Vizianagaram District News
-
రాజకీయ కక్షతోనే...
రాజకీయ కక్షతో ఉద్యోగుల తొలగింపునకు పూనుకోవడం మంత్రి సంధ్యారాణికి తగదని మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర అన్నారు. పీటీజీకి చెందిన కరాసవలస కేజీబీవీ ప్రత్యేకాధికారి, బోధనేతర సిబ్బందితో పాటు నియోజకవర్గంలో పలువురు ఉద్యోగులను కక్ష పూరితంగా తొలగించారని పేర్కొన్నారు. ఎన్నేళ్లు పాలించినా తనెప్పుడూ ఉద్యోగులపై కక్షసాధింపు చర్యలకు పూనుకోలేదన్నారు. జీఓ 3 పునరుద్ధరణ, ఆశ్రమపాఠశాలల్లో ఏఎన్ఎంల నియామకం, పట్టణంలో సామాజిక మరుగుదొడ్ల నిర్మాణం తదితర హామీలను ఇచ్చిన మంత్రి నేటికీ అమలుచేయకపోవడం విచారకరమన్నారు. గిరిజనులను మంత్రి సంధ్యారాణి మోసం చేస్తున్నారని విమర్శించారు. యువతకు నిరుద్యోగ భృతి, మహిళలకు అడబిడ్డ నిధి అందని ద్రాక్షగా మారిందన్నారు. రెండేళ్లలోనే లక్షల కోట్ల రూపాయల అప్పులతో రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మారుస్తున్న చంద్రబాబు ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనను ప్రజలకు వివరించాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. త్వరలో నియోజకవర్గంలోని ప్రతిగ్రామాన్ని సందర్శిస్తానని చెప్పారు. -
నమ్మించడం.. నట్టేట ముంచడం సీఎం చంద్రబాబుకు అలవాటైన విద్య అన్నది తరచూ రాజకీయ విశ్లేషకులు చెప్పేమాట. రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, వ్యాపారులు... ఇలా ఎవరన్నది అనవసరం. అవసరం తీరాక మొఖంచాటేయడమే ఆయనకు తెలిసిన రాజకీయ తంత్రం. ఇప్పుడు వివి
‘విజయనగరం మండలానికి చెందిన ఒక ఆటో డ్రైవర్ కొత్త వాహనం కొనుగోలుకు బీసీ కార్పొరేషన్ అందజేసే రాయితీ రుణానికి దరఖాస్తు చేసుకున్నాడు. అవసరమైన అన్ని ధ్రువపత్రాలు సమర్పించి ఏడాది దాటినా... ఇప్పటి వరకు రుణం మంజూరు కాలేదు. ఈయన ఒక్కరే కాదు... ఉమ్మడి విజయనగరం జిల్లాలో దరఖాస్తు చేసుకున్న అందరి పరిస్థితి ఇదే.’ విజయనగరం అర్బన్: పేద, మధ్యతరగతి వర్గాల స్వయం ఉపాధికి ఊతమివ్వాలనే ఉద్దేశంతో ఏర్పాటుచేసిన బీసీ, ఎస్సీ, ఈబీసీ, మైనార్టీ కార్పొరేషన్లు ప్రభుత్వం తీరుతో పూర్తిగా నిర్వీర్యమవుతున్నాయి. రాయితీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వేలాదిమంది అభ్యర్థులకు రుణాలు మంజూరు కావడం లేదు. ఏడాదికి పైగా ఎదురుచూపులే మిగులుతున్నాయి. ఇప్పటివరకు ఒక్కయూనిట్ కూడా మంజూరు కాకపోవడం తీవ్ర నిరాశ కలిగిస్తోంది. రుణాలు సకాలంలో మంజూరుకాకపోవడంతో స్వయం ఉపాధికి గండిపడుతోంది. ● 49 వేల దరఖాస్తులు.. వివిధ కార్పొరేషన్ల ద్వారా మొత్తం 5,863 యూ నిట్లు మంజూరు చేయాలని నిర్ణయించినప్పటికీ... 49 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అభ్య ర్ధులకు మౌఖిక పరీక్షలు కూడా నిర్వహించారు. కానీ క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత యూనిట్ల మంజూరు చేయాల్సిన ప్రక్రియ ఆగిపోయింది. బీసీ కార్పొరేషన్ ద్వారా యూనిట్ విలువలో 40 నుంచి 50 శాతం వరకు రాయితీ రుణాలు అందిస్తామని ప్రకటించిన ప్రభుత్వం... ఇప్పటి వరకు నిధులు విడుదల చేయకపోవడంతో బ్యాంకర్లు కూడా ముందుకు రావడం లేదని సమాచారం. దీంతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్పొరేషన్ల ప్రకటనలకే పరిమితం గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీఓలు, పట్టణాల్లో కమిషనర్ల ఆధ్వర్యంలో దరఖాస్తులు స్వీకరించి, ఇంటర్వ్యూలు నిర్వహించినప్పటికీ ఆ తర్వాత ఎలాంటి పురోగతి లేకపోవడం అధికార యంత్రాంగం నిర్లక్ష్యాన్ని బయటపెడుతోంది. స్వయం ఉపాధి కల్పిస్తామని పాలకులు చెప్పిన హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి. కార్పొరేషన్ల రుణాలు కాగితాలకే పరిమితం ఏడాది నుంచి లబ్ధిదారుల ఎదురు చూపులు స్వయం ఉపాధికి గండి రాయితీ నిధులే రాక... బ్యాంకులు వెనుకంజ -
పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి
● నేటి నుంచి మే 20వ తేదీ వరకు వివిధ పరీక్షలు విజయనగరం అర్బన్: జిల్లాలో నిర్వహించబోయే వివిధ కామన్ ఎంట్రెన్స్ టెస్టులు పటిష్టంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) సీహెచ్ సత్తిబాబు ఆదేశించారు. తన చాంబర్లో వివిధ శాఖల ప్రతినిధులు, కళాశాలల నిర్వాహకులతో పరీక్షల నిర్వహణపై బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా జరగాలని సూచించారు. జిల్లాలోని లెండి, అవంతి, ఎంవీజీఆర్, సీతం ఇంజినీరింగ్ కళాశాలతో పాటు అయాన్ డిజిటల్ కేంద్రాల్లో ఈ నెల 23 నుంచి మే 20 వరకు వివిధ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. గురువారం ఏపీ ఈసెట్, ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు ఏపీ పీజీఈసెట్, మే 2న ఏపీఐసెట్, 4న పీజీ లాసెట్, 8న ఏపీ ఎడ్సెట్, 8 నుంచి 11 వరకు ఏపీ ఈఏపీసెట్ (ఇంజినీరింగ్), 19 నుంచి 20వ తేదీ వరకు ఏపీ ఈఏపీసెట్ (అగ్రికల్చర్, ఫార్మసీ) జరగనున్నవి. పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 అమలు చేయాలని, విద్యార్థులకు తాగునీరు, పారిశుద్ధ్యం, నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు, పరీక్ష కేంద్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆరు కేంద్రాల్లో నీట్ జిల్లాలోని ఆరు కేంద్రాల్లో ఈనెల 3న నీట్ పరీక్ష నిర్వహించనున్నట్టు డీఆర్వో సీహెచ్ సత్తిబాబు తెలిపారు. పరీక్షకు పక్కాఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలని సూచించారు. పరీక్ష కేంద్రంలోకి కేవలం రైటింగ్ ప్యాడ్, ఐడీ ప్రూఫ్, పారదర్శక నీటి బాటిల్ మాత్రమే తీసుకురావాలన్నారు. సమావేశంలో విద్యుత్శాఖ ఎస్ఈ లక్ష్మణరావు, డీఈఓ మాణిక్యంనాయుడు, ప్రజా రవాణాఅధికారి జి.వరలక్ష్మి, కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ దిలీప్ మోదీ, తదితరులు పాల్గొన్నారు. -
అప్పుల కుప్పలు.. అభివృద్ధికి తిప్పలు
సాలూరు: చంద్రబాబు ప్రభుత్వం తీరు ‘అప్పులు కుప్పలు.. అభివృద్ధికి తిప్పలు’ అన్న చందంగా మారిందని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. సాలూరు పట్టణంలో వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఇటీవల పదవీ విరమణ పొందిన సర్పంచ్లను బుధవారం సన్మానించారు. కార్యక్రమానికి అరకు ఎంపీ గుమ్మ తనూజారాణి, వైఎస్సార్సీపీ జిల్లా రీజనల్ కో ఆర్డినేటర్ బూడి ముత్యాలునాయడులతో పాటు మజ్జి శ్రీనువాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో అప్పులు చేసి అవినీతికి పాల్పడడమే తప్ప అభివృద్ధి లేదని విమర్శించారు. సాలూరు నియోజకవర్గంలో రాజన్నదొర హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. గిరిజనుల ఆచారవ్యవహారాలు, సంప్రదాయాలను తుంగలో తొక్కుతూ, గిరిజనులను మంత్రి సంధ్యారాణి మోసం చేస్తున్నారని ఆరోపించారు. దోచుకుందామన్న రీతిలో మంత్రి వ్యవహార శైలి ఉందని విమర్శించారు. ప్రజల కష్టాలు గురించి మాట్లాడితే, తిరిగి నాకు జ్వరం వచ్చింది.. నన్నెవరు చూస్తారని బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం మంత్రికి తగదన్నారు. గత ప్రభుత్వంలో నిర్మించిన రోడ్లు, సచివాలయాల భవనాలు, ఆస్పత్రులు వంటి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేయడం తప్ప మంత్రి ఈ రెండేళ్ల పాలనలో కొత్తగా చేసిన అభివృద్ధి పనులు శూన్యమన్నారు. ఎంపీ గుమ్మ తనూజారాణి అరకు పార్లమెంట్ పరిధిలోని గిరిజనుల సమస్యలపై పార్లమెంట్లో ప్రస్తావిస్తూ, గిరిజనులకు మేలుచేసేందుకు కృషిచేస్తున్నారన్నారు. గిరిజన మంత్రి ఇక్కడి సమస్యలపై ఏనాడైనా అసెంబ్లీలో ప్రస్తావించారా అని ప్రశ్నించారు. రెండేళ్ల పాలనలో మంత్రి, ఆమె కుటుంబంపై వచ్చిన ఆరోపణలు అందరికీ తెలిసినవేనన్నారు. ప్రజ్యావతిరేక పాలన సాగిస్తున్న మంత్రిపై త్వరలోనే కూటమి నేతలే తిరుగుబాటు చేస్తారన్నారు. ● మొక్కజొన్న రైతులను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జెడ్పీ చైర్మన్ మండిపడ్డారు. యూరియా కోసం రైతులు పడిన అగచాట్లు ఇంకా ఎవ్వరూ మరిచిపోలేదన్నారు. ప్రజా సమస్యలను లెవనెత్తుతామనే భయంతో టీడీపీ ప్రజాప్రతినిధులు జెడ్పీ సమావేశాలకు రావడం లేదని విమర్శించారు. అధికారం కోల్పోయిన తరువాత పార్టీలోని పెద్ద నాయకులు పార్టీని వీడినా జగనన్న, రాజన్నదొర వెంట స్థానిక ప్రజాప్రతినిధులు ఉండడం గర్వంగా ఉందన్నారు. పదవీ విరమణ చేసినా ప్రజాసేవలో తరించాలని, ప్రజల సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ● వైఎస్సార్సీపీ జిల్లా రీజనల్ కో ఆర్డినేటర్ బూడి ముత్యాలునాయడు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు, 2029 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయదుందుభి మోగించి జగన్మోహన్రెడ్డిను ముఖ్యమంత్రిని చేసుకోవడమే లక్ష్యంగా పనిచేద్దామన్నారు. కార్యక్రమంలో తాజామాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజన్నదొర హయాంలోనే సాలూరు నియోజకవర్గ అభివృద్ధి గిరిజన సమస్యలను పట్టించుకోని మంత్రి ఆమైపె కూటమి నేతలే తిరుగుబాటు చేసేరోజు వస్తుంది జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఇటీవల పదవీకాలం పూర్తయిన సర్పంచ్లకు సన్మానం సర్పంచ్లతో విజయోత్సవ సభ నిర్వహిద్దాం వైఎస్సార్సీపీతో ఉంటూ.. జగనన్న, రాజన్న దొరల నాయకత్వంలో నడుస్తూ.. క్షేత్రస్థాయిలో ప్రజలకు అండగా నిలుస్తూ.. ప్రజలు ఆశీస్సు లు చూరగొంటున్న సర్పంచ్ల సేవలు అభినందనీయమని ఎంపీ గుమ్మ తనూజరాణి అన్నారు. సర్పంచ్ కుటుంబం నుంచి ఎంపీగా ఎదిగినట్టు పేర్కొన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో అందరూ మళ్లీ విజేతలుగా నిలిచి విజయోత్సవ సభ నిర్వహించుకుందామన్నారు. -
ఓరి ‘నాయనో’... వేధింపులు భరించలేం
బొబ్బిలిరూరల్: సహజవనరులను కాపాడాల్సిన ప్రజాప్రతినిధి.. ఇసుక దోపిడీకి ఊతమిస్తుండడం... ఇసుక తవ్వకాల్లో వాటాకోసం అక్రమార్కులకు అండగా నిలబడడం.. కళ్లముందరే వేగావతి నదిని గుల్లచేస్తున్నా పట్టనట్టు ఉండాలంటూ రెవెన్యూ అధికారులకు హుకుం జారీచేయడం.. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకోవద్దని.. పట్టుకున్నా విడిచిపెట్టాలంటూ ఆదేశాలివ్వడం బొబ్బిలిలోని రెవెన్యూ అధికారులకు తలనొప్పిగా మారింది. ఓరి ‘నాయనో’... ఆ వేధింపులు భరించలేమంటూ గగ్గోలు పెడుతున్నారు. బొబ్బిలి మండలంలోని పారాది, పెంట, అలజంగి, కారాడ గ్రామాల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు సాగుతున్నా ప్రజానిధి బెదిరింపులకు అటువైపు కన్నెత్తిచూసేందుకు భయపడుతున్నారు. విడిచిపెట్టేయండి... వేగావతి నదిలో ఇష్టారాజ్యంగా సాగుతున్న తవ్వకాలపై స్థానికులు అందించిన సమాచారం మేరకు రెవెన్యూ అధికారులు ఈ నెల 19న దాడులు చేశారు. ఆర్ఐ రామకుమార్ పారాది, అలజంగి వద్ద నిఘాపెట్టి ఇసుక అక్రమంగా తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను సీజ్ చేశారు. వాటిని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. వాటికి జరిమానా విధించేందుకు సిద్ధపడ్డారు. అక్రమ వ్యాపారులందరూ అధికార పార్టీకి చెందిన చోటానాయకులు కావడంతో స్థానిక నియోజకవర్గ ప్రజాప్రతినిధి వద్ద పంచాయితీ పెట్టారు. అంతే.. తమవారి ట్రాక్టర్లను వదిలేయా లని తహసీల్దార్ను ఆదేశించారు. దీనికి అధికారులు ససేమిరా అంటూ రూ.10వేలు చొప్పున అపరాధ రుసుం విధించాలని నిర్ణయించారు. అయితే, అందులో అలజంగికి చెందిన టీడీపీ చోటా నాయకుడి ట్రాక్టర్ను ఎలాంటి అపరాధ రుసుం లేకుండా విడిచిపెట్టాలని రెవెన్యూ అధికారులకు ప్రజాప్రతినిధి హుకుం జారీచేశారు. అధికారులు సాధ్యం పడదని చెబితే వారిపై ఓ దశలో తీవ్ర పదజాలంతో విరుచుకుపడినట్టు సమాచారం. తమ పార్టీ ముఖ్యనాయకుడని, ఇసుక అక్రమ వ్యాపారిగా చూడవద్దని, ఇప్పుడు కాకుంటే మరెప్పుడు కాసులు కూడబెడతారంటూ చిందులు తొక్కినట్టు తెలిసింది. చేసేదిలేక ఆ ట్రాక్టర్కు మినహాయించి మిగిలిన 4 ట్రాక్టర్లకు రూ.10 వేలు చొప్పున జరిమానా విధించి వదిలేయడం ఇప్పుడు బొబ్బిలిలో చర్చనీయాంశంగా మారింది. ఇదెక్కడి ‘రాజరిక’ పాలన అంటూ అధికారులు నివ్వెరపోతున్నారు. ఇసుక అక్రమతవ్వకాలతో కాసులను ‘కోట’కు చేర్చేందుకు ఎంతటికై నా దిగజారుతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇసుక అక్రమతరలింపునకు ప్రజాప్రతినిధి అండ! ట్రాక్టర్లను పట్టుకున్న రెవెన్యూ అధికారులకు చీవాట్లు విడిచిపెట్టేయాలంటూ హుకుం ప్రజాప్రతినిధి తీరుపై విమర్శల వర్షం -
పీ–4పై సమీక్ష
విజయనగరం అర్బన్: పీ–4 కార్యక్రమంపై కలెక్టరేట్ నుంచి వివిధ శాఖల అఽధికారులతో కలెక్టర్ రాంసుందర్రెడ్డి వీడియోకాన్ఫరెన్స్లో సమీక్షించారు. బంగారు కుటుంబాల దత్తత, నిధుల రీయింబర్స్మెంట్, జలధార కార్యక్రమాల పురోగతి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో 82,426 బంగారు కటుంబాలను గుర్తించగా ఇప్పటి వరకు 3,941 మంది మార్గదర్శులు 20,157 కుటుంబాలను దత్తత తీసుకున్నట్టు వెల్లడించారు. మిగిలిన కుటుంబాల దత్తతను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఎస్డీసీ, ఎంపీ ల్యాడ్స్ నుంచి వివిధ శాఖలకు సర్దుబాటు కింద అందజేసిన నిధులను ఆయా శాఖలు వెంటనే తిరిగి చెల్లించాలని ఆదేశించారు. జలధార, ఉపాధి హామీ పనుల తీరుపై ఆరా తీశారు. జీతం రికవరీ విజయనగరం ఫోర్ట్: ఎస్.కోట ఏరియా ఆస్పత్రిలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసిన ఓ వైద్యురాలు ఉద్యోగం చేస్తున్నట్టు జీతం తీసుకోవడం, మరోవైపు పీజీ చదువుతున్నట్టు స్టైఫండ్ తీసుకున్నారన్న అంశంపై ఈనెల 13వ తేదీన ‘వైద్యురాలి అత్యాస..!’ అనే శీర్షికన ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి వైద్య విధాన్ పరిషత్ అధికారులు స్పందించారు. దీనిపై ఇద్దరు అధికారులతో విచారణ జరిపారు. వైద్యురాలు చైతన్య స్రవంతితో ఉద్యోగం చేస్తున్నట్టు తీసుకున్న జీతంతోపాటు, పీజీ చదువుతున్నట్టు తీసుకున్న స్టైఫండ్ను రికవరీ చేసినట్టు డీసీహెచ్ఎస్ డాక్టర్ ఎన్.పద్మశ్రీరాణి బుధవారం తెలిపారు. వినియోగదారులతో మర్యాదగా మెలగాలి ● జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ విజయనగరం ఫోర్ట్: గ్యాస్ డెలవరీబాయ్స్ వినియోగదారులతో మర్యాదగా మెలగాలని జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ అన్నారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో బుధవారం పౌరసరఫరాల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రేషన్ దుకాణదారులు, గ్యాస్ డెలివరీ బాయ్స్ విని యోగదారులతో ఎల్లప్పుడూ సత్ప్రవర్తనతో మెలగాలని, వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిన వారికి సంబంధించి వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. భవిష్యత్తులో ప్రతికూల స్పందనలు వస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో డీఎస్ఓ మురిళీనాథ్ పాల్గొన్నారు. పార్వతీపురం: రెవెన్యూ సమస్యల పరిష్కారం విషయంలో అసంతృప్తిదారులతో ఈనెల 29న ముఖాముఖి సమావేశం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ముఖాముఖిలో పార్వతీ పురం, పాలకొండ సబ్ కలెక్టర్లు, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది అందుబాటులో ఉంటా రన్నారు. ముఖాముఖికి విచ్చేసే అర్జీదారులు గ్రీవెన్స్ రశీదు, ఎండార్స్మెంట్ కాపీని తీసుకు ని రావాలని సూచించారు. నేడు భగీరథ మహర్షి జయంతి భగీరథ మహర్షి జయంతి వేడుకలను గురువా రం కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలమేరకు జిల్లా యంత్రాంగం ఈ వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుందన్నారు. గురువారం ఉదయం 11 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని, కార్యక్ర మం విజయవంతం చేయాలని కోరారు. -
● న్యాయం చేసేవరకు పోరాటం
జిందాల్ నిర్వాసితులు సుమారు రెండు వందల రోజుల పాటు నిరాహార దీక్షలు చేశారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వానికి తమ గోడు వినిపించారు. సమస్యల పరిష్కారంపై అటు కేంద్రం, ఇటు రాష్ట్రప్రభుత్వం స్పందించకపోవడంతో బుధవారం మళ్లీ నిరాహార దీక్షలు ప్రారంభించారు. మేమంతా ఎస్సీ, ఎస్టీలకు చెందిన వారమని, తమ బతుకులుతో ఆడుకోవద్దని, తమ భూములు తమకు అప్పగించాలంటూ నినదించారు. న్యాయం చేసేవరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టంచేశారు. – శృంగవరపుకోట -
వైఎస్సార్సీపీ నాయకుల ఆత్మీయ కలయిక
విజయనగరం: విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుల ఆత్మీయకలయిక ప్రత్యేకతను సంతరించుకుంది. సాలూరు నియోజకవర్గంలో బుధవారం నిర్వహించిన సర్పంచ్ల సన్మాన కార్యక్రమానికి హాజరైన రీజనల్ కో ఆర్డినేటర్ బూడి ముత్యాలనాయుడు, అరకు పార్లమెంట్ సభ్యులు గుమ్మా తనూజరాణి బుధవారం ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఇంటికి విచ్చేశారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అంతకుముందు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.సూర్యనారాయణ రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శులు వర్రి నర్సింహమూర్తి, గొర్లె రవికుమార్, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు జైహింద్కుమార్ వారికి ఘన స్వాగతం పలికారు. -
మలుపు తిరుగుతున్న అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు
విజయనగరం క్రైమ్: విజయనగరం వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి పోర్ట్ సిటీ స్కూల్ సమీపంలో రెండు రోజుల క్రితం గుర్తించిన మృతదేహం ఎవరిది అన్నకోణంలో పోలీసులు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని జొన్నగుడ్డికి చెందిన పావాడ హరనాథ్ (24)గా గుర్తించిన పోలీసులు హరనాథ్ రౌడీషీటర్ అని విజయనగరం వన్ టౌన్, టూటౌన్ పీఎస్లలో పలు హత్య కేసులు ఉన్నాయని చెబుతున్నారు. కాగా బావిలో మృతదేహం ఉందని తెలుసుకున్న పోలీసులు బయటకు తీసి పోస్ట్ మార్టానికి తరలించగా హత్యగా తేలింది. ఈ మేరకు హత్య కేసు నమోదు చేసి విజయనగరం వన్ టౌన్ సీఐ చౌదరి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా తొలి రోజు ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.వారు ఇచ్చిన సమాచారంతో మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ వేగవంతం చేశారు. ఈ కేసుపై సీఐఆర్వీకే చౌదరి మాట్లాడుతూ పావాడ సంతోషి ఇచ్చిన ఫిర్యాదుతో తొలుత అదృశ్యం కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా బావిలో మృతదేహాన్ని గుర్తించామని పొస్ట్ మార్గం నివేదికలో హత్యగా తేలిందన్నారు. ఎస్పీ ఆదేశాలతో కేసు దర్యాప్తులో అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని సీఐ తెలిపారు. ఈ కేసును డీఎస్పీ దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల అదుపులో ఎనిమిది మంది -
ఎవరి టెంటు వారే వేసుకోవాలి..!
