breaking news
Vizianagaram District News
-
జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలి
● కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి ● రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం విజయనగరం: జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో రాణించాలని విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, వైఎస్సార్సీపీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి ఆకాంక్షించారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్ క్రీడామైదానంలో రెండు రోజుల పాటు నిర్వహించిన 42వ రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విజయనగరం జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలని ఆకాంక్షించారు. క్రీడలు ఆత్మస్థైర్యానికి, ఆత్మవిశ్వాసానికి దోహదపడతాయని చెప్పారు. రాష్ట్రస్థాయి క్రీడలను విజయవంతంగా నిర్వహించిన జిల్లా తైక్వాండో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డీవీ చారిప్రసాద్, ఇతర కార్యవర్గాన్ని ఈ సందర్భంగా ఆమె అభినందించారు. అనంతరం విజేతలకు మెడల్స్ ప్రదానం చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి సుంకరి సతీష్, కమిటీ సభ్యులు కె.రాంబాబు, బుగత శ్రీనివాసరావు, సీనియర్ తైక్వాండో మాస్టర్ రవి గన్, జాతీయ తైక్వాండో అసోసియేషన్ పరిశీలకుడు ఫరీద్, ఏపీటీఏ ఉపాధ్యక్షుడు శ్రీను, జాయింట్ సెక్రెటరీ ఎస్. గురుస్వామి, జనరల్ సెక్రెటరీ ఎల్టీ చంద్రమౌళి, ఆర్. దాలిరాజు, తదితరులు పాల్గొన్నారు. -
మహిళలకు అండగా...
విజయనగరం ఫోర్ట్: సమాజంలో మహిళల పట్ల వేధింపులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వివాహం కాని వారికి ఆకతాయిల నుంచి వేధింపులు ఎదురువుతున్నాయి. వివాహమైన వారికి భర్త, అత్తమామలు, ఇతర కుటుంబ సభ్యుల నుంచి వేధింపులు తప్పడం లేదు. గృహహింస భరించలేక ఎంతో మంది గృహిణిలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. మరి కొంతమంది ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. ఇటువంటి మహిళలకు రక్షణగా, అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం గృహహింస నిరోధక చట్టాన్ని తీసుకొచ్చింది. ఆదివారం గృహహింస నిరోధక చట్టం దినోత్సవం సందర్బంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. 2006 ఆక్టోబర్ 26న గృహహింస నిరోధక చట్టం అమల్లోకి వచ్చింది. గృహహింస.. మహిళను కొట్టడం, కొరకడం, తన్నడం, బలంగా గెంటడం లేదా శారీరకంగా నొప్పిని కలిగించడం ఇలా ఏవిధంగా గాయపరిచినా గృహహింస కిందకే వస్తుంది. లైంగిక హింస.. మహిళతో బలవంతపు లైంగిక సంభోగం, బిడ్డల మీద లైంగిక దాడులు, అశ్లీలమైన చిత్రాలను చూడమని బలవంతం చేయడం, సీ్త్రల గౌరవాన్ని కించపరిచేలా వ్యవహరించడం లైంగికహింస కిందకు వస్తుంది. ఆర్థిక హింస.. మనోవర్తి, ఆహారం, దుస్తులు, మందులు మొదలైనవాటికి డబ్బు ఏర్పాటు చేయకపోవడం.. పని, ఉద్యోగం, ఇంటి నుంచి నిరోధించడం.. సంపాదనను తీసుకొని పోవడం.. గృహ సంబంధ వస్తువులను ఉపయోగించకుండా అడ్డుకోవడం ఆర్థికహింస కిందకు వస్తుంది. ఉద్వేగపూరిత హింస.. మహిళ ప్రవర్తన మీద ఆరోపణులు, పిల్లలు లేరని అవమానించడం, వరకట్నం తీసుకురాలేదని వేధించడం, విద్య, ఉద్యోగం చేయకుండా నిరోధించడం, మనుషులతో కలవనివ్వకపోవడం, ఇంకో పెళ్లి చేసుకుంటానని బెదిరించడం, ఆత్మహత్య చేసుకుంటానని రెచ్చగొట్టడం ఉద్వేగపూరిత హింస కిందకు వస్తుంది. గృహహింస విభాగం వారు అందించే సహాయం.. గృహహింసకు గురయ్యే మహిళలకు అండగా అవసరమైన రక్షణ, సంరక్షణ, వైద్య, న్యాయసహాయాన్ని అందించేందుకు కలెక్టరేట్లోని ఐసీడీఎస్ కార్యాలయంలో గృహహింస నిరోధక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అధీనంలో పనిచేస్తుంది. ఇందులో ఒక లీగల్ కౌన్సిలర్, సోషల్ కౌన్సిలర్ , ఒకడేటా ఎంట్రీ ఆపరేటర్ ఇద్దరు హోం గార్డులుంటారు. గృహహింసకు గురైన మహిళలకు అవసరమైన వైద్య సహాయాన్ని అందించడం, ప్రతివాది నుంచి రక్షణ కల్పించడం, భార్యాభర్తలిద్దరికి కౌన్సెలింగ్ నిర్వహించడం, అవసరమైతే న్యాయ సహాయం చేయడం చేస్తారు. 1047 కేసుల నమోదు.. 2006 నుంచి ఇప్పటివరకు జిల్లాలో 1047 గృహహింస కేసులు నమోదయ్యాయి. ఇందులో కౌన్సెలింగ్ ద్వారా 324 కేసులు పరిష్కరించారు. 723 కేసులకు సంబంధించి నివేదికలను వివిధ కోర్టుల్లో పొందుపరిచారు. ఇందులో 150 కేసుల్లో భార్యాభర్తలు కలిసి ఉంటామని అంగీకరించారు. 404 కేసులకు రక్షణ, జీవన భృతి, గృహ వసతి, నష్ట పరిహార ఉత్తర్వులు వచ్చాయి. 169 కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయి. గృహహింస నిరోధక చట్టంతో అతివలకు రక్షణ నేడు గృహహింస నిరోధక చట్టం దినోత్సవం 2006 నుంచి ఇప్పటివరకు 1047 కేసుల నమోదు కౌన్సెలింగ్ ద్వారా 324 కేసుల పరిష్కారం కౌన్సెలింగ్ ఇస్తాం.. గృహహింస విభాగాన్ని అశ్రయించిన వారికి ముందుగా కౌన్సెలింగ్ నిర్వహిస్తాం. కలిసి ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి వివరించి సాధ్యమైనంతవరకు భార్యాభర్తలను కలపడానికి ప్రయత్నిస్తాం. అప్పటికీ అంగీకరించకపోతే గృహహింసకు గురైన మహిళ తరఫున కోర్టులో కేసు ఫైల్ చేస్తాం. జి. రజని, సోషల్ కౌన్సిలర్ -
ఆ గ్రామాలు.. రికార్డులకే పరిమితం
● భౌతికంగా కనిపించని శ్రీహరిపురం, మొదటి కెల్ల.. ● భూముల క్రయ, విక్రయాల్లో మాత్రం కొనసాగుతున్న ఆయా గ్రామాల పేర్లు ● ఆ రెండు గ్రామాల్లో 647 ఎకరాల్లో విస్తరించి ఉన్న భూములువీరఘట్టం: భౌతికంగా ఆ ఊళ్లు మనకు కనిపించవు. ఇంకా చెప్పాలంటే ఆ గ్రామాలు ఉన్నట్లు స్థానికులకే తెలియదు. రెవెన్యూ రికార్డుల్లో మాత్రం భద్రంగా ఉన్నాయి. భూముల క్రయ,విక్రయాలు.. రిజిస్ట్రేషన్లు వంటి కార్యకలాపాలన్నీ వాటి పేరిటే కొనసాగుతున్నాయి. మండలంలోని చిట్టపులివలస సచివాలయం పరిధిలో విక్రమపురం, చిట్టపులివలస, శ్రీహరిపురం, మొదటి కెల్ల రెవెన్యూ గ్రామాలున్నాయి. అయితే మొదటి రెండు గ్రామాల్లో వేల సంఖ్యలో జనాభా కూడా నివసిస్తున్నారు. అయితే మిగిలిన రెండు గ్రామాలైన శ్రీహరిపురం, మొదటికెల్లలకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ గ్రామాలు ఉన్నట్లు ఎక్కడా కనపడవు. కానీ రికార్డుల్లో మాత్రం ఈ ఊరు పేర్లు కొనసాగుతున్నాయి. బ్రిటిష్ కాలంలో ఈ రెండు గ్రామాలు అగ్రహారాలుగా ఉండేవని.. వందేళ్ల కిందటి వరకు ఆయా గ్రామాల్లో ప్రజలు ఉండేవారని.. కాలక్రమేణా వారు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడంతో ఊళ్లు ఖాళీ అయ్యాయని పెద్దలు చెబుతున్నారు. అయితే అధికారికంగా ఇప్పటికీ రికార్డుల్లో మాత్రం ఆ ఊర్లు ఉన్నాయి. ఇదీ విషయం.. వీరఘట్టం మండలంలో 41 రెవెన్యూ గ్రామాలున్నాయి. వీటిలో అన్ని గ్రామాలు భౌతికంగా ఉన్నప్పటికీ శ్రీహరిపురం, మొదటికెల్ల గ్రామాలు మాత్రం కనుమరుగయ్యాయి. ఈ రెండు గ్రామాలు నడుకూరు, చిట్టపులివలస, విక్రమపురం, నడిమికెల్ల గ్రామాల మధ్యలోనే ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. శ్రీహరిపురం పరిధిలో సుమారు 280 ఎకరాలు.. మొదటి కెల్ల పరిధిలో 367 ఎకరాలకు పైగా భూములున్నాయి. ప్రస్తుతం నడుకూరు పాలకేంద్రం నుంచి విక్రమపురం వరకు, చిట్టపులివలస గ్రామానికి సమీపంలో ఉన్న చింతచెట్టు నుంచి విక్రమపురం వరకు ఉన్న భూములన్నీ శ్రీహరిపురం రెవెన్యూ పరిధిలోనే ఉన్నాయి. అలాగే విక్రమపురం దాటిన తర్వాత నడిమికెల్ల ముందర వరకు.. విక్రమపురం నుంచి సమీపంలో ఉన్న నాగావళి నది వరకు ఉన్న భూములు మొదటికెల్ల రెవెన్యూ పరిధిలో ఉన్నాయి. ఆ పేర్లతోనే రిజిస్ట్రేషన్లు.. ప్రస్తుతం నడుకూరు, విక్రమపురం, చిట్టపులివలస గ్రామస్తుల భూములన్నీ శ్రీహరిపురం, మొదటికెల్ల రెవెన్యూ పరిధిలోనే ఉన్నాయి. మీ భూమి పోర్టర్లోనూ ఇవే కనిపిస్తాయి. ఆ ప్రాంతాల్లోని భూముల క్రయ,విక్రయాలు, రిజిస్ట్రేషన్లు అన్నీ పాత గ్రామాల పేరిటే కొనసాగుతున్నాయి.647 ఎకరాల భూములున్నాయి.. మండలంలోని శ్రీహరిపురం, మొదటికెల్ల రెవెన్యూ గ్రామాలు భౌతికంగా లేవు. అయితే రెవెన్యూ రికార్డుల్లో మాత్రం ఈ గ్రామాలున్నాయి. ఈ రెండు గ్రామాల్లో 647 ఎకరాల భూములున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ఇవే పేర్ల మీద వస్తున్నాయి. – ఏఎస్ కామేశ్వరరావు, తహసీల్దార్, వీరఘట్టం -
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గిరిజన విద్యార్థుల మృతి
● మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కళావతి సీతంపేట: ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గిరిజన విద్యార్థినులు మృతి చెందుతున్నారని పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి ఆరోపించారు. హడ్డుబంగి బాలికల ఆశ్రమపాఠశాల విద్యార్థిని ఎం.కవిత మృతిచెందడంతో కుటుంబ సభ్యులను శనివారం రాత్రి డొంబంగివలస వెళ్లి పరామర్శించారు. తల్లిదండ్రులు బాలకృష్ణ, చామంతిలను కుమార్తె మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. అన్నివిధాల అండగా ఉంటానని, ధైర్యంతో ఉండాలని ఓదార్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన విద్యార్థినులు వరుస మరణాలు సంభవిస్తుంటే గిరిజన మంత్రిలో చలనం లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మరణాలు సంభవించకుండా తక్షణ కర్తవ్యం ఏంటనేది ఆలోచించాల్సింది పోయి కాలయాపన చేయడం తగదన్నారు. పాఠశాలల్లో మౌలికవసతులు కల్పించకపోవడం, హెల్త్ వలంటీర్లను నియమించకపోవడం వంటి కారణాలు అనేకం ఉన్నాయన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడే ఆరోగ్య కార్యకర్తలను నియమిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. పాఠశాలల్లో హెల్త్ చెక్ప్లు లేవన్నారు. దోమతెరలు, దుప్పట్లు వంటివి పంపిణీ చేయడం లేదన్నారు. విద్యార్థులు మరణిస్తే ఆయా కుటుంబాలకు కనీసం ప్రభుత్వం నుంచి ఎటువంటి పరిహారం ఇవ్వకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బి.ఆదినారాయణ, వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు హెచ్.మోహన్రావు, పార్టీనాయకులు ఎస్.సాయికుమార్, సాయికిరణ్, సుభాష్, రామయ్య, మంగయ్య, చలపతి, వెంకునాయుడు, మహేష్, చంద్రశేఖర్, బాలు, ఎర్రయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
పాపం.. మన్యం బిడ్డలు!
ఆ గ్రామాలు.. రికార్డులకే పరిమితం భౌతికంగా ఆ ఊళ్లు మనకు కనిపించవు. ఇంకా చెప్పాలంటే ఆ గ్రామాలు ఉన్నట్లు స్థానికులకే తెలియదు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: మన్యం బిడ్డలకు కష్టకాలం దాపురించింది. వారు చదుకునే పాఠశాలలు, హాస్టల్స్లో సదుపాయాల లేమి చావుల వరకు తీసుకెళ్తోంది. స్వచ్ఛమైన తాగునీరు లభించకపోవడం, ఆర్వోప్లాంట్లు మూలకు చేరడం, సరిపడినన్ని మరుగుదొడ్లు లేకపోవడం, పారిశుద్ధ్య లోపం, దోమల దాడి, సకాలంలో వైద్యసేలందించే సిబ్బంది హాస్టల్స్లో లేకపోవడం తదితర కారణాలు గిరిజన విద్యార్థులను ఆస్పత్రులపాల చేస్తున్నాయి. కొందరి ప్రాణాలు తీస్తున్నాయి. ఏడాదిన్నర కాలంలో పార్వతీపురం మన్యం జిల్లాలో 16 మంది విద్యార్థులు మృతిచెందడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే వసతిగృహాల్లోని గిరిజన బిడ్డల ప్రాణాలకు సైతం ఇప్పుడు భద్రత లేకపోవడంతో గిరిజనుల ఆగ్రహానికి కారణమైంది. గిరిజన మంత్రి సొంత జిల్లాలో ఇప్పటి వరకు 16 మంది గిరిజన బిడ్డలు ప్రాణాలు వదిలారు. చదువుకుంటారని హాస్టళ్లలో వేస్తె ఊపిరిపోతోందంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని.. గిరిజన మంత్రిని నిలదీయడంతో సంధ్యారాణి వద్ద సమాధానం లేకపోయింది. దీంతో దీంతో ఉక్రోషం.. తరకంతో ఎదురుదాడి మొదలెట్టారు. నాకే జ్వరమొచ్చింది.. మనుషులన్నాక జ్వరం రాదా... నేను ఎవరికి చెప్పుకోవాలి.. ’ ఇదీ ఆమె ధోరణి. ప్రజల ఆరోగ్య భద్రత ప్రభుత్వం బాధ్యత.. అందుకే కదా ఆమెకు మంత్రిపదవి ఇచ్చింది.. లేకుంటే బుగ్గకారు వేసుకుని బదిలీలు.. కాంట్రాక్టులు ఇచ్చుకుంటూ కమీషన్లు నొక్కడానికి కాదుగా.. అనే విమర్శలు గిరిజన సంఘాలు, ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నా యి. తాజాగా సీతంపేట మండలం హడ్డుబంగి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్న మండంగి కవిత విశాఖ కేజీహెచ్లో జ్వరం, ఊపిరితిత్తుల వ్యాధితో మృతి చెందడం.. మంత్రి అసమర్థతను మరో ఎత్తుకు తీసుకెళ్లింది. గత నెల రోజులుగా కురుపాం గురుకుల బాలికల పాఠశాల/కళాశాల బాలికలు ప్రాణా లు కాపాడుకునేందుకు ఎంతగా అల్లాడిపోయారో రాష్ట్రం మొత్తం చూసింది. అయినా అది తన బాధ్యత కాదు.. ఎవరికీ ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది. దీనికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా అంటూ సంధ్యారాణి చేసిన వ్యాఖ్యలు ఆమె అహంకారధోరణిని తేటతెల్లం చేస్తున్నాయని గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. దురదృష్టమేనా..! వెనుకబడిన పార్వతీపురం మన్యం జిల్లాకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పదవి దక్కడం ఈ జిల్లా ప్రజల అదృష్టమో.. బాధ్యతలేని వారికి రెండు శాఖలు కట్టబెట్టడం దౌర్భాగ్యమో తెలియని పరిస్థితి నెలకొందని గిరిజన సంఘాల నాయకులు వాపోతున్నారు. సాలూరు ఎమ్మెల్యే, మంత్రి గుమ్మడి సంధ్యారాణి నియోజకవర్గంతో పాటు చుట్టూరా ఉన్న పార్వతీపురం.. కురుపాం... పాలకొండలో గిరిజన ప్రాంతాలే అధికం. పూర్తిగా వెనుకబడిన పల్లెలే. వర్షాకాలంలో వందలాది గ్రామాల ప్రజలు మలేరియా, టైఫాయిడ్.. నీళ్ల కాలుష్యం కారణంగా వచ్చే కామెర్ల వంటి వ్యాధులతో పోరాడుతుంటారు. సకాలంలో వైద్యసేవలు అందకపోవడం, పట్టించుకునే వారు లేకపోవడంతో భూమ్మీద నూకలున్నవారు బతికిపోగా లేనివారు సెలవు చెప్పి వెళ్లిపోవడం.. ఇదంతా మన ఖర్మ అనుకోవడం గ్రామస్తులకు పరిపాటిగా మారింది. సమాధానం చెప్పాల్సిందే.. మృతదేహంతో ఆందోళన చేసినా స్పందించని మంత్రి మంత్రి తీరుపై గిరిజనుల ఆగ్రహం సర్దిచెప్పిన సీతంపేట ఐటీడీఏ ఇన్చార్జి పీఓ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ -
తమ వారి రాకకోసం...
పూసపాటిరేగ: విజయనగరం జిల్లాకు చెందిన 9 మంది మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లి ఈ నెల 14న అర్ధరాత్రి సమయంతో దారి తప్పి బంగ్లాదేశ్ సముద్రజలాల్లో ప్రవేశించి అక్కడి కోస్టు గార్డులకు పట్టుబడిన విషయం తెలిసిందే. మత్స్యకారులను అక్కడి కోర్టులో హాజరుపరుస్తున్న ఫొటోలు పంపించడంతో బాధిత కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. తమవారి రాకకోసం ఆశగా ఎదురుచూస్తున్నాయి. తమవారిని విడుదల చేసేందుకు రాష్ట్రప్రభుత్వం కృషిచేయాలంటూ మత్స్యకార సంఘాల నాయకులతో పాటు బాధిత కుటుంబాల సభ్యులు వేడుకుంటున్నారు. బంగ్లాదేశ్ పోలీసులకు పట్టుబడిన వారిలో పూసపాటిరేగ మండలం తిప్పలవలసకు చెందిన నక్క రమణ, వాసుపల్లి సీతయ్య, చింతపల్లికి చెందిన మైలపల్లి అప్పన్న, భోగాపురం మండలం కొండ్రాజుపాలెంకు చెందిన మరుపల్లి చిన అప్పన్న, మరుపల్లి రమేష్, సూరాడ అప్పలకొండ, మరుపల్లి ప్రవీణ్, సురపతి రాము, సురపతి చినఅపన్న ఉన్నారు. చిక్కిన బోటుతో పాటు, మత్స్యకారులను బందీలుగా అదుపులోకి తీసుకొన్నట్లు బంగ్లాదేశ్ పోలీసులు ఫొటోలు రిలీజ్ చేశారు. మత్స్యకార కుటుంబాలు ఎదురుచూపు బంగ్లాదేశ్ కోర్టులో మత్స్యకారులను హాజరుపరుస్తున్నట్టు ఫొటోలు విడుదల బాధిత కుటుంబాల్లో ఆందోళన ప్రభుత్వం ఆదుకోవాలంటూ వేడుకోలు -
సమన్యాయం అందరి హక్కు..
● డీఎల్ఎస్ఏ సేవలను వినియోగించుకోవాలి ● జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత ● టోల్ ఫ్రీ నంబర్ 15100 ద్వారా ఉచిత న్యాయ సహాయం: కలెక్టర్ రాంసుందర్రెడ్డి విజయనగరం అర్బన్: సమన్యాయం పొందడం రాజ్యాంగం మనందరికీ కల్పించిన హక్కు అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత అన్నారు. ఎస్సీ, ఎస్టీలు, నిరుపేదలు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, తదితర వర్గాలకు చెందిన వారికి ఉచిత న్యాయసహాయం అందించే అవకాశాన్ని జిల్లా న్యాయసేవాధికార సంస్థ అందిస్తోందని చెప్పారు. జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ, జిల్లా అధికార యంత్రాంగం సంయుక్తంగా శనివారం స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆదాయం రూ.3 లక్షల కంటే తక్కువ ఉన్న పేదలు, మహిళలు, వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు, తదితర బలహీన వర్గాలకు చెందిన వారు డీఎల్ఎస్ఏని సంప్రదించవచ్చన్నారు. ఆర్థిక లేదా ఇతర వైకల్యాల కారణంగా ఏ ఒక్కరూ న్యాయం పొందే అవకాశాన్ని కోల్పోకూడదన్నదే ఈ చట్టం ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ఉచిత న్యాయ సహాయాన్ని అందించడం.. లోక్అదాలత్లు నిర్వహించడం.. న్యాయ అవగాహన శిబిరాలు ఏర్పాటు చేయడం.. బాధితులకు అండగా నిలవడం న్యాయసేవాధికార సంస్థ లక్ష్యమన్నారు. ఉచిత న్యాయ సహాయం కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి మాట్లాడుతూ.. డీఎల్ఎస్ఏను నేరుగా సంప్రదించడం ద్వారా లేదా టోల్ ఫ్రీ నంబర్ 15100కు ఫోన్ చేయడం ద్వారా కూడా న్యాయ సహాయాన్ని పొందే అవకాశం ఉందన్నారు. ఈ అవకాశాన్ని బాధితులు వినియోగించుకోవాలని సూచించారు. మండల, గ్రామ స్థాయిల్లో కూడా న్యాయ సేవాధికార సంస్థ సేవలపై అవగాహన కల్పించాలని కోరారు. ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తికీ రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పించిందని, వాటికి ఉల్లంఘన కలిగినప్పుడు పరిరక్షించడానికి వివిధ చట్టాలు ఉన్నాయని తెలిపారు. విస్తృతంగా పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం, సోషల్ మీడియా వల్ల మంచితో పాటు కొంత చెడుకూడా ఉందన్నారు. పోక్సో చట్టం ద్వారా రాష్ట్రంలోనే అత్యధికంగా మన జిల్లాలోనే సుమారు 20 మంది దోషులకు శిక్ష పడిందని తెలిపారు. అనంతరం వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ప్రదర్శనను సందర్శించారు. మిషన్ పథకంపై మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ప్రచురించిన బ్రోచర్లను ముఖ్య అతిథులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో జేసీ సేథుమాధవన్, డీఆర్ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. రవిబాబు, పలువురు న్యాయమూర్తులు, న్యాయాధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు. -
జిల్లాకు తుఫాన్ ముప్పు
● మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదు ● ప్రజలు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలి ● కలెక్టర్ రాంసుందర్రెడ్డి విజయనగరం అర్బన్: మొంథా తుఫాన్ కాకినాడ–విశాఖపట్నం మధ్య తీరందాటే అవకాశం ఉందని, దాని ప్రభావంతో జిల్లాలో గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులంతా ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. నష్టాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపాలటీ, విద్యుత్ శాఖలకు అధికారులకు శనివారం రెండు విడతలుగా నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో సూచించారు. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అత్యవసర వేళ సహాయం కోసం కలెక్టరేట్ (08922–236947, 85238 76706), విజయనగరం ఆర్డీఓ కార్యాలయం–88858 93515, చీపురుపల్లి ఆర్డీఓ కార్యాలయం– 97049 95807, బొబ్బిలి ఆర్డీఓ కార్యాలయం–99893 69511, విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్–98499 06486), ఏపీ ఈపీడీసీఎల్ –94906 10102, టోల్ ఫ్రీ నంబర్–1912లను సంప్రదించాలని సూచించారు. -
విద్యార్థుల మరణాలకు మంత్రి బాధ్యత వహించాలి
సాలూరు రూరల్: ఏజెన్సీ ప్రాంతంలో చోటుచేసుకుంటున్న గిరిజన విద్యార్థుల మరణాలకు గిరిజన శాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణి బాధ్యత వహించాలని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర డిమాండ్ చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల మరణాలు ఆగటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన స్థానిక మంత్రి సంధ్యారాణి నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. జ్వరాలు వస్తే నాకేం బాధ్యతంటూ వ్యంగ్యంగా సమాధానం చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో హడ్డుబంగి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న మండలంగి కవిత జ్వరంతో చనిపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికే 15 మంది విద్యార్థులు చనిపోయారని.. దీనిపై బాధ్యత వహించాల్సిన గిరిజన శాఖా మంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. ఈ వ్యవహారంపై విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ దృష్టి సారించాలని కోరారు. మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర -
నాగన్నా.. మీరైనా చెప్పండన్నా...
సాక్షి, పార్వతీపురం మన్యం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పని చేస్తున్న ఉపాధ్యాయులంతా ప్రభుత్వం నిర్వహించే డీఎస్సీలో ఉత్తీర్ణులై ఉద్యోగం సంపాదించిన వారే. వారికి ఇప్పుడు మరలా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించాలనడంపై ఉపాధ్యాయ వర్గాలు మండిపడుతున్నాయి. ఇది ఎంత వరకు సబబని ప్రశ్నిస్తున్నాయి. టెట్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు అనంతరం రాష్ట్ర ప్రభుత్వం దానిపై రివ్యూ పిటిషన్ వేయాలని.. తద్వారా సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరుతున్నారు. టీచర్ల ఆందోళనను ప్రభుత్వం సానుకూలంగా అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. శనివారం నాగులచవితి కావడంతో ఇదే విషయమై పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు అమరపు సూర్యనారాయణ, జిల్లా కార్యదర్శి మరిచర్ల ధనుంజయనాయుడు, రిటైర్డ్ ఉపాధ్యాయుడు సీర గంగునాయుడు తదితరులు పార్వతీపురంలో వినూత్నంగా నిరసన తెలిపారు. పుట్ట వద్దకు వెళ్లి.. ‘నాగేంద్రా.. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయించేటట్లు చేయండ’ని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఉపాధ్యాయుడూ ఉద్యోగం కోసం డీఎస్సీ పరీక్ష రాసి, ఉత్తమ ఫలితాలు సాధించి, ఎంపికై న వారేనని గుర్తు చేశారు. ఎంతోమంది విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దారని.. అటువంటి గురువులకు మరలా ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాయాలనడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధినేతలకు మంచి ఆలోచన వచ్చేటట్లు చేయాలని నాగన్న పుట్ట వద్ద పూజలు చేశారు. నిబంధనలను సవరించకుంటే ఉద్యమం టెట్పై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ వేయాలి. కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి విద్యాహక్కు చట్టంలోని నిబంధనలను సవరించి, పార్లమెంట్లో చట్టం చేయాలి. లేనియెడల ఉపాధ్యాయ లోకమంతా పెద్ద ఎత్తున ఉద్యమిస్తుంది. – ఎస్.మురళీమోహనరావు, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ‘టెట్’పై ఉపాధ్యాయ వర్గాల ఆందోళన సర్వీసులో ఉన్న టీచర్లకు మినహాయించాలని డిమాండ్ -
తేనెటీగల దాడిలో 50 మందికి గాయాలు
నెల్లిమర్ల: తేనెటీగల దాడిలో 50 మందికి గాయాలైన సంఘటన నగర పంచాయతీలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలియజేసిన వివరాల ప్రకారం.. నాగుల చవితి సందర్భంగా విశ్వంబర స్కూల్ వద్ద పుట్టలో పాలు వేయడానికి భక్తులు బాణసంచా కాల్చడంతో చెట్టు మీద తేనే టీగలు ఒక్కసారిగా భక్తులపై దాడి చేశాయి. వెంటనే స్థానికులు, సీహెచ్సీ అభివృద్ధి కమిటీ సభ్యుడు మజ్జి రాంబాబు స్పందించి బాధితులను సామాజిక ఆస్పత్రికి తరలించారు. దొంగతనంపై కేసు నమోదు భోగాపురం: తన పొలంలో వేసిన ఫెన్సింగ్ పోల్స్ (23) పోయాయంటూ మండలంలోని తూడెం గ్రామానికి చెందిన గాలి అప్పారావు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై వి. పాపారావు శనివారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అప్పారావుకు బసవపాలెం రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 63లో 33 సెంట్ల భూమి ఉంది. తనకున్న భూమి చుట్టూ వేసుకున్న ఫెన్సింగ్ పోల్స్ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు. దీనిపై బాధితుడు అప్పారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. చెస్, యోగా, టేబుల్ టెన్నిస్ జిల్లా జట్ల ఎంపిక బొబ్బిలి: స్థానిక సంస్థానం ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ – 14, 17 బాల, బాలికల విభాగంలో చెస్, యోగా, టేబుల్ టెన్నిస్ జిల్లా జట్ల ఎంపికలు శనివారం చేపట్టినట్లు పీడీ ఎన్. వెంకటనాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడు మండలాల నుంచి వచ్చిన సుమారు 200 మంది క్రీడాకారుల సామర్థ్యాలను పరీక్షించి క్రీడాకారులను ఎంపిక చేశామన్నారు. క్రీడాకారులకు స్థానిక ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల ఎండీఎం నిర్వాహకులు భోజన సదుపాయం కల్పించారన్నారు. కార్యక్రమంలో సంస్థానం ఉన్నత పాఠశాల హెచ్ఎం ఎం. సునీత, పలువురు పీడీలు పాల్గొన్నారు. వివాహిత ఆత్మహత్య విజయనగరం క్రైమ్: వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానిక టూటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై కృష్ణమూర్తి తెలియజేసిన వివరాల ప్రకారం.. విజయనగరం పీవీజీ నగర్కు చెందిన పొన్నాడ శ్యామల (32)కు 13 ఏళ్ల కిందట రాజస్థాన్కు చెందిన చౌహాన్కపూర్ సింగ్తో అన్నవరంలో వివాహమైంది. అయితే పిల్లలు లేకపోవడంతో వీరిద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి శ్యామల పీవీజీ నగర్లోని తల్లివారింటిలో ఉంటోంది. ఈక్రమంలో నగరంలోని ఓ దుస్తుల దుకాణంలో పనిచేస్తున్న సతీష్ అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కుటుంబ సభ్యులు వద్దని వారించినా అప్పటికే ఇద్దరు పిల్లలున్న సతీష్ను శ్యామల వివాహం చేసుకుంది. అక్కడకు కొద్ది రోజుల్లోనే మళ్లీ తల్లిగారింటికి వచ్చేసింది. పుట్టలో పాలుపోసేందుకు కుటుంబ సభ్యులందరూ శనివారం ఉదయం బయటకు వెళ్లగా.. శ్యామల ఇంటిలో ఆత్మహత్యకు పాల్పడింది. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులకు ఉరికి వేలాడుతున్న శ్యామల కనిపించింది. తమ కుమార్తె ఎందుకు ఆత్మహత్యకు పాల్పడిందో అర్థం కావడం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఎస్సై కృష్ణమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వేడుకగా కంచెమ్మ తల్లుల జాతర
● భక్తులతో పోటెత్తిన బోడికొండ ● అమ్మవారిని దర్శించుకున్న జెడ్పీచైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ బొత్సఝాన్సీ మెరకముడిదాం: మండలంలోని కొండలావేరు సమీపంలోని బోడికొండపై వెలసిన కంచెమ్మతల్లుల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జాతర శనివారం వైభవంగా సాగింది. ఉదయం నుంచి అమ్మవార్ల దర్శనానికి భక్తులు బారులు తీరారు. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7–30 గంటల మధ్యలో భక్తుల రద్దీ పెరగడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. సోమలింగాపురం గ్రామం నుంచి కంచెమ్మతల్లుల ఆలయం వరకు కాలినడకన వెళ్లాల్సి వచ్చింది. అమ్మవార్లను జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి దర్శించారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కుబడులు చెల్లించారు. ఐదు కిలోమీటర్ల మేర నిలిచిపోయిన ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడంలో పోలీసుల వైఫల్యంపై భక్తులు మండిపడ్డారు. అప్రమత్తతే ప్రధానం విజయనగరం క్రైమ్: మోంథా తుఫాన్ ముప్పు నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలని, పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేయాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాఽథ్ జెట్టీ సూచించారు. తుఫాన్ అప్రమత్తతపై శనివారం ఐదు జిల్లాల ఎస్పీలతో సమీక్షించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. -
మంత్రివర్యా.. మద్యం గోలేంటి..!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఏమీ తోచని పెద్దమ్మ తోడికోడలు పుట్టింటికి చుట్టరికానికి వెళ్లిందట.. అలా తయారైంది మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పరిస్థితి. తనశాఖలో ఏం జరుగుతోంది.. ఎంతమేరకు ప్రగతి సాధించాం.. ఏమై నా జిల్లాకు ఉపయోగపడ్డామా? లేదా?.. యువతకు ఉపాధి చూపగలిగామా? లేదా? అనే అంశాలు కంటే దండగమారి పనులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని సొంత పార్టీ నాయకులే చెవులు కొరుక్కుంటున్నారు. తాగితే అనారోగ్యం పాలయ్యే మద్యం నాణ్యత పరిశీలనపై మంత్రి శ్రద్ధచూపుతుండడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఎరువులు దొరకక రైతులు, జ్వరాలు, పచ్చకామెర్లతో విద్యార్థులు ఆస్పత్రులు పాలవుతుంటే పట్టించుకోని మంత్రి... మద్యం దుకాణాలకు వెళ్లి.. సురక్ష యాప్లో స్కాన్చేసి నాణ్యత పరిశీలిస్తుండడాన్ని చూసి జిల్లా ప్రజలు, మేధావి వర్గం ముక్కున వేలేసుకుంటున్నారు. నెలన్నర కిందటి వరకు యూరియా దొరక్క జిల్లా వ్యాప్తంగా రైతులు అల్లాడిపోయారు. పంట ఎదుగుదలకు అవసరమైన యూరియా కోసం రాత్రీపగలు ఆర్ఎస్కేలు, ప్రైవేటు దుకాణాల వద్ద పడిగాపులు కాశారు. కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. నిరసనలు తెలిపారు. ఇలాంటి సందర్భంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎక్కడా రైతుల సమస్య గురించి ప్రస్తావించిన దాఖలా లేవు. గట్టిగా నిలబడి జిల్లా రైతులకు అవసరమైన మేరకు ఎరువులు తెప్పించే ఏర్పాట్లు చేయలేదు. ఇప్పుడు మద్యం సరఫరాపై మంత్రి మక్కువ చూపుతుండడాన్ని చూసి రైతులు ముక్కునవేలేసుకుంటున్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ ఏదీ? పొరుగునే ఉన్న పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజన గురుకుల పాఠశాలలో వందలాది మంది పిల్లలు రోగాల బారిన పడ్డారు. 15 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అలాంటి సందర్భంలో కూడా కొండపల్లి శ్రీనివాస్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఏమాత్రం తన వంతు ప్రయత్నం చేయలేదని గిరిజన సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. కనీసం మరణించిన వారి కుటుంబాల పరిస్థితిని సీఎం దృష్టికి తీసుకెళ్లి ఆదుకునే చర్యలు తీసుకోలేదు. సాధారణ ప్రజలతో ముడిపడిన ఏ అంశం పైన ఆగమేఘాలపై స్పందించని మంత్రి.. లిక్కర్ సీసాల స్కానింగ్ కోసం మాత్రం అత్యుత్సాహంతో ముందుకు రావడాన్ని ప్రజలు, మహిళలు విమర్శి స్తున్నారు. మహిళా భద్రత కోసం ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన శక్తియాప్పై అవగాహన కల్పించేందుకు ఈ మాత్రం శ్రద్ధ చూపితే బాగుండేదని, మద్యం వ్యవహారంపై ఎందకంత మమకారం అంటూ మహిళలు ఛీదరిస్తున్నారు. అందరిలోనూ అదే వాసన... ఎవరి కోసం ఈ తనిఖీలు.. రైతుల సమస్యకంటే మద్యమే ఎక్కువా? విజయనగరం జిల్లా నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి, వెనువెంటనే కేబినెట్లో సీటు సంపాదించిన యువ మంత్రి కొండపల్లి శ్రీనివాస్కు తన శాఖ పనితీరుపై సమీక్షించడం.. జిల్లాలో చిన్న, కుటీర పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయడం వంటి వాటికంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న నకిలీ మద్యం దందా నుంచి తెలుగుదేశం పెద్ద నాయకులను బయటపడేసేందుకే ఎక్కువ శ్రమిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతులకు సాగునీరు, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించే విషయంలో మంత్రి ఏ స్థాయి శ్రద్ధ వహిస్తున్నారో తెలియదు కానీ నాణ్యమైన మద్యం అందిస్తున్నాం అని చెప్పుకోవడానికి మాత్రం ఏకంగా లిక్కర్ బాటిళ్లను స్కాన్ చేస్తూ మందుబాబులకు భరోసాగా నిలుస్తున్నారు. గజపతినగరంలో ఓ మద్యం షాపులోకి గురువారం వెళ్లి లిక్కర్ బాటిల్ స్కాన్ చేసి మేము ప్రజలకు నాణ్యమైన మద్యాన్ని అందిస్తున్నాం అన్నట్లు చెప్పకనే చెప్పుకున్నారు. మద్యంపై ఉన్న శ్రద్ధ ఎంఎస్ఎం పార్కులపై లేదా? ఏడాదిన్నర అయినా ఎక్కడ ఒక్క పార్కుకూడా ప్రారంభంకాని వైనం ఒక్క నిరుద్యోగికీ ఉపాధి కల్పించని పరిస్థితి ఎరువుల కోసం రైతులు అల్లాడినా పట్టించుకోని సచివులు రోగాలు.. గిరిజన బిడ్డల మరణాలూ కనిపించని వైనం తాగితే అనారోగ్యంబారిన పడే మద్యం వ్యవహారంపై మక్కువెందుకంటున్న జనం -
ప్రభుత్వ వైద్యం... ప్రజల హక్కు
● మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఉద్యమంలా కోటి సంతకాల సేకరణ ● 28న నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమం ● నిరసన ర్యాలీలు నిర్వహించి రెవెన్యూ అధికారులకు వినతులు ● పోస్టర్లు ఆవిష్కరించిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు విజయనగరం: ప్రభుత్వ వైద్యం.. ప్రజల హక్కని, సూపర్ స్పెషాలిటీ వైద్యం ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మిస్తే వాటిని ప్రైవేటీకరణ చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నించడం దుర్మార్గమని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఈ నెల 28న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమం నిర్వహించనుందని, ఇందులో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని వెల్లడించారు. ఈ మేరకు సంబందిత పోస్టర్లను పార్టీ నాయకులతో కలిసి గురువారం ధర్మపురిలోని సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు విద్య, వైద్యం ప్రభుత్వమే అందించాలని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను అడ్డుకుంటామన్నారు. ప్రభుత్వమే మెడికల్ కాలేజీలను నిర్మించాలి రాష్ట్ర ప్రభుత్వమే మెడికల్ కాలేజీలను నిర్మించి, నిర్వహించాలని మజ్జి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 17 కాలేజీలు నిర్మించేందుకు శ్రీకారం చుట్టగా అందులో 5 కాలేజీల నిర్మాణం పూర్తిచేసి తరగతులు ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు. మరో 2 రెండు కాలేజీల తరగతులు ప్రారంభించారన్నారు. మిగిలిన కాలేజీలను ప్రభుత్వమే పూర్తి చేయాలన్నారు. మెడికల్ కాలేజీ నిర్మిస్తే కేవలం వైద్యవిద్య మాత్రమే కాకుండా 500 పడకల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి అందుబాటులోకి వచ్చి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుతుందని చెప్పారు. వైద్య భరోసా కరువు రాష్ట్రంలో వైద్యరంగం దీన స్థితికి దిగజారిపోయిందని మజ్జి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. గత 15 రోజులుగా నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోవడంతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం జీజీహెచ్లో డయాలసిస్ కేంద్రాన్ని సరిగా నిర్వహించక రోగులను విశాఖకు తరలించడం దారుణమన్నారు. ప్రజలకు వైద్యభరోసా కరువైందన్నారు. వ్యవస్థలు నిర్వీర్యం కూటమి ప్రభుత్వ తీరుతో వ్యవస్థలు నిర్వీర్యమవుతున్నాయని, అన్నివర్గాల ప్రజలకు అవస్థలు తప్పడంలేదని జెడ్పీ చైర్మన్ శ్రీనివాసరావు అన్నారు. ఆరుగాలం శ్రమించి రైతులు సాగుచేసిన పంటలకు మద్దతు ధర కరువైందన్నారు. కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో మొక్కజొన్న రైతులకు మద్దతు ధర లభించడంలేదని, క్వింటా మొక్కజొన్నలకు రూ.2,400లు రైతుకు రావాల్సి ఉండగా, దళారులకు రూ.1900కే విక్రయిస్తున్నారన్నారు. పత్తి మద్దతు ధర రూ.8,110 ప్రకటించగా... రూ.6000 వేలకే దళారులకు రైతులు అమ్ముకుంటున్న వైనం జిల్లాలోని ప్రజాప్రతినిధులకు పట్టకపోవడం దారుణమన్నారు. ● గిరిజన విద్యార్థుల మృతిపై సంబంధిత శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి బాధ్యతారాహిత్యంగా చేసిన వాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. గిరిజన విద్యార్ధులు చనిపోతే ఆదుకోవాల్సినది ప్రభుత్వమే అన్న సంగతి మర్చిపోవడం విచారకరమన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి ధైర్యం చెప్పడంతో పాటు, మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకున్న విషయాన్ని గుర్తుచేశారు. ● ఉత్తరాంధ్రకు చెందిన కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహనాయుడు గడిచిన ఏడాదిన్నర కాలంలో రాష్ట్రానికి చేకూర్చే ప్రయోజనం శూన్యమని మజ్జి శ్రీనివాసరావు ఎద్దేవాచేశారు. రూ.4,500 కోట్లతో భోగాపురంలో నిర్మించతలపెట్టిన ఎయిర్పోర్టు పనులు 20 శాతం మేర గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని, ఇప్పుడు మూడు నెలలకొకసారి సందర్శనల పేరిట కేంద్రమంత్రి ఫొటోలకు ఫోజులిస్తున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్రకు కొత్తగా ఏ ప్రాజెక్టు, అభివృద్ధి పని తీసుకొచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కె.వి.సూర్యనారాయణరాజు, నెక్కలనాయుడుబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శులు వర్రి నర్సింహమూర్తి, గొర్లె రవికుమార్, ఇప్పిలి అనంత్, జిల్లా ఉపాధ్యక్షులు టంకాల అచ్చెంనాయుడు, మూకల కస్తూరి, జిల్లా అధికార ప్రతినిధి కనకల రఘురామారావు, జిల్లా సోషల్ మీడియా విభాగం అధ్యక్షులు వాసునాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
గ్రంఽథాలయాల్లో సౌకర్యాలు లేకపోవడం వాస్తవమే
జిల్లాలోని పలు శాఖా గ్రంథాలయాల్లో పాఠకులకు అవసరమైన సౌకర్యాలు లేకపోవడం వాస్తవమే. పలు లైబ్రరీలకు సొంత భవనాలు లేకపోవడం, మరుగుదొడ్లు, పాఠకులకు సరైన మౌలికవసతులు, కాంపిటేటివ్ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు లేని పరిస్థితిని ఇటీవల జిల్లాలోని గ్రంఽథాలయాల సందర్శనలో గుర్తించాను. అయితే జిల్లాలో గ్రంథాలయ శాఖకు స్థానిక సంస్థలు చెల్లించాల్సిన దాదాపు రూ.4 కోట్ల బకాయిలు ఉన్నాయి. శాఖా గ్రంథాలయాలలో గుర్తించిన సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటాను. రౌతు రామ్మూర్తినాయుడు, ఏపీ గ్రంథాలయ పరిషత్ మెంబర్ -
జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు ముఖేష్మణికంఠ
విజయనగరం: జాతీయస్థాయిలో జరగనున్న స్కూల్గేమ్స్ తైక్వాండో పోటీలకు జిల్లాకు చెందిన ముఖేష్మణికంఠ ఎంపికయ్యాడు. నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన ముఖేష్ ఈనెల 11,12 తేదీల్లో జరిగిన స్కూల్గేమ్స్ అండర్ 14 విభాగంలో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించాడు. అంతేకాకుండా నాగాలాండ్లో ఈనెల 28 నుంచి 30వ తేదీ వరకు జరగనున్న అండర్ 14 జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు విజయనగరం నుంచి ఎంపికయ్యాడు. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచడంతో పాటు జాతీయ పోటీలకు ఎంపికై న క్రీడాకారుడిని రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి వేణుగోపాలరావు, జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గురాన అయ్యలు, స్కూల్ గేమ్స్ సెక్రటరీ గోపాల్, విజయ, కోచ్ యశస్విని అభినందిస్తూ విజయంతో తిరిగి రావాలంటూ ప్రోత్సహించారు. -
రేషన్ సరుకులు అందేనా?
