breaking news
Vizianagaram District News
-
163 సెల్ఫోన్స్ రికవరీ
● బాధితులకు అప్పగించిన ఎస్పీ దామోదర్విజయనగరం క్రైమ్: ఏ మొబైల్ ఫోన్ పోయినా ఇక నుంచి సైబల్ సెల్ స్టేషన్కు వెళ్లవనసరం లేదని ఎస్పీ దామోదర్ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో మొబైల్ పోయినట్లు లేదా మిస్ అయినట్లు ఫిర్యాదు చేయవచ్చన్నారు. జిల్లా వ్యాప్తంగా పోయిన 163 సెల్ ఫోన్స్ రికవరీ చేసి వాటిని పొగొట్టుకున్న వారికి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అందజేశారు. జిల్లాలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసేందుకు ప్రత్యేకంగా ’మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టం’ ఏర్పాటు చేశామన్నారు. ఈ విధానంతో విజయనగరంలో సైబర్ సెల్ స్టేషన్ కు రావాల్సిన అవసరం లేదన్నారు. మొబైల్ పోగొ ట్టుకున్న వ్యక్తులు తమకు దగ్గరలోని పోలీస్ స్టేషన్ ను సంప్రదించి, పోగొట్టుకున్న మొబైల్స్ వివరాల ను అందించినట్లయితే, ’మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టం’ ద్వారా పోయిన మొబైల్ను ట్రాక్ చేసేందుకు చర్యలు చేపడతామని ఎస్పీ ఏఆర్.దామోదర్ అన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో సుమారు రూ.6.23కోట్ల విలువైన 3,463 మొబైల్ ఫోన్లు ట్రాక్ చేసి, బాధితులకు అందజేశామన్నారు. అదే విధంగా ప్రస్తుతం మరో 163 మొబైల్ ఫోన్లు సైబర్ సెల్ పోలీసులు, సిబ్బంది నిరంతరం శ్రమించి, ట్రాక్ చేశారని తెలిపారు. కార్యక్రమంలో సైబర్ సెల్ సీఐ శోభన్ బాబు, ఎస్బీ సీఐలు ఏవీ లీలారా వు, అంబేడ్కర్, డీసీఆర్బీ సీఐ కె.కుమార స్వామి, ఎస్సై రాజేష్, సైబర్ సెల్ సిబ్బంది శ్రీనివాసరావు, వాసుదేవ్, తిరుపతి నాయుడు, రాజేష్, నాగమణి, శిరీష పాల్గొన్నారు. -
ఆర్థిక బలోపేతమే ప్రధానం
● డీఆర్డీఏ పీడీ శ్రీనివాసపాణి రేగిడి: స్వయంశక్తి సంఘాల మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని వెలుగు పీడీ శ్రీనివాసపాణి అన్నారు. రేగిడి మండలంలోని ఐఏపీ కార్యాలయంలో స్వయంశక్తి సంఘాల మహిళలకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ రాబోయే ఐదేళ్లలో సంస్థను బలోపేతానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. స్వయంసహాయక సంఘాల మహిళలు బ్యాంకు రుణాలను సక్రమంగా చెల్లించాలన్నారు. వీఓఏలు, గ్రామసంఘ అధ్యక్షులు మరింత బాధ్యతగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీఎం బి.గోవిందరావు, ఎల్.సి.వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు. అల్లూరి డీఈఓగా రామకృష్ణారావు నెల్లిమర్ల: అల్లూరి సీతారామరాజు జిల్లా విద్యాశాఖాధికారిగా కె.రామకృష్ణారావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన విజయనగరం డైట్కళాశాల ప్రిన్సిపాల్(ఎఫ్ఎసీ)గా పనిచేస్తూ ఉద్యోగోన్నతిపై డీఈఓగా నియామకమయ్యారు. ఆయనను డైట్ సిబ్బంది అభినందించారు. మెరుగైన విద్యాబోధన అందించాలి నెల్లిమర్ల: ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించాలని పాఠశాల విద్యాశాఖ రీజనల్ డైరెక్టర్ కె.విజయభాస్కర్ సూచించారు. నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేట ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన టీచ్టూల్ శిక్షణను ఆయన పరిశీలించారు. శిక్షణకు సంబంధించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓలు సూర్యనారాయణమూర్తి, జ్ఞానశంకర్, తదితరులు పాల్గొన్నారు. వైద్య సదుపాయాలు మెరుగుపర్చాలి ● కలెక్టర్ రాంసుందర్ రెడ్డి విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, అనుబంధ ఘోషా ఆస్పత్రిలో వైద్య సదుపాయాలు మెరుగుపర్చేందుకు, అదనపు వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి వైద్యాధికారులకు సూచించారు. విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో మంగళవారం నిర్వహించిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం (హెచ్డీఎస్)లో ఆయన మాట్లాడారు. హెచ్డీఎస్ ఫండ్స్ రూ.7కోట్లు వరకు ఉందని, ఆస్పత్రిలో సౌకర్యాలు మెరుగుపర్చేందుకు వినియోగించాలని ఆదేశించారు. అత్యవసర వైద్య పరికరాలను వెంటనే కొనుగోలు చేయాలని సూచించారు. భవనాలు, ఇతర మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలన్నారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో అత్యవసర విభాగాలను గాజులరేగ సమీపంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలోకి తరలించేందుకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తామని చెప్పా రు. ఆస్పత్రికి కొత్తగా ఒక లైఫ్ సపోర్టు అంబులెన్సు సమకూర్చేందుకు, సీవేజ్ ట్రీటెమెంట్ప్లాంట్ నిర్మాణం, నెఫ్రాలజీ విభాగంలో డయాలసిస్ యూనిట్, దానికి అనుబంధంగా ఆర్వో ప్లాంటు, దినసరి వేతనంపై ఇద్దరు క్షరకుల నియామకం, జనరిక్ మందుల షాపు ఏర్పాటు, ఘోషా ఆస్పత్రిలో పలు భవనాల నిర్మాణం, 15 సీసీ కెమెరాల ఏర్పాటు, రూ.20 లక్షల విలువైన డయా థెర్మీ పరికరం ఏర్పాటు, వివిధ ధ్రువపత్రాల చార్జీల పెంపు, డేటా ఎంట్రీ ఆపరేటర్ల నియామకం, వేతనాల పెంపుపై చర్చించి ఆమోదించారు. విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ ఆస్పత్రిలో రోగులకు వసతి సరిపోవడం లేదని, అందువల్ల తక్షణమే డీసీహెచ్ఎస్ కార్యాలయాన్ని తరలించాలన్నారు. సమావేశంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ అల్లు పద్మజ, ఇన్చార్జి డీఎంహెచ్ఓ రాణి, డీసీహెచ్ఎస్ పద్మశ్రీ రాణి, ఎంపీహెచ్ఎంఐడీసీ భారతి, మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య, కో ఆప్సన్ సభ్యులు జయ చంద్రనాయుడు, వి.అశోక్, ఇమ్మడి సుధీర్, అనూరాధ బేగం, తదితరులు పాల్గొన్నారు. -
వెనుకబడిన విద్యార్థులపై నిర్లక్ష్యం
పార్వతీపురం రూరల్: ర్యాంకుల రేసులో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలపాలన్న అధికారుల తాపత్రయం పదో తరగతి విద్యార్థుల పాలిట శాపంగా మారుతోందా? ‘వంద రోజుల ప్రణాళిక’ పేరుతో విద్యాశాఖ అమలు చేస్తున్న కార్యాచరణ విద్యార్థులను తీర్చిదిద్దడం పక్కన పెడితే..వారిని మానసిక ఒత్తిడిలోకి నెట్టివేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘అందరికీ ఒకే మందు’ అన్న చందంగా.. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా రూపొందించిన ఈ షెడ్యూల్ వల్ల విద్యార్థులు లాభం కంటే నష్టమే ఎక్కువ పొందే ప్రమాదం ఉందని ఉపాధ్యాయ లోకం హెచ్చరిస్తోంది. బోధన కన్నా..‘యాప్’ల గోలే మిన్న పదో తరగతి ఫలితాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలన్న సంకల్పం మంచిదే అయినా.. ఆచరణలో ఉపాధ్యాయులపై పడుతున్న పని భారం అసలు లక్ష్యాన్ని దెబ్బతీస్తోంది. రోజూ ఉదయం జిల్లా కార్యాలయం నుంచి వచ్చే వాట్సాప్ ప్రశ్నపత్రాలను జిరాక్స్ తీయించడం, పరీక్ష పెట్టడం, ఆ వెంటనే మార్కులను సాయంత్రం లోపు ‘లీప్ యాప్’లో అప్లోడ్ చేయడం..ఇదంతా ఒక ప్రహసనంగా మారింది. బోధన కంటే ఈ సాంకేతిక పనులకే ఉపాధ్యాయుల సమయం హరించుకుపోతోంది. పిల్లలకు పాఠం చెప్పాలా? లేక యాప్ లో మార్కులు ఎక్కించాలా? అన్న సందిగ్ధంలో టీచర్లు కొట్టుమిట్టాడుతున్నారు. విరామం ఎరుగని ‘యంత్రాలు’ పిల్లలంటే యంత్రాలు కాదు..రక్తమాంసాలున్న మనుషులు. కానీ విద్యాశాఖ మాత్రం రెండవ శనివారాలు, ఆదివారాలు కూడా క్లాసులు పెట్టి వారిని రోబోల్లా మార్చేస్తోంది. ఇప్పటికే సిలబస్ పూర్తయిన తరుణంలో.. విద్యార్థులకు స్వయంగా చదువుకునేందుకు, పునశ్చరణ చేసుకునేందుకు సమయం ఇవ్వాలి. కానీ, సెలవు రోజుల్లో కూడా బడికి రప్పించడం వల్ల విద్యార్థులు తీవ్ర అలసటకు, మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ‘మెదడుకు కాస్తంత విశ్రాంతి దొరికితేనే చదివింది వంటబడుతుంది. ఇలా ఊపిరి ఆడనివ్వకుండా చదివిస్తే..అసలుకే ఎసరు వస్తుంది’ అని సీనియర్ ఉపాధ్యాయులు సైతం వాపోతున్నారు. పది పరీక్షలకు వంద రోజుల ప్రణాళికతో ‘స్లో లెర్నర్స్’ బలి! అందరికీ ఒకే విధానం.. ఎలా సాధ్యం? జిల్లాలో 187 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ర్యాంకుల పరుగులో విద్యార్థులకు గండం వందరోజుల ప్లాన్తో ఒత్తిడి -
చంద్రబాబు పాలనపై విరక్తి చెంది...
విజయనగరం: ఎన్నికలకు ముందు అమలు సాధ్యంకాని హమీలు గుప్పించడం, అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలను మోసగించడమే పరమావధిగా పెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనపై విరక్తి చెందిన నాయకులు, కార్యకర్తలు టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరడం శుభపరిణామమని ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్, వైఎస్సార్సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. తన నివాసంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో 50వ డివిజన్ కార్పొరేటర్ పట్టా ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో టీడీపీ పట్టణ మాజీ ఎస్సీసెల్ కమిటీ ప్రధాన కార్యదర్శి సియ్యాదుల చంద్రశేఖర్తో పాటు 20 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరాయి. వీరికి పార్టీ కండువాలు వేసి కోలగట్ల సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార టీడీపీకి చెందిన నాయకులు వైఎస్సార్సీపీలో చేరుతున్నారంటే చంద్రబాబు ప్రభుత్వం తీరును తేటతెల్లం చేస్తోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుచేయకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు. చంద్రబాబు మాయమాటలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. సంక్రాంతి అనంతరం నగరంలో విస్తృత పర్యటనలు నిర్వహించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, భవిష్యత్లో మరింత మంది అధికార టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం నాయకుడు జి.ఈశ్వర్కౌశిక్, కార్పొరేటర్లు బోనెల ధనలక్ష్మి, పట్నాన పైడిరాజు, ఆదినారాయణ, పార్టీ నగర ప్రధాన కార్యదర్శి జె.శ్రీను, 49వ డివిజన్ ఇన్చార్జి కనుగల రాజా, నగర వాణిజ్య విభాగం అధ్యక్షుడు జమ్ము మధు, తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీలో చేరిన 50వ డివిజన్ వాసులు పార్టీ కండువాలు వేసి స్వాగతం పలికిన మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి -
గోపీనాథ ఆలయంలో చోరీ
● రాధాకృష్ణుల విగ్రహాలపై ఉన్న వెండి, బంగారు నగలు మాయంభామిని: వంశధార నదీ తీరంలో ప్రముఖ వైష్ణవాలయంగా వెలుగొందుతున్న లివిరి గోపీనాథ రాధాకృష్ణ ఆలయంలో చోరీ జరిగింది. మంగళవారం వేకువ జామున దేవాలయంలో దొంగలు పడ్డారనే వార్త గుప్పుమంది. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆలయాన్ని చుట్టుముట్టి జరిగిన చోరీపై చర్చించారు. ఈ సమాచారం అందుకున్న పాలకొండ డీఎస్పీ రాంబాబు, బత్తిలి ఎస్సై జి.అప్పారావులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వెనువెంటనే క్లూస్ టీమ్ను రప్పించి ఆధారాలు సేకరించారు. చోరులు ఆలయం తలుపులకు ఉన్న నాలుగు తాళాలు దుండగులు విరగొట్టారు. రాధాకృష్ణుల మూర్తులపై ఉన్న ఆభరణాలను సీసీ కెమెరా వైర్లు కట్ చేసిన వీడియోలు నిలువ చేసే డీబీఎంను కూడా చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ చోరీలో సుమారు 56 తులాల వెండి వస్తువులు, అరతులం బంగారు ముక్కెరలు పోయినట్లు ఆలయ ఆర్చకుడు గోపీనాథ చౌదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బత్తిలి ఎస్సై జి.అప్పారావు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో సర్పంచ్ బౌరి సౌదామిని, మాజీ ఏఎంసీ చైర్మన్ సోమరాజు గోపాలరావు, మాజీ సర్పంచ్ ఎస్.రమణారావు, మిల్లరు కై లాస్ గౌడో, మండల నాయకులు తరలివచ్చి పోలీసులకు సహకరించారు. -
పిల్లల్ని యంత్రాలుగా మార్చొద్దు
పదో తరగతి విద్యార్థులపై ‘వంద రోజుల ప్రణాళిక’ పేరిట తీవ్ర ఒత్తిడి పెంచడం తగదు . శని, ఆదివారాల్లో తరగతుల నిర్ణయంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాం.ఇప్పటికే సిలబస్ పూర్తయినందున వారికి కావాల్సింది విశ్రాంతి, స్వయం పఠనమే. అలాగే మరోవైపు సెలవుల్లో పనిచేయిస్తూనే.. ఉపాధ్యాయులకు ‘సీసీఎల్’ మంజూరులో కఠిన నిబంధనలు, మెలికలు పెట్టడం అన్యాయం. బోధనేతర పనుల భారం తగ్గించి, సీసీఎల్పై విధించిన అసంబద్ధ నిబంధనలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. – ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యాయుడు ఎన్.బాలకృష్ణ -
13న పారా రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు
విజయనగరం: పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 13న స్థానిక రాజీవ్ క్రీడా మైదానంలో 4వ రాష్ట్రస్థాయి పారా పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్–2025 పోటీలు నిర్వహించనున్నామని జిల్లా క్రీడాధికారి ఎస్. వెంకటేశ్వర రావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన తన కార్యాలయంలో పోటీలకు సంబంధించిన పోస్టర్స్ను పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు కె.దయానంద్తో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలిసారిగా పారా రాష్ట్ర స్థాయి పోటీలు విజయనగరంలో నిర్వహించడం శుభపరిణామమన్నారు. ఈ పోటీలకు అన్ని జిల్లాల నుంచి పారా క్రీడాకారులు హాజరు కానున్నారని, జూనియర్, సబ్ జూనియర్, సీనియర్ విభాగాలకు సంబంధించి పోటీలు నిర్వహించనున్నారన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరచిన క్రీడాకారులను ఉత్తరాఖండ్లో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఉన్న పారా పవర్ లిఫ్టర్ లు ఈ పోటీల్లో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ చాటాలని కోరారు. మరిన్ని వివరాల కోసం ఫోన్ 9849377577 నంబర్ ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు కె. దయానంద్, కోచ్ తదితరులు పాల్గొన్నారు. -
● రబీలోనూ వీడని యూరియా వెతలు
ఖరీఫ్లో యూరియా కోసం తిప్పలు పడిన రైతులకు రబీలోనూ కష్టాలు తప్పడం లేదు. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో యూరియా కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. ప్రస్తుతం సాగులో ఉన్న కూరగాయలు, మొక్కజొన్న, ఉద్యానవన పంటలకు జల్లేందుకు యూరియా దొరకడం లేదు. చీపురుపల్లి మండలంలోని అలజంగి, గొల్లలములగాం, పెదనడిపల్లి, చీపురుపల్లి రైతు సేవా కేంద్రాల్లో మంగళవారం పంపిణీ చేసిన యూరియా కోసం రైతులు బారులు తీరారు. మండలానికి 49 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే రావడం, డిమాండ్ ఎక్కువగా ఉండడంతో పంపిణీకి వ్యవసాయ అధికారులు తలలుపట్టుకుంటున్నారు. పోలీసుల సమక్షంలో రైతుకు ఒక బస్తా చొప్పున పంపిణీ చేస్తున్నారు. – చీపురుపల్లి -
అంతర్జాతీయస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
● కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి పార్వతీపురం: పాఠశాల నుంచి కళాశాల స్థాయి వరకు గల క్రీడాకారుల ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించేలా ఒక ప్రత్యేక శిక్షణ ఇచ్చి అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన కలెక్టరేట్లోని సమావేశమందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లాలో క్రీడాకారులకు కొదవలేదన్నారు. అర్జున అవార్డు గ్రహీతలు, కోడిరామూర్తినాయుడు లాంటి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వెయిట్ లిఫ్టర్లున్నారన్నారు. అలాగే జాతీయ, రాష్ట్రస్థాయి క్రీడాకారుల్లో రాణించిన వారు ఎంతో మంది ఉన్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా 13 క్రీడా విభాగాల్లో జిల్లాస్థాయిలో ఎంపికలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను గుర్తించి తగిన తర్ఫీదు ఇవ్వనున్నట్లు తెలిపారు. పాఠశాల స్థాయిలో ఈనెల 12, 13 తేదీలలో, ఈనెల 15, 16, 17వ తేదీలలో జిల్లా స్థాయిలో పోటీలు జరుగుతాయన్నారు. అలాగే జిల్లాలో వాటర్ స్పోర్ట్స్ (జలక్రీడలు) నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతాయని చెప్పారు. దీనికి సంబంధించి శాప్తో చర్చించగా అంగీకారం తెలిపిందన్నారు. 2030లో కామన్వెల్త్ గేమ్స్ భారతదేశానికి కేటాయించనున్న తరుణంలో క్రీడల్లో మరింత ప్రతిభ కనబరిచి కామన్వెల్త్ క్రీడలలో పాల్గొనేలా శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. స్పోర్ట్స్ కోటాలో 3శాతం రిజర్వేషన్ ఉందని ఈమేరకు స్పోర్ట్స్లో ప్రతిభ కనబరిచిన వారికి ఉద్యోగాలు, ప్రవేశాలలో రిజర్వేషన్ వర్తిస్తుందన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్కుమార్ రెడ్డి పొల్గొన్నారు. -
ఏపీ టెట్పై యూటీఎఫ్ నిరసన
విజయనగరం అర్బన్: రాష్ట్రంలో 2010కి ముందు నియమితులైన ఉపాధ్యాయులను టెట్ పరీక్ష నుంచి పూర్తిగా మినహాయించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట యూటీఎఫ్ జిల్లా కమిటీ నాయకులు మంగళవారం నిరసన చేపట్టారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రెండురోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో తొలిరోజున జిల్లా వ్యాప్తంగా తాలూ కా కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించారు. రెండోరోజు జిల్లా కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 2010కి ముందు నియమితమైన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి శాశ్వత మనహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టెట్ అర్హతపై సుప్రీం కోర్టులో ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని, 100 రోజుల యాక్షన్ ప్లాన్ను ఆదివారాలు, ప్రభుత్వ సెలవులు మినహాయించి రీ షెడ్యూల్ చేయాలని కోరారు. బదిలీ అయిన ఉపాధ్యాయులను తక్షణమే రిలీవ్ చేయాలన్నారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి జేఏవీఏఆర్కే ఈశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో యూటీఫ్ నాయకులు సీహెచ్ తిరుపతినాయుడు, జి.రాజారావు, శ్రీదేవి, అల్లు శంకరరావు, గంగాధర్, ఎస్.వెంకటరావు, పల్లి శ్రీనివాసరావు, సుశీల తదితరులు పాల్గొన్నారు. -
సీపీఎస్ రద్దుకు డిమాండ్
● కలెక్టర్కు ఏపీ సీపీఎస్ఈఏ నాయకుల వినతి విజయనగరం అర్బన్: రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు అమలవుతున్న కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను వెంటనే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ ఉద్యోగుల అసోసియేషన్ (ఏపీ సీపీఎస్ఈఏ) రాష్ట్ర అధ్యక్షుడువ బాజీ పఠాన్ డిమాండ్ చేశారు. జిల్లా ఖజానా కార్యాలయంలో సీపీఎస్ ఉద్యోగులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి అయిన తరువాత చంద్రబాబు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడి 18 నెలలవుతున్నా సీపీఎస్ రద్దుపై ఊసేలేదని విమర్శించారు. జీతాలు, డీఏ, పీఆర్సీ బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్లోని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కరీం రాజేశ్వరరావు, చీరల కిరణ్కుమార్, ఎల్బీ యుగంధర్, జి.సతీష్కుమార్, ఎస్టీయూ ఆదినారాయుణ, తదితరులు పాల్గొన్నారు. -
సంతకాల ఉద్యమం విజయవంతం
చీపురుపల్లిరూరల్(గరివిడి): ప్రభత్వు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని చంద్రబాబు ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆగదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షు డు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనువాసరావు, మాజీఎంపీ బెల్లాన చంద్రశేఖర్ స్పష్టంచేశారు. గరివిడిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్థానిక విలేకరులతో వారు మంగళవారం మాట్లాడారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో జగన్మోహన్రెడ్డి 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను తీసుకువస్తే.. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం వాటిని ప్రైవేటుపరం చేసేందుకు పూనుకుందన్నారు. దీనిని వ్యతిరేకిస్తూ ప్రజల తరఫున ప్రతిపక్షపార్టీ బాధ్యతగా కోటి సంతకాల సేకరణ చేసి గవర్నర్కు అందజేయాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో సంతకాల ఉద్యమానికి శ్రీకారం చుట్టిందన్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో 50వేల సంతకాలు పైబడి సంతకాల సేకరణ సాగిందన్నారు. ఈనెల 10న నియోజకవర్గ స్థాయిలో చీపురుపల్లి మూడు రోడ్లు కూడలి వద్ద రాష్ట్ర శాసనమండలి విపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ ఉదయం 10 గంటలకు సంతకాల సేకరణ బాక్సులతో ఉన్న వాహనాన్ని లాంఛనంగా ప్రారంబిస్తారని తెలిపారు. మూడు రోడ్ల కూడలి నుంచి ఆంజనేయపురంలోని ఆంజనేయస్వామి ఆలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి అనంతరం పార్టీ జిల్లా కార్యాలయానికి సంతకాల సేకరణ బాక్సులను అందజేస్తారన్నారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల్లోనూ సంతకాల ప్రతులతో ర్యాలీలు సాగుతాయని తెలిపారు. ఈ నెల 15న జిల్లా కేంద్రంలో తలపెట్టిన సంతకాల ప్రతుల ప్రదర్శన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు, ప్రజలు, యువత పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రైవేటీకరణ వల్ల ప్రజలకు ఎంత నష్టం జరుగుతుందో విమానయానంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనలే నిలువెత్తు నిదర్శనమన్నారు. రాబోయే రోజుల్లో మెడికల్ కళాశాలల్లో కూడా అదే పరిస్థితి ఎదురవుతుందన్నారు. విమానయాన శాఖను సమర్థవంతంగా నిర్వహించలేక మంత్రి రామ్మోహన్నాయుడు తెలుగువారి పరువును తీసివేశారన్నారు. కార్యక్రమంలో బొత్స అనూష, వైఎస్సార్సీపీ నాయకుడు కె.వి.సూర్యనారాయణరాజు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎస్.వి.రమణరాజు, నాయకులు మీసాల విశ్వేశ్వరరావు, వాకాడ శ్రీనివాసరావు, కొణిశ కృష్ణంనాయడు, చీపురుపల్లి మండల నాయకులు ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసులనాయుడు, మీసాల వరహాలనాయుడు, బెల్లాన వంశీకృష్ణ, గుర్ల మండల నాయకులు సీర అప్పలనాయుడు, పొట్నూరు సన్యాసినాయుడు, తోట తిరుపతిరావు, మెరకముడిదాం మండల నాయకులు తాడ్డి వేణుగోపాలరావు, కోట్ల విశ్వేశ్వరరావు, నాలుగు మండలాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ పీఏసీఎస్ అధ్యక్షులు పాల్గొన్నారు. సాక్షిప్రతినిధి, విజయనగరం: ప్రభుత్వ వైద్యకళాశాలల పరిరక్షణకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు పార్టీ నాయకులు జిల్లాలో చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం విజయవంతమైంది. జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు సంతకాల కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. భవిష్యత్తు తరాల కోసం ఈ సంతకం ఉపయోగపడాలని ఆకాంక్షించారు. చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశత్వపాలనపై సంతకంతో నిరసన తెలిపారు. సంతకాల ప్రతులను గవర్నర్కు అందజేసి ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కాపాడాలని వైఎస్సార్సీపీ నేతలను కోరారు. ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇచ్చారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. దేశంలో ఎక్కడాలేని విధంగా 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను రాస్ట్రానికి తీసుకువచ్చిన విషయం విదితమే. 2023–24 కాలంలోనే ఇందులో ఐదు కళాశాలలను ప్రారంభించారు. అందులో విజయనగరం ప్రభుత్వ వైద్యకళాశాల ఒకటి. మిగిలిన కళాశాలలు వివిధ దశల్లో ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా వంటి వెనుకబడిన గిరిజన ప్రాంతంలోనూ ప్రభుత్వ వైద్యకళాశాల ఆవశ్యకతను నాటి సీఎం జగన్మోహన్రెడ్డి గుర్తించి.. రూ.600 కోట్లతో కళాశాల మంజూరు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ప్రజా ప్రయోజనాలను కాదని, కేవలం రాజకీయ కక్షతో వీటికి మంగళం పాడింది. తన బాధ్యత నుంచి తప్పుకుని, పీపీపీ విధానంలోని వీటిని ప్రైవేటుకు కట్టబెట్టేందుకు సిద్ధమైంది. ఇదే జరిగితే పేద విద్యార్థులకు వైద్యవిద్యను అభ్యసించాలన్న కల నెరవేరకుండా పోతోంది. పేదలకు, గిరిజనులకు జిల్లాలోనే ఉచితంగా మెరుగైన వైద్యసేవలు అందని పరిస్థితి. ప్రభుత్వ వైద్యకళాశాలలను ప్రైవేట్పరం చేయడాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండించింది. పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకు ప్రజాఉద్యమానికి పార్టీ నేతలు సిద్ధమయ్యారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోను సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టారు. శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ ఎమ్మెల్యేలు బడ్డుకొండ అప్పలనాయుడు, శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, బొత్స అప్పలనరసయ్య, కడుబండి శ్రీనివాసరావు, పార్టీ రాజాం నియోజకవర్గ సమన్వయకర్త తలే రాజేష్, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, పార్టీ నేతలు సంతకాల ఉద్యమంలో స్వయంగా పాల్గొన్నారు. వైద్యకళాశాలల ఆవశ్యకతను వివరించారు. చంద్రబాబు దుర్మార్గపు పాలనను విడమర్చిచెప్పారు. ప్రజల మద్దతు కోరుతూ, కోటి సంతకాల సేకరణ చేపట్టి రాష్ట్ర గవర్నర్కు అందజేయాలని నిర్ణయించారు. అక్టోబర్లో రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నెల 3వ తేదీ వరకు జిల్లాలోని ఒక్కో నియోజకవర్గంలో 60 వేల పైచిలుకు సంతకాలను సేకరించారు. ఈ నెల 10న సంతకాల ప్రతులను ప్రత్యేక వాహనాల ద్వారా జిల్లా కేంద్రాలకు తరలించనున్నారు. అనంతరం 15వ తేదీన జిల్లా కేంద్రం నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలిస్తారు. అక్కడి నుంచి ఈ నెల 17న గవర్నర్ వద్దకు వెళ్లి ప్రజాభిప్రాయాన్ని అందజేయనున్నారు. ప్రజల పక్షాన నిలిచిన వైఎస్సార్సీపీ జిల్లాలో వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణ విజయవంతం ప్రభుత్వ వైద్యకళాశాల పరిరక్షణకు ప్రజల నుంచి విశేష మద్దతు ఒక్కో నియోజకవర్గంలో 60 వేలకుపైగా సంతకాల సేకరణ 17న గవర్నర్ వద్దకు.. -
సాఫ్ట్బాల్ పోటీల్లో సత్తాచాటిన జిల్లా జట్లు
తెర్లాం: రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 సాఫ్ట్బాల్ పోటీల్లో జిల్లా బాలురు, బాలికల జట్లు సత్తా చాటాయి. ఈనెల 6 నుంచి 8వరకు గుంటూరు జిల్లా మోదుకూరులో జరిగిన రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ అండర్–19 సాఫ్ట్బాల్ పోటీల్లో జిల్లాకు చెందిన బాలుర జట్టు ప్రథమ స్థానం సాధించగా, బాలికల జట్టు తృతీయ స్థానాన్ని కై వసం చేసుకుంది. రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీల్లో రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి బాలురు, బాలికల జట్లు పాల్గొన్నాయని, ఈ పోటీల్లో విజయనగరం జిల్లా జట్లు అత్యుత్తమ ప్రతిభను కనబరిచినట్లు జిల్లా జట్ల మేనేజర్ చొక్కాపు సత్యనారాయణ మంగళవారం తెలియజేశారు. రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ ఫైనల్ పోటీల్లో జిల్లా బాలుర జట్టు కడప జట్టుతో తలపడి ప్రథమ స్థానం సాధించింది. అలాగే బాలికల జట్టు కడప బాలికల జట్టుతో పోటీపడి తృతీయ స్థానాన్ని కై వసం చేసుకుంది. రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ పోటీల్లో పాల్గొన్న జిల్లా బాలురు, బాలికల జట్లకు కోచ్లుగా శివ, మహేష్, మేనేజర్గా పీడీ సత్యనారాయణ వ్యవహరించారు. జిల్లాకు చెందిన బాలురు, బాలికల జట్లు రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో రాణించడంతో క్రీడాకారులను స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, పలువురు పీడీలు, పీఈటీలు అభినందించారు. మరిన్ని పోటీల్లో జిల్లా బాలికల, బాలుర జట్లు మరింత బాగా రాణించి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని వారంతా ఆకాంక్షించారు. ఈనెల 6 నుంచి 8 వరకు గుంటూరు జిల్లాలో జరిగిన పోటీలు రాష్ట్రస్థాయిలో ప్రఽథమ స్థానం సాధించిన బాలుర జట్టు తృతీయ స్థానాన్ని కై వసం చేసుకున్న బాలికల జట్టు -
హింసకు గురైన మహిళలకు తక్షణ సహాయం
● కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ● వన్స్టాప్ సెంటర్ వాహనం ప్రారంభంవిజయనగరం ఫోర్ట్: హింసకు గురైన మహిళలకు తక్షణ సహాయం అందించాలనే ఉద్దేశంతో వన్స్టాప్సెంటర్ నూతన వాహనాన్ని ప్రారంభించినట్లు కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు స్థానిక కలెక్టరేట్ వద్ద వన్స్టాప్ సెంటర్ హెల్ప్ లెన్ వాహనాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాహనంలో వైద్యం, న్యాయం, తాత్కాలిక ఆశ్రయం వంటి సేవలను అందించనున్నారని తెలిపారు. మహిళలను హింసజరిగే ప్రదేశం నుంచి (ఇల్లు, పని స్థలం) ఈకేంద్రాలకు తీసుకురావడం లేదా వారిని అవసరమైన ప్రదేశాలకు తరలించడానికి ఈ వాహనం ఉపయోగపడుతుందన్నారు. ఆపదలో ఉన్న మహిళకు హెల్ప్లైన్ వాహనం వన్స్టాప్ సెంటర్గా ఉపయోగపడుతుందన్నారు. మహిళలకు హెల్ప్లైన్ 181, పోలీస్ 100, ఆస్పత్రి 108 లీగల్ సర్వీసెస్ అనుసంధానం చేసి ఉన్నందున 24 గంటల పాటు సేవలు అందుతాయని చెప్పారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ విమలారాణి, డీఎంసీ సుజాత, వన్స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ సాయి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కీలక ప్రాజెక్టుల భూసేకరణ వేగవంతం చేయండి విజయనగరం అర్బన్: జిల్లాలో అమలవుతున్న పలు కీలక ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, తోటపల్లి ప్రాజెక్టు, తారకరామ తీర్థసాగర్, జాతీయ రహదారి 130సీ, జాతీయ రహదారి 519ఈ, ఖుర్దారోడ్–విజయనగరం మూడోలైన్, కొత్తవలస, విజయనగరం నాలుగోరైల్వే లైన్ తదితర మేజర్ ప్రాజెక్ట్ల భూసేకరణ ప్రకటనలు, పరిహార చెల్లింపులు వంటి అంశాలను వివరంగా సమీక్షించారు. ఈ ప్రాజెక్టుల కోసం ఇప్పటికే సేకరించిన ప్రభుత్వ భూమిని వెంటనే సంబంధిత శాఖలకు అప్పగించాలని మిగతా భూసేకరణ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర ఎస్.సేతుమాధవన్, ఆర్డీఓలు దాట్ల కీర్తి, రామ్మోహన్, ఎస్డీసీ కళావతి, ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ లక్ష్మణరావు, ఇరిగేషన్ ఈఈ వెంకటరమణ, అటవీశాఖ, ఎయిర్పోర్ట్ అథారిటీ, సెంట్రల్ యూనివర్సిటీ, ఆర్అండ్బీ, రైల్వే శాఖ అధికారులు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు (భూసేకరణ) పాల్గొన్నారు. -
బ్రెయిన్ యోగా ఒక అద్భుతం
● అంతర్జాతీయ బ్రెయిన్ యోగా గురువు పిడుగు శ్రీనివాసులువిజయనగరం: బ్రెయిన్ యోగా ఒక అద్భుతమని బెంగళూరుకు చెందిన ప్రముఖ బ్రెయిన్ యోగా గురువు, అంతర్జాతీయ శిక్షకుడు పిడుగు శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లాశాఖ అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్ ఆధ్వర్యంలో గురజాడ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో మంగళవారం ఆయన పాల్గొని మాట్లాడారు. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, మానసిక స్పష్టతను పెంచడం, ఆందోళనను తగ్గించడం, నాడీ వ్యవస్థను ఉత్తేజపరచడం, మెదడుకు రక్త ప్రసరణను పెంచడం, న్యూరోన్ల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేయడం వంటివి బ్రెయిన్ యోగాతో సాధ్యమన్నారు. ఈ సందర్భంగా వివిధ ముద్రలతో బ్రెయిన్ ఎక్సర్సైజ్ విద్యార్థులతో చేయించడమే కాక వాటి విశిష్టతను విపులంగా వివరించారు. ఈ సందర్భంగా యోగా గురువు పిడుగు శ్రీనివాసులును, రోటరీ లీడ్ ఇండియా చైర్మన్ దుర్గాబాలాజీ, పాఠశాల ప్రిన్సిపాల్ పూడి శేఖర్తో కలిసి గురుప్రసాద్ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో రోటరీ లీడ్ ఇండియా ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ చైతన్య, జగదీష్, లత తదితరులు పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ మృతి
కురుపాం: కురుపాం–గొరడ ప్రధాన రహదారిలో బుడ్డెమ్మ ఖర్జ సమీపంలో రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఆదివారం సాయంత్రం ఢీ కొన్న ఘటనలో కిచ్చాడ పంచాయతీ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ గోళ్ల గౌరీశంకర్ కు తీవ్ర గాయాలైన సంఘటన విదితమే. ఈ మేరకు సంఘటన స్థలం నుంచి కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి 108 వాహనంలో తరలించగా వైద్యులు ప్రాథమిక వైద్యం అందించిన తరువాత మెరుగైన వైద్య సేవల కోసం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి విజయనగరం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడు గౌరీశంకర్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎలక్ట్రానిక్స్ షాపులో అగ్నిప్రమాదంరాజాం సిటీ: మున్సిపాల్టీ పరిధి డోలపేట గ్రామంలోని ఎలక్ట్రానిక్స్ దుకాణంలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. షాపులోనుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో షాపు యజమానితోపాటు స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఫైర్స్టేషన్కు సమాచారం అందించడంతో ఎస్సై పి.అశోక్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ఈ ఘటనలో ఎలక్ట్రానిక్ పరికరాలతోపాటు ఏసీ, ఫ్రిడ్జ్, రిమ్మల్స్ స్పేర్పార్ట్స్ కాలిపోగా సుమారు రూ.2లక్షలు ఆస్తినష్టం సంభవించిందని ఫైర్ ఎస్సై తెలిపారు. 800 లీటర్ల బెల్లం ఊట ధ్వంసంకురుపాం: ఎకై ్సజ్ దాడుల్లో 800 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసినట్లు కురుపాం ఎకై ్సజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ ముందస్తు సమాచారం మేరకు సర్కిల్ పరిధిలో కొమరాడ మండలంలోని రెబ్బ గ్రామంలో సారా తయారీ కేంద్రాలపై సంయుక్తంగా దాడులు నిర్వహించగా సారా తయారీ కోసం 800 లీటర్ల బెల్లం ఊట నిల్వ ఉంచినట్లు గుర్తించి ధ్వంసం చేసినట్లు తెలిపారు. సారా బట్టీ నిర్వాహకుడిగా తాడంగి గోపాల్ను ఈ దాడుల్లో గుర్తించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దాడుల్లో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ వి.వి.వి.ఎస్. శేఖర్బాబు, ఎస్సైలు రాజశేఖర్, చంద్రకాంత్, కురుపాం ఎకై ్సజ్ సిబ్బంది పాల్గొన్నారన్నారు. 63 మద్యం బాటిల్స్ ధ్వంసం రాజాం సిటీ: స్థానిక టౌన్ సర్కిల్ కార్యాలయం ఆవరణలో పలు కేసుల్లో పట్టుబడిన 63 మద్యం బాటిల్స్ను అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీరంగందొర మంగళవారం ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో బెల్టుషాపులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటున్నామ న్నారు. ఇప్పటికే ఎకై ్సజ్ సిబ్బందికి బెల్టు నిర్వహణపై దాడులు నిర్వహించేలా ఆదేశాలు జారీచేశామని తెలిపారు. అనంతరం పలు కేసుల్లో పట్టుబడిన వాహనాలకు వేలం నిర్వహించారు. కార్యక్రమంలో టౌన్ సీఐ కె.అశోక్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. ముత్తూట్ ఫైనాన్స్లో అరకిలో బంగారం మాయంవిజయనగరం క్రైమ్: విజయనగరం ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో నుంచి అరకేజీ బంగారం మాయమైంది. ఆడిట్ తనిఖీకి వచ్చిన ఉద్యోగే ఏడు ప్యాకెట్లలో ఉన్న బంగారాన్ని సైడ్ చేశాడు. ఇందుకు సంబంధించి వన్టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై రవి కేసు నమోదు చేశారు. ఆడిట్ తనిఖీల్లో భాగంగా ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో ఆడిట్ ఇన్స్పెక్టర్ మనోజ్ తనిఖీలు చేసే క్రమంలో మేనేజర్తో మాట్లాడుతుండగానే దాదాపు రూ.48 లక్షలు విలువ చేసే అరకేజీ బంగారాన్ని స్వాహా చేశాడు. తనిఖీ అనంతరం సీసీ ఫుటేజీని పరిశీలించిన బ్రాంచ్ మేనేజర్ కంగుతిని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తానే ఆ బంగారాన్ని పట్టుకెళ్లానని తిరిగి ఇమ్మని అడిగినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆత్మహత్య చేసుకుంటానని ముత్తూట్ ఫైనాన్స్ మేనేజర్కు మెసేజ్ చేశాడు. దీనిపై వన్టౌన్ ఎస్సై రవి ఫండ్స్ మిస్ అప్రోప్రియేషన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
● ఈ నెల 10 నుంచి 21వ తేదీ వరకు నిర్వహణ ● హాజరుకానున్న అభ్యర్థులు 13,985 మంది
బొబ్బిలి రూరల్: మోంథా తుఫాన్ వరదలకు విశాఖ–రాయగడ అంతరరాష్ట్ర రహదారిలో పారాది వద్ద వేగావతి నదిపై నిర్మించిన తాత్కాలిక కాజ్వే కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. వరద సహాయ నిధి నుంచి రూ.15 లక్షలను కలెక్టర్ మంజూరు చేయడంతో ఆర్అండ్బీ అధికారులు మరమ్మతు పనులు పూర్తిచేశారు. కాజ్వేపై సోమవారం నుంచి భారీ వాహనాల రాకపోకలకు అనుమతించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వేగావతి నదిపై కొత్తగా వంతెన నిర్మాణానికి రూ.10కోట్లు మంజూరు చేసింది. అప్పట్లో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, అప్పటి బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు వంతెన పనులకు శంకుస్థాపన చేశారు. పిల్లర్ల వరకు పూర్తయిన వంతెన పనులకు చంద్రబాబు ప్రభుత్వం మరో మూడున్నర కోట్లు బడ్జెట్ పెంచింది. శ్లాబ్ పనులను బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు సోమవారం ప్రారంభించారు. విజయనగరం టౌన్: సైనిక సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని జిల్లా సైనిక సంక్షేమాధికారి కేవీఎస్ ప్రసాద్ అన్నారు. భారత సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని కలెక్టర్, జిల్లా సైనిక సంక్షేమ సంఘం చైర్మన్ రాంసుందర్రెడ్డి కలెక్టరేట్ ప్రాంగణంలో సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ సాయుధ దళాల పతాక నిధికి విరివి గా విరాళాలివ్వాలన్నారు. సైనిక సంక్షేమానికి ప్రజలిచ్చిన ప్రతిపైసా భారత సైన్యంలో వీరమరణం పొందిన, రక్షణ దళంలో విశిష్ట సేవలందించిన కుటుంబాల సంక్షేమ సహాయానికి అందించబడతాయన్నారు. కార్యక్రమంలో డి. ఈ శ్వరరావు, ఎన్సీసీ అధికారులు, సైనిక సంక్షేమ సిబ్బంది, వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు, మాజీ సైనికోద్యోగులు పాల్గొన్నారు. విజయనగరం అర్బన్: జిల్లాలో ఈ నెల 10 నుంచి 21వ తేదీ వరకు జరగనున్న ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ పరీక్ష–2025 (ఏపీ టెట్)కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) మురళి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశం మందిరంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 13,985 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారన్నారు. వీరికోసం 5 ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశామని చెప్పారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ ఉంటుందని వివరించారు. గంట్యాడ: ప్రభుత్వం జీఓ నంబర్ 36ను వెంటనే అమలు చేయాలని, వేతన సవరణతో పాటు మధ్యంతర భృతి చెల్లించాలని ఏపీ వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక నాయకుడు మంగయ్య డిమాండ్ చేశారు. ఉద్యోగులతో కలిసి గంట్యాడ డీసీసీబీ బ్రాంచి ఎదుట సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు చెల్లించే గ్రాట్యూటీ సిలింగ్ విధించి రూ.2 లక్షలు మాత్రమే చెల్లించడం సరికాదన్నారు. సహకార సంఘాలలో పనిచేసే ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలని, రూ. 5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య బీమా అమలు చేయాలని డిమాండ్ చేశారు. -
8వ తేదీ వచ్చినా జీతాల్లేవు
● రెండు శాఖల ఉద్యోగులు మినహా మిగిలిన వారికి అందని జీతం విజయనగరం అర్బన్: ‘వ్యవసాయ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఓ వ్యక్తి జిల్లా కేంద్రంలో కట్టుకున్న ఇల్లుకోసం బ్యాంకు రుణం తీసుకున్నారు. రుణం నెలవారీ వాయిదా మొత్తం 5వ తేదీలోపు జీతం నుంచి జమచేసుకోవాలని బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పుడు 8వ తేదీ వచ్చినా జీతం జమకాకపోవడంతో అకౌంట్ బౌన్స్ చార్జీలతో పాటు సెబీ విలువ పడిపోయి డిఫాల్టర్గా మారిపోయాడు.’ ఇది ఒక వ్యవసాయ శాఖ ఉద్యోగి సమస్యేకాదు. విద్య, పోలీస్ శాఖ ఉద్యోగులు మినహా జిల్లాలోని మిగిలిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితి అని ఆయన వాపోయాడు. ‘గత ప్రభుత్వం జీతాలు వేయడంలో రెండుమూడురోజులు ఆలస్యం అయినా అన్ని శాఖల ఉద్యోగ, అధికారులకు ఒకేసారి వేసేది. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఉద్యోగులు అధికంగా ఉన్న విద్యాశాఖ, పొలీసు శాఖల ఉద్యోగులకు ముందుగా వేసి మిగిలిన శాఖల ఉద్యోగులకు పదోతేదీ దాటాక వేస్తోంది. అత్యవసర శాఖల ఉద్యోగులకు తొలుత వేయాలంటూ చెబుతున్న ప్రభుత్వం మిగిలిన శాఖల ఉద్యోగుల కుటుంబాలకు వేతనాలు అవసరం లేదా..? ఉద్యోగుల మధ్య ప్రభుత్వం వివక్షత చూపడం సరికాదు.’ అంటూ వేతనాలు ఇప్పటికీ పడని ఓ ఆర్అండ్బీ ఉద్యోగి ఆవేదన ఇది. అంతన్నారు.. ఇంతన్నారు... ప్రజాసంక్షేమ పథకాలను పక్కనపెట్టేశారు. కనీసం ఉద్యోగుల జీతాలను కూడా ఒకటో తేదీన చెల్లించలేని దుస్థితిలో చంద్రబాబు సర్కారు ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండేళ్లలో లక్షలకోట్ల రూపాయలు అప్పుడుచేసిన సర్కారు... జీతాల చెల్లింపులో జాప్యంపై ఉద్యోగవర్గాలు మండిపడుతున్నాయి. జీతాల చెల్లింపులో వివక్ష చూపడాన్ని ఖండిస్తున్నాయి. 8వ తేదీ ముగిసినా జీతాలు చెల్లించకపోవడంపై ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో వివిధ విభాగాల్లో సుమారు 57 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో దాదాపు 24 వేల మంది వరకు ఉన్న టీచర్లు, పోలీస్ ఉద్యోగులకు మాత్రమే జీతాలు వేశారు. మిగిలిన వివిధ శాఖల సిబ్బందికి వేతనాలు పడలేదు. జీతాల చెల్లింపులో ఆలస్యంపై ఆయా ఉద్యోగవర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఓటేసిన పాపానికి అనుభవిస్తున్నా మంటూ మదనపడుతున్నాయి. -
మంత్రి కుమారుడిపై కేసు నమోదుకు డిమాండ్
● ఉద్యోగినిపై వేధింపులకు పాల్పడిన పీఏను అరెస్టు చేయాలి ● రౌండ్టేబుల్ సమావేశంలో మహిళా సంఘాల డిమాండ్ పార్వతీపురం రూరల్: మహిళలకు రక్షణ కల్పించా ల్సిన సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి సొంత నియోజకవర్గంలోని మహిళా ఉద్యోగినికి రక్షణ కరువవడం సిగ్గుచేటని, వేధింపులకు పాల్పడిన మంత్రి కుమారుడిపై తక్షణమే కేసు నమోదుచేయాలని, అనధికారిక పీఏను అరెస్టు చేయాలని మహిళా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పార్వతీపురంలోని సుందరయ్య భవనంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఆర్.శ్రీదేవి అధ్యక్షతన సోమవా రం నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో మ హిళా సంఘాల నాయకులు మాట్లాడారు. సాలూరుకు చెందిన మహిళా ఉద్యోగినిని మంత్రి పీఏ, కుమారుడు శారీరకంగా, మానసికంగా వేధించార ని ఆరోపించారు. దీనిపై ఆధారాలతో సహా ఆమె జిల్లా పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా రాజ కీయ ఒత్తిళ్లకు తలొగ్గి మంత్రి కుమారుడిపై కేసు నమోదు చేయలేదని ఆరోపించారు. పీఏపై కేసు ఉన్నప్పటికీ అరెస్టు చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. బాధితురాలికి న్యాయం చేయాల్సిన అధికారులు ఆమెకు నిబంధనల ప్రకారం రావాల్సి న సెలవులు నిరాకరిస్తూ జీతాల్లో కోత విధిస్తూ వేధించడం హేయమైన చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్షించాల్సిన వారే భక్షకులుగా మారితే సామాన్య మహిళల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. తక్షణమే నిందితులను అరెస్టు చేయకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని, అవసరమైతే ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించా రు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశా రు. కార్యక్రమంలో ఐద్వా, ప్రగతిశీల మహిళా సంఘం, శ్రామిక మహిళా సంఘం నాయకులు బి. లక్ష్మి, పి.రమణి, వి.ఇందిర, తులసి, కుమారి, తదితరులు పాల్గొన్నారు. -
విజయనగరం
మంగళవారం శ్రీ 9 శ్రీ డిసెంబర్ శ్రీ 2025కోటి సంతకాలకు విశేష స్పందన ● ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవా రం నిర్వహించిన ప్రజా వినతుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు ప్రజల నుంచి భారీ సంఖ్యలో అర్జీలు అందాయి. –8లోరేగిడి: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణకు ఉమ్మడి విజయనగరం జిల్లాలో అనూహ్య స్పందన లభించిందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. రేగిడిలో విలేకరులతో సోమవారం ఆయన మాట్లాడారు. ఈ నెల 10న నియోజకవర్గ స్థాయిలో కోటి సంతకాల ప్రతుల సేకరణకు, ఈ నెల 15న జిల్లా స్థాయిలో చేపట్టనున్న కోటి సంతకాల ర్యాలీకి ప్రతి గ్రామం నుంచి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఫీజురీయింబర్స్ మెంట్ నిధులు విడుదల కాక విద్యార్థులు, ఎరువులు, విత్తనాలు దొరకకపోవడం, పంట కొనుగోలు చేయక రైతులు, ఉద్యోగాలులేక, నిరుద్యోగ భృతి అందక నిరుద్యోగులు, పింఛన్లు మంజూరుకాక అర్హులు, రీ వెరిఫికేషన్తో దివ్యాంగులు.. ఇలా ప్రతి వర్గం ఇబ్బందులు పడుతోందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం 50 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందజేస్తామని ఇచ్చిన హామీ నీటిమూటగా మారిందన్నారు. ఆయన వెంట పార్టీ నాయకులు టి.అచ్చెన్నాయుడు, వి.జగన్మోహనరావు, దవళేశ్వరరావు, తదిరులు ఉన్నారు. -
మంత్రి తీరుతో తెలుగోడి గౌరవం నవ్వులపాలు