విజయనగరం ఫోర్ట్: అగ్నిగోళాన్ని తలపించేలా ఎండలు ఉన్నాయి. దీంతో ఇళ్లలోసైతం ఉండలేని పరిస్థితి. పొట్టకూటి కోసం ఎండతీవ్రతను సైతం భరిస్తూ ఉపాధి హామీ వేతనదారులు పనిచేస్తున్నారు. అయితే ఉపాధి హామీ వేతనదారులకు రక్షణ కల్పించడంలో టీడీపీ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎండవేడమి నుంచి ఉపశమనం పొందేందుకు అవసరమైన టెంట్లు సరఫరా చేయకుండా టీడీపీ సర్కార్ అలసత్వం వహించడం పట్ల వేతనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భానుడి ప్రతాపం ఎక్కువగా ఉండడం వల్ల ఉపాధి హామీ వేతనదారులు అల్లాడుతున్నారు. డ్వామా అధికారుల ఉచిత సలహా ఉపాధి హామీ పథకంలో పనిచేసే వేతనదారులకు ప్రభుత్వం నీడనిచ్చే టెంట్లు సరఫరా చేయలేదు. ఎవరి టెంట్లు వారే వేసుకోవాలని డ్వామా అధికారులు ఉచిత సలహా ఇస్తున్నారు. దీంతో గత్యంతరం లేక వేతనదారులు తాటి, కొబ్బరి కమ్మలతో టెంట్లు వేసుకుంటున్నారు. అయితే అవి వారికి పెద్దగా రక్షణ ఇవ్వడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టెంటు నీడలో కాసేపు విశ్రాంతి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే వేతనదారులు ఎటువంటి నీడలేని చెరువులు, కాలువులు వంటి ప్రదేశాల్లో పనిచేస్తారు. ఎండలో పనిచేయడం వల్ల త్వరగా అలసట చెందుతారు. అటువంటి వారికి కాసేపు విశ్రాంతి తీసుకోవడం కోసం టెంట్లు అవసరం. కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత వేతనదారులు పనులు చేయడానికి మళ్లీ వెళ్లుంటారు. అంతేకాకుండా టెంట్ల కింద మంచినీరు కూడా పెడతారు. అంతటి అత్యవసరమైన టెంట్లు సరఫరా చేయకుండా టీడీపీ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వడదెబ్బతో ఉపాధి వేతనదారు మృతి గంట్యాడ మండలం కొత్త వెలగాడ గ్రామంలో అదేగ్రామానికి చెందిన చౌడువాడ కన్నయ్యతాత అనే ఉపాధి వేతనదారు మంగళవారం చెరువులో పనిచేస్తూ ఎండ వేడమికి అస్వస్థతకు గురయ్యాడు. ఆస్పత్రికి తీసుకుని వెళ్లేందుకు సన్నద్ధయ్యేలోగా మృతిచెందాడు. అధిక ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్న ప్రస్తుతం తరుణంలో ఉపాధిహామీ వేతనదారులకు అన్ని విధాలా రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. విశ్రాంతి లేకుండా పనులు గతంలో ఉపాధి హామీ వేతనదారులకు వారంలో ఒక రోజు సెలవు ఉండేది. సోమవారం నుంచి శనివారం వరకు పనులు పెడితే ఆదివారం సెలవు ఉండేది. అయితే టీడీపీ సర్కార్ వేతనదారులకు ఒక్క రోజు కూడ విశ్రాంతి లేకుండా ఆదివారం కూడా పనులు పెడుతోంది. ఇది కూడా వేతనదారులకు కాస్త ఇబ్బంది కరమైన పరిస్థితే. జిల్లాలో సగటున రోజుకు 1.50 లక్షల మంది వరకు వేతనదారులు పనికి వెళ్తున్నారు. ఓఆర్ఎస్ వినియోగంపై అవగాహన కరువు వడదెబ్బకు గురికాకుండా రక్షణ ఇచ్చే ఓఆర్ఎస్ ద్రావణం ఏవిధంగా వినియోగించుకోవాలి అన్నదానిపై వేతనదారులకు అవగాహన కల్పించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల ఓఆర్ఎస్ ప్యాకెట్లు పెడుతున్నారు. కానీ ఆ ద్రావణం ఏవిధంగా నీళ్లలో కలిపి తాగాలి అనే దానిపై అవగాహన కల్పించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరి కొన్ని చోట్ల ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా అందించడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేతనదారులకు టెంట్లు సరఫరా చేయని టీడీపీ సర్కార్ తాటి, కొబ్బరి కమ్మలతో వేసుకుంటున్న వేతనదారులు వేతనదారులకు రక్షణ ఇవ్వడం లేదనే ఆరోపణలు గంట్యాడ మండలంలో పనిచేస్తూ ఓ వేతనదారు మృతివేతనదారులే టెంట్లు వేసుకోవాలిప్రభుత్వం నుంచి టెంట్లు సరఫరా లేదు. వేతనదారులే వారికి అవసరమైన టెంట్లు ఏర్పాటు చేసుకోవాలి. వైద్యసిబ్బంది ఓఆర్ఎస్ ప్యాకెట్లు వేతనదారులకు అందిస్తున్నారు. – ఎస్.శారదదేవి, పీడీ, డ్వామా -
మలేరియాపై అప్రమత్తంగా ఉండాలి
● జిల్లా మలేరియా అధికారి డి.సూర్యనారాయణకొమరాడ: ఏజెన్సీ గ్రామల్లో ప్రజలు మలేరియాపై అప్రమత్తంగా ఉండాలని పార్వతీపురం మన్యం జిల్లా మలేరియా అధికారి డి.సూర్యనారాయణ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన కొమరాడ మండలంలోని చినఖేర్జిల పంచాయతీ బంజుకుప్ప గ్రామంలో ‘మా ఊరికి మలేరియా’ అనే కార్యక్రమానికి హాజర య్యారు. ఆనంతరం అక్కడ ఉన్న మలేరియా జర్వపీడితులతో మాట్లాడి చిక్సిత అందించి వారి కుటుంబ సభ్యులకు రక్తపరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామల్లో మురుగునీరు నిల్వలేకుండా చేసుకోవాలని సూచించారు. ఖాళీ కొబ్బరిబొండాలు ఎక్కడపడితే అక్కడ ఉండకూడదన్నారు. గ్రామంలో పారిశుధ్య పనులు నిర్వహించాలని కాచి చల్ల ర్చిన నీటి తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రమేష్, ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
గడువులోగా పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి చేయాలి
విజయనగరం అర్బన్: జిల్లాలో జనవరి నెల నుంచి ప్రణాళికాబద్ధంగా కొనసాగుతున్న రీ సర్వే, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఆయన కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీఓలు, తహసీల్దార్లు, సర్వే సిబ్బందితో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. రూపొందించిన ప్రణాళిక ప్రకారం మ్యుటేషన్లు, సబ్డివిజన్లు, రైతు ముంగిటకే 1 బీ పంపిణీ, పాస్ పుస్తకాల ముద్రణ వంటి ప్రక్రియలను క్రమబద్ధంగా పూర్తి చేయాలని సూచించారు. మండల, గ్రామాల వారీగా రీ సర్వే పనుల పురోగతిని సమీక్షించారు. సర్వే పూర్తయ్యాక సర్టిఫికెట్ అందడం లేదని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో సర్వే అనంతరం తప్పనిసరిగా సర్టిఫికెట్ అందించాలని స్పష్టం చేశా రు. వంటగ్యాస్ సరఫరాలో అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారనే అరోపణలపై గ్యాస్ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని సివిల్ సప్లైస్ అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ మాట్లాడుతూ ఇప్పటికే పంపణీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలలోని తప్పులను సరిదిద్ది, మ్యుటేషన్లు, సబ్డివిజన్లు, ఫారం–8, జాయింట్ ఎల్బీఎం సమస్యలను పరిష్కరించి జూన్ నాటికి తప్పుల్లేని పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి చేయాలని సూచించారు. ఐదు విడతలుగా చేపట్టిన రీ సర్వే ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి, 2027 మార్చి నాటికి మొత్తం సర్వే పూర్తి చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో డీఆర్ఓ సీహెచ్ సత్తిబాబు, ఆర్డీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు. కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి -
మామిడి, టేకు తోటలు దగ్ధం
వేపాడ: మండలంలోని కొండగంగుబూడి పంచాయతీ ఎస్.కె.ఎస్.ఆర్.పురానికి చెందిన జగన్నాథసాగర్ పక్కన ఉన్న మామిడి, టేకు తోటలు దగ్ధమయ్యాయి. ఇందుకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో జరిగిన అగ్నిప్రమాదంలో తోట కాలిపోతుండడాన్ని గుర్తించిన పరవాడ జగదీష్ తక్షణమే వాటర్ ట్యాంక్తో నీరు తీసుకెళ్లి లగుడు అప్పలకొండ సహాయంతో మంటలను అదుపుచేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో పెద్దనష్టం జరగకుండా కాపాడుకోగలిగామని స్థానికులు చెబుతున్నారు. కంచిరెడ్డి పాలెంలో జీడితోట బొండపల్లి: మండంలోని కంచిరెడ్డి పాలెం గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదంలో 10 ఎకరాల్లో జీడితోట దగ్ధమైనట్లు గజపతినగరం అగ్నిమాపక కేంద్రం అధికారి ఎంఎస్వీ.రవిప్రసాద్ తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బర్ల లక్ష్మమ్మ జీడితోటలో మంటలు చేలరేగి క్రమంగా పక్కనే ఉన్న తోటలకు వ్యాపించి 10 ఎకరాల్లో చెట్లు కాలిపోయినట్లు తెలిపారు. సుమారు రూ.2 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్ని మాపక వాహనంతో వెళ్లి మంటలు చుట్టుపక్కల ఉన్న తోటలకు అంటుకోకుండా అర్పివేసినట్లు చెప్పారు. మహిళా రోగి పట్ల అసభ్యకర ప్రవర్తనవిజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఓ మహిళా రోగి పట్ల శానిటేషన్ వర్కర్ (మేల్) అసభ్యకరంగా ప్రవర్తించినట్లు తెలిసింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల20 వతేదీన ఆస్పత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్ ఒకరు రోగికి సహాయం చేస్తానని చెప్పి ఆమె పట్ల అసభ్యకరంగా వ్యవహరించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్కు సిబ్బంది తెలిపారు. ఇదేవిషయాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ వద్ద సాక్షి ప్రస్తావించగా ఓ మహిళా రోగి పట్ల మేల్ శానిటేషన్ వర్కర్ అసభ్యకరంగా ప్రవర్తించినట్టు తెలిసిందని, వెంటనే శానిటేషన్ సూపర్ వైజర్ను పిలిపించి వర్కర్ను అక్కడి నుంచి మార్చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. అనుచిత పోస్టులు పెడితే కఠిన చర్యలువిజయనగరం క్రైమ్ : సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే చట్టపరంగా చర్యలు తప్పవని ఎస్పీ దామోదర్ బుధవారం హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎలాంటి అనుచితమైన పోస్టులు పెట్టినా, విద్వేషాలు రెచ్చగొట్టే వారిపైన కఠిన చర్యలు తప్పవని ఎస్పీ మరో మారు హెచ్చరించారు. ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగాం, యూట్యూబ్, టెలిగ్రాం, వాట్సాప్, లింకిడిన్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ లో ఎవరికి తోచిన విధంగా వారు పోస్టులు పెట్టి మతాలు, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై జిల్లా పోలీసు శాఖ ప్రత్యేకం నిఘా పెట్టిందన్నారు. ఒక బృందాన్ని ప్రత్యేకంగా నియమించి, సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన వ్యక్తుల వివరాలను రాబట్టి, వారికి నోటీసులు జారీ చేస్తామన్నారు. కుటుంబ సభ్యుల సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు సీజ్ చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఉపక్రమిస్తామని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్నామని ఇతరులతో గుర్తింపు పొందేందుకు విద్వేషాలు రెచ్చగొడుతూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపైనా, వారిని ప్రోత్సహించే వారిపైనా చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ప్రజలను హెచ్చరించారు. -
చేపల మృతిపై విచారణ
సంతకవిటి: మండలంలోని బొద్దూరు గ్రామంలో అప్పమ్మ చెరువులో ఇటీవల చేపలు మృతి చెందిన విషయమై కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, జిల్లా డిప్యూటి డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ విజయకృష్ణ ఆదేశాలతో రాజాం ఫిషరీస్ ఇన్న్పెక్టర్ సీహెచ్.ప్రసాదరావు బుధవారం విచారణ చేపట్టారు. అప్పమ్మ చెరువుకు చేరుకుని అక్కడి పరిస్థితులపై మత్స్యకారులతో మాట్లాడారు. చెరువునుంచి నీరు తీయకుండా అడ్డుపడ్డారనే రైతులతో మాట్లాడారు. మత్స్యకారులు పలుమార్లు చెరువునుంచి నీరు తీయవద్దని తెలిపిన రాజాం ఇరిగేషన్ ఆఫీస్ సబార్డినేట్ ముఖలింగంను చెరువు వద్దకు పిలిపించుకుని నివేదిక తీసుకున్నట్లు తెలిపారు. చెరువులో ఎంత విలువ చేసే చేపలు విడిచి పెట్టారు తదితర అంశాలను మత్స్యకారులను అడిగి తెలుసుకున్నారు. పూర్తి నివేదికను జిల్లా మత్స్యశాఖ అధికారులకు అందజేయనున్నట్లు తెలిపారు. -
ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో సాలూరువాసికి సన్మానం
సాలూరు: ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో సాలూరు వాసి డా.రేగాన షణ్ముఖరావును బుధవారం సన్మానించారు. అనకాపల్లి కలెక్టర్ కార్యాలయంలో పీఆర్ఓగా పనిచేస్తున్న రేగాన షణ్ముఖరావు జర్నలిజం విభాగంలో పూర్వ పరిశోధక విద్యార్థిగా, సమాచార పౌర సంబంధాల శాఖ, షెడ్యూల్ కులాల స్థితిగతులపై అధ్యయనాలు, పరిశోధనల్లో ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించి ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల ప్రముఖులు ఆయనను సన్మానించి శతాబ్ది ఉత్సవాల జ్ఞాపికను అందజేశారు. ఈ మేరకు ఆయనకు సాలూరుకు చెందిన పలువురు అభినందనలు తెలిపారు.మొక్కజొన్నల లారీ బోల్తాగజపతినగరం రూరల్: మండలంలోని మరుపల్లి గ్రామ శివారులో బుధవారం మొక్కజొన్నల లోడ్ తీసుకువెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సమయంలో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో లారీ డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. పెదకాద, ఎం.గుమడాం, మరుపల్లి రైతుల వద్ద కొనుగోలు చేసిన మొక్కజొన్నలను లోడ్ చేసి విజయనగరం తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 3803 కిలోల పీడీఎస్ బియ్యం పట్టివేతసీతంపేట: సీతంపేటలోని రెండు వేర్వేరు కిరాణా దుకాణాల్లో అక్రమంగా విక్రయిస్తున్న 3803 కిలోల పీడీఎస్ బియ్యాన్ని పార్వతీపురం డీఎస్వో ఆశోక్ ఆధ్వర్యంలో సిబ్బంది బుధవారం పట్టుకున్నారు. వాటిని సీజ్ చేసి స్థానిక ఎంఎల్ఎస్ పాయింట్లో ఉంచినట్లు ఆర్ఎస్డీటీ శ్రీ విద్య తెలిపారు. -
అశ్రునయనాలతో యువకుడి అంత్యక్రియలు
బొబ్బిలి రూరల్: అమెరికాలోని మెరమెక్స్టేట్పార్కు వద్ద ఈనెల 11న ప్రమాదవశాత్తు నదిలో పడి మృతిచెందిన పిరిడి గ్రామానికి చెందిన సింగిరెడ్డి సాయిశ్రీహరికృష్ణ(26)మృతదేహం బుధవారం స్వగ్రామానికి చేరుకుంది. ప్రమాదం జరిగిన 12 రోజుల తరువాత హరికృష్ణ మృతదేహం తల్లిదండ్రుల వద్దకు చేరగా తల్లిదండ్రులు రమ, శ్రీనివాసరావులు భోరుమన్నారు. చేతికి అందికొచ్చిన కొడుకు అకాల మరణంతో గుండెలవిసేలా విలపించారు. గ్రామస్తులు,పెద్దలు, బంధువులు హరికృష్ణ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.తల్లిదండ్రులను ఓదార్చారు.అనంతరం అశ్రునయనాలతో హరికృష్ణ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. -
ఫిడే ఆర్బిటర్ టైటిల్ సాధించిన ప్రసాద్
చీపురుపల్లి: ప్రపంచంలో ప్రతిష్టత్మకంగా బావించే ఫిడే ఆర్బిటర్ టైటిల్ను చీపురుపల్లి పట్టణంలోని శ్రీనివాస జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఏడీఎన్ఎస్వీ. ప్రసాద్ సాధించారు. ఇంతవరకు సీనియర్ నేషనల్ ఆర్బిటర్గా ఉన్న ప్రసాద్ను అంతర్జాతీయ స్థాయిలో చదరంగం టోర్నమెంట్లు నిర్వహించే ఫిడే సంస్థ ఫిడే ఆర్బిటర్గా గుర్తించిన మేరకు ఫిడే అధ్యక్షుడు ధురవీకరణ పత్రం పంపించారు. ఇటీవల గుంటూరులో జరిగిన ఫిడే కౌన్సిల్ సెమినార్ లో దేశవ్యాప్తంగా 35 మంది పోటీ పడగా అందులో 12 మందిని ఫిడే ఆర్బిటర్లుగా ఎంపిక చేశారు. అందులో ప్రసాద్ ఉన్నారు. ప్రసాద్ ప్రస్తుతం విజయనగరం జిల్లా చదరంగం అసోసియేషన్ కార్యదర్శిగా, రాష్ట్ర ఆర్బిటర్ కమిటీ కన్వీనర్గా, ఫెయిర్ ప్లే కమిటీ మెంబర్గా, మన్యం జిల్లా కన్వీనర్గా వ్యవహరిస్తునారు. ఈ టైటిల్ను ఆయన సాధించినందుకు పలువురు చదరంగం క్రీడాకారులు రాష్ట్రవ్యాప్తంగా చదరంగం అసోసియేషన్ అధికారులు అభినందనలు తెలియజేశారు. -
బెర్రీ కంపెనీలో కార్మికుడి మృతి