విజయనగరం ఫోర్ట్: ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా జిల్లాలో పేద, మధ్య తరగతి ప్రజలకు అందించే రేషన్ బియ్యం పంపిణీపై నీలినీడలు కమ్ముకున్నాయి. నవంబర్ నెలకు సంబంధించిన రేషన్ సరుకులు ఒకటో తేదీన లబ్ధిదారులకు అందుతాయోలేదోనన్న మీమాంస నెలకుంది. రేషన్ షాపుల్లో కందిపప్పు పంపిణీని కొన్ని నెలలుగా కూటమి సర్కారు నిలిపివేసింది. ఇప్పుడు బియ్యం, పంచదార పంపిణీపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి బియ్యం, పంచదారను రేషన్ షాపులకు సరఫరా చేసే స్టేజ్–2 కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలు పేరుకు పోవడంతో వారు సరఫరాను నిలిపివేశారు. దీంతో రేషన్ షాపులకు ఇప్పటివరకు ఒక్క కిలో సరుకులు కూడా సరఫరా కాని పరిస్థితి. లబ్ధిదారులు, సరఫరా ఇలా... జిల్లాలో 5,71,801 రైస్ కార్డుదారులు ఉన్నారు. వీరికి నవంబర్ నెలకు బియ్యం కేటాయింపు 8587.730 మెట్రిక్ టన్నులు, పంచదార 304 మెట్రిక్ టన్నులు కేటాయించారు. జిల్లాలోని 11 ఎంఎల్ఎస్ పాయింట్లకు ప్రతినెలా 1– 15వ తేదీ మధ్యన, అక్కడ నుంచి 17–30వ తేదీ మధ్య జిల్లాలోని 1249 రేషన్ దుకాణాలకు సరుకుల పంపిణీ జరుగుతుంది. నవంబర్ నెల సరుకుల కోసం రేషన్ దుకాణాలకు అలాంట్ మెంట్ ఆర్డర్ను అధికారులు జారీచేశారు. అయితే, రవాణా చార్జీలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి స్టేజ్–2 కాంట్రాక్టర్లు రేషన్ డిపోలకు సరుకులు చేర్చేందుకు నిరాకరిస్తున్నారు. సమస్య ఉంది ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ డిపోలకు బియ్యం సరఫరా చేసేందుకు స్టేజ్–2 కాంట్రాక్టర్లు నిరాకరిస్తున్నారు. ఇంకా బియ్యం సరఫరా ప్రారంభం కాలేదు. వారితో మాట్లాడుతున్నాం. సమస్య పరిష్కారం అయిన వెంటనే రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటాం. – జి.మురళీనాథ్, జిల్లా పౌరసరఫరా అధికారి ఇప్పటికీ రేషన్ షాపులకు చేరని సరుకులు స్టేజ్–2 కాంట్రాక్టర్లకు బకాయిలు పేరుకుపోవడంతో సరఫరా నిలిపివేసిన వైనం జిల్లాలో ఎంఎల్ఎస్ పాయింట్లు:11 రైస్ కార్డులు: 5,71,801 బియ్యం కేటాయింపు 8587.730 మెట్రిక్ టన్నులు పంచదార 304 మెట్రిక్ టన్నులు -
ష్..సైలెన్స్ ప్లీజ్..!
● లైబ్రరీలకు బకాయిల భారం ● సమస్యల్లో శాఖా గ్రంథాలయాలు ● జిల్లాలో రూ.4 కోట్ల సెస్ బకాయి ● పట్టించుకోని పంచాయతీ, పురపాలకులు రామభద్రపురం: కూటమి పాలనలో గ్రంథాలయాలు అలంకార ప్రాయంగా మారాయి. ప్రభుత్వం పట్టించుకోకుండా వాటి బలోపేతంపై నిర్లక్ష్యం వహించడంతో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 41 గ్రంథాలయాలు ఉండగా వాటిలో 26 శాఖా గ్రంథాలయాలకు సొంత భవనాలు ఉన్నాయి. 7 గ్రంథాలయాలు అద్దెభవనాల్లో నడుస్తుంగా 8 ఉచిత అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. అయితే వాటిలో పలు గ్రంథాలయాల్లో మరుగుదొడ్లు, పాఠకులు చదువుకునేందుకు ఫర్నిచర్ వంటి కనీస మౌలికవసతులు లేవు. అలాగే ప్రధానంగా పోటీ పరీక్షల కోసం చదవడానికి అవసరమైన పుస్తకాలు లేవు. శాఖా గ్రంథాయాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న సిబ్బందిని ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించక 010 ప్రకారం జీతాలు రాక వారు ఇబ్బందులు పడుతున్నట్లు ఈ నెల 22వ తేదీన జిల్లాలో పర్యటించిన ఏపీ గ్రంథాలయ పరిషత్ మెంబర్ రౌతు రామ్మూర్తినాయుడు గుర్తించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలోని పలు శాఖా గ్రంథాలయాలను సందర్శించి సమస్యలను గుర్తించారు. పేదవిద్యార్థులకు శాపం జిల్లాలో 41 గ్రంథాలయాలు ఉండగా వాటిలో నిత్యం వందల మంది పాఠకులు సేవలు పొందుతున్నారు స్థానిక సంస్థల నుంచి సెస్ సకాలంలో వసూలు కాకపోవడంతో గ్రంథాలయాల్లో అరకొరగా వసతులు ఉన్నాయి. ముఖ్యంగా పుస్తకాలు సైతం తగినస్థాయిలో లేవని పాఠకులు అంటున్నారు. వివిధ పోటీ పరీక్షలకు నిరుద్యోగులు సిద్ధమవుతున్నారు. వారిలో అత్యధిక శాతం మంది సామాన్య,పేద తరగతి అభ్యర్థులే ఉంటారు. వారికి పోటీ పరీక్షల పుస్తకాలు, పేపర్లు కొనే ఆర్థిక స్థోమత లేక సమీపంలోని గ్రంథాలయాలకు వెళ్లి చదువుకుంటారు. కానీ అక్కడ అరకొరగా పుస్తకాలు ఉండడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో రూ.4 కోట్ల బకాయి విజ్ఞాన భాండాగారాలుగా పేరొందిన గ్రంథాయాలు ఆర్థిక సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాయి. స్థానిక సంస్థల నుంచి రూపాయిలో ఎనిమిదిపైసలు చొప్పున గ్రంథాలయాలకు రావాల్సిన సెస్ పూర్తి స్థాయిలో వసూలు కాకపోవడంతో రూ.కోట్లలో బకాయిలు పేరుకుపోయాయి. ఫలితంగా గ్రంఽథాలయాల ఉనికి ప్రమాదంలో పడింది. జిల్లాలో దాదాపు రూ.4 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు ఏటా ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తున్నాయి.ఆ పన్నుల నుంచి లైబ్రరీలకు చెల్లించాల్సిన సెస్ వాటాను మాత్రం సక్రమంగా జమచేయడం లేదు. నింబధనల ప్రకారం ప్థానిక సంస్థలు వసూలు చేసిన పన్నుల్లో నుంచి 8 శాతం గ్రంఽథాలయాకు సెస్గా చెల్లించాలి. ఈ నింబధన అమలుకు నోచుకోకపోవడంతో గ్రంథాలయాలు ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందించలేకపోతున్నాయి. ఈ సెస్ ద్వారా వచ్చిన సొమ్ముతోనే గ్రంథాలయాల్లో సౌకర్యాలు కల్పించడంతో పాటు పుస్తకాలు, మ్యాగజైన్లు, దిన,వార,మాస పత్రికలను పాఠకులకు అందుబాటులో ఉంచే వీలుంటుంది. అయితే ఇటు సెస్ వసూలు కాకపోవడం, అటు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో గ్రంథాలయాల సేవలు మొక్కుబడిగా మారాయని విమర్శలు వినిపిస్తున్నాయి. -
పాముకాటుతో మహిళ మృతి
గజపతినగరం: మండలంలోని కొనిశ గ్రామానికి చెందిన సూరెడ్డి అన్నపూర్ణ (47)పాము కాటుతో మృతిచెందింది. గురువారం జరిగిన ఈ సంఘటనపై గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం భర్త బుచ్చిబాబుతో కలిసి గ్రామం సమీపంలో ఉన్న గొడ్డు పొలంలో పత్తి ఏరేందుకు అన్నపూర్ణ వెళ్లింది. పత్తి ఏరుతుండగా ఆమెను పాము కరవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లి పోయింది. వెంటనే భర్త బుచ్చిబాబు, మేకలు మేపుతున్న మరో వ్యక్తి సహాయంతో గజపతినగరం ఏరియా ఆస్పత్రికి వైద్యం కోసం తరలించారు. వైద్యులు పరిక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోస్ట్మార్టం కోసం విజయనగరం సర్వజన ఆస్పత్రికి మృతదేహాన్ని పోలీసులు తరలించారు. -
ఎస్సీలకు విద్యుత్ బిల్లుల షాక్
బొబ్బిలిరూరల్: రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి వారిది. వారి ఇంటిలో ఒక బల్బు, టీవీ, ఫ్యాన్ మాత్రమే ఉన్నాయి. 200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్ సదుపాయం ఉండడంతో మొన్నటివరకు బిల్లులు కట్టాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు వారికి వేలల్లో బిల్లులు రావడంతో లబోదిబోమంటున్నారు. బొబ్బిలి మండలం అలజంగి గ్రామంలోని ఎస్సీ వీధిలో నివసిస్తున్న సుమారు 80 కుటుంబాలకు సెప్టెంబర్ నెల విద్యుత్ బిల్లు వేలల్లో వచ్చింది. రేజేటి శారదకు రూ.52,723, రేజేటి రమణకు రూ.56,062, యజ్జల రవికి రూ.36,000, యర్రారపు సరోజనమ్మకు 20,000 విద్యుత్ బిల్లులు రావడంతో ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ బిల్లులు చెల్లించకుంటే కనెక్షన్లు తొలగిస్తామని ఆ శాఖ సిబ్బంది బెదిరిస్తున్నారని, ఉన్నతాధికారుల స్పందించి ఆదుకోవాలంటూ బాధితులు విజ్ఞప్తిచేస్తున్నారు. పంచారామాలకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు విజయనగరం అర్బన్: కార్తీక మాసంలో పవిత్ర పుణ్యక్షేత్రాల దర్శనానికి ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నట్టు జిల్లా ప్రజా రవాణా అధికారి జి.వరలక్ష్మి గురువారం తెలిపారు. పంచారామాలుగా పేరుగాంచిన అమరావతి (అమరేశ్వరుడు), పాలకొల్లు (క్షీర రామలింగేశ్వరుడు), భీమవరం (సోమేశ్వరుడు), ద్రాక్షారామం (భీమేశ్వరుడు), సామర్లకోట (కొమరలింగేశ్వరుడు) పుణ్యక్షేత్రాలను దర్శించేందుకు సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సులను అందుబాటులో ఉంచామన్నారు. ఈ నెల 26, నవంబర్ 2, 9, 16 తేదీల్లో ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటలకు బస్సులు విజయనగరం డిపో నుంచి బయలుదేరి, మంగళవారం వేకువజామున తిరిగి విజయనగరానికి చేరుకునేలా షెడ్యూల్ రూపొందించినట్లు వివరించారు. సూపర్ లగ్జరీ బస్సుకు రూ.2 వేలు, అల్ట్రా డీలక్స్కు రూ.1,950 ఒక్కో టికెట్ చార్జ్గా ప్రకటించారు. టికెట్లు ‘ఏపీఎస్ఆర్టీసీఆన్లైన్.ఐఎన్’ ద్వారా ఆన్లైన్లో లేదా సమీప డిపోలలో బుక్ చేసుకోవచ్చని తెలిపారు. అయ్యప్ప క్షేత్రదర్శన కోసం అయ్యప్ప భక్తుల కోసం విజయనగరం నుంచి ఏడు, 11 రోజుల యాత్రల షెడ్యూల్లను ప్రకటించారు. ఏడు రోజుల ట్రిప్లో విజయవాడ, కాణిపాకం, శ్రీపురం, భవానీ, ఫలని, గురువాయూరు, ఎరుమేలి, సన్నిదానం, శ్రీరంగం, కంచి, తిరుపతి, శ్రీకాళహస్తి, రాజమండ్రి, ద్వారపూడి, అన్నవరం, సింహాచలంలోని పుణ్యక్షేత్రాలు ఉంటాయి. 11 రోజుల యాత్రలో విజయవాడ, శ్రీశైలం, మహానంది, కాణిపాకం, శ్రీపురం, భవాణి, ఫలని, గురువాయూరు, ఎరుమేలి, సన్నిదానం, త్రివేండ్రం, కన్యాకుమారి, మధురై, రామేశ్వరం, శ్రీరంగం, కంచి, తిరుపతి, శ్రీకాళహస్తి, రాజమండ్రి, ద్వారపూడి, అన్నవరం, సింహాచలం పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కార్తీకమాసం పిక్నిక్ స్పెషల్ బస్సులు విజయనగరం నుంచి ప్రయాణీకుల దర్శిని, అరుకుదర్శిని, పుణ్యగిరి, లంబసింగి, అరసవిల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం, టెక్కలి రావివలన తదితర క్షేత్రాలకు, భక్తుల కోరిక మేరకు ప్రయాణికులు కోరుకున్న స్థలాలకు పిక్నిక్ కోసం బస్సులు అద్దె ప్రాతిపదికన ఇస్తారు. బస్సులు బుక్ చేయడం కోసం డిపో మేనేజర్ 99592 25620, అసిస్టెంట్ మేనేజర్ విజయనగరం 73829 24103, బుకింగ్ సూపర్వైజర్ 73829 23683లను సంప్రదించాలని జిల్లా ప్రజా రవాణా అధికారి జి.వరలక్ష్మి కోరారు. -
108లో ప్రసవం
సీతంపేట: మండంలోని గూడగుడ్డి గ్రామానికి చెందిన గర్భిణి ఎం.ఎనిబిత 108లో గురువారం ప్రసవించింది. పురిటి నొప్పులు ఆమెకు రావడంతో గ్రామస్తులు 108కు ఫోన్ చేశారు. భామిని 108 ఈఎంటీ రాములు, పైలెట్ శ్రీనివాసరావులు గ్రామానికి వెళ్లి వాహనంలో ఎక్కించి పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో డెలివరీ కండక్ట్ చేశారు. మూడో కాన్పులో ఆడశిశువుకు ఆమె జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డను స్థానిక ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. సులువుగా ప్రసవ చేసిన 108 సిబ్బందిని గ్రామస్తులు, గర్భిణి కుటుంబసభ్యులు అభినందించారు. -
ప్రతిష్టాత్మకంగా చెస్పోటీలు నిర్వహించాలి
పార్వతీపురం రూరల్: జిల్లాలో నవంబర్ 13 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న రాష్ట్రస్థాయి చెస్పోటీలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం సంబంధిత అధికారులతో సమీక్షించిన ఆయన పోటీలను విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. టోర్నీకి హాజరయ్యే 486మంది రాష్ట్రస్థాయి క్రీడాకారులను గౌరవంగా చూసుకుని వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన అథ్లెటిక్స్ క్రీడాకారులను కలెక్టర్ అభినందించారు. కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి -
మహిళ ఆత్మహత్య
విజయనగరం క్రైమ్: విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి గొల్లపేట సమీప కొత్తకాపు పేటకు చెందిన గురమ్మ (58) గురువారం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కొత్తకాపుపేటకు చెందిన బాడితమాను గురమ్మ భర్త, ఇద్దరు పిల్లలతో కుటుంబం నెట్టుకొస్తోంది. మూడు నెలల క్రితం పొత్తి కడుపులో తీవ్రంగా నొప్పి వచ్చింది. డాక్టర్కు చూపించగా అపెండిసైటిస్ అని ఆపరేషన్ చేస్తే నయమవుతుందని చెప్పారు. కూలి పని చేసుకుని జీవనం సాగించే గురమ్మ ఆర్థిక స్థోమత లేక చికిత్స చేయించుకోలేదు. తరచూ పొత్తి కడుపులో నొప్పి రావడంతో భరించలేక, నయం చేయించేందుకు ఆర్థికభారం మోయలేక..భర్త తెచ్చిన కూలి డబ్బులతో ఇంట్లో సర్దలేక మనస్తాపం చెందిన ఆమె ఊరి చివరన పూరిపాకలో చీరతో ఉరేసుకుని ప్రాణం తీసుకుంది. భర్త రామునాయుడు ఇచ్చిన ఫిర్యాదుతో రూరల్ ఎస్సై అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తారకరామపై ఎమ్మెల్సీ ప్రశ్నలు
● సమాధానమిచ్చిన మంత్రి రామానాయుడు ● పునరావాస ప్యాకేజీ రూ.172.87 కోట్లు చెల్లించాలినెల్లిమర్ల రూరల్: తారకరామతీర్థ సాగర్ ప్రాజెక్టుపై ఇటీవల శాసన మండలిలో జరిగిన చర్చలో ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సూర్యనారాయణ రాజు(సురేష్ బాబు) ప్రశ్నల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. నిర్వాసితుల సమస్యలను ఎమ్మెల్సీ మండలిలో లేవనెత్తారు. దీంతో తాజాగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు లేఖ ద్వారా ఎమ్మెల్సీకి సమాధానం ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురైన బాధితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇస్తామని చెప్పడం వాస్తవం కాదా? అని ఎమ్మెల్సీ అడిగిన ప్రశ్నకు.. వాస్తవమేనని, ఏటీ అగ్రహరం, పడాలపేట, కోరాడపేట గ్రామాలకు ప్యాకేజీ కింద రూ.172.87 కోట్లు చెల్లించాల్సి ఉందని మంత్రి లేఖలో పేర్కొన్నారు. ప్రాజెక్టులో భాగంగా సారిపల్లి నుంచి మండల కేంద్రానికి వెళ్లే రహదారి మునిగిపోవడం వాస్తవమేనా? అని ఎమ్మెల్సీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా వాస్తవమేనని..రెండు చోట్ల రోడ్డు మునిగిపోతుందని..దాని కోసం రోడ్డు అలైన్మెంట్ మార్చినట్లు మంత్రి పేర్కొన్నారు. దీని కోసం 9.2 ఎకరాల భూసేకరణ చేపడుతున్నామని, ఆర్అండ్బీ, పంచాయతీ శాఖలు ఆమోదం తెలిపాయని బదులిచ్చారు. మంత్రి సమాధానాలకు ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్ బాబు స్పందించారు. నిర్వాసితులకు రావాల్సిన పునరావాస ప్యాకేజీ, అవసరమైన నిధులు ప్రభుత్వం తక్షణమే మంజూరు చేయాలని కోరారు. భోగాపురం విమానాశ్రయానికి తారకరామ నీటిని మళ్లిస్తామని చెబుతున్నారని, ప్రాజెక్టు పనులు నత్తనడకన కొనసాగితే లక్ష్యం ఎప్పుడు నెరవేరుతుందని ప్రశ్నించారు. నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రాజెక్ట్ నిర్మాణం వేగవంతం చేయాలని కోరారు. -
కదం తొక్కిన విద్యార్థులు
ఫీజురీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డిగ్రీ విద్యార్థులు కదం తొక్కారు. విజయనగరం తోటపాలెం నుంచి మయూరి కూడలి మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. కాంప్లెక్స్ వద్ద బైఠాయించి కూటమి ప్రభుత్వంపై నిరసన తెలిపారు. విద్యార్థుల ఉజ్వల భవితే లక్ష్యమంటూ ఎన్నికల ముందు తీపిమాటలు చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు విద్యార్థుల సంక్షేమాన్ని పట్టించుకోవడం మానేశారన్నారు. పెండింగ్లో ఉన్న రూ.6,800 కోట్లు ఫీజురీయింబర్స్మెంట్ నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు ‘బాబూ’ అంటూ ప్రశ్నించారు. నవంబర్ 1వ తేదీ నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని, ఫీజులు పెండింగ్లో ఉండడంతో హాల్ టికెట్లు ఇవ్వని దయనీయ పరిస్థితి నెలకొందని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు డి.రాము వాపోయారు. ప్రభుత్వం తీరుమారకుంటే తల్లిదండ్రులతో కలిసి ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్మి జె.రవికుమార్, మండలాధ్యక్షుడు జి.సూరిబాబు, కార్యదర్మి రాజు, జిల్లా కమిటీ సభ్యులు జయ, యర్రమ్మ, నాయకులు గుణ, శివ, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. – విజయనగరం గంటస్తంభం -
నేటి నుంచి రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలు
విజయనగరం: రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు విజయనగరం అతిథ్యమివ్వనుంది. ఈనెల 24,25 తేదీల్లో నగరంలోని రాజీవ్ స్టేడియంలో 42వ రాష్ట్రస్థాయి జూనియర్స్, 8వ క్యాడెట్ తైక్వాండో చాంపియన్షిప్ నిర్వహించనున్నారు. ఈ మేరకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా టోర్నీ నిర్వాహకులు డీవీ చారిప్రసాద్, సుంకరి సతీష్, కలగర్ల రాంబాబు, బుగత శ్రీనివాసరావులు పోటీలకు సంబంధించిన వాల్పోస్టర్ను గురువారం స్టేడియం ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా తైక్వాండో అసోసియేన్ అధ్యక్షుడు డీవీ చారిప్రసాద్ మాట్లాడుతూ రెండు రోజుల పాటు నిర్వహించే పోటీలను 24వ తేదీ సాయంత్రం ప్రారంభించనున్నామన్నారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 250 మంది క్రీడాకారులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. పోటీలకు హజరయ్యే క్రీడాకారులకు అవసరమైన భోజన, వసతి సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు 25వ తేదీ సాయంత్రం బహుమతులు ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. అంతేకాకుండా టోర్నీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. క్రీడాకారులు, క్రీడాభిమానులు పోటీల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. హాజరుకానున్న 250 మందిక్రీడాకారులు -
కౌశల్–2025 జిల్లా కో ఆర్డినేటర్గా బంగారయ్య
నెల్లిమర్ల: సైన్స్ ప్రతిభ పరీక్ష కౌశల్–2025 జిల్లా కోఆర్డినేటర్గా శివుకు బంగారయ్య నియమితులయ్యారు. ఆయన నెల్లిమర్ల నగర పంచాయతీ జరజాపుపేట ఉన్నత పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నారు. నవంబర్ 1 నుంచి 4వ తేదీ వరకు పాఠశాల స్థాయి పోటీలు, 27, 28 తేదీల్లో జిల్లాస్థాయి పోటీలు జరుగుతాయని బంగారయ్య తెలిపారు. 8, 9, 10 తరగతుల విద్యార్థులు పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. గ్రంథాలయాలకు రూ.4 కోట్ల బకాయిలు రామభద్రపురం: జిల్లాలో గ్రంథాలయ శాఖకు స్థానిక సంస్థలు దాదాపు రూ.4 కోట్ల పన్ను బకాయిలు చెల్లించాల్సి ఉందని ఏపీ గ్రంథాలయ పరిషత్ మెంబర్ రౌతు రామ్మూర్తినాయుడు అన్నారు. మండల కేంద్రంలోని శాఖా గ్రంథాలయాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని శాఖా గ్రంఽథాలయాలు 41 ఉన్నాయని, వాటిలో పలు సమస్యలు గుర్తించామ న్నారు. జిల్లాలోని గ్రంథాలయాల్లో పనిచేస్తున్న 14 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయడంతో పాటు జీఓ నంబర్ 010 ప్రకారం జీతాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆయన వెంట జిల్లా శాఖా గ్రంథాలయ కార్యదర్శి బి.లక్ష్మి, లైబ్రేరియన్ బి సత్యవాణి ఉన్నారు. సహకార సంస్థలు డేటాను అందించాలి విజయనగరం అర్బన్: నేషనల్ కోపరేటివ్ డేటా బేస్ పోర్టల్లో అప్లోడ్ చేసేందుకు సహకార సంస్థలు వారి డేటాను జిల్లా సహకార అధికారికి సమర్పించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన జిల్లా కోపరేటివ్ డెవలప్మెంట్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కోపరేటివ్ ద్వారా జిల్లాలో 19,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గొడౌన్ స్పేస్ అందుబాటులో ఉందని, మార్కెటింగ్ ఏడీతో మాట్లాడుకుని ఈ స్పేస్ను వినియోగంలోకి వచ్చేలా చూడాలని డీసీఓ రమేష్కు సూచించారు. సమావేశంలో జేసీ సేతుమాధవన్, వ్యవసాయ, మత్స్య, పశు సంవర్థక, చేనేత, అబ్కారీ శాఖల జిల్లా అఽధికారులు పాల్గొన్నారు. పార్సిల్ పేలుడు ఘటనలో నలుగురికి రిమాండ్ పార్వతీపురం రూరల్: ఆర్టీసీ కాంప్లెక్స్లో గోడబాంబుల పేలుడు ఘటనలో వాటి తయారీ, రవాణాకు పాల్పడిన నలుగురు నిందితులను కోర్టు ఆదేశాల మేరకు బుధవారం రిమాండ్కు తరలించినట్టు పార్వతీపురం పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గోవింద తెలిపారు. వీరిలో మెంటాడ మండలం ఇద్దనవలసకు చెందిన దాసరి పెంటయ్య (తయారీదారు), ముప్పిడి కాశీరాజు, అల్లాడ రవీంద్ర (రవాణాదారు), కొత్త కోట కిశోర్ (కొనుగోలుదారు) ఉన్నారన్నారు. పీజీఆర్ఎస్ వినతుల పరిష్కారానికి ప్రాధాన్యం -
● నాడి పట్టే నాథుడేడి?
పాలకొండ రూరల్/గుమ్మలక్ష్మీపురం: ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో నాడి పట్టే నాథుడు కరువయ్యాడు. కూటమి సర్కారు తీరుతో పల్లె ప్రజలు గడచిన మూడు వారాలుగా వైద్యంకోసం ఇబ్బందులు పడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ● పాలకొండ నియోజకవర్గంలో ఒడిశా సరిహద్దు ప్రాంతమైన భామిని మండల కేంద్రంలోని పీహెచ్సీలో ఉదయం 10 గంటలైనా వైద్యులు హాజరు కాలేదు. దీంతో ఆరోగ్య సమస్యలతో వచ్చిన రోగులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. గర్భిణులు, బాలింతలతో పాటు వృద్ధులకు సాధారణ వైద్య సేవలు అందలేదు. ● పాలకొండ మండల పరిధిలో అన్నవరం, ఎం.సింగుపురం పీహెచ్సీలకు స్థానిక ఏరియా ఆస్పత్రి నుంచి వైద్యులను కేటాయించారు. సమయానికి రాకపోవడంతో రోగులకు నిరీక్షణ తప్పలేదు. ● గుమ్మలక్ష్మీపురం మండలంలోని రేగిడి, దుడ్డుఖల్లు, తాడికొండ గ్రామాల్లోని పీహెచ్సీల్లో కూడా వైద్యసేవలు సకాలంలో అందక పలువురు రోగులు వెనుదిరిగారు. కొందరు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించారు. -
వైభవంగా పైడితల్లి రథయాత్ర
● జై పైడిమాంబ నినాదాలతో మార్మోగిన పట్టణం ● పైడితల్లి ఇరుముడులతో రథయాత్రలో పాల్గొన్న దీక్షధారులు విజయనగరం టౌన్: మంగళ వాయిద్యాలు, దీక్షధారుల జైపైడిమాంబ.. జైజై పైడిమాంబ జయజయధ్వానాలు, భజనల నడుమ సిరులతల్లి రథయాత్ర బుధవారం వైభవంగా సాగింది. ముందుగా చదురుగుడిలోని ఉత్సవ విగ్రహాన్ని రథంపై ఆశీనులు చేసి అమ్మవారికి శాస్త్రోక్తంగా పూజాధికాలు చేశారు. వేకువజామున ఆరు గంటలకు పైడితల్లి ఉత్సవ రథంతో పైడితల్లి దీక్షధారులు యాత్రను ఆలయ ఇన్చార్జి ఈఓ కె.శిరీష, సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, ఆలస సూపరింటెండెంట్ వై.వి.రమణ ప్రారంభించారు. పులివేషధారుల ప్రదర్శనలు, డప్పు వాయిద్యాలు, భాజాభజంత్రీల నడుమ కోట, రంజనీ థియేటర్, తోమాల మందిరం, గంటస్తంభం, కన్యకపరమేశ్వరీ ఆలయం, ఎన్సీఎస్ రోడ్డు, గాడీఖానా మీదుగా రైల్వేస్టేషన్ వద్ద ఉన్న వనంగుడికి రథయాత్ర చేరుకుంది. రథయాత్రను రోడ్డుకిరువైపులా భక్తులు నిలబడి తిలకించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. జాతర మహోత్సవాల్లో చివరిఘట్టమైన చండీహోమం, పూర్ణాహుతి, దీక్షధారుల దీక్షల విరమణ, తదితర కార్యక్రమాలను వనంగుడిలో వేదపండితులు శాస్త్రోక్తంగా పూర్తిచేశారు. వనంగుడిలో ఆధ్యాత్మిక శోభ సిరుల తల్లి వనంగుడికి చేరుకునే వేళ ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వేదపండితులు కొందరు చండీయాగం నిర్వహిస్తుంటే, మరికొంతమంది సూర్యనమస్కారాలు, శక్తి పూజలు, అమ్మవారి ఉత్స విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు చండీయాగంలో పాల్గొని పూర్ణాహుతిని అమ్మవారికి సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు దీక్షధారుల ఇరుముడులను పైడిమాంబ ఆదిపీఠం వ్యవస్థాపకుడు ఆర్.సూర్యపాత్రో నేత్రత్వంలో గురుస్వాములు ఎస్.అచ్చిరెడ్డి, రంజిత్, తదితరులు ఇరుముడి విప్పి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా ఈఓ శిరీష మాట్లాడుతూ ఆరు నెలల పాటు అమ్మవారు వనంగుడిలో భక్తులకు దర్శనమిస్తారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, వనంగుడి ప్రధాన అర్చకులు నేతేటి ప్రశాంత్, వేదపండితులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కృతజ్ఞతలు తెలిపిన కలెక్టర్ విజయనగరం అర్బన్: జిల్లాలో ఇటీవల నిర్వహించిన విజయనగరం ఉత్సవాలు, పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాన్ని విజయవంతం చేసిన వారందరికీ కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి బుధవారం కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఏడాది మొత్తం 435 మంది దాతలు రూ.2.02 కోట్లను విజయనగరం ఉత్సవాలు–2025 బ్యాంక్ ఖాతాకు జమచేశారని, అందులో రూ.1.41 ఉత్సవ కార్యక్రమాల నిర్వహణకు వినియోగించగా రూ.61,12,885 వచ్చే ఏడాది ఉత్సవాలకు నిల్వ ఉంచినట్లు వివరించారు. -
అందని వైద్యం... ఆవేదనలో జనం
ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పీహెచ్సీల సంఖ్య పీహెచ్సీలో పనిచేస్తున్న వైద్యుల సంఖ్య సుమారు 140 మంది ● రోగులకు అగచాట్లు సమ్మెలో ఉన్నది విజయనగరం ఫోర్ట్: ఓ వైపు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్సీ) వైద్యుల సమ్మె... మరోవైపు ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) ప్రైవేటు నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు సేవల నిలిపివేతతో రోగులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సకాలంలో మెరుగైన వైద్యసేవలు అందక అవస్థలు పడుతున్నారు. కొందరు ప్రాణాలు విడుస్తున్నారు. పీహెచ్సీ వైద్యుల సమ్మెతో పల్లె ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వైద్యం కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నా ఫలితం ఉండడంలేదు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పరిస్థితి ఘోరం. ప్రతినెలా అందే 104 వాహన సేవలు కొన్నిచోట్ల నిలిచిపోవడం, మందులు అందకపోవడంతో అస్వస్థతకు గురవుతున్నారు. పీహెచ్సీల్లో ఇన్చార్జి వైద్యులను నియమించినా సేవలు అంతంతమాత్రంగానే అందుతున్నాయంటూ రోగులు, వారిబంధువులు ఆరోపిస్తున్నారు. కొన్నిచోట్ల ఫార్మసిస్టులు, నర్సులు వైద్యం చేస్తున్నారు. ● డాక్టర్ లేని వైద్యం పీహెచ్సీ వైద్యుల సమ్మెతో ఫ్యామిలీ డాక్టర్ సేవలు నిలిచిపోయాయి. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రతిరోజు ఒక గ్రామంలో నిర్వహించాలి. ఉదయం వైద్యశిబిరం ఏర్పాటు చేసి అక్కడకు వచ్చే రోగులకు వైద్య పరీక్షలు చేయడంతో పాటు అవసరమైన మందులు అందజేయాలి. మధ్యాహ్నం పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి అక్కడ పిల్లలకు పరీక్షించాలి. ఆ తర్వాత పక్షవాతం, ఇతర అనారోగ్యం కారాణాలతో మంచాన పడినవారి ఇంటికి వెళ్లి చికిత్స అందించాలి. వైద్యులు సమ్మెతో ఈ సేవలన్నింటిని ఏఎన్ఎం, స్టాఫ్ నర్సు, పారా మెడికల్ సిబ్బందితో కానిచ్చేస్తున్నారు. దీనిపై పల్లెప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పడకేసిన పల్లైవెద్యం! మూడు వారాలుగా సమ్మెలో పీహెచ్సీ వైద్యులు రోగులకు తప్పని తిప్పలు నిలిచిన 104 సేవలు! ఆందోళనలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వైద్యులు లేక.. చిత్రంలో ఖాళీగా కనిపిస్తున్నది బాడంగి పీహెచ్సీ. ఇక్కడి ఇద్దరు వైద్యులు సమ్మెలో ఉన్నారు. ఇక్కడకు సీహెచ్సీ నుంచి ఒక మహిళా డాక్టర్ను డిప్యుటేషన్పై వేశారు. ఆమె ఎప్పుడు వస్తారో.. రారో తెలియక రోగులు ఆస్పత్రికి రావడమే మానేశారు. గతంలో రోజుకు 70 ఓపీ నమోదయ్యేది. ఇప్పుడు కొన్నిరోజుల్లో సింగిల్ డిజిట్ ఓపీ నమోదవుతోంది. కుటుంబ సంక్షేమ చికిత్సలు కూడా నిలిచిపోయాయి. వైద్యుల సమ్మెతో 22 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. – బాడంగి బొబ్బిలిరూరల్: వైద్యుల సమ్మెతో గ్రామీణ ప్రాంతాల్లోని రోగులకు వైద్య సేవలు అందడంలేదు. పిరిడి పీహెచ్సీలో బాడంగి ఆయుర్వేద వైద్యురాలిని, విజయనగరం జీజీహెచ్లో ఎంబీబీఎస్ ఇంటర్న్షిప్ చేస్తోన్న మరో విద్యార్థినిని నియమించారు. అయితే, మెరుగైన వైద్యసేవలు అందడంలేదని రోగులు వాపోతున్నారు. – పక్కి పీహెచ్సీలో బొబ్బిలి ప్రభుత్వాస్పత్రికి చెందిన ఆయుష్ వైద్యులను నియమించారు. వైద్యసేవలు అందకపోవడంతో ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య అమాంతం పడిపోయింది. గతంలో ప్రతిరోజు 80 ఓపీ నమోదుకాగా, ఇప్పుడు 20 ఓపీ నమోదవుతోంది. అత్యవసర వేళ ఆస్పత్రికి వచ్చేవారిని కూడా విజయనగరం ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేస్తున్నారంటూ రోగుల బంధువులు వాపోతున్నారు. జబ్బు తగ్గుతుందన్న నమ్మకం లేదు వారం రోజులుగా జ్వరం, కాళ్లు, ఒళ్లునొప్పులతో బాధపడుతున్నాను. ఇక్కడికి కొత్తడాక్టర్లు వచ్చారు. మందులిచ్చారు. అవి వాడుతున్నా జబ్బుతగ్గుతుందన్న నమ్మకం కలగడంలేదు. రేపు బొబ్బిలి ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాలి. – తూముల చినమల్లమ్మ, రోగి, పిరిడి అంతంతమాత్రమే.. కొమరాడ: మండలంలోని కొమరాడ, కూనేరు రామభద్రపురం పీహెచ్సీల్లో వైద్య సేవలు అంతంత మాత్రమే అందుతున్నాయి. వైద్యకోసం ఆస్పత్రులకు వస్తున్న చిన్నారులకు మెరుగైన వైద్యసేవలు అందడం లేదు. గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. పెదఖేర్జిల గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు పలువురు జ్వరాలతో బాధపడుతూ కొమరాడ పీహెచ్సీకి బుధవారం వచ్చారు. సేవలు అంతంతమాత్రంగానే అందాయంటూ విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. వైద్యులను నియమించాం సమ్మె కారణంగా రోగులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఏపీవీపీ ఆస్పత్రుల నుంచి 20 మంది వైద్యులను, ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి 15 మంది వైద్యులను నియమించాం. వారు ఆస్పత్రులకు వెళ్లడం లేదని తెలిస్తే చర్యలు తీసుకుంటాం. ప్రతీ పీహెచ్సీ పరిధిలో ఉన్న ఆయుష్ వైద్యులు సైతం సేవలందిస్తున్నారు. – డాక్టర్ ఎస్.జీవనరాణి , డీఎంహెచ్ఓ ఇదీ పరిస్థితి.. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 87 పీహెచ్సీలు ఉన్నాయి. వాస్తవంగా పీహెచ్సీకి ఇద్దరు వైద్యులు ఉండాలి. విజయనగరంలో 50 పీహెచ్సీలకు 100 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా 94 మంది ఉన్నారు. వీరిలో 71 మంది వైద్యులు సమ్మెలో ఉన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 37 పీహెచ్సీలు ఉండగా వీటిలో సుమారు 67 మంది వైద్యులు పని చేస్తున్నారు. పీజీ సీట్లలో రిజర్వేషన్, వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ గత నెల 26 నుంచి వైద్యులు వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వం దిగిరాకపోవడంతో గత నెలాఖరు నుంచి ఓపీ, అత్యవసర సేవలను సైతం నిలిపివేసి.. సమ్మెలోకి వెళ్లిపోయారు. పీహెచ్సీల్లో సేవలు నిలిచిపోకుండా వైద్యశాఖాధికారులు విజయనగరం, పార్వతీపురం జిల్లా ఆసుపత్రులు, వైద్య కళాశాల, మిమ్స్, ఆయుష్, ఇతర విభాగాల నుంచి డిప్యుటేషన్పై పంపించినా వీరిలో చాలామంది వేర్వేరు స్పెషలిస్టులు కావడంతో మొక్కుబడిగా ఇలా వచ్చి, అలా చూసి వెళ్లిపోతున్నారు. ఫలితంగా రోగులకు సరైన చికిత్స అందడం లేదు.87 161 -
జాతీయస్థాయిలో విజయనగరం కళాకారుల కీర్తి
విజయనగరం గంటస్తంభం: రాష్ట్రంలోని తెనాలిలో సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు వీణ అవార్డుల ఆధ్వర్యంలో జరిగిన జాతీయ పౌరాణిక పంచమ పద్య నాటక పోటీల్లో విజయనగరం కళాకారులు అద్భుత విజయం సాధించారు. విజయనగరం అక్కినేని సాంస్కతిక సమాజం తరఫున దర్శకుడు గవర సత్తిబాబు బృందం ప్రదర్శించిన మోహినీ భస్మాసుర నాటకం నాలుగు విభాగాలలో బహుమతులు గెలుచుకుని, ఉత్తమ ద్వితీయ ప్రదర్శనగా నిలిచి ప్రేక్షకులను, న్యాయనిర్ణేతలను ఆకట్టుకుంది. జిల్లా పౌర వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ మాట్లాడుతూ, మన జిల్లాకు చెందిన కళాకారులు జాతీయస్థాయిలో ప్రతిభ చాటడం గర్వకారణమన్నారు. అదేవిధంగా శ్యామలాంబ ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన ‘‘ఆదికవి నన్నయ్య భట్టు’’ నాటకం ఉత్తమ ప్రదర్శన అవార్డు సాధించడం మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పద్మశ్రీ అవార్డు గ్రహీత యడ్ల గోపాలరావు మాట్లాడుతూ, విజయనగరం కళాకారులు అద్భుతంగా ప్రదర్శించారని ప్రశంసించారు. తెనాలిలో పాల్గొన్న ఇతర కళాకారులూ వారిని ప్రశంసించారు. ప్రథమ, ద్వితీయ శ్రేణి బహుమతులు రెండూ మన జిల్లాకు రావడం గర్వకారణమన్నారు. ఈ విజయోత్సవ సభలో బహుమతులు పొందిన కళాకారులు గవర సత్తిబాబు, దాసరి తిరుపతి నాయుడు, కంది త్రినాథ్, కేవీ పద్మలను అతిథులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సీనియర్ కళాకారులు చల్లా రాంబాబు, ధవళ సర్వేశ్వరరావు, ఉమామహేశ్వరరావు, పెద్దింటి అప్పారావు, రౌతు వాసుదేవరావు, అబ్బులు తదితరులు పాల్గొన్నారు. -
ఆడబిడ్డ నిధి అందదా?
వీరఘట్టం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 18 నుంచి 59 ఏళ్ల లోపు వయస్సు మహిళలందరికీ ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసి ప్రతి మహిళకు నెలకు రూ.1500 నేరుగా ఖాతాలో జమ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో ప్రతి బహిరంగ సభలో హామీ ఇచ్చారు. ఆ మాటలు నమ్మి చాలా మంది అక్కచెల్లెమ్మలు ఓటేశారు. అయితే ఏం లాభం? కూటమి ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు కావొస్తున్నా..ఆడబిడ్డ నిధి పథకం అమలుపై మంత్రి వర్గ భేటీలో ఇంతవరకు ఒక్కసారి కూడా చర్చకు రాలేదు. అంటే ఈ పథకం కూడా గాలిలో కలిపేసినట్లేనా అని మహిహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హామీలు విస్మరించడం వెన్నతో పెట్టిన విద్య ఎప్పడు అధికారంలోకి వచ్చినా ఎన్నికల హామీలను తుంగలో తొక్కడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. అంతేకాకుండా సంక్షేమ పథకాల అమలులో కూడా తూతూమంత్రంగా అమలు చేసి అనుకూల మీడియాలో ఆహా ఓహో బ్రహ్మండంగా రాయించుకోవడంలో ఆయనకు మించిన సిద్ధ హస్తుడు మరెవరూ ఉండరు. ప్రభుత్వం తీరు చూస్తే ఆడబిడ్డ నిధిని గంగలో కలిపేసినట్లేనని జిల్లా మహిళలు అభిప్రాయపడుతున్నారు. గతంలో మహిళల జీవనోపాధికి అండ.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మహిళల జీవనోపాధికి పెద్దపీట వేశారు. అమ్మఒడి, వైఎస్సార్ ఆసరా, ఈబీసీ నేస్తం, కాపునేస్తం, సున్నావడ్డీ, వైఎస్సార్ చేయూత లాంటి పథకాలన్నింటినీ నేరుగా మహిళల వ్యక్తిగత ఖాతాల్లో జమ చేసి వారి ఆర్ధికాభివృద్ధికి అండగా నిలిచారు. మహిళల చేతికి చేరిన నగదు వృథా కాకుండా ఇంటి అవసరాలకే ఉపయోగపడుతుందని భావించి అనేక పథకాల డబ్బును మహిళల ఖాతాల్లోనే జమ చేశారు.రూ.573 కోట్లు బకాయి.. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని 3,09,425 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 60 ఏళ్లు పైబడిన వారిని మినహాయిస్తే 2024 అక్టోబర్ నాటి లెక్కల ప్రకారం 59 ఏళ్ల లోపు వారు 2.25 లక్షల మంది ఉన్నారు. వారికి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.1500 చొప్పున చెల్లిస్తే నెలకు రూ.33.75 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.ఈ లెక్కన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 17 నెలలకు రూ.573.75 కోట్లు చెల్లించాల్సి ఉంది.ఈ నగదు ఎప్పుడు చెల్లిస్తారని మహిళలు ప్రశ్నిస్తున్నారు.ఈ మెత్తాన్ని ఒకే విడతలో చెల్లించడంతో పాటు రాబోయే రోజుల్లో ప్రతినెలా రూ.1500 చెల్లించాలని మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు. 17 నెలలు గడుస్తున్నా అమలుకు నోచుకోని పథకం ప్రతినెలా రూ.1500 చొప్పున అందిస్తామని మోసం గత ఎన్నికల్లో ఓటు వేసిన జిల్లాలో మహిళలు 3,09,425 మంది వారిలో 59 ఏళ్లలోపు మహిళలు 2.25 లక్షల మంది మహిళలకు చెల్లించాల్సిన బకాయి రూ:573.75 కోట్లు -
పంటలు ధ్వంసమవుతున్నా పట్టించుకోరా?
