Vizianagaram District News
-
అన్నదాతతో ఆటలు..!
విజయనగరం ఫోర్ట్: అందరికీ అన్నం పెట్టే అన్నదాతలతో టీడీపీ సర్కార్ ఆటలాడుతోంది. అధికారంలోకి వస్తే రైతుల సంక్షేమానికి పాటు పడతామని గొప్పలు చెప్పిన టీడీపీ సర్కార్ ఆ తర్వాత రైతులను గాలికి వదిలేసింది. గడిచిన రెండేళ్లుగా ఎటువంటి యంత్ర పరికరాలు టీడీపీ ప్రభుత్వం అందించలేదు. తాజాగా మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ పథకం ద్వారా రైతులకు రాయితీపై ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు వంటి యంత్ర పరికరాలు అందిస్తామని టీడీపీ సర్కార్ ప్రకటించింది. అయితే గతంలో మాదిరి కాకుండా లాటరీ ద్వారా యంత్ర పరికరాలు కేటాయిస్తామని మెలిక పెట్టింది. లాటరీ పద్ధతిపై యంత్ర పరికరాలు కేటాయించడం అంటే రైతులను ఇబ్బంది పెట్టడమేననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లాటరీ వరించినా కష్టమే లాటరీలో యంత్ర పరికరం వచ్చినప్పటికీ అది అన్నదాతకు అందుతుందనే గ్యారంటీ లేదు. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న సామెత చందాన లాటరీలో వరించినప్పటికీ జిల్లా ఇన్చార్జి మంత్రి అమోదంతోనే యంత్ర పరికరాలను రైతులకు అందజేస్తారు. లాటరీ వరించిన రైతు అధికార పార్టీకి చెందిన వారు కాకపోతో పక్కన పెట్టేస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వ్యవసాయ యంత్ర పరికరాల కోసం లాటరీ టీడీపీ సర్కార్ వింత ధోరణి రైతులు ఈనెల 19 లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటన లాటరీ వరించినా ఇన్చార్జి మంత్రి అమోదం తప్పనిసరి జిల్లాకు యంత్ర పరికరాల కోసం రూ.4.22 కోట్లు కేటాయింపు -
రెచ్చిపోయిన పచ్చమూకలు
వండాన పేటలోరేగిడి: మండల పరిధిలోని వండానపేట గ్రామంలో సోమవారం రాత్రి వైఎస్సార్ సీపీ శ్రేణులపై పచ్చమూకలు రెచ్చిపోయాయి. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై విరుచుకుపడ్డాయి. రాత్రి నిద్రపోయే వేళ ఇంటికి వెళ్లి దాడిచేయడంతో బాధితులు పరుగులు తీశారు. విడిచిపెట్టాలంటూ ప్రాథేయపడినా విడిచిపెట్టలేదు. టీడీపీ కార్యకర్తల దాడిలో తీవ్ర గాయాలైన వియ్యపు జనార్దనరావు, వియ్యపు సూర్యనారాయణ, వియ్యపు వెంకటరమణ, వియ్యపు వెంకటలక్ష్మిను వారి కుటుంబ సభ్యులు 108లో రాజాం సామాజిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదుచేశామని ఎస్ఐ వి.బాలకృష్ణ తెలిపారు. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, రాజాం నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తలే రాజేష్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాధితులను మంగళవారం పరామర్శించారు. ఘటన వివరాలను మాజీ సర్పంచ్ వియ్యపు చక్రపాణిని అడిగితెలుసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాజాం నియోజకవర్గంలో దాడులు అధికమయ్యాయన్నారు. చేతిలో అధికారం ఉందనే అహంకారంతో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారన్నారు. పరామర్శించిన వారిలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు టంకాల అచ్చెన్నాయుడు, పార్టీ మండల కన్వీనర్ వావిలపల్లి జగన్మోహనరావు, రాజాం టౌన్ పార్టీ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు, పార్టీ వంగర మండలాధ్యక్షుడు కరణం సుదర్శనరావు, రాజాం నియోజకవర్గ బీసీ సెల్ విభాగం అధ్యక్షుడు కరణం శ్రీనివాసరావు, యువజన విభాగం అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, జిల్లా యువజన విభాగం కార్యదర్శి కెంబూరు నారాయణరావు, మున్సిపల్ విభాగం అధ్యక్షుడు శాసపు వేణుగోపాలనాయుడు, సలాది సతీష్, దూబ గోపాలం, కోరాడ రామినాయుడు తదితరులు ఉన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి పలువురికి గాయాలు ఆస్పత్రికి తరలింపు బాధితులను పరామర్శించిన ఎమ్మెల్సీ విక్రాంత్, ఇన్చార్జి తలే రాజేష్ -
రక్తదానం చేసిన మహిళ
విజయనగరం ఫోర్ట్: ఆపదలో ఉన్న ఓ మహిళకు మరో మహిళ రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచింది. జామి మండలం జాగారం గ్రామానికి చెందిన అల్లు వెంకటలక్ష్మి శస్త్రచికిత్స నిమత్తం ఘోషాఆస్పత్రిలో చేరింది. ఆమెకు శస్త్రచికిత్స నిమిత్తం ‘ఒ పాజిటివ్’ రక్తం ఎక్కించాలని వైద్యులు సూచించడంతో వారి బంధువులు ఆశ్రయ బ్లడ్ డోనర్స్ క్లబ్ అధ్యక్షుడు బి. రామకృష్ణారావును ఆశ్రయించారు. ఆయన సూచన మేరకు క్లబ్ సభ్యురాలు సాయి ఝాన్సీ మంగళవారం ప్రభుత్వ రక్తనిధి కేంద్రానికి వచ్చి రక్తదానం చేశారు. సకాలంలో స్పందించి రక్తదానం చేసినందుకు గాను ఝాన్సీని రామకృష్ణారావు, రోగి బంధువు చిన్ననాయుడు సత్కరించారు. సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్, క్యారెక్టరైజేషన్పై శిక్షణసీతంపేట: గిరిజన విద్యార్థులు సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్, క్యారెక్టరైజేషన్పై శిక్షణలో చేరేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పాలకొండ సబ్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జ్ పీఓ పవార్ స్వప్నిల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఉంటుందన్నారు. నాల్గవ సంవత్సరం చదువుతున్న బీఎస్సీ విద్యార్థులు, ఎంఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్న వారు అర్హులన్నారు. వివరాలకు వెబ్సైట్ చూడాలని సూచించారు. ప్రెజర్ కుక్కర్ పేలి మహిళకు తీవ్రగాయాలుగజపతినగరం: మండల కేంద్రంలోని కుమ్మర వీధిలో వంట చేస్తుండగా లక్ష్మి అనే మహిళ తీవ్రగాయాల పాలైంది. మంగళవారం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. లక్ష్మి అనే మహిళ తన ఇంటి వద్ద గ్యాస్ పై ప్రెజర్ కుక్కర్లో వంట చేస్తుండగా ఒక్క సారిగా ప్రెజర్ కుక్కర్ పేలడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. తక్షణమే ఆమెను బంధువులు గజపతినగరం ప్రాంతీయ ఆస్పత్రికి ఆటోలో తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. మాజీ సైనికుడికి 10రోజులు జైలుశిక్ష● రూ.10,000 జరిమానా విజయనగరం క్రైమ్/లక్కవరపుకోట: ఒక మాజీ సైనికుడు మందు తాగి డ్రంకెన్ డ్రైవ్లో చిక్కినందుకుగాను కొత్తవలస జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ విజయచందర్ పది రోజులు జైలు శిక్ష, రూ.పదివేలు జరీమానా విధిస్తూ తీర్పు ఇచ్చారని ఎస్పీ దామోదర్ మంగళవారం తెలిపారు. ఎల్.కోట ఎస్సై రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది మే 11న ఎల్.కోట పోలీస్ స్టేసన్ పరిధిలో గోల్డ్ స్టార్ జంక్షన్ వద్ద డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టగా జమ్మాదేవి పేట గ్రామానికి చెందిన మాజీ సైనికుడు కూరిమిని శ్రీనివాసరావు మద్యం తాగి మోటారు సైకిల్ నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో మాజీ సైనికుడిపై పోలీసులు కేసు నమోదు చేసి మే 12న కొత్తవలస జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వద్ద హాజరుపరచగా జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యంవిజయనగరం క్రైమ్: విజయనగరం వన్ టౌన్ పోలీసులు మంగళవారం గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. ఆర్టీఓ ఆఫీస్కు వెళ్లే దారిలో సీతం కాలేజీవద్ద 55 ఏళ్ల వయస్సు కలిగిన మహిళ మృతదేహాన్ని కనుగొన్నట్లు ఏఎస్సై జగన్మోహన్ రావు తెలిపారు. మృతురాలిని గుర్తించగలిగిన వారు వన్ టౌన్ స్టేషన్ లేదా కంట్రోల్ రూమ్ కు సమాచారం తెలపాలని కోరారు. -
రామతీర్థంలో వైభవంగా హనుమాన్ జయంతి
● కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండనెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి వేడుకలు మంగళవారం వైభవంగా జరిగాయి. వేకువజామున ప్రాతః కాలార్చన, బాలభోగం అనంతరం ఆంజనేయస్వామి సన్నిధిలో అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపించారు. స్వామికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, వివిధ రకాల ఫల రసాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామిని తమలపాకులు, సిందూరం, పుష్పాలతో సుందరంగా అలంకరించి అర్చనలు జరిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసి స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆంజనేయస్వామి దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో అర్చకులు సాయిరామాచార్యులు, కిరణ్కుమార్, పవన్, రామగోపాల్, తదితరులు పాల్గొన్నారు. వాడవాడలా భక్తి శ్రద్ధలతో హనుమాన్ జయంతి సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. కొత్తపేట, ఒమ్మి, సతివాడ, గొర్లిపేట, తదితర గ్రామాల్లో ఆంజనేయస్వామి ఆలయాల్లో భక్తులు పూజలు జరిపారు. విగ్రహాలకు భారీ పూలదండలు వేసి భక్తి శ్రద్ధలతో ఆరాధించారు. -
బాలభవన్ను సందర్శించిన జీతెలుగు డైరెక్టర్
రాజాం: పట్టణంలోని మెంతిపేటలో గల ప్రభుత్వ జవహర్ బాలభవన్ వేసవి శిక్షణ తరగతులను జీ తెలుగు టీవీ ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్స్ డైరెక్టర్ శేఖర్ మంగళవారం సందర్శించారు. జీ తెలుగులో పలు కార్యక్రమాలకు దర్శకత్వం వహిస్తున్న ఆయన బాలభవన్లో వేసవి శిక్షణ తరగతుల్లో భాగంగా నేర్పిస్తున్న పలు కార్యక్రమాలపై ఆరాతీయడంతో పాటు వాటిని పరిశీలించి, చిన్నారులతో ముచ్చటించారు. విద్యార్థులు చదువుతో పాటు పలు రంగాల్లో రాణించాలని, ఇవి ఉపాధినే కాకుండా మానసిక, శారీరక వికాసానికి తోడ్పడతాయని వెల్లడించారు. సంగీతం, నృత్యం వంటి కళల్లో విద్యార్థులు మంచి ప్రతిభ కనభరిచి రాష్ట్రస్థాయిలో రాణించాలని కోరారు. కళాకారులుగా గుర్తింపు పొంది, జిల్లాకు, రాష్ట్రానికి పేరుతేవాలన్నారు. ఈ సమయంలో నేర్చుకున్న కళలు జీవితంలో ఏదోఒక సమయంలో ఉపయోగపడ్తాయని గుర్తుచేశారు. మంచి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, వేసవి చిన్నారులకు మంచి మానసిక ఆటవిడుపుగా ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో బాలభవన్ డైరెక్టర్ డాక్టర్ సుంకరి రమేష్, డ్యాన్స్ మాస్టర్ తారకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
సాంకేతికతతో సమర్థంగా సేవలందించాలి
● పీటీసీలో ట్రైనీ ఎస్సైలకు ఎస్పీ సూచనవిజయనగరం క్రైమ్: సాంకేతికతను అందిపుచ్చుకుని సమర్థవంతమైన సేవలందించాలని ఎస్పీ దామోదర్ మంగళవారం అన్నారు. ఈ మేరకు స్థానిక పీటీసీలో ప్రీ ప్రమోషనల్ ఎస్సై ట్రైనింగ్ పొందుతున్న 49 మంది ఏఎస్సైల నుద్దేశించి ఎస్పీ మాట్లాడారు. పోలీసు శాఖలో ఎస్సైలుగా ఉద్యోగోన్నతి పొందేందుకు ఆరు వారాల శిక్షణ నిమిత్తం విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లాల నుంచి పోలీసు శిక్షణ కళాశాలకు విచ్చేసిన 49 మంది ఎస్సై శిక్షణార్థులతో ఎస్పీ ఏఆర్.దామోదర్ మమేకమై, భవిష్యత్తులో ఎస్సైలుగా నిర్వహించాల్సిన విధులపట్ల దిశానిర్దేశం చేశారు. పీటీసీ వైస్ ప్రిన్సిపాల్ పి.వి.అప్పారావు ఎస్పీకి పూల మొక్కను అందజేసి, స్వాగతం పలకగా, పోలీసుల నుంచి ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీసుశాఖలో సుమారు 35 సం.లు పైబడి సర్వీసు పూర్తి చేసుకుని, నేడు ఎస్సైలుగా ఉద్యోగోన్నతి పొందేందుకు శిక్షణకు వచ్చిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, పీటీసీ వైస్ ప్రిన్సిపాల్ పి.వి.అప్పారావు, డీఎస్సీ వాసుదేవ్, పలువురు సీఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్సై, ట్రైనీ ఏఎస్సైలు పాల్గొన్నారు. -
గంజాయి కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి
● ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డిపార్వతీపురం రూరల్: జిల్లాలో నమోదైన గంజాయి (ఎన్డీపీఎస్) కేసుల దర్యాప్తు పురోగతిపై ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి దర్యాప్తు అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఆయన..పెండింగ్లో ఉన్న కేసులపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారి ఆచూకీ కనిపెట్టాలని ఎస్పీ సూచించారు. గంజాయి అక్రమ రవాణా ద్వారా సంపాదించిన ఆస్తులను గుర్తించి జప్తు చేయాలని, పదేపదే నేరాలకు పాల్పడే వారిపై ’పిట్ ఎన్డీపీఎస్’ చట్టం కింద చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సీజ్ చేసిన గంజాయి, వాహనాలకు సంబంధించి న్యాయస్థానాల సమక్షంలో త్వరితగతిన ఇన్వెంటరీ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఎఫ్ఎస్ఎల్ నివేదికలు త్వరగా తెప్పించుకుని, నిర్ణీత గడువులోగా కోర్టుల్లో చార్జిషీట్లు దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు. మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ’సంకల్పం 2.0, చైతన్యం 2.0, అభ్యుదయం 2.0’ పేరిట రూపొందించిన 100 రోజుల ప్రత్యేక ప్రణాళికను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. గంజాయి వినియోగదారులను గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా సరఫరా మూలాలను ఛేదించాలని సూచించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ మనీషా రెడ్డి, పాలకొండ డీఎస్పీ రాంబాబు, సీఐలు పాల్గొన్నారు. -
జరిగేవరకూ ఉద్యమిస్తాం
దళిత క్రైస్తవులకు న్యాయం● కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలంవిజయనగరం టౌన్: దళిత క్రైస్తవులకు న్యాయం చేకూరేవరకూ ఉద్యమిస్తామని కేంద్ర మాజీమంత్రి జేడీ శీలం పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక సిమ్స్ బాప్టిస్ట్ చర్చి ఆవరణలో రాజ్యాంగం, మతస్వేచ్ఛ, దళిత క్రైస్తవుల తక్షణ కర్తవ్యం అనే అంశంపై మంగళవారం జరిగిన దళిత క్రైస్తవ మహాసభలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని ప్రసంగించారు. తాము అండగా ఉన్నామని భరోసా కల్పించారు. క్రిస్టియన్, మైనారిటీ వర్గాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ వర్తింపజేయాలన్న రాష్ట్రాల తీర్మానాన్ని ఆమోదించి, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా రిజర్వేషన్ హక్కులు కల్పించాలని కోరారు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జి.విజయకుమార్ (ఐఏఎస్) మాట్లాడుతూ ప్రస్తుతం వివక్ష కొనసాగుతోందన్నారు. మానవ మనుగడకు ఆటంకం ఏర్పడిందని సమానత్వం హక్కు ఎస్సీ క్రిస్టియన్స్కు, ముస్లింలకు మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా మతప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తామనడం ఎంతవరకూ సబబని ప్రశ్నించారు. అంబేడ్కర్ ఇండియా మిషన్ అధ్యక్షుడు పీవీ.సునీల్ కుమార్ (ఐపీఎస్) మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయసాధనలో దళితులకు సమస్యలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని కోరారు. ప్రభుత్వం సరైన రీతిలో స్పందించి రిజర్వేషన్ల విషయంలో న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అధ్యక్షుడు రంజిత్ ఒఫిర్, వైఎంసీఏ అధ్యక్షుడు రోలెండ్ విలియమ్స్లు ప్రసంగించారు. సంఘమిత్ర ఆర్ఎస్.జాన్ అధ్యక్ష్యతన నిర్వహించిన దళిత మహాసభలో సిమ్స్ చర్చి అధ్యక్షుడు తాలాడ ఆనంద్, పాస్టర్ వై.ప్రభాకర్ ఆంద్రప్రదేశ్ దళిత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఆదాడ మోహనరావు, జమాతే ఇస్లాం కమిటీ ప్రతినిధి హబీబ్, రిటైర్ట్ పీటీసీ ప్రిన్సిపల్ డాక్టర్ కె.రాజశిఖామణి, ఉత్తరాంధ్ర జిల్లాల సంఘ ప్రతినిధులు, అధిక సంఖ్యలో దళిత సంఘాల నాయకులు, పాల్గొన్నారు. -
హనుమాన్ శోభాయాత్ర
భక్తిశ్రద్ధలతో..విజయనగరంలో కనులపండువగా హనుమాన్ శోభాయాత్ర హనుమజ్జయంతిని పురస్కరించుకుని హిందూ ధర్మ రక్షాసమితి జిల్లాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం హనుమాన్ శోభాయాత్ర వైభవంగా సాగింది. భాజాభజంత్రీలు, కోలాట ప్రదర్శనలు, డప్పువాయిద్యాల నడుమ జై హనుమాన్ నామస్మరణతో విజయనగరం కోట కూడలి నుంచి గంటస్తంభం మీదుగా హనుమాన్ కూడలి వరకు శోభాయాత్ర సాగింది. పాత మహారాజా ఆస్పత్రి ప్రాంగణంలో నిర్వహించిన ఆధ్యాత్మిక సభలో ఆంధ్రప్రదేశ్ సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ఆధ్యాత్మిక ఉపన్యాసం ఇచ్చారు. కార్యక్రమంలో హిందూ ధర్మరక్షా సమితి రాష్ట్ర కార్యదర్శి నందివాడ వేణుగోపాల్, రాష్ట్ర ఉపాధ్యక్ష్యుడు ఆబోతుల శ్యామ్ సుందర్, జిల్లా ఇన్చార్జి రామ్ తరుణ్, సహాయ కార్యదర్శి రామ్రాజేష్, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. – విజయనగరం టౌన్ -
బిల్లులు చెల్లించినా..!
బొబ్బిలి: సాగునీరు సకాలంతో అందితేనే పంటలు పండుతాయి. రైతులు లాభపడతారు. అదే ఉద్దేశంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉమ్మడి విజయనగరం జిల్లాలోని మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి కృషిచేసింది. జపాన్ అంతర్జాతీయ సహకార ఏజెన్సీ (జైకా) నిధులతో పనులు చేపట్టింది. ఇంతలో ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయి. బిల్లులు చెల్లించినా కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి. పూడుకుపోయిన కాలువలు, పాడైన మదుములు, అభివృద్ధికి నోచుకోని ప్రాజెక్టులను చూసి రైతులు కన్నీరుపెడుతున్నారు. వేసవి కాలంలో పనులు జరగకపోవడంతో ఈ ఏడాది కూడా సాగునీటి తిప్పలు తప్పవంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ● ఇదీ పరిస్థితి... ఉమ్మడి విజయనగరం జిల్లాలోని ఒట్టిగెడ్డ, పెదంకలాం, వెంగళరాయసాగర్, పెద్దగెడ్డ ప్రాజెక్టుల పరిధిలో 71,063 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. కాలువలు లైనింగ్ సరిగా లేక, మదుములు మరమ్మతులు, ప్రాజెక్టుల ఆధునికీకరణ పనులు జరగక దాదాపు 40 శాతం భూములకు సాగునీరు అందడం లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రూ.165 కోట్ల జైకా నిధులతో పనులకు పరిపాలనామోదం వచ్చింది. పనులు ప్రారంభమయ్యాయి. ప్రాజెక్టులకు లైనింగ్తో పాటు ప్రధాన ప్రాజెక్టు, స్పిల్వే వద్ద ఆధునీకరణ పనులు చేపట్టారు. దశలవారీగా బిల్లులు కూడా అందాయి. ముందుగా గట్ల పటిష్టతను చేశారు. అలాగే, బుష్ క్లియరెన్స్ చేసి ప్రాజెక్టుల గట్లను పటిష్టం చేశారు. ఇలా వరుసగా ఒక్కో ప్రాజెక్టు పనులు పూర్తిచేస్తున్న సమయంలో ప్రభుత్వం మారింది. అంతే, పనులపై శ్రద్ధచూపేవారే కరువయ్యారు. వైఎస్సార్సీపీ హయాంలో బొబ్బిలి–మక్కువ మండలాల మధ్య వీఆర్ఎస్ కాలువ ఇలా (ఫైల్)24,500 ఎకరాల ఆయకట్టు ఉన్న వీఆర్ఎస్ ప్రాజెక్టుకు లైనింగ్ చేపట్టారు. రూ.8.2 కోట్ల బిల్లులు కూడా ప్రభుత్వం చెల్లించినా మిగులు పనులు పూర్తిచేయలేదు. పెదంకలాం ప్రాజెక్టు పనులకు రూ.36 లక్షల బిల్లులు చెల్లించినా కాంట్రాక్టరు పనులు చేసేందుకు ఆసక్తి చూపడంలేదు. పెద్దగెడ్డ, ఒట్టిగెడ్డకు లక్ష్యం ప్రకారం పనులు చేయలేదని బిల్లులు కూడా చెల్లించలేదు. ఎంతో ముఖ్యమైన ప్రాజెక్టుల ఆధునికీకరణ పనులు వేసవిలో ప్రారంభిస్తేనే జూన్లో ఖరీఫ్ నాటికి చివరి ఆయకట్టుకు సాగునీరందించేందుకు వీలుంటుంది. అధికారులు మాత్రం ప్రతిసారీ పనులు ప్రారంభించాలని కాంట్రాక్టర్లకు చెప్పడం, వారు తలూపడం వదిలేయడం మామూలైపోయింది. ఇప్పటికి రెండు సార్లు నోటీసులు ఇచ్చిన ఇరిగేషన్ అధికారులు మరోమారు నోటీసులు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. -
ప్రభుత్వం మారింది... ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పలు సాగునీటి ప్రాజెక్టులకు గ్రహణం పట్టింది. కాలువల లైనింగ్ పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. వచ్చే ఖరీఫ్లోనూ రైతులకు సాగునీటి కష్టాలు తప్పేలా లేవు. వేసవిలో పనులు చేసేందుకు అవకాశం ఉన్నా కాంట్రాక్టర్లు ముందుక
వెంకట్రాయుడిపేట వద్ద ప్రస్తుతం వీఆర్ఎస్ కాలువ దుస్థితి నోటీసులిస్తాం... జైకా నిధులతో పనులు చేయాలని కాంట్రాక్టర్లకు నోటీసులిచ్చినా ముందుకు రావడం లేదు. మరోమారు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాం. – ఆర్.అప్పారావు, సూపరింటెండెంట్ ఇంజినీరు, ఇరిగేషన్ సర్కిల్, బొబ్బిలి సాగునీటి ప్రాజెక్టులకు ‘చంద్ర’గ్రహణం వేసవిలో పూర్తికాని కాలువల లైనింగ్ పనులు ఈ ఏడాది ఖరీఫ్లోనూ సాగునీటికి కటకటే.. ఆవేదనలో రైతాంగం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన జైకా పనులు ప్రభుత్వం మారడంతో పనులపై నిర్లక్ష్యం -
విద్యార్థులకు కలెక్టర్ అభినందనలు
విజయనగరం అర్బన్: పదోతరగతి ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలల కీర్తిని దశదిశలా చాటిన విద్యార్థులను కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అభినందించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా పరిపాలన, విద్యా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక అభినందన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల సమర్ధమైన మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల ప్రోత్సాహం, విద్యార్థుల కఠిన శ్రమఫలితంగానే ఈ అద్భుత విజయాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. విద్యార్థులు తమ ఆసక్తులకు అనుగుణంగా కోర్సులను ఎంపిక చేసుకోవాలని సూచించారు. సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ ఏకాగ్రతతో ఉన్నత చదువుల్లో రాణించి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని హితవు పలికారు. అనంతరం ఉత్తమమార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, ఆయా పాఠశాలల హెచ్ఎంలను దుశ్శాలువలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులతో కలిసి ఆత్మీయ విందులో పాల్గొన్నారు. కార్యక్రమంలో డీఈఓ యు.మాణిక్యంనాయుడు, డిప్యూటీ ఈఓ కె.వి.రమణ, సహాయ సంచాలకులు అరుణజ్యోతి, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ సన్యాసిరాజు, డీఈఓ కార్యాలయ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
సజావుగా ఈఏపీసెట్
విజయనగరం అర్బన్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈఏపీసెట్ మంగళవారం ప్రారంభమైంది. తొలిరోజు 2,060 మందికి 1,893 మంది పరీక్షకు హాజరయ్యారు. 266 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు సమగ్ర ఏర్పాట్లు చేశారు. ఖరీఫ్లో 48 వేల క్వింటాళ్ల వరి విత్తనాలు ● వ్యవసాయ శాఖ జేడీ తారకరామారావు కొత్తవలస: రానున్న ఖరీఫ్ సీజన్లో జిల్లాలోని రైతులకు రాయితీపై అందజేసేందుకు 48వేల క్వింటాళ్లు వరి విత్తనాలను సిద్ధం చేశామని, అందులో 35 వేల క్వింటాళ్లు 1121 రకం విత్తనాలేనని వ్యవసాయ శాఖ జేడీ వి.తారకరామారావు తెలిపారు. కొత్తవలస ఏడీఏ కార్యాలయాన్ని ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో వరి సాధారణ విస్తీర్ణం లక్షా15వేల ఎకరా లుగా పేర్కొన్నారు. 38 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉంచుతామన్నారు. ఎకరానికి 75 కేజీల యూరియా మాత్రమే అందజేస్తామన్నారు. వ్యవసాయ పరికరాలు కావాల్సిన రైతులు రైతు సేవాకేంద్రాల్లో ఈనెల 19వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆయన వెంట ఏడీఏ భానులత ఉన్నారు. దళితుల హక్కులను కాపాడండి ● రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం విజయనగరం: దళిత వర్గాల హక్కులను కాపాడి, వారి ఆర్థికాభివృద్ధికి సహకారం అందివ్వాలని అధికార వర్గాలకు రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం సూచించారు. విజయనగరంలోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న దళిత ఉద్యోగుల వినతులను స్వీకరించారు. ఆ తర్వాత దళిత సంఘాల నేతలు, దళితుల నుంచి వచ్చిన వినతి పత్రాలను అందుకున్నారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరిపి పరిష్కరించారు. మధ్యాహ్నం పలువురి నుంచి వచ్చిన వినతులపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. అనంతరం సీతారాం మాట్లాడుతూ దళితుల హక్కులను పూర్తిగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. రిజర్వేషన్ల ప్రాతిపదికన నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలను కల్పించాలన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు విస్తృత పర్యటనలు చేపడుతున్నామన్నారు. ప్రతి దళిత కుటుంబంలోని ఒకరిని పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వం ధ్యేయమని పునరుద్ఘాటించారు. వివిధ శాఖలలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ఎస్సీ సొసైటీకి 22 శాతం రిజర్వేషన్ ప్రాతిపదికన అవకాశాలు కల్పించాలన్నారు. దళితులు, దళిత సంఘాలు, దళిత ఉద్యోగుల నుంచి వచ్చిన వినతులను 15 రోజుల్లోగా పరిష్కరించి తనకు నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశించారు. సమావేశంలో విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బాలస్వామి, సహాయ కమిషనర్ కిల్లాన అప్పలరాజు, డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి, డీసీహెచ్ఎస్ పద్మశ్రీ రాణి, విద్యుత్ శాఖ ఎస్ఈ యం.లక్ష్మణరావు, ప్రభుత్వ వైద్య కళాశాల ఏడీ, తదితరులు పాల్గొన్నారు. -
నీట్ పేపర్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ సమరభేరి
● నేరగాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ విజయనగరం గంటస్తంభం: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారంపై విద్యార్థి లోకం భగ్గుమంది. భారత విద్యార్ధి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో మంగళవారం విజయనగరం పట్టణంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. విద్య అమ్మకానికి కాదు–మా హక్కు, నీట్ మాఫియాను అంతం చేయాలంటూ విద్యార్థులు నినదించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామ్మోహనరావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన విద్యా వ్యవస్థను కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెడుతున్నారని విమర్మించారు. రాత్రింబవళ్లు కష్టపడి చదివే పేద, మధ్యతరగతి విద్యార్థుల కలలను ఈ విద్యా మాఫియా చిదిమేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఏ వైఫల్యం.. 2015 నుంచి నేటి వరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించిన పరీక్షల్లో నాలుగు సార్లు నీట్ పేపర్ లీక్ అవ్వడం, యూజీసీ నెట్ రద్దు కావడం చూస్తుంటే వ్యవస్థ ఎంతలా దిగజారిందో అర్ధమవుతోందని రామ్మోహనరావు అన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు నీట్ వల్ల తీవ్ర అన్యాయం జరుగుతోందని, అందుకే తమిళనాడు, కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాలు దీనిని వ్యతిరేకిస్తున్నాయని గుర్తుచేశారు. రాష్ట్ర నాయకులు కేంద్రానికి వత్తాసు పలకడం మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్మి డి.రాము, గర్ల్స్ కన్వీనర్ శిరీష్, జిల్లా నాయకులు సోమేష్, జగదీష్,నాని, డీవైఎఫ్ఐ నాయకులు హరీష్, రవి, పెద్ద సంఖ్యలో విద్యార్ధులు పాల్గొన్నారు. 620 మార్కులు వస్తాయని ఆశపడ్డాం నీట్ పరీక్షలో బాగా రాశా. కీలో చూస్తే 620 మార్కులు వచ్చాయి. ఈ మార్కులు తగ్గవనుకున్నా. మా తల్లిదండ్రులు, బంధువులు ఎంతో సంతోషించారు. ఇంతలో పరీక్షను రద్దుచేశారు. హతాశయులయ్యాం. మళ్లీ ఇంత ప్రిపరేషన్ సాధ్యమా? విద్యార్థుల భవిష్యత్తుపై పిడుగు వేశారు. – బొట్ట హేమంత్, ఇందిరమ్మ కాలనీ, బొబ్బిలి ఇది సరికాదు మా కుమార్తె మాధురి తొలిసారి నీట్ పరీక్ష రాసింది. బాగానే రాయడం వల్ల కీలో కూడా మంచి మార్కులు వచ్చాయి. పరీక్ష రద్దుచేశారని తెలియగానే కుమార్తెతో పాటు తామంతా నైరాశ్యంలోకి వెళ్లిపోయాం. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని చర్యలు తీసుకోవాలి. ప్రభావం ఉన్నచోట మాత్రమే పరీక్ష రద్దు చేయాలి. – లచ్చుపతుల శ్రీనివాసరావు, విద్యార్థిని తండ్రి -
ప్రభుత్వబడి పిల్లలకు విమాన ప్రయాణం
● మాట నెలబెట్టుకున్న తెలుగు మాస్టారు సత్యారావు విజయనగరం గంటస్తంభం: ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని, పోటీతత్వాన్ని పెంచేందుకు గోపన్నవలస జెడ్పీ హైస్కూల్ తెలుగు ఉపాధ్యాయుడు మరడాన సత్యారావు వినూత్న కార్యక్రమం చేపట్టారు. తాను ఇచ్చిన మాట ప్రకారం చీపురుపల్లి నియోజకవర్గం పరిధిలోని ఆరుగురు ప్రతిభావంతులైన విద్యార్థులను ఆదివారం విశాఖ నుంచి విజయవాడకు విమానంలో తీసుకెళ్లారు. విమాన ప్రయాణం చేసిన వారిలో మంత్రి విజయలక్ష్మి, నామాల లిఖిత, సంచాన దినేష్, ఇప్పిలి శేఖర్, మంత్రి ప్రియవర్షిని, గండ్రేటి కార్తీక్ ఉన్నారు. విజయవాడలో పలు దర్మనీయ ప్రదేశాలను సందర్మించిన అనంతరం వీరు సోమవారం విజయనగరం చేరుకున్నారు. కలెక్టర్ రాంప్రసాద్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. గత ఏడాది కూడా విద్యార్థుల తల్లిదండ్రులను విమానం ఎక్కించి విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని పెంపొందించారు. -
చందులూరులో ఉపాధి నిధుల మేత..!
చందులూరులో ఉపాధిహామీ నిధుల స్వాహాపై కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డికి వివరిస్తున్న గ్రామస్తులు విజయనగరం గంటస్తంభం: జిల్లాలో లక్కవరపుకోట మండలం చందులూరు పంచాయతీలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (వీబీజీ రామ్జీ) నిధులు అక్రమార్కులకు అక్షయపాత్రగా మారాయి. పేదలకు పని కల్పించాల్సిన నిధులను అధికార టీడీపీ పార్టీ నాయకులు, అధికారులు కలిసి అప్పనంగా బోంచేస్తున్నారు. దాదాపు రూ.2 కోట్ల మేర ప్రజాధనం దుర్వినియోగం అయినట్లు స్పష్టమవుతోంది. గ్రామసభ తీర్మానాలు లేవు.. సాంకేతిక అనుమతులు లేవు.. కానీ ఎం బుక్కుల్లో మాత్రం రికార్డులు చకచకా నమోదువుతున్నాయి. ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్న వారిపై, వారికి సహకరిస్తున్న అఽధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, దోచుకున్న సొమ్మును రికవరీ చేయాలని గ్రామస్తులు కలెక్టరేట్ వద్ద సోమవారం వినతిపత్రం అందజేశారు. గత నెల ఏప్రిల్లో జరిగిన సామాజిక తనిఖీ(సోషల్ అడిట్)లో రూ.21 లక్షలు అవకతవకలు జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. దీనికి బాధ్యులుగా ఏఈ, ఈఏలను గుర్తించి రికవరీకి ఆదేశించారు. అయితే, ఇది కేవలం మంచుకొండ చివర మాత్రమేనని, లోతుగా విచారిస్తే రూ.2 కోట్ల భారీ కుంభకోణం బయటపడుతుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చెరువుల్లో అక్రమ మైనింగ్ జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. రైతులకు కన్నీళ్లు... అధికారుల మౌనం... అక్రమార్కులకు వరం ఒకే తీర్మానం.. అనేక దోపిడీలు! ఒక్క గ్రామసభ తీర్మానాన్ని పట్టుకుని ఒకే చోట పలుమార్లు వేర్వేరు పనుల పేరిట అనుమతులు పొందుతూ నిధులు కాజేస్తున్నారు. ఒక ప్రాంతంలో రూ.10 లక్షలతో పనులు పూర్తి చేసి, కొన్ని నెలల తర్వాత అదే తీర్మానంతో రూ.40 లక్షల అంచనాలతో మరో పనిని సృష్టించి బిల్లులు డ్రా చేస్తున్నారు. ఆరేళ్ల కిందట వేసిన సిమెంట్ రోడ్డుపైనే మళ్లీ రోడ్డు వేసినట్లు చూపి రూ.25 లక్షలు కాజేశారంటే ఇక్కడ అక్రమాలు ఏ స్ధాయిలో జరుగుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. రూ.2కోట్ల ఉపాధిహామీ నిధులు స్వాహా! నిబంధనలు తుంగలో తొక్కిబిల్లుల డ్రా.. ప్రజాధనం లూటీ చేస్తున్న పచ్చపార్టీ నేతలు పాత పనులకే కొత్త రంగులు అక్రమ మైనింగ్తో చెరువుల విధ్వంసం రైతుల అనుమతి లేకుండానే పొలాల్లో రోడ్లు ఉపాధి నిధుల గోల్మాల్పై కలెక్టర్కు గ్రామస్తుల ఫిర్యాదు రైతుల పొట్ట కొడుతున్నారు మా అనుమతి లేకుండానే మా పొలాల్లో రోడ్లు వేస్తున్నారు. రిటైనింగ్ వాల్ కట్టడం వల్ల పొలాల్లోకి నీరు చేరి పంట నష్టపోతున్నాం. ట్రాక్టర్లు కూడా దిగనివ్వడం లేదు. అధికార పార్టీ అండ చూసుకుని కొందరు నాయకులు మా బతుకులను ఛిద్రం చేస్తున్నారు. – పి.వి.జగన్నాథం, రైతు, చందులూరు అడుగడుగునా అవినీతే... చందులూరులో గ్రామసభ తీర్మానం లేకుండానే కోట్ల రూపాయల పనులు మంజూరు చేసుకున్నారు. టెండర్లు లేవు. పారదర్మకత లేదు. అక్రమ పనులపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు. ఈ దోపిడీపై కలెక్టర్ సమగ్ర విచారణ జరిపించాలి. – యడ్ల కిశోర్కుమార్, ఎంపీటీసీ, చందులూరు గ్రామంలో బాపుని చెరువు అడ్డుగా సుమారు 600 మీటర్లు పొడవున అక్రమంగా రిటైనింగ్ వాల్ నిర్మించారు. దీనివల్ల వర్షపునీరు బయటకు వెళ్లే దారిలేక పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయి. ఒక నాయకుడికి చెందిన 60 ఎకరాల సైట్ ప్రయోజనం కోసం సామాన్య రైతుల అనుమతి లేకుండా వారి పొలాల్లోంచి 60 అడుగుల రోడ్డును దౌర్జన్యంగా నిర్మించారు. ఈ అక్రమ నిర్మాణాల వల్ల ట్రాక్టర్లు కూడా పొలాల్లోకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
లేబర్ కోడ్ రూల్స్ మాకొద్దు
విజయగనరం గంటస్తంభం: కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను నీరుగారుస్తూ తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ నిబంధనలను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్ డిమాండ్ చేశారు. సీఐటీయూ దేశవ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం విజయనగరం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. కేంద్రం నోటిఫై చేసిన లేబర్ కోడ్ రూల్స్ ప్రతాలను దహనం చేశారు. కార్పొరేట్ యాజమాన్యాలకు మేలు చేసేందుకు 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో కార్మిక వ్యతిరేక కోడ్లను తీసుకొచ్చిందని మండిపడ్డారు. పని గంటలను 12కు పెంచడం, కనీస వేతనాలు అమలు చేయకపోవడం దుర్మార్గమన్నారు. కార్మిక దోపిడీ విధానాలను అడ్డుకోకపోతే దేశవ్యాప్త ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమాల్లో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు వి.లక్ష్మి, కోశాధికారి ఎ.జగన్మోహన్రావు, కార్యదర్మి బి.సూర్యనారాయణ, సీహెచ్ వెంకటేష్, బాధిత హెల్పర్లు కిల్లాడ అనసూయ, ముగడ భాగ్యలక్ష్మి, రామలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి ఇలాకాలో మద్యం దందా..!
సాక్షిప్రతినిధి, విజయనగరం: జిల్లాలోని గజపతినగరం నియోజకవర్గంలో లిక్కర్ దందా సాగుతోంది. అక్రమ వ్యాపారానికి ప్రత్యేక కౌంటర్ తెరిచారు. ఇన్నాళ్లూ నకిలీ మద్యం మాత్రమే ఉందని మందుబాబులు భావించేవారు. ఇప్పుడు గరిష్ట చిల్లర ధర(ఎమ్మార్పీ) ఉల్లంఘనకు తెరతీయడంతో ఆందోళన చెందుతున్నారు. లిక్కర్ షాపులను ప్రధాన వనరుగా మార్చుకున్న ‘పెద్దలు’ ఒక్కో క్వార్టర్ మీద రూ.10, బీరుపై రూ.10 అద నంగా వసూలు చేస్తున్నారు. ప్రీమియం క్వాలిటీ బ్రాండెడ్ మద్యం ఫుల్బాటిల్ మీద రూ.50 వరకు అదనపు భారం వేస్తున్నారు. ఇదేంటి అని ప్రశ్నిస్తే ఎండకాలం చల్లగా బీర్లు ఉండాలంటే రూ.10 ఇవ్వాలి బ్రదర్ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ మందుబాబుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. మంత్రి ఇలాకాలో అంతేమరి... గజపతినగరం నియోజకవర్గంలోని దత్తిరాజేరు, బొండపల్లి, గంట్యాడ, గజపతినగరం మండలాల్లో మొత్తం 17 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇవి లాటరీలో ఎవరికీ దక్కినప్పటికీ వాటిని సిండికేట్ రూపంలోకి మార్చి ఆ సిండికేటును టీడీపీ నాయకులే నడిపిస్తున్నారు. ఎమ్మార్పీ ధరలకు అమ్ముతుంటే తమకు అనుకున్న లాభాలు రావడం లేదని... ఇలాగైతే మద్యం షాపు దక్కించుకుని ప్రయో జనం ఏముందని భావించిన వాళ్లంతా మంత్రి వద్ద తమగోడు వెళ్లబోసుకోగా... ఎమ్మార్పీ ధరలకు మించి అమ్ముకునేందుకు మంత్రితోపాటు, మాజీ ఎంపీపీ కొండబాబు కూడా మద్దతు ఇచ్చినట్టు సమాచారం. దీంతో ప్రతిసీసా మీద ఎమ్మార్పీ కంటే రూ.10 అదనంగా వేసి అమ్మకాలు సాగిస్తున్నారు. దీనిపై కొందరు మందుబాబులు వాగ్వాదం చేస్తున్నా... అదనపు వడ్డన మానడంలేదు. అంతా ఓ మాజీ జెడ్పీటీసీ కనుసన్నల్లోనే... ఈ మద్యం సిండికేటు ఏర్పాటు... వారి మధ్య ఏర్పడే చిక్కులు... వాటాల పంపకం.. తదితర బాధ్యతలన్నీ ఓ జెడ్పీటీసీ మాజీ సభ్యుడు చూస్తున్నారు. పోనీ ఇంత పెద్దరికం చేస్తున్నందుకు మీ గురువుకు ఏమైనా కాణి పరకా మిగులుతుందా అంటే అబ్బే అదేం లేదు. మావాడిది అంతా పైసారాని దండాసి చాకిరీ అని ఆయన అనుచరులు సైటెర్లు వేసుకుంటున్నారు. ధరల పెంపు ద్వారా సమకూరుతున్న అదనపు ఆదాయంలో సగం నాయకుడికి... మిగతా సగం వ్యాపారులు... ఎకై ్సజ్ వాళ్లకు సర్దుబాటు చేస్తున్నట్లు చెబుతున్నారు. మామ్మూళ్ల ‘మత్తు’... వాస్తవానికి అక్రమాలు ఎక్కడ జరిగితే అక్కడే అధికారులకు పని ఉంటుంది. అక్కడే వాళ్ల పవర్ చూపుతారు. ఇప్పుడు లిక్కర్ షాపుల వాళ్లు రేట్లు పెంచి అమ్ముతుండడంతో ఎకై ్సజ్ అధికారులు కొందరు మా సంగతి ఏమిటి? రైడ్స్ చేయాలా ఏంది అంటూ కన్నుగీటుతున్నారు. వచ్చిన పది రూపాయల్లో మంత్రి ఖాతాలోకి కొంత... సిండికేట్కు కొంత.. పోలీసులు.. ఎకై ్సజ్ వాళ్లకు కొంత ఇచ్చుకుంటూ వస్తున్నామని మద్యం వ్యాపారులే బహిరంగంగా చెబుతున్నారు. ప్రతినెలా గజపతినగరం నియోజకవర్గంలో సుమారు రూ.9 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ధరలు పెంచడంతో నెలకు రూ.50లక్షల వరకు మందు బాబులపై పడుతోంది. అ‘ధన’పు వసూళ్లు అన్నీ వాటాలుగా పంచుకుంటున్నారు. చర్యలు తీసుకుంటాం జిల్లా వ్యాప్తంగా ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అధికారులు, సిబ్బంది ప్రతిరోజూ మద్యం అమ్మకాలను పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడైనా అధిక ధరలకు మద్యం విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటాం. – బి.శ్రీనాథుడు, అబ్కారీ శాఖ సూపరింటెండెంట్ -
పిల్లల భవిష్యత్తుకు మాది భరోసా
● పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించండి ● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి విజయనగరం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడుతున్నాయని, తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించి, సదుపాయాలు చూసి తమ పిల్లలను చేర్పించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. వివిధ కార్పొరేట్ పాఠశాలల్లో చదువుతున్న 26 మంది విద్యార్థులు ఒకేసారి జమ్ము నారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం ప్రవేశాలు పొందారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించి ప్రోత్సహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ పాఠశాలలకు ఏ మాత్రం తీసిపోని విధంగా మౌలిక వసతులు, డిజిటల్ సదుపాయాలు, నాణ్యమైన బోధన అందిస్తున్నామని తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించగల నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారని పేర్కొన్నారు. జిల్లాలో ఈ ఏడాది పదోతరగతి ఫలితాల్లో 91 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచామని కలెక్టర్ గుర్తు చేశారు. జిల్లాలో 60 పాఠశాలలు శతశాతం ఉత్తీర్ణత సాధించాయని తెలిపారు. 591కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 13 మంది, 585కు పైగా మార్కులు సాధించిన వారు 68 మంది, 550కు పైగా మార్కులు సాధించిన వారు 1238 మంది, 500కు పైగా మార్కులు సాధించిన వారు 4,174 మంది ఉన్నారని వెల్లడించారు. ఈ ఫలితాలే ప్రభుత్వ పాఠశాలల నాణ్యతకు నిదర్శనమని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యంనాయుడు, ఎంఈఓలు పి.సత్యవతి, సీహెచ్ ఆనందమూర్తి, ప్రధానోపాధ్యాయులు వి.హరికృష్ణ, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
రైతుసంక్షేమంలో ప్రభుత్వం విఫలం
రేగిడి: రైతులకు సంక్షేమపథకాలు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన రేగిడి మండలంలోని బూరాడ గ్రామం వచ్చిన సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర అందకపోవడంతో రైతులు తీవ్రనష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందన్నారు. ఆరుగాలం కష్టించి పండించుకున్న మొక్కజొన్న పంటను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయకపోవడంతో దళారులకు విక్రయించి రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. క్వింటా ధర రూ. 2500లు మొక్కజొన్నకు గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందించేదని, ప్రస్తుతం కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు క్వింటా మొక్కజొన్నను రూ.1700లుకు విక్రయించడంతో ఎకరాకు వేలాది రూపాయలు నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందన్నారు. అస్తవ్యస్తంగా ఉన్న సాగునీటి వనరులను సైతం ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. మడ్డువలస ప్రధాన కుడికాలువకు అనుసంధానంగా ఉన్న పిల్లకాలువలు పూర్తిగా పాడవడంతోపా టు షట్టర్లు, తలుపులు లేకపోవడంతో పంటపొలాలకు సాగునీరు అందని పరిస్థితి నెలకొందన్నారు. ఇటు రైతు, అటు ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి కూట మి ప్రభుత్వం హాయిహాయి గారడీగా ప్రభుత్వాన్ని నడుపుతోందని ధ్వజమెత్తారు. ఈ ఏడాది ఖరీఫ్కు అవసరమైన వరి విత్తనాలు, ఎరువులు రైతు సేవా కేంద్రాలకు సకాలంలో అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖరీఫ్కు ముందుగానే రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సిద్ధంగా ఉంచేవారని గుర్తు చేశారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు టంకాల అచ్చెన్నాయుడు, పార్టీ మండల కన్వీనర్ వావిలపల్లి జగన్మోహనరావు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ -
పైళ్లెంది.. విషాదం మిగిలింది..