బొబ్బిలి: పట్టణ పరిధిలోని బెర్రీ ఫెర్రో ఎల్లాయీస్ కంపెనీలో డైలీ లేబర్గా పనిచేస్తున్న కొరికాని కృష్ణ(40)కంపెనీలో విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో ఆస్పత్రిలో మంగళవారం రాత్రి చేరి చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. సంతకవిటి మండలం కొండగూడెం గ్రామానికి చెందిన కృష్ణ పండగ నిమిత్తం స్వగ్రామం వెళ్లాడు. తిరిగి వచ్చాక మంగళవారం రాత్రి విధుల్లో చేరాడు. విధులు నిర్వర్తిస్తుండగా ఆకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లగా కార్మికులు, తండ్రి పెంటయ్య,బంధువు స్వామినాయుడులు స్థానిక అభయ ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతి చెందిన కృష్ణకు భార్య, పెళ్లీడుకొచ్చిన ఇద్దరు కుమార్తెలున్నారు. రూ.50లక్షల పరిహారమివ్వాలి గ్రోత్ సెంటర్లోని బెర్రీ పరిశ్రమలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, గతంలో ఈ కంపెనీలో పనిచేసిన వారు ఎంతోమంది అకస్మాత్తుగా మృతి చెందిన సంఘటనలున్నాయని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పొట్నూరు శంకర రావు, నాయకులు సింగిరెడ్డి గోపాలం, బల శ్రీనులు అన్నారు. బుధవారం స్థానిక అభయ ఆస్పత్రిలో కృష్ణ మృతదేహం వద్ద వారు మాట్లాడుతూ ఇద్దరు ఆడపిల్లలున్న మృతుడి కుటుంబానికి రూ.50లక్షల పరిహారమివ్వాలని డిమాండ్ చేశారు. కంపెనీలో కార్మికులకు తాగేందుకు నీరు, రక్షణ పరికరాలు, రెస్ట్ హాలు లేవన్నారు. కంపెనీలన్నీ ఒకటై కార్మికుల కడుపు కొడుతున్నాయని విమర్శించారు. స్థానికులకు ఉద్యోగాలివ్వకుండా ఇతర ప్రాంతాల నుంచి కార్మికులను తీసుకువస్తున్నారన్నారు. వారితో రోజుకు 12 గంటలు పనిచేయించుకుంటున్నారని ఆరోపించారు. లేబర్ అధికారులు, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేయడం లేదని, దీంతో కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. మృతి చెందిన కార్మికుడికి రూ.50లక్షల పరిహారమివ్వాల్సిందేనని పట్టుబట్టారు. చికిత్స పొందుతూ యువకుడు.. భామిని: మండలంలోని సతివాడకు చెందిన యువకుడు పొట్నూరు మనోజ్ కుమార్(24) బుధవారం విశాఖ కేజీహెచ్లో వైద్య సేవలు పొందుతూ మృతి చెందాడు. మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మనోజ్ కుమార్ ఒంటిపై పెట్రోలు పోసుకుని కాల్చుకున్నాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.కాలిన మంటలతో వీధిలో పరుగెడుతున్న మనోజ్కుమార్ను స్థానికులు వీధిలోని పెంటగుమ్మిలో తోసి ప్రమాదం నుంచి రక్షించారు. వెంటనే కొత్తూరు ప్రభుత్వాస్పత్రికి అనంతం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్కు తరలించగా వైద్యసేవలు పొందుతూ మృత్యువాత పడినట్లు పోలీసులు తెలిపారు. మనోజ్కుమార్కు మతిస్థిమితం లేక పోవడంతో ఈ దుర్ఘటన జరిగిందని మృతుడి తల్లిదండ్రులు తెలిపారు. బత్తిలి ఎస్సై రవీంద్ర ఆధ్వర్యంలో హెచ్సీ సంగమేస్ కేసు నమోదు చేసి కేజీహెచ్కు వెళ్లి పోస్టుమార్టం నిర్వహించారు. -
ఎట్టకేలకు పంచాయతీ కార్యదర్శిపై వేటు...
వేపాడ: అధికార దుధుర్వినియోగానికి పాల్ప డుతూ, రాజకీయాలకు వత్తాసు పలుకుతున్న పంచాయతీ కార్యదర్శిపై ఎట్టకేలకు వేటు పడింది. కార్యదర్శిపై వచ్చిన ఆరోపణలపై విచారణకు ఆదేశించిన కలెక్టర్ రాంసుందర్రెడ్డి ఆరోపణలు వాస్తవాలు అని తేలడంతో కార్యదర్శి సస్పెన్షన్కు ఆదేశాలు జారీచేశారు. వేపాడ మండలంలోని బానాది పంచాయతీ కార్యదర్శి ఏఎస్ఎస్ఎన్ మూర్తి సస్పెన్షన్ ఉత్తర్వులు మంగళవారమే స్థానిక ఎంపీడీఓ కార్యాలయానికి అందినా ఎంపీడీవో మాత్రం విషయం బయట పెట్టకపోవటం విశేషం. వేపాడ మండలంలో బానాది పంచాయతీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏఎస్ఎస్ఎన్ మూర్తి తీరు వివాదాస్పదమైంది. సకాలంలో గ్రామసభలు జరపకపోవడంవ, విధుల పట్ల నిర్లక్ష్యం, బాధ్యతగా వ్యవహరించకపోడడం, పారిశుధ్యపనులు నిర్వహించకపోవడం, రికార్డులు తారుమారు చేయడం, పంచాయతీ రికార్డులు తన ఇంటికి తీసుకుపోవడం, మహిళా సర్పంచ్ పట్ల దురుసుగా వ్యవహరించడం వంటి పలు అంశాలపై సర్పంచ్ కర్రి యశోద జిల్లా అధికారులు, కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కలెక్టర్ ఆదేశాలతో మార్చి 20న డీఎల్పీఓ విచారణ నిర్వహించి, నివేదికను జిల్లా అధికారులకు అందజేయడంతో స్పందించిన కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి పంచాయతీ కార్యదర్శిపై సస్పెన్షన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని ఎంపీడీఓ సీహెచ్ సూర్యనారాయణ తెలిపారు. -
వలస కార్మికుల కోసం టోల్ ఫ్రీ నంబర్
విజయనగరం గంటస్తంభం: అంతర్రాష్ట్ర వలస కార్మికులు తమ సమస్యలను నేరుగా అధికారులకు ఫిర్యాదు చేసేందుకు విజయవాడలో 24 గంటల పాటు పనిచేసే టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేసినట్లు విజయనగరం కార్మికశాఖ ఉప కమిషనర్ ఎస్డీవీ ప్రసాదరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వలస కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం 1800–425–8587 నంబర్కు ఎప్పుడైనా ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు. కార్మికులు ఎదుర్కొనే ఇబ్బందులను తక్షణమే పరిష్కరించే ఉద్దేశంతో కార్మికశాఖ ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిందని వివరించారు. మృత్యు‘ధార’.. శృంగవరపుకోట: మృత్యువు ఏ రూపంలో.. ఎవరిని ఎలా కాటేస్తోందో తెలియదు. దీనికి ఎస్.కోటలో మంగళవారం జరిగిన విద్యుత్ ప్రమాదమే నిలువెత్తునిదర్శనం. కొత్తూరు గ్రామానికి చెందిన కక్కల రాము (48) అదే గ్రామంలో బైక్ మెకానిక్ షాపులో పనిచేస్తున్నాడు. ఏళ్ల తరబడి చేస్తున్న అలవాటైన పని. ఎప్పటివలే బైక్కు వాటర్ సర్వీసింగ్ చేస్తున్న ప్రయత్నంలో గన్ను పైకిలేపాడు. అంతే.. నీటిధారపైన ఉన్న విద్యుత్ లైన్ను తాకింది. దానిగుండా విద్యుత్ ప్రవహించడంతో వెంటనే రాము షాక్కు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కొనఊపిరితో ఉన్న రామును ఎస్.కోటలోని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్.కోట సీఐ నారాయణమూర్తి తెలిపారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వీరిలో ఒక కుమార్తె, కుమారునికి వివాహాలు అయ్యాయి. బైక్ సర్వీసింగ్ కార్మికుడి మృతితో కొత్తూరులో విషాదం అలుముకుంది. విద్యుత్ షాక్తో హోటల్ యజమాని మృతి పూసపాటిరేగ: మండలంలోని కందివలస సమీపంలో దేవి హోటల్ నిర్వహిస్తున్న చిక్కాల అనిల్కుమార్(29) విద్యుత్షాక్తో దుర్మరణం చెందాడు. హోటల్ వెనకభాగంలో నీటిపైపుతో ఇంటిని శుభ్రం చేస్తుండగా షాక్ తగిలి అపస్మారక స్థితిలో చేరుకున్నాడు. ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. ఆయనకు భార్య అనురాధ ఉన్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం సుందరపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పూసపాటిరేగ ఎస్ఐ ఐ.దుర్గాప్రసాద్ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీహెచ్సీ సేవలపై ఆరా బాడంగి: బాడంగి సీహెచ్సీని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీహెచ్సీలో వైద్యసేవలపై రోగులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేకపోవడంపై సిబ్బందిని ప్రశ్నించారు. ఆస్పత్రి ముందు వర్షపునీరు నిల్వ ఉన్నా పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎంపీడీఓకు ఫోన్చేసి నీరు నిల్వలేకుండా చూడాలన్నారు. ఆస్పత్రి భవన నిర్వాణాలు త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఏపీఎంఐడీసీ డీఈఈ నరేంద్ర, తహసీల్దార్ వరప్రసాద్, సూపరింటెండెంట్ డాక్ట్టర్ నాగేశ్వరరావు, జెడ్పీటీసీ పెద్దింటి రామారావు ఉన్నారు. -
ప్రజాసంక్షేమాన్ని విస్మరించిన చంద్రబాబు సర్కారు
● ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ రేగిడి: చంద్రబాబు ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని విస్మరించి, రెండేళ్లుగా రెడ్బుక్ పాలన సాగిస్తోందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ విమర్శించారు. రేగిడిలో స్థానిక విలేకరులతో ఆయన మంగళవారం మాట్లాడారు. అధికార దాహంకోసం సూపర్సిక్స్ హామీలిచ్చి అమలులో చేతులెత్తేయడం విచారకరమన్నారు. గ్రామ పంచాయతీల్లో వీధి దీపాల ఏర్పాటు, పారిశుద్ధ్య పనులు చేయలేని దుస్థితి నెలకొందన్నారు. ప్రజల్లో చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువ కావడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కేసులు బనాయిస్తున్నారన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు టంకాల అచ్చెన్నాయుడు, పార్టీ మండల కన్వీనర్ వావిలపల్లి జగన్మోహనరావు, వైఎస్సార్ సీపీ రాజాం నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు కరణం శ్రీనివాసరావు, ఎంపీటీసీ కింజరాపు సురేష్, పాడి లక్ష్మునాయుడు, కెంబూరు వెంకటేశ్వరరావు, గార రమణ, టంకాల బుచ్చెన్నాయుడు, రామారావు, తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల ఉద్యమ బాట
విజయనగరం అర్బన్: రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట పీఆర్టీయూ మంగళవారం ఆందోళన చేసింది. సమస్యలు పరిష్కరించాలంటూ నినదించింది. ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయాలని, పీఆర్సీ కమిటీని ఏర్పాటుచేయాలని, సీపీఎస్ను రద్దుచేసి పాతపెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, మెమో 57 ప్రకారం 2003 డీఎస్సీ అభ్యర్థులకు పాతపెన్షన్ వర్తింపజేయాలని పీఆర్టీయూ నాయకులు డిమాండ్ చేశారు. జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, ఎర్నల్లీవ్ ఎన్క్యాష్మెంట్ అంశాలను అమలు చేయాలని కోరారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల నియామకం చేపట్టాలని సూచించారు. జెడ్పీ పరిధిలో కారుణ్య నియామకాలను కలెక్టర్ పరిధిలో నిర్వహించాలని, జీఓ 302ను పునరుద్ధరించి జూనియర్ లెక్చరర్లకు పదోన్నతులు కల్పించాలని కోరారు. మున్సిపల్ కార్పొరేషన్ ఉపాధ్యాయులకు జీపీఎఫ్ ఖాతాలు ప్రారంభించాలని, పెండింగ్ డీఏలు విడుదల చేయాలని, టెట్ పరీక్షను రద్దు చేయాలన్నారు. కేజీబీవీ, మోడల్ స్కూల్స్, గురుకులాలను ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఆయా సంస్థల్లో సిబ్బంది నియామకాలు చేపట్టాలని కోరారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసన కార్యక్రమానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ డాక్టర్ గాదె శ్రీనివాసులనాయుడు, ఏపీటీఎఫ్ నాయకులు ఈశ్వరరావు, ఏపీయూఎస్ నాయకులు బల్ల శ్రీనివాసరావు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వి.రవీంధ్రనాయుడు, ప్రధాన కార్యదర్శి డి.శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ రావాడ రాంబాబు, ఇందుకూరు అశోక్రాజు, బంకపల్ల శివప్రసాద్, శంకర్నాయుడు, రెడ్డి గణపతి, పైడిరాజు, డెక్క వెంకటరావు, చిట్టి రామునాయుడు, రావాడ రామకృష్ణ, మెహన్రాజ్, జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
● ట్రైన్లో కార్డన్ సెర్చ్
● బ్యారెక్స్లో పీఎస్ఓల ట్రైనింగ్ క్యాంప్బొబ్బిలి/విజయనగరం క్రైమ్: ఒడిశా నుంచి విశాఖపట్నం వెళ్లే భవానీపట్నం ఎక్స్ప్రెస్లో బొబ్బిలి డీఎస్పీ ఆర్.గోవిందరావు ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అన్ని బోగీలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. స్థానిక ఏపీ పోలీసులతో పాటు జీఆర్పీ, ఆర్పీఎఫ్, ఈగిల్, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ఒక్కసారిగా రైలెక్కి చేపట్టిన తనిఖీలు ప్రయాణికులను ఆందోళనకు గురిచేశాయి. తనిఖీల ఉద్దేశాన్ని ప్రయాణికులకు పోలీస్ అధికారులు వివరించారు. జిల్లావ్యాప్తంగా మద్యం, గంజాయి, పేలుడు పదార్థాలు, డ్రగ్స్, గుట్కాల అక్రమరవాణాను అడ్డుకునేందుకే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. సహకరించాలని కోరారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా వారి బ్యాగులు, సూట్కేస్లు, పలువురు తీసుకువెళ్తున్న గోనె సంచులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సీఐ కె.నారాయణరావుతో పాటు రామభద్రపురం, తెర్లాం, మానాపురం ఎస్సైలు జ్ఞానప్రసాద్, సాగర్బాబు, జయంతి, జీఆర్పీఎఫ్ ఎస్ఐ బాలాజీరావుతో పాటు వివిధ పోలీస్ స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు. వీఐపీల భద్రతలో అలెర్ట్ ముఖ్యంవిజయనగరం క్రైమ్: వీఐపీల భద్రత విషయంలో పోలీస్ శాఖ రాజీ పడే ప్రసక్తే లేదని ఎస్పీ దామోదర్ స్పష్టం చేశారు. వీవీఐపీల భద్రతలో సిబ్బందికి అలెర్ట్ అత్యంత ఆవశ్యకమన్నారు. ఈమేరకు డీపీఓలోని బ్యారెక్స్ మైదానంలో పీఎస్ఓల రెండు రోజుల శిక్షణ కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా హాజరైన ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ వ్యక్తిగత భద్రత విధులు (పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్) నిర్వహించే పోలీసు సిబ్బంది (పీఎస్ఓలు) తమ విధులు నిర్వహించే సమయంలో నిరంతరం అప్రమత్తతతో వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. భద్రత విధుల నిర్వహణలో సిబ్బందికి శారీరక దారుఢ్యం, వృత్తి నైపుణ్యం వారిని ఉత్తమంగా నిలుపుతాయన్నారు. ఈ శిక్షణలో పోలీసు సిబ్బందిలో శారీరక దారుఢ్యం పెంపొందించేందుకు, వీఐపీ సెక్యూరిటీలో నిర్వహించాల్సిన విధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫైరింగ్ ప్రాక్టీస్, వీఐపీ భద్రత విధుల నిర్వహణలో ఏం చేయాలి, ఏంచేయకూడదన్న అంశాలు, బాంబ్ డిస్పోజల్ విధుల పట్ల పునశ్చరణ తరగతులను రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నామన్నారు. ఈ పునశ్చరణ తరగతులను వ్యక్తిగత భద్రత విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది సద్వినియోగం చేసుకుని, తమ వృత్తి నైపుణ్యాన్ని, శారీరక సామర్థ్యాన్ని మెరుగుపర్చుకోవా లని సూచించారు. పీఎస్ఓ విధులు ఎక్కడ, ఎవరి వద్ద నిర్వహించినా క్రమశిక్షణతో మెలగాలని, నీట్ యూనిఫాం, చక్కని శారీరక దారుఢ్యంతో కనిపించాలని, విధుల నిర్వహణలో చురుగ్గా వ్యవహరిస్తూ, వీఐపీ భద్రతకు ప్రాధాన్యతను కల్పించాలన్నారు. ముఖ్య వ్యక్తుల భద్రత నిర్వహించే పీఎస్ఓలు చెడు వ్యసనాలకు దూరంగా, మంచి నడవడికతో ఉండాలని తద్వారా జిల్లా పోలీసుశాఖ ప్రతిష్టను పెంచాలని హితవు పలికారు. శిక్షణ కార్యక్రమంలో సెక్యూరిటీ ఆర్ఐ పి.శ్రీనివాసరావు, అడ్మిన్ ఆర్ఐ ఎన్.గోపాల నాయుడు, ఎంటి ఆర్ఐ ఆర్.రమేష్ కుమార్, ఆర్ఎస్సై ముబారక్ అలీ వ్యక్తిగత భద్రత విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది (పీఎస్ఓలు) పాల్గొన్నారు.నియామక పత్రాలు అందజేత విజయనగరం రూరల్: స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉద్యోగులకు ఉద్యోగోన్నతి, నిరుద్యోగులకు కారుణ్య నియామక పత్రాలను జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మంగళవారం తన కార్యాలయంలో అందజేశారు. సింగన్నపాలెంలో సెకెండ్ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తూ స్వామిబాబు మృతిచెందడంతో ఆయన భార్య ఎస్.రమాదేవిని చీపురుపల్లి ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో ఓఎస్గా నియమిస్తూ ఉత్తర్వులు అందజేశారు. జెడ్పీలో జూనియర్ సహాయకులుగా పనిచేస్తున్న 9 మందితో పాటు, ముగ్గురు టైపిస్టులకు సీనియర్ సహాయకులుగా ఉద్యోగోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ బి.వి.సత్యనారాయణ, ఎస్టాబ్లిష్మెంట్ ఏఓ ఎన్.రాజేశ్వరి పాల్గొన్నారు. -