లక్కవరపుకోట: కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు తెలుగువారి గౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో నవ్వులపాలు చేశారని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. ఎల్.కోటలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్లో పెద్ద పెద్ద ప్రసంగాలతో గొప్పలకు పోయిన మంత్రి ఈ రోజు దేశ విమానయానం సంక్షోభంలో పడిపోతే పలాయనం పుచ్చుకున్నారని ఎద్దేవాచేశారు. ప్రైవేటీకరణ ఎంత ప్రమాదమో ఇండియన్ ఎయిర్లైన్స్ ప్రైవేటీకరణతో దేశ, రాష్ట్ర ప్రజలకు అర్థమైందన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోన్రెడ్డి తీసుకున్న నిర్ణయం ఈ రోజు జాతీయ స్థాయిలో చర్చకు దారితీసిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ ఉచ్చులోపడి పేదవారి భవిష్యత్తు విస్మరిస్తున్నాయన్నారు. ఉపాధిహామీ పథకాన్ని నీరుగార్చుతున్నారని, రాష్ట్రంలో ప్రస్తుత ఏడాదిలో 38.2 కోట్లు పనిదినాలను కోత వేయడం విచారకరమన్నారు. రాష్ట్రంలో సుమారు 50వేలకు పైగా రైతులకు అన్నదాత సుఖీభవ వర్తించలేదన్నారు. గడిచిన 18 నెలల పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి నెక్కల నాయుడుబాబు పాల్గొన్నారు. -
కదం తొక్కిన రైతులు
విజయనగరం ఫోర్ట్: గుర్ల మండలంలో ఏర్పాటుచేయనున్న సూపర్ స్మెల్టర్ స్టీల్ ప్లాంట్కు వ్యతిరేకంగా పలు గ్రామాల రైతులు కదం తొక్కారు. ట్రాక్టర్లపై వందలాది మంది కలెక్టరేట్కు చేరుకుని సోమవారం ఆందోళన చేశారు. ‘స్టీల్ ప్లాంట్ వద్దు.. పచ్చని పంట పొలాలే ముద్దు, భూములు ఇవ్వకు.. భవిష్యత్ చంపకు, మా భూమి.. మా హక్కు’ అంటూ ప్లకార్డులు పట్టుకుని నినదించా రు. సూపర్ స్మెల్టర్స్ప్లాంట్ వ్యతిరేక పోరాట కమి టీ గౌరవాధ్యక్షుడు బుద్దరాజు రాంబాబు మాట్లాడుతూ పచ్చని పంట పొలాల్లో స్టీల్ప్లాంట్ను ఏర్పాటు చేస్తే సహించేది లేదన్నారు. ఏడాదికి రెండు పంటలు పండే భూములను ప్లాంట్ కోసం ఇచ్చేదిలేదని తెగేసిచెప్పారు. ఇక్కడి నేలను, నీరు, గాలిని కలుషితం చేస్తామంటే చూస్తూ ఊరుకోబో మన్నారు. ఆందోళనలో గుర్ల మండలంలోని దమరసింగి, వల్లాపురం, బెల్లాన పేట, మన్యపురిపేట, కెల్ల, ఎస్.ఎస్.ఎస్.ఆర్.పేట తదితర గ్రామాల రైతులు పాల్గొని ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపా రు. కార్యక్రమంలో ఎంపీపీ పొట్నూరు సన్యాసినాయుడు, గుర్ల సన్యాసినాయుడు, గుర్ల జెడ్పీటీసీ సభ్యుడు శీర అప్పలనాయుడు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మర్రాపు సూర్యనారాయణ, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు వి.వెంకటేశ్వర్లు, పోరాట కమిటీ కన్వీనర్ మీసాల ప్రసాద్, కో కన్వీనర్ మందపాటి కృష్ణం రాజు, వైఎస్సార్సీపీ నాయకులు కె.వి.సూర్యనారాయణ రాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, సీపీఐ నాయకులు బుగత అశోక్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసనాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
తండ్రే హంతకుడు
● అనుమానాస్పద మృతిలో వీడిన మిస్టరీ పాలకొండ రూరల్: ఇటీవల పాలకొండ మండలం బుక్కూరు గ్రామంలోని స్వగృహంలో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్ జామి విఠల్రావు (49) మృతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన సీఐ ఆమిటి ప్రసాదరావు అందించిన వివరాలిలా ఉన్నాయి. వ్యసనాలకు బాని సైన విఠల్రావు నిత్యం మద్యం తాగి ఇంటికి వచ్చి కుటుంబసభ్యులను వేదిస్తుండేవాడన్నారు. ఈ క్రమంలో ఈనెల 2వ తేదీన రాత్రి మద్యం మత్తులో వచ్చిన విఠల్రావు ఇంట్లో గొడవ పడ్డాడు. ఈ ఘర్షణలో మృతుడి తండ్రి రామప్పడు కోపం తట్టుకోలేక, సహనం కల్పోయి గొడ్డలితో తన కుమారుడిపై దాడి చేయగా తీవ్రంగా గాయపడిన విఠల్రావు మృతి చెండాడు. తమ దర్యాప్తులో తండ్రి ఈ నిజం అంగీకరించినట్లు సీఐ సోమవారం మీడియాకు తెలిపారు. మండల వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన ఈ మృతి కేసును కేవలం 7 రోజుల వ్యవధిలో పోలీసులు ఛేదించారు. ఘటన జరిగిన రోజు జాగిలాలు ఘటన స్థలం చుట్టూ తిరిగి రామప్పడు వద్దకు వచ్చి నిలిచిపోవడంతో ఆ దిశగా దర్యాప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
అర్జీలకు నాణ్యమైన పరిష్కారం ఇవ్వాలి
● కలెక్టర్ ప్రభాకరరెడ్డిపార్వతీపురం: ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అందిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారాన్ని ఇవ్వాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి మండల స్థాయి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన ప్రజలు 82 వినతులు అందజేశారు. వినతుల్లో రెవెన్యూకు సంబంధించి 12, సాధారణ అర్జీలు 70 ఉన్నాయి. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీలను ఆడిట్ చేయనున్నట్లు తెలిపారు. జిల్లా అధికారులు అర్జీలను స్వయంగా పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. నాణ్యంగా అర్జీలను పరిష్కరించకపోతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. అర్జీలను స్వీకరించినవారిలో డీఆర్ఓ కె.హేమలత, ప్రత్యేక ఉప కలెక్టర్ ఎస్.దిలీప్ చక్రవర్తి, డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పోలీసులు, ప్రజల మధ్య పరస్పర విశ్వాసం బలోపేతం చేయాలి పార్వతీపురం రూరల్: జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్కు వచ్చే అర్జీదారుల నుంచి స్వీకరించిన సమస్యలను వీలున్నంత మేరకు పరిష్కరించి పోలీసుశాఖ, ప్రజల మధ్య పరస్పర విశ్వాసాన్ని బలోపేతం చేయాలని ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లాలో ఉన్న పలు స్టేషన్ల పరిధిలో నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించి, అర్జీదారులతో ఎస్పీ ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రధానంగా వచ్చిన ఫిర్యాదుల్లో కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, తల్లిదండ్రుల వేధింపులు, భర్త/అత్తారింటి వేధింపులు, భూ–ఆస్తి వివాదాలు, నకిలీపత్రాలు, అధిక వడ్డీలు, ఆన్లైన్ మోసం, ప్రేమ పేరుతో మోసం, ఇతర సమస్యలపై ఫిర్యాదుదారులు స్వేచ్ఛగా విన్నవించగా వారి సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో స్వయంగా ఎస్పీ ఫోన్లో మాట్లాడి వచ్చిన ఫిర్యాదులు వాస్తవాలైనట్లైతే చట్టపరిధిలో చర్యలు చేపట్టి తీసుకున్న చర్యల నివేదికను తన కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు. మొత్తంగా 9 ఫిర్యాదులు ఎస్పీ పీజీఆర్ఎస్కు అందాయి. కార్యక్రమంలో ఎస్పీతోపాటు జిల్లా అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, డీసీఆర్బీసీఐ ఆదాం, ఎస్సై రమేష్నాయుడు మరికొందరు సిబ్బంది ఉన్నారు. డీకేటీ భూములకు అందని అన్నదాత సుఖీభవ సీతంపేట: డీకేటీ, ఆర్వోఎఫ్ఆర్ భూములు సాగుచేస్తున్న గిరిజన రైతులకు అన్నదాత సుఖీబవ నిధులు బ్యాంకు ఖాతాలో జమకాలేదని వైఎస్సార్సీపీ నాయకులు హెచ్.మోహన్రావు, వి.చలపతి, అప్పారావు, మంగయ్య, వెంకునాయుడు తదితరులు ఐటీడీఏలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పీహెచ్వో ఎస్వీ గణేష్కు వినతిపత్రం అందజేశారు. గత ప్రభుత్వంలో రైతు భరోసాలో అందరికీ నిధులు వచ్చాయని, ఇప్పుడు పూర్తిగా అందలేదన్నారు. గిరిజనులకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. ఇతర వినతులు పరిశీలిస్తే ఓండ్రుజోలకు చెందిన అంగన్వాడీ ఆయా సునోమి 19నెలల పెండింగ్ వేతనాలు ఇప్పించాలని కోరింది. ఐటీఐ ఎదురుగా ఇళ్ల నిర్మాణం చేసుకున్న గిరిజనులకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని పలువురు వినతిపత్రం ఇచ్చారు. కిరాణాషాపు పెట్టుకోవడానికి రుణం ఇప్పించాలని శిలిగాంకు చెందిన సవర అప్పలమ్మ కోరింది. చింతలగూడకు చెందిన వి.సొంబరు ఆర్వోఎఫ్ఆర్ భూములను సర్వే చేసి పట్టాలిప్పించాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీఈవో రామ్మోహన్రావు, వ్యవసాయాధికారి వాహినిణి, ఏపీడీ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
ఒలింపియాడ్ గోల్డ్ మెడలిస్ట్కు ఎస్పీ అభినందనలు
విజయనగరం: ఇటీవల ముంబైలో కేంద్రప్రభుత్వం నిర్వహించిన ‘ఒలింపియాడ్ అమెచ్యూర్ ఇండియా‘ బాడీ బిల్డింగ్ పోటీల్లో దివ్యాంగుల విభాగానికి సంబంధించి జరిగిన పోటీలో జిల్లాకు చెందిన బాడీ బిల్డర్ ఈదుబిల్లి సూర్యనారాయణ గోల్డ్ మెడల్ సాధించి అంతర్జాతీయ పోటీలకు ఎంపిక కావడం అభినందనీయమని, ఎస్పీ ఏ ఆర్ దామోదర్ ప్రశంశించారు. పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్తో కలిసి సూర్యనారాయణ సోమవారం ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పుట్టుకతోనే పోలియో బారిన పడిన సూర్యనారాయణ ఏ మాత్రం నిరాశ చెందకుండా బాడీ బిల్డింగ్ పట్ల తనకున్న ఆశక్తితో సాధన చేస్తూ అనేక రాష్ట్రాల్లో జరిగిన పోటీల్లో మెడల్స్ సాధిస్తూ అద్భుతంగా రాణిస్తున్నాడని ప్రశంసించారు. వచ్చే ఏడాది మార్చి 6న అమెరికాలో జరగనున్న అంతర్జాతీయ పోటీలకు ఎంపికై న సూర్యనారాయణ అక్కడ కూడా ప్రతిభ చాటి అంతర్జాతీయస్థాయిలో జిల్లా కీర్తి ప్రతిష్టలు మరింతగా పెంచాలన్నారు. ఈ సందర్భంగా సూర్యనారాయణను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలుగా నిలవాలి
● జిల్లా స్కూల్గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు గోపాల్, విజయలక్ష్మివిజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న స్కూల్గేమ్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు విజేతలుగా తిరిగి రావాలని జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు కె.గోపాల్, ఎస్.విజయలక్ష్మిలు ఆకాంక్షించారు. ఈనెల 9 నుంచి 11వ తేదీ వరకు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో జరగనున్న అండర్ –14 బాలబాలికల ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా జట్లతో పాటు ఈనెల 9 నుంచి 11వ తేదీ వరకు వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో జరగనున్న అండర్–17 బాలుర హాకీ పోటీల్లో పాల్గొనబోయే జట్టు సోమవారం బయల్దేరాయి. ఈ సందర్భంగా జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు వారికి పలు సూచనలు, సలహాలు చేశారు. విద్యార్థి దశలో క్రీడల్లో రాణించిన క్రీడాకారులకు మంచి భవిష్యత్ ఉంటుందని, ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభాపాటవాలు కనబరచాలని ప్రోత్సహించారు. తద్వారా జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించి, ఉజ్వల భవిష్యత్కు బాటలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. -
మత్తుపై సమర భేరి
● జిల్లా కేంద్రంలో అభ్యుదయ సైకిల్ యాత్రకు బ్రహ్మరథం ● 3వేల మందితో భారీ మానవహారంపార్వతీపురం రూరల్: మాదక ద్రవ్యాల మహమ్మారిని తరిమికొట్టేందుకు విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి మార్గదర్వకత్వంలో పాయకరావుపేటనుంచి ఇచ్చాపురం వరకు సాగుతున్న అభ్యుదయం సైకిల్ యాత్ర సోమవారం జిల్లా కేంద్రంలో అడుగుపెట్టగా అపూర్వ స్పందన లభించింది. మరిపివలస నుంచి మొదలైన ఈయాత్ర జిల్లా కేంద్రంలోని చర్చి జంక్షన్కు చేరుకోగానే పండగ వాతావరణంలో కలెక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి, ఎస్పీ మాధవ్ రెడ్డి, జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డి, జిల్లా అదనపు ఎస్పీ వెంకటేశ్వరరావు, ఏఎస్పీ మనిషా రెడ్డిలు యాత్రకు ఘన స్వాగతం పలికారు. డప్పులు, తప్పెటగుళ్లు, కోలాటాల నడుమ అధికారులే స్వయంగా సైకిల్ తొక్కుతూ ర్యాలీలో పాల్గొనడం యువతలో నూతనూత్తేజం నింపింది. అనంతరం ఆర్టీసీ కాంప్లెక్స్వద్ద 3వేలమంది విద్యార్థులు, ప్రజలతో భారీ మానవహారంగా రూపొంది డ్రగ్స్ వద్దుబ్రో అంటూ ముక్తకంఠంతో నినదించారు. సరదాకోసం చేస్తే జీవితం బలి స్థానిక కన్యకాపరమేశ్వరి కల్యాణ మంటపంలో జరిగిన సభలో ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ యువతను పక్కదోవ పట్టించేందుకు కొందరు చాక్లెట్ల రూపంలో మత్తును చిమ్ముతున్నారని ఆకర్షణీయమైన మాటలతో వలవేసే వారిని నమ్మొద్దని , గంజాయి మహ్మరి మొదడును మొద్దుబార్చి, భవిష్యత్ను అంధకారం చేస్తుందని హెచ్చరించారు. గంజాయి రహిత జిల్లానే లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ మేరకు డీఐజీ గోపీనాఽథ్ జెట్టి పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. -
పీజీఆర్ఎస్కు పోటెత్తిన వినతులు
● త్వరితగతిన పరిష్కారానికి కలెక్టర్ ఆదేశాలు ● 273 అర్జీల స్వీకరణవిజయనగరం అర్బన్: కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా వినతుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ సంఖ్యలో అర్జీలు పోటెత్తాయి. ఈ కార్యక్రమంలో మొత్తం 273 వినతులు స్వీకరించగా వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఎం.రాంసుందర్రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మొత్తం వినతుల్లో అత్యధికంగా రెవెన్యూ శాఖకు 120, డీఆర్డీఏకు 45, జిల్లా పంచాయతీ రాజ్కు 13, వైద్యశాఖకు 15, మున్సిపల్, విద్యుత్ శాఖలకు 10, గ్రామసచివాలయాలకు సంబంధించి 7, హౌసింగ్కు 4, ఇతర శాఖలకు 43, డీసీహెచ్ఎస్ శాఖకు రెండు అర్జీలు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలపై ఎండార్స్మెంట్ చేసే ముందు అధికారులు అర్జీదారును తప్పనిసరిగా కలిసి మాట్లాడాలని మాట్లాడిన తేదీ, సమయాన్ని రిపోర్టులో నమోదు చేయాలని స్పష్టం చేశారు. అలాగే పీజీఆర్ఎస్ టోల్ ఫ్రీ నంబర్ 1100కు అందే కాల్స్కు కూడా సత్వరం సరైన సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. వినతుల స్వీకరణలో కలెక్టర్తోపాటు జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మురళి, డి.వెంకటేశ్వరరావు, రాజేశ్వరి, ప్రమీల గాంధీ, బి.శాంతి, కళావతి తదితరులు పాల్గొని ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను విని వెంటనే సంబంధిత శాఖల అధికారులకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో సర్వే ఎ.డి ఆర్. విజయకుమార్, కలెక్ట్రేట్ ఏవో దేవీప్రసాద్, సీపీఓ బాలాజీ, జిల్లా విద్యాశాఖాధికారి మాణిక్యంనాయుడు, వ్యవసాయ శాఖ జేడీ రామారావు, సాంఘిక సంక్షేమశాఖ డీడీ అన్నపూర్ణమ్మ, బీసీ సంక్షేమ అధికారి జ్యోతిశ్రీ, ఆర్అండ్బీ ఎస్ఈ కాంతిమతి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కవిత, మార్క్ఫెడ్ మేనేజర్ వెంకటేశ్వరరావు, ఐసీడీఎస్ పీడీ విమలరాణి, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసపాణి, మైక్రో ఇరిగేషన్ పీడీ లక్ష్మీనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు. ఫిర్యాదు దారులపై పోలీస్ సిబ్బంది అసహనం విజయనగరం క్రైమ్: స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఎస్పీ దామోదర్ తన చాంబర్లోను, ఏఎస్పీ సౌమ్యలత కాన్ఫరెన్స్ హాలులో సోమవారం నిర్వహించారు. పీజీఆర్ఎస్లో 40 మంది ఫిర్యాదు దారులు తమ సమస్యలను చెప్పుకోగా, సిబ్బంది మాత్రం ఫిర్యాదుదారులపై అసహనం వ్యక్తం చేశారు. ఏఎస్పీ సౌమ్యలత ఫిర్యాదు దారుల సమస్యలను క్షుణ్ణంగా ఆలకించి వారి సమస్యలపై వారిముందే సంబంధిత స్టేషన హౌస్ ఆఫీసర్లతో ఫోన్లో మాట్లాడారు.అనంతరం ఫిర్యాదు దారుల సమస్యలను డేటాలో నిక్షిప్తం చేసే క్రమంలో సిబ్బంది వారిపై అసహనం ప్రదర్శించారు. పనిలో వస్తున్న ఒత్తిడిని, ఫిర్యాదు దారులపై అసహనం రూపంలో వ్యక్తం చేశారు. సమస్యతో రోడ్డుక్కినప్పుడు లేని సిగ్గు, ఆందోళన, భయం..స్టేషన్ కు వెళ్లమంటే ఏమొచ్చిందంటూ ఓ పెద్దాయనతో డీపీఓలో సిస్టం ముందు కూర్చుని అంశాలను కంప్యూటర్ లోకి ఎక్కిస్తున్న ఓ కానిస్టేబుల్ అసహనం వ్యక్తం చేశాడు. వచ్చిన ఫిర్యాదులను ఎస్హెచ్ఓలు క్షుణ్ణంగా పరిశీలించాలని వాటిని ఏడు రోజుల్లో పరిష్కరించాలని ఎస్పీ దామోదర్ అదేశించారు. ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలను నివేదిక రూపంలో జిల్లా పోలీసు కార్యాలయానికి పంపాలని సిబ్బందిని ఎస్పీ కోరారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ కె. కుమార స్వామి, ఎస్బీ సీఐలు ఏవీ లీలారావు, అంబేడ్కర్, ఎస్సై ప్రభావతి, సిబ్బంది పాల్గొన్నారు. -
శ్రీరామనామ సంకీర్తనతో మార్మోగిన రామతీర్థం
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ సీతారామస్వామివారి దేవస్థానం శ్రీరామనామ సంకీర్తనతో ఆదివారం మార్మోగింది. స్వామి సన్నిధిలో పలువురు భక్తులు సహస్ర శ్లోకీ రామాయణ పారాయణం ఘనంగా నిర్వహించారు. వేకువజామున స్వామికి ప్రాతః కాలార్చన, బాలభోగం నిర్వహించిన తరువాత యాగశాలలో సుందరాకాండ హోమాన్ని జరిపించారు. ఉత్సవమూర్తుల వద్ద స్వామివారికి నిత్య కల్యాణం నిర్వహించిన అనంతరం భగవత్ రామానుజ దాస బృందానికి చెందిన భక్తులు సహస్ర శ్లోకి రామాయణం 72వ ఆవృతం, శ్రీమన్నారాయణ వైభవం 70వ ఆవృతం పారాయణం చేశారు. ఈ సందర్భంగా బృంద సభ్యుడు శ్రీమాన్ కందాల రాజగోపాలాచార్యులు మాట్లాడుతూ ఇప్పటివరకు సింహాచలం, శ్రీకూర్మం, పద్మనాభం, తదితర దివ్య క్షేత్రాల్లో పారాయాణాలు పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. విజయనగరం అర్బన్: జిల్లాలో స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ప్రజల్లో అనవసర ఆందోళన చెలరేగకుండా పూర్తి అవగాహన కల్పించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అధికారులను ఆదేశించా రు. స్క్రబ్ టైఫస్పై సమగ్ర సమాచారం అంది స్తూ ఈ వ్యాధి సమయానికి గుర్తిస్తే 100 శాతం నయమవుతుందని, దీనిపై భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మైట్స్ కాటు ద్వారా వచ్చే ఈ జ్వర వ్యాధి లక్షణాలను వివరాల ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాధి గుర్తించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రి లేదా పీహెచ్సీ, సీహెచ్సీలో పరీక్ష చేయించుకుంటే అక్కడే ఉచితంగా అందే మందులతో పూర్తిగా నయమవుతుందని ఆలస్యం చేయొద్దని హెచ్చరించారు. అదనంగా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, వైద్య ఆరోగ్య సిబ్బంది గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అనుమానాస్పద లక్షణాలు ఉన్న వారిని వెంట నే పీహెచ్సీ లేదా సీహెచ్సీకి తరలించి చికిత్స అందించాలని ఆదేశించారు. స్క్రబ్ టైఫస్ భయపడాల్సిన వ్యాధి కాదని జాగ్రత్తలు పాటి స్తే లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడికి కలిస్తే సులభంగా నయమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. విజయనగరం అర్బన్: హిందీ భాషాభిమానుల వేదికగా పేరొందిన హిందీ మంచ్ జిల్లా శాఖ కొత్త కార్యవర్గం ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. స్థానిక పూల్బాగ్లోని సరస్వతి శిశుమందిర్లో జరిగిన ఎన్నికల సభలో జిల్లా అధ్యక్షులుగా ఏలూరు శ్రీనివాసరావు, జనరల్ సెక్రటరీగా నందివాడ చిన్నాదేవి, గౌరవాధ్యక్షురాలుగా పి.ఉమాబాల, సహాధ్యక్షురాలుగా భోగరాజు సూర్యలక్ష్మి ఎన్నికయ్యారు. ఉత్తరాంధ్ర కార్యదర్శి కోనే శ్రీధర్ ఎన్నికల సమన్వయకర్త గా వ్యవహరించారు. సంఘం కార్యదర్శిగా కె.రోజా, కె.శారదా పద్మావతి, ఉపాధ్యక్షులుగా ఆశాపు చంద్రారావు, విజయలక్ష్మి, సహాయ కార్యదర్శులుగా సాలూరు సంతోషి, వై.సూర్యకుమారి, శ్రీదేవి ఎన్నికయ్యారు. ముఖ్య సలహాదారుగా కె.సుబ్బారావు, గౌరవ సలహాదారుగా దవళ సర్వేశ్వరరావును ఎంపిక చేశారు. -
ప్రణాళిక ఫలించేనా..!
రామభద్రపురం: ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ ఎంతో కీలకం. ఆయా పరీక్ష ఫలితా ల్లో ఉత్తమ మార్కులు సాధించేందుకు ప్రతీ ఒక్క రూ శ్రమిస్తుంటారు. వారికి టీచర్లు తోడ్పాటు అందిస్తారు. ఈ క్రమంలో కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో కూడా ఈ ఏడాది పది, ఇంటర్మీడియెట్ పరీక్షల్లో జిల్లాలోని అన్ని పాఠశాలల్లో నూ నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలనే ఆశయంతో సమగ్రశిక్ష అధికారులు ప్రణాళికలు రూపొందిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా అన్ని కేజీబీవీ విద్యాలయాలలో దాదా పు సిలబస్లు పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నా రు. జిల్లాలోని 26 చొప్పున్న కేజీబీవీ పాఠశాల లు, జూనియర్ కళాశాలలు ఉన్నాయి. పదో తరగతిలో 973 మంది, ఇంటర్మీడియట్ ప్రధమ సంవత్సరంలో 750 మంది, సెకండియర్లో 750 వార్షిక పరీక్షల్లో హాజరు కానున్నారు. గతేడాది పదో తరగతి విద్యార్థులు 92 శాతం ఫలితాలతో రాష్ట్రంలో జిల్లా పదో స్థానం సాధించింది. ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో 79 శాతం ఫలితాలు సాధించి పదో స్థానంలో నిలవగా సెకెండియర్లో 93 శాతం ఫలితాలు సాధించి 5వ స్థానంలో నిలిచింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్మీడియెట్, మార్చి 16 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది సుమారు అన్ని విద్యాలయాల్లో వంద శాతం ఫలితాలు సాధన కోసం విజయ పథం పేరుతో సమగ్రశిక్ష వంద రోజుల ప్రణాళికలు రూపొందించింది. కేజీబీవీ విద్యాలయాల్లో చదువుతున్న ఫస్టియర్ విద్యార్థినులకు ఈ ఏడాది నుంచి సీబీఎస్ఈ సిలబస్ అమలు చేయనున్నందున ఆయా విద్యార్థినుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గతేడాది స్టేట్ సిలబస్లో పరీక్షలు రాసి 79 శాతంతో రాష్ట్రంలో జిల్లా పదో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది సీబీఎస్ఈ సిలబస్ అమలుతో విద్యార్థినుల్లో కొత్తగా అనిపించడంతో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలనే ఆశయం సాధ్యమవుతుందా.. అని ఇటు టీచర్లు, అటు సమగ్ర శిక్ష అధికారుల్లో కూడా అందోళన వ్యక్తమవుతోంది. కేజీబీవీ విద్యార్థినుల పట్ల ఏపీసీ, జీసీడీవో ప్రతీ రోజూ పర్యవేక్షణ చేస్తున్నారు. అన్ని పాఠశాలలు విద్యార్థినుల అభ్యసన స్థాయిపై సమీక్షలు చేపడుతున్నారు. విద్యార్థుల చదువుతో పాటు మెనూ ప్రకారం భోజనం తీరుపై గూగుల్ మీట్ ద్వారా తెలుసుకుంటున్నారు. టీచర్లు పిల్లలపై వ్యక్తిగత శ్రద్ధతో పాటు వారి లో ఆత్మవిశ్వాసం పెంపొందించడం. ప్రత్యేక తరగతులు, స్టడీ అవర్స్, రోజువారీ పరీక్షలు నిర్వహిస్తూ వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. రోజుకో పాఠ్యాంశంపై ప్రత్యేక తరగతులు నిర్వహి స్తూ విద్యార్థుల సందేహాలను ఎప్పటికప్పు డు నివృత్తి చేస్తున్నారు. ఎస్ఏ–1 పరీక్ష ఫలితాల ఆధారంగా విద్యలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రతీరోజు రాత్రి సమయంలో రోజుకో పాఠ్యాంశంపై స్టడీ అవర్స్ నిర్వహించి మరుసటి రోజు ఉదయం ఆ సబ్జెక్టుపై పరీక్ష నిర్వహిస్తున్నారు. మా కళాశాలలో అధ్యాపకులు అర్ధమయ్యే రీతి లో విద్యాబోధన చేస్తున్నారు. ప్రత్యేక తరగతు ల్లో సబ్జెక్టుల్లో సందేహా లను నివృత్తి చేస్తున్నా రు. ఈ ఏడాది నుంచి సీబీఎస్ఈ సిలబస్ అమలు చేస్తున్నారు. ఉత్తమ మార్కులు సాధనలో కొద్దిగా భయం ఉన్నా ప్రతీ రోజు తరగతులలో రోజుకో సబ్జెక్టుపై పరీక్షలు నిర్వహిస్తున్నందున కొంత మేర భయం పోయింది. మా అధ్యాపకుల ప్రోత్సాహంతో మంచి మార్కులు సాధిస్తాను. – తోట లోకేశ్వరి, ఇంటర్ ఫస్టియర్ బైపీసీ, కేజీబీవీ, బూసాయవలస కేజీబీవీల్లో ఉత్తమ ఫలితాల సాధనకు విజయ పథం పకడ్బందీగా అమలు చేస్తున్నాం. పదో తరగతితో పాటు ఇంటర్మీడియెట్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. వంద శాతం ఫలితాలు లక్ష్యంగా ప్రతీరోజు పర్యవేక్షణ చేస్తున్నాం. గతేడాది కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామన్న నమ్మకం ఉంది. – ఎ.రామారావు, ఏపీసీ, విజయనగరం -
వాళ్ల పింఛన్లు ఆపేయండి..!
●గంట్యాడ మండలం వసాది గ్రామానికి చెందిన లచ్చిరెడ్డి ఎర్రయ్యమ్మ భర్త లక్ష్మీనారాయణ ఏడాది క్రితం మరణించాడు. అతనికి వృద్ధాప్య పింఛన్ వచ్చేది. దీంతో అతని భార్య మరుసటి నెల స్పౌజ్ కోటా కింద వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసింది. పింఛన్ మంజూరుకు సంబంధించి ఐడీ కూడా వచ్చింది. కాని ఆమెకు టీడీపీ నేతలు చెప్పారని అధికారులు పింఛన్ నిలిపివేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత 8 నెలలుగా ఆమె పింఛన్ కోసం అధికారులను అడిగినా ఫలితం లేకుండా పోయింది. ●గంట్యాడ మండలం పెదవేమలి గ్రామానికి చెందిన సారిక కళావతి భర్త పోలయ్య 2025 ఏప్రిల్ నెలలో మరణించాడు. అతనికి వృద్ధాప్య పింఛన్ వచ్చేది. దీంతో ఆమె స్పౌజ్ కోటా కింద వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసింది. ఈమెకు వితంతు పింఛన్ మంజూరైనట్టు ఐడీ కూడా వచ్చింది. అయితే ఈమెకు కూడా టీడీపీ నేతలు చెప్పారని అధికారులు మంజూరైన పింఛన్ నిలిపివేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలకు ఊతం ఇచ్చేలా టీడీపీ నేతలు కూడా మేమే పింఛన్లు నిలిపివేసినట్టు ప్రచారం చేసుకుంటున్నట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. గంట్యాడ: భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వితంతవుల పట్ల సానుభూతితో వ్యవహరించాల్సింది పోయి వారిని మరింత క్షోభకు గురిచేసే విధంగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారనే విమర్శ లు వినిపిస్తున్నాయి. వితంతు పింఛన్ ఇచ్చి వారిని ఆదుకోవాల్సింది పోయి పసుపు కండువా కప్పుకుంటెనే పింఛన్ మంజూరు చేస్తామని టీడీపీ నేత లు బహిరంగంగానే చెబుతున్నారు. వితంతవుల పట్ల కూడా టీడీపీ నేతలు, చంద్రబాబు ప్రభుత్వం రాజకీయం చేయడం పట్ల సర్వత్రా చర్చనీయాంశమవుతుంది. మీరు మా కండువా కప్పుకోలేదు కాబట్టి మీ పింఛన్లు నిలిపివేశామని వితంతువుల వద్ద టీడీపీ నేతలు అన్నట్టు తెలుస్తుంది. లోకల్ లీడర్లను కలవండంటూ ఉచిత సలహాలు టీడీపీ నేతలకు వంతపాడే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాళ్లు ఏది చెబితే దానికి తలాడించే విధంగా నడుచుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఏదైనా సమస్య వస్తే తమ ఉద్యోగులకు ఎసరు వస్తుందనే విషయాన్ని ఉద్యోగులు తెలుసుకోలేకపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మా వారికి వితంతు పింఛన్ ఎందుకు మంజూరు కావడంలేదని డీఆర్డీఏకి చెందిన ఓ అధికారిని వితంతు బంధువు అడగ్గా లోకల్టీడీపీ లీడర్లను కలవాల్సింది కదా.. అని ఉచి త సలహా ఇచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మంత్రి కొండపల్లి ఇలాకాలోనే... మంత్రి కొండపల్లి ఇలాకా అయిన గంట్యాడ మండలంలో టీడీపీ నేతలు ఇలా వ్యవహరించడం పట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రి ఉన్నారు.. మనల్ని ఆపేది ఎవడు.. అన్న విధంగా ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్స్, పాఠశాలల వాచ్మెన్లు, ఆయాలను, కేజీబీవీ ఆయా, వెలుగు వీవోఏలను తొలిగించేశారు. ఇప్ప డు పింఛన్దారులను కూడా వదలడం లేదు. చంద్రబాబు వచ్చిన తర్వాత ఒక్క కొత్త ఫించను మంజూ రు చేయలేదు. వృద్ధాప్య పింఛన్ వచ్చే వ్యక్తి మరణిస్తే అతని భార్యకు భాగస్వామి పింఛన్ కింద ఇచ్చే వితంత పింఛన్ మంజూరులోనూ టీడీపీ నేత లు రాజకీయం చేస్తున్నారు. తమ కండువా వేసుకు ని తమతో తిరిగితేనే పింఛన్ మంజూరు చేస్తామని బాధితులకే బరి తెగించి చెబుతున్నారు. చంద్రబా బు ప్రభుత్వంలో రాజకీయ సిఫార్సులు, పసుపు కండువాలు వేసుకోవాలని బరితెగింపుగా చెప్పడం పట్ల జనం మండిపడుతున్నారు. సారికి కళావతి, ఎర్రయ్యమ్మ వితంతు పింఛ న్ల కోసం వచ్చిన దరఖాస్తులను అప్రూవల్ చేసి డీఆర్డీఏకు పంపించాం. అక్కడ ఏ సమస్యతో ఆగిందో తెలియదు. దీనిపై రెండుసార్లు డీఆర్డీఏకు లేఖ కూడా రాశాం. ఉన్నత అధికారుల కు పంపించామని వారు చెబుతున్నారు. – ఆర్.వి.రమణమూర్తి, ఎంపీడీవో -
ధాన్యం దళారుల పాలు..!
●గంట్యాడ మండలం పెదవేమలి గ్రామంలో ఓ రైతు నుంచి దళారి 61 బస్తాల ధాన్యం కొనుగోలు చేశాడు. 80 కేజీల బస్తాకుగాను 82 కేజీల 300 గ్రాముల చొప్పున తీసుకున్నాడు. అంటే బస్తా వద్ద 2కేజీల 300 గ్రాములు అదనంగా తీసుకున్నారు. 80 కేజీల బస్తాకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం రూ.1895 చెల్లించాలి. కాని రూ.1750 మాత్రమే రైతుకు చెల్లించారు. ●విజయనగరం మండలం పినవేమలి గ్రామంలో కూడా ఓ రైతు నుంచి దళారి 20 క్వింటాళ్లు ధాన్యం కొనుగోలు చేశాడు. క్వింటాకు 100 కేజీల ధాన్యం తీసుకోవాల్సి ఉండగా సదరు దళారి 5 కేజీలు అదనంగా తీసుకున్నాడు. క్వింటాకు రూ.2369 చెల్లించాల్సి ఉండగా రూ.1800 మాత్రమే చెల్లించాడు. -
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
విజయనగరం అర్బన్: కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించనున్నట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని శాఖల జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు తమ వివరాలతో పాటు వారి సమస్యలకు సంబంధించి అర్జీలను అందజేయాలని చెప్పారు. అర్జీదారులు గతంలో ఇచ్చిన అర్జీలకు సంబంధించి స్లిప్పును తీసుకురావాలని సూచించారు. సమస్య పరిష్కారమైనపుడు ఫోన్కి మెసేజ్ వస్తుందని, అర్జీదారులు వారి ఫోన్ చెక్ చేసుకోవచ్చన్నారు. నోటీసులు, ఎండార్స్మెంట్ను వాట్సాప్లో అందజేస్తు న్నామని, ఎండార్స్మెంట్ను రిజస్టర్ పోస్ట్ ద్వారా సంబంధిత చిరునామాకు పంపిస్తున్నామని చెప్పారు. అర్జీ ఇచ్చేటప్పుడు దానిని కరెక్ట్గా పూరించాలన్నారు. రిపీటెడ్ అర్జీదారులు పాత రసీదును తీసుకురావాలని అన్నారు. కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలి అర్జీదారులు మీకోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి ‘మీ కోసం.ఏపీ.జీఓవి.ఐఎన్’ వెబ్సైట్ను సంప్రదింవచ్చని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమ్యలను పరిష్కారం పొందాలని విజ్ఞప్తి చేశారు. -
పెరుగుతున్న ప్రకృతి సాగు
● ఆరోగ్యకరమైన జీవితం..సారవంతమైన భూమిభామిని: గ్లోబల్ వార్మింగ్ నుంచి పర్యావరణ పరిరక్షణతో పాటు భూ సారవంతాన్ని కాపాడి ఆరోగ్యం పంచే ప్రకృతి వ్యవసాయం వైపు పార్వతీపురం మన్యం జిల్లాలో జోరుగా అడుగులుపడుతున్నాయి. సుస్థిర వ్యవసాయ విధానాల వైపు రైతుల దృష్టి మరల్చి ప్రకృతి సాగు ప్రయోజనాలు వివరణతో పూర్తి స్థాయిలో సుస్థిర వ్యవసాయ పద్ధతులు అమలు చేస్తున్నారు. మరోవైపు మిశ్రమ సాగు పద్ధతిలో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ పద్ధతి అమలు చేస్తూ పాక్షికంగా మిశ్రమ పంటల సాగుకు ప్రోత్సహిస్తూ నిరంతర ఆదాయ వనరులు కల్పిస్తున్నారు. సేంద్రియ పద్ధతిలో క్రిమిసంహారక మందుల వాడకం, రసాయన ఎరువులతో కలిగే నష్టాలు వివరిస్తూ ఏపీసీఎన్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రకృతి సాగు సిబ్బంది రైతుల్లో చైతన్యం కల్పిస్తున్నట్లు జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ ఎం.శ్రావణ్కుమార్ నాయుడు తెలియజేశారు. ఆర్గానిక్ కార్బన్ పెరుగుదల నివారించి భూమిశుద్ధి చేసే కార్యాచరణ చేపడుతున్నట్లు వివరించారు. భూమి పొరల్లోని సూక్ష్మజీవులు,వానపాములను కాపాడడంతో పాటు భూసారాన్ని పెంచేందుకు సహకరించే సుస్థిర పద్ధతులను అలవరుస్తున్నామన్నారు. నవధాన్యాల సాగు పద్ధతిలో నిత్యం భూమిపై పచ్చదనం పెంచుతున్నట్లు వివరించారు. ప్రకృతి సాగులో విధానాలు.. ప్రకృతి వ్యవసాయంలో ఆవు పేడ,మూత్రంలో ద్రవామృతాలు,అందుబాటులోని ఆకులు,అలములతో కషాయాల తయారీతో ప్రకృతి వ్యవసాయం చేయించడాన్ని అలవర్చుతున్నారు. రైతుకు పంట పెట్టుబడి తగ్గించి,నికర ఆధాయానికి ఢోకా లేకుండా ఆరోగ్యవంతమైన వ్యవసాయం అలవర్చడం భూసారాన్ని కాపాడేందుకు సీడ్బాల్స్ పోలాల్లో జల్లించడంతో వర్షాకాలంలో అన్ని రకాల మొలకలు వచ్చి భూమి సారవంతాన్ని కాపాడుతుంది.నవధాన్యాల సాగు పేరున పది రకాల పంటలను పండించి అన్ని వేళల్లో పొలాల్లో పచ్చని పంటలు ఉండేలా పండిస్తున్నారు.సూర్యమండలం పేరున కూరగాయలు,ఆకుకూరలు,చిరుధాన్యాల,ఆహార పంటలు వేసే విధానం విస్తృతం చేస్తున్నారు. మహిళా సంఘాలకు ప్రోత్సాహం.. ఆరోగ్యకరమైన వాతావరణం,భూ సంరక్షణకు చర్యలు చేపడుతున్నాం. క్రిమిసంహారకాలు, రసాయనాలు వాడకుండా నివారిస్తున్నాం. అంతరించి పోతున్న పంటలను పునరుద్ధరించడం, భూ పొరల్లో సారవంతం పోకుండా ఆరోగ్యవంతమైన పంటలు పండించడానికి మార్గం సుగమం చేస్తున్నాం. .. ఎం.శ్రావణ్కుమార్,డీపీఎం,ఏపీసీఎన్ఎఫ్,పార్వతీపురం మన్యం జిల్లా -
నెల్లిమర్ల టు విజయవాడ
● దుర్గమ్మ దర్శనానికి మూడోసారి సైకిల్ యాత్ర నెల్లిమర్ల రూరల్: భక్తి, దీక్ష, సంకల్ప బలానికి ప్రతీకగా నిలుస్తూ నెల్లిమర్ల మండలంలోని ఒమ్మి, అలుగోలు గ్రామాలకు చెందిన భవానీ భక్తులు మూడోసారి సైకిల్ యాత్రకు పయనమయ్యారు. ఒమ్మి గ్రామంలో అమ్మవారి నామస్మరణతో, భక్తి నినాదాల నడుమ ఈ యాత్ర ప్రారంభమైంది. 41 రోజుల పాటు భవాని అమ్మవారి దీక్షను నిష్టగా నిర్వర్తించిన భక్తులు అంబళ్ల అప్పలనాయుడు, కోరాడ గోవర్ధన్లు గురుస్వామి నారాయణరావు ఆధ్వర్యంలో ఇరుముడి ధరించి సైకిళ్లపై విజయవాడకు బయలుదేరారు. ఇప్పటికే రెండు సార్లు సైకిల్పై వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకున్నామని, సుమారు 480 కిలోమీటర్లు యాత్రను మూడు రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. లోక కల్యాణార్థం..హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఏటా ఈ సైకిల్ యాత్రను కొనసాగిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో గురుస్వాములు కురిమినేని నారాయణరావు, అంబళ్ల సురేష్, తదితరులు పాల్గొన్నారు. -
ఇందువదన..కుందరదన
చీపురుపల్లి: అదో పల్లెటూరు. అక్కడ పేద వ్యవసాయ కుటుంబంలో జన్మించిన అమ్మాయి దేశ స్థాయిలో జరిగే 42వ టెన్నికాయిట్ చాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించింది. చీపురుపల్లి మండలంలోని పెదనడిపల్లి గ్రామానికి చెందిన కిలారి ఇందు పదో తరగతి చదువుతోంది. ఇప్పటికే జాతీయస్థాయిలో జరిగే టెన్నికాయిట్ చాంపియన్షిప్లో ఎన్నో బంగారు పతకాలు సాధించింది. ఇందుకు చిన్న వయస్సు నుంచే టెన్నికాయిట్పై ఆమెకు ఉన్న ఆసక్తిని గమనించిన ఆ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు రామారావు నాణ్యమైన తర్ఫీదు ఇచ్చి మట్టిలో మాణిక్యాన్ని వెలికితీశారు. దీంతో ఇందు కోచ్ రామారావు వద్ద అకుంఠిత దీక్షతో శిక్షణ పొందుతోంది. వ్యవసాయ కుటుంబంలో పుట్టి కిలారి ఇందు మండలంలోని పెదనడిపల్లి గ్రామంలో వ్యవసాయ వృత్తిలో ఉన్న గొల్ల, భారతి దంపతుల కుమార్తె. అదే గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు టెన్నికాయిట్ క్రీడలో రాణిస్తోంది. నవంబర్ 26 నుంచి 30 వరకు జమ్ముకశ్మీర్లో జరిగిన 42వ జాతీయ టెన్నికాయిట్ చాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ తరఫున పాల్గొన్న ఇందు ఉత్తమ ప్రతిభ కనపిరిచి బంగారు పతకం సాధించింది. కోచ్ రామారావు ప్రత్యేక శ్రద్ధతో పెదనడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుడు రామారావుకు క్రీడల పట్ల ఎంతో ఆసక్తి ఉంది. దీంతోనే పల్లెటూరిలో చదువుతున్న పిల్లలను చక్కగా తీర్చిదిద్దుతూ రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడల్లో రాణించే దిశగా తర్ఫీదు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో కిలారి ఇందు టెన్నికాయిట్లో జాతీయస్థాయిలో ప్రతిభ చూపి బంగారు పతకం సాధించింది.రాష్ట్ర, జాతీయ స్థాయిలో సాధించిన పతకాల ఇందుఅంతర్జాతీయ స్థాయిలో విజేతగా నిలవాలి కేరళలో 2027లో జరగనున్న అంతర్జాతీయ టెన్నికాయిట్ చాంపియన్షిప్లో భారతదేశం తరఫున పాల్గొని విజేతగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. దీనికి కోచ్ రామారావు ప్రోత్సాహం పూర్తిగా ఉంది. ఆయన శిక్షణతోనే జాతీయ స్థాయి వరకు ఆడగలిగాను. అంతర్జాతీయ స్థాయిలో విజేతగా నిలవడమే కాకుండా పోలీస్ ఆఫీసర్ అవడమే నా లక్ష్యం. కిలారి ఇందు, జాతీయ క్రీడాకారిణి, పెదనడిపల్లి పల్లెలో మెరిసినన ‘బంగారుతల్లి’ పేదింటిలో పుట్టి ఆటల్లో దేశస్థాయిలో గుర్తింపు మట్టిలో మాణిక్యాన్ని తీర్చిదిద్దిన కోచ్ రామారావు టెన్నికాయిట్లో రాణిస్తున్న ఇందు అంతర్జాతీయ పోటీలకు సిద్ధం -
13మంది అగ్నివీర్కు ఎంపిక
చీపురుపల్లి: రన్మిషన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న 13 మంది యువకులు ఒకేసారి అగ్నివీర్ జవాన్లుగా ఎంపికయ్యారు. పట్టణానికి చెందిన కంది హేమంత్ అనే ఎయిర్ఫోర్స్ ఉద్యోగి రన్మిషన్ స్థాపించి గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువతకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నాడు. రన్మిషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ప్రతిరోజూ శరీరదారుఢ్యంలో శిక్షణ ఇస్తున్నారు. దీంతో పాటు పరీక్షలకు సంబంధించిన సూచనలు, పుస్తకాలు కూడా ఇస్తున్నారు. రన్మిషన్ నేతృత్వంలో గతంలో కూడా ఎంతో మంది యువత సీఐఎస్ఎఫ్, కానిస్టేబుల్, ఆర్మీ, ఐటీబీపీ వ్యవస్థల్లో ఉద్యోగాలు సాధించారు. తాజాగా 13 మంది యువత అగ్నివీర్కు ఎంపికయ్యారు. హేమంత్ సెలవు రోజుల్లో యువతకు శిక్షణ ఇస్తుండగా ఆయన విధి నిర్వహణలో ఉన్న సమయంలో అసిస్టెంట్ కోచ్ నవీన్ యువతకు ఉచితంగా కోచింగ్ ఇస్తున్నారు. తాజాగా అగ్నివీర్కు ఎంపికై న యువతను రన్మిషన్ ఆధ్వర్యంలో ఆదివారం సత్కరించారు. ప్రశాంతంగా ఎన్ఎంఎంఎస్ పరీక్ష● పరీక్షకు 97.92 శాతం హాజరు విజయనగరం అర్బన్: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) ప్రతిభా పరీక్ష ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని 3 డివిజన్ల పరిధిలో 19 పరీక్షా కేంద్రాల్లో 4,094 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 97.92 శాతంతో 4,009 మంది హాజరయ్యారు. పట్టణంలోని సెయింట్ జోసెఫ్ స్కూల్లోని పరీక్ష కేంద్రంలో పరీక్ష నిర్వహణను డీఈఓ యూ.మాణిక్యం నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్ష నిర్వహణలో ఎటువంటి అంతరాయం లేకుండా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుని సాఫీగా నిర్వహించామని తెలిపారు. మూడు షాపుల్లో చోరీరాజాం సిటీ: పట్టణ నడిబొడ్డున తిరుమలనగర్లో ఆదివారం వేకువజామున రెండు సెల్సాయింట్లు, టైలరింగ్ షాపుల్లో దొంగతనం జరిగింది. ఈ విషయాన్ని ఆదివారం ఉదయం యథావిధిగా దుకాణాలకు వచ్చిన యజమానులు తాళాలు విరగ్గొట్టి ఉండడాన్ని చూసి ఆందోళన చెంది పోలీసులను ఆశ్రయించారు. ఒక సెల్పాయింట్లో ఉంచిన ముప్పావు తులం బంగారంతో పాటు, రూ.10వేలు, మరో సెల్పాయింట్లో రూ.15వేలు అపహరణకు గురయ్యాయని బాధితులు పోలీసులు వద్ద వాపోయారు. అలాగే టైలరింగ్ షాపులో ఏమీ దొరకపోవడంతో బట్టలు చిందరవందరగా పడేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సీపీ ఫుటేజీ పరిశీలించిన అనంతరం క్లూస్టీమ్కు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ఈ ఘటనకు సంబంధించి బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ కె.అశోక్కుమార్ తెలిపారు. ఆలయంలో చోరీ కేసులో ఇద్దరి అరెస్టుబొబ్బిలి: మండలంలోని పిరిడి గ్రామంలోని శాంకరిమాత ధ్యానమందిరంలో పుస్తెలతాడు,శతమానాలు దొంగిలించిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఈ మేరకు ఎస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం నవంబరు 5న శాంకరిమాత ధ్యానమందిరంలో భక్తులుగా ధ్యానం చేస్తున్నట్లు నటించి అక్కడే ఉన్న బంగారు పుస్తెల తాడు, శతమానాలను దొంగిలించారు. ఆలయ నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ సతీష్కుమార్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టిన పోలీసులు నిందితులైన సీతానగరం మండలానికి చెందిన పోల భాస్కర్రావు, శ్రీకాకుళం జిల్లా హిరమండలానికి చెందిన సవర సూర్యంలను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా నేరం అంగీకరించారు. ఈ మేరకు నిందితులను అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్సై రమేష్ తెలిపారు. వారిద్దరూ గతంలో సీతానగరం మండలంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలోను వెండివస్తువుల దొంగతనానికి పాల్పడినట్లు తమ విచారణలో తేలిందని,జిల్లాలో పలు దొంగతనాల్లో వారి పాత్ర ఉందని తెలియజేశారు. -
కవి అంటే భ్రష్టయోగి
● పచ్చడం పుస్తకావిష్కరణలో వాగ్గేయకారుడు గోరటి వెంకన్నరాజాం: కవి అంటే సాఫీగా జీవితాన్ని గడిపే వ్యక్తి కాదని, ఒక భ్రష్టయోగి అని వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. ఈ మేరకు ఆదివారం రాజాంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో రాజాం రచయితల వేదిక నిర్వహించిన 11 వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన పచ్చడం పుస్తకావిష్కరణలో ఆయన పాల్గొని మాట్లాడారు. కవిలోపల భావాలెంతో గొప్పవని వెల్లడించారు. అతిశయాలు కవులకు శాపమని, పసితనమే కవులకు బలమని వివరించారు. ఈ సృష్టిలో గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి వంటివి సౌందర్యవంతమైనవేనని, వాటిని ఏ వ్యక్తికి ఆ వ్యక్తి స్వేచ్ఛగా ఆస్వాదించే అవకాశం లేకుండా రాజులు, భూ స్వాములు, పెత్తందారీలు, నిజాందారులు అణగదొక్కుతుంటే వాటి నుంచి ప్రజలను చైతన్యవంతులను చేయగలిగేవే కవితలని పేర్కొన్నారు. జీవితం నుంచే కవిత్వం వస్తుంది. స్వప్నయోగంలో కవిత్వాలు పుడతాయి. ధూర్జటి, పోతన, కాళిదాసు వంటి కవులు మొదలుకుని ఈకవుల పరంపర కొనసాగుతోందని తెలిపారు. పరోపకారం కవి లక్షణమన్నారు. ఆకలి, దైన్యం, పేదరికం వంటివి చూసి, రాజులను ధిక్కరించేవి కవిత్వాలు. విశ్వనాథ, శ్రీశ్రీ, జాషువా, దేవులపల్లి కృష్ణశాస్త్రి, గురజాడ వంటివారందరూ పరోపకారానికి సంబంధించి కవితలు రాశారని వివరించారు. అటువంటి వారసత్వం నుంచి వచ్చినవారమే తామంతా అన్నారు. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రాలో ఎప్పటినుంచే కవులు రాజ్యధిక్కార కవితలు రాశారని గుర్తుచేశారు. పోరాటాలు, కవులకు పుట్టినిల్లు ఉత్తరాంధ్ర పోరాటాలకు, కవులకు పుట్టినిల్లు ఉత్తరాంధ్ర అని గోరటి వెంకన్న వెల్లడించారు. ఇక్కడ ఎన్నో పోరాటాలు కవుల నుంచి పుట్టుకొచ్చాయని, కవులు అంటే హాయిగా జీవితం గడిపేవారుకాదని పేర్కొన్నారు. క్షామంతో అల్లాడిపోతున్న పేదరికం కవి లక్షణమని, సంప్రదాయాన్ని, దైవత్వాన్ని ఎత్తుకుని ఆ పరంపరను కొనసాగించాలని, మానవత్వ విలువలు పెంచాలని, ఎప్పటికప్పుడు తనకు తాను కరిగిపోయి కవి నైతిక విలువలు పెంపొందించాలని పిలుపునిచ్చారు. బుద్ధభగవానుడు పుట్టకుంటే దయ, జాలి వంటివి ఉండేవి కావేమోనని ఆవేదన వ్యక్తం చేశారు. రామచంద్రారెడ్డి, రామలింగారెడ్డి, రంగమాచార్యులు, వేరుచూరి నారాయణరావు, పిల్లా తిరుపతిరావు, గార రంగనాథం వంటివారు తమ పద్ధతిలో తాము రచనలు చేస్తున్నారన్నారు. ప్రశంసలకు దూరంగా ఉన్నవారే మంచి కవిత్వాలు రాయగలరన్నారు. రాజాంలో రచయితల వేదిక 11 సంవత్సరాలు పూర్తిచేసుకోవడం, 11 పుస్తకాలు ఆవిష్కరించడం చాలా ఆనందించదగిన విషయమన్నారు. రచయిత పిల్లా తిరుపతిరావు రచించిన పచ్చడం పుస్తకాన్ని రారవే నిర్వాహకులు సభలోని సభ్యులకు పరిచయం చేశారు. గోరటి వెంకన్న గొప్పతనాన్ని వివరించారు. పచ్చడం పుస్తకంలోని విశేషాలు వివరించారు. ఈ పుస్తకానికి రాజాం ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ఇన్చార్జ్ హెచ్ఎం బీవీ అచ్యుతరావు దంపతులు ఆర్థికసాయం అందించారని వెల్లడించారు. రచయిత తిరుపతిరావు తాను రచించిన పుస్తకంలోని సాహిత్య వ్యాసాలు వివరించారు. పలువురికి సత్కారం అనంతరం గోరటి వెంకన్నను రారవే సభ్యులు సత్కరించారు. పుస్తక రచయిత తిరుపతిరావును రారవే సభ్యులు, గోరటి వెంకన్న, స్నేహితులు, బంధువులు సత్కరించారు. పుస్తకావిష్కరణకు సహకరించిన అచ్యుతరావుతో పాటు ఆయన కుటుంబసభ్యులను రాజాం అమృత హాస్పిటల్ వైద్యురాలు సూర్యశైలజను అభినందించారు. అంతకుముందు సమతం మహేశ్వరరావు సమావేశాన్ని ప్రారంభించగా, డాక్టర్ ఆల్తి మోహనరావు, శ్రీనివాసరావు తదితరులు స్వాగత కార్యక్రమాలు నిర్వహించారు. విజయనగరానికి చెందిన రచయిత చీకటి దివాకర్, రాజాం రచయిత వెలుగు రామినాయుడు, మజ్జి మదన్మోహన్, రాజాం పట్టణంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన రచయితలు, కవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్కు తీవ్రగాయాలు
కురుపాం: కురుపాం–గొరడ ప్రధాన రహదారిలో బుడ్డెమ్మ ఖర్జ సమీపంలో రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఆదివారం సాయంత్రం ఢీ కొన్న ఘటనలో కిచ్చాడ పంచాయతీ ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడు గోళ్ల గౌరీశంకర్కు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలం నుంచి కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి 108 వాహనంలో తరలించగా వైద్యులు ప్రాథమిక వైద్యం అందించి మెరుగైన వైద్య సేవల కోసం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించాలని సూచించారు. బుడ్డెమ్మఖర్జ గ్రామంలో శుభకార్యానికి వెళ్లి స్వగ్రామం పట్టాయి దొరవలసకు ఫీల్డ్ అసిస్టెంట్ తిరిగి వెళ్లిపోతుండగా బుడ్డెమ్మఖర్జ సమీపంలో కురుపాం నుంచి కొల్లిగూడ గ్రామానికి వెళ్తున్న పి.మహేష్ తన ద్విచక్రవాహనంతో ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగి గౌరీశంకర్ చెవి, ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావమైంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వాటర్ఫాల్స్లో పడి యువకుడి మృతి