వారిద్దరూ ఇంజినీరింగ్ విద్యనభ్యసిస్తున్నారు. ఒకరు శనివారం విజయనగరంలో జరిగిన స్నేహితుడి పెళ్లికి వెళ్లాడు. పెళ్లి అనంతరం మళ్లీ తమ రూమ్కు వచ్చేందుకు అట్నుంచి మరో స్నేహితుడితో కలిసి బైక్పై ఇద్దరూ వస్తున్నారు. ఇంతలోనే దారి కాచిన మృత్యువు వారిని అయినాడ జంక్షన్ వద్ద కాటేసింది. స్నేహితులతో సందడిగా.. సంతోషంగా అప్పటి వరకు గడిపిన వారిద్దరూ ఇంతలోనే మృత్యువు పాలవడంతో ఇటు కుటుంబాల్లోనూ... అటు స్నేహితుల్లోనూ తీవ్ర విషాదం అలుముకుంది. వివరాల్లోకి వెళ్తే... డెంకాడ/మక్కువ/సీతానగరం: డెంకాడ మండలంలోని అయినాడ జంక్షన్ వద్ద శనివారం అర్ధరాత్రి 12.15 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు దుర్మణం చెందారు. ఎస్ఐ ఎ.సన్యాసినాయుడు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ వైపు నుంచి వస్తున్న డీసీఎం వ్యాన్ అయినాడ జంక్షన్ వద్ద చింతలవలస గ్రామం వైపు వచ్చేందుకు కుడివైపు తిరుగుతున్న క్రమంలో డీసీఎం వాహనాన్ని విజయనగరం నుంచి వస్తున్న మోటారుసైకిల్ ఢీకొంది. దీంతో మోటారు సైకిల్పై ఉన్న తన్నా హర్షచైతన్య(19), రెడ్డి ఉదయ్కుమార్(20) తీవ్ర గాయాలతో రోడ్డుపై పడిపోయారు. రోడ్డుపై తీవ్ర గాయాలతో పడి ఉన్న రెడ్డి ఉదయ్కుమార్ను విజయనగరం వైపు నుంచి విశాఖ వైపు అతివేగంతో వచ్చిన కారు ముందు భాగంతో కొంత దూరం ఈడ్చుకుపోయింది. దీంతో ఉదయ్కుమార్ అక్కడికక్కడే మరణించాడు. తీవ్రంగా గాయపడిన హర్షచైతన్యను చికిత్స నిమిత్తం విజయనగరం తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా.. తన్నా హర్షచైతన్య చింతలవలస ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బి.టెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. దీంతో చింతలవలసలోనే ఒక రూమ్ తీసుకుని ఉంటున్నాడు. శనివారం విజయనగరంలో ఓ పెళ్లికి వెళ్లిన హర్షచైతన్య తిరుగు ప్రయాణంలో స్నేహితుడు రెడ్డి ఉదయ్కుమార్తో మోటారు సైకిల్పై విజయనగరం నుంచి విశాఖ వైపు వస్తున్నాడు. ఈ క్రమంలో అయినాడ జంక్షన్ వద్ద చింతలవలసకు వెళ్లేందుకు తిరగాలి. ఈ సమయంలో నిర్లక్ష్యంగా వస్తున్న డీసీఎం వాహనాన్ని మోటారుసైకిల్ ఢీకొంది. రెండు నిమిషాల్లో రూమ్కు చేరుకోవాల్సిన వీరు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో వారు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. మరణించిన హర్ణచైతన్యది మక్కువ మండలంలోని ఎ.వెంకంపేట గ్రామం. ఇదే ప్రమాదంలో మరణించిన రెడ్డి ఉదయ్కిరణ్ పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతానగరం మండలంలోని కొత్తవలస గ్రామం. సీఆర్ రెడ్డి కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఎ.సన్యాసినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మడ్డువలసలో తగ్గుతున్న నీటిమట్టం
వంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టులో నీటిమట్టం గణనీ యంగా తగ్గింది. వేసవి కారణంగా వర్షపాతం తక్కువగా ఉండడంతో వేగావతి, సువర్ణముఖి నదుల్లో ఇన్ఫ్లోస్ భారీగా పడిపోయాయి. దీంతో ఆదివారం ప్రాజెక్టు వద్ద 62.47 మీటర్లు లెవెల్ నమోదైంది. వాస్తవంగా ప్రాజెక్టు అసలు నీటిమట్టం 65 మీటర్లు లెవెల్ ఉండగా దాదా పు 2.47 మీటర్లు మేర నీటి నిల్వ తగ్గింది. దీంతో ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో 3.37 టీఎంసీల కెసాసిటీ కలిగిన ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 1.33 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే నమోదైంది. ప్రాజెక్టు అధికారులు ప్రణాళిక ప్రకారం జూన్ మొదటి వారంలో ఖరీఫ్ పంటల సాగుకు నీరు విడుదల చేయాల్సి ఉంది. అలా జరగాలంటే వరుణుడు కరుణించాల్సిందేనని రైతులు చెబుతున్నారు. నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్న రామారావుకు ఉద్యోగోన్నతి లభించింది. ఆయనను గ్రేడ్–2 ఈఓగా నియమిస్తూ దేవదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో మాన్సాస్ సంస్థతో పాటు విజయనగరం పైడితల్లి అమ్మవారి ఆలయంలో సుదీర్ఘ కాలం విధులు నిర్వర్తించారు. రామతీర్థం దేవాలయంలో మూడేళ్ల నుంచి సీనియర్ అసిస్టెంట్ హోదాలో సేవలందిస్తున్నారు. ప్రస్తుతం ఈఓగా ఉద్యోగోన్నతి లభించడంతో దేవస్థాన ఈఓ వై.శ్రీనివాసరావు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. విజయనగరం రూరల్: ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రం రామనారాయణంలో ఈ నెల 12న హనుమాన్ జయంత్యుత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్టు ఎన్సీఎస్ ట్రస్టీ నారాయణం శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా రామనారాయణ ప్రాంగణంలో హనుమాన్ జయంత్యుత్సవాల ఆహ్వాన ప్రతులను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంగళవారం ఉదయం 6 గంటలకు పంచామృత అభిషేకం, స్నపనం నిర్వహించనున్నట్టు తెలిపారు. 8 గంటలకు లక్ష తమలపాకులు, సింధూరంతో సహస్ర నామార్చనలు, హనుమాన్ చాలీసా నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. సాయంత్రం 6 గంటలకు 60 అడుగుల అభయాంజనేయ స్వామికి మహా హారతి, లేజర్ షో కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న బోడికొండపై అభయాంజనేయస్వామి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రాష్ట్ర సాధు పరిషత్ ఆధ్వర్యంలో కొండకు దిగువ భాగంలో ఏర్పాటు చేసిన పిల్లర్పై క్రేన్ సహకారంతో ఆదివారం విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సుమారు పదమూడున్నర అడుగుల ఎత్తు, రెండు టన్నుల బరువుతో ఈ విగ్రహాన్ని రూపొందించారు. వచ్చే నెలలో విగ్రహానికి ప్రాణ ప్ర తిష్ఠ కార్యక్రమాలు జరిపిస్తామని నిర్వాహకు లు తెలిపారు. -
ఆలయ నిర్మాణాలపై వీహెచ్పీ ఆరా
గరుగుబిల్లి: తోటపల్లి శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణాలపై విశ్వహిందూ పరిషత్ సభ్యులు ఆరా తీశారు. ఈ మేరకు ఆదివారం మండలంలోని తోటపల్లి శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో నూతనంగా నిర్మాణం చేపడుతున్న నిర్మాణాలను, విగ్రహల ఏర్పాటును వీహెచ్పీ స్టేట్ జాయింట్ సెక్రటరీ ఫల్గుణరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, వీహెచ్పీ ఇతర సభ్యులు అనంత్, జిల్లా అధ్యక్షుడు చింతా భాస్కరరావు, సీతానగరం మండల అధ్యక్షుడు జి.బాలకృష్ణ తదితరులు పరిశీలించారు. తోటపల్లి ఆలయంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు, ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలకు స్పందించి బీజేపీ, వీహెచ్పీ చేసిన ఆందోళనల నేపథ్యంలో వారు స్పందించి ఆలయ నిర్మాణాలను పరిశీలించారు. ఏదైతే తోటపల్లిలో స్వయం భుగా వెలసిన విగ్రహం 52 సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్న స్వామి వారి విగ్రహాన్ని ఆర్అండ్బీ రోడ్ స్థలంలో రేకుల షెడ్లో బంధించి ఉన్న విధానం చూసి ఆశ్చర్యపోయారు. ఆలయంలో విగ్రహాలు, నూతనంగా చేపడుతున్న నిర్మాణాలు, ఇతర వివరాలపై సిబ్బంది, అర్చకులతో మాట్లాడి ఆరా తీశారు. పుట్టు దేవుని విగ్రహాలను బయట ఉంచడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఉచిత దర్శనం లేకపోవడంతో విస్మయం వ్యక్తం చేశారు. తోటపల్లిలో జరుగుతున్న ప్రతి అంశాన్ని పరిశీలించి నోట్ చేసుకుని తగు చర్యల నిమిత్తం సంబంధిత అధికారులకు నివేదించి, ఆగమ శాస్త్రం ప్రకారం ఎండోమెంట్ వారితో స్వామివారి విగ్రహాన్ని పునఃప్రతిష్ట చేసేలా తమ వంతు కృషిచేస్తామని పేర్కొన్నారు. విగ్రహ పునఃప్రతిష్టకు చర్యలు -
పాదర్శకత ఉండాలి
సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ప్రభుత్వానికి పాదర్శకత అవసరం. జిల్లాలో అనేక మంది తల్లికి వందనం పథకం లబ్ధి కోల్పోయారు. గత వైఎస్.జగన్ హయాంలో లబ్ధి పొందినవారు గత ఏడాది అర్హత పొందలేకపోయారు. యూడైస్లో తప్పుడు సమాచారం ఆన్లైన్ ద్వారా నమోదైనట్లు చెప్పిన యంత్రాగం వాటిని సరిచేసుకున్నా నగదు జమ చేయలేదు. గతంలో ముఖ్యంగా పాలకొండ పట్టణంతోపాటు నియోజకవర్గంలో అనేకులు అర్హత కోల్పోయారు. పాదర్శకంగా వివరాలు నమోదు చేయడంతో పాటు గతంలో ఎలిజిబుల్ లిస్టులో పేర్లు ఉన్నవారికి ఈ ఏడాది రూ.30వేలు జమ చేయాలి. విశ్వాసరాయి కళావతి, మాజీ ఎమ్మెల్యే, పాలకొండ -
శవాలపై కాసుల వేట..!
●డబ్బులు ఇస్తేనే పోస్టుమార్టం ●పైసలివ్వకుంటే అంతే.. ●రూ.3 వేల నుంచి రూ.5వేల వరకు వసూలు! ●విజయనగరం మండలానికి చెందిన నారాయణమ్మ అనే వృద్ధురాలు మూడు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. పోస్టుమార్టం నిమిత్తం మృతురాలిని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి మార్చురీకి తరలించారు. అక్కడ సిబ్బంది పోస్టుమార్టం చేయడం కోసం రూ.3200 మృతురాలి బంధువుల నుంచి తీసుకున్నట్టు తెలిసింది. రూ.1000 కంటే ఎక్కువ ఇచ్చుకోలేం.. అని చెప్పినప్పటకీ సిబ్బంది ఒప్పుకోకపోవడంతో అడిగినంత ఇవ్వక తప్పలేదు. ●గంట్యాడ మండలానికి చెందిన ఎర్నాయుడు అనే వ్యకి రోడ్డు ప్రమాదంలో ఇటీవల మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. అక్కడ పోస్టుమార్టం చేయడానికి రూ.2500 తీసుకున్నట్టు సమాచారం. ●విజయనగరం పట్టణానికి చెందిన ఓ మహిళ అగ్ని ప్రమాదంలో ఇటీవల మృతి చెందింది. ఆమె మృతదేహానికి కూడా పోస్టుమార్టం చేయడానికి రూ.3 వేలు వరకు తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. విజయనగరం ఫోర్ట్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వచ్చే మృతదేహాల పోస్టుమార్టంకు అక్కడ ఉన్న సిబ్బంది రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఓ వైపు తమ కుటుంబసభ్యులు మృతి చెందారనే ఆవేదనతో బంధువులు ఉంటే... మృతదేహం పోస్టుమార్టం కోసం ఇలా పైసలు పేరిట సిబ్బంది వేధించడంతో వాళ్లు మరింత కృంగిపోతున్నారు. చివరకు శవాలను కూడా వదలడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఇంతకంటే దౌర్భగ్యం ఏముందంటూ వారు కన్నీరుమున్నీరవుతున్నారు. రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలకు పాల్పడే వారి మృతదేహాలు ఇక్కడకు పోస్టుమార్టం నిమిత్తం వస్తాయి. వీటిపై కింది సిబ్బంది కాసుల వేట సాగిస్తున్నారు. బంధువులు ఎవరైనా ఇదేమని ప్రశ్నిస్తే పోస్టుమార్టం అనంతరం మృతదేహం అప్పగింతలో చెప్పలేనంత ఆలస్యం చోటు చేసుకుంటుందన్న ఆరోపణలు వినిపిస్తున్నా యి. దీంతో తీరని ఆవేదనలో కూడా మృతుల కుటుంబసభ్యులు సిబ్బంది అడిగినంత ముట్టజెప్పక తప్పడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. రూ.3 వేల నుంచి రూ.5 వేలు వరకు వసూలు మృతదేహం పోస్టుమార్టం చేయడానికి కూడా సిబ్బంది నిర్ధిష్టమైన ధర నిర్ణయించి వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీసం రూ.3 వేలకు తక్కువైతే పోస్టుమార్టం చేయకుండా అక్కడ వైద్య సిబ్బంది కావాలనే జాప్యం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. చేసేది లేక సిబ్బంది అడిగినంత సమర్పించుకుంటున్నారు. తాము పేదవాళ్ల మని ఎంతగా ప్రాధేయపడుతున్నా... సిబ్బంది కనికరించడం లేదు. పోస్టుమార్టం గదిలో విధులు నిర్వహించాల్సిన వారు పూర్తిగా మానవత్వాన్ని మరచి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఇదిలా ఉండగా ఆస్పత్రి వైద్యాధికారులకు సైతం ఈ విషయం తెలిసినప్పటికీ తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. మరోవైపు మార్చురీ సిబ్బంది అడిగినంత ఇచ్చేయండని కొందరు పోలీసులు కూడా చెబుతున్నట్టు విమర్శలు ఉన్నాయి. ఇలా శవాలపై కాసుల దందా సాగిస్తున్న దానిపై ఆస్పత్రి ఉన్నతాధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలకు పాల్పడిన వ్యక్తుల మృతదేహాలు ఆస్పత్రికి వచ్చేటప్పుడు తప్పనిసరిగా ఉచితంగా పోస్టుమార్టం చేయాలి. డబ్బులు వసూలు చేయడం కూడదు. అలా చేసినట్టు నా దృష్టికి రాలేదు. ఒక వేళ ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే లిఖితపూర్వకంగా బాధితులు ఫిర్యాదు చేయాలి. తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ అల్లు పద్మజ, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి -
శ్మశాన వాటిక పరిశీలన
● పరిష్కారం కాని దళితుల శ్మశాన, అసైన్డ్ భూవివాదం ● రాజకీయ ఒత్తిళ్లకు లోనవుతున్న రెవెన్యూ అధికారులు ● సివిల్, క్రిమినల్ కేసులు పెడతామంటున్న రిటైర్డ్ జడ్జిజియ్యమ్మవలస రూరల్: కొన్నేళ్లుగా మండలంలోని చింతలబెలగాం గ్రామ దళితులకు సంబంధించిన శ్మశాన వాటిక, అసైనన్డ్ భూములపై వివాదం కొనసాగుతోంది. దళితుల అసైన్డ్ భూముల రెవెన్యూ ట్యాంపరింగ్, ఆన్లైన్ మార్పులు, ఆక్రమణలు శ్మశాన వాటిక ఆక్రమణ ఇలాంటి ఎన్నో విషయాలపై సామాజిక కార్యకర్త బెలగాం ప్రవీణ్ కుమార్ అనేకమార్లు ఆర్డీవో, సబ్ కలెక్టర్, కలెక్టర్లకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇంతవరకు ఎలాంటి చర్యలూ చేపట్టని పరిస్థితుల్లో ప్రకాశం జిల్లా విశ్రాంత న్యాయమూర్తి, ప్రస్తుత హైకోర్టు అడ్వకేట్ డాక్టర్ ఎస్ శ్యాం సుందర్ జయరాజు గ్రామాన్ని ఆదివారం సందర్శించారు. దళితులకు జరిగిన అన్యాయంపై ఆయన విచారణ చేసి ఇదే గ్రామంలో దళిత మహిళ మృతదేహాన్ని శ్మశాన వాటికలో ఖననం చేస్తే స్థానికులు ఆ భూమిని ఆక్రమించి పాతిపెట్టిన మృతదేహాన్ని తిరిగి బయిటకు తీయించి వేరే చోటకు మార్పించిన ఘటన పోలీసులు, రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో జరగడం దుర్మార్గమని పేర్కొన్నారు. ప్రభుత్వం దళితులకు కేటాయించిన అసైన్డ్ భూమిని స్థానిక రిటైర్డ్ వీఆర్ఓ తన కుమార్తె పేరున పాస్బుక్ ఎలా చేయించుకున్నారో చెప్పాలని ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు అందుకు సహకరించిన రెవెన్యూ అధికారులను సైతం వదిలిపెట్టేది లేదని తక్షణమే అసైన్డ్ భూమిని దళితులకు విడిచిపెట్టకుంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ హైకోర్టులో కేసు వేస్తామని హెచ్చరించారు. మానవ హక్కుల ఉల్లంఘన కింద కేసు దళితులకు శ్మశాన వాటికకు అవసరమైన స్థలాన్ని కలెక్టర్, సబ్ కలెక్టర్ పరిశీలించి అప్పగించాలని కోరారు. దళితులకు కేటాయించిన అసైన్డ్ భూముల్లో నిజానిజాలు పరిశీలించి వారికి తగు న్యాయం చేయాలని కోరారు. కాదని స్థానిక నాయకులు అడ్డుకుంటే మానవ హక్కుల ఉల్లంఘన కింద కేసు వేస్తామని హెచ్చరించారు. ఈ విషయంపై దళితులకు న్యాయం జరిగేందుకు పోరాడుతున్న ప్రవీణ్ను బెదిరింపు చర్యలకు పాల్పడితే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ముందుగా చింతల బెలగాంలో దళితుల శ్మశాన వాటికను పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా దళితులు అణిచివేతకు గురవుతున్నారని, ప్రశ్నించే వారి గొంతునొక్కేస్తున్నారని ఇలాంటి పరిస్థితుల్లో వారంతా ఐక్యమత్యంతో పోరాటాలు చేస్తే కానీ న్యాయం జరిగిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తాను దళితుల వైపు బడుగు బలహీన వర్గాల వైపు పని చేస్తూ వారికి అన్నివేళలా తన వంతు సహాయ సహకారాలను అందిస్తానని తెలిపారు. -
50 పాఠశాలల బస్సుల తనిఖీ పూర్తి
పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలోని 95 పాఠశాలల బస్సుల్లో ఫిట్నెస్, బస్సుల రికార్డులను ఇప్పటివరకు 50 బస్సులకు జిల్లా రవాణాధికారి దుర్గాప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది ఆదివారం తనిఖీ చేశారు. బస్సుల పనితీరు, సాంకేతిక పరిస్థితులు పరిశీలించి, మిగిలిన 45 బస్సులను కూడా త్వరలో తనిఖీ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు బస్సులు సురక్షితంగా నడవడం లక్ష్యమని డీటీఓ తెలిపారు. బస్సులను తనిఖీ చేయించుకోకపోతే శాఖాపరమైన చర్యలు చేపట్టనున్నట్లు పాఠశాలల యాజమాన్యాలను హెచ్చరించారు. -
కిల్లో స్వప్న పేరు వచ్చింది
నా కుమార్తె కార్తిక ప్రస్తుతం 7వ తరగతి చదువుతుంది. నా బిడ్డ తల్లి పేరు కిల్లో స్వప్న అని ఆన్లైన్లో నమోదు కావడంతో గత ఏడాది లబ్ధి కోల్పోయాం. మధ్యతరగతి కుటుంబం మాది. ఈ పథకం వర్తిస్తే పిల్ల చదువులకు ఉపయోగపడతాయి. గతంలో వచ్చిన సాంకేతిక సమస్య పరిష్కారం కోరి సచివాలయంలో అర్జీచేశాం. అటుపై ఎలిజిబుల్ లిస్టులో పేరు వచ్చిందన్నారు. త్వరలో నగదు జమ అవుతుందని చెప్పారు. ఫలితం లేకపోయింది. ఈ ఏడాదైనా పథకం వర్తింపజేయాలి. అల్లెన భావన, లబ్ధికోల్పోయిన విద్యార్థిని తల్లి, పాలకొండ -
సాగర తీరాన..సందడి..!
విజయనగరం గంటస్తంభం: అవి పర్యావరణ రాయబారులు.. సముద్రపు ఆరోగ్యాన్ని చాటిచెప్పే సంకేతాలు. ప్రకృతి సమతుల్యానికి ప్రతీకలైన ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంరక్షణలో విజయనగరం జిల్లా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. సముద్ర తీరాన్ని ఆశ్రయించి సంతానోత్పత్తి కోసం వచ్చే ఈ అరుదైన తాబేళ్లను రక్షించేందుకు అటవీ శాఖ విస్తృత చర్యలు చేపట్టింది. స్వచ్ఛంద సంస్థల సహకారంతో తీర ప్రాంతాల్లో హేచరీలు ఏర్పాటు చేసి గుడ్లను భద్రపరుస్తూ, పిల్లలుగా పొదిగిన అనంతరం తిరిగి సముద్రంలోకి విడిచిపెడుతోంది. 2025–26 సీజన్లో ఇప్పటివరకు జిల్లాలో 52 వేల తాబేళ్ల గుడ్లను సేకరించగా, వాటిలో 41 వేల పిల్లలను విజయవంతంగా సముద్రంలోకి విడుదల చేశారు. మిగిలిన గుడ్లును కూడా ప్రత్యేక సంరక్షణలో ఉంచి పిల్లలుగా మారిన వెంటనే సముద్రంలో విడిచిపెట్టేందుకు అధికారులుచర్యలు చేపడుతున్నారు. పర్యావరణ హితులైన ఆలివ్ రిడ్లేలు ఆలివ్ రిడ్లే తాబేళ్లు సముద్ర జీవ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి కనిపించే ప్రాంతాలు కాలుష్యం తక్కువగా ఉండే పర్యావరణ హిత ప్రాంతాలుగా గుర్తింపు పొందుతాయి. గుజరాత్ నుంచి ఒడిశా వరకు భారత తీర ప్రాంతాల్లో ఇవి సంచరిస్తూ సంతతి వృద్ధి కోసం ప్రశాంతమైన తీరాలను ఎంపిక చేసుకుంటాయి. అలల తీవ్రత తక్కువగా ఉండే, మానవ కదలికలు తగ్గిన ప్రాంతాల్లో గూళ్లు కట్టి ఒక్కో తల్లి తాబేలు 100 నుంచి 130 వరకు గుడ్లు పెడుతుంది. పది హేచరీస్లతో సంరక్షణ కవచం జిల్లాలోని బొడ్డుగుయ్యపేట, తిప్పలవలసల్లో రెండేసి చొప్పున, చేపలకంచేరు, ముక్కాం, చోడిపల్లిపేట, పులిగెడ్డపాలెం, బర్రిపేట, చింతపల్లి ప్రాంతాల్లో ఒక్కో హేచరీస్ ఏర్పాటు చేశారు. మొత్తం పది హేచరీల్లో ప్రస్తుతం 246 గూళ్లను భద్రపరిచి సంరక్షిస్తున్నారు. హేచరీస్ల వద్ద ప్రత్యేక సిబ్బందిని నియమించి గుడ్ల సంరక్షణతో పాటు పిల్లలు బయటకు వచ్చిన వెంటనే సముద్రంలోకి విడిచిపెట్టే ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. ఇందుకోసం 25 మంది సిబ్బందిని నియమించినట్లు అధికారులు తెలిపారు. మత్స్యకారుల్లో అవగాహన ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంరక్షణలో మత్స్యకారుల పాత్ర కీలకమని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రమాదకరమైన వేట వలలు, గ్రిల్నెట్స్, టేకు వలలు వల్ల తాబేళ్లు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో తీర గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాబేళ్లు చిక్కుకున్నప్పుడు వెంటనే సముద్రంలో వదిలేయాలని సూచిస్తున్నారు. వలల మృత్యుపాశం.. టెడ్ వాడకం అనివార్యం సముద్రంలో చేపల వేట కోసం వాడే యాంత్రిక బోట్ల వలల్లో చిక్కుకుని ఏటా వందలాది తాబేళ్లు ప్రాణాలు కోల్పోతున్నాయి. శ్వాస తీసుకోవడానికి ఇవి పైకి రావాల్సి ఉంటుంది. కానీ వలల్లో చిక్కుకుపోవడం వల్ల ఊపిరాడక మృత్యువాత పడుతున్నాయి. దీనిని అరికట్టేందుకు టెడ్ పరికరాలను వలలకు అమర్చుకోవాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. -
ఆ గ్రామానికి సర్టిఫికెట్ల సమస్య
రాజాం సిటీ: మున్సిపాల్టీ పరిధి పొనుగుటివలస గ్రామాన్ని సర్టిఫికెట్ల సమస్య వేధిస్తోంది. విద్యాసంవత్సరం ముగిసింది. తమ పిల్లలు మరో మెట్టుపైకి వస్తున్నారని తల్లిదండ్రులు మురిసిపోతూ సచివాలయానికి కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలకోసం వెళ్లుంటే అక్కడ చేదు అనుభవం ఎదురవుతోంది. సచివాలయంలో దరఖాస్తు చేసుకున్న తరువాత సంతకవిటి వెళ్లాలని అక్కడ తహసీల్దార్ సంతకం చేసుకుని రాజాం తహసీల్దార్ వద్దకు వెళ్తే సర్టిఫికెట్ వస్తుందని చెబుతుండడంతో అవాక్కవుతున్నారు. గతంలో ఈ సమస్య ఎప్పుడూ రాలేదని వారితే చెప్పినా తమకు ఫలితంలేకుండా పోతోందని గ్రామస్తులు వాపోతున్నారు. గత ప్రభుత్వంలో సచివాలయంలోనే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సేవలు ప్రజల ముంగిటకే అందేవి. విద్యార్థులకు కావాల్సిన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు గ్రామ/వార్డు సచివాలయాల్లోనే వెంటవెంటనే అందడం వంటి సేవలను ప్రజలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం సర్టిఫికెట్లు కావాలన్నా ఇబ్బందులు పడక తప్పడంలేదని ప్రజలు, విద్యార్థులు వాపోతున్నారు. కూతవేటు దూరంలో ఉన్న రాజాంలో కాకుండా 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంతకవిటి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోందని, అక్కడినుంచి మళ్లీ సర్టిఫికెట్లు పొందేందుకు రాజాం తహసీల్దార్ కార్యాలయానికి రాక తప్పడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాదిరి కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సచివాలయంలోనే అందించాలని కోరుతున్నారు. ఇదీ అసలు సమస్య.. 2005 వరకు సంతకవిటి మండలంలో కొనసాగిన పొనుగుటివలస గ్రామం ప్రస్తుతం రాజాం మున్సిపాల్టీలో కొనసాగుతోంది. 2005లో రాజాం మండలంలోని రాజాం, సారథి మేజర్ పంచాయతీలతోపాటు కొత్తవలస, కొండంపేట, సంతకవిటి మండలం పొనుగుటివలస గ్రామాలను కలుపుతూ నగరపంచాయతీగా ఏర్పాటుచేశారు. అప్పటికే ఈ పంచాయతీలకు సర్పంచ్లుగా ఉన్నవారి పదవీకాలం ముగియకపోవడంతో వారు కోర్టును ఆశ్రయించారు. దీంతో నగరపంచాయతీ (2020లో థర్డ్గ్రేడ్ మున్సిపాల్టీగా రాజాం అప్గ్రేడ్) ఏర్పడినప్పటికీ మిగతా పనులు ఎక్కడివక్కడే మిగిలిపోయాయి. దీంతో సంతకవిటి మండలంలో భాగమైన పొనుగుటివలస రెవెన్యూ, పంచాయతీ రికార్డులు నగరపంచాయతీకి అప్పగించకుండా సంతకవిటి మండలంలోనే ఉండిపోయాయి. అప్పటి నుంచి ప్రతి పనికి మున్సిపాల్టీకి వెలితే సంతకవిటి మండలానికి వెళ్లాలని, సంతకవిటి వెళ్తే నగరపంచాయతీకే వెళ్లాలని అధికారులు చెబుతుండడంతో చేసేదిలేక అటూ ఇటూ తిరుగుతూ ఏదో విధంగా గ్రామస్తులు తమ పనులను మమ అనిపిస్తున్నారు. ముఖ్యంగా రెవెన్యూ, పోలీసు శాఖల విషయంలో ప్రజలకు ఎక్కువ సమస్యలు తలెత్తుతున్నాయి. రెండు మండలాల నడుమ నలుగుతున్న విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నామంటున్న గ్రామస్తులు వైఎస్సార్సీపీ హయాంలో సచివాలయంలోనే సర్టిఫికెట్ల అందజేత సమస్య పరిష్కరించాలని గ్రామస్తుల వేడుకోలు -
తల్లికి వందనం ఎందరికో?
పాలకొండ రూరల్: ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ‘తల్లికి వందనం’ పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తామని ఎన్నికల ముందు కూటమి నాయకులు ఊదరగొట్టారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక తొలి ఏడాది తల్లికి వందనం పథకం అమలు ఎగ్గొట్టారు. గతేడాది జిల్లాలో వేల మంది విద్యార్థులకు ఈ పథకానికి సంబంధించి అర్హత ఉన్నా నేటికి పలురువురు తల్లుల ఖాతాల్లో లబ్ధి జమ చేయకుండా ఎగనామం పెట్టారు. ఈ నేపథ్యంలో తల్లికి వందనం డబ్బులు ఈ ఏడాది తల్లుల ఖాతాల్లో జమ కావడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్పష్టత లేదు.. కూటమి సర్కారు తల్లికి వందనం పథకం ప్రకటించిన తొలి ఏడాది 2024లో అమలుకు నోచుకోలేదు. అర్హత ఉన్నప్పటికీ గతేడాది అనేక కారణాలు చూపుతూ జిల్లాలో వందల మందికి కోత పెట్టింది. దీంతో అప్పట్లో తల్లులంతా స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. అధిక విద్యుత్ బిల్లులు, నాలుగు చక్రాల వాహనాలు, లెక్కకు మించి భూములు ఉన్నాయని కారణాలు చూపించారు. అర్హత ఉన్నా లబ్ధి కోల్పోయిన వారిలో పిల్లల తల్లి స్థానంలో ‘కిల్లో స్వప్న’ అనే మహిళ పేరు అనేక మంది పిల్లలకు నమోదైంది. ఆమె పేరిట ఉన్న ఆస్తులను చూపించి పలువురికి తల్లికి వందనం నిలిపివేశారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామని, నమస్యలు పరిష్కరించుకోవాలని, అర్హత ఉండి లబ్ధి కోల్పోయినట్లు ఏ ఒక్కరు చూపించినా లబ్ధి చేకూరుస్తామని సంబంధిత మంత్రి చెప్పినా అంతా బూటకంగానే సాగింది. తొలివిడత జాబితాలో సొమ్ములు జమకాని విద్యార్థులకు సంబంధించి పలు సమస్యలు చెప్పారు. ఆయా సమస్యలపై సంబంధిత శాఖల నుంచి పరిష్కార పత్రాలు తీసుకుని గ్రామ, వార్డు సచివాలయ అధికారులకు తల్లులంతా అందించారు. ఈ క్రమంలో వారికి ఎలిజిబల్ లిస్టుల్లో పేర్లు వచ్చాయి అన్నారు. అయినా ఫలితం లేకపోవడంతో ఈ ఏడాది ఇంకెన్ని కొర్రీలు పెడతారోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. సరైన వ్యవస్థ లేదు.. ప్రస్తుత సర్కారు జిల్లాలో1,584 పాఠశాలల్లో ద్వారా బోధన పొందుతున్న ప్రతి విద్యార్ధికి రూ.15వేలు అందిస్తామని నమ్మబలికింది. ఈ క్రమంలో 2025 జూన్లో 69,600 మంది తల్లులకు సంబంఽధించి లక్షా 8,951 మంది పిల్లలను అర్హులుగా ప్రకటించారు. వారిలో ఒకరికి మించి బిడ్డలున్న తల్లులు 39వేలుగా పేర్కొన్నారు. అయితే పూర్తి స్థాయిలో వారికి లబ్ధి చేకూర్చలేకపోయారు. పథకం వర్తింపులో వస్తున్న సమస్యలను పరిష్కరించేందుకు సరైన వ్యవస్థ లేకుండా పోయింది. పాఠశాలల యాజమాన్యాలు, సచివాలయ సిబ్బంది ఆన్లైన్లో పిల్లల వివరాలు నమోదు చేయటం వరకే తమ పని అని, సమస్య పరిష్కారం కావడం తమ చేతుల్లో లేదంటూ చేతులెత్తేస్తున్నారు. వైఎస్ జగన్మోహనరెడ్డి హయాంలో ఇంట్లో ఒకరికి ఈ పథకం వర్తింప చేసినప్పుడు జిల్లాలో దాదాపు 85 వేల మందికి లబ్ధి అందించినట్లు రికార్డులు చెబుతున్నాయి. అప్పట్లో పథకం అందలేదన్న సమస్య తలెత్తకపోవడం పారదర్శకతకు నిదర్శనం. తాజా ఏడాది 2026కి సంబంధించి 15 మండలాల పరిధిలో లక్షా 18వేల పై చిలుకు విద్యార్థులు బోధన పొందుతున్నట్లు విద్యా శాఖ పేర్కొంటోంది. వారి పూర్తి వివరాలను ఈ నెల 15 నాటికి యూడైస్లో నమోదు చేయాలని ప్రభుత్వం సూచించడంతో పాఠశాలల యాజమాన్యాలు ఆ పనిలో నిమగ్నమయ్యాయి. లెక్క ప్రకారం ఈ ఏడాది జూన్లో అందించనున్న లబ్ధితో పాటు గతంలో అర్హత కోల్పోయి, శాంక్షన్ లిస్టులో తమ పేర్లు ఉన్నందున బకాయి మొత్తం కలిపి నగదు జమ చేయాలంటూ పలువురు తల్లులు కోరుతున్నారు. అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి ‘తల్లికి వందనం’ అందుతుందా..? లేక గతంలో మాదిరి కొర్రీలు పెడతారా అన్న అనుమానాలు నెలకొన్నాయి. లబ్ధిదారుల సంఖ్యను తగ్గించుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి ఎత్తుగడలు వేస్తుందో అనే చర్చ జరుగుతోంది. గతంలో ఏర్పడ్డ లోపాలు, సాంకేతిక సమస్యలు అధిగమించి అర్హత ఉన్న ప్రతి విద్యార్థికీ లబ్ధి అందించాలని పిల్లల తల్లులు కోరుతున్నారు. గత ఏడాది వేలమందికి ఎగనామం నేటికీ కొంతమంది తల్లులకు జమకాని లబ్ధి నాడు పలుమార్లు అర్జీలు ఇచ్చినా ఫలితం శూన్యం వచ్చే నెలలో మలివిడత తల్లికి వందన కార్యక్రమం శతశాతం అర్హులకు నిధుల జమపై తొలగని సందేహాలు ఈనెల 15 నాటికి పిల్లల వివరాల నమోదుకు ఆదేశాలు -
పెళ్లింట విషాదం
● లారీ, ఆటో ఢీకొని ఇద్దరి మృతి ● ముగ్గురికి తీవ్ర గాయాలు ● ఒకరి పరిస్ధితి విషమంజామి: పెళ్లింట బంధువులు, మిత్రులు అంతా సరదాగా గడిపారు. పెళ్లి కూడా సందడిగా జరిగిపోయింది. బంధువులు ఎవరింటికి వారు తిరిగి ప్రయాణమయ్యారు. ఇంతలోనే విషాదవార్త వినవలసి వచ్చింది. మరో పదినిమిషాల్లో స్వగ్రామం చేరుకుంటారనగా లారీ రూపంలో వారిని మృత్యువు కాటేసింది. దీంతో పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. పాచిపెంట మండలంలోని తోటవలస గ్రామంలో ఆడపిల్ల ఇంటివద్ద వివాహం జరిగింది. వివాహమైన తరువాత ఆదివారం పెండ్లి కుమారుడి తండ్రి మట్టా సన్యాసిరావు, తల్లి కనకమ్మ, వరుసకు పెళ్లి కుమార్తె చిన్నాన్న విజయనగరం మండలం చాకలిసేటకు లావేటి పైడిరాజు, పిన్ని గౌరమ్మ, బంధువులు ఆటోలో తిరిగి పెండ్లికుమారుడి స్వగ్రామం జామి మండలంలోని అన్నంరాజు పేట గ్రామానికి ఆటోలో తిరిగి పయనమయ్యారు. ఈ క్రమంలో జామి మండలంలోని జన్నివలస వద్ద విశాఖ గ్రీన్ఫీల్డ్ హైవేపై పాచిపెంటనుంచి వస్తున్న ఆటోను జామి నుంచి విజయనగరం వెళ్తున్న లారీకి టైర్ పంక్చరై అదుపు తప్పి ఆటోను ఢీకొట్టడంతో ఆటోలో ఉన్న పెళ్లికొడుకు తండ్రి మట్టా సన్యాసిరావు(62), అక్కడికక్కడే మృతిచెందాడు. పెళ్లికుమార్తెకు వరుసకు చిన్నాన్న లావేటి పైడిరాజు(52), పెండ్లి కుమారుడి తల్లి కనకమ్మ, బంధువులు ఒకే కుటుంబానికి చెందిన మడ్డు రాఘువ, వట్టి సాయి కుమార్ తీవ్ర గాయాల పాలయ్యారు. వారిని 108 వాహనంలో విజయనగరంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ లావేటి పైడిరాజు మృతిచెందాడు. కనకమ్మ పరిస్థితి విషమంగా ఉంది. గాయాలపాలైన మిగిలిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జామి ఎస్సై వీర జనార్దన్ సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి జరిగిన ఘటనపై తెలుసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ నిర్వహిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఎడారిలా నాగావళి
రేగిడి: మండలంలోని సంకిలి వద్ద ఉన్న నాగావళి నది నీరులేక ఎడారిని తలపిస్తోంది. వేసవి ఎండల ప్రభావంతో నదిలో గతంలో వచ్చిన కొద్దిపాటి నీరు కూడా పూర్తిగారాని పరిస్థితి ఏర్పడింది. దీంతో నదీపరీవాహక గ్రామాలైన సంకిలి, బొడ్డవలస, పుర్లి, కొమెర, వెంకటాపురం, ఖండ్యాం తదితర గ్రామాల్లో భూగర్బజలాలు అడుగంటాయి. దీంతో ఆయా గ్రామాల్లో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు తప్పవేమోనని ఆందోళన చెందుతున్నారు. బాలేరులో ఏనుగుల విధ్వంసంభామిని: మండలంలోని బాలేరులో నాలుగు ఏనుగుల గుంపు ఆదివారం విధ్వంసం సృష్టించింది. కోత దశలో ఉన్న వరిచేను పొలాల్లో తిరుగాడుతూ పంటను నాశనం వేశాయి. రైతుల పొలాల్లోని బోర్వెల్స్ పైపులను విరగ్గొట్టి వాటిలోని నీటిని తాగాయి. బాలేరుకు చెందిన ఎర్నాగుల అప్పారావు 5 హెచ్పీ బోరును పాడు చేశాయి. పొలాల్లో తిరుగాడుతూ వరి పంటను ధ్వంసం చేశాయి. ఏనుగుల ప్రయాణం మారడంతో స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టాలను లెక్కించాలని కోరుతున్నారు. న్యాయమూర్తుల గృహ సముదాయనికి భూమి పూజవిజయనగరం లీగల్: జిల్లా కేంద్ర న్యాయమూర్తుల గృహ సముదాయనికి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ తర్లాడ రాజశేఖర్ రావు ఆదివారం భూమి పూజ నిర్వహించారు. స్థానిక వీటీ అగ్రహారంలో ఉన్న పాత జిల్లా కోర్టు ప్రాంగణంలో శిథిలావస్థలో వున్న భవన సముదాయాన్ని తొలగించి వాటి స్థానంలో కొత్త సముదాయాన్ని నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జస్టిస్లతో పాటు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత, స్థానిక న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు నళితం రమేష్ కుమార్, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు బెల్లాన రవి ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. కార్డన్ సెర్చ్లో 80 వాహనాలు సీజ్ విజయనగరం క్రైమ్: స్థానిక డబుల్ కాలనీలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఆపరేషన్ వజ్ర ప్రహార్లో భాగంగా డ్రగ్స్ నిర్మూలన, నేరాల నియంత్రణ లక్ష్యంగా చేపట్టిన ఈ తనిఖీల్లో 100 మంది పోలీసులు బృందాలుగా ఏర్పడి కాలనీలోని 120 ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు చేశారు. అపరిచిత, అనుమానాస్పద వ్యక్తులు, సారా, అక్రమ మద్యం నిల్వలు, మాదకద్రవ్యాలు, నాటు తుపాకులు, అక్రమ వాహనాలు ఉన్నవీ లేనివీ క్షుణ్నంగా తనిఖీ చేశారు. కొత్త వ్యక్తుల వివరాలు సేకరించి, వారి వేలిముద్రలను ఎంఎస్సీడీ పరికరంతో తనిఖీ చేశారు. ఈ సోదాల్లో వాహన ధ్రువపత్రాలు సక్రమంగా లేని 80 వాహనాలను సీజ్ చేసి, స్టేషన్కు తరలించినట్లు విజయనగరం రెండో పట్టణ సీఐ టి.శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ రామారావు, కృష్ణమూర్తి, కనకరాజు, కానిస్టేబుళ్లు నాగమణి, సంధ్య, రజియా తదితరులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం ఎన్నిక విజయనగరం టౌన్: స్థానిక కేఎల్ పురం గురుద్వార వద్ద జై జులేలాల్ సింద్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక ఆదివారం జరిగింది. అధ్యక్షుడిగా లక్ష్మీచంద్ లాల్వానీ, ఉపాధ్యక్షుడిగా శశి కుక్రేజా, కార్యదర్శిగా హరేష్ లాల్వానీ, సహాయ కార్యదర్శిగా రామ్లాల్ లాల్వానీ, కోశాధికారిగా కె.రాజేంద్ర ఎన్నికయ్యారు. -
విజయనగరం
ట్రిపుల్ ఐటీ పిలుస్తోంది... పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించేందుకు ట్రిపుల్ ఐటీ పిలుస్తోంది.ఆదివారం శ్రీ 10 శ్రీ మే శ్రీ 2026జిల్లాలో రబీలో సాగుచేసిన వరి పంట విస్తీర్ణం వరి పంటకు ప్రభుత్వం ప్రకటించిన క్వింటాకు మద్దతు ధర రూ.1900 4,643 హెక్టార్లు రూ.2,369 -
తల్లిని మించిన దైవం లేదు
● ఘనంగా మాతృభాషా దినోత్సవం ● తల్లులకు సత్కారం విజయనగరం టౌన్: బిడ్డకు జన్మనివ్వడమే కాదు.. నడక, నడత నేర్పే గురువు తల్లి, ఆమెను మించిన దైవం లేదని తెలుగు భాషా పరిరక్షణ సమితి అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్ అన్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక గీతాంజలి పాఠశాలలో శనివారం పలువురు మాతృమూర్తులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ పెన్నేటి స్వప్నహైందవి మాట్లాడుతూ అమ్మ అంటే దైవసమానమని, అమ్మప్రేమకు ప్రత్యామ్నాయం లేదన్నారు. న్యాయవాది నాలుగెస్సుల రాజు, వస్త్ర వ్యాపారవేత్త పులిపాటి రామారావు, జెడ్పీహైస్కూల్ తెలుగు పండిట్ దశగ్రంథాల వెంకట సుబ్రహ్మణ్యంలు మాతృమూర్తి గొప్పతనాన్ని వివరించారు. అనంతరం రచయిత శ్రీనివాసరావు రచించిన పైడితల్లి పదాలు పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు బి.రమేష్, ఉత్తరాంధ్ర మహిళా విభాగం అధ్యక్షురాలు పలుకూరి ప్రభావతి, జిల్లా శాఖ మహిళా విభాగం అధ్యక్షురాలు గిరిజా ప్రసన్న, వాకర్స్ క్లబ్ డిప్యూటీ గవర్నర్ ముళ్లపూడి సుభద్రాదేవి, విశ్వసాహితీవేదిక అధ్యక్షురాలు భోగరాజు సూర్యలక్ష్మి, న్యాయవాది దాసరి పద్మ, తదితరులు పాల్గొన్నారు. డీఎఫ్ఓగా సోమసుందరం విజయనగరం గంటస్తంభం: విజయనగరం జిల్లా అటవీశాఖ అధికారిగా (డీఎఫ్ఓ) ఎం.సోమసుందరం అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు డీఎఫ్ఓగా పనిచేసిన రెడ్డి కొండలరావుకు ఐఎఫ్ఎస్ అధికారిగా ఉద్యోగోన్నతి లభించడంతో రాజమండ్రికి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సోమసుందరం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అటవీ సంరక్షణలో సమర్ధవంతంగా సేవలందిస్తానని తెలిపారు. జిల్లా సర్వే అధికారి బదిలీ ● ప్రధాన కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లా సర్వే, ల్యాండ్ రికార్డుల అధికారి (ఏడీ) ఎం.శ్రీనివాసరావుకు బదిలీ అయ్యింది. జిల్లాకు వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆయనను ఇక్కడ నుంచి బదిలీ చేశారు. ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా ప్రధాన కార్యాలయానికి తక్షణమే రిపోర్ట్ చేయాలని ఆ శాఖ డైరెక్టర్ ఆర్.కూర్మనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో పార్వతీపురం సబ్కలెక్టర్ కార్యాలయంలో ఐఓఎస్గా పనిచేస్తున్న ఎ.మన్మథరావుకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. పలు ఆరోపణల నేపథ్యంలో వేటు వేశారా? జిల్లా సర్వే అధికారిగా ఎం.శ్రీనివాసరావు బదిలీపై వచ్చి కొద్ది నెలలే అయ్యింది. మొదటి నుంచి ఆయన వైఖరి పట్ల తీవ్ర విమర్శలు వచ్చా యి. ప్రధానంగా మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధిస్తున్నట్లు, కార్యాలయంలో రాత్రి 9 నుంచి 10 గంటల వరకు వారిని ఉంచేస్తున్నట్లు, అర్ధరాత్రి సమయంలో ఫోన్లు చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఇదే విషయమై ఓ మహిళా ఉద్యోగిని ఇటీవల నాలుగు పేజీల ఫిర్యాదును సంయుక్త కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డికి అందజేశారు. ఈ విషయంలో గతంలో ఒకసారి కలెక్టర్, జేసీ కూడా ఆయనను పిలిచి మందలించారు. ఆ తర్వాత కొద్ది రోజులు బాగానే ఉన్నా.. మళ్లీ వేధింపులు ప్రారంభించారని తెలిసింది. మరోసారి జేసీకి నేరుగా ఫిర్యాదు వెళ్లడంతో ఆయన తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఏడీకి బదిలీ కావడం గమనార్హం. ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా ప్రధాన కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించడం వెనుక ఆయన మీద వచ్చిన ఆరోపణలే కారణంగా తెలుస్తోంది. సెల్ఫోన్ల రికవరీ పూసపాటిరేగ: మండలంలోని పలు ప్రాంతాల్లో బాధితులు పోగొట్టుకున్న సెల్ఫోన్లను రికవరీ చేసి వారికి శనివారం అందజేశారు. ఎవరి ఫోన్లు పోయినా ఐఎంఐ నంబర్తో వచ్చి ఫిర్యాదు చేయాలని, రికవరీ సాధ్యమవుతుందన్నారు. -
ట్రిపుల్ ఐటీ పిలుస్తోంది...
● విడుదలైన నోటిఫికేషన్ ● ఈ నెల 30 వరకు గడువుపాలకొండ రూరల్: పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించేందుకు ట్రిపుల్ ఐటీ పిలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రవేశ ప్రకటన కొద్ది రోజుల కిందట వెలువడింది. ఈ నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ట్రిపుల్ ఐటీలో టెన్త్ మార్కులు ఆధారంగా ప్రవేశం లభిస్తుంది. ఇక్కడ సీటు లభిస్తే ఇంటర్ రెండేళ్లతో పాటు సమీకృత కోర్సుగా ఇంజినీరింగ్ విద్య కూడా అందుతుంది. ఇది మరో నాలుగేళ్లు అభ్యసించాల్సి ఉంటుంది. అంటే మొత్తంగా ఆరేళ్లు ఇక్కడే చదువుకోవచ్చు. దీంతో పలువురు ఉపాధ్యాయులు క్షేత్ర స్థాయిలో విద్యార్థులకు ఉపాధ్యాయులు అవగాహన కల్పిస్తున్నారు. కార్పొరేట్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పలువురు ఈ ఏడాది టెన్త్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించారు. రాష్ట్రంలోనే పార్వతీపురం మన్యం జిల్లా ఫలితాల్లోనే కాకుండా మార్కుల సాధనలో కూడా ముందంజలో ఉంది. ఈ క్రమంలో తమ విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ఉపాధ్యాయులు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ట్రిపుల్ ఐటీ ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు సదరు కళాశాలలు అండగా ఉంటాయని సూచిస్తున్నారు. దరఖాస్తు చేసుకునే విధానంపై అవగాహన కల్పిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు. ఈ బ్రాంచ్ల్లో అవకాశం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం నేతృత్వంలో మన రాష్ట్రంలో నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలులో ట్రిపుల్ ఐటీ కళాశాలలు ఉన్నాయి. అర్హత మేరకు విద్యార్థులు ఈ కళాశాలల్లో సీటు పొందవచ్చు. ఏటా ఒక్కో కళాశాలలో వెయ్యి మంది వంతున 4 వేల మంది విద్యార్థులకు ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. ట్రిపుల్ ఐటీలో చేరిన విద్యార్థులకు తొలి రెండేళ్లు ఇంటర్తో పాటు ఇంజినీరింగ్ తరగతులు ఉచితంగా కొనసాగిస్తారు. సివిల్, సీఎస్ఈ, ఈఈఈ, ఈసీఈ, మెకానికల్ కోర్సుల్లో తర్ఫీదు అందిస్తారు. ఇడుపులపాయ, న్యూజివీడు క్యాంపస్ల్లో మెటీరియల్ కోర్సులతో పాటు మెటలర్జికల్, కెమికల్ ఇంజినీరింగ్ సబ్జెక్టులు అదనంగా నిర్వహిస్తారు. చదువుల కాలంలో విద్యార్థులకు ఉచితంగా వసతి, భోజన సౌకర్యం లభిస్తుంది. అప్లోడ్ చేద్దామిలా... అర్హులైన విద్యార్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఆర్జీయుకెటి.ఇన్ (ఠీఠీఠీ.టజ ఠజ్టు.జీ ుఽ) వెబ్సైట్లో దరఖాస్తు చేయాల్సి ఉటుంది. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు విద్యార్థి ఆధార్, ఫోన్ నంబర్, పదవ తరగతి మార్కుల ధ్రువీకరణ పత్రాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 4 శాతం మార్కులు అదనంగా కలిపి అర్హుల జాబితాల్లో చేరుస్తారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.250, ఓబీసీ విద్యార్థులు రూ.400 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. జూన్ నెల 12న ఎంపికై న విద్యార్థుల జాబితా విడుదల చేయనున్నారు. అవకాశం లభించిన విద్యార్థులు జూలై 1న నిర్దేశిత కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. -
స్కూల్ మైదానం ఆక్రమణపై నిరసన
రాజాం : మున్సిపాల్టీ పరిధి వస్త్రపురి కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల స్థలాన్ని రాజాం మండలం నర్సింహపురం గ్రామానికి చెందిన పి.వెంటరమణ అనే వ్యక్తి ఆక్రమిస్తున్నాడంటూ స్థానికులు శనివారం పాఠశాల ఆవరణలో ఆందోళనకు దిగారు. అనంతరం ప్రధాన రహదారిపై ర్యాలీ చేపట్టారు. సర్వే నంబరు 59లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు 196 అడుగుల వెడల్పు, 216అడుగుల పొడవుల విస్తీర్ణంపై మైదానం ఉందని తెలిపారు. ఈ మైదానాన్ని ఎటువంటి హక్కులు లేకుండా వెంకటరమణ ఆక్రమణ చేస్తూ, ప్రహరీ నిర్మించాడని గ్రామస్తులు ఆరోపించారు. కమలనాయుడు ఆధ్వర్యంలో వంద మందికి పైగా కాలనీ వాసులు ఆక్రమణలపై మండిపడ్డారు. తహసీల్దార్, ఎంఈఓకు ఫిర్యాదు చేశామని, సోమవారం కలెక్టరేట్లో ఫిర్యాదు చేయనున్నామని వెల్లడించారు. ఆక్రమణలు తొలగించడంతో పాటు ఆక్రమణదారుడుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంఈఓ దర్యాప్తు వస్త్రపురి కాలనీలో ప్రభుత్వ పాఠశాల ఆక్రమణలపై ఎంఈఓ యాగాటి దుర్గారావు దర్యాప్తు ప్రారంభించారు. ఉన్నతాధికారులు నుంచి వచ్చిన ఆదేశాలతో పాఠశాల మైదానాన్ని పరిశీలించారు. 5 నుంచి ఆరు అడుగుల వెడల్పు మేర పాఠశాల మైదానంలోకి ఆక్రమణదారుడు వచ్చినట్టుగా గుర్తించారు. పాఠశాల హెచ్ఎం రాజుతో పాటు తహసీల్దార్కు ఆక్రమణలు తొలగించాలని ఫిర్యాదు చేశారు. కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్టు ఎంఈఓ తెలిపారు. -
రైతన్నకు ధరల సంకటం..!