దేవదాయ భూముల వేలంలో ఉద్రిక్తత
● సచివాలయం వద్ద కౌలు రైతుల ఆందోళన ● చివరకు వేలంపాట వాయిదా గజపతినగరం రూరల్: మండలంలోని పీ.ఎస్.ఆర్ పురం గ్రామంలోని 47 ఎకరాల దేవదాయశాఖ భూములకు మంగళవారం నిర్వహించిన కౌలు వేలంటపాట ఉద్రిక్తతగా మారింది. భూములను సాగుచేస్తున్న 19 మంది కౌలు రైతులు వేలంపాట నిర్వహించిన సచివాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. 70 ఏళ్లుగా భూములు సాగుచేస్తున్నామని, ఏటా ఠంచన్గా దేవదాయ శాఖకు కౌలు చెల్లిస్తున్నామని, వేలంపాట లేకుండా తమకే కౌలుకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ జి.శ్యామ్ప్రసాద్, శ్రీరామ్లు మాట్లాడుతూ ఇన్చార్జి ఈఓలు ఉండడం వల్ల ప్రతి మూడేళ్లకు నిర్వహించాల్సిన వేలంపాట 12 ఏళ్లుగా నిర్వహించలేదని, వేలంపాటకు రైతులు సహకరించాలని కోరారు. ఎస్ఐ కిరణ్కుమార్నాయుడు సైతం సర్దిచెప్పారు. వేలంపాటలో పాల్గొని భూములను కౌలుకు తీసుకోవాలని సూచించారు. దీనికి రైతులు ససేమిరా అనడంతో మరో పది రోజులు గడువు ఇస్తామని, వేలంపాట పాడిన వారికే భూములను కౌలుకు ఇస్తామని చెబుతూ దేవదాయ శాఖ అధికారులు వెనుదిరిగారు. -
కలకలం రేపిన లేగ దూడల కళేబరాలు
జామి: మండలంలోని అలమండ, కొవ్వాడ గ్రామాల మధ్యలో ఉన్న పల్లె గెడ్డలో సుమారు 15 లేడదూడల కళేబరాలు తీవ్ర కలకలం రేపాయి. సోమవారం స్థానికులు గెడ్డలో లేడదూడల కళేబరాలను చూసి ఆందోళనకు గురయ్యారు. ఈ కళేబరాలు ఈ గెడ్డలో ఏ విదంగా పడి ఉన్నాయి అని పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి ఇన్ని మృత్యువాత పడిఉండడం గమనార్హం. స్థానికులు లేగ దూడలను, పశువులను సంతలకు పెద్ద పెద్ద లారీలపై తరలిస్తుంటారని సోమవారం అలమండ సంత కావడంతో వాటిని కబేళాకు తరలించడానికి వాహనాల్లో కాళ్లకు తాళ్లు కట్టి చుట్టూ గోనె సంచులు కడుతుంటారని దీంతో గాలి లేక చిన్నవి కావడంతో మృత్యువాత పడి ఉంటాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.పశువులను కబేళాలకు ఏవిధంగా తరలిస్తున్నారో అనడానికి ఇదే నిదర్శనం. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి అక్రమ పశురవాణాకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. అధికారులు బృందం సందర్శన విషయం తెలుసుకున్న ఎస్సై వీర జనార్దన్, పశు వైద్యాధికారి నరేష్కుమార్, పంచాయతీ కార్యదర్శి ఎర్నమ్మ ఘటనా స్ధలానికి వెల్లి పరిశీలించి కేసు నమోదు చేశారు. -
జర్నలిజంపై ఉక్కుపాదం
విజయనగరం గంటస్తంభం: రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ ప్రశ్నార్థకంగా మారుతోంది. సాక్షి పత్రిక చిత్తూరు జిల్లా సీనియర్ జర్నలిస్ట్ పూడి శ్రీహరి అరెస్టు తీరు ప్రజాస్వామ్యవాదులను విస్మయానికి గురిచేస్తోంది. ప్రభుత్వం తన వైఫల్యాలను ప్రశ్నించే గొంతుకలను నొక్కేయాలని చూడడం అత్యంత దుర్మార్గమని జర్నలిస్టు సంఘాలు మండిపడ్డాయి. విజయనగరం కలెక్టరేట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద జర్నలిస్టు యూనియన్ల ఆధ్వర్యంలో సోమవారం భారీ నిరసన ప్రదర్మన నిర్వహించాయి. ● ఇదెక్కడి అన్యాయం... అరెస్టుల విషయంలో అత్యున్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన చారిత్రాత్మక తీర్పులను పోలీసులు పూర్తిగా విస్మరించారని జర్నలిస్టు సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష పడే కేసుల్లో నిందితులకు ముందస్తుగా సెక్షన్ 41–ఏ కింద నోటీసులు ఇవ్వాల్సి ఉండగా, శ్రీహరి విషయంలో నేరుగా అరెస్టు చేయడం పోలీసుల అతిగా ప్రవర్తించడమేనని విమర్మించారు. అరెస్టు సమయంలో పోలీసులు యూనిఫాంలో ఉండాలని, స్పష్టమైన ఐడెంటిటీ కార్డులు కలిగి ఉండాలన్న నిబంధనలను గాలికొదిలేశారని, డీకే బసు మార్గదర్మకాలకు తూట్లుపొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ● ప్రభుత్వ కక్షసాధింపు చర్యే... ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం కేవలం ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపినందుకే జర్నలిస్టులపై కక్ష కట్టిందని నేతలు ఆరోపించారు. కేవలం వార్తలు రాసినందుకు దేశద్రోహం, 153ఏ వంటి తీవ్రమైన సెక్షన్లు బనాయించడం భావప్రకటన స్వేచ్ఛను ఖూనీ చేయడమేనన్నారు. నిరసన కార్యక్రమంలో సాక్షి ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి యుగంధర్, చిన్న పత్రికల అసోసియేషన్ అధ్యక్షుడు కె.జె.శర్మ, ఏపీడబ్ల్యూజే ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు రమేష్నాయుడు, ఏపీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్మి ఎం.ఎస్.రాజు, వారితో పాటు పాత్రికేయులు వి.ఎం.ఎల్.లక్ష్మణరావు, డేవిడ్రాజు, ఉమెన్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యురాలు దేవి, తదితరులు పాల్గొన్నారు.అక్రమ అరెస్టులు ఆపాలి జర్నలిస్టుల విధి నిర్వహణకు ఆటంకం కలిగించడం రాజ్యాంగ విరుద్ధం. శ్రీహరి అరెస్టులో నిబంధనలు పాటించని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అక్రమంగా బనాయించిన కేసులను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి. – పి.ఎస్.ఎస్.వి.శివప్రసాద్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ, ఏపీడబ్ల్యూజే పోలీస్ వ్యవస్థ చట్టబద్ధంగా నడుచుకోవాలి పోలీసులు ఒక పార్టీ కార్యకర్తల్లా వ్యవహరించడం దారుణం. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకోకపోతే న్యాయపోరాటం చేస్తాం. జర్నలిస్టులకు తగిన రక్షణ కల్పించాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉంది. – వి.ఎం.మహాపాత్రో, ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు నిరంకుశత్వానికి పరాకాష్ట జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తాయి. ప్రశ్నించే గొంతుకలను అరెస్టులతో భయపెట్టలేరు. ప్రభుత్వం తన పద్ధతి మార్చకోవాలి. – ఎంఎంఎల్ నాయుడు, 10టీవీ, సీనియర్ రిపోర్టర్ చట్టాన్ని గౌరవించాలి.. సీనియర్ జర్నలిస్టు పూడి శ్రీహరి అరెస్టు విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్మకాలను అధికారులు తప్పనిసరిగా పాటించాలి. చట్టాన్ని పక్కనపెట్టి వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి హానికరం. మహిళా జర్నలిస్టులపై కూడా నిరాధార కేసులు నమోదు చేయడం ఆందోళనకరం. ఇటువంటి చర్యలు వెంటనే నిలిపివేసి, ప్రజల కోసం పనిచేసే పాలన కొనసాగాలి. – విజయలక్ష్మి, జనరల్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ ఉమెన్ జర్నలిస్టు అసోసియేషన్ పూడి శ్రీహరి అరెస్టు రాజ్యాంగ విరుద్ధం అక్రమ అరెస్టుపై భగ్గుమన్న జర్నలిస్టు లోకం సుప్రీంకోర్టు మార్గదర్మకాలకు పాతర ఖాకీల అత్యుత్సాహంపై ఆగ్రహం విజయనగరం కలెక్టరేట్ వద్ద శాంతియుత నిరసన కలెక్టర్కు వినతిపత్రం అందజేత -
జేఈఈ మెయిన్స్లో ‘విజయ’కేతనం
విజయనగరం అర్బన్: దేశంలో అత్యున్న ఇంజినీరింగ్ విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ–2026 మెయిన్స్ ప్రవేశపరీక్ష ఫలితాల్లో విజయనగరం జిల్లా విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. ఉత్తమ ర్యాంకులు సాధించారు. విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారు. విద్యార్థి పేరు: యర్రమిల్లి శ్రీకృష్ణ ఆదిత్య ఊరు: విజయనగరం పర్సంటైల్: 99.820 ర్యాంకు: 2,974 (జాతీయ స్థాయి) తల్లిదండ్రులు: నాగస్వరూపలలిత, వై.వి.శివశంకరమూర్తి (మిమ్స్ పీడియాట్రిక్ విభాగాధిపతి) విద్యార్థి పేరు: తోతాడి శైలేష్ ఊరు: విజయనగరం పట్టణం పర్సంటైల్: 99.102 ర్యాంకు: 14,393 ఙ (జాతీయస్థాయి) (ఓబీసీ–3,630) తల్లిదండ్రులు: బలగ కళావతి (గృహిణి), సత్యారావు (టీచర్) విద్యార్థి పేరు: చింతల వెంకటసాయి వర్షిత్ ఊరు: ఎస్.చింతలవలస(రామభద్రపురం మండలం) పర్సంటైల్: 99.72 ర్యాంకు: 4,443 (జాతీయస్థాయి) (ఓబీసీ–915) తల్లిదండ్రులు: త్రివేణి(గృహిణి), రామారావు (రైతు) -
ప్రశాంత వాతావరణంలో అమ్మవార్ల జాతర
● డీఎస్పీ గోవిందరావు బొబ్బిలి: పట్టణంలో ఈ నెల 28న జరిగే దాడితల్లి, సరేపోలమ్మ అమ్మవార్ల జోడు సిరిమానోత్సవాలను భక్తులు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని డీఎస్పీ ఆర్ గోవిందరావు సూచించారు. పాత బొబ్బిలిలోని ధర్మకర్త చోడిగంజి రమేష్నాయుడు, గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు, భక్తులతో సోమవారం రాత్రి సిరిమానోత్సవ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. సిరిమాను తిరిగే ప్రాంతాల్లో రహదారులు పరిశుభ్రంగా ఉండాలన్నారు. అల్లర్లు చేసే వారిపై దృష్టి సారించాలని సీఐ కె.నారాయణరావుకు సూచించారు. గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు పోలీసులకు సహకరించాలన్నారు. కౌన్సిలర్ కోట పెదరాములు, నాయకులు మింది రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడదాం విజయనగరం గంటస్తంభం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మికవ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు కార్మికులంతా ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐటీయూసీ ఏపీ స్టేట్ జనరల్ సెక్రటరీ వెంకటసుబ్బయ్య పిలుపునిచ్చారు. విజయనగరంలో సోమవారం నిర్వహించిన ఏఐటీయూసీ 12వ జిల్లా మహాసభలు భారీ ప్రదర్మనతో ప్రారంభమయ్యాయి. పట్టణంలోని స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు ఎర్రజెండాలతో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ... కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసమే కేంద్రం 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కుదించిందని విమర్మించారు. ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చడం దారుణమన్నారు. ఈ నెల 26 నుంచి తిరుపతిలో జరిగే రాష్ట్ర మహాసభలను జయపద్రం చేయాలని కోరారు. సీపీఐ నేతలు పి.కామేశ్వరరావు, ఓమ్మి రమణ మాట్లాడుతూ, ఏఐటీయూసీ 106 ఏళ్లుగా కార్మికుల పక్షాన పోరాడుతోందని, వారికి ఎల్లప్పుడూ సీపీఐ అండగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా నేతలు బుగత అశోక్, పడాల రమణ, కె.స్రవంతి, తదితరులు పాల్గొన్నారు. -
నాలుగు కిలోల కణితి తొలగింపు
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో క్లిష్టతరమైన శస్తత్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాలను ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్ట ర్ అల్లు పద్మజ సోమవారం వెల్లడించారు. చీపురుపల్లి ప్రాంతానికి చెందిన రైతు పెంటమ్మ అనే వృద్ధురాలు కొద్ది రోజుల క్రితం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి కడుపు నొప్పితో వచ్చింది. జనరల్ సర్జరీ విభాగం హెచ్ఓడీ డాక్టర్ పీఏ రమణ, ఇతర వైద్యులు ఆమెకు వైద్య పరీక్షలు, స్కానింగ్ నిర్వహించి కడుపు లోపలి భాగంలో రెట్రోపెరిటోనియల్ ట్యూ మర్ ఉన్నట్లు నిర్ధారించారు. కడుపులో ఉన్న కణితిని రెట్రోపెరిటోనియల్ ప్రాంతంలో అన్ని వైపులా విస్తరించి, సమీపంలోని కిడ్నీ, ముఖ్యమైన రక్తనాళాలకు అంటుకుని ఉన్నట్లు గుర్తించారు. ఈ కణితి వల్ల రక్తనాళాలకు, ఇతర అవయవాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుమారు 4 కిలోల కణితిని శస్త్రచికిత్స చేసి తొలగించారు. కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. ఈ శస్త్రచికిత్సలో డాక్టర్లు పీఏ రమణతో పాటు, చైతన్య బాబు, జగదీష్, వెంకటనాయుడు, ధర్మ కిషోర్, శశిధర్, అక్షిత, హేమసుందర్ నాయుడు పాల్గొన్నారు. వారిని సూపరింటెండెంట్ అభినందించారు. -
యావన్మందికీ తెలియజేయునది ఏమనగా...
● 27న పైడితల్లి అమ్మవారి దేవర మహోత్సవం ● 28 నుంచి చదురుగుడిలో అమ్మవారి దర్శనం విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి దేవర మహోత్సవం చాటింపు ప్రక్రియ సోమవారం సాయంత్రం ఆలయం వద్ద నిర్వహించారు. ఆలయ తలయారులు రామవరపు చినపైడిరాజు బృందం అమ్మవారికి మనవి చెప్పి, ఈ నెల 27న సోమవారం దేవరమహోత్సవం నిర్వహిస్తారని, 28న మంగళవారం నుంచి అమ్మవారు చదురుగుడిలో భక్తులకు దర్శనమిస్తారంటూ చాటింపు వేశారు. అనంతరం ఆలయ ఈఓ కె.శిరీష మాట్లాడుతూ 27న సాయంత్రం 4 గంటలకు అమ్మవారికి వనంగుడిలో పంచామృతాలతో అభిషేకాలు, స్తపన కార్యక్రమాలు అనంతరం ప్రత్యేక అలంకరణ ఉంటుందన్నారు. వేదపండితుల వేదస్వస్తి అనంతరం విచిత్రవేషధారణలు, భాజాభజంత్రీలతో అమ్మవారిని గాడీఖానా, సీఎంఆర్ కూడలి, ఎన్సీఎస్ రోడ్డు, గంటస్తంభం మీదుగా హుకుంపేటకు తీసుకెళ్తామన్నారు. రాత్రి 10 గంటలకు హుకుంపేటలో ఉన్న అమ్మవారి చదురుగుడి వద్ద ప్రత్యేక పూజలు ఉంటాయన్నారు. 28న మంగళవారం ఉదయం 6 గంటలకు అమ్మవారు పూజలందుకుంటారన్నారు. నాటి నుంచి ఉయ్యాల కంబాల వరకూ చదురుగుడిలోనే భక్తులకు దర్శనమిస్తారన్నారు. భక్తులందరూ అమ్మవారిని దర్శించి, తరించాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
జాబితా విడుదల
టీచర్ల సీనియారిటీ ● ఈ నెల 21 నుంచి 26 వరకు అభ్యంతరాల స్వీకరణ ● డీఈఓ యూ.మాణిక్యం నాయుడువిజయనగరం అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను విడుదల చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి యూ.మాణిక్యం నాయుడు తెలిపారు. ఈ జాబితా ఆధారంగానే భవిష్యత్తులో బదిలీలు, పదోన్నతులు, ఇతర పరిపాలన చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. పాఠశాల విద్యాశాఖ సంచాలకుల ఆదేశాల మేరకు స్కూల్ అసిస్టెంట్స్, ఎస్జీటీలు సమానమైన సిబ్బంది వర్గాలకు సంబంధించిన సీనియారిటీ జాబితాను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఉపాధ్యాయులు తమ వివరాలను పరిశీలించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే తగిన ఆధారాలతో ఈ నెల 21 నుంచి 26వ తేదీ వరకు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. పదోన్నతుల జోన్లో ఉన్న ఉపాధ్యాయులు మాత్రమే కాకుండా, అందరూ తమ సీనియారిటీ వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలని అధికారులు తెలిపారు. జీఓ 610 ద్వారా జిల్లాకు బదిలీ అయిన ఉపాధ్యాయులు తమ డీఎస్సీ మార్కులు, ర్యాంక్ వివరాలను సమర్పించి సీనియారిటీ సరిచేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. లేకపోతే వారిని సంబంధిత డీఎస్సీలో జూనియర్గా పరిగణించే అవకాశం ఉందని హెచ్చరించారు. అలాగే నోషనల్ సీనియారిటీ పొందిన ఉపాధ్యాయులు తగిన ఆధారాలు సమర్పించి సీనియారిటీ తప్పులు ఉన్నట్లు గుర్తించినందున, వాటిని సరిచేసుకుని అప్డేట్ చేయాలని సూచించారు. -
కాలు కోల్పోయినా కనికరం లేదు..
