breaking news
Vizianagaram District News
-
చదురుగుడికి పెదపోలమాంబ
మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి మేనత్త పెదపోలమాంబ సోమవారం చదురుగుడికి చేరుకున్నారు. ముందుగా పెదపోల మాంబ అమ్మవారి ఘటాన్ని జన్నివారి ఇంటి నుంచి ఎస్.పెద్దవలస గ్రామ రహదారి వద్దనున్న అమ్మవారి గద్దె సమీపంలోకి తీసుకువచ్చి పూజలు చేశారు. ట్రస్టు బోర్డు చైర్మన్ నైదాన తిరుపతిరావు, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, కరణం కుటుంబీకులు సంప్రదాయ బద్ధంగా అమ్మవారి ఘటానికి పూజలు జరిపారు. అనంతరం మేళ తాళాలు, కోలాట ప్రద్శనలు, భక్తుల జయజయ ధ్వానాల నడుమ పెద పోలమాంబను చదురు గుడికి తీసుకువచ్చారు. అమ్మవారు గ్రామంలోని చదురుగుడిలో వారం రోజులపాటు భక్తులకు దర్శనమిస్తారు. వచ్చే ఏడాది జనవరి 5న పెదపోలమాంబ అమ్మవారి తొలేళ్ల ఉత్సవం, 6న ప్రధాన ఉత్సవం, 7న అనుపొత్సవం నిర్వహిస్తారు. అదేరోజు శంబరపోలమాంబ అమ్మవారిని గ్రామంలోకి ఆహ్వానించేందుకు సనప చాటింపు వేస్తారు. జనవరి 12న శంబర పోలమాంబ అమ్మవారిని గ్రామంలోకి తీసుకువస్తారు. 13 రోజుల పాటు పోలమాంబ అమ్మవారు చదురు గుడిలో భక్తులకు దర్శనమిస్తారు. జనవరి 26న తొలేళ్లు ఉత్సవం, 27న సిరిమానోత్సవం, 28న అనుపోత్సవం నిర్వహిస్తారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ బి.శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యుడు తీళ్ల పోలినాయుడు, సర్పంచ్ సింహాచలమమ్మ, ఉప సర్పంచ్ అల్లు వెంకటరమణ, మాజీ ట్రస్టు బోర్డు చైర్మన్లు, గ్రామపెద్దలు, జన్ని, కరణం, కుప్పిలి కుటుంబీకులు పాల్గొన్నారు. -
పదవి కోసం వల..!
సాక్షిప్రతినిధి, విజయనగరం: ప్రజాస్వామ్యయుతమైన అధికారం,కోరంలో బలం లేకపోయినా మున్సిపాలిటీలు, మండల పరిషత్లు.. పంచాయతీలను కేవలం అధికార బలంతో చేజిక్కించుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్న చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు నేడు మత్స్యకార సహకార సంఘాల ఎన్నికల్లోనూ అదే విధానం అవలంబిస్తోంది. విజయనగరం జిల్లాలోని మత్స్యకార సహకార సంఘానికి సంబంధించి పలు సొసైటీల డైరెక్టర్లు, సంఘాల సభ్యులు ఇప్పటికే వైఎస్సార్సీపీలో కొనసాగుతూ పార్టీ తరఫున పదవుల్లో కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆ పదవులను లాక్కునేందుకు టీడీపీ.. జనసేన నాయకులు అడ్డదారులు తొక్కు తున్నారు. గత వారం రోజులుగా మంత్రుల నుంచి ఎమ్మెల్యేలు, మండల స్థాయి నాయకులు, చోటా నేతలు గ్రామాల్లోకి దిగిపోయి సొసైటీ నేతలను ప్రలోభపెడుతున్నారు. అధికారం తమది కాబట్టి తమతో ఉంటే అభివృద్ధి ఉంటుందని నమ్మబలుకుతున్నారు. లొంగనివాళ్లని బెదిరిస్తున్నారు. ప్రత్యేకంగా శిబిరాలుపెట్టి వారిని తమ దారిలోకి తెచ్చేందుకు చేస్తున్న విశ్వప్రయత్నాలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. నేడు జిల్లా మత్స్యకార సహకార సంఘం జిల్లా అధ్యక్షుడి ఎన్నిక విజయనగరం, పార్వతీపురంమన్యం జిల్లాలకు సంబంధించి ఉమ్మడి జిల్లాగానే జిల్లా మత్సకార సహకార సంఘం ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు మత్సశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలు జారీ చేయగా.. ఈ నెల 30న మంగళవారం జిల్లా సంఘం అధ్యక్ష ఎన్నిక నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు విజయనగరం జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ రోడ్డులోని చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి విజయనగరం జిల్లా మొత్తం అధికారిక లెక్కల ప్రకారం 66 మంది మత్స్యకార ప్రాథమిక సహకార సంఘాల అధ్యక్షులు ఉన్నారు. విజయనగరం జిల్లాలో 44 మంది, పార్వతీపురం మన్యం జిల్లాలో 22 మంది అధ్యక్షులుగా ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఈ మేరకు తుది ఓటర్ల జాబితాను ప్రచరించేశారు. వీరంతా సోమవారం జరిగే ఎన్నికల్లో 11 లంగా ఉండే వారిని ఎన్నుకునేందుకు పావులు కదుపుతున్నారు. గడిచిన పక్షం రోజులుగా పార్టీ జిల్లా నేత గ్రామాల్లో ఉండే నాయకులతో మంతనాలు నిర్వహించి వారి ద్వారా ప్రాథమిక సహకార సంఘాల అధ్యక్షులను తమదారిలోకి తెచ్చే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలకు చెందిన మంత్రులు సైతం సమీక్షలు నిర్వహించి ఎన్నిక ల్లో విజయం కోసం ఆరాటపడుతున్నారు. ప్రాథమి క సహకార సంఘాల అధ్యక్షులు తాము చెప్పినట్లు చేయకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నా రు. ప్రత్యేక క్యాంప్లు పెట్టి మాట వినిని వారిని బుజ్జగిస్తున్నారు. మంది డైరెక్టర్లను ముందుగా ఎన్నుకోవాల్సి ఉంటుంది. డైరెక్టర్లుగా ఎన్నికై న వారంతా వారిలోనే ఒక అధ్యక్షుడిని, ఒక ఉపాధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల ప్రక్రియ నిర్వహించనున్నట్టు మత్స్యశాఖ అధికారులు పేర్కొన్నారు. చేతులు ఎత్తే పద్ధతిలో ఎన్నిక... జిల్లా మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుని ఎన్ని క ప్రక్రియ చేతులు ఎత్తే విధానంలో ప్రత్యక్షంగా నిర్వహించనున్నారు. ఇదే సువర్ణావకాశంగా భావించిన అధికార టీడీపీ, జనసేన ప్రజాప్రతినిధులు, నాయకులు సంఘం అధ్యక్షుడిగా తమకు అనుకూవాస్తవానికి ప్రస్తుతం ఉన్న 66 మత్స్యకార ప్రాథమిక సహకార సంఘాల అధ్యక్షుల్లో అధిక శాతం మంది వైఎస్సార్సీపీ సానుభూతిపరులే. గడిచిన రెండు ఎన్నికల నుంచి ఇప్పటి వరకు జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించిన వారు సైతం వైఎస్సార్సీపీలో ఉన్న వారే. సదరు వ్యక్తి పార్టీలో రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహిస్తుండడంతో మింగుడు పడని టీడీపీ, జనసేన నాయకులు జిల్లా అధ్యక్ష పదవిని దక్కించుకుని, వారి ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు తాపత్రయ పడుతున్నారు. ఇదిలా ఉండగా ప్రాథమిక సహకార సంఘాల అధ్యక్షుల్లో చాలా మంది గ్రామాల్లో నెయ్యిల సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, వారి ఆర్ధిక, సామాజిక స్థితి గతులు అంతంతమత్రంగానే ఉండటంతో వారిని అధికార బలంతో బెదిరించి తమవైపు తిప్పుకునేందుకు నేతలు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. దీనిని సంబందిత సంఘ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. -
జిల్లా అధికారుల టేబుల్ క్యాలెండర్ ఆవిష్కరణ
విజయనగరం అర్బన్: జిల్లా అధికారుల తరఫు న ముఖ్యప్రణాళిక అధికారి బాలాజీ రూపొందించిన టేబుల్ క్యాలెండర్ను కలెక్టర్ రాంసుందర్రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా పరిపాలనలో సమన్వయం, ప్రణాళికాబద్ధమైన పనితీరుకు ఈ క్యాలెండర్ దోహద పడుతుందని చెప్పారు. జిల్లాలో చేపట్టబోయే శాఖాపరమైన కార్యక్రమాలు, తేదీలు, ప్రభుత్వ ప్రాధా న్యతలను క్యాలెండర్లో గుర్తించి, అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విజయనగరం అర్బన్: సచివాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న వివిధ కేడర్ సిబ్బంది అందరూ హాజరును బయోమెట్రిక్ విధానంలోనే నమోదు చేయా లని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కార పరిస్థితులపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన సోమవారం మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా నుంచి రెవె న్యూ వినతుల్లో ఎక్కువ శాతం తిరస్కారం అవుతున్నాయని, ప్రతి వినతిని మరోసారి పరిశీలించాలని ఆదేశించారు. అర్జీదారుల వినతులు నాణ్యమైన, స్పీకింగ్ ఆర్డర్ రూపంలో సమాధానం ఇవ్వాలని, అర్జీదారుల సంతృప్తి పెరగాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోలు వేగంగా జరగాలని, ప్రస్తుతం నూర్చిన ధాన్యం 30వేల మె ట్రిక్ టన్నుల వరకు ఉన్నాయని, బుధవారం మొ త్తం ధాన్యాన్ని సేకరించాలని తెలిపారు. పదో తరగ తి పరీక్షలపై దృష్టి పెట్టాలని, 100 రోజుల ప్రణాళిక అమలు చేసి శతశాతం ఫలితాలు వచ్చేలా చూడాల ని ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో మురళి, జిల్లా అధికారులు, వర్చువల్గా ఆర్డీఓలు, మండల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. గరుగుబిల్లి: ఎన్నో ఏళ్లుగా అసంపూర్తిగా ఉన్న జంఝావతి ప్రాజెక్టు నిర్మాణసాధనకు రైతు లంతా కలిసి రావాలని జంఝావతి సాధనసమితి అధ్యక్ష, కార్యదర్శులు చక్క భాస్కరరావు, మరిశర్ల మాలతీకృష్ణమూర్తి నాయు డు కోరారు. గరుగుబిల్లి మండలంలోని ెఉల్లిభద్ర, దళాయివలస, ఉద్దవోలు, శివరాంపురం తదితర గ్రామాల్లో పర్యటించి రైతులు, పెద్దలతో కలిసి మాట్లాడారు. సమస్యపై చర్చించి కరపత్రాలు అందజేశారు. జంఝా వతి ప్రాజెక్టును పాలకులు ఎన్నికల హామీగానే చూస్తున్నారే తప్ప పూర్తిచేసేందుకు శ్రద్ధ వహించడం లేదన్నారు. సాగునీరు అందక, పంటలు పండక ఈ ప్రాంత రైతులు పేదరికాన్ని అనుభవిస్తున్నారన్నారు. రైతులు ప్రశ్నించడంలేదనే సాకుతో పాలకులు పట్టించుకోవడం లేదని తెలిపారు. రైతులు ప్రశ్నించినప్పుడే ప్రభుత్వాలు దిగివచ్చి రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. జంఝావతి నిర్మాణం పూర్తికోసం బాధిత గ్రామాల రైతులతో సమితులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అక్రమంగా అరటిచెట్ల నరికివేతజియ్యమ్మవలస రూరల్: మండలంలోని బిత్రపాడు గ్రామానికి చెందిన నీరసం చంద్రకళ అనే మహిళా రైతుకు చెందిన అరటి తోటలో శనివారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు సుమారు యాభై అరటి గెలలతో ఉన్న చెట్లు నరికివేశారు. దీనిపై కొమరాడ ఎస్సై కె. నీలకంఠానికి ఫిర్యాదు చేశారు. -
నల్లబెల్లం విక్రయిస్తే కఠిన చర్యలు
● ఎకై ్సజ్ సీఐ శ్రీనివాసరావు ● మండల కేంద్రంలో ముమ్మరంగా తనిఖీలుకురుపాం: సారా తయారీకి వినియోగించే నల్లబెల్లం విక్రయాలు చేసినా, సరఫరా చేసినా అటువంటి వ్యాపారుల పైన, వ్యక్తుల పైన చర్యలు తప్పవని కురుపాం ఎకై ్సజ్ శాఖ సీఐ పి.శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు సోమవారం సాక్షి దిన పత్రికలో ‘ధాన్యం ముసుగులో నల్లబెల్లం అక్రమ రవాణా’ శీర్షికన వెలువడిన కథనానికి స్పందించిన సీఐ పి.శ్రీనివాసరావు కురుపాం మండల కేంద్రంలోని రావాడ కూడలి, శివ్వన్నపేట తదితర దుకాణాల్లో సోమవారం ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా బెల్లం నిల్వల పై ఆరా తీశారు. ఇకపై బెల్లం దిగుమతి ఏ మేరకు చేపడుతున్నది తమకు 15 రోజులకు ఒకసారి తెలియజేయాలని వ్యాపారులకు సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ ఇప్పటి వరకు బెల్లం సరఫరా చేస్తున్న ఐదుగురు వ్యాపారులపై కేసులు నమోదు చేశామని మరో 14 మంది పై బైండవర్ కేసులు నమోదు చేసి వారి నుంచి రూ45 వేల అపరాధ రుసుం వసూలు చేసినట్లు తెలిపారు. సారా నిర్మూలనే లక్ష్యంగా చేపడుతున్న దాడుల్లో పట్టుబడిన వారిని, వారికి బెల్లం సరఫరా చేసేవారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు అందించండి
● కలెక్టర్ను కోరిన పారా అంతర్జాతీయ క్రీడాకారుడువిజయనగరం: జాతీయ, అంతర్జాతీయ పోటీలకు వెళ్లేందుకు అవసరమైన ఆర్థిక సహకారంతో పాటు దివ్యాంగ క్రీడాకారులకు (పారా) ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు అందేలా చూడాలని పారా అంతర్జాతీయ క్రీడాకారుడు యాళ్ల సత్తిబాబు కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డిని కలిసి కోరారు. ఈ మేరకు సోమవారం పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్తో కలిసి కలెక్టరెట్లో జరిగిన గ్రీవెన్స్ సెల్లో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా దయానంద్ మాట్లాడుతూ జిల్లాకు చెందిన పారా బాడ్మింటన్ క్రీడాకారుడు యాళ్ల సత్తిబాబు ఇప్పటివరకు జాతీయ స్థాయిలో అనేక మెడల్స్ సాధించి జిల్లాకు పేరు తీసుకుని వచ్చాడని, అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రతిభ కనబరిచాడని కలెక్టర్కు వివరించారు. భవిష్యత్ లో జరగనున్న జాతీయ, అంతర్జాతీయ పోటీలకు వెళ్లేందుకు అవసరమైన ఆర్ధిక సహకారంతో పాటు దివ్యాంగ క్రీడాకారులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు అందేలా చూడాలని కోరారు. ఇందుకు కలెక్టర్ స్పందిస్తూ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తానని హామీ ఇచ్చారు. -
పీజీఆర్ఎస్కు పోటెత్తిన అర్జీలు
● 232 వినతుల స్వీకరణవిజయనగరం అర్బన్: కలెక్టరేట్లోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మొత్తం 232 వినతుల స్వీకరించగా వాటిని వారం రోజుల్లోగా పరిష్కరించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మాట్లాడిన కలెక్టర్ పీజీఆర్ఎస్కు వచ్చిన వినతుల పరిష్కారంలో ఆలస్యం చూపితే సహించేది లేదని హెచ్చరించారు. రెవెన్యూ సమస్యలపై వచ్చిన వినతులను సకాంలో పరిష్కరించాలని స్పష్టం చేశారు. ప్రతి వారం పీజీఆర్ఎస్ పై సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఫిర్యాదుదారుల సమస్యలపై వెంటనే సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు అర్జీదారును తప్పనిసరిగా కలిసి మాట్లాడిన తర్వాతనే ఎండార్స్మెంట్ ఇవ్వాలని మాట్లాడిన తేదీ, సమయాన్ని రిపోర్ట్లో నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే పీజీఆర్ఎస్ టోల్ ఫ్రీ నంబర్ 110పై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆ నంబర్కు వచ్చిన కాల్స్ను సరైన సమాధానం అందించాలని సూచించారు. స్వీకరించిన వినతులలో అత్యధికంగా రెవెన్యూశాఖకు 136, పంచాయతీ శాఖ 26, పోలీస్ శాఖ 10, పబ్లిక్ హెల్త్ 10, మున్సిపల్ పరిపాలన 9, సర్వేల్యాండ్ రికార్స్5, వ్యవసాయ శాఖ 4, విద్యుత్ శాఖ 4, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ 3, ఎస్సీ కార్పొరేషన్కు రెండు, దేవాదాయ శాఖ 2, మెడికల్ ఎడ్యుకేషన్ 2, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ 2, సమగ్రశిక్షక్ష 2, వాటర్రిసోర్సెస్కు 2 వినతులు స్కీకరిచారు. వినతుల స్వీకరణలో జిల్లా రెవెన్యూ అధికారి మురళి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డి.వెంకటేశ్వరరావు, రాజేశ్వరి, ప్రమీలా గాంధీ, బి.శాంతి, సర్వేశాఖ ఎ.డి ఎస్వీవిజయకుమార్, కలెక్టరేట్ పరిపాలనాధికారి దేవ్ ప్రసాద్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. రెవెన్యూ క్లినిక్స్ ప్రారంభం ప్రజా ఫిర్యాదుల శ్రీఘ్ర పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన పీజీఆర్ఎస్లో భాగంగా విజయనగరం జిల్లాలో రెవెన్యూ క్లినిక్స్ను సోమవారం ప్రారంభించినట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మాట్లాడిన కలెక్టర్, రెవెన్యూ క్లినిక్స్ ద్వారా రికార్డుల ఆధారంగా సాధ్యమైనంత వరకు ఆన్ది స్పాట్లోనే ఫిర్యాదులకు పరిష్కారం అందించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తహసీల్దార్లు, ఆర్డీఓల సమక్షంలో పిటిషనర్లకు నేరుగా పరిష్కారం అందించడం లేదా ఫ్యాక్టువల్ సమాచారం ఇవ్వనున్నట్లు వివరించారు. అన్ని పిటిషన్లను డేటాబేస్లో నమోదు చేసి, వీక్లీ రివ్యూ నిర్వహించి గరిష్ట సంతృప్తిని సాధించేలా కృషి చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. గత 3–4 నెలల్లో జిల్లాలో పీజీఆర్ఎస్ సంతృప్తికరమైన పురోగతి సాధించినట్లు తెలిపారు. పిటిషన్ల పరిష్కారానికి సాధారణంగా ఒక వారం టైమ్లైన్ నిర్ణయించామని, కొన్ని ఆర్ఓఆర్ (రికార్డ్ ఆఫ్ రైట్స్) కేసులు మిగహా మిగతావాటిని వేగంగా పరిష్కరించి ప్రజల సంతృప్తిని పెంచుతామని కలెక్టర్ స్పష్టం చేశారు. పెన్షన్లకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్న నేపధ్యంలో అర్హత ఆధారంగా వెరిఫికేషన్ చేసి తగు చర్యలు తసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు. ఎస్పీ గ్రీవెన్స్ సెల్కు 19 ఫిర్యాదులు విజయనగరం క్రైమ్: ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఎస్పీ చాంబర్ లోనే సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లిమర్లకు చెందిన ఓ ఫిర్యాదురాలు ఎస్పీ చాంబర్ వద్దే ఆవేదన వెళ్లగక్కింది. తనను చిత్రహింసలు పెడుతున్నారని, బూతులు తిడుతున్నారంటూ తనకు న్యాయం చేయాలని డీపీఓలో ఎస్పీ వాహనం వద్దే ఆందోళనకు దిగింది. అక్కడే ఉన్న వుమెన్ కానిస్టేబుల్ ,ఆ ఫిర్యాదుదారు రాలిని లోపలికి పిలిచి కూర్చోబెట్టి ఎస్పీని కలిపించారు. ఇక ఎస్పీ ఛాంబర్ లోనే ఫిర్యాదుదారుల నుంచి ఎస్పీ దామోదర్ 19 ఫిర్యాదులను స్వీకరించారు. వాటిలో భూతగాదాలకు సంబంధించి 8, కుటుంబ కలహాలకు సంబంధించి 3, నగదు వ్యవహారాలకు సంబంధించి 1, ఇతర అంశాలకు సంబంధించినవి 7 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీసీఆర్బీ సీఐ కె.కుమార స్వామి, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, ఎస్సైలు రాజేష్, ప్రభావతి, సిబ్బంది పాల్గొన్నారు. -
రామతీర్థంలో నేడు ఉత్తర ద్వార దర్శనం
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని సీతారామస్వామి వారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి పూజలకు సర్వం సిద్ధంమైంది. స్వామి వారి ఉత్తర ద్వార దర్శనానికి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం వేకువజామున 3గంటలకు స్వామికి ప్రాతః కాలార్చన, బాలభోగం నిర్వహించనున్నారు. అనంతరం తిరుప్పావై సేవాకాలం, మంగళాశాసనం, తీర్ధ గోష్ఠి కార్యక్రమాలను అర్చకులు జరిపిస్తారు. ఉదయం 5గంటలకు సీతారామచంద్ర స్వామి వారు ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం 7.30 గంటలకు స్వామివారి గ్రామ తిరువీధి ఉత్సవాన్ని జరిపించనున్నారు. అనంతరం బోదికొండ మెట్ల మార్గం వద్ద మెట్లోత్సవం, గోపూజలు నిర్వహిస్తారు. ప్రత్యేక పూజలనంతరం గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. సుమారు ఎనిమిది కిలోమీటర్ల మేర భక్తులు గిరి ప్రదక్షిణ చేసి స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. భక్తుల రద్దీ నేపధ్యంలో దేవాదాయ, పోలీస్ శాఖలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. పూర్తికాని గిరి ప్రదక్షిణ రహదారి నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంగళవారం గిరి ప్రదక్షిణ జరగనుంది. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తులు కాలినడకన చెప్పులు లేకుండా సుమారు ఎనిమిది కిలోమీటర్లు భక్తి శ్రద్ధలతో నడిచి స్వామిని దర్శించుకోవడం ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తోంది. గతంలో అస్తవ్యస్తంగా ఉన్న ఈ రహదారిని ఎనిమిదేళ్ల క్రితమే గ్రావెల్ రహదారిగా మార్చి సిద్ధం చేశారు. గత వైఎస్సార్సీపీ హయాంలో రహదారిలో మట్టిని వేసి రహదారికి మోక్షం కల్పించారు. గత ఏడాది అక్టోబర్ నెలలో గిరి ప్రదక్షిణ రహదారి(తారు రోడ్డు) నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే లోకం నాగమాధవి శంకుస్థాపన చేశారు. ఆ తరువాత వచ్చే ముక్కోటి ఏకాదశికే సిద్ధం చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయారు. ఈ ఏడాదైనా సిద్ధమవుతుందేమోనని ఎదురు చూసిన భక్తులకు చివరికి నిరాశే ఎదురైంది. ప్రస్తుతం సగం వరకు చిప్స్(రాళ్ల పిక్కలు) మాత్రమే వేసి వదిలేయడంతో ఈ ఏడాది కష్టాలు తప్పేలా లేవని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి చేసేశామంటూ సోషల్మీడియాలో ప్రచారం రహదారి నిర్మాణాన్ని పూర్తి చేసేశామని, ఓ రూపుకు తీసుకువచ్చామని, తామే మార్గం సిద్ధం చేశామని..ఇలా ఎమ్మెల్యే లోకం నాగమాధవి అనుచరులు సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ప్రచారాన్ని చూసి భక్తులు నవ్వుకుంటున్నారు. ఆ రహదారిని కొత్తగా వాళ్లే సృష్టించినట్లు ప్రచారం చేసుకోవడం ఏమిటని మండిపడుతున్నారు. గతంలో ఎమ్మెల్యే ఇచ్చిన హామీ మేరకు తారు వేస్తేనే కదా పూర్తయినట్లు అన్నది భక్తుల అభిప్రాయం. వాస్తవానికి మంజూరైన రూ.2కోట్ల నిధులు సరిపడకపోవడం వల్లనే రహదారి నిర్మాణం పూర్తి కాలేదని ఆ పార్టీ నాయకులే చెప్పడం గమనార్హం. గిరి ప్రదక్షిణ రహదారిలో వేసిన చిన్న చిన్న చిప్స్ కాళ్లకు గుచ్చుకునే ప్రమాదం ఉందని భక్తుల్లో ఆందోళన నెలకొంది. నడిచేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని పలువురు సూచిస్తున్నారు. -
ప్రజలలో సంతృప్తి స్థాయి పెరగాలి
● కలెక్టర్ ప్రభాకరరెడ్డిపార్వతీపురం: ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అందిన అర్జీల పరిష్కారం పట్ల ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరగాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి మండలస్థాయి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో వివిధ ప్రాంతాల ప్రజల నుంచి 144 వినతులు అందాయి. ఇందులో రెవెన్యూకు సంబంధించి 55 అర్జీలు, 89 అర్జీలు వివిధ సమస్యలకు సంబంధించినవి ఉన్నాయి. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీలను ఆడిట్ చేయనున్నట్లు తెలిపారు. జిల్లా అధికారులు అర్జీలను స్వయంగా పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. నాణ్యంగా అర్జీలను పరిష్కరించకపోతే సంబంధిత అధికారులపై కఠినచర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. రీ ఓపెన్ అవుతున్న అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అర్జీలను స్వీకరించిన వారిలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, సబ్కలెక్టర్ ఆర్.వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్, డీఆర్ఓ కె.హేమలత, ఎస్డీసీ పి.ధర్మచంద్రారెడ్డి, డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తల్లికి వందనం మంజూరు చేయాలి ● సీతానగరం మండలం సీతానగరం గ్రామానికి చెందిన టి.ఉమ తన కుమారుడికి తల్లికి వందనం పథకం మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేసింది. ● పార్వతీపురం మండలం హిందూపురం గ్రామానికి బి.వెంకటరమణ తప్పెటగుళ్లు బృందానికి ప్రభుత్వం గుర్తింపు కార్డులు మంజూరు చేసి, రిజిస్టర్ చేయాలని, జిల్లాలో నిర్వహించే సంబరాల్లో అవకాశం కల్పించాలని కోరుతూ దరఖాస్తు చేశారు. ● సీతానగరం మండలం రేపటివలస గ్రామానికి చెందిన పి.సుమలత జీవనోపాధి కల్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేసింది. ● పార్వతీపురం పట్టణానికి చెందిన పి.రజని, భామిని మండలం భామినికి చెందిన టి.సరస్వతి వితంతువు పింఛన్ మంజూరు చేయాలని, సీతానగరం మండలం పాపమ్మవలస గ్రామానికి చెందిన ఎన్.అప్పలనాయుడు దివ్యాంగుల పింఛన్ ఇప్పించాలని కోరారు. ఫిర్యాదులపై చర్యల నివేదిక పంపాలి పార్వతీపురం రూరల్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమం నిర్వహించిన ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి బాధితుల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను ఎస్పీకి విన్నవించారు. ఈ వారం కార్యక్రమంలో 5 ఫిర్యాదులు అందాయి. బాధితులతో మాట్లాడిన ఎస్పీ, ఫిర్యాదుల పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడి, ఫిర్యాదులపై తక్షణమే విచారణ చేపట్టి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో తీసుకున్న చర్యలపై నివేదికను కార్యాలయానికి సమర్పించాలని సూచించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే ఈ వేదికను వినియోగించుకోవచ్చని ఎస్పీ తెలిపారు. నిర్ణీత గడువులోగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీఆర్బీ ఎస్సై రమేష్ నాయుడు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఐటీడీఏ పీజీఆర్ఎస్కు 15 వినతులు సీతంపేట: ఐటీడీఏలో ఏపీఓ జి.చిన్నబాబు సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వివిధ సమస్యలపై 15 అర్జీలు వచ్చాయి. తిడ్డిమికి చెందిన నీలారావు ఆర్ఓఎఫ్ఆర్ పట్టా ఇప్పించాలని కోరారు. పెద్దగుమ్మడ స్కూల్కు ప్రహరీ, మరుగుదొడ్లు నిర్మించాలని బగదల గ్రామస్తురాలు జన్ని వరలక్ష్మి విన్నవించింది. రోలుగుడ్డికి కమ్యూనిటీ భవనం నిర్మించాలని గ్రామానికి చెందిన కె.నరేష్ వినతిపత్రం అందజేశాడు. లోకొండ పంచాయతీని విభజించవద్దని కె.ఎర్రన్నాయుడు కోరాడు. ట్రైకార్ రుణం ఇప్పించాలని మంగయ్య, హౌస్హోల్డ్ మ్యాపింగ్లో పేరు వేరేగ్రామంలో ఉందని తమ గ్రామానికి మార్చాలని కొంటికర్రగూడ గ్రామస్తుడు సవర గోపాల్ విన్నవించారు. కార్యక్రమంలో పీహెచ్వో ఎస్.వి.గణేష్, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ రమాదేవి, డిప్యూటీఈవో రామ్మోహన్రావు, జీసీసీ మేనేజర్ జి.నరసింహులు, పీఆర్ జేఈ కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పశుసంవర్థకంతోనే గ్రామీణ ఆర్థికాభివృద్ధి
పార్వతీపురం రూరల్: పశుసంవర్థక రంగం బలోపేతం ద్వారానే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పురోగతి సాధిస్తుందని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. ఈ మేరకు పశుసంవర్ధక శాఖపై సోమవారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పశుపాలనలో జెమిని, పెరప్లెక్సిటీ వంటి ఏఐ సాంకేతికతను జోడించి రైతులకు వేగంగా సమాచారం అందించాలని, పాఠశాల విద్యార్థులు, యువతకు ఈ రంగంలోని ఉపాధిపై అవగాహన కల్పించాలని సూచించారు. ఏడాదికి ప్రతి రైతు 1200 గుడ్ల ఉత్పత్తి లక్ష్యంగా పనిచేయాలని, వ్యవసాయ వ్యర్థాల నుంచి సంపద సృష్టించే ప్రాజెక్టులను ప్రోత్సహించాలని కలెక్టర్ పేర్కొన్నారు. మహిళా డైరీ సంఘాలను బలోపేతం చేస్తూ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు ఏర్పాటు చేయాలని, ఎగుమతి నాణ్యత కలిగిన మేత ఉత్పత్తిపై దృష్టి సారించాలని సూచించారు. జిల్లాలో అమలు చేసిన గ్రామ ముస్తాబు, గోపాల సంబరాలు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందాయని పశుసంవర్థక శాఖాధికారి మన్మథరావు వివరించారు. సమావేశంలో జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డి, డ్వామా పీడీ రామచంద్రరావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మా క్లినిక్కు వచ్చేయండి..
విజయనగరం ఫోర్ట్: గంట్యాడ మండలానికి చెందిన ఆర్. దీపక్వర్థన్కు రోడ్డు ప్రమాదంలో చేయి విరగడంతో స్థానిక సర్వజన ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగింది. దీంతో ఎముకల వైద్యులు ఫిజియోథెరపీ చేయించుకోవాలని అతడ్ని ఫిజియోథెరపీ విభాగానికి రిఫర్ చేశారు. అయితే అక్కడ ఉన్న ఫిజియోథెరపిస్ట్ ఆస్పత్రిలో సరైన పరికరాలు లేవని.. అంబటిసత్రం ప్రాంతంలో తనకు సొంత క్లినిక్ ఉందని.. అక్కడకు వస్తే త్వరగా తగ్గిస్తానని చెప్పడంతో గత్యంతరం లేని పరిస్థితిలో ఆ రోగి ప్రైవేట్ క్లినిక్కు వెళ్లారు. ఆ క్లినిక్లో ఒకసారి ఫిజియోథెరపీ చేసినందుకు రోగి నుంచి రూ. 1500 వసూలు చేసినట్లు సమాచారం. అలాగే ఇదే మండలానికి చెందిన ఆర్. వరలక్ష్మి అనే మహిళ మెడనొప్పితో సర్వజన ఆస్పత్రిలోని న్యూరో సర్జరీ విభాగానికి వెళ్లింది. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమెను కూడా ఫిజియోథెరపీ విభాగానికి రిఫర్ చేశారు. ఈమెను కూడా సదరు ఫిజియోథెరపిస్ట్ తన సొంత క్లినిక్కు వస్తే త్వరగా తగ్గిస్తానని చెప్పాడు. అయితే ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఆమె అతని క్లినిక్కు వెళ్లలేదు. ఇలా వీరిద్దరిరే కాదు ఫిజియోథెరపీ విభాగానికి వస్తున్న ప్రతి రోగినీ ఆయన తన ప్రైవేట్ క్లినిక్కు వెళ్లాలని సూచిస్తున్నాడు. దీంతో రోగులు బయటకు చెప్పలేక తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ క్లినిక్కు వెళ్లి చేతిచమురు వదిలించుకుంటున్నారు. ఇదిలా ఉంటే సదరు ఫిజియోథెరపిస్ట్ ఆస్పత్రిలో అందుబాటులో ఉండడని గతంలో ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఆ సమయంలో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అయినప్పటికీ ఆయనలో ఎటువంటి మార్పు రాకపోవడం విశేషం. రోగుల తరలింపే లక్ష్యం.. ఆస్పత్రికి వచ్చే ప్రతి రోగినీ తన క్లీనిక్కు తరలింపే లక్ష్యంగా సదరు ఫిజియోథెరపిస్ట్ ప్రయత్నిస్తున్నాడు. పక్షవాతం బారిన పడిన వారికి, శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి ఫిజియోథెరపీ తప్పనిసరి. ప్రభుత్వాస్పత్రిలో మంచి సదుపాయాలున్నప్పటికీ, ఫిజియోథెరపిస్ట్ స్వార్థం వల్ల రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. చర్యలు తీసుకుంటాం.. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఫిజియోథెరపీ కోసం వచ్చిన వారికి ఇక్కడే చేయాలి. ఇతర క్లినిక్లకు తరలించడానికి వీల్లేదు. అలా తరలించిన వారిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ అల్లు పద్మజ, సూపరింటిండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సర్వజన ఆస్పత్రిలో ఓ ఫిజియోథెరపిస్ట్ నిర్వాకం ఆస్పత్రిలో మంచి పరికరాలు లేవని రోగులను మభ్యపెడుతున్న వైనం గత్యంతరం లేక ప్రైవేట్ క్లినిక్కు వెళ్తున్న రోగులు వారి నుంచి వేల రూపాయలు గుంజుతున్నట్లు ఆరోపణలు -
ధాన్యం ముసుగులో నల్లబెల్లం..!
● ఒడిశా నుంచి ఆంధ్రాకు దిగుమతి ● బయట ధాన్యం బస్తాలు..లోపల నల్ల బెల్లం ● సారా తయారీలో నల్లబెల్లం వినియోగం కురుపాం: కొన్ని సినిమాలు ఆదర్శంగా నిలుస్తాయి.. మరికొన్ని సినిమాలు ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సంఘటనలను వివరిస్తాయి.. మరి ఏది ఆదర్శంగా తీసుకున్నారో కానీ కొంతమంది వ్యాపారులు సారా తయారీకి అవసరమయ్యే నల్లబెల్లాన్ని ఒడిశా నుంచి అక్రమ మార్గంలో దిగుమతి చేసుకుంటున్నారు. సారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం స్థానికంగా పుష్కలంగా లభిస్తుండడం.. అది ఎక్కడ నుంచి తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇటీవల వచ్చిన ఓ సినిమాలో హీరో బయటకు సక్రమంగాను.. లోపల అక్రమంగాను సరుకులు తరలిస్తూ పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తాడు. సరిగ్గా ఇదే పంథాను స్థానిక వ్యాపారులు ఎన్నుకున్నారు. ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లు జోరుగా సాగుతుండడంతో వ్యాపారులు ధాన్యం మాటన నల్లబెల్లాన్ని ఒడిశా నుంచి తీసుకువస్తున్నారు.ఈ బెల్లాన్ని కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ మండలాలకు చెందిన సారా తయారీ దారులు కొనుగోలు చేస్తున్నారు. అక్రమార్కులకు వేగులుగా సిబ్బంది..? ఈ అక్రమ రవాణాకు కొంతమంది ఎకై ్సజ్ సిబ్బంది సహకరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. వ్యాపారులకు ఎకై ్సజ్ సిబ్బందే వేగులుగా పనిచేస్తుండడంతో బెల్లం రవాణాను, సారాను అర్టికట్టలేకపోతున్నారు. ఈ విషయంపై స్థానిక ఎకై ్సజ్ శాఖ కురుపాం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు వద్ద ప్రస్తావించగా.. ఇకపై తనిఖీలు మరింత ముమ్మరం చేస్తామన్నారు. -
ఇద్దరు యువకుల దుర్మరణం
గజపతినగరం: గజపతినగరం రైల్వేస్టేషన్ సమీపంలో ఓ మారుతి వ్యాన్ చెట్టును ఢీకొనడంతో ఇద్దరు యువకులు ఆదివారం దుర్మరణం చెందారు. ఈ ప్రమాద సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నంలోని కంచరపాలెం ప్రాంతానికి చెందిన పొట్నూరు వినయ్ కు మార్(35), ఎల్లాబిల్లి దినేష్(24)లు శనివారం సాయంత్రం బేకరీ ఐటమ్స్ తీసుకుని విశాఖపట్నం నుంచి ఒడిశాలోని రాయగడ వెళ్లి తిరిగి అదేవ్యాన్లో ఆదివారం విశాఖపట్నం వస్తుండగా గజపతినగరం రైల్వేస్టేషన్ దగ్గర వ్యాన్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. చెట్టును వ్యాన్ బలంగా ఢీకొట్టడంతో మృతదేహాలు వాహనంలో పోలిక లేకుండా పడి ఉన్నా యి. ప్రమాద సమాచారం అందుకున్న గజపతి నగరం ఎస్సై కె.కిరణ్ కుమార్ నాయుడు సంఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. మృతదేహాలను, వ్యాన్ను పోలీసులు జేసీబీతో బయటకు తీసి శవపంచనామాకు తరలించారు. వినయ్ కుమార్కు భార్య, ఇద్దరు చిన్నపిల్లలు, దినేష్కు భార్య, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. మృతుడు దినేష్ తల్లి ఎల్లబిల్లి శంకరమ్మ పిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ట్లు ఎస్సై కె.కిరణ్కుమార్ నాయుడు తెలిపారు. -
జానపద కళలకు ఆదరణ
బొబ్బిలి: మనదేశ జానపద కళలకు, సంస్కృతికి ఎల్లప్పుడూ ఆదరణ ఉంటుందని ప్రముఖ సినీ, టీవీ నటుడు షకలక శంకర్ అన్నారు. ఆదివారం రాత్రి స్థానిక కోటలో బొబ్బిలి కళోత్సవ్ పేరిట జానపద కళల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శంకర్ మాట్లాడుతూ.. చరిత్రలో బొబ్బిలికి ప్రత్యేక స్థానముందన్నారు. ఈ సందర్భంగా బొబ్బిలి వీరత్వంపై ఓ పద్యాన్ని ఆలపించారు. అనంతరం రేలారేరేలా గాయకుడు కోరాడ జానకిరామ్ యువతను ఆకట్టుకునే గేయాలు ఆలపించారు. అంతకు ముందు రంగస్థలం ఫేమ్ తప్పెటగుళ్ల కళాకారుడు నీలబోను సత్యం బృంద ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం చెక్కకభజనలు, బుర్రకథ ప్రదర్శనలు, కోలాటం, జాలరిబాగోతం, థింసా నృత్యం, డప్పుల వాయిద్యం, జయదేవుని అష్టపది, బిందెల డాన్స్, సినీ నృత్యాల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే బేబి నాయన కళాకారులను సత్కరించారు. కార్యక్రమంలో గ్రంథాలయ పరిషత్ రాష్ట్ర డైరెక్టర్ రౌతు రామమూర్తినాయుడు, కోలాటం డ్యాన్స్ మాస్టర్ జి. కరుణ్కుమార్, శ్రీ కళాభారతి కార్యదర్శి నంబియార్ వేణుగోపాలరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ పువ్వల శ్రీనివాసరావు, స్థానిక కళాకారులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. సినీ నటుడు షకలక శంకర్ -
●మంచుబారిన పడకుండా జాగ్రత్త
ఉదయం పూట మంచు ఎక్కువగా కురుస్తున్నందున మంచుబారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మార్నింగ్వాకింగ్, రన్నింగ్, గేమ్స్కు వెళ్లే వారు మంచు తగ్గిన తర్వాత వెళ్లడం మంచింది. పిల్లలు, వృద్ధులు, ఆస్తమా, నిమోనియా, సీఓపీడీ వంటి వ్యాధులు ఉన్న వారు చలిబారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలి. చల్లటి పానీయాలు, చల్లటి ఆహారం తీసుకోకూడదు, చలిలో అసలు తిరగకూడదు. చలి కాలంలో సైనసైటిస్, ఆస్తమా, నిమోనియో వ్యాధుల వ్యాప్తి అధికంగా ఉంటుంది. చలినుంచి రక్షణగా స్వెట్టర్లు, మంకీక్యాప్లు వంటివి ధరించడం మంచిది. కాచి చల్లార్చిన నీరు తాగాలి. తాజా ఆహార పదార్థాలను మాత్రమే తినాలి. –డాక్టర్ బొత్స సంతోష్కుమార్, పలమనాజిస్ట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి -
హు..హు..హు..హు..!
