Vizianagaram District News
-
పశుసంవర్థక శాఖ ఎ.డి.గా శారద
విజయనగరం ఫోర్ట్: పశు సంవర్థక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ)గా డాక్టర్ ఆర్.శారద శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. చీపురపల్లి ఏరియా వెటర్నరీ ఆస్పత్రిలో ఏడీగా పనిచేసి బదిలీపై విజయనగరం జిల్లా డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాడి రైతుల అభ్యున్నతికి కృషి చేస్తానని చెప్పారు. గిరిజన వర్సిటీ పనులు వేగవంతం చేయండి ● ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక డిమాండ్ విజయనగరం అర్బన్: కేంద్రీయ గిరిజన యూ రివర్సిటీ పనులను వేగవంతం చేయాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రతినిధులు డిమాండ్ చేశారు. వర్సిటీ పనులను శుక్రవారం పరిశీలించారు. వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ టీవీ కట్టిమణిని కలిసి నిర్మాణానికి సంబంధించిన సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా వేదిక ప్రతినిధులు మాట్లాడుతూ 2019లో స్థాపితమైన విశ్వవిద్యాలయ నిర్మాణం ఇప్పటికీ పూర్తికాకపోవడం విచారకరమన్నారు. పనుల్లో ప్రభుత్వం అశ్రద్ధ చూపడం తగదన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో గిరిజన వర్సిటీది కీలకపాత్రగా అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం.శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కె.విజయగౌరి, నాయకులు వెంకటరావు, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రవికుమార్, తదితరులు పాల్గొన్నారు. ఏజెన్సీలో ఎండీయూ వ్యవస్థను కొనసాగించాలి ● రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు విజయనగరం అర్బన్: గిరిజన ప్రాంతాలలో రేషన్ సరఫరాను పాత ఎండీయూ విధానంలో కొనసాగించాలని, లేదంటే ప్రత్యేక రేషన్ డిపోలను ఏర్పాటుచేసి సరుకులు సరఫరా చేయాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు ప్రభుత్వాన్ని కోరారు. రేషన్ తీసుకోవడంలో గిరిజనుల ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పత్రికల్లో వచ్చిన కథనాలపై స్పందిస్తూ శుక్రవారం మాట్లాడారు. ప్రస్తుతం రేషన్ తీసుకోవడంలో గిరిజనులు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని కోరుతూ సివిల్ సప్లయి కమిషనర్కు ఎస్టీ కమిషన్ లేఖ రాసిందన్నారు. ఏజెన్సీ ప్రజలు ఆహార భద్రతకు దూరంగా ఉన్న పరిస్థితులున్నాయని, ఈ నేపథ్యంలో ఎండీయూ విధానాన్ని ఆపడంవల్ల ప్రభుత్వం అందించే సరుకులు తీసుకునేందుకు వ్యయ ప్రయాసలకు గురవుతున్నారన్నారు. గిరిజనుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఏజెన్సీ ప్రాంతాలతో పాటు ఎండీయూ విధానాన్ని కొనసాగించాలని డాక్టర్ శంకరరావు కోరారు. సోమవారం సాలూరులో పీజీఆర్ఎస్ పార్వతీపురం టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికను సోమ వారం సాలూరులో నిర్వహిస్తామని కలెక్ట ర్ ఎ.శ్యామ్ప్రసాద్ తెలిపారు. జిల్లా అధి కారులతో శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఈ విషయాన్ని వెల్లడించారు. సా లూరు ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటల నుంచి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామని స్పష్టంచేశారు. జిల్లా అధికారులందరూ సాలూరులో నిర్వహించనున్న పీజీఆర్ఎస్లో పాల్గొనాలని కోరారు. -
విత్తన బస్తా రూ.1000..!
● అదనంగా బస్తాకు రూ.40 తీసుకుంటున్న వైనం ● విత్తన శుద్ధి ప్యాకెట్ ఇవ్వకుండానే వసూలు విజయనగరం ఫోర్ట్: జిల్లాలోని కొన్ని రైతుసేవా కేంద్రాల్లో (రైతు భరోసా కేంద్రాలు) వరి విత్తన పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. విత్తన రకాలను బట్టి ధర నిర్ణయించారు. గతేడాదికి ఈ ఏడాదికి కొన్ని రకాల విత్తన ధర పెంపుపై రైతులు నిరసన తెలుపుతున్నారు. మరోవైపు విత్తనశుద్ధి ప్యాకెట్ పేరుతో అదనంగా రూ.40 వసూలు చేయడాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు సాగుసాయం అందజేయకపోగా... రైతుల నుంచి విత్తనాలకు అదనపు వసూళ్లకు పాల్పడడంపై ఆవేదన చెందుతున్నారు. ఎంటీయూ 1121 రకం విత్తనాలు 30 కేజీల బస్తాధర రూ.960కాగా విత్తన శుద్ధి ప్యాకెట్ సుడోమోనాస్ అందజేస్తామని మరో రూ.40 వసూలు చేస్తున్నారు. అయితే, విత్తన శుద్ధి ప్యాకెట్ ఇవ్వకుండా డబ్బులు వసూలుచేయడంపై పలు చోట్ల రైతులు నిలదీసినా ఫలితం లేకపోయింది. మొత్తం రూ.1000 ఇచ్చిన వారికే విత్తన బస్తాలు విక్రయించారంటూ రైతులు వాపోయారు. జిల్లాలో వరి పంట సాధారణ సాగు విస్తీర్ణం 91 వేల హెక్టార్లు జిల్లాలో వరి పంట సాధారణ సాగు విస్తీర్ణం 91వేల హెక్టార్లుగా వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి వ్యవసాయ అధికారులు 50,010 క్వింటాళ్లు విత్తనాలు జిల్లాకు కేటాయించారు. ఇప్పటి వరకు 30,350 క్వింటాళ్లు విత్తనాలు రైతు సేవ కేంద్రాల్లో పొజిషన్ చేశారు. మిగిలిన విత్తనాలు రావాల్సి ఉంది. అదనపు వసూళ్లు చేయొద్దు ఎంటీయూ 1121 రకం 30 కిలోల విత్తన బస్తా వాస్తవ ధర రూ.960 మాత్రమే. అయితే, విత్తనశుద్ధి చేయడానికి ఆసక్తి చూపే రైతులకు మాత్రమే రూ.40 విలువచేసే సుడోమోనస్ ప్యాకెట్ అందించాలి. రైతులు వద్దంటే విత్తనాలు మాత్రమే అందజేయాలని చెప్పాం. బలవంతంగా వసూలు చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. – వి.తారకరామారావు, జిల్లా వ్యవసాయ అధికారి -
కొందరికే కాదు... అందరికీ ఇవ్వాలి
విజయనగరం గంటస్తంభం: తల్లికి వందనం పథకం కొందరికే కాదని, అర్హులైన విద్యార్థులందరికీ వర్తింపజేయాలని ఎస్ఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. నిబంధనల పేరుతో అధికమంది విద్యార్థులను అనర్హులుగా ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనికి నిరసనగా విజయనగరం మయూరి కూడలి నుంచి ఆర్టీసీ కాంపెక్స్ వరకు శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ మానవహారం నిర్వహించి కూటమి ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు డి.రాము మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే ఎటువంటి షరతులు లేకుండా కుటుంబంలో ఎంతమంది విద్యార్థులున్నా అందరికీ రూ.15000 చొప్పున ఇస్తామని ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇప్పుడు రూ.2వేలు కోతపెట్టి రూ.13వేలు ఇవ్వడం విచారకరమన్నారు. 300 యూనిట్లు విద్యుత్ వినియోగించిన వారికి, అతి తక్కువ జీతంతో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగ కుటుంబాల్లోని పిల్లలకు పథకాన్ని నిలిపివేయడం తగదన్నారు. ఒకే కుటుంబంలో పాఠశాల, డిగ్రీ చదివే విద్యార్థులు ఉంటే... ఒక్కరికి మాత్రమే ఏదైనా పథకం వర్తిస్తుందని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. తల్లికివందనానికి, ఫీజు రీయింబర్స్మెంట్కు ముడిపెట్టడం శోచనీయమన్నారు. గత ప్రభుత్వం తెలుపుకార్డు కలిగి ఉన్న పేదవిద్యార్థులందరికీ అమ్మఒడి పథకాన్ని వర్తింపజేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా ఎటువంటి షరతులు లేకుండా అర్హులైన విద్యార్థులందరికీ తల్లికి వందనం కింద రూ.15000 చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తల్లిదండ్రులు, విద్యార్థులను ఐక్యంచేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శులు ఎం.వెంకీ, పి.రమేష్, రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు సీహెచ్ వంశీ, ఆర్.శిరీష్, ఎస్.సోమేష్, జిల్లా నాయకులు భారతి, రమణ, నాని, జగదీష్, మురళి, చైతు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ముగిసిన టీచర్ల బదిలీ కౌన్సెలింగ్
విజయనగరం అర్బన్: ఉపాధ్యాయ సంఘాల ఆందోళనలు.. నిరసనలు.. బైఠాయింపులు.. కౌన్సెలింగ్ కేంద్రంలో ఖాకీల హడావిడితో చివరకు ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రాతిపదికన చేపట్టిన ఉపాధ్యాయ బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రియ శుక్రవారం అర్ధరాత్రితో ముగిసింది. 2,300 మంది ఎస్జీటీలకు మాన్యువల్ విధానంలో బదిలీచేశారు. ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు దిగినా ఉన్నతాధికారుల సూచనల మేరకు క్లియర్ వేకెన్సీలు మాత్రమే భర్తీ చేశారు. క్లస్టర్ ఖాళీలు చూపించలేదు. చివరి రోజు 1,001 నుంచి ప్రారంభించిన కౌన్సెలింగ్ చివరి నంబర్ వరకు పూర్తి చేయాలనే ఉద్దేశంతో కౌన్సెలింగ్కు హాజరుకావాలని అందరికీ సమాచారం ఇచ్చారు. ఒకే రోజు దాదాపు వెయ్యిమందిని పిలవడంతో జిల్లా పరిషత్ సమావేశ మందిరం పరిసరాలు ఉపాధ్యాయులతో సందడిగా మారాయి. తాజాగా ఉన్న ఖాళీ స్థానాలన్నిటినీ తప్పనిసరి బదిలీ ఉపాధ్యాయులు కోరుకోవడంతో, రిక్వెస్ట్ బదిలీల ఉపాధ్యాయులు అధికంగా తమ స్థానాల్లోనే ఉండిపోయేందుకు సుముఖత తెలిపారు. 1,400 సీరియల్ ప్రారంభ సమయానికి మైదాన ప్రాంత మండలాల స్కూల్స్లో పోస్టులన్నీ భర్తీ అయిపోయాయి. మిగిలిన ఉపాధ్యాయులు ఏజెన్సీ మండలాలైన జీఎల్పురం, కురుపాం, కొమరాడ మండలాల సుదూర ప్రాంతాల స్కూళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పలువురు మహిళా టీచర్లు ఆవేదన చెందారు. డీఈఓ యు.మాణిక్యంనాయుడు మాట్లాడుతూ క్లస్టర్ ఖాళీలను ఉన్నతాధికారుల సూచనల మేరకు చివరి వరకు చూపించలేదన్నారు. మిగిలిన 152 మంది ఉపాధ్యాయులకు పోస్టింగ్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఖాకీల హడావిడిపై గురువుల గుర్రు విజయనగరం క్రైమ్: ఉపాధ్యాయుల ఆందోళనల నేపథ్యంలో బందోబస్తు కావాలని డీఈఓ మాణిక్యంనాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఉపాధ్యాయ కౌన్సెలింగ్ కేంద్రం జెడ్పీ సమావేశ మందిరం వద్ద సీఐ శ్రీనివాస్, వన్టౌన్ ఎస్ఐలు రామగణేష్, రమణ, సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహించారు. కౌన్సెలింగ్ కేంద్రంలో పోలీసులు తిష్టవేయడం, గురువులపై దురుసుగా వ్యవహరించడం, ప్రవేశ ద్వారం వద్ద కాపలాగా ఉండి కౌన్సెలింగ్ కేంద్రంలోకి విడిచిపెట్టకపోవడం వంటి ఘటనలతో ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తంచేశారు. కౌన్సెలింగ్ విధానంలో స్పష్టమైన విధానాలను ప్రకటించకపోవడమే దీనికి కారణమని, ప్రభుత్వ లోపాలను విడిచిపెట్టి గురువులపై పోలీసులతో పెత్తనం సాగించాలని చూస్తే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోకతప్పదని కొందరు బహిరంగంగానే హెచ్చరించారు. ఎన్నడూ చూడని విధంగా ఉపాధ్యాయుల బదిలీ కౌన్సెలింగ్ కేంద్రంలో పోలీసుల హడావిడిని తప్పుబట్టారు. బదిలీ కౌన్సెలింగ్కు హాజరైన గురువులు ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేసినా చూపించిన క్లస్టర్ ఖాళీలు 2,300 మంది ఎస్జీటీలకు బదిలీ -
రాష్ట్రంలో హిట్లర్, ముస్సోలిని పాలన
సాక్షి, పార్వతీపురం మన్యం/సాలూరు: రాష్ట్రంలో అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం స్థానంలో రెడ్బుక్ పాలన సాగుతోందని.. హిట్లర్, ముస్సోలిని వంటి నియంతలను చంద్రబాబు, లోకేశ్లు తలపిస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు పీడిక రాజన్న దొర విమర్శించారు. సూపర్ సిక్స్ పథకాలని దగా చేసి, అన్ని వర్గాలనూ మోసగించి.. ఏడాది కాలంలో ఏం సాధించారని సుపరిపాలన సంబరాలు చేసుకుంటున్నారని కూటమి నాయకులకు ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం పట్ల ప్రజలు విసిగిపోయారని తెలి పారు. నిజంగా వారు మంచి పరిపాలన అందిస్తే.. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఎందుకు బ్రహ్మరథం పడతారని ప్రశ్నించారు. సాలూరులో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇదేం సుపరిపాలన? ఇది ఏ సుపరిపాలనో తనకై తే అర్థం కావడం లేదని రాజన్నదొర అన్నారు. ‘తల్లికి వందనం గత ఏడాది పూర్తిగా ఎగ్గొట్టేశారు. ప్రస్తుతం ఇస్తున్నది ఈ విద్యా సంవత్సరానికి సంబంధించినది. దీపం–2 కింద ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తామన్నారు. ఈ ఏడాది కాలంలో ఒక్కటే ఇచ్చారు. పింఛన్లు ఇవ్వడం వారి గొప్పా.. ఏ ప్రభుత్వం వచ్చినా కచ్చితంగా దానిని కొనసాగిస్తుంది. సూపర్ సిక్స్ కాకుండా.. గత ప్రభుత్వం అమలు చేసినవి, ఇతర పథకాలన్నీ కలిపి 150 వరకూ ఉంటాయి.. అవన్నీ ఎక్కడ? సంక్షేమ క్యాలెండర్ లేదు, జాబ్ క్యాలెండర్ లేదు.. గతంలో ఇచ్చిన పథకాలన్నీ నిలిపివేశారు. ఇదేనా, ఇలాగేనా సుపరిపాలన? అడిగితే అరెస్టులు, మాట్లాడితే కేసులు.. అంబేడ్కర్ రాజ్యాంగం రాష్ట్రంలో అమలు కావడం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. హిట్లర్, ముస్సోలిని పాలన సాగుతోంది..’ అని విమర్శించారు. ఏడాదిలోనే పాలన తేలిపోయింది.. ఏడాది కాలంలోనే కూటమి పాలన తేలిపోయింద ని రాజన్నదొర విమర్శించారు. అమ్మ ఒడి పథకంలో ఉన్న నిబంధనలపై విమర్శలు చేసిన చంద్రబాబు, లోకేశ్లు.. తల్లికి వందనం పథకం విషయంలో అంతకుమించి నిబంధనలు ఎందుకు తీసుకొచ్చారని రాజన్నదొర ప్రశ్నించారు. చాలామందికి పథకం అందని ద్రాక్షగా మారిందన్నారు. -
వేటకు వేళాయె..!
పూసపాటిరేగ: వేటనిషేధం గడువు శుక్రవారంతో ముగిసింది. శనివారం నుంచి చేపలవేట సాగించవచ్చని మత్స్యశాఖ ఉత్తర్వులు జారీ చేసినట్టు డీడీ విజయకృష్ణ పేర్కొన్నారు. ఏటా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో చేపలు, రొయ్యలు, తాబేళ్లు వంటి మత్స్యజాతులు గుడ్లుపెట్టి పొదిగే సమయంగా భావిస్తారు. మత్స్య సంపద వృద్ధిలో భాగంగా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు వేట నిషేధం విధిస్తారు. చేపల వేటకు గ్రీన్సిగ్నల్ రావడంతో మత్స్యకారులు కోటి ఆశలతో సంద్రంలో వేట సాగించేందుకు సిద్ధమవుతున్నారు. వలలు, బోట్లు సిద్ధం చేసుకుంటున్నారు. వేట సాగించేదిలా.. జిల్లాలో భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లోని 21 తీర గ్రామాల ప్రజలకు చేపలవేటే జీవనాధారం. చింతపల్లిలో 412 బోట్లు, తిప్పలవలసలో 226, పతివాడబర్రిపేటలో 163, కోనాడలో 4, తమ్మయ్యపాలెంలో 25, పులిగెడ్డలో 10, ముక్కాంలో 91, చోడిపల్లిపేట 38, కొండ్రాజుపాలెం 60, చేపలు కంచేరులోని మత్స్యకారులు 91 బోట్లతో వేట సాగిస్తారు. అయితే, వీరికి ప్రస్తుత కూటమి ప్రభుత్వం డీజీల్ రాయితీలు వంటివి అందజేయకపోవడం, చింతపల్లి ఫ్లోటింగ్ జెట్టీ అందుబాటులోకి రాకపోవడంతో వేట కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గతేడాది మత్స్యకార భృతిని కూడా ప్రభుత్వం ఎగ్గొట్టిందంటూ వాపోతున్నారు. ఈ ఏడాది ఇచ్చిన మత్స్యకార భరోసా కూడా అర్హులందరికీ అందలేదని మత్స్యకార సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు బి.చిన అప్పన్న ఆరోపించారు. చింతపల్లి తీరంలో వేటకు సిద్ధం చేసిన బోట్లు ముగిసిన వేట నిషేధం గడువు నేటి నుంచి సముద్రంలో చేపలవేటకు మత్స్యకారులు సన్నద్ధం -
ఆటో బోల్తా పడి ఇద్దరు మహిళలకు గాయాలు
చీపురుపల్లి: పట్టణంలోని రాజాం రోడ్లో వెదుళ్లవలస జంక్షన్ వద్ద ఆటో బోల్తా పడడంతో ఇద్దరు మహిళలకు గాయలయ్యాయి. ఇద్దరిలో సవరపు సావిత్రికి తీవ్రగాయాలు కాగా గుంప సావిత్రికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్సై ఎల్.దామోదరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం చీపురుపల్లి నుంచి రాజాం వెళ్తున్న ఆటోలో గరివిడి మండలానికి చెందిన సవరపు సావిత్రి, విజయనగరానికి చెందిన గుంప సావిత్రితో పాటు మరికొంత మంది ప్రయాణికులు ఉన్నారు. రైల్వేస్టేషన్ దాటిన తరువాత వెదుళ్లవలస జంక్షన్ వద్ద ఎదరుగా మితిమీరిన వేగంతో ద్విచక్రవాహనం రావడాన్ని గుర్తించిన ఆటో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో ఆటో బోల్తా కొట్టింది. దీంతో బొండపల్లికి చెందిన సవరపు సావిత్రి ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. అలాగే విజయనగరానికి చెందిన గుంప సావిత్రికి స్వల్ప గాయలయ్యాయి. దీంతో ఆ ఇద్దరినీ పట్టణంలోని ఏరియా ఆస్పత్రిలో చేర్పించిన అనంతరం తీవ్ర గాయాల పాలైన సవరపు సావిత్రిని అత్యవసర వైద్యం నిమిత్తం విజయనగరం రిఫర్ చేశారు. 13 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్నెల్లిమర్ల రూరల్: మండలంలోని కొండవెలగాడ గ్రామంలో పేకాట స్థావరంపై పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించారు. తమకు వచ్చిన ముందస్తు సమాచారంతో ఎస్సై గణేష్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించి..స్థానిక సీత చెరువు సమీపంలో పేకాట ఆడుతున్న 13 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.8,860 నగదు సీజ్ చేశామని ఎస్సై తెలిపారు. గ్రామాల్లో పేకాట, కోడిపందాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఏగోటివలస పొలాల్లో ఏనుగుల గుంపుసీతానగరం: మండలంలోని కోట సీతారాంపురంలో నాలుగు రోజులుగా తిష్ఠవేసిన ఏనుగుల గుంపు శుక్రవారం ఏగోటివలస పొలాల్లో సంచరిస్తున్నాయని గ్రామస్తులు తెలియజేశారు. కోట సీతారాంపురం గ్రామానికి వచ్చిన 8 ఏనుగుల గుంపు 9కి చేరడంతో తాజాగా 9 ఏనుగుల గుంపు ఏగోటివలస పొలాల్లో సంచరిస్తున్నాయి. కోటసీతారాంపురం రైతు కె.రత్నాకర్ పొలంలో మొక్కలు ధ్వంసం చేయడంతో నష్టం వాటిలిందని తెలియజేశారు. ఇక్కడి పొలాల్లో ఏనుగులు ఏమేరకు నష్టాల్ని తెస్తాయోనని చెరకు, మామిడిరైతులు ఆందోళన చెందుతున్నారు. 20 లీటర్ల సారాతో వ్యక్తి అరెస్ట్గుమ్మలక్ష్మీపురం(కురుపాం): సారా నిర్మూలన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కురుపాం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని జియ్యమ్మవలస మండలం చినబుడ్డిడి గ్రామ సమీపంలో నిర్వహించిన దాడుల్లో ద్విచక్రవాహనంపై 20 లీటర్ల సారాను తరలిస్తున్న ఓ వ్యక్తి పట్టుబడినట్లు కురుపాం ఎకై ్సజ్ సీఐ పి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ మేరకు తన కార్యాలయం వద్ద సీఐ విలేకరులతో మాట్లాడుతూ పట్టుబడిన వ్యక్తికి సారాను సరఫరా చేసిన మరో వ్యక్తిని కూడా త్వరలో అరెస్ట్ చేయనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం జియ్యమ్మవలస మండలంలో గల పెదతుంబలి గ్రామాన్ని సారా రహిత గ్రామంగా గ్రామ కమిటీ తీర్మానం మేరకు ప్రకటించినట్లు సీఐ పేర్కొన్నారు. -
యోగాంధ్ర పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపాలి
పార్వతీపురం టౌన్: యోగాంధ్ర మాసోత్సవ కార్యక్రమాల్లో బాగంగా జిల్లా స్థాయి యోగా పోటీలను నిర్వహించినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్.భాస్కరరావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి యోగా పోటీలను పర్యవేక్షించారు. జిల్లాలోని వివిధ మండల,పట్టణ స్థాయి యోగాంధ్ర పోటీల్లో గెలుపొందిన వారికి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో యోగా పోటీలు నిర్వహించామన్నారు.యోగా చిత్రలేఖనం, సాంగ్స్, ఎస్సే, గ్రూప్ యోగా ప్రదర్శనలను ఆయన పరిశీలించారు. యోగా గురు మోహన్ గంతాయత్ బృందంతో కూడిన ఐదుగురు సభ్యులు జిల్లా స్థాయి పోటీలకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. జిల్లా పోటీల్లో గెలుపొందిన వారు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హులన్నారు. జిల్లా స్థాయిలో గెలుపొందినవారు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చి మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఆర్బీఎస్కే ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు, హోమియో వైద్యురాలు డా.సుశీల,జిల్లా కన్సల్టెంట్ డా రఘు,యోగా మాస్టర్స్ మోహన్ గంతాయత్, జనార్దన రావు, డా.హేమాక్షి, డా.వర్మ, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ భాస్కరరావు -
అలసత్వంతో అవినీతి
జిల్లా వ్యాప్తంగా ఉన్న నీటి ప్రాజెక్టులకు సంబంధించిన పంటకాలువల్లో పూడికలు తీసే పనులు జనవరి నుంచి మే మాసం లోపే అధికారులు పూర్తి చేసి వర్షాకాలానికి సన్నద్ధం కావాలి. ఈ పనులేవీ చేయకుండా వర్షాకాలం వచ్చిన తరువాత నిధులు కేటాయించి కాలువల్లో వరదనీరు ఉంటుంది కాబట్టి ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఆ నిధులను దుర్వినియోగం చేసేందుకు అధికారులు కుట్ర పన్నుతున్నారన్న ఆరోపిణలు వినిపిస్తున్నాయి. ఇటీవల తోటపల్లి కాలువకు సంబంధించిన పనుల్లో ఓ అధికారి పనులు నిర్వహించకుండానే ఎం బుక్లు చేసి నిధులు ఏవిధంగా తారుమారు చేశారో తెలిసిందే. ఇదే వైఖరిని అధికారులు కొనసాగిస్తున్నారు. – ఎం.కృష్ణమూర్తి, రైతుసంఘం నాయకుడు -
మెరుగైన వైద్య సేవలు కల్పించాలి
పార్వతీపురటౌన్: పార్వతీపురం మన్యం జిల్లాలో గణనీయమైన సంఖ్యలో గిరిజనులు, పేదలు నివసిస్తున్నారని జిల్లాలో ప్రధానంగా వైద్యానికి ప్రభుత్వ ఆస్పత్రులే ఆధారమని కానీ చాలా ఆస్పత్రుల్లో సరైన మౌలిక వసుతులు లేవని వెంటనే మెరుగుపరచాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం అభివృద్ధి వేదిక కమిటీ సభ్యులు ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా జిల్లాలోని సాలూరు, కురుపాం, సీతంపేట, పార్వతీపురం ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించి, వైద్య సదుపాయాలపై రోగులు, ఆయా ఆస్పత్రుల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పర్యటన అనంతరం కలెక్టర్ కార్యాలయంలో డీఆర్ఓ హేమలతకు వినతిపత్రాన్ని అందించి సమస్యలను వివరించారు. వెంటనే వైద్య సదుపాయాలను మెరుగుపరిచే దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. ఒక బెడ్పై ఇద్దరు అంతకంటే ఎక్కువగా.. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర అభివద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ మాట్లాడుతూ పార్వతీపురం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రి 150 పడకలకు, సాలూరు ఆస్పత్రి 100 పడకలకు, కురుపాం 50 పడకలకు, భద్రగిరి 50 పడకలకు, సీతంపేట 250 పడకలకు అప్డేట్ అయినప్పటికీ భవన నిర్మాణాలు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. దీని వల్ల ఒకే బెడ్పై ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది పడుకోవలసి వస్తోందన్నారు. అంతే కాక సాలూరులో గైనకాలజిస్ట్లు ఉన్నా ఆపరేషన్ థియేటర్ అందుబాటులోకి రాలేదని, సాలురులో డాక్టర్ల కొరత కుడా చాలా ఎక్కువగా ఉందన్నారు. పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఆంకాలజీతో సహా అన్ని సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వచ్చేలా డాక్టర్లను నియమించాలని, ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు అత్యధికంగా నివసించే ప్రాంతమైన మక్కువ మండలంలోని నంద, దుగ్గేరు, సాలూరు మండలంలోని కురుకూటి, పాచిపెంట మండలంలోని వేటగాని వలస వంటి ప్రాంతాల్లో అదనంగా పీహెచ్సీలను ఏర్పాటు చేయాల్సిన అవసరముందని వివరించారు. కార్యక్రమంలో కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం.శ్రీనివాస రావు, ఉపాధ్యక్షులు కె.విజయయగౌరి, వేదిక నాయకులు వెంకటరావు, ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా ఉపాధ్యక్షుడు రవికుమార్, సీఐటీయూ మన్యం జిల్లా కార్యదర్శి బీవీ రమణ, డీవైఎఫ్ఐ నాయకుడు పి.రాజశేఖర్ పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర అభివద్ధి వేదిక కమిటీ డిమాండ్ డీఆర్ఓకు వినతి పత్రం అందించిన కమిటీ సభ్యులు -
అస్తవ్యస్తంగా వరద కాలువలు
● నిలిచిపోయిన కల్వర్టుల నిర్మాణం ● ఆందోళనలో రైతులు పార్వతీపురం రూరల్: ఓ వైపు వాతావరణంలో మార్పులు సంభవించి వానలు ముంచుకొస్తున్నప్పటికీ అధికారుల్లో మాత్రం కదలిక కనిపించడం లేదు. ఎక్కడ చూసినా పంట కాలువలు పూడికలతో నిండిపోయి వర్షం కురిస్తే వరదనీరు కాలువల ద్వారా చెరువుల్లోకి పారేందుకు ఆస్కారం లేకుండా అస్తవ్యస్తంగా దర్శనమిస్తున్నాయి. ఉపాధిహామీ పథకంలో పూడిక తీత వంటి పనులు చేపట్టే వెసులుబాటు ఉన్నా జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఆ ఊసే లేకుండా పోయింది. సంబంధిత అధికారులు ఇంతవరకు ఆ దిశగా చర్యలు తీసుకోనప్పటికీ ఏ ఛానల్లో ఎంత పరిధి నిధులు అవసరమన్నది ఉపాధి, నీటి పారుదల శాఖ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి ప్రతిపాదనలు చేసి ఇప్పటికే పనులు పూర్తిచేయాలి. కానీ వాటి జోలికే అధికారులు వెళ్లలేదు. ఎక్కడ చూసినా ఆధ్వానమే జిల్లాలో చాలా వరకు పంటలకు ఆధారమైన పంట కాలువలు పూడికలతో నిండిపోయి వాటి ఆనవాళ్లే లేకుండా మారాయి. ప్రధానంగా చెరువులైతే వాటి విస్తీర్ణం తగ్గి బక్కచిక్కిన దుస్థితిలో దర్శనమిస్తున్నాయి. వాటికి సంబంధించిన భూములు కూడా శిథిలమయ్యాయి. గతంలో కూడా పనులు సక్రమంగా చేపట్టక వాటి లైనింగ్ పనులు పూర్తిగా పాడై పంట సాగుకు నీరు పారని దుస్థితిలో ఉన్నాయి. ఇప్పటికే వాటి పనులు జరిగి ఉంటే రైతులకు సాగునీటికి ఇబ్బంది ఉండేది కాదు. నాలుగు వారాల్లో పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించినప్పటికీ ఎక్కడా పనులు ప్రారంభించిన దాఖలాలు కన్పించడం లేదు. గిరిజన ప్రాంతాల్లో ఇదే దుస్థితి జిల్లా వ్యాప్తంగా ఉన్న గిరిజన ప్రాంతాల్లో దాదాపుగా వందల కొద్దీ చెక్డ్యాంలు గతంలో నిర్మించారు. వాటితో గిరిజన రైతుల ఆయకట్టు భూమికి పుష్కలంగా సాగునీరు అందేది. సమీపంలో ఉన్న వాగుల ద్వారా చెరువులు, గెడ్డలు నిండి వాటి ద్వారా పంటలకు సాగునీరు అందించేందుకు కార్యాచరణ జరిగేది. ఈ క్రమంలో వేసవిలో కూడా గిరిజన రైతులు పంటలు పండించుకునేందుకు ఆస్కారం ఉండేది. కొన్నేళ్లుగా వాటివైపు చూసే నాథుడే లేక అలాగే చెక్డ్యాంల నిర్వహణ మరమ్మతులు జరగక కాలువల్లో పూడికలు పేరుకుపోయి రైతులను ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికిప్పుడు భారీ వర్షాలు కురిస్తే నీరు వృథాకావడమే కాకుండా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ భూముల సైతం ముంపు బారిన పడక తప్పదని ఆప్రాంత గిరిజనులు వాపోతున్నారు. -
రక్తదాతలు..ప్రాణదాతలే..!
● స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న యువత ● నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవంరాజాం సిటీ: అన్ని దానాల్లోకెల్లా రక్తదానం మిన్న, రక్తదానం.. మహాదానం అంటూ ఎన్ని ప్రచారాలు చేసినా, స్పందన మాత్రం కొందరిలోనే కనిపిస్తోంది. రక్తదానం చేయాలని ఉన్నా కొన్ని అపోహలు, మనకెందుకులే అన్న భావనతో చాలా మంది రక్తదానం చేసేందుకు ఇష్ట పడడంలేదు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుండగా, ప్రస్తుతం సేకరిస్తున్న రక్తం ఆపదలో ఉన్నవారికి సరిపోవడంలేదు. విపత్కర పరిస్థితుల్లో మేమున్నామంటూ కొంతమంది రక్తదాతలు ముందుకొచ్చి దానం చేయడంతోపాటు అడపాడదపా నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాల్లో పాల్గొంటూ అపాయంలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. ఇటువంటి సమయంలో స్వచ్ఛంద సంస్థలు, యువకులు చొరవచూపి రక్తదానానికి ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం. ప్రాణంతో సమానం.. ప్రమాదాల్లో గాయపడిన వారికి, అత్యవసర చికిత్సలు అవసరమైన వారికి రక్తం ఎంతో అవసరం. రక్తాన్ని ఒకరి నుంచి మరొకరికి అందించాల్సిందే కానీ కృత్రిమంగా తయారుచేయలేం. అందుకే రక్తదానం ప్రాణదానంతో సమానం. ఒకరి రక్తం మరొకరి ఆయుష్షు కాపాడుతుంది. రక్తానికి పేద, ధనిక భేదాలు లేవు. ఒకమనిషి రక్తం మరో మనిషికి అందిస్తేనే వారి ప్రాణాలు నిలుస్తాయన్న సంగతి తెలిసినా చాలా మంది రక్తదానం చేయడానికి భయపడుతున్నారు. కొంతమంది మాత్రం ఎప్పుడు రక్తం అవసరం వచ్చినా మేమున్నామంటూ ముందుకొస్తున్నారు. వారు కూడా రక్తదానం చేయపోతే అత్యవసరమైన వారి పరిస్థితి ఇబ్బందికరమే. రక్తదానానికి వీరు అర్హులు.. అపోహలు వీడి రక్తదానం చేయాలనుకునేవారు ఆరోగ్యంగా ఉండడంతోపాటు 18 నుంచి 60 ఏళ్లలోపు వయసు, 50 కిలోల బరువు కలిగిఉండాలి. హిమోగ్లోబిన్ శాతం 12.5 ఉండాలి. చికెన్గున్యా, టైఫాయిడ్, మలేరియా, ఇతర వ్యాధులు సోకిన వారు నయమైన నాలుగు నుంచి ఆరు నెలల తరువాత రక్తదానం చేయవచ్చు. రక్తదానం చేసేవారి నుంచి కేవలం 300 మిల్లీ లీటర్ల రక్తాన్ని మాత్రమే సేకరిస్తారు. ● రక్తాన్ని సేకరించే ముందు వైద్యులు దాత ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తారు.వీరు అనర్హులు.. మధుమేహ వ్యాధి గ్రస్తులు, రక్తపోటుతో బాధపడుతున్న వ్యక్తులు రక్తం ఇవ్వకుండా ఉండాలి. అలాగే గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్నవారు క్యాన్సర్ శస్త్రచికిత్స చేయించుకున్నవారు, గుండెపోటుకు గురైనవారు మూర్ఛవ్యాధి ఉన్నవారు, కంటి జబ్బులు, కంటి కలక వంటివి ఉన్నప్పుడు రక్తదానం చేయవద్దు. -
విద్యుత్షాక్తో లైన్మన్ మృతి
శృంగవరపుకోట: ప్రమాదవశాత్తు విద్యుత్షాక్కు గురై ఆ శాఖలో పనిచేస్తున్న జూనియర్ లైన్మన్ మృతిచెందాడు. ఈ సంఘటన శుక్రవారం జామి మండలంలోని సోమయాజుల పాలెం గ్రామంలో జరిగింది. శాసనాపల్లి సచివాలంయలో జూనియర్ లైన్మన్గా విధులు నిర్వహిస్తున్న షేక్ రహ్మాన్ శుక్రవారం సోమయాజులపాలెంలో విద్యుత్ పోల్ ఎక్కి మరమ్మతులు చేస్తుండగా, ఒక్కసారిగా విద్యుత్ సరఫరా కావడంతో షాక్ తగిలి కింద పడిపోయాడు, విద్యుత్ సిబ్బంది హుటాహుటిన విజయనగరంలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఉద్యోగం వచ్చిందని, కుటుంబానికి ఆసరాగా కొడుకు ఉన్నాడని, మురిసిపోయామని, తమ ఆనందం మూడు రోజులు ముచ్చటే అయ్యిందని, ఇక తమకు దిక్కెవరంటూ మృతుడి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించడం గ్రామస్తులను కలిచివేసింది. చికిత్స పొందుతూ వృద్ధుడు..లక్కవరపుకోట: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి విశాఖపట్నంలో గల కేజీహెచ్లో చికిత్స పొందుతూ మండల కేంద్రంలోని బీసీ కాలనీకి చెందిన పెదగాడ అప్పారావు(77) శుక్రవారం ఉదయం మృతి చెందినట్లు ఏఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఘటనపై ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 9వ తేదీన ఎల్.కోట జంక్షన్ నుంచి అప్పారావు సోంపురం వెళ్తుండగా వెనుక నుంచి కారు వచ్చి ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాల పాలైన అప్పారావును విశాఖ కేజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.ఈ మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
బాల కార్మిక వ్యతిరేక దినోత్సవంపై అవగాహన
విజయనగరం లీగల్: జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ ఉత్తర్వుల మేరకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం బాలాజీ మార్కెట్ ఆవరణలో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్ట గడవక జీవనోపాధి కోసం కష్టపడే వారిని కార్మికులంటారు. చదువుకోవాల్సిన బాల్యంలో బలమైన పనులు చేస్తున్న దుస్థితి దాపరించడం నిజంగా అందరూ ఖండించాల్సిన విషయమన్నారు. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం ప్రపంచంలో ఐదు సంవత్సరాల నుంచి 14 ఏళ్ల లోపు బాల కార్మికులు 20 కోట్ల మంది ఉన్నారని అందులో సగం మంది భారతదేశంలో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయన్నారు. బాలకార్మిక నిషేధ, నియంత్రణ చట్టం 1986 నుంచి అమల్లోకి వచ్చిందన్నారు. ఈ చట్టం ప్రకారం 14 ఏళ్ల లోపు బాలబాలికలతో దుకాణాల్లో పనిచేయించుకున్నట్లయితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. బాల కార్మికులను గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇచ్చి స్కూల్కు పంపే ప్రయత్నం చేయవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ జి.హిమబిందు, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ బీహెచ్ లక్ష్మి, జిల్లా కన్వీనర్ చైల్డ్ రైట్స్ ఫోరం చిట్టిబాబు, న్యాయవాది తాడి రాజు, బెజ్జిపురం యూత్ ఆర్గనైజేషన్ ఎన్జీవో కోఆర్డినేటర్ ఝాన్సీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి కృష్ణ ప్రసాద్ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా బాలబాలికల హక్కుల ఫోరం కన్వీనర్ చిట్టి బాబు ఆధ్వర్యంలో పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం బాల కార్మిక వ్యవస్థ నిషేధంపై ప్రతిజ్ఞ చేశారు. -
విత్తనాలకుకటకట..!
విత్తనాలు తక్కువగా వచ్చాయి.. జీలుగు విత్తనాలు ఈ ఏడాది తక్కువగా వచ్చాయి.1295 క్వింటాళ్లుకు 740 క్వింటాళ్ల జీలుగ విత్తనాలు మాత్రమే వచ్చాయి. వాటిని రైతు సేవ కేంద్రాల్ ద్వారా రైతులకు అందించాం. – వి.తారకరామారావు, జిల్లా వ్యవసాయ అధికారి●విజయనగరం ఫోర్ట్: ఆరుగాలం శ్రమించి అందరికీ అన్నంపెట్టే రైతన్నను కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. గతేడాది ఖరీఫ్, రబీ కాలాలు ముగిసినా రూపాయి పెట్టుబడి సాయం అందించలేదు. ఈ ఏడాది ఖరీఫ్ వచ్చినా ఇంకా ప్రకటనలే తప్ప సాయం అందని పరిస్థితి. వరి విత్తనాల సరఫరాను పక్కన పెడితే కనీసం వరి సాగుకు ముందు భూసారం పెంపునకు కీలకమైన పచ్చిరొట్ట ఎరువు విత్తనాలు కూడా పూర్తిస్థాయిలో సరఫరా చేయకపోవడంపై రైతన్న భగ్గుమంటున్నాడు. గతంలో అన్నదాతకు అండగా ఉండే రైతుభరోసా కేంద్రాలు (రైతు సేవా కేంద్రాలు) సేవలు ఇప్పుడు నిర్వీర్యంగా కనిపిస్తున్నాయి. విత్తనాలు, ఎరువులు, యంత్ర సాయం అందడం లేదు. రైతు సంక్షేమానికి పాటు పడుతున్నామని గొప్పలు చెబుతున్న కూటమి నేతలు కనీసం విత్తనాలను కూడా అందించలేకపోవడం సిగ్గుచేటు. రైతు సుఖీభవను కాస్త దుఃఖీభవగా మార్చేశారంటూ రైతన్నలు వాపోతున్నారు.జీలుగ విత్తనాలకు కటకట పచ్చిరొట్ట ఎరువుల్లో ప్రధానమైన జీలుగ విత్తనాలు దొరకని పరిస్థితి. పిల్లిపెసర విత్తనాలు కూడా పూర్తిస్థాయిలో దొరకడం లేదని రైతులు చెబుతున్నారు. జీలుగ విత్తనాలు జిల్లాకు 1295 క్వింటాళ్లు అవసరం కాగా 740.30 క్వింటాళ్లు మాత్రమే వచ్చాయి. అవికూడ అయిపోయాయి. ప్రస్తుతం జీలుగ విత్తనాలు ఎక్కడా దొరకడం లేదు. అలాగే, పిల్లిపెసర విత్తనాలు సైతం 87 క్వింటాళ్లకు 22 క్వింటాళ్లు మాత్రమే వచ్చాయి. వాటికి కూడా కొరత ఏర్పడింది. మినప విత్తనాలు 95 క్వింటాళ్లు, పెసర 40 క్వింటాళ్లకు ఒక్క క్వింటా విత్తనాలు కూడా రాలేదు. వేరుశనగ 432 క్వింటాళ్లకు గాను 125 క్వింటాళ్లు మాత్రమే వచ్చాయి. చోడి 80 క్వింటాళ్లకు ఒక క్వింటా కూడా రాలేదు. కంది 8.50 క్వింటాళ్లు, నువ్వులు 80 క్వింటాల విత్తనాలు సరఫరా చేయాల్సి ఉండగా ఒక్క కిలో విత్తనాలు కూడా సరఫరా చేయకపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. అపరాల విత్తనాలదీ అదే పరిస్థితి.. -
క్లస్టర్ ఖాళీలు చూపించాల్సిందే..
● కౌన్సెలింగ్ కేంద్రం వద్ద ఉపాధ్యాయుల ఆందోళన ● బైఠాయించి ప్లకార్డులతో నిరసన ● కూటమి ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలపై మండిపాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాఠశాల విద్యాబోధనలో నైపుణ్యాభివృద్ధికి కీలకంగా నిలిచే స్కూల్ కాంప్లెక్స్ల విధానాన్ని రద్దు చేసింది. వాటి స్థానంలో క్లస్టర్ విధానాన్ని తెరపైకి తెచ్చింది. క్లస్టర్ మార్గదర్శకాల ప్రకారం ఇంతవరకు ఉన్న స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలలు వాటి దూరం. ఆయా స్కూళ్లలో విద్యార్థులు, టీచర్ల సంఖ్య ఆధారంగా జిల్లాలోని 162 స్కూల్ కాంప్లెక్స్ల స్థానంలో అదే సంఖ్యలో క్లస్టర్స్ను ఏర్పాటు చేశారు. ఒక్కో క్లస్టర్కు ప్రధానోపాధ్యాయుడితో పాటు స్కూళ్ల సంఖ్యను అనుసరించి ఒకటీ లేక రెండు ఎస్జీటీ పోస్టులను కేటాయించాలని క్లస్టర్ విధానంలో నిర్దేశించారు. అయితే ఈ పోస్టుల ఖాళీలను ప్రస్తుతం మాన్యువల్ కౌన్సెలింగ్లో తొలిరోజు నుంచి చూపించడం లేదు. దీనిపై ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై డీఈఓ యు.మాణిక్యంనాయుడు మాట్లాడుతూ క్లస్టర్ పరిధిలోని పోస్టులు కొత్తగా రూపొందించినవి మాత్రమేనని, మంజూరైన పోస్టులు కాదన్నారు. జిల్లా స్థాయిలో ఎక్కడైనా పోస్టులు ఖాళీ అయితే క్లస్టర్ పరిధిలో నియమించిన ఉపాధ్యాయులు ఆ స్థానాల్లోకి వెళ్లి పనిచేయాల్సి ఉంటుందన్నారు. వీటిని జూనియర్లకు ఇవ్వాలని ఉన్నతాధికారులు నిర్ణయించినట్టు తెలిపారు. కౌన్సెలింగ్ షెడ్యూల్ పూర్తయిన తరువాత మిగిలిపోయిన జూనియర్ ఉపాధ్యాయులకు ఈ పోస్టులను కౌన్సెలింగ్లో కేటాయిస్తామన్నారు. అయితే, క్లస్టర్ పరిధిలో పోస్టుల ఖాళీలను సైతం చూపించి, కౌన్సెలింగ్లోనే భర్తీచేయాలని ఉపాధ్యాయ సంఘాలు పట్టుబట్టాయి. దీంతో శుక్రవారం నిర్వహించాల్సిన కౌన్సెలింగ్పై ఇంతవరకు స్పష్టత రాలేదు. విజయనగరం అర్బన్: ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ గందరగోళంగా మారింది. స్పష్టమైన విధివిధానాలు ప్రకటించకపోవడం ఉపాధ్యాయులను ఆందోళన, ఆవేదనకు గురిచేస్తోంది. ఎస్జీటీ పోస్టుల బదిలీలను మాన్యువల్ విధానంలో జరపాలన్న ఉపాధ్యాయుల ఆందోళనకు కూటమి ప్రభుత్వం దిగివచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మాన్యువల్ కౌన్సెలింగ్లో పోస్టుల ఖాళీలన్నింటినీ చూపించకపోవడంతో పారదర్శకత లోపించిందంటూ ఉపాధ్యాయులు రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులను సంప్రదించాలని, తమ చేతుల్లో ఏమీ లేదంటూ జిల్లా విద్యాశాఖ అధికారులు చేతులెత్తేయడంతో గురువారం నిరసనకు దిగారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలోనే బైఠాయించారు. న్యాయం చేయాలంటూ నినదించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ఉదయం 9 గంటలకు సీరియల్ నంబర్ 500 నుంచి ప్రారంభమైన కౌన్సెలింగ్ సాయంత్రం 4 గంటల సమయంలో 370 నంబర్ వచ్చింది. ఆ సమయంలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు మరోసారి క్లస్టర్ ఖాళీలు చూపించాలంటూ డిమాండ్ను లేవనెత్తారు. తొలుత అధికారుల నుంచి స్పందన రాకపోవడంతో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు నిరసనకు పిలుపునిచ్చారు. కౌన్సెలింగ్ ప్రాంగణం కౌన్సెలింగ్ హాల్ బయట ఉపాధ్యాయుల ఆందోళన బయట, లోపల ఉన్న ఉపాధ్యాయులంతా ఒక్కసారిగా నిరసనకు దిగి నినాదాలు చేశారు. ఈ సమయంలో సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం మున్సిపాలిటీల్లోని ఖాళీలకు కౌన్సెలింగ్ నిర్వహించగా, రాత్రి 9 గంటల తర్వాత విజయనగరం కార్పొరేషన్ పరిధిలోని ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ జరిపారు. అంతా అస్తవ్యస్తం.. -
అత్యాచారం కేసులో ముద్దాయికి 12 ఏళ్ల జైలు శిక్ష
విజయనగరం క్రైమ్: ఆండ్ర పోలీస్ స్టేషన్ పరిధిలో రెండేళ్ల కిందట నమోదైన అత్యాచా రం కేసులో ముద్దాయికి 12 ఏళ్ల జైలుశిక్ష, రూ.2వేలు జరిమానా విధిస్తూ జిల్లా మహిళా కోర్టు గురువారం తీర్పు ఇచ్చినట్టు ఎస్పీ వకు ల్ జిందాల్ తెలిపారు. కేసు వివరాల్లోకి వెళితే.. మెంటాడ మండలం కుంటినవలసకు చెందిన మాదిరెడ్డి అప్పారావు ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడినట్టు 2023లో ఆండ్ర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. అప్పటి ఎస్ఐ సిద్ధార్థ కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం గజపతినగరం సీఐ అప్పలనాయుడు ఆధ్వర్యంలో అరెస్టు చేశారు. అభియోగపత్రాన్ని ఎస్ఐ ప్రభాకర్ కోర్టులో దాఖలు చేశా రు. అప్పారావుపై నమోదైన కేసులో సాక్ష్యాలు రుజువు కావడంతో మహిళా కోర్టు ఐదవ అడిషనల్ జడ్జి పద్మావతి ముద్దాయికి శిక్ష ఖారారు చేస్తూ తీర్పు చెప్పారు. కేసులో నిందితునిపై నేరం రుజువయ్యేలా పోలీస్శాఖ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ శకుంతల వాదనలు వినిపించగా, గజపతినగరం సీఐ రమణ, ఆండ్ర ఎస్ఐ సీతారాం కోర్టు కానిస్టేబుళ్లు సూర్యనారాయణ, సౌజన్యలు సకాలంలో సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారని ఎస్పీ చెప్పారు. వారిని అభినందించారు. విమాన ప్రమాదంపై దిగ్భ్రాంతి విజయనగరం: గుజరాత్లో జరిగిన విమాన ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు మృతి చెందడంపై జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘోర దుర్ఘటన బాధాకరమన్నారు. విమానం హాస్టల్ భవనంపై కూలడంతో అధికమంది వైద్య విద్యార్థులు మృతి చెందడం, మరో 16 మంది తీవ్రంగా గాయపడడం హృదయాన్ని కలిచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపాన్ని తెలిపారు. విమాన ప్రమాదాలను అరికట్టడంపై కేంద్రప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త..!●పార్వతీపురంటౌన్: సైబర్ నేరగాళ్లు పెట్టే ప్రలోభాలకు గురికావద్దని, వారు చేసే వివిధ మోసాలకు దూరంగా ఉండాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అపరిచితుల నుంచి వచ్చే మొబైల్ నంబర్లకు బదులివ్వవద్దని, డిజిటల్ అరెస్టులు లాంటివి లేవని కలెక్టర్ తేల్చిచెప్పారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. డిజిటల్ అరెస్ట్ అని ఎవరైనా చెప్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. మొబైల్లో ఎలాంటి బెట్టింగ్ యాప్లను డౌన్లోడ్ చేసుకోవద్దని, వాటిని సోషల్ మీడియా ద్వారా ఇతరులకు షేర్ చేయొద్దన్నారు. అలా చేసి ఇబ్బందులు, లేనిపోని సమస్యలను కొనితెచ్చుకోవద్దని కలెక్టర్ హితవు పలికారు. బెట్టింగ్ యాప్లు ఉపయోగించినా, ఇతరులకు ప్రమోట్ చేసినా చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. మీరు లాటరీ గెలిచారు. మీకు పాస్వర్డ్ వస్తుంది. లేదా మీ మొబైల్కు వచ్చే పిన్ నంబర్ చెప్పండంటూ సైబర్ నేరగాళ్లు మోసం చేసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతాల వివరాలు, ఓటీపీ వివరాలు ఎవరికి తెలియజేయవద్దని సూచించారు. స్క్రాచ్ చేయండి. రివార్డు పొందండి అని వచ్చే సందేశాలను క్లిక్ చేసి ఓపెన్ చేయవద్దని, ఏపీకే (ఏపీకె) పేరు మీద డాక్యుమెంట్ వస్తుందని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయరాదని కలెక్టర్ వివరించారు. పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని సోషల్ మీడియాలో ప్రలోభపెట్టే యాప్ల జోలికి వెళ్లొద్దన్నారు. ఏ అనుమానం వచ్చినా వెంటనే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ 1930కు కాల్ చేయాలని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
మామిడి, పామాయిల్ మొక్కల ధ్వంసం
● కోటసీతారాం పురంలో ఏనుగుల తిష్ఠసీతానగరం: మండలంలో దట్టమైన తోటలు న్న కోట సీతారాంపురంలో నాలుగు రోజులుగా ఏనుగుల గుంపు తిష్ఠ వేశాయి. అల్లు వాసు, సూర్యనారాయణల మామిడితోటలో మామిడి కాయల కోసం మామిడి, పనస చెట్లను ధ్వంసం చేశాయి. ఆ పక్కనే ఉన్న మాదాసు శ్రీనివాసరావుకు చెందిన పామాయిల్ మొక్కలను నాశనం చేశాయి. దీంతో లక్షలు ఖర్చుచేసి మామిడి తోటను తయారు చేసి పంటకోతకు వచ్చే సమయానికి ఏనుగులు ధ్వంసం చేయడంతో అపారమైన నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం పంటనష్టాన్ని అంచనావేసి ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నారు. ఏనుగు పిల్లకు ‘సీత’గా నామకరణం కోట సీతారాంపురం గ్రామంలో బుధవారం జన్మించిన ఏనుగు పిల్లకు ‘సీత’ అని ట్రాకర్స్, బీట్ అధికారులు, గ్రామస్తులు కలిసి నామకరణం చేశారు. 8 ఏనుగుల గుంపుతో కోట సీతారాంపురం వచ్చిన ఏనుగులు గుంపులో పెద్ద ఏనుగు శిశువుకు జన్మనివ్వడంతో ఏనుగుల గుంపు 9కి చేరింది. వీటి సంచారాన్ని ట్రాకర్స్ గమనిస్తున్నారు. -
మాతాశిశు ఆరోగ్యం మెరుగుకు కృషి
● రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఎ.డి అనిల్కుమార్ పార్వతీపురంటౌన్: మాతాశిశు ఆరోగ్య సేవలను బలోపేతం చేసే దిశగా వైద్యారోగ్యశాఖ అడుగులు వేస్తుందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అదనపు సంచాలకుడు డాక్టర్ కేవీఎస్ అనిల్కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లాలో ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరు పర్యవేక్షణకు విచ్చేసిన ఆయన గురువారం స్థానిక ఎన్జీఓ హోంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.భాస్కరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై ప్రస్తావించి సమీక్ష చేశారు. గర్భిణులకు వైద్యసేవలు మెరుగు పరిచే లక్ష్యంగా జననీ మిత్ర యాప్ ప్రవేశపెట్టినట్లు తెలిపారు. మాతాశిశు మరణాలు నివారించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. స్టేట్ కన్సల్టెంట్స్ డా.నరేంద్ర, వెంకటేష్లు యాప్పై వైద్యసిబ్బందికి శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.పద్మావతి, డీఐఓ డా.నారాయణరావు, ప్రోగ్రాం అధికారి డా.వినోద్, పీహెచ్సీల వైద్యాధికారులు, వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
బడి బస్సు భద్రమేనా ?
