breaking news
Vizianagaram District News
-
700 క్యూసెక్కుల నీరు సరఫరా
వంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ ద్వారా శనివారం 700 క్యూసెక్కుల నీటిని సరఫరా చేశారు. గత కొంత కాలంగా ఖరీఫ్ సీజన్కు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని 24,788 ఎకరాల ఆయకట్టు భూములకు 500 క్యూసెక్కుల నీటిని సరఫరా చేశారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఆయకట్టుకు నీటి అవసరం ఉండడంతో మరో 200 క్యూసెక్కుల నీటిని పెంపుదలచేసి మొత్తం 700 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు ఏఈ నితిన్ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 61.96 మీటర్లు లెవెల్ నీటిమట్టం ఉందన్నారు. కంట్రోల్ రూమ్ నుంచే పర్యవేక్షణ ● ప్రజలు సురక్షితంగా చేరే వరకు నిరంతర పర్యవేక్షణకు ఆదేశాలు విజయనగరం గంటస్తంభం: అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం తిరుగు ప్రయాణంలో ఉన్న వాహనాల రాకపోకలను కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి స్వయంగా పర్యవేక్షించారు. సుమారు గంటపాటు అక్కడే ఉండి ఈఎంఎస్ వ్యవస్థతో వాహనాల కదలికలను పరిశీలించారు. ప్రధాని పర్యటనకు వచ్చిన 4,860 బస్సుల్లో ప్రయాణించిన ప్రజలు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునే వరకు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి, వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ రోణంకి గోపాలకృష్ణ, సెర్ప్ డైరెక్టర్(అడ్మిన్) ఎ.కల్యాణ్ చక్రవర్తితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిల్లా ప్రజలకు ఎస్పీ కృతజ్ఞతలు విజయనగరం టౌన్: అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి భారత ప్రధాని నరేంద్రమోదీ పర్యటనలో ఎటువంటి అవాంతరాలు లేకుండా విజయవంతంగా ముగించినందుకు జిల్లా ప్రజలకు ఎస్పీ ఏఆర్ దామోదర్ శనివారం ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. పోలీస్శాఖ ముందస్తు ప్రణాళికతో చేపట్టిన భద్రతా, బందోబస్తు చర్యలు సత్ఫలితాలిచ్చాయన్నారు. జాతీయ రహదారిపై కాసేపు వాహనాల రద్దీ ఏర్పడినప్పటికీ అధికారులు, సిబ్బంది సమర్ధవంతంగా స్పందించి ట్రాఫిక్ను త్వరితగతిన సాధారణ స్ధితికి తీసుకువచ్చారన్నారు. బందోబస్తు విధులను అత్యంత క్రమశిక్షణతో, నిబద్దతతో నిర్వహించిన పోలీసు అధికారులు, సిబ్బందిని అభినందించారు. ఎయిర్పోర్టుకు శంఖారావం చేసిన కోడూరు వాసి బాడంగి: మండలంలోని కోడూరు గ్రామానికి చెందిన యోగా శిక్షకుడు కడిమిశెట్టి రమేష్కు అరుదైన అవకాశం లభించింది. భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శనివారం తొలుత శంఖానాదం చేశారు. విజయనగరం డిప్యూటీ కలెక్టర్ శర్మ సూచనల మేరకు ప్రధాని మోదీ పాల్గొన్న సభాస్థలి వద్ద శంఖారావంపూరించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నట్టు రమేష్ తెలిపారు. -
కక్షసాధింపుతోనే మాజీ వీసీ ప్రసాదరెడ్డి సస్పెన్షన్
● యూనివర్సిటీలను సైతం పాడు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం ● మాజీ ఎమ్మెల్యే శంబంగి బొబ్బిలి: ఏయూ మాజీ వీసీ పీవీ జీడీ ప్రసాదరెడ్డిని సస్సెండ్ చేసేందుకు రాత్రికి రాత్రి ఇచ్చిన కమిటీ నివేదికను ఆసరా చేసుకో వడం దారుణమని మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. పట్టణంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ పీవీ జీడీ ప్రసాదరెడ్డిని పదవీ విరమణ రోజునే సస్సెండ్ చేయడం అనేక రకాల అనుమానాలకు తావిస్తోందన్నారు. ఆయన పదవీకాలంలో అక్రమాలు జరిగాయని విజిలెన్స్ విచారణకు ఆదేశించి ఆఘమేఘాల మీద నివేదిక తెప్పించుకుని కొత్త కమిటీ ద్వారా సస్పెండ్ చేయడం ముమ్మాటికీ రెడ్ బుక్ రాజ్యాంగ నిర్ణయమేనన్నారు. వాస్తవానికి యూనివర్సిటీ అంతర్గత విచారణ పూర్తి కాకముందు విజిలెన్స్ విచారణకు ఆదేశించడం, వెంటనే నివేదిక తెప్పించుకోవడం సస్సెండ్ చేయడం చకచకా జరిగిపోయాయన్నారు. ఇన్నాళ్లుగా యూనివర్సిటీలో అంతా బాగుండి, ఆయన పదవీ విరమణ రోజే చంద్రబాబుకు అక్రమాలు గుర్తొచ్చాయా అని శంబంగి ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేక ఇంటాబయటా విమర్శలు ఎదుర్కొంటున్న చంద్రబాబు ఇప్పుడు యూనిర్సిటీల్లోనూ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తవానికి చంద్రబాబు హయాంలో జరిగినన్ని అక్రమాలు, అధర్మాలు ఎక్కడా జరగలేదన్నారు. రాత్రి వేళల్లో చీకటి జీఓలు విడుదల చేయడం చంద్రబాబుకు అలవాటైనా మరీ ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం అన్యాయమన్నారు. మరో పక్క పత్రికా ఎడిటర్లపైనా కేసులు నమోదు చేసేందుకు జీఓలు విడుదల చేయడం దేశంలో ఎక్కడా తాను చూడలేదన్నారు. ఇటువంటి చీకటి జీఓలు విడుదల చేయడం మానుకుని ఉన్న మూడేళ్ల కాలం ప్రజాస్వామ్య బద్ధంగా పరిపాలించాలని చంద్రబాబుకు హితవు పలికారు.రైతు సేవా కేంద్రంలో చోరీ బొబ్బిలి రూరల్: మండలంలోని సిహెచ్.బొడ్డవలస గ్రామ రైతు సేవా కేంద్రలో శుక్రవారం రాత్రి దొంగలు పడి విలువైన వస్తువులు దొంగిలించుకుపోయారు. ఈ మేరకు హార్టీకల్చర్ అసిస్టెంటుగా పని చేస్తున్న ఆరికతోట నాగభూషణం శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి పది గంటల వరకు తాను విధుల్లోనే ఉన్నానని, అప్పుడే తాళం వేసి ఇంటికి వెళ్లిపోయాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. శనివారం ఉదయం ఆర్ఎస్కే తాళాలు పగిలి ఉన్నాయని లోపలికి వెళ్లి చూస్తే కంప్యూటర్, ప్రింటర్, టీవీ కనిపించలేదని దొంగలు వాటిని పట్టుకుపోయారని సుమారు రూ.లక్షన్నర విలువుంటుందని తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, రాజాం ఏరియా ఆస్పత్రిలో మరిన్ని రక్త పరీక్షలురాజాం: రాజాంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో జిల్లా లేబొరేటరీ ఏర్పాటు చేశామని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దామోదర ప్రధాన్ శనివారం ఓ ప్రకటనలో తెలిపా రు. ఈల్యాబ్లో డెంగ్యూ, స్క్రబ్ టైపస్, చికున్గున్యా, లెప్టోస్ఫిరిసోసిస్ వంటి వ్యాధులకు రక్త పరీక్షలు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. రాజాంతో పాటు చుట్టు పక్కల ప్రజలు, ఆస్పత్రులు ఈ వైద్య సేవలు పొందవచ్చని పేర్కొన్నారు. -
కోటి రెడ్డి కుటుంబానికి వైఎస్సార్సీపీ అండ
● రూ.50 వేలు సాయం అందించిన మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్లవిజయనగరం అర్బన్: వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులకు ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా పార్టీ అండగా నిలుస్తుందని శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి స్పష్టం చేశారు. ఇటీవల అకాల మరణం చెందిన విజయనగరం బాబామెట్ట నివాసి కోటి రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. కోటి రెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తక్షణ ఆర్థిక సాయంగా రూ.50 వేలు అందజేశారు. ఆయన వెంట ఐదో డివిజన్ మాజీ కార్పొరేటర్ గాదం మురళి, వర్మరాజు, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగం సభ్యులు కె.సుధాకర్, కాశిరెడ్డి నవీన్, సతీష్, సాయికుమార్, మువ్వల భాస్కర్, శ్రీహరిబాబు, రవి, శంకరరావు తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థినులకు కడుబండి పరామర్శ
శృంగవరపుకోట: మండలంలోని తాటిపూడి వద్ద ఉన్న ఆంధ్రప్రదేశ్ బాలికల గురుకుల కళాశాలలో జ్వరాల బారినపడిన విద్యార్థినులను మాజీ ఎమ్మెల్యే వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కన్వీనర్ కడుబండి శ్రీనివాసరావు శనివారం మధ్యాహ్నం పలువురు నేతలతో కలిసి పరామర్శించారు. విద్యార్థినులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. విద్యార్థినులకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. అక్కడే ఉన్న కొ ట్టాం పీహెచ్సీ వైద్యాధికారి హారికతో మాట్లాడి విద్యార్థినులకు అందిస్తున్న సేవల గురించి, ప్రిన్సి పాల్ శారదాబాయితో మాట్లాడి విద్యార్థినులకు అందిస్తున్న ఆహారం, కళాశాలలో పారిశుద్ధ్యం, తాగునీటి వసతులు,ఇతర సౌకర్యాలు గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు ఎటువంటి అవసరం వచ్చినా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట వైస్ ఎంపీపీ పినిశెట్టి వెంకటరమణ, నాయకులు వాకాడ రాంబాబు, కె.వెంకటరావు, టి.సాంబరాజు, డి.సన్యా సిదేముడు, ఆల్తి బాబురావు, ఎస్.కనకం, చిన్నా మాస్టర్ ఉన్నారు. -
పోటాపోటీగా పొర్లు దండాలు..!
–8లో● మోదీ ప్రాపకం కోసం ముగ్గురు దండకాలు ● చంద్రబాబు, పవన్, లోకేశ్... ఒక్కొక్కరు ఒక్కో బాణీలో పొగడ్తలు ఆరోగ్యశ్రీ వర్తించినా.. అదనపు వసూళ్లు..! ఆరోగ్యశ్రీ వర్తించినా కొన్ని ఆస్పత్రుల సిబ్బంది అదనపు వసూళ్లకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది. మళ్లీ గజరాజుల సంచారం మొరకముడిదాం మండలం నుంచి గరివిడి మండలం వైపు మళ్లిన ఏనుగులు కొత్తకర్ర, బుధరాయవలస గ్రామాల మధ్య తోటలోకి మళ్లీ చేరాయి. సాక్షిప్రతినిధి, విజయనగరం: హూ ఈజ్ మోదీ.. అయామ్ ఫాదరాఫ్ లోకేశ్.. నౌ టెల్ మీ.. హూ ఈజ్ మోదీ.. తల్లిని చూడలేనివాడు దేశాన్ని చూస్తాడా.. గోద్రా నరహంతకుడు మోదీ దేశానికి ప్రధానిగా ఎలా పనికొస్తాడు అంటూ అప్పట్లో హూంకరించిన చంద్రబాబేనా ఈయన.. కొంపదీసి డూప్ చంద్రబాబు గట్రా స్టేజి మీద ఉన్నారా అని ఒక్క క్షణం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవ సభకు హాజరైన జనానికి అనిపించింది. ఈ దేశానికి మోదీలాంటి వ్యక్తి అవసరం ఎంతైనా ఉంది.. అసలు మోదీ అవసరం దేశానికీ ఉంది.. ఆయన లేకపోతే దేశం లేదు.. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో మోదీలాంటి నాయకుడిని చూడలేదు అంటూ బాబు ఉన్నఫళంగా మోదీ దండకం అందుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీని ఏదో మర్యాదకోసం... ప్రొటోకాల్ కోసం అభినందించడం.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కృతజ్ఞతలు పూర్వకంగా రెండు మాటలు మాట్లాడడం సహజమే.. కానీ శనివారం చంద్రబాబు.. లోకేశ్.. పవన్ కల్యాణ్ ఒక్కొక్కరు ఒక్కో రేంజిలో పూనకాలు వచ్చినట్లు ఊగిపోతూ మోదీ భజన చేస్తుంటే... అసలు ఇది విమానాశ్రయ ప్రారంభమా ? మోదీ భజన కోసం ఇన్ని వేలమందిని తరలించారా అనే సందేహం అందరిలోనూ కలిగింది. ● లోకేశ్ చిడతల భజన చంద్రబాబు, పవన్ ఒక్కోరేంజిలో భజన చేయడంతో... ఇక లోకేశ్ కూడా తనవంతు పాత్ర గట్టిగానే పోషించేశారు. మోదీజీ విజన్.. చంద్రబాబు ఎగ్జిక్యూషన్ అంటూ పావుగంటసేపు చిడతలు వాయించేశారు. ఉన్న సమయమంతా మోదీని పొగడడానికి సరిపెట్టేశారు. రాష్ట్ర, దేశ ప్రగతికి మోదీ చేస్తున్న సేవలు.. ఆయన కృషి అంటూ మొదలెట్టి పలు పథకాలు.. రకరకాల ప్రాజెక్టుల పేర్లు చెబుతూ మోదీజీకి జై అనేలా ప్రజలను బతిమాలి మరీ జై కొట్టించారు. వచ్చీరాని మాటలు, అర్ధంలేని ప్రసంగాలతో తనదైన ‘ముద్ర’ను ఖాతాలో వేసుకున్నారు. మొత్తానికి ముగ్గురూ ఒకరిని మించి ఒకరు ప్రధానమంత్రి మోదీని ఉబ్బించేసి తాము ఉబ్బిపోయి వేదిక దిగిపోయారు. సీఎం పవన్ సారథ్యం అవసరం: శ్రీనివాస వర్మ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఉప ముఖ్యమంత్రి చంద్రబాబుల నాయకత్వం ఎంతో అవసరం అని కేంద్ర పరిశ్రమల శాఖ శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేదిక మీద ఆయన ప్రసంగిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఎంతగానో దోహదపడుతోందన్నారు. దీనికి ప్రధానమంత్రి మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఘనత సాధించడానికి ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఉప ముఖ్య మంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని, ఈ కాంబినేషన్ ఇలాగే ఉండాలని అభిలషించారు. పొరపాటున ఆయన ఇలా అన్నారేమో అనుకుని సభికులు కలవరపడ్డారు. ముఖ్యమంత్రి పవన్ అని కేంద్రమంత్రి అనగానే జనంలోంచి కాస్త గుసగుసలు.. కేకలు, అరుపులు వినిపించాయి... కానీ కేంద్ర మంత్రి ఏకంగా రెండుమూడు సార్లు పవన్ను ముఖ్యమంత్రి అని, చంద్రబాబును ఉప ముఖ్యమంత్రి అని సంబోధించడం వెనుక బీజేపీ నుంచి ఏమైనా సూచనలు ఉన్నాయా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. పవన్ కల్యాణ్ను ముఖ్యమంత్రిని చేసే ఉద్దేశంతో మోదీ ఈయనతో ఇలా మాట్లాడించారా అనే గుసగుసలు వినిపించాయి. రాష్ట్రమంత్రులకు నో మైక్ యువత దుమ్మెత్తిపోస్తుంటే... పవన్కు కన్నీళ్లు వచ్చేశాయి సముద్రం ఒకరి కాళ్లదగ్గర మోకరిల్లదు .. పర్వతం ఎవరికీ సలాం చేయదు అంటూ విప్లవ డైలాగులు చెప్పే పవన్ కల్యాణ్ సైతం ఈ రోజు పదిపన్నెండు మెట్లు దిగి మోదీకి భజన కొట్టారు. ప్రభుత్వ వైఫల్యాల మీద యువత మోదీని తిడుతుంటే తనకు కన్నీళ్లొచ్చేశాయి అంటూ సెంటిమెంట్ పండించారు. మోదీని కొట్టేవాళ్లు దేశంలోనే లేరని, ఆయనకు నచ్చినన్నాళ్లు ప్రధాని పదవిలో ఉండచ్చని చెబుతూ ఆయనకు బోర్ కొడితే మాత్రమే పదవిని వదులుకోవాలన్నారు. అలాంటి ప్రధాని సారథ్యంలో పని చేయడం తనకు జన్మజన్మల పుణ్యఫలం అని చెబుతుంటే... గతంలో మనం ఢిల్లీ వాళ్ల ముందు తలవంచుతామా ? ఢిల్లీ పెత్తనం మనకు అవసరమా అంటూ గొంతు చించుకుని అరచిన పవన్ కల్యాణ్ జనానికి గుర్తొచ్చారు. కాచిన చెట్టుకే రాళ్ల దెబ్బలు.. పని చేస్తున్నందుకే మోదీజీకి ఈ నిందలు అంటూ పవన్ మ్రాన్పడిపోవడాన్ని చూసి సభికులు విస్తుపోయారు. నటనా చాతుర్యం బాగుందని కితాబిచ్చారు. విమానాశ్రయం ప్రారంభ వేదిక మీద కేవలం ప్రధాని మోదీ, లోకేశ్, పవన్ కల్యాణ్, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ, రామ్మోహన్ నాయుడు మాత్రమే ప్రసంగించారు. మరో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కానీ రాష్ట్ర మంత్రులు టీడీ జనార్దన్, జిల్లాకు చెందిన కొండపల్లి శ్రీనివాస్, హోం మంత్రి అనితకు మైక్ దక్కలేదు. ఆఖరుకు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కానీ స్థానిక ఎమ్మెల్యే లోకం మాధవి కూడా ప్రసంగించేందుకు అవకాశం దక్కలేదు. గవర్నర్ అబ్దుల్ నజీర్ , గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు సైతం వేదిక మీద ఆసీనులయ్యారే తప్ప మాట్లాడేందుకు మైక్ అందలేదు. దేశవ్యాప్తంగా జెన్జీ యువత అటు బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తోంది. నీట్ లీకేజీ వ్యవహారంలో కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో దేశంలో మోదీ ప్రభ కాస్త మసకబారుతోందన్న సూచనలు సైతం సమాజంలోకి వెళ్తున్నాయి. ఇదిలా ఉండగా మరోవైపు తణమూల్ కాంగ్రెస్ నుంచి పలువురు ఎంపీలు బీజేపీలో కలుస్తుండడంతో ఈ అవకాశవాద చంద్రబాబును మోదీ పక్కనబెడతారు.. ఇక బాబుకు ప్రాధాన్యం తగ్గుతుందన్న వెర్షన్ కూడా వినిపిస్తోంది. ఇలాంటి తరుణంలో చంద్రబాబుకు అత్యవసరంగా లోకేశ్ను సీఎంగా చేయాలన్న ఇంటిపోరు సైతం మొదలైంది. మోదీ అనుమతి లేకుండా లోకేశ్ను సీఎం చేయడంకుదరని పని. దీంతో అటు తృణమూల్ రూపంలో కేంద్రంతో తన ప్రాధాన్యాన్ని ముంచుకొచ్చిన ముప్పును తప్పించుకుంటూ ఇంకా మోదీకి విధేయత చూపడానికి బాబు ఎక్కడలేని తంటాలు పడ్డారు. మేకిన్ ఇండియా.. ఆత్మనిర్భర భారత్.. బులెట్ ట్రైన్, డిజిటల్ పేమెంట్స్.. రోడ్లు.. విమానాశ్రయాలు.. జాతీయ రహదారులు అంటూ పలు ప్రాజెక్టులు, పథకాల పేర్లు చెబుతూ వెనువెంటనే మోదీమోదీ అంటూ అరవాల్సిందిగా బాబు సభికులకు ప్రాథయపడ్డారు. ఒకానొకదశలో బాబు పూనకం వచ్చినట్లు గొంతు చించుకుని మోదీమోదీ అని అరవడాన్ని చూసి వీఐపీ గ్యాలరీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం విస్తుపోయారు. ఉన్నఫళంగా ఈ స్థాయి పూనకానికి కారణం ఏమిటో అర్థంకాక ఒకరి మోకాలు ఒకరు చూసుకున్నారు. లోకేశ్ను సీఎంను చేసేందుకే ఇంత ప్రాపకమా అన్న విషయం తెలిసుకున్నాక ముక్కనవేలేసుకున్నారు. -
ఆరోగ్యశ్రీ వర్తించినా.. అదనపు వసూళ్లు..!
● అధికారులకు తెలిసినా పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ● నెట్వర్క్ ఆస్పత్రులు ఇచ్చే మామూళ్ల కోసం మౌనంనెట్వర్క్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులువిజయనగరం ఫోర్ట్: ఇది ఈ ఇద్దరు రోగులకు వచ్చిన సమస్యే కాదు. నిత్యం అనేక మంది రోగులకు ఆరోగ్యశ్రీ ప్రైవేటు నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఇదే పరిస్థితి ఎదురవుతోంది. చర్యలు చేపట్టాల్సిన ఆరోగ్యశ్రీ అధికారులు తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కిందిస్థాయి సిబ్బంది అధికారులకు చెబితే కొన్ని చూసీచూడనట్లు వదిలేయాలని ఓ అధికారి సిబ్బందితో అన్నట్లు తెలుస్తోంది. టీడీపీ సర్కార్ హయాంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని నెట్వర్క్ ఆస్పత్రులు పూర్తిగా కమర్షియల్గా మార్చేశాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ ద్వారా ట్రస్టు ఇచ్చే నిధులతో పాటు అదనంగా కూడా రాబట్టుకునే పనిలో నెట్వర్క్ ఆస్పత్రులు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెరిగిన కో పేమెంట్స్ ఆరోగ్యశ్రీ పథకంలో కో పేమెంట్స్ బాగా పెరిగినట్లు పెద్దఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదనపు వసూళ్లకే కో పేమెంట్స్ అని నెట్వర్క్ ఆస్పత్రులు పేరు పెట్టాయి. కో పేమెంట్ లేకుండా ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స గాని, శస్త్రచికిత్సలు చేయడానికి నెట్వర్క్ ఆస్పత్రులు ఇష్టపడడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెట్వర్క్ ఆస్పత్రులు అదనపు వసూళ్లకు పాల్పడుతున్నాయనే విషయం ఆరోగ్యశ్రీ అధికారులకు తెలిసినప్పటికీ నెట్వర్క్ ఆస్పత్రులు ఇచ్చే మామ్మూళ్ల కోసం మౌనం వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో రోగుల నుంచి నెట్వర్క్ ఆస్పత్రుల అదనపు వసూళ్లుకు అడ్డులేకుండా పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. చీపురుపల్లికి చెందిన ఓబాలుడికి హైడ్రాసిల్ నొప్పి రావడంతో విజయనగరం పట్టణంలోని ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) నెట్వర్క్ ఆస్పత్రిలో చూపించగా శస్త్రచికిత్స చేయాలని వైద్యులు చెప్పడంతో ఆస్పత్రిలో ఇన్పేషేంట్గా చేర్పించారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా బాలుడికి శస్త్రచికిత్స చేశారు. అయినప్పటికీ అదనంగా మరో రూ.8 వేలు బాలుడి కుటుంబ సభ్యుల దగ్గర ఆస్పత్రి సిబ్బంది తీసుకున్నారు. ఉచితంగా వైద్య సేవలు అందించేలా చూడాలి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చికిత్స అందించే ప్రతినెట్వర్క్ ఆస్పత్రిలో ఆరోగ్య మిత్రలు ఉంటారు. వారిని పర్యవేక్షించేందుకు టీమ్ లీడర్లు కూడా ఉంటారు. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా చికిత్స చేయించుకోవడానికి వచ్చే రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందేవిధంగా చూడాల్సింది వారే. ఆస్పత్రిలో రోగులు చికిత్స పొందే ప్రతిరోజూ రోగుల దగ్గరకు వెళ్లి వైద్య సేవల గురించి ఆరా తీయాలి. అదేవిధంగా డబ్బులు ఎవరైనా తీసుకుంటున్నారా? అని రోగులనుంచి ఆరా తీయాలి. అయితే ఆరోగ్యమిత్రలు, టీమ్ లీడర్లు, ఉన్నప్పటికీ నెట్వర్క్ ఆస్పత్రులు అదనపు వసూళ్లకు పాల్పడడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. విజయనగరం మండలానికి చెందిన ఓ వ్యక్తి ఇంటి వద్ద పడిపోవడంతో కాలు విరిగింది. దీంతో విజయనగరం పట్టణంలోని ఓ ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్య పరీక్షల్లో అ వ్యక్తికి బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉంది ఆపరేషన్ చేయాలంటే ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నప్పటికీ రూ.50 వేలు అదనంగా అవుతుందని చెప్పడంతో అంత ఇచ్చుకోలేమని చెప్పి, మరో ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ కూడా రూ.15 వేల వరకు అదనంగా ఇవ్వాలని చెప్పారు. దీంతో ఆ ఆస్పత్రిలో ఆ వ్యక్తిని చేర్పించారు. ఫిర్యాదు చేస్తే చర్యలు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న ప్రతి రోగికి నెట్వర్క్ ఆస్పత్రి వారు ఉచితంగా వైద్యసేవలు అందించాలి. అదనంగా డబ్బులు అడినట్లయితే సంబంధిత ఆస్పత్రి మిత్రాకుగాని, నాకు గానీ లఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. డాక్టర్ కె. సాయిరాం, ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ -
అందని పనస కలప
● ఆవేదనలో వీణల తయారీదారులు బొబ్బిలి: పట్టణంలోని వీణల తయారీ కేంద్రంలో పనిచేస్తున్న కార్మికులకు పనస కలప కొరత వెంటాడుతోంది. వీణల తయారీ కష్ట సాధ్యంగా మారింది. విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం వపన్కల్యాణ్ అటవీశాఖ కార్పస్ ఫండ్ రూ.10 లక్షలతో కలప కొనుగోలు చేసి ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు అటవీశాఖ రూ.5లక్షల విలువైన పనస కలప కొనుగోలు చేసి వీణల తయారీ కేంద్రానికి చేర్చింది. మిగిలిన నిధులను ఉమ్మడి ఖాతాలో జమచేశారు. అయితే, కొనుగోలు చేసిన కలప వీణల తయారీ కేంద్రానికి చేరి దాదాపు మూడు నెలలవుతున్నా తయారీ దారులకు అప్పగించలేదు. ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం పెదపెంకిలో సీసీ రోడ్లు, కాలువల నిర్మాణాల ప్రారంభానికి పవన్ వస్తారని, పనస కలప అందిస్తారని భావించారంతా! కానీ ఆ పనులు కనీసం 50 శాతం కూడా పూర్తికాలేదని, గత నెల పవన్ రావాల్సిన షెడ్యూల్ను రద్దు చేశారు. ఇటీవల కుంకీ ఏనుగులు వచ్చాయి. వాటిని సంరక్షణ కేంద్రానికి తరలించగా ఆ ప్రాంతాన్ని శంకుస్థాపనతో వర్చువల్గా ప్రారంభించారు. ఇక ఆ అవకాశమూ వాయిదా పడింది. పనస కలపను పవన్ చేతుల మీదుగా ఇస్తారని భావిస్తున్న కార్మికులకు నిరాశే మిగులుతోంది. వర్చువల్గా 50 శాతం రాయితీపై పనసకలప ఇచ్చే అవకాశాలను పరిశీలించాలని తయారీదారులు కోరుతున్నారు. ఆగస్టులో రావచ్చు! వీణ కార్మికులకు పనస కలప అందించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వస్తారని సమాచారం ఉంది. ఆయన వచ్చాకే పనస కలప కార్మికులకు అందిస్తారు. ఈలోగా పనస కలప పాడవ్వకుండా భద్రపరిచాం. ఆగస్టు 15న కలప ఇచ్చేందుకు అవకాశం ఉంది. – రామకృష్ణ, వీణల తయారీ కేంద్రం ఇన్చార్జి, బొబ్బిలి -
మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబితవిజయనగరం లీగల్: మధ్యవర్తిత్వం ద్వారా ఎన్నో కేసుల పరిష్కారం జరుగుతోందని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత సూచించారు. జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో మధ్యవర్తిత్వం–దేశం కోసం అనే అంశంపై న్యాయమూర్తులు, న్యాయవాదులతో శనివారం చర్చించారు. మనోవర్తి, ప్రమాద బీమా, గృహహింస, చెక్బౌన్స్ తదితర కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. అనంతరం జిల్లా కోర్టు ఆవరణ నుంచి పూల్బాగ్ కాలనీ వరకు ర్యాలీ నిర్వహించి, మధ్యవర్తిత్వంపై అవగాహన కల్పించారు. 90 రోజుల పాటు ఈ అవగాహన కార్యక్రమం కొనసాగుతుందని, మధ్యవర్తిత్వంపై అవగాహన కోసం కోర్టు ఆవరణలో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
పంటల బీమా ప్రీమియం చెల్లింపు గడువు పెంపు
● రైతుల నెత్తిన మరింత భారం ● చెల్లింపునకు పాట్లురామభద్రపురం: ఖరీఫ్ సీజన్లో వరి మినహా పత్తి, మొక్కజొన్న తదితర మిగతా పంటలకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గడువును కేంద్ర ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించింది. ఇప్పటికే వరి పంటకు ఈ నెల 15వ తేదీ వరకు గడువు ఉండగా, మిగతా పంటలకు గడువును పొడిగించింది. బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నవారు, తీసుకోని వారితో పాటు కౌలు రైతులకు పంటల బీమా ప్రీమియం చెల్లించేందుకు ఈ గడువు వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 1,16,990 హెక్టార్లు. ఇందులో వరి 97,500 హెక్టార్లు, మొక్కజొన్న 10,791 హెక్టార్లు, పత్తి 2,200 హెక్టార్లలో సాగు లక్ష్యం. ఇప్పటి వరకు వెదలు, ఉబాలుతో వరి సాగు చేసింది 10,600 హెక్టార్లు, మొక్కజొన్న 7,212 హెక్టార్లలో సాగైంది. పంటల బీమా ప్రీమియం చెల్లింపులో తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ రెండు పంటలకుగాను ఇప్పటి వరకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద బ్యాంకులో రుణాలు తీసుకున్న వారు, తీసుకొని వారు కలిపి 6,393 హెక్టార్లకు 56,600 మంది రైతులు సుమారు రూ.31 లక్షలు పంటల బీమా ప్రీమియం చెల్లించారు. వాతావరణ ఆధారిత పథకం కింద పత్తి 2,112 హెక్టార్లకుగాను 462 మంది రైతులు 81 హెక్టార్లకు మాత్రమే పంటల బీమా ప్రీమియం సుమారు రూ.3,87 లక్షలు చెల్లించారు. చెల్లింపునకు పాట్లు ఎల్నినో పరిస్థితులు ఉన్నందున పంట చేతికిరాని సమయంలో కనీసం బీమా పరిహారమైనా వస్తుందనే ఆశతో ప్రీమియం చెల్లించేందుకు ఎగబడుతున్నారు. అయితే మీ సేవా కేంద్రాలు, కామన్ సర్వీస్ సెంటర్లు(సీఎస్సీ)ఆర్ఎస్కేలు, డిజిటల్ కేంద్రాలలో సర్వర్లు సరిగా పని చేయకపోవడంతో రైతులు ప్రీమి యం చెల్లింపు కోసం గంటల తరబడి నిరీక్షిస్తూ పా ట్లు పడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. రైతులు తా ము చేసిన పంటలకు తమ వాటా కింద ప్రీమియం చెల్లిస్తేనే బీమా పథకాలు వర్తించనున్నాయి. అన్నదాతపై బీమా భారం చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉచిత పంటల బీమాకు మంగళం పాడింది. ఆ భారాన్ని రైతులపైనే వేసింది. ఒక వైపు ఎలినినో ప్రభావంతో వర్షాలు లేక పొలంలో తాము కష్టపడి సాగు చేసిన పంటలు చేతికి రాకుండా పోతుండటం, చేతిలో చిల్లిగవ్వ లేక రైతులు ఇబ్బందులు పడుతున్న సమయంలో రైతులే పంటల ప్రీమియం చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది. ఫలితంగా అన్నదాత మరిన్ని కష్టాలు పడుతున్నాడు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో రైతులపై పైసా భారం మోపకుండా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ ఉచిత పంటల బీమా కింద ఈ–పంట ఆధారితంగానే బీమా ప్రీమియం చెల్లించారు. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం ఈ భారాన్ని రైతులపైనే వేసింది.15లోగా ప్రీమియం చెల్లించాలి రైతు ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం పంటల బీమా నమోదు గడువు ఈ నెల 15వ తేదీ వరకు పెంచింది. రైతులు చివరి వరకు వేచి ఉండకుండా బ్యాంకులో రుణాలు ఉన్న వారు, లేని రైతులు మొబైల్ యాప్ ద్వారా లేక ఆర్ఎస్కేలు, సీఎస్సీల వద్ద ప్రీమియం చెల్లించాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – మధుసూదనరావు, ఏడీఏ, బొబ్బిలి -
తమ్ముళ్ల ఖాతాలోకి.. పంచాయతీల సొమ్ము!
● గిరిజన పంచాయతీలే టార్గెట్ ● పనులు చేయకుండానే స్వాహా ● రూ.18 లక్షల వరకు పక్కదారి వీణల తయారీ కేంద్రంలో ఉన్న పనస కలప సాక్షి, పార్వతీపురం మన్యం: సర్పంచ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత గిరిజన పంచాయతీల్లో కనీస పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ వంటి పనులు జరిగిన దాఖలాల్లేవు. ఇదే సమయంలో అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేయాల్సిన నిధులు.. తెలుగు తమ్ముళ్ల ఖాతాలోకి మళ్లిపోతున్నాయి. వారి సొంత జేబులో సొమ్ములా వాడేసుకుంటున్నారు. ఇదే తరహాలో సాలూరు నియోజకవర్గంలోని సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాల్లో గల గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేయాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులను కొద్ది రోజుల కిందట డ్రా చేసినట్లు సమాచారం. సాలూరు మండలానికి చెందిన టీడీపీ ముఖ్య నాయకుడు ఒకరు 12 పంచాయతీల్లో రూ.18 లక్షలు విత్ డ్రా చేసినట్లు భోగట్టా. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న పంచాయతీలనే ఇందుకు ఎంచుకున్నారు. పనులు చేయకుండా నిధులు డ్రా చేయడం పట్ల తాము ఇరకాటంలో పడిపోతామేమో అని ఆయా కార్యదర్శులు ఆందోళనలో ఉన్నారు. అధికార పార్టీకి చెందిన ముఖ్య నాయకుడు కావడం.. మండల అధికారుల సిఫార్సులు కూడా ఉండడంతో నోరు మెదపలేక పోతున్నారు. ఇప్పుడు ఆయా పంచాయతీల్లో నిర్వహణ, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇచ్చేందుకు కూడా నిధులు లేవని తెలుస్తోంది. గిరిజన పంచాయతీలే అధికం.. నిధులు డ్రా చేసిన పంచాయతీల్లో ఎక్కువ భాగం గిరిజన, గిరి శిఖర ప్రాంతాలే ఉన్నాయి. అది కూడా గతంలో వైఎస్సార్ సీపీ సర్పంచ్లు ప్రాతినిధ్యం వహించిన పంచాయతీలనే ఎంచుకోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ భాగోతం బయట పడినా నిందను వారి మీదకు నెట్టేయవచ్చన్న ఆలోచన కూడా అయి ఉండొచ్చని గ్రామస్తులు అంటున్నారు. ఈ పంచాయతీల్లో టీడీపీ నాయకులు ఉన్నప్పటికీ ప్రశ్నించలేని పరిస్థితిలో వారు ఉండటం ఆ ‘తమ్ముడికి’ కలిసి వచ్చింది. కొత్తవలస పంచాయతీ నుంచి రూ.2,00,364, కందులపథం పంచాయతీ నుంచి 1,00,300, తోణాం రూ.1,49,978, సారిక రూ.2,00,482, మరిపల్లి రూ.1,00,300, కురుకుట్టి 2,50,750, అన్నంరాజువలస రూ.2,49,216, తుండ రూ.2,00,010, గంజాయిభద్ర రూ.లక్ష, పట్టుచెన్నూరు రూ.1.50 లక్షలు, కూర్మరాజుపేట రూ.50,622, కొదమ నుంచి రూ.1.20 లక్షల చొప్పున నిధులు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. ఈ 12 పంచాయతీల్లో రూ.18 లక్షలు విత్ డ్రా కావడం.. మెజారిటీ పంచాయతీలు గిరిజన ప్రాంతానికి చెందినవే అవ్వడం గమనార్హం. పాచిపెంట మేజర్ పంచాయతీలో కూడా పారిశుద్ధ్య నిర్వహణ కోసమని మంత్రి అనుచరుడి పేరు మీద రూ.లక్ష రూపాయల నిధులు డ్రా చేయడం చర్చనీయాంశంగా మారింది. గ్రామస్తుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. -
‘లెక్క’లేని ఓట్లు.. లక్షకు మించి..!
విజయనగరం అర్బన్: జిల్లాలో ప్రతిపాదించిన ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)–2026 ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ స్థానిక ఓటర్లలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శుక్రవారం విడుదల చేసిన ప్రాథమిక ఓటరు జాబితాను పరిశీలిస్తే అధికారుల ఉదాసీనత, క్షేత్రస్థాయి సర్వేలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఓటర్ల వివరాలు సేకరించ లేకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లక్షకు పైగా ఓట్లు ప్రశ్నార్థకం..! జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 15,78,949 డిజిటలైజ్డ్ గణన ఫారాలను అధికారులు పరిశీలించారు. ప్రస్తుతం ముసాయిదా జాబితాలో 14,51,072 మందికి మాత్రమే చోటు దక్కింది. దీంతో దాదాపు 1.27 లక్షల మంది ఓటర్ల భవిష్యత్తు ఇప్పుడు త్రిశంకు స్వర్గంలో పడింది. సేకరించలేని ఫారాలలో కేవలం మరణాల పేరిట వేలాది మందిని పక్కన పెట్టడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఉపాధి కోసం తాత్కాలికంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారిని, సర్వే సమయంలో ఇంట్లో లేని వారిని ‘శాశ్వత బదిలీ’, ‘గైర్హాజరు’ కింద జమ కట్టేశారనే ఆరోపణలు వస్తున్నాయి. రాజాం నియోజకవర్గంలో అత్యధికంగా 223,688 ఫారంలు, బొబ్బిలిలో 21,274 ఫారంలు, చీపురుపల్లిలో 19,060 ఫారంలు లభించలేదని రికార్డుల్లో చూపడం క్షేత్రస్థాయి సర్వే ఎంత అసంపూర్తిగా సాగిందో అర్థం పడుతోంది. నోటీసుల పేరుతో సామాన్యుడిపై భారం ఓటరు వివరాలు సమర్పించని వారికి, వ్యత్యా సాలు ఉన్న వారికి నోటీసులు జారీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే నిరక్షరాస్యులు, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఈ నోటీసుల ప్రక్రియ నరకంగా మారే ప్రమాదం ఉంది. గుర్తింపు కోసం 11 రకాల కఠినమైన పత్రాలను ప్రతిపాదించడంతో సామాన్యులు, రెక్కాడితేగానీ డొక్కాడని పేద ప్రజలు తహసీల్దార్, ఈఆర్ఓ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. కేవలం ఆగస్టు 30 వరకు క్లైవ్ఏులు, అభ్యంతరాలకు గడువు ఇవ్వడం వల్ల తక్కువ సమయంలో అర్హులైన ఓటర్లు తమ పేర్లు నిలబెట్టుకోవడం సవాలుగా మారింది. బీఎల్ఓలు సరిగ్గా ఇళ్లకు రాకుండానే ‘గైర్హాజరు’, ‘బదిలీ’ అని రాసేశారని, ఇప్పుడు తమ ఓటు హక్కును కాపాడుకోవడానికి పనులు వదులుకుని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని పలువురు బాధితులు వాపోతున్నారు. ఆగస్టు 30లోపు బాధితులంతా స్పందించి దరఖాస్తులు చేసుకోకపోతే అక్టోబర్ 3న ప్రచురించే తుది జాబితాలో వేలాది మంది ఓటు హక్కును శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. 11 రకాల ఽధ్రువీకరణ పత్రాలు.. వివరాలు నింపి ఎన్యూమరేషన్ పత్రాలు బీఎల్ఓలకు సమర్పించిన వారిలో చాలా మంది 2002 నాటి జాబితాలో తమ, తమ సంబంధీకుల వివరాలతో మ్యాపింగ్ చేసుకోలేదు. అలాంటి వారికి నోటీసులిస్తారు. వీరు ఆధార్ కార్డు కాకుండా.. ఎన్నికల సంఘం నిర్ధేశించిన 11 రకాల ఽధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించాలి. వాటిలో కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛనుదారుకు జారీ చేసిన ఐడెంటిటీ కార్డు లేదా పింఛను పేమెంట్ ఆర్డర్ ఉంటే సరిపోతుంది. అలాగే 1987 జూలై 1కు ముందు ప్రభుత్వ/స్థానిక సంస్థలు/బ్యాంకులు/జనన ధ్రువీకరణ పత్రం, బోర్డు/విశ్వవిద్యాలయం జారీ చేసిన విద్యా సర్టిఫికెట్లు, శాశ్వత నివాస ధ్రువీకరణ, అటవీ హక్కుల చట్టం సర్టిఫికెట్, కుల ఽధ్రువీకరణ. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(అమల్లో ఉన్న ప్రాంతాల్లోనే). రాష్ట్ర/స్థానిక సంస్థలు తయారు చేసిన ఫ్యామిలీ రిజిస్టర్, ప్రభుత్వం జారీ చేసిన భూమి/ఇంటి కేటాయింపు పత్రాలు. జిల్లాలో 1.27 లక్షలకు పైగా ఓట్లకు గండం సర్ ప్రక్రియ తర్వాత భారీగా తగ్గిన ఓటర్ల సంఖ్య నోటీసుల పేరుతో సామాన్యులకు తప్పని తిప్పలు ముసాయిదా జాబితా విడుదల -
అధికార బలంతో అభిమానులను అడ్డుకోలేరు
విజయనగరం రూరల్: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాష్ట్ర ప్రజలకున్న అభిమానాన్ని చంద్రబాబు అడ్డుకోవడం, అరచేతితో సూర్యకాంతిని అడ్డుకోవడంలాంటిదేనని మాజీ డిప్యూటీ స్పీకర్, వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి అన్నా రు. తన నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పరామర్శ నేపథ్యంలో విజయనగరం జిల్లా మీదుగా గురు వారం పర్యటన సాగించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసేందుకు, ఆయనకు స్వాగతం పలికేందుకు జిల్లా వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీ ఎత్తున తరలివెలుతుంటే అధికార పార్టీ నేతల ఒత్తిడితో పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడం విచారకరమన్నారు. యువత, ప్రజలు, అభిమానులు తమ వాహనాలను దూరంగా నిలిపేసి జననేతను చూడటానికి కిలోమీటర్ల మేర నడిచి వెళ్లి తమ అభిమానాన్ని చాటుకున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో అధికారమదంతో ఈ విధమైన అడ్డంకులు సృష్టించడం సరికాదని మండిపడ్డారు. ప్రజలకు సేవ చేస్తున్న మాజీ మంత్రి అప్పలరాజుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. ప్రమాదంలో చనిపోయిన కుటుంబానికి కూటమి మంత్రి రూ.10 లక్షలు, ఇల్లు ఇస్తామని ప్రకటించడంతో మాజీ మంత్రిపై వారి అక్కసు తేటతెల్లమవుతోందన్నారు. రాష్ట్రంలో ప్రమాదాల్లో చనిపోయిన ప్రతీ ఒక్కరికీ ఇదే పరిహారం అందిస్తారా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ సంకల్పమే నేటి భోగాపురం విమానాశ్రయం గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ సంకల్పంతోనే నేడు భోగాపురంలో అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సాగుతోందని కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు. విమానాశ్రయం నిర్మాణానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. అప్పటివరకు 70 శాతం పనులు పూర్తిచేసిందన్నారు. 2024లో ప్రభుత్వం మారడంతో విమానాశ్రయ పనులు వేగవంతం చేయాల్సిన చంద్రబాబు సర్కారు ఎక్కడ ఆ క్రెడిట్ వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి దక్కుతుందన్న దురుద్ధేశంతో పనులు ఆలస్యం చేసి రెండేళ్లు సాగదీసి, క్రెడిట్ను చోరీ చేసిందన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనే కృషి జరిగిందన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని సాదరంగా ఆహ్వానిస్తున్నామని, దీనిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాత్ర వెలకట్టలేనిదన్నారు. సూపర్సిక్స్ పథకాలతో మోసగించారు కూటమి నేతలు ఎన్నికల హామీల్లో సూపర్సిక్స్ పథకాలు అమలు చేస్తామని హామీలను ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక వాటిని పక్కన పెట్టేశారని కోలగట్ల విమర్శించారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తున్నామని చెబుతున్న చంద్రబాబు సర్కారు కలియుగదైవం వేంకటేశ్వరుని ఎదుట ప్రమాణం చేసి చెప్పగల ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు సర్కారు అబద్ధపు ప్రచారాలు చేస్తుండటాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టబోయే పోరుబాటలో ప్రజలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి, పార్టీ పట్టణ, మండలాధ్యక్షులు ఆశపు వేణు, కెల్ల త్రినాథ్, ఎంపీపీ మామిడి అప్పలనాయుడు, పార్టీ నాయకులు బంగారునాయుడు, ఎస్.వి.వి.రాజేష్, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. వైఎస్ జగన్ పర్యటన విజయవంతం పోలీసులు అడ్డంకులు సృష్టించడం విచారకరం రెట్టించిన ఉత్సాహంతో అభిమానులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు అంతర్జాతీయ విమానాశ్రయం తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డిదే.. మాజీ డిప్యూటీ స్పీకర్, వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి -
ఆర్టీసీని ప్రైవేటీకరించేది లేదు..
● మంత్రి ఎం.రాంప్రసాద్రెడ్డి విజయనగరం అర్బన్: ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ చేయబోమని ప్రభుత్వ బస్సులు, కార్మికులు ఉన్నప్పుడే సంస్థ మనుగడ సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి కార్మికులకు స్పష్టమైన హామీ ఇచ్చారు. సంస్థ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం నుంచి సాధ్యమైనంత సహాయం అందిస్తామని తెలిపారు. శుక్రవారం ఆర్టీసీ జోనల్ వర్క్షాప్ను సందర్శించి, క్షేత్ర స్థాయిలో అందుతున్న సేవలు, పనితీరును తనిఖీ చేశారు. వర్క్షాప్లో ఎఫ్ఐపీ, ఇంజన్, మెషిన్ షాప్, ఎలక్ట్రికల్, బాడీ షాప్, గేర్ బాక్స్, లేత్ మిషన్ సెక్షన్లను దగ్గరుండి పరిశీలించారు. బస్సుల నిర్వహణ, మరమ్మతుల నాణ్యతపై అధికారులను ఆరా తీశారు. ప్రయాణికులకు సురక్షితమైన, మెరుగైన సేవలు అందించేలా నిర్వహణ ప్రమాణాలు పాటించాలని అధికారులకు మంత్రి సూచించారు. ఖర్చులు తగ్గిస్తూనే నాణ్యతను పెంచడంలో ఆర్టీసీ ముందుండాలని పిలుపునిచ్చారు. విజయనగరం వర్క్షాప్ జోన్ అంతటికీ ఉత్తమ సర్వీసులు అందిస్తోందని అధికారులు మంత్రికి వివరించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగానే సంస్థలోకి ఎలక్ట్రిక్, సీఎన్జీ బస్సులను ప్రవేశపెడుతున్నామని ఆయన తెలిపారు.కార్యక్రమంలో భాగంగా ఇటీవల పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు మంత్రి రాంప్రసాద్రెడ్డి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో విశాఖపట్నం రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు, వర్క్స్ మేనేజర్లు వరుణ్ కుమార్, అరుణ, స్టోర్స్ అధికారి రాజశేఖర్, సెక్యూరిటీ ఆఫీసర్ దుర్గాప్రసాద్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, పలువురు అధికారులు, సూపర్వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
చంద్రబాబుది అబద్ధాల పాలన
విజయనగరం: భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్టు నిర్మాణ చరిత ప్రజలకు తెలుసని, సీఎం చంద్రబాబు చెబుతున్న అబద్ధాలను నమ్మే స్థితిలో ఎవరూ లేరని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ఎవరైనా తాము చేసింది చెప్పుకుంటారని.. చంద్రబాబు ప్రభుత్వం వారు చేయని పనులు చేసినట్లు చెప్పుకోవడం దిగజారుడు తనానికి నిదర్శనమని విమర్శించారు. ఉత్తరాంధ్రకే తలమానికంగా నిలిచే భోగాపురంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం ఘనత మాజీ వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం అంతా తామే చేశామంటూ క్రెడిట్ చోరీ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని వాఖ్యానించారు. ధర్మపురిలోని సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎయిర్పోర్ట్ శంకుస్థాపన నుంచి నేటి వరకు ఏ ప్రభుత్వంలో ఎవరేమి చేశారో ఆధారాలతో సైతం వివరించారు. అన్ని అనుమతులు తీసుకున్న తరువాతే 2023లో శంకుస్థాపన... భోగాపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని మజ్జి శ్రీనివాసరావు స్పష్టంచేశారు. 2,203 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులు తీసుకున్న తరువాతనే 2023 మే నెలలో అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారన్నారు. శంకుస్థాపనకు ముందు రూ.135 కోట్లతో 14 కిలోమీటర్ల మేర కాంపౌండ్ వాల్, విద్యుత్ సబ్స్టేషన్, లైటింగ్ సిస్టమ్, అప్రోచ్ రోడ్లు, తాత్కాలిక నీటిసరఫరా ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. ఫలితంగానే ఎయిర్పోర్ట్ నిర్మాణం నిర్ణీత సమయానికి పూర్తయిందని వెల్లడించారు. శంకుస్థాపన అనంతరం 2024 జూన్ 12 నాటికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కేంద్రమంత్రి హోదాలో పర్యటించిన రామ్మోహన్నాయుడు అప్పటి వరకు 23 శాతం పనులు పూర్తయినట్లు ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. అనంతరం సదరు జీఎంఆర్ సంస్థ అగ్రిమెంట్ ప్రకారం పనులు చేపట్టడం మినహా ఇందులో రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. శంకుస్థాపన రోజునే ఎయిర్పోర్ట్ నిర్మాణ బాధ్యతలు తీసుకున్న జీఎంఆర్ సంస్థ అధినేత గ్రంధి మల్లికార్జునరావు 2026 నాటికి పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామని వెల్లడించారని, జిల్లా వాసిగా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని చెప్పారు. తాజాగా అంతా తామే చేసినట్లు చంద్రబాబు సర్కారు చెబుతుండడంపై ప్రజలు నవ్వుతున్నారన్నారు. ఉత్తరాంధ్రుల ఆర్థిక ప్రగతికి తండ్రీకొడుకులు సాయం రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్ర ఆర్థికాభివృద్ధిని కాంక్షిస్తూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేశారని మజ్జి శ్రీనివాసరావు గుర్తు చేశారు. ప్రజల అవసరాలను , సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చొరవ చూపిన వ్యక్తులుగా చరిత్రలో నిలిచిపోతారన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ఎంతో మంది ఉన్నత స్థాయి నాయకులున్నా ఎవ్వరూ చేయని అభివృద్ధిని తండ్రీతనయులు చేశారన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, మూలపాడు పోర్టు, సముద్ర తీరంలో జెట్టీల నిర్మాణం, ఉద్దానంలో మంచి నీటి సరఫరా, భోగాపురంఎయిర్పోర్ట్ నిర్మాణం, ప్రభుత్వ మెడికల్ కళాశాలలు నిర్మాణం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల కళ సాకారం... భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం వల్ల ఉత్తరాంధ్ర ప్రజల కళ సాకారమవుతుందన్నారు. కార్యక్రమంలో ముఖ్య అథిగా పాల్గొనేందుకు వస్తున్న ప్రధాని నరేంద్రమోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ఎయిర్పోర్టు నిర్మాణాన్ని నిర్ణీత సమయానికి పూర్తిచేసిన జీఎంఆర్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో విజయనగరం జిల్లా అభివృద్ధి పథంలో నడుస్తుందని ఆకాంక్షించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కె.వి.సూర్యనారాయణరాజు, నెక్కల నాయుడుబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శులు వర్రి నర్సింహమూర్తి, ఇప్పిలి అనంత్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎయిర్పోర్టు నిర్మాణ చరిత ప్రజలకు తెలుసు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం ఘనత వైఎస్ జగన్ మోహన్రెడ్డిదే.. ఉత్తరాంధ్రుల ఆర్థిక అభివృద్ధే తండ్రీ, తనయుల ఆకాంక్ష అన్ని అనుమతులు తీసుకున్న తరువాతే 2023లో శంకుస్థాపన అప్పట్లో ఇచ్చిన మాట ప్రకారం 2026 నాటికి నిర్మాణం పూర్తి భోగాపురం ఎయిర్ పోర్టుతో ఉత్తరాంధ్రుల కల సాకారం జెడ్పీ చైర్మన్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు -
గిరిజన బాలికలకు నృత్య‘శిక్ష’ణ!