రామభద్రపురం: చేతికి అందివచ్చిన కొడుకు హఠాత్తుగా అనంత లోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రుల ఘోష అంతా ఇంత కాదు. కంటికీమింటికీ ఏకధారగా తల్లిదండ్రులు రోదిస్తున్నారు. మండలకేంద్రానికి చెందిన యువకుడు ఆదివారం స్నేహితులతో కలిసి పిక్నిక్కు సాలూరు మండలంలోని కురికూటి వద్ద గల దళాయివలస వాటర్ ఫాల్స్కు వెళ్లి ప్రమాదవశాత్తు లోయలో పడి మృతిచెందాడు. ఈ ఘటనపై కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండలకేంద్రంలోని కోవెల వీధికి చెందిన గర్భాపు హరి బలరామకృష్ణ(26) కీర్తన గోల్డ్ లోన్ సంస్థలో పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో స్నేహితులతో పిక్నిక్కు వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి బయల్దేరాడు. స్నేహితులతో కలిసి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలోని దళాయివలస వాటర్ ఫాల్స్ దగ్గరకు పిక్నిక్కు వెళ్లాడు. మధ్యాహ్నం భోజనం సమయం వరకు సరదాగా గడిపాడు. మధ్యాహ్నం భోజన సమయంలో చేతులు కడుక్కుని వస్తానని స్నేహితులకు చెప్పి కింద లోయలోకి దిగాడు.ఇంతలో ప్రమాదవశాత్తు కాలుజారి కిందకు పడిపోయాడు. ఎంతకీ రాకపోవడంతో స్నేహితులు వెళ్లి వెతకగా కనిపించలేదు. దీంతో దగ్గరలో ఉన్న గిరిజన వ్యక్తులను పిలిచి విషయం చెప్పారు. ఓ గిరిజన వ్యక్తి లోయలోని నీటిలోకి దిగి చూడగా హరి బలరామకృష్ణ నీటిలో దొరికాడు వెంటనే స్నేహితులు సాలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించడంతో కుటుంబసభ్యులకు జరిగిన విషయంపై సమాచారం ఇచ్చారు. పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం సాలూరు ఆస్పత్రిలో మృతదేహాన్ని ఉంచారు.తండ్రి గోవిందరావు తాపీమేసీ్త్రగా పనిచేస్తుండగా తల్లి మగమ్మ గృహిణి. -
రహదారి భద్రతకు ప్రాధాన్యం
● సిబ్బందితో ఎస్పీ దామోదర్ సెట్ కాన్ఫరెన్స్ విజయనగరం క్రైమ్: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రణాళికలు రూపొందించాలని ట్రాఫిక్ సిబ్బందికి ఎస్పీ దామోదర్ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల హౌస్ ఆఫీసర్లతో ఎస్పీ దామోదర్ ఆదివారం సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రహదారి భద్రత నియమాలను ప్రజలు తప్పక పాటించాలని ప్రమాదాల నియంత్రణకు సిబ్బంది భద్రతాచర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు,. వాహనదారులకు రహదారి భద్రతపట్ల అవగాహన కల్పించాలన్నారు. వాహనదారులు వాహనం తాలూకా అన్ని డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి, ద్విచక్ర వాహన దారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించే విధంగా చూడాలి. హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలను, ప్రమాదాలు జరిగినప్పటికీ స్వల్పగాయాలతో ఎలా ప్రాణాలతో భయటపడవచ్చునో ద్విచక్ర వాహనదారులకు వివరించాలని కోరారు. ప్రతిరోజూ విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలని, వాహన తనిఖీలు చేపట్టి, ప్రజలకు, వాహనదారులకు రహదారి భద్రత, మోటార్ వాహన చట్టం గురించి అవగాహన కల్పించాలని సూచించారు. ప్రమాదాలను నియంత్రించడంలో భాగంగా విస్తృతంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు, కేసులు నమోదు చేసి వారిని జైలుకు పంపించే విధంగా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగి, ప్రజాశాంతికి భంగం కలిగించే వారిపై ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేయాలని చెప్పారు. కాషనరీ బోర్బులు ఏర్పాటు చేయాలి రహదారి ప్రమాదాల నియంత్రణలో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాదాలు జరగకుండా బ్లాక్ స్పాట్కు ఇరువైపులా కాషనరీ బోర్డులను ఏర్పాటు చేయడం, వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్టాపర్లు, డ్రమ్ములు ఏర్పాటు చేసి, రాత్రి సమయాల్లో వాహనదారులకు కనిపించే విధంగా రేడియం స్టిక్కర్లు అతికించాలని సూచించారు. రహదారి ప్రమాదాల నియంత్రణకు చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్ వర్క్లో భాగంగా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు హెల్మెట్ ధరించని ద్విచక్రవాహనదారులపై 19,077 కేసులు, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలను నడిపే వారిపై 2370 కేసులు, మైనర్లు వాహనాలను నడిపిన కారణంగా వాహన యజమానులపై 1020 కేసులు, డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన వారిపై 5510 కేసులు, గడిచిన 20 రోజులలో మద్యం తాగి వాహనాలు నడిపిన 45 మందికి జైలు శిక్ష పడిందన్నారు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన వారిపై 17,246 కేసులు నమోదు చేశామని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. -
సాయుధ దళాల నిధికి విరాళాలను అందించాలి
పార్వతీపురం: సాయుధ దళాల పతాక నిధికి విరివిగా విరాళాలను అందించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సాయుధ దళాల పతాక నిధి స్టిక్కర్స్, ఫ్లాగ్స్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత సైనిక దళాలు మొక్కవోని దీక్షతో చూపిన దేశభక్తి, సాహసం, త్యాగాల పట్ల దేశమంతా గర్విస్తుందన్నారు. దేశం కోసం ఎంతో మంది సైనిక సోదరులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రాణత్యాగం చేసిన అమరులు ఎంతో మంది ఉన్నారన్నారు. సైనికులకు మనమంతా ఎంతో రుణపడి ఉన్నామని, వారి త్యాగాలకు ఎవరూ విలువ కట్టలేరన్నారు. పతాక నిధికి వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలు, విద్యార్థులు, పౌరులు, ఉద్యోగులు విరాళాలను అందించాలని కోరారు. ఈనెల 7న సాయుధ దళాల దినోత్సవం నిర్వహించుకోన్నట్లు తెలిపారు. విరాళాలను డైరెక్టర్ సైనిక్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేరున ఎస్బీఐ అకౌంట్ నంబర్ 33881128795, ఐఎఫ్ఐసీ కోడ్:ఎస్బీఐఎన్ 0016857కి అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పలువురు మాజీ సైనికులు పాల్గొన్నారు. డీఆర్ఓ హేమలత -
అంతర్ యూనివర్సిటీ టేబుల్ టెన్నిస్ జట్టు ఎంపిక
రాజాం సిటీ: అంతర్ యూనివర్సిటీ టేబుల్ టెన్నిస్ పోటీల్లో పాల్గొనే జేఎన్టీయూ జీవీ టేబుల్ టెన్నిస్ జట్టు ఎంపిక స్థానిక జీఎంఆర్ ఐటీలో చేపట్టామని పీడీ బీహెచ్ అరుణ్కుమార్ తెలిపారు. శనివారం చేపట్టిన ఈ ఎంపికకు జేఎన్టీయూ జీవీ అనుబంధ కళాశాలల నుంచి 20 మంది క్రీడాకారులు హాజరయ్యారన్నారు. వారిలో ప్రతిభ కనబర్చిన ఐదుగురు మెయిన్ ప్లేయర్స్, ముగ్గురిని స్టాండ్బైగా ఎంపిక చేశామని తెలిపారు. మెయిన్ ప్లేయర్స్గా ఎంపికై న వారిలో ఎంఎల్ఎస్ సౌజన్య (విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాల), రిజ్వానా (రఘు ఇంజినీరింగ్ కళాశాల), జి.ప్రసన్న (విజ్ఞాన్ కాలేజ్), జి.శ్రీజ, సీహెచ్ దేవీ హర్షిత (జీఎంఆర్ ఐటీ)లు ఉన్నారన్నారు. వారంతా ఈ నెల 9 నుంచి 11 వరకు విశాఖపట్నంలోని గీతం వర్సిటీలో జరగనున్న అంతర్ విశ్వవిద్యాలయాల పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ ఎంపికలు జేఎన్టీయూ జీవీ అబ్జర్వర్, సెలక్షన్ కమిటీ మెంబర్ డాక్టర్ పి.రమణ, విశాఖపట్నం టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ సభ్యుడు రోహిత్ సమక్షంలో జరిగాయన్నారు. జట్టు ఎంపిక పట్ల జీఎంఆర్ ఐటీ ప్రిన్సిపాల్ డాక్టర్ సీఎల్వీఆర్ఎస్వీ ప్రసాద్, ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ జె.గిరీష్, స్టూడెంట్స్ డీన్ డాక్టర్ వి.రాంబాబు, ఎంపిక సిబ్బందిని అభినందించారు. -
ఎప్పటికప్పుడే ధాన్యం తరలింపు
● జేసీ సేతుమాధవన్ విజయనగరం ఫోర్ట్: రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలిస్తున్నామని జేసీ ఎస్.సేతుమాధవన్ తెలిపారు. సేకరించిన ధాన్యానికి సంబంధించి రైస్ మిల్లర్లు ఇవ్వాల్సిన సీఎంఆర్కు డెలివరీ చేసే కార్యక్రమాన్ని కె.ఎల్.పురం ఎస్డబ్ల్యూసీ గోదాములో శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యానికి 13,017 మంది రైతులకు రూ.140 కోట్లు చెల్లించామన్నారు. కార్యక్రమంలో సివిల్ సప్లై డీఎం బి.శాంతి పాల్గొన్నారు. -
అన్నక్యాంటీన్లో ఉడకని భోజనం
నెల్లిమర్ల: పట్టణంలోని అన్నక్యాంటీన్లో శనివారం ఉడికీ ఉడకనీ భోజనం వడ్డించారు. పొంగల్ బదులు వెజిటబుల్ బిర్యానీ, బంగాళాదుంప కూర, మజ్జిగ వడ్డించారు. వెజ్బిర్యానీ పూర్తిగా ఉడకలేదు.దీంతో భోజనం తిన్న పట్టణవాసులు నిర్వాహకులపై చిందులు వేశారు. ఉడికీ ఉడకనీ బిర్యానీ ఎలాపెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలామంది తినకుండానే డస్ట్బిన్లో పడేశారు.ఇదే విషయమై నిర్వాహకులను సాక్షి ఫోన్లో సంప్రదించగా బిర్యానీ పూర్తిగా ఉడకలేదన్నది నిజమేనని ఒప్పుకున్నారు. మరోసారి ఇలాంటి తప్పు జరగకుండా చూస్తామని చెప్పారు. నిర్వాహకులపై పట్టణవాసుల చిందులు -
రైతన్నను నట్టేట ముంచేసిన చంద్రబాబు సర్కారు
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు బొబ్బిలి: విద్య, వైద్య రంగాలను ప్రైవేటుపరం చేయడం.. తన అనుయాయులకు ప్రభుత్వ భూములను కట్టబెట్టడంతో పాటు రైతన్నను సైతం చంద్రబాబు ప్రభుత్వం నట్టేటముంచుతోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. బొబ్బిలిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని వరి రైతుల నుంచి క్వింటా వద్ద 5 నుంచి 10 కిలోలు అదనంగా దోచుకుంటున్నా పాలకులు స్పందించకపోవడం విచారకరమన్నారు. మొక్క జొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యంతో రైతులు నష్టపోయారన్నారు. ప్రజలను, రైతులను నిత్యం మోసగిస్తూ పోతే ఊరుకునేది లేదని, ప్రజా గొంతుకై నినదిస్తామని, వారి పక్షాన పోరాడతామన్నారు. అసమర్థ యంత్రాంగాన్ని రోడ్డుపై నిలబెడతామని హెచ్చరించారు. చెరకు పంటకు కర్మాగారం యాజమాన్యమే మద్దతు ధర నిర్ణయించడం దారుణమన్నారు. గతంలో జేసీ ఆధ్వర్యంలోని కమిటీ ధర నిర్ణయించేదని చెప్పారు. రైతుల పక్షాన జర్నలిస్టులు కూడా వెళ్లి క్షేత్ర పర్యటన చేసి సమస్యలు తెలుసుకోవాలన్నారు. విత్తన సరఫరాలో లోపాలున్నాయి.. విపత్తుల సమయంలో పరిహారాల్లేవు.. ఎరువు కష్టాలు వెంటాడుతున్నా పట్టించుకోవడం లేదు.. అన్నదాత సుఖీభవ రూ.20వేలకు రూ.10వేలు చేతిలో పెట్టారంటూ చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులుచెరిగారు. వైఎస్సార్ సీపీ హయాంలో జిల్లాలోని 2.50 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందిందని, ఎరువులు, విత్తనాల సరఫరాతో ఉచిత పంటల బీమా పథకం వల్ల రైతులకు సకాలంలో పరిహారం అందిన విషయం గుర్తుచేశారు. మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు మాట్లాడుతూ జిల్లాలో అరటి, మామిడి, మొక్కజొన్న, పత్తి, ధాన్యం రైతులకు చంద్రబాబు ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందన్నారు. మిల్లర్లు, ప్రభుత్వ యంత్రాంగం కుమ్మకై ్క ధాన్యం రైతుల నుంచి అదనంగా వసూలుచేస్తున్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యే బేబీనాయన రైతుల వద్ద ఒకలా, మిల్లర్ల వద్ద మరొకలా అదనపు ధాన్యం గురించి మాట్లాడడంతో వారు రైతులను లక్ష్యంగా చేసుకున్నారన్నారు. పల్లెలు, పట్టణాల్లో మద్యం ఏరులై పారుతోందని, బొబ్బిలి ఎమ్మెల్యేకు మద్యం బెల్ట్ షాపుల నుంచి ముడుపులు అందుతున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు నెక్కల నాయుడుబాబు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఇంటి గోపాలరావు, ఆర్థిక మండలి రాష్ట్ర మాజీ సభ్యుడు తూముల భాస్కరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శంబంగి వేణుగోపాలనాయుడు, జిల్లా ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఘనంగా హోంగార్డ్స్ 63వ ఆవిర్భావ దినోత్సవం
● డీపీఓ నుంచి మహిళా పోలీస్స్టేషన్ వరకు ర్యాలీ, మానవహారంవిజయనగరం క్రైమ్: శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డ్స్ సేవలు క్రియాశీలకమని ఎస్పీ దామోదర్ అన్నారు. ఈ మేరకు శనివారం స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో హోంగార్డ్స్ 63వ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై, హోంగార్డ్స్ నుంచి గౌరవ వందనం స్వీకరించి, పోలీసుశాఖకు, ప్రజలకు హోంగార్డ్స్ అందిస్తున్న సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థలో హెూంగార్డ్స్ అంతర్గత భాగమన్నారు. పోలీసులు నిర్వహించే అన్ని రకాల విధులను నిర్వహిస్తూ, పోలీస్శాఖలో క్రియాశీలకంగా మారారన్నారు. హోం గార్డులు నీతి, నిజాయితీ, అంకితభావంతో, క్రమశిక్షణతో పని చేసి జిల్లా పోలీసుశాఖకు మంచి పేరు తీసుకుని రావాలని, తద్వారా రాష్ట్ర పోలీసుశాఖకు కూడా మంచి కీర్తిని తీసుకు వచ్చే విధంగా పని చేయాలని సూచించారు. అనంతరం, విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన హెూంగార్డ్స్కు, పరేడ్ నిర్వహణలో ప్రతిభకనబర్చిన హోంగార్డ్స్కు ఎస్పీ బహుమతులను ప్రదానం చేశారు. హెూంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కవాతు నిర్వహించగా, పరేడ్ కమాండర్గా ఎం.శివ సంతోష్ వ్యవహరించారు. హెూంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవానికి సూచికగా శాంతి కపోతాలను, బెలూన్స్ను ఎస్పీ ఏఆర్.దామోదర్, అదనపు ఎస్పీ పి.సౌమ్యలత ఎగురవేశారు. నగరంలో ర్యాలీ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయం నుంచి నిర్వహించిన ర్యాలీని ఎస్పీ ఏఆర్.దామోదర్ పచ్చ జెండా ఊపి, ప్రారంభించారు. ఈ ర్యాలీ జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి దిశ పోలీస్ స్టేషన్ వరకు నిర్వహించి, మానవ హారంగా ఏర్పడి, హెూంగార్డ్స్ విధులు, సేవల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఏఆర్ డీఎస్పీ ఈ.కోటిరెడ్డి, చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు, బొబ్బిలి డీఎస్పీ జి.భవ్యరెడ్డి, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, సీఐలు ఆర్వీఆర్కే చౌదరి, ఈ.నర్సింహమూర్తి, సీహెచ్. సూరినాయుడు, బి.లక్ష్మణరావు, టి.శ్రీనివాసరావు, ఆర్ఐలు ఆర్.రమేష్ కుమార్, ఎన్.గోపాల నాయుడు, టి.శ్రీనివాసరావు, డీపీఓ ఏఓ పి.శ్రీనివాసరావు, కార్యాలయ పర్యవేక్షకులు లలితకుమారి, వెంకటలక్ష్మి, ఆర్ఎస్సైలు ముబారక్ అలీ, మంగలక్ష్మి, సూర్యనారాయణ, రామకృష్ణ, ఇతర పోలీను అధికారులు, హెూంగార్డ్స్ ఇన్చార్జ్ హెచ్సీలు డీఎస్ఎన్ రాజు, కె.శ్రీనివాసరావు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. పార్వతీపురంలో.. పార్వతీపురం రూరల్: హోం గార్డులు పోలీసు శాఖకు వెన్నెముక లాంటివారని, నేర పరిశోధన నుంచి బందోబస్తు వరకు వారి సేవలు అద్భుతమని ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి కొనియాడారు. 63వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో శనివారం పోలీస్ మల్టీఫంక్షన్ హాల్ గ్రౌండ్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు వేడుకల్లో కేవలం మూడు రోజుల శిక్షణతోనే పరేడ్ను నిర్వహించిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు. అనంతరం ప్రతిభ కనబరిచిన సిబ్బందికి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, పార్వతీపురం ఏఎస్పీ మనీషారెడ్డి, డీఎస్పీ థామస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి భూసేకరణ త్వరగా పూర్తి చేయాలి
విజయనగరం అర్బన్: ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఇంజినీరింగ్, రెవెన్యూ అధికారులతో శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో గ్రామాలవారీగా భూసేకరణ పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. అంచనా వ్యయం రూ.17,050 కోట్లతో ఉత్తరాంధ్రలో సుమారు 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకుందని కలెక్టర్ తెలిపారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 3.865 లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్టు నీరు అందనుందని పేర్కొన్నారు. ప్రాజెక్టును రెండు దశలుగా నిర్మిస్తున్నట్లు వివరిస్తూ రెండో దశలోని 6 ప్యాకేజీల్లో 1వ ప్యాకేజీలో కొంత భాగంతో పాటు 2, 4, 5, 6 ప్యాకేజీలు విజయనగరం జిల్లాలో ఉన్నాయని తెలిపారు. జిల్లాలో మొత్తం 9,630 ఎకరాలు సేకరించాల్సి ఉండగా కాలువల నిర్మాణం కోసం మాత్రమే 4,495 ఎకరాలు అవసరమని చెప్పారు. తక్షణ ప్రాధాన్యత మేరకు 339.68 ఎకరాలను వెంటనే సేకరించాలని రైతులతో సమావేశాలు నిర్వహించి ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇకపై భూసేకరణకు సంబంధించి ప్రతి వారం సమీక్షా సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ప్రాజెక్టు ఈఈ ఉమేష్ కుమార్, భూసేకరణ విభాగం ఎస్డీసీ కళావతి, చీపురుపల్లి ఆర్డీఓ సత్యవాణి, పలువురు డీఈలు, తహాసీల్దార్లు, డీటీలు పాల్గొన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు వేగవంతం చేయాలిజిల్లాలో కొత్త పరిశ్రమల స్థాపనకు వచ్చే దరఖాస్తులకు గడువుకోసం వేచి చూడకుండా వెంటనే పరిశీలించి అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏ శాఖ వద్ద దరఖాస్తు పెండింగ్లో ఉన్నా వెంటనే సమన్వయం చేసుకుని క్లియరెన్స్ ఇప్పించాలని పరిశ్రమల శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్లో జరిగిన జిల్లా పరిశ్రమలు/ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా పరిశ్రమలు స్థాపించాలని ముందుకు వస్తున్న వారికి జిల్లా యంత్రాంగం అన్ని విధాలా సహకారం అందించి వీలైనంత త్వరగా పరిశ్రమలు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో సింగిల్ డెస్క్ విధానం, ఇన్సెంటివ్ మంజూరు, పీఎంఈజీపీ, ఏపీఐఐసీ అంశాలు, ర్యాంపు కార్యక్రమం తదితర అంశాలపై సమీక్ష జరిగింది. కొత్తగా ఏర్పాటు కానున్న 6 పరిశ్రమల ప్రగతిపై ప్రత్యేకంగా చర్చించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ డీడీ ఎంవీ కరుణాకర్, ఏపీఐఐసీ జెడ్ఎం మురళీమోహన్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ సరిత, అగ్నిమాపక అధికారి రాంప్రకాష్, నాబార్డ్ డీడీఎం నాగార్జున, ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ ఎం.లక్ష్మణరావు, మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య తదితర అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి -
దివ్యాంగుల జీవితాల్లో ‘గురుదేవా’ వెలుగులు
● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి కొత్తవలస: వివిధ ప్రమాదాలు, పోలియో, కుష్టు వ్యాధితో అవయవాలు కోల్పోతున్నవారి జీవితాల్లో గురుదేవా చారిటబుల్ ట్రస్టు వెలుగులు నింపుతోందని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అన్నారు. మంగళపాలెం సమీపంలోని గురుదేవా చారిటబుల్ ట్రస్టును కలెక్టర్ శని వారం సందర్శించారు. ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, క్యాన్సర్ ఆస్పత్రి, కృత్రిమ అవయవాల తయారీ యూనిట్ విభాగాలను పరిశీలించారు. కృత్రిమ అవయవాలను వినియోగిస్తున్న దివ్యాంగులతో మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులకు సేవ చేయడం దైవసేవగా భావించాలన్నారు. అతి తక్కువ ఖర్ఛుతో కృత్రిమ అవయవాలు తయారుచేసి అందజేయడం గొప్పవిషయమన్నారు. దివ్యాంగులకు సేవచేసే భాగ్యం గురుదేవాకు దక్కిందన్నారు. ట్రస్టు చైర్మన్ రాపర్తి జగదీష్బాబును ప్రత్యేకించి అభినందించారు. ఈ సేవలు కొనసాగించేందుకు తనవంతు సహకారం అందస్తానని తెలిపారు. కార్యక్రమంలో కొత్తవలస తహసీల్దార్ పి.సునీత, ఆర్ఐ షణ్ముఖరావు, తదితరులు పాల్గొన్నారు. వరలక్ష్మి రైస్ మిల్లుపై చర్యలు ● డీ ట్యాగ్ చేసిన అధికారులు విజయనగరం ఫోర్ట్: రైతుల నుంచి అదనంగా ధాన్యం డిమాండ్ చేస్తున్న రైస్ మిల్లును పోర్టల్ నుంచి డీ ట్యాగ్ చేశారు. శ్రీకేవీర్ వరలక్ష్మి రైస్ ఇండసీ్త్ర మిల్లు యాజమాన్యం అదనపు ధాన్యం డిమాండ్ చేస్తున్నారని చీపురుపల్లి మండలానికి చెందిన రైతులు యల్లంటి సూర్యారావు, బూరాడ రమణ, తుంపల్లి త్రినాథ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం విచారణలో నిజమని తేలడంతో జేసీ సేతుమాధవన్ చర్యలు తీసుకున్నారు. రైస్ మిల్లుకు తదుపరి ధాన్యం కేటాయింపు లేకుండా చర్యలు తీసుకుంటామని జేసీ తెలిపారు. 1800 కేజీల పేదల బియ్యం పట్టివేత సాలూరు రూరల్: సాలూరు మండలం సారిక గ్రామంలో అక్రమంగా తరలించేందుకు ఆటోలో సిద్ధంగా ఉన్న 1800 కేజీల పేదల బియ్యంను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ సతీష్, సిబ్బంది శనివారం పట్టుకున్నారు. ఒడిశాకు అక్రమంగా తరలిస్తుండగా పీడీఎస్ బియ్యం పట్టుకున్నట్టు ఆయన తెలిపారు. నిందుతులు జంపా సురేష్, కొర్ర మహేంద్రపై కేసు నమోదుచేసి బియ్యాన్ని తహసీల్దార్కు అప్పగించామని తెలిపారు. -
దైవదర్శనానికి వెళ్లి అనంతలోకాలకు..
భక్తిశ్రద్ధలతో అయ్యప్ప మాల ధరించారు. 41 రోజుల పాటు ఉపవాస దీక్షతో గడిపారు. దైవనామస్మరణలో తరించారు. శబరి చేరుకుని మొక్కుబడి చెల్లించారు. తిరుగు ప్రయాణంలో నలుగురు భక్తులను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కాటేసింది. ఒకరిని ఆస్పత్రిపాల చేసింది. కుటుంబ సభ్యుల్లో విషాదం నింపింది. దత్తిరాజేరు/గజపతినగరం: అయ్యప్పమాల ధరించి శబరి వెళ్లి.. తిరిగి వస్తున్న అయ్యప్ప భక్తులు తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం సమీపంలోని రామనారాయణపురం వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. శనివారం తెల్లవారు జామున ఆగి ఉన్న కారును వెనుక నుంచి మరో కారు బలంగా ఢీకొనడంతో దత్తిరాజేరు మండలం కె.కొత్తవలస గ్రామానికి చెందిన ముగ్గురు, మరుపల్లికి చెందిన ఒక అయ్యప్ప భక్తుడు మృతి చెందారు. కె.కొత్తవలస అయ్యప్ప సన్నిధి నుంచి ఈ నెల 1వ తేదీన వంగర రామకృష్ణ(54), మరడ రాము(50), మార్పిన అప్పలనాయుడు(31)తో పాటు గజపతినగరం మండలం మరుపల్లికి చెందిన బండారు రామచంద్రరరావు (35), గజపతినగరానికి బెవర శ్రీరాం ఇరుముడి కట్టుకొని కారులో శబరి బయలు దేరారు. 4వ తేదీన శబిరిలో అయ్యప్పకు మొక్కుచెల్లించారు. వచ్చేదారిలో కారు పక్కకు నిలిపి విశ్రాంతి తీసుకుంటుండగా వెనుక నుంచి మరో కారు ఢీ కొనడంతో ఐదుగురు గాయపడ్డారు. వీరిలో నలు గురు మృతిచెందగా, డ్రైవర్ బెవర శ్రీరాం రామేశ్వరంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ● గురుస్వామిగా పేరుపొంది... మృతుడు రామకృష్ణ 20 ఏళ్లుగా అయ్యప్ప మాలధారణ చేస్తున్నారు. కొత్తవలస గ్రామంలో గురుస్వామిగా పేరు పొందారు. వడ్రంగి పనిచేస్తూ భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలు భవాని, లతతో పాటు వృద్ధురాలైన తల్లి సూరమ్మను పోషిస్తూ వస్తున్నారు. ఇంటికి పెద్ద దిక్కు దైవదర్శనానికి వెళ్లి మృతిచెందడంతో విలపిస్తున్నారు. కుటుంబానికి దిక్కెవరంటూ భార్య లక్ష్మీ బావురమంటోంది. ● అనాథగా మారిన కుటుంబం మరుపల్లికి చెందిన బండారు రామచంద్రరావు మృతితో కుటుంబం అనాథగా మారింది. ఆయనకు భార్య సత్యవతితో పాటు తొమ్మిదేళ్ల కుమారుడు శ్రీనివాస్, మూడేళ్ల పాప శ్రీసహిత ఉన్నారు. ● కూలీ కుటుంబంలో మృత్యుఘోష రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మరడ రాము కూలిచేస్తేనే ఇల్లుగడిచే పరిస్థితి. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా అయ్యప్పస్వామిపై ఉన్న భక్తితో మాలధారణ చేశారు. ఇంటి పెద్ద దిక్కును మృత్యువు కాటేయడంతో భార్య పైడితల్లి, కుమారుడు ప్రసాద్, వృద్ధురాలైన తల్లి సింహాచలం విషాదంలో మునిగిపోయారు. మృతి చెందిన అయ్యప్ప భక్తులు అయ్యప్ప భక్తులను కాటేసిన మృత్యువు తమిళనాడులోని రామేశ్వరంలో రోడ్డు ప్రమాదం నలుగురు మృతి.. ఒకరికి తీవ్రగాయాలు విషాదంలో కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా... కె.కొత్తవలస నుంచి మొదటిసారి అయ్యప్ప మాల ధరించి శబరిమల వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మార్పిన అప్పలనాయుడు(31)కు మూడేళ్ల కిందటే మేనమామ కూతురు గాయత్రితో వివాహం జరిగింది. పిల్లల కోసం దైవసేవలో ఉండగా మృత్యువు కాటేయడంతో భార్య రోదిస్తోంది. అప్పలనాయుడు అక్క అప్పలనర్సమ్మ కూలి పనులకు వెళ్లి చైన్నెలో లారీ ఢీకొనడంతో మృతి చెందింది. మేనమామ గంజి త్రినాఽథ్ కొడుకు కూడా 2018 ఆర్మీకి ఎంపికై విశాఖపట్నంలో స్కూటీపై వెళ్తుండగా లారీ ఢీకొనడంతో మృతిచెందాడు. ఇప్పుడు రెండు కుటుంబాలకు పెద్ద దిక్కుగా ఉన్న అప్పలనాయుడు మృతితో తల్లిదండ్రులు రాములమ్మ, తిరుపతి, అత్త మామలు గంజి త్రినాథ్, లక్ష్మి కన్నీరుకార్చుతున్నారు. -
రాజ్యాంగం స్ఫూర్తితో సాగుదాం
● జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు విజయనగరం: మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దేశ ప్రజలందరి కోసం రచించిన రాజ్యాంగం స్ఫూర్తితో ముందుకు సాగుదామని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం, చెప్పిన మాటలను ఆచరించడమే ఆయనకు మనమిచ్చిన ఘన నివాళిగా పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతిని విజయనగరంలోని జెడ్పీ కార్యాలయ ప్రాంగణంలో శనివారం నిర్వహించారు. పార్టీ నేతలతో కలిసి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్ భారత దేశం ముద్దుబిడ్డ అని కొనియాడారు. మానవాళి ఉన్నంత వరకు తన ఆశయాల రూపంలో అంబేడ్కర్ సజీవంగా ఉంటారని గుర్తుచేశారు. దురదృష్టవశాత్తు చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి నెక్కల నాయుడుబాబు, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి వర్రి నర్సింహమూర్తి, నగర ఎస్సీసెల్ అధ్యక్షుడు బుంగ భానుమూర్తి, జిల్లా ఉపాధ్యక్షుడు పతివాడ సత్యనారాయణ, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
6,173 మంది అనుమానితులు గుర్తింపు
● గతనెల 17 నుంచి ఇంటి సర్వే చేస్తున్న వైద్యసిబ్బంది ● కుష్ఠువ్యాధి అనుమానితులు 6,173 మంది విజయనగరం ఫోర్ట్: సమాజాన్ని కుష్ఠు వ్యాధి పీడిస్తూనే ఉంది. జిల్లాలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. చాపకింద నీరులా వ్యాప్తి చెందుతున్న వ్యాధిపై వైద్యసిబ్బంది ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇంటింటి సర్వేతో అనుమానితులను గుర్తిస్తున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరిపిస్తున్నారు. వ్యాధి భారిన పడిన వారికి అవసరమైన ముందులు ఉచితంగా అందజేస్తున్నారు. కుష్ఠువ్యాధి మచ్చలు ఉన్నప్పటికీ అవి సాధారణ మచ్చలు అనుకుని చాలా మంది పట్టించుకోవడంలేదని, దీనివల్లే కేసులు నమోదవుతున్నట్టు వైద్యవర్గాలు చెబుతున్నాయి. చురుగ్గా సర్వే.. జిల్లాలో ఉన్న జనాభా అంతటిని సర్వే చేయాలని వైద్యశాఖ నిర్ణయించింది. గత నెల 17 నుంచి ఆశ వర్కర్, వైద్యసిబ్బంది కలిసి ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారు. స్శర్శ, నొప్పిలేని మచ్చలు ఏమైనా ఉన్నాయా? లేదా? అన్నది పరిశీలిస్తున్నారు. కుష్ఠువ్యాధి అనుమానితులను పీహెచ్సీకి తీసుకెళ్లి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నారు. జిల్లాలో 19,72,666 మందిని సర్వే చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 18,12,284 మందిని సర్వే చేశారు. ఈ నెలాఖరు వరకు సర్వే కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు గత నెల 17 నుంచి ఈ నెల 31వరకు సర్వే చేస్తాం. ఇప్పటి వరకు 6,173 మంది అనుమానితులను గుర్తించాం. ఇందులో 21 మందికి వ్యాధి నిర్ధారణ అయింది. కుష్టు వ్యాధి నిర్ధారణ అయిన వారికి వెంటనే చికిత్స అందిస్తున్నాం. – డాక్టర్ కె.రాణి, జిల్లా కుష్టువ్యాధి నియంత్రణ అధికారి 21 మందికి కుష్ఠు వ్యాధి నిర్ధారణ 3,852 మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు వైద్య సిబ్బంది చేపట్టిన సర్వేలో జిల్లా వ్యాప్తంగా 6,173 మంది అనుమానితులను గుర్తించారు. వీరిలో 3,852 మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇందులో 21 మందికి కుష్టు వ్యాధి నిర్ధారణ అయింది. ఇంకా 2,321 మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాల్సి ఉంది. వీరిలో కూడ కొంతమందికి వ్యాధి నిర్ధారణ అయ్యే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. కుష్టు వ్యాధి నిర్ధారణ సకాలంలో జరిగి సక్రమంగా మందులు వాడితే వ్యాధి నయమవుతుందని, అంగవైకల్యం బారిన పడకుండా ఉండవచ్చన్నది వైద్యుల మాట. -
ఆసియన్ యూత్ పారా గేమ్స్–2025కు ప్రేమ్చంద్
విజయనగరం: దుబాయ్ వేదికగా ఈనెల 7 నుంచి 14 వరకు జరగబోయే ఆసియన్ యూత్ పారా గేమ్స్కు విజయనగరం జిల్లాకు చెందిన పొట్నూరు ప్రేమ్ చంద్ ఎంపిక కావడం జిల్లాకు దక్కిన అరుదైన అవకాశమని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఆయన మాట్లాడుతూ నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఈ ఆసియన్ యూత్ పారాగేమ్స్, ఆసియన్ గేమ్స్తో సమానమని అన్నారు. యూత్ ఆసియన్ గేమ్స్కు ఆంధ్రప్రదేశ్ నుంచి 8 మంది ఎంపిక కాగా వారిలో మన జిల్లాకు చెందిన ప్రేమ్చంద్ ఉండడంగర్వకారణమని అన్నారు. ఈ ఏడాది లక్నోలో జరిగిన నేషనల్ యూత్ పారా గేమ్స్ బ్యాడ్మింటన్ మెన్స్న డబుల్స్లో గోల్డ్, సింగిల్స్లో బ్రాంజ్ మెడల్ గెలుచుకుని అంతర్జాతీయ చాంపియన్ షిప్కు ఎంపికయ్యాడని తెలిపారు. ప్రేమ్ చంద్ ఎంపిక పట్ల కలెక్టర్ రాం సుందర రెడ్డి, జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, జిల్లా క్రీడాధికారి ఎస్. వెంకటేశ్వసరరావు అభినందనలు తెలియజేశారు. దుబాయిలో జరిగే చాంపియన్ షిప్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు, రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు తీసుకురావాలని అకాంక్షించారు.11 మంది సత్య కళాశాల విద్యార్థులు అగ్నివీర్కు ఎంపికవిజయనగరం అర్బన్: భారత సైన్యం అగ్నిపథ్ కింద అగ్నివీర్ జనరల్ డ్యూటీ/టెక్నికల్ విభాగాల్లో పట్టణానికి చెందిన సత్య డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థులు 11 మంది ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీ.సాయిదేవమణి శనివారం విడుదల చేసిన ప్రకనటలో తెలిపారు. ఎంపికై న విద్యార్థులను స్థానిక కళాశాల ప్రాంగణంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు అభినందించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ అగ్నివీర్ ఎంపిక ప్రక్రియలో చూపిన ప్రతిభను కళాశాల విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ విభాగాల అధ్యాపకులు, ఎన్సీసీ ఆఫీసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. -
గిరిజనులను మోసం చేయొద్దు
కొత్తవలస: గ్రేహౌండ్స్ పోలీస్ శిక్షణ కేంద్రం పేరుతో మరోమారు మా గిరిజనులను మోసం చేయొద్దని అప్పన్నదొరపాలెం, తమ్మన్నమోరక, జోడిమెరక గ్రామాలకు చెందిన గిరిజనులు కోరారు. గతంలో ఈ ప్రాంతంలో గిరిజన యూనివర్సిటీ నిర్మిస్తామని మా భూములను లాక్కున్నారని, యువతకు ఉపాధి కల్పిస్తామని, భూమికి భూమి ఇస్తామని, ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్లు నిర్మిస్తామని ఇలా ఏడు హామీలిచ్చి ఒక్కటీ అమలు చేయలేదన్నారు. పోలీస్ శిక్షణ కేంద్రం ఏర్పాటులో భాగంగా తహసీల్దార్ పి.సునీత ఆధ్వర్యంలో శుక్రవారం అప్పన్నదొరపాలెంలో గ్రామ సభ నిర్వహించారు. సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ నుంచి అందించే పరిహారం, ప్రోత్సాహకాలను గిరిజనులకు తహసీల్దార్ వివరించారు. అనంతరం ఎమ్మెల్యే లలితకుమారి మాట్లాడుతూ గిరిజనులకు చంద్రబాబు ప్రభుత్వం ఎంతో చేసిందని, గ్రేహౌండ్స్ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పడంతో గిరిజన యువకులు ఆందోళనకు దిగారు. ఏళ్లు తరబడుతున్నా ఇచ్చిన హామీలు ఒక్కటైనా నెరవేర్చారా అంటూ నిలదీశారు. హామీలు నెరవేర్చాకే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. గిరిజన యువత ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఎమ్మెల్యే లలితకుమారి సభ నుంచి వెళ్లిపోవడంపై యువకులు, మహిళలు అసహనం వ్యక్తంచేశారు. మా సమస్యలు తెలుసుకోవడం కూడా ఎమ్మెల్యేకు ఇష్టంలేదన్నారు. ఎన్నికల సమయంలో మాత్రం వచ్చి వరసలు కలుపుకొని ఓట్లు అడిగేందుకు వచ్చేస్తారా? అంటూ ప్రశ్నించారు. అభిప్రాయం చెప్పుకునే ఆవకాశంలేని గ్రామసభ ఎందుకంటూ సభ నుంచి గిరిజనులు నిష్క్రమించారు. తహసీల్దార్ సునీత సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా గిరిజన యువకులు, మహిళలు వినిపించుకోలేదు. దీంతో అధికారులు వెనుదిరిగారు. హామీలు నెరవేర్చాక పోలీస్ శిక్షణ కళాశాల నిర్మాణం చేపట్టండి తేల్చిచెప్పిన గిరిజనులు గిరిజనుల మాట వినకుండానే వెళ్లిపోయిన ఎమ్మెల్యే -
రెచ్చిపోతున్న ట్రాన్స్ఫార్మర్ల దొంగలు
నెల్లిమర్ల రూరల్: మండలంలో కొంతకాలంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల దొంగలు రెచ్చిపోతున్నారు. పొలాల్లోని రైతుల వ్యవసాయ మోటార్లకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ వైర్లు ఎత్తుకు పోతున్నారు. దొంగల స్వైర విహారంతో రైతులు హడలిపోతూ ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ వ్యవహారంపై విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి.చోరీ సమయంలో విద్యుత్ ప్రమాదం జరిగితే తమకు సంబంధం లేదనే ప్రకటనలు ఇస్తున్నారే తప్ప తమ సంస్థకు దొంగల వల్ల జరుగుతున్న నష్టాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల మండలంలోని సతివాడ, మధుపాడ గ్రామాల్లో గుర్తు తెలియని వ్యక్తులు నాలుగు ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి వాటిలోని కాపర్ వైర్లను ఎత్తుకుపోయారు. ఒక్కో ట్రాన్స్ఫార్మర్ ధర సుమారు రూ.3లక్షల వరకు ఉంటుందని విద్యుత్ సిబ్బంది చెబుతున్నారు. చోరీపై బాధిత ఏఈకి ఫిర్యాదు చేసి మూడు రోజులు గడుస్తున్నా పోలీసులకు సమాచారం అందించలేదని బాధిత రైతులు తెలియజేస్తున్నారు. ఇప్పటికై నా విద్యుత్, పోలీస్ అధికారులు చోరీలపై నిఘా ఉంచి నియంత్రించాలని డిమాండ్ చేస్తున్నారు. రెండు గ్రామాల్లో నాలుగు చోట్ల చోరీ -
క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరచాలి
● జేఎన్టీయూ, గురజాడ వర్సిటీ వీసీ సుబ్బారావు డెంకాడ: ఈనెల 10 నుంచి 14వ తేదీ వరకూ కాకినాడ జేఎన్టీయూలో జరగబోయే సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో పాల్గొనే జేఎన్టీయూ, విజయనగరం గురజాడ విశ్వవిద్యాలయం జట్టు ఉత్తమ ప్రతిభ కనబరచాలని వీసీ వీవీ సుబ్బారావు అన్నారు. ఈ పోటీల్లో గురజాడ విశ్వవిద్యాలయం తరఫున ఆడబోయే వాలీబాల్ పురుషుల జట్టు, ఇంటర్ కాలేజియేట్ టోర్నమెంట్ కమ్ యూనివర్సిటీ వాలీబాల్ పురుషుల జట్టు ఎంపిక పోటీలను చింతలవలసలోని ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం వీసీ వీవీ సుబ్బారావు రిబ్బన్కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపిక పోటీల్లో విశ్వవిద్యాలయాల అనుబంధ కళాశాలల జట్ల క్రీడాకారులు మెరుగైన ఆటతీరును ప్రదర్శించాలన్నారు. క్రీడలతో శారీరక, మానసిక వికాసం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వైఎంసీ శేఖర్, టోర్నమెంట్ ఆర్గనైజర్ సెక్రటరీ, పీడీ రామచంద్రరాజు, క్రీడా సమన్వయకర్త జి.అప్పలనాయుడు, పరిశీలకులు కె.నాగరాజు, పీడీలు, కోచ్లు, రిఫరీలు,కళాశాల డీన్లు, హెచ్ఓడీలు, అధ్యాపకులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
కూరగాయల సాగుపై దృష్టిసారించాలి
● కలెక్టర్ రాంసుందర్ రెడ్డి విజయనగరం ఫోర్ట్: మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా కూరగాయల సాగు విస్తీర్ణం పెంచేందుకు కృషిచేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సూచించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో ఉద్యానశాఖ అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో సీజనల్గా డిమాండ్ ఉన్న కూరగాయలు, ఆకు కూరల విస్తీర్ణం పెంపుపై ఉద్యానశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే మార్గాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి మండలంలో కనీసం 1000 ఎకరాల్లో ఉద్యాన పంటల అభివృద్ధి జరగాలన్నారు. కూరగాయాల సాగుకు వీలుగా రైతులకు బోర్ల సదుపాయం కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో ఉద్యానశాఖ డీడీ చిట్టిబాబు పాల్గొన్నారు. ‘ఉపాధి’ కల్పనలో అలసత్వం తగదు విజయనగరం అర్బన్: జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ హామీ పథకం కింద 100 రోజుల పని కల్పనలో అలసత్వం తగదని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అన్నారు. పనుల కల్పనలో వెనుకబడిన మండలాల అధికారులపై శుక్రవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో అసహనం వ్యక్తంచేశారు. వంగర, మెంటాడ, జామి, వేపాడ, కొత్తవలస మండలాలు ప్రతి వారం ప్రగతి తగ్గుతుండడంపై నిలదీశారు. వెంటనే మెమోలు జారీ చేయాలని ప్రాజెక్టు డైరెక్టర్ను ఆదేశించారు. గుర్ల, విజయనగరం, ఎల్.కోట, రేగిడి, భోగాపురం మండలాల్లో నిర్దేశిత లక్ష్యాల సాధనకు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. రోజువారీ వేతనం రూ.300 కంటే తక్కువ రాకుండా చూడాలన్నారు. ● వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో నిర్వహించిన మరో టెలికాన్ఫరెన్స్లో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో స్క్రబ్టైఫస్ వ్యాధిపై ప్రజల్లో అనవసర ఆందోళన రాకుండా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ● జిల్లా అభివృద్ధి సూచికల్లో పలు శాఖలు వెనుకబడి ఉండడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తంచేశారు. పరిశ్రమలు, మహిళా అండ్ శిశు సంక్షేమం, పోలీస్, ఫిషరీస్, పశుసంవర్థక, ఉద్యానవన శాఖలు తమ ప్రగతిని తక్షణం మెరుగుపరచుకోవాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగితాలపై మాత్రమే కాకుండా క్షేత్రస్థాయిలో నిజమైన, రియలిస్టిక్ డేటాను సిద్ధం చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో సీపీఓ బాలాజీ పాల్గొన్నారు. -
పరజపాడుగదబవలసలో ఏనుగుల తిష్ఠ
జియ్యమ్మవలస రూరల్: పంట చేతికి అందికొస్తున్న సమయంలో అటవీ ఏనుగులు గుంపు ఈ మండలానికి వచ్చి రైతు కంట కన్నీరు పెట్టిస్తున్నాయి. ఈ విషయమై కూటమి నాయకులంతా ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఏనుగులను తరలించాలని గగ్గోలు పెట్టారు. ఎన్నికల సమయంలో కుంకీ ఏనుగులను తెప్పించి ఈ ప్రాంతం నుంచి అటవీ ఏనుగుల గుంపును తరలిస్తామని హామీ ఇచ్చి ప్రస్తుతం కిక్కురుమనకుండా చోద్యం చూస్తున్నారు.మరోవైపు ఏనుగులను తరలించాలని గట్టిగా నిలదీస్తే కేసుపెడతారేమోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో జియ్యమ్మవలస మండలంలో గడిచిన ఐదు రోజులుగా ఏనుగులు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు నాశనం చేస్తూ నిద్రాహారాలు లేకుండా చేస్తున్నాయి. గురువారం చింతల బెలగాం పరిసరాల్లో రైతుల ధాన్యం బస్తాలను పాడుచేసి శుక్రవారం పరజపాడు గదబవలసలో తిష్ఠ వేశాయి. దీంతో కళ్లాల్లో ధాన్యం, చెరుకు పంటలను నాశనం చేస్తూ ప్రాణహాని కలిగిస్తాయన్న భయాందోళనలో ప్రజలు ఉన్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం ఏనుగుల గుంపును తరలించే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం
విజయనగరం క్రైమ్: విజయనగరం, కోరుకొండ రైల్వేస్టేషన్ ల మధ్య రైలు పట్టాలపై సుమారు 50నుంచి 55 ఏళ్ల వయస్సు కలిగిన గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని విజయనగరం రైల్వే పోలీసులు శుక్రవారం గుర్తించారు. ఇందుకు సంబంధించి జీఆర్పీ ఎస్సై బాలాజీరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం కోరుకొండ రైల్వే స్టేషన్ల మధ్య ట్రాక్ పై సుమారు 5 అడుగుల 3 అంగుళాల పొడవు కలిగి, ఎరుపు రంగు ఛాయతో, పసుపు రంగుపై ఎరుపు, తెలుపు రంగు చిన్న గడుల చీర, ఎరుపు రంగు జాకెట్ ధరించి ఉన్న మహిళ మృతదేహాన్ని కనుగొన్నామని తెలిపారు. మృతురాలి కుడి చేతిపై ఒడిశా భాషలో పచ్చబొట్టు గుర్తు ఉందన్నారు. ఆచూకీ తెలిసిన వారు ఫోన్ 9490617089,94419 62879 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్సై బాలాజీ రావు కోరారు. -
అట్టహాసంగా సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభం
● అలరించిన సినీ తారలు రితిక, నిధి అగర్వాల్ పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రం వాకిట ప్రముఖ వస్త్ర వాణిజ్య సంస్థ ‘ిసీఎంఆర్ షాపింగ్ మాల్’ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. పార్వతీపురంలోని సౌందర్య జంక్షన్లో ఏర్పాటు చేసిన ఈ భారీ షోరూమ్ను స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎంఆర్ రాకతో జిల్లా ప్రాంత ప్రజల షాపింగ్ కష్టాలు తీరాయన్నారు. గతంలో శుభకార్యాల కోసం విశాఖ, విజయవాడ వెళ్లేవారని, ఇప్పుడు ఆ అవసరం లేకుండా అంతర్జాతీయ స్థాయి షాపింగ్ అనుభవం, ఉపాధి అవకాశాలు స్థానికంగానే లభించడం ఆనందదాయకమన్నారు. సంస్థ చైర్మనన్ మావూరి వెంకటరమణ మాట్లాడుతూ.. 40 ఏళ్లుగా తెలుగు ప్రజల ఆదరణే తమ బలమని, సొంత మగ్గాలపై నేయించిన వస్త్రాలను ఫ్యాక్టరీ ధరలకే సామాన్యులకు అందిస్తున్నామని తెలిపారు. ‘వన్న్స్టాప్ ఫ్యామిలీ డెస్టినేషన్’గా అన్ని వర్గాలకు నచ్చేలా మాల్ను తీర్చిదిద్దామని డైరెక్టర్ మావూరి మోహన్ బాలాజీ పేర్కొన్నారు. ప్రారంభోత్సవంలో సినీ తారలు రితిక నాయక్, నిధి అగర్వాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వస్త్ర శ్రేణులను తిలకించి, తమ ఆటపాటలతో అభిమానులను ఉర్రూతలూగించారు. -
ఆసక్తి మేరకు ప్రోత్సహించాలి
● పీటీఎంలో ఎస్పీ దామోదర్ విజయనగరం క్రైమ్: విద్యార్థుల ఆసక్తిని గమనించి ఆయా రంగాల్లో ప్రోత్సహించాలని ఎస్పీ దామోదర్ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు సూచించారు. విజయనగరం కస్పా ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన పీటీఎంలో పాల్గొన్నారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం పెంపొందేలా ఉపాధ్యాయులు బోధన సాగించాలన్నారు. విద్యార్థులకు మంచి నడత నేర్పాలన్నారు. టెక్నాలజీని మంచి విషయాలు తెలుసుకునేందుకు వినియోగించేలా ప్రోత్సహించాలన్నారు. గుడ్, బ్యాడ్ టచ్లపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులను కోరారు. అనంతరం సైన్స్ ఎగ్జిబిషన్ను ఎస్పీ తిలకించారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు పెన్నులను బహుమతిగా అందజేశారు. కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం విశాలాక్షి, టూటౌన్ సీఐ టి.శ్రీనివాసరావు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
స్వరరాగ గంగా ప్రవాహం
● అలరించిన నిర్విరామ సినీ సంగీత విభావరి ● తెలుగు ఇండియన్ ఐడల్స్ అద్భుత గానాలాపన ● పద్మశ్రీ డాక్టర్ శివమణికి ఘంటసాల స్మారక విశిష్ట పురస్కారం విజయనగరం టౌన్: శతాబ్దిగాయకుడు పద్మశ్రీ ఘంటసాల 103వ జయంతిని పురస్కరించుకుని స్థానిక ఆనందగజపతి కళాక్షేత్రంలో ఘంటసాలకు 12 గంటల నిర్విరామ ఘంటసాల స్వరాభిషేకం వేడుకగా నిర్వహించారు. వర్ధమాన గాయనీగాయకులు ఆలపించిన ఆపాతమధురాలు ఆద్యంతం ఆహూతులను ఆకట్టుకున్నాయి. ఇండియన్ ఐడల్ గాయకులు నజీరుద్దీన్, శిరీష, సౌజన్యలు ఘంటసాల గీతాలాపన చేశారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ కళాకారులు అద్భుతమైన పాటలతో ఆకట్టుకున్నారు. భారతమాతకు జేజేలు అంటూ చిన్నారులు పాడుతూ చూపరుల కరతాళ ధ్వనులందుకున్నారు. చిన్నారులే సంగీత పరికరాలను వినియోగిస్తూ, నటన కౌశల్యాన్ని ప్రదర్శిస్తూ చేసిన ప్రదర్శన ఆద్యంతం అలరించింది. ఘంటసాల స్మారక కళాపీఠం వ్యవస్ధాపకుడు ఎం.భీష్మారావును చిన్నారుల తల్లిదండ్రులు దుశ్సాలువతో ఘనంగా సత్కరించారు. తనవద్దనున్న సంగీత వాయిద్యపరికరం వాయిస్తూనే సంగీత మాంత్రికుడు పద్మశ్రీ డాక్టర్ శివమణి స్టేజిపైకి వచ్చి చూపరులను అలరించారు. తన శిష్యుడు భీష్మారావు కుమారులు సాయి,పవన్లతో కలిసి సంగీత స్వరఝురి మధురిమలను ప్రదర్శించి విజయనగరవాసులను కట్టిపడేశారు. విభిన్నరకాల సంగీత పరికరాలను శివమణి తనదైనౖశైలిలో వాయిస్తూ పవన్తో కలిసి డప్పు వాయిద్య ప్రదర్శనకు ఆడిటోరియంలో ప్రేక్షకులు నిలబడి కరతాళధ్వనులందించి, ఆద్యంతం ఆస్వాదించారు. ఈ సందర్భంగా విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ 1909లో మా పూర్వీకులు సంగీత కళాశాలను స్ధాపించారని, అదే కళాశాల నుంచి ఎందరో మహానుభావులు ప్రపంచ వ్యాప్తంగా విజయనగర ఖ్యాతిని వ్యాప్తి చేశారన్నారు. అందులో ఒకరు ఘంటసాల అని గుర్తుచేశారు. నగర డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ ఘంటసాల స్మారక కళాపీఠం 35 ఏళ్లుగా నిర్విరామ కృషిచేస్తోందన్నారు. ఘంటసాల జయంతి సందర్భంగా శివమణిని సత్కరించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో కళాపీఠం ప్రతినిధులు దుర్వాసుల రాజేంద్రప్రసాద్, ధవళసర్వేశ్వరరావు, ఈఆర్ సోమయాజులు, మేకా అనంతలక్ష్మి, డాక్టర్ జి.సన్యాసమ్మ, డాక్టర్ ఎం.వెంకటేశ్వరరావు, డాక్టర్ ఎ.గోపాలరావు, మారుతీ శ్రీనివాస్, కాపుగంటి ప్రకాష్, అధిక సంఖ్యలో కళాకారులు, అభిమానులు పాల్గొన్నారు. శివమణికి ఘంటసాల స్మారక విశిష్ట పురస్కారం ప్రపంచ ప్రసిద్ధ పెర్కషన్ మాస్ట్రో, పద్మశ్రీ డాక్టర్ శివమణికి ఘంటసాల స్మారక విశిష్ట పురస్కారాన్ని ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల శ్రావణిల చేతుల మీదుగా అందజేసి పెద్దలు గజమాలతో ఘనంగా సత్కరించారు. సువర్ణ కంకణం, ప్రశంసాపత్రం, జ్ఞాపిక, దుశ్సాలువ, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. -
వైభవంగా సహస్ర దీపారాధన
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో సహస్ర దీపారాధన కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శుక్రవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. వేకువజామున స్వామికి ప్రాతః కాలార్చన పూజలనంతరం యాగశాలలో విశేష హోమాలు నిర్వహించారు. అనంతరం వెండి మంటపం వద్ద సీతారాముల నిత్యకల్యాణ మహోత్సవాన్ని వేడుకగా జరిపించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయంత్రం స్వామివారి విగ్రహాలను ఊరేగింపుగా దీపారాధన మంటపం వద్దకు తీసుకువెళ్లి అక్కడున్న ప్రత్యేక ఊయలలో ఆశీనులు చేశారు. అనంతరం సహస్ర దీపాలను వెలిగించి దీపాల కాంతుల శోభలో స్వామికి ఊంజల్ సేవ జరిపించారు. -
ఆరోగ్యశ్రీకి తూట్లు..!
● ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) పథకం పేరు చెరిపివేసే కుట్ర..! ● బీమా కంపెనీకి అప్పగించేందుకు సిద్ధమవుతున్న చంద్రబాబు సర్కారు ● దీనికోసం జీఓ 162 జారీ ● సిబ్బంది ఉద్యోగాలకు భద్రత కరువు ● బీమా కంపెనీ తరఫున అందించే వైద్య పరిమితి ఏడాదికి రూ.2.50 లక్షలే.. ● వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ ఏడాదికి రూ.25 లక్షల వరకు వైద్యం ● జిల్లాలో ఆరోగ్యశ్రీ కార్డులు 5,47 లక్షలు విజయనగరం ఫోర్ట్: చంద్రబాబు సర్కారు ఒక్కోపథకాన్ని అటకెక్కించేందుకు పూనుకుంది. ఇప్పటికే ఊరు/వార్డు ప్రజలకు సేవలందించే వలంటీర్ వ్యవస్థకు మంగళం పాడేసింది. ఎండీయూ వ్యవస్థను రద్దుచేసి నిరుద్యోగులకు ఉపాధిని దూరం చేసింది. రైతన్నను ఆదుకునే ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తేసింది. ఫ్యామిలీ డాక్టర్ సేవలను నిర్వీర్యం చేస్తోంది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పేరును చెరిపేసి.. పేద, మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పించే పథకానికి తూట్లు పొడిచేందుకు సిద్ధమైంది. వైద్య ఖర్చులను పరిమితం చేస్తూ... పథక నిర్వహణను బీమా కంపెనీకు అప్పగించేందుకు జీఓ 162ను జారీ చేసింది. దీనిపై పేద, మధ్యతరగతి ప్రజలు భగ్గుమంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం తీరును దుయ్యబడుతున్నారు. ఇదెక్కడి అన్యాయం బాబూ.. ఆరోగ్యశ్రీ పథకం నిర్వహణ బాధ్యతలను బీమా కంపెనీకి అప్పగించేందుకు చంద్రబాబు సర్కారు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు జీఓ 162ను కూడా జారీ చేసింది. హైబ్రిడ్ మోడ్లో అమలు చేసేందుకు బీమా కంపెనీకి అప్పగించనున్నారు. బీమా కంపెనీ ద్వారా ఏడాదికి కేవలం రూ.2.50లక్షల విలువైన వైద్యసేవలనే అందిస్తారు. వైఎస్సార్ సీపీ ప్రభు త్వం ఆరోగ్యశ్రీ కార్డు కల్గిన వారికి ఏడాదికి రూ.25 లక్షల వరకు వైద్యం చేయించుకునే అవకాశం కల్పించింది. జిల్లాలో ఆరోగ్యశ్రీ కార్డులు కలిగి ఉన్న 5.44 లక్షల మందికి ఈ సేవలు అందుబాటులో ఉండేవి. ఇప్పుడు బీమా కంపెనీ ద్వారా కేవలం రూ.2.50 లక్షల విలువైన వైద్యం అందించేందుకు పరిమితం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగులకు భద్రత కరువు... ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్య సేవ) ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కరువు అయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో ఆరోగ్య మిత్రలు, టీమ్ లీడర్లు, డేటాఎంట్రీ ఆపరేటర్లు, జిల్లా మేనేజర్, జిల్లా కో ఆర్డినేటర్లు పనిచేస్తున్నారు. అయితే, ఆరోగ్య మిత్రలను మాత్రమే బీమా కంపెనీ తీసుకుంటుందని సమాచారం. మిగతా సిబ్బంది అంశంపై స్పష్టత ఇవ్వకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. 10 ప్రభుత్వాస్పత్రులు, 26 ప్రైవేటు నెట్వర్క్ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న సిబ్బంది ఆందోళనకు సిద్ధమవుతున్నారు. నాడు ఘనం.. ఆరోగ్యశ్రీ పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికీ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరెడ్డి గుర్తుకు వస్తారు. అంతలా దేశ వ్యాప్తంగా పథకానికి గుర్తింపు వచ్చింది. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే చాలు కార్పొరేట్ ఆస్పత్రులు సైతం పిలిచి మరీ వైద్యం చేసేవి. వైఎస్సార్ తనయుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు సమర్ధవంతంగా నిర్వహించారు. ఆరోగ్యశ్రీ పథకం కింద శస్త్రచికిత్స చేసుకున్న రోగులకు ఆరోగ్య ఆసరా పేరిట చికిత్స అనంతరం కోలుకునేందుకు వీలుగా భృతిని కూడా ఇచ్చారు. రోగి డిశ్చార్జ్ అయిన 48 గంటలలోగా రోగి బ్యాంకు ఖాతాకు డబ్బులు జమచేసేవారు. ప్రస్తుతం ఆరోగ్య ఆసరా అందడం లేదు. ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) సేవలు కూడా మృగ్యంగా మారాయి. ఆస్పత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో సేవలందడంలో జాప్యం జరుగుతోంది. -
క్షణికావేశం.. కన్నవారికి శోకం
గత నెల 29న కొమరాడ మండలం మాదలింగి గ్రామంలో తల్లిదండ్రులు ఉద్యోగానికి వెళ్లమని మందలించారన్న చిన్న కారణానికి 27ఏళ్ల బి.మధుసూదనరావు అనే యువకుడు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడి తనువు చాలించాడు. భవిష్యత్లో ఉన్నత స్థాయికి వెళ్లాల్సిన యువకుడు చిన్న మందలింపునకే ఆయువు తీసుకోవడం తల్లిదండ్రులకు తీరని కడుపుకోతను మిగిల్చింది. కన్నవారికి శోకం● మందలిస్తే మరణమేనా? ● ఓర్పులేని తనం..బలవుతున్న జీవనం ● చిన్నపాటి మనస్తాపాలకే బలవన్మరణాలు ● ఆందోళన కలిగిస్తున్న వరుస విషాదాలు పెంపకమే పునాది... సంభాషణే పరిష్కారం పిల్లలకు చిన్న నాటి నుంచే మంచి, చెడుల విచక్షణ నేర్పాలి. కోరినవన్నీ ఇవ్వడమే ప్రేమ అనుకోకూడదు. ఆ కోరికల వెనుక ఉన్న పర్యవసానాలను వారికి అర్థమయ్యేలా వివరించాలి. చిన్ననాటి నుంచి గారాబం చేసి పెద్దయ్యాక ఒక్కసారిగా వారిపై ఆంక్షలు విధిస్తే తట్టుకోలేరు. యవ్వనంలో వారిని మందలించడం కంటే మిత్రుడుగా మారి సమస్యను విశ్లేషించి నచ్చజెప్పాలి. వారి ఆసక్తులను గౌరవిస్తూనే అవి ఉన్నత భవిష్యత్కు ఏ విధమైన బాటలు వేస్తాయో నచ్చజెప్పాలి. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేలా ప్రోత్సహించాలి. యువత కష్టమొస్తే కుమిలిపోకూడదు. తల్లిదండ్రులతో మనస్సు విప్పి మాట్లాడాలి. వారి అనుభవం, ప్రేమ ఏ సమస్యకై నా పరిష్కారం చూపుతాయని గుర్తించాలి. – రష్మిత, మానసిక వైద్య నిపుణురాలుయువకుడి ఆత్మహత్యవిజయనగరం క్రైమ్: పట్టణంలోని దాసన్నపేటలో గొల్లవీధికి చెందిన కోరాడ వీరేంద్ర (25) ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. వీరేంద్ర మూడేళ్ల నుంచి నగరానికి చెందిన దుర్గ అనే అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడుస్తోంది.పెళ్లి చేసుకుందామని ఇద్దరూ నిర్ణయించుకుని ప్రేమ వ్యవహారం ఇరుకుటుంబాల పెద్దలకు తెలియచెప్పారు. ప్రస్తుతం పెళ్లిముహూర్తాలు లేవని, మూడు నెలలు ఆగాలని వీరేంద్ర తరఫున అమ్మానాన్నలు అమ్మాయి కన్నవారికి చెప్పి మిన్నకున్నారు. అయితే అమ్మాయి మాత్రం అత్యవసరంగా తన మెడలో తా ళి కట్టాలని వీరంద్రపై ఒత్తిడి చేసింది. ముహూర్తాలు లేకపోయినా, పెళ్లి చేసుకోవాలని ప్రేమించిన యు వతి ఒత్తిడి చేయడంతో ఇంట్లో చెప్పలేక వీరేంద్ర తీవ్ర ఘర్షణ పడ్డాడు. ఆపై మనో వేదన చెందాడు. కొడుకు మనోవ్యథను కళ్లారా చూసిన వీరంద్ర తల్లిదండ్రులు మీ ఇద్దరి పెళ్లి సింహాచలంలో చేస్తామని ఆగాలని తొందర పడొద్దని నచ్చజెప్పారు. కానీ అంతలోనే ఏమైందో ఏమో గానీ శుక్రవారం ఉదయాన్నే తన ఇంట్లోని మేడపైకి వెళ్లిన వీరేంద్ర ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సమాచారం తెలుసుకున్న టూటౌన్ సీఐ టి.శ్రీనివాసరా వు, ఎస్సై కనకరాజు లు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీ లించారు. కన్నవారు, స్థానికుల నుంచి వివరాలు తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ శ్రీనివాస్ చెప్పారు.పార్వతీపురం రూరల్: జీవితం ఒక యుద్ధం..పోరాడి గెలవాలి. కానీ నేటి యువత ఆయుధం చేతపట్టకముందే చేతులెత్తేస్తోంది. సమస్య ఎదురైతే పరిష్కారం వెతకాల్సిందిపోయి ప్రాణం తీసుకోవడమే పరమావధిగా భావిస్తోంది. ‘ఛీ’ అంటే చిన్నబుచ్చుకోవడం ‘వద్దు’ అంటే విగతజీవిగా మారడం నేటి యువతకు పరిపాటిగా మారింది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబకలహాలు, ప్రేమ వ్యవహారాలు ఇలా కారణమేదైనా పర్యవసానం మాత్రం మరణంగానే మారుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఉద్వేగమే ఉరితాడై.. నేటితరం ఉద్వేగాలను అదుపులో ఉంచుకోలేకపోతోంది. క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు నిండు నూరేళ్ల జీవితాన్ని సమాధి చేస్తున్నాయి. ప్రేమలో ప్రమాద ఘంటికలు ప్రేమంటే రెండు మనస్సుల కలయిక మాత్రమే కాదు. బాధ్యత కూడా అని మరిచిపోతున్నారు. ● గతేడాది ఆగస్టు నెలలో పాచిపెంటలో జరిగిన ఘటన ప్రేమికుల అనాలోచిత నిర్ణయాలకు ఆద్దం పట్టింది. ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరగలేదన్న బాధతో ఓ యువతి ఆత్మహత్య చేసుకోగా అక్క మృతిచెందిన ఆలోచనను తట్టుకోలేక ఆమె చెల్లెలు కూడా బలవన్మారణానికి పాల్పడడం స్థానికులను కంటతడిపెట్టించింది. ● అలాగే ఈ ఏడాది ఏప్రిల్లో సాలూరు పరిధిలో వెలుగు చూసిన ఘటన ప్రేమ ముసుగులో జరిగిన ఘాతుకాన్ని బయటపెట్టింది. పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసిన పాపానికి ప్రియరాలిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రియుడు ప్రయత్నించడం సభ్య సమాజాన్ని ఉలికిపాటుకు గురిచేసింది. మానిసిక స్థైర్యమే రక్ష జీవితంలో ఎత్తు, పల్లాలు సహజం. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా కుటుంబసభ్యులతో పంచుకుంటే పరిష్కారం లభిస్తుంది. ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదు. అది పలాయనవాదం. తల్లిదండ్రులు కూడా పిల్లలతో స్నేహ పూర్వకంగా చిన్న నాటి నుంచే వారితో మెలుగుతూ, వారిలో మానసిక స్థైర్యాన్ని నింపాల్సిన అవసరం ఎంతైనా ఉందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. -
వృద్ధుడి అదృశ్యం
విజయనగరం క్రైమ్: విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 75 ఏళ్ల వృద్ధుడు కనిపించడం లేదని పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు అందింది. వృద్ధుడు లెక్కల అప్పారావు గత నెల 29వ తేదీన చెల్లూరు సమీపంలో ఉన్న ఇంటి నుంచి వెళ్లిపోయాడని కొడుకు రామకృష్ణ ఫిర్యాదు చేశాడు. అదే రోజు ఉదయం 10.15గంటలకు ఇంటి నుంచి సమీప షాపుకు వవెళ్లిన అప్పారావు మధ్యాహ్నం 1గంట అయినా ఇంటికి రాలేదు. అప్పటి నుంచి స్థానికులతో పాటు చుట్టు పక్కల వారిని వాకబు చేసినప్పటికీ అప్పారావు జాడ తెలియరాలేదు. తన తండ్రి అప్పారావు కనిపించలేదంటూ కొడుకు రామకృష్ణ ఫిర్యాదు చేశాడని కేసు కట్టి నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని ఎస్సై అశోక్ తెలిపారు.బస్సు, బైక్ ఢీకొని ద్విచక్రవాహనదారు మృతిసీతానగరం: మండలంలోని ప్రధాన రహదారిపై గుచ్చిమి వద్ద శుక్రవారం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.విజయనగరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు పార్వతీపురం నుంచి సీతానగరం మీదుగా విజయనగరం వస్తుండగా సీతానగరం నుంచి పార్వతీపురం మధ్యలో బస్సు గుచ్చిమి బస్టాప్ వద్ద ఆగింది.ఆగి ఉన్న బస్సును మోటార్ సైకిలిస్ట్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ప్రమాదం జరిగిందని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఏఎస్సై లక్ష్మణరావు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడిని గుర్తించడానికి మోటార్సైకిల్లో ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో గుర్తించలేకపోయామని తెలియజేశారు. హోండాషైన్ మోటార్ సైకిల్ (ఎపి35ఎసి2190 నంబర్) బస్సు ఫ్రంట్వీలును చుట్టుకోవడంతో బైక్ నుజ్జునుజ్జు అయింది. ఈ వివరాలు తెలిసిన వారు పోలీస్ స్టేషన్ ను సంప్రదించాలని కోరారు. విద్యుత్ షాక్తో వ్యక్తి మృతిగజపతినగరం: గంట్యాడ మండలం బుడతనాపల్లి గ్రామానికి చెందిన కొర్నాన అప్పలనాయుడు(30) అనే వ్యక్తి గజపతినగరం మండలంలోని పురిటిపెంట గ్రామ సమీపంలో విద్యుత్ వైర్లు తగిలి షాక్ కొట్టి మృతిచెందినట్లు ఎస్సై కె.కిరణ్ కుమార్ నాయుడు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మట్లాడుతూ కొర్నాన అప్పలనాయుడు గజపతినగరం మండలం పురిటి పెంట గ్రామ సమీపంలో ఇసుక లోడు పట్టిన అనంతరం ట్రాక్టర్ పైకి ఎక్కి ఇసుకను సర్దుతుండగా దగ్గరలో ఉన్న విద్యుత్ వైర్లు తగిలి గురువారం రాత్రి చనిపోయినట్లు మృతుడి తండ్రి మల్లయ్య చెప్పాడన్నారు.ఈ విషయంపై శుక్రవారం మల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిరణ్ కుమార్ నాయుడు తెలిపారు. -
ఇది అంతం కాదు.. ఆరంభం..
విజయనగరం: పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల ఆరోగ్యమే పరమావధిగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాలు చేపడితే, వాటిని కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమంటూ విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ బాధ్యత గల ప్రతిపక్షంగా చేస్తున్న పోరాటం అంతం కాదని, ఆరంభం మాత్రమేనని స్పష్టంచేశారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకునేంత వరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న భయంతోనే చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణకు పూనుకుందన్నారు. ధర్మపురిలోని సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమం తుది దశకు చేరుకుందని చెప్పారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రతి నియోజకవర్గం నుంచి 50 వేల నుంచి 70వేల వరకు సంతకాలు సేకరణ జరిగిందన్నారు. గ్రామాలు, వార్డుల్లో ఇంటింటికీ వెళ్లి సంతకాలు సేకరించిన పార్టీ శ్రేణులను ఆయన అభినందించారు. సేకరించిన సంతకాలను ఈ నెల 16న రాష్ట్ర గవర్నర్కు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అందజేస్తామన్నారు. ప్రజా సమస్యలను పట్టించుకోని సర్కారు 2024 ఎన్నికలు అనంతరం అధికార పగ్గాలు చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టడం లేదని, వెలుగులోకి వస్తున్న సమస్యలను తమ అనుకూల మీడియాతో తప్పుడు ప్రచారాలు చేయించి ప్రజలను మోసగించే ప్రయత్నం చేయడం దారుణమని జెడ్పీ చైర్మన్ అన్నారు. వలంటీర్, ఎండీయూ వ్యవస్థను రద్దు చేసిందన్నారు. అంగన్వాడీ నిర్వహణ పూర్తిగా గాడితప్పిందన్నారు. రైతుల కష్టాలు పట్టించుకోవడంలేదని వాపోయారు. అన్నదాత సుఖీభవ అర్హులందరికీ అందని ద్రాక్షగా మారిందన్నారు. గడిచిన రెండేళ్లలో రూ.40వేలు ఇవ్వాల్సి ఉండగా... కేవలం రూ.10వేలు ఇచ్చి చేతులు దులుపుకుందని మండిపడ్డారు. పంట కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ప్రభుత్వ అలసత్వం రైతులకు శాపంగా మారిందన్నారు. స్వయానా జిల్లా ఇన్చార్జి మంత్రి అనిత ఖరీఫ్ ధాన్యం కొనుగోలులో 5 కేజీలు అదనంగా తీసుకుంటున్నారంటూ నేరుగా ఫిర్యాదు అందినట్టు చెప్పడం ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ లోపాన్ని ఎత్తిచూపుతోందన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్బాబు, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు కె.వి.సూర్యనారాయణరాజు, నెక్కల నాయుడుబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శులు అల్లాడ సత్యనారాయణమూర్తి, గొర్లె రవికుమార్, పార్టీ జిల్లా పార్లమెంటరీ పరిశీలకుడు కిల్లి సత్యనారాయణ, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు పాండ్రంకి సంజీవరాజు, భోగాపురం మండల పార్టీ అధ్యక్షుడు ఉప్పాడ సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. 10న నియోజకవర్గం... 13న జిల్లా స్థాయిలో.... ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రక్రియ ఈనెల 10న నియోజకవర్గ స్థాయిలో, 13న జిల్లా స్థాయిలో ముగుస్తుందని జెడ్పీ చైర్మన్ తెలిపారు. గ్రామ, మండల స్థాయిలో సేకరించిన సంతకాల పత్రాలను ఈ నెల 7,8 తేదీల్లో నియోజకవర్గ సమన్వయకర్తలకు అందజేయాలని సూచించారు. 13న సంతకాల పత్రాలతో జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని, ఇందులో నియోజకవర్గ సమన్వయకర్తలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేకవిధానాలపై బాధ్యత గల ప్రతిపక్షంగా నిలదీస్తాం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విరమించుకునేంతవరకు పోరాటం సేకరించిన కోటి సంతకాలు ఈ 16న గవర్నర్కు అందజేత 10వ తేదీ నాటికి నియోజకవర స్థాయిలో కార్యక్రమం ముగింపు 13న జిల్లాస్థాయిలో కోటి సంతకాల సేకరణ ముగింపు అదే రోజున ప్రజల భాగస్వామ్యంతో జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు -
రైతు నడ్డి విరిచారు..
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులను భ్రమలో పెట్టి మోసం చేస్తూ వస్తోంది. మోంథా తుఫాన్ పంట లను ముంచేసినా రూపాయి పరిహారం అందించలేదు. ఇంత దారుణం ఎన్నడూ చూడలేదు. పంట సాగుచేయాలంటనే భయం వేస్తోంది. – పడాల గజపతి, భూదేవిపేట, గజపతినగరం మండలం పత్తిరైతు చిత్తు గజపతినగరం మండలం తమ్మారాయుడు పేట, ఎం. గుమడాం గ్రామాల్లో సుమా రు 350 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశాం. మొంథా తుఫాన్ వర్షాలకు పంటంతా తడిసి ముద్దయింది. ఇప్పటివరకు ఏ ఒక్క రైతుకు పైసా సాయం అందలేదు. కష్టాల్లో ఉన్న రైతును ఆదుకోకుండా ‘రైతన్నా మీ కోసం’ అంటూ ఏదో ఉద్దరిస్తామంటూ కల్లబొల్లి కార్యక్రమాలతో కాలక్షేపం చేయడం చంద్రబాబు ప్రభుత్వానికి తగదు. – ధనాన రామునాయుడు, తమ్మారాయుడు పేట, గజపతినగరం మండలం -
డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
విజయనగరం క్రైమ్: విజయనగరంలోని శంకరమఠం వద్ద ఉన్న బీసీ సంక్షేమ హాస్టల్లో గురువారం ఓ డిగ్రీ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. నగరంలోని ఎంఆర్ కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న కె.స్వాతి(17) ఆత్మహత్య సంఘటనపై సహచర విద్యార్థినులు, హాస్టల్ వార్డెన్, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా గార మండలానికి చెందిన స్వాతి విజయనగరంలోని శంకరమఠం వద్ద ఉన్న బీసీ సంక్షేమ శాఖ బాలికల హాస్టల్లో ఉంటూ డిగ్రీ చదువుతోంది. కొద్దిరోజుల క్రితం తనసొంతూరుకు వెళ్లి మూడురోజుల క్రితం వచ్చింది. వచ్చిన దగ్గర నుంచి ఎవరితోనూ మాట్లాడక పోవడం, నెమ్మదిగా ఉండడం చూసి సహచర విద్యార్థినులు కాస్త ఆందోళన చెందారు. కాలేజీకి వెళ్తూ వస్తోందే తప్ప ఎవరితోనూ మాట్లాడలేదు సహచర విద్యార్థిని మానసిక స్థితి చూసి తోటి విద్యార్థినులు వార్డెన్తో చెప్పి ఆస్పత్రికి తీసుకు వెళ్లమని సూచించారు. ఈ నేపథ్యంలో రూమ్లో తన వద్ద ఉన్న డైరీలో ఒక పేజీని చింపి అమ్మా.. నాన్న..నాకు బతకాలని లేదు.. నేను ఏ తప్పూ చేయలేదు. ఎందుకో నాకు భయమేస్తోంది. నేను బతకలేను’ అంటూ సూసైడ్ నోటు రాసి హాస్టల్లోనే తాను ఉంటున్న రూమ్లో చున్నీతో ఫ్యాన్కు ఉరివేసుకుని తనువు చాలించింది. మధ్యాహ్నం భోజనానికి తోటి విద్యార్థినులు ఎంత పిలిచినా రాకపోవడంతో గట్టిగా తలుపు తట్టారు. దీంతో ఫ్యాన్కు వేలాడుతూ స్వాతి కనిపించడంతో హుటాహుటిన హాస్టల్ వార్డెన్కు చెప్పి స్వాతిని కిందికి దించారు. అప్పటికే ఆమె మృతి చెందింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో టూటౌన్ సీఐ టి.శ్రీనివాసరావు, ఎస్సై కనకరాజు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అలాగే ఎఫ్ఎస్ఎల్ బృందాన్ని పిలిచి ప్రింగర్ ప్రింట్స్ తీయించారు. వార్డెన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్థిక సాయం అందలేదు..
నా పేరు దివిలి శ్రీను. మాది మెంటాడ మండలం లోతుగెడ్డ. నేను రెండు ఎకరాల భూమి కౌలుకు చేస్తున్నాను. నాకు కౌలు కార్డు కూడా ఉంది. చంద్రబాబు ప్రభుత్వం నాకు అన్నదాత సుభీభవ సాయం అందించలేదు. యూరియా కోసం కూడ తీవ్ర ఇబ్బంది పడ్డాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పడు మాకు రైతు భరోసా అందేది. రైతును ఆదుకోని ప్రభుత్వం ఇప్పుడు రైతన్న కోసం అంటూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం నవ్వుతెప్పిస్తోంది. అధికారులు గ్రామానికి వస్తే నిలదీస్తాను. రైతన్నకు గడ్డు పరిస్థితి నా పేరు ఎ. శ్రీరామ్మూర్తి. మాది మెంటాడ మండలం. నేను రెండు రెండున్నర ఎకరాలు భూమి కౌలుకు చేస్తున్నాను. నాకు అన్నదాత సుభీభవ సాయం అందలేదు. ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తేశారు. దీనివల్ల బీమా ప్రీమియం చెల్లించుకోలేక కట్టలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పడు ప్రభుత్వమే పంటల బీమా ప్రీమియం చెల్లించేది. విపత్తుల సమయంలో ఆర్థికంగా ఉపశమనం లభించేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. రైతన్నకు గడ్డు పరిస్థితి. -
గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు ఇంటర్వ్యూలు
నెల్లిమర్ల: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని ప్రిన్సిపాల్ రేఖ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. బోటనీ, మ్యాథ్స్ సబ్జెక్టులకు సంబంధించి సీనియర్ లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఎమ్మెస్సీలో 55 శాతం మార్కులు పొంది, పీహెచ్డీ, నెట్క్వాలిఫై అయిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 8వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు కళాశాలలో నిర్వహించే ఇంటర్వ్యూకు నేరుగా హాజరుకావాలని కోరారు. డీఎల్డీఓ కార్యాలయం ప్రారంభం విజయనగరం రూరల్: స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో జెడ్పీ నిధులు రూ.14.95 లక్షల వ్యయంతో నిర్మించిన డివిజనల్ అభివృద్ధి అధికారి (డీఎల్డీఓ) కార్యాలయాన్ని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు గురువారం ప్రారంభించారు. అలాగే, బొబ్బిలి, చీపురుపల్లి డివిజన్ల పరిధిలోని డీఎల్డీఓ కార్యాలయాలను సైతం వర్చువల్గా కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి జిల్లా ఇన్చార్జ్ మంత్రి వంగలపూడి అనిత, ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జెడ్పీ చైర్మన్ ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్, జాయింట్ కలెక్టర్తో పాటు జెడ్పీ సీఈఓ బి.వి.సత్యనారాయణ, డీఎల్డీఓ రోజారాణి, జీఎస్డబ్ల్యూఎస్ సిబ్బంది పాల్గొన్నారు. అన్ని పంచాయతీల్లోనూ జనసేన పోటీ దత్తిరాజేరు: వచ్చే ఏడాది జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని పంచాయతీల్లోనూ జనసేన పార్టీ పోటీ చేస్తుందని, అభ్యర్థులు సన్న ద్ధం కావాలని గజపతినగరం నియోజకవర్గం ఇన్చార్జి మర్రాపు సురేష్ పిలుపునిచ్చారు. మాజీ మంత్రి పడాల అరుణ, పార్టీ ఉమ్మడి విజయనగరం జిల్లా కార్యనిర్వాహక సభ్యుడు మామిడి దుర్గాప్రసాద్, మండలాధ్యక్షుడు చప్ప అప్పారావుతో కలిసి కోమటిపల్లి పెట్రోల్ బంక్ సమీపంలోని కల్యాణమంటపంలో గురు వారం నిర్వహించిన ఆత్మీయ కలయిక సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ కార్యకర్తలు కలిసికట్టుగా వెళ్లాలన్నారు. టీడీపీ నాయకుల వేధింపులు, అవమానాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. అలిగితే నష్టపోయేది మనమే.. ● పార్టీ శ్రేణులకు లోకేశ్ సూచన సాక్షి, పార్వతీపురం మన్యం: టీడీపీలో వ్యక్తులు శాశ్వతం కాదు, పార్టీ శాశ్వతమని పార్టీ జాతీ య ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. భామినిలో పార్టీ శ్రేణులనుద్దేశించి ఆయన గురువారం మాట్లాడారు. అలిగి ఇంట్లో పడుకుంటే నష్టపోయేది మనమేనని, గ్రూపు రాజకీయాలకు ఫుల్స్టాప్ పెట్టాలని సూచించారు. ప్రతి పనికి లోకేశ్, ఎమ్మెల్యే ఫోన్ చేయాలంటే కుదరదు. ఈ విషయంలో ఇన్చార్జి మంత్రి అచ్చెన్న కలెక్టర్, ఎస్పీలకు ఆదేశాలివ్వాలి అంటూ లోకేశ్ చెప్పడం గమనార్హం. -
పీఏసీఎస్ ఉద్యోగుల ఆందోళన ముమ్మరం
● ఈ నెల 6 నుంచి రాష్ట్రవ్యాప్త నిరసనలువిజయనగరం అర్బన్: రైతుల అభివృద్ధికి గత 40 ఏళ్లుగా కృషి చేస్తున్న పీఏసీఎస్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని పీఏసీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. సమస్యలు పరిష్కారం కాకపోతే ఈ నెల 6 నుంచి దశలవారీగా రాష్ట్రవ్యాప్త ఉద్యమాలకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గురువారం స్థానిక అమర్ భవన్లో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యారావు, ప్రధాన కర్యాదర్శి బి.రామునాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన అసోసియేషన్ జిల్లా గౌవర అధ్యక్షుడు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.కామేశ్వరరావు మాట్లాడారు. రైతుల కోసం జీవితాంతం కష్టపడుతున్న పీఏసీఎస్ ఉద్యోగులకు న్యాయం జరిగేలా వెంటనే జీఓ నంబర్ 36 అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న మధ్యంతర భృతి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డీసీసీబీ పరిధిలోని 95 పీఏసీఎస్లలో పనిచేస్తున్న 300 మంది ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలని కోరారు. ప్రతి ఉద్యోగికి కనీసం రూ.5 లక్షల ఆరోగ్య బీమా, రూ.20 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్, 2019 తర్వాత చేరిన వారిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ వేధింపులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. దశలవారీ ఆందోళన షెడ్యూల్ను విడుదల చేశారు. ఈనెల 6న నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు, 8న రాష్ట్రవ్యాప్తంగా డీసీసీబీ కార్యాలయాల వద్ద ధర్నా, 16న అన్ని జిల్లా సహకార కార్యాలయాల వద్ద ధర్నా, వినతి పత్రం సమర్పణ, 22న డీసీసీబీ ప్రధాన కార్యాలయాల వద్ద ధర్నా, 29న విజయవాడ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా, జనవరి 5న విజయవాడలో 26 జిల్లాల ఉద్యోగులతో రిలే నిరాహార దీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. అనంతరం విప్లవ నినాదాలు చేశారు. సమావేశంలో డిప్యూటీ జనరల్ సెక్రటరీ డి.నారాయణరావు, ట్రెజరర్ ఏవీ సత్యనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ.గిరిబాబు, ఆర్వీనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు
విజయనగరం క్రైమ్: స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 23వ తేదీన జరిగిన దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించి రూరల్ పోలీస్ స్టేషన్లో సీఐ లక్ష్మణరావు, ఎస్సై అశోక్లు గురువారం వివరాలు వెల్లడించారు. విశాఖకు చెందిన కోస్టుగార్డ్ మహేష్ కుమార్ తన ఫ్రెండ్ను కలవడానికి విజయనగరంలోని డెంకాడ వచ్చారు. కలిసిన అనంతరం స్కూటీపై డెంకాడ నుంచి రామనారాయణం వెళ్తుండగా పడాలపేట వద్ద కొంతమంది వ్యక్తులు కారులో వచ్చి మహేష్ కుమార్ను అడ్డగించారు. తాము డీఎస్పీ సిబ్బంది అంటూ మహేష్కుమార్ను అడ్డగించి కారులో ఎక్కించి కొంతదూరం తీసుకువెళ్లి చిత్రహింసలు పెట్టి మెడలో ఉన్న చైన్, ఉంగరం, రూ.10వేలు నగదు తీసుకుని ఖాళీ పేపర్పై సంతకాలు పెట్టించి రూ.20లక్షలు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారు. ఎలాగోలా వారి నుంచి మహేష్కుమార్ తప్పించుకుని రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈనెల 3వ తేదీన చెల్లూరు బైపాస్ రోడ్డులో కేవీఆర్ లే అవుట్ వద్ద కిలపర్తి నాగంనాయుడు(38), కొన్న రామకృష్ణ(43) బొడ్డ పరమేష్(26) నేలతేటి చిరంజీవి(25)లను అరెస్టు చేశారు. నిందితుల్లో ముగ్గురు విజయనగరంలోని కుమ్మరివీధి, కొత్తపేట, గాజులరేగకు చెందిన వారు కాగా చిరంజీవి విశాఖలోని ఎంవీపీ కాలనీకి చెందిన వాడుగా సీఐ తెలిపారు. నిందితుల నుంచి మూడు కార్లు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. -
సమస్యలు అవే... సమీక్ష తీరూ అదే..
విజయనగరం అర్బన్: కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమావేశం (డీఆర్సీ)లోనూ గత సమావేశంలో ప్రస్తావించిన అంశాలపైనే సమీక్షించారు. అభివృద్ధి, సంక్షేమంలో లోపాలు, అధికారుల నిర్లక్ష్యం, శాఖల మధ్య సమన్వయలోపం, రెవెన్యూ శాఖలో అవినీతి, వ్యవసాయ సంక్షోభం వంటి అంశాలు చర్చకు వచ్చాయి. కాసేపు సభ్యుల వాదోపవాదాలతో పాలనా వైఫల్యాలు కొట్టుచ్చినట్టు కనిపించాయి. జిల్లా ఇన్చార్జి మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన జరిగిన సమీక్షలో రైతులను దోచుకునే మిల్లర్లు, అవినీతిలో మునిగిన రెవెన్యూ శాఖ, మాతృ–శిశు మరణాలు, పదోతరగతి ఫెయి ల్యూర్ రేటు ప్రధానంగా నిలిచాయి. జిల్లాలోని రైతుల చెరకు ఉత్పత్తులపై వచ్చిన సమీక్షలో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ చెరుకు మద్దతుధర ప్రకటన ముందు రైతులతో సమావేశం ఎందుకు పెట్టలేదని కేన్ అధికారిని నిలదీశారు. గతంలో జాయింట్ కలెక్టర్ సమక్షంలో సమావేశ నిర్వహించి ధరలను రైతులకు తెలియజేసేవారని, ఆ సంప్రదాయం ఇప్పుడు ఎందుకు పాటించలేదని ప్రశ్నించారు. సంకిలి సుగర్ ఫ్యాకరీ నడవాలంటే కనీసం 3 లక్షల మెట్రిక్ టన్నుల చెరకు ఉత్పత్తి అవసరమని, ఆ స్థాయిలో రైతుల సాగు విస్తీర్ణం కోసం వ్యవసాయశాఖ లక్ష్యాలు ఏర్పరచుకోలేదని వ్యాఖ్యానించారు. తోటపల్లి కుడి కాలువ విస్తరణ కోసం గత సమావేశంలో రూ.32 కోట్లతో ప్రతిదానలు చేసినా నిధులు విడుదల కాలేదని, భూసేకరణ పనులు జరగలేదని ప్రస్తావించారు. దీనిపై మంత్రి అనిత స్పందిస్తూ వచ్చే సమావేశానికి పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించారు. ఈ ఏడాది బొబ్బిలి ప్రాంతాల్లో అధిక విస్తీర్ణంలో సాగుచేసిన సంపద స్వర్ణ రకం ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్మన్ అధికారులను కోరారు. మొక్కజొన్న సాగు విస్తీర్ణం, ఉత్పత్తి పెరిగిందని, ఆ మేరకు కొనుగోలు కేంద్రాలను అందుబాటులో ఉంచాలన్నారు. అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల సంఖ్య భారీగా తగ్గుతున్న విషయంపై ప్రభుత్వం దృష్టి పెటాలని విజ్ఞప్తిచేశారు. ● ఎమ్మెల్సీ డాక్టర్ సూర్యనారాయణరాజు (సురేష్బాబు) మాట్లాడుతూ నెల్లిమర్ల ప్రాంతానికి ధాన్యం కొనుగోలు కోసం గోనె సంచలు పంపిణీ కావడం లేదని, దీనివల్ల రైతులు బయట కొనుగోలు చేయాల్సి వస్తోందని సమావేశంలో ప్రస్తావించారు. ● ధాన్యం కొనుగోలులో మిల్లర్ల దందా చేస్తున్నారని, రైతుల నుంచి ఐదు కిలోల వరకు రైతుల నుంచి ధాన్యం దోచుకుంటున్నారని నేరుగా కాల్ సెంటర్కే వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ధాన్యం కొనుగోల వ్యవస్థ నిర్వహణపై ఇన్చార్జ్ మంత్రి సీరియన్ అయ్యారు. మరోసారి ఇలాంటి ఫిర్యాదులు వస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో రెవెన్యూ లో మ్యుటేషన్ల అంశంలో అవినీతి ఎక్కువగా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయని, కింది స్థాయి నుంచి ప్రక్షాళన చేయాలని, ఈ క్రమంలో కలెక్టర్ ఏ చర్యలు తీసుకున్నా పూర్తి మద్దతు ఇస్తామని ప్రకటించారు. సమావేశంలో కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి, జేసీ ఎస్.సేతుమాధవన్, ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు రఘురాజు, కావలి గ్రీష్మ, ఎమ్మెల్యేలు కోండ్రు మురళీమోహన్, బేబేనాయన, లోకం నాగమాధవి, పి.అదితి విజయలక్ష్మి గజపతిరాజు, డీసీసీబీ చైర్మన్ నాగార్జున, బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో ఇన్చార్జి మంత్రి మాట్లాడుతూ జిల్లాలో స్క్రబ్ టైఫస వైరస్ కేసులు లేవని, భయోందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సమావేశంలో పాల్గొన్న జెడ్పీచైర్మన్, ఎమ్మెల్సీలు అధికారుల నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు, శాఖ సమన్వయలోపంపై సభలో ప్రస్తావన అన్నదాత సుఖీభవ పథకం అర్హతల సవరణకు ప్రతిపాదన -
వారంతా భారం కాదు.. మనలో ఓ భాగం
● జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కృష్ణప్రసాద్ విజయనగరం అర్బన్: దివ్యాంగులు సమాజానికి భారం కాదని.. వారూ సమాజంలో అంతర్భాగమని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి డాక్టర్ ఎ.కృష్ణప్రసాద్ అన్నారు. ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయనగం ఆనంద గజపతి ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు, అవసరాలు, హక్కులు, అవకాశాల గురించి సమాజంలో అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. శారీరక, మానసిక పరిమితులున్నప్పటికీ వారి ప్రతిభ, పట్టుదల, నిబద్దత అసాధారణమైందని.. సమాన అవకాశాలు ఇస్తే వారు సాధించే విజయాలు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న సేవలను వివరించారు. అయితే, విరిగిన కుర్చీల మధ్యన కూర్చొనేందుకు విభిన్నప్రతిభావంతులు ఇబ్బందులు పడ్డారు. కార్యక్రమంలో మెప్మా పీడీ జి.వి.చిట్టిరాజు, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ విభిన్న ప్రతిభావంతుల శాఖ ఇన్చార్జి ఎ.డి. డి.వెంకటేశ్వరరావు, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కేఆర్ఎస్ ప్రసాద్, సమగ్ర శిక్ష కోఆర్డినేటర్ సూర్యారావు, బదిరుల ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్.భారతి, తదితరులు పాల్గొన్నారు. -
జగనన్న సీఎం కావాలని...