నా పేరు ఆర్నిపల్లి శివ. మాది బాడంగి మండలం పాల్తేరు గ్రామం. మూడేళ్ల కిందట జరిగిన ప్రమాదంలో ఎడమ కాలికి దెబ్బ తగలడంతో మోకాలి పైవరకు కాలును తొలగించారు. అప్పటి నుంచి ప్లాస్టిక్ కాలుతో, కర్ర సహాయంతో నడుస్తూ బతుకు పోరాటం సాగిస్తున్నాను. వైద్యులు 72 శాతం వైకల్యం ఉన్నట్టు సదరం ధ్రువపత్రం ఇచ్చారు. దానిని పట్టుకుని రెండేళ్లుగా పింఛన్ కోసం తిరుగుతున్నా మంజూరు కావడం లేదు. వైద్య ఖర్చులకు కూడా అప్పు చేస్తున్నాను. పింఛన్ సైట్ ఓపెన్ చేయకపోవడం విచాకరం. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మా లాంటి వారికి బతుకు కష్టాలు తప్పడంలేదు. -
పీఎం రాహత్తో నగదు రహిత వైద్యం
విజయనగరం ఫోర్ట్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు ఉచిత తక్షణ వైద్యం సహాయం అందించేందుకు పీఎం రాహత్ పథకాన్ని ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు (ఆరోగ్యశ్రీ) ద్వారా అమలు చేస్తున్నట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీఎంరాహత్ పథకం వాల్ పోస్టర్లను ఆయన సోమవారం ఆవిష్కరించారు. రోడ్డు ప్రమాద బాఽధితులకు గోల్డెన్ అవర్లో రూ.1.5 లక్షల వైద్యాన్ని ఉచితంగా అందించేందుకు పీఎంరాహత్ పథకాన్ని జిల్లాలో 23 ఆస్పత్రుల్లో అందిస్తామన్నారు. సమావేశంలో జేసే సేతుమాధవన్, డీఆర్వో సత్తిబాబు, ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ డాక్టర్ కె.సాయిరాం, డీఎల్ఓ డాక్టర్ కె.రాణి, డీసీహెచ్ఎస్ ఎన్.పద్మశ్రీరాణి, తదితరులు పాల్గొన్నారు. -
మా గోడు వినండి బాబూ..
నివాసం ఉన్న చోటే పట్టాలివ్వాలి దశాబ్దాలు నివసిస్తున్నాం.. ప్రభుత్వం ఇచ్చిన జీఓ 30 ప్రకారం వంద గజాల ఇంటి స్థలానికి పట్టాలివ్వడంలో జాప్యంపై విజయనగరం నగర పరిధిలోని ఎల్బీజీ నగర్, గురజాడ నగర్, రామకృష్ణ నగర్, వినాయక నగర్, గొడగల వీధి కాలనీవాసులు ఆందోళన వ్యక్తంచేశారు. అధికారులను నిలదీశారు. తాగడానికి గుక్కెడు నీరు, నడవడానికి రోడ్డు లేక నరకయాతన అనుభవిస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారంటూ వాపోయారు. కార్యాక్రమంలో సీపీఎం నగర కమిటీ సభ్యులు బి.రమణ, నగర కమిటీ సభ్యులు రంభ శ్రీనివాసరావు, ఆనంద్, రాజు పాల్గొన్నారు. -
చచ్చుబడిన కాళ్లు.. చలించని ప్రభుత్వం
సాగు భూమి పోతే చావే శరణ్యం నాలుగు తరాలుగా సుమారు 48.30 ఎకరాల ఎండోమెంట్ దేవస్థానం భూములను సాగు చేసుకుంటూ బతుకుతున్నాం. ,గ్రామంలోని కొందరు స్వార్థపరులు తమకు ఆ భూములు కావాలని, వేలం వేయించాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. వేలం ప్రక్రియను నిలిపివేసి, తమకే సాగుకు భూములు ఇవ్వాలంటూ గజపతినగరం మండలం పాత, కొత్త శ్రీరంగరాజపురం గ్రామస్తులు కలెక్టర్కు విన్నవించారు. తొలుత కలెక్టరేట్ ఎదుట తమ ఆవేదన వ్యక్తంచేశారు. చిత్రంలో కాళ్లుచచ్చుబడిపోవడంతో ట్రైసైకిల్కే పరిమితమైనది.. పూసపాటిరేగ మండలం రెల్లివలస గ్రామానికి చెందిన మీసాల యుగందర్. చెట్టుమీద నుంచి పడిపోవడంతో నడవలేని స్థితికి చేరాడు. పింఛన్ మంజూరు చేయాలంటూ రెండేళ్లగా డాక్టర్లు ఇచ్చిన సదరం ధ్రువపత్రం పట్టుకుని తిరుగుతున్నా ఫలితం శూన్యం. కొత్తపింఛన్లు మంజూరుకు వెబ్సైట్ ఓపెన్ కాలేదని అధికారులు చెబుతున్నారని, నా లాంటి వారు ఎలా బతకాలో పాలకులు, అధికారులే చెప్పాలంటూ గగ్గోలు పెట్టాడు. -
చేపలు మృత్యువాత
● దాదాపు రూ.20 లక్షలు నష్టంసంతకవిటి: మండలంలోని బొద్దూరు గ్రామంలో దాదాపు 150 ఎకరాల విస్తీర్ణంలో ఉండే అప్పమ్మ చెరువులో టన్నుల కొద్దీ చేపలు మృత్యువాత పడ్డాయి. చెరువులో ముళ్ల నాచు అధికంగా పేరుకు పోవడంతో చేపలు ఊపిరాడక మృత్యువాత పడ్డాయని దాదాపు రూ.20లక్షలు నష్టం వాటిల్లిందని సొసైటీ సభ్యులు వాపోతున్నారు. దాదాపు దశాబ్దాలనుంచి ఈ చెరువునే నమ్ముకుని శ్రీ గణేష స్వదేశీ పారిశ్రామిక సహకార సంఘ సభ్యులం బతుకుతున్నామని చేపలు మృత్యువాత పడడంతో వీధిన పడ్డామని సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ సంఘంలో దాదాపు 65 మంది సభ్యులున్నారు. చెరువులోని నీరు బయటకు వెళ్లకుండా ఓ రైతు అడ్డుపడడంతో చెరువులో నీరు అధికంగా ఉండడంతో నాచును చెరువునుంచి తీసేందుకు వీలు కాలేదు. ఎండలకు నీరు తగ్గడంతో చేపలు తిరుగాడేందుకు వీలుకాక ఊపిరాడక చనిపోయాయాని గ్రామానికి చెందిన సభ్యుడు దువ్వారపు శ్రీను వాపోయాడు. -
పీజీఆర్ఎస్కు వినతుల వెల్లువ
● 215 వినతుల స్వీకరణవిజయనగరం అర్బన్: కలెక్టరేట్లోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’(పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో అర్జీదారులు హాజరై తమ సమస్యలపై వినతిపత్రాలు, ఫిర్యాదులు సమర్పించారు. కలెక్టర్ ఎం.రాంసుందర్రెడ్డి నేతృత్వంలో జిల్లా యంత్రాంగం వినతుల పరిష్కానికి ప్రత్యేక చర్యలు చేపడుతూ అర్జీదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు సత్వర పరిష్కారం అయ్యేలా కృషి చేస్నున్నారు. అర్జీదారుల సౌకర్యార్థం కలెక్టరేట్ వద్ద ప్రత్యేక రిసెప్షన్ కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు కూర్చుని సమస్యలు వివరించేందుకు కుర్చీలు ఏర్పాటు చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి తాగునీరు వంటి వసతులు కల్పించారు. విభిన్న ప్రతిభావంతుల కోసం మూడు చక్రాల సైకిళ్ల ద్వారా లోపలికి వెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మొత్తం 215 వినతులు స్వీకరించగా అందులో 89 రెవెన్యూ శాఖకు సంబంధించినవి ఉన్నాయి. పంచాయతీ రాజ్–24, మున్సిపల్–8, విద్యుత్–9, హౌసింగ్–2, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ–3, గ్రామ సచివాలయ శాఖ–2, విద్యాశాఖ–1 ఇతర శాఖలకు మరో 62 వినతులూ అందాయి. వినతుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని పెండింగ్ కేసులను వెంటనే డిస్పోజ్ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్ టోల్ఫ్రీ నంబర్ 1100 ద్వారా అందిన ఫిర్యాదులపై కూడా బాధ్యతగా స్పందించాలని సూచించారు,. ప్రతి వారం పురోగతిపై సమీక్ష నిర్వహిస్తూ అర్జీదారులతో మాట్లాడిన వివరాలను రికార్డు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, డీఆర్ఓ సీహెచ్.సత్తిబాబు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. వినతుల పెండింగ్పై ప్రజల్లో అసంతృప్తి పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లకు పెద్ద ఎత్తున తరలివస్తున్న ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో మాత్రం అసంతృప్తి కొనసాగుతోంది. జిల్లా నలుమూలల నుంచి వచ్చి అర్జీదారులు తమ వినతులు సమర్పించినప్పటికీ చాలా సమస్యలు వెంటనే పరిష్కారం కాలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. భూ వివాదాలు, సర్వే సమస్యలు, పట్టాదారు పాస్ పుస్తకాల జాప్యం వంటి అంశాలు ఎక్కువగా రావడం, రెవెన్యూ వ్యవస్థలో లోపాలను వెలుగులోకి తెస్తున్నాయి. ప్రజలు గంటల తరబడి వేచి ఉండాల్సి రావడం, అధికారులతో నేరుగా మాట్లాడే అవకాశం పరిమితంగా ఉండడం వంటి అంశాలపై అసంతృప్తి వ్యక్తమైంది. అర్జీలను ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించాలి పార్వతీపురం: పీజీఆర్ఎస్ కార్యక్రమానికి వచ్చిన వినతులను ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో కలెక్టర్, జేసీ సి.యశ్వంత్ కుమార్రెడ్డి, డీఆర్ఓ కె. హేమలత. ఎస్ఈసీ దిలీప్ చక్రవర్తి కలిసి 93 వినతులను స్వీకరించారు. ఇందులో రెవెన్యూకు సంబంధించి 24, ఇతర వినతులు 69 వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్దిష్ట గడువులోగా క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలను పరిష్కరించేలా అధికారులు చొరవ చూపాలని సూచించారు. ఎక్కువ కాలం పెండింగ్లో ఉన్న ఫిర్యాదులను గుర్తించి వాటిపై సమగ్ర పరిశీలన చేసి పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఐటీడీఏ పీజీఆర్ఎస్కు 27 వినతులు సీతంపేట: ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు 27 వినతులు వచ్చాయి. ఐటీడీఏ ఏవో సునీల్ ఆధ్వర్యంలో అర్జీలు స్వీకరించారు. భామిని మండలం పాలవలస గ్రామానికి చెందిన కడ్రక గోపాలం, పీఎల్పురానికి చెందిన లక్ష్మీనారాయణలు పవర్ టిల్లర్ మంజూరు చేయాలని వినతిపత్రం సమర్పించారు. రాజమానుగూడ గ్రామానికి చెందిన సవర శివకుమార్ తాగునీటి ట్యాంకు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశాడు. కొత్తబర్న గ్రామానికి చెందిన ఆరిక వెంకటరావు రచ్చబండ నిర్మించాలని వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈవో నారాయుడు, వ్యవసాయాధికారి వాహిని, స్పోర్ట్స్ ఇన్చార్జ్ జాకాబ్ దయానంద్, డీఈ రాధారాణి, ఎ.డి శ్రీనివాసరావు, డీడీ సెక్షన్ సూపరింటెండెంట్ అప్పారావు, జీసీడీవో రాములమ్మ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. -
జలధార పరిమితం
● ప్రస్తుతం జరుగుతున్న ఉపాధి పనులే కొత్తగా చేపట్టినట్లు జలహారతివిజయనగరం ఫోర్ట్: ఓ సినిమాలో నటుడు చెల్లికి జరగాలి మళ్లీ మళ్లీ పెళ్లి అన్న విధంగా టీడీపీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు తయారైందని పలువురు విమర్శిస్తున్నారు. కొత్తగా ఎటువంటి పనులు చేయకుండానే పాత పనులనే కొత్తగా చేసినట్లు చంద్రబాబు ప్రభుత్వం కలరింగ్ ఇవ్వడం విస్తుగొలుపుతోంది. టీడీపీ వ్యవహారిశైలిని చూసిన వారంతా ఇదేం చోద్యం రా బాబు అని చర్చించుకుంటున్నారు. కొత్త పనులు చేపడితే డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది కావున పాతపనులనే కొత్తపనులుగా మమ అనిపించే విధంగా చంద్రబాబు సర్కార్ వ్యవహరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈనెల 6వతేదీన టీడీపీ సర్కార్ జలధార కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద జిల్లాలో ఉన్న గ్రామాల్లో చెరువుపనులు, నీరు చెట్టు వంటి పనులు చేపట్టాలి. తద్వారా భూగర్భ జలాల నీటిమట్టం పెంచాలన్నది కార్యక్రమం ఉద్దేశ్యం. అయితే జలధార పథకం కింద ఎలాంటి పనులు గుర్తించలేదని తెలిసింది. ప్రాథమిక కసరత్తు, పనుల గుర్తింపు వంటివి ఏవీ ఇంకా ప్రారంభం కాలేనట్లు తెలుస్తోంది. -
మండే సూరీడు..!
● సోమవారం 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు ● ఎండ వేడమితో విలవిల ● మధ్యాహ్నం 12 గంటలకే ఖాళీ అయిన రోడ్లు విజయనగరం ఆర్అండ్ఆర్ రైతు బజార్ రోడ్డులో పండ్లు వదిలేసి నీడకు వెళ్లిపోయిన చిరు వ్యాపారులు విజయనగరం ఫోర్ట్: భానుడు భగ్గుమన్నాడు. జనంపై నిప్పుల వర్షం కురిపించాడు. ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఈ ఏడాదిలో అధ్యధికంగా సోమవారం 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో జనం అపసోపాలు పడ్డారు. ఇటుకబట్టీలు, ఫుట్పాత్ వ్యాపారులు, ఉపాధి హామీ వేతనదారులు, కర్రలు కొట్టేవారు, కళాసీలు ఎండ వేడమికి తాళలేక ఉదయం 10 గంటలకే ఇళ్లకు వచ్చేశారు. పుట్పాత్లు, రోడ్డు పక్కన కూరగాయలు, పండ్లు అమ్ముకునేవారు ఎండ వేడమికి తాళలేక నీడకు వెళ్లి పోయారు. మధ్యాహ్నం 12 గంటలకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. వృద్ధులు, పిల్లలు, చర్మసంబంధిత వ్యాధిగ్రస్తులు ఎండ ధాటికి తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఎండ వేడిమి నుంచి ఉపశమనం కోసం కొబ్బరి బొండాలు, పండ్ల రసాలు, మజ్జిగ, ఓఆర్ఎస్ను తాగారు. ఎండలో తిరగరాదు ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఎండలో తిరగడం, ప్రయాణించడం మంచిదికాదు. సాధ్యమైనంతవరకు 10 గంటల లోగా పనులు ముగించుకోవాలి. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదు. మజ్జిగ, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు మంచినీళ్లు తాగాలి. – డాక్టర్ ఎస్.జీవనరాణి, డీఎంహెచ్ఓ -
ద్వారపురెడ్డి దారెటు?
● టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ జగదీష్ రాజకీయ భవితవ్యంపై చర్చ ● మాజీ ఎమ్మెలేలు, చిరంజీవులు, భంజ్దేవ్లకు అవమానం సాక్షి, పార్వతీపురం మన్యం: ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న అన్న చందంగా తెలుగుదేశం పార్టీ వ్యవహారశైలి ఉంటుందన్నది జగత్విదితమే. సుదీర్ఘ కాలంపాటు పార్టీకి సేవలందించిన నాయకులను..అవసరం తీరాక కరివేపాకు మాదిరి తీసి పడేయడం ఆనవాయితీగా వస్తోంది. ఉమ్మడి జిల్లాలో పార్టీ అధ్యక్షుడిగా పని చేసిన..రాష్ట్ర అధికార ప్రతినిధిగా సేవలందించిన.. సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ విషయంలోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. గత ఎన్నికలకు ముందు నుంచి ఆయనతోపాటు..మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులును అధిష్టానం పూర్తిగా పక్కన పెట్టేసిన విషయం విదితమే. నియోజకవర్గంతో పాటు, జిల్లాలో బలమైన సామాజిక వర్గానికి చెంది న జగదీష్..నిన్న మొన్నటి వరకూ పార్టీ ఆదేశాలను దాటక, విధేయుడిగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఏ రోజుకై నా వాస్తవాలను గ్రహించి, పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని ఆశించారు. ఇటీవల జరిగిన పరిణామాలు ఆయనను మరింత కుంగదీశాయన్న ప్రచారం నడుస్తోంది. కొద్దిరోజుల క్రితం పార్వతీపురం మండలం అడ్డాపుశీల పంచాయతీ పిన్నింటిరామినాయుడువలసలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ విషయంలో ఘర్షణ జరిగిన విషయం విదితమే. ఆ సందర్భంలో ఆయనతోపాటు, మాజీ ఎమ్మెల్యే చిరంజీవులుకు తీవ్ర అవమానం జరిగింది. దీనిపై పార్టీ అధిష్టానం దృష్టి సారిస్తుందని భావించారు. నియోజకవర్గ ఎమ్మెల్యే బోనెల విజయ్చంద్ర వైఖరిని ఆయన బహిరంగంగానే తప్పుబట్టారు. ఈ విషయాన్ని అధిష్టానం పట్టించుకోకపోగా..ఇటీవల నియామకం చేపట్టిన పార్టీ కమిటీల్లోనూ ఆయనకు చోటు కల్పించకపోవడం తీవ్రంగా బాధించినట్లు తెలుస్తోంది. పార్టీ అధికార ప్రతినిధిగానూ ఆయనను తొలగించారు. చాలా రోజులుగా జరుగుతున్న పరిణామాల పట్ల ఆయన మనస్తాపానికి గురైనట్లు సన్నిహిత వర్గాల భోగట్టా. భంజ్దేవ్కూ పరాభవం జగదీష్, చిరంజీవులు వంటివారే కాదు.. సాలూరుకు చెందిన సీనియర్ నేత భంజ్దేవ్కూ పార్టీలో తీరని పరాభావమే ఎదురవుతోంది. ఇటీవల ఓ విచారణ విషయమై పోలీసులు నేరుగా ఆయన ఇంటికి వెళ్లడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. సొంత పార్టీ నేతల ఒత్తిడితోనే పోలీసులు వచ్చారని సన్నిహితుల వద్ద వాపోయారు. సుదీర్ఘ కాలంపాటు రాష్ట్రసాయిలో సేవలందించిన ఆయనకు..పార్టీ కమిటీలోనూ చోటు కల్పించలేదు. ఈ నేపథ్యంలో కష్టకాలంలోనూ తనతోపాటు నిలిచిన పార్టీ కార్యకర్తలతో నేడో, రేపో ఆయన సమావేశం కానున్నారని తెలుస్తోంది. వారితో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారని అంటున్నారు. అవమానాలు భరిస్తూ, పార్టీలో నే ఉండాలా? లేదా మరోచోటకు వెళ్లిపోవా లా? అన్నది కార్యకర్తల అభీష్టం మేరకు నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. -
నాటి సంస్కరణలతోనే నేటి సత్ఫలితాలు
తాను వ్యవసాయ కుటుంబంలో పుట్టి బూసాయవలస కేజీబీవీ జూనియర్ కళాశాలలో ఇంటర్ బైపీసీలో చేరాను. ఇక్కడ ఇంటర్లో 947 మార్కులు సాధించడం చాలా గర్వంగా ఉంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మామయ్య ప్రభుత్వ విద్యలో మార్పులు చేసి మంచి సంస్కరణలు తీసుకొచ్చారు. ఆయన కేజీబీవీలో ఇంటర్మీడియట్ ప్రవేశపెట్టకుంటే ప్రైవేటు కాలేజీల్లో డబ్బులు ఖర్చుపెట్టి నాలాంటి వారు చదవాల్సి వచ్చేది. అంత స్తోమత మాకు లేదు. జగన్ మామయ్య సంస్కరణలు నా చదువుకు ఎంతగానో ఉపకరించాయి. వెటర్నరీ డాక్టర్ కావడమే నా లక్ష్యం. –ఎస్,షర్మిల, సెకండియర్ టాపర్ విద్యార్థిని రామభద్రపురం: పేదరికం చదువుకు అడ్డుకాకూడదనే ఓ సంకల్పంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యా రంగంలో సంస్కరణలు తీసుకొచ్చింది. పేదింటి పిల్లలు ఉన్నత చదువులకు దూరం కాకూడదు.. ప్రతి ఇంట్లో ఇంజినీరు, డాక్టర్ ఉండాలన్న లక్ష్యంతో 2018లో జిల్లాలో ఒక్క కేజీబీవీలో మాత్రమే ఇంట ర్ విద్య ఉండగా.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని కేజీబీవీల్లో పాఠశాల స్థాయి నుంచి ఇంటర్ విద్యను ప్రవేశపెట్టారు. ఇప్పుడు 26 కేజీబీవీలను కార్పొరేట్ కళాశాలలకు దీటుగా తీర్చిదిద్దారు. నాడు – నేడు, అమ్మ ఒడి, వసతి, విద్యాదీవెన తదితర పథకాలు అమలు చేశారు. ఫలితంగా నేడు కేజీబీవీల్లో విద్యార్థినులు ఇంటర్లో సత్ఫలితాలు సాధించారు. ఇదంతా గత ప్రభుత్వం చలువేనని తల్లిదండ్రులు, విద్యార్థినులు ముక్తకంఠంతో పేర్కొంటున్నారు. జిల్లాలో రామభద్రపురం, బాడంగి, బొండపల్లి, గంట్యాడ, ఎల్.కోట, నెల్లిమర్ల, వేపాడ, గుర్ల, వంగర మండలాల్లో ఉన్న మొత్తం తొమ్మిది కేజీబీవీలు ఇంటర్ ఫస్టియర్లో వంద శాతం ఫలితాలు సాధించాయి. అలాగే రామభద్రపురం, బాడంగి, బొండపల్లి, గంట్యాడ, గుర్ల, జామి, కొత్తవలస, పూసపాటిరేగ, రేగిడి, తెర్లాం మండలాల్లో ఉన్న మొత్తం పది కేజీబీవీలు ఇంటర్ సెకండియర్లో వంద శాతం ఫలితాలు సాధించాయి. రామభద్రపురం, బాడంగి, బొండపల్లి, గంట్యాడ, గుర్ల మండలాలో ఉన్న కేజీబీవీలలో మొత్తం ప్రధమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు వంద శాతం ఉత్తీర్ణులయ్యారు. గత వైఎస్సార్సీపీ సర్కారు పాలనలో విద్యా రంగంలో చేసిన సంస్కరణలే నేడు ఇంటర్మీడియట్లో ఉత్తమ ఫలితాలకు దోహదం చేశాయని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. పేద బాలికలకు పైసా ఖర్చు లేకుండా వసతితో కూడిన నాణ్యమైన విద్య బోధనను ప్రభుత్వం నుంచి ఉచితంగా లభిస్తుండడంతో కేజీబీవీ జూనియర్ కళాశాలల్లో మరింత మంది చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. అప్పట్లో 26 కేజీబీవీలో ఒకొక్క జూనియర్ కళాశాలలో ఒక్కో గ్రూపు మాత్రమే ఏర్పాటు చేసింది. వీటిలో గ్రూపునకు 40 మంది చొప్పున ఇంటర్ ప్రధమ, ద్వితీయ సంవత్సరం కలిపి మొత్తంగా 1040 మంది విద్యార్థినులు చదివేందుకు అవకాశం ఉంది. అయితే కేజీబీవీ జూనియర్ కళాశాలల్లో కేజీబీవీ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులే కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థినులు చదివేందుకు అవకాశం కల్పించారు. దీంతో ప్రవేశాలు పెరిగాయి. బాడంగి, చీపురుపల్లి, గజపతినగరం, గరివిడి, మెంటాడ, కొత్తవలస, ఎల్.కోట, నెల్లిమర్ల కళాశాలలో ఎంపీసీ గ్రూపు నిర్వహిస్తున్నారు. రామభద్రపురం, భోగాపురం, బొండపల్లి, పూసపాటిరేగ, రాజాం, తెర్లాం, వంగర, విజయనగరం, గంట్యాడలో గల కళాశాలల్లో బైపీసీ గ్రూపులు ఉన్నాయి. సంతకవిటిలో సీఈసీ, ఆర్.ఆమదాలవలస, వేపాడ కళాశాలల్లో కంప్యూటర్ సైన్స్ ఎడ్యుకేషన్(సీఎస్ఈ), బొబ్బిలి, డెంకాడ, జామి కళాశాలల్లో ఎంపీహెచ్డబ్ల్యూ, గుర్ల కళాశాలలో ఫిజియోథెరిఫీ, దత్తిరేజేరు కేజీబీవీ కళాశాలలో ప్రైమరీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ గ్రూపులు నిర్వహిస్తున్నారు. టీచర్ కావాలన్నదే నా లక్ష్యం. బూసాయవలస కేజీబీవీ జూనియర్ కాలేజీ లో ఇంటర్మీడియట్ బైపీసీలో 927 మార్కులు సాధించాను. సెకండ్ టాపర్గా నిలిచాను. గత ప్రభుత్వ చలువతో పాటు అధ్యాపకుల బోధనతో ఇది సాధ్యమైంది. – ఎన్.మోహిని, కేజీబీవీ విద్యార్థిని -
25, 26న కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి మహోత్సవాలు
విజయనగరం టౌన్: వైశాఖ శుద్ధ దశమి ఆదివారం వాసవీ కన్యకాపరమేశ్వరి జయంతి సందర్భంగా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవాలయం పాలకమండలి అధ్యక్షుడు నారాయణం శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు కార్యాలయం ఆవరణలో దేవాలయ గౌరవాధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి ఉత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం నారాయణం శ్రీనివాస్ మాట్లాడుతూ జయంతి ఉత్సవాలను రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టామన్నారు. 25న 108 మంది దంపతులతో అష్టోత్తర శత కలశ ప్రదక్షిణ, 26న అమ్మవారికి ప్రత్యేకాభిషేకాలు, బంగారు చీర, వజ్రకీరీటంతో విశేష అలంకరణ ఉంటుందన్నారు. 108 రకాల పిండివంటలతో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి సారె సమర్పణ, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కోలాటం, కర్రసాము, పులివేషాలతో అమ్మవారి ఊరేగింపు పండగ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు ఉసిరికల చంద్రశేఖర్, కాపుగంటి ప్రకాష్, కుమ్మరిగుంట శ్రీనివాస్, రవ్వా శ్రీనివాస్, వెత్సా సత్యనారాయణమూర్తి, మామిడిపాక జగన్, విజ్జపు వెంకట శ్రీనివాసరావు, బలభద్రుని నానాజీ, మురుగన్, బుడ్డెపు వెంకటరావు, పెంటపాటి కామరాజు, వెత్సా శ్రీనివాస్, గోపాలకృష్ణ, బాల తదితరులు పాల్గొన్నారు. -
వాల్మీకి రామాయణంపై ప్రకాష్రాజ్ వ్యాఖ్యలు సరికాదు
● వాల్మీకి రామాయణం పరిశోధనా కేంద్రం డైరెక్టర్, ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్ విజయనగరం రూరల్: ప్రముఖ సినీ నటుడు ప్రకాష్రాజ్ వాల్మీకి రామాయణంపై చేసిన అవమానకరమైన, వాస్తవ విరుద్ధమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, రామనారాయణంలోని వాల్మీకి రామాయణం పరిశోధనా కేంద్రం డైరెక్టర్, ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్ మండిపడ్డారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాముడిని ఉత్తరం నుంచి దక్షిణానికి వలస వచ్చిన కూలీగా చిత్రీకరించడం ప్రకాష్రాజ్కు ఈ మహా ఇతిహాసం యొక్క ఆధ్యాత్మిక, సాంస్కృతిక, నాగరికత పరమైన గొప్పతనంపై సరైన అవగాహన లేమిని స్పష్టం చేస్తుందన్నారు. వాల్మీకి రామాయణం ఒక సాధారణ కావ్యం కాదని, ఇది భారతదేశ నైతిక విలువలకు, కుటుంబ వ్యవస్థకు, సమాజ నిర్మాణానికి పునాదని పేర్కొన్నారు. శ్రీరాముడి జీవితం ద్వారా ధర్మం, న్యాయం, పాలనా విలువలు నేటికి మనకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని గుర్తు చేశారు. భారతీయ కుటుంబ వ్యవస్థ, దాని నైతిక విలువలు, సంప్రదాయాలు, సంస్కృతి, సామాజిక ఐక్యత న్యాయం, సంక్షేమం ఆధారంగా ఉన్న ప్రజా విధానాలు భారత రాజ్యాంగంలోని మౌలిక హక్కుల ఆత్మ అని అన్నారు. ఇలాంటి బాధ్యతారహిత వ్యాఖ్యలు ప్రజల మధ్య విభేదాలను రగిలించే ప్రమాదం ఉందని, జాతీయ ఐక్యతను దెబ్బతీస్తాయని మండిపడ్డారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రముఖులు ఇలాంటి విషయాలలో మరింత బాధ్యతతో వ్యవహరించాలని హితవు పలికారు. ఇలాంటి గొప్ప గ్రంథాలపై వ్యాఖ్యలు చేసే ముందు సరైన అధ్యయనం, అవగాహన అవసరమని, తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు భావోద్వేగాలను దెబ్బతీయడమే కాకుండా, సత్యాన్ని కూడా వక్రీకరిస్తాయని అన్నారు. తన వ్యాఖ్యల వల్ల కలిగిన నష్టాన్ని సరిదిద్దడానికి, రామాయణంలోని మహత్తర విలువలను ప్రతిబింబించే ఒక సార్థక కళాఖండం (సినిమా/నాటకం) రూపొందించడం ఉత్తమ మార్గమని మేము భావిస్తున్నామని పేర్కొన్నారు. -
దిగుబడులు కొండంత.. కొనుగోలు గోరంత..!
● వేల టన్నుల అపరాల దిగుబడి ● జిల్లాలో సుమారు 38,373 మెట్రిక్ టన్నుల దిగుబడి ● ప్రభుత్వం కొనుగోలు చేసింది 39 టన్నులు మాత్రమే.. ● దిగుబడుల్లో పది శాతం కూడా కొనుగోలు చేయని సర్కార్ ● తక్కువ ధరకే వ్యాపారులకు విక్రయించిన రైతులు విజయనగరం ఫోర్ట్: కొండను తవ్వి ఎలుకను పట్టిన సామెత మాదిరి తయారైంది టీడీపీ సర్కార్ పరిపాలన తీరు. రబీ సీజన్లో రైతులు పండించిన అపరాలు (పెసర, మినుము) కొనుగోలు చేసేందుకు టీడీపీ సర్కార్ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల తీరు ఇలానే ఉంది. జిల్లాలో పెసర, మినుము పంటల ఉత్పత్తి వేలాది టన్నులు వస్తే అందులో కనీసం 10 శాతం పంటను కూడా కొనుగోలు చేయలేదు. దీంతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల రైతులకు ఒరిగిన ప్రయోజనం లేకుండా పోయింది. దీనికి తోడు పంటను రైతులు 60 నుంచి 70 శాతం విక్రయించుకున్న తర్వాత కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీని వల్ల రైతులు తక్కువ ధరకే వ్యాపారులకు పంటను విక్రయించుకున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసింది 39.2 మెట్రిక్ టన్నులే.. జిల్లాలో అపరాల దిగుబడులు ఆశించిన విధంగానే వచ్చాయి. మొత్తంగా 38,373 మెట్రిక్ టన్నుల దిగుబడులు వచ్చాయి. అయితే టీడీపీ సర్కార్ జిల్లాలో నాలుగు అపరాల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. జామి మండలం విజినిగిరి, సంతకవిటి, గజపతినగరం, బొబ్బిలిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇందులో విజినిగిరి మినహా మిగిలిన ఎక్కడా ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదు. విజినిగిరి కొనుగోలు కేంద్రంలో 39.2 మెట్రిక్ టన్నులు మినుములు మాత్రమే కొనుగోలు చేశారు. రైతులకు దక్కని మద్దతు జిల్లాలో ఆలస్యంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల రైతులకు మద్దతు ధర కూడా లభించలేదు. అమావాస్య వెళ్లిన ఆరు నెలలు తర్వాత అల్లుడు వచ్చిన సామెత చందాన రైతులు పంట విక్రయించుకున్న తర్వాత కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. దీంతో రైతులకు ఎటువంటి ప్రయోజనం చేకూరలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రైతులు ఎంతో శ్రమించి ఆరుగాలం కష్టపడి పంటలు దిగుబడులు సాధిస్తుంటే ప్రభుత్వ తీరుతో నష్టాలే తప్ప లాభాల బాట పట్టలేకపోతున్నామన్న ఆవేదన రైతుల్లో నెలకొంది. తక్కువ ధరకే.. అపరాలు (పెసర, మినుము) కొనుగోలు కేంద్రాలు ఏర్పాటులో జాప్యం వల్ల వ్యాపారులు రైతుల నుంచి పంటను తక్కువ ధరకే కొనుగోలు చేశారు. ప్రభుత్వం మద్దతు ధర క్వింటాకు పెసలు రూ. 8,768, మినుములు క్వింటా మద్దతు ధర రూ. 7800గా నిర్ణయించింది. వ్యాపారులు మాత్రం క్వింటాకు పెసలు రూ.7 వేలు, మినుములు రూ. 6800లకు కొనుగోలు చేశారు. దీని వల్ల క్వింటాకు రైతులు పెసలకు రూ.1800, మినుములు రూ. 1000 వరకు నష్టపోయారు. మూడు నాలుగు క్వింటాళ్లు పండించిన రైతులు అయితే పెసలు రూ. 5400, మినుములు 3 వేల వరకు నష్టపోయారు. పంట చేతికి వచ్చిన ఆరంభ దశలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టయితే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర వచ్చేదని రైతులు చెబుతున్నారు. పెసర, మినుము పంటలకు సంబంధించి జిల్లాలో నాలుగు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. జామి మండలం విజినిగిరి కొనుగోలు కేంద్రంలో మినుములు 39.2 మెట్రిక్ టన్నుల కొనుగోలు చేశాం. మిగిలిన కేంద్రాల్లో కొనుగోలు జరగలేదు. – ఎన్.వెంకటేశ్వరావు, జిల్లా మేనేజర్, మార్క్ఫెడ్ -
బతుకు వేటపై వేటు
వంగర: మండలంలోని మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టులో చేపలు వేట చేస్తూ జీవనం సాగిస్తున్న మత్స్యకారుల బతుకుల్లో అంధకారం అలుముకుంది. చేపల వేట నిషేధం అమలు చేయడంతో వారి కుటుంబాలు జీవనాధారం లేక రోడ్డున పడ్డాయి. కొట్టిశకు చెందిన శ్రీసీతారామ ఫిషర్మెన్ సొసైటీ సభ్యులు ఈ ప్రాజెక్టులో నిత్యం చేపలు వేట సాగిస్తున్నారు. ఈ సొసైటీలో ఉన్న సుమారు 500 మంది మత్స్యకారులకు ఈ ప్రాజెక్టే జీవనాధారం. గతంలో ప్రభుత్వానికి లీజు సొమ్ము చెల్లించకపోవడంతో మత్స్యశాఖ అధికారులు ప్రాజెక్టులో చేపల వేట నిషేధిస్తున్నట్లు వెల్లడించారు. గతంలో జరిగిన తప్పులకు తమను బాధ్యులను చేయవద్దని, తాజాగా మత్స్యకార సొసైటీ నూ తనం కార్యవర్గం ఎన్నికై న తరువాత చెల్లించాల్సిన లీజు మొత్తం చెల్లిస్తామని వారు చెబుతున్నారు. దీనికి అధికారులు ససేమిరా అనడంతో మత్స్యకార కుటుంబాల్లో చీకటి అలుముకుంది. ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన బీసీలు ఇదే ప్రాంతంలో మత్స్యకారులుగా మారి జీవనం సాగిస్తుండగా.. వందల సంఖ్యలో ఎస్సీ, ఎస్టీలకు కూడా ప్రాజెక్టులో చేపల వేటే జీవనాధారం. రూ.63 లక్షలు చెల్లించాల్సిందే ప్రాజెక్టులో చేపల వేట నిషేధం అమలులో ఉంది. గడిచిన ఐదేళ్ల నుంచి మత్స్యకార సొసైటీ ద్వారా ప్రభుత్వానికి చెల్లించాల్సిన లీజు సొమ్ము సకాలంలో చెల్లించలేదు. 1431, 1432, 1433, 1434 ఫసలీలకు సంబంధించి గత ఏడాది జూలై నాటికి సుమారు రూ.45 లక్షలు చెల్లించాల్సి ఉంది. మత్స్యకార సొసైటీ కార్యవర్గం పదవీ కాలం ముగియడంతో ఆ పరిస్థితి మరింత జఠిలమైంది. అయితే గత ఏడాది నవంబర్ 11వ తేదీన నూతన కార్యవర్గం ఎన్నికై ంది. పాత బకాయిల చెల్లింపులో వెసులుబాటు ఇవ్వాలని, ప్రస్తుతం చెల్లించాల్సిన 1435 ఫసలీ డబ్బులు రూ.18,21,817 చెల్లిస్తామని సంఘం సభ్యులు అధికారుల ఎదుట వెల్లడించారు. దీనిపై గత ఏడాది నవంబర్లో విశాఖపట్నం జిల్లాకు చెందిన జేడీ లక్ష్మణరావు దర్యాప్తు చేపట్టి నివేదికను ప్రభుత్వానికి, మత్స్యశాఖ కమిషనర్ ద్వారా అందించారు. అప్పటి నుంచి ఆ దర్యాప్తు నివేదిక ఏమైందో తెలియని పరిస్థితి, ఏమి చర్యలు తీసుకున్నారో తెలియని దుస్థితి నెలకొంది. తాజాగా నూతన కార్యవర్గం ఎన్నిక జరిగినప్పటికీ ప్రాజెక్టులో చేపల వేట చేసేందుకు ఇటీవల ఓపెన్ ఆక్షన్ పెడతామని అధికారులు ముందస్తు ప్రకటన జారీ చేశారు. దీంతో మత్స్యకారులంతా ప్రతిఘటించడంతో అధికారులు వెనక్కి తగ్గారు. 1435 ఫసలీ సొమ్ము చెల్లించి మత్స్యకారులంతా చేపల వేటకు సిద్ధమని అధికారులకు తెలియజేసినప్పటికీ గత పాత నాలుగు ఫసలీల సొమ్ము రూ.45 లక్షలు, ప్రస్తుతం కొత్త ఫసలీ సొమ్ము మొత్తం రూ.18.21 లక్షలు కలిపి మొత్తం రూ.63 లక్షలు చెల్లించాల్సిందేనని మత్స్యశాఖ అధికారులు తేల్చి చెబుతున్నారు. దీంతో మత్స్యకారుల్లో గందరగోళంలో నెలకొంది. చేపల వేట నిషేధిస్తే తమ బతుకులు రోడ్డున పడతాయని, నిషేధాన్ని ఎత్తివేయకపోతే ఉద్యమబాట పట్టే యోచనలో మత్స్యకారులున్నట్లు తెలుస్తోంది. మత్స్యకారుల బతుకుల్లో అంధకారం మడ్డువలసలో చేపల వేట నిషేధం పాత బకాయిల పేరుతో లీజు ఆర్డర్ నిలుపుదల సమస్య పరిష్కరించాలంటూ 500 మంది మత్స్యకారుల డిమాండ్చేపల వేట నిషేధిస్తే ఎలా? ప్రాజెక్టులో చేపలు వేట చేసి జీవనం సాగించే తమకు వేట నిషేధం చేస్తే జీవనం కష్టతరమవుతుంది. 500 మత్స్యకార కుటుంబాలు రోడ్డున పడతాయి. గత నాలుగు ఫసలీల లీజు సొమ్ము చెల్లించనంత వరకు అధికారులు నిద్రావస్థలో ఉండడమే ప్రధాన సమస్య అయింది. పాత బకాయిలు కలిపి తమను కట్టమంటే ఎలా కట్టగలం. మల్లీడ తవిటందొర, మత్స్యకారుడు, సంగాం అన్ని ఫసలీల సొమ్ము చెల్లించాలిగతంలో బకాయి పడిన మొత్తం సొమ్ముతో పాటు ప్రస్తుతం 1435వ ఫసలీ సొమ్ము చెల్లించాలి. చేపల వేట నిషేధం వాస్తవమే. ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు అమలు చేస్తున్నాం. మత్స్యకారుల పట్ల మాకు ఏమీ కక్ష లేదు. మత్స్యకారులు సమస్యపై ఫిర్యాదు చేస్తే ఉన్నతాధికారులకు నివేదిస్తాం. సీహెచ్.వి.వి.ప్రసాదరావు, అసిస్టెంట్ ఫిషరీస్ ఇన్స్పెక్టర్, రాజాం.మత్స్యశాఖ అధికారుల కక్ష మత్స్యకారులపై అధికారులు కక్ష గడుతున్నారు. ప్రస్తుత కాలానికి లీజు సొమ్మును చెల్లించేందుకు మా సంఘం సభ్యులంతా ఏకతాటిపైకి వచ్చాం. గతంలో ఉన్న బకాయిలు ఇప్పుడు చెల్లించమంటే ఎలా చెల్లించగలం. ఉన్నతాధికారులు పునరాలోచించి చేపల వేట నిషేధం ఎత్తివేయాలి. 1435 ఫసలీ సొమ్ము చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాం. అధికారులు లీజు ఆర్డర్ ఇవ్వాలి. కోల రాము, మత్స్యకారుడు, మగ్గూరు. -
గిరిజనులకు రేషన్ కష్టాలు
● సింధునగరం, పెద్దూరు గ్రామస్తులకు తప్పని పాట్లు ● స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయాలంటున్న గిరిజనులువీరఘట్టం: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రేషన్ కార్డు దారులకు గడప వద్దకే రేషన్ బండి వచ్చి రేషన్ బియ్యాన్ని అందించేది. నేడు చంద్రబాబు ప్రభుత్వంలో రేషన్ బియ్యం కోసం గడపదాటి కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వస్తోందని గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. మండలంలోని దశుమంతపురం పంచాయతీ పరిధి పెద్దూరు, సింధునగరంలలో ప్రజలు తమ రేషన్ సరుకుల కోసం సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న దశుమంతపురం గ్రామానికి వెళ్లి ప్రతి నెలా తెచ్చుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. రేషన్ సరుకుల కోసం ఈ రెండు గ్రామాల గిరిజనులు ప్రతి నెలా నానా ఇబ్బందులు పడుతున్నా వారి గోడు వినే నాథుడు కరువయ్యాడని వాపోతున్నారు. ఇదీ పరిస్థితి మండలంలోని దశుమంతపురం గ్రామపంచాయతీలో పెద్దూరు, సింధునగరం హేమ్లెట్ గ్రామాలుగా ఉన్నాయి. పెద్దూరులో 48 మంది కార్డుదారులు, సింధునగరంలో 24 మంది కార్డుదారులు ఉన్నారు. వారికి ప్రతినెలా 1985 కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఈ బియ్యం దశుమంతపురంలో ఉన్న రేషన్ షాపు వద్దకు వెళ్లి తీసుకునేందుకు రెండు మార్గాలు ఉన్నాయి. గ్రామం నుంచి పంట పొలాల్లో, నాగావళి ఎడమకాలువను దాటుకుని నడిచి వెళ్తే 5 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి.ఇంకొకటి వీరఘట్టం,చలివేంద్రి గుండా రోడ్డు మార్గంలో వెళ్తే 15 కిలో మీటర్లు ప్రయాణం చేయాలి. ఇలా ఈ రెండు మార్గాల గుండా బియ్యం తెచ్చుకునేందుకు ఈ రెండు గ్రామాల గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారు. తమ ఇబ్బందులు గుర్తించి గ్రామంలో స్టాక్ పాయింట్ పెట్టి బియ్యం పంపిణీ చేయాలని ఈ రెండు గ్రామాల గిరిజనులు కోరుతున్నారు. -
సాక్షి విలేకరి మృతి
దత్తిరాజేరు: ప్రముఖ పత్రికలలో పనిచేసిన అనుభవం ఉన్న సీనియర్ పాత్రికేయుడు, ప్రస్తుతం సాక్షి దినపత్రికలో కలెక్టరేట్ డేట్లైన్తో వార్తలు రాస్తున్న విలేకరి సుంకరి రాజేశ్వరరావు(శివ)(49)ఆదివారం ఉదయం ఆనారోగ్యంతో విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మృతిచెందారు. కొద్ది నెలల క్రితం ఆనారోగ్యానికి గురైన ఆయన చికిత్స పొందుతూ మృతిచెందారు. మృతుడికి వెలుగులో పనిచేస్తున్న భార్య ఇందిర, కుమారుడు ఉన్నారు. మృతి వార్త తెలుసుకున్న వెంటనే ఆర్కే టౌన్షిప్లో ఉన్న ఆయన ఇంటి వద్దకు జర్నలిస్టు సంక్షేమ సంఘం అధ్యక్షుడు లింగాలనర్సింగరావు, జిల్లా వ్యాప్తంగా పాత్రికేయులు పెద్ద ఎత్తున చేరుకుని మృతదేహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు, -
సీసీలా..సర్వేయర్లా..!