● ఏనుగుల బాధిత రైతుల ఆవేదన కొమరాడ: ఏనుగుల గుంపు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్లడం లేదు, పంటలు పోతున్నా కనీసం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బాధిత రైతులు వాపోతున్నారు. ఆరుగాలం కష్టపడి వేలాది రూపాయలు పెట్టబడి పెట్టి చెమటోడ్చి పండించిన పంట చేతికి వచ్చిన సమయంలో కళ్ల ముందే పాడవుతోందంటూ అన్నదాత అవేదన వ్యక్తం చేస్తున్నాడు. 2018లో వచ్చిన ఏనుగుల గుంపు ఈ ప్రాంతంలో వేలాది ఎకరాల్లో పంటనష్టం చేసినా కనీసం రూపాయి నష్టపరిహారం అందడం లేదని రైతులు వాపోతున్నారు, మంగళవారం రాత్రి కొమరాడ మండలంలోని కుమ్మరిగుంట పంచాయతీ రావికర్రవలస పరిధిలో షణ్ముఖ్ రెడ్డికి సంబంధించిన జామతోటలో ఉన్న మోటారుతో పాటు పైపులను ఏనుగులు ధ్వంసం చేశాయి. అలాగే వరి పంటను తొక్కి నాశనం చేయడంతో ఆ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికై నా అటవీ శాఖ అధికారులు స్పందించి ఏనుగులు గుంపును ఈ ప్రాంతం నుంచి తరలించి రైతులకు నష్టపరిహారం అందజేయాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు. -
జిల్లాస్థాయి వాలీబాల్ క్రీడాపోటీలకు మిశ్రమ స్పందన
● ఎమ్మెల్యే రాక ఆలస్యంతో క్రీడాకారులకు తప్పని ఇక్కట్లు భోగాపురం: మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో బుధవారం నిర్వహించిన జిల్లాస్థాయి వాలీబాల్ క్రీడా పోటీలకు మిశ్రమ స్పందన లభించింది. పోటీల్లో పాల్గొనేందుకు ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పార్వతీపురం, బొబ్బిలి, చీపురుపల్లి, విజయనగరం నుంచి క్రీడాకారులు ఉదయం తొమ్మిది గంటలకే వచ్చి మైదానంలో కూర్చుని ఎమ్మెల్యే లోకం నాగమాధవి రాక కోసం వేచి చూశారు. అయితే ఎంతసేపటికీ ఎమ్మెల్యే రాకపోవడంతో క్రీడాకారులు మైదానాన్ని వీడి బయటకు వెళ్లిపోతుండడంతో వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడాకారులను బుజ్జగించి మైదానంలో కూర్చోబెట్టారు. ఎమ్మెల్యే పదకొండున్నర గంటలకు (రెండున్నర గంటల ఆలస్యంగా) వచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించడంతో అండర్–17 స్కూల్ గేమ్స్ వాలీబాల్ క్రీడా పోటీలు పన్నెండు గంటలకు ప్రారంభమై హోరాహోరీగా కొనసాగాయి. ఈ పోటీల్లో 150 మంది బాలురు, 100 మంది బాలికలు పాల్గొని సత్తా చాటారు. వారిలో విశేష ప్రతిభ కనబరిచిన 12 మంది బాలురు, 12 మంది బాలికలను రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్కు ఎంపిక చేసినట్లు జిల్లా స్కూల్గేమ్స్ సెక్రటరీలు గోపాల్, విజయలక్ష్మి తెలిపారు. వారు ఈ నెల 27, 28, 29 తేదీలలో ఈస్ట్ గోదావరి జిల్లా కొవ్వూరులో జరగబోయే రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు రాజు (చిన్నారి), సింగిడి నాగన్న, తహసీల్దార్ రమణమ్మ, ఎంపీడీఓ స్వరూపరాణి, ఎంఈఓ రమణమూర్తి, గ్రామ పెద్దలు, మండలంలోని వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
విశాఖ సిటీ : భారీగా లాభాలు వస్తాయని ఆశ చూపించి ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురిని సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. క్రికెట్ బెట్టింగ్ విషయంలో పోలీసులు ఇప్పటికే అనేక మందిని అరెస్టు చేశారు. తాజాగా ఈ కేసులో మరికొంత మంది పాత్ర ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. సాంకేతికత సహాయంతో దర్యాప్తు చేపట్టారు. ఎక్స్చేంజ్ 666 అనే అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఆ వెబ్సైట్ ద్వారా డబ్బు పెడితే అధిక లాభాలు వస్తాయని అమాయకులకు ఆశ చూపించి వారి జీవితాలను నాశనం చేస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. నిరంతరం బెట్టింగ్ ఆడడంతో పాటు ఇతరులకు కూడా ఈ బెట్టింగ్ విధానాన్ని వివరిస్తూ, తమ సొంత ఐడీ ద్వారా అనేక మందిని బెట్టింగ్లో పాల్గొనేలా చేస్తున్న నలుగురి ముఠాను గుర్తించారు. రాంబిల్లి మండలం లోవపాలెంకు చెందిన గనగళ్ల బంగార్రాజు(31) అచ్యుతాపురం మండలం దొప్పర్ల గ్రామానికి చెందిన కొరుప్రోలు పూర్ణ కిశోర్(29), పరవాడ మండలం ఫార్మా సిటీకి చెందిన మేడిశెట్టి రాజు(38), విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం భూపాలరాజపురానికి చెందిన గడిదేశి ఈశ్వరరావు(39)లను అరెస్టు చేశారు. వారిని కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. వీరి ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్న బుకీల సమాచారాన్ని తెలుసుకున్నారు. వారిపై నిఘా పెట్టారు. రిమాండ్కు తరలింపు -
శ్మశానాల రోడ్ల కోసం ఉపాధి నిధులతో ప్రతిపాదన
● విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సమావేశంలో కలెక్టర్ విజయనగరం అర్బన్: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ కాలనీలకు, శ్మశానాలకు రహదారుల సౌకర్యం కల్పించేందుకు ఉపాధి హామీ నిధులతో ప్రతిపాదనలు రూపొందించి ప్రణాళికలో పెట్టాలని డ్వామా అధికారులకు కలెక్టర్ ఎస్.రామ్సుందర్రెడ్డి సూచించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా హౌస్ హోల్డ్ సర్వేలో ఎస్సీ కులాల వారిని బీసీకులాల వారిగా నమోదు చేయడంతో వారికి అందవలసిన లబ్ధి అందకుండా పోతోందని సభ్యుడు బసవ సూర్యనారాయణ కలెక్టర్కు విన్నవించుగా ఎడిట్ ఆప్షన్ కోసం ప్రభుత్వానికి లేఖ రాస్తామని, ఆప్షన్ మార్చడం జరుగుతుందని తెలిపారు. సంక్షేమ వసతిగృహాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుధ్యం, రక్షిత తాగునీటి సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని డైలీ పర్యవేక్షణ ఉండాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో నమోదైన 35 అట్రాసిటి కేసులకు గాను రూ.42 లక్షల 79 వేలు పరిహారంగా చెల్లించినట్లు కలెక్టర్ తెలపగా పరిహారం త్వరగా అందించినందుకు సభ్యులు జిల్లా యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. ప్రతినెలా పౌర హక్కుల దినం గ్రామాల మధ్యలో జరగాలని, ఇందులో పోలీసు, రెవెన్యూ అధికారులు పాల్గొని ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంపై అవగాహన కలిగించాలని కలెక్టర్ సూచించారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు జిల్లాలో 20 కేసులు నమోదైనట్లు తెలిపారు. సమావేశంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ రఘురాజు, డీఆర్ఓ శ్రీనివాసమూర్తి, సోషల్ వెల్ఫేర్ డీడీ వెంకటేశ్వరరావు, ఆర్డీఓలు, డీఎస్పీలు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
కానిస్టేబుల్స్కు ఉత్తమ శిక్షణ అందించాలి
విజయనగరం క్రైమ్: కానిస్టేబుల్స్కు ఉత్తమ శిక్షణ ఇవ్వాలని ఎస్పీ దామోదర్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన నగర శివారు సారిపల్లి జిల్లా పోలీస్ శిక్షణ కళాశాలను తనిఖీ చేశారు. ట్రెనీ కానిస్టేబుల్స్ శిక్షణకు రానున్న నేపథ్యంలో వసతులను ఎస్పీ పరిశీలించారు. శిక్షణార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని మౌలిక వసతులు కల్పించాలని ఈ సందర్భంగా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ స్పష్టం చేశారు. జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలోని తరగతి గదులను, కార్యాలయం, వంట గది, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్, వాష్ రూమ్, స్నానపు గదులు, మినరల్ వాటర్ ప్లాంట్, లైబ్రరీ, పరేడ్ గ్రౌండ్, కంప్యూటర్ ల్యాబ్, ఫైరింగ్ రేంజ్ను ఎస్పీ స్వయంగా పరిశీలించి, సిబ్బందికి సూచనలు చేశారు. ఎస్పీ వెంట అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీపీటీసీ డీఎస్పీ ఎం.వీరకుమార్, సీఐలు బి.లలిత, చంద్రశేఖర్, శ్రీనివాసరెడ్డి, జి.గోపాల నాయుడు, ఎస్సైలు రామ్ గణేష్, మురళి, డీపీటీసీ సిబ్బంది పాల్గొన్నారు. సారిపల్లి డీటీపీసీని సందర్శించిన ఎస్పీ -
తండ్రికి ఐదేళ్ల జైలు
విజయనగరం క్రైమ్: గతేడాది జిల్లాలోని బొబ్బిలి పోలీస్స్టేషన్ పరిధిలో కన్నకూతురిపై లైంగిక దాడికి యత్నించిన కేసులో ముద్దాయి అయిన తండ్రికి ఐదేళ్ల జైలు శిక్ష పడినట్లు ఎస్పీ దామోదర్ బుధవారం తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఎస్పీ పేర్కొన్న వివరాలిలా ఉన్నాయి. బొబ్బిలిలోని ఇందిరమ్మ కాలనీలో ఉంటున్న కాసా నరసింగరావు (42) 2024 జులై 19 వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిద్రలో ఉన్న తన 11 ఏళ్ల కూతురిపై లైంగిక దాడికి యత్నించినట్లు బాలిక అమ్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి సీఐ ఎం.నాగేశ్వరరావు పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి, నిందితుడిని అరెస్టు చేసి, రిమాండుకు తరలించారు. అనంతరం ఆ కేసును ప్రస్తుత బొబ్బిలి సీఐ కె.సతీష్ కుమార్ కేసు దర్యాప్తు చేపట్టి కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. నేరారోపణలు రుజువు కావడంతో విజయనగరం స్పెషల్ జడ్జి ఫర్ పోక్సో కోర్టు కె.నాగమణి ముద్దాయికి 5 ఏళ్ల కారాగార శిక్ష రూ.2,00 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో బాధితురాలికి పరిహారంగా రూ.50 వేలు మంజూరు చేస్తూ పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పును వెల్లడించారన్నారు. -
రోడ్డు ప్రమాదంలో జూనియర్ అసిస్టెంట్ మృతి
● అటెండర్కు గాయాలు ● రెండు బైక్లు ఢీకొనడంతో ప్రమాదం తెర్లాం: మండలంలోని చుక్కవలస గ్రామం వద్ద బుధవారం ఉదయం ఎదురెదురుగా వస్తున్న రెండు మోటారు సైకిళ్లు ఢీకొన్న ప్రమాదంలో నెమలాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కె.శ్రావణ్కుమార్(33)మృతి చెందారు. ఈ ప్రమాదంలో అదే పాఠశాలలో అటెండర్గా పనిచేస్తున్న రమణమ్మకు గాయాలయ్యాయి. దీనికి సంబంధించి తెర్లాం ఎస్సై సాగర్బాబు తెలిపిన ప్రకారం వివరాలి లా ఉన్నాయి. రాజాం నుంచి నెమలాం వైపు, బూరిపేట నుంచి రాజాం వైపు వస్తున్న రెండు మోటారు సైకిళ్లు చుక్కవలస మలుపు వద్ద బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో శ్రావణ్కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా, మోటార్ సైకిల్ వెనుక కూర్చున్న మహిళ గాయపడింది. గాయపడిన మహిళను రాజాంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రాణం ఉందేమో అన్న అనుమానంతో శ్రావణ్కుమార్ను పెరుమాళి పీహెచ్సీకి తీసుకువచ్చారు. అక్కడి సిబ్బంది చూసిన వెంటనే మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న ఎస్ఐ సాగర్బాబు సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. భోరున విలపించిన భార్య, కుటుంబసభ్యులు పాఠశాలకు వెళ్లి వస్తానని చెప్పి మోటార్ సైకిల్పై వెళ్లిన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడన్న విషయం తెలిసిన వెంటనే శ్రావణ్కుమార్ భార్య నారాయణమ్మ పెరుమాళి పీహెచ్సీ వద్దకు వచ్చి భర్త మృతదేహాన్ని చూసి భోరున విలపించింది. కుటుంబసభ్యులు ఆస్పత్రికి వచ్చి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. మృతుడికి ఎనిమిదేళ్ల కుమారుడు సాయి శ్రావణ్ ఉన్నాడు. ఆస్పత్రికి చేరుకున్న ఎంఈఓ, ఉపాధ్యాయులు నెమలాం హైస్కూల్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న శ్రావణ్కుమార్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న ఎంఈఓ త్రినాథరావు, నెమలాం హైస్కూల్ హెచ్ఎం సంగమేశ్వరరావు, యూటీఎఫ్ అధ్యక్షుడు మునిస్వామి, పలువురు ఉపాధ్యాయులు పెరుమాళి పీహెచ్సీకి వచ్చి శ్రావణ్కుమార్ భార్య, కుమారుడిని, కుటుంబ సభ్యులను ఓద్చారు. ఈ సంఘటనకు సంబంధించి మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ఎస్సై సాగర్బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబసభ్యుల సమక్షంలో శవ పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాడంగి సీహెచ్సీకి తరలించారు. -
మరువలేనివి
అమరుల త్యాగాలు..● పోలీస్ బ్యారెక్స్లో పోలీస్ అమరవీరుల దినంవిజయనగరం క్రైమ్: పోలీస్ అమరవీరుల త్యాగా లు అజరామరం. వారి జీవితం స్ఫూర్తిదాయకమని ఎస్పీ దామోదర్ కొనియాడరు. ఈ మేరకు స్థానిక పోలీస్ బ్యారెక్స్ లోని ‘స్మృతి వనం‘లో మంగళవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ దేశంలో మావోయిజం తీవ్రంగా ఉన్న సమయంలో దేశ అంతర్గత భద్రత కోసం, తీవ్రవాద కార్యక్రమాలను అరికట్టేందుకు ఎంతోమంది పోలీ సు అధికారులు, సిబ్బంది తమ ప్రాణాలను తృణ ప్రాయంగా అర్పించారని కొనియాడారు. వివిధ విభాగాల్లో పని చేస్తున్న పోలీసులు, పారా మిలటరీ దళాలు శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా మా వోయిస్టులు, తీవ్రవాదులు, సంఘవిద్రోహ శక్తులతో వీరోచిత పోరాటం చేసిన కారణంగా తీవ్రవాద కార్యకలాపాలు తగ్గుముఖం పట్టి, నేడు మనమందరం స్వేచ్ఛగా, శాంతియుతంగా జీవించే అవకాశం కలిగిందన్నారు. ఈ పోరాటంలో ప్రాణాలను కోల్పోయిన పోలీసు కుటుంబాలకు తమప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నామని, వారి కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటామని చెప్పారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎంతో ధైర్య, సాహసాలతో విధులు నిర్వహించి మావోయిస్టుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయి అమరులైన ముద్దాడ గాంధీ, చిట్టిపంతులు చిరంజీవి, షేక్ ఇస్మాయిల్, బి.శ్రీరాములు, ఎస్.సూర్యనారాయణల త్యాగాల ను స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తున్నామని ఎస్పీ దామోదర్ అన్నారు. అమరవీరుల పుస్తకావిష్కరణ అంతకుముందు అమరులైన 191 మంది పోలీసుల వివరాలతో కూడిన పుస్తకాన్ని ఎస్పీ ఆవిష్కరించారు. విధులు నిర్వహిస్తూ, తీవ్రవాదుల దాడుల్లో మృతి చెందిన పోలీసు అధికారులు, సిబ్బంది పేర్లను అదనపు ఎస్పీ పి.సౌమ్యలత చదివి వినిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన కలెక్టర్ రామ్సుందర్ రెడ్డి, జిల్లా ప్రధాన న్యాయ మూర్తి ఎం.బబిత, జిల్లా అదనపు న్యాయమూర్తి మీనాదేవి, పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కె.నాగమణి, కోరుకొండ సైనిక్ స్కూల్ ప్రిన్సిపాల్ కెప్టెన్ ఎస్.ఎస్.శర్మ, స్థానిక ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, రాష్ట్ర తూర్పు కాపు చైర్మన్ పాలవలస యశస్వి, అదనపు ఎస్పీ సౌమ్యలత, ఏఆర్ అదనపు ఎస్పీ జి. నాగేశ్వరరావులు పోలీసు అమర వీరుల స్థూపం వద్ద పుష్పాలను సమర్పించి, ఘనంగా నివాళులు అర్పించారు. రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎన్.గోపాల నాయుడు ఆధ్వర్యంలో పోలీసులు పరేడ్ నిర్వహించగా, పోలీసులు తుపాకుల గాలిలో పేల్చి అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకుని, విధి నిర్వహణలో అమరులైన పోలీసులను స్మరిస్తూ, రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా చెళ్లపిళ్ల సుజాత వ్యవహరించారు. కార్యక్రమంలో విజయనగరం ఇన్చార్జ్ డీఎస్పీ ఆర్.గోవిందరావు, చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు, డీటీసీ డీఎస్పీ ఎం.వీరకుమార్, ఏఆర్ డీఎస్పీ ఈ.కోటి రెడ్డి, ఏఓ శ్రీనివాసరావు, పలువురు సీఐలు, ఆర్ఐలు, డీపీఓ పర్యవేక్షకులు టి.రామకృష్ణ, వెంకటలక్ష్మి, పోలీసు అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాసరావు సీఐలు ఆర్వీఆర్కే.చౌదరి, శ్రీనివాస్, లక్ష్మణ రావు, ఎస్బీ సీఐలు లీలారావు,అంబేడ్కర్, ఎస్సైలు దుర్గాప్రసాద్, మురళి ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని పోలీసు అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. -
రోడ్డుపై పడి మహిళ మృతి
బొబ్బిలి: మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో స్థానిక గొల్లపల్లి ఆటో స్టాండ్ వద్ద ఓ మహిళ రోడ్డుపై పడిపోగా తలకు దెబ్బతగిలి రక్తం ధారగా కారుతోంది. నోట్లోంచి కూడా రక్తం వస్తోంది. అంతలో అటుగా వెళ్తున్న ఎస్సై ఆర్.రమేష్ కుమార్ ఆ మహిళ స్థితి చూసి పరిశీలించి వెంటనే 108కి సమాచారమందించారు. కానీ సమయానికి 108 రాలేదు. దీంతో తానే ఓ ఆటో మాట్లాడి స్థానిక సీహెచ్సీకి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యసిబ్బంది అప్పటికే మృతి చెందిందని చెప్పగా అయ్యో అంటూ నిరుత్సాహం చెందారు. చివరకు ఆమె గురించి ఆరా తీయగా యాదవ వీధికి చెందిన బొట్ట ఆదెమ్మ(70)అని తేలింది. గొల్లపల్లిలోని యూహెచ్సీకి ఆరోగ్య చికిత్స కోసం వచ్చిందని, అట్నుంచి వస్తుండగా బీపీ పెరిగి పడిపోయి ఉండొచ్చని తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకువెళ్లారు. -
బాలల హక్కుల కోసం సంక్షేమ కమిటీలు
● కలెక్టర్ రామ్సుందర్ రెడ్డివిజయనగరం ఫోర్ట్: బాలల హక్కుల కోసం పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ ఎస్.రామ్సుందర్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రో చైల్డ్ గ్రూప్ జిల్లా చైల్డ్ రైట్స్ ఫోరం రుపొందించినవాల్ పోస్టర్ను మంగళవారం ఆయన తన చాంబర్లో ఆవిష్కరించారు. ఐసీడీఎస్ పీడీ టి.విమలారాణి మాట్లాడుతూ బాలల సంక్షేమం కోసం మిషన్ వాత్సల్య ద్వారా అమలు జరుగుతున్న పథకాల అమలును పర్యవేక్షించడం, పిల్లల సంరక్షణ, పునరావాసం, శిశు హక్కులను పరిరక్షించడంలో బాలల పరిక్షణ కమిటీలు పనిచేస్తాయన్నారు. బాల్య వివాహాల నివారణకు నిర్దిష్టమైన కార్యక్రమాలను చేపట్టి బాలల హక్కుల పరిరక్షణకు కమిటీలు కృషి చేస్తాయని తెలిపారు. కార్యక్రమంలో చైల్డ్రైట్స్ ఫోరం కన్వీనర్ పి.చిట్టిబాబు, పోగ్రాం ఆఫీసర్ నాగరాజు, కౌన్సిలర్ సంధ్య, లీగల్ కో ఆర్డినేటర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
తైక్వాండో పోటీల విజేతలకు డీఈఓ అభినందన
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరిగిన స్కూల్ గేమ్స్ తైక్వాండో పోటీల్లో విజేతలుగా నిలిచిన జిల్లా క్రీడాకారుల బృందానికి జిల్లా విద్యాశాఖ అధికారి యు.మాణిక్యంనాయుడు అభినందనలు తెలిపారు. గుంటూరు జిల్లా బాపట్ల రేపల్లెలో జరిగిన అండర్–14 బాల, బాలికల తైక్వాండో పోటీలలో జిల్లా క్రీడాకారులు ఒక బంగారు, నాలుగు రజత పతకాలు, నాలుగు కాంస్య పతకాలను సాధించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను అభినందించడంతో పాటు భవిష్యత్లో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు కె.గోపాల్, విజయలక్ష్మి పాల్గొన్నారు. -
మెగా వెంచర్లో హెచ్చరిక బోర్డులు
● ఇంటిప్లాన్, కరెంట్, తాగునీటి సరఫరాకు అనుమతులు ఇవ్వం ● చిననడిపల్లి మెగా వెంచర్లో హెచ్చరిక బోర్డులుచీపురుపల్లి: ఎలాంటి అనుమతులు లేని మెగా వెంచర్లో జరుగుతున్న ప్లాట్ల విక్రయాలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎట్టకేలకు పంచాయతీరాజ్ అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు. భవిష్యత్లో మరెంతో మంది కొనుగోలుదారులు మోసపోకుండా ఉండేందుకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. చీపురుపల్లి మండలంలోని చిననడిపల్లి పంచాయతీ పరిధిలో కనీస నిబంధనలు పాటించకుండా 69 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ మెగా వెంచర్ ఏర్పాటు చేయడంపై ‘సాక్షి’ పత్రికలో ‘రియల్గా మోసం’ శీర్షికన ఈ నెల 19న కథనం వెలువడిన సంగతి తెలిసిందే. దీనిపై అదే రోజు స్పందించిన ఎంపీడీఓ ఐ.సురేష్ ఆధ్వర్యంలో సిబ్బంది చిననడిపల్లి పంచాయతీ పరిధిలో అనుమతులు లేని లేఅవుట్ను సందర్శించి నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా మంగళవారం అదే మెగా వెంచర్లో ఎలాంటి అనుమతులు లేవంటూ హెచ్చరిక బోర్డులను డిప్యూటీ ఎంపీడీఓ అప్పలనాయుడు ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ ఏర్పాటు చేశారు. చిననడిపల్లి పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్లు 73, 92, 93, 94లో అభివృద్ధి చేస్తున్న ఈ లేఅవుట్ను అనధికార లేఅవుట్గా గుర్తిస్తూ, ఇందులో ప్లాట్లు కొనుగోలు చేసిన వారిని ఇంటి ప్లాన్లు పంచాయతీ నుంచి ఇవ్వబోమని, విద్యుత్, తాగునీటి సరఫరాకు కూడా ఎలాంటి పంచాయతీ అనుమతులు ఉండవని హెచ్చరిక బోర్డుల్లో స్పష్టం చేశారు. -
స్కూల్ గేమ్స్ హాకీ పోటీలకు జిల్లా జట్ల ఎంపిక
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న స్కూల్గేమ్స్ హాకీ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా జట్ల ఎంపిక పోటీలు మంగళవారం పూర్తయ్యాయి. నగరంలోని రాజీవ్ స్టేడియంలో జిల్లా స్కూల్ గేమ్స్ ఫేడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపికలకు సుమారు 150 మంది క్రీడాకారులు హాజరుకాగా.. అందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 72 మంది క్రీడాకారులను అండర్–14,17 విభాగాల్లో ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు త్వరలో చిత్తూరు జిల్లా చంద్రగిరిలో జరగనున్న అంతర్ జిల్లాల బాల,బాలికల స్కూల్గేమ్స్ ఫోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ ఎంపిక పోటీలను జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు కె.గోపాల్, ఎస్.విజయలక్ష్మి, హాకీ అసోసియేషన్ ప్రతినిధులు, పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు పర్యవేక్షించారు. -
చందులూరు విద్యార్థుల ప్రతిభ
లక్కవరపుకోట: మండలంలోని చందులూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు అథ్లెటిక్స్ విభాగంలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరిలో వై.చరణ్కుమార్, ఎ.కార్తీక్, సీహెచ్ ఎర్నమ్మ ఉన్నట్టు పీడీ డాక్టర్ పి.శ్రీరాములు మంగళవారం తెలిపారు. ఈ నెల 22, 23 తేదీల్లో పశ్చిమగోదావరి జిల్లాలో జరగబోయే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో విజయనగరం జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తారన్నారు. ఎంపికై న విద్యార్థులను పాఠశాల హెచ్ఎం సగుబండి శివరామకృష్ణ, ఉపాధ్యాయుడు చిన్నంనాయుడు, శాప్ కార్యదర్శి ఉమామహేశ్వరరావు అభినందించారు. -
ఆనందమానందమాయె..!
విజయనగరం ఫోర్ట్: జిల్లా ప్రజలతో పాటు పేద, మధ్యతరగతి కుటుంబాల వైద్య విద్యార్థులకు శుభవార్త ఇది. గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ కృషికి తార్కాణం. మూడేళ్ల కిందట జిల్లాలో ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటుతో ఓ వైపు ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి రావడంతో పాటు పేద కుటుంబాల విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించేందుకు అవకాశం లభించింది. తాజాగా కళాశాలకు 12 పీజీ సీట్లు మంజూరు చేస్తూ ఎన్ఎంసీ (నేషనల్ మెడికల్ కమిషన్) ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఓ వైపు విద్యార్థిలోకం సంబరపడుతుండగా, మరోవైపు మరింత మెరుగైన వైద్యసేవలు అందుతాయని జిల్లా ప్రజలు సంతోషపడుతున్నారు. గత ప్రభుత్వం కృషి, ముందుచూపును కొనియాడుతున్నారు. పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన విద్యార్థులకు వైద్య విద్య, ప్రజలకు వైద్యసేవలు చేరువ చేయాలనే గొప్ప సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్హహన్ రెడ్డి అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా 17 వైద్య కళాశాలలకు ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం, ఐదు కళాశాలలు నిర్మించి తరగతులు ప్రారంభించడాన్ని గుర్తుచేసుకుంటున్నారు. దుష్ప్రచారానికి చెంపపెట్టు ప్రభుత్వ వైద్య కళాశాలలపై కూటమి నేతలు దుష్ప్రచారం చేశారు. వైద్య కళాశాలలు నిర్మాణం జరగలేదని, అక్కడ గోతులు, తుప్పలు ఉన్నాయని, తరగతులు జరగడం లేదని రకరకాలుగా ఆరోపణలు చేశారు. ప్రైవేటీకరణకు పూనుకున్నారు. ఇప్పుడు ఎన్ఎంసీ ప్రభుత్వ వైద్య కళాశాలలకు పీజీ సీట్లు మంజూరు చేయడంతో కూటమి నేతల నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్టు అయింది. జగన్ మోహన్ రెడ్డి వైద్య కళాశాలలు నిర్మించడం వల్లే ఎన్ఎంసీ పీజీ సీట్లు మంజూరు చేసిందనే చర్చ జోరందుకుంది. కూటమి నేతల చేసినది అంతా బూటకపు ప్రచారం అని తేలిపోయింది. వైద్య కళాశాలలు నిర్మించడం వల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుందనే దుర్భుద్ధితోనే కూటమి సర్కారు దుష్ప్రచారానికి తెరలేపిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 150 మందికి విద్యావకాశం విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాలలో 150 మంది వైద్య విద్యార్థులు ఏటా వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. గత మూడేళ్లుగా ఏడాదికి 150 మందికి ప్రవేశాలు లభిస్తున్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు వల్ల సామాన్య, మధ్యతరగతి విద్యార్థులకు వైద్యవిద్య అక్కరకు వచ్చింది. డాక్టర్ కావాలన్న ఆశం నెరవేరుతోంది. పీజీ సీట్లు మంజూరుతో స్థానికంగానే వైద్యవిద్యలో మాస్టర్ చేసే అవకాశం లభిస్తుంది. శుభపరిణామం ఇక్కడి ప్రభుత్వ వైద్య కళాశాలకు 12 పీజీ సీట్లు మంజూరయ్యాయి. జనరల్ సర్జరీ విభాగానికి 4, జనరల్ మెడిసిన్కు 4, గైనిక్కు 4 చొప్పున పీజీ సీట్లు మంజూరయ్యాయి. పీజీ సీట్లు మంజూరు కావడం శుభపరిణామం. విద్యార్థులకు చక్కని అవకాశం. – డాక్టర్ దేవీమాధవి, ప్రిన్సిపాల్, ప్రభుత్వ వైద్య కళాశాల ఆనందంగా ఉంది మా కళాశాలకు పీజీ సీట్లు రావడం చాలా ఆనందంగా ఉంది. విజయనగరంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుతో సీట్లు లభించాయి. వైద్యవిద్యను అభ్యసించగలుగుతున్నాం. కళాశాలకు పీజీ సీట్లు రావడంతో పీజీ విద్యను సైతం ఇక్కడే చదువుకునే అవకాశం ఉంటుంది. – హరీష్, వైద్య విద్యార్థి, ప్రభుత్వ వైద్య కళాశాల ఇదో మంచి అవకాశం వైద్య కళాశాల ఏర్పాటు కావడం పెద్ద అవకాశం. పీజీ సీట్లు రావడం మరింత సదావకాశం. వైద్య కళాశాలకు ఎన్ఎంసీ పీజీ సీట్లు కేటాయించడం గొప్ప విషయం. ఎంబీబీఎస్తో పాటు పీజీ వైద్యవిద్యను ఇక్కడే చదువుకోవచ్చు. – శరత్ సింగ్, వైద్య విద్యార్థి, ప్రభుత్వ వైద్య కళాశాల అందుబాటులోకి పీజీ వైద్యవిద్య ఫలించిన గత ప్రభుత్వ ముందుచూపు గత సీఎం జగన్ వల్ల వైద్యకళాశాల నిర్మాణంతో పాటు తరగతులు ప్రారంభం నేడు 12 పీజీసీట్లు మంజూరు చేసిన ఎన్ఎంసీ -
ఉయ్యాలో.. ఉయ్యాలా..
● నేత్రపర్వంగా పైడితల్లి ఉయ్యాల కంబాల మహోత్సవం ● అమ్మదర్శనానికి పోటెత్తిన భక్తులు విజయనగరం టౌన్: భక్త కోటికి సిరులిచ్చే చిన్నారి పైడిమాంబ ఉయ్యాల కంబాల ఉత్సవం మంగళవారం రాత్రి వైభవంగా సాగింది. ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు జరిపారు. చదురుగుడి ఆవరణలో ప్రత్యేకంగా అలంకరించిన ఉయ్యాల చుట్టూ అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని మూడుసార్లు ప్రదక్షణ చేశారు. సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు ఉత్సవ విగ్రహాన్ని పట్టుకుని ఊయలలో ఆశీనులై అమ్మవారి ఉయ్యాలకంబాల ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. అనంతరం సిరిమానుతో పాటు తెచ్చిన రాటకు మూడుసార్లు గొడ్డలి ఆనించి ఊయలను తీసివేశారు. దీంతో అమ్మవారి జాతరకు ముగింపు పలికినట్లేనని, వనంగుడి వద్ద బుధవారం నిర్వహించే చండీహోమం పూర్ణాహుతితో జాతర ముగుస్తుందని అర్చకులు తెలిపారు. ఉత్సవం పూర్తయిన తర్వాత అమ్మవారిని మేళతాళాలతో వనంగుడికి తీసుకువెళ్లనున్నారు. అమ్మవారు వనంగుడిలోనే ఆరు నెలల పాటు భక్తులకు దర్శనమిస్తారు. కార్యక్రమానికి ముందు ఆలయ ఇన్చార్జి ఈఓ కె.శిరీష మాట్లాడుతూ సెప్టెంబర్ 9న పందిరిరాటతో ప్రారంభమైన నెలరోజుల జాతర మహోత్సవాలు ఈ నెల 22న వనంగుడిలో నిర్వహించే దీక్షా విరమణలతో పూర్తవుతాయని వివరించారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ వై.వి.రమణి, సూపర్వైజర్లు రామారావు, పెనుమత్స శ్రీనివాసరాజు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. పోటెత్తిన భక్తులు సిరిమానోత్సవం రోజు రాలేని భక్తులు ఉయ్యాల కంబాల ఉత్సవం రోజు అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఘటాలు సమర్పించారు. మొక్కుబడులు చెల్లించారు. సుమారు 30వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు అఽధికారులు తెలిపారు. పలు స్వచ్ఛంద సంస్థలు, దేవదాయాశాఖ ఆధ్వర్యంలో భక్తులకు మంచినీరు, పులిహోర, మజ్జిగ, ప్రసాదం ఉచితంగా పంపిణీ చేశారు. నేడు దీక్షాపరుల ర్యాలీ బుధవారం వేకువజామున 6 గంటల నుంచి ఇరుముడి కట్టిన పైడితల్లి అమ్మవారి దీక్షధారులు అమ్మవారి నామస్మరణతో చదురుగుడి నుంచి ఇరుముడినెత్తుకుని అమ్మవారి ఉత్సవ విగ్రహంతో వనంగుడికి బయలుదేరుతారు. వనంగుడి వద్ద నిర్వహంచే చండీహోమం, పూర్ణాహుతి కార్యక్రమాల్లో దీక్షధారులు పాల్గొంటారు. పూర్ణాహుతి పూర్తయిన తర్వాత దీక్ష విరమణలు చేస్తారు. దీంతో ఉత్సవం పూర్తవుతుంది. -
కూటమి పాలనా వైఫల్యాలపై గళమెత్తాలి
● నవంబర్ 20లోగా మండల, గ్రామ, వార్డు స్థాయి కమిటీలు పూర్తి చేయాలి ● వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర యువజన విభాగం సమీక్షలో నేతల పిలుపు సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వపాలనా వైఫల్యాలపై గళమెత్తాలని వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఉత్తరాంధ్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార దిశగా యువజన విభాగం పోరాడాలని, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ ప్రతి ఒక్కరూ తమ పరిధిలో ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఎండాడలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో అదీప్రాజ్ ఆధ్వర్యంలో మంగళవారం ఉత్తరాంధ్ర యువజన విభాగం సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి యువజన విభాగం ఉత్తరాంధ్ర జోనల్ ఇన్చార్జి అంబటి శైలేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెంటాడ స్వరూప్, ఉత్తరాంధ్ర జిల్లాల యువజన విభాగం అధ్యక్షులు హాజరయ్యారు. తొలుత మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదీప్రాజ్ మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రలో యువజన విభాగాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు. రానున్న రోజుల్లో గ్రామ, మండల యువజన విభాగం కమిటీలను త్వరితగతిన పూర్తి చేసి, పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మీ నియోజకవర్గ సమన్వయకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని.. వారి సూచనలు, సలహాల మేరకు యువజన విభాగ కమిటీలను వేగంగా పూర్తిచేయాలని సూచించారు. అంబటి శైలేష్ మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మండల, గ్రామ, వార్డు స్థాయిలో యువజన విభాగ కమిటీలను నవంబర్ 20 లోపు పూర్తి చేయాలన్నారు. రానున్న స్థానిక ఎన్నికలే లక్ష్యంగా మీ పరిధిలో సమస్యలు, ప్రజా సమస్యలపై పోరాడి.. వాటిని ప్రభుత్వం పరిష్కరించే వరకూ శాంతియుతంగా ఆందోళనలు, నిరసనలు కొనసాగించాలని తెలిపారు. రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు మెంటాడ స్వరూప్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైఫల్యం చెందిందని, ప్రధానంగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి, యువతకు ఉద్యోగాలు ఇస్తామంటూ మోసం చేసిందని ఆరోపించారు. వీటిపై పోరాటం చేయడంలో యువజన విభాగం ఎప్పుడూ ముందుండాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా యువజన విభాగం అధ్యక్షులు అల్లు అవినాష్(విజయనగరం), పుల్లేటి వెంకటేష్(అనకాపల్లి), శరత్బాబు(పార్వతీపురం), పృథ్వీరాజ్(శ్రీకాకుళం), గాబడి శేఖర్(అల్లూరి), తదితరులు పాల్గొన్నారు. -
గెడ్డల్లోని ఇసుక స్థానిక అవసరాలకు మాత్రమే...
● కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి విజయనగరం అర్బన్: చిన్నచిన్న వాగులు, గెడ్డల్లోని ఇసుకను స్థానిక అవసరాలకు మాత్రమే తరలించాలని, ఇతర ప్రాంతాలకు తరలించేందుకు అనుమతి లేదని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి స్పష్టంచేశారు. జిల్లాలో ఎక్కడా ఇసుక అక్రమ రవాణా, తవ్వకాలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇసుక తరలించేవారికి ఇచ్చే కూపన్లపై తప్పనిసరిగా తేదీ, పంచాయతీ కార్యదర్శి సంతకం ఉండాలన్నారు. యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరిపేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో థర్డ్ ఆర్డర్ రీచ్లు 48 ఉన్నాయని, రెండు స్టాకు పాయింట్లలో నాణ్యమైన ఇసుకను శ్రీకాకుళం జిల్లా నుంచి తెప్పించి అందుబాటులో ఉంచామని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ వివరించారు. జిల్లాలో ఏడాదికి సుమారు 4 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అవసరం ఉంటుందని, ఆ మేరకు అందుబాటులో ఉంచుతున్నట్టు గనులశాఖ డీడీ సీహెచ్ సూర్యచంద్రరావు వివరించారు. కొత్తవలస వద్ద ఇసుక స్టాక్ పాయింట్ ప్రతిపాదన పెండింగ్లో ఉందన్నారు. సమావేశంలో డీటీసీ మణికుమార్, ఆర్డీఓలు డి.కీర్తి, రామ్మోహన్, ఆశయ్య, డీపీఓ మల్లికార్జునరావు, ఇరిగేషన్ ఈఈ వెంకటరమణ, పొల్యూషన్ ఈఈ సరిత, పలువురు తహసీల్దార్లు పాల్గొన్నారు. డీఏ బకాయిల కోసం మరణించాలా? ● తక్షణమే డీఏ ఉత్తర్వులు సవరించాలి ● ఏపీటీఎఫ్ డిమాండ్ బొబ్బిలి: కూటమి ప్రభుత్వం నుంచి డీఏ బకాయిలు పొందాలంటే ఉద్యోగులు మరణించాలా? ఇదెక్కడి అన్యాయం? లేదంటే ఉద్యోగవిరమణ పొందాలా? ఇవెక్కడి నిబంధనలు అంటూ ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ జేసీ రాజు ఆవేదన వ్యక్తంచేశారు. బొబ్బిలిలోని ఏపీటీఎఫ్ కార్యాలయంలో కార్యవర్గ సభ్యులతో కలిసి విలేకర్లతో మంగళవారం మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి డీఏ బకాయిల జీఓలో 30–09–2025 నాటికి చెల్లించాల్సిన బకాయిలను ఉద్యోగ విరమణ చేసిన కాలంలో ఇస్తామని, ఒక వేళ చనిపోతే వారి వారసులకు అందజేస్తామని ప్రకటించడం దారుణమన్నారు. ఈ నిర్ణయం ఉద్యోగుల పట్ల ముమ్మాటికీ నిర్లక్ష్యమేనన్నారు. ఎలాంటి వివక్ష చూపకుండా వెంటనే జీఓ నంబర్లు 60, 61లను సవరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన 21 నెలల బకాయిలను వారి పీఎఫ్ ఖాతాలకు జమ చేయాలన్నారు. నాలుగు డీఏలు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఒక డీఏ ఇవ్వడమే దారుణమంటే, తిరిగి దానిని కూడా ఉద్యోగులు మరణించాక వారసులకు ఇస్తామని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. చర్చల్లో ఒకవిధంగా, జీఓలో మరోలా పేర్కొనడం ఉద్యోగ, ఉపాధ్యాయులను ప్రభుత్వం మోసం చేయడమేనన్నారు. సీపీఎస్ ఉద్యోగులకు, పింఛను దారులకు నగదు రూపంలో తక్షణమే డీఏ బకాయిలు చెల్లించాలన్నారు. ఆయన వెంట జీసీహెచ్జీ శర్మ, చిన్నారావు, యుగంధర్, తదితరులు ఉన్నారు. 6,120 క్యూసెక్కుల నీరు విడుదల వంగర: మండలంలోని మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టులో వేగావతి, సువర్ణముఖి నదుల నుంచి 5 వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టులో 64.48 మీటర్ల మేర నీటిమట్టం నమోదుకావడంతో మంగళవాం రెండు గేట్లు ఎత్తి 6,120 క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెట్టినట్టు ఏఈ నితిన్ తెలిపారు. -
ఇది సరైన విధానం కాదు..
పాత నిబంధనలను కొత్త వాటితో పోల్చడం, ఉపాధ్యాయులకు ఇబ్బంది పెట్ట డం సరైన విధానం కాదు. వీటిపై మేధావి వర్గాలు ఆలోచన చేయాలి. గతంలో ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా కష్టంతో కూడుకున్నది. ఉపాధ్యా య శిక్షణకు ముందుగానే ఒక పరీక్ష పాసవ్వాలి. ర్యాంకు రావాలి. అనంతరం డీఎస్సీలో ర్యాంకు రావాలి. అప్పట్లో శిక్షణ అంటేనే సివిల్స్ మాదిరి గా ఉండేది. అటువంగి సమయంలో ఉపాధ్యా య ఉద్యోగాలు పొందినవారు చాలా కష్టపడిన వారే. వారికి ఇప్పుడు మళ్లీ టెట్తో ముడిపెట్ట డం సరైన విధానం కాదు. – పొట్నూరు మొయ్యన్నాయుడు, రిటైర్డ్ హెచ్ఎం, చింతలపేట, సంతకవిటి మండలం -
నిర్ణీత గడువు పెట్టి..
సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1న ప్రభుత్వ ఉపాధ్యాయులు టెట్ అర్హత సాధించాలని తీర్పు ఇచ్చింది. వెంటనే చాలా రాష్ట్రాలు రివ్యూ పిటిషన్లు వేశాయి. ఇక్కడ ఇంతవరకూ కదలిక లే దు. ఇలాగైతే చాలా మంది ఉపాధ్యాయులకు ఇబ్బందులు తప్పవు. కొత్తగా వస్తున్న నిబంధ నలను గత ఉద్యోగులకు, ఉద్యోగాలకు ముడిపెట్టడం సబబుకాదు. ఏ ప్రభుత్వ శాఖకు లేని నిబంధనలు విద్యా శాఖకు మాత్రమే అమలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై ఉపాధ్యాయులకు అనుకూలంగా వ్యవహరించాలి. – అదపాక దామోదరరావు, సీనియర్ ఉపాధ్యాయులు, రాజాం -
దీపావళి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి
విజయనగరం రూరల్: దీపావళి పండగ ప్రజలందరి జీవితాల్లో వెలుగు లు నింపాలని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షు లు మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) ఆకాంక్షించారు. ఉమ్మడి జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, నాయకులకు, కార్యకర్తలకు ఆదివారం ఒక ప్రకటన ద్వారా దీపావళి పండగ శుభాకాంక్షలు తెలిపారు. అమావాస్య నాటి కారు చీకటిని తొలగించడానికి, దీపాలతో వెలుగును నింపడం ఈ పండగ సంప్రదాయమని, మనలోని అంథకారాన్ని తొలగించి జ్ఞాన జ్యోతులు వెలిగించాలన్నది దీని వెనుక ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖః సంతోషాలు వెల్లివిరియాలని, ఆ లక్ష్మీదేవి చల్లని చూపుతో అష్టైశ్వర్యాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. దీపావళి చీకటిపై వెలుగు, అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి విజయం సాధించిన పండగని పేర్కొన్నారు. ఈ పవిత్ర పండగ సందర్భంగా ప్రతి ఇంటా ఆనందం, ఐశ్వర్యం, శాంతి, సౌభాగ్యం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. ప్రజలు దీపావళి పండగను ఆనందంగా, పర్యావరణ హితంగా జరుపుకోవాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. డెంకాడ: మండలంలోని అక్కివరం పంచాయ తీ గొల్లపేట వద్ద ఉన్న ఏపీ మోడల్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న పతివాడ భాను రాష్ట్ర స్థాయి సైస్స్ సెమినార్–2025లో విజేత గా నిలిచాడు. విజయవాడలో ఇటీవల జరిగిన సైన్స్ సెమినార్లో రాష్ట్ర వ్యాప్తంగా 52 మంది విద్యార్థులు పాల్గొనగా పతివాడ భాను విజేతగా నిలిచాడు. ఈ నెల 29వ తేదీన బెంగళూరులో జరగనున్న జాతీయ స్థాయి సైన్స్ సెమినార్కు భాను ఒక్కడే ఎంపికయ్యాడని ప్రిన్సిపాల్ సీహెచ్ సంధ్య ఆదివారం తెలిపారు. విజేతగా నిలిచిన పతివాడ భాను ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఎం.వెంకటకృష్ణరెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. గైడ్ టీచర్గా వై.రెబెక్క సెల్వి వ్యవహరించారు. విజేతగా నిలిచిన పతివాడ భానును డీఈవో యు.మాణిక్యంనాయుడు, ప్రిన్సిపాల్ సంధ్య, ఉపాధ్యాయులు అభినందించారు. జాతీయ స్థాయిలో రాణించి జిల్లా, రాష్ట్ర గౌరవాన్ని నిలబెట్టాలని ఆకాంక్షించారు. -
జ్ఞానకాంతులు... కలశజ్యోతులు
విజయనగరం టౌన్: పైడితల్లి నామస్మరణతో విజయనగరం పట్టణం ఆదివారం పులకరించిపోయింది. మాలధారుల కలశ జ్యోతుల వెలుగులో అమ్మవారి రథం ముందుకు సాగింది. వనంగుడి నుంచి చదురుగుడి వరకూ దారి పొడవునా భక్తులు జ్యోతి దర్శనం చేసుకున్నారు. చల్లంగ చూడాలంటూ తల్లిని శరణువేడారు. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, సిరుల తల్లి శ్రీ పైడితల్లి అమ్మవారికి భక్తులు జ్యోతులతో నీరాజనం పలికారు. రైల్వేస్టేషన్ వద్దనున్న పైడితల్లి వనంగుడి నుంచి అమ్మ వారి ఉత్సవ విగ్రహంతో భారీ ర్యాలీ నిర్వహించారు. పైడిమాంబ దీక్షాధారులు జై పైడిమాంబ.. జైజై పైడిమాంబ అంటూ నినాదాలు చేశారు. ఆలయ సూపరింటెండెంట్ వైవి.రమణి, సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, సూపర్వైజర్ రామారావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, పైడితల్లి దీక్షాపరులు కొబ్బరికాయలు కొట్టి ఉత్సవ రథాన్ని ప్రారంభించారు. ముందుగా ఆలయ ఆవరణలో కలశజ్యోతులను వెలిగించి, ఉత్సవ విగ్రహంతో పాటూ దీక్షాపరులు మూడుసార్లు ప్రదక్షణలు చేశారు. చీకటి అనే అజ్ఞానం నుంచి జ్ఞానమనే వెలుగును ప్రసాదించి అందరినీ చల్లగా కాపాడమని పైడితల్లికి పూజలు నిర్వహించారు. వర్షంతో అమ్మకు చల్లదనం పసిడి కాంతుల పైడితల్లి అమ్మవారు కలశజ్యోతుల నీరాజనానికి చల్లదనం చేయించుకున్నారు. దీపాలను వెలిగించిన కొద్దిసేపటికే వర్షం పడింది. వర్షం పడినంతసేపూ పైడితల్లి దీక్షాదారుల శరణుఘోషతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మికత సంతరించుకుంది. రథాయాత్ర చదురుగుడికి చేరుకోగానే భక్తులు, దీక్షాదారులు అమ్మవారికి జ్యోతులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పైడితల్లి దీక్షా ఆదిపీఠం వ్యవస్థాపకులు ఆర్.సూర్యపాత్రో నేత్రత్వంలో పైడితల్లి దీక్షాపరులు, భక్తులు, దాతలతో చదురుగుడి వద్ద అంబలం పూజను ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. -
అధికారులకు దీపావళి
● మళ్లీ పండగొచ్చింది ● షాపుల వారీగా వసూళ్లు ● సిండికేట్ కలెక్షన్ ఫుల్ సాక్షి ప్రతినిధి, విజయనగరం : అదేమిటో.. జిల్లా అధికారులకు అదృష్టం ముసురు పట్టినట్టు పట్టింది. వద్దంటున్నా కనక వర్షం కురిసేస్తుంది. మొన్న మొన్నటి వరకు పైడితల్లి అమ్మవారి పండగ పేరు చెప్పి కలెక్షన్ చేసిన రెవెన్యూ.. పోలీస్.. మున్సిపల్ అధికారులకు... ఇంకా ఆ డబ్బులు ఖర్చుపెట్టక ముందే వారికి ఇంకో పండగ వచ్చి పడింది. ఈసారి దీపావళి ధమాకా... బాణసంచా దుకాణాలు పెట్టాలంటే భారీ స్థాయిలో అనధికారిక ఫీజులు చెల్లించాల్సిందే.. లేకుంటే మతాబులు అమ్మేందుకు లైసెన్సు ఇచ్చేది లేదని అధికారులు తెగేసి చెప్పడంతో ఈ దీపావళి వ్యాపారం చేసే వ్యాపారులు అడిగిన కాడికి ముడుపులు ఇచ్చుకోక తప్పలేదు. విజయనగరంలోని ఆర్టీవో ఆఫీస్ వద్ద కె.ఎల్.పురంలో ఎప్పట్లానే ఈసారి కూడా బాణసంచా షాపులకు తాత్కాలిక లైసెన్సులు ఇచ్చారు. ఇక్కడ దాదాపు 32 షాపులు ఏర్పాటు చేయగా ఫైర్, మున్సిపాలిటీ, రెవెన్యూ, పోలీసులు ఇలా వేర్వేరు శాఖలకు ముడుపులు ఇచ్చుకొని షాపులు ఏర్పాటు చేశారు. అయితే ఒక్కో శాఖకు వేర్వేరుగా ఇవ్వడం అదంతా ఇబ్బందికరమైన వ్యవహారం కావడంతో గంపగుత్తగా ఒక్కో షాపు నుంచి రూ.50వేలు వసూలు చేసి అన్ని శాఖలతో కలిపి పంచుకున్నట్టు తెలుస్తోంది. అంటే కెఎల్.పురంలోని షాపుల నుంచే రూ.16లక్షలు వసూలైందన్న మాట. ఇది కాకుండా లోయర్ ట్యాంక్ బండ్ వద్ద తాత్కాలికంగా 18 షాపులు ఏర్పాటు చేయగా అది మాన్సాస్ స్థలం కాబట్టి ఒక్కో షాపు రూ.20 వేల చొప్పున రౌడీ మామూలు చెల్లించాల్సిందే.. ఓ ముఖ్య ప్రజాప్రతినిధి తాలూకా అనుచరుడు దందా చేసినట్టు తెలుస్తోంది. పెద్దమ్మికే పెద్దరికం పట్టణంలోని మతాబుల షాపుల నుంచి మామూలు వసూలు చేసే బాధ్యత రెవెన్యూ శాఖకు చెందిన పెద్దమ్మికి ఆయా శాఖలు అప్పగించినట్టుగా తెలుస్తోంది. అమ్మవారి పండగలో కూడా పెద్దమ్మి చెయ్యి బాగా తిరిగిందని... ఆమె చేత్తో బోణి బాగుంటుందని నమ్మకంతో ఫైర్, పోలీస్, మున్సిపల్ అధికారులు సైతం ఆమెకే కలెక్షన్ బాధ్యత అప్పగించి వసూలు చేయాలని కోరినట్టు తెలుస్తోంది. దీంతో ఒక్కో షాపు నుంచి రూ.50వేలు చొప్పున మతాబుల వ్యాపారుల సంఘం వసూలు చేసి రెవెన్యూ పెద్దమ్మికి ముట్ట చెప్పగా ఆమె తన వాటా మినహాయించుకుని మిగతా వాళ్లకు కొంత పంపిణీ చేసినట్టుగా చెబుతున్నారు. వారం రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో వ్యాపారాల మీద నమ్మకం లేదని... ఆదివారం సాయంత్రం కూడా నగరంలో భారీగా వాన కురవడంతో ప్రజలు టపాసులు కొనేందుకు వీధుల్లోకి రావడం లేదని, ఇలాంటి గడ్డు కాలంలో రూ.వేలకు వేలు ముడుపులు ఇచ్చుకొని చేసేంత వ్యాపారం ఏమీ లేదని... తెచ్చిన సరుకు తడిసిపోయి... తమకు నష్టాల భయం పట్టుకుందని చిరు వ్యాపారులు వాపోతున్నారు. మీ నష్టాలతో మాకేం సంబంధం.. మీకు లాభం వస్తే మాకు వాటా ఇస్తారా..? ఇవ్వరు కదా... కాబట్టి జస్ట్ మామూళ్లు ఇచ్చి దుకాణాలు ఏర్పాటు చేసుకోండి అంటూ అధికారుల సిండికేట్ అల్టిమేటం జారీ చేయడంతో అడిగినంత ఇచ్చుకోక వ్యాపారులకు తప్పలేదు. -
పరమ పవిత్రం కార్తీకం
● కార్తీక దీక్ష శ్రేష్టం ● ఓ వైపు ముక్తి..మరో వైపు ఆరోగ్యం.. ● నెలరోజుల దీక్షతో ఎన్నో ఫలితాలు..రాజాం: కార్తీకమాసం పవిత్రమైన మాసం. ఈనెల 22 నుంచి కార్తీక దీక్షలు, పూజలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అన్ని గ్రామాల్లో శివాలయాలు ఈ పూజలకు సిద్ధమయ్యాయి. కార్తీకమాసంలో చేపట్టే నెలరోజుల దీక్ష ఓ వైపు ముక్తిని, మరో వైపు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. కార్తీక దీపం ఎంతో పవిత్రమైనది. ఈ నెలరోజులు దీపం వెలిగించినా, ఆలయాల వద్ద, ఇండ్ల వద్ద వెలిగించిన దీపాన్ని దర్శించినా ఎంతో పుణ్యం కలుగుతుంది. ఈ కార్తీకంలో వేకువజామున చేసే స్నానాలు శరీరానికి శక్తిని ఇస్తాయి. ఆయుష్షును పెంచుతాయి. దీర్ఘకాలిక రోగాలను నయం చేస్తాయి. దీపారాధనతో ఆధ్యాత్మిక భావనలో ఉన్నవారికి శాంతిభావం పెంపొందుతుంది. వనసమారాధనలు, సామూహిక భోజనాలు ఐక్యతను చాటుతాయి. శివ, కేశవులిద్దరికీ అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీకమాసం. కార్తీక దీపం అంటే.. కార్తీకమాసంలో ప్రతిరోజూ సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి స్నానమాచరించాలి. అప్పుడే అది కార్తీక స్నానమవుతుంది. నిత్యం దీపాన్ని వెలిగించినా, ఆరాధించినా, దీపం కార్తీకమాసంలో వెలిగించడం, నది, ప్రవహిస్తున్న సెలయేరుల్లో విడిచిపెట్టడం, ఆకాశ దీపాలను వెలిగించడం, దీపదానం చేయడం వంటి ఆచారాలు పాటించాలి. కార్తీకమాసమంతా ఇంటి ముందు గుమ్మానికి ఇరువైపులా సాయంకాలం దీపాలను వెలిగించాలి. అలాగే సాయంత్రం శివాలయాల్లో, వైష్ణవాలయాల్లో గోపుర ద్వారం వద్ద దేవుని సన్నిధానం, ప్రాంగణంలో దీపాలు వెలిగించిన వారికి సర్వపాపాలు హరిస్తాయని, వైకుంఠప్రాప్తి కలుగుతుందని శాస్త్ర వచనం చెబుతోంది. దీపారాధనకు ప్రాముఖ్యం ఈ నెలలో ఆలయాల వద్ద ఇతరులు వెలిగించిన దీపాలు ఆరిపోకుండా చూసినా పుణ్యప్రదమే. కార్తీక సోమవారాలు, పౌర్ణమి, ఏకాదశి తదితర దినాల్లో సాయం సమయాల్లో శివాలయాల్లో ఉసిరికాయపైన వత్తులు వేసి దీపం వెలిగించడం శ్రేష్టం. ఆవునెయ్యితో దీపం వెలిగించడం శ్రేష్టం. నువ్వుల నూనె, కొబ్బరి నూనె, అవిశనూనె, విప్ప నూనె, ఆముదంతోనైనా దీపాలు వెలిగించాలి. నెలరోజుల దీక్ష..కార్తీక స్నానాన్ని ఆశ్వయుజ బహుళ అమావాస్య దీపావళి రోజు నుంచి ప్రారంభించచాలి. నెలంతా కార్తీకస్నానం చేయడం మంచిది. వీలుకాని వారు సోమవారాల్లోనూ, శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి రోజుల్లోనైనా తప్పక ఆచరించాలి. శుద్ధ ద్వాదశినాడు తులసి పూజచేయాలి. ఈ నెలంతా శ్రీ హావిష్ణువును తులసీదళాలు, జాజిపూలతో పూజించాలి. ఈ నెలంతా శివుడిని మారేడు దళాలు, జిల్లేడు పూలతో పూజించాలి. ఈ మాసంలో కార్తీక పురాణాన్ని పారాయణం చేయడం మంచిది. కార్తీకంలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. -
కార్పొరేట్ మతతత్వ శక్తులపై పోరాడదాం
● కడపలో మహాసభలను విజయవంతం చేయాలి ● సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పిలుపువిజయనగరం గంటస్తంభం: కార్పొరేట్ మతతత్వ మనువాద శక్తులను ప్రతిఘటించి, సమానత్వం, సౌభ్రాతృత్వం, ప్రజాస్వామ్యం వర్ధిల్లే ఆంధ్రప్రదేశ్ను నిర్మిద్దామనే పిలుపుతో, డిసెంబర్ 6,7 తేదీల్లో కడపలో జరగనున్న సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ తొమ్మిదవ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం విజయనగరంలోని ఊటగెడ్డ వద్ద పార్టీ జెండాను జిల్లా కమిటీ విడుదల చేసిన కరపత్రాన్ని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ జిల్లా కమిటీ సభ్యులు ఎం.అప్పలరాజు, బి.గిరిప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నోరు విప్పడం లేదని మిమర్మించారు. జీఎస్టీ శ్లాబ్ రేటు తగ్గించడం ద్వారా ధరలు తగ్గిపోయాయని, ఆదాయాలు పెరిగాయని పాలకులు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, వాస్తవానికి 18శాతం జీఎస్టీ శ్లాబ్ ఇప్పటికీ కొనసాగుతున్నప్పుడు ప్రజలపై మరింత భారం పడుతోందని తెలిపారు. ఎనిమిది సంవత్సరాలుగా లక్షల కోట్ల రూపాయల జీఎస్టీని వసూలు చేసి కార్బొరేట్లకు లాభాలు చేకూర్చారని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో విప్లవ వామపక్ష ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి కడపలో జరిగే మహాసభలను విజయవంతం చేయాలని, అందుకు ప్రజలు, కార్మికులు, విద్యార్థులు, యువత అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు కె.గౌతమి, పార్టీ నాయకులు జి.సత్యారావు, ఎం.పైడిరాజు తదితరులు పాల్గొన్నారు. -
జాతీయస్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఎంపిక
గుమ్మలక్ష్మీపురం: జాతీయస్థాయి ఫెన్సింగ్ పోటీలకు గుమ్మలక్ష్మీపురం మండలం జొల్లగూడ గ్రామానికి చెందిన నిమ్మల జితేంద్ర, బిడ్డిక హర్షవర్ధన్ ఎంపికై నట్లు కొత్తగూడ ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల పీడి నిమ్మక మాధవరావు, ఎన్ఐఎస్ ఫెన్సింగ్ కోచ్ బాలరాజు ఆదివారం విలేకరులకు తెలిపారు. ఈమేరకు ఈనెల 17వ తేదీన విజయనగరంలోని విజ్జి స్టేడియంలో జరిగిన సబ్ జూనియర్ బాల బాలికల ఫెన్సింగ్ ఎంపిక పోటీల్లో వీరిద్దరూ ఉత్తమ ప్రతిభ కనపరి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని, ఈనెల 18వ తేదీన కాకినాడలోని లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ వేదికగా నిర్వహించిన 12వ సబ్ జూనియర్ అంతర జిల్లా బాల బాలికల ఫెన్సింగ్ పోటీల్లో కూడా ఉత్తమ ప్రతిభ కనబర్చారని, వ్యక్తిగత విభాగంలో చూపిన ప్రతిభకు జితేంద్ర, హర్షవర్థన్ కాంస్య పతకాలు సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. జాతీయస్థాయి పోటీల్లో కూడా ఉత్తమంగా రాణించాలని పిలుపునిచ్చారు. -
చేతకాని మంత్రికి రెండు పదవులు అవసరమా?
● మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర ● నియోజకవర్గంలో అభివృద్ధిపై బహిరంగ చర్చకు సవాల్ సాలూరు: గిరిజనులకు అండగా నిలవలేని, ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎమ్ల నియామకంపై తొలిసంతకం చేసి నేటికీ అమలుచేయలేని మంత్రి సంధ్యారాణికి రెండు పదవులు అవసరమా? మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర ప్రశ్నించారు. గిరిజన విద్యార్థుల మరణాలపై పభుత్వం చోద్యం చూస్తుండగా, ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బాధిత కుటుంబాలకు పదిలక్షల రుపాయలు చొప్పున నష్టపరిహారం ఇచ్చి తన మానవత్వాన్ని చాటుకున్నార న్నారు. కాగా జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలపై మంత్రి సంధ్యారాణి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన వైఎస్సార్సీపీ నేతలు రాజకీయం చేస్తున్నారంటూ విమర్శలు చేస్తారా? అంటూ మంత్రి సంధ్యారాణిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీ్త్రశిశుసంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల మంత్రిగా పనిచేస్తున్న ఆమె తన శాఖలకు న్యాయం చేయలేక అసమర్థ మంత్రిగా నిలిచారని, పదవులకు న్యాయంచేయలేని మీకు రెండు పదవులు అవసరమా? అంటూ మండిపడ్డారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గురుకులాల్లో తాము ఏఎన్ఎమ్ల నియామకం చేపట్టామని, ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎమ్ల నియామకంపై తాను ఫైల్ పెట్టానని, సీఎం వద్ద ఫైలు ఉండగా ఎన్నికలు వచ్చాయని కావాలంటే వారు ఆఫైల్ను తెప్పించుకోవచ్చ న్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తాము మంజూరుచేసిన రోడ్ల పనులు, ఆ బిల్లులు జరగాలన్నా ఆ ప్రాంతాల గిరిజన నాయకులు తమ పార్టీలోకి వస్తేనే బిల్లులు అవుతాయంటూ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరి హయాంలో నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందో అందరికీ తెలుసునని, అభివృద్ధి విషయంలో బహిరంగ చర్చకు తానెప్పుడూ సిద్ధమని, మీరెక్కడికి రమ్మంటే అక్కడికి తాను చర్చకు వస్తానని సవాల్ విసిరారు. మంత్రి సంధ్యారాణి మాట్లాడేవన్నీ అబద్ధాలేనని, పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో కూటమి ప్రభుత్వంలో 14 మంది గిరిజన విద్యార్థులు మరణించడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. పదవులు ఎవరికీ శాశ్వతం కాదని, ఇకనైనా మంత్రి సంధ్యారాణి విమర్శలు మానుకుని హుందాగా రాజకీయాలు చేయాలని హితవుపలికారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. -
జిల్లా రెవెన్యూ సర్వీసెస్ నూతన కమిటీ ఏకగ్రీవం
పార్వతీపురం రూరల్: ఆంఽధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసి యేషన్(ఏపీఆర్ఎస్ఏ) పార్వతీపురం మన్యం జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. జిల్లా యూనిట్ పదవీ కాలం ముగియడంతో రాష్ట్ర కమిటీ సూచనల మేరకు ఆదివారం పార్వతీపురంలో ఈ ఎన్నికల ప్రక్రియ చేపట్టారు. రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆదేశాలతో, ఎన్నికల అధికారిగా శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు కె.శ్రీరాములు, సహాయ ఎన్నికల అధికారిగా బీవీవీ ఎన్.రాజు, పరిశీలకుడిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్ బంగార్రాజు వ్యవహరించారు. జిల్లా నూతన అధ్యక్షుడిగా కలెక్టరేట్ ఈఎఫ్జీ సెక్షన్ పర్యవేక్షకుడు గొట్టాపు శ్రీరామ్మూర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా వీరఘట్టం తహసీల్దార్ ఎ.సాయి కామేశ్వరరావు, కోశాధికారిగా కలెక్టరేట్ సి.సెక్షన్ పర్యవేక్షకురాలు పి.సత్యలక్ష్మి కుమార్ ఎంపికయ్యారు. నూతన కార్యవర్గంలో ముఖ్యలు వీరే.. సహాధ్యక్షులుగా పాలకొండ తహసీల్దార్ సీహెచ్ రాధాకృష్ణమూర్తి, ఉపాధ్యక్షులుగా ఎన్.శివన్నారాయణ(తహసీల్దార్, భామిని), పి. చిట్టెమ్మ(రీ–సర్వే ఉప తహసీల్దార్, సీతానగరం), ఎన్.శ్రీనుబాబు(ఆర్ఐ, సీతానగరం) ఎన్నికయ్యారు. ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కె. శ్రీనివాసరావు (ఉపతహసీల్దార్, బలిజిపేట), క్రీడలు– సాంస్కృతిక కార్యదర్శిగా బి.శివరామకృష్ణ(ఆర్ఐ, గుమ్మలక్ష్మీపురం) బాధ్యతలు చేపట్టనున్నారు. వారితో పాటు పలువురు సంయుక్త కార్యదర్శులు, ఈసీ సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. -
మార్కెట్లో పెండలం
● ఆరంభమైన సీజన్ ● పెరిగిన దిగుబడులు ● ఏజెన్సీలో వంద ఎకరాలకు పైగా సాగుసీతంపేట: సీతంపేట ఏజెన్సీలో విస్తృతంగా పండే పెండలం సీజన్ ఈ ఏడాది ఆరంభమైంది. దిగుబడులు బాగా పెరిగినట్లు గిరిజనులు చెబుతున్నారు. మైదాన ప్రాంత వ్యాపారులు వాటిని కొనుగోలు చేస్తున్నారు. అంతగా పెట్టుబడులు అక్కర్లేక పోయినప్పటికి ఈ పంట వేసుకుంటే మంచి ఆదాయవనరులు వస్తాయని గిరిజనులు తెలియజేస్తున్నారు. సీతంపేట, బామిని ఏజెన్సీ ప్రాంతాల్లో సుమారు వంద ఎకరాలకు పైగా కొండ పోడు వ్యవసాయంలో భాగంగా పెండలం పండిస్తారు. కావిళ్లలో కట్టలు కట్టి తీసుకువచ్చి గిరిజనులు విక్రయిస్తారు. ఒక్కో కట్ట రూ.200 నుంచి రూ.300 వరకు విక్రయిస్తున్నామని గిరిజనులు తెలిపారు. గతేడాది ఇదేసీజన్లో ఒక్కో కావిడి రూ.300ల వరకు విక్రయించేవారమని అంటున్నారు. ఇలా కొనుగోలు చేసిన వ్యాపారులు పట్టణాల్లోని మార్కెట్లో కిలోల వంతున కిలో రూ.90 వరకు విక్రయిస్తారు. ఒక్కో పెండలం కట్టకు రూ.200 వరకు ఆదాయం వస్తుందని గిరిజన రైతులు చెబుతున్నారు. అలాగే కందను కూడా బుట్టల లెక్కన ఒక్కో బుట్ట వంద వరకు కొనుగోలు చేస్తారు. మైదాన ప్రాంతాల్లో రూ.300ల వరకు అమ్మకాలు జరుపుతారు. మైదాన వ్యాపారులదే హవావిశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఒడిశా ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఇక్కడికి వచ్చి పెండలం కొనుగోలు చేస్తారు.గతంలో సీతంపేటలో సోమవారం, మర్రిపాడులో బుధవారం, గురువారం దోనుబాయిలో కుశిమి, పొల్ల గ్రామాల్లో శనివారం వారపు సంతలు జరుగుతాయి. ఈ సంతలకు వ్యాపారులు వచ్చి కొనుగోలు చేసేవారు. అయితే కోవిడ్–19 కారణంగా వారపు సంతలు తగ్గాయి. నామమాత్రంగా అక్కడక్కడా జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చి గిరిజన రైతులు చెప్పిన ధరలు కాకుండా వ్యాపారులు సిండికేట్గా మారి కొన్ని సందర్భాల్లో ధర నిర్ణయిస్తారు. దీంతో వారు చెప్పిన ధరలకు ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని గ్రామాల్లో గిరిజనులు ముందుగా దళారుల నుంచి అడ్వాన్స్లు తీసుకుంటారు. పంట పక్వానికి వచ్చే సమయంలో ఆ పంటను వ్యాపారులకు ఇస్తారు. పాండ్ర, కొండాడ, చింతాడ, జగతపల్లి, అక్కన్నగూడ, బెన్నరాయి, గాటిగుమ్మడ, సీదిగూడ తదితర గ్రామాల్లో ఈ పంట ఎక్కువగా పండుతుంది. గిట్టుబాటు ధర కల్పిస్తే బాగుంటుంది కావిళ్లు మోసుకుని తీసుకువస్తాం. గిట్టుబాటు ధర లేకపోవడంతో తక్కువ ధరలకు విక్రయించాల్సి వస్తోంది. ప్రత్యేక మద్దతు ధరలు లేవు. దీంతో వ్యాపారులు నిర్ణయించిన ధరలకు అమ్మకాలు చేయాల్సిన పరిస్థితి ఉంది. శ్రమకు తగిన ఫలితం దక్కడం లేదు. ఎస్.తోటయ్య, మూలగూడ తవ్వితీయడం చాలా కష్టం కొండపోడు వ్యవసాయంలో పెండలాన్ని పండిస్తాం. ఎంతో శ్రమకోర్చి పెండలాన్ని తవ్వి తీస్తాం. వ్యాపారులు నిర్ణయించిన ధరలకు విక్రయించాల్సి వస్తోంది. ధరలు పడిపోవడంతో ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఎస్.సుక్కయ్య, ఈతమానుగూడ -
రియల్ మోసంపై..స్పందించిన అధికారులు..
చీపురుపల్లి: మండలంలోని చిననడిపల్లి రెవెన్యూ పరిధిలో అనుమతులు లేకుండా వెలసిన మెగా వెంచర్ మోసంపై అధికారులు స్పందించారు. చిననడిపల్లి రెవెన్యూ పరిధిలోని మెగా వెంచర్కు ఎలాంటి అనుమతులు లేవని ఆదివారం ‘సాక్షి’ పత్రికలో ‘రియల్గా మోసం’ అనే శీర్షికన కథనం వెలువడింది. దీనికి ఎంపీడీఓ ఐ.సురేష్ ఆధ్వర్యంలో సిబ్బంది స్పందించారు. ఆదివారం చిననడిపల్లి పరిధిలోని అనుమతులు లేని మెగా వెంచర్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సురేష్ మాట్లాడుతూ అనుమతి లేని లేఅవుట్కు సంబంధించిన యజమాని అందుబాటులో లేరని చెప్పారు. అయితే ఎలాంటి అనుమతులు లేని ఈ వెంచర్లో ఎవ్వరూ ప్లాట్లు కొనుగోలు చేయకుండా బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత పంచాయతీ కార్యదర్శిని అదేశించినట్లు చెప్పారు. అంతేకాకుండా అనుమతులు లేని ఇక్కడి లే అవుట్కు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని వీఎంఆర్డీఏకు సూచనలు తెలియజేస్తూ నివేదిక పంపుతున్నట్లు తెలిపారు. అలాగే సదరు వెంచర్ అభివృద్ధిని తక్షణమే నిలుపుదల చేయాలని సంబంధిత వెంచర్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేయనున్నట్లు చెప్పారు. -
లొద్ద జలపాతం అభివృద్ధి చేస్తా
సాలూరు: కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర్రెడ్డి ఆదివారం సాలూరు మండలంలోని లొద్ద ప్రాంత గిరిజనుల గూడాల్లో గిరిజనులతో మమేకమయ్యారు. ప్రభుత్వం ద్వారా అందుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ఆరా తీశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గృహాలు లేని వారందరికీ గృహాలను మంజూరుచేస్తానని తెలిపారు. స్వచ్ఛమైన ప్రేమాభిమానాలకు గిరిజనులు మారుపేరని కితాబిచ్చారు. అనంతరం అతికష్టంమీద కొంతదూరం అటవీమార్గంగుండా కాలినడకన లొద్ద జలపాతానికి వెళ్లిన కలెక్టర్ ఆ జలపాతాన్ని చూసి మంత్రముగ్ధుడయ్యారు. అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించారు. ఇటువంటి సుందరమైన ప్రాంతం పర్యాటకుల తాకిడితో సందడిగా మారాలని ఆకాంక్షించారు. లొద్ద జలపాతానికి పర్యాటకులు వచ్చేలా మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ ప్రసూన, పలువురు అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రభాకర్రెడ్డి -
ఎస్ఐ న్యాయం చేయడం లేదు...
చీపురుపల్లి: తమ కుమారుడిని యజమానే హత్య చేశాడని, ఆయనకు గతంలోనూ నేర చరిత్ర ఉందని పోలీస్స్టేషన్లో ఎస్ఐకు ఫిర్యాదు చేసినప్పటికీ కనీసం పట్టించుకోవడం లేదని మండలంలోని పత్తికాయవలసకు చెందిన మృతుడు యలకల రాము తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం స్థానిక ప్రెస్క్లబ్కు వచ్చిన మృతుని తల్లిదండ్రులు యలకల రమేష్, సింహాచలం, చెల్లి రమ, మేనమామలు ముగిది పైడితల్లి, ముగిది గొల్ల, మేనత్తలు ముగిది సత్యవతి, రాధ మాట్లాడారు. కొడుకును పోగొట్టుకుని ఉన్న తమకు న్యాయం జరగడం లేదన్నారు. తమ కుమారుడు రామును సంబంధిత యజమాని వండాన సన్యాసి హత్య చేశాడని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ ఎస్ఐ పట్టించుకోవడం లేదన్నారు. ఎస్ఐకు జేసీబీ యజమాని వండాన సన్యాసికి బంధుత్వం ఉండడంతోనే హత్య కేసును నీరుగార్చే కుట్ర పన్నుతున్నారనే భయం కలుగుతోందన్నారు. అందుకనే తమకు న్యాయం చేయాలంటూ ఎస్పీ దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఐదారు రోజులు క్రితమే తమ కుమారుడును జేసీబీ యజమాని వండాన సన్యాసి హత్య చేశాడని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే.. ఇంతవరకు కనీసం గ్రామానికి వచ్చి విచారణ నిర్వహించలేదని పేర్కొన్నారు. అందుకే తమకు న్యాయం జరగదని భయం పెరిగిందన్నారు. కూలి పనులు చేసుకునే తమకు ఎలాంటి అండదండలు లేవని పోలీసులు కూడా న్యాయం చేయకపోతే ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. జేసీబీ యజమాని సన్యాసి మొబైల్లో అక్టోబర్ 7 నుంచి 12 వరకు కాల్ లిస్ట్ వెల్లడించాలని పోలీసులను కోరామన్నారు. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. హత్య చేశాడని ఫిర్యాదు చేసినా విచారణ చేపట్టలేదు.. జేసీబీ యజమానికి ఎస్ఐకు బంధుత్వం ఉండడమే కారణం మృతుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఆవేదన -
దివ్యాంగులకు మళ్లీ వైద్య పరీక్షలు!
విజయనగరం ఫోర్ట్: ఏళ్ల తరబడి పింఛన్ పొందుతున్న దివ్యాంగులకు కూటమి సర్కార్ అఽధికారంలోకి రాగానే పెద్ద షాక్ ఇచ్చింది. దివ్యాంగ పింఛన్ పొందుతున్న ప్రతీ దివ్యాంగుడు రీ అసెస్మెంట్ చేయించుకోవాలని కూటమి సర్కార్ నోటీసులు అందించింది. సచివాలయాల పరిధిలో వెల్ఫేర్ అసిస్టెంట్ల ద్వారా వారికి ఏ ఆస్పత్రికి ఏ సమయానికి వెళ్లాలి అనే దానిపై నోటీసులు ఇచ్చింది. 2025 జనవరి నెలలో రీ అసెస్మెంట్ కార్యక్రమం వైద్య విధాన్ పరిషత్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రుల్లో ఆగస్టు నెల వరకు నిర్వహించారు. పింఛన్ పునః పరిశీలన మాత్రమే, ఏ ఒక్క దివ్యాంగుడి పింఛన్ తొలగించబోమని అప్పట్లో కూటమి ప్రజాప్రతినిధులు తెలిపారు. ఆగస్టు నెలలో పింఛన్లు తొలగిస్తామని నోటీసులు ఆగస్టు నెలలో రీ అసెస్మెంట్ 40 శాతం కంటే తక్కువ వైకల్యం ఉందని చెప్పి జిల్లాలో వేలాది మంది దివ్యాంగులకు నోటీసులు ఇచ్చారు. దీంతో తమకు అర్హత ఉందని చెిప్పి జిల్లాలో 5,159 మంది దివ్యాంగులు మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు. మళ్లీ పరీక్షలు.. దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులకు మళ్లీ వైద్యులు పరీక్షలు చేయనున్నారు. నాలుగు వైద్య విధాన్ పరిషత్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రుల్లో ఈ పరీక్షలు చేయనున్నారు. ఈ మేరకు దివ్యాంగులకు సచివాలయం ఉద్యోగులు నోటీసులు కూడా అందించారు. ఎస్.కోట ఏరియా ఆస్పత్రి, గజపతినగరం ఏరియా ఆస్పత్రి, చీపురుపల్లి ఏరియా ఆస్పత్రి, రాజాం ఏరియా ఆస్పత్రి, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రుల్లో దివ్యాంగులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆర్థో విభాగానికి చెందిన దివ్యాంగులు 3600 మందికి, కంటికి సంబంధించి దివ్యాంగులు 1038మందికి, చెవుడు, మూగకు సంబంధించిన దివ్యాంగులు 465మందికి, మెంటల్ డిజార్డర్కు సంబంధించి దివ్యాంగులు 42 మందికి, మెంటల్ ఇల్నెస్కు సంబంధించిన దివ్యాంగులు 14 మందికి పరీక్షలు చేయనున్నారు. పింఛన్లు తొలగించేందుకే.. దివ్యాంగులకు ఇచ్చే పింఛన్ రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచుతున్నట్టు కూటమి సర్కార్ గొప్పలు చెప్పింది. ఈ చేత్తో ఇచ్చినట్టే ఇచ్చి ఆ చేత్తో లాగేసికొన్నట్టు కూటమి సర్కార్ దివ్యాంగులకు పింఛన్ పెంచి ఆ భారాన్ని తగ్గించుకునే కుట్ర చేస్తుందని దివ్యాంగులు ఆరోపిస్తున్నారు. పింఛన్ పెంచడం వల్ల కోట్లాది రుపాయిల భారం పడుతుందనే దురుద్దేశంతో కూటమి సర్కార్ పింఛన్ తొలగించడానికే దివ్యాంగులకు రీ అసెస్మెంట్ పేరుతో పరీక్షలు చేయిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆందోళనకు గురవుతున్న దివ్యాంగులు 5,159 మందికి వైకల్య పరీక్షలకు మళ్లీ రావాలని నోటీసులు ఏపీవీపీ, జీజీహెచ్లో పరీక్షలు చేయనున్న వైద్యులు ఫించను తొలగిస్తామని ఆగస్టులో నోటీసులు ఇచ్చిన కూటమి సర్కార్ మాకు అర్హత ఉందని దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులువైకల్య పరీక్షలు దివ్యాంగ పింఛన్కు తమకు అర్హత ఉందని జిల్లాలో 5,159 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికి సచివాలయాల ద్వారా ఏ ఆస్పత్రికి, ఏ సమయానికి వెళ్లాలో నోటీసులు వెళ్లాయి. ఆయా ఆస్పత్రుల్లో వైద్యులు దివ్యాంగులకు పరీ క్షలు చేసి సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయనున్నారు. –డాక్టర్ ఎన్.పద్మశ్రీరాణి, జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయాధికారి -
న్యాయం కోసం.. ఆత్మహత్యా యత్నం..
● తాకట్టు బంగారం కోసం జ్యువెలరీ షాపు వద్ద కుటుంబం నిరసన ● పెట్రోల్ డబ్బాతో బాధితుడి హల్చల్ పార్వతీపురం రూరల్: తాకట్టు పెట్టిన బంగారం తిరిగివ్వాలని కోరుతూ ఓ కుటుంబం బంగారం దుకాణం వద్ద ఆందోళనకు దిగిన ఘటన పట్టణంలో శనివారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. న్యాయం కోసం ఏళ్ల తరబడి తిరుగుతున్నా ఫలితం లేకపోవడంతో, బాధితుడు ఏకంగా పురుగుల మందు తాగి, పెట్రోల్తో అఘాయిత్యానికి యత్నించడం కలకలం రేపింది. బాధితుడు కోట విజయ్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని రామాపురం కాలనీకి చెందిన ఆయన, 2019లో తన అవసరాల నిమిత్తం శ్రీస్వామి జ్యువెలరీ యజమాని గెంబలి శంకరరావు వద్ద 30 తులాల బంగారం తాకట్టు పెట్టారు. కొన్నాళ్లకు శంకర్రావు కరోనాతో మరణించగా, ఆయన కుమారులు పృథ్వీ, విజయ్ కుమార్లను సంప్రదించినట్టు బాధితుడు విజయ్ తెలిపారు. అప్పటి నుంచి రెండేళ్లుగా ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తాం అంటూ వారు కాలయాపన చేస్తున్నారని బాధితుడు వాపోయాడు. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరిగినా, 15 తులాలకు లెక్క తేల్చాలని చూశారని, ఆ మాట కూడా నిలబెట్టుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎక్కడా న్యాయం జరగకపోవడంతో విసిగిపోయిన విజయ్, చివరకు పట్టణ పోలీస్స్టేషన్న్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అయితే, కేసు నమోదు చేసిన పోలీసులు సైతం చేతులు దులుపుకొన్నారని, తమకు న్యాయం చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని బాధితుడు ఆరోపించాడు. పోలీసుల నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో శనివారం నేరుగా జ్యువెలర్ షాపు వద్దకు చేరుకున్నాడు. షాపులోకి వెళ్లి పురుగుల మందు తాగేందుకు, పెట్రోల్తో ఆత్మహత్యకు ప్రయత్నించగా, కుటుంబ సభ్యులు శ్రీదేవి, సాయిరూప అడ్డుకున్నారు. అనంతరం షాపు గేట్లు మూసివేసి నడిరోడ్డుపై బైఠాయించడంతో తీవ్ర ఆందోళనకర వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న ఎస్ఐ జగదీష్నాయుడు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా బాధితులు వెనక్కి తగ్గలేదు. అనంతరం సీఐ మురళీధర్ సైతం అక్కడికి చేరుకున్నారు. కేసు నమోదు చేసిన విషయాన్ని ఆయన ధ్రువీకరించినప్పటికీ, బాధితుల ఆందోళన మాత్రం చల్లారలేదు. పోలీసుల జోక్యం చేసుకున్నప్పటికీ ఈ వ్యవహారం రాజకీయ మలుపు తిరిగింది. శనివారం సాయంత్రం పట్టణానికి చెందిన ఓ తెలుగుదేశం నాయకుడి ఆధ్వర్యంలో ఇరు వర్గాల మధ్య చర్చలు జరిగినట్టు బాధితులు వాపోయారు. సోమవారం నాటికి చెల్లింపులు జరిపేలా సయోధ్య కుదిరిందని బాధితులు తెలపడంతో ఆందోళన విరమించారు. చట్టపరంగా, పోలీస్స్టేషన్ ద్వారా తేలాల్సిన వివాదం, చివరకు రాజకీయ నాయకుడి పంచాయతీతో తాత్కాలికంగా రాజీ అయినట్టు బాధితుల తెలిపిన వివరాల మేరకు స్పష్టమైంది -
విద్యార్థులను పరామర్శించిన డీడీ
సాలూరు: పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆశ్రమ, గురుకుల పాఠశాలల విద్యార్థులను ఐటీడీఏ డీడీ విజయశాంతి, ఏటీడబ్ల్యూవో కృష్ణవేణి వేర్వేరుగా పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా వారు వేర్వేరుగా మాట్లాడుతూ, సాలూరు మండలం మామిడిపల్లి, మక్కువ మండలం ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులపై మరణాలకు సంబంధించి ఆ పాఠశాలల హెచ్ఎమ్ సీతారాం, పుష్పనాధం, మామిడిపల్లి వార్డెన్ విజయలను సస్పెండ్ చేయడం జరిగిందన్నారు. పాఠశాలల్లో సీనియర్ ఉపాధ్యాయులకు ఆ బాధ్యతలను అప్పగించినట్టు తెలిపారు. అనంతరం ఐటీడీఏ డీడీ విజయశాంతి పట్టణంలో బంగారమ్మ కాలనీలో ఉన్న బాలికల వసతిగృహాన్ని పరిశీలించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి : జేసీ పార్వతీపురం రూరల్: స్వచ్ఛ పార్వతీపురం నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, పరిసరాల పరిశుభ్రతతో పాటు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్ ప్రాంగణంలో స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ఆయన ఆధ్వర్యంలో జరిగింది. ఈ నెల స్వచ్ఛమైన గాలి నినాదంలో భాగంగా జాయింట్ కలెక్టర్తో పాటు డీఆర్వో కె.హేమలత, రెవెన్యూ సిబ్బందితో కలిసి ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ స్వచ్ఛమైన గాలి మొక్కల వల్లే సాధ్యం, ప్రతి ఒక్కరూ తమకు అందుబాటులో ఉన్న ఖాళీ స్థలంలో మొక్కలు నాటాలని కోరారు. వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రజా రవాణా వినియోగించాలని, సోలార్ విద్యుత్ వాడకాన్ని పెంచాలని సూచించారు. నిత్యం కొంత సమయం పరిశుభ్రతకు కేటాయించి, దానిని అలవాటుగా మార్చుకున్నప్పుడే స్వచ్ఛ పార్వతీపురం రూపుదిద్దుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం అధికారులతో స్వచ్ఛతపై జేసీ ప్రతిజ్ఞ చేయించారు. నేడు జూనియర్స్ తైక్వాండో క్రీడాకారుల ఎంపికలు విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరగనున్న జూనియర్స్, క్యాడెట్ తైక్వాండో పోటీల్లో పాల్గొనబోయే జిల్లా బాల, బాలికల జట్ల ఎంపిక పోటీలు ఈ నెల 19న ఆదివారం నిర్వహించనున్నట్టు జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు డివి.చారిప్రసాద్ తెలిపారు. ఉదయం 9 గంటలకు ఎంపిక పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈ నెల 24, 25 తేదీల్లో విజయనగరం వేదికగా జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు. ఎంపిక పోటీల్లో పాల్గొనబోయే క్రీడాకారులు ఆధార్, జనన ధ్రువీకరణ పత్రం, గ్రేడింగ్ సర్టిఫికెట్లు వెంట తీసుకురావాలని సూచించారు. వివరాలకు 7793950599 నంబరును సంప్రదించాలని కోరారు. నేడు పైడితల్లి అమ్మవారి కలశజ్యోతుల ఊరేగింపు విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి కలశజ్యోతుల ఊరేగింపు ఆదివారం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లును పూర్తి చేసినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి కె.శిరీష శనివారం తెలిపారు. స్థానిక రైల్వేస్టేషన్ వద్దనున్న వనంగుడిలో పైడితల్లి అమ్మవారి ఉత్సవ విగ్రహానికి స్తపన కార్యక్రమాన్ని నిర్వహించి, వేదపండితుల వేదమంత్రోచ్ఛారణలతో విశిష్ట పూజలు నిర్వహిస్తారన్నారు. అనంతరం పైడితల్లి అమ్మవారి దీక్షాపరులతో కలశ జ్యోతులు పట్టుకుని ఉత్సవ విగ్రహంతో భారీ ర్యాలీ నిర్వహిస్తారని తెలిపారు. సాయంత్రం 5.30 గంటలకు వనంగుడి నుంచి బయలుదేరుతుందని, దీక్షాపరులు కలశజ్యోతులు చేతపట్టుకుని జై పైడిమాంబ నినాదాలతో గాడీఖానా, వైఎస్ఆర్ సర్కిల్, ఎన్సీఎస్ థియేటర్ రోడ్డు, కన్యకపరమేశ్వరీ ఆలయం, గంటస్తంభం మీదుగా చదురుగుడికి చేరుకుని అక్కడ అమ్మవారికి జ్యోతులు సమర్పిస్తారని తెలిపారు. అనంతరం చదురుగుడి వద్ద భారీ ఎత్తున మెట్ల పూజను దీక్షాపరుల ఆదిపీఠం ఆధ్వర్యంలో నిర్వహించన్నుట్టు పేర్కొన్నారు. భక్తులందరూ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించి, తరించాలని కోరారు. -
రోగులకు మెరుగైన సేవలందించాలి : డీఎంఈ
విజయనగరం ఫోర్ట్: రోగులకు సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంఈ (వైద్య విద్యా సంచాలకులు) డాక్టర్ జి.రఘునందన్ అన్నారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన శనివారం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో ఓపీ విభాగాన్ని, క్యాజువాలటీ, ల్యాబొరేటరీ, ఫిమేల్ శస్త్రచికిత్సల వార్డు, పురుషల మెడికల్ వార్డును, ఎక్సరే, స్కానింగ్లను పరిశీలించారు. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు గురించి ఆరా తీశారు. రోగులకు అవసరమైన చికిత్స, మందులు అందజేయాలన్నారు. శస్త్రచికిత్సల కోసం ఆస్పత్రిలో చేరిన వారికి అవసరమైన వైద్య పరీక్షలు చేసి శస్త్రచికిత్స సకాలంలో చేయాలన్నారు. రోగులతో ప్రేమగా మాట్లాడి వారికి అవసరమైన వైద్యాన్ని అందించాలని సూచించారు. అనంతరం ఎండోస్కోప్ విభాగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంఈని వైద్యులు సన్మానించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మ, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ పీఏ రమణి, డాక్టర్ శివశ్రీధర్, ఎముకలు, మత్తు, న్యూరోసర్జరీ, డెర్మాటాలజీ హెచ్వోడీలు డాక్టర్ లోక్నాధ్, డాక్టర్ జయధీర్బాబు, డాక్టర్ ప్రహ్లాదరెడ్డి, డాక్టర్ వెంకటాచలం తదితరులు పాల్గొన్నారు. -
23న పీడీఎస్వో జిల్లా మహాసభలు
పార్వతీపురం: పీడీఎస్వో జిల్లా మహసభలు ఈ నెల 23న పార్వతీపురంలో నిర్వహించనున్నట్టు జిల్లా అధ్యక్షులు కె.సోమేష్ తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో మహాసభలకు సంబంధించి పోస్టర్ను సోమేష్తో కలిసి సంఘ సభ్యులు శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యా రంగంలో వున్న సమస్యలను పరిష్కరించాలని, గిరిజన ఆశ్రమ, గురుకుల పాఠశాలలో విద్యార్థుల మరణాలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ ప్రభుత్వాన్ని, అధికారులను డిమాండ్ చేస్తున్నామన్నారు. సభలలో ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.బాలకృష్ణ, ప్రముఖ కవి సిరికి స్వామినాయుడు, పీడీఎస్వో రాష్ట్ర అధ్యక్షులు ఎన్.భాస్కరరావు, ఎన్వైఎస్ జిల్లా నాయకులు పీడిక అసిరి తదితరులు పాల్గొంటారన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. -
‘రియల్’గా మోసం..!
చీపురుపల్లి: వడ్డించే వాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా.. అనే సామెతలా ఏం చేసినా చర్యలు తీసుకోని అధికార యంత్రాంగం ఉండగా మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ రియల్టర్లు రెచ్చిపోతున్నారు. కనీస నిబంధనలు పాటించకుండా పెద్ద పెద్ద వెంచర్లు వేసి దూర ప్రాంతాల్లో ఉండే కొనుగోలుదారులను మోసం చేసి యథేచ్ఛగా అమ్మకాలు జరిపేస్తున్నారు. ఇదంతా రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులకు తెలిసినప్పటికీ చూసీచూడనట్టే వదిలేస్తున్నారు. దీని వెనుక రియల్టర్లతో అధికార యంత్రాంగానికి ఉన్న సన్నిహిత సంబంధాలే కారణమనే చర్చ జరుగుతోంది. దీనికి మండలంలోని చిననడిపల్లి రెవెన్యూ పరిధిలో వెలిసిన 69 ఎకరాల మెగా వెంచర్ చక్కని అద్దం పడుతోంది. ఈ మెగా వెంచర్కు ఎలాంటి అనుమతులు లేకుండానే రియల్గా కొనుగోలుదారులను మోసం చేసి అమ్మకాలు జరుపుతున్నప్పటికీ అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఎలాంటి అనుమతులు లేని ఈ వెంచర్లో ప్లాట్ నంబర్లు వేసి మరీ దర్జాగా సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్నాయి. చిననడిపల్లి రెవెన్యూలో 69 ఎకరాల మెగా వెంచర్ మండలంలోని శివారు పంచాయతీ చిననడిపల్లి రెవెన్యూ పరిధిలో మండల సర్వేయర్ తెలిపిన సర్వే నంబర్లు ప్రకారం సర్వే నంబర్ 73, 94, 93, 92ల్లో దాదాపు 69 ఎకరాల వ్యవసాయ భూమిని చదును చేసి మెగా రియల్ వెంచర్ను సిద్ధం చేశారు. అందు లో స్థలాలను ప్లాట్లుగా విభజించి రోడ్లు వేసి సిద్ధం చేశారు. ప్రస్తుతం సర్వే నంబర్ 73కు చెందిన ప్లాట్లు రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. చిననడిపల్లి నుంచి శ్రీకాకుళం జిల్లాలోని కమ్మసిగడాం వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న ఈ మెగా వెంచర్లో ఇప్పటికే ప్లాట్లు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పంచాయతీ, ఉడా అనుమతులు లేకుండానే.. సాధారణంగా వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చినప్పుడు ల్యాండ్ కన్వర్షన్ ఫీజు రెవెన్యూ శాఖ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ల్యాండ్ కన్వర్షన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదట. అంతేకాకుండా కనీసం పంచాయతీ తీర్మానం ద్వారా అనుమతులు, ఉడా అనుమతులు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ నిర్వాహకులు ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. మోసపోతున్న కొనుగోలుదారులు ఎలాంటి అనుమతులు లేకుండా ఇక్కడి మెగా వెంచర్లో ప్లాట్లు కొనుగోలు చేస్తున్న ఎంతో మంది కొనుగోలుదారులు మోసపోతున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. పంచాయతీ, ఉడా అనుమతులు లేని ప్లాట్లలో ఇళ్లు నిర్మించుకోవాలన్నా బ్యాంకు రుణాలు కూడా రావు. అంతేకాకుండా పంచాయతీ ఇంటి నిర్మాణ ప్లాన్ అనుమతులు కూడా ఇవ్వదు. ఇవన్నీ తెలియకుండానే కొనుగోలుదారుకు ఏవో మాయ మాటలు చెప్పి రియల్ ఎస్టేట్ యజమానులు ప్లాట్లు అంటగడుతున్నట్టు చర్చ జరుగుతోంది. మండలంలోని పత్తికాయవలస సమీపంలో గతంలో ఇలాంటి రియల్ ఎస్టేట్ వెంచర్ను ఏర్పాటు చేసి ప్లాట్లు అమ్మకాలు జరిపారు. ఇప్పుడు ఆ వెంచర్లో రైతులు వ్యవసాయం సాగు చేస్తున్నారని తెలుస్తోంది. 69 ఎకరాల్లో అనధికారికంగా వెంచర్ పంచాయతీ, ఉడా అనుమతులు లేకుండానే.. ప్లాట్ నంబర్లతో దర్జాగా రిజిస్ట్రేషన్లు చూసీ చూడనట్టు వదిలేస్తున్న అధికారులు అనుమతులు లేకపోయినా రిజిస్ట్రేషన్ చేయొచ్చు.. రియల్ ఎస్టేట్ వెంచర్లకు సంబంధించి పంచాయతీ, ఉడా అనుమతులు లేకపోయినప్పటికీ రిజిస్ట్రేషన్లు చేయొచ్చు. చిననడిపల్లి రెవెన్యూ పరిధిలో గల సర్వే నంబర్ 73లో మెగా వెంచర్లో ప్లాట్ నంబర్లతో సహా రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం. – లక్ష్మణరావు, సబ్ రిజిస్టార్, చీపురుపల్లి చర్యలు తీసుకుంటాం.. చిననడిపల్లి రెవెన్యూ పరిధిలో సిద్ధమైన మెగా వెంచర్ తమ దృష్టికి ఇంతవరకు రాలేదు. ఇంతవరకు ఎలాంటి వెంచర్లకు అనుమతులు ఇవ్వలేదు. తక్షణమే నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటాం. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శికి నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేస్తున్నాం. – ఐ.సురేష్, ఎంపీడీఓ, చీపురుపల్లి -
సత్య డిగ్రీ కళాశాల విద్యార్థులకు యూనివర్సిటీ జట్టులో స్థానం
విజయనగరం అర్బన్: ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగిన అంతర్ కళాశాల కబడ్డీ టోర్నమెంట్ – 2025లో అద్భుత ప్రదర్శన కనబరిచిన సత్య డిగ్రీ మరియు పీజీ కళాశాల విద్యార్థులు నలుగురు యూనివర్సిటీ కబడ్డీ జట్టుకు ఎంపికయ్యారు. వీరు రాబోయే దక్షణ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ టోర్నమెంట్లో ఆంధ్ర విశ్వవిద్యాలయ తరఫున పోటీపడనున్నారు. ఎంపికై న విద్యార్థులలో శ్రీవల్లి, రమ్య, నీలిమ, వరలక్ష్మి ఉన్నారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీసాయి దేవ మణి తెలిపారు. అలాగే జూడే విభాగంలో జరిగిన అంతర్ కళాశాల పోటీల్లో ప్రధమ స్థానం సాధించిన డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థి హేమంత్ సౌత్ జోన్ జూడో చాంపియన్షిప్కు ఎంపికయ్యారని తెలిపారు. ఎంపికై న విద్యార్థులను కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శిశభూషణరావు, ఫిజికల్ డైరెక్టర్ ఎస్హెచ్ ప్రసాద్ అభినందించారు. -
● పక్కపక్కనే...