విజయనగరం ఫోర్ట్: జిల్లా ప్రజలను చలి వణికిస్తోంది. చలితీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు అల్లాడుతున్నారు. దుప్పట్లు, రగ్గులు ఏవీ కూడా చలి నుంచి రక్షణ అంతగా ఇవ్వడం లేదు. మైదాన ప్రాంతాల కంటే గిరిజన ప్రాంతాల్లో చలితీవ్రత మరింత ఎక్కువగా ఉంది. గిరిజన ప్రాంతాలైన మెంటాడ, ఎస్.కోట, గంట్యాడ మండలంలోని గిరిశిఖర గ్రామాల్లో చలి తీవ్రత చాలా ఉంది. ఉదయం 9 గంటల వరకు ప్రజలు బయటకు రాలేని పరిస్థితి. ఉదయం 8 గంటల వరకు పొగమంచు కమ్మేస్తోంది. దీంతో ఉద యం పూట విధులు నిర్వర్తించే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొలాలకు వెళ్లే రైతులు, పేప ర్ బాయ్స్, ఉదయం 7 గంటలకు వివిధ కంపెనీల్లో పనిచేయడానికి వెళ్లే ఉద్యోగులకు అవస్థలు తప్ప డం లేదు. మంచు దట్టంగా కమ్మేయడంతో వాహనాలపై ప్రయాణించేవారికి ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక పోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఉదయం పూట కూడా లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి. మంచు కారణంగా ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్నందున వాహనాలను అత్యంత అప్రమత్తంగా నడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రోడ్డు దాటేటప్పుడు కూడా వాహనాలను గమనిస్తూ ఉండాలి. అవస్థలు పడుతున్న వృద్ధులు, పిల్లలు చలితీవ్రత ఎక్కువగా ఉండడంతో అన్ని వర్గాల ప్ర జలు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చలికాలంలో ఆస్తమా, సైనసైటిస్, సీఓపీడీ, నిమోనియా వంటి వ్యాధులు ఎక్కువగా వ్యాప్తి చెందే ఆస్కారం ఉంది. అదేవిధంగా ఇప్పటికే ఈ వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాధి తీవ్రత మరింత పెరిగే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నా రు. చలితీవ్రత బారిన పడకుండా అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. చలికాలంలో చర్మ వ్యాధులు కూడా వ్యాప్తి చెందే అవకాశంతో పాటు ఎక్కువయ్యే ఆస్కారం ఉంది. తగ్గుతున్న ఉష్ణోగ్రతలు జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు తగ్గిపోతున్నా యి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 15 డిగ్రీలు నమోదవుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో చలి తీవ్రత పెరిగి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఉన్ని స్వెట్టర్లు, మంకీక్యాప్లు, జర్కిన్లు వంటివి ధరిస్తున్నారు. కొంతమంది చలి మంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. -
ఎర్రజెండా ఎప్పటికీ నేలకొరగదు
విజయనగరం గంటస్తంభం: కమ్యూనిజం అంతరించిపోయిందని భావించే వారికి సీపీఐకి ఉన్న వందేళ్ల ఉద్యమ చరిత్రే గట్టి సమాధానమని ఆ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ అన్నారు. నగరంలోని పడమర బలిజి వీధిలో సీపీఐ 101వ వ్యవస్థాపక దినోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన..సూర్యచంద్రులున్నంత కాలం కమ్యూనిజం ఉంటుందని, దానికి అంతం లేదని, కమ్యూనిజం గుర్తుగా ఉన్న ఎర్రజెండా ఎప్పటికీ నేలకొరగదన్నారు. అంతకుముందు అమరజీవి, కామ్రేడ్ మొకర అప్పారావు విగ్రహానికి ఆ పార్టీ నాయకులు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం బడుగు, బలహీన వర్గాలు, కార్మిక, కర్షకుల కోసం ఆ పార్టీ చేసిన పోరాటాలు తెలిపారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు రమణమ్మ, పావని, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. -
విజయనగరం
సోమవారం శ్రీ 29 శ్రీ డిసెంబర్ శ్రీ 2025సర్వజన ఆస్పత్రికి వస్తున్న రోగులను ఇక్కడ సరైన సదుపాయాలు లేవని తన క్లినిక్కు వస్తే బాగు చేస్తానని ఓ ఫిజియోథెపిస్ట్ తరలిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. –8లోరామతీర్థం దేవస్థానం (ఇన్సెట్లో) సీతారామస్వామివారి ఉత్సవ విగ్రహాలువిజయనగరం ఫోర్ట్: కలెక్టరేట్లోని ఆడిటోరి యంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. అర్జీ దారులు తమ సమస్య గురించి కచ్చితమైన పూర్తి వివరాలతో దరఖాస్తు చేయాలని సూచించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు అధికారులందరూ హాజరై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించాలని కోరారు. అర్జీదారులు కలెక్టరేట్కు రాకుండానే తమ సమస్యలను నమోదు చేసుకునేందుకు 1100 ట్రోల్ఫ్రీ నంబర్ను సంప్రదించవచ్చని స్పష్టం చేశారు. రాజాం సిటీ: స్థానిక జీసీఎస్ఆర్ కళాశాలలో గణిత అధ్యాపకుడిగా పనిచేస్తున్న శ్రీనివాసరావుకు గణితంలో పీహెచ్డీ పట్టా లభించింది. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇన్విస్టిగేషన్ ఆన్ డెస్క్ ఎనర్జీ కాస్మోలాజికల్ మోడల్ ఇన్ సెర్టిన్ థీరీస్ ఆఫ్ గ్రావిటేషన్ అనే పరిశోధనకు గాను గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ యూనివర్సిటీ పీహెచ్డీ పట్టా ప్రదానం చేసిందని పేర్కొన్నారు. తన ఈ పరిశోధనకు డాక్టర్ వి.గణేష్, డాక్టర్ కె.దాసునాయుడులు గైడ్స్గా వ్యవహరించారన్నారు. శ్రీనివాసరావుకు పీహెచ్సీడీ రావడం పట్ల ప్రిన్సిపాల్ పురుషోత్తం, అధ్యాపకులు అభినందించారు. విజయనగరం టౌన్: జిల్లాకు చెందిన ధర్మాస్ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ డైరెక్టర్ పీఎస్వీ.కామేశ్వరరావుకు ఉత్తమ నాట్యాచార్య పురస్కారం దక్కింది. జాతీయస్థాయి కూచిపూ డి నృత్యోత్సవాన్ని పురస్కరించుకుని కృష్ణాజిల్లా గుడివాడలోని శ్రీ ఉపద్రష్ట ఫంక్షన్ హాల్లో ద్వారకాసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డు దక్కినట్లు ఆదివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. నృత్యప్రదర్శన చేసిన చిన్నారులకు ఉత్తమ నాట్య ప్రతిభా పురస్కారాలు అందజేశారన్నారు. మచిలీపట్నం ఎమ్మార్వో హరినాథ్ చేతుల మీదుగా తాము పురస్కారా లు అందుకున్నామన్నారు. ఈ మేరకు జిల్లాకు చెందిన పలు సంస్థల ప్రతినిధులు, కళాభిమానులు హర్షం వ్యక్తం చేశారు. నేడు చదురుగుడికి పెదపోలమాంబమక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి మేనత్త, పెదపోలమాంబ అమ్మవారు సోమవారం చదురుగుడికి చేరుకోనున్నారు. శంబర పోలమాంబ అమ్మవారి జాతర వచ్చే ఏడాది జనవరి 26, 27, 28 వ తేదీల్లో జరగనున్న నేపథ్యంలో అమ్మవారి జాతర తొలిఘట్టం పోలమాంబ అమ్మవారి మేనత్త పెద పోలమాంబ అమ్మవారిని చదురుగుడికి తీసుకువస్తారు. పోలమాంబ మేనత్త పె ద పోలమాంబ అమ్మవారి ఘటాన్ని జన్ని వారి ఇంటి నుంచి ఎస్.పెద్దవలస గ్రామ రహదారి వద్దనున్న అమ్మవారి గద్దె సమీపంలోకి తీసుకువచ్చి పూజలు నిర్వహిస్తారు. అనంతరం భక్తు ల కోలాహం, వాయిద్యాలు, డప్పుల మధ్య పెదపోలమాంబ అమ్మవారిని గ్రామంలోనీ చదురుగుడికి తీసుకువచ్చి పూజలు నిర్వహిస్తారు. పెద పోలమాంబ అమ్మవారిని తీసుకువచ్చేందుకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతా రామస్వామి దేవస్థానం ముక్కోటి ఏకాదశి సంబ రానికి సిద్ధమవుతోంది. ఈ నెల 30న వైకుంఠ ఏకా దశి పర్వదినం సందర్భంగా ఆలయంలో శ్రీ సీతా రామచంద్రస్వామి ఉత్తర రాజగోపురం ద్వారా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ముక్కోటి ఏకాదశి కార్యక్రమాన్ని వైఖాసన ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించడం దశాబ్దాల కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది. గడిచిన ఎనిమిదేళ్ల నుంచి రామతీర్థంలోని బోడికొండ(నీలాచలం పర్వతం) చుట్టూ గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. పవిత్ర వైకుంఠ ఏకాదశి నాడు రామగిరి చుట్టూ గిరి ప్రదక్షిణ చేసి ఉత్తర మార్గం గుండా స్వామిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో ఏటా ఇక్కడ జరిగే గిరి ప్రదక్షిణకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. భక్తుల రాక నేపథ్యంలో దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఉచిత దర్శనంతో పాటు స్వామివారి అన్న ప్రసాదా న్ని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఈ నెల 30న జరిగే కార్యక్రమాలు ముక్కోటి ఏకాదశి(వైకుంఠఏకాదశి)ని పురస్కరించుకుని ఈ నెల 30న అర్చకులు ప్రత్యేక పూజా కా ర్యక్రమాలు జరిపించనున్నారు. వేకువజామున 3 గంటలకు శ్రీ స్వామివారి ఆరాధన, 4 గంటలకు తిరుప్పావై సేవాకాలం, మంగళాశాసనం, తీర్థగోష్ఠి జరిపిస్తారు. సరిగా ఉదయం 5 గంటలకు ఉత్తర ద్వారదర్శనం ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఉత్తర రాజ గోపురం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక పల్లకిలో ఉంచి విశేష పూజలు జరిపిస్తారు. అనంతరం అదేమార్గంలో భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. తరువా త 7.30 గంటలకు స్వామివారి గ్రామ తిరువీధి ఉత్సవం జరిపించి భక్తులతో ఊరేగింపుగా బోడికొండ (నీలాచలం పర్వతం) మెట్లమార్గం వద్దకు చేరుకుని మెట్లోత్సవం, గిరి ప్రదక్షిణ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఏటా పెరుగుతున్న భక్తుల సంఖ్య రామతీర్థంలో శ్రీ రామచంద్రస్వామి గిరి ప్రదక్షిణ కు ఏటా భక్తుల తాకిడి పెరుగుతూ వస్తోంది. ఇక్క డ బోడికొండకు సుదీర్ఘ చరిత్ర ఉంది. కొండపై స్వ యంగా శ్రీరాముడే నడయాడిన ఆనవాళ్లు, పాండవులు సంచరించే చిహ్నాలు..ఇలా ఎంతో చరిత్ర ఉండడంతో కొండ చుట్టూ పాదయాత్ర చేసేందుకు భక్తులు పోటీ పడుతుంటారు. ఎనిమిదేళ్ల క్రితం రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామిజీ శ్రీనివాసనంద సరస్వతి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టా రు. అప్పటి నుంచి ప్రతి ఏటా గిరిప్రదక్షిణ విజయవంతంగా కొనసాగుతోంది. రామతీర్థంలో మెట్ల మార్గం వద్ద ప్రారంభమయ్యే గిరి ప్రదక్షిణ ప్రధాన ఆలయం మీదుగా సీతారామునిపేట జంక్షన్కు చేరుకుంటుంది. సుమారు ఎనిమిది కిలోమీటర్లు భక్తులు నడుస్తారు. అనంతరం స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు.రామభద్రపురం: ఈ ఏడాది పదోతరగతి వార్షిక పరీక్ష ఫలితాల్లో జిల్లాను మొదటి స్థానంలో ఉంచడ మే లక్ష్యమని జిల్లా విద్యాశాఖాధికారి మాణిక్యంనాయుడు అన్నారు. ఈ మేరకు రామభద్రపురం మండల కేంద్రంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్ధులు మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతోనే వంద రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 9 వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. 9గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు తరగతుల నిర్వహణ ఉంటుందని, మళ్లీ సాయంత్రం 5.15గంటల వరకు ప్రత్యేక తరగతుల నిర్వహణ జరుగుతుందని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్ధులు 16,287 మంది.ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు 6,878 మంది 119 పరీక్ష కేంద్రాలలో పదో తరగతి పరీక్షలు రాయనున్నారని పేర్కొన్నారు. అలాగే ప్రాథమిక తరగతుల విద్యార్థులు పైస్థాయికి వెళ్తున్నా అక్షరాలు, కూడికలు, తీసివేతలు కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉంటున్నారని, వారి సామర్థ్యాలు పెంచేందుకు ప్రాథమిక స్థాయి విద్యకు 75 రోజుల ప్రణాళికకు శ్రీకారం చుట్టామని తెలి పారు. కార్యక్రమంలో డీఈసీ మెంబర్ సన్యాసిరాజు, తదితరులు పాల్గొన్నారు.పుష్పయాగం అలంకరణలో వేంకటేశ్వరస్వామివిజయనగరం టౌన్: ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా విజయనగరంలోని రింగురోడ్డులో గల శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో కొలువైన స్వామివారికి శ్రీనివాసా సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పుష్పయాగం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగురంగుల పుష్పాలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయమంతా సంకీర్తనలు, గోవిందనామ భజనలు, అష్టోత్తర శతనామార్చనలతో భక్తిభావం పెంపొందింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి, తరించారు.రామతీర్థంలో ముక్కోటి ఏకాదశి పూజలకు అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తి చేశాం. ఆ రోజు ఉత్తర మా ర్గం నుంచి స్వామి దర్శన భాగ్యం ఉంటుంది. వేకువజామున 5 గంటల కు ప్రత్యేక పూజలనంతరం భక్తులు స్వామిని దర్శించుకోవచ్చు. బోడికొండ మెట్ల మార్గం వద్ద మెట్లోత్సవం, గోపూజ అనంతరం గిరి ప్ర దక్షిణ ప్రారంభమవుతుంది. సుమారు 10వేల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాం. అందరికీ అన్న ప్రసాదాలను పంపిణీ చేస్తాం. –వై.శ్రీనివాసరావు, ఈఓ,రామతీర్థం దేవస్థానంవైకుంఠ ఏకాదశి సందర్భంగా రామతీర్థంలో ప్రత్యేక బందోబస్తు నిర్వహిస్తాం. ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు కొండ మార్గంలో, కోనేరు వద్ద, ఆలయంలో విధులు నిర్వర్తి స్తాం. క్యూల వద్ద తోపులాట జరగకుండా ముందస్తుగా చర్యలు చేపడతున్నాం. స్వామి దర్శనానికి భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా బందోబస్తు చేపడతాం. ప్రశాంతంగా ముగి సేందుకు భక్తులు కూడా సహకరించాలి. –గణేష్, ఎస్సై, నెల్లిమర్ల మండలం -
గిరిజన హక్కులను పాలకులు కాలరాస్తున్నారు..
పార్వతీపురం: గిరిజన హక్కులను పాలకులు కాలరాస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కోలక లక్ష్మణరావు విమర్శించారు. మండల కేంద్రంలోని ఆలిండియా ఆదివాసీ గిరిజన హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ గిరిజన భవనంలో వివిధ ఆదివాసీ, గిరిజన సంఘాల ప్రతినిధుల సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఆయన గిరిజను ల హక్కులు, వారి కోసం రాజ్యాంగం కల్పించిన చట్టాలపై అవగాహన కల్పించారు. రానురాను గిరి జనులకు భద్రత కరువవుతోందని, ప్రభుత్వాలు చేస్తున్న నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి కలుగుతోందన్నా రు. గిరిజనులకు రక్షణగా ఉన్న ఎన్నో చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. 1/70 చట్టం, పీసా చట్టం, అటవీ హక్కుల చట్టాలను అటు అధికారు లు, ఇటు పాలకులు దుర్వినియోగం చేస్తున్నారు. గిరిజన హక్కుల రక్షణ కోసం అందరం ఐక్యంగా ఉండి, పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ఎక్కడైనా గిరిజనులకు అన్యా యం జరిగితే మూకుమ్మడిగా పోరాటం చేయాలని, గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి అనునిత్యం పోరాడాలన్నారు. అనంతరం ఆలిండియా ఆదివా సీ గిరిజన హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ నూతన కార్యవర్గం ఏర్పాటు చేసుకున్నారు. -
వన దేవతలకు ప్రత్యేక పూజలు
జియ్యమ్మవలస: మండలంలోని తూర్పుముఠా ప్రాంతంలో గల టీకే జమ్ము, చినదోడిజ, పెదదోడిజ, కొండచిలకాం, పిటిమండ పంచాయతీ పరిధిలోని గిరిజనులు కందికొత్తల పండగలో భాగంగా వన దేవ తలకు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారోత్సవాల్లో భాగంగా డప్పులు, సాంప్ర దాయ వాయిద్యాల నడుమ గిరిజనులంతా ఒక చోటకు చేరుకుని వనదేవతలైన గొడ్డలమ్మ, సాతారమ్మతల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా నృత్యాలు చేస్తూ సందడిగా గడిపారు. పంటలను వనదేవతలకు నైవేద్యంగా పెట్టిన తర్వాత సామూహిక భోజనాలు చేస్తామని గిరిజనులు తెలిపారు. ఇప్పటికే ఆయా గ్రామాలు బంధుమిత్రులతో కళకళలాడుతున్నాయి. -
వ్యాన్ ఢీ కొనడంతో వ్యక్తికి గాయాలు
సీతానగరం: మండలంలోని హైవే రోడ్డుపై లచ్చయ్యపేట – పాత బొబ్బిలి మధ్య ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు గాయపడ్డారు. పోలీసులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. బొబ్బిలి మున్సిపాలిటీ గొల్లపల్లికి చెందిన బొబ్బాది వెంకటరమణ ఆదివారం ఉదయం బొబ్బిలి వైపు నుంచి పాత బొబ్బిలి మీదుగా ద్విచక్ర వాహనం వాహనంపై లచ్చయ్యపేట వైపు వస్తుండగా.. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న కోళ్ల వ్యాన్ ఢీ కొనడంతో వెంకటరమణకు గాయాలయ్యాయి. వెంటనే వ్యాన్డ్రైవర్ 108 వాహనానికి ఫోన్ చేయగా.. సిబ్బంది సంఘటనా ప్రాంతానికి చేరుకుని క్షతగాత్రుడ్ని బొబ్బిలి సామాజిక ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రుడ్ని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుడు తవిటినాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్సై లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆటోను ఢీకొన్న లారీ.. దత్తిరాజేరు: మండలంలోని కోమటిపల్లి పెట్రోల్ బంక్ సమీపంలో పెదమానాపురం నుంచి వస్తున్న ఆటోను వెనుక నుంచి లారీ ఢీ కొనడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. పెదమానాపురం ఎస్సై ఆర్.జయంతి తెలియజేసిన వివరాల ప్రకారం.. పెదమానాపురం నుంచి గర్భాం వైపు వెళ్తున్న ఆటోను వెనుక నుంచి లారీ ఢీ కొట్టడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్ మామిడి నాగరాజుకు తీవ్ర గాయాలు కాగా.. ప్రయాణికులు చొక్కపు అప్పలనాయుడు, అల్లు గోరమ్మకు కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను గజపతినగరం సీహెచ్సీకి తరలించగా.. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. -
పందెంరాయుళ్ల అరెస్ట్
బాడంగి: మండలంలోని పాల్తేరు శివారులో గొర్రెప్పందాలు నిర్వహిస్తున్న వారిపై పోలీసులు దాడి చేసి పందెంరాయుళ్లను అరెస్ట్ చేశారు. ఎస్సై తారకేశ్వరరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పాల్తేరు సమీపంలోని తోటలో గొర్రెప్పందాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు పోలీసులు ఆదివారం దాడి చేశారు. దీంతో ఏడుగురు పందెంరాయుళ్లు పట్టుబడగా.. వారి వద్ద నుంచి 23,160 రూపాయల నగదు, రెండు గొర్రెపోతులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తారకేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్రాంతి నేపథ్యంలో ఎవ్వరైనా పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. -
శతపతి అన్నపూర్ణకు ఎస్డీజీ చాంపియన్ అవార్డు
రామభద్రపురం: స్థానిక కమ్యూనిటీ డెవలప్మెంట్ సెంటర్ ప్రాజెక్టు డైరెక్టర్ శతపతి అన్నపూర్ణకు నేపాల్ దేశ రాజధాని ఖాట్మండులో ఆదివారం ఎస్డీజీ చాంపియన్ 2025 అవార్డు ప్రదానం చేశారు. ఖాట్మండులో జరిగిన అంతర్జాతీయ సదస్సులో నేపాల్ దేశ సీ్త్ర శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి భగవతి చౌదరి చేతుల మీదుగా ఈ అవార్డు తాను అందుకున్నట్లు అన్నపూర్ణ సాక్షికి తెలిపారు. సీడీసీ సుస్థిర గ్రామీణాభివృద్ధిపై గ్రామ స్థాయిలో మహిళా సాధికారత, ఆరోగ్య శిబిరాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ తదితర సేవలకు ఈ అవార్డు లభించిదని ఆమె చెప్పారు. ఈ అవార్డు లభించడం ఆనందంగా ఉందన్నారు. ఎంపీపీ చొక్కాపు లక్ష్మణరావుతో పాటు పలువురు గ్రామ పెద్దలు ఆమెను ఈ సందర్భంగా అభినందించారు.ధాన్యం ఎత్తుకెళ్లిపోతున్న దొంగలు ● ఆందోళనలో రైతులు భామిని: మండలంలోని పలు గ్రామాల్లో రైతులు కళ్లాల్లో నిల్వ చేసిన ధాన్యం బస్తాలను దొంగలు ఎత్తుకెళ్లిపోతున్నారు. దీంతో బాధిత రైతులు లబోదిబోమంటున్నారు. కొద్ది రోజులుగా వరుస సంఘటనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం వేకువజామున వడ్డంగి రోడ్డులో ఉన్న కళ్లంలో 31 బస్తాలను అపహరించుకుపోయారు. దీంతో బాధిత రైతులు ముదుల పోలినాయుడు, కీర్తి మోహనరావు, బోదెపు ప్రదీప్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు రోజుల కిందట నేరడి–బికి చెందిన రైతు వలరౌతు దండాసికి చెందిన 13 బస్తాల దాన్యం దొంగలించుకుపోయారు. అలాగే బత్తిలికి చెందిన అప్పన్న అనే రైతు సింగుబై కళ్లంలో వేసిన ధాన్యం రాశి నుంచి పది బస్తాల వరకు ధాన్యం చోరీ చేశారు. సరిహద్దు ఒడిశా గ్రామాలకు చెందిన దొంగలే ధాన్యం దోచుకుంటున్నారని మండల రైతులు ఆరోపిస్తున్నారు. డెంకాడ: మండలంలోని బొడ్డవలస జంక్షన్ వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై సన్యాసినాయుడు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. బొడ్డవలస గ్రామానికి చెందిన అట్టాడ పైడినాయుడు (59) బొడ్డవలస జంక్షన్ వద్ద శనివారం రాత్రి 7.10 గంటల ప్రాంతంలో రోడ్డు దాటుతుండగా.. విశాఖ వైపు నుంచి విజయనగరం వైపు వస్తున్న లారీ ఢీ కొట్టడంతో పైడినాయుడుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రుడిని విజయనరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి 11.20 గంటలకు మృతి చెందాడు. మృతుడి మనవడు అశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన మహిళ.. భామిని: రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందింది. బత్తిలి ఎస్సై జి.అప్పారావు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని సతివాడకు చెందిన మండల అప్పలమ్మ (54) ఈ నెల 23న సతివాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడింది. వెంటనే ఆమెను శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం రాగోలు జెమ్స్కు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసింది. మృతదేహానికి ఆదివారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
లేబర్ కోడ్లపై సమరం
విజయనగరం గంటస్తంభం: సీఐటీయూ అఖిలభారత జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ విజయనగరం సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. కోట జంక్షన్ నుంచి మూడు లాంతర్ల మీదగా గంటస్తంభం వర కు సాగిన ఈ ర్యాలీలో మహిళా కార్మికులు, నాయకులు ఎర్రచీరలు, ఎర్ర బనియన్లు ధరించి పాల్గొన్నారు. ముందు భాగంలో మహిళలు కోలాటం ప్రదర్శిస్తూ ర్యాలీకి ఆకర్షణగా నిలిచారు. ర్యాలీని ఉద్దేశించి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్మి టీవీ రమణ మాట్లాడుతూ, డిసెంబర్ 31 నుంచి జనవరి 4 వరకు విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్లో తొలిసారి గా సీఐటీయూ అఖిలభారత జాతీయ మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మహాసభల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, లేబర్ కోడ్లపై విస్తృతంగా చర్చ జరగనుందన్నారు. కట్టు బానిసలుగా కార్మికులు అనేక పోరాటాలతో సాధించిన 29 కార్మిక చట్టాల ను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి కార్మికుల హక్కులను హరించారని విమర్శించారు. పనిగంట లు పెంచడం, కనీస వేతనాలు అమలు కాకుండా చేయడం, మహిళా కార్మికులను రాత్రి పనుల్లోకి నెట్టడం ద్వారా కార్మికులను కట్టు బానిసలుగా మార్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాలన్న ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల వైఖరికి నిదర్శనమని ఆందోళన వ్యక్తం చేశారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల నుంచి వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు నాయకత్వం వహిస్తున్న రెండు వేల మంది కార్మిక సంఘాల నాయకులు ఈ మహాసభల్లో పాల్గొంటా రని తెలిపారు. ఐదు దేశాల నుంచి కార్మిక సంఘాల ప్రతినిధులు హాజరు కానున్నారని పేర్కొన్నారు. మహాసభల చివరి రోజు జనవరి 4న విశాఖపట్నంలో లక్షలాది మందితో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే శ్రామిక ఉత్సవాలు ప్రారంభమయ్యామని, పుస్తక ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. జిల్లాలోని కార్మికులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా నాయకులు శ్రీలక్ష్మి, ఎ.జగన్మోహన్రావు, బి.రమణ, పి.రమణమ్మ, సుధారాణి పాల్గొన్నారు. -
● సోషల్ టీచర్ను నియమించండి
మా పాఠశాలలో ఒకటి నుంచి 8వ తరగతి వరకు 90 మంది విద్యార్థులం చదువుతున్నాం.. మాకు సోషల్ టీచర్ లేరు.. పాఠ్యాంశ బోధన జరగడం లేదు.. తక్షణమే సోషల్ టీచర్ను నియమించాలంటూ కొత్తవలస మండలం వీరభద్రపురం ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు శనివారం కోరారు. గతంలో ఇక్కడ పనిచేసిన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు జె.వి.ఎస్.సన్యాసిరావును తోటి విద్యార్థులు, ఉపాధ్యాయినులపై అనుచిత ప్రవర్తన, లైంగిక ఆరోపణలతో గతేడాది సస్పెండ్ అయ్యారు. కొద్దిరోజుల తర్వాత ఆయన సస్పెన్షన్ రద్దుచేసి తొలుత పూసపాటిరేగ మండలం ముక్కాం జెడ్పీ హైస్కూల్, ఈ ఏడాది జూన్లో మళ్లీ వీరభద్రపురం ప్రాథమికోన్నత పాఠశాలలో నియమించారు. ఆయనను తాజాగా డీఈఓ మౌఖిక ఆదేశాలతో జామి జెడ్పీ హైస్కూల్కు బదిలీ చేశారు. దీంతో ప్రస్తుతం వీరభద్రపురం పాఠశాలలో శాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు పోస్టు ఖాళీగా ఉంది. ఎఫ్ఏ పరీక్షలు దగ్గర పడుతుండడంతో పాఠ్యాంశ బోధన జరగక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయంపై ఎంఈఓ జి.శ్రీదేవి స్పందిస్తూ సోషల్ టీచర్గా వేరొకరిని నియమించేందుకు ప్రయత్నిస్తున్నామని, లేదంటే అదే పాఠశాలో బీఈడీ చేసిన ఉపాధ్యాయులతో పాఠ్యాంశాల బోధనకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. – కొత్తవలస -
పర్యాటకుల విడిది.. తాటిపూడి
విజయనగరం గంటస్తంభం: ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ప్రశాంతంగా విహరించాలనుకునే పర్యాటకులను గంట్యాడ మండలంలో ఉన్న తాటిపూడి (గొర్రిపాటి బుచ్చిఅప్పారావు) ప్రాజెక్టు ఆకర్షిస్తోంది. అటవీశాఖ, వన సంరక్షణ సమితి సహకారంతో ఇక్కడ నడుస్తున్న ఎకో టూరిజం కేంద్రం పచ్చని అడవులు, కొండలు, విస్తారమైన జలాశయం కలిసిన అద్భుత దృశ్యాలు పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తున్నాయి. ప్రకృతి సోయగాల మధ్య అటవీశాఖ నిర్మించిన 10 కాటేజీలు సందర్మకులకు ప్రశాంత వాతావరణంలో బసచేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. పచ్చని కొండల మధ్య వసతి పట్టణ కాలుష్యానికి దూరంగా, ప్రశాంత వాతావరణంలో కాటేజీలను కొండ పాదాల వద్ద నిర్మించారు. చుట్టూ అడవులు, ఎదురుగా తాటిపూడి రిజర్వాయర్ కనిపించేలా ఏర్పాటు చేయడంతో పర్యాటకులు ప్రకృతి ఒడిలో ఉన్న అనుభూతిని పొందుతున్నారు. కాటేజీల నిర్వహణను ఈడీసీ ఆధ్వర్యంలో స్థానిక గిరిజనులు నిర్వహించడం విశేషం. వేడుకలకు వేదిక... కార్పొరేట్ సమావేశాలు, కుటుంబ వేడుకలు, పుట్టినరోజు కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా మీటింగ్ హాల్ అందుబాటులో ఉంది. మీటింగ్ హాల్ అద్దె రూ.5 వేలు మాత్రమే. ముందస్తుగా తెలియజేస్తే కావాల్సిన ఆహారాన్ని అక్కడే సిద్ధం చేస్తారు. రిజర్వాయర్లో పట్టిన చేపలను పర్యాటకుల ముందే వండి వడ్డించడం ఇక్కడి ప్రత్యేకత. రవాణా సౌకర్యం... ఎకో టూరిజం కేంద్రం ప్రధాన నగరాలకు సులభంగా చేరుకునేలా ఉంది. విజయనగరం నుంచి 32 కి.మీ, విశాఖపట్నం నుంచి 70 కి.మీ.దూరంలో ఉంది. విజయనగరం–ఎస్.కోట జాతీయ రహదారిపై ఐతన్నపాలెం కూడలి నుంచి కేవలం 7 కి.మీ. దూరంలో కాటేజీలు ఉన్నాయి. కాటేజీలకు వెళ్లేందుకు రోడ్డు సదుపాయం ఉంది. మరిన్ని సౌకర్యాలు తాటిపూడి గిరివినాయక ఎకో టూరిజం కేంద్రంలో అదనపు సౌకర్యాలు కల్పిస్తున్నాం. రిజర్వాయర్లో బోటింగ్ సౌకర్యం, పిల్లల కోసం చిల్డ్రన్ ప్లే పార్క్ ఏర్పాటు చేసే ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ప్రకృతి ఒడిలో ఉన్న ఎకో టూరిజం కేంద్రాన్ని పర్యాటకులు వినియోగించుకోవాలి. – బిర్లంగి రామ్నరేష్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రిజర్వాయర్ చెంతనే నిర్మించిన కాటేజీలు అందుబాటులో వసతి సౌకర్యం.. పర్యాటకుల కోసం ఇక్కడ మొత్తం 10 కాటేజీలు ఉన్నాయి. ఒక్కో కాటేజీలో రెండు బెడ్ రూమ్లు, అవసరమైన అన్ని ఆధునిక సౌకర్యాలు కల్పించారు. రోజుకు కాటేజీ అద్దెను రూ.2,500గా నిర్ణయించారు. చిన్న కుటుంబాలకు ఇది అనువుగా ఉంది. సేంద్రియ పంటలతో తయారు చేసిన రుచికరమైన భోజనం అందించేందుకు ప్రత్యేక రెస్టారెంట్ సదుపాయం ఉంది. బొంగు చికెన్ వంటి స్థానిక వంటకాలు పర్యాటకులకు నోరూరిస్తున్నాయి. గిరిజన నృత్యాల ప్రదర్శన పర్యాటకుల కోరిక మేరకు గిరిజన సంప్రదాయాలను ప్రతిబింబించే థింసా, మయూరి నృత్యాలు ప్రదర్మిస్తారు. చలి రాత్రుల్లో క్యాంప్ ఫైర్, సాహస ప్రియుల కోసం ట్రెక్కింగ్ మార్గం అందుబాటులో ఉంది. -
10 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు
● కలెక్టర్ రాంసుందర్ రెడ్డి విజయనగరం ఫోర్ట్: జిల్లాలో అదనంగా 10 వేల ఎకరాల్లో ఉద్యానసాగుకు ప్రణాళికలు రూపొందించినట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ శాఖలు సమష్టిగా, సమన్వయంతో కృషిచేసి లక్ష్యాన్ని సాధించాలన్నారు. వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యసాయాన్ని లాభసాటి చేయాలన్న ఉద్దేశంతో సంప్రదాయ వరి పంటకు బదులు ఉద్యాన పంటల విస్తరణకు ప్రత్యేక మిషన్ను రూపొందించామన్నారు. ప్రస్తుత రబీ సీజన్లో 4వేలు ఎకరాలు, ఖరీఫ్లో 6 వేలు ఎకరాల్లో సాగు పెంచాలన్నది మిషన్ లక్ష్యమన్నారు. పొలానికి 180 మీటర్ల దూరం లోపు విద్యుత్ సదుపాయం ఉన్న రైతులను ముందుగా ఎంపిక చేయాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి వి. తారకరామరావు, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసపాణి, తదితరులు పాల్గొన్నారు. ● ప్రధాన మంత్రి సూర్యఘర్ పథకంలో భాగంగా జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సౌర విద్యుత్ను అందించే పథకాన్ని జనవరి మొదటి వారంలో ప్రారంభించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. అర్హులైన ప్రతి ఇంటిపై రెండు కిలో వాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్ ఫలకాల ఏర్పాటుకు ప్రభుత్వం ఎటువంటి ఖర్చు లేకుండా అందిస్తుందన్నారు. సమావేశంలో ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ మువ్వల లక్ష్మణరావు పాల్గొన్నారు. -
జాబు ఏది బాబూ..?
విజయనగరం గంటస్తంభం: చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టి 18 నెలలు పూర్తయినా జాబ్క్యాలెండర్ ప్రకటించకుండా నిరుద్యోగులను మోసం చేస్తోందంటూ ఏఐవైఎఫ్ నాయకులు విజయనగరంలో శనివారం ఆందోళన చేశారు. ఎన్నికల సమయంలో యువత, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు పట్టణంలో భిక్షాటన చేస్తూ ప్రభుత్వం తీరుపై వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు బూరవాసు మాట్లాడుతూ యువగళం పేరిట జిల్లాలో చేపట్టిన పాదయాత్రలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని, నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3వేలు చెల్లిస్తామని నేతలు హామీ ఇచ్చారన్నారు. 18 నెలలుగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. నిరుద్యోగుల సమస్యలు ప్రభుత్వానికి కనిపించడం లేదని విమర్శించారు. ఉద్యోగాలు రాక నిరుద్యోగ యువత నిరాశకు గురై మాదకద్రవ్యాలకు బానిసలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించి జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ విడుదలచేసి, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంతో పాటు నిరుద్యోగ భృతి రూ.3వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్మి వెలగడ రాజేష్, ఏఐఎస్ఎఫ్ నాయకులు సుమన్, చరణ్, విద్యార్థులు, యువత పాల్గొన్నారు. బాబు వచ్చాడు.. జాబుల్లేవు జాబ్క్యాలెండర్ హామీని విస్మరించిన చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగ భృతి చెల్లింపు ఊసేలేదు యువత భవిష్యత్తు ఎటు? భిక్షాటనతో ఏఐవైఎఫ్ నిరసన -
అవయవదాతకు అంతిమ వీడ్కోలు
రాజాం సిటీ: రాజాం మండలం వీఆర్ అగ్రహారం గ్రామానికి చెందిన గెడ్డాపు ఎర్రయ్య (39) స్థానిక వాటర్ ప్లాంట్లో పనిచేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఈ నెల 16న ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యాడు. ఆయన కుటుంబ సభ్యులు రాజాంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు రాగోలు జెమ్స్కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 26న బ్రెయిన్డెడ్ అయినట్లు కుటుంబ సభ్యులకు వైద్యులు తెలిపారు. గ్రామానికి చెందిన ఆర్మీ విశ్రాంత అధికారి డబ్బాడ వెంకటరమణ సాయంతో కుటుంబ సభ్యులకు అవయువ దానంపై అవగాహన కల్పించారు. వారు అంగీకరించడంతో శనివారం అవయవ దానం చేసిన అనంతరం ఎర్రయ్య మృతదేహాన్ని గ్రామానికి తరలించారు. మృతదేహం గ్రామానికి వస్తుందని తెలుసుకున్న గ్రామస్తులు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజాం–శ్రీకాకుళం రోడ్డుకు చేరుకున్నారు. అవయువ దాత అమర్రహే అంటూ అంతిమయాత్ర నిర్వహించారు. మృతునికి భార్య లక్ష్మితో పాటు కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
శ్రీనివాసుని కల్యాణానికి తలంబ్రాల సేకరణ
రాజాం సిటీ: వచ్చేఏడాది ఏప్రిల్ నెలలో తిరుపతిలో జరగనున్న శ్రీనివాసుని కల్యాణానికి అవసరమైన తలంబ్రాల కోసం భక్తులు శనివారం ధాన్యంసేకరించారు. అగ్రహారంలో శ్రీనివాసుని రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ధాన్యం సేకరణ చేపట్టారు. వీటిని గోటితో ఒలవగా వచ్చిన బియ్యాన్ని తలంబ్రాలుగా శ్రీనివాసునికి సమర్పిస్తామని గాయత్రి బ్రాహ్మణ సంఘం సభ్యులు, పనసలవలస గ్రామానికి చెందిన వైష్ణవాచార్యపీఠాధిపతి తిరుమల రంగనాథం, అయ్యప్ప గురుస్వామి శేషు తెలిపారు. ఇలా అయితే గ్రామాల్లో తిరగలేం... ● మంత్రి వద్ద వాపోయిన కార్యకర్తలు దత్తిరాజేరు: మండలంలోని చుక్కపేటలో టీడీపీ మండలాధ్యక్షుడు చప్ప చంద్రశేఖరరెడ్డి సమక్షంలో పార్టీ కార్యకర్తల సమావేశం శనివారం నిర్వహించారు. దీనికి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు హాజరయ్యారు. గదబవలస గ్రామానికి రోడ్డు నిర్మాణంలో జాప్యంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నామని, తమను నిలదీస్తున్నారంటూ సీనియర్ నాయకుడు సూర్యనారాయణ వాపోయారు. అర్హులకు పింఛన్లు మంజూరు కావడంలేదు... సంక్షేమ పథకాల్లో కోత పెడుతున్నారు.. కార్యకర్తలకు కూడా పథకాలు అందడం లేదు.. పల్లెల్లో తిరగలేకపోతున్నామని, ఇలా అయితే భవిష్యత్తులో కష్టమేనంటూ పలువురు నాయకులు మంత్రి వద్ద విచారం వ్యక్తంచేయడం గమనార్హం. -
వినియోగం తగ్గించాలి
రీఫిల్స్, దోమల చక్రాల మితిమీరిన వినియోగం చాలా ప్రమాదకరం. ఇటీవల కాలంలో శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు ఎక్కువగా ఆస్పత్రికి వస్తున్నారు. చిన్న పిల్లలు, వృదుధలు, టీబీ పేషెంట్లు ఉన్నచోట వీటి వినియోగం పూర్తిగా నియంత్రించాలి. దోమతెరలు వాడడం, మస్కెటో కిల్లర్ బ్యాట్ల వినియోగం వంటి ప్రత్యామ్నాయ పద్ధతులు పాటించాలి. అతిగా మస్కెటో రీఫిల్స్ వినియోగిస్తే చర్మసంబధిత వ్యాధులతో పాటు శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్ వంటి వ్యాధులు ఉత్పన్నమవుతాయి. – గట్టి బార్గవి, పీహెచ్సీ వైద్యాధికారి, పొగిరి, రాజాం మండలం -
గంజాయి రవాణాకు అడ్డుకట్ట..
● నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ దామోదర్ విజయనగరం క్రైమ్: గంజాయి అక్రమ రవాణకు అడ్డుకట్ట వేశామని ఎస్పీ దామోదర్, కలెక్టర్ ఎం. రామసుందర్రెడ్డి అన్నారు. శనివారం స్థానిక దండుమారమ్మ టెంపుల్లో జిల్లా స్థాయి పోలీస్ సిబ్బందితో వార్షిక నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గంజాయి రవాణా, పోక్సో కేసు నమోదుపై జిల్లా శాఖ దృష్టి సారించిందన్నారు. పోక్సో నిందితులకు వెంటనే శిక్షలు పడేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. జిల్లా స్థాయిలోనే కాకుండా సబ్ కోర్టుల్లో కూడా శిక్షలు పడుతున్నాయన్నారు. గతేడాది పోక్సో కేసులు 58 నమోదైతే.. ఈ ఏడాది 57 నమోదయ్యాయని తెలిపారు. గంజాయి అక్రమ రవాణాపై 87 కేసులు నమోదు చేసి 270 మందిని అరెస్ట్ చేశామన్నారు. నిందితుల నుంచి 1,175 కిలోల గంజాయిని సీజ్ చేశామని.. 54,15,860 రూపాయల ఆస్తి రికవరీ చేశామని తెలిపారు. మహిళలపై జరుగుతున్న నేరాలను అదుపు చేసేందుకు ప్రత్యేకంగా శక్తి టీమ్స్ పని చేస్తున్నాయన్నారు. వరకట్న వేధింపులు గతేడాది 241 నమోదైతే ఈ ఏడాది 267 నమోదు చేసినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే హత్యకేసులు గతేడాది కంటే పెరగడం బాధాకరమని తెలిపారు. మొత్తానికి గతేడాది కంటే ఈ ఏడాది నేరాలు తగ్గుముఖం పట్టాయని 2024లో 7,352 జరిగితే ఈ ఏడాది 4,880 కేసులు నమోదు అయ్యాయన్నారు. రౌడీలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పోలీస్ శాఖాధికారులు పాల్గొన్నారు. -
మానవీయ విలువలు పెంపొందించేలా..
పార్వతీపురం రూరల్: మానవీయ విలువలు పెంపొందించేలా ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ కార్యకలాపాలు సాగాలని కలెక్టర్ ఎన్. ప్రభాకర్రెడ్డి అన్నారు. స్థానిక ఐటీడీఏ క్వార్టర్స్ ఆవరణలో ఏర్పాటు చేసిన రెడ్క్రాస్ కార్యలయాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సేవే ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలన్నారు. రక్తదాన శిబిరాలు ముమ్మరంగా నిర్వహించడంతో పాటు సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వైశాలి, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి ఎస్ భాస్కరరావు, జిల్లా మెడికల్ ఆఫీసర్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె. సాయికృష్ణ చైతన్య, రెడ్క్రాస్ చైర్మన్ మంచుపల్లి శ్రీరామ్మూర్తి, సెక్రటరీ బీఎన్ రావు, తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం పార్వతీపురం రూరల్: ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ, పార్వతీపురం మన్యం జిల్లా మొబైల్ మెడికల్ యూనిట్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన నాలుగు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రెడ్క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ మంచుపల్లి శ్రీరాములు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వైద్యాధికారి–1, స్టాఫ్నర్స్–1, ఫార్మసిస్ట్ కమ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్–1, డ్రైవర్–1 పోస్టులను మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి, అర్హతలున్న అభ్యర్థులు తమ దరఖాస్తులను విద్యార్హత ధ్రువపత్రాల జిరాక్స్లతో కలిపి 2026 జనవరి ఐదో తేదీలోగా జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాల యంలో సమర్పించాలన్నారు. వైద్యాధికారి పో స్టుకు రూ.500 (ఎస్సీ, ఎస్టీలకు మినహాయింపు), మిగిలిన పోస్టులకు రూ.300 చొప్పున డిమాండ్ డ్రాఫ్ట్ను జతచేయాలని తెలిపారు. వంగర: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కింజంగి గ్రామానికి చెందిన చిప్పాడ సింహాచలం (65) ఈ నెల 26న గ్రామాల్లో పప్పు దినుసులు విక్రయించుకుని టీవీఎస్ వాహనంపై ఇంటికి తిరిగి వస్తున్నాడు. సరిగ్గా శ్రీహరిపురం పరిధి బందరు చెరువు సమీపంలోకి వచ్చే సరికి శ్రీహరిపురం నుంచి బాగెంపేట వైపు వస్తున్న గంటాన తరుణ్ ద్విచక్ర వాహనంతో ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో సింహాచలానికి తీవ్ర గాయాలు కావడంతో, రాజాంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు ఏఎస్సై వి. ప్రసాద్ తెలిపారు. మృతుడి భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. పురుగు మందు తాగిన వ్యక్తి.. వంగర: మండల పరిధి శివ్వాం గ్రామానికి చెందిన బలగ సత్యంనాయుడు (67) పురుగు మందు తాగి మృతి చెందాడు. పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. సత్యంనాయుడుకు మద్యం అలవాటు ఉంది. ఈ క్రమంలో శుక్రవారం మద్యం బాటిల్ కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత మద్యం బాటిల్ అనుకుని పొరపాటున ఇంటిలో ఉన్న పురుగు మందు తాగేశాడు. వెంటనే అపస్మారకస్థితికి చేరుకున్న సత్యంనాయుడును కుటుంబ సభ్యులు రాజాం సీహెచ్సీకి తరలించగా.. ప్రథమ చికిత్స అనంతరం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం వేకువజామున మృతి చెందాడు. మృతుడి భార్య తవిటమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్సీ నీలం శ్రీనివాసరావు తెలిపారు. -
రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువు
● ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఎ.విమలవిజయనగరం గంటస్తంభం: రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని ఎన్ఎఫ్ఐడబ్ల్యూ(జాతీయ మహిళా సమైక్య) రాష్ట్ర అధ్యక్షురాలు ఎ.విమల ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని అమర్భవన్లో ఆ సంఘ జిల్లా అధ్యక్షురాలు బాయి రమణమ్మ, జిల్లా కార్యదర్శి బుగత పావనిల ఆధ్వర్యంలో శనివారం జరిగిన సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రతిరోజూ దేశంలో ఎక్కడో ఓ చోట బాలికలు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా లైంగికదాడులు జరుగుతూనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మహిళల రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంలో విఫలమవుతోందన్నారు. ఇకనుంచి అయి నా మహిళలపై వివక్ష లేకుండా చూడాలని, వారిని అన్నిరంగాల్లో ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.దుర్గాభవాని తదితరులు పాల్గొన్నారు. -
రెండు ఆటోలు ఢీ..