గజపతినగరం మండలంలో పొలాల్లోనే ఉన్న మొక్కజొన్న బస్తాలు అనుమతులు రాలేదు.. మొక్కజొన్న పంట కొనుగోలుకు వీలుగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ఎటువంటి అనుమతులు రాలేదు. రబీలో వరి పంట తక్కువ విస్తీర్ణంలో సాగైనందున ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. – ఎన్. వెంకటేష్, మార్కెఫెడ్జిల్లా మేనేజర్ – వి.టి.రామారావు, జిల్లా వ్యవసాయ అధికారి విజయనగరం ఫోర్ట్: రైతు సంక్షేమమే లక్ష్యమంటూ చంద్రబాబు ప్రభుత్వం చేసిన ప్రకటనలు వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఉన్నాయి. ఇంటిల్లిపాది ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంటలను కొనుగోలుచేసే వారే కరువయ్యారు. పంట చేతికొచ్చి నూర్పిడిలు సాగుతున్నా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు కానరావడం లేదు. రైతులకు మద్దతుధర లభించడం లేదు. వరి, మొక్కజొన్న పంటలను అతి తక్కువ ధరకే దళారులకు విక్రయిస్తూ రైతులు నష్టపోతున్నారు. అష్టకష్టాలు పడి పండించిన పంట దళారుల పాలవుతున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏవీ? జిల్లాలో రబీలో 4,642 హెక్టార్లలో వరి, 45,590 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగైంది. వరి పంట 23,290 మెట్రిక్ టన్నుల వరకు, మొక్కజొన్న 3,28,248 మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి వచ్చింది. పంటలను కొనుగోలుచేసేందుకు అనువుగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోంది. అధికారులు ప్రతిపాదనలను కనీసం పట్టించుకోవడంలేదు. రైతులు గగ్గోలు పెడుతున్నా కనికరించని పరిస్థితి. గత్యంతరంలేని పరిస్థితుల్లో తక్కువ ధరకే పంటను విక్రయించేస్తున్నారు. ఇప్పటకే చాలా వరకు పంటను దళారులకు విక్రయించేశారు. మెంటాడ మండలంలో ధాన్యం కొనుగోలు చేసేవారు లేక రోడ్డుపైనే నిల్వ చేసిన ధాన్యం బస్తాలు కొనుగోలు కేంద్రాలు లేక దళారులు కొనుగోలుచేస్తున్న ధర రూ.800-700 రూ.2,400నష్టపోతున్న రైతులు వరి పంటకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాకు రూ.2,369 కాగా దళారులు రూ.1900కు కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల రైతులు క్వింటాకు రూ.469 నష్టపోతున్నారు. మొక్కజొన్న పంట క్వింటాకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.2,400. కానీ దళారులు కొనుగోలు చేస్తున్నది రూ.1600 నుంచి రూ.1700కు మాత్రమే. దీనివల్ల రైతులు రూ.800 నుంచి రూ.700వరకు నష్టపోతున్నారు. రూ. 1600-1700 మధ్యన -
రెండు చోట్లా ఒక్కరే...
సాక్షి ప్రతినిధి విజయనగరం: రెవెన్యూ శాఖలో చిత్రమైన పరిస్థితి నెలకొంది. విజయనగరం నియోజకవర్గ జనాభా పెరగడంతో రెవెన్యూ సేవలు సకాలంలో అందడంలేదన్న ఉద్దేశంతో విజయనగరం రెవెన్యూ కార్యాలయాన్ని అర్బన్, మండల తహసీల్దార్ కార్యాలయాలుగా ఇటీవల విభజించారు. దీంతో ప్రజలు కూడా సంతోషించారు. ఇద్దరు అధికారులు ఉంటారని, చకచకా పనులు జరుగుతాయని, నాణ్యమైన రెవెన్యూ సేవలు అందుతాయని ఆశపడ్డారు. తీరా రెండు కార్యాలయాలకు ఒకే తహసీల్దార్ను నియమించడంతో ఉసూరుమంటున్నారు. విభజించడం వల్ల ప్రయోజనం ఏముందని నిట్టూర్చుతున్నారు. చెప్పుకునేందుకే రూరల్, అర్బన్ అంటూ రెండు తహసీల్దార్ కార్యాలయాలని, ఇద్దరు తహసీల్దార్లను నియమించాల్సిన చోట ఒక్కరినే నియమించడంపై అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న తహసీల్దార్ మీద గతంలో ఆరోపణలు.. ఫిర్యాదులు వెల్లువెత్తగా కొన్నాళ్లు సెలవుపై పంపేశారని, అంతా సద్దుమణిగాక మళ్లీ ఆయనను రెండు కార్యాలయాల బాధ్యతలు అప్పగించారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనివెనుక అవినీతి కథ నడుస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కుడిచేత్తో అర్బన్ ఫైళ్ళు, ఎడమచేత్తో రూరల్ ఫైళ్ళు క్లియర్ చేస్తూ రెండు చేతులా ప్రజలకు సేవలు అందిస్తారంటూ కొందరు ఎద్దేవా చేస్తున్నారు. -
టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
● శాసన మండలి విపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ చీపురుపల్లిరూరల్(గరివిడి): రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని వైఎస్సార్సీపీ నాయకులకు శాసనమండలి విపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ సూచించారు. గరివిడిలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో శనివారం మాట్లాడారు. గ్రామస్థాయి కమిటీల ఏర్పాటుపై ఆరా తీశారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో చంద్రబాబు విఫలమయ్యారని, ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేద్దామన్నారు. ముందుగా చీపరుపల్లి మండల నాయకులతో బొత్స కుమార్తె అనూష సమావేశమయ్యారు. పార్టీ కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పిలి అనంతం, ప్రచార విభాగం అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసులనాయుడు, యువజన విభాగం అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ, పార్టీ గరివిడి మండలాధ్యక్షుడు మీసాల విశ్వేశ్వరరావు, మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు ఎలకల అప్పలనాయుడు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో పలువురు దుర్మరణం
చికెన్ రోడ్డు ప్రమాదంలో సైక్లిస్ట్.. జామి: మండల కేంద్రమైన జామిలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక సైక్లిస్ట్ దుర్మరణం పాలైన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. జామి గ్రామానికి చెందిన బీల అచ్చన్న(54) పొలం పని చేసుకుని తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో స్థానిక వినాయక గుడి వద్ద ఎస్.కోట నుంచి విజయనగరం వైపు వస్తున్న లారీ సైక్లిస్ట్ను ఢీకొనడంతో లారీ వెనుక భాగాన టైర్లు కింద పడి దుర్మరణం పాలయ్యాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ వీర జనార్ధన్ ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య కనకమ్మ, ఒక కుమార్తె ఉన్నారు. భామిని: మండలంలోని బత్తిలికి చెందిన యువకుడు కోట చంటి (29) శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. బత్తిలికి చెందిన మీసాల సమీర్తో కలిసి బుల్లెట్ బైక్పై కోట చంటి కొత్తూరు వైపు వెళ్తుండగా ఘనసర వద్ద ఏబీ రోడ్డుపై ప్రమాదానికి గురై మృతి చెందాడని బత్తిలి ఎస్ఐ కె.రవీంద్ర తెలిపారు. బైక్ డ్రైవ్ చేస్తున్న సమీర్ ఈ ప్రమాదంలో చిన్నపాటి గాయాలతో బయటపడ్డాడు. బైక్పై వెళ్తున్న వీరికి ఘనసర వద్ద ఎదురుగా వ్యాన్ వచ్చింది. వ్యాన్కు దారిచ్చేందుకు బైక్ను సడన్ బ్రేక్ వేయగా చంటి తుళ్లి కిందకు పడిపోయాడు. ఈ ప్రమాదంలో చంటి తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. దీంతో ప్రమాద స్థలంలోనే చంటి మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. బత్తిలి ఎస్ఐ రవీంద్ర కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పాలకొండ రూరల్: సీతంపేట రహదారిలో పట్టణ శివారున ప్రధాన రహదారికి పక్కన ఓ వ్యక్తి మృతదేహాన్ని అక్కడి స్థానికులు గుర్తించారు. ఒంటిపై పూర్తి స్థాయి బట్టలు లేకుండా ఉండటంతో తొలిత పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇంతలో అతను పట్టణంలో గల ఎన్ఎస్ఎన్ కాలనీకి చెందిన బుడ్డి(55)గా గుర్తించారు. ఈయన గత కొద్ది రోజులుగా మానసికంగా ఇబ్బందులు పడుతూ, మద్యానికి బానిసై తిరుగుతున్నట్టు తేలింది. ఈ కోవలో మరణించి ఉంటారని భావించి స్థానికులు వారి బంధువులకు సమాచారం అందించారు. వారి బంధువులు వచ్చి మృతదేహాన్ని తరలించారు. దీనిపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. సీతానగరం: మండలంలోని కృష్ణారాయపురం గ్రామానికి చెందిన గుణుపూరు అచ్చుతరావు(26) సత్తెనపల్లి వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే... అచ్చుతరావు డిప్లమా ఇంజినీరింగ్ చదివి ఉద్యోగం నిమిత్తం ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్ వెళ్లి ఓ ప్రైవేటు కంపెనీలో ఉపాధి చూసుకున్నాడు. హైదరాబాద్లోని బొల్లారంలో నివాసం ఉంటూ శుక్రవారం హైదరాబాద్ నుంచి మోటారుసైకిల్పై కాకినాడ వస్తుండగా సత్తెనపల్లి సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన అచ్చుతరావును సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి వద్ద ఆధార్ కార్డు ఆధారంగా పోలీసులు శనివారం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చేతికందొచ్చిన కొడుకు ఇలా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు గంగమ్మ, భాస్కరరావు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యార్థులకు అవగాహన
ఈ ఏడాది అధిక శాతం మంది ట్రిపుల్ ఐటీలో సీటు సంపాదించే అవకాశం జిల్లా నుంచి లభించనుంది. 15 మండలాల్లో అనేక ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు రాబెట్టారు. ఈ క్రమంలో వారు ట్రిపుల్ ఐటీలో చేరే అవకాశాలను అందిపుచ్చుకోవాలి. మా పరిధిలో ఉపాధ్యాయులు పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించాలని గ్రామాల్లో ప్రచారం చేయటంతో పాటు అర్హత గల విద్యార్థులకు ట్రిపుల్ ఐటీకి దరఖాస్తులు చేసే విధానంపై అవగాహన కల్పిస్తున్నారు. – పర్రి కృష్ణమూర్తి, డిప్యూటీ ఈఓ, పాలకొండ -
రజిత పతకం సాధించిన రష్మిత
గరుగుబిల్లి: మండలంలోని సంతోషపురం గ్రామానికి చెందిన తిమిటి రష్మిత జాతీయ స్థాయిలో ప్రతిభ చాటింది. ఈమె ముంబాయిలోని మార్వే బీచ్లో ఈ నెల 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరిగిన వైఏఐ యూత్ అండ్ జూనియర్ నేషనల్ చాంపియన్షిప్ – 2026లో అండర్ – 17 విండ్ సర్ఫింగ్ విభాగంలో రజిత పతకం కై వసం చేసుకొంది. పోటీలలో కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటు అద్భుతమైన నౌక నైపుణ్యం, పట్టుదల, సమర్ధవంతమైన రేసింగ్ వ్యూహలను ప్రదర్శించి రష్మిత విజయం సాధించింది. రష్మిత తండ్రి శ్రీకాంత్ చతుర్వేది వృత్తి రీత్యా ఆర్మీలో ఉద్యోగం చేయడంతో ముంబయిలోనే స్థిరపడ్డారు. రష్మిత ప్రస్తుతం 9వ తరగతి చదువుతుంది. ఈమె ప్రతిభపై తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. రష్మిత సాధించిన పతకం జిల్లాకే గర్వకారణమని పలువురు క్రీడాభిమానులు పేర్కొన్నారు. -
కుక్కల దాడిలో గొర్రె, మేక పిల్లల మృతి
సంతకవిటి: మండలంలోని కృష్ణంవలస గ్రామంలో వంకల పాపయ్యకు చెందిన నాలుగు గొర్రె పిల్లలు, రెండు మేక పిల్లలు కుక్కల దాడిలో శనివారం మృతి చెందాయి. పాపయ్య మధ్యాహ్న సమయంలో గొర్రె, మేక పిల్లలను పాకలో పెట్టి, ఇంటికి భోజనానికి రాగా ఇంతలో కుక్కలు చొరబడి వాటిపై దాడి చేసి చంపేశాయి. దీనితో పాపయ్య బోరున విలపించారు. వీటి విలువ దాదాపు రూ.30 వేలు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, కుక్కలను గ్రామం నుంచి బయటకు పంపేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కుక్కల బెడదతో చిన్నారులను ఇంటి నుంచి బయటకు పంపించాలంటే భయంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. -
నాటుబాంబు కలకలం
కొత్తవలస: మండలంలోఓని కంటకాపల్లి పంచాయతీ పరిధి భామసాగర్ చెరువు వద్ద శనివారం నాటుబాంబు కలకలం రేపింది. ఈ ప్రాంతంలో అడవి పందులను వేటాడేందుకు వేటగాళ్లు నాటుబాంబులను ఉపయోగిస్తుంటారు. రాత్రి సమయల్లో అడవి పందులు తిరిగే దారుల్లో వేటగాళ్లు నాటుబాంబులను అమర్చి తెల్లవారుజామున తీసేసి భద్రపరుచుకుంటారు. ఈ క్రమంలో వేటగాళ్లు నిర్లక్ష్యంగా వదిలేయడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇదే చెరువులో గత నెల ఏప్రిల్ 20వ తేదీన ఉపాధి పనులు నిర్వహిస్తుండగా నాటుబాంబు పేలి గ్రామానికి చెందిన కక్కల అప్పారావు తీవ్రంగా గాయపడగా.. మరో ఇద్దరు కూలీలు స్వల్పంగా గాయపడిన విషయం విదితమే. ఇంతలోనే మళ్లీ నాటుబాంబు కలకలం రేగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు వన్యప్రాణులను వేటాడే వేటగాళ్లపై నిఘా ఏర్పాటు చేసి జరగబోయే ప్రమాదాలను నివారించాలని కోరుతున్నారు. -
రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు ఆరుగురు ఎంపిక
విజయనగరం: విజయనగరం జిల్లా స్థాయి అండర్–13 చెస్ పోటీల్లో చిన్నారులు తమ మేధస్సుకు పదునుపెట్టారు. ఎత్తుకు పై ఎత్తులు వేసి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. విజయనగరం చెస్ అకాడమీలో శుక్రవారం జరిగిన ఎంపిక పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఓపెన్ విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన శ్రీమన్, నారాయణ సాహూ, అమండు, జిగ్నేష్, బాలికల విభాగంలో ఎజ్జురోతు పరిణిత, భావన రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఎంపిక ప్రక్రియకు కె.వి.జ్వాలాముఖి, ఎ.హేమబిందు, ఆసిఫ్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ జిల్లా క్రీడాకారులు రాణించి విజయనగరం పేరును నిలబెట్టాలని ఆకాంక్షించారు. ● అండర్–13 విభాగంలో ప్రతిభ చాటిన క్రీడాకారులు ● ఓపెన్ విభాగంలో నలుగురు, బాలికల విభాగంలో ఇద్దరు అర్హత -
బస్సు ఢీకొని వృద్ధురాలి మృతి
విజయనగరం క్రైమ్: స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్లో శుక్రవారం బస్సు ఢీకొని ఓ వృద్ధురాలు మృతి చెందింది. వన్టౌన్ ఎస్ఐ రవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం మండలం రాకోడుకు చెందిన బోదంకి నారాయణమ్మ(76) బస్సు కోసం విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్కు వచ్చింది. ఆ సమయంలో బస్టాండ్లో డ్రైవర్ లక్ష్మునాయుడు బస్సు తీసే క్రమంలో వెనుకాలే ఉన్న నారాయణమ్మను ఢీకొట్టింది. దీంతో ఆమె పడిపోయింది. ఆమె పైనుంచి బస్సు వెళ్లిపోయింది. దీంతో వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. సమీపంలో ట్రాఫిక్ అవుట్పోస్టులో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హెచ్.పాల్ ప్రమాద సమాచారాన్ని మ్యాన్ ప్యాక్ ద్వారా వన్టౌన్ పోలీసులకు ఇచ్చాడు. వన్ టౌన్ ఎస్ఐ రవి ప్రమాద స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతురాలి మనవడు సురేష్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. -
ప్రతి ఒక్కరూ సేవాగుణాన్ని అలవర్చుకోవాలి
● రెడ్క్రాస్ చైర్మన్ ప్రసాదరావు విజయనగరం ఫోర్ట్: ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలని రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ ప్రసాదరావు కోరారు. రెడ్క్రాస్ సొసైటీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సీతం ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో రెడ్క్రాస్ సొసైటీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. రక్తదాతలను అభినందించారు. కార్యక్రమంలో సీతం కళాశాల డైరెక్టర్ మజ్జి శశిభూషణరావు, ఎన్సీపీ కెప్టెన్ సత్యవేణి, ఎన్సీసీ లెఫ్ట్నెంట్ ఉదయ్కిరణ్, డాక్టర్ వేణుగోపాల్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
పిల్లలపై ఓ కన్నేయండి..!
విజయనగరం గంటస్తంభం: వేసవి సెలవులొచ్చాయంటే పిల్లలకి పండగే. పుస్తకాల భారముండదు.. ఉదయం లేచిందే మొదలు ఆటలు.. మధ్యాహ్నం మొబైల్.. సాయంత్రం స్నేహితుల వెంట ఊరు చుట్టేయడం. కానీ అదే ఆనందం కొన్ని కుటుంబాల్లో కన్నీళ్లు మిగులుస్తోందని పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సెలవులు మొదలైనప్పటి నుంచి పిల్లలపై ప్రత్యేక నిఘా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. మొబైల్ మోజు... మెల్లగా మింగేస్తోంది డిజిటల్ కాలంలో చిన్నారులు మొబైల్ ఫోన్లకే పరిమితమవుతున్నారు. ఉదయం లేవగానే ఫోన్.. రాత్రి పడుకునే వరకు గేమ్స్, రీల్స్, సోషల్ మీడియాతో గడుపుతున్నారు. బయట ఆటలు తగ్గిపోవడంతో పాటు చదువుపై ఆసక్తి కూడా తగ్గుతోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. కొంత మంది పిల్లలు అనవసర యాప్లు, చెడు స్నేహాల ప్రభావానికి లోనవుతున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది. చెడు సావాసాలు జీవితాలను నాశనం చేసేస్తున్నాయి.. సెలవుల సమయంలో పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు మైనర్లు గంజాయి, సిగరెట్, ఇతర మత్తు పదార్ధాల వైపు ఆకర్షితులవుతున్నారని సమాచారం. సరదాగా మొదలైన అలవాటు తర్వాత కుటుంబాలకు తీరని బాధను మిగులుస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.పిల్లలతో స్నేహితుల్లా ఉండాలి పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు...? ఎవరితో తిరుగుతున్నారు..? ఏమి చూసున్నారు..? అన్నది తల్లిదండ్రులు గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు. భయపెట్టకుండా ప్రేమగా మాట్లాడితే పిల్లలు తమ విషయాలు చెప్పుకుంటారని చెబుతున్నారు. సెలవుల సమయంలో పిల్లల కోసం తల్లిదండ్రులు సమయం కేటాయించాలి. స్నేహితుల్లా మాట్లాడితేనే వారు సరైన మార్గంలో నడుస్తారు. పిల్లలను ఒంటరిగా వదిలేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. – వై.సతీష్కుమార్, కెమిస్ట్రీ లెక్చరర్, మానసిక వికాస నిపుణులు, విజయనగరం తల్లిదండ్రులూ.. బిడ్డలూ పదిలం.. సుమీ! మృత్యువుతో చెలగాటమొద్దు ఆటల మాటున ఆపదలు ఆన్లైన్లో మునిగితే భవిష్యత్తుకే ముప్పు చెరువులు, రోడ్లు, మొబైళ్లతో పెరుగుతున్న ప్రమాదాలు సరదా.. వ్యవనం కాకముందే మేల్కొనండి మత్తు పదార్ధాలు, డిజటల్ బానిసత్వంపై నిఘా ఉంచండి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరిక -
బెట్టింగ్ నిర్వాహకుల అరెస్టు
లక్కవరపుకోట: మండలంలోని గనివాడ గ్రామంలో ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్ఐ జె.రామకృష్ణ శుక్రవారం తెలిపారు. గ్రామంలో గురువారం రాత్రి ఒక ఇంటిలో విశాఖపట్నంకు చెందిన ముగ్గురు వ్యక్తులతో కలిసి రంగాపురం, లక్కవరపుకోట, గనివాడ గ్రామాలకు చెందిన ఒకొక్కరు టీవీలో క్రికెట్ ప్రచారం జరుగుతుండగా బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రామకృష్ణ తన సిబ్బందితో ఆ ఇంటిపై దాడి చేశారు. దీంతో విశాఖపట్నంకు చెందిన ముగ్గురు వ్యక్తులు పరారయ్యారు. రంగాపురం, గనివాడ, లక్కవరపుకోట గ్రామాలకు చెందిన ముగ్గురు వ్యక్తుల పట్టుబడగా వారి నుంచి రూ. 47వేలు నగదు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. పరారైన వారి కోసం గాలిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పోక్సో కేసు నమోదు విజయనగరం క్రైమ్: స్థానిక మహిళ పోలీస్స్టేషన్లో పోక్సో కేసు నమోదైంది. దీనికి సంబంధించి దర్యాప్తు అధికారి శిరీష శుక్రవారం తెలిపిన వివరాలు.. గత నెల ఏప్రిల్ 22న చిన్నపల్లి వీధిలో నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో పనికి వచ్చిన గుర్లకు చెందిన అబద్దం అక్కడ మహిళా వాచ్మన్ కుమార్తె(8)ని మాయమాటలు చెప్పి అత్యాచారం చేయబో యాడు. బాలిక కేకలు వేయడంతో మిగిలిన కూలీలు వచ్చి లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి దేహశుద్ది చేశారు. బాలిక తల్లి టు టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా మహిళ పోలీస్స్టేషన్కు రిఫర్ చేశారు. సీఐ నరసింహమూర్తి ఆదేశాలతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ శిరీష తెలిపారు. వృద్ధురాలి అదృశ్యం గజపతినగరం: మండలంలోని జిన్నాం గ్రామానికి చెందిన యజ్జిరోతు పోలమ్మ (75) ఈ నెల 6వ తేదీ నుంచి కనిపించడం లేదని అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ కె.కిరణ్కుమార్ నాయుడు శుక్రవారం తెలిపారు. పోలమ్మ తన భర్త లక్ష్మునాయుడుతో కలిసి గజపతినగరం ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి వచ్చి స్వగ్రామం జిన్నాం వెళ్లేందుకు స్థానిక భైరిపురం జంక్షన్ వద్దకు వచ్చింది. తరువాత గజపతినగరం నుంచి మధుపాడ, మరుపల్లి గ్రామాల వైపు వెళ్లినట్టు సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్టు తెలిపారు. దీన్ని భర్త గమనించలేదు. పోలమ్మ కుమారుడు ఇజ్జిరోతు సూరినాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు. ఎవరికై నా ఆచూకీ తెలిస్తే గజపతినగరం పోలీస్స్టేషన్కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు. -
17న టాలెంట్ టెస్టు
విజయనగరం టౌన్: ముస్లిం విద్యార్థులకు ఉచిత కార్పొరేట్ ఇంటర్ విద్యను వక్ఫ్ ఎడ్యుకేషన్ మిషన్ ద్వారా అందించేందుకు ఈ నెల 17న రాష్ట్ర వ్యాప్తంగా టాలెంట్ టెస్ట్ నిర్వహించనున్నట్టు ఖాదర్బాబా దర్గా దర్బార్ షరీఫ్ ముతవల్లి డాక్టర్ ఎం.డి. ఖలీలుల్లా షరీఫ్ తాజ్ ఖాదరీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 12లోపు విద్యార్థులు ఏపీ వక్ఫ్బోర్డు లింక్ను ఓపెన్చేసి దరఖాస్తు చేసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 250 మంది మెరిట్ విద్యార్థులను ఎంపిక చేసి ఇంటర్ రెసిడెన్షియల్ విద్యతో పాటు, ఐఐటీ, జేఈఈ, నీట్, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. ఈ సెట్లో ‘రమ్య’మైన ప్రతిభ సంతకవిటి: మండలంలోని వాల్తేరు గ్రామానికి చెందిన గురుగుబెల్లి రమ్య శుక్రవారం విడుదలైన ఈసెట్ ఫలితాల్లో సత్తాచూపింది. రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు సాధించింది. ఆమె సిరిపురం జెడ్పీహెచ్ఎస్లో చదివి పదో తరగతిలో 520 మార్కులు సాధించింది. పాలిసెట్లో ర్యాంకు సాధించి అనకాపల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలో అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేసింది. ఈసెట్కు సిద్ధమై మంచి ర్యాంకు సాధించింది. ఆమె తల్లిదండ్రులు రాము, రాజు వ్యవసాయ కూలీలు. కుమార్తె చదువులో ప్రతిభ చూపడంతో తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు. బాలికకు గ్రామస్తులు పలువురు అభినందనలు తెలిపారు. -
ఆలోచనల మార్పిడికి ఇదో అద్భుత వేదిక
రాజాం సిటీ: అధ్యాపకుల ఆలోచనా శక్తిని పెంపొందించేందుకు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రొగ్రాంలు ఎంతో అవసరమని గువహటి ఐఐటీ కన్వీనర్, ప్రొఫెసర్ పి.పాము అన్నారు. రాజాం జీఎంఆర్ ఐటీ డీమ్డ్ యూనివర్సిటీలో ఈ నెల 4 నుంచి నిర్వహించిన ‘ఫ్రంటియర్స్ ఇన్ ఫిజికల్ అండ్ కెమికల్ సైన్సెస్, ఇన్నోవేషన్స్ ఇన్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్’ అనే అంశంపై నిర్వహించిన ఫ్యాకల్టీ డెవలప్ మెంట్ ప్రొగ్రాం శుక్రవారంతో ముగిసింది. ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నానో పదార్థాలు, శక్తి నిల్వ వ్యవస్థలు, కాటలీటిక్ పదార్థాలు, హైడ్రోజన్ నిల్వ, కార్బన్ సంగ్రహణ, థిన్ఫిల్మ్, తదితర అంశాలపై జరిగిన పరిశోధనలు సమాజానికి ఎంతగానో దోహదపడతాయన్నారు. ఇటువంటి కార్యక్రమాలు జ్ఞానం, ఆలోచనలు, వినూత్న పరిశోధనా దృక్కోణాల పరస్పర మార్పిడికి ఒక అద్భుతమైన వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల సైన్స్ అండ్ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ డీన్ సీఎల్వీఆర్ఎస్వీ ప్రసాద్, ఎం.వి.సుబ్బారావు, ఆర్.ఎల్.నాయుడు, కె.కోటేశ్వరరావు, బి.విశ్వనాథం, తదితరులు పాల్గొన్నారు. -
ఇదే మంచి తరుణం
ధ్రువపత్రాలు పొందేందుకు..రామభద్రపురం: ఇటీవల పదో తరగతి, ఇంటర్ తదితర తరగతుల పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ, ట్రిపుల్ ఐటీ, ఇంజినీరింగ్, వైద్య తదితర కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. ఇందుకు విద్యార్హత పత్రాలతో పాటు ఆదాయ, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి. జూన్ నెలలో విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో ధ్రువపత్రాలు పొందేందుకు ఇదే మంచి తరుణం. వేల సంఖ్యల్లో ఉన్న విద్యార్థులకు ఒకేసారి ధ్రువపత్రాలు జారీ చేయడం అధికారులకు కష్టతరమవుతోంది. ముందుగా దరఖాస్తు చేసుకుంటే సంబంధిత అధికారులు పరిశీలించి జారీ చేయడానికి అవకాశం ఉంటుంది. నమోదు చేసుకోవడం ఇలా.. కులం, ఆదాయ, నివాస ద్రువీకరణ పత్రాల కోసం స్వర్ణ, గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థితో పాటు తల్లిదండ్రుల ఆధార్, కుటుంబ సభ్యులున్న రేషన్ కార్డు ఇతర పత్రాలతో దరఖాస్తు జత చేయాలి. స్వర్ణ, గ్రామ సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్లు ఇంటర్నెట్లో నమోదు చేసి సంబంధిత వీఆర్ఓలు పరిశీలించి దరఖాస్తుకు సంబంధించి రిపోర్ట్ రాసి ఆర్ఐకు పంపుతారు. ఆర్ఐ పరిశీలించి తహసీల్దార్కు పంపగా అన్ని పత్రాలు పరిశీలించి సక్రమంగా ఉంటే డిజిటల్ సంతకం మండల తహసీల్దార్ చేస్తారు. సంబంధిత విద్యార్థి సెల్ఫోన్కు మెసేజ్ వస్తుంది. అప్పుడు దరఖాస్తు చేసుకున్న కేంద్రాలకు వెళ్లి ఆయా ధ్రువపత్రాలు తీసుకోవచ్చు. సర్వేల్లో సచివాలయ సిబ్బంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాలలోని సిబ్బందిపై పనిభారం పెరిగింది. వలంటీర్లు లేకపోవడంతో పింఛన్ల పంపిణీతో పాటు రకరకాల సర్వేలు వారితో చేయిస్తోంది. జాబ్ చార్ట్కు విరుద్ధంగా వారికి సంబంధించిన శాఖ పనులే కాకుండా ఇతర శాఖలకు చెందిన పనులు కూడా అప్పగించడంతో క్షేత్ర స్థాయిలోకి వెళ్లి పనులు చేయడం వల్ల వారు బిజీ అయ్యారు. ప్రస్తుతం గ్రామాలలో జనగణన సర్వే ఇంటింటికీ వెళ్లి చేస్తున్నారు. పనుల కోసం సచివాలయాలకు వెళ్లిన వారికి అందుబాటులో లేక సకాలంలో సేవలు అందించలేని పరిస్థితి ఉంది. గ్రామ స్థాయిలో ప్రజలకు రోజు రోజుకు సేవలు సన్నగిల్లుతున్నాయి. జనగణన సర్వేలో డిజిటల్ అసిస్టెంట్లు కూడా ఉండడంతో ధ్రువపత్రాల కోసం చేసిన దరఖాస్తులు అప్లోడ్ చేసేందుకు ఆలస్యం అవుతోంది. సర్వే చేసిన తర్వాతగాని సచివాలయాలకు చేరకపోవడంతో ధ్రువపత్రాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి వెళ్లిన విద్యార్థులకు సకాలంలో సేవలు అందిచలేని పరిస్థితి ఉంది. దాంతో వారు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యం కాకుండా జారీ చేస్తాం.. ధ్రువపత్రాల కోసం ముందుగా దరఖాస్తు చేసుకుంటే త్వరితగతిన పత్రాలు జారీ అవుతాయి. స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న వాటిని ఎప్పటికప్పుడు పరిశీలించి వివరాలు సక్రమంగా ఉంటే మంజూరు చేస్తాం. ఎక్కడా ఆలస్యం కాకుండా త్వరితగతిన జారీ చేయాలని ఇప్పటికే మండల స్థాయి అధికారులతో చర్చించాం. ఎవరూ ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకున్నాం. – జేవీఎస్ఎస్ రామమోహనరావు, ఆర్డీఓ, బొబ్బిలి దరఖాస్తు చేసుకోండి.. ధ్రువపత్రం పొందండి విద్యార్థులకు రెవెన్యూ అధికారుల సూచన -
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
గజపతినగరం రూరల్: మండలంలోని గుడివాడ గ్రామ సమీపంలో రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఈశ్వరరావు శుక్రవారం అందించిన వివరాలు... పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలంలోని రావుపల్లి గ్రామానికి చెందిన పల్ల అప్పలనాయుడు(25) ఈ నెల ఆరో తేదీ రాత్రి 8.40 గంటల సమయంలో రైల్వే టికెట్ తీసుకొని భవానిపట్నం పాసింజర్లో సింహాచలం నుంచి పార్వతీపురం ప్రయాణం చేస్తుండగా గజపతినగరం – కోమటిపల్లి రైల్వేస్టేషన్ల మధ్య మండలంలోని గుడివాడ గ్రామ సమీపంలో ప్రమాదవశాత్తు జారి పడిపోయాడు. దీంతో అప్పలనాయుడు తీవ్రంగా గాయపడి అక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు బొబ్బిలి జీఆర్పీ హెచ్సీ బండారు ఈశ్వరరావు తెలిపారు. -
దూసుకొచ్చిన మృత్యువు
కొమరాడ: రోడ్డు పక్కన ఉన్న టీ దుకాణంలో టీ తాగుతూ ముచ్చట్లు చెబుతున్న ఓ వృద్ధుడిపై మృత్యువు దూసుకొచ్చింది. బొలేరో వాహనం రూపంలో కనురెప్పవేసిన పాటులో ప్రాణాలను హరించింది. వ్యవసాయ పనులపై వెళ్తూ ఆగిన మరో ఇద్దరు.. కూరగాయలు విక్రయిస్తున్న మరో మహిళను క్షతగాత్రులుగా మార్చింది. దుకాణాలపైకి దూసుకొచ్చిన బొలేరోవాహనాన్ని చూసిన స్థానికులు భీతిల్లిపోయారు. భయంతో పరుగులు తీశారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పార్వతీపురం నుంచి రాయగడ వైపు అతివేగంగా వెళ్తున్న బొలేరో వాహనం శుక్రవారం మధ్యాహ్నం అదుపుతప్పి కొమరాడ మండల కేంద్రంలోని రోడ్డుపక్కన ఉన్న దుకాణాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో టీ తాగేందుకు వచ్చిన కొమరాడ గ్రామానికి చెందిన మరడాన చిన్నంనాయుడు(75) దుర్మరణం చెందారు. పొరుగు జిల్లా నుంచి వ్యవసాయం చేసుకుని జీవనం కొనసాగిస్తున్న ముద్దురు గోపాల్కృష్ణ, కూనేరు రామభభద్రపురం గ్రామానికి చెందిన మోయి జాషువ, అక్కడే కూరగాయల దుకాణం నిర్వహిస్తున్న బొత్స మహలక్ష్మి గాయపడ్డారు. వీరిని వైద్యం కోసం కొమరాడ పీహెచ్సీకి తరలించారు. వృద్ధుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. కొమరాడ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదుచేశారు. గాయాలతో పడిఉన్న ముద్దురు గోపాలకృష్ణ అక్కడికక్కడే మృతి చెందిన మరడాన చిన్నంనాయుడు కొమరాడలో రెప్పపాటులో ఘోర రోడ్డు ప్రమాదం అదుపు తప్పి కూరగాయల దుకాణంలోని దూసుకెళ్లిన బొలేరో ఒకరు మృతి, ముగ్గురికి త్రీవగాయాలు -
పెళ్లికి వెళ్తుండగా ప్రమాదం
● పాలకొండ – వీరఘట్టం రహదారిలో ఘటన ● పెళ్లి కుమార్తె తల్లిదండ్రులతో పాటు పలువురికి గాయాలుపాలకొండ రూరల్: పాలకొండ – వీరఘట్టం ప్రధాన రహదారిలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెళ్లి బృందం సభ్యులు గాయపడ్డారు. పెళ్లి బృందంతో వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించబోయి రోడ్డుపై ఆగి ఉన్న మరో వివాహానికి సారె సామగ్రిని తీసుకువెళ్తున్న బొలెరో వాహనాన్ని ఢీకొని బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు కూడా ఉన్నారు. దీనికి సంబంధించి బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు... రాజాం మండలం పొగిరి గ్రామానికి చెందిన ఐ.సత్యనారాయణ, పద్మ దంపతులు తమ కుమార్తె వివాహ నిమిత్తం ఆటోలో వీరఘట్టం మండలం పాలమెట్టకు బంధువులతో కలిసి ప్రయాణమయ్యారు. అప్పటికే పెళ్లి కుమార్తె మరో వాహనంలో వెళ్లింది. ఇదే సమయంలో సీతంపేట మండలానికి చెందిన మరో వివాహ బృందానికి చెందిన వారు తన చెల్లెలు పెళ్లికి సంబంధించిన సారె సామగ్రి తీసుకుని అన్నయ్య బొలెరో వాహనంతో కురుపాం బయలుదేరాడు. బొలెరో వాహనం నడుపుతున్న పెళ్లి కుమార్తె అన్న వీరఘట్టం రహదారిలోని టీ అడ్డా దాటిన తరువాత తన వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపాడు. ఈ సమయంలో వెనుక నుంచి వేరే పెళ్లి బృందం సభ్యులతో వస్తున్న ఆటో వీరఘట్టం నుంచి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించబోయి ఆగి ఉన్న బొలెరోను బలంగా ఢీకొట్టాడు. దీంతో ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. ఆటోలో ప్రయాణిస్తున్న పెళ్లి కుమార్తె తల్లి పద్మకు తీవ్ర గాయాలు కాగా.. తండ్రి సత్యనారాయణకు చేయి నుజ్జయ్యి అపస్మారక స్థితికి చేరారు. వీరి బంధువులైన ఐ.సూర్యనారాయణకు నడుము, కె.రాజేశ్వరికి కాళ్లు విరిగాయి. తీవ్రంగా గాయపడిన వీరిని పాలకొండ ఏరియా ఆస్పత్రికి 108 వాహనంలో తరలించారు. తీవ్ర గాయాలైన వారిని వైద్యులు శ్రీకాకుళం రిఫర్ చేశారు. ఇదే ఘటనలో గాయాల పాలైన కె.లక్ష్మి, ఐ.ఆదిలక్ష్మి, కె.రమణమ్మ, కె.రాజ్కుమార్, కె.అచ్చెయ్యకు స్థానిక వైద్యులు తక్షణ చికిత్స అందించారు. ప్రాణాపాయం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న పెళ్లి బృందం సభ్యులు కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రిలో కన్నీటి పర్యంతమయ్యారు. అయినవారి యోగక్షేమాల కోసం ఆరా తీశారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన ఎస్ఐ డోల వెంకన్న ప్రమాదానికి గల కారణాలు తెలసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
గిరిజన సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత
పార్వతీపురం: గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఐటీడీఏ పీఓ ఆర్.వైశాలి అన్నారు. శుక్రవారం ఐటీడీఏలోని గిరిమిత్ర హాల్లో నిర్వహించిన గిరిజన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి 19 వినతులను స్వీకరించి, సంబంధిత శాఖాధికారులతో వెంటనే పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతీ వినతిని బాధ్యతాయుతంగా పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన సేవలు సమయానికి అందేలా చర్యలు కొనసాగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీఓ పి.మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. -
మూగబోయిన జానపద స్వరం
విజయనగరం గంటస్తంభం: విజయనగరం జిల్లా కణపాకలో ఓ చిన్న ఇల్లు..ఆ ఇంటి నుంచి ఒకప్పుడు వినిపించిన గాత్రం ఉత్తరాంధ్ర పల్లెల్ని ఉర్రూతలూగించింది. ఆ గాత్రం దంపుడు లక్ష్మిది. బుర్రకథ అంటే ఏమిటో..జానపద కళలో భావోద్వేగం ఎలా ఉంటుందో? ఒక మహిళ వేదికపై నిలబడి వేల మందిని ఎలా కట్టిపడేస్తుందో తన జీవితంతో చూపించిన కళాకారిణి ఆమె. కానీ జనాలను నవ్వించిన ఆ కళాకారిణి జీవితం మాత్రం నిశ్శబ్దంగా కన్నీళ్ల మధ్య ముగిసింది. ˘õ³§ýl-ÇMýS… Ð]l$«§ýlÅ ç³#sìæt¯]l MýSâê{ç³-Ý릯]l… చిన్నప్పటి నుంచే లక్ష్మికి కళలంటే ప్రాణం. అప్పట్లో గ్రామాల్లో విద్యుత్ లేదు..టీవీలు లేవు..వినోదానికి జాతరలు, బుర్రకథలే ప్రధాన ఆధారం. గ్రామంలో ఎక్కడ బుర్రకథ వినిపించినా చిన్నారి లక్ష్మి అక్కడికెళ్లి గంటల తరబడి చూసేది. కథ చెబుతున్న వాళ్ల హావభావాలు, పాటలు, సంభాషణలు ఆమెను ఆకట్టుకునేవి. ఆ ఆసక్తే తర్వాత ఆమె జీవితాన్ని బుర్రకథ వైపు నడిపించింది. ఆ రోజుల్లో మహిళలు వేదికపైకి రావడం చాలా అరుదు. అయినా భయపడకుండా బుర్రకథ రంగంలోకి అడుగుపెట్టిన లక్ష్మి, తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ˘§ýl…ç³#yýl$ ÌS„ìSà Ð]lçÜ$¢…-§ýl…sôæ FÆý‡…™é ^ólÆó‡¨ ఒకప్పుడు ఉత్తరాంధ్ర గ్రామాల్లో జాతరలో బుర్రకథ తప్పనిసరి. సాయంత్రం కాగానే గ్రామం మధ్యలో చిన్న వేదిక ఏర్పాటు చేసేవారు. నేలమీదే పిల్లలు, పెద్దలు కూర్చుని కథ మొదలయ్యే వరకు ఎదురు చూసేవారు. అప్పుడు దంపుడు లక్ష్మి బుర్రకథ మొదలైతే చాలు..జనాలు మైమరచిపోయేవారు. బాలనాగమ్మ, సీతారామ కల్యాణం, నలదమయంతి, మహాభారతం, రామాయణం..ఏ కథ చెప్పినా తన గాత్రంతో ప్రేక్షకుల కళ్లలో నీళ్లు తెప్పించగలిగేది. హాస్యం చెప్పి నవ్వించేది.. విషాదం చెప్పి ఏడిపించేది. అంతటి మంత్రముగ్థత ఆమె కళలో ఉండేది. ˘MýSâýæ™ø ´ër$ {ç³fÌZÏ O^ðl™èl-¯]lÅ….. దంపుడు లక్ష్మి కేవలం వినోదం కోసం మాత్రమే కథలు చెప్పలేదు. బాల్య విహహాలు, అక్షరాస్యత, మహిళా హక్కులు, ఎయిడ్స్ నియంత్రణ, పొదుపు సంఘాలు, పనికి ఆహార పథకం వంటి ప్రభుత్వ కార్యక్రమాలపై కూడా ఊరూరా తిరిగి బుర్రకథల రూపంలో ప్రజల్లో అవగాహన కల్పించింది. ఆ రోజుల్లో ప్రభుత్వ అధికారులు కూడా దంపుడు లక్ష్మి బృందం వస్తే ప్రజలకు విషయం త్వరగా చేరుతుందని ప్రత్యేకంగా ప్రోగ్రాములు పెట్టేవారు. విజయనగరం మాత్రమే కాదు..ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కూడా ఆమె ప్రదర్శనలు ఇచ్చింది. ˘f¯éÌS ^èlç³µsôæÏ M>± yýlº$¾ Æ>Ìôæ§ýl$ వేదికలపై చప్పట్లు కొట్టిన జనాలు వేలమంది. కానీ ఆ చప్పట్లు ఆమె జీవితాన్ని నిలబెట్టలేకపోయాయి. కళను నమ్ముకుని కుటుంబాన్ని నెట్టుకొచ్చిన లక్ష్మి ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు, ఒంటరి పోరాటం..అన్నింటినీ భరించింది. ఒక కుమారుడిని కష్టపడి పెంచి పెద్ద చేసింది. అయితే కళాకారిణిగా ఆమెకు పేరు వచ్చినా..జీవితంలో మాత్రం స్థిరత్వం రాలేదు. ˘yìlhrÌŒæ Ķæ¬VýS….. MýS¯]l$-Ð]l$-Æý‡$-OVðS¯]l º${Æý‡MýS£ýl కాలం మారింది. టెలివిజన్ వచ్చింది. తర్వాత సినిమాలు, మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా వచ్చాయి. గ్రామాల్లో జాతరల వేదికలపై బుర్రకథల స్ధానంలో రికార్డింగ్ డ్యాన్సులు వచ్చాయి. ఒకప్పుడు రాత్రంతా కూర్చుని బుర్రకథలు విన్న ప్రజలు.. ఇప్పుడు మొబైల్ స్క్రీన్స్పై వినోదం వెతుక్కుంటున్నారు. కొత్త తరం జానపద కళల వైపు చూడకపోవడం, ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడం వల్ల బుర్రకథలు క్రమంగా కనుమరుగయ్యాయి. ఆ కళను నమ్ముకున్న కళాకారులు బతుకు కోసం ఇతర పనులు చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ˘_Ð]l-ÇMìS MýS*Æý‡V>-Ķæ$ÌS §ýl$M>-׿Ðól$ B«§éÆý‡… ఒకప్పుడు వేదికలపై వేలాది మందిని అలరించిన దంపుడు లక్ష్మి... చివరికి కలెక్టర్ కార్యాలయం పక్కన చిన్న కూరగాయల దుకాణం పెట్టుకుని జీవనం సాగించింది. అది ఆమె జీవితంలో అత్యంత బాధాకరమైన మలుపు. కళతో గౌరవం వచ్చింది. కానీ బతుకు రాలేదు. అనారోగ్యం వెంటాడినా.. మందులకు డబ్బు లేకపోయినా..అప్పుడప్పుడు చిన్న ప్రోగ్రాములు చేస్తూనే ఉండేది. కళను వదిలేస్తే నేను బతకలేను అని చెప్పేదామె. ˘MóS¯]lÞ-ÆŠ‡™ø ´ùÆ>-yìl¯]l MýSâê-iÑ™èl… కేన్సర్ బారిన పడిన తర్వాత ఆమె పరిస్థితి మరింత దయనీయమైంది. వైద్యానికి డబ్బులు సరిపోలేదు. ప్రభుత్వ సహాయం అందలేదు. కళాకారుల పెన్షన్ కూడా ఆమెకు దక్కలేదు. జీవితాంతం ప్రజలకు సందేశాలు చెప్పిన కళాకారిణి.. చివరికి తన బాధను ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితిలో మిగిలిపోయింది. ఈ నెల 5 మంగళవారం ఆకస్మాత్తుగా ఆయాసానికి గురై ఆమె తుదిశ్వాస విడిచింది. బుర్రకథ కళాకారిణి దంపుడు లక్ష్మి మృతి ప్రభుత్వ పథకాల ప్రచారంలో ముందున్న కళాకారిణి బాల్య వివాహాలపై బుర్రకథలతో పోరాడిన మహిళ కళను నమ్ముకున్న జీవితం..ఆదుకోని సమాజం డిజిటల్ యుగం దెబ్బకు కనుమరుగైన జీవితం -
స్వచ్ఛ సర్వేక్షణ్పై సమీక్ష
పార్వతీపురం: జిల్లాలో స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం అమలుపై జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి గురువారం తన చాంబర్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పట్టణాల్లో ఇంటింటి చెత్త సేకరణ, తడి–పొడి చెత్త వేరుచేయడం, ప్లాస్టిక్ నియంత్రణ, డ్రైనేజీల పరిశుభ్రత, దోమల నివారణ చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. ప్రధాన రహదారులు, మార్కెట్ ప్రాంతాలు, బస్టాండ్లు తదితర రద్దీ ప్రదేశాల్లో ప్రతిరోజూ శుభ్రత కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్లో మెరుగైన స్థానం సాధించేందుకు ప్రతి మున్సిపాల్టీ కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. సమావేశంలో పార్వతీపురం, సాలూరు, పాలకొండ, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత శాఖాధికారులు పాల్గొన్నారు. 40 లీటర్ల సారా పట్టివేతసీతంపేట: మండలంలోని మండ గ్రామంలో 40 లీటర్ల సారా పట్టుకున్నట్లు ఎస్సై వై.అమ్మన్నరావు తెలిపారు. సారాతో పాటు సవర జగ్గయ్య అనే పేర్లు గల ఇద్దరు నిందితులను అరెస్టు చేశామన్నారు. సారా వండినా, విక్రయించినా, అక్రమరవాణా చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతిగజపతినగరం/దత్తిరాజేరు: పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన దత్తిరాజేరు మండలం ఎం.లింగాలవలస గ్రామానికి చెందిన మజ్జి ఈశ్వరరావు వైద్యసేవలు పొందుతూ మృతి చెందాడని గజపతినగరం ఎస్సై కె.కిరణ్ కుమార్ నాయుడు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వివరాలు తెలిపారు. ఈశ్వర రావు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అప్పులు చేసి నష్టాల బాట పట్టడంతో అప్పుల బాధ భరించలేక మనస్తాపానికి గురై ఈనెల 5వ తేదీన సాయంత్రం గజపతినగరం మండలం దావాలపేట రోడ్డు మహంకాళి అమ్మవారి గుడి సమీపంలో ఉన్న శ్మశాన వాటికలో పురుగు మందు తాగాడన్నారు. అనంతరం తన స్నేహితుడు రామకృష్ణ గజపతినగరం ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో చేర్పించి వైద్యసేవలు అందించాడని తెలిపారు. మెరుగైన వైద్యం కోసం విజయనగరంలోని మెడికవర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతిచెందినట్లు ఎస్సై కిరణ్ కుమార్ నాయుడు తెలిపారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. రైలు నుంచి జారిపడి యువకుడి మృతిగరుగుబిల్లి: మండలంలోని రావుపల్లి గ్రామానికి చెందిన పల్ల అప్పలనాయుడు(25) రైలు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. బతుకు తెరువు నిమిత్తం విశాఖపట్నంలో వెల్డర్గా పనిచేస్తున్న అప్పలనాయుడు బుధవారం విశాఖపట్నం నుంచి భవానీపట్నం వెళ్తున్న రైలులో అమ్మను చూసేందుకు వస్తున్న తరుణంలో మానాపురం–గజపతినగరం మధ్య ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. అప్పలనాయుడు మృతితో రావుపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కొన్నేళ్ల క్రితం తండ్రి పరిసనాయుడు అనారోగ్యంతో మృతిచెందగా, ప్రస్తుతం తల్లి సావిత్రమ్మకు ఆయనే పెద్ద దిక్కుగా ఉంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుమారుడి మృతివార్త తెలుసుకున్న తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుడికి విజయనగరంలోని జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసి రావుపల్లిలో అంత్యక్రియలను గురువారం నిర్వహించారు. -
గంజాయి ముఠా గుట్టురట్టు
నెల్లిమర్ల: పట్టణంలోని గంజాయి ముఠా గుట్టు రట్టు చేసినట్లు ఎస్సై బి. గణేష్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ డైట్ కాలనీకి చెందిన మనోహర్ అనే వ్యక్తి రాయగడ రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి గంజాయిని కొనుగోలు చేసి నెల్లిమర్లలోని యువకులకు అమ్ముతున్నాడన్నారు. గంజాయి సమాచారం రావడంతో చంపావతి నదీతీరంలో గ్యాస్ గొడౌన్ వెనక భాగంలో గల తుప్పల్లో సిబ్బందితో కలిసి దాడి చేసి నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. డైట్ కాలనీకి చెందిన మనోహర్ అనే వ్యక్తి దగ్గర నెల్లిమర్ల పట్టణానికి చెందిన ప్రవీణ్, సత్య దివాకర్, నవీన్, లోకేష్ అనే నలుగురు వ్యక్తులు 100 గ్రాములు గంజాయి కొనుగోలు చేసి కాల్చడానికి వెళ్తుండగా ఈ దాడిలో పోలీసులకు పట్టుబడ్డారని, గంజాయిని అమ్మడానికి వచ్చిన మనోహర్ దగ్గర 1.2 కిలోలు గంజాయిని సీజ్ చేశామన్నారు. నెల్లిమర్ల పట్టణం, పరిసర ప్రాంతాల్లో గంజాయిపై గట్టిగా నిఘా ఏర్పాటు చేశామని ఎవరైనా గంజాయి పీల్చినా, అమ్మినా, కొనుగోలు చేసినా వారిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గంజాయి గురించి సమాచారాన్ని ఫోన్ 9121109444 నంబర్కు సమాచారం ఇవ్వాలని ఎస్సై గణేష్ కోరారు. -
రెండు బైక్లు ఢీ: ఇద్దరికి తీవ్రగాయాలు
గజపతినగరం: స్థానిక పైడితల్లమ్మ వారి గుడి సమీపంలో రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయాల పాలయ్యారు. వివరాలిలా ఉన్నాయి. గజపతినగరం మండలం మధుపాడ గ్రామానికి చెందిన బూడి చందు గురువారం ఉదయం గ్రామంలో తన తాతయ్యను బైక్ ఎక్కించుకుని లింగాలవలస గ్రామంలో దించి తిరిగి వస్తున్నాడు. అదే సమయంలో బొండపల్లి మండలం బొండపల్లి గ్రామానికి చెందిన భార్యాభర్తలు బి.సింహాద్రి, ఈశ్వరమ్మలు ఓ తోటలో సపోటా పళ్లు ఏరేందుకు గజపతినగరం నుంచి బైపాస్ రోడ్డు గుండా బైక్పై వెళ్తున్నారు. ఆ సమయంలో గుడి సమీపంలో ఆ రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొనడంతో మధుపాడ గ్రామానికి చెందిన బూడి చందు కుడిచేయి ఫ్రాక్చర్ అయింది. బి.సింహాద్రికి ఎడమ చేయి ఫ్రాక్చర్ కావడంతో పాటు తలకు కుట్లు పడ్డాయి. అలాగే సింహాద్రి భార్య ఈశ్వరమ్మకు స్పల్ప గాయమైంది. వారిని బంధువులు గజపతినగరం ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందించారు. మెరుగైన వైద్యం కోసం చందును గజపతినగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, సింహాద్రిని విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు.పోలీసులు క్షతగాత్రుల వద్దకు వెళ్లి వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. యువకుడికి తీవ్రగాయాలుబొబ్బిలి: పట్టణంలోని ఫ్లైఓవర్ డౌన్లో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని పక్కి గ్రామానికి చెందిన శంబంగి శంకర రావుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై సీఐ కె.నారాయణరావు తెలిపిన వివరాల ప్రకారం విజయనగరం తాహసీల్దార్ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్న శంకర్ విధులు ముగించుకుని రాత్రి 10 గంటల సమయంలో బైక్పై తిరిగి వస్తుండగా ఫ్లైఓవర్ వద్ద ఎదురుగా వస్తున్న లారీని ప్రమాదవశాత్తు ఢీకొన్నాడు. ఈ సంఽఘటనలో శంకర్కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడ్ని స్థానిక ిసీహెచ్సీలో చేర్పించారు. అక్కడి వైద్యులు ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి బంధువులు విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని, కోమాలో ఉన్నట్లు బంధువులు తెలిపారు.సీతంపేట: మండలంలోని పుట్టిగాంలో వివాహ కార్యక్రమానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో వస్తుండగా సవరపాడు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన బెన్నరాయి వాసులు స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మొత్తం 18 మంది గాయపడగా వారిలో మెరుగైన వైద్యం కోసం పదిమందిని శ్రీకాకుళం రిమ్స్కు రిఫర్ చేశారు. మిగతా 8 మందికి ఆర్ఎంవో డీవీ శ్రీనివాస్ పర్యవేక్షణలో వైద్యసేవలు అందుతున్నాయి. మరో మహిళకు స్వల్ప గాయం -
ఆపత్కాలంలో అండగా..