విజయనగరం అర్బన్/పూసపాటిరేగ: విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి వస్తున్న ప్రధాని మోదీ ముందు ‘మెప్పు’ కోసం చంద్రబాబు సర్కారు పాకులాడుతోంది. థింసా నృత్య శిక్షణ పేరిట గిరిజన బాలికలను అవస్థలకు గురిచేస్తోంది. ‘గిన్నిస్ రికార్డు’ ఆర్భాటం కోసం వేలాది మంది గిరిజన సంక్షేమ పాఠశాలల విద్యార్థులను చదువులకు దూరం చేయడం, మండే ఎండలో శిక్షణ ఇస్తుండడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. రికార్డు సంఖ్యలో 14వేల మంది గిరిజన బాలికలతో థింసా నృత్యం చేయించాలని సర్కారు షెడ్యూల్ ఖరారు చేసింది. ఇందులో భాగంగా ఐటీడీఏ పాడేరు పరిధి నుంచి 7 వేల మంది, పార్వతీపురం మన్యం నుంచి 3 వేలు, రంపచోడవరం నుంచి 2 వేలు, సీతంపేట నుంచి 2 వేల మంది 8, 9, 10 తరగతులు చదువుతున్న బాలికలను ఎంపిక చేసింది. వీరికి ఈ నెల 26వ తేదీ నుంచి ఎయిర్పోర్టు గ్రౌండ్లో థింసా నృత్యంపై శిక్షణ ఇస్తోంది. శిక్షణ, ప్రచారం మోజుపై ఉన్న ఆసక్తి గిరిజన బాలికలకు సదుపాయాలు కల్పించడంలో చూపడం లేదు. సరైన తిండిలేక, పడుకునేందుకు చోటులేక నరకయాతన పడుతున్నారు. విజయనగరం జిల్లాలోని వివిధ మండలాల్లో సరైన వసతులు లేకుండా పశువులకంటే హీనంగా వసతిగృహాలు, కళాశాలల్లో ఉంచడంపై బాలికల తలిదండ్రులు, ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గతంలో గోదావరి పుష్కరాలు, యోగాసన సాధన, ఆలయాల వద్ద జరిగిన ఘటనలను గుర్తుచేస్తూ.. ప్రచారం పేరుతో ప్రాణాలు తీయడం చంద్రబాబుకు అలవాటని, గిరిజన బాలికలు అప్రమత్తంగా వ్యవహరించాలంటూ గిరిజన సంఘాల నాయకులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆకలి కేకలు.. రికార్డులు తిరగరాయాలన్న ఆకాంక్షే తప్ప, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే బాలికల కనీస అవసరాలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నెల 26వ తేదీ నుంచి నృత్య సాధన పేరిట గంటల తరబడి ఎండలోనే శిక్షణ ఇస్తున్నారు. వీరికి విజయనగరం జిల్లాలోని డెంకాడ, భోగాపురం, నెల్లిమర్ల, పూసపాటిరేగ ప్రాంతాల్లోని వసతి కేంద్రాల్లో, విశాఖ సరిహద్దుల్లోని తగరపువలస, భీమిలి మండలాల వసతి కేంద్రాల్లో బాలికలకు ఆశ్రయం కల్పించారు. 150 మందికి మాత్రమే వసతి ఉన్న ఆయా కేంద్రాల్లో మరో 200 మంది వరకు అదనంగా చేర్చడంతో సౌకర్యాలు మృగ్యమయ్యాయి. పిల్లలకు వండిన అన్నం సరిపోక, అర్ధాకలితోనే నిద్రపోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఫ్యాన్లు పనిచేయక, ఉక్కబోత, విషపురుగుల బెంగతో బాలికలు నిద్రకుదూరమవుతున్నారు. 14 వేల మంది బాలికలకు తగినన్ని మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయం కల్పించకపోవడంతో దుర్వాసన మధ్యే కాలకృత్యాలు తీర్చుకోవాల్సి వస్తోందని పేరు చెప్పేందుకు ఇష్టపడని గిరిజన విద్యార్థిని, ఉపాధ్యాయురాలు తెలిపారు. ప్రచార ఆర్భాటం.. గిరిజన బాలికల ప్రాణాలతో చెలగాటం! థింసా శిక్షణ పేరిట నరకయాతన 14 వేల మంది బాలికలను తరలించి చేతులెత్తేసిన సర్కారు డెంకాడ, భోగాపురం మండలాల్లో అస్తవ్యస్తంగా వసతులు.. కన్నీరు పెడుతున్న విద్యార్థినులు, టీచర్లు బయటకు చెప్పుకోలేక మదనపడుతున్న వైనం బలి పశువులుగా టీచర్లు.. ప్రభుత్వ ప్రచార ఆర్భాటానికి విద్యార్థినులతో పాటు వారిని పర్యవేక్షించేందుకు వచ్చిన గిరిజన సంక్షేమ పాఠశాలల టీచర్లు సైతం ఇబ్బందులు పడుతున్నారు. 13 వేల మంది బాలికల్లో 50 మందికి ఒకరు వంతున దాదాపు 260 మంది టీచర్లను గైడ్లుగా నియమించారు. ‘పిల్లల బాధ్యత మాపై తోసేశారు.. కనీసం తాగడానికి స్వచ్ఛమైన నీళ్లు, రాత్రి పడుకోవడానికి సరిపడా స్థలం కూడా లేదు.. పిల్లలు ఆకలితో అల్లాడుతుంటే ఏం చేయాలో పాలుపోవడం లేదు.. ఏదైనా విపత్తు జరిగితే అధికారులు తప్పించుకుంటారు.. మా సరిస్థితి ఏమిటి?’ అంటూ పలువురు టీచర్లు ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 1న ప్రధాని పర్యటన మార్గంలో అట్టహాసంగా థింసా నృత్యం చేయించి క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్న సర్కారు.. తక్షణమే బాలికలకు నాణ్యమైన భోజనం, రక్షణ, సరైన వసతి సౌకర్యాలు కల్పించాలని, లేకపోతే బాధ్యులైన అధికారులను నిలదీస్తామని గిరిజన, విద్యార్ధి సంఘాలు మరోవైపు హెచ్చరిస్తున్నాయి. సాక్షి, విజయనగరం సెల్ : 99516 02981 -
2న రాష్ట్రస్థాయి జూనియర్స్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక
విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరగనున్న జూనియర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక పోటీలు ఆగస్టు 2న నిర్వహించనున్నట్టు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు లీలాకృష్ణ, శ్రీకాంత్ గురువారం తెలిపారు. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి నగర శివారులోని విజ్జీ స్టేడియం ప్రాంగణంలో ఎంపిక పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అండర్–14, 16, 18, 20 వయస్సుల విభాగాల్లో బాల, బాలికలకు రన్స్, త్రోస్, జంప్స్ అంశాల్లో పోటీలు నిర్వహిస్తామన్నారు. జిల్లా స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను వచ్చేనెల 11 నుంచి 13వ తేదీ వరకు తిరుపతిలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు. ఎంపిక పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు విధిగా వయస్సు ధ్రువీకరణ పత్రాన్ని వెంట తీసుకురావాలని సూచించారు. అర్హత, ఆసక్తి గల క్రీడాకారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల చలో కలెక్టరేట్ విజయనగరం అర్బన్: ఏపీ స్టేట్ సమగ్ర శిక్ష కాంట్రాక్టు అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (జేఏసీ) ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద ‘చలో కలెక్టరేట్’ నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డీఆర్ఓకు అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర చైర్మన్ బి.కాంతారావు నాని మాట్లాడుతూ పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి పలు రాష్ట్రాల్లో సమగ్ర శిక్ష ఉద్యోగులకు రెగ్యులరైజ్ చేసినపుడు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు సాధ్యం కావడంలేదని ప్రశించారు. కేజీబీవీల గౌరవాధ్యక్షురాలు కె.విజయగౌరి, నాయకుడు రామకృష్ణ మాట్లాడుతూ తక్షణమే జూన్, జూలై నెలల జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, పార్ట్టైమ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, సమగ్ర హెచ్ఆర్ పాలసీ అమలు, ప్రతి నెలా సకాలంలో వేతనాలు చెల్లింపు, పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంపు, ఈపీఎఫ్, గ్రాట్యుటీ, ఆరోగ్య భద్రత కల్పన, డీఎస్సీ నియామకాల్లో సర్వీస్ వెయిటేజీ డిమాండ్లు నెరవేర్చకుంటే ఈ నెల 24న ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు ఆర్.శ్రీనివాసారవు, లక్ష్మణరావు, దేవుడుబాబు, పోలినాయుడు, జయగణేష్ పాల్గొన్నారు. -
● జననేత రాకకోసం..
విజయనగరం రూరల్: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పరామర్శించేందుకు విజయనగరం జిల్లా మీదుగా వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేతకు విజయనగరం నియోజకవర్గ నేతలు ఘనస్వాగతం పలికారు. నాతవలస, సీహెచ్ అగ్రహారం వద్ద జాతీయ రహదారిపై జననేతకు మాజీ డిప్యూటీ స్పీకర్, వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ మేయర్ వి.విజయలక్ష్మి, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేశారు. కోలగట్ల శ్రావణిని జననేత ఆశీర్వదించారు. -
జననేత రాకతో
భోగాపురం జాతీయరహదారిపై ప్రజలకు అభివాదం చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, తదితరులు సాక్షి ప్రతినిధి, విజయనగరం: జై జగన్.. జైజై జగన్.. అన్నా.. మళ్లీ నువ్వే సీఎం.. అన్న నినాదాలతో జాతీయ రహదారి హోరెత్తింది. జననేత అభివాదం చేస్తూ ముందుకు సాగుతుండగా అభిమానలోకం ఉరకలెత్తే ఉత్సాహంతో వెంటసాగింది. మాజీ సీఎం జగన్మోహన్రెడ్డికి ఘనంగా స్వాగతం పలికింది. శ్రీకాకుళం జిల్లా అంపోలు సబ్ జైలులో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు జిల్లా మీదుగా గురువారం వెళ్లిన జననేతకు స్వాగతం పలికేందుకు ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జననేత రాకకోసం జాతీయ రహదారిపై వివిధ కూడళ్లలో ఎదురుచూశారు. ఆయన కనిపించేసరికి ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఉదయం 10 గంటల నుంచి మహిళలు, యువత, విద్యార్థులు నెల్లిమర్ల నియోజకవర్గంలోని భోగాపురం, నాతవలస, సీహెచ్ అగ్రహారం తదితర కూడళ్లకు చేరుకుని జననేత రాకకోసం ఎదురు చూశారు. భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి.. దాని శ్రీకారానికి మీరే కారణం.. థాంక్యూ జగన్ సర్ అంటూ ప్ల కార్డులు చూపిస్తూ ధన్యవాదాలు తెలిపారు. రోడ్డు పక్కన పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. రైతులు...యువత జననేతతో కరచాలనానికి ఎగబడ్డారు. ఎక్కడికక్కడ ఆయన వాహనానికి స్వాగతం పలుకుతూ అడుగు పడనివ్వకుండా.. కాన్వాయ్ ముందుకు సాగనివ్వకుండా అభిమాన దడి కట్టేశారు. పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు జననేత వెంట శ్రీకాకుళం వరకు సాగారు. గజమాలతో స్వాగతం నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండల అప్పలనాయుడు సారథ్యంలో వందలాది మంది యువకులు గజమాలతో స్వాగతం పలికారు. దాదాపు కిలోమీటరు దూరం నుంచి కనిపించేలా ఆకాశానికి భూమికి నిచ్చెన వేసేలా పార్టీ రంగులతో గజమాల భారీ క్రేన్కు వేలాడుతూ జననేతకు స్వాగతించింది. వేలాది కార్యకర్తల నడుమ ఆ గజమాల వైఎస్ జగన్ మెడలో అలంకారమై తనకుతాను పులకించిపోయింది. ఈ కార్యక్రమం ఆద్యంతం భోగాపురం, డెంకాడ మండలాల కార్యకర్తలు యువతలో నూతనోత్సాన్ని నింపింది. సీహెచ్ ఆగ్రహరంలో... సీహెచ్ అగ్రహారం కూడలిలో వేలాదిమంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు చేరుకుని వైఎస్ జగన్కు స్వాగతం పలికారు. రోడ్డుకు ఇరువైపులా బారులు తీరి జైజగన్ అంటూ నినదించారు. పోలీసు ఆంక్షలను ఛేదించి.. భోగాపురం విమానాశ్రయం నిమిత్తం ప్రధాని రాకతో ఎక్కడికక్కడ పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం... ఆ పోలీసులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నిలువరించేందుకు ఉపయోగించింది. అయితే, జననేతను చూడాలన్న లక్ష్యంతో జనం వివిధ మార్గాల్లో జాతీయ రహదారికి చేరుకున్నారు. అభిమాన నాయకుడు తమ ఊరు రావడంతో తమ ఇంటికి పండగ వచ్చినట్లు.. తమ ఇంట్లో సంబరం జరుగుతున్నట్లు ఫీలయ్యారు. కొంతమంది తల్లిదండ్రులు బిడ్డలను సైతం తమతో పాటు తీసుకొచ్చి తమ అభిమాన నాయకుడితో ఫొటోలు తీయించి షేక్ హ్యాండ్ చేయించడానికి ఉత్సాహపడ్డారు. ● భోగాపురంలో వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు ఉప్పాడ సూర్యనారాయణరెడ్డి, నాయకులు యు.శివారెడ్డి, యు.విజయబాస్కరరెడ్డి, కె.వెంకటరమణ తదితరులు జననేతకు స్వాగతం పలికారు. ● నాతవలస వద్ద ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్ బాబు, మాజీ ఎమ్మెల్యేలు అలజంగి జోగారావు, విశ్వాసరాయి కళావతి, శంబంగి వెంకట చినప్పలనాయుడు, వైఎసార్సీపీ యువజన, ఐటీ విభాగం అధ్యక్షులు బడ్డుకొండ ప్రదీప్, మణిదీప్, తదితరులు వైఎస్ జగన్మోహన్రెడ్డికి స్వాగతం పలికారు. మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర తన అనుచరులతో కలిసి జగనన్నకు స్వాగతం పలికేందుకు ర్యాలీగా వచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ డీవీజీ శంకరరావు, నాయకులు మావుడి రంగునాయుడు పాల్గొన్నారు. జననేతకు అభిమాన హారతి స్వాగతం పలికేందుకు తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులు జనసంద్రంగా మారిన జాతీయ రహదారి జననేతను చూసి కేరింతలు కొట్టిన అభిమానులు -
రోడ్డెక్కిన పెదపెంకి మహిళలు
పెదపెంకి గ్రామంలో సమస్యలపై మహిళలు రోడ్డెక్కారు. గ్రామంలోని కూరాకుల వీధి, కాపువీధికి చెందిన మహిళలు వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పెదపెంకి బస్టాండ్ వద్ద బుధవారం నిరసన తెలిపారు. వీధి కాలువలు వేస్తామని గుమ్ములు పెట్టి వదిలేశారు. తాగునీరు అందుబాటులో లేక అవస్థలు పడుతున్నాం. గుమ్ముల్లో వృద్ధులు పడిపోతున్నారు. కాలువ గుమ్ముల్లో నీరు నిల్వ ఉండి దుర్గంధంగా మారుతోంది. దోమల బెడద ఎక్కువగా ఉండి జ్వరాలు సోకుతున్నాయి. వెంటనే సమస్యలను పరిష్కరించాలని మహిళలు డిమాండ్ చేశారు. గ్రామాన్ని ఎప్పుడు బాగుచేస్తారో తెలియదు కానీ గడిచిన 4నెలల నుంచి ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. కాలువల నిర్మాణాలు జరుపుతామని జేసీబీలతో గుమ్ములు తీసి వదిలివేయడం దారుణంగా ఉందని మహిళలు ఆగ్రహించారు. కార్యక్రమంలో నేతాజీ గ్రంథాలయ వ్యవస్థాపకుడు సంజీవనాయుడు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. -
బందోబస్తు విధులు సమర్థంగా నిర్వహించాలి
● ఎస్పీ ఏఆర్ దామోదర్పూసపాటిరేగ: దేశ ప్రధాని నరేంద్రమోడీ ఆగస్టు 1న జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో బందోబస్తు విధులు నిర్వహించే ప్రతి ఒక్కరు సమర్థవంతంగా పనిచేయాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన భోగాపురం ఎయిర్పోర్టు సమీపంలో రహదారులను పరిశీలించారు. ఆక్టోపస్ ఐజీ శ్రీకాంత్, విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టీలతో కలిసి ప్రధానిపాల్గొనే సభకు బస్సులు వచ్చే మార్గాలను ఎస్పీ దామోదర్ పరిశీలించారు. నిర్మాణ పనులు అవుతున్నందున ప్రజలకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా బారికేడ్లు, ర్యాంపులు నిర్మించాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు విధులు నిర్వహించేందుకు కేటాయించిన ప్రాంతాలను విడిచిపెట్టవద్దన్నారు. బందోబస్తు నిమిత్తం వచ్చిన సిబ్బందికి వసతి, భోజన సదుపాయం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సభ నిర్వహించే ప్రాంతాలను, ఎయిర్పోర్టు ఆవరణలో పలు ప్రాంతాలను డాగ్స్క్వాడ్, బాంబు స్క్వాడ్ సిబ్బంది క్షణ్ణంగా పరిశీలించారు. ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని ఎస్పీ అన్నారు. కార్యక్రమంలో గ్రేహౌండ్స్ డీఐజీ అట్టాడ బాపూజీ, వెల్ఫేర్ డీఐజీ అన్భురాజన్, బెటాలియన్ కమాండెంట్ రవిశంకరరెడ్డి, విజయవాడ డీసీపీ కృష్ణకాంత్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. -
పెద్దాస్పత్రికి పెద్ద జబ్బు..!
● సర్వజన ఆస్పత్రిలో నిలిచిపోయిన ప్రధానమైన వైద్య పరీక్షలు ● ప్రైవేటు ల్యాబ్ల్లో రూ.వేలల్లో ఖర్చు చేస్తున్న రోగులువిజయనగరం ఫోర్ట్: విజయనగరం పట్టణానికి చెందిన లక్ష్మి అనే మహిళ ఒంట్లో నీరసంగా ఉంటోందని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులు ఆమెకు సుగర్ వ్యాధికి సంబంధించి హెచ్బీఏవన్సీ పరీక్ష రాశారు. ఆ చీటీ పట్టుకుని ఆమె ఆస్పత్రిలోని ల్యాబొరేటరీ వద్దకు వెళ్లగా అక్కడ సిబ్బంది ఆ పరీక్ష లేదని చెప్పడంతో ప్రైవేట్ ల్యాబొరేటరీలో రూ.500 పెట్టి హెచ్బీఏవన్సీ పరీక్ష చేయించింది. ● గంట్యాడ మండలానికి చెందిన భవాని అనే మహిళకు థైరాయిడ్ లక్షణాలు కనిపించడంతో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులు థైరాయిడ్ పరీక్ష చేసుకోవాలని చీటీ రాసి ఇచ్చారు. అది పట్టుకుని ల్యాబొరేటరీకి వెళ్లగా థైరాయిడ్ పరీక్ష చేయడం లేదని చెప్పడంతో ప్రైవేట్ ల్యాబొరేటరీలో రూ.600 పెట్టి చేయించుకుంది. ● జామి మండలానికి చెందిన రామునాయుడు అనే వ్యక్తికి జ్వరం రావడంతో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో వైద్యుడి వద్దకు వెళ్లాడు. అక్కడ వైద్యులు సీబీపీ (కంప్లీట్ బ్లడ్ పిక్చర్) రాశారు. దీంతో సీబీపీ పరీక్ష కోసం ల్యాబొరేటరీ వద్దకు వెళ్లాడు. ఇక్కడ సీబీపీ పరీక్ష చేయడం లేదని చెప్పడంతో ప్రైవేట్ ల్యాబొరేటరీలో రూ.500 పెట్టి చేయించుకున్నాడు. వీరు ముగ్గురే కాదు. ప్రభుత్వసర్వజన ఆస్పత్రికి వచ్చిన అనేక మంది రోగులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఇది. జిల్లాలో అతిపెద్ద ప్రభుత్వ ఆస్పత్రి అయినా సర్వజన ఆస్పత్రికి జబ్బు చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు కనీసం వైద్య పరీక్షలు కూడా అందించలేని దుస్థితిలో టీడీపీ సర్కార్ ఉందని రోగులు ఆగ్రహిస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లే ఆర్థిక స్థోమత లేక ప్రభుత్వ ఆస్పత్రికి వస్తే ఇక్కడ పూర్తిస్థాయిలో వైద్యం అందే పరిస్థితి లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని వసతులు ఉంటాయని జిల్లా నలుమూలల నిత్యం అధిక సంఖ్యలో ఇక్కడికి రోగులు వస్తారు. అయితే ఉచితంగా వైద్యం అందించాల్సిన ఆస్పత్రిలో సౌకర్యాలు లేకపోవడం వల్ల చేతిచమురు వదిలించుకోవాల్సిన దుస్థితి రోగులకు దాపురించింది. నిలిచిపోయిన ప్రధాన వైద్య పరీక్షలు రోగులకు వ్యాధి నిర్ధారణలో ప్రధానమైన వైద్య పరీక్షలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో నిలిచిపోయాయి. మధుమేహం(సుగర్) వ్యాధి నిర్ధారణలో అతి ప్రధానమైన హెచ్బీఏ1సీ (మూడు నెలల సుగర్ను నిర్ధారించే) పరీక్ష కొద్ది రోజులుగా చేయడం లేదు. అదేవిధంగా థైరాయిడ్ పరీక్ష అయితే రెండున్నర నెలలుగా చేయడం లేదు. ముఖ్యంగా సీబీపీ(కంప్లీట్ బ్లడ్పిక్షర్) పరీక్ష కూడా గత కొద్ది రోజులుగా నిలిచిపోయింది. ప్రస్తుత సీజన్లో ఈ పరీక్ష చాలా అవసరం. ఎందుకంటే సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగీ, టైఫాయిడ్, వైరల్ ఫీవర్స్ అధికంగా ఉన్న నేపథ్యంలో సీబీపీ పరీక్షను ప్రతి రోగికి వైద్యులు రాస్తారు. కొరవడిన ముందుచూపు టీడీపీ సర్కార్ కు ముందు చూపు కొరవడిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. బోధనాస్పత్రి కావడంతో సర్వజన ఆస్పత్రికి ప్రతిరోజూ 1000 నుంచి 1200 మంది వరకు రోగులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షలు కూడా అత్యధికంగా జరుగుతాయి. ఈ క్రమంలో ముందస్తుగానే రోగులకు అవసరమైన వైద్య పరీక్షలకు అవసరమైన టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉంచుకోవాలి. కిట్లు అయిపోయే వరకు సరఫరా చేయక పోవడం పట్ల రోగులు మండిపడుతున్నారు. -
బిల్లులు ఆపండి..!
బలిజిపేట: మండలంలోని పెదపెంకి గ్రామంలో అభివృద్ధి పనుల నిర్వహణలో మూడుముక్కలాట సాగుతుండడంతో ప్రత్యేక నిధులు మంజూరుచేసిన డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్కు శిరోభారంగా మారింది. పెదపెంకిని దత్తత తీసుకుని ఫైలేరియా రహిత గ్రామంగా తీర్చుదిద్దుదామనుకుని ఉపాధిహామీ పథకం ద్వారా 5.85కోట్లు ప్రత్యేక నిధులు కేటాయించారు. నిధుల వినియోగంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంట్రాక్టర్ల మధ్య మూడుముక్కలాట జరుగుతుండడంతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేటాయించిన నిధుల ప్రాప్తికి పనులు నాణ్యతతో జరిగాయా అంటే అదేమీ లేదని రుజువైంది. ఈ విషయాన్ని తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ పనుల నిర్వహణపై అసంతృప్తి చెంది కాంట్రాక్టర్లపై తక్షణ చర్యలు తీసుకోవాలని, సంబంధిత పనుల బిల్లులు వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీచేశారు. పనుల పర్యవేక్షణకు తరచూ బృందాలను పంపిస్తున్నారు. అందరు భాగస్వాములే.. పెదపెంకి అభివృద్ధి పనుల్లో లోపాలకు ఎమ్మెల్యే విజయచంద్ర, స్థానిక నాయకులు, అధికారులు, కాంట్రాక్టర్లు అందరూ భాగస్వాములేనని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. స్థానిక నాయకులకు, ఎమ్మెల్యేకు మద్య విభేదాలు ఉండడంతో రణరంగం జరిగిందని చెబుతున్నారు. పనులు ప్రారంభించేటప్పుడు స్థానిక నాయకులు కొంతమందికి పనులు అప్పగించి చేయిస్తుండగా ఎమ్మెల్యే విజయచంద్ర వచ్చి ఆయన ప్రతిపాదించిన వ్యక్తికి కాంట్రాక్ట్ పనులు అప్పగించాలని అధికారులపై ఒత్తిడి తేవడంతో తలొగ్గిన అధికారులు కొత్త కాంట్రాక్టర్ చేత పనులు చేయించారు. దీంతో ఆ కాంట్రాక్టరు ఇష్టానుసారం పనులు చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు వారితో కుమ్మకై ్క వారి పాత్ర వారు పోషిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. బృందాల పర్యవేక్షణ ఇటీవల రాష్ట్రస్థాయి చీఫ్ క్వాలిటీ కంట్రోల్ అధికారి పనుల నాణ్యతను పరిశీలించారు. పనుల్లో నాణ్యతా లోపాలు ఉన్నట్లు గుర్తించి నివేదికలు అందించారు. మంగళవారం డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ పేషీ నుంచి ఓఎస్డీ కె.సాయినవీన్ బృందం వచ్చి గ్రామంలో జరిగిన పనుల నిర్వహణ ఏవిధంగా ఉంది, ఏం జరుగుతోంది? ప్రజల అభిప్రాయం ఏమిటి? వారి సమస్యలు ఏమిటనేది తెలుసుకునేందుకు ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు. 21పనులకు బిల్లులు పెట్టాల్సి ఉంది పెదపెంకిలో ముందుగా 5.80కోట్లతో 66సీసీ రోడ్లు, 18ఆర్డబ్ల్యూఎస్ పనుల నిర్మాణాలకు ప్రతిపాదనలు చేశారు. ఆ తరువాత అంతర్గత పరిణామాలతో 49సీసీ రోడ్ల నిర్మాణాలు చేయాలని వాటికే నిధుల కేటాయింపు అని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో 17సీసీ రోడ్ల నిర్మాణాల బిల్లుల విషయం సందిగ్థంలో పడింది. సీసీ రోడ్లకు సంబంధించి 21పనులకు బిల్లులు పెట్టాల్సి ఉంది. ఉపాధిహామీ పథకంలో రూపురేఖలు మారడంతో కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ అయ్యేవరకు బిల్లుల సమస్య ఉండే అవకాశాలున్నాయి. జరిగిన పనులకు బిల్లులు చెల్లింపు చేయాలని కోరుతున్న కాంట్రాక్టర్లు పనుల విషయంలో ముఖం చాటేస్తుండడంతో పనుల్లో తాత్సారం జరుగుతున్నట్లు సమాచారం. ఇంతలో ఒక్కసారిగా పిడుగుపడినట్టు డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో పనులు ఎంతమేర జోరుగా సాగుతాయో? లేదా నత్తనడకగా సాగుతాయా ? అనేది వేచి చూడాల్సిందే. డిప్యూటీ సీఎం ఆదేశాలు పెదపెంకిలో చేసిన పనుల్లో నాణ్యతా లోపాలు పనులు పరిశీలిస్తున్న కొత్త బృందం -
లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు
● స్కానింగ్ కేంద్రాల నమోదు తప్పనిసరి ● పీసీపీఎన్డీటీ చట్టం అమలుపై డీఎంహెచ్ఓ సమీక్షపార్వతీపురం రూరల్: గర్భస్థ పిండ లింగ నిర్ధారణ వెల్లడి నిషేధ చట్టం (పీసీపీఎన్డీటీ–1994) ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి (డీఎంహెచ్ఓ) డాక్టర్ పి.విజయలక్ష్మి హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం స్థానిక వైద్యారోగ్య కార్యాలయంలో పీసీపీఎన్డీటీ చట్టం పటిష్ట అమలు, కార్యాచరణపై జిల్లాస్థాయి సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..జిల్లాలోని అన్ని అల్ట్రా సౌండ్ స్కానింగ్ కేంద్రాలు విధిగా ‘డిస్ట్రిక్ట్ అథారిటీ ఆఫ్ పీసీపీఎన్డీటీ’లో నమోదు చేసుకోవాలని ఆదేశించారు. లింగ వివక్షను అరికట్టేందుకు గ్రామ, మండల, జిల్లా స్థాయి సమావేశాలు, కళాశాలలు, యువజన సంఘాలు, మహిళా మండళ్లలో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు.కుటుంబ ఆరోగ్య శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు చట్ట ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు 1800 233–2447 టోల్ఫ్రీ నంబరును ఏర్పాటు చేసినట్లు డీఎంహెచ్ఓ వెల్ల డించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామన్నారు. అనంతరం జిల్లాలో మాతృ, శిశు మరణాలపై అధికారులతో ఆమె సమీక్షించారు. ఈ సమావేశంలో డీఐఓ వై.విజయ్ మోహనన్, డీసీహెచ్ఎస్ జి.నాగభూషణరావు, డిప్యూటీ డీఎంహెచ్ఓలు కేవీఎస్.పద్మావతి, కె.విజయపార్వతి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగశివజ్యోతి, ప్రోగ్రాం అధికారులు జగన్మోహనరావు, రవికుమార్ రెడ్డి, ఎస్.కె.హఫీజా, వైద్యులు నాగరాజు, కమల, రవి, పద్మజ, డిప్యూటీ డెమోలు గిరిబాబు, ప్రసాద్, డీపీహెచ్ఏవో విజయలక్ష్మి పాల్గొన్నారు. -
‘ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు’ జిల్లా స్థాయి పోటీల విజేతలు
విజయనగరం అర్బన్: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు’–‘వై డిస్ట్రిక్ట్ టేక్స్ ఆఫ్’ థీమ్పై జిల్లా స్థాయి వ్యాసరచన, చిత్రవేఖనం, క్విజ్ పోటీలు ఎంఆర్సంస్కృత ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి మండల స్థాయిలో ఎంపికై న విద్యార్ధులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి యూ.మాణిక్యంనాయుడు, డిప్యూటీ ఈఓ కె.వెంకటరమణ, డీసీఈబీ కార్యదర్శి టి.సన్యాసిరాజు విజేతలకు బహుమతులు ప్రకటించారు. జిల్లా స్థాయి వ్యాసరచన పోటీల విజేతలు ప్రథమ: ఎస్.భానుప్రకాశ్ (జెడ్పీహెచ్ జరజాపుపేట), ద్వితీయ: జి.హేమలత (జెడ్పీహెచ్ వల్లాపురం), తృతీయ: కె.గీత (కేజీబీవీ, మెరకముడిదాం), చిత్రలేఖనం విజేతలు ప్రథమ: పి.బాలాజీ (జెడ్పీహెచ్ బొద్దూరు), ద్వితీయ: బి.జయశ్రీ (జీజీహెచ్ఎస్ విజయనగరం), తృతీయ: సీహెచ్.సంధ్య (జెడ్పీహెచ్ఎస్, బుడతనాపల్లి), క్విజ్ విజేతలు ప్రథమ: ఎం.లోహిత, బి.చరణ్ (ఏపీఎంఎస్, అక్కివరం), ద్వితీయ: పి.తనిష్క (జెడ్పీహెచ్ చీపురుపల్లి), బి.కొండలరావు (జెడ్పీహెచ్ఎస్, పాలవలస), తృతీయ: ఎం.శంకర్ (జెడ్పీహెచ్ఎస్ గోవిందపురం), సీహెచ్.మౌనిక (జెడ్పీహెచ్ఎస్ కుమిలి). విద్యార్థుల్లో సృజనాత్మకత, జిల్లాపై గౌరవభావాన్ని పెంపొందించేందుకు ఈ పోటీలు ఎంతో దోహదపడతాయని డీఈఓ పేర్కొన్నారు. -
డిగ్రీ ప్రవేశాలు ఎప్పుడో?
రాజాం సిటీ: ఇంటర్మీడియట్ రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాలు విడుదలై నెలలు గడుస్తున్నా డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ మాత్రం ప్రారంభంకాలేదు. ఇంటర్ పాసైన విద్యార్థులకు డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరేందుకు ఎదురుచూపులు తప్పడంలేదు. ఉన్నత విద్యాశాఖ నుంచి అడ్మిషన్లపై ఎలాంటి స్పష్టత రాకపోవడం విద్యావర్గాలను కలవరపెడుతోంది. సర్కారు తీరును ఆక్షేపిస్తోంది. జూలై ముగుస్తున్నా.. డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఏ కళాశాలలో ఏ గ్రూపులో జాయిన్ కావాలో తెలియని అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. అధిక శాతం మంది విద్యార్థులు బీఎస్సీ, బీకాం కోర్సుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ అధికారిక నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో వేచి చూడాల్సివస్తోంది. డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ ఆలస్యమైతే విద్యాసంవత్సరం ప్రారంభం కూడా ఆలస్యమౌతుందని కళాశాలల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అడ్మిషన్లు పూర్తయ్యాక తరగతులు ప్రారంభించడంతో పాటు అకడమిక్ ప్రణాళికలు సిద్ధం చేసుకునేందుకు సమయం అవసరమని పేర్కొంటున్నాయి. అడ్మిషన్ల ప్రక్రియ మరింత ఆలస్యమైతే సెమిస్టర్ బోధనపై ప్రభావం పడే అవకాశం ఉందని, యూనివర్సిటీలు రూపొందించిన అకడమిక్ క్యాలెండర్, పరీక్షల షెడ్యూల్ వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విద్యార్థుల విద్యాప్రగతి మందగించే అవకాశం ఉందంటున్నారు. కళాశాలల వసతులుపై ఆరా...... ఉన్నత విద్యామండలి అధికారులు డిగ్రీ కళాశాలల్లో వసతులపై ఆరా తీశారు. ఉన్నత విద్యామండలికి నివేదిక అందజేశారు. ఈ ప్రక్రియ పూర్తయి 20 రోజులు గడుస్తున్నా నేటికీ అడ్మిషన్లకు నోటిఫికేషన్ వెలువడలేదు. రాజాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల జూలై ముగిసినా విడుదకాని నోటిఫికేషన్ సెమిస్టర్లపై పడనున్న ప్రభావం ఎఫ్ఆర్ఎస్పై సందిగ్దం ఆందోళనలో విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు ఎఫ్ఆర్ఎస్పై సందిగ్ధం.... ప్రతి విద్యార్థి కళాశాలకు రావాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఎఫ్ఆర్ఎస్తో కళాశాలల యాజమాన్యాలు సందిగ్ధంలో పడ్డాయి. ఫీజు రీయింబర్స్మెంట్పైనే ఆధారపడి నిర్వహిస్తున్న కళాశాలలకు మరింత తలనొప్పిగా మారింది. విద్యార్థులు ప్రతిరోజు హాజరైనా వారికి ఎఫ్ఆర్ఎస్ వేసేందుకే సమయం సరిపోదని, దీంతో తరగతులు నిర్వహించేదెలా అని వాపోతున్నారు. ఇప్పటికే ద్వితీయ, తృతీయ సంవత్సరాల విద్యార్థులకు అరకొరగానే ఎఫ్ఆర్ఎస్ నమోదు చేస్తున్నామని, ఈ ప్రభావం ఫీజురీయింబర్స్మెంట్పై పడుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాప్లు సక్రమంగా పనిచేయకపోవడం, ఫేస్లు సరిగా పడకపోవడం వంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొంటున్నారు. -
పెన్డౌన్తో ఆదాయం డౌన్
500 క్యూసెక్కుల నీరు సరఫరా వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ నుంచి 500 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్టు ఏఈ నితిన్ బుధవారం తెలిపారు. దశల వారీగా సాగునీటి విడుదలను పెంపుదల చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 62.10 మీటర్లమేర నీరు నిల్వ ఉందన్నారు. జీఓ 396 రద్దు చేయాలి దస్తావేజు లేఖరుల వ్యవస్థనే కనుమరుగు చేసి, వారి జీవనోపాధికి గండికొట్టేలా ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓ 396ను తక్షణమే రద్దు చేయాలి. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలతో ప్రైవేటే సంస్థలకు లాభం చేకూర్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నో ఏళ్లుగా ఈ వృత్తినే నమ్ముకుని జీవిస్తున్నాం. – రామసింగు సత్యప్రసాదరావు, సీనియర్ దస్తావేజు లేఖరి, విజయనగరం కడుపు కొట్టొద్దు జీఓ–396తో దస్తావేజు లేఖరుల కడుపు కొట్టొద్దు. దశా బ్దాల చరిత్ర ఉన్న దస్తావేజు లేఖరుల బతుకులు రోడ్డున పడేయడం సరికాదు. ఎంతోమంది నిరుద్యోగులం ఈ వ్యవస్థపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాం. ప్రభుత్వం ఆర్ఎస్కేల ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నాలు విరమించుకోవాలి. – ఎస్.వెంకటేష్, దస్తావేజు లేఖరి, విజయనగరం విజయనగరం రూరల్: చంద్రబాబు సర్కార్ సంపద సృష్టి ప్రక్రియలో భాగంగా రిజిస్ట్రేషన్ల సేవా కేంద్రాలు ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. దీనికోసం జీఓ 396 జారీ చేసింది. ఈ కేంద్రాల బాధ్యతలను తన అనుచర గణానికి అప్పగించాలన్నది చంద్రబాబు తెరవెనుక ఉద్దేశమన్నది ప్రధాన ఆరోపణ. దీనిపై దస్తావేజు లేఖరులు ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ జీవనోపాధికి గండికొడుతూ తీసుకువచ్చిన జీఓకు వ్యతిరేకంగా పోరుబాట పట్టారు. ఈ నెల 20 నుంచి పెన్డౌన్తో ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. వారం రోజులకు పైబడి రిజిస్ట్రేషన్లు పూర్తి స్థాయిలో జరగకపోవడంతో రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. తప్పులకు ఆస్కారం ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెంబర్ 396తో రిజిస్ట్రేషన్ ప్రక్రియకు రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు (ఆర్ఎస్కే) ద్వారా దస్తావేజులు రూపొందించబడతా యి. అయితే, ఈ ప్రక్రియకు రూ. 2వేలు ఫీజుతో పాటు 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తవుతోందని ప్రభుత్వం చెబుతోంది. ఆస్తి కొనుగోళ్లకు సంబంధించి ఈ ప్రక్రియలో ఎంతో క్షుణ్ణంగా పరిశీలన చేసినా చాలా సమయం పడుతుందని, పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంటే తప్పులకు ఆస్కారం ఎక్కువగా ఉంటుందని క్రయవిక్రయదారులు పేర్కొంటున్నారు. కేంద్రాల బాధ్యతలను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించి, కమీషన్లు కొట్టేసి, తద్వారా కూటమి నేతలు డబ్బులు సంపాదనకే కొత్త జీఓ జారీచేసిందని దస్తావేజు లేఖరులు ఆరోపిస్తున్నారు. వందేళ్లకు పైబడి ఉన్న దస్తావేజు లేఖరుల వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలన్న చంద్రబాబు సర్కారు ఆలోచనను విరమించుకోవాలని కోరుతూ ఈ నెల 6, 7 తేదీల్లో తొలివిడత పెన్డౌన్ కార్యక్రమం చేపట్టారు. అయినప్పటికీ ప్రభుత్వం మొండివైఖరి వీడకపోవడంతో ఈ నెల 20 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా పెన్డౌన్ కార్యక్రమం చేపట్టి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద నిరవధిక సమ్మె చేపడుతున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అరకొర రిజిస్ట్రేషన్లే సాగుతున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. రోడ్డున పడనున్న కుటుంబాలు జిల్లాలోని 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో దస్తావేజు లేఖరులు 300కు పైబడి ఉంటారు. స్టాంప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు, దస్తావేజు లేఖరుల సహాయకులు, జిరాక్స్ సెంటర్ల నిర్వాహకులు అందరూ కలిపి సుమారు 1100 మందికి మించి ఉంటారు. వీరిలో అనేకమంది నిరుద్యోగులే. చంద్రబాబు సర్కారు జారీ చేసిన జీఓ 396తో ప్రత్యక్షంగా 1100 కుటుంబాలు, పరోక్షంగా మరో 300 కుటుంబాలు జీవనోపాధిని కోల్పోయే ప్రమాదం ఉంది. ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం, లేకుంటే నెలకు రూ.3వేలు చొప్పున నిరుద్యోగ భృతి అని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు... ఉన్న జీవనోపాధిని తీసేసి తమ కడుపు కొడుతోందని దస్తావేజు లేఖరులు మండిపడుతున్నారు. రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయానికి గండి ప్రభుత్వం ఆర్ఎస్కేల ఏర్పాటుకు జీఓ నంబర్ 396 జారీ జీఓపై ఆగ్రహంతో ఈ నెల 20 నుంచి దస్తావేజుల లేఖర్ల పెన్డౌన్ తమ జీవనోపాధికి గండికొట్టొద్దంటున్న దస్తావేజు లేఖర్లు 9 రోజుల్లో భారీగా తగ్గిన రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం -
యుద్ధ నౌక నమూనా బహూకరణ
విజయనగరం రూరల్: కోరుకొండ సైనిక పాఠశాలకు ఐఎన్ఎస్ దునాగిరి యుద్ధనౌక నమూనాను ఐఎన్ఎస్ దునాగిరి కమాండింగ్ అధికారి, కెప్టెన్ దివ్య అలోక్ బహూకరించారు. కోరుకొండ సైనిక పాఠశాలను బుధవారం సందర్శించిన అలోక్కు సైనిక పాఠశాల పిన్సిపాల్, కెప్టెన్ ఎస్ఎస్ శాస్త్రి, అధికారులు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పాఠశాలలో కాన్ఫరెన్స్ హాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక స్మార్ట్ ప్యానల్ను ఆయన ప్రారంభించారు. అనంతరం ప్యాలెస్ హాల్లో భారత నౌకాదళ సంప్రదాయ, సైనిక వారసత్వానికి ప్రతీకగా నిలిచే ఐఎన్ఎస్ దునాగిరి నౌక నమూనాను ఈస్టర్న్ ఫ్లీట్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్, రియర్ అడ్మిరల్ అలోక్ ఆనంద్ తరఫున పాఠశాలకు అందజేశారు. ఈ సందర్భంగా పీవీజీ రాజు ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి దేశ రక్షణ రంగంలో చేరి దేశానికి సేవ చేయాలన్నారు. విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలన్నారు. నౌకాదళ, దేశభక్తి అంశాలపై తన అభిప్రాయాలను విద్యార్థులతో పంచుకున్నారు. ఎన్డీఏలో చేరేందుకు పాఠశాల చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్, వింగ్ కమాండర్ వి.కిరణ్, పరిపాలన అధికారి, స్క్వాడ్రన్ లీడర్ అతుల్జాన్ థామస్, తదితరులు పాల్గొన్నారు. బ్రెయిన్స్ట్రోక్తో ఉపాధ్యాయురాలి మృతిరేగిడి: మండల పరిధిలోని లచ్చన్నవలస ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా విధులు నిర్వహిస్తున్న మంతిన హేమలత బ్రెయిన్ స్ట్రోక్తో బుధవా రం మృతిచెందినట్లు ఎంఈఓ ఎంవీ ప్రసాదరావు విలేకరులకు తెలిపారు. ఈ నెల 24న పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ సమావేశం నిర్వహించిన సమయంలో ఆమె అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారన్నారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా మెదడులో రక్తనాళాలు దెబ్బతిన్నాయని వైద్యులు తెలిపారని, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతిచెందారన్నారు. ఆమె మృతిపై లచ్చన్నవలస గ్రామస్తులతోపాటు ఎంఈఓ ఎరకయ్య, ఉపాధ్యాయ సంఘాల నాయకులు సంతాపం తెలిపారు. -
చెరువు కాదు.. ఇదే మా రోడ్డు
ఇది చెరువుకాదు.. మేము ప్రయాణించే రోడ్డు. దీనిని బాగుచేసి ప్రయాణ కష్టాలు తొలగించాలని నాలుగు రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారు.. పల్లెపండగ పేరుతో రోడ్డును అద్దంలా మెరిపిస్తామని మురికి కూపంగా మార్చారంటూ వేపాడ గ్రామస్తులు వాపోయారు. బుధవారం సైతం దీక్ష కొనసాగించారు. చంద్రబాబు సర్కారు తీరుతో మా రోడ్డు కష్టాలు తీరడంలేదంటూ మండిపడ్డారు. వీరికి రైతు ఉద్యమనేత చల్లా జగన్తో పాటు వేపాడ ఎంపీపీ దొగ్గ సత్యవంతుడు, వైస్ ఎంపీపీ ఈశ్వరరావు, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ జగ్గుబాబం, అరిగిపాలెం మాజీ ఎంపీటీసీ సభ్యుడు సన్యాసిరావు తదితరులు సంఘీభావం తెలిపారు. నిధులున్నా రోడ్డు పనులు చేయకపోవడం ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. – వేపాడ -
నేడు జగనన్న రాక
విజయనగరం: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం శ్రీకాకుళం పర్యటనకు జిల్లా మీదుగా వెళ్తున్నారని, పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలకాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు(చిన్నశ్రీను) పిలుపునిచ్చారు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును పరామర్మించేందుకు వైఎస్ జగన్ వస్తు న్నారని తెలిపారు. విశాఖ విమానాశ్రయం నుంచి విజయనగరం మీదుగా శ్రీకాకుళం వెళ్లనున్న జగన్కు రాజపులోవ కూడలి నుంచి కందివలస గెడ్డ వరకు ఆయా నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని కోరారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తమకు కేటాయించిన ప్రాంతాల్లో నిర్ణీత సమయానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఘనంగా స్వాగతం పలుకుదాం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు -
స్వాగత సన్నాహాలు
చీపురుపల్లిరూరల్(గరివిడి): జిల్లా మీదుగా శ్రీకాకుళం వెళ్లనున్న మాజీ సీఎం జగన్మోహన్రెడ్డికి స్వాగతం పలికేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు సమాయత్తం అవుతున్నాయి. ఇందులో భాగంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గరివిడిలోని పార్టీ కార్యాలయంలో బుదవారం మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, యువ నాయకురాలు బొత్స అనూషతో కలిసి పలువురు నాయకులు సమావేశమయ్యారు. చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం, గుర్ల మండలాల నాయకులు, కార్యకర్తలు పైడిబీమవరం వద్ద గల మహిగ్రాండ్ ఇన్ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్ సమీపంలో స్వాగతం పలకాలని నిర్ణయించారు. శాసనమండలి విపక్షనాయకుడు బొత్స సత్యనారాయణ సూచనలతో ముందుకు సాగుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మీసాల విశ్వేశ్వరరావు, బమ్మిడి కార్తీక్, ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసులనాయుడు, బెల్లాన వంశీకృష్ణ, తాడ్డి వేణు, కోట్ల విశ్వేశ్వరరావు, కె.వి.సూర్యనారాయణరాజు, సీర అప్పలనాయుడు, పొట్నూరు సన్యాసినాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
గురుకులంలో.. జ్వరాల కలవరం
శృంగవరపుకోట: ఒకరి తర్వాత ఒకరు... ఇలా బుధవారం ఉదయం నుంచి సాయంత్రమయ్యేసరికి ఎస్.కోట మండలంలోని తాటిపూడి బాలికల గురుకుల కళాశాలకు చెందిన 51 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. జ్వరాలతో వణికిపోయారు. కళ్లు మంటలు, కాళ్ల పీకులతో కదలలేక మంచం పట్టారు. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు కలతచెందారు. కొందరు విద్యార్థినుల తల్లిదండ్రులు గురుకులానికి చేరుకుని సపర్యలు చేశారు. జ్వరాల వ్యాప్తి ఉద్ధృతం కావడంతో కళాశాల సిబ్బంది కొట్టాం పీహెచ్సీ సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి బాలికల హాస్టల్లోనే వైద్యసేవలు అందించినా తగ్గుముఖం పట్టకపోవడంతో, మరింత మంది వైద్యులను రప్పించారు. సాయంత్రం వరకు సేవలు కొనసాగించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న ఏడుగురు విద్యార్థినులను ఆటోలో ఎస్.కోట ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. 44 మందికి కళాశాల హాస్టల్లోనే వైద్యసేవలు అందిస్తున్నట్టు పీహెచ్సీ డాక్టర్ హారిక తెలిపారు. కారణం ఏమిటో... జ్వరాల వ్యాప్తికి స్పష్టమైన కారణం నిర్ధారణకాలేదు. కళాశాలలో చదువుతున్న 200 మంది విద్యార్థినుల్లో 51 మంది ఒకేసారి జ్వరం, ఒళ్లునొప్పులు, కళ్లు మంటలతో అస్వస్థతకు గురికావడం వైద్యులను సైతం విస్మయపరుస్తోంది. వైరల్ జ్వరాలుగా భావించి వైద్యసేవలు అందిస్తున్నామని, వైద్యపరీక్షల్లో స్పష్టమైన కారణం తెలుస్తుందని కొట్టాం పీహెచ్సీ డాక్టర్ హారిక చెప్పారు. ఎవరికీ మలేరియాగా నిర్ధారణ కాలేదని, 14 మంది మినహా మిగిలిన వారి ఆరోగ్యం కుదుటుపడిందన్నారు. కొందరు విద్యార్థినులు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నట్టు గుర్తించి వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పారు. కొట్టాం పీహెచ్సీ సిబ్బంది వచ్చి వైద్యసేవలు అందించాక మాలో ఆందోళన తగ్గిందని, విద్యార్థునులు కోలుకుంటున్నారని ప్రిన్సిపాల్ శారదాబాయి తెలిపారు. తాటిపూడి గురుకులంలో 51 మంది విద్యార్థులకు అస్వస్థత ఒకరితర్వాత ఒకరుగా మంచం పట్టిన బాలికలు జ్వరాలతో వణుకుతున్న వైనం ఏడుగురిని ఆటోలో ఎస్.కోట తరలింపు అవసరానికి అందుబాటులో లేని అంబులెన్స్లుఅవసరానికి రాని అంబులెన్స్... జ్వరాలతో వణుకుతున్న గురుకుల విద్యార్థినులను ఎస్.కోట ఏరియా ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్లు లేకపోవడం ఆందోళనకు గురిచేసింది. విద్యార్థినులు దుప్పట్లు కప్పుకుని సాయంత్రం వరకు ఆటో కోసం నిరీక్షించారు. ఎట్టకేలకు కళాశాల సిబ్బంది ఆటోను రప్పించి వారిని ఎస్.కోట పంపారు. గత ప్రభుత్వ హయాంలో పరుగులు తీసిన అంబులెన్స్లు ఇప్పుడు అవసరానికి రాని ఆపద్బంధువులుగా మారాయంటూ విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. -
చెరకు మొక్కతోటలకు అగ్రిమెంట్ చేయాలి
● ఏపీ చెరకు రైతు సంఘం వినతిపత్రం రేగిడి: ఈ ఏడాది రైతులు కొత్తగా వేసిన చెరకు మొక్కతోటకు అగ్రిమెంట్ చేయాలని ఏపీ చెరకురైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు సంకిలి ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారం జనరల్ మేనేజర్ వెంకటసూర్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ 2026–27 చెరకు క్రషింగ్ సీజన్కు టన్నుకు రూ.4వేలు అందజేయాలన్నారు. గతంలో మాది రిగా చెరకు రైతులకు రాయితీలు ఇచ్చి సాగువిస్తీర్ణాన్ని పెంచాలని కోరారు. చెరకు రైతులకు యాజమాన్యం ఇస్తున్న మద్దతు ధర ఏ మాత్రం సరిపోవడంలేదన్నారు. పంట పెట్టుబడికి, రైతుకు అందే మద్దతు ధర మధ్య చాలా వ్యత్యాసం ఉండడంతో చెరకు పంట సాగుచేయడం రైతులకు భారంగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెరకు సాగుచేస్తున్న రైతులకు టన్నుకు రూ.వెయ్యి ప్రోత్సాహక మద్దతు ధర ఇచ్చి ఇటు రైతులను, అటు చక్కెర కర్మాగారాన్ని ఆదుకోవాలని కోరారు. ఈ విషయంపై జీఎం మాట్లాడుతూ రైతులు లిఖితపూర్వకంగా అందించిన డిమాండ్లను యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్తామని వెల్లడించారు. సమావేశంలో రైతులు గేదెల సత్యం, తాడేల తవిటినాయుడు, యర్రాపాత్రుని సూర్యనారాయణ, రుంకు భుజంగరావు, కిమిడి మాధవరావు, తదితరులు పాల్గొన్నారు. -
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు..
కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. సర్ ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితాలో ఓటు కనిపించని వారితో పాటు 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటు హక్కు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలి. అలాగే ప్రస్తుతం 17 ఏళ్లు నిండిన యువతీయువకులు కూడా ఓటు హక్కు కోసం ముందస్తు దరఖాస్తు చేసుకునే సదుపాయం కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. అయితే సదరు దరఖాస్తు దారు ముందస్తు దరఖాస్తు చేసుకున్నప్పటికీ 18 ఏళ్లు పూర్తిగా నిండిన తర్వాతనే వారి పేర్లు తుది ఓటరు జాబితాలో ప్రచురితమవుతాయి. ప్రస్తుతం సచివాలయాల్లో బీఎల్ఓలు అందుబాటులో ఉన్నారు. అర్హత ఉండి ఓటు లేని ప్రతిఒక్కరూ ఓటు హక్కు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలి. – రామ్మోహనరావు, ఆర్డీవో, బొబ్బిలి -
17 ఏళ్లకే ఓటరుగా నమోదు..!
రామభద్రపురం: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను పూర్తిచేసిన కేంద్ర ఎన్నికల సంఘం అందులో భాగంగా 17 ఏళ్లకే కొత్త ఓటరుగా నమోదు ప్రక్రియను ప్రారంభించింది. ప్రస్తుతం 18 ఏళ్లు నిండి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ కొత్తగా ఓటు హక్కు పొందేందుకు అవకాశం కల్పించింది. ఇటీవల సర్ ప్రక్రియలో ఓటు కనిపించని వారు కూడా అర్హత ఉండి ఉంటే కొత్తగా దరఖాస్తు చేసుకుని ఓటు హక్కు పొందవచ్చు. యువత భాగస్వామ్యాన్ని మరింత పెంచడమే లక్ష్యంగా మరో చాతరిత్రాత్మక నిర్ణయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంది. ఇకపై 17 ఏళ్లు నిండిన యువతీ యువకులు ముందస్తుగానే ఓటరు జాబితాలో పేరు నమోదుకు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అయితే యువత ముందస్తు దరఖాస్తు చేసుకున్నప్పటికీ వారికి 18 ఏళ్లు పూర్తిగా నిండిన తర్వాతే తుది ఓటరు జాబితాలో పేరు నమోదు కావడంతో పాటు ఓటు హక్కు లభిస్తుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఉండాల్సిన ధ్రువీకరణపత్రాలు.. 17 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటరుగా నమోదు చేసుకోవడానికి తమ వయస్సు, నివాస ధ్రువీకరణ పత్రం, ఆధార్కార్డు సమర్పించాల్సి ఉంటుంది. అలాగే తల్లిదండ్రుల ఓటరు ఐడీ కూడా ఉండాలి. ఈ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో బీఎల్ఓలు పరిశీలిస్తారు. వారు ధ్రువీకరణ పత్రాలను వ్యక్తిగతంగా పరిశీలించిన తర్వాత అర్హులా కాదా అని తేల్చి ఓటు హక్కు ఇవ్వాలా లేదా అనేది నిర్ణయిస్తారు. దరఖాస్తు ప్రక్రియ 17 ఏళ్లకే ప్రారంభమైనప్పటికీ సదరు యువతకు 18 ఏళ్లు నిండిన తర్వాతనే వారి పేర్లు తుది జాబితాలో ప్రచురితమవుతాయి.ఈ సరికొత్త విధానంపై అవగాహన కల్పించడానికి ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలతో పాటు డిగ్రీ కళాశాలలో ప్రత్యేక నమోదు శిబిరాలను నిర్వహించేందుకు సంబంధిత అధికారులు కసరత్తు చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న ఈ సలభతరమైన ముందస్తు దరఖాస్తు ప్రక్రియ వల్ల వేలాదిమంది యువతకు సరికొత్త ఓటరుగా మారే అవకాశం లభించనుంది. విద్యాసంస్థల గణాంకాల ప్రకారం 2023–24 విద్యాసంవత్సరంలో పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలు రాసే సమయానికి 15 ఏళ్లు నిండిన విద్యార్థుల వయస్సు 2026 నాటికి 17 ఏళ్లకు చేరుకుంటుంది. ప్రస్తుతం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం, డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న వేలాది మంది విద్యార్థులకు ఇప్పుడు 17 నుంచి 18 ఏళ్లు నిండుతున్నాయి. వారు చేసుకునే ముందస్తు దరఖాస్తు ప్రక్రియ వల్ల ఓటర్ల సంఖ్య పెరిగే అవకాం కనిపిస్తోంది. ముందస్తుగా దరఖాస్తుల ఆహ్వానం ఎన్నికల సంఘం కీలక నిర్ణయం జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వెంటనే ఓటుహక్కు జాబితాలో చేరనున్న కొత్త ఓటర్లు కళాశాలల్లో ప్రత్యేక శిబిరాల ఏర్పాటుకు కసరత్తు వేలాదిమంది యువతకు దక్కనున్న అవకాశం -
బరువు ఎత్తడంలో ‘అజేయు’డిగా..
నెల్లిమర్ల రూరల్: కొన్నిసార్లు విజయాలు వ్యక్తిగతంగా నిలుస్తాయి. మరికొన్నిసార్లు అవి ఒక కుటుంబ చరిత్రను సృష్టిస్తాయి. పట్టుదలకు పౌరుషం తోడైతే ఎలా ఉంటుందో గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్–2026 సాక్షిగా జిల్లాకు చెందిన యువకుడు నిరూపించాడు. పురుషుల 79 కిలోల వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామానికి చెందిన వల్లూరి అజయ్బాబు సోమవారం అర్ధరాత్రి చేసిన అద్భుతమైన ‘హిస్టారికల్ లిఫ్ట్’కు అంతర్జాతీయ వేదిక ఫిదా అయ్యింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో సరికొత్త గేమ్స్ రికార్డుతో రజత పతకాన్ని ముద్దాడాడు. ఒకప్పుడు తండ్రి వల్లూరి శ్రీనివాసరావు కామన్వెల్త్ వేదికపై పతకం కొట్టి భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తే.. ఇప్పుడు ఆయన కుమారుడు అజయ్ వెండి పతకంతో తండ్రి వారసత్వాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాడు. స్నాచ్లో నయా హిస్టరీ.. క్లీన్ అండ్ జెర్క్లో సంచలనం స్నాచ్ విభాగంలో అజయ్ బాబు ఏకంగా 149 కేజీల అసాధారణ బరువు ఎత్తడంతో సరికొత్త కామన్వెల్త్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ అద్భుత ఘనతతో గ్లాస్గో వేదిక కరతాళ ధ్వనులతో మారుమోగిపోయింది. అనంతరం క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో తన సర్వ శక్తులను ఒడ్డి ఏకంగా 181 కేజీల బరువును గాల్లోకి లేపాడు. ఆ బరువుతో స్థిరంగా నిలబడిన ఆ కొన్ని సెకెన్ల దృశ్యం భారత క్రీడా చరిత్రలోనే ఒక అద్భుత హిస్టారికల్ లిఫ్ట్గా నిలిచింది. మొత్తంగా 330 కేజీల బరువుతో అజయ్ రెండో స్థానాన్ని సుస్థిరం చేసుకోగా.. మలేషియాకు చెందిన ఎర్రీ హిదాయిత్ (331) కేజీలు కేవలం ఒక్క కిలో తేడాతోనే బంగారు పతకాన్ని సాధించాడు. 16 ఏళ్ల తరువాత మార్మోగిన జిల్లా పేరు గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్కు ఆంధ్రప్రదేశ్ నుంచి అజయ్బాబు ఒక్కడే ఎంపికయ్యాడు. త్రుటిలో స్వర్ణం చేజారినప్పటికీ అసాధారణ ప్రతిభతో వెండి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ చారిత్రాత్మక విజయం వెనుక తండ్రి కల దాగి ఉంది. 2010 ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో అజయ్ తండ్రి వల్లూరి శ్రీనివాసరావు దేశం తరఫున ఆడి కాంస్య పతకం గెలిచాడు. తండ్రి సాధించిన ఘనతను ఆదర్శంగా తీసుకున్న అజయ్ అనుకున్నట్లే గ్లాస్గో వేదికపై వెండిని ముద్దాడి తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు. అజయ్ సాధించిన విజయంపై స్వగ్రామమైన కొండవెలగాడలో సందడి వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో పాటు జిల్లా వ్యాప్తంగా క్రీడాభిమానులు పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మజ్జి శ్రీనివాసరావు, నెల్లిమర్ల మాజీ ఎమ్మె ల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీ సురేష్ బాబు, తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.అజయ్ తండ్రికి సత్కారం కామన్వెల్త్ గేమ్స్లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో వల్లూరి అజయ్బాబు వెండి పతకం సాధించి కొండవెలగాడ గర్వాన్ని ప్రపంచానికి చాటాడని జెడ్పీటీసీ సభ్యుడు, వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు గదల సన్యాసినాయుడు అన్నారు. కొండవెలగాడలో అజయ్ తండ్రి శ్రీనివాసరావును మంగళవారం ఘనంగా సత్కరించారు. వెయిట్లిఫ్టర్లగా తండ్రీకొడుకుల ఘనతను ప్రశంసించారు. వీరిని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గ్రామస్తులు, యువత పాల్గొన్నారు. కామన్వెల్త్ గేమ్స్లో అదరగొట్టిన అజయ్ 149 కేజీల స్నాచ్లో రికార్డు క్లీన్ అండ్ జెర్క్లో 181 కేజీలు లిఫ్ట్ మొత్తం 330 కేజీల బరువును ఎత్తి వెండి పతకం 16 ఏళ్ల తరువాత అంతర్జాతీయ పోడియంపై జిల్లా పేరు నాడు తండ్రికి కాంస్యం.. నేడు తనయుడుకి రజతం.. -
తప్పుచేయకుంటే భయమెందుకు...?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన డీఎస్సీ నియామకాల్లో తప్పులు జరగకుంటే భయమెందుకు. రాష్ట్రంలో జెన్జీ యువత సత్తా చూడలనుకుంటే ప్రభుత్వానికి పతనం తప్పదు. యువత, విద్యార్థులు తలచుకుంటే ప్రభుత్వాలు దిగిరాక తప్పదని ఢిల్లీ ఘటన చూసి తెలుసుకోండి. 2025 డీఎస్సీ నియామకాల మెరిట్ లిస్ట్ ప్రకటించడంలో విద్యాశాఖమంత్రికి ఎందుకుంత భయం. నియామకాల్లో అవకతవకలు జరగలేదని ఎందుకు శ్వేతపత్రం విడుదల చేయడం లేదు. ఇందుకు బాధ్యత వహించాల్సిన నారా లోకేష్.. యువతకు చేస్తున్న అన్యాయంపై బహిరంగ చర్చకు రావాలి. సామాన్యకార్యకర్తలైన మేమే గద్దె దింపుతాం. – కోలగట్ల శ్రావణి, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి, విజయనగరం -
ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు
● ఎస్పీ ఏఆర్ దామోదర్పూసపాటిరేగ: దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు 1న జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఎస్పీ ఏఆర్ దామోదర్ మంగళవారం ఆదేశించారు. దేశ ప్రధాని జిల్లాలోని భోగాపురంలో పర్యటించనున్న నేపథ్యంలో ఎస్పీ ఏఆర్ దామోదర్, ఆక్టోపస్, గ్రేహౌండ్స్ ఐజీ కె.శ్రీకాంత్, విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి, గ్రేహౌండ్స్ డీఐజీ అట్టాడ బాపూజీ, గ్రేహౌండ్స్ ఎస్పీ డా.సుమిత్ గరుడ్తో కలిసి ఎయిర్ పోర్ట్కు వెళ్లే రహదారులను, పార్కింగ్ స్థలాలు, మీటింగ్ స్థలం, కమాండ్ కంట్రోల్, ఎయిర్ పోర్ట్ మార్గానికి అనుసంధానం చేస్తున్న ట్రంపెట్ లను సందర్శించి, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ప్రధాని పర్యటనలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా జాతీయ రహదారిని ఎయిర్ పోర్ట్ రహదారికి అనుసంధానం చేసే పనులను వేగవంతం చేయాలన్నారు. ప్రధాని పర్యటనలో పాల్గొనేందుకు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల నుంచి సుమారు 5వేల బస్సులు, ముఖ్య వ్యక్తులు, ప్రముఖులకు సంబంధించి మరో 5వేల కార్లు, ఇతర వాహనాలు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా పని చేయాలని చెప్పారు. జాతీయ రహదారిని ఎయిర్ పోర్ట్ రహదారికి అనుసంధానం చేసే ప్రాంతాల వద్ద పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. వీఐపీ వాహనాలు సన్ రే రిసార్ట్ మీదుగా ఎయిర్ పోర్ట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలానికి చేరుకునే విధంగా చర్యలు చేపడుతున్నామని ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. -
డీఎస్సీ అక్రమాలపై.. యువ గర్జన
విజయనగరం: చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు, అన్యాయాలు, మోసకారి పాలనపై యువజనం గర్జించింది. విద్యార్థిలోకం గళ మెత్తింది. నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై సమాధానం చెప్పాలని, అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. నియామక ప్రక్రియలో జరిగిన అవకతవకలపై సీబీఐ దర్యాప్తు చేయాలన్నారు. విద్యార్థులకు రావాల్సిన రూ.12000 కోట్ల ఫీజురీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను విడుదల చేయాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర వాప్త పిలుపులో భాగంగా యువతకు, విద్యార్థులకు కూటమి సర్కారు చేస్తున్న అన్యాయంపై తక్షణమే మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విజయనగరం జిల్లా కేంద్రంలో వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన నిరసన విజయవంతమైంది. జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు సమక్షంలో జరిగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువత, విద్యార్థులు నిరసన ర్యాలీలో పాల్గొని తమ గళం వినిపించారు. మెగా డీఎస్సీ కాదు.. ఇది దగా డీఎస్సీ.., టెట్ లేదు... డీఎస్సీ లేదు.. డీల్ ఉంటే ఉద్యోగం ఖాయం.. పతక విజేతలు బయట.. పైరవీ విజేతలకు అందలం... అర్హతను పాతిపెట్టి అవినీతికి పట్టం కట్టారు.. తప్పు చేయకుంటే సీబీఐ విచారణకు భయమెందుకు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స్థానిక న్యూపూర్ణ కూడలి నుంచి ప్రారంభమైన ర్యాలీలో భాగంగా ముందుగా పార్టీ నాయకులు దివంగత నేత డాక్టర్ వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గంటస్తంభం జంక్షన్, మెయిన్ రోడ్డు మీదుగా విజయనగరం ప్రజల ఇలవేల్పు పైడితల్లి ఆలయం వద్దకు చేరుకుని ప్రజలకు మంచి జరిగే పాలన అందించేలా కూటమి ప్రభుత్వానికి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ టెంకాయలు కొట్టి పూజలు చేశారు. కార్యక్రమంలో ఎస్.కోట మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ డాక్టర్ శోభా స్వాతిరాణి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కె.వి.సూర్యనారాయణరాజు, నెక్కల నాయుడుబాబు, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు కరుమజ్జి సాయికుమార్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శంబంగి వేణుగోపాలనాయుడు, కార్పొరేషన్ మాజీ ఫ్లోర్ లీడర్ ఎస్.వి.వి.రాజేష్, పార్టీ నగర అధ్యక్షుడు ఆశపు వేణు, యువజన విభాగం నాయకులు జి.ఈశ్వర్కౌశిక్, బడ్డుకొండ మణిదీప్నాయుడు, ప్రదీప్నాయుడు, బెల్లాన వంశీకృష్ణ, చెల్లూరు భార్గవ్, మణికంఠ, తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు, యువత జీవితాలతో ఆటలా..? యువత, విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై బాధ్యత గల ప్రతిపక్షంగా పోరాటం చేస్తాం. మంత్రి నారా లోకేష్కు మంత్రిగా కొనసాగే అర్హత లేదు. యువత, విద్యార్థుల జీవితాలతో ఆటలాడటం సరికాదు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ చేపట్టకుంటే ఢిల్లీలో జరిగిన ఘటన రాష్ట్రంలో పునరావృతం అవుతుంది. కష్టపడి చదువుకునే నిరుద్యోగ యువతను మోసం చేయడం నేరం. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపడుతున్న నారా లోకేష్ ఏం చేస్తున్నారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ఉద్యోగం లేని వారికి నెలకు రూ.3 వేలు భృతి ఇస్తామని ప్రకటించిన హమీ అమలు ఏమైంది?. – బొత్స అనూష, వైఎస్సార్సీపీ మహిళా విభాగం నాయకురాలు, విజయనగరం ‘ఉపాధ్యాయ ఉద్యోగాలు అమ్మేశారు’ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యువత, విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తున్నారు. ఉద్యోగ నియామకాల్లో రాజకీయ జోక్యంతో అర్హులు ఉద్యోగాలకు దూరమయ్యారు. సంతలో కూరగాయలు అమ్ముకున్నట్టు ఉపాధ్యాయ ఉద్యోగాలు రూ.లక్షలకు అమ్మేశారు. ఎన్నికలు వచ్చే ప్రతిసారి యువతకు హామీలు ఇవ్వడం, వాటిని అమలుచేయకుండా మోసగించడం చంద్రబాబుకు అలవాటుగా మారిపోయింది. – అల్లు అవినాష్, వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మెగా కాదు... దగా డీఎస్సీ కేంద్రమంత్రి తరహాలో నారా లోకేష్ రాజీనామా చేయాలి డీఎస్సీ నియామకాలపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలి రూ.12 కోట్ల ఫీజురీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ యువత, విద్యార్థులకు అండగా వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మంచి బుద్ధిని ప్రసాదించాలంటూ పైడితల్లికి పూజలు -
వ్యవసాయ ఆవిష్కరణలకు సీటీయూఏపీ, ఐకార్, నార్మ్ సహకారం
విజయనగరం రూరల్: గిరిజన యువత నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయ ఆవిష్కరణలు, పరిశోధన, ఉపాధి అవకాశాల విస్తరణ లక్ష్యంగా కేంద్రియ గిరిజన విశ్వవిద్యాలయం–ఏపీ, ఐకార్, నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ (నార్మ్) వ్యూహాత్మక భాగస్వామ్యంపై మంగళవారం చర్చించామని సీటీయూఏపీ ఇన్చార్జి వైస్ చాన్స్లర్ టి.శ్రీనివాసన్ తెలిపారు. ఈ సందర్భంగా వృక్ష శాస్త్ర విభాగధిపతి డాక్టర్ అనిరుధ్కుమార్, నార్మ్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.ఎం.సుందరంతో హైదరాబాద్లో వీసీ భేటీ అయ్యారు. గిరిజన యువతలో నైపుణ్యాలు, వ్యవసాయ ఆధారిత వ్యవస్థాపకత పెంపొందించడం, అగ్రి బిజినెస్ ఇంక్యుబేషన్, గిరిజన ఉత్పత్తులకు విలువ జోడింపు, మార్కెట్ అనుసంధానం, వాతా వరణ అనుకూల వ్యవసాయ విధానాలతో పాటు ఆర్టిఫి షియల్ ఇంటెలిజెన్స్, వ్యవసాయ నిర్వహణ, పరిశోధన, నాయకత్వం తదితర రంగాల్లో సంయుక్త శిక్షణపై చర్చించామని ఆయన వివరించారు. గిరిజన ప్రాంతాల్లో విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, స్థిరమైన జీవనోపాధి అవకాశాలను బలోపే తం చేయాలని ఇరు సంస్థలు ఆకాంక్షించినట్లు ఇన్చార్జి వీసీ తెలిపారు. -
జగనన్న వస్తున్నారు..
● ఘనంగా స్వాగతం పలుకుదాం రండి ● జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు విజయనగరం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీ య అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఈ నెల 30న ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. శ్రీకాకుళంలో మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును పరామర్శించడానికి గురువారం ఉదయం 10 గంటలకు విశాఖ ఎయిర్ పోర్ట్కు చేరుకొని, అక్కడ నుంచి రోడ్డు మార్గంలో విజయనగరం మీదుగా శ్రీకాకుళం వెళ్తారని తెలిపారు. రాజపులోవ కూడలి నుంచి శ్రీకాకుళం జిల్లా సరిహద్దు ప్రారంభం కందివలస గెడ్డ వరకు పార్టీ అధినేతకు ఆత్మీయ స్వాగతం పలికేందుకు ఆయా నియోజక వర్గాల పార్టీ నాయకులు ముందుగా ఎంపిక చేసుకున్న సమీకరణ ప్రదేశాల నుంచి తరలిరావాలని సూచించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన ఎస్ఈసీ సభ్యులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు, పార్టీ మండలాధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జిల్లా, నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి పార్టీ కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, మాజీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, మహిళా ప్రజాప్రతినిధులు, సోషల్ మీడియా కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తమకు కేటాయించిన ప్రాంతాలకు నిర్ణీత సమయానికి హాజరై, అధినేత వైఎస్ జగన్కు ఘనంగా స్వాగతం పలికి, అయన పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకోవాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీలో చేరిన ఎంపీటీసీ డెంకాడ: చొల్లంగిపేట ఎంపీటీసీ సభ్యుడు గుడివాడ కిరణ్కుమార్, మరో 40 మంది యువకులు జనసేన పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మంగళవారం చేరారు. అలాగే, బంటుపల్లి పంచాయతీలోని గొంపవానిపేటకు చెందిన పది కుటుంబాలు వైఎస్సార్ సీపీలో చేరారు. వీరికి నెల్లిమర్ల నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. మోదీ పర్యటనను విజయవంతం చేయాలి విజయనగరం: వచ్చేనెల 1న ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేయాలని కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) డాక్టర్ పి.సంపత్ కుమార్ ఆదేశించారు. విజయనగరం కార్పొరేషన్ సమావేశ మందిరంలో కమిషనర్లతో మంగళవారం సమావేశమయ్యారు. పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరాపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. -
విలేజ్ హెల్త్క్లినిక్స్లో జరగని డెంగీ పరీక్ష..!
● కానరాని టెస్టింగ్ కిట్లు ● పరీక్ష కోసం పీహెచ్సీకి వెళ్లాల్సిన పరిస్థితివిజయనగరం ఫోర్ట్: ప్రజారోగ్యాన్ని టీడీపీ సర్కార్ గాలికివదిలేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా గ్రామీణ ప్రాంత ప్రజలు వైద్యసేవల కోసం అవస్థలు పడుతున్నారు. గ్రామీణుల చెంతనే అందాల్సిన వైద్య సేవలు అందకపోవడం వల్ల వారు పీహెచ్సీలకు వెళ్లాల్సిన దుస్థితి. ప్రస్తుతం సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగీ, వైరల్ జ్వరాల వ్యాప్తి అధికంగా ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యాధుల వ్యాప్తి అధికంగా ఉంది. వ్యాధి నిర్ధారణ త్వరగా చేయగలిగితే చికిత్స అందించి ప్రాణపాయం బారిన పడకుండా కాపాడడానికి అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో చేసే డెంగీ పరీక్షలు నిలిచిపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. గ్రామాల్లో కిట్ల కొరత జిల్లాలో482 విలేజ్ హెల్త్ క్లినిక్లు ఉన్నాయి. వాటి పరిధిలో జ్వరం బారిన పడిన వారికి మలేరియా, డెంగీ పరీక్షలు చేయడానికి మలేరియా, డెంగీ టెస్టింగ్ కిట్లు ప్రభుత్వం సరఫరా చేయాలి. అయితే డెంగీ టెస్టింగ్ కిట్లు చాలా చోట్ల లేనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో జ్వరపీడితులకు మలేరియా టెస్టు మాత్రమే వైద్యసిబ్బంది చేస్తున్నారు. మలేరియా కంటే డెంగీ ప్రమాదకరమైనది. డెంగీ వ్యాధిని త్వరగా గుర్తించాల్సి ఉంటుంది. డెంగీ వ్యాధిని సకాలంలో గుర్తించకపోతే వ్యాధి తీవ్రమై ప్రాణాలమీదకు వస్తుంది. పీహెచ్సీకి వెళ్లాల్సిన పరిస్థితి విలేజ్ హెల్త్ క్లినిక్స్లో డెంగీ కిట్ల కొరత వల్ల జ్వరపీడితులు డెంగీ టెస్టు కోసం పీహెచ్సీలకు వెళ్లాల్సిన పరిస్థితి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విలేజ్ హెల్త్ క్లినిక్లోనే మలేరియా, డెంగీ కిట్లు అందుబాటులో ఉంచేవారు. ఇంటింటా సర్వే నిర్వహించి జ్వరపీడితులు ఉంటే వారికి అక్కడికక్కడే పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ అయిన వారికి చికిత్స కోసం రిఫరల్ ఆస్పత్రికి పంపించేవారు. దీని వల్ల వారికి త్వరగా చికిత్స అందడం వల్ల త్వరగా కోలుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేక పోవడం వల్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. విచారణ చేసి చర్యలు విలేజ్ హెల్త్ క్లినిక్స్లో డెంగీ కిట్ల కొరత విషయం తెలియదు. విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. పీహెచ్సీల్లో నుంచి విలేజ్హెల్త్ క్లినిక్లకు కిట్లు అందిస్తారు. – డాక్టర్ ఎస్. జీవనరాణి, డీఎంహెచ్ఓ -
సామాన్యుడి ఇంట ధరల మంట
● క్వింటాకు రూ.800 చొప్పున పెరిగిన బియ్యం ధరలు ● నిత్యావసర సరుకుల ధరలకు రెక్కలు ● బెంబేలెత్తుతున్న సామాన్య ప్రజలు ఈ చిత్రంలో చేతిలో చిన్న సంచితో బియ్యం చూపిస్తున్నది రామభద్రపురం గ్రామానికి చెందిన కనపాక బాబ్జి. ఇతడు రోజూ కూలీ పనిచేసుకుంటూ జీవనం స్తాస్తున్నాడు. ఈయన ప్రతినెలా బియ్యం కొనుగోలు చేస్తాడు. గత నెలలో 5 కిలోల బియ్యం రూ.300లకు కొనుగోలు చేయగా, ప్రస్తుతం అవే బియ్యం రూ.360కు ధర పెరగడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. ఈయన జూన్ నెలవరకు ఇంట్లో సరిపడా సరుకులకు సుమారు రూ.3 వేలు ఖర్చుపెట్టగా, ఇప్పుడు ఆ ఖర్చు రూ.4వేలకు చేరిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు. రామభద్రపురం: నిత్యావసర సరుకుల ధరలు సామాన్యుడికి దడపుట్టిస్తున్నాయి. బియ్యంతో పాటు వంట నూనె, కందిపప్పు, వేరుశనగ పలుకులు, పంచదార, తదితర నిత్యావసర వస్తువుల ధరలు నింగినితాకుతున్నాయి. సామాన్యుల బతుకు భారంగా మారింది. ధరల నియంత్రణలో చంద్రబాబు సర్కారు విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సన్నబియ్యం నుంచి దొడ్డ బియ్యం వరకు నెలరోజుల్లో 20 నుంచి 40 శాతం ధరలు పెరగడంతో సామాన్యులకు రెండు పూటలా గడవడం కష్టంగా మారింది. గతనెలలో రూ.1450 ఉండే 25 కిలోల సన్నబియ్యం బస్తా ప్రస్తుతం రూ.1650కు చేరింది. తక్కువ రకం కర్నూలు రకం బియ్యం గత నెలలో రూ.1050లు ఉండగా ప్రస్తుతం రూ.1500లకు చేరింది. ప్రతి క్వింటా బియ్యం బస్తాకు నెలరోజుల్లో దాదాపు రూ.800లు పెరిగిందటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. కూరగాయల ధరలు కూడా అమాంతం పెరగడంతో పేదలు బెంబేలెత్తిపోతున్నారు. బతుకు ఎలా సాగేదంటూ ఆందోళన చెందుతున్నారు. -
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
● సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథిఅల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, వివిధ శాఖల అధికారులంతా పరస్పరం సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ, గహనిర్మాణ శాఖామంత్రి కొలుసు పార్ధసారథి ఆదేశించారు. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఏర్పాట్లపై, మంత్రులు డోలా శ్రీ బాలాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్లతో కలిసి భోగాపురం ఎయిర్పోర్టు అడ్మినిస్ట్రేషన్ భవనంలో మంత్రి పార్ధసారథి మంగళవారం ఉదయం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. సమావేశంలో ప్రధాని పర్యటన కార్యక్రమం నోడల్ అధికారి ఎంటి కృష్ణబాబు, కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వర్ల కుమార్ రాజా, లోకం నాగమాధవి, జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్, పలువురు కూటమి నేతలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
చెరువులో పడి మహిళ మృతి
గంట్యాడ: మండలంలోని మదనాపురం గ్రామానికి చెందిన రంధి దేవుడమ్మ (56) చెరువులో పడి మృతిచెందింది. సోమవారం రాత్రి ఇంట్లో నిద్రించిన ఆమె మంగళవారం ఉదయం కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించగా గ్రామంలోని చంద్రాజీ చెరువులో మృతదేహమై కనిపించింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె అనారోగ్య కారణాలతో చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని, లేదా ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెంది ఉండవచ్చని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఏఎస్సై విజయ్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మ్యాక్సీ క్యాబ్ ఢీకొని వ్యక్తి మృతిబలిజిపేట: మండలకేంద్రంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెర్లాం మండలం ఆమిటి గ్రామానికి చెందిన మరడాన అప్పలస్వామి(52) మృతిచెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య సత్యవతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్సై రమణ కేసు నమోదుచేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనపై ఏఎస్సై తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తెర్లాం మండలం ఆమిటి గ్రామానికి చెందిన అప్పలస్వామి వ్యవసాయ పని నిమిత్తం గాబుమందు కొనేందుకు తన ద్విచక్రవాహనంపై బలిజిపేట వచ్చి కొనుగోలు చేసి తిరిగి ఇంటికి వెళ్లిపోతున్నాడు. అదే సమయంలో బలిజిపేట వైపు కొబ్బరి బొండాల లోడుతో టాటా మ్యాజిక్ మ్యాక్సీ క్యాబ్ వస్తోంది. ఈ క్రమంలో గొల్లవీధి మలుపువద్ద మ్యాక్సీ క్యాబ్ అప్పలస్వామి ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడంతో కాళ్లు విరిగి, తలకు బలమైన గాయం తగలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవకర్ కె.జనార్దన్ను అదుపులోకి తీసుకున్నామని ఏఎస్సై చెప్పారు. విద్యుదాఘాతంతో యువకుడి మృతి● మరో యువకుడికి గాయాలు పార్వతీపురం రూరల్: నూతన దుకాణానికి బోర్డు అమర్చుతున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృతి చెందగా, మరో యువకుడికి గాయాలయ్యాయి. ఈ ఘటన పార్వతీపురం జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి జరిగింది. పట్టణంలోని సుదర్శన్ షాపింగ్ మాల్ ఎదురుగా కొత్తగా ఒక దుకాణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ దుకాణం పేరుతో ఉన్న బోర్డును ఇద్దరు యువకులు భవనం పైనుంచి కిందకు దించుతూ అమర్చే పని చేపట్టారు.ఈ క్రమంలో వారు పట్టుకున్న బోర్డు ప్రమాదవశాత్తు భవనం ఎదురుగా వెళ్తున్న విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో ఒక్కసారిగా విద్యుత్ ప్రవహించి పురోహిత్ ముఖేష్ కుమార్ (23) అనే యువకుడు తీవ్రంగా షాక్కు గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ముఖేష్తో పాటు బోర్డును పట్టుకున్న మరో యువకుడికి సైతం గాయాలు కావడంతో, గమనించిన స్థానికులు వెంటనే పార్వతీపురం ప్రభుత్వ జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన ఈ ఇద్దరు యువకులను రాజస్థాన్ ప్రాంతానికి చెందిన మార్వాడీలుగా గుర్తించారు. అసభ్యకర ప్రవర్తన కేసులో రెండేళ్ల జైలు, జరిమానాబొబ్బిలి: పట్టణానికి చెందిన ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు పాల్పడిన స్థానికుడు బొట్ట అప్పారావు అనే వ్యక్తికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.4వేల జరిమానా విఽధిస్తూ న్యాయమూర్తి హేమ స్రవంతి జానకిరామ్ మంగళవారం తీర్పునిచ్చినట్లు పోలీసులు తెలిపారు. అప్పారావు 2020లో మహిళపై వేధింపులకు పాల్పడగా బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామన్నారు. మంగళవారం ఆ కేసు తుది తీర్పును అనుసరించి న్యాయమూర్తి పై విధంగా తీర్పునిచ్చినట్లు తెలిపారు. -
సీ్త్రలు శక్తి చూపాల్సిందే..
బస్సు ఎక్కాలంటే..ఈ చిత్రాలు చూశారా.. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్లో మంగళవారం బస్సులు ఎక్కేందుకు ప్రయాణికులు అష్టకష్టాలు పడ్డారు. శక్తినంతా కూడగడితే తప్ప బస్సు ఎక్కలేని పరిస్థితి. విశాఖపట్నం జిల్లాలోని సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షణ కోసం విజయనగరం నుంచి వెళ్లేందుకు అరకొర ఆర్టీసీ సర్వీసులు ఉండడంతో ప్రయాణికులకు పాట్లు తప్పలేదు. ఆర్టీసీ డిపోలు, రోడ్లపైనే బస్సు ఎక్కేందుకు పోటీపడ్డారు. తోపులాటల్లో కొందరు కిందపడి గాయపడ్డారు. మరికొందరు ఫుట్బోర్డులపై ప్రమాదకర ప్రయాణాలు సాగించారు. వృద్ధులు, చిన్నారులు బస్సులు ఎక్కలేక ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. అరకొర బస్సులు నడుపుతూ సీ్త్రశక్తి పథకం అమలు చేస్తున్నట్టు చంద్రబాబు ప్రభుత్వం గొప్పలు చెబుతుండడంపై మండిపడ్డారు. ఇంతటి ప్రయాణ కష్టాలు ఎన్నడూ చూడలేదని, బస్సుల్లో ప్రయాణం మరిచిపోవాల్సిందేనంటూ పలువురు పురుష ప్రయాణికులు నిట్టూర్చారు. – సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం -
యువత, విద్యార్థులను మోసం చేయడం తగదు
–8లో17 ఏళ్లకే ఓటరుగా నమోదు..! ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను పూర్తిచేసిన కేంద్ర ఎన్నికల సంఘం అందులో భాగంగా 17 ఏళ్లకే కొత్త ఓటరుగా నమోదు ప్రక్రియను ప్రారంభించింది.ఎన్నికలకు ముందు యువత, విద్యార్థుల జీవితాల్లో ఆశలు కల్పించారు. ఎన్నికల్లో లబ్ధిపొందాక హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్నారు. యువత, విద్యార్థుల సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు వైఎస్సార్సీపీ తరఫున పోరాటం చేస్తాం. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ విషయంలో యువత, విద్యార్థులు చేపట్టిన పోరాటంతో కేంద్రం దిగివచ్చింది. నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు. రాష్ట్రంలో గతేడాది చేపట్టిన డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి ఎందుకు నోరు విప్పడం లేదు. ఉత్తీర్ణులు కాని వారికి స్పోర్ట్స్ కోటా పేరిట డబ్బులు వసూలు చేసి ఉద్యోగాలు కట్టబెట్టారు. దీనివల్ల అర్హులకు అన్యాయం జరిగింది. తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలి. అప్పటి వరకు విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాలి. ఎన్నికలకు ముందు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హమీ మేరకు నెలకు రూ.3వేల భృతి ఇవ్వాలి. – మజ్జి శ్రీనివాసరావు, జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు -
భూములు లాక్కుంటారా?
పరిహారం చెల్లించకుండా మేము ముగ్గు రం అన్నదమ్ములం. సర్వే నంబ ర్ 141–4లోని 2.27 ఎకరాల భూమిని అధికారులు తీసుకున్నారు. అప్పట్లో ఎకరాకు రూ.11లక్షల పరిహారం అందజేస్తామ ని తెలిపారు. తీరా కేవలం రూ.9 లక్షలు మాత్ర మే మా ఖాతాలకు జమచేశారు. మిగిలిన రూ. 15.97 లక్షల సొమ్మును అడిగితే ఇచ్చేశాం అంటున్నారు. ఎవరికి చెప్పుకోవాలి? – డోకుల దేముడు, కృష్ణ, బాధిత రైతులు, బలిఘట్టంకొత్తవలస: తమ సాగు భూములకు తగిన పరిహారం చెల్లించకుండా ఎంఎస్ఎంఈ (సూక్ష్మ చిన్న, మధ్య తరహా పరిశ్రమలు) పార్కు పనులు ఎలా చేపడతారంటూ మండలంలోని బలిఘట్టం రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్కు నిర్మాణ పనులను సోమవారం అడ్డుకున్నారు. నిబంధనల ప్రకారం పరిహారం అందించిన తర్వాతే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. అరకొర పరిహారం అందించి భూములను లాక్కోవడం తగదని వాపోయారు. ఇదీ పరిస్థితి... గత తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో 2018 సంవత్సరంలో బలిఘట్టం గ్రామ రెవెన్యూ పరిధిలో 57.02 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వాడ నిర్మాణానికి సేకరించింది. అప్పట్లో అరకొర పరిహారం రైతుల బ్యాంకు ఖాతాలకు జమచేశారు. ఇంతలో ప్రభుత్వం మారింది. ఏపీఐసీ భూముల ఊసెత్తలేదు. మళ్లీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇక్కడ పరిశ్రమలు స్థాపిస్తామంటూ 2025 మే1వ తేదీన అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. అప్పట్లోనే రైతులకు పూర్తిస్థాయిలో పరిహారం అందించకుండా పార్కు శంకుస్థాపన పూజలు చేయడం తగదని బాధిత రైతులు ఆందోళన చేశారు. ఆయనకు వినత పత్రం అందజేశారు. వారం రోజుల్లో రైతుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా విస్మరించారు. ఇప్పుడు దౌర్జన్యంగా సాగుభూముల్లో పార్కు పనులు తలపెట్టడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిహారం ఇచ్చేశామంటూ అధికారులు చెబుతుండడంపై మండిపడుతున్నారు. తమ ఖాతాలను పరిశీలించాలని, ఎవరి ఖాతాలకు డబ్బులు జమయ్యాయో నిర్ధారించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయమై తహసీల్దార్ ఎస్.రామలక్ష్మి మాట్లాడుతూ భూసేకరణ 2018 సంవత్సరంలోనే జరిగిపోయిందని, రైతుల ఖాతాలకు ఎంఎస్ఎంఈ అధికారులు పరిహారం జమచేశారన్నారు. ఇంతకు మించి తనకు తెలియదని చెప్పుకొచ్చారు. నాకు సర్వే నంబర్ 141లో ఎకరా 45 సెంట్లు భూమిని అధికారులు తీసుకున్నారు. దీనికి సంబంధించి కొత్తవలస కెనరా బ్యాంకు ఖాతాలో కేవలం రూ 3.75 లక్షలు మాత్రమే జమ చేశారు. మిగిలిన డబ్బులు అడిగితే మీ బ్యాంకు ఖాతాలకు జమ చేశామంటున్నారు. ఇదెక్కడి అన్యాయం. ఎవరిని అడగాలి?. – యడ్ల దేముడమ్మ, బాధితురాలు, బలిఘట్టంపార్కు నిర్మాణానికి సర్వే నంబర్ 141–26లో 19 సెంట్లు భూమికి పరిహారం అందించారు. సర్వే నంబర్ 141–45 లోగల 18 సెంట్లు భూమికి పరిహారం అందించలేదు. అడిగితే మీ ఖాతాలకు జమ చేసేశాం అంటున్నారు. బ్యాంకు స్టేట్ మెంట్లు చూపించి అడిగినా ఫలితం శూన్యం. రైతులకు పరిహా రం అందించకుండా ఎలా నిర్మాణాలు సాగిస్తారు. – పోరాపు అప్పారావు,నాగేశ్వరరావు, బలిఘట్టంనాతో పాటు మా కుంటు సభ్యులైన 20 మందికి సర్వే నంబర్ 141లో 36, 38 సబ్డివిజన్లో 4.80 ఎకరాల భూమి ఉంది. మొత్తం భూమిని అధి కారులు తీసుకున్నారు. మాకు మాత్రం కేవలం రూ 2.20 లక్షలు మాత్రమే పరిహారం అందజేశారు. మిగిలిన డబ్బులు మా ఖాతాలకు జమ చేశాం అంటున్నారు. మా ఖాతాలను పూర్తిగా విచారించి నిరూపించాలి. అసలు ఈ సొమ్ము ఎవరి ఖాతాలకు వెళ్లిందో నిర్ధారించాలి. – ఆకుల శ్రీనివాసరావు, బాధితుడు, బలిఘట్టం -
విజయనగరం
మంగళవారం శ్రీ 28 శ్రీ జూలై శ్రీ 2026సీ్త్ర, శిశు సంక్షేమంపై కూటమి ప్రభుత్వం కినుక వహిస్తోంది. పౌష్టికాహారం సరఫరాలోనే జాప్యం చేస్తోంది. ఎల్నినో దెబ్బకు వర్షాలు ముఖం చాటేశాయి. ఇప్పటికే సమృద్ధిగా వర్షాలు కురిసి వాతావరణం చల్లబడాల్సి ఉండగా తీవ్రమైన వేడిమితో జిల్లా ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు. విజయనగరం గంటస్తంభం: అర్హత ఉన్నా తల్లికి వందనం అందలేదంటూ పలువురు తల్లులు.. అడ్డగోలుగా చేపట్టిన భూ సేకరణ వల్ల నిరాశ్రయులమవుతామంటూ రైతులు, విద్యా వ్యవస్థలో జరిగిన అవకతవకలను నిరసిస్తూ విద్యార్థి సంఘాల నాయకులు.. భూ హక్కుల కోసం మహిళలు.. పింఛన్ల కోసం దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులు.. ఇలా వేర్వేరు సమస్యలపై వందలాది మంది కలెక్టరేట్ వేదికగా తమ ఆవేదన వ్యక్తంచేశారు. పీజీఆర్ఎస్లో వినతులు అందజేశారు. అధికారులకు తమ గోడు వినిపించారు. సమస్యలు పరిష్కరించాలంటూ వేడుకున్నారు. ఎన్టీఏను వెంటనే రద్దు చేయాలి నీట్ పరీక్షల నిర్వహణలో విఫలమైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)ను వెంటనే రద్దు చేయాలని సీపీఐ నాయకులు, నిరుద్యోగులు కలెక్టరేట్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. విద్యార్థుల ఉద్యమాల ఫలితంగానే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని, వ్యవస్థలో మార్పులు తీసుకురాకపోతే సమస్య పరిష్కారం కాదన్నారు. విద్యార్థులను కోల్పోయిన కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.కామేశ్వరరావు, జిల్లా కార్యదర్మి ఒమ్మి రమణ, సహాయ కార్యదర్మి బుగత అశోక్, జిల్లా వర్గ సభ్యులు భీముడు, రంగరాజు, పావని, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. వీల్చైర్లో కూర్చున్నది గంట్యాడ మండలంలోని లక్కిడాం గ్రామానికి చెందిన కిలపర్తి నాయుడుబాబు. దివ్యాంగుడు. ఈయన ఇద్దరు కుమారైలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నా రెండేళ్లుగా తల్లికి వందనం పథకం వర్తించడం లేదు. హౌస్హోల్డ్ మ్యాపింగ్లో ఇతరుల వివరాలు లింక్ అయ్యాయని అధికారులు చెబుతున్నారని, ఎన్నిసార్లు తిరిగినా సరిచేయడంలేదని వాపోయాడు. ప్రభుత్వ సాయం అందకపోతే మా పిల్లల చదువుల పరిస్థితి ఏమిటంటూ కన్నీరుపెట్టారు. తన భార్యతో కలిసి పీజీఆర్ఎస్లో వినతిపత్రం అందజేశాడు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కాలువకు ప్రతిపాదించిన ఎలైన్మెంట్ను మార్చాలని పలువురు రైతులు కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. ప్రత్యామ్నాయ డిజైన్తో తక్కువ భూసేకరణ, తక్కువ వ్యయంతో ప్రాజెక్టు పూర్తవుతుందని, ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రత్యామ్నాయ ఎలైన్మెంట్ను నిపుణులతో పరిశీలించే వరకు భూసేకరణ నోటిఫికేషన్లు నిలిపివేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్మి తమ్మినేని సూర్యనారాయణ, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్మి బి.రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షుడు లోకవరపు ఆదినారాయణమూర్తి పాల్గొన్నారు. భోగాపురం మండలానికి చెందిన సైన్స్ ఉపాధ్యాయుడు ముద్దన శ్రీనివాసరావు, ఆయన భార్య ధనలక్ష్మి చీటీల పేరిట సుమారు రూ.10 కోట్ల మేర మోసం చేశారని, ఆదుకోవాలంటూ బాధితులు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. సుమారు 150 మంది నుంచి చీటి డబ్బులు వసూలు చేసి తిరిగి చెల్లించలేదని ఆరోపించారు. న్యాయం చేయాలంటూ అధికారులకు వినతిపత్రం అందజేశారు. -
400 క్యూసెక్కుల నీరు విడుదల
వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములనాయుడు ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువకు మొత్తంగా 400 క్యూసెక్కుల నీరు సరఫరా చేస్తున్నట్టు ఏఈ నితిన్ తెలిపారు. గతంలో 300 క్యూసెక్కుల నీరు సరఫరా చేయగా, సాగునీటి అవసరాల దృష్ట్యా మరో 100 క్యూసెక్కుల నీటి సరఫరాను పెంపుదల చేశామన్నారు. విజయనగరం అర్బన్: శాసన మండ లి విపక్షనేత బొత్స సత్యనారాయణ డీఎస్సీ అక్రమాలు, నిరుద్యోగ సమస్యల పై లేవనెత్తిన ప్రజా సమస్యలను పక్కదా రి పట్టించేలా ప్రభుత్వం దాటవేత ధోరణి ప్రద ర్శిస్తోంది. డీఎస్సీ నిర్వహణలో విమర్శలు, అభ్యర్థుల ఆందోళనలకు నేరుగా సమాధానం చెప్పలేక ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రతిపక్షాలపై విమర్శలకే పరిమితమయ్యారు. తన క్యాంప్ కార్యాలయంలో సోమ వారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడిన తీరు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే యత్నంలా కనిపించింది. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ, డీఎస్సీ ప్రక్రియలో జరిగిన లోపాలపై ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ప్రశ్నిస్తుంటే దానికి స్పష్టమైన సమాధానం చెప్పలేకపోవడం గమనార్హం. నిరుద్యోగులు, యువత తరఫున వైఎస్సార్సీ పీ మంగళవారం చేపడుతున్న ధర్నాకు వస్తున్న మద్దతును చూసి ప్రభుత్వం భయపడుతోందని మంత్రి మాటల్లో స్పష్టమవుతోంది. భోగాపురం నిర్వాసితుల కష్టాలు పట్టవా? భోగాపురం విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రా రంభించేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నా మని చెబుతున్న ప్రభుత్వం, దానికి భూములి చ్చిన పేద నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైంది. వైజాగ్ ట్రిబ్యునల్ లో 20 కేసులు, హైకోర్డులో 50కి పైగా కేసులు ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయి. ప్రారంభోత్సవానికి ఉన్న అత్యుత్సాహం, భూ నిర్వాసితుల న్యాయపరమైన సమస్యలను పరిష్కరించడంలో చూపించడం లేదనే విమర్శలు వ్యక్త మవుతున్నాయి. దాదాపు 3 లక్షల మందితో భారీ బహిరంగ సభ పేరిట కోట్లాదిరూపాయ లు ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారే తప్ప, క్షేత్ర స్థాయిలో ఉపాధి కోల్పోయిన స్థానిక యువత కు స్పష్టమైన హామీ ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. పూసపాటిరేగ/విజయనగరం అర్బన్: భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభానికి విచ్చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. మరో నాలుగు రోజులే గడువు ఉండడంతో ఏర్పాట్లను వేగవంతం చేశారు. కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి పర్యవేక్షణలో అధికార యంత్రాంగం, జీఎంఆర్ సంస్థ ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రధాని పాల్గొనే వేదిక ఏర్పాటు పనులు జోరుగా సాగుతున్నాయి. బహిరంగ సభలో జనం కూర్చోడానికి ఇప్పటికే భారీ జర్మన్ హ్యాంగెర్లను ఏర్పాటు చేశారు. ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు, సమీపంలోనే కంట్రోల్ రూమ్ను సిద్ధం చేస్తున్నారు. వీఐపీ పార్కింగ్, సాధారణ వాహనాల పార్కింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టి ట్రాఫిక్కు ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ●భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం, అనంతరం నిర్వహించే భారీ బహిరంగ సభ ఏర్పాట్లను సమర్ధవంతంగా పర్యవేక్షించేందుకు కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి ఆదేశాల మేరకు కలెక్టరేట్లో ప్రత్యేకంగా ‘కోర్ కంట్రోల్ రూం’ను ఏర్పాటు చేశారు. మంగళవారం నుంచి ఆగస్టు 1 వరకు 24 గంటలపాటు షిప్టుల వారీగా పనిచేసేలా వివిధ నియోజకవర్గాలకు అధికారులను ఇన్చార్జిలు గా నియమించారు. పీఎం సభకు జనసమీకరణకు చంద్రబాబు ప్రభుత్వం అధికారులపై కత్తిపెట్టింది. గ్రామా లకు బస్సులు పంపించి ఉదయం 5 గంటలకే భోగాపురం తరలించాలని టార్గెట్ ఫిక్స్ చేసి నట్టు సమాచారం. ఉపాధిహామీ వేతనదారు లు, డ్వాకా మహిళలు బస్సులు ఎక్కిన తర్వాత ఫొటోలు తీసి యాప్లో అప్లోడ్ చేయాలని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. -
యువతకు బాసటగా...