చిత్రంలో కనిపిస్తున్నవి ఆంధ్రా–ఒడిశా అంతర్రాష్ట్ర రహదారిపై బొబ్బిలి ఫ్లై ఓవర్కు వందమీటర్ల లోపల ఏర్పాటుచేసిన బాణసంచా విక్రయ దుకాణాలు. వీటికి సమీపంలో ఆస్పత్రులు, ఆలయాలు, పాఠశాలలు ఉన్నాయి. ఇంకా అధికారులు అనుమతులు ఇవ్వకుండా... దుకాణాల మధ్య కనీస దూరం (20 అడుగులు) పాటించకుండా.. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటుచేయడంపై స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దంటూ హెచ్చరిస్తున్నారు. అధికారులు సూచించిన నిబంధనలు పాటించాలని కోరుతున్నారు. – బొబ్బిలి -
మన్యంపై జ్వరాల పంజా
సాక్షి, పార్వతీపురం మన్యం: మన్యంపై సీజనల్ వ్యాధులు పంజా విసురుతున్నాయి. జ్వరాలు, కామెర్ల బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మలేరియాతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య అధికమవుతోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు అందుబాటులో లేకపోవడంతో.. సీహెచ్సీలు, జిల్లా ఆస్పత్రికి రిఫరల్స్ అధికమవుతున్నాయి. ప్రధానంగా జిల్లా ఆస్పత్రిలో వార్డులు జ్వరపీడితులతో నిండిపోతున్నాయి. వీరిలో వివిధ ఆశ్ర మ పాఠశాలలు, వసతిగృహాల నుంచి వస్తున్న పిల్లలే ఎక్కువగా ఉండడం గమనార్హం. సాలూ రు సీహెచ్సీలో 21 మందికిపైగా విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. వీరిలో పచ్చకామెర్లు, మలేరియా, ఇతర అనారోగ్య సమస్యలతో ఉన్న వారు ఉన్నారు. జిల్లా ఆస్పత్రిలో కురు పాం ఆశ్రమ, ఏకలవ్య పాఠశాల విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. -
● ఫ్రీ బస్సు పాట్లు..!
ఏ బస్సు చూసినా ఏముంది గర్వకారణం.. కిక్కిరిసిన ప్రయాణమే అన్నట్టుగా ఉంది ప్రస్తుతం విజయనగరం జిల్లాలో బస్సు సర్వీసుల పరిస్థితి. చాలా రూట్లలో ప్రయాణికులకు సరిపడా బస్సులు లేకపోవడం సమస్యగా మారింది. గమ్యస్థానాలకు చేరుకోవాలన్న ఆతృతలో ఫుట్బోర్డులపై ప్రమాదకర ప్రయాణాలు సాగిస్తున్నారు. గతంలో యువకులు, విద్యార్థులు మాత్రమే ఫుట్బోర్డులపై ప్రయాణిస్తూ కనిపించేవారు. ఇప్పుడు ఉచిత బస్సు సదుపాయంతో మహిళలు కూడా ఆ కోవలోకి చేరారు. దీనికి కోట కూడలిలో శనివారం కనిపించిన ఈ చిత్రమే సజీవ సాక్ష్యం. – సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం -
అందని శుద్ధజలం.. ఆవేదనలో విద్యార్థిలోకం
● పాఠశాలల్లో మూలకు చేరిన ఆర్వో ప్లాంట్లు ● ఇళ్లనుంచే తాగునీటిని తెచ్చుకుంటోన్న విద్యార్థులు బొబ్బిలి రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద, మధ్యతరగతి విద్యార్థులకు సమస్యలు చుట్టుముడుతున్నాయి. కనీస సదుపాయాలు అందడంలేదు. స్వచ్ఛమైన తాగునీరు కూడా అందని పరిస్థితి. గత ప్రభుత్వం నాడు–నేడు పనుల్లో భాగంగా పాఠశాలలకు ఆధునిక హంగులతో పాటు ఆర్వోప్లాంట్లను ఏర్పాటుచేసింది. విద్యార్థుల ఆరోగ్యమే పరమావధిగా స్వచ్ఛమైన తాగునీటిని అందించే ఏర్పాట్లు చేసింది. ప్రస్తుత ప్రభుత్వం వీటి నిర్వహణను గాలికొదిలేసింది. ఫలితం.. లక్షలాది రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు మూలకు చేరాయి. రామభద్రపురం మండలంలో 91 ప్రభుత్వ పాఠశాలలుండగా వాటిలో నాడు–నేడు పథకం కింద 41 ఆర్వోప్లాంట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం దాదాపు అన్ని పాఠశాలల్లోని ఆర్వో ప్లాంట్లు మూలకు చేరాయి. మరమ్మతులకు గురైన వాటిని బాగుచేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడం, చిన్నచిన్న సాంకేతిక లోపాలను సైతం పట్టించుకోకుండా వదిలేయడంతో విద్యార్థులు ఇంటినుంచే నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. విద్యార్థులకు తాగునీటిని అందించే విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఆర్వో ప్లాంట్లను వినియోగంలోకి తేవాలని కోరుతున్నారు. -
వాస్తవాలను వెలుగులోకి తెచ్చే పత్రికలపై కూటమి ప్రభుత్వ అణచివేత చర్యలను మేధావులు దుయ్యబట్టారు. పత్రికా స్వేచ్ఛను హరించడమంటే ప్రజల గొంతునొక్కడమేనని, ఇది రాజ్యాంగానికే విరుద్ధమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తేవడం, ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపడం, అభివ
రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జర్నలిస్టులు, ఎడిటర్లపై కక్ష సాధింపులపై ఉపేక్షించేది లేదు. ప్రభుత్వాలు చేసే పొర పాట్లను వివరించి ప్రజలకు కలిగే కష్టనష్టాలను, జాగ్రత్తలు సూచించడం పత్రికల బాధ్యత. అ క్రమంలో పత్రికలు రాసే వార్తలను వేరే భావనతో చూసి ఆ సంస్థపై వేధింపులకు దిగడం దారుణం. ప్రభు త్వ వైఫల్యాలను ప్రజల పక్షాన వినిపిస్తున్న సాక్షి మీడియాపై కూటమి ప్రభుత్వ అణచివేత ధోర ణిని ఖండిస్తున్నాం. కక్ష సాధింపు చర్యలు మానకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు తప్పవు. – మహా పాత్రో, జిల్లా అధ్యక్షుడు, ఎపీయూడబ్ల్యూజే పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తారా జర్నలిస్టులపై కేసుల పేరిట వేధింపులకు పాల్పడడం రాష్ట్రంలో గత కొద్ది కాలంగా కొనసాగుతోంది. ఇది బాధాకరం. నకిలీ మద్యం తయారీ మీద సాక్షి పలు కథనాలను ప్రచురిస్తోంది. అందులో ఏమైనా తప్పులుంటే ఖండించాలే తప్ప కేసులు బనాయించడం అంటే పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేయడం కిందే లెక్క. – వీఎంఎల్కే లక్ష్మణరావు, సీనియర్ జర్నలిస్టు అప్రజాస్వామికం రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ ప్రమాదంలో పడింది. ప్రజా సమస్యలను పత్రికలు వెలుగులోకి తీసుకొని రావడాన్ని పాలకులు సహించలేకపోతున్నారు. కేవలం కొంతమందిని లక్ష్యంగా చేసుకొని కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారు. ప్రజా సమస్యలను పత్రికల ద్వారా ప్రభుత్వానికి చేరవేసే జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టడం హేయమైన చర్య. సాక్షాత్తు ఎడిటర్ మీద కేసులు పెట్టడం, నోటీసులతో కార్యాలయానికి వెళ్లి హడావిడి చేయడం ప్రజాస్వామ్యానికి హితం కాదు. – వీఎస్ఎన్ కుమార్, రాష్ట్ర చైర్మన్, ఇంటర్నేషనల్ హ్యూమన్రైట్స్ అసోసియేషన్ పత్రికా స్వేచ్ఛపై దాడి సమంజసం కాదు ప్రజాస్వామ్య పరిపుష్టికి పత్రికలదే ప్రధాన పాత్ర. ప్రభుత్వానికో, వ్యక్తులకో వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయని సాక్షి పత్రికపై దాడి చేయడం ఏవిధంగాను సమర్ధనీయం కాదు. ఒకవేళ వార్తలు వ్యతిరేకంగా వస్తే నిజాలతో న్యాయబద్ధంగా పోరాడాలే తప్ప కేసులు పెట్టడం తగదు. ఈ రోజు సాక్షి.. రేపు మరొకటి.. ఇలా పత్రికలపై కక్ష సాధింపు చర్యలు చేపడుతూ ఉంటే పత్రికా స్వేచ్ఛ ఎక్కడ?. ఇలాంటి చర్యలు ఆమోదయోగ్యం కాదు. – జేసీ రాజు, ఫ్యాప్టో రాష్ట్ర నాయకుడు -
మొక్కల పెంపకంతో ఆరోగ్యం
● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి విజయనగరం: మొక్కల పెంపకంతో ఆరోగ్యం సిద్ధిస్తుందని, వాహన కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా స్వచ్ఛమైన గాలి పొందగలుగుతామని కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి అన్నారు. ‘స్వచ్ఛమైన గాలి’ అనే అంశంతో పెద్దచెరువు గట్టున ఉన్న గాంధీ విగ్రహం వద్ద నగరపాలక సంస్థ శనివారం చేపట్టిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నగరపాలక సంస్థలో ఉత్తమ సేవలు అందించిన పన్నెండుమంది పారిశుద్ధ్య కార్మికులను దుశ్శాలువలతో సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ప్రతిఒక్కరూ మొక్కలు విరివిగా నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని కోరారు. తల్లిదండ్రులు పిల్లలకు కాలుష్యం మీద అవగాహన కల్పించి భావితరాలు పరిశుభ్రమైన వాతావరణం అందించే దిశగా కృషిచేయాలని అన్నారు. విజయనగరం నగరపాలక సంస్థ ద్వారా సుమారు యాభైవేల పండ్ల మొక్కలు పంపిణీ చేయడం ఆనందదాయకమన్నారు. అనంతరం గాంధీ విగ్రహం ఆవరణలో మొక్కలు నాటారు. ‘స్వచ్ఛాంధ్ర– స్వచ్ఛ విజయనగరం’ అనే నినాదంతో ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ నల్లనయ్య, జిల్లా కాలుష్యనియంత్రణాధికారి సరిత, ఐసీడీఎస్ పీడీ విమలారాణి, మెప్మా పీడీ చిట్టిరాజు, కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
తప్పుడు ప్రచారం చేశారు
పచ్చకమెర్లతో విద్యార్థినులు మృతిచెందితే సరైన వైద్యం చేయించుకోలేదని, నాటువైద్యం చేయించుకోవడం వల్ల మృతిచెందారంటూ అధికారులతో తప్పుడు ప్రచారం చేయించడం సిగ్గుచేటు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 18 నెలల పాలన కాలంలో 15 మంది విద్యార్థులు మృతిచెందారు. అందులో నెలరోజుల వ్యవధిలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సొంత మండలంలో ముగ్గురు విద్యార్థులు, సొంత నియోజకవర్గానికి చెందిన మరో ఇరువురు విద్యార్థులు కలిపి ఐదుగురు మృతిచెందారు. ఇప్పటికై నా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కళ్లు తెరవాలి. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు చొప్పున్న పరిహారం అందజేయాలి. – పీడిక రాజన్నదొర, మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి మరెంత మంది ప్రాణాలు పోయేవో.. కురుపాం గురుకుల పాఠశాల విద్యార్థినులు మృతిచెందిన సమాచారం తెలియగానే.. ఆయా కుటుంబాలను పరామర్శించాను. మృతికి గల కారణాలపై ఆరా తీసి పచ్చకామెర్ల వ్యాప్తిని వెలుగులోకి తీసుకురాకపోయి ఉంటే మరెంత మంది విద్యార్థినులు ప్రాణాలు పోగొట్టుకునే వారో తలచుకుంటేనే భయమేస్తోంది. అంజలి, కల్పనలకు ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించి ఉంటే బతికేవారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపడంతో మిగిలిన విద్యార్థులకు వైద్యసేవలు అందాయి. వి ద్యార్థుల సమస్యలు పరిష్కరించడంతో పాటు ప్రభు త్వ అలక్ష్యంపై చర్యలు తీసుకోవాలని జాతీయ మానవహక్కుల కమిషన్, ఎస్టీకమిషన్ చైర్మన్లకు విన్నవించాం. – పాముల పుష్పశ్రీవాణి, మాజీ డిప్యూటీ సీఎం -
బాధిత కుటుంబాలకు..వైఎస్సార్సీపీ భరోసా
సాక్షి, పార్వతీపురం మన్యం/కురుపాం/గుమ్మలక్ష్మీపురం: కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పచ్చకామెర్లతో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు గిరిజన బాలికలకు వైఎస్సార్ సీపీ నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు. కురుపాం మండలం దండుసూర గ్రామానికి వెళ్లి వారి కుటుంబాలను శుక్రవారం ఓదార్చి, ధైర్యం చెప్పారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల ప్రకారం.. పార్టీ తరఫున తోయక కల్పన, అంజలి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున శాసనమండలి విపక్ష నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అందజేశారు. అనంతరం పార్వతీపురం మన్యం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కురుపాం ఆశ్రమ పాఠశాల, ఏకలవ్య పాఠశాల విద్యార్థులను మాజీ ఉప ముఖ్యమంత్రులు పాముల పుష్పశ్రీవాణి, పీడిక రాజన్నదొర, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్రాజు, మాజీ ఎమ్మెల్యేలు అలజంగి జోగా రావు, విశ్వాసరాయి కళావతి, శంబంగి వెంకట చిన అప్పలనాయుడు తదితరులతో కలిసి బొత్స పరామర్శించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్యంపై తల్లిదండ్రులను ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని, పూర్తిగా నయమైన తర్వాతనే డిశ్చార్జి చేయాలని వైద్యులకు సూచించారు. వార్డులో చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరి వద్దకూ వెళ్లిన నాయకులు.. త్వరగా తగ్గిపోతుందని ధైర్యం చెప్పారు. హడావిడిగా డిశ్చార్జి.. గది మార్పు వైఎస్సార్సీపీ నాయకులు పరామర్శకు వస్తున్నారన్న సమాచారంతో.. ఎవరి ఆదేశాల ప్రకారమో గానీ, ఆస్పత్రి వైద్యులు గురువారం రాత్రి, శుక్రవారం పలువురు పిల్లలను డిశ్చార్జి చేశారు. ముందు రోజు రాత్రి వరకు ఒక గదిలో ఉంచి, చికిత్స అందించిన పిల్లలందరినీ.. అక్కడ నుంచి హడావిడిగా ఖాళీ చేయించి, ఆస్పత్రిలోని వివిధ వార్డులకు సర్దేశారు. దీంతో పిల్లలను తీసుకుని తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారు. రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి పచ్చకామెర్లతో బాధపడుతూ కురుపాం బాలికల గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు బాలికలు మృతిచెందడం అత్యంత బాధాకరం. ఈ ఘటన కలచివేస్తోంది. కలుషిత నీరు తాగడం వల్ల సుమారు 200 మంది బాలికలు అస్వస్థకు గురై ఆస్పత్రుల్లో చేరడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దంపడుతోంది. ఇద్దరు బాలికలు చనిపోయినా మంత్రుల స్పందించకపోవడం విచారకరం. మృతుల కుటుంబాలకు ఓదార్చుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.5 లక్షలు చొప్పున్న పరిహారం ప్రకటించారు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుధ్ధి ఉంటే మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించాలి. – బొత్స సత్యనారాయణ, శాసనమండలి విపక్షనేత -
పంటదశకు వచ్చినా పూర్తి కాని ఈ క్రాప్..!
● నత్తనడకన సాగుతున్న నమోదు ● జిల్లాలో వరి సాగు 2.42 లక్షల ఎకరాలు ● ఈ–క్రాప్ నమోదు 2.13 లక్షల ఎకరాలు ● మొక్కజొన్న సాగు 24 వేల ఎకరాలు ● ఈ–క్రాప్ నమోదు 12 వేల ఎకరాలుఈ–క్రాప్ నమోదుతో ప్రయోజనాలు: ● పంటల బీమా వర్తిస్తుంది ● పంట రుణాలు తీసుకోవచ్చు ● ఇన్పుట్ సబ్సిడీ, పంట నష్టపరిహారం అందుకోవచ్చు ● పండించిన ధాన్యాన్ని అమ్ముకోవచ్చు.విజయనగరం ఫోర్ట్: వరిపంట దశకు వచ్చేసింది. కొద్ది రోజుల్లో పంటను కోసేయనున్నారు. అయినప్పటికీ ఈ–క్రాప్ నమోదు పూర్తిస్థాయిలో కాలేదు. ఈ–క్రాప్ నమోదు ఇప్పటికే పూర్తయి సామాజిక తనిఖీ కూడా జరిగిపోవాలి. కాని ఈఏడాది ఈ– క్రాప్ నమోదే ఇంతవరకు పూర్తి కాని పరిస్థితి. ఈ–క్రాప్ నమోదులో జాప్యం వల్ల సామాజిక తనిఖీకి అవకాశం ఉండకపోవచ్చు. దీని వల్ల ఈ–క్రాప్ నమోదులో అవకతవకలు జరిగినప్పటికీ గుర్తించే అవకాశం ఉండదు. ఖాళీగా ఉన్న పంట పొలాల్లో కూడా వరి పంట సాగు చేసినట్లు కొంతమంది ఈ–క్రాప్ నమోదు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అటువంటివాటిని గుర్తించాలంటే సామాజిక తనిఖీ ద్వారానే సాధ్యం. ఈ క్రాప్ నదు సాగులో కీలకం ఈ–క్రాప్ నమోదు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సకాలంలో సెప్టెంబర్ నెలాఖరు నాటికి పూర్తయ్యేది. కానీ ప్రస్తుతం ఆక్టోబర్ నెల మూడో వారం వచ్చినా ఇంతవరకు ఈ–క్రాప్ నమోదు పూర్తి కాని పరిస్థితి. ఈ–క్రాప్ అధారంగానే 2023వ సంవత్సరం వరకు ప్రభుత్వ పథకాలు అందేవి. అంతేకాకుండా అర్హులకు మాత్రమే పథకాలు అందుతాయి. బినామీలకు అస్కారం ఉండదు. పంట సాగుకు విత్తనాలు కావాలన్నా, ఎరువులు కావాలన్నా, పంటను విక్రయించుకోవాలన్నా, పంటనష్టం జరిగినప్పడు పంటలబీమా పొందాలన్నా ఈక్రాప్ ఉపయోగపడుతుంది. ఈ–క్రాప్ నమోదు ఇలా వరి పంట ఖరీఫ్ సీజన్లో 2,42 లక్షల ఎకరాల్లో సాౖ గెంది. ఇందులో ఈ–క్రాప్ నమోదు 2.13 లక్షల ఎకరాల్లో పూర్తయింది. మొక్కజొన్న 24 ఎకరాల్లో సాగవగా ఈ–క్రాప్. 12 వేలు ఎకరాల్లో ఈ క్రాప్ నమోదైంది. అలాగే పత్తి 4600 ఎకరాల్లో సాగవగా 4300 ఎకరాల్లో నమోదైంది. చెరుకు పంట 5400 ఎకరాల్లో సాగవగా 3500 ఎకరాలకు ఈ–క్రాప్ నమోదైంది. వేగవంతం చేశాంఈ–క్రాప్ నమోదును వేగవంతం చేశాం. ఈ నెలాఖరు నాటికి పూర్తిస్థాయిలో ఈ–క్రాప్ నమోదు పూర్తి చేస్తాం. భారతి, జిల్లా వ్యవసాయ అధికారి -
నకిలీ మద్యంపై విస్తృత తనిఖీలు
● అబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ చౌదరివిజయనగరం రూరల్: ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలో 225 దుకాణాలు, 26 బార్ అండ్ రెస్టారెంట్లలో కల్తీ మద్యం విక్రయాలు జరగకుండా విస్తృత తనిఖీలు నిర్వహించామని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ వై. శ్రీనివాస చౌదరి శుక్రవారం తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఎక్కడ నకిలీ మద్యం దాఖలాలు కనిపించ లేదన్నారు. లైసెన్న్స్ పొందిన రిటైల్ మద్యం దుకాణాలు, బార్లు, ఇన్ హౌస్ సంస్థల కార్యకలాపాలను, అలాగే నాణ్యమైన, సురక్షితమైన మద్యం మాత్రమే విక్రయించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అయితే రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో నిర్ధారణకాని, అక్రమంగా తయారైన మద్యం చలామణి జరుగుతున్నట్లు వస్తున్న ఫిర్యాదులపై ప్రభుత్వం ఆదేశాల మేరకు నకిలీ మద్యంపై విస్తృత తనిఖీలు చేపట్టి మద్యం దుకాణాల్లో సహకరించిన నమూనాలను ల్యాబ్ లకు పంపించి నిర్ధారణ చేసుకోనున్నామన్నారు. సమావేశంలో ఎకై ్సజ్ సూపరింటెండెంట్ బి. శ్రీనాథుడు, తదితరులు పాల్గొన్నారు. -
డివైడర్ను ఢీకొని విద్యార్థి మృతి
విశాఖపట్నం: స్థానిక బీఆర్టీఎస్ రోడ్డు మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని విజయనగరానికి చెందిన చిలకలపల్లి విశాల్ (21)గా గుర్తించారు. విశాల్ గీతం విశ్వవిద్యాలయంలో నాలుగో సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతూ పెందుర్తి ప్రాంతంలోని పురుషోత్తమపురంలో తన మామయ్య ఇంట్లో ఉంటూ కళాశాలకు వెళ్తున్నాడు. గురువారం సాయంత్రం విశాల్ తన స్నేహితుడు సూర్యతో కలిసి కళాశాల నుంచి ద్విచక్రవాహనంపై ఇంటికి హనుమంతవాక మీదుగా బీఆర్టీఎస్ రోడ్డులో వెళ్తున్న క్రమంలో.. శ్రీకృష్ణాపురం సమీపంలో వారు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం అదుపు తప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కిందపడిన విశాల్ గుండెకు తీవ్ర గాయం తగిలి అంతర్గత రక్తస్రావం జరిగింది. సూర్యకు స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన విశాల్ను స్థానికులు.. ఆరిలోవ పోలీసుల సహాయంతో విమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో పోలీసులు మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. శుక్రవారం మృతదేహానికి శవపంచనామా నిర్వహించి, అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రుణాల రికవరీపై దృష్టి పెట్టాలి
● కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి విజయనగరం అర్బన్: రుణాల మంజూరుతోపాటు రికవరీపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్ర వారం జరిగిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రుణాల రికవరీ సక్రమంగా ఉంటేనే మరిన్ని రుణాలు మంజూరుకు బ్యాంకులకు అవకాశముంటుందని చెప్పా రు. పీఎంఈజీపీ, పీఎంవిశ్వకర్మ, ముద్ర, స్టాండప్ ఇండియా, నాబార్డు రుణాల మంజూరు, రికవరీ పురోగతిని సమీక్షించారు. నాబార్డు అమలు చేస్తున్న ఆగ్రిక్లినిక్–అగ్రి బిజినెస్ సెంటర్ పథకం కింద వ్యవసాయ విద్యార్థులు ‘అగ్రిప్రెన్యూర్స్’గా మారి రైతులకు సాంకేతిక సేవలు, సలహాలు అందించవచ్చని తెలిపారు. నాబార్డు డీడీఎం నాగార్జున మాట్లాడుతూ ఈ పథకం కింద 45 రోజుల ఉచిత శిక్షణ, గరిష్టంగా రూ.20 లక్షల వరకు వ్యక్తిగత రుణం, రూ. కోటి వరకు గ్రూపు రుణం, మహిళలు, ఎస్సీ/ ఎస్టీ, హిల్ ప్రాంతాల అభ్యర్థులకు 44 శాతం వరకు సబ్సిడీ అందుబాటులో ఉందని వివరించారు. సమావేశంలో ఎల్డీఎం రమణమూర్తి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం మెప్మా ముద్రించిన ‘వన్ ఫ్యామిలీ–వన్ ఎంటర్ప్రెన్యూర్’ పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. వార్డెన్లు బాధ్యతాయుతంగా పనిచేయాలి జిల్లాలోని అన్ని సంక్షేమ వసతిగృహాల వార్టెన్లు బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి ఆదేశించారు. విద్యార్థులకు శుభ్రత, సురక్షిత తాగునీరు, నాణ్యమైన ఆహారం, అవసరమైన సౌకర్యాలు అందించడంతో పాటు, వారి భవిష్యత్తు కోసం మంచి విద్య, కెరీర్ మార్గదర్శకం ఇవ్వాలని సూచించారు. సమీక్ష సమావేశంలో బాలల సంరక్షణ కమిటీ చైర్పర్సన్ హిమబిందు, డీఆర్వో ఎస్.శ్రీనివాసమూర్తి, సామాజికి సంక్షేమ శాఖ డీడీ వెంకటేశ్వరరావు, డీబీసీడబ్ల్యూఓ జ్యోతిశ్రీ, ఐసీడీఎస్ పీడీ టి.విమల పాల్గొన్నారు. -
హోంగార్డు కుటుంబానికి ‘చేయూత’
విజయనగరం క్రైమ్: ఉద్యోగ విరమణ చేసిన హోంగార్డు కె.సూర్యనారాయణకు ‘చేయూత‘ కింద రూ.3,18,790ల చెక్కు, కో ఆపరేటివ్ నుంచి రూ.32,017ల చెక్కును జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ శుక్రవారం అందజేశారు. జిల్లా పోలీస్ శాఖలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు, అనారోగ్యంతో మృతి చెందిన, ఉద్యోగ విరమణ చేసిన హోంగార్డు కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న హోంగార్డులను అభినందించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీపీఓ ఏఓ పి.శ్రీనివాసరావు, హోంగార్ుడ్స ఇన్చార్జి ఆర్ఐ ఆర్.రమేష్ కుమార్, ఆఫీస్ సూపరింటెండెంట్ టి.రామకృష్ణ, కో ఆపరేటివ్ డైరెక్టర్ సుశీల పాల్గొన్నారు. -
ఖైదీలపట్ల వివక్ష కూడదు
● జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి కృష్ణ ప్రసాద్విజయనగరం ఫోర్ట్: ఖైదీల పట్ల సిబ్బందిగాని, తోటి ఖైదీలు గాని వివక్ష చూపకూడదని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణ ప్రసాద్ అన్నారు. స్థానిక సబ్జైలును శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జైలులో ఉన్న ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఖైదీల పట్ల వివక్ష చూపిన ఎడల కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ నేర ప్రవృత్తిని విడనాడాలని కోరారు. జైల్లో ఉన్న ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందించడమే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కర్తవ్యమని తెలిపారు. జైల్లో ఉన్న సౌకర్యాల గురించి ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత జైల్లో ఉన్న లీగల్ ఎయిడ్ క్లినిక్ను తనిఖీ చేశారు. అనంతరం జువైనల్ జస్టిస్ హోమ్ను సందర్శించి అక్కడ ఉన్న ప్యానల్ న్యాయవాదులతో బాల నేరస్తుల పట్ల నమోదు చేస్తున్న కేసులను వాటికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఆ తర్వాత వన్స్టాప్ సెంటర్ను పరిశీలించి సెంటర్లో నిర్వహిస్తున్న కార్యకలాపాలు, బాధితులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వన్స్టాప్ సెంటర్ పోలీస్ అధికారి శోభారాణి తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ కేసులపై జర్నలిస్టుల ఆగ్రహం
విజయనగరం అర్బన్/గజపతినగరం/రాజాం/చీపురుపల్లి: ప్రజాపక్షంగా వార్తలు ప్రచురిస్తున్న ‘సాక్షి’పై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనా యించడంపై జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది భావప్రకటన, పత్రికా స్వేచ్ఛను నెరిపే ప్రయత్నమని పేర్కొన్నారు. నకిలీ మద్యం తయారీ అంశాన్ని వెలుగులోకి తెచ్చిన సాక్షి మీడియాపై అక్కసు ఎందుకు ‘బాబూ’ అంటూ ప్రశ్నించారు. ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డికి పదేపదే నోటీసులు ఇవ్వడాన్ని ఆక్షేపిస్తూ ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఆందోళనలు చేశారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రజాపక్షంగా నిలిచే పత్రికల గొంతు నొక్కేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేయడమే అన్నారు. వార్తలు సహేతుకంగా లేవని భావిస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ప్రజాస్వామ్య పద్ధతి అని, ప్రభుత్వం ఆ మార్గాన్ని పక్కన పెట్టి అక్రమ కేసులు పెట్టి మీడియాపై దాడులు చేయడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని కొనసాగిస్తే రానున్న రోజుల్లో జర్నలిస్టులమంతా సంఘటితమై అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, జర్నలిస్టులపై అక్రమ కేసులు ఎత్తేయాలని కోరుతూ విజయనగరంలోని జర్నలిస్టుల బృందం కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేసింది. ఈ నిరసన కార్యక్రమానికి ఏపీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ మద్దతు తెలిపింది. సాక్షి బ్యూరో చీఫ్ గాంధీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు పీవీ శివప్రసాద్, జిల్లా అధ్యక్షుడు మహాపాత్రో, సీనియర్ జర్నలిస్టులు పి. అప్పారావు, లక్ష్మణరావు, వి. శ్రీనివాసరావు, చిన్న మధ్యతరహా పత్రికల ఎడిటర్ల సంఘం అధ్యక్షుడు కేజేశర్మ, ఎస్. నాగరాజు, రవికుమార్, శెట్టి గోవిందరావు, రాజేష్, వి.జగన్నాథవెంకట్, రాజేంద్ర, విజయలక్ష్మి, సునీతారెడ్డి, సీమా పాల్గొన్నారు. ● సాక్షి దినపత్రిక ఎడిటర్ దనంజయరెడ్డితో పాటు జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలంటూ గజపతినగరంలోని పాత్రికేయులు సీఐ జీఏవీ రమణకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో రిపోర్టర్లు ఎస్.తిరుపతిరావు, గోవిందరావు, వెంకటరమణ, రత్నాకర్, జగదీష్, వెంకటరావు, రవి, పాల్గొన్నారు. ● నకిలీ మద్యం వ్యవహారాన్ని బయటకు తీయడంతో పాటు కూటమి అరాచకాలు, అక్రమాలను వెలుగులోకి తీసుకొస్తున్న సాక్షి దినపత్రిక గొంతు నొక్కేందుకు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను రాజాం ప్రెస్క్లబ్ ఖండించింది. రాజాంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద జర్నలిస్టులు కాసేపు ఆందోళన చేసి తహసీల్దార్ ఎం.రాజశేఖరానికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నీలకంటేశ్వరయాదవ్, కె.శ్రీనివాసరావు, ప్రెస్క్లబ్ అధ్యక్షుడు పి.వెంకటరావు, సభ్యులు పి.వెంకటరావు, శేఖర్, కిశోర్, రామారావు, ఉపేంద్ర, గణేష్, ఎస్.సత్తీష్, వి.శ్రీనివాసరావు, మన్మథకుమార్, రాజేష్, కె.సురేష్ పాల్గొన్నారు. ● జర్నలిజంపై ఉక్కుపాదం మోపేందుకు ప్రయత్నిస్తున్న కూటమి చర్యలను చీపురుపల్లి తాలూకా జర్నలిస్టు ఫెడరేషన్ (టీజేఎఫ్) నాయకులు ఖండించారు. చీపురుపల్లిలోని ప్రెస్క్లబ్ నుంచి మూడు రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. పత్రికాస్వేచ్ఛకు సంకెళ్లు వేయడం సిగ్గుసిగు అంటూ నినదించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయ పరిపాలన అధికారి(ఏఓ) ఆర్.ఈశ్వరమ్మకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో టీజేఎఫ్ ప్రతినిధులు బి.రామారావు, కె.హరీష్, ఐ.గణేశ్, కె.సత్యనారాయణ, పి.ఉమ, ఎస్.వి.సత్యనారాయణరాజు, బాలాజీ, ఎస్.వెంకటేశ్వరరావు, ఆదినారాయణ, రామారావు, సతీష్, పైడినాయుడు, అప్పలనాయుడు, కనకరాజు, నరేష్, రవి, రమేష్, చిన్న, మణి, శ్రీను, నర్సింగ్, పవన్, మురళి పాల్గొన్నారు. ● ‘సాక్షి’పై కూటమి కక్షసాధింపులకు నిరసనగా బొబ్బిలి ప్రెస్క్లబ్, జర్నలిస్టు సంఘాల ప్రతినిధుల ఆధ్వర్యంలో బొబ్బిలిలో ఆందోళన చేశారు. అనంతరం ఆర్డీఓ జేవీవీఎస్ రామమోహన రావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.వ్యాస్బాబు, చుక్క జగన్మోహనరావు, ఆర్.జగదీశ్వరరావు, బి. కృష్ణమూర్తి, వి. తిరుమలరావు, మహ్మద్ రఫీ, కె. ఆదినారాయణ, రాజేష్, కిశోర్, వెంకినాయుడు పాల్గొన్నారు. పత్రికా స్వేచ్ఛను హరించడం సిగ్గుసిగ్గు ‘సాక్షి’పై అక్కసు ఎందుకు బాబూ..? జర్నలిస్టులపై అక్రమ కేసులను నిరసిస్తూ ఆందోళన ప్రజాపక్షంగా వార్తలు రాస్తున్న పత్రికల గొంతునొక్కడం తగదు ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డికి నోటీసులు ఇవ్వడంపై నిరసన దాడులు ఆపకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరిక -
వైభవంగా సహస్ర దీపారాధన
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో సహస్ర దీపారాధన కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శుక్రవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. వేకువజామున స్వామికి ప్రాతఃకాలార్చన పూజలనంతరం యాగశాలలో విశేష హోమాలు నిర్వహించారు. అనంతరం వెండి మంటపం వద్ద సీతారాముల నిత్యకల్యాణ మహోత్సవాన్ని వేడుకగా జరిపించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయంత్రం స్వామివారి విగ్రహాలను ఊరేగింపుగా దీపారాధన మంటపం వద్దకు తీసుకువెళ్లి అక్కడున్న ప్రత్యేక ఊయలలో ఆసీనులను చేశారు. అనంతరం సహస్ర దీపాలను వెలిగించి దీపాల కాంతుల శోభలో స్వామికి ఊంజల్ సేవ జరిపించారు. కార్యక్రమంలో అర్చకులు సాయిరామాచార్యులు, రామగోపాలాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. కడుపునొప్పి తాళలేక ఆత్మహత్యాయత్నంపార్వతీపురం రూరల్: మండలంలోని సంగంవలస గ్రామానికి చెందిన వివాహిత వర్రి జానకి శుక్రవారం ఉదయం 9:30 గంటల సమయంలో తీవ్రమైన కడుపు నొప్పితో ఇబ్బంది పడుతున్న క్రమంలో నొప్పిని తట్టుకోలేక గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రాస్పత్రికి తరలించగా చికిత్స పొంతుతున్నట్లు కేంద్రాస్పత్రి అవుట్ పోస్ట్ పోలీస్ అధికారి ఎన్. భాస్కరరావు తెలిపారు. -
గంజాయి కేసులో ముద్దాయికి మూడేళ్ల జైలు
విజయనగరం క్రైమ్: విజయనగరం వన్టౌన్ పోలీస్స్టేషన్లో 2022 లో నమోదైన గంజాయి కేసులో అస్సాం రాష్ట్రానికి చెందిన ముద్దాయి (ఎ1) ఆకాష్ ఖూడా (22)కు మూడేళ్లు కఠిన కారాగార శిక్ష రూ.10వేల జరిమానా విధిస్తూ విజయనగరం ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి ఎం.మీనాదేవి తీర్పు వెల్లడించినట్టు ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ శుక్రవారం తెలిపారు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. విజయనగరం రైల్వే స్టేషన్ సమీపంలో 2022 సెప్టెంబర్ 19 వ తేదీన ఒక లాడ్జిలో ముగ్గురు వ్యక్తులు మూడు బ్యాగులతో అనుమానాస్పదంగా ఉన్నట్లు పోలీసులకు వచ్చిన కచ్చితమైన సమాచారంతో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 4.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి అరెస్టు చేసి, కోర్టులో అభియోగ పత్రాలను దాఖలు చేశారు. మూడేళ్ల తర్వాత కోర్టు విచారణలో నిందితుడు ఆకాష్ ఖూడా (22)పై నేరారోపణలు రుజువు కావడంతో విజయనగరం ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి ఎం.మీనాదేవి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష రూ.లక్ష జరిమానా విధించారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులపై నాన్ బెయిలబుల్ వారంట్లు పెండింగ్ లో ఉన్నాయని ఎస్పీ తెలియజేశారు. -
ఫెన్సింగ్ పోటీలకు జిల్లా జట్లు సిద్ధం
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న సబ్ జూనియర్స్ బాల, బాలికల ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని విజ్జి స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన పోటీల్లో 14 సంవత్సరాలలోపు వయస్సు గల బాల, బాలికలకు అవకాశం కల్పించగా.. జిల్లా నలుమూలల నుంచి 40 మంది క్రీడాకారులు హాజరయ్యారు. వారికి పోటీలు నిర్వహించగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన పడగల కనిష్(ఫైల్), ఎం.డి షేక్ అహ్మద్ (ఫైల్), జె.శ్యాం శశాంక్ (ఫైల్), ఎన్ఎం జితేంద్ర (ఫైల్), బి .హర్షవర్ధన్ (ఇప్పి), బి.ఆదిత్య వర్ధన్ (సేబర్), పి.శారద (ఫైల్), బి.హన్సి శ్రీవల్లి (సేబర్) విభాగాల్లో రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 18న కాకినాడలో జరగనున్న పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించనున్నట్లు చీఫ్ కోచ్ డీవీ చారి తెలిపారు. ఈ ఎంపికపోటీలను అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు సుంకర సతీష్కుమార్, వ్యాయామ అధ్యాపకురాలు సౌదామిని ,ఎన్ఐఎస్ కోచ్ అప్పలరాజులు పర్యవేక్షించారు. -
దివ్యాంగ ఉద్యోగిని చూసి చలించిన కలెక్టర్
విజయనగరం అర్బన్: కలెక్టర్ ఎస్.రామ్సుందర్రెడ్డి మానవతా విలువలకు నిదర్శనంగా నిలిచారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన ఎంప్లాయీస్ గ్రీవెన్స్ సెల్ కార్యక్రమంలో ఒక దివ్యాంగ యువతిని చూసి ఆత్మీయంగా పలకరించి, ఆమె సమస్యను తెలుసుకున్నారు. ఎస్.కోట మండలానికి చెందిన తానవరపు రూపశ్రీ దివ్యాంగురాలు. సెకండరీ గ్రేడ్ టీచర్గా ఎంపిక కాగా కురుపాం మండలానికి పోస్టు కేటాయించారు. దూరప్రాంతం కావడంతో తన శారీరక పరిస్థితుల దృష్ట్యా అక్కడ విధులు నిర్వర్తించడం సాధ్యం కాదని ఆమె కలెక్టర్కు వివరించింది. ఆమె బాధ విన్న కలెక్టర్ రామ్సుందర్రెడ్డి మానవత్వంతో స్పందించి మాట్లాడుతూ నీ సమస్యను ప్రభుత్వానికి పంపించి మేలు జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మొత్తం 27 ఫిర్యాదులు అందగా గత నెలలో వచ్చిన 40 ఫిర్యాదులలో ఎక్కువ శాతం పరిష్కారమయ్యాయని కలెక్టర్ తెలిపారు. ట్రెజరీ, డ్వామా, ఈపీడీసీఎల్, మెడికల్ వంటి విభాగాలకు సంబంధించిన ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, డీఆర్ఓ ఎస్శ్రీనివాసమూర్తి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. సానుభూతితో సమస్య పరిష్కారానికి హామీ -
టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి...