● మానవత్వం చాటుకున్న జెడ్పీచైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విజయనగరం: రాజకీయాల్లో నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండే ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు మానవత్వాన్ని చాటుకున్నారు. విధులు ముగించుకుని బుధవారం రాత్రి బొబ్బిలి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన విజయనగరం తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న శంబంగి శంకరరావుకు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో దగ్గరుండి వైద్య చికిత్స చేయించారు. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పిల్లలు పనిలో కాదు బడిలో ఉండాలి శృంగవరపుకోట: ‘బడిఈడు పిల్లలు పనిలో కాదు బడిలో ఉండాలి.. ప్రభుత్వ పాఠశాలలో చేర్చండి, మెరుగైన సమాజానికి ఊతమివ్వండి’ అంటూ మండల విద్యాశాఖాధికారి–2 గణపతి లక్ష్మి నేతృత్వంలో గురువారం ఎస్.కోట పట్టణంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. అన్ని వసతులు, ప్రమాణాలతో కూడిన విద్యను బోధించే ఉపాధ్యాయులున్న ప్రభుత్వ బడిలో పిల్లలను చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో బాలికోన్నత పాఠశాల హెచ్ఎం శైలజారాణి, కె.బంగారునాయుడు, టి.అప్పారావు, జి.వి.రమణ, చిప్పాడ సూరిబాబు, గొల్లు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ధాన్యం లోడు లారీ బోల్తా వంగర: ధాన్యం లోడుతో వీరఘట్టం నుంచి వంగర వైపు గురువారం వస్తున్న లారీ వంగర మండలం రుషింగి–కొప్పరవలస గ్రామాల మధ్య పంటపొలాల్లో బోల్తా కొట్టింది. ఇరుకుగా ఉన్న రోడ్డును దాటుతుండగా దిగబడి పంట పొలాల్లోకి బోల్తాపడింది. గంటల తరబడి వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ ఘటనలో ఎవరికీ ఏ ప్రమాదం జరగకపోవడంతో అక్కడ ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. గతంలో స్థానిక ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ఈ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పటికీ పనులు ప్రారంభించ లేదు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా రోడ్డు నిర్మాణాన్ని పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీహెచ్సీని సందర్శించిన డీఎంహెచ్ఓ బాడంగి: మండల కేంద్రంలోని సీహెచ్సీని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి జీవనరాణి, జిల్లా ప్రభుత్వ సామాజిక ఆరోగ్యకేంద్రాల కోఆర్డినేటర్ (డీసీహెచ్ఓ) రఘువంశీ గురువారం సందర్శించారు. సీహెచ్సీకి డయేరియా రోగుల తాకిడి ఎక్కువ కావడంతో సాక్షిలో ‘భయపెడుతున్న డయేరియా’ శీర్షికన గురువారం ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. సీహెచ్సీలోని ప్రతి వార్డుకీ వెళ్లి రోగులతో మాట్లాడారు. అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. వైద్యసేవలు బాగానే ఉన్నాయని రోగులు, సహాయకులు చెప్పడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో సీహెచ్సీ సూపరింటెండెంట్ పి. నాగేశ్వరరావు, వైద్యులు వంశీ, ఇమ్రాన్, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే, కలెక్టర్ రాంసుందర్రెడ్డి ఎంపీడీఓకు ఫోన్ చేసి డయేరియా వ్యాప్తిపై ఆరా తీశారు. -
రాయితీపై వ్యవసాయ పరికరాలు
● జేసీ సేతుమాధవన్ విజయనగరం ఫోర్ట్: రాయితీపై అందించే వ్యవసాయ పరికరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జేసీ సేతుమాధవన్ అన్నారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో గురువారం వ్యవసాయ యాంత్రీకరణ మోనిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాకు మొత్తం 1160 వ్యవసాయ యంత్రాలు, పరికరాల పంపిణీకోసం రూ.422.43 కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు. అర్హులైన రైతులు ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు, ప్లాంట్ ప్రొటెక్షన్ పరికరాలు, స్వయం చోదిత యంత్రాలు, కోత, త్రైషింగ్ యంత్రాలకు ఈ నెల 19లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. చిన్న, సన్నకారు రైతులు, ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు 50 శాతం రాయితీపై యంత్ర పరికరాలు అందిస్తామన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి వి.టి. రామారావు, ఉద్యానశాఖ ఉప సంచాలకులు చిట్టిబాబు, తదితరులు పాల్గొన్నారు. -
టాప్ ‘టెన్’ విద్యార్థులకు నగదు ప్రోత్సాహం
● డీఈఓ మాణిక్యం నాయుడు చేతుల మీదుగా చెక్కుల పంపిణీవిజయనగరం గంటస్తంభం: ప్రభ్వుత పాఠశాలల్లో చదివి పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లా టాప్ టెన్ విద్యార్థులకు వీకే(వసుధైక కుటుంబం) ఫ్యామిలీ ఫౌండేషన్, క్రెడిట్ బీ సంయుక్త ఆధ్వర్యంలో నగదు ప్రోత్సాహక చెక్కులు పంపిణీ చేశారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో డీఈఓ యు.మాణిక్యం నాయుడు విద్యార్ధులకు చెక్కులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాణిక్యంనాయుడు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. విజయనగరం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో విద్యార్థులకు సైకిళ్లు, స్కాలర్షిప్లు అందించడంతో పాటు టాప్ టెన్ విద్యార్థులకు నగదు బహుమతులు ఇవ్వడం మంచి కార్యక్రమమన్నారు. 594 మార్కులతో ప్రథమ స్థానం సాధించిన ఇ.ఉమాపార్వతి, జి.సాద్వికలకు రూ.14 వేలు చొప్పున, 593 మార్కులతో ద్వితీయ స్ధానం పొందిన ఎస్.గుణశేఖర్, జె.పవన్కుమార్లకు రూ.10 వేలు చొప్పున, 591 మార్కులతో తృతీయ స్థానం సాధించిన కె.కీర్తనకు రూ.7వేలు నగదు బహుమతులు అందజేశారు. అలాగే 590 మార్కులు సాధించిన మరో ఏడుగురు విద్యార్థులకు రూ.3 వేలు చొప్పున చెక్కులు అందించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ మోహనరావు, వెంకటరమణ, డీసీఈబీ కార్యదర్శి టి.సన్యాసిరాజు, ట్రస్ట్ ప్రతినిధులు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
15న మహా పాదయాత్ర
● ప్రకాశం బ్యారేజీ నుంచి విద్యాశాఖా మంత్రి నారాలోకేశ్ ఇంటివరకు పాదయాత్ర విజయనగరం గంటస్తంభం: సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈ నెల 15న మహా పాదయాత్రను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన సమాచార పత్రాన్ని ఏపీ సమగ్ర శిక్షా కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (జేఏసీ) నాయకులు డీఈఓ యు.మాణిక్యంనాయుడుకు గురువారం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ, ఎన్నికల ముందు సమగ్రశిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల రెగ్యులరైజేషన్, హెచ్ఆర్ పాలసీ అమలు, సమాన పనికి సమాన వేతనం, మినిమం టైమ్స్కేల్, ఈపీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, మెడికల్ లీవులు, మహిళలకు చైల్డ్కేర్ లీవులు, తదితర సమస్యలను తక్షణమే పరిష్కరిచాలని కోరారు. ఈ నెల 15న ప్రకాశం బ్యారేజ్ నుంచి విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నివాసం వరకు కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించనున్న మహా పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర చైర్మన్ బి.కాంతారావు, నాని, జిల్లా చైర్మన్ ఆర్.శ్రీనివాసరావు, ఎంఐఎస్ కోఆర్డినేటర్ కృష్ణంనాయుడు, మండల అకౌంటెంట్ రామకృష్ణ, సీఆర్ఎంటీ నాయకులు ఎం.అప్పలనాయుడు, అప్పలనాయు డు, పైడిరాజు, వేణుగోపాల్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
హనుమాన్ జయంతి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
విజయనగరం టౌన్: స్థానిక పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో ఈ నెల 12న మంగళవారం నిర్వహించనున్న హనుమాన్ జయంతి వేడుకలకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు మడిపల్లి వెంకటాచలం పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక ఆలయం ఆవరణలో గురువారం నిర్వహించిన సమావేశంలో కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆలయం నిర్మించి 18 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఐదు రోజుల పాటు ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకూ వేడుకలు ఉంటాయన్నారు. ప్రాజెక్ట్ చైర్మన్ గ్రంధి గుప్తా మాట్లాడుతూ 12వ తేదీ ఉదయం 5 గంటల నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, 108సార్లు మన్యసూక్తం పారాయణం, లక్ష తమలపాకులతో అభిషేకాలు చేస్తామన్నారు. గోకవరపు ఉదయ్ మాట్లాడుతూ ఆ రోజు సాయంత్రం 5 గంటలకు చిన్నారులతో సిందూరార్చన, 27 రకాల పిండివంటల నివేదన, అనంతరం ప్రసాద వితరణ ఉంటుందన్నారు. దేవాలయం కన్వీనర్ పెంటపాటి కామరాజు మాట్లాడుతూ దేవాలయం గౌరవాధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి సలహా, సూచనలతో ఆ రోజు మధాహ్నం ఐదువేల మందికి మహాఅన్నప్రసాద వితరణ చేపడతామన్నారు. కార్యక్రమంలో పెంటపాటి ముత్యాలు, బాబ్జీ, బ్రహ్మనాథం తదితరులు పాల్గొన్నారు. -
నాకు చావే శరణ్యం..!
● మెడికల్ విద్యార్థి ఆవేదన ● కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులువిజయనగరం క్రైమ్: నర్సింగ్ చదువుతున్న ఓ విద్యార్థి క్యాష్కో యాప్కు దాసోహమై అప్పుల పాలై చివరకు ఆత్మ హత్యే శరణ్యమనుకున్నాడు. కానీ కన్నవారి ఆశయాలు ఆ విద్యార్థిని అల్లంత వరకు లాక్కెళ్లి వెనక్కు రప్పించాయి. తనకున్న ఆగమ్య గోచర పరిస్థితికి పోలీసులు సమాధానం చెబుతారేమోనని సరాసరి విజయనగరం టూటౌన్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాడు. వివరాలిలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన ఆడారి చాతుర్య విజయనగరం మిమ్స్లో మెడిసిన్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఫోన్లో క్యాష్యో బెట్టింగ్ యాప్లో పూర్తిగా మునిగిన చాతుర్య దాదాపు రూ. 6లక్షల వరకు అప్పులు చేశాడు. చాతుర్య తండ్రి ఒక సాదాసీదా లైన్మన్. కొడుకు చదువుకోసం ప్రతినెలా దాదాపు రూ. 20వేల వరకు డబ్బులు పంపుతూనే ఉన్నారు. ఎక్కడో దూరంలో ఉన్న కొడుకు చదివి వృద్ధిలోకి వచ్చి తమను చరమాంకంలో ఆదుకుంటాడనే నమ్మకంతో తల్లిదండ్రులు ఉన్నారు. కానీ చదువు కోసం దూరాభారం వచ్చి విజయనగరంలోని పూల్బాగ్లో రూమ్ తీసుకుని మిమ్స్లో చదువుతున్న చాతుర్య క్యాష్యో యాప్కు బానిసై దాదాపు రూ.6లక్షల వరకు అప్పులు చేశాడు. చివరకు యాప్ ద్వారా రాబడి రాకపోవడంతో చావే శరణ్యమనుకుని నెల్లిమర్ల రైల్వేస్టేషన్ వరకు వెళ్లాడు. అక్కడ ఎందుకో ఓ క్షణం ఆగి మనస్సు చంపుకుని పోలీసులను ఆశ్రయిస్తే తన సమస్యకు పరిష్కారం చెబుతారని అనుకుని పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. చాతుర్య పరిస్థితిని గుర్తించిన సీఐ శ్రీనివాస్ రెండు రోజుల పాటు తనతో పాటు ఉంచి విద్యార్థి బాగోగులు చూసి కేసుల విషయంలో, పనివిషయంలో తమ సిబ్బంది చేస్తున్న, పడుతున్న కష్టాన్ని దగ్గరుండి చూసేలా చేశారు. చివరకు తాను చదువుకుంటానని, పరీక్షలో ఉత్తీర్ణుడినై కన్నవారి ఆశలను నెరవేరుస్తానని ఆ విద్యార్థి చెప్పడం విశేషం.మిమ్స్ స్టూడెంట్కు కౌన్సెలింగ్ ఇచ్చాం ఆన్లైన్ యాప్లకు ఏ ఒక్కరూ బలికావద్దని విజయనగరం టూటౌన్ సీఐ శ్రీనివాస్ స్పష్టం చేశారు. మిమ్స్ విద్యార్థి చాతుర్య క్యాష్యో యాప్ ద్వారా డబ్బులు కట్టి ఆపై అప్పులు చేసి రాబడి రాకపోవడంతో చావే శరణ్యమనుకుని పరిష్కారం చూపాలంటూ తన వద్దకు వచ్చాడన్నారు. రెండు రోజులపాటు తన సిబ్బందితోనే ఉంచి కౌన్సెలింగ్ ఇచ్చామని, ప్రస్తుతం పరీక్షలు రాసేందుకు సన్నద్ధంగా ఉన్నాడని సీఐ శ్రీనివాస్ చెప్పారు. -
● సరదా సరదాగా...
● శ్రద్ధగా నీతికథల బోధన శృంగవరపుకోట పట్టణంలోని శాఖాగ్రంథాలయంలో వేసవి విజ్ఞాన తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వర్ధమాన కవయిత్రి కటకం పావని విద్యార్థినీ విద్యార్థులతో గురువారం నీతి కథలు చదివించారు. కథల్లోని నీతిని విద్యార్థులకు వివరించారు. అనంతరం చిన్నారులకు వివిధ ఆటల్లో తర్ఫీదునిచ్చారు. – ఎస్.కోట క్రికెట్ ఆడుతున్న చిన్నారులు వేసవి సెలవుల్లో పిల్లలు సరదాసరదాగా గడుపుతున్నారు. నచ్చిన ఆటల్లో శిక్షణ పొందుతున్నారు. పల్లెల్లో గ్రామీణ క్రీడల్లో మునిగితేలుతున్నారు. ఏ వీధిన చూసినా చిన్నారులు సందడే కనిపిప్తోంది. క్రికెట్, గోలీపిక్కలు, క్యారెమ్స్, చెస్ తదితర ఆటల్లో నిమగ్నమవుతున్నారు. రామభద్రపురంలో పలువురు విద్యార్థులు చెస్లో ప్రత్యేకంగా శిక్షణ పొందుతున్నారు. తోటి చిన్నారులతో కలిసి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. మెదడుకు పదును పెడుతున్నారు. ఆటలో రాటుదేరుతున్నారు. వేసవిలో పిల్లలను ఆటల్లో ప్రోత్సహించాలని, ప్రమాదకర ఆటలవైపు వెళ్లకుండా తల్లిదండ్రులు బాధ్యత వహించాలని విద్యావేత్తలు, వైద్యులు సూచిస్తున్నారు. సమయానికి భోజనం చేసేలా పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, స్మార్ట్ఫోన్లు, టీవీలకు దూరంగా ఉండేలా చూడాలని సూచనలు ఇస్తున్నారు. – రామభద్రపురం -
విజయ ధరహాసం
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరిగిన తైక్వాండో పోటీల్లో అతిథ్య విజయనగరం జట్టు ఓవరాల్ చాంపియన్ షిప్ దక్కించుకుంది. గడిచిన మూడు రోజులుగా జరిగిన పోటీల్లో 394 పాయింట్లు దక్కించుకున్న విజయనగరం క్రీడాకారులు ఈ ఘనత సాధించారు. 350 పాయింట్లు సాధించిన విశాఖ జట్టు రెండవ స్థానంలో నిలవగా..మూడవ స్థానాన్ని 259 పాయింట్లతో తూర్పుగోదావరి జట్టు దక్కించుకుంది. పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు తైక్వాండో అసోసియేషన్ ప్రతినిధులు బహుమతులు ప్రదానం చేశారు. దీంతో జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ నేతృత్వంలో జరిగిన 5వ ఏపీ కప్ స్టేట్ తైక్వాండో చాంపియన్షిప్–2026 పోటీలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. ఈ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 600 మంది క్రీడాకారులు పోటీ పడ్డారు. ముగింపు కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వేణుగోపాలరావు మాట్లాడుతూ యువ క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణను పెంపొందించడమే లక్ష్యంగా ఈ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా క్రీడాకారులను తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చిం నాయుడు, కోశాధికారి నాయబ్ రసూల్, వివిధ జిల్లాల కార్యదర్శులు, కోచ్లు, క్రీడాకారుల తల్లిదండ్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అథ్లెటిక్స్ పోటీల్లో పతకాలు రాష్ట్రస్థాయిలో జరిగిన సీనియర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఈనెల 5, 6 తేదీల్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరులో జరిగిన రాష్ట్రస్థాయి సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు ఉత్తమ క్రీడా ప్రతిభతో విద్యల నగరం విజయనగరం జిల్లా కీర్తి ప్రతిష్టలను చాటిచెప్పారు. పోటీల్లో 9 మంది క్రీడాకారులు పాల్గొనగా.. 7గురు క్రీడాకారులు పతకాలు కై వసం చేసుకోవడం విశేషం. షాట్పుట్లో జి.వెంకటనాయుడు, 400 మీటర్ల పరుగు పోటీలో పి.ప్రవీణ్కుమార్ బంగారు పతకాలు కై వసం చేసుకున్నారు. అంతేకాకుండా లాంగ్జంప్లో జి.లక్ష్మి స్విలర్, డెకాతలీన్లో కె.సాయితేజ సిల్వర్, పోల్వాల్ట్ విభాగంలో కె.సాయితేజ సిల్వర్ మెడల్స్ చేజిక్కించుకున్నారు. అలాగే జావెలిన్త్రోలో డి.ఉదయ్, 100 మీటర్ల పరుగు పోటీలో ఎ.దివ్యవాణిలు బ్రాంజ్ మెడల్స్ దక్కించుకున్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పి.లీలాకృష్ణ, ఎ.శ్రీకాంత్, ట్రెజరర్ వి.ఆనంద్ కిషోర్లు అభినందించారు. తైక్వాండో ఓవరాల్ చాంపియన్ విజయనగరం రెండవ స్థానంలో నిలిచిన విశాఖ క్రీడాకారులు మూడవ స్థానాన్ని దక్కించుకున్న తూ.గో జట్టు ముగిసిన రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలు -
భోజనానికి టెండర్..!
ఆస్పత్రుల్లో వైద్యసేవలు పొందే రోగులకు భోజనం వడ్డింపుకోసం నిర్వహించిన టెండర్ ప్రక్రియ గందరగోళంగా మారింది. గడువుముగిసి నెలలు గడుస్తున్నా టెండర్లు ఖరారు కాలేదు. తప్పుడు ధ్రువపత్రాలతో భోజనానికి ‘టెండర్’పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్న ఫిర్యాదుపై నిజనిర్ధారణ ప్రక్రియ ఇంకా కొలిక్కిరాకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. వాస్తవికత నిర్ధారణలో జాప్యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు భోజనం సరఫరా చేసేందుకు రెండు నెలలు కిందట నోటిఫికేషన్ ఇచ్చినా కొన్ని ఆస్పత్రులకు ఇప్పటివరకు టెండర్లు ఖరారుకాని పరిస్థితి. గతంలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితి లేదని, టీడీపీ సర్కారు హయాంలో టెండర్ల ఖారారులో జాప్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినవారికి కట్టబెట్టి, భోజనంలో ‘టెండర్’పెట్టేందుకే జాప్యం చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పారదర్శకంగా నిర్వహించాల్సిన టెండర్ల పక్రియ గందరగోళానికి దారితీయడంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ● ఇదీ పరిస్థితి... ఈ ఏడాది మార్చి నెలలో జిల్లాలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, వైద్యవిధాన్ పరిషత్లోని ఎస్.కోట, గజపతినగరం, రాజాం ఏరియా ఆస్పత్రులు, నెల్లిమర్ల సీహెచ్సీ, బొబ్బిలి, బాడంగి, భోగాపురం, చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రుల్లో డైట్ (భోజనం) అందించేందుకు టెండర్ల కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. పలువురు కాంట్రాక్టర్లు టెండర్లు వేశారు. గత నెల 13వ తేదీన జేసీ సమక్షంలో టెండర్లు తెరిచారు. బాడంగి, బొబ్బిలి, నెల్లిమర్ల, చీపురుపల్లి ఆస్పత్రులకు టెండర్లు ఖరారయ్యాయి. నెల్లిమర్ల సీహెచ్సీకి ఒక్కరు కూడా టెండర్ వేయలేదు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, వైద్య విధాన్ పరిషత్ ఆస్పత్రులైన ఎస్.కోట, గజపతినగరం, రాజాం ఏరియా ఆస్పత్రుల్లో రోగులకు భోజనం సరఫరా చేసేందుకు తక్కువ ధరకు కోడ్ చేసిన వ్యక్తులకు అధికారులు డైట్ కాంట్రాక్ట్ను కేటాయించారు. దీనిపై టెండర్లో పాల్గొన్న కొంతమంది వ్యక్తులు అభ్యంతరం తెలిపారు. రోగులకు డైట్ సరఫరాలో అనుభవం ఉన్నట్టు టెండర్ ఖరారు అయిన వ్యక్తులు సమర్పించినవి తప్పుడు ధ్రువపత్రాలని ఆరోపించారు. వాస్తవికతను నిర్ధారించాలని కోరారు. దీంతో టెండర్ ఖరారైన వారు సమర్పించిన ధ్రువపత్రాల వాస్తవికత నిర్ధారణ కోసం ఏ ఆస్పత్రిలో అయితే వారు డైట్ సరఫరా చేసినట్టు తెలిపారో ఆ ఆస్పత్రికి సమాచారం ఇచ్చారు. ఇప్పటికీ ఇది కొలిక్కిరాకపోవడంతో టెంటర్ ప్రక్రియ అసంపూర్తిగా మారింది. నిజనిర్ధారణ జరుగుతోంది.. సర్వజన ఆస్పత్రి, గజపతినగరం, ఎస్.కోట, రాజాం ఏరియా ఆస్పత్రులకు సంబంధించి డైట్ టెండర్లు తక్కువ ధరకు టెండర్ వేసిన వ్యక్తులపై ఫిర్యాదులు వచ్చాయి. తప్పుడు ధ్రువపత్రాలతో వారు టెండర్ వేశారని ఫిర్యాదులు అందాయి. నిజనిర్ధారణ కోసం సంబంధిత ఆస్పత్రులకు పంపించాం. అక్కడ నుంచి క్లారిటీ వచ్చిన వెంటనే టెండర్లు ఖరారు చేస్తాం. అప్పటివరకు పాతకాంట్రాక్టరే భోజనం సరఫరా చేస్తారు. – డాక్టర్ పద్మజ, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి – డాక్టర్ పద్మశ్రీ రాణి, డీసీహెచ్ఎస్ పెద్దాస్పత్రులే టార్గెట్... టెండర్లు ఖరారు కాని నాలుగు ఆస్పత్రులు కూడ పెద్దాస్పత్రులే. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో సగటున రోజుకి 400 నుంచి 500 మంది వరకు రోగులు చికిత్స పొందుతారు. ఎస్.కోట ఏరియా ఆస్పత్రిలో 100 మంది, గజపతినగరం ఏరియా ఆస్పత్రిలో 90 నుంచి 100 మంది, రాజాం ఏరియా ఆస్పత్రిలో 100 మంది వరకు రోగులు ఇన్పేషేంట్లుగా చికిత్స పొందుతారు. డైట్ కాంట్రాక్ట్ దక్కించుకున్న వ్యక్తి ప్రతిరోజు మూడు పూటలా రోగులకు నిబంధన ప్రకారం భోజనం అందించాలి. పెద్దాస్పత్రుల్లో భోజనం సరఫరా టెండర్ ప్రక్రియ గందరగోళంగా మారడం ఆందోళన కలిగిస్తోంది. టెండర్ నోటిఫికేషన్ ఇచ్చి రెండు నెలలైనా ఖరారుకాని టెండర్లు టెండర్లు దక్కించుకున్న వారు తప్పుడు ధ్రువపత్రాలు పెట్టారని ఫిర్యాదు పూర్తికాని నిజనిర్ధారణ పాతకాంట్రాక్టర్తోనే భోజనం వడ్డింపు నిబంధనలివీ.. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని రోగులకు భోజనం సరఫరా చేసేందుకు టెండర్ వేసేవారు ఇదివరకే ఏదైనా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రికి డైట్ సరఫరా చేసి ఉండాలి. ఆదాయపన్ను వివరాలు సమర్పించాలి. ఏ ఆస్పత్రిలో అయితే వారు డైట్ సమర్పించారో సంబంధిత ఆస్పత్రి వారి నుంచి అనుభవ ధ్రువపత్రం సమర్పించాలి. -
ప్రభుత్వాల తీరు దారుణం
బొబ్బిలి: విశాఖపట్నం రైల్వేజోన్ ప్రకటించి ఏళ్లు గడుస్తుండగా.. ఇప్పుడు కొత్తగా కిరండోల్ రైల్వేలైన్ తప్పించి విశాఖ రైల్వే జోన్ ప్రకటించడం దారుణమని ఉత్తరాంధ్ర సాధన సమితి వ్యవస్థాపక కన్వీనర్ వేమిరెడ్డి లక్ష్మునాయుడు అన్నారు. బొబ్బిలిలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఉన్న వాల్తేరు డివిజన్నే విశాఖ డివిజన్ అనిపేరు పెట్టారు తప్ప అధికాదాయం ఉన్నప్రాంతాలను మాత్రం ఎక్కడో దూరాన ఉన్న రాయగడ డివిజన్లో కలపడం అన్యాయమన్నారు. కొత్తవలస–కిరండోల్ రైల్వేలైన్ వల్ల ఏటా రూ.3వేల కోట్ల ఆదాయం వస్తుందన్నారు. రాష్ట్ర విభజన తరువాత అటువంటి ఆదాయ వనరును ఏపీకి అన్వయించాలే తప్ప వేరే రాష్ట్రానికి బదలాయించి ఏపీకి తీరని నష్టాన్ని మిగిల్చారన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన చంద్రబాబు ప్రభుత్వం దీనిపై నోరు విప్పకవడం విచారకరమన్నారు. ఇది రాష్ట్రప్రజలను మోసం చేయడమేనన్నారు. విశాఖ రైల్వే జోన్ మంజూరు జరిగిన నాటి నుంచి రైల్వే ఉద్యోగులు, ప్రజానీకం కేకే లైన్ను విశాఖ జోన్లోనే ఉంచాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం కేకే లైన్ను తప్పించి విశాఖనుజోన్గా ప్రకటించడం ఏపీపై కేంద్రానికి ఉన్న ఆలోచన ఎలాంటిదో తెలుస్తోందన్నారు. కార్యక్రమంలో వజ్జి రవికుమార్, తమ్మిరెడ్డి కృష్ణ, చుక్క కూర్మినాయుడు పాల్గొన్నారు. -
తాగుబోతుల నిర్వాకం..!
● అంగన్వాడీ కేంద్రం వద్ద తాగి విడిచిపెట్టిన అవశేషాలుగంట్యాడ: మాంసం తిన్నానని అందరికీ తెలియాలని వెనకటికొకడు బొమికెలు మెడలో వేసుకుని తిరిగాడన్నట్లుంది కొందరు తాగుబోతుల నిర్వాకం. మండలంలోని నరవ గ్రామంలో అంగన్వాడీ–2 కేంద్రం వద్ద తాగుబోతుల చేసిన నిర్వాకం చిన్నారులు, అంగన్వాడీ సిబ్బందిలో ఆందోళన కలిగిస్తోంది. బుధవారం రాత్రి సమయంలో కొంతమంది అసాంఘిక వ్యక్తులు అంగన్వాడీ కేంద్రం వద్ద మద్యం తాగి, ఖాళీ సీసాలు, ప్లాస్టిక్ గ్లాసులు అక్కడే పడేయడంతో గురువారం ఉదయం స్కూల్కు వచ్చిన చిన్నారులు భయాందోళనకు గురవుతున్నారు. చిన్నపిల్లలు చదువుకునే ప్రదేశమని తెలిసినా నిర్లక్ష్యంగా మద్యం తాగడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం పరిసరాల్లో పగిలిన సీసాలు, మద్యం అవశేషాలు ఉండడంతో పిల్లలకు ప్రమాదం పొంచి ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా స్థానిక పోలీసులు, సంబంధిత అధికారులు స్పందించి అంగన్వాడీ కేంద్రం వద్ద అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చిన్నారుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
ఆకట్టుకున్న కవిగాయక సమ్మేళనం
విజయనగరం టౌన్: మేడే వారోత్సవాల్లో భాగంగా సాహితీ స్రవంతి, సీఐటీయూ జిల్లాశాఖల ఆధ్వర్యంలో కొత్తూరి శ్రీనివాస్ అధ్యక్ష్యతన స్థానిక గురజాడ స్వగృహంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన కవి,గాయక సమ్మేళనం ఆకట్టుకుంది. ప్రముఖ రచయిత అట్టాడ అప్పలనాయుడు ముఖ్య అతిథిగా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. సుమారు 80 ఏళ్ల తర్వాత మళ్లీ ఎనిమిది గంటల పనిదినాల కోసం పోరాడాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మనిషి ఎనిమిది గంటలు మాత్రమే పనిచేయగలుగుతాడని, అదనపు పనిగంటలు వేతనం లేకుండా చేయిస్తున్నారన్నారు. ఇది మానవహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. పాయల మురళీకృష్ణ, జమ్ము బంగారం నిర్వహించిన కవిగాయక సమ్మేళనంలో మానాపురం రాజా చంద్రశేఖర్, బాలకృష్ణ, చంద్రమౌళి, జయపాలరావు, రెడ్డి శంకరరావు, తదితరులు కవితాగానంతో అలరించారు. డప్పు శ్రీను, చీకటి చంద్రికారాణి, రాములు గానంతో సభికులను ఆకట్టుకున్నారు. -
చిన్నపత్రిక ఎడిటర్పై దాడి
● తెగబడిన జనసేన నాయకులు ● దెబ్బలు తిన్న ఎడిటర్పైనే కేసు నమోదుసాక్షి ప్రతినిధి, విజయనగరం: నిష్పక్షపాతంగా వార్తలు రాసినందుకు గాను చిన్నపత్రిక ఎడిటర్ కాళ్ల శ్రీనివాసరావుపై జనసేన నాయకులు దాడికి తెగబడ్డారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో అధికారపార్టీ అగడాలపై కేవలం వార్తలు రాశారనే అక్కసుతోనే ఎడిటర్పై దాడికి పాల్పడ్డారు. ప్రజాస్వామ్యంలో మీడియా గొంతు నొక్కాలని చూడడం హేయమని పలువురు సామాజిక వేత్తలు మండిపడుతున్నారు. జరజాపుపేట గ్రామంలో తన ఇంటికి వెళ్తున్న ఎడిటర్ శ్రీనివాసరావుపై ఉద్దేశపూర్వకంగా దాడి చేయడంతో జర్నలిజానికి చీకటి రోజులు వచ్చినట్లు పలువురు అభివర్ణించారు. శ్రీనివాసరావుపై దాడి చేయడం ప్రజాస్వామ్యంలో ఫోర్త్ఎస్టేట్పై దాడి చేయడమేనన్నారు. నెల్లిమర్ల నియోజకవర్గం కీలకనేత తప్పిదాలపై పత్రికలో వరుస కథనాలు రాయడంతోనే జనసేన నాయకులు దాడికి తెగబడినట్లు పలువురు తెలియజేశారు. ఎడిటర్పై దాడికి పాల్పడిన అధికార పార్టీ నాయకులపై కేసులు నమోదు చేయాలని పలువురు మీడియా ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే అరెస్టు చేయాలి జర్నలిస్టు శ్రీనివాసరావుపై దాడికి తెగబడిన అధికారపార్టీ నేతలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. శ్రీనివాసరావుపై దాడి జరగడం ముమ్మాటికీ పత్రికలపై దాడి జరిగినట్లే అని నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలంటూ నెల్లిమర్ల తహసీల్దార్ శ్రీకాంత్కు, నెల్లిమర్ల పోలీస్స్టేషన్లోను జర్నలిస్టు యూనియన్ ప్రతిధులు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో జర్నలిస్టు యూనియన్ ప్రతినిధులు ఆరిపాక శ్రీనివాసరావు, పతివాడ రమణ, మద్దిల శ్రీనివాస రావు, పి.సురేష్, శనపతి శ్రీనువాసరావు తదితరులు ఉన్నారు. దాడి దుర్మార్గం.. జర్నలిస్టు శ్రీనివాసరావుపై జనసేన నాయకులు దాడిచేయడం దుర్మార్గమని వైఎస్సార్సీపీ నగర పంచాయతీ అధ్యక్షుడు చిక్కాల సాంబశివరావు అన్నారు. -
మామిడి పండు చూడు మేలిమై ఉండు..!
● రసాయనాలతో మగ్గిస్తున్న పండ్లు ● విచ్చలవిడిగా విక్రయాలు ● నిరుపయోగంగా మ్యాంగో రైపినింగ్ సెంటర్రాజాం: పట్టణంలో మామిడిపండ్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. ప్రమాదకర కార్బన్ రసాయనాలు వినియోగించి మామిడిపండ్లను మగ్గపెడుతున్నారు. పక్వానికి రాకముందే మామిడికాయలు కొనుగోలుచేసి, వాటిని నిబంధనలు అతిక్రమించి మగ్గబెట్టడంతో మామిడికాయలు రంగుమారి పక్వానికి వస్తున్నాయి. వాటిని రాజాంలో తోపుడు బండ్లపై కిలో రూ. 50 నుంచి రూ. 80లు చొప్పున విక్రయిస్తున్నారు. వాటిని కొనుగోలుచేసి తింటున్న ప్రజలు వ్యాధులుబారిన పడుతున్నారు. రైపినింగ్ సదుపాయం ఉన్నా.. రాజాం వ్యవసాయ మార్కెట్ యార్డులో మామిడి రైతులకోసం ఏర్పాటుచేసిన మ్యాంగో రైపినింగ్ సెంటర్ నిరుపయోగంగా మారింది. రసాయనాలతో మామిడిపండ్లను మగ్గపెట్టకుండా, రైపినింగ్ సెంటర్ ద్వారా మామిడిపండ్లు మగ్గపెట్టి, రైతులు మార్కెట్లో విక్రయించుకునేందుకు వీలుగా 2013లో ఇక్కడ మిషన్తో పాటు కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ఈ కేంద్రంపై రైతులకు అవగాహన కల్పించడంలో మార్కెట్ యార్డు అధికారులు విఫలంకావడంతో ఈ కేంద్రం నిరుపయోగంగా దర్శనమిస్తోంది. ఈ కేంద్రంలో మామిడిని మగ్గబెడితే అద్దె చెల్లించడంతో పాటు మూడురోజుల కనీస వ్యవధి పడుతోంది. ఈ కాలయాపన, అద్దెలతో పనిలేకుండా ఒక్కరోజులో మగ్గే విధంగా కొంతమంది వ్యాపారులు రాజాంలో మామిడిపండ్ల వ్యాపారాలు చేస్తున్నారు. దీనిపై అధికారులు దృష్టిసారించి, రసాయనాల వినియోగాన్ని నియంత్రించాల్సి ఉంది. -
ఆర్టీసీ బస్సు ఢీ కొని వృద్ధుడి మృతి
రామభద్రపురం: మండల పరిధిలోని ఆరికతోట ఆంజనేయస్వామి ఆలయం జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం ఆర్టీసీ బస్పు ఢీకొని ఓ వృద్ధుడు మృతిచెందాడు. ఈ ప్రమాదంపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆరికతోట గ్రామానికి చెందిన పూసర్ల శ్రీరామమూర్తి అలియాస్ పుల్లయ్య (70) తన వ్యక్తిగత నిమిత్తం ఆ జంక్షన్కు వచ్చాడు. పని ముగించుకుని ఇంటికి వెళ్లిపోయేందుకు జాతీయ రహదారి దాటుతుండగా అదే సమయంలో విజయనగరం నుంచి సాలూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో శ్రీరామమూర్తి అక్కడక్కడే మృతి చెందాడు. ప్రమాద సమాచారం తెలుసుకున్న ఎస్సై జ్ఞానప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాడంగి సీహెచ్సీకి తరలించారు. -
జెడ్పీలో కారుణ్య నియామకాలు
● ఉత్తర్వులు అందజేసిన జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విజయనగరం రూరల్: జిల్లా పరిషత్ పరిధిలో కారుణ్య నియామకాల్లో భాగంగా ముగ్గురికి జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కారుణ్య నియామక ఉత్తర్వులు అందజేశారు. తన కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో కె.లక్ష్మిని లోగిశ జెడ్పీ ఉన్నత పాఠశాలలో సహాయకురాలిగా నియమించారు. కె.జయలక్ష్మిని పార్వతీపురం డివిజన్ కార్యాలయంలోను, కె.రాజ్కుమార్ను జియ్యమ్మవలస ఎంపీడీవో కార్యాలయ సహాయకుడిగా నియమిస్తూ ఉత్తర్వులు అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఇ.నాగలక్ష్మి, ఏఓ ఎన్.రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు. -
ప్లైవుడ్, ఆక్వా కంపెనీల్లో ’టాస్క్ ఫోర్స్’ తనిఖీలు
● సబ్సిడీ యూరియా పక్కదారి పడితే చర్యలు ● జిల్లా యంత్రాంగం హెచ్చరికపూసపాటిరేగ: సబ్సిడీ యూరియా పారిశ్రామిక అవసరాలకు అక్రమంగా మళ్లింపు అవుతుందన్న అనుమానంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లోని పలు పరిశ్రమల్లో టాస్క్ఫోర్స్ బృందం బుధవారం విస్తృత తనిఖీలు చేపట్టింది. జిల్లా వ్యవసాయ అధికారి వి.టి. రామారావు నేతృత్వంలోని ఈ బృందం వివిధ ప్లాంట్లలో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించింది. తనిఖీల్లో భాగంగా సవరవిల్లిలోని కృష్ణ ప్లైవుడ్, కొవ్వాడ అగ్రహారంలోని సిఫా ప్లైవుడ్, గైతుల చోడవరంలోని ిసీపీఎఫ్ ఆక్వా కంపెనీలను అధికారులు సందర్శించారు. సీపీఎఫ్ ఆక్వా కంపెనీలో రొయ్యల మేత తయారీలో యూరియా వినియోగం అవసరం లేదని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్లాంట్లోని ముడి పదార్థాలు, ఫార్ములా రికార్డులను అధికారులు తనిఖీ చేశారు. సిఫా ప్లైవుడ్ కర్మాగారంలో ప్లైవుడ్ తయారీకి అవసరమైన ’మెలనిన్ రీజనింగ్’ కోసం టెక్నికల్ గ్రేడ్ యూరియా వాడుతున్నట్లు గుర్తించారు. గత ఏడాది ఆ కంపెనీ ఉత్పత్తి రికార్డులు, దానికి సరిపడా కొనుగోలు చేసిన టెక్నికల్ గ్రేడ్ యూరియా ఇన్వాయిస్లను అధికారులు సరిపోల్చారు. ప్రస్తుతం ఉన్న స్టాక్ రిపోర్టులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో జిల్లా వ్యవసాయ అధికారి వి.టి. రామారావుతో పాటు, డిప్యూటీ కలెక్టర్ (విజిలెన్స్–సివిల్ సప్లైస్) ఎం. అరుణ కుమారి, విజయనగరం డీఎస్పీ ఎం.వీర కుమార్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ జి.ఎల్లాజీ, ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ ఎం.వి. కరుణాకర్ పాల్గొన్నారు. అలాగే విజయనగరం సబ్ డివిజన్ ఇన్చార్జి ఏడీఏ సంగీత, పూసపాటిరేగ మండలం ఇన్చార్జి వ్యవసాయ అధికారి ఎ.శ్రీనివాస్, వ్యవసాయ విస్తరణాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
బాలికల భవితకు భరోసా.. కేజీబీవీలు
500 పైబడి మార్కులు సాధించినవారురామభద్రపురం: మహానేత వైఎస్సార్ చదువుల సంకల్పం సత్ఫలితాలనిస్తోంది. నిరుపేద కుటుంబాల బాలికల చదువుకు, భవితకు కేజీబీవీలు భరోసా ఇస్తున్నాయి. శతశాతం ఫలితాలతో దూసుకుపోతున్నాయి. తల్లిదండ్రులను కోల్పోయిన బాలికలు, ఆర్థిక స్థోమత లేక మధ్యలో చదువులు ఆపేసిన ఆడపిల్లలు చదువుకు దూరం కాకూడదన్న సదుద్దేశంతో 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏర్పాటుచేసిన కేజీబీవీలు పేద కుటుంబాల్లో విద్యావెలుగులు నింపుతున్నాయి. నాడు 6 నుంచి 10వ తరగతి వరకు చదివేందుకు బాలికలకు బాసటగా నిలిచిన విద్యాలయాలను వైఎస్సార్ తనయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో అడుగు ముందుకు వేసి స్థాయిపెంచారు. ఇంటర్ విద్యను ప్రవేశపెట్టారు. అన్ని విద్యాలయాలను నాడు–నేడు నిధులతో కార్పోరేట్ విద్యాలయాలకు దీటుగా తీర్చిదిద్దారు. డిజిటల్ బోర్డులు, బైలింగ్విన్ పుస్తకాలు, అమ్మ ఒడి, వసతి, విద్యా దీవెన, మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారంతో కూడిన భోజనం తదితర సదుపాయాలు సమకూర్చారు. ఆ సంస్కరణలు ఇప్పుడు సత్ఫలితాలనిస్తున్నాయి. కేజీబీవీ బాలికలు పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. భవితకు బంగారు బాటలు వేసుకుంటున్నారు. ● కేజీబీవీల్లో చేరేందుకు ఆసక్తి గత వైఎస్సార్సీపీ సర్కారు పాలనలో అమలు చేసిన సంస్కరణలే నేడు పదో తరగతి, ఇంటర్మీడియట్ ఉత్తమ ఫలితాలకు దోహదం చేశాయని పలువురు విద్యావేత్తలు చెబుతున్నారు. పేదబాలికలు పైసా ఖర్చులేకుండా వసతితో కూడిన నాణ్యమైన విద్యా బోధనను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది. దాంతో పేద కుటుంబాలకు చెందిన బాలికలు కేజీబీవీ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో చేరేందుకు మరింత ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో మొత్తం కేజీబీవీలు 2694.13పదోతరగతిలో ఉత్తీర్ణత శాతం: ఇంటర్లోనూ శతశాతం ఉత్తీర్ణత జిల్లాలో రామభద్రపురం, బాడంగి, బొండపల్లి, గంట్యాడ, ఎల్.కోట, నెల్లిమర్ల, వేపాడ, గుర్ల, వంగర మండలాల్లో ఉన్న మొత్తం 9 కేజీబీవీలు ఇంటర్ ఫస్టియర్లో వంద శాతం ఫలితాలు సాధించాయి. అలాగే, రామభద్రపురం, బాడంగి, బొండపల్లి, గంట్యాడ, గుర్ల, జామి, కొత్తవలస, పూసపాటి రేగ, రేగిడి, తెర్లాం మండలాల్లో ఉన్న మొత్తం 10 కేజీబీవీలు ఇంటర్ సెకండియర్లో శతశాతం ఫలితాలు సాధించాయి. రామభద్రపురం, బాడంగి, బొండపల్లి, గంట్యాడ, గుర్ల మండలాల్లోని కేజీబీవీల్లో రెండేళ్ల ఇంటర్ పరీక్షల్లోనూ విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణులయ్యారు. ఇంటికి దూరంగా.. చదువుకు దగ్గరగా.. జిల్లాలోని పదో తరగతి ఫలితాల్లో ఏటా కస్తూర్బా గాంధీ విద్యాలయాల బాలికలు సత్తా చూపుతున్నారు. జిల్లాలో 26 కేజీబీవీలు ఉండగా వాటిలో ఈ ఏడాది 94.13 శాతం మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 500 మార్కులు పైబడి 229 మందికి వచ్చాయి. అలాగే, 9 పాఠశాలలు వంద శాతం ఫలితాలు సాధించగా అందులో రామభద్రపురం, బాడంగి, బొండపల్లి, డెంకాడ, గరివిడి, కొత్తవలస, తెర్లాం, వంగర, ఎల్.కోట కేజీబీవీలు ఉన్నాయి. పదోతరగతి, ఇంటర్లో ఉత్తమ ఫలితాలు నెరవేరుతున్న వైఎస్సార్ కల, వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయం కేజీబీవీలను ఏర్పాటు చేసిన దివంగత నేత వైఎస్సార్ ఇంటర్ విద్యను ప్రవేశపెట్టిన గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ప్రభుత్వాల సంస్కరణలతో మెరుగైన ఫలితాలు కేజీబీవీల్లో చేరేందుకు మరింత ఆసక్తి చూపుతున్న బాలికలు 229 మంది -
నాటి సంస్కరణల వల్లే..