● డిప్యుటేషన్పై సర్వేయర్లుగా డీఆర్డీఏ సీసీలు ● కొద్ది నెలల క్రితం మళ్లీ సీసీలుగా డీఆర్డీఏకు ● వారిలో కొంతమంది రెవెన్యూ శాఖలో సర్వేయర్లుగా కొనసాగుతున్నట్లు ఆరోపణలు విజయనగరం ఫోర్ట్: డీఆర్డీఏ (జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ) పరిధిలో పనిచేసే కమ్యూనిటీ కో ఆర్డినేటర్ల(సీసీ)లో కొంతమంది వ్యవహారం విమర్శలకు తావిస్తుంది. డీఆర్డీఏ శాఖలో పనిచేస్తున్న 12మంది సీసీలు సర్వేయర్లుగా రెవెన్యూ శాఖకు డిప్యుటేషన్పై వెళ్లారు. కొద్ది నెలల క్రితం తిరిగి డీఆర్డీఏకు వచ్చేశారు. దీంతో వారిని సీసీలుగా డీఆర్డీఏ అధికారులు వివిధ మండలాల్లో నియమించారు. అయితే రెవెన్యూశాఖ నుంచి డీఆర్డీఏకు వెనక్కి వచ్చినప్పటికీ కొంతమంది సీసీలు సర్వేయర్లుగా రెవెన్యూ శాఖలోనే కొనసాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అక్కడ రెవెన్యూ అధికారులతో సత్ససంబంధాలు కొనసాగిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా సర్వే చేయడానికి వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఓవ్యక్తి వారిపై డీఆర్డీఏ అధికారులకు, సీఎంఓకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా డీఆర్డీఏ అధికారులు దాచినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరోపణలు వచ్చిన తరువాత ఓ సీసీని విజయనగరం నుంచి వేరే మండలానికి బదిలీ చేసినట్లు సమాచారం.రెవెన్యూలో తప్పులతో మాకేం సంబంధంరెవెన్యూ శాఖలో సర్వేయర్లుగా చేసినప్పుడు వారు చేసిన తప్పుల గురించి మాకేం సంబంధం. రెవెన్యూ శాఖ నుంచి తిరిగి వచ్చేసిన తర్వాత వారిని సీసీలుగా నియమించాం. కొంతమంది సీసీలు సర్వేయర్లుగా చలామణీ అవుతున్న విషయం తెలియదు. ఓ సీసీని వేరే కారణంతో బదిలీ చేశాం. శ్రీనివాసపాణి, డీఆర్డీఏ పీడీ -
చిట్టిబాబు సేవలకు ఏయూలో ఘనసత్కారం
విజయనగరం టౌన్: ఆంధ్రాయూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని విశాఖలోని ఏయూ కన్వెన్షెన్లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో సోషల్ వర్క్ విభాగంలో పూర్వ పరిశోధక విద్యార్థిగా ఉన్న జిల్లాకు చెందిన పెంకి చిట్టిబాబుకు ఘనసత్కారం జరిగింది. ఇటీవల ఐక్యరాజ్యసమితి దోహాలో నిర్వహించిన రెండవ సోషల్ సమ్మిట్లో పాల్గొనడమే కాకుండా, బాలల హక్కులు, దళిత ఆదివాసీ హక్కులపై సుబ్రహ్మణ్యం జా తీయ అవార్డు పొందిన చిట్టిబాబుకు యూనివర్సిటీ రెక్టార్ పి.కింగ్ చేతుల మీదుగా అభినందించారు. సోషల్ వర్క్ విభాగాధిపతి ఆచార్య ఎస్.హరినాథ్, ఆచార్య ఆర్.స్వామిదాస్, విశ్రాంత ప్రొఫెసర్లు టి.శోభ, పి. అర్జున్, కె.విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.బొబ్బిలి రూరల్: పారాది వద్ద వేగావతి నదిలో అక్రమంగా ఇసుకను తవ్వి తరలిస్తున్న 5 ఇసుక ట్రాక్టర్లను ఆర్ఐ రామకుమార్ ఆదివారం పట్టుకున్నారు. కొద్ది రోజులుగా వేగావతి నదిలో ఇష్టానుసారం ఇసుక తవ్వకాలు జరగుతున్నాయని స్థానికుల నుంచి అందిన సమాచారం మేరకు తహసీల్దార్ ఎం.శ్రీను ఆదేశాలతో తమ సిబ్బందితో దాడులు చేయగా అలజంగి వద్ద రెండు,పారాది వద్ద మూడు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుబడ్డాయని ఆర్ఐ తెలిపారు.పట్టుకున్న ట్రాక్టర్లను తహసీల్దార్ కార్యాలయానికి తరలించామని, సోమవారం ఆర్డీఓ ఆదేశాలతో జరిమానా విధిస్తామని తెలిపారు. విద్యార్థులు నైపుణ్యాలు పెంపొందించుకోవాలినెల్లిమర్ల రూరల్: విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సెంచూరియన్ విశ్వ విద్యాలయం ఉపాధ్యక్షుడు డీఎన్ రావు సూచించారు. ఈ మేరకు నెల్లిమర్ల మండలంలోని టెక్కలి సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో ఆదివారం నిర్వహించిన కౌశల్ సాథీ కార్యక్రమంలో వీసీతో పాటు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువతలో నైపుణ్యాలు ఉంటే ఉపాధి అవకాశాలు సులభంగా లభిస్తాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం విద్యార్హతలతో ఉద్యోగాలు పొందడం కష్టమవుతోందని, నైపుణ్యాల ఆధారిత ఉపాధి అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయన్నారు. అందువల్ల యువత తమకు ఇష్టమైన రంగంలో ప్రావీణ్యం సంపాదించుకోవాలని సూచించారు. వీసీ ప్రశాంత కుమార్ మాట్లాడుతూ రెగ్యులర్ కోర్సులతో పాటు నైపుణ్య కోర్సులకు విశ్వవిద్యాలయం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అనంతరం పలువురు విద్యార్ధులకు కౌశల్ సాథీ ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ పల్లవి, అధ్యాపకులు పాల్గొన్నారు. అలరించిన చిన్నారుల నృత్య ప్రదర్శన నెల్లిమర్ల: స్థానిక శ్రీరామకృష్ణ ధ్యాన మందిరం వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం చిన్నారులు చేసిన భరతనాట్య ప్రదర్శన అలరించింది. అంతకుముందు భీమునిపట్నానికి చెందిన ఆధ్యాత్మిక ప్రవచనకర్త శ్రీరామకృష్ణానంద చేసిన ప్రవచనాలు ఆలోచింపజేశాయి. కార్యక్రమంలో సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు టి.జగన్నాథరాజు, బి.వంశీపావని తదితరులు పాల్గొన్నారు. -
పక్కాగా జనగణన చేయాలి
● కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర్రెడ్డి సీతానగరం: గ్రామాల్లో పొదుపు సంఘాల సభ్యులు చేస్తున్న 2026 జనగణన పక్కాగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర్రెడ్డి అన్నారు. ఈ మేరకు సీతానగరం మండలంలోని సూరంపేట పంచా యతీ, మరిపివలస రామమందిరంలో వెలుగు ఏపీఏ కె.పద్మ పర్యవేక్షణలో పొదుపు సంఘాల సభ్యులు చేస్తున్న వ్యక్తిగత జన గణన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొదుపుసంఘాల సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న జనగణన పక్కాగా ఉన్నప్పుడే ప్రణాళికలు సక్రమంగా ఉంటాయని తెలియజేశారు. ఎన్యూమరే్షన్ చేయడం వల్ల ఆర్థిక వనరులు సమకూర్చుకునేందుకు, అభివృద్ధి పనులు మంజూరు చేయడానికి, సంక్షేమ పథకాల మంజూరు, ఉపాధి అవకాశాలు కల్పించడానికి అవసరమైన ప్రణాళికలు తయారు చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. వాటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని జనగణన చేయాలని సూచించారు. కార్యక్రమంలో వివిధశాఖల అధికార సిబ్బంది, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు. -
అక్షయ తృతీయకు ధరల సెగ
విజయనగరం: శుభకార్యమైనా.. వివాహ వేడుకై నా పసిడి మెరవాల్సిందే.. వెండి మురవాల్సిందే. పేదింట్లో అయినా, కలవారి కుటుంబమైనా ఎవరి తాహతుకు తగ్గట్టు వారు బంగారం కొనుగోలు చేయడం సంప్రదాయం. ఇక పెళ్లిళ్ల సీజన్, అక్షయ తృతీయ రోజున పుత్తడికి గిరాకీ మరింత పెరుగుతుంది. అదే సమయంలో ధర ౖపైపెకి చేరుతోంది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరలు పెరిగి సామాన్యులకు అందనంత ఎత్తుకు వెళ్లిపోతున్నాయి. అక్షయ తృతీయ పర్వదినం ఇక అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా ధనిక.. పేద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో కొంత బంగారం కొనుగోలు చేస్తారు. గతేడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం ధరలు రెట్టింపయ్యాయి. ఏటా సంప్రదాయంగా కొనుగోలు చేసేవారు ప్రస్తుతం పెరిగిన ధరల నేపథ్యంలో గతేడాదిలో కొన్న దానిలో సగమైనా తీసుకుందామని యోచిస్తున్నారు. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో దూరంగానే ఉంటున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో.. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో పట్టణ ప్రాంతాల్లో వస్త్రాలు, ఇతర సామగ్రి కొనుగోళ్లు ఊపందుకున్నాయి. గతంలో సామాన్యుల వివాహ వేడుకకు అన్ని ఖర్చులు కలిపి మొత్తంగా రూ.10 లక్షలలోపు పూర్తయ్యేది. ప్రస్తుతం అదే తరహాలో జరిపించడానికి రూ.15 లక్షల నుంచి రూ.17 లక్షల వరకు వెచ్చించాల్సి వస్తోంది. గడిచిన రెండు మూడేళ్లలో వ్యయం 60 శాతం పెరిగినట్లయింది. ఈ మోయలేని భారం వల్ల బంగారు ఆభరణాలకు దూరం చేస్తుంది. ఈసారి అంతంతే... ఉమ్మడి జిల్లాలో బంగారం వ్యాపారానికి విజయనగరం పెట్టింది పేరు. సుమారు 12 వరకు కార్పొరేట్ సంస్థలతో పాటు చిన్న, చితక అన్నీ కలిపి మరో 300 వరకు దుకాణాలు ఉన్నాయి. బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం, చీపురుపల్లి తదితర ప్రాంతాల్లో ఇప్పటికే అమ్మకాలు పడిపోయాయి. గత ఏడాదితో పొలిస్తే అంత సందడి కనిపించడం లేదు. ఇళ్లలో ఉన్న బంగారాన్ని విక్రయించి వస్తువులు చేయించుకోడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. మరీ చిన్నదుకాణాలు వెలవెలబోతున్నాయి. గతంలో తక్కువ రేటులో బంగారం కొని ఉంచుకున్న వారు ఈ గరిష్ఠ ధరలో విక్రయించి, పెట్టుబడులు ఇతర మార్గాల్లోకి మళ్లిస్తున్నారు. పెరిగిన బంగారం ధరలతో వ్యాపారం బాగా తగ్గిపోయింది. ఊహించని విధంగా ధరలు పెరగడంతో పేద, మధ్య తరగతి ప్రజలు కొనే పరిస్థితి లేదు. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో బంగారం దిగుబడి తగ్గడంతో పాటు మూడుసార్లు పెరగడం ఈ రేట్లు పెరుగుదలకు ప్రధాన కారణం. యుద్ధం ముగిసేంత వరకు రేట్లు ఇలానే ఉంటాయి. ఆ తర్వాత తగ్గే అవకాశాలున్నాయి. కొన్ని నెలల్లోనే 24 క్యారెట్ల బంగారం ఒక్కసారిగా రూ.లక్ష దాటడంతో వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడింది. ఈ పెళ్లిళ్ల సీజన్లో మా అంచనాలు తల్లకిందులయ్యాయి. పెద్ద వస్తువులు కొనేవారు తగ్గిపోయారు. అవసరమైన చిన్న వస్తువులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. – మాధవ, గోల్డ్ మర్చంట్, విజయనగరం రోజురోజుకు పెరుగుతున్న పసిడి ప్రస్తుతం తులం బంగారం ధర రూ.2 లక్షలకు చేరువైంది. 24 క్యారెట్ల బంగారం రూ.1,80,200, 22 క్యారెట్ల బంగారం ధర తుల రూ. 1,65800 పలుకుతోంది. అదే వెండి కిలో రూ.2,65,000 అమ్ముతుండటంతో కొనుగోలుదారులు బెంబేలెత్తి పోతున్నారు. గతంలో రూ.10 లక్షల వరకు పెళ్లికి ఖర్చవగా ఇందులో రూ.3 లక్షల వరకు బంగారానికే కేటా యించేవారు. ప్రస్తుతం ఇతర ఖర్చులు తగ్గించుకుని బంగారానికి ఎక్కువ మొత్తం కేటాయించాల్సి వస్తోందని వినియోగదారులు చెబుతున్నారు. -
ఆటోలో నుంచి జారిపడి యువతి మృతి
గంట్యాడ: కుటుంబానికి తోడుగా నిలవాలని ఆశించిన ఓ పేదింటి యువతి ప్రాణం రోడ్డు ప్రమాదంలో కరిగిపోవడం గంట్యాడ మండలాన్ని కలిచివేసింది. గంట్యాడ మండలంలోని పెదవేమలి గ్రామ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో నరవ గ్రామానికి చెందిన బోనెల రేణుక(18) మృతి చెందింది. ఈ ప్రమాదంపై స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..విజయనగరంలో ఓ బట్టల షాపులో సేల్స్ గర్ల్గా పనిచేస్తున్న రేణుక..నిర్వాహకుల సూచనల మేరకు ముకపాక, సిరిపురం, పెదవేమలి గ్రామాల్లో ప్రచారం కోసం సహచరులతో కలిసి ఆటోలో బయలుదేరింది. ప్రచారం ముగించుకుని తిరుగు ప్రయాణంలో పెదవేమలి సమీపంలో ఆటోలో నుంచి అనుకోకుండా జారిపడింది. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయమై అపస్మారక స్థితికి చేరుకుంది. ఆమె పరిస్థితిని గమనించిన సహచరులు వెంటనే అదే ఆటోలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గమధ్యంలోనే రేణుక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని గంట్యాడ ఎస్సై డి.సాయికృష్ణ తెలిపారు. కుటుంబానికి ఆదరణ అవసరం పేద కుటుంబానికి చెందిన రేణుక, చిన్న వయస్సులోనే కుటుంబ భారం తగ్గించాలని ఉద్యోగం చేస్తూ కుటుంబానికి ఆధారంగా నిలబడాలని కృషి చేసింది. అలాంటి సమయంలోనే జరిగిన ఈ దుర్ఘటన గ్రామాన్ని విషాదంలో ముంచెత్తింది. గ్రామస్థులు, స్థానికులు ప్రభుత్వాన్ని వేడుకుంటూ బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం, పరిహారం అందించాలని కోరుతున్నారు. గుండెపోటుతో పీహెచ్సీ ఉద్యోగిని..జియ్యమ్మవలస రూరల్: జియ్యమ్మ వలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీహెచ్ఓగా పనిచేస్తున్న బిడ్డిక హైమావతి శుక్రవారం రాత్రి తన స్వగ్రామం గుమ్మలక్ష్మీపురంలో గుండెపోటుతో మరణించారు. ఆమె రెండేళ్ల క్రితం పశ్చిమగోదావరి జిల్లా నుంచి బదిలీపై జియ్యమ్మవలస పీహెచ్సీకి వచ్చారని, మరో 40 రోజుల్లో ఉద్యోగ విరమణ చేయనున్నారని ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది తెలిపారు. తోటి ఉద్యోగులతో సన్నిహితంగా ఉంటూ కష్టసుఖాల్లో పాలుపంచుకునేవారని తన కుమారుడి వివాహం చేసే పనిలో రెండు రోజులుగా సెలవులపై వెళ్లారని, ఇంతలో ఆమె మృతి చెందడంపై సహచర సిబ్బంది, వైద్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆమెకు ఆత్మశాంతి కలగాలని వారంతా కోరారు. -
స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాల ఏర్పాట్లలో వివక్ష తగదు
విజయనగరం టౌన్: స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాల ఏర్పాట్లలో వివక్ష చూపడం తగదని జిల్లా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాల ఐక్యవేదిక నాయకులు చోడి ఆదినారాయణ, రొంగలి రామారావు, ఇప్పిలి రామారావు, బూర ఐశ్వర్య, టీవీ.దుర్గారావు, దిమిలి పైడిరాజు, షాజహాన్లు పేర్కొన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక ప్రజా గ్రంథాలయంలో ఆదివారం లచ్చన్న చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ తన జీవితాంతం కార్మికులు, కర్షకుల, పేద, దళితుల పక్షాన నిలబడి ఆనాటి వ్యవస్ధలకు, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేసిన మహాయోధుడని కొనియాడారు. అటువంటి మహానీయుడి విగ్రహాన్ని జిల్లాలో ఏర్పాటుచేయాలని ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. ఆ యన జయంతిని రాష్ట్ర పండగగా గుర్తించిన ప్రభుత్వం విగ్రహం ఏర్పాటులో నిర్లక్ష్యదోరణి ప్రదర్శిస్తోందని విమర్శించారు. ఇప్పటికై నా సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహం ఏర్పాటుచేయాలని కోరారు. కార్యక్రమంలో చెలికి లక్ష్మణరావు, జంపాన చిన్న, తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా ఉపాఽధి శిక్షణ అధికారిగా మెస్సీ ఇవాంజిలిన్