రాజాం సిటీ: మండల పరిధి కొత్తపేట సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీ కొన్న సంఘటనలో పలువురు గాయపడ్డారు. శనివారం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. తెర్లాం నుంచి ఐదుగురు వ్యక్తులతో రాజాం వస్తున్న ఆటో.. రాజాం వైపు నుంచి తెర్లాం వైపు వెళ్తున్న ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్లతో పాటు పలువురు ప్రయాణికులు గాయాలపాలయ్యారు. వెంటనే స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇవ్వగా ఈఎంటీ మీసాల ఈశ్వరరావు, పైలెట్ గౌరీశంకర్ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స చేసి అనంతరం బాధితులను రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన కారాడ గ్రామానికి చెందిన యాండ్రాపు నారాయణమ్మ, తెర్లాంనకు చెందిన సింగిరెడ్డి దివ్య, గదబవలసకు చెందిన దువ్వి లక్ష్మణరావు, నాషత్లను శ్రీకాకుళం రిమ్స్కు రిఫర్ చేశారు. అలాగే పొట్టా యశోదను రాజాం కేర్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. జామి అప్పలనాయుడు, పచ్చికాల వరలక్ష్మి, యండమూరి గణేష్లకు కూడా గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఆటో డ్రైవర్ గణేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పలువురికి గాయాలు -
అంతా హడావుడే..!
● చేప పిల్లల విడుదలకు ఇదా సమయం.. ● 546 చెరువుల్లో 14 లక్షల చేప పిల్లలు ● రానున్న వేసవికి నీరు అడుగంటే ప్రమాదం ● మత్స్యశాఖ తీరుపై అసంతృప్తిసీతంపేట: మత్స్యశాఖాధికారులు హడావిడిగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారు. శనివారం నుంచి పలు గ్రామాల్లోని చెరువుల్లో పిల్లలు విడిచిపెడుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ మరికొద్ది నెలల్లో వేసవికాలం ప్రారంభంకానున్న నేపథ్యంలో ఇప్పుడు చేప పిల్లలను చెరువుల్లో ఎలా విడిచిపెడతారని పలువురు ప్రశ్నిస్తున్నారు. వేసవిలో నీరు అడుగంటే అవకాశం ఉండడంతో చేప పిల్లలు ఎదుగుదల లేకుండా మధ్యలో చనిపోయే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో ఇవి ఎంతవరకు రైతులకు ఉపయోగపడతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. పాలకొండ నియోజకవర్గ పరిధిలో 546 గిరిజనులకు చెందిన చెరువుల్లో 14 లక్షల చేపలు వేయడానికి చర్యలు తీసుకున్నట్లు అధికారుల గణాంకాల ద్వారా తెలిసింది. దీనిలో భాగంగా చేప పిల్లల పంపిణీకి కొద్ది రోజుల కిందట టెండర్లు నిర్వహించగా.. ఎల్వన్ బిడ్డర్ టెండర్ దక్కించుకున్నారు. ఐటీడీఏ నిధులు సుమారు రూ.15 లక్షల వరకు ఇందుకోసం వెచ్చించనున్నారు. సీతంపేట, భామిని, వీరఘట్టం, పాలకొండ మండలాల్లోని చెరువుల్లో చేప పిల్లలు వేయనున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే సగానికి పైగా చెరువులు అడుగంటగా, మిగతా చెరువుల్లో నీరు ఉంది. అన్ని చెరువులూ మార్చి నెలాఖరుకు అడుగంటుతాయి. జూన్, జూలై నెలల్లో చెరువుల్లో చేప పిల్లలు వేయాల్సి ఉండగా..ఇప్పుడు వేయడం ఏం ప్రయోజనమన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మత్స్యశాఖ జిల్లా అభివృద్ధి అధికారి ఏమన్నారంటే... ఈ విషయమై జిల్లా మత్స్యశాఖ అభివృద్ధి అధికారి సంతో ష్కుమార్ వద్ద ప్రస్తావించగా టెండర్లు ఆలస్యం కావడం వల్ల చేప పిల్లల పంపిణీ ఆలస్యమైందన్నారు. వర్షాలు ఈ దఫా బాగా పడడంతో చెరువుల్లో నీరు ఉందన్నారు. ఎక్కడైతే నీరు ఉంటుందో అక్కడే చేప పిల్లలు వేయనున్నట్లు చెప్పారు. -
ప్రాణాంతక వ్యాధితో చిన్నారి పోరాటం..
● ఆపన్నహస్తాల కోసం ఎదురుచూపు.. ● వైద్యానికి రూ. 12 లక్షలు అవసరం భోగాపురం: మండలంలోని రెడ్డికంచేరు గ్రామానికి చెందిన బైరెడ్డి సురేష్రెడ్డి, శైలజ దంపతులకు ఈ నెల 8న కుమారుడు జన్మించాడు. అయితే వారసుడు వచ్చాడన్న ఆనందం వారికి ఎంతోసేపు నిలువలేదు. చిన్నారికి ఆరోగ్యం సక్రమంగా లేకపోవడంతో వారి ఆనందం ఆవిరైంది. వివిధ ఆస్పత్రుల్లో చిన్నారిని చూపించినా, ఆరోగ్యం కుదుటపడలేదు. ఇందుకోసం రూ. లక్షల్లో ఖర్చు చేశారు. చివరగా విశాఖపట్నం అపోలో ఆస్పత్రిలో చూపించగా.. చిన్నారి నెక్రోటైజింగ్ ఎంటెరోకోలైటిస్ వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు చెప్పారు. చికిత్స కోసం సుమారు 12 లక్షల రూపాయలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం అంత సొమ్ము ఎలా పోగు చేయాలో తెలియక దేవుడిపై భారం వేసి ఆపన్నహస్తాల కోసం ఎదురుచూస్తున్నారు. సాయం చేయాలనుకునే దాతలు 83744 67856, 93901 41053 నంబర్లను సంప్రదించాలని బాధిత తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇదిలా ఉంటే విషయం తెలుకున్న వైఎస్సార్సీపీ సర్పంచ్ బైరెడ్డి రమణరెడ్డి, శీరపు వంశీరెడ్డి, బైరెడ్డి దుర్గయ్యరెడ్డి, చిన్నయ్యరెడ్డి చిన్నారి తండ్రి సురేష్రెడ్డిని శనివారం కలిసి రూ. 21 వేల నగదు అందజేశారు. -
దాడి చేసిన వారిని శిక్షించాలి
భోగాపురం: మండలంలోని ముంజేరు పంచాయతీ సిద్ధార్థ్నగర్ కాలనీకి చెందిన దళితులపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని దళిత నేత, మాజీ ఎంపీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. కాలనీ మీదుగా నిర్మించిన మురుగునీటి కాలువ సమస్యను పరిష్కరించడంతో పాటు తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. సిద్ధార్థ్నగర్కు చెందిన దళితులు 22 రోజులుగా స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దళితనేత, మాజీ ఎంపీ హర్షకుమార్ దీక్షా శిబిరాన్ని శనివారం సందర్శించి, సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దళితులు 22 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నా.. స్థానిక ఎమ్మెల్యే లోకం నాగమాధవి, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. గతంలో ముంజేరు గ్రామంలోని వాడుకనీరు వేరే మార్గం వైపు పోయేదని.. అయితే వాడుకనీరు పోయేందుకు వీలుగా సిద్ధార్థ్నగర్ కాలనీ మీదుగా కాలువ నిర్మించి, పనులు మధ్యలో నిలిపివేయడంతో మురుగునీరంతా కాలనీలో నిలిచిపోతోందని చెప్పారు. ఇదేమని అడిగిన వారిప కొంతమంది దాడి చేశారన్నారు. కాలువను నాగులగెడ్డ వద్దకు నిర్మించి మురుగునీటి సమస్యను పరిష్కరించడంతో పాటు దాడి చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో వివిధ దళిత సంఘాలకు చెందిన నాయకులు, దళితులు పాల్గొన్నారు. మాజీ ఎంపీ హర్షకుమార్ -
ఒక్క నిమిషం ఆలోచించాల్సిందే..
రాజాం: గతంలో కంటే దోమల బెడద ఎక్కువైంది. కలుషిత వాతావరణంతో పాటు ఎక్కడికక్కడే చెత్తాచెదారాలు పేరుకుపోవడం, మురుగు కాలువలు మూసుకుపోవడం వంటి కారణాలతో దోమల వ్యాప్తి అధికమైంది. గతంలో వేసవిలో మాత్రమే దోమల సమస్య పీడించేది. ఇప్పుడు అన్ని కాలాల్లోనూ దోమల బెడద ఉంది. పట్టణాల నుంచి గ్రామాల వరకు అన్నిచోట్లా దోమలదండు కనిపిస్తోంది. అంతుపట్టని విష జ్వరాలను ఈ దోమలు వ్యాప్తి చేస్తున్నాయి. వీటి నిర్మూలనకు ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. పెరిగిన దోమల కాయిల్స్, రీఫిల్స్ వినియోగం గతంలో దోమల నివారణకు ఎక్కువుగా దోమ తెరలు వినియోగించేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. గ్రామాల దగ్గర నుంచి పట్టణాల వరకు అన్నిచోట్లా దోమల కాయిల్స్, రీఫిల్స్ వినియోగం పెరిగింది. ప్రతి ఇంట్లో దోమల చక్రాలు సాయంత్రం నుంచి వెలుగుతూనే కనిపిస్తున్నాయి. ఇక దోమల నివారణ రీఫిల్స్ వినియోగానికి హద్దే లేకుండా పోయింది. రాత్రి, పగలు తేడా లేకుండా రీఫిల్స్ వినియోగిస్తున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం 50 మంది అంతకంటే ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఒక రీఫిల్ వినియోగాన్ని చేపట్టాలి. అలా కాకుండా ఒకరిద్దరు ఉన్నచోట కూడా రాత్రింబవళ్లు రీఫిల్స్ వినియోగిస్తున్నారు. ఫలితంగా చాపకిందనీరులా వాయు కాలుష్యం జరుగుతోంది. దీంతో అంతుచిక్కని వ్యాధులు ప్రబలుతున్నాయి. అమ్మో శ్వాసకోశ వ్యాధులు గతంలో ఏ వెయ్యి మందిలో ఒకరికి శ్వాసకోశ వ్యాధులు ఆశించేవి. ఇప్పుడు అలా కాకుండా ప్రతి కుటుంబంలో ఒకరిద్దరు శ్వాసకోశ వ్యాధుల భారిన పడుతున్నారు. దోమల చక్రాలు, రీఫిల్స్లో వినియోగించే డైఇథైల్ టోలుమైడ్, పైరెత్రిన్, పైరిథ్రోయిడ్స్ వంటి రసాయనాలు మండి వాయుకాలుష్యం జరుగుతోంది. వీటిని పీల్చడం ద్వారా చర్మంపై అలర్జీలు, క్యాన్సర్ వంటి వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు, నాడీ వ్యవస్థ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ వ్యాధులను సకాలంలో గుర్తించలేక చాలా మంది జీవితం అర్ధంతరంగా ముగుస్తోంది. విచ్చలవిడిగా దోమల నివారణ మందు వినియోగం తగదు కాయిల్స్, రీఫిల్స్ అతి వినియోగం ప్రమాదకరం చాపకింద నీరులా వ్యాపిస్తున్న శ్వాసకోశ వ్యాధులు ప్రత్యామ్నాయం ఆలోచించాల్సిందే.. -
సులభ పద్ధతుల్లో బోధించాలి
గుర్ల: ఉపాధ్యాయులు సులభ పద్ధతుల్లో విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించాలని డీఈఓ ఎం.మాణిక్యం నాయుడు సూచించారు. మండలంలోని తెట్టంగి హైస్కూల్ను ఆయన శుక్రవారం సందర్శించారు. విద్యార్థుల అభ్యాసన స్థాయిని పరీక్షించారు. పదోతరగతి విద్యార్థులు పట్టుదలతో చదివి శతశాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. ఆయన వెంట ఎంఈఓ భానుప్రకాష్ ఉన్నారు. 31న పింఛన్ల పంపిణీ విజయనగరం అర్బన్: సామాజిక పింఛన్దారులకు ఈ నెల 31వ తేదీన పింఛన్లు అందజేస్తామని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వచ్చి పింఛన్లు అందజేస్తారన్నారు. డిసెంబర్ నెలకుగాను జిల్లాలో 2,71,691 మంది పింఛన్దారులకు రూ.116.25 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. ఈ నగదును 30 తేదీన బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని, సంబంధిత సచివాలయ సిబ్బంది నగదు విత్డ్రా చేసుకొని పింఛన్ల పంపిణీకి సిద్ధంకావాలన్నారు. 33వేల టన్నుల చెరకు క్రషింగ్ రేగిడి: మండంలోని సంకిలి వద్ద ఉన్న ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారంలో ఇంతవరకు 33వేల మెట్రిక్ టన్నుల చెరకు క్రషింగ్ పూర్తయినట్టు యాజమాన్యం శుక్రవారం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల నుంచి చెరకును కర్మాగారానికి తీసుకువస్తున్నామని పేర్కొంది. ఈ ఏడాది 2.50 లక్షల మెట్రిక్ టన్నుల చెరకు క్రషింగ్ చేయనున్నట్టు వెల్లడించింది. పార్వతీపురం: వినూత్న కార్యక్రమాల అమల తో జిల్లాకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర్రెడ్డికి డీఎంహెచ్ఓ ఎస్.భాస్కరరావు, వైద్య సిబ్బంది అభినందనలు తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి దుశ్శాలువతో సత్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ ఓ కెవీఎస్ పద్మావతి, ప్రోగ్రాం అధికారులు టి. జగన్మోహన్రావు, రఘుకుమార్, వినోద్ కు మార్, ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు జీవీఆర్ఎస్ కిశోర్ తదితరులు పాల్గొన్నారు. -
పిల్లలే వికసిత్ భారత్కు పునాది
● కలెక్టర్ రాంసుందర్ రెడ్డి విజయనగరం ఫోర్ట్: పిల్లలే వికసిత్ భారత్కు పునాది అని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం వీర్బాల్ దివస్ వేడుకలు నిర్వహించారు. ముందుగా కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్స్ను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువ మనస్సులను సంస్కరించడం, వారిలో సృజనాత్మకతను పెంపొందించడం, ఆత్మవిశ్వాసాన్ని నింపడం కార్యక్రమ ప్రధాన ఉద్దేశమన్నారు. దేశాభివృద్ధిలో పిల్లలు, యువత చురుగ్గా పాల్గొనేలా చూడాలన్నారు. పిల్లలో ధైర్యం, దేశ భక్తి, త్యాగం వంటి విలువలు పెంపొందించాలని తెలిపారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ విమలరాణి, డీఎంసీ సుజాత, డీసీపీయూ లక్ష్మి, రామకోటి, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. -
జన్నివలస అనాథ బాలురకు కలెక్టర్ అండ
విజయనగరం అర్బన్/జామి: తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన జామి మండలం జన్నివలస గ్రామానికి చెందిన ఇద్దరు బాలురను కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అక్కున చేర్చుకు న్నారు. వారికి ఇల్లు మంజూరు చేయడంతోపాటు, చదువుకు అవసరమైన సహకారం అందించి, హాస్టల్ సీట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. జన్నివలస గ్రామానికి చెందిన మైలపల్లి విజయ్ (12), గౌతమ్ (10) చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయారు. వారి తండ్రి కొంతకాలం కిందట క్యాన్సర్తో మృతి చెందగా, తల్లి ఆరు నెలల కిందట గుండెపోటుతో చనిపోయారు. విజయ్ జామి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి, గౌతమ్ జన్నివలస ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నారు. బాలురు ఇద్దరు అనాథులుగా మారడం, పూరిపాకలో బిక్కుబిక్కుమంటూ జీవిస్తూ, పాఠశాలలో పెట్టిన మధ్యాహ్న భోజనంతోనే కాలంనెట్టుకొస్తున్న చిన్నారుల దీనగాథను ఇటీవల ‘పాపం పసివాళ్లు’ శీర్షికన సాక్షిలో కథ నం ప్రచురితమైంది. దీనికి పలువురు దాతలు స్పందించి తమ చేయూతను అందించారు. ఐసీడీఎస్ పీడీ టి.విమలారాణి స్పందిస్తూ బాలు రు, వారి పెద్దమ్మ కొండమ్మను కలెక్టర్ వద్దకు శుక్రవారం తీసుకెళ్లారు. వారి దయనీయ పరిస్థి తిని వివరించగా కలెక్టర్ చలించిపోయారు. బాలురకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చక్కగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని బాలురకు సూచించారు. ఇల్లు, హాస్టల్ సీట్ల మంజూరుకు హామీ సాక్షి వార్తకు స్పందన -
ఎరువుకోసం రైతన్న పాట్లు
వణికిస్తున్న చలిలో.. గరికవలస ఆర్ఎస్కే వద్ద యూరియా కోసం ఉదయం నుంచే వేచివున్న రైతులు ఆనందపురం ఆర్ఎస్కే వద్ద దుప్పట్లు కప్పుకొని క్యూ కట్టిన రైతులురైతన్నల ఎరువు కష్టాలకు ఈ చిత్రాలే నిలువెత్తు నిదర్శనం. బస్తా యూరియా కోసం వణికిస్తున్న చలిలో ఉదయం నుంచి ఆర్ఎస్కేలు, ప్రైవేటు దుకాణాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. గుర్ల మండలంలోని ఆనందపురం, గరికివలస ఆర్ఎస్కేల వద్ద యూరియా పంపిణీ చేస్తామని అధికారులు చెప్పడంతో శుక్రవారం ఉదయం నుంచి రైతులు బారులు తీరారు. గరికివలసలో సుమారు 500 మంది రైతులు వేచిఉన్నా యూరియా పంపిణీ చేయలేదు. ఆనందపురం ఆర్ఎస్కే వద్ద రైతుకు బస్తా చొప్పున పంపిణీ చేశారు. ఎంత భూమి ఉన్నా ఒక బస్తా యూరియా ఇవ్వడంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో రైతన్నకు కష్టాలు తప్పడం లేదని, ఓట్లేసి గెలిపించినందుకు తగిన శాస్తిచేస్తున్నారంటూ పలువురు వాపోయారు. యూరియా కోసం రోజుల తరబడి తిరిగితే పొలంపని ఎప్పుడు చేస్తామంటూ మరికొందరు ప్రశ్నించారు. – గుర్ల -
పశుగ్రాసం పెంచేందుకు దరఖాస్తుల ఆహ్వానం
● పశుసంవర్థక శాఖ జేడీ డాక్టర్ మురళీకృష్ణ గంట్యాడ: పాలఉత్పత్తి పెంపే లక్ష్యంగా ఉపాధిహామీ పథకం నిధులతో పశుగ్రాసాలు పెంచేందుకు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కె.మురళీకృష్ణ తెలిపారు. గంట్యాడ ప్రాంతీయ పశు వైద్యశాలను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపెయ్యిల పథకం కింద జిల్లాలో 9 వేలకు 6వేలు వ్యాక్సిన్లు వేసినట్టు తెలిపారు. మార్చి నెలఖారులోగా లక్ష్యాన్ని పూర్తిచేయాలని సిబ్బందిని ఆదేశించామన్నారు. జనవరి నెలలో మెగా పశగర్భకోశ శిబిరం, లేగ దూడల ప్రదర్శన ప్రతి మండలంలో నిర్వహిస్తామని చెప్పారు. జిల్లాలో 8 పశువుల హాస్టల్స్ నిర్మాణానికి కలెక్టర్కు ప్రతిపాదనలు పంపించామన్నారు. కార్యక్రమంలో పశు సంవర్థక శాఖ ఏడీ డాక్టర్ మురళీకృష్ణ పాల్గొన్నారు. -
● ఒకే ఇంటితో ఓ గ్రామం
అదో మారుమూల ప్రాంతం. కొండల నడుమ ఓ గిరిజనుడు ఓ ఇంటిని నిర్మించుకున్నాడు. ఆ గ్రామంలో ఆయన కుటుంబం ఒక్కటే నివసిస్తోంది. ఆ గ్రామం పేరు పైగుజ్జి. సీతంపేట మండలం తాడిపాయి పంచాయతీ పరిధిలో ఉంది. ఈ గ్రామంలో సవర తోటన్న తన భార్య మంగమ్మతో పాటు కుమారులు వైకుంఠ, సునీల్, కుమార్తె ప్రియాంకతో కలిసి నివసిస్తున్నారు. విశేషమేమిటంటే ఈ గ్రామానికి వెళ్లేందుకు దారి, విద్యుత్ సౌకర్యం కూడా ఉంది. దశాబ్ధాలుగా ఇక్కడ నివాసముంటున్నామని, కొండపోడు పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్టు తోటన్న తెలిపారు. – సీతంపేట -
ఏనుగులతో భీతిల్లుతున్న ప్రజలు
గరుగుబిల్లి: ఏనుగుల సంచారంతో ప్రజలు భీతిల్లుతున్నారు. కురుపాం నియోజకవర్గంలోని కొమరాడ, జియ్యమ్మవలస, కురుపాం మండలాల్లో సంచరిస్తున్న ఏనుగులు శుక్రవారం ఉదయానికి గరుగుబిల్లి మండలంలోని సుంకి గ్రామంలో ప్రత్యక్షమయ్యాయి. ఈ మేరకు ఎస్డబ్యూపీసీలోని స్తంభాలను ధ్వంసం చేసి చిందరవందర చేశాయి. గజరాజులతో ఇప్పటికే వివిధ గ్రామాల్లో ధన, ప్రాణనష్టం జరిగినప్పటికీ ఏనుగులను తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. దీంంతో ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ప్రధాన రహదారి సమీపంలో ఏనుగులు సంచరిస్తుండడంతో వాహనచోధకులు రాకపోకలు చేసేందుకు భయాందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పొలం పనులు ముమ్మరంగా ఉండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఏనుగులను తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఆస్తి, ప్రాణనష్టం సంభవించకముందే ఏనుగులను తరలించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
సీనియర్స్ ఖోఖో పోటీల్లో జిల్లాకు ద్వితీయ స్థానం
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరిగిన సీనియర్స్ ఖోఖో పోటీల్లో విజయనగరం జిల్లా జట్టు సత్తా చాటింది. ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు గుడివాడ జరిగిన పోటీల్లో పురుషుల విభాగంలో ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి ద్వితీయస్థానంలో నిలిచారు. రాష్ట్రస్థాయిలో జరిగిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను, కోచ్ అండ్ మేనేజర్లను జిల్లా ఖోఖో అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు. అంబకండిలో అగ్నిప్రమాదంరేగిడి: మండల పరిధిలోని అంబకండి గ్రామంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురి రైతులకు చెందిన ధాన్యం బస్తాలు, గడ్డివాములు దగ్ధమయ్యాయి. రైతులు అందించిన సమాచారం మేరకు అందరూ పొలాల్లో ఉన్న సమయంలో అగ్నిప్రమాదం ఎలా సంభవించిందో తెలియరాలేదు. ఈ ప్రమాదంలో ఎవర్న సత్యంనాయుడు, ఎవర్న రాము, ఎవర్న లక్ష్మి, ఎవర్న రామునాయుడు, ఎవర్న రాము, కరకవలస ఆదినారాయణ, తదితర రైతులకు చెందిన 50 బస్తాల ధాన్యంతో పాటు గడ్డివాములు పూర్తిగా కాలిపోయాయి. ఆరుగాలం కష్టించి పండించుకున్న పంట చేతికందొచ్చిన సమయంలో అగ్గిపాలు కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. స్థానికులు రాజాం అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో వారు వచ్చి కొంతమేర మంటలు అదుపుచేయడంతో పరిసర ప్రాంతాల్లోని చేనుకుప్పలకు ప్రమాదం జరగకుండా ఆపగలిగారు. ● బాలికకు తీవ్ర గాయాలు కొమ్మాది: భీమిలి బీచ్రోడ్డులో శుక్రవారం సాయంత్రం ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి.. తొలుత రోడ్డు పక్కన ఉన్న జనరేటర్ను, ఆపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ బాలికను ఢీకొట్టింది. ఈ ఘటనలో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. జీవీఎంసీ 4వ వార్డు మంగమారిపేట సమీపంలోని వీబీసీ కాలనీకి చెందిన వాసుపల్లి కార్తీక అనే బాలిక నగరపాలెం జంక్షన్ వైపు నడుచుకుంటూ వెళ్తోంది. అదే సమయంలో నగరం నుంచి భీమిలి వైపు అతివేగంగా వస్తున్న ఓ కారు అదుపు తప్పింది. ముందుగా రోడ్డుకు ఆనుకుని ఉన్న పెద్ద జనరేటర్ను బలంగా ఢీకొనడంతో అది తిరగబడిపోయింది. అనంతరం అక్కడి నుంచి దూసుకెళ్లి బాలికను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కార్తీక తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆమెను రుషికొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించా రు. ప్రస్తుతం బాలిక ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు ఆమె తల్లి వాసుపల్లి నూకరత్నం తెలిపారు. కారును విజయనగరం జిల్లా రాజాంనకు చెందిన ఎర్రగుంట్ల ప్రీతమ్ నడుపుతున్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై బాలిక తల్లి భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తి మృతివిజయనగరం క్రైమ్: విజయనగరం రైల్వేస్టేషన్లో 4,5 నంబర్ ప్లాట్ఫామ్పై శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి స్పృహ లేకుండా పడి ఉండడంతో జీఆర్పీ సిబ్బంది గమనించి ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి వయస్సు సుమారు 45 నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉంటుందని, 5 అడుగుల 8 అంగుళాల పొడవు కలిగి చామన ఛాయ రంగు ఉన్నాడని, తెలుపురంగుపై పింక్ కలర్ పువ్వులు గల ఫుల్హ్యాండ్ షర్ట్, బ్లూ కలర్ జీన్ ప్యాంట్ ధరించి ఉన్నాడని జీఆర్పీ ఎస్సై బాలాజీ రావు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు ఫోన్ 9490617089, 8309430708 నంబర్లకు సమాచారం అందజేయాలని కోరారు. -
ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మీట్లో సీతం విద్యార్ధుల ప్రతిభ
విజయనగరం అర్బన్: గాజులరేగ పరిధిలోని సీతం పాలిటెక్నిక్ కళాశాల విద్యార్ధులు ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ రీజనల్ మీట్ 2025–26 లో అద్భుత ప్రదర్శన కనబరిచి పలు పతకాలు సాధించారు. ఇటీవల మహారాజా పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో జరిగిన ఈ చాంపియన్షిప్లో అథ్లెటిక్స్, వివిధ గేమ్స్ పోటీలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 పాలిటెక్నిక్ కళాశాలల నుంచి 800 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీలలో కె.దీక్ష బాలికల విభాగంలో 800 మీటర్ల రన్నింగ్లో బంగారు పతకం, 200 మీటర్ల రన్నింగ్లో కాంస్యపతకం సాధించింది. జి.పవన్కుమార్ బాలుర విభాగంలో ట్రిపుల్ జంప్ ఈవెంట్లో కాంస్య పతకం సాధించగా బాలుర విభాగంలో బాల్ బ్యాడ్మింటన్ జట్టుకు తృతీయ స్థానం లభించింది. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీరామమూర్తి, వివిధ విభాగాల అధిపతులు విజేతలను అభినందించారు. -
చంద్రబాబు పాలనలో ఒక్క పరిశ్రమ రాలేదు
చంద్రబాబు పాలనలో జిల్లాలో ఒక్క భారీ పరిశ్రమ స్థాపన జరగలేదు. లక్కవరపుకోట మండలంలో గల మామహామాయ, స్టీల్ ఎక్సేంజ్ ఇండియా లిమిటెడ్, శారడ కార్మారం వంటివి నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, మహానేత రాజశేఖర్ రెడ్డి పానలలో స్థాపన జరిగాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పానలలో కంటకాపల్లి గ్రామం వద్ద భారీ కర్మగారం అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ స్థాపన జరిగింది. కాగా చంద్రబాబు పాలనలో పరిశ్రమల స్థాపనకు తీసుకునే భూములు బడా బాబులకు కేటాయించడమే తప్ప పరిశ్రమల స్థాపన జరగలేదు. ఉన్న పరిశ్రమలకు రాయి తీలు కట్ చేయడంలో సంక్షోభంలో నడుస్తున్నాయి.చంద్రబాబు పాలన అంటే పరిశ్రమల మనుగడ కష్టంగా మారిపోతుంది. ఇందుకు ఉదాహరణ జిల్లాలోని పరిశ్రమలే. –నెక్కల నాయుడుబాబు, జిందాల్ కార్మికుల సంఘం గౌరవ అధ్యక్షుడు, వైఎస్ఆర్సీసీ రాష్ట్ర కార్యదర్శి. -
వైన్ షాపులో స్కెచ్.. జిమ్ కోచ్ మర్డర్
● వెంకునాయుడు హత్య కేసు మిస్టరీ వీడింది ● వ్యభిచార కార్యకలాపాల్లో తేడాల్లో కారణం ● ఏడుగురు నిందితుల అరెస్ట్ ● డీఎస్పీ విష్ణుస్వరూప్ వెల్లడి పరవాడ: లంకెలపాలెం శ్రీరామనగర్ కాలనీలో ఈ నెల 23న అర్ధరాత్రి జరిగిన ఈగల వెంకునాయుడు (39) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ హత్య కేసుకు సంబంధించి దాసరి తేజస్వి (దానబోయిన పాలెం, అగనంపూడి), కనాటి దేముడునాయుడు (శనివాడ దరి కేఎస్ఎన్రెడ్డి నగర్), గొల్లు దినేష్కుమార్ (ఎస్.కోట మండలం సీతారాంపురం), చింతాడ సూర్యప్రకాష్ (తురకపేట, హిరమండలం), గుడె జాన్ ప్రశాంత్కుమార్(దయాల్నగర్), అదురి దాసు(హెచ్బీ కాలనీ), గుందేటి వంశీ (సంజీవనిగిరి, గాజువాక)లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. శుక్రవారం స్థానిక పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మల్లికార్జునరావుతో కలిసి డీఎస్పీ వి.విష్ణుస్వరూప్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. శ్రీరామనగర్ కాలనీలో నివాసముంటున్న మొల్లి సరస్వతి.. కూర్మన్నపాలెంలోని ఓ జిమ్లో కోచ్గా పనిచేస్తున్న ఈగల వెంకునాయుడుతో నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఈ నెల 23న అర్ధరాత్రి దాటిన తర్వాత తేజ అనే వ్యక్తి వెంకునాయుడుకి ఫోన్ చేసి మాట్లాడాలని బయటకు పిలిచాడు. అలా వెళ్లిన వెంకునాయుడు తిరిగి రాలేదు. 24న ఉదయం ఇంటికి సమీపంలోనే రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండడాన్ని గమనించిన సరస్వతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కక్షలు.. కుట్రలు ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, సీసీ ఫుటేజీలు, మొబైల్ డేటాను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు నిందితుల కోసం నాలుగు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. ఈ విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. వెంకునాయుడు వ్యభిచార కార్యకలాపాల విషయంలో దాసరి తేజకు సహకరించకుండా, వేరే వర్గానికి మద్దతుగా నిలిచాడు. అంతేకాకుండా తేజ అనుచరుడైన కనాటి దేముడునాయుడును తరచూ కొట్టడం, తిట్టడం, డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయడం, అర్ధరాత్రి వేళల్లో పనులు పురమాయించి అవమానించేవాడు. దీంతో తేజ, దేముడునాయుడు అతడిపై కక్ష పెంచుకున్నారు. అలాగే తేజకు సంబంధించిన వ్యభిచార కార్యకలాపాల్లో ఉన్న ఇతరులకు సామూహిక శత్రువుగా మారిపోయాడు. ఈ నెల 23 రాత్రి దువ్వాడలోని ఓ వైన్ షాపులో శత్రువులంతా సమావేశమై వెంకునాయుడు హత్యకు పథకం రచించారు. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం.. అర్ధరాత్రి అతనికి ఫోన్ చేసి బయటకు రప్పించారు. అప్పటికే సిద్ధంగా ఉంచిన పెద్ద బండరాయితో ముఖం, తలపై పలుమార్లు మోది కిరాతకంగా హత్య చేశారు. ఈ హత్యలో కొందరు ప్రత్యక్ష దాడిలో పాల్గొనగా, మరికొందరు పరోక్షంగా సహకరించినట్లు దర్యాప్తులో తేలిందని డీఎస్పీ తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం తాడి మూడు మదుముల వద్ద ఐదుగురిని, గాజువాక దుర్గానగర్ ప్రాంతంలో మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను అనకాపల్లి న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్ విధించారు. హత్య కేసును ఛేదించిన పోలీసులను డీఎస్పీ అభినందించారు. ఎస్ఐలు మహాలక్ష్మి, భీమరాజు, ట్రైనీ డీఎస్పీ చైతన్య, సిబ్బంది పాల్గొన్నారు. -
ఏషియన్ గోల్డ్ మెడలిస్ట్ను సత్కరించిన జేసీ
విజయనగరం: దుబాయి వేదికగా ఇటీవల జరిగిన యూత్ ఏషియన్ పారా గేమ్స్–2025 పోటీల్లో బాడ్మింటన్లో గోల్డ్మెడల్ సాధించిన జిల్లాకు చెందిన పారా (దివ్యాంగ) క్రీడాకారుడు పొట్నూరు ప్రేమ్చంద్ను జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ గురువారం తన కార్యాలయంలో అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాకు చెందిన పారా క్రీడాకారులు అంతర్జాతీయస్థాయిలో రాణించి మెడల్స్ సాధించడం జిల్లా కు గర్వకారణమన్నారు. పారా క్రీడల ద్వారా దివ్యాంగులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక అవకాశాలను కల్పిస్తోందని దివ్యాంగులంతా అందిపుచ్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్.వెంకటేశ్వరరావు, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి వి.రామస్వామి, జిల్లా గౌరవఅధ్యక్షుడు కె.దయానంద్, జాయింట్ సెక్రటరీ కర్రోతు లక్ష్మి, అంతర్జాతీయ బాడ్మింటన్ క్రీడాకారుడు యాళ్ల సత్తిబాబు, కోచ్లు, తల్లితండ్రులు తదితరులు పాల్గొన్నారు. -
ఇదెక్కడి న్యాయం?
జియ్యమ్మవలస రూరల్: మండలంలోని చింతలబెలగాం గ్రామానికి చెందిన బెలగాం పారమ్మ అనే వృద్ధురాలు గురువారం చనిపోయింది. ఈ మేరకు మృతదేహాన్ని స్థానిక గుడి చెరువులో దళితులకు అంత్యక్రియలకు కేటాయించిన స్థలంలో కప్పిపెట్టారు. అయితే ఆ చెరువును ఆక్రమించిన రైతులు మృతురాలి కుటుంబ సభ్యులపై శుక్రవారం చినమేరంగి పోలీసులకు ఫిర్యాదు చేశారని దళితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోను మృతదేహాన్ని బయటకు తీయందే తాము ఒప్పుకోమని రైతులు డిమాండ్ చేశారని దళితులు తెలిపారు. ఈ విషయమై రెవెన్యూ అధికారులు, తహసీల్దార్కు ఫోన్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేసినప్పటికీ వారు అందుబాటులో లేరన్నారు. ఈ విషయంపై తమకు న్యాయం చేయాలని దళితులు కోరుతున్నారు. -
చెదిరిన బతుకులు
మూతబడిన జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ కర్మాగారంకరాల సత్తువ..నరాల బిగువూ ఉన్నంతకాలం స్వేదం చిందించి పరిశ్రమ ఉన్నతి కోసం పనిచేసిన కార్మికులు రోడ్డున పడ్డారు. పరిశ్రమలో పనికి అలవాటు పడి మరో పని చేతకాక..అర్ధాంతరంగా రోడ్డున పడిన బతుకులను చూసి మనోవ్యధ చెందుతున్నారు. కుటుంబాలను పోషించలేక..వేరే దారి లేక..ఏవో చిన్నచిన్న పనులు చేసుకుంటూ తలో దిక్కుకు చెదిరిపోయి కుటుంబ నావను ఈడ్చేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఇదీ జిందాల్ కర్మాగారం మూసివేసిన తరువాత అందులో పనిచేసిన కార్మికుల దుస్థితి. -
వైభవంగా సహస్ర దీపారాధన
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో సహస్ర దీపారాధన కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శుక్రవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. వేకువజామున స్వామికి ప్రాతః కాలార్చన పూజలనంతరం యాగశాలలో విశేష హోమాలు నిర్వహించారు. అనంతరం వెండి మంటపం వద్ద సీతారాముల నిత్యకల్యాణ మహోత్సవాన్ని జరిపించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయంత్రం స్వామివారి విగ్రహాలను ఊరేగింపుగా దీపారాధన మంటపం వద్దకు తీసుకువెళ్లి అక్కడున్న ప్రత్యేక ఊయలలో ఆసీనులను చేశారు. అనంతరం సహస్ర దీపాలను వెలిగించి దీపాల కాంతుల శోభలో స్వామికి ఊంజల్ సేవ జరిపించారు. -
ఎట్టకేలకు పట్టుబడిన దొంగలు
● 12 తులాల బంగారం, రెండు సెల్ఫోన్లు రికవరీ లక్కవరపుకోట: పోలీసులకు సవాల్గా మారిన దొంగతనాలను ఎట్టకేలకు ఛేదించి ఇద్దరు నిందితులను పట్టుకుని వారి నుంచి 12 తులాల బంగారం ,రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను సీఐ ఎల్.అప్పలనాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం విలేకరుల ముందు హాజరు పరిచి వివరాలు వెల్లడించారు. అరకు–విశాఖపట్నం రోడ్డులో ఎస్సై సీహెచ్.నవీన్పడాల్ ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అదే దారిలో వస్తున్న ఆటోలోంచి ఇద్దరు వ్యక్తులు పారిపోయేందుకు ప్రయత్నించగా పట్టుకుని విచారణ చేయగా విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం కోట్నివానిపాలెం గ్రామానికి చెందిన ఉప్పలూరి ఉదయ్భాస్కర్ అలియాస్ బాలు, అదే జిల్లా కై లాసపురం, సాలిగ్రామపురానికి చిరత శివలుగా తేలింది. వారిద్దరూ కొంత బంగారం తీసుకుని ఆరకు, అనంతగిరి ప్రాంతాల్లో అమ్మేందుకు వెళ్తున్నట్లు పోలీసుల విచారణలో అంగీకరించారు. ఆ ఇద్దరు నిందితులు లక్కవరపు కోట మండలంలోని గోల్డ్స్టార్ జంక్షన్లో జూలై 2023లో, అలాగే శ్రీరాంపురం గ్రామంలో ఆగస్టు2024లో ఇళ్లలో పట్టపగలే చొరబడి కిటికీ ఊచలు వంచి దొంగతనాలకు పాల్పడినట్లు కేసులు నమోదయ్యాయి. -
15 టన్నుల అక్రమ పేలుడు పదార్థాలు ధ్వంసం
వేపాడ: మండలంలోని వల్లంపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమతుల్లేకుండా రవాణా చేస్తూ పట్టుబడిన పేలుడు పదార్థాలను అత్యంత భద్రతా చర్యలతో పోలీసులు శుక్రవారం నిర్వీర్యం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 2018లో రాతి క్వారీలకు ఎటువంటి అనుమతులు లేకుండా రవాణా చేస్తున్న పేలుడు పదార్థాలను పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. విజయనగరం జిల్లా సెషన్స్ జడ్జికోర్టు ఉత్తర్వుల మేరకు బాంబ్ స్కాడ్ టీమ్ ఎక్స్పర్ట్స్ ఆధ్వర్యంలో ఎస్.కోట రూరల్ సీఐ ఎల్.అప్పలనాయుడు, వల్లంపూడి ఎస్సై ఎస్.సుదర్శన్, ఇద్దరు వీఆర్ఓలు, పోలీసు సిబ్బంది సమక్షంలో కరకవలసగ్రామంలో ఎవరూ సంచరించని ప్రదేశంలో 15000 కేజీల అక్రమ పేలుడు పదార్థాలను ధ్వంసం చేశారు. ● మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర సాలూరు: తప్పు చేసిన వారు ఎవరైనా చట్టం నుంచి తప్పించుకు పోలేరని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర అన్నారు. సీ్త్రశిశు,గిరిజన సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి అనధికార పీఏ సతీష్పై ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు తదితర విషయాలపై మంత్రి సంధ్యారాణి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వైఎస్సార్సీపీ నుద్దేశించి మాట్లాడిన మాటలపై రాష్ట్ర వైఎస్సార్సీపీ లీగల్ టీమ్ పరిశీలించాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సాలూరు పట్టణంలో విలేకరులతో మాట్లాడారు. బాధితురాలు ముందుగా మీడియాతో మాట్లాడిందని, అదే బాధితురాలు ఎస్పీకి లిఖిత పూర్వకంగా కంప్లెయింట్ ఇచ్చి పార్వతీపురంలో మీడియాతో మాట్లాడి మెజిస్ట్రేట్ ముందు కూడా స్టేట్మెంట్ ఇచ్చిందని చెప్పారు. ఈ వ్యవహారంలో సతీష్ అరెస్ట్ కాకుండా ఉండాలనే రాజకీయ ఒత్తిళ్ల వల్లనే బెయిలబుల్ సెక్షన్లు పెట్టారని పలువురు ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు. -
థర్మాకోల్ షీట్లే బోట్లు..!