విజయనగరం టౌన్: పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు పూర్తికావచ్చాయి. గురువారం పూర్తిస్థాయిలో పాఠశాలలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులను పాఠశాలలు, కళాశాలలకు తీసుకువెళ్లి వచ్చేందుకు గాను బస్సులు ముస్తాబవుతున్నాయి. అన్ని అనుమతి పత్రాలతో, ఫిట్నెస్ను సరిచూసుకుని బస్సు పనితీరు తదితర అంశాలపై స్కూల్ యాజమాన్యాలు, ఆర్టీఓ అధికారులు రంగం సిద్ధం చేశారు. స్కూల్ బస్సుకు సంబంధించి అన్ని రకాల సర్టిఫికెట్లు, ఫిట్నెస్ సక్రమంగా ఉంటేనే తిరగాలని, లేకుంటే కఠిన చర్యలకు వెనుకాడబోమని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బడిబస్సుల భద్రతకు సంబంధించి జిల్లా రవాణాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. 15 ఏళ్లు దాటిన బస్సులకు రిజిస్ట్రేషన్ రద్దు చేస్తున్నారు. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు తమ స్కూల్ బస్సులో క్షేమంగా వెళ్లి, తిరిగి ఇంటికి చేరుకునేందుకు గాను బస్సుల ఫిట్నెస్ను అధికారులు ఎప్పటికప్పుడు పర్వేక్షిస్తున్నారు. ఫిట్నెస్ సక్రమంగా ఉంటేనే వాటికి అనుమతులిస్తున్నారు. జిల్లాలో 510 స్కూల్, కళాశాలల బస్సులు ఉన్నాయి. వాటిలో ఇప్పటివరకు దాదాపు 400కి పైగా బస్సులు ఫిట్నెస్ పూర్తిచేసుకుని పాఠశాలలు, కళాశాలలకు విధులు నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. మరిన్ని బస్సులకు ఫిట్నెస్ పరీక్షలతో పాటూ ఇతర అనుమతి పత్రాలను అధికారులు తనిఖీ చేస్తున్నారు. బస్సు డ్రైవర్ ఎంపిక కీలకం స్కూల్ బస్సు డ్రైవర్ల ఎంపికలో విద్యాసంస్థల యాజమాన్యాలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. శిక్షణ పొందిన, ఆరోగ్యంగా ఉన్న డ్రై వర్లకు ఎక్కువ వేతనం చెల్లించాలన్న కారణంగా 50 ఏళ్లు నిండిన వారిని ఎంపిక చేసుకుంటున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే డ్రైవర్ వయసు 50 ఏళ్లకు మించకూడదని, తప్పనిసరిగా లైసెన్స్ ఉండాలని, ప్రతి మూడు నెలలకు ఒకసారి డ్రై వర్ బీపీ, సుగర్ పరీక్షలు చేయించుకోవాలనే నిబంధనలు ఉన్నాయి. యాజమాన్యాలదే బాధ్యత జిల్లాలో సుమారు 510కి పైగా స్కూల్ బస్సులు ఉన్నట్లు రవాణాశాఖ అధికారులు గుర్తించారు. వాటిలో సుమారు 400 బస్సులకు ఇప్పటికే ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించారు. నిబంధనలు పాటించని బస్సులను తిరస్కరించారు. మిగిలిన బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేస్తున్నారు. అయితే తిరస్కరణకు గురైన బస్సులను మళ్లీ పరీక్షలు చేయించుకోవడంలో యాజమాన్యాలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయని అధికారులు అంటున్నారు. స్కూల్స్ పునః ప్రారంభమవుతున్న నేపథ్యంలో బస్సు భద్రత తప్పనిసరి అని విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. బస్సులో సీట్లు, అద్దాలు, టైర్లు తదితర బస్సు సామగ్రి అన్నీ సక్రమంగా ఉనాయా? లేదా? అనేది చూసుకోవాలని రవాణాశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఫిట్నెస్ లేని బస్సులపై అధికారుల కొరడా 15 ఏళ్లు దాటిన బస్సుల రిజిస్ట్రేషన్ రద్దు జిల్లాలో 400 బస్సులు ఫిట్నెస్లో పాస్ మిగిలిన బస్సులకు పరీక్షలు చేస్తున్న అధికారులు -
వచ్చే నెల 5న జాతీయ లోక్ అదాలత్
విజయనగరం లీగల్: వచ్చే నెల 5వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో జాతీయ లోక్అదాలత్కు సంబంధించి విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ అధికారులతో జిల్లా కోర్టు సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. రాజీ కాదగిన అన్ని క్రిమినల్ కేసులతో పాటు చెక్బౌన్స్ కేసులను గుర్తించి స్పెషల్ డ్రైవ్ చేపట్టి జాతీయ లోక్ అదాలత్లో పరిష్కరించుకోవా లని సూచించారు. తద్వారా కక్షిదారులకు డబ్బు సమయం వృథా కావన్నారు. పోలీస్ అధికారులు వారెంట్ పెండింగ్ ఉన్న కేసులు, గంజాయికి సంబంధించిన కేసులు, పోక్సో యాక్ట్కు సంబంధించిన కేసులలో నిందితులకు అవగాహన కల్పించాలని, తద్వారా నేరాలు తగ్గుముఖం పడతాయని అభిప్రాయ పడ్డారు. సమావేశంలో ఏఎస్పీ సౌమ్యలత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి పి బుజ్జి, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన 80 మంది పోలీస్ అధికారులు పాల్గొన్నారు. సద్వినియోగం చేసుకోండి: జిల్లా జడ్జి పిలుపు -
ముగ్గురూ ముగ్గురే..!
● కష్టపడి చదివి..ఎస్బీఐలో కొలువులు ● ఆనందం వ్యక్తంచేస్తున్న కుటుంబసభ్యులు, గ్రామస్తులుడీసీసీబీలో సూపర్వైజర్గా పనిచేస్తూ.. నందిగాం గ్రామానికి చెందిన అల్లు దినేష్ తెర్లాంలోని డీసీసీబీలో స్టాఫ్ అసిస్టెంట్(సూపర్వైజర్)గా ఉద్యోగం చేస్తూ ప్రస్తుతం ఎస్బీఐలో జూనియర్ అసోసియేట్గా తెలంగాణ సర్కిల్లో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. దినేష్ కాకినాడ జేఎన్టీయూలో బీటెక్ చదివాడు. తండ్రి అల్లు లక్ష్మణరావు వైఎస్సార్సీపీ నాయకుడిగా ఉంటూ, వ్యవసాయం చేస్తున్నారు. తల్లి అల్లు గౌరి నందిగాం ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ) సభ్యురాలు. పెద్ద కుమారుడు సుధీర్కుమార్ వ్యవసాయ శాఖలో ఏఈవోగా పనిచేస్తున్నాడు. – అల్లు దినేష్, నందిగాం, తెర్లాం మండలంతెర్లాం: ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు కష్టపడి చదివారు. ఆ ముగ్గురూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో కొలు వులు సాధించారు. ఒకే గ్రామానికి చెందిన ము గ్గురికి ఎస్బీఐలో జూనియర్ అసోసియేట్ ఉద్యోగాలు ఒక్కసారే రావడంతో వారి కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ వారిని ప్రశంసిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..తెర్లాం మండలం నందిగాం గ్రామానికి చెందిన అల్లు దినేష్, గంటసాధిక్, కొల్లి ప్రకాష్లు బుధవారం వెలు వడిన ఎస్బీఐ పరీక్షా ఫలితాల్లో జూనియర్ అసోసియేట్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు.రైతు బిడ్డ ప్రకాష్.. నందిగాం గ్రామానికి చెందిన కొ ల్లి ప్రకాష్ తె లంగాణ సర్కిల్లో ఎస్బీ ఐలో జూనియర్ అసోసియేట్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ప్రకాష్ తండ్రి సింహాచలం రైతు. తల్లి లక్ష్మణమ్మ గృహిణి. ప్రకాష్ బీఎస్సీ కెమిస్ట్రీ చదివాడు. –కొల్లి ప్రకాష్, నందిగాం, తెర్లాం మండలంమొదటి ప్రయత్నంలోనే ఎస్బీఐలో ఉద్యోగం.. నందిగాం గ్రామానికి చెందిన గంట సాంబశివ, పార్వతమ్మల కుమారుడు సాధిక్..మొదటి ప్రయత్నంలోనే మహారాష్ట్ర సర్కిల్లో ఎస్బీఐలో జూనియర్ అసోసియేట్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. సాధిక్ బీకామ్ చదివాడు. తండ్రి సాంబశివ గ్రామంలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్గా పనిచేస్తుండగా, తల్లి పార్వతమ్మ నందిగాం జెడ్పీ హైస్కూల్లో మధ్యాహ్న భోజన పథకంలో నిర్వాహకురాలిగా పనిచేస్తున్నారు. –గంట సాధిక్, నందిగాం, తెర్లాం మండలం -
● సారథి గెడ్డ ఇలా.. సాగునీరు వెళ్లేదెలా..
రాజాం ప్రాంతంలోని సారథి గెడ్డ పూర్తిగా పూడుకుపోయింది. తుప్పలు, పిచ్చిమొక్కలతో నిండిపోయింది. కనీసం సాగునీరు వెళ్లే దారి కనిపించడం లేదు. ఆయకట్టుకు సాగునీరు అందని పరిస్థితి. మరోవైపు రంగప్ప చెరువు మదుములకు షట్టర్లు లేకపోవడంతో సాగునీరు వృథా అవుతోంది. చి‘వరి’లో వరి పంటకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. తక్షణమే స్పందించి సారథిగెడ్డలో ఆక్రమణలతో పాటు, రంగప్ప చెరువు మదుములకు షట్టర్లు బించాలని కోరుతూ నీటిపారుదల శాఖ ఏఈ రాజేష్కు ఆయకట్టు రైతులు గురువారం వినతిపత్రం అందజేశారు. – రాజాం సిటీ -
అన్నార్తులకు ఆసరా
గరుగుబిల్లి: ఏ ఆధారం లేని నిరుపేదలు కడుపారా రెండుపూటలా తినేందుకు ఆహారాన్ని సరఫరా చేసేందుకు ఓ మంచి కార్యక్రమానికి గురజాడ విద్యాసంస్థల అధినేత జీవీ స్వామినాయుడు శ్రీకారం చుట్టారు. వృద్ధాప్యంలో వంట చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారికి అవకాశం లేని వారిని గుర్తించి వారి వద్దకు నేరుగా క్యారియర్లతో రెండుపూటలా భోజనం సరఫరా చేసేందుకు శ్రీ సత్యసాయి అన్నపూర్ణ సేవా కేంద్రం ద్వారా చర్యలు చేపట్టారు. ఈ మేరకు గురువారం గరుగుబిల్లి మండలంలోని నాగూరు గ్రామంలో క్యారియర్ల ద్వారా భోజనం సరఫరా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరఘట్టం, రావివలస, చిట్టపులివలస, కెల్ల తదితర దాదాపు పది గ్రామాల్లో గత కొన్నేళ్లుగా క్యారియర్ల ద్వారా అనార్తులకు భోజనం సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. నాగూరులో 12 మందిని గుర్తించి వారికి కూడా ప్రతిరోజూ క్యారియర్ల ద్వారా భోజనం సరఫరా చేయనున్నామన్నారు. ప్రతిరోజూ ఉదయం 11 గంటలకే ఆహారాన్ని చిట్టపులివలసలో ఉన్న సత్యసాయి అన్నపూర్ణ సేవా కేంద్రంలో తయారు చేసి మినీ వాహనం ద్వారా తమ సిబ్బంది అన్నార్తులకు నేరుగా క్యారియర్లను అందిస్తారని తెలిపారు. ఇక్కడితో ఆగకుండా మరికొద్ది రోజుల్లో గరుగుబిల్లి మండలంలోని దత్తివలస, కారివలస, చిలకాం గ్రామాలకు కూడా ఆహారాన్ని క్యారియర్ల ద్వారా సరఫరాచేయనున్నట్లు తెలిపారు. దాతల సహకారం అన్నార్తుల ఆకలి తీర్చేందుకు మంచి ఉద్దేశ్యంతో ప్రారంభించిన ఈ కార్యక్రమానికి పలువురు దాతలు ముందుకొచ్చి వారి ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. ఇందులో భాగంగా కేతిరెడ్డి గాయత్రినాయుడు జ్ఞాపకార్థం ఆయన భార్య రాధాకాంతమ్మ రూ. 2లక్షలు, గురజాడ సంస్థల అధినేత రూ.2లక్షలు, అక్కేన సత్యనారాయణ జ్ఞాపకార్థం కుటుంబసభ్యులు అంబటి తిరుమల రావు రూ.లక్ష, ఎల్లాపు కాశీవిశ్వనాథ తన తండ్రి జ్ఞాపకార్ధం రూ.లక్ష, అమెరికాలో ఉంటున్న విమలాకర్, సరళ దతాని ఫౌండేషన్ ద్వారా రూ.లక్ష, తిరుమల తన తండ్రి జగన్నాథం జ్ఞాపకార్ధం రూ.50వేలు ఆర్థిక సహకారాన్ని అందించారు. కార్యక్రమంలో భాగంగా ప్రముఖ నఖచిత్రకారుడు పల్ల పరిశి నాయుడు వేసిన నఖ చిత్రమాల పుస్తకాన్ని గురజాడ విద్యాసంస్థల అధినేత జీవీ.స్వామినాయుడు ఆవిష్కరించారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఉమ్మడి జిల్లా రిమ్స్ సేవా సంస్థల ప్రతినిధి రమణబాబు, విశ్రాంత ఏఎస్పీ కె. భార్గవ నాయుడు, ఆధ్యాత్మిక గురువు వైఆర్వీ గణపతిరావు, సీతంనాయడు, బొత్స తవిటినాయుడు, మిరియాల సత్యనారాయణ, కేతిరెడ్డి శ్రీను, రిటైర్డ్ ఎస్ఈ కె.చంద్రశేఖరరావు, కొప్పల వెలమ సంఘం డైరెక్టర్ ఎ.మధుసూధనరావు, బి. తాతబాబు, తదితరులు పాల్గొన్నారు. రోజూ క్యారియర్లతో భోజనం సరఫరా -
చికెన్
బ్రాయిలర్ లైవ్ డెస్డ్ స్కిన్లెస్ శ్రీ107 శ్రీ184 శ్రీ194గంజాయి నిందితుడి ఆస్తుల సీజ్విజయనగరం క్రైమ్: గత ఏడాది గంజాయి కేసులో అరెస్ట్ అయిన ఒడిశా వాసికి చెందిన రూ.42 లక్షల ఆస్తులు సీజ్ చేశామని ఎస్పీ వకుల్ జిందల్ గురువారం తెలిపారు. 2024లో జిల్లాలోని ఎస్.కోట పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కేసులో నిందితుడిగా అరెస్టు అయిన ఒడిశాలోని కొరాపుట్ జిల్లా నందపూర్ మండలం, బసుపుట్ గ్రామానికి చెందిన వ్యాపారి పతి ఖిల అలియాస్ గురు (32)కు చెందిన రూ.42,70,000 విలువైన స్థిర, చరాస్తులను అటాచ్ చేశామన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి గురు 200కిలోల గంజాయిని గతేడాది అక్టోబరు 6న తరలిస్తూ ఎస్.కోటలో పందిరప్పన్న జంక్షన్ వద్ద పోలీసులకు పట్టుబడినట్లు చెప్పారు. విచారణలో నిందితుడు గురు కొన్నేళ్లుగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు వెల్లడైందన్నారు. అలా వచ్చిన అక్రమ సంపాదనతో రూ.42,70,000 విలువైన స్థిర, చరాస్థులను కూడబెట్టినట్లు గుర్తించామన్నారు. ఆస్తుల అటాచ్ ప్రక్రియలో క్రియాశీలకంగా పని చేసిన అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్.కోట ఇన్స్పెక్టర్ వి.నారాయణమూర్తి, ఇతర పోలీసు అధికారులను ఎస్పీ వకుల్ జిందల్ అభినందించారు. గంజాయి నిందితుడి అరెస్ట్సాలూరు రూరల్: మండలంలోని దుద్దిసాగరం గ్రామ శివారులో గత నెల 7వ తేదీన 183.800 కేజీల గంజాయితో కారును రూరల్ పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. అయితే అప్పట్లో పరారైన నిందితుల్లో ఒకడైన దీపక్ కుమార్ పొధార్ను ఈ నెల 10వ తేదీన ఒడిశా రాష్ట్రంలోని సెమిలిగుడలో గల ఫ్యూజన్ హోటల్లో పట్టుకున్నట్లు రూరల్ ఎస్సై నరసింహ మూర్తి తెలిపారు. పై అధికారుల ఉత్తర్వుల మేరకు మెజిస్ట్రేట్ వద్దకు రిమాండ్ నిమిత్తం పరిచినట్లు చెప్పారు. పాము కాటుతో వ్యక్తి మృతిదత్తిరాజేరు: మండలంలోని చినకాద గ్రామానికి చెందిన ఆవాల సూర్యనారాయణ(31) పాముకాటుకు గురై మృతి చెందినట్లు పెదమానాపురం ఎస్సై ఆర్ జయంతి తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల మేరకు సూర్యనారాయణ 10వ తేదీ రాత్రి గ్రామ సమీపంలో మల విసర్జనకు వెళ్తున్న సమయంలో చీకట్లో పాము కాటు వేయడంతో గజపతినగరం సామాజిక ఆస్పత్రికి తీసుకువెళ్లగా అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయనగరం సర్వజన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య రాము, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. శతాధిక వృద్ధుడి మృతివీరఘట్టం: వీరఘట్టం పట్టణానికి చెందిన శతాధిక వృద్ధుడు వూణ్న రామలింగేశ్వరుడు(103) గురువారం తెల్లవారుజామున మృతిచెందారు. ప్రస్తుత జనరేషన్లో 25–30 ఏళ్ల లోపే చాలా మందికి సుగర్, బీపీ, చూపు మందగించడం వంటి సమస్యలు వస్తున్నాయి. అయితే ఆయనకు నేటివరకు జ్వరం అనే మాట కూడా తెలియదని ఆయన కుమారుడు సురేష్ తెలిపారు. కళ్లజోడు లేకుండా న్యూస్పేపర్ ప్రతిరోజూ చదివేవారని, బుధవారం రాత్రి భోజనం చేసి పడుకున్న తన తండ్రి నిద్రలోనే కన్నుమూశారని చెప్పారు. ఇన్నాళ్లూ ఒకరిపై ఆధారపడకుండా అందరికీ ఆదర్శంగా రామలింగేశ్వరుడు ఉన్నారన్నారు. -
‘చిటుక’ నివారణే లక్ష్యం..
సాధారణంగా వ్యాధి సోకిన జీవాలకు చికిత్స చేసే వ్యఽవధి ఉండదు. వ్యాధి రాకుండా ముందుగానే వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. సంవత్సరం వయసున్న గొర్రెల్లో ఎక్కువగా వస్తుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే గొర్రెల్లోను, వలస గొర్రెల్లోనూ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. అంటు వ్యాధులు సోకక ముందే ఈ వ్యాఽధి నిరోధక టీకాలు వేయిస్తే గొర్రెలు, మేకల్లో రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. గొర్రెల పెంపకం దారులు అప్రమత్తంగా ఉండాలి. ఎల్.విష్ణు, పశుసంవర్థక శాఖ ఎ.డి, బొబ్బిలి● -
ముందస్తు నివారణ లేకపోతే..‘చిటుక’లో గొర్రెల మృతి..!
● రోగాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ● టీకాలు వేయిస్తే వ్యాధి నివారణ ● తొలకరి వర్షాలు, అకాల వర్షాలకు మొలిచిన గడ్డిని వేయరాదు ● పశు సంవర్థక శాఖాధికారుల సూచనలురామభద్రపురం: గొర్రెల పెంపకందారులకు తీవ్రనష్టం కలిగించే వ్యాధి ‘చిటుక’ రోగం. ఇందులో 40 శాతం వరకు మరణాల రేటు ఉంటుంది. ఈ వ్యాధి సోకిన గొర్రెలు నిమిషాల్లోనే చనిపోతాయి. గొర్రెల పెంపకందారులు ప్రధానంగా చిటుక రోగంపై అప్రమత్తంగా ఉండాలి. ఈ వ్యాధి సోకితే చిటికెలో వెంటనే మరణించే ప్రమాదం ఉండడం వల్ల దీనిని చిటుక రోగం అంటారు. జిల్లాలో 1,30,180 గొర్రెలు, 43,101 మేకలు ఉన్నాయి. వాటికి ఈ వ్యాధి సోకుండా, అలాగే వ్యాధి నివారణకు ప్రభుత్వం ఇప్పటికే టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ వ్యాధితో గొర్రెలకు నష్టం జరగకుండా ఉండేందుకు టీకాలు వేయించాల్సిన అవసరం ఉంది. టీకాల కార్యక్రమం మొదలైన నేపథ్యంలో గొర్రెల్లో ఈ వ్యాధి ఎప్పుడు వస్తుంది?లక్షణాలు ఎలా ఉంటాయి?నివారణ పద్ధతులపై పశుసంవర్ధక శాఖాధికారులు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. టీకాలు వేయిడంతో వ్యాధి నివారణ.. గొర్రెలు, మేకల్లో గాలికుంటు, మశూచి, పీపీఆర్, చిటుకు రోగం, దొమ్మ, గొంతువాపు మొదలైన అంటువ్యాధులు ఒక మంద నుంచి వేరే మందకు అత్యంత వేగంగా, సులభంగా వ్యాపించి ప్రాణనష్టం కలిగిస్తాయి. చాలా సందర్భాల్లో చికిత్స చేసేందుకు తగిన వ్యవధి కూడా ఉండదు. ఇలాంటి ప్రమాదకరమైన ప్రాణాంతకమైన వ్యాధులకు చికిత్స బదులు నివారణే శ్రేయస్కరం అని గుర్తించాలి. అంటు వ్యాధులు సోకక ముందే వ్యాఽధి నిరోధక టీకాలు వేయిస్తే గొర్రెలు, మేకల్లో రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. గొర్రెలకు ఎక్కువగా సోకే ప్రమాదం.. మేకల్లో ఈ వ్యాధి తీవ్రత అంతగా కనిపించదు.గొర్రెలకు ఎక్కువగా సోకే ప్రమాదం ఉంది. తొలకరిలో ఎక్కువగా వస్తుంది. తొలకరిలో పెరిగిన పచ్చికను అతిగా మేయడం వల్ల శరీరంలో ఎప్సిలాల్ అనే విష పదార్థం విడుదల కావడం వల్ల ఈ వ్యాధి సంభవిస్తుంది. మేతను తినేసి అకస్మాత్తుగా దాణాను మార్చడం వల్ల కూడా వచ్చే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. -
ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేస్తాం
ప్రతి స్కూల్ బస్సుకు సంబంధిత పాఠశాల యాజమాన్యం తప్పనిసరిగా ఫిట్నెస్ చేయించాలి. లేకపోతే అటువంటి బస్సులను తిరగనిచ్చే ప్రసక్తే లేదు. పాఠశాల భద్రత విషయంలో రాజీపడేది లేదు. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. పాఠశాలలు తెరవనున్న నేపథ్యంలో ఫిట్నెస్ పరీక్షలు చేయించుకుని బస్సులు నడపాలి. పాఠశాలలు ప్రారంభం నాటి నుంచి ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేస్తాం. 15 ఏళ్లు దాటిన బస్సులు, 15 ఏళ్లకు దగ్గరగా ఉన్న బస్సులు తుక్కుగా అమ్మేసి వాటి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ రద్దుచేసుకోవాలి. – మణికుమార్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, విజయనగరం -
ఇక్కడి ఇసుక వద్దు... అక్రమ ఇసుకే ముద్దు..!
చిత్రంలోని ఇసుక నిల్వలు చూశారా... ఇవి బొబ్బిలి గ్రోత్ సెంటర్ వద్ద ప్రభుత్వం నిల్వ చేసిన ఇసుక. ఇక్కడ 9 వేల టన్నుల ఇసుక నిల్వ ఉంది. రవాణా చార్జీలు చెల్లించి ఇక్కడ నుంచి ఇసుకను తీసుకెళ్లాలి. అయితే, రవాణా చార్జీల పేరుతో అధిక డబ్బులు వసూలు చేయడంతో ఇక్కడ నుంచి ఇసుకను తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. మరోవైపు నదుల్లో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు జరుగుతుండడం వ్యాపారులకు కలిసివస్తోంది. ఇసుక నిల్వ కేంద్రాల వైపు కన్నెత్తి చూడాల్సిన అవసరం లేకపోతోంది. ఇసుక అక్రమ తవ్వకాలతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుండగా, అధికార పార్టీ నేతలకు మాత్రం ఇసుక వ్యాపారం కాసులు కురిపిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక గ్రోత్ సెంటర్లో ఇసుక నిల్వలు ఉన్నాయని, వీటిని తీసుకెళ్లేందుకు ఎవరైనా వస్తే ఇస్తామని బొబ్బిలి ఆర్డీఓ జేవీఎస్ఎస్ రామమోహనరావు తెలిపారు. – బొబ్బిలి -
వసివాడుతున్న బాల్యం!
పని ప్రదేశంలో బాలలుబాలలను పనిలో పెడితే... కఠిన చర్యలు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన బాధ్యత అందరిపై ఉంది. చిన్నారులను పనిలో పెట్టినా, వారితో పనులు చేయించినా చట్టారీత్యా నేరం. బాల కార్మికులు ఎక్కడ కనిపించినా 1098, 100, 112 టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్చేసి సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నాం. విజయనగరం జిల్లాలో అన్ని శాఖల వారీగా 2020–24 సంవత్సరాల మధ్య మొత్తం 576 పిల్లలను రక్షించాం. ఈ ఏడాది జూన్ 1తేదీ నుంచి ప్రారంభమైన ఆపరేషన్ ముస్కాన్ స్పెషల్ డ్రైవ్ జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతోంది. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, రద్దీ ఎక్కువగా ఉండే మార్కెట్లు, కూడళ్లు, ఇటుక బట్టీలు, మోకానిక్ షెడ్లు, వస్త్ర దుకాణాలు తదితర ప్రాంతాల్లో ఈ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. ప్రతి బుధవారం బాలకార్మికుల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తాం. ఈనెల 31 వరకు ఈ డ్రైవ్ కొనసాగుతుంది. చిన్నారులను పనులకు పంపిస్తే జరిగే అనర్థాలు, చట్టాలపై గ్రామాల్లోనూ అవగాహన కల్పిస్తున్నాం. ఎస్డీవీ ప్రసాదరావు, జిల్లా కార్మికశాఖ ఉప కమిషనర్ ● పనుల్లో నలిగిపోతున్న పిల్లలు ● నేడు ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవంవిజయనగరం గంటస్తంభం: చిన్న వయస్సులోనే పనులు చేస్తున్న బాల కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు కనీసం ప్రాఽథమిక విద్య కూడా పొందకుండానే కార్మికులుగా మారుతున్నారు. వారిలో పోషకార లోపం కారణంగా శారీరక ఎదుగుదల సరిగ్గా ఉండడం లేదు. అనేక మానసిక, శారీరక ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. యాజమాన్యాలు బాల కార్మికులతో ఎక్కువ పనిచేయిస్తూ, తక్కువ వేతనాలు ఇస్తున్నాయి. కొంతమంది బాలలు వారి సామర్థ్యానికి మించి పనులు చేయాల్సి వస్తోంది. ప్రమాణాలకు అనుగుణంగా లేని ప్రమాదకర పరిస్ధితుల్లో సైతం బాలలు పనిచేస్తున్నారు. బాలకార్మికులు భౌతిక, లైంగిక దాడులను ఎదుర్కోవాల్సి వస్తోందని అనేక నివేదికలు వివరిస్తున్నాయి. భవిష్యత్ అంధకారం.. బాల కార్మికులుగా కొనసాగిన వారు భవిష్యత్లో ఉ న్నతమైన జీవితాన్ని గడిపేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. వారికి సరైన విద్య లేకపోవడంతో ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. పోటీతత్వం నిండిన సమాజంలో అన్నిరకాలుగా వెననుకబడిపోతున్నారు. పెద్దవారయ్యాక సరైన ఉపాధి దొరకని కారణంగా పలువురు నేరాలకు పాల్పడుతున్నారు. ఏటా బాలకార్మిక వ్యతిరేక దినం ఏటా జూన్ 12న దాదాపు 100 దేశాల్లో బాల కార్మికుల వ్యతిరేక దినం నిర్వహిస్తారు. బాలకార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా అవగాహన తీసుకురావడానికి ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ సంయుకత ఆధ్వర్యంలో ఈ దినాన్ని నిర్వహిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 80 శాతం పిల్లలు ఏదో ఒక పనిలో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరాలు, పట్టణల్లో పనులు ఎక్కువగా లభిస్తున్నందున చిన్నారుల వలసలు కొనసాగుతున్నాయి. అలా మారడానికి కారణం అధిక జనాభా, నిరక్షరాస్యత, పేదరికం వంటి కారణాలతో బడి ఈడు పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. -
అడ్డగోలు అవిశ్వాసం సంపూర్ణం
బొబ్బిలి: టీడీపీ నాయకులు పదవీ కాంక్షతో చేపట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఇప్పటికే వైఎస్సార్సీపీకి పజలు కట్టబెట్టిన మున్సిపల్ చైర్మన్ పదవిని కౌన్సిలర్లను ప్రలోభపెట్టి తమ వైపు తిప్పుకున్న టీడీపీ నాయకులు వైస్చైర్మన్ పదవిని కూడా అదే అవిశ్వాసంతో రాజకీయం చేసి తమ వైపు తిప్పుకున్నారు. దీంతో అడ్డగోలు అవిశ్వాసం పూర్తయినట్లయింది. బుధవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీఓ జేవీఎస్ఎస్ రామమోహన రావు ఆధ్వర్యంలో మున్సిపాలిటీలో అవిశ్వాసం తీర్మాన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో ముందుగా కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారని, ఇందుకు అనుకూలంగా చేతులెత్తాలని ఆర్డీఓ రామమోహన రావు కోరారు. దీంతో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే బేబీ నాయన చేతులెత్తడంతో మూడవ వంతు కౌన్సిలర్లు (22మంది) చేతులెత్తారు. వారితో పాటు వైఎస్సార్సీపీకి చెందిన రెండో వైస్ చైర్మన్ చెలికాని మురళీకృష్ణ కూడా చేతులెత్తడంతో సంఖ్యాపరంగా సరిపోవడంతో అవిశ్వాస తీర్మానం నెగ్గిందని ఆర్డీఓ ధ్రువీకరించారు. అనంతరం వారితో సంతకాలు చేయించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తామని చెప్పారు. కాగా ఈ అవిశ్వాస తీర్మానానికి వైఎస్సార్సీపీకి చెందిన కౌన్సిలర్లు ఎవరూ హాజరు కాలేదు. వారంతా వైఎస్సార్సీపీ కార్యాలయంలోనే ఉండిపోయారు. -
నిజజీవితంలో స్మార్ట్ స్కిల్స్ అవసరం
● జేఎన్టీయూ జీవీ ఇన్చార్జి వీసీ డి.రాజ్యలక్ష్మివిజయనగరం అర్బన్: ఉద్యోగ, ఉపాధి పనిలోనే కాకుండా నిజ జీవితంలో కూడా స్మార్ట్ స్కిల్స్ అవసరమని జేఎన్టీయూ జీవీ ఇన్చార్జి వీసీ డి.రాజ్యలక్ష్మి అన్నారు. జేఎన్టీయూ గురజాడ విజయనగరం (జీవీ)లో ‘స్మార్ట్ స్కిల్స్ ఫర్ ఏ సెక్యూర్ ఫ్యూచర్’ అనే అంశంపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో బుధవారం నిర్వహించిన వర్క్షాప్ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి చెందేందుకు వయస్సుతో సంబంధం లేదన్నారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.జయసుమ మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి సాఫ్ట్స్కిల్స్పై నైపుణ్యం పెంచుకోవాలన్నారు. ఈసీఈ ఫ్యాకల్టీ కో ఆర్డినేటర్ డాక్టర్ ఎం.హేమ పర్యవేక్షణలో వర్క్షాప్ రి సోర్స్ పర్సన్స్గా ఎస్బీఐఎల్డీ చీఫ్ మేనేజర్ (ఫ్యాకల్టీ) సురేష్ కుమార్, చార్టర్డ్ అకౌంటెంట్ వి.అభినాష్, డాక్టర్ కె.శ్రీకాంత్ వ్యవహరించారు. కార్యక్రమంలో ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డి.రాజేశ్వరరావు, ఎస్బీఐ అధికారులు, ఎం.సురేష్ బాబు, ఎ.శ్రీనివాసరావు, సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మెట్టవలసలో డీఎంఓ పర్యటన
రామభద్రపురం: మండలంలోని జన్నివలస పంచాయతీ పరిధి మెట్టవలస గిరిజన గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థికి కుడుమూరు మేఘన(14) ఈనెల 9వ తేదీ రాత్రి విషజ్వరంతో మృతిచెందిన సంఘటన తెలిసిందే. అయితే ఈ విషయాన్ని విషజ్వరంతో గిరిజన విద్యార్ధిని మృతి శీర్షికన ఈ నెల 11న సాక్షి వార్త ప్రచురించింది. ఈ వార్తకు స్పందించిన డీఎండ్హెచ్వో మెట్ట్వలస గ్రామాన్ని సందర్శించి మేఘన మృతికి గల కారణాలతో పాటు అక్కడ వైద్యశిబిరం నిర్వహించాలని జిల్లా మలేరియా అధికారిణి వై.మణిని ఆదేశించారు. దీంతో ఆమె బుధవారం మెట్టవలస గిరి జన గ్రామాన్ని సందర్శించి మృతిచెందిన గిరిజన విద్యార్థిని తల్లిదండ్రులు సూర్యనారాయణ,సంధ్యలను పరామర్శించారు.అలాగే మేఘన ఎలా మృతిచెందింది? మృతికి గల కారణాలేంటి? ఎన్ని రోజులు జ్వరం వచ్చింది? వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే మృతురాలి కుటుంబసభ్యులతో పాటు వారి ఇంటి చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో ఒకరిద్దరికి వైరల్ జ్వరాలు ఉండడంతో వారికి వైద్య పరీక్షలు చేశారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. గ్రామంలోని పరిసరాలను పరిశీలించారు.సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామప్రజలకు సూచించారు. కార్యక్రమంలో స్థానిక పీహెచ్సీ హెల్త్ సూపర్వైజర్ ఎన్.వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. -
సబ్జైల్ ఆకస్మిక తనిఖీ
విజయనగరం లీగల్: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని సబ్ జైలును జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఖైదీలకు చట్టాలపై అవగాహన కల్పించారు. నేర ప్రవృత్తిని విడనాడాలని సూచించారు. జైలులో ఉన్న ముద్దాయిలకు ఉచిత న్యాయ సహాయం అందించడమే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ముఖ్య కర్తవ్యమన్నారు. ఖైదీల పట్ల సిబ్బంది, తోటి ఖైదీలు ఎటువంటి వివక్ష చూపించరాదన్నారు. అనంతరం సబ్ జైల్లో కొనసాగుతున్న జైల్ లీగల్ ఎయిడ్ క్లినిక్లను తనిఖీ చేశారు. పారా లీగల్ వలంటీర్ల విధులపై ఆరా తీశారు. జైలులో అమలవుతున్న సౌకర్యాలు గురించి ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వంట గదిని, భోజనశాలను పరిశీలించారు. స్టోర్ రూమ్ను సందర్శించి వంట సరుకులను పప్పు దినుసులను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్ , సబ్ జైల్ సూపరింటెండెంట్ పాల్గొన్నారు. -
రహదారుల నిర్మాణానికి అటవీ అనుమతులు
పార్వతీపురం రూరల్: పార్వతీపురం మన్యం జిల్లాలో 11 రహదారుల నిర్మాణానికి అటవీ అనుమతులు మంజూరు చేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అధ్యక్షతన వర్చువల్ విధానంలో జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ కమిటీ సమావేశంలో కురుపాం మండలంలోని సందిగూడ నుంచి కాగుమాను గూడ వరకు 820 మీటర్ల రహదారి నిర్మాణానికి, కాగుమానుగూడ నుంచి సాలిదంగు వరకు 820 మీటర్ల రహదారి, పొద్దీస నుంచి సాలమానుగూడ వరకు 1320 మీటర్ల రహదారి, సాలమాను గూడ నుంచి చాపరాయిగూడ వరకు 1300 మీటర్ల రహదారి, దాముగూడ నుంచి చినబంటుజోల వరకు 815 మీటర్లు, మంటికొండ నుంచి దాముగూడ వరకు 733 మీటర్లు, జె పులుపుట్టి నుంచి వై పులిపుట్టి వరకు 1140 మీటర్లు, జాజరుగూడ నుంచి జె పులుపుట్టి వరకు 1120 మీటర్లు, తిత్తిరి నుంచి దొమ్మిడి వరకు 1208 మీటర్లు, దొమ్మిడి నుంచి గాలిమానుగూడ వరకు 1034 మీటర్లు, తిత్తిరి నుంచి గునుగూడ వరకు 1197 మీటర్ల రహదారి నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయి. ఈ రహదారులు గిరిజన ఆవాసాలను బయట ప్రపంచంతో అనుసంధానం చేసేందుకు అత్యావశ్యమని కమిటీ భావించింది. త్వరగా రహదారుల నిర్మాణం పూర్తిచేసి గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, సబ్కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, పాలకొండ సబ్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి, జిల్లా అటవీ అధికారి జీఏపీ ప్రసూన తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ శ్యామ్ప్రసాద్ -
ఆల్ ది బెస్ట్
బొబ్బిలి: వ్యోమగామి శుభాంశు శుక్లా ఎటువంటి అవరోధాలు లేకుండా తన రోదసీ ప్రయాణాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని పట్టణ వాసులు ఆల్ ది బెస్ట్ చెప్పారు. బుధవారం రాత్రి కారుణ్య ఫౌండేషన్ సీఈఓ జేసీ రాజు ఆధ్వర్యంలో జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. దాదాపు 140 కోట్ల మంది భారతీయుల ప్రతినిధిగా నాలుగు దశాబ్దాల అనంతరం వినువీధిలో దేశ కీర్తిపతాకాన్ని ఎగురవేసేందుకు రోదసీ యానం చేస్తున్న భారత వాయుసేన అధికారి శుభాంశు శుక్లా దేశానికి గర్వకారణమని ప్రశంసించారు. స్థానిక ఐటీఐ ప్రిన్సిపాల్ శ్రీధర్, రమణారావు, శివకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
ఆండ్ర ఎస్సైకి ఎస్పీ ప్రశంసలు
విజయనగరం క్రైమ్: జిల్లాలోని ఆండ్ర పోలీస్ స్టేషన్ పరిధి బిరసాడవలన గ్రామసమీపంలోని గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఇద్దరి ప్రాణాలను ఆండ్ర ఎస్సై కె.సీతారామ్ కాపాడారు. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. అనంతరగిరి మండలం రొంపల్లి పంచాయతీ గూడెంకు చెందిన గెమ్మెల రాంబాబు, గెమ్మెల అప్పలస్వామిలు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే వారు డయల్ 100, 112 నంబర్కు సమాచారం ఇవ్వగా సకాలంలో ఎస్సై సీతారాం స్పందించి ఘటనా స్థలికి చేరుకుని, రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆ ఇద్దరిని 108 సిబ్బంది సహకారంతో అంబులెన్స్లో ముందుగా గజపతినగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, ప్రథమ చికిత్స అందించారు. అనంతరం వైద్యుల సూచనతో మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ఆ ఇద్దరు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం గాయపడిన ఇద్దరు విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనను స్పెషల్ బ్రాంచ్ ద్వారా తెలుసుకున్న ఎస్పీ వకుల్ జిందల్ ఆండ్ర ఎస్సై సీతారాంను అభినందించారు. -
చికెన్
బ్రాయిలర్ లైవ్ డెస్డ్ స్కిన్లెస్ శ్రీ107 శ్రీ184 శ్రీ19416 నుంచి కబడ్డీ టీమ్కు శిక్షణపాలకొండ: పార్వతీపురం మన్యం జిల్లా అండర్ 18న కబడ్డీ టీమ్కు శిక్షణ ఈ నెల 16 నుంచి ప్రారంభిస్తామని జిల్లా కబడ్డీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు పల్లా కొండలరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం కబడ్డీ ఆసోసియేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అండర్ 18 కబడ్డీ టీమ్ జాతీయస్థాయిలో పాల్గొనడానికి క్రీడాకారులకు శిక్షణ అందిస్తామన్నారు. ఈ నెల 28 నుంచి హరిద్వార్లో జరగనున్న జాతీయస్థాయి అండ్ 18 కబడ్డీ పోటీల్లో పాల్గొనదలచిన వారికి శిక్షణ అందిస్తామని, వారికి ఉచిత భోజనం, వసతి కల్పిస్తామని తెలిపారు. పూర్తి వివరాలకు ఫోన్ 9440529144 నంబర్ను సంప్రందించాలని సూచించారు. సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు కోడి సుదర్శనరావు, కార్యదర్శి వెన్నపు చంద్రశేఖర్, కోశాధికారి శనగల సీతారాం, సభ్యులు కాయల రమేష్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదంవేపాడ: మండలంలోని భర్తవానిపాలెంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో జరిగిన అగ్నిప్రమాదంలో దుకాణంలోని సామగ్రి అగ్నికి ఆహుతైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై బాధితుడు పోతల రామునాయుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మంగళవారం తెల్లవారు జామున తన షాపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అవడంతో ప్రింటర్తో పాటు నోట్బుక్స్, ఇతక సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. విద్యుత్ మీటర్ కాలిపోయిందని, ఫ్రిడ్జ్ పాక్షికంగా కాలిపోయిందని, సుమారు ఏభై వేలు రూపాయల ఆర్థిక నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు. ఆమె చూపు పదిలంచీపురుపల్లి: మరణానంతరం చూపు పదిలంగా ఉండాలంటే నేత్రదానం చేయాలి. అప్పుడే ఆ నేత్రాలు నిరంతరం సజీవంగా ఉంటాయి. అందులో భాగంగానే చీపురుపల్లి పట్టణానికి చెందిన అంధవరపు జగదాంబ చూపు కూడా నిరంతరం పదిలంగా ఉండనుంది. దీనికి ఆమె నేత్రాలను కుటుంబసభ్యులు దానం చేయడమే కారణం. పట్టణంలోని ఆంజనేయపురంలో నివాసం ఉంటున్న ఆంధవరపు జగదాంబ(57) బుధవారం ఉదయం మృతిచెందారు. దీంతో పట్టణానికి చెందిన మానవీయత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు అక్కడికి వెళ్లి నేత్రదానంపై కుటుంబసభ్యులకు అవగాహన కల్పించారు. దీంతో మృతురాలి భర్త అంధవరపు నర్సింగరావు తన భార్య నేత్రాలు దానం చేసేందుకు అంగీకరించగా విజయనగరం రెడ్క్రాస్ సొసైటీ టెక్నీషియన్ రమణ, సుధాకర్లు సంఘటనా స్థలానికి చేరుకుని మృతురాలి నుంచి కార్నియా సేకరించారు. సీతం అధ్యాపకుడికి గుర్తింపు● ఆన్లైన్ పరీక్షలో ప్రతిభ విజయనగరం అర్బన్: ఐఐటీ మద్రాస్ నిర్వహించిన నేషనల్ ప్రోగ్రాం ఆన్ టెక్నాలజీస్ ఎన్హేన్స్డ్ లెర్నింగ్ (ఎన్పీటీఈఎల్) జాతీయ స్థాయి ఆన్లైన్ పరీక్షలో ప్రతిభ చూపిందుకు విజయనగరం పట్టణంలోని సీతం ఇంజినీరింగ్ కళాశాల అధ్యాపకుడు మొగలి మధుబాబుకు ‘ఎన్పీఈఎల్ స్టార్ బిలీవర్’గా గుర్తింపు లభించింది. ఈ మేరకు బుధవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఆయన నాలుగు విభిన్న సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించారు. జూలైలో ఐఐటీ మద్రాస్లో జరగనున్న ప్రత్యేక ‘స్టార్ బిలీవర్స్’ వర్క్షాప్కు ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మధుబాబును కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీరామమూర్తి, వైస్ ప్రిన్సిపాల్ డార్టర్ దామోదరనాయుడు, ఇతర అధ్యాపకులు అభినందించారు. -
అండర్–14 క్రికెట్ పోటీల్లో ‘విఘ్నేష్’ సత్తా
● దూసుకుపోతున్న తెర్లాం యువకుడు ● ముంబైలో జరుగుతున్న టోర్నమెంట్ ● టోర్నమెంట్లో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ● రెండు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కై వసంతెర్లాం: ముంబైలో జరుగుతున్న అండర్–14 క్రికెట్ టోర్నమెంట్లో తెర్లాం మండలం ఎన్.బూర్జవలస గ్రామానికి చెందిన యువకుడు పైల విఘ్నేష్ రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ చేసి సత్తా చాటాడు. టోర్నమెంట్లో ఓ జట్టు తరుఫున విఘ్నష్ పాల్గొన్నాడు. ఈ పోటీల్లో రెండుసార్లు మేన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్, టోర్నమెంట్లో బెస్ట్ బ్యాట్స్మన్గా ఎంపికయ్యాడు. ఒక మ్యాచ్లో 91 బంతుల్లో 104 పరుగులు, మరో మ్యాచ్లో 62 బంతుల్లో 114 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ముంబైలో పలు రాష్ట్రాలకు చెందిన క్రికెట్ అకాడమీలు నిర్వహించే టోర్నమెంట్లో విఘ్నేష్ ఈ ఘనతను సాధించాడు. అంతర్రాష్ట్ర క్రికెట్ పోటీల్లో రాణిస్తున్న విఘ్నేష్ను మండలానికి చెందిన పలువురు అభినందించారు. విఘ్నేష్ తండ్రి పైల గణపతి ఎన్.బూర్జవలస పంచాయతీ సర్పంచ్ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. -
ఆర్టీసీ ఉద్యోగులలో ఆందోళన తొలగించాలి
● నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ డిమాండ్ పార్వతీపురం రూరల్: జిల్లాలో ఉన్న పార్వతీపురం, పాలకొండ, సాలూరు ఆర్టీసీ డిపోల సమస్యలపై ఏపీపీటీడీ, డీపీటీఓలకు అనేక మార్లు మెమొరాండాల ద్వారా సమస్యల పరిష్కారానికి తెలియజేసినప్పటికీ ఇంతవరకు సమస్యలు పరిష్కారం కాలేదు. పైగా మరిన్ని సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగుల్లో ఆందోళన, అభద్రత తొలగించి జిల్లాలో పారిశ్రామిక శాంతి నెలకొల్పాలి. ఈ మేరకు బుధవారం నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నాయకులు కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లాలో సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను, గతంలో యాజమాన్యంతో జరిగిన చర్చల్లో అంగీకరించారు. అయినప్పటికీ అమలు చేయని అంశాలపై జోనల్ కౌన్సిల్లో సుదీర్ఘ చర్చ జరిపి సామరస్య పూర్వకంగా చేసే ఉద్యమాలకు యాజమాన్యం కనీసం స్పందించడం లేదు. ఈ పరిస్థితుల్లో ‘సమ్మె నోటీసు’ ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశామని ఈ నెల 25 తరువాత ఎప్పుడైనా జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు సమ్మెకు సిద్ధం అవుతారని పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టర్ చొరవ తీసుకుని సిబ్బంది సమస్యలు సత్వరమే పరిష్కరించాలని ఆర్టీసీ జిల్లా, డిపో అధికారులను ఆదేశించి సమ్మె జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. కలెక్టర్కు 30 సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేసినట్లు తెలిపారు. సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు సిద్ధం విజయనగరం అర్బన్: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై పలుమార్లు ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని, 15 రోజుల్లో పరిష్కరించకపోతే సమ్మె చేస్తామని ఆర్టీసీ ఎన్ఎంయూ జోనల్ కమిటీ ప్రకటించింది. ఈ మేరకు కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్కు బుధవారం ఆరు జిల్లాల సంఘం నాయకులు కలిసి తమ సమస్యలు వినిపించారు. అనంతరం వినతిపత్రాన్ని అందజేశారు. యూనియన్ నాయకులపై దౌర్జన్యం, అనారోగ్య సెలవులు పెట్టిన ఉద్యోగుల జీతాలు ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్ను కలిసిన వారిలో ఎన్ఎంయూ జిల్లా కార్యదర్శి పీజీ రాఫెల్, డిపో కమిటీ నాయకులు బి.రామారావు, ఎం.కృష్ణ, వై.విష్ణు, గురుమూర్తి, జి.ప్రభాకరరావు, ఎస్.కోట డిపో అధ్యక్ష, కార్యదర్శి ఎ.రాజయ్య, జి.వి.రమణ, తదితరులు ఉన్నారు. -
9వ తేదీ నుంచి డ్యూటీకి రావద్దన్నారు
ఈ నెల 8వ తేదీ వరకు పనిచేశాను. 8వ తేదీ సాయింత్రం ఫోన్ చేసి 9వ తేదీ నుంచి డ్యూటీకి రావద్దని చెప్పారు. 2022 నుంచి పనిచేస్తున్నాం. ఇప్పుడు ఒక్కసారిగా ఉద్యోగం నుంచి తొలగించడంతో ఏం చేయాలో తెలియడం లేదు. – దాలమ్మ, పారావెట్, గంట్యాడ ఉద్యోగం నుంచి తీసేశారు.. 2022 నుంచి సంచార పశు ఆరోగ్య సేవ వాహనంలో పనిచేస్తున్నాను. 8వ తేదీ సాయంత్రం ఫోన్ చేసి 9వ తేదీ నుంచి ఉద్యోగానికి రావద్దని చెప్పారు. ఉన్న పళంగా ఉద్యోగం తీసేస్తే ఏలా బతకాలి. ఇప్పడు మా కుటుంబాన్ని ఏ విధంగా పోషించాలి. చాలా అన్యాయం. – గణపతి, డ్రైవర్, బొబ్బిలి సంస్థ సూచనల మేరకే.. సంస్థ హెచ్ఆర్ విభాగం నుంచి ఎవరిని ఆపేయాలో వారి పేర్లు పంపిస్తున్నారు. దానికి అనుగుణంగా వారిని నిలిపివేస్తున్నాం. – గెంబలి గంగరాజు, ప్రొగ్రాం మేనేజర్, భవ్య హెల్త్ సర్వీసెస్ సంస్థ -
బడి చుట్టూ.. సమస్యల దడి
విజయనగరం వినాయక్ నగర్ జొన్నగుడ్డి నగర పాలక ఉన్నత పాఠశాలలో పేరుకుపోయిన మురుగునీరు● యూనిఫారం లేని ‘విద్యార్థి మిత్ర’ కిట్ ● కొన్ని స్కూళ్లకు ఇంకా చేరని సన్నబియ్యం ● నిలిచిపోయిన ‘మన బడి.. మన భవిష్యత్’ నిధులు ● అసంపూర్తిగా దర్శనమిస్తున్న పాఠశాల భవనాలు విజయనగరం అర్బన్: వేసవి సెలవులు ముగిశాయి. పాఠశాలలు గురువారం పునఃప్రారంభం కానున్నాయి. బడికి వెళ్లేందుకు విద్యార్థులు చకచకా ముస్తాబవుతున్నారు. వీరికి పలు సమస్యలతో స్వాగతం పలికేందుకు సర్కారు బడులు రెడీ అయ్యాయి. అధ్వాన పరిసరాలు, మూలకు చేరిన ఆర్వో ప్లాంట్లు, అసంపూర్తి భవన నిర్మాణాలే కనిపిస్తున్నాయి. నాడు–నేడు నిధులతో స్కూళ్ల ప్రారంభ సమయానికి ముస్తాబు కావాల్సిన అదనపు తరగతి గదుల నిర్మాణాలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. ‘మన బడి.. మన భవిష్యత్తు’ అభివృద్ధి పనులు నిధులులేక ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. జిల్లాలో శతశాతం పాఠశాలలకు గత ప్రభుత్వం సమకూర్చిన తాగునీటి వ్యవస్థలు నిర్వహణలోపంతో పలుచోట్ల మూలకు చేరాయి. వీటిని బాగుచేయాలని ఉపాధ్యాయులు మొత్తుకున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. ‘యూనిఫారం’ లేని విద్యార్థిమిత్ర కిట్లు.. జిల్లాలో వివిధ యాజమాన్యాల పరిధిలో చదువుతున్న 1,17,683 మంది విద్యార్థులకు పాఠశాలల పునఃప్రారంభం రోజున పంపిణీ చేయాల్సిన విద్యార్థి మిత్ర కిట్ (విద్యాకానుక)లలో కొన్ని మాత్రమే వచ్చాయి. యూనిఫాంలు పూర్తిగా రాలేదు. బెల్ట్లు, నోట్ పుస్తకాలు మినహా మిగిలినవన్నీ అరకొరగా వచ్చాయి. దీంతో తొలిరోజున కొందరికే విద్యార్థిమిత్ర కిట్లు అందే పరిస్థితి. కొన్ని స్కూళ్లకే సన్నబియ్యం స్కూళ్ల ప్రారంభం నుంచే మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం అందిస్తామన్నారు. జిల్లాలో వివిధ యాజమాన్యాలకు చెందిన 2,243 స్కూళ్లలో ఇంకా 20 శాతం స్కూళ్లకు సన్నబియ్యం చేరలేదు. జిల్లాలో నెలకు అవసరమైన 9,856 బస్తా (25 కేజీల)ల్లో సుమారు వెయ్యిబస్తాలు రావాల్సి ఉంది. నిలిచిన పనులు రెండో విడత నాడు–నేడు కింద గత ప్రభుత్వం చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం, రన్నింగ్ వాటర్ సదుపాయంలో మరుగుదొడ్ల నిర్మాణ పనులు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లతో విద్యుదీకరణ, విద్యార్థులు, సిబ్బంది కోసం ఫర్నిచర్, పాఠశాలలకు పెయింటింగ్, స్కూళ్లకు పెద్ద, చిన్న మరమ్మతులు, ఆకుపచ్చ సుద్ద బోర్డులు, ఇంగ్లిష్ ల్యాబ్స్, పాఠశాలల్లో కాంపౌండ్ వాల్స్, వంటగది నిర్మాణాలు వంటివి తలపెట్టింది. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఏడాదిగా పనులు నిలిచిపోయాయి. -
నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలకు డిమాండ్
● వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రేపు ర్యాలీ విజయనగరం: వైఎస్సార్ సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావుల సూచనలతో ఈ నెల 13న నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహిస్తామని వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అల్లు అవినాష్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు కరుమజ్జి సాయికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు స్థానిక పోలీస్ బ్యారెక్స్ కూడలి నుంచి నెహ్రూ యువకేంద్రం, జ్యోతిరావు పూలే విగ్రహం మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు, చంద్రబాబునాయుడు హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతిని వెంటనే ఇచ్చేలా ప్రభుత్వానికి సూచించాలని కోరుతూ కలెక్టర్కు వినతిపత్రం అందజేస్తామన్నారు. కార్యక్రమానికి విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు. అర్ధరాత్రి వరకు ఎస్జీటీల బదిలీ కౌన్సెలింగ్ ● తొలిరోజు 500 మందికి బదిలీ విజయనగరం అర్బన్: జిల్లాలో బుధవారం ప్రారంభమైన సెకెండరీ గ్రేడ్ టీచర్ కౌన్సెలింగ్ ప్రక్రియ అర్ధరాత్రి వరకు సాగింది. తొలుత ఉదయం 400 మంది, మధ్యాహ్నం 400 మంది చొప్పున మొత్తం 800 మందికి నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ షెడ్యూల్ ఖరారు చేసింది. ఆ మేరకు ఉపాధ్యాయులకు మెసేజ్ ఇవ్వడంతో వారంతా హజరయ్యారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన కౌన్సెలింగ్ ప్రక్రియలో స్పౌజ్ కేటగిరీలోని ఉపాధ్యాయులకు ప్లేస్ల కేటాయింపులో జాప్యం జరిగింది. మధ్యాహ్నం 2 గంటలకు కేవలం 250 మందికి మాత్రమే కౌన్సెలింగ్ పూర్తయింది. ఈ నేపథ్యంలో ముందుగా నిర్ణయించిన 800 మందికి కౌన్సెలింగ్ నిర్వహణ సాధ్యం కాదని, కేవలం 500 మందికే నిర్వహిస్తామని డీఈఓ యూ.మాణిక్యంనాయుడు ప్రకటించారు. గురువారం సీరియల్ నంబర్ 501 నుంచి నిర్వహిస్తామని తెలిపారు. దీంతో 800 మందిలో మిగిలిన టీచర్లంతా వెనుతిరిగారు. బదిలీ మాన్యువల్ కౌన్సెలింగ్ హాల్లోకి ఉపాధ్యాయ సంఘాలకు అనుమతి నిరాకరించడాన్ని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక సభ్యులు వ్యతిరేకించారు. సందేహాలు వస్తే నివృతిచేసేందుకు సంఘాల సభ్యులు అందుబాటులో ఉండాలంటూ విద్యాశాఖ అధికారులకు వినతి పత్రాలు అందజేసినా పట్టించుకోలేదు. -
● ఉన్నవారిని తీసేసి.. కొత్తవారికి పోస్టింగ్
కూటమి నాయకులు తమ కార్యకర్తలకు ఉపాధి స్థావరాలుగా ప్రభుత్వసేవలను మార్చేశారు. తాత్కాలిక ప్రాతిపదికన ఏళ్ల నుంచి పని చేస్తున్న వారిని తొలగించి, ఆ స్థానంలో తమవారిని నియమించుకునేలా అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. అందులో భాగంగానే పశు సంచార వైద్యసేవ ఉద్యోగులను తొలగించేందుకు కుట్ర పన్నుతున్నారు. రాష్ట్రంలో 2022లో సంచార పశు ఆరోగ్య సేవ పథకం ప్రారంభించింది. అప్పటి నుంచి జీవీకేఈఎంఆర్ఐ సంస్థ ఈ పథకాన్ని ప్రభుత్వ నిధులతో నిర్వహిస్తోంది. గత ఏప్రిల్ 30వ తేదీ వరకు ఆ సంస్థే నిర్వహించింది. ఈ ఏడాది మే 1 నుంచి భవ్య హెల్త్ సర్వీసెస్ సంస్థ నిర్వహించడానికి ప్రస్తుత ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. పాత సంస్థలో పనిచేసిన సిబ్బందిని కొనసాగించాల్సి ఉన్నప్పటికీ.. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కొంతమందిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకు సదరు సంస్థ పూనుకుంది. ● తొలుత సంచార పశువైద్యసేవలకు మంగళం ● రైతుల తిరుగుబాటుతో పునఃప్రారంభం ● నిర్వహణ బాధ్యతలు మరో సంస్థకు అప్పగింత ● గతంలో పనిచేసిన ఉద్యోగులను కాదని, కొత్తవారి నియామకానికి సన్నాహాలు ● ఇప్పటికే నలుగురు ఉద్యోగుల తొలగింపు ● తొలగించిన వారిలో ముగ్గురు మంత్రి నియోజకవర్గానికి చెందిన వారే.. ● ఆందోళనలో సంచార పశువైద్యసేవ సిబ్బంది విజయనగరం ఫోర్ట్: అధికారంలోకి వస్తే లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని, లేదంటే నిరుద్యోగ భృతిగా నెలకు రూ.3వేలు అందజేస్తామని ఎన్నికల ముందు కూటమి నేతలు హామీల వర్షం కురిపించారు. నిరుద్యోగులను నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షలాది ఉద్యోగాలు దేవుడెరుగు.. ఉన్న ఉద్యోగాలను ఊడపీకుతున్నారు. ఇప్పటికే ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్స్, కేజీబీవీలో పనిచేసే కుక్లు, వాచ్మన్లు, ఆయాలు, భోజన నిర్వాహకులు, వెలుగులో పనిచేసే వీఓఏలను తొలిగించారు. తాజాగా సంచార పశు ఆరోగ్య సేవ వాహనాల్లో పనిచేసే ఉద్యోగుల మెడపై తొలగింపుల కత్తి పెట్టారు. వారిని ఒక్కసారిగా తొలగిస్తే ఉద్యమం చేస్తారని విడతలు వారీగా తొలగిస్తున్నారు. ఇప్పటికే నలుగురిని విధులకు రావొద్దని చెప్పారు. ఆ నలుగురిలో మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గానికి చెందిన వారే ముగ్గురు కావడం గమనార్హం. ఉన్న ఫళంగా తీసేయడంతో చిరుద్యోగులు, వారి కుటుంబ సభ్యులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ వయసులో ఏ ఉద్యోగం వెతుక్కోవాలని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తొలగింపులపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ● అదే పనిగా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన వ్యవస్థలకు మంగళం పాడటం.. లేకుంటే అందులో పని చేస్తున్న ఉద్యోగులను తొలగించడమే కూటమి ప్రభుత్వం పనిగా పెట్టుకుంది. పశువులకు పాడి రైతుల ఇంటి వద్దే మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సంచార పశు ఆరోగ్య సేవలను ప్రవేశపెట్టిన విషయం విదితమే. ఈ వాహనంలో డాక్టర్, సహాయకులు, డ్రైవర్ చొప్పున ముగ్గురు సిబ్బంది ఉంటారు. పశువులకు సంబంధించిన అన్ని మందులూ ఉంటాయి. ఒక్కో నియోజకవర్గానికి రెండు చొప్పున సంచార వైద్య సేవల వాహనాలను నాటి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లాలో ఏడు నియోజకవర్గాలకు 13 వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. అనతికాలంలోనే ప్రతి రైతు ముంగిట ఈ సేవలు గుర్తింపు పొందాయి. సంచార వాహన నిర్వహణను ఏజెన్సీకి అప్పగించగా... కూటమి ప్రభుత్వం వచ్చాక, ఈ సేవలను తగ్గిస్తూ వస్తోంది. కొద్ది రోజుల కిందటి వరకూ వైద్యసేవలను నిలిపివేసింది. ఇప్పుడు మరలా ప్రారంభించినా.. అందులో పని చేస్తున్న ఉద్యోగుల మెడపై కత్తి వేలాడదీస్తోంది. సేవలూ.. దినదిన గండమే! ఏడాది క్రితం వరకు పశు సంచార వైద్యసేవలు సక్రమంగానే పాడిరైతులకు అందేవి. కూటమి ప్రభుత్వం వచ్చింది మొదలు.. ఈ సేవలకు గ్రహణం పట్టుకుంది. గత ప్రభుత్వం ఫేజ్ 1, ఫేజ్ 2 కింద వాహన సేవలను ప్రారంభించింది. ఫిబ్రవరి 15 నుంచి ఫేజ్ 1 వాహనాల సేవలను ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేసింది. తర్వాత కొన్నాళ్లకు ఫేజ్ 2 సేవలనూ నిలుపు చేశారు. మళ్లీ నిర్వహణ సంస్థను మార్పు చేసి మే ఒకటో తేదీ నుంచి పునఃప్రారంభించారు. వైద్యసేవలు ఎప్పుడు ఉంటాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. గతంలో ఫోన్ చేస్తే 20 నిమిషాల్లోపు వాహనం రావడంతో మెరుగైన వైద్య సేవలు సాధ్యమయ్యేవి. కూటమి ప్రభుత్వ వైఖరితో ఈ సేవలకూ గ్రహణం పట్టుకుందని పాడిరైతులు వాపో తున్నారు.ఈ ఫొటోలో సంచార పశు ఆరోగ్య సేవ వాహనం వద్ద ఉన్న వ్యక్తిపేరు సాయి సతీష్. గజపతినగరం సంచార పశు ఆరోగ్యసేవ వాహనం డ్రైవర్గా 2022 డిసెంబర్ నుంచి విధులు నిర్వహిస్తున్నాడు. ఇతనిని బుధవారం నుంచి విధులకు రావద్దని కొత్తగా నిర్వహణ బాధ్యతలు స్వీకరించిన భవ్య హెల్త్ సర్వీసెస్ సంస్థ అధికారి ఫోన్ చేసి చెప్పారు. ఎందుకని ప్రశ్నిస్తే ఉన్నత అధికారులు నుంచి ఆదేశాలు వచ్చాయి. అందుకనేనని చెప్పారట. దీంతో ఆయన దిక్కు తోచని స్థితిలో పడ్డాడు. ఈ ఫొటోలో సంచార పశు ఆరోగ్య సేవ వాహనం వద్ద కనిపిస్తున్న ఉద్యోగి పేరు రెడ్డి నరేష్. ఇతను గంట్యాడ సంచార పశు ఆరోగ్య సేవ వాహనంలో 2022 మే నెల నుంచి డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈయనను కూడా బుధవారం నుంచి విధుల్లోకి రావద్దని చెప్పేశారు. వీరు ఇద్దరే కాదు. గంట్యాడ వాహనంలో పనిచేసే పారావెట్ను, బొబ్బిలి వాహనంలో పనిచేసే డ్రైవర్ను కూడా నిలిపివేశారు. -
ఐసీడీఎస్లో.. డబ్బులే మాట్లాడతాయ్!