రేగిడి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ శబరిమలలో అయ్య ప్పకు రేగిడి మండలం లచ్చన్నవలస గ్రామానికి చెందిన అయ్యప్పదీక్ష ధారులు బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. గ్రామానికి చెందిన 20 మంది భక్తులు 41 రోజుల కిందట అయ్యప్పదీక్ష ప్రారంభించారు. దీక్ష ముగియడంతో శబరిమల యాత్రకు వెళ్లిన వీరంతా అక్కడ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ ఆలయానికి చేరుకున్నారు. జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావాలని అయ్యప్పను ప్రార్థించారు. రేపటి నుంచి చెరకు క్రషింగ్ రేగిడి: మండలంలోని సంకిలి ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారంలో ఈ నెల 5 నుంచి చెరకు క్రషింగ్ ప్రారంభించనున్నట్టు యాజమాన్యం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2025–26 సీజన్లో మెట్రిక్ టన్ను చెరకు రూ. 3,360లు మద్దతు ధరగా ప్రకటించామని వెల్లడించింది. గత సంవత్సరం కంటే ఈ ఏడాది టన్నుకు రూ.209లు మద్దతు ధర పెంచినట్టు పేర్కొంది. రైతులకు కటింగ్ ఆర్డర్లు ఇస్తున్నామని తెలిపింది. చెరకు నరికేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తీసుకొచ్చామని వెల్లడించింది. చిన్నారుల మరణాలపై చలించరా మంత్రివర్యా! సాక్షి, పార్వతీపురం మన్యం: ప్రభుత్వం, అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా గడిచిన ఏడాదిన్నర కాలంలోనే జిల్లాలో 16 మంది ఆశ్రమ, ఇతర పాఠశాలల విద్యార్థులు వివిధ అనారోగ్య సమస్యలతో మరణించారు. కొద్దిరోజుల కిందట కురుపాం బాలిక గురుకుల పాఠశాలలో పచ్చకామెర్ల ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. తోయక కల్పన, అంజలి అనే ఇద్దరు విద్యార్థినులు మృతి చెందారు. 200 మందికిపైగా వ్యాధి బారిన పడ్డారు. పాఠశాలలో కలుషిత నీరు, అధ్వాన పారిశుద్ధ్యం, కనీస సౌకర్యాల లేమి ఈ దుస్థితికి కారణమని విద్యార్థి, గిరిజన సంఘాలు గగ్గోలు పెట్టాయి. ఈ ఘటనపై స్పందించిన వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. మావనతాదృక్పథంతో స్పందించిన ఆయన.. మృతి చెందిన ఇద్దరు విద్యార్థుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఆ మొత్తాన్ని వెనువెంటనే బాధిత కుటుంబాలకు కురుపాంలో పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, పాముల పుష్పశ్రీవాణి, పీడిక రాజన్నదొర తదితరుల చేతుల మీదుగా అందజేశారు. ప్రభుత్వం నుంచి మాత్రం ఇప్పటికీ ఎటువంటి భరోసా కూడా లభించలేదు. ఎక్స్గ్రేషియా ప్రకటించాలని వైఎస్సార్సీపీతో పాటు, గిరిజన, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తూనే ఉన్నా.. ఫలిత లేకపోతోంది. ఈ ఘటనను వైఎస్సార్సీపీ జాతీయస్థాయికి తీసుకెళ్లి, పోరాటం చేసింది. ఎన్హెచ్ఆర్సీ, ఎస్టీ కమిషన్లకూ ఫిర్యాదు చేసింది. జిల్లాలో మూడు రోజులపాటు ఎన్హెచ్ఆర్సీ ప్రతినిధి బృందం విచారణ సైతం చేపట్టింది. అనారోగ్యంతోనే గత అక్టోబర్ 24న సీతంపేటలోని హడ్డుబంగి ఆశ్రమ పాఠశాలలో మండంగి కవిత అనే ఆరో తరగతి విద్యార్థిని మృతి చెందింది. నష్టపరిహారం అందించాలని చిన్నారి కుటుంబ సభ్యులు, గిరిజన సంఘ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపట్టారు. ఇన్ని ఘటనలు జరుగుతున్నా.. జిల్లాకే చెందిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కనీస స్పందన చూపలేకపోయారు. వారికి పరిహారాన్ని ప్రభుత్వం నుంచి తెప్పించడంలో సఫలీకృతం కాలేకపోయారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ గురువారం జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఆయన నుంచైనా పరిహారం ప్రకటన వస్తుందని మృతి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ఆ మేరకు మంత్రి లోకేశ్ ప్రకటన చేయాలని గిరిజన సంఘాల నాయకులు కోరుతున్నారు. -
● పోలీసుల సేవా ‘మార్గం’
విజయనగరం ‘వై’ జంక్షన్ సమీపంలో రోడ్డు అధ్వానంగా మారింది. పెద్దపెద్ద గోతులు ఏర్పడ్డాయి. రోడ్డును బాగుచేయాల్సిన అధికారులు మిన్నకున్నారు. పాలకులు పట్టించుకోలేదు. దీంతో రాకపోకలకు వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరచూ ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. కొన్ని సార్లు ప్రమాదాలు జరుగుతున్నాయి. బుధవారం కూడా ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో పోలీసులు స్పందించారు. సీఐలు సూరినాయుడు, లక్ష్మణరావు పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. సేవా దృక్పథంతో దగ్గరుండి గోతులు పూడ్చివేయించి ప్రయాణికుల ప్రశంసలు అందుకున్నారు. దీనికి ఈ చిత్రమే సజీవ సాక్ష్యం. – విజయనగరం క్రైమ్ -
● దివ్యాంగుల నిరసన గళం
చంద్రబాబు ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమాన్ని విస్మరించిందంటూ దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి, ఏపీ పీడబ్ల్యూడీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులు బుధవారం ఆందోళన చేశారు. కళ్లకు నల్లరిబ్బన్లు కట్టుకుని విజయనగరం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. రీసర్వే, సదరం సర్టిఫికెట్ల పేరుతో దివ్యాంగులకు ప్రభుత్వం కలిగిస్తున్న ఇబ్బందులను ఏకరువుపెట్టారు. చంద్రబాబు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నినదించారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ‘బ్లాక్ డే’గా పరిగణిస్తున్నామని ప్రకటించారు. ఆందోళనలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కానూరు శంకర్రావు, దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్.జేసుదాస్తో పాటు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన దివ్యాంగులు పాల్గొన్నారు. – విజయనగరం అర్బన్ -
స్క్రబ్ టైఫస్పై అప్రమత్తతే ప్రధానం
విజయనగరం అర్బన్: జిల్లాలో ప్రస్తుతం స్క్రబ్టైఫస్ కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదని, ఇతర జిల్లాల్లో కేసులు బయటపడుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి తెలిపారు. స్క్రబ్ టైఫస్ ఓరియాంటియా సుట్సుగామిషి బ్యాక్టీరియా వల్ల వస్తుందని, పొదలు, పంటచేలు, గడ్డి మైదానాల్లో ఉండే సంక్రమిత చిగర్ మైట్స్ కాటు వేయడం వల్ల వ్యాధి వ్యాప్తిస్తుందని తెలిపారు. అనుమానం ఉన్నవారు వెంటనే సమీప ప్రభుత్వాస్పత్రిని సంప్రదించాలని సూచించారు. ఆకస్మిక జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు, అలసట, దద్దుర్లు, కాటువేసిన చోట నల్లటి పూతలా కనిపించే ఎస్కార్ గాయం వంటి లక్షణాలు స్క్రబ్ టైఫస్ వ్యాధికి చెందినవిగా పేర్కొన్నారు. డాక్సిసైక్లిన్ అత్యంత ప్రభావితమైన మందు అని, గర్భిణులు, చిన్న పిల్లల కోసం అజిత్రమైసిస్ వంటి ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయన్నారు. స్క్రబ్ టైఫస్ పాజిటివ్ అంటూ ప్రజలను కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు భయపెడుతున్నట్టు ఫిర్యాదులు అందాయని, వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. దీనికి సంబంధించి ఇప్పటికే నోటీసులు జారీ చేశామన్నారు. -
విద్యలనగరంతో.. ఘంటసాలకు ఎనలేని బంధం
ఆపాత మధురాలు ఆయన సొంతం ఘంటసాల సాధన చేసిన గుమ్చీ విజయనగరం టౌన్: సకలకళల సమాహారం విజయనగరం. ఎందరో మహానుభావులు నడయాడిన నేల ఇది. ఇక్కడ పుట్టకపోయినప్పటికీ ఈ గడ్డపై అడుగుపెట్టి, అహోరాత్రులు కష్టపడి ప్రపంచ చరిత్రలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఎందరో మహానుభావుల్లో ఘంటసాల వెంకటేశ్వరరావు ఒకరు. పుట్టింది గుడివాడ సమీపంలోని చౌటుపల్లి గ్రామంలో అయినప్పటికీ తండ్రి సూర్యనారాయణ కోరిక మేరకు ఆంధ్రరాష్ట్రంలో ఏకై క సంగీత కళాశాలగా ఉన్న విజయనగరానికి చేరుకున్నారు. ఆయన వచ్చే సమయానికి వేసవి సెలవుల కారణంతో కళాశాల మూసేసి ఉంది. కళాశాల ప్రిన్సిపాల్ వద్దకు వెళ్లి తన పరిస్థితిని వివరించగా వసతి సమకూర్చారు. ఘంటసాల అక్కడే ఉంటూ రోజుకో ఇంట్లో వారాల భోజనం చేస్తూ ఉండేవారు. 1935 నుంచి 1942 వరకు విజయనగరంలోనే ఉంటూ సంగీత కళాశాల అధ్యాపకుడు పట్రాయుని సీతారామశాస్త్రి వద్ద శిక్షణ పొందారు. ఘంటసాలకు ఆ రోజుల్లో నర్తకి అయిన లక్ష్మీనరసమ్మ (కలవర్ రింగ్) ఘంటసాలను ఆదరించి, అన్నంపెట్టేది. సరస్వతుల వెంకటరావుతో కలిసి గురువు శాస్త్రి శిక్షణలో నాలుగేళ్ల కోర్సును ఘంటసాల రెండేళ్లలో పూర్తిచేశారు. 1922 డిసెంబర్ 4న జన్మించిన చౌటుపల్లిలో జన్మించిన ఘంటసాల 1974 ఫిబ్రవరి 11న 51 ఏళ్ల వయసులో చైన్నెలో మృతిచెందారు. ఆయనకు నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలున్నారు. పద్మశ్రీ శివమణికి ఘంటసాల విశిష్ట పురస్కారం ఘంటసాల 103వ జయంతిని పురస్కరించుకుని ఘంటసాల స్మారక కళాపీఠం ఆధ్వర్యంలో ఈ నెల 4న గురువారం గుమ్చీ వద్దనున్న ఘంటసాల విగ్రహానికి క్షీరాభిషేకం, పుష్పాభిషేకం చేస్తారు. 5వ తేదీ శుక్రవారం సాయంత్రం ఆనందగజపతి ఆడిటోరియంలో ప్రపంచ ప్రసిద్ధ పెర్కషన్ మాస్ట్రో పద్మశ్రీ డాక్టర్ శివమణికి ఘంటసాల విశిష్ట పురస్కారాన్ని అందజేస్తారు. ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు ఆడిటోరియంలో ఘంటసాల సినీ సంగీత స్వరార్చన, నిర్విరామ సంగీత ఇక్కడి సంగీత కళాశాలలో శిక్షణ పట్రాయుని సీతారామశాస్త్రి వద్ద విద్యాబోధన నేడు ఘంటసాల జయంతి 5న శివమణికి ఘంటసాల పురస్కారం ఘంటసాల పాటలంటే చెవులుకోసుకునేవారులేరంటే అతిశయోక్తి లేదు. ఘంటసాల చేత తరచూ పాటలు పాడించుకుని ఆస్వాదించే చిత్తూరు నాగయ్య, బీఎన్ రెడ్డిల తమ సినిమా అయిన స్వర్గసీమలో తొలిసారి నేపథ్యగాయకుడిగా అవకాశమిచ్చారు. ఆ పాటకు ఆయనకు రూ.116 పారితోషకం లభించింది. మూగమనసులు, మంచి మనసులు, మహాకవి కాళిదాసు, పుష్పవిలాపం, భగవద్గీత, భక్త తుకారం, గుండమ్మ కథ, కన్యాశుల్కం, డాక్టర్ చక్రవర్తి వంటి చిత్రాలతో పాటు అక్కడ నుంచి వరుస చిత్రాలన్నీ దాదాపుగా ఆయన పాడినవే. ఎటువంటి పాటనైనా ఘంటసాల మాత్రమే పాడగలడు అన్న ఖ్యాతి సంపాదించారు. మనం వింటున్న భగవద్గీత ఆ మహానుభావుడు నోట నుంచి జాలువారినదే. 1970లో ఆయనకు భారతప్రభుత్వం అత్యున్నత పురస్కారం పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది. 35 ఏళ్లుగా ఘంటసాల స్మారక కళాపీఠం ఘంటసాల అంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే సంగీతాభిమానులందరూ కలిసి ఘంటసాల కళాపీఠం స్థాపించాం. ఆయన ఎంతో ఇష్టపడి గుమ్చీ దగ్గర సాధన చేసేవారు. ఆయనకు గుర్తుగా అక్కడే విగ్రహాన్ని పెట్టగలిగాం. ప్రతి ఏటా జయంతి, వర్ధంతులతో పాటు ప్రత్యేక పర్వదినాల్లో ఆయన విగ్రహానికి క్షీరాభిషేకాలు నిర్వహిస్తున్నాం. ప్రతినెలా ఘంటసాల స్మారక కళాపీఠం తరఫున ఘంటసాల ఆపాత మధురాల పేరుతో క్రమం తప్పకుండా 35 ఏళ్లుగా సంగీత విభావరి నిర్వహిస్తున్నాం. – ఎమ్.భీష్మారావు, ఘంటసాల స్మారక కళాపీఠం వ్యవస్థాపకుడువిభావరి ఉంటుందని ఘంటసాల స్మారక కళాపీఠం సభ్యులు తెలిపారు. -
జాతీయ స్థాయిలో సత్తా చాటిన ఇందు
చీపురుపల్లి: జాతీయస్థాయిలో జరిగిన టెన్నికాయిట్ చాంపియన్ షిప్లో చీపురుపల్లి మండలంలోని పెదనడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని కిలారి ఇందు సత్తా చాటింది. జాతీయ స్థాయిలో జరిగిన చాంపియన్షిప్లో చక్కని ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించింది. దీంతో బుధవారం పెదనడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బంగారు పతకం సాధించిన ఇందును పాఠశాల హెచ్ఎం ఎల్.తిరుపతిరావు, కోచ్ ఎం.రామారావు అభినందించారు. ఈ సందర్భంగా కోచ్ రామారావు మాట్లాడుతూ నవంబర్ 26 నుంచి 30 వరకు జమ్ము కాశ్మీర్లో జరిగిన 42వ జాతీయ టెన్నికాయిట్ ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయని ఈ పోటీల్లో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ తరఫున ఇందు పాల్గొన్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి జట్లు పాల్గొనగా అందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆంధ్రప్రదేశ్ జట్టు ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిధ్యం వహించిన ఇద్దరిలో పెదనడపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కిలారి ఇందు ఒకరని తెలిపారు. జాతీయ స్థాయిలో జరిగిన చాంపియన్షిప్ పోటీల్లో చక్కని ప్రతిభ కనపరిచి రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చిన ఇందును ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలని హెచ్ఎం తిరుపతిరావు పిలుపునిచ్చారు. టెన్నికాయిట్లో బంగారు పతకం -
చికిత్స పొందుతూ వైఎస్ఆర్సీపీ నాయకుడి మృతి
రామభద్రపురం: మండలంలోని బూసాయవలస జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై గత నెల 28వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన మామిడివలస మాజీ సర్పంచ్, వైఎస్ఆర్సీపీ నాయకుడు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గతనెల 28వ తేదీన మామిడివలస గ్రామానికి చెందిన మండల సన్యాసిరావు (56) పనినిమిత్తం మామిడివలస నుంచి రామభద్రపురం వెళ్లి పని ముంగించుకుని తిరిగి తన గ్రామానికి ద్విచక్రవాహనంపై వెళ్లిపోతుండగా బూసాయవలస జంక్షన్ వద్ద మలుపు తిరుగుతున్న సమయంలో విజయనగరం నుంచి ఒడిశా వెళ్తున్న కారు బలంగా ఢీ కొట్టింది. దీంతో సన్యాసిరావు తలకు తీవ్ర గాయమవడంతో కుటుంబసభ్యులు, స్థానికులు ప్రథమ చికిత్స నిమిత్తం బాడంగి సీహెచ్సీకి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతిచెందారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై వి. ప్రసాదరావు కేసునమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. సన్యాసిరావు మృతి పార్టీకి తీరని లోటుమామిడివలస గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకుడు మండల సన్యాసిరావు రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడన్న సమాచారం తెలుసున్న మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, ఎంపీపీ చొక్కాపు లక్ష్మణరావు, జెడ్పీటీసీ అప్పికొండ సరస్వతి వెళ్లి మృతదేహానికి నివాళులు అర్పిచారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు. కార్యక్రమంలో మామిడవలస సర్పంచ్ మూడడ్ల అప్పలనాయుడు, వైఎస్సార్సీపీ మండల నాయకుడు చింతల సింహాచలం నాయుడు, మండల యూత్ అధ్యక్షుడు పత్తిగుళ్ల ఏక్నాథ్, పార్టీ మండల ఉపాధ్యక్షుడు డర్రు పైడిరాజు పాల్గొన్నారు. -
బీఏ నారాయణకు ఘంటసాల స్మారక పురస్కారం
విజయ నగరం: ఘంటసాల జయంతిని పురస్కరించుకుని ఈనెల 5వ తేదీన ప్రముఖ సంగీత విద్వాంసుడు బీఏ నారాయణకు ఘంటసాల స్మారక పురస్కారం ప్రదానం చేయనున్నామని ఘంటసాల సంగీత సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపకుడు సముద్రాల గురుప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజున సీతం కాలేజీలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో భాగంగా ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ గాయనీ గాయకులు ఉమామహేశ్వరి,కూర్మారావు,సూర్య ప్రకాష్, నీలిమా రాణి, గిరిజాప్రసన్న తదితరులు తమ పాటలతో అలరిస్తారని పేర్కొన్నారు. అట్రాసిటీ కేసులో ఇద్దరు ముద్దాయిలకు జైలుశిక్షవిజయనగరం క్రైమ్: జిల్లాలోని సంతకవిటి పోలీస్స్టేషన్లో 2020లో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ముద్దాయిలైన సంతకవిటి మండలం గోళ్లవలసకు చెందిన వెంపటాపు గోపి (35), కొప్పల రామినాయుడు (50)లకు శ్రీకాకుళం ఎస్సీ, ఎస్టీ కోర్టు కం 4వ అదనపు జిల్లా సెషనన్స్ జడ్జి, ఎస్.ఎం.ఫణికుమార్ నాలుగున్నరేళ్ల జైలు శిక్ష, రూ.12,000లు చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. ఈ మేరకు ఎస్పీ ఏఆర్.దామోదర్ బుధవారం తెలిపారు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. సంతకవిటి మండలంలోని గోళ్లవలస గ్రామంలో ఉపాధి హామీ పథకం పనుల ఆడిట్ జరుగుతున్న సమయంలో గ్రామానికి చెందిన ఫిర్యాదు దారు చింతాడ అసిరయ్య (40)ను అదే గ్రామానికి చెందిన వెంపటాపు గోపి, కొప్పల రామినాయుడు కులం పేరుతో దూషించి, కర్రతోను, చేతులతో దాడి చేసి గాయ పరిచినట్లు సంతకవిటి పోలీస్ స్టేషన్లో 6.2.2020న బాధితుడు ఫిర్యాదు చేయగా సంతకవిటి పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఆ కేసుపై, అప్పటి ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ ఎ.సత్యనారాయణ దర్యాప్తు చేపట్టి, నిందితులను అరెస్టు చేసి, కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. నిందితులపై నేరం రుజువు కావడంతో శ్రీకాకుళం ఎస్సీ, ఎస్టీ కోర్టు కం 4వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి, ఎస్.ఎం.ఫణికుమార్ పై విధంగా శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు. -
జాతీయస్థాయి పోటీలకు జీసీఎస్ఆర్ విద్యార్థి
రాజాం సిటీ: ఈ నెల 5 నుంచి 9 వరకు హర్యానా రాష్ట్రం రోహ్తక్లో జరగనున్న జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు స్థానిక జీసీఎస్ఆర్ కళాశాల విద్యార్థి టొంపల జగదీష్కుమార్ ఎంపికయ్యాడని పీడీ సీహెచ్ కేశవనారాయణ బుధవారం తెలిపారు. ఇటీవల నిర్వహించిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్లో అండర్–19 విభాగంలో రాష్ట్రస్థాయిలో చక్కని ప్రతిభ కనబరిచాడన్నారు. విద్యార్థి జాతీయస్థాయికి ఎంపిక కావడంపట్ల ప్రిన్సిపాల్ ఎం.పురుషోత్తం, సీహెచ్ రవీంద్రకుమార్, అధ్యాపకులు అభినందించారు. జీఆర్పీ అదుపులో రైళ్లలో చోరీల నిందితుడువిజయనగరం క్రైమ్: వెళ్తున్న రైళ్లల్లో నేరాలకు పాల్పడే నిందితుడిని విజయనగరం గవర్నమెంట్ రైల్వే పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. విజయనగరం ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ఉంటున్న పుల్లేటికుర్తి వంశీ(25)ట్రైన్లలోను, రైల్వే ఫ్లాట్ఫారాల వద్ద ప్రయాణికుల నుంచి దొంగతనాలకు పాల్పడేవాడు. ఈ క్రమంలో సుమారు రెండు లక్షల రూపాయల విలువగల 8 మొబైల్ ఫోన్ల అపహరణ కేసులో నిందితుడిని పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం రైల్వే కోర్టులో ప్రవేశపెట్టామని ఎస్సై బాలాజీ రావు తెలిపారు. పోలమాంబ జాతరలో వస్తువులకు వేలం పాటమక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి జాతర వచ్చే ఏడాది జనవరి నెలలో జరగనున్న నేపథ్యంలో ఫస్ట్ బోర్డ్ చైర్మన్ లైలా తిరుపతిరావు, కమిటీ సభ్యులు, ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం వేలపాట నిర్వహించారు. చీరలు, రవికలకు 2025–2026 సంవత్సరానికి 4,40,000 ఆదాయం వచ్చింది. కొబ్బరి ముక్కల నిమిత్తం ఆరు లక్షల ఒక వెయ్యి రూపాయలు, తలనీలా ల నిమిత్తం 3,42,000 వచ్చింది. అమ్మవారి లామినేషన్ ఫొటోలు, వనం గుడి వద్ద దీపాలు పెట్టుకునే హక్కు కోసం పాట దారులు ఎవరూ రాకపోవడంతో వాయిదా వేశారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ తనిఖీదారు ఎన్.రాజకుమారి, సర్పంచ్ సింహాచలమమ్మ, ఎంపీటీసీ తీళ్ల పోలినాయుడు, ఉప సర్పంచ్ అల్లు. వెంకటరమణ, గ్రామపెద్దలు పాల్గొన్నారు. వృద్ధుడి ఆత్మహత్యకొత్తవలస: బతుకు తెరువు కోసం చేసిన అప్పులను తిరిగి చెల్లించలేక మనస్తాపానికి లోనైన మండలంలోని సబ్బవరం రోడ్డులో గల శివాజీనగర్కు చెందిన ఎస్.సూరిబాబు (71) రైలుకింద పడి మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు గవర్నమెంట్ రైల్వే ఎస్సై బాలాజీరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సూరిబాబు కొత్తవలస మండలంలోని రెండు బ్యాంకుల్లో సుమారు రూ.4లక్షలకు పైగా రుణాలు తీసుకుని టిఫిన్ సెంటర్ పెట్టుకున్నాడు. వ్యాపారం సక్రమంగా సాగకపోవడంతో రుణ వాయిదాలను సకాలంలో చెల్లించకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బాలాజీరావు చెప్పారు. మద్యం తాగొద్దన్నందుకు ఆత్మహత్యబొబ్బిలి: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో నివసిస్తున్న మామిడిపల్లి నాగేంద్ర బాబు (25)ఈనెల 1న తన అత్తవారి గ్రామమైన విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోని సింగారపు వీధిలో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్సై డి.కొండల రావు తెలిపారు. నాగేంద్రబాబు అత్తవారింటికి వచ్చిన రోజు నవంబర్ 30న భార్య మద్యం తాగడం మానాలని గొడవ పడడంతో మరుసటి రోజు ఉదయం 10 గంటలకు నాగేంద్రబాబు గడ్డిమందు తాగేశాడు. విషయం గమనించిన బంధువులు మెరుగైన వైద్యం కోసం విశాఖలోని కేజీహెచ్కు తరలించగా . అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందినట్లు ఏఎస్సై కొండల రావు విలేకరులకు తెలిపారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
వైభవంగా హనుమద్ వ్రతం
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో హనుమద్ వ్రతం బుధవారం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది. వేకువజామున ఆలయంలో ప్రాతఃకాలార్చన, బాలభోగం అనంతరం యాగశాలలో సుందరకాండ హోమం నిర్వహించారు. అనంతరం వెండి మంటపంలోని ఉత్సవ మూర్తులకు నిత్య కల్యాణ మహోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. ప్రతి ఏటా మార్గశిర మాస శుద్ధ త్రయోదశి భరణి నక్షత్రం రోజున జరుపుకునే హనుమాన్ వ్రతం ఈ సారి మరింత భక్తి ప్రపత్తులతో సాగింది. ఆంజనేయస్వామికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, వివిధ రకాల ఫల రసాలతో అర్చకులు విశేష అభిషేకాలు జరిపించారు. అనంతరం తమలపాకులు, సిందూరంతో సహస్రనామర్చన నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఈఓ వై శ్రీనివాసరావు, అర్చకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
అర్హులందరికీ ఇళ్ల స్థలాలు
● సర్టిఫికెట్ల మంజూరులో ఆలస్యం చేయొద్దు ● కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డివిజయనగరం అర్బన్: అర్హులందరికీ ఇళ్లస్థలాలు ఇచ్చే ప్రభుత్వ లక్ష్యం నేపథ్యంలో వారి పేర్లను నమోదు చేసుకునే అవకాశం ప్రతి గ్రామంలో అందుబాటులో ఉండేలా చూడాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి సూచించారు. ఈ నెల 14 వరకూ ఇళ్ల స్థలాలకు దరఖాస్తుల నమోదుకు గడువు ఉన్నందున ప్రజలకు ఈ సమాచారం చేరేలా చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఇళ్లస్థలాల మంజూరుకు గ్రామాలవారీగా ప్రణాళిక సిద్ధం చేయాలని ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్థలాలు, ఇంకా అవసరమయ్యే భూముల వివరాలు పూర్తిస్థాయిలో సేకరించాలని ఆదేశించారు. మ్యుటేషన్లు, రెవెన్యూ దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించడంతో పాటు, ప్రజలకు కావాల్సిన సర్టిఫికెట్లను తక్షణమే మంజూరు చేయాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ మాట్లాడుతూ సివిల్ సప్లైస్ విభాగానికి సంబంధించిన రైస్ కార్డుల పెండింగ్ కేసులను వెంటనే క్లియర్ చేయాలని ఆదేశించారు. నిర్ణయించిన అజెండా అంశాలపై తాజా సమాచారంతో ప్రతి అధికారి తప్పనిసరిగా సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియపై జరిగిన సమీక్షలో గోనెసంచులు, జీపీఎస్తో కూడిన వాహనాలు సిద్ధంగా ఉన్నాయని రెండు రోజుల్లో బ్యాంకు గ్యారంటీలు కూడా పూర్తి అవుతాయని కలెక్టర్ తెలిపారు. బీజీలు రాని మిల్లర్లతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని దళారులపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. వివిధ శాఖలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో రెవెన్యూ డివిజన్ అధికారులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, కలెక్టరేట్ సెక్షన్ సూపరింటెండెంట్లు, జిల్లా పౌరసరఫరాల అధికారి, వ్యవసాయ శాఖ జేడీ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఎ.డి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్, హౌసింగ్ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్, వివిధ మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు. -
జాతీయస్థాయి కరాటే పోటీలకు జిందాల్ విద్యార్థి
కొత్తవలస: జాతీయస్థాయిలో న్యూఢిల్లీలో ఈ నెల 10వ తేదీ నుంచి జరగనున్న కరాటే పోటీలకు మండలంలోని అప్పన్నపాలెం గ్రామం సమీపంలో గల ఓపీ జిందాల్ పాఠశాలకు చెందిన విద్యార్థి అడ్డూరి యోగికార్తీక్ ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు పీవీఎస్ఎస్.విశ్వనాథం బుధవారం తెలిపారు. నవంబర్ 24,25 తేదీల్లో రాజమహేంద్రవరంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో అండర్–14 విభాగంలో యోగికార్తీక్ ప్రథమ స్థానం సాదించడంతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఆయన చెప్పారు. కోచ్ సూరిబాబు శిక్షణలో యోగికార్తీక్ తర్ఫీదు పొందినట్లు తెలిపారు. అలాగే రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో ఆరవ తరగతి చదువుతున్న ఈ.దేవకీలత రెండోస్థానంలో నిలిచి సిల్వర్ పతకం సాధించిందన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణ లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇద్దరు వి ద్యార్థులను అభినందించారు.కార్యక్రమంలో పాఠశాల పీడీ అప్పలనాయుడు పాల్గొన్నారు. -
నీతి కథలే వ్యక్తిత్వానికి పునాది
● అలరించిన విద్యార్థుల కోలాటం ● ఘనంగా 9వ రోజు పుస్తక మహోత్సవం పార్వతీపురం రూరల్: పిల్లలకు బాల్యం నుంచే నీతి కథలు వినిపించడం ద్వారా వారిలో దేశభక్తి, వినయం, సమయస్ఫూర్తి వంటి సద్గుణాలను పెంపొందించి, ఉత్తమ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దవచ్చని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత నారంశెట్టి ఉమామహేశ్వరరావు అన్నారు. స్థానిక పురిపండా అప్పలస్వామి ప్రాంగణంలో బుధవారం 9వ రోజు పుస్తక మహోత్సవ సాహిత్య సభ కళారత్న డా.డి.పారినాయుడు అధ్యక్షతన జరిగింది. బాలసాహితీవేత్తలకు పార్వతీపురం నిలయంగా మారిందని ఈ సందర్భంగా పారినాయుడు కొనియాడారు. కార్యక్రమంలో బెహరా ఉమామహేశ్వరరావు రచించిన ‘చెట్లు చెప్పిన కథలు’ నవలను ఆవిష్కరించారు. పర్యావరణ ఆవశ్యకతను ఈ పుస్తకం అద్భుతంగా వివరిస్తోందని సమీక్షకుడు పక్కి రవీంద్రనాథ్ పేర్కొన్నారు. కాగా, ఎన్.ములగ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు ప్రదర్శించిన కోలాటం ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది. విద్యార్థుల ప్రతిభను ప్రముఖ కవి గంటేడ గౌరునాయుడు ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం జరిగిన కవి సమ్మేళనంలో బెలగాం భీమేశ్వరరావు, తుంబలి శివాజీ, బీవీ పట్నాయక్, ఈదుబిల్లి ఉషారాణి, గొట్టాపు శ్రీనివాసరావు తదితర కవులు తమ కవితా గానంతో అలరించారు. -
వెటరన్ బాడ్మింటన్ చాంపియన్ షిప్కు పేర్లు నమోదు
శృంగవరపుకోట: జిల్లాస్థాయి వెటరన్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్, సెలక్షన్కు హాజరయ్యేవారు ఈనెల ఏడోతేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలని ఎస్.కోట ఫ్రెండ్స్ రిక్రియేషన్ బ్యాడ్మింటన్ అకాడమీ చీఫ్కోచ్, బ్యాడ్మింటన్ ఆసోసియేషన్ సీఈఓ పొట్నూరు శ్రీరాములు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 14వ తేదీ ఉదయం 9 గంటల నుంచి విజయనగరంలోని డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో జిల్లా బ్యాడ్మింటన్ ఆసోషియేషన్ చైర్మన్ ఇందుకూరు రఘురాజు, గౌరవ అధ్యక్షుడు ద్వారపూడి జగదీష్, అధ్యక్షుడు కేఏ నాయుడు కార్యదర్శి సురేష్ ఆధ్వర్యంలో ఎంపిక నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ పోటీల్లో 35,40,45,50,55,60,65,70ఏళ్ల విభాగాల్లో సీ్త్రలు, పురుషులకు వేర్వేరుగా సింగిల్స్, డబుల్స్ మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో పోటీలు నిర్వహించి గెలుపొందిన క్రీడాకారులను ఫిబ్రవరిలో విజయనగరంలో జరిగే రాష్ట్రస్థాయి వెటరన్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొన దలిచినవారు బొబ్బిలి అపర్ణబాబా 7981111705, ఎస్.కోట పొట్నూరు శ్రీరాములు 7989199534.విజయనగరం జి.శ్రీనివాసరావు9133773485 ఫోన్ నంబర్లకు ఫోన్చేసి ఈ నెల 7వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. -
ఎడతెగని చర్చలు
గిరిజన రైతుల కన్నీరుఈ సమావేశంలో కూడా దశాబ్దాల కాలంగా నేల తల్లినే నమ్ముకుని ఉన్నాం..మేము సాగు చేస్తున్న భూములు లాక్కుని మాకు అన్యాయం చేయకండని గిరిజన రైతులు కన్నీరు పెట్టుకున్నారు.ఏపీఐఐసీకి కేటాయించక ముందు నుంచి ఆ భూమిలో సాగు చేస్తున్నామని, తాము మొక్కలు వేస్తున్నప్పుడు కూడా ఎవరూ అడ్డుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. సుమారు 30 కుటుంబాలకు చెందిన తామంతా పిల్లలతో వివిధ పంటలు సాగు చేసుకుని బతుకుతున్నామని మమ్మల్ని ఇబ్బంది పెట్టొదని వాపోయారు. పంటలు చేతికొస్తున్న సమయంలో పరిశ్రమల ఏర్పాటు పేరుతో ఏపీఐఐసీ అధికారులు మొక్కజొన్న, మామిడి, జీడిమామిడి తదితర పంటలు నాశనం చేశారని,అదే జీవనాధారంగా బతుకుతున్న ఆ భూములు లాక్కోవడం అన్యాయమని కన్నీరుమున్నీరయ్యారు. ఈ భూములు ఇచ్చేస్తే తర్వాత తరాలకు జీవనోపాధి లేక ఇబ్బందులు పడతారని ఒక్కో కుటుంబానికి రూ.8 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వడంతో పాటు మాకు ఇస్తామన్న భూమిలో సాగుకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.రామభద్రపురం: మేము సాగు చేసుకుంటూ జీవనాధారం పొందుతున్న భూములకు మెరుగైన పరిహారం ఇవ్వడంతో పాటు మాకు చూపిస్తున్న భూముల్లో సాగుకు అవసరమైన సౌకర్యం కల్పించాలని కాకర్లవలస, కారేడువలస గిరిజన రైతులు డిమాండ్ చేశారు. రామభద్రపురం మండలంలోని కొట్టక్కి రెవెన్యూ, మిర్తివలస పంచాయతీ పరిధి కాకర్లవలస, కారేడువలస గ్రామాల మధ్య 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం సుమారు 187.08 ఎకరాల భూమిని రూ.7.48 కోట్లకు ఏపీఐఐసీకి విక్రయించింది.అయితే అ భూమిలో ఏపీఐఐసీ సుమారు ఆరు ఏళ్ల వరకు కనీసం ఒక్క పరిశ్రమ పెట్టలేదు సరికదా, భూమి ఎక్కడుందో?ఎలా ఉందో? ఎవరు ఆక్రమించుకున్నారో అని కనీసం కన్నెత్తి చూడని పరిస్థితి ఉంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఏపీఐఐసీకి సంబంధించిన భూమిలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు కోసం 20 ఎకరాల భూమిని కేటాయించిది. ఆ 20 ఎకరాల్లో చిన్న, పెద్ద పరిశ్రమల ఏర్పాటుకు ఒక్కొ ప్లాట్ 300 స్క్వేర్ ఫీట్స్ చొప్పున 139 ప్లాట్లుగా చేశారు.ఒక్కో స్క్వేర్ ఫీట్ రూ.1112లు ధర నిర్ణయించారు. అలాగే ఎస్సీ, ఎస్టీలు పరిశ్రమలు స్థాపించి ఆర్ధికంగా అభివృద్ధి చెదుతామని ముందుకు వస్తే వారికి 50 శాతం రాయితీపై ప్లాట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ముందుగా 1.3 కిలో మీటర్ల రోడ్లు, డ్రైన్లు అభివృద్ధి కోసం రూ.4 కోట్లు నిధులు విడుదల చేసింది. దాంతో మే నెల 10వ తేదీన మంత్రి కొడపల్లి శ్రీనివాస్, ఎమ్మెలే బేబీనాయన, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడులు శంకుస్థాపన కూడా చేసిన విషయం విదితమే. సంబంధిత కాంట్రాక్టర్ జూలై నెలలో రోడ్లు,డ్రైన్లు అభివృద్ధి కోసం పనులు ప్రారంభించారు. ఈ క్రమంలో ఏపీఐఐసీకి సంబంధించిన భూమిలో ప్రస్తుతం పత్తి, మొక్కజొన్న, మామిడి, జీడితోటలు సాగు చేస్తున్న గిరిజన రైతులకు కనీసం నోటీసు ఇవ్వడకుండా జేసీబీతో పంటలను ధ్వంసం చేశారు. దీంతో తమ సాగులో ఉన్న భూముల్లో ఎలా రోడ్లు ఎలా వేస్తారని గత 5 నెలలుగా గిరిజన రైతులు నిరసనలు, ధర్నాలు చేస్తూ అభివృద్ధి పనులు అడ్డుకుంటున్నారు. ఏపీఐఐసీ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు పలుమార్లు గిరిజన రైతులతో సమావేశమై చర్చలు జరిపారు. అయినప్పటికీ గిరిజన రైతులు ససేమిరా అనడంతో చర్చలు విఫలమయ్యాయి. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం మరోసారి తహసీల్దార్ అజూ రఫీజాన్, సీఐ కె నారాయణరావు, ఏపీఐఐసీ డీఈ విజయ చంద్ర, జేఈ రాజేష్లు మిర్తివలస సర్పంచ్ మజ్జి రాంబాబు, సీఐటియూ నాయకుడు బలస శ్రీనివాసరావు సమక్షంలో గిరిజన రైతులతో సమావేశమయ్యారు. మా సంతకాలు లేకుండా తీర్మానం ఎలా? సమావేశంలో సర్పంచ్ మజ్జి రాంబాబు మాట్లాడుతూ మిర్తివలస పంచాయతీ పరిధిలో ఉన్న సర్పంచ్, గ్రామ ప్రజల సంతకాలు లేకుండా కొట్టక్కి రెవెన్యూ పరిధిలో ఉన్నంత మాత్రాన ఆ సర్పంచ్ సంతకంతో తీర్మానం ఎలా చేస్తారు? నోటిఫికేషన్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అలాగే మా నిధులతో రోడ్లు అభివృద్ధి చేసుకుంటే ఏపీఐఐసీ అధికారులు ఆ రోడ్డును ఎలా వినియోగించుకుంటారని నిలదీశారు. గిరిజన రైతులకు న్యాయం జరిగే వరకు వారికి మద్దతుగా తాము నిలబడతామని స్పష్టం చేశారు. దీంతో ఏపీఐఐసీ డీఈఈ మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు మే నెలలో అందరికీ తెలిసేలా పెద్ద షామియానాలు, కర్టెన్లు, కార్పెట్లు వేసి మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీ వచ్చి శిలాఫలకం ప్రారంభిస్తే అప్పట్లో అడ్డుకోకుండా ఇప్పుడు అడ్డుకోవడం మంచిది కాదన్నారు.అలాగే ప్రభుత్వానికి రూ.7.48 కోట్ల డబ్బులు ఇచ్చి ఏపీఐఐసీ కొనుగోలు చేసిందని, భూమి ఊరకనే రాలేదని మీరు పరిహారం అడగడం సబబుకాదన్నారు. తహసీల్దార్ అజు రఫీజాన్ స్పందిస్తూ మీ డిమాండ్లు రాసి ఇవ్వాలని, ఉన్నతాధికారుల దృష్టిలో పెడతామని సూచించారు. ఈ చర్చల్లో గిరిజన రైతులు కోరిన కోరికలకు తతంగమంతా మళ్లీ మొదటికొచ్చే విధంగా కనిపిస్తోంది. ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటును అడ్డుకుంటున్న గిరిజన రైతులు గిరిజన రైతులతో మరోసారి సమావేశమైన అధికారులు పరిహారం ఇచ్చి..సౌకర్యాలు కల్పించాలని రైతుల డిమాండ్ ఉన్నతాధికారుల దృష్టిలో పెడతామన్న అధికారులు -
ఆందోళనలో ఉపాధ్యాయులు
అరకొర నిధులు.. ● పైసలు విదల్చకుండా పండగ ఎలా..? ● మెగా పేరెంట్టీచర్స్డేకు నిధులు చాలవంటున్న ఉపాధ్యాయులు ● పెరిగిన ధరలకు అనుగుణంగా నిధులు విడుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ విజయనగరం అర్బన్ / వీరఘట్టం: మన ఇంటిలో జరిగే ఓ శుభకార్యానికి షామియానా వేసి... మైక్సెట్ పెట్టి.. ఓ 30 మంది బంధుమిత్రులను పిలిచి వారికి అన్ని మర్యాదలు చేయాలంటే మార్కెట్లో ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం సుమారు రూ.10 వేలు వరకు ఖర్చు అవుతుంది. అదే బంధువుల సంఖ్య పెరిగితే ఖర్చు రూ.వేల నుంచి రూ.లక్షలకు చేరుంది. ఈ విషయం అందరికీ తెలిసినదే. మరి అలాంటప్పుడు ప్రతి పాఠశాలలో ఈ నెల 5న నిర్వహించనున్న మెగా పేరెంట్–టీచర్ (పీటీఎం)3.0 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం అరకొర నిధుల కేటాయింపుపై అయ్యవార్లు పెదవివిరుస్తున్నారు. 30 మంది విద్యార్థులున్న పాఠశాలకు రూ.900 నిధులు కేటాయిస్తే ఎక్కడ సరిపోతాయని ప్రశ్నిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యను బట్టికాకుండా మార్కెట్లో పెరిగిన ధరలకు అనుగుణంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. నిధుల కోసం దాతల వద్ద చేయిచాచమని పరోక్షంగా అయ్యవార్లకు చంద్రబాబు సర్కారు సూచిస్తోందంటూ మండిపడుతున్నారు. ● డబ్బులు లేకుండా పండగ ఎలా? రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఈ నెల 5న పీటీఎంను పండగలా నిర్వహించాలని ప్రభుత్వం విద్యాశాఖ అధికారులకు దిశానిర్దేశం చేసింది. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యాకమిటీ సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులకు ఆహ్వానించి స్కూల్ ప్రగతిని చాటి చెప్పాలని సూచించారు. ప్రతి విద్యార్థి ప్రొగ్రెస్ను వారి తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమానికి విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా చేసుకుని ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. దీనిని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుత ధరల ప్రకారం పీటీఎం నిర్వహణకు నిధులు చాలవని చెబుతున్నారు. ● ఇదీ పరిస్థితి.... ఉమ్మడి విజయనగరం జిల్లాల్లో 3,386 సర్కారు బడులు ఉన్నాయి. ఇందులో విజయనగరం జిల్లాలో 1796, పార్వతీపురం మన్యం జిల్లాలో 1590 సర్కారు బడులు ఉన్నాయి. వీటిలో పీటీఎంల నిర్వహణకు విజయనగరం జిల్లాకు రూ.38,20,500లు, పార్వతీపురం మన్యం జిల్లాకు రూ.25,12,800లు విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. అయితే, ప్రభుత్వం చెప్పిన ప్రకారం కార్యక్రమం చేయాలంటే ఈ నిధులు చాలవని హెచ్ఎంలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పెదవి విరుస్తున్నారు. నిధుల కేటాయింపును పెంచాలని కోరుతున్నారు. ఈనెల 5న నిర్వహించనున్న మెగా పీటీఎం 3.0 ఎజెండా రాజకీయనాయకులను ఆహ్వానిస్తే ఇబ్బందులు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కు స్థానిక రాజకీయ నాయకులను ఆహ్వానించాలని చెప్పడం సరికాదు. తల్లిదండ్రుతో పాటు వారు కూడా మీటింగ్కు హాజరైతే రాజకీయ వాతావరణం అనివార్యం అవుతుంది. ఈ పరిస్థితులు వివాదాలకు దారితీసి పీటీఎం లక్ష్యాలు సాధించలేం. రాజకీయ నాయకుల జోక్యం లేకుండా తల్లిదండ్రులతో మాత్రమే నిర్వహించేలా ఆదేశాలు జారీచేయాలి. – డి.శ్యాం, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు సింగిల్ టీచర్లకు నిర్వహణ భారం సింగిల్ టీచర్లున్న పాఠశాలలో పీటీఎం నిర్వహణ భారంగా మారుతుంది. తల్లిదండ్రులతో పాటు స్థానిక రాజకీయ నాయకులు, వాళ్లతో వచ్చే కార్యకర్తలు భారీగా ఉంటారు. అందరినీ ఆహ్వానిస్తూ కార్యక్రమం నిర్వహించడం ఒక్క ఉపాధ్యాయునికి సాధ్యం కాదు. మరోవైపు అరకొర నిధులతో విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా మధ్యాహ్నం భోజనాలు పెట్టాలంటే ఆర్థికంగా ఇబ్బందికరం. – జేఏవీఆర్కే ఈశ్వరరావు, ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్ తల్లిదండ్రులు గైర్హాజరు కాకుండా చూసుకోవాలి మెగా పీటీఎంకు తల్లిదండ్రులు ఎవరూ గైర్హాజరుకాకుండా చూసుకోవాలి. మీటింగ్ ఉద్దేశాన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రికి తెలియజేయాలి. షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటలకు ప్రారంభించి 12.45 గంటలకే ముగించి మధ్యాహ్న భోజనం పెట్టాలి. తల్లిదండ్రులతో అకడమిక్ చర్చలు తప్పనిసరిగా నిర్వహించి విజయవంతం చేయడానికి ప్రతి ఉపాధ్యాయుడు బాధ్యత తీసుకోవాలి. – యు.మాణిక్యంనాయుడు, డీఈఓ, విజయనగరం నిధుల కేటాయింపు ఇలా... పాఠశాలల్లో 0–30 మంది విద్యార్థులుంటే రూ.900, 31–100 మంది మధ్య విద్యార్థులున్న పాఠశాలకు రూ.2,250, 101–250 మధ్యన రూ.4,500, 251–1000 మంది విద్యార్థులుంటే రూ.6,750, వెయ్యి మంది విద్యార్థులు కంటే ఎక్కువ ఉండే పాఠశాలకు రూ.9 వేలు కేటాయిస్తున్నట్లు ఉత్తర్వులు జారీచేశారు. -
మెట్టపల్లిని సందర్శించిన వైద్య బృందం
చీపురుపల్లి: మండలంలోని మెట్టపల్లి గ్రామాన్ని ర్యాపిడ్ రెస్పాన్స్ బృందం మంగళవారం సందర్శించింది. ఇటీవల మెట్టపల్లి గ్రామంలో స్క్రబ్ టైఫస్ వైరస్ వ్యాధి లక్షణాలతో తన భార్య మృతి చెందినట్లు భర్త చెప్పిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి. దీనిపై స్పందించిన కర్లాం పీహెచ్సీ వైద్యులు గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా జిల్లా కేంద్రం నుంచి ర్యాపిడ్ రెస్పాన్స్ వైద్య బృందం గ్రామంలో ఇటీవల మృతి చెందిన మహిళ చందక రాజేశ్వరి ఇంటిని సందర్శించారు. ఆమె మృతికి సంబంధించిన కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో జ్వరాలతో బాధపడుతున్న వారి నుంచి రక్త నమూనాలు సేకరించారు. ఆరోగ్య జాగ్రత్తలు వివరించారు. వైద్య బృందంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.శరత్నాయక్, డీఎస్ఓ సత్యనారాయణ, వినోద్ లాల్వాని, శ్రావణి, కర్లాం పీహెచ్సీ వైద్యురాలు శ్రీలక్ష్మి ఉన్నారు. -
4న జిల్లా సమీక్ష సమావేశం
