విజయనగరం
న్యూస్రీల్
భారీగా బంగారం చోరీ
రాజాంలోని జీఎంఆర్ఐటీ క్వార్టర్స్లో ఆదివారం రాత్రి దొంగలు దూరారు. రెండిళ్లలో కేజీన్నర బంగారం, కేజీ వెండిన దోచుకుపో యారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ పరిశీలించారు.
మంగళవారం శ్రీ 3 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
ఈ ఫొటోలో నడవలేని స్థితిలో ఉన్న వృద్ధురాలి పేరు పి.ఆదమ్మ. ఈమెది విజయనగరం మండలం జొన్నవలస గ్రామం. తనకు ఇచ్చే 5 కేజీల రేషన్ బియ్యం తెచ్చుకునేందుకు రేషన్ షాపునకు వెళ్లి వచ్చేందుకు అపసోపాలు పడింది. ఇంటికి వెళ్లే మార్గంలో నడవలేక వంగిపోయి, నిలబడిపోయి అవస్థలు పడింది. గత ప్రభుత్వంలో ఇంటి ముంగిటకే రేషన్ బండిని తెచ్చి బియ్యం ఇచ్చేవారని, ఇప్పుడు కష్టాలు తప్పడంలేదంటూ వాపోయింది.
రేషన్ సరుకులకోసం నిరీక్షిస్తున్న లబ్ధిదారులు
ఈ ఫొటోలో బియ్యంతో నిలబడిన వృద్ధిరాలి పేరు టి.అప్పయ్యమ్మ. ఈమెది కూడా జొన్నవలస గ్రామం. బియ్యం తెచ్చుకునేందుకు అష్టకష్టాలు పడింది. ఇంటికి వెళ్లే మార్గంలో పలు మార్లు ఆగుతూ వెళ్లింది.
ఇంటి వద్దకు అందని సరుకులు
బియ్యం ఇంటికి
తెచ్చుకునేందుకు
అష్టకష్టాలు
జిల్లాలో 5.71 లక్షల రైస్ కార్డులు
ఇంటికి రేషన్
అందించాల్సింది 69వేల మందికి...
జిల్లాలో
5.71 లక్షల రైస్ కార్డులు
విజయనగరం
విజయనగరం