ఐసీడీఎస్లో వేలంపాట మాదిరి జరిగిన బదిలీల తంతులో ఆర్జేడీ కార్యాలయం చుట్టూనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారికి లబ్ధి కలిగించేందుకు ఓ సీనియర్ సహాయకుడు చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. గతంలో విజయనగరం జిల్లాలోని ఓ ప్రాజెక్టు సీడీపీవో వేధింపులు భరించలేక.. పలువురు అంగన్వాడీ కార్యకర్తలు తమ వివరాలను గోప్యంగా ఉంచుతూ, విషయాన్ని లేఖ రూపంలో ఆర్జేడీ కార్యాలయానికి పంపారు. దీనిపై ఎటువంటి విచారణ కూడా చేపట్టకుండా సదరు ఉద్యోగితోపాటు.. మరో కీలకాధికారి ఆ ఫిర్యాదును కనుమరుగు చేసినట్లు సమాచారం. మరోవైపు అస్తవ్యస్తంగా చేపట్టిన బదిలీలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న పలువురు ఉద్యోగులు న్యాయస్థానం తలుపుతట్టేందుకు సిద్ధమవుతున్నారు. సాక్షి, పార్వతీపురం మన్యం: ఐసీడీఎస్లో బదిలీలు పెట్టిన చిచ్చు.. చల్లారేలా కనిపించడం లేదు. అక్రమంగా సాగిన ఈ ప్రక్రియ కొంతమందికి లబ్ధి కలిగిస్తే.. మరికొందరికి ఖేదాన్ని మిగిల్చింది. విశాఖ జోనల్ పరిధిలో ఆర్జేడీ కార్యాలయం నుంచి సాగిన పైసా వసూల్ బదిలీలు.. చివరికి న్యాయస్థానం మెట్లు ఎక్కే వరకూ సాగేలా ఉంది. ప్రభుత్వం వివిధ శాఖల్లో బదిలీలకు అవకాశం కల్పించిన విషయం విదితమే. ఈ నెల 9వ తేదీతో ఆ ప్రక్రియ ముగిసింది. విశాఖ జోనల్ పరిధిలోని విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఈ తంతు వివాదాస్పదంగా మారింది. మొత్తం ఆర్జేడీ కార్యాలయం నుంచి చక్రం తిప్పిన ఓ సీనియర్ సహాయకుడు.. ఉన్నతాధికారులకు భారీగా ముడుపులు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇష్టానుసారం, వేలంపాట మాదిరి చేపట్టిన బదిలీలే ఇందుకు సాక్ష్యంగా ఉన్నాయి. ● విజయనగరం జిల్లాలోని ఓ ప్రాజెక్టు సీడీపీవోను బదిలీ చేస్తూ సాయంత్రం 5.30కి ఉత్తర్వులు అందాయి. మరొకరికి ఆ స్థానంలో నియమించేశారు కూడా. అక్కడ నుంచి కదలడానికి ఇష్టపడని సదరు సీడీపీవో.. తనకున్న పలుకుబడితో కేవలం రెండు గంటల్లోనే ఉత్తర్వులు మార్పు చేసుకున్నారు. మరలా యథా స్థానంలో కొనసాగేందుకు సఫలీకృతులయ్యారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ఆ శాఖలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ● బదిలీలను ఇష్టానుసారం.. తమకు నచ్చిన విధంగా చేసి పడేశారు. రెండేళ్లు పూర్తి కాకపోయినా.. ‘రిక్వెస్’ పెట్టుకోకపోయినా స్థానచలనం కలిగించారు. ఓ ప్రాజెక్టు సూపర్వైజర్.. కనీసం విజ్ఞప్తి కూడా పెట్టుకోలేదు. ఆమెకు ‘రిక్వెస్ట్’ పెట్టుకున్నట్లుగా కారణం చూపుతూ పార్వతీపురం మన్యం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతానికి బదిలీ చేశారు. ● చీపురుపల్లి నియోజకవర్గం నుంచి గ్రేడ్–2 సూపర్వైజర్గా రెండేళ్ల కిందట ఉద్యోగోన్నతిపై ఒక సూపర్వైజర్ గజపతినగరం నియోజకవర్గంలోని ప్రాజెక్టుకు వెళ్లారు. వాస్తవానికి ఆమెకు బదిలీకి అవకాశం లేదు. తాజా బదిలీల్లో ఆమెను తన సొంత ప్రాంతమైన చీపురుపల్లి నియోజకవర్గానికే మరలా వేయడం గమనార్హం. ప్రస్తుతం పనిచేస్తున్న చోట రెండేళ్లయినా సర్వీసు పూర్తి కాని ఓ సూపర్వైజర్కు భోగాపురం నుంచి గంట్యాడ పోస్టింగ్ ఇచ్చారు. ● వితంతువులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కాస్త వెసులుబాటు ఇవ్వాల్సి ఉంది. ఈ శాఖలో వితంతువుల విషయంలో ఒక్కొక్కరికీ ఒక్కోలా వ్యవహరించారు. కేన్సర్తో బాధ పడుతున్న ఓ ప్రాజెక్టు సూపర్వైజర్.. చికిత్సకు వీలుగా ఉంటుందని, విశాఖపట్నంలో తనకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేసుకున్నారు. ఆమె విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోలేదు. ప్రస్తుతం ఉన్నచోటే ఉంచేశామని.. సంతోషించాలని ఆర్జేడీ కార్యాలయం నుంచి సమాధానం రావడం విశేషం. ఎవరికో లబ్ధి కలిగించాలని.. వేరెవరినో బలిచేస్తూ బదిలీల తంతు సాగింది. 50 ఏళ్లు దాటిన వారికి ఏజెన్సీలోని కొండ ప్రాంతాలకు వేశారు. ● పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం నుంచి ఓ సూపర్వైజర్ను విజయనగరం జిల్లాకు బదిలీ చేశారు. మన్యం జిల్లాలో ఆ స్థానంలోకి కొత్తగా వస్తున్న వారు విధుల్లో చేరితేనే.. ప్రస్తుతం ఉన్నవారిని రిలీవ్ చేయాలని కలెక్టర్ స్పష్టం చేసినట్లు సమాచారం. ఇదే సమయంలో విజయనగరం జిల్లాలో ప్రస్తుతం ఉన్న సూపర్వైజర్లు ఇంకా రిలీవ్ ఆర్డర్లు తీసుకోకుండానే సీడీపీవోలు అత్యుత్సాహం చూపినట్లు తెలుస్తోంది. తమకు కొంత సమయం ఇవ్వాలని కోరుతున్నా.. సంబంధిత సూపర్వైజర్లను రిలీవ్ చేస్తున్నట్లుగా వారి వ్యక్తిగత మెయిల్కు ఆర్డర్లు పంపేశారు. చక్రం తిప్పుతున్న ఆ వ్యక్తి ఎవరు? ఇష్టానుసారం ఉద్యోగుల బదిలీలు రెండు గంటల్లోనే ఒకరి ఉత్తర్వులు తారుమారు ఆర్జేడీ కార్యాలయం నుంచే మొత్తం తతంగం నడిపిస్తున్న ఆ వ్యక్తి ఎవరు? -
అవస్థల ‘యోగాంధ్ర’
శృంగవరపుకోట: ఎస్.కోట మండలం ముషిడిపల్లి గ్రామ సమీపంలోని సాయిదివ్యామృతం ఆశ్రమం వద్ద మంగళవారం నిర్వహించిన ఉపాధిహామీ వేతనదారులతో యోగాంధ్ర కార్యక్రమం వారిని అవస్థలకు గురిచేసింది. యోగాంధ్రకు రాకుంటే మస్తర్లు వేయ మని బెదిరించడంతో ఎస్.కోట, ఎల్.కోట, బొండపల్లి, గంట్యాడ తదితర మండలాల నుంచి అధిక సంఖ్యలో వేతనదారులు తరలివచ్చారు. యోగాసనాలు వేసేందుకు స్థలం కూడా చాలకపోవడంతో వాహనాల్లోనే ఉండిపోయారు. ఉదయం నుంచే గాలివాన కురవడంతో ఇళ్లకు చేరుకునేందుకు నానాపాట్లు పడ్డారు. ఉదయాన్నే కూలి పనికి వెళ్లి కష్టపడకపోతే పూటగడవని మాకెందుకు యోగాసనాలు అంటూ పలువురు వేతనదారులు నిట్టూర్చారు. వృద్ధులైతే విసుక్కున్నారు. యోగాసనాల వద్ద ఏర్పాటు చేసిన అల్పాహారం చాలామందికి అందకపోవడం ఆకలితో అలమటించారు. యోగా నిర్వాహకులు ఉదయం 7.15 నుంచి 7.45గంటల వరకు 30 నిమిషాల పాటు యోగాసనాలపై తర్ఫీదునిచ్చారు. యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ, మాజీ ఉపకులపతి ముత్యాలనాయుడు, ఆశ్రమ నిర్వాహకులు బాబాసాయి వివరించారు. కార్యక్రమంలో ఏపీ టూరిజం బోర్డు డైరెక్టర్ సుధారాజు, జేసీ సేతుమాధవన్, ఎంపీపీ సోమేశ్వరరావు, డీఆర్డీఏ పీడీ కళ్యాణ చక్రవర్తి, డ్వామా పీడీ శారదాదేవి, డీఎంహెచ్ఓ ఎస్.జీవనరాణి, డీటీఓ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. హోర్డింగ్లు కూలి ఇద్దరికి గాయాలు యోగాసన కార్యక్రమం పూర్తయ్యేసరికి గాలి వాన జోరందుకుంది. ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటుచేసిన హోర్డింగ్ కూలిపోవడంతో బొండపల్లి మండలం కనిమెరక గ్రామానికి చెందిన కొరువాడ దుర్గారావు తలకు, అదే గ్రామానికి చెందిన మన్యం లక్ష్మికి ముఖంపై గాయాలయ్యాయి. వీరిని 108లో ఎస్. కోట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దుర్గారావు తలకు నాలుగు కుట్లు పడ్డాయి. వైద్యసేవల వివరాలు తెలిపేందుకు ఆస్పత్రి సిబ్బంది విముఖత చూపడం, ఎవరికీ వైద్యసేవలు అందజేయలేదని చెప్పడం గమనార్హం. వర్షంలో తడిసిముద్దయిన వేతనదారులు హోర్డింగ్ కూలడంతో ఇద్దరు వేతనదారులకు గాయాలు -
పైడితల్లికి పుష్పార్చన
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం చదురుగుడి, వనంగుడిలలో పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునుంచి పంచామృ తాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్, నేతేటి ప్రశాంత్లు శాస్త్రోక్తంగా నిత్య పూజాదికాలు చేశారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయం వెనుక ఉన్న వేప,రావిచెట్ల వద్ద దీపారాధన చేశారు. ఆలయ ఇన్చార్జ్ ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్ కార్యక్రమాలను పర్యవేక్షించారు. హోంగార్డు కుటుంబానికి ’చేయూత’● రూ.3 లక్షల చెక్కు అందజేత విజయనగరం క్రైమ్: జిల్లా పోలీసుశాఖలో హెూంగార్డుగా పని చేసి, ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన బీవీ రమణమూర్తికి ‘చేయూత’ కింద రూ.3,23,050 చెక్కును ఎస్పీ వకుల్ జిందల్ డీపీఓలో మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసుశాఖలో పని చేస్తూ ప్రమాదవశాత్తు లేదా అనారోగ్యంతో మరణించినా లేదా ఉద్యోగ విరమణ చేసిన హోంగార్డు కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు హెూంగార్డ్స్ స్వచ్ఛందంగా ఒకరోజు డ్యూటీ అలవెన్సు మొత్తాన్ని పోగు చేసి, వారి కుటుంబాలకు చేయూతగా అందజేయడం అభినందనీయ మన్నారు. ఈ తరహా చర్యలు చేపట్టడం వల్ల పోలీసు ఉద్యోగుల్లో ఐకమత్యం పెరగడంతో పాటు, వారి కుటుంబాలకు అండగా ఉన్నామన్న భరోసా లభిస్తుందని ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. కార్యక్రమంలో హెూంగార్డ్స్ ఇన్చార్జ్ ఆర్ఐ ఆర్.రమేష్ కుమార్, ఆఫీసు సూపరింటెండెంట్ టి.రామకృష్ణ, పోలీసు కుటుంబసభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. విష జ్వరంతో గిరిజన విద్యార్థిని మృతిరామభద్రపురం: మండలంలోని జన్నివలస పంచాయతీ మెట్టవలస గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థిని పదవ తరగతి చదువుతున్న కుడుమూరు మేఘన(14) విషజ్వరంతో సోమవారం రాత్రి మృతిచెందింది. ఈ సంఘటనపై మృతురాలి తల్లి సంధ్య తెలిపిన వివరాల ప్రకారం..రెండు రోజులుగా ఆమెతో పాటు కుమారుడు మహేంద్ర విషజ్వరాలతో బాధపడుతున్నారు. గ్రామానికి వచ్చే ఆర్ఎంపీ డాక్టర్ వద్ద మందులు వాడుతున్నారు. ఇంతలో సోమవారం ఉదయానికి చిన్న కూతురు మేఘన(14)కు కూడా జ్వరం సోకింది. వెంటనే ఆర్ఎంపీని పిలిచి వైద్యపరీక్షలతో పాటు రక్త పరీక్షలు చేశారు. రక్తపరీక్షల్లో మలేరియాతో పాటు పచ్చకామెర్లు సోకినట్లు డాక్టర్ చెప్పగా మందులు కూడా వాడారు. సాయంత్రానికి కూడా తగ్గకపోవడంతో డాక్టర్ సూచన మేరకు సాలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు పరీక్షించి జ్వరం విషమించింది వెంటనే విజయనగరం తీసుకెళ్లాలని సూచించారు. దీంతో తండ్రి సన్యాసిరావు మేఘనను 108లో విజయనగరం ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మేఘన మృతదేహాన్ని సొంత గ్రామానికి తీసుకొచ్చాక చూసిన కుటుంబసభ్యులు అమ్మా వేసవి సెలవులకు వచ్చి తిరిగిరాని లోకానికి వెళ్లిపోయావా? అంటూ రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. జ్వరం వచ్చిన ఒక్కరోజులోనే మృతి చెందడమేంటని గ్రామస్తులంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. మేఘన కొటికిపెంట ఏకలవ్య పాఠశాలలో చదువుతోంది. ఆమె తమ్ముడు మహేంద్ర గొట్లాం ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతూ అక్కడే హాస్టల్లో ఉంటున్నాడు. మృతురాలి అక్క సాలూరులో నర్సు శిక్షణ తీసుకుంటోంది. -
వేధింపుల కేసులో ముద్దాయిలకు ఏడాది జైలు
● రూ.51వేల జరిమానా విజయనగరం క్రైమ్: విజయనగరం మహిళా పోలీస్ స్టేషన్లో 2018లో నమోదైన వరకట్న వేధింపుల కేసులో ముగ్గురు ముద్దాయిలకు ఏడాది జైలు, రూ.51వేల జరిమానా విధిస్తూ విజయనగరం స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి కుమారి పి.బుజ్జి తీర్పు వెల్ల డించినట్లు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఆర్.గోవిందరావు మంగళవారం చెప్పారు. కేసు వివరాల్లోకి వెళ్ళితే..విజయనగరానికి చెందిన ప్రవీణ గోగులకు తమిళనాడు రాష్ట్రంలోని పెరంబదూర్కు చెందిన పసుపులేటి జాషువాతో 2017లో పైళ్లెంది. వివాహ సమయంలో రూ.10 లక్షల కట్నం, మూడు తులాల బంగారు వస్తువులను కానుకగా కన్నవారు ఇచ్చారు. పైళ్లెన అనంతరం భర్త పసుపులేటి జాషువా, అతని తల్లిదండ్రులు భాస్కరరావు, సుజాతలు అదనంగా మరో రూ.5లక్షలు కట్నంగా తీసుకురావాలని శారీరకంగా, మానసికంగా వేధింపులకు పాల్పడేవారని 2018 లో ఆగస్టు 6 వ తేదీన అప్పటి దిశ మహిళా పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేయగా అప్పటి మహిళా ఎస్సై ఎ.వెంకటరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసి, నిందితులను అరెస్టు చేసి, కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. విచారణలో ఫిర్యాది భర్త పసుపులేటి జాషువా (ఎ1), మామ భాస్కరరావు (ఎ2) అత్త సుజాత (ఎ3) వరకట్న వేధింపులకు పాల్పడినట్లు రుజువు కావడంతో పై విధంగా స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి తీర్పు వెల్లడించారని డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో పోలీసుల తరఫున ఏపీపీ శాంతి గౌతమి వాదనలు వినిపించారు. అప్పటి ఎస్సై ఎ.వెంకటరావు దర్యాప్తు చేయగా, కోర్టు కానిస్టేబుల్ వై.పూర్ణ సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపర్చారని డీఎస్పీ ఆర్.గోవిందరావు తెలిపారు. -
కోవిడ్ పరీక్షలకు ఏర్పాట్లు చేయండి
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో కోవిడ్ వైరస్ వ్యాప్తి దృష్ట్యా అనుమానితుల శాంపిల్స్ను పరీక్షించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వైద్యాధికారులను ఆదేశించారు. ప్రస్తుతం కోవిడ్ శాంపిల్స్ను విశాఖపట్నం పంపించడం వల్ల నివేదిక రావడంలో జాప్యం జరుగుతోందన్నారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా ప్రజలు కోవిడ్ జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఎస్.కోట, గజపతినగరం, రాజాం, చీపురపల్లి ఏరియా ఆస్పత్రుల్లో పెండింగ్లో ఉన్న పనులను పూర్తిచేసి జూలై నెలఖారు నాటికి అప్పగించాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. బిల్లుల చెల్లింపులు పెంగింగ్ ఉన్నందున పనులు పూర్తి చేయలేకపోయామని కాంట్రాక్టర్లు తెలపగా.. నిధులు కోసం వైద్యశాఖ ముఖ్య కార్యదర్శికి డీఓ లేఖ రాయాలని డీసీహెచ్ఎస్ ఎన్.పి.పద్మశ్రీ రాణిను ఆదేశించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి, ఏపీఎంఎస్ఐడీసీ ఎస్.ఇ.విజయభాస్కర్, ఈఈ శ్రీనివాసమూర్తి, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ -
ఆమె మాటే వింటున్నారని..!
● ఏడాది తిరగకముందే తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్ల బదిలీ ● నెల్లిమర్ల టీడీపీ–జనసేన అంతర్గత పోరులో ఉద్యోగులకు తప్పని బదిలీలు పూసపాటిరేగ: రెవెన్యూ అధికారులందరూ ఆమె మాటే వింటున్నారు.. మనం చెబితే ఒక్కపనీ చేయడం లేదు.. ఇలా అయితే నెల్లిమర్ల నియోజకవర్గంలో టీడీపీ మనుగడ కష్టం.. అందరూ జనసేనలోనే చేరిపోతారు.. ఇప్పటికే పార్టీలోని ఓ వర్గాన్ని ఆమె లాక్కున్నారు... ఇక రాజకీయం చేయలేం.. అంటూ ఇటీవల కడపలో జరిగిన మహానాడులో నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట. అంతే.. వెంటనే ‘చినబాబు’ రంగంలోకి దిగారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల తహసీల్దార్లను బదిలీ చేయాలంటూ ఉన్నతాధికారులకు మౌఖిక ఆదేశాలివ్వడం, ఉద్యోగ బాధ్యతలు స్వీకరించి ఏడాది గడవకముందే తహసీల్దార్లకు స్థానచలనం తప్పలేదన్న చర్చ నియోజకవర్గంలో జోరందుకుంది. జనసేన, టీడీపీ పార్టీలు ఆదిపత్య పోరు ఉద్యోగులకు ఇబ్బందిగా మారింది. జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభీష్టం మేరకు ఏడాది కిందట తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, సీనియర్ అసిస్టెంట్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ల నియామకాలు జరిగాయన్నది టీడీపీ నాయకుల ఆరోపణ. అంతే.. ఏడాది తిరగక ముందే పూసపాటిరేగ, డెంకాడ , నెల్లిమర్ల, భోగాపురం మండలాల తహసీల్దార్లు, డిప్యూటీ తహసీర్లతో పాటు వివిధ హాదాల్లో ఉన్న రెవెన్యూ ఉద్యోగులను ఇటీవల బదిలీలు చేశారు. కొందరు కలెక్టర్ స్వయంగా బదిలీ చేశారని చెబుతున్నా ఇందులో నిజంలేదని మరికొందరి వాదన. ఏడాది పూర్తికాకుండా... ఎలాంటి ఒత్తిడి లేకుండా కలెక్టర్ అధికారులను ఎందుకు బదిలీ చేస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. నెల్లిమర్ల నియోజకవర్గంలో జనసేన, టీడీపీ నాయకుల మధ్య కొన్నాళ్లుగా ఆధిపత్యపోరు సాగుతోంది. పలు సార్లు సమావేశాల సాక్షిగానే ఒకరిపై ఒకరు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంతో ఎమ్మెల్యేకు మద్దతుగా అధికారులు ఉన్నారని, రెవెన్యూ పరమైన పనులు చేయడం లేదని, టీడీపీ బలహీనపడుతోందని టీడీపీ నాయకులు చినబాబు దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. ఆ కారణంతోనే ఉన్నతాధికారులకు చెప్పి నాలుగు మండలాల రెవెన్యూ అధికారులను ఒకేసారి బదిలీ చేసినట్టు భోగట్టా. పూసపాటిరేగ తహసీల్దార్ టి.గోవిందను కలెక్టర్రేట్ సి–సెక్షన్, డెంకాడ తహసీల్దార్ వి.పద్మావతిని వంగర మండలానికి, భోగాపురం తహసీల్దార్ సురేష్ పార్వతీపురం మన్యం, నెల్లిమర్ల తహసీల్దార్ పి.సుదర్శనరావును సంతకవిటి మండలాలకు బదిలీ చేశారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 19 మంది తహసీల్దార్లకు బదిలీ కాగా నెల్లిమర్ల నియోజకవర్గంలో నాలుగు మండలాల తహసీల్దార్లకు బదిలీ కావడం గమనార్హం. -
ఓ ఐసీడీఎస్ సూపర్వైజర్ విజయనగరం జిల్లాలోని గరివిడి ప్రాజెక్టులో బాధ్యతలు స్వీకరించి రెండేళ్లయ్యింది. వాస్తవంగా ఐదేళ్లు పూర్తయినా, బదిలీ చేయాలని దరఖాస్తు చేసినా బదిలీ ప్రక్రియలో పరిగణనలోకి తీసుకోవాలి. ఆమె ఎలాంటి అర్జీ పెట్టుకోకుండానే పార్వతీపురం మన్యం జి
బదిలీలకు అవకాశం లేకున్నా సరే.. ఏజెన్సీకి కొట్టేశారు! సూపర్వైజర్లకు స్థానచలనం ఉండాలంటే కచ్చితంగా పని చేసే చోట ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకోవాలి. లేకుంటే.. వారి విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకునైనా బదిలీ చేయవచ్చు. ఐసీడీఎస్లో అందుకు భిన్నంగా సాగింది. కనీసం రిక్వెస్ట్ పెట్టని వారిని ఎనిమిది మంది వరకూ బదిలీ చేశారు. సోమవారం అర్ధరాత్రి వేళ అపాయింట్మెంట్లు ఇచ్చారు. విజయనగరం జిల్లాలోని గరివిడి ప్రాజెక్టు నుంచి ఒక సూపర్వైజర్ను బదిలీ అర్జీ పెట్టుకోకుండానే పార్వతీపురం మన్యం జిల్లా భద్రగిరి ప్రాజెక్టుకు విసిరికొట్టేశారు. ఇదే మాదిరి విజయనగరం ప్రాజెక్టు నుంచి మరో సూపర్వైజర్కు పార్వతీపురం మన్యం జిల్లాలోని పాచిపెంట ప్రాజెక్టుకు బదిలీ చేశారు. చీపురుపల్లి నుంచి పెదబయలుకు.. గజపతినగరం నుంచి జి.మాడుగల, మరొకరికి హుకుంపేట వేశారు. ఇవన్నీ అధిక శాతం అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని ప్రాజెక్టులే. సీనియారిటీని పరిగణనలోకి తీసుకోలేదు. ఆదివారం కొంతమందిని నామమాత్రంగా పిలిచి, కొన్ని ఆప్షన్లు ఇచ్చి మమ అనిపించేశారు. రెండేళ్లు పూర్తి కాని గ్రేడ్–2 వారినీ ఏజెన్సీకి బదిలీ చేశారు. వీరిలో ఎవరినీ కౌన్సెలింగ్కు కూడా పిలవలేదు. ఉద్యోగ నియామక సమయంలో ఏజెన్సీ ప్రాంతం వేసినా వెళ్లిపోదుమని.. 50 ఏళ్లు దాటాక గిరిజన ప్రాంతాల్లో ఎలా పని చేయగలమని పలువురు వాపోతున్నారు. ఇదే సమయంలో కొంతమందిని ముందు ఏజెన్సీ ప్రాంతానికి వేసి.. తర్వాత మైదాన ప్రాంతానికి పంపారు. జాబితాలు మారడానికి కూడా డబ్బు ప్రభావం చూపిందని వినిపిస్తోంది. ఇందుకు విజయనగరంలోని ఓ ఉద్యోగితోపాటు.. ఆర్జేడీ కార్యాలయంలోని మరో ఉద్యోగి మధ్యవర్తిత్వం వహించినట్లు తెలిసింది. గతంలో బదిలీలు కలెక్టర్ చేతిలో ఉండేవి. దీన్ని వ్యతిరేకించి మరీ.. మరలా ఆర్జేడీ పరిధిలోకి ఆ శాఖ ఉద్యోగులు తెచ్చుకున్నారు. ఇటువంటి లాబీయింగ్ల కోసమే ఇలా చేసుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ శాఖ మంత్రి సొంత ప్రాంతంలోనే బదిలీలకు పైరవీలు జరగడం గమనార్హం. ఐసీడీఎస్లో నగదు బదిలీలు! సీడీపీఓలకు స్థానచలనంవిజయనగరం ఫోర్ట్: ఐసీడీఎస్లో పనిచేస్తున్న పలువురు సీడీపీఓలు, 50 మంది సూపర్వైజర్లకు బదిలీ అయింది. ఎస్.కోట ప్రాజెక్టు సీడీపీఓ ఉమకు రంపచోడవరం, భోగాపురం సీడీపీఓ ఎస్తేరు రాణికి అల్లూరి సీతారామరాజు జిల్లా, భోగాపురం ఏసీడీపీఓ బి.తవిటినాయుడుకు ఐసీడీఎస్ పీడీ ఆఫీస్ నోడల్ అధికారిగా, బాడంగి సీడీపీఓ రాజేశ్వరికి బలిజిపేటకు బదిలీ అయింది. సాక్షి, పార్వతీపురం మన్యం: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో బదిలీల ప్రక్రియ అత్యంత ‘నగదు’ పారదర్శకంగా చేపట్టారు. అర్హతే ప్రామాణికం అన్న పదాలను పూర్తిగా పక్కనపెట్టి.. డబ్బే పరమావధిగా లెక్క కట్టి నిర్వహించారు. కోరుకున్న వారికి.. కోరుకున్న చోటకు ‘ఆర్డర్స్’ ఇచ్చిపడేశారు. నిబంధనల ప్రకా రం.. అసలు బదిలీలకే అవకాశం లేనివారిని ఏకంగా ఏజెన్సీ ప్రాంతాలకు విసిరికొట్టేశారు. నిన్నటి వరకూ ధీమాగా ఉన్న అటువంటి వారంతా.. ఒక్కసారిగా తమ బదిలీ ఉత్తర్వులు చూసి కంగుతిన్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే.. కొంతమందిపై గత ప్రభుత్వ ముద్ర వేసి, పూర్తిగా ‘కూటమి’ టీమ్ ఉండాలన్న ఉద్దేశంతో మార్పు చేశామని విశాఖ ఆర్జేడీ కార్యాలయం నుంచి సమాధానం వస్తున్నట్లు తెలిసింది. ● ఉత్తరాంధ్ర జోనల్ పరిధి ప్రాతిపదికగా.. సాధారణ బదిలీల్లో భాగంగా ఐసీడీఎస్ ఉత్తరాంధ్ర జోనల్ పరిధి ప్రాతిపదికగా ప్రక్రియ చేపట్టారు. ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారికి కచ్చితంగా బదిలీ ఉండాలని ప్రభుత్వం నిర్దేశించగా.. ఐసీడీఎస్లో చిత్రవిచిత్రాలు జరిగాయి. ఫలానా చోటకు వెళ్లాలంటే.. ఇంతనీ ఒక రేటు కట్టేసి వసూలు చేసినట్టు సమాచారం. ఎప్పటి నుంచో స్థానచలనం కోసం ఎదురుచూస్తున్న సీడీపీవోలు, సూపర్వైజర్లు కాస్త పలుకుబడితోపాటు, అడిగినంత ఇచ్చుకోవడానికీ వెనుకాడలేదు. మొత్తం ప్రక్రియకు విశాఖ ఆర్జేడీ కార్యాలయంలో ఒక సీనియర్ సహాయకునితో పాటు, విజయనగరం కార్యాలయంలో మరో ఉద్యోగి కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరికి ఎక్కువ కాలం విజయనగరం జిల్లాలో పని చేసిన అనుభవం ఉండటం వల్ల తమకున్న పరిచయాలతో మధ్యవర్తిత్వం వహించారు. సీడీపీవోల్లో కాస్త పలుకుబడి ఉన్నవారు.. అధికార పార్టీ విధేయులు తాము కోరుకున్న స్థానాన్ని పదిలం చేసుకున్నారు. సూపర్వైజర్లు సైతం అధికార పార్టీ సిఫారసు లేఖలతో పాటు.. వెళ్లే పోస్టు ప్రాంతాన్ని బట్టి ఒక ‘రేటు’ ఇచ్చుకోవాల్సి వచ్చింది. విజయనగరం జిల్లాలోని ఓ పట్టణ ప్రాజెక్టులో పోస్టు కోసం ఒక సూపర్వైజర్ సుమారుగా రూ.1.50 లక్షల వరకు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. మిగిలిన మండలాల పరిధిలోని ప్రాజెక్టులకూ రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేసినట్లు సమాచారం. విజయనగరంతోపాటు.. భోగాపురం, జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ప్రాజెక్టుల కోసం బాగా డిమాండ్ ఏర్పడింది. డబ్బులు సమర్పిస్తే కోరుకున్న చోటకు.. మైదాన ప్రాంతం కావాలంటే.. భారీగా ముట్టజెప్పాల్సిందే నిబంధనలను పక్కనపెట్టి, కొందరిని గిరిజన ప్రాంతాలకు బదిలీ చేసిన వైనం ఆర్జేడీ కార్యాలయంలో చక్రం తిప్పిన ఓ ఉద్యోగి -
రైతన్నకు సేవలు దూరం
విజయనగరం ఫోర్ట్: దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా రైతు ముంగిటకే సేవలు అందించాలనే గొప్ప సంకల్పంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల(రైతు సేవా కేంద్రాలు)ను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టారు. విత్తు దగ్గర నుంచి పంట కొనుగోలు వరకు అన్ని సేవలు రైతు భరోసా కేంద్రాల ద్వారా అక్కడే అందించేవారు. దీంతో రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వంటివి కొనుగోలు చేయడానికి మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సిన దుస్థితి తప్పింది. రైతులే తమకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు పురుగు మందులు ఇండెంట్ పెట్టుకునే విధంగా ప్రతి రైతు భరోసా కేంద్రంలోనూ కియోస్క్లను ఏర్పాటు చేశారు. దీంతో రైతులకు వారి గ్రామాల్లోనే సేవలు అందడంతో ఎంతో సంతోషించేవారు. జగన్మోహన్ రెడ్డి పాలన చెరిపేసేలా చర్యలు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది. అన్ని సేవలు ఒకే చోట అందడంతో అన్నదాతలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పాలన ముద్రను చెరిపేసే విధంగా ప్రయత్నిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యలే ఈ విమర్శలకు ఊతమిచ్చే విధంగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు భరోసా కేంద్రాల పేరును రైతు సేవా కేంద్రాలుగా మార్చేసింది. ఇప్పడు ఏకంగా రేషనలైజేషన్ పేరుతో రైతు భరోసా కేంద్రాలను కుదించేస్తోంది. ఉన్న సిబ్బందిని కూడా సర్దుబాటు చేస్తోంది. ఒక వైపు ఖాళీ పోస్టులు భర్తీ కాకపోగా, ఉన్న పోస్టులను సర్దుబాటు చేయడంతో కర్షకులకు కష్టాలు రెట్టింపు కానున్నాయి. జిల్లాలో రైతు భరోసా కేంద్రాలు 396 జిల్లాలో 396 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. వాటిలో 10 అర్బన్ రైతు భరోసా కేంద్రాలు కాగా 386 గ్రామీణ ప్రాంత రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. వాటిలో 383 మంది సిబ్బంది ఉండేవారు. ప్రస్తుతం వారి సంఖ్యను 357కు తగ్గించేసింది. 26 మంది సిబ్బంది తగ్గిపోయారు. 242 మంది గ్రామ వ్యవసాయ సహాయకులకు గాను 223 మందికి తగ్గించేశారు. గ్రామ ఉద్యాన సహాయకులు 79మందికి గాను 72కు తగ్గించేశారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా అందే సేవలు రైతు భరోసా కేంద్రాల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్, సెరికల్చర్ అసిస్టెంట్, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్లు ఉండేవారు. రైతులకు రాయితీపై విత్తనాల పంపిణీ ఈక్రాప్ బుకింగ్కు రైతు డేటాను ఆప్లోడ్ చేయడం పంట సాగుదారుల హక్కు ధ్రువీకరణ పత్రం జారీ, విత్తన సేకరణ కార్యకలాపాలు పీఎం కిసాన్, వైఎస్సార్ రైతు భరోసా, సున్నా వడ్డీ వంటి పంట రుణాల కోసం డేటాను ఆప్లోడ్ చేయడం పొలంబడి,, సీడ్ విలేజ్ ప్రోగ్రాం, మినీకిట్ ట్రయల్ ఫ్లాట్లు, మొదలైన ఫ్లాగ్ షిప్ పోగ్రాంల నిర్వహణ పొలం బడి పద్ధతి ప్రదర్శనలు స్మార్ట్ టీవీ ద్వారా క్రాప్ నిపుణులతో సాంకేతిక స్టేషన్ల చిరునామా ప్రత్యక్ష ప్రసారం వివిధ పథకాల కింద లబ్ధిదారుల సామాజిక తనిఖీ డిజిటల్ లైబ్రరీ ద్వారా తెగుళ్లు, వ్యాధులపై అవగాహన కల్పించడం పశు ఆరోగ్య కార్డుల జారీ ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, జంతువుల ప్రథమ చికిత్స ఈక్రాప్ బుకింగ్ ద్వారా పశుగ్రాసం అవసరాన్ని లెక్కించడం వంటి కార్యక్రమాలు నిర్వహించేవారు. రేషనలైజేషన్ పేరుతో రైతు సేవా కేంద్రాల కుదింపు జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన సహాయకుల తగ్గింపురేషనలైజేషన్ పూర్తిరేషనలైజేషన్ పక్రియ పూర్తయింది. ఆ వివరాలను ఉన్నతా ధికారులకు పంపించాం. దానికి అనుగుణంగా సిబ్బందిని కేటాయించనున్నాం. వి.తారకరామారావు, జిల్లా వ్యవసాయ అధికారి -
చికెన్
బ్రాయిలర్ లైవ్ డెస్డ్ స్కిన్లెస్ శ్రీ107 శ్రీ184 శ్రీ194ఆటో బోల్తా పడి గిరిజన మహిళ మృతిపాచిపెంట: మండలంలోని పనుకువలస పంచాయతీ చీపురు వలస సమీపంలో మంగళవారం ఆటో బోల్తా పడడంతో జరిగిన ప్రమాదంలో ఓ గిరిజన మహిళ మృతి చెందింది. ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి, మండలంలోని చినచీపురువలస గ్రామానికి చెందిన కోట సోమమ్మ (64) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. మంగళవారం ఉదయం గ్రామానికి చెందిన కొంతమంది కూలీలతో కర్రివలస గ్రామంలో పత్తి చేను గొప్పు తవ్వకానికి ఆమె వెళ్లింది. వర్షం కారణంగా పని మధ్యలో ఆగిపోవడంతో, గ్రామస్తులతో కలిసి గ్రామానికి తిరిగి ఆటోలో వెళ్తుండగా చీపురువలస గ్రామ సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సోమమ్మకు తీవ్ర గాయాలు కాగా వెంటనే 108 సహాయంతో సాలూరు సీహెచ్సీకి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. సోమమ్మ భర్త పారయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకట సురేష్ తెలిపారు. గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యంవిజయనగరం క్రైమ్ : విజయనగరం రైల్వే పోలీస్స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఇందుకు సంబంధించి జీఆర్పీ ఎస్సై బాలాజీ రావు మంగళవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అలమండ కంటకాపల్లి రైల్వే స్టేషన్ల మధ్య సుమారు 30 ఏళ్ల వయసు కలిగిన ఓ మహిళ మృతదేహాన్ని రైల్వే పోలీసులు మంగళవారం కనుగొన్నారు. మృతురాలి శరీరంపై గ్రీన్ కలర్, గోల్డ్ కలర్ అంచులు గల చీర, నలుపు రంగు జాకెట్ కలిగి ఉన్నట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు. చామన ఛాయ రంగులో ఉండే ఆమె ఎడమ చేతి మోచేతిపై పచ్చబొట్టు ఉన్నట్లు ఎస్సై బాలాజీరావు చెప్పారు. మృతురాలి ఆచూకీ తెలిసిన వారు ఫోన్ 9490617089, 08912883218 నంబర్లకు తెలియజేయాలని కోరారు. మరో గుర్తు తెలియని వ్యక్తి..విజయనగరం క్రైమ్: జిల్లా కేంద్రంలోని లీలామహల్ రోడ్డు వద్ద మంగళశారం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. ఈ మేరకు వన్టౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం సుమారు 40 నుంచి యాభై ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తి లీలామహల్ రోడ్డులో గల బార్ వద్ద పడి ఉండడంతో స్థానికులు చూసి ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. వెంటనే హాస్పిటట్ సిబ్బంది తమకు సమాచారం ఇచ్చినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని మృతదేహాన్ని గుర్తు పట్టేవారు ఫోన్ 9121109419 నంబర్కు సమాచారం తెలియజేయాలని కోరారు. యువకుడి ఆత్మహత్య● ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన విజయనగరం క్రైమ్: దగ్గరి వారికి తెలిసిన వారి నుంచి అప్పు ఇప్పించడమే ఆ యువకుడి తప్పయింది. డబ్బులు తీసుకున్న తిరిగి చెల్లించకపోవడంతో అప్పు ఇచ్చిన వారి వేధింపులను తట్టుకోలేక కోరుకొండకు చెందిన 27 ఏళ్ల యువకుడు శ్రీనివాసరావు ఆత్మహత్యకు పాల్పడి కన్నవారికి కడుపుకోత మిగిల్చాడు. ఈ నేపథ్యంలో మృతుని స్నేహితులు, బంధువులు, కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం వెలుగు చూసిన ఈ ఘటనపై మృతుని కుటుంబసభ్యులు ఇటు జేసీకి, అటు ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మృతుడి అన్నయ్య హరీష్ మాట్లాడుతూ తన తమ్ముడు అలమండ సంతలో అనుమానాస్పద స్థితిలో పడి ఉండడంతో విజయనగరం ప్రభుత్వ సర్వజన హాస్పిటల్లో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందాడని చెప్పాడు. తమ్ముడి మృతదేహం వద్ద ఉన్న ఫోన్లో రికార్డ్ అయిన వాయిస్ల ద్వారా తెలుసుకున్న సమాచారం మేరకు నలుగురు వ్యక్తుల వేధింపుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పాడు. వెంటనే బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని ఏఎస్పీకి ఫిర్యాదు చేశామని, ఏఎస్పీ ఆదేశాలతో సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఎస్సైని కలవగా ఫిర్యాదు ఆధారంగా నిందితులను పిలిచి మాట్లాడతామని ఎస్సై చెప్పారని వివరించాడు. పురుగు మందు తాగి మరో యువకుడు..వంగర: మండల పరిధిలోని అరసాడ గ్రామానికి చెందిన కడుముల వెంకటేష్ (19) మనస్తాపంతో గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం..ఈ నెల 9న గడ్డిమందు తాగిన వెంకటేష్ను బంధువులు రాజాం సీహెచ్సీకి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్లో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. మృతుడి తండ్రి రెండేళ్ల క్రితం మృతిచెందగా తల్లి రమణమ్మ కూలిపనులు చేస్తోంది. ఏదైనా పని చేసుకోమంటూ కుమారుడికి హితవు చెప్పేది. దీంతో మనస్తాపం చెందిన వెంకటేష్ పురుగు మందు తాగేశాడు. ఈ ఘటనపై మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై షేక్శంకర్ తెలిపారు. -
విద్యతోనే ఉజ్వల భవిష్యత్
పార్వతీపురం: విద్యతోనే పిల్లలకు ఉజ్వల భవిష్యత్ సాధ్యమని పార్వతీపురం మన్యం జిల్లా రెండవ అదనపు జడ్జి ఎస్.దామోదర్రావు అన్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కోర్టు ఆవరణలో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ(నల్సా) ఆధ్వర్యంలో నిర్వహించిన లీగల్ సర్వీసెస్ చైల్డ్ ఫ్రెండ్లీ స్కీంలో భాగంగా మండల విద్యాశాఖాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ చదువుపట్ల విద్యార్థుల్లో ఆశక్తిని పెంచాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు. బడికి రాని పిల్లను గుర్తించి బడిలో చేర్పించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించేలా ఉపాధ్యాయులు చొరవ చూపాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, చదువుకు జాతి, లింగం, భాష, మతంతో సంబంధంలేకుండా పిల్లలును మానసికంగా, నైతికంగా, ఆధ్యాత్మికంగా, సామాజికంగా ఆరోగ్యకరమైన పరిస్థితులలో పెరిగేలా వ్యవస్థను రూపొందించాలని పేర్కొన్నారు. పాఠశాలలో మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందిస్తూ సక్రమంగా పౌష్టికాహారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో లోక్అదాలత్ సభ్యుడు టి.జోగారావు, ఏజీపీ బి.సత్యనారాయణ, న్యాయవాది ఎం.వెంకటరామణ, పార్వతీపురం, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, కొమరాడ మండలాల ఎంఈఓలు, తదితరులు పాల్గొన్నారు. జిల్లా రెండవ అదనపు జడ్జి ఎస్.దామోదర్రావు -
సైబర్ నేరాల ఛేదనకు దర్యాప్తు ముమ్మరం
విజయనగరం క్రైమ్: జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లలో నమోదైన సైబర్ కేసులను అదనపు ఎస్పీ పి.సౌమ్యలత జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం సమీక్షించారు.సైబర్ నేరాలను ఛేదించేందుకు దర్యాప్తును వేగవంతం చేయాలని, కేసుల మిస్టరీని ఛేదించి బాధితులకు న్యాయం చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. సైబర్ నేరాల ఛేదనకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాన్ని దర్యాప్తు అధికారులు మెరుగుపర్చుకోవాలని సూచించారు. సైబర్ నేరాల్లో బాధితులు ఏ తరహాలో మోసపోయింది? ఆయా కేసుల్లో ఇప్పటివరకు సంబంధిత దర్యాప్తు అధికారులు చేపట్టిన దర్యాప్తు, తీసుకున్న చర్యలను అధికారులను అడిగి అదనపు ఎస్పీ తెలుసుకున్నారు. సైబర్ నేరాలు జరిగిన వెంటనే బాధితులు సంప్రదించి, సకాలంలో 1930కు ఫిర్యాదు చేసే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. సైబర్ మోసానికి గురైన తరువాత బాధితుల నగదు ఎవరి బ్యాంకు ఖాతాకు బదిలీ జరిగింది? ఎక్కడ, ఎవరు ఆయా నగదును విత్ డ్రా చేశారన్న వివరాలను సాధ్యమైనంత వేగంగా రాబట్టాలన్నారు. అనంతరం, ఆయా బ్యాంకు ఖాతాల నుంచి నిందితులు నగదు విత్ డ్రా చేయకుండా ఫ్రీజ్ చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తదుపరి ఫ్రీజ్ అయిన నగదు కోర్టు అనుమతితో బాధితుల బ్యాంకు ఖాతాకు జమయ్యే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. మోసగాళ్ల ప్రలోభాలకు లొంగవద్దని, ఓటీపీలను ఎవరికీ షేర్ చేయకుండా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో సీఐలు బి.సుధాకర్, బి.శ్రీనివాసరావు, ఎస్.శ్రీనివాస్, టి.శ్రీనివాసరావు, బి.లక్ష్మణరావు, శంకరరావు, ఎల్.అప్పల నాయుడు, కె.నారాయణరావు, జి.రామకృష్ణ, కె.దుర్గా ప్రసాద్, షణ్ముఖరావు, ఎ.అశోక్ కుమార్, వి.నారాయణమూర్తి, ఎస్సైలు నజీమా బేగం, రమేష్ కుమార్, షేక్ శంకర్, కె.కిరణ్ కుమార్ నాయుడు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఏఎస్పీ సౌమ్యలత సమీక్ష -
అంతా డైవర్షన్ పాలిటిక్స్...