విజయనగరం: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ పోస్టుల భర్తీలో చోటుచేసుకున్న అక్రమాలకు బాధ్యతగా మంత్రి నారాలోకేశ్ రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి, యువజన విభాగం నాయకులు జి.ఈశ్వర్కౌశిక్ డిమాండ్ చేశారు. టెట్ వంటి అర్హత పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటా పేరిట అర్హులకు అన్యాయం చేస్తూ చేపట్టిన ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియపై సీబీఐ విచారణ జరపాలన్నారు. మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల క్యాంప్ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు యువత, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 28న తలపెట్టిన నిరసన ర్యాలీకి సంబంధించిన వాల్పోస్టర్లను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నియోజకవర్గం పరిధిలోని యువజన, విద్యార్థి విభాగాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీట్ పోరాటంలో యువత, విద్యార్థులు విజయం సాధించారన్నారు. కేంద్రం దిగివచ్చి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారని పేర్కొన్నారు. అదే తరహాలో డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలు, నిరుద్యోగభృతి అమలులో మోసం, 20 లక్షల ఉద్యోగాల కల్పనలో అలసత్వం, విద్యార్థులకు చెల్లించాల్సిన సుమారు రూ.12 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపుపై వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందన్నారు. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా కేంద్రంలోని న్యూపూర్ణ కూడలి నుంచి మూడులాంతర్ల కూడలి వరకు మంగళవారం శాంతియుత నిరసన ర్యాలీ చేపడుతుందన్నారు. పార్టీలకు అతీతంగా యువత, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసకారి పాలనను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గ యువజన, విద్యార్థి విభాగాల నాయకులు చెల్లూరి భార్గవ్, మణికంఠ, లెంక నరేష్, తదితరులు పాల్గొన్నారు. -
30న జిల్లా మీదుగా మాజీ సీఎం జగన్ ప్రయాణం
● నాతవలస కూడలిలో స్వాగతం పలుకుదాం ● పార్టీశ్రేణులకు పిలుపునిచ్చిన మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి విజయనగరం: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 30న జిల్లా మీదుగా శ్రీకాకుళం వెళ్లనున్నారని, డెంకాడ మండలం నాతవలస కూడలిలో ఆయనకు ఘనంగా స్వాగతం పలుకుదామని పార్టీ శ్రేణులకు ఏపీ శాసనసభా మాజీ డిప్యూటీ స్పీకర్, వైఎస్సార్సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి పిలుపునిచ్చారు. తన నివాసంలో విజయనగరం నియోజకవర్గ పార్టీ ముఖ్యనాయకులతో సోమవారం సమావేశమైన ఆయన, జగన్ పర్యటన వివరాలపై చర్చించారు. రోడ్డు మార్గంలో వెళ్తున్న పార్టీ అధినేతకు స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ద్విచక్ర వాహనాలు, కార్లతో పాటు మహిళలకోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటుచేయాలన్నారు. టీడీపీ నేతలను నిలదీయండి.. ఎన్నికలకు ముందు అమలుసాధ్యంకాని మామీలు గుప్పించి నేడు వాటిని అమలు చేయకుండానే అన్నీ అమలు చేశామంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్న టీడీపీ నేతలను నిలదీయాలని ప్రజలకు కోలగట్ల సూచించారు. ప్రభుత్వ ఆదేశాలతో ఈ నెల 27 నుంచి ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారని, ఈ కార్యక్రమంలో ఇంటికి వచ్చే వారిని సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదంటూ ప్రశ్నించాలన్నారు. తప్పుడు ప్రచారాలతో గద్దెనెక్కిన వారిని గట్టిగా నిలదీయాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి, పార్టీ నగర అధ్యక్షుడు ఆశపు వేణు, ఎంపీపీ మామిడి అప్పలనాయుడు, పార్టీ మండలాధ్యక్షుడు కెల్ల త్రినాథరావు, కార్పొరేషన్ మాజీ ఫ్లోర్ లీడర్ శెట్టివీరవెంకట రాజేష్, జిల్లా పింఛనర్లు/ ఉద్యోగుల విభాగం అధ్యక్షుడు డోల మన్మథకుమార్, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు గదుల సత్యలత, మాజీ మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, పార్టీ నాయకులు అవనాపు లక్ష్మణరావు, రెడ్డి గురుమూర్తి, అల్లు చాణక్య, బండారు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
రామాయవలసలో ఏనుగుల గుంపు
మెరకముడిదాం: మండలంలోకి ఆదివారం సాయంత్రం ప్రవేశించిన ఏనుగుల గుంపు సోమవారం సాయంత్రానికి ఎం.రావివలస మీదుగా రామాయవలస, గొల్ల లమర్రివలస గ్రామాల మధ్యలో ఉన్న మామిడితోటలోకి ప్రవేశించినట్లు ఎలిఫెంట్ ట్రాకర్స్ సాయి, చంటి, ఉపేంద్ర, నాగ చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దారు సులోచనారాణి ఏనుగుల గుంపు ఉన్న ప్రాంతానికి వెళ్లారు. రామాయవలస, గొల్లలమర్రివలస ప్రజలను అప్రమత్తం చేశారు. ● సోమలింగాపురం గ్రామానికి చెందిన ఎస్.కిరణ్రాజుకి చెందిన ఎకరా 50 సెంట్లు విస్తీర్ణంలోని కొబ్బరితోటను ఽఏనుగులు ద్వంసం చేశాయి. -
సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి
చికెన్పార్వతీపురం రూరల్: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులకు అలసత్వం తగదని, అర్జీదారుల సమస్యల మూలాల్లోకి వెళ్లి శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ కె.హేమలత, డీఆర్డీఏ పీడీ ప్రభావతితో కలిసి 74 దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో 21 రెవెన్యూకు సంబంధించిన అర్జీలు రాగా, 53 ఇతర అర్జీలున్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కేవలం సాంకేతిక కారణాలు చూపుతూ అర్జీలను మూసివేయరాదన్నారు. పరిష్కారం పూర్తయినట్లు పోర్టల్లో నమోదు చేసేముందు క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్జీదారుతో మాట్లాడి నిర్ధారించుకోవాలని స్పష్టం చేశారు. అసంపూర్ణ నివేదికలిస్తే కఠిన చర్యలు తప్పవని, పెండింగ్ ఫిర్యాదులకు గడువు విధించి వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని అధికారులను హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి, నోడల్ అధికారులు పాల్గొన్నారు. చట్ట పరిధిలో సత్వర న్యాయం: ఎస్పీ పార్వతీపురం రూరల్: ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి, చట్ట పరిధిలో సత్వరమే సమస్యలను పరిష్కరించాలని ఎస్పీ ఎస్.వి.మాధవ్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదు దారులతో ఎస్పీ ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబకలహాలు, ఆస్తి వివాదాలు, సైబర్ మోసాలు, మహిళలపై వేధింపులు, అధిక వడ్డీలు తదితర సమస్యలపై ఈ వేదికలో మొత్తం 7 ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ, వెంటనే సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఫిర్యాదుల్లోని వాస్తవాలను నిర్ధారించుకుని తక్షణమే చర్యలు చేపట్టాలని, తీసుకున్న చర్యల నివేదికలను ప్రధాన కార్యాలయానికి పంపాలని స్పష్టం చేశారు. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించే ఈ పరిష్కార వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ సీఐ జీఏవీ రమణ, ఎస్సై శిరీష పాల్గొన్నారు. ఐటీడీఏ పీజీఆర్ఎస్కు 33 వినతులు సీతంపేట: స్థానిక ఐటీడీఏలోని ఎస్ఆర్శంకరన్ సమావేశ మందిరంలో ఏపీఓ జి.చిన్నబాబు సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు గిరిజనులు వివిధ సమస్యలపై 33 వినతులు సమర్పించారు. పవర్ వీడర్ ఇప్పించాలని పెద్దగూడకు చెందిన సవర సింగడు అర్జీ ఇచ్చారు. హౌసింగ్ పెండింగ్ బిల్లు చెల్లించాలని బగందరకు చెందిన పద్మావి విన్నవించారు. హౌసింగ్ మంజూరు చేయాలని బత్తిలి గ్రామస్తుడు కె.వెంకటరావు తదితరులు కోరారు. కొండపోడు పట్టాలు కావాలని సత్యజగన్నాథపురం గ్రామస్తురాలు కృష్ణవేణి కోరారు. మొగదారగూడలో సీసీ రోడ్డు నిర్మించాలని సవర చిరంజీవి వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ డా.ప్రభాకరరెడ్డి -
రౌడీ షీటర్ అరెస్టు
రాజాం సిటీ: బలవంతపు వసూళ్లకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న మరో రౌడీ షీటర్ను రాజాం పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను స్థానిక టౌన్ సర్కిల్ కార్యాలయంలో సీఐ డి.నవీన్కుమార్ సోమవారం వెల్లడించారు. ఈ నెల 25న మధ్యాహ్నం కంచరాం గ్రామానికి చెందిన ఎల్.రవిమోహన్ అతని స్నేహితుడు రామసుందరంతో కలిసి బొబ్బిలి రోడ్డులోని ఫైర్స్టేషన్ వెనుక తోటలో మద్యం తాగుతున్నాడు. ఆ సమయంలో రౌడీ షీటర్ అయిన సిరిపురపు దేవరాజు అక్కడికి చేరుకున్నాడు. మద్యం తాగుతున్న రవిమోహన్, రామసుందరంలపై దాడిచేయడంతోపాటు డబ్బు, ఫోన్ ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించి రూ.వెయ్యితోపాటు ఫోన్ బలవంతంగా తీసుకున్నాడు. ఈ దాడిలో గాయపడిన రవిమోహన్ రాజాం ప్రాంతీయ ఆస్పత్రిలో చికిత్సనిమిత్తం చేరాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై మహ్మద్ సల్మాన్ బేగ్ కేసు నమోదుచేసి దర్యాప్తు నిర్వహించి దేవరాజును సోమవారం అరెస్టు చేసి కోర్టుకు తరలించగా 14 రోజులు రిమాండ్ విధించారు. -
స్వాతంత్య్ర వేడుకలకు ఎంపికై న స్కౌట్స్ అండ్ గైడ్స్
విజయనగరం అర్బన్: రాష్ట్ర స్థాయి స్వాతంత్య్ర దిన వేడుకల కవాతు దళంలో పాల్గొనేందుకు జిల్లా స్థాయి స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థుల ఎంపిక పోటీలను భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో మంగళవారం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల నుంచి మొత్తం 25 మంది విద్యార్ధులు ఈ పోటీలకు హాజరయ్యారు. ఎంపికై న విద్యార్థుల నుంచి రాష్ట్రస్థాయి పరేడ్కు ఇద్దరు స్కౌట్స్, ఇద్దరు గైడ్స్ను తుది ఎంపిక చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఎంపికై న విద్యార్థుల్లో స్కౌట్స్ విభాగం: పి.జగన్కుమార్, పి.కిరణ్, ఎన్.హేమంత్కుమార్, జి.హరీష్, కె.అఖిల్ ఉన్నారు. గైడ్స్ విభాగం: పి.ప్రియాంక, ఎల్.ఉషశ్రీ, బి.వాణి, వి.హర్షిత, ఎన్.దేవయాని ఉన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వాక చిన్నంనాయుడు, జిల్లా కమిషనర్ ఈపు విజయ్కుమార్, ప్రతినిధులు చోడవరం నారాయణమూర్తి, వేమలి త్రినాథనాయుడు, ప్రవీణ్కుమార్, రవికుమార్, సూర్యనారాయణ, పుష్పలత, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. -
వెల్లువెత్తిన వినతులు
● పేరుకుపోతున్న పెండింగ్ కేసులు ● అర్జీదారులకు తప్పని నిరీక్షణ!విజయనగరం అర్బన్: జిల్లాలో ప్రజా సమస్యలు, ముఖ్యంగా రెవెన్యూ శాఖ పరిధిలోని భూ వివాదాలు తీవ్రరూపం దాల్చాయి. ప్రతి వారం నిర్వహిస్తున్న ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలకు వినతులు వరదలా వస్తుండడమే అందుకు నిదర్శనం. సోమవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఒక్క రోజే ఏకంగా 199 వినతులు నమోదు కా వడం అధికారుల తీరుపై విమర్శలకు తావిస్తోంది. రెవెన్యూ శాఖలోనే అత్యధిక సమస్యలు: నమోదైన మొత్తం వినతుల్లో ఒక్క రెవెన్యూ శాఖకు సంబంధించే 97 అర్జీలు రావడం గమనార్హం. భూ వివాదాలు, సర్వే సమస్యలను క్షేత్రస్థాయి అధికారులు సకాలంలో పరిష్కరించకపోవవడం వల్లే ప్రజలు కలెక్టరేట్ చుట్టూ తిరగాల్సి వస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పీజీఆర్ఎస్ పోర్టల్ను నిరంతరం పరిశీలించాలని పెండింగ్ అర్జీలపై ప్రత్యేక శ్రద్ద చూపాలని జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్.సత్తిబాబు ఆదేశించినప్పటికీ, కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం వీడడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అర్జీదారులతో నేరుగా మాట్లాడకుండానే ఎండార్స్మెంట్లు ఇస్తున్న తీరుపై కూడా ఈ సందర్భంగా డీఆర్ఓ అసంతృప్తి వ్యక్తం చేశారు. 1100 టోల్ ఫ్రీ సేవలు, శాఖల వారీగా నమోదవుతున్న ఫిర్యాదులపై అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం సడలే ప్రమాదం ఉంది. ప్రతి అర్జీదారుతో నేరుగా సంప్రదించిన తర్వాతే నివేదికలు/ఎండార్స్మెంట్లు ఇవ్వాలని మాట్లాడిన తేదీ, సమయం వివరాలను తప్పనిసరిగా రికార్డుల్లో నమోదు చేయాలని డీఆర్ఓ స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కళావతి, అరుణకుమారి, కలెక్టరేట్ ఏఓ దేవ్ప్రసాద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ గ్రీవెన్స్ సెల్కు 34 ఫిర్యాదులు విజయనగరం క్రైమ్: స్థానిక డీపీఓలోని డీసీఆర్బీ సెక్షన్లో డీసీఆర్బీ సీఐ కుమార స్వామి ఆధ్వర్యంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మొత్తం 34 ఫిర్యాదులను సీఐ స్వీకరించారు. వాటిలో భూతగాదాలకు సంబంధించి 9, కుటుంబ కలహాలకు సంబంధించి 5, మోసాల గురించి 9, ఇతర అంశాలకు సంబంధించి 11 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో గాజులరేగకు చెందిన ఓ యువతి తాను ప్రేమించిన వ్యక్తి తనను కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని సీఐ స్వామికి ఫిర్యాదు చేసింది. కార్యక్రమంలో ఎస్సైలు ప్రభావతి, పద్మావతి సిబ్బంది పాల్గొన్నారు. -
కరెంటుకే షాక్..!
విజయనగరం: ఎల్నినో దెబ్బకు వర్షాలు ముఖం చాటేశాయి. ఇప్పటికే సమృద్ధిగా వర్షాలు కురిసి వాతావరణం చల్లబడాల్సి ఉండగా తీవ్రమైన వేడిమితో జిల్లా ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా జిల్లా వ్యాప్తంగా వర్షా కాలంలో విద్యుత్ వినియోగం పెరిగింది. పల్లెలు, పట్టణాల్లో ఒకే మాదిరిగా విద్యుత్తును వినియోగిస్తుండడంతో మీటర్లు రయ్ రయ్మంటూ పరుగు పెడుతున్నాయి. ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ పరిధిలో విజయనగరం టౌన్, విజయనగరం రూరల్, బొబ్బిలి డివిజన్ల పరిధిలో మరో 9 సబ్ డివిజన్లు ఉన్నాయి. వాటి పరిధిలో 98 సబ్ స్టేషన్లు ఉండగా..24,428 డీటీఆర్ (డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, 8,640 కిలోమీటర్ల విద్యుత్ లైన్లు ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. వాటి పరిధిలో జిల్లా వ్యాప్తంగా 7,19,165 సర్వీసులకు ప్రతిరోజు విద్యుత్సరఫరా చేస్తుండగా..వాటిలో గృహావసర విద్యుత్సర్వీసులు 6,00,828, వాణిజ్య సర్వీసులు 64,361, పారిశ్రామిక సర్వీసులు 2432, వివిధ రకాల ఇనిస్టిట్యూషన్ సర్వీసులు 15,332, వ్యవసాయాధారిత సర్వీసులు మరో 36,215 సర్వీసులు ఉన్నాయి. వాటిలో వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు పగటి వేళ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మొత్తంగా 9 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు, ఇతర సర్వీసులకు 24 గంటల పాటు నిరంతరాయ విద్యుత్ సరఫరా అందిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అప్రకటిత కోతలు.. వాస్తవానికి జూలై నెల వచ్చిందంటే వర్షాలు కురిసి వాతావరణం చల్లబడుతుంది. అయితే ఈఏడాది ఎల్నినో ప్రభావంతో భిన్న వాతావరణ పరిస్థితులను ప్రజలు అనుభవిస్తున్నారు. వర్షాలు పూర్తిగా లేకపోవడం..ఉక్కపోత ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలంతా ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు నిరంతరాయంగా వేసవి తరహాలో వినియోగిస్తున్నారు. దీంతో జిల్లాలో విద్యుత్తు డిమాండ్ పెరగడంతో అప్రకటిత కోతలు మొదలు పెట్టారు. పల్లెలు, పట్టణాల్లో గంటల కొద్దీ మరమ్మతుల పేరిట కరెంటు సరఫరా నిలిపివేస్తున్నారు. మరో పక్కన లోడు అధికమై విద్యుత్తు నియంత్రికలు మొరాయిస్తూ కాలిపోతున్నాయి. మార్చి మూడవ వారం వరకు జిల్లాలో సగటు వినియోగం 9 ఎంయూ (90 లక్షల యూనిట్లు) ఉండగా..గడిచిన మూడు రోజుల్లో 50 లక్షల యూనిట్లు పెరుగుదలను నమోదు చేసుకుని 9.5 ఎంయూ వినియోగిస్తున్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. మే, జూన్ నెలల్లో మరో 50 లక్షల యూనిట్లు పెరిగి మొత్తంగా 10 ఎంయూ పైగా పెరిగింది. తాజాగా జూలై నెలలో గతేడాది 9 ఎంయూ విద్యుత్ను సరాసరిన వినియోగదారులు వినియోగించగా .. ప్రస్తుత 2026లో 10 నుంచి 11 ఎంయూ వరకు పెరగడం గమనార్హం.నిరంతరాయ సరఫరాకు చర్యలు ఈ ఏడాది వాతావరణంలో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. విద్యుత్ వినియోగం పెరిగింది. వర్షాలు లేకపోవడంతో ఉక్కపోత ఎక్కువైంది. దీంతో వినియోగదారులు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వినియోగిస్తున్నారు. దీంతో ప్రసుతం 10లక్షల 80వేల యూనిట్లు విద్యుత్ వినియోగిస్తున్నారు. వినియోగదారులకు అవసరమైన సరఫరాను చేస్తున్నాం. చిన్నపాటి సాంకేతిక ఇబ్బందులు ఎదురైనా వాటిని పరిష్కరించి సరఫరాను పునరుద్దరిస్తున్నాం. – మువ్వల లక్ష్మణరావు, ఎస్ఈ, ఏపీఈపీడీసీఎల్, విజయనగరం ఆపరేషన్ సర్కిల్ జోరుతగ్గని విద్యుత్ వినియోగం వేసవిలో మాదిరి తిరుగుతున్న విద్యుత్ మీటర్ ఎల్నినో ప్రభావంతో కురవని వర్షాలు..ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి గతేడాదితో పోల్చుకుంటే జూలై నెలలో పెరిగిన విద్యుత్ వినియోగం ఆగని ఏసీలు, కూలర్, ఫ్రిజ్ల వినియోగం -
పోస్టుమార్టం అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నం
విజయనగరం ఫోర్ట్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో పోస్టుమార్టం అసిస్టెంట్గా పనిచేస్తున్న అశ వేధింపులు తాళలేక సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఓ అంబులెన్సు నిర్వాకుడు, ఇద్దరు మీడియా ప్రతినిధులు కొంత కాలంగా ఆమెను వేధిస్తున్నారు. సోమవారం కూడా వారు మరింతగా వేధించడంతో ఇంటిలో లైజాల్ తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. దీంతో కుటుంబసభ్యులు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఆమెను చేర్పించారు. ప్రస్తుతం ఆశ స్టెప్డౌన్ ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఔట్ పోస్టు పోలీసులు బాధితురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించారు. శ్రీకాకుళం రూరల్: బొల్లినేని మెడిస్కిల్స్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని హెచ్పీసీఎల్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ నేతృత్వంలో ఫ్రంట్లైన్ హెల్త్కేర్ గివింగ్ అసిస్టెంట్, వెల్నెస్ థెరపిస్ట్ కోర్సులో ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పాసై 18 నుంచి 27 ఏళ్లలోపు యువతీ యువకులు అర్హులని పేర్కొన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన, వసతి సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఇంటర్ పాసైన విద్యార్థులకు డిప్లమో, బీఎస్సీ, ఎంఎల్టీ, బీపీటీ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయని, మరిన్ని వివరాలకు 7995013422, 7680945357 నంబర్లను సంప్రదించాలని కోరారు. పశువుల అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలి● ఆంధ్రప్రదేశ్ గో సంరక్షణ సమాఖ్య డిమాండ్ విజయనగరం అర్బన్: జిల్లాలో పశువుల అక్రమ రవాణా జోరుగా సాగుతోందని అరికట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రవాణా ఖాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గో సంరక్షణ సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి కేదారశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్సెల్లో జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్.సత్తిబాబుకు ఫిర్యాదు సమర్పించారు. రాయపూర్ నేషనల్ హైవే, గొట్లాం, పూసపాటిరేగ, పెదమానాపురం, అలమండ, రాజాం ప్రాంతాల నుంచి కంటైనర్లు, వ్యాన్లలో ఆవులు, దూడలు, గేదెలను రాత్రింబవళ్లు కబేళాలకు తరలిస్తున్నారని ఫిర్యాదులో తెలియజేశారు. ఫిర్యాదు అందజేసిన వారిలో జిల్లా కార్యదర్శి సంధ్యారాణి, రేణుక పట్నాయక్, గేదెల నారాయణమ్మ, దమయంతి తదితరులు ఉన్నారు. రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని మృతదేహంవిజయ నగరం క్రైమ్: అలమండ రైల్వేయార్డ్ దిగువ ఉన్న రైల్వే ట్రాక్పై ఎలక్ట్రికల్ పోల్ వద్ద గుర్తు తెలియని మృతదేహాం పడి ఉండడాన్ని విజయనగరం జీఆర్పీ సిబ్బంది సోమవారం కనుగొన్నారు. మృతుని వయస్సు సుమారు 35నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని జీఆర్పీ హెచ్.సీ అశోక్ తెలిపారు. మృతుడు 5 అడుగుల 6 అంగుళాల పొడవు, చామనఛాయ రంగులో చింపిరి గెడ్డం కలిగి ఉన్నాడని, శరీరంపై బిస్కెట్ రంగు లోయర్, స్లీల్ లెస్ రౌండ్ నెక్ నలుపు రంగు గల బనియన్ దానిపై బుల్స్ 23 అను ఇంగ్లీష్ అక్షరాలు ఉన్నాయన్నారు. మెడలో తెలుపు ఆకు పచ్చ ఎరుపు రంగు గల దారంతో ఉన్న తాడు ధరించి ఉన్నాడని మృతదేహాన్ని గుర్తించిన గలిగిన వారు ఫోన్ 6301365605, 9192475 85742 నంబర్లకు తెలియజేయాలని హెచ్సీ అశోక్ కోరారు. -
తమ్ముడి మృతికేసులో అన్న అరెస్టు
రాజాం సిటీ: అన్న చేతిలో తమ్ముడు మృతిచెందిన ఘటనకు సంబంధించి అన్నను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సోమవారం రూరల్ సర్కిల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో రూరల్ సీఐ హెచ్.ఉపేంద్ర వె ల్లడించారు. ఈ నెల 22న రేగిడి మండలం సరసనాపల్లి గ్రామానికి చెందిన గొడే కృష్ణ, అతని పెద్దన్నయ్య గొడే అప్పడు మద్యం మ త్తులో భూమి వాటాల గురించి గొడవపడ్డా రు. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన అప్ప డు తన తమ్ముడైన కృష్ణను చెక్కతో తలపై, నుదురుపై ఇష్టానుసారం కొట్టాడు. దీంతో సంఘటనా స్థలంలోనే కృష్ణ మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి మృతుడి భార్య రాములమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రేగిడి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు నిర్వహించారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న అప్పడును సోమవారం బూరాడ జంక్షన్ వద్ద అరెస్టు చేశామని సీఐ వెల్లడించారు. సమావేశంలో రేగిడి ఎస్సై బాలకృష్ణ, సిబ్బంది ఉన్నారు. -
ఎయిర్పోర్టు రహదారికి జాతీయరహదారిని అనుసంధానం చేయాలి
పూసపాటిరేగ: దేశప్రధాని నరేంద్రమోడీ ఆగస్టు 1న జిల్లాకు విచ్చేస్తున్నందున ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా జాతీయరహదారిని ఎయిర్పోర్టు రహదారికి అనుసంధానం చేయాలని ఎస్పీ ఎఆర్ దామోదర్ హైవే అథారిటీ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశప్రధాని జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ట్రాఫిక్కు ఇబ్బందులు తలెత్తకుండా జాతీయరహదారిని ఎయిర్పోర్టు రహదారికి మూడు చోట్ల అనుసంధానం చేయాలన్నారు. ఈ మేరకు ఎస్పీ దామోదర్ సోమవారం నేషనల్ హైవే అథారిటీ అఽధికారులు, పోలీసు అఽఽధికారులతో కలిసి రాజాపులోవ జంక్షన్ నుంచి రావివలస జంక్షన్ వరకు జాతీయ రహదారిపై పర్యటించి పలుచోట్ల పరిశీలించారు. ప్రధాని పర్యటనలో పాల్గొనేందుకు శ్రీకాకుళం,విజయనగరం, పార్వతీపురం మన్యం, ఆనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విశాఖ జిల్లాల నుంచి సుమారు 5వేల బస్సులు, ముఖ్య వ్యక్తులు, ప్రముఖులకు సంబంధించి మరో 5వేల కార్లు, పెద్ద సంఖ్యలో వాహనాలు వచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ చర్యలు చేపడుతుందన్నారు. ఇందులో భాగంగా జాతీయ రహదారి 16పై మూడు చోట్ల ఐరన్సేఫ్ గార్డులు తొలగించి ఎయిర్పోర్టు రహదారికి అనుసంధానం చేయాలని నేషనల్ హైవే అథారిటీ అధికారులను ఎస్పీ ఆదేశించారు. కార్యక్రమంలో నేషనల్ హైవే అథారిటీ అధికారులు, పోలీసు అఽధికారులు పాల్గొన్నారు. ఎస్పీ ఏఆర్ దామోదర్ -
గర్భిణులకు అందని పౌష్టికాహారం
● వేలాది మంది లబ్ధిదారుల ఎదురుచూపు ● జిల్లాలో 2499 అంగన్వాడీ కేంద్రాలు విజయనగరం ఫోర్ట్: సీ్త్ర, శిశు సంక్షేమానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని చంద్రబాబు ప్రభుత్వం గొప్పలు చెబుతుంది. కానీ అది అమలులో మాత్రం కానరావడం లేదు. గర్భిణులు, బాలింతలకు అందించే పౌష్టికాహారం కూడా సకాలంలో అందించలేని దుస్థితిలో టీడీపీ సర్కార్ ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారం కోసం గర్భిణులు, బాలింతలు ఎదురుచూస్తున్నారు. ప్రతినెల ఐదో తేదీలోగా గర్భిణులు, బాలింతలకు బాల సంజీవని కిట్లు (పౌష్టికాహారం కిట్లు) అందిస్తారు. అయితే ఈనెల 24వతేదీ వచ్చినా టీడీపీ సర్కార్ ఇంతవరకు వాటిని ఇవ్వకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 7 ఐసీడీఎస్ ప్రాజెక్టులు జిల్లాలో 7 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటి పరిధిలో 2499 అంగన్వాడీ కేంద్రాలు, 292 మినీ అంగన్వాడీ కేంద్రాలు, 2,207 మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటి పరిధిలో గర్భిణులు, బాలింతలు 14,568 మంది ఉన్నారు. అందని బాలసంజీవిని కిట్లు ప్రతి నెలా అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు బాలసంజీవని(పౌష్టికాహారంతోకూడిన) కిట్లు అందిస్తారు. ప్రతి లబ్ధిదారుకు అటుకలు కేజీ, చోడిపిండి 2 కేజీలు, బెల్లం పావు కేజీ, చెక్కీలు 250 గ్రాములు, ఎండు కర్జూరం 250 గ్రామలతో కూడిన బాలసంజీవని కిట్టు అందిస్తారు. అయితే ఈరోజు వరకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందాల్సిన బాలసంజీవని కిట్లు అందకపోవడంతో గర్బిణులు, బాలింతలు ఆశగా ఎదురుచూస్తున్నారు.కాంట్రాక్ట్ ఖరారు కావడం లేటు గర్భిణులు, బాలింతలకు అందించే బాలసంజీవని కిట్లు ఇంతవరకు కేంద్రాలకు రాలేదు. బాలసంజీవని కిట్లు సరఫరా చేసే కాంట్రాక్ట్ ఖరారు కావడం ఆలస్యం అవడంతో ఈనెల పంపిణీ ఆలస్యమైంది. కిట్లు వచ్చిన వెంటనే కేంద్రాలకు సరఫరా చేయనున్నాం. కేవీ బాలమణి, జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ సాధికారిత అధికారిణి -
శాకాంబరి అలంకరణలో శ్రీ కనకమహాలక్ష్మి
చీపురుపల్లి: పట్టణంలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు శాకాంబరి దేవి అలంకరణలో భక్తులకు ఆదివారం దర్శనమిచ్చారు. శాకాంబరి ఉత్సవాల్లో భాగంగా వివిధ రకాల కూరగాయలతో అమ్మవారిని అలంకరించారు. విజయనగరం టౌన్: స్థానిక కంటోన్మెంట్ బొగ్గులదిబ్బ ప్రాంతంలో కొలువైన శ్రీ పైడితల్లి అమ్మవారి మూలవిరాట్కు అదే ప్రాంతానికి చెందిన భక్తుడు, వ్యాపారవేత్త రెయ్యిశంకర్ రెడ్డి, అనంతలక్ష్మి దంపతులు రూ.14 లక్షల విలువైన ఐదున్నర కిలోల వెండి చీరను కానుకగా ఆదివారం సమర్పించారు. ఆషాడ మా సంలో ఏటా మూడురోజుల పాటు అమ్మవారి పండగను భక్తులు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో పైడితల్లి అమ్మవారికి ఆదివారం వేకువజామునుంచి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాలతో, వేదమంత్రా ల నడుమ అమ్మవారికి వెండిచీరను సమర్పించారు. కార్యక్రమంలో మాజీ కార్పోరేటర్ బోనెల ధనలక్ష్మి, కొట్యాడ రాము, ఈశు, గిరి, అనిల్, రుజుతా రెడ్డితో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బొండపల్లి: వరుణుడి కటాక్షం కోసం రైతులు, చిన్నారులు బొండపల్లి మండలంలోని గిట్టుపల్లి గ్రామంలో ఆదివారం కప్పల పండుగను నిర్వహించారు. కప్పల పండుగ చేస్తే తప్పనిసరిగా వర్షాలు కురుస్తాయన్న నమ్మకం గ్రామాల్లోని రైతులకు ఉండడంతో చిన్నారులు, పెద్దలు కలిసి గ్రామంలో కప్పలను పసుపుబట్టల్లో కట్టి ఇంటింటికీ తీసుకువెళ్లి స్నానాలు చేయించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరుణుడు కరుణించి వర్షాలు కురిసి పంటలు సాగు చేయడానికి అవకాశం కల్పించి ముందుకు నడిపించాలని గ్రామంలోని చిన్నా పెద్దా పండుగను నిర్వహించి, పూజలు చేశారు. మెరకముడిదాం: మండలంలోని ఉత్తరావల్లి పంచాయతీ మధుర గ్రామాలైన గొల్లవెంకయ్యపేట, గదబపేట గ్రామాల మధ్యలో ఆది వారం సాయంత్రం ఏనుగుల గుంపు ప్రత్యక్షమైంది. ఈ గుంపు రెండు గ్రామాల మధ్యలో ఉన్న చెరువులో కాసేపు సేద దీరాయి. అనంత రం అటు శ్యామాయవలస గ్రామం వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా శ్యామాయవలస గ్రామస్తులు అప్రమత్తమై పెద్దగా కేకలు వేయడంతో ఈ ఏనుగులు గుంపు మళ్లీ గొల్లవెంకయ్యపేట, గదబపేట గ్రామాల మధ్యలో ఉన్న మామిడితోటలోకి తరలిపోయాయి. గొల్లవెంకయ్యపే ట, గదబపేట గ్రామాలకు ఫారెస్ట్ బీట్ అధికా రి గణేష్ సిబ్బంది తిరుపతిరావు వెళ్లి ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరారు. వైస్ ఎంపీ పీ తలచట్ల హరిబాబు రెండు గ్రామాల ప్రజలతో మాట్లాడుతూ గ్రామస్తులెవరూ బయటకు రావద్దని అప్రమత్తంగా ఉండాలని కోరారు. -
వ్యవసాయం అంటే చులకన భావం సరికాదు
ఈ ఎత్తిపోతల పథకం ద్వారా నీరు వస్తుంది. పంటలు పండుతాయని ఆశగా ఎదురు చూస్తున్న రైతన్నకు ఒక రకంగా ఈ ప్రభుత్వం చుక్కలు చూపిస్తోందనే చెప్పుకోవాలి. వ్యవసా యం అంటే ఇంత చులకనగా చూడడం టీడీపీ ప్రభుత్వానికి భావ్యం కాదు. నారుమడులు ఎండిపోతున్నాయి. ఈ ఏడాది ఎకరా నా సొంత భూమి, మరో 3 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగుకు సిద్ధం చేశాను. కానీ అటు వర్షాలు కురవక ఇటు ఎత్తి పోతల పథకం పనిచేయక సాగునీటికి ఇబ్బందులు పడుతున్నాం. వనరు ఉన్నా కూడా సాగునీరందడం లేదు. –సామిరెడ్డి సూర్యనారాయణ, రైతు కొట్టక్కి -
పారని పథకాలు
విజయనగరంసోమవారం శ్రీ 27 శ్రీ జూలై శ్రీ 2026వ్యవసాయం తప్ప మరో వ్యాపకం తెలియని రైతులు గడిచిన రెండేళ్ల క్రితం వరకు ఆనందంగా పంటలు సాగుచేశారు. ప్రస్తుతం సాగునీరు లేక అవస్థలు పడుతున్న రైతులను ఆదుకునే నాథుడే కరువయ్యాడు. సకాలంలో వర్షాలు కురవక, వనరులు ఉన్నా సాగునీరు అందక సాగు భూములన్నీ బీడుగా మారుతున్నాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. సాగునీటి వనరులున్న చోట చివరి ఆయకట్టు వరకు సాగునీరందించి అన్నదాతను ఆదుకోవాలన్న లక్ష్యంతో గతంలో ప్రభుత్వాలు నిర్మించిన ఎత్తి పోతల పథకాలు పూర్తిగా పనిచేయని విధంగా పాడై మరమ్మతుల కోసం ఎదురుచూస్తున్నాయి. దీంతో ఆయా ఆయకట్టుల రైతులు సాగునీటి అవస్థలు పడుతున్నారు. –రామభద్రపురంఓ వైపు ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, ప్లేట్లు..ఫలితంగా మరో వైపు పర్యావరణానికి ముప్పు. -
సర్కారుపై సమరం
విజయనగరం: ఎన్నికలకు ముందు యువత, విద్యార్థులకు ఇచ్చిన హమీలను విస్మరించి మాయమాటలు, మోసకారి చర్యలతో పబ్బంగడుపుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై సమరశంఖం పూరించనున్నట్లు ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 28న పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నిరసన ద్వారా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిర్వహించిన డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలతో పాటు ఎన్నికలకు ముందు ప్రకటించిన హామీల విషయంలో చేస్తు న్న మోసంపై గళం విప్పనున్నామన్నారు. ఈ మేరకు ఆదివారం విజయనగరంలోని రింగ్రోడ్లో గల వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిరసన ర్యాలీకి సంబందించి వాల్పోస్టర్లను పార్టీ యు వజన విభాగం నాయకులతో కలిసి ఆయన ఆవి ష్కరించారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు విజయనగరంలోని మున్సిపల్ కార్యాలయం జంక్షన్ నుంచి గంటస్తంభం జంక్షన్, మెయిన్ రోడ్ మీదుగా మూడులాంతర్ల జంక్షన్ వరకు నిరసన సాగుతుందన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో విద్యార్థులు, యువత అధిక సంఖ్యలో పాల్గొ ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సర్కారు మెడలు వంచేంత వరకు పోరటం జాతీయస్థాయిలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించి న నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీపై ఇటీవల ఢిల్లీ సహా దేశ వ్యాప్తంగా యువత, విద్యార్థులు చేపట్టిన పోరటంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింద ని అందుకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రితో రాజీనామా చేయించారని మజ్జి శ్రీని వాసరావు గుర్తు చేశారు. ఇదే తరహాలో ఆఽంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న తరువాత నిర్వహించిన డీఎస్సీ అక్రమాలపై చంద్రబాబు ప్రభుత్వం మెడలు వంచేందుకు యువత, విద్యార్థులకు మద్దతుగా వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనకు పిలుపునిచ్చిందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే డీఎస్సీలో అక్రమా ల ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అందుకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను ఆ బాధ్యతలను తొలగించాలని డిమాండ్ చేశారు. యువత, విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు ఎప్పుడు..? ఎన్నికలకు రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు చంద్రబాబు సర్కారు ఇచ్చిన హమీలు ఎప్పుడు అమలు చేస్తారని మజ్జి శ్రీని వాసరావు ప్రశ్నించారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3వేలు భృతి ఇస్తామని ప్రకటించి రెండేళ్లుగా గడుస్తున్నా అమలు చేయలేదన్నారు. అదే విధంగా ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజురీయింబర్స్మెంట్ బకా యిల విషయంలో నిర్లక్ష్యం వహిస్తోందని దుమ్మెత్తిపోశారు. ఈ నేపథ్యంలో యువత, విద్యార్థుల భవిష్యత్ కోసం రాష్ట్రంలో బాధ్యత గల ప్రతిపక్షగా వైఎస్సార్సీపీ పోరుబాట పడుతుందని చె ప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ, పట్టణ స్థాయి నుంచి యువత, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొలని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి, మహిళా నాయకురాలు డాక్టర్ బొత్స అనూష, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కరుమజ్జి సాయికుమార్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు అల్లు అవినాష్, జిల్లా యువజన విభాగం నాయకుడు జి.ఈశ్వర్ కౌశిక్, జిల్లాలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన యువజన, విద్యార్థి విభాగం అధ్యక్షులు బడ్డుకొండ ప్రదీప్కుమార్, బెల్లాన వంశీ, చెల్లూరి భార్గవ్, పైడిపినాయుడు తదితరులు పాల్గొన్నారు. మజ్జి శ్రీనివాసరావు -
అమ్మ దర్శనానికి వెళ్తూ..
● రోడ్డు ప్రమాదంలో కుటుంబ పెద్ద మృతి ● పలువురికి గాయాలుసీతానగరం: దైవ దర్శనానికి వెళుతూ రోడ్డు ప్రమాదంలో కుటుంబ పెద్ద మృతి చెందిన సంఘటన ఆదివారం వేకువజామున చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు తెలియజేసిన వివరాల ప్రకారం.. చీపురుపల్లి మండలం అలజంగి గ్రామానికి చెందిన చింత గురునాయుడు (52) అలియాస్ దాసు, కుటుంబ సభ్యులు పది మందితో కలిసి రాయగడలోని మజ్జిగౌరి దర్శనానికి ఆటోలో శనివారం రాత్రి బయలుదేరారు. సీతానగరం మండలం జోగింపేట వద్దకు ఆదివారం వేకువజామున ఐదు గంటలకు చేరుకున్నారు. ఈ సమయంలో అదే రోడ్డులో పార్వతీపురం నుంచి బొబ్బిలి వైపు వెళ్తున్న బొలేరో వ్యాన్ ఎదురుగా వచ్చి ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గురునాయుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మిగిలిన వారు గాయపడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న ఏఎస్పీ వెంకటేశ్వరరావు, పార్వతీపురం రూరల్ సీఐ రంగనాథ్ పరిశీలించి, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై హేమలత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రచ్చ గెలిచి.. ఇంట ఓడి..!
బొబ్బిలి: ఇంటిపేరు కస్తూరి వారు. ఇంటినిండా గబ్బిలాల కంపు అన్న చందంగా ఉంది బొబ్బిలి వీణల కేంద్రం పరిస్థితి. బొబ్బిలి వీణల కేంద్రం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. అంతే కాదు. అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ సైతం ఇక్కడి జ్ఙాపికలు, బహుమతుల వీణలు, తయారీ విధానానికి అబ్బురపడ్డారు. ఇక్కడి కార్మికులను వైట్ హౌస్కు ఆహ్వానించారు. ఇక్కడి తయారీ దారులు దేశ నాయకులు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా గుర్తింపు పొందారు. వీణల కేంద్రంలో ఎన్నో వీణలు తయారయ్యాయి. కానీ ఇక్కడి వీణల కేంద్రం మాత్రం అసౌకర్యాలతో కొట్టుమిట్టాడుతోంది. కేంద్రం చుట్టూ తుప్పలు, డొంకలు బొబ్బిలి వీణల కేంద్రం ఆవరణ, ప్రహరీ లోపల తుప్పలు, డొంకలతో నిండి ఉంది. ఏటా ఇవి పెరుగుతున్నా చర్యలు తీసుకునే నాథుడే కరువయ్యాడు. వాస్తవానికి వీణల కేంద్రం ఏటా దాదాపు రూ.40వేలు పన్నుల రూపేణా మున్సిపాలిటీకి చెల్లిస్తోంది. అయినా మున్సిపల్ కార్మికులతో ఇక్కడ పరిశుభ్రం చేయించేందుకు అధికారులు చొరవ చూపడం లేదు. ఫలితంగా ఆవరణ అంతా నాగుపాములు, జెర్రిపోతులు, ఉల్లి పాములు తిరుగుతూ కళాకారులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. సుమారు 38 మంది కళాకారులు ఉన్న వీణల కేంద్రం వద్ద వారు మరుగుదొడ్లకు వెళ్లేందుకు కూడా వీలు లేకుండా చుట్టూ పొదలు దర్శనమిస్తున్నాయి. చీకట్లోనే కేంద్రం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న వీణల కేంద్రానికి వెళ్లాలంటే చీకటి తప్పదు. ఇక్కడి కేంద్రం బోర్డు వద్ద వీధిలైట్లు ఏర్పాటు చేయాలని కళాకారులు కోరినా మున్సిపల్ సిబ్బంది పట్టించుకోవడం లేదు. అంతే కాదు వీణల కేంద్రానికి వెళ్లే ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన బోర్డు వెలిసిపోయి తుప్పుపట్టింది. కానీ పట్టించుకునే నాథుడే లేడు. కేంద్రం వద్ద బోర్డు లేక పోవడం వల్ల ఇతర ప్రాంతాల నుంచి వీణల కొనుగోలు కోసం వచ్చిన ఔత్సాహికులు కేంద్రం ఎక్కడుందని స్థానికులను అడగాల్సి వస్తోంది. తుప్పలు తొలగించి వీణల కేంద్రం వద్ద లైట్లు వేసి కేంద్రానికి మునుపటి శోభ తీసుకురావాలని వీణల కేంద్రం కళాకారులు, స్థానికులు కోరుతున్నారు. జాతీయస్థాయిలో గుర్తింపు.. స్థానికంగా పారిశుధ్య లోపంతో కంపు.. తుప్పలు తొలగించకపోవడంతో పాములు, కీటకాల బెడద ఇదీ బొబ్బిలి వీణల కేంద్రం దుస్థితి -
లారీ ఢీకొని యువకుడు మృతి..
సబ్బవరం (విశాఖ): అమ్మవారి దర్శనానికి బయలుదేరిన ఓ యువకుడి ప్రయాణం విషాదాంతమైంది. స్నేహితులతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం ఉదయం సబ్బవరం మండలం చిన్నయ్యపాలెం వద్ద అనకాపల్లి–ఆనందపురం జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా రాజాం మండలం కటారిపురం గ్రామానికి చెందిన పంచిరెడ్డి దుర్గారావు (26) పెందుర్తి మండలం ప్రహ్లాదపురం సమీపంలో తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. ఆదివారం తన స్నేహి తులు బల్లా బుచ్చిబా బు, బల్లా భూదేవితో కలిసి అనకాపల్లిలోని శ్రీ నూకాలమ్మ అమ్మవారి దర్శనానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. చిన్నయ్యపాలెం సమీపానికి చేరుకోగానే ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో తీవ్ర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దుర్గారావు అక్కడికక్కడే మృతి చెందాడు. బుచ్చిబాబు, భూదేవి తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే 108 అంబులెన్స్లో సబ్బవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వారిని కేజీహెచ్కు తరలించారు. దుర్గారావు మృతితో కుటుంబ సభ్యులు, స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుమారుడి మృతి వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. మృతుడి తండ్రి పంచిరెడ్డి చిన్నంనాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సబ్బవరం ఎస్ఐ సింహాచలం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లిలోని ఎన్టీఆర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరికి తీవ్ర గాయాలు -
పట్టపగలే దొంగతనం
వీరఘట్టం: మండలంలోని చలివేంద్రి గ్రామంలో ఆదివారం పట్టపగలే దొంగతనం జరిగింది. గ్రామానికి చెందిన గర్బాన శంకరరావు ఇంటిలో దొంగలుపడి రూ. 1.80 లక్షల నగదు, అరతులం బంగారు చెవిదిద్దులు తీసుకెళ్లిపోయారు. బాధితుడు, పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. బాధితుడు శంకరరావు వ్యవసాయ పనుల పెట్టుబడి కోసం రెండు రోజుల కిందటే బ్యాంక్లో బంగారం తాకట్టుపెట్టి రూ. 1.80 లక్షల నగదు తీసుకుని, ఇంటిలోని బీరువాలో భద్రపరిచాడు. ఆదివారం ఉదయం ఆయన పొలం పనులకు వెళ్లగా.. అతని భార్య హేమ భోజనం తీసుకుని పొలానికి వెళ్లింది. ఇంటికి తాళం వేసి, పక్కనే ఉన్న గోడపై తాళంచెవి పెట్టడంతో.. గమనించిన దొంగలు ఇంటి తలుపులు తెరిచి దొంగతనానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న ఎస్సై షణ్ముకరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పక్కాగా వాహన తనిఖీలు
● ఎస్పీ ఏఆర్ దామోదర్ గంట్యాడ: ఆగస్టు 1న ప్రధాని నరేంద్రమోదీ జిల్లా పర్యటన నేపథ్యంలో విజయనగరం పట్టణం, రూరల్, భోగాపురం, భోగాపురం సర్కిల్ పరిధిలో పక్కాగా వాహన తనిఖీలు చేపట్టాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఆయన మాట్లాడుతూ.. భోగాపురం ఎయిర్పోర్టుకు వెళ్లే మార్గాల్లో తాత్కాలిక చెక్పోస్టులు ఏర్పాటు చేసి, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమానితులను అదుపులోకి తీసుకోవాలన్నారు. ఎయిర్పోర్టు పరిసర గ్రామాల్లో కూంబింగ్, ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. ప్రధాని పర్యటన ముగిసే వరకు భద్రతా చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. పెంట జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు అవార్డులు బొబ్బిలిరూరల్: రాష్ట్ర అటవీశాఖ కాకినాడలో నిర్వహించిన స్పారో హీరో జాతీయస్థాయి కథా రచనల పోటీల్లో పెంట జెడ్పీహెచ్ స్కూల్ విద్యార్థులు రాణించారు. ఎం. జయశ్రీ సీనియ ర్ విభాగంలో మొదటి స్థానం సాధించగా, రెండో స్థానాన్ని శ్రీలాస్య సాధించింది. అలాగే జూనియర్ విభాగంలో ఎన్. ప్రణీతకు మూడో స్థానం, డ్రాయింగ్ జూనియర్ విభాగంలో జి. అశ్విన్కుమార్కు నాలుగో స్థానం లభించింది. కాకినాడ సమీపంలోని కోరంగి అభయారణ్యం వద్ద ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో అటవీశాఖ ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే విజేతలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా హెచ్ఎం మోహనరావు విద్యార్థులతో గైడ్ టీచర్లు కె సింహాచలం, ఎం శ్రీనివాసరావులను అభినందించారు. భట్రాజుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సతీష్రాజు విజయనగరం గంటస్తంభం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భట్రాజుల సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం విజయవాడలో నిర్వహించారు. ఈ సమావేశంలో విజయనగరం జిల్లాకు చెందిన సీహెచ్సీఎస్వీ రాజు (సతీష్రాజు)ను సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు ఆయన్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో భట్రాజుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు చక్రాల పక్కిరాజు, ఏపీ రాష్ట్ర భట్రాజుల కార్పొరేషన్ చైర్మన్ సరికొండ వెంకటేశ్వరరాజు, విజయనగరం జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు. మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య సీతానగరం: తీవ్ర మనస్తాపానికి గురై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని అంటిపేటలో ఆదివారం జరిగింది. స్థానికులు తెలియజేసిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చుక్క త్రినాథ్ (75) భార్యర తొమ్మిది నెలల కిందట మృతి చెందింది. ఇతనికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారులు వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. కుమార్తెకు కూడా వివాహం జరిగిపోవడంతో కొన్నాళ్లుగా ఒంటరిగా ఉంటున్నాడు. దీంతో ఒంటరితనాన్ని జీర్ణించుకోలేక కొన్నాళ్లుగా ముభావంగా ఉంటున్నాడు. ఈక్రమంలో ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెచ్సీ కమలాకర్ గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బొబ్బిలి సీహెచ్సీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గర్భగుడి నుంచి గ్రీన్ పిచ్ వరకు..