● సమగ్ర వివరాలతో హాజరుకావాలి ● కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి విజయనగరం అర్బన్: కలెక్టరేట్లో ఈ నెల 4వ తేదీన జరగనున్న జిల్లా సమీక్ష సమావేశానికి అన్ని శాఖల అధికారులు పూర్తి స్థాయి సమాచారంతో హాజరుకావాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జేసీ సేతుమాధవన్తో కలిసి వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో మంగళవారం ప్రాథమిక సమావేశం నిర్వహించారు. గత సమీక్షా సమావేశంలోని నిర్ణయాలపై తీసుకున్న చర్యలపై సమీక్షించారు. పభుత్వ ప్రాధాన్యతా పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు, లక్ష్యసాధన, పెండింగ్ పనులపై సమీక్షా సమావేశంలో సవివరంగా చర్చిస్తామని, అందుకు అనుగుణంగా అన్ని శాఖలు డేటా సిద్ధం చేసుకోవాలని సూచించారు. వ్యవసాయం, ఖరీఫ్, రబీ పంటల ప్రణాళిక, నీటిపారుదల ప్రాజెక్టుల స్థితిగతులు, ధాన్యం సేకరణ, గృహనిర్మాణాలు, పారిశుద్ధ్యం, వైద్యం, ఆరోగ్యశ్రీ సేవలు, విద్య, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై వివరాలు సమర్పించాలని ఆదేశించారు. జేసీ సేతుమాధవన్ మాట్లాడుతూ నివేదికలు కేవలం సంఖ్యలతోనే కాకుండా క్షేత్రస్థాయిలో పథకాల అమలు వల్ల లబ్ధిదారులకు కలిగిన ప్రభావాన్ని ప్రతిబింబించేలా సమర్పించాలని స్పష్టం చేశారు. ఏ అధికారి అడిగినా వెంటనే సమాధానం చెప్పేలా సిద్ధం కావాలన్నారు. సమావేశంలో సీపీఓ పి.బాలాజీతోపాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. భూసేకరణను వేగవంతం చేయాలి జిల్లాలో పలు జాతీయ ప్రాజెక్టులకు చేపట్టిన భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. భూసేకరణపై తన చాంబర్లో వివిధ శాఖల అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జాతీయ రహదారి 130 (సీడీ), జాతీయ రహదారి 516 (బీ), రైల్వే ఆర్ఓబీలు, జి.సిగడాం–విజయనగరం మూడో రైల్వేలైన్, కొత్తవలస–విజయనగరం నాలుగో రైల్వేలైన్ తదితర ప్రాజెక్టులకు భూసేకరణపై సమీక్షించారు. భూసేకరణ ప్రకటన, పరిహారం చెల్లింపు తదితర అంశాలపై ఆరా తీశారు. వీటన్నింటినీ త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి ప్రాజెక్టుకు నిర్ణీత కాలవ్యవధిని నిర్ణయించుకొని నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో జేసీ ఎస్.సేతుమాధవన్, ఆర్డీఓలు డి.కీర్తి, సత్యవాణి, రామ్మోహన్, ఈ–సెక్షన్ సూపరింటెండెంట్ తాడ్డి గోవింద, ఆయా శాఖల అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
గురజాడ గృహానికి రక్షణ కరువు
● తలుపులు, లైట్లు బద్దలుకొట్టి లోపలకు వెళ్లిన అగంతకులు ● కొద్ది నెలల కిందట తాగుబోతు హల్చల్ విజయనగరం టౌన్: విజయనగరంలోని మహాకవి గురజాడ వెంకట అప్పారావు సొంతగూటికి రక్షణ కరువైంది. మహాకవి ఇంటి పక్కన ఖాళీస్థలమంతా మలమూత్ర విసర్జనకే పరిమితమైంది. తాగుబోతులు హల్ చల్ చేయడం, మహాకవి ఇంట్లో ఏమైనా దొరుకుతాయనుకునే భ్రమలో ఉన్న తలుపులు, కిటికీలు, లైట్లు విరగ్గొట్టి మరీ లోపలికి వెళ్లడం, ఏమీ లభించకపోవడంతో పరిసరప్రాంతాలను, గురజాడ నడియాడిన ఆనవాళ్లు, వినియోగించిన పరికరాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 12న మత్తులో ఉన్న ఓ దొంగ ఇంటి వెనుక వైపు నుంచి లోపలికి ప్రవేశించి, మద్యం మత్తులో మహాకవి రచనలను చిందరవందర చేసి, మరికొన్ని గోడపైనుంచి బయటకు విసిరేసి నానాహంగామా చేశాడు. అధికారులు అప్పటికప్పుడు తూతూమంత్రంగా చర్యలు చేపట్టి మమ అనిపించేశారు. మరలా సోమవారం అర్ధరాత్రి అదే పరిస్థితి పునరావృతమైంది. తలుపులు పగులగొట్టారు. వస్తువులు చిందరవందర చేశారు. మంగళవారం ఉదయం విషయం తెలుసుకున్న గురజాడ వారసులు అధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. అసలు దొంగ మద్యం మత్తులో ప్రవేశించాడా? లేదా ఇంకేదైనా ఆశించాడా అన్నది తెలియరాలేదు. గురజాడ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకే తప్ప మహాకవి స్వగృహాన్ని, ఆయన రచనలను పరిరక్షించడంలో జిల్లా అధికారయంత్రాంగం, ప్రజాప్రతినిధులు ఏమాత్రం పట్టించుకోకపోవడంపై సాహితీవేత్తలు, అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహాకవి రచనలకు భద్రత ఏదీ? మహాకవి గురజాడ రచనలను భద్రం చేయా ల్సిన ఆర్కియాలజీ విభాగం, జిల్లా అధికార యంత్రాంగం ఎటువంటి చర్యలు చేపట్టలేదు. మహాకవి ఇంటిని పరిరక్షణకు, పక్కన ఉన్న ఖాళీ స్థలం వల్ల కలిగే ఇబ్బందులపై అధికారులకు పలుమార్లు వినతులు అందజేసినా ఏ ఒక్కరూ పటించుకోలేదు. తాజా ఘటనతో మహాకవి అభిమానులు, సాహితీసంఘాల ప్రతినిధులు ఆవేదన చెందుతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి మహాకవి రచనలకు భద్రత కల్పించాలని కోరుతున్నారు. -
మా భూములు సేకరించొద్దు
బాడంగి: ఆ భూములే మాకు జీవనాధారం.. ఎట్టి పరిస్థితుల్లోనూ హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ పైపులైన్ నిర్మాణానికి భూములు ఇచ్చేదేలేదని భీమవరం, పాల్తేరు, ముగడ, పిండ్రంగివలస, వీరసాగరం, బాడంగి గ్రామాలకు చెందిన రైతులు తేల్చిచెప్పారు. భూ సేకరణ కోసం ఆయా గ్రామాల రైతులకు 3(1)నోటీసులను అధికారులు అందజేశారు. వారందరితో బాడంగి మండలపరిషత్ సమావేశ భవనంలో ప్రజావిచారణ పేరుతో మంగళవారం సమావేశమయ్యారు. రైతుల అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ మా గ్రామాలు మీదుగా 18 కిలోమీటర్ల పొడవున 12 మీటర్ల వెడల్పున భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేమని చెప్పారు. పైపులైన్ కోసం భూములు ఇస్తే ధరలు పడిపోతాయని, అవసరానికి అమ్ముకోలేమని అభిప్రాయం తెలిపారు. దీనిపై స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్.సుధాసాగర్ మాట్లాడుతూ పైపులైన్ వల్ల నష్టంకలగదని, 12 మీటర్ల వెడల్పులో 1.5 మీటర్ల లోతులో కంతకాలు తవ్వుతారని, 14 అంగుళాల అధునాతనమైన పైపులనే వాడుతారని చెప్పారు. ఒకలైన్ కోసం అవకాశమిస్తే రెండోలైన్ వేయరని గ్రారంటీ ఏమిటని రైతులు ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానం ఇస్తే ఇది భారత ప్రభుత్వం విశాఖ నుంచి రాయపూర్ వరకు పైప్లైన్ వేసేందుకు నిర్ణయించిందన్నారు. ప్రత్యేక అవసరంగా భూములు ఇవ్వకపోయినా తీసుకునే అవకాశంలేక పోలేదని ఎస్డీసీ చెప్పగా.. వీలైనంతవరకు మా జిరాయితీ భూములను తప్పించి వేరే ప్రదేశంనుంచి లైన్వేసుకునేలా చూడాలని అధికారులను కోరారు. సమావేశంలో హెచ్పీసీఎల్ చీఫ్ఇంజినీరు జి.కిశోర్, తహసీల్దార్ ఎన్.వరప్రసాద్, విశ్రాంత తహసీల్దార్ గిరడ అప్పలనాయుడు, వీరసాగరం, పిన్నవలస రైతులు పాల్గొన్నారు. -
ముగిసిన ఆర్టీసీ హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ
విజయనగరం అర్బన్: ఏపీఎస్ ఆర్టీసీ విజయనగరం డిపో ఆధ్వర్యంలో నిర్వహించిన 24వ బ్యాచ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ ఉచిత శిక్షణ మంగళవారంతో ముగిసింది. శిక్షణార్థులకు ఆర్టీసీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు ధ్రువపత్రాలను అందజేశారు. శిక్షణ పొందిన అభ్యర్థులందరూ రోడ్డు భద్రతను పాటిస్తూ క్రమశిక్షణతో వాహనాలు నడపాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ప్రజారవాణా అధికారి జి.వరలక్ష్మి, డిపో మేనేజర్ జె.శ్రీనివాసరావు, శిక్షకులు డీఎన్రాజు, తదితరులు పాల్గొన్నారు. ‘అమృతం’లో ఆయువు తీసే నిర్లక్ష్యం! సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్: చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించే ఉద్దేశంతో ఐసీడీఎస్ ద్వారా అంగన్వాడీ కేంద్రాల నుంచి బాలామృతం ఉచితంగా అంద జేస్తారు. దీనిని బాలలకు అమృతతుల్యంగా భావిస్తారు. బిడ్డకు పుష్టినిచ్చే ఈ బాలామృతం.. ఐసీడీఎస్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా విషతుల్యమవుతోంది. మందులౖకైా, తినే వస్తువులకై నా కాలపరిమితి ఉంటుంది. గడువు దాటిన తర్వాత వాటిని వినియోగించరాదని స్పష్టంగా చెబుతారు. అటువంటిది చిన్నారులకు అందించే పౌష్టికాహారం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఐసీడీఎస్ అధికారుల తీరు ఇందుకు భిన్నం. పార్వతీపురం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో చోటుచేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. పసిబిడ్డల ఆరోగ్యాన్ని పెంచాల్సిన పౌష్టికాహారం.. కాంట్రాక్టర్ల అలక్ష్యం.. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా దారి తప్పింది. గడువు తీరిన బాలామృతం ప్యాకెట్లను ప్రాజెక్టు పరిధిలో పంపిణీ చేయడం.. చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైనం వెలుగులోకి వచ్చింది. ఆరోగ్యానికా.. అనారోగ్యానికా! అంగన్వాడీ కేంద్రాల్లో ఏడు నెలల పసికందు నుంచి మూడేళ్ల చిన్నారులకు బాలామృతం ఇస్తారు. రెండున్నర కిలోల ప్యాకెట్ను ఒక లబ్ధిదారుకు 25 రోజులకోసారి అందిస్తారు. తెలంగాణ నుంచి కాంట్రాక్టర్ ద్వారా వీటిని సరఫరా చేస్తారు. జిల్లాలో 10 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 1,475 ప్రధాన, 600 మినీ అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. 7 నెలల నుంచి 36 నెలల మధ్య వయస్సున్న చిన్నారులు దాదాపు 27 వేల మంది ఉన్నారు. జిల్లాలో ఏటా 10 వేల వరకు ప్రసవాలు జరుగుతుంటాయి. చిన్నారులకు కాలం చెల్లిన బాలామృతం అందజేయడం ఆందోళన కలిగిస్తోంది. పార్వతీపురం ప్రాజెక్టు పరిధిలో గత నవంబర్ లో వచ్చిన సుమారు 2,786 ప్యాకెట్లలో అఽధిక భాగం కాలం చెల్లినవే కావ డం గమనార్హం. ప్యాకెట్లపై స్పష్టంగా 22/ 11అని గడువు తేదీ ఉన్నప్పటికీ వాటినే అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు అందజేయడం ఆ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. అయితే, బస్తాల్లో ఉండిపో వడంతో గడువు తేదీ గమనించకుండా సర ఫరా చేసినట్టు గొడౌన్ సిబ్బంది చెబుతున్నారు. పొరపాటు జరిగిందని, ప్రభుత్వానికి లేఖ రాసినట్టు సీడీపీఓ రేఖావాణి తెలిపారు. -
9 న కాలంచెల్లిన వస్తువుల బహిరంగ వేలం
విజయనగరం క్రైమ్: ఈ నెల 9 వ తేదీన జిల్లా పోలీస్ కార్యాలయంలో కాలం చెల్లిన వస్తువులను వేలం వేయనున్నట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ మంగళవారం తెలిపారు. జిల్లా పోలీసు శాఖ వినియోగించిన, కాలం చెల్లిన జనరేటర్లు, బ్యాటరీలు, ఎలక్ట్రికల్ వస్తువులు (ఫ్యాన్స్, టేబుల్స్ వగైరా), ఎలక్ట్రానిక్ వస్తువులు (రిఫ్రిజిరేటర్లు, వాటర్ డిస్పెన్సర్లు, డీప్ ఫ్రీజర్లు, ఏసీలు), ఫర్నిచర్ వస్తువులు, ఐరన్ స్క్రాప్, మిగతా వస్తువులు 8 స్లాట్లుగా విభజించామన్నారు. ఈ వస్తువులకు బహిరంగ వేలం నిర్వహించనున్నామని ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. వేలం వేయనున్న వస్తువులను డీపీఓ ప్రాంగణంలో భద్రపర్చామని ఆసక్తి కలిగిన వేలందారులు డిసెంబరు 3 నుంచి 8 వరకు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరిశీలించుకోవచ్చునన్నారు. వివరాల కోసం విజయనగరం ఏఆర్ అడ్మిన్ ఆర్ఐ ఎన్.గోపాల నాయుడు ఫోన్ నంబర్ 9121109485 ను సంప్రదించవచ్చునని ఎస్పీ తెలిపారు. వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి కలిగిన బిడ్డర్లు డిసెంబరు 9న ఉదయం 10గంటలకు జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణం వద్ద నిర్వహించే వేలంలో పాల్గొనాలన్నారు. ఆసక్తి కలిగిన బిడ్డర్లు అదే రోజున బిడ్ అమౌంట్ను జీఎస్టీతో సహా ఆన్లైన్లో చెల్లించి, వస్తువులను 24గంటలలో తీసుకుని వెళ్లాలని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ వివరించారు. -
రంగస్ధల కళాకారులకు జెడ్పీ చైర్మన్ ప్రశంసలు
విజయనగరం టౌన్: రంగస్ధల రారాజు ఆచంట వెంకటరత్నం నాయుడు దశమ వర్ధంతిని పురస్కరించుకుని ఆచంట ఆర్ట్స్ అకాడమీ, రావి నాంచారయ్య ట్రస్ట్ సంయుక్త నిర్వహణలో గుంటూరులో దుర్యోధన మయసభ ఏకపాత్రాభినయ పోటీలలో జిల్లాకు చెందిన మండా రమేష్ పాల్గొని ప్రథమ విజేతగా నిలిచారు. ఈ మేరకు జెడ్పీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు చేతుల మీదుగా మెమెంటోను మంగళవారం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన కళాకారుడిని అభినందించారు. అనంతరం డిసెంబరు 9న జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన కార్యక్రమానికి సంబంధించిన వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. విజయనగరం కళాకారులకు పుట్టినిల్లు వంటిదని, అటువంటి కళాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. కార్యక్రమంలో విశాఖ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు, నంది అవార్డు గ్రహీత వంకాయల మారుతీప్రసాద్, కంది త్రినాథ్, కందుల గున్నేశ్వరరావు, జీపీ రాజు, రెడ్డి తిరుపతిరావు, మండా రమేష్, రామారావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రపంచ చాంపియన్షిప్లో ఉణుకూరు యువకుడి ప్రతిభ
రేగిడి: మండల పరిధిలోని ఉణుకూరు గ్రామానికి చెందిన ఎందువ రాహుల్ ప్రపంచ చాంపియన్షిప్లో సత్తాచాటాడు. గత నెల 28 నుంచి 30 వరకు హంగేరీలో జరిగిన కెటిల్బెల్ ప్రపంచ చాంపియన్షిప్లో పాల్గొని 48 కేజీల విభాగంలో ద్వితీయ స్థానం సాధించి భారత జాతీయ పతాకాన్ని ఆ దేశంలో రెపరెపలాడించాడు. రాహుల్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. ఆయన తండ్రి ఎందువ రామకృష్ణ ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా శిర్లాం పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. మండలానికి చెందిన యువకుడు ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్, విజయనగరం జిల్లాతోపాటు రేగిడి మండలాన్ని నిలబెట్టడంతో గ్రామస్తులు, ఉపాధ్యాయులు, యువకులు అభినందించారు. మంగళవారం ఈ విషయాన్ని రాహుల్ తండ్రి ఎందువ రామకృష్ణ విలేకరులకు తెలిపారు. -
పోలియోపై పోరుకు సిద్ధం
● డిసెంబర్ 21న పోలియో చుక్కలు ● డీఎంహెచ్ఓ భాస్కర రావు పార్వతీపురం రూరల్: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ సన్నద్ధమైంది. ఈ నెల 21న జరగనున్న పోలియో డ్రైవ్పై వైద్యాధికారులకు, పర్యవేక్షకులకు స్థానిక ఎన్జీఓ హోంలో మంగళవారం రీ–ఓరియంటేషన్ శిక్షణ జరిగింది. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.భాస్కరరావు మాట్లాడుతూ, చిన్నారుల భవిష్యత్తు ఆరోగ్యం దృష్ట్యా వ్యాక్సిన్ ఆవశ్యకతపై ఇప్పటి నుంచే ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. ఐదేళ్లలోపు పిల్లల జాబితాతో పక్కా మైక్రో ప్లాన్ రూపొందించాలని, హైరిస్క్ ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కోల్డ్ చైన్ నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసి, వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయడమే లక్ష్యంగా సిబ్బంది కృషి చేయాలని కోరారు. డాక్టర్ జాన్ పవర్ శిక్షణ ఇవ్వగా, కార్యక్రమంలో డీఐఓ డా.విజయ మోహన్ సహ జిల్లా ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు. -
ఆత్మవిశ్వాసమే ఆలంబనగా..
● నర్సిపురంలో పారా ఒలింపిక్స్ క్రీడలు ● విజేతలకు బహుమతులుపార్వతీపురం రూరల్: శారీరక వైకల్యాన్ని జయిస్తూ మానసిక స్థైర్యంతో దివ్యాంగ విద్యార్థులు క్రీడా మైదానంలో కదం తొక్కారు. మంగళవారం పార్వతీపురం మండలంలోని నర్సిపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో జిల్లా పారా ఒలింపిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన క్రీడా పోటీలు ఆద్యంతం ఉల్లాసంగా సాగాయి. 15 మండలాల నుంచి వచ్చిన 85మంది విద్యార్థులు పతాకాల వేటలో పోటాపోటీగా తలపడ్డారు. డీఈఓ బి.రాజ్కుమార్, సమగ్ర శిక్ష ఏపీసీ తేజేశ్వరరావు డీఎల్ఈసీ భానుమూర్తి ఈ పోటీలను పర్యవేక్షించారు. రాష్ట్రస్థాయికి ఎంపికై న ఆణిముత్యాలు పోటీల్లో సత్తాచాటి రాష్ట్రస్థాయికి అర్హత సాధించిన వారిలో 400మీటర్ల పరుగుకు సంబంధించి కె.ప్రమీల, జూనియర్ విభాగంలో సీహెచ్ జాను, ప్రధమ స్థానాల్లో నిలవగా జి. మణి, రాంనరేష్ ద్వితీయ స్థానాలు దక్కించుకున్నారు. లాంగ్ జంప్ విభాగంలో ఎస్.శివ, పి.రామచంద్ర (అండర్ జూనియర్స్) వరుసగా ఒకటి, రెండు స్థానాల్లో నిలిచారు. జావెలెన్ త్రోకు సంబంధించి జూనియర్ విభాగంలో వెంకటసాయి, మనీషా స్వర్ణాలు సాధించారు. ఈ మేరకు విజేతలతో పాటు పాల్గొన్న క్రీడాకారులకు అతిథుల చేతుల మీదుగా పతాకాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. -
పారా జిల్లా స్థాయి పోటీలు ప్రారంభం
విజయనగరం: సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ సహకారంతో మంగళవారం స్థానిక విజ్జి స్టేడియంలో దివ్యాంగ క్రీడాకారుల జిల్లా స్థాయి పోటీలు ఉత్సాహ భరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన సమగ్ర శిక్ష అదనపు సమన్వయకర్త ఎ.రామారావు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్.వెంకటేశ్వర రావు, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్ లతో కలిసి జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు శారీరక ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని, వైకల్యాన్ని జయించే శక్తి క్రీడలకు ఉందన్నారు. ప్రభుత్వాలు కూడా పారా క్రీడలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాయని ప్రతి ఒక్కరూ ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకునేలా క్రీడల్లో రాణించాలని సూచించారు. రన్నింగ్, షాట్పుట్, డిస్క్త్రో, జావెలిన్త్రో, లాంగ్జంప్, హై జంప్ అంశాల్లో జూనియర్, సబ్ జూనియర్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 150 మంది వరకు దివ్యాంగ క్రీడాకారులు పోటీలకు హజరుకాగా..జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమలో సమగ్ర శిక్ష జిల్లా కో ఆర్డినేటర్ ఎస్.సూర్యారావు, సహాయ కో–ఆర్డినేటర్ ఎం.భారతి, పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
20 లాడ్జిల్లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు
విజయనగరం క్రైమ్: విజయనగరం రైల్వేస్టేషన్ పరిఽధిలో గల పలు లాడ్జిల్లో వన్టౌన్ పోలీసులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నగరంలోని సీఎంఆర్ జంక్షన్ నుంచి స్వీట్ ఇండియా వరకు 20 లాడ్జిల్లో సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విస్తృత తనిఖీలు చేశారు. వన్టౌన్ సీఐ ఆర్వీఆర్కే చౌదరితో పాటు క్రైమ్ ఎస్సైలు సురేంద్రనాయుడు, రవిలు మూకుమ్మడిగా ఏకకాలంలో మొత్తం 20 లాడ్జిలలో సోదాలతో పాటు తనిఖీ చేశారు. రెండు రోజుల క్రితమే నగరం మొత్తం దాదాపు 120 ప్రాంతాల్లో వెయ్యి మంది సిబ్బందితో నాకాబందీ చేపట్టిన విషయం తెలిసిందే. ఆ తనిఖీల్లో దాదాపు 70 మంది వాహనాలను సీజ్ చేశారు. ఈ క్రమంలోనే వన్టౌన్ పోలీసులకు వచ్చిన సమాచారంతో క్రైమ్ ఎస్సై సురేంద్రనాయుడు రైల్వే స్టేషన్ వద్ద యామిని, ఎస్ఆర్, సామ్రాట్ లాడ్జిలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ లాడ్జిలలోనే నెలరోజుల క్రితం కొరాపుట్ నుంచి రెండు సూట్ కేసుల్లో గంజాయితో అనుమానితులు వచ్చిన దరిమిలా పోలీసులు విస్తృతంగా ఈ తనిఖీలు నిర్వహించారు. -
జాతీయ జంబోరీలో జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ బృందానికి అవార్డులు
విజయనగరం అర్బన్: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో నవంబర్ 23 నుంచి 29వ తేదీ వరకు జరిగిన భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 19వ జాతీయ జంబోరీలో జిల్లా బృందం అద్భుతంగా రాణించింది. దేశవ్యాప్తంగా 35 వేల మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ పాల్గొంటే ఆంధ్రప్రదేశ్ నుంచి 455 మంది, వారిలో విజయనగరం జిల్లా నుంచి 30 మంది పాల్గొన్నారు. అందులో కొత్తవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచే 27 మంది విద్యార్థులు పాల్గొనడం విశేషం. రాష్ట్రబృందం మొత్తం 9 అవార్డులు సాధించగా జిల్లా కంటిన్జెంట్ టీమ్ ఈ విజయంలో కీలకపాత్ర పోషించింది. గెలుచుకున్న అవార్డులలో బ్యాండ్–ఎ గ్రేడ్, మార్చ్పాస్ట్–ఎ గ్రేడ్, క్యాంప్క్రాఫ్ట్ ఎ గ్రేడ్, క్యాంప్ ఫైర్ –ఎ గ్రేడ్, స్టేట్ గేట్ –బి గ్రేడ్, పయనీరింగ్–బి గ్రేడ్, రంగోలి–సి గ్రేడ్ విభాగాలు ఉన్నాయి. జంబోరి ముగింపు కార్యమానికి రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్ధులను ఆశీర్వదించారు. జిల్లాకు చేరుకున్న విజేతల బృందానికి జిల్లా విద్యాశాఖ అధికారి యూ.మాణిక్యంనాయుడు మంగళవారం ఘనంగా స్వాగతం పలికారు. గెలుచుకున్న షీల్డ్లు, సర్టిఫికెట్లను విజేతలకు, గైడ్ టీచర్లకు అందజేశారు. బృంద ప్రతినిధులు ఏఎస్ఓసీ కె.దుర్గానాగేశ్వరరావు, డీటీసీ ఎ.కనకలక్ష్మి, కె.సూరిబాబులను డీఈఓ అభినందించారు. కార్యక్రమంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్ జిల్లా కార్యదర్శి వాక చిన్నంనాయుడు, కమిషనర్ ఈ.విజయకుమార్, సీఈఓ సన్యాసిరాజు, డైట్ వైస్ ప్రిన్సిపాల్ దత్తి అప్పలనాయుడు, నాగరాజు, శర్మ తదితరులు పాల్గొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో ఆర్టీసీ డ్రైవర్ మృతి
పాలకొండ రూరల్: మండలంలోని బుక్కూరు ఎస్సీవీధిలో నివాసముంటున్న పాలకొండ ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న జామి విఠల్రావు (49) అనుమానాస్పద రీతిలో మృతి చెందినట్లు ఎస్సై కె.ప్రయోగమూర్తి తెలిపారు. ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సోమవారం రాత్రి తన ఇంట్లో నిద్రించిన విఠల్రావు మంగళవారం ఉదయం విగత జీవిగా ఉండడాన్ని గుర్తించిన ఆయన తండ్రి రామప్పడు షాక్కు గురుయ్యారు. కరుణ అనే మహిళతో ఇటీవల విఠల్రావుకు వివాహమైంది. భార్య శ్రీకాకుళంలో ఉండడంతో భర్త మరణించినట్లు సమాచారం ఆమెకు అందించారు. ఆమె బుక్కూరు చేరుకుని భర్త మృతదేహంపై గాయాలున్నట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆమె అందించిన ఫిర్యాదుతో పోలీసులు, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సీఐ ఆమిటి ప్రసాద్ వివిధ కోణాల్లో తమదైన శైలిలో దృష్టి పెట్టామని చెప్పారు. తమ ఉద్యోగి జేవీ రావు మృతిపట్ల ఈయూ జోనల్ సెక్రటరీ బీకే.మూర్తి, సహ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. లారీ వ్యాన్ ఢీ● వ్యాన్ డ్రైవర్ మృతి దత్తిరాజేరు: మండలంలోని ఎస్ బూర్జవలస పోలీస్స్టేషన్ పరిధి మర్రివలస వద్ద జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడిశాకు చెందిన వ్యాన్ డ్రైవర్ మృతి చెందినట్లు ఎస్సై జి.రాజేష్ తెలిపారు. ఈ ప్రమాదంపై ఎస్సై, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రామభద్రపురం నుంచి వస్తున్న లారీ మరడాం నుంచి బొబ్బిలి వైపు వెళ్తున్న వ్యాన్ను ఢీకొనడంతో వ్యాన్ డ్రైవర్ తీవ్ర గాయాల పాలు కాగా 108లో విజయనగరం సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి కుటుంబ వివరాలు, చిరునామా తెలియాల్సి ఉందని కుటుంబసభ్యులు బుధవారం వచ్చి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయనున్నామని ఎస్సై తెలిపారు. -
గ్రామ సింహాల దండయాత్ర
పార్వతీపురం రూరల్: అవి వీధులు కావు..‘గ్రామ సింహాల’ అడ్డాలు! రోడ్డెక్కితే చాలు..మృత్యువు నాలుగు కాళ్ల రూపంలో వెంటాడుతోంది. పసివాడని లేదు..పండు ముసలి అని చూడవు. కనిపించిన వారిపై కసి తీరా విరుచుకుపడుతున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో వీధి కుక్కలు ‘గ్యాంగు’లుగా ఏర్పడి చేస్తున్న స్వైరవిహారంతో జనం గడప దాటాలంటేనే గజగజ వణికిపోతున్నారు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా, ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేసినా, క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం మాత్రం వీడలేదు. ఫలితంగా జిల్లాలో ఏటా వేల సంఖ్యలో జనం ఆస్పత్రుల పాలవుతున్నారు. బడి బాటలో..బెంబేలు కుక్కల దాడులు రోజురోజుకూ శ్రుతి మించుతున్నాయి. మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. పాఠశాలకు వెళ్తున్న ఇద్దరు చిన్నారులు, పనికి వెళ్తున్న ఓ వ్యక్తిపై కుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి. అలాగే పార్వతీపురం మండలం సంగంవలస గ్రామంలో సోమవారం, మంగళవారం గౌరమ్మ అనే ఇద్దరు మహిళలు కుక్కకాటు బారిన పడ్డారు. ఇటీవల ఈ గ్రామంలో కుక్కలు స్వైరవిహారం చేస్తూ దాడులకు తెగబడుతున్నాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా అభంశుభం తెలియని విద్యార్థులు ఆనందంగా బడికి వెళ్లాల్సిన సమయంలో కుక్కకాటుకు గురవుతూ ఆస్పత్రి బాట పడుతున్నారు. గుమ్మలక్ష్మీపురం, ఎల్విన్ పేట, పార్వతీపురం ప్రధాన రహదారులు, ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఇలా ప్రాంతం ఏదైనా పదుల సంఖ్యలో కుక్కలు తిష్ట వేసి వాహనదారులను, పాదచారులను హడలెత్తిస్తున్నాయి. పసిబిడ్డ ముఖంపై కోరల గాట్లు నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా మరో హృదయ విదారక ఘటన ఇటీవల పార్వతీపురం మండలం తాళ్లబురిడి గ్రామంలో చోటుచేసుకుంది. ఇంటి వద్ద ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారి టి.యశ్వంత్ కుమార్ పై కుక్క దాడి చేసి ముఖాన్ని తీవ్రంగా గాయపరిచింది. రక్తమోడుతున్న ఆ పసివాడిని చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. డోకిశీల ఆస్పత్రి నుంచి జిల్లా కేంద్రాస్పత్రికి తరలించి చికిత్స అందించాల్సి వచ్చింది. ఇంత జరుగుతున్నా పాలకులు, అధికారులకు మాత్రం చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం గమనార్హం. లెక్కలు భయంకరం..అధికారుల తీరు నిర్లక్ష్యం జిల్లాలో కుక్క కాటు బాధితుల సంఖ్య ఏటా ఆందోళనకరంగా పెరుగుతోంది. గత మూడేళ్లలో జిల్లావ్యాప్తంగా 12,831 మంది కుక్క కాటుకు గురయ్యారు. కేవలం పార్వతీపురం మండలంలోనే 4,783 కేసులు నమోదు కాగా, సీతానగరంలో 1,856 కేసులు ఉన్నాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన వారి సంఖ్య దీనికి అదనం. అధికారిక రికార్డుల్లో రేబిస్ మరణాలు లేవు అని అధికారులు గొప్పలు చెప్పుకుంటున్నా..క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరు. జియ్యమ్మవలస మండలంలో కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఉదంతాలు కంటతడి పెట్టిస్తున్నాయి. 2024 మే నెలలోనే బంటు లక్ష్మి(70), నీరస శంకరరావు(39) మృత్యువాత పడ్డారు. నవంబర్లో కందేన పారమ్మ కూడా కుక్కల దాడికి బలైంది. ఇవి అధికారుల కంటికి కనిపించడం లేదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆదేశాలు బుట్టదాఖలు..చర్యలు శూన్యం వీధి కుక్కల బెడద నివారణకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని సాక్షాతు్త్ సుప్రీంకోర్టు ఆదేశించింది. కానీ జిల్లాలో మాత్రం ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు. స్టెరిలైజేషన్ (కుటుంబ నియంత్రణ) ఆపరేషన్లు చేపట్టిన దాఖలాలు కానరావడం లేదు. అలాగే కుక్కలను సంరక్షణ కేంద్రాలకు తరలించడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. యుద్ధప్రాతిపదికన వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని, ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గడప దాటాలంటే చేతిలో కర్ర ఉండాల్సిందే మూడేళ్లలో 12 వేల మందికి పైగా కుక్కకాటు బాధితులు ఈ ఏడాదిలో 5422 మందిపై దాడి పార్వతీపురం మన్యం జిల్లాలో పడకేసిన వీధి కుక్కల నియంత్రణస్థానిక సంస్థలు స్పందిస్తేనే..‘ఏబీసీ’ సాధ్యం! వీధి కుక్కలను అరికట్టడానికి శాసీ్త్రయ పద్ధతిలో ‘ఏనిమల్ బర్త్ కంట్రోల్’ (ఏబీసీ–కుటుంబ నియంత్రణ) శస్త్రచికిత్సలు చేయడమే ఏకై క మార్గం. అయితే ఈ ప్రక్రియలో మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పాత్రే కీలకం. నిబంధనల ప్రకారం ముందుగా స్థానిక సంస్థలు ప్రత్యేక పర్యవేక్షణ కమిటీలను నియమించాలి. ఆయా కమిటీల ఆధ్వర్యంలో ప్రత్యేక సిబ్బందితో కుక్కలను పట్టుకుని, మా శాఖకు అప్పగించాల్సి ఉంటుంది. అలా పట్టుకువచ్చిన శునకాలకు మా పశువైద్యాధికారులు, సిబ్బంది వెంటనే శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు. శస్త్రచికిత్స అనంతరం వాటి బాగోగులు చూసి, తిరిగి పట్టుకున్న ప్రాంతాల్లోనే వదిలేయాలి. డా.మన్మథరావు, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి, పార్వతీపురం మన్యం -
పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రదాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునుంచి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. చదురుగుడి వద్దనున్న బాలాలయంలో మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలతో అర్చనలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారిణి కె.శిరీష కార్యక్రమాలను పర్యవేక్షించారు. న్యాయమూర్తి మానవతా దృక్పథంవిజయనగరం టౌన్: పాక్షికదృష్టి లోపంతో నడిరోడ్డుపై అగమ్యగోచరంగా ఓ వృద్ధుడు తిరుగుతున్నట్లు తెలుసుకున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత మానవతా దృక్పథంతో స్పందించారు. ఈ మేరకు జిల్లా న్యాయసేవాధికార సంస్ధ కార్యదర్శి కృష్ణప్రసాద్ను పంపించి ఆ వృద్ధుడిని ప్రేమసమాజంలో మంగళవారం చేర్పించారు. ఈ సందర్భగా వృద్ధుడి పేరు అప్పన్నగా కృష్ణప్రసాద్ తెలుసుకుని ఆశ్రమ నిర్వాహకులతో మాట్లాడి, బాగోగులను చూసుకోవాలని, ఎటువంటి సహాయ, సహకారాలు కావాల్సిన జిల్లా న్యాయసేవాధికార సంస్థను సంప్రదించాలని సూచించారు. చట్టప్రకారమే చర్యలు● ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి పార్వతీపురం రూరల్: సాలూరులో మంత్రి అనధికార పీఏ, ఓ ఒంటరి మహిళ పరస్పరం చేసుకున్న ఫిర్యాదులపై చట్టప్రకారమే నడుచుకుంటున్నామని, ఇందులో ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వీమాధవ్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగం పేరుతో మోసం చేశారని మహిళ, తమపై అసత్య ప్రచారాలు చేస్తూ కుట్ర పన్నుతున్నారని పీఏ వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు సాలూరులో రెండు కేసులు నమోదు చేశామన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నది అవాస్తవమని ఎస్పీ కొట్టిపారేశారు. ‘కేసులో వాస్తవాలను నిగ్గుతేల్చేందుకు సాంకేతిక ఆధారాలను, వాట్సాప్ చాటింగ్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపామని, ఆ నివేదిక ఆధారంగా, సమగ్ర విచారణ జరిపి తప్పు ఎవరిదైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తేల్చిచెప్పారు. సామాజిక రుగ్మతలపై.. గురజాడ ‘అక్షర’ కొరడా● చరిత్రను సాహిత్యంగా మలిచిన వైతాళికుడు● ప్రముఖ సాహితీవేత్త పొదిలాపు శ్రీనివాస్పార్వతీపురం రూరల్: గురజాడ లేని సాహిత్య జాడ శూన్యమని, తరాలు మారినా ఆయన అక్షరం తరగని గని అని ప్రముఖ సాహితీవేత్త పొదిలాపు శ్రీనివాస్ అభివర్ణించారు. పార్వతీపురం మన్యం పుస్తక మహోత్సవం మంగళవారంతో ఎనిమిదో రోజుకు చేరుకుంది. వంగపండు–భూషణం– గణేష్ పాత్రో సాహిత్య వేదికపై జరిగిన సభకు పిల్ల తిరుపతిరావు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా హాజరైన పొదిలాపు ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకుంది. పురాతన అహంకారం మొదలు..నేటి కార్పొరేట్ అధికారం వరకు సాగుతున్న దోపిడీని తన సాహిత్యంతో ఎండగట్టిన ధీశాలి గురజాడ అని కొనియాడారు. ‘కన్యాశుల్కం’ ద్వారా మహిళా లోకానికి వెలుగులద్ది, అణగారిన వర్గాల హక్కుల కోసం అక్షరాయుధాన్ని ప్రయోగించిన సంఘ సంస్కర్త అని ప్రస్తుతించారు. పేదల బతుకులను ఛిద్రం చేసే కుట్రలను తన రచనల ద్వారా ప్రతిఘటించిన తీరు అమోఘమన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి సిరికి స్వామినాయుడు రచించిన ‘శతర’ పుస్తకాన్ని సాహితీవేత్త అల్తి మోహన్న్ సమీక్షించారు. గురజాడ ఆశయ సాధనే లక్ష్యంగా సాగిన ఈ వేడుకలో కామాక్షి నృత్య ప్రదర్శన ఆహూతులను విశేషంగా అలరించింది. -
విద్యార్థుల వివరాల నమోదులో జాగ్రత్త
విద్యార్థుల వివరాల నమోదులో ఆందోళన వద్దు పదో తరగతి విద్యార్థుల వివరాలు నామినల్ రోల్స్లో ఎంట్రీ చేసేందుకు ఆందోళన చెందొద్దు. గడువు కూడా ఇచ్చే అవకాశం ఉంది. అయితే విద్యార్థులకు భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా నమోదు చేయాలి. నమోదు చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ప్రతి అక్షరం చెక్ చేయాలి.గడువు ఇచ్చే అవకాశం ఉంది కదా అని నిర్లక్ష్యంగా చేయకూడదు. – బి.మోహనరావు, డీఈఓ, విజయనగరంఈ ఏడాది గందరగోళం ఈ ఏడాది యూడైస్ ప్రామాణికంగా నామినల్ రోల్స్లో విద్యార్థుల వివరాలు నమోదుకు గందగోళంగా ఉంది.గతంలో ఇలా ఎప్పుడూ లేదు. అన్లైన్లో విద్యార్థుల వివరాలు నమోదు చేసేటప్పుడు పొరపాటున తప్పు దొర్లితే సరిదిద్దేందుకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు.దాంతో ఇబ్బందిగా ఉంది.యూడైస్ ప్లస్లో ఎడిట్,సేవ్ సబ్మిట్ ఆప్షన్,బీఎస్ఈ సైట్లో కూడా ఎడిట్,సేవ్ సబ్మిట్ ఆప్షన్స్ లేకుండా కేవలం యూడైస్ ప్లస్లో మాత్రమే సబ్మిట్ ఆప్షన్ పెట్టడం వల్ల 24 గంటల తర్వాత బీఎస్ఈ సైట్లో డేటా రిఫ్లెక్ట్ కావడం ఇబ్బందిగా ఉంది.విద్యాశాఖ ఉన్నతాధికారులు మాత్రం వివరాల నమోదు తర్వాత ఎడిట్ ఆప్షన్ ఇస్తామంటున్నారు. – వి.గోపాలనాయుడు, హెచ్ఎం, ఉన్నత పాఠశాల రామభద్రపురంరామభద్రపురం/మెరకముడిదాం: విద్యార్థులకు పదవ తరగతి సర్టిఫికెట్ ఎంతో కీలకం.మార్కులొక్కటే కాదు.. అందులో నమోదయ్యే వివరాలు కూడా ముఖ్యమే. భవిష్యత్లో ఉన్నత చదువులకే కాకుండా ఉపాధి అవకాశాలకు పదో తరగతి సర్టిఫికెట్లోని వివరాలే ప్రధానం.ఇంతటి ప్రాధాన్యం కలిగిన మార్కుల జాబితాల్లో విద్యార్థుల వివరాల్లో ఎలాంటి తప్పులు దొర్లకుండా చూడాల్సిన అవసరం ఇటు ఉపాధ్యాయులు, అటు విద్యార్థుల తల్లిదండ్రులపై ఉంది. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్ధులు 16,287 మంది. ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు 6,878 మంది మొత్తం 23,165 మంది పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. తాజాగా ఆన్లైన్లో వారి నామినల్ రోల్స్ ఎంట్రీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో పకడ్బందీగా విద్యార్థుల వివరాలు నమోదు చేయాలని, తప్పొప్పులు నమోదు కాకుండా చూడాలని, విద్యార్థుల వివరాల నమోదులో నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్లో విద్యార్థులకు ఇబ్బంది కలిగే ప్రమాదం ఉందని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. నామినల్ రోల్స్ చేయించుకునేటప్పుడు ఆపార్లో అన్ని వివరాలు అప్డేట్ ఉండాలి. దీంతో పదో తరగతి నామినల్ రోల్స్ ఎంట్రీ కోసం ఈ నెల 6 వ తేదీ గడువు కావడంతో వివరాల నమోదులో ఆయా పాఠశాలల హెచ్ఎంలు నిమగ్నమై ఉన్నారు.అలాగే ఆన్లైన్లో నామినల్ రోల్స్కు సంబంధించి వివిరాలు నమోదు చేసే సమయంలో పొరపాటున తప్పులు దొర్లితే సరిదిద్దేందుకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోవడంతో ఇబ్బందిగా ఉందని హెచ్ఎంలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్లో ఇబ్బంది పదో తరగతి నామినల్ రోల్స్ ఎంట్రీలో జాగ్రత్తలు అవసరం ఈ నెల 6వ తేదీ వరకు గడువు ఆన్లైన్లో ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోవడంతో హెచ్ఎంల ఇబ్బందులు -
అక్రమ తవ్వకాలు వాస్తవమే
కొత్తవలస: మండలంలో సర్వే నంబర్ 168లో గల ఫిరంగి కొండ వద్ద అక్రమ తవ్వకాలు జరుగుతుండడం వాస్తవమేనని తహసీల్దార్ పి.సునీత స్పంష్టం చేశారు. సాక్షి దిన పత్రికలో సోమవారం ప్రచురితమైన ‘కొండ’ పై అక్రమార్కుల ‘ఫిరంగి’ అనే కథనానికి రెవెన్యూ అదికారులు ఆగమేఘాలపై స్పందించారు.అక్రమ తవ్వకాల ప్రాంతంలో రెవన్యూ ఇన్స్పెక్టర్ షణ్ముఖరావు, వీఆర్ఓ ఆర్.రాధాకృష్ణతో పాటు మరికొంతమంది రెవెన్యూ సిబ్బంది సోమవారం విచారణ చేశారు. ఈ ప్రాంతంలో రాత్రి సమయాల్లో ముఖ్యంగా సెలవుదినాల్లో తవ్వకాలు జోరుగా జరుగుతున్నాయని స్థానికులు చెప్పారని తహసీల్దార్ సునీత తెలిపారు.ఈ తవ్వకాల వల్ల రెండు జీడిచెట్లు, ఒక తుమ్మచెట్టు నేలకొరిగినట్లు గుర్తించామన్నారు. తవ్వకాలను నిరోధించేందుకు ఆప్రాంతంలో వాహనాలు వెళ్లకుండా ఉండే విధంగా పెద్ద కందకం జేసీబీతో తవ్వించినట్లు తెలిపారు. అలాగే ఇప్పటి వరకు ఎంత మేర తవ్వకాలు జరిగాయో గుర్తించాలని మైనింగ్ శాఖ అధికారులకు లేఖ పంపించినట్లు చెప్పారు. రాత్రి వేళ అక్రమంగా తవ్వకాలు జరిపిన వ్యక్తులను తక్షణమే గుర్తించాలని పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఫిరంగి కొండ, గ్రేహౌండ్స్కు కేటాయించిన ప్రాంతంలో ప్రత్యేకించి ఇద్దరు వీఆర్ఏలను కాపలా నియమించినట్లు ఆమె తెలిపారు. తహసీల్దార్ పి.సునీత సాక్షి కథనంపై స్పందించిన రెవెన్యూ అదికారులు ఆక్రమార్కులను గుర్తించాలని పోలీసులకు ఫిర్యాదు -
సమర్థంగా విధుల నిర్వహణకు ఆరోగ్యం ముఖ్యం
● కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డిపార్వతీపురం: జిల్లా పరిపాలనా యంత్రాంగం సమర్థవంతంగా విధులను నిర్వహించాలంటే ఆరోగ్యం ముఖ్యమని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అధికారులు, సిబ్బంది కోసం ఏర్పాటుచేసిన వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ జిల్లా అబివృద్ధిలో పాలుపంచుకుంటున్న ప్రతి ఒక్క అధికారి, సిబ్బంది ఆరోగ్యం చాలా ముఖ్యమన్నారు. సిబ్బంది ఆరోగ్యం, శ్రేయస్సు దృష్ట్యా ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఈ శిబిరంలో కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, అంకాలజీ, జాయింట్ రీప్లేస్మెంట్, ఎకో, ఈసీజీ తదితర పరీక్షలను నిర్వహించి అనుభవజ్ఞులైన వైద్యులతో చికిత్సలు అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డా.పి.భాస్కరరావు, డీసీహెచ్ఎస్ డా.జి.నాగభూషణరావు, జిల్లా ఎయిడ్స్ నియంత్రణాధికారి డా.ఎం.వినోద్, ప్రోగ్రాం మేనేజర్ డా.టిజగన్మోహన్రావు, తదితరులు పాల్గొన్నారు. -
సకాలంలో వినతుల పరిష్కారం
● కలెక్టర్ డాక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డివిజయనగరం అర్బన్: జిల్లాలో ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు పీజీఆర్ఎస్ (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెవెన్స్ సిస్టమ్)ను సమర్థవంతంగా వినియోగించుకోవాలని అందుకు సంబంధించిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి ప్రజలు విశేషంగా స్పందించారు. ఈ సందర్భంగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ప్రజల నుంచి 201 వినతులను స్వీకరించారు. ప్రతి అర్జీదారుతో మాట్లాడి, వారి సమస్యలను శ్రద్ధగా విని వెంటనే సంబంధిత అధికారులకు పరిష్కార సూచనలు జారీ చేశారు. విభాగాల వారీగా స్వీకరించిన వినతులలో అత్యధికంగా రెవెన్యూశాఖకు 73, మిగిలిన వాటిలో డీఆర్డీఏ 32, గ్రామ సచివాలయం 12, మున్సిపాలిటీ 6, పంచాయతీరాజ్ 10, విద్యుత్ శాఖ 3, వైద్య ఆరోగ్యశాఖ 2, హౌసింగ్ 7, ఇతర శాఖలు మరో 50 అర్జీలు ఉన్నాయి. ఫిర్యాదులపై చర్యల విషయంలో అర్జీదారులతో మాట్లాడిన తేదీ, సమయాన్ని తప్పకుండా పోర్టల్లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మురళి, డి.వెంకటేశ్వరరావు, రాజేశ్వరి, ప్రమీల గాంధీ, బి.శాంతి, కళావతి, సర్వే శాఖ ఎ.డి ఆర్.విజయకుమార్, కలెక్టరేట్ పరిపాలనాధికారి దేవీప్రసాద్, సీపీఓ బాలాజీ, డీఈఓ మాణిక్యంనాయుడు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. అర్జీలు పునరావృతం కారాదు: కలెక్టర్ ప్రభాకరరెడ్డి పార్వతీపురం: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అందిన అర్జీలు ఎట్టిపరిస్థితుల్లో కూడా పునరావృతం కారాదని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి మండల స్థాయి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్కు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు 69 వినతులు అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదును శ్రద్ధతో పరిశీలించి ప్రజలకు సంతృప్తి కలిగే విధంగా నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. పరిష్కారంలో జాప్యం వహించరాదని స్పష్టం చేశారు. అధికారులు చిత్తశుద్ధితో సమస్యలను పరిష్కరించి ప్రజల మన్ననలను పొందాలని సూచించారు. ఒకవేళ అర్జీలు పరిష్కారం కాకపోతే అందుకు గల కారణాలను అర్జీదారులకు వివరించాలని కెప్పారు. అర్జీలను స్వీకరించినవారిలో డీఆర్ఓ కె.హేమలత, సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, ప్రత్యేక ఉప కలెక్టర్ పి.ధర్మచంద్రారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
అక్రమ కబేళాలు మూసివేయాలి