మాది రైతు కుటుంబం. బూసాయవలస కేజీబీవీ పాఠశాలలో పదో తరగతి చదివాను. 535 మార్కులు సాధించాను. కేజీబీవీలు ఏర్పాటుచేయకుంటే మా లాంటి పేద కుటుంబాల బాలికలు చదువుకునేందుకు ఇబ్బందులు ఎదురయ్యేవి. చదువుకు దూరమయ్యేవారం. విద్యాలయాలను గత ప్రభుత్వ హయాంలో సుందరంగా తీర్చిదిద్దారు. నాటి సంస్కరణల వల్లే ఉత్తమ ఫలితాలు వస్తున్నాయి. – కె.కావ్య, బూసాయవలస కేజీబీవీ విద్యార్థిని సంతృప్తికర ఫలితాలు.. కేజీబీవీల ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయి. 26 కేజీబీవీలలో పదో తరగతిలో 94.13 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలోని పదో తరగతిలో 9 కేజీబీవీలు, ఇంటర్ ఫస్టియర్లో 9 కేజీబీవీ జూనియర్ కలాశాలలు, సెంకండియర్లో 10 కేజీబీవీ జూనియర్ కళాశాలల్లో వంద శాతం ఫలితాలు సాధించారు. వచ్చే ఏడాది కూడా విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టి ఫలితాలను మరింత మెరుగుపరుచుకునేందుకు కృషి చేస్తాం. – యు.మాణిక్యంనాయుడు, డీఈఓ, జిల్లా కేజీబీవీ కో ఆర్డినేటర్ -
తహసీల్దార్ అవుతామంటారా..?
సాక్షిప్రతినిధి, విజయనగరం: చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తమ భవిష్యత్ అగమ్యగోచరమవుతోందని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రమోటీ డిప్యూటీ తహసీల్దార్లు (క్లరికల్ క్యాడర్ నుంచి డీటీలుగా ఎదిగినవారు) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తహసీల్దార్గా పదోన్నతి పొందకుండానే రిటైరయ్యే పరిస్థితులు తలెత్తుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలోని వివిధ కార్యాలయాల్లో మొత్తం ప్రమోటీ, ప్రొబేషనరీ డీటీ ( గ్రూప్ 2 ద్వారా వచ్చినవారు) సంఖ్య 1,513 మంది ఉన్నారు. ఇందులో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరు చొప్పున ఎలక్షన్ డీటీలు (ఎన్నికల సంబంధిత కార్యకలాపాలు పర్యవేక్షించేవారు) 175 మంది పనిచేస్తున్నారు. అయితే పదోన్నతులకు సంబంధించి ఈ 175 మందిని మొత్తం క్యాడర్ సంఖ్య నుంచి ప్రభుత్వం మినహాయిస్తుండడంతో వీరు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమకు వ్యతిరేకంగా హైకోర్టులో వచ్చిన ఉత్తర్వులపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు. పదేళ్లకు మించి కొనసాగుతున్న ఎన్నికల డీటీ పోస్టులను శాశ్వత సిబ్బందిగానే పరిగణించాలి తప్ప వాటిని మినహాయించి లెక్కేయడం తగదన్నది వారి వాదన. తమ సమస్యను సుప్రీంకోర్టుకు దృష్టికి తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉందని వారు కోరుతున్నారు. ఇక మొత్తం సంఖ్య 1,513 మంది నుంచి పదోన్నతులకు సంబంధించి ఈ 175 మందిని మినహాయిస్తుండడంతో మిగిలిన మొత్తం ప్రమోటీ డిప్యూటీ తహసీల్దార్ల సంఖ్య 1,338కి తగ్గిపోతోంది. అయితే పదోన్నతులకు సంబంధించి 175 మంది ఎలక్షన్ డీటీలను మినహాయిస్తున్న క్రమంలో వరుస సంఖ్యలు, రోస్టర్లు, సీనియారిటీలు మారిపోయి.. సదరు 1,338 జాబితాలో ఉన్న వారు కూడా ‘పదవీ విరమణ చేసేలోపు’ తమకు పదోన్నతులు రావడంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆందోళన చెందుతున్నారు. డీటీల పదోన్నతులు జోనన్ల వారీగా కేటాయించనుండగా, సీనియారిటీ జాబితాలో తాము బాగా వెనకబడిపోతామని ప్రమోటీ డీటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమోటీ డిప్యూటీ తహసీల్దార్ల ఆవేదన ఉద్యోగోన్నతి పొందకుండానే రిటైర్ అవుతామన్న ఆందోళన -
విధుల నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ తొలగింపు
విజయనగరం ఫోర్ట్: ఏళ్ల తరబడి అనధికారికంగా విధులకు గైర్హాజరైన ప్రభుత్వ వైద్యకళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ కె.జయశ్రీని విధుల నుంచి తొలగిస్తూ డీఎంఈ వేమిరెడ్డి రాధికారాణి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. రేడియోథెరపీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసే జయశ్రీ 04, మార్చి 2024 నుంచి 30 ఏప్రిల్ 2026 వరకు అనధికారికంగా విధులకు గైర్హాజయ్యారు. ఈ నేపథ్యంలో డీఎంఈ చర్యలు తీసుకున్నారు. నిబంధనల ప్రకారం ఏడాదిపాటు అనధికారికంగా విధులకు గైర్హాజరైన వారిని టెర్మినేట్ చేయవచ్చు. ఎంఆర్ఐ స్కాన్ సాయంత్రం 6 గంటలకే క్లోజ్..! విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని ఎంఆర్ఐస్కాన్ సాయంత్రం 6 గంటలకే క్లోజ్ చేస్తున్నారని, 6 గంటల తర్వాత ఎంఆర్ఐ స్కాన్ అవసరమైన వారు మరుసటి రోజు వరకు వేచిఉండాల్సి వస్తోందని రోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. విషయం అధికారులకు తెలిసినినా పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవంగా స్కానింగ్ సేవలు 24 గంటలూ అందుబాటులో ఉండాలి. ఎంఆర్ఐ స్కాన్ నిర్వహణ బాధ్యతలను ఎన్ఆర్ఐ సంస్థ సరిగా నిర్వహించడంలేదని రోగులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ అల్లు పద్మజ వద్ద ప్రస్తావించగా ఎంఆర్ఐ స్కాన్ 24 గంటల పాటు అందుబాటులో ఉండాలని, ఆ మేరకు ఎన్ఆర్ఐ సంస్థతో ఎంఓయూ కుదిరిందన్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత స్కాన్ తీయని విషయం నా దృష్టికి రాలేదని, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు. భయపెడుతున్న డయేరియా.. ● వ్యాధి వ్యాప్తితో ప్రజల ఆందోళన బాడంగి: వేసవి ఎండలను తట్టుకోలేక అత్యధికులు డయేరియా భారిన పడుతున్నారు. బాడంగి సీహెచ్సీకి డయేరియా రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సీహెచ్సీలో బుధవారం చేరిన వారిలో 32 మందికి 15 మంది డయేరియా బాధితులే ఉండడం గమనార్హం. గ్రామదేవత పండగలు, శుభకార్యాల సమయంలో వడ్డించే ఆహారంలో తేడా డయేరియాకు కారణంగా వైద్యులు భావిస్తున్నారు. వేసవి ఎండల్లో తిరగొద్దని, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. నందివానివలసలో ఏనుగుల గుంపు గరుగుబిల్లి: మండలంలోని నందివానివలస గ్రామ పరిసరాల్లో ఏనుగుల గుంపు బుధవారం సంచరించింది. రెండువారాల నుంచి గిజబ, తోటపల్లి, నాగూరు, మరుపెంట, సుంకి, నందివానివలస తదితర గ్రామాల పరిధిలో ఏనుగులు సంచరిస్తున్నాయి. పంటలను నాశనం చేస్తున్నాయి. ప్రధాన రహదారికి ఆనుకొని సంచరిస్తుండడంతో ప్రజలు రాకపోకలు సాగించేందుకు భయపడుతున్నారు. ఏనుగులను ఈ ప్రాంతం నుంచి తరలించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
ఉత్తమ మార్కుల సాధనకు..
విద్యార్థుల్లో పోటీతత్వం పెరిగింది. అందుకు అనుగుణంగా ఉత్తమ మార్కులు సాధించేందుకు కష్టపడుతున్నారు. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో మా విద్యార్థులు చక్కటి ప్రతిభ కనబర్చారు. మరింత మెరుగైన మార్కుల సాధనకు అవకాశం లభించడంతో సప్లిమెంటరీపై కసరత్తు చేపడుతున్నారు. ఈ ఏడాది ద్వితీయ ఇంటర్ విద్యార్థులకు అవకాశం లభించడంతో పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధుల్లో వారి సంఖ్య అధికంగా ఉంది. సమయం వృథా కాకుండా మా అధ్యాపకులు విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. క్రమం తప్పకుండా పునశ్చరణ తరగతులు నిర్వహిస్తున్నారు. జూన్ ఒకటవ తేదీ నుంచి యథావిధిగా ఇంటర్ తరగతులు ప్రారంభించనున్నాం. – వేమూరి హరగోపాల్, ప్రిన్సిపాల్, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, పాలకొండ. -
కళ్లాల్లోనే పంట.. రైతన్న ఇంట కన్నీటి మంట
సీతానగరం: రైతన్నపై చంద్రబాబు ప్రభుత్వం కినుక వహిస్తోంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కొనుగోలు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తోంది. రైతన్నను ఆవేదనకు గురిచేస్తోంది. కర్షకులను ఆదుకుంటామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రస్తుత సీఎం చంద్రబాబు.. నిలువునా ముంచేస్తున్నారంటూ సీతానగరం మండలంలోని లక్ష్మీపురం, బుడ్డి పేట, చెల్లన్నాయుడువలస, వెంకటాపురం పంచాయతీల రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. రబీ వరి పంట నూర్పిడిచేసి 15 రోజులుగా కళ్లాల్లోనే ధాన్యం ఉన్నా కొనుగోలు చేసేవారే లేరన్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయకపోవడంతో క్వింటా పచ్చి ధాన్యం రూ.1270లకు, తేమలేకుండా ఆరబెట్టిన ధాన్యం రూ.1750కి మించి వ్యాపారులు కొనుగోలు చేయడంలేదన్నారు. గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం బలిజిపేట, సాలూరు ప్రాంతాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర చెల్లించి పంట కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, రైతులు నష్టపోతున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడంలేదని సీహెచ్ అప్పలనాయుడు, జి.సత్యనారాయణ, ధనంజయ్ తదితరులు వాపోయారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రబీ ధాన్యం, మొక్కజొన్నలు కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరారు. -
ఘాట్రోడ్లో హాహాకారాలు
సీతంపేట: పెళ్లి భోజనానికి ఆనందంగా వెళ్లారు. అక్కడ బంధువులను కలిశారు. వధూవరులను ఆశీర్వదించారు. మధ్యాహ్న భోజనం చేశాక తిరిగి వ్యాన్లో బయలుదేరారు. పెళ్లి ముచ్చట్లు చెప్పు కుంటూ ఘాట్ రోడ్లో ముందుకు సాగుతున్నారు. అంతే... ఒకేఒక్క కుదుపు.. కళ్లుమూసి తెరిచేలోగా వారు ప్రయాణించిన వ్యాన్ లోయలోకి బోల్తా కొట్టింది. ఆ ప్రాంతమంతా హాహాకారాలతో నిండిపోయింది. అంతలోనే వ్యాన్ ఓ చెట్టుకు తగలి నిలవడంతో ఊపిరితీసుకున్నారు. ఒక్కొక్కరుగా వ్యాన్ నుంచి బయటపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. సీతంపేట ఏజెన్సీలోని ఘాట్ రోడ్లో బుధవారం జరిగిన ప్రమాదంలో 18 మంది గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం... సీతంపేట మండలం పూతికవలస పంచాయతీ పరిధిలో బెన్నడుగూడ గ్రామానికి చెందిన గిరిజనులు 42 మంది పుట్టిగాం గ్రామంలో జరిగిన వివాహానికి బొలెరో మినీ పికప్ వ్యాన్పై వెళ్లారు. మధ్యాహ్నం భోజనం అనంతరం తిరుగు ప్రయాణంలో వస్తుండగా సలబం పాడు గ్రామ సమీపంలో అదుపుతప్పి పల్టీ కొట్టింది. వ్యాన్లో ఉన్నవారు చెల్లాచెదురుగా పడిపోయారు. వ్యాన్ను చెట్టు అడ్డుకోవడంతో అందులో ఉన్న మిగిలిన వారు ప్రాణాలతో బయటపడ్డారు. చెట్టు అడ్డుకోకుంటే పెద్ద ప్రమాదమే జరిగేది. ప్రమాదంలో 18 మంది గాయపడ్డారు. కూరంగి మంపి, సవర సురభి, బిడ్డిక ప్రకాష్, సవర శ్రావణ్కుమార్, బి.కీర్తి, కె.సంజన, ఎస్.సింగన్న, నందిని, సవర నరేష్, సవర గుడిమి, సవర గంగమ్మ, సవర బూగమ్మ, సవర తోటయ్య, సవర నీలమ్మ, గుడమి, ఎస్.పూలమై, ధమయంతి, సుభద్రలతో పాటు చిన్నచిన్న గాయాలపాలైన వారిని 108 అంబులెన్స్లో సీతంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆర్ఎంవో డి.వి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైద్యసిబ్బంది సేవలు అందజేశారు. మెరుగైన వైద్యసేవలు అవసరమైన 8 మందిని శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. పాలకొండ సీఐ ప్రసాదరావు, ఎస్ఐ వై.అమ్మన్నరావు ఘటనా స్థలాన్ని సందర్శించారు. వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి భోజనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం అదుపుతప్పి లోయలోకి బోల్తాకొట్టిన వ్యాన్ చెట్టు అడ్డకోవడంతో తప్పిన ప్రాణముప్పు 18 మందికి గాయాలు మెరుగైన వైద్యం కోసం 8 మందిని శ్రీకాకుళం రిమ్స్కు తరలింపు -
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు
పార్వతీపురం: జిల్లాలో మే 21నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత అన్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లోని సమావేశమందిరంలో ఆమె అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 16 పరీక్షా కేంద్రాల్లో పోలీస్ బందోబస్తు, 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు తప్పనిసరిగా మూసివేయాలని ఆదేశించారు. ప్రశ్నపత్రాలను 13 పోలీస్ స్టేషన్లలో భద్రపరిచి, సమాధాన పత్రాలను స్పీడ్ పోస్ట్ద్వారా తరలించాలన్నారు. విద్యార్థుల రాకపోకలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులను నడపాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, విద్యుత్ సరఫరా, ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. జిల్లాలో 4,731 మంది విద్యార్ధులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారని, పరీక్షలు జూన్ 4వరకు జరుగుతాయని తెలిపారు. సమీక్షలో డీఐఈఓ నాగేశ్వరరావు, డీఈఓ పి.బ్రహ్మజీరావు, డీపీఓ ఎస్.రవీంద్ర తదితరులు ఉన్నారు. -
భక్తిశ్రద్ధలతో పైడితల్లి చండీయాగం
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, శ్రీ పైడితల్లి అమ్మవారు జన్మనక్షత్రమైన మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని స్థానిక రైల్వేస్టేషన్ వద్ద నున్న వనంగుడిలో భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బుధవారం చండీయాగం నిర్వహించారు. వేదపండితులు సాయికిరణ్ శర్మ, వెలువలపల్లి నరసింహమూర్తిలు శాస్త్రోక్తంగా యాగప్రక్రియ చేశారు. యాగ విశిష్టతను భక్తులకు వివరించారు. అనంతరం యాగంలో పాల్గొన్న భక్తులకు అమ్మవారి శేషవస్త్రాలను, తీర్ధప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో అర్చకులు నేతేటి ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు. ఉచిత కంప్యూటర్ శిక్షణవిజయనగరం రూరల్: బీటెక్, డిగ్రీ పూర్తి చేసిన, చదువుతున్న నిరుద్యోగ యువతీయువకులకు కంప్యూటర్ కోర్సుల్లో ఉచిత శిక్షణ అందించనున్నట్లు ఎన్ఆర్ఐ కుమార్ తెలిపారు. నగర పరిధిలోని రాజారావు మేడ సమీప కంచర్ల టవర్స్లోని కార్యాలయంలో జావా, నెట్, అడ్వాన్స్డ్, పైథాన్, ఏఐ బేసిక్స్, సీ ప్లస్, ప్లస్ కోర్సులపై శిక్షణ అందించనున్నామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు ఫోన్ 7187578586, 6281974895, 6303756314 నంబర్లను సంప్రదించాలని సూచించారు. రెండవ రోజు కొనసాగిన తైక్వాండో పోటీలువిజయనగరం: జిల్లా వేదికగా జరుగుతున్న రాష్ట్రస్థాయి తైక్వాండో చాంపియన్షిప్ పోటీలు రెండువ రోజు బుధవారం కొనసాగాయి. జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 5వ ఏపీ కప్ పోటీల్లో భాగంగా 26 జిల్లాలకు చెందిన 800మందికి పైగా క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. వారికి నగరంలోని రాజీ వ్ ఇండోర్ స్టేడియంలో నాకౌట్ పద్ధతిలో పోటీలు నిర్వహిస్తుండగా..క్రీడాకారులు పోటాపోటీగా తలపడుతున్నారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు గురువారం బహుమతి ప్రదానోత్సవం చేయనున్నట్లు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గురాన అయ్యలు, సీహెచ్ వేణుగోపాలరావులు తెలిపారు. వ్యక్తి ఆత్మహత్యవిజయనగరం క్రైమ్: స్థానిక ప్రదీప్ నగర్కు చెందిన ప్రతాప్ బాల సిద్ధార్థ(39) తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు వన్ టౌన్ పోలీసులకు బుధవారం ఫిర్యాదు అందింది. దీంతో సీఐ ఆర్వీఆర్కే చౌదరి ఆదేశాలతో హెచ్సీ అప్పలనాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భార్య, పిల్లలు ఉన్న సిద్ధార్థ్కు విడాకులై ఒంటరిగానే ఉంటున్నాడని దర్యాప్తు అధికారి హెచ్సీ అప్పలనాయుడు తెలిపారు. 16 కేజీల గంజాయితో ఇద్దరి అరెస్ట్ విజయనగరం క్రైమ్: సుమారు రూ.8 లక్షలు విలువ చేసే 16 కేజీల గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను జీఆర్పీ సిబ్బంది బుధవారం అరెస్ట్ చేశారు. విజయనరంలోని రైల్వేస్టేషన్ ప్లాట్ఫామ్లపై జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గకు చెందిన మహమ్మద్ ఇబ్రహీం ఖలీల్, మహంత్ డీఎన్ఎస్లు అనుమానాస్పదంగా తిరుగుతుండడాన్ని గుర్తించారు. వారిని విచారణ చేయగా అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నట్లు తేలడంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి ఇద్దరి వద్ద ఉన్న 16 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని కోర్టుకు తరలించినట్లు జీఆర్పీ ఎస్సై బాలాజీ రావు తెలిపారు. కొనసాగుతున్న దర్యాప్తురాజాం సిటీ: మున్సిపాల్టీ పరిధిలో జరిగిన వివాహిత హత్యకేసుకు సంబంధించి ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఇన్చార్జి టౌన్ సీఐ శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. ఇప్పటికే ప్రత్యేక బృందాలతో శ్రీకాకుళం, పలాస, ఇచ్ఛాపురం, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో మృతురాలి కుమారుడు శశాంక్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. అన్ని కోణాల్లో డోలపేటలోని అతని స్నేహితుల వద్ద వివరాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు. -
కూలి బతుకులపై మృత్యు పిడుగు
అందరివీ కూలి బతుకులే... రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి... కూలి చేసుకుంటూ కుటుంబాలను గుట్టుగా నెట్టుకొస్తున్నవారిని పిడుగు రూపంలో మృత్యువు కాటేసింది. కష్టపడేవారిని కుటుంబాలకు దూరం చేసింది. కుటుంబ ఆధారాన్ని అందని లోకాలకు తీసుకుపోయి ఆవేదన మిగిల్చింది. మంగళవారం సాయంత్రం వేర్వేరు చోట్ల పిడుగుపాటుకు నలుగురు మృతిచెందడం జిల్లా వాసులను కలచివేసింది. కుటుంబ సభ్యులకు కన్నీరుమిగిల్చింది. గ్రామస్తుల్లో విషాదం నింపింది. రాజాం సిటీ: విజయనగరం జిల్లాలోని రాజాం మండలం గెడ్డవలస, తెర్లాం మండలంలోని చిన్నయ్యపేటలో మంగళవారం సాయంత్రం పిడుగుపాటుకు నలుగురు కూలీలు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు తోడికోడళ్లు ఉన్నారు. గ్రామస్తులు, పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం... గెడ్డవలస గ్రామ సమీపంలోని పొలంలో దొండకాయలు ఏరేందుకు మజ్జి సత్యవతి (55), మజ్జి అప్పలనర్సమ్మ (50), పైల రాము (45)లు మంగళవారం ఉదయం వెళ్లారు. సాయంత్రం పిడుగులతో కూడిన వాన ఆరంభం కావడంతో భయపడ్డారు. పొలం నుంచి గట్టుకు చేరుకునేందుకు సిద్ధమయ్యారు. అంతే... పెద్దశబ్దంతో ముగ్గురిపైనా పిడుగు పడడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వీరిని దూరం నుంచి చూసిన రైతులు పరుగున చేరుకుని సపర్యలు చేసినా ఫలితం లేకపోయింది. అప్పటికే ప్రాణాలు విడిచారు. ఈ ఘటన గ్రామస్తులకు తెలియడంతో ఘొల్లుమన్నారు. మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు కన్నీరు కార్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవ పంచనామా నిర్వహించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజాం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ● అన్నీ తానై.. మృతుల్లో ఒకరైన మజ్జి అప్పలనర్సమ్మ కుటుంబానికి అన్నీతానై ముందుకు నెట్టుకొస్తోంది. పదిహేనేళ్ల కిందట భర్త రాము మృతిచెందాడు. అప్పటి నుంచి కుమారుడు, కుమార్తెలను కూలి పనులు చేసుకుంటూ పెంచుతోంది. తల్లికి తోడుగా కుమారుడు రామకృష్ణ కూడా కూలి పనులు చేస్తూ చేదోడువాదోడుగా ఉంటుంటున్నారు. కాస్త ఆర్థిక ఆసరా కలిగిందన్న దశలో తల్లి మృతిచెందడంతో కుమారుడు, కుమార్తె బోరున విలపించారు. ● ఆశ నెరవేరకుండానే... పైల రాముకు ఇద్దరు కుమారులు. కూలి పనులు చేస్తూనే వారిని సాకింది. తనవలే కుమారులు కష్టపడకూడదని, ఉద్యోగాలు సాధించాలని ఆశ పడింది. పనులు చేస్తూనే ఉద్యోగ శిక్షణ కోసం వారికి కావాల్సిన డబ్బులు పంపించేది. పెద్దకుమారుడు జగన్నాథం ఈ ఏడాది విడుదలైన కానిస్టేబుల్ పరీక్షలో ఒక్క మార్కులో ఉద్యోగ సాధనలో వెనుకబడ్డాడు. ఉద్యోగం సాధించాలన్న తపనతో హైదరాబాద్లో శిక్షణ తీసుకుంటున్నాడు. డిగ్రీ చదువుకున్న రెండో కుమారుడు వాసు కూడా విజయనగరంలో ఉంటూ పోటీపరీక్షలకు సిద్ధమవుతున్నాడు. తల్లి మృతితో ఇద్దరూ కన్నీరు పెడుతున్నారు. పిల్లలు ఉద్యోగ కల నెరవేరకముందే మృత్యువు రామును కబలించిందంటూ గ్రామస్తులు విచారం వ్యక్తంచేశారు. మృత్యువులోనూ వీడని తోడికోడళ్ల బంధం దొండపంటలో కూలి పనికి వెళ్లిన మజ్జి సత్తెమ్మ, మజ్జి అప్పలనర్సమ్మలు తోడికోడళ్లు. అంత వరకు మాటామంతి ఆడుకుంటూ పనిలో నిమగ్నమయ్యారు. భారీ వర్షంతోపాటు ఒక్కసారిగా పిడుగు పడడంతో మృతిచెందారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు తోడికోడళ్లు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. ఘటనా స్థలం రోదనలతో మిన్నంటింది. మృతదేహాల వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు పిడుగుపాటుకు నలుగురు మృతి మృతిచెందిన ఆవు గెడ్డవలస, చిన్నయ్యపేటలో విషాదం మృతుల్లో ఇద్దరు తోడికోడళ్లు అమ్మా.. లే అమ్మా... మృతురాలు సత్తెమ్మకు భర్త నర్సింహులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో దివ్యాంగురాలైన పెద్దకుమార్తె రమణమ్మ భర్త మూడేళ్ల కిందట మరణించడంతో కన్నవారి ఇంటివద్దనే తన ఇద్దరి పిల్లలతో ఉంటోంది. వారిని కూలిపనులు చేస్తూ సత్తెమ్మ సాకుతోంది. ఇప్పుడు ఆమెను పిడుగు రూపంలో మృత్యువు కాటేయడంతో కుమార్తె రమణమ్మ బోరున విలపించింది. మృతదేహాన్ని పట్టుకుని అమ్మా... లే అమ్మా అంటూ రోదించిన తీరు అక్కడివారిలో కన్నీరు తెప్పించింది. -
వేగావతి సమావేశ మందిరం ప్రారంభం
పార్వతీపురం: అత్యాధునిక హంగులతో పునర్నిర్మించిన వేగావతి సమావేశ మందిరాన్ని కలెక్టర్ డా. ఎన్. ప్రభాకరరెడ్డి జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డితో కలిసి కలెక్టరేట్లో మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం నిర్వహించే కీలక సమావేశాలు, ఉన్నతాధికారులతో జరిగే వీడియో కాన్ఫరెన్స్లకు ఎలాంటి ఆటంకం లేకుండా మెరుగైన సాంకేతికతతో నిర్వహించేందుకు ఈ హాల్ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. జిల్లాకు వచ్చే ఉన్నతాధికారులు, వివిధ శాఖల సమీక్ష సమావేశాలకు ఈ వేదిక ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ కె. హేమలత, కలెక్టరేట్లోని వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఆత్మ డీపీడీగా మహారాజన్ విజయనగరం ఫోర్ట్: వ్యవసాయ యాజమాన్య సాంకేతిక సంస్థ (ఆత్మ) డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్గా కె.మహారాజన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. పార్వతీపురం మన్యం జిల్లా ఏడీఏగా పనిచేసి ఉద్యోగోన్నతిపై డీపీడీగా ఇక్కడకు వచ్చారు. ప్రత్యేక అవసరాల పిల్లల గుర్తింపు పార్వతీపురం: జిల్లాలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల గుర్తింపు, నమోదు కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. దృష్టి పోర్టల్లోని ఎక్సెల్ కంటెంట్ యాప్ ద్వారా జిల్లాలోని 26 మంది ఐఈఆర్పీలు 0–16 ఏళ్ల పిల్లను గుర్తించి స్క్రీనింగ్చేసి వారి వివరాలను నమోదు చేస్తున్నారు. 15 మండలాల పరిధిలోని 2,381 హేబిటేషన్లలో జూన్ 10 వరకు సర్వే కొనసాగనుంది. పట్టణంలో నిర్వహిస్తున్న సర్వేలో డీఈఓ పి.బ్రహ్మాజీరావు, ఐఈఆర్టీ కోఆర్డినేటర్ భానుమూర్తి, ఎంఈఓ కె.ప్రసాద్ పాల్గొని ఆటిజం ఉన్న తోట శ్రావణ్ ప్రజ్వల్ అనే బాలుడిని గుర్తించారు. సర్వేతో దివ్యాంగ పిల్లలకు కచ్చితమైన డేటాసేకరణ, థెరపీ, విద్యాసేవలు, ఉపకరణాల పంపిణీ, అలెవెన్స్ల అమలు, తదితర కార్యక్రమాలు మెరుగుపడతాయని డీఈఓ తెలిపారు. ఈ–కేవైసీ త్వరితగతిన పూర్తి చేయాలి● ఐటీడీఏ పీఓ ఆర్.వైశాలి సీతానగరం: పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిణి ఆర్ వైశాలి సీతానగరం తహసీల్దార్ కార్యాలయాన్ని మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో జరుగుతున్న భూ రీ–సర్వే పనులు, ఈ–కేవైసీ నమోదు ప్రక్రియను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. రీ–సర్వే పూర్తయిన గ్రామాల్లో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించిన ప్రాజెక్ట్ అధికారిణి, ప్రింటింగ్కు సిద్ధంగా ఉన్న ధ్రువీకరణ పత్రాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తహసీల్దార్, ఆర్ఎస్డీటీ, వీఆర్వోలకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. అనంతరంప్రాజెక్ట్ అధికారిణి ఆర్ వైశాలి మాట్లాడుతూ రీ–సర్వే గ్రామాల్లో పెండింగ్లో ఉన్న ఈ–కేవైసీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రింటింగ్కు అర్హత పొందిన పత్రాలను నిశితంగా పరిశీలించి, ఎటువంటి లోపాలు లేకుండా చూసుకోవాలని సూచించారు. అలాగే వెరిఫికేషన్ పూర్తయి, ప్రింటింగ్కు సిద్ధంగాఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలను వెంటనే ప్రింటింగ్కు పంపి రైతులకు సకాలంలో అందజేయాలని స్పష్టం చేశారు. పరిపాలనాపరమైన ఈ ప్రక్రియలో ఎక్కడా జాప్యం జరగకూడదని, క్షేత్రస్థాయి అధికారులు సమన్వయంతో పనిచేసి వెరిఫికేషన్ ప్రక్రియను ముగించాలని ఆమె ఆదేశించారు. ఈ పర్యటనలో తహసీల్దార్ కె.ప్రసన్నకుమార్, డీటీ ఉమామహేశ్వరరావు, ఆర్ఐ ఎన్ శ్రీనివాసరావు,వీఆర్వోలు, సచివాలయ సిబ్బంది ఉన్నారు. -
లింగ నిర్ధారణకు పాల్పడే స్కానింగ్ సెంటర్లపై చర్యలు
● డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్. జీవనరాణివిజయనగరం ఫోర్ట్: జిల్లాలో లింగ నిర్ధారణ వంటి చట్ట విరుద్ధచర్యలకు పాల్పడే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి హెచ్చరించారు. ఈ మేరకు స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో పీసీపీఎన్డీటీ చట్టం 1994 అమలుపై మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ గర్భస్థ పిండ ఆరోగ్య పరిస్థితులు, వ్యాధుల గుర్తింపు వంటి వైద్య అవసరాలకే స్కానింగ్ యంత్రాలను వినియోగించాలి తప్ప లింగ నిర్ధారణ కోసం వినియోగించడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. అన్ని ఫెర్టిలిటీ కేంద్రాలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. సంబంధిత పోగ్రాం అధికారులు నిరంతరం స్కానింగ్ సెంటర్స్ను పర్యవేక్షిస్తూ చట్టాల అమలులో లోపాలు లేకుండా చూసుకోవాలన్నారు. సమావేశంలో డీఎల్ఓ డాక్టర్ కె.రాణి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఎన్. సూర్యనారాయణ, డాక్టర్ మహేంద్రగిరి, డాక్టర్ జె.సుధ, డాక్టర్ నారాయణరావు, డాక్టర్ గౌతమి , డాక్టర్ స్వాతి, ఎస్.ఓ గిరిగణేష్, డాక్టర్ అర్చనాదేవి, జిల్లా పంచాయతీ అధికారి వి. మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. -
పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షల్లో తగ్గిన ఉత్తీర్ణత
● గత ఏడాది 94.5 శాతం... ● ఈ ఏడాది 91.76 శాతం విజయనగరం అర్బన్: పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలో జిల్లా విద్యార్థుల ఉత్తీర్ణత గతేడాది కంటే 4.5 శాతం తగ్గింది. ప్రవేశ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. గతేడాది జిల్లాలో 6,938 మందిలో 95.36 శాతంతో 6,616 మంది పాసైతే, ఈ ఏడాది పరీక్ష రాసిన 7,222 మందిలో 91.76 శాతంతో 6,627 మంది విద్యార్థులు ఉత్తీర్ణలయ్యారు. ఈ ఏడాది పరీక్ష రాసిన 3,070 మంది బాలికల్లో 94.43 శాతంతో 2,899 మంది, బాలురు 4,152 మందిలో 89.79 శాతంతో 3,728 మంది పాసయ్యారు. విశాఖలో పరీక్షకు హాజరైన ఎల్.కోట మండలం గొల్జాం గ్రామానికి చెందిన జామి చేతన్ 120/120 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంకు సాధించాడు. జిల్లాలో పరీక్ష రాసిన వారిలో 118 మార్కులు సాధించిన అల్లు లవ శాత్విక్, 116 మార్కులతో సీర యోగేశ్వర్, గండ్రేటి కిశోర్ కుమార్ జిల్లా మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. వెయ్యిలోపు ర్యాంకులు తెచ్చుకున్నవారిలో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు ఉన్నారు. మెరకముడిదాం మండలం మర్రివలస చెందిన డి.వెంకటేశ్ (115/120), గుర్ల మండలం గుసినికి చెందిన జె.పవన్ (112/120), గుర్ల మండలం పెదబంటుపల్లి జి.సంజయ్ (109/120), సంతకవిటి మండలం మామిడిపల్లి చెందిన కె.రుక్మిణి (98/120), రాజాం మండలం బూరాడ పేటకు చెందిన ఎన్.జాహ్నవి (96/120) మార్కులు సాధించారు. చేతన్కు అభినందనలు లక్కవరపకోట: పాలిసెట్ ఫలితాల్లో ఎల్.కోట మండలంలోని గొల్జాం గ్రామానికి చెందిన జామి చేతన్ సత్తాచూపాడు. 120 మార్కులకు 120 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు సాధించాడు. చేతన్ విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదోతరగతి చదివి 588/600 మార్కులు సాధించాడు. తండ్రి శ్రీనివాస్ ఆర్మీలో పనిచేసి ఇటీవల ఉద్యోగ విరమణ పొందగా, తల్లి విజయలక్ష్మి గృహిణి. స్టేట్ ర్యాంకర్ను గ్రామస్తులు అభినందించారు. -
టేకు చెట్ల దొంగలకు శిక్ష విధించాలి
పార్వతీపురం: మండలంలోని అడారు పాఠశాలలో టేకు చెట్ల దొంగతనానికి పాల్పడిన వారికి శిక్ష విధించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు డీఎఫ్ఓ జీఏపీ ప్రసూనకు ఆమె కార్యాలయంలో మంగళవారం వినతిపత్రాన్ని అందజేశారు. దొంగలను వెంటనే అరెస్టు చేసి, రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చెట్ల రవాణాకు ఉపయోగించిన వాహనాలు, నిడగల్లులో ఉన్న సామిల్లును సీజ్ చేయాలని కోరారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిని సస్పెండ్ చేయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డీఎఫ్ఓ మాట్లాడుతూ దొంగతనానికి గురైన చెట్ల విలువను నిర్ధారణ చేశామని, పోలీసు, రెవెన్యూ శాఖల సహకారంతో దర్యాప్తు సాగుతుందని, దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ఘనంగా రాష్ట్రస్థాయి తైక్వాండో చాంపియన్షిప్ ప్రారంభం
విజయనగరం: స్థానిక రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం వేదికగా 5వ తైక్వాండో రాష్ట్ర చాంపియన్షిప్ పోటీలు మంగళవారం సాయంత్రం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఈ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి దాదాపు 800 మంది చిన్నారులు ఈ పోటీల్లో పాల్గొనడం గర్వకారణమని, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించారు. జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, ఇంటి స్థలాలు కేటాయిస్తున్నామని వెల్లడించారు. ఇటీవల క్రికెటర్ శ్రీచరణికి గ్రూప్–1 ఉద్యోగంతో పాటు రూ.2 కోట్ల నగదు, అథ్లెట్ జ్యోతి ఎర్రాజీకి ఉద్యోగం, స్థలం కేటాయించామని, మన జిల్లాకు చెందిన వెయిట్ లిఫ్టర్లు భార్గవి, హారికలకు కూడా త్వరలో బహుమతులు అందించనున్నట్లు ప్రకటించారు. క్రీడాకారులకు ఉద్యోగాల్లో 3 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నామని, దీనివల్ల ఇటీవల డీఎస్సీలో 420 మంది క్రీడాకారులు ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారని మంత్రి గుర్తుచేశారు. అనంతరం రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.కె.పురుషోత్తం మాట్లాడుతూ, తైక్వాండో క్రీడ ఎంత ప్రమాదకరమో అంతటి క్రమశిక్షణతో కూడుకున్నదని, అకాడమీల ఏర్పాటు ద్వారా క్రీడలకు మంచి భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి శ్రీహరి, తైక్వాండో అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్, అధ్యక్షుడు గురాన అయ్యలు, జిల్లా క్రీడాశాఖాధికారి ఎస్. వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వేణుగోపాల్, అసోసియేషన్ సభ్యులు, రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు. -
బక్కచిక్కుతున్న పేద రోగులు..!
రోగులకు డైట్ చార్జీలు రోజుకు రూ.80 రోగులకు అందించే డైట్ (భోజనం) చార్జీలు సాధారణ, ఆరోగ్యశ్రీ, క్షయ రోగులకు రోజుకు రూ.80 చెల్లిస్తున్నారు. వైద్యులు, జేఎస్కే గర్భిణులకు రూ.100 చొప్పన చెల్లిస్తున్నారు. – డాక్టర్ అల్లు పద్మజ, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రివిజయనగరం ఫోర్ట్: పేద రోగుల పట్ల చంద్రబాబు సర్కార్ చిన్న చూపు చూస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిత్యావసరాల వస్తువుల ధరలు భారీగా పెరిగినప్పటికీ డైట్ చార్జీలు పెంచకుండా నిర్లక్ష్యం చేస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పప్పు దగ్గర నుంచి ఉప్పు వరకు అన్ని ధరలూ పెరిగిపోయాయి. కూరగాయలు, ఆకుకూరల ధరలు కూడా పెరిగాయి. ముఖ్యంగా వాణిజ్య సిలిండర్ ధర బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో టిఫిన్స్, భోజనాల ధరలు బాగా పెరిగిపోయాయి. రెండు ఇడ్లీ రూ.30, శాఖహార భోజనం రూ.120 నుంచి రూ. 130 అయింది. అయినప్పటికీ పేద రోగులకు టీడీపీ సర్కార్ డైట్ చార్జీలు పెంచలేదు. 2014–18 లోనూ అదే పరిస్థితి టీడీపీ సర్కార్ అధికారంలో ఉన్న 2014నుంచి 18 వరకు అదే పరిస్థితి ఉండేది. అ కాలంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇన్పేషేంట్లుగా చికిత్స పొందే రోగులకు రోజుకు ఒక రోగికి రూ.40 చొప్పున మాత్రమే చెల్లించారు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యత లేని భోజనం పెట్టినా అడిగే నాథుడే ఉండేవాడు కాదు. ఇటువంటి తరుణంలో 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం డైట్ చార్జీలను రెట్టింపు చేసింది. సాధారణ రోగులకు అందించే ఒక రోజు భోజనం చార్జీలను రూ. 40 నుంచి రూ. 80కు పెంచింది. డాక్టర్లు, ఆరోగ్యశ్రీ రోగులకు రూ.50 నుంచి రూ.100కు పెంచింది. అధికారం చేపట్టి రెండేళ్లయినా పెంచని చార్జీలు టీడీపీ సర్కార్ అధికారం చేపట్టిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు, గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. అధికారం చేపట్టి 2 ఏళ్లు అవుతున్నా ఇంతవరకు చంద్రబాబు సర్కార్ డైట్ చార్జీలను ఒక్క పైసా కూడా పెంచిన దాఖలాలు లేవు. ప్రస్తుతం ధరలు పెరిగిన కారణంగా రోగులకు ప్రస్తుతం ప్రభుత్వం చెల్లిస్తున్న డైట్ చార్జీలు చాలక పోవడం వల్ల రోగులకు నాణ్యమైన భోజనం అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోగులకు భోజనం అందించే ఆస్పత్రులు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, వైద్య విధాన్ పరిషత్ ఆస్పత్రులైన గజపతినరం ఏరియా ఆస్పత్రి, ఎస్. కోట ఏరియా ఆస్పత్రి , చీపురుపల్లి ఏరియా ఆస్పత్రి, రాజాం ఏరియా ఆస్పత్రి, బొబ్బిలి సీహెచ్సీ, బాడంగి సీహెచ్సీ, నెల్లిమర్ల సీహెచ్సీ, భోగాపురం సీహెచ్సీల్లో భోజనం అందిస్తున్నారు. సర్వజన ఆస్పత్రిలో నెలకు 16 వేల మంది వరకు చికిత్స ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో నెలకు 16 వేల మంది వరకు చికిత్స పొందుతున్నారు. వైద్య విధాన్ పరిషత్ 8 ఆస్పత్రుల్లో 13 వేల నుంచి 13,500 మంది వరకు చికిత్స పొందుతున్నారు. వారందరికీ ప్రతి రోజు మూడు పూటలా భోజనం అందించాలి. సాధారణ రోగులు, ఆరోగ్యశ్రీ, క్షయ రోగులకు రోజుకు రూ.80 చొప్పన చెల్లిస్తున్నారు. వైద్యులు, జననీ శిశు సురక్ష యోజన కార్యక్రమం కింద చికిత్స పొందే గర్భిణులకు రోజుకు రూ.100 చొప్పున చెల్లిస్తున్నారు. నిత్యావసరాల ధరలు పెరిగినా డైట్ చార్జీలు పెంచని సర్కారు రోజుకు ఒక రోగికి రూ.80 చెల్లింపు ఒక్క పూట భోజనం హోటల్లో రూ.130 మూడు పూటలకు రూ.80తో ఎలా? రోగులకు అందని నాణ్యమైన భోజనం -
ఆ మహిళది హత్యే..
● రెండురోజుల్లో హంతుకుడిని పట్టుకుంటాం ● విలేకరుల సమావేశంలో డీఎస్పీ రాఘవులురాజాం: రాజాం మున్సిపాల్టీ పరిధి డోలపేట గ్రామానికి చెందిన ముంజేటి స్పందన అనే వివాహిత అనుమానస్పద మృతి హత్యేనని చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు స్పష్టంచేశారు. సంఘటనా స్థలాన్ని మంగళవారం పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మిస్టరీగా మారిన స్పందన అనుమానస్పద మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశామన్నారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతురాలి భర్త సత్తీష్ తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 4న ఉదయం స్పందనతో పాటు ఆమె కుమారుడు శశాంక్ ఇంటి వద్దే ఉన్నట్లు తెలిసిందన్నారు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో మృతురాలి తల్లిఫోన్ చేస్తే మనువడు ఫోన్లిఫ్ట్చేసి, అమ్మ బట్టలు ఆరబెడుతుందని చెప్పినట్లు, తరువాత 1.30 గంటల సమయంలో ఫోన్ స్విచ్ ఆఫ్చేసి ఉన్నట్లు సమాచారం వచ్చిందని తెలిపారు. మృతురాలి భర్త డ్యూటీ నుంచి మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో భోజనానికి వస్తే ఇంటికి తాళం వేసి ఉండడం, సాయంత్రం 5 గంటల సమయంలో ఇంటి తాళం అలానే ఉండడం, భర్తకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదుచేశారన్నారు. ఇంట్లో కొంత బంగారంతో పాటు రూ.5 వేలు నగదు చోరీ జరిగినట్లు భర్త సత్తీష్ తెలిపారని, భార్య స్పందన మృతదేహం ఇంటి వెనుక చెరువులో ఆయనే గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి మృతదేహాన్ని పరిశీలించగా, ఆమె ఒంటిపై గాయాలు ఉండడంతో హత్యగా అనుమానిస్తున్నామని అన్నారు. ఈ హత్యకు కారణాలు తెలియరావడం లేదని, వీరికి గ్రామంలో ఎవరితోనూ ఎటువంటి కక్షలు, గొడవలు లేవని ధ్రువీకరించారు. మృతురాలి కుమారుడు శశాంక్ ఆచూకీ లేకపోవడం పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని, అతను దొరికాక కేసు కొలిక్కి వస్తుందని, దర్యాప్తు పూర్తిచేసి, హంతకుడిని పట్టుకోవడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రెండు రోజుల్లో కేసును ఛేదించే దిశగా పోలీసులు ముమ్మరమైన చర్యలు చేపట్టారని వివరించారు. హత్య వెనుక కారణాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదన్నారు. ఆయన వెంట రాజాం పట్టణ, రూరల్ సీఐలు శ్రీనివాసరావు, హెచ్.ఉపేంద్ర ఉన్నారు. -
తోటపల్లి పరిసరాల్లో ఏనుగులు
గరుగుబిల్లి: మండలంలోని తోటపల్లి పంచాయతీ పరిసరాల్లో పంట పొలాలు, తోటల్లో మంగళవారం ఏనుగుల గుంపు సంచరిస్తోంది. పదిరోజుల నుంచి గిజబ, తోటపల్లి, సుంకి, నందివానివలస తదితర గ్రామాల పరిసరాల్లో సంచరిస్తుండడంతో ప్రస్తుతం ఆయా గ్రామాల్లో అరటి, మొక్కజొన్న, పామాయిల్ తదితర పంటలు నాశనం చేస్తున్నాయని రైతులంటున్నారు. ప్రధాన రహదారికి సమీపంలో ఏనుగులు సంచరిస్తుండడంతో రైతులు పొలాలకు వెళ్లేందుకు భీతిల్లుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని సర్వత్రా ఆందోళన చెందుతున్నారు. ఏనుగులను ఈ ప్రాంతం నుంచి తరలించేందుకు చర్యలు చేపట్టాలని రైతులు అధికారులను కోరుతున్నారు. -
నాయకత్వ శైలి, భావోద్వేగ మేధస్సుపై వర్క్షాప్
విజయననగరం అర్బన్: స్థానిక సీతం కళాశాలలో మేనేజ్మెంట్ స్టడీస్ విభాగం ఆధ్వర్యంలో ‘నాయకత్వ శైలి, భావోద్వేగ మేధస్సు’ అనే అంశంపై ఒక రోజు వర్క్షాప్ మంగళవారం విజయవంతంగా నిర్వహించారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం, వృత్తిపరమైన విజయానికి అవసరమైన నైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా కార్యక్రమం జరిగిందని ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు తెలిపారు. రిసోర్స్ పర్సన్గా హాజరైన సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు మేనేజ్మెంట్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ ఎ.చంద్రమోహన్ మాట్లాడుతూ ఆధునిక యుగంలో నాయకత్వం మారుతున్న తీరును వివరించారు. వర్క్షాప్లో ఆర్ఐఎన్ఎల్కు చెందిన మాజీ జీఎం ఓఆర్ఎంరావు, డిస్క్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ దివాకర్ వివిధ అంశాలపై ప్రసంగించారు. అనంతరం ప్రతిష్టాత్మక ‘క్వాంటమ్ ఆల్గారిథమ్ కోర్సు’కు ఎంపికై న సీతం క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ సెల్కు చెందిన అధ్యాపకులు డాక్టర్ శ్రీలత కరణం, డాక్టర్ జీ.శ్రీచందనలను అభినందించారు. కార్యక్రమంలో వివిధ విభాగాల అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
దళిత క్రైస్తవ మహాసభకు తరలిరండి
విజయనగరం టౌన్: రాజ్యాంగం, మత స్వేచ్ఛ, దళిత క్రైస్తవుల తక్షణ కర్తవ్యం అనే అంశంతో ఈ నెల 12న మంగళవారం చలో విజయనగరం దళిత క్రైస్తవ మహాసభ భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్లు సంఘమిత్ర ఆర్ఎస్.జాన్ తెలిపారు. ఈ మేరకు స్థానిక సిమ్స్ బాప్టిస్ట్ చర్చి ఆవరణలో మంగళవారం సమావేశం నిర్వహించి, కరపత్రాలను ఆవిష్కరించారు. క్రైస్తవులపై జరుగుతున్న దాడులు, ఈ ఏడాది మార్చి 24న సుప్రీం కోర్టు తీర్పు, ఆకివీడులో జరిగిన సంఘటనలపై క్రైస్తవ మహాసభను ఉత్తరాంధ్ర సంఘాల సహకారంతో సిమ్స్ చర్చి ఆవరణలో నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమానికి పద్మశ్రీ మంద కృష్ణ మాదిక, మాజీ కేంద్రమంత్రి జీవీ.హర్షకుమార్, పీవీ.సునీల్ కుమార్ ఐపీఎస్, జీవీ విజయకుమార్ ఐఎఎస్, తదితరులు కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి అనేక మంది సంఘం నాయకులు హాజరుకానున్నారన్నారు. క్రైస్తవ సోదరులందరూ సమావేశానికి హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు ఆదాడ మోహనరావు, తాలాడ ఆనంద్, పాస్టర్ వై.ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమణపై విచారణ
● హైకోర్టు జోక్యంతో రెవెన్యూలో కదలిక ● తహసీల్దార్ కార్యాలయంలో విచారణ శృంగవరపుకోట: ప్రభుత్వ భూములు, చెరువుల ఆక్రమణలపై విచారణ జరిపి, ఆక్రమణలు తొలగించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై జిల్లా రెవెన్యూ యంత్రాంగం స్పందించింది. మంగళవారం విచారణ జరిపింది. ఎస్.కోట మండలం ముషిడిపల్లి గ్రామంలో లేఅవుట్కు రోడ్డు కోసం రెండు చెరువులు పూర్తిగా కబ్జా చేశారని, ప్రభుత్వ భూములు, డీ పట్టా భూములు యథేచ్ఛగా ఆక్రమణకు గురవుతున్నాయని పలు ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులపై రెవెన్యూ యంత్రాంగంలో సరైన స్పందన లేకపోవడంతో ఫిర్యాదుదారులు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలతో మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనివాసరావు ముషిడిపల్లి గ్రామస్తులను, ప్రజాప్రతినిధులను పిలిచి విచారణ జరిపారు. విచారణకు హాజరైన గ్రామపెద్దలు, ఎమ్మెల్సీ రఘురాజు తదితర ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ గ్రామంలో పెద్దబంద, జగన్నాథబందలతో పాటు డీ–పట్టా భూములు కబ్జా చేసినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. 2016లో నాటి పంచాయతీ కార్యదర్శి తప్పుడు తీర్మానాలు చేశారన్నారు. ప్రభుత్వ భూముల్లో లే అవుట్ల కోసం రోడ్లు వేసే హక్కు పంచాయతీలకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ప్రభుత్వ భూములు, చెరువులను పరిరక్షించాలని కోరారు. దీనిపై తహసీల్దార్ శ్రీనివాసరావు స్పందిస్తూ మీరు ఇచ్చిన సమాచారం నోట్ చేసుకున్నామని, హైకోర్టు ఉత్తర్వుల మేరకు త్వరలో క్షేత్రస్థాయి విచారణ పూర్తిచేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. విచారణకు ఎంపీపీ సోమేశ్వరరావు, వైస్ ఎంపీపీ సుధారాజు హాజరయ్యారు. -
బెర్రీ కంపెనీపై రైతుల ఫిర్యాదు
● తహసీల్దార్ పరిశీలన బొబ్బిలి: పట్టణంలోని గ్రోత్ సెంటర్లో ఉన్న బెర్రీ ఫెర్రో ఎల్లాయీస్ కంపెనీ దాని పరిధి దాటి ఉన్న పంట పొలాల్లో బోర్లు వేసి సాగునీటిని అక్రమంగా వినియోగించడంపై బెర్రీ కంపెనీ యాజమాన్య తీరును వివరిస్తూ ఎం.బూర్జివలస గ్రామస్తులు తహసీల్దార్కు మంగళవారం ఫిర్యాదు చేశారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు తహసీల్దార్ తన సిబ్బందితో కలిసి కంపెనీ తీసిన బోర్లను సందర్శించారు. రైతుల అవసరాలకు ఉపయోగపడే భూగర్భ జలాలను కంపెనీ అవసరాలకు యధేచ్ఛగా వినియోగిస్తున్న పరిస్థితిని గుర్తించారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న వీఆర్ఓ వెంకునాయుడును వివరణ కోరగా అది బాడంగి మండలానికి సంబంధించిన బుచ్చింపేట పరిధిలోకి వస్తుందని అందువల్ల చర్యలు తీసుకోలేకపోతున్నామని సమాధానమిచ్చారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ ఫారం –3 ప్రకారం పరిశ్రమల ప్రహరీలోనే కంపెనీకి అవసరమైన బోర్లను తీసుకోవాలని, ఇలా చేయడం నేరమన్నారు. భూగర్భ జలాలు ఒకే చోట ఇంకిపోయి సమీప భూములకు అవసరమైన తేమ, నీరు లభ్యం కాదని, దీనిపై చర్యలు తీసుకుంటామన్నారు. -
పిడుగు పాటుకు వేతనదారు బలి..
