కారణాల వల్ల ఇప్పటికే ఆదివాసీలు విద్యకు దూరమవుతున్నారని, పక్కా భవనాలు, ఉపాధ్యాయులు ఉన్న చోట, ఉపాధ్యాయుల నిర్లక్ష్య వైఖరి వల్ల చిన్నారులు విద్యకు దూరం కావడం శోచనీయమన్నారు. మన్యం జిల్లాలో ఇటువంటి పాఠశాలలు ఇంకా ఎన్ని ఉన్నాయి? ఎందుకు సంబంధిత అధికారులు పాఠశాలలను పర్యవేక్షణ చేయడం లేదనే అంశాలపై జిల్లా యంత్రాంగం నివేదిక సమర్పించాలని ఆదేశించారు. భవిష్యత్లో ఇటువంటి పరిణామాలు పునరావృతం కాకుండా చూడాలని, గిరిజనుల చదువుకునేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ శంకరరావు -
బురదలో కలిసిన రైతు ప్రాణం
వేపాడ: ఆయనకు వ్యవసాయమంటే మక్కువ. ఊహ తెలిసిన నుంచి పంటల సాగులో నిమగ్నమవుతున్నారు. సొంత ట్రాక్టర్ను కొనుగోలు చేసి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఆయనపై విధి కన్నెర్ర చేసింది. ట్రాక్టర్ రూపంలో మృత్యువుకాటేసింది. దమ్ముమడిలోనే ప్రాణాలను తీసేసి కుటుంబ సభ్యుల్లో విషాదాన్ని నింపింది. ఈ విషాదకర ఘటన వేపాడ మండలం కొండగంగుబూడి పంచాయతీ ఎస్.కోట సీతారాంపురంలో సోమవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్.కోట సీతారాంపురం గ్రామానికి చెందిన పరవాడ రామేశ్వరరావు(45)కు వ్యవసాయమే జీవనాధారం. తన పొలాన్ని ట్రాక్టర్తో తనే దమ్ముచేస్తుండగా అదుపు తప్పి ట్రాక్టర్ బొల్తాకొట్టింది. అంతే... ఆయన ట్రాక్టర్ కింద ఉండిపోయారు. రక్షించేందుకు అక్కడి రైతులు పరుగుతీసినా ప్రయోజనం లేకపోయింది. దమ్ముమడిలోనే ఆయన ప్రాణాలు విడిచారు. జేసీబీ సాయంతో ట్రాక్టర్ను పక్కకుతీసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషాదకర ఘటనతో గ్రామం ఘొల్లుమంది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతునికి భార్య వెంకటలక్ష్మి, తల్లి అచ్చియ్యమ్మ, కుమార్తెలు లీలావతి, హైమావతి ఉన్నారు. చిన్నకుమార్తె హైమావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వల్లంపూడి ఎస్ఐ ఎస్.సుదర్శన్ కేసు నమోదుచేశారు. దమ్ముమడిలో ట్రాక్టర్ బోల్తా అక్కడిక్కడే మృతిచెందిన రైతు విలపిస్తున్న కుటుంబ సభ్యులు -
‘తల్లికి వందనం’... అందలేదు బాబూ..!
ఈ చిత్రంలోని మహిళలది డెంకాడ మండలం అక్కివరం. తమ పిల్లలు అక్కివరంలోని మోడల్ స్కూల్లో చదువుతున్నారు. 300లకు మించి విద్యుత్ వినియోగించారని, కుటుంబంలో ఉద్యోగులు ఉన్నారని, నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్నారని, అధిక విస్తీర్ణంలో భూమి కలిగి ఉన్నారని... ఇలా వివిధ కారణాలు చూపి తల్లికివందనం పథకాన్ని నిలిపివేశారు. అవి సరికాదని, తాము పథకానికి అర్హులమంటూ అధికారులతో ధ్రువీకరించిన పత్రాలు సమర్పించడంతో వారి పిల్లల పేర్లు అర్హుల జాబితాలో చేరాయి. అయినా, వారి ఖాతాలకు తల్లికి వందనం పథకం డబ్బులు జమకాలేదు. దీనిపై అర్జీ అందజేసేందుకు అదే స్కూల్లో పిల్లలను చదివిస్తున్న 20 మంది తల్లులు సోమవారం కలెక్టరేట్కు వచ్చారు. పీజీఆర్ఎస్లో కలెక్టర్ అంబేడ్కర్కు తమ గోడును వినిపించారు. పథకం వర్తింపజేసేలా చూడండి బాబూ అంటూ విన్నవించారు. విజయనగరం అర్బన్: కూటమి ప్రభుత్వం ‘అమ్మఒడి’కి ప్రత్యామ్నాయంగా అమలు చేసిన ‘తల్లికి వందనం’ పథకం లబ్ధిదారులకు అందని ద్రాక్షలామారింది. మంజూరైన జాబితాలో పేర్లు ఉన్నా నిధులు మాత్రం తల్లుల ఖాతాలకు జమకాలేదు. వివిధ కొర్రీలతో పేదలకు పథకం దూరమవుతోంది. అధికారులు, కార్యాలయాల చుట్టూ లబ్ధిదారులు తిరుగుతున్నా ఫలితం కనిపించడం లేదు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీలలో తల్లికి వందనం పథకం అందలేదన్న అంశపై వచ్చినవే 120 ఉండడం గమనార్హం. కొన్ని పాఠశాలల్లో పదుల సంఖ్యలో విద్యార్థులకు పథకం వర్తించలేదు. వారి తల్లిదండ్రులందరూ వచ్చి కలెక్టర్కు సమస్యలను వివరించారు. రాజాం పరిధిలోని పలు పాఠశాలలకు చెందిన 30 మంది పిల్లల తల్లిదండ్రులు అర్హత ఉన్నా తల్లికి వందనం పథకం అందలేదంటూ కలెక్టర్కు గోడు వినిపించారు. ఇదెక్కడి అన్యాయం... నాలుగేళ్లపాటు గత ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పథకం అందింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్హులైన పిల్లలందరికీ పథకం వర్తింపజేస్తామంటూ గతేడాది ఎగ్గొట్టింది. ఈ ఏడాది అర్హులకు కూడా పథకం వర్తింపజేయలేదు. కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం కనిపించడంలేదంటూ విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టరేట్ వద్ద గగ్గోలు పెట్టారు. కూటమి ప్రభుత్వ అసమర్థ పాలనను ఎండగట్టారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలే తప్ప ఇలా ఆవేదనకు గురిచేయడం తగదన్నారు. డబ్బులు పడినట్టు మెసేజ్లు పంపిస్తున్నారని, తీరా బ్యాంకుకు వెళ్లి ఖాతా చెక్చేస్తే డబ్బులు మాత్రం జమకావడంలేదని, ఇదెక్కడి అన్యాయమంటూ ఆవేదన వ్యక్తంచేశారు. తొలి, రెండు, మూడో విడత అంటూ కాలయాపనే తప్ప పథకాన్ని చిత్తశుద్ధితో అమలుచేసేందుకు ప్రభుత్వం చొరవచూపడంలేదని విమర్శించారు. కలెక్టరేట్లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కౌంటర్లో తమ అర్జీలను నమోదుచేయించినా పథకం వచ్చేవరకు గ్యారంటీ లేదవంటూ వాపోయారు. కలెక్టరేట్లో 120 మంది తల్లుల అధికారులకు వినతి -
రాజధర్మం ఇదేనా..?
విజయనగరం ఫోర్ట్: రైతులు పండించిన కూరగాయలు విక్రయించేందుకు అవసరమైన రైతుబజార్ కోసం 26 ఏళ్ల కిందట ఇచ్చిన స్థలాన్ని తిరిగి ఖాళీ చేయమనడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. రాజధర్మం ఇదేనా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇచ్చిన భూమిని వెనుకకు తీసుకోవడం రాజరికం అనిపించుకోదని వ్యాఖ్యానిస్తున్నారు. ఎం.ఆర్ రైతు బజార్ స్థలం ఖాళీ చేయించాలంటూ కేంద్ర మాజీ మంత్రి అశోక్గజపతిరాజు కలెక్టర్పై ఒత్తిడి తేవడాన్ని తప్పుబడుతున్నారు. 1999లో ఎన్సీఎస్ రోడ్డులోని రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఎం.ఆర్ (మహారాజ) పేరుమీద రైతు బజార్ను ఏర్పాటు చేశారు. అప్పట్లో రైతులకు మేలు చేసేందుకే రైతు బజార్ ఏర్పాటుచేస్తున్నామంటూ ఆర్భాటంగా ప్రకటించారు. ఇప్పుడు అదే స్థలాన్ని తీసుకునేందుకు ప్రయత్నించడం విమర్శలకు తావిస్తోంది. ఆదేశాలు వచ్చాయి.. రైతు బజార్ను ఖాళీ చేయించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఆ మేరకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నాం. రైతులకు నాలుగు స్థలాలు చెప్పాం. వాటిలో ఎదో ఒకటి ఎంచుకోమని సూచించాం. – బి.రవికిరణ్, మార్కెటింగ్శాఖ ఏడీ కలెక్టరేట్ ఎదుట ఆందోళన పిలిచి షాపు పెట్టుకోమన్నారు.. బయట కూరగాయాలు విక్రయించుకుంటే పిలిచి రైతు బజార్లో షాపు ఇస్తాం అమ్ముకోండని చెప్పారు. ప్రతినెల షాపుకు రూ.1900 చొప్పున అద్దె చెల్లిస్తున్నాం. ఇప్పుడు రింగ్ రోడ్డు రైతు బజార్కు వెళ్లిపోండని చెబుతున్నారు. ఎంతవరకు కరెక్ట్. 45 కుటుంబాల వారం రోడ్డున పడతాం. – పి.సునీత, రైతు, గాజులరేగ నోటిలో కూడు లాక్కున్నట్టే... 26 ఏళ్లుగా ఇక్కడే కూరగాయాలు విక్రయించుకుని బతుకు ఈడ్చుతున్నాం. ఇప్పుడేమో వెళ్లిపోండని చెబుతున్నారు. ప్రత్యామ్నాయ స్థలం చూపించి అక్కడ షెడ్లు నిర్మించిన తర్వాతే ఇక్కడ నుంచి వెళతాం. నోటిలో కూడా లాక్కోవడం రాజులకు తగదు. – పి.విజయలక్ష్మి, రైతు, అంబలి వలస, బొండపల్లి మండలం స్థలం ఇచ్చినట్టే ఇచ్చి వెనుకకు తీసుకోవడంపై విమర్శల వెల్లువ ఎం.ఆర్. రైతు బజార్ స్థలం ఖాళీ చేయించాలని కలెక్టర్ను కోరిన అశోక్ నోటికాడ కూడు లాక్కోవద్దంటూ కలెక్టరేట్ వద్ద రైతుల ఆందోళన విజయనగరం పాత మహారాజా ఆస్పత్రి దగ్గరున్న రైతుబజార్ ఎత్తివేతను నిరసిస్తూ రైతులు, బజార్ నిర్వాహకులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. రైతుబజార్ తొలగించి రైతుల బతుకు బుగ్గిపాలు చేయొద్దని..కలెక్టరు ఉత్తర్వులు వెంటనే రద్దు చేయాలని, రైతుబజార్ను ఇక్కడే కొనసాగించాలని ఆందోళకారులు నినాదాలు చేశారు. పట్టణ పౌర సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకరరావు మాట్లాడుతూ 26 ఏళ్లుగా ప్రభుత్వ స్థలంలో నడుస్తున్న బజార్ను ఎత్తివేస్తే దాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న వారంతా ఎక్కడకు పోవాలని ప్రశ్నించారు. ఇది మహారాజా వారసుల స్థలం అనడానికి ఆధారాల్లేవని 2018 ఇదే టీడీపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం గుర్తు చేశారు. రైతుబజార్ను ఇక్కడే ఉంచాలని లేకుంటే పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టరు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.రాంబాబు, ఐద్వా జిల్లా కార్యదర్శి పి.రమణమ్మ, నగర కార్యదర్శి వి.లక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షుడు బి.రమణ కేవీపీస్ జిల్లా కార్యదర్శి రాకోటి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. – విజయనగరం గంటస్తంభం -
ఉపాధ్యాయుడిపై వేటు
బొబ్బిలి రూరల్: మండలంలోని నారశింహునిపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడిని జిల్లా అధికారులు సస్పెన్షన్ చేశారు. పాఠశాలలో విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అసభ్యకరంగా ప్రవర్తించడం వంటి కారణాలపై పలువురు ఫిర్యాదులిచ్చిన నేపథ్యంలో ఇటీవల జిల్లా విద్యాశాఖాధికారులు వచ్చి విచారణ చేపట్టారు. అనంతరం సస్పెన్షన్ ఉత్తర్వులు విడుదల చేసినట్టు ఎంఈఓ గొట్టాపు వాసు తెలిపారు. లక్కీడిప్ విజేతలకు నగదు బహుమతులు విజయనగరం ఫోర్ట్: ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఈ నెల 11న నిర్వహించిన లక్కీడిప్లో బహుమతులకు ఎంపికై న వారికి చెక్కులు, సర్టిఫికెట్లను కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సోమవారం అందజేశారు. పీపీఐయూసీడీలు ఎక్కువ మందికి వేసినందుకు చీపురుపల్లి ఏరియా ఆస్పత్రి గైనకాలజిస్ట్ డాక్టర్ ఎ.వి.ఎస్.ఉషారాణికి రూ.8వేలు, వేసెక్ట్మీ ఆపరేషన్స్ ఎక్కువ చేసిన పోలిపల్లి పీహెచ్సీ వైద్యాధికారి టి.తిరుపతి స్వామికి రూ.7వేలు, ఆర్ఎంఎన్సీహెచ్+ఏ కౌన్సిలర్ ఎ.నాగమణికి రూ. 2,500లు, మోటివేటర్ ఎంఎల్హెచ్పీ ఎస్.రమ్యకు రూ.2,500, బెస్ట్ మోటివేటర్ ఎంపీహెచ్ఏ (ఎఫ్) ఏఎస్ఎం ఎం.ఎరుకలమ్మకి రూ.2,500, మోటివేటర్ ఆశకు రూ.2,500లు, ముగ్గురు పిల్లల కంటే ఎక్కువ మంది సంతానం కలిగిన చంద్రకళ, పైడితల్లి, సునీతలకు రూ.5వేలు చొప్పున, పీపీఐయూసీడీ యాక్సెప్టర్ ఎ.హేమలతకు రూ.5వేలు, వేసెక్టమీ యాక్సెప్టర్ ఆడపా సురేష్కి రూ.5వేలు, ఇంజెక్టబుల్ యాక్సెప్టర్ వానపల్లి రమ్యకు రూ.5వేలు చొప్పున చెక్కులను కలెక్టర్తో కలిసి డీఎంహెచ్ఓ జీవనరాణి అందజేశారు. కార్యక్రమంలో ఇన్చార్జి గణాంకాధికారి సంధ్యారాణి, డెమో వి.చిన్నతల్లి, డెమో సెక్షన్ సభ్యులు పాల్గొన్నారు. -
● ఎరువు కరువు తీర్చండి...