సాలూరు రూరల్: ఆర్భాటంగా హామీలివ్వడం ఆనక ఆచరణ శూన్యంలా తయారైంది ప్రస్తుత గిరిజన, శిశు సంక్షేమ శాఖమంత్రి గుమ్మిడి సంధ్యారాణి పరిస్థితి అని నియోజకవర్గంలో పెద్ద చర్చ నడుస్తోంది. మంత్రి తొలి సంతకం ఏఎన్ఎంల నియామకంపై చేసినప్పటికీ ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. అలాగే మున్సిపాలిటీలో మరుగుదొడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని నిధులు మంజూరు చేస్తామని చెప్పి ఏడాదిన్ననర గడుస్తున్నా ఆ మాటలు నీటిమూటలుగానే మిగిలాయి. ఇటీవల వెంగళరాయ సాగర్లో చేపల విడుదల కార్యక్రమంలో తమకు బోట్లు మంజూరు చేయాలని, థర్మాకోల్షీట్ పడవలతో చేపలవేటతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళన చెందుతున్నామని మంత్రికి మత్స్యకారులు విన్నవించుకున్నారు. దీనికియ మంత్రి వెంటనే మత్స్యకారులకు బోట్లు మంజూరుతో పాటు డిసెంబర్ కల్లా బోటు షికారు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అసలు మత్స్యకారులకు బోట్లు లేక చేపల వేటకు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే బోటు షికారు అంటూ మరో మెట్టు ఎక్కి బోట్లు ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో తమకు కష్టాలు తీరిపోతాయని చేపల వేటతో పాటు బోటు షికారుతో పర్యాటకుల నుంచి ఆదాయం వస్తుందని ఆశపడిన మత్స్యకారులకు చుక్కెదురైంది. డిసెంబర్ కల్లా బోటుషికారు వచ్చేస్తుందని ఎదురు చూసిన మత్స్యకారులకు ఇంతవరకు చేపల వేటకు అవసరమైన బోట్లు అందలేదు. అసలు ఆ బోట్లు ఎప్పుడు ఇస్తారో కూడా అధికారులు చెప్పడంలేదని మత్స్యకారులు వాపోతున్నారు.చేపల వేటకు బోట్లు మంజూరు చేసేముందు ఇప్పటివరకు ఇంకా లబ్ధిదారులను గుర్తించలేదు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఉన్న వారికి బోట్లు మంజూరు చేయాలి. వారిని గుర్తించిన తరువాత బోట్లు కొంటాం. జిల్లాకు 6 ఫిషింగ్ బోట్లు మంజూరయ్యాయి. ఇంకా బోట్లు కొనుగోలు చేయలేదు. పర్యాటక బోట్ల విషయమై ఆ శాఖఅధికారులతో మాట్లాడాల్సి ఉంది. ఫిషింగ్ బోట్లు పర్యాటక బోట్లు వేరుగా ఉంటాయి. మత్య్స శాఖ ఎ.డి.ఎఫ్ సంతోష్ కుమార్ -
బ్యాంకు అకౌంట్ నుంచి రూ.2 లక్షలు మాయం
భోగాపురం: మండలంలోని కవులవావాడ గ్రామానికి చెందిన కొండపు రాంబాబు అనేవ్యక్తి బ్యాంకు అకౌంట్ నుంచి 2025 సెప్టెంబర్ 21వ తేదీన రూ.2 లక్షలు మాయమైనట్లు సీఐ కె దుర్గాప్రసాద్ గురువారం తెలిపారు. దీంతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై వి.ఆప్పారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని సీఐ చెప్పారు. డ్రోన్తో గమనించి కేసుల నమోదుశృంగవరపుకోట: పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం ఎస్.కోట– శివరామరాజుపేట రోడ్డులో పోలీసులు డ్రోన్తో పరిసరాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా బహిరంగంగా మద్యం తాగుతున్న వారిని గుర్తించి 3కేసులు నమోదు చేశారు. మద్యం తాగి బైక్ నడుపు తున్న వ్యక్తిని గుర్తించి డ్రంకెన్ డ్రైవ్ కేసు నమోదు చేశారు. ఇటీవల పోలీసులు డ్రోన్ ఫ్లైతో అనుమానిత ప్రాంతాలను జల్లెడ వేసి శోధిస్తున్నారు మందుల షాపులో అగ్నిప్రమాదంకొమరాడ: మండలంలోని విక్రంపురంలో విద్యుత్ షార్కసర్క్యూట్తో గురువారం రాత్రి ఓ మెడికల్ షాపులో అగ్ని ప్రమాదం జరిగింది. దీనిపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..షాపు యాజమాని ఎనిమిది గంటల సమయంలో షాపు కట్టేసి ఇంటికి వెళ్లిన తరువాత విద్యుత్ షార్ట్సర్క్యూట్ కావడంతో షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే స్థానిక అగ్నిమాపక సిబ్బందికి చుట్టుపక్కల వారు సమాచారం అందించగా తక్షణమే అగ్ని మాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేయడంతో చుట్టుపక్కల వారు ఊపిరి పీల్చుకున్నారు. షాపులో ఉన్న మందులు కాలిపోవడం షాపు యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు మహిళ అదృశ్యంవిజయనగరం క్రైమ్: విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ గురువారం అదృశ్యమైంది. ఇందుకు సంబంధించి ఎస్సై అశోక్ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోనీ వీటీ అగ్రహారం యాత వీధికి చెందిన మహిళ(45)కు పైళ్లె ఒక కూతురు ఉంది. ఇటీవల ఆమె ఓ మహిళ నుంచి ఐదున్నర తులాల బంగారం అవసరాల దృష్ట్యా తీసుకుంది. బంగారం ఇచ్చిన సదరు మహిళ అడుగుతుండగా ఇదిగో అదిగో ఇచ్చేస్తానంటూ వాయిదాలతో తప్పించుకు తిరగసాగింది. ఇటీవలే ఆ బంగారం ఇచ్చిన మహిళ మళ్లీ అడిగింది. ఇక లాభం లేదనుకుని ఇంట్లోంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. అదృశ్యమైన మహిళ కూతురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు. -
వేణుగోపాల స్వామివారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి
బొబ్బిలి: పట్టణంలోని పురాతన దేవాలయమైన శ్రీ వేణుగోపాలస్వామి ఆలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్రాయ్ గురువారం దర్శించుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పర్యటన నుంచి తిరిగి వస్తూ ఆలయాన్ని సందర్శించారు. ఆయనకు ఆలయ పురోహితులు, దేవదాయ శాఖ సిబ్బంది, ఎమ్మెల్యే, తదితరులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆయన చేతులమీదుగా అర్చకులు పూజలు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట జిల్లా న్యాయమూర్తి బబిత, న్యాయమూర్తి రోహిణీ రావు, రెండో అదనపు జిల్లా న్యాయమూర్తి దామోదర రావు, ఏపీపీ గంటి శర్మ, సీఐలు కె.సతీష్కుమార్, సీహెచ్ నారాయణరావు, పలువురు న్యాయవాదులు ఉన్నారు. -
పది యాక్షన్ ప్లాన్ వల్ల రాష్ట్రస్థాయి ఫలితాలు రావు
పదోతరగతి ఉత్తమ ఫలితాల సాధన కోసం రూపొందించిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ రాష్ట్రస్థాయిలో ఒకే విధానంలో ఉండడం వల్ల ఫలితాలు రావు. ఒక్కో జిల్లాలో ఒక్కో స్థాయిలో విద్యార్థుల ప్రిపరేషన్ శైలి ఉంటుంది. ఆయా జిల్లా స్థాయి విద్యార్థుల అవగాహనకు అనుగుణంగా యాక్షన్ ప్లాన్ ఉన్నప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతాం. స్టడీ మెటీరియల్ ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేయాలి. ఆన్లైన్లో ఇచ్చిన పేపర్ను ప్రతిరోజు జిరాక్స్ తీసుకుని రాయడం విద్యార్థికి ఆర్థికంగా భారం. స్లిప్ టెస్ట్ మార్కుల పోస్టింగ్ పనులు ఇవ్వడం వల్ల విద్యార్ధి ప్రిపరేషన్పై టీచర్స్ దృష్టిపెట్టలేక పోతున్నారు. –వై.అప్పారావు, విజయనగరం జిల్లా అధ్యక్షుడు, ఎస్టీయూ● -
గంజాయి డాన్ అరెస్ట్
● రిమాండ్ నిమిత్తం విశాఖ సెంట్రల్ జైలుకు తరలింపువిజయనగరం క్రైమ్: గంజాయి రవాణాలో డాన్గా వ్యవహరిస్తున్న పఠాన్ బాషా అలీని విజయనగరం టూటౌన్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. విజయనగరం టూటౌన్ సీఐ శ్రీనివాస్ రావు, ఎస్సై కృష్ణమూర్తి పఠాన్ బాషా ఆలీనీ అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించి టూటౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం, కొత్తవీధికి చెందిన పఠాన్ బాషా అలీ (31) విజయనగరంలోని ఫూల్బాగ్లో నివాసం ఉంటున్నాడు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో గంజాయి అక్రమ రవాణాను మార్గంగా ఎంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆలీపై నాలుగు కేసులు నమోదయ్యాయి. విజయనగరం టూ టౌన్ పీఎస్ పరిధి బాబామెట్ట ప్రాంతంలో గత ఏడాది 10 కిలోల గంజాయిని విక్రయిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో పాటు మరో కేసులో 3.10 కిలోల గంజాయితో పట్టుబడగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో 2021లో గంట్యాడ పీఎస్ లో 1596.36 కిలోలు, 2023లో బాపట్ల జిల్లా నిజాంపట్నం పీఎస్ పరిధిలో 1.5 కిలోలల గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడిగా తేలింది. దీంతో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టి రిమాండ్ నిమిత్తం విశాఖ సెంట్రల్ జైలుకు తరలించినట్లు టూటౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. -
ఆర్టీసీ కార్గో సేవలను వినియోగించుకోవాలి
మక్కువ: ఏపీఎస్ఆర్టీసీ అందిస్తున్న కార్గో సేవలను ప్రజలు వినియోగించుకోవాలని ఏపీఎస్ ఆర్టీసీ సాలూరు డిపో మేనేజర్ ఆచారి కోరారు. ఈ మేరకు మక్కువలోని ఏపీఎస్ఆర్టీసీ పార్సిల్, కొరియర్ ఆఫీస్ను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మక్కువ నుంచి ఇతర ప్రాంతాలకు వివిధ వస్తువులను చేరవేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ కార్గో సేవలను పూర్తిస్థాయిలో అందిస్తున్నామన్నారు. వినియోగదారుల వస్తువులను సకాలంలో ఇతర ప్రాంతాలకు తరలించేందుకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కలాసీలు, వినియోగదారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్గో సేవల పట్ల వినియోగదారులు తగిన సూచనలు, సలహాలు అందజేయాలని కోరారు. వ్యాపార అభివద్ధికి తగు సూచనలు చేయాలని పిలుపునిచ్చారు. మండల కేంద్రం మక్కువ నుంచి విశాఖ, విజయనగరం పట్టణాలకు చేరుకునేందుకు డైరెక్ట్ బస్సులు లేక ప్రయాణికులు, విద్యార్థులు, ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని డిపో మేనేజర్ ఆచారి దృష్టికి పలువురు తీసుకెళ్లగా పూర్తిస్థాయిలో పరిశీలించి తగుచర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ కార్గో సేవా నిర్వాహకుడు వెంకట తిరుమల విశ్వనాథం, కలాసీలు పాల్గొన్నారు. -
ఆ అధికారితో వేగలేం..!
విచారణ జరుగుతోంది.. ఐసీడీఎస్లో మహిళా ఉద్యోగినిపై వాటర్ బాటిల్ విసిరిన అధికారిపై విచారణ చేపడుతున్నాం. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తాం. – టి.విమలారాణి, పీడీ, ఐసీడీఎస్ విజయనగరం ఫోర్ట్: ఆ అధికారి అంటే ఐసీడీఎస్ ఉద్యోగులకు హడల్. టీడీపీ నేత అండతో మహిళా ఉద్యోగులపై ఇష్టారాజ్యంగా రెచ్చిపోతుండం, పెద్దపెద్ద కేకలు వేయడం, చేతిలో ఏది ఉంటే దానిని వారిపై విసిరేస్తుండడంతో బెదిరిపోతున్నారు. ఉద్యోగం చేసేందుకు భయపడుతున్నారు. తాము కూడా ఉద్యోగులమన్న కనీసం జ్ఞానం లేని అధికారితో వేగలేకపోతున్నామంటూ తెలిసినవారి దగ్గర గోడు వెళ్లబోస్తున్నారు. అయితే, ఆయనకు అధికార పార్టీ నేత అండదండలు ఉండడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు కూడా భయపడుతున్నారు. తమ వల్లే ఉన్నతాధికారులకు ఆయన విషయం తెలిసిందన్న సమాచారం తెలిస్తే.. ఏ స్థాయిలో రెచ్చిపోతారోనన్న బెంగ వారిని వెంటాడుతోంది. ఆయన సీటుకు ఎవరైనా అడ్డువస్తారని అనుమానం వస్తే చాలు.. వారిని గిరిజన ప్రాంతాలకు బదిలీ, లేదంటే డిప్యుటేషన్పై పంపించేస్తున్నారు. సహోద్యోగులపై అధికారి వేధింపులు తెలిసినా ఉన్నతాధికారులు పట్టించుకోవడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అంతకు ముందు కూడా ఒక సీడీపీఓను సదరు అధికారి గిరిజన ప్రాంతానికి బదిలీచేయించినట్టు విశ్వసనీయ సమాచారం. విజయనగరం అర్బన్ సీడీపీఓగా పనిచేసిన జి.ప్రసన్నను అల్లూరి సీతారామరాజు జిల్లాకు డిప్యుటేషన్పై ఏసీడీపీఓగా బదిలీచేశారు. ఈ వ్యవహారంలో ఐసీడీఎస్కు చెందిన ఓ అధికారి హస్తం ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారంరోజుల కిందట ఐసీడీఎస్లో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగిపై ఆ అధికారి పెద్దగా అరుపులు, కేకలు వేశాడు. అంతటితో ఆగకుండా ఆమైపె వాటర్ బాటిల్ విసిరారు. తోటి ఉద్యోగుల ముందే దాడికి దిగడంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది. బెదిరిపోయి స్పృహకోల్పోవడంతో తోటి ఉద్యోగులు ఆస్పత్రిలో చేర్పించారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఐసీడీఎస్ అధికారులు విచారణ చేపట్టారు. ఐసీడీఎస్లో ఓ అధికారి వేధింపులతో హడిలిపోతున్న ఉద్యోగులు టీడీపీ నేత అండతో రెచ్చిపోతున్న అధికారి ఆయనకు నచ్చకుంటే గిరిజన ప్రాంతాలకు బదిలీ అధికారి వేధింపులు తట్టుకోలేక ఆస్పత్రిపాలైన ఓ మహిళా ఉద్యోగి -
తూనికల్లో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు
● అసిస్టెంట్ కంట్రోలర్ పి.వి. రంగారెడ్డి ● ఆకస్మిక తనిఖీల్లో 19 కేసుల నమోదు ● ఎలక్ట్రానిక్ కాటాల్లో భారీగా తేడాలు గుర్తింపుసాలూరు: కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి ఆదేశాల మేరకు సాలూరు పట్టణంలోని ప్రధాన వ్యాపార కేంద్రాల్లో తూనికలు/కొలతల శాఖ అధికారులు గురువారం మెరుపు దాడులు నిర్వహించారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల అసిస్టెంట్ కంట్రోలర్ పి.వి. రంగారెడ్డి నేతత్వంలో ఈ తనిఖీలు జరిగాయి. సాలూరు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న చేపల మార్కెట్, పెద్ద బజార్లోని చికెన్, మటన్, చేపల దుకాణాలు, కిరాణా షాపుల్లో అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో వెలుగులోకి వచ్చిన ఉల్లంఘనలు. ఎలక్ట్రానిక్ కాటాలపై మోసానికి సంబంధించి 8 కేసులు, నిర్ణీత కాల పరిమితిలో కాటాలకు ప్రభుత్వ ముద్రలు వేయించనందుకు 6 కేసులు నమోదు చేశారు. అలాగే ప్యాకెట్లపై తయారీదారు పేరు, చిరునామా, ధర, తయారీ తేదీ వంటి వివరాలు లేనందుకు 5 కేసులు నమోదు చేశారు. ఈ విధంగా ఒకే రోజులో వివిధ ఉల్లంఘనలపై మొత్తం 19 కేసులు నమోదయ్యాయి. వినియోగదారులను తూనికలు, కొలతల్లో మోసం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. వ్యాపారస్తులు తూనికలు, కొలతల్లో తేడాలు లేకుండా సరుకులు విక్రయించాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో పార్వతీపురం లీగల్ మెట్రాలజీ ఇనన్స్పెక్టర్ కె.రత్నరాజు, విజయనగరం ఇన్స్పెక్టర్ బి.ఉమా సుందరి ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
11న ఏపీ ఎన్జీజీఓఎస్ జిల్లా కమిటీ ఎన్నికలు
విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ మరియు గెజిటెడ్ అధికారుల సంఘం (ఏపీ ఎన్జీజీఓఎస్) జిల్లా నూతన కమిటీ ఎన్నికలు వచ్చేనెల 11వ తేదీన నిర్వహించనున్నట్టు సంఘ ఎన్నికల అధికారి ఎం.వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. ఎన్నికలకు డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎన్జీజీఓఎస్ అధ్యక్షుడు ఎం.వెంకటేశ్వర్లు ఎన్నికల అధికారిగా, అదే జిల్లా కార్యదర్శి కేపీవీఎన్బీ కృష్ణ అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్గా వ్యవహరించనున్నారని పేర్కొన్నారు. అమరావతికి చెందిన సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.శ్రీనివాసులు ఎన్నికల అబ్జర్వర్గా బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపారు. విజయనగరం జిల్లా కమిటీలో సుమారు 6,001 మంది ఉద్యోగులు సభ్యులుగా ఉండగా ఈ ఎన్నికల్లో 283 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారని చెప్పారు. జిల్లా అధ్యక్షుడు, జిల్లా కార్యదర్శి, కోశాధికారి, అసోసియేట్ ప్రెసిడెంట్, ఆర్గనైజింగ్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ, మహిళా వైస్ ప్రెసిడెంట్, ఆర్గనైజింగ్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ, మహిళా వైస్ ప్రెసిడెంట్, మహిళా జాయింట్ సెక్రటరీతో పాటు మొత్తం 17 పోస్టులకు ఎన్నికలు జరుగుతాయన్నారు. ఎన్నికలకు సంబంధించి ఈ నెల 30న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నామినేషన్లను స్వీకరిస్తామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం విజయనగరం ఏపీఎన్జీజీఓహోంలో జరుగుతుందని వెల్లడించారు. జిల్లాలోని అన్ని తాలూకాల నుంచి ఎన్నికై న ఆఫీస్ బేరర్స్, డీసీ, డీఈసీ, సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని ఎన్నికలను విజయవంతం చేయాలని కోరారు. గిరిప్రదక్షిణను విజయవంతం చేయండి ● రామతీర్థం సేవా పరిషత్ పిలుపు నేడు వీర్బాల్ దివస్ పార్వతీపురం: కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు వీర్బాల్ దివస్ను నిర్వహిస్తామని కలెక్టర్ డా.ఎన్, ప్రభాకరరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సీ్త్ర శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో సిబ్బంది అంతా పాల్గొనాలని కోరారు. బాలలనుద్దేశించి పీఎం నరేంద్ర మోదీ భారత్ మండపం, న్యూఢిల్లీ నుంచి ప్రసంగిస్తారన్నారు. -
దళారుల రాజ్యం.. రైతన్నకు నష్టం
ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు.. పోట్టి చిక్కుడు ధరలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. వారం రోజుల కిందట కిలో చిక్కుడు సుమారు రూ.60 ఉండగా, ఇప్పుడు రూ.25కు కొనుగోలు చేస్తున్నారు. ఈ ధరలు ఇలానే ఉంటే పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఏదైనా ఒక ధరను నిలకడగా ఉంచడం లేదు. మార్కెటింగ్ శాఖ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. రైతులు ఎవరితో చెప్పుకోవాలో తెలియడం లేదు. – చొక్కాపు రామారావు, రైతు, రామభద్రపురం నష్టపోతున్నాం.. ఆదుకోవాలి.. విత్తనాలు నాటి మొక్కవుతున్న సమయంలో తీవ్ర తుఫాన్ ప్రభావం వల్ల అధిక వర్షాలు కురవడంతో పంట పొలాల్లో నీరు నిల్వకు కొంత మేర పంటలు కుళ్లిపోయి నష్టాల బారిన పడ్డాం. అధిక పెట్టుబడులు పెట్టి ఏదోలా కొద్దో గొప్పో పంటలు కాపాడుకున్నా.. పంట చేతికొచ్చే సమయానికి వాతావరణం కలిసిరాక తెగుళ్లు, చీడపీడలు ఆశించి పంట దిగుబడులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. చేతికందిన కొద్దిపాటి పంటను మార్కెట్కు తెచ్చేసరికి ధరలు పూర్తిగా పతనమవుతున్నాయి. ఓ వైపు తుఫాన్లకు పంటపాడై నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పైసా పరిహారం అందజేయలేదు. ఇప్పుడు దళారులు పంటను దోపిడీ చేస్తున్నారు. కూరగాయ రైతుల మొరవినేవారే కరువయ్యారు. – పొందూరు శంకరరావు, రైతు రామభద్రపురం చిక్కుడు ధర పతనం వారం రోజుల కిందట కిలో ధర రూ.60, నేడు రూ.25 అదే కోవలో ఉల్లికాడల ధర దళారులే ధర నిర్ణీతలు నష్టాల బాటలో చిక్కుడు, ఉల్లికాడ రైతులు చోద్యం చూస్తున్న మార్కెటింగ్ శాఖ అధికారులు పెట్టుబడులు కూడా రావని రైతన్నల గగ్గోలు -
8 మద్యం సీసాలతో వ్యక్తి అరెస్టు
పూసపాటిరేగ: మండలంలోని పూసపాటిరేగ గ్రామంలో అనుమతి లేకుండా మద్యం అమ్మకాలు చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు భోగాపురం ఎకై ్సజ్ సీఐ రవికుమార్ గురువారం తెలియజేశారు. అనుమతిలేని షాపులో ఎనిమిది మద్యం సీసాలు ఉండడంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అనధికార మద్యం షాపు నిర్వహించినా, ప్రోత్సహించినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.అనధికార మద్యం షాపుల వద్ద మద్యం కొనుగోలు చేసిన వ్యక్తులపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆయనతో పాటు ఎస్సై చంద్రమోహన్, సిబ్బంది సత్యనారాయణ, ప్రతాప్ తదితరులు ఉన్నారు. -
● 108 కేజీల చిత్రాన్న నివేదన
జామి మండలం అన్నంరాజుపేట పంచాయతీ పుష్పగిరి వేణుగోపాలస్వామి ఆలయంలో ధనుర్మాస పవిత్రోత్సవాల్లో భాగంగా స్వామివారికి గురువారం తిరుప్పావడ (108 కేజీలు చిత్రాన్న నివేదన) సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఫణిహరం సీతరామాచార్యుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. గోదాదేవిని ఆలయ ప్రాంగణంలో పల్లకిలో ఊరేగింపు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రసాదవితరణ చేశారు. – జామి పుష్పగిరి వేణుగోపాలస్వామి ఆలయంలో చిత్రాన్ననివేదన -
కారు, లారీ ఢీకొని ఒకరి మృతి
పూసపాటిరేగ: మండలంలోని గుండపురెడ్డిపాలెం సమీపంలో జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని కారు వెనుక నుంచి ఢీకొనడంతో కారులో ఉన్న వ్యక్తి తీవ్రగాయాల పాలై చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం ప్రాంతానికి చెందిన పసుపులేటి దక్షిణామూర్తి (58) చీపురరుపల్లి నుంచి కారులో విశాఖపట్నం వెళ్తుండగా జీఆర్పాలెం సమీపంలో జాతీయరహదారిపై ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టడంతో కారులో ఉన్న దక్షిణామూర్తికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్చగా పరిస్థితి విషమించడంతో గురువారం మృతిచెందాడు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం జిల్లాకేంద్రాస్పత్రికి తరలించారు. ఈ మేరకు పూసపాటిరేగ ఎస్సై ఐ.దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పది ప్రణాళిక తీరుపై గుర్రు
విజయనగరం అర్బన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణ, ఉత్తమ ఫలితాల సాధన కోసం విద్యాశాఖ అమలు చేసిన 100 రోజుల ప్రణాళిక అమలు తీరు పలు విమర్శలకు దారితీస్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్న నియంతృత్వ పోకడలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఉపాధ్యాయులు గగ్గోలు పెడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడంపై టీచర్లు మండిపడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికే పదోతరగతి వార్షిక పరీక్షలను 2026 మార్చి 16వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో నూతనంగా అమలులోకి తీసుకొస్తున్న పరీక్షల నిర్వహణ విధానం తలనొప్పిగా మారిందనే విమర్శలు ఉపాధ్యాయుల నుంచి వస్తున్నాయి. పరీక్షల నిర్వహణలో పారదర్శకతకు పాతర పరీక్షల క్షేత్రస్థాయి విధులు నిర్వహించే ఇన్విజిలేటర్ నుంచి మూల్యాంకన ప్రక్రియ వరకు అన్ని స్థాయిలలోనూ విధులు కేటాయించే నిర్ణయాలు రాష్ట్రస్థాయి అధికారుల చేతుల్లోనే ప్రభుత్వం ఉంచింది. జిల్లా, క్షేత్రస్థాయి అధికారుల అధికారాలు, రూల్స్ ప్రివిలైజేషన్ ద్వారా సంక్రమించిన విధులు, బాధ్యతలను కూడా రాష్ట్రస్థాయి అధికారులకు ప్రభుత్వం హస్తగతం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ ఆలోచనలు మండల విద్యాశాఖ అధికారుల విధులు, బాధ్యతలను నిర్వీర్యం చేసేలా ఉన్నాయని వాపోతున్నారు. మరోవైపు ఇన్విజిలేటింగ్ విధుల కేటాయింపులో గందరగోళం తప్పదని తెలుస్తోంది. మండలానికి రెండు, మూడు పరీక్షా కేంద్రాలు ఉంటే ఆ కేంద్రాల పరిధిలో ఉన్న ప్రభుత్వ, జిల్లా పరిషత్, ప్రైవేట్ యాజమాన్యాల ఉన్నత పాఠశాలల విద్యార్థులు అవే కేంద్రాల్లో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో స్థానిక అధికారులు ఇన్విజిలేషన్ డ్యూటీలు, బాధ్యతలు వంటి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఆ విధానంలో కాకుండా ప్రభుత్వ తాజా ఆలోచనల ప్రకారం పాఠశాల విద్యాశాఖ కేంద్ర కార్యాలయమే నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్రస్థాయి అధికారులే ఇన్విజిలేషన్ విధులను కేటాయిస్తే పలుచోట్ల విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు బోధించిన పాఠశాల విద్యార్థులు ఒకే కేంద్రంలో ఉండే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణలో పారదర్శకతకు అవకాశం లేదని వాపోతున్నారు. ఇతర శాఖల పెత్తనం మరోవైపు 100 రోజుల ప్రణాళిక పర్యవేక్షణ ఉపాధ్యాయులకు గుదిబండలా తయారైంది. ఎన్నడూ లేని విధంగా విద్యాశాఖకు సంబంధం లేని ఇతర శాఖల మండలాల అధికారులను నియమించడం వారికి మింగుడు పడడం లేదు. ప్రతి మండలానికి రెవెన్యూ, వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్, ఎంపీడీఓ, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపాలిటీ, వ్యవసాయం, హౌసింగ్, ఇరిగేషన్, వశుసంవర్థక శాఖతో పాటు మరికొన్ని శాఖల అధికారులను పర్యవేక్షకులుగా నియమించాలని జిల్లా విద్యాశాఖకు ఆదేశాలు ఇచ్చారు. పర్యవేక్షకులు వారికి ఇష్టం వచ్చినప్పుడు ఆయా మండల పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వెళ్లి పదో తరగతి విద్యార్థులకు అమలు చేస్తున్న ప్రణాళికను పరిశీలిస్తారు. స్లిప్ టెస్ట్లు, పేపర్ల దిద్దుబాటు, మార్కులు సక్రమంగా వేశారా లేదా అన్న విషయాలతోపాటు ఉపాధ్యాయుల హాజరు పరిశీలిస్తారు. పరిశీలనకు వచ్చిన వారు అడిగిన తేదీకి సంబంధించిన పరీక్ష పేపర్లను వారి ముందు ఉంచాల్సి ఉంటుంది. షైనింగ్, రైజింగ్ స్టార్ల విభజన తెలియజేయాలి. సెలవు రోజుల్లో సైతం తరగతులు నిర్వహిస్తున్నారా? లేదా? అన్నది కూడా తనిఖీ చేస్తుంటారు. ఇందులో ఏమాత్రం తేడాలు గుర్తించినా సదరు ఉపాధ్యాయులపై చర్యలు తప్పవు. అయితే పేపర్ల దిద్దుబాటు, బోధన ఇతర విషయాలపై ఏ మాత్రం అవగాహన లేని ఇతర శాఖల అధికారులకు పెత్తనం ఇవ్వడంపై ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. -
సేవా పథంలో విద్యార్థి లోకం
● శ్రమదానంతో పాఠశాలల ప్రక్షాళనపార్వతీపురం రూరల్: సేవే పరమావధిగా..క్రమశిక్షణే ఆయుధంగా పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు సేవా పథంలో కదం దొక్కారు. మండలంలోని చినబొండపల్లి, ఎమ్మార్నగరం గ్రామాల్లో నిర్వహిహి స్తున్న ఎన్ఎస్ఎస్ 2,3 యూనిట్ల ప్రత్యేక శిబిరం బుధవారం నాటికి మూడో రోజుకు చేరుకుంది. స్వచ్ఛతే సంపద అనే నినాదంతో తెల్లవారుజామునే క్షేత్రస్థాయిలోకి వెళ్లిన వలంటీర్లు, స్థానిక ప్రాథమిక పాఠశాల ఆవరణలోని వ్యర్థాలను తొలగించి శ్రమదానంతో పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. అనంతరం విద్యార్థుల్లో ఏకాగ్రతను, మానసిక వికాసాన్ని పెంపొందించేందుకు శ్రీరాములు నాయుడు, లలిత్ కుమార్ ప్రత్యేకంగా నిర్వహించిన ధ్యాన తరగతులు విద్యార్థులకు మనోల్లాసాన్ని పంచాయి. మధ్యాహ్నం వేళ నిర్వహించిన రంగవల్లుల పోటీలు పల్లె ముంగిళ్లలో రంగుల హరివిల్లులను కురిపించి అందరినీ కట్టుకున్నాయి. సేవాభావం, సృజనాత్మకత కలగలిసిన ఈ కార్యక్రమాలను ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డి.తవిటినాయుడు, పీవీ సత్యానంద్ దగ్గరుండి పర్యవేక్షించి విద్యార్థులను సమన్వయ పరిచారు. -
పరిపాలన కేంద్రీకరణ ఆలోచనలు మానుకోవాలి
పాఠశాల విద్యలో పరిపాలన వికేంద్రీకరణకు అవకాశం ఉన్నప్పటికీ.. పరిపాలన కేంద్రీకరణ దిశగా నిర్ణయాలు ఉండడం బాధాకరం. పదోతరగతి పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలకు సిద్ధమవుతోంది. పరీక్ష నిర్వహణ, ఇన్విజిలేషన్, వాల్యుయేషన్ నియామకాలు కూడా రాష్ట్రస్థాయి నుంచే వచ్చే ఆదేశాలను అమలు చేయాలనే ఆలోచనలను వెనక్కి తీసుకోవాలి. మండల స్థాయి అధికారుల నిర్ణయాలను విజయవాడ కేంద్రంగా తీసుకుంటుండటం ఆశ్చర్యంగా ఉంది. –జే.సీ.రాజు, స్టేట్ అకడమిక్ కౌన్సిలర్, ఏపీటీఎఫ్ ● -
ఆధునిక కాలంలో ఎన్ని బ్యూటీ పార్లర్లు, ఫ్యాషన్స్ వచ్చినా మగువల్లో గోరింటాకు ముచ్చటే వేరు. స్నేహితులు, బంధువులతో పాటు చేతిపై ముగ్గులు వేసే నైపుణ్యం ఉన్నవారితో గోరింటాకు పెట్టించుకుని సంతోషపడతారు. దీనికి విజయనగరం సిమ్స్ బాప్టిస్టు చర్చి వద్ద గురువారం కనిపి
● గాడిదపాయిలో కందికొత్తల పండగ సీతంపేట మండలం గాడిదపాయి గ్రామంలో గురువారం కందికొత్తల పండగను గిరిజన ఆచార, సంప్రదాయాల ప్రకారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలో ఉన్న జాకరమ్మ దేవతకు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. చేతి‘కంది’న తొలి పంటతో చేసిన వంటకాలను నైవేద్యంగా సమర్పించారు. దేవతల ప్రతిరూపంగా ఛత్రమ్మ(నెమలి పించాలు)ను ఊరేగించారు. ఇంటింటికీ తీసుకెళ్లిన ఛత్రమ్మకు దూపదీప నైవేద్యాలతో పాటు కర్పూరహారతులు ఇచ్చారు. డప్పువాయిద్యాలతో ఆడ, మగ, చిన్నాపెద్దా తేడా లేకుండా నృత్యాలు చేశారు. ఐదురోజుల పండగలో చివరిరోజు దోనుబాయిలో గిరిజనులమంతా కలిసి పండగ చేసుకుంటామని, ఆ తర్వాత కందులతో తయారుచేసిన వంటకాలను భుజిస్తామని గాడిదపాయి వాసులు తెలిపారు. – సీతంపేట -
దివ్యాంగ విద్యార్థికి అరుదైన అవకాశం
● ఎవరెస్ట్ శిఖర అధిరోహణ శిక్షణకు ఎంపిక పూసపాటిరేగ : మండల కేంద్రానికి చెందిన దివ్యాంగ విద్యార్థి కందివలస సంతుకు అరుదైన అవకాశం వచ్చింది. ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం అధిరోహణకు ఇచ్చే బేస్ క్యాంప్ శిక్షణకు ఎంపికయ్యాడు. ఈ మేరకు బుధవారం ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని కోడిరాంమూర్తి క్రీడా ప్రాంగణంలో ఎవరెస్ట్ శిఖరం అధిరోహణ శిక్షణకు ఎంపికలు జరిగాయి. విశాఖపట్టణం, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ప్రత్యేక అవసరాలు పిల్లలకు ఎంపికలు జరిగాయి. పోటీలకు వందల సంఖ్యలో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రత్యేక అవసరాలు పిల్లలు హాజరయ్యారు. జిల్లా నుంచి పలువురు విద్యార్థులు పాల్గొనగా పూసపాటిరేగకు చెందిన కందివలస సంతు ఎవరెస్ట్ శిఖర అధిరోహణ శిక్షణకు ఎంపికయ్యారు. సంతు గత నెలలో జరిగిన పారా ఒలింపిక్స్ పోటీలలో రెండు బంగారు పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. సంతు పూసపాటిరేగ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సంతును కళాశాల ప్రిన్సిపాల్ ఎం.హనుమంతురావుతో పాటు అధ్యాపకులు, తోటి విద్యార్థులు అభినందించారు. కోచ్ మరియు ఎస్కార్ట్గా వ్యవహరించిన ప్రత్యేక ఉపాధ్యాయుడు ఎన్.బంగారునాయుడును పలువురు అభినందించారు. -
ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నగదు బ్యాగ్ మాయం
విజయనగరం క్రైమ్ : స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఇన్గేట్ వద్ద బుధవారం నగదుతో కూడిన బ్యాగ్ మాయమైంది. వివరాల్లోకి వెళ్తే.. సాలూరు నుంచి చిన్నమ్మ, రేవతి పండగ షాపింగ్కని విజయనగరం ఆర్టీసీలో బస్సులో వచ్చారు. బస్సు దిగిన ఇద్దరూ కాంప్లెక్స్ నుంచి నడుచుకుంటూ ఆటో కోసమని ఇన్గేట్ వద్ద ఆటో ఎక్కే లోపే గుర్తు తెలియని వ్యక్తులు బ్యాగ్ను కొట్టేశారు. బ్యాగ్లో ఇన్నర్ పాకెట్ జిప్ తీసేసి అందులోంచి రూ.10వేల నగదు తీసుకెళ్లిపోయారు. అక్కడే ఉన్న ట్రాఫిక్ సబ్ కంట్రోల్ రూమ్కు బాధితులు వెళ్లి ట్రాఫిక్ సీఐ సూరినాయుడుకు ఫిర్యాదు చేశారు. స్పందించిన తయన సబ్ కంట్రోల్ రూమ్లో రికార్డు అయిన సీసీ పుటేజ్ను పరిశీలించారు. ఇద్దరు మహిళలు తోటి ప్రయాణికుల వలే ఫిర్యాదుదారులతో కలిసి మాట్లాడే సమయంలోనే హ్యాండ్ బ్యాగ్ను తడిమి నగదు ఉన్నట్టు గుర్తించి బ్యాగ్ను ఎత్తుకెళ్లిపోయి ఉంటారని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. వన్టౌన్ పోలీస్స్టేషన్కు వెళ్లి బాధితులు చిన్నమ్మ, రేవతి ఫిర్యాదు చేశారు. ఎస్ఐ రవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వినియోగదారులకు చేరువగా కన్జ్యూమర్ కమిషన్
● వినియోగదారుల కమిషన్ చైర్మన్ ఆర్.వెంకట నాగసుందర్ విజయనగరం అర్బన్: వినియోగదారుల సౌకర్యార్థం కన్జ్యూమర్ కమిషన్ వినియోగదారులకు చేరువవుతుందని ఆ కమిషన్ చైర్మన్ ఆర్.వెంకట నాగసుందర్ పేర్కొన్నారు. ప్రభుత్వ సంస్కృత ఉన్నత పాఠశాల ఆవరణలో బుధవారం జరిగిన జాతీయ వినియోగదారుల దినోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు అన్యాయం జరిగినప్పుడు కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా భయం లేకుండా కన్జ్యూమర్ కమిషన్న్ను ఆశ్రయించవచ్చని తెలిపారు. వినియోగదారు సొంత ప్రాంతంలోనే కేసు దాఖలు చేసుకునే సౌకర్యం ఉందని, ఆఫిడవిట్ ద్వారా కూడా వ్యవహారం సాగుతుందని చెప్పారు. ఒరిజినల్ బిల్లులు లేకపోయినా ఫొటోస్టాట్ కాపీలతో కేసు నమోదు చేయవచ్చని, సాధారణంగా మూడు నెలల్లో కేసులు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. జేసీ ఎస్.సేతుమాధవన్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు స్కూల్ విద్యార్థులకు వినియోగదారుల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 18 నుండి 24వ తేదీ వరకు వినియోగదారుల వారోత్సవాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ–కామర్స్ కొనుగోళ్లలో ఉత్పత్తి వివరాలు, తయారీ తేదీ, గడువు తేదీ పరిశీలించాల్సిన అవసరాన్ని వివరించారు. ఫిర్యాదులను ఆన్లైన్, కన్జ్యూమర్ కమిషన్ లేదా పీజీఆర్ఎస్ ద్వారా చేయవచ్చన్నారు. కార్యక్రమంలో కమిషన్ సభ్యులు బి.శ్రీదేవి మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో వినియోగదారుడి పాత్ర కీలకమని అన్నారు. మరో సభ్యులు అశోక్కుమార్ శర్మ డిజిటల్ న్యాయ పాలనపై మాట్లాడుతూ, ఈ–జాగృతి యాప్ ద్వారా కోర్టుకు రాకుండానే కేసు ఫైల్ చేయవచ్చని, కొనుగోలులో కలిగే నష్టాన్ని నమోదు చేయవచ్చని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో బహుమతులు సాధించిన విద్యార్థులు వ్యాసరచనలో రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతి గంట్యాడ హైస్కూల్కు చెందిన వి.దీక్షిత, వక్తృత్వ పోటీలలో భోగాపురానికి చెందిన కళాశాల విద్యార్థిని కె.జయలక్ష్మి సాధించారు. వ్యాసరచన పోటీలలో గంట్యాడకు చెందిన కళాశాల విద్యార్థిని ఎ.ఝాన్సీలక్ష్మి రాష్ట్రస్థాయిలో రెండవ స్థానం, గంట్యాడకు చెందిన హైస్కూల్ విద్యార్థిని ఎన్.నిరీక్షణ రాష్ట్ర స్థాయిలో మూడవ స్థానం సాధించారు. వినియోగదారుల వారోత్సవాలలో భాగంగా నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో జిల్లా స్థాయిలో మొదటి మూడు బహుమతులు పొందిన 24 మంది విద్యార్థులకు ఈ సందర్భంగా అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డీఎస్ఓ మురళీనాథ్, డీవీఈఓ తవిటినాయుడు, సంస్కృత ఉన్నత పాఠశాల హెచ్ఎం లలితకుమారి, పలువురు వినియోగదారుల సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
26న సమైక్య తెలుగు దినోత్సవం
విజయనగరం: తెలుగు భాషా పరిరక్షణ సమితి, సమైక్య భారతి, అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతి సమితి సంయుక్తంగా ఈ నెల 26వ తేదీన సమైక్య తెలుగు దినోత్సవం నిర్వహిస్తున్నామని తెలుగు భాషా పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో గల మహాకవతి గురజాడ అప్పారావు స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆహ్వాన ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు సంస్మరణ నేపథ్యంలో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, ఏకపాత్రాభినయం పోటీలు, వందేమాతరం గేయానికి 150 ఏళ్ల నేపథ్యంలో వ్యాసరచన, వక్తృత్వ పోటీలను జిల్లా కేంద్రంలో వివిధ పాఠశాలల్లో ఇప్పటికే నిర్వహించామని తెలిపారు. విజేతలుగా నిలిచిన వందమంది విద్యార్థులకు 26న కేఎల్ పురంలోని గీతాంజలి పాఠశాలలో బహుమతి ప్రదానం చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న సాంస్కృతికోత్సవంలో లయ లాస్య డ్యాన్స్ అకాడమీకి చెందిన బెల్లాన రాజు నృత్య దర్శకత్వంలో విద్యార్థులు నృత్య ప్రదర్శన గావిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సమైక్య భారతి జాతీయ సమన్వయకర్త పి.కన్నయ్య, సమితి కార్యదర్శి డాక్టర్ జక్కు రామకృష్ణ, వాకర్స్ క్లబ్ డిప్యూటీ గవర్నర్ ముళ్ళపూడి సుభద్ర దేవి, విశ్రాంత ఉపాధ్యాయులు దేవరశెట్టి శ్రీరామమూర్తి, డిమ్స్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
బ్యానర్...