మహిళలకు భద్రత కల్పించాలంటూ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి నినదిస్తున్న మహిళలు విజయనగరం: కూటమి ప్రభుత్వంలో రోజుకో అఘాయిత్యం... గంటకో నేరం జరుగుతుండడం ఘోరం.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో సాగుతున్న పాలనలో మహిళలకు కనీసం రక్షణ లేకుండా పోయిందంటూ నినదించారు. శాంతియుతమైన విజయనగరం జిల్లాతో పాటు రాష్ట్ర వాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. మహిళలపై జరుగుతున్న దారుణాలకు నిరసనగా వైఎస్సార్సీపీ జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కేంద్రంలో మంగళవారం ఆందోళన చేశారు. పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గదుల సత్యలత ఆధ్వర్యంలో బాలాజీ కూడలి వరకు ర్యాలీ నిర్వహించి, అక్కడి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటూ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గదుల సత్యలత, పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి దుప్పాడ సునీత, కార్పొరేటర్ రేగాన రూపాదేవి, ఎంపీటీసీ సభ్యురాలు కెల్ల కృష్ణవేణిలు మాట్లాడారు. రాష్ట్రంలోని మహిళలకు గతేడాది జూన్ మొదటి వారం నుంచి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయన్నారు. మహిళా సంక్షేమాన్ని విస్మరించిన కూటమి ప్రభుత్వం భద్రత కల్పనలోనూ వైఫల్యం చెందిందన్నారు. శాంతి భద్రతల నిర్వహణలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూర్తిగా వైఫల్యం చెందారని ఆరోపించారు. గడిచిన ఏడాది కాలంలో సుమారు 1600కు పైగా కేసులు కేవలం మహిళల వేధింపులపై నమోదు కావడమే దీనికి నిదర్శనమన్నారు. హోంశాఖ మంత్రిగా ఓ మహిళ బాధ్యతలు నిర్వర్తిస్తున్నా.. మహిళలకు భద్రత కల్పనపై కనీసం ఆలోచన చేయకపోవడం దురదృష్టకరమన్నారు. బాధ్యత గల ప్రజాప్రతినిధులు, రక్షణ కల్పించాల్సిన వారే మహిళల పట్ల అసభ్యకరంగా వ్యవహరించడం దారుణమని పేర్కొన్నారు. అనంతపురంలో ఇంటర్మీడియట్ చదువుతున్న గిరిజన బాలికను అత్యంత దారుణంగా హత్య చేయటం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. ఈనెల 3న తమ కుమార్తె కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆరు రోజుల తరువాత మృతదేహాన్ని గుర్తించడం వారి పని తీరుకు అద్దంపడుతోందన్నారు. శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లెలో 9వ తరగతి విద్యార్థినిపై గత ఆరు నెలలుగా అత్యాచారం చేసిన వారు అధికార మదంతో తప్పించుకు తిరుగుతుంటే పట్టించుకునేవారే కరువయ్యారన్నారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పని చేస్తుందా...? ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. మహిళల రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. అప్పుడు మహిళా సంక్షేమమన్నారు.. ఇప్పుడు ముంచేస్తున్నారు2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికారమే పరమావధిగా మహిళా లోకానికి మాయమాటలు చెప్పి అధికారం దక్కించుకున్న కూటమి ప్రభుత్వం నేడు కనీస భద్రత కల్పించకపోవడం ప్రభుత్వం పనితీరును తేటతెల్లం చేస్తుందని వైఎస్సార్సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గదుల సత్యలత పేర్కొన్నారు. తల్లికివందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తదితర హమీలు ఇచ్చి ఏడాది గడుస్తున్నా ఒక్క హమీ నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళల రక్షణ కోసం దిశ వ్యవస్థను ప్రారంభించి న్యాయం చేస్తే నేటి కూటమి ప్రభుత్వం ఆ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని వాపోయారు. ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఎన్నికలకు ముందు రాష్ట్రంలో మహిళల భద్రతపై పెద్దపెద్ద మాటలు చెప్పి నేడు అదే మహిళలకు అన్యాయం జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువు శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం ఘోర వైఫల్యం రాష్ట్రంలో అమలవుతున్నది అంబేడ్కర్ రాజ్యాంగం కాదు.. రెడ్ బుక్ రాజ్యాంగం వైఎస్సార్సీపీ జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వినతి గతేడాది ఎన్నికలకు ముందు అమలుసాధ్యంకాని హమీలు గుప్పించి వాటిని అమలు చేయడంలో ఏడాది గడుస్తున్నా నిర్లక్ష్యం నటిస్తున్న ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపి ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ మూలన ఏం జరిగినా వైఎస్సార్సీపీ ముద్రవేసి పబ్బంగడుపుకుంటోందన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగా అమలుకావడం లేదని ఆరోపించారు. కేవలం కక్షపూరిత రాజకీయాలు చేస్తున్న కూటమి ప్రభుత్వం రెడ్బుక్ రాజ్యాంగాన్ని తప్ప.. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదన్నారు. సామాన్య మహిళల పట్లే కాకుండా ఉద్యోగాలు చేసుకుంటున్న వారి పట్ల కూడా వేధింపులకు పాల్పడుతుండడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆశపు సుజాత, పిన్నింటి కళావతి, ఆల్తి సత్యకుమారితో పాటు వైఎస్సార్సీపీ మహిళా విభాగం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఫలించని గురువుల నిరీక్షణ
● ‘మాన్యువల్’ కౌన్సెలింగ్కు తొలిరోజు సాంకేతిక ఆటంకాలు ● నేటికి వాయిదా విజయనగరం అర్బన్: గురువుల తొలిరోజు నిరీక్షణ ఫలించలేదు. పోరాడి సాధించుకున్న మాన్యువల్ కౌన్సెలింగ్ కోసం జిల్లా పరిషత్ సమావేశ మందిరం వద్ద మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వేచి చూశారు. చివరకు సాంకేతిక కారణాలతో కౌన్సెలింగ్ను వాయిదా వేస్తున్నట్టు డీఈఓ యు.మాణిక్యంనాయుడు ప్రకటించడంతో నిరాశతో వెనుదిరిగారు. ఉపాధ్యాయ సంఘాల ఉద్యమాలతో ఎస్జీటీల బదిలీల ప్రక్రియను మాన్యువల్ విధానంలో నిర్వహిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ యంత్రాంగం మంగళవారం మధ్యాహ్నం బదిలీ కౌన్సెలింగ్కు సిద్ధమైంది. సీరియల్లో ఉన్న తొలి 400 మంది ఉపాధ్యాయులకు సమచారం ఇవ్వడంతో వారంతా జెడ్పీ సమావేశ మందిరం వద్దకు చేరుకున్నారు. పాఠశాలవిద్య కమిషన్ నుంచి కౌన్సెలింగ్కు సంబంధించి రావాల్సిన లింక్ రాకపోవడంతో వాయిదా వేశారు. బుధవారం నిర్వహించే కౌన్సెలింగ్కు హాజరుకావాల్సిన ఉపాధ్యాయులకు సీరియల్ నంబర్ ప్రకారం సమాచారం పంపుతామని తెలిపారు. నిరసన.. ఉమ్మడి విజయనగరంలో నూతనంగా ఏర్పడిన క్లస్టర్ కేంద్రాల్లో పోస్టుల ఖాళీలను చూపించకపోవడంపై ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు నిరసన తెలిపారు. తొలుత డీఈఓను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. సంబంధిత ఖాళీలను ప్రస్తుతం చూపించాలన్న నిబంధనలు లేవని, బదిలీల ప్రక్రియ చివర్లో వాటిపై ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుంటారని డీఈఓ వివరించారు. దీనిని వ్యతిరేకిస్తూ కౌన్సెలింగ్ ప్రాంగణంలోనే ఉపాధ్యాయులు నిరసనకు దిగారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులకు గాయాలు మెంటాడ: సాలూరు నుంచి మెంటాడ వైపు గ్రీన్ఫీల్డ్ హైవే మీదుగా మంగళవారం రాత్రి బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు బిరసాడవలన వద్ద ప్రమాదానికి గురయ్యారు. బైక్ స్కిడ్ కావడంతో రోడ్డుపై బోల్తా కొట్టారు. ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. అపస్మారక స్థితికి చేరుకున్నారు. యువకులు ఇద్దరిదీ అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీ గూడెం గ్రామంగా పోలీసులు గుర్తించారు. వీరిని వైద్యచికిత్స కోసం గజపతినగరం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని ఎస్ఐ కె.సీతారాం పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మత్తు రహిత భారతదేశం మనందరి లక్ష్యం
విజయనగరం లీగల్: యువత మత్తు పదార్థాలకు బానిసవుతోందని దానివల్ల వారి భవిష్యత్తు, అలాగే దేశ భవిష్యత్తు దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతుందని విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత అన్నారు. ఈ మేరకు ఆమె ఆధ్వర్యంలో సోమవారం విజయనగరంలోని ఫూల్బాగ్లో ఉన్న నూతన జిల్లా కోర్టు కాన్ఫరెన్స్ హాల్లో న్యాయశాఖ సిబ్బందికి న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భగా ఆమె మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ మాదకద్రవ్యాలపై అవగాహనతో పాటు వారి క్షేమం అనే పథకాన్ని జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ ప్రారంభించిందని చెప్పారు. ఈ పథకానికి సంబంధించి న్యాయశాఖ ఉద్యోగులందరికీ అవగాహన కల్పించామని తెలిపారు. అనంతరం న్యాయశాఖ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉద్యోగులు మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఉండాలని మత్తు పదార్థాలకు బానిసలైన పక్షంలో సరిగ్గా విధులు నిర్వహించలేరన్నారు. విధి నిర్వహణలో ఎవరైనా ఉద్యోగులు ఆల్కహాల్ స్వీకరించినట్లు తెలిస్తే వారిపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణ ప్రసాద్, డాక్టర్ న్యూరో సైకియాట్రిస్ట్ నిమ్స్ కాలేజ్ ప్రొఫెసర్ విముక్తి సీడ్ సంస్థ కౌన్సిలర్ విజయనిర్మల తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత -
రాష్ట్రంలో ఆటవిక పాలన
సాక్షి, పార్వతీపురం మన్యం: కూటమి పాలనలో అరాచకాలు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని.. వాటిని కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. ఒక నిజాయితీపరుడైన జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయడం నీచమైన చర్యగా పేర్కొన్నారు. పార్వతీపురంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో సోమ వారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.ఆడబిడ్డలపై దాడులు కనిపించలేదా?ఒక చర్చావేదికలో సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు అడిగిన ప్రశ్నకు.. జర్నలిజం వృత్తిలో ఎంతో అనుభవం ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు సమాధానమిచ్చారని తెలిపారు. దానిని వైఎస్సార్సీపీ పైన.. జగన్, భారతమ్మల మీద ఆపా దించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆ వ్యాఖ్యలు సమర్థనీయం కాదని, వాటితో తమకు ఏం సంబంధమూ లేదని వైఎస్సార్సీపీ స్పష్టం చేసిందని.. జరిగిన పొరపాటుకు సదరు జర్నలిస్టులు కూడా క్షమాపణ చెప్పారని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలను కప్పిపుచ్చడానికే లోకేశ్ డైరెక్షన్లో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో గిరిజన ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య బాధాకరమన్నారు. తన బిడ్డ కనిపించలేదని గత నెల 3న ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల తర్వాత సమీపంలోనే పురుగులు పట్టి, ఆడబిడ్డ మృతదేహం కనిపించిందని.. బీరు సీసాతో దారుణంగా ఆమెను హత్య చేసినట్టు తెలుస్తోందని తెలిపారు. పోలీసుల నిర్లక్ష్యంతోనే చనిపో యిందని.. వారే సకాలంలో స్పందించి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని చెప్పారు. అదే అనంతపురంలో తొమ్మిదో తరగతి చదువుతున్న దళిత విద్యార్థినిపై 14 మంది టీడీపీ కార్యకర్తలు విచక్షణారహితంగా లైగింక దాడికి పాల్పడినా ఏ ఒక్కరూ స్పందించలేదన్నారు. నిందితులు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఆడబిడ్డలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి పోయిందన్నారు. పట్టపగలే వారికి రక్షణ కరవైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలన్నింటినీ డైవర్షన్ పాలిటిక్స్ ద్వారా మరుగునపర్చడమే కూటమి ప్రభుత్వ ఉద్దేశమన్నారు.నాడు విజయమ్మ, భారతమ్మల మీద వ్యాఖ్యలు చేయడం తప్పు కాదా?ఆత్మగౌరవం, మహిళల మనోభావాలంటూ మాట్లాడుతున్న టీడీపీ నాయకులకు.. నాడు విజయమ్మ, జగన్ సతీమణి భారతమ్మలపై నిందలు వేసి, దుర్భాషలాడటం తప్పు అనిపించలేదా? అని పుష్పశ్రీవాణి ప్రశ్నించారు. వారూ మహిళలే కదా, వారికి ఆత్మాభిమానం ఉండదా? వారికి ఇప్పుడు క్షమాపణ చెబుతారా? అని నిలదీశారు. ‘నాడు మాజీ మంత్రి సుచరితపై అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు.. రోజాపై టీడీపీ నాయకులు బండారు సత్యనారాయణ, చేబ్రోలు కిరణ్ తదితరులు ఎటువంటి వ్యాఖ్యలు చేశారో గుర్తు లేదా? మీ ఐ–టీడీపీలోనే నీచంగా, నిస్సిగ్గుగా వ్యాఖ్యలు చేశారు. ఐ–టీడీపీ చంద్రబాబు, లోకేశ్ల కోసం పని చేయడం నిజం కాదా? దానికి బాధ్యత వహిస్తూ వారిద్దరూ క్షమాపణ చెబుతారా?’ అని ఆమె ప్రశ్నించారు.పౌరుల రక్షణ కోసం పోలీసు శాఖ కాదా..పోలీసు శాఖ ఎవరి కోసం పని చేస్తోందని పుష్పశ్రీవాణి ప్రశ్నించారు. పౌరుల రక్షణ ఆ శాఖ బాధ్యత కాదా? అన్నారు. ‘రాష్ట్రంలో మహిళలు, చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు పెరుగుతున్నా ప్రభుత్వం నుంచి ఒక్క సమీక్ష అయినా చేశారా? అక్రమ కేసులు, అరెస్టులు.. రెడ్బుక్ అమలు.. ఇదే మీకు తెలిసిన పాలన. ప్రశ్నించిన ప్రతి ఒక్కరి మీదా కేసులు పెడతారు. రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తోంద’ని తెలిపారు. పోలీసు వ్యవస్థను రెడ్బుక్ రాజ్యాంగం అమలు కోసం కాకుండా.. ప్రజలు, పిల్లల రక్షణ కోసం ఉపయోగించాలని సూచించారు.జగన్ను తిట్టడానికే హోంమంత్రి పదవిశాంతిభద్రతల పరిరక్షణలో హోంమంత్రి అనిత పూర్తిగా విఫలమయ్యారని పుష్పశ్రీవాణి విమర్శించారు. జగన్ను, ఆయన కుటుంబాన్ని తిట్టడానికే ఆ పదవి ఇచ్చినట్లుందని ఎద్దేవా చేశారు. ‘సింహాచలం దుర్ఘటనను సమీక్షించింది కూటమి నాయకులు, కార్యక్రమాన్ని నిర్వహించింది వారే.. భక్తులు చనిపోయిన తర్వాత కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు. తర్వాత బాధిత కుటుంబాలను పరామర్శించలేద’ని అన్నారు. రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా లభ్యమవుతోందన్నారు. మారుమూల జియ్యమ్మవలస, కొమరాడ మండలంలో చిన్నపిల్లల వద్దే దొరుకుతోందని చెప్పారు. గంజాయి వల్లే అఘాయిత్యాలు పెరుగుతున్నాయని తెలిపారు. వంద రోజుల్లో ఈ మాదక ద్రవ్యాన్ని నిర్మూలిస్తామని చెప్పిన ప్రభుత్వ పెద్దలు.. వెయ్యి రోజులైనా ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. గంటకు సుమారు ముగ్గురిపైన.. రోజుకు కనీసం 70 మందిపైన అఘాయిత్యాలు జరుగుతున్నాయని.. ఇది ప్రభుత్వ బాధ్యత కాదా? అని నిలదీశారు. ప్రెస్మీట్లు, బూతులు మాట్లాడానికే హోం మంత్రి పరిమితమయ్యారన్నారు. ఆడపిల్లల మీద ఇన్ని దుర్ఘటనలు జరుగుతున్నా ఏ రోజైనా వారి ఇంటికి వెళ్లి పరామర్శించారా? అని ప్రశ్నించారు. కూటమి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని.. రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతారని పుష్పశ్రీవాణి అన్నారు.మహిళాభ్యున్నతికి పాటుపడిందే జగన్..మహిళాభ్యున్నతి అని గొప్పలు చెప్పుకొంటున్న కూటమి నాయకులు.. వారి కోసం ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను ఏం చేశారని పుష్పశ్రీవాణి ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి మహిళాభ్యున్నతి, సాధికారికత శ్రద్ధ, చిత్తశుద్ధి ఎక్కడ ఉందన్నారు. వెన్నుపోటు తప్ప ప్రజలకు మంచి చేద్దామన్న ఆలోచన వీరికి లేదన్నారు. ఆడబిడ్డలకు ఇస్తామన్న తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. మహిళాభ్యున్నతి జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమని చెప్పారు. దాదాపు 11 పథకాలు వారి కోసమే అమలు చేశారని గుర్తు చేశారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం, వలంటీర్లలో 55 శాతం, 13 మంది జిల్లా పరిషత్ అధ్యక్షుల్లో ఏడుగురు మహిళలే అని తెలిపారు. మహిళలకు ఇళ్ల పట్టాలిచ్చి, వారికి ఆర్థిక భరోసానిచ్చారని గుర్తు చేశారు. -
అంతా గందర గోళం
విజయనగరం అర్బన్: జిల్లాలోని పదోతరగతి, ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన 198 మంది విద్యార్థులకు ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో సోమవారం నిర్వహించిన షైనింగ్ స్టార్స్ పురస్కారాల ప్రదానం గందరగోళంగా సాగింది. పేరు ఒకరిని పిలిచి, మరొకరికి హోం మంత్రి వంగలపూడి అనిత చేతుల మీదుగా పురస్కార పత్రాలు అందజేయడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తికమకపడ్డారు. 198 మందిలో పదో తరగతికి చెందిన వారు 158 మంది, ఇంటర్మీడియట్కి చెందిన వారు 40 మంది ఉన్నారు. అవార్డులు అందుకున్న పదోతరగతి విద్యార్థుల్లో 93 మంది ప్రభుత్వ, 65 మంది ప్రైవేటు స్కూళ్లకు చెందిన వారు కాగా, ఇంటర్మీడియట్ విద్యార్థులు 40 మందిలో ప్రభుత్వ కళాశాలకు చెందిన వారు 11 మంది, ప్రైవేటు కళాశాలలకు చెందిన వారు 29 మంది ఉన్నారు. డీఈఓ యు.మాణిక్యంనాయుడు అధ్యక్షతన జరిగిన పురస్కార ప్రదానోత్సవంలో కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, ఎమ్మెల్యేలు అతిథిగజపతిరాజు, లోకం నాగమాధవి, డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ, డీవీఈఓ ఎస్.తవిటినాయుడు, సమగ్ర శిక్ష ఏపీసీ ఎ. రామారావు, డీఆర్డీఏ పీడీ కళ్యాణచక్రవర్తి, ఉపా ధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
జిల్లాలో మరో రెండు కోవిడ్ కేసులు
● మూడుకు చేరిన కోవిడ్ కేసుల సంఖ్య విజయనగరం ఫోర్ట్: జిల్లాలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. చాపకింద నీరులా వ్యాధి వ్యాప్తి చెందుతోంది. జిల్లాలో ఇప్పటికే ఒక కోవిడ్ కేసు నమోదు కాగా, తాజాగా మరో రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో కోవిడ్ కేసుల సంఖ్య మూడుకు చేరింది. బాడంగి మండలం పెదపల్లి గ్రామానికి ఓ వ్యక్తి, జామి మండలం రామభద్రపురానికి చెందిన ఓ వ్యక్తి కోవిడ్ లక్షణాలతో బాధపడుతూ ఈ నెల 6వ తేదీన ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వచ్చారు. ఆస్పత్రి సిబ్బంది వీరిద్దరి శాంపిల్ తీసి ఆర్టీపీసీఆర్ పరీక్ష కోసం విశాఖపట్నం కేజీహెచ్కు పంపించగా కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. కేసుల సంఖ్య పెరుగుతుండడంతో జిల్లా ప్రజల్లో భయం పెరుగుతోంది. పీఆర్, ఆర్డీలో బదిలీలు సాక్షి, పార్వతీపురం మన్యం: పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్ విభాగంలో భారీగా బదిలీలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. విజయనగరం జిల్లా పంచాయతీ అధికారి టి.వెంకటేశ్వర్లకు విశాఖపట్నంలోని డ్వామా కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా బదిలీ అయింది. ఆయన స్థానంలో డీవీ మల్లికార్జునరావును డీపీఓగా నియమించారు. పార్వతీపురం మన్యం జిల్లా గ్రామ పంచాయతీ అధికారి టి.కొండలరావును బదిలీ చేస్తూ.. తదుపరి పోస్టింగు కోసం ఆ శాఖ కమిషనర్కు రిపోర్ట్ చేయాల్సిందిగా పేర్కొన్నారు. ఆయన స్థానంలో జిల్లా గ్రామ పంచాయతీ అధికారిగా విశాఖ నుంచి డ్వామాలో ఫైనాన్స్ మేనేజర్ (డీడీవో) ఎస్.రవీంద్రను నియమించారు. విజయనగరం డివిజనల్ పంచాయతీ అధికారిగా ఆర్.శిరీషరాణిను నియమించారు. ఇప్పటి వరకూ ఆమె అనకాపల్లిలో పని చేస్తున్నారు. విజయనగరం డ్వామా పీడీ ఇ.సందీప్ను అనకాపల్లికి బదిలీ చేశారు. కదం తొక్కిన కార్మిక సంఘాలు ● కలెక్టరేట్ వద్ద రాస్తారోకో విజయనగరం గంటస్తంభం: కాంట్రాక్టు కార్మికుల అక్రమ తొలగింపులు, వేధింపులు ఆపాలి.. వెంటనే విధులోకి తీసుకోవాలి.. విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించడంతో పాటు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలంటూ కార్మిక సంఘాలు కదం తొ క్కాయి. విజయనగరం కలెక్టరేట్ వద్ద సోమ వారం రాస్తోరోకో నిర్వహించాయి. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్మి కె.సుబ్బరామమ్మ, ఏఐఎఫ్టీయూ నాయకుడు ఎం.అప్పలరాజు మాట్లాడుతూ ఎన్నో త్యాగాలు, పోరాటాలు, బలిదానం ఫలితంగా వచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసి దోపిడీదార్లకు కట్టబెట్టే ప్రయత్నం దుర్మార్గమన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగని వ్వమని ఓట్లు వేయించుకొని, అధికారంలోనికి వచ్చిన తర్వాత మాట్లాడకపోవడం వారి తీరుకు నిదర్మనమన్నారు. విశాఖ స్టీల్ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్ర ధాన కార్యదర్మి కె.సురేష్, టి.వి.రమణ, వి. లక్ష్మి, బి.రమణ, బి.సూర్యనారాయణ, బి.సుధారాణి, ఎం.రమణ, బి.రమణ, ముత్యాలు, పెంటరాజు, శ్రీను, రమణమ్మ పాల్గొన్నారు. -
నిధులు లేక నిలిచిన పల్లె ప్రగతి!
రామభద్రపురం: పల్లె ప్రగతికి నిధుల లేమి వెంటాడుతోంది. కనీసం పారిశుద్ధ్య పనులు, వీధిలైట్ల నిర్వహణకూ నిధులు లేని పరిస్థితి. జిల్లాలో 777 పంచాయతీలు ఉన్నాయి. వివిధ అభివృద్ధి పనులకు ఆధారమైన 15వ ఆర్థిక సంఘం రెండో విడత నిధులు సుమారు రూ.33 కోట్లు విడుదల కాలేదు. దీంతో పంచాయతీల అభివృద్ధి కుంటుపడింది. గ్రామాల్లో సీసీ రోడ్లు, కాలువల పనులు జరగడం లేదు. వీధులు సరైన రహదారులు లేక మట్టిరోడ్లపైనే గ్రామీణ ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. కేవలం ఇంటి పన్నులు సిబ్బంది జీతాలు, పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాల నిర్వహణకే సరిపోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పల్లెల అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం కనీస శ్రద్ధ చూపడంలేదని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. పంచాయతీల్లో నిధులు లేకపోవడంతో వీధుల్లోని డ్రైనేజీలు శిథిలమైనా మరమ్మతులు చేయలేకపోతున్నారు. కొత్తగా కాలువల నిర్మాణాలు జరగడం లేదు. వాడుక నీరు వీధుల్లోనే ప్రవహిస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. మురుగునీరు నిల్వ ఉండి దోమలకు నిలయాలుగా మారుతున్నాయి. ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. వీధి దీపాల నిర్వహణపై నిధుల కొరత ప్రభావం పడుతోంది. చాలా పల్లెలు చీకటిలోనే కాలం వెల్లదీస్తున్నాయి. త్వరలో విడుదల కానున్నాయి 15వ ఆర్థిక సంఘం నిధులు త్వరలో విడుదల కానున్నాయి. విడుదలైన వెంటనే పంచాయతీల ఖాతాలకు జమచేస్తాం. పారి శుద్ధ్య పనులు చేయాలని ఈఓపీర్డీలకు, కార్యదర్శులకు సూచించాం. మంచినీటి ట్యాంకులు ఎప్పటికప్పుడు శుద్ధిచేసేలా చర్యలు తీసుకుంటాం. – మోహనరావు, డీఎల్పీఓ మంజూరుకాని 15వ ఆర్థిక సంఘ రెండో విడత నిధులు రావాల్సిన నిధులు రూ.33 కోట్లు పారిశుద్ధ్య పనులు, వీధిలైట్ల నిర్వహణకూ నిధులులేని వైనం పల్లెలను విస్మరించారు కూటమి ప్రభుత్వంలో పాలకుల ప్రచార ఆర్భాటమే తప్ప ఆచరణ లేదు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవణ్కళ్యాణ్ పల్లెల అభివృద్ధి బాధ్యత నాది అన్నారు. పూర్తిగా విస్మరించారు. 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా విడుదల చేయలేని స్థితిలో ఉన్నారంటే ఆయన మాట సాగడం లేదని అర్ధమవుతుంది. ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయకపోవడం వల్ల గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతున్నాం. వర్షాకాలం ప్రారంభమైంది. సీజనల్ వ్యాధులు కట్టడికి కాలువల్లో పూడికలు, పారిశుద్ధ్యం పనులు చేయడానికి కూడా నిధులు లేవు. వీధి లైట్లు కొనుగోలుకూ పంచాయతీల్లో డబ్బులు లేని పరిస్థితి. – మజ్జి రాంబాబు, జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు, మిర్తివలస -
అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం
● జేసీ సేతు మాధవన్ ● పీజీఆర్ఎస్కు 153 వినతులువిజయనగరం అర్బన్: సమస్యలతో వచ్చి పీజీఆర్ఎస్లో అర్జీలు సమర్పించే అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా వారి సమస్యలను పరిష్కరించాలని అధికారులను జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినతులు రీ ఓపెన్ కాకుండా పరిష్కరించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. అర్జీల స్వీకరణ కార్యక్రమంలో ఆయనతో పాటు జెడ్పీ సీఈఓ బీవీ సత్యనారాయణ, డీపీఓ టి.వెంకటేశ్వర్రావు, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ బిశాంతి పాల్గొని వివిధ శాఖలకు సంబంధించి 153 వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎస్పీ గ్రీవెన్స్సెల్కు 41 ఫిర్యాదులు విజయనగరం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందల్ సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించి 41ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించి, వారి సమస్యలను శ్రద్ధగా విన్నారు. అనంతరం సంబంధిత పోలీస్ అధికారులతో ఫిర్యాదు దారుల ముందే వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి సమస్యలను వివరించారు. ఫిర్యాదుల పరిష్కారానికి చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని అధికారులను ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. పీజీఆర్ఎస్లో ఎస్పీ 41 ఫిర్యాదులను స్వీకరించగా వాటిలో భూతగాదాలకు సంబంధించి 13, కుటుంబ కలహాలకు సంబంధించి 9, మోసాలకు పాల్పడినట్లు 5, ఇతర అంశాలకు సంబంధించి 14 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సీఐలు ఏవీ లీలారావు, ఆర్వీఆక్కే చౌదరి, డీసీఆర్బీ సీఐ బి.సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ వృద్ధురాలి మృతి
రామభద్రపురం: మండలంలోని అప్పలరాజు పేట గ్రామానికి చెందిన వృద్ధురాలు బాడంగి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన బెవర సింహాచలం (65) ఆదివారం మధ్యాహ్నం కడుపునొప్పి తాళలేక గడ్డిమందు తాగేసింది. ఈ విషయం కుటుంబసభ్యులకు తెలియగా వెంటనే ప్రథమ చికిత్స నిమిత్తం బాడంగి సీహెచ్సీకి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రికి చికిత్స పొందుతూ మృతిచెందింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై వి.ప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విజన్ డాక్యుమెంట్ జిల్లా యూనిట్ ప్రారంభం
విజయనగరం అర్బన్: స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ జిల్లా యూనిట్ను రాష్ట్ర హోంశాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి వంగలపూడి అనిత కలెక్టరేట్లో సోమవారం ప్రారంభించారు. కలెక్టరేట్లోని జిల్లా ముఖ్యప్రణాళిక శాఖ కార్యాలయం వద్ద ఈ యూనిట్ను ఏర్పాటు చేశారు. దీనిని ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి అమరావతి నుంచి వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలోకలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్, జేసీ ఎస్.సేతు మాధవన్, డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ, సీపీఓ జి.బాలాజీ, జిల్లా అధికారులు భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2047 నాటికి సాధించాల్సి అభివృద్ధిని ఈ డాక్యుమెంట్లలో పొందుపరిచినట్లు చెప్పారు. అన్ని రంగాల్లో ముందడుగు వేయడానికి ఇలా శ్రీకారం చుట్టామన్నారు. -
అనుమతి లేని విద్యాసంస్థల బోర్డులు తొలగించాలి
విజయనగరం గంటస్తంభం: జిల్లాలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన విద్యాసంస్థల బోర్డులను విద్యా శాఖాధికారులు తొలగించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు కోరారు. ఈ మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.వెంకీ, జె.రవికుమార్ మాట్లాడుతూ..మరో 4 నాలుగు రోజుల్లో విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతుందని, కానీ విద్య పేరుతో వ్యాపారం ముందే మొదలైపోయిందని విమర్మించారు. రాజాం మండలంలో ఉన్న అభ్యాస్ పాఠశాలకు ఎటువంటి అనుమతులు లేకపోయినా ఇంటర్నేషనల్ అనే బోర్డు ఏర్పాటు చేశారని, ఆ విధంగా తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని విమర్శించారు. రాజాం మండలంలోనే ఉన్న నారాయణ కార్పొరేట్ పాఠశాలల్లో కూడా ఎటువంటి అనుమతులు లేకుండా ఈ–టెక్నిక్ బోర్డు ఏర్పాటు చేసి ఆ పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. విజయనగరం పట్టణంలో గల ఆదిత్య జూనియర్ కళాశాలకు అనుమతులు లేకున్నా, కాకినాడ ఆదిత్య పేరు పెట్టారన్నారు. ఇలా అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన బోర్డుల పేరుతో ఆ విద్యా సంస్ధలు పెద్ద ఎత్తున తల్లిదండ్రుల నుంచి వేలకు వేలు ఫీజు వసూలు చేస్తున్నాయని విమర్శించారు. తక్షణమే జిల్లా విద్యా శాఖాధికారులు ఇలాంటి విద్యాసంస్థలపై చర్యలు తీసుకుని బోర్డులను తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జరిగే తాము చేపట్టే ఆందోళనకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. జేసీని కలిసిన వారులో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శులు పి.రమేష్, ఎస్.సమీర తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జేసీకి వినతిపత్రం -
కార్పొరేట్ల సేవలో ప్రభుత్వం
విజయనగరం గంటస్తంభం: పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇటీవల విడుదలైన ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ, ప్రైవేట్ విద్యార్థులను మండలాల వారీగా ఎంపిక చేసి షైనింగ్ స్టార్ అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కానీ షైనింగ్ స్టార్ అవార్డుల ఎంపికలో ప్రభుత్వం అవలంబించిన విధానాలను ఉద్దేశించి భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) సోమవారం విజయనగరం జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శి డి.రాము, సీహెచ్ వెంకటేష్లు మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సంపాదించిన విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డుల పేరుతో 20వేల రూపాయల, నగదు, సర్టిఫికెట్, అవార్డుతో సత్కరించింది. సోమవారం ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా అవార్డులకు ఎంపికై న వారికి అందజేశారు. దీనికి గాను ప్రతి మండలం నుంచి ఓసీకి ఇద్దరు, బీసీకి ఇద్దరు, ఎస్సీ ఒకరు, ఎస్టీ ఒకరిని ఎంపిక చేసి మండలానికి ఆరుగురికి చొప్పున అవార్డులను ఇవ్వనున్నారు. ఈ అవార్డులకు ఎంపికై న ఇంటర్మీడియట్ విద్యార్థుల్లో 29 మంది ప్రైవేట్ విద్యాసంస్ధల నుంచి ఉంటే 17 మంది మాత్రమే ప్రభుత్వ విద్యాసంస్థల నుంచి ఎంపిక చేసిన వారున్నారు. పాఠశాలలకు సంబంధించి మొత్తం 158 మందిలో 65 మంది ప్రైవేట్ పాఠఽఽశాలల నుంచే ఎంపికయ్యారు. ఈ రకమైన అవార్డులు ప్రైవేట్, కార్పొరేట్, ప్రభుత్వ విద్యాసంస్థలన్నింటికీ ఒకే ప్రమాణాలు పాటించడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు నష్టపోయి ప్రైవేట్ విద్యాసంస్థల్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీ టీచర్ పోస్టులను భర్తీ చేయకుండా, సిలబస్ పూర్తిగా అవకుండా, అరకొర సౌకర్యాల మధ్య చదువు సాగించి అత్యధిక మార్కులు పొందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఈ షైనింగ్ అవార్డ్స్ ఇవ్వకపోవడం వారి కష్టాన్ని విస్మరించడమేనన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ప్రతి మండలంలో ఓసీ ఇద్దరు, బీసీ ఇద్దరు, ఎస్సీ ఒకరు, ఎస్టీ ఒకరిని చొప్పున ఎంపిక చేయాలి. కానీ విజయనగరం జిల్లాలో ఈ ఎంపిక విషయంలో అన్నాయం జరిగిందని ఆరోపించారు. 580 మార్కులు వచ్చిన ఓసీ కేటగిరికి చెందిన ప్రైవేట్ పాఠశాల విద్యార్థిని ఎంపిక చేసి అదే 580 మార్కులు వచ్చి ప్రభుత్వ పాఠఽశాలల్లో చదువుకున్నప్పటికీ వెనుకబడిన తరగతుల విద్యార్థిని ఎంపిక చేయకపోవడం సామాజిక బాధ్యతను విస్మరించడం అవుతుందన్నారు. కాబట్టి ఇప్పటికై నా ఈ అవార్డులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలని, ప్రభుత్వ పాఠశాలలు..ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు మొదట ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తోందన్నారు. వారికే షైనింగ్ అవార్డ్స్ కేటాయింపు ధ్వజమెత్తిన ఎస్ఎఫ్ఐ నాయకులు -
జర్నలిస్ట్ వేజ్ బోర్డు చట్టాన్ని పరిరక్షించాలి
విజయనగరం అర్బన్: ప్రభుత్వం రద్దు చేసిన జర్నలిస్ట్ చట్టాలను పునరుద్ధరిస్తూ వేజ్బోర్డు చట్టాల్ని పరిరక్షించాలని పలువురు జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జర్నలిస్టులు నల్లబ్యాడ్జిలు ధరించి స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా శాఖ అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టుల వృత్తి ప్రమాణాలు కాపాడేందుకు, వేతనాల చెల్లింపులు, ఇతర సదుపాయాలకు వేతన బోర్దులు ఏర్పాటైన 1995, 1998 చట్టాలను రద్దు చేయడం దుర్మార్గమన్నారు. ఈ చట్టాల రద్దు వల్ల జర్నలిస్టుల వృత్తి ప్రమాణాలకు విఘాతం కలగడంతో పాటు వేతన చెల్లింపులకు సంబంధించిన అంశాలు ప్రసావనకు రాకుండా పోతున్నాయన్నారు. కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు రమేష్నాయుడు, మురళి, శంకర్రావు, అప్పారావు, ప్రసాదరావు, గొర్లె సూరిబాబు, తదితరులు పాల్గొన్నారు. -
పునరావృతం కాకూడదు
పీజీఆర్ఎస్లో అర్జీలుపార్వతీపురం: ప్రజాసమస్యల పరిష్కార వేదికకు వచ్చిన దరఖాస్తులు పునరావృతం కాకూడదని డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణి అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ మందిరంలో జిల్లా వ్యవసాయాధికారి రాబర్ట్పాల్, ఈ సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీరామ్మూర్తిలతో కలిసి ప్రజల నుంచి 44 వినతులను ఆమె స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చూపాలని సూచించారు. దరఖాస్తుల్లో కొన్ని ఇలా.. ● జియ్యమ్మవలస మండలం అర్నాడ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక నిత్యం ఇబ్బందులు పడుతున్నామని, రానున్న వర్షాకాలంలో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు మరింత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని, రోడ్డు నిర్మించాలని గ్రామానికి చెందిన ఎం. సురేష్ అర్జీ అందించారు. ● పార్వతీపురం పట్టణంలోని బెలగాంలో హెడ్పోస్టాఫీసు వీధిలో చెత్త కుండీ ఏర్పాటు చేయకపోవడం వల్ల నిత్యం పందులు సంచరిస్తున్నాయని, దీంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని గిరి పట్నాయక్ ఫిర్యాదు చేశారు. ● మక్కువ మండలం ఎర్ర సామంతవలస గ్రామానికి చెందిన ఆర్. పార్వతమ్మ సర్వే నంబర్ 101లో భూమిని 20ఏళ్లుగా సాగు చేస్తున్నానని కానీ తన భూమిని వేరేవారు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని రికార్డుల ప్రకారం సర్వే చేపట్టి తన భూమి తనకు ఆన్లైన్ చేసి పట్టాదారు పాస్బుక్ మంజూరు చేయాలని కోరారు. ● పార్వతీపురం మండలం జమ్మిడివలస గ్రామానికి చెందిన అల్లు కుమారి వితంతు పింఛన్ మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో ఉద్యానవనశాఖాధికారి బి.శ్యామల, డీఆర్డీఏ ఏపీడీ సత్యంనాయుడు, జిల్లా పశుసంవర్థకశాఖాధికారి ఎస్. మన్మథరావు, డీపీఓ టి.కొండలరావు, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ గ్రీవెన్స్సెల్కు 23 వినతులు సీతంపేట: స్థానిక ఐటీడీఏలో సోమవారం ఏపీవో చిన్నబాబు నిర్వహించిన పీజీఆర్ఎస్కు 23 వినతులు వచ్చాయి. సీతంపేటలో ఎంపీహెచ్ఏ పోస్టు ఇప్పించాలని జోగైనాయుడుగూడకు చెందిన సవర లక్ష్మణరావు కోరారు. సవర భాష వలంటీర్ పోస్టు ఇప్పించాలని చీడిగూడకు చెందిన సవర బెనర్జీరావు వినతి అందజేశారు. దబ్బగూడకు చెందిన సవర ముసలమ్మ ట్రాక్టర్ లోన్ ఇప్పించాలని కోరింది. మినీ ఫ్లోర్మిల్ కావాలని బి.భారతి విన్నవించింది. అంటికొండకు చెందిన నిమ్మక సుందరరావు ఉపాధి వేతనాలు పెండింగ్లో ఉన్నవి చెల్లించాలని అర్జీ చేశారు. కార్యక్రమంలో ఈఈ రమాదేవి, డీడీ అన్నదొర, ఏఎంవో కోటిబాబు, స్పోర్ట్స్ ఇన్చార్జ్ జాకాబ్ దయానంద్ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయలోక్ అదాలత్లో క్లెయిమ్ల పరిష్కారం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత విజయనగరం లీగల్: మోటార్ ప్రమాద బీమా క్లెయిమ్లను జాతీయలోక్ అదాలత్లో పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత అన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా కోర్టు హాల్లో ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల అధికారులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ వచ్చే నెల 5న జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని, ఈ అదాలత్లో మోటార్ ప్రమాద బీమా క్లెయిమ్లు పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి ఎ. కృష్ణప్రసాద్, వివిధ ఇన్సూరెన్స్ కంపెనీలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతుల సమస్యలు పరిష్కరించాలిపార్వతీపురం: విభిన్న ప్రతిభావంతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీహెచ్ విజయ్కుమార్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని విభిన్న ప్రతిభావంతులకు వర్తింప జేయాలని కోరారు. సుదూర ప్రాంతాలకు 50 శాతం రాయితీ వర్తింప జేయాలని, ఆర్టీసీలో రెగ్యులర్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో జీఓ నంబర్ 77 ప్రకారం 4 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ నిర్వహిస్తున్న షాపుల్లో 5శాతం షాపులను విభిన్న ప్రతిభావంతులకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలను పరిష్కరించేలా అధికారులు చొరవ చూపాలని కోరారు. ముగ్గురికి గాయాలుదత్తిరాజేరు: మండలంలోని కోమటిపల్లి సరితి వారి కళ్లాల వద్ద జాతీయ రహదారిపై సోమవారం మధ్యాహ్నం ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్న సంఘటనలో ముగ్గురికి గాయాలైనట్లు పెదమానాపురం హెడ్ కానిస్టేబుల్ కాశీరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం బొబ్బిలి నుంచి గజపతినగరం వైపు వెళ్తున్న కారును పెదమానాపురం నుంచి రామభద్రపురం వెళ్తున్న కారు ఢీకొనడంతో రెండు కార్లలో ఉన్న ఆగూరి సంతోషి, పువ్వల రవిబాబు, పువ్వల శాంతమ్మలకు గాయాలయ్యాయి. వెంటనే వారిని 108లో గజపతినగరం సామాజిక ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
పైడితల్లి హుండీల ఆదాయం లెక్కింపు
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు హుండీల ఆదాయాన్ని స్థానిక శివాలయం వీధిలో ఉన్న శ్రీ పైడితల్లి అమ్మవారి కల్యాణ మంటపంలో సోమవారం లెక్కించారు. ఆలయ ఇన్చార్జ్ ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ 75 రోజులకు గాను చదురుగుడి హుండీల నుంచి రూ.29 లక్షల 38వేల 935 నగదు, 20 గ్రాముల 200 మిల్లీ గ్రాముల బంగారం, 541 గ్రాముల వెండి లభించాయన్నారు. అదేవిధంగా రైల్వేస్టేషన్ వద్దనున్న వనంగుడి హుండీల నుంచి రూ.6 లక్షల 92వేల 729 నగదు, 1 గ్రాము.400మిల్లీగ్రాముల బంగారం, 49 గ్రాముల వెండి లభించాయన్నారు. వీటితో పాటు అన్నదానానికి సంబంధించి రూ.16వేల12 ఆదాయం ద్వారా లభించిందన్నారు. కార్యక్రమంలో హుండీల పర్యవేక్షణ అధికారులుగా గ్రేడ్–1 ఈఓ బి.శ్రీనివాసరావు, బొబ్బిలి ఇన్స్పెక్టర్ ఎన్.రాజకుమారి, శ్రీవారి సేవకులు, ఆలయసిబ్బంది పాల్గొన్నారు. -
కార్పొరేటు ప్రతిభకు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ప్రభుత్వ విద్యను పక్కా ప్రణాళికతో నిర్వీర్యం చేస్తుందనే అనుమానాలు సర్వత్రా తలెత్తుతున్నాయి. ఎందుకంటే గత వైఎస్సార్సీపీ హయాంలో విద్యా వ్యవస్థలో చేపట్టిన సంస్కరణల పుణ్యమాని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ఒకానొక దశలో కార్పొరేట్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తయారయ్యాయి. నాడు నేడుతో ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా కార్పొరేట్ స్థాయికి తీసుకువెళ్లింది జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం. అమ్మ ఒడితో ప్రతి ఒక్క విద్యార్థి చదివేలా ప్రణాళిక రచించింది. మధ్యాహ్న భోజనంలో నాణ్యత పెంచింది. ట్యాబ్లు అందజేసింది. ఇంగ్లిష్ మీడియంతో విద్యార్థుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ఇవన్నీ గత వైభవాలు...కానీ కూటమి పాలకులు వచ్చాక ప్రభుత్వ విద్యను పూర్తిగా నీరుగార్చేస్తున్నారు. నాడు – నేడును పూర్తిగా మరిచారు. రెండో విడత పాఠశాలల పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. పాఠశాలల స్థాయిని విభజించి మరింత నిర్యీర్యం చేసింది. తాజాగా ప్రతిభా పురస్కారాల పేరిట తెచ్చిన షైనింగ్ స్టార్స్తో కార్పొరేట్కే పట్టం కట్టేలా కూటమి ప్రభుత్వం నిర్ణయిం తీసుకుంది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కూడా కొన్ని చోట్ల పురస్కారాలు రాని పరిస్థితి నెలకొంది. ● ‘షైనింగ్ స్టార్స్’ పేరుతో ప్రైవేటు విద్యకు ప్రోత్సాహం ● ప్రతిభ చూపిన పది, ఇంటర్ విద్యార్థులకు రూ.20 వేల నగదు పురస్కారాలు ● కులాల కేటగిరి వారీగా మండల స్థాయిలో ప్రతిభ ఎంపిక ● మండలానికి ఆరుగురు వంతున పదో తరగతికి 158 మంది, ఇంటర్లో గ్రూప్కి ఆరుగురు వంతున 40 మంది ఎంపిక ● అధిక మార్కులు సాధించినప్పటికీ 3 మండలాల్లో ఎంపిక కాని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ● ఇంటర్లో ఎంపికై న 40 మందిలో 29 మంది ప్రైవేటు విద్యార్ధులే.. ఇంటర్లో 40 మందికి 29 మంది ప్రైవేటు విద్యార్థులే.. జిల్లాలోని ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో ప్రతిభ చూపిన 40 మంది విద్యార్థులు షైనింగ్ స్టార్స్ పురస్కారానికి ఎంపికయ్యారు. వీరికి కూడా ఒక్కొక్కరికీ రూ.20 వేల వంతున నగదు బహుమతితో పురస్కారాన్ని అందజేస్తారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూప్ల నుంచి ఒక్కో గ్రూపులో బీసీ, జనరల్, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ కేటగిరికి ఒక్కరు వంతున అధిక మార్కులు సాధించిన మొత్తం 40 మందిని ఎంపిక చేశారు. అయితే వారిలో కేవలం 11 (ఎస్సీ, ఎస్టీ) మంది మాత్రమే ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు ఉన్నారు. మిగిలిన 29 మంది కార్పొరేట్ కళాశాలల విద్యార్థులే ఉండడం విశేషం. విజయనగరం అర్బన్: ప్రభుత్వ పాఠశాల విద్యను ప్రోత్సహించే దిశ గా ఎక్కడైనా పాలకులు తమ పాలన సాగించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో మంచిగా చదివే వారిని ప్రోత్సహిస్తూ ముందుకు సాగితే ఆయా కుటుంబాల్లో విద్యావంతులు తయారై కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులతో పోటీ పడే అవకాశం ఉంటుంది. గత వైఎస్సార్సీపీ హయాంలో ఇటువంటి లక్ష్యంతోనే విద్యా రంగానికి తగిన ప్రాధాన్యత ఇచ్చింది. ఇందులో భాగంగా పదో తరగతి వార్షిక పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో నగదు బహుమతులతో ప్రతిభా పురస్కారాలను అందజేసి వారిని ప్రోత్సహించింది. ఈ పురస్కారాల ను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు మాత్రమే అందజేసింది. తాజాగా కూటమి ప్రభుత్వం కూడా షైనింగ్ స్టార్స్ పేరుతో నగదు పురస్కారాలను కొనసాగిస్తుంది. కానీ ఇందులో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో పాటు ప్రైవేటు విద్యా సంస్థల విద్యార్థులను కూడా ఎంపిక చేసింది. ఇది కాస్త తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ మేరకు ఈ నెల 9న జిల్లా కేంద్రాల్లో ఈ పురస్కారాలను అందజేయాలని విద్యా శాఖ ఏర్పాట్లు చేస్తుంది. ఈ విధానం పూర్తిగా కార్పొరేట్ విద్యను ప్రోత్సహించేలా ఉందని విద్యావేత్తలు, ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు సామాన్యులు వ్యాఖ్యానిస్తున్నారు. పదిలో 158 మంది విద్యార్థులకు పురస్కారాలు ఈ ఏడాది మార్చిలో జరిగిన పదో తరగతి వార్షిక పరీక్షలో అధిక మార్కులు తెచ్చుకున్న జిల్లా స్థాయిలో 158 మంది విద్యార్థులకు ‘షైనింగ్ స్టార్స్’ పేరుతో ఒక్కొక్కరికీ రూ.20 వేలు నగదు బహుమతి పురస్కారాలను ప్రకటించింది. మండల స్థాయిలో అధిక మార్కులు (500 పైబడిన) సాధించిన నాలుగు కేటగిరీలలో ఆరుగురు వంతున 26 మండలాల నుంచి ఎంపిక చేశారు. ఓసీ, బీసీల నుంచి ఇద్దరేసి, ఎస్సీ, ఎస్టీల నుంచి ఒకొక్కరిని, ఎస్టీలు లేని మండలాల సంఖ్య నుంచి అంగవైకల్యం (సీడబ్ల్యూఎస్) కేటగిరి నుంచి ఏడుగురితో మొత్తం 158 మందిని ఎంపిక చేశారు. మూడు మండలాల్లో ప్రభుత్వ పాఠశాలల నుంచి ఒక్కరూ లేరు.. జిల్లాలో ఎంపిక చేసిన పదో తరగతి 158 మంది షైనింగ్ స్టార్స్లో 65 మంది కార్పొరేట్/ప్రైవేటు విద్యా సంస్థలలో చదివిన వారే ఉండడం విశేషం. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపిన మార్కులు సాధించినప్పటికీ జిల్లాలో కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థల ప్రభావం ఉన్న మూడు మండలాల్లో ఒక్కరు కూడా పురస్కార జాబితాకి ఎంపిక కాలేదు. ఉదాహరణకు బొబ్బిలి మండలంలోని పక్కి గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, కారాడా సంక్షేమ పాఠశాలలో 592 మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు పురస్కారానికి ఎంపికలో అవకాశం లభించలేదు. లక్షల రూపాయలు వసూలు చేసిన మండల కేంద్రంలోని కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థలకు చెందిన ఆరుగురు ఒక్క మార్కు తేడాతో ఎంపిక జాబితాలో ఉన్నారు. జిల్లాలో విజయనగరం, రాజాం మండలాల్లో కూడా ఇదే పరిస్థితి. దీంతో ఆయా మండలాల్లో ప్రతిభ చూపిన పేద విద్యార్థులను ప్రోత్సహించలేని పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో మొత్తం 26 మండలాలలో ఏడు మినహా అన్ని మండలాలలో కార్పొరేట్, ప్రైవేటు విద్యార్థులు జాబితాలో ఉన్నారు. దత్తిరాజేరు, గుర్ల, మెంటాడ, నెల్లిమర్ల, రేగిడి ఆమదాలవలస, తెర్లాం, వేపాడ మండలాలో మాత్రమే పూర్తి స్థాయిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. ఇది సర్వత్రా చర్చనీయాంశమైంది. -
అపూర్వ సమ్మేళనం