తెర్లాం: చెరువులో పనిచేస్తుండగా పిడుగుపాటుకు గురై ఉపాధి హామీ పథకం వేతనదారు మృతి చెందగా, మరో వేతనదారు అస్వస్థతకు గురయ్యాడు. తెర్లాం పంచాయతీ మధుర గ్రామమైన చిన్నయ్యపేటలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. చిన్నయ్యపేట గ్రామానికి చెందిన జమ్మల సూర్యనారాయణ(71) ఉదయం ఉపాధి పనికి వెళ్లి ఇంటికి వచ్చి భోజనం చేసిన తరువాత రెండో పూట ఉపాధి పనికి వెళ్లాడు. పని చేస్తుండగా భారీ వర్షం కురవడంతోపాటు, పిడుగు పడడంతో చెరువులోనే సూర్యనారాయణ మృతిచెందాడు. ఆయనకు దగ్గరలో ఉన్న గణపతి అస్వస్థతకు గురికావడంతో వేతనదారులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య సత్యవతి, వివాహితుడైన కుమారుడు ఉన్నారు. ఉపాధి వేతనదారు పిడుగుపడి మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎంపీడీఓ కార్యాలయం ఏఓ వెంకటరమణ, ఉపాధి ఏపీఓ సుశీల, మండల టీడీపీ అధ్యక్షుడు, తెర్లాం పీఏసీఎస్ అధ్యక్షుడు నర్సుపల్లి వెంకటేశ్వరరావు, మాజీ ఉప సర్పంచ్ మర్రాపు శంకరరావు గ్రామానికి వెళ్లి సూర్యనారాయణ మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ● పిడుగుపడి ఆవు మృతి మండలంలోని లింగాపురం పంచాయతీ పరిధి అంట్లవార గ్రామంలో పిడుగుపడి ఓ ఆవు మృతి చెందింది. గ్రామానికి చెందిన సోపేటి పకీరు ఆవు పొలంలో మేత మేస్తుండగా పిడుగుపడి మృతి చెందినట్లు బాధిత రైతు తెలిపాడు. -
11న అండర్ 15 చెస్ ఎంపికలు
చీపురుపల్లి: పట్టణంలోని శ్రీనివాసా జూనియర్ కళాశాలలో ఈ నెల 11న ఆంధ్రా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఓపెన్, బాలికల అండర్ 15 చెస్ పోటీలకు ఎంపికలు నిర్వహించనున్నట్లు టోర్నమెంట్ డైరెక్టర్ ఏపీవీఎన్ఎస్.మూర్తి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. ఈ పోటీల్లో పాల్గొనాలనుకునే వారు 2011 జనవరి 1 తర్వాత జన్మించిన వారై ఉండాలని, పోటీల్లో పాల్గొనే వారు తప్పని సరిగా జనన ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని సూచించారు. ఈ పోటీలకు చీఫ్ ఆర్బిటర్గా ఏడీఎన్ఎస్వీ ప్రసాద్ వ్యవహరిస్తారన్నారు. క్రీడాకారులు తమ పేర్లను 9642546955, 9381549246 నంబర్లకు ఫోన్ చేసి నమోదు చేసుకోవాలని సూచించారు. బాధిత కుటుంబానికి చెక్కు అందజేసిన ఎస్పీపార్వతీపురం రూరల్: జిల్లాలోని వీరఘట్టం పోలీస్స్టేషన్లో పనిచేసిన కానిస్టేబుల్ పి.రవి రోడ్డు ప్రమాదంలో ఇటీవల మరణించగా ఆయన కుటుంబానికి గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్(జీపీఏఐ) ద్వారా మంజూరైన రూ.20.65 లక్షల చెక్కును రవి భార్య లలితకు ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబానికి ధైర్యం చెప్పి, ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి తదితరులు ఉన్నారు. జిల్లా ఫైర్ ఆఫీసర్గా సోమేశ్వర రావువిజయనగరం క్రైమ్: జిల్లా ఫైర్ ఆఫీసర్ గా సోమేశ్వర రావు అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు జిల్లా అగ్నిమాపక అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రమేష్, వి.కృష్ణమోహన్ లతో పాటు సభ్యులు ఆదినారాయణ, ప్రకాష్, ఉమామహేశ్వరరావు, జగదీష్, విజయభాస్కర్ జిల్లా ఫైర్ ఆఫీసర్ను మంగళవారం కలిసి శుభాకాంక్షలు చెప్పారు. కాగా రెండు రోజుల క్రితమే జిల్లా ఫైర్ ఆఫీసర్ రామ్ ప్రసాద్ జీవీఎంసీకి బదిలీ అయ్యారు.ప్రస్తుతం అదనపు జిల్లా అధికారి అయిన సోమేశ్వర రావు జిల్లా అగ్నిమాపక అధికారిగా చార్జ్ తీసుకున్నారు. పోగొట్టుకున్న ఫోన్లు రికవరీ నెల్లిమర్ల: పోయిన 8 మొబైల్ఫోన్లను నెల్లిమర్ల పోలీసులు వెతికిపట్టుకున్నారు. గడిచిన పదిరోజుల్లోనే 8 ఫోన్లు రికవరీ చేసి వాటి యజమానులకు అప్పగించారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఈఐఆర్ పోర్టల్ ద్వారా టెక్నాలజీ సాయంతో ఈ ఫోన్లు ట్రాక్చేసినట్లు ఎస్సై గణేష్ తెలిపారు. ఫోన్ గొట్టుకున్నవారు నేరుగా పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయవచ్చన్నారు.కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఏడుగురు గంజాయి నిందితుల అరెస్ట్విజయనగరం క్రైమ్: స్థానిక గూడ్స్ షెడ్ వద్ద గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ఏడుగురిని విజయనగరం వన్ టౌన్ ఎస్సై కమల్ భార్గవ్ మంగళవారం అరెస్ట్ చేశారు. గూడ్స్ షెడ్ రైల్వేట్రాక్ వద్ద రెండు మూటలతో నిందితులు తచ్చాడుతుండగా ఎస్సై అనుమానంతో ప్రశ్నించడంతో వారు తడబడ్డారు. దీంతో ఎస్సై తమదైన శైలిలో విచారణ చేయగా గంజాయిని రవాణా చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు విజయనగరం జిల్లాకు చెందిన అరవింద్, తేజ స్వరూప్, సాగర్, కిషోర్, విశాఖకు చెందిన మహీంద్, నాని, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కిరణ్లను అదుపులోకి తీసుకున్నామని ఎస్సై చెప్పారు. నిందితుల దగ్గర రెండున్నర కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
దమ్ముంటే పట్టుకోండి
● సవాల్ విసురుతున్న దొంగలు చీపురుపల్లి: వరుస దొంగతనాలతో హడలెత్తిస్తున్న దొంగలు.. మరో అడుగు ముందుకేసి దమ్ముంటే పట్టుకోండి అంటూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. అదేదో మాట వరుసకు అన్నది కాదు... తాజాగా ఆదివారం రాత్రి ఓ చికెన్ దుకాణంలో చోరీకి పాల్పడిన ఆగంతకుడు ఓ పేపర్పై దమ్ముంటే పట్టుకోండంటూ తన ద్విచక్ర వాహనం నంబర్ కూడా రాయడం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే... చీపురుపల్లి పట్టణంలోని లావేరు రోడ్డులో ఓ చికెన్ దుకాణంలో సోమవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. ఇదే దుకాణంలో ఏప్రిల్ 10న జరిగిన చోరీలో రూ.32వేలు నగదు అపహరణకు గురైంది. అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. తాజాగా సోమవారం తెల్లవారుజామున జరిగిన చోరీలో రూ.5వేలు వరకు అపహరించి దమ్ముంటే పట్టుకోండని ఓ కాగితంపై రాసి సవాల్ విసిరాడు ఆ దొంగ. మెయిన్రోడ్డులోనే వరుస దొంగతనాలు జరుగుతున్నా.. సీసీ కెమెరాల్లో అగంతకుడు స్పష్టంగా కనిపిస్తున్నా పోలీసులు కేసు చేధించలేకపోవడంపై స్థానికుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నేడు ఎస్సీ కమిషన్ సభ్యుల పర్యటన విజయనగరం అర్బన్: జిల్లాలో వివిధ భూ సంబంధిత ఫిర్యాదులపై క్షేత్రస్థాయి విచారణ జరిపేందుకు ఈ నెల 7, 8 తేదీల్లో ఏపీ షెడ్యూల్ కులాల కమిషన్ సభ్యులు జిల్లాలో పర్యటించనున్నారు. 7న ఉదయం 10గంటలకు రాజాం చేరుకొని ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. అనంతరం మాధ్యాహ్నం 2.30 గంటల నుంచి రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి రాజాంలో రాత్రి బసచేస్తారు. 8న ఉదయం 8 గంటలకు రాజాం నుంచి బయలుదేరి 10.30 గంటలకు మారేడుబాక, మధ్యాహ్నం 3.30 గంటలకు వేపాడ మండలం బొద్దాం గ్రామాల్లో పర్యటించి ఫిర్యాదుదారుల భూములను పరిశీలించి విచారణ చేపడతారు. అనంతరం సాయంత్రం 4.30 గంటల నుంచి ఎస్సీ కాలనీలు, వసతి గృహాలను సందర్శిస్తారు. -
వివాహిత హత్య?
● డోలపేటలో వివాహిత అనుమానాస్పద మృతి ● కుమారుడి ఆచూకీ కోసం గాలింపు రాజాం సిటీ: రాజాం మున్సిపాలిటీ పరిధి డోలపేటలో సోమవారం ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం కలకలం రేపింది. ఇది హత్యా..? ఆత్మహత్యా అన్నది తెలియరాలేదు. భర్త సతీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజాం జీఎంఆర్ ఐటీలో ఫొటో గ్రాఫర్గా పనిచేస్తున్న ముంజేటి సతీష్, భార్య స్పందన (35), కుమారుడు శశాంక్ డోలపేటలో నివసిస్తున్నారు. సాయంత్రం 5 గంటల తరువాత విధులు ముగించుకుని సతీష్ ఇంటికి వచ్చాడు. తలుపులకు తాళం వేసి ఉండడం, బాత్రూమ్ వాల్ నుంచి నీరు రావడం గమనించాడు. తాళాలు పగులకొట్టి చూడగా ఇంట్లో వస్తువులు చిందరవందరగా ఉండడాన్ని గమనించి వెంటనే చుట్టుపక్కల ఆరా తీయగా ఇంటి వెనుక చెరువులో తన భార్య మృతదేహం కనిపించిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే, స్పందన శరీరంపై దాడిచేసిన ఆనవాళ్లు, రక్తం మరకలు ఉన్నాయి. స్పందన మృతిపై తొలుత కుటుంబీకులను, తరువాత భర్త సతీష్ను వన్టౌన్ సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. ఉదయం డ్యూటీ నిమిత్తం కాలేజీకి వెళ్లిపోయానని, మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చానని, ఇంటి వద్ద ఎవరూలేకపోవడంతో పక్కనే ఉంటున్న తన తల్లి ఇంటి వద్ద భోజనం చేసి మళ్లీ కళాశాలకు వెళ్లిపోయినట్టు సతీష్ వెల్లడించారు. కుమారుడు ఎక్కడ? స్పందన మృతి మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. కుమారుడు శశాంక్ ఆచూకీ లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. స్పందన, సతీష్లకు ఒక్కడే కుమారుడు. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణుడు కావడంతో స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నట్లు సమాచారం. సోమవారం ఉదయం ఇంటి వద్దే ఉన్న శశాంక్ మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదు. స్పందన, ఆమె కుమారుడు శశాంక్ల మధ్య ఏదైనా వివాదం తలెత్తిందా? బయట నుంచి దుండగులు వచ్చి స్పందనను హత్యచేసి శశాంక్ను కిడ్నాప్ చేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యా ప్తు చేస్తున్నారు. ఉదయం నుంచి ఇంటికి తాళంవేసి ఉన్నా... సతీష్కు అనుమానం రాకపోవడం, డ్యూటీ నుంచి వచ్చిన సతీష్కు చుట్టుపక్కల వెతకాలని అనిపించడంపైనా ఆరా తీస్తున్నారు. క్లూస్ టీం బృందాలు ఆధారాలు సేకరించాయి. -
నిరసన హోరు
పింఛన్ మంజూరు చేయాలంటూ వినతులు అందజేసేందుకు కలెక్టరేట్కు వచ్చిన వితంతువలు కొత్తకొట్ట లక్ష్మి, వాకిటిపూడి సత్యవతి, సతివాడ హేమ బొంతుకొండ రక్షణకు కదం తొక్కిన కొండకరకాం ఊరి ప్రజల ఊపిరి తీయొద్దుంటూ వినతి పింఛన్లు ఎప్పుడు మంజూరుచేస్తారంటూ ప్రశ్నించిన లబ్ధిదారులు విజయనగరం గంటస్తంభం: విజయనగరం కలెక్టరేట్ పరిసరాలు సోమవారం ఉదయం నుంచి ప్రజల నిరసన హోరుతో దద్దరిల్లాయి. కొండకరకాం గ్రామస్తులు, ఉపాధిహామీ వేతనదారులు, వితంతువులు, అంగన్వాడీ హెల్పర్లు, తోపుడు బండ్ల కార్మికులు గుంపులుగా వచ్చి తమ గోడును అధికారులకు వినిపించారు. డీఆర్వో, జేసీకి వినతిపత్రాలు అందజేశారు. వితంతువుల ఆర్తనాదం.. భర్తలు చనిపోయి ఏళ్లు గడుస్తున్నా పింఛన్లు మంజూరు చేయడంలేదంటూ విజయనగరం మండలం బుగ్గవీధి, రంగాలవీధి ప్రాంతాలకు చెందిన కొత్తకోట లక్ష్మి, సతివాడ హేమ, వాకిటిపూడి సత్యవతి తదితరులు ఆవేదన వ్యక్తంచేశారు. చంద్రబాబు ప్రభుత్వం వితంతువుల విషయంలో కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వాపోయారు. కొండకరకాం సర్వే నంబర్ 24లో బీటు నంబర్–2 వద్ద మంజూరైన దోభీఘూట్ పనులు నత్తనడకన సాగడంపై విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాగవంశపు వీధి, బోయివీధి, నల్లావీధి, ఉల్లివీధి, వైఎస్సార్నగర్ కాలనీ ప్రాంతాల రజక వృత్తిదారులు ఆవేదన వ్యక్తంచేశారు. 2023లో రూ.9,95,000లతో చేపట్టిన పనులు ఇప్పటికీ పూర్తిచేయకపోవడం దారుణమన్నారు. నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులకు విన్నవించారు. రాజాం ప్రాజెక్టులో హెల్పర్లుగా ఉన్న మహిళలకు వర్కర్లుగా ఉద్యోగోన్నతి ఇవ్వకుండా అడ్డుకోవడం తగదని సీఐటీయూ ఆధ్వర్యంలో జేసీ సేతు మాధవన్కు గోడు వినిపించారు. వంగర, సంతకవిటి మండలాల్లో ఇద్దరు హెల్పర్లకు ఉద్యోగోన్నతి ఉత్తర్వులు ఇచ్చాక ఎమ్మెల్యే పీఏ వద్దన్నారని ఆ కాపీలను వెనక్కి తీసుకున్నారని వివరించారు. దీనిపై జేసీ స్పందిస్తూ వారం రోజుల్లో వీరికి ఉద్యోగోన్నతులు కల్పించాలని పీడీని ఆదేశించారు. గ్యాస్ ధరలు తగ్గించాలంటూ సీఐటీయూ నేత జగన్మోహన్రావు అధికారులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి రావాల్సిన గ్యాస్ వాటాను రాబట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లో 159 వినతులు విజయనగరం అర్బన్: కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’, ‘రెవెన్యూ క్లినిక్’లకు 159 వినతులు అందాయి. అందులో అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించినవే 68 ఉన్నాయి. శాఖల వారీగా డీఆర్డీఏ–18, పంచాయతీ రాజ్–19, మున్సిపల్–7, డీసీహెచ్ఎస్–2, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ–3, గ్రామ సచివాలయ శాఖ– 2, విద్యాశాఖ–5, ఇతర శాఖలు–35 వినతులు నమోదయ్యాయి. పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ వినతుల పరిష్కారంలో వేగం పెంచాలని, పెండింగ్ వినతులను తక్షణమే పరిష్కరించి డిస్పోజ్ చేయాలని అధికారులను జేసీ సేతుమాధవన్ ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఇ.మురళి, కళావతి, ఎస్. వెంకటేశ్వరరావు, విజయనగరం, చీపురుపల్లి, బొబ్బిలి ఆర్డీవోలు, సీపీఓ బాలాజీ, జిల్లా సర్వే శాఖ ఏడీ ఆర్.విజయకుమార్, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్పాణి, హౌసింగ్ పీడీ మురళీధర్, డీఈఓ మాణిక్యంనాయుడు, మైక్రో ఇరిగేషన్ పీడీ లక్ష్మీనారాయణ, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీపీఓ, మార్క్ఫెడ్ మేనేజర్ డి.వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
● ఊరి ఊపిరి తీయొద్దు..
బొంతు కొండ క్యారీ లీజును తక్షణమే రద్దుచేయాంటూ విజయనగరం మండలం కొండకరకాం గ్రామస్తులు కలెక్టరేట్ వేదికగా కదం తొక్కారు. భారీస్థాయిలో ధర్నా చేశారు. ఊరి పెద్దలను అడగకుండా, గ్రామసభ పెట్టకుండా ఎన్ఓసీ ఎలా ఇస్తారంటూ నిలదీశారు. సర్వే నంబర్ 198/50లో బంగారమ్మ ఎర్త్ ఓవర్స్, వెంకట మురుగన్ స్టోన్ క్రషర్లకు అనుమతులు ఇచ్చి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఊరు ఊపిరి తీసేయొద్దని, అదే జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కొండకు దగ్గరలోనే మెడికల్ కాలేజీ, ట్రైబల్ యూనివర్సిటీకి గతంలో కేటాయించిన భూములు, ఈఎస్ఐ ఆస్పత్రి ఉన్నాయని, కొండను తవ్వితే పోరాటం తప్పదన్నారు. -
సర్వజన కష్టాలు..!
వైద్యం కోసం.. ట్రై సైకిల్పై పేషెంట్ను తీసుకువస్తున్న బంధువు విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రితో పాటు ఏరియా ఆస్పత్రులు, సీహెచ్సీల్లో మెరుగైన వైద్య సేవలు అందడం లేదు. రిఫరల్ కేసులే అధికంగా కనిపిస్తున్నాయి. సదుపాయాల కల్పన, వైద్యులు, సిబ్బంది పోస్టుల భర్తీలో చంద్రబాబు ప్రభుత్వ అలసత్వం సేవలపై ప్రభావం చూపుతోంది. ఆస్పత్రులపై పర్యవేక్షణ లోపించింది. రోగుల అవస్థలు వర్ణణాతీతంగా మారాయి. ఓపీ విభాగాల్లో వైద్యులు ఉదయం 9 నుంచి సాయత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉండాలి. కొంతమంది వైద్యులు ఇలా వచ్చి అలా వెళ్లి పోతున్నారు. చాలా విభాగాల్లో ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. నడవలేని స్థితిలో ఉన్న రోగులను వైద్య పరీక్షలకు తీసుకెళ్లేందుకు సిబ్బంది నిర్లక్ష్యంచేస్తున్నారు. రోగి బంధువులే వైద్యులు, వివిధ పరీక్షలకు వీల్ చైర్, స్ట్రెచర్పైన, ఎత్తుకుని తీసుకెళ్తున్నారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో స్టాప్ నర్సు పోస్టులు 50, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ పోస్టులు 10, ఫార్మసిస్టు పోస్టు–1 ఖాళీగా ఉన్నా భర్తీచేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ● ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా ఉంది. జనరల్ మెడిసిన్ ఓపీ విభాగం ఎదురుగా ఉన్న మరుగుదొడ్లు అపరిశుభ్రంగా దర్శినమిస్తున్నాయి. డోర్కు గ్లాస్ కూడా లేదు. ఆస్పత్రి ఆవరణలోనే రోగులు వినియోగించిన గ్లౌజ్లను పడేస్తున్నారు. ● ఆస్పత్రిలో పరుపులు చాలక రోగులకు వరాండలో చికిత్స అందిస్తున్నారు. పక్షవాతం బారిన పడిన రోగులకు సైతం వరాండలోనే చికిత్స అందిస్తుండడం గమనార్హం. మరోవైపు ఆస్పత్రిలోని వార్డులో ఏర్పాటుచేసిన మినరల్ వాటర్ ఫ్రిజ్లు మూలకు చేరినా పట్టించుకునేవారే కరువయ్యారు. ● సర్వజన ఆస్పత్రిలో భాగమైన ఘోషాస్పత్రిలోని కాన్పుగదిలో సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నట్టు సమాచారం. మగపిల్లవాడు అయితే ఒకలా, ఆడపిల్ల అయితే ఒకలా డబ్బులు వసూలు చేస్తున్నట్టు మహిళలు చెబుతున్నారు. మగ పిల్లవాడు అయితే రూ.800 నుంచి రూ. 1000 వరకు, ఆడపిల్ల అయితే రూ.500 నుంచి రూ. 600 వరకు కలెక్షన్ చేస్తున్నట్టు సమాచారం. ● ప్రైవేటు అంబులెన్సుల సిబ్బందితో వార్డు బోయ్లు చేతులు కలుపుతున్నారు. రోగిని వైద్యులు వేరే ఆస్పత్రికి రిఫర్ చేసిన సమయంలో ప్రైవేటు అంబులెన్స్ నిర్వాహకుడికి ఫోన్ చేసి అధిక అద్దెకు అప్పగిస్తున్నారు. దానికి ప్రతిఫలంగా కమీషన్ తీసుకుంటున్నారు. మహా ప్రస్థానం వాహనం కూడా ఒకటే ఉండడంతో రెండు మూడు మృత దేహాలు ఉన్న రోజు ప్రైవేటు అంబులెన్సులకు అప్పగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ● బొబ్బిలి సీహెచ్సీలో అంబులెన్స్లేదు. రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించాలంటే ప్రైవేటు అంబులెన్స్లే గతి. ఇక్కడ జనరల్ సర్జన్ పోస్ట్ ఖాళీగా ఉంది. మేజర్ శస్త్ర చికిత్సల కోసం జిల్లా కేంద్రాస్పత్రి, లేదంటే కేజీహెచ్కు తరలించాల్సిన పరిస్థితి. గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కంటి పరీక్షల కేంద్రం ద్వారా కంటి అద్దాలను అందజేసేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కంటి పరీక్షల కేంద్రాన్ని ఎత్తేసింది. ● చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రిలో హైరిస్క్ ప్రసవ కేసులను విజయనగరం రిఫర్ చేస్తున్నారు. ఇక్కడ అంబులెన్స్ సౌకర్యం లేదు. ఇక్కటి కంటి పరీక్షల కేంద్రాన్ని ఎత్తేశారు. ● ఎస్.కోట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిర్మించిన కొత్త భవనం ఇప్పటికీ వాడుకలోకి రాలేదు. ఇక్కడ వసతి సమస్య వెంటాడుతోంది. ఎముకుల విభాగం వైద్యులు లేరు. ట్రామా కేర్ సెంటర్ లేదు. అత్యవసర సమయంలో మెరుగైన వైద్యం అందని పరిస్థితి. ● రాజాం ప్రాంతీయ ఆస్పత్రిలో ఎక్స్రే, ల్యాబ్ విభాగం సక్రమంగా పనిచేయడం లేదు. రోగులు డబ్బులు చెల్లించి ప్రైవేటు ల్యాబ్లలో ఎక్స్రేలు, రక్తపరీక్షలు చేయించుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) రోగులకు సరిగా భోజనాలు కూడా పెట్టడంలేదు. ఉదయం పాలు, గుడ్లు, టిఫిన్ వంటివి ఇవ్వడంలేదని రోగులు చెబుతున్నారు. ● గజపతినగరం ఏరియా ఆస్పత్రికి వచ్చే రోగులను వైద్యం కోసం తిరిగి విజయనగరం తరలిసున్నారు. గైనిక్, ఆర్థో వంటి విభాగాల్లో సర్జరీలు చేసేందుకు సాహసించడంలేదన్న వాదన వినిపిస్తోంది. వసతులు లేక రోగులు అవస్థలు వార్డుల్లో మూలకు చేరిన మినరల్ వాటర్ ఫ్రిజ్లు రోగిబంధువులే వీల్చైర్, స్ట్రెచర్పై తీసుకెళ్లాల్సిన దుస్థితి మరుగుదొడ్లు అధ్వానం కాన్పుగదిలో సిబ్బంది చేతివాటం చాలీచాలని బెడ్స్.. వరండాల్లోనే చికిత్స -
ఆండ్ర భూముల ఆక్రమణ
● జేసీబీతో చదును చేస్తున్నా పట్టించుకోని యంత్రాంగం ● ఆవేదనలో నిర్వాసిత గిరిజనులు ఇదెక్కడి అన్యాయం నా భూమి 5 ఎకరాలు రిజర్వాయర్లో కలిసిపోయింది. సెంటు భూమి కూడా మిగల్లేదు. రిజర్వాయర్ ఒడ్డున ఎప్పుడూ నీటి ముంపునకు గురికాని భూములను వ్యవసాయం చేద్దామంటే అధికారులు కుదరదని వెళ్లగొట్టారు. బయటి నుంచి వచ్చి ఈ ప్రాంతంలో భూములను కొనుగోలుచేసి చుట్టు పక్కల ప్రభుత్వ భూములను, రిజర్వాయర్ భూములను ఆక్రమించేస్తున్నా అతడిని మాత్రం రెవెన్యూ అధికారులు ఏమీ అనడంలేదు. పేదలకో న్యాయం... డబ్బున్న వాళ్లకో న్యాయమా?. – ఇంటి నరసింహులు, నిక్కలవలస, ఆండ్ర రిజర్వాయర్ నిర్వాసిత రైతు చర్యలు తీసుకుంటాం ప్రభుత్వ భూములు, వాగులు, గెడ్డపోరంబోకు భూములు, రిజర్వాయర్ భూములు ఆక్రమించడం చట్టరీత్యా నేరం. ఆక్రమిస్తే క్షేత్ర పరిశీలన చేసి చర్యలు తీసుకుంటాం. – విజయభాస్కర్, తహసీల్దార్, మెంటాడ రిజర్వాయర్ భూమిని జేసీబీతో చదును చేస్తున్న దృశ్యం మెంటాడ: మండలంలోని ఆండ్ర రిజర్వాయర్ ముంపు భూములు దురాక్రమణకు గురవుతున్నాయి. జేసీబీతో చదును చేస్తున్నా రెవెన్యూ అధికారులు కనీసం కన్నెత్తి చూడడంలేదు. భూముల ఆక్రమణల వెనుక అధికారపార్టీ నేతల హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెంటాడ మండలంలోని లోతుగెడ్డ, నిక్కలవలస, ఆండ్ర గ్రామాల రెవెన్యూ పరిధిలో సుమారు వెయ్యిఎకరాల విస్తీర్ణంతో ఆండ్ర రిజర్వాయర్ను నిర్మించారు. అవసరమైన భూములను రైతుల నుంచి సేకరించారు. రిజర్వాయర్ బయట ఖాళీగా ఉన్న భూములను అప్పుడు భూములిచ్చిన రైతులే సాగుచేస్తున్నారు. అయితే, రిజర్వాయర్ వల్ల పూర్తిగా భూములు కోల్పోయిన గిరిజనులు రిజర్వాయర్లో ముంపు కాకుండా ఖాళీగా ఉన్న భూముల్లో వ్యవసాయం చేయడానికి సిద్ధపడితే అప్పటి రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు అడ్డుకున్నారు. నిక్కలవలస రెవెన్యూలో అధికంగా భూములున్న వ్యక్తి చుట్టుపక్కల ఉన్న వాగులు, గెడ్డపోరంబోకు ప్రభుత్వ భూములన్నింటినీ చదునుచేసి కలిపేసుకున్నా అధికారులు పట్టించుకోలేదు. ఇప్పుడు రిజర్వాయర్ భూములపై అతని కన్ను పడింది. కిందటి వేసవిలో రిజర్వాయర్లో నీరు తగ్గగానే భూములను చదును చేయడానికి ప్రయత్నిస్తే గిరిజన నిర్వాసితులు అడ్డుకున్నారు. మళ్లీ రెండు రోజుల నుంచి జేసీబీతోల చదును చేస్తున్నారు. నిర్వాసిత గిరిజనులు వెళ్లి అడ్డుకున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు కిమ్మనకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
విదేశీ అతిథులు వచ్చేశాయ్..
బొండపల్లి: ఎక్కడో వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశం కాని దేశం నుంచి పక్షులు మండలానికి వచ్చేశాయి. కొన్నేళ్లుగా సైబీరియా దేశం నుంచి పక్షులు మే నెల ప్రారంభంలోనే వచ్చి సందడి చేస్తుంటాయి. మండల కేంద్రంలోని రాజు చెరువులో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆహర వేటలో ఉండే ఈ పక్షులు రాత్రి కాగానే గజపతినగరం మండలం లోగిశ గ్రామంలోని చింతచెట్ల పైకి చేరుకుని సేద తీరుతాయి. ఈ పక్షులు రావడాన్ని ఇటు బొండపల్లి, అటు లోగిశ ప్రజలు శుభసూచికంగా భావిస్తారు. ఇక్కడకు వచ్చిన పక్షులు గుడ్లు పెట్టి వాటిని పొదిగి పిల్లలను చేసిన తర్వాత అక్టోబర్ సమయంలో తిరిగి స్వదేశానికి వెళ్లిపోతాయి. ఇక్కడి ప్రజలు పక్షులకు ఎటువంటి ఇబ్బంది కలగజేయకుండా నడుచుకోవడం విశేషం. చేయనున్న సైబీరియా పక్షులు -
ఉద్యమ నేతకు ఘనంగా నివాళి
విజయనగరం గంటస్తంభం: గిరిజనులు, వ్యవసాయ కార్మికులు, షాపు ఉద్యోగుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన సీపీఎం నేత రెడ్డి శ్రీరామమూర్తి ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ పిలుపునిచ్చారు. రెడ్డి శ్రీరామమూర్తి 5వ వర్ధంతి సందర్భంగా స్థానిక ఎల్బీజీ భవనంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని శ్రీరామమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆయన మరణం ఉమ్మడి జిల్లా ఉద్యమాలకు తీరని లోటు అని పేర్కొన్నారు. అనేక నిర్బంధాలను ఎదుర్కొంటూ గిరిజనులు, కార్మికులు, షాపు ఎంప్లాయీస్ హక్కుల కోసం నిరంతరం పోరాడిన నాయకుడని కొనియాడారు. కురుపాం నియోజకవర్గంలో సీపీఎం విజయంలో ఆయన పాత్ర విశేషమని గుర్తచేశారు. వ్యవసాయ కార్మిక, గిరిజన, కార్మిక ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించి చివరి రక్తబొట్టు వరకు ప్రజల కోసం అంకితభావంతో పని చేశారన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎ.జగన్మోహనరావు, రాము, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
రహదారి భద్రతపై ప్రతిజ్ఞ
సీతంపేట: పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సీతంపేట మండలంలోని కుశిమి కూడలి వద్ద రహదారి భద్రతపై ఆదివారం పాలకొండ సీఐ ప్రసాదరావు ఆధ్వర్యంలో వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించినట్లు ఎస్సై వై.అమ్మన్నరావు తెలిపారు. ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు డ్రైవింగ్కు ఇవ్వవద్దని సీఐ సూచించారు. రోడ్డు నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఓవర్ స్పీడ్ వెళ్లవద్దని, ఘాట్రోడ్లో ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడపవద్దని హితవు పలికారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
అనారోగ్యంతో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మృతి
వేపాడ: మండలంలోని బొద్దాం గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గల్లా షణ్ముఖరావు (29) అనారోగ్యంతో అస్పత్రి చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందారు. ఇందుకు సంబంధించి స్థానికులు కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గల్లా షణ్ముఖరావు 2021 సీఆర్పీఎఫ్ జీడీ కానిస్టేబుల్గా విశాఖపట్నం 198 బెటాలియన్లో పనిచేస్తున్నారు. అనారోగ్యంగా ఉండడంతో మిలట్రీ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. దీంతో సీఆర్పీఎఫ్ సీఐ డి.కృష్ణారావు ఆధ్వర్యంలో సైనికలాంఛనాలతో బొద్దాం శ్మశాన వాటికలో ఆదివారం సాయంత్రం గౌరవవందనం చేస్తూ గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు నిర్వహించి అంత్యక్రియలు చేపట్టారు. అనంతరం జాతీయ జెండాను షణ్ముఖరావు తల్లిదండ్రులు వెంకటరమణ ముత్యాలమ్మకు అందజేశారు. సీతంపేట: మండలంలోని వాబ జంక్షన్ వద్ద గురువారం ద్విచక్రవాహనం, ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో గాయపడిన పాలకొండ మండలం జంపరకోటకు చెందిన వరలక్ష్మి (55) శ్రీకాకుళం రిమ్స్లో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆమె భర్త జీలకర్ర మోహన్రావు సంఘటన స్థలంలోనే మృతిచెందిన విషయం విదితమే. గాయపడిన వరలక్ష్మి మృతిచెండంతో జంపరకోటలో మరోమారు విషాదఛాయలు అలముకున్నాయి. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు -
పోలీస్ సిబ్బంది కావలెను..!
బొబ్బిలి: సబ్ డివిజనల్ పోలీసు కార్యాలయం బొబ్బిలి పరిధిలో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇరుకు రోడ్లున్న బొబ్బిలిలో ట్రాఫిక్తో పాటు శాంతి భద్రతల పర్యవేక్షణ వంటి అంశాల్లో పర్యవేక్షణకు ఉన్న కొద్దిపాటి సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. గతంలో పూర్తిస్థాయిలో ఉన్న పోలీస్ యంత్రాంగం దాదాపు సగానికి తగ్గినట్లనిపిస్తోంది. విచిత్రమేమిటంటే మండల కేంద్రాల్లో ఉండాల్సిన ఎస్సైల పోస్టులకు కూడా అధికారులను నియమించడం లేదు. పక్క స్టేషన్ల ఎస్సైలకు ఇన్చార్జి బాధ్యతలను అప్పగిస్తున్నారు. సాధారణంగా ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించే యువత, ఇతర బాధ్యతారాహిత్య వ్యక్తుల వల్ల రోడ్డు ప్రమాదాలు, క్షణికావేశంలో పరస్పరం దాడులు సంభవించే పరిస్థితులు ఇప్పుడు సాధారణమైపోయాయి. ఇటువంటి సమయంలో పూర్తిస్థాయి సిబ్బంది ఉంటే పర్యవేక్షణ సులువవుతుంది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత శాంతి భద్రతల పర్యవేక్షణకు ఉండాల్సిన సిబ్బంది నియామకంపై దృష్టి సారించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆరు ఎస్సై పోస్టులు ఖాళీ బొబ్బిలి సబ్ డివిజన్లో 9 పోలీస్స్టేషన్లు ఉన్నాయి. ఈ స్టేషన్లలో సిబ్బంది కొరత ఉండడం సాధారణమే. కానీ ఏకంగా ఆరు ఎస్సై పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బొబ్బిలి ఎస్సై ఆర్ రమేష్ కుమార్ వీఆర్కు పంపించారు. అలాగే మరో ఎస్సై ఉండాలి కానీ నేటికీ నియామకం కాలేదు. ఇక వుమెన్ ఎస్సైగా రెండేళ్ల కిందట ఒకామె విధులు నిర్వహిస్తుండగా ఆమెను దిశ పోలీస్స్టేషన్కు బదిలీ చేసి నేటికీ ఎవరినీ నియమించలేదు. ఇక్కడే ట్రాఫిక్ ఎస్సైగా విధులు నిర్వహించిన జ్ఙాన ప్రసాద్ను రామభద్రపురం బదిలీ చేశారు. అలాగే బాడంగి ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న తారకేశ్వర రావును సీసీఎస్కు బదిలీ చేశారు. తెలంగాణ జర్నలిస్టు కేవీఆర్ను అరెస్టుచేసే క్రమంలో జరిగిన రాజకీయ బదిలీగా దీనిని చెప్పుకుంటున్నారు. అలాగే మానాపురం ఎస్సై జయంతిని క్రైమ్ పోలీసు స్టేషన్కు బదిలీ చేశారు. వారితో పాటు దత్తిరాజేరు మండలం బూర్జి వలస ఎస్సై రాజేష్ను కూడా సీసీఎస్కు పంపించారు. దీంతో సబ్ డివిజన్ మొత్తంలో ఉన్న 9 పోలీస్స్టేషన్లలో 6గురు ఎస్సైలు లేనట్లు లెక్క. శాంతిభద్రతల విషయంలో నిత్యం ఉండాల్సిన పోలీసుశాఖలో సిబ్బందిని ఎందుకనో నియమించడం లేదు. దీనిపై ప్రజా ప్రతినిధులు కూడా పట్టించుకోవడం లేదని ప్రజానీకం విమర్శిస్తోంది. ఇలా వచ్చి అలా సెలవుపై వెళ్లిపోయి.. బొబ్బిలి ట్రాఫిక్ ఎస్సై జ్ఞానప్రసాద్ను రామభద్రపురం బదిలీ చేశారు. ఎందుకంటే అక్కడ అప్పటికే ఉన్న వెలమల ప్రసాదరావు స్థానిక నాయకులకు నచ్చలేదన్న కారణంతో కూటమి ప్రభుత్వం వీఆర్కు పంపించేలా చర్యలు తీసుకుందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో బొబ్బిలికి తీవ్రమైన ట్రాఫిక్ కారణంగా ఎల్.కోట ఎస్సైగా పనిచేసిన సీహెచ్ నవీన్ పడాల్ను ఇక్కడ ట్రాఫిక్ ఎస్సైగా నియమించారు. సరిగ్గా దాడితల్లి అమ్మవారి పండగ ముందు రోజు విధుల్లో చేరిన ఆయన పండగ ముగిసిన వెంటనే మరో చోట పోస్టింగ్ ప్రయత్నాలకోసం సెలవుపై వెళ్లిపోయారు. దీంతో ఇప్పుడు బొబ్బిలి సర్కిల్ కార్యాలయంలో ఇద్దరు ఎస్సైలు, ఒక వుమెన్, ఒక ట్రాఫిక్ ఎస్సై లేరు. ఏఎస్సైలు, కానిస్టేబుళ్లతోనే సీఐ నారాయణ రావు నెట్టుకొస్తున్నారు. మరో విషయం ఏంటంటే బొబ్బిలి సర్కిల్ కార్యాలయానికి 72 మంది సిబ్బంది (పేట్రన్ ) ఉండాలి. ఆ మేరకు పోస్టులు మంజూరై ఉన్నాయి. కానీ ఇప్పుడు అందులో సగం మంది కూడా లేరు. మొత్తంగా చూస్తే బొబ్బిలి డివిజన్కు 30 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. మే నెలలో అమ్మవార్ల పండగలున్నాయి. సోమవారం నుంచి మండలంలోని మెట్టవలసలలో పండగ ఉంది. మొన్న దాడితల్లి అమ్మవారి పండగ లాగానే ఇక్కడ కూడా ఇతర ప్రాంతాల నుంచి సిబ్బందిని తీసుకు రావాల్సి వస్తోంది. బొబ్బిలి డివిజన్లో ఆరు ఎస్సై పోస్టులు ఖాళీ విధుల్లో చేరిన వెంటనే సెలవులో ట్రాఫిక్ ఎస్సై జాడే లేని వుమెన్ ఎస్సై అదే కోవలో బాడంగి, బూర్జివలస, మానాపురం స్టేషన్లు నియామకానికి ప్రాధాన్యమివ్వని కూటమి సర్కార్ -
ఎస్టీ కమిషన్ ముందుకు జిందాల్ విచారణ
శృంగవరపుకోట: జిందాల్ భూముల సేకరణ వ్యవహారంలో జరుగుతున్న అవకతవకలపై విచారణకు హాజరు కావాలని ఎస్టీ కమిషన్ నుంచి జిల్లా అధికారులకు సమన్లు అందినట్లు ఎమ్మెల్సీ రఘురాజు చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఆయన బొడ్డవరలోని తన నివాసంలో మాట్లాడుతూ హైదరాబాద్లోని దిల్కుషా గెస్ట్హౌస్లో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ నేతృత్వంలో జరగనున్న విచారణకు తాను హాజరవుతున్నట్లు చెప్పారు. గతంలో నాలుగు దఫాలు విచారణకు షెడ్యూల్ జారీ చేసినప్పటికీ జిల్లా ఉన్నతాధికారులు గైర్హాజరు కావడం వల్ల విచారణ జరగలేదన్నారు. జిల్లా అధికారుల గైర్హాజరును తీవ్రంగా పరిగణించిన కమిషన్ ఈ దఫా కచ్చితంగా హాజరు కావాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈ దఫా విచారణలో వాస్తవాలు వెలుగు చూసి నిర్వాసితులకు న్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్వాసితుల పోరాటానికి స్థానిక ప్రజాప్రతినిధులు సంపూర్ణ మద్దతు ప్రకటించారని, మార్చి 30న వాయిదా పడిన ఎస్టీ కమిషన్ పర్యటనను త్వరలోనే పునరుద్ధరించాలని, కమిషన్ స్వయంగా బాధిత ప్రాంతాల్లో పర్యటించి, క్షేత్రస్థాయి వాస్తవాలను వెల్లడించాలని ఆయన కోరారు. అధికారులు కమిషన్ ఎదుట వాస్తవాలు మాట్లాడితే నినర్వాసితులకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
పదో తరగతి టాపర్లకు ఘనంగా సత్కారం
విజయనగరం అర్బన్: పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో అధికమార్కులు తెచ్చుకున్న పలువురు విద్యార్ధులకు కలెక్టరేట్లోని సమావేశ మందింరంలో ఆదివారం ఘనంగా సత్కారం జరిగింది. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాల నుంచి ప్రతిభ కనపరిచిన 68 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.వెయ్యి వంతున నగదు ప్రోత్సాహకం, మెరిట్ సర్టిఫికెట్ అందజేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులను కూడా ప్రత్యేకంగా గౌరవించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విద్యార్థులను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులను అభినందించారు. ముఖ్య అతిథులుగా విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు విజయభాస్కర్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీలు డాక్టర్ గాదె శ్రీనివాసులునాయుడు, వేపాడ చిరంజీవిరావు, డీఈఓలు, విద్యావేత్తలు పాల్గొన్నారు. -
మూగరోదన..!