‘గంట్యాడ మండలం పెదవేమలి గ్రామానికి చెందిన సిరిపురపు తాతబాబు అనే రైతు 2024–25 రబీలో ఎకరన్నర పొలంలో పెసర పంట సాగు చేశాడు. ఇందుకు గాను బీమా ప్రీమియం రూ.500 చెల్లించాడు. ఇదే గ్రామానికి చెందిన ఎస్.రామునాయుడు అనే రైతు తనకు ఉన్న ఎకరం పొలంలో పెసరపంట వేశాడు. బీమా ప్రీమియం రూ.300 చెల్లించాడు. అకాల వర్షాలకు పంటకు నష్టం వాటిల్లినా రైతులకు పైసా పరిహారం అందలేదు.’ ఏడాదిగా బీమా పరిహారం అందజేయడంలో నిర్లక్ష్యం ఆవేదనలో రైతన్నలు 2024–25 రబీలో 31,208 ఎకరాల్లో అపరాలకు బీమా చేసిన రైతులు 27,158 మంది రైతులు రూ.1.7 కోట్లు బీమా ప్రీమియం చెల్లింపు ఎకరా పంట నష్టానికి రూ.20 వేలు పరిహారం అందుతుందన్న అధికారులు అకాల వర్షాలతో పెసర, మినుము పంటలు దెబ్బతిన్నా పట్టించుకోని వైనం -
శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి
సీతంపేట: విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని ఐటీడీఏ ఏపీఓ జి.చిన్నబాబు సూచించారు. సీతంపేట గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల ఆవరణలో బుధవారం నిర్వహించిన అన్వేష ఫెస్ట్ ముగింపు, బహుమతి ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడారు. 53 గిరిజన విద్యాసంస్థల నుంచి 292 ప్రాజెక్టులు ప్రదర్శించడం గర్వించదగ్గ విషయమన్నారు. భవిష్యత్తులో గిరిజన విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. సైన్స్ఫెస్ట్లో సీనియర్, జూనియర్ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 42 మంది విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ముగ్గురు ఉపాధ్యాయులకు టీచర్ మోడల్స్ను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ డీడీ అన్నదొర, డిప్యూటీఈఓ జి.రామ్మోహన్రావు, ఏటీడబ్ల్యూఓలు మల్లిఖార్జునరావు, సూర్యం, హెచ్ఎంలు టి.చంద్రరావు, పి.నారాయుడు, పి.కోటిబాబు, నల్లయ్య, వసంతకుమారి, జీసీడీఓ రాములమ్మ, సీఎంవో చిరంజీవులు, తదితరులు పాల్గొన్నారు. -
సంప్రదాయానికి ప్రతీక కందికొత్తలు
● రేపటి నుంచి ప్రారంభం కానున్న పండగ గుమ్మలక్ష్మీపురం: గిరిజనుల ఆచార సంప్రదాయాలను ప్రతిబింబింపజేసే పండగల్లో ప్రధానమైనది ‘కంది కొత్తల పండగ’. అన్ని వర్గాల ప్రజలు వైభవంగా జరుపుకునే వినాయకచవితి, దీపావళి, దసరా, సంక్రాంతి, ఉగాది తదితర పండగల తరహాలో మన్యం ప్రాంత గిరిజనులు ప్రతీ సంవత్సరం చివరి నైలెన డిసెంబర్లో ఈ కంది కొత్తల పండగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ పండగకు ఎంతటి ప్రాధాన్యముందంటే రెక్కలు ముక్కలు చేసుకొని కష్టించి పని చేసి కొండ పోడులో సాగు చేసిన పంటలైన కందులు, గంటెలు, జొన్నలు, రాగులు, కొర్రలతో పాటు దిగుబడొచ్చిన వరి పంటను ఈ పండగ పూర్తయితేగాని ఏ ఒక్క గిరిజనుడు ఆహారంగా తీసుకోరు. ఈ పంటలు చేతికి అందివచ్చిన సందర్భంగా ఎంతో సంతోషంగా గ్రామ దేవతలకు కంది కొత్తల పండగ పేరుతో భక్తిశ్రధ్ధలతో పూజలు చేస్తారు. అలాగే కొత్త పంట దినుసులను ఆరగిస్తారు. దీనిని బట్టి గిరిజనులు ఈ పండగను ఎంత ఆచారంగా నిర్వహిస్తారో అర్థం చేసుకోవచ్చు. కంది కొత్తల పండగ ప్రారంభం రోజూ అందరూ కొత్త బట్టలు ధరించి, మేళ తాళాలతో గ్రామదేవతకు పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారు. తరువాత రోజు నుంచి గ్రామ దేవత ప్రతి రూపంగా కొలిచే గొడ్డలమ్మ(గొడ్డలి), ఛత్తరమ్మ(నెమలి పింఛాలు)లను పరిసర గ్రామాల్లో ఊరేగిస్తూ ఆడా, మగా, చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా ఐక్యమత్యంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా సాంప్రదాయ రీతిలో థింసా నృత్యాలు చేస్తారు. రాత్రి, పగలు అన్న తేడా లేకుండా గిరిజన గ్రామాల్లో అందరూ ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. తమ జీవితాలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ వారం రోజుల పాటు ఈ పండగను నిర్వహిస్తారు. జన్నోడు, దీసరోడు, ఎజ్జోడుగా పిలువబడే పూజరి సూచనల మేరకు ఆయా గ్రామాల్లో ఈ పండగను నిర్వహిస్తారు. వీరి సూచనల మేరకే దేవతలుగా పిలుచుకునే గొడ్డలమ్మ, ఛత్తరమ్మలను గ్రామాల్లోకి తీసుకురావడం, పూజలు చేయడం, అనుపోత్సవాలు నిర్వహిస్తారు. ఈ నేపఽథ్యంలోనే ఈ ఏడాది కూడా ఈ పండగను ఈ నెల 26 నుంచి (శుక్రవారం) ఘనంగా నిర్వహించుకునేందుకు ఇరిడి, తాడికొండ, తోలుఖర్జ, మంగళాపురం, ఎగువ తాడికొండ, కొత్తగూడ, నేరేడుమానుగూడ తదితర గ్రామాల గిరిజనులు సన్నాహాలు చేస్తున్నారు. -
మర్యాదపూర్వక కలయిక
పార్వతీపురం: పార్వతీపురానికి వచ్చిన రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ను కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి, ఎస్పీ మాధవ్రెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనను దుశ్శాలువతో సత్కరించారు. కార్యక్రమంలో పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ ఉన్నారు. మానవేంద్రనాథ్రాయ్ గురువారం గరుగుబిల్లి మండలంలోని తోటపల్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న తరువాత గుమ్మలక్ష్మీపురం మండలంలో ని గొరడలో వావిలాల బాపూజీ స్మారక వ్యవసాయ విజ్ఞాన సమాచార కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్లో... మన్యం విద్యార్థుల ప్రతిభ పార్వతీపురం టౌన్/వీరఘట్టం: రాష్ట్రస్థాయి సైన్న్స్ ఫెయిర్లో పార్వతీపురం మన్యం జిల్లా విద్యార్థులు ప్రతిభ చూపారని జిల్లా సైన్స్అధికారి లక్ష్మణరావు తెలిపారు. ఈ నెల 23, 24 తేదీల్లో విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి విజ్ఞాన ప్రదర్శన పోటీ ల్లో జిల్లా నుంచి జాతీయ స్థాయికి ఒక ప్రాజెక్టు, సౌత్ ఇండియా స్థాయిలో రెండు ప్రాజెక్టులు ఎంపికయ్యాయన్నారు. నర్సిపురం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు రూపొందించిన గ్రామం ముస్తాబు–విజన్ ఫర్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు జాతీయ స్థాయికి ఎంపికై ందన్నారు. ఇదే ప్రాజెక్టు సౌత్ ఇండి యా లెవెల్లో ఎంపికై నట్లు తెలిపారు. ఎంపీయూపీ మొట్టవలస విద్యార్థులు రూపొందించిన టెస్టులేష న్ ప్రాజెక్టు సౌత్ ఇండియా స్థాయి పోటీలకు ఎంపి కై ందని వివరించారు. జాతీయస్థాయి పోటీలు మార్చినెలలో ఢిల్లీలో నిర్వహిస్తారని, సౌత్ ఇండి యా లెవెల్ పోటీలు జనవరి 19న హైదరాబాద్లో సాగుతాయని చెప్పారు. మన్యం జిల్లా విద్యార్థులను జిల్లా విద్యాశాఖ అధికారి బ్రహ్మాజీరావు అభినందించారు. ●వీరఘట్టం మండలలలోని ఎం.వి.పురం యూపీ పాఠశాలకు చెందిన గణిత ఉపాధ్యాయురాలు డి. సంతోషికుమారి రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్లో సత్తాచాటారు. ఆమె ప్రదర్శించిన ‘టెస్సలేషన్’ ప్రాజెక్టు జాతీయ స్థాయికి ఎంపికై ంది. ఆమెను పాఠశాల హెచ్ఎం వై.శ్రీనుబాబు, సర్పంచ్ పి.వెంకటరమ ణ, ఎంఈఓ ఆనందరావు, తహసీల్దార్ కామేశ్వరరా వు అభినందించారు. టెస్సలేషన్ ప్రాజెక్టు ఒక జ్యామితీయ కళ. దీని ఆధారంగా తక్కువ ఖర్చుతో బిల్డింగ్ కనస్ట్రక్షన్స్ చేయవచ్చని సంతోషికుమారి తెలిపారు. హైకోర్టు జడ్జికి మొక్కలను అందజేస్తున్న కలెక్టర్ ప్రభాకరరెడ్డి, ఎస్పీ మాధవ్ రెడ్డి -
ఉద్యాన పంటల విస్తీర్ణం పెంచాలి : కలెక్టర్
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో ఉద్యాన సాగు విస్తీర్ణం పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ రుపొందించినట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అన్నారు. కలెక్టరేట్లో వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులతో ఆయన బుధవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్సాహవంతులైన రైతులను మార్గదర్శకులుగా ఎంపిక చేయాలని సూచించారు. కార్యక్రమం అమలు చేయడానికి మండల స్థాయి అధికారులతో ఈ నెలఖారున ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి వి.తారకరామారావు, ఉద్యాన శాఖాధికారి చిట్టిబాబు, ఏపీఎంఐపీ పీడీ లక్ష్మీనారాయణ, విద్యుత్ శాఖ ఎస్ఈ మువ్వల లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. మట్టి తరలిస్తున్న టిప్పర్ లారీల పట్టివేత బొబ్బిలి రూరల్: ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా రాత్రి పూట చెరువుల్లో మట్టిని అక్రమంగా తవ్వి తరలిస్తున్న మట్టి లోడుతో ఉన్న నాలుగు టిప్పర్ లారీలను కలవరాయి గ్రామం వద్ద రెవెన్యూ శాఖ ఆర్ఐ రామకుమార్ పట్టుకున్నారు. తహసీల్దార్ శ్రీనుకు అందిన సమాచారం మేరకు మంగళవారం నిఘా పెట్టిన రెవెన్యూ వర్గాలు అర్థరాత్రి కాపుకాసి కలవరాయి గ్రామంలో చెరువు నుంచి బొబ్బిలి పట్టణ రియల్ ఎస్టేట్ వెంచర్కు టిప్పర్లతో మట్టిని తరలిస్తున్న నాలుగు టిప్పర్ లారీలను స్వాధీనం చేసుకుని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. మైనింగ్ శాఖ ఇచ్చిన గణాంకాల మేరకు మట్టి లోడును పరిశీలించి 50వేల రూపాయిల జరిమానా విధించారు. మొదటిసారి జరిమానాతో విడిచిపెడుతున్నామని, మరో మారు అక్రమంగా మట్టి, గ్రావెల్ తరలిస్తే కేసులు పెడతామని యజమానికి, కాంట్రాక్టర్ను తాహసీల్దార్ శ్రీను హెచ్చరించారు. -
24 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు
పాలకొండ: నగర పంచాయతీ పరిధిలోని కొండాపురం గ్రామ సమీపంలో పంచముఖ గాయత్రి దేవి ఆలయంలో మంగళవారం పట్టపగలు జరిగిన చోరీ కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. ఈ మేరకు సీఐ ప్రసాద్ బుధవారం ఇందుకు సంబందించిన వివరాలను విలేకరుల సమావేశంలో వివరించారు. నగర పంచాయతీలోని సుందరయ్యనగర్ (భుట్టిమఠం) కాలనీకి చెందిన భార్యాభర్తలు పసల చిన్నారావు (22), బమ్మిటి దుర్గా (20) మంగళవారం ఉదయం గాయత్రి దేవి ఆలయంలో దర్శనం కోసం వెళ్లారు. అ సమయంలో అర్చకులు అక్కడ లేకపోవడంతో అమ్మవారి గర్భగుడిలో ప్రవేశించి అమ్మవారి మంగళ సూత్రాలు, కళ్లు, ముక్కుపుడక తస్కరించి అక్కడ నుంచి జారుకున్నారు. అర్చకులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై కేసు నమోదు చేసిన ఎస్సై ప్రయోగమూర్తి రెండు బృందాలను ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించారు. బుధవారం వీరిని వాహన తనిఖీల సమయంలో పట్టుకున్నారని తెలిపారు. నిందితుడు చిన్నారావుపై ఇప్పటికే పోక్సో కేసు నమోదైందని వివరించారు. నిందితులు చోరీ చేసిన 24గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామని వివరించారు. కేసును ఛేదించడంలో సిబ్బంది కృషిని సీఐ అభినందించారు. ఆయనతో పాటు ఎస్సై ప్రయోగమూర్తి, ట్రైనీ ఎస్సై హేమలత ఉన్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రజలు పండగ సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సెలవులకు ఇంటికి తాళం వేసి వెళ్తే బంగారు ఆభరణాలు లాకర్లో పెట్టుకోవాలని, పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. -
యువకుని అదృశ్యంపై కేసు నమోదు
తెర్లాం: యువకుని అదృశ్యంపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ సాగర్బాబు బుధవారం తెలిపారు. మండలంలోని అంట్లవార గ్రామానికి చెందిన ముడిదాన హరి అనే యువకుడు ఇంటి నుంచి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని అతని తండ్రి ముడిదాన పైడితల్లి స్థాని క పోలీస్స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశా డని తెలిపారు. అతని ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. పోక్సో కేసులో నిందితుడు.. తెర్లాం పోలీస్స్టేషన్లో నమోదైన అదృశ్యం కేసుకు సంబంధించి మండలంలోని అంట్లవార గ్రామానికి చెందిన ముడిదాన హరి పోక్సో కేసులో నిందితునిగా ఉన్నాడు. అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేయడంతో 2025 ఫిబ్రవరిలో పోక్సో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉంది. పొరపాటున గడ్డి మందు కలిసిన నీళ్లు తాగి రైతు మృతి పాచిపెంట : పొరపాటున గడ్డి మందు కలిసిన నీళ్లు తాగిన ఓ రైతు చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఈ విషయంపై పోలీసులు తెలిపిన వివరాలు.. సాలూరు మండలం కందులపదం గ్రామానికి చెందిన శెట్టి బాబ్జి అనే రైతు పాచిపెంట మండలం గడివలస సమీపంలో 27 ఎకరాల భూమిని లీజుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఈ నెల మూడవ తేదీన పొలంలో గడ్డిని చంపడానికి గడ్డి మందు పిచికారి చేసే సమయంలో గడ్డి మందు కలిపిన ప్లాస్టిక్ డబ్బాలో పొరపాటున గడ్డి మందు లేదనుకొని అదే ప్లాస్టిక్ డబ్బాతో పక్కన డ్రమ్ములో ఉన్న నీటిని తీసుకొని సేవించాడు. అలా సేవించిన కొంత సమయానికి వాంతులు విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే స్థానికులు సాలూరులో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లగా వైద్య పరీక్షల అనంతరం శరీరంలో పాయిజన్ ఉన్నట్టు గుర్తించారు. వెంటనే అక్కడి నుంచి విజయనగరం తరువాత విశాఖపట్నం తీసుకువెళ్లి పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. చివరకు కేజీహెచ్లో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. భార్య సూర్యలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై వెంకట్ సురేష్ తెలిపారు. -
వివాహిత ఆత్మహత్య
పూసపాటిరేగ : మండలంలోని ఎరుకొండ గ్రామంలో అత్తింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఉరి వేసుకొని మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. పోలీసులు, మృతురాలు బంధువుల కథనం మేరకు పూసపాటిరేగ ఎస్పీ కాలనీకి చెందిన పాండ్రికి పుష్ప(19)కి ఎరుకొండ గ్రామానికి చెందిన శొంఠ్యాన శివతో మూడు నెలలు క్రితం వివాహం జరిగింది. వివాహ సయంలో శివ కుటుంబ సభ్యులు రూ.3 లక్షలు అదనపు కట్నం కోసం డిమాండు చేయడంతో ఇరువురు గ్రామాల పెద్దలు సర్ది చెప్పి అత్త వారింటికి పుష్పను కాపురానికి పంపించారు. అప్పటి నుంచి పుష్పను అత్తవారు వేధించడంతో మంగళవారం ఇంట్లో ఉరి వేసుకొని మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సుందరపేట ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా అత్తింటి వారి వేధింపులు తాళలేకే తమ కుమార్తె మృతి చెందిందని తల్లి పాండ్రంకి రమ కన్నీరుమున్నీరయ్యారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఐ.దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆదివాసీ కుటుంబంపై రాజకీయ కక్ష
మాసగూడలో జేసీబీతో తమపూరిపాక ముందు పునాదుల తవ్విన చోట విలపిస్తున్న ఆదివాసీ కుటుంబం భామిని: మండలంలోని మాసగూడలో నిరుపేద ఆదివాసీ గిరిజన కుటుంబంపై అదే గ్రామానికి చెందిన కూటమి నాయకుడు కక్షగట్టాడు. గత ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాన్ని లాక్కుని అంగన్వాడీ కేంద్ర నిర్మాణానికి పూనుకున్నాడు. దీంతో దివ్యాంగుడైన బిడ్డిక ఈనత్తు, భార్య లక్ష్మి దంపతులతో పాటు ముగ్గురు కుమారులు వీధినపడ్డారు. బిడ్డిక లక్ష్మిపేరున గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇంటి స్థలాన్ని మంజూరు చేసింది. అందులో పూరిపాక వేసుకుని గిరిజన కుటుంబం నివసిస్తోంది. కొత్తగా కేంద్ర ప్రభుత్వం అమలుచేసిన పీఎం జన్మాన్ పథకంలో పక్కాగృహం మంజూరైందని హౌసింగ్ అధికారులు చెప్పడంతో ఇంటి నిర్మాణం కోసం రాళ్లుకూడా తెప్పించుకున్నారు. ఇది చూసిన కూటమి నాయకుడు కక్ష పెంచుకున్నాడు. వారు నివసిస్తున్న పూరిపాక స్థలంలో కొత్తగా వచ్చిన మినీ అంగన్వాడీ భవనం నిర్మాణం పేరున జేసీబీతో బుధవారం పునాదులు తవ్వించారు. వాస్తవంగా అంగన్వాడీ భవన నిర్మాణానికి వేరే దగ్గర పొజిషన్సర్టిఫికేట్ను కూడా అధికారులు ఇచ్చారు. అయితే, దివ్యాంగుడి కుటుంబంపై ప్రతీకారంతో అధికారులపై వత్తిడి తెచ్చి మరీ గత ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలంలో అంగన్వాడీ కేంద్రం నిర్మాణం తలపెట్టడంపై బాధిత కుటుంబంతో పాటు గిరిజన సంఘాల నాయకులు తప్పుబడుతున్నారు. ఈ విషయాన్ని ఐటీడీఏ పీఓ దృష్టికి తీసుకెళ్తామని బాధితులు తెలిపారు. జగనన్న ఇచ్చిన ఇంటి స్థలంలో అంగన్వాడీ కేంద్రానికి పునాది వీధిన పడిన దివ్యాంగుడి కుటుంబం -
క్రాస్ కంట్రీ పరుగు పోటీలో జిల్లాకు పతకాలు
● 24 నుంచి రాంచీలో జరగనున్న జాతీయ పోటీలకు అర్హత విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరిగిన క్రాస్ కంట్రీ పరుగు పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు సత్తా చాటారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో గల ఎంఆర్ కళాశాలలో జరిగిన పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన ముగ్గురు క్రీడాకారులు పతకాలు దక్కించుకున్నారు. అంతేకాకుండా ఈ నెల 24 నుంచి రాంచీలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయిలో జరిగిన పోటీల్లో హరీష్ 10 కిలోమీటర్ల పరుగు పోటీలు బంగారు పతకం కై వసం చేసుకోగా... నిరంజన్ 6 కిలోమీటర్ల పరుగులో మరో బంగారు పతకాన్ని చేజిక్కించుకున్నారు. అంతేకాకుండా మహిళల విభాగంలో మహాలక్ష్మి 4 కిలోమీటర్ల విభాగంలో మరో బంగారు పతకంతో నిలిచారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచటంతో పాటు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులను జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు లీలాకృష్ణ, కార్యదర్శి శ్రీకాంత్, కోశాధికారి ఆనంద్కిషోర్లు అభినందించారు. -
● జిల్లాలో జలపాతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు యంత్రాంగం చర్యలు ● కనీస సౌకర్యాలు, రక్షణ శూన్యం ● వెళ్లేందుకు రహదారీ కరువే
దళాయివలస జలపాతం ఆనందం వెంటే.. ప్రమాదం సాక్షి, పార్వతీపురం మన్యం : జిల్లాలో సహజ వనరులకు కొదవ లేదు. కొండకోనలు, జాలువారే జలాపాతాలతో ఆహ్లాదం పంచుతుంది. వీటిని సద్వినియోగం చేసుకుంటే.. జిల్లాను పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చేయవచ్చు. గత కలెక్టర్ శ్యామ్ప్రసాద్, ప్రస్తుత కలెక్టర్ ప్రభాకరరెడ్డి.. జిల్లా పర్యాటక అభివృద్ధిపై దృష్టి సారించారు. అందులో భాగంగా బాహ్య ప్రపంచానికి తెలియని జలపాతాలను వినియోగంలోకి తీసుకురావాలని సంకల్పించారు. ప్రస్తుత కలెక్టర్ ప్రభాకరరెడ్డి ఈ విషయంలో ఒక అడుగు ముందే ఉన్నారు. బాధ్యతలు స్వీకరించినది మొదలు.. జిల్లాలో ఉన్న జలపాతాలను వెలికి తీసి.. పర్యాటకులను ఆహ్వానిస్తున్నారు. జిల్లాలోని సీతంపేట, సాలూరు, పాచిపెంట, కురుపాం, గుమ్మలక్ష్మీపురం తదితర మండలాల్లో దండిగాం, దళాయివలస, సున్నపుగెడ్డ, మెట్టుగూడ, మల్లి, బెనరాయి, తాడికొండ, శిఖపరువు, కురుకుట్టి, లొద్ద, తోణాం వంటి ప్రధాన జలపాతాలు 20 వరకు ఉన్నాయి. కొండలు, గుట్టలతో ఆ ప్రాంతాలు చూపురులకు కొత్త అనుభూతిని ఇస్తున్నాయి. పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. పిక్నిక్ల సమయంలో ఈ కేంద్రాలన్నీ కిటకిటలాడుతాయి. వీటిని వినియోగంలోకి తీసుకురావాలన్న సంకల్పం మంచిదే అయి నా.. అక్కడికి వెళ్లేందుకు సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో చేసే ప్రయత్నాలన్నీ వృథాగా మారే పరిస్థితి కనిపిస్తోంది. అటవీశాఖ అనుమతులున్నవెన్ని? అటవీశాఖ పరిధిలోని ఏ ప్రాంతంలోనైనా పర్యాటకంగానూ, ఇతర పనులు చేపట్టాలన్నా ఆ శాఖ అనుమతి తప్పనిసరి. జిల్లాలో జలపాతాల గుర్తింపు, అభివృద్ధి అంటూ హడావిడి చేస్తున్న యంత్రాంగం.. అటవీశాఖ అనుమతులు లేకుండానే చాలా వరకు పనులు చేపట్టేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటవీశాఖ ఆధ్వ ర్యంలో సున్నపుగెడ్డ వద్ద జలపాతానికి రూ.20 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఆర్చ్ ఏర్పాటు చేశారు. ఇంకొంత పనులున్నాయి. మిగిలిన ఎక్క డా ఆ శాఖ కనీస అనుమతులు కూడా లేనట్లు తెలుస్తోంది. సంబంధం లేని డీఆర్డీఏ శాఖను ఇందులో భాగస్వామ్యం చేయడం విమర్శలకు తావిస్తోంది. ●ఎకో టూరిజం ప్రకారం ఎకో డెవలప్మెంట్ కమిటీని ఏర్పాటు చేయాలి. స్థానికులకే శిక్షణ ఇచ్చి గైడ్స్గా నియమించాలి. పర్యాటకుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని వారికి జీతాలు, అక్కడ సౌకర్యాల కల్పనకు వెచ్చిస్తారు. కొండకోనల ప్రాంతంలో జంతువులు సంచరించే అవకాశం ఉంటుంది. తగిన హెచ్చరిక, రక్షణ చర్యలు తీసుకోవాలి. జలాపాతాల వద్ద ప్రమాదకర పరిస్థితులు ఉంటాయి. కనీస నిబంధనలు పాటించాలి. చాలా వరకు జలాపాతాల వద్ద ఇవేవీ అమలు కావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ●దళాయివలస, శిఖపరువు వద్ద టికెట్ పెట్టి మనిషి వద్ద రూ.10 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇది ఎవరి ఖాతాలోకి వెళ్తుందో తెలియడం లేదు. రామభద్రపురం మండలానికి చెందిన హరిబాలకృష్ణ అనే యువకుడు స్నేహితులతో కలసి ఈ నెల 7వ తేదీన సాలూరు మండలం దళాయివలస వద్దనున్న జలపాతానికి వచ్చాడు. రోజంతా సరదాగా గడిపాడు. అక్కడ ఈత కొడుతూ నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. గతంలో దోనుబాయి జలపాతం వద్ద గల ఊటకుంటలో పడి ఓ పర్యాటకుడు ప్రాణాలు వదిలాడు. మెట్టగూడ వద్ద ఓ ఆశ్రమ పాఠశాల విద్యార్థి జారిపడి, తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. శిఖపరువు వద్ద గతంలో పలు ప్రమాదాలు జరిగాయి. రాళ్ల మీద పడి గాయాలపాలైన వారు అనేక మంది ఉన్నారు. ఇవి కొన్ని ఘటనలు మాత్రమే. జలాపాతాల వద్ద పర్యాటకుల భద్రత, రక్షణకు యంత్రాంగం తీసుకున్న చర్యలు శూన్యం. ముఖ్యంగా యువత మద్యం మత్తులో ప్రమాదాల బారిన పడుతున్నారు. కొంతమంది మృత్యుఒడిలోకి చేరుకుంటున్నారు. ఆహ్లాదం వెంటే ప్రమాదం కూడా పొంచి ఉంది. యువత, పిల్లలు జలకాలాడుతూ, పై నుంచి రాళ్ల ద్వారా కిందకు జారుతున్నారు. ఈ సమయంలో గాయాలపాలవుతున్నారు. యువత ఎక్కువగా మద్యం మత్తులోనే ఉంటారని స్థానికులు చెబుతుంటారు. తాగిన మత్తులో ప్రమాదకర ప్రాంతంలోకి ఈతకు దిగి, మునిగిపోయిన సందర్భాలు అనేకం. ఇవేకాక.. జంఝావతి రబ్బర్ డ్యాం, తోటపల్లి ప్రాజెక్టు వద్ద కూడా పర్యాటకులు ఎక్కువగా ఉంటారు. జంఝావతి రబ్బర్డ్యాం వద్ద ఇటీవలే విహార యాత్రకు వెళ్లి ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. జలపాతాలు, ప్రాజెక్టుల వద్ద కనీస రక్షణ చర్యలు ఉండటం లేదు. హెచ్చరిక బోర్డులు పెట్టినా.. యువత వినిపించుకునే పరిస్థితి లేదు. సాలూరు మండలంలోని లొద్ద జలపాతం అద్భుతంగా ఉన్నా అక్కడకు వెళ్లేందుకు రోడ్డు లేదు. గత ఏడాది అక్టోబర్లో సుమారు నాలుగు కిలోమీటర్ల మేర రహదారి పనులు ప్రారంభించినా నేటికీ పూర్తి కాలేదు. సందర్శకులకు మట్టి రోడ్డే దిక్కవుతోంది. ప్రస్తుత కలెక్టర్, గత కలెక్టర్ కూడా ఈ మట్టి రోడ్డు మీదే వెళ్లారు. కురుకుట్టి జలపాతానికి కూడా రహదారి సౌక ర్యం లేదు. సుమారు రెండు కిలోమీటర్ల దూరం పొలాల మధ్య నుంచి వెళ్లాలి. దండిగాం వద్ద గతంలో పవర్ ప్రాజెక్టు మంజూరు అయ్యింది. తర్వాత అది రద్దు అయ్యింది. ఆ సమయంలో కొంత అభివృద్ధి చేసి వదిలేశారు. దండిగాం గ్రామం నుంచి వందమీటర్లు నడిస్తే జలపాతం వస్తుంది. దానిని కూడా అభివృద్ధి చేయకుండా వదిలేశారు. దళాయివలస ప్రాంతంలో గిరిజనులు సొంతంగా ముందుకొచ్చి, వెదురుతో నిర్మాణాలు చేశారు. దుకాణాలు పెట్టారు. ప్రభుత్వం నుంచి రూపాయి కూడా ఇవ్వలేదు. వారు సొంతంగా చేసుకున్న దానికి ప్రస్తుత ప్రజాప్రతినిధులు, అధికారులు వచ్చి రిబ్బన్ కట్ చేసి తమ గొప్పగా చెప్పుకోవడాన్ని చూసి అక్కడివారు ఆశ్చర్యపోయారు. రెండున్నర కిలోమీటర్ల మేర రోడ్డు వేస్తే.. సందర్శకులకు సౌకర్యంగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న మట్టి రోడ్డును కూడా అక్కడి గ్రామస్తులే వేసుకోవడం గమనార్హం. జిల్లాలోని కురుపాం, గుమ్మలక్ష్మీపురం, సీతంపేట ప్రాంతాల్లో ఉన్న జలపాతాలదీ ఇదే పరిస్థితి. -
భూసేకరణకు తొలి ప్రాధాన్యం
● అభివృద్ధి పనుల సమీక్ష సమావేశంలో కలెక్టర్ రాంసుందర్ రెడ్డి విజయనగరం అర్బన్: జిల్లాలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం చేపట్టిన భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం, తోటపల్లి, తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టులు, జాతీయ రహదారి–516 (బీ), కుర్దారోడ్–విజయనగరం మూడో రైల్వే లైన్, విజయనగరం–సంబల్పూల్ మూడో రైల్వే లైన్, కొత్తవలస–విజయనగరం నాలుగో రైల్వే లైన్ వంటి కీలక ప్రాజెక్టుల భూసేకరణపై ఆరా తీశారు. సమావేశంలో జేసీ ఎస్.సేతుమాధవన్, డీఆర్వో ఇ.మురళీ, ఆర్డీఓ దాట్ల కీర్తి, సత్యవాణి, రామ్మోహన్, ఎస్డీసీలు కళావతి, ప్రమీలాగాంధీ, ఏపీ ఈపీడీసీఎల్ ఎస్ఈ లక్ష్మణరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కవిత, ఇరిగేషన్ ఈఈ వెంకటరమణ, రైల్వే, తదితర శాఖల అధికారులు, ఎల్ఏ డీటీలు పాల్గొన్నారు. -
104 ఉద్యోగుల ఆందోళన బాట
● ‘భవ్య’తో మాకు భవిష్యత్తు లేదంటూ ఆవేదన ● సెలవుపెడితే వేతనంలో కోత విధిస్తున్నారు.. ● సమస్యలు చెబితే సస్పెండ్ చేస్తామని బెదిరింపులు ● సామూహిక సెలవు పెట్టి ఆందోళనకు దిగిన ఉద్యోగులు ● వేధింపులు ఆపాలని డిమాండ్ విజయనగరం ఫోర్ట్: పల్లె ప్రజలకు వైద్యసేవలందించే 104 వాహన సేవలపై చంద్రబాబు ప్రభుత్వం కినుకవహిస్తోంది. వాహనాల్లో పనిచేసే ఉద్యోగులను సమస్యల వలయంలోకి నెట్టేసింది. అరకొర వేతనాలు, సెలవు పెడితే జీతాల్లో కోతవేయడం, సమస్యలు చెప్పుకునే దారిలేకపోవడం, ప్రశ్నించే ఉద్యోగులను ఆకారణంగా తొలగించడం, బెదిరించడంపై ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. సామూహికంగా సెలవుపెట్టి ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ వద్ద టెంట్ వేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉద్యోగభద్రత కల్పించాలంటూ డిమాండ్ చేశారు. గతంలో 108, 104 వాహనాల నిర్వాహణ బాధ్యతలను అరబిందో కంపెనీ నిర్వహించేది. ఆ బాధ్యతలను ఏడునెలల కిందట భవ్య అనే సంస్థకు చంద్రబాబు సర్కారు అప్పగించింది. అప్పటి నుంచి వేధింపులు ఎక్కువయ్యాయంటూ ఉద్యోగులు చెబుతున్నారు. సమస్యలను ప్రస్తావించినా ఉద్యోగులపై వేటు వేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పల్లెలకు వెళ్లి ప్రజలకు మెరుగైన వైద్యసేవలందిస్తున్న సిబ్బందిని పురుగుల్లా చూస్తున్నారని వాపోతున్నారు. వేధింపులు ఆపాలి... 104 ఉద్యోగులకు సమస్యలు ఉన్నాయని, అధికారులకు విన్నవించించేందుకు వీలులేని విధంగా భవ్య సంస్థ వ్యవహరిస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యోగుల సమస్యలపై ఆరోగ్యశ్రీ అడిషనల్ సీఈఓకు వినతి పత్రం ఇచ్చారని రాంబాబు అనే ఉద్యోగిని సస్పెండ్ చేశారన్నారు. జిల్లాలో 104 వాహనాలు 46 ఉన్నాయి. ఇందులో డ్రైవర్లు 48 మంది, డీఈఓలు 47 మంది పనిచేస్తున్నారు. వీరిలో ఏ ఉద్యోగి కూడా సెలవు మంజూరు చేయకపోవడంపై మండిపడుతున్నారు. గతంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి చూడలేదన్నారు. ఏడు నెలల కాలంలోనే ... కనీస వేతనం ఇవ్వడంలేదని, అదనపు బాధ్యతలు అప్పగించి ఒత్తిడికి గురిచేస్తున్నారని, అనారోగ్యంతో సెలవు పెట్టినా జీతంలో కోత విధిస్తున్నారని చెబుతున్నారు. -
సీనియర్స్ ఖోఖో పోటీలకు జిల్లా జట్లు పయనం
● 24 నుంచి గుడివాడలో జరగనున్న మహిళ, పురుషుల పోటీలు విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరగనున్న సీనియర్స్ మహిళ, పురుషుల ఖోఖో పోటీలకు జిల్లా జట్లు మంగళవారం పయనమయ్యాయి. ఈ నెల 24 నుంచి 26 వరకు గుడివాడలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ సీనియర్ అంతర్ జిల్లాల ఖోఖో పోటీలు జరగనున్నాయి. జిల్లా జట్లు పోటీలకు బయలుదేరి వెళ్తున్న సందర్భంగా డిగ్రీ కాలేజీలో కోచింగ్ క్యాంప్ ముగించుకొని కిట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పురుషుల జట్టుకు వజ్రపు శ్రీనివాసరావు, అదే విధంగా మహిళల జట్టుకు సత్య డిగ్రీ కళాశాల యాజమాన్యం కీడా దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షులు ఏఎంఎన్ కమలనాభరావు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారులు ఉత్తమ ప్రదర్శనతో విజేతలుగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. సత్య డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సత్యవేణి, జిల్లా ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.గోపాల్, ఉపాధ్యక్షుడు రామారావు, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఏవీ?
భవ్య సంస్థ నిర్వహణ బాధ్యత చేపట్టి ఏడు నెలలైంది. ఇంతవరకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఏ ఉద్యోగికి ఇవ్వలేదు. పే స్లిప్పులు లేవు. సెలవుకూడా ఇవ్వడం లేదు. ఒక వేళ సెలవు ఇస్తే వేతనంలో కోత విధిస్తున్నారు. బఫర్ ఉద్యోగులను తగ్గించడం వల్ల సెలవులు లేక ఇబ్బంది పడుతున్నాం. అరబిందో సంస్థ ఇచ్చిన జీతం కంటే పెంచాల్సింది పోయి, జీతం తగ్గించి ఇస్తున్నారు. ఆ సంస్థతో వేగలేం. – ఎ.రామరాజు, 104 ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సమస్యలు చెబితే బెదిరింపులా? ఉద్యోగుల సమస్యలు అధికారులకు చెబితే ఉద్యోగులను సస్పెండ్ చేస్తామని భవ్య సంస్థ ప్రతినిధులు బెదిరిస్తున్నారు. ఆరోగ్యశ్రీ అడిషనల్ సీఈఓకు వినతిపత్రం ఇచ్చారని రాష్ట్ర కార్యదర్శి రాంబాబును అకారణంగా సస్పెండ్ చేశారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లతో ఫార్మాసిస్టులు, స్టాఫ్నర్సుల చేయాల్సిన విధులు చేయిస్తున్నారు. ఐదేళ్లు పూర్తయిన డ్రైవర్లకు రూ.21 వేలు జీతం చెల్లించాలన్న నిబంధన అమలుచేయలేదు. – డి.జగన్మోహన్, 104 ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి -
ఆలయాల్లో హుండీల చోరీని చేధించిన పోలీసులు
● నిందితుడి నుంచి రూ.42,135 స్వాధీనం ● సబ్బవరం స్టేషన్ పరిధిలో మరో చోరీకి పాల్పడిన నిందితుడు వేపాడ: మండలంలోని బానాది గ్రామంలో ఐదు ఆలయాల్లో జరిగిన చోరీని వల్లంపూడి ఎస్ఐ సుదర్శన్ నేతృత్వంలో సిబ్బంది హుంఽడీల చోరీని చేధించినట్టు ఎస్.కోట రూరల్ సీఐ అప్పలనాయుడు తెలిపారు. స్థానిక వల్లంపూడి పోలీసుస్టేషన్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడారు. పోలీసులకు మంగళవారం వచ్చిన సమాచారం మేరకు కె.ఆర్.పేట జంక్షన్లో చోరీకి సంబంధించి పెందుర్తి గ్రామానికి చెందిన పెందుర్తి నాగరాజుగా గుర్తించిన పోలీసులు నిందితుని వద్ద రూ.42,135ల నగదు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఈ నెల 13న బానాదిలో వినాయక ఆలయం, శివాలయం, ఆంజనేయస్వామి, పరదేశమ్మ, మరిడిమాంబ ఆలయాల్లో తాళాలు పగులకొట్టి హుండీల్లో సోమ్ము చోరీకి గురైన సంగతి పాఠకులకు విదితమే. దీనిపై ఎస్ఐ సుదర్శన్ సిబ్బందితో కలసి నిందితుడు నాగరాజును పట్టుకున్నట్టు చెప్పారు.ఐదు ఆలయాల్లో చోరీకి పాల్పడిన సొమ్ము రూ.42,135లు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నట్టు సీఐ తెలిపారు. సబ్బవరం పోలీసుస్టేషన్ పరిధిలో ఈ నెల 10వ తేదీ రాత్రి ఓ ఆలయంలో చోరీకి పాల్పడి 10,170 రూపాయలు చోరీ చేసినట్టు నిందితుడు చెప్పినట్టు సీఐ అప్పలనాయుడు తెలిపారు. కార్యక్రమంలో వల్లంపూడి ఎస్ఐ ఎస్.సుదర్శన్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. -
కానిస్టేబుల్కు బ్రాంజ్ మెడల్
విజయనగరం క్రైమ్ : జాతీయ స్థాయి తైక్వాండో చాంపియన్ షిప్లో బ్రాంజ్ మెడల్ సాధించిన విజయనగరం ట్రాఫిక్ పోలీస్స్టేసన్ కానిస్టేబుల్ బీఎస్ఎన్ మూర్తిని ఎస్పీ దామోదర్ తన చాంబర్లో మంగళవారం అభినందించారు. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఈ నెల 12 నుంచి 14 వరకు 14 జాతీయ స్థాయి సీనియర్ పూమ్సే తైక్వాండో చాంపియన్షిప్ పోటీలు జరిగాయి. ఇందులో మూర్తి జిల్లా పోలీసు విభాగం తరఫున పాల్గొన్నారు. మూర్తిని అభినందించిన ఎస్పీ భవిష్యత్లో మరింతగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ సూరినాయుడు, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి జూడో పోటీల్లో జిల్లాకు పతకాలు విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరిగిన క్యాడిట్, జూనియర్స్ జూడో పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు సత్తా చాటారు. ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు కర్నూలు జిల్లాలో జరిగిన పోటీల్లో జిల్లా క్రీడాకారులు మొత్తంగా పది పతకాలు సాధించారు. మూడు రోజుల పాటు జరిగిన పోటీల్లో దుర్గ బంగారు పతకం దక్కించుకోగా... ప్రవల్లిక, ప్రణిత, యశస్విప్రియ, మహమ్మద్ మున్నా, హేమంత్, సిద్విక్, ప్రణీత్, తేజ వికాస్, నితీష్ కాంస్య పతకాలు చేజిక్కించుకున్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి ఎస్.వెంకటేశ్వరరావు, జిల్లా కో ఆర్డినేటర్ రామకృష్ణ, కోచ్లు బంగారునాయుడు, ఆనంద్ తదితరులు అభినందించారు. అటవీ ఉత్పత్తులకు అడ్వాన్స్ టెండర్లు సీతంపేట: అటవీ ఉత్పత్తులకు అడ్వాన్స్ టెండర్లు నిర్వహించనున్నట్టు పాలకొండ సబ్కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జ్ పీవో పవార్ స్వప్నిల్ ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన సహకార సంస్థతో సేకరించబడే కొండచీపుర్లు, పసుపుకొమ్ములు, కుంకుడు కాయలు, చింతపండు వంటి వాటికి అడ్వాన్స్ టెండర్లు నిర్వహిస్తామన్నారు. ప్రతీ పక్షం రోజులకొకమారు ఈ టెండర్లు ఉంటాయన్నారు. వ్యాపారులు ఈ టెండర్లలో పాల్గొనవచ్చన్నారు. టెండర్లు ఎప్పుడు నిర్వహిస్తామనేది ముందస్తుగా తెలియజేయనున్నామని తెలిపారు. పుస్తెలతాడు చోరీ సీతానగరం: మండలంలోని కొత్తవలస – వీరభధ్రాపురం గ్రామాల మధ్య మహిళ మెడలో ఉన్న పుస్తెలతాడును గుర్తు తెలియని వ్యక్తి తెంపుకుని పారిపోయిన వైనమిది. స్థానిక పోలీసులు అందించిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. మక్కువ మండలం శంబర గ్రామానికి చెందిన తీళ్ళ భూలక్ష్మి మంగళవారం సాయంత్రం శంబర నుంచి కొత్తవలస మీదుగా కాలినడన కన్నవారిల్లు అయిన వీరభధ్రపురం వెళ్తుంది. అదే సమయంలోమోటారు సైకిల్తో గుర్తు తెలియని వ్యక్తి వెనుక నుంచి వచ్చి తన మెడలో ఉన్న రెండు పుస్తెల తాడును తెంపుకుని వెళ్లిపోయాడు. ఈ మేరకు బాధితురాలు భూలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ ఎం.రాజేష్ తెలిపారు. బస్తా దించుతూ.. బతుకు చాలించి... పార్వతీపురం రూరల్: పశువుల దాణా ఆ కూలి పాలిట మృత్యుపాశమైంది. బస్తాలు దించే క్రమంలో లారీ పైనుంచి జారిపడి ఓ కార్మికుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మంగళవారం ఉదయం మండలంలోని హిందూపురం కూడలి వద్ద ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాలు.. శ్రీకాకుళం నుంచి విశాఖ డెయిరీకి చెందిన పశువుల దాణా లోడ్తో వచ్చిన లారీ పార్వతీపురం చేరుకుంది. మండలంలోని గంగాపురం వైపు వెళ్తూ హిందూపురం కూడలి వద్ద బస్తాలు దించుతుండగా, లారీపై ఉన్న ఆమదాలవలసకు చెందిన తారకేశ్వరరావు (35) ప్రమాదవశాత్తు అదుపుతప్పి కింద పడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో ప్రాణాలు కోల్పోయాడు. రూరల్ ఎస్ఐ సంతోషి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. -
ప్రతీ నెల పౌరహక్కుల దినం నిర్వహించాలి
● అట్రాసిటీ ఘటనల ప్రాంతాలకు ఆర్డీవో, డీఎస్పీలు హాజరు కావాలి ● కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి విజయనగరం అర్బన్: ప్రతి నెల 30వ తేదీని పౌర హక్కుల దినాన్ని పక్కాగా నిర్వహించి డివిజనల్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ (డీవీఎంసీ) సభ్యులందరినీ తప్పనిసరిగా ఆహ్వానించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. సివిల్ రైట్స్ డే నిర్వహించే గ్రామం, సమయం తదితర వివరాలను నెల రోజుల ముందే షెడ్యూల్ చేయాలని, అనంతరం మినిట్స్ను కలెక్టర్కు పంపించాలని, వాటిపై జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో చర్చ జరుగుతుందని తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ, మాన్యువల్ స్కావెంజర్ నిరోధక మరియు పునరావాస చట్టంపై కలెక్టర్ అధ్యక్షతన మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెల 30న అన్ని మండలాల్లో ఎస్హెచ్వో, తహసీల్దార్ ఆధ్వర్యంలో సివిల్ రైట్స్డే నిర్వహించి సమావేశపు వివరాలు పంపాలని ఆదేశించారు. సమావేశంలో డీవీఎంసీ సభ్యులు బసవ సూర్యనారాయణ ఎస్సీ కాలనీల్లో కొన్ని చోట్ల శ్మశానాలు లేకపోవడం మరికొన్ని చోట్ల ఆక్రమణలు జరిగిన విషయాన్ని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్ గ్రామ జనాభాను బట్టి శ్మశాన విస్తీర్ణం ఉండాలని ముగ్గురు ఆర్డీవోలు తనిఖీలు చేసి ఎక్కడ అవసరం ఉందో ఎక్కడ ఆక్రమణలు జరిగాయో నివేదిక పంపాలని ఆదేశించారు. ఉపాధి హామీ నిధులతో శ్మశానాలు, వాటికి రోడ్డు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధితులకు పరిహారం చెల్లింపులో ఆలస్యం జరుగుతోందని సభ్యుడు చిట్టిబాబు ప్రస్తావించగా నిధుల కోసం డీవోకు లేఖ రాసినట్టు, నిధులు రాగానే పరిహారం చెల్లిస్తామని కలెక్టర్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కులాలపై దాడులు జరిగినప్పుడు ఆర్డీవో, డీఎస్పీలు, తప్పనిసరిగా సంఘటనా స్థలానికి హాజరై విచారణ జరపాలని, హత్య కేసులైతే కలెక్టర్, ఎస్పీలు కూడా హాజరు కావాలని సభ్యులు మజ్జి గణపతి, ఎం.రాము కోరారు. దీనికి కలెక్టర్ స్పందించి ఆర్డీవోలు, డీఎస్పీలు స్వయంగా హాజరు కావాలని స్పష్టం చేశారు. ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు 17 నమోదయ్యాయని, అందులో 14 కేసులు విచారణలో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ఈ ఏడాది అక్టోబరు 21 నుంచి డిసెంబర్ 15 వరకు 49 కేసుల్లో 68 మందికిగాను రూ.58 వేల పరిహారం చెల్లించినట్టు తెలిపారు. జిల్లాలో మాన్యువల్ స్కావెంజర్లు లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. విజయనగరం మున్సిపాలిటీలో రెండు చోట్ల మాన్యువల్ స్కావెంజర్లు ఉన్నారన్న సమాచారంపై మున్సిపల్ కమిషనర్ వెరిఫై చేసి నివేదిక ఇవ్వాలని సూచించారు. జేసీ సేతుమాధవన్, అదనపు ఎస్పీ సౌమ్యలత, డీఆర్వో మురళి, డీఎస్పీలు, ఆర్డీవోలు, సోషల్ వెల్ఫేర్ డీడీ అన్నపూర్ణమ్మ, జిల్లా అధికారులు, డీవీఎంసీ సభ్యులు సున్నపు రామస్వామి, ఎం.రాము తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి సంధ్యారాణి పీఏ కేసులో ట్విస్ట్
సాక్షి, పార్వతీపురం మన్యం: రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పీఏ సతీష్, ఆమె కుమారుడిపై మహిళా ఉద్యోగిని చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవ్రెడ్డి తెలిపారు. ఆమె ఉద్దేశపూర్వకంగా ఫేక్ కేసులు పెట్టేశారని చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్, కుమారుడు పృథ్వీ తనను వేధిస్తున్నట్లు సాలూరుకు చెందిన త్రివేణి అనే ఉద్యోగిని కొద్దిరోజుల కిందట పోలీసులకు ఫిర్యాదు చేశారని ఎస్పీ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామని, అదే సమయంలో రెండో వర్గం నుంచి కూడా ఫిర్యాదు అందిందని చెప్పారు. రెండు ఫిర్యాదులపై విచారణ జరిపి, వారి ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపామని చెప్పారు. నిపుణుల పరిశీలనలో సతీష్, మంత్రి కుమారుడు పృథ్వీ చేసినట్లుగా ఉన్న వాట్సాప్ చాట్లన్నీ అబద్ధమని తేలిందన్నారు. త్రివేణి, ఆమె స్నేహితుడు దేవిశ్రీప్రసాద్ కలిసి తప్పుడు చాట్లు సృష్టించి సతీష్, పృథ్వీలను బెదిరించారని పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన మహిళే నిందితురాలిగా... బాధితురాలిగా ఫిర్యాదు చేసిన మహిళనే నిందితురాలిగా పోలీసులు తేల్చారు. అలాంటిది ఆమెను గానీ, దేవీశ్రీప్రసాద్ను గానీ మీడియా ముందుకు తీసుకురాకపోవడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయాన్ని మీడియా ప్రతినిధులు ఎస్పీ వద్ద ప్రస్తావించగా.. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం వారిని మీడియా సమావేశానికి తీసుకురావాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. సతీష్, త్రివేణి మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి సతీష్కు, త్రివేణికి మధ్య గతంలో ఉద్యోగం విషయమై ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని ఎస్పీ చెప్పారు. ఇదే విషయమై వారి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయని తెలిపారు. ఆ తర్వాత దేవిశ్రీప్రసాద్ అనే మున్సిపల్ ఉద్యోగితో కలిసి ఆమె పలుమార్లు సతీష్ను బెదిరించినట్లు వివరించారు. ఈ క్రమంలోనే గత నెల 24న సతీష్ ఆమె ఇంటికి వెళ్లి గొడవపడ్డాడని చెప్పారు. దీంతో సతీష్పై పగ తీర్చుకోవాలన్న ఉద్దేశంతో ఆమె మంత్రి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని తప్పుడు ఫిర్యాదులతో మీడియా ముందుకొచ్చినట్లు గుర్తించామన్నారు. త్రివేణి, దేవిశ్రీప్రసాద్లపై ఫోర్జరీ, ఛీటింగ్, ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్కు తరలించనున్నట్లు వివరించారు. మహిళా ఉద్యోగిని తప్పుడు ఫిర్యాదు చేశారు ఆమె చూపించిన వాట్సాప్ మెసేజ్లన్నీ అబద్ధం స్నేహితుడితో కలిసి ఆమె తప్పుడు మెసేజ్లు సృష్టించారు వాటి ద్వారా మంత్రి కుమారుడు, పీఏలను బెదిరించారు పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ వెల్లడి -
తల్లి వెంటే తనయ...