● ఘనంగా ప్రారంభమైన బ్రాహ్మణ క్రికెట్ టోర్నమెంట్ ● టోర్నమెంట్లో పాల్గొన్న ఎనిమిది టీమ్లు విజయనగరం టౌన్: నిత్యం వేదమంత్రోచ్ఛారణలతో ధార్మిక కార్యక్రమాల్లో తీరిక లేకుండా గడిపే ఆ చేతులు ఆనందంతో కాసేపు ఉల్లాసంగా.. ఉత్సాహంగా బ్యాట్, బంతి పట్టుకుని ఆనందపడ్డాయి. ఆదివారం స్థానిక రాజీవ్ క్రీడామైదానంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న బ్రాహ్మణ క్రికెట్ టోర్నమెంట్ను జిల్లా క్రీడాశాఖాధికారి వెంకటేశ్వరరావు దంపతులు ప్రారంభించారు. జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమాఖ్య అధ్యక్షుడు టీవీ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొదటి రోజు టోర్నీలో ఎనిమిది టీమ్లు పాల్గొన్నాయి. కార్యక్రమంలో భాగంగా వెంకటేశ్వరరావు దంపతులను నిర్వాహకులు సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా అర్చక పురోహిత సంఘం అధ్యక్షుడు భమిడిపాటి రామ్కుమార్ శర్మ, గౌరవాధ్యక్షుడు ఈఆర్.సోమ యాజులు, అల్లంరాజు సూర్యరాజేశ్వరశర్మ, పప్పు సరోజిని, భమిడిపాటి జోగేష్ శర్మ, రామాయణం సత్యనారాయణ శర్మ, కాశీభట్ల పవన్కుమార్ శర్మ, సంగీసపు మోహన్శర్మ, నూతి సుబ్రహ్మణ్యం, బొడ్డపాటి కామేశ్వరశర్మ, నౌడూరి మణికుమార్ శర్మ, చెంబోలు సూర్యనారాయణ శర్మ, జయంతి సత్యనారాయణ శర్మ, తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారమే ఏపీటీఎఫ్ లక్ష్యం
రాజాం సిటీ: ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఏపీటీఎఫ్ ముందడుగు వేస్తోందని ఆ శాఖ రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల అన్నారు. ఆదివారం స్థానిక సన్స్కూల్ ఆవరణలో ‘రాష్ట్రపతి ఉత్తర్వులు 2025 – ఉపాధ్యాయుల విభజన’పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విభజనపై ఉపాధ్యాయులు లేవనెత్తుతున్న అంశాలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఉమ్మడి రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు కె.వేణుగోపాల్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యోగుల విభజనలో జరిగిన లోపాలు ఆంధ్రప్రదేశ్లో పునరావృతం కాకుండా ఏపీటీఎఫ్ చూడాలని సూచించారు. ఉపాధ్యాయుల విభజనకు సంబంధించి అనేక సందేహాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేసుకునేందుకు ఈ అవగాహనా సదస్సు ఏర్పాటు చేశామని జిల్లా అధ్యక్షుడు మజ్జి మదన్మోహన్ తెలిపారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ ప్రతినిధులు సరస్వతి, బాలకృష్ణ, వెంకటపతిరాజు, జోగినాయుడు, పాల్తేరు శ్రీనివాస్, తిరుమలరావు, చావలి శ్రీనివాస్, బుఖారి బాబు, అచ్యుతకుమార్, ఆర్.అప్పలనాయుడు, లంక రామకృష్ణ, సీతంనాయుడు, భాస్కరరావు, శివరావు, మహేష్, తదితరులతో పాటు మూడు జిల్లాల నుంచి 500 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ప్రధాని పర్యటన నేపథ్యంలో.. ఆకస్మిక వాహన తనిఖీలు
● వాహనదారులు చొరబడకుండా సూచిక బోర్డుల ఏర్పాటు ● ఎస్పీ ఏఆర్ దామోదర్ ● మీటింగ్ స్థలానికి వాహనాలు వచ్చే మార్గాల పరిశీలన పూసపాటిరేగ: దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు 1న జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు వెళ్లవలసిన మార్గాలు, వాటికి కేటాయించిన పార్కింగ్ స్థలాల ను ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదివారం క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడూతూ భోగాపురం అంతర్జాతీయ విమానా శ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇతర ప్రాంతాల నుంచి బస్సుల్లో వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. వాహనాలు వచ్చే మార్గాల్లో వాహనదారులు దారి తప్పకుండా, స్పష్టంగా కనిపించే విధంగా ప్రధాన జంక్షన్లలో పెద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మార్గాల నుంచి వచ్చే వాహనాలకు ఎటువంటి ట్రాఫిక్ ఆటంకాలు కలగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని సూచించా రు. బందోబస్తు నిమిత్తం విధులకు వచ్చే పోలీసు అధికారులు, సిబ్బందికి వసతి, భోజన ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం, ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే బహిరంగ సభా ప్రాంగణంతో పాటు భద్రతా ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించి, అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ప్రధాని పర్యటన వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా అత్యున్నత స్థాయి నిఘా, పటిష్టమైన భద్రతా బందోబస్తు నిర్వహించాలని పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు. -
ఈ నగరాలకు ఏమైంది?
నార సంచుల వినియోగమే పర్యావరణానికి మేలు సింగిల్–యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తగ్గించుకోవాలి. ప్లాస్టిక్కు బదులు నార సంచులు, గుడ్డ సంచులు, జూట్ ఉత్పత్తులు, కాగితపు సంచులు వంటి పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను వినియోగించాలి. నిషేధిత ప్లాస్టిక్ వస్తువుల తయారీ, నిల్వ, విక్రయం, వినియోగాన్ని పూర్తిగా నివారించాలి. ప్లాస్టిక్ వ్యర్ధాలను ఎక్కడపడితే అక్కడ వేయకుండా శాసీ్త్రయ పద్ధతిలో నిర్వహించడం ప్రతి ఒక్కరి బాధ్యత. పర్యావరణాన్ని కాపాడాలంటే ప్రజలు, వ్యాపారులు కలిసి పనిచేయాలి. ప్లాస్టిక్కు మనమే దూరంగా ఉంటేనే భావితరాలకు స్వచ్చమైన వాతావరణాన్ని అందించగలం. సరిత, కాలుష్య నియంత్రణ మండలి, ఈఈ, విజయనగరం విజయనగరం గంటస్తంభం: ఓ వైపు ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, ప్లేట్లు..ఫలితంగా మరో వైపు పర్యావరణానికి ముప్పు. కేంద్ర ప్రభుత్వం సింగిల్–యూజ్ ప్లాస్టిక్పై నిషేధం విధించి నాలుగేళ్లు దాటుతున్నా ఉమ్మడి విజయనగరం జిల్లాలో మాత్రం ఆ నిబంధనలు క్షేత్రస్థాయిలో పూర్తిగా అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదు. నగరాలు, పట్టణాలు, గ్రామాలు తేడా లేకుండా ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, ప్లేట్లు, థర్మాకోల్ వస్తువుల వినియోగం యథేచ్ఛగా కొనసాగుతోంది. ఫలితంగా ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలే కనిపిస్తున్నాయి. ఇవి పర్యావరణాన్ని కలుషితం చేయడంతో పాటు ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతున్నాయి. అవగాహనతో ఆగిపోయిన ప్రచారం గతంలో విజయనగరం నగర పాలక సంస్థ, బొబ్బిలి, రాజాం మున్సిపాలిటీలు, నెల్లిమర్ల, ఎస్.కోట నగర పంచాయతీలు ప్లాస్టిక్ నిషేధంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. వ్యాపారులకు సూచనలు జారీ చేశాయి. కొంతకాలం తనిఖీలు కూడా చేపట్టాయి. అయితే ఆ తర్వాత ఆ కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో కొనసాగకపోవడంతో ప్లాస్టిక్ వినియోగం మళ్లీ పెరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.తనీఖిలు..జరిమానాలు విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 2025–26లో 196 తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై రూ.2.92 లక్షల జరిమానా విధించారు. 3 టన్నుల నిషేధిత సింగిల్–యూజ్ ప్లాస్టిక్ను స్వాధీనం చేసుకుని విశాఖపట్నంలోని జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్కు తరలించి నిర్వీర్యం చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. మార్కెట్లలో యథేచ్ఛగా వినియోగం కూరగాయల మార్కెట్లు, కిరాణా దుకాణాలు, పండ్ల దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, కర్రీ పాయింట్ల, టీ దుకాణాల్లో ఇప్పటికీ ప్లాస్టిక్ కవర్ల వినియోగం అధికంగానే కొనసాగుతోంది. వస్తువులు కొనుగోలు చేసే వినియోగాదారులకు కూడా వ్యాపారాలు ప్లాస్టిక్ కవర్లనే అందిస్తున్నారు. కాటన్ సంచులు వెంట తీసుకెళ్లే అలవాటు ప్రజల్లో పూర్తిగా పెరగకపోవడంతో ప్లాస్టిక్ వినియోగం తగ్గడం లేదు. కానరాని ప్లాస్టిక్ నిషేధం అమలు ఉమ్మడి జిల్లాలో యథేచ్ఛగా సింగిల్–యూజ్ ప్లాస్టిక్ వినియోగం నివేదికల్లో తనిఖీలు..క్షేత్రస్థాయిలో పాలిథిన్ కవర్ల హవా పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు -
ఎరువుల సరఫరాపై ప్రత్యేక దృష్టి
విజయనగరం ఫోర్ట్: ఎరువుల సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం స్థానిక కలెక్టరేట్ నుంచి వ్యవసాయ శాఖాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటి విడత ఎరువులు తీసుకోని రైతులు ఎరువులు తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లోని రైతులు ఇప్పటికే రెండో విడత ఎరువులు తీసుకుంటున్నారని తెలిపారు. రెండు విడతల ఎరువుల వివరాలను ప్రత్యేకంగా నమోదు చేయాలని సూచించారు. జిల్లాలో మొదట విడతకు 12,259 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, 11,653 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేసినట్లు చెప్పారు. ఎల్నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో, ఎరువులు తీసుకోవడానికి రైతులు ఆసక్తి చూపడం లేదని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. మండలాల వారీగా పరిస్థితులను అంచనా వేసి ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు సలహాలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ రాంసుందర్ రెడ్డి -
రెండు రాష్ట్రాల కనెక్టివిటీకి గండి
భోగాపురం ఎయిర్పోర్ట్ కేవలం ఉత్తరాంధ్రకే కాక, సరిహద్దున ఉన్న ఒడిశా, ఛత్తీగఢ్ ప్రాంత వాసులకు, వ్యాపారులకు సైతం అత్యంత కీలకం. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఒడిశా, ఛత్తీస్గఢ్ సరిహద్దుల నుంచి ఎయిర్పోర్ట్కు చేరుకునే జాతీయ రహదారులకు అనుసంధానంగా ఉండాల్సిన ఫ్రీవేలు, బైపాస్ రోడ్ల నిర్మాణం కాగితాలకే పరిమితమయ్యాయి. పొరుగు రాష్ట్రాల నుంచి సరుకు రవాణా (కార్గో) వాహనాలు, ప్రయాణికులు రావాలంటే ఇప్పటికీ దశాబ్దాల నాటి ఇరుకు రోడ్లే దిక్కు. ప్రత్యామ్నాయ రహదారుల ఊసే ఎత్తడం లేదు. ● ఎయిర్పోర్ట్కు ఇరువైపులా ఉన్న ప్రధాన జిల్లా కేంద్రాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం నుంచి రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంలో ఆయా జిల్లాల యంత్రాంగాలు, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్న వాదన ఉంది. విశాఖ–భోగాపురం చీచ్రోడ్డు/ఎక్స్ప్రెస్ వే అంశం ప్రచారాలకే పరిమితమైంది తప్ప పనులు అడుగు ముందుకు పడలేదు. జిల్లా కేంద్రాల నుంచి ఎయిర్పోర్ట్ను కలిపే విజయనగరం, శ్రీకాకుళం లింక్ రోడ్లు, వాటి విస్తరణను పూర్తిగా పక్కనబెట్టేశారు. రేపు విమానాలు దిగాక ప్రయాణికులు నడిరోడ్డుపై గంటల తరబడి నిరీక్షించాల్సిన దుస్థితి దాపురించింది. -
ఇది విద్యార్థుల ఐక్య విజయం
విజయనగరం గంటస్తంభం: నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం దేశ విద్యార్థుల ఐక్యపోరాట విజయమని విద్యార్థి, యువజన సంఘాల నాయకులు పేర్కొన్నారు. 24 మంది అమాయక విద్యార్థుల ప్రాణత్యాగానికి, లక్షలాది మంది విద్యార్థుల ఆవేదనకు ఈ రాజీనామా సమాధానమని వ్యాఖ్యానించారు. విజయనగరంలోని కోట కూడలి వద్ద ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, డీవైఎఫ్ఐ, ఏఐవైఎఫ్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో శనివారం బాణాసంచా కాల్చి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్మి డి.రాము, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్మి నాగభూషణం, డీవైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ సీహెచ్ హరీష్ మాట్లాడుతూ... గడిచిన 45 రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థిలోకం చేసిన అలుపెరుగని పోరాటానికే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిందని పేర్కొన్నారు. విద్యార్ధుల న్యాయమైన ఆందోళనలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఐటీ సెల్ ద్వారా విదేశీ నిధుల ఉద్యమంగా, దేశద్రోహ చర్యగా చిత్రీకరించేందుకు కుట్ర పన్నిందని మండిపడ్డారు. అన్ని రకాల నిర్బంధాలు, లాఠీచార్జీలు, టియర్ గ్యాస్ ప్రయోగాలను ఎదుర్కొని విద్యార్థిలోకం చారిత్రాత్మక విజయం సాధించిందన్నారు. విద్యావ్యవస్థలో సంపూర్ణ జవాబుదారీతనం వచ్చేవరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. నీట్, నెట్ పరీక్షల అవినీతికి కారణమైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)ని తక్షణమే రద్దు చేయాలని, బలవన్మరణాలకు గురైన 24 మంది విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యా రంగంలో కాషాయీకరణ, ప్రైవేటీకరణ విధానాలు నశించాలని నినాదాలు చేశారు. ఈ ఉద్యమ స్ఫూర్తితోనే భవిష్యత్తులో విద్యార్థుల సమస్యలపై మరింత పెద్ద ఎత్తున పోరాటాలు సాగిస్తామని స్పష్టంచేశారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన డీఎస్సీ అవకతవకలపై కూడా పోరాటం సాగించాల్సిన అవసరం ఉందని పలువురు విద్యార్థి సంఘ నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు వంశీ, రమణ, భారతి, సూరిబాబు, గుణ, జయ, ఏఐఎస్ఎఫ్ నాయకులు చరణ్, గణేష్, డీవైఎఫ్ఐ నాయకులు జె.రవికుమార్, లోకేష్, తదితరులు పాల్గొన్నారు. -
అల్లూరి త్యాగం.. చిరస్మరణీయం
పూసపాటిరేగ: భారత స్వాతంత్య్ర సంగ్రామంలో తెల్లదొరలను ఎదిరించిన విప్లవకారుడు అల్లూరి సీతారామరాజు పేరు భోగాపురం ఎయిర్పోర్టుకు పెట్టడంతో ఆయన త్యాగం దేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం నేపథ్యంలో శనివారం ఎయిర్పోర్టులో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ ఎస్.రాంసుందరరెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి మాట్లాడారు. ఉత్తరాంధ్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభిస్తారన్నారు. 13 వేల మంది బాలికలతో ప్రత్యేక థింసా నృత్య ప్రదర్సనతో ప్రధానమంత్రికి స్వాగత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. బీచ్ కారిడార్కు రూ.8వేల కోట్లతో మాస్టర్ ప్లాన్ సిద్ధమైందన్నారు. ఉత్తరాంధ్రలో 34 నియోజకవర్గాల నుంచి 5 వేలు బస్సులతో భారీ జన సమీకరణ చేస్తున్నట్లు తెలిపారు. జీఎంఆర్ సంస్థకు 69 మెట్రోబస్లు కేటాయించామన్నారు. ఆగస్టు 17 నుంచి పూర్తిస్థాయిలో భోగాపురం ఎయిర్పోర్టు సేవలు అందుతాయన్నారు. ఎయిర్పోర్టు పనులు రూ.4,592 కోట్లతో పూర్తిచేసినట్టు వెల్లడించారు. సమావేశంలో ఎస్పీ ఏఆర్ దామోదర్తో పాటు ప్రజాప్రతినిధిలు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించే చరిత్ర ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి 5వేల బస్సులతో జన సమీకరణ కళాకారులతో ప్రధానికి స్వాగత ఏర్పాట్లు -
300 క్యూసెక్కుల నీరు విడుదల
వంగర: మండల పరిధి మడ్డువలస కుడి ప్రధాన కాలువ నుంచి శనివారం నీటిసరఫరా పెంపుదల చేశారు. ఈ నెల 24న తొలిరోజు వంద క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఆయకట్టుకు సాగునీరు అందకపోవడంతో మరో 200 క్యూసెక్కుల నీటిని పెంచి మొత్తం 300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెడుతన్నామని ఏఈ నితిన్ తెలిపారు. ఈవీఎం గోదాముల తనిఖీ నెల్లిమర్ల: స్థానిక ఈవీఎం గోదాములను కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శనివారం తనిఖీ చేశారు. గోదాము షట్టర్లకు వేసిన సీళ్లను, తాళాలను పరిశీలించారు. పోలీస్ బందోబస్తుపై సమీక్షించారు. అంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు, పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. నెల్లిమర్ల తహసీల్దార్ శ్రీకాంత్, కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ ప్రసాద్, ఇతర రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రధాని పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు గంట్యాడ: జిల్లాలో ఆగస్టు 1న ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టంగా అమలు చేయాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ అధికారులను ఆదేశించారు. ఎయిర్పోర్టు ఆవరణలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికారులు, సిబ్బంది సమన్వయంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. అప్పగించిన బాధ్యతలను క్రమశిక్షణతో నిర్వర్తించాలని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు విధి స్థావరాలను వీడరాదన్నారు. బందోబస్తు సిబ్బందికి అవసరమైన అల్పాహారం, భోజన ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీఎస్పీలు ఎస్.రాఘవులు, ఆర్.గోవిందరావు, పలువురు సీఐలు పాల్గొన్నారు. శ్రీనివాసునికి చందన సేవ విజయనగరం టౌన్: తొలి ఏకాదశి పర్వదినాన వేంకటేశ్వరస్వామి చందన అలంకరణలో శనివారం దర్శనమిచ్చారు. విజయనగరం టీటీడీ కల్యాణ మండపం ఆవరణలో కొలువైన శ్రీనివాసునికి ఆలయ ప్రధాన అర్చకులు పి.వి.నరసింహాచార్యులు వేకువజాము నుంచి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి చందనపూతతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అరుంధతీనగర్లో కొలువైన వైభవ వేంకటేశ్వర స్వామికి అర్చకులు రాజేష్ శర్మ ఆధ్వర్యంలో విశిష్ట పూజలు నిర్వహించారు. స్వామివారికి తులసీదళాలు, పుష్పాలతో అలంకరించి పూజలు చేశారు. రింగు రోడ్డులో ఉన్న కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం, వివేకానంద కాలనీలో ఉన్న శ్రీనివాసునికి విశిష్ట పూజలు జరిగాయి. వందలాది మంది భక్తులు స్వామివారిని దర్శించి, తరించారు. -
గాలిలోనే ప్రయాణం..!
విజయనగరం అర్బన్: ఉత్తరాంధ్రలోని ఐదు జిల్లాలు... పొరుగున ఉన్న ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల విమాన ప్రయాణికులకు, ఈ ప్రాంత ఉత్పత్తుల ఎగుమతులకు ఆధారంగా నిలవనున్న భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమైంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రత్యేక చొరవతో ప్రారంభమైన పనులు మూడేళ్లలో పూర్తయ్యాయి. జీఎంఆర్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మాణ బాధ్యతలు తీసుకుని పనులు పూర్తి చేసింది. ఆగస్టు 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. అయితే, విమానాశ్రయానికి రాకపోకలు సాగించేందుకు ఆధారమైన కనెక్టెవిటీ రోడ్ల నిర్మాణంలో కూటమి ప్రభుత్వం చేతులెత్తేసింది. రెండేళ్లలో ఒక్క రోడ్డునూ పూర్తిచేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విమానాశ్రయం ఊరిస్తున్నా అక్కడకు చేరుకునేందుకు ప్రయాణ కష్టాలు తప్పవని ప్రయాణికులు చెబుతున్నారు. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల నుంచి నేరుగా విమానాశ్రయానికి చేరుకునేందుకు ఇప్పటికీ ఇరుకురోడ్లే దర్శనమిస్తుండడంపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. విమానాశ్రయాన్ని బయట ప్రపంచంతో అనుసంధానించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్న వాదన వినిపిస్తోంది. వేల కోట్ల రూపాయలు కుమ్మరిస్తూ అమరాతిలో నీళ్లు తోడడానికి చూపిన శ్రద్ధలో ఒకశాతం చూపించి ఉంటే ఈ పరిస్థతి ఉండేది కాదని, గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమే ఇప్పుడు అధికారంలో ఉండిఉంటే రోడ్లను సైతం ముస్తాబుచేసి ఉండేదన్న వ్యాఖ్యలు వినిపిస్తు న్నాయి. విమానాశ్రయం చుట్టూ రవాణా నెట్ వర్క్, మౌలిక వసతుల కల్పనను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేయంతో ‘రంగుల కల...రోడ్డున పడింది’ అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ● ‘లాజిస్టిక్ పవర్’కి పక్షవాతం! భోగాపురం నుంచి అంతర్జాతీయ స్థాయి కార్గో సేవలు అందించి, ఈ ప్రాంత ఫార్మా, సీఫుడ్, వ్యవసాయ ఉత్తత్పులను విదేశాలకు ఎగుమతి చేయాలన్నది ప్రధాన లక్ష్యం. కానీ విమానాశ్రయం చుట్టూ లాజిస్టిక్స్ రవాణాకు అనుకూలమైన మౌలిక వసతులు, భారీ ట్రక్కుల రాకపోకలకు తగ్గ రహదారులు కల్పించకపోవడంతో ఆశలన్నీ అడియాసలయ్యే ప్రమాదం ఉంది. విమానం ల్యాండ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది కానీ, ఆ విమానం దాకా చేరుకోవడానికి రోడ్డు లేకపోవడం కూటమి పాలనలోని ప్రణాళికా రాహిత్యానికి పరాకాష్ట. సరిహద్దు రాష్ట్రాల అనుసంధానం మాటలా ఉంచితే కనీసం మూడు జిల్లాల అనుసంధానం కూడా విస్మరించడం వల్ల ఈ ప్రాంతం ఆర్థిక వికాసానికి పెద్ద గండి పడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ● ప్రచార ఆర్బాటానికే పరిమితం.. ప్రధాని చేతుల మీదుగా ప్రారంభోత్సవం అని పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్న పచ్చనాయకులు, కనీసం ఎయిర్పోర్టుకు చేరుకునే రోడ్లను, ట్రాఫిక్ మేనేజ్మెంట్ను ఎందుకు సమీక్షించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, ఆర్అండ్బీ అధికారుల మధ్య కనీసం చర్చలు లేవు. భూసేకరణ, నిధుల విడుదలపై పాలకుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఎయిర్పోర్ట్ ప్రారంభమైన తొలిరోజే రీజినల్ ట్రాఫిక్ ఘోరంగా స్తంభించి పోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. ఎయిర్ పోర్టుకు ప్రయాణికులు, సరుకులు చేరేలా నాలుగు వైపులా అనుసంధాన రోడ్లు నిర్మించాలన్న కనీస జ్ఞానం కూడా సర్కార్కు లేకపోవడంపై ఉత్తరాంధ్ర సహా పొరుగు రాష్ట్రాల ప్రజలు విమర్శిస్తున్నారు. ఎయిర్పోర్టు రెడీ అయినా పూర్తికాని కనెక్టివిటీ రోడ్లు అనుసంధాన రోడ్ల నిర్మాణంపై దృష్టిపెట్టని చంద్రబాబు సర్కారు విమాన ప్రయాణికులకు రోడ్డు కష్టాలు తప్పని వైనం రెండు పొరుగు రాష్ట్రాల సరిహద్దు ఎయిర్పోర్టుకు నలువైపులా రహదారి దిగ్బంధం! విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్ల విస్తరణను పట్టించుకోని ప్రభుత్వం -
పెద్దపెద్దోళ్లు వస్తున్నారు.. దుకాణాలు మూసేయండి
● నగరంలోని దుకాణదారులకు కార్పొరేషన్ అధికారుల ఆదేశం విజయనగరం: విజయనగరం జిల్లా భోగాపురంలోని అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేళ దుకాణదారులకు ఉపాధి దూరమయ్యే పరిస్థితి దాపురించింది. దేశం నలుమూలల నుంచి పెద్దపెద్దోళ్లు వస్తున్నారని, తోపుడు బండ్లు, చిరు దుకాణాలను మూసివేయాలంటూ విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వారం రోజుల పాటు దుకాణాలు మూసేస్తే జీవితాలు ఎలా గడపాలని తోపుడు బండ్ల వాసులు, కూరగాయల వ్యాపారులు, చిరు దుకాణదారులు, ఫాస్ట్ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై అవేవీ అనవసరం, అతిథుల కంట్లో మీ దుకాణాలు ఆదివారం నుంచి కనిపించకూడదంటూ అధికారులు హుకుం జారీ చేశారు. అందుకేనా అత్యుత్సాహం...? భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం నెపంతో మహారాజా కోట చుట్టూ ఉన్న చిరు వ్యాపారులను ఖాళీ చేయించాలని స్థానిక ఎమ్మెల్యే భావించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఇచ్చిన ఆదేశాల మేరకు వారు చిరు వ్యాపారులపై అత్యుత్సాహం కనబరుస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏళ్ల తరబడి చిరువ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్నవారి పొట్టకొట్టడం తగదని, గతంలో కూడా మహారాజ కోట ఆధునికీకరణలో భాగంగా చాలా షాపులు తొలగించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఎనిమిదేళ్ల బాలుడికి కోవిడ్ పాజిటివ్
విజయనగరం ఫోర్ట్: ఎనిమిదేళ్ల బాలుడికి కరోనా సోకింది. వైద్యాధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలానికి చెందిన బాలుడు ఈనెల 17వ తేదీన మలేరియా జ్వరంతో విజయనగరం జిల్లా కేంద్రంలోని ఘోషాస్పత్రి పిల్లల విభాగంలో కుటుంబ సభ్యులు చేర్పించారు. బాలుడి కాలుపై గాంగ్రిన్ (పుండు) రావడంతో ఘోషాస్పత్రి వైద్యులు బాలుడిని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి డెర్మటాలజీ విభాగానికి ఈ నెల 23న రిఫర్చేశారు. కుటుంబ సభ్యులు బాలుడిని డెర్మటాలజీ వైద్యునికి చూపించగా కోవిడ్ వల్ల ఏర్పడిన గాంగ్రిన్గా అనుమానించి కోవిడ్ టెస్టు చేయాలని ల్యాబ్కు పంపించారు. అక్కడి వైద్య సిబ్బంది బాలుడికి రాపిడ్ టెస్టు చేయగా కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. కచ్చితమైన నిర్ధారణ కోసం ఆర్టీపీసీఆర్ టెస్టు కోసం ప్రభుత్వ వైద్య కళాశాల వైరాలజీ ల్యాబ్కు శాంపిల్ పంపించారు. శుక్రవారం ఆర్టీపీసీఆర్ టెస్టులో కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. బాలుడికి కోవిడ్ లక్షణాలు లేక పోవడంతో హోం ఐసోలేషన్లో ఉండాలని ఇంటికి పంపించారు. సర్వజన ఆస్పత్రిలో నిర్వహించిన పరీక్షలో నిర్ధారణ -
నైతిక విలువలు పెంపొందించాలి
● మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు విజయనగరం రూరల్: నేటి విద్యార్థులకు ఇతిహాసాలను తెలియజేసి వారిలో నైతిక విలువలు పెంపొందించేలా బోధన సాగించాలని భారత మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. జిల్లా కేంద్రంలోని రామనారాయణంలో ఉన్న వాల్మీకి రీసెర్చ్ సెంటర్, ఏకాగ్ర అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో 1 నుంచి 6 తరగతుల విద్యార్థుల కోసం రామాయణంపై ప్రత్యేకంగా రూపొందించిన పుస్తక శ్రేణిని హైదరాబాద్లో తన నివాసంలో శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతృభాష, భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని తెలిపే ఇటువంటి పుస్తకాలు దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది పిల్లలకు, పాఠశాలలకు చేరువకావాలని ఆకాంక్షించారు. రామాయణంలోని గొప్ప నీతిని ఈనాటి తరగతి గది బోధనకు తగినట్లుగా ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగిందని నిర్వాహకులు, ఎన్సీఎస్ ప్రతినిధులు ఆయనకు వివరించారు. తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో, సులభంగా అర్ధమయ్యే భాషలో రూపొందించిన ఈ పుస్తకాలను విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంలోని పాఠశాలలకు అందిస్తామన్నారు. బీఎన్ఆర్ గోల్డ్, డైమండ్స్ షోరూమ్ ప్రారంభం బీచ్రోడ్డు: బీఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ తన ఐదో షోరూమ్ను విశాఖపట్నంలోని శ్రీ సంపత్ వినాయక ఆలయ ప్రాంగణంలో శుక్రవారం ప్రారంభించింది. నూతన షోరూమ్ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావు ప్రత్యేక అతిథిగా పాల్గొని సంస్థ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రారంభోత్సవానికి ప్రముఖ సినీ నటి సంయుక్త మీనన్ హాజరై షోరూమ్ను సందర్శించారు. బంగారు, వజ్రాభరణాలను పరిశీలించి అభిమానులతో కలిసి ఫొటోలు దిగారు. ప్రారంభోత్సవం సందర్భంగా వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను సంస్థ ప్రకటించింది. బంగారు ఆభరణాలపై మేకింగ్ చార్జీలు 0 శాతం, బంగారు ఆభరణాల తరుగుపై 3 నుంచి 9 శాతం వరకు, డైమండ్ ఆభరణాల తరుగుపై 25 శాతం వరకు తగ్గింపు కల్పిస్తున్నట్లు తెలిపింది. డైమండ్ ఆభరణాలు ప్రతి క్యారెట్ రూ.46,999 నుంచి అందుబాటులో ఉంటాయని పేర్కొంది. అలాగే అన్ని రకాల కొనుగోళ్లపై జీఎస్టీని సంస్థే భరిస్తుందని వెల్లడించింది. ఈ సందర్భంగా బీఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ చైర్మన్ నాగిరెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ రోహిత్ చరణ్ రెడ్డి మాట్లాడుతూ విశాఖ ప్రజల ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు. నాణ్యమైన ఆభరణాలు, మెరుగైన సేవలను అందించేందుకు కట్టుబడి ఉంటామని చెప్పారు. -
బంద్ విజయవంతం
విజయనగరం గంటస్తంభం: నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, యువజన సంఘాల పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నిర్వహించిన విద్యా సంస్థల బంద్ విజయవంతమైంది. విద్యార్థులు స్వచ్ఛందంగా తరగతులు బహిష్కరించి బంద్కు మద్దతు తెలిపారు. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, డీవైఎఫ్ఐ, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువజనులు నగరంలోని కోట కూడలిలో రాస్తారోకో నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నీట్ లీకేజీ వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు పూడి రామ్మోహన్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్మి నాగభూషణం, డీవైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ హరీష్, ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ వాసు మాట్లాడుతూ.. ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. నిరసన తెలిపే విద్యార్థులపై పోలీసులు కఠినంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. గత పన్నెండు సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా అనేక పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ కావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్మనమని పేర్కొన్నారు. నీట్ లీకేజీపై రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు స్పందించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ను పదవి నుంచి తొలగించి, పరీక్షల నిర్వహణలో పారదర్మకత తీసుకురావాలని కోరారు. లేదంటే విద్యార్ధి ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్మి డి.రాము, నాయకులు భారతి, సూరిబాబు, గుణ, జయ, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్మి సుమన్, నాయకులు చరణ్, గణేష్, డీవైఎఫ్ఐ నాయకులు జె.రవికుమార్, లోకేష్, తదితరులు పాల్గొన్నారు. నీట్ లీకేజీపై నిరసన తెలిపిన విద్యార్థిలోకం స్వచ్ఛందంగా తరగతుల బహిష్కరణ కోట కూడలిలో విద్యార్థి, యువజన సంఘాల రాస్తారోకో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ -
ప్రధాని పర్యటనకు పటిష్ట భద్రత
పూసపాటిరేగ: భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించను న్నారు. ఈ మేరకు ఏర్పాట్లను శుక్రవారం పలువురు ఉన్నతాధికారులు పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ నోడల్ ఆఫీసర్ ఎం.టి.కృష్ణబాబు, స్పెషల్ ఆఫీసర్ వీర పాండ్యన్, రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ మల్లిఖార్జున్, ఏసీఎల్ ఎండీ ప్రవీణ్ ఆదిత్య, విశాఖ రేంజ్ ఐజీ గోపినాథ్ జెట్టి, ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్, తదితరులు ట్రంపెట్ బ్రిడ్జి, ప్రధాన అనుసంధాన రహదారులు, బహిరంగ వేదిక ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. పార్కింగ్ ప్రదేశాలను, మ్యాపులను పరిశీలించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి, భద్రతా పనులను శరవేగంగా పూర్తి చేయాలని జీఎంఆర్ అధికారులను ఆదేశించారు. 5వేల మందితో బందోబస్తు ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి పీఎం మోదీ వస్తున్న సందర్భంగా 5వేల మంది పోలీసులతో బందోబస్తు విధులు నిర్వహిస్తామని ఎస్పీ దామో దర్ తెలిపారు. 17 విభాగాలుగా భద్రతా సిబ్బందిని విభజించామన్నారు. బందోబస్తు వివరాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా డీజీపీకి వివరించారు. వాహనాల నిలుపుదలకు ప్రాథమికంగా 5 పెద్ద పార్కింగ్ స్థలాలతో పాటు, అదనంగా మరో 9 పార్కింగ్ స్థలాలను సిద్ధం చేశామన్నారు. -
ఆర్టీసీని ప్రైవేటుకు అప్పగిస్తే తిరుగుబాటే..
విజయనగరం గంటస్తంభం: ప్రజల సొమ్ముతో నిర్మితమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ)ని ప్రైవేటీకరించే ప్రయత్నాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్మి బుగత అశోక్ డిమాండ్ చేశారు. ఆర్టీసీని బలహీనపరిచి ప్రైవేటు సంస్థలకు అప్పగించే చర్యలు కొనసాగితే రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం విజయనగరం ఆర్టీసీ డిపో ఎదుట ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ, ఇప్పటికే అద్దె బస్సుల విధానంతో ప్రైవేటీకరణకు ప్రభుత్వం మార్గం సుగమం చేసిందని, ఇప్పుడు విద్యుత్ బస్సుల కొనుగోలు, నిర్వహణను కూడా ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేస్తోందని విమర్మించారు. విద్యుత్ బస్సులను పూర్తిగా ఆర్టీసీ ద్వారానే కొనుగోలు చేసి నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కోట్ల రూపాయల విలువైన ఆర్టీసీ భూములు, ఆస్తులను తక్కువ ధరలకు లీజుల పేరుతో ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నాలను నిలిపివేయాలని కోరారు. ఆర్టీసీ కొత్త బస్సుల కొనుగోలు నిలిచిపోవడం, ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగుల స్థానంలో నియామకాలు చేపట్టకపోవడంతో సంస్థ తీవ్ర సిబ్బంది కొరతను ఎదుర్కొంటోందన్నారు. పెండింగ్లో ఉన్న డీఏ బకాయిలు చెల్లించడం, పే రివిజన్ అమలు చేయడం, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనాలు, సామాజిక భద్రత కల్పించడం వంటి డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎస్.రంగరాజు, జిల్లా కార్యదర్మి కె.వి.రమణ, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి ఆర్టీసీ ‘ప్రమాద రహిత వారోత్సవాలు’
● డ్రైవర్లు, కండక్టర్లకు అవగాహన, శిక్షణ తరగతులు విజయనగరం అర్బన్: ఏపీఎస్ ఆర్టీసీ జిల్లా పరిధి లో ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు ‘ప్రమాద రహిత వారోత్సవాలు’ నిర్వహించనున్నట్టు జిల్లా ప్రజా రవాణా అధికారి జి.వరలక్ష్మి తెలిపారు. ప్రయాణికుల సురక్షిత ప్రయాణమే ధ్యేయంగా ఈ వారోత్సవాలు చేపడుతున్నట్లు ఆమె వెల్లడించారు. జిల్లాలోని ప్రతి ఆర్టీసీ డిపోలోనూ రోజువారీగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. రోడ్డు భద్రతపై సిబ్బందికి మరింత స్పష్టత ఇచ్చేందుకు కండక్టర్లు, డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ తరగతులు ఇస్తామన్నారు. ప్రమాద రహిత ప్రయాణమే లక్ష్యమన్నారు. -
అవస్థల పీటీఎం
విజయనగరం అర్బన్: పాఠశాల విద్యలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నామని, తల్లిదండ్రులను భాగస్వాములను చేస్తున్నామని కూటమి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసిన ‘మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్’ క్షేత్రస్థాయిలో తీవ్ర గందర గోళానికి, అవస్థలకు వేదికగా మారింది. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నిర్వహించిన ఈ వేడుకల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలను సేవకులుగా మార్చేయడం విమర్శలకు దారితీసింది. ఒకవైపు ఘనంగా నిర్వహించాలని హుకుం జారీ చేసిన విద్యాశాఖ... అందుకు తగ్గట్టుగా నిధులు కేటాయించకపోవడంతో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బడుల్లో కుర్చీలు మోయడం, షామియానాలు వేయడంలో సహాయపడడం, పెద్దలకు నీళ్లు అందించడం, ప్రాంగణాలను శుభ్రం చేయడం... ఇలా అన్ని పనులనూ పిల్లలతోనే చేయించడం పలు పాఠశాలల్లో కనిపించింది. చుదువుకోవడానిక, తమ ప్రతిభను ప్రదర్శించడానికి బడికి వచ్చిన పిల్లలను రోజంతా బరువులు మోయించి, సేవకులుగా మార్చడంపై పలువురు తల్లిదండ్రులు మండిపడ్డారు. మరోవైపు పీటీఎంల నిర్వహణకు అరకొర నిధులు కేటాయించడంతో ఉపాధ్యాయుల చేతిచమురు వదిలింది. సమావేశాల నిర్వహణకు అయ్యే ఖర్చును నిజాయితీగా కేటాయించకపోవడం వల్లే ‘మెగా పేరెంట్స్ డే’ కాస్తా ‘మెగా ప్రహసనం’గా మారిందని ఉపాధ్యాయ లోకం నిట్టూర్చుతోంది. క్షేత్రస్థాయిలో టీచర్ల ఆవేదన ‘మా జీతాల్లోంచే ఖర్చు చేయాలా?’, ‘ప్రభుత్వం ఇచ్చిన నిధులు కనీసం కుర్చీల అద్దెకు, మైక్ సెట్కే సరిపోవు. ఇక ఊరందరికీ భోజనాలు పెట్టాలంటే వేల రూపాయలు కావాలి. హంగామా చేయమని ఉత్తర్వులు ఇస్తారు కానీ నిధులు ఇవ్వరు. పరువు కోసం మేమే సొంత డబ్బులు వేసుకుని కార్యక్రమం పూర్తి చేశాం. ప్రతిదానికి ఉపాధ్యాయులనే బలిచేయడం ఏంటి?’ – పేరుచెప్పేందుకు ఇష్టపడని ఓ ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం ఆవేదన ఇది -
పూడిక తీయలేదింకా..!
● లెక్కల్లో కనిపిస్తున్న ఖర్చు ● క్షేత్రస్థాయిలో కనిపించని పనులు పాచిపెంట: పెద్దగెడ్డ జలాశయం కుడి కాలువ పూడికతీత, జంగిల్ క్లియరెన్న్స్ కోసం 19 పనులకు గాను రూ.84 లక్షలు ఖర్చు చేశామని, మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్వయంగా ఇటీవల ఖరీఫ్ సీజన్కు నీరువిడుదల చేసినప్పుడు, ఏర్పాటు చేసిన సభలో గొప్పగా చెప్పుకున్నారు. అయితే వాస్తవం అందుకు భిన్నంగా ఉంది. ఎందుకంటే కాలువను పరిశీలించిన రైతులు మాత్రం ‘పూడిక పోయిందెక్కడ?‘ అని ప్రశ్నిస్తున్నారు. జలాశయం మొదట బొండి వద్ద నుంచే పూడిక, పిచ్చిమొక్కలు కనిపిస్తుండడంతో అసలు పనులు ఎక్కడ జరిగాయనే చర్చ సాగుతోంది. కాలువ శుభ్రం కాకపోవడంతో చివరి ఆయకట్టుకు నీరు సకాలంలో చేరడం లేదన్న ఆవేదన రైతుల్లో నెలకొంది. ఖర్చు లెక్కల్లో కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో పనులు కూడా కనిపిస్తే బాగుండేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరి దీనిపై సంబంధిత అధికారులు ఎలాంటి వివరణ ఇస్తారో వేచి చూడాలి. -
ఆటోపై నుంచి జారిపడి ఉపాధిహామీ కూలీ మృతి
రామభద్రపురం: మండలకేంద్రంలో ఆటోలో నుంచి జారి పడి చికిత్స పొందూతూ ఉపాధిహామీ కూలీ మృతి చెందింది. గురువారం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. మారుతీ కాలనీలోని శివాలయం వీధికి చెందిన చింతల కన్నమ్మ(65) ఉపాధిహామీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. రోజూ చెరువు పనులకు వెళ్తున్నట్లుగానే గురువారం ఉదయం కూడా మిగతా కూలీలతో కలిసి కొండకెంగువ రూట్ వైపు ఆటోలో రాణి బంద చెరువుకు వెళ్లింది.అక్కడ పని పూర్తయిన తర్వాత మళ్లీ ఆటోలో ఇంటికి వచ్చేస్తుండగా స్థానిక పీహెచ్సీ సమీపంలో ఉన్న మలుపు వద్దకు వచ్చేసరికి వెనుకభాగాన కూర్చున్న కన్నమ్మకు చెందిన కాలిచెప్పు జారికింద పడింది. దీంతో చెప్పు కింద పడిపోయిందన్న ఉద్దేశంతో కన్నమ్మ కూడా కిందకు దిగడం వల్ల రోడ్డుమీద పడిపోయి దెబ్బ తగిలి తీవ్రగాయమైంది. దీంతో పక్కనే ఉన్న పీహెచ్సీకి తరలించి ప్రథమ చికిత్స చేశారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం బాడంగి సీహెచ్సీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలి కుమారుడు తిరుపతిరావు ఫిర్యాదు మేరకు ఎస్సై జ్ఞానప్రసాద్ కేస్నుమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాముకాటుతో వ్యక్తి..కురుపాం: మండలంలోని ఉదయపురం పంచాయతీ సంజువాయి గ్రామానికి చెందిన కూరంగి రమేష్ (42) పాముకాటుకు గురై గురువారం తెల్ల వారు జామున చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. కూరంగి రమేష్ తన తల్లి ఆరోగ్యం బాగాలేదని తెలిసి 22వ తేదీన కురుపాం మండల కేంద్రంలో నివాసం ఉంటున్న తన తల్లి ఇంటికి భార్యాపిల్లలతో వచ్చాడు. గురువారం తెల్లవారు జామున నేలపై నిద్రిస్తున్న సమయంలో రమేష్ కుడి చెవిపై కట్ల పాము కాటు వేయగా వెంటనే కుటుంబసభ్యులు కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రథమ చికిత్స అందించిన వైద్యసిబ్బంది మెరుగైన వైద్యసేవల కోసం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతునికి భార్య బుల్లెమ్మతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రమేష్ మృతితో సంజవాయి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
ఎరువుల షాపుపై 6ఎ కేసు నమోదు
● మక్కువలో ఎరువుల గోదామును తనిఖీచేసిన ఆర్డీవో మక్కువ: మండలకేంద్రం మక్కువలోని గ్రంధి గున్నరాజు ఎరువుల గోదాములో భౌతిక నిల్వలకు, రికార్డులో ఉన్న నిల్వల్లో వ్యత్యాసం ఉన్నందున 6ఎ కేసు నమోదుచేసినట్లు ఆర్డీవో కె.మాధురి తెలిపారు. స్థానిక గ్రంథిగున్నరాజు ట్రేడర్స్ గోదామును ఆర్డీవో మాధురి గురువారం తనిఖీ చేశారు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..సాలూరు మండలంలోని మావుడి రైతుసేవాకేంద్రం పరిధి కొట్టుపరువు గ్రామానికి చెందిన సత్తి శ్రీనివాసరెడ్డి తోటలో అక్రమంగా నిల్వ చేసిన సుమారు రూ.26లక్షల విలువజేసే 1344 పొటాష్ బస్తాలు నకిలీవంటూ ప్రాథమికంగా నిర్ధారిస్తూ ఈనెల 20వతేదీన వ్యవసాయశాఖ అధికారులు పట్టుకుని సీజ్ చేసి ల్యాబ్కు ఎరువులు శాంపిల్స్ను పంపించారు. తాజాగా బుధవారం మరో 312బస్తాల పొటాష్ ఎరువును వ్యవశాయశాఖ అధికారులు సీజ్చేశారు. ఈ 312బస్తాలు పొటాష్ ఎరువులు ఒరిజినల్ అయినప్పటికీ, బిల్లుల్లో తేడా ఉన్నందున, ఆరాతీయగా మక్కువకు చెందిన డీలర్ గ్రంధి కోటి నుంచి కొనుగోలుచేసి, నిల్వ చేసినట్లు రైతు సత్తి శ్రీనివాసరెడ్డి గుమస్తా వివరించినట్లు డీఏవో అన్నపూర్ణ తెలిపారు. ఈమేరకు ఆర్డీవో మాధురి ఎరువుల గోదామును తనిఖీచేశారు. స్టాక్ రికార్డులు, ఎరువుల నిల్వలు, రైతుల ఫిర్యాదు, వాంగ్మూలం కాపీలను ఆర్డీవో పరిశీలించారు. గోదాములో భౌతిక నిల్వలకు, రికార్డులో ఉన్న నిల్వలకు వ్యత్యాసం ఉండటంతో, డీలర్లను వివరణ కోరినప్పటికీ, వివరణ ఇవ్వకపోవడంతో 6ఎ కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాధురి మాట్లాడుతూ మావుడి రైతుసేవాకేంద్రం పరిధిలో కల్తీ ఎరువులు విక్రయించినట్లు ప్రాథమికంగా తేలడంతో, సీజ్ చేసిన ఎరువులు ల్యాబ్కు పంపించిన శాంపిల్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత, నకిలీవని తేలితే ఫెర్టిలైజర్ యాక్ట్ కింద కేసు నమోదుచేసే అవకాశముంటుందన్నారు. అంతకుముందు డీఏవో అన్నపూర్ణ, ఏడీఏ సత్యవతి, ఏవో భారతి గ్రంధి గున్నరాజు ట్రేడర్స్ దుకాణంలో ఎరువులు నిల్వలు, స్టాక్ రికార్డులు పరిశీలించారు. -
ప్రధాని పర్యటనలో ఉన్నత ప్రమాణాలు పాటించాలి
● లోపాలకు తావులేకుండా శాఖలు సమన్వయంతో పనిచేయాలి ● ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబు, ప్రత్యేక అధికారి వీరపాండ్యన్పూసపాటిరేగ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతులమీదుగా ఆగస్టు 1న జరగనున్న అల్లూరిసీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రతిష్టాత్మక వేడుకగా నిలిచేలా అన్ని ఏర్పాట్లు అత్యున్నత ప్రమాణాలతో పూర్తిచేయాలని ప్రధానమంత్రి పర్యటన నోడల్ అధికారి ఎంటి కృష్ణబాబు ,ప్రధానమంత్రి పర్యటన ప్రత్యేక అధికారి జి. వీరపాండ్యన్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం కలెక్టర్ రాంసుందర్రెడ్డితో కలిసి భోగాపురంలోని అల్లూరిసీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వారు సందర్శించారు. ప్రారంభోత్సవానికి సంబంధించిన ప్రతి అంశాన్ని క్షణ్ణంగా పరిశీలించారు. ముందుగా విమానాశ్రయం టెర్మినల్ను సందర్శించిన అధికారులు అరైవల్, డిపార్చర్, చెక్ఇన్ కౌంటర్లు, భద్రతా తనిఖీ కేంద్రాలు, వీఐపీ లాంజ్లు, ప్రయాణికుల నిరీక్షణ మందిరాలు, బ్యాగేజ్ క్లెయిమ్ ఏరియా, బోర్డింగ్ప్రాంతాలు, విమానాల ల్యాండింగ్కు సంబంధించిన సదుపాయాలు, అంతర్గత రాకపోకల ఏర్పాట్లు సమగ్రంగా పరిశీలించారు. ప్రధానమంత్రి రాక సందర్భంగా అనుసరించాల్సిన ప్రోటోకాల్ భద్రతా ప్రమాణాలు, అతిథుల స్వాగత ఏర్పాట్లు, వివిధ శాఖల మధ్య సమన్వయం తదితర అంశాలపై అధికారులకు పలుసూచనలు చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకానున్న నేపథ్యంలో ట్రాఫిక్ నిర్వహణ, వాహనాల పార్కింగ్, ప్రజల కదలికలు, భద్రత, తాగునీరు, వైద్యసేవలు, పారిశుధ్యం వంటి అంశాల్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు పరస్పరం సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. నిర్ణీత గడువులో అన్ని పనులు పూర్తిచేసి, ప్రతి ఏర్పాటును పలుమార్లు తనిఖీ చేసి కార్యక్రమం విజయవంతమయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎయిర్పోర్ట్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ ఆదిత్య, పురపాలక శాఖ కమిషనర్ పి.సంపత్కుమార్, విజయనగరం, అనకాపల్లి జాయంట్ కలెక్టర్లు సేతుమాధవన్, సౌర్యమాన్పటేల్, జీసీసీ మేనేజింగ్ డైరెక్టర్ శోభిత, అదనపు ఎస్పీ సౌమ్యలత, జీఎంఆర్ ప్రతినిధులు ఐ.ప్రభాకరరావు, రామరాజుతో పాటు వివిధశాఖల న్నతాధికారులు పాల్గొన్నారు.భద్రతా ఏర్పాట్ల పరిశీలన అనంతరం ప్రధానమంత్రి విమానాశ్రయంలో నిర్వహించనున్న వాక్త్రూ మార్గాన్ని పరిశీలించి, వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రదర్శనలు, ప్రత్యేక ప్రదర్శన స్టాళ్లు, అతిథుల కదలికలు, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాల వేదికలు, కళాకారుల ఏర్పాట్లు, సౌండ్సిస్టమ్, అలంకరణ, స్వాగత కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు సమయపాలనతో, ఆకర్షణీయంగా నిర్వహించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. తదుపరి బహిరంగ సభాప్రాంగణాన్ని సందర్శించి ప్రధాని వేదిక, వీవీఐపీ, వీఐపీ, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆహ్వానితులు, మీడియాప్రతినిధులు, ప్రజలకోసం ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక ఎన్క్లోజర్లు, మీడియా గ్యాలరీ, నియంత్రణ కేంద్రం, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, పార్కింగ్ప్రాంతాలు, బారికేడింగ్, భద్రతా ఏర్పాట్లు , తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య శిబిరాలు, అత్యవసర సేవలు, విద్యుత్ , కమ్యూనికేషన్ సదుపాయాలను క్షణ్ణంగా పరిశీలించారు. -
అన్నచేతిలో తమ్ముడి హతం
రేగిడి: మండల పరిధిలోని సరసనాపల్లి గ్రామంలో బుధవారం రాత్రి అన్నదమ్ముల మధ్య తలెత్తిన వివాదంలో అన్న చేతిలో తమ్ముడు హతమయ్యాడు. ఈ ఘటనపై ఎస్సై వి.బాలకృష్ణ అందించిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గొడేఅప్పడు, గొడే కృష్ణ(50) అన్నదమ్ములు. వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఉమ్మడిగా పది సెంట్లు మేర టేకు చెట్లు ఉన్న స్థలం ఉంది. ఈ స్థలానికి సంబంధించి ప్రతిరోజూ గొడవ పడుతున్నారు. ఇద్దరూ మద్యం తాగుతుంటారు. యథావిధిగా బుధవారం రాత్రి కూడా ఇద్దరూ మద్యం తాగి భూమికోసం గొడవపడ్డారు. అన్నయ్య గొడే అప్పడు మద్యం మత్తులో భూమి వాటాల గురించి తమ్ముడు కృష్ణ వద్ద ప్రస్తావించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. వెంటనే గొడే అప్పడు తన ఇంట్లో ఉన్న తాటిపట్టి చెక్క తీసుకువచ్చి తమ్ముడు కృష్ణ తలపై, నుదుటిపై వంటిపై ఇష్టానుసారం కొట్టాడు. దీంతో కృష్ణ అక్కడికక్కడే మృతిచెందాడని ఎస్సై తెలిపారు. అప్పడు వెంటనే ఘటనా స్థలం నుంచి పరారవడంతో ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. హతుడు కృష్ణ భార్య రాములమ్మ గడిచిన ఇరవై సంవత్సరాల నంచి కన్నవారి గ్రామమైన రేగిడిలో తన ముగ్గురు పిల్లలతో ఉంటోంది. అప్పడు భార్య గతంలోనే మృతిచెందింది. ఇద్దరు పిల్లలు విశాఖ పట్నంలో తాపీ పని చేసుకుంటున్నారు. అప్పడు వ్యసనానికి బానిస కావడంతో ఈ ఘటన జరిగిందని ఎస్సై తెలిపారు. ఘటనా స్థలాన్ని రాజాం టౌన్ సీఐ డి.నవీన్కుమార్, ఎస్సై వి.బాలకృష్ణ గురువారం పరిశీలించారు. రాజాం సామాజిక ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు. మృతుని భార్య రాములమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై తెలిపారు. కర్రల లారీ బోల్తాదత్తిరాజేరు: మండలంలోని పెదమానాపురం టోల్ ప్లాజా వద్ద గురువారం తెల్లవారు జామున విజయనగరం నుంచి రాయగడ వెళ్తున్న కర్రల లారీ బోల్తా పడింది. దీంతో డ్రైవర్ తిరుమల రావు చేతికి తీవ్ర గాయాలయ్యాయి డ్రైవర్ను వెంటనే ప్రాథమిక చికిత్స నిమిత్తం గజపతినగరం ఆస్పత్రికి తరలించినట్లు లారీ యజమాని అప్పారావు తెలిపారు. రాయగడ వెళ్తున్న లారీ పెదమానాపురం వద్దకు వచ్చేసరికి డ్రైవర్ ఒకసారిగా మత్తు నిద్రలోకి జారిపోవడంతో బోల్తా పడి బాడీ మొత్తం నుజ్జునుజ్జు అవడంతో పాటు వివిధ రకాల లారీ పార్టులు కూడా పాడైనట్లు యజమాని తెలిపారు. -
దొరికిన ఏకలవ్య విద్యార్థి
భామిని: మండలంలోని ఏకలవ్య స్కూల్ విద్యార్థి సవర ప్రవీణ్ ఆచూకీ లభించిందని బత్తిలి ఎస్సై కె.రవీంద్ర గురువారం తెలిపారు. లక్ష్మీనర్సుపేట మండల కేంద్రంలో విద్యార్థి సవర ప్రవీణ్ను గుర్తించామేన్నారు. తల్లిదండ్రులు సవర లలిత, ప్రసాద్లకు ఏకలవ్య స్కూల్ టీచర్ల సమక్షంలో విద్యార్థిని అప్పగించామని చెప్పారు. స్కూల్కు వచ్చిన తరువాత ఇంటిపై బెంగతో ప్రవీణ్ వెళ్లిపోయినట్లు గుర్తించామన్నారు. మహిళా ప్రాంగణంలో ఉచిత శిక్షణవిజయనగరం ఫోర్ట్: స్థానిక మహిళా ప్రాంగణంలో మహిళలకు వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ, స్వయం ఉపాధి కల్పన నిమిత్తం దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రాంగణం మేనేజర్ బి,రెబక్కా శామ్యూల్ తెలిపారు. అర్హులైన, అసక్తిగల 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల మహిళలు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అసిస్టెంట్ బ్యూటీ థెరపిస్ట్ (75 రోజులు), స్యూయింగ్ మెషీన్ ఆపరేటర్ (50 రోజులు), హ్యాండ్ ఎంబ్రాయిడరీ (45 రోజులు), అసిస్టెంట్ క్రిచి కేర్టేకర్ (75 రోజులు) జేరియాటిక్ కేర్ టేకర్ (75 రోజులు) కోర్సులకు ఉచిత శిక్షణ తరగతలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దరఖాస్తులను ఈ నెల 30 వతేదీ లోగా సమర్పించాలని సూచించారు. స్కూటీ ఎత్తుకుపోయిన స్నేహితుడుజియ్యమ్మ వలస రూరల్: మండలంలోని గెడ్డతిరువాడ గ్రామానికి చెందిన కొలుసు ఆర్య స్నేహితుడైన అదే గ్రామానికి చెందిన బొంగు కార్తీక్ అనే వ్యక్తి ఈనెల 18న ఆర్య స్కూటీని ఎత్తుకు పోయాడు. కార్తీక్ ఆ రోజు ఉదయం తన ఇంటికి వచ్చి తల దిండు కింద ఉన్న స్కూటీ తాళాన్ని తీసి స్కూటీతో పరారయ్యాడని, ఐదు రోజులు కావస్తున్నా ఇప్పటివరకు తన బండిని అప్పజెప్పకుండా విశాఖపట్నం, తుని, ప్రాంతాలలో తిరుగుతున్నట్లు తెలిసిన వ్యక్తులు ఫోన్ చేసి చెబుతున్నారని కొత్త స్కూటీని ఫైనాన్స్పై తీసుకున్నట్లు ఆర్య తెలిపాడు. ఈ విషయాన్ని గ్రామంలో ఉంటున్న కార్తీక్ తండ్రి వెంకటరమణ, కుటుంబసభ్యులకు తెలపగా మా అబ్బాయి కొన్ని సంవత్సరాలుగా ఇంటికి రావడం లేదని, ఇలాంటి పనులు చేస్తూ మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడని, మీరు ఏం చేసినా మాకు సంబంధం లేదని తెలపడంతో చేసేదిలేక కొలుసు ఆర్య, తల్లి లక్ష్మి జియ్యమ్మవలస పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడు పాలిటెక్నిక్ చేసి బతకలేక పార్వతీపురంలో ఓ షాపులో పనిచేస్తుంటే జీవనం సాగిస్తున్నామని తల్లి లక్ష్మి తెలిపింది. ఎలాగైనా తన కుమారుడికి న్యాయం చేసి స్కూటీని తమకు అప్పచెప్పేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆమె వేడుకుంది. -
వర్షాభావంతో.. వీఆర్ఎస్ వెలవెల
మక్కువ: మక్కువ, సాలూరు మండలాల్లో వర్షాలు కురవకపోయినా.. వీఆర్ఎస్ ప్రాజెక్ట్ ఎగువనున్న ఒడిశా రాష్ట్రంలో వర్షాలు కురిస్తే ప్రాజెక్ట్లోకి గోముఖి, సువర్ణముఖి నదుల ద్వారా నీరు చేరి, ఏటా జూలై మొదటి, రెండు వారాల్లో వీఆర్ఎస్ నీటితో కళకళలాడేది. ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకుని వర్షాభావం ఏర్పడడంతో ఒడిశా రాష్ట్రంలో కూడా వర్షాలు కురవకపోవడంతో వీఆర్ఎస్లోకి నీరు చేరక ప్రాజెక్టు వెలవెలబోతుంది. ఈ ప్రాజెక్టు ఫుల్ రిజర్వుడు లెవెల్(ఎఫ్ఆర్ఎల్) 161 మీటర్లు కాగా, ప్రస్తుతం 155 మీటర్లు లెవెల్లో నీరు నిల్వ ఉండడంతో ఈ ఏడాది ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం ఎలినినో ప్రభావం ఓ వైపు ఆందోళనకు గురి చేస్తుంటే మరో వైపు అధికారుల నిర్లక్ష్యం కూడా రైతులను ఆవేదనకు గురి చేస్తోంది. కొన్నేళ్ల నుంచి స్పిల్వే రెగ్యులేటర్లు మరమ్మతులకు గురైనా.. మరమ్మతులు చేయించడంలో అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఫలితంగా సాగు నీటికి ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. స్పిల్వే ద్వారా నీరు లీకై ఏడాది పొడవునా కాలువల ద్వారా నదుల్లోకి నీరు వృథాగా పోతున్నా.. చర్యలు చేపట్టడం లేదని రైతులు ఆక్రోశిస్తున్నారు. జైకా నిధులతో పనులు జరిపిస్తామని ఏటా అధికారులు నెట్టుకొస్తున్నారే తప్ప పనులు మాత్రం చేయించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. చేపలు చెరువులకు సాగు నీరు వీఆర్ఎస్ ఎడమ ప్రధాన కాలువ నుంచి చేపల చెరువులకు పలువురు రైతులు సాగునీరు మళ్లిస్తున్నా.. అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించడం వల్లే ప్రాజెక్టులో నీటి నిల్వలు లేకుండా పోతున్నాయని రైతులు విమర్శిస్తున్నారు. నిత్యం ఈ ప్రాజెక్టు ద్వారా ఇలా జరుగుతున్నా.. అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. ఎట్టకేలకు ట్రెంచ్ తొలగింపు కుడి ప్రధాన కాలువ పరిధిలో ఇటీవల సప్టా పనులు చేయించారు. దీంతో స్పిల్వే ద్వారా లీకై న నీటిని సువర్ణముఖి నదిలోకి మళ్లించారు. నారుమడులు ఎండిపోవడంతో రైతులు మోటార్లు, వాటర్ ట్యాంకర్లు, బిందెలతో తడిపి రక్షించుకుంటున్నారు. అయినా అధికారులు ట్రెంచ్ తొలగించి కాలువలకు నీటిని సరఫరా చేయకుండా వదిలేశారు. ఎట్టకేలకు శనివారం కుడి, ఎడమ ప్రధాన కాలువల పరిధిలో జేసీబీ సాయంతో ట్రెంచ్లు తొలగించి కాలువలకు నీటిని విడిచి పెట్టారు. ఇప్పటికై నా ఇరిగేషన్ అధికారులు స్పందించి సాగునీరు వృథా కాకుండా ఖరీఫ్ సాగుకు అవసరమైన నీటిని పంట పొలాలకు అందించాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు. వీఆర్ఎస్ ఎఫ్ఆర్ఎల్ 161 మీటర్లు ప్రస్తుతం నిల్వ ఉన్న నీరు 155 మీటర్లు స్పిల్వే రెగ్యులేటర్లు ద్వారా లీకవుతున్న నీరు ఎట్టకేలకు కాలువల్లో ట్రెంచ్లు తొలగించిన ఇరిగేషన్ అధికారులు చేపల చెరువులకు నీటి మళ్లింపుతో సాగునీటి కష్టాలు ఖరీఫ్ సాగు కష్టమేనంటున్న రైతన్నలు ఖరీఫ్ వరి సాగు సాధారణ విస్తీర్ణం 12,300 ఎకరాలు మండలంలోని ఖరీఫ్ వరి సాగు సాధారణ విస్తీర్ణం 12,300 ఎకరాలు కాగా, ప్రస్తుతం 120ఎకరాల్లో వెదజల్లే పద్ధతిలో సాగు చేసేందుకు రైతులు సమాయత్తమయ్యారు. మిగిలిన 12,180 ఎకరాల్లో వరి సాగు, వర్షాలు, వీఆర్ఎస్ ప్రాజెక్ట్ కాలువలు ద్వారా సరఫరా అయ్యే సాగు నీటిపైనే ఆధారపడాల్సి ఉంది. ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడంతో, నారుమడులు ఎండిపోతున్నాయి. ఏటా ఆగస్టు మొదటి వారంలో వీఆర్ఎస్ ప్రాజెక్ట్ కాలువల ద్వారా నీటిని విడిచిపెట్టగా, ఆగస్టు నెలాఖారులోగా ఉభాలు పూర్తయ్యేవి. ప్రస్తుతం వర్షాలు కురవకపోవడంతో ఈ ఏడాది ఖరీఫ్ సాగుపై రైతుల్లో సందిగ్ధత నెలకొంది. ఏం చేయాలో పాలుపోక ఆందోళన చెందుతున్నారు. -
అజేయుడై రావాలి..