జిల్లాలో యూరియా, ఎరువులు ఆర్ఎస్కే, పీఏసీఎస్లలో అందుబాటులో ఉంచాలని రైతులు డిమాండ్ చేశారు. ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో విజయనగరం కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా చేశారు. ప్రభుత్వం యూరియా సరఫరా చేయకపోవడంతో బయట మార్కెట్లో బస్తా రూ.400కు కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఎరువు కొరత నివారించాలని కోరుతూ జేసీ సేతుమాధవన్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.రాంబాబు, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి టి.పైడినాయుడు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సాగి రవి, చలుమూరి వెంకటరావు, చల్ల పెంటయ్య, సూరిదేవుడు, సత్యారావు తదితరులు పాల్గొన్నారు. – విజయనగరం ఫోర్ట్ -
● ‘కూటమి’తీరుపై అంగన్వాడీల ఆందోళన
ఐసీడీఎస్లో ఫేస్ రికగ్నైజేషన్ యాప్ అమలును రద్దు చేయాలని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, సూపర్ వైజర్లు ఆందోళన చేశారు. గజపతినగరం ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద సోమవారం ధర్నా చేశారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు అధ్యక్ష, కార్యదర్శులు ఎం.సుభాషిణి, పి.జ్యోతి మాట్లాడుతూ బాలసంజీవని యాప్లో మాత్రమే సరుకులు ఇవ్వాలన్నారు. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు సరుకులు ఇచ్చేటప్పుడు ఫొటోలు తీసి పెట్టాలన్న విధానం ఇబ్బందికరంగా ఉందన్నారు. నెట్వర్క్ లేని కారణంగా గంటల తరబడి లబ్ధిదారులు నిరీక్షించాల్సి వస్తోందన్నారు. కొత్తఫోన్లు ఇవ్వాలని, నెట్వర్క్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. యాప్లో ఫొటోలు అప్లోడ్ చేయడం వల్ల చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యను బోధించలేకపోతున్నామన్నారు. అనంతరం ఐసీడీఎస్ పీఓ ఎం.రాజేశ్వరికి వినతి పత్రాన్ని అందజేశారు. – గజపతినగరం -
నానో ఎరువులను డ్రోన్లతో పిచికారీ చేయాలి
విజయనగరం ఫోర్ట్: రైతులకు ప్రయోజనం కల్పించేలా నానో ఎరువుల పిచికారీకి డ్రోన్లు వినియోగించాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అధికారులను సోమవారం ఆదేశించారు. కలెక్టర్ చాంబర్లో వ్యవసాయ శాఖ రూపొందించిన చీడపురుగుల నుంచి పంటలను కాపాడుకునేందుకు దోహదపడే జీవన ఎరువుల ఆవశ్యకతను నానో ఎరువుల ప్రచార పోస్టర్, బ్రోచర్లను విడుదల చేశారు. నానో ఎరువుల వినియోగం, ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాకు మంజూరైన 17 వ్యవసాయ డ్రోన్లను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు. తప్పని డోలీ కష్టాలు మెంటాడ: గిరిజనులను డోలీ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. గిరిశిఖర గ్రామాల ప్రజలకు సరైన దారిలేక పోవడంతో అత్యవసర వేళ రోగులను డోలీలోనే ఆస్పత్రికి తరలిస్తున్నారు. మెంటాడ మండలం పిట్టాడ పంచాయతీ మిర్తివలస గ్రామానికి చెందిన సారా అప్పారావుకు గతంలో జరిగిన ప్రమాదంలో కాలు విరిగిపోయింది. శస్త్ర చికిత్సలో భాగంగా కాలిలో ప్లేట్లు అమర్చారు. ఇంటిదగ్గర సరైన సదుపాయాలు లేకపోవడం, జాగ్రత్తలు తీసుకోకపోవడంతో కాలు వాచిపోయింది. దీంతో గ్రామస్తులు ఆయనను డోలీపై నాలుగు కిలోమీటర్ల రాళ్లదారిలో పిట్టాడ మధర గ్రామమైన వాణిజ వరకు తరలించారు. అక్కడి నుంచి ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. మహిళల ఆర్థికాభివృద్ధికి సూక్ష్మరుణ ప్రణాళికలు ● డీఆర్డీఏ పీడీ కె.సావిత్రి విజయనగరం టౌన్: పొదుపు సంఘాల సభ్యుల ఆర్థికాభివృద్ధికి సెర్ప్ ద్వారా సూక్ష్మరుణ ప్రణాళిక (మైక్రో క్రెడిట్ ప్లాన్), ఏసీఎల్పీ (యూన్యువల్ క్రెడిట్ అండ్ లైవ్లీ హుడ్ ప్లాన్) పథకాలు అమలుచేస్తున్నట్టు డీఆర్డీఏ, వెలుగు పథక సంచాలకులు కె.సావిత్రి తెలిపారు. పథకాల అమలు తీరును కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె వివరించారు. రుణాల వల్ల పొదుపు సంఘాల సభ్యులకు కలగనున్న ప్రయోజనాలను తెలియజేశారు. అర్హులైన సభ్యులకు రుణాలు మంజూరయ్యేలా అధికారులు సహకరించాలని కోరారు. -
●అమ్మవారికి ఆషాఢం సారె
విజయనగరంలోని పెద్దచెరువు ఉత్తర గట్టుపై ఉన్న శ్రీవిజయసాగర దుర్గామల్లేశ్వరమ్మ వారికి ఆషాఢం సారెను ఆదివారం సమర్పించారు. హెల్పింగ్ హ్యాండ్స్ హిజ్రాస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అమ్మవారికి భక్తులు ఉదయం పసుపు, కుంకుమలు అందజేసి, ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం ఏడు ఎడ్ల బండ్లపై కొబ్బరి బొండాలు, వివిధ రకాల స్వీట్లు, పండ్లు, పూలతో కోట వద్ద నుంచి ర్యాలీగా వెళ్తూ సారెను ఊరేగించారు. బాజాభజంత్రీలు, మేళతాళాలు, విచిత్ర వేషధారణల ప్రదర్శన నడుమ సాగిన ఈ కార్యక్రమం అందరిలో ఆధ్యాత్మిక భావం పెంపొందించింది. భక్తులు అమ్మవారికి ఘటాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ వ్యవస్థాపకుడు కొండబాబు, ప్రతినిధులు మీనమ్మ, స్రవంతి, స్వాతి తదితరులు పాల్గొన్నారు. – విజయనగరం టౌన్ -
కొలువుల కాణాచి జేఎన్టీయూఈ కళాశాల
● తొమ్మిదేళ్లలో 1714 మందికి ప్లేస్మెంట్ ● రెండేళ్ల క్రితం నుంచి జాతీయ నూతన విద్యా విధానం అమలు ● ఇంజినీరింగ్ హానర్స్ డిగ్రీ కొనసాగింపు ● ఈ ఏడాది నుంచి మైనర్ సబ్జెక్ట్గా క్వాంటం కంప్యూటర్ ఉద్యోగ సాధనకు కళాశాలలో నైపుణ్యాలు పుష్కలం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ (ఈసీఈ) 2024–25 విద్యా సంవత్సరంలో పూర్తి చేశాను. తొలి ప్రయత్నంలోనే గేట్ ద్వారా న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్పీసీఐఎల్)లో సీనియర్ ఆఫీసర్–సీ పోస్టు సాధించా ను. కళాశాలలో నైపుణ్యాభివృద్ధికి అనుగుణంగా అందించే బోధనలు వల్లే సాధించగలిగాను. ప్రత్యేకించి ఉన్న ప్లేస్మెంట్ విభాగం ఆ దిశగా అందించిన శిక్షణ వల్ల ఉద్యోగం లభించింది. –వానపల్లి లలితాప ప్రదీప్ కుమార్ విజయనగరం అర్బన్: రాష్ట్రంలో ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల సందడి తాజాగా మొదలైంది. ఈ నేపథ్యంలో ఉత్తమ ప్రమాణాలున్న కళాశాలలను ఎంపిక చేసుకొనే పనిలో ఇంజినీరింగ్ అభ్యర్థులు బిజీగా ఉన్నా రు. నగర శివారున ఉన్న జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల ఉద్యోగ కల్పనలో ముందు వరుసలో ఉంది. రెండేళ్ల నుంచి నూతన విద్యా విధానాన్ని అమలులోకి తెచ్చింది. మరో వైపు ఉన్నత విద్య శాఖ ఈ కళాశాల ప్రాంగణంలోనే జేఎన్టీయూ గురజాడ విజయనగరం (జీవీ) యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. విద్యార్థుల నైపుణ్యాలను పెంచే విధంగా మొదటి సంవత్సరం ఇంజినీరింగ్ కోర్సులలో హానర్స్, మైనర్ పేరుతో విస్తరణ డిగ్రీలను గత ఏడాది నుంచి ప్రవేశ పెడుతుంది. జాతీయ నూతన విద్యా విధానానికి అనుగుణంగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి రూపొందించిన నూతన సిలబస్, బోధనా విధానాన్ని అమలులోకి తెచ్చింది. మొత్తం 8 సెమిస్టర్స్లో తొలి మూడు మినహా మిగిలిన ఐదు సెమిస్టర్స్తో పాటు పది నెలల ఇంటర్న్షిప్ చేయిస్తారు. ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, ట్రిపుల్ ఈ, ఐటీ, మెకానికల్ డిగ్రీలలో 66 సీట్ల చొప్పున, సివిల్, మెటలర్జికల్ సబ్జెక్టు డిగ్రీలలో 33 సీట్లు వంతున కోర్సులను నిర్వహిస్తుంది. ఇంజినీరింగ్ హానర్స్ డిగ్రీ విద్యార్థుల సామర్థ్యాల స్థాయికి అనుగుణంగా ఇంజినీరింగ్ డిగ్రీని మూడు విధాలుగా విభజించారు. ఎప్పటి మాదిరిగా ఇచ్చిన కోర్సులను పూర్తి చేసిన విద్యార్థులకు యధావిధిగా సాధారణ బీటెక్ డిగ్రీ వస్తుంది. డిగ్రీ సిలబస్తో పాటు ఇతరేత్ర (డిగ్రీ సబ్జెక్టులకు సంబంధం లేని) అదనపు ప్రతిభాంశాలను ఉన్నట్టు నిర్ధారించుకున్న వారికి హానర్ డిగ్రీ ప్రకటిస్తారు. ఇందు కోసం మొత్తం ఎనిమిది సెమిస్టర్స్లోనూ 80 శాతం ఉత్తీర్ణతను చూపాల్సి ఉంటుంది. తొలిత రెండో సంవత్సరం మొదటి సెమిస్టర్ ఫలితాలలో అప్పటికి పూర్తయిన మూడు సెమిస్టర్లలో 80 శాతంతో చూపిన ఫలితాల (ఒకేసారి ఉత్తర్ణత పొందాలి) ఆధారంగా రిజస్టర్ అయిన విద్యార్థిని హానర్ డిగ్రీ విభాగంలోకి తీసుకుంటారు. అప్పటి నుంచి చివరి సెమిస్టర్ వరకు కనీసం 160 క్రెడిట్ పాయింట్లతో పాటు అదనపు నైపుణ్యాలపై మరో 20 క్రెడిట్ పాయింట్లు తెచ్చుకోవాలి. ఇంజినీరింగ్ మైనర్ డిగ్రీ నూతన విద్యా విధానం అమలులో భాగంగా విద్యార్థుల సామర్థ్యాలను మెరుగు పరిచే విధంగా మైనర్ డిగ్రీని ప్రవేశ పెట్టారు. చేరిన డిగ్రీకి చెందిన ప్రధాన సబ్జెక్టుతో పాటు ఇతర ఇంజినీరింగ్ కోర్సుల్లో మరో సబ్జెక్టులలో కూడా ప్రతిభ చూపాలనుకొనే వారికి ఈ డిగ్రీ రూపంలో అవకాశాన్నిచ్చారు. మొదటి మూడు సెమిస్టర్ ఫలితాలలో 80 శాతం పాయింట్లను తెచ్చుకున్న వారికి మైనర్ డిగ్రీ కోర్సులకు రిజస్టర్ చేయిస్తారు. తొమ్మిదేళ్లలో 1714 మందికి ప్లేస్మెంట్ ఈ ఏడాది నుంచి మైనర్ సబ్జెక్ట్గా క్వాంటం కంప్యూటర్ ఉద్యోగ, ఉపాధి అధికంగా ఉన్న క్వాంటం కంప్యూటర్ సబ్జెక్టును ఈ ఏడాది నుంచి మైనర్ సబ్జెక్టుగా ప్రవేశ పెడుతున్నాం. నూతన విద్యా విధానం అమలు నేపథ్యంలో విద్యార్థుల కోసం ఈ అవకాశం కల్పిస్తున్నాం. దేశ విదేశాల సంస్థల్లో ఉద్యోగ కల్పనే లక్ష్యంగా విద్యార్థులకు గ్లోబలైజ్డ్ నైపుణ్యాలపై మెరుగుపరిచే ప్రణాళికలను రూపొందించాం. దేశ, అంతర్జాతీయ స్థాయిలోని 13 ప్రతిష్టాత్మక కంపెనీలతో ఉద్యోగ నియామక ఒప్పందాలు పెట్టుకున్నాం. జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నాం. – ప్రొఫెసర్ ఆర్.రాజేశ్వరరావు, ప్రిన్సిపాల్, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల, విజయనగరం ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి పాలనలో 2007లో ప్రారంభం అయిన ఈ కళాశాల తొలి బ్యాచ్ నుంచి తాజాగా రిలీవ్ అయిన బ్యాచ్ వరకు ప్రతి ఏడాదిలోనూ ప్లేస్మెంట్లు తెచ్చి పెట్టింది. దినదినాభివృద్ధిగా మౌలిక సదుపాయాలు, బోధనా సామర్థ్యాలను పెంచుకుంటుంది. రిలీవ్ అయిన తొమ్మిది బ్యాచ్ల నుంచి 1714 మంది విద్యార్థులకు ఉద్యోగాలొచ్చాయి. వివిధ కంపెనీలలో అత్యధికంగా రూ.18 లక్షల వార్షిక వేతన ఉద్యోగాలతో పాటు గ్యాట్ ద్వారా ప్రతి ఏడాదిలోనూ ఉద్యోగాలను ఈ కళాశాల ఇప్పించింది. -
స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై అపోహలొద్దు
● ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి సాక్షి, విశాఖపట్నం : స్మార్ట్ మీటర్ల ఏర్పాటు విషయంలో ఎలాంటి అపోహలు అవసరం లేదని, వీటితో వినియోగదారులపై అదనపు భారం ఉండే అవకాశమే లేదని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి స్పష్టం చేశారు. స్మార్ట్ మీటర్ల ప్రక్రియ విషయంలో వస్తున్న వదంతులపై ఆయన స్పందిస్తూ.. ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యుత్ వినియోగదారుల సేవల్లో పారదర్శకతను మరింత పెంచేందుకు ఆర్డీఎస్ఎస్ పథకంలో భాగంగా రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు జరుగుతోందని పేర్కొన్నారు. ఏపీఈఆర్సీ రెగ్యులేషన్ ప్రకారం ప్రభుత్వ, వాణిజ్య కేటగిరీల వినియోగదారులకు ప్రస్తుతం వీటిని అమర్చుతున్నామని పేర్కొన్నారు. వీటితో పాటు ఎక్కువ విద్యుత్ వినియోగం కలిగిన (హై వేల్యూ) గృహ వినియోగదారులకు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. స్మార్ట్ మీటర్ ఏర్పాటు సమయంలో వినియోగదారులు వాటి ఖరీదు, ఛార్జీలు కానీ, మామూళ్లు కానీ చెల్లించవలసిన అవసరం లేదని సీఎండీ తెలిపారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు వల్ల వినియోగదారులపై విపరీత భారాలు పడతాయనే ఆందోళన అవసరం లేదన్నారు. స్మార్ట్ మీటర్లు పాత మీటర్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగాన్ని నమోదు చేయవని, వీటి కారణంగా బిల్లులు పెరిగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పాత మీటర్లతో పోలిస్తే స్మార్ట్ మీటర్ల ద్వారా మరింత పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు. ఏపీఈఆర్సీ నిర్ణయించిన టారీఫ్ ప్రకారమే విద్యుత్ బిల్లులు వసూలు చేస్తామని పేర్కొన్నారు. ఈ మీటర్లకు సంబంధించిన బిల్లు వివరాలను నేరుగా వినియోగదారుని మొబైల్కు చేరవేస్తామని ఆయన చెప్పారు. వినియోగం, ఖర్చుపై పూర్తి నియంత్రణ వినియోగదారుల చేతుల్లో ఉండటం వలన విద్యుత్ వినియోగాన్ని మెరుగ్గా ప్లాన్ చేయడంలో స్మార్ట్ మీటర్లు సహయకరిస్తాయని పేర్కొన్నారు. ఈ విషయంలో వినియోగదారులకు ఎలాంటి సందేహం ఉన్నా.. టోల్ ఫ్రీ నంబరు 1912కి సంప్రదించాలని సీఎండీ పృథ్వీతేజ్ ఆ ప్రకటనలో సూచించారు. -
రాజన్న బతికుంటే రైతులకీ పాట్లు ఉండేవా?