గుర్ల: తల్లి అంటే ఆమెకు ప్రాణం. తల్లి మరణంతో తల్లఢిల్లింది. ఆమె భౌతిక కాయాన్ని పట్టుకుని బోరున ఏడ్చింది. ఆ క్రమంలో కుప్పకూలి ఆస్పత్రిపాలైంది. అక్కడే ప్రాణం విడిచిన ఘటన గుర్ల మండలం చింతపల్లిపేటలో చోటుచేసుకుంది. తల్లిని కడసారి చూసేందుకు వచ్చిన కుమార్తె మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుపెడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే... చింతపల్లిపేటకు చెందిన సోమురోతు అప్పలనర్సమ్మ (60) అనారోగ్యంతో సోమవారం మృతి చెందింది. తల్లిని చివరిగా చూసేందుకు విశాఖపట్నం నుంచి వచ్చిన కుమార్తె గౌరి (39) తల్లి మృతదేహం వద్ద విలపిస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తల్లికి ఓ వైపు కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తిచేస్తూనే మరోవైపు గౌరిని చీపురుపల్లి సీహెచ్సీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూనే సోమవారం అర్థరాత్రి సమయంలో మృతి చెందింది. 24 గంటల వ్యవధిలో తల్లీకుమార్తె మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గౌరి భర్త శంకరరావు విశాఖపట్నం పోర్టులో కూలిపని చేస్తూ అక్కడే నివసిస్తున్నారు. వారికి కుమారుడు హర్షవర్థన్, కుమార్తె కుసుమ ఉన్నారు. మృత్యువులోనూ వీడని తల్లీకూతుళ్ల అనుబంధం తల్లిని కడసారి చూసేందుకు వచ్చి మృత్యుఒడిలోకి.. విలపిస్తున్న కుటుంబ సభ్యులు చింతపల్లిపేటలో విషాదం -
కలెక్టరేట్లో క్రిస్మస్ వేడుకలు
విజయనగరం అర్బన్: కలెక్టరేట్లో మంగళవారం సాయంత్రం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా మైనారిటీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని వేడుకలను ప్రారంభించారు. కేక్ను కట్చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దైవదూతగా వచ్చిన యేసు త్యాగం, ప్రేమ, కరుణతో ప్రజలందరికీ ఒక మార్గం చూపారని తెలిపారు. యేసు చూపిన మార్గం స్ఫూర్తిదాయకమన్నారు. అనంతరం క్యాండిల్ వెలుగులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చిన్నారులు ఆటపాటలతో అలరించారు. కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమశాఖ ఈడీ షేక్ మహబూబ్ షరీఫ్, క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పి.ప్రేమానందం, రెవరెండ్ పిల్లా ఆనంద్బాబు, రెవరెండ్ ఎస్.మధు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ రఘురాం, వివిధ విభాగాల జిల్లా అధికారులు, క్రైస్తవ ప్రతినిధులు పాల్గొన్నారు. -
బిగ్బాస్ విజేత విజయనగరం వాసి
భోగాపురం: నెల్లిమర్ల నియోజకవర్గంలోని భోగాపురం పంచాయతీ మధుర గ్రామం సుందరపేటకు చెందిన పడాల లక్ష్మణరావు, లక్ష్మి దంపతుల కుమారుడు పడాల కళ్యాణ్ సినిహీరో నాగార్జున నిర్వహించిన బిగ్బాస్ గ్రాండ్ ఫినాలేలో పాల్గొని విజేతగా నిలిచాడు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించి కామన్మెన్గా బిగ్బాస్ హౌస్లోకి చేరి విజేతగా నిలిచి విజయం సాధించిన తొలి ఉత్తరాంధ్ర వాసిగా కళ్యాణ్ గుర్తింపు పొందాడు. బిగ్బాస్ హౌస్లోకి చేరిన మొదటలో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ పట్టువదలకుండా శ్రమించి చివరకు ఫైనల్కు చేరి విజేతగా నిలిచాడు. చిన్నప్పటి నుంచి సినీ హీరోగా ఎదగాలనే ఆశ ఉన్నప్పటికీ ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మూడేళ్లకిందట సీఆర్ఫీఫ్ జవాన్గా చేరాడు. బిగ్బాస్ షోలో పాల్గొనేందుకు సామాన్యులకు అవకాశం ఉందన్న విషయం తెలుసుకుని దరఖాస్తు చేశాడు. కోట్లాది మంది వీక్షకుల మద్దతుతో బిగ్బాస్ హౌస్లోకి అడుగుపెట్టి 105 రోజుల పాటు సాగిన పోటీలో విజేతగా నిలిచాడు. తుది పోటీలో కళ్యాణ్, తనుజాల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగిన పోటీలో ఎక్కువ మంది ఓట్లువేసి కళ్యాణ్ను విజేతగా నిలిపారు. సినీ హీరో అక్కినేని నాగార్జున చేతుల మీదుగా విన్నర్ ట్రోఫీ అందుకున్నారు. ట్రోఫీతో తొలిసారి బుధవారం గ్రామానికి వస్తున్న కళ్యాణ్కు ఘనస్వాగతం పలికేందుకు యువత సిద్ధంగా ఉన్నారు. ఈ సందర్భంగా తన కుమారుడికి ఓటు వేసి గెలిపించిన ప్రజలందరికీ కళ్యాణ్ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. -
అంతర్ విశ్వవిద్యాలయాల పోటీలకు జీఎంఆర్ విద్యార్థులు
రాజాం సిటీ: చైన్నె ఎస్ఆర్ఎం ఐటీ డీమ్డ్టుబీ యూనివర్సిటీలో ఈ నెల 25 నుంచి 28 వరకు జరగనున్న అంతర్ విశ్వవిద్యాలయాల బాస్కెట్బాల్ పోటీలకు జీఎంఆర్ ఐటీ విద్యార్థులు ఎంపికయ్యారని పీడీ బీహెచ్ అరుణ్కుమార్ మంగళవారం తెలిపారు. ఇటీవల రఘు ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన పోటీల్లో కళాశాలకు చెందిన ఎం.కార్తీక్, కె.శ్రీనివాస్ జేఎన్టీయూ జీవీ తరఫున ఆడారని తెలిపారు. విద్యార్థుల ఎంపికపట్ల ప్రిన్సిపాల్ డాక్టర్ సీఎల్వీఆర్ఎస్వీ ప్రసాద్, ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ జె.గిరీష్, స్టూడెంట్స్ డీన్ డాక్టర్ వి.రాంబాబు, అధ్యాపకులు అభినందించారు. -
సర్వజన ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స
● విజయవంతంగా ఆపరేషన్ చేసి కేన్సర్ కణితి తొలగింపు విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. విజయవంతంగా ఆపరేషన్ చేసి రోగి కడుపులో నుంచి కేన్సర్ కణితిని తొలగించారు. దీనికి సంబంధించిన వివరాలను ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ మంగళవారం వెల్లడించారు. రక్తహీనత, కిడ్నీ వాపు, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలతో దుక్క రమణ అనే వ్యక్తి కొద్ది రోజులు క్రితం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చేరిన వెంటనే వైద్యులు రోగికి రక్తహీనతకు అత్యవసర చికిత్స అందించారు. అనంతరం నిర్వహించిన పలు వైద్య పరీక్షల్లో ఆయకు రెట్రోపెరిటోనియల్ సాప్ట్ టిష్యూ సార్కోమా అనే అరుదైన కేన్సర్ వ్యాధి ఉన్నట్టు నిర్ధారణ అయింది. శస్త్రచికిత్సకు ముందు రోగి ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు అవసరమైన చికిత్స అందించారు. కిడ్నీ వాపును తగ్గించేందుకు యూరాలజిస్ట్ సహాయంలో మూత్ర నాళంలో స్టెంటింగ్ నిర్వహించారు. తదుపరి జనరల్ సర్జరీ, యురాలజీ విభాగాల వైద్యులు, మత్తు వైద్యులు సమన్వయంతో రెట్రోపెరిటోనియల్ కణితిని (రెండు కేజీలు) తొలగించారు. శస్త్రచికిత్స అనంతరం రోగిని అత్యవసర చికిత్స విభాగంలో ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి కేన్సర్ చికిత్స అందించారు. రోగిని కేన్సర్తో పాటు కేన్సర్ వల్ల వచ్చే క్లిష్ట పరిణామాల నుంచి కూడా సురక్షితంగా కాపాడగలిగారు. శస్త్రచికిత్సలో పాల్గొన్న జనరల్ సర్జరీ హెచ్వోడీ డాక్టర్ పి.ఎ.రమణ, డాక్టర్ చైతన్యబాబు, డాక్టర్ శశిధర్, డాక్టర్ సుదర్శన్లను సూపరింటెండెంట్ అభినందించారు. -
ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరి మృతి
సీతంపేట: సీతంపేట ఏజెన్సీలోని వెంపలగూడ సమీపంలో మంగళవారం ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న సంఘటనలో పెద్దింటి సోమేశ్వరరావు (53) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఆర్.యుగంధర్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలవ్వడంతో పరిస్థితి విషమంగా ఉంది. టి.జయరాజు, అరవింద్లకు స్వల్ప గాయలవ్వడంతో స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎస్ఐ వై.అమ్మన్నరావు తెలిపిన వివరాలు.. పీపీ ఈతమానుగూడ పంచాయతీ ఇప్పగూడకు చెందిన సోమేశ్వరరావు తన స్వగ్రామం నుంచి సీతంపేటకు ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. ఎదురుగా కొత్తూరుకు చెందిన యుగంధర్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురెదురు వాహనాలు బలంగా ఢీకొట్టాయి. దీంతో సోమేశ్వరరావు తలపై బలమైన గాయం తగలడంతో రక్తపు మడుగులో ఉన్న ఆయన్ను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన యుగంధర్కు ప్రధమ చికిత్స చేశారు. పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్కు రిఫర్ చేసినట్టు, స్వల్ప గాయాలైన ఇద్దరు ఇక్కడే ట్రీట్మెంట్ పొందుతున్నట్టు సూపరెండెండెంట్ బి.శ్రీనివాసరావు తెలిపారు. మృతుని భార్య బుచ్చమ్మ రెండేళ్ల క్రితం మృతి చెందగా ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించడానికి పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. మరొకరి పరిస్థితి విషమం -
పట్టపగలే గాయత్రీదేవి ఆలయంలో చోరీ
పాలకొండ: నగర పంచాయతీ సమీపంలోని కొండాపురం గ్రామ సమీపంలో ఉన్న పంచముఖ గాయత్రీదేవి ఆలయంలో మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో చోరి జరిగింది. భక్తుల వేషంలో వచ్చిన భార్యాభర్తలు ఆలయ అర్చకులు ఆలయ మెట్లపై టిఫిన్ చేయడాన్ని గుర్తించారు. అమ్మవారిని దర్శించుకున్నట్టు నటించి గర్భగుడిలోకి ప్రవేశించారు. అమ్మవారి ముక్కుపుడక, మంగళసూత్రాలు, కళ్లు తీసుకుని ఆలయం నుంచి హడావుడిగా బయటకు వెళ్లిపోయారు. ఇది గమనించిన అర్చకులు చిట్టిబాబు శర్మ అమ్మవారిని చూడగా అమ్మవారి అలంకరణలో చేసిన బంగారు వస్తువులు కనిపించలేదు. వెంటనే కేక వేయగా నిందితులు తాము తెచ్చుకున్న వాహనంపై వుడాయించారు. వెంటనే ఆయన పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై ఎస్ఐ ప్రయోగమూర్తి కేసు నమోదు చేశారు. దొంగలించిన వస్తువులు సుమారుగా 23 గ్రాములు ఉంటాయని అర్చకులు తెలిపారు. కాగా చోరి చేసిన నిందితులను పోలీసులు పట్టుకున్నట్టు విశ్వాసనీయ సమాచారం. వీరు నగర పంచాయతీ పరిధిలోని నక్కలపేటకు చెందిన భార్యాభర్తలుగా తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన వివరాలు బుధవారం వెల్లడించే అవకాశం ఉంది. -
భోగాపురం, విజయనగరంలో ఏసీబీ సోదాలు
విజయనగరం క్రైమ్/భోగాపురం: ఏసీబీ అధికారుల సోదాలతో విజయనగరం, భోగాపురంలో అలజడి నెలకొంది. ఏకకాలంలో ఏసీబీ బృందాల సోదాలతో ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. గత నెల 5, 6, 7 తేదీల్లో భోగాపురం సబ్ రిజిస్ట్రర్ కార్యాలయంలో తనిఖీలు జరిపిన అధికారులు ఈ సారి సబ్రిజిస్ట్రార్ పి.రామకృష్ణ ఇంటిలోను, కార్యాలయ ఆఫీస్ బోయ్ అలేటి కనకరాజు ఇంటిలో సోదాలు చేశారు. ఏసీబీ డీఎస్పీ రమ్య, సీఐ మహేష్ ఆధ్వర్యంలో సోదాలు జరిగాయి. భోగాపురంలో కనకరాజు ఇంటికి మంగళవారం ఉదయం 6 గంటలకే డీఎస్పీ రమ్మ తన బృందంతో చేరుకుని సోదాలు జరిపారు. రాత్రి వరకు జరిపిన సోదాల్లో ఆయన వద్ద అక్రమంగా ఉన్న రూ.18లక్షల10వేల నగదు, 40తుల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంటిలో ఉన్న వస్తువులు, డాక్యుమెంట్లతో పాటు కనక రాజు, అతని భార్య బ్యాంకు అకౌంట్లను పరిశీలించారు. ఆయా ఖాతాల నుంచి జరిగిన లావాదేవీలపై ఆరా తీశారు. డీఎస్పీ రమ్య ఆదేశాల మేరకు సీఐ మహేష్ సిబ్బందితో కలిసి విజయనగరంలోని ఎస్వీఎన్ నగర్లో నివసిస్తున్న సబ్రిజిస్ట్రార్ రామకృష్ణ ఇంటిలో సోదాలు జరిపారు. దాదాపు రూ.మూడు కోట్లు విలువచేసే భవనాల డాక్యుమెంట్లు, రూ.25 లక్షల నగదు, 200 గ్రాముల బంగారం అక్రమంగా సంపాదించినట్టు గుర్తించారు. రామకృష్ణకు చెందిన ఆరు ప్రాంతాల్లో సోదాలు చేశారు. విజయనగరంలోని ఎస్వీఎన్ నగర్, ప్రదీప్నగర్, దాసన్న పేట కుమ్మరివీధి, ప్రదీప్నగర్–1, ఉడాకాలనీ, కంటోన్మెంట్, వీటీ అగ్రహారంలో బినామీ ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ గుర్తించింది. రామకృష్ణ అత్త, తోడల్లుడి పేరుతో ఆస్తులు కూడబెట్టారని, వాటిని సీజ్చేశామని సీఐ తెలిపారు. భోగాపురం సబ్రిజిస్ట్రార్ ఇంటిలో అక్రమ ఆస్తుల గుర్తింపు కార్యాలయ బోయ్ ఇంటిలో పట్టుబడిన నగదు, బంగారం గతనెలలో సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో సోదాలు అనతికాలంలోనే తనిఖీలతో ఉద్యోగుల్లో గుబులు ఉదయం నుంచి రాత్రి వరకు సాగిన సోదాలు -
గుర్తు తెలియని వృద్ధుడు మృతి
రాజాం సిటీ: స్థానిక వైఎస్సార్ పార్కు సమీపంలో గుర్తు తెలియని వృద్ధుడు అపస్మారక స్థితిలో పడి మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. వైఎస్సార్ పార్కు ఏరియా, శ్రీనివాస థియేటర్ రోడ్డుల్లో గుర్తు తెలియని వృద్ధుడు యాచిస్తూ సంచరిస్తుండేవాడు. మంగళవారం వైఎస్సార్ పార్కు సమీపంలో అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది వృద్దుడుని ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అప్పటికే మృతి చెందాడని వైద్యులు పేర్కొన్నారు. వృద్ధుని గుర్తించిన వారి బంధువులు పోలీసులను సంప్రదించాలని తెలిపారు. -
వంద రోజుల ప్రణాళికను అమలు చేయాలి
● డీఈఓ మాణిక్యంనాయుడు నెల్లిమర్ల రూరల్: పదో తరగతి విద్యార్థులకు వంద రోజుల బోధన ప్రణాళికను అమలుచేయాలని డీఈఓ మాణిక్యంనాయుడు ఉపాధ్యాయులకు సూచించారు. మండలంలోని మొయిద ఉన్నత పాఠశాలను మంగళవారం సందర్శించారు. పదో తరగతిలో శతశాతం ఉత్తీర్ణత నమోదుకు కృషిచేయాలన్నారు. రోజువారీ బోధన ప్రణాళిక, వారానికోసారి మోడల్ టెస్ట్ నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం మహాలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు. 30 ఆలయాల నిర్మాణానికి ప్రతిపాదనలు ● టీటీడీ జిల్లా ప్రోగ్రాం అధికారి జె.శ్యామసుందర్ రేగిడి: జిల్లాలో 30 రామాలయాల నిర్మాణానికి శ్రీవాణి ట్రస్టు తరఫున ఆర్థిక సహకారానికి ప్రతిపాదనలు పంపించామని టీటీడీ జిల్లా ప్రోగ్రాం అధికారి జె.శ్యామసుందర్ తెలిపారు. రేగిడి మండలం సంకిలిలో నిర్మాణంలో ఉన్న రామాలయాన్ని మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాలతో పాటు విగ్రహాలు, మైక్సెట్లు, ఇతర సామగ్రికి శ్రీవాణి ట్రస్టు ద్వారా సహకారానికి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జిల్లాలో 30 ఆలయాలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని వెల్లడించారు. ఆయన వెంట టీటీడీ సహాయకులు సీహెచ్ ప్రసాద్, సంకిలి ఆలయ కమిటీ సభ్యులు బి.తవిటినాయుడు, కొరికాన వెంకటేశ్, ఆర్.శ్రీకాంత్, జి.రామకృష్ణ, ఆర్.కోదండం ఉన్నారు. ఆవిష్కరణలు భళా ● ఆకట్టుకున్న ఐటీడీఏ స్థాయి అన్వేష సైన్స్ ఫెస్ట్ ● 53 విద్యాసంస్థల నుంచి 300ల ప్రాజెక్టుల ప్రదర్శనసీతంపేట: గిరిజన విద్యార్థులు సృజనకు పదునుపెట్టారు. సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలతో ఆకట్టుకున్నారు. సీతంపేట గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో మంగళవారం నిర్వహించిన అన్వేష సైన్స్ఫెస్ట్ను పాలకొండ సబ్కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జి పీఓ పవార్ స్వప్నిల్ ప్రారంభించారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలోని పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలోని 53 గిరిజన విద్యాసంస్థల నుంచి 300లకు పైగా ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారు. వీటిలో కొన్నింటిని పీఓ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి శాస్త్రవేత్తగా ఎదగాలని, చదువుతో పాటు శాసీ్త్రయదృక్పథాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. నిత్యజీవితంలో ప్రశ్నించడం అలవాటు చేసుకున్నప్పుడే విద్యార్థులు శాస్త్రవేత్తలుగా తయారవుతారన్నారు. సమాజంలో సమస్యలకు పరి ష్కారం కనుగొనే దిశగా విద్యార్థులు ఆలోచించాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో నిత్యం ఎదుర్కొనే సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొనాలన్నారు. ఖరీదైన టెక్నాలిజీని సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చేలా తక్కువ ఖర్చుతో కూడిన ఆవిష్కరణలు రావాలని సూచించారు. ఇక్కడ ప్రదర్శించిన ప్రాజెక్టులను ఎంపిక చేసి ఇస్రోకు పంపిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీఓ చిన్నబాబు, డీడీ అన్నదొర, డిప్యూటీ ఈఓ రామ్మోహన్రావు, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పి.భూదేవి పాల్గొన్నారు. -
వివాహిత ఆత్మహత్య
విజయనగరం క్రైమ్ : నగరంలోని అయ్యకోనేరులో ఓ వివాహిత మృతదేహాన్ని టు టౌన్ పోలీసులు మంగళవారం కనుగొన్నారు. ఎస్ఐ కనకరాజు తెలిపిన వివరాలు... దాసన్నపేటలోని గొల్లవీధికి చెందిన కోరాడ సునీత(35)కు పదేళ్ల కిందట వివాహమైంది. పెళ్లయి పదేళ్లు అవుతున్నా పిల్లలు పుట్టకపోవడంతో, భర్త నుంచి విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న సునీత మానసిక స్థితిని కోల్పోయింది. ఈ పరిస్థితిలో సునీత బాగోగులను అన్నయ్య చూసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఇంట్లో సునీత కనిపించకపోవడంతో పరిసర ప్రాంతాలను వెతికాడు. స్థానికులను సంప్రదించాడు. ఇంతలో స్థానిక అయ్యకోనేరులో ఓ మహిళ మృతదేహం కనిపించిందని సునీత అన్నయ్యకు సమాచారం అందింది. అయ్యకోనేరుకు వెళ్లి చూడగా పడమర గట్టున సునీత మృతదేహం కనిపించింది. పోలీసులు సీసీ పుటేజీలో చూడగా సోమవారం రాత్రే ఇంటి నుంచి వెళ్లి కోనేరులో దూకేసినట్టు రికార్డు అయినట్టు పోలీసులు గుర్తించారు. సునీత అన్నయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ కనకరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అదనంగా ఇస్తేనే.. ధాన్యం బస్తాలు దించేది..!
● 80 కిలోలకు అదనంగా మరో 4 కిలోల ధాన్యం వసూళ్లు ● అర్థరాత్రి వరకూ ఇబ్బందులు పడ్డ రైతులురాజాం : పట్టణంలోని పాలకొండ రోడ్డులో లక్ష్మీనారాయణ రైస్ మిల్లు వద్ద సోమవారం అర్థరాత్రి వరకూ కొంతమంది రైతులు ఇబ్బందులు పడ్డారు. సంతకవిటి, రేగిడి మండలాలకు చెందిన రైతులతో పాటు రాజాం మండల రైతులు కొందరు ఇక్కడకు సోమవారం ధాన్యం విక్రయాలు నిమిత్తం తీసుకొచ్చారు. ముందస్తుగా తమ గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల వద్ద ధాన్యం శాంపిల్స్ తీయడంతో పాటు వాటిని ఈ మిల్లర వద్దకు తీసుకొచ్చి అనుమతులు ఇచ్చిన తరువాత ట్రక్షీట్లు తీసుకున్నారు. ఆయా ట్రక్షీట్లుతో ట్రాక్టర్ల ద్వారా ఎనిమిది గ్రామాలకు చెందిన రైతులు ధాన్యం తీసుకుని రాగా మిల్లరు ధాన్యంలో నాణ్యత లేదని, కళాసీలు లేరని మొండికేసి ధాన్యం అన్లోడింగ్ చేయకుండా ట్రాక్టర్లపైనే వదిలేశారు. ఓ వైపు గజగజలాడించే చలి, మరో వైపు ట్రాక్టర్ల యాజమాన్యంతో ఇబ్బందులు పడుతూ రైతులు నానా అవస్థలు పడ్డారు. అదనపు చెల్లింపుతో దిగిన యజమాని చివరకు రైతులు ఒక్కో 80 కిలోల బస్తా ధాన్యంకు అదనంగా నాలుగు నుంచి ఐదు కిలోలు చెల్లిస్తామని చెప్పడంతో రైతులు ధాన్యం దించేందుకు మిల్లరు అనుమతులు ఇచ్చాడు. పలువురు రైతులు ఈ ఒప్పందానికి అంగీకరించి ధాన్యం బస్తాలు దించారు. వీరికి రాత్రి 12 గంటల సమయం పట్టింది. మరికొంతమంది రైతులు అదనంగా ధాన్యం ఇచ్చేందుకు నిరాకరించి అక్కడి నుంచి వెనుదిరిగారు. తాము మధ్యాహ్నం 2 గంటలకు ధాన్యం తీసుకెళ్తే రాత్రి 11 గంటల వరకూ ధాన్యం దించకుండా లక్ష్మీనారాయణ మిల్లర్ల యజమాని అడ్డుకున్నారని సంతకవిటి మండలం సిరిపురం గ్రామానికి చెందిన పలువురు రైతులు ఆరోపించారు. ఈ విషయంపై మిల్లరు యజమాని అవినాష్ వద్ద సాక్షి ప్రస్తావించగా, ధాన్యం నాణ్యత బాగోలేని కారణంగా రైతులే అదనంగా ధాన్యం ఇచ్చేందుకు ముందుకు వచ్చారని చెప్పారు. ఈ సమస్యపై ఉన్నతాధికారులు స్పందించాలని రైతులు కోరుతున్నారు. -
రాష్ట్రానికి ఆదర్శంగా మన్యం జిల్లా
పార్వతీపురం: పరిపాలనలో, ప్రజాసమస్యల పరిష్కారంలో పార్వతీపురం మన్యం జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తుందని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అన్నారు. కలెక్టర్ల సమావేశంలో జిల్లా సాధించిన ప్రగతిని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించిన నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, సబ్కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు గజమాలతో కలెక్టర్ను సత్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన ముస్తాబు కార్యక్రమం అద్భుత ఫలితాన్ని ఇచ్చిందన్నారు. విద్యార్థుల్లో పరిశుభ్రత, క్రమశిక్షణ, సంస్కారాన్ని పెంపొందించేందుకు ఇది ఒక గొప్ప సంకల్పమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలు, వసతిగృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించడం మన జిల్లాకు దక్కిన గొప్ప గౌరవమన్నారు. పీజీఆర్ఎస్ సమస్యల పరిష్కారంలో పార్వతీపురం జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలవడం ఎంతో అభినందనీయమన్నారు. రెవెన్యూ క్లినిక్ విధానాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడం గర్వకారణమన్నారు. ఇదే స్ఫూర్తితో పనిచేసి జిల్లా అన్ని రంగాల్లో ముందుండేలా చూడాలని సిబ్బందిని కోరారు. కార్యక్రమంలో జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, పార్వతీపురం, పాలకొండ సబ్కలెక్టర్లు వైశాలి, పవర్ స్వప్నిల్ జగన్నాథ్, డీఆర్ఓ హేమలత, హౌసింగ్ పీడీ ధర్మచంద్రారెడ్డి తదితరులున్నారు. వినియోగదారుల హక్కులపై అవగాహన కలిగి ఉండాలి వస్తువులు కొనుగోలు, సేవల వినియోగం విషయంలో ప్రజలు అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి హితవు పలికారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వినియోగదారుల హక్కులు, ప్రమాణాలకు సంబంధించిన వాల్పోస్టర్ను జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్వతీపురం, పాలకొండ సబ్కలెక్టర్లు వైశాలి, పవర్ స్వప్నిల్ జగన్నాథ్, డీఆర్ఓ హేమలత, డీఆర్డీఏ పీడీ సుధారాణి, హౌసింగ్ పీడీ ధర్మచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మిస్టర్ ఇండియా పోటీలకు కోన రమణ
శృంగవరపుకోట: మిస్టర్ ఇండియా బాడీబిల్డింగ్ పోటీలకు ఎస్.కోటకు చెందిన బాడీ బిల్డర్ కోన రమణ ఎంపికయ్యాడు. ఈ నెల 21న తగరపువలసలో జరిగిన మిస్టర్ ఆంధ్రా ఓపెన్ బాడీ బిల్డింగ్ పోటీల్లో మాస్టర్స్ విభాగంలో పాల్గొన్న కోన రమణ 5వ స్థానం సాధించాడు. నిర్వాహకులు రమణకు రూ.1000లు నగదు ప్రోత్సాహకంతో పాటు మెడల్, ప్రశంసాపత్రం అందజేశారు. జనవరిలో ఛత్తీస్గఢ్లో జరగనున్న మిస్టర్ ఇండియా బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించినట్లు రమణ చెప్పాడు. డీజీపీ కమోడేషన్కు ఎంపికై న విజయనగరం పీసీవిజయనగరం క్రైమ్: ఏపీ రాష్ట్ర పోలీస్ శాఖ ఇవ్వనున్న డీజీపీ కమోడేషన్ డిస్క్ అవార్డులను సోమవారం ప్రకటించింది. ఈ అవార్డుల్లో సిల్వర్ డిస్క్ విజయనగరం పోలీస్ శాఖ పరిధి రామభధ్రపురం పోలీస్ స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ వై.అప్పలనాయుడును వరించింది. డీజీపీ సిల్వర్ డిస్క్లు నలుగురు ఐపీఎస్లతో పాటు మొత్తం 343 మందికి లభించాయి. కానిస్టేబుల్స్లో ఉత్తరాంధ్రలోని విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు సంబంధించి ఇద్దరికి ఈడిస్క్ అవార్డులు లభించాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో మహిళా పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ శారద ఉన్నారు. -
పక్కా ప్రణాళికతో హత్య
● భీముడు మృతిపై సమగ్ర విచారణ జరపాలి ● ఎస్పీకి మృతుడి భార్య వినతిపార్వతీపురం రూరల్: రికార్డుల్లో గుండెపోటు..శరీరంపై మాత్రం గాయాల అనవాళ్లు..వెరసి గొర్రె భీముడు(52) మృతి మిస్టరీగా మారింది. తమకు న్యాయం చేయాలంటూ మృతుడి భార్య భారతి, ఆదివాసీ ఎరుకల సంఘాల నాయకులతో కలిసి సోమవారం ఎస్పీ కార్యాలయం ఎదుట బైఠాయించింది. పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం తాలాడకు చెందిన భీముడు గత ఏప్రిల్ 22న వంశధార నది ఒడ్డున విగతజీవిగా లభ్యమయ్యాడు. మృతదేహంపై కంటి భాగం, పక్కటెముకల వద్ద గాయాలున్నా..పోస్టుమార్టం నివేదికలో గుండెపోటుగా పేర్కొనడంపై బాధితులు మండిపడ్డారు. గ్రామంలో చెత్త బండి నడిపే విషయంలో స్థానికంగా కొందరితో విభేదాలున్నాయని, వారే కులం పేరుతో దూషించి, దాడి చేసి చంపేశారని భారతి ఫిర్యాదులో ఆరోపించింది. దీనిపై సాక్షులున్నా పోలీసులు పట్టించుకోలేదని, పైగా హడావుడిగా అంత్యక్రియలు చేయించారని వాపోయింది. హైకోర్టు ఆదేశించినా న్యాయం జరగలేదని, తప్పుడు నివేదిక ఇచ్చిన వైద్యుడిపై, నిందితులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి వినతిపత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏపీ ఆదివాసీ ఎరుకల సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.శంకరరావు, యూటీఎఫ్ అధ్యక్షుడు కె.సంజయ్బాబు, ఏపీఏవైఎస్ఎస్ నేతలు జి.శ్రీనివాసరావు, ఎస్.ముసలయ్య, ఎం.పోతురాజు, గొర్ల సత్యం,చల్ల చిన్నారావు, గొర్ల సన్యాసిరావు, గొర్ల రమణమూర్తి, గేదెల ఆదినారాయణ, గేదెల సురేంద్ర, గొర్ల బుల్లోడు తదితరులు పాల్గొన్నారు. -
అర్జీలకు నాణ్యమైన పరిష్కారం ఇవ్వాలి
● కలెక్టర్ ప్రభాకరరెడ్డిపార్వతీపురం: ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అందిన అర్జీలను సొంత సమస్యగా భావించి నాణ్యమైన పరిష్కారాన్ని ఇచ్చి అర్జీదారుల సంతప్తిని స్థాయిని పెంచాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి మండల స్థాయి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో వివిధ ప్రాంతాల ప్రజలు 185 వినతులు అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీలను ఆడిట్ చేయనున్నట్లు చెప్పారు. జిల్లా అధికారులు అర్జీలను స్వయంగా పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. నాణ్యంగా అర్జీలను పరిష్కరించకపోతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. అర్జీలను స్వీకరించినవారిలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్కుమార్రెడ్డి, సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్, డీఆర్ఓ కె.హేమలత, ఎస్డీసీలు పి.ధర్మచంద్రారెడ్డి, ఎస్.దిలీప్ చక్రవర్తి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మైనింగ్ అనుమతులు నిలిపివేయాలి పాచిపెంట మండలం శ్యామల గౌరీపురం గ్రామం సమీపంలో గల కొండకు ఉన్న మైనింగ్ అనుమతులను నిలిపివేయాలని కోరుతూ గ్రామంలోని ఎస్టీ గదబ కులానికి చెందిన ఎస్. మహేశ్వరరావు, ఎస్.కుమార్, ఎస్.వెంకట పాపారావు, ఎస్. శ్రీధర్తోపాటు గ్రామస్తులు వచ్చి కలెక్టర్ ప్రభాకరరెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. శ్యామల గౌరీపురం సమీపంలో ఉన్న కొండచుట్టూ పోడు వ్యవసాయం రాగులు, జొన్నలు, కందులు, కొర్రలు, జీడిమొక్కలు తదితర పంటలను సాగు చేసి జీవనం సాగిస్తున్నామని, కొండ ప్రాంతాన్ని పశువులు, మేకలు మేత కోసం వినియోగిస్తున్నామని, అలాగే కొండపై ఉమామహేశ్వర గోకర్ణ స్వామి ఆలయం కూడా ఉందన్నారు. ఈ కొండకు, గుడికి రాకపోకలు చేసేందుకు ప్రభుత్వం గతంలో రహదారిని కూడా నిర్మించిందని గుర్తు చేశారు. ఈ కొండకు మైనింగ్ అనుమతుల కోసం 18.5.2025న జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో మైనింగ్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారన్నారు. అయితే ఈ కొండ సమీపంలో ఉన్న మంచాడవలస, పణుకువలస, శ్యామల గౌరీపురం గ్రామాలకు అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సమావేశం నిర్వహించారని, కొండకు మైనింగ్ అనుమతులు ఇవ్వడం వల్ల ఈ గ్రామాలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని వాపోయారు. అధికారులు పునరాలోచన చేసి నవదుర్గ మైనింగ్కు ఇచ్చిన అనుమతులను నిలిపివేయాలని వారు కోరారు. ఐటీడీఏ పీజీఆర్ఎస్లో వెలుగు సీఎఫ్పై ఫిర్యాదు సీతంపేట: తాము తీసుకున్న ఉన్నతి రుణాలను తిరిగి చెల్లిస్తుంటే వెలుగు సీఎఫ్ జమచేయడం లేదని కొత్తూరు మండలంల కురిగాం గ్రామానికి చెందిన ఆదివాసీ స్వయం శక్తిసంఘం మహిళా సభ్యులు ఐటీడీఏ ఏపీఓ జి.చిన్నబాబుకు సోమవారం పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. ప్రజాసమస్యల పరిష్కారవేదికకు 27 అర్జీలను గిరిజనులు సమర్పించారు. గూనభద్రకు చెందిన చల్లా ఉమాదేవి, సుబ్బారావు తదితరులు పెండింగ్ హౌసింగ్ బిల్లులు చెల్లించాలని కోరారు. కొంకాడపుట్టి గ్రామాన్ని పంచాయతీగా గుర్తించాలని సవర శివకుమార్ వినతి ఇచ్చారు. పిల్లలు ఉన్నందున డబారుసింగి గ్రామానికి పాఠశాల మంజూరు చేయాలని దేవి తదితరులు కోరారు. సోదగ్రామం మండల పరిషత్ పాఠశాల భవనానికి మరమ్మతులు చేయించాలని పి.శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశాడు. శ్మశాసస్థలాన్ని ఆక్రమిస్తున్నారని కొండపల్లికి చెందిన ఎం.రాజారావు ఫిర్యాదు చేశాడు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి పార్వతీపురం రూరల్: ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చే ఫిర్యాదులను చట్టపరిధిలో నిర్దేశిత సమయంలోగా పరిష్కరించాలని ఎస్పీ ఎస్.వి.మాధవ్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో ఆయన ఫిర్యాదుదారుల నుంచి స్వయంగా అర్జీలను స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబకలహాలు, సైబర్ నేరాలు, ఆస్తి వివాదాలు, వడ్డీ వ్యాపారుల వేధింపులు వంటి అంశాలపై మొత్తం 11 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా ఎస్పీ సంబంధిత స్టేషన్ల అధికారులతో ఫోనన్లో మాట్లాడి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధితులకు న్యాయం చేసి, ఆ నివేదికలను కార్యాలయానికి పంపాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ సీఐ ఆదాం, ఎస్సై రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
నాయనమ్మను హత్య చేసిన మనుమడి అరెస్ట్
విజయనగరం క్రైమ్: ఈ నెల 13 జరిగిన జరిగిన హత్య కేసు మిస్టరీని భోగాపురం పోలీసులు ఛేదించారు. డబ్బులు ఇవ్వలేదని సొంత నాయనమ్మనే మనుమడు హత్య చేశాడని ఎస్పీ దామోదర్ సోమవారం తెలిపారు. ఈ కేసుకు సంబంధించి విలేకరుల సమావేశంలో ఎస్పీ దామోదర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని భోగాపురం మండలం ముడసలపేట గ్రామం ఎయిర్ పోర్టు కాలనీకి చెందిన ముడసల అప్పయ్యమ్మ (70) అనే వృద్ధురాలిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి, ఆమె ఒంటిపై ఉన్న బంగారు చెవి దిద్దులు, జుమ్మలు, ముక్కు కమ్ములు, వెండి పట్టీలను దొంగిలించుకుని పోయారని మృతురాలి కోడలు ముడసల లక్ష్మి డిసెంబర్ 13న ఫిర్యాదు చేసింది.ఈ మేరకు భోగాపురం పోలీసులు కేసు నమెదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు విచారణలో భాగంగా, నేర స్థలాన్ని క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు పరిశీలించాయి. విజయనగరం ఇన్చార్జ్ డీఎస్పీ ఆర్.గోవిందరావు ఆధ్వర్యంలో భోగాపురం సీఐ కె.దుర్గాప్రసాద్, ఎస్సై పి.పాపారావు, సీసీఎస్ ఎస్సై కె.లక్ష్మణరావు బృందాలుగా ఏర్పడి. విచారణ చేపట్టారు. నేర స్థలం పరిశీలనలో డాగ్స్క్వాడ్. నిందితుడు ముడసల గౌరి చుట్టూ తిరగడంతో అనుమానంతో అతని కదలికలపై నిఘా పెట్టారు. బంగారం, వెండి రికవరీ నేరం జరిగిన కొద్ది రోజుల తర్వాత, పోలీసులకు అనుమానం లేదని నిందితుడు ముడసల గౌరిపై భావించి, దొంగిలించిన వస్తువులను అమ్మేయాలన్న ఉద్దేశంతో వాటిని తీసుకుని వెళ్తుండగా భోగాపురం పోలీసులు అరెస్టు చేసి, 18.250 గ్రాముల బంగారు వస్తువులను, 106 గ్రాముల వెండి పట్టీలను రికవరీ చేశారని ఎస్పీ దామోదర్ తెలిపారు. విచారణలో మృతురాలు తన కుమార్తె, చిన్న కుమారుడికి తన వద్ద ఉన్న డబ్బులు ఇస్తున్నట్లు, పెద్ద కుమారుడి కుటుంబానికి డబ్బులు ఇవ్వడం లేదన్న కారణంగా ఆమైపె కక్ష పెంచుకున్నాడన్నారు. ముందు రోజు రాత్రి పెద్ద కొడుకు కొడుకై న గౌరి మద్యం మత్తులో తన నాయనమ్మను బైక్ ఫైనాన్స్ కట్టేందుకు డబ్బులు అడిగాడని, ఇవ్వకపోవడంతో ఆమె ముఖంపై తలగడతో అదిమి హత్య చేసి, ఒంటిపైగల చెవి కమ్ములు, జుమ్మాలు, చెవి మద్య రింగులు, రోల్డ్ గోల్డ్ చైన్, వెండి పట్టీలను దొంగిలించాడన్నారు. మృతురాలు బహిర్భూమికి బయటకు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి, మృతురాలి ఒంటిపై బంగారు వస్తువులు తీసుకుని పోయినట్లు మభ్యపెట్టేందుకు మృతదేహాన్ని ఇంటినుంచి బయటకు తీసుకు వెళ్లి, నూతికి సమీపంలో పడేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని, లాభాపేక్షతో హత్య కేసు మిస్టరీని చేధించామన్నారు. ఈ కేసులో క్రియాశీలకంగా పని చేసిన డీఎస్పీ ఆర్.గోవిందరావు, భోగాపురం సీఐ కె.దుర్గా ప్రసాద్, ఎస్సైలు పి.పాపారావు, కె.లక్ష్మణరావు, ఏఎస్సై గౌరీ శంకర్, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బందిని అభినందించి నగదు రివార్డులను ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ప్రదానం చేశారు. -
పరిష్కారం ఆలస్యమైతే సహించేది లేదు
● కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి ● పీజీఆర్ఎస్లో 257 వినతుల స్వీకరణవిజయనగరం అర్బన్: కలెక్టరేట్లోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు విశేష స్పందన లభించింది. ఫిర్యాదుదారుల నుంచి మొత్తం 257 అర్జీలు స్వీకరించినట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతిని త్వరితగతిన బాధ్యతాయుతంగా పరిష్కరించాలని సంబంధిత శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. వినతుల పరిష్కారంలో ఆలస్యం ప్రదర్శిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. పీజీఆర్ఎస్లో కలెక్టర్తోపాటు జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, డీఆర్ఓ మురళి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొని ప్రజల సమస్యలను స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత శాఖల అధికారులు అర్జీదారులను ప్రత్యక్షంగా కలిసి మాట్లాడిన తర్వాతనే ఎండార్స్ మెంట్ ఇవ్వాలని అలాగే మాట్లాడిన తేదీ, సమయాన్ని నివేదికలో తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. విభాగాల వారీగా వినతుల వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా డీఆర్డీఏకు 82 అర్జీలు, రెవెన్యూశాఖకు 70, జిల్లా పంచాయతీ శాఖకు 28, జిల్లా వైద్యారోగ్యశాఖకు 16, మున్సిపల్ శాఖకు 7, గ్రామ సచివాలయ శాఖకు 6, విద్యాశాఖకు 5, విద్యుత్ శాఖకు 4, హౌసింగ్ శాఖకు 4, ఇతర శాఖలకు చెందినవి 35 వరకు ఉన్నాయి. పీజీఆర్ఎస్ టోల్ ఫ్రీ నంబర్ 1100పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. ఈ నంబర్కు వచ్చే కాల్స్కు సంబంధిత అధికారులు సరైన విధంగా సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్, జిల్ల రెవెన్యూ అధికారి మురళి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు డి.వెంకటేశ్వరరావు, రాజేశ్వరి, ప్రమీల గాంధీ, బి.శాంతి, సర్వేశాఖ ఎ.డి ఆర్.విజయకుమార్, కలెక్టరేట్ అధికారి దేవీప్రసాద్, సీపీఓ బాలాజీ, డీఈఓ మాణిక్యంనాయుడు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ పీజీఆర్ఎస్కు 27 ఫిర్యాదులు విజయనగరం క్రైమ్: స్థానిక డీపీఓలోని కాన్ఫరెన్స్ హాలులో ఎస్పీ ఏఆర్ దామోదర్ సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించి 27 ఫిర్యాదులను స్వీకరించారు. వాటిలో భూతగాాదాలకు సంబంధించి 11, కుటుంబ కలహాలకు సంబంధించి 3, నగదు వ్యవహారాలకు సంబంధించి 2, మోసాలకు సంబంధించి 1, ఇతర అంశాలకు సంబంధించి 10 ఫిర్యాదులు వచ్చాయి. సంబంధిత అధికారులు ఫిర్యాదు అంశాలను పరిశీలించాలని, వాటి పూర్వాపరాలను విచారణ చేయాలని ఎస్పీ దామోదర్ ఆదేశించారు. ఫిర్యాదు అంశాల్లో వాస్తవాలను గుర్తించి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని సూచించారు. స్వీకరించిన ఫిర్యాదులపై ఏడు రోజుల్లో వాటి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలను నివేదిక రూపంలో జిల్లా పోలీసు కార్యాలయానికి పంపాలని సంబంధిత పోలీసు అధికారులను ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీసీఆర్బీ సీఐ కె.కుమార స్వామి, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, ఎస్సైలు రాజేష్, ప్రభావతి పాల్గొన్నారు. -
తండ్రిని హతమార్చిన కుమారుడిపై కేసు నమోదు
పాచిపెంట: మండలంలోని తుమరవల్లి పంచాయతీ నేరళ్లవలసలో పోయిరి సోమయ్య(50) ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందగా ఈ మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. విచారణ అనంతరం ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నేరళ్లవలస గ్రామానికి చెందిన పొయిరి సోమయ్య తన పెద్ద కుమారుడు పోయిరి సింహాచలం ఇంటి వద్ద ఉండేవాడు, సోమయ్య మతిస్థిమితం కోల్పోయి తరచూ తన పెద్ద కుమారుడిని విసిగిస్తూ అసహనానికి గురి చేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఈనెల 17వ తేదీన కూడా అలా ప్రవర్తించడంతో అసహనానికి గురైన సింహాచలం తన తండ్రి సోమయ్య ఎడమ చెవి వద్ద కర్రతో బలంగా కొట్టాడు. దీంతో సోమయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషయాన్ని పోలీసుల విచారణలో సింహాచలం అంగీకరించడంతో కేసు నమోదు చేసి సోమవారం రిమాండ్కు తరలించినట్లు సాలూరు రూరల్ సీఐ రామకృష్ణ తెలిపారు. ఇద్దరు గిరిజనులకు గాయాలుభామిని: మండలంలోని బొడ్డగూడకు చెందిన ఆరిక రామయ్య, తులసి గ్రామానికి చెందిన మోహనరావు సోమవారం వేకువజా మున జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఒడిశాలోని పర్లాకిమిడికి వారిద్దరూ బైక్పై వెళ్తుండగా మంచు తాకిడికి రోడ్డు కనిపించక పోవడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. గాయపడిన వారిద్దరికీ ముందుగా పర్లాకిమిడి ఆస్పత్రిలో వైద్యసేవలు అందించిన అనంతరం ఆరిక రామయ్యను శ్రీకాకుళం రిమ్స్కు, మోహనరావును సీతంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇద్దరికి గాయాలువీరఘట్టం: మండలంలోని సీఎస్పీ రహదారిలో కడకెల్ల వద్ద సోమవారం రాత్రి 9 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరఘట్టానికి చెందిన బంగారం వ్యాపారి, వైఎస్సార్సీపీ నాయకుడు వూణ్ణ శ్రీనివాస్ (కోణార్క్ శ్రీను), ఆర్టీసీ డ్రైవర్ శ్రీను తీవ్రంగా గాయపడ్డారు. వారిద్దరూ బుల్లెట్పై గరుగుబిల్లి మండల ఖడ్గవలస వెళ్లి తిరిగి వస్తుండగా కడకెల్ల వద్ద రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాలను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.ఇటీవల కొత్తగా వేస్తున్న విద్యుత్ లైన్స్ కోసం కొన్ని విద్యుత్ స్తంభాలను కడకెల్ల వద్ద రోడ్డు పక్కనే డంపింగ్ చేశారు. అయితే ఖడ్గవలస నుంచి వస్తున్న వీరు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి రోడ్డు పక్కనే డంపింగ్ చేసిన విద్యుత్ స్తంభాలను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సంఘటనా స్థలంలో ఉన్నవారు తెలిపారు. క్షతగాత్రులను వైద్య చికిత్సల కోసం పార్వతీపురం తరలించారు. కారును ఢీకొట్టిన కంటైనర్● త్రుటిలో తప్పిన పెనుప్రమాదంగజపతినగరం: మండల కేంద్రంలో స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదురుగా ఉన్న లక్ష్మిషాపింగ్ కాంప్లెక్స్ వద్ద జాతీయ రహదారిలో అదుపు తప్పి ఆదివారం రాత్రి పార్కింగ్లో ఉన్న ఓకారును కంటైనర్ బలంగా ఢీకొట్టింది. ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. విశాఖ పట్నంనుంచి రామభద్రపురం వెళ్తున్న కంటైనర్ మార్గమధ్యంలో అదుపు తప్పి గజపతినగరంలో లక్ష్మిషాపింగ్ కాంప్లెక్స్ లోకి దూసుకు పోయింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జయింది. ఆదివారం మార్కెట్ సెలవు కావడంతో అక్క జనసంచారం లేదు. లేదంటే భారీ ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు తెలిపారు. 108 డ్రైవర్ ఆత్మహత్యపార్వతీపురం రూరల్: పదుల సంఖ్యలో ప్రాణాలను కాపాడే 108 వాహనానికి సారథిగా ఉండి, తన కుటుంబాన్ని మాత్రం ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించుకోలేక ఓ డ్రైవర్ తనువు చాలించాడు. అప్పుల బాధ తాళలేక మనస్తాపంతో గడ్డిమందు తాగి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే పార్వతీపురం పట్టణానికి చెందిన కంది గిరిప్రసాద్ (46) గడిచిన 18 ఏళ్లుగా 108 అంబులెనన్స్ డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో ఈ నెల 21న విధుల్లో ఉండగానే, మల విసర్జన సాకుతో బయటకు వెళ్లి కేంద్రాస్పత్రి సమీపంలో గడ్డిమందు తాగేశాడు. ఈ విషయం గమనించి తోటి సిబ్బంది వెంటనే మెరుగైన చికిత్స కోసం విజయనగరం తరలించగా చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశాడు. మృతుడికి భార్య లక్ష్మి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