● కామన్వెల్త్ గేమ్స్కు కొండవెలగాడ బిడ్డ ● దేశం నుంచి బరిలోకి..మరో మూడు రోజుల్లో ప్రదర్శన ● ఆల్ ద బెస్ట్ చెబుతున్న జిల్లా ప్రజలు, క్రీడాకారులునెల్లిమర్ల రూరల్: ఒక చిన్న గ్రామం నుంచి బయలుదేరిన యువకుడు..ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షించే అంతర్జాతీయ క్రీడా వేదికపై భారత్ నుంచి బరిలోకి దిగబోతున్నాడు. ఎన్నో సంవత్సరాల సాధన, వందల గంటల శిక్షణ..ఎన్నో పోటీలు..వందల పతకాలు..ఇప్పుడు ఆ యువకుడి ప్రయాణం కామన్వెల్త్ వేదికకు చేరింది. నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామానికి చెందిన వెయిట్లిఫ్టర్ వల్లూరు అజయ్బాబు కామన్వెల్త్ గేమ్స్లో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. మరో మూడు రోజుల్లో జరగనున్న పోటీ కోసం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, క్రీడాభిమానులు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్లో అజయ్ భారత్ తరఫున 79 కేజీల విభాగంలో పోటీ పడనున్నాడు. ఈ నెల 27 అర్ధరాత్రి 12.30 గంటలకు(భారత కాలమానం ప్రకారం ఈ నెల 28 తెల్లవారుజామున) గ్లాస్గోలోని ఎస్ఈసీ ఆర్మడిల్లో వేదికగా పోటీ జరగనుంది. తండ్రి స్ఫూర్తితో విజేయుడై.. అజయ్బాబు తండ్రి వల్లూరి శ్రీనివాసరావు ప్రముఖ ఇండియన్ వెయిట్లిఫ్టర్. 1997లో శిక్షణ ప్రారంభించిన ఆయన రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు పతకాలు సాధించారు. 2010లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో శ్రీనివాసరావు భారత్ తరఫున 56 కేజీల విభాగంలో పోటీపడి కాంస్యం సాధించారు. ఇప్పుడు 16 ఏళ్ల తరువాత అదే కుటుంబం నుంచి ఆయన కుమారుడు అజయ్ కామన్వెల్త్ వేదికపై బరిలోకి దిగుతున్నాడు. ఇండియన్ ఆర్మీలో సిఫాయి స్థాయి నుంచి జేఏఓ కేడర్ వరకు ఎదిగి వల్లూరి శ్రీనివాస రావు రిటైర్ అయ్యారు. ప్రస్తుతం స్వగ్రామంలోనే ఉంటూ యువ క్రీడాకారులకు శిక్షణ అందిస్తున్నారు. తండ్రి స్ఫూర్తితో అజయ్బాబు తన ఎనిమిదేళ్ల వయసు నుంచే వెయిట్లిఫ్టింగ్లో శిక్షణ ప్రారంభించాడు. కఠోర సాధనతో అంచెలంచెలుగా ఎదుగుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చాటుతూ వచ్చాడు. బంగారు కొండ అజయ్ ు 2021లో పాటియాలాలో జరిగిన యూత్, జూనియర్, సీనియర్ జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో స్వర్ణ పతకంతో తన విజయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. అనంతరం భువనేశ్వర్, పంచకుల, తమిళనాడు, మద్యప్రదేశ్, గోవా, అరుణాచల్ ప్రదేశ్, తదితర ప్రాంతాల్లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో పలు పతకాలు సాధించాడు. కామన్వెల్త్ చాంపియన్షిప్ పోటీల్లోనూ అజయ్బాబు ప్రతిభ చాటాడు. 2023లో నోయిడాలో జరిగిన జూనియర్ కామన్వెల్త్ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో స్వర్ణపతకం సాధించాడు. 2024 ఫిజీలో జరిగిన సీనియర్ కామన్వెల్త్ చాంపియన్షిప్లోనూ బంగారు పతకం కై వసం చేసుకున్నాడు. 2026లో అహ్మదాబాద్లో జరిగిన సీనియర్ కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్షిప్లో మరోసారి స్వర్ణం సాధించి అత్యతంత ప్రతిష్టాత్మకంగా జరగబోయే ‘కామన్వెల్త్ గేమ్స్కు’ అర్హత సాధించాడు. వెయిట్లిఫ్టింగ్లో సాధించిన ప్రతిభతో అజయ్బాబు క్రీడా కోటాలో ఇండియన్ ఆర్మీలో జేఏఓ కేడర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. క్రీడలో రాణించడమే కాకుండా దేశ సేవకు అవకాశం లభించడం పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిన్న గ్రామం నుంచి నేడు అంతర్జాతీయ వేదిక వరకు వెళ్లిన అజయ్బాబు విజయం సాధించాలని జిల్లా వాసులు ఆకాంక్షిస్తున్నారు. ఆల్దిబెస్ట్ అజయ్బాబు అని చెబుతున్నారు. -
సమగ్ర శిక్ష ఈఈగా మురళీబాబు
విజయనగరం అర్బన్: జిల్లా విద్యాశాఖలోని సమగ్ర శిక్ష ఇంజనీరింగ్ విభాగం కార్యనిర్వాహక ఇంజనీరు (ఈఈ)గా ఆర్డబ్ల్యూఎస్/ఆర్అండ్బీ శాఖకు చెందిన కె.మురళీబాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. రోడ్లు, భవనాల శాఖలో ఏఈగా విధులు నిర్వహిస్తున్న ఆయనకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ (డీఈఈ)గా ఉద్యోగోన్నతి కల్పిస్తూ సమగ్రశిక్ష ఈఈగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో గురువారం ఆయన స్థానిక సమగ్రశిక్ష కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఇక్కడ ఈఈగా బాధ్యతలు నిర్వహించిన హరిప్రసాద్ను మాతృ సంస్థకు బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బాధ్యతల స్వీకరణ అనంతరం ఆయన మాట్లాడుతూ శాఖ పరధిలో కొనసాగుతున్న పాఠశాలల మౌలిక వసతులు, వివిధ అభివృద్ధి పనుల వేగవంతానికి కృసిచేస్తానని వెల్లడించారు. కేజీబీవీల బోధనా సిబ్బంది మోరిట్ జాబితా విడుదల విజయనగరం అర్బన్: జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాల్లో 2026–27 విద్యా సంవత్సరానికి కాంట్రాక్టు ప్రాతిపదికన బోధనా సిబ్బంది నియామక ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోందని డీఈఓ యు.మాణిక్యం నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష సొసైటీ ఆధ్వర్యంలో చేపడుతున్న నియామకాలకు సంబంధించి తాత్కాలిక మెరిట్ జాబితా, రోస్టర్ పాయింట్ల వివరాలను జిల్లా అధికారిక వెబ్సైట్ ‘విజయనగరం.ఏపీ.జీఓవి.ఐఎన్’లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. మెరిట్ జాబితాపై అభ్యర్థులకు ఏవైనా అభ్యంతరాలు, సందేహాలు, వ్యత్యాసాలు ఉంటే తగిన ఆధార పత్రాలతో నేరుగా వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చని డీఈఓ పేర్కొన్నారు. ఈ నెల 25, 27, 28 తేదీల్లో కలెక్టరేట్లోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అభ్యంతరాలు స్వీకరిస్తారని తెలిపారు. నిర్దేశించిన గడువు ముగిసిన తర్వాత అందిన అభ్యంతరాలను ఏ పరిస్థితుల్లోనూ పరిగణనలోకి తీసుకోబోమని, అఽభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేశారు. -
వరుణుడిపైనే భారం
● నేరు మడ్డువలస ప్రాజెక్టు సాగునీరు విడుదల ● గతమెన్నడూ లేని విధంగా ఆలస్యంగా నీటి విడుదల వంగర: చినుకు రాలదు...చింత తప్పదు అన్నచందంగా మడ్డువలస ప్రాజెక్టు పరిస్థితి దాపరించింది. ఈ ఏడాది వర్షాల జాడ లేదు. నదుల నుంచి ఇన్ఫ్లో రాకపోవడంతో ప్రాజెక్టులో నీటిమట్టం డెడ్ స్టోరేజీలో ఉంది. గతమెన్నడూ లేని విధంగా ఈ ఏడాది సాగునీటి నిల్వలు అడుగంటుతున్నాయి. ఖరీఫ్ సీజన్ ఆరంభమై నెలన్నర గడుస్తున్నా వర్షాలు లేక సాగునీటిని విడుదల చేయలేని స్థితి. ఆయకట్టులో రైతన్న సాగునీటిని కష్టాలను దుష్టిలో పెట్టుకొని అధికారులు సాగునీటి విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు. అరకొర నీటి నిల్వలున్న మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ ద్వారా శుక్రవారం సాగునీటిని విడుదల చేయనున్నారు. ప్రాజెక్టులో ఉన్న నీరు 15–20 రోజులు మాత్రమే ఆయకట్టుకు సరఫరా చేసే పరిస్థితి ఉంది. దీంతో అన్నదాతలు వరుణిడి కరుణ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రాజెక్టులో నీటి నిల్వలు ఇలా..... మడ్డువలస ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 65 మీటర్లు. ఈ లెక్కన 3.37 టీఎంసీల నీరు ఉండాలి. అయితే, ప్రస్తుతం 62.28 మీటర్లు లెవెల్ నీటిమట్టం ఉంది. 1.25 టీఎంసీల నీరు ఉంది. వర్షాలు కురవకుంటే 15 రోజుల్లో డెడ్ స్టోరేజీకి ప్రాజెక్టు చేరుకుంటుంది. ఆయకట్టు వివరాలు..... ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువ ద్వారా 31వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. అయితే వర్షాభావ పరిస్థితులు కారణంగా ఈ ఏడాది తొలిఫేజ్లో ఉన్న 24,877 ఎకరాలకు సాగునీటి అందించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎడమ ప్రధాన కాలువ నుంచి వంగర మండలంలో 996 ఎకరాలకు, కుడి ప్రధాన కాలువ నుంచి రేగిడి–6,777, సంతకవిటి–10,976, జి.సిగడాం–6,029, పొందూరు–99 ఎకరాలకు మాత్రమే సాగునీటిని అందించనున్నారు. వర్షాలు పుష్కలంగా కురిస్తే రెండో ఫేజ్లో ఉన్న మరో 6వేలు ఎకరాలకు సాగునీటిని అందించగలమని అధికారులు చెబుతున్నారు. -
ఏబీఎన్ రాధాకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
విజయనగరం: బాధ్యత గల జర్నలిజం రంగంలో ఉన్నత స్థాయిలో ఉన్న ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ఎం.డి.రాధాకృష్ణ మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినా ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారణమని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ మహిళా నాయకులు, కార్యకర్తలను ఉద్దేశిస్తూ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు యావత్ మహిళాలోకం మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి వ్యక్తిపై విజయనగరంలోని వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఇప్పటికే రెండు సార్లు ఫిర్యాదుచేసినా కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా నిర్లక్ష్యం నటించడంతో ఎస్పీ దృష్టికి సమస్యను తీసుకువచ్చామన్నారు. ఈ మేరకు గురువారం ఎస్పీ కార్యాలయంలో జిల్లా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ అధికార బలం, ప్రభుత్వం అండదండలు చూసుకుని మహిళల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ వాటిని ఏబీఎన్, ఆంధ్రజ్యోతి మీడియాలో ప్రచురించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేఖంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే వారిపై తప్పుడు కేసులు బనాయిస్తున్న ప్రభుత్వం రాధాకృష్ణ లాంటి వ్యక్తులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. విజయనగరం జిల్లా కేంద్రంలో పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఎస్పీ కార్యాలయంలో సమస్యను చెప్పుకునేందుకు వస్తే ఒక్క అధికారి అందుబాటులో లేకపోవడం దారుణమన్నారు. ఓ రాజకీయ పార్టీ తరఫున తమకే ఇటువంటి పరిస్థితి ఎదురైతే సాధారణ ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. మహి ళలపై అనుచిత వాఖ్యలు చేసిన రాధాకృష్ణ భేషరతుగా క్షమాపణ చెప్పాలని, అతనిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మహిళలతో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గదుల సత్యలత, పార్టీ నగర అధ్యక్షుడు ఆశపు వేణు, యువజన విభాగం నాయకులు జి.ఈశ్వర్ కౌశిక్, నగర యువజన విభాగం అధ్యక్షుడు చెల్లూరి భార్గవ్, ఉపాధ్యక్షుడు అవనాపు లక్ష్మణరావు, నియోజకవర్గ బూత్లెవెల్ కమిటీ ఇన్చార్జి బండారు ఆనంద్, సప్పా ప్రసాద్, తాళ్లపూడి గణేష్ , బొంగ భానుమూర్తి తదితరులు పాల్గొన్నారు. మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం దారుణం పోలీస్ యంత్రాంగం తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి ఎస్పీ కార్యాలయంలో పిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ నాయకులు -
నీట్ లీకేజీపై నిరసన
● నేడు విద్యాసంస్థల బంద్కు ఐక్య విద్యార్థి సంఘాల పిలుపువిజయనగరం గంటస్తంభం: నీట్ ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ ఘటనపై కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని ఐక్య విద్యార్థి, యువజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈనెల 24న రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న విద్యాసంస్థల బంద్ను విద్యార్థులు,యువత, తల్లిదండ్రులు, అధ్యాపకులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల నాయకులు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కావడం విద్యా వ్యవస్థ వైఫల్యానికి నిదర్మనమని విమర్శించారు. కష్టపడి చదివిన విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టాలని కోరారు. ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యులైన వారిపై వేగవంతమైన, కఠిన చర్యలు తీసుకోవాలని, పూర్తిస్థాయి నిష్పాక్షిక విచారణ నిర్వహించి బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామ్మోహన్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి సుమన్, ఎస్ఎఫ్ఐ నాయకుడు రాము, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు బూర వాసు, డీవైఎఫ్ఐ నాయకుడు రవి, శిరీష,చరణ్, గణేష్, సూరిబాబు, గౌరీశంకర్, దుర్గాప్రసాద్, సోమేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
అందరికీ కాదు.. కొందరికీ వందనం..!
● నిబంధనల పేరుతో షాక్ ● హౌస్ మ్యాపింగ్ తప్పిదాలతో అడ్డగోలుగా అనర్హత విజయనగరం అర్బన్ / రామభద్రపురం : అర్హులందరికీ తల్లికి వందనం పథకం అందిస్తున్నామని.. ఎంత మంది పిల్లలుంటే అందరికీ జమ చేస్తున్నామన్న చంద్రబాబు ప్రభుత్వం గొప్పలకు.. వాస్తవానికి పొంతన కుదరడంలేదు. లెక్కలన్నీ అంకెల్లోనూ.. ప్రజా ప్రతినిధుల గొప్పల్లోనూ కనిపిస్తున్నాయని తల్లిదండ్రులు అంటున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చాక.. జిల్లాలో వేలాది మంది పథకానికి దూరమైన పరిస్థితి ఉంది. వేరొకరి కరెంటు బిల్లులు ఆధార్తో లింకు కావడం, భూమి లేకున్నా ఉన్నట్లు చూపడం వల్ల లబ్ధిదారులు పథకానికి దూరమవుతున్నారు. కొత్త నిబంధనలు ఇలా.. విద్యార్థికి సంబంధిత విద్యా సంవత్సరంలో కనీసం 75 శాతం హాజరుతప్పనిసరి. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ నెలసరి ఆదాయం రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలు లోపు ఉండాలి. గత 12 నెలల సగటు విద్యుత్ వినియోగం 300 యూనిట్లకు మించకూడదు. 3 ఎకరాల కంటే తక్కువ పల్లం భూమి, లేదంటే 10 ఎకరాల కంటే తక్కువ మెట్ల భూమి ఉండాలి. నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు. పట్టణాల్లో వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇల్లు/ఆస్తి ఉండకూడదు. తల్లి బ్యాంక్ ఖాతా తప్పని సరిగా ఆధార్ సీడెడ్ అయి, ఎన్పీసీఐ యాక్టివేట్ అయి ఉండాలి. స్కూల్ రికార్డుల్లో విద్యార్థుల వివరాలు, ఆధార్ లేదా తల్లి పేరులో చిన్న అక్షర దోషాలు ఉన్నా సిస్టంలో ఆటోమేటిక్గా అప్లికేషన్ తిరస్కరణకు గురవుతోంది. సరిచేయండి సారూ.. నా మనవరాలికి గతేడాది తల్లికి వందనం డబ్బులు పడ్డాయి. ఈ ఏడాది పడలేదంటూ రామభద్రపురం మండలంలోని రావివలసకు చెందిన దమ్మి తమ్మయ్య ఇన్చార్జి తహసీల్దార్ సాయికృష్ణకు గోడు వినిపించాడు. రావివలసకు చెందిన తమ్మయ్యకు కుమారుడు పెంటయ్యకు 3.25 ఎకరాల పొలం మాత్రమే ఉంది. అయితే అతడి ఆధార్ కార్డు నంబర్ పొరపాటున ఇంకొకరి భూమికి లింక్ అయింది. దీంతో పెంటయ్య పేరున సుమారు 10 ఏకరాల పైగా భూమి ఉన్నట్లు 1బీలో చూపిస్తోంది. ఈ కారణంగా తల్లికి వందనం పథకం నిలిపివేశారు. వెంటనే అనధికారికంగా నమోదైన భూమిని తొలగించాలని తహసీల్దార్కు వినతిపత్రం అందజేశాడు. చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు సిగడం ఉష. విజయనగరం పట్టణంలోని దర్మపురి గ్రామం. ఆమెతో పాటు భర్త పాపునాయుడు రోజుకూలీలు. వీరి ఇద్దరు పిల్లల్లో షణ్ముకసాయి రెండో తరగతి, భాను ప్రకాశ్ మూడో తరగతి చదువుతున్నారు. వీరిలో రెండేళ్లుగా ఒక్కరికీ తల్లికివందనం లబ్ధి అందుతోంది. దీనిపై సచివాలయ సిబ్బందిని సంప్రదిస్తే మ్యాపింగ్లో భార్యాభర్తలు వేర్వేరుగా జీవిస్తున్నట్టు నమోదైంది. గతేడాది సరిచేయాలని విన్నవించినా ఫలితం లేకపోయిందంటూ కూలి దంపతులు వాపోతున్నారు. -
నిరుద్యోగులతో ఆటలొద్దు
విజయనగరం గంటస్తంభం: నిరుద్యోగులతో ఆటలొద్దు.. ప్రభుత్వం ప్రకటించిన 2,500 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులను 10వేల వరకు పెంచాలి.. ఉద్యోగాల భర్తీలో వయోపరిమితిని 35 ఏళ్లకు పెంచాలి.. జీఓ నెం.46ను వెంటనే రద్దు చేయాలంటూ డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం కోట కూడలి నుంచి మూడు లాంతర్లు, కన్యకాపరమేశ్వరి ఆలయం మీదుగా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం డీఆర్వో ఇ.సత్తిబాబుకు వినతిప్రతం అందజేశారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ సీహెచ్ హరీష్ మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఉద్యోగ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం, రెండేళ్లుగా నిరుద్యోగులకు నిరాశ కలిగించేలా తక్కువ పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందని విమర్మించారు. రాష్ట్రంలో సుమారు 19వేల పోలీసు పోస్టులు ఖాళీగా ఉన్నాయని మంత్రలే ప్రకటించారని, అలాంటిప్పుడు కేవలం 2,500 పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడం అన్యాయమన్నారు. గత కొన్నేళ్లేగా పోలీస్ నియామకాలు లేకపోవడంతో వేలాది మంది అభ్యర్థులు వయోపరిమితి దాటే పరిస్థితి ఏర్పడిందని, అందువల్ల వయోపరిమితిని 35 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువకుడు నవీన్ మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వేలాది మంది అభ్యర్థులు అద్దె గదుల్లో ఉంటూ, రీడింగ్ హాళ్లలో కష్టపడి చదువుతున్నారని, ప్రభుత్వం వారి పరిస్థితిని గుర్తించి న్యాయం చేయాలని కోరారు. డిమాండ్లు నెరవేర్చకపోతే భవిష్యత్తులో చలో విజయవాడ పేరుతో భారీ ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నిరుద్యోగ యువతతో పాటు డీవైఎఫ్ఐ నాయకులు, వందలాదిమంది నిరుద్యోగులు పాల్గొన్నారు. ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు 10 వేలకు పెంచాలి వయో పరిమితిని 35 ఏళ్లకు పెంచి.. జీఓ 46 రద్దు చేయాలి డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగుల ఆందోళన -
జగన్నాథుడికి పట్టువస్త్రాల సమర్పణ
నెల్లిమర్ల రూరల్: విశాఖలోని కొత్తరోడ్డులో కొలువైన జగన్నాథస్వామి వారికి రామతీర్థం శ్రీరామస్వామి దేవస్థానం తరఫున గురువారం పట్టువస్త్రాలు సమర్పించారు. ఏటా ఆషాడమాసంలో జరిగే స్వామివారి రథయాత్ర అనంతరం పది రోజుల పాటు జగన్నాథస్వామి దశావతారాల్లో భక్తులకు దర్శనమిస్తుంటారు. ఈ నేపథ్యంలో గురువారం రామావతారంలో స్వామిని అలంకరించగా.. సంప్రదాయబద్ధంగా ఆలయ ఈఓ వై శ్రీనివాసరావు, అర్చకులు అక్కడికి చేరుకుని పట్టువస్త్రాలు, పూజా సామగ్రి అందజేశారు. 26న రాష్ట్రస్థాయి జూనియర్స్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికలు విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న జూనియర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక పోటీలు ఈనెల 26న నిర్వహించనున్నట్టు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు లీలాకృష్ణ, శ్రీకాంత్ గురువారం తెలిపారు. ఆ రోజు ఉదయం 9 నుంచి నగర శివారుల్లో గల విజ్జీ స్టేడియం ప్రాంగణంలో ఎంపిక పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అండర్–14, 16, 18, 20 వయస్సుల విభాగాల్లో బాల, బాలికలకు రన్స్, త్రోస్, జంప్స్ అంశాల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను వచ్చేనెల 11 నుంచి 13వ తేదీ వరకు తిరుపతిలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. అర్హత, ఆసక్తి గల క్రీడాకారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ విజయనగరం అర్బన్: ఏపీఎస్ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) చేపట్టిన రెండవ దశ ఉద్యమంలో భాగంగా గురువారం స్థానిక డిపోలో విస్తృత సంతకాల సేకరణ కార్య క్రమం నిర్వహించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు డిపోలోని ప్రతి ఉద్యోగి ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని సంతకాలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ స్థానిక నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర జేఏసీ తీర్మానం ప్రకారం ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలని ఈ నెల 27 తేదీన కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రికి సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేస్తామన్నారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా కన్వీనర్ పీజీరాఫెల్, జి.రవికాంత్, కో–కన్వీనర్లు బి.రామారావు, సీహెచ్.శ్రీనివాసరావు, ఎ.చంద్రయ్యతో పాటు పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు, జేఏసీ భాగస్వాములు, డిపో సిబ్బంది పాల్గొన్నారు. ఎంతమందికి ఉద్యోగాలిచ్చారు బాబూ? విజయనగరం గంటస్తంభం: భోగాపురం విమానాశ్రయం కోసం భూములిచ్చిన రైతులకు ఎన్ని ఉద్యోగాలు కల్పించారో కూటమి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు వెల్లడించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఎల్బీజీ భవన్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రైతుల నుంచి భూములు తీసుకున్నప్పటికీ ఉపాధి, ఉద్యోగ హామీలు అమలు చేయలేదన్నారు. స్థానిక యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పించాలని, రైతులకు పూర్తి నష్టపరిహారం చెల్లించాలని కోరారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు రెడ్డి శంకరరావు పాల్గొన్నారు. -
వ్యాపారాలు ఢమాల్..!
కాపర్ రేటు పెరగడంతో మరమ్మతులు నిల్ ఫ్యాన్లు, మోటార్లు, కూలర్లకు వినియోగించే బేరింగుల్లో కాపర్ రేటు బాగా పెరిగిపోయింది. దీంతో వినియోగదారులు వివిధ మరమ్మతులను వాయిదా వేసుకుంటున్నారు. ఈ కారణంగా గతంతో పోల్చితే వ్యాపారం బాగా తగ్గింది. – కలిశెట్టి కృష్ణారావు, మెకానిక్, బొబ్బిలిగడచిన 15 సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నా. ఇప్పుడు బేరాలులేవు.మహిళలకు అవసరమైన పూసలు, గాజులు, రింగులు, కేశాలంకరణ, ముఖాలంకరణ వస్తువులకోసం జనం ఎగబడే వారు. చిన్నారుల నుంచి పెద్ద వాళ్ల వరకూ మహిళలు వచ్చీ పోయేవారు. కానీ ఇప్పుడు అలా లేదు. రుణం తీసుకుని వ్యాపారాలు చేస్తున్నా సరే ముందుకు సాగడం లేదు. రుణం పెంచి ఇవ్వాలని మెప్మావారిని కోరుకుంటున్నాం. – పి.కృష్ణవేణి, అలంకరణ వస్తువుల వ్యాపారం,బొబ్బిలి -
కమ్ముకున్న కరువు మేఘాలు..!
● కురవని వాన.. నిండని ప్రాజెక్టులు ● జూలై నెల చివరిలోనూ ముందుకు సాగని వరి ఉభాలు ● అస్తవ్యస్తంగా సాగునీటి కాలువలు ● బీడు భూములుగా పంట పొలాలు ● ఆ‘వెద’నలో రైతాంగం విజయనగరం ఫోర్ట్: జిల్లాలో కరువు మేఘాలు కమ్ముకున్నాయి. జిల్లాలోని 22 మండలాల్లో తీవ్ర వర్షాభావం నెలకొంది. విజయనగరం జిల్లా 27 మండలాలు ఉంటే అందులో 22 మండలాల్లో వర్షాభావం నెలకొనడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో పంటల సాధారణ విస్తీర్ణం 1, 23,608 హెక్టార్లు కాగా ఇప్పటి వరకు 22,115 హెక్టార్లలో మాత్రమే సాగయ్యాయి. ఇందులో వరి 9,305 హెక్టార్లు, మొక్కజొన్న 6,713, చోడి 25, కొర్ర 4, సామ 3, కంది 7, పెసర 15, మినుము 31, వేరుశనగ 70, నువ్వులు 2,367, పత్తి 1954, గోగు 110, చెరకు 1511 ఆదుకోవాలి.. జిల్లా వ్యాప్తంగా నారుమడులు, వెద పద్దతిలో వేసిన వరి పంట వర్షాలు లేక ఎండిపోతున్నాయి. బోర్లు ఉన్నచోట కొంతమంది రైతులు ఆయిల్ ఇంజిన్లు ద్వారా పంటను అష్టకష్టాలు పడి కాపాడుకుంటున్నారు. మిగిలిన చోట రైతులకు ఉచితంగా ప్రభుత్వం విత్తనాలను అందించి ఆదుకోవాలి. – బుద్దరాజు రాంబాబు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి -
కొనసాగుతున్న దస్తావేజు లేఖరుల సమ్మె
విజయనగరం రూరల్: రిజిస్ట్రేషన్ కార్యాలయాల ప్రైవేటీకరణను నిరసిస్తూ దస్తావేజు లేఖరులు చేపట్టిన సమ్మె బుధవారం కొనసాగింది. జిల్లాలోని 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద నిరవధిక సమ్మెచేస్తున్న దస్తావేజు లేఖరులు.. ప్రభుత్వం దిగివచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని పేర్కొన్నారు. 24న ‘మెగా పేరెంట్ టీచర్స్ మీట్’ ● కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి విజయనగరం అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ‘మెగా పేరెంట్–టీచర్స్ మీట్’ను ఈ నెల 24న జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించనున్నట్టు కలెక్టర్ ఎస్.రామసుందర్రెడ్డి తెలిపారు. ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థి అభ్యసన సా మర్థ్యాలు, ప్రోగ్రెస్ కార్డులు, హాజరు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై తల్లిదండ్రులకు సమగ్ర వివరాలు అందిస్తారు. పిల్లల చదువు, మార్కులు, హాజరును ఎప్పటి కప్పుడు ఫోన్లోనే తెలుసుకునే ‘లీప్’ యాప్ వినియోగంపై ప్రత్యక్ష అవగాహన కల్పిస్తారు. విద్యార్థులు రూపొందించిన సైన్స్ ప్రాజె క్టులు, కళా ఖండాలు, బోధన సామగ్రి (టీఎల్ఎం), సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఐటీఐలలో రెండో విడత ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం విజయనగరం అర్బన్: జిల్లాలోని 3 ప్రభుత్వ, 25 ప్రైవేటు ఐటీఐలలో రెండవ విడత ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అర్హులైన అభ్యర్థులు ‘ఐటీఐఅడ్మిషన్స్.ఏపీ.జీఓవీ.ఐఎన్/ఐటీఐ’ వెబ్సైట్లో ఆగస్టు 3వ తేదీ రాత్రి 11.55 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా కన్వీనర్, ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ టి.వి.గిరి తెలిపారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తర్వాత లభించే ‘యునిక్ నంబర్’తో ఆగస్టు 4న సాయంత్రం 6 గంటలలోపు దగ్గరలోని ప్రభుత్వ లేదా ప్రైవేటు ఐటీఐకి వెళ్లి ఒరిజనల్ సర్టిఫికెట్లతో వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలన్నారు. ఆగస్టు 6న ప్రభుత్వ ఐటీఐలు, 8న ప్రైవేటు ఐటీఐలు ప్రవేశ కౌన్సెలింగ్ నిర్వహిస్తాయని తెలిపారు. డ్రెస్ మేకింగ్, వెల్డర్, ప్లంబర్ ట్రేడ్లకు 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని, మిగిలిన అన్ని ట్రేడ్లకు 10వ తరగతి విద్యార్హతగా ప్రకటించారు. -
పెద్ద గెడ్డకు నీటి గండం..