శృంగవరపుకోట: దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి బతికిఉంటే జిందాల్ నిర్వాసిత రైతులకు ఈ పాట్లు ఉండేవి కాదని ఎమ్మెల్సీ రఘురాజు తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిందాల్ నిర్వాసితుల అగచాట్లు, ప్రభుత్వం వైఖరి, పోలీసుల తీరు, అధికారుల నిర్లక్ష్య వైఖరిపై స్పందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వాన్ని నడుపుతున్నది కూటమి సర్కారా? లేక జిందాల్ యాజమాన్యమా? అన్న సందేహం కలుగుతోందన్నారు. రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాన్ని జిందాల్ భూములకు కాపలా కాయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందా? లేక కార్పొరేట్ల సేవలో యంత్రాంగం తరిస్తోందా? అని ప్రశ్నించారు. జిందాల్ భూముల వద్దకు రైతులు వెళ్లకుండా, నిర్వాసితులు రోడ్డు ఎక్కకుండా కాపలా కాయడం, కేసులు పెట్టడం సిగ్గుచేటన్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులకు ప్రభుత్వం వేతనాలు ఇస్తోందా? లేక జిందాల్ దగ్గర ఉద్యోగాలు చేస్తున్నారో ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. దివంగత రాజశేఖర్ రెడ్డి హయాంలోనే జిందాల్కు భూములు కేటాయించారని, నేడు వైఎస్ఆర్ ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. నిర్వాసితులకు జిందాల్ అన్నీ ఇచ్చేసిందని మంత్రులు, కలెక్టర్ అంతా జిందాల్ ఇచ్చిన నోట్నే పదే పదే చదువుతారు తప్ప ఎస్కోట వచ్చి ప్రెస్మీట్ ఎందుకు పెట్టరు? ధైర్యంగా రైతుల ముందుకు ఎందుకురారని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే లలితకుమారి స్పందిస్తారని ఆశించినా ఆమె ఏ ఒత్తిళ్ల వల్ల మాట్లాడడం లేదో తెలియడం లేదన్నారు. -
పాపం..పసివాడు
● గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్నారి ● ఆదుకోని ఆరోగ్యశ్రీ ● వైద్యం కోసం డబ్బు లేక తల్లిదండ్రుల విలవిల ● ఆపన్నహస్తం కోసం ఆత్రంగా ఎదురుచూపులురేగిడి: ముక్కుపచ్చలారని పసికందు. బోసినవ్వులతో అమ్మ ఒడిలో లాలన..ఆలనతో గడిచిపోవలసిన పసిప్రాణం. బాల్యంలోనే మాయదారి రోగం ఆవహించింది. నిరుపేద కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు కూలిపనులు చేస్తే తప్ప పూటగడవని పరిస్థితి. మరోపక్క బాలుడికి ఆపరేషన్ చేయకపోతే ప్రాణభయం ఉందని వైద్యులు చెబుతున్నారు. అంపశయ్యపై ఆ బాలుడు కాలం వెళ్లదీస్తుంటే..ఆర్థిక స్థోమత లేక నిస్సహాయ స్థితిలో తల్లిదండ్రులు విలవిలలాడిపోతు న్నారు. ఇటువంటి తరుణంలో ఆ పసికందు ప్రాణం నిలబెట్టాలంటే మనసున్న వారంతా ఆపన్నహస్తం అందించాలి. వైద్యం ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందించాలని తల్లిదండ్రులు ప్రాథేయ పడుతున్నారు. ఇది విజయనగరం జిల్లా రేగిడి మండలం వన్నలి గ్రామానికి చెందిన నాలుగు నెలల బాలుడు బోనెల నిషాంత్ తల్లిదండ్రులు బోనెల రాము, అరుణలతల దీనగాథ. గ్రామానికి చెందిన బోనెల రాము, అరుణలతకు నాలుగు నెలల క్రితం నిషాంత్ జన్మించాడు. పుట్టిన కొద్దిరోజుల వరకు ఆరోగ్యంగా ఉండేవాడు. క్రమేణా పసికందు ఆరోగ్యం క్షీణిస్తుండడంతో తల్లిదండ్రులు తెలుసుకుని ఆస్పత్రులకు తీసుకువెళ్లారు. వైద్యులు తనిఖీల అనంతరం బాలుడికి గుండె సంబంధిత వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. ఆపరేషన్ చేయాలంటే రూ.6లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెబుతున్నారని బాలుడి తల్లిదండ్రులు వాపోతున్నారు. సహజంగా ప్రతి మనిషికి గుండె ఎడమ భాగంలో ఉంటుంది. కానీ ఈ బాలుడికి గుండె కుడివైపు ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. రాజాం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లోని ఆస్పత్రులకు పసివాడిని తిప్పారు. ఇంట్లో ఆర్థిక స్థోమత లేకపోయినా అప్పులు చేసి పిల్లాడిని ఆస్పత్రుల చుట్టూ తిప్పారు. ఇన్ని లక్షలు పెట్టి బాలుడికి వైద్యం చేయలేని పరిస్థితిలో తాము ఉన్నామని రోదిస్తున్నారు. ఆదుకోని ఆరోగ్య శ్రీ.. ఆరోగ్యశ్రీ పథకం ఆ పసింకందును ఆదుకోవడం లేదు. ఎన్టీఆర్ భరోసా ద్వారా తమ కుమారుడిని రక్షించాలని పలుమార్లు వేడుకున్నప్పటికీ ఆస్పత్రుల్లో ఈ వ్యాధికి ఆరోగ్య శ్రీ వర్తించదని చెబుతున్నారన్నారు. దీంతో ఏమీ చేయలేని ఆ కుటుంబం పిల్లవాడిని చేతిలో ఉంచుకుని బేలచూపులు చూస్తోంది. మానవతా వాదుల కోసం.. నిరుపేద తల్లిదండ్రులు దాతల నుంచి సహాయం కోరుతున్నారు. నిషాంత్ వైద్యం కోసం సహాయం అందించాలనుకునే మానవతా వాదులు ఫోన్ ఫే నం.7036780839కు ఆర్థికసహాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
పారా సబ్ జూనియర్స్, జూనియర్స్ అథ్లెట్స్ ఎంపిక
విజయనగరం: పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రాజీవ్ క్రీడా మైదానంలో పారా జూనియర్, సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు ఆదివారం ఉత్సాహంగా సాగాయి. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన పారా స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వి.రామస్వామి జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి విజయనగరం జిల్లాలో 13 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు పారా క్రీడాకారులు వందమందికి పైగా ఈ పోటీల్లో పాల్గొనడం శుభపరిణామమన్నారు. ప్రధానంగా రన్నింగ్, షాట్పుట్, లాంగ్ జంప్, హై జంప్, డిస్కస్ త్రో, జావెలిన్ త్రో పోటీలు నిర్వహించామని తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరచిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నామని, అందులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఆగస్టులో హర్యానాలో జరగనున్న జాతీయ స్థాయి పారా జూనియర్, సబ్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్–2025 కోసం ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు తురెళ్ల రాము, మన్యం జిల్లా అధ్యక్షుడు చీమల రాంబాబు, ఇంటర్నేషనల్ మెడలిస్ట్ శివగంగ, పారా నేషనల్ స్విమ్మర్ రవి తదితరులు పాల్గొన్నారు. -
శ్రావణం.. శుభప్రదం
పాలకొండ కోటదుర్గ ఆలయంలో వరలక్ష్మీ వ్రతాలు చేస్తున్న మహిళలు(ఫైల్) ఇన్ సెట్లో, శ్రావణలక్ష్మిగా ముస్తాబైన వీరఘట్టం శ్రీ కోటదుర్గతల్లి (ఫైల్)ఈ నెల 28 నుంచి మంచి ముహూర్తాలు.. నెల రోజులుగా ఉన్న ఆషాఢ మాసం ఈనెల 22తో ముగియనుంది. ఈనెల 25 నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది. దీంతో ఈనెల 28 నుంచి ఆగస్టు 22 వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. శ్రావణ మాసంలో వ్రతాలతో పాటు పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, శుభాకార్యాలకు మంచి రోజులు కావడంతో శుభకార్యాలు చేపట్టేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా జూలై 26,27,30,31ఆగస్టు నెలలో1,3,4,6, 7, 8, 9, 10, 11, 13,14,17,18 తేదీలో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. శ్రావణమాసంలో ఉన్న 17 మంచి ముహూర్తాల్లో జిల్లాలో వందల సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నాయని పురోహితులు చెబుతున్నారు. ● ఈనెల 25 నుంచి ప్రారంభం ● ఆగస్టు 3న స్నేహితుల దినోత్సవం ● 8న వరలక్ష్మీ వ్రతం ● 9న రాఖీ పండగ ● 16న శ్రీకృష్ణ జన్మాష్టమి ● పూజలకు సిద్ధమవుతున్న మహిళలువీరఘట్టం: సకల శుభాల శ్రావణ మాసం ఈ నెల 25న ఆరంభం కానుంది. శ్రావణ మాసంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు, పవిత్రోత్సవాలు, కృష్ణాష్టమి వేడుకల నేపథ్యంలో ఆలయాల్లో భక్తుల సౌలభ్యం కోసం ఆలయ నిర్వహణ కమిటీలు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ మాసంలో ఇంటింటా శ్రావణ శోభ కనిపిస్తుంది. అయితే ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి ఓ విశిష్టత ఉంది, అందుచేత మహిళలు ఈరోజును ఎంతో పవిత్రమైన దినంగా భావిస్తారు. నెల రోజులుగా ఆషాఢం కావడంతో ముహూర్తాలు లేవు.ఈనెల 25 నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుండడంతో మహిళలు శ్రావణ లక్ష్మీ వ్రతాలను ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో చేసేందుకు సిద్ధమవుతున్నారు.ఈనెల 26న మొదటి శుక్రవారం కావడంతో తమ ఇళ్లల్లో, ఆలయాల్లో శ్రావణ లక్ష్మికి పూజలు చేసేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. నోముల మాసం శ్రావణం.. పురోహితులు శ్రావణ మాసాన్ని నోముల మాసంగా అభివర్ణిస్తారు. శ్రావణంలో మంగళగౌరీ వ్రతం, వరలక్ష్మీ వ్రతాలను ఆచరిస్తారు. మంగళగౌరీ వ్రతాన్ని శ్రావణంలో వచ్చే ఏ మంగళవారమైనా చేయవచ్చు. ఈ వ్రతాన్ని యువతులు పైళెన ఏడాది తరువాత ఆచరిస్తారు. వరలక్ష్మీ వ్రతాన్ని పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు జరుపుకుంటారు.ఈ వ్రతాన్ని జీవితాంతం ఆచరిస్తారు. ముఖ్యమైన పండగలు.. శ్రావణ మాసమంతా పండగల సందడి ఉంటుంది.ఈ నెల 26న తొలి శుక్రవారం, ఆగస్టు 1న రెండవ శుక్రవారం, ఆగస్టు 3న ఆదివారం స్నేహితుల దినోత్సవం, ఆగస్టు 8న మూడో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం, ఆగస్టు 9న రాఖీ పండగ, అదే రోజు జంధ్యాల పౌర్ణమి, ఆగస్టు 15న నాల్గవ శుక్రవారం, ఆగస్టు 16న శ్రీకృష్ణ జన్మాష్టమి వంటి ముఖ్యమైన పండగలు శ్రావణంలో ఉన్నాయి. ఆగస్టు 22న ఐదవ శుక్రవారంతో శ్రావణ మాసం ముగుస్తుంది.శ్రావణం పూర్తయిన వెంటనే భాద్రపదం మాసం ఈ ఏడాది ఆగస్టు 27న జరగనున్న వినాయకచవితితో ప్రారంభంకానుంది.శ్రావణమాసానికి అత్యంత ప్రాధాన్యం సకల శుభాలను ఒసగే శ్రావణం జ్ఞానస్థితిని అందిస్తుంది. హరిహర భేదం లేదని నిరూపించే శ్రావణమాసంలో వైష్టవారాధనతో పాటు మహాశివుడికి పెద్ద ఎత్తున రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు.ముఖ్యంగా వివాహాది శుభకార్యాలకు శ్రావణ మాసంలో మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఎస్వీఎల్ఎన్ శర్మయాజీ, యజ్ఞకర్త, వీరఘట్టం -
ఆడలికి తగ్గుతున్న ఆదరణ