● అంగరంగా వైభవంగా వజ్రోత్సవం ● విదేశాల నుంచి తరలివచ్చిన పూర్వ విద్యార్థులు ● పూర్వ విద్యార్థులతో కిటకిటలాడిన వీరఘట్టం హైస్కూల్ ప్రాంగణం ● గతంలో పనిచేసిన ఉపాధ్యాయులకు సత్కారంవానికి హాజరైన ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ను పూర్వ విద్యార్థులు, ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనకు చదువు చెప్పిన మాస్టార్లను గౌరవించడం విద్యార్థుల బాధ్యత అన్నారు. పాఠశాల అభివృద్ధికి విరాళాలు.. వీరఘట్టం హైస్కూల్లో 1970లో చదువుకున్న దౌలూరు కై లాసరావు పాఠశాల అభివృద్ధికి రూ.1 లక్ష చెక్కును ఉత్సవ కమిటీకి అందజేశారు. అలాగే మరి కొంతమంది పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి విరాళాలు ప్రకటించారు. అలాగే వజ్రోత్సవం విజయవంతం చేయడంలో కృషి చేసిన 1982 బ్యాచ్కు చెందిన బెహరా ప్రసాద్, ఇట్లా మన్మథరావు, కోణార్క్ శ్రీనులను ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. పాఠశాల అభివృద్ధికి దోహదం పాఠశాలల్లో పూర్వ విద్యార్థులు నిర్వహించే ఆత్మీయ కలయికలు పాఠశాలల అభివృద్ధికి దోహదపడతాయని పార్వతీపురం మన్యం జిల్లా విద్యాశాఖాధికారి కె.రాజ్కుమార్ అన్నారు.ఆత్మీయ కలయికకు ఇంతమంది పూర్వ విద్యార్థులు హాజరుకావడంతో పాఠశాల చరిత్రలో ఓ సంచలనమని డీఈఓ అన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన విశ్రాంత ఉపాధ్యాయులు వాన సత్యంనాయుడు, సీరపాణి, బీవీ సత్యానందం, కె.సత్యమూర్తి, నిష్టల నరసింహమూర్తి, కె.శేషమ్మ, పెంకి సుందరరావు, మాచర్ల శ్రీరాములుదొర, ఎంబీ బెనర్జీ, పొట్నూరు భరతుడు, ధర్మాన సిమ్మయ్య, అడివినాయుడు, జీఎస్ఎన్, వారాడ వేణుగోపాలరావు, యర్రా అప్పలరాజు, తెంటు రామినాయుడు తదితరులను ఉత్సవ కమిటీతో పాటు డీఈఓ ఘనంగా సత్కరించారు.వీరఘట్టం: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏర్పాటై 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవాన్ని ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సుమారు 2 వేల మంది పూర్వ విద్యార్థులు ఈ సంబరానికి హాజరు కావడంతో సభా ప్రాంగణం కిటకిటలాడింది. వీరఘట్టంలోని పంచముఖ ఆంజేయస్వామి ఆలయ సెంటర్ నుంచి పూర్వ విద్యార్థులు ర్యాలీ చేపట్టి ప్రధాన రహదారి గుండా హైస్కూల్కు చేరుకున్నారు. ఉత్సవ కమిటీ అంచనాలకు మించి పూర్వ విద్యార్థులు రావడంతో హైస్కూల్ ప్రాంగణంలో పండగ వాతావరణం నెలకొంది. తొలుత హైస్కూల్కు ఐదెకరాల స్థలాన్ని ఇచ్చిన స్థలదాత దివంగత రౌతు చిన్నంనాయుడు విగ్రహాన్ని ఆయన మనుమడు హైకోర్టు న్యాయవాది రౌతు సురేష్కుమార్, ఆయన కుటుంబసభ్యులు ప్రతిష్టించారు. తర్వాత శ్రీకాకుళం గురజాడ సంస్థల అధినేత గుండ్రెడ్డి స్వామినాయుడు ప్రపంచ మల్లయోధుడు కోడి రామ్మూర్తినాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఈ వజ్రోత్సవానికి హాజరైన మాజీ గురువులకు ఉత్సవ కమిటీ సభ్యులు మంగళవాఽయిద్యాలు, పూర్ణ కలశాలతో సాదర స్వాగతం పలికారు. సభా వేదికపై ఆసీనులైన ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించి, వజ్రోత్సవ జ్ఞాపికలను అందజేశారు. ఇది గొప్ప కార్యక్రమం వజ్రోత్సవానికి హాజరైన పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణను కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 52 బ్యాచ్లను సమన్వయం చేస్తూ ఇటువంటి బృహత్తర కార్యక్రమం చేపట్టిన కమిటీ సభ్యులను అభినందించారు. చదువు చెప్పిన మాస్టారును గౌరవించాలి వీరఘట్టం హైస్కూల్లో జరుగుతున్న వజ్రోత్స -
చికెన్
బ్రాయిలర్ లైవ్ డెస్డ్ స్కిన్లెస్ శ్రీ115 శ్రీ200 శ్రీ210సోషల్మీడియాలో పోస్టు పెట్టిన వ్యక్తి అరెస్టుపాలకొండ: భామిని మండలానికి చెందిన జామి వెంకటేష్ అనే వ్యక్తిని సోషల్మీడియాలో పోస్టు పెట్టినందుకు పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు ఆ వివరాలను సీఐ చంద్రమౌళి ఆదివారం విలేకరుల సమావేశంలో వివరించారు. స్థానిక ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఇన్స్టా గ్రామ్లో రీల్ పోస్టు చేయగా దానిపై వెంకటేష్ అసభ్యంగా కామెంట్ చేసినట్లు తెలిపారు. దీనిపై జనసేన నాయకుల ఫిర్యాదు మేరకు వెంకటేష్ను అరెస్టు చేశామని చెప్పారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ వాట్సాప్, ఫేస్బుక్, సోషల్మీడియాలో పెట్టే పోస్టులకు అడ్మిన్ బాధ్యత తీసుకోవాలని పేర్కొన్నారు. విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయనతో పాటు ఎస్సై ప్రయోగమూర్తి ఉన్నారు. యువకుడి ఆత్మహత్యశృంగవరపుకోట: మండలంలోని గౌరీపురం గ్రామానికి చెందిన శానాపతి సాయికుమార్ (26) గడ్డిమందు తాగి అత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొంతకాలంగా సాయికుమార్ తరచూ కడుపునొప్పితో బాధపడుతున్నాడు. శనివారం రాత్రి విపరీతంగా కడుపునొప్పిరావడంతో భరించలేక అందుబాటులో ఉన్న గడ్డిమందును తాగేశాడు. దీంతో గమనించిన తండ్రి అప్పారావు ఎస్.కోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం విశాఖలోని కిమ్స్, అక్కడినుంచి కేజీహెచ్కు తరలించి చికిత్స అనంతరం బాగుందని ఇంటికి తీసుకొచ్చారు. ఆదివారం ఉదయం సాయికుమర్కు మళ్లీ విపరీతమై కడుపునొప్పి రావడంతో ఇంటివద్ద చనిపోయాడు. దీనిపై మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రెండు బొలెరో వ్యాన్లు ఢీ: ఒకరికి గాయాలుదత్తిరాజేరు: మండలంలోని ఎస్.బూర్జవలస పోలీస్స్టేషన్ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం రెండు బొలెరో వ్యాన్లు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఒకరికి గాయాలైనట్లు ఎస్సై జి.రాజేష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం తెర్లాం మండలం కుసుమూరు నుంచి గజపతినగరం వైపు సామగ్రితో వెళ్తున్న బొలెరో వ్యాన్ను వెనుక నుంచి వస్తున్న మరో బొలెరో వ్యాన్ ఢీకొనడంతో తెర్లాం మండలం కుసుమూరు గ్రామానికి చెందిన బడిమిశెట్టి శ్రీను కాలికి బలమైన గాయమైనట్లు ఎస్సై తెలిపారు. గాయాలపాలైన బడిమిశెట్టి శ్రీనును 108లో ఆస్పత్రికి తరలించి బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. సీహెచ్సీకి రోగుల తాకిడిబాడంగి: స్థానిక సామాజిక ఆరోగ్యకేంద్రాని(సీహెచ్సీ)కి జ్వరం, డయేరియా రోగుల తాకిడి ఆదివారం పెరిగింది. ఆస్పత్రి నూతన భవన నిర్మాణం పూర్తికాకపోవడంతో ఉన్నపాటి పాతభవన ఇరుకు గదుల్లోనే వైద్యచికిత్సలు అందిస్తున్నారు. ఇన్పేషెంట్ వార్డులో మంచాలు చాలకపోవడంతో ఆస్పత్రి వరండాలో కూడా మంచాలు, బెంచీలు వేసి రోగులకు చికిత్స చేస్తున్నారు. దీంతో ఎక్స్రే, గైనకాలజిస్టు, ఇన్ఫెషెంట్ వార్డులోకి డాక్టర్లు, సిబ్బంది, రోగుల ధువులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందిగా మారింది. అదేవిధంగా దూరం నుంచి వచ్చిన ఓపీరోగులకు కూడా ఆస్పత్రిలో చోటుచాలక ఆరుబయట చెట్లకింద ఓపీ టికెట్ల నమోదు, ఎన్ఓపీ బయోమెట్రిక్లు చేపడుతున్నారు. అత్యవసర వైద్యసేవలకోసం రిఫరల్ కేసులను తరలించేందుకు గతంలో అంబులెన్స్ సౌకర్యం ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆ వాహనం మూలకుచేరడంతో పేదరోగులు ప్రైవేట్ అంబులెన్స్లకు అద్దెలు చెల్లించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. -
డ్రోన్ సహాయంతో ఓపెన్ డ్రింకింగ్కు అడ్డుకట్ట
● వన్టౌన్ పీఎస్ పరిధిలో 6 కేసులు ● టూటౌన్ పరిధిలో 11 కేసుల నమోదువిజయనగరం క్రైమ్: విజయనగరం పోలీస్ సబ్డివిజన్ పరిధి విజయనగరం వన్టౌన్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని శివారు ప్రాంతాల్లో ఆదివారం ఓపెన్ డ్రింకింగ్కు పోలీసులు చెక్ పెట్టారు. డ్రోన్స్ సహాయంతో రైడ్స్ నిర్వహించి, ఓపెన్ డ్రింకింగ్కు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. టూటౌన్ పోలీసులకు వచ్చిన కచ్చితమైన సమాచారంతో పూల్భాగ్ కాలనీ నందిగుడ్డి ప్రాంతంలోను, 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని కణపాక, అయ్యన్నపేట ఏరియాల్లో బహిరంగ ప్రదేశాల్లో ఓపెన్ డ్రింకింగుకు పాల్పడుతున్న వారిపై డ్రోన్స్ పంపారు. ఆయా ప్రాంతాల్లో కొంతమంది ఓపెన్ డ్రింకింగ్కు పాల్పడుతున్నట్లు గుర్తించి పోలీసులు రైడ్స్ నిర్వహించారు. వన్ టౌన్ పోలీసు స్టేషను వరిధిలో ఓపెన్ డ్రింకింగుకు పాల్పడుతున్న వారిపై ఆరు కేసులు, టూ టౌన్ పోలీసు స్టేషను పరిధిలో ఓపెన్ డ్రింకింగుకు పాల్పడుతున్న వారిపై 11 కేసులను నమోదు చేశామని ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. పేకాట, ఓపెన్ డ్రింకింగ్, ట్రాఫిక్ రెగ్యులేషన్, జాతర్లు, ధర్నాల నిర్వహణలో అనుమానాస్పద వ్యక్తుల ఆచూకీని కనిపెట్టేందుకు డ్రోన్ వినియోగిస్తున్నామని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.నేర నియంత్రణలోను, శివారు ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు డ్రోన్స్ వినియోగించాలని, శివారు ప్రాంతాలపై నిఘా పెట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. -
జీఆర్పీ, ఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్
విజయనగరం క్రైమ్: ఆర్పీఎఫ్ డీజీ ఆదేశాలతో విశాఖపట్నం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో విజయనగరం రైల్వేస్టేషన్లో ఆదివారం కార్టన్ సెర్చ్ జరిగింది. ఈ మేరకు విజయనగరం జీఆర్పీ ఎస్సై బాలాజీరావు, ఆర్పీఎఫ్ సీఐ కుమార్, ఎస్సై శ్రీధర్లతో పాటు 30 మంది సిబ్బంది ఉదయం 10గంటల నుంచి ఒంటిగంట వరకు రైల్వేస్టేషన్లో గంజాయి అక్రమ రవాణా, ఇతర మత్తుపదార్థాల రవాణాను అడ్డుకునేందుకు చర్యలు చేపట్టారు. మూడు బృందాలుగా ఏర్పడి విజయనగరం రైల్వే స్టేషన్లోని అన్ని విశ్రాంతి గదులతో పాటు క్లాక్ రూమ్లు, పార్సిల్ ఆఫీస్ వద్ద సోదాలు నిర్వహించారు. అలాగే స్టేషన్లో ఉన్న 5 ఫ్లాట్ఫారాలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. స్టేషన్కు వచ్చిన భువనేశ్వర్–బెంగళూరు వందేభారత్ ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ బెంగళూరు ప్రశాంతి ఎక్స్ప్రెస్, గుంటూరు రాయగడ ఎక్స్ప్రెస్, సమతా ఎక్స్ప్రెస్ రైళ్లను స్టేషన్ మేనేజర్ ఆదేశాలతో ప్రతి కంపార్టుమెంట్లోనూ సోదాలు చేశారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో ఏ విధమైన మత్తుపదార్థాలు కానీ, గంజాయి సరఫరా కానీ జరగలేదని జీఆర్పీ ఎస్సై బాలాజీరావు తెలిపారు. ఈ తనిఖీల్లో పీసీలు రామకృష్ణ, సత్యనారాయణ, నారాయణలతో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు. -
ఏపీఈఏపీ సెట్లో సత్తా చాటిన విద్యార్థులు
విజయనగరం అర్బన్: ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ డిగ్రీ కోర్సులకు ఇటీవల నిర్వహించి న ఏపీఈఏపీ సెట్–2025 ప్రవేశ పరీక్ష ఫలితాలలో పలువురు జిల్లా విద్యార్థులకు ఉత్తమ ర్యాంకులు లభించాయి. ఇంజినీరింగ్ విభాగంలో జిల్లా నుంచి దరఖాస్తు చేసుకున్న 11,110 మందిలో 10,749 మంది పరీక్ష రాయగా 7,925 మంది క్వాలిఫై అయి నట్టు నివేదికలో వెలువడింది. అదే విధంగా అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో జిల్లా నుంచి దర ఖాస్తు చేసుకున్న 4,305 మందిలో 4,004 మంది పరీక్ష రాయగా 3,434 మంది క్వాలిఫై అయ్యారు. ఆదివారం రాత్రి విడుదల అయిన ఫలితాలలో ఇంతవరకు సేకరించిన ర్యాంక్ల వివరాలు ఇలా ఉన్నా యి. ఇంజినీరింగ్ విభాగంలో పట్టణానికి చెందిన బలగ జయేంద్రనాయుడుకి 212 ర్యాంక్, మజ్జి జ్ఞాన హాసినికి 846 ర్యాంక్, బులుసు వినేష్కి 1,420, బెల్లాన షాన్ సువర్ణ రత్నాకర్కి 1,752వ ర్యాంక్లు వచ్చాయి. అగ్రికల్చర్ విభాగంలో పట్టణానికి చెందిన సాయి శిరీష్ 926, లోపింటి జాహ్నవి 1,592 ర్యాంక్ సాధించారు. ఆరికతోట విద్యార్థి సత్తా.. రామభద్రపురం: ఏపీఈఏపీ సెట్ పరీక్ష ఫలితాలలో మండలంలోని ఆరికతోట గ్రామానికి చెందిన జాగాన యోగేశ్వర్ రాష్ట్ర స్థాయిలో 41వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు. గతంలో జేఈఈ మెయిన్స్ జాతీయ స్థాయి ఓబీసీ కేటగిరీలో 40వ ర్యాంకు, కామన్ కేటగిరీలో 284వ ర్యాంకు సాంధించి ప్రతిభ కనబరిచాడు. విద్యార్థి తండ్రి సింహాచలం ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో అధ్యాపకునిగా పని చేయగా తల్లి యర్రయ్యమ్మ గృహిణి. -
లోహ జగత్తు పుస్తకావిష్కరణ
విజయనగరం టౌన్: మానవ శరీరం అనేక లోహమూలకాల సమూహం. ఆయా లోహాలు శరీరం ఎదుగుదల, క్షీణతలపై ఏ విధంగా ప్రభావితం చేస్తాయి ‘లోహ జగత్తు’ పుస్తకంలో సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో వివరించినట్లు ప్రముఖ రచయిత్రి చాగంటి తులసి పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక అయ్యన్నపేట పాల్నగర్లో ఉన్న చాగంటి తులసి స్వగృహంలో తన సోదరి చాగంటి కృష్ణకుమారి రచించిన లోహ జగత్తు పుస్తకావిష్కరణ ఆదివారం చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత సుమనస్పతి రెడ్డి మాట్లాడుతూ తెలుగులో సరళమైన భాషలో లోహ జగత్తు పుస్తకం కథాకథనంలో ప్రజలకు అందుబాటులో రావడం వల్ల విదార్థులకు విషయ పరిజ్ఞానం సముపార్జనకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. జనవిజ్ఞానవేదిక రాష్ట్ర నాయకుడు ఎంవీఆర్.కృష్ణాజీ మాట్లాడుతూ ప్రపంచ నాగరికత వెనుక లోహ మూలకాలు, మనిషి జీవితంలో లోహాల వినియోగం సైన్స్ అభివృద్ధి సమాజంపై ప్రభావం చూపిందన్నారు. లోహ జగత్తు పుస్తకం కథా కథనం వెలువరించడం వెనుక తన తండ్రి చా.సోకు ఆమె ఇచ్చిన మాట ఉందన్నారు. జీవనంలో లోహాలు, నానోటెక్నాలజీ ఎలా ఉపయోగిస్తున్నారు? సైన్స్ అంటే భయాలు లేకుండా పోతాయని వివరించారు. లోహ జగత్తు పుస్తకం కథాకథనానికి అనుగుణంగా చిత్రాలు వేయడంతో లోహాల ప్రయోజనం తెలుసుకోవడం సులభతరమైందని చిత్రకారిణి కె.మధురశ్రీ అన్నారు. కార్యక్రమంలో ఎంఆర్. మహిళా కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ లలితకుమారి, చిత్రకారుడు చా.సో కుమారుడు చాగంటి బాపిరాజు, చాసో అభిమానులు, వర్ధమాన రచయితలు, సాహితీ స్రవంతి నిర్వాహకుడు చీకటిదివాకర్ తదితరులు పాల్గొన్నారు. -
శాసీ్త్రయ ధృక్పథం పెంపొందించడమే లక్ష్యం
బొబ్బిలి: ప్రజల్లో శాసీ్త్రయ ధృక్పథాన్ని పెంపొందించి, విజ్ఙాన శాస్త్రాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా జనవిజ్ఙాన వేదిక పనిచేస్తోందని రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.రాజగోపాల్ అన్నారు. ఈ మేరకు ఆదివారం స్థానిక రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవనంలో జేవీవీ నియోజకవర్గ సమావేశాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ జేవీవీ రాష్ట్ర మహాసభలను సెప్టెంబర్లో విజయనగరంలో నిర్వహించనున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగా విజ్ఙాన మేళాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆర్థిక వనరుల సమీకరణ అంశాలపై సభ్యులతో చర్చించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రమణ ప్రభాత్, ఉపాధ్యక్షుడు సత్యం నాయుడు,శివానంద్ పాల్గొన్నారు. -
ఆర్టీసీ విజిలెన్స్ నూతన కమిటీ ఏకగ్రీవం
విజయనగరం అర్బన్: ఏపీ ప్రజా రవాణా శాఖ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ విజయనగరం ఆర్టీసీ జోన్ నూతన కమిటీని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక జిల్లా పరిషత్ మినిస్టీరియల్ సిబ్బంది సంఘం కార్యాలయంలో ఆదివారం ఎన్నిక జరిగింది. జోన్ నూతన కమిటీలోని విశాఖ జోనల్ అధ్యక్షుడుగా సీహెచ్ మోహన్రావు, కార్గో విశాఖపట్నం జోనల్ అధ్యక్షుడుగా టీఎస్ ప్రసాద్, విజయనగరం జోనల్ వర్క్షాప్ జోనల్ కార్యదర్శిగా డి.శ్యాంసుందరావు ఎన్నికయ్యారు. సంఘం రాష్ట్ర అడహక్ కమిటీ కన్వీనర్ టీవీ రావు, రాష్ట్ర అడహక్ కమిటీ సభ్యులు ఎం.అనంతకుమార్, సీఎస్ఐ విశాఖ రీజియన్ సీహెచ్మోహనరావు సమక్షంలో ఎన్నిక జరిగింది. అక్రమ సస్పెన్షన్లు మానుకోవాలి ● ఆర్టీసీ ఎన్ఎంయూ జోనల్ కమిటీ డిమాండ్ విజయనగరం అర్బన్: ఆర్టీసీలో ఉద్యోగులపై అధికారులు చేపడుతున్న అక్రమ సస్పెన్షన్లు మానుకోవాలని లేకపోతే ఉద్యమాలు తప్పవని ఆర్టీసీ ఎన్ఎంయూ విజయనగరం జోనల్ కమిటీ హెచ్చరించింది. స్థానిక జిల్లా పరిషత్ మినిస్టీరియల్ సిబ్బంది సంఘ భవనంలో ఆదివారం నిర్వహించిన సంఘం జోనల్ కమిటీ సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సంస్థ క్రమశిక్షణ చర్యలపై జారీ చేసిన మార్గదర్శకాలపై 01/2019 సర్క్యులర్ ఆదేశాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆరోపించారు. ఉద్యోగులను ఇష్టారాజ్యంగా సస్పెన్షన్స్, తొల గించడం చేస్తుండడంపై న్యాయం కోరుతూ అనకాపల్లిలో 100 రోజులుగా చేపడుతున్న రిలే నిరాహార దీక్షలపై అధికారులు కనీసం స్పందించడం లేదని మండిపడ్డారు. విజయనగరం డిపో ఉద్యోగ, సంఘ నాయకులపై స్థానిక అధికారులు దుర్భాషలాడటంపై ఉన్న తాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విజయనగరం జోన్ పరిధిలోని అన్ని డిపోలలోనూ, గ్యారేజీలలోనూ ఇదే పద్ధతిలో అధికారుల తీరు ఉందని దీన్ని మానుకోవాలని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాసరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర కోశాధికారి పీవీ మోహన్, రాష్ట్ర కార్యదర్శి కె.నర్సింగరావు, జోనల్ కార్యదర్శి బీఎస్ రాములు, జిల్లా కార్యదర్శి పీజీ రాఫీల్, వివిధ డిపోల కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. సువర్ణముఖి నది ఒడ్డున ఏనుగుల సంచారం సీతానగరం: మండలంలోని లక్ష్మీపురం – ఏగోటివలస గ్రామాల మధ్యనున్న సువర్ణముఖి నది ఒడ్డున తోటల్లో ఏనుగులు ఆదివారం సంచరిస్తూ కనిపించాయి. శనివారం వెంకటాపురం – బూర్జ తోటల్లో సంచరించిన ఏనుగుల గుంపు ఆదివారం ఉదయానికి లక్ష్మీపురం పురవీధుల్లో కనిపించాయి. ఉదయం 10 గంటల తరువాత నది ఒడ్డుకు చేరాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ఇదిలా ఉండగా గడిచిన మూడు రోజులుగా మండలంలోనే ఏనుగుల గుంపు సంచరిస్తుండడంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. మరోవైపు పంట పొలాల వైపు సంచరించే సమయంలో తమ పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఏనుగుల గుంపును ఈ ప్రాంతం నుంచి తరలించే చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
ఎమ్మెల్యే పేరు చెప్పుకుని గ్రావెల్ దందా!
బొబ్బిలి: పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న గ్రోత్ సెంటర్ భూములు ఇప్పుడు గ్రావెల్ దందాకు అడ్డాగా మారాయి. గ్రోత్సెంటర్లోని ప్రధాన రహదారిలో నారాయణపురం వెళ్లే దారి మలుపు లో ఉన్న పరిశ్రమలకు కేటాయించిన స్థలంలో గ్రావెల్ తవ్వకాలు జరిపి నిల్వ కేంద్రంగా చేసుకున్నారు. అక్కడి నుంచి వివిధ వ్యాపారాలకు గ్రావెల్ను తరలిస్తున్నారు. దీనిని చిత్రీకరించేందుకు స్థానిక విలేకర్లు వెళ్లగా ఈ వ్యవహారం ఎమ్మెల్యే గారిదని, ఏం రాయొద్దని పీఏ హర్ష ముందుగా చెప్పారు. అనంతరం మిగతా వారికి కూడా చెప్పాలని అప్పుడు రాయడం మానేస్తామ ని అనగా నాకేటి దూ... మీకు ఏ అవసరాలు రావా? అప్పుడు చూద్దాం అని పీఏ హర్ష దురు సుగా మాట్లాడటంతో ఆ విలేకరి చిన్నబుచ్చుకున్నారు. ఇటీవల ఆర్డీవో సీజ్ చేసిన ఇసుక ట్రాక్టర్ విషయంలో కూడా ఎమ్మెల్యే పీఏ తహసీల్దార్ ఎం.శ్రీనుతోనూ దురుసుగా ఫోన్లో మాట్లాడా రని ఈ సందర్భంగా పట్టణంలో చర్చించుకుంటున్నారు. గ్రోత్ సెంటర్లోని గ్రావెల్ దందాకు వినియోగిస్తున్న వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించినట్టు తహసీల్దార్ ఎం.శ్రీను తెలిపారు. ● ప్రశ్నించిన విలేకరులకు బెదిరింపులు -
డీసీసీబీ పర్సన్ ఇన్చార్జ్గా.. కిమిడి నాగార్జున బాధ్యతల స్వీకరణ
విజయనగరం అర్బన్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నాన్ అఫీషియల్ పర్సన్ ఇన్చార్జ్గా కిమిడి నాగార్జున ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. స్థానిక ప్రైవేట్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో డీసీసీబీ సీఈఓ సీహెచ్.ఉమామహేశ్వరరావు ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కిమిడి నాగార్జున మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి, రైతులకు తోడ్పాటును అందించేందుకు కృషి చేస్తానన్నారు. డీసీసీబీ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. బాధ్యతలు స్వీకరించిన నాగార్జునకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు కిమిడి కళావెంకటరావు, కోళ్ల లలితకుమారి, కోండ్రు మురళీమోహన్, బోనెల విజయ్ చంద్ర, లోకం నాగమాధవి, పి.అదితి గజపతిరాజు, కేంద్ర మాజీ మంత్రి అశోక్గజపతిరాజు, మాజీ మంత్రి కిమిడి మృణాళిని, మాజీ ఎమ్మెల్యేలు భంజ్దేవ్, కిమిడి గణపతిరావు, డాక్టర్ కేఏనాయుడు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ వర్మ పలువురు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, డీసీసీబీ సిబ్బంది అభినందనలు తెలిపారు. డీసీఎంఎస్ సేవలను విస్తృతం చేస్తా విజయనగరం ఫోర్ట్: జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం లిమిటెడ్ సేవలను విస్తృతం చేయడం ద్వారా సంఘాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని చైర్మన్ గొంప కృష్ణ అన్నారు. స్థానిక సంఘంకార్యాలయంలో ఆదివారం డీసీఎంఎస్ చైర్మన్గా ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకు ప్రభుత్వం నుంచి లభించే గౌరవ వేతనం. ఇతర అలివెన్స్లు తీసుకోబోనని, ఆ డబ్బును డీసీఎంఎస్ బలోపేతం చేసేందుకు వినియోగిస్తానని ప్రకటించారు. డీసీఎంఎస్ ఫలాలను అందరికీ అందించేందుకు సాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. సంఘం ఆదాయాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తానన్నారు. సేవలను మరింత ఎక్కువ మందికి అందిస్తానని చెప్పారు. బాధ్యతలు స్వీకరించిన కృష్ణను మంత్రులు సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాసరావు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు కిమిడి కళా వెంకటరావు, కోండ్రు మురళీమోహన్, పి. అదితి గజపతిరాజు, బోనెల విజయచంద్ర, కోళ్ల లలితకుమారిలు అభినందించారు. -
వెబ్ కౌన్సెలింగ్ రద్దు చేసే వరకు ఉద్యమం
● కలెక్టరేట్ ఎదుట టీచర్ల నిరసన ● కదం తొక్కిన ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక విజయనగరం అర్బన్: ఎస్జీటీలకు వెబ్ కౌన్సెలింగ్ విధానంలో బదిలీలు నిర్వహించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఎస్జీటీలకు మాన్యువల్ విధానంలోనే కౌన్సెలింగ్ నిర్వహించాలనే ప్రధాన డిమాండ్తో రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలు ఆదివారం కూడా కొనసాగాయి. స్థానిక కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక సభ్యులు నిరసనలు తెలుపుతూ కదం తొక్కారు. నిరసనలో ఉపాధ్యాయులు నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక ప్రతినిధులు మాట్లాడుతూ ఎస్జీటీల బదిలీలను మాన్యువల్లో నిర్వహిస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలుపుకోవాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. తొలిత షెడ్యూల్లో ప్రకటించిన వెబ్ కౌన్సెలింగ్ విధానాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో ఉపాధ్యాయులు మానసిక ఒత్తిడిలో ఉన్నారని, ఇచ్చిన మాట ప్రకారం ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు డి.శ్రీనివాస్, వి.రవీంధ్రనాయుడు, జోగారావు, కేఎస్ శ్రీనివాసరావు, సూరిబాబు, బంకపల్లి శివప్రసాద్, డి.రాము, డి.ఈశ్వరరావు, జేవీఆర్కే ఈశ్వరరావు, పైడిరాజు, పి.శ్రీనివాసరావు, ఎన్.రమణ, కంది రామారావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్లకార్డుతో నిరసన -
సారా నియంత్రణే లక్ష్యంగా కార్డన్సెర్చ్
విజయనగరం క్రైమ్/గుర్లు: సారా నియంత్రణే లక్ష్యంగా జిల్లా కేంద్రంతోపాటు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ‘కార్డన్ సెర్చ్‘ చేపడుతున్నామని ఎస్పీ వకుల్ జిందల్ స్పష్టం చేశారు. ప్రజల రక్షణ, భద్రత, నేరాల కట్టడితో పాటు సారా అక్రమ రవాణా నియంత్రణే లక్ష్యంగా చీపురుపల్లి పోలీస్సబ్ డివిజన్ పరిధి గుర్ల పోలీస్ స్టేషన్ పరిధి దేవుని కణపాక గ్రామంలో ఆదివారం ఉదయం 5గంటలకు చీపురుపల్లి సర్కిల్ సిబ్బంది ఆపరేషన్ నిర్వహించారని ఎస్పీ చెప్పారు. స్టేషన్ సీఐ శంకరరావు ఆధ్వర్యంలో సర్కిల్ పోలీసు అధికారులు, సిబ్బంది గ్రామస్తుల ఇళ్లలోను, బహిరంగ ప్రదేశాల్లో ఆకస్మికంగా సోదాలు నిర్వహించారన్నారు. గ్రామంలో నివాసం ఉన్న అనుమానిత వ్యక్తులపై నిఘా ఏర్పాటు చేసేందుకు, ప్రజల రక్షణకు భరోసా కల్పించేందుకు గుర్ల, గరివిడి, బుదరాయవలస ఎస్సైలు 35 మంది సిబ్బంది బృందాలుగా ఏర్పడి సోదాలు నిర్వహించారని చెప్పారు. గ్రామంలోని అన్ని ఇళ్లలో ఆకస్మిక సోదాలు నిర్వహించి, అపరిచిత వ్యక్తుల వివరాలు సేకరించి, వారి వేలిముద్రలను ఎంఎస్సీడీ పరికరాలతో తనిఖీ చేశారని చెప్పారు. అదేవిధంగా వారి దగ్గర లభించిన వాహనాల రికార్డులను పరిశీలించి, రికార్డులు సక్రమంగాలేని ఆరు ద్విచక్ర వాహనాలను తదుపరి చర్యల నిమిత్తం గుర్ల పోలీస్ స్టేషన్కు తరలించామన్నారు. నుమానిత వ్యక్తులు పారిపోయేందుకు అవకాశం ఉన్న మార్గాలను ముందుగా గుర్తించి, ఆయా మార్గాలను పోలీసు బృందాలతో దిగ్బంధం చేసినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో 400లీటర్ల బెల్లం ఊటను గుర్తించి, ధ్వంసం చేశామన్నారు. ఈ ఆపరేషన్లో చీపురుపల్లి సీఐతో పాటు గుర్ల, గరివిడి, బుదరాయవలస ఎస్సైలు పి.నారాయణరావు, లోకేశ్వరరావు, లోకేష్, సిబ్బంది పాల్గొన్నారు. -
వివాహిత ఆత్మహత్యా యత్నం
వేపాడ: మండలంలోని వల్లంపూడి పోలీస్స్టేషన్ ఎదురుగా రోడ్డుపై పెట్రోలు పోసుకుని ఓ వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆదివారం జరిగిన ఈ సంఘటన స్థానికంగా చంచలనం రేకెత్తించింది. ఇందుకు సంబంధించి వల్లంపూడి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎస్.కోట మండలంలోని కాపు సోంపురానికి చెందిన రొంగలి లక్ష్మి కొంత కాలంగా భర్తకు దూరంగా తన ఇద్దరు పిల్లలతో ఉంటోంది. ఈ క్రమంలో ఆమెకు కొంత కాలం క్రితం వేపాడ మండలం సోంపురం గ్రామానికి చెందిన ప్రస్తుతం వల్లంపూడిలో నివాసముంటున్న యోగుల కాళీతో పరిచయం ఏర్పడింది. కాళీ తన భార్య, ఇద్దరు పిల్లలతో వల్లంపూడిలో నివాసముంటున్నాడు. రొంగలి లక్ష్మి, కాళీల మధ్య ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే కొంతకాలంగా లక్ష్మి వద్దకు కాళీ వెళ్లకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీనిపై ఆదివారం వల్లంపూడి పోలీసులు కాళీతో పాటు లక్ష్మిని స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. గ్రామపెద్దల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తుండగా ఇద్దరం పొరపాటు చేశామని ఇద్దరికీ పిల్లలు ఉన్నందున ఇకపై ఎవరి బతుకులు వారు బతుకుదామంటూ కాళీ నచ్చచెప్పే ప్రయత్నం లక్ష్మికి చేశాడు. దీంతో కలత చెందిన ఆమె తనను నమ్మించి కాళీ మోసం చేశాడని ఈ జీవితం తనకు అవసరం లేదంటూ స్టేషన్ బయటకు పరుగెత్తి ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుంది. ఈ హఠాత్పరిణామంతో నివ్వెరపోయిన పోలీసులు, స్థానికులు హుటాహుటిన ఆమె శరీరంపై రగ్గు కప్పి లక్ష్మిని కాపాడి 108 వాహనంలో ఎస్.కోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళ ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని, లక్ష్మి ఇచ్చిన వాగ్మూలంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుదర్శన్ తెలిపారు. -
రైతులంతా ఒక్కటై...
రేగిడి మండలం సంకిలి వద్ద ఉన్న సాయన్న చానల్ తిరుగుడు గెడ్డ షట్టర్లు పూర్తిగా పాడయ్యాయి. దీంతో నీటి అదుపు లేక ఆయకట్టు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై అధికారులకు రైతులు పలుసార్లు విన్నవించినా స్పందించలేదు. ఖరీఫ్ వచ్చేయడంతో చేసేది లేక రైతులే స్వయంగా షట్టర్లు మరమ్మతులు చేసేందుకు ముందుకొచ్చారు. పుర్లి ఎంపీటీసీ కురిటి రామకోటి, మాజీ ఎంపీటీసీ పాలవలస సూర్యారావు, ఖండ్యాం నీటి సంఘం ప్రాదేశిక సభ్యుడు పాలవలస ప్రసాద్ అంతా కలిసి రూ.1.50లక్షలు ఖర్చు చేసి మూడు షట్టర్లను తయారు చేయించి తిరుగుడు గెడ్డ వద్ద ఆదివారం అమర్చారు. – రేగిడి -
రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు బొబ్బిలి విద్యార్థులు
బొబ్బిలి: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఈనెల 9 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు బొబ్బిలి క్రీడాకారులు ఎంపికై నట్లు కోచ్ బంకురు ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సబ్జూనియర్ విభాగంలో ఎన్.హర్షిత, బి వరలక్ష్మి, క్యాడెట్ విభాగంలో బి.భరద్వాజ్, జూనియర్ విభాగంలో బి గౌతమి, పి.సంజన, సోమేశ్ యాదవ్, బి.శివరామకృష్ణ, సీనియర్స్ విభాగంలో కె.అభినవ్, వై.కిశోర్ కుమార్, బి.రోహిత్, ఎన్.కిరణ్లు తాడిపత్రిలో పోటీలకు హాజరవుతున్నారన్నారు. వారంతా గత నెల 31న బొబ్బిలిలో జరిగిన జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో ముందు నిలిచారన్నారు. -
బీసీ సంక్షేమ శాఖ బదిలీల్లో అవకతవకలు
విజయనగరం టౌన్: బీసీ సంక్షేమ శాఖలో హాస్టల్ వెల్పేర్ ఆఫీసర్ (వార్డెన్)ల బదిలీల ప్రక్రియకు సంబంధించి అస్మదీయులకు ప్రాధాన్యతనిచ్చినట్టు, నిబంధనలకు విరుద్ధంగా జిల్లా అధికారులు వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బదిలీల ప్రక్రియలో భాగంగా సీనియారిటీ ప్రకారం చేపట్టాల్సిన ప్రక్రియను పక్కదోవ పట్టించి సీనియారిటీ తక్కువ ఉన్న వారికి అందలం ఎక్కించడంలో ఆ శాఖ అధికారులు కీలకపాత్ర పోషిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సీనియారిటీలో 6, 7 స్థానాల్లో ఉన్న వారికి విజయనగరం హెడ్క్వార్టర్స్లోనూ, మరొకరిని నెల్లిమర్లకు బదిలీ చేశారు. రెండో స్థానంలో ఉన్న హాస్టల్ వార్డెన్ గతంలో సాలూరు, చీపురుపల్లి, ఎస్.కోటలో పని చేశారు. జిల్లా కేంద్రంలో పని చేయలేదు. ఇదిలా ఉంటే గతంలో జిల్లా హెడ్క్వార్టర్లో పని చేసిన వారికి ఇప్పుడు సీనియారిటీలో చివరి స్థానమైన 6, 7 స్థానాలను మరలా జిల్లా కేంద్రానికి, నెల్లిమర్లలకు బదిలీ చేశారు. రెండో స్థానంలో స్పౌజ్ సర్టిఫికెట్ జత చేసి ఉన్న హాస్టల్ వార్డెన్ను జిల్లాలో మారుమాల ప్రాంతమైన చిన్నమేరంగికి బదిలీ చేయడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కలెక్టర్ దీనిపై స్పందించి, పూర్తి స్థాయిలో స్వీయ విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. దీనిపై బీసీ సంక్షేమాధికారిణి జ్యోతిశ్రీని వివరణ కోరగా నిబంధనల ప్రకారమే బదిలీల ప్రక్రియ కొనసాగిందన్నారు. కమిటీలోని సభ్యులందరూ ఆమోదంతోనే ప్రక్రియ చేపట్టామని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా బదిలీల ప్రక్రియ బదిలీల్లో సీనియారిటీకి ప్రాధాన్యతనివ్వని యంత్రాంగం? కమిటీ ఆధ్వర్యంలోనే బదిలీలు చేపట్టామన్న అధికారులు -
అంతా గుట్టుగానే...!
పేదలకు చేరాల్సిన బియ్యం కోళ్ల ఫారాలకు, మామిడి తోటలకు పెద్ద ఎత్తున తరలిపోయాయి. అదీ కూడా ప్రభుత్వ సరఫరా చేసిన నార సంచుల ద్వారానే... అంటే వీటి తరలింపు వెనుక ఎవరో గుర్తు తెలియని పెద్ద హస్తమే ఉందన్నది నిజం. అలాగే అధికారులు, డీలర్ల పాత్ర కూడా ఉండే ఉంటుందన్నది జనాభిప్రాయం. అయితే వీటిని పట్టుకున్న అధికారులు పెద్ద తిమింగలాలను వదిలేసి చిట్టెలుకలపై చర్యలకు తమ వంతు చర్యలు తీసుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది. అసలు ఈ తరలింపు గుట్టు విప్పాలంటే దీని వెనుక ఉన్న పెద్ద తలకాయలను బయటకు లాగాలని ప్రజలు సూచిస్తున్నారు. ● ఆ బియ్యం ఎక్కడ నుంచి వచ్చాయి? ● అసలు దొంగలను వదిలేశారనే ఆరోపణలు ● రేషన్ దుకాణాల్లో ఉండాల్సిన బియ్యం వ్యాపారుల దగ్గరికి ఎలా చేరాయి? ● డీలర్లు, అధికారుల పాత్రపై అనుమానాలు విజయనగరం ఫోర్ట్: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందించే పీడీఎస్ బియ్యం పెద్ద ఎత్తున పక్కదారి పట్టిన విషయం తెలిసిందే. ప్రతీ నెల ప్రజలకు బియ్యం, పంచదార నిత్యావసర వస్తువులు ప్రజలకు అందిస్తారు. సివిల్ సప్లయి పరిధిలో ఉన్న ఎంఎల్ఎస్ పాయింట్స్ నుంచి రేషన్ దుకాణాలకు బియ్యం, పంచదార వాహనాల ద్వారా సరఫరా చేస్తారు. మే నెల వరకు నిత్యావసర వస్తువులు ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటికి అందించేవారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి రేషన్ దుకాణాల ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తుంది. బొండపల్లి మండలంలో పట్టుబడిన పీడీఎస్ బియ్యం పేదలకు అందించే బియ్యాన్ని కొంతమంది వ్యాపారులు పెద్ద ఎత్తున పక్కదారి పట్టించారు. ఈ సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. కొండకిండాంలోని కోళ్ల ఫారంలో 106 క్వింటాళ్లు పీడీఎస్ బియ్యం, కిండాం ఆగ్రహారం మామిడి తోటలో 43 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో పీడీఎస్ బియ్యం ఎలా అక్కడకు తరలించారనేది అనుమానాస్పదంగా ఉంది. దీని వెనుక ఎవరెవరున్నారో తేలాల్సి ఉంది. అధికారులు, డీలర్లు పాత్ర లేకుండా జరిగే పని కాదని సర్వత్రా చర్చనీయాంశమైంది. డీలర్లు, అధికారుల పాత్రపై అనుమానాలు..! పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలించే వ్యాపారులు నార సంచుల్లో నేరుగా తరలించడం కుదరదు. రేషన్ డీలర్లు లేదా అధికారుల సహకారంతోనే పీడీఎస్ బియాన్ని వ్యాపారులు తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారి పాత్ర లేకపోతే బియ్యం వ్యాపారులు అంత దర్జాగా వీటిని తరలించలేరనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొండకిండాం కోళ్ల ఫారంలో నార సంచుల్లో పట్టుబడ్డ పీడీఎస్ బియ్యం బియ్యం ఎవరు తరలించారు? పక్కదారి పడుతున్న విచారణ? పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్న అధికారులు వాటిని తరలించే వ్యాపారులపై కేసులు నమోదు చేసి అసలు దొంగలను వదిలేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బియ్యం వ్యాపారులకు పీడీఎస్ బియ్యాన్ని ఎవరు విక్రయించారు, రేషన్ డీలర్లు విక్రయించారా, లేదంటే ఎంఎల్ఎస్ పాయింట్స్ సరఫరా చేస్తున్న సమయంలో పక్కదారి పట్టించారా.. అనే దానిపై విచారణ చేపట్టాల్సి ఉండగా.. ఆ దిశగా విచారణ జరగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేషన్ షాపుల్లో ఉండాల్సిన బియ్యం అంత ధైర్యంగా ఎలా తరలించారు అనేది సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్న. క్రిమినల్ కేసులు పెట్టాం.. పీడీఎస్ బియ్యం తరలించిన వ్యక్తులపై 6ఏ కేసులతో పాటు క్రిమినల్ కేసులు పెట్టాం. పెద్ద ఎత్తున పీడీఎస్ బియ్యం పట్టుబడడంతో సీరియస్గా దీన్ని తీసుకున్నాం. బియ్యం ఎక్కడ నుంచి తరలించారన్న దానిపై విచారణ చేయాలని పోలీసులను కోరాం. – కె.మధుసూదనరావు, జిల్లా పౌర సరఫరాల అధికారి రేషన్ దుకాణాల్లో ఉండాల్సిన పీడీఎస్ బియ్యం కోళ్ల ఫారంకు, మామిడితోటలోకి ఎవరు తరలించారనే ప్రశ్న సర్వత్రా వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఎంఎల్ఎస్ పాయింట్స్ ద్వారా నార సంచుల్లో ప్రభుత్వ ముద్ర వేసిన ట్యాగ్తో పీడీఎస్ బియ్యం రేషన్ షాపులకు సరఫరా అవుతుంది. అవే సంచులతో బియ్యం పక్కదారి పట్టడం వెనుక ఎవరి హస్తం ఉందన్నది తేలాల్సి ఉంది. ఎంఎల్ఎస్ పాయింట్స్ ద్వారా రేషన్ షాపులకు సరఫరా అవుతున్న సమయంలో పక్కదారి పట్టించారా... లేదా రేషన్ షాపులకు సరఫరా అయిన తర్వాత డీలర్లు సాయంతో పక్కదారి పట్టించారా... అన్న విషయంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
వెబ్ కౌన్సెలింగ్ రద్దు చేయకపోతే ఉద్యమమే
విజయనగరం అర్బన్: ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియలో ఎస్జీటీలకు మాన్యువల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలుపుకోవాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. తొలిత షెడ్యూల్లో ప్రకటించిన వెబ్ కౌన్సెలింగ్ విధానాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమిస్తామని ప్రకటించింది. ఈ మేరకు శనివారం కలెక్టరేట్లోని డీఈవో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక సభ్యులు మాట్లాడుతూ ఉన్నతాధికారులు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధుల సమావేశంలో ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీల నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పిందని ఈ రోజు లీప్ యాప్లో వెబ్ కౌన్సెలింగ్ మోడల్ వీడియోను విడుదల చేశారని అన్నారు. వెబ్ కౌన్సెలింగ్ విధానంలో రెండు వేలకు పైగా ఆప్షన్స్ నమోదు చేయడం తప్పనిసరి బదిలీ ఉపాధ్యాయులకు కష్టతరమని అన్నారు. ఈ విషయంలో ఉపాధ్యాయులు మానసిక ఒత్తిడిలో ఉన్నారని, ఇచ్చిన మాట ప్రకారం ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అనంతరం వినతిపత్రాన్ని డీఈవో మాణిక్యంనాయుడుకు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు డి.శ్రీనివాస్, వి.రవీంధ్రనాయుడు, జోగారావు, కేఎస్ శ్రీనివాసరావు, సూరిబాబు, బంకపల్లి శివప్రసాద్, డి.రాము, డి.ఈశ్వరరావు, జేవీఆర్కే ఈశ్వరరావు, పైడిరాజు, పి.శ్రీనివాసరావు, ఎన్.రమణ, కంది రామారావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు. మాటిచ్చారు... నిలుపుకోండి ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక డీఈవో కార్యాలయం ఎదుట నిరసనలు -
ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ రిజిస్ట్రేషన్
విజయనగరం ఫోర్ట్: ఎంబీబీఎస్ పూర్తి చేసిన వైద్య విద్యార్థులు వైద్యుడిగా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఏపీ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అదే విధంగా ఐదేళ్లకు ఒకసారి రెన్యూవల్ చేసుకోవాలి. ఈ ప్రక్రియను ఏపీ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో గాజులరేగ వద్ద ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలో ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ శ్రీహరి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంతవరకు రిజిస్ట్రేషన్తో పాటు రెన్యూవల్ కోసం వైద్యులు విజయవాడ వచ్చేవారని, దీంతో ఇబ్బంది పడుతున్నారని ఉద్దేశంతో జిల్లాలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలల్లో దీన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఆదివారం కూడా ఈ పక్రియ కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.పద్మలీల, ఐఎంఏ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎం.జయచంద్ర నాయుడు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో కోవిడ్ కేసు నమోదు ● నెల్లిమర్ల మండలం పారసాం వ్యక్తికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ విజయనగరం ఫోర్ట్: జిల్లాలో తొలి కోవిడ్ కేసు నమోదైంది. నెల్లిమర్ల మండలం పారసాం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి జ్వరం, దగ్గు, ఆయాసంతో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 10 రోజుల క్రితం చేరారు. అతనికి వైద్య పరీక్షలు చేసిన వైద్యులు నిమోనియా అనుకుని ఆసుపత్రిలోని స్టెఫ్ డౌన్ ఐసీయూలో చేర్చి చికిత్స అందించారు. శుక్రవారం అతనికి కోవిడ్ పరీక్ష కోసం శాంపిల్ తీసి విశాఖలోని కేజీహెచ్కు పంపించారు. అక్కడ ఆర్టీపీఎస్ఆర్ పరీక్ష చేయగా అతనికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఆసుపత్రిలో చేరినప్పడు అతనికి ఆక్సిజన్ లెవల్స్ 45 నుంచి 60 ఉండేది. ప్రస్తుతం ఆక్సిజన్ లెవల్స్ 90 నుంచి 91 మధ్య ఉంది. దీంతో అతన్ని ఆసుపత్రి వైద్యాధికారులు శనివారం డిశ్చార్జ్ చేసి హోం ఐసోలేషన్లో ఉండాలని సూచించారు. ఇంకా అందుబాటులోకి రాని ఆర్టీపీసీఆర్ పరీక్షలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఇంకా ఆర్టీపీసీఆర్ పరీక్షలు అందుబాటులోకి రాలేదు. ఆర్టీపీఎస్ఆర్ పరీక్షలు చేయడానికి అవసరమైన ల్యాబ్ను ఇంకా సిద్ధం చేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో కోవిడ్ లక్షణాలు ఉన్న వారి నుంచి శాంపిల్స్ తీసి విశాఖపట్నం కేజీహెచ్కు పంపిస్తున్నారు. 9న విజన్ ప్లాన్ కార్యాలయం ప్రారంభం ● ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కార్యాలయం ఏర్పాటు ● కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విజయనగరం అర్బన్: అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా రూపొందించిన విజన్ ప్లాన్ (దార్శనిక పత్రం) అమలు కోసం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యాలయాలను ఈ నెల 9వ తేదీన ప్రారంభించనున్నామని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వెల్లడించారు. నియోజకవర్గ కేంద్ర ఎంపీడీవో కార్యాలయంలో విజన్ ప్లాన్ అమలు కార్యాలయాలు ఏర్పాటవుతాయని ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఈ కార్యాలయాలు ప్రారంభిస్తారని చెప్పారు. ఈ కార్యాలయాల ప్రారంభోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను ఆయా నియోజకవర్గ ప్రత్యేక అధికారులు చేపట్టాలన్నారు. జిల్లాలోని నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లతో కలెక్టర్ శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఈ మేరకు ఆదేశించారు. -
రామతీర్థంలో ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో శనివారం పలువురు చిన్నారులు చేసిన సంప్రదాయబద్ధ నృత్య ప్రదర్శనలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విజయనగరంలోని మయూరి నృత్యాలయ డైరెక్టర్ శ్రీదేవి కృష్ణ ఆధ్వర్యంలో స్వామి సన్నిధిలో విద్యార్థినులు నత్య నీరాజనాన్ని సమర్పించారు. రఘుకుల తిలకా రారా..నిన్నెత్తి ముద్దులాడెదరా..అంటూ జానపద గేయానికి చిన్నారులు చేసిన నృత్యం విశేషంగా ఆకట్టుకుంది. హడలెత్తిస్తున్న ఏనుగులుభామిని: మండలంలోని తాలాడలో నాలుగు ఏనుగుల గుంపు శనివారం హడలెత్తించింది. ఎండ తీవ్రత తగ్గిన వెంటనే తోట నుంచి బయటకు వచ్చి రోడ్లు వెంబడి సంచరించిన ఏనుగులు బెంబేలెత్తించాయి. కొద్ది రోజులుగా తాలాడ సమీపంలోని ఐలమ్మ తోటలో తిష్ఠ వేసిన ఏనుగులు ఆహారం కొరతతో సాయంత్రం బయటకు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఏనుగుల గుంపు వెంట స్థానికులు పరుగులు తీశారు. శుక్రవారం రాత్రి మొక్కజొన్న గింజల బస్తాలు ధ్వంసం చేసిన ఏనుగుల గుంపు ఎటువైపు పయనిస్తుందోనన్న భయాందోళనతో ఏనుగుల వెంట వెళ్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గోతిలో పడి కార్మికుడికి తీవ్ర గాయాలుబొబ్బిలి: మండలంలోని అలజంగి గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు అలజంగి ఆచారి శుక్రవారం రాత్రి బాడంగి, రామభద్రపురం మండల కేంద్రాలకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా రామభద్రపురం–జగనన్న కాలనీల మధ్య ఉన్న పెద్ద గోతిలో పడిపోయాడు. దీంతో తల, కాలర్బోన్లకు గాయాలయ్యాయి. గాయపడిన ఆచారిని బాడంగి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం విశాఖ కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆచారిని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పొట్నూరు శంకర రావు శనివారం వెళ్లి పరామర్శించారు. పేద కార్మికుడికి తీవ్ర గాయాలైతే ఆదుకోవాల్సిన భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డును ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, దీంతో పేదలైన కార్మికులు వీధిన పడుతున్నారన్నారు. ఆచారి నిరుపేద అని, ఇద్దరు చిన్న ఆడపిల్లలతో ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాడని, దాతలెవరైనా ఫోన్ 7780623626 నంబర్ను సంప్రదించి తోచినంత సహాయం చేయాలని కోరారు. నేడు డీసీసీబీ చైర్మన్గా కిమిడి నాగార్జున బాధ్యతల స్వీకరణవిజయనగరం అర్బన్: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్గా కిమిడి నాగార్జున ఆదివారం పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్లు డీసీసీబీ సీఈఓ సీహెచ్ ఉమామహేశ్వరరావు తెలిపారు. ఉదయం 10.30 గంటలకు నగరంలోని పూల్భాగ్ రోడ్డులో ఉన్న ‘జె’ కన్వెన్షన్లో నిర్వహించనున్న కార్యక్రమంలో ఆయన పదవీ స్వీకారం చేస్తారని పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి, కింజరావు అచ్చెన్నాయుడు. జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. డీసీఎంఎస్ చైర్మన్గా గొంప కృష్ణ.. అలాగే జిల్లా సహకార మార్కెంటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) చైర్మన్గా నియమితులైన గొంప కృష్ణ ఆదివారం బాధ్యతలు చేపట్టనున్నట్లు డీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్ సాయికుమార్ తెలిపారు. మధాహ్నం 1 గంటకు నగరంలోని పోస్టాఫీస్ ఎదురుగా ఉన్న కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొంటారని పేర్కొన్నారు. -
ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ చేపట్టాలి
పార్వతీపురం టౌన్: పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ను చేపట్టాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో మలేరియా ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయని ఆయా ప్రాంతాల్లో మరింత సమర్థవంతంగా డ్రైవ్ను నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో మంచి పారిశుద్ధ్య పరిస్థితులు ఏర్పడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అందుకు గ్రామ పంచాయతీలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. గ్రామాల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ప్రతి ఇంటి నుంచి తడి చెత్త, పొడి చెత్త సేకరణ జరగాలని వాటిని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు పంపించాలని సూచించారు. వ్యక్తిగతంగా, గృహపరంగా పరిశుభ్రమైన వాతావరణం కలిగి ఉండాలని తద్వారా రోగాలకు దూరంగా ఉండవచ్చన్నారు. ప్రతి శుక్రవారం డ్రైడే నిర్వహించాలని కోరారు. నీటి నిలవకు అవకాశం లేకుండా ఖాళీ కొబ్బరి బొండాలు, సీసాలు, టైర్లు, పాత్రలు తదితర పరికరాలపై దృష్టిసారించి అవి ఎక్కడ లేకుండా చూడాలని స్పష్టం చేశారు. జూన్లోనే పారిశుద్ధ్య డ్రైవ్ జూన్ నెలలోనే జిల్లాలో పారిశుద్ధ్య డ్రైవ్ చేపట్టడం వల్ల రానున్న నెలల్లో సులభతరమవుతుందన్నారు. మురుగు కాలువల్లో ఆయిల్ బాల్స్ వేయడం, దోమల నివారణ కార్యక్రమాలను చేపట్టాలన్నారు. గ్రామాల దగ్గరలో ఉండే నీటి వనరులలో గంబూషియా చేపలను వదలడం వల్ల లార్వా నిరోధక వ్యవస్థగా పనిచేస్తుందని చెప్పారు. ప్రతి ఇంట్లోనూ, బయట దోమల నివారణగా స్ప్రేయింగ్ జరగాలని ఆదేశించారు. దోమ తెరల ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని సూచించారు. పురపాలక సంఘాల్లో కూడా పెద్ద ఎత్తున శానిటేషన్ డ్రైవ్ చేపట్టాలని, కాలువల్లో పూడికలు తీయాలని, మురుగునీరు ఎక్కడా నిలవ లేకుండా చూడాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ -
విద్యాశాఖ మంత్రి రాకకు ఏర్పాట్ల పరిశీలన
పార్వతీపురం టౌన్: రాష్ట్ర విద్యాశాఖామంత్రి నారా లోకేష్ జిల్లా పర్యటనకు సోమవారం రానున్న దృష్ట్యా మంత్రి గుమ్మడి సంధ్యారాణి, రాష్ట్ర ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, కలెక్టర్ శ్యామ్ప్రసాద్, ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి, పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, పార్వతీపురం సబ్కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, ఏఎస్పీ అంకిత సురానా ఏర్పాట్లను పరిశీలించారు. పార్వతీపురం పట్టణంలో పదవ తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు సత్కార కార్యక్రమంలో పాల్గొని, విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడే కార్యక్రమాన్ని స్థానిక రాయల్ కన్వెన్షన్లో ఏర్పాటు చేయగా వసతులను వారు పరిశీలించారు. ఏర్పాట్లు పక్కాగా చేయాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణిి అధికారులను ఆదేశించారు. అనంతరం చినబొండపల్లిలో జరిగే కార్యక్రమం ఏర్పాట్లను తనిఖీ చేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, సర్వశిక్ష అభియాన్ ఏపీసీ తేజేశ్వరరావు, జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారి బి.చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
సేదదీరుతూ అనంతలోకాలకు..!