విజయనగరం ఫోర్ట్: జిల్లాలోని రైతులు వ్యవసాయంతో పాటు పాడి పోషణకు కూడా అధిక ప్రాధాన్యం ఇస్తారు. వ్యవసాయం కలిసి రాకపోయినా పాడిపశువుల ద్వారా పాల విక్రయంతో వచ్చే ఆదాయంతో జీవించవచ్చనేది రైతుల భావన. వ్యవసాయం చేసే ప్రతి రైతు రెండు, మూడు పాడిపశువులను మేపుతుంటాడు. అదేవిధంగా పౌల్ట్రీఫారాలు కూడా జిల్లాలో అధికంగానే ఉన్నాయి. గొర్రెలు, మేకల పెంపకం దారులు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఈ మూగ జీవాలకు ఏదైనా జబ్బు చేస్తే వైద్యసేవలు అందించే వారే కరువయ్యారు. జిల్లాలోని అనేక పశువైద్య శాలల్లో పశు వైద్యులు లేరు. దీంతో పశుసంవర్థకశాఖ సహాయకులే దిక్కుగా నిలుస్తున్నారు. దీని వల్ల పశువైద్యులు అందించాల్సిన సేవలు మూగజీవాలకు అందని పరిస్థితి. పశు వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నప్పటకీ టీడీపీ సర్కార్ భర్తీ చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని పశు వైద్యశాలలు జిల్లాలో ప్రాంతీయ పశు వైద్య ఆస్పత్రులు 13 ఉన్నాయి. లైవ్స్టాఫ్ అధికారులున్న గ్రామీణ పశువైద్యశాలలు 40 ఉన్నాయి. జిల్లా ఆస్పత్రి ఒకటి ఉంది. వైద్యులున్న పశు వైద్యశాలలు 64 ఉన్నాయి. అదేవిధంగా సంచార పశు వైద్య శాలలు 13 ఉన్నాయి. పశువుల వివరాలు జిల్లాలో ఆవులు 3,77, 960 ఉన్నాయి. గేదెలు 97, 845 ఉన్నాయి. గొర్రెలు 4,48, 154, మేకలు 1, 56, 511, పందులు 2585, కోళ్లు 51, 26, 764 ఉన్నాయి. 150 రకాల మందులు అందుబాటులో ఉండాలి ఖాళీగా 14 పశువైద్యుల పోస్టులు జిల్లాలో 14 పశువైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా ఒక ఎ.డి పోస్టు, ఒక వెటర్నరీ లైవ్స్టాఫ్ అధికారి పోస్టు ఖాళీగా ఉన్నాయి. గంట్యాడ మండలం బోనంగి, మెరకముడిదాం, గర్భం, గరివిడి మండలంలోని జి.బొండపల్లి, ఎస్.కోట మండలం బొడ్డవర, దత్తిరాజేరు, దత్తిరాజేరు మండలం మానాపురం, వంగర, వంగర మండలం రాజుల గుమడ, చీపురుపల్లి, మెంటాడ, రామభద్రపురంలో మండలం కొట్టక్కి, రాజాం మండలంలో పొగిరి, సంకలిలో పశువైద్యుల కొరత ఉంది. అదేవిధంగా రాజం ఎ.డి (సహాయ సంచాలకుడు), గంట్యాడ మండలం పెదవేమలిలో వెటర్నీరీ లైవ్స్టాఫ్ అధికారి పోస్టు ఖాళీగా ఉన్నాయి. అందని నాణ్యమైన పశువైద్యం పశువైద్యుల కొరత వల్ల మూగజీవాలకు నాణ్యమైన వైద్యం అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామ పశు సంవర్థక శాఖ సహాయకులు వారి పరిజ్ఞానం మేరకు చికిత్స అందిస్తున్నారు. పశు వైద్యశాలల్లో వైద్యుల కొరత 14 పశు వైద్యశాలల్లో వైద్యులు లేరు రాజం ఎ.డి పోస్టు కూడా ఖాళీ పశు సంవర్థక శాఖ సహాయకులే దిక్కు జిల్లాలో పశు వైద్య శాలలు 118 జిల్లాలో 3,77,960 అవులు గేదెలు 97,845ఖాళీగా పశువైద్యాధికారి పోస్టులు జిల్లాలో కొన్ని చోట్ల పశు వైద్యాధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రిక్రూట్ మెంట్ అయితే వైద్యులు వస్తారు. డాక్టర్ ఎన్. దామోదర్రావు, జిల్లా పశుసంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్ -
ప్రశాంతంగా ముగిసిన ‘నీట్’
విజయనగరం అర్బన్: జిల్లాలో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల ప్రవేశ పరీక్ష నీట్–యూజీ 2026 ఆదివారం ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 6 పరీక్షా కేంద్రాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 1,824 మంది అభ్యర్థులు నమోదు చసుకోగా 1,790 మంది హాజరై పరీక్ష రాశారు. 34 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు సంభవించకుండా అధికారులు సమగ్ర ఏర్పాట్లు చేశారు. పరీక్ష నిర్వహణను పర్యవేక్షించేందుకు నియమితులైన జిల్లా జాయింట్ కలెక్టర్ (నోడల్ అధికారి) సేతు మాధవన్ పరీక్షా కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు పోలీస్, విద్యాశాఖ సహా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసినట్లు అధికారులు తెలిపారు. గోడకూలి ఇద్దరికి గాయాలుసీతానగరం: మండలంలోని తామరఖండి గ్రామంలో ఇంటిపని చేస్తుండగా ఆదివారం గోడకూలి ఇద్దరు మేసీ్త్రలకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తామరఖండిలో బొంగు తవిటినాయుడు ఇంటిపనికి బొబ్బిలికి చెందిన కర్రి సింహాచలం, కర్రి లక్ష్మణ వచ్చారు. ఆదివారం ఉదయం పని ప్రారంభించి పాత ఇంటి గోడల మధ్య కాలమ్స్ కడుతుండగా ఆదేఇంటికి సంబంధించిన పాతగోడ కూలి పోయి ఇటుక బెడ్డలు ఆ ఇద్దరిపై పడడం వల్ల గాయాలయ్యాయి. క్షతగాత్రులు సింహాచలం, లక్ష్మణలను 108 వాహనంలో చికిత్సనిమిత్తం పార్వతీపురం జిల్లాకేంద్రాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సింహాచలం పరిస్థితి విషమించడంతో విజయనగరం మహరాజా ఆస్పత్రికి తరలించగా లక్ష్మ ణ పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కీసరలో ఏనుగుల విధ్వంసంభామిని: మండలంలోని కీసరలో నాలుగు ఏనుగులు ఆదివారం పంటలు ధ్వంసం చేసి నష్టంకలిగించాయని రైతులు వాపోతున్నారు. ఏనుగులు గతంలో మొక్కజొన్న పంటనే తినివేసేవి. ప్రస్తుతం రైతులు ఆలుగాలం శ్రమించి పండించి ఆరబెట్టిన మొక్కజొన్న గింజలపై ప్రతాపం చూపాయి. గ్రామం చుట్టూ ఆరబెట్టిన మొక్కజొన్న కళ్లాల్లో విచ్చల విడిగా తిరుగాడుతూ ఆరబెట్టిన గింజలను ధ్వంసం చేసి బస్తాల్లో కుట్టిన మొక్కజొన్న గింజలను పాడు చేశాయి. జొన్న గింజల బస్తాలను నాలుగు పక్కలను విసిరివేస్తూ పాడు చేశాయి. పంటలు ఇంటికి చేరే సమయంలో ఏనుగులు విధ్వంసం చేయడాన్ని రైతులు జీర్ణించుకోలేక పోతున్నారు. అప్పులబాధతో వ్యక్తి ఆత్మహత్యవిజయనగరం క్రైమ్: స్థానిక తోటపాలెం నివాసి బూర రాము (44) తన కంపెనీలో ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి రూరల్ ఎస్సై అశోక్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వీటీ అగ్రహారంలో సిల్వర్ గిన్నెల కంపెనీ నడుపుతున్న రాము మొదటి భార్య మృతి చెందగా, రెండో భార్య సంధ్య, ముగ్గురు పిల్లలతో ఉంటున్నాడు. కంపెనీ కోసమని రూ.యాభై లక్షల వరకు అప్పు చేశాడు. అయితే కంపెనీ టర్నోవర్లో తీవ్ర నష్టం రావడం, తీసుకున్న అప్పులు సకాలంలో కట్టలేకపోవడంతో మనస్తాపం చెంది కంపెనీలోనే రాడ్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని భార్య సంధ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై అశోక్ తెలిపారు. -
‘నీట్’గా రాయండి: కలెక్టర్
● సమయానికి గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలి ● హాజరు కానున్న 1,824 మంది అభ్యర్థులు విజయనగరం అర్బన్: జిల్లాలో ఆదివారం నిర్వహిస్తున్న నీట్ యూజీ ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి తెలిపారు. పరీక్ష ఏర్పాట్లపై శనివారం సమీక్ష నిర్వహించిన ఆయన జిల్లాలోని 6 పరీక్ష కేంద్రాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందని వెల్లడించారు. మొత్తం 1,824 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారని చెప్పా రు. పరీక్ష నిబంధనలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొకుండా ఉండాలంటే పరీక్ష ప్రారంభానికి కనీసం గంట ముందే మధ్యాహ్నం 1 గంటలలోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. నిర్ణీత సమయం దాటిన తర్వాత కేంద్రంలోకి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. అభ్యర్థుల సౌకర్యార్ధం కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పరీక్షకు సంబంధించి సందేహాలు ఉన్న వారు 08922–236947 నంబరుకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించవచ్చని సూచించారు. బాల్య వివాహాలు నిరోధించాలి ● కలెక్టర్ రాంసుందర్ రెడ్డి విజయనగరం ఫోర్ట్: బాల్యవివాహాల నిరోధంపై ప్రత్యేక దృష్టిసారించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో శనివారం కిశోర బాలబాలికల కోసం రూపొందించిన కిశోరీ వికాసం సమ్మర్ క్యాంపెయిన్–2020 వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ఒకటి నుంచి 9వ తేదీ వరకు క్యాంపెయిన్ ఉంటుందన్నారు. క్యాలెండర్ ప్రకారం కిశోర బాలలకు జీవన నైపుణ్యాలు, స్వీయ అవగాహన, రక్తహీనత నివారణ, హెచ్ఐవీ, ఎయిడ్స్ వంటి అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. పోక్సో, బాల్యవివాహాల నిరోధక చట్టం, గృహహింస నిరోధక చట్టం, విద్యాహక్కు చట్టం పనితీరును వివరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ సాధికారత అధికారిణి కె.వి. బాలామణి, జిల్లా బాలల సంరక్షణ అధికారులు బి.హెచ్.లక్ష్మి, బి.రామకోటి, వై. నాగరాజు, కె.జయలక్ష్మి, వి.సంధ్యకుమారి, జి.రజని, ఆర్.సరస్వతి, చంద్రమౌళి, అరుణ్, అనిల్, తదితరులు పాల్గొన్నారు. శుభకార్యానికి వెళ్తుండగా.. అనంతలోకాలకు.. ● రోడ్డు ప్రమాదంలో వంట మాస్టర్ మృతి ఆనందపురం: విజయనగరం జిల్లా గుర్ల గ్రామానికి చెందిన గెడ్డపు ఈశ్వరరావు(32) శనివారం మధ్యాహ్నం గుడిలోవ సమీపంలో జరిగిన రోడ్డు ప్ర మాదంలో మృతి చెందాడు. విజయవాడలోని ఒక రెస్టారెంట్లో ఆయన వంట మాస్టర్గా పనిచేస్తున్నాడు. తన ఇంట్లో జరగబోయే శుభకార్యానికి హాజరయ్యేందుకు బైక్పై వెళ్తుండగా.. ఎన్హెచ్–16పై ముందు వెళ్తున్న లారీని తప్పించే క్రమంలో అదుపుతప్పి రోడ్డుపై పడిపోయారు. తలకు బలమైన గాయాలు కావడంతో దుర్మరణం చెందాడు. అతనికి భార్య, పాప, బాబు ఉన్నారు. ఆనందపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం భీమిలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈశ్వరరావు తలి సరస్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐవాసునాయుడు కేసు నమోదు చేశారు. -
హోటల్స్కు గుదిబండ..!
● సంక్షోభంలో హోటల్స్ రంగం ● ఏకంగా సిలిండర్పై రూ.993 పెంపు ● ప్రస్తుతం వాణిజ్య సిలిండర్ ధర రూ.3,315లు ● జిల్లాలో వాణిజ్య సిలిండర్లు సంఖ్య: 30,000 ● ఏడాదికి రూ.60 కోట్ల వరకు భారం ● కేటరింగ్, హోటళ్లపై పెనుభారం ధరల పెంపు హోటల్ రంగానికి ముప్పు జాతీయ ఆయిల్ కంపెనీలు, ప్రభుత్వం మే 1 నుంచి వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచడం హోటల్ రంగానికి పెను ప్రమాదంగా మారింది. హోటల్ నిర్వహణ క్లిష్టతరం. ఈ ఏడాది మార్చి1 నుంచి మే 1వ తేదీ వరకు ఒక్కో సిలిండర్పై రూ.1,320 వరకు సుమారు 81 శాతం ధర పెరిగింది. ధరలు తగ్గించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. లేదంటే బంద్కు పిలుపునిస్తాం. – జి.శ్రీనివాసరావు, ఏపీ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టిఫిన్ సెంటర్ నిర్వహించడం కష్టమే... వాణిజ్య సిలిండర్ ధర ఏకంగా రూ.993 పెరిగింది. దీంతో సిలిండర్ ధర రూ.3,315 అయ్యింది. అంత ధర పెట్టి వాణిజ్య సిలిండర్ పెట్టి టిఫిన్ సెంటర్ నిర్వహించాలంటే కష్టమే. ఒక వేళ నిర్వహించినా టిఫిన్ ధరలు పెంచాల్సి వస్తుంది. వినియోగదారులు తగ్గితే నష్టం తప్పదు. – రమణ, టిఫిన్ సెంటర్ నిర్వాకుడు, విజయనగరంవిజయనగరం ఫోర్ట్/విజయనగరం: నిన్న, మొన్నటి వరకు గృహవినియోగదారులతో పాటు వ్యాపారులకు వాణిజ్యసిలిండర్లు దొరకని పరిస్థితి. వాణిజ్య సిలిండర్ల కొరతతో చాలా హోటల్స్, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు మూతపడ్డాయి. కొన్నిచోట్ల నడిచినా భోజనం, బిర్యానీ, టిఫిన్ ధరలు అమాంతం పెంచేశారు. ఇప్పుడిప్పుడే పరిస్థితి చక్కబడుతుందనుకుంటున్న తరుణంలో ఎద్దుపుండు మీద కారం చల్లిన సామెత చందాన వాణిజ్య సిలిండర్ ధరను ప్రభుత్వం అమాంతం పెంచడంతో వినియోగదారులపై మరింత భారం పడనుంది. దీంతో వారి మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది. హోటళ్లు, ఫాస్ట్ఫుడ్, టిఫిన్ సెంటర్ల నిర్వహణ గుది‘బండ’గా మారింది. రూ.కోట్లలో భారం.. వాణిజ్య సిలిండర్ (కమర్షియల్) ధర రూ.2,322 ఉండేది. ప్రభుత్వం వాణిజ్య సిలిండర్ ధరను రూ.993కు పెంచింది. దీంతో వాణిజ్య సిలిండర్ ధర రూ.3,315కు చేరింది. ఏకంగా ఒకేసారి రూ.993 పెరగడంతో వాణిజ్య సిలిండర్లు వినియోగించేవారు నోరెళ్ల బెట్టాల్సిన పరిస్థితి. జిల్లాలో 30 వేలు వరకు వాణిజ్య సిలిండర్లు ఉన్నాయి. వాణిజ్య సిలిండర్లు కొంతమందికి నెలకు ఒకటి రెండు వినియోగిస్తారు. మరి కొంతమంది నెలకు 10 వరకు వినియోగిస్తారు. వాణిజ్య సిలిండర్లు వినియోగించే వారిపై నెలకు రూ.5 కోట్లు వరకు, ఏడాదికి రూ.60 కోట్లు వరకు భారం పడనుంది. హోటల్ నిర్వహణకు గడ్డు పరిస్థితి వాణిజ్య సిలిండర్ ధర భారీగా పెరగడంతో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ఫుడ్, బిర్యానీ సెంటర్ల నిర్వహణ కష్టతరంగా మారింది. రూ.3,315 పెట్టి వాణిజ్య సిలిండర్లు కొనుగోలు చేసి హోటళ్లు, టిఫిన్ సెంటర్లు నిర్వహించాలంటే అసాధ్యంగా కనిపిస్తోంది. ఒకవేళ కష్టమీద నడిపినా ధరలు అమాంతం పెరగడం కాయం. దీనివల్ల తినేవారు తగ్గితే నష్టాలు తప్పవని హోటల్ నిర్వాహకులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే రెండు ఇడ్లీ రూ.30, మినపదోశ రూ.50, మినప ఉల్లి దోస రూ.60, కాయగూర భోజనం రూ.120కి, చికెన్ బిర్యానీ రూ.200 విక్రయిస్తున్నారు. వీటి ధరలు మరింత పెరగనున్నాయి. -
స్వామికి అపచారం.. ఎందుకంత నిర్లక్ష్యం?
● ఆలయ అసలు విగ్రహాలను అలా పడేస్తారా..? ● తోటపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద స్వామి సేవకుల నిరసన సాక్షి, పార్వతీపురం మన్యం/గరుగుబిల్లి: తోటపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అపచారం జరిగినా దేవదాయశాఖ అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్వామివారి సేవకులు ప్రశ్నించారు. ఆలయంలో కొద్ది రోజులుగా చేపడుతున్న నిర్మాణ పనులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని మండిపడ్డారు. స్వామి వారి విగ్రహాన్ని తొలగించి, నిర్లక్ష్యంగా రహదారి పక్కన రేకుల షెడ్డులో వదిలేయడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్థానిక బీజేపీ నేతలు ద్వారపురెడ్డి శ్రీనివాసరావుతో కలిసి శనివారం ఆలయం వద్ద నిరసన తెలిపారు. రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ఆలయ చైర్మన్, ఈవోకు వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా.. వారు అందుబాటులోకి రాలేదు. దీంతో చాలాసేపు అక్కడే ధర్నా చేయడంతో అక్కడున్న ప్రైవేట్ ట్రస్టు సభ్యులు స్వామి సేవకులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం ద్వారపురెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని చెప్పారు. కేంద్రం అందించే ఉపాధి నిధులతో కూడా ఇక్కడ పలు పనులు చేపడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. స్వామి వారికి అపచారం చేయవద్దని తాము కోరుతున్నామన్నారు. అన్నవరం సత్యదేవుని ఆలయంలో మాదిరి.. ఇక్కడ కూడా కొత్త ప్రతిమలతో పాటు, పూర్వ విగ్రహాలను ముందు ప్రతిష్ఠించి నిత్య పూజలు అందేలా చేస్తామని అప్పట్లో చెప్పారని, ఇప్పుడు అందుకు విరుద్ధంగా చేశారన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా దేవదాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని.. ట్రస్టు కార్యకలాపాలపై పర్యవేక్షణ చేయాలని కోరారు. కార్యక్రమంలో హిందూ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
కుటుంబ సర్వేను పారదర్శకంగా చేపట్టాలి
● డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ● అధికారులతో సమీక్ష.. సంఘాల నుంచి వినతుల స్వీకరణ విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం సుప్రీంకోర్డు మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య డెడికేటెడ్ కమిషన్ శనివారం జిల్లాలో పర్యటించింది. కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డితో కలిసి ఉమ్మడి జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బీసీ రిజర్వేషన్ల అమలులో ఏకీకృత కుటుంబ సర్వే (యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే) అత్యంత కీలకమని స్పష్టం చేశారు. బీసీ కులాల డేటా మ్యాపింగ్లో ఎటువంటి తారతమ్యాలు లేకుండా కచ్చితమైన సమాచారం సేకరించాలని ఆదేశించారు. గత ఎన్నికల్లో బీసీ వర్గాలకు కేటాయించిన సీట్లు, మొత్తం సీట్లలో వారి ప్రాతినిధ్య నిష్పత్తి వివరాలను వెంటనే అందజేయాలన్నారు. సర్వే ప్రక్రియ పూర్తయిన తర్వాత పారదర్శకత కోసం గ్రామ సభలు నిర్వహించి డేటాను సరిచూసుకోవాలని అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో కుటుంబ సర్వే ప్రక్రియను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని, ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించి సర్వే నాణ్యతను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో డెడికేటెడ్ కమిషన్ సెక్రటరీ డి.చంద్రశేఖర్రాజు, ఏఎస్పీ పి.సౌమ్యలత, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసపాణి, బీసీవెల్ఫేర్ అధికారులు జె.జ్యోతిశ్రీ, ఇ.అప్పన్న, సీపీఓ పి.బాలాజీ, డీపీఓ మల్లిఖార్జున, ఏడు మున్సిపాలిటీల కమిషనర్లు పాల్గొన్నారు. ● వెనుకబడిన తరగతుల జనాభా దామాషాను ఆధారంగా తీసుకుని స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని విజయనగరం నాగవంశ సంక్షేమ సంఘం అధ్యక్షుడు అవనాపు విక్రమ్ కోరారు. ఈ మేరకు సంఘం ప్రతినిధులు కాళ్ల గౌరీశంకర్, సముద్రపు రామారావు, అవనాపు సత్యనారాయణ, రామసింగు సత్యప్రసాద్, తదితరులతో కలిసి కమిషన్ చైర్మన్కు వినతిపత్రం అందజేశారు. ● జిల్లాలో ఉన్న బీసీల్లో అధిక శాతం కొప్పుల వెలమ కులం ప్రజలున్నారని, వారిలో పేదకుటుంబాలే అధికమని, కులస్తులకు బీసీ–డి కేటగిరీ నుంచి బీసీ–బీ/ఏ కేటగిరీలోకి మార్చాలని కొప్పుల వెలమ సంక్షేమ సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు డెడికేటెడ్ కమిషన్ చైర్మన్కు వినతిపత్రం సమర్పించారు. ● బీసీ–డి కులధ్రువపత్రాల జారీ విషయంలో జిల్లాల వారీగా వివక్ష కొనసాగుతోందని పట్టణ కళింగ వైశ్య వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ మిశ్రాకు వినతి పత్రం సమర్పించారు. -
తారకరామ తీర్ధసాగర్పై కలెక్టర్ సమీక్ష
విజయనగరం అర్బన్: తారకరామ తీర్ధసాగర్ రిజర్వాయర్ ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రెవెన్యూ, సాగునీటి శాఖ అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రాజెక్టు పురోగతిపై ఆయన చర్చించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ పనులపై అధికారులతో సమీక్షిస్తూ మొత్తం రూ.110 కోట్ల పరిపాలన అనుమతుల కోసం తక్షణమే ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ప్రాజెక్టు పనులను తిరిగి ప్రారంభించి త్వరగా పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే ప్రాజెక్టు ప్రభావిత గ్రామాల ప్రజలతో చర్చించి వారి అభిప్రాయాలు తెలుసుకోవాలని, సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, ఆర్డీఓ సుధాసాగర్, ఇరిగేషన్ జాఖ అధికారులు పాల్గొన్నారు. పరిశ్రమల స్థాపన వేగవంతం చేయాలి జిల్లాకు మంజూరైన పరిశ్రమలు, ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు, పరిశ్రమల శాఖ అధికారులతో సమీక్షమావేశం నిర్వహించారు. జిల్లాలో ఆమోదం పొందిన పరిశ్రమలు వేగంగా అమలు కావాలని ముఖ్యంగా ఎంఎస్ఎంఈ యూనిట్లు, ఫుడ్ పార్క్లు, ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన ఎంఓయూలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పరిశ్రమలకు అవసరమైన లాజిస్టిక్స్ సదుపాయాలను కూడా సమర్ధవంతంగా ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ఆర్డీఓలు సుధాసాగర్, సుధారాణి, రామ్మోహన్రావు, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తమ ప్రతిభకు.. మార్కులే ‘సాక్షి’
పదోతరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చూపారు. అధికమంది ఉత్తమ మార్కులు సాధించారు. దీనికి ‘సాక్షి’ యాజమాన్యం అందించిన పదోతరగతి మెటీరియల్ దోహదపడిందని విద్యార్థులు చెబుతున్నారు. సరళంగా, వివరణాత్మకంగా, సులభంగా అర్థంచేసుకునేందుకు వీలుగా విద్యానిపుణులతో తయారుచేసిన మెటీరియల్ ఉత్తమ మార్కుల సాధనకు ఉపయోగపడిందని పేర్కొన్నారు. మంచి మెటీరియల్ అందించి విజయంలో భాగస్వామ్యమైన ‘సాక్షి’కి కృతజ్ఞతలు చెబుతున్నారు. – సాక్షి నెట్వర్క్ 593 మార్కులు సాధించా పదో తరగతిలో 593 మార్కులు సాధించాను. నా విజయంలో ఉపాధ్యాయుల బోధనతో పాటు సాక్షి యాజ మాన్యం అందజేసిన స్టడీ మెటీరియల్ ఎంతగానో దోహదపడింది. సాక్షి యాజమాన్యానికి ధన్యవాదాలు. – బడే సృజన, బీజేపురం, జెడ్పీహైస్కూల్, జియ్యమ్మవలస చదువుకు సాయం పదో తరగతి విద్యార్థులకు సాక్షి యాజమాన్యం అందించిన గణితం, సైన్స్ సబ్జెక్టుల మేటీరియల్ సందేహాలను తీర్చింది. చదువుకు సహకరించింది. ఉత్తమ మార్కుల సాధనకు ఉపయోగపడింది. – బి. సాయిదీపిక (580), జియ్యమ్మవలస జెడ్పీ హైస్కూల్ ఆశించిన మార్కులకు ‘సాక్షి’సహాయం పదోతరగతి పరీక్ష ఫలితాల్లో 595 మార్కుల సాధనకు ‘సాక్షి స్టడీ’ మెటీరియల్ సహాయపడింది. గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో సందేహాల నివృత్తికి మెటీరియల్ దోహదపడింది. గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో 100కి 100 మార్కులు సాధించగలిగాను. – ఆర్.నిత్యకనక వర్షిణి, సీతానగరం మెటీరియల్ చదివి అధిక మార్కులు సాధించా సాక్షి యాజమాన్యం గణితం, సైన్స్ సబ్జెక్టుల స్టడీమెటీరియల్ను చది వాను. పదోతరగతిలో 585 మార్కులు సాధించాను. అధిక మార్కుల సాధనకు ఉపాధ్యాయుల బోధనతో పాటు మెటీరియల్ దోహదపడింది. – బోధంకి సాయికృష్ణ, రాచకిండాం హైస్కూల్ కంటెంట్పై పట్టు సాధించగలిగాను మాకు పబ్లిక్ పరీక్షల ముందు సాక్షి యాజమాన్యం స్టడీ మెటీరియల్ అందించింది. ఈ పుస్తకాల్లో కంటెంట్ కనిపించింది. ఒక ప్రశ్న ఎన్ని రకాలుగా రావొచ్చు.. ఎన్ని విధాలుగా జవాబు ఇవ్వగలమనే అంశాలు నేర్చుకున్నాను. ప్రాక్టీస్ చేశాను. పదో తరగతి ఫలితాల్లో 594 మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలల్లో జిల్లా టాపర్గా నిలిచాను. – గొర్లె సాద్విక, చిన్నయ్యపేట -
మా దేవుడు మీరే మాస్టారు
● రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడి మృతి ● గ్రామస్తుల కంటకన్నీరురామభద్రపురం: గ్రామంలోని పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తూ అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో చనిపోయారన్న సమాచారం తెలిసిన వెంటనే గ్రామస్తులంతా విషాదంలో మునిగిపోయారు. మంచి మాస్టారును కోల్పోయామని, హఠాత్తుగా విషాద వార్త వినాల్సి వస్తుందను కోలేదని గ్రామంలోని ప్రజలు, చిన్నారులు, తల్లిదండ్రులు వాపోయారు. రామభద్రపురం మండలంలోని నాయుడువలస గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో మూడేళ్లుగా ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న రెడ్డి వేణు మాస్టారు గురువారం పార్వతీపురం మండలంలోని బంధువుల ఇంట పెళ్లికి ద్విచక్రవాహనంపై వెళ్తూ వెంకంపేట పంచాయతీ వైకేఎంనగర్ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. మూడేళ్ల పాటు టీచర్గా పనిచేసిన ఆయన గ్రామంలోని అందరిలో కుటుంబసభ్యుడిగా కలిసిపోయారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తూ మంచి మాస్టారుగా పేరు పొందారు.హెచ్ఎం అకాల మరణం అందరినీ కలిచివేసింది. శుక్రవారం వైఎస్సార్సీపీ నియోజకవర్గం రైతు విభాగం అధ్యక్షుడు నడిమింటి సత్యం, గ్రామ తాజా మాజీ సర్పంచ్ లక్ష్మి ఆధ్వర్యంలో గ్రామప్రజలు, తల్లిదండ్రులు,విద్యార్థులు మాస్టారు మృతిపట్ల రెండు నిమిషాలు మౌనం పాటించడంతో పాటు సంతాపం తెలుపుతూ కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. ఎంఈవో తిరుమలప్రసాద్, పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం జేసీ రాజులు వేణు మాస్టారి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. -
ఉపాధి వేతనదారులకు గుర్తింపు కష్టాలు
రామభద్రపురం: ఉపాధిహామీ పథకంలో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన (నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్) యాప్ ఫేస్ అంథెంటికేషన్ నిబంధన కూలీలకు కష్టాలు తెచ్చిపెడుతోంది. నెట్వర్క్ సమస్యలు, సాంకేతిక లోపాలు, ఈ–కేవైసీ పెండింగ్ వంటి కారణాలతో కూలీలకు హాజరు పడడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధిహామీ పథకంలో నిబంధనలు పెట్టడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం వేసవి సీజన్లో ప్రతి గ్రామంలో ఉపాధిహామీ పనులు జరుగుతున్నాయి. జిల్లాలో 3.45 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. వాటిలో సుమారు 6,26,094 మంది వేతనదారులు ఉండగా రోజుకు సుమారు 1.70 లక్షల మంది ఉపాధి పనులకు హాజరవుతున్నారు. వారికి ఫేస్ ఆథెంటికేషన్ యాప్ ద్వారా ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు కూలీల వివరాలను నమోదు చేస్తున్నారు. అయితే ఆ సమయంలో సాంకేతిక సమస్యల కారణంగా కూలీల ముఖ గుర్తింపు సరిగ్గా నమోదు కాకకపోవడం, సర్వర్ సమస్యల కారణంగా పడిగాపులు కాయాల్సి వస్తోందని కూలీలు వాపోతున్నారు.కొన్ని గ్రామాల్లో పనులు చేయక ముందే ఫేస్ ఆథెంటికేషన్ యాప్ ద్వారా ముఖ గుర్తింపు నమోదు చేస్తుండగా వారి వివరాలతో పాటు ముఖ గుర్తింపు నమోదైన వారు పనులు చేస్తున్నారు.నమోదు కాని వారు మొర్రో అంటూ కిలోమీటర్లు నడిచి తిరిగి ఇంటికి వెళ్లిపోతున్నారు. అలాగే మరి కొన్ని గ్రామాలలో పనులు పూర్తయ్యాక ఇంటికి వెళ్లిపోయే ముందు ఆయా ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు ముఖ గుర్తింపు, వివరాలు నమోదు చేస్తున్నారు. ఆ సమయంలో సాంకేతిక సమస్యల కారణంగా కూలీల ముఖ గుర్తింపు సరిగ్గా నమోదు కాని కూలీలు ఆ రోజు వేతనం నష్టపోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫేస్ ఆథెంటికేషన్ సమస్యతో కళ్లు,వేలి ముద్రలు, ఆధార్ మిస్మ్యాచ్ సమస్యతో యాప్ గుర్తించకపోవడం, ఫేస్ మ్యాచ్ కాకపోవడంతో హాజరు పడడం లేదని కూలీలు చెబుతున్నారు. పని ప్రదేశంలో ఇంటర్నెట్ సరిగ్గా పని చేయకపోవడంతో ఫొటోలు తీయడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని క్షేత్ర స్థాయి సిబ్బంది అంటున్నారు. వేతనదారుల ఆకలికేకలు.. ఉపాధి హామీ శ్రామికులు ఉపాధి పనులు చేయగా వచ్చే వేతనాలతోనే బతుకు బండిని నెట్టాలి.అయితే వారి పొట్టకొట్టేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది.మండుటెండలో కష్టపడి పనిచేసిన కూలీలకు ఏకంగా నాలుగు నెలలుగా కూలి డబ్బులు చెల్లించకుండా పస్తులు పెడుతోంది. వారు చేసిన పనులకు గానూ జిల్లాలో దాదాపు రూ.24 కోట్ల మేర చెల్లించాల్సి ఉన్నా..ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఉపాధి వేతనాలు అందక వేతనదారులు నానా అగచాట్లు పడుతున్నారు.నాలుగు నెలలకు సంబధించిన ఉపాధి కూలి ఖాతాల్లో జమకాకపోవడంతో కూలీనాలీ చేసుకుని జీవనం సాగించే కుటుంబాలు తల్లడితున్నాయి. ఫేస్ ఆథెంటికేషన్కు సాంకేతిక సమస్య పడిగాపులు కాస్తున్న కూలీలు కానరాని వేసవి భత్యం నాలుగు నెలలుగా అందని వేతనాలు వేతనదారుల వేదన ఆగిన వేసవి భత్యం.. వేసవిలో మండుటెండలను సైతం లెక్క చేయకుండా భారీ సంఖ్యలో శ్రామికులు ఉపాధి పనుల్లో పాల్గొంటున్నారు.ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వేసవిలో భత్యం అందిస్తూ వస్తున్నాయి.ఉపాధిహామీ పథకంలో ఏటా వేసవి భత్యాన్ని ఫిబ్రవరి నుంచి జూన్ నెల వరకు నెల వారీగా పెంచి అందించే వారు. చేసిన పనికి తగ్గట్లు 15 నుంచి 30 శాతం వరకు అదనపు భత్యం లభించేది. వేతనదారులకు ఒక్కొక్కరికి రోజువారీ రూ.200 వస్తే వేసవి భత్యం 30 శాతం కలిపి రూ.260 వారి ఖాతాలకు వారి ఖాతాలకు జమచేసేవారు. అయిటే కూటమి ప్రభుత్వం వచ్చాక వేసవి భత్యం అందించకపోవడంతో శ్రామికులు ఆర్థికంగా నష్టపోతున్నారు.అలాగే వారి జీవనంపై అదనపు భారం పడుతోంది. ఇప్పటి నుంచైనా వేసవి భత్యం ఇవ్వాలని వేతనదారులు కోరుతున్నారు. వయసు పైబడిన వారితో ఇబ్బంది సాంకేతిక సమస్య కారణంగా వయసు పైబడిన కూలీలకు కొంత ఇబ్బంది కలుగుతోంది. కళ్లు, వేలిముద్రలు గుర్తించకపోవడం,ఫేస్ మ్యాచ్ కాకపోవడం జరుగుతోంది. అలాంటి వారికి కొంత ఇబ్బందైనా నష్టం కలగకుండా ఒకటికి రెండు సార్లు ప్రయత్నించి హాజరు పడేలా చూస్తున్నాం. వేతనదారులు నష్టపోకుండా కూలి డబ్బులు పడేలా చర్యలు తీసుకుంటాం. ఎస్ శారదా దేవి,ఉపాధిహామీ పీడీ -
ఆయిల్ ట్యాంకర్, బస్సు, కారు ఢీ
● నుజ్జునుజ్జయిన కారుసాలూరు: పట్టణ సమీపంలో జాతీయరహదారిపై శుక్రవారం ఉదయం ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. కాసేపటికి ప్రమాదానికి గురైన బస్సును వెనుకనుంచి కారు ఢీకొట్టింది. ఈ ఘటనపై ఎస్సై అనిల్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సాలూరు నుంచి రామభద్రపురం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును రామభద్రపురం నుంచి సాలూరు వస్తున్న జియో ఆయిల్ ట్యాంకర్ బలంగా ఢీకొట్టింది.ఈ సంఘటన జరిగిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైన బస్సును వెనుకనుంచి వచ్చి ఓ కారు ఢీకొట్టడంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది.ఈ ప్రమాదంలో బస్సు కండక్టర్, లారీ క్లీనర్కు గాయాలవగా, స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. బస్సులో ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రమాదం కారణంగా ట్రాఫిక్ జామ్ అవడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లియర్ చేశారు.దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
చివరి ప్రయాణం
పాలకొండ రూరల్: ఒకే గ్రామానికి చెందిన నలుగురి ఆఖరి ప్రయాణం గ్రామస్తులను విషాదంలో ముంచేసింది. ఆ నలుగురి మృతదేహాలకు ఒకే చోట దహన సంస్కారాలు జరుగుతుంటే గ్రామస్తుల కన్నీరు ఆగలేదు. పాలకొండ మండలానికి చెందిన పలువురు గిరిజనులు గురువారం సీతంపేట మండలం పుబ్బాడలో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లి ఆటోలో తిరిగి వస్తుండగా మీనకోట మలుపు వద్ద ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో జంపరకోటకు చెందిన ఆరిక లక్ష్మి (55), కొండగొర్రి శ్రావణి (25), ఉర్లక శాంతి (30)తో పాటు ఆటో డ్రైవర్ అక్కుపల్లి రమణ (36) మృతి చెందిన విషయం విదితమే. ఈ క్రమంలో వారి మృతదేహాలకు శుక్రవారం పాలకొండ ఏరియా ఆస్పత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ కె.చిరంజీవి పర్యవేక్షణలో పోస్టుమార్టం చేపట్టారు. అప్పటికే మృతుల బంధువులు, వారి గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. పోలీసుల పంచనామా అనంతరం అధికారిక చర్యలు పూరికావడంతో మధ్యాహ్నం 12 గంటలకు మృతదేహాలను మహిళల స్వగ్రామం జంపరకోటకు, ఆటో డ్రైవర్ మృతదేహం ఆయన గ్రామమైన డోలమడకు ప్రత్యేక వాహనాల్లో తరలించారు. మృతదేహాలు గ్రామాలకు చేరడంతో ఒక్కసారిగా ఆయా పల్లెల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువులు, గ్రామస్తులు, సన్నిహితుల రోదనలు మిన్నంటాయి. డోలమడలో ఆటో డ్రైవర్కు అంత్యక్రియలు నిర్వహించారు. జంపరకోటలలో మృతిచెందిన ముగ్గురు మహిళలతో పాటు అదే గ్రామానికి చెందిన జీలకర్ర మోహనరావు(60) శుక్రవారం సీతంపేట మండలం వాబ వద్ద బైక్పై భార్యతో వస్తుండగా బస్సు ఢీకొనడంతో ఘటనా స్థలంలో మరణించాడు. మోహనరావు మృతదేహానికి సీతంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం పోస్టుమార్టం పూర్తి చేశాక మృతదేహం అదే సమయానికి గ్రామానికి చేరింది. దీంతో నలుగురి మృతదేహాలకు ఒకే చోట దహనసంస్కారాలు చేపట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు రోడ్డు ప్రమాద ఘటనల్లో ఒకే గ్రామానికి చెందిన నలుగురు మరణించటంతో వారి కుటుంబసభ్యుల రోదనలను అదుపుచేయడం ఎవరి తరమూ కాలేదు. ప్రయాణం మిగిల్చిన విషాదాన్ని తలుచుకుంటూ గిరిజనులు తల్లడిల్లిపోయారు. జంపరకోటకు చేరిన మృతదేహాలు ఒకే చోట నలుగురి దహన సంస్కారాలు డోలమడలో ఆటో డ్రైవర్ రమణ అంత్యక్రియలు కన్నీటి పర్యంతమైన రెండు గ్రామాల ప్రజలుకోలుకుంటున్న క్షతగాత్రులు ఇదిలా ఉండగా ఆటో ప్రమాదంలో గాయాలపాలై శ్రీకాకుళంలో వైద్య సేవలు పొందుతున్న కొండగొర్రి మౌనిక, ఎనిమిదేళ్ల నిమ్మక చాందినితోపాటు మృతురాలు శ్రావణి పిల్లలు హేమ, రిషికుమార్తోపాటు గాయపడిన కె.మల్లమ్మ, కె.పద్మలత తదితరులు కోలుకుంటున్నారు. -
ప్రజావ్యతిరేక ప్రభుత్వాలకు బుద్ధిచెబుదాం
విజయనగరం గంటస్తంభం: ప్రపంచవ్యాప్తంగా కార్మికవర్గ పోరాట చరిత్రకు ప్రతీకగా నిలిచిన మే డే వేడుకలు విజయనగరం జిల్లా కేంద్రంలో శుక్రవారం పోరాట స్ఫూర్తితో సాగాయి. చికాగో వీధుల్లో ఎనిమిది గంటల పనిదినం సాధన కోసం కార్మికులు చిందించిన రక్తపు చుక్కలను స్మరించుకుంటూ, నేటి తరపు శ్రామిక వర్గం తమ హక్కుల పరిరక్షణ కోసం గళమెత్తింది. ఉదయం నుంచే నగరంలో ఎర్రజెండాలు రెపరెపలాడుతూ కార్మిక ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించాయి. సీఐటీయూ, సీపీఐ, సీపీఎం, ఏఐసీసీటీయు, సీపీఐ లిబరేషన్ అనుబంధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వేలాదిమంది కార్మికులు, ఉద్యోగులు, కూలీలు వీధుల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు. చేతుల్లో ఎర్రజెండాలు, నోట నినాదాలతో కార్మిక హక్కుల కోసం పోరాట సంకల్పాన్ని వ్యక్తం చేశారు. ఎనిమిది గంటల పని హక్కు కాపాడాలి, కాంట్రాక్ట్ విధానాలను రద్దు చేయాలి, కార్మిక చట్టాల సవరణలను ఉపసంహరించాల, కనీస వేతనం అందజేయాలంటూ నినదించారు. ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలు అమలుచేస్తున్న ప్రభుత్వాలకు బుద్ధిచెబుతామని స్పష్టంచేశారు. నగరంలోని బొంకులదిబ్బ నుంచి ప్రారంభమైన కార్మికుల ప్రదర్మన గంటస్తంభం మీదుగా కోట కూడలి వరకు సాగింది. ఆటో కార్మికులు, ముఠా వర్కర్లు, భవన నిర్మాణ శ్రామికులు, మున్సిపల్ కార్మికులు దారిపొడువునా కార్మిక వర్గ ఐక్యత వర్ధిల్లాలి, లేబర్ కోడ్లను రద్దు చేయాలి అంటూ చేసిన నినదించారు. ● కోట కూడలి వద్ద జరిగిన బహిరంగ సభలో ఐద్వా జాతీయ ఉపాధ్యక్షురాలు ఎస్.పుణ్యవతి మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ, కార్మికుల శ్రమను కారుచౌకగా ధారాదత్తం చేస్తోందని ధ్వజమెత్తారు. 44 కార్మిక చట్టాలను రద్దు చేసి, యజమానులకు కొమ్ముకాసేలా 4 లేబర్ కోడ్లను తీసుకురావడం దారుణమన్నారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని చట్టాలు చెబుతున్నా, స్కీమ్ వర్కర్లకు నామమాత్రపు జీతాలతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారని మండిపడ్డారు. ● పైడి రాజమ్మ సామాజిక భవనంలో ఏఐసీసీటీయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు బొడ్డు వాసుదేవరావు మాట్లాడుతూ, కార్మికులకు కనీస వేతనాలు చెల్లించకుండా, భద్రత లేని వెట్టిచాకిరీ చెయిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్మి బుగత అశోక్, ఎం.రాజు, బి.శంకరరావు పాల్గొన్నారు. ● పసిబిడ్డల అలనాపాలనా చూసే అంగన్వాడీలకు ఇచ్చే వేతనాలు ఏమాత్రం సరిపోవడం లేదని ఐషా రాష్ట్ర అధ్యక్షురాలు కె.గౌతమి ప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. ● సీఐటీయూ నగర కార్యదర్మి బి.రమణ ఎస్బ్ల్యూసీ మార్కెట్ వద్ద జెండా ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులపై దాడులు చేస్తూ హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును కాపాడుకోవడానికి ప్రతి కార్మికుడు పోరాడాలని పిలుపునిచ్చారు. ● సీపీఎం నగర కార్యదర్మి రెడ్డి శంకరరావు డాబా తోటలో జెండా ఆవిష్కరించారు. మే డే స్ఫూర్తితో ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ● సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యు.ఎన్.రవికుమార్ మాట్లాడుతూ, కార్మిక చట్టాలు ఎవరి దయాదక్షిణ్యాల వల్ల వచ్చినవి కావని, రక్తం చిందించి సాధించుకున్నవని గుర్తు చేశారు. -
విశాఖలో చెస్ పోటీలకు జిల్లా క్రీడాకారులు
విజయనగరం: విశాఖ జిల్లాలో జరగబోయే రాష్ట్రస్థాయి ఓపెన్ చెస్ పోటీలకు జిల్లా క్రీడాకారులు సిద్ధమయ్యారు. శుక్రవారం చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం ఆధ్వర్యంలో రింగు్ రోడ్లో గల ఫైర్ చెస్ స్కూల్లో నిర్వహించిన ఎంపిక పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి సుమారు 70 మంది క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించారు. వారిలో బాలుర విభాగంలో శ్రీమన్నారాయణ సాహో, జ్ఞాన ప్రజ్వాల్లు, బాలికల విభాగంలో ఖ్యాతిసాయి, ఎన్.దైన్వికలు ఉత్తమ ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 9,10 తేదీల్లో విశాఖ వేదికగా జరగబోయే రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించనున్నట్లు చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం సీఈఓ కేవీ.జ్వాలాముఖి తెలిపారు. -
గత ప్రభుత్వ కృషి.. అక్కరకు రానున్న రెవెన్యూ సేవలు
● అర్బన్ తహసీల్దార్ ఏర్పాటుకు శ్రీకారం ● వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనే గజిట్ నోట్ ● పట్టణవాసులకు ప్రయోజనకరం 13 రెవెన్యూ గ్రామాలతో గ్రామీణ మండలం 13 రెవెన్యూ గ్రామాలతో గ్రామీణ మండలంగా ఏర్పాటుకానుంది. గ్రామీణ మండల పరిధిలో గుంకలాం, ద్వారపూడి, కొండకరకాం, సిరియాలపేట, రాకోడు, పినవేమలి, కోరుకొండ, సారిక, జొన్నవలస (జగన్నాథపురం), దుప్పాడ, చెలువూరు, నారాయణపురం, మలిచర్ల గ్రామాలను చేర్చారు. విజయనగరం గ్రామీణ మండల తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న ఎం.కూర్మనాథరావు అర్బన్ మండల ఇన్చార్జి తహసీల్దార్గా వ్యవహరించనున్నారు. ఇతర సిబ్బంది నియామక ప్రక్రియ తెలియాల్సి ఉంది. విజయనగరం రూరల్: జిల్లాలో అతిపెద్ద నియోజకవర్గంలో ఒకటైన విజయనగరం వాసులకు రెవెన్యూ సేవలు సులభతరం కానున్నాయి. అర్బన్, గ్రామీణ మండలాలుగా మారుస్తూ కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి గజిట్ నోట్ విడుదల చేశారు. అర్బన్ తహశీల్దార్ కార్యాలయం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ప్రారంభంకానుంది. అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రామీణ మండల తహశీల్దార్ కార్యాలయం బూర్లెపేటలో ప్రస్తుతం ఉన్న చోటనే యథావిధిగా కొనసాగనుంది. ● గత ప్రభుత్వ హయాంలోనే... ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు అందించాలనే సదుద్దేశంతో గ్రామ సచివాలయ వ్యవస్థను గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ప్రజలకు మెరుగైన, త్వరిగతిన రెవెన్యూ సేవలు అందించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆరు జిల్లాలో అర్బన్ మండలాల ఏర్పాటుకు 2023 ఫిబ్రవరి నెలలో శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆరు జిల్లాల్లో అర్బన్ మండలాలుగా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా విజయనగరం అర్బన్ మండలంగా 2023 మే 8న ఆఖరి గజిట్నోట్ (జీఓ నంబర్ 210) జారీచేసి విజయనగరం అర్బన్ మండలంగా ప్రకటించింది. ఏడాదిలోనే ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు ఆలస్యమైంది. అయితే, ఎట్టకేలకు అర్బన్ తహశీల్దార్ కార్యాలయం ఏర్పాటుకు కలెక్టర్ గజిట్ జారీ చేయడంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.4.5 లక్షల జనాభాకు ఒకటే తహశీల్దార్ కార్యాలయం విజయనగరం నియోజకవర్గం పరిధిలో మున్సిపల్ కార్పొరేషన్, విజయనగరం గ్రామీణ మండలం ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం విజయనగరం మున్సిపల్ కార్పోరేషన్లో ఉన్న 50 వార్డు సచివాలయాల పరిధిలో 2.88 జనాభా ఉండగా, విజయనగరం మండలంలోని 22 గ్రామ పంచాయతీల పరిధిలో 43,599 మంది జనాభా నివసిస్తున్నారు. నియోజకవర్గం విస్తీర్ణం 29,226.69 హెక్టార్లలో విస్తరించి ఉంది. మెట్టభూమి విస్తీర్ణం 10,874.81 హెక్టార్లు కాగా, పల్లం భూమి విస్తీర్ణం 7,954.44 హెక్టార్లు. తెలుపు రేషన్కార్డుదారులు సుమారు 80 వేల మంది ఉండగా, వీరిలో అర్బన్ పరిధిలోనే సుమారు 60 వేల మంది ఉన్నారు. విజయనగరం నియోజకవర్గంలో 2,61,133 ఓటర్లు ఉండగా గ్రామీణం మండలంలో 37,732 మంది, కార్పొరేషన్ పరిధిలో 2,23,401 మంది ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గం అంతటికీ ఒకటే తహసీల్దార్ కార్యాలయం ఉండటంతో ఇన్నాళ్లూ సేవల్లో కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎట్టకేలకు విజయనగరం కార్పొరేషన్తో పాటు, హజీసాహెబ్పేటతో అర్బన్ మండలంగా ఏర్పాటు చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు కానుండడంతో ధ్రువపత్రాల మంజూరు వేగవంతంతో పాటు రెవెన్యూ సమస్యలు త్వరతగతిని పరిష్కారానికి ఆస్కారం కలగనుంది. -
పెళ్లింట విషాదం
● తమ్ముడి పెళ్లికి వచ్చి అన్న మృతి ● శోకసంద్రంలో కుటుంబ సభ్యులు రాజాం/సంతకవిటి: సంతకవిటి మండలం మిర్తివలస గ్రామంలో పెళ్లింట విషాదం అలుముకుంది. తమ్ముడి పెళ్లి కోసం పదిరోజుల ముందే వచ్చి పనుల్లో నిమగ్నమైన యువకుడిని మృత్యువు విద్యుత్షాక్ రూపంలో కాటేసింది. మరికొన్ని గంటల్లో పెళ్లిబాజా మోగాల్సిన ఇంటిలో చావుగంట మోగింది. కుటుంబ సభ్యులకు శోకాన్ని మిగిల్చింది. గ్రామస్తుల్లో విషాదం నింపింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్తివలస గ్రామానికి చెందిన పొన్నాడ రమణారావు, పుష్పలత దంపతులకు ముగ్గురు కుమారులు. చిన్నకుమారుడు దీపక్కుమార్ వివాహం శుక్రవారం రాత్రి జరగాల్సి ఉంది. దీనికోసం హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న రెండో కుమారుడు సతీష్ (32) పదిరోజుల కిందట భార్యతో కలిసి మిర్తివలస వచ్చాడు. తమ్ముడి పెళ్లి పనుల్లో బిజీ అయ్యాడు. ఉదయం వంటలు చేయించడం కోసం శుక్రవారం వేకువజామున 4 గంటలకు డాబా మీద ఇంట్లో స్నానానికి వెళ్లాడు. ఎంత సమయానికి భర్త రాకపోవడంతో భార్య మౌనిక డాబా ఎక్కిచూసింది. ఇంటికి అలంకరించి ఉన్న సీరియల్సెట్ తీగలకు తగిలి భర్త పడిపోయినట్లు గుర్తించి కేకలు వేసింది. ఇంతలో కుటుంబ సభ్యులందరూ డాబా మీదకు వెళ్లి చూడగా సతీష్ విద్యుత్షాక్కు గురైనట్లు గుర్తించారు. ప్రైవేటు వాహనంలో శ్రీకాకుళం రిమ్స్కు తరలించగా, అప్పటికే ఆయన మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన తో అటు సతీష్ ఇంటితో పాటు మిర్తివలస గ్రామంలో విషాదం అలుముకుంది. పెళ్లి జరగాల్సిన ఇంటిలో చావుమేళం మోగిందంటూ కుటుంబ సభ్యులు కన్నీరుపెట్టారు. మృతునికి ఎనిమిది నెలల కిందటే పెళ్లి జరిగింది. తమ్ముడి పెళ్లిపనుల్లో ముందుండే సతీష్ అనంతలోకాలకు వెళ్లిపోయిన ఘటనను కుటుంబీకులు జీర్ణించుకోలేకపోతున్నారు. సమాచారం అందుకున్న సంతకవిటి ఎస్ఐ గోపాలరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదుచేశారు. రెండు నెలలు వ్యవధిలో ఆరు మరణాలు మిర్తివలసలో విషాదచాయలు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరిలో గ్రామానికి ఏమైందన్న మాట వినిపిస్తోంది. రెండు నెలలు వ్యవధిలో ఓ చిన్న గ్రామంలో ఆరు మరణాలు సంభవించడం గ్రామస్తులను కలచివేస్తోంది. సతీష్ మృతిచెందిన ఒకరోజు ముందే గ్రామానికి చెందిన రైల్వే ఉద్యోగి కూన మల్లేశు (31) ఏప్రిల్ 30న ఒంగోలులో రైలు దిగుతూ ప్రమాదానికి గురై మృతిచెందాడు. ఆయన మృతదేహం ఇంకా గ్రామానికి చేరలేదు. ఆయనకు భార్య సుమశ్రీ, తల్లిదండ్రులు సత్యవతి, ఆనందరావు ఉన్నారు. వారంరోజుల కిందట గ్రామానికి చెందిన మీసాల చంద్రరావు(55), అప్పటికి పదిరోజులు ముందు కూన బాబూరావు(30), మరో 25 రోజుల ముందు అరసాడ విజయలక్ష్మి(60), అరసాడ వెంకటరావు(65)లు అనే భార్యభర్తలు మృతిచెందారు. కొందరు అనారోగ్యంతో, యువకులు ప్రమాదాల రూపంలో మృతిచెందడం గ్రామస్తుల్లో విషాదం నింపింది. -
నేడు డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ పర్యటన
విజయనగరం అర్బన్: డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్మిశ్రా ఈ నెల 2న జిల్లాలో అధికారిక పర్యటన చేయనున్నట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై కుల సంఘాలు, సామాజిక సంస్థలు, ప్రజాప్రతినిధులు, సాధారణ ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. బస్సులకు ఫిట్నెస్ తప్పనిసరి ● డీటీ సీ మణికుమార్ విజయనగరం గంటస్తంభం: జిల్లాలోని అన్ని విద్యాసంస్థల బస్సుల యాజమాన్యాలు తమ వాహనాల ఫిట్నెస్ పునరుద్ధరణ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తిచేయాలని విజయనగరం జిల్లా ఉప రవాణా కమిషనర్ డి.మణికుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, 2026–27 విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే ఈ నెల 15వ తేదీలోపు బస్సులకు ఫిట్నెస్ తనిఖీలు పూర్తిచేయించాలని కళాశాలలు, స్కూల్ యాజమాన్యాలను ఆదేశించామన్నారు. గడువులోగా ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందని వాహనాలపై మోటారు వాహన చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ బడుల రూపురేఖలు మారాయి ● కలెక్టర్ రామసుందరరెడ్డి లక్కవరపుకోట: ప్రభుత్వ పాఠశాలలు రూపురేఖలు మారాయి.. అత్యంత నిబద్దతతో అనుభజ్ఞలతో బోధన జరుగుతోంది.. గురువారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో గంగుబూ డి జెడ్పీ హైస్కూల్కు చెందిన ఎలిశెట్టి ఉమా పార్వతి 594 మార్కులు సాధించడమే దీనికి నిలువెత్తు నిదర్శనమని కలెక్టర్ రామసుందరరెడ్డి అన్నారు. శుక్రవారం విద్యార్థిని ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా అభినందించారు. ఉపాధ్యాయుల బోధన తీరును ప్రశంసించారు. జిల్లాలో ని 296 ప్రభుత్వ పాఠశాలల నుంచి 11,916 మంది విద్యార్థులు ప్రథమ, 1754 మంది ద్వితీయ, 524 మంది తృతీయ శ్రేణిలో ఉతీర్ణు లయ్యారన్నారు. ఫెయిలైన వారికి ప్రత్యేక త ర్ఫీదు ఇవ్వాలని టీచర్లకు సూచించారు. ఉమాపార్వతికి మల్లివీడుకు చెందిన మాజీ సర్పంచ్ బోని సన్యాసిరావు(సన్ని) రూ.10వేలు నగదు బహుమతిని కలెక్టర్ చేతులమీదుగా అందజేశారు. కార్యక్రమంలో డీఈఓ మాణిక్యాలనాయుడు, ఎంఈఓలు కూర్మారావు, జి.శ్రీనివాసరావు, తహసీల్దార్ టి.రమేష్, ఎంపీడీఓ అల్లు భాస్కరరావు పాల్గొన్నారు. -
పడవ బోల్తా: ఒకరి మృతి
పూసపాటిరేగ: మండలంలోని తమ్మయ్యపాలెం సముద్రపు రేవులో పడవ బోల్తాపడి ఒకరు మృతి చెందగా, ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. వివరాల్లోకి వెళ్తే.. పతివాడ పేటకుచెందిన వాసుపల్లి ఎల్లయ్య (50) తన సహచరులతో కలిసి శుక్రవారం తెల్లవారు జామున 5 గంటల సమయంలో సముద్రంలో చేపలవేటకు బయలు దేరాడు. కొద్ది క్షణాల్లోనే కెరటాల ఉధృతికి పడవ బోల్తా పడడంతో ఎల్లయ్య గల్లంతయ్యాడు. అదే పడవలో ఉన్న ముగ్గురు మత్స్యకారులు అతి కష్టం మీద సురక్షితంగా ఒడ్డుకు చేరారు. గల్లంతైన ఎల్ల య్య కోసం పలువురు మత్స్యకారులు గాలించగా సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో చింతపల్లి రేవులో శవమై ఒడ్డుకు చేరాడు. సమాచారం మేరకు మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం సుందరపేట ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పూసపాటిరేగ ఎస్సై ఐ.దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు సురక్షితం -
గం‘జోయ్’..!