సీతంపేట: సీతంపేట ఏజెన్సీలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆడలి వ్యూపాయింట్ పర్యాటక ప్రాంతం పర్యాటకులు లేక వెలవెలబోతోంది. సుమారు రూ.2 కోట్ల వ్యయంతో ఇక్కడ వ్యూపాయింట్ నిర్మించారు. ఏడాది కిందట పర్యాటక దినోత్సవం రోజున వ్యూ పాయింట్ ఇక్కడ ప్రారంభమైంది. ఒకప్పుడు వందల సంఖ్యలో టూరిస్టులు ప్రతిరోజూ వచ్చి ఇక్కడి అందాలను వీక్షించి వెళ్లేవారు. ఇప్పుడు రోజులో కనీసం 20 మంది కూడా వస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఆదివారం సెలవు రోజున కూడా రావడానికి ఎవరూ ఆసక్తి చూపించక పోవడం గమనార్హం. దీనికి ప్రధాన కారణం ఆడలి వ్యూపాయింట్కు వెళ్లే రహదారిలో ప్రమాదాలు సంభవించడమేనని పలువురు చెబుతున్నారు. ఆడలి వ్యూపాయింట్ ఏర్పాటైన తరువాత మలుపుల వద్ద జరిగిన ప్రమాదాల్లో నలుగురు చనిపోయారు. అలాగే ఆటోలు, టూవీలర్లు, మ్యాక్సీక్యాబ్లు వంటివి ఘాట్రోడ్డులోని మలుపుల వద్ద తిరగబడిపోయి పదుల సంఖ్యలో పర్యాటకులు గాయాలపాలైన వారు ఉన్నారు. ఇక్కడికి వెళ్తే ప్రమాదాలు జరుగు తున్నాయన్న భావన టూరిస్టుల్లో కలగడంతో వ్యూపాయింట్ వెలవెలబోతున్నట్లు తెలుస్తోంది. నిర్మాణంలో రక్షణగోడ..ఆడలి వ్యూపాయింట్కు వెళ్లే మార్గంలో పలు మలుపుల వద్ద రక్షణగోడలు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడక్కడ హెచ్చరిక బోర్డులు సైతం పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. రక్షణగోడలు పూర్తయితే పర్యాటకుల రద్దీ పెరిగే అవకాశం ఉందని టూరిజం శాఖ భావిస్తోంది. ఒకప్పుడు కనువిందు చేసిన ఆడలి వ్యూపాయింట్ ఇప్పుడు వెలవెలబోతుండడం గమనార్హం. టూరిస్టులు లేక వ్యూపాయింట్ వెలవెల ప్రమాదాలే కారణమా? -
అనాలోచిత అధికారులను వదిలించుకోండి
● పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు సూర్యనారాయణ పార్వతీపురం రూరల్: విద్యాశాఖాధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రభుత్వం మాట పడాల్సి వస్తోందని, ఈ మేరకు మంత్రి వారిని వదిలించుకునే ప్రయత్నం చేయాలని పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు అమరాపు సూర్యనారాయణ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి తవిటినాయుడు, కాగాన విజయ్ సంబంధిత విద్యాశాఖామంత్రి లోకేష్కు హితవు పలికారు. ఆర్థికశాఖ అనుమతి తీసుకోకుండా ఉపాధ్యాయ పోస్టులను కొన్ని పాఠశాలలకు మంజూరు చేయకుండా బదిలీలు చేయడం వల్లే జీతాల చెల్లింపునకు సమస్య వచ్చిందన్నారు. ఇప్పటికి కూడా విద్యాశాఖాధికారులు ఎప్పటిలోగా పొజిషన్ ఐడీలు కేటాయించి జీతాలు చేయగలరో వివరంగా చెప్పలేకపోతున్నారన్నారు. రెండు నెలలు కావస్తున్నా జీతాలు లేక కుటుంబ జీవన పరిస్థితి ఏవిధంగా నెట్టుకురాగలమని పీఆర్టీయూ తరఫున ప్రశ్నించారు. అనాలోచిత అధికారుల హడావిడి బదిలీలు చేసిన కారణంగానే ఈ పరిస్థితి దాపురించిందన్నారు. ఈ మేరకు మంత్రి లోకేష్ అనాలోచిత అధికారుల విధానాలను గుర్తించి దూరం పెట్టాలని ఏరికోరి ఎంచుకున్న శాఖకు మీరు ఎంచుకున్న అధికారుల వల్ల నష్టపోతున్నారన్న విషయాన్ని గ్రహించి ఆ దిశగా ఆలోచన చేయాలని కోరారు. బస్సు ఢీకొని ఇద్దరికి గాయాలుజియ్యమ్మవలస రూరల్: మండలంలోని చినమేరంగి నెయ్యిల వీధికి చెందిన సిద్ధాంతంనాగరాజు, సిద్ధాతం వెంకటేష్లు తమ బైక్పై ఆదివారం మధ్యాహ్నం 3.40 గంటల సమయంలో పెదమేరంగి కూడలికి వెళ్తుండగా పెదమేరంగి రామమందిరం మలుపువద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో వారిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో చినమేరంగి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకురాగా డ్యూటీ డాక్టర్ ప్రభుతేజ చికిత్స అందించారు. నాగరాజు పరిస్థితి సీరియస్ కావడంతో 108 ద్వారా పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. చినమేరంగి ఎస్సై పి.అనీష్ కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. ఆదివాసీలకు అండగా ఉంటాం●● రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు విజయనగరం అర్బన్: గిరిజన ప్రాంతంలోని ఆదివాసీలకు అండగా ఉంటామని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్డర్ డీవీజీ శంకర రావు అన్నారు. ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజన సమస్యలను రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు దృష్టికి సీపీఎం సీనియర్ నాయకుడు ఎం.కృష్ణమూర్తి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా చైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి వినతిపత్రం అందజేసి ఏజెన్సీలోని పలు సమస్యలను వివరించారు. కురుపాం నియోజకవర్గంతోపాటు ఇతర ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికీ మౌలిక సదుపాయాలు కొరవడిన పరిస్థితులున్నాయని చెప్పారు. నాణ్యమైన విద్య, వైద్యం అందని పరిస్థితులున్నాయన్నారు. మారుమూల గిరిజన గ్రామాల ప్రజలు వైద్యసహాయం పొందేందుకు దూర ప్రాంతాలకు వెళ్లవలసి వస్తోందని రహదారి సౌకర్యం లేనందున ఇబ్బందులు పడుతున్నారని కృష్ణమూర్తి తెలిపారు. దీనిపై కమిషన్ చైర్మన్ స్పందిస్తూ ఏజెన్సీ ప్రాంతాల సమస్యలను తమ క్షేత్రస్థాయి పర్యటనల్లో గుర్తించి ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నట్లు తెలిపారు. సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని డాక్టర్ శంకరరావు ఈ సందర్భంగా సీపీఎం నాయకుడు కృష్ణమూర్తికి చెప్పారు. -
పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై ప్రత్యేక డ్రైవ్
● డ్రోన్స్తో దాడులు ● ఒకే రోజు 255 ఓడీ, 53 కోప్టా కేసుల నమోదు ● మందుబాబులకు కౌన్సెలింగ్విజయనగరం క్రైమ్: జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ ప్రజాశాంతికి భంగం కలిగించినా, విద్యాసంస్థలకు వంద మీటర్ల పరిధిలో సిగరెట్స్, ఇతర పొగాకు ఉత్పత్తులు విక్రయించినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ వకుల్ జిందల్ హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లుగా తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగి, న్యూసెన్స్ చేస్తూ, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై దాడులు చేయాలని సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు. అలాగే వారిపై కేసులు నమోదు చేయాలని, పట్టుబడిన మైనర్లు, మందుబాబులకు కౌన్సెలింగ్ నిర్వహించాలని ఎస్పీ వకుల్ జిందల్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా సంబంధిత పోలీసు అధికారులు, సిబ్బంది విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా లేఅవుట్లు, గ్రామ శివారు ప్రాంతాల్లోను, నగర శివారు ప్రాంతాల్లోను, బహిరంగంగా మద్యం తాగిన వారిపై పోలీసు అధికారులు, సిబ్బంది డ్రోన్స్ తో దాడులు నిర్వహించారు. ఇక విద్యాసంస్థలకు 100మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలు చేసే కిరాణా, పాన్ షాపు వ్యాపారులపై కూడా దాడులు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై కోప్టా చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి, జరిమానా విధించామని ఎస్పీ తెలిపారు. ఆదివారం ఒక్కరోజునే 255 కేసులు నమోదు చేశామని పొగాకు ఉత్పత్తులు విక్రయించిన వారిపై 53 కేసులు నమోదు చేసి, జరిమానాగా రూ.8,500 విధించామని ఎస్పీ వకుల్ జిందల్ వివరించారు. -
ఎమ్మెల్సీ పెనుమత్సకు అభినందనల వెల్లువ
నెల్లిమర్ల రూరల్: వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సూర్యనారాయణరాజు(సురేష్బాబు) నియమితులు కాగా ఆయనకు పార్టీ శ్రేణుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా మండలంలోని మొయిద గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎంపీపీ అంబళ్ల సుధారాణి, జెడ్పీటీసీ గదల సన్యాసినాయుడు, నగరపంచాయతీ వైస్ చైర్మన్ సముద్రపు రామారావులు పెనుమత్సను సత్కరించి, అభినందనలు తెలిపారు. తనపై ఎంతో నమ్మకం ఉంచి ఈ పదవి కట్టబెట్టిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలని, మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ, ఇతర నాయకుల సమన్వయంతో పార్టీ మరింత బలోపేతానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ తెలిపారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేత మత్స సత్యన్నారాయణ, వైస్ ఎంపీపీ సారిక వైకుంఠం నాయుడు, నాయకులు పెనుమత్స సంతోష్, రేగాన శ్రీనివాసరావు, జమ్ము అప్పలనాయుడు, గేదెల రామచిరంజీవి, తర్లాడ దుర్గారావు, అంబళ్ల కిరణ్, తదితరులు పాల్గొన్నారు. -
చంపేసినా ఇక్కడ నుంచి కదిలేదిలేదు
విజయనగరం ఫోర్ట్: మమ్మల్ని చంపేస్తారా.. చంపేయండి.. 26 ఏళ్లుగా ఇక్కడే కూరగాయాలు విక్రయిస్తూ జీవిస్తున్నాం.. ఈ స్థలంలోనే చచ్చిపోతాం.. అంతేగాని ఇక్కడ నుంచి కదిలేది లేదు. చంపేస్తారా రండి ఇక్కడే అందరం రోడ్డుపై పడుకుంటాం. మా మీద నుంచి ఏబండి ఎక్కించేస్తారో ఎక్కించేయండి అంటూ అధికారుల ఎదుట ఎం.ఆర్. రైతు బజార్ రైతులు శనివారం ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లాలోని అన్ని రైతు బజార్ల ఎస్టేట్ అధికారులు ఎం.ఆర్.రైతుబజార్ రైతులతో సమావేశమయ్యారు. రైతు బజార్ను రింగ్రోడ్డు బజార్కు తరలించేందుకు రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. రింగ్ రోడ్డు బజార్లో షాపులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. కొత్తగా రైతు బజార్ ఏర్పాటు చేసి అక్కడకు తరలిస్తామని ఒప్పించే ప్రయత్నం చేశారు. ఈ దశలో రైతులు మాట్లాడుతూ మాకు ప్రత్యేకంగా రైతుబజారు నిర్మించి చూపించండి.. అప్పుడే ఇక్కడ నుంచి కదులుతాం.. రైతు బజార్ కూడా ఎం.ఆర్. రైతు బజార్ పరిసర ప్రాంతాల్లోనే ఏర్పాటు చేయాలి. అప్పటి వరకు మమ్మల్ని చంపినా, నరికినా, కొట్టినా, ఇక్కడ నుంచి కదిలేదిలేదు. మా బతుకులు రోడ్డున పడిన తర్వాత చనిపోతే ఏమైపోతోందంటూ రైతులు పాలూరి విజయలక్ష్మి, వనం జయలక్ష్మి, సునీత తదితరులు ఎస్టేట్ అధికారుల వద్ద వాపోయారు. రాజు స్థలం అంటున్నారు.. అలాంటప్పడు మా దగ్గర ప్రతినెలా అద్దె కట్టించుకుని ప్రభుత్వ ముద్రవేసి రశీదులు ఎందుకిచ్చారని నిలదీశారు. ఇక్కడ నుంచి కదిలేది లేదంటూ తేల్చిచెప్పారు. అధికారులకు స్పష్టంచేసిన ఎం.ఆర్.రైతు బజార్ రైతులు -