పెందుర్తి: ఓ నిర్మాణ కూలీ జీవితం నిద్రలోనే కడతేరింది. తాను పనిచేస్తున్న చోటే సేద తీరుతుండగా విధి చిన్నచూపు చూడడంతో ఊపిరాడక అసువులు బాశాడు. పెందుర్తి మండలం ముదపాకలోని జగనన్న కాలనీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పెందుర్తి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా తెర్లాం మండలం నందబలగ గ్రామానికి చెందిన పక్కి సూరన్నదొర (57), గంగమ్మ దంపతులు కుటుంబంతో కలిసి ముదపాకకు వలస వచ్చి ఇక్కడి జగనన్న కాలనీలో నిర్మాణ పనులు చేస్తుంటారు. సూరన్నదొర అన్న కుమారుడు పక్కి ప్రసాద్ ఈ నెల 4న ఇదే ప్రాంతంలో బావిలో పడి మృతి చెందాడు. ఈ క్రమంలో ప్రసాద్ మృతదేహం పోస్టుమార్టం కోసం కేజీహెచ్కు వెళ్లిన సూరన్న.. నీరసంగా ఉండడంతో ముదపాకలోని ఇంటికి తిరిగి వచ్చేశాడు. తీవ్ర విషాదంలో ఉన్న సూరన్న ముదపాకలోనే ఉన్న బంధువులతో అదే రోజు సాయంత్రం మద్యం తాగాడు. ఉదయం మళ్లీ కేజీహెచ్కు వెళ్లి మృతదేహంతో ఊరికి వెళ్తానని చెప్పాడు. అనంతరం సమీపంలో నిర్మాణం కోసం పోసి ఉన్న నల్ల పిక్క రాశిపై పడుకున్నాడు. అయితే అర్ధరాత్రి అక్కడికి పిక్క వేసేందుకు వచ్చిన లారీ డ్రైవర్ సూరన్న నిద్రిస్తున్న విషయాన్ని గమనించకుండా అతనిపైనే అన్లోడ్ చేసేశాడు. అప్పటికే గాఢ నిద్రలో ఉన్న సూరన్నదొర ఊపిరాడక మరణించినట్లు పోలీసులు భావిస్తున్నారు. మూడు రోజుల తర్వాత వెలుగులోకి... కేజీహెచ్కు వెళ్తానని చెప్పిన సూరన్న కనిపించకపోవడంతో విజయనగరం వెళ్లిపోయాడని అందరూ భావించారు. కానీ అతను అక్కడికి కూడా రాకపోవడంతో కుటుంబసభ్యులు ప్రసాద్ అంత్యక్రియలు నిర్వహించకుండా చాలాసేపు ఎదురుచూశారు. చివరకు ఆ కార్యక్రమం పూర్తి చేసుకున్న కుటుంబ సభ్యులు గురువారం తిరిగి ఇక్కడికి వచ్చి సూరన్న ఆచూకీ కోసం ఆరా తీశారు. ఈ క్రమంలో అతను అదృశ్యమైనట్లు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేద్దామని నిర్ణయించుకున్నారు. అయితే శనివారం ఉదయం కాలనీలో నిర్మాణ పనుల కోసం నల్ల పిక్కను తరలించేందుకు పొక్లెయిన్తో లారీలకు లోడ్ చేస్తున్నారు. ఆ సమయంలో నల్ల పిక్క రాశి నుంచి ఓ చేయి బయటకు కనిపించడం, ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా దుర్వాసన రావడంతో ఆందోళనకు గురైన పొక్లెయిన్ ఆపరేటర్ విషయాన్ని కాలనీవాసులకు, గ్రామస్తులకు తెలిపాడు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయగా, అది సూరన్నదొరదేనని కుటుంబ సభ్యులు గుర్తించారు. ప్రాథమిక విచారణ చేపట్టిన సీఐ కె.వి.సతీష్కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏడాది కిందట రైలు ప్రమాదంలో సూరన్న కుమారుడు, మూడు రోజుల కిందట ప్రమాదవశాత్తు బావిలో పడి అతని అన్న కుమారుడు మృతి చెందడంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబంలో.. ఈ తాజా విషాదం తో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. నిద్రపోతున్న కూలీని గమనించని లారీ డ్రైవర్ నల్ల పిక్కలో కూరుకుపోయి కూలీ దుర్మరణం మూడు రోజుల తర్వాత వెలుగుచూసిన విషాద ఘటన -
యథేచ్ఛగా విద్యుత్ చౌర్యం
● పుట్టగొడుగుల్లా షాపులు ● సహకరిస్తున్న విద్యుత్ సిబ్బంది ● రెడ్డి కంచేరులో విద్యుత్కష్టాలు ● గ్రామానికి లోడు సరిపడక ప్రజలు అవస్థలు భోగాపురం: మండలంలోని రెడ్డి కంచేరు గ్రామ ప్రజలు విద్యుత్ కష్టాలతో గడిచిన కొన్ని నెలలుగా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి అతి సమీపంలోనే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణమవుతోంది. ఇదే అదునుగా కొంతమంది అక్రమార్కులు గ్రామంలోని రహదారులను ఆక్రమించి పదుల సంఖ్యలో కొత్త షాపులను నెలకొల్పారు. ఇంతవరకు బాగానే ఉన్నా..షాపులకు నిత్యం విద్యుత్ చౌర్యం చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. సమీపంలోని ట్రాన్స్ఫార్మర్కు కర్రలు కట్టి మరీ విద్యుత్ చౌర్యం చేస్తున్నారని, దీనివల్ల గ్రామానికి లోడు సరిపడక విద్యుత్ సరఫరాలో నిత్యం ఆటంకం ఏర్పడుతోందని వాపోతున్నారు. విద్యుత్ చౌర్యం పట్టపగలే బహిరంగంగా జరుగుతున్నా సంబంధిత అధికారులు కనీసం స్పందించడం లేదని, షాపుల నిర్వాహకులకు ప్రత్యక్షంగా సహకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఆరు ట్రాన్స్ఫార్మర్లు ఉండగా..గ్రామానికి విద్యుత్ సరఫరా అయ్యే ప్రధాన ట్రాన్స్ఫార్మర్ నుంచి కర్రలు కట్టి చౌర్యానికి పాల్పడుతున్నారని వాపోతున్నారు. దీంతో ప్రతి రోజూ రాత్రి 7 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు విద్యుత్ సరఫరాలో ఆటంకం ఏర్పడుతోందని, వేసవి కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమార్కులకు సహకరిస్తూ సుమారు 2వేల మంది జనాభా ఉన్న గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని ప్రజలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా విద్యుత్ అధికారులు స్పందించి విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.నరకయాతన అనుభవిస్తున్నాం ప్రతిరోజూ విద్యుత్ సరఫరాలో ఆటంకం ఏర్పడుతుండడంతో నరకయాతన అనుభవిస్తున్నాం. ఇంత ఘోరం ఎన్నడూ చూడలేదు. వేసవికాలం కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. అక్రమార్కులకు సహకరించకుండా గ్రామానికి విద్యుత్ సరఫరాను సక్రమంగా ఇవ్వాలి. సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ స్పందించడం లేదు. కొల్లేటి అప్పలరాజు, రెడ్డి కంచేరు అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలివిద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుంచి కర్రలు కట్టి యథేచ్ఛగా దొంగతనంగా విద్యుత్ను ఉపయోగించుకుంటున్నారు. మాకు సరఫరా సక్రమంగా అందివ్వడం లేదు. కానీ నెల నెలా బిల్లులు చూస్తే నిజంగానే షాక్ కొడుతోంది. గ్రామానికి మానేసి షాపులకు దొంగతనంగా విద్యుత్ను ఎలా సరఫరా చేస్తారు? విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. సీరపు అప్పలరాముడు, రెడ్డి కంచేరు -
విద్యార్థుల జీవితాలతో ఆటలా..?
విజయనగరం: కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటోందని, పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనంలో పూర్తిగా విఫలమైందని వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు కరుమజ్జి సాయికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మూల్యాంకనాన్ని లోపభూయిష్టంగా నిర్వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యంనాయుడుకు శుక్రవారం వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూలేనివిధంగా పదో తరగతి పరీక్షల ఫలితాల ప్రకటనలో ఇటు పాలకులు, అటు అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 6.14 లక్షల మంది విద్యార్థులు రాత్రీపగలూ కష్టపడి చదివి పరీక్షలు రాస్తే, జవాబు పత్రాలను సరిగ్గా దిద్దకుండా, లోపభూయిష్టమైన మార్కుల లెక్కింపుతో ఫెయిల్ చేసి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అంతులేని మానసిక క్షోభకు గురిచేశారన్నారు. ట్రిపుల్ ఐటీ, గురుకుల జూనియర్ కాలేజీలు సహా ఇతరత్రా విద్యాసంస్థల్లో ప్రవేశాలకు విద్యార్థులు దూరమయ్యారన్నారు. రీవాల్యుయేషన్, రీ కౌంటింగ్లో రాష్ట్రవ్యాప్తంగా 11వేల మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారంటే మూల్యాంకనంలో ఏ స్థాయిలో లోపాలు జరిగాయో అర్థం చేసుకోవచ్చన్నారు. కొందరు విద్యార్థులు కొన్ని సబ్జెక్టుల్లో 95 మార్కులకు పైబడి సాధించడం గమనార్హమన్నారు. ప్రభుత్వ నిర్వాకానికి విద్యార్థులు బలైపోవడానికి వీల్లేదని, తప్పులకు బాధ్యులైన విద్యాశాఖ మంత్రి లోకేశ్తో పాటు అందరిపైనా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా విద్యార్థి విభాగం నాయకులు ధీరుయాదవ్, బోనెల తరుణ్, తిరుపతిరావు, గణేష్, అశోక్, సాయి, మురళీ, తదితరులు పాల్గొన్నారు. పదోతరగతి జవాబుపత్రాల మూల్యాంకనంలో యంత్రాంగం విఫలం బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి వైఎస్సార్సీపీ జిల్లా విద్యార్ధి విభాగం అధ్యక్షుడు కరుమజ్జి సాయి డిమాండ్ డీఈఓకు వినతిపత్రం అందజేత -
తీవ్రంగా నష్టపోతున్నాం...
మామిడి పండ్లు మార్కెట్కు తీసుకెళ్తే కొనుగోలుచేసేవారి కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. ఒకవేళ ఎవరో వచ్చినా వారికి నచ్చిన ధరకు అడుగుతున్నారు. పండ్లు పోతాయేమోనన్న భయంతో వారడిగిన ధరకు ఇవ్వాల్సి వస్తుంది. రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో కాయలు కోయకుండా చెట్లకే వదిలేస్తున్నాం. ఈ ఏడాది అప్పు చేసి రూ.3 లక్షల పెట్టుబడి పెట్టి తోటలు కొనుగోలు చేశాను. అకాల వర్షాల వల్ల రూ.2 లక్షల వరకు నష్టపోతున్నాను. అప్పు తీరే పరిస్థితి లేదు. మామిడి రైతును ప్రభుత్వం ఆదుకోవాలి. – చొక్కాపు చిన్నంనాయుడు, మామిడి రైతు, రామభద్రపురం -
పకడ్బందీగా డీఎస్సీ
● పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ విజయనగరం అర్బన్: డీఎస్సీ పరీక్షను పకడ్పందీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో స్థానిక ఐయాన్ డిజిటల్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. అభ్యర్థులకు అక్కడ కల్పించిన వసతులు, పరీక్ష నిర్వహణ, బందోబస్తును పరిశీలించారు. కలెక్టర్ వెంట డీఈఓ యు.మాణిక్యంనాయుడు, ఇన్చార్జి తహసీల్దార్ స్వర్ణకూమార్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కేసుల నమోదు
విజయనగరం ఫోర్ట్: పేదలకు అందించాల్సిన పీడీఎస్ బియ్యంను అక్రమంగా తరలిస్తున్న అంశంపై ‘మంత్రి ఇలాకాలో.. పేదల బియ్యం పక్కదారి’ అనే శీర్షికన ‘సాక్షి’లో శుక్రవారం ప్రచురితమైన వార్తకు పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందించారు. పేదల బియ్యాన్ని పక్కదారిపట్టిస్తున్న వ్యక్తులపై 6ఏ కేసులతో పాటు, క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు జిల్లా పౌరసరఫరాల అధికారి కె.మధుసూదనరావు తెలిపారు. గొట్లాం గ్రామం నుంచి గజపతినగరం వైపు 10 క్వింటాల పీడీఎస్ బియ్యం తరలిస్తూ పట్టుబడిన ముప్పిడి గణేష్తో పాటు బొండపల్లి మండలం కిండాం ఆగ్రహారంలోని మామిడి తోటలో 43 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం, కొండ కిండాం గ్రామంలోని కోళ్ల ఫారంలో 106 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం నిల్వ చేసిన సీమల వెంకటరమణ, కళ్ల వెంకటరావుపై 6ఏతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. బియ్యంను కిండాం ఆగ్రహారం నుంచి విశాఖపట్నంలోని ఆనందపురం మండలానికి బండారు వెంకట ఎల్లాజీ అనే వ్యక్తి తరలిస్తున్నట్టు తెలిసిందన్నారు. ఇతనిపై గతంలో 3 నుంచి 4 వరకు 6ఏ కేసులు నమోదుచేసి క్రిమినల్ కేసులు పెట్టామన్నారు. -
రూ.13,444 కోట్లతో వార్షిక రుణప్రణాళిక
విజయనగరం అర్బన్: జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.13,444 కోట్లతో వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్ డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ విడుదల చేశారు. గత ఏడాది కన్నా 19.20 శాతం అదనంగా ఈ ఏడాది రుణ ప్రణాళిక వ్యయం పెంచినట్టు కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన జిల్లాస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది రుణ ప్రణాళికలో వ్యవసాయ రంగానికి రూ.8,025 కోట్లను కేటాయించామన్నారు. ఎంఎస్ఎంఈ కింద ముద్ర, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా రుణాల కోసం రూ.1,843 కోట్లను కేటాయించామని చెప్పారు. విద్య, గృహ నిర్మాణరంగాలకు రూ.282 కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు. శతశాతం రూణాలు అందజేసేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని కోరారు. నవంబర్ నెలలో తుఫాన్లు వచ్చే అవకాశం ఎక్కువని, అక్టోబర్ నాటికే వరిపంట కోత పూర్తయ్యేలా ప్రణాళికలు వేసుకోవాలని తెలిపారు. పీఎం విశ్వకర్మ పథకానికి 86,386 దరఖాస్తులు అందగా స్టేజ్ 3 వెరిఫికేషన్ అనంతరం 6,182 దరఖాస్తులను ఆమోదించినట్టు చెప్పారు. కార్యక్రమంలో ఎల్డీఎం రమణమూర్తి, నాబార్డు డీడీఎం నాగార్జున, జిల్లా అధికారులు, పలు బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. -
వ్యవసాయరంగంపై చిన్నచూపు
రేగిడి: కూటమి ప్రభుత్వం వ్యవసాయరంగంపై చిన్నచూపు చూస్తోందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ ఆరోపించారు. రేగిడికి శుక్రవారం వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఖరీఫ్ సమయం దగ్గరపడుతున్నా ఇంతవరకు రైతు సేవా కేంద్రాలకు విత్తనాలు, ఎరువులు అందకపోవడం దారుణమన్నారు. రైతు సేవా కేంద్రాలకు నేటికీ విత్తనాలు రాకపోవడంతో ప్రైవేటు డీలర్ల వద్ద విత్తనాలను కొనుగోలు చేసుకునే దుస్థితి నెలకుందన్నారు. చెరకు, మొక్కజొన్న పంటలకు ఎరువులు అందజేసే పరిస్థితి లేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఖరీఫ్, రబీ సీజన్లు గడిచిపోయాయి.. మళ్లీ ఖరీఫ్ సీజన్ వచ్చిన అన్నదాత సుఖీభవ పథకం లబ్ధి రైతన్నకు అందలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్బీకేల ద్వారా ఎరువులు, విత్తనాలు పుష్కలంగా అందేవని తెలిపారు. సమావేశంలో బీసీసెల్ అధ్యక్షుడు కరణం శ్రీనివాసరావు, ఎంపీటీసీ సభ్యుడు కింజరాపు సురేష్, లక్ష్మీపురం సర్పంచ్ కెంబూరు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
49 మంది ఎస్ఏలకు ఉద్యోగోన్నతి
విజయనగరం అర్బన్: జిల్లాలో కొద్దిరోజులుగా ఉపాధ్యాయుల బదిలీలు, ఉద్యోగోన్నతుల ప్రక్రియ కొనసాగుతోంది. హెచ్ఎంల బదిలీలు, స్కూల్ అసిస్టెంట్ల ఉద్యోగోన్నతుల తంతు ముగిసింది. బదిలీల షెడ్యూల్ ప్రకారం స్కూల్ అసిస్టెంట్ టీచర్ల బదిలీల ప్రక్రియ శుక్రవారం ముగిసింది. జిల్లాలో బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్న స్కూల్ అసిస్టెంట్ టీచర్స్ 2,125 మంది ఉండగా, వీరిలో తప్పనిసరి బదిలీల ద్వారా 1,290 మందికి స్థాన చలనం కలిగింది. మిగిలిన 835 మంది రిక్వెస్ట్ బదిలీలో ఉన్నారు. ఉద్యోగోన్నతి కోటాలో ఖాళీగా ఉన్న 49 పీఎస్హెచ్ఎం పోస్టులను అర్హులైన సీనియర్ స్కూల్ అసిస్టెంట్లతో భర్తీ చేశారు. వీటిటో స్థానిక విద్యాసంస్థల స్కూళ్లు 24, మున్సిపాలిటీ స్కూల్స్ 20, కార్పొరేషన్ స్కూల్స్ 4, ప్రభుత్వ పాఠశాల ఒకటి ఉంది. ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు విజయనగరం: జిల్లాలోని ముస్లింలకు జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు శుక్రవారం ఓ ప్రకటనలో బక్రీద్ పండగ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పర్వదినం అందరి జీవితాల్లో శాంతి, ఆనందం నింపాలని, అల్లా ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైనా ఉండాలని ఆకాంక్షించారు. మనం చేసే త్యాగాలు సత్ఫలితాలు ఇస్తాయని, దీనికి అల్లా దయ తోడుగా ఉంటుందని పేర్కొన్నారు. మతసామరస్యానికి ప్రతీక బక్రీద్ ● ముస్లిం సోదరులకు ఎస్పీ శుభాకాంక్షలు విజయనగరం క్రైమ్: బక్రీద్ పండగను మతసామరస్యానికి ప్రతీకగా జరుపుకోవాలని ముస్లిం సోదరులకు ఎస్పీ వకుల్ జిందల్ శుక్రవారం పిలుపునిచ్చారు. ముస్లింలందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని మసీదుల వద్ద బక్రీద్ పండగను భక్తిశ్రద్ధలతో, స్నేహభావంతో జరుపుకోవాలని సూచించారు. బక్రీద్ పర్వదినాన ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియా లన్నారు. ముస్లిం హిందువుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాల్లో ప్రసారమయ్యే అసత్య ప్రచారాలను నమ్మవద్దన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. -
సొంత వైద్యం.. కోరి కష్టం!
‘గంట్యాడ మండలానికి చెందిన రామయ్యమ్మ అనే మహిళ నడుం, తలనొప్పి సమస్యలకు మందుల దుకాణంలో కొనుగోలు చేసిన నొప్పి తగ్గిన మందులు ఎక్కువగా వాడేసింది. దీనివల్ల ఆమె రెండు కిడ్నీలు పాడయ్యాయి. ఏడాది పాటు డయాలసిస్ చేయించుకున్నా ఫలితం లేకపోయింది. చివరికి మరణించింది.’ –––––––––––––––––––––––––––– ‘విజయనగరం పట్టణానికి చెందిన అచారి అనే వ్యక్తి కాలికి ఇన్ఫెక్షన్ కావడంతో నొప్పి తగ్గే మాత్రలు, యాంటీ బయాటిక్ మాత్రలను వైద్యుల సూచన లేకుండా వాడాడు. చివరికి మందులు పనిచేయలేదు. శరీరమంతా ఇన్ఫెక్షన్ సోకింది.’ విజయనగరం ఫోర్ట్: ఏదైనా అస్వస్థతకు గురైతే వైద్యులను సంప్రదించాలి. పరీక్షలు చేయించుకుని ఆ నివేదికల ఆధారంగా మందులు వాడాలి. దీనివల్ల శరీరంలోని మిగిలిన అవయవాలపై ఎలాంటి దుష్ప్రభావం పడదు. కానీ, కొందరు తమకు వైద్యం తెలుసు అన్నట్టుగా సొంతంగా దుకాణాల్లో మందులు కొనుగోలు చేసి వాడుతున్నారు. దీనివల్ల ఆరోగ్యసమస్యలు కోరి తెచ్చుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు. నొప్పి మాత్రలు, యాంటీ బయాటిక్ మందులు అధిక మోతుదులో వాడడం వల్ల వాటి ప్రభావం కిడ్నీ, లివర్పై పడుతుందని, ప్రాణాలమీదకి వస్తుందని పేర్కొంటున్నారు. చిన్న సమస్యలకు సైతం యాంటీబయాటిక్స్... గ్రామీణ ప్రాంతాల ప్రజలు తెలిసీతెలియని వైద్యసేవలందించే వారి సలహాల మేరకు మొతాదుకు మించి యాంటీ బయాటిక్స్ వాడుతున్నారు. జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి, నడుంనొప్పి, చర్మ వ్యాధులు... ఇలా ఏ జబ్బుకు అయినా యాంటీ బయాటిక్స్ తప్పనిసరిగా వాడుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులను తెలుసుకోకుండా ఆర్ఎంపీలు ఇస్తున్న మందులు వాడుతూ కిడ్నీ, కాలేయ వ్యాధుల బారిన పడుతున్నారు. వైద్యుడి చీటీ లేకుండానే మందుల అమ్మకాలు.. వైద్యుల చీటీ లేకుండానే మందుల దుకాణాల్లో విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ మందుల విక్రయం కూడా ప్రజల ఆరోగ్యానికి హానికలిగిస్తోందన్నది వైద్యుల మాట. రైతులు, కూలీలు ఒళ్లు నొప్పులు వచ్చిన ప్రతిసారి డైక్లోఫినాక్ ఇంజక్షన్, యాంటీ బయోటిక్ మాత్రలను మందుల దుకాణాల్లో కొనుగోలుచేసి వాడుతున్నారని, దీనివల్ల ఆరోగ్యసమస్యల్లో చిక్కుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు. వైద్యుల చీటీ ఉంటేనే మందులు ఇవ్వాలని సూచిస్తున్నారు. ఆన్లైన్లో పరిశోధన.. చాలామంది ఇప్పుడు ఆరోగ్య సమస్యలకు ఆన్లైన్లో మందులు వెతుకుతున్నారు. ఆస్పత్రుల్లో వైద్యులు వివిధ రకాల వ్యాధులకు రాసి ఇచ్చిన ప్రిస్కప్షన్లను సైతం పక్కన పెట్టేస్తున్నారు. ఆన్లైన్లో సంబంధిత వ్యాధులకు ఎటువంటి మందులు వాడితే తగ్గుతుందన్నది పరిశోధన చేసి వాటినే వాడుతున్నారు. ఇది చాలా అనర్ధాలకు దారితీస్తుందని, రోగిని భౌతికంగా పరీక్షించకుండా, అతనికి ఆ వ్యాధి కాకుండా బీపీ, సుగర్, గుండె జబ్బులు ఏవైనా ఉన్నాయో తెలుసుకోకుండా ఆన్లైన్లో పరిశోధన చేసి మందులు వాడడం రోగికి ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. వైద్యుల సలహామేరకే మందులు వాడాలి వైద్యుల సలహా మేరకే మందులు వాడాలి. లేదంటే ఇతర ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ప్రిస్కప్షన్ లేకుండా మందులు విక్రయిస్తే సంబంధిత మెడికల్ షాపు యజమానిపై చర్యలు తీసుకుంటాం. నిషేధిత మందులు, కాల పరిమితి అయిన మందులు విక్రయిస్తే కేసులు నమోదు చేయిస్తాం. – కె.రజిత, అసిస్టెంట్ డైరెక్టర్, ఔషధ నియంత్రణశాఖ చిన్నచిన్న ఆరోగ్య సమస్యలకు యాంటీబయాటిక్ మందుల వినియోగం ఇవి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం కిడ్నీ, లివర్పై దుష్ప్రభావం వైద్యుల సలహా మేరకు మందులు వాడాడం మంచిది -
పెట్టుబడులు పోయాయి...
180 ఎకరాల విస్తీర్ణంలోని మామిడితోటలను సాగులో కి తీసుకున్నాను. రైతులకు చెల్లించిన సొమ్ముతో పాటు దుక్కులు, మందులు, ఎరువులకు సుమారు రూ.50 లక్షల పెట్టుబడి పెట్టాను. ఇప్పటి వరకు రూ.17 లక్షలకు మాత్రమే పంటను విక్రయించాను. ఇప్పుడు అకాల వర్షాలు కారణంగా కొనుగోలుకు పెద్ద వ్యాపారులు రావడంలేదు. మిగిలిన పంట తోటల్లోనే వదిలేసే పరిస్థితి ఉంది. ఈ ఏడా రూ.33 లక్షల వరకు నష్టపోయే పరిస్థితి ఉంది. ధర పడిపోవడంతో నష్టాలు వస్తున్నాయి. కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. – బవిరెడ్డి చంద్ర, మామిడి వ్యాపారి, రామభద్రపురం -
యోగా.. ఆరోగ్య ఔషధం
పూసపాటిరేగ: మానసిక ప్రశాంతతకు, శారీరక ఆరోగ్యానికి యోగా దివ్య ఔషధమని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను నిత్య జీవితంలో భాగంచేసుకోవాలని పిలుపునిచ్చారు. పూసపాటిరేగ మండలం చింతపల్లి బీచ్లో శుక్రవారం యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా నుంచి 8 లక్షల మందిని భాగస్వాములు చేస్తున్నామన్నారు. పర్యాటక ప్రదేశాల్లో యోగాంధ్ర నిర్వహణలో భాగంగా ఇటీవల రామనారాయణం, నేడు చింతపల్లిలో యోగా సాధన చేసినట్టు వెల్లడించారు. ఈ నెల 10వ తేదీన ఎస్.కోటలో 5 వేల మంది ఉపాధిహామీ వేతనదారులతో యోగాప్రదర్సన ఏర్పాటు చేస్తామని చెప్పారు. యోగాంధ్రంలో భాగంగా చింతపల్లి బీచ్లో సైకత శిల్పి హరికృష్ణ వేసిన యోగాంధ్ర సైకత శిల్పం చూపరులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ కల్యాణచక్రవర్తి, పర్యాటకశాఖ అధికారి కుమారస్వామి, ఆయుష్ అధికారి డాక్టర్ ఆనందరావు, ఎంపీడీఓ ఎం.రాధిక, తహసీల్దార్ తాడ్డి గోవింద, వైద్యాధికారులు రాజేష్వర్మ, ఎ.వి.సుధారెడ్డి, సర్పంచ్ బర్రి మొసలి, వివిధ శాఖల అధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
పైడితల్లి అమ్మవారికి స్వర్ణ పుష్పార్చన
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, సిరుల తల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు శుక్రవారం స్వర్ణ పుష్పార్చనలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజాము నుంచి అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు ఏడిద రమణ ఆధ్వర్యంలో పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, వేదపండితులు సాయికిరణ్, అచ్యుతశర్మ, దూసి శివప్రసాద్లు శాస్త్రోక్తంగా అమ్మవారికి స్వర్ణ పుష్పార్చన సేవను నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ ఇంచార్జ్ ఈవో కెఎన్విడివి.ప్రసాద్ కార్యక్రమాలను పర్యవేక్షించారు. -
తూడెం గ్రామంలో అగ్ని ప్రమాదం
భోగాపురం: మండలంలోని తూడెం గ్రామంలో గ్యాస్ లీక్ కావడంతో ఇల్లు పూర్తిగా కాలిపోయింది. తూడెం గ్రామానికి చెందిన నీలాపు ఆదమ్మ తన కుటుంబ సభ్యులతో కలిసి పూరింటిలో ఉంటుంది. శుక్రవారం తెల్లవారుజామున గ్యాస్ లీక్ కావడంతో ఆదమ్మ గమనించలేదు. వంట చేసేందుకు స్టౌ వెలిగించగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో రూ.2 లక్షలకు పైబడి నగదు, విలువైన వస్తువులు కాలిపోయాయి. సమాచారం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు గాలి రాజారెడ్డి రూ.5వేల నగదు, నిత్యావసర సరుకులు అందజేశారు. రెవెన్యూ సిబ్బంది గ్రామానికి వెళ్లి వివరాలు సేకరించారు. -
చికెన్
బ్రాయిలర్ లైవ్ డెస్డ్ స్కిన్లెస్ శ్రీ110 శ్రీ190 శ్రీ200డీపీవోలో పోలీస్ వెల్ఫేర్ డే విజయనగరం క్రైమ్: పోలీసు శాఖలో పలు హోదాల్లో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి ఎస్పీ వకుల్ జిందల్ డీపీవోలో పోలీసు వెల్ఫేర్ డేను శుక్రవారం నిర్వహించారు. సిబ్బంది నుంచి వినతులు స్వీకరించారు. వారి సమస్యలను తెలుసుకున్నా రు. సిబ్బంది వ్యక్తిగత, వృత్తిపరమైన, శాఖాపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సి బ్బంది వినతులు పరిశీలించిన ఎస్పీ త్వరితగతి న సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతాన ని సిబ్బంది, అధికారులకు భరోసా ఇచ్చారు. బొబ్బిలి విద్యార్థులకు జాతీయ పతకాలు బొబ్బిలి: ఒడిశాలోని కటక్ జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో మే 30 నుంచి మూడు రోజుల పాటు జరిగిన జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో బొబ్బిలి క్రీడాకారులు జాతీయ పతకాలు సాధించినట్టు కోచ్ సుధాకర్యాదవ్ తెలిపారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 200 మంది పాల్గొన్న ఈ పోటీల్లో బొబ్బిలికి చెందిన 17 మంది క్రీడాకారులు వివిధ కేటగిరీలలో గెలుపొందారన్నారు. బంగారు పతకాలు ముగ్గురికి, కాంస్య పతకాలు 9 మందికి, వెండి పతకాలు ఐదుగురికి లభించాయన్నారు. వీరిలో జ్ఞానదీపక్ తన ప్రత్యర్థిపై రెండు రౌండ్లలోనూ 16–0, 13–0 స్కోర్లతో గొప్ప విజయం సాధించినట్టు చెప్పారు. జాతీయ పతకాలు సాధించిన క్రీడాకారులను ఎమ్మెల్యే బేబీ నాయన, డీఎస్పీ జి.భవ్యా రెడ్డి అభినందించినట్టు చెప్పారు. తేనేటీగల దాడిలో పలువురికి గాయాలు రేగిడి: మండల పరిధి కొమెర వెంకటాపురం గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న వేతనదారులుపై తేనేటీగలు శుక్రవారం దాడి చేశాయి. కాలువల్లో పనులు చేస్తుండగా తుప్పులకు ఉన్న తేనెటీగలు దాడి చేయడంతో వేతనదారులు పరుగులు తీశారు. అప్పటికే పలువురి వేతనదారులు తీవ్రంగా గాయపడడంతో ఫీల్డ్ అసిస్టెంట్ రేగిడి రమణ 108కు సమాచారం అందించారు. రేగిడి, పాలకొండ 108 సిబ్బంది రెండు వాహనాల ద్వారా గ్రామానికి చేరుకుని దాడిలో గాయపడిన బట్న జగన్నాథం, ఇందిరాపు రత్నాలమ్మ, వెంపటాపు సూర్యనారాయణ, బట్న రాజేష్, అరసవిల్లి గౌరమ్మ, అరసవల్లి దుర్గారావులతో పాటు మరి కొందరిని ఈఎంటీ మీసాల ఈశ్వరరావు, ఎ.శ్రీనివాసరావు, పైలెట్ జి.నారాయణరావు, వెంకటరమణలు పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. జిల్లా కేంద్రంలో రెండు చోట్ల చోరీ పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో కొత్తవలస ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో ఉన్న శ్రీరంగ మోటార్ మహేంద్ర ట్రాక్టర్ షోరూం, శ్రీ వాసవీ లారీ యూనియన్ కార్యాలయంలో గురువారం రాత్రి చోరీ జరిగినట్టు పట్టణ ఎస్ఐ జగదీష్నాయుడు శుక్రవారం తెలిపారు. ఈ చోరీ ఘటనలో ట్రాక్టర్ షోరూంలో రూ.80వేల నగదు అపహరించినట్టు తెలిపారు. దుండగలు ముందు లారీ యూనియన్ కార్యాలయంలో చోరీకి పాల్పడినట్టు అక్కడ ఏమీ లేకపోవడంతో పక్కనే ఉన్న ట్రాక్టర్ షోరూంలోకి వెనుక భాగం నుంచి ప్రవేశించి చోరీకి పాల్పడినట్టు పేర్కొన్నారు. బాధితుడు బోటు గంగారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఇప్పటికే క్లూస్ టీం ద్వారా ఆధారాలను సేకరిస్తున్నామని, చోరీకి పాల్పడిన ఇద్దరు సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్టు తెలిపారు. -
88 గ్రామాల్లో కుటుంబ సర్వే చేయాలి : పీవో
సీతంపేట: ఐటీడీఏ పరిధిలోని 88 గిరిజన గ్రామాల్లో కుటుంబ సర్వే చేయాలని ఐటీడీఏ పీవో సి.యశ్వంత్కుమార్రెడ్డి ఆదేశించారు. వివిధ మండలాలకు చెందిన మండల స్థాయి అధికారులతో శుక్రవారం తన చాంబర్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధార్ తప్పుల సవరణ, భూమి పట్టాలు ఉన్నాయా లేదా, ఉంటే కరెక్షన్ ఏమైనా చేయాలా?, కుల ధ్రువీకరణ పత్రం, జనన ధ్రువపత్రం వంటివి తీసుకోవాల్సినవి పెండింగ్లో ఉన్నాయనేది సర్వే చేయాలన్నారు. ఎంతమంది ఇంట్లో ఉంటున్నారు, వారి జీవన విధానం తదితర వివరాల సర్వే ఈ నెల 13వ తేదీ వరకు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి నెలాఖరు వరకు అన్ని శాఖలకు చెందిన అధికారులు గ్రామాల్లో క్యాంపయిన్ నిర్వహించి సమస్యలు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో ఏపీవో జి.చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. -
నగరంలో భారీ వర్షం
విజయనగరం: విజయనగరం జిల్లా కేంద్రంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో భారీ ఈదురుగాలులతో ప్రారంభమైన వర్షం గంట సమయం ఏకధాటిగా కురిసింది. ఉదయం నుంచి భానుడి ప్రతాపంతో విలవిలలాడిన అన్ని వర్గాల ప్రజలు మధ్యాహ్నం కురిసిన వర్షంతో కాసింత ఉపశమనం పొందారు. ఇదిలా ఉండగా భారీ ఈదురుగాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయి రాకపోకలకు అంతరాయం కలిగింది. విజయనగరం చింతలవలస వెళ్లే మార్గంలోని ధర్మపురి ప్రాంతంలో రోడ్డుకు అడ్డంగా భారీ వృక్షం నేలకొరగటంతో అటుగా రాకపోకలు సాగించే వారు ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న కార్పొరేషన్ యంత్రాంగం జేసీబీ సహాయంతో వృక్షాన్ని తరలించటంతో సమస్య పరిష్కారమైంది. ఇదిలా ఉండగా ఎప్పటిలానే భారీ వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం: నగరంలో చిన్నపాటి వర్షానికి గంటల తరబడి విద్యుత్ సరఫరాలో అంతరాయం వాటిల్లటం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వర్షాలు కురుస్తున్న సందర్భంలో ఇదే సమస్య ఉత్పన్నమవుతుండగా... సరఫరా పునరుద్ధరణకు గంటల తరబడి సమయం పడుతుండటం గమనార్హం. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు నిలిచిపోయిన విద్యుత్ సరఫరా మరల సాయంత్రం 5 గంటల తరువాత పునరుద్ధరించటం ఇందుకు తార్కాణంగా నిలుస్తుంది. వాస్తవానికి వర్షాకాలానికి ముందుగానే విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రీ మాన్సూన్ ఇన్స్పెక్షన్ పేరిట విద్యుత్ లైన్ల వెంబడి ఉండే చెట్లు, చెట్లు కొమ్మలు తొలగించే చర్యలు చేపడుతున్నప్పటికీ ఫలితం లేకపోతుంది. దీంతో చిన్నపాటి వర్షం కురిసినా గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 3 గంటలకు పైగా విద్యుత్ సరఫరాకు అంతరాయం -
పసుపు సాగుకు సమయమిదే..!
● జిల్లాలో వెయ్యి ఎకరాల వరకు సాగు ● విత్తనశుద్ధి తప్పనిసరి ● విత్తన ఆదా ముఖ్యం ● నాటే విధానంలో జాగ్రత్తలు పాటించాలిసీతంపేట: జిల్లాలో నాణ్యమైన పసుపు దిగుబడికి సీతంపేట ఏజెన్సీ పెట్టింది పేరు. ఇక్కడ పండిన పసుపునకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. జిల్లాలో దాదాపు వెయ్యి ఎకరాల్లో పసుపు పంట సాగులో ఉండగా సీతంపేట ఏజెన్సీలోనే కొండ పోడు వ్యవసాయంలో 650 ఎకరాల్లో సాగవుతుంది. గిరిజనులు ప్రతీ ఏటా సాగును పెంచుతున్నారు. ఈ క్రమంలో పసుపు సాగుకు ఈ నెలలోనే అనువైన సమయమని హర్టీకల్చర్, వ్యవసాయ పరిశోధనా శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. తగు జాగ్రత్తలు పాటిస్తే పసుపు బంగారమే అవుతుందంటున్నారు. పసుపు పంట సాగు దశలో ప్రధానంగా విత్తన ఎంపిక కీలకమైంది. ఈ విత్తనాన్ని ఎన్నుకునేటప్పుడు తెగళ్లు, చీడపీడలు లేని నాణ్యమైన విత్తనం ఎంపిక చేసుకోవాలి. ఖరీదైన పంటలను సీజన్లో సమయానికి వేయకపోతే దుంపపై ఆ ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏజేన్సీలో ఆధికంగాను, మిగిలిన మండలాల్లో తక్కువ విస్తీర్ణంలోను పసుపు సాగు చేస్తారు. దీని సాగుకు ఈ నెల చివరి వరకు సరైన ఆదును సమయం. జూలై నెలలో పసుపు సాగు చేస్తే బాగా దిగుబడి తగ్గిపోతుంది. దీంతో పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి ఉండదు. ఎంత విత్తనం వేయాలంటే.. విత్తనం ఎకరానికి కాడి రకం సాధారణంగా ఏజెన్సీలో 6 పుట్లు (పుట్టి 300 కిలోలు) 1800 కిలోలు వేస్తారు. కొంత మంది రైతులు 5 పుట్లు కూడా విత్తనంగా వేస్తారు. ఆయా పరిస్థితులను బట్టి విత్తనంగా వేసుకోవాల్సి ఉంటుంది. కొత్త పద్ధతులు ఆమలులో ఉన్నాయి. విత్తనంలో కనుపు వద్ద విరిచి చిన్న ముక్కలుగా చేసుకుని విత్తనంగా వేసుకోవచ్చు. దీంతో విత్తనం ఆదా కావడంతో పాటు రైతుకు ఖర్చు కూడా తగ్గుతుంది. పసుపు పంట సాగుకు బలమైన నేలలు శ్రేష్టమైనవి. నల్ల, బంక నేలల్లో పసుపు సాగు చేయవచ్చు. గరప, చౌడు నేలలు పనికిరావు. విత్తనశుధ్ధి తప్పనిసరి విత్తనాన్ని పొలంలో నాటే ముందు లీటరు నీటిలో మూడు గ్రాముల కార్బండిజమ్ లేదా డైథేన్ ఎం–45ను కలిపిన ద్రావణాన్ని తయారు చేసుకోవాలి. విత్తనం ఉంటైనా, కోమ్మైన 40 నిమిషాలు ఈ ద్రావణంలో నానబెట్టాలి. విత్తనాన్ని డ్రమ్ము నుంచి బయటకు తీసి నీడలో ఆరబెట్టాక ఆ తర్వాత విత్తనం పూడ్చాలి. శిలీంధ్ర నాశని వల్ల వచ్చే తెగుళ్ల నివారణకు మూడు మిల్లీలీటర్ల డైమిథోయేట్ ద్రావణంలో ట్రెకోడెర్మావిరిడి పొడి 3 గ్రాములు కలిపి విత్తనశుద్ధి చేసుకుంటే తెగుళ్లను చాలా వరకు నివారించవచ్చు.నాటే విధానంలో జాగ్రత్తలు పాటించాలి పసుపు విత్తనాన్ని మూడు రకాల పద్ధతుల్లో నాటుకోవచ్చు. ఇందులో ఎత్తుమడుల పద్ధతి, సమతల పద్ధతి, బోదే పద్ధతి. ఎత్తుమడుల పద్ధతిలో మీటరు వెడల్పు కలిగిన కయ్యల్లో 30 సెంటీమీటర్ల వెడల్పు కలిగిన బోదెలు ఉండేలా చుసుకోవాలి. అదే విత్తన ఉంటను 15 సెంటీమీటర్ల ఎడమతో పూడ్చుకోవాలి. పసుపు పంటకు సోకే తెగుళ్లలో దుంప కుళ్లు, ఆకుమచ్చ తెగుళ్లు వేరు వ్యవత్థ ద్వారా వ్యాపిస్తాయి. విత్తన శుద్ధి చేయకుండా కొమ్మలను ఉంటలను పూడ్చకూడదు. పొలంలోని మురుగు నీరు బయటకు వెళ్లిపోయేలా చేసుకోవాలి. మొక్కల చుట్టూ నీరు నిల్వ లేకుండా చేయాలి. పొటాష్ ఎరువులను సక్రమంగా వేయకపోవడం వల్ల ఇవి వ్యాప్తిస్తాయి. దీనికి మూల కారణం విత్తన శుద్ధి తప్పక చేయాలి. జాగ్రత్తలు పాటించాలి పసుపు పంటకు అధికంగా ఎరువుల వినియోగించకూడదు. దీని వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. దుక్కి దున్నే సమయంలో ఎకరాకు 3 బస్తాల సూపర్ పాస్ఫేట్, 200 కిలోల వేప పిండి, 25 కిలోల పొటాష్ను వేయాలి. ఆ తర్వాత విత్తనం పూడ్చిన 40 రోజులకు ఒక బస్తా యూరియా వేయాలి. మూడవ విడత 80 రోజులకు బస్తా యూరియా, 25 కిలోల పొటాష్, 200 కిలోల వేప పిండి వేసుకోవాలి. నాలుగో విడత 120 రోజులకు బస్తా యూరియా, 25 కిలోల పొటాష్ వేస్తే సరిపోతుంది. ఇలా శాసీ్త్రయ పద్ధతిలో ఎరువులను వేయడం వల్ల ఎకరానికి రూ.8 వేల వరకు పెట్టుబడి తగ్గుతుంది. ఆకులను మల్చ్గా ఉపయోగించాలి పంట విత్తిన వెంటనే హెక్టార్కు 12–15 టన్నుల పచ్చని ఆకులను మల్చ్గా ఉపయోగించాలి. కలుపు తీయడం,భూమిని పైకెత్తి, నాటి న 40–90 రోజుల తర్వాత హెక్టార్కు 7.5 టన్నుల చొప్పున మల్చింగ్ పునరావృతం చేయాలి. పసుపును రైజోముల ద్వారా వ్యాప్తి చేస్తారు. ఒక ఎకరం భూమిలో నాటడానికి వెయ్యి కిలోల రైజోముల విత్తన రేటు అవసరం. – పి.జయశ్రీ, ఉద్యానవనశాఖ అధికారి, సీతంపేట -
పిడుగుపాటుకు గురై మహిళ మృతి
తెర్లాం: పిడుగు పాటుకు గురై ఓ మహిళ మృతి చెందిన సంఘటన తెర్లాం మండలం విజయరాంపురం ఉరఫ్ బూరిపేట గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి గ్రామస్తులు, రెవెన్యూ అధికారులు తెలిపిన వివరాలు.. విజయరాంపురం గ్రామానికి చెందిన పూడివలస వెంకటమ్మ(40) పిడుగు పాటుకు గురై మృతి చెందింది. శుక్రవారం మధ్యాహ్నం గ్రామంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. అదే సమయంలో వెంకటమ్మ పశువులకు దాణా పెట్టేందుకు పశువులశాలకు వెళ్లింది. ఆ సమయంలో పెద్ద శబ్ధంతో పిడుగు పశువుల శాల పక్కనే పడడంతో పశువుల శాలలో ఉన్న వెంకటమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. మృతిరాలికి భర్త రామిశెట్టి, ఇద్దరు వివాహితులైన కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె కామేశ్వరికి గతంలో వివాహం జరగగా, 10 రోజుల క్రితమే చిన్న కుమార్తె గౌరీశ్వరికి వివాహమైంది. అంతవరకు ఇంట్లో ఉండి పశువులకు దాణా పెట్టి వస్తానని చెప్పి పశువుల శాలకు వెళ్లిన వెంకటమ్మ పిడుగుపాటుకు గురై మృతి చెందిందన్న విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తహసీల్దార్ హేమంత్కుమార్కు గ్రామ సర్పంచ్ బూరి మధుసూదనరావు సమాచారం ఇవ్వగా వెంటనే తహసీల్దార్ గ్రామానికి వెళ్లి సంఘటనా స్థలాన్ని, మహిళ మృతదేహాన్ని పరిశీలించారు. తెర్లాం ఏఎస్ఐ భాస్కరరావు సంఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహానికి శవ పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం బాడంగి సీహెచ్సీకి తరలించారు. పాము కాటుకు గురై వ్యక్తి..తెర్లాం: పాము కాటుకు గురై ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన తెర్లాం మండలం సింగిరెడ్డివలస పంచాయతీ బొంగుపేట గ్రామంలో జరిగింది. దీనికి సంబంధించి తెర్లాం ఎస్ఐ సాగర్బాబు శుక్రవారం తెలిపిన వివరాలు.. బొంగుపేట గ్రామానికి చెందిన ఏగిరెడ్డి లక్ష్మునాయుడు(59) పాము కాటుకు గురై మృతి చెందాడు. బుధవారం రాత్రి కళ్లానికి వెళ్తుండగా పాము కాటుకు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం రాజాంలోని సీహెచ్సీకి తీసుకువెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్య సేవల నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. మృతుడు లక్ష్మునాయుడుకి సత్యవతి, వివాహితులైన పిల్లలు ఉన్నారు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి ఆసుపత్రిలో శవ పంచనామా చేసి అక్కడే పోస్టుమార్టం చేయించారు. జ్వరంతో వ్యక్తి..సీతంపేట: మండలంలోని జగతపల్లి గ్రామానికి చెందిన సవర ఆనందరావు (26) అనే గిరిజనుడు జ్వరం, వాంతులు, విరేచనాలు, ఆయాసంతో బాధపడుతూ పాలకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆనందరావు రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతుండగా గురువారం అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో స్థానిక ఏరియా ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకువచ్చారు. ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం పాలకొండ ప్రైవేటు ఆసుపత్రికి శుక్రవారం ఉదయం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య మేఘన, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇంటి పెద్ద మృతి చెందడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి..జియ్యమ్మవలస రూరల్: మండలంలోని చింతల బెలగాం దాటి పరసపాడు గ్రామ సమీపాన శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చినమేరంగి గ్రామానికి చెందిన ముదిలి దినేష్(26) మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే... దినేష్ తన భార్య దివ్యతో బయటకు వెళ్లి వస్తానని గురువారం రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో పల్సర్ బైక్పై బయలుదేరాడు. పరసపాడు సమీపంలో ముందు టేకు కర్రలతో వెళ్తున్న నాటుబండిని ఢీకొని పడిపోయాడు. స్థానికులు 108లో పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దినేష్కు భార్య దివ్య, మూడేళ్ల కుమార్తె దీక్షితశ్రీ ఉన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ పి.అనీష్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా టేకు కర్రలతో వెళ్తున్న బండికి వెనుక భాగాన ప్రమాద సూచిక ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదంలో రైతు దుర్మరణంపాలకొండ రూరల్: కుటుంబ పోషణకు రైతు వారీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న సన్నకారు రైతు పొలం నుంచి ఇంటిబాట పడుతున్న క్రమంలో విధి వక్రించింది. రోడ్డు దాటుతున్న క్రమంలో ద్విచక్ర వాహన రూపంలో మృత్యువు కబలించింది. ఎస్ఐ కె.ప్రయోగమూర్తి తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. గోపాలపురం గ్రామానికి చెందిన గర్భాన లక్ష్ముం(62) ఉపాధి పనులతో పాటు పొలం పనులు పూర్తి చేసుకుని శుక్రవారం సాయంత్రం ఇంటికి వస్తున్నా రు. గ్రామ సమీపంలో రోడ్డు దాటుతుండగా పాలకొండ నుంచి రాజాం వైపు ద్విచక్ర వాహనంపై వె ళ్తున్న యాకుల రఘు తన వాహనంతో లక్ష్ముంను ఢీకొన్నాడు. తీవ్ర గాయాల పాలైన క్షతగాత్రుడిని స్థానికులు పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే లక్ష్ముం మృత్యువాత పడ్డారు. విషయం తెలుసుకున్న భార్య అన్నపూర్ణ, ముగ్గరు పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. -
పేదల బియ్యం పక్కదారి
ఈ చిత్రం చూశారా... ఇదేంటి రేషన్ డిపోల్లో ఉండాల్సిన బియ్యం కోళ్లఫారం షెడ్ లో ఉన్నాయని ఆశ్చర్యపోతున్నారా. మంత్రి ఇలాకా.. మజాకా అన్నట్టుగా... పేదలకు సరఫరా చేసే బియ్యం నేరుగా అవే గోనెల్లో బొండపల్లి మండలం కిండాం అగ్రహారంలోని కోళ్లఫారంలో దర్శనమిచ్చాయి. విజిలెన్స్ అధికారులకు అందిన సమాచారం మేరకు గురువారం ఇదిగో ఇలా కోళ్లఫారానికి వెళ్లి పరిశీలించారు. అక్కడ బియ్యం బస్తాల నెట్టును చూసి అధికారులే ఆశ్చర్యపోయారు. పేదలకు సరఫరా చేయాల్సిన బియ్యం.. ఇంత పెద్దమొత్తంలో నేరుగా ఎలా తరలిస్తున్నారని ముక్కునవేలేసుకున్నారు. 6ఏ కేసు నమోదుచేసి ఆరా తీస్తున్నారు. చిత్రంలో బియ్యం బస్తాలను చూశారా... ఇదేంటి పేదల కోసం ప్రభుత్వం సరఫరా చేసే బియ్యం ఇలా కోళ్ల ఫారంలో ఉండడమేమిటన్న అనుమానం కలుగుతుందా..?.. ఇది నిజమే.. ప్రభుత్వం సరఫరా చేసిన గోనె సంచుల్లోనే పీడీఎస్ బియ్యంను ఇలా అక్రమ మార్గంలో బొండపల్లి మండలం కొండకిండాంలో కోళ్ల ఫారం వద్దకు తరలించి నిల్వ చేశారు. ఇక్కడ నుంచి ధాన్యం మిల్లులకు తరలించి, అక్కడ మరోసారి మరపట్టి అధిక ధరలకు అమ్ముతున్నట్టు సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం విజిలెన్స్ అధికారులు వెళ్లి బియ్యంను సీజ్ చేశారు. ఈ బియ్యం కథను తేల్చేపనిలో ఉన్నారు. అయితే, వారిపై పెద్దస్థాయి నాయకుల నుంచి ఒత్తిడి ఉన్నట్టు సమాచారం. -
కూటమి ప్రభుత్వ తీరుపై నిరసన
విజయనగరం గంటస్తంభం: పని గంటల పెంపు, నైట్ షిఫ్ట్లో మహిళలతో పని చేయించేందుకు అనుగుణంగా కార్మిక చట్టాల్లో మార్పులు చేస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలపై సీఐటీయూ నాయకులు నిరసన తెలిపారు. తక్షణమే లేబర్కోడ్స్ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్, కార్యదర్శి అయిలాడ జగన్మోహనరావు ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద ఆందోళన చేశారు. మోదీ అడుగుజాడల్లో చంద్రబాబు కూటమి ప్రభుత్వం నడుస్తోందని, పని గంటలను 10 నుంచి 12 గంటలకు పెంచడం అంటే కార్మికుల శ్రమను మరింత దోపిడీ చేయడమేనన్నారు. మహిళా సాధికారత అని గొప్పగా చెప్పిన కూటమి ప్రభుత్వం నైట్ షిప్ట్లో పనిచేసేందుకు అనుమతివ్వడం విచారకరమన్నారు. మహిళా సాధికారతపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వివిధ సంస్థలు, శాఖల్లో పనిచేస్తున్న మహిళలందరికీ కనీస వేతనాలు అమలు చేయా లని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లేబర్ కోడ్స్ అమలు నిలిపివేయాలని, లేని పక్షంలో జూలై 9న కార్మికవర్గం పెద్ద ఎత్తున సమ్మెకు సిద్ధమవుతుందన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు యు.ఎస్.రవికుమార్, బి.రమణ, పాపారావు, రాఘవ, సుధీర్, వాసు, వెంకటేష్, సురేష్, సత్యం తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి ఇలాకాలో...