లక్కవరపుకోట మండలంలోని గంగుబూడి జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల సమీపంలోని కొండ ప్రాంతం గంజాయిబాబులకు అడ్డాగా మారింది. చీకటిపడితే చాలు బైక్లను పాఠశాల ప్రహరీ పక్కన పార్క్చేసి కొండ ప్రాంతంలోని జాడిమామిడి చెట్టు కిందకు చేరుకుంటున్నారు. రాత్రి 12 గంటల వరకు మద్యం, గంజాయి సేవిస్తున్నారు. వీరి అరుపులు, కేకలకు గొర్రెలు, మేకల పెంపకందారులు భయాందోళన చెందుతున్నారు. మత్తులో యువకులు తూలుతూ ఎప్పుడు ఎవరిపైన దాడి చేస్తారోనని హడలిపోతున్నారు. రాత్రిపూట నిఘావేసి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్టవేస్తామని ఎస్ఐ జె.రామకృష్ణ తెలిపారు. – ఎల్.కోట -
ఏనుగులతో భీతిల్లుతున్న ప్రజలు
గరుగుబిల్లి: ఏనుగుల సంచారంతో ప్రజలు భీతిల్లుతున్నారు. గరుగుబిల్లి మండలంలోని సుంకి, సంతోషపురం గ్రామాల మీదుగా నందివానివలస గ్రామానికి ఏనుగులు శుక్రవారం చేరుకున్నాయి. వారం రోజులనుంచి మండలంలోని పలుగ్రామాల్లో సంచరిస్తున్న ఏనుగుల గుంపు నందివానివలస, తోటపల్లి, ఖడ్గవలస, నాగూరు తదితర గ్రామాల్లో సంచరించి పలు పంటలను ధ్వంసం చేస్తున్నాయి. ప్రస్తుతం పొలంలో అరటి, పామాయిల్, వేరుశనగ తదితర పంటలు ఉండడంతో ఎప్పుడు ఏ పంటలకు నష్టం జరుగుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏనుగులను తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పంధించి ఏనుగులను తరలించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
కార్మిక వర్గాన్ని దోపిడీ చేసేందుకే చట్టాల్లో మార్పు
● రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్.ఝాన్సీ ● వేడుకగా మే డే వేడుకలువిజయనగరం టౌన్: అంతర్జాతీయ శ్రామిక దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక న్యూపూర్ణ జంక్షన్ వద్ద శ్రీ విజయదుర్గా ఆటోవర్కర్స్ యూనియన్, ఏఐఎఫ్టీయూ (న్యూ) అనుబంధ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం భారీ బహిరంగ సభ నిర్వహించారు. రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్.ఝాన్సీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దేశంలోనే దళారీ బూర్జువా వర్గంగా వ్యవహరిస్తున్న పాలకులు దోపిడీ విధానాలకు వంతపాడుతూ దేశంలోనే రైతాంగాన్ని, కార్మిక వర్గాన్ని దోపిడీ చేయడానికి తగినట్లుగా చట్టాలను మారుస్తున్నారన్నారు. దేశంలో ఉన్న కుల,మత, వర్గ వ్యత్యాసాలను ఉపయోగించుకుని ప్రజలను విభజించేందుకు, ప్రధాన సమస్యలను ఆలోచించకుండా ఉండేందుకు టెర్రరిజం, మైనారిటీ, రిజర్వేషన్ల పేరుతో అల్లర్లను రెచ్చగొడుతున్నారన్నారు. ఏఐఎఫ్టీయూ న్యూ రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ పండా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులను కంపెనీ యాజమాన్యాలకు అణిగిమణిగి ఉండేలా, వారి హక్కులను కాలరాస్తూ నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చిందన్నారు. ఈ లేబర్ కోడ్లు ముఖ్యంగా యూనియన్లను లేకుండా చేసేందుకు, నాయకుల ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు ఉద్దేశించినవన్నారు. శ్రీ విజయదుర్గా ఆటోవర్కర్స్ యూనియన్ నాయకుడు అప్పలరాజు రెడ్డి మాట్లాడుతూ రారేడో, ఊబర్ వంటి యాప్స్ వచ్చి ఆటో కార్మికుల పొట్టకొడుతున్నాయని, ఉచిత బస్సు పథకం ఏకంగా కార్మికులను రోడ్డున పడేసిందని వాపోయారు. యూనియన్ కార్యదర్శి రెడ్డి నారాయణరావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో పీడీఎస్ఓ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.విశ్వనాథ్, రజక సంఘం నాయకులు కె.సతీష్, చిన్న, అప్పలరాజు, ఎన్వైఎస్ జిల్లా కన్వీనర్ సీహెచ్. ధర్మ, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. -
శుభకార్యానికి వెళ్లి వస్తూ... అనంత లోకాలకు..
శుభ కార్యానికి వెళ్లిన వారు మృత్యుఒడికి చేరారు. బంధువుల శుభకార్యంలో సంతోషంగా గడిపి... తిరుగు ప్రయాణంలో వస్తున్న వారిని మృత్యువు దారి కాచి వెంటాడింది. నలుగురి ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. అంతవరకు ఆటోలో సరదగా కబుర్లు చెబుతూ వస్తున్న వారు ఒక్కసారిగా హహకారాలు చేశారు. ఇంతలోనే నలుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే... ఈ ఘటనలో మరణించిన ఆటో డ్రైవర్ అక్కుపల్లి రమణకు ఆటోనే జీవనం. అదే ఆటో ఆయనకు మృత్యుశకటంగా మారింది. రమణకు భార్య నాగమణితో పాటు వినీత, చందు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె వినీత గురువారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 563 మార్కులు సాధించింది. కుమార్తెను అభినందించి సాయంత్రం అన్నీ కొనిపెడతానని చెప్పి బయలుదేరిన తండ్రి ఇంతలోనే ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కు మార్తె విజయం ఆనందించేలోపే తండ్రి ఇలా దుర్మరణం చెందడంతో ఆయన కుటుంబంతో పాటు గ్రామస్తుల్లో తీవ్ర విషాదం నెలకొంది. మిన్నంటిన రోదనలు ఈ ప్రమాదంలో మృతి చెందిన వారంతా ఒకే గ్రామస్తులు కావడంతో బడ్డుమహసింగిలో రోదనలు మిన్నంటాయి. గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. శుభకార్యంలో ఆనందంగా గడిపి ఇళ్లకు వస్తున్న వారిలో నలుగురు మృత్యువాత పడడం, మిగిలిన వారంతా క్షతగాత్రులుగా మారడంతో గ్రామంలో అంతులేని విషాదం అలుముకొంది. పాలకొండ/పాలకొండ రూరల్: పాలకొండ మండలం బడ్డుమహసింగి గ్రామానికి చెందిన గిరిజనులు సీతంపేట మండలం పుబ్బాడ గ్రామంలో గురువారం జరిగిన బంధువుల శుభకార్యానికి వెళ్లేందుకు డోలమడ గ్రామానికి చెందిన ఆటోను కుదుర్చుకుని బయలుదేరారు. ఆటోలో 12 మంది వరకు వెళ్లారు. జంపరకోట మీదుగా సీతంపేట వెళ్లేందుకు ఉన్న ఘాట్ రోడ్డులో వెళ్లిన వీరు శుభకార్యంలో భోజనాలు చేసిన అనంతరం అదే రోడ్డులో ఆటోలో సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యారు. ఈ రహదారిలో మార్గమద్యంలోకి చేరుకునే సరికి సీతంపేట మండలం మీనకోట వద్ద ఆటో ఘాటీ డౌన్లో అదుపు తప్పి లోయలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో కొండగొర్రి శ్రావణి(30), ఆటో డ్రైవర్ అక్కుపల్లి రమణ(33), ఉర్లక శాంతి(35) సంఘటన స్థలంలోనే మరణించారు. ఆరిక లక్ష్మి(55) తీవ్రంగా గాయపడగా ఈమెను ఏరియా ఆస్పత్రికి తరలించే క్రమంలో మార్గమద్యంలో మృతి చెందింది. ఆస్పత్రుల్లో క్షతగాత్రులు.. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కొండగొర్రి మౌనిక, ఎనిమిదేళ్ల నిమ్మక చాందినిలను శ్రీకాకుళం ఏరియా ఆస్పత్రికి తరలించారు. స్థానిక ఆస్పత్రిలో కొండగొర్రి మౌనిక కుమారుడు రుషికుమార్, కొండగొర్రి హేమ, కొండగొర్రి మల్లమ్మ, కొండగొర్రి పద్మలత చికిత్స పొందుతున్నారు. ఎస్పీ మాధవరెడ్డి, సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్, డీఎస్పీ రాంబాబు ఆస్పత్రిలో క్షతగాత్రులకు అందుతున్న సేవలను పర్యవేక్షించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇదిలా ఉండగా రాత్రి సమయం వరకు మృతదేహాల ఆస్పత్రికి తరలించలేదు. ఘాటీ రోడ్డు కావడంతో మృతదేహాలను తీసుకురావడం కష్టంగా మారింది. అమ్మ ఎక్కడ... ఈ ప్రమాదంలో గాయపడిన ఎనిమిదేళ్ల రుషికుమార్, ఆరేళ్ల హేమ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి తల్లి కొండగొర్రి శ్రావణి సంఘటన స్థలంలోనే మరణించింది. తల్లి మృతి చెందిందన్న విషయం తెలియని ఆ చిన్నారులిద్దరూ అమ్మ ఎక్కడంటూ రోదిస్తుంటే అక్కడి వారి హృదయాలు చలించిపోతున్నాయి. బంధువులు సమాధానం చెప్పలేక... చిన్నారులను సముదాయించలేక కన్నీరుమున్నీరవుతున్నారు. మా అమ్మ ఎక్కడంటూ అభంశుభం తెలియని ఆ చిన్నారుల రోదనలు అరణ్యరోదనలే అవుతున్నాయి. -
ఏడీఏలకు డీడీలుగా పదోన్నతిపై బదిలీ
విజయనగరం ఫోర్ట్: వ్యవసాయ శాఖలో సహా య సంచాలకులుగా (ఏడీఏ) పనిచేస్తున్న నలుగురికి డీడీ(ఉప సంచాలకులు)గా పదోన్న తి లభించింది. విజయనగరం సబ్ డివిజన్ ఏడీఏ నాగభూషణంకు డీడీగా కృష్ణా జిల్లాకు పదోన్నతిపై బదిలీ అయింది. ప్రకృతి వ్యవసా య విభాగం ప్రాజెక్టు మేనేజర్ ఆనంద్రావుకు గుంటూరు కమిషనర్ కార్యాలయంకు డీడీగా పదోన్నతిపై బదిలీ అయింది. జిల్లా వ్యవసా య శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఆర్.శ్రీనివాసరావుకు డీడీగా శ్రీకాకుళం పదోన్నతి పై బదిలీ అయింది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏడీఏగా పనిచేస్తున్న మహారాజన్కు విజయనగరం ఆత్మ (వ్యవసాయ యాజమా న్య సాంకేతిక సంస్థ) డీపీడీగా పదోన్నతిపై బదిలీ అయింది. శ్రీకాకుళం నుంచి ఎం.రామారావు డీడీగా విజయనగరం వస్తున్నారు. రామభద్రపురం: నిషేధిత విత్తనాలు, పురుగు మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ కమిషనర్ కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్.శశిధర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయ ఏడీఏ కె.ఆంజనేయకుమార్తో కలిసి గురువారం పురుగు మందులు, విత్తనాల దుకాణాలను తనిఖీ చేశారు. రికార్డులతో పాటు నిల్వలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిషేధిత పత్తి విత్తనాలు విక్రయిస్తే దుకాణ లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. రూ.లక్ష జరిమానాతో పాటు సంబంధిత దుకాణ యజమానిపై కేసు నమోదు చేస్తామన్నారు.హెచ్టీ రకం వంటి నిసేధిత పత్తి విత్తనాలు ఏ రైతు నాటినా ఆ రైతు పంట నష్టపోయినా పంట నష్టం బీమా వర్తించదని, వారు బీమాకు అనర్హులవుతారన్నారు. ప్రస్తుతం దేశంలో బీటీ పత్తి విత్తనాలకు మాత్రమే అనుమతి ఉందని స్పష్టం చేశారు. రైతులు లైసెన్స్ ఉన్న దుకాణాలలో విత్తనాలు, పురుగు మందులు కొనుగోలు చేసి బిల్లులు పొందాలని సూచించారు. ఏఓ ఎం.శివ, విస్తరణాధికారి జి.శరత్ పాల్గొన్నారు. బొబ్బిలి: దాడితల్లి, సరేపోలమ్మ అమ్మవార్ల పండగకు మేనమామ ఇంటికి వచ్చిన ఓ బాలి క తిరుగు ప్రయాణంలో బస్సులో మహిళల మధ్య జరిగిన గొడవలో దాడికి గురై తీవ్ర అస్వస్థత పాలైంది. దీంతో స్థానికులు బాలిక ను సీహెచ్సీకి 108లో తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం విజయనగ రం కేంద్రాస్పత్రికి తరలించారు. వివరాలు.. విశాఖకు చెందిన బెజ్జుపల్లి భార్గవి(14) తల్లి దండ్రులతో కలసి బొబ్బిలిలోని గొల్లవీధిలోని తన మేనమాన ఇంటికి పండగల నిమిత్తం వచ్చింది. పండగ పూర్తయిన సందర్భంగా గురువారం సాయంత్రం తిరిగి విశాఖ వెళ్లేందు కు ఆర్టీసీ కాంప్లెక్స్కు వెళ్లి తల్లిదండ్రులు, తమ్ముడితో కలసి ఆర్టీసీ బస్ ఎక్కింది. ఈ సమయంలో సీట్ల కోసం పడుతున్న ఆదుర్దాలో మరో మహిళకు భార్గవి కాలు తగిలింది. దీంతో ఆమె కోపోద్రిక్తురాలై గొడవ పడింది. ఈ గొడవ రెండు సమూహాల మధ్య గొడవగా మారి తోసుకున్నారు. ఈ క్రమంలోనే భార్గవిపై ఓ మహిళ పిడిగుద్దులు కురిపించిందనీ, దీంతో బాలిక కిందపడటంతో పలువురు మీది నుంచి వెళ్లిపోయారని బాలిక తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. తీవ్ర అస్వస్థతకు గురై ఊపిరాడని పరిస్థితుల్లో 108 ద్వారా స్థానిక సీహెచ్సీకి తరలించారు. వెంటనే పోలీసులకు సమాచారమందించారు. ఏఎస్సై సన్యాసిరావు వెళ్లి వివరాలు సేకరించారు. బాలికను పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించారని భార్గవి బంధువులు తెలిపారు. -
నేటి నుంచి జనగణన
విజయనగరం అర్బన్: జిల్లాలో నేటి నుంచి ప్రారంభం కానున్ను జనగణనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కలెక్టర్ ఎం.రాంసుందర్రెడ్డి తెలిపారు. అమరావతి నుంచి రాష్ట్ర జనగణన నోడల్ అఽధికారి రావత్, స్టేట్ సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ నివాస్ కలెక్టర్తో గురువారం నిర్వహిచిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లాల వారీగా సన్నద్దతను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియలో జిల్లా ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారని తెలిపారు. నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రతి చార్జ్ ఆఫీసర్, ఎన్యూమరేటర్ బాధ్యతగా పని చేస్తున్నారని పేర్కొన్నారు. ఇంటింటి గణన పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు వెల్లడించారు. ఎన్యూమరేటర్లకు తగిన శిక్షణ ఇచ్చి ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించినట్టు తెలిపారు. రాబోయే మూడు రోజులు జనగణన ప్రక్రియలో అత్యంత కీలకమని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్, డీఆర్ఓ సీహెచ్ సత్తిబాబు, మున్సిపల్ కమిషనర్ బాలస్వామి, సీపీఓ పి.బాలాజీ తదితర అధికారులు పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో కంట్రోల్ రూం అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ జనగణన ప్రక్రియను పర్యవేక్షించాలని లెక్కింపు కార్యక్రమాన్ని వీడియో రికార్డు చేయాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో 08922–236947 నంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మండల స్థాయిలో కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి జనగణనపై విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. -
యథేచ్ఛగా గ్రావెల్ తవ్వకాలు
బొండపల్లి: మండల కేంద్రం బొండపల్లిలో కొద్ది రోజులుగా చెరువులో గ్రావెల్ను అభివృద్ధి పనుల ముసుగులో అక్రమంగా తరలించుకుపోతున్నారు. గ్రామాన్ని ఆనుకుని ఉన్న కొత్త చెరువులో రెవెన్యూ అధికారుల అనుమతులు లేకుండానే వందలాది ట్రాక్టర్ల గ్రావెల్ను రాత్రి పూట యథేచ్ఛగా తరలిస్తున్నారు. గ్రావెల్ను ఇళ్ల నిర్మాణంలో ఖాళీ స్థలాలను ఎత్తు చేసుకునేందుకు, పశువుల శాలలు ఖాళీ స్థలాలను ఎత్తు చేసేందుకు అక్రమంగా తరలించుకుపోతున్నారు. ఈ విషయం రెవెన్యూ అధికారులకు తెలిసినా చూసీచూడనట్లు వదిలేయడంతో వారి అక్రమాలకు అంతు లేకుండా పోతోంది. చెరువుల్లో గ్రావెల్ తవ్వాలంటే రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు, మైన్స్ అధికారుల అనుమతులు తీసుకున్న తర్వాత వారు సూచించిన మోత్తాన్ని ప్రభుత్వానికి జమ చేసి తరలించాల్సి ఉంది. మరో వైపు వాల్టా చట్టం నిబంధనలకు లోబడి తరలించాలి. ఈ నిబంధనలు అన్ని గాలికి వదిలేసి ప్రభుత్వ రోడ్డు పనులు, అభివృద్ధి పనుల పేరుతో గ్రావెల్ను తరలిస్తూ పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రావెల్ అక్రమ తవ్వకాలపై ఇటీవల బొండపల్లిలో జరిగిన గ్రామ సభలో పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు అధికారుల ముందు బాహాటంగానే నిలదీసినప్పటికీ చర్యలు మాత్రం శూన్యం. డెంకాడ: మండలంలోని చింతలవలస ఐదవ ఏపీఎస్పీ బెటాలియన్లో ఉన్న ఎస్వీఎస్ ఏపీఎస్పీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బెటాలియన్ కమాండెంట్ వై.రవిశంకర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నర్సరీ, యూకేజీ తరగతులకు ఒక పోస్టు, 1నుంచి 5వ తరగతి బోధించేందుకు ఇంటర్, బీఏ, బీఎస్సీలతో పాటు టీపీటీ, హెచ్పీటీ, డీఈడీల అర్హత కలిగిన వారితో 4 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని వివరించారు. 6నుంచి 10వ తరగతి వరకూ హిందీ బోధించేందుకు బీఏతో పాటు హిందీ పండిట్ విద్యార్హత అని తెలిపారు. కంప్యూటర్ తరగతులు బోధించేందుకు 1 ఉపాధ్యాయ పోస్టు ఉందని, దీనికి బీసీఏ, బీఎస్సీ, బీఈ, బిటెక్ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు. దరఖాస్తులను rvremschool@gmail.com గాని, వాట్సాప్ నంబర్ 73282234573కు గానీ పంపగలరన్నారు. అడ్మినిస్ట్రేషన్ 9573184185, స్కూల్ కాంటాక్ట్ నంబర్ 7382234573, బీడబ్ల్యూ అధికారి ఎన్.గణేష్ 9440906345కు ఫోన్ చేసి మరింత సమాచారం కోసం సంప్రదించాలని సూచించారు. అభివృద్ధి పనుల ముసుగులో తరలింపు -
● భోగాపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం ● నెమ్మదిగా వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టిన బైక్ ● ఘటన స్థలంలోనే ముగ్గురు మృతి ● పైళ్లె ఏడాది కాకముందే యువకుడిని కాటేసిన మృత్యువు ● కన్నీటిపర్యంతమైన భార్య ● ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఏఎస్పీ, డీఎస్పీ
భోగాపురం సమీపంలో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన సాయికుమార్, చిన్నమ్మలు, రిత్విక భోగాపురం సమీపంలో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన సాయికుమార్, చిన్నమ్మడు, రిత్విక పూసపాటిరేగ: దైవదర్శనానికి వెళ్లివస్తున్న ముగ్గురిని మృత్యువు కాటేసింది. రోడ్డు ప్రమాదం రూపంలో రెప్పపాటులో కనిపించని లోకాలకు తీసుకుపోయింది. నిరుపేద కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. పైళ్లె ఏడాది కాకముందే భర్త మరణించడంతో భార్య కన్నీరుమున్నీరుపెడుతోంది. ఓ వైపు భర్త, మరోవైపు తల్లి మృతదేహాలను చూస్తూ గుండెలవిసేలా రోదించింది. భోగాపురం సమీపంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురుమృతి చెందడంతో శ్రీకాకుళం జిల్లా దీపావళి, ఫరీదుపేట గ్రామాల్లో విషాదం అలముకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఫరీదుపేట గ్రామానికి చెందిన సంచాన సాయికుమార్ (24) విశాఖపట్నంలోని బ్లిన్కిట్లో పనిచేస్తున్నాడు. అక్కడే భార్య తేజేశ్వరితో కలిసి ఉంటున్నాడు. మంగళవారం స్వగ్రామానికి వచ్చారు. బుధవారం ఉదయం భార్యతో కలిసి అత్తవారైన గార మండలంలోని దీపావళి గ్రామానికి బైక్పై వెళ్లారు. అక్కడ భార్యను ఉంచేసి అత్త లావేటి చిన్నమ్మడు (41), వదిన కుమార్తె అయిన రిత్విక(4)ను బైక్పై తీసుకుని విశాఖపట్నం సింహాచలంలోని అప్పన్నస్వామి దర్శనానికి సాయికుమార్ బయలుదేరాడు. మొక్కులు చెల్లించాక సాయంత్రం తిరుగుప్రయాణమయ్యారు. కాసేపట్లో వచ్చేస్తామంటూ భార్యకు ఫోన్లో సమాచారం ఇచ్చారు. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. భోగాపురం సమీపంలో ఎన్హెచ్ –16పై నిలిపేందుకు నెమ్మదిగా వెళ్తున్న లారీను వెనుక నుంచి బైక్ ఢీకొనడంతో ముగ్గ్గురూ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. రెప్పపాటులో జరిగిన ప్రమాదంలో బైక్ డివైర్పై తుల్లిపడింది. స్థానికులు అక్కడకు చేరుకునేలోపే ముగ్గురూ ప్రాణాలు విడిచారు. ఈ హృదయవిదారకర ఘటనను చూసి స్థానికులు కన్నీరుపెట్టారు. ఘటన సమాచారం అందుకున్న భోగాపురం ఎస్ఐలు వి.పాపారావు, సూర్యకుమారి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. భోగాపురం సీఐ కూన దుర్గాప్రసాద్ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషాదం అత్త, వదిన కుమార్తెను తీసుకెళ్లి సింహాచలంలోని అప్పన్నస్వామి మొక్కుచెల్లించి వస్తానని చెప్పిన భర్తను మృత్యువు కాటేయడంతో భార్య తేజేశ్వరి బోరున విలపిస్తోంది. ఓ వైపు తల్లి, అక్క కూతురు, మరోవైపు భర్త మృతదేహాలను చూసి కన్నీరుపెట్టింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. రెండు గ్రామాల్లోనూ విషాదం అలముకుంది. మృత్యు‘మార్గం’ భోగాపురం సమీపంలోని ప్రమాద స్థలాన్ని అడిషనల్ ఎస్పీ సౌమ్యలత, డీఎస్పీ రాఘవులు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకటరావు సందర్శించారు. ప్రమాద కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. రెండు రోజుల వ్యవధిలో పూసపాటిరేగ వద్ద హైవేపై జరిగిన ప్రమాదంలో నలుగురు, భోగాపురంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు విడిచారు. రెండు ప్రమాదాల్లో ఏడుగురు మృత్యువాత పడడంతో జాతీయరహదారిపై ప్రమాదాలు నివారణకు తమవంతుగా కృషి చేయాలని పోలీసు సిబ్బందికి సూచించారు. -
చుక్కానిలా డీవీజీ కథలు
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్ర జిల్లాలు కథలకు పుట్టినిల్లు అని మరోసారి రుజువైందని, డాక్టర్ డీవీజీ శంకరరావు కథలు చుక్కానిలా ఉన్నాయని సాహితీవేత్త అట్టాడ అప్పలనాయుడు అన్నారు. సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో చీకటి దివాకర్ అధ్యక్షతన మహాకవి శ్రీశ్రీ జయంతి, మేడే పురస్కరించుకుని డాక్టర్ డీవీజీ శంకరరావు కథల సంపుటి పుస్తకావిష్కరణను జెడ్పీ మీటింగ్ హాల్లో బుధవారం సాయంత్రం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ ఎం.జై చంద్రనాయుడు అధ్యక్ష ఉపన్యాసం చేశారు. అణగారిన వర్గాల కోసం, స్వేచ్ఛాజీవనం కోసం, కార్మికుల హక్కుల కోసం, ప్రజాస్వామ్య విలువలు కాపాడడం కోసం శ్రీశ్రీ రచనలు చేశారన్నారు. డాక్టర్ ఎం.రమాగీతాదేవి, పాయల మురళీకృష్ణ పుస్తక సమీక్ష చేశారు. డీవీజీ రచనలు మానవత్వాన్ని మృదువుగా తాకే స్పర్శ రేఖలని, వైద్యునిగా పొందిన అనుభవాలు, జీవిత సత్యాలు వారి కలంలో జీవం పోసుకుని మన ముందుకు వచ్చాయన్నారు. అనంతరం ఇటీవల మృతిచెందిన షేక్ భాషా, కె.వి.శేషారావు, ఎల్.ఆర్.స్వామిలకు సభ నివాళులర్పించింది. ఎస్.శ్రీనివాసరావు వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రఘువర్మ, లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ, డాక్టర్ గుల్లిపల్లి జయపాలరావు, రొంగలి పోతన్న, పీవీఎస్.శ్రీనివాసరావు, స్వర్ణలత, చీకటి చంద్రిక, తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా కేంద్రంలో చాగంటి ప్రవచనం
● హాజరైన హైకోర్టు జడ్జి దంపతులుపార్వతీపురం: ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన వక్త, ప్రభుత్వ ఆధ్యాత్మిక సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం భక్తులను ఆకట్టుకుంది. బెలగాంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి శతాబ్ది ప్రయుక్త నవాహ్నిక కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన సభలో ఆయన ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పారు. ధర్మం, నైతిక విలువలు, కుటుంబ జీవన విధానం, భక్తిమార్గం తదితర అంశాలపై ఆయన చేసిన ప్రవచనాలు అన్ని వర్గాలవారిని ఆకర్షించాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న చాగంటి పార్వతీపురం పట్టణం రావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. కార్యక్రమంలో హైకోర్టు జడ్జి సీహెచ్.మానవేంద్రనాఽథ్ రాయ్ దంపతులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
ఏనుగుల సంచారంతో భయాందోళన
గరుగుబిల్లి: ఏనుగుల సంచారంతో మండలంలోని ప్రజలు భీతిల్లుతున్నారు. నందివానివలసలోని తామరచెరువు, పంటపొలాల్లో సంచరించిన ఏనుగులు బుధవారం సాయంత్రానికి తోటపల్లి గ్రామ పరి సరాల్లో సంచరిస్తున్నాయి. కొద్ది రోజులనుంచి ఈ ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తుండంతో ఎప్పుడు ఏ గ్రామంలో ఎవరికి హాని చేస్తాయోనని రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వేసవి పంటలు ఉండడంతో రైతులు పొలం పనులు చేపట్టేటప్పుడు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భీతిల్లుతున్నారు. ఏనుగులను తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలాన్ని వెళ్లదీస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఏనుగులను తరలించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
‘బెట్టింగ్ మాయాజాలం‘ షార్ట్ ఫిల్మ్ ఆవిష్కరణ
విజయనగరం క్రైమ్: క్రికెట్ బెట్టింగ్ వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ జిల్లా పోలీసుశాఖ ప్రత్యేకంగా రూపొందించిన ‘బెట్టింగ్ మాయాజాలం‘ అనే షార్ట్ ఫిల్మ్ ను ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ డీపీఓలోని తన చాంబర్లో బుధవారం ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ యువత క్రికెట్ బెట్టింగులకు పాల్పడి పెద్ద మొత్తంలో డబ్బులు నష్టపోవడంతో పాటు, చదువులను నిర్లక్ష్యం చేస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. క్రికెట్ బెట్టింగులు, ఇతర ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల వల్ల యువత ఏవిధంగా ప్రభావానికి గురవుతున్నది, వారి జీవితాలను ఏవిధంగా నాశనం చేసుకుంటున్నది, డబ్బులను ఎలా నష్టపోతున్నది అన్న విషయాల పట్ల అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా ‘బెట్టింగ్ మాయాజాలం‘ అనే షార్ట్ ఫిల్మ్ ను రూపొందించామన్నారు. ఈ షార్టు ఫిల్మ్ ను పోలీసు అధికారులు, సిబ్బంది గ్రామ సందర్శన, కళాశాలల్లో నిర్వహించే అవగాహన సదస్సుల్లోను ప్రదర్శించి, బెట్టింగుల వలన కలిగే అనర్థాలను వివరిస్తారని ఎస్పీ తెలిపారు. అంతేకాకుండా, సోషల్ మీడియా ద్వారా ఎక్కువ మంది ప్రజలకు చేరే విధంగా చర్యలు చేపడతామన్నారు. బెట్టింగులను నియంత్రించేందుకు పోలీసు అధికారులు తమ స్టేషన్ పరిధిలోని లాడ్జిలు, హాస్టల్స్, విద్యార్థులు, యువత ఎక్కువగా గుమిగూడే కళాశాలలు, శివారు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. తనిఖీలు చేపట్టే సమయంలో యువత మొబైల్ ఫోన్లను పరిశీలించి, వారి మొబైల్స్ లోని బెట్టింగ్ యాప్లు తొలగిస్తున్నామన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, డీసీఆర్బీ సిఐ కె.కుమారస్వామి పాల్గొన్నారు. -
కార్మికుల స్వీయగణన నమోదు తప్పనిసరి
● జిల్లా కార్మికశాఖ ఉప కమిషనర్ ఎస్డీవీ.ప్రసాదరావువిజయనగరం గంటస్తంభం: జిల్లాలోని దుకాణాలు,వాణిజ్య సంస్థలు, ఇతర ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులంతా స్వీయగణన నమోదు చేసుకోవాలని కార్మిక శాఖ ఉప కమిషనర్ ఎస్డీవీ.ప్రసాదరావు బుధవారం ఒక ప్రకటనలో తెలపారు. కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ పథకాల సక్రమ అమలుకు ఈ నమోదు ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. ప్రతి కార్మికుడు తన వ్యక్తిగత వివరాలు, ఉద్యోగానికి సంబంధించిన సమాచారం సరైన విధంగా నమోదు చేసుకోవాలని సూచించారు. స్వీయగణన ద్వారా కార్మికుల పూర్తి వివరాలు ప్రభుత్వానికి అందుబాటులోకి వచ్చి, భవిష్యత్తులో సంక్షేమ పథకాల అమలు మరింత సులభతరం అవుతుందని తెలిపారు. జిల్లాలోని కార్మిక సంఘాల నాయకులు, యాజమాన్యాలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించాలని కోరారు. ముఖ్యంగా తమ సంఘాలకు చెందిన కార్మికులు తప్పనిసరిగా స్వీయగణనలో నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. కార్మికుల భద్రత, హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
ట్రాక్టర్ ఢీకొని యువకుడి మృతి
జామి: స్నేహితుడిని స్కూటీపై దించడానికి వెళ్తున్న సమయంలో ట్రాక్టర్ మృత్యువు రూపంలో వెంటాడి ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఈ ఘటనపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎల్.కోట మండలం ఖాసాపేట గ్రామానికి చెందిన యువకుడు కొటాన ఎర్నాయుడు (24) బీటెక్ పూర్తిచేశాడు. విశాఖ పట్నంలో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. స్వగ్రామం అయిన ఖాసాపేటలో పండగకు వచ్చాడు. స్నేహితుడిని బుధవారం పెంట శ్రీరాంపురం స్కూటీపై దించడానికి తీసుకువెళ్లాడు. తాండ్రంగి గ్రామం సమీపంలో జామి నుంచి పిక్క లోడ్తో రేవళ్ల పాలెం వెళ్తున్న ట్రాక్టర్ వెనుకనుంచి స్కూటీని ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఎర్నాయుడు మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న జామి పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి జరిగిన ఘటనపై ఆరా తీశారు. ప్రమాద ఘటనపై కేసు నమోదుచేసిదర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వీర జనార్దన్ తెలిపారు. వెంకటరావు, చినతల్లి దంపతులకు ఎర్నాయుడు ఒక్కడే కుమారుడు.ఇద్దరు అక్కలు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో లైన్మన్..సీతంపేట: మండలంలోని గొయిది గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నబగ్గ సచివాలయ పరిదిలో లైన్మన్గా పనిచేస్తున్న కీసరజోడుకు చెందిన బిడ్డిక శంకరరావు (36) బుధవారం మృతి చెందాడు. ఈ ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన సోమగండి వీఆర్వో తులసిరావుకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై ఎస్సై వై.అమ్మన్నరావు అందించిన వివరాల ప్రకారం పాలకొండలో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి ఇద్దరూ వెళ్లి ద్విచక్రవాహనంపై వస్తున్నారు. డ్రైవింగ్ చేస్తున్న శంకరరావు ముందున్న బైక్ను ఓవర్టేక్ చేయబోయే క్రమంలో వెనుక నుంచి ఢీకొట్టడంతో ఇద్దరూ అదుపు తప్పి కిందపడిపోయారు. తలపై శంకరరావుకు తీవ్రగాయలవడంతో వెంటనే 108 సాయంతో స్థానిక ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య శిరీష, ఏడాది కుమారుడు నివేది ఉన్నాడు. కుటుంబ పెద్ద మృతిచెందడంతో కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
మామిడి రైతు కుదేలు..!
● కళ తప్పిన మ్యాంగో మార్కెట్ ● తెగుళ్లతో నేలరాలుతున్న మామిడిపంట ● తగ్గిపోతున్న సాగు విస్తీర్ణంమెరకముడిదాం: ఏటా వేసవికాలంలో మామిడిపంట ఎగుమతులు, దిగుమతులతో కళకళలాడిన విజయనగరం జిల్లా మార్కెట్ ఈ ఏడాది దిగుబడిలేక వెలవెల బోతోంది. దీర్ఘకాలంగా మామిడిపంట సాగుతో జీవనం సాగించే రైతాంగానికి వాతావరణ ప్రతికూలతతో పంట పాడై పోగా ఉన్న పంట కాస్తా తెగుళ్లతో పూత, పిందెరాలిపోవడంతో మిగిలిన పంటను కొనేవారు ముందుకు రాక మామిడిరైతులు కుదేలవుతున్నారు. విజయనగరం జిల్లావ్యాప్తంగా 30,940 ఎకరాల్లో మామిడిపంటను రైతులు సాగుచేస్తున్నారు. అయితే మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉన్న బంగినపల్లి, సువర్ణరేఖ రకాల మామిడిపంట దిగుబడి పూర్తిస్థాయిలో తగ్గిపోవడంతో ఢిల్లీ, హైదరాబాద్, కోల్కత్తా, చైన్నై, తదితర ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారులు ఈ ఏడాది ముఖం చాటేసే పరిస్థితి నెలకొంది. మామిడి సీజన్లో ఎగుమతి, దిగుమతులపై కూలీలు, దళారులు, లారీలు, ట్రాక్టర్లు, వ్యాన్ల డ్రైవర్లు వందలాదిమంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధిపొందుతుండగా, మార్కెట్ ప్రతికూలతతో వారంతా రోడ్డునపడే పరిస్థితి నెలకొంది. తెగుళ్లతో నష్టాలు: ఏటా పూతదశలోనే ప్రారంభమవుతున్న తెగుళ్లు పిందెదశలో ఉధృతమై కాపు నేలరాలిపోయి రైతులు తీవ్రనష్టాలు చవిచూస్తున్నారు. ఈ ఏడాది సైతం నల్లతామర, తేనెమంచు తెగుళ్లతో పాటు ఇతర తెగుళ్ల కారణంగా చాలా వరకూ మామిడిపంట నేలరాలిపోయింది. దీనికి తోడు ఇటీవల వచ్చిన ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా చాలావరకూ పంట నేలరాలిపోగా, ఉన్న కాస్త పంట వర్షం కారణంగా పురుగు పట్టిపోతుందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. అయితే ప్రస్తుతం పనుకులు రకం సీజన్ ప్రారంభంలో ఆశాజనకంగా ఉన్నప్పటికీ మార్కెట్లో గిరాకీ లేకపోవడంతో తక్కువధరకే అమ్మకోవలసిన పరిస్థితి నెలకొంది. వాతావరణ ప్రభావంతో రైతులు భయపడి సీజన్ ప్రారంభం నుంచే ఎదుగుదల రాకపోయినా కాయలు కోసి అమ్మేసుకోవడంతో ధర గిట్టుబాటు కావడంలేదు. సీజన్ మొదటిలో పనుకులు రకం టన్ను రూ.35 వేలు పలకగా, ప్రస్తుతం సగం ధర కూడా రావడంలేదని రైతులు వాపోతున్నారు. బంగినపల్లిలో నంబర్ వన్ రకం– టన్ను రూ.60 వేలకు పైగా ధర పలుకుతున్నప్పటికీ మార్కెట్లో ఈ రకం పెద్దగా కనిపించడంలేదు. మామిడి రుచి చూద్దామని ఆశించేవారికి డజను కాయలు వందలాదిరూపాయల ధర పలుకుతుండడంతో కొనేందుకు వెనక్కి తగ్గుతున్నారు.పూర్తిగా నష్టపోయాం..మామిడితోటలు సాగు చేస్తే గతంలో మంచి దిగుబడి వస్తుండడంతో మంచి రాబడి వచ్చేది, దానికి తగిన లభాలు వచ్చేవి. గత నాలుగేళ్లుగా దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది, కాస్తో, కూస్తో దిగుబడి వస్తుందంటే ఆపంట ప్రకృతి కన్నెర్రకు నేలపాలవుతోంది. ప్రతి ఏడాది లక్షల్లో మదుపులు పెట్టినప్పటికీ తగిన దిగుబడి రాకపోవడంతో పూర్తిగా నష్టపోతున్నాం. గత ప్రభుత్వ హయాంలో మామిడిపంటపై బీమా ఉండేది. ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా..భయం ఉండేది కాదు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల నుంచి రైతులు బీమా కడుతున్నప్పటికీ విపత్కరపరిస్థితుల్లో ఆ బీమా రావడంలేదు, ఎందుకో అర్థం కావడంలేదు. మామిడిపంటతో నష్టపోయిన మమ్మల్ని ప్రభుత్వమే అన్ని విధాలా ఆదుకోవాలి. శిరువూరు నారాయణమూర్తిరాజు, సువర్ణరేఖ మామిడిరైతుల సంఘం అధ్యక్షుడు, సోమలింగపురం -
హత్యాయత్నం వెనుక ఎవరున్నారు?
సాలూరు: సాక్షి ఎలక్ట్రానిక్ మీడియా సాలూరు నియోజకవర్గ రిపోర్టర్ నల్లి శ్రీనివాసరావుపై బుధవారం ముగ్గురు అగంతకులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. హత్యాయత్నానికి ప్రయత్నించారు. ఎంపీడీఓ కార్యాలయంలో వార్తా సేకరణ ముగించుకుని సహచర విలేకరితో కలిసి బైక్పై వస్తుండగా వెంబడించారు. సాలూరు రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోనే వారిని అడ్డగించి, పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఈ ఘాతుకంలో శ్రీనివాసరావు తలకు తీవ్రగాయమైంది. రక్తస్రావంతో స్పృహ కోల్పోయాడు. గమనించిన స్థానికులు తక్షణమే స్పందించి బాధితుడిని సాలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుడిని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు పీడిక రాజన్నదొర ఆస్పత్రిలో పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజా గొంతుకగా నిలిచే విలేకర్లపై దాడులను ఖండించారు. ఈ విషసంస్కృతి సరికాదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్న మీడియా వ్యక్తులను ముఖ్యంగా సాక్షిటీవీ, ప్రింట్మీడియా రిపోర్టర్లను లక్ష్యంగా చేసుకుని చేపడుతున్న దాడులు ఎవరి ప్రమేయంతో, ఎవరి సహాయంతో జరుగుతున్నాయి, దీనివెనుక ఎవరున్నారనే విషయాలు అందరికీ అర్థమవుతున్నాయన్నారు. దీనిపై పోలీసులు లోతుగా విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రలోని సాలూరు వంటి ప్రశాంతమైన ప్రాంతంలో ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఘటనలు బాధాకరమన్నారు. మీడియాను భయపెడితే అరాచకాలు, అక్రమాలు, దురాఘాతాలు సాఫీగా సాగిపోతాయని కొందరు భావిస్తున్నట్టుందన్నారు. దాడులను మీడియా శ్రేణులంతా ఐక్యంగా ఖండించాలని కోరారు. రిపోర్టర్పై హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తులను, వారి వెనుక ఉన్నవారిని పోలీసులు పట్టుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి సంధ్యారాణి హయాంలో ప్రశాంతమైన సాలూరు బీహార్ను తలిపిస్తోందన్నారు. గతంలో సాలూరు మండలం మరిపల్లి గ్రామానికి చెందిన గిరిజన ఎంపీటీసీ సభ్యులు జన్ని సీతారాంను జుట్టుపట్టుకుని కొట్టారని, మక్కువలో ప్రజాశక్తి విలేకరిపై దాడిచేశారని, సాలూరు మెంటాడ వీధిలో పప్పల మోహన్పై దాడి జరిగిన సంఘటలను గుర్తుచేశారు. ఇటువంటి దాడులు ప్రజాస్వామ్యానికి మాయనిమచ్చగా పేర్కొన్నా రు. నిందితులను పట్టుకోకుంటే వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తామని హెచ్చరించారు. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు పార్వతీపురం రూరల్: విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టుపై జరిగిన భౌతిక దాడిని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ (ఏపీయూడబ్ల్యూజే) తీవ్రంగా ఖండించింది. ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టని పేర్కొంది. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ వెంకటేశ్వరరావుకు యూనియన్ నాయకులు వినతిపత్రం అందజేశారు. పోలీస్ స్టేషన్ సాక్షిగా ఇంతటి దుస్సాహసానికి ఒడిగట్టారంటే జిల్లాలో విలేకరుల రక్షణ ప్రశ్నార్థకంగా మారిందని ధ్వజమెత్తారు. ముందస్తు పథకం ప్రకారమే ఈ దాడి జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. నిందితులను అరెస్ట్ చేయడంలో జాప్యం జరిగితే జిల్లావ్యాప్తంగా ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నాయకులు గంగి శ్రీనివాసరావు, ఆర్.సుధాకర్, గోపాల్, దుర్గా, అనంతరావు, సాక్షి స్టాఫర్ రామకృష్ణ, నవీన్, దివానీ, సోమశేఖర్, కాకిముక్కల నాగు, శేఖర్, శాస్త్రి, శంకరరావు, నాయుడు, కృష్ణ, సుధీర్, తదితరులు పాల్గొన్నారు. అమానుషం సాలూరు రూరల్: సాక్షి సాలూరు టీవీ రిపోర్టర్ శ్రీనివాస్పై బుధవారం గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేయడాన్ని ఎస్ఎఫ్ఐ పార్వతీపురం మన్యం జిల్లా నాయకులు హెచ్.సింహాచలం, బి.అనిల్ ఖండంచారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విలేకర్ల పైదాడి మీడియా స్వేచ్ఛను హరించడమేనన్నారు. వారి వెంట ఎస్ఎఫ్ఐ నాయకులు సురేష్, ఎ.గంగారావు ఉన్నారు. సాక్షి ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్పై హత్యాయత్నం దుండగుల దాడితో తీవ్ర గాయాలు నిందితులను తక్షణమే అరెస్టు చేయాలంటూ జర్నలిస్టు సంఘాల ఆందోళన బాధితుడిని పరామర్శించిన జెడ్పీ చైర్మన్, మాజీ డిప్యూటీ సీఎం -
సమయపాలన తప్పనిసరి
● రాష్ట్ర ఆస్పత్రుల విభాగం విజిలెన్స్ జాయింట్ కమిషనర్పాలకొండ రూరల్: ప్రభుత్వ వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బంది కచ్చితంగా సమయపాలన పాటించాలని రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రుల విభాగం విజిలెన్స్ జాయింట్ కమిషనర్ నాయక్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన స్థానిక ఏరియా ఆస్పత్రిని తన బృంద సభ్యులతో కలిసి ఆకశ్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో ప్రతి వార్డు నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించారు. రోగులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న వైద్యసేవలు, ఇతర మౌలిక వసతులు, అందిస్తున్న భోజనంపై ఆరా తీశారు. ఈ క్రమంలో ముఖ ఆధారిత హాజరుపై కచ్చితత్వం అవసరమన్నారు. సకాలంలో విధులకు హాజరు లేకుంటే సేవలు సక్రమంగా అందించడంలో ఏర్పడే అవరోధాలను ఎలా అధిగమిస్తారని ప్రశ్నించారు. మూడు సార్లు ముఖ హాజరులో అలస్యం గుర్తిస్తే ఓ రోజు సెలవుగా పరిగణించాల్సి ఉంటుందన్నారు. ఇటీవల మంజూరైన నిధులతో జరుగుతున్న పనుల తాజా స్థితిగతులు, రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట డీసీహెచ్ఎస్ డాక్టర్ జి.నాగభూషణరావు, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కడియం చిరంజీవి, ఆర్ఎంఓ కె.రవికుమార్, సహ వైద్యులు, పలు విభాగాల సిబ్బంది ఉన్నారు.