సారా స్థావరాలపై పోలీసుల దాడులు
వంగర: మండల పరిధి వి.వి.ఆర్.పేట గ్రామ సమీపంలో సారా స్థావరాలపై శనివారం పోలీసులు దాడులు చేశారు. ఎస్ఐ షేక్ శంకర్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది నాగావళి పరివాహక ప్రాంతంలో గాలించారు. ఓ ప్రదేశంలో 1500 పులిసిన బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేశారు. అనంతరం గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించారు. సారా తయారీ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రెండు బైక్లు ఢీకొని నలుగురికి గాయాలు మక్కువ: మక్కువ – చినబోగిలి రహదారి మధ్య ములక్కాయవలస గ్రామ సమీపంలో శనివారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు యువకులు గాయాల పాలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం వెంకటభైరిపురం గ్రామానికి చెందిన గంటసాగర్ అనే యువకుడు ద్విచక్ర వాహనంపై మక్కువ వస్తుండగా, మక్కువ నుంచి ములక్కాయవలస గ్రామం మీదుగా మక్కువకు చెందిన చోడవరపు జశ్వంత్, కాతా తనూజ్, చెముడు గ్రామానికి చెందిన వి.విష్ణు బైక్పై వస్తున్నారు. ఎదురెదురుగా వచ్చిన రెండు వాహనాలు ఢీకొనడంతో నలుగురూ గాయాల పాలయ్యారు. వెంటనే స్థానికులు వీరిని మక్కువ పీహెచ్సీకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం, మెరుగైన చికిత్స కోసం పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం భోగాపురం: భోగాపురం పోలీస్స్టేషన్ పరిధిలో గల జాతీయ రహదారి 16పై శనివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఎరుపు రంగు షర్ట్ వేసుకున్న ఈ వ్యక్తి సమాచారం తెలిస్తే 9121109445 నంబరును సంప్రదించాలని ఎస్ఐ ఎస్ఐ సూర్యకుమారి తెలిపారు. లోయలో పడిపోయిన ట్రాక్టర్ ఇంజిన్ సాలూరు: మండలంలోని గిరిశిఖర సంపంగిపాడు పంచాయతీ సుల్లారి నుంచి దిగువరూఢి మధ్య మలుపు వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి లోయలో పడిపోయింది. పట్టణం నుంచి యూరియా కొనుగోలు చేసుకుని జీపులో కురుకుటి వరకు తీసుకువచ్చారు. అక్కడ నుంచి ట్రాక్టర్లో లోడ్ చేసుకుని వెళ్తుండగా, దిగువరూఢి మలుపు వద్ద ఆపాడు. ఇటీవల వర్షాలు పడుతుండడం మలుపు ప్రమాదకరమని ముందుగానే గుర్తించి, వారు లోడును అక్కడ నిలిపేశాడు. ట్రాక్టర్ ఇంజిన్ను ముందుకు వెనక్కి తీసి లోడుతో ట్రాక్టర్ వెళ్లేందుకు అనువుగా చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ ఇంజిన్ అదుపు తప్పడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై గెంతేయడంతో ప్రమాదం తప్పి డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. కాగా వాహనం సుమారు 200అడుగుల లోతులో పడిపోయింది. ఏడుగురికి రూ.70వేల జరిమానా పార్వతీపురం రూరల్: మద్యం సేవించి వాహనాలను నడిపినందుకుగాను ఏడుగురు వ్యక్తులకు ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో రూ. 70వేలు జరిమానాను పార్వతీపురం ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ విధించినట్టు పట్టణ సీఐ కె.మురళీధర్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండోసారి మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడితే మూడు నెలల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. -
అగ్ని ప్రమాదంలో ఆస్తి నష్టం రూ.80లక్షలు
వీరఘట్టం: స్థానిక యూనియన్ బ్యాంకు పక్కనే ఉన్న గోదాంలో శుక్రవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ప్లాస్టిక్ సంచులతో పాటు జనపనార సంచులు కూడా దగ్ధమయ్యాయి. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో చెలరేగిన మంటలు శనివారం తెల్లవారుజామున 4 గంటలకు అదుపులోకి వచ్చినట్టు పాలకొండ అగ్నిమాపక అధికారి జామి సర్వేశ్వరరావు తెలిపారు. ప్రమాదంలో సుమారు 1000 బండిల్స్ ప్లాస్టిక్ టార్ఫాలిన్లతో పాటు టైల్స్ కాలిపోయినట్టు గుర్తించామన్నారు. విలువైన మార్బుల్స్తో పాటు గోదాంలో ఉన్న స్లాబ్, గోడలు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు. సుమారు రూ.80 లక్షల ఆస్తి నష్టం ఉంటుందని అంచనా వేశామన్నారు. తహసీల్దార్ ఏఎస్ కామేశ్వరరావు ప్రమాద స్థలాన్ని సందర్శించారు. ప్రమాదం ఎలా జరిగిందని గోదాం యజమాని కొత్తకోట వెంకటరమణను ఆరా తీశారు. ఆయనతో పాటు వీఆర్వో వి.రమేష్నాయుడు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. శనివారం ఉదయం పాలకొండ సీఐ ఎం.చంద్రమౌళి ప్రమాద స్థలాన్ని సందర్శించారు. బాధితునితో మాట్లాడారు. రూ.10 లక్షల సరుకును కాపాడిన యువత యూనియన్ బ్యాంకు పక్కన ఉన్న వ్యాపార సముదాయంలో రెండు గోదాంలు ఉండగా ఒక గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ మంటలు పక్కనే ఉన్న గోదాంలోకి వ్యాపిస్తుండడంతో అందులో ఉన్న సుమారు రూ.10 లక్షల విలువ గల గోనె సంచులు ఉన్నాయి. స్థానిక కూరాకుల వీధికి చెందిన శ్రీకృష్ణా సేవా సంఘం యువత వెంటనే స్పందించి పక్క గోదాంలో ఉన్న గోనె సంచులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. యువతకు బాధితుడు వెంకటరమణ కృతజ్ఞతలు తెలిపాడు. -
ఎస్పీ కార్యాలయంలో డీఐజీ తనిఖీలు
పార్వతీపురం రూరల్: వార్షిక తనిఖీల్లో భాగంగా విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి జిల్లా పోలీసు శాఖ కార్యాలయంలో ఉన్న పలు ప్రధాన విభాగాలను శనివారం తనిఖీ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో జిల్లా పోలీసు శాఖ కార్యాలయానికి వచ్చిన ఆయనకు ముందుగా ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం డీసీఆర్బీ, స్పెషల్ బ్రాంచ్, పాస్పోర్టు విభాగాలను ఆయన సందర్శించి రికార్డులు నిర్వహణను ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డితో కలసి క్షుణ్ణంగా పరిశీలించారు. వివిధ సెక్షన్లు, వివిధ రకాలుగా నిర్వర్తించే అధికారులు, సిబ్బంది, వారి విధులు వంటి అంశాలపై అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా సోషల్ మీడియా, సైబర్ సెల్ విభాగాల్లో విధులు నిర్వర్తించే సిబ్బంది అందరినీ ప్రశ్నించి వారు రోజువారీ కార్యక్రమాలపై ఆరా తీశారు. అనంతరం పలు అంశాలపై సమీక్ష నిర్వహించిన డీఐజీ గోపీనాథ్ జట్టి నిర్వహణ, పనితీరుపై సంతృప్తిని వ్యక్తం చేశారు. వార్షిక తనిఖీల్లో ఎస్పీతో పాటు ఏఎస్పీ అంకితా సురాన, పాలకొండ డీఎస్పీ రాంబాబు, ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
అన్నదాత గోడు పట్టదా..!
● సంగాంలో అన్నదాతకు తీవ్రనష్టం ● పూడుకుపోయిన తంపర బట్టి ● పంట పొలాల్లోకి వరద నీరు ● నీట మునిగిన పంట పొలాలు ● ఏటా ఇదే దుస్థితి ● పట్టించుకోని ప్రభుత్వం, అధికారులు ● 300 ఎకరాల్లో వరద నీరు పోటు వంగర: మండల పరిధి సంగాంలో అన్నదాతకు తీరని నష్టం జరుగుతుంది. వర్షం నీరు.. వరద నీరు మళ్లించేందుకు ఏర్పాటు చేసిన తంపర బట్టి పూర్తిగా పూడుకుపోవడంతో ఆ నీరు పంట పొలాల్లోకి వెళ్లిపోతుంది. దీంతో పంట పొలాల్లో నీరు నిలువ ఉండడంతో 300 ఎకరాలు మేర పంటకు ఏటా నష్టం జరుగుతుందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. తంపర భూములు చుట్టూ ఇక్కడ ఉన్న చేపల చెరువు యజమాని గట్టు కట్టేయడంతో ఈ సమస్య మరింత జఠిలమైంది. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలంటూ సంగాం, మగ్గూరు గ్రామాలకు చెందిన రైతులు కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఇదీ సమస్య.. సంగాం, మగ్గూరు గ్రామాలకు చెందిన కడుమల పొలం, షావుకారి పొలం, బోరుమడులు, బదంతాలు పొలంతో పాటు మరిన్ని పంట పొలాలు ఏటా నీట మునుగుతున్నాయి. సంగాంకు చెందిన 250 ఎకరాలు, మగ్గూరుకు చెందిన 50 ఎకరాలు తంపర బట్టి సమీపంలో పంట పొలాలున్నాయి. ఈ తంపర బట్టి ఎగువ భాగంలో 16 ఎకరాల తంపర పొలాలున్నాయి. ఈ పొలాల్లో చేరిన వరద నీరు తంపర పొలాల నుంచి తంపర బట్టిలోకి వెళ్లి నేరుగా సంగాం గ్రామ సమీపంలో ఉన్న నాగావళి నదిలోకి ప్రవేశిస్తుంది. అయితే తంపర బట్టి పూర్తిగా పూడుకుపోవడంతో చేపలు చెరువుల్లోని నీరు, తంపర పొలాల్లోని నీరు పంట పొలాల్లోకి చొరబడుతుంది. దీంతో ఈ సమస్య నెలకొంది. ప్రభుత్వం.. అధికారుల నిర్లక్ష్యం గడిచిన కొన్నేళ్లుగా తంపర బట్టి పొలాలపై ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని రైతులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. తంపర బట్టిలో పూడిక తీత పనులు చేపడితే కొంత నష్ట నివారణ జరుగుతుందని, అదే విధంగా ఇరిగేషన్ అధికారులు కూడా ఇక్కడ పనులు చేపట్టడకపోవడం ఈ పరిస్థితి నెలకొంది. అలాగే 14 మీటర్లు వెడల్పు ఉన్న తంపర బట్టి కేవలం నాలుగు మీటర్లకు కుదించిపోవడంతో వృథా నీరు, వరద నీరు వెలుపలికి తరలించే పరిస్థితి లేదు. చేపలు చెరువు యజమాని ఏటా రెండుసార్లు తంపరబట్టిలో పూడిక తీస్తామని హామీ ఇచ్చినా ఎన్నడూ పట్టించుకోలేదని ఆయకట్టు రైతులు ఆవేదన చెందుతున్నారు. తంపరబట్టికి ఇరువైపుల ఉన్న సంగాం, మగ్గూరుకు చెందిన 300 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లుతుంది. ప్రస్తుతం రైతులు ఉబాలు వేసిన నాట్లు నీటిలోనే ఉన్నాయి. -
జిందాల్ నిర్వాసితుల ఫిర్యాదులపై విచారణ
విజయనగరం అర్బన్: జిందాల్ సేకరణలో నిర్వాసితులైన లబ్ధిదారులకు అన్యాయం జరగకుండా చూ స్తామని కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ హామీ ఇచ్చారు. కలెక్టర్ చాంబర్లో చీడిపాలెం, ముషిడిపల్లి, చినఖండేపల్లి, కిల్లంపాలెం, మూల బొడ్డవర గ్రామాలకు చెందిన 10 మంది రైతులు తమకు జిందాల్ భూములకు సంబంధించి ఇంతవరకు నష్టపరిహారం అందలేదని శనివరాం ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించిన దస్తాలు కలెక్టర్కు చూపించి వివరించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ కేఆర్సీసీ డిప్యూటీ కలెక్టర్ మురళిని విచారణాధికారిగా నియమిస్తూ నిజనిర్ధారణ చేసి పూర్తి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. నివేదిక ప్రకారం తగిన చర్యలు తీసకోవడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ మురళి, లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ -
బ్యానర్...