కరాటే చాంపియన్షిప్లో పతకాలు
విజయనగరం అర్బన్: విశాఖలో ఇటీవల జరిగిన 19వ కెన్యూరియో కరాటే చాంపియన్షిప్–2025లో పట్టణానికి చెందిన సత్య డిగ్రీ/పీజీ కళాశాల విద్యార్థులు పతకాలు సాధించారు. బంగారు పతకాలు సాధించిన వారిలో పి.హర్షవర్ధన్(2), సీహెచ్.రిషిత, పి.గురుసిద్దిక్, ఎన్.వేవన్ష్, ఎస్.శ్రీవత్సవ్, ఎస్.నవ్య, కె.ప్రేమేష్ ఉన్నారు. కాంస్య పతకాలు సాధించిన వారిలో కె.తనుశ్రీ, సీహెచ్.రిషిత, ఎన్.దేవాన్ష్, కె.ప్రేమేష్, వి.ఇందిరా ప్రియదర్శిని, మహమ్మద్ సమీర్, ఎం.హర్హవర్ధన్, కె.శివగణేష్, పి.గగన్సాయి, బి.లేవాన్ ఉన్నారు. రజత పతకం సాధించిన వారిలో కె.తనుశ్రీ, ఎం.యోగిత, పి.గురుసిద్ధిక్, ఎస్.శ్రీవత్సవ్, ఎస్.నవ్య, ఎన్.జనని, వి.ఇందిరా ప్రియదర్శిని, జి.వివేక్ వర్మ రెండు, మహమ్మద్ సమీర్, ఎం.హర్షవర్ధన్, కె.శివగణేష్, పి.కుష్వంత్కుమార్ (2), పి.గగన్ సాయి, బి.లేవాన్ ఉన్నారు. విజేతలను, కోచ్ కె.సంతోష్కుమార్, అసిస్టెంట్ కోచ్ శ్రీభార్గవ్ను కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు, కళాశాల ప్రిన్సిపాల్ ఎంవీసాయిదేవమణి అభినందించారు. -
వైద్యసేవలు వేగవంతం.. పారదర్శకతే లక్ష్యం
● విశాఖ జోనల్ సమీక్షలో హెల్త్ సెక్రటరీ సౌరబ్గౌర్ పార్వతీపురం రూరల్: వైద్యారోగ్య శాఖలో పారదర్శకతను పెంచి, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా అధికారులు పని చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కళాశాల వీసీ సమావేశ భవనంలో నిర్వహించిన ఉత్తర కోస్తా జిల్లాల ఆరోగ్య సమీక్షా సమావేశానికి పార్వతీపురం మన్యం జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.భాస్కరరావు తన వైద్యబృందంతో హాజరయ్యారు. జిల్లాలో ఆరోగ్య కార్యక్రమాల అమలుతీరు, ప్రగతి నివేదికలను కార్యదర్శికి వివరించారు. ఈ సందర్భంగా సౌరబ్ గౌర్ మాట్లాడుతూ.. కార్యాలయం వ్యవహారాలన్నీ ఇకపై ఈ–ఆఫీసు ద్వారానే నిర్వహించాలని, ప్రతి నివేదికను డిజిటలైజేషన్ చేయడం ద్వారా పర్యవేక్షణ సులభతరమవుతుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా మాతృ మరణాల విషయంలో కచ్చితమైన జవాబుదారీ తనం ఉండాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా క్షేత్రస్థాయిలో పటిష్ట ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. అధికారులు ఎప్పటికప్పుడు డ్యాష్ బోర్డులు, పోర్టల్లను పరిశీలిస్తూ వైద్య సేవలను పర్యవేక్షించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా నుంచి ప్రోగ్రాం అధికారులు డాక్టర్ టి. జగన్మోహనరావు, డాక్టర్ రఘు కుమార్, డాక్టర్ ఎం. వినోద్ కుమార్, డాక్టర్ కౌశిక్, డీపీఓ లీలారాణి, ఏఓ మణిరత్నం తదితర సిబ్బంది పాల్గొన్నారు. -
● భక్తిశ్రద్ధలతో ధనుర్మాస ఉత్సవాలు
● బొబ్బిలిలో అనసూయ సందడి జామి మండలంలోని అన్నంరాజుపేట పంచాయతీ పుష్పగిరి వేణుగోపాలస్వామి ఆలయంలో సోమవారం ధనుర్మాస మహోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఘణిహారం సీతారామాచార్యుల ఆధ్వర్యంలో స్వామివారికి, గోదాదేవికి నైవేద్యం సమర్పించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం ప్రసాద వితరణ చేశారు. ● వేంకటేశ్వర ఆలయంలో.. భీమసింగి సుగర్ ఫ్యాక్టరీ వేంకటేశ్వర స్వామి ఆలయంలోనూ ధనుర్మాస వేడుకలు వైభవంగా జరిగాయి. – జామి బొబ్బిలి పట్టణంలో సినీనటి అనసూయ సోమవారం సందడి చేశారు. ముందుగా ఎస్ఆర్ షాపింగ్ మాల్ను ప్రారంభించారు. అనంతరం షాపంతా కలియతిరిగారు. సరమైన ధరలకే వస్త్రాలను విక్రయించడం ఎస్ఆర్ షాపింగ్మాల్ ప్రత్యేకమని, వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. సంక్రాంతి ఆఫర్లను అందిపుచ్చుకోవాలన్నారు. అనంతరం తనను చూసేందుకు వచ్చిన అభిమానులకు అభివాదం చేస్తూ కొన్ని చిత్రాల పాటలకు స్టెప్పులు వేసి సందడి చేశారు. అభిమానులతో కేరింతలు కొట్టించారు. ప్రస్తుతం మూడు చిత్రాల్లో నటిస్తున్నట్టు తెలిపారు. టీవీ అయినా సినిమా అయినా ఒకేలా ప్రేమిస్తానన్నారు. జర్నలిస్టుగా పనిచేస్తూ ఈ రంగంలోకి వచ్చానన్నారు. సంప్రదాయబద్ధంగా ఉండడమంటే ఇష్టమని, అందుకే సోషల్ మీడియాలో నచ్చిన వారిని విమర్శించినా, కామెంట్ చేసినా వెంటనే స్పందిస్తానన్నారు. కార్యక్రమంలో షాపింగ్మాల్ యజమానులు ప్రసాదరెడ్డి, కేశవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు, మున్సిపల్ చైర్మన్ రాంబార్కి శరత్, వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధానకార్యదర్శి శంబంగి వేణుగోపాలనాయుడు, తదితరులు పాల్గొన్నారు. – బొబ్బిలి -
ఉత్తమ ఫలితాల సాధనే లక్ష్యం
● కలెక్టర్ రాంసుందర్రెడ్డి విజయనగరం అర్బన్: పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధన కోసం రూపొందించిన 100 రోజుల ప్రత్యేక బోధన ప్రణాళికను సమర్ధవంతంగా అమలు చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరలో పీజీఆర్ఎస్పై సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని 297 పాఠశాలల నుంచి 16,240 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరవుతారన్నారు. వీరందరూ ఉత్తీర్ణులయ్యేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. ప్రత్యేకాధికారులు, మండల అధికారులు తమ లక్ష్యాలకు అనుగుణంగా పాఠశాలల తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. వారానికి కనీసం నాలుగు సార్లు సచివాలయాలను సందర్శించాలని మండల ప్రత్యేకాధికారులు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. తనిఖీ వివరాలను గూగుల్ షీట్లో నమోదు చేయాలన్నారు. సమావేశంలో జేసీ సేతుమాధవన్, డీఆర్వో మురళి పాల్గొన్నారు. పీఎంఏజీవైను విజయవంతం చేయాలి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రధాన మంత్రి గ్రామీణ ఆదర్శ యోజన (పీఎంఏజీవై) పథకాన్ని జిల్లాలో సమర్ధవంతంగా అమలుచేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సంబంధిత శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ పథకం అమలుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ 500 జనాభా కలిగి అందులో కనీసం 40 శాతం షెడ్యూల్డ్ కులాల వారు నివసిస్తున్న మెరకముడిదాం, వంగర, తెర్లాం, ఆర్.ఆమదాలవలన మండలాల్లోని ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి ప్రతిపాదించామని చెప్పారు. ఈ పథకం కింద వివిధ అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల చొప్పున నిధులు అందుతాయని తెలిపారు. సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్ ఎం.అన్నపూర్ణమ్మ, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్పాణి, జెడ్పీ సీఈఓ సత్యనారాయణ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ పాల్గొన్నారు. -
మెరికల్లా తయారుకావాలి
విజయనగరం క్రైమ్: పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడంలో మెరికల్లా తయారుకావాలని విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి మహిళా పోలీస్ అభ్యర్థులకు పిలుపునిచ్చారు. విజయనగరం పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో 478 స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ కానిస్టేబుళ్ల శిక్షణను సోమవారం గంట కొట్టి సంప్రదాయబద్ధంగా ప్రారంభించారు. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని, శాంతిభద్రతల పరిరక్షణలో మహిళా పోలీసుల పాత్ర కీలకమన్నారు. శిక్షణలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కళాశాల ప్రిన్సిపాల్ రామచంద్రరాజుకు సూచించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ పి.వి.అప్పారావు, డీఎస్పీలు పి.శ్రీకాంత్, ఎమ్.మహేష్, టి.రమేష్, మెడికల్ ఆఫీసర్ ఉదయ కుమార్, ఏఓ టి.భవాని, సీఐ మంగవేణి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
క్రిస్మస్ శోభ
సిమ్స్ ఫ్లాటినం బాప్టిస్ట్ చర్చి విద్యుత్ వెలుగులో సెయింట్పాల్ లూథరిన్ చర్చి క్రిస్మస్ను పురస్కరించుకుని విజయనగరం జిల్లా కేంద్రంలోని చర్చిలను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. ప్రార్థనా మందిరాలను ముస్తాబు చేస్తున్నారు. వివిధ అలంకరణల్లో క్రిస్మస్ట్రీలు, స్టార్స్ చూపరులను ఆకట్టుకుంటున్నాయి. జిల్లా కేంద్రంలో క్రిస్మస్ శోభ కళ్లకుకడుతోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం -
11 నెలల్లో 77 కేసుల నమోదు
● కొద్ది రోజుల కిందట జామి మండలం భీమషింగి వద్ద ఆటోలో పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తుండగా సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. బియ్యం ఒడిశాకు అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు. ● ఈ ఏడాది జూన్ నెలలో బొండపల్లి మండలం కొండకిండాం, కిండాం ఆగ్రహారంలోని కోళ్ల ఫారం, మామిడి తోటల్లో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. సుమారు 480 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని రేషన్ షాపులకు సరఫరా చేసే నార సంచులతోనే నేరుగా తరలించేశారు. అక్కడి నిల్వలను చూసి అధికారులే ఆశ్చర్యపోయారు. విజయనగరం ఫోర్ట్: జిల్లాలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. రేషన్ డిపోల నుంచి నేరుగా తరలించి వ్యాపారులు సొమ్ముచేసుకంటున్నారు. దీనివెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేదలకు అందాల్సిన వేలాది టన్నుల బియ్యం తరలింపు నిత్యకృత్యంగా మారడం ఇప్పుడు అధికార వర్గాలను సైతం విస్మయపరుస్తోంది. కొందరు అధికారులకు ఈ వ్యవహారం తెలిసినా చూసీచూడనట్టు వ్యవహారిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ● ఓ టీడీపీ నేత అండతోనే... జిల్లాకు చెందిన ఓ టీడీపీ నేత అండతోనే బియ్యం వ్యాపారులు యథేచ్ఛగా పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్నట్టు సమాచారం. పీడీఎస్ బియ్యం తరలిస్తున్న సమయంలో ఎక్కడైనా అధికారులు పట్టు కునే ప్రయత్నిం చేసినప్పుడు సదరు నేత అధికారులకు ఫోన్ చేసి... ‘వాళ్లు మా వాళ్లే.. బియ్యంతో పాటు వదిలేయండి’ అని ఫోన్ చేస్తున్నారని తెలిసింది. నేత అండదండలతో బియ్యం మాఫియా బరితెగిస్తోంది. కొంతమంది రేషన్ డీలర్ల సహకారంతో నేరుగా రేషన్ షాపుల నుంచే పీడీఎస్ బియ్యాన్ని తరలించేస్తున్నారు. అయినప్పటకీ వారిపై ఎటువంటి చర్యలు ఉండడం లేదు. గ్రామాల్లో చిరువ్యాపారులు నుంచి పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి కొంతమంది వ్యాపారులు పీడీఎస్ బియ్యాన్ని సరిహద్దులు దాటిస్తున్నారు. జిల్లాలో 11 నెలల్లో పీడీఎస్ బియ్యం తరలింపుపై–6ఏ కేసులు 77 నమోదుచేశారు. వారి నుంచి 729.91 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఇంతకు 30 రెట్లు పీడీఎస్ బియ్యం తరలిపోతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనిఖీలకు ఆదేశం పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రతినెలా సీఎస్డీటీలు ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. తనిఖీలు మరింతగా చేసేలా ఆదేశాలు ఇచ్చాం. – జి.మురళీనాథ్, జిల్లా పౌరసరఫరాల అఽధికారి చంద్రబాబు ప్రభుత్వ పాలనలో పేదల బియ్యం పక్కదారి.. నామమాత్రంగా అధికారుల తనిఖీలు! రేషన్ దుకాణాల నుంచి నేరుగా తరలిపోతున్న బియ్యం సరిహద్దులు దాటించేస్తున్న బియ్యం వ్యాపారులు 11నెలల్లో 77 కేసుల నమోదు 729.91 క్వింటాళ్లు స్వాధీనం -
శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకం
రాజ్యాంగ హక్కులను హరించడమే.. నైపుణ్యం సాధించండి ● విశాఖ డీఐజీ గోపీనాథ్ జెట్టి ● చింతలవలస ఏపీఎస్పీ ఐదో బెటాలియన్, విజయనగరం కంటోన్మెంట్ పోలీస్ బ్యారెక్స్లో పోలీస్ శిక్షణ ప్రారంభం కురుపాం: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం బలహీన పరచడం అనేది రాజ్యాంగబద్ధంగా గ్రామీణ కార్మికులకు కల్పించిన హక్కులను హరించడమేనని, ఇది ఆదివాసీ, ఆర్థికంగా అనగారిన ప్రజల జీవన గౌరవంపై నేరుగా దాడి చేయడమేనని మాజీ కేంద్ర మంత్రి, జాతీయ ఉపాధి హామి పథకం రూపకల్పన కమిటీ సభ్యుడు వైరిచర్ల కిశోర్చంద్ర సూర్యనారాయణదేవ్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణతో పాటు నిరుపేదలకు ఆహార భద్రత కల్పించాలన్న ఉద్దేశంతో జాతీయ గ్రామీణ ఉపా ధి హామీ చట్టం తీసుకువచ్చినట్టు పేర్కొన్నారు. తను గిరిజన వ్యవహారాల, పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్న సమయంలో గిరిజన ప్రాంతాల్లో సమ స్యలు అక్కడ ఉండే ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా షెడ్యూల్డ్ ప్రాంతాల్లో 150 రోజుల పనిదినాలు చేశామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు చేస్తున్న చర్యలు సరైనవి కాదన్నారు. విజయనగరం క్రైమ్/డెంకాడ: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమైనదని విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి అన్నారు. నూతనంగా ఎంపికై న కానిస్టేబుళ్లకు చింతలవలస ఏపీఎస్పీ ఐదో బెటాలియన్, విజయనగరం కంటోన్మెంట్ పోలీస్ బ్యారెక్స్లో సోమవారం శిక్షణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగిన తొలి పోలీస్ అధికారి కానిస్టేబుల్ అని అన్నారు. శిక్షణ కాలం ఎంతో విలువైనదని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉద్యోగ జీవితంతో పాటు వ్యక్తిగత జీవితానికి కూడా శిక్షణలోని క్రమశిక్షణ దోహదపడుతుందన్నారు. శారీరక దృఢత్వంతో పాటు మానసిక సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ప్రజలకు సేవ చేయాలనే భావన బలంగా ఉండాలన్నారు. చట్టం పట్ల గౌరవం, విధి నిర్వహణలో నిజాయితీ, సమయపాలన వంటి లక్షణాలు పోలీస్ జీవితంలో అత్యంత అవసరమని చెప్పారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలు భవిష్యత్లో ప్రజల శాంతి భధ్రతల పరిరక్షణకు ఉపయోగపడాలన్నారు. 9 నెలల పాటు శిక్షణ కొనసాగుతుందని, రెండు చోట్లకు శిక్షణకు వచ్చిన 395 మంది పోలీస్ అభ్యర్థులు సమర్థవంతంగా శిక్షణ పూర్తి చేయాలని కోరారు. ఏపీఎస్పీ, సీవిల్ విభాగాలు వేర్వేరుకాదని, అందరమూ ఏపీ రాష్ట్ర పోలీస్ విభాగానికి చెందిన వారమేనన్న విషయాన్ని మరువరాదని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ అన్నారు. శిక్షణలో అవుట్ డో ర్, ఇండోర్ శిక్షణతో పాటు టెక్నాలజీ, కమ్యూనికేషన్ స్కిల్స్, యోగా, ఆయుధాల వినియో గం, స్విమ్మింగ్, మ్యాప్ రీడింగ్లో పట్టుసాధించాలన్నారు. సైబర్ నేరగాళ్లను అరికట్టే సైబర్ వారియర్స్గా మారాలన్నారు. శిక్షణకు వచ్చినవారిలో 12 మంది పోస్టు గ్రాడ్యుయేషన్, 28 మంది బీటెక్, ముగ్గురు ఎల్ఎల్బీ, ఇద్దరు జర్నలిజం, మిగిలిన వారు డిగ్రీ, ఇంటర్మీడియట్ చదివినవారు ఉన్నారని డీపీటీసీ ప్రిన్సిపాల్, అదనపు ఎస్పీ పి.సౌమ్యలత తెలిపారు. శిక్షణ వచ్చే ఏడాది సెప్టెంబర్ 21 కి పూర్తవుతుందన్నారు. కార్యక్రమంలో ఏపీఎస్పీ ఐదో బెటాలియన్ కమాండెంట్ వై.రవిశంకర్ రెడ్డి, ఒకటవ బెటాలియన్ కమాండెంట్ సీహెచ్వీఎస్ పద్మనాభరాజు, 16వ బెటాలియన్ కమాండెంట్ అరుణ్బోస్, డీపీటీసీ డీఎస్పీ పి.నారాయణరావు, డీఎస్పీలు ఎం.వీరకుమార్, ఆర్.గోవిందరావు, ఇ.కోటిరెడ్డి, డీపీఓ ఏఓ పి.శ్రీనివాసరావు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. కేంద్ర మాజీ మంత్రి, జాతీయ ఉపాధి హామీ రూపకల్పన కమిటీ సభ్యుడు కిశోర్ చంద్ర సూర్యనారాయణ దేవ్ -
● చదువుకు అండ
నా పేరు వరిరెడ్డి పూజ. కొమరాడ మండలంలోని మాదలింగి గ్రామం. నిరుపేద కుటుంబం. నాకు తమ్ముడు రాంమకుమార్, చెల్లి శ్రీజ ఉన్నారు. మా చిన్నతనంలోనే తండ్రి చనిపోయారు. అమ్మ దమయంతికి వచ్చిన టైలరింగ్ వృత్తితో మా జీవనం సాగేది. ఉన్నత చదువులు చదివించాలని అమ్మ కలలు కనేది. ఊర్లో ఉన్న పాఠశాల వరకు మాత్రమే చదివించగల ఆర్ధిక స్థోమత మాత్రమే ఉండేది. ఫీజురీయింబర్స్ ఆర్థిక సాయంతో పిల్లలను చదివించవచ్చని అమ్మ తెలుసుకొని నన్ను ఇంజిరింగ్ విద్యకు ప్రోత్సహించింది. దీనివల్లే నేను ఇంజినీరింగ్ ఈసీఈ కోర్సు పూర్తిచేసి ప్రస్తుతం హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ సంస్థలో ఇంజినీరింగ్ వృత్తిలో స్థిరపడ్డాను. తమ్ముడు ఐటీఐ పూర్తిచేసి ఉద్యోగం తెచ్చుకున్నాడు. చెల్లి కూడా అమ్మఒడి సాయంతో చదువుకుంది. ఫీజురీయింబర్స్మెంట్తో గత ప్రభుత్వం సాయం చేయకపోతే చదువు పాఠశాల విద్యతోనే నిలిచిపోయేది. -
● ఆదుకున్న కుటీర పరిశ్రమ
నా పేరు చప్ప మౌనిక. వంగర మండలంలోని కొప్పర గ్రామం. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. భర్త శ్రీనివాసరావు ఎమ్మెస్సీ బీఈడీ పూర్తి చేసినా ఉద్యోగం రాలేదు. ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాం. గత ప్రభుత్వ హయాంలో వైఎస్సార్ ఆసరా, సీ్త్రనిధి, జగనన్నతోడు వంటి పథకాలతో రూ.2లక్షల సాయం అందింది. వీటితో పిడికర్రలు (మాప్ స్టిక్స్), కొండచీపుర్లు తయారీ యూనిట్ను ఇంటివద్ద ప్రారంభించాను. ఇప్పుడు నెలకు రూ.15వేలు సంపాదిస్తున్నాను. సాయం అందేలా చేసిన జగనన్న మేలు మరచిపోలేనిది. ● ఆదుకున్నారు నా పేరు బోదంకి సంతోష్కుమార్. మా నాన్న పేరు కృష్ణ. అమ్మ పేరు కనకం. మాది విజయనగరం మండలం రాకోడు గ్రామం. మూడేళ్ల కిందట బీపీ ఎక్కువై పడిపోవడంతో మెదడులోని రక్తనాళాలు చిట్లిపోయాయి. రూ.3 లక్షలు అప్పుచేసి ఆపరేషన్ చేయించారు. విషయం తెలుసుకున్న అప్పటి డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేయించారు. రూ. 2.20 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు కావడంతో అప్పుతీర్చగలిగాం. ఆయన మేలు మరచిపోలేం. ఆయనకు ముందుస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు. -
క్రమ‘శిక్షణ’తో పూర్తిచేయండి
విజయనగరం క్రైమ్: కానిస్టేబుల్ ఉద్యోగం మిగిలిన శాఖల కన్నా భిన్నమైనది.. విధి నిర్వహణలో క్రమశిక్షణ, అంకితభావాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది.. మారుతున్న నేరాలకు అనుగుణంగా వృత్తి నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలి.. సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని పోలీస్ అభ్యర్థులకు ఎస్పీ దామోదర్ దిశానిర్దేశం చేశారు. జిల్లా నుంచి ఎంపికై న 116 మంది అభ్యర్థుల్లో 38 మంది మహిళలను ఒంగోలు పీటీసీకి, 78 మంది పురుషులను చిత్తూరు పీటీసీకి శిక్షణకు వేశారు. ఈ సందర్భంగా వారితో పోలీస్ బ్యారెక్స్లో శనివారం ఎస్పీ మమేకమయ్యారు. శిక్షణలో నేర్చుకోవాల్సిన అంశాలను వివరించారు. శిక్షణలో ప్రతిభ చూపి జిల్లాకు పేరుతీసుకురావాలని సూచించారు. రాబోయే రోజుల్లో సైబర్ నేరాలు, మోసాలు సవాల్గా మారుతాయని, వాటిని ఛేదించే నైపుణ్యాలు మన సొంతం కావాలన్నారు. కానిస్టేబుల్ ఉద్యోగమేనన్న నిరాశ వద్దని, మంచి క్రమశిక్షణతో బాధ్యతలు నిర్వహిస్తే ఎస్ఐ, సీఐ, డీఎస్పీ స్థాయికి ఎదగవచ్చన్నారు. శిక్షణ సమయంలో వివిధ చట్టాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నారు. 9 నెలల శిక్షణ పూర్తయ్యేనాటికి ప్రతి ఒక్కరూ మెరికల్లా తయారుకావాలన్నారు. సమాజానికి పట్టిన జబ్బును వదిలించే డాక్టర్లా పోలీసులు పనిచేయాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో అదనవు ఎస్పీ పి.సౌమ్యలత, డీపీఓ ఏఓ పి.శ్రీనివాసరావు, ఎస్బీ సీఐ ఎ.వి.లీలారావు, సీసీఎస్ సీఐ ఎస్.కాంతారావు, రిజర్వు ఇన్స్పెక్టర్లు ఎన్.గోపాలనాయుడు, టి.శ్రీనివాసరావు, ఆర్ఎస్ఐ నీలిమ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ అభ్యర్థులకు ఎస్పీ దిశానిర్దేశం వృత్తి నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలి జిల్లాకు పేరు తేవాలి ఒంగోలు, చిత్తూరు పీటీసీల్లో జిల్లా అభ్యర్థులకు శిక్షణ -
అంబేడ్కర్ మార్గంలో నడుద్దాం..
విజయనగరం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినం పురస్కరించుకుని అంబేడ్కర్ రైట్స్ ఫోరమ్ ఆంధ్రప్రదేశ్ శాఖ రూపొందించిన కరపత్రాలను జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీసీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ధర్మపురిలో గల సిరి సహస్ర రైజింగ్ ప్యాలెస్లో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తుందన్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ రాజ్యాంగంలో విద్య, వైద్యం ప్రభుత్వం అమలు చేయాలని ప్రాథమిక హక్కులలో భాగంగా ఉంటే చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయటం లేదని అన్నారు. కార్పొరేట్ సంస్థలకు జీవో నెంబర్ 590 ద్వారా మెడికల్ కాలేజ్లను అప్పగించి పేద వర్గాలకు వైద్య విద్యను, వైద్యాన్ని దూరం చేయడం దారుణమన్నారు. 2019 – 2024 మధ్య కాలంలో సంక్షేమ పథకాల ద్వారా రూ.రెండు లక్షల కోట్లు ఆర్థిక సాయం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే చెందుతుందని పేర్కొన్నారు. జగన్మోహన్రెడ్డి విజయవాడలో 127 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని రూ.404 కోట్లు ఖర్చు పెట్టి 19 ఎకరాల్లో చేపట్టిన సృతి వనాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో వేపాడ మండల పార్టీ అధ్యక్షులు జగ్గు బాబు, అంబేడ్కర్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భానుమూర్తి, కార్పొరేటర్ బోనేల ధనలక్ష్మి, బుధరాయవలస మఽధు తదితరులు పాల్గొన్నారు. జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు -
ప్రభుత్వ బడిలో ఏఐ పాఠాలు
చీపురుపల్లి: చదువు మాత్రమే పేదరికాన్ని దూరం చేస్తుందని, విద్యార్థులు ప్రయోజకులైతే ఆ కుటుంబాలు బాగుపడతాయని నమ్ముతూ ప్రభుత్వ బడుల్లో చదివే పేద విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే నాణ్యమైన విద్యను అందించేందుకు నాటి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కృషిచేసింది. నాడు–నేడుతో ప్రభుత్వ బడులకు ఆధునిక హంగులు కల్పించడంతో పాటు ట్యాబ్లు, బైజూస్ కంటెంట్తో పాఠ్యాంశాలను బోధించేలా విద్యాసంస్కరణలు చేపట్టింది. అక్కడితో ఆగకుండా ప్రస్తుత రోజుల్లో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్సీ(ఏఐ) ప్రపంచాన్ని శాసిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఎనిమిదో తరగతి నుంచి ఏఐను పరిచయం చేయడంతోపాటు వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి భవిష్యత్ను తీర్చిదిద్దుకోలిగే సామర్థ్యాలు అందించాలని భావించారు. ఇంటెల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని 2024 మార్చి 2న చీపురుపల్లిలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పైలట్ ప్రాజెక్టు కింద ఏఐ ల్యాబ్ను ప్రారంభించారు. తరువాత కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ల్యాబ్లు ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ ప్రతిపాదన మూలకు చేరిన విషయం తెలిసిందే. ఆలిండియా ఏఐ ఇంపాక్ట్ ఫెస్టివల్లో చీపురుపల్లి విద్యార్థులు 2025 నవంబర్ నెలలో ఢిల్లీలోని అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో కేంద్ర విద్యాశాఖ, ఇంటెల్ సంస్థ సంయుక్తంగా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్సీ ఇంపాక్ట్ ఫెస్టివల్ నిర్వహించాయి. ఈ ఫెస్టివల్లో చీపురుపల్లి బాలుర ఉన్నత పాఠశాల నుంచి ఏఐ ల్యాబ్లో శిక్షణ తీసుకున్న ఆర్.హర్షిత (9వ తరగతి), పీవిఎల్.ప్రణవి, పి.తనిష్క్లు సిద్ధం చేసిన సిటిజన్ క్రెడిట్ కార్డు, ఏఐ ఆధారిత క్యూ మేనేజ్మెంట్ అనే రెండు ప్రాజెక్టులు ప్రదర్శించారు. వీటిని పరిశీలించిన ఇంటెల్ అంతర్జాతీయ వ్యవరాల ప్రతినిధి సారా కెంప్ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. భారత ప్రభుత్వ ఐటీ, ఎలక్ట్రానిక్స్ కార్యదర్శి ఎస్.కృష్ణన్ చీపురుపల్లి పాఠశాలను పేరును ప్రస్తావిస్తూ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. 50 ప్రాజెక్టులకు రూపకల్పన చీపురుపల్లి బాలుర ఉన్నత పాఠశాలలో ఏఐ ల్యాబ్ ఏర్పాటైనప్పటి నుంచి అక్కడ ఫెసిలిటేటర్ బాధ్యతలను అదే పాఠశాలలోని హిందీ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న ఏవీఆర్డీ ప్రసాద్కు అప్పగించారు. ఆయన శిక్షణలో ఏడాదిన్నర కాలంలో విద్యార్థులు 50 ప్రాజెక్టులు వరకు రూపొందించారు. ఏఐ ఫర్ ఫ్యూచర్ అనే యూట్యూబ్ ఛానల్ను కూడా తయారుచేసి అందులో వీరు తయారు చేసిన ప్రాజెక్టులను అప్లోడ్ చేస్తున్నారు. అందులో ప్రధానంగా బ్లైండ్ పీపుల్ అసిస్టెన్స్ డివైజ్ (బీఏడీ) యాప్ను తయారు చేశారు. ఇటీవల ఇదే పాఠశాలకు చెందిన ఆర్.హర్షిత, పీవీఎల్ ప్రణవి పారిశుద్ధ్యంపై ఎన్పవరింగ్ అవర్ శానిటేషన్ హీరోస్ పేరుతో సిటిజన్ క్రెడిట్ కార్డు అనే ప్రాజెక్టును రూపొందించారు. ఎంతో విలువైన సేవలందించే పారిశుద్ధ్యకార్మికులతో పాటు సమాజానికి ఉపయోగపడే ప్రతీ ఒక్కరికీ సిటిజన్ క్రెడిట్ కార్డు ద్వారా పాయింట్లు కేటాయించి వారికి విద్యుత్ బిల్లు, ఇంటి పన్ను వంటి అంశాల్లో రాయితీలు ఇవ్వడం ఈ సిటిజన్ క్రెడిట్ కార్డు ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. నాటి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ముందుచూపు చీపురుపల్లి బాలుర ఉన్నత పాఠశాలలో ఏఐ ల్యాబ్ ఏర్పాటు ఇంతవరకు 50 ఏఐ ప్రాజెక్టులు తయారు చేసిన విద్యార్థులు ఢిల్లీ స్థాయిలో ప్రదర్శనలు -
దీర్ఘకాలిక రెవెన్యూ సమస్యల పరిష్కారంపై దృష్టి : కలెక్టర్
విజయనగరం అర్బన్: జిల్లాలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో శనివారం నిర్వహించిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో ఆయన ఈ మేరకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యాన్ని స్పష్టం చేశారు. ఇందుకోసం అవసరమైన ప్రతిపాదనలు, సాధ్యమైన పరిష్కార మార్గాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ముందుగా జిల్లాలో ఉన్న ప్రధాన రెవెన్యూ పరమైన సమస్యలపై అధికారుల నుంచి వివరాలు సేకరించారు. సమావేశంలో రీసర్వే ప్రక్రియలో తలెత్తుతున్న సమస్యలపై చర్చించారు. సమావేశంలో జేసీ ఎస్.సేతుమాధవన్, డీఆర్వో మురళి, ఆర్డీవోలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు పాల్గొన్నారు. సవరవిల్లి–తూడెం–భోగాపురం రోడ్డు పనులు వేగవంతం చేయాలి సవరవిల్లి, తూడెం, భోగాపురం రోడ్డు కనెక్టివిటీకి సంబంధించిన ఏడీఏసీఎల్ ప్రతిపాదించిన రహదారి పనులపై కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి శనివారం తన చాంబర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిపాదిత రహదారిలో మామూలు కల్వర్టు స్థానంలో బాక్స్ కల్వర్టు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రహదారి నిర్మాణ పనులను ఆరు నెలలలోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో కలెక్టరేట్ నుంచి పీఆర్ శాఖ ఎస్ఈ శ్రీనివాసరావు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏడీఏసీఎల్ జీఎం ప్రవీణ్, ఆర్అండ్బీ ఎస్ఈ కాంతిమతి, సంబంధిత కాంట్రాక్టర్్ పాల్గొన్నారు. -
సీడీపీవోకు ఏసీడీపీవోగా బదిలీ
● ఆకస్మిక బదిలీపై అనుమానాలు విజయనగరం ఫోర్ట్: విజయనగరం అర్బన్ సీడీపీవో జి.ప్రసన్న కు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏసీడీపీవోగా డిప్యూటేషన్పై బదిలీ అయింది. ఈ మేరకు రాష్ట్ర సీ్త్ర, శిశు సంక్షేమ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అర్బన్ ప్రాజెక్టులో ఏసీడీపీవోకు ఇన్చార్జ్ సీడీపీవోగా బాధ్యతలు అప్పగించారు. అయితే సీడీపీవోల బదిలీ పక్రియ కొన్ని నెలలు క్రితమే ముగిసింది. ఎటువంటి బదిలీలు లేని సమయంలో సీడీపీవోను అది కూడా ఏసీడీపీవోగా డిప్యూటేషన్పై బదిలీ చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సీనియర్ సీడీపీవో, ఇన్చార్జ్ పీడీగా కూడా పని చేసిన ఆమెను ఏసీడీపీవోగా బదిలీ చేయడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. గత కొంత కాలంగా ఐసీడీఎస్లో అంతర్గత విబేధాలు తలెత్తినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్(పి.డి)కి సీడీపీవోకు మధ్య అంతర్గత విబేధాలు నడుస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ తరుణంలో సీడీపీవో బదిలీ జరగడం సర్వత్రా చర్చినీయాంశమైంది. ఇదే విషయాన్ని ఐసీడీఎస్ పి.డి విమలారాణి వద్ద సాక్షి ప్రస్తావించగా అల్లూరి సీతారామరాజు జిల్లాకు అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్లో డిప్యూటేషన్పై ఏసీడీపీవోగా ప్రసన్నను బదిలీ చేశారని తెలిపారు. ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ శ్రీకాకుళం రూరల్: హెచ్పీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్, బొల్లినేని మెడిస్కిల్ సంయుక్తంగా బ్యుటీషియన్, హోటల్ మేనేజ్మెంట్, జనరల్ డ్యూటీ అసిస్టెంట్ (నర్సింగ్), ప్రొడక్షన్ మిషన్ ఆపరేటివ్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు బొల్లినేని మెడిస్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు శనివారం తెలిపారు. విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ మేడపై ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కేంద్రంలో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఇంటర్, డిగ్రీ, డిప్లమో, ఐటీఐ, పదో తరగతి పూర్తి చేసిన 18 నుంచి 28 ఏళ్ల వారు అర్హులని తెలిపారు. శిక్షణలో ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తామన్నారు. పూర్తి వివరాలకు 7680945357, 7995013422 నంబర్లను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. విజయనగరం అర్బన్: పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల మంత్రి కొండపల్లి శ్రీనివాస్కు కొన్నేళ్లుగా పరిష్కారం కాని అపరిశుధ్య సమస్య ఎదురయింది. ఐటీఐలోని తరగతుల నిర్వాహణ భవనానికి ఆనుకొని ఉన్న గిరిజన సంక్షేమ వసతిగృహం నుంచి మరుగుదొడ్ల మురుగునీరు రావడాన్ని మంత్రి కొండపల్లికి అక్కడి ఐటీఐ విద్యార్థులు చెప్పుకున్నారు. కొన్నేళ్లుగా ఈ సమస్య కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి దృష్టిలో ఉంది. మరుగుదొడ్ల మురుగునీటి ప్రవాహం ఐటీఐ ప్రాంగణంలోకి రాకుండా కాలువను నిర్మించుకోవాలని జిల్లా గిరిజన సంక్షేమ అధికారి శ్రీనివాసరావుకు కొన్ని నెలల క్రితం ఆదేశాలిచ్చానని ఈ సందర్భంగా కలెక్టర్ రాంసుందర్రెడ్డి అన్నారు. సంబంధిత గిరిజన సంక్షేమ అధికారి పట్టించుకోకపోవడంపై మంత్రి ఎదుటే కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుదొడ్ల ప్రవాహ మరుగునీటి సమస్యను శాఖపరమైన ఉన్నదాధికారులకు తెలియజేసి ప్రత్యామ్నాయ మార్గం పనుల చేపట్టాలని మంత్రి ఆదేశాలిచ్చారు. అనంతరం ఐటీఐ ప్రాంగణంలో మొక్కలు నాటి, పరిసరాలను పరిశభ్రం చేశారు. కార్యక్రమంలో ఐటీఐ ప్రిన్సిపాల్ టీవీగిరి, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రశాంత్, గిరిజన సంక్షేమాధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు మృతి బలిజిపేట: మండలంలోని బర్లి గ్రామం సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన శశాంక్(20) మృతి చెందినట్టు ఎస్ఐ సింహాచలం తెలిపారు. వారి వివరాల ప్రకారం బర్లి గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి లారీ, మోటార్ సైకిల్ ఢీ కొనడంతో ముగ్గురు గాయాలవగా వీరిని బొబ్బిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో శశాంక్ పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడ నుంచి రాజాంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి తిరిగి అక్కడ నుంచి మెరుగైన వైద్య నిమిత్తం శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తెలిపారు. -
రైతన్నకు అండగా అగ్రిల్యాబ్లు
● గత ప్రభుత్వ హయాంలో విజయనగరం జిల్లాలో 8 అగ్రిల్యాబ్ల ఏర్పాటు బొబ్బిలి: గతంలో వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం జిల్లాలో ఏర్పాటుచేసిన అగ్రిల్యాబ్లు రైతన్నకు అండగా నిలుస్తున్నాయి. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల నాణ్యతను పరీక్షించేందుకు సహకరిస్తున్నాయి. మట్టి పరీక్షలు చేసి భూసార నివేదికలు అందిస్తున్నాయి. ఏ నేలలో ఏ పంట సాగుచేస్తే లాభదాయకమో తెలియజేస్తున్నాయి. గతంలో స్థానికంగా అగ్రిలాబ్లు లేకపోవడంతో రైతులకు ఇబ్బందులు ఎదురయ్యేవి. నాసిరకం విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో రైతులు నష్టపోయేవారు. దీనికి చెక్ చెబుతూ జిల్లాలోని నాలుగున్నర లక్షల మంది రైతులకు మేలుచేకూర్చేలా ఉమ్మడి విజయనగరం జిల్లాలో 8 చోట్ల అగ్రిల్యాబ్లను గత ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఒక్కోల్యాబ్కు రూ.55 లక్షలు వెచ్చించింది. జిల్లా కేంద్రంలో రూ.3.68 కోట్ల ఖర్చుతో జిల్లాస్థాయి ల్యాబ్ను నిర్మించింది. డాక్టర్ వైఎస్సార్ సమీకృత వ్యవసాయ ప్రయోగ శాలలుగా పిలిచే ఈ అగ్రిల్యాబ్లలో ముగ్గురు సిబ్బందిని నియమించింది. వీరి ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి రీజనల్ కోడింగ్ సెంటర్తో పాటు చైన్నె, బెంగుళూరు, ఫరీదాబాద్ ప్రాంతాల్లో నిర్వహించే పరీక్షల ఫలితాలను కోడింగ్ ద్వారా ఎంపికచేసి నాణ్యమయినవి, కానివి వీరు గుర్తించి రైతులకు ఆర్బీకేల ద్వారా సమాచారం అందించేవారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ల్యాబ్ల సేవలను అందకుండా చేస్తోందంటూ రైతులు వాపోతున్నారు. -
పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యం
పార్వతీపురం: జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు, చిన్నారులకు నాణ్యమైన పోషకాహారాన్ని అందించడమే లక్ష్యంగా పని చేయాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులతో ఆయన శనివారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అంగన్వాడీలకు పంపిణీ చేసే బియ్యం, కందిపప్పు, వంటనూనె నాణ్యతా ప్రమాణాలతో ఉండాలని ఎక్కడా నిల్వలు నిలిచిపోకుండా సకాలంలో సరఫరా చేయాలని ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అధికారులకు సూచించారు. చిన్నారులకు, గర్భిణులకు అందించే పాలు తాజాగా ఉండేలా చూడాలని ఏపీ డెయిరీ ద్వారా సరఫరా ప్రక్రియలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలన్నారు. కేంద్రాలకు సరఫరా చేసే కోడిగుడ్ల నాణ్యతను పర్యవేక్షించాలన్నారు. చిన్నారుల శారీరక పెరుగుదలకు అవసరమైన బాలామృతం, పోషకాహార కిట్ల పంపిణీని ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. మెనూ ప్రకారం పోషకాహారం అందించేలా అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. సమీక్షలో ఐసీడీఎస్ పీడీ టి.కనకదుర్గతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జేసీ యశ్వంత్కుమార్ రెడ్డి -
గ్రంథాలయాలకు చంద్ర గ్రహణం
మెరకముడిదాం: విద్యార్థులు, నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు ఉపయోగపడే గ్రంథాలయాలు చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారుతున్నాయనే చెప్పుకోవాలి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రంథాలయాలకు అవసరమయ్యే కొత్త పుస్తకాలు కొనుగోలు చేయకపోవడంతో పాత సమాచారంతో ఉన్న పుస్తకాలు పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఉపయోగపడడంలేదు. ఫలితంగా నిరుద్యోగులు గ్రంథాలయాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి సిబ్బంది కొరత కూడా తోడు కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ముఖ్యపాత్ర పోషిస్తున్న గ్రంథాలయాలు మూతపడే పరిస్థితి నెలకొంది. ఆధునిక దేవాలయాలుగా పేరుబడిన గ్రంథాలయాలు మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పు చెందకపోవడంతో అటు పాఠకులు, ఇటు నిరుద్యోగుల ఆదరణ కరువై నిర్వీర్యమవుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం గ్రంథాలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించకపోవడం, కొత్త పుస్తకాలు కొనుగోలుకు అనుమతులు లేకపోవడంతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు చేసేది లేక ఇతర మార్గాలను వెతుక్కుంటున్నారు. మరికొందరు విద్యార్థులు ఏఐ టెక్నాలజీని ఆశ్రయిస్తున్నారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో మొత్తం 41 గ్రంథాలయాలు ఉన్నాయి. వీటిలో గ్రేడ్ – 1 గ్రంథాలయాలు – 1, గ్రేడ్ – 2 గ్రంథాలయాలు – 4, గ్రేడ్ – 3 గ్రంథాలయాలు–33, గ్రామీణ గ్రంథాలయాలు – 3 వున్నాయి. ఉమ్మడి విజయనగరంలో వున్న 41 గ్రంథాలయాల్లో 26 గ్రంథాలయాలకు సొంత భవనాలు వుండగా మిగిలిన వాటిలో 8 గ్రంథాలయాలు అద్దె భవనాల్లోనూ, 7 గ్రంథాలయాలను అద్దె లేని భవనాలలో అధికారులు నిర్వహిస్తున్నారు. గడిచిన రెండేళ్ల కాలంలో క్రీడలు, ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులు గణనీయంగా మారాయి. అన్ని రంగాల్లో కరెంట్ అఫైర్స్ మారిపోయాయి. వీటన్నింటితో కూడిన పుస్తకాలు టెట్, డీఎస్సీతో పాటూ బ్యాంకింగ్ రంగానికి చెందని పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి గ్రంథాలయాల్లో అందుబాటులో లేవు. గ్రూప్ పరీక్షలకు హాజరయ్యే వారికి అవసరమైన ఎకనామీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ పుస్తకాలు అవసరం. నిరుద్యోగ అభ్యర్థులకు అప్డేట్ కరెంటు అఫైర్స్ అందుబాటులో లేకపోవడంతో గ్రంథాలయాలకు వచ్చిన అభ్యర్థులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. కొత్త పుస్తకాలు కొనుగోలులో చంద్రబాబు ప్రభుత్వం అలసత్వం గ్రంథాలయాలను వేధిస్తున్న పుస్తకాలు, సిబ్బంది కొరత అందుబాటులో లేని కాంపిటేటివ్ పుస్తకాలు ఉమ్మడి విజయనగరం జిల్లాలో 41 గ్రంథాలయాలు 11 లైబ్రేరియన్ల పోస్టులు ఖాళీ సిబ్బంది కొరతతో మూతపడుతున్న కొన్ని గ్రంథాలయాలువేధిస్తున్న ఉద్యోగుల కొరత ఇదిలా వుంటే మరోవైపు ఈ గ్రంథాలయాలను ఉద్యోగుల కొరత తీవ్రంగా వేధిస్తుంది. జిల్లా వ్యాప్తంగా 11 లైబ్రేరియన్ పోస్టులు, 2 రికార్డు అసిస్టెంట్ పోస్టులు, 14 ఆఫీసు సబార్డినేట్ పోస్టులు ఖాళీగా వున్నాయని అధికారులు చెబుతున్నారు. గ్రంథాలయాధికారులు 11, రికార్డు అసిస్టెంట్లు రెండు, ఆఫీస్ సబార్డినేట్లు 14 ఖాళీలున్నాయి. జిల్లాలో వున్న 41 గ్రంథాలయాల పరిధిలో 33,640 మంది సభ్యులు ఉన్నట్టు రికార్డులు చెబుతున్నాయి. లైబ్రేరియన్ల కొరత కారణంగా కొన్ని లైబ్రేరీలకు ఇన్చార్జ్లే దిక్కుగా మారింది. అదే విధంగా మరోవైపు ఇన్చార్జ్ బాధ్యతలను నిర్వహిస్తున్న లైబ్రేరియన్లకు అదనపు పని భారంతో పాటూ ఆర్థిక భారం కూడా తోడవుతుందంటున్నారు. అదనంగా చేస్తున్న పనికి ప్రభుత్వం అదనంగా జీతం ఇవ్వడం లేదు సరికదా కనీసం టీఏ, డీఏలైనా ఇవ్వకపోతే తమ వేతనాల్లో నుంచి ఎన్నాళ్లు ఖర్చు చేయగలగమని వాపోతున్నారు. -
ఏఐ ల్యాబ్తో గొప్ప లక్ష్యం
ఎంతో గొప్ప లక్ష్యంతో 2024 మార్చి2న గత ప్రభుత్వం ఏఐ ల్యాబ్ను చీపురుపల్లి బాలుర ఉన్నతపాఠశాలలో ఏర్పాటు చేసింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఇదొక వరం. ల్యాబ్ ఏర్పాటైనప్పటి నుంచి దాదాపు 50 ప్రాజెక్టులు వరకు విద్యార్థులు తయారుచేశారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఆర్టిఫీషియల్ ఇంప్లాక్ట్ ఫెస్టివల్లో తమ పాఠశాల విద్యార్థులు చేసిన ప్రాజెక్టులను కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ కార్యదర్శి ఎస్.కృష్ణన్, ఇంటెల్ సంస్థ అంతర్జాతీయ వ్యవరాల ప్రతినిధి సారా కెంప్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులు సాంకేతిక రంగంలో ఎదిగేందుకు ఇదొక గొప్ప అరుదైన అవకాశం. పాఠశాల హెచ్ఎం ఉమామహేశ్వరి ప్రోత్సాహంతో విద్యార్థులకు ఏఐ పాఠాలు బోధిస్తున్నాం. – ఏవీఆర్డి.ప్రసాద్, ఏఐ ల్యాబ్ ఫెసిలిటేటర్, చీపురుపల్లి -
మాకూ చలివేస్తోంది...