పాచిపెంట: పెద్దగెడ్డ ఆయకట్టుకు నీటిగండం నెలకొంది. ఆశించిన వర్షాలు లేకపోవడంతో 12 వేల ఎకరాలకు సాగునీరు అందించే పరిస్థితి కనిపించడంలేదు. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 213.80 మీటర్లు కాగా ప్రస్తుతం 210.50 మీటర్లు ఉంది. నీటిమట్టం పెరిగితేనే పంటలకు ఊరట లభిస్తుందని, లేకుంటే నష్టం తప్పదని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి విడిచిపెట్టిన 50 క్యూసెక్కుల సాగునీరు ఎటూ సరిపోదని, ఆయకట్టుకు నీరు అందించాలంటే 150 క్యూసెక్కులు విడుదల చేయాల్సి ఉందని చెబుతున్నారు. వర్షాలు కురవకుంటే 15 రోజుల్లోనే జలాశయం డెడ్ స్టోరేజీకి చేరుకునే ప్రమాదం ఉందన్నారు. నారు మడులు ఎండిపోతున్నాయి... పెద్దగెడ్డ జలాశయంలో నీరు ఉన్నా పంటల సాగుకు సరిపోయినంత లేదు. వర్షాలు కురవడం లేదు. నారు మడులు ఎండిపోతున్నాయి. శివారు భూమలుకు చుక్కనీరు అందే పరిస్థితి కనిపించడంలేదు. – ఈదుబిల్లి సుదీర్ నాయుడు, రైతు, మిర్తివలస -
ఉత్తరాంధ్ర వికాసానికి రెక్కలు
● 1న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం ● జాతికి అంకితం చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీవిజయనగరం అర్బన్: భారతీయ విమానయాన రంగంలో మరో అద్భుత ఘట్టానికి వేళైంది. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ భోగాపురం వద్ద అత్యాధునిక హంగులతో నిర్మించిన ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ఆగస్టు 1న ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఈ విమానాశ్రయం కేవలం ఒక రవాణా కేంద్రంగానే కాకుండా ఉత్తరాంధ్ర ప్రాంత ఆర్ధిక ప్రగతికి, పారిశ్రామిక విప్లవానికి, స్థానిక ఉపాధి అవకాశాల సృష్టికి ప్రధాన చోదక శక్తిగా నిలవనుంది. చట్టబద్ధ అనుమతులు పూర్తి ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం అనంతరం తక్షణమే వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించేందుఉ వీలుగా అన్ని కీలక ఆమోదాలు లభించాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి ఏరోడ్రోమ్ లైసెన్స్, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) ఆమోదాలు, ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్, కస్టమ్స్ నోటిఫికేషన్లు, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) క్లియరెన్సులు పూర్తయ్యాయి. ప్రాంతీయ, రహదారి అనుసంధానం ఈ ఎయిర్పోర్ట్ కేవలం విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకే కాకుండా దక్షిణ ఒడిశా, ఛత్తీస్గఢ్ సరిహద్దు జిల్లాల ప్రజలకు ప్రధాన విమానయాన కేంద్రంగా మారనుంది. ప్రయాణికులు సులభంగా విమానాశ్రయానికి చేరుకునేందుకు విశాఖపట్నం నుంచి 7 అప్రోచ్ రోడ్లతో కూడిన అధునాతన హైవే కనెక్టివిటీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే సిద్ధం చేశాయి. ఇన్నాళ్లూ వెనుకబడిన జిల్లాగా ఉన్న విజయనగరం..ఈ విమానాశ్రయం ఏర్పాటుతో రాష్ట్రానికే వెన్నెముక జిల్లాగా మారి సరికొత్త అభివృద్ధి బాటలో పయనించనుంది.ప్రపంచ స్థాయి మౌలిక వసతులు ప్రముఖ జీఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రపంచ స్థాయి సౌకర్యాలతో రూపుదిద్దుకుంది. భారీ విమానాలు సైతం సులభంగా రాకపోకలు సాగించేలా 3,800 మీటర్ల పొడవుగల ‘కోడ్ 4 ఈ’ రన్వేను సిద్ధం చేశారు. మొదటి దశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించేలా ఈ ఎయిర్పోర్టును రూపొందించగా భవిష్యత్తులో దశలవారీగా 4 కోట్ల మందికి పైగా సేవలు విస్తరించేలా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. స్థానిక వ్యాపార, పారిశ్రామిక ఎగుమతులకు ఊతమిచ్చేలా ప్రత్యేకా కార్గో టెర్మినల్ సదుపాయాలు కల్పించారు. -
ఎయిర్పోర్ట్పై జిల్లా స్థాయి పోటీలు
విజయనగరం అర్బన్: భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభాన్ని పురస్కరించుకుని జిల్లాలోని పాఠశాల, కళాశాల విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు వివిధ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అఽధికారి యూ.మాణిక్యంనాయుడు తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ‘అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్’ ప్రధాన అంశంగా ఈ పోటీలను మూడు స్థాయిలో నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వ్యాసరచన పోటీ: అంశం ‘అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్: ఎ గేట్వే టు గ్రోత్ అండ్ గ్లోబల్ ఆపర్ుట్యనిటీస్’, వక్తృత్వ పోటీ (ఎలక్యూషన్): అంశం ‘అల్లూరి సీతారామ రాజు ఎయిర్పోర్ట్: జ్యూవెల్ ఆఫ్ ఉత్తరాంధ్ర’, చిత్రలేఖనం (పెయింటింగ్): అంశం ‘అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్’, ట్యాగ్లైన్ (స్లోగన్) పోటీ: అంశం: అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్పై ఒక వాక్యంలో ఆకర్షణీయమైన ట్యాగ్లైన్ రాయడం. పోటీల నిర్వహణ విధానంఅన్ని ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో ముందుగా పోటీలు నిర్వహిస్తారు. ఇక్కడ ప్రతిభ చూపిన విద్యార్ధులను మండల స్థాయికి ఎంపిక చేస్తారు. ఇక్కడ విజేతలుగా నిలిచిన వారికి మండల కేంద్రాల్లో పోటీలు నిర్వహిస్తారు. మండలస్థాయిలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులకు జిల్లా కేంద్రమైన విజయనగరంలో తుది పోటీలు నిర్వహించి విజేతలను ప్రకటిస్తారు. విమానాశ్రయం ద్వారా లభించే అభివృద్ది అవకాశాలపై స్థానిక యువతకు అవగాహన కల్పించేందుకు ఈ పోటీలను ఏర్పాటు చేసినట్లు డీఈఓ తెలిపారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలు, కళాశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్ చొరవ తీసుకుని విద్యార్థులు అధిక సంఖ్యలో పోటీల్లో పాల్గొనేలా చూడాలని డీఓఓ కోరారు. డీఈఓ యూ.మాణిక్యంనాయుడు వెల్లడి -
అందని మడ్డువలస నీరు
వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు నుంచి ఇప్పటికీ సాగునీరు అందలేదు. ఉభాల సమయం మించిపోతున్నా సాగునీరు అందకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని 9 మండలాల్లో 31వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. గత ఏడాది జూన్ నెలాఖరు నాటికి సాగునీరు విడుదల చేయగా... ఈ ఏడాది జూలై చివరి వారం వస్తున్నా సాగునీటి సరఫరాను అధికారులు చేపట్టలేదు. గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 64.62 మీటర్లు లెవెల్ నీటిమట్టం నమోదైంది. ఈ లెక్కన 3.30 టీఎంసీల నీరు ప్రాజెక్టులో నిలువ ఉంది. ఈ ఏడాది అదే సమయానికి ప్రాజెక్టులో 62.28 మీటర్ల నీటిమట్టం నమోదు కాగా, 1.25 టీఎంసీల నీరు మాత్రమే నిలువ ఉంది. గత ఏడాది ఈ సమయానికి 25వేల ఎకరాలకు సాగునీరందించగా ప్రస్తుతం 550 ఎకరాలకు మాత్రమే సాగునీరు సరఫరా చేస్తున్నారు. వంగర మండలంలోని తోటపల్లి ప్రాజెక్టు ఆయకట్టు భూములకూ సాగునీరు అందడంలేదు. గత ఏడాది ఈ సమయానికి 6,900 ఎకరాలకు సాగునీరు అందగా, ఈ ఏడాది 1800 ఎకరాలకు సాగునీటిని సరఫరా చేశారు. వర్షాభావం, సాగునీరు అందక కె.కొత్తవలస, కొప్పర, మద్దివలస, ఎం.సీతారాంపురం, కొండచాకరాపల్లి, వంగర, తలగాం, రుషింగి, శివ్వాం తదితర గ్రామాల్లో వరి వెదలు ఎండిపోతున్నాయి. ప్రస్తుతం మడ్డువలస ప్రాజెక్టు వద్ద 62.28 మీటర్ల మేర ఉన్న సాగునీరు సాగు కష్టమే.... వర్షాలు పుష్కలంగా కురవకపోతే మడ్డువలస ప్రాజెక్టు నుంచి నీటి సరఫరా కష్టమే. గత ఏడాది ఈ సమయానికి సగానికి పైగా దమ్ములు పూర్తయ్యాయి. ఈ ఏడాది ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో ఒక్క ఎకరా నాట్లు వేయలేదు. – బూరాడ వెంకటరావు, రైతు, మడ్డువలస, వంగర మండలం సాగునీటికి కటకట ఈ ఏడాది తోటపల్లి ప్రాజెక్టును నమ్ముకొని పంటలను సాగుచేస్తే సాగునీరు అందడంలేదు. వర్షాలు కురవకపోతే రైతులు పంట కోల్పోవలసిన పరిస్థితి. రైతులకు వలసలు తప్పేలా లేవు. – గుడివాడ గౌరునాయుడు, తోటపల్లి ఆయకట్టు రైతు, కె.కొత్తవలస, వంగర మండలం -
సాదాసీదాగా సర్వసభ్య సమావేశం
సాలూరు: మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రాములమ్మ అధ్యక్షతన, ఎంపీడీఓ పార్వతి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశం సాదాసీదాగా జరిగింది. సమావేశానికి పలుశాఖల అధికారులు గైర్హాజరయ్యారు.మండలంలో నకిలీ ఎరువులు అధికమయ్యాయని దీనిపై అధికారులు దృష్టిసారించి, చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరారు. నాణ్యమైన ఎరువులు రైతులకు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామాల్లో ఇళ్లపై నుంచి కరెంట్ వైర్లు వెళ్తున్నాయని దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్థానికంగా పలు సమస్యలపై చర్చించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రెడ్డి సురేష్, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
అరకొరగా సాగునీరు
గరుగుబిల్లి: తోటపల్లి ప్రాజెక్టు ఆయకట్టుకు అరకొర సాగునీరు అందుతోంది. ప్రాజెక్టులో 105 అడుగులకు 104.69 అడుగుల నీటి మట్టం ఉంది. ఎడమ కాలువ పరిధిలో 32,200 ఎకరాలకు 404క్యూసెక్యుల నీటిని విడిచి పెట్టాల్సి ఉంగా ప్రస్తుతం 320 క్యూసెక్యుల నీటిని విడిచిపెడుతున్నారు. కుడి కాలువలో 9,600 ఎకరాలకు 106 క్యూసెక్యుల నీటిని విడిపెట్టాల్సి ఉన్నప్పటికీ 80 క్యూసెక్యుల నీటిని విడిచిపెడుతున్నారు. కాలువలు నిర్వహణ సరిగా లేకపోవడంతో శివారు భూములకు సాగునీరు చేరడంలేదు. -
అంగన్వాడీల్లో నిర్లక్ష్యానికి తావులేదు
పార్వతీపురం: అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లో జరిగిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిల్లల బరువు, ఎత్తు, గ్రోత్ వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని, తప్పుడు వివరాలు నమోదుచేస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇకపై అన్ని నివేదికలు ఈ–ఆఫీస్, గూగుల్ ఫార్మ్స్ లేదా ఎకై ్సల్ ద్వారా మాత్రమే సమర్పించాలని, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల హాజరు, పరిశుభ్రత, పోషకాహారం, తాగునీరు, టాయిలెట్ల సౌకర్యం, ప్రీ–స్కూల్ కార్యకలాపాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. వచ్చే సమీక్ష నాటికి అన్ని లక్ష్యాలను శతశాతం పూర్తిచేయాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలు ఎ+ గ్రేడ్ సాధించేలా అధికారులు కృషిచేయాలని, ఆహారపు అలవాట్లలో మార్పు ప్రతి ఇంటి నుంచి ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు. అలాగే డిజిటల్ హెల్త్ ఐడీలు(అభా), పోషణ్ ట్రాకర్, కిశోరీ వికాసం కార్యక్రమాలను వేగవంతం చేసి గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ టి.కనకదుర్గ, డీఆర్డీఏ పీడీ ప్రభావతి, జిల్లా ఎన్సీడీ పీఓ డా.టి.జగన్మోహన్, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి -
ీపీఎం పర్యటన ఏర్పాట్లు ముమ్మరం
● పర్యవేక్షించిన కలెక్టర్ రాంసుందర్ రెడ్డి పూసపాటిరేగ: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి ఆగస్టు 1న ప్రధాని నరేంద్రమోదీ విచ్చేస్తున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లు ముమ్మరం అయ్యాయి. కలెక్టర్ రాంసుందరరెడ్డి ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. ముందుగా ప్రధాని పాల్గొనే బహిరంగ సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. అక్కడ వేదిక ఏర్పాట్లు, వివిధ గ్యాలరీలు, మీడియా సెంటర్, గ్రీన్ రూమ్స్ తదితర వాటి గురించి సంబంధిత అధికారులతో చర్చించారు. అనంతరం వీఐపీ వాహనాల పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. వాహనాల రాకపోకలపై ఆరా తీశారు. ట్రాఫిక్కు ఎక్కడా అంతరాయం కలగకుండా చూడాలని, పటిష్టమైన ప్రణాళికతో ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ స్థలాలు ఖరారు చేయాలని ఆదేశించారు. అంతకుముందు టెర్మినల్ భవనాన్ని కలెక్టర్ పరిశీలించి కంట్రోల్ రూమ్ భవనాన్ని ఖరారు చేశారు. ఈ పర్యటనలో జేసీ సేతుమాధవన్, జీసీసీ ఎం.డి. ఎస్.ఎస్.శోభిక, ట్రైనీ ఐఏఎస్ హరిఓంపాండ్య, జీఎంఆర్ ప్రాజెక్టు హెడ్ రామరాజుతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 2 వేల బస్సుల ఏర్పాటు విజయనగరం అర్బన్: భోగాపురంలోని ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభ కార్యక్రమానికి ప్రజారవాణా కోసం 2 వేల బస్సులను అందుబాటులో ఉంచుతున్నామని ఆర్టీసీ విజయనగరం జోన్ ఈడీ విజయగీత తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సంబంధిత జిల్లాల ప్రజారవాణా అధికారులు, డిపో మేనేజర్లు, మెకానికల్ విభాగ అధికారులతో ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించింది. సభకు వచ్చే ప్రజలకు రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై అఽధికారులకు ఆమె స్పష్టమైన సూచనలు చేశారు. సభా ప్రాంగణం వద్ద పార్కింగ్ ప్రదేశాలను సీనియర్ అధికారులు, డిపో మేనేజర్లు స్వయంగా పర్యవేక్షిస్తారన్నారు. కేటాయించిన బస్సులను ముందస్తుగా తనిఖీ చేసి, పూర్తి కండిషన్లో ఉన్న వాహనాలనే నడపాలని ఆదేశించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్ల పరిశీలన పూసపాటిరేగ: జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లను కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి సమీర్ కుమార్ సిన్హా బుధవారం సాయంత్రం పరిశీలించారు. టెర్మినల్ భవనం, రన్ వే, బహిరంగ సభా ప్రాంగణాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. -
వర్షపు నీటితో సాగునీటి ప్రాజెక్టులు కళకళలాడుతూ.. వరి ఉభాలు ముమ్మరంగా సాగాల్సిన సమయంలో పంట పొలాలు బీడు భూములుగా దర్శనమిస్తున్నాయి. కొన్నిచోట్ల వరి వెదలు జల్లినా ఎండిపోతున్నాయి. వరి నారు మడులను బిందెలతో నీటిని తీసుకెళ్లి తడపాల్సిన దుస్థితి. వర్షాభావంతో సాగు
వీడని జంఝాటం కొమరాడ: ఒడిశాతో ఉన్న వివాదంతో జంఝావతి ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు జంఝాటం తప్పడం లేదు. వైఎస్సార్ హయాంలో ఆస్ట్రియా టెక్నాలజీతో నిర్మించిన రబ్బర్ డ్యాం వల్ల 12వేల ఎకరాలకే సాగునీరు అందుతోంది. పార్వతీపురం, కొమరాడ, గరుగుబిల్లి, మక్కువ, సీతానగరం మండలాల పరిధిలోని 75 గ్రామాల్లో మరో 12వేల ఏకరాలకు సాగునీరు అందని పరిస్థితి. రెండుచోట్ల కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా సమస్య పరిష్కారానికి చొరవ చూపకపోవడం రైతులకు శాపంగా మారింది. -
ఎయిర్పోర్ట్పై స్లోగన్ రాసి రూ.లక్ష గెలుచుకోండి
విజయనగరం అర్బన్: భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని మార్చే ఈ విమానాశ్రయ ప్రారంభ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేయడంలో భాగంగా అందరినీ ఆకట్టుకునేలా ‘స్లోగన్’ పోటీని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి తెలిపారు. తెలుగులో ఉత్తమమైన స్లోగన్ను రూపొందించి పంపిన విజేతకు రూ.లక్ష నగదు బహుమతి అందజేయనున్నట్లు ఆయన ప్రకటించారు. పోటీ నిబంధనలు ఇలా ఉన్నాయి. 6వ తరగతి నుంచి డిగ్రీ చదువుతున్న విద్యార్థులందరూ ఈ పోటీలో పాల్గొనవచ్చు. స్లోగన్ సృజనాత్మకంగా సంక్షిప్తంగా ఉండాలి. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై విమానాశ్రయం చూపే ప్రభావం, ఆశయాలు, దాని ప్రత్యేకత, గొప్పదనాన్ని ప్రతిబింబించేలా స్లోగన్ శైలి ఉండాలి. విద్యార్థులు తాము తయారు చేసిన స్లోగన్తోపాటు తమ పేరు, చదువు, చిరునామా, సెల్ఫోన్ నంబర్ తదితర వివరాలను తప్పనిసరిగా జతపరచాలి. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు పంపించాల్సి ఉంటుంది. ఈ మెయిల్ ‘ఎయిర్పోర్ట్స్లోగన్.జీమెయిల్.కాం’కి కానీ వాట్సాప్ నంబర్ ‘9440749687’కు కానీ పంపాలి. వివిధ దశల్లో ప్రభుత్వ పరిశీలన అనంతరం అత్యంత ఉత్తమంగా ఎంపికై న ఒక్క స్లోగన్కు మాత్రమే నగదు బహుమతి అందజేస్తారు. ఒక వేళ ఏ స్లోగన్ ఎంపిక కాకపోతే ఎటువంటి బహుమతులు ఉండవని కలెక్టర్ స్పష్టం చేశారు. విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ పోటీలో పాల్గొని తమ సృజనాత్మకతను చాటుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి -
పూడుకుపోయిన కాలువలు
మెంటాడ: లోగుగెడ్డ ప్రాజెక్టు కాలువలు పూడికలతో నిండిపోవడం రైతులకు శాపంగా మారింది. సాగునీరు విడుదల చేసినా ఆయకట్టుకు అందని పరిస్థితి. ఎడమ ప్రధాన కాలువ నుంచి సుమారు 4,630 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందాలి. రిజర్వాయర్ నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఈ కాలువ ఐదున్నర అడుగుల లోతుకు, ఐదు అడుగుల మేర పూర్తిగా మట్టి, ఇసుక, పిచ్చిమొక్కలతో పూడుకుపోయింది. దీంతో నీరు ముందుకు కదిలే పరిస్థితి లేదు. ప్రధాన కాలువ నుంచి విడిపోయే ఆర్ఎల్–1 కాలువ పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ఉన్నతాధికారులు స్పందించి ప్రాజెక్టు పరిధిలోని కాలువలను బాగుచేయాలని రైతులు కోరుతున్నారు. -
త్వరలో 314 మంది కార్యకర్తల పోస్టుల భర్తీ
బొబ్బిలి: జిల్లాలో ఖాళీగా ఉన్న 314 మంది అంగన్వాడీ కార్యకర్తల నియామకాలను మరికొద్ది రోజుల్లో ప్రారంభిస్తామని ఐసీడీఎస్ పీడీ కె.వి.బాలామణి అన్నారు. బొబ్బిలి పట్టణంలోని ఐసీడీఎస్ కార్యాలయంలో బాల్యవివాహాల నిరోధం అమలుపై బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మట్లాడారు. బాల్యవివాహ రహిత జిల్లాగా మార్చడమే మనముందున్న లక్ష్యంగా భావించాలన్నారు. అనంతరం విలేకర్లతో ఆమె మాట్లాడుతూ జిల్లాలో 2,500 అంగన్వాడీ కేంద్రాల్లో ఫేషియల్ యాప్ ఆధారంగా మెనూ అమలు చేస్తున్నామన్నారు. అంగన్వాడీ కేంద్రాల నుంచి 4,374 మంది పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించామని తెలిపారు. జిల్లాలో 99 సూపర్ వైజర్ పోస్టులుండగా ఇందులో 40 పోస్టులను భర్తీ చేయాల్సి ఉందన్నారు. సమావేశంలో సీడీపీఓ జె.విజయలక్ష్మి, ఎంపీడీఓ పోతుల రవికుమార్, ఎంఈఓ గొట్టాపువాసు, బొబ్బిలి, బాడంగి వైద్యులు భరధ్వాజ్, సాయి కుమార్, వన్స్టాప్ సెంటర్ కేస్ వర్కర్ అనిత, తదితరులు పాల్గొన్నారు. మేం చనిపోతే వచ్చేదేం లేదు... కార్యకర్తలుగా తాము పలు యాప్లను ఫాలో అవుతూ వివరాలను అప్లోడ్ చేస్తున్నామని, కానీ మేం పని ఒత్తిడి, అనారోగ్యంతో మృతి చెందితే మాకు ఏం వస్తుందని పీడీ బాలామణిని సంఘం వీధి కార్యకర్త శ్రీదేవి ప్రశ్నించారు. ఇటీవల ఓ కార్యకర్త చనిపోతే తాము పరామర్శకు వెళ్లామని, అక్కడి వారు అమ్మా మీరు కూడా అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నారు కదా.. ఏమైనా వస్తుందా అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేకపోయామన్నారు. అది ప్రభుత్వ పాలసీ అని, శాఖాపరంగా ఏదేని సమస్య ఉంటే తాను పరిష్కరిస్తానని పీడీ అనడంతో కార్యకర్తలంతా నిర్వేదనకు గురయ్యారు. -
ఫిష్ ఆంధ్ర షాపులపై కూటమి కినుక!
● గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో 72 షాపుల ఏర్పాటు ● ప్రోత్సాహం లేకపోవడంతో దాదాపు 20 షాపులు మూత విజయనగరం ఫోర్ట్: నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం, చేపల వినియోగం పెంచాలన్న ఉద్దేశంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఫిష్ ఆంధ్ర షాపులను ఏర్పాటు చేసింది. వీటిపై రెండేళ్లుగా కూటమి సర్కారు నిర్లక్ష్యం చూపుతోంది. కొత్త షాపుల ఏర్పాటుకు ప్రోత్సాహం లేదు. ఉన్నదుకాణాలు మూతపడుతున్నా పట్టించుకోవడం లేదు. జిల్లాలో సముద్రతీర ప్రాంతం 24 కిలోమీటర్లు ఉంది. మైదాన ప్రాంతంలో చెరువులు, సాగునీటి ప్రాజెక్టులు అధికంగానే ఉన్నాయి. చేపలవేటే ఆధారంగా మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారు. వీరు వేట సాగించిన చేపలు దళారులకు తక్కువ ధరకే అమ్మేవారు. దీనికి చెక్చెబుతూ మత్స్యకారులే చేపల విక్రయించుకునేందుకు వీలుగా గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఫిష్ ఆంధ్ర షాపులను అందుబాటులోకి తెచ్చింది. స్థలంతోపాటు దుకాణాల ఏర్పాటుకు నిర్వాహకుడు 10 శాతం చెల్లిస్తే 40 శాతం రాయితీ, 50 శాతం బ్యాంకు రుణం కింద ఆర్థిక సాయం అందజేసేది. దీనివల్ల అటు మత్స్యకారులు చేపలు విక్రయించుకునేందుకు అవకాశం ఉండేది. ఇటు వినియోగదారులకు తక్కువ ధరకే చేపలు లభించే పరిస్థితి. జిల్లాలో 72 షాపుల ఏర్పాటు... జిల్లాలో 72 ఫిష్ ఆంధ్ర షాపులను గత ప్రభుత్వ హయాంలో మత్స్యకారులు ఏర్పాటుచేశారు. రూ.60 వేలు నుంచి రూ.3.30 లక్షల యూనిట్ విలువ కలిగిన షాపులు ఉన్నాయి. ఈ షాపుల ఏర్పాటుకు అప్పట్లో ప్రభుత్వం రూ.40 లక్షల వరకు రాయితీ ఇచ్చింది. అయితే, టీడీపీ సర్కార్ ఫిష్ ఆంధ్రషాపుల నిర్వహణను పట్టించుకోవడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని మత్స్యశాఖ డీడీ లావణ్య వద్ద ప్రస్తావించగా గతంలో 72 ఫిష్ఆంధ్ర దుకాణాలు ఉండేవని, ఇప్పుడు 15 నుంచి 20వరకు మూతపడ్డాయన్నారు. -
అరాచక పాలనపై.. మహిళల ఆగ్రహం
విజయనగరం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి మహిళలకు భద్రత కరువైందని, నిత్యం జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలను అరికట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్సీపీ జిల్లా మహిళా విభాగం నాయకులు ధ్వజమెత్తారు. పార్టీ అధినేత వై.ఎస్.జగనన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విజయనగరం జిల్లా కేంద్రంలో మంగళవారం ఆందోళన చేశారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా ప్రభుత్వానికి పట్టకపోవడం శోచనీయమన్నారు. ఆడబిడ్డల జోలికొస్తే ఆదే లాస్ట్ డే చేసిన ప్రకటనలు డ్రామాలకే పరిమితామయ్యారా... అంటూ నిలదీశారు. మహిళలపై జరుగుతున్న అకృత్యాలు అధికారంలో ఉన్న పాలకులకు ఎందుకు పట్టడం లేదని ప్రశ్నించారు. అరాచక పాలనకు నిరసనగా విజయనగరం మహారాజా సంగీత, నృత్య కళాశాల ప్రాంగణం నుంచి బాలాజీ కూడలి వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అక్కడి బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు సర్కారుకు రాజ్యాంగ విలువలు పాటించేలా సద్బుద్ధిని ప్రసాదించాలని వినతిపత్రం అందజేశారు. సోషల్ మీడియాలో ప్రభుత్వ తీరును విమర్శిస్తూ పోస్టులు పెడితే కేసులు నమోదును ప్రోత్సహిస్తున్న చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లు... మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడంలేదంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. సీఎం చంద్రబాబు డౌన్ డౌన్... మహిళలకు భద్రత కల్పించాలంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీలు రాజేశ్వరి, వల్లిరెడ్డి శిరీష, శాంతకుమారి, చీపురుపల్లి ఎంపీపీ ఇప్పిలి వెంకటనరసమ్మ, గరివిడి ఎంపీపీ మీసాల విజయలక్ష్మి, రాష్ట్ర అంగన్వాడీ కార్యదర్శి బెవర ఉమాకుమారి, అంగ ఆంధ్రప్రదేశ్లో బ్రిటిష్ కాలంనాటి పాలన ఊరికో సైకోను తయారు చేస్త్తున్న పచ్చచొక్కా దండు ఆడబిడ్డల జోలికొస్తే ఆదే లాస్ట్ డే అంటూ చేసిన ప్రకటనలు డ్రామాలకే పరిమితామా..? రెండేళ్ల ప్రభుత్వ పాలనలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలు పట్టవా..? వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో కదం తొక్కిన మహిళలు జిల్లా కేంద్రంలోని బాలజీ కూడలిలో నిరసన రాజ్యాంగ విలువలు కాపాడేలా మంచి బుద్ధిని ప్రసాదించాలంటూ అంబేడ్కర్ విగ్రహానికి వినతి -
మహిళల భద్రత ప్రశ్నార్ధకం
రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. మహిళలు ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మహిళలపై దాడులు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. వాటిని నిరోధించడంలో ప్రభుత్వం ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదు. ఇక పోలీస్ యంత్రాంగం పూర్తిగా అధికార పార్టీ తొత్తుగా మారిపోవడం దురదృష్టకరం. ఇటీవల గుంటూరు, బద్వేలు తదితర ప్రాంతాల్లో మహిళలను వివస్త్రలను చేసి అవమానించిన అమానవీయ ఘటనలు రాష్ట్రంలో దారుణ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. నాగరిక సమాజానికే మాయని మచ్చగా నిలుస్తాయి. మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థలు, మహిళా పోలీస్ స్టేషన్లు, హెల్ప్లైన్లు, పెట్రోలింగ్ బృందాలు సమర్థవంతంగా పని చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మహిళలకు భరోసా కల్పించాలి. – బొత్స అనూష, వైఎస్సార్సీపీ మహిళా విభాగం నాయకురాలు -
24న మడ్డువలస నీరు విడుదల
వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువకు ఈ నెల 24న సాగునీటిని విడుదల చేస్తామని డీఈ పి.అర్జున్ మంగళవారం తెలిపారు. ఆయకట్టు పరిధిలోని 24,877 ఎకరాలకు సాగునీటిని అందిస్తామని వెల్లడించారు. స్టేజ్–1లో వంగరలో 996, రేగిడిలో 6,777, సంతకవిటిలో 10,976, శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలంలో 6,029, పొందూరు మండలంలో 99 ఎకరాలకు సాగునీరు సరఫరా చేస్తామని పేర్కొన్నారు. మహాలక్ష్మిగా సుభద్రాదేవి విజయనగరం టౌన్: జగన్నాథుడి రథయాత్రలో భాగంగా ఆరోరోజు నిర్వహించిన హీరాపంచమి వేడుకలు హుకుంపేటలోని గుండిచా ఆలయంలో వైభవంగా నిర్వహించారు. సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథస్వామి శ్రీరామకృష్ణ అవతారంలో మంగళవారం భక్తులకు దర్శనమిచ్చారు. సుభద్రాదేవిని మహాలక్ష్మి రూపంగా భావిస్తూ 160 పట్టుచీరలతో అత్యంత మనోహరంగా అలంకరించారు. ఆలయ ధర్మకర్తలు వెంకటేశ్వరప్రసాద్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు మహా అన్నప్రసాద సంతర్పణ చేశారు. ఇజ్రాయిల్లో ఉద్యోగావకాశాలు● ఎస్సీ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ విజయనగరం అర్బన్: జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల సహకార ఆర్థిక సంస్థ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను చేపడుతోందని జిల్లా ఎస్సీ సేవా సహకార సంస్థ కార్యనిర్వహక సంచాలకు (ఈడీ) వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇజ్రాయిల్లో ఉన్న ‘హోమ్ బేస్డ్ కేర్ గివర్’ ఉద్యోగాలకు జీడీఏ, ఏఎన్ఎం, జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ లేదా పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన విద్యార్హతతో 25 నుంచి 45 సంవత్సరాల వయోపరిమితి ఉన్న అభ్యర్థులు అర్హులని. ఎంపికై న అభ్యర్థులకు ఇంటర్మీడియట్ స్థాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఇజ్రాయిల్ పంపనున్నట్లు తెలిపారు. అక్కడ నెలకు సుమారు రూ.1,99,770 వరకు సంపాదించే అవకాశం లభిస్తుందన్నారు. ఇతర నైపుణ్య శిక్షణ కోర్సుల్లో కిసాన్ డ్రోన్ ఆపరేటర్/డ్రోన్ సర్వీస్ టెక్నిషియన్, అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, సోలార్ పీవీ.ఇన్స్టాలర్, బూటీథెరపిస్ట్, ప్లంబింగ్ జనరల్ వంటివి ఉన్నాయని వాటికి 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్హత ఉండాలని చెప్పారు. ఈ శిక్షణ కార్యక్రమాలను డీఆర్డీఏ, పరిశ్రమల శాఖ, వ్యవసాయ, మత్స్య, పశుసంవర్థక, ఉద్యానవన శాఖ సమన్వయంతో అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆపన్న హస్తం వేపాడ: మండలంలోని బల్లంకి గ్రామానికి చెందిన కోట సాయిలక్ష్మి (23) పేస్మేకర్ సమస్య శస్త్రచికిత్సకు అమెరికాలో స్థిరపడిన 1987 ఇంజినీరింగ్ ఉద్యోగులు రూ.ఐదు లక్షలు ఆమె ఖాతాకు జమచేసి మానవత్వం చాటుకున్నారు. సాయిలక్ష్మికి చిన్నవయస్సులోనే గుండెకు రంధ్రం పడడంతో 2005లో శస్త్రచికిత్స చేశారు. నాటి నుంచి నేటికి పలుమార్లు పేస్మేకర్స్ అమర్చడంతో జీవనం సాగిస్తోంది. ఇటీవల పేస్మేకర్లో సాంకేతిక లోపంతో పనిచేయకపోవడంతో ప్రాణాపాయం తలెత్తింది. నాణ్యమైన పేస్మేకర్ అమర్చేందుకు లక్షల్లో ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో సాయిలక్ష్మి తండ్రి శ్రీనివాసరావు వివిధ ప్రచారమాధ్యమాల్లో సాయం అర్ధించారు. దీనికి స్పందించి సాయం చేసిన ఎన్ఆర్ఐలకు బాధితురాలుతోపాటు తల్లి దండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. -
పార్వతీపురం యువకుడికి కరోనా
● విశాఖ కేజీహెచ్లో ప్రత్యేక ఐసోలేషన్లో చికిత్స పార్వతీపురం రూరల్: మన్యం జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువకుడు ఉపాధి నిమిత్తం విశాఖ నగర శివార్లలోని పెందుర్తి ప్రాంతంలో సముద్రపు చేపలకు సంబంధించిన వ్యాపార సంస్థలో కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా మలేరియా జ్వరంతో బాధపడుతున్న యువకుడికి ఎంతకూ జ్వరం తగ్గకపోవడంతో మెరుగైన వైద్యం కోసం విశాఖలోని కింగ్ జార్జ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు యువకుడి రక్త నమూనాలు సేకరించి వైరాలజీ ల్యాబ్లో పరీక్షించగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు విశాఖ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి అధికారికంగా తెలిపారు. ప్రస్తుతం ఆ యువకుడిని కేజీహెచ్లోని ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యవర్గాలు వెల్లడించాయి.ఈ ఘటనపై అధికారులు చేపట్టిన దర్యాప్తులో బాధితుడు పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ, దాదాపు ఏడాది కాలంగా సొంత గ్రామానికి రాలేదని తేలింది. ఈ నేపథ్యంలో మంగళవారం తలెత్తిన పలు అనుమానాలపై స్పందించిన మన్యం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.. ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లాలో ఎలాంటి కరోనా కేసులు లేవని స్పష్టం చేశారు. -
మృత్యు పిడుగు
● పిడుగు పాటుకు రైతు మృతి ● పొలంలో కూలీలతో కలిసి కలుపుతీస్తుండగా ఘటన ● ఇంటి పెద్ద మృతితో శోకసంద్రంలో కుటుంబం మృతుడు కృష్ణమూర్తిసంతకవిటి: మండలంలోని మంతిన పంచా యతీ మల్లయ్యపేట గ్రామంలో మంగళవారం ఓ మోస్తరు వర్షం కురవడంతో పాటు పిడుగు పడడంతో మూల కృష్ణమూర్తి(65) అనే రైతు మరణించాడు. ఆయన ఉదయం 10 గంటల సమయంలో తన పొలంలో ఐదుగురు మహిళలతో కలిసి వరి వెదలో కలుపు తీసే పనికి వెళ్లాడు. అందరూ పనిలో నిమగ్నమయ్యారు. మధ్యాహ్నం భోజనం చేశాక మళ్లీ పనిలో చేరారు. సాయంత్రం మేఘాలు ఆవరించడంతో వర్షం కురిస్తే వరి పైరుకు మేలు జరుగుతుందనుకున్నారు. ఇంతలో పెద్ద శబ్దంతో పిడుగు కృష్ణమూర్తిని తాకింది. అంతే... పక్కనే పనిచేస్తున్న మహిళలు భీతిల్లిపోయారు. ఒడ్డుకు పరుగుతీశారు. కొంతసమయం తర్వాత తేరు కుని రైతు వద్దకు వెళ్లారు. అప్పటికే ఆయన మృతిచెందడంతో కన్నీరుపెట్టారు. మృతుడికి ఇద్దరు కుమారుల్లో ఒకరు ఎస్సైగా, మరొకరు ఎలక్ట్రికల్ ఏఈగా ఉద్యోగం చేస్తున్నారు. -
ప్రధాని పర్యటనకు పక్కా ఏర్పాట్లు చేయాలి
● కలెక్టర్ రాంసుందర్రెడ్డి పూసపాటిరేగ: భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభించేందుకు వచ్చేనెల 1వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రానున్నారని, ఆయన పర్యటనకు పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రధాన మంత్రి రూట్మ్యాప్, సభా స్థల వివరాలు, పార్కింగ్ ప్రదేశాలకు చెందిన రూట్మ్యాప్, పబ్లిక్ హోల్డింగ్ పాయింట్లను పవర్పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఈవెంట్ మేనేజ్మెంట్ ప్రతినిధులకు కలెక్టర్ ఎం.రాంసుందర్రెడ్డి మంగళవారం వివరించి తగు సూచనలు చేశారు. విమానాశ్రయం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో తగు సూచనలు చేశారు. వీఐపీలు పార్కింగ్ స్థలం నుంచి వేదికకు వచ్చే మార్గంలో రెండంచెల బారికేడ్లు అమర్చాలని జీఎంఆర్ ప్రతినిధులకు సూచించారు. ప్రధానికి స్వాగత కార్యక్రమంలో పాల్గొనే కళాకారులు, విద్యార్థులకు తాగునీరు, అల్పాహారం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సభకు హాజరయ్యే వారికి సెక్టార్ల వారీ రంగులతో కూడిన గుర్తింపు కార్డులు తయారు చేయాలన్నారు. పార్కింగ్ ప్రదేశం నుంచి సభా స్థలి వరకు ప్రజలు హాజరయ్యేందుకు నిర్దిష్టమైన ప్రణాళిక తయారు చేయాలని అడిషనల్ ఎస్పీ సౌమ్యలతను ఆదేశించారు. సమావేశంలో జీఎంఆర్ ప్రతినిధులు, జేసీ సేతుమాధవన్, జీసీసీ ఎం.డి. శోభిత, ఈవెంట్ మేనేజ్మెంట్ ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర ఉన్నతాధికారుల సమీక్ష ప్రధాని పర్యటన ఏర్పాట్లను ఈ నెల 28వ తేదీకి పూర్తిచేయాలని రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ప్రధాని పర్యటన కార్యక్రమం నోడల్ అధికారి ఎం.టి. కృష్ణబాబు, పీఎం కార్యక్రమం ప్రత్యేకాధికారి వీరపాండ్యన్ జిల్లా అధికారులను ఆదేశించారు. అమరావతి నుంచి ఏర్పాట్లపై వీడియోకాన్ఫరెన్స్లో కలెక్టర్, ఇతర అధికారులతో మాట్లాడారు. భద్రత, ప్రజలకు సదుపాయాల కల్పనపై సూచనలిచ్చారు. -
మహిళల పరిస్థితి దయనీయం
రాష్ట్రంలో మహిళల పరిస్థితి దయనీయంగా మారింది. రెండేళ్ల కూటమి పాలనలో నిత్యం ఏదో ప్రాంతంలో మహిళలపై అకృత్యాలు, అఘాయిత్యాలు, అరాచకాలు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. గుంటూరులో ఇంటి ముందు బోరు తవ్వించుకునేందుకు స్థానిక సచివాలయ కార్యదర్శి 10వేల లంచం ఇవ్వలేదని ఓ మహిళను వివస్త్రను చేసి దాడి చేయడం దారుణం. ఇంట్లో ఉండే మహిళలకు సైతం రక్షణ లేకుండా పోతోంది. అభివృద్ధిని పక్కన పెట్టి అవినీతి, అరాచకాలు, అఘాయిత్యాలే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారు. ఎమ్మెల్యే అరవఽశ్రీధర్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చేసిన అకృత్యాలపై ఎందుకు పట్టించుకోవడం లేదు. రాష్ట్ర ప్రజలు ఇప్పుడు పొట్టకూటికోసం కాకుండా ఇళ్లలోని మహిళల మానప్రాణాలకు కాపాడుకునేందుకు పొరుగు రాష్ట్రాలకు వలసలు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. మహిళలకు భద్రత కల్పించలేని చేతగాని ప్రభుత్వం గద్దె దిగాలి. రాష్ట్రానికి పట్టిన చెడు గ్రహణం త్వరలో వీడిపోవాలి. – కోలగట్ల శ్రావణి, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి విజయనగరం -
అద్దె భవనం ఇరుగ్గా ఉంది
మా పాఠశాల నిర్వహిస్తున్న అద్దె భవనం చాలా ఇరుగ్గా ఉంది. ఇబ్బంది పడుతున్నాం. ఒకటో తరగతినుంచి అక్కడే చదువుతున్నాను. మాకు సొంత బిల్డింగ్ కట్టాలి. అందుకే కలెక్టర్ ఆఫీస్కు వచ్చాం. – వైష్ణవి, విద్యార్ధిని, రెడ్డి వానివలస గ్రామం, మెంటాడ మండలం అధికారంలోకి వస్తే పాఠశాల భవనం నిర్మిస్తామని హామీ రెండేళ్లు దాటినా కన్నెత్తి చూడని వైనం కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు, తల్లిదండ్రుల ధర్నా -
30న అమరావతి చాంపియన్షిప్ క్రీడా పోటీలకు ఎంపికలు
రాజాం సిటీ: అమరావతి చాంపియన్షిప్ క్రీడా పోటీలకు ఈ నెల 30న ఎంపికలు చేయనున్నామని ఎంపీడీఓ జె.ఆనందకుమార్ తెలిపారు. ఈ మేరకు సోమవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల స్పోర్ట్స్ ఇన్చార్జిలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక జీసీఎస్ఆర్ కళాశాల మైదానంలో అండర్–17, అండర్–23 సీ్త్ర, పురుషుల విభాగంలో నిర్వహించనున్నామన్నారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, షటిల్, యోగా, చెస్ తదితర ఆరు అంశాల్లో ఈ పోటీలు ఉంటాయని చెప్పారు. పోటీల్లో పాల్గొనదలచిన క్రీడాకారులు ముందుగా ఆన్లైన్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, ఒక క్రీడాకారుడు ఒక అంశంలో మాత్రమే పాల్గొనాలని సూచించారు. ఇక్కడ గెలుపొందిన విజేతలు జిల్లా స్థాయిలోను, అక్కడినుంచి రాష్ట్రస్థాయిలో జరగనున్న పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. పోటీల్లో పాల్గొనదలచిన క్రీడాకారులు ఆధార్కార్డు, వయసు ధ్రువీకరణకు సంబంధించి పదవ తరగతి సర్టిఫికెట్ తీసుకుని రావాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓలు పి.ప్రవీణ్కుమార్, వై.దుర్గారావు, పోటీల నియోజకవర్గ ఇన్చార్జి చీమల రేణుకాదేవి, నాలుగు మండలాల పీడీలు, ఎంఎస్ఓలు సత్యనారాయణ, దుర్గయ్య, రవి, అజయ్, రోజారాణి తదితరులు పాల్గొన్నారు. -
గుడ్డు చాలు.. పిల్ల వద్దు!
సాక్షి, పార్వతీపురం మన్యం: ఉమ్మడి విజయనగరం జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న ఆహార పదార్థాల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని కేంద్రాల్లో కాలం చెల్లిన, గడువు ముగియడానికి దగ్గరలో ఉన్న ఆహార పదార్థాలు అందుతున్నాయని స్థానికులు, లబ్ధిదారులు చెబుతున్నారు. పౌష్టికాహారం సరఫరా చేసే కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఏళ్ల తరబడి ఒకే కాంట్రాక్టర్కు సరఫరా బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీనివల్ల ఉన్నతాధికారులతో లాలూచీ పడి, నాణ్యత లేని సరుకులు అంటగడుతున్నారు. కేంద్రాలకు సరుకులు సరఫరా చేసే సమయంలో గడువు తేదీలు, నిల్వ విధానం, నాణ్యత వంటి అంశాలను సంబంధిత ఐసీడీఎస్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉన్నప్పటికీ.. ఆ దిశగా తగిన పర్యవేక్షణ లేదన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. దీంతో చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతోంది. ● గుడ్లలో పిల్లలు.. కాలం చెల్లిన సరుకులు విజయనగరం జిల్లాలో 11 ప్రాజెక్టుల పరిధిలో 2,500 కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 72,416 మంది కేంద్రాల ద్వారా లబ్ధి పొందుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని 10 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 2,075 కేంద్రాలుండగా.. 47 వేల మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందుతున్నారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలలో పోషకాహార లోపాన్ని తగ్గించడం కోసం గుడ్లు, చక్కీలు, పాలు, బాలామృతం, కందిపప్పు, నూనె, బెల్లం వంటి సరకులు అందిస్తున్నారు. ఇందుకోసం కోట్లాది రూపాయల నిధులను వెచ్చిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు ఏళ్లుగా కొంతమంది కాంట్రాక్టర్లకే సరకుల సరఫరా బాధ్యతలు అప్పగిస్తున్నారు. కమీషన్లకు అలవాటు పడిన ప్రాజెక్టు అధికారులు.. సరుకుల నాణ్యత పరిశీలనను పూర్తిగా గాలికి వదిలేసి, చిన్నారుల నోట్లో మట్టి కొడుతున్నారు. ఐసీడీఎస్ జిల్లా అధికారులకు సైతం నెలవారీ కమీషన్లు వెళ్లిపోతుండటంతో గుడ్డిగా బిల్లులపై సంతకం పెట్టేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. విజయనగరం జిల్లాలోని పలు ప్రాజెక్టులకు ఇటీవల కాలంలో కరిగిపోయిన కోడిగుడ్లే గుత్తేదారులు అందిస్తున్నారు. పలు ప్రాజెక్టులలో వీటిని అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్న సమయంలో, గుడ్డు లోపల కోడి పిల్లల ఆకారం కనిపించడం గమనార్హం. గతంలో దీనిపై కాంట్రాక్టర్లకు, ప్రాజెక్ట్ అధికారులకు ఫిర్యాదు చేసినా పరిస్థితుల్లో మార్పు రాలేదు. పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా ఇదే పరిస్థితి. గడువు దాటిన బాలామృతం, నాసిరకమైవ కందిపప్పు, బెల్లం సరఫరా చేసిన ఘటనలు ఇటీవల వెలుగు చూశాయి. నాసిరకం లేదా గడువు ముగిసిన ఆహారం అందితే ప్రయోజనం దక్కకపోగా.. ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐసీడీఎస్ అధికారులు మాత్రం దీన్ని తేలిగ్గా తీసుకుని, తమకు రావాల్సిన వాటాల కోసమే ప్రాధాన్యమిస్తున్నారు. ఇప్పటికై నా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని లబ్ధి దారులు కోరుతున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసిన గుడ్లలో కోడి పిల్లలు సరుకుల్లో నాణ్యతకు తిలోదకాలిస్తున్న కాంట్రాక్టర్లు మామ్మూళ్ల మత్తులో ప్రాజెక్టు అధికారులు ఫిర్యాదులు చేస్తున్నా.. స్పందించని జిల్లా అధికారులు -
ప్రధాని పర్యటన ఏర్పాట్ల పరిశీలన
● మంత్రులు అనిత, కొండపల్లి పూసపాటిరేగ: ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి విచ్చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. సోమవారం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన మంత్రులు ఏర్పాట్లును పరిశీలించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లుపై అంశాలు వారి చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి వచ్చేస్తున్న వీఐపీలు, ప్రజలు అధికంగా తరలి వచ్చే అవకాశం ఉన్నందున తగు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్కు ఎటువంటి ఇబ్బంది లేకుండా పక్కా ప్రణాళికతో వ్యవహరించాలని సూచించారు. ముందుగా మంత్రులు ప్రధాని పర్యటించే ప్రాంతం, టెర్మినల్ భవనం, బహిరంగ సభా స్థలం, పార్కింగ్, అప్రోచ్ రోడ్లు, అల్లూరి ఐలాండ్, ట్రంపెడ్ బ్రిడ్జి నిర్మాణం తదితర ప్రాంతాలను సందర్శించారు. వీటికి సంబంధించిన మ్యాపులును పరిశీలించి పలు సూచనలు చేశారు. వీరి వెంట ఎమ్మెల్యే నాగమాధవి, మార్క్ఫెడ్ చైర్మెన్ బంగార్రాజు, జేసీ సేతుమాధవన్ తదితరులు ఉన్నారు. -
చర్యలు తీసుకోవాలి
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎం.డిపై ● వన్టౌన్లో ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ నాయకులువిజయనగరం: ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ మీడియా చానల్ ఎం.డి వేమూరి రాధాకృష్ణపై చట్ట పరమైన చర్యలు తీసుకోవడంలో జాప్యం వహించడం సరికాదని వైఎస్సార్సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గదుల సత్యలత, పార్టీ నగర అధ్యక్షుడు ఆశపు వేణులు విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ శ్రేణులు, మహిళలను కించపరిచేలా తప్పుడు కథనాలు ప్రచురించిన రాధాకృష్ణపై తక్షణమే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయనగరం జిల్లా కేంద్రంలోని వన్టౌన్ పోలీస్ స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేశారు. రాధాకృష్ణపై బేషరతుగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రెండేళ్ల పాలనలో జరుగుతున్న అన్యాయాలు, అకృత్యాలపై చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. గతంలో టీటీడీ ఛైర్మన్పై వచ్చిన ఆరోపణల విషయంలో ఎటువంటి చర్యలు లేవన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గడిచిన రెండేళ్లలో చెప్పేందుకు చేసిందేమి లేక ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అసత్య ప్రచారాలు చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలు, అకృత్యాలపై ప్రశ్నించే వైఎస్సార్సీపీ శ్రేణులుపై అక్రమ కేసులు బనాయించి , పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని, రాధాకృష్ణ లాంటి వ్యక్తిపై చర్యలు తీసుకోవడంలో తాత్సారం ఎందుకని నిలదీశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సంగంరెడ్డి బంగారునాయుడు, పార్టీ మండల అధ్యక్షుడు కెల్ల త్రినాథరావు, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు పిన్నింటి కళావతి, యువజన విభాగం నాయకుడు జి.ఈశ్వర్ కౌశిక్, ఎస్సీ విభాగం నాయకుడు బొంగ భానుమూర్తి, మాజీ కార్పొరేటర్లు అల్లు చాణక్య, బండారు ఆనంద్, బోడసింగి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
పీజీఆర్ఎస్కు 251 వినతులు
విజయనగరం ఫోర్ట్: కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 251 వినతులు వచ్చాయి. ఇందులో 126 రెవెన్యూకు సంబంధించివి. డీఆర్వో సత్తిబాబు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. డీఆర్డీఏకు 15, విద్యాశాఖకు 9, విద్యుత్ శాఖకు 5, సచివాలయ శాఖకు 7, జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు 6, గృహ నిర్మాణ శాఖకు 2, ఇతర శాఖలకు 149 వినతులు వచ్చాయి. ఈ సందర్భంగా డీఆర్వో సత్తిబాబు మాట్లాడుతూ 1100 ట్రోల్ఫ్రీ ద్వారా అందుతున్న ఫిర్యాదులను అత్యంత బాధ్యతతో పరిష్కరించాలన్నారు. ప్రతీ అర్జీదారునితో నేరుగా మాట్లాడిన తరువాతే ఎండార్స్మెంట్ ఇవ్వాలన్నారు. మెంటాడ మండలం రెడ్డివానివలస గ్రామంలో ప్రాధమిక పాఠశల భవనం పనులు పూర్తి చేయాలంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు కోరారు. 28 మంది పిల్లలున్నా.. అనువైన భవనం లేకపోవడంతో అవస్థలు పడుతున్నారని తెలిపారు. పింఛన్ పెంచాలంటూ గరివిడికి చెందిన దివ్యాంగుడు రాంబాబు వినతి ఇచ్చారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వరావు, కళావతి, అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. పాఠశాల భవనం కోసం ప్లకార్డులు ప్రదర్శిస్తున్న విద్యార్థులు -
జీవో నంబర్ 396 తక్షణమే వెనక్కి తీసుకోవాలి
● దస్తావేజు లేఖరుల నిరవధిక సమ్మె విజయనగరం రూరల్: దస్తావేజు లేఖరుల ఉపాధిని దెబ్బతీసే విధంగా ‘రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల’ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 396 రద్దు చేయాలని కోరుతూ దస్తావేజు లేఖర్లు మరోసారి సమ్మెబాట పట్టారు. జిల్లాలోని 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద సోమవారం నుంచి నిరవధిక సమ్మెలో దస్తావేజు లేఖరులు పాల్గొన్నారు. చంద్రబాబు సర్కారు అధికారం చేపట్టినప్పటి నుంచి స్థిరాస్తి వ్యాపారం మందగించడం, భారీగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడంతో రెండేళ్లుగా ఆదాయం అంతంతమాత్రంగా ఉన్నా కుటుంబాలను నెట్టుకొస్తున్నామని దస్తావేజు లేఖర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్క ఉద్యోగాలు లేక ఇదే వృత్తిని జీవనంగా చేసుకుని నెట్టుకొస్తున్న నిరుద్యోగులు, ఎన్నో ఏళ్లుగా దీనిపై ఆధారపడి జీవిస్తున్న లేఖరులకు చంద్రబాబు సర్కారు ‘సంపద సృష్టి’ పేరుతో ఆర్ఎస్కేలు ఏర్పాటు చేస్తామనడంపై వారు భగ్గుమంటున్నారు. ప్రభుత్వం జీవో ఉపసంహరించుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని దస్తావేజు లేఖర్లు హెచ్చరించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పది రోజుల నిరవధిక సమ్మెకు పిలుపునివ్వడంతో జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద దస్తావేజు లేఖర్లు సమ్మెలో పాల్గొన్నారు. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్థిరాస్తుల క్రయవిక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లు సోమవారం నిలిచిపోయాయి. -
ఆల్ ఇంగ్లాండ్ జూనియర్ బ్యాడ్మింటన్ విజేత మనోడే..
–8లోవిజయనగరం: ఇంగ్లాండ్లోని బర్మింగ్హోమ్ నగరంలో ఈ నెల 17 నుంచి జరుగుతున్న ఆల్ ఇంగ్లాండ్ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్ి షప్ (అండర్ – 19) పోటీల్లో విజయనగరానికి చెందిన భట్రాజు సాయి నచికేత్ బంగారు పతకం సాధించాడు. ఆల్ ఇంగ్లాండ్ జూనియర్ బాడ్మింటన్ చాంపియన్షిప్లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయుడుగా చరిత్ర సృష్టించాడు. ఆరేళ్ల వయసు నుంచే బ్యాడ్మింటన్ ఆటపై ఆసక్తిని పెంచుకొని తొలి కోచ్ భాస్కరబాబు వద్ద మెలకువలు నేర్చుకున్న నచికేత్ ప్రస్తుతం ప్రఖ్యాత చేతన్ఆనంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. నచికేత్ తల్లి నాగమణి విజయనగరంలోని పీఎస్ఆర్ కాలనీ ప్రాంతానికి చెందినవారు. తండ్రి ఉద్యోగ రీత్యా హైదరాబాదులో నివాసం ఉంటున్నారు. నచికేత్ ఇప్పటికే మలేషియా, ఇండోనేషియా, బంగ్లాదేశ్, స్వీడన్, బల్గేరియా దేశాల్లో జరిగిన పోటీల్లో పాల్గొని మంచి గుర్తింపు సాధించాడు. 2025 ఆగస్టులో శ్రీలంకలో జరిగిన జూనియర్ ఇంటర్నేషనల్ సిరీస్లో పాల్గొని తృతీయ బహుమతి సాధించాడు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో నచికేత్ ప్రస్తుతం 12వ ర్యాంకులో ఉన్నాడు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్లో 56వ ర్యాంకులో ఉన్నాడు. నచికేత్ సోదరుడు సాయి హృషికేత్ కూడా బ్యాడ్మింటన్ క్రీడాకారుడే. ఆయన కూడా చేతన్ ఆనంద్ అకాడమీలోనే శిక్షణ పొందుతున్నాడు. నచికేత్ తల్లి నాగమణి సీనియర్ వాలీబాల్ క్రీడాకారిణి. ఆమె విజయనగరంలో వాలీబాల్ క్రీడపై మక్కువ పెంచుకొని రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. ఆంధ్ర యూనివర్సిటీ మహిళా వాలీబాల్ టీంకు నాయకత్వం వహించారు. జాతీయ స్థాయి పోటీల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టులో పాల్గొని ప్రతిభ చూపించారు. నచికేత్ను వాలీబాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి టివి.భగవాన్ దాస్, ప్రతినిధులు కృష్ణంరాజు, కెవిఎన్.రాజు తదితరులు అభినందించారు. జూనియర్ చాంపియన్గా నిలిచిన సాయి నచికేత్ తొలి భారతీయుడుగా ఖ్యాతి -
పంటల బీమా.. గోల్మాల్..!