గంట్యాడ మండలం పెదవేమలి గ్రామంలో సాగుకు నోచుకోక ఖాళీగా ఉన్న పంట పొలాలు● రైతన్నకు గడ్డు పరిస్థితి ● ముందుకు సాగని ఖరీఫ్ సాగు ● జిల్లాలో పంటల సాగు సాధారణ విస్తీర్ణం: 1,16,993 హెక్టార్లు ● ఇంతవరకు సాగైనది 22,045 హెక్టార్లలోనే.. ● కర్షకుల్లో అయోమయం విజయనగరం ఫోర్ట్: ఖరీఫ్ సీజన్ లో వ్యవసాయ పనులు చురుగ్గా సాగాల్సిన జూలై నెలలో వరుణుడు మొహంచాటేశాడు. అక్కడక్కడ చిరుజల్లులే కురుస్తున్నాయి. చెరువుల్లో నీరు చేరే పరిస్థితి లేదు. పంటల సాగు మందకొడిగా సాగుతోంది. మరోవైపు కూటమి ప్రభుత్వం రైతన్నపై కక్షకట్టింది. గతేడాది అందజేయాల్సిన అన్నదాత సుఖీభవ పథకాన్ని ఎగ్గొట్టింది. ఈ ఏడాది ఖరీఫ్ ఆరంభంలో రైతన్నకు అందజేయాల్సిన పెట్టుబడి సాయం ఊసెత్తడంలేదు. విత్తనాలు, ఎరువులు, దమ్ము, నాట్లు వేసేందుకు అయ్యేఖర్చులకు చేతిలో చిల్లిగవ్వలేక రైతులు బేలచూపులు చూస్తున్నారు. అప్పులు చేసి పంటల సాగుకు ఉపక్రమించారు. గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏటా మే నెలలోనే వైఎస్సార్ రైతుభరోసా పథకం కింద తొలివిడత సాగుసాయం అందించేదని, సాగు ఖర్చులకు బెంగ ఉండేది కాదని, వర్షాలు కూడా అనుకూలించడంతో ఉత్సాహంగా ముందుకు సాగేవారమని, ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నాయంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. పంటల సాగు అంతంత మాత్రమే... జిల్లాలో అధిక విస్తీర్ణంలో పంటల సాగుకు వర్షమే ఆధారం. వర్షాలు అనుకూలించకపోవడంతో సాగు ప్రతికూలంగా మారింది. మరోవైపు ప్రాజెక్టుల నుంచి సాగునీరు విడిచిపెట్టినా కాలువలు అధ్వానంగా ఉండడంతో శివారు భూములకు సాగునీరు అందని పరిస్థితి. వరినారు సిద్ధమైనా.. దమ్ముచేసి నాట్లు వేయడానికి అవసరమైన నీరు లేకపోవడం సమస్యగా మారింది. జిల్లాలో ఖరీఫ్లో వరి, జొన్న, మొక్కజొన్న, వేరుశనగ, నువ్వు, పత్తి, చెరకు తదితర పంటల సాగు సాధారణ విస్తీర్ణం 1,16,993 హెక్టార్లు. జూలై 18వ తేదీ నాటికి కేవలం 22,045 హెక్టార్లలో మాత్రమే పంటలు సాగయ్యాయి. వరి పంట 7,464 హెక్టార్లు, జొన్న పంట 5, మొక్కజొన్న 7,454, పెసర, మినుము పంటలు 19, వేరుశనగ 46, నువ్వులు 3,799, పత్తి 1507, గోగు 15, చెరకు 1729 హెక్టార్లలో సాగయ్యాయి. నాలుగు మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదు జిల్లాలోని రామభద్రపురం, బొబ్బిలి, పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. రామభద్రపురంలో 378.5 మి.మీ సాధారణ వర్షపాతం కాగా 290.7 మి.మీ, బొబ్బిలిలో 377.6 మి.మీకు 343.6, పూసపాటిరేగలో 268.8 మి.మీకు 245.2 మి.మీ, భోగాపురంలో 295.5 మి.మీకు 277.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో 10 రోజుల పాటు తుఫాన్ వాతావరణం నెలకున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. జిల్లాలో 10 వేలు వరకు చెరువులు ఉన్నాయి. వీటిల్లో అధిక శాతం చెరువులు నిండలేదు. రైతులు పంటల సాగుకు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకుంది. నీరుగారుతున్న ఖరీఫ్ ఆశలు వరుణుడు కరుణించకపోవడంతో ఖరీఫ్ ఆశలు సన్నగిల్లుతున్నాయి. వరి నారు సిద్ధంగా ఉన్నా నీరులేక నాట్లు వేయలేని పరిస్థితి. ఇప్పటికే అప్పుచేసి విత్తనాలు కొనుగోలుచేశాం. పొలాలను దుక్కిచేశాం. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు రూపాయి పెట్టుబడి సాయం అందలేదు. గతంలో ఏటా ఠంచన్గా పెట్టుబడి సాయం అందేది. పెట్టుబడి ఖర్చులు గట్టెక్కేవి. – కర్రి అప్పలనాయుడు, రైతు, రాకోడు గ్రామం, విజయనగరం మండలం ఆ ఉత్సాహం లేదు... గతంలో వర్షాలు అనుకూలించేవి. మరోవైపు ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం అందేది. వ్యవసాయమంటే పండగలా ఉండేది. పంటల సాగును ఉత్సాహంగా చేపట్టేవారం. కూటమి ప్రభుత్వం వచ్చాక అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రెండో ఏడాది వచ్చినా ఇంతవరకు సాయం అందించలేదు. భారీ వర్షాలు కురకపోవడంతో చెరువులు నిండలేదు. దమ్ము చేయడానికి అవసరమైన నీరు లేదు. దీంతో ఏం చేయాలో తెలియడం లేదు. – ఎస్.రామునాయుడు, రైతు, పెదవేమలి గ్రామం -
వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించాలి
పార్వతీపురం రూరల్: ప్లాస్టిక్ రహిత సమాజంలో ప్రతీ ఒక్కరు భాగస్వామ్యులు కావాలని, అలాగే ప్రతీ ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని జిల్లా ప్రత్యేకాధికారి డా.నారాయణ భరత్ గుప్తా జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం పార్వతీపురం మండలంలోని పెదబొండపల్లి గ్రామంలో స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్తో కలసి పాల్గొన్నారు. ఈ మేరకు గ్రామంలో ఉన్న చెత్త సేకరణ కేంద్రాన్ని వారు పరిశీలించి వర్మీకంపోస్టు త యారీ విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో రెండు రకాల డస్ట్బిన్లను స్థానికులకు పంపిణీ చేశారు. వాటిలో తడి చెత్త, పొడి చెత్తను వే ర్వేరుగా వేయాలని ప్రజలకు అవగాహన కల్పించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇతర రా ష్ట్రాల్లో నిత్యావసరాలకు గుడ్డ సంచులను వినియోగిస్తున్నారని, అదే విధంగా మన జిల్లాలో కూడా ప్లాస్టిక్ వినియోగానికి స్వస్తి పలికి పర్యావరణానికి హానికరం లేని వస్తువులను ప్రజలు వినియోగించాలని సూచించారు. ఐటీడీఏ పీవో అశుతోష్ శ్రీవాత్సవ, డీపీవో కొండలరావు, డీఆర్డీఏ పీడీ సుధారాణి, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. జిల్లా ప్రత్యేకాధికారి నారాయణభరత్ గుప్తా -
జీతం బెత్తెడు.. బాధ్యతలు బారెడు!
‘ ఎంఏ, బీఈడీ పూర్తిచేసి విజయనగరం పట్టణంలోని ఓ కార్పొరేట్ విద్యాసంస్థలో 10 సంత్సరాలుగా పనిచేస్తున్నాను. ప్రారంభ దశలో నెలకు రూ.5,500కు విధుల్లో చేరాను. ఇప్పుడు రూ.15వేలు ఇస్తున్నారు. ప్రతిరోజూ దాదాపు పది గంటలకు పైగా పనిచేయాల్సి వస్తోంది. ఫలితాలు సాధించడంలో విద్యార్థుల కంటే ఉపాధ్యాయులపైనే ఒత్తిడి అధికం. సెలవులు ఉండవు. అత్యవసర వేళ సెలవు ఇవ్వకుండా ఉండిపోతే అదే ఉద్యోగానికి చివరిరోజు అవుతుంది.’ – ఇదీ ఓ ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయుడి ఆవేదన ‘డిగ్రీ పూర్తి చేశా.. ప్రైవేటు పాఠశాలలో నెలకు రూ.8 వేలు ఇస్తున్నారు. అదీ ప్రతి నెలా ఇవ్వరు. రెండు మూడు మాసాలకు ఒక పర్యాయం చెల్లిస్తున్నారు. పైగా రికార్డుల్లో చూపించి నంత జీతం ఇవ్వడంలేదు. రెవెన్యూ స్టాంపులు వేయించుకొని మరీ సంతకాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో విధిలేక విధులు నిర్వర్తిస్తున్నా..’ – మరో టీచర్ వ్యథ విజయనగరం అర్బన్: ప్రైవేటు విద్యాలయాల్లో ఉపాధ్యాయ వృత్తి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. అధిక పనిభారం వారిని తీవ్రంగా కుంగదీస్తోంది. ఏటా ఫీజులు పెంచుతూ తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి వసూలు చేసే యాజమాన్యాలు ఉపాధ్యాయుల వేతనాల విషయంలో మాత్రం శీతకన్ను వేస్తూ శ్రమదోపిడీకి పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేసవిలో యాజమాన్యాల ఒత్తిడి, ప్రవేశాల లక్ష్యం వారిని మరింత కలవరపెడుతోందని ప్రైవేటు ఉపాధ్యాయ సంఘం సభ్యులు వాపోతున్నారు. ఇచ్చిన జీతాలతో కుటుంబ జీవనం నెట్టుకోలేక... తప్పనిసరిగా ట్యూషన్స్ చెప్పుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 6 కార్పొరేట్ విద్యాసంస్థలతో పాటు 553 వరకు ప్రైవేటు పాఠశాలలున్నాయి. వాటిలో 7 వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో చాలా మంది ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు చేస్తున్నారు. పట్టణంలో ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు తన భర్త అనారోగ్యం కారణంగా సడన్గా సెలవు పెట్టింది. ప్రిన్సిపాల్ సెలవు మంజూరు చేయకపోవడమేకాకుండా ఆ స్థానంలో మరొకరిని నియమించారు. సెలవు పెడితే వేతనంలో కోత.. జిల్లాలోని మండల కేంద్రాల్లోని పాఠశాలల్లో పనిచేస్తున్నవారికి నెలకు రూ. 5 వేలకు మించి వేతన ఉండదు. పట్టణ పరిధిలోని ప్రైవేటు స్కూళ్లలో అయితే రూ.8 వేల నుంచి రూ.10 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. ప్రతినెలా వేతనాలు చెల్లించే పాఠశాలలు తక్కవగానే ఉన్నట్లు వాపోతున్నారు. అత్యవసర సెలవు పెట్టినా జీతంలో కోత విధిస్తున్నారు. పీఎఫ్, ఈఎస్ఐ వంటివి పూర్తిస్థాయిలో అమలు కావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనిఖీలు జరిపి బోధకులకు న్యాయం చేయాల్సిన విద్యాశాఖ నిస్తేజంగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్మిక శాఖ అధికారులు సైతం చర్యలకు ఉపక్రమించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బోధనకంటే ఇతర వేధింపులే ఎక్కువ ఉమ్మడి విజయనగరం జిల్లాలో 553 ప్రైవేటు స్కూళ్లు అందులో పనిచేస్తున్న టీచర్లు 7 వేల మంది తూతూ మంత్రంగా అధికారుల తనిఖీలు -
అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలి
● కలెక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విజయనగరం ఫోర్ట్: అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖకు చెందిన సీడీపీఓలు, సూపర్ వైజర్స్తో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాలకు మరుగుదొడ్లు, విద్యుత్ సదుపాయం తప్పనిసరన్నారు. తక్కువ బరువు ఉన్న పిల్లలు బరువు పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీ్త్ర, శిశు సంక్షేమశాఖ సాధికారత అధికారిణి టి.విమలారాణి పాల్గొన్నారు. వేతనదారులకు కనీస వేతనాలు అందించాలి ఉపాధిహామీ వేతనదారులకు రూ.307 వేతనం వచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అంబేద్కర్ తెలిపారు. డ్వామా ఇంజినీరింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాకు కేటాయించిన 1.33 లక్షల పనిదినాల లక్ష్యాన్ని పూర్తిచేయాలన్నారు. దీనికోసం అధికారులు రోజువారీ సమీక్ష నిర్వహించాలన్నారు. సమావేశంలో డ్వామా పీడీ శారదాదేవి పాల్గొన్నారు. ఓపెన్స్కూల్ విద్యార్థులకు ధ్రువపత్రాలు విజయనగరం అర్బన్: ఓపెన్ స్కూల్–2025 విద్యాసంవత్సరంలో ఉత్తీర్ణులైన పదోతరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థుల ధ్రువపత్రాలను సార్వత్రిక విద్యాపీఠం విడుదల చేసిందని డీఈఓ యు.మాణిక్యంనాయుడు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. వీటిని అభ్యర్థుల ఇంటి అడ్రస్కు స్పీడ్ పోస్టులో పంపిస్తామని తెలిపారు. అడ్రస్ల వివరాలను ‘ఏపీ ఓపెన్స్కూల్.ఏపీ.జీఓవీ.ఐఎన్’ వెబ్ సైట్లో పరిశీలించుకోవాలన్నారు. 24న టీటీసీ లోయర్ గ్రేడ్ థియరీ పరీక్షలు టీటీసీ లోయర్ గ్రేడ్ థియరీ పరీక్షను ఈ నెల 24న రెగ్యులర్, ఫెయిలైన విద్యార్థులకు నిర్వహిస్తామని డీఈఓ తెలిపారు. ఆ రోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఎడ్యుకేషన్ సైకాలజీ అండ్ స్కూల్ అడ్మిషన్ పేపర్, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటలకు మెథడ్స్ ఆఫ్ టీచింగ్ (జనరల్) పేపర్, 3.30 నుంచి 4.30 గంటలకు మెథడ్స్ ఆఫ్ టీచింగ్ (స్పెషల్) పేపర్ పరీక్ష ఉంటుందని తెలిపారు. పరీక్షకు సంబంధించిన హాల్టికెట్లను ‘బీఎస్ఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్’ వెబ్సైట్లో పొందుపరిచామన్నారు. అభ్యర్థులు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్టికెట్, గుర్తింపు కార్డుతో పరీక్షకు హాజరుకావాలని కోరారు. 21న పీడీఎస్ బియ్యం వేలం విజయనగరం ఫోర్ట్: గత కొద్ది కాలంగా జరిపిన తనిఖీల్లో దొరికిన పీడీఎస్ బియ్యాన్ని ఈ నెల 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విజయనగరం ఎంఎల్ఎల్ పాయింట్ వద్ద వేలం వేస్తామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కె.మధుసూదనరావు తెలిపారు. మొత్తం 90.80 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని వేలంవేస్తామని చెప్పారు. -
నవీన్పై పీడీ యాక్టు
విజయనగరం క్రైమ్ : చట్టాన్ని తరచూ ఉల్లంఘిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న రాజాం మండలం గురువాంకు చెందిన కుప్పిలి నవీన్(19)పై పీడీ యాక్టు ప్రయోగించి, ముందస్తు నేర నియంత్రణ చర్యల్లో భాగంగా నవీన్ను విశాఖ సెంట్రల్ జైలుకు తరలించినట్టు ఎస్పీ వకుల్ జిందల్ శనివారం తెలిపారు. నవీన్ చెడు వ్యసనాలకు అలవాటు పడి, దురుసుగా ప్రవర్తిస్తూ ఇతరులకు హాని కలిగించే విధంగా మారాడని ఎస్పీ పేర్కొన్నారు. చిన్న చిన్న విషయాలకే తగదా పడుతూ.. భౌతిక దాడులకు పాల్పడుతూ గత ఐదేళ్లలో రాజాం పోలీస్స్టేషన్లో నాలుగు, సంతకవిటి పోలీస్స్టేషన్లో ఎనిమిది కేసుల్లో నిందితుడిగా అరెస్టు అయ్యాడని వెల్లడించారు. నేరాల నియంత్రణకు జిల్లా పోలీసు శాఖ చేపడుతున్న ముందస్తు చర్యల్లో భాగంగా నవీన్పై పీడీ యాక్టు అమలు చేయాలని కోరుతూ రాజాం పోలీసులు జిల్లా పోలీసు కార్యాలయానికి ప్రతిపాదనలు పంపారని తెలిపారు. వాటిని సిఫారసు చేస్తూ కలెక్టర్కు ప్రతిపాదనలు పంపామన్నారు. ఈ మేరకు నవీన్ను నిర్బంధించి విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించామని ఎస్పీ తెలిపారు. హక్కులను సద్వినియోగం చేసుకోవాలి ● కొత్తవలస జూనియర్ సివిల్ జడ్జి డాక్టర్ ఎస్.విజయచంద్రన్ కొత్తవలస: రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి మహిళా సద్వినియోగ పర్చుకోవాలని కొత్తవలస జూనియర్ సివిల్ జడ్జి డాక్టర్ సముద్రాల విజయచంద్రన్ అన్నారు. మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ అధ్వర్యలో శనివారం నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందన్నారు. చదువే వ్యక్తిగత అభివృద్ధికి మూలమని.. విద్యతోనే అభివృద్ధి సాధించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి.వి.శ్రీదేవి, న్యాయవాదులు గొడుగుల మహేంద్ర, డి.శ్రీనివాస్, జీవీ రమణ, వెలుగు ఏపీఎం ఎం.వెంకటరమణ, ఎస్సై సీహెచ్.హేమంత్, తదితరులు పాల్గొన్నారు. -
● పోలీసుల ‘మొక్క’వోని దీక్ష...