మనుషులనే కాదు మూగజీవాలను చలి వణికిస్తోంది. వెచ్చదనం కోసం అన్ని జీవులూ పాకులాడుతున్నాయి. దీనికి బొబ్బిలి పట్టణంలోని సీబీఎం బాలికల హైస్కూల్ వద్ద శుక్రవారం కనిపించిన ఈ చిత్రమే నిదర్శనం. ఇక్కడ రోడ్డుకిరువైపులా ఆకు కూరలు, కూరగాయలమ్మే విక్రయదారులు సాయంత్రం ఇంటికి వెళ్లే ముందు అక్కడి చెత్తను తగులబెడతారు. వారు కొద్దిసేపు చలికాచుకున్నాక ఇళ్లకు వెళ్లిపోతారు. అంతవరకూ రోడ్డుపై సంచరించే ఆవులన్నీ మంట వద్దకు వెళ్లి ఇలా వెచ్చదనం పొందుతాయి. మాకూ చలి ఉందనే సంకేతాన్నిస్తున్నాయి. – బొబ్బిలి -
ప్రజావ్యతిరేక పాలనను ఎండగట్టండి
చీపురుపల్లిరూరల్(గరివిడి): చంద్రబాబు ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనను ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. గరివిడిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, బొత్స అనూషతో పాటు నాలుగు మండలాలకు చెందిన నాయకులతో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 21న చేపట్టే వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు, రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా అమలుచేయలేదన్నారు. పింఛన్లు, ఫీజురీయింబర్స్మెంట్, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ ఇలా.. ఏ పథకమూ లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో అందలేదన్నారు. 18 నెలల పాలనలో అప్పులు మినహా సంక్షేమపాలన కనిపించడంలేదన్నారు. నాయకులతో మాట్లాడి గ్రామాల్లో పరిస్థితులపై ఆరా తీశారు. కార్యక్రమంలో మీసాల విశ్వేశ్వరరావు, వలిరెడ్డి శ్రీనువాసులనాయుడు, మీసాల వరహాలనాయుడు, బెల్లాన వంశీకృష్ణ, సీర అప్పలనాయుడు, పొట్నూరు సన్యాసినాయుడు, తోట తిరుపతిరావు, కోట్ల విశ్వేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
నేర పరిశోధనలో రాష్ట్రస్థాయి అవార్డు
పార్వతీపురం రూరల్: నేర పరిశోధనలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను పార్వతీపురం మన్యం జిల్లా పోలీసులకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు దక్కింది. దర్యాప్తులో చాకచక్యం ప్రదర్శించిన కేసులకు ఇచ్చే ‘ఏబీసీడీ’ అవార్డుల్లో జిల్లా పోలీసు శాఖ రాష్ట్రంలోనే రెండో స్థానాన్ని దక్కించుకుంది. శుక్రవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చేతుల మీదుగా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి, గత ఏఎస్పీ అంకిత సురానా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. సాలూరు మండలం చీపురువలస సమీపంలోని ఒక జీడితోటలో యువతి మృతదేహం లభ్యమైన కేసును పోలీసులు సవాలుగా తీసుకున్నారు. తొలుత అనుమానాస్పద మృతిగా నమోదైన ఈ కేసును, ఎస్పీ ఆదేశాల మేరకు సాంకేతిక ఆధారాలతో విశ్లేషించారు. కాల్డేటా, సీసీటీవీ ఫుటేజీ. సెల్ టవర్ లొకేషన్ సాయంతో అది ’హత్య’ అని తేల్చడమే కాకుండా, కేవలం 48 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. 2025 మొదటి త్రైమాసికంలో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఈ దర్యాప్తు అత్యుత్తమమైనదిగా నిలిచింది. ఈ కేసులో కీలక పాత్ర పోషించిన సాలూరు రూరల్ సీఐ పి.రామకృష్ణ, ఎస్సైలు నరసింహమూర్తి, వెంకట సురేష్, రమణ, క్లూస్ టీం సభ్యులను డీజీపీ అభినందించారు. -
రైస్ మిల్లులకు నోటీసులు జారీ
విజయనగరం ఫోర్ట్: మిల్లర్లు అదనపు ధాన్యం డిమాండ్ చేస్తున్నారంటూ రైతుల ఆవేదనను ఈ నెల 13న ‘రైతు కష్టం మిల్లర్ల పాలు’ అనే శీర్షికన ‘సాక్షి’లో ప్రచురించిన కథనంపై పౌరసరఫరాల సంస్థ అధికారులు స్పందించారు. రైతుల నుంచి అదనపు ధాన్యం డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చిన మిల్లర్లకు శుక్రవారం నోటీసులు జారీచేశారు. గంట్యాడ మండలం రావివలస వద్ద ఉన్న కనకదుర్గ రైస్ మిల్లు, చీపురుపల్లిలోని శ్రీకేవీఆర్ ఇండస్ట్రీ, కింతలిపేటలోని కేవీఆర్ వెంకట కామేశ్వరి రైస్ మిల్లు, బొబ్బిలి మండలం కోమటిపల్లిలోని శ్రీ మహాలక్ష్మి రైస్ మిల్లు, కలవరాయిలోని శ్రీలక్ష్మి సంతోషిమాత రైస్ మిల్లు, గొల్లపల్లిలోని శ్రీవిజయలక్ష్మి రైస్ మిల్లు, బొబ్బిలిలోని శ్రీ సాయి వెంకట కామేశ్వరి రైస్ మిల్లు, తెర్లాంలోని శ్రీ ఉమామహేశ్వరి రైస్ మిల్లుకు నోటీసులు జారీ చేసినట్టు సివిల్ సప్లై జిల్లా మేనేజర్ బి.శాంతి తెలిపారు. జిల్లాలో 29 స్క్రబ్ టైఫస్ కేసుల నమోదు విజయనగరం ఫోర్ట్: ఉమ్మడి విజయనగరం జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులు 29 నమోదైనట్టు డీఎంహెచ్ఓ ఎస్.జీవనకుమారి తెలిపారు. 194 మందిని పరీక్షించగా 29 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయిందన్నారు. పీహెచ్సీల్లో నిర్వహించిన ర్యాపిడ్ టెస్టులో పాజిటివ్ వస్తే ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ల్యాబ్లో ఎలిజా టెస్టు ద్వారా నిర్ధారిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం వ్యాధి సోకినవారంతా ఆరోగ్యంగానే ఉన్నారన్నారు. -
వాజ్పేయి ఆదర్శనీయులు
విజయనగరం రూరల్: మాజీ ప్రధాని, భారతరత్న ఏబీ వాజ్పేయి ఆదర్శనీయులని, ఆయన చూపిన మార్గంలోనే నరేంద్ర మోదీ సర్కారు పయనిస్తోందని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. వాజ్పేయి శతజయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్రవ్యాప్త సుపరిపాలన (బస్సు) యాత్రలో భాగంగా శుక్రవారం విజయనగరం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దేశాభివృద్ధికి వాజ్పేయి అనేక సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. ఆయన సంస్కరణ వాది అని కొనియాడారు. ఆయన స్థిరమైన నిర్ణయాలతో దేశం ఆర్థికంగా ముందుకు సాగుతుందని, నేడు దేశం ఆర్థికవృద్ధి రేటులో ప్రపంచంలో నాలుగో స్థానానికి చేరుకుందన్నారు. కొందరు దేశాధినేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం మనది డెడ్లీ ఎకానమీ అని ఎద్దేవా చేస్తూ, పొరుగు దేశానికి సాయం చేయాలని చూసినా మన దేశం సాధిస్తున్న ప్రగతిని ప్రపంచ ఆర్థిక సంస్థలు కొనియాడుతున్నాయన్నారు. యువత దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు. హింసా, వ్యసనాలకు లోనుకాకుండా మనం చేసే పనిమీద దృష్టి సారిస్తే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. వాజ్పేయి ఆదర్శభావాలను ప్రతీ ఒక్కరూ పాటించాలన్నారు. కార్యక్రమానికి ముందుగా విజయనగరం శివారు వై కూడలి వద్ద ఏర్పాటుచేసిన వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. ఆయన చూపిన మార్గంలోనే మోదీ సర్కారు పయనిస్తోంది 2047 నాటికి వికసిత్ భారత్ సుపరిపాలన యాత్రలో మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు -
నిబంధనలకు పాతర..!
విజయనగరం ఫోర్ట్: జిల్లా పౌరసరఫరాల సంస్థలో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ విధానంలో చేపట్టిన పోస్టుల భర్తీలో అవకతవకలు జరిగాయని, నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేపట్టారంటూ పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తంచేశారు. అర్హతలు కాదని డబ్బులు ఇచ్చిన వారికే పోస్టులు కట్టబెట్టారన్నది వారి ఆరోపణ. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో దర్యాప్తునకు విజిలెన్స్ అధికారులను నియమించారు. కొద్ది రోజులుగా అధికారుల దర్యాప్తులో వాస్తవాలు వెలుగుచూస్తున్నట్టు సమాచారం. పోస్టుల భర్తీలో జరిగిన అవకతవకలను గుర్తించినట్టు తెలిసింది. దర్యాప్తు నివేదికను ఒకటి రెండు రోజుల్లో ఉన్నతాధికారులకు అందజేయనున్నట్టు సమాచారం. ● ఇదీ పరిస్థితి... జిల్లా పౌరసరఫరాల సంస్థలో అకౌంటెంట్ గ్రేడ్–3 మూడు పోస్టులు (కాంట్రాక్టు పద్ధితిలో), డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టు–01 (ఔట్ సోర్సింగ్), టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్–3 పోస్టులు–07 (కాంట్రాక్ట్ పద్ధతిలో) భర్తీకి 2023 నవంబర్ 25వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చారు. అకౌంటెంట్ పోస్టుకు ఎం.కామ్ విద్యార్హత, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు ఏదైనా డిగ్రీ, ఎం.ఎస్ ఆఫీస్ అప్లికేషన్స్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బీఎస్సీ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ విద్యార్హతగా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన కొద్ది నెలలకే ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది. 2024 ఆగస్టులో పోస్టులు భర్తీ చేశారు. నోటిఫికేషన్లో ఇచ్చిన పోస్టుల భర్తీలో రోస్టర్ పాటించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోస్టర్ పాటించకపోవడం వల్ల అర్హత ఉన్నప్పటికీ ఉద్యోగం రాలేదని పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు అభ్యర్థులను అసలు ఇంటర్వ్యూకే పిలవలేదని చెబుతున్నారు. అకౌంటెంట్ పోస్టుల విషయంలో ఎస్సీ మహిళ కేటగిరికీ అభ్యర్థినికి పోస్టు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఈ రెండు రోస్టర్లు పాటించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజిలెన్స్ దర్యాప్తులో కూడా ఈ విషయం నిర్ధారణ అయినట్టు సమాచారం. కొన్ని పోస్టుల విషయంలో విద్యార్హత లేక పోయినప్పటకీ పోస్టులు కట్టబెట్టారన్న విమర్శలు ఉన్నాయి. విజిలెన్స్ అధికారుల దర్యాప్తుతో అర్హత లేకుండా ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళా అభ్యర్థి పేరు ఉప్పలాపు భారతి. ఈమెది నెల్లిమర్ల ప్రాంతం. జిల్లా పౌరసరఫరాల సంస్థ అకౌంటెంట్ పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్కు దరఖాస్తు చేశారు. అకౌంటెంట్ పోస్టుకు సంబంధించి అన్ని విద్యార్హతలు ఉన్నా ఆమెను ఇంటర్వ్యూకు పిలవలేదు. ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. దర్యాప్తు జరుగుతోంది పోస్టులు భర్తీచేసిన సమయంలో జిల్లా మేనేజర్గా విధుల్లో చేరలేదు. పోస్టుల భర్తీ ప్రక్రియ తెలియదు. విజిలెన్స్ అధికారుల దర్యాప్తు జరుగుతోంది. – బి.శాంతి, జిల్లా మేనేజర్, సివిల్ సప్లయీస్ సివిల్ సప్లై ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు..! అకౌంటెంట్ పోస్టుల భర్తీలో రోస్టర్ అమలు చేయలేదని ఆరోపణ విచారణ చేపడుతున్న విజిలెన్స్ అధికారులు పోస్టుల భర్తీకోసం డబ్బులు చేతులు మారాయన్న విమర్శలు -
● చంద్రన్నా... ఎరువు ఏదన్నా..?
మెరకముడిదాం: గర్భాం రైతుసేవా కేంద్రం వద్ద బస్తా యూరియా కోసం బారులు తీరిన రైతులు నెల్లిమర్ల రూరల్: వల్లూరు రైతు సేవా కేంద్రం వద్ద యూరియా కోసం రైతుల క్యూ రైతన్నను రబీలోనూ ఎరువు కష్టాలు వెంటాడుతున్నాయి. మొక్కజొన్న, కూరగాయల పంటలకు వేసేందుకు అవసరమైన యూరియా లభించక రైతులు ఆందోళన చెందుతున్నారు. బస్తా యూరియా కోసం ఆర్ఎస్కేలు, ప్రైవేటు దుకాణాల వద్ద రోజంతా పడిగాపులు కాస్తున్నారు. భూమి పత్రాలు, ఆధార్ కార్డులు పట్టుకుని క్యూ కడుతున్నారు. యూరియా కోసం గత ప్రభుత్వంలో ఎన్నడూ ఇలాంటి కష్టాలు ఎదుర్కోలేదని, చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక విత్తనం నుంచి పంట అమ్ముకునేవరకు కష్టాల నడుమ ‘సాగు’తున్నామంటూ రైతులు వాపోయారు. నెల్లిమర్ల మండలంలోని వల్లూరు, మెరకముడిదాం మండలంలోని గర్భాం ఆర్ఎస్కేల వద్ద బస్తా యూరియా కోసం శుక్రవారం గంటల తరబడి నిరీక్షించారు. చాలామంది రైతులకు ఎరువు అందక నిరాశతో వెనుదిరిగారు. – నెల్లిమర్ల రూరల్/మెరకముడిదాం -
1180 బూతుల్లో పల్స్పోలియో కార్యక్రమం
● డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి విజయనగరం ఫోర్ట్: జిల్లాలోని 1185 బూతుల్లో ఈ నెల 21న ఆదివారం పల్స్పోలియో నివారణకు చుక్కలమందు వేస్తామని డీఎంహెచ్ఓ ఎస్.జీవనరాణి తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అప్పుడేపుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. భారతదేశాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2014లో పోలియో రహిత దేశంగా ప్రకటిచిందన్నారు. అయినప్పటకి కొన్ని దేశాల్లో పోలియో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో పల్స్పోలియో కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్టు తెలిపారు. 1999లో చివరి సారిగా జిల్లాలో రెండు పోలియో కేసులు కర్లాం, ముంజేరులో నమోదయ్యాయన్నారు. జిల్లాలో 2,45,667 ఓపీవీ వ్యాక్సిన్ డోసులు సిద్ధం చేశామన్నారు. చుక్కల మందు వేసేందుకు 2,360 బృందాలు, 129 మంది సూపర్ వైజర్లు, 66 మొబైల్ టీమ్లు, 21 ట్రాన్సిట్ టీములు, 56 కోల్డ్ చైన్ టీమ్లను ఏర్పాటుచేసినట్టు వెల్లడించారు. సమావేశంలో డీఐఓ అచ్చుతకుమారి, డీఎల్ఓ కె.రాణి పాల్గొన్నారు. -
కొఠియా ఒడిశాదే..
● వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఒడిశా మంత్రి సాలూరు: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో ఉన్న వివాదాస్పద కొఠియా గ్రూపు గ్రామాలకు ఒడిశాయే తల్లి అని, ఆంధ్రా పిన్ని వంటిదంటూ ఒడిశా రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి సురేష్ పూజారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొఠియా ఎప్పటికీ ఒడిశాదేనంటూ నమ్మబలికారు. కొఠియాలో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 31 మంది మహిళా సంఘాల సభ్యులకు ఒడిశా ప్రభుత్వం మంజూరు చేసిన కోటి రూపాయల రుణం, రైతులకు బఠానీ విత్తనాలు అందజేశారు. రూ.2లక్షల16 వేలు విలువైన బ్రాయిలర్ ఫాం యూనిట్ను మంజూరు చేశారు. కార్యక్రమంలో కొరాపుట్ జిల్లా కలెక్టర్ మనోజ్ సత్యవాన్ మహాజన్, పొట్టంగి, కొరాపుట్, కోట్పాడ్ ఎమ్మెల్యేలు రామచంద్ర కదమ్, రఘరామ్ మాచ్, రూపు భత్రా, భద్రతా అధికారి రోహిత్ వర్మ, తదితరులు పాల్గొన్నారు. -
తపాలా బీమా పథకాలపై అవగాహన తప్పనిసరి
విజయనగరం టౌన్: తపాలా బీమా పథకాలపై ఉద్యోగులందరూ అవగాహన తప్పనిసరిగా పెంపొందించుకోవాలని విశాఖపట్నం రీజియన్ పోస్ట్మాస్టర్ జనరల్ వీఎస్.జయశంకర్ సూచించారు. ఈ మేరకు స్థానిక జెడ్పీసమావేశమందిరంలో శుక్రవారం ఉద్యోగులకు బీమా సంకల్ప్ 2.0పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ నెలలో నిర్దేశించిన కోటి రూపాయల ప్రీమియానికి ఇప్పటివరకూ రూ.70లక్షలకు పైగా టార్గెట్ సాధించడం అభినందనీయమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా తపాలా ఉద్యోగుస్తులందరూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు తపాలా బీమా సేవలపై అవగాహన కల్పించాలని కోరారు. తద్వారా తమ సేవలను విస్తృతం చేయాలని సూచించారు కార్యక్రమంలో విజయనగరం డివిజన్ సూపరింటెండెంట్ కె.శ్రీనివాస్, సహాయ సూపరింటెండెంట్లు జీవీ.రమణారావు, టి.సుందరనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
సత్ప్రవర్తనతో శిక్ష పూర్తిచేయండి
● విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత పార్వతీపురం: సత్ప్రవర్తనతో ఖైదీలు శిక్షను పూర్తిచేయాలని విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత సూచించారు. శుక్రవారం జిల్లా పర్యటనలో భాగంగా ఆమె సబ్ జైలును తనిఖీచేసి వసతులను, రికార్డులను, జైలు పరిస్థితులు, ఆహారం, వైద్య సౌకర్యాలు, ఖైదీల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా నాణ్యమైన ఆహారం అందుతోందా? లేదా? అని ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. నిబంధనల మేరకు నడుచుకోవాలని, నైతిక విలువలను పెంపొందించుకుంటే మానసిక ప్రఽశాంతత లభిస్తుందని ఖైదీలకు తెలిపారు. ఖైదీల ఫిర్యాదులు, అభ్యర్ధనలు, ఏవైనా సమస్యలుంటే వాటిని వెంటనే పరిష్కరించాలని సబ్ జైలు అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో పార్వతీపురం జిల్లా రెండవ అదనపు జడ్జి ఎస్.దామోదరరావు, విజయనగరం సీనియర్ జడ్జి బీహెచ్వీ లక్ష్మీకుమారి, పార్వతీపురం అడిషనల్ జ్యుడిషియల్ ఫస్టుక్లాస్ మెజిస్ట్రేట్ జె.సౌమ్య జాస్పిన్ తదితరులు పాల్గొన్నారు. -
గోడకూలి విద్యార్థికి గాయాలు
శృంగవరపుకోట: పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలో పై అంతస్తులో ఉన్న వాటర్ట్యాంక్ గోడకూలి ఓ విద్యార్థి తీవ్రగాయాల పాలయ్యాడు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని గాంధీనగర్ నాల్గవవీధిలో ఉన్న త్రినేత్ర డిఫెన్స్ కాన్సెప్ట్ స్కూల్లో పందిరప్పన్న జంక్షన్కు చెందిన వేమలి భార్గవ్ 6వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం 4గంటల సమయంలో భార్గవ్ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి పాఠశాల వెనుక వైపు ఉన్న రేకుల బాత్రూమ్కు మూత్రవిసర్జనకు వెళ్లాడు. మూత్రవిసర్జన చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పాఠశాల భవనం మూడవ అంతస్తుపైన ఉన్న వాటర్ట్యాంక్ గోడ కూలిపోయి బాత్రూమ్పైన పడిపోవడంతో భార్గవ్ రేకులు, గోడ శిథిలాల మధ్య చిక్కుకు పోయాడు. హఠాత్తుగా వచ్చిన శబ్దంతో వెనుక వీధిలో ఉన్న కార్పెంటర్ వాసు, చిల్డ్రన్ హాస్పిటల్లోని నర్స్లు వచ్చి శిథిలాలను తొలగించి విద్యార్థిని కాపాడారు. భార్గవ్ తలకు కుడివైపు లోతైన గాయం కాగా, ఎడమకాలు విరిగిపోయింది. స్కూల్కు పక్కనే ఉన్న అభినవ్ ఆస్పత్రిలో ప్రాథమిక వైద్యం చేయించారు. విషయం తెలిసి విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిపై నిలదీశారు. అనంతరం మాట్లాడుతూ ఈ ఘటనలో పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యవైఖరి, నిర్మాణంలో లోపాలే ప్రమాదానికి కారణం ఆరోపించారు. స్థానిక పోలీసులు ఘటనాస్థలిని సందర్శించి విచారణ చేశారు. గాయపడిన భార్గవ్కు వైద్యం చేసిన ఆస్పత్రి నిర్వాహకులు మాట్లాడుతూ విద్యార్థికి ఎటువంటి ప్రాణాపాయం లేదని చెప్పారు. -
సైన్స్ ఫెయిర్ విజయవంతం
విజయనగరం అర్బన్: జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్–2025ను పాఠశాల జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం విజయనగరంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. తొలుత పదర్శన కార్యక్రమాన్ని ఆర్డీఓ దాట్ల కీర్తి ప్రారంభించారు. ఈ సైన్స్ ఫెయిర్లో జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ‘సస్టైనబుల్ అగ్రికల్చర్, పర్యావరణ నిర్వహణ, గ్రీన్ ఎనర్జీ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, క్రీడలు అండ్ వినోదం, ఆరోగ్యం అండ్ పరిశుభ్రత, నీటి సంరక్షణ, వ్యర్థాల నిర్వహణ’ వంటి అంశాలపై వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించారు. ప్రదర్శన అనంతరం ఉత్తమ వైజ్ఞానిక ప్రాజెక్టులను జ్యూరీ సభ్యులు ప్రకటించారు. విద్యార్థుల గ్రూప్ కేటగిరి విజేతలలో అంశాల వారిగా ఏడు ప్రదర్శనలు ఎంపిక చేశారు. జిల్లా స్థాయి విజేతలు వీరే సైన్స్ ఫెయిర్లో సస్టైన్బుల్ అగ్రికల్చర్ అంశంలో జెడ్పీహెచ్ఎస్ చీపురుపల్లి (బాలికలు), ‘పర్యవరణ నిర్వహణ–పర్యావరణ హిత ప్రత్నామ్నాయాలు’ అనే అంశంలో జెడ్పీహెచ్ఎస్ జామి, ‘గ్రీన్ ఎనర్జీ–ఈవీ చార్జింగ్ స్టేషన్’ అనే అంశంలో జెడ్పీహెచ్ఎస్ రామభద్రపురం, ‘అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు–మాగ్నటిక్ గేర్స్’ అనే అంశంలో వల్లాపురం జెడ్పీహెచ్ఎస్, ‘నీటి సంరక్షణ–డ్రైయిన్ ఓవర్ఫ్లో గుర్తింపు వ్యవస్థ’ అనే టాపిక్లో రామతీర్ధం జెడ్పీహెచ్ఎస్, ‘ఆరోగ్యం అండ్ పరిశుభ్రత–స్మోక్ అబ్జార్బర్స్’ అనే అంశంపై కెల్ల జెడ్పీహెచ్ఎస్, ‘వాటర్ లీకేజ్ అండ్ డ్రైయిన్ ఓవర్ఫ్లో డిటెక్షన్ సిస్టమ్’ అనే అంశంలో కొండవెలగాడ జెడ్పీహెచ్ఎస్ ప్రాజెక్టులు విజేతలుగా నిలిచాయి. ఉపాధ్యాయుల కేటగిరిలో రామతీర్థం జెడ్పీహెచ్ఎస్ టీచర్ బల్లా శ్రీనివాసరావు (నీటి పొదుపు, పరిశుభ్రతకు పర్యావరణ హిత స్థూపాకార యూరినల్ బ్లాక్ డిజైన్), కొట్టాం జెడ్పీహెచ్ఎస్ టీచర్ పి.స్వప్న (స్కూల్ గ్రీన్ ల్యాబ్) విజేతలుగా ఎంపికయ్యారు. విద్యార్థుల వ్యక్తిగత కేటగిరి విజేతలుగా వియ్యంపేట కొత్తవలస ఏపీఎస్డబ్ల్యూఆర్ఎస్ (బాలికలు) విద్యార్థులు రూపొందించిన ‘ఎఫిషియంట్ ట్రైన్ ప్లాట్ ఫాం క్రాసింగ్ సిస్టం’ ప్రదర్శన, దేవుపల్లి జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు రూపొందించిన వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు’ ఎంపికయ్యాయి. అనంతరం జరిగిన ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు చేతుల మీదుగా విజేతలకు జ్ఞాపికలు, బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా డీఈఓ యూ.మాణిక్యంనాయుడు, డిప్యూటీ ఈఓలు విజేతలైన విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులను అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా విజేతలు జిల్లా సైన్స్ కోఆర్డినేటర్ టి.రాజేష్ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో విజేతలుగా ఎంపికై న గ్రూప్ కేటగిరిలో ఏడు ప్రాజెక్టులు, టీచర్ కేటగిరిలో రెండు ప్రాజెక్టులు, వ్యక్తిగత విద్యార్థి కేటగిరిలో రెండు ప్రాజెక్టులు ఈ నెల 23, 24 తేదీల్లో విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరఫున పాల్గొంటాయని తెలిపారు. రాష్ట్రస్థాయి విజేతలు ఆ తరువాత జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. విజేతలకు బహుమతుల ప్రదానం -
చోరీ కేసులో ఇద్దరు ముద్దాయిలకు మూడేళ్ల జైలు
● రూ.13వేలు జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు పార్వతీపురం రూరల్: తాళం వేసిన ఇళ్లే వారి టార్గెట్. రాత్రి వేళ ఇళ్లలో చొరబడి చేతివాటం ప్రదర్శించిన దొంగలకు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. పదేళ్ల క్రితం నాటి దొంగతనం కేసులో నేరం రుజువు కావడంతో ఇద్దరు ముద్దాయిలకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సాలూరు జ్యుడిషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ హర్షవర్ధన్ శుక్రవారం తీర్పు వెలువరిచారు. ఎస్పీ మాధవ్రెడ్డి తెలియజేసిన ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. సాలూరు మండలంలోని యరగాడ వలస గ్రామానికి చెందిన కొత్తపల్లి సత్తిపండు 2015లో పని నిమిత్తం రాజమండ్రి వెళ్లాడు. ఈ క్రమంలో ఇల్లంతా ఖాళీగా ఉండడం గమనించిన అదే గ్రామానికి చెందిన కొండగొర్రి రమేష్, ఆలూరి గణపతిలు ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు అప్పటిలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి నిందితులపై సమర్పించిన సాక్ష్యాధారాలు, ఏపీపీ మాధవి వినిపించిన బలమైన వాదనలతో నేరం రుజువైంది. దీంతో ముద్దాయిలిద్దరికీ మూడేళ్ల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.13వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చినట్లు ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి వివరించారు. చికిత్స పొందుతూ వృద్ధుడి మృతిభోగాపురం: మండలంలోని అమటాం గ్రామానికి చెందిన కోరాడ సూరి (70) అనే వృద్ధుడు విశాఖపట్నం కేజీహెచ్లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కోరాడ సూరి కొబ్బరి చీపుళ్లు తయారు చేసి వాటిని విశాపట్నంలో విక్రయిస్తూ కుటుంబంతో జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 4న విశాఖపట్నంలో చీపుళ్లను విక్రయించి ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంతలో ఏమైందో ఏమో తెలియదు గానీ ఇంట్లో పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. పరిస్థితిని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే సూరిని తగరపువలస ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్య కోసం విశాఖపట్నం కేజీహెచ్లో చేర్చగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఏఎస్సై తిరుపతి తెలిపారు. జాతీయస్థాయి ఫుట్ బాల్ పోటీలకు నెల్లిమర్ల క్రీడాకారులునెల్లిమర్ల: నెల్లిమర్ల నగర పంచాయతీకి చెందిన ముగ్గురు క్రీడాకారులు జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికై నట్లు నెల్లిమర్ల రిక్రియేషన్ ఫుట్బాల్ క్లబ్ ప్రతినిధులు కె.సురేష్, ఎం.నాని తెలిపారు. ఈ నెల 22 నుంచి కేరళ రాష్ట్రంలో జరగనున్న ఆంధ్ర యూనివర్సిటీ జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీలకు బి.రామకృష్ణ, బి. వరుణ్లు ఎంపికై నట్లు తెలిపారు. అలాగే ఇదే ప్రాంతానికి చెందిన సంతోష్ కుమార్ అనంతపురం జిల్లాలో జరగనున్న జాతీయ స్థాయి సంతోష్ ట్రోఫీకి ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. క్రీడాకారులు రామకృష్ణ, వరుణ్, సంతోష్ కుమార్ జాతీయస్థాయి పోటీల్లో రాణించి, విజేతలుగా నిలవాలని క్లబ్ ప్రతినిధులు, పూర్వ శిక్షకుడు కోల చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. -
కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
సాలూరు: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి పూదోట ప్రకాష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక ఏరియా ఆస్పత్రి వద్ద నిర్వహించిన ధర్నాకు ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాంట్రాక్ట్ ఏజెన్సీల చట్ట ప్రకారం కార్మికులకు పీఎఫ్, బీమా చెల్లింపులు చెల్లించకుండా ఒక్కో చోట ఒకలా చెల్లిస్తున్నారని ఆరోపించారు. పేదరోగులకు సేవచేసుకుంటూ జీవిస్తున్న బడుగు బలహీన వర్గాలకు చెందిన కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు బుగత అశోక్, బలగ రాధ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి హామీ చట్టాన్ని కాపాడాలి
● చట్టాన్ని పథకంగా మారిస్తే కూలీల హక్కులు కోల్పోతారు ● కలెక్టరేట్ దగ్గర గాంధీజీ విగ్రహం వద్ద సీపీఎం నిరసనవిజయనగరం గంటస్తంభం: గ్రామీణ పేదలకు ఉపాధిని హక్కుగా కల్పించే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పథకంగా మార్చడం ద్వారా ఉపాధికి ఉన్న గ్యారంటీని తొలగించే ప్రయత్నం జరుగుతోందని సీపీఎం జిల్లా కార్యదర్మి తమ్మినేని సూర్యనారాయణ విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం విజయనగరం కలెక్టరేట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఉపాధి హామీ చట్టంలో ఉన్న హక్కులను బలహీనపరిచేందుకే గాంధీజీ పేరు తొలగించి చట్టాన్ని సాధారణ పథకంగా మార్చారని ఆరోపించారు. వామపక్షాలు, ప్రజాసంఘాలు సాధించుకున్న ఈ చట్టంపై గాంధీజీపై ఉన్న వ్యతిరేకతతోనే కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తోందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, పార్లమెంటులో ఉన్న మోజారిటీతో కూలీలకు హక్కుగా ఉన్న చట్టాన్ని మార్చే ప్రమాదకర నిర్ణయాలు తీసుకుంటోందని పేర్కొన్నారు. చట్టం స్థానంలో పథకం అమలులోకి వస్తే ఉపాధికి గ్యారంటీ ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి నేతలు స్పందించాలి ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను 90 శాతం నుంచి 60 శాతానికి తగ్గించడం వల్ల రాష్ట్రాలపై తీవ్ర భారం పడుతోందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా, అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కేంద్రానికి వ్యతిరేకంగా స్పందించడం లేదని విమర్శించారు. ఇప్పటికై నా టీడీపీ, జనసేన పార్టీలు ఈ విషయంలో స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ, ఈ చట్టాన్ని కాపాడుకునే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జగన్మోహన్, వెంకటేష్, విజయనగరం పట్టణ నాయకులు బుల్లి రమణతో పాటు పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఎస్పీ దామోదర్కు ఏబీసీడీ అవార్డు
● అభినందించిన డీజీపీ హరీష్కుమార్ గుప్తా విజయనగరం క్రైమ్ : డీజీపీ హరీష్ గుప్తా చేతుల మీదుగా ఎస్పీ దామోదర్ అవార్డు ఫర్ బెస్ట్ ఇన్ క్రైం డిటెక్షన్ (ఏబీసీడీ) అవార్డును శుక్రవారం అందుకున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పోలీసులు ఛేదించిన ముఖ్య కేసుల దర్యాప్తును పరిశీలించి, వాటిలో ఉత్తమంగా దర్యాప్తు చేసిన కేసులకు ఇచ్చే ఏబీసీడీ (అవార్డు ఫర్ బెస్ట్ ఇన్ క్రైం డిటెక్షన్) అవార్డును ఎస్పీ దామోదర్ అందుకున్నారు. ప్రకాశం జిల్లాలో మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసును ఛేదించినందుకు గాను అప్పటి ప్రకాశం జిల్లా ఎస్పీగా పని చేసిన దామోదర్ను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రత్యేకంగా అభినందించి, ఏబీసీడీ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ గతేడాది ఏప్రిల్ 22 వ తేదీన ప్రకాశం జిల్లా, ఒంగోలు మెయిన్ రోడ్డు వద్ద నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు స్కూటీపై వచ్చి ముప్పవరపు వీరయ్య చౌదరిని కత్తులతో విచక్షణా రహితంగా 49 పోట్లు పొడిచి అక్కడ నుంచి పారిపోయారన్నారు. అనంతరం ఒంగోలు తాలూకా పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేయగా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ హత్య కేసును తొందరగా ఛేదించి నిందితులను పట్టుకుని చట్టం ముందు నిలపాలని ఎస్పీకి ఆదేశాలు ఇవ్వడంతో ఈ కేసు మరింత ప్రాధాన్యం పెంచిందన్నారు. అప్పటి జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ డీఎస్పీ స్థాయి అధికారులతో వెంటనే 60 క్రైమ్ బృందాలను ఏర్పాటు చేసి, రాత్రింబవళ్లు శ్రమించి, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తక్కువ వ్యవధిలోనే సంచలన హత్య కేసులో నిజాలు నిగ్గు తేల్చి, 9మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారన్నారు. సంచలన హత్య కేసును తక్కువ వ్యవధిలో ఛేదించిన ఎస్పీ దామోదర్ను డీజీపీ ప్రత్యేకంగా అభినందించి, కేసు ఛేదనలో క్రియాశీలకంగా వ్యవహరించిన అధికారులు, సిబ్బందికి నగదు బహుమతి ప్రదానం చేశారు.