విజయనగరం ఫోర్ట్/బొండపల్లి: జిల్లాలో రేషన్ డిపోల నుంచి బియ్యం పంపిణీ ప్రారంభమై ఐదు రోజులవుతోంది. అప్పుడే.. అక్రమార్కులు తమ పనిలో పడ్డారు. పేదలకు చేరాల్సిన రేషన్ బియ్యాన్ని పెద్ద ఎత్తున అక్రమ మార్గంలో తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. టన్నుల కొద్దీ బియ్యం తరలిస్తుండడం, అది కూడా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రాతినిథ్యం వహించిన గజపతినగరం నియోజకవర్గంలోనే అధిక మొత్తంలో పేదల బియ్యంను విజిలెన్స్ అధికారులకు పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది. పేదల బియ్యం అక్రమ రవాణాకు గజపతినగరం అడ్డాగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బియ్యం పట్టుబడిన నాలుగు గ్రామాలు కూడా మంత్రి నియోజకవర్గంలోనివే కావడం గమనార్హం. ఒకటి మంత్రి శ్రీనివాస్ నిత్యావసర వస్తువులు పంపిణీ చేపట్టిన బొండపల్లి మండలం గొట్లాం గ్రామం కాగా, మరొకటి మంత్రి సొంత మండలం గంట్యాడ మండలం వసాది గ్రామం. మిగిలిన రెండు గ్రామాలు బొండపల్లి మండలంలోని కిండాం అగ్రహారం, కొండకిండాం. ఇక్కడ రెండు చోట్ల అధికారులు జరిపిన తనిఖీల్లో 360 బస్తాల బియ్యం పట్టుబడగా.. అందులో 106 బస్తాలు ఏకంగా సివిల్సప్లయి సరఫరా చేసే గోనెల్లోనే ఎంఎల్సీ పాయింట్ నుంచి నేరుగా తరలించినవి కావడం గమనార్హం. మిగిలినవి గోనెలు మార్చి కోళ్లఫారం బయట వ్యాన్లో రవాణాకు సిద్ధంగా ఉంచారు. వీటిని సివిల్ సప్లయి డీటీ కె.తిరుపతిరావుతో పాటు బొండపల్లి ఎస్ఐ యు.మహేష్ గురువారం సీజ్చేశారు. వాహనాలతో పాటు బియ్యంను ఎంఎల్సీ పాయింట్కు తరలించారు. 6ఏ కేసు నమోదు చేశారు. బియ్యం ఎక్కడ నుంచి వచ్చాయి? ఎవరు ఇక్కడ నిల్వచేశారు? బాధ్యులెవరు అన్న అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం సీజ్చేసిన బియ్యం 15 టన్నులకు పైబడి ఉంటాయని అధికారులు చెబుతున్నారు. రేషన్ దుకాణాలు ప్రారంభించిన ఐదు రోజుల్లోనే ఇంత పెద్ద మొత్తంలో బియ్యం పక్కదారి పట్టడంపై అధికారులు నివ్వెరపోతున్నారు. అయితే, కేసు నీరుగార్చేలా వారిపై రాజకీయ పార్టీ పెద్దల నుంచి ఒత్తిడి వస్తున్నట్టు సమాచారం. యువత ఉపాధికి గండికొట్టి.. ఎండీయూ వ్యవస్థతో వందలాది మంది యువతకు ఉపాధి కలిగింది. మరోవైపు ఇంటిద్దకే రేషన్ సరుకులు సరఫరా అయ్యేవి. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవికావు. ఐదేళ్లుగా చక్కగా సాగుతున్న వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దుచేసింది. యువతకు ఉపాధిలేకుండా చేసి రేషన్కార్డు లభ్ధిదారులకు కష్టాలు తెచ్చిపెట్టింది. అధికార పార్టీ నాయకులు కుమ్మకై ్క పేదల బియ్యంను కొల్లగొట్టేందుకు ఎండీయూ వ్యవస్థను రద్దుచేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజిలెన్స్ అధికారుల దాడుల్లో బియ్యం పెద్ద ఎత్తున పట్టుబడడం ఆరోపణలకు బలం చేకూరుతోంది. అమాత్యా.. ఇప్పడు ఏమంటారు? అక్రమాలను నిరోధించేందుకు రేషన్ షాపులను పునరుద్ధరించినట్టు చెప్పిన మంత్రి శ్రీనివాస్ ప్రారంభించిన నాలుగు రోజులకే పక్కదారి పట్టిన టన్నులకొద్దీ బియ్యం అధికారుల తనిఖీల్లో వెలుగుచూసిన బాగోతం గజపతినగరం నియోజకవర్గంలో సాగుతున్న బియ్యం అక్రమ తరలింపు‘ఎండీయూ వ్యవస్థలో ఆపరేటర్లు పేదలకు పంపిణీ చేయాల్సిన బియ్యంను పక్కదారి పట్టిస్తున్నారు. దీనివల్ల పేదలకు నష్టం జరుగుతోంది. అక్రమాలను నిరోధించేందుకు ఎండీయూ వ్యవస్థను రద్దుచేసి రేషన్ డిపోల్లో నిత్యావసర సరుకుల సరఫరాను పునరుద్ధరిస్తున్నాం.’ – రేషన్ డిపోల్లో బియ్యం సరఫరా ప్రారంభ సమయంలో రాష్ట్ర సెర్ప్, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఇవి. -
ఎస్సీ యువతకు ఉపాధి నైపుణ్య శిక్షణ
విజయనగరం టౌన్: ఎస్సీ యువతీ, యువకులను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు రాష్ట్ర మాలల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పెదపూడి విజయకుమార్ పేర్కొన్నారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం మాట్లాడారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తామని చెప్పారు. ఎస్సీల ఆర్థికాభివృద్ధికి ఈ ఏడాది రూ.340 కోట్లు బడ్జెట్ కేటాయించారని, ఈ నిధులతో ఎస్సీలకు ఉపయోగపడే రీతిలో స్వయం ఉపాధి పథకాలను రూపొందించి అమలుకు శ్రీకారం చుడతామన్నారు. సమావేశంలో ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కోండ్రు మరిడయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి.వెంకటేశ్వరరావు, ఎస్సీ నాయకుడు ఆదాడ మోహనరావు, తదితరులు పాల్గొన్నారు. కుట్టుశిక్షణ మహిళలతో ముఖాముఖి ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో కుట్టుశిక్షణ పొందుతున్న 30 మంది ఎస్సీ యువతలతో సమావేశమై శిక్షణ వివరాలు తెలుసుకున్నారు. ఎస్సీ సంఘాల నాయకులు, ప్రతినిధులతో భేటీ అయి కార్పొరేషన్ ద్వారా అందుతున్న పథకాలపై ఆరా తీశారు. జిల్లాలోని ఎస్సీలకు (మాలలకు) అమలవుతున్న పథకాలపై కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్తో క్యాంపు కార్యాలయంలో చర్చించారు. కలెక్టరేట్ సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భవన్ను పరిశీలించారు. శిథిలావస్థకు చేరిన భవనాన్ని ఆధునీకరించేందుకు అవసరమైన నిధులు మంజూరుకు కృషిచేస్తానన్నారు. రాష్ట్ర మాలల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పెదపూడి -
ఐఆర్సీటీసీ సేవలను సద్వినియోగం చేసుకోండి
విజయనగరం టౌన్: ఈస్ట్కోస్ట్ రైల్వే డివిజన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రయాణికులు ఐఆర్సీటీసీ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఐఆర్సీటీసీ ప్రాంతీయ చైర్మన్ అనూజ్ దత్త (భువనేశ్వర్) పేర్కొన్నారు. స్థానిక రైల్వే వీఐపీ లాంజ్లో ఆయన గురువారం మాట్లాడుతూ ఐఆర్సీటీసీ అందిస్తున్న పలు ప్యాకేజీలను వివరించారు. శ్రీలంక పర్యటనలో భాగంగా శాంకరీదేవి శక్తిపీఠంతో పాటు పలు ఆలయాల సందర్శన చేసే వారికి ఈ నెల 28 నుంచి జూలై మూడో తేదీ వరకు ఎయిర్ ప్యాకేజీలతో పర్యటన ఉందన్నారు. సెప్టెంబర్ 12 నుంచి 18వ తేదీ వరకు కేరళ, ఆగస్టు 14 నుంచి 23వ తేదీ వరకు గుజరాత్లోని పుణ్యక్షేత్రాలు, స్టాట్యూ ఆఫ్ యూనిటీ, అక్ష రధామ్ ద్వారక, జ్యోతిర్లింగ యాత్రలు ఉంటాయన్నారు. వివరాలకు సెల్: 92810 30748, 92814 95847 నంబర్లను సంప్రదించాలని కోరారు. -
ఒక పోస్టుకు 40 మంది పోటీ
విజయనగరం అర్బన్: జిల్లాలో ఈ నెల 30వ తేదీ వరకు జరగనున్న డీఎస్సీ–2025 పోటీ పరీక్షలు శుక్రవారం ప్రారంభంకానున్నాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 446 ఉపాధ్యాయ నియామకాల కోసం 18,001 మంది 34,623 దరఖాస్తులు సమర్పించారు. ఈ మేరకు పరీక్షలకు సన్నద్ధమయ్యారు. పోస్టులు, అభ్యర్థుల పోటీని పరిశీలిస్తే ఒక్కో పోస్టుకు 40.38 మంది పోటీ పడుతున్నారు. వీరి కోసం జిల్లాలో 5 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. వాటిలో సీతం ఇంజినీరింగ్ కళాశాల, ఐయాన్ డిజిటల్ కేంద్రం, లెండీ ఇంజినీరింగ్ కళాశాల, ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాల, అవంతి ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఆన్లైన్ విధానంలో ప్రతిరోజు ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు పూటలా పరీక్ష జరుగుతుంది. అభ్యర్ధులు పరీక్ష ప్రారంభానికి గంట ముందుగా హాజరుకావాలి. హాల్ టిక్కెట్తో పాటు తప్పనిసరిగా ఆధార్ లేదా ఏదైనా గుర్తింపు కార్డును తీసుకురావాలి. నేటి నుంచి డీఎస్సీ రాతపరీక్ష 34,623 దరఖాస్తులు.. పరీక్ష రాయనున్న 18,001 మంది అభ్యర్థులు మొత్తం పోస్టులు 446 ఉమ్మడి విజయనగరంలో 5 పరీక్ష కేంద్రాల ఏర్పాటు -
● కలశ యాత్ర
రాజాం మండలం గార్రాజుచీపురుపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన అన్నపూర్ణసమేత కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంతో పాటు నవగ్రహ దేవాలయాల ప్రతిష్ఠోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ప్రతిష్ఠా సంకల్పం, వినాయకపూజ, పుణ్యాహవచనం, పరిషత్ ప్రాయశ్చిత్తం, పంచగవ్యారాధన, యాగశాల ప్రవేశం, మండల మండపారాధన, అగ్నిప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు. విగ్రహాలతో పాటు పసుపు నీటితో కూడిన కలశాలను ఊరేగింపుచేశారు. ఇందులో వందలాదిమంది మహిళలు పాల్గొన్నారు. – రాజాం -
ఈదురు గాలులకు నేలకొరిగిన చెట్లు
వేపాడ: మండలంలోని పలు గ్రామాల్లో గురువారం మధ్యాహ్నం కురిసిన ఈదురగాలులతో కూడిన వర్షానికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. చామలాపల్లి–దబ్బిరాజుపేట రోడ్డులో చామలాపల్లి పసలమ్మ అమ్మవారి ఆలయ సమీపంలో భారీ చెట్టు విరిగి రోడ్డుపై పడడంతో రాకపోకలకు కాసేపు అంతరాయం కలిగింది. ఈదురగాలులకు మామిడి పంటకు నష్టం వాటిల్లింది. చామలాపల్లిలో విద్యుత్ స్తంభం విరిగిపోయింది. దబ్బిరాజపేట, చామలాపల్లి, కరకవలస, పోతుబందిపాలెం, వెంకయ్యపాలెం గ్రామాల్లో భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పరిశ్రమల్లో రక్షణ పరికరాలు తప్పనిసరి బొబ్బిలి: పరిశ్రమల్లో రక్షణ పరికరాలను విధిగా ఏర్పాటుచేయాలని డీఎస్పీ జి.భవ్యారెడ్డి సూచించారు. బొబ్బిలి గ్రోత్ సెంటర్లో ఉన్న చిన్న, పెద్ద పరిశ్రమలను సీఐ కె.సతీష్కుమార్తో కలిసి రక్షణ పరికరాల ఏర్పాటును గురువారం తనిఖీ చేశారు. సిబ్బంది సంఖ్య, వారికి తగ్గట్టుగా రక్షణ పరికరాలు ఉన్నా యా లేదా అన్న అంశాన్ని పరిశీలించి వివ రాలు నమోదుచేశారు. పరిశ్రమల్లో ఎటువంటి నష్టాలు సంభవించకుండా రక్షణ వ్యవస్థను పటిష్టపరచుకోవాలని పారిశ్రామిక వర్గాలకు సూచించారు. పీఎస్హెచ్ఎం పోస్టుల మంజూరులో అన్యాయం బొబ్బిలి: టీచర్ పోస్టుల మంజూరులో రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ లేనివిధంగా జిల్లాకు పీఎస్హెచ్ఎం పోస్టులను కేటాయించకుండా తీరని అన్యాయం చేశారని ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.వి.పైడిరాజు అన్నారు. బొబ్బిలిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షురాలు ఎన్.శ్రీదేవి అధ్యక్షతన గురువారం నిర్వహించిన ఏపీటీఎఫ్ ప్రాంతీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఎస్హెచ్ఎం పోస్టులు కేటాయించకపోవడం వల్ల జిల్లాలోని ఎస్సీ, ఎస్టీలు తీవ్ర నిరాశకు లోనవుతున్నారన్నారు. తక్షణమే పోస్టులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అధ్యక్షుడు ఎం.బలరాంనాయుడు, గౌరవాధ్యక్షుడు ఎం.వి.రమణ, ఉపాధ్యక్షులు సీహెచ్ రామారావు, గంట సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
పుట్టినరోజుకు మూడు రోజుల ముందు ప్రమాదం
రామభద్రపురం: మరో మూడురోజుల్లో పుట్టినరోజు జరుపుకోవాల్సిన ఓ యువకుడు అనంత వాయువుల్లో కలిసిపోయాడు. ఈ దుర్ఘటన వివరాలిలా ఉన్నాయి. రామభద్రపురం మండల పరిధిలోని రొంపల్లివలస వద్ద ద్విచచక్రవాహనాన్ని లారీ ఢీ కొనడంతో జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. దత్తిరాజేరు మండల పోలీస్స్టేషన్ బూర్జవలస గ్రామానికి చెందిన కస్తూ రి సాయి (21) పనినిమిత్తం రామభద్రపురం మండలంలోని ఆరికతోట గ్రామానికి వచ్చాడు. పని ముగించుకుని తిరిగి బూర్జవలసలోని ఇంటికి బైక్పై వెళ్తుండగా విజయనగరం నుంచి ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ఎస్సై వి.ప్రసాదరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. మృతుడి తండ్రి ప్రభాకర్ ఫిర్యాదు మేరకు ఎస్సై ప్రసాదరావు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో మూడు రోజుల్లో పుట్టిన రోజు చేసుకోవాల్సిన కుమారుడు హఠాత్తుగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో తల్లిదండ్రులు ప్రభాకర్, లక్ష్మి, ఇతర కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పెళ్లి వేడుకకు వచ్చి పరలోకానికి.. జి.సిగడాం: సేహితుడి సోదరి వివాహ వేడుకకు వచ్చిన ఓ యువకుడు బావిలో దిగి ఈతరాక మృత్యువాతపడ్డాడు. ఈ విషాద ఘటన జి.సిగడాం మండలం పెంట గ్రామంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండల కేంద్రానికి చెందిన దుగ్గాన అజిత్కుమార్(19) విజయవాడ కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నాడు. ఇటీవలే ప్రథమ సంవత్సరం పరీక్షలు రాసి సెలవులకు సాలూరు వచ్చాడు. తన స్నేహితుడు తామాడ మహేష్ సోదరి పెళ్లి వేడుక కోసం స్నేహితులు తామాడ మహేష్, చిట్టివలస కుమార్, రాజుతో ఈ నెల 4న సంతకవిటి మండలం మామిడిపల్లి వచ్చారు. సాయంత్రం పూట అందరూ బయటకు వచ్చి జి.సిగడాం మండలం పెంట గ్రామంలో నేల బావి వద్దకు వెళ్లారు. ముందుగా అజిత్కుమార్ బావిలో దిగి ఈత రాకపోవడంతో మునిగిపోయాడు. వెంటనే స్నేహితులు బావిలో దిగి రక్షించే ప్రయత్నం చేయగా సాధ్యం కాకపోవడంతో గ్రామస్తులకు సమాచారం అందించారు. స్థానికులు హుటాహుటిన బావి వద్దకు చేరుకుని బయటకు తీసేసరికే అజిత్కుమార్ మృతిచెందాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడి తల్లి సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వై.మధుసూదనరావు గురువారం తెలిపారు. వీఆర్ఓ భూపతి నర్సింగరావు, వీఆర్ఏ బాలకృష్ణ సమక్షంలో శవపంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించారు. బైక్ను లారీ ఢీకొట్టడంతో యువకుడి మృతి -
అధ్వానంగా సాగునీటి చెరువులు..
గ్రామంలోని పంటపొలాలన్నీ సాగునీటి చెరువులపైనే ఆధారపడి ఉన్నాయి. గ్రామ ఆయకట్టుకు సుమారు ఎనిమిది సాగునీటి చెరువులు ఉన్నాయి. అన్ని చెరువులు తుప్పలు పేరుకుపోయి, మదుములు పాడై పోయి ఉన్నాయి. వ్యవసాయ పనుల సమయంలో చెరువుల నిండుగా నీరున్నా ఇంజిన్ల సహాయంతో తడులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీనికితోడు సాగునీటి కాలువలు కూడా పూడుకుపోతున్నాయి. ఏ అధికారి వద్ద చెరువుల పరిస్థితిని చెప్పుకోవాలో తెలియడంలేదు. ఎం.వెంకటినాయుడు, రైతు, పొనుగుటివలస -
జిల్లాకు రెండు మోడ్రన్ డ్రోన్స్
విజయనగరం క్రైమ్: జిల్లాలో నిర్వహించే సభలు, సమావేశాలు, జాతర్లలో మరింత నిఘా ఏర్పాటుకు ప్రత్యేకంగా రూపొందించిన రెండు టెథర్డ్ డ్రోన్స్ను రాష్ట్ర పోలీసు శాఖ జిల్లాకు మంజూరు చేసిందని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. సాధారణ డ్రోన్స్కు భిన్నంగా, ప్రత్యేక అవసరాలకు కోసం రూపొందించిన టెథర్డ్ డ్రోన్ పని తీరును గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ పరిశీలించారు. ఒక నిర్దిష్ట ప్రదేశాల్లో నిర్వహించే సభలు, సమావేశాలు, జాతర్లలో మరింత నిఘాను ఏర్పాటు చేసేందుకు టెథర్డ్ డ్రోన్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎస్పీ ఈ సందర్భంగా చెప్పారు. సుమారు 10గంటలపాటు గాలిలో తేలుతూ ఒక నిర్ధిష్ట ప్రదేశంలో జరిగే కార్యకలాపాలపై నిఘా ఏర్పాటు చేసే సామర్ధ్యం కలిగి ఉంటుందన్నారు. ఎలక్ట్రిక్ పవర్ లేదా జనరేటర్ సహాయంతో ఒక కేబుల్ ఆధారంగా డ్రోన్ పని చేస్తుందని తెలిపారు. జీపీఎస్ అవాంతరాలు ఉన్న ప్రదేశాల్లో కూడా ఈ డ్రోన్ పని చేసే సామర్ధ్యంతో పాటు అదనంగా పబ్లిక్ అడ్రస్ సిస్టం, డే/నైట్ విజన్ కెమెరా, ఏఐ కెమెరాలను కలిగి ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐలు ఆర్వీఆర్కే చౌదరి, ఏవీ లీలారావు, డ్రోన్ పైలట్స్ నరేష్, వెంకటేష్, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పరిశీలించిన ఎస్పీ వకుల్ జిందల్ -
విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు
సాలూరు: వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈనెల 4న నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సాలూరు నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో చేపట్టిన నిరసన ర్యాలీని ఊహకందని రీతిలో ప్రజలు విజయవంతం చేశార న్నారు. భవిష్యత్లో ప్రజావ్యతిరేక విధానాలపై చేపట్టనున్న పోరాటానికి ఇదే తరహాలో ప్రజలు సహకరించాలని రాజన్నదొర విజ్ఞప్తి చేశారు. -
మొక్కలతో వాతావరణంలో సమతుల్యం
చికెన్బ్రాయిలర్ లైవ్ డెస్డ్ స్కిన్లెస్ శ్రీ110 శ్రీ190 శ్రీ200విజయనగరం లీగల్: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం ప్లాస్టిక్తో ముప్పు అనే నినాదంతో ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.బబిత అన్నారు. ఈ మేరకు ప్రపంచపర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయస్థానాల సముదాయంలో ఆమె గురువారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పజలందరూ ప్లాస్టిక్ వినియోగం తగ్గేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. 70 మైక్రాన్ల కన్నా ఎక్కువ పరిమాణంతో కూడిన ప్లాస్టిక్ బ్యాగులు వాడితే పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని అందువల్ల ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా స్టీల్గ్లాసులు, స్టీల్ బాటిల్స్, కాటన్ బ్యాగులు ఉపయోగించాలని కోరారు. మొక్కలు ఎక్కువగా నాటడం వల్ల వాతావరణం సమతుల్యంగా ఉంటుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా నాల్గవ అదనపు జడ్జి బి.అప్పలస్వామి, ఐదవ అదనపు జడ్జి ఎన్.పద్మావతి, సీనియర్ సివిల్ జడ్జి బీహెచ్వీ లక్ష్మీకుమారి, జిల్లా న్యాయ సేవా సాధికార సంస్థ సెక్రటరీ ఎ.కృష్ణప్రసాద్, మొబైల్ కోర్టు జడ్జి బుజ్జి, స్థానిక న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.రవిబాబు, నాయమూర్తులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని కలిసికట్టుగా నిర్మూలిద్దాం విజయనగరం: ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిర్మూలించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కలెక్టర్ డా.బీఆర్.అంబేడ్కర్ పిలుపునిచ్చారు. మానవుల జీవన సరళిలో పర్యావరణానికి హాని చేసే వాటిని నిర్మూలించాలని తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని కోరారు. ఈ మేరకు గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యం లో జరిగిన వర్క్షాప్లో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అంతకు ముందు నగరంలోని అంబేడ్కర్ కూడలి నుంచి జిల్లా పరిషత్ వరకు ప్లాస్టిక్ను నిర్మూలిద్దాం అనే నినాదం తో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రతి గ్రామంలో, మండలంలో, జిల్లాస్థాయిలో ప్రజలకు ప్లాస్టిక్ వ్యర్థాల వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కలిగించాలని, వచ్చే ఏడాది ఈ తేదీ నాటికి జిల్లా పర్యావరణంలో స్పష్టమైన మార్పు కనపడాలని, ప్రతి ఒక్కరూ సామజిక బాధ్యతగా భావించి పర్యావరణానికి ప్రాణం పోయాలని కలెక్టర్ ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేషన్ కమిషనర్ నల్లనయ్య మాట్లాడుతూ నగరంలో ప్లాస్టిక్పై యుద్ధాన్ని ప్రకటిస్తున్నామని, దుకాణాలపై దాడులు చేసి ఎక్కడా ప్లాస్టిక్ వినియోగం లేకుండా చూస్తున్నామన్నారు. నగరంలో 15 వేల వరకు మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. జిల్లా అటవీ అధికారి కొండలరావు మాట్లాడుతూ జనాభా పెరుగుదల వల్ల పర్యావరణం దెబ్బ తింటోందని, దీని పరిణామాలు భవిష్యత్తు వారికీ నష్టం కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతికి దగ్గరగా మానవుడు ఉండాలని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని కోరారు. ఒక్కరోజే 4 లక్షల మొక్కల్ని జిల్లాలో నాటడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి ముద్రించిన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ప్రతి మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో పాల్గొంటూ పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఉత్తమ కంపెనీలైన ఎంఎస్ఎం ఫార్మా, శారద మెటల్, అంజన ఫెర్రో ఎల్లాయీస్ కంపెనీల ప్రతినిధులకు కలెక్టర్ అంబేడ్కర్ ప్రశంసాపూర్వకంగా మెమెంటోలు అందజేశారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సరిత, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ వెంకట రమణ, ప్రొఫెసర్ రామకృష్ణ, పలు పరిశ్రమలకు చెందిన ఉద్యోగులు, విద్యార్ధులు పాల్గొన్నారు. జిల్లాలో నాలుగు లక్షలు మొక్కలు నాటడమే లక్ష్యం నెల్లిమర్ల రూరల్: వనమహోత్సవం కార్యక్రమం ద్వారా ఈ ఏడాది జిల్లాలో నాలుగు లక్షలు మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించిందని కలెక్టర్ డాక్టర్ బీఆర్ ఆంబేడ్కర్ తెలిపారు. ఈ మేరకు నెల్లిమర్ల మండలంలోని కొండవెలగాడ నగరవనంలో 4లక్షల మొక్కలు నాటే కార్యాక్రమానికి స్థానిక ఎమ్మెల్యే లోకం నాగమాధవితో కలిసి గురువారం ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిరోజూ ప్రతి వ్యక్తి ఒక మొక్కను నాటి సంరక్షణ బాధ్యతలు తీసుకుంటే జిల్లాలో పచ్చదనం నిండుతుందన్నారు. పర్యావరణానికి ఆరోగ్యానికి సంబంధం ఉందని, పర్యావరణాన్ని సంరక్షిస్తే అది మనల్ని కాపాడుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి కొండలరావు, ఇన్చార్జ్ ఆర్డీఓ సవరమ్మ, డీఎంహెచ్ఓ జీవనరాణి, స్థానిక అధికారులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. బబిత -
బొలెరోను ఢీకొట్టిన బైక్: ఒకరి మృతి
విజయనగరం క్రైమ్: నగరంలోని ఆర్టీఓ ఆఫీస్ వద్ద గురువారం బొలెరో వాహనాన్ని బైక్ ఢీ కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వన్టౌన్ సీఐ శ్రీనివాస్ తెలియజేశారు. కొండకరకాం గ్రామానికి చెందిన ప్రమోద్, చిన్నారావు, సునీల్ బుల్లెట్పై విజయనగరంలో పని చూసుకుని తిరిగి గ్రామానికి వెళ్తున్న క్రమంలో ఆర్టీఓ ఆఫీస్ వద్ద ఓ బొలెరో వాహనం అకస్మాత్తుగా రోడ్పైకి వస్తుండగా త్రిబుల్ రైడింగ్ చేస్తున్న ఈ ముగ్గురు బైక్తో ఢీకొట్టారు. దీంతో బైక్పై ఉన్న ముగ్గురిలో చిన్నారావు కింద పడిపోగా మిగిలిన ఇద్దరూ పక్కకు పడిపోయారు. చిన్నారావుకు మాత్రం శరీరం మధ్యబాగంలో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108కి సమాచారం ఇవ్వగా గాయపడిన వ్యక్తులను తిరుమల మెడికవర్కు చికిత్స కోసం తరలించారు. తీవ్రంగా గాయపడిన చిన్నారావు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మిగిలిన ఇద్దరూ చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. రొటోవేటర్ కిందపడి వ్యక్తి దుర్మరణంసీతానగరం: మండలంలోని కామందొరవలసలో గురువారం ట్రాక్టర్తో దుక్కి చేస్తున్న సమయంలో రొటోవేటర్కు ఉన్న గడ్డి తీస్తుండగా ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కామన్న దొరవలస గ్రామానికి చెందిన బురిడి రామారావు(46) తన పొలంలో దుక్కిదున్నే నిమిత్తం ట్రాక్టర్ను రప్పించుకున్నాడు. ఆ ట్రాక్టర్ వెనుకనున్న రొటోవేటర్కు తగిలిన గడ్డిని తీయమని ట్రాక్టర్ డ్రైవర్ రామారావుకు సూచించడంతో రామారావు రొటొవేటర్ గడ్డి తీస్తుండగా డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో రొటోవేటర్కున్న బ్లేడ్లు ఆయన ఛాతీపైన బలంగా తగలడంతో కిందపడి మృతిచెందాడు. ఈ సంఘటనపై మృతుడి కుమారుడు తిలక్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఎం. రాజేష్ తెలియజేశారు. మృతుడికి తల్లి, భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతికొత్తవలస: అరకు–విశాఖపట్నం జాతీయ రహదారిలో కొత్తవలస మండలంలోని తాడివానిపాలెం గ్రామం సమీపంలో ఈ నెల రెండవ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన జి.వెంకటరమణ (63) చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. కొత్తవలసలోని వసంత్విహార్ ప్రాంతానికి చెందిన వెంకటరమణ విశాఖపట్నంలో గల కూతురి ఇంటికి ద్విచక్రవాహనంపై వెళ్లి తిరిగి వస్తుండగా తాడివానిపాలెం వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించబోయి పక్కనే గల చెట్టును బలంగా ఢీకొట్టారు. దీంతో తీవ్ర గాయాల పాలైన ఆయనను 108 వాహనంలో విశాఖపట్నంలో గల ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు -
జాతీయ స్థాయి ప్రదర్శనలో గుంట్రెడ్డి కార్టూన్
బొబ్బిలి: ప్రముఖ జాతీ య పత్రిక కా ర్టూన్ వాచ్ రా యపూర్లో గురువారం నిర్వహించిన జాతీయస్థాయి కార్టూన్స్ ప్రదర్శనలో బొబ్బిలి పట్టణా నికి చెందిన కార్టూనిస్ట్ గుంట్రెడ్డి భాస్కరరావు వేసిన కార్టూన్ను ప్రదర్శించారు. ప్లాస్టిక్ భూ తంలో కూరుకు పోతున్న భూమిని పచ్చదనంతో రక్షించాలనే సందేశాన్నిస్తున్న ఈ కార్టూన్ పలువురి ప్రశంసలు పొందిందని భాస్కరరావు(భాను) ఈ సందర్భంగా తెలిపారు. నాలుగు క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేతకొత్తవలస: ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 4క్వింటాళ్ల ప్రజా పంపిణీ బియ్యాన్ని విజిలె న్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ బి.సింహాచలం ఆధ్వర్యంలో గురువారం పట్టుకున్నారు. ఈ మేరకు సీఐ సింహాచలం మాట్లాడుతూ కొత్తవలస మండలంలోని వీరభద్ర పురం, దాసరివానిపాలెం గ్రామాల నుంచి ఆటోలో పీడీఎప్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని వచ్చిన సమాచారం మేరకు ఆయా గ్రామాల పరిధిలో మాటువేసినట్లు చెప్పారు. దాసరివాని పాలెం గ్రామానికి చెందిన సత్యవరపు వెంకటబంగార్రాజు ఆటోలో 4వందల కేజీల బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. ఈ మేరకు నిందితుడిపై 6ఎ కేసు నమోదు చేసినట్లు పట్టుబడిన బియ్యాన్ని సీఎస్డీటీ రామకృష్ణకు అప్పగించినట్లు వివరించారు. ముగ్గురి అరెస్ట్గుమ్మలక్ష్మీపురం(కురుపాం): సారా అక్రమ తయారీ, రవాణాను నిరోధించే కార్యక్రమంలో భాగంగా గురువారం చేపట్టిన దాడుల్లో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు కురుపాం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ పి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు కురుపాం ఎకై ్సజ్ కార్యాలయం వద్ద విలేకరులతో సీఐ మాట్లాడుతూ జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామంలో స్టేట్టాస్క్ ఫోర్స్తో కలిసి దాడులు నిర్వహించగా 60 లీటర్ల సారాతో ఇద్దరు వ్యక్తులు పట్టుబడినట్లు చెప్పారు. అంతేకాకుండా గ్రామ పరిసరాల్లో పులియబెట్టిన 400 లీటర్ల బెల్లపు ఊటను గుర్తించి ధ్వంసం చేశామన్నారు. అలాగే సారా తయారీ సామగ్రిని అమ్మిన ఓ మహళపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. పై ముగ్గురినీ రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరిచామన్నారు. గ్రామాల్లో సారా తయారీ రవాణా, అమ్మకాలు చేసి ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ ఎస్సై జె.రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ దృష్టికి సమగ్ర శిక్ష అవినీతి ఆరోపణలు● సూపరింటెండెంట్పై ఆర్జేడీ విచారణ విజయనగరం అర్బన్: జిల్లాలోని సమగ్ర శిక్ష విభాగంలో అవినీతి ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆ ఆరోపణలు కలెక్టర్ దృష్టికి వెళ్లాయి. దీంతో ఆ విభాగంలోని ఒక సూపరింటెండెంట్పై విచారణకు విద్యాశాఖ ప్రాంతీయ సంయక్త సంచాలకుడు (ఆర్జేడీ)సిద్ధమయ్యారు. సంబంధిత సూపరింటెండెంట్పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నుంచి ఆర్జేడీకి గురువారం ఆదేశాలు వెళ్లాయి. ఈ మేరకు ఆ సూపరింటెండెంట్ను విశాఖలోని ఆర్జేడీ కార్యాలయానికి గురువారం రప్పించి విచారణ ప్రారంభించారు. అవినీతి ఆరోపణలలో నిజం లేదని నిరూపించుకోవడానికి ఒక రోజు గడువు ఇచ్చినట్లు తెలిసింది. నిరూపించకపోతే కలెక్టర్ నుంచి చర్యలు తప్పవని తెలుస్తోంది. -
జిల్లాలో కేంద్ర జలశక్తి అభియాన్ బృందం పర్యటన
విజయనగరం అర్బన్: జిల్లాలోని జలవనరులను పరిశీలంచి క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకోడానికి కేంద్ర జలశక్తి అభియాన్ బృందం బుధవారం జిల్లాలో పర్యటించింది. తొలుత కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ను బృందం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి వారి పర్యటన వివరాలను తెలియజేశారు. జిల్లాలో తోటపల్లి, తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టులను సందర్శిస్తామని, కోటగండ్రేడులో జలజీవన్ మిషన్ లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడతామని కలెక్టర్కు తెలియజేశారు. బృందంలో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ తరుణా దోలియ, కేంద్ర వాటర్ కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ నిఖిల్ జెఫ్, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు శాస్త్రవేత్త డి.అనంతరావులతో పాటు ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కవిత, ప్రాజెక్ట్ డీఈఈ గోవిందరావు, తోటపల్లి ఎస్ఈ స్వర్ణకుమార్, ఈఈ అప్పలనాయుడు తదితరులు ఉన్నారు. వెనుకబడిన జిల్లాకు నిధులు మంజూరు చేయాలి కేంద్ర జలశక్తి అభియాన్ బృందంతో కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ మాట్లాడుతూ విజయనగరం వెనుకబడిన జిల్లా అని, కేంద్ర ప్రాజెక్టుల కోసం నిధులను కేటాయించాలని కోరారు. తారకరామ తీర్ధ సాగర్పై బృందానికి వివరిస్తూ ఈ ప్రాజెక్టు కోసం రూ.800 కోట్లతో అంచనా ప్రతిపాదనలు పంపగా రూ.100 కోట్లు మాత్రమే ఇప్పటివరకు మంజూరయ్యాయని ఆర్అండ్ఆర్ చెల్లింపులు పెండింగ్ ఉన్నాయని మిగిలిన నిధులు మంజూరు చేస్తే అభివృద్ధికి అవకాశం ఉంటుందని తెలిపారు. మర్యాదపూర్వకంగా కలెక్టర్ను కలిసిన బృంద సభ్యులు -
అధికారిక లాంఛనాలతో ఆర్మీ జవాను అంత్యక్రియలు
బాడంగి: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఆర్మీ జవాన్ సత్యం మృదేహానికి అధికారిక లాంఛనాలతో బుధవారం అంత్యక్రియలు జరిగాయి. బొబ్బిలి మండలం పారాది సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాడంగి మండలంలోని ముగడ గ్రామానికి చెందిన జవాను తూముల సత్యం మృతిచెందిన విషయం తెలిసిందే. బొబ్బిలిలో శవపంచాయతీ ఆనంతరం సత్యం మృతదేహాన్ని స్వగ్రామం ముగడ తరలించారు. బుధవారం ఉదయం ఆయన పనిచేస్తున్న దగ్గర నుంచి మిలటరీ అధికారి, పోలీసులు వ్యాన్పై ముగడ గ్రామానికి చేరుకుని సత్యం మృతదేహాన్ని పూలమాలలతో అలంకరించి, మృతదేహంపై జాతీయజెండా అవగతం చేసి గాలిలోకి కాల్పులు జరిపి గౌరవవందనం చేశారు. అనంతరం అంత్యక్రియలకు శ్మశానానికి పోలీసులే మృతదేహాన్ని మోసుకుని వెళ్లారు. అంతకుముందు భార్య నాగరత్నానికి దహన సంస్కారాల కోసం ప్రభుత్వం సమకూర్చిన నగదును అందజేశారు. ఆమె కుమార్తె హిమబిందుతో కలిసి మృతదేహాన్ని కడసారిగా చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. కుమారుడు అరవింద్ తండ్రికి తలకొ రివి పెట్టగా దహన సంస్కారాలు పూర్తిచేశారు. మృతుడి అన్నదమ్ములతో పాటు బంధువులు, ప్రజలు పెద్దసంఖ్యలో గుమిగూడి నివాళులర్పించారు. తహసీల్దార్ సుధాకర్, ఎస్సై తారకేశ్వరరావు, వీఆర్ఓ దేవి, కార్యదర్శి సూర్యారావు ప్రభుత్వం తరఫున హాజరయ్యారు. -
గురి తప్పని పూర్ణచంద్
రామభద్రపురం: మండలంలోని కొత్తరేగ గ్రామానికి చెందిన కిలపర్తి పూర్ణచంద్ 9వ తరగతి చదువుతూ క్రీడారంగంలో రాణిస్తున్నాడు. జాతీయస్థాయి ఆర్చరీ పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపి జాతీయ స్థాయి చాంపియన్షిప్ సాధించి దేశంలో జిల్లా కీర్తిని చాటాడు. ఈ కుర్రాడు 7వ తరగతి నుంచే పలుమార్లు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి ఆర్చరీ చాంపియన్ షిప్లలో పాల్గొని గోల్డ్, బ్రాంజ్, సిల్వర్ మెడల్స్ అందుకుని శభాష్ అనిపించుకున్నాడు. పథకాల్లో అధికశాతం గోల్డ్ మెడల్స్ అందుకుని అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఇటీవల మార్చి నెలలో గుంటూరులో నిర్వహించిన జాతీయస్థాయి ఆర్చరీ పోటీల్లో ఎన్టీపీసీ సంస్థ ద్వారా అండర్ 15 విభాగంలో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్మెడల్ సాధించాడు. ఈ సందర్భంగా పూర్ణచంద్ను సంగారెడ్డి జిలా కలెక్టర్ క్రాంతి ఘనంగా సత్కరించి ప్రశంసాపత్రం అందజేశారు. అలాగే 2021లో తమిళనాడులోని అండర్ 14 కేటగిరీలో జాతీయ ఇన్డోర్ ఆర్చరీ వ్యక్తిగత చాంపియన్ షిప్ గెలుచుకుని గోల్డ్మెడల్ సాధించాడు. ఇంకా బాలుర మిక్స్డ్ విభాగంలో బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నాడు. 2024లో హైదరాబాద్లో జరిగిన నేషనల్ చాంపియన్షిప్లో గోల్డ్మెడల్ కై వసం చేసుకున్నాడు. కొత్తరేగ గ్రామానికి చెందిన కిలపర్తి మురళీకృష్ణ ప్రథమ సంతానం పూర్ణచంద్. మురళీకృష్ణ హైదరాబాద్లో ఉంటూ చిన్న చిన్న వ్యాపారాలతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. పూర్ణ చంద్ అక్కడే ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. 3వ తరగతి నుంచి ఆర్చరీ క్రీడలో రాణించేవాడు. ఆర్చరీ కోచ్ బండి స్వామి వద్ద శిక్షణ పొందుతూ ఆయన సలహాలు, సూచనలతో ముందుకెళ్తున్నాడు. అయా స్థాయిల్లో వివిధ పోటీల్లో పాల్గొని సుమారు 26 మెడల్స్, ట్రోఫీలు దక్కించుకున్నాడు. విద్యలో కూడా తరగతిలో టాప్ 5లో రాణిస్తున్నట్లు తండ్రి మురళీకృష్ణ తెలిపారు. పూర్ణచంద్కు మహారాష్ట్రలోని పూణెలో ఉన్న ఇండియన్ ఆర్మీ స్పోర్ట్స్ ఇనిస్టిట్యూట్ యాజమాన్యం ఉచిత విద్యతో పాటు ఆర్చరీలో మరింత శిక్షణ ఇచ్చి ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనేందుకు తీసుకు వెళ్లారని తెలిపారు.ఒలింపిక్స్లో మెడల్ సాధనే లక్ష్యం.. నేను నా తల్లిదండ్రుల ప్రో త్సాహంతో ఆర్చరీ చాంపియన్షిప్ పోటీల్లో జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో పలుమార్లు పాల్గొని సు మారు 26 గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించాను. ఇండియన్ ఆర్మీ స్పోర్ట్స్ ఇనిస్టిట్యూట్లో చదువుతో పాటు ఆర్చరీలో మరింత శిక్షణ పొంది ఒలింపిక్స్లో పాల్గొని మెడల్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. కిలపర్తి పూర్ణచంద్, ఆర్చరీ క్రీడాకారుడు ఆర్చరీలో అద్భుతాలు సృష్టిస్తున్న యువకుడు అండర్ 15లో జాతీయస్థాయిలో రాణింపు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించిన క్రీడాకారుడుఆనందంగా ఉంది.. నా కొడుకు జాతీయస్థాయిలో గోల్డ్మెడల్ సాధించాడన్న సంతోషం కంటే మహారాష్ట్రలోని పూణెలో ఉన్న ఇండియన్ ఆర్మీ స్పోర్ట్స్’ ఇనిస్టిట్యూట్ యాజమాన్యం ఉచిత విద్యతో పాటు ఆర్చరీలో మరింత శిక్షణ ఇచ్చేందుకు తీసుకెళ్లడం మరింత ఆనందంగా ఉంది. 3వ తరగతి నుంచి బాబు ఆర్చరీ అంటే ఇష్టపడేవాడు. కోచ్ బండి స్వామి చక్కని శిక్షణతో పాటు సలహాలు సూచనలు ఇవ్వడంతో మరింత రాటు దేలాడు. అంతర్జాతీయ స్థాయి ఒలింపిక్స్లో ప్రథమ స్థానం సాధించి మెడల్ గెలిస్తే మరెంతో సంతోషంగా ఉంటుంది. కిలపర్తి మురళీ కృష్ణ, పాతరేగ, రామభద్రపురం మండలం -
పుడమి పరవశించాలి
● పచ్చదనం ఫరిడవిల్లాలి ● ప్రకృతితో సహజీవనమే పర్యావరణ పరిరక్షణ ● నేడు పర్యావరణ దినోత్సవంవిజయనగరం గంటస్తంభం: ధరణీమాత భగభగ మండుతోంది. కన్నబిడ్డలు చేస్తున్న అకృత్యాలు భరించలేక ఆవేదన చెందుతోంది. లక్షలకొద్దీ హిరణాక్ష్యులను చూసి తల్లడిల్లుతోంది. భూమాత పెడబొబ్బలు మనకు వినబడవు. వాహనాల రొద వాటిని మింగేస్తోంది. ధరణి కన్నీరు కారుస్తోంది. మనకు కనబడదు. ఫ్యాక్టరీల పొగమబ్బులు కమ్ముకున్నాయి. అభివృద్ధి ముసుగు వేసుకున్న రక్కసి వికట్టాట్టహాసం చేస్తోంది. అన్నిటికీ ఒకటే సమాధానం గ్లోబల్ వార్మింగ్. ఇప్పుడు మానవాళి మేలుకోవాల్సిన సమయం వచ్చింది. ఉపేక్షిస్తే ఆ తల్లి మహోగ్రరూపం దాలుస్తుంది. అప్పుడంతా ప్రళయమే. మన కాళ్లకింద వెయ్యి టన్నుల న్యూక్లియర్ బాంబులున్నాయి. వందల కొద్దీ హైడ్రోజన్ బాంబులున్నాయి. అవి ఏ క్షణంలోనైనా పేలవచ్చు. అదే జరిగితే భూమీమీద ఉన్న సమస్త జంతుజాలం, చెట్లు చేమలు నాశనమవుతాయి. భూమి ఓ మరుభూమిగా మారిపోతుంది. నివాసయోగ్యంగా లేని గ్రహంగా మిగిలిపోతుంది. ఇది మండిపోతున్న ధరణి భవిష్యవాణి. మనం చేసే తప్పిదాలకు ప్రకృతి అప్పుడప్పుడు తన ఉగ్రరూపాన్ని చూపిస్తున్నా అదిచ్చే ప్రమాద సంకేతాలను గుర్తించలేకపోతున్నాం. అసలు భూమాతను పరిరక్షించుకోవాలని, పర్యావరణాన్ని కాపాడుకోవాలన్న ఆలోచన ఇప్పుడొచ్చిందేమీ కాదు.అర్ధశతాబ్దం కిందటే ఐక్యరాజ్యసమితి పర్యావరణ పరిరక్షణ కోసం నడుం బిగించింది. సమితి జనరల్ అసెంబ్లీ జూన్ 5, 1972న పర్యావరణ దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. ప్రతి ఏడాది ఇదేరోజున ఏదైనా ఓ నగరంలో అంతర్జాతీయ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని ప్రజలు, ప్రభుత్వం గుర్తించి తగు చర్యలు చేపట్టేలా ప్రోత్సహించడమే పర్యావరణ దినోత్సవ ముఖ్య ఉద్దేశం. ఇక అప్పట్నుంచి ప్రతి ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నాం. విషపూరిత వాయువులు వాతావరణంలో ఎక్కువ కావడంతో క్రమంగా భూమి కేడెక్కుతోంది. అడవులు, జల వనరులు తగ్గిపోతున్నాయి. 2025 థీమ్‘‘బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్’’ 2025లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5న జరుపుకుంటారు. ఈ సంవత్సరం థీమ్ ‘‘ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయండి’’ ప్లాస్టిక్ కాలుష్యం వల్ల పర్యావరణానికి, జీవులకు కలిగే నష్టం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, దీనిని అంతం చేయడానికి కృషి చేయడం. ప్లాస్టిక్ భూతం..తరిమేద్దాం భూమిని పట్టిపీడిస్తున్న ప్రమాదకర వస్తువు ప్లాస్టిక్. 100 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. వ్యాపారులు మాత్రం విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. ప్లాస్టిక్ను కొంతమంది వ్యాపారులు రోడ్డుపైనే తగులబెడుతున్నారు. దీనివల్ల క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో రోజుకు 150 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పోగవుతున్నాయి. విజయనగరం పట్టణంలో సేకరించిన చెత్త నుంచి ఎరువు, ఇంధనం తయారుచేసే ప్రతిపాదనలు ఉన్నా కార్యరూపం దాల్చడం లేదు. ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని పూర్తిగా అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.మొక్కలు నాటి సంరక్షించాలి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని సంరక్షించాలి. ఈ సంవత్సరం జిల్లాలో 20 లక్షలు మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకున్నాం. మొక్కల పెంపకం వల్ల పర్యావరణం సమతుల్యత పెరిగి మానవ మనుగడకు ప్రాణాధారం అవుతాయి. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి. స్వచ్ఛమైన, ఆహ్లాదరకమైన వాతావరణం కోసం నాటిన ప్రతి మొక్కను కాపాడుకోవాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. ఆర్.కొండల రావు, జిల్లా అటవీ శాఖ అధికారి -
టన్ను పీడీఎస్ బియ్యం పట్టివేత
● డీలర్ల ద్వారా పంపిణీకి శ్రీకారం చుట్టిన నాలుగు రోజుల్లోనే బట్టబయలైన అక్రమరవాణా ● రేషన్షాపు నుంచి అక్రమమార్గంలో రైస్ మిల్లులకు తరలింపు ● డీలర్లకు వరంలా మారిన రేషన్ పంపిణీ పాతవిధానం బొండపల్లి: గతప్రభుత్వం పారదర్శకంగా, ఎక్కడా అక్రమాలకు తావు లేకుండా ఇంటింటికీ రేషన్ సరుకుల పంపిణీకి శ్రీకారం చుట్టిన సంగతి విదితమే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటింటి రేషన్ సరుకుల పంపిణీకి మంగళం పాడాలని మొదటి నుంచి ఆలోచన చేస్తూ అందుకు అనుగుణంగా ఏడాది వరకు కొనసాగించి జూన్ నెల నుంచి రేషన్ షాపుల్లో డీలర్ల ద్వారానే రేషన్ సరుకుల పంపిణీకి శ్రీకారం చుట్టి అమలు చేయడం ప్రారంభించింది. అందులో భాగంగా రేషన్ షాపుల డీలర్లు, గతంలో అక్రమంగా రేషన్ బియ్యం ఇతర సరుకులను బ్లాక్ మార్కెట్లోకి తీసుకువెళ్లి సొమ్ము చేసుకున్న వారు..తమ పాత అక్రమాలకు మళ్లీ పాల్పడుతూ పేద ప్రజలకు అందాల్సిన రేషన్ సరుకులను పక్కదారి పట్టించే పనిలో నిమగ్నమయ్యారు. నాలుగు రోజులకే అక్రమ రవాణారేషను సరుకులను డీలర్ల ద్వారా పంపిణీని కూటమి ప్రభుత్వం ప్రారంభించి నాలుగు రోజులు కూడా పూర్తి కాకముందే, డీలర్లు, అక్రమాక్కులు కుమ్మకై ్క అక్రమమార్గంలో రేషన్ సరుకులను తరలించే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా విజయనగరంలోని గుంకలాం నుంచి గొట్లాం బైపాస్ రోడ్డు మీదుగా గజపతినగరం తరలిస్తున్న టన్ను పీడీఎస్ బియ్యాన్ని బుధవారం వేకువ జామున విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ బి.సింహాచలంతో పాటు సివిల్ సప్లయిస్ డీటీ కె.తిరుపతిరావు అధికారులతో కలిసి పట్టుకుని బొండపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. పట్టుకున్న బియ్యం విలువ రూ.45వేల 500 ఉంటుందని, ఆటోలో తరలిస్తుండగా ఆటో యజమాని గేదేల ఈశ్వర్రావుతో పాటు సహాయకుడు దాసరి శ్రీనును అదుపులోనికి తీసుకుని విచారణ చేయగా గజపతినగరానికి చెందిన ముప్పిడి గణేష్కు బియ్యం తరలిస్తున్నట్లు తెలపడంతో అక్రమ రవాణాకు పాల్పడుతున్న అందిరిరీ అదుపులోకి తీసుకుని వారిపై 6ఎ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
రక్తహీనతతో ఎవరూ బాధ పడకూడదు
పార్వతీపురం రూరల్: జిల్లాలోని ఏ ఒక్కరూ రక్తహీనతతో బాధపడకూడదని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన పార్వతీపురం మండలం ఎమ్మార్నగరం గ్రామ సచివాలయంలో నిర్వహించిన రక్తహీనత నివారణ కమిటీ (అనీమియా యాక్షన్ కమిటీ)లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్యామ్ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి సచివాలయం పరిధిలో అనీమియా యాక్షన్ కమిటీ సమావేశాన్ని ప్రతి నెలా మొదటి బుధవారం నిర్వహించనున్నట్లు తెలిపారు. గర్భిణులు, డెలివరీ కేసులను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయాలని, అలాగే గర్భిణులకు చేయాల్సిన నెలవారీ పరీక్షలు, ప్రసవం అనంతరం పసిపిల్లలకు సమయానుకూలంగా ఇవ్వాల్సిన ఇంజక్షన్లు తదితర వాటిని ఏఎన్ఎంలు బాధ్యతాయుతంగా చేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు అనీమియా లోపంతో బాధపడుతున్న వారిపట్ల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని వైద్య సిబ్బందిని కలెక్టర్ హెచ్చరించారు. అనీమియా నివారణకు వైద్యాధికారులు, వైద్య సిబ్బంది సక్రమంగా పనిచేయాలని స్పష్టం చేశారు. సమావేశం అనంతరం ప్రజలతో కలిసి టీబీ వ్యాధి పట్ల శ్రద్ధ వహించండి, టీబీ రహిత భారత్కు సహకరించండి అనే వాల్పోస్టర్ను విడుదల చేశారు. సమావేశంలో జిల్లా టీబీ నియంత్రణ అధికారి డా.ఎం.వినోద్ కుమార్, తహసీల్దార్ వై.జయలక్ష్మి సీడీపీఓ బి.శ్రీనివాసరావు, డాక్టర్ పి.గోపాల్ కృష్ణ, సర్పంచ్ త్రినాథ రావు, వైద్యసిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ శ్యామ్ప్రసాద్ -
ర్యాపిడ్ కిట్లే దిక్కు..!