విజయనగరం ఫోర్ట్: జిల్లా వ్యాప్తంగా 2024 – 25 సంవత్సరంలో వేలాది మంది రైతులు పంటల బీమా ప్రీమియం చెల్లించారు. పంటలు తీవ్రంగా నష్టపోయినా ఒక్క పైసా పరిహారం కూడా రైతులకు రాలేదు. పంటల బీమా ప్రీమియం చెల్లించండి.. పంట నష్టం జరిగితే పరిహారం ఇప్పిస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాబు మాటలు నమ్మి ప్రీమియం వందల రూపాయిల్లో చెల్లించి నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఉచిత పంటల బీమా పథకానికి చంద్రబాబు ప్రభుత్వం మంగళం పాడేసింది. దీంతో రైతులే పంటల బీమా ప్రీమియం కట్టుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఉచిత పంటల బీమా లేకపోయినా.. రైతులు తమ సొంత డబ్బులు వెచ్చించి బీమా ప్రీమియం కట్టారు. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం రైతులకు పంట నష్టానికి సంబంధించిన బీమా ఏ ఒక్క రైతుకు ఆ రబీ సీజన్లో ఇప్పించలేదు. దీంతో ఆర్థికంగా నష్టపోయామని రైతులు పేర్కొంటున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో.. రాష్ట్రంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఉచిత పంటల బీమా పథకం పక్కాగా అమలయ్యేది. రైతులు తాము సాగు చేసిన పంటకు ఈ క్రాప్ చేసుకుంటే చాలు.. ప్రభుత్వమే రైతుల తరఫున పంటల బీమా ప్రీమియం చెల్లించేది. అంతేకాకుండా పంట నష్టం జరిగితే ప్రభుత్వమే వారికి బీమా సకాలంలో అందే విధంగా చర్యలు తీసుకునేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఉచిత పంటల బీమా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హాయంలో ఉచిత పంటల బీమా పథకం అమలు అయ్యేది. రైతులు తాము సాగు చేసిన పంటకు ఈ– క్రాప్ చేసుకుంటే చాలు ప్రభుత్వమే రైతులు తరుపున పంటల బీమా ప్రీమియం చెల్లించేది. అంతేకాకుండా పంట నష్టం జరిగితే ప్రభుత్వమే వారికి బీమా సకాలంలో అందేవిధంగా చర్యలు తీసుకునేది. పంటల బీమా ఇంకా రాలేదు.. 2024 – 25 సంవత్సరంలో రబీ సీజన్కు సంబంధించి పంటల బీమా రైతులకు ఇంకా రాలేదు. ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. – వి.తారకరామారావు, జిల్లా వ్యవసాయ అధికారిబీమా మొత్తం రూ.1.35 కోట్లు 2024 – 25లో రబీ సీజన్ నుంచి చంద్రబాబు ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకం ఎత్తేసింది. రైతులే పంటల బీమా ప్రీమియం చెల్లించుకోవాలని తేల్చి చెప్పింది. దీంతో గత్యంతం లేక అపరాలు(పెసర, మినుము) పంటలకు ఎకరానికి రూ.300 చొప్పున రైతులు పంటల బీమా చెల్లించారు. సుమారుగా జిల్లాలో 45 వేల ఎకరాలకు పంటల బీమా కింద రూ.1.35 కోట్లు వరకు రైతులు చెల్లించారు. అయితే పంటల బీమా మాత్రం ఏ ఒక్క రైతుకు రాలేదు. పంటల బీమా కింద చెల్లించిన ప్రీమియం రూ.కోట్లు నష్టపోయామని రైతులు వాపోతున్నారు. రైతు సంక్షేమమే ధ్యేయమని ఎన్నికల సమయంలో హామీలిచ్చిన చంద్రబాబుతో పాటు కూటమి నాయకులు తమకు తీరని ద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎలాగూ పంటల బీమా చెల్లించలేదు... తాము కట్టిన ప్రీమియం డబ్బులు కూడా చెల్లించకుంటే ఎలాగని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా తమ బీమా డబ్బులు తమకు ఇప్పించాలని వారు కోరుతున్నారు. 2024 – 25లో అపరాలకు బీమా ప్రీమియం చెల్లించిన రైతులు రెండేళ్లు కావస్తున్నా అందని బీమా అన్నదాత ఆవేదన -
విద్యార్థుల అవస్థలు
గిరిజన మంత్రి ఇలాకాలో..విజయనగరం ఫోర్ట్: అధికారంలోకి వస్తే విద్యకు పెద్దపీట వేస్తామని సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారంలో హామీలు గుప్పించారు. గద్దె నెక్కినతర్వాత హామీలను గాలికి వదిలేశారని ప్రజలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో పాఠశాలకు భవనం లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. మంత్రి నియోజకవర్గంలోని మెంటాడ మండలం రెడ్డి వానివలస గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు సొంత భవనాలు లేకపోవడంతో అద్దె భవనాల్లో పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలలో 1వతరగతి నుంచి 5వ తరగతి 28 మంది విద్యార్థులు చదువుతున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఈ గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ప్రస్తుత మంత్రి సంధ్యారాణి రెడ్డివానివలస పాఠశాలకు సొంత భవనాలు నిర్మిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఇంతవరకు పునాది రాయి కూడా అక్కడ పడలేదు. ప్రస్తుతం పాఠశాల నిర్వహిస్తున్న భవనం వసతులు చాలకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడతున్నారు. ఈ పాఠశాలకు పక్కా భవనాలు నిర్మించాలని గతంలో కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయిందని విద్యార్ధుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. -
ప్రధాని పర్యటనకు 7వేల మందితో బందోబస్తు
● విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టివిజయనగరం క్రైమ్: ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు దాదాపు 7,500 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి సోమవారం తెలిపారు. భోగాపురం మండలంలోని అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవానికి వచ్చే నెల 1 న ప్రధాన మంత్రి మోడీ వస్తున్న సందర్భంగా క్షేత్ర స్థాయిలో సభావేదిక, పార్కింగ్, ప్రజా రవాణా, కాన్వాయ్ వెళ్లే మార్గాలను, భద్రత, బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ ఏఆర్ దామోదర్దతో కలిసి విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి పర్యవేక్షించి భద్రతా పరమైన సూచనలు చేశారు. ప్రధాని మోడీ పర్యటనలో భాగంగా ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్, ప్రజా వేదికను డీఐజీ సందర్శించారు. జరుగుతున్న పనులను, ఏర్పాట్లను పరిశీలించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వాహనాల పార్కింగ్ విషయంలో ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా పటిష్టం చేసి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని ఎస్పీ దామోదర్ ను ఆదేశించారు. బందోబస్తును సెక్టార్లుగా విభజించి బహిరంగ సభకు హాజరయ్యే ప్రజలకు ఎటువంటి సమస్యలు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని డీఐజీ గోపీనాథ్ జెట్టి అన్నారు. బందోబస్త్ ఏర్పాట్లపై ఎస్పీ దామోదర్ రూట్ మ్యాప్ ప్రెజెంటేషన్ ద్వారా డీఐజీకి వివరించారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఎస్పీ కె.మహేశ్వర రెడ్డి, అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా, విజయనగరం అదనపు ఎస్పీలు సౌమ్యలత, కిరణ్ కుమార్, డీఎస్పీలు రాఘవులు, నరసింహరావు, వీరకుమార్ సీఐలు దుర్గా ప్రసాద్, శ్రీనివాస్, ఎస్సైలు సన్యాసిరావు, అరుణ్ ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
కాంట్రాక్టు అధ్యాపకుల రెన్యువల్ ప్రారంభం
చీపురుపల్లి: జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల రెన్యువల్ ప్రక్రియను ఆర్డీఓ సుధారాణి పర్యవేక్షణలో ప్రారంభించారు. సోమవారం స్థానిక ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో రెన్యువల్ ప్రక్రియ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలల నుంచి కాంట్రాక్టు అధ్యాపకులు హాజరయ్యారు. 2026 ఏప్రిల్ 30 వరకు డిగ్రీ కళాశాలల్లో విధులు నిర్వహించిన కాంట్రాక్టు అధ్యాపకులకు రెన్యువల్ చేస్తున్నట్లు ఆర్డీఓ తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. సీహెచ్ లలిత పాల్గొన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి ● రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత విజయనగరం ఫోర్ట్: విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించే దిశగా అడుగులు వేయాలని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. స్థానిక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో సోమవారం నిర్వహించిన షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు తమపై తాము నమ్మకం ఉంచి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషి వెలకట్టలేనిదన్నారు. కార్యక్రమంలో 184 మంది పదో తరగతి విద్యార్థులకు, 39 మంది ఇంటర్ విద్యార్థులకు మెడల్, ప్రశంసాపత్రం, రూ.20వేల నగదు అందించారు. కార్యక్రమంలో కలెక్టర్ రాంసుందర్రెడ్డి, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, మార్క్ఫెడ్ చైర్మన్ బంగారురాజు, డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృషి తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎస్ఏ ఇన్చార్జ్ ఈఈ మాతృశాఖకు బదిలీ విజయనగరం అర్బన్: సమగ్ర శిక్ష ఇంజినీరింగ్ విభాగంలో ఇన్చార్జ్ ఈఈగా పని చేస్తున్న ఎన్.హరిప్రసాద్ను మాతృశాఖ ఇరిగేషన్ శాఖకు బదిలీ చేశారు. ఈ మేరకు సమగ్ర శిక్ష ఎస్పీడీ నుంచి సోమవారం ఆదేశాలు వచ్చాయని డీఈఓ యు.మాణిక్యంనాయుడు తెలిపారు. డిప్యూటేషన్పై ఆ శాఖ నుంచి డీఈ కేడర్లో వచ్చిన ఆయన ఏడాది క్రితం నుంచి ఇన్చార్జ్ ఈఈ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిప్యూటేషన్ పీరియడ్ జనవరి నెలతో ముగిసింది. అప్పటి నుంచి మాతృశాఖకు వెళ్లిపోవాలని శాఖపరమైన విజ్ఞప్తులు చేసినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో విజయవాడ ప్రధాన కార్యాలయంలో ఉన్న మాతృశాఖకు ఆయన్ని బదిలీ చేశారు. మందుల దుకాణాల్లో తనిఖీలు పార్వతీపురం రూరల్: మాదకద్రవ్యాల నియంత్రణకై చేపట్టిన ‘ఆపరేషన్ గరుడ’ కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం పట్టణంలోని పలు మందుల దుకాణాల్లో అధికారులు సోమవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు.. డ్రగ్ ఇన్స్పెక్టర్ యోగేందర్ పర్యవేక్షణలో ఈగల్ బృందం, టౌన్ పోలీసులు సంయుక్తంగా ఈ తనిఖీలు నిర్వహించారు. స్థానిక స్వామి ఆస్పత్రి ప్రాంగణంలోని శ్రీరేణుక మెడికల్ స్టోర్స్, శ్రీ లక్ష్మీ గణపతి మెడికల్ షాపుల్లో బృందాలు సోదాలు చేశాయి. ఈ సందర్భంగా నిబంధనల ప్రకారం విక్రయించాల్సిన ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ నిల్వలు, వాటికి సంబంధించిన రిజిస్టర్లు, కొనుగోలు రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం దుకాణాల నిర్వాహకులకు మాదకద్రవ్యాల నియంత్రణ చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పార్వతీపురం టౌన్ ఎస్ఐ పి.సింహాచలం, ఈగల్ సెల్ సభ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
రైతు సేవా కేంద్రానికి తాళం
● బిల్లులు మంజూరైనా చెల్లించని అధికారులు ● కేంద్రానికి తాళం వేసిన కాంట్రాక్టర్ గుర్ల: మండలంలోని వల్లాపురం రైతు సేవా కేంద్రం నిర్మాణాలకు సంబంధించి బిల్లు మంజూరైనా అధికారులు చెల్లించడానికి నిరాకరిస్తుండడంతో సంబంధిత కాంట్రాక్టర్ కేంద్రానికి సోమవారం తాళం వేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ కేంద్రం నిర్మాణానికి సంబంధించి బిల్లులు కొద్ది రోజుల కిందట మంజూరయ్యాయి. అయితే పనులు చేసిన కాంట్రాక్టర్ శ్రీనివాసరావుకు అధికారులు ఆ మొత్తం బిల్లుల చెల్లింపునకు నిరాకరిస్తున్నారు. ఈ క్రమంలో కాంట్రాక్టర్ ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ పలుమార్లు తిరిగినా ఫలితం లేకుండా పోయింది. దీంతో విసిగిపోయిన కాంట్రాక్టర్ శ్రీనివాసరావు సోమవారం కేంద్రానికి తాళం వేశాడు. ఈ రైతు సేవా కేంద్రానికి సంబంధించి రెండు వారాల కిందట సుమారు రూ.లక్షా 60 వేలు ప్రత్యేకాధికారి ఖాతాలో నగదు జమైంది. ఈ మొత్తాన్ని సంబంధిత కాంట్రాక్టర్కు చెల్లించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలూ వచ్చాయి. అయినా బిల్లుల చెల్లింపులో ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది నిర్లక్ష్యం వహించారు. దీంతో కేంద్రానికి కాంట్రాక్టర్ తాళం వేశాడు. అయితే రైతులకు సరఫరా చేయాల్సిన ఎరువులు ఇందులో ఉండడంతో ఏఓ తిరుపతిరావు, ఎంపీడీఓ రవికుమార్ రైతు సేవా కేంద్రానికి వచ్చి బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. బిల్లు చెల్లించిన తరువాతే తాళం తీస్తానని కాంట్రాక్టర్ చెప్పడంతో అధికారులు వెనుదిరిగారు. -
ఎస్ఎఫ్ఐ కలెక్టరేట్ ధర్నా భగ్నం
● గృహనిర్బంధంలో విద్యార్థి సంఘం నేతలు ● ప్రభుత్వ తీరుపై ఎస్ఎఫ్ఐ మండిపాటుపార్వతీపురం రూరల్: విద్యార్థుల సమస్యల పరిష్కారం కోరుతూ ఎస్ఎఫ్ఐ సోమవారం తలపెట్టిన కలెక్టరేట్ ధర్నాను అడ్డుకునేందుకు పోలీసు యంత్రాంగం ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. ఆందోళనకు సిద్ధమైన విద్యార్థి సంఘం నేతలను ఉదయం ఆరు గంటలకే ఇళ్ల వద్ద పోలీసులు అనుమతి లేదనే కారణంతో ముందస్తుగా అరెస్టు చేసి గృహనిర్బంధం చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కాలరాయడం ప్రజాస్వామ్య విలువలపై జరిగిన దాడేనని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు హెచ్.సింహాచలం తీవ్రంగా ఖండించారు. నిర్బంధాలతో ఉద్యమాలను అణిచివేయలేరని ఆయన ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ముందస్తుగా గృహనిర్బంధం చేసిన వారిలో సింహాచలంతో పాటు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బిడ్డిక అనిల్, నాయకులు గెమ్మల సురేష్ తదితరులు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టీపట్టనట్లు వ్యవహరించడం దుర్మార్గమని నాయకులు విమర్శించారు. ఈ సందర్భంగా పలు ప్రధాన డిమాండ్లను వారు ప్రభుత్వం ముందుంచారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న రూ. 7 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, విద్యార్థులకు నష్టం చేకూరుస్తున్న ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ధరలకు అనుగుణంగా మెస్చార్జీలను రూ.3 వేలకు పెంచడంతో పాటు, పార్వతీపురం, పాలకొండ, కురుపాం కేంద్రాల్లో నూతనంగా పీజీ సెంటర్లను వెంటనే ప్రారంభించాలని కోరారు. మరణించిన గిరిజన విద్యార్థుల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలని, గురుకులాలు, ఆశ్రమ కళాశాలలు, వసతిగృహాల్లో ఖాళీగా ఉన్న ఏఎనన్ఎం పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని స్పష్టం చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన పాలకులే, వారి పక్షాన పోరాడే గొంతును నొక్కడం తగదని ఎస్ఎఫ్ఐ నేతలు హితవు పలికారు. -
గుండెపోటుతో టీచర్ శ్రీనివాసరావు మృతి
బాడంగి: మండలంలోని ముగడ గ్రామానికి చెందిన టీచర్ మత్స శ్రీనివాసరావు(61) గుండెపోటుతో సోమవారం ఆకశ్మికంగా మృతిచెందారు. ఆయన బొబ్బిలి నరేంద్ర మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య వరలక్ష్మి, ఐబీఎంకు ఎంపికై న కుమార్తె యశస్విని, జేఎన్టీయూ విజయనగరంలో ఇంజినీరింగ్ చదువుతున్న కుమారుడు కార్తికేయ ఉన్నారు. తన అత్తవారు సీతానగరం మండలం జగ్గునాయుడుపేట ఆదివారం వెళ్లిన ఆయన ఉదయం పాఠశాలకు వెళ్లాలని స్నానానికి బాత్రూమ్లోకి వెళ్లిన కొద్ది నిమిషాలకే గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతిచెందాడని బంధువులు తెలిపారు. ఆయన మృతితో ముగడ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరో ఏడాదిలోగా ఉద్యోగ విరమణచేయనున్న సమయంలో ఇలాజరగడం పట్ల గ్రామస్తులు విషణ్ణవదనాలతో మాట్లాడుకున్నారు. వివాహిత ఆత్మహత్యచీపురుపల్లిరూరల్(గరివిడి): గరివిడి మండలం కొండశంభాం గ్రామానికి చెందిన వివాహిత పిల్లా శ్రీలక్ష్మి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనకు సంబంధించి గరివిడి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చీపురుపల్లి మండలంలోని కరకాం గ్రామానికి చెందిన శ్రీలక్ష్మికి కొండశంభాం గ్రామానికి చెందిన పిల్లా సాయితో ఈ నెల 2వ తేదీన వివాహం జరిగింది. శ్రీలక్ష్మి గతంలో హైద్రాబాద్లో ఉద్యోగం చేసేది. హైదరాబాద్లో ఉండేటప్పుడు ఓ వ్యక్తితో ఆమె సన్నిహితంగా ఉండేదన్న విషయం భర్తకు తెలియడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ విషయాన్ని తన భర్త తండ్రికి తెలియజేస్తే తట్టుకోలేడని మనస్తాపం చెందిన శ్రీలక్ష్మి ఈ నెల 17న పురుగు మందు తాగేసింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆమెను వెంటనే విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం ఆమె మృతిచెందింది. మృతురాలి తండ్రి కడగల బంగారునాయుడు ఫిర్యాదు మేరకు ఎస్సై బి.లోకేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుక్కలదాడిలో 5 మేకలు హతంసీతానగరం: మండలంలోని ఏగోటివలస గ్రామానికి చెందిన కోడిబోను సింహాచలం సాలలో ఉన్న మేకలు, గొర్రెలపై సోమవారం రాత్రి కుక్కలు దాడి చేసి 5 మేకలను హతమార్చాయి. పగలంతా పొలాల్లో మేతకు తిప్పి ఇంటికి వచి గొర్రెలు, మేకలు సాలకు చేరుకున్న కొద్దిసేపటికే కుక్కలు చొరబడ్డాయని బాధితుడు వాపోయాడు. గడిచిన నెలలో ఇదే సాలలో ఉన్న మేకలపై కుక్కలు దాడిచేసి 6 మేకలు, గొర్రెలను హతమార్చిన విషయం తెలిసిందే. వీధికుక్కలు పగబట్టినట్లు తన జీవనోపాధిపై దెబ్బ కొట్టడంతో జీర్ణించుకోలేక సింహాచలం కుటుంబీకులు భోరున విలపిస్తున్నారు. -
లారీ ఢీకొని ఒకరి మృతి
● మరొకరికి గాయాలు దత్తిరాజేరు: మండలంలోని ఎస్.బూర్జవలస పోలీస్ స్టేషన్ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి వెనుక నుంచి లారీ ఢీకొనడంతో ఒకరు మృతి చెందినట్లు ఎస్సై ప్రయోగమూర్తి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం కె. కొత్తవలస గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బైక్పై ఆరికతోట నుంచి స్వగ్రామానికి వస్తుండగా బూర్జవలస పోలీస్స్టేషన్ వద్దకు వచ్చే సరికి వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొనడంతో బేత త్రినాథ్(38)అక్కడికక్కేడే మృతిచెందాడు. మరో వ్యక్తి నల్ల చిట్టినాయుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రగాయాల పాలైన వ్యక్తిని 108లో గజపతినగరం సామాజిక ఆస్పత్రికి తరలించి త్రినాథ్ మృతదేహన్ని పోస్ట్మార్టం నిమిత్తం విజయనగరం సర్వజన ఆస్పత్రికి పంపించారు. మృతుడికి భార్య ఇందు ఎనిమిదేళ్ల ప్రవీణ్, ఏడేళ్ల బాలు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ఎస్సై తెలిపారు. బాలికపై లైంగికదాడి ● నిందితుడిపై పోక్సోకేసు నమోదు చీపురుపల్లిరూరల్(గరివిడి): గరివిడి మండలంలోని కోడూరు గ్రామానికి చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన బాలుడు లైంగికదాడికి పాల్పడిన ఘటనలో బాలుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధిత బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం రాత్రి కేసు నమోదు చేసామని ఎస్సై బి.లోకేశ్వరరావు తెలిపారు. బాధిత బాలిక నుంచి వివరాలను నమోదు చేయడంతో పాటు ఘటనకు సంబంధించిన ఇతర అంశాలపై సీఐ జి.శంకరరావు కేసు దర్యాప్తు సాగిస్తున్నట్లు తెలిపారు. -
డ్వాక్రా సంఘాలు
విజయనగరంసోమవారం శ్రీ 20 శ్రీ జూలై శ్రీ 2026నీరసించిపోతున్న● జిల్లాలో 40,197 డ్వాక్రా సంఘాలు ● ఇందులో బీ గ్రేడ్లో 7943 సంఘాలు నేడు ‘షైనింగ్ స్టార్స్ అవార్డ్స్’ ప్రదానోత్సవం ఏది వాస్తవం..!ఎన్నో సంవత్సరాల నుంచి సంక్రమించిన, కొనుగోలు చేసిన తమ భూములు మాకు కాకుండా చేయడమేమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. వంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టులో చేపల వేట అధికారికంగా ప్రారంభమైంది. గత కొంత కాలంగా లీజు సొమ్ము చెల్లించకపోవడంతో ప్రాజెక్టులో చేపల వేట నిషేధం అమలులో ఉంది. ఇటీవల లీజు సొమ్ము ప్రభుత్వానికి చెల్లించడంతో అన్ని గ్రామాల్లో ఉన్న మత్స్యకారులు రిజర్వాయర్లో చేపల వేట సాగిస్తున్నారు. తెర్లాం: మండలంలోని నందబలగ పరిసర ప్రాంతాల్లో శనివారం తిష్టవేసిన ఏనుగుల గుంపు ఆదివారం ఉదయం బాడంగి మండలం పినపెంకి గ్రామం వైపు వెళ్లిపోయాయి. శనివా రం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు నందబలగ గ్రామ పరిసర పొలాల్లోను, మామిడి తోటలో ఎనిమిది ఏనుగులు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ ఏనుగుల గుంపు గ్రామానికి చెందిన పలువురి రైతుల చెరకు పంటను ధ్వంసం చేశాయి. చెరకు పంటను తినేయడంతో పాటు, కాళ్లతో తొక్కేయడంతో పంట నాశనమైయిందని గ్రామానికి చెందిన రైతులు లబోదిబోమంటూ విలపిస్తున్నారు. పంటలు నష్టాన్ని గుర్తించి ప్రభుత్వం ద్వారా తమకు నష్టపరిహారం అందజేయాలని వారంతా అధికారులను కోరుతున్నారు. ఆదివారం ఉదయం నందబలగ–పినపెంకి రోడ్డు మీదుగా ఏనుగుల గుంపు పయనించి పినపెంకి సమీపంలోని పంట పొలాల్లోకి వెళ్లిపోయా యి. దీంతో నందబలగ గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. కారాడ వైపు తరలిన ఏనుగులు బాడంగి: మండలంలోని శివారు గ్రామం పినపెంకి గ్రామ పంట పొలాల్లోకి ఏనుగుల గుంపు ఆదివారం చేరుకుంది. మధ్యాహ్నం వరకు ఆ పరిసరాల్లో సంచరించిన ఏనుగులు తిరిగి బొబ్బిలి మండలం కారాడ వైపు వెళ్లాయి. విషయం తెలుసుకున్న ఎస్ఐ సూర్యకుమారి అప్రమత్తమై తమ సిబ్బందితో అక్కడికి చేరుకొని అటవీ శాఖ అధికారులతో మాట్లాడి గ్రామంలోకి వెళ్లకుండా గస్తీ కాశారు. విజయనగరం అర్బన్: జిల్లా ప్రజల సమస్యల ను త్వరితగతిన పరిష్కరించేందుకు సోమవా రం కలెక్టరేట్ ఆడిటోరియంలో ‘ప్రజా సమస్య ల పరిష్కార వేదిక’ నిర్వహించనున్నట్టు కలెక్ట ర్ ఎస్.రాంసుందర్రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు పాల్గొని నేరుగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తారని పేర్కొన్నారు. అర్జీదారులు దరఖాస్తుల్లో పేరు, చిరునామా, ఫోన్ నంబర్ వంటి పూర్తి వివరాలను స్పష్టంగా నమోదు చేయాలని, సమస్యకు సంబంధించిన ఆధారాలను జతపరచాలని సూచించారు. గతంలో ఫిర్యాదు చేసిన వారు పాత అర్జీ రశీదును తప్పనిసరిగా తీసుకురావా లని తెలిపారు. అర్జీల స్థితిగతులను తెలుసుకునేందుకు ప్రభుత్వం ఎస్ఎంఎస్ సౌకర్యాన్ని కల్పించిందున, సమస్య పరిష్కారం అనంత రం నోటీసులు లేదా ఎండార్స్మెంట్లు వాట్సా ప్, రిజిస్టర్ పోస్టు ద్వారా పంపుతారని వివరించారు. కలెక్టరేట్కు రాలేని వారు 1100 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయడం ద్వారా లేదా ‘మీ కోసం.ఏపీ.జీఓవి.ఐఎన్’ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. సమీపంలోని మండల, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా దరఖాస్తులు అందజేయవచ్చని పేర్కొన్నారు. విజయనగరం ఫోర్ట్: డ్వాక్రా మహిళలను లక్షాధికారులను చేసే బాధ్యత మాది.. అంటూ గత సార్వత్రిక ఎన్నికల్లో గొప్పగా ప్రచారం చేసిన చంద్రబాబు అధికారంలో కి వచ్చాక వారికి మొండిచేయి చూపుతున్నారు. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ అమలు చేస్తామని, ప్రతీ ఒక్కరిని లక్షాధికారిని చేస్తామని హామీ ఇచ్చా రు. దీన్ని నమ్మిన డ్వాక్రా మహిళలు టీడీపీకి ఓట్లు వేసి అధికారం కట్టబెట్టారు. లక్షాధికారుల మాట దేవుడెరుగు డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాల ను చెల్లించడానికి నానా అవస్థలు పడుతున్నారు. తీసుకున్న రుణం వడ్డీతో సహా చెల్లించాల్సి రావడంతో వీరు అష్టకష్టాలు పడుతున్నారు. ఫలితంగా డ్వాక్రా సంఘాలు నీరసించిపోతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరికి అండగా నిలవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదనే విమర్శలూ లేకపోలేదు. సున్నా వడ్డీ ఉత్తిదే.. సున్నా వడ్డీ (వడ్డీ లేని) రుణాలు మహిళలకు ఇస్తా నని ప్రస్తుత సీఎం చంద్రబాబు గతంలో ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అధికారం చేపట్టి రెండేళ్లు అవుతున్నా ఇంతవరకు ఆ హామీని అమలు చేయలేదు. దీంతో డ్వాక్రా మహిళలు తాము తీసుకున్న రుణాలను వడ్డీతో సహా ప్రతీ నెల చెల్లిస్తున్నా రు. ఇది వారికి భారంగా మారుతుంది. ప్రస్తుతం వ్యాపారాలు కూడా మందగించాయి. దీంతో వారి జీవనం కష్టతరంగా మారింది. వడ్డీ లేని రుణాలు ఇచ్చినట్టయితే డ్వాక్రా మహిళలకు ఎంత గానో ఉపయోగపడుతుంది. కాని చంద్రబాబు సర్కార్ మాట తప్పడం డ్వాక్రా మహిళల పాలిట శాపంగా మారింది. స్వయం సహాయక సంఘాల్లో సభ్యులు గా ఉన్న మహిళలు తీసుకున్న రుణంతో గేదెలు, ఆవులు కొనుగోలు చేయడం, చిన్న చిన్న వ్యాపారు లు కిరాణా, బట్టలు, పిండి మిల్లులు, పేపర్ ప్లేట్ ఆకుల మిషన్ వంటివి ఏర్పాటు చేసుకుని ప్రతీ నెల కొంత మొత్తాన్ని బ్యాంకుకు కడుతూ ఉంటారు. వడ్డీ లేకుండా కట్టినట్టయితే వారికి వడ్డీగా చెల్లించాల్సిన డబ్బులు మిగులుతాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాఫీ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ చేశారు. 2019 ఏప్రిల్ నాటికి డ్వాక్రా మహిళలకు ఉన్న రుణాన్ని పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాఫీ చేసింది. అంతేకాకుండా రుణాలు సంక్రమించిన వారికి కోట్లాది రుపాయిలు వడ్డీ రాయితీ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆ పరిస్థితు లు లేకపోవడంతో డ్వాక్రా సంఘాల మహిళలు అవస్థలు పడుతున్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీ లు అమలు చేయాలని వారు కోరుతున్నారు. జిల్లాలోని డ్వాక్రా సంఘాలు అన్నింటిని ఏ గ్రేడ్లోకి తీసుకొచ్చేందుకు శాఖా పరమైన చర్యలు తీసుకుంటున్నాం. బీ, సీ, డీ గ్రేడ్లో ఉన్న సంఘాలను ఏ గ్రేడ్లోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాం. ఆ దిశగా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నాం. – శ్రీనివాసపాణి, పీడీ, డీఆర్డీఏ విజయనగరం అర్బన్: మార్చి – 2026లో జరిగిన ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలో అత్యుత్త మ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ‘షైనింగ్ స్టార్స్ అవార్డ్స్’ ప్రదానోత్సవ కార్యక్రమం సోమవారం నిర్వహించనున్నారు. పట్టణ శివార్లలోని ఎస్ కన్వెన్షన్ హాల్లో ఉదయం 8.30 గంటలకు ఈ కార్యక్ర మం ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు విజయనగరం జిల్లా వ్యాప్తంగా మొత్తం 184 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. అవార్డుకు ఎంపికై న ప్రతి విద్యార్థికి ఒక మెడల్, మెరిట్ సర్టిఫికెట్ తో పాటు రూ.20 వేలు నగదు బహుమతిని అంద జేయనున్నారు. కార్యక్రమానికి ఎంపికై న విద్యార్థులందరూ తమ తల్లిదండ్రులతో కలిసి రేపు ఉద యం 8.30 గంటలకల్లా తప్పనిసరిగా వేదిక వద్దకు చేరుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. సాలూరు: గిరిజన విద్యార్థి మరణంలో వాస్తవమేంటో తెలియదు కానీ ఒక్కొక్కరు ఒక్కో వాదన వినిపిస్తున్నారు. సాలూరు మండలంలోని తోణాం పీహెచ్సీ పరిధి ఎగువమెండంగికి చెందిన తాడంగి జోయ్(16) మృతిపై ఈ నెల 17న సాక్షిలో జ్వరంతో గిరిజన విద్యార్థి మృతి శీర్షికన వార్త ప్రచురిచతమైంది. దీనిపై తాడంగి జోయ్ మూడు రోజుల పాటు తన స్నేహితుడి ఇంట్లో ఉంటూ గంజాయి వంటి మత్తు పదార్థాలు వినియోగించడం వల్లనే మరణించాడని డీఎంహెచ్ఓ డా. పి.విజయలక్ష్మి ఓ ప్రకటన విడుదల చేశారు. దీనిపై ఈ నెల 19న 16 ఏళ్ల బాలుడు గంజాయికి బానిస? అనే శీర్షికన సాక్షిలో మరో కథనం ప్రచురితమైంది. గంజాయి వినియోగించడం వల్ల విద్యార్థి మరణించాడన్న వైద్యారోగ్య శాఖ ప్రకటన నేడు చర్చనీయాంశంగా మారింది. గంజాయి వంటి మత్తుపదార్థాలు గిరిశిఖర గ్రామాల్లో నిజంగా లభ్యమవుతున్నాయా? నిజంగా వాటిని ఆ 16 ఏళ్ల బాలుడు వినియోగించాడా? తదితర అంశాలపై వాస్తవా లను తెలుసుకునేందుకు ఆదివారం జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఇటు పోలీసులు, అటు వైద్యశాఖ సిబ్బంది ఎగువమెండంగి గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. విద్యార్థి తల్లిదండ్రులు తమ బిడ్డకు గంజాయి వంటి ఎటువంటి అలవాట్లు లేవని, జ్వరంతోనే మరణించాడని స్పష్టం చేసినట్లు సమాచారం. జ్వరం, కడుపునొప్పితో మరణించాడని మృతుని తండ్రి దనేల్ పోలీసులకు తెలిపినట్లు రూరల్ సీఐ రామకృష్ణ స్పష్టం చేశారు. గంజాయికు బానిసై యువకుడు మరణించాడన్నది అవాస్తమని ఆదివారం సాయంత్రం ఎస్పీ మాధవరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థి గంజా యి వంటి మత్తుపదార్థాలు వినియోగించడం వల్ల మరణించాడన్న వైద్యారోగ్యశాఖ ప్రకటన అవాస్తవమని పోలీసుశాఖ తన ప్రకటన ద్వారా స్పష్టంచేసింది. ఆ గిరిజన విద్యార్థి పదవ తరగతిలో ఓ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చదువుకుని 503 మార్కులు సాధించాడు. తమ బిడ్డకే కాదు. గ్రామంలో ఎవరికీ ఇటువంటి అలవాట్లేమీ లేవని మృతుడి తల్లిదండ్రులు విచారణలో స్పష్టం చేశారు. గిరిజన విద్యార్థి మృతి అంత చులకనా? ఓ గిరిజన విద్యార్థి మరణించిన తరువాత ఎటువంటి శవ పంచనామా నిర్వహించకుండా, పూర్తి వాస్తవాలు తెలుసుకోకుండా గంజాయి వంటి మత్తుపదార్థాలు వినియోగించి మరణించాడని వైద్యారోగ్యశాఖ ఏ విధంగా ప్రకటన విడుదల చేస్తుందని స్థాని కులు ప్రశ్నిస్తున్నారు. ఆధారాలు లేకుండా, పూర్తి స్థాయిలో విచారణ చేయకుండా ఎలా ప్రకటిస్తారని మృతుని తండ్రి ప్రశ్నిస్తున్నాడు. చనిపోయిన గిరిజన విద్యార్థిపై మాయని మచ్చను వేసే ప్రయత్నం చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఓ గిరిజన విద్యార్థి మరణమంటే అధికారులకు ఇంత చులకనా? అని ప్రశ్నిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపితే వాస్తవాలు తెలుస్తాయని, సరైన ఆధారాలు విచారణ లేకుండా ఓ గిరిజన యువకుడి మరణంపై అధికారులు తప్పుడు నివేదికలు ఇవ్వవద్దని గిరిజన నాయకులు కోరుతున్నారు. గిరిజన విద్యార్థి మరణంలో మతలబు గంజాయి వినియోగంతో మరణించాడని ప్రకటించిన డీఎంహెచ్ఓ గంజాయి మత్తుతో మరణం అవాస్తవమని ప్రకటించిన ఎస్పీ -
విమానాశ్రయం ప్రారంభోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు
● ఆగస్టు 1న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం ● జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి మోదీ ● రూ.4.592 కోట్లతో తొలి దశ పూర్తి విజయనగరం అర్బన్: ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం సాకారం కాబోతోంది. జిల్లాలోని భోగాపురంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అల్లూ రి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. ఆగస్టు 1న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ విమానాశ్రయా న్ని ప్రారంభించి, జాతికి అంకితం చేయనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జి.సాయిప్రసాద్, రోడ్లు భవనా ల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబా బు ఇతర సీనియర్ ఐఏఎస్ అధికారులతో కలిసి ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని సూచించారు. ప్రధాని పర్యటనలో భాగంగా చేపట్టాల్సిన విధులను వివిధ విభాగాలుగా విభజించి, ఐఏఎస్ అధికారులకు ప్రత్యేక బాధ్యతలను అప్పగించారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తాం : కలెక్టర్ కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి మాట్లాడుతూ ప్రధా ని పర్యటన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా జానపద కళారూపాలతో స్వాగత ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. పకడ్బందీగా బందోబస్తు : ఎస్పీ ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ ప్రధాని పర్య టన నిమిత్తం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. విమానాశ్రయానికి భారీగా వాహనాలు వచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్దంగా పార్కింగ్ సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఉత్తరాంధ్రకు మణిహారంగా ఎయిర్పోర్ట్ సుమారు రూ.4,592 కోట్ల భారీ వ్యయంతో తొలి దశలో నిర్మించిన ఈ అంతర్జాతీయ విమానాశ్రయం, ఉత్తరాంధ్ర ప్రాంతంలో పారిశ్రామిక, పర్యా టక, వాణిజ్య రంగాల్లో భారీ మార్పులకు కేంద్ర బిందువుగా మారనుంది. పూసపాటిరేగ: ఆగస్టు 1వ తేదీన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి విచ్చేయనున్న నేపథ్యంలో భోగాపురం ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాల్లో చేపడుతున్న ఏర్పాట్లను కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, మంత్రి శ్రీనివాస్ ఆదివారం సంయుక్తంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాల్లో గుర్తించిన ఐదు లేఔట్లలో సుమారు ఆరు వేల వాహనాల పార్కింగ్కు చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. కంచేరు నుంచి ముంజేరు వరకు ఉన్న రహదారిని వెంటనే మరమ్మతులు చేపట్టి ప్రయాణానికి అనువుగా తీర్చిదిద్దాలని రోడ్లు భవనాల శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. హెలిప్యాడ్, ప్రజా వేదికను సందర్శించి, నిర్మాణ పనులను, ఏర్పాట్లును పరిశీలించి, సంబంధిత అధికారులకు ఎస్పీ పలు సూచనలు చేశా రు. పరిశీలనలో ఎమ్మెల్యే నాగమాధవి, అడిషనల్ ఎస్పీ సౌమ్యలత, ఆర్డీఓ సుధాసాగర్, ఎయిర్పో ర్టు ప్రాజెక్టు హెడ్ రామరాజు, రెవెన్యూ, పోలీసు, రోడ్లు భవనాల శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఆయన కడుపు కొట్టారు...!
విజయనగరం టౌన్: సమాజాన్ని పట్టిపీడిస్తున్న అంశాలన్నింటినీ క్రోడీకరించి, వాటిని తనదైన శైలిలో రూపు మాపేందుకు కలంపట్టి కన్యాశుల్కం వంటి అద్భుతమైన నాటకాన్ని మహాకవి గురజాడ రచించి, అసమానతలను రూపు మాపేందుకు కృషి చేసి, విమర్శకుల నోట వెంట శభాష్ అనిపించుకున్నారు. అటువంటి మహనీయునికి ఉన్న చిన్నపాటి స్వగృహం రక్షించుకోవడంలోనూ, వారి వారసత్వాన్ని కొనసాగించడంలో కూటమి ప్రభుత్వం కుట్ర పన్నడం చరిత్రలో ఓ కళంకంగా నిలిచిపోతుందని సాహితీవేత్తలు ధ్వజమెత్తుతున్నారు. మహాకవి గురజాడ సమాజంలో రుగ్మతలను రూపుమాపేందుకు కన్యాశుల్కం పేరుతో 1892 ఆగస్టు 13న తొలి కూర్పును ప్రదర్శించారు. 1897లో ఆనందగజపతి రాజుకి అంకితం ఇచ్చారని చరిత్రలో చెప్పుకుంటూ వస్తున్నారు. అటువంటి కూటమి ప్రభుత్వంలో విజయనగరం రాజుల కుటుంబీకులే ప్రజాప్రతినిధులుగా వ్యవహరిస్తుండడం పట్ల మరింత ఆగ్రహం వ్యక్తం వెళ్లగక్కుతున్నారు. మహాకవి కుటుంబం చాలీచాలని జీతంతో ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ 2015 నుంచి నెలకు రూ.10 వేలు క్రమం తప్పకుండా పంపిస్తున్నారు. అది తీసుకోవడం కూడా ఇబ్బందిగానే ఉందని కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర రచయిత్రుల సమావేశానికి హాజరైన యార్ల గడ్డ సభాముఖంగా ఎమ్మెల్యే అతిధికి సమస్యను వివరించిన సంగతి విదితమే. మీ మహారాజులకు సేవ చేసిన మహాకవి కుటుంబానికి ట్రస్ట్ నుంచి రూ. 25 వేలు నెలకు అందే విధంగా చూడాలని కోరారు. 1989లో మహాకవి గురజాడ అప్పారావు స్వగృహాన్ని ఆయన కుటుంబీకులు దివంగత ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వపరం చేశా రు. నాటి నుంచి ఆ గృహాన్ని సంరక్షించే బాధ్యతల ను కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు నిర్వహిస్తూ ఉండేవారు. 2011లో గురజాడ మునిమనవడు వెంకటేశ్వరప్రసాద్కి ఎటువంటి జీవనాధారం లేదని నెలకు రూ.20వేల జీతంతో అందులో అవుట్ సోర్సింగ్ విధానంలో అవకాశమిచ్చారు. ఆయనకు 50 ఏళ్ల వయసున్నప్పుడు అవకాశమిచ్చి ప్రస్తుతం 62 ఏళ్లు అయిపోయిందని కల్చరల్ డిపార్ట్మెంట్ అధికారులు గతేడాది నుంచి తీసివేశారు. ఈ ఏడాది మార్చి నెలలో విజయవాడ వచ్చి జీతాలు ఎందుకు రావడం లేదని కుటుంబ సభ్యులు ఆరా తీస్తే ఉద్యో గం నుంచి తీసివేసినట్లు చెప్పడం బాధాకరమని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. మహాకవి ఇంటికి తమ చేతి డబ్బులు పెట్టించి పనులు చేసుకోవాల్సి వస్తుందని గురజాడ ముని మనవరాలు ఇందిర ఆవేదన వెళ్లగక్కారు. 2011లో గురజాడ గృహాన్ని సంరక్షించే బాధ్యతను జీఓ ప్రకారమే ఇచ్చినప్పటికీ గతేడాది సెప్టెంబర్ నుంచి అతన్ని విధుల్లోంచి తొలగిస్తూ రిటైర్ అయిపోయారని అక్కడకు వెళితే గానీ చెప్పలేదని వాపోయారు. సీఎం, డిప్యూటీ సీఎంలకు, మంత్రులు లోకేష్, కందుల దుర్గేష్ను, మంత్రి కొండపల్లి శ్రీనివాస్లకు వినతులిచ్చినా పక్కన పడేయడం విచాకరమని ఆవేదన వెళ్లగక్కుతున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులకు వినతులిచ్చాం. ఎటువంటి నోటీసు లేకుండా విధుల్లోంచి తీసేశారు. జీవిత కాల గౌరవవేతనం ఇచ్చి గురజాడను బతికించండి. పక్క రాష్ట్రాల్లో ప్రసిద్ధ కవులు, కళాకారుల కుటుంబాలకు ప్రభుత్వమే ఆర్థిక సాయ మందిస్తోంది. అటువంటిది మహాకవి కుటుంబం పట్ల ఇంతటి చిన్నచూపు చూడడం తగదు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం స్పందించాలి. తమకు న్యాయం చేయాలి. –గురజాడ వెంకటేశ్వరప్రసాద్, గురజాడ ముని మనవడు, విజయనగరం -
‘హద్దు’ మీరిన నిర్లక్ష్యం
ఎక్కడ పడితే అక్కడే దర్శనమిస్తున్న సరిహద్దు రాళ్లు బొండపల్లి: గత ప్రభుత్వ హయాంలో సర్వే నిర్వహించి రైతుల భూముల సరిహద్దుల కోసం కేటాయించిన సరిహద్దు రాళ్లను రెవెన్యూ అధికారులు తమ ఇష్టారాజ్యం ఎక్కడిపడితే అక్కడ పడేయడంతో ప్రజాధనాన్ని కాపాడాల్సిన అధికారులే ఇలా ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నా పట్టించుకోరా? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో సర్వే అనంతరం రైతుల భూముల్లో హద్దుల కోసం ఏర్పాటు చేయాల్సిన సరిహద్దు రాళ్లు పాతకుండా ఎక్కడిపడితే అక్కడ పడేసి గత ప్రభుత్వంపై నిందలు వేసేలా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఎప్పడో జరిగిన భూ సర్వే స్థానంలో గత ప్రభుత్వ హయాంలో సమగ్ర భూ సర్వేను విడతల వారీగా గ్రామాల్లో చేపట్టగా సగానికి పైగా గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసి సరిహద్దు రాళ్ల భారం రైతులపై పడకుండా నేరుగా ప్రభుత్వమే నిధులు కేటాయించి ఏర్పాటు చేసింది. అయితే కొంతమంది రెవెన్యూ అధికారులు ఉదాసీనత కారణంగా గ్రామాలకు కేటాయించిన రాళ్లు ఎక్కడిపడితే అక్కడ వదిలేసి రైతుల పొలాల్లో పాత కుండా చేతులు దులుపుకున్నారు. మండలంలోని తమటాడ, బోడసింగి పేట గ్రామాల్లో సర్వే రాళ్లు చెత్త కుప్పల్లోను, రచ్చ బండల వద్ద ఎక్కేందుకు అవసరమైన మెట్లుగా ఉపయోగించడం పట్ల రెవెన్యూ అధికారుల తీరు పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
స్వామినాయుడువలసలో సినిమా షూటింగ్
కొమరాడ: మండలంలోని స్వామినాయుడువలస గ్రామ పరిసరాల్లో మేరంగి జంక్షన్ ఇద్ద సినిమా బృందం ఆదివారం సందడి చేసింది. శ్రీకాకుళానికి చెందిన హాస్య నటుడు షకలక శంకర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం కీలక సన్నివేశాలను గ్రామ పరిసరాల్లో చిత్రీకరించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ నేపథ్యంలో సినీ ప్రేమికులతో పాటు గ్రామస్తులు షూటింగ్ వద్దకు వెళ్లి ఆనందించారు.గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించిన ఎస్పీవిజయనగరం క్రైమ్: తన కళ్లముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయ పడిన మహిళను ఎస్పీ దామోదర్ దగ్గరుండి హాస్పిటల్కు తరలించారు. ఆదివారం జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద భద్రతా చర్యలను సమీక్షించిన అనంతరం ఎస్పీ దామోదర్ విజయనగరం వస్తున్న సమయంలో భోగాపురం మండలం, లింగాలవలస జంక్షన్ వద్ద బైక్ ప్రమాదం జరిగింది. ఆ బైక్పై వెనుక కూర్చున్న మహిళ తీవ్రంగా గాయపడినట్లు ఎస్పీ గుర్తించారు. దీంతో తన కాన్వాయ్ను ఆపి గాయపడిన మహిళకు తన ఎస్కార్ట్ సిబ్బందితో సపర్యలు చేయించారు. బాధితురాలికి ధైర్యం చెప్పి ఫోన్ చేసి అంబులెన్స్ను రప్పించి గాయపడిన మహిళను స్థానికుల సహాయంతో దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. భోగాపురం రూరల్ సీఐ శ్రీనివాస్ కు సమాచారం ఇచ్చి తదుపరి చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. వ్యక్తి ఆత్మహత్య● బతుకు తెరువుకు భామిని వచ్చిన కర్ణాటక వాసి భామిని: బతుకుతెరువులో భాగంగా వచ్చిన కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి భామిని మండల కేంద్రంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై మృతుని బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటకకు చెందిన వలసకూలీ రమేష్ కోల్కర్(37) మండల పరిధిలో సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసే పనికోసం భార్య లక్ష్మితో ఇక్కడికి వచ్చాడు. స్థానికంగా ఓ ఇల్లు అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తున్నాడు. మద్యం అలవాటు ఉన్న కోల్కర్ రోజులాగానే శనివారం మద్యం మత్తులో భార్యతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో రాత్రి కుటుంటసభ్యులు నిద్రపోయిన క్రమంలో తన ఇంటి బాత్రూమ్లో ఉరివేసుకున్నాడు. ఆదివారం ఉదయం ఈ విషయం గమనించిన భార్య, సహచరులు, చుట్టుపక్కల వారు బత్తిలి పోలీసులకు సమాచారం అందించారు. భార్య ఫిర్యాదుతో ఈ ఘటనపై ఏఎస్సై కాంతారావు కేసు నమోదు చేశారు. -
క్రీడాకారుల శ్రమదానం
● పరిశుభ్రం చేసిన మైదానం ● క్రీడలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న యువకులు ఎవరూ ముందుకు రావడం లేదు అప్పుడప్పుడు వివిధ రకాల క్రీడా పోటీలు జరుగుతున్నప్పుడు తామే తలా రూపాయి ఎత్తుకుని క్రీడా మైదానాన్ని అబివృద్ధి చేసుకోవడమే తప్ప పాలకులు, అధికారులు ఎవరూ ముందుకు రావడం లేదు. క్రీడలను బతికించు కోవడం కోసం మేమే అప్పుడప్పుడు శ్రమదానం చేస్తూ మైదానాన్ని కాపాడుకుంటున్నాం తాతబాబు, కబడ్డీ కోచ్ -
ఖోఖో విజేత కస్పా జట్టు
● ద్వితీయ స్థానంలో కుమిలి ● తృతీయ ఉమ్మడి విజేతలుగా పూసపాటిరేగ, గంగచోళ్లపెంటవిజయనగరం: స్వర్గీయ పోరాల అనిల్ కుమార్ యాదవ్ జ్ఞాపకార్థం నిర్వహించిన జిల్లా స్థాయి ఆహ్వానపు పాఠశాల విద్యార్థుల ఖోఖో పోటీల్లో విజేతగా కస్పా ఉన్నత పాఠశాల జట్టు నిలిచింది. ద్వితీయ స్థానాన్ని కుమిలి ఉన్నత పాఠశాల జట్టు దక్కించుకోగా..తృతీయ స్థానాన్ని ఉమ్మడిగా పూసపాటిరేగ, గంగచోళ్ల పెంట జట్లు కై వసం చేసుకున్నాయి. జిల్లా ఖోఖో అసోసియేషన్ సారథ్యంలో జాతీయ ఖో ఖో క్రీడాకారుడు తురాల అనిల్ కుమార్ యాదవ్ మిత్రబృందం ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి 15 జట్లు పాల్గొన్నాయి. ఆదివారం నిర్వహించిన పోటీలను జిల్లా ఖోఖో అసోసియేషన్ చైర్మన్ పెనుమజ్జి విజయలక్ష్మి, ఒలింపియన్ మాణిక్యాలరావు, తూరాల శ్రీనివాసులు ప్రారంభించారు. పోటీల ముగింపు అనంతరం విజేతలుగా నిలిచిన జట్లకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు ఏఎన్ఎం కమలనాభరావు, కార్యదర్శి కె.గోపాల్, ఆర్గనైజింగ్ కార్యదర్శి మల్లికార్జునరావు, కేఏ బాలకృష్ణ, వ్యాయామ ఉపాధ్యాయులు సత్యనారాయణ, రాము, శ్రీను, వరలక్ష్మి, విజయ, వాణి, స్వర్గీయ అనిల్ కుమార్ మిత్రులు పొంతపల్లి హరీష్, రాము, మహారాజులు పాల్గొన్నారు. -
సీతారాముల ఖాతాలో రైతుల భూములు
బలిజిపేట: ఎన్నో సంవత్సరాల నుంచి సంక్రమించిన, కొనుగోలు చేసిన మా భూములు మాకు కాకుండా చేయడమేమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో బలిజిపేట మండలంలోని గలావల్లి గ్రామ రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గ్రామంలో 1350సర్వే నంబర్లకు సంబంధించిన 500మంది రైతులకు చెందిన 600ఎకరాలకు పైగా భూమి జీరో అకౌంట్, 2 వేల అకౌంట్, రాముడు, సీత అకౌంట్లలో ఉన్నాయని వాటికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు తెచ్చుకుంటేనే వాటిని సరిచేయగలవని లేకపోతే మీ ఖాతాలోకి రావని రెవెన్యూ అధికారులు ఇప్పుడు చెప్పడం ఏమిటని, ఇదో వింతనాటకంగా ఉందని రైతులు లబోదిబోమంటున్నారు. గతంలో ఎప్పుడు మ్యుటేషన్కు పెట్టినా మీ నంబర్లు ఆయా ఖాతాల్లో ఉన్నాయి అని చెప్పేవారే కాని దానిని ఏ విధంగా సరిచేయాలనేది ఇంతవరకు రెవెన్యూ శాఖకు చెందిన ఎవరూ చెప్పలేదని వాపోతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పక్కాగా రీ–సర్వే 2023లో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గలావల్లిలో రీ–సర్వే పక్కాగా జరిగిందని దాని ప్రకారం మా పాస్పుస్తకాలు మాకు ఇచ్చిఉంటే మాకు ఇప్పుడు ఎటువంటి సమస్య ఉండేదికాదని రైతులు వాపోతున్నారు. అప్పట్లో ఫీల్డ్ వెరిఫికేషన్లో భూమిని సాగుచేస్తున్న రైతుతో పత్రాలను చూపించిన తరువాత ఆభూమికి అన్ని వైపులా ఎవరు ఉన్నారో వారినుంచి వాస్తవాన్ని తెలుసుకుని పక్కాగా రీసర్వే చేశారు. ఎన్నికల కోడ్ వచ్చిందని దానిని నిలుపుదల చేశారు. ప్రభుత్వం మారి చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత గలావల్లిలో రెండోసారి రీ–సర్వే నామమాత్రంగా చేసి చేతులు దులుపుకున్నారని రైతులు తెలిపారు. భూములు సాగు చేసుకుంటున్న రైతుల భూములకు వన్–బీలు రాకపోగా మీ భూములు జీరో అకౌంట్లో, 2వేల ఖాతాలో, రాముడు, సీత ఖాతాల్లో ఉన్నాయని ఇప్పుడు రెవెన్యూ అదికారులు చెప్పడంతో ఇదేమి విడ్డూరమంటూ లబోదిబోమంటున్నారు. పాత పాస్బుక్, గ్రామ పురోణీలు, క్రయ, విక్రయ డాక్యుమెంట్లు, వారసత్వ ఆధారాలు ఉండి మా భూములకు వన్–బీలు రాకపోవడం దారుణంగా ఉందని ఆందోళన చెందుతున్నారు. ఆన్లైన్ ఎప్పుడు జరిగింది–ఖాతాలంటే ఏమిటి: 2011లో వెబ్ల్యాండ్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అంతవరకు చేతిరాతద్వారా ఉండే పాస్పుస్తకాల స్థానే డిజిటలైజేషన్కు శ్రీకారం చుట్టారు. ఆసమయంలో పాస్ పుస్తకాల్లో ఉండే భూమి వివరాలు వెబ్ల్యాండ్ చేసి డిజిటలైజేషన్ చేశారు. ఇక ఆసమయంలో రైతులు వారివారి భూములకు సంబంధించిన ఆధారాలు సక్రమంగా చూపించిన వారికి వెబ్ల్యాండ్లో పక్కాగా ఆన్లైన్ జరిగింది. ఆసమయంలో ఆధారాలు చూపలేని రైతుల భూములకు గ్రామాన్ని బట్టి ఒక అంకెను పెట్టి నామకరణం చేసి దానిలో వారివారి భూములను చేర్చారు. అందులో భాగంగా గలావల్లి భూములు 2వేల ఖాతాకు చేరాయి. ఇక రాముడు, సీత ఖాతా అంటే గ్రామంలో ఎవరి పేరునా ఆభూములను పెట్టలేక ఏదో ఒక నామకరణం చేయాలి కనుక రాముడు, సీత ఖాతాలని పెట్టి దానిలో కొంతభాగం చేరింది. ఈ ప్రకారం ఖాతాలు ఏర్పాటు జరిగాయి. గలావిల్లి రైతుల్లో గందరగోళంవేరువేరుగా సర్వే నంబర్లు రీ–సర్వే చేసిన తరువాత రెవెన్యూశాఖ వారు ఇచ్చే సర్వే నంబర్ల జాబితాకు రైతుల వద్ద ఉన్న డాక్యుమెంట్లలో సర్వే నంబర్లు వేరువేరుగా కనిపిస్తున్నాయని ఇదో గందరగోళంగా ఉందని రైతులు చెబుతున్నారు.