పర్యావరణ పరిరక్షణలో పోలీసులు భాగస్వాములయ్యారు. చింతవలస ఐదవ ఏపీఎస్పీ బెటాలియన్లో శనివారం వనమహోత్సవం నిర్వహించారు. బెటాలియన్ ఆవరణలో ‘జగమంతా వనం–ఆరోగ్యంతో మనం’ పేరిట బెటాలియన్ కమాండెంట్ మలికా గార్గ్ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు, సిబ్బంది సామూహికంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బెటాలియన్ అదనపు కమాండెంట్ సి.రాజారెడ్డి మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. నాటిన మొక్కలను సంరక్షిస్తే పర్యావరణాన్ని రక్షించినట్టు అవుతుందన్నారు. – డెంకాడ -
రైతుబజారు తొలగించొద్దు.. రైతు బతుకు బుగ్గిపాలు చేయొద్దు
● సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ విజయనగరం గంటస్తంభం: పాత మహారాజ ఆస్పత్రి వద్ద ఉన్న రైతుబజారును తొలగించవద్దని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ అన్నారు. అదే రైతుబజారు వద్ద విజయనగరం పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రైతుబజార్ను ఆస్పత్రి వద్దే కొనసాగించాలనే దానికి మద్దతు కూడగడుతూ సంతకాల సేకరణ శనివారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని, రైతులతో కలిసి రైతుబజార్ను కాపాడుకుంటామన్నారు. 1999 నుంచి రైతుబజారు అక్కడే ఉందని, అప్పటి నుంచి 50 కుటుంబాల వారు అదే బజారుపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారన్నారు. నగర ప్రజలకు అన్ని విధాలా అందుబాటులో ఉన్న ఈ స్థలం ఎమ్మెల్యే అదితిగజపతి, అశోక్ గజపతిరాజులు ఇన్నాళ్లు ఊరుకుని ఇప్పుడు ఆ స్థలం తమదని అప్పగించాలని అనడం సరికాదన్నారు. విద్యాదాతలు, భూ దాతలు అని చెప్పుకునే వారే ఇలా చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. అద్దెలు కట్టుకుని, పన్నులు చెల్లించుకుని మరీ కూరగాయలు అమ్ముకుని జీవనం సాగిస్తున్న వారిని తీసేయడమనేది వారి పొట్టకొట్టడమేనన్నారు. ప్రస్తుతం అక్కడ భూమి ఖరీదైనది కాబట్టి ఆ భూమిని లాగేసుకునే ప్రయత్నం చేయడం దుర్మార్గం తప్ప మరొకటి కాదన్నారు. పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి రెడ్డి శంకరరావు మాట్లాడుతూ ప్రభుత్వానికి అద్దెలు చెల్లించి రైతుబజారులో కూరగాయలు అమ్ముకుని జీవనం సాగిస్తున్న రైతు కుటుంబాలను రోడ్డున పడేస్తే ఎలా అని, వారి తరఫున పోరాడుతామన్నారు. ఇప్పటికై నా అధికారులు, ప్రభుత్వం బాధ్యత తీసుకుని, రైతుబజారును అక్కడే ఉంచేలా చర్యలు తీసుకోవాలని లేకుంటే పోరాటం కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో రామ్జీ చాంబర్ ఆఫ్ కామర్స్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కె.సురేష్, జిల్లా ఉపాధ్యక్షుడు టి.వి.రమణ, అంగన్వాడీ జిల్లా గౌరవాధ్యక్షులు వి.లక్ష్మి, ఐద్వా జిల్లా కార్యదర్శి పి.రమణమ్మ, సీఐటీయూ నగర కార్యదర్శి బి.రమణ, అధ్యక్షుడు జగన్మోహన్, కేవీపీస్ జిల్లా కార్యదర్శి రాకోటి ఆనంద్, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి హరీష్ తదితరులు పాల్గొన్నారు. -
ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి
విజయనగరం: ప్లాస్టిక్ ప్రతి ఒక్కరి నిత్య జీవితంలో భాగమైపోయిందని, అయితే ప్లాస్టిక్తో మన ఆరోగ్యాన్ని మనమే నాశనం చేసుకుంటున్నామని, ప్లాస్టిక్ అత్యంత ప్రమాదకరమని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని జిల్లా ఇన్చార్జ్ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్రలో భాగంగా శనివారం గంటస్తంభం నుంచి బాలాజీ కూడలి వరకు జరిగిన ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం బాలాజీ కూడలిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. మూడవ శనివారం ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతమొందిద్దాం అనే నినాదంతో ప్రభుత్వం రాష్ట్రమంతటా కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగంపై ఒక్క రోజులో మార్పు రాదనీ, ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయం చూడాలని తెలిపారు. డ్వాక్రా, మెప్మా సంఘాల ద్వారా పేపర్, జనప నార, కాటన్తో బ్యాగ్లను తయారు చేసే యూనిట్లను స్థాపించేలా శిక్షణ ఇవ్వాలని తెలిపారు. ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడారు. ఈ సందర్భంగా 12 మంది పారిశుధ్య కార్మికులను సన్మానించారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. సమావేశంలో సంయుక్త కలెక్టర్ సేతు మాధవన్, డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ , కార్పొరేషన్ కమిషనర్ నల్లనయ్య, సీపీవో బాలాజీ, ఆర్డీవో కీర్తి, కార్పొరేటర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి వంగలపూడి అనిత -
నీ వెంటే నేను..!
● మరణంలోనూ వీడని దంపతుల బంధం ● భర్త మృతిచెందిన కొద్ది సమయానికే భార్య మృతికొమరాడ/పార్వతీపురం రూరల్: నాతిచరామి..అన్న పెళ్లినాటి ప్రమాణానికి కట్టుబడి ఉన్నారా దంపతులు. వివాహం అయినప్పటి నుంచి ఒకరికొకరు తోడుగా అన్యోన్యంగా ఉంటూ జీవనం సాగించారు. వృద్ధాప్యం వచ్చినప్పటికీ వారిలో అన్యోన్యత ఏ మాత్రం తగ్గలేదు. కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ కలిసి జీవనం సాగిస్తున్న ఆ దంపతులు మరణంలోనూ వారి బంధాన్ని వీడలేదు. భర్త మరణ వార్త విన్న భార్య భావోద్వేగానికి లోనై కొద్ది క్షణాల్లోనే మరణించింది. ఈ ఘటన కొమరాడ మండలంలోని కళ్లికోట గ్రామంలో జరిగింది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన సీర పకీరునాయుడు (80), సీర పోలమ్మ (75) దంపతులు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల పకీరునాయుడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయినప్పటికీ ఆరోగ్యం కుదుటపడక గురువారం మధ్యాహ్నం మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య భావోద్వేగానికి గురై సాయంత్రం మృతిచెందింది. భార్యాభర్తలు ఒకే రోజు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. -
నకిలీ ఎరువుతో జాగ్రత్త!
● ప్రారంభమైన ఖరీఫ్ సీజన్ ● మొదలైన పురుగు మందులు, ఎరువుల విక్రయాలు ● కొనుగోలు విషయంలో అవగాహన తప్పనిసరి ● రసీదు తప్పనిసరిగా తీసుకోవాలి ● జిల్లాలో సుమారు 328 దుకాణాలురామభద్రపురం: ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో ప్రస్తుతం కొద్దో గొప్పో కురుస్తున్న వర్షాలకు రైతులు పంటల సాగు చేపట్టారు. ఇప్పటికే జిల్లాలో వరి 6510 హెక్టార్లు, పత్తి 1490 హెక్టార్లు, మొక్కజొన్న 6678 హెక్టార్లు, వేరుశనగ 46 హెక్టార్లు, చెరకు 1489 హెక్టార్లు, కూరగాయలు 1000 హెక్టార్లలో సాగులో ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.అలాగే ప్రభుత్వం అనుమతి పొందిన సుమారు 328 పురుగుమందులు, ఎరువుల దుకాణాలు జిల్లాలో ఉన్నాయి. అయితే పంటల సాగులో అధిక దిగుబడులు సాధించాలని రైతులు ఎరువులు, పురుగు మందులు అధికంగా వినియోగిస్తున్నారు. అన్నదాతల అవసరాలను సొమ్ము చేసుకునేందుకు కొందరు వ్యాపారులు నకిలీ ఉత్పత్తులను అంటగట్టే అవకాశముందని, అప్రమత్తంగా వ్యవహరించకుంటే మోసపోయే ప్రమాదముందని ప్రస్తుతం అకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తున్న విజిలెన్స్ అధికారులు, వ్యవసాయాధికారులు హెచ్చరిస్తున్నారు. దళారుల వద్ద కొనుగోలు చేయొద్దు నిషేధిత మందులు కొనుగోలు చేస్తే రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. కొందరు ఎరువులు, పురుగు మందుల వ్యాపారులు దిగుబడి ఎక్కువగా వస్తుందని నమ్మించి అనుమతి లేని వివిధ కంపెనీల కల్తీ ఎరువులు, పురుగు మందులు అంటగట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా అనుమతులు లేని దుకాణాలు, దళారుల వద్ద కొనుగోలు చేయరాదు. తక్కువ ధరకే ఇస్తున్నారని కొని వాడితే పంట దిగుబడి తగ్గడంతో పాటు భూసారం దెబ్బతింటుంది. కొనుగోలు చేసేటప్పుడు మందుల లేబుల్స్ పరిశీలించి, అవి కంపెనీ ఉత్పత్తులా? లేక స్థానికంగా తయారు చేసి విక్రయిస్తున్నారా? అనే విషయాలను తెలుసుకోవాలి.కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా దుకాణ యజమాని సంతకంతో కూడిన రసీదు తీసుకోవాలి. ముఖ్యంగా విత్తనాలకు సంబంధించిన సంచుల సీల్ తొలగించినట్లు గుర్తిస్తే వాటిని కొనుగోలు చేయకుండా నకిలీలపై ఫిర్యాదు చేయాలి.అధికారుల పరిశీలనలో అది వాస్తవమని తేలితే సంబంధిత డీలర్పై కేసు నమోదు చేసి రైతులకు న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. -
యాౖభై ఏళ్ల వ్యక్తి అదృశ్యం
విజయనగరం క్రైమ్: భార్య అన్నం సరిగా వండలేదని అలిగిన ఓ భర్త ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన శుక్రవారం విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.ఇందుకు సంబంధించి ఎస్ఐ అశోక్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం మండలం కొండకరకాం గ్రామానికి చెందిన యజ్జపురపు గౌరినాయుడి(50)కు భార్య సత్యవతితో ఒక పాప ఉంది. ఇన్నాళ్లూ అన్యోన్యంగా సాగిన భార్యాభర్తల కాపురంలో ‘అన్నం’ చిచ్చుపెట్టింది. తనకు సరిగా అన్నం వండి పెట్టలేదన్న కోపంతో భర్త గౌరినాయుడు అలిగాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య గలాటా జరిగింది. దీంతో ఈ నెల 12న ఇంటి నుంచి వెళ్లిపోయి నేటివరకు ఇంటికి చేరకపోవడంతో భార్య సత్యవతి రూరల్ పోలీస్ స్టేషన్లో లేదని ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు ఎస్సై అశోక్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో జిల్లాకు పతకాలు
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరిగిన బాక్సింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఇటీవల విశాఖలోని రైల్వే స్టేడియంలో జరిగిన 6వ అంతర్ జిల్లాల సబ్ జూనియర్స్ బాల, బాలికల పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు 8 పతకాలు కై వసం చేసుకున్నారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకం దక్కించుకున్న బి. సచిన్ వచ్చేనెల 7 నుంచి 14వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్లోని నొయిడాలో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించాడు. అదేవిధంగా పోటీల్లో ఎన్.దేవకి, వి.జాహ్నవిలు వెండి పతకాలు దక్కించుకోగా..పి.లోకేష్, పి.దుర్గాప్రసాద్, వర్ధన్, ఆర్.యశ్వంత్, బి.గౌతమ్ గణేష్లు కాంస్య పతకాలు సాధించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించడంతో పాటు జాతీయస్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులను విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితిగజపతిరాజు అభినందించారు. కార్యక్రమంలో జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు, కార్యదర్శి ఇందుకూరి అశోక్రాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎస్ఈ.రాజు, శాప్ కోచ్ బి.ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జాతీయపోటీలకు ఎంపికై న సచిన్ -
రైతును మోసగిస్తే చట్టపరమైన చర్యలు
గ్రామాల్లో ఎవరైనా లైసెన్స్ లేకుండా విత్తనాలు, ఎరువులు,పురుగు మందులు విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే వ్యవసాయ,విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయాలి. మందుల లాట్ నంబర్ను బట్టి తయారు చేసిన తేదీని గుర్తించి ఏ కంపెనీ, ఏ రకం వంటి విషయాలను కొనుగోలుదారులు పరిశీలించాలి. రైతులు పురుగు మందు, ఎరువుల కొనుగోలులో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపారులు నకీలి పురుగు మందులు, ఎరువులు విక్రయించి రైతులను మోసగిస్తే సంబంధిత డీలర్పై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. టి.అప్పలనాయుడు, విజిలెన్స్ సీఐ -
చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలి
విజయనగరం: విధి నిర్వహణలో చిత్తశుద్ధితో వ్యవహరించి పని చేసేచోట గుర్తింపు పొందాలని ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు హితవు పలికారు. ఈ మేరకు జిల్లా పరిషత్ కార్యాలయంలోని తన చాంబర్లో పలువురికి కారుణ్య, పదోన్నతుల నియామక పత్రాలను శుక్రవారం అందజేశారు. ఇందులో భాగంగా వేపాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సేవలందిస్తూ మరణించిన బయాలజీ ఉపాధ్యాయుడు డి.కన్నయ్య కుమారుడు సింహాచలానికి వియ్యంపేట జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో సహయకుడిగా కారుణ్య నియామకపత్రాన్ని అందజేశారు. అదేవిధంగా మెరకముడిదాం మండల పరిషత్ కార్యాలయంలో సహాయకుడిగా పని చేస్తున్న టి.రాములుకు మెరకముడిదాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ల్యాబ్ అసిస్టెంట్గా, బలిజిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వీపర్గా పని చేస్తున్న జి.ప్రమీలకు పాల్తేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రికార్డ్ అసిస్టెంట్గా పదోన్నతి కల్పిస్తూ నియామకపత్రాలు అందజేశారు. విజయనగరం మండల పరిషత్ కార్యాలయంలో సహాయకుడిగా విధులు నిర్వహిస్తున్న కె.శ్రీనివాసరావుకు పాచిపెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రికార్డ్ అసిస్టెంట్గా నియామకం పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ బీవీవీ.సత్యనారాయణ పాల్గొన్నారు. జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు -
అనాథ వృద్ధురాలికి సేవలు
విజయనగరం అర్బన్: ఈ నెల 12వ తేదీన సాక్షి దినపత్రికలో ‘అమ్మ రోడ్డున పడింది’ శీర్షికన వచ్చిన వార్త మరికొంత మందిని కదిలించింది. తొలి రోజున కొందరు స్పందించి శుభ్రమైన నీటితో ఆమెకు స్నానం చేయించి నూతన వస్త్రాలు ధరింప చేసి షెల్టర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ రోజు నుంచి ఆ వృద్ధురాలికి ప్రతి రోజూ కొందరు దయార్ద్ర హృదయులు మానవత్వంతో సేవలు అందిస్తున్నారు. సమీపంలోని ఆర్డబ్ల్యూఎస్, ఆర్టీసీ తదితర శాఖల ఉద్యోగులు అబ్రహం పీటర్ పాల్, వెంకాయమ్మ, రాగిణి, గీతి తదితరులు మేము సైతం అంటూ చేయి చేయి కలిపి సేవలు చేస్తున్నారు. వృద్ధురాలి కాలు, శరీరంపై పుండ్లను శుభ్రం చేయడం, స్నానం చేయించడం, కొత్త వస్త్రాలు ధరించేలా చేయడం, ఆహారం, మందులు అందించడం వంటి పనులు చేస్తున్నారు. ఈ నిస్వార్థ సేవలు నిజమైన సామాజిక బాధ్యతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. సాక్షి కథనానికి స్పందించిన దయార్ద్ర హృదయులు -
అక్షరాంధ్రతో శతశాతం అక్షరాస్యత
విజయనగరం అర్బన్: అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా జిల్లాలో శతశాతం అక్షరాస్యతను సాధించేందుకు కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన అక్షరాంధ్ర ప్రత్యేక కార్యక్రమం ద్వారా దశలవారీగా జిల్లా ప్రజలందరినీ అక్షరాస్యులను చేయాలని సూచించారు. దీనిలో భాగంగా మొదటి విడత సుమారు లక్షన్నర మందిని అక్షరాస్యులను చేసేందుకు ప్రణాళికను రూపొందించాలని చెప్పారు. ఈ మేరకు అక్షరాంధ్ర కార్యక్రమంపై కలెక్టర్ తన చాంబర్లో వివిధ శాఖల అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమం అమలుకు చేస్తున్న ఏర్పాట్లపై చర్చించారు. ఉపాధిహామీ వేతనదారులు, వెలుగు, మెప్మా, మహిళా సంఘాల సభ్యులు, అంగన్వాడీ ఆయాలు, ఆ శాఖ ద్వారా లబ్ధి పొందుతున్న గర్భిణులు, బాలింతల్లో నిరక్షరాస్యులను గుర్తించి, వారిని అక్షరాస్యులను చేయాలని సూచించారు. ఈ నెల 26లోగా నిరక్షరాస్యుల జాబితాను రూపొందించాలన్నారు. అక్షరాంధ్ర కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ఎంపీడీఓ ఆధ్వర్యంలో ఏపీఓ, సీడీపీఓ, ఎంఈఓలు సభ్యులుగా మండల కమిటీలను ఈ నెల 26లోగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వలంటీర్ల ఎంపికను త్వరగా పూర్తి చేసి, వారికి శిక్షణ నిర్వహించాలని చెప్పారు. అంగన్వాడీ కార్యకర్తలను సైతం వలంటీర్లుగా నియమించే అంశాన్ని పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో వయోజన విద్య ఇన్చార్జ్ డీడీ ఎస్.సుబ్రహ్మణ్య వర్మ, జెడ్పీ సీఈఓ బీవీ సత్యనారాయణ, డీఆర్డీఏ ఇచ్చార్జ్ పీడీ సావిత్రి, డీఈఓ యు.మాణిక్యంనాయుడు, ఐసీడీఎస్ పీడీ టి.విమలారాణి, డ్వామా పీడీ శారదాదేవి, జీఎస్డబ్ల్యూఓ జిల్లా కోఆర్డినేటర్ రోజారాణి తదితరులు పాల్గొన్నారు. వాయు కాలుష్యం లేని నగరంగా విజయనగరం విజయనగరం పట్టణాన్ని వాయు కాలుష్యంలేని నగరంగా తీర్చి దిద్దడానికి కృషి చేయాలని జిల్లా అధికారులను కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ ఆదేశించారు. నగరంలో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (ఎన్సీఏపీ) కింద కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం జిల్లా కమిటీ సమావేశంలో ఈ మేరకు ప్రకటించారు. ఎన్సీఏపీ కింద పార్కులు, రహదారుల అభివృద్ధి కోసం జిల్లాలో 14 పనులు చేపట్టడానికి ప్రతిపాదనలు పంపగా రూ.2.84 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని అందులో నుంచి 2024–25 ఆర్థిక సంవత్సరానికి 12 పనులకు రూ.71 లక్షలు విడుదల చేసినట్లు తెలిపారు. ఈ నిధులతో విజయనగరం కార్పొరేషన్ పరిధిలో 4 పార్కులను అభివృద్ధి చేసేందుకు అలాగే బీటీరోడ్లు, ఉద్యానవనాల పెంపకం, డ్రైనేజీలు, ఫుట్పాత్స్ అభివృద్ధికి ప్రతిపాదనలు చేసి ఇప్పటికే టెండర్లు పిలిచినట్లు చెప్పారు. సమావేశంలో కాలుష్య నియంత్రణమండలి ఈఈ సరిత, కార్పొరేషన్ కమిషనర్ నల్లనయ్య, పరిశ్రమల శాఖ జీఎం కరుణాకర్, విద్యుత్ శాఖ ఎస్ఈ లక్ష్మణరావు, జిల్లా పౌరసరఫరాల అధికారి మధుసూదనరావు, జిల్లా వ్యవసాయ అధికారి తారకరామారావు, ఉద్యాన శాఖ డీడీ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ -
ప్లాస్టిక్ సంచుల గొడౌన్లో అగ్నిప్రమాదం
● అదుపులోకి రాని మంటలు ● ప్రయత్నిస్తున్న ఫైర్ సిబ్బందివీరఘట్టం: వీరఘట్టం యూనియన్ బ్యాంకు పక్కనే ఉన్న ప్లాస్టిక్ సంచుల గొడౌన్లో శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. గొడౌన్లో విలువైన ప్లాస్టిక్ పైపులతో పాటు పాలిథిన్ సంచులకు నిప్పు అంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.ఈ మంటలను అదుపు చేసేందుకు పాలకొండ ఫైర్ ఆఫీసర్ జామి సర్వేశ్వరరావు తన సిబ్బందితో వచ్చి అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే మంటలు అదుపు కాకపోవడంతో పాటు రెట్టింపు మంటలు చెలరేగడంతో సమీప ఇళ్ల వారు భయాందోళన చెందుతున్నారు. అయితే అగ్నిప్రమాదం ఏవిధంగా జరిగిందో తెలియాల్సి ఉంది. అగ్ని ప్రమాదాన్ని చూసేందుకు స్ధానికులు సంఘటనా స్ధలానికి రావడంతో ఫైర్ అధికారులకు కొంత ఆటంకం కలిగింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.18 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు గొడౌన్ యజమాని వాపోతున్నాడు. -
లైసెన్స్ రద్దు చేస్తాం
దుకాణాల్లో నకిలీ ఎరువులు, పురుగు మందులు విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే దుకాణం లైసెన్స్ రద్దు చేస్తాం. మందులు కొనుగోలు చేసిన రైతులకు దుకాణం పేరుతో పాటు యజమాని సంతకంతో కూడిన బిల్లు తప్పనిసరిగా ఇవ్వాలి. పురుగు మందులు తీసుకునేటప్పుడు డబ్బాపై ఉన్న వివరాలను పూర్తిగా పరిశీలించాలి. చదువు రాని వారు తెలిసిన వారికి చూపించి అది ఏ కంపెనీదో నిర్ధారించిన తర్వాతనే కొనుగోలు చేయాలి. వ్యవసాయాధికారుల సూచన ప్రకారమే మందు పిచికారీ చేయాలి. లేకుంటే పంట దెబ్బతినే ప్రమాదం ఉంది. శ్యామ్ప్రసాద్, ఏడీఏ, బొబ్బిలి -
పిచ్చికుక్కల దాడిలో పలువురికి గాయాలు
గరుగుబిల్లి: పిచ్చికుక్కలు స్వైరవిహారం చేసి పలువురిని గాయపరచడంతో ప్రజలు రాకపోకలు చేసేందుకు భీతిల్లుతున్నారు. గురుగుబిల్లి మండలంలోని రావుపల్లిలో గ్రామంలో పలువీధుల్లో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేసి గ్రామానికి చెందిన గుల్ల సుహంత్, కుమ్మరి సూరయ్య తదితరులను శుక్రవారం గాయాల పాలుచేశాయి. కుక్కల బెడద కారణంగా ఒంటరిగా వీధుల్లో తిరిగేందుకు, ముఖ్యంగా విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. అలాగే సాయంత్రం వ్యక్తిగత పనుల నిమిత్తం అన్ని వర్గాలవారు రాకపోకలు చేసేందుకు భయాందోళన చెందుతున్నారు. గాయాలపాలైన వారు గరుగుబిల్లి పీహెచ్సీలో చికిత్స పొందుతున్నారు. కుక్కలను నియంత్రించాలని అధికారులకు తెలియజేసినప్పటికీ పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కుక్కలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. యువకుడి అదృశ్యంపార్వతీపురం రూరల్: పట్టణంలోని బంగారమ్మ కాలనీకి చెందిన బుగత శ్రీనివాసరావు కుమారుడు అజయ్ కుమార్ అదృశ్యమయ్యాడు. బుధవారం ఉదయం 7గంటల సమయంలో ఢిల్లీ వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లిపోయాడు. మరుసటి రోజు కుమరుడి రూమ్ సర్దుతున్న సందర్భంలో అజయ్ కుమార్ ఫోన్, పర్సు ఇంట్లోనే విడిచిపెట్టి నా గురించి వెతకకండి, నన్ను క్షమించండి అని రాసి ఉన్న పేపర్ను తల్లిదండ్రులు గమనించారు. దీంతో భయాందోళన చెంది పట్టణ పోలీస్స్టేషన్లో చేసిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై గోవింద తెలిపారు. ఫొటోలో ఉన్న వ్యక్తి ఆచూకీ తెలిస్తే పట్టణ పోలీస్స్టేషన్కు ఫోన్ 9121109467, 8341517437 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇంటి నుంచి వెళ్లిన అజయ్ కుమార్ నీలం రంగు ఫ్యాంట్, క్రీమ్ కలర్ టీషర్టును ధరించినట్లు తల్లిదండ్రులు చెప్పినట్లు తెలిపారు. పురుగు మందు తాగి రైతు ఆత్మహత్యదత్తిరాజేరు: మండలంలోని ముద్దానపేట గ్రామానికి చెందిన రైతు ముద్దాన అప్పన్న(38) అప్పుల బాధలు తాళలేక పురుగు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు, పెదమానాపురం ఎస్సై ఆర్.జయంతి శుక్రవారం తెలిపారు. మృతుడి భార్య దేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అప్పన్నకు వ్యవసాయంలో నష్టం రావడంతో మనస్తాపం చెంది ఈనెల 14న రాత్రి పురుగు మందు తాగడంతో వెంటనే కుటుంబసభ్యులు గజపతినగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి విజయనగరంలోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం మరింత విషమించడంతో వైజాగ్ కేజీహెచ్కు తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య దేవి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నేలబావిలో పడి వ్యక్తి మృతిరాజాం సిటీ: పట్టణ పరిధిలోని హరిజనవీధికి చెందిన రేజేటి సోమయ్య (54) నేలబావిలో పడి ప్రమాదవశాత్తు మృతిచెందాడని సీఐ కె.అశోక్కుమార్ శుక్రవారం తెలిపారు. సీఐ తెలిపిన వివరాల మేరకు వివరాలిలా ఉన్నాయి. సోమయ్య ఈ నెల 17న మధ్యాహ్నం 1.30 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లి శుక్రవారం ఉదయం వరకు ఇంటికి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు పరిసర ప్రాంతాల్లో వెతికారు. మృతుడి సోదరుడు భాస్కరరావు తన అన్నయ్యను వెతుకుతూ కొండంపేట సమీపంలోని తన పొలం వద్దకు వెళ్లి చూశాడు. అక్కడ నేలబావిలో తేలియాడుతున్న మృతదేహాన్ని చూసి సోదరుడు సోమయ్యగా గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. ఈ విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి మృతుని భార్య సరోజిని ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
● నాయకులపై కాదు.. మాపై కేసులు పెట్టండి
భూములు కోల్పోయి, ఉద్యోగాలు రాక, ఉపాధి లేక రోడ్డున పడిన రైతుల మొరవినాలని అడిగితే అణచివేయాలని చూడడం తప్పు అనిపించడం లేదా.. అధికారులకు, కూటమి నాయకులకు ఆత్మసాక్షి లేదా అంటూ జిందాల్ నిర్వాసితులు ఆవేదన వ్యక్తంచేశారు. తమ నాయకులపై కాదు తమపై కేసులు పెట్టాలంటూ నినదించారు. బొడ్డవర వద్ద శుక్రవారం నిరసన తెలిపారు. వీరికి ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ మద్దతు తెలిపారు. నిర్వాసితులపై పోలీస్, రెవెన్యూ యంత్రాంగం అనుసరిస్తున్న తీరు సరికాదన్నారు. – శృంగవరపుకోట