● ఇంకా సరఫరా కాని ఆర్టీపీఎస్ కిట్లు ● పలు జిల్లాలో పెరుగుతున్న కోవిడ్ కేసులు విజయనగరం ఫోర్ట్: కోవిడ్ వ్యాధి తీవ్రత ఏవిధంగా ఉంటుందో ప్రజలం దరికీ తెలుసు, కరోనా సోకితే చాలా ఇబ్బంది పడతారు. కరోనా వ్యాధికి సకాలంలో చికిత్స చేయించుకోకపోతే ప్రాణాలు మీదికి వచ్చే ఆస్కారం ఉంది. నాలుగేళ్ల కిందట కోవిడ్ వ్యాధి యావత్ ప్రపంచాన్ని తీవ్రంగా వణికించింది. దీంతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ కూడా విధించారు. లాక్ డౌన్ కారణంగా ప్రజలు అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పటికీ అ రోజులు తలుచుకుంటే ప్రజలు వణికిపోతారు. కొద్ది రోజులుగా కరోనా వ్యాప్తి మళ్లీ మొదలైంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహారించాల్సి ఉంది. కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు కరోనా లక్షణాలు ఉన్న వారందరికీ పరీక్షలు చేయాల్సి ఉంది. కోవిడ్ కేసులు ఎక్కువవుతున్నప్పటికీ ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నట్లు లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాకు రాని ఆర్టీపీసీఆర్ కిట్లు కరోనా వ్యాధి కచ్చితమైన నిర్ధారణ ఆర్టీపీసీఆర్ పరీక్ష ద్వారా అవుతుంది. గతంలో కూడా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసి కోవిడ్ రోగులను నిర్ధారించేవారు. అంతటి ప్రాధాన్యం గల ఆర్టీపీసీఆర్ పరీక్షల కిట్లను కూటమి ప్రభుత్వం ఇంతవరకు జిల్లాకు సరఫరా చేయలేదు. దీంతో ప్రభుత్వ తీరుపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ర్యాపిడ్ కిట్లతో కోవిడ్ పరీక్షలు కోవిడ్ లక్షణాలు ఉన్న వారికి ర్యాపిడ్ కిట్లతో పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో రోగుల్లో వ్యాధి నిర్ధారణ కచ్చితంగా తెలుస్తుందో తెలియదోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో కోవిడ్ లక్షణాలు ఉన్న వారికి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల ద్వారా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఆర్టీపీసీఆర్ పరీక్షలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ ల్యాబొ రేటరీలను రోగులు ఆశ్రయిస్తున్నారు. సొంత డబ్బులతో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసుకుంటున్నారు.ఆర్టీపీసీర్ కిట్లు వస్తాయి కోవిడ్ లక్షణాలు ఉన్న వారికి ప్రస్తుతం ర్యాపిడ్ కిట్లుతో పరీక్ష చేస్తున్నాం. ఆర్టీపీసీఆర్ కిట్లు ఒకటి, రెండు రోజుల్లో జిల్లాకు వస్తాయి. డాక్టర్ ఎస్.జీవనరాణి, డీఎంహెచ్ఓ -
ఇద్దరు హెచ్డబ్యూఓలను బదిలీ చేయాలి
పార్వతీపురం: పదమూడేళ్లుగా ఒకే కార్యాలయంలో ప్రభుత్వ నిబంధనలు కూడా వర్తించకుండా ఫెవిక్విక్లా అంటుకుని ఉన్న ఇద్దరు హెచ్డబ్యూఓలను బదిలీ చేయాలని గిరిజన సంక్షేమ ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన మాట్లాడుతూ పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని ఎస్కోట, బొబ్బిలి కేంద్రాల్లో గల గిరిజన కళాశాల వసతి గృహాల్లో ఉద్యోగం వచ్చినప్పటి నుంచి ఒకే చోట 13 ఏళ్లుగా హెచ్డబ్యూఓలుగా పనిచేస్తున్న ఆ ఇద్దరినీ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలకు బదిలీ చేయాలని డిమాండ్ చేయనున్నట్లు తెలిపారు. ఆ ఇద్దరినీ డిప్యుటేషన్ పేరుతో అక్కడే కొనసాగిస్తుండడం విడ్డూరంగా ఉందన్నారు. తాజా బదిలీల్లో కూడా మరో ఐదేళ్లు అక్కడే ఉండేలా ఆదేశాలు జారీ చేశారన్నారు. ఇదే అమలైతే ఒకేచోట 18 ఏళ్లు పనిచేసిన ఘనత వారికే దక్కుతుందన్నారు. జిల్లా అధికారులకు కూడా వర్తించని నియమాలు, నిబంధనలు వీరిద్దరికే ఎలా వర్తిస్తున్నాయో అధికారులకే ఎరుక అని ఈ ఇద్దరు హెచ్డబ్యూఓలను గిరిజన ఆశ్రమ పాఠశాలలకు బదిలీ చేయకపోతే గిరిజన సంక్షేమ సంఘం తరఫున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.సెల్ఫోన్ల దొంగకు మూడు నెలల జైలువిజయనగరం క్రైమ్: సెల్ఫోన్లు దొంగిలిస్తున్న వ్యక్తిని విజయనగరం గవర్నమెంట్ రైల్వే పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలసకు చెందిన బి.అజయ్ కుమార్ గతంలో పలు రైర్వే ప్లాట్ఫాంలలో సెల్ఫోన్లు బ్యాగులు దొంగతనాలు చేసేవాడని జీఆర్పీ ఎస్సై బాలాజీరావు చెప్పారు. ఈ మేరకు విజయనగరం స్టేషన్లో సెల్ఫోన్ చోరీ చేస్తుండగా పట్టుకుని కేసు నమోదుచేసి కోర్టులో ప్రవేశపెట్టగా అజయ్ చేసిన నేరం రుజువు కావడంతో విశాఖపట్నం రైల్వేకోర్టు మెజిస్ట్రేట్ అనురాగ్ మూడు నెలల జైలుశిక్ష విధించారని ఎస్సై బాలాజీరావు వివరించారు. మహిళ మృతదేహం లభ్యం విజయనగరం క్రైమ్: స్థానిక బాలాజీ జంక్షన్ సమీపంలోని పెద్ద చెరువు సమీపంలోని ఆచండ గార్డెన్ వద్ద ఓ మహిళ మృతదేహాన్ని స్థానికులు బుధవారం గుర్తించారు. పెద్ద చెరువు ఆచంట గార్డెన్ వద్ద మృతదేహం కనిపించిన వెంటనే వెంటనే స్థానికులు వన్టౌన్ పోలీస్స్టేషన్కు ఫిర్యాదు చేయగా ఎస్సైతో పాటు ఇద్దరు కానిస్టేబుల్స్ను ఘటనాస్థలికి వచ్చి పరిశీలించారు. గుర్తు తెలియని మహిళకు 40 నుంచి 50 ఏళ్లు ఉంటాయని పోలీసులు భావిస్తున్నా రు. వెంటనే మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం సర్వజన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి వన్టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఆమె నా భార్య.. విజయనగరం పెద్దచెరువు ప్రాంతంలోని ఆచంట గార్డెన్ వద్ద పోలీసులకు లభించిన మహిళ మృతదేహాన్ని గుర్తించి ఆమె తన భార్యేనంటూ వన్టౌన్ పోలీస్ స్టేషన్లో మృతురాలి భర్త చంద్రన్ స్పష్టం చేశాడు. ఈ మేరకు నగరంలోని గంటస్తంభం వద్ద ఉన్న వన్టౌన్ పోలీస్స్టేషన్కు తన భార్య ఆధార్ కార్డు తీసుకువెళ్లి లిఖిత పూర్వకంగా చంద్రన్ సమాచారం ఇచ్చాడు. భర్త చంద్రన్న ఇచ్చిన సమాచారంతో అనుమానాస్పద మృతి కాదని మతిస్థిమితం లేక ఆమె ఇంట్లోనుంచి వెళ్లిపోయిందని సీఐ శ్రీనివాస్ చెప్పారు. పిడుగుపాటుతో మహిళ మృతిబలిజిపేట: మండలంలోని పలగర గ్రామానికి చెందిన వావిలపల్లి చంద్రమ్మ(57) బుధవారం సాయంత్రం పిడుగుపాటుకు గురై మృతిచెందింది. పెసర మొక్కలు తీసేందుకు సాయంత్రం నాలుగు గంటల సమయంలో భర్త చిన్నంనాయుడితో పాటు ఆమె పొలానికి వెళ్లింది. కొంత సమయం అయిన తరువాత ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో భార్యాభర్తలు తిరిగి ఇంటికి వస్తుండగా బోలుబంద వద్ద పిడుగుపడడంతో ఆమె అక్కడికి అక్కడే మృతిచెందింది. మృతురాలిని చూసిన భర్త లబోదిబో మన్నారు. దీనిపై వీఆర్ఓ మౌనిక రిపోర్టు రాసి అందించారు. -
డబ్బులివ్వక పోతే ఖబడ్దార్..!
● డబ్బుల కోసం బాలికకు యువకుడి వేధింపులు ● ఫేక్ ఇన్స్ట్రాగామ్ ఖాతాలో అసభ్యకర పోస్టులు ● నిందితుడిపై కేసుల నమోదు, రిమాండ్కు తరలింపు ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ భవ్యారెడ్డిరామభద్రపురం: రోజురోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులు అవగాహన కల్పిస్తున్నా..చదువుకున్న వారు కూడా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతుడండం, సైబర్ నేరగాళ్లు కూడా రకరకాల యాప్ల ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.అక్రమంగా డబ్బు సంపాదనే లక్ష్యంగా ఫేక్ ఇన్స్ట్రాగామ్ ఖాతా తెరిచి అసభ్యకర పోస్టులు పెట్టి డబ్బులు ఇవ్వాలంటూ ఓ ఆడపిల్లను బ్లాక్మెయిల్ చేస్తున్న ఓ నిందితుడు పోలీసులకు మంగళవారం చిక్కాడు. ఈ సంఘటనపై డీఎస్పీ భవ్యారెడ్డి నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. మెరకముడిదాం మండలం భైరిపురంగ్రామానికి చెందిన ఓ యువకుడు ఒడిశాలో ఐటీఐ చదువుతున్నాడు. అక్కడ ఫేక్ ఇన్స్ట్రాగామ్ ఓపెన్ చేసి అందులో ఆడపిల్లల ఫోటోలు పెట్టి లైక్లు కొట్టమని ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెట్టేవాడు. ఈ క్రమంలో రామభద్రపురం గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలిక స్నేహితురాలి ఫొటో మార్ఫింగ్ చేసి, ఇన్స్ట్రాగామ్ యాప్లో పెట్టి ప్రెండ్ రిక్వెస్ట్ పెట్టగా రామభద్రపురం గ్రామానికి చెందిన బాలిక తన స్నేహితురాలే కదా అని లైక్ కొట్టింది. దీంతో ఆ కుర్రాడు ఆ ఇన్స్ట్రాగామ్ యాప్ ద్వారా డౌన్లోడ్ అయిన బాలిక ఫొటోలు స్క్రీన్షాట్ తీశాడు.ఆ ఫొటోలను వాడి మొబైల్ ఫోన్లోనే నగ్నంగా మార్ఫింగ్ చేసి ఉంచుకున్నాడు. ఇవేవీ అ బాలికకు తెలియదు. బాలిక స్నేహితురాలు అడిగినట్లుగానే నాకు అవసరం ఉంది ఓ రూ.500 కావాలని అడిగాడు. ఆమె తన దగ్గర లేవని సమాధానం ఇచ్చింది. దీంఓ వెంటనే ఆ మోసగాడు నగ్నంగా..అసభ్యకరమైన ఉన్న ఫొటోలు ఆమెకు పంపించి నీవు అర్జెంటుగా రూ.8 వేలు ఇవ్వకుంటే ఈ ఫొటోలు సోషల్ మీడియా, ఫేస్బుక్లలో పెడతానంటూ బ్లాక్ మెయిల్కు పాల్పడ్డాడు. పోలీసులను ఆశ్రయించిన బాధిత బాలిక దీంతో ఆ బాలిక నీవు అలా చేస్తే నేను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే తల్లిదండ్రులు అప్రమత్తమై స్థానిక పోలీసులను ఆశ్రయించారు.ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాల మేరకు సీఐ కె నారాయణరావు, ఎస్సై వి.ప్రసాదరావులు మే 2వ తేదీన కేసునమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతికతను ఉపయోగించి సైబర్ మోసానికి పాల్పడిన నిందితుడిని అదుపులోకి తీసుకుని, విచారణ చేసి, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. సైబర్ నేరం, పోక్సో కింద నిందితుడిపై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ మొబైల్కు వచ్చే లింక్లు క్లిక్ చేయొద్దని,సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే 1930 నంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. స్మార్ట్ఫోన్లు మంచి కోసం ఉపయోగించాలని, ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్లు ఖాతాలు ఓపెన్ చేయడం ఆడపిల్లలకు అవసరం లేదన్నారు. సోషల్ మీడియాలో ఫేక్ ఫోటోలను చూసి అకర్షణకు లోనై మోసపోకూడదని హితవు పలికారు. వేగంగా కేసును ఛేజ్ చేసిన సీఐ నారాయణరావు, ఎస్సై వి.ప్రసాదరావులను అభినందించారు. -
దక్కని ఆశించిన ‘మద్దతు’
● అరకొరగా వరి క్వింటాకు రూ.69 పెంపు ● తీవ్ర ఆందోళనలో అన్నదాతలుపార్వతీపురం/విజయనగరం ఫోర్ట్: విత్తనాలు, ఎరువులు సాగు వ్యయం రోజురోజుకూ తడిసి మోపెడవుతోంది. ఎరువులు, పురుగు మందుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కూలీల ఖర్చులు గణనీయంగా పెరుగుతున్నాయి. ట్రాక్టర్లతో వ్యవసాయం చేయడంతో డీజిల్ ధరలు కూడా తగ్గనంటున్నాయి. ఈ ధరాభారంతో రైతుల సాగు వ్యయం ఏటా పెరిగిపోతోంది. ఖర్చులు, ధరలు పెరిగే స్థాయిలో మద్దతు ధర పెరగకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మద్దతు ధర సాగు వ్యయానికి అనుగుణంగా ఉంటుందని ఆశించినప్పటికీ రైతులకు నిరాశనే కలిగించింది. వ్యవసాయ ఉత్పత్తులకు కేంద్రప్రభుత్వం మద్దతు ధరను ప్రకటించింది. గిట్టుబాటు ధర ఎలా ఉన్న మద్దతు ధర సాగు వ్యయం ఆధారంగా పెరుగుతుందని ఆశపడిన రైతులకు తీవ్ర నిరాశే మిగిలింది. మొక్కుబడిగా వరి పంటకు మద్దతు ధరను కేంద్రం పెంచిందని రైతుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయకుండా పాలకులు మోసగిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాగుకు, వ్యయానికి ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధరకు ఏ మాత్రం పొంతన లేకపోవడంతో రైతులు ఏటా నష్టాలను చవిచూస్తున్నారు. ధాన్యం క్వింటాకు మద్దతుఽ ధర రూ.69 పెంచి రైతులను ప్రభుత్వం దగా చేసిందని వాపోతున్నారు. ఎంతోకాలంగా ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు. క్వింటా ధాన్యం మద్దతు ధర రూ.2,300ల నుంచి రూ.2369కి పెంచి రైతులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. పంట పండించాలంటే నష్టపోవాల్సిందే.. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రధానమైన వరిపంటకు కేంద్రం మద్దతు ధర ప్రకటించినప్పటికీ ఏటా మిల్లర్లు, దళారులు కుమ్మకై ్క రైతులకు మద్దతు ధర అందివ్వని పరిస్థితి నెలకొంది. రైతు సేవా కేంద్రాల ద్వారా మిల్లర్లకు ధాన్యాన్ని తరలిస్తున్నట్లు అధికారులు ప్రకటనలు చేస్తున్నప్పటికీ వాస్తవానికి దళారుల నుంచి రైతుల పేరు మీద మిల్లర్లకు తరలించే పరిస్థితి నెలకొంది. ఈ కారణంగా రైతులకు మద్దతు ధర అందని ద్రాక్షగా మిగిలింది. ఉమ్మడి జిల్లాలోని పలుగ్రామాల్లో ఎకరాకు 24 నుంచి 28 బస్తాల వరకు దిగుబడి వస్తోందని పంట దిగుబడి ప్రయోగాలద్వారా నిర్ధారించి అధికారులు ప్రకటించారు. దిగుబడుల ఆధారంగా మద్దతు ధర ఏ గ్రేడ్ రకానికి రూ.2369 ప్రకారం 80 కిలోల బస్తాకు రూ.1790లు వస్తుంది. ఈ ప్రకారం 25 బస్తాలకు రూ.40వేల వరకు ఆదాయం రాగా, ఎకరాకు పెట్టుబడిగా రూ.25 వేల నుంచి రూ.30వేల వరకు వ్యయం అవుతోంది. ఈ లెక్కన రైతుకు మిగిలేది రూ.10వేల నుంచి రూ.15వేలు మాత్రమే. అదే రైతు కూలికి వెళ్తే ఏడాదికి రూ. ఒక లక్ష వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. సొంతభూమి సాగు చేసుకునే రైతుకు కొంతవరకు మిగులు కనిపించే ఆవకాశం ఉండగా కౌలు రైతుకు కౌలు, ఖర్చులు పోను మిగిలేది అంతంతమాత్రమేగానే ఉంది. మద్దతు ధరపై పునరాలోచన చేయాలి ప్రస్తుతం ప్రకటించిన మద్దతు ధర సాగు ఖర్చులకు వచ్చిన ఆదాయానికి పొంతన ఉండడం లేదు. రోజురోజుకూ వ్యవసాయ మదుపులు పెరిగిపోతున్నాయి. కూలీలు కూడా దొరకడం లేదు. వ్యవసాయం చేయాలంటే ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రభుత్వాలు కేవలం మొక్కుబడిగా మద్దతు ధర పెంచి మమ అనిపించి రైతులను మోసం చేస్తున్నారు. ప్రభుత్వం వరి పంటకు మద్దతు ధర పెంచడంపై పునరాలోచించి రైతులకు న్యాయం చేయాలి. –బి.అప్పలనాయుడు, రైతు, నాగూరు -
వైద్యసిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం
విజయనగరం ఫోర్ట్: వివిధ కారణాలతో ప్రసవ సమయంలో, ప్రసవానంతరం గర్భిణులు, శిశువులు మృతి చెందడం పట్ల కలెక్టర్ బీఆర్. అంబేడ్కర్ వైద్యసిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా సంఘటనలపై సమగ్రంగా దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నవంబర్ 24 నుంచి మార్చి 2025 వరకు జిల్లాలో సంభవించిన నాలుగు మాతృమరణాలు, ఐదు శిశు మరణాలపై మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మృతికి గల కారణాలు, సిబ్బంది లేకపోవడం వల్ల, వైద్యుల నిర్లక్ష్యం, ఏ స్థాయిలో తప్పిదం జరిగి ఉంటుంది తదితర కారణాలపై ఆరా తీశారు. వైద్యులు, ఐసీడీఎస్ సిబ్బంది, ఆశ, ఏఎన్ఎంలను ప్రశ్నించారు. అన్ని రికార్డులను సమర్పించాలని ఆదేశించారు. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల ప్రతినిధులు సమావేశానికి రాకపోవడంపై మండిపడ్డారు. గర్భిణులు వెంపడాపు లీలావతి, బంగారి సుధ మరణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించారు. కొరమ దుర్గ మృతి విషయంలో పీజీ స్టార్ ఆస్పత్రికి నోటీస్ ఇవ్వాలని, అలాగే మరో మృతికి సంబంధించి సమావేశానికి కేజీహెచ్ వైద్యులు రాకపోవడంతో కేజీహెచ్ సూపరింటెండెంట్కు కూడా లెటర్ రాయాలని వైద్యఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలో మాతృ, శిశు మరణాలు సంభవించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వహించేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పొంతన లేని నివేదికలు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, ఐసీడీఎస్ సిబ్బంది ఇస్తున్న నివేదికలు పొంతన లేకుండా పోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల స్థాయిలో ఇరు శాఖల అధికారులు నెలకోసారైనా సమావేశమై చర్చించుకోవాలని సూచించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి, డీసీహెచ్ఎస్ డాక్టర్ ఎన్.పి.పద్మశ్రీరాణి, ఘోషాఆస్పత్రి గైనకాలజీ హెచ్ఓడీ డాక్టర్ అరుణశుభశ్రీ, డీఐఓ డాక్టర్ అచ్యుతకుమారి, ఇన్చార్జి ఐసీడీఎస్ పీడీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. గర్భిణుల మృతిపట్ల సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశాలు -
మాటల్లో తీపి..చేతల్లో చేదు
● సుగర్ ఫ్యాక్టరీల నిర్వహణపై ప్రభుత్వం స్పష్టత కరువు ● రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శికి భీశెట్టి వినతిపత్రంవిజయనగరం గంటస్తంభం: రాష్ట్రంలో కీలకమైన తాండవ, ఏటికొప్పాక, తుమ్మపాల, భీమసింగి సుగర్ ఫ్యాక్టరీల భవిష్యత్తుపై రాష్ట్ర ప్రభుత్వం విధానమేమిటో ప్రకటించాలని లోక్ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ కోరారు. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ కార్యదర్మి ఎన్.యువరాజును విన్నవించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో యువరాజుతో ఆయన సమావేశమై ఉత్తరాంధ్రలోని సహకార చక్కెర కర్మాగారాల కార్మికులు, ఉద్యోగులు, రైతులు పడుతున్న ఇబ్బందులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా భీశెట్టి మాట్లాడుతూ..గడిచిన ఐదేళ్లుగా భీమసింగి సుగర్ ఫ్యాక్టరీ కార్మికులు, ఉద్యోగులు వారికి రావాల్సిన పీఎఫ్, గ్రాట్యుటీ యాజమాన్యం చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని, కొంతమంది కార్మికులు ఆకలి, ఆవేదనతో ఆందోళన చెంది చనిపోగా, వారి పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. తాండవ, ఏటికొప్పాక, అనకాపల్లి, సుగర్ ఫ్యాక్టరీల పరిధిలో రైతులకు ఇంకా బకాయిలు చెల్లించాల్సి ఉందని, భీమసింగి సుగర్ ఫ్యాక్టరీకి ఆ పరిస్థితి లేదని, రాష్ట్ర ప్రభుత్వం అసలు సుగర్ ఫ్యాక్టరీలను నడుపుతుందో, మూసేస్తుందో ప్రకటించకుండా రైతుల్ని ఆందోళనకు గురిచేస్తోందన్నారు. వెంటనే బకాయిలు చెల్లించాలి నాలుగు ఫ్యాక్టరీల కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు సుమారు రూ.35 కోట్లు ఉండవచ్చునని ఫ్యాక్టరీల్లో ఉన్న యంత్ర పరికరాలను అమ్మేసి ప్రభుత్వం వెంటనే కార్మికులు, రైతుల,ఉద్యోగుల బకాయిలు చెల్లించవచ్చని అభిప్రాయపడ్డారు. మూతపడిన సుగర్ ఫ్యాక్టరీల స్ధానంలో ఇథనాల్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచన చేస్తే బాగుంటుందని భీశెట్టి అభిప్రాయపడ్డారు. కార్మికుల బకాయిలు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని యువరాజు హామీ ఇచ్చినట్లు భీశెట్టి తెలిపారు. -
యువకుడి అదృశ్యంపై కేసు నమోదు
కొత్తవలస: మండలంలోని గులివిందాడ గ్రామానికి చెందిన కోట దుర్గాప్రసాద్ (22) అదృశ్యం కావడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు కొత్తవలస పోలీసులు మంగళవారం తెలిపారు. ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దుర్గాప్రసాద్ నర్సీపట్నం సమీపంలోని ఓ కోల్లఫామ్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. కాగా గత నెల 27వ తేదీన సెలవుపై సొంతూరు వెళ్తున్నట్లు ఫామ్ యజమానికి తెలిపాడు. అదే రోజు కొత్తవలసలో దుర్గాప్రసాద్ తన బావమరిదికి కనిపించినప్పటికీ ఇంటికి మాత్రం చేరలేదు. యువకుడి మోటర్ సైకిల్ విశాఖపట్నం రైల్వేస్టేషన్ వద్ద పార్కింగ్ చేసి ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు దుర్గాప్రసాద్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
లారీ ఢీకొని ఆర్మీ జవాను దుర్మరణం
బొబ్బిలి రూరల్/బాడంగి: బొబ్బిలి మండలంలోని పారాది గ్రామం వద్ద మంగళవారం లారీ ఢీ కొన్న ఘటనలో ఆర్మీ జవాను తూముల సత్యం(53) దుర్మరణం చెందారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బాడంగి మండలం ముగడ గ్రామానికి చెందిన తూముల సత్యం మోటార్సైకిల్పై బొబ్బిలి నుంచి రామభద్రపురం వెళ్తుండగా పారాది బ్రిడ్జి వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో సత్యం అక్కడికక్కడే మృతిచెందినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న సీఐ సతీష్కుమార్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను స్థానికుల నుంచి ఆరాతీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సీహెచ్సీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శోకసంద్రంలో మృతుడి కుటుంబం, గ్రామస్తులు ఆర్మీ జవాను తూముల సత్యం(52) రోడ్డుప్రమాదంలో మృతిచెందడంతో ఒక్కసారిగా ముగడ గ్రామం మూగబోయింది. మృతుడి తండ్రి సోములు గతంలో మృతిచెందగా తల్లి అప్పమ్మ మరోముగ్గురు సోదరులున్నారు.వారిలో సత్యం మూడవవాడు. ఆయన 1994లో ఆర్మీలో చేరగా మిగిలినవారు వ్యసాయం చేసుకుంటున్నారు. ఆయనకు 2001లో నాగరత్నంతో వివాహం జరిగింది. వారికి బీటెక్ చదివిన అబ్బాయి అరవింద్, విశాఖలో ఆంధ్రా యూనివర్సిటీలో బీఎస్సీ చదువుతున్న అమ్మాయి హిమబిందు ఉన్నారు. ఆయన తొమ్మిదేళ్ల క్రితమే బొబ్బిలిలోని గొల్లవీధిలో ఇల్లు కొనుగోలు చేసి భార్యాపిల్లలతో నివాసం ఉంటున్నారు. ఇదిలాఉండగా ప్రస్తుతం సీఆర్పీఎఫ్ ఏఎస్సైగా ఆయనకు ప్రమోషన్ రాగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని జగదల్పూర్లో బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన అక్క రామభద్రపురంలో ఉంటున్నందున తాను బుధవారం వెళ్లిపోతున్నానని చెప్పేందుకు బైక్పై వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు. రోడ్డు ప్రమాదంలో సత్యం మృతి చెందడంతో భార్యాపిల్లలు, తల్లి, సోదరులు, బంధువులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆర్మీ జవాను మృతదేహానికి బుధవారం ముగడ గ్రామంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. -
కార్మిక శాఖ సహాయ కమిషనర్ బాధ్యతల స్వీకరణ
విజయనగరం గంటస్తంభం: విజయనగరం కార్మికశాఖ సహాయ నూతన కమిషనర్గా జి.ఎల్లాజీ రావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత కార్మిక శాఖ సహాయ కమిషనర్ ఏటీ శ్రీనివాసులు నుంచి ఉదయం 10 గంటలకు బాధ్యతలు తీసుకుని విధుల్లో చేరారు. అనంతరం కార్మిక శాఖ కార్యాల యంలో కార్మిక శాఖ ఉప కమిషనర్, సిబ్బంది ఆయనను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.బాధ్యతలు స్వీకరించిన అనంతరం విలేకరులతో కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, నాణ్యమైన సేవలు అందించడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. తులసిరామినాయుడువలసలో ఏనుగులుగరుగుబిల్లి: పదిరోజుల నుంచి మండలంలోని సుంకి, సంతోషపురం, గొట్టివలస తదితర గ్రామాల్లో సంచరిస్తున్న ఏనుగులు గడిచిన రెండు రోజుల నుంచి తులసిరామినాయుడు వలస, దళాయివలస గ్రామాల్లో సంచరిస్తున్నాయి. మంగళవారం పార్వతీపురం–గరుగుబిల్లి ఆర్అండ్బీ ప్రధాన రహదారి పరిధిలో ఏనుగులు సంచరిస్తుండడంతో రాకపోకలు చేసేందుకు ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పంట పొలాల్లో ఉన్న పంటలను నాశనం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. ఏనుగుల నుంచి రక్షణ కల్పించాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు. యువకుడిపై పోక్సో కేసు నమోదునెల్లిమర్ల రూరల్: మండలంలోని కొండగుంపాం గ్రామానికి చెందిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై గణేష్ సోమవారం తెలిపారు. మండలానికి చెందిన ఓ బాలికకు మాయమాటలు చెప్పి బలవంతంగా పలుమార్లు శారీరకంగా అనుభవించాడంటూ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కందివలస వాసు అనే వ్యక్తిపై పోక్సోతో పాటు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామన్నారు. ఈ నేపథ్యంలతో డీఎస్పీ శ్రీనివాసరావు గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి పలు వివరాలు సేకరించారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి నిందితుడిని కోర్టులో ప్రవేశపెడతామని ఎస్సై చెప్పారు. ఆకస్మికంగా సబ్జైల్ తనిఖీపార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలో ఉన్న సబ్జైలును విజయనగరం జిల్లా న్యాయమూర్తి ఎం.బబిత మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైల్లో వసతులను ఈ సందర్భంగా పరిశీలించి ఖైదీలతో ముఖాముఖి మాట్లాడి అక్కడి పరిస్థితుల పట్ల ఆరాతీశారు. నిబంధనల ప్రకారం చక్కటి నడవడిక, నైతిక విలువల వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని ఖైదీలకు సూచించారు. ఖైదీల ఆరోగ్యంపట్ల తీసుకుంటున్న చర్యలపై సబ్సైల్ సూపరింటెండెంట్ను అడిగి తెలుసుకున్నారు. అలాగే జైల్లో ఉన్న లీగల్ ఎయిడ్ క్లినిక్ను పరిశీలించారు. పలు విభాగాలను తనిఖీ చేసి ప్రిజన్ లీగల్ ఎయిడ్ క్లినిక్ గురించి ఖైదీలకు వివరించారు. ఒక ఆడ్వకేట్, ఒక పారా లీగల్ వలంటీర్ ఉంటారని, వారు ఖైదీలకు న్యాయ సలహాలను అందిస్తారని చెప్పారు. ఖైదీలు సత్ప్రవర్తనతో తమకు విధించిన శిక్షను పూర్తిచేసుకోవాలని సూచించారు. న్యాయవాదులు లేని ఖైదీలకు ఉచితంగా నియమించనున్నట్లు తెలిపారు. 70ఏళ్లు పైబడిన వారికి, అలాగే అనారోగ్యంతో బాధ పడేవారికి బెయిల్ మంజూర య్యేలా కృషిచేస్తామన్నారు. ఈ పరిశీలనలో పార్వతీపురం జిల్లా రెండవ అదనపు న్యాయమూర్తి ఎస్. దామోదరరావు, లోక్ అదాలత్ సభ్యుడు టి. జోగారావు తదితరులు పాల్గొన్నారు. రేషన్కు వెళ్తూ ప్రమాదానికి గురైన వ్యక్తిరాజాం సిటీ: కూటమి ప్రభుత్వం రేషన్ విషయంలో అవలంబించిన విధానంతో రాజాంలోని ఓ వ్యక్తి మంగళవారం ప్రమాదం బారినపడి ఆస్పత్రి పాలయ్యాడు. దీనికి సంబంధించి టౌన్ సీఐ కె.అశోక్కుమార్ తెలిపిన వివరాల మేరకు మెంటిపేట ఎస్సీ కాలనీకి చెందిన రాగోలు విశ్వనాథం రేషన్ సరుకులు విడిపించేందుకు మల్లయ్యపేటలోని డిపోకు సైకిల్పై వస్తున్నాడు. సిరి కల్యాణమంటపం వద్దకు వచ్చేసరికి అదే సమయంలో బొబ్బిలి నుంచి వస్తున్న ద్విచక్రవాహనం బలంగా ఢీకొంది. దీంతో రోడ్డుపై పడిపోయిన విశ్వనాథం తల, కాలికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 ద్వారా మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం తరలించారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. -
పైడితల్లికి పుష్పాలంకరణ
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్ప సేవ నిర్వహించారు. చదురుగుడి, వనంగుడిలలో కొలువైన పైడితల్లి అమ్మవారు పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునుంచి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అమ్మవారికి లడ్డూలతో నివేదన చేశారు. ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్, నేతేటి ప్రశాంత్లు శాస్త్రోక్తంగా నిత్య పూజాదికాలు చేశారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయం వెనుక ఉన్న వేప,రావిచెట్ల వద్ద మహిళలు దీపారాధన చేశారు. ఆలయ ఇన్చార్జ్ ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్ కార్యక్రమాలను పర్యవేక్షించారు. -
మనసున్న ’మాస్టారు’
● అవయవ దానానికి ముందుకొచ్చిన విజయ్ కుమార్ ● మిమ్స్ వైద్య కళాశాలకు అంగీకార పత్రం అందజేతనెల్లిమర్ల: నెల్లిమర్ల మండల రిటైర్డ్ ఎంఈఓ ఈపు విజయ్ కుమార్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. తన తదనంతరం శరీరాన్ని మిమ్స్ వైద్య కళాశాలకు దానం చేసేందుకు ముందుకొచ్చారు. ఈ మేరకు కుటుంబ సభ్యుల సమ్మతితో అవయవ దానం చేస్తున్నట్లు మిమ్స్ వైద్యులకు మంగళవారం అంగీకార పత్రాన్ని అందజేశారు. తద్వారా మనసున్న మాస్టారుగా నిరూపించుకున్నారు. నెల్లిమర్ల మండల విద్యాశాఖాధికారి–2గా విధులు నిర్వర్తించి, తాజాగా ఉద్యోగ విరమణ పొందిన ఈపు విజయ్ కుమార్ తన తదనంతరం పార్థివ దేహాన్ని మిమ్స్ వైద్య కళాశాలకు అందజేస్తున్నట్లు ప్రకటించారు. తన భార్య, కుమార్తె సమ్మతితో కళాశాల డీన్ డాక్టర్ లక్ష్మీకుమార్, అనాటమీ డిపార్ట్మెంట్ విభాగాధిపతి డాక్టర్ అనిల్ కుమార్కు మంగళవారం డిక్లరేషన్ సమర్పించారు. ఈ సందర్భంగా విజయ్కుమార్ను అభినందిస్తూ మిమ్స్ వైద్యులు అభినందన పత్రం అందజేశారు. విజయ్ కుమార్ పాఠశాల ఉపాధ్యాయుడిగా, ప్రధానోపాధ్యాయుడిగా నాలుగు దశాబ్దాల పాటు సేవలందించారు. సారిపల్లి ప్రాథమిక పాఠశాలలో మొట్టమొదట ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. అలాగే నటుడిగా నాటకరంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఈ సందర్భంగా విజయ్కుమార్ మాట్లాడుతూ తన అవయవ దానంతో మెడికల్ విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తనలాగానే నేత్ర, అవయవ దానానికి మరింత మంది ముందుకు రావాలని పిలుపునిచ్చారు. -
వినడం, హామీ ఇవ్వడం కాదు.. పని పూర్తిచేయాలి ...
ఇటు టీడీపీ, అటు వైఎస్సార్సీపీతో పనిలేకుండా మాకు ఏ మాత్రం అఽధికారం వచ్చినా ఇక్కడ వంతెన నిర్మిస్తాం. ఇక్కడి 50 గ్రామాల ప్రజల కలను నెరవేరుస్తాం. 2018లో రాజాం నియోజకవర్గం సంతకవిటి మండలంలో వాల్తేరు గ్రామంలో బలసలరేవు వద్ద నాగావళి నదిపై వంతెన నిర్మాణం నిమిత్తం ప్రజలుచేస్తున్న పోరాటానికి మద్దతు ఇచ్చి పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ. ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఏడాదైనా గత జగన్మోహన్రెడ్డి ప్రభు త్వం రూ. 87 కోట్ల ఖర్చుతో తలపెట్టిన వంతెన నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు చొరవ తీసుకోకపోవడంపై జనం మండిపడుతున్నారు. -
దగాకోరు పాలన...
స్మార్ట్ మీటర్లను బద్దలు కొట్టండి.. విశాఖ ఉక్కు..ఆంధ్రుల హక్కు.. అని చెప్పిన నారా లోకేశ్.. అధికారంలోకి వచ్చాక స్మార్ట్ మీటర్ల బిగించు తున్నారు. విశాఖఉక్కు కర్మాగారం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు చొరవచూపుతున్నారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఫుడ్ కోర్టు, సాగునీటి ప్రాజెక్టుల పనులను విస్మరించారు. నిరుద్యోగ భృతి, విద్యార్థులకు విద్యా దీవెన, తల్లికి వందనం ఇవ్వలేదు. విద్యుత్ చార్జీలు పెంచారు. కుళాయి చార్జీలు రెట్టింపు చేశారు. కూటమిది దగాకోరు పాలన. – రెడ్డి శంకరరావు, పట్టణ పౌర సంక్షేమ సంఘం అధ్యక్షుడు, విజయనగరం సాగుకు భరోసా లేదు.. గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లూ క్రమంతప్పకుండా వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్ కింద రూ.13,500 చొప్పున అందించింది. వాటితో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకుని వ్యవసాయం చేసుకునేవాళ్లం. కూటమి ప్రభు త్వం వచ్చి ఏడాది అయినా ఇంతవరకు ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు. – పొటుపురెడ్డి అప్పలనాయుడు, రైతు, పెదవేమలి గ్రామం వైద్య కష్టాలు ఆరంభం కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపడంలేదు. ఫ్యామిలీ డాక్టర్ సేవలు పారదర్శకంగా అందడంలేదు. గత ప్రభుత్వం జిల్లాకు వైద్యకళాశాల మంజూరు చేసి ప్రజలకు భరోసా కల్పించింది. – ఎన్. సన్యాసిరావు, సామాజిక కార్యకర్త, నరవ గ్రామం అభివృద్ధి శూన్యం రాజాం–పాలకొండ రోడ్డు ప్రమాదకరంగా మారింది. గతంలో అధికారులు గోతులైనా పూడ్చేవారు. ఇప్పుడు అదికూడా లేదు. అధికారంలోకి వచ్చినవెంటనే రోడ్డును నిర్మించేస్తామని హామీలు ఇచ్చిన చంద్రబాబునాయుడు ఇంతవరకూ ఈ రోడ్డు పనులు పూర్తిచేయలేదు. రాజాం మండలంతో పాటు పట్టణంలో ఎటువంటి అభివృద్ధిలేదు. – లావేటి రాజగోపాలనాయుడు, వైఎస్సార్సీపీ రాజాం మండలాధ్యక్షుడు, రాజాం నాడు చదువుల విప్లవం.. నేడు సమస్యల రాజ్యం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది పాలనలో విద్యార్థులకు చేసిందేమీ లేదు. వసతిదీవెన నిలుపుదల చేసింది. విద్యాదీవెన బకాయిలు విడుదలచేయలేదు. గత ప్రభుత్వం మెడికిల్ కాలేజీలను తీసుకొస్తే.. ప్రస్తుత ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తూ విద్యార్థులకు చదువును భారంగా మార్చే ప్రయత్నం చేస్తోంది. వైద్యవిద్యను వ్యాపారంగా మార్చేసింది. గత ప్రభుత్వం చదువుల విప్లవం సృష్టిస్తే.. కూటమి ప్రభుత్వం సమస్యల విప్లవం తెచ్చిపెట్టింది. – డి.రాము, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు, విజయనగరం -
సీజ్చేసిన జేసీబీ అప్పగింత
చీపురుపల్లి: దేవదాయశాఖ అధికారుల ఆధ్వర్యంలో ఓ ఇంటిని కూల్చేందుకు తీసుకెళ్లిన ఓ ప్రైవేటు జేసీబీను రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకు చీపురుపల్లి పోలీసులు సీజ్చేసిన సంగతి తెలిసిందే. దీనిని దేవదాయశాఖ అధికారులు కూడా ఖండించారు. తాము జేసీబీని అద్దెకు తీసుకెళ్లినట్టు వివరణ ఇచ్చినా పోలీసులు వినకపోవడంతో ‘ఇదెక్కడి రాజ్యాంగం’ అనే శీర్షికన మంగళవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు స్పందించారు. తక్షణమే జేసీబీని యజమానికి అప్పగించాలని చీపురుపల్లి పోలీసులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జేసీబీను రిలీజ్ చేశారు. పోలీసుల సూచన మేరకు యజమాని దుర్గారావు తన డ్రైవర్ను తీసుకెళ్లి జేసీబీని ఇంటికి తీసుకెళ్లిపోయారు. అన్యాయంపై స్పందించిన ‘సాక్షి’కి, నిబంధనలకు విరుద్ధంగా జేసీబీ సీజ్ చేయడంపై పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడిన మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘సాక్షి’ కథనానికి స్పందించిన పోలీస్ యంత్రాంగం -
5 నుంచి ఐటీఐలలో ప్రవేశాలకు కౌన్సెలింగ్
విజయనగరం అర్బన్: జిల్లాలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో ప్రవేశాలకు ఈ నెల 5 నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని జిల్లా కన్వీనర్, ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ టీవీగిరి తెలిపారు. కౌన్సెలింగ్ షెడ్యూల్ను ఆయన మంగళవారం విడుదల చేశారు. విద్యార్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా కేటాయించిన ర్యాంకుల బట్టి వారికి కేటాయించిన తేదీల్లో ఒరిజినల్ ధ్రువపత్రాలతో కౌన్సెలింగ్కు హాజరుకావాలని కోరారు. మొదటి విడతగా ఈ నెల 5, 6, 10వ తేదీల్లో నిర్వహిస్తున్న షెడ్యూల్లో ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 2 గంటల ప్రారంభిస్తామని తెలిపారు. కౌన్సెలింగ్ తేదీలను మెసేజ్ రూపంలో సెల్కు పంపిస్తామన్నారు. -
అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ.. నేడు ‘వెన్నుపోటు దినం’
● జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు విజయనగరం: ఎన్నికలకు ముందు ప్రకటించిన హమీలు నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజలకు కూటమి ప్రభుత్వం చేస్తున్న దగాపై ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 11 నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు మంగళవారం పిలుపునిచ్చారు. నిరసన ర్యాలీలు చేపట్టి తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్లకు కూటమి ప్రభుత్వం చేస్తున్న దగా పాలనపై వినతిపత్రాలు అందజేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీకి అదనపు బాధ్యతలు విజయనగరం టౌన్: ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి.వెంకటేశ్వరరావుకు సాంఘిక సంక్షేమశాఖ ఉపసంచాలకులుగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆ శాఖ డైరెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు పనిచేసిన జిల్లా సాంఘిక సంక్షేమాధి కారి బి.రామానందం పదోన్నతిపై అనకాపల్లి జిల్లాకు బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో ఈడీ వెంకటేశ్వరరావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. 5న రాష్ట్ర మాలల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ రాక రాష్ట్ర మాలల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పెదపూడి విజయకుమార్ ఈ నెల 5న గురువారం జిల్లాలో పర్యటించనున్నట్టు సాంఘిక సంక్షేమ శాఖ ఈడీ డి.వెంకటేశ్వరరావు తెలిపారు. కలెక్టర్, ఇతర జిల్లా అధికారులతో సమావేశమై పథకాల అమలుపై చర్చిస్తారని పేర్కొన్నారు. జేఎన్టీయూ జీవీలో ఆన్లైన్ శిక్షణ విజయనగరం అర్బన్: జేఎన్టీయూ గురజాడ విజయనగరం (జీవీ), ఢిల్లీ యూనివర్సిటీ యూజీసీ, మాలవియామిషన్ టీచర్ ట్రైవింగ్ సెంటర్, ఎస్జీటీబీ ఖల్సా కాలేజీ సంయక్త నిర్వహణలో బోధన సిబ్బందికి ఈ నెల 13 తేదీ వరకు నిర్వహించే ఆన్లైన్ శిక్షణ మంగళవారం ప్రారంభమైంది. జాతీయ విద్యావిధానం–2020పై బోధనా సిబ్బందికి అవగాహన కల్పించడం, సున్నితత్వాన్ని పెంపొందించే అంశాల్లో ఇచ్చే శిక్షణకు జేఎన్టీయూ జీవీ అనుబంధ కాలేజీల నుంచి సుమారు 200 మంది హాజరయ్యారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్, కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ జి.జయసుమ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ సాంకేతిక విద్యా విధానంపై అవగాహన పెంచుకోవడానికి ఇలాంటి శిక్షణలు దోహదపడతాయన్నారు. సినిమా థియేటర్లలో ఆకస్మిక తనిఖీలు చీపురుపల్లి: పట్టణంలోని రాధామాధవ సినీ కాంప్లెక్సు ఆవరణలోని వంశీ, విష్ణు, వైభవ్ సినిమా థియేటర్లను ఆర్డీఓ ఆశియ్య, డీఎస్పీ రాఘవులు, సీఐ శంకరరావు, తహసీల్దార్ రాజారావు తదితరులు మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాంటీన్లో తినుబండారాలు, వాటర్ బాటిళ్లు, డ్రింకుల అమ్మకాలు, ధరల పట్టికలను పరిశీలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సినీ కాంప్లెక్స్ను తనిఖీ చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఐ రామ్కుమార్, వీఆర్వో గోవిందరావు, వీఆర్ఏ శంకర్, తదితరులు పాల్గొన్నారు. వృద్ధులకు ఇంటివద్దనే రేషన్ విజయనగరం ఫోర్ట్: వృద్ధులు, దివ్యాంగులు, ఆరోగ్య సమస్యలతో మంచం పట్టినవారికి ఇంటివద్దకే రేషన్ సరుకులు సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్టు జిల్లా పౌరసరఫరాల అధికారి కె.మధుసూదన్రావు తెలిపారు. అటువంటి వారికి ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు డీలర్ స్వయంగా ఇంటికి సరుకులు అందజేయాల్సి ఉంటుందన్నారు. ప్రతినెల ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ సరుకులు పంపిణీ చేయాలని డీలర్లకు ఆదేశాలిచ్చామన్నారు.