దత్తిరాజేరు: మండల కేంద్రమైన దత్తిరాజేరులో గురువారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు పువ్వల శ్రీనివాసరావుతో పాటు పది కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరాయి. స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు మహదేవ్ ఫణీంద్రుడు, మజ్జి అప్పలనాయుడు ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య, పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్బాబు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. గతంలో జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందేవని, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజల సంక్షేమం కుంటుపడిందని ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. -
జీఎస్టీ తగ్గింపు వల్ల అన్ని వర్గాలకు ప్రయోజనం
విజయనగరం టౌన్: జీఎస్టీ శ్లాబ్ను రెండుకు తగ్గించడం వల్ల అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుతుందని కలెక్టర్ ఎస్.రామ్సుందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రాంతీయ రవాణాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ వాహన ర్యాలీని కలెక్టరేట్ వద్ద గురువారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టరేట్ నుంచి ఆర్అండ్బీ జంక్షన్, సంతకాల వంతెన, ఆర్టీసీ కాంప్లెక్స్, బాలాజీ జంక్షన్ వరకూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జేసీ సేతు మాధవన్, డీఆర్ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, ఉప రవాణాధికారి డి.మణికుమార్, ఆర్టీఓ విమల, సీనియర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు దుర్గాప్రసాద్, రవిశంకర్ ప్రసాద్, శివరాంగోపాల్, సంగీత కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మండపాక నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
వైద్యరంగంలో మత్తు వైద్యులది కీలక ప్రాత
● సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ విజయనగరంఫోర్ట్: వైద్యరంగంలో మత్తు వైద్యులది కీలకపాత్ర అని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ అన్నారు. ప్రపంచ మత్తు వైద్యుల దినోత్సవం సందర్భంగా సర్వజన ఆస్పత్రిలో నిర్వహించిన ర్యాలీని ఆమె గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అత్యవసర కేసులకు వైద్యం అందించడంలోనూ, శస్త్రచికిత్స చేయడానికి అవసరమైన మత్తు ఇచ్చేది మత్తు వైద్యులేనన్నారు. కోవిడ్ తర్వాత మత్తు వైద్యులకు మంచి గుర్తింపు వచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో మత్తు వైద్య విభాగం అధిపతి డాక్టర్ డి.జయధీర్బాబు, ఆర్థో హెచ్ఓడీ డాక్టర్ లోక్నాథ్, మానసిక విభాగం హెచ్ఓడీ డాక్టర్ శారద తదితరులు పాల్గొన్నారు. సాలిపేటలో బంగారం చోరీగజపతినగరం: మండలంలోని సాలిపేట గ్రామానికి చెందిన రొంగలి శంకరరావు ఇంట్లో బంగారం చోరీకి గురి కావడంతో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కె.కిరణ్ కుమార్ నాయుడు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బుధవారం ఉదయం రొంగలి శంకరరావు తన ఇంటికి తాళం వేసి భార్య పద్మతో కలిసి వ్యవసాయ పనుల నిమిత్తం బయటకు వెవెళ్లాడన్నారు. పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చి చూసే సరికి తలుపులు తెరిచి ఉన్నాయని, అలాగే బీరువా తలుపులు కూడా దొంగలు పగుల గొట్టారన్నారు. బీరువాలో ఉండాల్సిన సుమారు మూడు తులాలు బంగారం పుస్తెల తాడు, రెండు శతమానాలను దొంగిలించినట్లు బాధితుడు శంకరరావు ఫిర్యాదు చేశాడని తెలిపారు. ఈ మేరకు చోరీ జరిగిన ఇంటిని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిరణ్ కుమార్ నాయుడు తెలిపారు. మూగ బాలికపై వృద్ధుడి లైంగిక దాడి యత్నంశృంగవరపుకోట: మండలంలోని ధర్మవరం గ్రామంలో ఓ మూగ బాలికపై వృద్ధుడు లైంగికదాడి యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు కాగా పెద్ద కుమారై మూగబాలిక. బుధవారం రాత్రి 7 గంటల సమయంలో ఇంటి సమీపంలో ఒంటరిగా ఉన్న బాలిక నోటిపై చెయ్యిపెట్టి తన ఇంట్లోకి వృద్ధుడు లాక్కెల్లాడు. దీంతో బాలిక కేకలు వేయడంతో స్థానికులు వచ్చి వృద్ధుడి బారి నుంచి బాలికను రక్షించారు. బాధితురాలి తండ్రి గురువారం జామి మండలం తాండ్రంగి గ్రామానికి చెందిన మానవహక్కుల సంఘం ప్రతినిధి కొత్తలి గౌరునాయుడికి ఫిర్యాదు చేయగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం సాయంత్రం సీఐ నారాయణమూర్తిని వివరణ కోరగా ఫిర్యాదు అందిందని విచారణ చేయాల్సి ఉందన్నారు. -
గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
నెల్లిమర్ల: స్థానిక చంపావతినదిలో బుధవారం గల్లంతైన కనకల అప్పారావు(46) మృతదేహం లభ్యమైంది. జరజాపుపేటకు చెందిన కనకల అప్పారావు థామస్పేట వద్ద చంపావతినదిలో స్నానానికి దిగి నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో మునిగిపోయి గల్లంతైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపకసిబ్బంది గాలింపు చేపట్టగా కొండపేట వెళ్లే రహదారిలో జూట్మిల్లు వద్ద మృతదేహం గురువారం లభ్యమైంది. మృతదేహానికి పంచనామా అనంతరం పోస్టుమార్టం కోసం పోలీసులు తరలించారు. రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చీపురుపల్లి రూరల్(గరివిడి): గరివిడి–చీపురుపల్లి రైల్వేస్టేషన్ల మధ్య రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని శ్రీకాకుళం జీఆర్పీ హెచ్సీ ఎస్.మధుసూదనరావు తెలిపారు. పాండిచ్చేరి నుంచి హౌరా వెళ్లే రైలు ఢీకొట్టగా మృతి చెందాడన్నారు. మృతుడి వయస్సు సుమారు 45 సంవత్సరాలు ఉంటుందని, చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీలో మృతదేహం ఉంటుందని తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు పోన్ 9110305494 నంబర్ను సంప్రదించాలని కోరారు. బైక్ అదుపుతప్పి వ్యక్తి.. గుర్ల: మండలంలోని తెట్టంగి శివారులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెనుబర్తికి చెందిన తాడేల అచ్యుతరావు (35) మృతి చెందాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..దీపావళి సందర్భంగా బాణ సంచా కొనుగోలు చేయడానికి పెనుబర్తి నుంచి గవిడి పేట వెళ్తుండగా తెట్టంగి దాటిన తర్వాత బైక్ ఆదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న స్తంభాన్ని ఢీకొట్టాడు. దీంతో జరిగిన ప్రమాదంలో అచ్యుతరావు అక్కడికక్కడే మృతిచెందాడు. అదే బైక్పై వెళ్తున్న గుషిడి నారాయణ రావుకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాల పాలైన వ్యక్తిని చీపురుపల్లి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. మృతుడికి భార్య పార్వతి, ఇద్దరు కుమారులు వసంత్ కుమార్, తరుణ్ ఉన్నారు. -
గిరిజన శాఖ మంత్రి బాధ్యత వహించాలి
సాలూరు: మంచి చదువులు చదివి జీవితంలో గొప్పస్థాయికి ఎదిగి తమ కష్టాలను శాశ్వతంగా దూరం చేస్తారని కోటి ఆశలతో బిడ్డలను పాఠశాలలకు పంపగా అక్కడ సరైన సదుపాయాలు లేక అనారోగ్యాలకు గురై అమాయక గిరిజన బిడ్డలు మరణస్తున్నారు. ఆ బిడ్డల తల్లిదండ్రులకు సంబంధిత శాఖ మంత్రి, ప్రభుత్వం ఏం సమాధానం చెబుతారని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన సాలూరు పట్టణంలోని తన స్వగృహంలో పట్టణంలో వైఎస్సార్సీపీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనారోగ్యానికి గురై మరణించిన విద్యార్థులు, దివంగత మాజీ మున్సిపల్ వైస్చైర్మన్ పువ్వలనాగేశ్వరరావులకు నివాళులు అర్పించి కొన్ని నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం రాజన్నదొర మాట్లాడుతూ, గిరిజన విద్యార్థుల ప్రాణాలు రక్షించడంలో గిరిజనసంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యాయని, ఫలితంగా గిరిజన విద్యార్థులు మృత్యువాత పడుతున్నారని గిరిజన విద్యార్థులు మరణిస్తుంటే గిరిజనశాఖ మంత్రికి బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 13 మంది విద్యార్థులు మృతిచెందారని, సాలూరు నియోజకవర్గంలో ఇద్దరు మృతిచెందారన్నారు. కురుపాం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 175 మంది పచ్చకామెర్లతో బాధపడుతూ కురుపాం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నా సంబంధిత గిరిజన సంక్షేమశాఖమంత్రికి, ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేకపోవడం శోచనీయమన్నారు. జాతీయ స్థాయిలో ఫిర్యాదు చేశాంవిద్యార్థులు పచ్చకామెర్లతో చరిపోతున్నా,సెరిబ్రల్ మలేరియా, జ్వరంతో చనిపోతున్నట్లు చూపిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల మరణాలపై జాతీయమానవహక్కుల సంఘానికి, జాతీయ ఎస్టీ కమిషన్కు ఢిల్లీలో ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. జిల్లాలో ఇంతమంది విద్యార్థులు మృతిచెందడం వల్ల జిల్లా మంత్రిగా ఆమె విఫలమయ్యారని, ఈ శాఖలో మరణాలపై సదరు మంత్రి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర -
పూరిల్లు దగ్ధం
సంతకవిటి: మండలంలోని మండాకురిటి గ్రామానికి చెందిన బొమ్మరిల్లు రాజారావు పూరిల్లు గురువారం అగ్నికి ఆహుతైంది. సమాచారం మేరకు పొందూరు అగ్నిమాపక శాఖ సిబ్బంది గ్రామానికి చేరుకుని మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో దాదాపు రూ.1.5 లక్షలు ఆస్తి నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక శాక సిబ్బంది తెలిపారు. ప్రమాదానికి కారణం తెలియరాలేదన్నారు. ఇల్లు కాలిపోవడంతో కుటుంబం వీధిన పడిందని, ప్రభుత్వం తనను ఆదుకోవాలని రాజారావు కోరుతున్నాడు. హెచ్ఐవీ రొగులకు శస్త్ర చికిత్సలు● స్పందించిన సర్వజన ఆస్పత్రి వైద్యాధికారులు విజయనగరంఫోర్ట్: హెచ్ఐవీ రోగులకు శస్త్రచికిత్సలు చేయడం లేదనే అంశంపై సాక్షిలో ఈనెల 14వతేదీన హెచ్ఐవీ రోగుల పట్ల వివక్ష శీర్షికన ప్రచురించిన కథనానికి ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వైద్యాధికారులు స్పందించారు. ఆస్పత్రిలో హెచ్ఐవీ, హెచ్బీఎస్ఏజీ రోగులకు శస్త్రచికిత్సలు చేస్తున్నామని తెలిపారు. ఒక వేళ ఎవరైనా శస్త్రచికిత్సలు చేయడానికి నిరాకరిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ తెలిపారు. -
ఆనందం వెంబడి అంధకారం
● బాణసంచా పేల్చడంలో జాగ్రత్తలు పాటించాలి ● పెద్దలు వెంట ఉంటే ఆనందం మీ వెంటేరామభద్రపురం: జాతి, కుల, మత,వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా ఆనందోత్సాహాలతో జరుపుకునే పండగ దివ్య దీపావళి. చీకటిని పారదోలి వెలుగులు నింపే పండగగా, విజయానికి ప్రతీకగా దీపావళిని ఏటా ఆశ్వయుజ మాసంలో అమావాస్య రోజున జరుపుకోవడం ఆనవాయతీ. అయితే దీపావళిని వేడుకగా జరుపుకునే క్రమంలో చాలా ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగి పలువురు గాయపడుతున్నారు. టపాసులు పేల్చే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. బాణసంచాలోని రసాయనాలతో కళ్లు దెబ్బతింటాయి. సల్ఫర్, గన్పౌడర్ లాంటి రసాయనాల ప్రభావం వల్ల కళ్ల నుంచి నీరు కారడం, కళ్ల మంటలు, దురద వంటి ప్రభావాలు ఉంటాయి. ఒక్కోసారి కళ్లు పూర్తిగా కనబడకుండా పోతాయి. నిఘాతోనే అక్రమానికి అడ్డు కట్ట రూ.లక్షల విలువైన సరుకును ఎలాంటి అనుమతులు లేకుండా దిగుమతి చేసుకుని నిల్వ ఉంచుతున్నారు.పండగ రోజు విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. కొదరైతే ఏకంగా నివాస ప్రాంతాల మధ్య నిబంధనలు పాటించకుండా నిల్వ చేస్తున్నారు. అలాగే తాత్కాలికంగా అనుమతులు తీసుకున్న దుకాణాల వ్యాపారులు మిగిలిన సరుకును కొన్న చోటకే తిరిగి పంపాల్సి ఉంటుంది. కానీ కొందరు అలా చేయడం లేదు.పలు చోట్ల గుట్టుగా నిల్వ చేసి ఇతర సమయాల్లోనూ అమ్మేస్తున్నారు.కొందరైతే ఎలాంటి అనుమతులు లేకపోయినా పొరుగు ప్రాంతాల నుంచి పేలుడు పదార్థాలు తెప్పించి ఇళ్లలోనే టపాసులు తయారు చేస్తుండడం ఆందోళన కలిగించే పరిణామం. పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ అధికారులు స్పందించి తనిఖీలు చేయకపోతే అనుమతి లేని వారు విక్రయాలతో పాటు చేసే నిల్వలతో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు.సొంత వైద్యం వద్దు టపాసులు కాల్చేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే కొందరు సొంత వైద్యం చేస్తుంటారు. ఇది మంచిది కాదు. వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ను సంప్రదించాలి. ప్రథమ చికిత్స చేసే ముందు కాలిన గాయంపై చల్లని నీరు పోయాలి. అంతేగానీ ఐస్ముక్కలతో రుద్దకూడదు. వెన్న గ్రీజ్, ఇతర పౌడర్లు వంటివి రాయకూడదు. వాటివల్ల ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది. దిలీప్కుమార్, వైద్యాధికారి, పీహెచ్సీ, రామభద్రపురం కాల్చే ముందు అప్రమత్తం పెద్దవాళ్ల పర్యవేక్షణలోనే చిన్నారులు బాణసంచా కాల్చడం ఉత్తమం. టపాసులు కాల్చేటప్పుడు నీళ్లు దగ్గర పెట్టుకోవాలి.ఇంటి కిటికీలు, తలుపులు మూసివేయాలి. ఉదయం 6 నుంచి 8 వరకు,రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చాలి.దీపావళి పండుగ రోజున ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అలాగే ఏ విధమైన అనుమతులు లేకుండా బాణ సంచా విక్రయిస్తే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం. వి.ప్రసాదరావు, ఎస్సై, రామభద్రపురంప్రమాద నివారణ, జాగ్రత్తలు ఇలా.. టపాసులు వెలిగించిన వెంటనే దూరంగా జరగాలి పేలని టపాసులపై వంగి చూడడం మంచిది కాదు కంటికి రక్షణగా ప్లెయిన్ అద్దాలు వాడడం మంచిది పేరున్న సంస్థలు తయారు చేసిన టపాసులనే ఎంపిక చేసుకోవాలి పిల్లలు, యువకులు, మహిళలు ఇలా ఎవరు ఏ రకం టపాసులు కాల్చాలో ముందే నిర్ణయించుకుని ప్రణాళిక మేరకే కొనాలి ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే వైద్యాధికారిని సంప్రదించాలి బాణసంచాను కిచెన్, పొయ్యి ఉన్న ప్రాంతాల్లో ఉంచకూడదు బాణసంచా కాల్చేటప్పుడు వదులుగా ఉన్న దుస్తులు ధరిస్తే అవి వేలాడుతూ అంటుకునే ప్రమాదం ఉంది. కొద్దిగా బిగుతైన కాటన్ దుస్తులను మాత్రమే ధరించాలి చిన్న పిల్లలను ఎత్తుకుని బాణసంచా కాల్చకూడదు.పెద్ద వారి సహాయం లేకుండా పిల్లలు వారంతట వారే బాణసంచా కాల్చరాదు అప్పుడే పుట్టిన చిన్నారులు, గర్భిణులు, వృద్ధులపై బాణసంచా శబ్దాలు ఎక్కువ ప్రమాదం చూపుతాయి. ప్రధానంగా చెవులు దెబ్బతింటాయి. చెవులను రక్షించుకోవడానికి ఇయర్ ప్లగ్స్ కొంత మేరకు ఉపయోగపడతాయి. పెద్ద శబ్దాలతో పేలే టపాసులు కాకుండా చాలా తక్కువ శబ్ధంతో పూలలాంటి వెలుగులు కురిపించే చిచ్చుబుడ్లు, కాకర పువ్వొత్తులు, పెన్సిళ్లు, భూచక్రాలు వంటివి కాల్చడం మంచిది.భూ చక్రాలు, ఔట్లు కూడా ఒక్కోసారి పేలే ప్రమాదం ఉంది. వాటిని అగ్గిపుల్లలతో కాకుండా కాకర పువ్తొత్తులతో కాల్చడం మంచిది. -
పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి చర్యలు
పాచిపెంట: మండలంలోని పలు పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నారు. అ భివృద్ధి చేస్తే ‘అరుకుకు దీటుగా అందాలు‘ శీర్షికన గత నెల 29వ తేదీన సాక్షిలో ప్రచురితమైన కథనంపై కలెక్టర్ స్పందించారు. మండలంలోని పర్యాటక ప్రదేశాలను గుర్తించి అభివృద్ధి పనులు చేపట్టాలని వెలుగు డీపీఎం శ్రీనివాసరావుకు బాధ్యతలు అప్పజెప్పారు. అందులో భాగంగా ధారగెడ్డకు వెళ్లే దారిలో ఉన్న తుప్పలు డొంకలు గురువారం తొలగించారు. ఈ పనులు పర్యవేక్షిస్తున్న వెలుగు ఏపీఎం శ్రీరాములు ‘సాక్షి‘ తో మాట్లాడుతూ త్వరలో రహదారి నిర్మాణం చేపట్టనున్నామని, వాటితోపాటు ప్రత్యక్షంగా పర్యాటకులతో మాట్లాడి అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడతామన్నారు. అలాగే వెలుగు మహిళా సంఘాల సభ్యులకు లోన్ రూపంలో డబ్బులు మంజూరు చేసి పర్యాటక ప్రదేశాల్లో షాపులు ఏర్పాటు చేయించి పర్యాటకులకు అవసరమైన వస్తువులను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. -
గిరిజనం గుండెఘోష పట్టదా..?
● ప్రజాసంఘాల నాయకులు ● కలెక్టరేట్ ఎదుట నిరసన పార్వతీపురం రూరల్: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల వరుస మరణాలు జరుగుతున్న నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. గిరిజన విద్యార్థుల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్క లేదా? ఇంకెంతమంది విద్యార్థులను నిర్లక్ష్యంతో బలిచేస్తారంటూ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్లు మాట్లాడుతూ గిరిజన విద్యాసంస్థలు విద్యార్థుల పాలిట నిర్లక్ష్యంతో వారి ప్రాణాలను బలిగొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే పసిమొగ్గలు పిట్టల్లా రాలిపోతున్నాయని ఈ మరణాలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లను పత్రికాముఖంగా ప్రభుత్వానికి తెలియజేశారు. విద్యార్థుల ప్రాణాలకు రక్షణ కల్పించాలి. వసతిగృహాల్లో మెరుగైన సదుపాయాలు, వైద్యసేవలు అందించాలి. మృతిచెందిన గిరిజన విద్యార్థుల కుటుంబాలకు రూ. 25లక్షల నష్టపరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. అలాగే విద్యార్థుల మరణాలకు కారణమైన వారిపై చర్యలు తీసుకుని సురక్షితమైన తాగునీటిని విద్యార్థులకు అందించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో ఇటీవల మృతిచెందిన విద్యార్థుల ఫొటోలు చూపిస్తూ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు వికాస్, బుచ్చి, కార్తీక్, చరణ్, గణేష్, మల్లేష్, చందు, గౌరీశ్వరి, చిన్నారావు, కొందరు తల్లిదండ్రులు, పలు పార్టీల నాయకులు శివప్రసాద్, గౌరీశంకరరావు, ఈవీనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
పైడితల్లి వనంగుడి హుండీల ఆదాయం లెక్కింపు
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం పైడితల్లి అమ్మవారి వనంగుడి హుండీల ఆదాయాన్ని రైల్వేస్టేషన్ వద్ద ఉన్న అమ్మవారి ఆలయ ఆవరణలో గురువారం లెక్కించారు. 42 రోజులకు రూ.12లక్షల 52వేల 606 నగదు లభించినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి కె.శిరీష తెలిపారు. రామతీర్థం ఈఓ వై.శ్రీనివాసరావు పర్యవేక్షణలో సాగిన ఆదాయం లెక్కింపులో ధర్మకర్తల మండలి సభ్యులు పద్మావతి, కుమారి, తామేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు విజయనగరం టౌన్: మహాకవి గురజాడ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లాస్థాయిలో ఉన్నత పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తామని సమాఖ్య ప్రధాన కార్యదర్శి కాపుగంటి ప్రకాష్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30న ఉదయం 9.30 గంటల నుంచి గురజాడ జిల్లా కేంద్ర గ్రంథాలయం ఆవరణలో పోటీలు నిర్వహిస్తామన్నారు. వక్తృత్వ పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన వారికి నవంబర్ 30న సాహితీవేత్తలతో నిర్వహించే సభలో మాట్లాడే అద్భుతమైన అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. వివరాలకు సెల్: 83744 49526, 75693 51363, 94401 17116 నంబర్లను సంప్రదించాలని కోరారు. దైవానుగ్రహంతోనే లోక కల్యాణం బొబ్బిలి: దైవానుగ్రహంతోనే లోక కల్యాణం సాధ్యమని త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జియర్, బృందావన రామానుజ జియర్లు అన్నారు. బొబ్బిలి కంచర వీధిలోని కల్యాణవేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు ప్రవచనాలు, మంగళా శాసనాలు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక పురోహితులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ ● ఈ నెల 18లోగా దరఖాస్తుల స్వీకరణ విజయనగరం అర్బన్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి విజయనగరం జిల్లాలకు చెందిన గ్రామీణ మహిళలకు ఉచితంగా ఉపాధి కోర్సుల్లో శిక్షణ ఇస్తామని సంస్థ డైరెక్టర్ డి.భాస్కరరావు తెలిపారు. మగ్గం వర్క్ అండ్ పెయింటింగ్కి 31 రోజులు, బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్కు 35 రోజులు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. పదో తరగతి పాస్/ ఫెయిల్ అయిన 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసున్న గ్రామీణ మహిళలు అర్హులని పేర్కొన్నారు. శిక్షణలో పాల్గొనే మహిళా అభ్యర్థులకు ఉచిత భోజనం, వసతి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఆసక్తిగల గ్రామీణ మహిళలు ఈ నెల 18వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం సెల్: 99595 21662, 99857 87820 నంబర్లను సంప్రదించాలని కోరారు. 40 కిలోల గంజాయి పట్టివేత ● పట్టుబడిన నలుగురిలో ఇద్దరు మహిళలు విజయనగరం క్రైమ్: విజయనగరం రైల్వే పోలీసులు అక్రమంగా రవాణా చేస్తున్న 40 కేజీల గంజాయిని గురువారం స్వాధీనం చేసుకున్నారు. జీఆర్పీ ఎస్ఐ బాలాజీరావు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా విజయనగరం రైల్వే స్టేషన్ ప్లాట్ఫాంపై తనిఖీలు నిర్వహిస్తుండగా మహారాష్ట్ర ఔరంగాబాద్ జిల్లాకు చెందిన గీతా సంజయ్ చౌహాన్, పారుబాయి సంజయ్ చౌహాన్లతో పాటు రజిని బీమాపవర్, వైశాలి కాలే వద్ద ఉన్న బ్యాగులలో గంజాయి ఉన్నట్టు గుర్తించారు. గంజాయిని ఒడిశా రాష్ట్రం బరంపురం ప్రాంతం నుంచి అక్రమంగా తరలిస్తున్నట్టు నిర్ధారించారు. కేసు నమోదుచేసి నలుగురినీ రైల్వే కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించారు. -
లైంగిక వేధింపులకు గురిచేసేవారిపై కఠిన చర్యలు
● ఎస్పీ దామోదర్ విజయనగరం క్రైమ్: మహిళలను లైంగిక వేధింపులకు గురిచేసేవారిపై కఠిన శిక్ష పడేలా కేసులు నమోదుచేయాలని ఎస్పీ దామోదర్ పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం పోలీస్ అధికారులతో నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. దర్యాప్తులో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్, ఎన్డీపీఎస్, పోక్సో, అట్రాసిటీ, మిస్సింగ్, రోడ్డు ప్రమాదాలు, భూ వివాదాల పెండింగ్ కేసులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యమివ్వాలన్నారు. దర్యాప్తులో ఉన్న కేసులను డీఎస్పీలు, సీఐలు తరచూ సమీక్షించి, దర్యాప్తు అధికారులకు తగిన సూచనలు చేయాలన్నారు. గంజాయి వ్యాపారులపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. చట్టాలను గౌరవించే వారితో స్నేహపూర్వకంగా మెలగాలన్నారు. బెల్టు షాపులను పూర్తిగా నియంత్రించాలన్నారు. తాత్కాలిక అనుమతులు (లైసెన్సు) కలిగిన వ్యాపారులను బాణసంచావిక్రయాలకు అనుమతించాలని సూచించారు. వివిధ కేసుల్లో దర్యాప్తుపై పలు సూచనలు చేశారు. నేర సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీఎస్పీలు ఆర్.గోవిందరావు, జి.భవ్యారెడ్డి, ఎస్.రాఘవులు, పలువురు సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
● అందని వైద్యం
ఈ చిత్రంలోని మహిళ పేరు పద్మ. ఆమెతోపాటు, చేతిలో ఉన్న చిన్నారి కొద్దిరోజులుగా మలేరియాతో బాధ పడుతోంది. గిరి శిఖర ప్రాంతం నుంచి మూడు రోజులుగా పార్వతీపురం మండలం డోకిశీల పీహెచ్సీకి వస్తోంది. అక్కడ వారికి సిబ్బంది ఇచ్చే సూది మందే దిక్కు. గతంలో ఇక్కడ ఇద్దరు వైద్యులు ఉండేవారు. ప్రస్తుతం సమ్మె కావడంతో ఎవరూ రావడం లేదు. జిల్లా వైద్య శాఖాధికారులు ప్రత్యామ్నాయంగా పీడియాట్రిషియన్ను జిల్లా ఆస్పత్రి నుంచి పంపిస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న 52 గ్రామాలతోపాటు.. సమీపంలో ఉన్న దుగ్గేరు, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల ప్రజలకూ ఈ ఆస్పత్రే ఆధారం. పార్వతీపురం మండలం పెదబొండపల్లి పీహెచ్సీలో గత నెల వరకు ఇద్దరు వైద్యులు ఉండేవారు. సమ్మె కారణంగా ఇద్దరూ గత నెలాఖరు నుంచి విధులకు రావడం లేదు. దీంతో విజయనగరం మిమ్స్ నుంచి హౌస్ సర్జన్ను తాత్కాలికంగా డిప్యుటేషన్పై నియమించారు. రెగ్యులర్ వైద్యాధికారులు లేకపోవడం వల్ల ఇక్కడ రోగులకు పూర్తిస్థాయిలో అందడంలేదు. వచ్చిన వారిని సైతం జిల్లా ఆస్పత్రికి పంపించేస్తున్నారు. ఫలితంగా గతంలో 50–60 వరకు ఉండే ఓపీ.. ఇప్పుడు 30కి పడిపోయింది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలకు ఏఎన్ఎం, అటెండర్, ఫార్మాసిస్ట్నే దిక్కవుతున్నారు. పురుడు పోయాలన్నా.. ఏఎన్ఎంలే ధైర్యం చేయాల్సిన పరిస్థితి. -
భూసేకరణ వేగవంతం చేయాలి
విజయనగరం అర్బన్: ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి అసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, దీనికి అవసరమైన నిధుల ప్రతిపాదనలను సమగ్ర ఫార్మేట్లో అందజేయాలని నీటిపారుదల శాఖ అధికారులను కలెక్టర్ ఎస్.రామ్సుందర్రెడ్డి ఆదేశించారు. తోటపల్లి, నారాయణపురం, తారకరామ తీర్థసాగర్, మడ్డువలస, తాటిపూడి, ఆండ్ర ప్రాజెక్టులపై నీటిపారుదల శాఖ అధికారులతో గురువారం సమీక్షించారు. చీఫ్ ఇంజినీర్/తోటపల్లి ప్రాజెక్టు ఇన్చార్జి సూపరింటెండెంట్ ఇంజినీర్ స్వర్ణకుమార్ పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా నీటిపారుదల ప్రాజెక్టుల స్థితిగతులను, పురోగతిని కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తోటపల్లి ప్రాజెక్టులో గజపతినగరం బ్రాంచ్ కెనాల్కు అవసరమైన భూసేకరణను సత్వరమే పూర్తిచేయాలని సూచించారు. ప్రాజెక్టులకు అనుబంధంగా ఉన్న 759 చెరువులు, నలబై చెక్డ్యామ్ పనులు ఉపాధిహామీ నిధులు రూ.8.6 కోట్లతో చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. సమావేశంలో ఎస్ఈలు ఆర్.అప్పారావు, సుధాకర్, ఈఈలు అప్పలనాయుడు, రమణ పాల్గొన్నారు. -
ప్రతిభ చూపినవారికే పట్టం
విజయనగరం: విద్యార్థి దశ నుంచే బాలబాలికల్లో క్రీడాసక్తిని పెంపొందించేందుకు ఏటా ఎస్జీఎఫ్ (స్కూల్ గేమ్స్ ఫెడరేషన్) పోటీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదికి సంబంధించి నేరుగా జిల్లా స్థాయిలో నిర్వహించే ఎంపిక పోటీలు ప్రారంభించగా.. తాజాగా మండల స్థాయి నుంచి నిర్వహించాల్సిన ఎంపిక పోటీల ప్రక్రియను జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఖరారు చేసింది. ఫెడరేషన్కు చైర్మన్గా వ్యవహరిస్తున్న డీఈఓ షెడ్యూల్ను ప్రకటించారు. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను పెంపొందించడం, ఆటల్లో రాణించిన వారిని రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయడం వీటి ముఖ్య ఉద్దేశం. ఈనెల 17 నుంచి మండల స్థాయి, అనంతరం డివిజన్ స్థాయి, అందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తామని డీఈఓ పేర్కొన్నారు. ఈ మేరకు ఎంఈఓలు, అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సర్క్యులర్ జారీ చేశారు. మూడంచెల పద్ధతిలో ఇలా.. స్కూల్గేమ్స్ పోటీల్లో భాగంగా మొత్తం 50 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. అండ్–14, 17 విభాగంలో 10వ తరగతి పాఠశాల విద్యార్థులకు మండల, జోనల్, జిల్లా స్థాయిల్లో విడతల వారీగా నిర్వహిస్తారు. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్, చెస్, యోగా, అథ్లెటిక్స్ క్రీడాంశాలకు మూడంచెలుగా పోటీలు నిర్వహించనున్నారు. మిగిలిన 43 క్రీడాంశాలకు జిల్లా స్థాయిలో నేరుగా పోటీలు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తారు. మూడంచల్లో నిర్వహించే 7 క్రీడాంశాల్లో ముందుగా అన్ని మండలాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ చూపిన వారికి జోనల్ స్థాయి, అక్కడ నుంచి జిల్లా స్థాయి, తర్వాత ఉమ్మడి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయికి పంపిస్తారు. జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న వారికి ధ్రువపత్రాలు అందజేస్తారు. వీటితో వివిధ ఉద్యోగాలకు క్రీడా కోటా కింద 2శాతం రిజర్వేషన్ల సదుపాయం వర్తిస్తుంది. నేటి నుంచి మండలస్థాయి స్కూల్గేమ్స్ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు డివిజన్, జిల్లా స్థాయిలో పోటీలు మొత్తం 7 క్రీడాంశాల్లో జరగనున్న పోటీలు షెడ్యూల్ ఖరారు చేసిన జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నేటి నుంచి మండల స్థాయి ఎంపికలు: స్కూల్ గేమ్స్ క్రీడా పోటీల్లో భాగంగా ఉమ్మడి జిల్లాల పరిధిలోని 23 మండలాల్లో శుక్రవారం ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. మొత్తం 7 క్రీడాంశాల్లో నిర్వహించే ఎంపికల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ఆయా డివిజన్ కేంద్రాలైన విజయనగరం, చీపురుపల్లి, బొబ్బిలి ప్రాంతాల్లో ఎంపికలు నిర్వహిస్తారు. ఆ ఎంపికల్లో రాణించిన వారికి జిల్లా స్థాయిలో నిర్వహించే ఎంపికలకు అవకాశం కల్పించనుండగా.... జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి కె.గోపాల్, విజయలక్ష్మిలు తెలిపారు. అర్హత, ఆసక్తి గల క్రీడాకారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
● జిల్లా ఆస్పత్రికి రిఫర్
ఈ చిత్రంలోని విద్యార్థి పేరు కె.అఖిల్. డోకిశీల ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. దసరా సెలవులకు ఇంటికి వెళ్లాక అనారోగ్యం బారిన పడ్డాడు. అక్కడ కొద్దిరోజులు చికిత్స పొంది, పాఠశాలకు తిరిగొచ్చాడు. అప్పటికీ జ్వరం తగ్గకపోవడంతో పరీక్షలు చేయగా.. మలేరియా అని తేలింది. పాఠశాల పక్కనే డోకిశీల పీహెచ్సీ ఉంది. అక్కడ వైద్యసేవలు అందకపోవడంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. ముందురోజే ఇదే ఆశ్రమ పాఠశాల నుంచి మలేరియాతో బాధ పడుతున్న ఆరో తరగతి విద్యార్థి కె.రాజేష్ను కూడా జిల్లా ఆస్పత్రికే తరలించారు. -
రహదారులపై చెత్త కనిపించరాదు
● కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి పార్వతీపురం రూరల్: పార్వతీపురం, సాలూరు పట్టణంలోని రహదారులు శుభ్రంగా ఉండాలని, ఎక్కడా చెత్త కనిపించరాదని కలెక్టర్ డా.ఎన్ ప్రభాకర రెడ్డి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, ప్రతి వార్డులో పనులను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలని సూచించారు. నిరంతరాయంగా తాగునీటి సరఫరా చేయాలని, పరిపాలనలో పూర్తిస్థాయి ‘ఈ–ఆఫీసు’ విధానం అమలు చేయాలని స్పష్టం చేశారు. విద్యుత్ ఆదా కోసం సోలార్ లైట్లు ఏర్పాటు చేయాలని, రోడ్లపై నిరుపయోగంగా ఉన్న వాహనాలను తొలగించాలని ఆదేశించారు. ● జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పద్మజ విజయనగరం ఫోర్ట్: అత్యవసర సమయాల్లో ప్రాణాలను రక్షించే సీపీఆర్ గురించి ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ అన్నారు. స్థానిక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో బుధవారం సీపీఆర్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ కారణాల రీత్యా ఒక వ్యక్తి గుండె కొట్టుకోవడం, శ్వాస ఆగిపోయినప్పడు అతని ప్రాణాలు రక్షించడానికి సీపీఆర్ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో మత్తు విభాగం అధిపతి డాక్టర్ జయధీర్బాబు, అత్యవసర విభాగం హెచ్వోడీ డాక్టర్ శివప్రసాద్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శివ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
గెడ్డలో కొట్టుకుపోయిన వ్యక్తి మృతదేహం లభ్యం
గంట్యాడ: మండలంలోని చంద్రంపేట, వసంత గ్రామాల మధ్య ఉన్న గెడ్డలో కొట్టుకుపోయిన ఆర్.వసంత గ్రామానికి చెందిన విజ్జపు సోమరాజు(54) మృతదేహం బుధవారం లభ్యమైంది. విజయనగరంలోని పీడబ్ల్యూ మార్కెట్లో కిరాణా హోల్సేల్ దుకాణంలో విధులు ముగించుకుని సోమవారం రాత్రి టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై వసంత గ్రామానికి సోమరాజు వెళ్తుండగా చంద్రంపేట దాటిన తర్వాత గెడ్డ దాటుతూ కొట్టుకుపోయాడు. కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించి మంగళవారం గాలింపు చేపట్టారు. రాత్రి వరకు గాలించినా అచూకీ లభ్యం కాలేదు. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో గెడ్డలో మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని విజయనగరం ప్రభుత్వసర్వజన ఆస్పత్రికి పోలీసులు తరలించారు. -
బుల్లెట్ బైకులే టార్గెట్
● ముగ్గురు బైక్ దొంగల అరెస్టు ● రూ.14 లక్షలు విలువ చేసే ఏడు బుల్లెట్ బైక్లు చోరీ ● వివరాలు వెల్లడించిన అదనపు ఎస్పీ శ్రీనివాసరావు శ్రీకాకుళం రూరల్: జల్సాలకు అలవాటు పడ్డారు. సులువుగా డబ్బు సంపాదించాలని మార్గాలు వెతికారు. బైక్ హ్యాండిల్ లాక్లను అన్లాక్ చేయడం నేర్చుకున్నారు. బైక్లను దొంగిలించి తక్కువ ధరకు అమ్మడం అలవాటు చేసుకున్నారు. ఆఖరకు పోలీసుల చేతికి చిక్కారు. బుధవారం రూరల్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ ( క్రైం) శ్రీనివాసరావు కేసు వివరాలు వెల్లడించారు. శ్రీకాకుళం రూరల్ పరిసర ప్రాంతంలో 5 బుల్లెట్ బైక్లు, ఆమదాలవలస ప్రాంతంలో 2 బుల్లెట్ బైక్లు పోయినట్లు రూరల్ స్టేషన్లో కేసు నమోదైందన్నారు. రెండు రోజుల కిందట రాగోలు దూసి ప్రాంతంలో రూరల్ ఎస్ఐ రాము వాహనాలు తనిఖీలు చేస్తుండుగా రెండు బుల్లెట్లపై వస్తున్న ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా వ్యవహరించడంతో ఆరా తీశామని, అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు. ఖరీదైన వాహనాలే ఆదాయ వనరులు.. బుల్లెట్ దొంగతనాలకు పాల్పడిన ఎ–1 దండు రిషివర్ధన్ స్వస్థలం విశాఖపట్నం. విశాఖ కమిషనరేట్లో పీఎం పాలెం పోలీస్స్టేషన్లో ఓ వివాహిత హత్య కేసులో ప్రధాన నిందితుడు. పార్వతీపురం రూరల్ పోలీస్టేషన్లో ఒక చీటింగ్ కేసులో ముద్దాయిగా ఉన్నాడు. ఎ–2 రాయిపల్లి వినోద్ స్వస్థలం సాలూరు కాగా.. అక్కడి పోలీస్స్టేషన్లో ఐదు సారా కేసులు, సాలూరు ఎకై ్సజ్ పోలీస్స్టేషన్తో పాటు గంట్యాడ పోలీస్స్టేషన్లో ఒక డెకాయిటీ కేసు, అలాగే పార్వతీపురం రూరల్ పోలీస్స్టేషన్లో చీటింగ్ కేసులతో పాటు ఏడు కేసులు నమోదై ఉన్నాయి. ఇతనిపై పార్వతీపురం జిల్లా కలెక్టర్ పీడీ యాక్ట్ కూడా ఓపెన్ చేశారు. జైలులో పరిచయం.. దండు రిషివర్దన్, రాయిపల్లి వినోద్లు ఇద్దరూ జైలులో ఒకరికి ఒకరు పరిచయమయ్యారు. విలువైన బైక్లు దొంగతనం చేసి నంబర్ మారిస్తే ఎవరూ పట్టుకోలేరని ప్లాన్లు గీశారు. గడిచిన మూడు నెలలుగా ఏడు బైక్లు దొంగిలించారు. దొంగిలించిన బైక్లను మూడో నిందితుడు, బైక్ మెకానిక్ కొత్తూరుకు చెందిన చిట్టి సంతోష్ సెకండ్ హ్యాండ్ బైక్ షోరూమ్ నిర్వాహకుడి సాయంతో విక్రయించారు. వీరి వద్ద నుంచి ఏడు బైక్లను స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. కేసులో ప్రతిభ కనబరిచిన కానిస్టేబుళ్లు బాబురావు, నారాయణరావు, సురేష్, కృష్ణ కానిస్టేబుల్స్కు ఎస్పీ మహేశ్వరరెడ్డి చేతులమీదుగా ప్రశంసాపత్రాలను అందించారు. సమావేశంలో డీఎస్పీ సీహెచ్ వివేకానంద, సీఐ పైడపు నాయుడు, ఎస్ఐ రాము పాల్గొన్నారు. -
గృహప్రవేశాలకు సిద్ధంగా ఉండాలి
విజయనగరం అర్బన్: పీఎంఏవై పథకం కింద మంజూరైన గృహాలను త్వరగా పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ ఎస్.రామ్సుందర్రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో హౌసింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. పీఎంఏవై కింద జిల్లాలో 8,259 గృహాలు లక్ష్యం కాగా 6,873 గృహాలు ఇప్పటికే పూర్తయ్యాయని, మిగిలిన 1,386 గృహాలను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ముందుగా అర్బన్లో సొంత స్థలాలు ఉన్న వారి గృహాలను పూర్తి చేయాలన్నారు. రూఫ్ లెవెల్లో ఆర్సీ స్థాయిలో ఉన్నవి పూర్తి కావాలని ఇకపై ప్రతి వారం సమీక్షించనున్నట్లు తెలిపారు. కాలనీలలో నిర్మాణాలకు అనువుగా ఉన్న వాటిని గుర్తించి అందుకు ఎంతమేరకు భూమి అవసరం అవుతుందో ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. సమావేశంలో హౌసింగ్ పీడీ మురళీ ప్రసాద్, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. కలెక్టర్ ఎస్.రామ్ సుందర్రెడ్డి -
వైద్యవిద్య వ్యాపారం కాదు!
విజయనగరం గంటస్తంభం: ప్రజారోగ్య వ్యవస్థ ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రభుత్వ బాధ్యతలు వదిలేసి వైద్యవిద్యా వ్యవస్థను వ్యాపారుల చేతుల్లోకి నెట్టొద్దని పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ మేరకు బుధవారం జెడ్పీ మినిస్టీరియల్ భవనంలో జరిగిన సమావేశంలో సంఘం అధ్యక్షుడు యూ.ఎస్. రవికుమార్ అధ్యక్షతన ప్రజా సంఘాల ప్రతినిధులు, వైద్యులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వైద్య రంగాన్ని పీపీపీ మోడల్ పేరుతో ప్రైవేటీకరణ చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. గత ప్రభుత్వం కేంద్ర నిధులతో స్థాపించిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు చేతుల్లోకి ఇవ్వడం పేద విద్యార్థులకు, ప్రజారోగ్యానికి భారీ దెబ్బ పడుతుందని పేర్కొన్నారు. వైద్యవిద్య ఫీజులు ఆకాశాన్నంటుతాయని, పేద విద్యార్థులకు డాక్టర్ కావాలనే కల దూరమవుతుందని, రిజర్వేషన్లు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడం వల్ల పేదలు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారని విమర్మించారు. గ్రామీణ పీహెచ్సీ వైద్యులు సమ్మెలో ఉన్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని, ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేసి ప్రజారోగ్యాన్ని కాపాడాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. కార్యక్రమంలో రెడ్డి శంకరరావు, నాగమనోహర్, ఫైజల్, సురేష్ బాబు, రాజగోపాల్, వెంకటరావు, దివాకర్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
మత్తు వైద్యులకు గుర్తింపు వచ్చింది:
గతంలో మత్తు వైద్యులకు అంత ప్రాధాన్యం ఉండేది కాదు. తెరవెనుకనే వారి పాత్ర ఉండేది. కోవిడ్ రోగులకు సేవలు అందించిన తర్వాత మత్తు వైద్యులకు ప్రాధాన్యం, గుర్తింపు వచ్చింది. గతంలో మత్తు వైద్యులుగా చేయడానికి చాలా మంది వెనుకాడేవారు. రోగికి ఏదైనా అయితే నిందిస్తారేమోనని ముందుకు వచ్చేవారు కాదు. కానీ ఇప్పడు మంచి పరికరాలు అందుబాటులోకి రావడం వల్ల మత్తు వైద్యుల పని సులభతరమైంది. మత్తు ఇవ్వడం కష్టతరమైన పని అయినప్పటికీ రోగుల ప్రాణాలు కాపాడామనే సంతృప్తి ఉంటుంది. డాక్టర్ డి.జయధీర్బాబు, ప్రొఫెసర్, మత్తు విభాగం అధిపతి , ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి -
‘శౌర్యం స్మృతి’ బ్రోచర్ల ఆవిష్కరణ
విజయనగరం క్రైమ్: పోలీస్ అమరవీరుల స్మారక వారోత్సవం సందర్భంగా, విజయనగరం జిల్లా పోలీసు డివిజన్ పరిధిలో పోలీస్ శాఖ చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘శౌర్యం‘ (తెలుగు) ‘స్మృతి‘ (ఆంగ్లం) పేరుతో రూపొందించిన అమరవీరుల స్మారక బ్రోచర్లను ఎస్పీ ఏఆర్ దామోదర్ బుధవారం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ‘అమరవీరుల సేవా తపస్సుకు ఈ సాహిత్య నివాళి ప్రతి పోలీసు సిబ్బందిలో ధైర్యస్ఫూర్తిని నూరిపోస్తుందన్నారు. అమరవీరుల కుటుంబాలకు గౌరవాన్ని చాటుతుందని చెప్పారు. ఈ ప్రయత్నం రాష్ట్రంలో తొలిసారిగా జిల్లాస్థాయి పోలీసు విభాగం ఆధ్వర్యంలో అధికారికంగా ప్రారంభం కావడం విశేషమన్నారు.. భవిష్యత్లో ఇది తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ప్రేరణారూపంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ సౌమ్యలత, ప్రముఖ యాంకర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ ఈడీ దృష్టికి ఉద్యోగుల సమస్యలు
విజయనగరం అర్బన్: ఆర్టీసీ విజయనగరం జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.ఎస్.బ్రహ్మానందరెడ్డి దృష్టికి విజయనగరం జోన్ పరిధిలో ఉన్న ఉద్యోగుల సమస్యలను ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ కమిటీ తీసుకెళ్లింది. ఈ మేరకు బుధవారం సంఘం ప్రతినిధులు స్థానిక జోనల్ ట్రైనింగ్ కాలేజీ సమావేశ మందిరంలో ఆయనను కలిసి తమ సమస్యల పత్రాన్ని అందజేశారు. జోన్ పరిధిలోని 6 జిల్లాలు, 19 డిపోలు, జోనల్ వర్క్షాప్లకు సంబంధించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సీ్త్రశక్తి బస్సుల్లో డ్రైవర్లు, కండక్టర్లకు ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని కోరారు. జోన్లో ప్రమోషన్లు ఇవ్వాలని, గ్యారేజీ ఉద్యోగులపై అధిక పనిభారం తగ్గించాలని, రన్నింగ్ టైమ్ తగినవిధంగా లేవని, రికవరీలు, రెస్ట్ రూమ్లు, డ్యూటీ చార్టులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పాడేరు డిపోలో నివాస గృహాల అద్దె సమస్య, టీమ్ రికవరీలు, రెస్ట్ రూమ్లు, డ్యూటీ చార్డులు వంటి పలు సమస్యలు ఉన్నాయిని వినతిపత్రంలో తెలియజేశారు. కొన్ని జిల్లాల్లో అక్రమంగా ఇస్తున్న ఓడీలు, ఉద్యోగుల సీనియార్టీలో తేడాలు, రూట్ సర్వేలు, మంచినీటి సదుపాయాలు, ఇంక్రిమెంట్లు లభించకపోవడం వంటి 30కు పైగా సమస్యలను వినతిపత్రంలో వివరించారు. ఈడీని కలిసిన వారిలో సంఘం రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ పి.భానుమూర్తి, రాష్ట్ర కార్యదర్శి వెంకటరావు, జోనల్ అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు, జోనల్ కార్యదర్శి బీకేమూర్తి, జోనల్ కోశాధికారి కేఎస్ఎస్మూర్తి, జిల్లా కార్యదర్శి రవికాంత్ ఉన్నారు. -
మత్తులో ఉంచి వైద్యం
● వైద్యరంగంలో అధిక ప్రాధాన్యం ● ఏడాదిలో లక్ష మంది వరకు రోగులకు ఎనస్థీషియా ● నేడు ప్రపంచ మత్తు వైద్యుల దినోత్సవం విజయనగరం ఫోర్ట్: వైద్యరంగంలో కొన్నేళ్ల క్రితం వరకు మత్తు వైద్యుల గురించి ప్రజలకు పెద్దగా తెలియదు. కోవిడ్ మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న కోవిడ్ రోగులకు చికిత్స అందించి వారి ప్రాణాలు కాపాడడంతో మత్తు వైద్యులకు గుర్తింపు వచ్చింది. సమాజంలో మత్తు వైద్యులు అంటూ ఉన్నారన్న విషయం అందరికీ తెలిసింది. గురువారం ప్రపంచ మత్తు వైద్య దినోత్సవం (వరల్డ్ ఎనస్థీషియా డే) సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. పూర్వ కాలంలో తలమీద, ముక్క దగ్గర మూలికలు పెట్టి మత్తు వచ్చేలా చేసి చికిత్స అందించేవారు. గతంలో మత్తు వైద్యవిద్యను అభ్యసించడానికి పెద్దగా అసక్తి చూపేవారు కాదు. మత్తు వైద్యులు కూడా చాలా తక్కువగా ఉండేవారు. మత్తు విభాగంలో ఆధునాతన వైద్య పరికరాలు అందుబాటులోకి రావడంతో ఇటీవల మత్తు వైద్యవిద్యను అభ్యసించే వారి సంఖ్య పెరుగుతోంది. మత్తు వైద్యులకు ప్రాధాన్యం పెరిగింది. ఆపదలో ఉన్న రోగుల ప్రాణాలు నిలబెట్టడంలో మత్తు వైద్యులు కీలక పాత్ర పోషిస్తారు. శస్త్రచికిత్సలో కీలక పాత్ర ఏదైనా వ్యాధికి శస్త్రచికిత్స చేయాలంటే మత్తు వైద్యులదే కీలక పాత్ర. సంబంధిత వ్యాధికి ఎంత మోతాదులో మత్తు ఇవ్వాలో అంతే మత్తు ఇవ్వాల్సి ఉంటుంది. మోతాదుకు మించి మత్తు ఇచ్చినట్లయితే రోగి ప్రాణాల మీదకు వస్తుంది. ఎముకల సంబంధిత, ఈఎన్టీ, గైనిక్, డెంటల్ శస్త్రచికిత్సలకు, కడుపునొప్పి, అపెండిసైటిస్, పేగుఒరుపు, హెర్నియా, హైడ్రాసిల్, పైల్స్, కేన్సర్, న్యూరోసర్జరీ, గుండె సంబంధిత శస్త్రచికిత్సలకు మత్తు ఇస్తారు. ముఖ్యంగా గుండె మార్పిడి, కాలేయం మార్పిడి, కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల్లో మత్తు వైద్యుల పాత్ర అత్యంత కీలకం. ఈ శస్త్రచికిత్సలు చేసేటప్పుడు ప్రతి సెకెను గుండె ప్రతి స్పందనను గమనిస్తూ మత్తు వైద్యులు ఉండాలి. అదేవిధంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నవారికి, పురుగు మందు తాగి క్లిష్టపరిస్థితుల్లో ఉన్న వారికి కూడా మత్తు వైద్యులు మత్తు ఇచ్చి చికిత్స అందిస్తారు. వెంటిలేటర్పై ఉన్న రోగులకు, ఐసీయూ నిర్వహణ కూడా మత్తు వైద్యులే చూస్తారు. జిల్లాలో విధుల్లో 100 మంది వైద్యులు గతంలో మత్తు వైద్యులు తక్కువగా ఉండేవారు. ఇప్పుడు వారి సంఖ్య పెరిగింది. జిల్లాలో 100 మంది వరకు మత్తు వైద్యులు ఉన్నారు. వారిలో 70 నుంచి 80 మంది ప్రాక్టీస్ చేస్తున్నారు. సర్వజన ఆస్పత్రిలోనే ఏడాదికి 12 వేల మంది వరకు రోగులకు మత్తు ఇస్తారు. జిల్లావ్యాప్తంగా ఏడాదికి లక్ష మంది వరకు రోగులకు మత్తు ఇస్తారు. -
విజయనగరం
గురువారం శ్రీ 16 శ్రీ అక్టోబర్ శ్రీ 2025గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వం స్పందించిన దాఖలాలు లేవు. ఫలితమే కురుపాం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఓ పువ్వల అంజలి.. ఒక తోయక కల్పన.. సాలూరు నియోజకవర్గంలో కేజీబీవీ విద్యార్థిని బిడ్డిక కీర్తన.. ఈ చావుల పరంపర వీరితో ఆగిపోలేదు. నిన్న కాక మొన్న మూడో తరగతి విద్యార్థిని శాంత.. తాడంగి పల్లవి.. ఇప్పుడు అభంశుభం ఎరుగని బాలుడు, మక్కువ మండలం మూలవలస గ్రామవాసి, ఎర్రసామంత వలస ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతి చదుతున్న విద్యార్థి తాడంగి చిన్నారి. ఇలా.. ఏడాదిన్నర కాలంలో పార్వతీపురం మన్యం జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలు, కేజీబీవీలు, ఇతర విద్యాసంస్థల్లో చదువుతున్న 15 మంది విద్యార్థులు అనారోగ్య సమస్యలతో ప్రాణాలు విడిచారు. మండంగి గౌతమ్, నిమ్మల అవంతి, పత్తిక దినేష్, నిమ్మక నితిన్, నిమ్మక జీవన్ కుమార్ తదితర విద్యార్థుల మరణాలతో మన్యం వణికిపోతున్నా ప్రభుత్వం చలించడం లేదు. కురుపాం బాలికల గురుకుల పాఠశాలలో 611 మంది విద్యార్థినులకు ఒకే ఏఎన్ఎం సేవలందిస్తున్నారంటే.. విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికై నా ప్రభుత్వం గిరిజన విద్యార్థుల మరణాల నివారణకు శాశ్వత చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ గిరిజన, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థి చిన్నారి మృతదేహం వద్ద బుధవారం ఆందోళన చేశాయి. చిన్నారి మృతికి సమాధానం చెప్పాలంటూ ఐటీడీఏ అధికారులను, జిల్లా యంత్రాంగాన్ని, పాలకులను ప్రశ్నించాయి. చిన్నారి తల్లిదండ్రులు తాడంగి ముగిరి, కాంతమ్మ కన్నీటి రోదన వినాలని, చావులకు అంతం పలకాలంటూ నినదించాయి. మంత్రి సంధ్యారాణి తీరును ఎండగట్టాయి. రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. పత్తిక దినేష్ (ఫైల్) నిమ్మక నితిన్ (ఫైల్) -
ఆ హాస్టల్ ప్రారంభానికే పరిమితం..!