● ఏపీ గో సంరక్షణ సమాఖ్య డిమాండ్విజయనగరం: విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల కంటోన్మెంట్లో అక్రమంగా నడుస్తున్న గో మాంసం కబేళాలు, దుకాణాలపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గో సంరక్షణ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు లోగిశ రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కార్పొరేషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. స్థానిక కంటోన్మెంట్ మసీదు ఎదురుగా ఉన్న బిర్యానీ సెంటర్ వెనుక బ్లూ గేట్తో పాటు దాని చుట్టు పక్కల యథేచ్ఛగా ప్రతిరోజూ ఆవులు, దూడలను చంపి రాష్ట్రంలో కంపెనీలకు పంపిస్తున్నారని గతంలో మున్సిపల్ కమిషనర్, హెల్త్ ఆఫీసర్కు ఫిర్యాదు చేయగా వారి లైసెన్సులు రద్దు చేసినప్పటికీ కబేళాలు, షాపులను నిర్వహిస్తున్న వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని పేర్కొన్నారు. తక్షణమే అక్రమ కబేళాలు, గో వధ శాలల మూసివేతకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలని లేని పక్షంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపడతామని ఈ మేరకు కమిషనర్ నల్లనయ్యను మున్సిపల్ కార్యాలయంలో కలిసి నోటీసు ఇచ్చామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కేవీఆర్ సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి భీమపల్లి సంధ్యారాణి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పాడ పైడితల్లి, సారిక రేణుక తదితరులు పాల్గొన్నారు. -
13న జాతీయ లోక్ అదాలత్ను జయప్రదం చేయండి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబితవిజయనగరం లీగల్: ఈనెల 13న జరిగే జాతీయ లోక్ అదాలత్ను జయప్రదం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత అన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా కోర్టు పరిధిలో ఉన్న న్యాయమూర్తులందరితో ఆమె సమావేశమయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, మోటార్ ప్రమాద కేసులు, బ్యాంకుకేసులు, చెక్బౌన్స్, మనీ కేసులు, ప్రాంసరీ నోట్ కేసులు, పర్మినెంట్ ఇంజక్షన్ దావాలు, ఎకై ్సజ్, ల్యాండ్ కేసులు, మున్సిపాలిటీ కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులకు ఇరు పార్టీల అనుమతితో రాజీమార్గంలో శాశ్వత పరిష్కారం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు మొదటి న్యాయమూర్తి ఎం.మీనా దేవి, మూడవ అదనపు న్యాయమూర్తి కె.విజయకల్యాణి, నాల్గవ అదనపు న్యాయమూర్తి బి.అప్పలస్వామి, ఐదవ అదనపు న్యాయమూర్తి ఎం.పద్మావతి, పోక్సోకోర్టు జడ్జి కె.నాగమణి, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ జి. దుర్గయ్య,సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్పీ పీజీఆర్ఎస్కు 24 ఫిర్యాదులు
విజయనగరం క్రైమ్: ప్రతి వారం మాదిరిగానే జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక సోమవారం జరగ్గా రెండు చోట్ల ఫిర్యాదు దారుల నుంచి ఎస్పీ, ఏఎస్పీలు ఫిర్యాదులు స్వీకరించారు. సరిగ్గా పదిగంటలకు డీపీఓలోని కాన్ఫరెన్స్ హాలులో ఎస్పీ ఆదేశాలతో ఏఎస్పీ సౌమ్యలత ఫిర్యాదులు స్వీకరించారు. పన్నెండున్నర గంటలకు ఎస్పీ దామోదర్ తన చాంబర్లో ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తంగా 24 ఫిర్యాదులను స్వీకరించి ఏడు రోజుల్లో ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఎస్పీ, ఏఎస్పీలు ఆదేశించారు. కార్యక్రమంలో డీజీఆర్బీ సీఐ కె.కుమార స్వామి, ఎస్బీ సీఐలు ఏవీ లీలారావు, అంబేడ్కర్, ఎస్సై రాజేష్, సిబ్బంది పాల్గొన్నారు. ఐటీడీఏ పీజీఆర్ఎస్కు 27 వినతులు సీతంపేట: స్థానిక ఐటీడీఏలో పరిపాలనాధికారి వి.సునీల్ నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో 27 వినతులు స్వీకరించారు. మోంథా తుఫాన్ కారణంగా నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలని కోడిశ పంచాయితీ బిల్లగూడకు చెందిన అప్పన్న కోరాడు. కొంజరగూడ గ్రామస్తురాలు లలిత అంగన్వాడీ సెంటర్ మంజూరు చేయాలని, పొలంగూడ గ్రామస్తుడు రాజయ్య మేకల కొనుగోలుకు రుణం ఇప్పించాలని కోరారు. మండ పాఠశాల ఎండీఎం నిర్వాహకులు బియ్యం పాఠశాలకు సరఫరా చేయలని వినతి అందజేశారు. డిప్యూటీ ఈఓ రామ్మోహన్రావు, డీఈ నాగభూషణరావు, వ్యవసాయాధికారి వాహిని పాల్గొన్నారు. -
పవర్ లిఫ్టింగ్లో గోల్డ్మెడల్స్
● వన్ టౌన్ ఏఎస్సై త్రినాథ రావు ప్రతిభ ● అభినందించిన ఎస్పీ దామోదర్విజయనగరం క్రైమ్: రాష్ట్ర స్థాయి డెడ్ లిఫ్ట్, బెంచ్ ప్రెస్ చాంపియన్ షిప్ పోటీల్లో రెండు గోల్డ్ మెడల్స్ సాధించిన విజయనగరం వన్ టౌన్ ఏఎస్సై త్రినాథ్ను ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ సోమవారం అభినందించారు. వన్ టౌన్లో ఏఎస్సై పని చేస్తున్న ఆల్తి త్రినాథరావు ఇటీవల విశాఖలోని వెలమపేట శ్రీ విజయేంద్ర వ్యాయామ మండలిలో ‘పవర్ లిఫ్టింగ్ ఆఫ్ ఇండియా‘ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో రెండు బంగారు పతకాలు సాధించారు. బంగారు పతకాలు సాధించిన ఏఎస్జై ఆల్తి త్రినాథరావు ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ను ఆయన చాంబర్ లో సోమవారం మర్యాద పూర్వకంగా కలిసిన సందర్భంగా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి, ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులో కూడా కొనసాగించి, జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలు సాధించాలని అభిలషించారు. గత నెల 30న జరిగిన రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ సెలక్షన్స్ కమ్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో మాస్టర్స్ విభాగం 60+, 93 కేటగిరిలో ఏఎస్సై త్రినాథరావు బెంచ్ ప్రెస్లో 95 కిలోలు, డెడ్ లిఫ్ట్లో 142.5 కిలోల బరువును ఎత్తి, రెండు విభాగాల్లోను బంగారు పతకాలు సాధించి, స్టేట్ సెలక్షన్స్కు కూడా ఎంపికయ్యారు. కార్యక్రమంలో విజయనగరం వన్ టౌన్ సీఐ ఆర్వీఆర్కే చౌదరి, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
నేడు జిల్లా స్థాయి పోటీలు
పాలకొండ రూరల్: పారా ఒలింపిక్స్ అసోసియేషన్ సౌజన్యంతో మంగళవారం జిల్లాస్థాయి దివ్యాంగుల క్రీడాపోటీలు చేపట్టనున్నామని సహిత విద్య జిల్లా కోఆర్డినేటర్ పి.భానుమూర్తి తెలిపారు. 13–20 ఏళ్లలోపు 40 శాతం దివ్వాంగులైన ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాల్లో చదువుతున్న బాల బాలికలు ఈ పోటీలకు అర్హులన్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలో గల నర్సిపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఈ పోటీలు చేపడతామని పేర్కొన్నారు. సోమవారం పాలకొండ వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ డీఈఓ బి.రాజ్కుమార్, సమగ్ర శిక్ష అదనపు సమన్వయకర్త తేజేశ్వరరావుల పర్యవేక్షణలో ఈ పోటీలు జరుగుతాయని చెప్పారు. ప్రధాన రహదారి నుంచి క్రీడా వేదిక వద్దకు నడవ లేని వారి కోసం ప్రత్యేక వాహనం ఏర్పాటు చేశామని, ఔత్సాహిక క్రీడాకారులకు భోజన వసతితో పాటు అవసరమైన క్రీడా పరికరాలు తామే సమకూరుస్తామని తెలిపారు. జాతీయ తైక్వాండో పోటీల్లో నేషనల్ స్కూల్ విద్యార్థికి కాంస్యంవిజయనగరం అర్బన్: ఉత్తరప్రదేశ్లో ఇటీవల జరిగిన జాతీయ స్థాయి అండర్–17 తైక్వాండో పోటీల్లో పట్టణానికి చెందిన ది నేషనల్ స్కూల్ విద్యార్థి వై.ముఖేష్ విశ్వనాఽథ్కు కాంస్య పతకం లభించింది. ఈ మేరకు సోమవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విజేతను పాఠశాల కరస్పాండెంట్ బొడ్డు రామారావు, స్కూల్ ఇన్చార్జ్ దీపక్, ఉపాధ్యాయులు అభినందించారు. -
ముగిసిన రాష్ట్ర స్థాయ చదరంగం పోటీలు
విజయనగరం అర్బన్: పట్టణంలోని ఇన్స్పిరో లార్వెన్స్ స్కూల్లో జరిగిన అండర్–15 ఓపెన్ చదరంగ (చెస్) రాష్ట్ర స్థాయి పోటీలు సోమవారం ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆరు జిల్లాల నుంచి సుమారు వందమంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. వివిధ విభాగాల్లో మొత్తం 60 మంది విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ పోటీల్లో అండర్–11 విభాగంలో పర్వేశ్కు స్టేట్ ఫస్ట్, అండర్–13 బాలికల విభాగంలో జాస్మిస్ స్టేట్ ఫస్ట్, అలాగే అండర్–13 విభాగంలో ఆర్వీ మాధురి మోక్షిత ద్వితీయ స్థానంలో నిలిచారు. టోర్నమెంట్ నిర్వహణలో జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బీఏరావు, కార్యదర్శి ఏడీఎస్ఎస్వీప్రసాద్ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథులుగా లార్వెన్స్ స్కూల్ డైరెక్టర్ మండా రవి, శ్రీకాకుళం చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.భీమారావు, కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. వ్యక్తి అదృశ్యంవిజయనగరం క్రైమ్: విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మావతి నగర్కు చెందిన కోసల ధర్మేంద్ర (33) అదృశ్యమయ్యా డు. ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. నగర శివారులోని పద్మావతినగర్లో ఉంటున్న కోసల ఽపెదబాబు కొడుకు ధర్మేంద్ర అక్టోబర్ పదవ తేదీన ఇంట్లోంచి వెళ్లి పోయాడు. అప్పటి నుంచి చుట్టుపక్కల స్థానికులు, బంధువులు, స్నేహితులను వాకబు చేసినా అచూకీ దొరకలేదు. ఈ మేరకు రూరల్ పోలీస్ స్టేషన్కు వచ్చి తన కొడుకు కనిపించకుండా పోయాడని పెదబాబు సోమవారం ఫిర్యాదు చేశాడని రూరల్ ఎస్సై అశోక్ తెలిపారు. పెళ్లయి ఇద్దరు పిల్లలున్న ధర్మేంద్రకు ఆర్థిక ఇబ్బందులు తోడవడంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడని, తమకు వచ్చిన సమాచారం మేరకు దర్యాప్తు చేస్తున్నామన్నారు. సర్వజన ఆస్పత్రి సిబ్బంది అలసత్వం● పక్షవాతం రోగికి ఇంజక్షన్ చేయడంలో నిర్లక్ష్యం ● రోగి బంధువులు పలుమార్లు అడిగినా పట్టించుకోని సిబ్బందివిజయనగరం ఫోర్ట్: పక్షవాతం (బ్రెయిన్ స్ట్రోక్) వచ్చిన రోగికి వైద్యుడు సూచించిన ఇంజక్షన్లు చేయడంలో వైద్య సిబ్బంది అలసత్వం వహించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గంట్యాడ మండలానికి చెందిన బి.అప్పారావుకు మూతివంకరపోయి, మాట రాకపోవడంతో వారి బంధువులు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఆదివారం చేర్పించారు. క్యాజువాలిటీలో చూపించిన అనంతరం మేల్ మెడికల్ వార్డుకు తరలించారు. సోమవారం ఉదయం రౌండ్స్ వేసిన వైద్యులు అతనికి స్ట్రోక్ తగ్గడానికి అవసరమైన ఇంజక్షన్లు కేషీట్పై రాసి వాటిని అప్పారావుకు చేయాలని సూచించారు. అయితే అ ఇంజక్షన్లు రోగి బెడ్పైనే నర్సింగ్ సిబ్బంది పెట్టి వదిలేశారు. ఇంజక్షన్లు చేయాలని పలుమార్లు నర్సింగ్ సిబ్బందిని రోగి బంధువు అడిగినప్పటికీ పట్టించుకోలేదు. మధ్యాహ్నం 3:30 గంటల వరకు ఇంజక్షన్లు అలాగే వదిలేశారు. మధ్యాహ్నం డ్యూటీకి వచ్చిన నర్సింగ్ సిబ్బంది దగ్గరకు రోగి బంధువు వెళ్లి ఇంజక్షన్లు అలానే వదిలేశారు. చేయండని చెబితే అప్పడు వచ్చి నాలుగు గంటల సమయంలో ఇంజక్షన్లు చేశారు. ఇదేవిషయాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ వద్ద సాక్షి ప్రస్తావించగా ఎందుకు ఇంజక్షన్లు చేయడంలో జాప్యం చేశారో విచారణ చేపడతామని తెలిపారు. సాలూరులో అభ్యుదయం సైకిల్ యాత్రసాలూరు: డ్రగ్స్కు వ్యతిరేకంగా ఎస్పీ మాదవరెడ్డి ఆధ్వర్యంలో సాలూరు పట్టణంలో అభ్యుదయం సైకిల్ యాత్ర సోమవారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్పీతో పాటు సీ్త్ర శిశు సంక్షేమ,గిరిజన సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి పాల్గొన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి డీలక్స్ సెంటర్ వరకు విద్యార్థులతో కలిసి నిర్వహించిన భారీ ర్యాలీలో సీఐలు అప్పలనాయు డు, రామకృష్ణ, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది, ప లువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
సర్వకాలీనం, సార్వజనీనం భగవద్గీత
విజయనగరం: కురుక్షేత్ర యుద్ధ సమయంలో శ్రీకృష్ణపరమాత్ముడు కర్తవ్య నిర్వహణ గురించి అర్జునుడికి చేసిన హితబోధే భగవద్గీత అని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, శ్రీ సాయి సత్సంగ సేవా సంఘం వ్యవస్థాపకుడు ఉపద్రష్ట వరప్రసాద్ పేర్కొన్నారు. గీతా జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు భాష పరిరక్షణ సమితి అధ్యక్షుడు సముద్రాల గురు ప్రసాద్ ఆధ్వర్యంలో కేఎల్పురంలో గల గీతాంజలి స్కూల్లో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వరప్రసాద్ మాట్లాడారు. భగవద్గీతలోని ప్రతి అక్షరం ఒక శక్తిమంతమైన బాణం అని, ప్రతి భావం అమూల్య సందేశం అని భగవద్గీత సర్వకాలికం, సార్వజనీనం అని అన్నారు. రచయిత, ప్రముఖ వైద్యుడు డాక్టర్ జీవీఎన్ భూపతి మాట్లాడుతూ భగవద్గీత ధర్మయుద్ధానికి సంబంధించిన సందేశం మాత్రమే కాదు. మానవ జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారాలను అందించే జీవన శాస్త్రం అన్నారు. అందుకే భగవద్గీత ఒక ఆధ్యాత్మిక గ్రంథమేకాదు, మానసిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి సంపూర్ణ మార్గదర్శిని అని పేర్కొన్నారు కార్యక్రమంలో భాగంగా పూసపాటి రేగకు చెందిన టేకుమళ్ల అమిత్ సాయి శశాంక్ భగవద్గీత లోని భక్తి యోగాన్ని అర్థవంతంగా భక్తిశ్రద్ధలతో చదివి వినిపించారు .ఈ సందర్భంగా ఉపద్రష్ట వరప్రసాద్, డాక్టర్ జీవీఎన్ భూపతి లను పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాసరావు, డైరెక్టర్ రాజేష్, ప్రిన్సిపాల్ మల్లికలతో కలిసి గురుప్రసాద్ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సమితి కార్యదర్శి డాక్టర్ జక్కు రామకృష్ణ, సలహాదారు సుభద్రాదేవి, డిమ్స్ రాజు, గిరి తదితరులు పాల్గొన్నారు. -
ఎయిడ్స్ పట్ల అవగాహన కల్పించాలి
● కలెక్టర్ రాంసుందర్ రెడ్డివిజయనగరం ఫోర్ట్: హెచ్ఐవీ/ఎయిడ్స్ పట్ల విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ నియంత్రణ దినోత్సవం సందర్భంగా స్థానిక ఆర్టీసీ కాంపెక్స్ నుంచి సోమవారం నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎయిడ్స్ పట్ల అప్రమత్తంగా ఉండేందుకు నిరంతరం అవగాహన కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఎయిడ్స్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఎయిడ్స్/హెచ్ఐవీ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపకూడదని హితవు పలికారు. వారు కూడా సమాజంలో భాగమేనన్నారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణ ప్రసాద్, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్. జీవనరాణి, డీఎల్ఓ డాక్టర్ కె.రాణి, సెట్విజ్ సీఈఓ వి.విశ్వేశ్వరరావు, రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ ప్రసాదరావు, నేచర్ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
ఎయిర్పోర్ట్కు వసతులు కల్పించండి
● కలెక్టర్ రాంసుందర్రెడ్డి విజయనగరం అర్బన్: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అవసరమైన మౌలిక వసతుల కల్పన పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్.రాంసందర్రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. విమానాశ్రయానికి రోడ్లు, కాలువలు, విద్యుత్, నీటి సరఫరా, భూసేకరణ తదితర అంశాలపై తన చాంబర్లో అధికారులతో సోమవారం సమీక్షించారు. ఎయిర్పోర్టుకు నీటిని అందించేందుకు సుమారు రూ.20 కోట్లతో చేపట్టిన పనుల పురోగతిపై ఆరా తీశారు. విద్యుత్లైన్ ఏర్పాటుపై సంబంధిత అధికారులను ప్రశ్నించారు. విద్యుత్లైన్ కోసం రూ.85 లక్షల ఖర్చవుతుందని, సుమారు 15 కిలోమీటర్లమేర లైన్ వేయాల్సి ఉంటుందని అధికారులు వివరించారు. ఎయిర్పోర్ట్ను వర్షపు నీరు ముంచెత్తకుండా సుమారు రూ.27కోట్ల వ్యయంతో 25 కిలోమీటర్ల మేర నాలుగు కెనాల్స్ తవ్వాల్సి ఉందని, దీనికోసం వెంటనే అంచనాలు సిద్ధం చేయాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. సవరవిల్లి–తూడెం గ్రామాల మధ్య 2.3 కిలోమీటర్ల మేర నిర్మించనున్న సీసీ రోడ్డు పనుల అంచనాలు అత్యవసరంగా సిద్ధం చేయాలన్నారు. విమానాశ్రయ స్టాఫ్ కార్వర్టర్స్, ఇతర అవసరాల కోసం జరగాల్సిన భూసేకరణపై సమగ్రంగా చర్చించారు. సమావేశంలో జేసీ ఎస్.సేతుమాధవన్, ఆర్డీఓ డి.కీర్తి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కవిత, ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ లక్ష్మణరావు, మైనర్ ఇరిగేషన్ ఈఈ వెంకటరమణ, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
గ్యాస్ సరఫరా చేయకుండా.. భోజనం వండేది ఎలా?
గ్యాస్ సరఫరా చేయకుండా పాఠశాలల పిల్లలకు మధ్యాహ్న భోజనం వండేది ఎలా ‘బాబూ’ అంటూ నిర్వాహకులు ఆందోళన వ్యక్తంచేశారు. తమ సమస్యలు పరిష్కారం కోరుతూ ఏపీ మధ్యాహ్నభోజన కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విజయనగరం కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా చేశారు. మెనూ చార్జీలు ఒక్కో విద్యార్థికి రూ.20 చొప్పున చెల్లించాలని, భోజన కార్మికులకు నెలకు రూ.10వేలు జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక భోజన బకాయిలు పేరుకుపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తంచేశారు. – సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం -
మహిళ ఫిర్యాదు చేసినా పట్టించుకోరా?
● మంత్రి సంధ్యారాణి తీరుపై ధ్వజమెత్తిన మాజీ ఎమ్మెల్యే కళావతి వీరఘట్టం: ఒక మహిళా మంత్రి అయి ఉండి, మరో మహిళకు రక్షణ కల్పించడంలో వివక్ష చూపించారు.. ఉద్యోగిని అయిన ఒంటరి మహిళ రక్షణ కోరి వస్తే ఆదుకోకపోగా.. ఆమైపె దురుసుగా విరుచుకుపడి, ఆమెను వేధింపులకు గురి చేశారు.. ఒంటరి మహిళకు అండగా ఉండి ఆమె గోడును ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన మీడియాపై మంత్రి సంధ్యారాణి కక్ష సాధింపు చర్యలు చేపట్టడం సమంజసం కాదని మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అన్నారు. వండువలో ఆమె విలేకర్లతో సోమవారం మాట్లాడారు. భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఓ మహిళకు ఉద్యోగం ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి ఆమె నుంచి డబ్బులు కాజేసిన మంత్రి పీఏపై చర్యలు తీసుకోకుండా, తప్పుచేసిన వారిని వదిలేసి, ఆ తప్పును వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’పై కేసులు పెట్టి భయపెడుతుండడం రెడ్బుక్ రాజ్యాంగానికి పరాకాష్టగా పేర్కొన్నారు. ఒక గిరిజన మంత్రి అయి ఉండి, గిరిజనుల సంక్షేమాన్ని ఏనాడైనా పట్టించుకున్నారా అని మంత్రి సంధ్యారాణిని ప్రశ్నించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన విద్యార్థుల అకాల మరణాలపై ఎందుకు మంత్రి స్పందించడం లేదని ధ్వజమెత్తారు. మృతుల కుటుంబాలను ఎందుకు ఆర్థికంగా ఆదుకోలేకపోయారో చెప్పాలన్నారు. మహిళోద్ధరణకు కట్టుబడి ఉన్నామని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం మంత్రి కుమారుడి విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. ఓ ఆడబిడ్డ అవమానాలను భరించి, అన్ని ఆధారాలతో ఫిర్యాదుచేసినా నిందితులను ఎందుకు అరెస్టుచేయలేదన్నారు. తక్షణమే బాధిత మహిళకు మంత్రి సంధ్యారాణి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
పండగ వాతావరణంలో పీటీఎం నిర్వహణ
● కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి విజయనగరం అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 5వ తేదీన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (పీటీఎం)ను పండగ వాతారణంలో నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తోందని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి తెలిపారు. తన చాంబర్లో పీటీఎం షెడ్యూల్ను సోమవారం విడుదల చేశారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మెగా పీటీఎం కార్యక్రమాలను నిర్వహిస్తామని కలెక్టర్ వెల్లడించారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.45 గంటలకు పీటీఎం ముగుస్తుందన్నారు. కార్యక్రమంలో డీఈఓ యు.మాణిక్యంనాయుడు, సమగ్రశిక్ష ఏపీసీ డాక్టర్ ఎ.రామారావు పాల్గొన్నారు. మెట్టపల్లిలో వైద్య శిబిరం ● వైద్య శిబిరాన్ని సందర్శించిన డీఎంహెచ్ఓ చీపురుపల్లి: స్క్రబ్ టైఫస్ వైరస్ కలకలం నేపథ్యంలో చీపురుపల్లి మండలం మెట్టపల్లి గ్రామంలో సోమవారం వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. స్క్రబ్ టైఫస్ వైరస్ లక్షణాలతో భార్య మృతి చెందినట్టు భర్త తెలిపిన వివరాల మేరకు గతనెల 30న ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు వైద్య సిబ్బంది స్పందించారు. కర్లాం పీహెచ్సీ వైద్యాధికారి శ్రీలక్ష్మి, సిబ్బంది వైద్యశిబిరం నిర్వహించారు. గ్రామంలో జ్వరాలతో బాధపడుతున్న వారి నుంచి రక్త నమూనాలు సేకరించారు. డీఎంహెచ్ఓ జీవనరాణి వైద్య శిబిరాన్ని సందర్శించి వైద్యాధికారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మృతురాలు చికిత్స పొందిన ఆస్పత్రి వివరాలపై ఆరా తీశారు. ప్రస్తుతం మెట్టపల్లిలో ఎలాంటి స్క్రబ్ టైఫస్ వైరస్ వ్యాప్తిచెందలేదని పీహెచ్సీ వైద్యాధికారి శ్రీలక్ష్మి తెలిపారు. డీఎంహెచ్ఓ వెంట జిల్లా ఇమ్యూనిటీ అధికారి సత్తిరాజు, జిల్లా సర్వేలైన్స్ అధికారి సత్యనారాయణ ఉన్నారు. పార్వతీపురం: విపత్తులు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ముందస్తు జాగ్రత్తలు అవసరమని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అన్నా రు. కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏపీ విపత్తుల స్పందన, అగ్నిమాపక సేవల శాఖ జిల్లా కు సరఫరా చేసిన రక్షణ పరికరాలను కలెక్టర్ సోమవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విపత్తులశాఖ సామర్థ్యా న్ని మరింత పెంపొందించుకోవాలన్నారు. రక్ష ణ పరికరాలతో జిల్లాలోని ప్రజలకు సమయానుకూలంగా, త్వరితగతిన, నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో విపత్తుల నిర్వాహణాధికారి పి.సింహాచలం, సిబ్బంది పాల్గొన్నారు. -
మంత్రి కుమారుడు, పీఏపై చర్యలేవీ?
● బాధిత మహిళకు న్యాయం చేయకుండా.. వేధింపులకు గురి చేస్తారా..? ● నిందితులు దర్జాగా తిరుగుతున్నారు.. ● ఇదేం వివక్ష వైఖరి ● చర్యలు తీసుకోకుంటే ఉద్యమిస్తాం: ఐద్వా పార్వతీపురం రూరల్: మహిళను లైంగికంగా, మానసికంగా వేధించిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కుమారుడు, పీఏలపై నేటి వరకూ ఎందుకు చర్యలు తీసుకోలేదని ఐద్వా నాయకులు ప్రశ్నించారు. సాలూరుకు చెందిన ఒక మహిళా ఉద్యోగిని.. తనను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేసినట్లు ఆధారాలతో సహా పార్వతీపురం ఏఎస్పీకి ఫిర్యాదు చేసిందని గుర్తు చేశారు. నిందితులు ఇరువురిపై కేసులు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాల్సిన యంత్రాంగం ఆ దిశగా చేయలేదని... పైగా ఫిర్యాదు చేసిన మహిళకు వైద్య పరీక్షల నిమిత్తం వివిధ ఆస్పత్రులకు తిప్పుతూ, తన వ్యక్తిగత సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని తీవ్ర ఇబ్బందులకు గురి చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. అధికారులు ఈ రకమైన కక్షపూరిత వైఖరి ప్రదర్శించడం పట్ల అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించారు. పార్వతీపురంలోని సుందరయ్య భవనంలో ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.శ్రీదేవి, బి.లక్ష్మి మీడియాతో సోమవారం మాట్లాడారు. రాష్ట్ర సీ్త్రశిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వ్యక్తిగత సిబ్బంది, కుమారునిపై ఇంతటి తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పటికీ.. కనీసం వారిపై చర్యలు చేపట్టక పోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. నిందితులు దర్జాగా తిరుగుతున్నారని, ఫిర్యాదు చేసిన మహిళను మాత్రం తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ● పశ్చాత్తాపం లేని మంత్రి మంత్రి ఇటీవల చేసిన పత్రిక ప్రకటనలో నిందితులను శిక్షిస్తామని గానీ, జరిగిన తప్పు సరిదిద్దుతామని గానీ మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. పైగా ఫిర్యాదు చేసిన మహిళను బెదిరించే విధంగా ప్రకటించడంపై ఐద్వా తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకొని మహిళలను వేధింపులకు గురిచేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధిత మహిళకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఐద్వా ఆధ్వర్యంలో బాధిత మహిళకు మద్దతుగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా ఉపాధ్యక్షులు ఎం.గౌరమ్మ పాల్గొన్నారు. -
చివరిలో.. దిత్వా అలజడి
● ధాన్యం కొనుగోలు అంతంత మాత్రమే... జొన్నవలసలో ఇలా... తడిసి ముద్దయిన వరి పనలువిజయనగరం ఫోర్ట్: వరి పంట కోతకొచ్చే సమయంలో మోంథా తుఫాన్ ముంచేసింది. పంటను నేలపాలచేసింది. ఇప్పుడు కోత, పనలు, నూర్పిడి పనుల దశలో దిత్వా తుఫాన్ రైతన్న గుండెల్లో అలజడి రేపుతోంది. మొన్నటివరకు వాతావరణం బాగుండడం, జిల్లాకు తుఫాన్ ముప్పు ఉండదని భావించి వరి కోతలు యథావిధిగా సాగించారు. నూర్పిడిలు పూర్తిచేసి ధాన్యం రాశులను కళ్లాల్లోనే ఉంచారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి చిరుజల్లులు కురవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వరి పంటను రక్షించుకునేందుకు సోమవారం ఉదయం పొలాలకు పరుగు తీశారు. ● 1.25 లక్షల హెక్టార్లలో వరి పంట సాగు.. జిల్లాలో వరి పంట 1.25 లక్షల హెక్టార్లలో సాగైంది. ఇందులో ఇప్పటి వరకు 60 శాతం మేర వరి కోతలు పూర్తయ్యాయి. రేగిడి ఆమదాలవలస, రాజాం, సంతకవిటి, వంగర, బొబ్బిలి, మెంటాడ, గజపతినగరం, జామి, గంట్యాడ, బొండపల్లి, రామభద్రపురం తదితర మండలాల్లో వరి పంట నూర్పులు ముమ్మరంగా జరుగుతున్నాయి. కొన్ని మండలాల్లో వరి పంట పనలపైన, కుప్పల రూపంలో ఉంది. తుఫాన్ వర్షాలకు పనలపై ఉన్న వరిపంట తడిసి ముద్దయింది. కళ్లాల్లో ఉన్న ధాన్యం రాశులు తడిచిపోకుండా కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. టార్పాలిన్లను అద్దెకు తెచ్చుకొని ధాన్యం రాశులు, కుప్పలపై కప్పుతున్నారు. వర్షాలు కురిసే సమయంలో పంట రక్షణకు ఉపయోగపడే టార్పాలిన్లను సైతం చంద్రబాబు ప్రభుత్వం రాయితీపై అందజేయలేదని రైతులు వాపోతున్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు అంతంత మాత్రంగానే జరుగుతుందని రైతులు చెబుతున్నారు. నూర్పుడి పూర్తయిన వెంటనే ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు. ఈ ఏడాది వరి దిగుబడి అంచనా 7 లక్షల మెట్రిక్ టన్నులు. ఇందులో కొనుగోలు లక్ష్యం 4 లక్షల మెట్రిక్ టన్నులు. అయితే, ఇప్పటివరకు వరి పంట నూర్పిడి చేసిన రైతుల నుంచి 45వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు వ్యవసాయ అధికారులు షెడ్యూల్ ఇవ్వగా 35వేల మెట్రిక్ టన్నులే కొనుగోలు చేశారు. మిగిలిన 10వేల టన్నల ధాన్యం రాశుల రూపంలో కళ్లాలు, పొలాల్లోనే ఉంది. ఇంటిల్లిపాదీ ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంటను ఓ వైపు తుఫాన్ వర్షాలు తడిపేస్తుండగా.. మరోవైపు ప్రభుత్వం ఆదుకునే చర్యలు చేపట్టకుండా రైతన్నను క(న)ష్టాల్లోకి నెట్టేస్తోందంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. వరి కుప్పలపై వేసిన టార్పాలిన్లు విజయనగరం మండలం రాకోడులో ధాన్యం తడిసిపోకుండా టార్పాలిన్లు కప్పుతున్న రైతులు షెడ్యూల్ ఇస్తారు.. పంట నూర్పిడి పూర్తయిన వెంటనే రైతు సేవా కేంద్రంలో ఉన్న వ్యవసాయ సహాయకులకు చెబితే పంట కొనుగోలుకు షెడ్యూల్ ఇస్తారు. తేమ శాతాన్ని పరీక్షించి ధాన్యం కొనుగోలు చేస్తారు. ఎక్కడైనా పంట కొనుగోలులో ఇబ్బంది వస్తే సంబంధిత వ్యవసాయ అధికారికి, సీఎస్డీటీకి చెబితే చర్యలు తీసుకుంటారు. – వి.తారకరామారావు, జేడీ, వ్యవసాయశాఖ పొలాల్లోనే వరి కుప్పలు, ధాన్యం రాశులు ధాన్యం తడిసిపోకుండా కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్న రైతులు టార్పాలిన్లు సరఫరా చేయని ప్రభుత్వం మందకొడిగా ధాన్యం కొనుగోళ్లు -
ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు
విజయనగరం అర్బన్: ప్రీ ఆడిట్, ఆడిట్ ప్రక్రియల్లో ఫిర్యాదుదారుల సంతృప్తి స్థాయి పెరగాల్సిన అవసరం ఉందని, ఫిర్యాదు పరిష్కారంలో అలసత్వం చూపే అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి హెచ్చరించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ వినతుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పీజీఆర్ఎస్కు సంబంధించిన సమావేశాలకు ఆడిట్ అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి మ్యుటేషన్లపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో మండల ప్రత్యేకాధికారులు ప్రత్యేకశ్రద్ధ వహించాలని సూచించారు. మ్యుటేషన్ల దరఖాస్తుల పరిశీలన, తిరస్కరణ అంశాలపై నేరుగా విచారణ జరపాలన్నారు. సమావేశంలో జేసీ సేతుమాధవన్, ప్రత్యేక ఉపకలెక్టర్ మురళీ సహా పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఇది అనధికార లే అవుట్ చీపురుపల్లి: ‘ఇది అనధికార లే అవుట్.. ఈ లే అవుట్కు ఎలాంటి అనుమతులు లేవు.. క్రయ విక్రయాలకు గ్రామ పంచాయతీ ఎలాంటి బాధ్యత వహించదు.. ఇక్కడ ప్లాట్లు కొన్న వారికి ఇంటి ప్లాన్లు ఆమోదించబడవు.. తాగునీటి సదుపాయం అనుమతించబడదు’.. ఇదీ రావివలస రెవెన్యూ పరిధిలో వెలసిన అనధికార రియల్ ఎస్టేట్ వెంచర్లో అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డు. రావివలస రెవెన్యూ పరిధిలో ఏర్పాటైన అనధికార లే అవుట్పై ‘దర్జాగా రియల్ దందా’ అనే శీర్షికన గతనెల 30న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. అదేరోజు ఎంపీడీఓ సురేష్ ఆధ్వర్యంలో సిబ్బంది రియల్ ఎస్టేట్ వెంచర్ను పరిశీలించి నోటీసులు జారీచేశారు. పంచాయతీ కార్యదర్శి కె.సతీష్, వీఆర్వో ఏ.జగన్నాథం నేతృత్వంలో అనధికార లే అవుట్లో సోమవారం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. సర్వే నంబర్ 164/11,12,13,14,15, 165/1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 11, 12, 13, 14, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 166/1, 2, 3పి, 4పి నంబర్లల్లో ఏర్పాటు చేసిన లే అవుట్కు ఎలాంటి అనుమతులు లేవని హెచ్చరిక బోర్డులో పేర్కొన్నారు. అనుమతులు లేకుండా లేఅవుట్లు వేసి విక్రయాలు జరిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ● హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిన అధికారులు ● ఇంటి ప్లాన్లు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం మంజూరు చేయం -
వేతనదారులపై వేటు..!
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేదలకు ఒక వరం. అలాంటి పథకం అమలుపై చంద్రబాబు ప్రభుత్వం కొత్త కుట్రలకు తెర తీస్తోంది. పేదల ఉపాధి కొట్టేందుకు చర్యలకు ఉపక్రమించింది. దీనికి ఈకేవైసీ అస్త్రాన్ని తెర మీదకు తెచ్చింది. ఈకేవైసీ చేయించుకోని వారిని వేతనదారుల జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టింది. దీంతో తాత్కాలికంగా దూర ప్రాంతాలకు వెళ్లిన వేతనదారుల పరిస్థితి ఏమిటన్న దానిపై సందిగ్ధత నెలకొంది. ప్రభుత్వ చర్యలు ఏ మాత్రం సరికాదని వేతనదారులు మండిపడుతున్నారు. విజయనగరం ఫోర్ట్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే వేతనదారుల ఉపాధిపై చంద్రబాబు సర్కార్ దెబ్బకొడుతుందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈకేవైసీ చేయించుకోవడానికి రాలేదనే నెపంతో వేతనదారులను జాబ్ కార్డు నుంచి తొలగిస్తున్నారు. వేలాది మంది వేతనదారులను ఇప్పటికే తొలిగించినట్టు అధికారుల మాటలు అర్ధం చెబుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం లక్ష్యానికి అనుగుణంగా వేతనదారులకు పని కల్పించలేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో వేలాది మందికి ఉపాధి లేకుండా పోయింది. దీనికి తోడు ఇప్పు డు వేతనదారులను పనికి దూరం చేయనుండడంతో మరింత మందికి ఉపాధి లేకుండా పోతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని చంద్రబా బు ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే ప్రతి పని సర్కార్కు భారంగా మారిందనే నెపంతో ఆర్థికపరమైన భారాలను తగ్గించే కుట్రలు పన్నుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వలసల నివారణకే ఉపాధి ఉపాధి హామీ పథకం రాక ముందు జిల్లా వాసులు వేల సంఖ్యలో ఉపాధి కోసం హైదరాబాద్, చైన్నై, విజయవాడ, బెంగళూరు వంటి ప్రాంతాలకు వలస వెళ్లేవారు. అదే విధంగా పొరుగు జిల్లా అయిన విశాఖపట్నం కూడా ఎక్కువగా వలస వెళ్లేవారు. నెలలు, సంవత్సరాలు తరబడి కూలీ, నాలీ చేసుకుని అక్కడే ఉండేవారు. ఉపాధి హామీ పథకం చేపట్టిన తర్వాత కొంతవరకు వలసలు తగ్గాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వ వైఖరి వల్ల మళ్లీ వలస వెళ్లే పరిస్థితులు నెలకొన్నాయి. ఉపాధి వేతనంతో జీవనం జిల్లాలో అధిక శాతం మంది వేతనదారులు నిరుపే దలే. గ్రామాల్లో నిర్వహించే ఉపాధి పనులకు వెళ్లి వాటి ద్వారా వచ్చే వేతనంతో జీవిస్తారు. ఇటువంటి వారు ఉపాధి పనులు లేని సమయంలో కూలీ పనులకు ఇతర ప్రాంతాలకు వెళ్తారు. అటువంటి వారు వలస వెళ్లారని తొలిగిస్తే వారి పరిస్థితి ఏమిటన్నది ప్రభుత్వం ఆలోచించకుండా వారిని తొలగించే చర్యలు చేపట్టడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఏడాదిలో కొన్ని నెలలు ఉపాధి పను లు లేనప్పుడు పేదలు పక్క జిల్లాలతో పాటు దూర ప్రాంతాలకు వెళ్లి జీవన విధానాన్ని వెతుక్కుంటున్నారు. మళ్లీ ఉపాధి దొరుకుతుందన్న సమయంలో సొంత గ్రామాలకు వచ్చి పనులు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం ఇప్పుడే ఈకేవైసీ చేయించుకోవాలని సూచిస్తూ లేకుంటే తొలగింపు తప్పని చర్యలు చేపడుతూ వారి ఉపాధికి గండి కొట్టే చర్యలకు ఉపక్రమించింది. ఇది కాస్త పేదల జీవనంపై దెబ్బ తీస్తుంది. అలాంటప్పుడు శాశ్వత ఉపాధి కల్పించే చర్యల కు చంద్రబాబు సర్కార్ చర్యలు తీసుకోవాలని వా రు కోరుతున్నారు. అంతేగాని ఇలా డొంకతిరుగుడు పద్ధతిలో తమ జాబ్ కార్డులను తొలగించే చర్యలు ఎంత వరకు సమంసజమని పలువురు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో వేతనదారులు 5,42,057 మంది ఉన్నారు. వీరిలో 4,73,988 మందికి ఉపాధి సిబ్బంది ఈకేవైసీ చేశారు. 68,069 మంది వేతనదారులు ఇంకా ఈకేవైసీ చేయించుకోలేదు. ఇప్పడు వీరందని తొలగిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉపాధి పనులు గిట్టుబాటు కాకపోవడం, పూర్తి స్థాయిలో పనులు కల్పించక పోవడం తదితర కారణాల వల్ల కొంతమంది వేతనదారులు తాత్కలికంగా ఇతర పనులకు వలస వెళ్తున్నారు. అటువంటి వారిని కూడా తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్న విమర్శలు లేకపోలేదు. ఉపాధి హామీ పథకంలో పనిచేసే వేతనదారు లు 4,73,988 మందికి ఇప్పటికే ఈకేవైసీ చేయ డం జరిగింది. ఇంకా 68,069 మంది ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంది. కానీ వారంతా రాలే దు. ఈ పరిస్థితుల్లో గ్రామాల నుంచి శాశ్వతంగా వలస వెళ్లిన వారిని తొలగిస్తున్నాం. అదే విధంగా మరణించిన వేతనదారులను, డూప్లికెట్, రెండుసార్లు పేర్లు నమోదైన వారి పేర్లను తొలగిస్తున్నాం. తాత్కలికంగా వలస వెళ్లిన వారు ఎప్పుడొచ్చినా ఈకేవైసీ చేస్తాం. – ఎస్.శారదాదేవి, డ్వామా పీడీ -
కనిపించని కాటు.. తీరని చేటు!
ట్రాంబోక్యులిడ్ అనే కంటికి కనిపించని సూక్ష్మ కీటకం కుట్టడం వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. దీనిని చిగ్గర్ అని కూడా అంటారు. ఓరియెన్షి యా సుసుగాముషి అనే బ్యాక్టీరియా దీనికి కారణం. ముఖ్యంగా పొలాల్లో, అటవీ ప్రాంతాల్లో, పొదలు, గడ్డి ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో తిరిగే రైతులు, కూలీలకు ఇది సోకే ప్రమాదం ఎక్కువ. అన్ని వయసుల వారికీ ఇది సోకే అవకాశముంది. కానీ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వృద్ధులు, చిన్నారులు త్వరగా ప్రభావితం అవుతారు. పార్వతీపురం రూరల్: జిల్లాల్లో మారుతున్న వాతావరణం, పచ్చని పొలాల మాటున కంటికి కనిపించని ప్రమాదం పొంచి ఉంది. అదే స్క్రబ్ టైఫస్ వైరస్. ఉమ్మడి విజయనగరం జిల్లా వాసులను గత కొద్ది నెలలుగా ఈ వ్యాధి కలవరపెడుతోంది. అయితే దీనిపై ఆందోళన చెందాల్సిన పనిలేదు కానీ అప్రమత్తంగా ఉండకపోతే మాత్రం ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదం ఉంది. సాదాసీదా జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే అది ఊపిరితిత్తులపై పంజా విసురుతుంది. అందుకే దీనిపై సంపూర్ణ అవగాహన, తక్షణ వైద్యమే మనకు శ్రీరామరక్ష. గణాంకాలు ఏం చెబుతున్నాయి? ఈ ఏడాది జనవరి 1 నుంచి నవంబరు 17 వరకు నమోదైన కేసులను పరిశీలిస్తే విజయనగరం జిల్లాలో 487 నమూనాలను పరీక్షించగా 59 మందికి స్క్రబ్ టైఫస్ పాజిటివ్గా తేలింది. ఇక మన్యం జిల్లా (పార్వతీపురం) పరిధిలో 27 నమూనాల్లో 6 కేసులు బయటపడ్డాయి. ఇటీవల మెట్టపల్లికి చెంది న ఓ మహిళ ఈ లక్షణాలతో మృతి చెందడం విచారకరం. అయితే, ప్రస్తుతం పార్వతీపురం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఒక్క యాక్టివ్ కేసు కూడా లేకపోవ డం ఊరటనిచ్చే అంశం. స్క్రబ్ టైఫస్ సోకినప్పుడు మొదట సాధారణ వైరల్ జ్వరంలాగే అనిపిస్తుంది. వైద్యుల దగ్గరకు వెళ్తే మందులు ఇస్తారు. జ్వరం తగ్గినట్టే తగ్గి, లోలోపల ఈ బ్యాక్టీరియా తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఉన్నట్టుండి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది. ప్రధాన లక్షణం కీటకం కుట్టిన చోట చర్మంపై సిగరెట్ కాలిన గాయం లాంటి మచ్చ ఏర్పడుతుంది. తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు, చలి జ్వరం, దగ్గు ఉంటాయి. సకాలంలో గుర్తించకపోతే కిడ్నీలు, ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. జాగ్రత్తలే మన ఆయుధాలు పొలాలకు, అటవీ ప్రాంతాలకు వెళ్లేవారు కాళ్లు, చేతులు పూర్తిగా కప్పుకునేలా దుస్తులు ధరించాలి. ఇంటి పరిసరాల్లో గడ్డి, పొదలు లేకుండా చూసుకోవాలి. ఎలుకల ద్వారా కూడా ఈ కీటకాలు వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి, ఎలుకల నివారణ ముఖ్యం. పొలాల నుంచి రాగానే వేడి నీటితో స్నానం చేయడం, బట్టలు ఉతకడం మంచిది. తీవ్రమైన జ్వరం వచ్చి, చర్మంపై నల్లని మచ్చ కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రభుత్వ ఆస్పత్రిని సంప్రదించాలి.వ్యాధి నివారణలో ప్రభుత్వ పాత్ర కీలకం. గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉన్న పార్వతీపురం మన్యం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు చేసే పరికరాలు అందుబాటు లో లేకపోవడం గమనార్హం. అనుమానిత లక్ష ణాలు ఉన్నవారి నమూనాలను బయట ల్యాబ్ లను సంప్రదించాల్సి వస్తోంది. చాలామంది ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆ లెక్కలు అధికారిక గణాంకాల్లోకి రావడం లే దు. ప్రభుత్వం తక్షణమే స్పందించి జిల్లా ఆస్పత్రిలో పరీక్షలు చేసేందుకు కావల్సిన కిట్లును అందుబాటులోకి తేవాలి. మారుమూల గ్రామా ల్లో ఈ వ్యాధిపై విస్తృత అవగాహన కల్పించాలి. పచ్చని పొదల్లో.. ప్రాణ గండం! అశ్రద్ధ చేస్తే.. ఆయువుకే ఎసరు! జ్వరమే కదా అని జారవిడిస్తే.. ప్రాణాలకే ముప్పు! సాధారణ జ్వరం కాదు.. ‘స్క్రబ్’ కాటు కావొచ్చు! చిగ్గర్ కాటుతో చిక్కులు..పెరుగుతున్న కేసులు 11 నెలల్లో 65 కేసులు.. ‘స్క్రబ్’ విషయంలో నిర్లక్ష్యం వద్దు! ప్రస్తుతం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో స్క్రబ్ టైఫస్ యాక్టివ్ కేసులు ఏమీ లేవు. ఇది ఒకరి నుంచి ఒకరికి సోకే అంటువ్యాధి కాదు. గాలి ద్వారా వ్యాపించదు. కేవలం పొదలు, తుప్పల్లో ఉండే మైట్ అనే సూక్ష్మ కీటకం కుట్టడం ద్వారానే వస్తుంది. కాబట్టి ప్రజలు అనవసర భయాలకు లోనుకావద్దు. వ్యాధి సోకిన ప్రాథమిక దశలోనే గుర్తిస్తే యాంటీ బయాటిక్ మందులతో సులభంగా నయం చేయవచ్చు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రుల్లో దీనికి సంబంధించిన మందులను తగినంతగా అందుబాటులో ఉంచాం. జ్వరం వస్తే కాలయాపన చేయకుండా, సొంత వైద్యం చేసుకోకుండా వైద్యులను సంప్రదించాలి. – డా.ఎస్.భాస్కరరావు, డీఎంహెచ్వో, పార్వతీపురం మన్యం -
అమాత్యా.. ఇదేమి తీరు..!
● మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొరసాలూరు: గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి పీఎస్ సంఘటన చాలా బాధాకరమని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు, మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర పేర్కొన్నారు. పీఎస్ వ్యవహారంపై ప్రతిపక్ష వైఎస్సార్సీపీని, సాక్షి దినపత్రికను, తనను విమర్శిస్తూ నిందను మాపై నెట్టి బుదరజల్లే విధంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడారని ఇది సరికాదని అన్నారు. కుటుంబ బంధాలకు విలువనిచ్చే తాను ఏనాడు కుటుంబాల జోలికి వచ్చి రాజకీయాలు చేయలేదన్నారు. అధికారంలో ఉన్న వారు తప్పులు, పొరపాట్లు చేసి వాటిని ప్రతిపక్షంలో ఉన్న తమపై నెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. పట్టణంలో తన స్వగృహం వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భర్త లేని బాధిత మహిళ తనకు జరిగిన అన్యాయంపై మంత్రి వద్దకు వెళ్లానని చెబుతున్నారని, అప్పుడే మంత్రి స్పందించి ఉంటే నేడు పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదన్నారు. బాధిత మహిళ, సతీష్ ఇరువురు పరస్పర ఫిర్యాదులు పోలీస్స్టేషన్లో చేసుకున్న నేపథ్యంలో నిష్పక్షపాతంగా విచారణ జరిగితే వాస్తవాలు వెలుగు చూస్తాయన్నా రు. ఇప్పటికే బాధిత మహిళ హైకోర్టుకు వెళ్లారని అవసరమైతే న్యాయస్థానాన్ని మళ్లీ ఆశ్రయించే అవకాశం ఉంటుందన్నారు. తాను ఏనాడూ కక్షపూరిత రాజకీయాలు చేయలేదని మానవత్వంతోనే రాజకీయాలు చేశానని చెప్పారు. తనను ఇబ్బంది పెడుతున్నారని మంత్రి సంధ్యారాణి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడే ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని, అటువంటిది ప్రతిపక్షంలో ఉన్న తాము అధికారంలో ఉన్న వారిని ఎలా ఇబ్బంది పెట్టగలమని ప్రశ్నించారు. బాధిత మహిళ తనకు అన్యాయం జరిగిందని సాక్షి టీవీకి తెలిపిన తరువాత ఆ మహిళ అదే విషయాన్ని ఎస్పీ కార్యాలయానికి వెళ్లి అన్ని మీడియా చానళ్లకు కూడా విషయం చెప్పారన్నారు. మంత్రి పీఏ, బాధిత మహిళ విషయంలో తమకు, వైఎస్సార్సీపీకి, సాక్షి దినపత్రికకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. మాజీ ఉప ముఖ్యమంత్రినైన తనపై టీడీపీ శ్రేణులు, నేతలు సామాజిక మాధ్యమాల్లో మెసేజ్లు, పోస్టింగ్లు పెడుతున్నారని, వాటిని భద్రపరుస్తున్నానని పోలీస్స్టేషన్లో, సైబర్ క్రైమ్కు సమయం చూసి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఇందులో ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వాస్తవ పరిస్థితులు తెలుసుకోండి.. సాలూరు నియోజకవర్గ వాస్తవ పరిస్థితులను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్, మంత్రి లోకేష్ తెలుసుకోవాలని సూచించారు. తన రాజకీయ జీవితంలో ఏనాడూ ఏ ఒక్కరిపై వ్యక్తిగత విమర్శలు చేయలేదన్నారు. రెండు శాఖలకు మంత్రిగా ఉన్న సంధ్యారాణి తమ నాయకుడు జగన్మోహన్రెడ్డిని, తమను ఎంత దారుణంగా విమర్శిస్తుంటారో ప్రజలకు తెలుసునని, ప్రజలు ఆమె వ్యవహార శైలిని గమనిస్తున్నారన్నారు. మంత్రి పీఎస్ వ్యవహారంలో తాను ఇప్పటి వరకు స్పందించలేదని, కానీ మంత్రి సంధ్యారాణి తనను, వైఎస్సార్సీపీని ఉద్దేశిస్తూ మాట్లాడడం వల్లే స్పందించానని చెప్పారు. రాజన్నదొర వెంట పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తది తరులు ఉన్నారు. -
సమాజ చైతన్యస్ఫూర్తి గురజాడ
● పద్మశ్రీ కొలకలూరి ఇనాక్కు గురజాడ విశిష్ట పురస్కారం ● గురజాడ రచనలు స్ఫూర్తినిచ్చాయి..: హైకోర్టు జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్ ● గురజాడ స్వగృహంలో మహాకవికి ఘన నివాళి ● గురజాడ వారసులు, ఉత్తమ కవితా పురస్కార గ్రహీతలకు సత్కారం విజయనగరం టౌన్: సాంఘిక దురాచారాలను రూపుమాపడంలో తనదైన శైలిలో రచనలు చేసి సమాజాన్ని చైతన్యపరిచిన మహనీయుడు గురజా డ అప్పారావు అని, అటువంటి మహనీయుని 110వ వర్ధంతిలో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతమని గురజాడ విశిష్ట పురస్కార గ్రహీత పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ పేర్కొన్నారు. గురజాడ సాంస్కృతిక సమాఖ్య సాహితీ చైతనోత్సవంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక క్షత్రియ కల్యాణ మండపం ఆవరణలో గురజాడ విశిష్ట పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ముందుగా గురజాడ చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. వర లక్ష్మి త్యాగరాజ సంగీత కళాశాల, సూర్యతేజ డాన్స్ అకాడమీ విద్యార్థులు ప్రదర్శించిన నృత్యరూపకా లు ఆద్యంతం ఆహుతులను ఆకట్టుకున్నాయి. అనంతరం అతిథులను, గురజాడ వారసులను దుశ్శాలువ, జ్ఞాపికలతో సత్కరించారు. శ్రీ సాయి ఫౌండేషన్ తరఫున ప్రముఖ న్యాయవాది కోలగట్ల తమ్మన్నశెట్టి పద్మశ్రీ కొలకలూరి ఇనాక్కు గురజా డ విశిష్ట పురస్కారం, జ్ఞాపిక, ప్రశంసాపత్రం, నగ దుతో ఘనంగా సత్కరించారు. సమాఖ్య కోశాధికా రి డాక్టర్ ఎ.గోపాలరావు ప్రశంసాపత్రాన్ని చదివి వినిపించారు. అనంతరం గురజాడ విశిష్ట పురస్కా ర గ్రహీత పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ మాట్లాడుతూ గురజాడ వంటి మానవతా మూర్తి పుట్టడం వలన సమానత్వాన్ని పొందుతున్నామన్నారు. మహిళలను, చిన్నారులను, సామాన్యుల ను ఆయన ఆదరించారని, దేశమును ప్రేమించుమన్నా.. అంటూ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో ఉన్న వారికి హితబోధ చేశారన్నారు. భాష గొప్ప తనాన్ని వివరించిన మహనీయుడన్నారు. ముత్యాల సరాలను తయారు చేశారని, మనుషులంతా మనుషులుగా బతకాలని, దేశమంటే మట్టికాదు.. మనుషులని, దేశాన్ని ప్రేమిస్తే సమాజం బాగుంటుందని చాటి చెప్పారన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టి స్ సిహెచ్.మానవేంద్రనాథ్రాయ్ మాట్లాడుతూ మహాకవి రాసిన గేయాలు తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయన్నారు. సొంతలాభం కొంతమానుకుని పొ రుగు వారికి సాయం చేయమన్నటువంటి వాఖ్యా లు ఎంతో విలువైనవన్నారు. సాంఘిక దురాచారాలను ఎలా రూపు మాపాలి, వాటిని ఏ విధంగా సంస్కరించాలని ఆలోచన చేసి కన్యాశుల్కం రూపొందించారన్నారు. ప్రజల మధ్యలోకి నాటకం రూపంలో తీసుకువెళ్లి ఆలోచన రేకెత్తించారన్నారు. అటువంటి మహనీయునికి మనమంతా రుణపడి ఉన్నామన్నారు. ఎస్పీ ఎఆర్.దామోదర్ మాట్లాడుతూ 130 ఏళ్లకి పూర్వమే సమాజంలోని సాంఘిక దురాచారాలను రూపుమాపేందుకు మహాకవి చేపట్టిన కృషి ఎనలేనిదన్నారు. తెలుగు సాహిత్యానికి విశేష కృషి చేసిన ఇనాక్ని సత్కరించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కవితా పోటీలలో విజేతల వివరాల ను డాక్టర్ జక్కు రామకృష్ణ వెల్లడించారు. పొత్తూరి సీతారామరాజు, సునీత గంగవరపు, చిలకలూరిపేట, మహమ్మద్ అప్సర వలీషా, కోనసీమ, ఇనపకుర్తి చినసత్యన్నారాయణ, చెళ్లపిళ్ల శ్యామల తదితరులకు గురజాడ ఉత్తమ కవితా పురస్కారాలను, అదే విధంగా గురజాడ రచనలపై నిర్వహించిన వక్తృత్వం, వ్యాసరచన పోటీల విజేతలకు అతిథుల చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమానికి ముందు మహాకవి గుర జాడ స్వగృహంలో గురజాడ చిత్రపటం వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మహాకవి ఇంటి నుంచి గురజాడ దేశభక్తి గీతాలాపన చేస్తూ ర్యాలీగా బయలుదేరి కాంస్య విగ్రహం వద్ద పూలమాలలను సమర్పించారు. గురజాడ సాంస్కృతిక సమా ఖ్య అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ ఎం.వెంకటేశ్వరరా వు, కాపుగంటి ప్రకాష్ల నేత్రత్వంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబి త, కలెక్టర్ రాంసుందర్ రెడ్డి, నవసాహితీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్వి.సూర్యప్రకాష్రావు (చైన్నె), సభ్యు లు ఎం.అనిల్కుమార్, మేకా అనంతలక్ష్మి, తదితరు లు పాల్గొన్నారు. -
త్వరలో అసెంబ్లీ ముట్టడి
● మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపకుంటే పోరాటం ఉధృతం ● ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి ● ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నాగభూషణ్ విజయనగరం: ప్రజలు, విద్యార్థులు ఎదుర్కొంటు న్న సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణీత వ్యవధిలో స్పందించి పరిష్కరించకుంటే త్వరలో అసెంబ్లీని ముట్టడిస్తామని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి దాసరి నాగభూషణ్ హెచ్చరించారు. ఆదివారం నగరంలోని సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థుల దగ్గరి కి యువగళం పాదయాత్ర ద్వారా వచ్చి జీవో నెంబర్ 77ను రద్దు చేస్తామన్నారని, ఫీజురీయింబర్స్మెంట్ అమలు చేస్తామని మోసం చేస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రత్యేక యూనివర్సిటీలకు నిధులు తెస్తామంటూ చేసిన ప్రకటన అమలుకు నోచుకోలేదని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను తక్షణమే ఉపసంహరించుకోకుంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వం ఆలోచన మార్చుకోకపోతే విద్యార్థి ఉద్యమం గుణపాఠం నేర్పిస్తుందని, భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ప్రజాస్వామిక శక్తులతో కలిసి పోరాటం నిర్మిస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు సుమన్, సహాయ కార్యదర్శి గౌరీ శంకర్, చరణ్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు పీజీఆర్ఎస్
విజయనగరం అర్బన్: కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించనున్నట్టు ఎస్.రాంసుందర్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు తమ వివరాలతో పాటు వారి సమస్యలకు సంబంధించి అర్జీలను అందజేయాలని చెప్పారు. జిల్లా ప్రజలు పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విజయనగరం: అండర్ – 12 బాలుర జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు మంగళవారం నిర్వహించనున్నట్టు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి పి.సీతారామరాజు (రాంబాబు) శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని బాబా మెట్ట శివారు విజ్జి స్టేడియంలో మంగళవారం ఉదయం 7 గంటలకు ఎంపి క పోటీలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నా రు. పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు 2013 సెప్టెంబర్ 1 తర్వాత జన్మించిన వారై ఉండాల ని తెలిపారు. క్రీడాకారులు తెలుపు దుస్తులు ధరించి రావాలని సూచించారు. చీపురుపల్లి: మండలంలోని రావివలస రెవె న్యూ పరిధిలో అనుమతుల్లేకుండా ఏర్పాటైన రియల్ ఎస్టేట్ వెంచర్ను అధికారులు పరిశీలించారు. రావివలస రెవెన్యూ పరిధిలో అనుమతుల్లేని లే అవుట్పై దర్జాగా రియల్ దందా అనే శీర్షికన సాక్షి పత్రికలో ఆదివారం వెలువడిన కథనంపై అధికారులు స్పందించారు. ఎంపీడీ వో ఐ.సురేష్, డిప్యూటీ ఎంపీడీవో అప్పలనాయుడు, పంచాయతీ కార్యదర్శి సతీష్ లేఅవుట్ను పరిశీలించారు. లే అవుట్కు సంబంధించి ఎలాంటి అనుమతులు ఉన్నా యో, అనుమతులు తీసుకున్నారా.. లేదా.. అ నే అంశాలపై నాలుగు రోజుల్లో వివరణ ఇవ్వా లని లేఅవుట్ యాజమాన్యానికి నోటీసులు అందజేశారు. అనుమతులు లేని లేఅవుట్లలో సోమవారం బోర్డులు ఏర్పాటు చేస్తామని ఎంపీడీవో తెలిపారు. సర్వే నంబర్లలో స్పష్టత కోసం తహసీల్దార్కు సమాచారం కోరనున్న ట్టు ఎంపీడీవో చెప్పారు. -
చెరకు తూనిక కేంద్రాలు సిద్ధం
● డిసెంబర్ 5న క్రషింగ్ ● తగ్గిన ఉత్పత్తిపండించిన చెరకు అంతా క్రషింగ్ జిల్లాలో 2025–26 క్రషింగ్ సీజన్కు ఈఐడీ ప్యారీస్ లిమిటెడ్, భీమసింగి, ఎన్సీఎస్,గోవాడ సుగర్ ప్యాక్టరీల పరిధిలో చెరకు ఉత్పత్తి చేసిన 2.5 లక్షల టన్నుల చెరకు క్రషింగ్ చేయనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. అందుకు అనుగుణంగా ఓవర్ హాలింగ్ చేసినట్లు యాజమాన్యం కార్యాలయానికి సమాచారం ఇచ్చింది. ఇప్పటికే ఉన్న చక్కెర కర్మాగారాల పరిధిలో రైతులు ఉత్పత్తి చేసిన చెరకు క్రషింగ్కు పూర్తిస్థాయిలో ఈఐడీ ప్యారీస్ యాజమాన్యం సిద్ధం చేసింది. – ఎం.సత్యనారాయణ, సుగర్కేన్ డిప్యూటీ కమిషనర్, బొబ్బిలిసీతానగరం: సంకిలి ఈఐడీ ప్యారీస్ లిమిటెడ్ చక్కెర కర్మాగారంలో 2025–26 క్రషింగ్ ప్రారంభించడానికి యాజమాన్యం సిద్ధం చేయడంతో రైతులు ఉత్పత్తి చేసిన చెరకు తరలించడానికి రహదారులు సక్రమంగాలేక మల్లగుల్లాలు పడుతున్నారు. సంకిలి ఈఐడీ ప్యారీస్ ప్రైవేట్ చక్కెర కర్మాగారం ఓవర్హాలింగ్ చేసి డిసెంబర్ 5న క్రషింగ్ చేయడానికి యాజమాన్యం సిద్ధం చేసింది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎనన్్ సీఎస్, భీమసింగి,సంకిలిలో ఈఐడీ ప్యారీస్ చెరకు కర్మాగారాలు ఉన్నాయి. పేరుకే మూడు చక్కెర కర్మాగారాలు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న లచ్చయ్యపేట ఎన్సీస్ కర్మాగారాన్ని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే విజయనగరం ఎన్సీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కు విక్రయించారు. అప్పటి నుంచి రైతులకు కష్టాలు మొదలయ్యాయి. ఇక్కడి రైతులు వాణిజ్య పరంగా చెరకుపంటసాగుకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో ఎన్సీఎస్ కర్మాగారం పరిధిలోఉన్న 16 మండలాల్లో వేలాదిమంది రైతులు 5లక్షల నుంచి 6 లక్షల టన్నుల చెరకు ఉత్పతి చేసేవారు. కర్మాగారం మూతపడడంతో చెరకు విస్తీర్ణం తగ్గడం, ఉన్న చెరకును సంకిలి ఈఐడీ ప్యారీస్కు తరలించడం ఆనవాయితీగా వస్తోంది. కర్మాగారం పరిధిలో ఉన్న గ్రామాల్లో 2025–26 క్రషింగ్ సీజన్కు సుమారు 2.9లక్షల టన్నులచెరకు ఉత్పత్తి చేసినట్లు గణాంకాల ద్వారా తెలియవచ్చింది. అలాగే భీమసింగి కోఆపరేటివ్ చక్కెర కర్మాగారం పరిధిలో 20 వేలు, గోవాడ కో ఆపరేటివ్ చక్కెర కర్మాగారం పరిధిలో 40 వేల టన్నుల చెరకు ఉత్పత్తి చేసినట్లు సంబంధిత అధికారుల ద్వారా తెలియవచ్చింది.ఈ క్రమంలో ఈఐడీప్యారీస్ లిమిటెడ్ చక్కెర కర్మాగారం యాజమాన్యం 2 లక్షల 50 వేల టన్నులు క్రషింగ్ చేయడానికి వీలుగా ఓవర్ హాలింగ్ చేసినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో చెరకు ఉత్పత్తి 3.5 లక్షల టన్నుల వరకూ ఉంది. అ మేరకు తెర్లాం, బాడంగి, సీతానగరం, కొమరాడ,బలిజిపేట, వంగర మండలాల్లో బెల్లం క్రషర్లు బెల్లం తయారు చేయడానికి గానుగలను చిన్నరైతులు ఏర్పాటు చేసుకుంటున్నారు. టన్ను చెరకు రూ. 3,200గా సుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్ధారించగా బెల్లం క్రషర్ యాజమాన్యాలు చెరకు టన్నుకు రూ.2800కు మించి కొనుగోలు చేయలేమని చెప్పడంతో చెరకు పండించే రైతులంతా పండించిన చెరకును ఏం చేసు కోవాలో అర్ధంకాక ఆందోళన చెందుతున్నారు. లచ్చయ్యపేట ఎన్సీఎస్ కర్మాగారాన్ని తెరిపిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించి చెరకు రైతులు ఉత్పత్తి చేసిన చెరకును కొనుగోలు చేయాలని, మూత పడిన కార్మాగారాలను తెరిపించడానికి సత్వర చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సీతానగరం మండలంలో చెరకు తూనిక కేంద్రాలు.. సీతానగరం మండలంలోని బూర్జ, కృష్ణారాయపురం, వెంకటాపురం, లక్ష్మీపురం, నిడగల్లు, సీతానగరం, పణుకుపేట, బగ్గందొరవలస గ్రామాల్లో చెరకు తూనిక కేంద్రలున్నాయి. అలాగే మక్కువ, బాడంగి, తెర్లాం,బొబ్బిలి ప్రాంత గ్రామాల్లో చెరకు తూనిక యంత్రాలను ఏర్పాటు చేశారు. -
రైల్వే ట్రాక్పై గుర్తు తెలియని మృతదేహం
విజయనగరం క్రైమ్: విజయనగరం రైల్వే డివిజన్ పరిధి లో కంటకాపల్లి కొత్తవలస రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే ట్రా క్పై ముప్పై ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి మృతదేహాన్ని జీఆర్పీ ఆదివారం కనుగొంది. సదరు వ్యక్తి సు మారు 5 అడుగుల 5 అంగుళాల పొడవు, తెలు పు రంగు ఛాయతో ఎరుపు రంగుపై తెలుపు రంగు గీతల గల ఫుల్ హాండ్స్ షర్ట్, నలుపు రంగు జీన్ ఫ్యాంట్ ధరించి ఉన్నాడని జీఆర్పీ హెచ్సీ రవికుమార్ తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసినవారు ఫోన్ 94419 62879, 9490617089 నంబర్కు కానీ జీఆర్పీ ల్యాండ్ లైన్ నంబర్ 08912 883218కు కానీ తెలియజేయాలని కోరారు. -
ఆధునిక మహిళ చరిత్ర తిరగరాసేలా గురజాడ రచనలు
● సాహితీగోష్ఠిలో ప్రముఖుల సందేశాలువిజయనగరం టౌన్: ఆధునిక మహిళ చరిత్రను గురజాడ రచనలు తిరగరాస్తాయని ప్రముఖ సామాజికవేత్త పీఏ దేవి పేర్కొన్నారు. మహాకవి గురజాడ వర్ధంతిని పురస్కరించుకుని సాహితీస్రవంతి, జనవిజ్ఞాన వేదిక సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక జిల్లాపరిషత్ కార్యాలయంలోని సెమినార్ హాల్లో ఆదివారం సాహితీ గోష్ఠి నిర్వహించారు. గురజాడ సీ్త్ర పాత్రల ఔన్యత్యంపై సామాజికవేత్త దేవి ప్రసంగిస్తూ గురజాడ రచించిన కన్యాశుల్కం నాటకంలో పాత్రలేవీ కల్పితాలు కావన్నారు. పాత్ర నేపథ్యాలున్నవేనని తెలిపారు. కన్యాశుల్కంలో కన్యక, పుత్తడిబొమ్మ పూర్ణమ్మ, పూటకూళ్లమ్మ, బుచ్చమ్మ , మధురవాణి వంటి సీ్త్రపాత్రలన్నీ సంఘసంస్కరణకు చేయాల్సిన పనులన్నీ ఆ నాటకంలో చేసి చూపించారన్నారు. గురజాడ సాహిత్య విషయాలు ఇంకా అనేకం బయటకు రావాల్సి ఉందన్నారు. కవి, రచయిత, జర్నలిస్ట్ రెహానా మాట్లాడుతూ మధురవాణి పాత్ర ఒక వర్గానికే కాదని, సీ్త్ర ధైర్యాన్ని, ఔన్యత్యాన్ని చూపిందన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు ఉపన్యాసకులు రమాగీతాదేవి మాట్లాడుతూ గురజాడ పాత్రలు దార్శనీకమైనవన్నారు. ప్రముఖ సీ్త్రల వైద్యనిపుణురాలు డాక్టర్ జి.సన్యాసమ్మ మాట్లాడుతూ మహిళాభ్యున్నతికి మహాకవి మహోన్నతమైన విషయాలను ప్రజల కళ్లకు కట్టినట్లు నాటకం ద్వారా చూపించి మార్పు తీసుకువచ్చారన్నారు. జనవిజ్ఞానవేదిక రాష్ట్ర సమత కన్వీనర్ జి.నిర్మల, మహిళాచేతన కార్యదర్శి కత్తిపద్మ, ఎం.సుశీల, డాక్టర్ లెక్కల చిన్నారి తదితరులు ప్రసంగించారు. గురజాడ ప్రవచించిన దేశభక్తిపై సాహితీ స్రవంతి రాష్ట్ర గౌరవాధ్యక్ష్యులు తెలకపల్లి రవి ప్రసంగించారు. ప్రముఖ రచయితలు అట్టాడ అప్పలనాయుడు, గంటేడ గౌరునాయుడు, మక్కెన శ్రీనివాస్, సాహితీస్రవంతి రాష్ట్ర కార్యదర్శి చీకటి దివాకర్లు గురజాడ విశిష్టతను వివరించారు. ప్రముఖుల స్మారక భవనాలు, చిహ్నాలు పరిరక్షణ – ఆవశ్యకత అనే అంశంపై ఇన్టాక్ కన్వీనర్, చరిత్ర పరిశోధకులు ఈమని రాణీశర్మ ప్రసంగించారు. మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్. శర్మ, తవ్వా సురేష్, గొంటి గిరిధర్, జి.మురళీధర్, ప్రొఫెసర్ కె.ఎస్.చలం, కొత్తూరి శ్రీనివాస్లు మాట్లాడుతూ మహనీయుల స్మారక భవనాలను పరిరక్షించుకునేందుకు చేపట్టాల్సిన చర్యలను వివరించారు. అనంతరం కన్యాశుల్కం–సామాజిక ప్రయోజనం అనే అంశంపై జనచైతన్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రకరకాల పేర్లతో వేలకోట్లు ఖర్చుపెడుతోందని సమాజం కోసం దేశం కోసం కష్టపడిన వారిని గుర్తించడం లేదన్నారు. తిరుపతి వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మేడిపల్లి రవికుమార్, జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్.లక్ష్మణరావు, జేవీవీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎంవీఎన్.వెంకటరావు, తవ్వాసురేష్లు ప్రసంగించారు. కార్యక్రమానికి ముందు గురజాడ విగ్రహం నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు గురజాడ గౌరవ యాత్రను నిర్వహించారు. యుగస్వరం గురజాడ పుస్తకావిష్కరణ చేశారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో సాహితీ అభిమానులు పాల్గొన్నారు. -
గాయపడిన వ్యక్తి మృతి
భామిని: మండల కేంద్రానికి చెందిన బొమ్మాళి సుదర్శన్(40) ఇటీవల శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనకు విశాఖ కేజీహెచ్లో వైద్యసేవలు అందిస్తుండగా చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు. దీంతో మృతుని కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. ఆయనకు భార్య, ఓ కుమార్తె ఉన్నారు. చికిత్స పొందుతూ వృద్ధురాలు.. బాడంగి: స్థానిక పెద్దవీధికి చెందిన మరడాన పాపమ్మ(76) కాలిన గాయాలతో విజయనగరం ఆస్ఫత్రిలో చికిత్సపొందుతూ ఆదివారం మృతిచెందినట్లు ఎస్సై తారకేశ్వరరావు తెలిపారు. వృద్ధురాలు తనఇంటిలో శనివారం సాయంత్రం వంటచేస్తుండగా ప్రమాదవశాత్తు చీరకొంగుకు నిప్పంటుకుని శరీరం కాలిపోగా మెరుగైనచికిత్సకోసం విజయనగరం సర్వజన ఆస్ఫత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆమెకు ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలున్నారని ఎస్సై చెప్పారు. కుమారుడు అప్పల నాయుడి ఫిర్యాదుమేరకు కేసునమోదుచేసి మృతదేహాన్ని బంధువులకు అప్పగించి కేసుదర్యాఫ్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. -
హెచ్ఐవీ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
● జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ రాణివిజయనగరం ఫోర్ట్: హెచ్ఐవీ/ఎయిడ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ కె.రాణి పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం సందర్భంగా ఆదివారం రంగోలి పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవగాహన ద్వారానే హెచ్ఐవీని నియంత్రించవచ్చన్నారు. హెచ్ఐవీ రోగుల పట్ల ప్రేమ, అప్యాయత చూపించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం ఉమామహేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. -
మెనూ అమలు చేయకుంటే ఎలా?
గుమ్మలక్ష్మీపురం: విద్యార్థుల కోసం కేటాయించిన మెనూ అమలు చేయకుంటే వారి ఆరోగ్యాలెలా బాగుంటాయని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ నాయకులు టి.అఖిల్, హెచ్.సింహాచలం ప్రశ్నించారు. ఈమేరకు ఆదివారం వారు మండలంలోని టిక్కబాయి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. మెనూ ప్రకారం ఉదయం పూరి పెట్టాల్సి ఉన్నప్పటికీ కిచిడీ అంటూ అన్నం పెట్టారని, మధ్యాహ్నం చికెన్ బిర్యానీ పెట్టాల్సి ఉన్నప్పటికీ వాటి స్థానంలో గుడ్డు కూరతో ముద్దగా ఉన్న అన్నం పెట్టారని..ఇలా మెనూ పాటించకపోవడం వల్ల విద్యార్థులు ఎంతో నష్టపోతున్నారన్నారు. కావున సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ఆశ్రమ పాఠశాలలో మెనూ అమలుపై దృష్టిసారించాలని, విద్యార్థులకు సరైన వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ..విద్యార్థులతో కలిసి నిరసన చేపట్టారు. -
త్రుటిలో తప్పిన ప్రమాదం
గరుగుబిల్లి: పార్వతీపురం మన్యం జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు అదుపు తప్పి సినీఫక్కీలో పల్టీకొట్టింది. ఆదివారం ఆయన వ్యక్తిగత పనుల నిమిత్తం కురుపాం వెళ్లి తిరు గు ప్రయాణంలో పార్వతీపురం వస్తుండగా మార్గమధ్యంలో తోటపల్లి శ్రీ కోదండరామాలయం సమీపంలో అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఆయన సరక్షితంగా బయటపడ్డారు.కుక్కల దాడిలో పది గొర్రెపిల్లల మృతివంగర: మండలకేంద్రంలో కుక్కలు ఆదివారం దాడిచేయడంతో పది గొర్రెపిల్లలు మృతిచెందాయి. గ్రామానికి చెందిన పడాల గంగులు ఇంటి సమీపంలోని గొర్రెల షెడ్డులోకి కుక్కలు చొరబడి దాడిచేశాయి. ఈ దాడిలో పది గొర్రెపిల్లలు మృతిచెందడంతో బాధితుడు లబోదిబో మంటున్నాడు. ఇదిలా ఉండగా అదే గ్రామంలో వారం రోజుల క్రితం 20 గొర్రె పిల్లలను కుక్కలు దాడిచేసి హతమార్చాయి. అధికారులు స్పందించి కుక్కల నివారణకు చర్యలు చేపట్టడంతోపాటు తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. బైక్ ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలురామభద్రపురం: మండలంలోని తారాపురం వద్ద ఆదివారం బైక్ ఢీ కొని ఓ వ్యక్తి తీవ్రగాయాల పాలయ్యాడు. ఈ ప్రమాదంపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తారాపురం గ్రామానికి చెందిన పిల్లా రమణ తన పాడిపశువులను మేతకు తోలుకుని వెళ్లి మేత తర్వాత తిరిగి ఇంటికి తొలుకోస్తుండగా వెనుకనుంచి మితిమీరిన వేగంతో వస్తున్న ద్విచక్రవాహనదారు ఢీ కొట్టి ఆపకుండా పరారయ్యాడు. దీంతో రమణ తలకు తీవ్రగాయమైంది. కుటుంబసభ్యులు ప్రథమ చికిత్స నిమిత్తం సాలూరు సీహెచ్సీకి తరలించి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుడి భార్య సాయి ఫిర్యాదు మేరకు ఎస్సై వి.ప్రసాదరావు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘కొండ’పై అక్రమార్కుల ‘ఫిరంగి’
● మొద్దునిద్రలో రెవెన్యూ సిబ్బంది ● కొత్తవలసలో లే అవుట్లకు కంకర తరలింపు ● సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులుకొత్తవలస: మండలంలో రోజురోజుకు ఆక్రమణలు, ప్రభుత్వ భూముల కబ్జా, గ్రావెల్ అక్రమ తవ్వకాలు పెరుగుపోతున్నాయి. ఈ తవ్వకాలు చంద్రబాబు ప్రభుత్వ పాలన ప్రారంభం నాటి నుంచి జోరుగా సాగుతున్నాయి. అధికార పార్టీ అండతో అక్రమార్కులు రెచ్ఛిపోతున్నారు. అడ్డుకోవాల్సిన రెవెన్యూ అదికారులు మొద్దు నిద్ర వహిస్తున్నారు.దీంతో అక్రమార్కులు రెచ్చిపోయి బరితెగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇందులో కొంతమొత్తం రెవెన్యూ అధికారులకు చేరుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సెలవు రోజులు వచ్చాయంటే చాలు అక్రమార్కులు తెరలేపుతున్నారు. అధికారులు ఎక్కువ శాతం మంది స్థానికేతరంగా ఉండడంతో అక్రమార్కుల పని సులువవుతోంది. మండలంలోని కొత్తవలస రెవెన్యూ పరిధి ఫిరంగి కొండ ప్రాంతంలో రాత్రి, పగలు తేడా లేకుండా జోరుగా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి.సర్వే నంబర్ 168లో సుమారు 15 సెంట్లు, సర్వే నంబర్ 168–1లో 415–37 ఎకరాల కొండ ప్రభుత్వ భూమి ఉంది. ఈ ప్రాంంతంలో ఇప్పటికే ఎక్కువశాతం ఆక్రమణలకు గురైంది. కాగా ప్రస్తుతం ఈ కొండప్రాంతంలో గ్రావెల్ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. కొత్తవలస మండలంలో ఎక్కడ లేఅవుట్ వేసినా అవసరమైన గ్రావెల్ ఇక్కడి నుంచి వెళ్లాల్సిందే.దీంతో అక్రమార్కులు రెండు చేతులా డబ్బులు సంపాదించుకుంటున్నారు. అధికారులు మాత్రం తూతూ మంత్రంగా హెచ్చరించి వదిలేస్తున్నారు.ముందుగా కొండ ప్రాంతంలో గ్రావెల్ను తవ్వేసి అమ్ముకున్న తరువాత చదునైన భూమిని ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకుంటున్నారు. అలాగే రెల్లి రెవెన్యూ పరిధిలో గ్రేహౌండ్స్కు కేటాయించిన కొండ ప్రాంతంలో సైతం జోరుగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి.ఇప్పటికై నా అధికారులు స్పందించి అక్రమార్కులను అదుపు చేయాలని పలువురు కోరుతున్నారు. తవ్వకాలు నిరోధిస్తాం ఈ తవ్వకాలపై తహసీల్దార్ సునీతను వివరణ కోరగా సంబంధిత రెవెన్యూ కార్యదర్శిని అప్రమత్తం చేసి తవ్వకాలను నిరోధిస్తామన్నారు. పట్టుబడిన వ్యక్తులపై కేసుల నమోదుకు సిఫారసు చేస్తామని చెప్పారు. -
బహుపరాక్..!
ప్రాణాంతక వ్యాధితో..విజయనగరం ఫోర్ట్: హెచ్ఐవీ ఎయిడ్స్వ్యాఽధి పట్ల ఒకప్పుడు సమాజంలో వివక్ష ఉండేది. అరోగులు ఉన్న ఛాయలకు కూడా వెళ్లడానికి ఇష్టపడేవారుకాదు. అంతేకాకుండా హెచ్ఐవీ పరీక్ష చేయించుకోవడానికి కూడా రోగులు ముందుకు వచ్చేవారు కాదు. హెచ్ఐవీ రోగులను కలవడానికి కానీ, వారితో మాట్లాడడానికి కాని ఇష్టపడేవారు కాదు. సోమవారం ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. హెచ్ఐవీ/ఎయిడ్స్ రోగుల పట్ల గతంలో కంటే అవగాహన వచ్చింది. హెచ్ఐవీ పరీక్షలు చేయించుకోవడానికి కూడా రోగులు ముందుకు వస్తున్నారు. అయితే ఇప్పటికీ ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది. హెచ్ఐవీ/ఎయిడ్స్ పట్ల ఇంకా అవగాహన రావాల్సి ఉంది. సన్మార్గమే ఉత్తమం హెచ్ఐవీ వచ్చిన తర్వాత బాధపడేకంటే హెచ్ఐవీ బారిన పడకుండా ఉండడం మంచిది. చెడుఅలవాట్లకు దూరంగా ఉంటూ సన్మార్గంలో నడవడం ద్వారా హెచ్ఐవీ బారిన పడకుండా ఉండవచ్చు. హెచ్ఐవీ సోకిందంటే జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. ఐసీటీసీ సెంటర్లో హెచ్ఐవీ పరీక్షలు చేసిన తర్వాత నిర్ధారణ అయినవారికి ఏఆర్టీ సెంటర్లో రిజిస్ట్రేషన్ చేసి మందులు అందిస్తారు. ఒకసారి మందుల వాడకం ప్రారంభించిన తర్వాత మధ్యలో మానివేయకూడదు. మందులు మధ్యలో మానివేస్తే వారి ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణిస్తుంది. ఏఆర్టీ కేంద్రంలో 6582 మందికి చికిత్స జిల్లాలోని ఏఆర్టీ కేంద్రంలో 6582 మంది చికిత్స పొందుతున్నారు. వారిలో పురుషులు 2836 మంది, మహిళలు 3707 మంది, పిల్లలు 39 మంది ఉన్నారు. 2008 నుంచి ఆక్టోబర్ నెలాఖరు నాటికి 13,897మంది హెచ్ఐవీ రోగులు నమోదయ్యారు. జిల్లాలో చికిత్స అందించే కేంద్రాల వివరాలు జిల్లాలో సమగ్ర, పరీక్ష కేంద్రా(ఐసీటీసీ)లు 11 ఉన్నాయి. అదేవిధంగా పీహెచ్సీల్లో 65 ఐసీటీసీలు ఉన్నాయి. అలాగే రక్తనిధి కేంద్రాలు జిల్లాలో 9 ఉన్నాయి. రక్త నిల్వ కేంద్రాలు 8 ఉన్నాయి. రక్తసేకరణ వాహనం ఒకటి ఉంది. జిల్లాలో ఏఆర్టీ కేంద్రాలు రెండు ఉన్నాయి. లింక్ ఏఆర్టీ కేంద్రాలు 7 ఉన్నాయి. సుఖవ్యాధి చికిత్స కేంద్రాలు రెండు ఉన్నాయి. హెచ్ఐవీ/ఎయిడ్స్ నిర్మూలనపై పనిచేసే స్వచ్ఛంద సంస్థలు 6 ఉన్నాయి.అవగాహన కల్పిస్తున్నాం హెచ్ఐవీ/ఎయిడ్స్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నాం. హెచ్ఐవీ ఏవిధంగా వ్యాప్తి చెందుతుంది, రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. హెచ్ఐవీ సోకిన వారికి ఎక్కడ చికిత్స అందిస్తారనే దానిపై అవగాహన కల్పిస్తున్నాం.ీ పీహెచ్సీ, సీహెచ్సీ, జిల్లా ఆస్పత్రుల్లో హెచ్ఐవీ పరీక్షలతో పాటు హెచ్ఐవీపై కౌన్సెలింగ్ ఇస్తారు. ప్రతి ఒక్కరూ హెచ్ఐవీపై అవగాహన కల్పించుకోవాలి. – డాక్టర్ కె.రాణి, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి ఎయిడ్స్ పట్ల అవగాహన అవసరం జిల్లాలోని ఏఆర్టీ కేంద్రంలో రోగులు 6582 మంది హెచ్ఐవీ పరీక్ష చేసే ఐసీటీసీ కేంద్రాలు 77 నేడు ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం -
గురజాడ.. భావితరాలకు దిక్సూచి..
● నేడు మహాకవి 110వ వర్ధంతి ● గురజాడ అప్పారావు స్వగృహం నుంచి భారీ ర్యాలీ● ఆచార్య కొలకలూరి ఇనాక్కు గురజాడ విశిష్ట పురస్కారం గురజాడ వేంకట అప్పారావు విజయనగరం టౌన్: విజ్ఞానదాయకమైన విద్య విజయానికి దోహదపడుతుందని ముందుచూపుతో పటిష్టమైన ప్రణాళిక రచించి భావితరాలకు గురజాడ వేంకట అప్పారావు వెలుగుజాడగా నిలిచారు. సంఘ సంస్కరణ, సాంఘిక చైతన్యమవసరమని ఆశించారు. ఆయన ఆశయాలు, వారి రచనలు అజరామరం. విజయనగరం సంస్థానంలో ఆనందగజపతికి అభిమానపాత్రునిగా.. రీవారాణి అప్పలకొండమాంబ అంతరంగిక కార్యదర్శిగా పనిచేశారు. నాలుగో విజయరామ గజపతి దత్తత విషయంలో ప్రముఖ పాత్ర వహించిన నిస్వార్థపరులు మహాకవి గురజాడ. అటువంటి మహానుబావుడికి సొంత ఇల్లు కూడా లేదు. సంస్థానం వారు ఉండమన్న అద్దె ఇంటిని రెండువేల రూపాయలకు కొనుక్కున్నారు. ఆ ఇల్లును బాగు చేసిన కొన్ని నెలలకే అనగా 1915 నవంబర్ 30న పరమపదించారు. ఇప్పుడా గృహం అధ్యయన కేంద్రంగా విరాజిల్లుతోంది. సాహితీ సౌరభాలు.. విజయనగర ఖ్యాతిని దశ దిశలా చాటిన మహోనుభావులు ఎందరో ఉన్నారు. వందల ఏళ్లు దాటినా ఆ సాహితీవేత్తలు అజరామరులే. అటువంటిి సాహితీవేత్తలు నడయాడిన నేలపై మనం జన్మించడం మనందరి అదృష్టం. అంతటి మహనీయుల్లో వెలుగుజాడ గురజాడ ఒకరు. గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో 24 ఏళ్లుగా సాహితీ చైతనోత్సవం పేరిట గురజాడ విశిష్ట పురస్కారంతో విశిష్ట వ్యక్తిని సత్కరించుకుంటున్నారు. కోవిడ్ కారణంగా రెండేళ్లపాటు గురజాడ పురస్కారం వాయిదా పడింది. మరలా 2022 నుంచి ఈ పురస్కారాన్ని సమాఖ్య ప్రతినిధులు అందజేస్తున్నారు. ఈ ఏడాది సమాఖ్య 25 సంవత్సరాల రజతోత్సవ వేడుకలను నిర్వహిస్తోంది. 2025 సంవత్సరానికి గాను పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్కు ఆదివారం ఉదయం 10.30 గంటలకు డాక్టర్ పీవీజీ.రాజు క్షత్రియ కల్యాణ మంటపం ఆవరణలో గురజాడ విశిష్ట పురస్కారాన్ని అందజేయనున్నారు. గురజాడ విశిష్ట పురస్కారం అందుకోనున్న ఆచార్య కొలకలూరి ఇనాక్ -
మాదకద్రవ్యాల రవాణాను అరికట్టాలి
పార్వతీపురం: జిల్లాలో మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల రవాణాను పూర్తిగా అరికట్టాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. మాదకద్రవ్యాల నియంత్రణ కమిటీ జిల్లా స్థాయి సమావేశం, జిల్లా స్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశం కలెక్టర్, ఎస్పీ మాధవరెడ్డి అధ్యక్షతన శనివారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో డ్రగ్స్, గంజాయి నివారణపై విస్తృతంగా ప్రచారం చేపట్టాలన్నారు. ఇందుకోసం ప్రతి పది ఇళ్లకు ఒక వలంటీర్ను ఏర్పాటు చేసుకుని గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు. ఫొటోల కోసం కాకుండా నివారణే అంతిమ లక్ష్యంగా భావించి అధికారులు పని చేయాలన్నారు. రవాణా, అటవీ, ఆర్టీసీ, ఎకై ్సజ్, తదితర శాఖల ద్వారా నిర్వహిస్తున్న ర్యాలీలు, చైతన్య కార్యక్రమాల వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ.. రహదారి ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. ప్రమాదాల నివారణకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, డీఎస్పీ ఎం.రాంబాబు, ఎస్టీసీ పి.ధర్మచంద్రారెడ్డి, డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణి, పశుసంవర్థక శాఖాధికారి ఎస్.మన్మధరావు, డీఎంహెచ్ఓ ఎస్.భాస్కరరావు, సీపీఓ ఎస్ఎస్ఆర్ పట్నాయక్, డీటీఓ దుర్గాప్రసాద్, డీపీటీఓ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రభాకరరెడ్డి -
బుడతనాపల్లిలో అగ్ని ప్రమాదం
గంట్యాడ: మండలంలోని బుడతనాపల్లిలో శనివారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో గ్రామానికి చెందిన బొమ్మిడి సూరమ్మకు చెందిన పూరిల్లు కాలిపోయింది. ఒక్కసారిగా ఇంటి నుంచి మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల వారు స్పందించి మంటలను ఆర్పారు. అయితే అప్పటికే ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ప్రమాద సమయంలో బాధిత మహిళ ఇంటిలో లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ‘మళ్లీ విచారణకు రావాలి’ సాలూరు: గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పీఎస్ సతీష్పై ఫిర్యాదు చేసిన బాధిత మహిళను పోలీసులు విచారించారు. పట్టణ పోలీస్స్టేషన్లో శుక్రవారం విచారణ చేపట్టి సాయంత్రం వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. శనివారం ఉదయం ఆమెను విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించి, మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహించారు. సాయంత్రం ఆమెను ఇంటికి పంపించి వేసి మళ్లీ విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు. వృద్ధురాలి ఆత్మహత్యాయత్నం వంగర: మండల పరిధి నీలయ్యవలస గ్రామానికి చెందిన సీహెచ్ విజయమ్మ (60) గడ్డి మందు తాగి శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికుల సమాచారం మేరకు.. కుటుంబ కలహాల నేపథ్యంలో పురుగు మందు తాగింది. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి 108 వాహనంలో రాజాం ఆస్పత్రికి తరలించారు. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి గుర్ల: మండలంలోని చుక్కపేట, సొలిపిసోమరాజుపేట వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో కలవచర్లకు చెందిన నడుపూరు అప్పలనర్సమ్మ (65), చీపురుపల్లికి చెందిన ఇప్పిలి భూషణరావు (48) మృతి చెందారు. నడుపూరు అప్పలనర్సమ్మ తన కుటుంబ సభ్యులతో ద్విచక్ర వాహనంపై వస్తుండగా.. చుక్కపేట వద్దకు వచ్చే సరికి ప్రమాదవశాత్తూ జారి పడిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అప్పలనరసమ్మను విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసింది. మరో ప్రమాదంలో చీపురుపల్లికి చెందిన ఇప్పిలి భూషణరావు విజయనగరం నుంచి తన స్వగృహానికి ద్విచక్ర వాహనంపై వస్తుండగా.. సొలిపిసోమరాజు పేట వద్ద వాహనం బోల్తా పడడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదాలపై గుర్ల పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గురజాడ భావజాలం దేశానికి అవసరం
● సాహితీ స్రవంతి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు తెలకపల్లి రవివిజయనగరం టౌన్: జాతీయ పునర్వికాసానికి ప్రతిబింబంగా, ప్రతీకగా నిలిచిన వ్యక్తి గురజాడ అప్పారావు భావజాలం దేశానికి ఎంతైనా అవసరం.. అటువంటి మహనీయుడి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించుకోవడం మన కనీస బాధ్యతని సాహితీ స్రవంతి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు తెలకపల్లి రవి అన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గురజాడ పేరుతో సాంస్కృతిక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ఆయన నివాసాన్ని ఆధునీకరించాలని సూచించారు. ఉత్తరాంధ్రలో శ్రీశ్రీ, ఆరుద్ర, ఘంటసాల, సుశీల , ఆదిభట్ల, ద్వారం వంటి మహానుభావులెందరో ఉండడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. కార్యక్రమంలో సాహితీస్రవంతి ప్రతినిధి చీకటి దివాకర్, జనవిజ్ఞాన వేదిక నాయకులు డాక్టర్ ఎంవీఎన్ వెంకటరావు, డాక్టర్ జక్కు రామకృష్ణ, గురజాడ వెంకటేశ్వరరావు, ఇందిర, తదితరులు పాల్గొన్నారు. -
సాహితీ చైతన్య రజతోత్సవం..
విజయనగరం టౌన్: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మహనీయుడును స్మరిస్తూ గురజాడ సాంస్కృతిక సమాఖ్య పేరుతో జిల్లాలోని సాహితీవేత్తలు, అభిమానులు 2000 సంవత్సరంలో ఓ సంస్థ ఏర్పాటు చేశారు. కేవలం సభ్యుల సహకారంతోనే ప్రతి ఏటా ఉత్సవాలను నిర్వహిస్తూ గురజాడ సాహిత్యంపై కృషి చేస్తున్న వారిని గుర్తించి గురజాడ విశిష్ట పురస్కారాలను అందజేస్తోంది. నేటికి 25 ఏళ్లు పూర్తి కావడంతో ఈ ఏడాది సాహితీ చైతన్యోత్సవం పేరుతో రజతోత్సవ వేడుకలకు రంగం సిద్ధం చేసింది. భావితరాలకు అవగాహన మహాకవి చేసిన రచనలపై నేటితరానికి అవగాహన కల్పించే దిశగా సమాఖ్య కృషి చేస్తోంది. జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి వందలాది మంది విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు పోటీలు నిర్వహించి బహుమతులు అందిస్తున్నారు. జాతీయస్థాయిలో కవితల పోటీలు నిర్వహించి ఉత్తమ కవులకు గురజాడ ఉత్తమ కవితా పురస్కారంతో సత్కరిస్తున్నారు. ఇప్పటివరకు భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 190 మందికి పైగా కవులు పాల్గొన్నారు. మరణాంతరం కూడా జీవిస్తారు.. మహా పురుషులందరూ మరణాంతరం కూడా జీవిస్తారు. ప్రతి ఒక్కరూ మహానుభావుల జయంతి రోజున కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. కానీ గురజాడ సాంస్కృతిక సమాఖ్య మాత్రం గురజాడ వర్ధంతి రోజున కార్యక్రమాలు నిర్వహిస్తూ..ఆయనకు మరణం లేదని చెబుతూ వస్తున్నాం. మహాకవి సాహితీవనంలో వేసిన బాటలో నడయాడడమే మనందరి బాధ్యత. – కాపుగంటి ప్రకాష్, ప్రధాన కార్యదర్శి, గురజాడ సాంస్కృతిక సమాఖ్య, విజయనగరం -
వైద్యాధికారిపై విచారణ
చీపురుపల్లి రూరల్ (గరివిడి): గరివిడి మండలంలోని కోనూరు పీహెచ్సీ వైద్యాధికారి వెంకటరమణమ్మపై జిల్లా వైద్యశాఖాధికారులు శనివారం విచారణ చేపట్టారు. వెంకటరమణమ్మ విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని, సకాలంలో అందుబాటులో ఉండడం లేదంటూ కోనూరు, గొలగాం గ్రామాలకు చెందిన నాయకులు మాజీ సర్పంచ్ వెంపడాపు రమణమూర్తి, ఎం.అప్పలనాయుడు, వై.రమణ, ఎం. రాము, తదితరులు ఇటీవల కలెక్టర్, డీఎంహెచ్ఓలకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డీఎంహెచ్ఓ జీవనరాణి ఆదేశాల మేరకు జిల్లా వైద్యారోగ్యశాఖ ప్రొగ్రాం అధికారి సుబ్రహ్మణ్యం స్థానిక పీహెచ్సీలో ఫిర్యాదుదారుల సమక్షంలో విచారణ చేశారు. ఆరోగ్య కేంద్రానికి సకాలంలో విధులకు హాజరు కావటం లేదని, ప్రతీరోజు 11, 12 గంటలకు పీహెచ్సీకి వచ్చి వెంటనే వెళ్లిపోతున్నారని.. ఆస్పత్రిలో ప్రసవాలు జరిపించడం లేదంటూ ఫిర్యాదుదారులు అధికారులకు తెలియజేశారు. ఇదే పీహెచ్సీ పరిధిలో గల గుర్ల మండలం తాటిపూడి సచివాలయంలో పనిచేస్తున్న ఎంఎల్హెచ్పీ కస్తూరి సక్రమంగా విధలకు హాజరుకావడం లేదని గొలగాం గ్రామానికి చెందిన సర్పంచ్ కలిశెట్టి అప్పలరాజు విచారణాధికారులకు తెలియజేశారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు తెలియజేస్తామని అధికారులు తెలిపారు. -
టీడీపీ నాయకులు చెబితేనే కొంటాం..
గుర్ల: రైతులు ఆరుగాలం పండించిన పంటను అమ్ముకోవడానికి కూడా చంద్రబాబు ప్రభుత్వంలో ఇబ్బంది పడాల్సి వస్తోంది. పండించిన పంటను మిల్లులకు తరలించాలన్న టీడీపీ నాయకుల అనుమతి ఉండాలని అధికారులు చెబుతుండడంపై అన్నదాతలు నివ్వెరబోతున్నారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని చింతలపేటకు చెందిన సంచాన గౌరినాయుడు, యడ్ల ఉమామహేశ్వరి, పతివాడ శ్రీనువాసరావు, పతివాడ రమణ, పతివాడ పద్మ, తదితరులు కోతలు పూర్తి చేసి ధాన్యాన్ని కళ్లాల్లో ఉంచారు. రైతుసేవా కేంద్రానికి వెళ్లి ధాన్యం మిల్లుకు తరలించాలని వీఏఏను కోరారు. దీంతో ఆమె గురువారం షెడ్యూల్ ఇచ్చి గూడెం సొసైటీ సిబ్బంది నియమించిన టీఏ, డీఈఈల వద్దకు పంపించింది. రైతులు టీఏ, డీఈఈలను సంప్రదించి ధాన్యం తరలింపునుకు సంబంధించి ఽట్రక్షీట్ జనరేట్ చేయాలని కోరారు. అయితే ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేయాలంటే తప్పనిసరిగా గ్రామ టీడీపీ నాయకుడు, గూడెం సొసైటీ చైర్మన్ను కలవాలని.. అతను చెబితే కొనుగోలు ప్రారంభిస్తామని సొసైటీ నియమించిన సిబ్బంది తెలిపారు. రెండు రోజులుగా నిలిచిన లారీలు చింతలపేటలో ఐదుగురు రైతులకు చెందిన 1100 బస్తాల ధాన్యం రెండు లారీలకు లోడ్ చేశారు. ధాన్యం లోడ్ చేసి రెండు రోజులవుతున్న సొసైటీ సిబ్బంది మాత్రం ట్రక్షీట్ జనరేట్ చేయలేదు. దీంతో రైతులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. జిల్లా అధికారులు ట్రక్షీట్ జనరేట్ చేయాలని చెప్పినా శనివారం సాయంత్రం వరకు జనరేట్ చేయలేదు. దీంతో అధికారులు గ్రామానికి వచ్చి ట్రక్షీట్ జనరేట్ చేయించారు. మండిపడుతున్న అన్నదాతలు.. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రారంభంలోనే టీడీపీ నాయకుల తీరు ఇలా ఉంటే.. రానున్న రోజుల్లో ఇంకెంత దారుణంగా వ్యవహరిస్తారోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. టీడీపీ నాయకుల చుట్టూ తిరిగితే ధాన్యం కొంటారా అంటూ మండిపడుతున్నారు. ధాన్యం లోడ్ చేసి రెండు రోజులవుతున్నా ట్రక్షీట్ జనరేట్ చేయని వైనం గూడెం సొసైటీ సిబ్బంది నిర్వాకం అధికారుల ఆగ్రహించడంతో మిల్లుకు తరలింపు -
దేశ సేవలో భాగస్వాములు కావాలి
విజయనగరం రూరల్: సైనిక పాఠశాల విద్యార్థులు దేశ సేవలో భాగస్వాములు కావాలని తూర్పు నావికాదళ కమాండ్, చీఫ్ ఆఫ్ స్టాఫ్, రియర్ అడ్మిరల్ మురళీమోహన్రాజు అన్నారు. కోరుకొండ సైనిక పాఠశాల వార్షికోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలన్నారు. సైనిక పాఠశాల యూనిఫాం పాఠశాల నైతికతను, తల్లిదండ్రుల త్యాగాలను, అంచలమైన నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. విద్యార్థుల క్రమశిక్షణలో తొలి గురువులు తల్లిదండ్రులేనని, నాయకత్వ ప్రయాణంలో నిజమైన భాగస్వాములని పేర్కొన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్, గ్రూప్ కెప్టెన్ ఎస్ఎస్ శాస్త్రి మాట్లాడుతూ సైనిక పాఠశాల క్రమశిక్షణతో కూడిన విద్య, క్రీడాంశాల్లో ఉత్తమ ప్రదర్శనలో ముందు వరుసలో ఉంటుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాహస కృత్యాలు, జానపద, ఇతర సాంస్కతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులకూ పలు పోటీలను నిర్వహించారు. అనంతరం ప్రతిభ గల విద్యార్థులు, వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు నగదు బహుమతులు, మెడల్స్, షీల్డ్లు అందజేశారు. పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తూర్పు నావికాదళ కమాండ్, చీఫ్ ఆఫ్ స్టాఫ్, రియర్ అడ్మిరల్ మురళీమోహన్రాజు ఘనంగా కోరుకొండ సైనిక పాఠశాల వార్షికోత్సవం -
స్క్రబ్ టైఫస్ వైరస్ కలకలం
● మెట్టపల్లిలో వ్యాధి లక్షణాలతో మహిళ మృతి ● వారం రోజులు ఆస్పత్రిలో చికిత్స ● ఆందోళన చెందుతున్న స్థానికులు చీపురుపల్లి: స్క్రబ్ టైఫస్ వైరస్ కలకలం రేపుతోంది. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఈ స్క్రబ్ టైఫస్ వైరస్ ఇప్పుడు చీపురుపల్లి ప్రాంతానికి సోకినట్టు చర్చ జరుగుతోంది. దీంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. స్క్రబ్ టైఫస్ వైరస్ వ్యాధి లక్షణాలతో మండలంలోని మెట్టపల్లి గ్రామంలో చందక రాజేశ్వరి(39) మృతి చెందినట్టు సాక్షాత్తూ భర్త సూర్యనారాయణ చెబుతుండడంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ సంఘటనకు సంబంధించి మృతురాలు రాజేశ్వరి భర్త సూర్యనారాయణ అందించిన వివరాల్లోకి వెళ్తే.. మెట్టపల్లి గ్రామానికి చెందిన చందక రాజేశ్వరికి వారం రోజులు కిత్రం మెడపై ఓ పురుగు కుట్టుంది. దీంతో మెడంతా దద్దుర్లుగా ఏర్పడి తీవ్ర స్థాయిలో జ్వరం వచ్చింది. దీంతో చీపురుపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. తరువాత ఇంటికి వెళ్లగా వాంతులు, ఆయాసం ప్రారంభమైంది. దీంతో విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి అక్కడ రెండు రోజులు చికిత్స అందించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో గుండె కొట్టుకోవడం తగ్గిపోయింది. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాజేశ్వరి మరణించింది. అక్కడి వైద్యులు సైతం స్క్రబ్ టైఫస్ వైరస్ లక్షణాలు ఉన్నాయని చెప్పినట్టు సూర్యనారాయణ చెబుతున్నాడు. గుడ్లు వ్యాపారం చేసుకునే సూర్యనారాయణకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అకస్మాత్తుగా భార్య మరణించడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు.