● ఇదెక్కడి తీరు ‘నాయనా’..! ● విద్యార్థులకు అక్కరకు రాని హాస్టల్ భవనం ● ఇంటివద్ద నుంచే రాకపోకలు బాడంగి: విద్యార్థుల వసతి కోసం హాస్టల్ భవనాన్ని ప్రారంభించారు. దానిని ఇప్పటిరకు అందుబాటులోకి తేలేదు. విద్యార్థులకు వసతి కల్పించలేదు. ఫలితం.. భవనం ప్రారంభించినా ఫలితం లేకపోతోంది. దీనిపై విద్యార్థినుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇదెక్క తీరు ‘నాయనా’ అని ప్రశ్నిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే... బాడంగి హైస్కూల్కు అనుబంధంగా కేజీబీ టైప్–4 హాస్టల్ నూతన భవనాన్ని హడావిడిగా సెప్టెంబర్ 9న ఎమ్మెల్యే బేబీ నాయన చేతులమీదుగా ప్రారంభించారు. ఇప్పటివరకు ఆ భవనం నిర్వహణకు నోచుకోలేదు. వసతి సదుపాయం ఉంటుందన్న ఆశతో సాలూరు, పాచిపెంట తదితర దూరప్రాంతాలనుంచి హైస్కుల్లో చేరిన బాలికల పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. ఇక్కడకు వచ్చి ఉండేందుకు వసతిలేక ఇంటివద్దనే ఉండిపోతున్నారు. చదువుకు దూరమవుతున్నారు. ఇదే విషయంపై బాడంగి హైస్కూల్ హెచ్ఎం సత్యనారాయణ వద్ద ప్రస్తావించగా వార్డెన్, ట్యూటర్ను ఇచ్చారని, ఇంకా వంటమనిషి, వాచ్మన్, శానిటేషన్ వర్కర్లు, స్వీపర్లను నియమించాల్సి ఉందన్నారు. సిబ్బంది నియామకం అయితే వసతిగృహం అందుబాటులోకి వస్తుందన్నారు. హాస్టల్ సౌకర్యం ఉంటుందని మా పిల్లల్ని జె డ్పీ హైస్కూల్లో చేర్పించాం. జూన్ నెల నుంచి నాలుగునెలుగా చదువుకు దూరంగా గడుపుతున్నారు. ఇలా అయితే పదోతరగతిలో ఉత్తీర్ణులు ఎలా అవుతారు. త్వరితగతిన వసతిగృహాన్ని ప్రారంభించాలి. – గొర్కాకుమారి, దళాయి సత్యవతి, బాలికల తల్లులు, సాలూరు -
కక్ష సాధింపులు తగవు
విజయనగరం టౌన్: తపాలా శాఖ యూనియన్లో ఉన్న నాయకులపై కక్ష సాధింపులను తక్షణమే నిలుపుదల చేయాలని ఆల్ ఇండియా పెన్షన్ ఎంప్లాయీస్ యూనియన్ గ్రూప్–సి రాష్ట్ర ఉపాధ్యక్ష్యుడు వి.రుద్రప్రతాప్ కోరారు. యూనియన్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ కామ్రేడ్ ఎస్.ఎస్.మహదేవయ్యను డిపార్ట్మెంట్ విధుల నుంచి తొలగించడంపై తపాలాశాఖ కార్యాలయం ఆవరణలో బుధవారం నిరసన తెలిపారు. తపాలాశాఖలో ట్రేడ్ యూనియన్ హక్కులను పరిరక్షించాలన్నారు. యూనియన్ల గుర్తింపును వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు బి.కిరణ్ కుమార్, ఎ.పెంటపాపయ్య, వి.శ్రీనివాసరావు, పతివాడ శ్రీనివాసరావు, కె.ఈశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన సంక్షేమశాఖ మంత్రి రాజీనామా చేయాలి
పార్వతీపురం: వరుసగా అనారోగ్యంతో విద్యార్థులు మరణిస్తున్నా పట్టించుకోని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తక్షణమే రాజీనామా చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి బి.రవికుమార్ డిమాండ్ చేశారు. స్థానిక విలేకరులతో ఆయన బుధవారం మాట్లాడారు. మక్కువ మండలం ఎర్రసామంతవలస ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న తాడంగి చిన్నారిని బతికించుకునేందుకు తల్లిదండ్రులు ఈనెల 13న సాలూరు ఏరియా ఆస్పత్రికి, అక్కడ నుంచి విజయనగరం, విశాఖ కేజిహెచ్కు తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందన్నారు. అలాగే, సాలూరు మండల మామిడిపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల వసతి గృహం 7వ తరగతి చదువుతున్న తాడంగి పల్లవి ఈనెల 11న విశాఖపట్నం తరలించినప్పటికీ సెలిబ్రల్ మలేరియాతో మృతి చెందిందన్నారు. కురుపాంలో కలుషిత నీరు కారణంగా సుమారు 224 మంది విద్యార్థులు ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతుండగా ఇద్దరు మృతి చెందారన్నారు. గిరిజనుల ఓట్లతో గెలిచి వారికి కష్టమొస్తే పట్టించుకోని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి తక్షణమే విద్యార్థుల మృతికి బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
అందని బిల్లులు.. నిలిచిన పనులు
రామభద్రపురం: ప్రతీ ఇంటికీ తాగునీరు సరఫరా చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జల్జీవన్ మిషన్ పనులకు బిల్లుల బకాయిలు గుదిబండగా మారాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 100 పనులకు రూ.40 కోట్ల బిల్లులు చెల్లింపులు నిలిచిపోయాయి. ఫలితం.. మూడునెలలుగా పనులు జరగడంలేదు. ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. చివరిదశలో నిలిచిన పనులు చాలా గ్రామాల్లో జల్జీవన్ మిషన్ పనులు చివరి దశలో నిలిచిపోయాయి. తాగునీటి పథకాల నిర్మా ణాలు, బోర్ల ఏర్పాటు పూర్తయినా పైప్లైన్ పనులు జరగలేదు. దీంతో ఇంటింటికీ నీటి సరఫరా సా ధ్యం కావడంలేదు. తాగునీటి ట్యాంకులు దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. కొన్నిచోట్ల ట్యాప్లు ప్రారంభానికి ముందే పాడవుతున్నాయి.ఈ చిత్రంలో కనిపిస్తున్న మంచినీటి ట్యాంకు రామభద్రపురం మండలం రావివలస పంచాయతీలోని ఎనుబరువు గిరిజన గ్రామంలోనిది. రూ.17.60 లక్షల అంచనా వ్యయంతో నిర్మించారు. 90 శాతం పైగా పనులు పూర్తయ్యాయి. మరో పది శాతం పనులు పూర్తిచేస్తే ఇంటింటికీ తాగునీరు అందుతుందని గ్రామస్తులు సంబర పడ్డారు. ప్రభు త్వం బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ చివరిదశలో పనులు నిలిపివేశారు. ఫలితం.. గిరిజనులకు తాగునీరు అందని ద్రాక్షగా మారింది. జల్జీవన్ మిషన్ బిల్లులు చెల్లించని మాట వాస్తవమే. జిల్లా వ్యాప్తంగా సుమారు 100 పనులకు దాదాపు రూ.40 కోట్ల మేర బిల్లులు చెల్లింపుకు సిద్ధం చేశాం. ఆన్లైన్లో అప్లోడ్ కూడా చేశాం. త్వరలో బిల్లులు మంజూరయ్యే అవకాశం ఉంది. కాంట్రాక్టర్లతో మాట్లాడి చివరిదశలో నిలిచిన పనులను పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటాం. – ఎస్.కవిత, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ, విజయనగరం -
●ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ‘పారిశ్రామిక భాగస్వామ్య డ్రైవ్’ ప్రారంభం
విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) ఆధ్వర్యంలో ‘ఏపీఐఐసీ–పారిశ్రామిక భాగస్వామ్య డ్రైవ్’ పేరుతో నెల రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు బుధవారం ప్రారంభమయ్యాయి. డ్రైవ్కు సంబంధించిన పోస్టర్ను బుధవారం కలెక్టర్ చాంబర్లో కలెక్టర్ ఎస్.రామ్సుందర్రెడ్డి ఆవిష్కరించారు. ఏపీఐఐసీ అధికారులు వారాల వారీగా చేపడుతున్న స్పెషల్ డ్రైవ్లో ఈ నెల 21వ తేదీ వరకు పరిశ్రమల ప్రాంగణాల్లో పరిశుభ్రత, పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు పచ్చదనం పెంపు, ఈ నెల 29 నుంచి నవంబర్ 5వ తేదీ వరకు పరిశ్రమలతో భాగస్వామ్యం, పెట్టుబడుల ప్రోత్సాహం, నవంబర్ 6 నుంచి 15వ తేదీ వరకు పరిశ్రమల మౌలిక వసతుల ఆధునీకరణ, సుస్థిరత చర్యల అమలు వంటి కార్యక్రమాలను చేపడతారు. కార్యక్రమంలో ఏపీఐఐసీ డీజెడ్ఎం కె.జయచంద్ర, జేసీ వి.రాజేష్ కుమార్ పాల్గొన్నారు. -
గెడ్డలో కొట్టుకుపోయిన వ్యక్తి
● గాలింపు చేపట్టిన ఎస్డీఆర్ఎఫ్గంట్యాడ: మండలంలోని చంద్రంపేట గెడ్డలో ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని ఆర్.వసంత గ్రామానికి చెందిన విజ్జపు సోమరాజు విజయనగరం పీడబ్ల్యూ మార్కెట్లోని ఓ కిరాణా హోల్సేల్ దుకాణంలో పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి విధులు ముగించుకుని టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై గ్రామానికి వెళ్తుండగా చంద్రంపేట దాటిన తర్వాత వసంత గ్రామానికి ముందు ఉన్న గెడ్డలో ప్రమాదవశాత్తు కొట్టుకుపోయాడు. రాత్రి 12 గంటలైనా సోమరాజు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు గ్రామ స్తులతో కలిసి వెతకసాగారు. తెల్లవార్లూ వెతికినా అచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై సాయికృష్ణ, తహసీల్దార్ నీలకంఠేశ్వరరెడ్డిలు సంఘటనా స్థలానికి చేరుకుని ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించి గాలింపు చేపట్టారు. గల్లంతైన సోమరాజుకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. గెడ్డపై ఇప్పటికై నా పాలకులు వంతెన నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ గెడ్డపై వంతెన నిర్మించాలని రెండు గ్రామాలకు చెందిన ప్రజలు మంగళవారం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. -
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు
● శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ విజయనగరం: విశాఖ ఉక్కు కర్మాగారం ఆంధ్రుల హక్కు అని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు ఉద్యమం ప్రారంభమై 59 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అంబేడ్కర్ రైట్స్ ఫోరం ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాలను విజయనగరంలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత, దళిత సామాజికవర్గానికి చెందిన తాడికొండ మాజీ ఎమ్మెల్యే తమనంపల్లి అమృతరావు స్ఫూర్తిని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కొనసాగిస్తూ ప్రైవేటీకరణను విరమించుకోవాలని హితవుపలికారు. 2025 ఆగస్టు 16న విశాఖ స్టీల్ప్లాంట్లోని 32 విభాగాలను ప్రైవేటీకరణకు టెండర్లు పిలవడం, అదే రోజున ప్యాకేజీ ప్రకటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. 32 మంది ప్రాణత్యాగంతో సాకారమై, నేడు లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు. ఎన్నికలకు ముందు మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకుని నేడు ప్రైవేటీకరణకు పాటుపాడడం దుర్మార్గపు చర్యగా పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అంబేడ్కర్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బి.భానుమూర్తి, ప్రతినిధులు పిడకల ప్రభాకరరావు, ధారాన వెంకటేష్, డోల కోటేశ్వరరావు, వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి రేగాన శ్రీనివాసరావు, జామి కృష్ణ, చంద ఉమామహేశ్వరరావు, వంక చిన్నికృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
నరక యాతన పడి వ్యాన్ డ్రైవర్ మృతి
● మృతుడు తాడేపల్లి గూడెం వాసి వీరఘట్టం: ఐషర్ వ్యాన్లో ఉన్న గోనె సంచులను అన్లోడ్ చేసేందుకు వ్యాన్కు ఉన్న తాళ్లను విప్పుతూ ప్రమాదవశాత్తు వ్యాన్ బాడీకి–క్యాబిన్కు మధ్యలో పడిపోయిన డ్రైవర్ రాజు (35) వీరఘట్టం మెయిన్ రోడ్డులో మంగళవారం మృతి చెందాడు. ఈ ప్రమాదంపై ఎస్సై జి.కళాధర్తో పాటు స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక గోనె సంచుల వ్యాపారికి విజయవాడ నుంచి ఐషర్ వ్యాన్తో తాడేపల్లి గూడెంకు చెందిన రాజు అనే డ్రైవర్ గోనె సంచులను తీసుకువచ్చాడు. వ్యాన్లో ఉన్న గోనె సంచులను అన్లోడ్ చేసేందుకు గాను కలాసీలు రావడంతో వ్యాన్కు ఉన్న కట్లు విప్పేందుకు డ్రైవర్ రాజు వ్యాన్ పైకి ఎక్కాడు.ఆ తాళ్లు విప్పుతూ ప్రమాదవశాత్తు వ్యాన్ బాడీకి–క్యాబిన్కు మధ్యలో ఉన్న సందులో పడిపోయాడు. ఈ ప్రమాదంలో డ్రైవర్ రాజు తలకిందులుగా వ్యాన్ బాడీకి రేడియేటర్కు మధ్యలో ఉండిపోయి నరకయాతన అనుభవించాడు. ఈ ప్రమాదాన్ని చూసిన కలాసీలు, స్థానికులు వెంటనే అతన్ని బయటకు తీసే ప్రయత్నం చేశారు. పక్కనే ఉన్న కొందరు మోటార్ వర్కర్లు కూడా వచ్చి వ్యాన్కు ఉన్న కొన్ని పరికరాలను కోసేసి డ్రైవర్ రాజును బయటకు తీయగా కొన్ని గాయాలతో బయట పడ్డాడు. మెల్లగా బయటకు వచ్చి కూర్చున్న డ్రైవర్కు కొద్ది క్షణాల్లోనే ఫిట్స్ వచ్చి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు సపర్యలు చేసి పీహెచ్సీకి తీసుకువెళ్లగా వైద్యసిబ్బంది తనిఖీ చేసి చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ ప్రమాదంపై ఎస్సై జి.కళాధర్ కేసు నమోదు చేశారు. వీరఘట్టం పీహెచ్సీలో ఉన్న డ్రైవర్ మృతదేహాన్ని పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించి భద్రపరిచారు. మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం తెలియజేశామని, వారు వచ్చిన తర్వాత స్టేట్మెంట్లు రికార్డు చేసి పోస్ట్మార్టం అనంతరం బాడీని అప్పగిస్తామని ఎస్సై తెలిపారు. గిలగిలాకొట్టుకోవడంతో కంట తడి చుట్టూ వందలాది జనం..రోడ్డు పక్కనే ఉన్న వ్యాన్ వద్ద గిలగిలా కొట్టుకుంటూ డ్రైవర్ రాజు చేసిన ఆర్తనాదాలు స్థానికులను కంటతడి పెట్టించాయి. వ్యాన్ బాడీకి–క్యాబిన్కు మధ్య సుమారు 40 నిమిషాల పాటు ఇరుక్కపోయిన డ్రైవర్ రాజు మృత్యువుతో పోరాడి బయటపడ్డాడని అందరూ అనుకున్నారు. హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు.అయితే బయటకు వచ్చిన క్షణాల్లోనే డ్రైవర్ చనిపోయాడని తెలియడంతో అక్కడ ఉన్నవారంతా తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. వెంటనే ఈ ప్రమాద విషయాన్ని వ్యాన్ యజమానికి ఫోన్లో తెలియజేశారు. తాడేపల్లిగూడెంకు చెందిన రాజు అనే డ్రైవర్ విజయవాడ నుంచి ఈ వ్యాన్ ఇక్కడికి తీసుకువచ్చినట్లు వ్యాన్ యజమాని పోలీసులకు తెలిపారు.ఈ విషయాన్ని డ్రైవర్ కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం అందజేశారు. -
హంసవాహనంపై సిరుల తల్లి
విజయనగరం టౌన్: మంగళవాయిద్యాలు... బాణసంచా వెలుగులు.. భక్తుల జై పైడిమాంబ.. జైజై పైడిమాంబ జయజయధ్వానాలు.. వేదపండితుల మంత్రోచ్ఛరణాల నడుమ హంస వాహనంపై పసిడి కాంతుల పైడితల్లి విజయనగరం పెద్ద చెరువులో మంగళవారం సాయంత్రం జలవిహారం చేశారు. భక్తులకు చల్లని ఆశీస్సులు అందించారు. అమ్మవారి జలవిహారాన్ని చూసేందుకు సున్నంబట్టీ వీధి సమీపంలోని చెరువు గట్టు వద్దకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అమ్మవారు సాక్షాత్కరించిన చెరువులో మూడుసార్లు జలవిహారం చేస్తుంటే.. గట్టుపై ఉండి కళ్లార్పకుండా తిలకించారు. పైడితల్లమ్మా.. చల్లంగా చూడమ్మా అంటూ స్మరించారు. చల్లని తల్లి కరుణాకటాక్షాలను అందుకున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 6.30 గంటల వరకు సాగిన తెప్పోత్సవానికి జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేయగా, ఆలయ ఇన్చార్జి ఈఓ కె.శిరీష పర్యవేక్షించారు. ● వనంగుడిలో వేదస్వస్తి వనంగుడిలో ముందుగా వేదపండితులు వేదస్వస్తి నిర్వహించారు. రాజాం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెన్నేటి స్వప్న హైందవి, అధికార భాషా సంఘం పూర్వపు సభ్యులు డాక్టర్ ఎ.గోపాలరావు వ్యాఖ్యానం చేశారు. వేదస్వస్తి చెప్పిన బ్రాహ్మణులకు ఆలయ కార్యనిర్వహణాధికారి కె.శిరీష దుశ్సాలువ, నగదు బహుమతితో సత్కరించారు. అనంతరం అమ్మవారికి పారాయణం, ఆధ్యాత్మిక అంశాలను, పైడితల్లి అమ్మవారి భజనలను వినిపించారు. ● పైడితల్లికి స్నపనం తెప్పోత్సవానికి ముందు పైడితల్లి అమ్మవారి ఉత్సవ విగ్రహానికి వనంగుడిలో ఆలయ అధికారులు, పైడితల్లి దీక్షాపరులు స్నపన కార్యక్రమం నిర్వహించారు. వేదమంత్రాల సాక్షిగా పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం అమ్మవారిని అలంకరించి ఆలయం చుట్టూ మూడుమూర్లు ప్రదిక్షణ జరిపారు. అనంతరం పల్లకిలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి, భాజాభజంత్రీలు, మేళతాళాలతో భారీ ఊరేగింపుగా సున్నంబట్టివీధి మీదుగా పెద్దచెరువు వద్దకు తెప్పోత్సవానికి తీసుకెళ్లారు. అక్కడ ఉన్న హంసవాహనంపై అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి జలవిహారం జరిపించారు. ఉత్సవంలో ఆలయ సిరిమాను అర్చకులు బంటుపల్లి వెంకటరావు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, ఉత్సవ ప్రత్యేకాధికారి మూర్తి, దీక్షాపరులు, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. కనులపండువగా పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం అమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు వనంగుడిలో పైడితల్లికి స్నపనం పెద్దచెరువులో మూడుసార్లు జలవిహారం కనిపించని ప్రజాప్రతినిధులు పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవానికి జిల్లా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు హాజరుకాకపోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. కేవలం ఈఓ, సిరిమాను పూజారికే ఈ ఏడాది ఉత్సవం మిగిలింది. ఏటా కనీసం ఐదారుగురైనా అధికారులు ఉత్సవంలో పాల్గొని, అమ్మ ఆశీస్సులందుకుంటుంటారు. ఈ ఏడాది అన్నింటికీ మించి తెప్పోత్సవం ఎవరికీ పట్టకుండా పోయింది. అయినప్పటికీ పైడితల్లి అమ్మవారికి శాస్త్రోక్తంగా చేయాల్సిన కార్యక్రమాలన్నింటిని భక్తిశ్రద్ధలతో ఆలయ అధికారులు నిర్వహించడం విశేషం. -
నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు ఎక్కడ ‘బాబూ’?
విజయనగరం గంటస్తంభం: నిరుద్యోగ యువతను కూటమి ప్రభుత్వం మళ్లీ మోసం చేసిందని అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్మి పరుచూరి రాజేంద్రబాబు అన్నారు. సూపర్ సిక్స్–సూపర్ హిట్ అంటూ సభలు నిర్వహిస్తున్న చంద్రబాబుకు నిరుద్యోగ భృతి అంశం పట్టడంలేదని మండిపడ్డారు. విజయనగరంలోని డీఎన్ఆర్ అమర్ భవన్లో మంగళవారం నిర్వహించిన ఏఐవైఎఫ్ జిల్లా నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 18 నెలలు కూటమి పాలనలో నిరుద్యోగ భృతి గల్లంతయ్యిందన్నారు. ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి వలంటీర్లు, రేషన్ సిబ్బందిని తొలగించారని విమర్శించారు. రాష్ట్రంలో 1.56 కోట్ల మంది నిరుద్యోగులు ఉండగా, విజయనగరం జిల్లాలోనే 4.68 లక్షల మంది ఉన్నారన్నారు. నారా లోకేశ్ విద్యాశాఖ మంత్రిగా వ్యవహరించకుండా కార్పొరేట్లకు సీఈఓలా ఉన్నారని విమర్శించారు. పేద విద్యార్థులకు ప్రభుత్వ వైద్య విద్యను దూరం చేసే కుట్రలో భాగంగా పీపీపీ మోడల్ ద్వారా వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడం అన్యాయమన్నారు. రాష్ట్రానికి బీజేపీ–టీడీపీ కూటమి ఏం చేసింది అనే అంశంపై శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. నవంబర్ చివరి వారం నుంచి హిందూపురం–ఇచ్ఛాపురం వరకు నిరుద్యోగుల ఆవేదన యాత్ర నిర్వహిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్మి కోన శ్రీనివాసరావు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్మి నాగభూషణం, జిల్లా నాయకులు వాసు, అప్పన్న, కిరణ్, గోపినాయుడు, రాజేష్, తదితరులు పాల్గొన్నారు. -
పుష్పాలంకరణలో పైడితల్లి అమ్మవారు
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్, నేతేటి ప్రశాంత్లు పూజాదికాలు నిర్వహించారు. కార్యక్రమాలను ఆలయ ఈఓ కె.శిరీష పర్యవేక్షించారు. 19న జిల్లా స్థాయి యోగాసనాల పోటీలునెల్లిమర్ల: స్థానిక మిమ్స్ సమీపంలోని శ్రీరామకృష్ణ ధ్యాన మందిరంలో ఈ నెల 19వ తేదీన జిల్లా స్థాయి యోగసనాల పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా యోగా క్రీడా సంఘం ప్రతినిధులు ఓ ప్రకటనలో మంగళవారం తెలిపారు. మొత్తం ఏడు విభాగాల్లో పోటీలు ఉంటాయని, విజేతలను 25, 26వ తేదీల్లో విశాఖపట్టణంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. పోటీల్లో పాల్గొనే వారు తమ పేర్లను 17వ తేదీలోగా ఫోన్ నంబర్లు 8374904262, 8465954998 సంప్రదించి నమోదు చేసుకోవాలన్నారు. -
చంద్రబాబు చేసింది శూన్యం
చీపురుపల్లి(గరివిడి): రాష్ట్ర భవిష్యత్, ప్రజల ప్రయోజనాల కోసం సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన చంద్రబాబునాయుడు చేసింది శూన్యమని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఆలోచన చేసినది దివంగత మహానేత వైఎస్సార్ తరువాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి మాత్రమేనని అన్నారు. గరివిడిలోని తన క్యాంప్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన వైఎస్సార్సీపీ చీపురుపల్లి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మించాలని, పేదలకు మెరుగైన వైద్యం, పేదలకు వైద్యవిద్య అందుబాటులోకి రావాలని 2017లో అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అయితే అప్పటికే ఎన్డీఏ కూటమిలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు కనీసం పట్టించుకోలేదన్నారు. 2019లో ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి రెండేళ్ల పాటు కరోనా మహమ్మారి సవాల్ విసిరిందన్నారు. అయినప్పటికీ కరోనా బారి నుంచి ప్రజలను రక్షించి, మరణాలు రేటు తగ్గించడంలో జగన్మోహన్రెడ్డి పరిపాలన దోహదం చేసిందన్నారు. ఆ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా 17 వైద్య కళాశాలల మంజూరుకు కృషిచేశారన్నారు. కేవలం మూడేళ్లలోనే 5 కళాశాలల నిర్మాణాలు పూర్తిచేశారన్నారు. వీటి కోసం రూ.8 వేల కోట్లు అవసరం కాగా రూ.2,200 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. కేవలం మూడేళ్ల కాలంలో 17 వైద్య కళాశాలలు మంజూరు చేయడం సాధ్యమైతే 2014లో విభజన సమయంలో రాష్ట్రానికి మంజూరైన ఎయిమ్స్ కళాశాల ఇంతవరకు ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. 2014లో రూ.1.19 వేల కోట్లతో డిజైన్ చేసిన అమరావతి 2019 వరకు ఎంత మేర పనులు జరిగాయని ప్రశ్నించారు. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 19 నెలలు కాలంలో రూ.2 లక్షలు కోట్లు అప్పులు తెచ్చి రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉచిత వైద్యం అందేవరకు పోరాటం చేద్దాం కూటమి ప్రభుత్వం చేపడుతున్న మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో పేద కుటుంబాల విద్యార్థులు వైద్యవిద్యకు, సామాన్య ప్రజలు వైద్యానికి దూరమవుతారని, దీనిని ప్రజావ్యతిరేక కార్యక్రమంగానే పరిగణించి పోరుబాట సాగిద్దామని శాసనమండలి విక్షనేత బొత్స సత్యనారాయణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వైద్యకళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరించి గవర్నర్కు అందజేద్దామన్నారు. సంతకాల సేకరణను వేగవంతం చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వంలో దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజా సంక్షేమం కానరావడంలేదన్నారు. ఇటీవల గుర్ల మండలం జమ్ము గ్రామంలో జరిగిన సంఘటన అత్యంత దారుణమని, భవిష్యత్తులో ఫలితం అనుభవిస్తారన్నారు. ● పార్టీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ అనేది ప్రజావ్యతిరేక నిర్ణయమని, విద్య, వైద్యం అనేది ప్రజల హక్కు అని అన్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకునేలా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ చేపట్టేలా జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారన్నారు. గ్రామంలో ప్రతీ ఇంటికి వెళ్లి కళాశాలల ప్రాముఖ్యతను వివరించి సంతకాలు సేకరించాలన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో విద్య, వైద్యం, వ్యవసాయం పూర్తిగా నిర్వీర్యం అవుతున్నాయన్నారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వ తప్పులను సోషల్మీడియా వేదికగా ఎండగట్టాలన్నారు. కోటి సంతకాల సేకరణ తరువాత ఈనెల 28న నియోజకవర్గ స్థాయిలో పెద్దస్థాయిలో ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ● మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్రెడ్డి హయాంలోనే విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం లభించిందన్నారు. ఆరోగ్యశ్రీ నుంచి 108, 104, పీహెచ్సీ, సీహెచ్సీల్లో ఎన్నో వైద్యసేవలు, విజయనగరంలో మెడికల్ కళాశాల అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. వైద్యకళాశాలలను ప్రైవేటీకరిస్తూ కూటమి చేపట్టిన దుర్మార్గ పాలనను ప్రజలకు వివరించి కోటి సంతకాలు సేకరించాలన్నారు. కార్యక్రమంలో చీపురుపల్లి, గరివిడి, గుర్ల, మెరకముడిదాం మండలాల నాయకులు ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసులనాయుడు, మీసాల వరహాలనాయుడు, బెల్లాన వంశీకృష్ణ, మీసాల విశ్వేశ్వరరావు, వాకాడ శ్రీనివాసరావు, శీర అప్పలనాయుడు, పొట్నూరు సన్యాసినాయుడు, ఎస్.వి.రమణరాజు, కోట్ల విశ్వేశ్వరరావు, తాడ్డి వేణు, నాలుగు మండలాల సర్పంచులు, ఎంపీటీసీలు, పీఏసీఎస్ మాజీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. రూ.1.19 వేల కోట్లతో డిజైన్చేసిన అమరావతి ఎక్కడుంది? 2014లో మంజూరైన ఎయిమ్స్ కళాశాల పరిస్థితి ఏంటి? ఉచిత వైద్యం అందేవరకు పోరాటం చేద్దాం వైద్యకళాశాలల ప్రైవేటీకరణ దారుణం కోటి సంతకాలు సేకరించి గవర్నర్కు అందజేద్దాం శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ -
వైభవంగా పునర్వసు పట్టాభిషేకం
● సీతారామస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలునెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో పునర్వసు పట్టాభిషేక మహోత్సవాన్ని ఆలయ అర్చకులు మంగళవారం వైభవంగా జరిపించారు. వేకువజామున స్వామికి ప్రాతః కాలార్చన, బాలభోగం నిర్వహించిన తరువాత యాగశాలలో సుందరకాండ హవన హోమం జరిపించారు. అనంతరం స్వామి వెండి మంటపంలో సీతారామస్వామి కల్యాణ మహోత్సవాన్ని వేడుకగా జరిపించి..ఉత్సవమూర్తులకు రామాయణంలో పట్టాభిషేకం సర్గ విన్నవించారు. అనంతరం స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి వివిధ రకాల ఫల రసాలతో అభిషేకం, పునర్వసు పట్టాభిషేకాన్ని జరిపించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో అర్చకులు సాయిరామాచార్యులు, నరసింహాచార్యులు, వర ప్రసాద్, రామ గోపాల్, తదితరులు పాల్గొన్నారు. -
సుజుకి నూతన షోరూం ప్రారంభం
విజయనగరం గంటస్తంభం: విజయనగరం పట్టణంలోని రింగ్ రోడ్డులో వేణుగోపాల్ సుజుకి సంస్థ తమ రెండవ షోరూమ్ను ప్రారంభించింది. మంగళవారం ఈ కొత్త శాఖను సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నేషనల్ హెడ్ అభిషేక్ ఠాకూర్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సుజుకి సంస్థ దేశవ్యాప్తంగా వినియోగదారుల విశ్వాసాన్ని పొందిందని, ఉత్తమమైన సేవలు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. వేణుగోపాల్ సుజుకి సంస్థ విజయనగరంలో ఇప్పటికే ఒక శాఖను విజయవంతంగా నిర్వహిస్తోందని, వినియోగదారుల మద్దతుతో రెండో షోరూం ప్రారంభించడం ఆనందకరమ న్నారు. కార్యక్రమంలో బెస్ట్ వాల్యూ ఎస్ఎంఐపీఎల్ ఆపరేషన్స్ హెడ్ వీఎస్.యాస్ పాల్, వేణుగోపాల్ సుజుకి ఎండి జి.అభిరామ్, జీఎం సీహెచ్.ప్రవీణ్ కుమార్, సర్వీస్ మేనేజర్ సంతోష్ వర్మ, ఏరియా సేల్స్ మేనేజర్ ఎన్.సురేంద్ర, ఏరియా సర్వీస్ మేనేజర్ వి.సాయి కౌటిన్య తదితరులు పాల్గొన్నారు. -
చెప్పుకోలేను.. విప్పుకోలేను..
పీఏ పోరు పడలేక.. ● అందుకే విజయనగరం నుంచి వెళ్లిపోతా...? ● మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య ఆవేదన చందాల వసూళ్లలోనూ ఒత్తిడి సాక్షిప్రతినిధి, విజయనగరం: టీడీపీ నాయకులకు సొంత తెలివితేటలు లేవు.. చెబుదామంటే అర్థం చేసుకునే ఓపిక లేదు.. నా కష్టాలు బయటకు చెప్పుకోలేను.. లోలోపల దాచుకోలేను.. ఎందుకొచ్చిన బాధ.. సంచిసర్దుకుని వేరే ఊరు వెళ్లిపోతాను అంటూ మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య లోలోన కుమిలిపోతున్నారట. వాస్తవానికి విజయనగరం మున్సిపల్ కౌన్సిల్లో తెలుగుదేశానికి అసలు బలమే లేదు. మేయర్... డిప్యూటీ మేయర్, ఇంకో డిప్యూటీ మేయర్... స్టాండింగ్ కౌన్సిల్ చైర్మన్ వంటి అన్ని పదవుల్లోను వైఎస్సార్సీపీ నాయకులే ఉన్నారు. నగరంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా.. ఖర్చుతో కూడిన ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి. ఈ విషయంలో కౌన్సిల్ నిర్ణయమే అంతిమం. కౌన్సిల్లో తెలుగుదేశానికి పూర్తిగా బలం లేకపోవడంతో కేవలం ఎమ్మెల్యే పదవి మాత్రమే ఉన్న టీడీపీ ఆ ఒక్క పదవి పేరు చెప్పి అడ్డదిడ్డమైన నిర్ణయాలకు కమిషనర్ మీద ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. దీంతో ఆయన మేనేజ్ చేయలేక అసలు విషయం అర్థం అయ్యేలా చెప్పలేక సతమతమై బదిలీకి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్యే అదితి గజపతిరాజుతోపాటు ఆమె పీఏ కూడా అలవిమాలిన పెత్తనం చేస్తూ ఒత్తిడి తెస్తుండడంతో వారు చెప్పిన పనులు చేయలేక కౌన్సిల్లో వాటిని నెగ్గించలేక కమిషనర్ నల్లనయ్య ఇరకాటంలో పడిపోతున్నట్టు తెలిసింది. కౌన్సిల్లో తీర్మానం లేకుండా ఏ ఒక్క పని కూడా చేయడం సాధ్యం కాదన్నది అందరికీ తెలిసిందే. అయితే ఎమ్మెల్యే పదవి తమది కాబట్టి కౌన్సిల్ నిర్ణయాలను పక్కనపెట్టి మౌఖికంగా చెప్పే ఆదేశాల పాటించాలంటూ టీడీపీ నాయకులు చేస్తున్న ఒత్తిడిని ఆయన భరించలేకపోతున్నారు. ఇటు వైఎస్సార్సీపీ అటు టీడీపీ మధ్య నలిగిపోయి ఇబ్బంది పడడం కంటే వెళ్లిపోవడం మేలని ఆయన భావిస్తున్నారని తెలిసింది. ఇదే విషయం టీడీపీ పెద్దల వద్ద ప్రస్తావించగా.. ఉంటే ఉండండి పోతే పొండి అన్నట్లుగా మాట్లాడారని మున్సిపల్ వర్గాలు చెబుతున్నాయి. కమిషనర్ మనస్తాపానికి ఇవేనా కారణం? ఇటీవల కాలంలో నగరంలో పలు రోడ్ల విస్తరణలో ఇల్లు, షాపులు కోల్పోయిన వారికి ప్రభుత్వం టీడీఆర్ లు ఇస్తుంది. ఆ సర్టిఫికెట్లను సదరు జాగాలు కోల్పోయిన వాళ్లు బయట ఎవరికై నా విక్రయించి తమకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవచ్చు. ఉదాహరణకు రోడ్డు విస్తరణలో 50 గజాలు కోల్పోయిన వారికి రెట్టింపు పరిహారం ఇస్తారు. అంటే వంద గజాల స్థలం కోల్పోయినట్లు సర్టిఫికెట్ ఇస్తారు. దానిని సదరు బాధితులు వేరే బిల్డర్లకు విక్రయించుకుని తమకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవచ్చు. అయితే, ఇదే క్రమంలో రోడ్డు విస్తరణలో సింహాచలం మేడ, లోయర్ ట్యాంక్ బండ్, కోట వద్ద మాన్సాస్ సంస్థ స్థలాలు కొంతమేర కోల్పోగా వీటికి టీడీఆర్ ఇచ్చే విషయంలో కమిషనర్తో పేచీ వచ్చినట్లు తెలుస్తోంది. ఇది ఆయనను బాగా ఇబ్బంది కలిగించినట్టు సమాచారం పైడితల్లి అమ్మవారి పండగ సందర్భంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి కమిషనర్ జోక్యం చేసుకొని రూ.15 లక్షలకు పైగా వసూలు చేసి ఇచ్చారు. టౌన్ ప్లానింగ్ అధికారులు.. మున్సిపల్ హెల్త్.. ఎన్విరాన్మెంట్ విభాగం వారితో ఒత్తిడి చేయించి మరీ డబ్బులు వసూలు చేశారు. ఈ అంశంలోనూ కమిషనర్ బాగా ఇబ్బంది పడినట్టు తెలిసింది. ఇలాంటి పలు పరిణామాలు కమిషనర్ను ఇక్కడి నుంచి బదిలీ వైపు పురిగొల్పుతున్నాయన్న చర్చ సాగుతోంది. -
హెచ్ఐవీ రోగులపై వివక్ష..!
విజయనగరం ఫోర్ట్: వీరిద్దరికే కాదు అనేక మంది హెచ్ఐవీ రోగులకు ఇదే పరిస్థితి ఎదురవుతోంది. జిల్లాలో ఉన్న ప్రభుత్వాస్పత్రుల్లో హెచ్ఐవీ బాధితులకు వైద్యసేవలు అందడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. హెచ్ఐవీ రోగుల పట్ల వివక్ష చూపరాదని, ఆప్యాయత చూపాలంటూ ప్రజాప్రతినిధులు దగ్గర నుంచి అధికారుల వరకు ఉపన్యాసాలు చెబుతున్నా.. వైద్యులే సేవలందించేందుకు ససేమిరా అంటుండడం ఆందోళన కలిగిస్తోంది. ఏదైనా అనారోగ్యంతో చికిత్స కోసం ఆస్పత్రిని ఆశ్రయిస్తే వైద్యసేవలు ఆందించేందుకు వైద్యులు, సిబ్బంది ఇష్టపడడం లేదని హెచ్ఐవీ బాధితులే వాపోతున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి, గైనిక్ సమస్య ఉన్న మహిళలకు, కడుపునొప్పి, పేగు వరపు, హెర్నియా, హైడ్రోసిల్, ఈఎన్టీ సర్జరీ, ఎముకలు, నరాల సంబంధిత శస్త్రచికిత్సలు అవసరమైన వారికి ప్రభుత్వాస్పత్రుల్లో శస్త్రచికిత్సలు చేయడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, ఎస్.కోట, రాజాం, గజపతినగరం, చీపురుపల్లి ఏరియా ఆస్పత్రులు, బాడంగి, బొబ్బిలి, నెల్లిమర్ల, భోగాపురం సీహెచ్సీలు, ఘోషా ఆస్పత్రిలో హెచ్ఐవీ బాధితులకు అవసరమైన శస్త్రచికిత్సలు, చికిత్స అందించడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ● ప్రైవేటు ఆస్పత్రులే దిక్కు... జిల్లాలో 6,670 మంది హెచ్ఐవీ బాధితులు ఉన్నట్టు ఆస్పత్రి రికార్డులు చెబుతున్నాయి. వీరిలో పురుషులు 2,755 మంది, మహిళలు 3,646 మంది, పిల్లలు 269 మంది వరకు ఉన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో సేవలందక పలువురు హెచ్ఐవీ బాధితులు ఆపదవేళ శస్త్రచికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. వైద్యం కోసం వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. హైడ్రోసిల్, ఫైల్స్ శస్త్రచికిత్సకు రూ.20 వేల నుంచి రూ.30 వేలు, గైనిక్ సర్జరీలకు రూ.60 వేల నుంచి రూ. 70 వేలు వరకు వసూలు చేస్తున్నారు. హెర్నియా, కడుపు నొప్పి వంటి శస్త్రచికిత్సలకు రూ. 50 వేల నుంచి రూ.60 వేల వరకు వసూలు చేస్తున్నారు. ‘విజయనగరం పట్టణానికి చెందిన ఓ హెచ్ఐవీ బాధితురాలికి గైనిక్ సమస్య రావడంతో ఆమె ప్రభుత్వాస్పత్రిని ఆశ్రయించింది. ఆమెకు శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు గుర్తించారు. హెచ్ఐవీ ఉండడంతో శస్త్రచికిత్స చేయలేమని చెప్పేశారు. చేసేదిలేక విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రూ. 60 వేలు వెచ్చించి శస్త్రచికిత్స చేయించుకుంది.’ ‘చీపురపల్లి ప్రాంతానికి చెందిన ఓ హెచ్ఐవీ రోగికి కడుపునొప్పి రావడంతో విజయనగరంలో ఉన్న ప్రభుతాస్పత్రిలోని వైద్యుడిని ఆశ్రయించారు. వైద్య పరీక్షల్లో హెచ్ఐవీ ఉందని తేలడంతో వైద్యులు అతనికి శస్త్రచికిత్స చేయలేదు. విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రూ.50 వేలు ఖర్చుచేసి శస్త్రచికిత్స చేసుకున్నారు.’ ఆదేశాలిచ్చాం.. హెచ్ఐవీ రోగులకు ప్రభుత్వాస్పత్రుల్లో శస్త్రచికిత్సలు చేయాలని ఆదేశాలు ఇచ్చాం. శస్త్రచికిత్సలు జరిగేలా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ కె.రాణి, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి ప్రభుత్వాస్పత్రుల్లో హెచ్ఐవీ రోగులకు జరగని శస్త్రచికిత్సలు ప్రైవేటు ఆస్పత్రుల్లో వేలాది రుపాయలు వెచ్చించి వైద్యం పొందుతున్న హెచ్ఐవీ రోగులు జిల్లాలో 6,610 మంది హెచ్ఐవీ బాధితులు వీరిలో మహిళలే 3,646 మంది -
తెప్పోత్సవం ట్రయల్ రన్ సక్సెస్
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవ ట్రయల్ రన్ విజయవంతమైంది. సోమవారం ఉద యం 11 గంటలకు పెద్దచెరువులో సుమారు 40 మందితో ఆలయ ఇన్చార్జి ఈఓ కె.శిరీష, ఆర్డీఓ కీర్తి, వన్టౌన్ సీఐ చౌదరితో పాటు మత్స్యశాఖ అధికారులు తెప్ప ట్రయల్ రన్లో పాల్గొన్నారు. హంసవాహనంపై అమ్మవారు విహరించే ప్రదేశాల్లోకి తెప్పను తీసుకువెళ్లారు. ఆ ప్రాంతమంతా పరిశీలన చేశారు. అనంత రం ఆర్డీఓ కీర్తి మాట్లాడుతూ తెప్పోత్సవ ఏర్పాట్లను పైడితల్లి అమ్మవారి దేవస్థానం అధికారులు పూర్తిచేశారన్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి పెద్దచెరువులో అమ్మవారు హంసవాహనంపై విహరిస్తారన్నారు. కేవలం 20 మంది మాత్రమే తెప్పలోకి అనుమతి ఉందన్నారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అర్జీదారు సమస్యను అర్ధం చేసుకోవాలి ● కలెక్టర్ ఎస్.రామసుందర్రెడ్డి విజయనగరం అర్బన్: అర్జీదారు సమస్యను పూర్తిగా అర్ధం చేసుకోవాలని, వారు చెప్పే విషయాన్ని ఓపిగ్గా వినాలని, అప్పుడే వారికి సంతృప్తి కలుగుతుందని కలెక్టర్ ఎస్.రామసుందర్రెడ్డి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ వినతులపై కలెక్టర్ సోమవారం సమీక్షించారు. వినతులపై స్వయంగా సంబంధిత అధికారే ఎండార్స్మెంట్ వేయాలని, కిందిస్థాయి అధికారులకు అప్పగించకూడదని తెలిపారు. జిల్లాలో రీ ఓపెన్ అయిన కేసులు 2.83 శాతం ఉన్నాయని, రీ ఓపెన్కు గల కారణాలను ఆయా అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో డీఆర్వో శ్రీనివాసమూర్తి, సీపీఓ బాలాజీ, డిప్యూటీ కలెక్టర్ మురళి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. జేఎన్టీయూ జీవీ వీసీ బాధ్యతల స్వీకరణ ● విద్యాప్రమాణాల మెరుగుకు కృషిచేస్తా: వీసీ వి.వి.సుబ్బారావు విజయనగరం రూరల్: జేఎన్టీయూ–గురజాడ విశ్వవిద్యాలయం ఉప కులపతిగా (వీసీ) వి.వెంకట సుబ్బారావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జేఎన్టీయూ కాకినాడ రెక్టార్గా విధులు నిర్వహిస్తున్న ఆయన ఉద్యోగోన్నతిపై వీసీగా నియమిస్తూ ఈ నెల 8న ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన వర్సిటీ అధికారులు, ఆచార్యుల సమక్షంలో తాజాగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరు లతో మాట్లాడుతూ విశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాలల్లో విద్యా ప్రమాణాలు పెంపునకు చర్యలు తీసుకుంటానన్నారు. ఉద్యోగ, ఉపాధి రంగాల్లో స్థిరపడేలా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. వర్సిటీలో మౌలిక సదుపాయాల పెంపు, బోధన సిబ్బంది నియామకంతోపాటు విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది, అధికారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. పదోన్నతి కల్పించండి విజయనగరంఫోర్ట్: అర్హతకలిగిన మినీ అంగన్వాడీ కార్యకర్తలకు మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలుగా పదోన్నతి కల్పించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షరాలు బి.పైడిరాజు డిమాండ్ చేశారు. విజయనగరం కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో సుమారుగా 284 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తలు 15 ఏళ్లుగా పనిచేస్తున్నారన్నారు. మినీ అంగన్వాడీ కార్యకర్తలు విధుల్లో చేరినప్పుడు 10వ తరగతి సర్టిఫికెట్స్ సమర్పించినప్పటకీ అధికారులు సరిగా చూడ క, 10వ తరగతిలోపు చదివినట్లుగా ఆన్లైన్లో తప్పుగా నమోదు చేయడంతో అర్హత ఉన్నప్పటికీ అన్యాయానికి గురయ్యారన్నారు. కార్యక్రమంలో సంఘ నాయకులు వి. లక్ష్మి, జి.ఉష, బి.వెంకటలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
గడువులోగా రీ సర్వే పూర్తి చేస్తాం..
● జిల్లా సర్వే అండ్ సెటిల్మెంట్ రికార్డ్స్ ఎ.డి లక్ష్మణరావు సీతానగరం: జిల్లాలో జరుగుతున్న థర్డ్ ఫేజ్ రీ సర్వే పనులు 30 రోజుల్లో పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నామని సర్వే అండ్ సెటిల్మెంట్ రికార్డ్స్ ఏడీ పి. లక్ష్మణరావు అన్నారు. సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సర్వే అండ్ సెటిల్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం డీడీ, మూడు జిల్లాల ప్రత్యేక అధికారి కె. సూర్యనారాయణతో సమావేశమై రీ సర్వేపై చర్చించారు. ఈ సందర్భంగా ఎ.డి లక్ష్మణరావు మాట్లాడుతూ.. థర్డ్ ఫేజ్ కింద 43 గ్రామాలకు గాను 27,380 ఎకరాల్లో రీ సర్వే చేయాలని నిర్ధారించామని, అందులో ప్రైవేట్ భూమి 18,788 ఎకరాలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. విప్యూటీ డైరెక్టర్ కె. సూర్యనారాయణ మాట్లాడుతూ.. రీ సర్వే ప్రక్రియ నిర్దేశిత సమయానికి పూర్తి చేసేలా అధికారులకు అవగాహన కల్పించామన్నారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాల్లో సర్వే పనులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నామని, ఇందులో భాగంగానే ఇప్పలవలసలో చేపడుతున్న సర్వేను పరిశీలించామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్ఐ నాగిరెడ్డి శ్రీనివాసరావు, మండల సర్వేయర్ చంద్రశేఖర్, స్థానిక సర్వేయర్లు, వీఆర్ఓలు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారంలో పారదర్శకత
● కలెక్టర్ ఎస్. రామసుందర్రెడ్డివిజయనగరం అర్బన్: సమస్యల పరిష్కారంలో అధికారులు పారదర్శకత పాటించాలని కలెక్టర్ ఎస్. రామసుందర్రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పీజీఆర్ఎస్ కార్యక్రమానికి జిల్లా అధికారులతో పాటు మండల, మున్సిపల్ స్థాయి అధికారులు వీడియో కాన్ఫరెన్స్ లేదా జూమ్ లింక్ ద్వారా తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేశారు. ఫిర్యాదుల రీ ఓపెనింగ్ ఎక్కువగా ఉంటున్నాయని, రెండు వారాల్లో వాటిని తగ్గించాలని సూచించారు. ప్రతి ఫిర్యాదుదారుడికీ సక్రమమైన ఎండార్స్మెంట్ ఇవ్వడం, అందులో సంబంధిత రూల్ పొజిషన్ స్పష్టంగా పేర్కొనడం తప్పనిసరన్నారు. ఎండార్స్మెంట్లు నిర్లక్ష్యంగా ఇస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతిరోజూ కనీసం 60 కాల్స్ చేసి ఫిర్యాదుదారుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలన్నారు. ఫిర్యాదుల స్వీకరణలో కొత్త విధానం.. పీజీఆర్ఎస్ వినతుల స్వీకరణలో కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. ఫిర్యాదులు అధికంగా వస్తున్న విద్యాశాఖ, డీఆర్డీఏ, వైద్యారోగ్య శాఖకు చెందిన బాధ్యతలను కలెక్టర్, జేసీ, డీఆర్ఓలతో పాటు ఆరుగురు డిప్యూటీ కలెక్టర్లు తీసుకున్నారు. ప్రవేశ ద్వారంలోనే వినతులకు సంబంఽధించిన ప్రభుత్వ శాఖను తెలుసుకుని.. ఆ ఆధికారి వద్దకు నేరుగా అర్జీదారులను పంపే విధానాన్ని సోమవారం నుంచి అమలులోకి తెచ్చారు. పీజీఆర్ఎస్కు 184 వినతులు.. పీజీఆర్ఎస్కు జిల్లా వ్యాప్తంగా వచ్చిన అర్జీదారుల నుంచి 184 ఫిర్యాదులు స్వీరించారు. అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించిన వినతులు 69 వచ్చాయి. డీఆర్డీఏకి చెందినవి 28, డీపీఓకు సంబంధించినవి 13, మున్సిపాలిటీలకు సంబంధించి మరో 13, జీఎస్డీడబ్ల్యూస్కు 21, ఇతర శాఖలతో కలిపి 184 ఫిర్యాదులు అందాయి. కార్యక్రమంలో డీఆర్ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు మురళీ, వెంకటేశ్వరరావు, నూకరాజు, ప్రమీలాగాంధీ, రాజేశ్వరి, కళావతి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.40 ఫిర్యాదుల స్వీకరణ.. విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులు 40 వినతులు స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను ఎస్పీ ఏఆర్ దామోదర్ శ్రద్ధగా విని, వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భూ తగాదాలకు సంబంధించి 8, కుటుంబ కలహాలవి 5, మోసాలవి 4, నగదు వ్యవహారాలకు సంబంధించినవి ఒకటి, ఇతర అంశాలకు సంబంధించినవి 22 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, డీసీఆర్బీ సీఐ బి.సుధాకర్, ఎస్సై ప్రభావతి, తదితరులు పాల్గొన్నారు. -
● జీతాలందక అవస్థలు
● కలెక్టర్ రామసుందర్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన ఆరోగ్యమిత్రలువిజయనగరం ఫోర్ట్: ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) పథకంలో పనిచేస్తున్న ఆరోగ్యమిత్రలకు ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించి జీతాలు ఇప్పించాలని పలువురు కోరారు. ఈ మేరకు కలెక్టర్ రామసుందర్ రెడ్డిని సోమవారం గ్రీవెన్స్ సెల్లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య మిత్రల సంఘ జిల్లా అధ్యక్షుడు జెర్రిపోతుల ప్రదీప్ మాట్లాడుతూ.. రెండు నెలలుగా జీతాలు అందక పోవడంతో సిబ్బంది కుటుంబాలను నెట్టుకురాలేకపోతున్నారన్నారు. వెంటనే జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో పైడపునాయుడు, మహేష్, బంగారునాయు డు, జగదీష్, రాజప్పడు, తదితరులు పాల్గొన్నారు. -
ఆర్పీఎఫ్ కానిస్టేబుల్కు అవార్డు
● గుజరాత్లో మంత్రి చేతుల మీదుగా అందుకున్న సుమతివంగర: మండల పరిధి తలగాం గ్రామానికి చెందిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కిమిడి సుమతికి ధైర్య సాహస అవార్డు దక్కింది. ఐదేళ్ల కిందట రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సులో కానిస్టేబుల్గా వెస్ట్ బెంగాల్లోని మెచేడా రైల్వేస్టేషన్లో విధులు నిర్వహించే సమయంలో.. ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడుతుండగా ఆ వ్యక్తిని రక్షించింది. అలాగే రైల్వే ఆస్తులు, ప్రయాణికుల భద్రత పట్ల ఆమె చూపించిన ధైర్యసాహసాలను సంబంధిత శాఖ గుర్తించింది. ఈ మేరకు గుజరాత్లోని వలా్స్ద్ ఆర్పీఎఫ్ శిక్షణ కేంద్రంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చేతులమీదుగా సుమతి సోమవారం అవార్డు అందుకుంది. ఈ మేరకు సుమతిని పలువురు అభినందించారు. -
జిల్లాలో అభివృద్ధి శూన్యం..
● పూర్తికాని ప్రాజెక్ట్లు ● కానరాని అభివృద్ధి పనులు ● పట్టించుకోని కూటమి ప్రభుత్వంవిజయనగరం గంటస్తంభం: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక జిల్లాలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఎన్నో హామీలిచ్చినా నేటికీ ఏ ఒక్క హామీ కూడా పూర్తి చేసిన దాఖలాలు లేవు. సాగునీటి ప్రాజెక్ట్ల ఊసే ఎత్తకపోవడంతో రైతుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాకు రెండుసార్లు వచ్చినా హామీలు ఇవ్వడమే తప్ప ఆచరణలో చేసి చూపించలేకపోయారు. జెకా నిధులపై నిర్లక్ష్యం... 2014 సంవత్సరం నుంచి జైకా నిధులపైనా నిర్లక్ష్యం కొనసాగుతోంది. వట్టిగెడ్డకు రూ.38 కోట్ల జైకా నిధులు విడుదలయ్యాయి. కానీ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదు. దీంతో కోట్ల రూపాయల విలువైన పనులు చేసిన తర్వాత కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. వెంగళరాయ సాగర్కు రూ.64 కోట్లతో టెండర్లు ఆమోదించారు. ఈ పనులు కూడా మధ్యలో నిలిచిపోయాయి. అలాగే పెదంకలాం, ఆండ్ర ప్రాజెక్ట్ పనులు కూడా పూర్తయ్యే దాఖలాలు కనిపించడం లేదు. శిథిలావస్థలో నారాయణపురం ఆనకట్ట .. సంతకవిటి మండలం రంగారాయపురం, శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం నారాయణపురం సమీపంలో నాగావళి నదిపై 1959 – 63 మధ్య నారాయణపురం ఆనకట్టను నిర్మించారు. సంతకవిటితో పాటు శ్రీకాకుళం జిల్లాలోని సుమారు 38 వేల ఎకరాలకు ఈ ఆనకట్ట సాగునీరు అందిస్తూ వచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి నిర్లక్ష్యం కనబరచడంతో షట్టర్లు, రెగ్యులేటర్లు, స్పిల్వే వ్యవస్థలతో పాటు కాలువలు, గట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తి .. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు దాటినా జిల్లాలో అభివృద్ధి రూపురేఖలు కనిపించడం లేదు. గిరిజన విశ్వవిద్యాలయం, భోగాపురం విమానాశ్రయం వంటి ప్రధాన ప్రాజెక్ట్లు నిలిచిపోయాయి. పతంజలి వంటి సంస్థల పరిశ్రమలు కూడా ఊసులకే పరిమితమయ్యాయి. అంతేకాదు, పదిహేను సంవత్సరాలుగా పని చేస్తున్న కార్మికులను తొలగించడం, మౌలిక సదుపాయాల కేటాయింపులో జాప్యం వంటి చర్యలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. మూతబడిన ఎన్సీఎస్ సుగర్ ఫ్యాక్టరీ.. చెరకు రైతులకు అండగా నిలబడడంతో పాటు వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించిన ఎన్సీఎస్ సుగర్ ఫ్యాక్టరీ మూతబడింది. ముడి సరుకు కొరత, విద్యుత్ చార్జీల పెరుగుదల, ప్రభుత్వ రాయితీలు కల్పించకపోవడం వంటి కారణాలతో ఫ్యాక్టరీని మూసి వేయాల్సి వచ్చింది. -
సత్వరమే పరిష్కరించాలి..
● కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి పార్వతీపురం రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన సమస్యలను సత్వరమే పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి జిల్లా అధికారులకు దిశానిర్ధేశం చేశారు. పీజీఆర్ఎస్కు వచ్చిన అర్జీదారులు తమ సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకంతో తిరిగి వెళ్లాలన్నారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో 112 మంది అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌరసరఫరాల సేవలు, గృహాల మంజూరు, పింఛన్లు, సర్వే, ఉపాధి, తదితర సమస్యలకు సంబంధించిన వినతులు ఎక్కువగా వచ్చాయి. కార్యక్రమంలో సబ్ కలెక్టర్లు ఆర్. వైశాలి, పవర్ స్విప్నిల్ జగన్నాథ్, డీఆర్ఓ హేమలత, ఉప కలెక్టర్లు ధర్మచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
తెర్లాం ఉపాధ్యాయుడికి గుర్తింపు
● వరించిన అంతర్జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతెర్లాం: అంతర్జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు తెర్లాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పత్తికాయల సునీల్ ఎంపికయ్యారు. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విజయవాడలో సొసైటీ ఫర్ లెర్నింగ్ టెక్నాలజీస్ (సోలిట్) ఆధ్వర్యంలో ఆదివారం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఇండియా – అమెరికా సంయుక్త రాష్ట్రాలు విద్యా, సాంకేతికతలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులను గుర్తించి వారికి అంతర్జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రకటిస్తోంది. అందులో భాగంగానే ఈ ఏడాదికి సంబంధించి తెర్లాం హైస్కూల్లో ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు బోధిస్తున్న సునీల్కు అవార్డు వరించింది.ఈ నేపథ్యంలో ఏపీ స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్. విజయభాస్కరరావు, అనువాద ఏఐ సీఈఓ డాక్టర్ బి.చంద్రశేఖర్, ప్రముఖ అంతర్జాతీయ క్యాన్సర్ రీసెర్చ్ నిపుణుడు డాక్టర్ జి.పూర్ణచంద్ర నాగరాజు, యూనివర్సిటీ ఆఫ్ అలబామా ఎట్ బర్మింగ్హామ్ (అమెరికా) చేతుల మీదుగా సునీల్ అవార్డు అందుకున్నారు. దేశ వ్యాప్తంగా 80కి అవార్డులు రాగా.. అందులో ఒకరు జిల్లా వాసి కావడం గర్వకారణమని ఎంఈఓ త్రినాథరావు, తెర్లాం హైస్కూల్ హెచ్ఎం రమేష్, తదితరులు ప్రశంసించారు. -
బుచ్చి అప్పారావు సేవలు అమోఘం
గంట్యాడ: జిల్లాకు గొర్రి పాటి బుచ్చి అప్పారావు అందించిన సేవలు అమోఘమని రాష్ట్ర సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మండలంలోని తాటిపూడి గ్రామంలో స్వాతంత్య్ర సమరయోధుడు గొర్రిపాటి బుచ్చి అప్పారావు కాంస్య విగ్రహాన్ని సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాటిపూడి రిజర్వాయర్ (బుచ్చి అప్పారావు) జలా శయం నిర్మించేందుకు ఆయన శక్తివంచన లేకుండా కృషి చేశారన్నారు. ఆయన కృషివల్లే జామి, గంట్యాడ మండలాల్లో వేలాది ఎకరాలకు సాగునీరు అందుతోందన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ, కోళ్ల లలితకుమారి, ఆర్వీఎస్ఆర్కే రంగారావు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, కొప్పలవెలమ కార్పొరేషన్ చైర్మన్ పీవీజీ కుమార్, తూర్పుకాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్విని, డీసీఎంఎస్ చైర్మన్ గొంపకృష్ణ, బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు, జనసేన నాయకుడు సురేష్, తదితరులు పాల్గొన్నారు. -
యజమానే మా కొడుకును చంపేశాడు..
● మృతుడు యలకల రాము తల్లిదండ్రులుచీపురుపల్లి: తండ్రిలా చూసుకోవాల్సిన యజమానే తమ కొడుకును కిరాతకంగా హత్య చేసాడని మండలంలోని పత్తికాయవలస గ్రామానికి చెందిన ఇటీవల మృతి చెందిన యలకల రాము తల్లిదండ్రులు సింహాచలం, రమేష్ ఆరోపించారు. తమ కుమారుడిని యజమానే హత్య చేసాడని ఆలస్యంగా తెలుసుకున్న వారు సోమవారం ఫిర్యాదు చేసేందుకు స్థానిక పోలీస్ స్టేషన్కు వచ్చారు. ఈ సందర్భంగా మృతుని తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు పోలీస్స్టేషన్ వద్ద స్థానిక విలేకరులతో మాట్లాడారు. తమ కుమారుడు నాలుగు సంవత్సరాలుగా తమ గ్రామానికి చెందిన వండాన సన్యాసి వద్ద జేసీబీ డ్రైవర్గా పని చేస్తున్నాడని చెప్పారు. అయితే సకాలంలో జీతాలు కూడా ఇచ్చేవాడు కాదని.. అయినప్పటికీ ఒకే ఊరు కావడంతో ఆయన వద్దనే పని చేస్తుండేవాడని తెలిపారు. ఈ నెల 8న ఇంటి నుంచి విధులకు వెళ్లిన తమ కొడుకు రాము తిరిగి ఇంటికి చేరుకోలేదన్నారు. ఫోన్ చేసినా అవ్వకపోవడంతో యజమాని సన్యాసికి ఫోన్ చేసి చెప్పగా.. అప్పటికే విధులు ముగించుకుని వెళ్లిపోయాడని తెలిపాడని చెప్పారు. మరుచటి రోజు యజమాని సన్యాసి గ్రామంలో వేరేవారికి ఫోన్ చేసి రాము అలిగి వెళ్లిపోయాడని.. పదో తేదీన మరి కొంతమందితో భోగాపురం విమానాశ్రయం పనికి వెళ్లిపోయాడని పొంతన లేని సమాధానాలు చెప్పాడన్నారు. ఇంతలో 11వ తేదీన పుర్రేయవలస ఇటుక బట్టీల వద్ద ఉన్న బావిలో తమ కుమారుడు శవమై కనిపించాడని కన్నీరుమున్నీరయ్యారు. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతోనే సన్యాసి తమ కుమారుడ్ని హత్య చేశాడని ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడ్ని శిక్షించాలని కోరారు. -
నేషనల్ యూనివర్సిటీ గేమ్స్కు లావణ్య
చీపురుపల్లి: సౌత్ జోన్ నేషనల్ యూనివర్సిటీ కబడ్డీ పోటీలకు పట్టణంలోని ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం (బీకాం) చదువుతున్న డి.లావణ్య ఎంపికై ంది. ఈ నెల 11, 12 తేదీల్లో విశాఖపట్టణంలోని ఆంధ్రా యూనివర్సిటీలో నిర్వహించిన ఏయూ ఇంటర్ కాలేజ్ కబడ్డీ చాంపియన్షిప్ పోటీల్లో స్థానిక ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాల జట్టు ఉత్తమ ప్రతిభ కనబరిచింది. అయితే ఈ పోటీల్లో అద్భుతంగా రాణించిన లావణ్యను సౌత్ జోన్ నేషనల్ యూనివర్సిటీ గేమ్స్కు ఎంపిక చేశారు. దీంతో లావణ్యను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పీవీ కృష్ణాజీ, వైస్ ప్రిన్సిపాల్ ఎం.రమేష్కుమార్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ కె.జ్వాలాముఖి, సిబ్బంది అభినందించారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు ఇంటర్వ్యూలు విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో డేటా ఏంట్రీ ఆపరేటర్ పోస్టులకు సోమవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. పది పోస్టులకు గాను 250 మంది హాజరుకాగా..ఆస్పత్రి ఆఫీస్ సూపరింటిండెంట్ నారాయణరావు, ఇతర సిబ్బంది ఇంటర్వ్యూలు చేపట్టారు. -
సత్తా చాటిన జిల్లా స్విమ్మర్స్
విజయనగరం: పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఏలూరు వేదికగా నిర్వహించిన 7వ రాష్ట్ర పారా స్విమ్మింగ్ చాంపియన్షిప్ – 2025 పోటీల్లో జిల్లాకు చెందిన పారా స్విమ్మర్స్ ప్రతిభ కనబరిచారని అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు కె. దయానంద్ తెలిపారు. ఏలూరులోని బిశ్వనాథ్ ఈత కొలనులో నిర్వహించిన ఈ పోటీల్లో సీనియర్ మెన్ కేటగిరీలో జాగరణ సత్యనారాయణ 50 మీటర్ల బెస్ట్ స్ట్రోక్ పోటీల్లో సిల్వర్ మెడల్.. 50 మీటర్ల ఫ్రీ స్టైల్ విభాగంలో సిల్వర్ మెడల్ దక్కించుకున్నాడని తెలిపారు. సబ్ జూనియర్ ఉమెన్ విభాగంలో ప్రియాంకదాస్ బెస్ట్ స్ట్రోక్లో.. మౌనిక 50 మీటర్ల ఫ్రీ స్టైల్ పోటీల్లో సిల్వర్ మెడల్స్ సాధించారన్నారు. ఈ మేరకు విజేతలను ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వి. రామస్వామిలతో కలిసి సోమవారం ఆయన ప్రత్యేకంగా అభినందించారు. -
15 నుంచి నిరవధిక సమ్మె
● విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లక్ష్మణ్ విజయనగరం ఫోర్ట్: విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ట్రాన్స్కో యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి అవలింభిస్తోందని, దీనికి నిరసనగా ఈనెల 15వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్టు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ సురగాల లక్ష్మణ్ తెలిపారు. విజయనగరం జేఏసీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 13వ తేదీన చలో విజయవాడ మహాధర్నాకు విజయవాడ, పార్వతీపురం మన్యం సర్కిల్ నుంచి వందలాది మంది సామూహిక సెలవులు పెట్టి బయలు దేరుతున్నట్టు వెల్లడించారు. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం స్పందించడంలేదని, గత్యంతరం లేని పరిస్థితుల్లో 14వ తేదీన వర్క్ టు రూల్, 15న సమ్మెకు సిద్ధమవుతున్నట్టు స్పష్టంచేశారు. సమావేశంలో విద్యుత్ జేఏసీ నాయకులు బంగారు రాజేష్కుమార్, పప్పల అప్పలస్వామినాయుడు, నిర్మలమూర్తి, ఆర్.అప్పలనాయుడు, సత్యనారాయణ, సీతారామరాజు, తదితరులు పాల్గొన్నారు. మేకల కాపరి హత్య ● పంట పొలంలో మేకలు దిగాయని కాపరిపై కర్రతో దాడి ● ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కాపరి మృతి కురుపాం: వరి పంట పొలంలోకి మేకలు దిగాయన్న కోపంతో ఓ వ్యక్తి మేకల కాపరి తలవెనుక భాగంపై కర్రతో కొట్టగా కాపరి మృతి చెందిన ఘటన కురుపాం మండల కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కురుపాం మండలం హుకుంపేట సమీపంలో రాయగడ నల్లన్నదొరకు చెందిన వరి పంట పొలం ఉంది. పంట పొలం గట్ల మీదకు మేదరవీధికి చెందిన పిల్లి రాములు(58) మేకలు ప్రవేశించాయి. వెంటనే మేకల కాపరి రాములు వాటిని బయటకు తరలించేలోపే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ కోపంలో చేతిలో ఉన్న కర్రతో రాయగడ నల్లన్నదొర కాపరి రాములు తల వెనుకభాగంలో గట్టిగా కొట్టాడు. దీంతో రాములు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు వెంటనే సైకిల్పై రాములును స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కురుపాం ఎస్సై నారాయణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాములోరికి స్వర నీరాజనం నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో సింగర్ సాయి వేద వాగ్దేవి శనివారం సందడి చేసింది. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆశీర్వచన మండపంలో పలు భక్తి గీతాలను పాడి స్వామివారికి స్వర నీరాజనం సమర్పించింది. చిన్నారి పాడిన భక్తి గీతాలు భక్తులను ముగ్దులను చేశాయి. తన పాపకు గతంలో మాటలు వచ్చేవి కావని, రామతీర్థం సీతారామస్వామికి మూడుసార్లు మొక్కు చెల్లించుకున్న అనంతరం కొద్ది రోజుల్లోనే మాటలు వచ్చాయంటూ తల్లి సంతోషం వ్యక్తం చేశారు. స్వామివారి ఆశీస్సులతోనే సింగర్గా రాణిస్తోందని తెలిపారు. -
‘మత్తు’వదిలించేందుకు కదలిరండి
● గంజాయి, మద్యం అమ్మకాలపై ఐద్వా ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ విజయనగరం గంటస్తంభం: కూటమి ప్రభుత్వ మద్యం ‘మత్తు’పై పోరుబాటకు కదలిరావాలని ఐద్వా నాయకులకు పిలుపునిచ్చారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) 16వ రాష్ట్ర మహాసభలను పురస్కరించుకుని మద్యం, డ్రగ్స్, గంజాయి అమ్మకాలు నిషేధించాలంటూ ఎల్బీజీ నగర్, వినాయక నగర్లో శనివారం ర్యాలీ నిర్వహించారు. ఐద్వా జిల్లా కార్యదర్మి పి.రమణమ్మ మాట్లాడుతూ గంజాయి పీల్చి గల్లీలో పడిపోతే గృహశాంతి ఎగిరిపోతుందని, మద్యం తాగి భర్త చనిపోతే భార్య విధవ అవుతుందని... ప్రభుత్వం మాత్రం రెవెన్యూ రాగం వినిపిస్తోందంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. జిల్లాలో బెల్ట్షాపుల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయన్నారు. ఈ మత్తు మయమైన సమాజం నుంచి మహిళలను రక్షించాల్సిన సమయం వచ్చిందన్నారు. అనంతపురం వేదికగా సాగే మహాసభల్లో మద్యం, డ్రగ్స్, గంజాయి వ్యాపారానికి వ్యతిరేకంగా పోరాట కార్యాచరణకు రూపురేఖలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా కమిటీ సభ్యులు పుణ్యవతి, రామలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
తెప్పోత్సవానికి సర్వం సిద్ధం
● సోమవారం ట్రయల్ రన్ ● మంగళవారం సాయంత్రం పెద్దచెరువులో పైడితల్లి తెప్పోత్సవం పైడితల్లి తెప్పోత్సవానికి సిద్ధం చేసిన హంసవాహనం విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవానికి సర్వం సిద్ధం చేసినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి కె.శిరీష తెలిపారు. ఆలయ సిబ్బందితో కలిసి తెప్పోత్సవం ఏర్పాట్లను శనివారం పర్యవేక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెప్పోత్సవానికి తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పోలీస్, ఫిషరీస్, మున్సిపాలిటీ, ఫైర్ తదితర శాఖల సమన్వయంతో ఉత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించేలా చూస్తున్నట్టు వెల్లడించారు. సోమవారం ఉదయం ట్రయల్ రన్ నిర్వహిస్తామని తెలిపారు. 14న మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి రైల్వేస్టేషన్ వద్దనున్న వనంగుడిలో వేదపండితుల వేదమంత్రోచ్ఛారణలతో వేదస్వస్థ ఉంటుందని చెప్పారు. అనంతరం స్తపన మందిరంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు ఉంటాయని తెలిపారు. సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, వేదపండితుల సహకారంతో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పట్టుకుని ఆలయం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేసి ఆలయం బయట పుష్పాలంకరణలో సిద్ధం చేసిన రథంపై ఆశీనులు చేస్తారన్నారు. అక్కడ నుంచి భాజాభజంత్రీలతో సున్నంబట్టీవీధి మీదుగా పెద్దచెరువు వద్దకు తీసుకువచ్చి అమ్మవారిని హంసవాహనంపై ఊరేగింపు చేస్తామన్నారు. సాయంత్రం 5 గంటల నుంచి అమ్మవారు హంసవాహనంపై పెద్దచెరువులో మూడుసార్లు విహరిస్తారని తెలిపారు. హంసవాహనంలో 20మందికే అవకాశం అమ్మవారు విహరించే హంసవాహనంలో 20మందికే అవకాశం ఉంటుందని, మిగతావారి కోసం ప్రత్యేక బోట్లను ఏర్పాటుచేశామని ఇన్చార్జి ఈఓ కె.శిరీష తెలిపారు. 30 మంది వరకూ గజఈతగాళ్లు హంసవాహనం చుట్టూ తెప్పలపై ఉంటారన్నారు. ఫైర్ సిబ్బంది లైఫ్ జాకెట్లు, హస్కా లైట్లను ఏర్పాటుచేస్తారని తెలిపారు. భారీ ఎత్తున బాణాసంచా పేల్చేందుకు నిపుణులను ఏర్పాటుచేశామన్నారు. భక్తులందరూ తెప్పోత్సవంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. -
పాటలే పోరాటాలకు స్ఫూర్తి
● రాష్ట్ర స్థాయి కళాజాత శిక్షణ ప్రారంభం విజయనగరం అర్బన్: పాట.. మనిషి జీవనానికి గమనం.. పోరాటాలకు స్ఫూర్తి అని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.విశ్వనాథ్ అన్నారు. స్థానిక గురజాడ స్కూల్లో జనవిజ్ఞాన వేదిక రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి కళాజాత శిక్షణ తరగతులను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనం గురించి పనిచేసే సామాజిక సంస్థ జనవిజ్ఞాన వేదిక అని, చైతన్య రహితంగా నిరక్షరాస్యులుగా ఉన్న జనాన్ని చైతన్య పరచడానికే కార్యక్రమాలను రూపొందిస్తుందని తెలిపారు. జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఎంవీఆర్ కృష్ణాజీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎ.పృద్వీ, సాంస్కృతిక విభాగం రాష్ట్ర కన్వీనర్ గండ్రేటి శ్రీనివాసరావు, హరేరాం, గాంధీ, జానీ, గండ్రేటి లక్షణరావు, గండ్రేటి అప్పలనాయుడు, ఎ.వి.రాజశేఖర్, జిల్లా అధ్యక్షుడు ఆనంద్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ హెచ్కృష్ణారావు, జిల్లా కోశాధికారి ఎస్.శివాజీ, ఉత్తరాంధ్ర జనవిజ్ఞాన వేదిక కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఎయిర్పోర్టు పనుల పరిశీలన
పూసపాటిరేగ: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను ఇండస్ట్రీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.డి.కృష్ణబాబు ఏిపీఏడీసీఎల్ ఎం.డి.ప్రవీణ్, కలెక్టర్ రామసుందర్రెడ్డితో కలిసి శనివారం పరిశీలించారు. ట్రంపెట్ బ్రిడ్జి, విమానశ్రయానికి వెళ్లే అప్రోచ్రోడ్డు, ఎయిర్పోర్టు టెర్మినల్, రన్వేను పరిశీలించారు. నిర్మాణాలపై ఆరా తీశారు. మ్యాపును పరిశీలించారు. టెర్మినల్ భవనం మూడు అంతస్తులను తనిఖీ చేశారు. అనంతరం ఎయిర్పోర్టు కార్యాలయం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎయిర్పోర్టుకు నీటి సరఫరా, విద్యుత్, వర్షపునీరు వెళ్లే మార్గాలు, మిగిలిన భూసేకరణ, పరిహారం చెల్లింపులు, న్యాయ సంబంధిత అంశాలను అధికారులను అడిగితెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరించి నిర్ణీత సమయంలో విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ ఎస్.సేతుమాధవన్, ఆర్డీఓ దాట్ల కీర్తి, ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ లక్ష్మణరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కవిత, ఆర్అండ్బీ ఎస్ఈ కాంతిమతి, పీఆర్ ఎస్ఈ శ్రీనివాసరావు, తహసీల్దార్ ఎం.రమణమ్మ, జీఎంఆర్ ఎయిర్పోర్టు సీఈఓ కన్వర్బీర్సింగ్ కలరా, ప్రాజెక్టు హెడ్ బీహెచ్ రామరాజు, సీడీఓ ఎం. కోటేశ్వరరావుతో పాటు ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
‘బుచ్చి అప్పారావు’ విగ్రహం ఏర్పాటులో రాజకీయం..!
● విగ్రహావిష్కరణలో విభేదాలు, వసూళ్ల వివాదం విజయనగరం అర్బన్: స్వాతంత్య్ర సమరయోధుడు గొర్రిపాటి బుచ్చి అప్పారావు పేరుతో గంట్యాడ మండలంలోని తాడిపూడి రిజర్వాయర్ ప్రాంతంలో సోమవారం జరుగనున్న విగ్రహ ఆవిష్కరణ రాజకీయ రంగుదాల్చింది. తూర్పు కాపు–కొప్పుల వెలమ సంఘాల మధ్య విభేదాలు, పాత ప్రభుత్వాల నిర్ణయాలపై కొత్త పాలకుల వైఖరి, చందాల వసూళ్ల వివాదం ఈ కార్యక్రమాన్ని చర్చనీయాంశంగా మర్చాయి. స్వాతంత్య్ర సమరయోధుడి స్ఫూర్తి చుట్టూ రాజకీయ లెక్కలు, సంఘాల విఽభేదాలు, చందాల వసూళ్లు వెరసి ఈ కార్యక్రమాన్ని వివాదాస్పదం చేశాయి. వైఎస్సార్సీపీ పాలనలో మొదలైన ప్రణాళిక వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో తాడిపూడి రిజర్వాయర్కు గొర్రిపాటి బుబ్బి అప్పారావు పేరు పెట్టాలన్న ప్రతిపాదన కొప్పుల వెలమ సంక్షేమ సంఘం జిల్లా కమిటీ తరఫున జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు సమర్పించగా ఆ వినతిని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఆమోదించి ప్రత్యేక జీఓ జారీ చేసింది. సంఘం జిల్లా కమిటీ కోరిన మేరకు మాజీ ఎమ్మెల్సీ బొత్స అప్పలనరసయ్య ఆర్థిక సహకారంతో దాదాపు రూ.10 లక్షల వ్యయంతో బుచ్చి అప్పారావు విగ్రహాన్ని తయారు చేశారు. విగ్రహానికి స్థలాన్ని కూడా గత ప్రభుత్వం ఎంపిక చేసి ఇచ్చింది. ఆ స్థలంలో సంఘం ప్రతినిధులు శంకుస్థాపన పూర్తి చేశారు. ఎన్నికల అనంతరం పాలకపక్షం మారింది. కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వ కాపు నేతలు విగ్రహస్థాపన ప్రయత్నాన్ని జరగనీయలేదు సరికదా ఆ జీఓను రద్దు చేయించారు. కొప్పుల వెలమ సంఘం గత నలభై ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ పాలనలో పలుమార్లు వినతులు సమర్పించినా ఏనాడూ స్పందన రాలేదు. అదే కులానికి చెందిన అయ్యన్న పాత్రుడు మంత్రిగా ఉన్న సమయంలో కూడా ఈ డిమాండ్ పట్టించుకోలేదని సంఘం నాయకులు చెబుతున్నారు. ఇలాంటి నేపధ్యంలో జిల్లా ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతను ఎదుర్కోలేక చివరికి కూటమి ప్రభుత్వానికి మళ్లీ కొత్త జీఓ జారీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మరో విగ్రహం–మరో కథ కూటమి ప్రభుత్వం వచ్చాక మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ వ్యవహారంలో కలుగచేసుకుని కొత్త విగ్రహం తయారు చేయించే ప్రతిపాదన తెచ్చారు. అయితే తొలి నుంచి తమ కులానికి చెందిన సమరయోధుడిగా ఆరాధిస్తూ తాడిపూడి రిజర్యాయర్కు ఆయన పేరు పెట్టాలని పట్టుపడుతూ ఆయన విగ్రహాన్ని పెట్టాలని కృషి చేసిన కొప్పుల వెలమ సంక్షేమ సంఘాన్ని పక్కను పెట్టి తెలుగుదేశం పార్టీలో స్థానిక మరో కులం తూర్పుకాపు నాయకుల కార్యక్రమంగా తీసుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త విగ్రహం పేరుతో చందాల వసూలు కొప్పుల వెలమ సంఘం రూ.10 లక్షల వ్యయంతో సిద్ధం చేసిన విగ్రహాన్ని కాదని కొత్త విగ్రహం ఆవిష్కరణ పేరుతో ప్రజల నుంచి వసూళ్ల దందాకు తెరలేపారు. తాడిపూడి రిజర్వాయర్ పరిధిలోని గంట్యాడ, జామి మండలాల గ్రామ ప్రజలు, ఉద్యోగుల నుంచి భారీగా చందాలను బహిరంగంగానే వసూలు చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామాల వారీగా రూ.2లక్షల నుంచి రూ.5 లక్షలు టార్గెట్ ఇచ్చి వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. పలు గ్రామాల్లో ఈ వసూళ్లపై ప్రజల నుంచి ఆగ్రహం ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. -
ఆహ్లాదం మాటున విషాదం
ఆడలి వ్యూపాయింట్ పరిస్థితి ఇది.. ఆడలి వ్యూ పాయింట్ను అన్ని విధాలా తీర్చిదిద్దారు. సీతంపేట– పాలకొండ మధ్య ఉన్న కుశిమి జంక్షన్ నుంచి 6 కిలోమీటర్ల మేర సాగే ప్రయాణంలో దారి మధ్యమధ్యలో వచ్చే ప్రతి మలుపులో ప్రకృతి అందాలు అటువైపుగా వెళ్లే వారిని కట్టిపడేస్తాయి. ఇక వ్యూపాయింట్ వద్దకు వెళ్లే సరికి మంచుపొరలు, చల్లనిగాలి వంటి రమణీయత ఆహ్లాదాన్ని పంచుతాయి. ఘాట్రోడ్లో ఉండే మలుపులే సందర్శకులను భయపెడుతున్నాయి. ఇటీవల ఆడలి వ్యూపాయింట్ వద్ద ఉన్న రక్షణగోడకు ఉన్న బండరాళ్లు పక్కనే ఉన్న క్యాంటీన్పై పడిపోగా క్యాంటీన్లో ఉన్న నలుగురు వ్యక్తులు పరుగులంకించారు. తాజాగా సీతంపేట ఏజెన్సీలో పర్యటించి నూతన కలెక్టర్ ప్రభాకర్రెడ్డి ఆడలి వ్యూపాయింట్ను సందర్శించారు. ఇక్కడ ఎకోటూరిజంగా తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.సీతంపేట: మరో పక్షం రోజుల్లో పిక్నిక్ల సీజన్ ఆరంభం కానుంది. ఈ సమయంలో పర్యాటకులు అప్రమత్తంగా లేకపోతే ప్రమాదాలు సంభవించే ఆస్కారం ఉంది. ముఖ్యంగా పర్యాటకులను కట్టిపడేసే అందమైన వ్యూపాయింట్లు చూడడానికి సీతంపేట ఏజెన్సీకి వస్తున్న టూరిస్టులు జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదం పొంచి ఉంటుంది. జగతపల్లి వ్యూపాయింట్కు వెళ్లే మార్గంలో జగతపల్లి మలుపు వద్ద ఇప్పటి వరకు ఇద్దరు, ఆడలి వ్యూపాయింట్ మార్గంలోని వెల్లంగూడ సమీపంలో మలుపుల వద్ద నలుగురు మృతిచెందారు. ఆరుగురు మృతిచెందగా 30 నుంచి 40 మంది వరకు క్షతగాత్రులై ఆస్పత్రి పాలయ్యారు. పర్యాటకుల ప్రాణాలు ఘాట్రోడ్లు హరిస్తుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. జగతపల్లి వ్యూపాయింట్ను పరిశీలిస్తే.. సీతంపేట ఏజెన్సీలో సుమారు రూ.7 కోట్ల అంచనా వ్యయంతో జగతపల్లి వ్యూ పాయింట్ను అభివృద్ధి చేయదలిచారు. వాటిలో ఇప్పటి వరకు వ్యూపాయింట్ నిర్మించారు. ఇంకా రిసార్ట్ పనులు పూర్తిస్థాయిలో జరగలేదు. ఇక్కడి నుంచి చూస్తే ఏజెన్సీలో పలు గ్రామాలు, పచ్చని కొండలు, ఎంతో అందంగా కనిపిస్తాయి. ఇక్కడి వ్యూ పాయింట్కు సీతంపేట నుంచి దోనుబాయి రోడ్డుకు వెళ్లే మార్గంలో దేవనాపురం మీదుగా జగతపల్లి వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో ఆ రోడ్డులో పెద్ద పెద్ద మలుపులు ఉన్నాయి. మలుపులు దాటుకుంటూ వెళ్లాలి. ప్రస్తుతం ఆడలి అంత ప్రాచుర్యం జగతపల్లికి లేదని చెప్పవచ్చు. దీనికి ప్రధాన కారణం ఇంకా ఐటీడీఏ ఆధ్వర్యంలో పర్యాటక పరంగా నిర్వహించడం లేదు. టిక్కెట్ల ధరలు, ఫొటోషూటింగ్, క్యాంటీన్ల వంటివి ఏర్పాటు చేయలేదు. అప్పుడప్పుడు పర్యాటకులు వచ్చి వెళ్తుంటారు. కొన్నాళ్లుగా జరిగిన ప్రమాదాలను పరిశీలిస్తే.. జగతపల్లి వ్యూపాయింట్ నుంచి తిరిగి వస్తుండగా ద్విచక్రవాహనం అదుపుతప్పి మూడేళ్ల క్రితం ఏఆర్ కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతిచెందారు. కొద్దిరోజుల కిందట పాలకొండకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి సాయికృష్ణ ఇదే ఘాట్రోడ్లో ద్విచక్రవాహనం స్కిడ్ అయి మృతిచెందారు. ఇక ఆడలిలో 8నెలల కిందట పాలకొండలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన భారతి తన భర్త, పిల్లలతో కలిసి వ్యూపాయింట్ అందాలు చూసి ఇంటికి వెళ్తుండగా వెల్లంగూడ మలుపు వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడిపోయింది. ఈఘటనలో ఆమె మృతిచెందగా మిగతా వారికి గాయాలయ్యాయి. అ ఘటన మరువకముందే శ్రీకాకుళానికి చెందిన ఓ కుటుంబం ఆటోలో అడలి వ్యూపాయింట్కు వెళ్లి మార్గమధ్యంలోని మలుపువద్ద అక్కడి లోయలోకి అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో సుమారు 10 మంది గాయపడ్డారు. అప్పటికి కొద్దిరోజుల్లోనే పిక్నిక్కు వెళ్లిన మరో కుటుంబం సవర గొయిది సమీపంలో డౌన్ దిగుతుండగా పక్కన ఉన్న గట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. అనంతరం ఆడలి వ్యూ పాయింట్ నుంచి దిగి వస్తున్న ఆటోను దాని వెనుక నుంచి వస్తున్న మరో ఆటో ఢీకొట్టగా ముందు ఆటో చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. వారిలో బూర్జమండలం కురుంపేటకు చెందిన బొడ్డు యశోదమ్మ, వెల్లంగూడకు చెందిన సవర రెల్లయ్య మృతిచెందారు. అలాగే మే 20న సీతంపేటకు చెందిన గిరజాల వేణుమాధవ్ వెల్లంగూడ మలుపు వద్దకి వచ్చేసరికి ద్విచక్రవాహనం అదుతప్పి లోయలో పడడంతో మృతిచెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పక్షం రోజుల్లో ప్రారంభం కానున్న పిక్నిక్లు పర్యాటకులు అప్రమత్తంగా లేకపోతే ప్రమాదమే ఘాట్రోడ్లలో మలుపుల వద్ద ప్రమాదాలు అవగాహన కల్పిస్తున్నా పట్టించుకోని పర్యాటకులుఅవగాహన కల్పించినా కానరాని ఫలితం పోలీసుల ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఘాట్ రోడ్లలో జరిగే ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని, హెల్మెట్ ధరించాలని, ట్రిపుల్ రైడింగ్ వద్దని సూచించినా కొందరు టూరిస్టులు అవేవీ పట్టించుకోకుండా వ్యవహరించడం మూలాన ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఆడలి వ్యూపాయింట్కు వెళ్లే మార్గంలో రూ.కోటి వ్యయంతో మలుపుల వద్ద రక్షణ గోడలు నిర్మిస్తున్నారు. హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. జాగ్రత్తలు తప్పనిసరి వ్యూపాయింట్లకు వెళ్లే పర్యాటకులు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ద్విచక్రవాహనాలపై వెళ్లేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదముంది. ఘాట్రోడ్లో వాహనాలతో దిగేటప్పుడు జాగ్రత్త వహించాలి. న్యూట్రల్లో కాకుండా గేర్లో రావాలి. ఆడలి, జగతపల్లి వైపు వెల్లే పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలి. వై.అమ్మన్నరావు, ఎస్సై, సీతంపేట