విజయనగరం అర్బన్: జిల్లా ఉపాధి శిక్షణ అధికారిగా ఆర్.మెస్సి ఇవాంజిలిన్ శనివారం పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఇదే సమయంలో విశాఖపట్నం జిల్లా ఉపాధి అధికారిగా రెగ్యులర్ బాధ్యతలను కూడా చేపట్టారు. ఏపీపీఎస్ గ్రూప్–1 సర్వీస్లో ఎంపికై న ఇవాంజిలిన్ ఇప్పటి వరకు జిల్లా ఉపాధి శిక్షణ అధికారిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న వహీదా నుంచి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాఽధి అవకాశాల విస్తరణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. ముగిసిన పారా లీగల్ వలంటీర్ల శిక్షణ విజయనగరం లీగల్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో గత ఐదు రోజులుగా పారాలీగల్ వలంటీర్లకు నిర్వహించిన శిక్షణ శనివారంతో ముగిసింది. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత మాట్లాడుతూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు, ప్రజలకు మధ్య వారధిగా ఉండేవారే పారా లీగల్ వలంటీర్స్ అని పేర్కొన్నారు. చిన్నచిన్న సమస్యలను వలంటీర్లు పరిష్కరిస్తారన్నారు. ఐదు రోజుల్లో 54 మంది పారా లీగల్ వలంటీర్లకు శిక్షణ ఇచ్చామన్నారు. శిక్షణ పొందిన వారిలో అంగన్వాడీ టీచర్లు, ట్రైబల్ యూనివర్సిటీ విద్యార్థులు, ఆశా వర్కర్స్ గ్రూప్ సభ్యులు, ఎక్స్ సర్వీస్మెన్ ఉన్నారు. వీరందరికీ జిల్లా ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా గుర్తింపు కార్డులు అందజేశారు. గిరిజనుడి ఆత్మహత్యసీతంపేట: మండలంలోని మెట్టు హడ్డుబంగి పంచాయతీ ఉప్పరజమ్మి గ్రామానికి చెందిన సవర మహేంద్ర (23) క్షణికావేశంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ వై.అమ్మన్నరావు చెప్పిన వివరాలు.. మృతుడు తండ్రి కడాయికి ముగ్గురు కుమారులు. వీరిలో రెండో కుమారుడు మహేంద్ర డిగ్రీ పూర్తి చేశాడు. అదే గ్రామానికి చెందిన దీవెనతో ఏడాది కిందట వివాహమైంది. ఇద్దరు కలిసి శ్రీకాకుళంలోని వేర్వేరుగా ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. మహేంద్ర ఐస్క్రీం పార్లర్లో పని చేస్తున్నాడు. భార్య ప్రైవేటు ఆస్పత్రిలో నర్స్గా పనిచేస్తుంది. వీరిరువురి మధ్య ఇటీవల మనస్పర్దలు రావడంతో శ్రీకాకుళం నుంచి శుక్రవారం రాత్రి ఇంటికి వచ్చి తోటలోని మామిడి చెట్టుకు ఉరి వేసుకున్నట్టు ఎస్ఐ తెలిపారు. గ్రామస్తులు చూసి సమాచారం అందించారన్నారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. చింతలపాలెంలో తీవ్ర ఉద్రిక్తత ● నలుగురిపై కేసు నమోదు కొత్తవలస : మండలంలోని చింతలపాలెం గ్రామం వద్ద అరుకు – విశాఖ రోడ్డుకు ఆను కొని ఉన్న స్థలంలో గల షాపులు, సమాధులను కొంతమంది వ్యక్తులు శుక్రవారం సాయంత్రం చిందరవందర చేశారు. దీంతో అక్కడ ఏం జరుగుతుందోని గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై సీఐ షణ్ముఖరావు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. చింతలపాలెం గ్రామానికి చెందిన బోను లక్ష్మికి సంబంధించిన స్థలంలో షాపు లను సమాధులను మంగళపాలెం గ్రామానికి చెందిన పి.బాలరాజుతో పాటూ మరో ముగ్గురు వ్యక్తులు జేసీబీ సాయంతో చిందరవందర చేసి లక్ష్మిని కులం పేరుతో దూషించారని లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశామన్నారు. ఈ మేరకు విజయనగరం ఇన్చార్జ్ డీఎప్పీ రాఘవులు క్షేత్ర స్థాయిలో శనివారం విచారణ నిర్వహించారు. బాధితురాలు నుంచి స్టేట్మెంట్ను రికార్డు చేసుకున్నారు. గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని డీఎస్పీ రాఘవులు సీఐ షణ్ముఖరావుకు ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్ఐ, పలువురు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
యువకుడిపై చాకుతో దాడి
రాజాం సిటీ: మద్యం మత్తులో ఓ యువకుడు మరో యుకుడిపై చాకుతో విచక్షణా రహితంగా గాయపర్చిన ఘటన రాజాం పట్టణంలోని శ్రీనివాసకాలనీలో శుక్రవారం రాత్రి కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనివాస కాలనీలో నివసిస్తున్న కురిటి కిరణ్ టిఫిన్ దుకాణంలో పనిచేస్తున్నాడు. అదే కాలనీలో నివసిస్తున్న నల్ల మురళి ప్రతిరోజు మాదిరిగా శుక్రవారం రాత్రి మద్యం సేవించి గొడవపడుతుండగా కిరణ్ అక్క కురిటి పద్మ వచ్చి ఇక్కడ గొడవ పడవద్దని చెప్పింది. ఆమెతో మురళీ గొడవకు దిగి గాయపర్చాడు. దీనిపై ప్రశ్నించిన పద్మ తండ్రి సత్యనారాయణను కూడా తోసేశాడు. వెంటనే అక్కడున్న కిరణ్ కలుగజేసుకుని అక్క, తండ్రిని తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడు. అయినా, మురళి వారిని వెంటాడాడు. ఇంటికి వెళ్లి వెంట తెచ్చుకున్న చాకుతో కిరణ్పై దాడికి పాల్పడ్డాడు. వీపు, మెడ, ఎడమ చెవి, ఎడమ చేయిపై విచక్షణా రహితంగా గాయపర్చాడు. స్థానికులు గాయపడిన కిరణ్ను రాజాం సీహెచ్సీలో చేర్పించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ పి.ఉమావెంకటేశ్వరరావు తెలిపారు. ఇటీవల కాలంలో రాజాంలో మద్యం, గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని, వీటిని సేవించిన యువత విచక్షణ కోల్పోయి దాడికి తెగబడుతున్నారన్న చర్చ సాగుతోంది. మద్యం మత్తులోనే మైనర్ అయిన మురళీ దాడిచేసినట్టు ఎస్ఐ తెలిపారు. -
జీవన మార్క్ట్..!
రామభద్రపురం: రామభద్రపురం అంతర రాష్ట్ర మార్కెట్లో రాత్రి 2 గంటలైతే చాలు... జన సందడి ఆరంభమవుతుంది. వాహన రాకపోకలు, కూరగాయలు, పండ్లను తీసుకొచ్చే వాహనాల రాకపోకలు కనిపిస్తాయి. ఛాయ్వాలా నుంచి చిరువ్యాపారుల వరకు ఎవరి పనిలో వారు నిమగ్నమవుతారు. ఉదయం 10 గంటల వరకు వ్యాపారాలను చక్కబెడుతూ తమ జీవనమార్గాన్ని వెతుక్కుంటారు. రైతులే మూలం.. మార్కెట్కు రైతులే మూలం. రైతులకు మార్కెట్టే ఆధారం. ఈ ప్రాంతంలో 25 సెంట్లు నుంచి 2 ఎకరాల భూమి ఉన్న ఆసామీ వరకు నిరంతరం శ్రమిస్తారు. భూమిని సారవంతంగా మలచి బంగారు పంటలు పండిస్తారు. ధరలు బాగుంటే ఆనందిస్తారు. ధరలు పడిపోయిన సమయంలో దిగులు చెందుతారు. వ్యవసాయం ఓ వ్యాపకంగా ముందుకు సాగుతారు. అందుకే... ఈ మార్కెట్లో 365 రోజులూ కూరగాయలు, సీజన్వారీ పండ్ల వ్యాపారం సాగుతుంది. వ్యాపారులు, కలాసీలు, వాహనదారులకు ఉపాధి లభిస్తోంది. ఇక్కడ కూరగాయల ధరలు కూడా ఇతర ప్రాంతాల కంటే తక్కువ ధరకే లభించడంతో ఉత్తరాంధ్రతో పాటు నాలుగు రాష్ట్రాల వ్యాపారులు మార్కెట్కు వచ్చి క్రయవిక్రయలు జరుపుతారు. తమ జీవనానికి మార్కెట్టే ఆధారమని చెబుతారు. ● రామభద్రపురం మార్కెట్ రామభద్రపురం, బాడంగి, దత్తిరాజేరు, గజపతినగరం, మెంటాడ, సాలూరు, బొబ్బిలి మండలాల రైతులు సాగుచేసిన కూరగాయలు, పండ్ల విక్రయాలకు ఆధారం. రోజూ 3 వేల మంది వరకు రైతులు కూరగాయలు, పండ్లను ఇక్కడకు తెస్తుంటారు. ● ఈ మార్కెట్ నుంచి రోజూ ఒడిశా రాష్ట్రంలోని రాయగడ, సుంకి, పొట్టంగి, జగదల్పూర్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్నాటక, మహారాష్ట్రలకు కూరగాయలు తరలిస్తారు. ఉదయాన్నే కోసిన కాయగూరలను నేరుగా మార్కెట్లోకి రైతులు తేవడంతో కొనుగోలుకు వ్యాపారులు మొగ్గుచూపుతారు. ● శుభకార్యాలకు కూరగాయలు కొనుగోలు చేయాలంటే గుర్తొచ్చేది రామభద్రపురం మార్కెట్. ● ఈ మార్కెట్పై ఆధారపడి పరిసర గ్రామాలకు చెందిన చిరువ్యాపారులు, కార్మికులు వందల సంఖ్యలో జీవనం సాగిస్తుంటారు. ● ఈ మార్కెట్ వల్ల ఏటా సుమారు రూ.35 లక్షల నుంచి రూ.45 లక్షల వరకు గ్రామ పంచాయతీకి ఆదాయం సమకూరుతుంది. -
‘బడి పిలుస్తోంది’ ప్రారంభం
విజయనగరం అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపు, నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమాన్ని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం అవగాహన ర్యాలీకి శ్రీకారం చట్లారు. ర్యాలీ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిచిన్నారి విద్యను పొందడం అత్యంత ముఖ్యమని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న సదుపాయాలు, నాణ్యమైన బోధన, మెరుగైన మౌలిక వసతులు విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది అవుతాయని పేర్కొన్నారు. ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో నమోదు శాతం పెంచడం, డ్రాప్ అవుట్లను తగ్గించడం ప్రధాన లక్ష్యమన్నారు. ఉపాధ్యాయులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రతిఇంటికీ వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో డీఈఓ యు.మాణిక్యంనాయుడు, విద్యాశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కార్మికులకు ఉపాధి భరోసా..
రామభద్రపురం కూరగాయల మార్కెట్ మా లాంటి పలువురు కార్మికులకు ఉపాధినిస్తోంది. కూరగాయలు, పండ్ల మూటలను లారీలకు లోడ్చేయడం వల్ల రోజూ రూ.400 నుంచి రూ.500 వరకు కూలి వస్తుంది. ఆ డబ్బులతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నా. రైతులు కష్టపడి పంట పండిస్తేనే మా లాంటి వారికి ఉపాధి. – సవరాల శ్రీనివాసరావు, కార్మికుడు, రామభద్రపురం జీవనాధారం ఇదే.. మా తాతదండ్రులనుంచి కూరగాయల సాగే మాకు జీవనాధారం. సీజన్లో అయితే రెండు మూడు రకాల కూరగాయలు పండిస్తాం. అన్సీజన్లో ఒకటి రెండు రకాలే పండిస్తాం. నిత్యం ఏదో ఒక రకం కూరగాయ పంటలు పండిస్తాం. ఈ ఏడాది ఎకరా విస్తీర్ణంలో వంగ, మిరప, చిక్కుడు తదితర కూరగాయలు వేశాను. దిగుబడి బాగా వచ్చింది. రామభద్రపురం మార్కెట్కు తెచ్చి విక్రయిస్తున్నాం. – తూముల సింహాచలం, రైతు, రామభద్రపురం మూటలు కట్టుకుని జీవనం.. ఈ ప్రాంత రైతులు అధికంగా కూరగాయల పంటలు సాగుచేయడం వల్లే రామభద్రపురం మార్కెట్కు మంచి పేరువచ్చింది. రైతు, మార్కెట్ లేకుంటే మా లాంటి వారి జీవనం దుర్భరంగా ఉండేది. పదేళ్లుగా ఇక్కడే కలాసీగా పనిచేస్తున్నాను. కాలువిరిగిపోవడంతో మూటలు కట్టుకుని బతుకుతున్నాను. – బోను అప్పలనాయుడు, రామభద్రపురం -
‘చంపావతి’లో పడి వ్యక్తి దుర్మరణం
బాడంగి: మండలంలోని గజరాయునివలస గ్రామానికి చెందిన కందుల సత్యనారాయణ(58) శుక్రవారం రాత్రి ఆటో ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందినట్టు బాడంగి పోలీసులు శనివారం తెలిపారు. సత్యనారాయణ శుక్రవారం రాత్రి గ్రామంలో రోడ్డుపై నడుస్తుండగా రామభద్రపురం నుంచి బాడంగి వైపు వస్తున్న ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంగా నడుపుతూ వెనుక నుంచి వచ్చి ఢీకొన్నాడు. దీంతో సత్యనారాయణ తలకు తీవ్ర గాయమైంది. భుజానికి, కాలికి కూడా గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడు కుటుంబ సభ్యులకు విషయం తెలిపారు. బాడంగి సీహెచ్సీకి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయినట్టు తెలిపారు. మృతుడి సోదరుడు తాతయ్యలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెర్లాం ఎస్ఐ సాగర్బాబు కేసు నమోదు చేసినట్టు హెచ్సీ ప్రసాద్ చెప్పారు. సత్యనారాయణ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. గజపతినగరం : మండలంలోని పురిటిపెంట ఎస్సీ కాలనీకి చెందిన నీలంశెట్టి రమణ(48) చంపావతి నదిలో పడి మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. రమణ కొన్నేళ్ల కిందట వివాహమైంది. తరువాత భార్యకు దూరమై ఓ ప్రైవేటు దుకాణంలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం మద్యం సేవించి అటుగా వెళ్తున్న సమయంలో నదిలో ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందినట్టు స్థానికులు చెబుతున్నారు. సంతకవిటి: మండలంలోని రామారాయపురం గ్రామానికి చెందిన యెన్ని ఉమామహేశ్వరరావు హైదరాబాద్లో శనివారం మృతి చెందాడు. బంధువులు తెలిపిన వివరాలు.. ఉమామహేశ్వరరావు హైదరాబాద్లో ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తూ జీవిస్తున్నారు. ఆయన శనివారం ఉదయం మార్నింగ్ వాక్ చేస్తుండగా చెట్టు కొమ్మ పడి గుండెకు బలంగా తాకడంతో మృతి చెందాడు. ఆయనకు భార్య గౌరి, కొడుకు కార్తికేయ, కూతురు జ్ఞాన మనస్వి ఉన్నారు. భార్య పిల్లలు శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలోని తాడివలసలో అమ్మవారి పండగ నిమిత్తం అత్త వారింటికి వారం కిందట చేరుకున్నారు. ఉమామహేశ్వరరావు మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. -
వాడేశారు.. వదిలేశారు..!
● సీనియర్లను తొక్కేసిన టీడీపీ అధిష్టానం ● పత్తాలేని కొండపల్లి, చిరంజీవులు, పతివాడ ● జాడలేని యువజనం సాక్షి ప్రతినిధి, విజయనగరం: అవసరానికి వాడుకోవడం.. మోసం చేయడం.. వదిలేయడం టీడీపీ నేత చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నది రాజకీయ విశ్లేషకులు తరచూ చెప్పేమాట. వారు ఓటర్లా.. ప్రజలా.. నాయకులా.. అన్నది కాదు. ఆయన దృష్టిలో ఎవరైనా ఒక్కటే. అవసరం, వారి నుంచి స్వప్రయోజనం లేదని తెలిస్తే ఎంతటివారైనా కరివేపాకుతో సమానం. ఈ విషయం ఇప్పుడిప్పుడే టీడీపీ నేతలకు బోధపడుతున్నట్టు ఉంది. ఇన్నాళ్లూ పార్టీలో మాదే పెత్తనం.. మాదే పెద్దరికం అనుకుంటూ వస్తున్న పలు కుటుంబాలు మొన్నటి టీడీపీ రాష్ట్ర కమిటీలో పత్తా లేకుండా పోయాయి. నిన్నమొన్నటివరకు పార్టీలో మాదే రాజ్యం.. నాయకులమైనా, సేవకులమైనా అంతా మేమే అనుకున్న వాళ్లంతా ఆ కమిటీలో గల్లంతైపోయారు. జిల్లాలో ఒకనాడు చక్రం తిప్పినవాళ్లు నేడు కనుమరుగయ్యారు. దీనిపై ఎవరినీ అడిగే పరిస్థితి లేదు. సమాధానం చెప్పే వారూ లేకపోవడంతో అందరూ ఎవరికివారే సమాధానం చెప్పుకుని లోలోపల కుమిలిపోవడం తప్ప మరో మార్గం లేకపోయింది. 2014–19 మధ్య గజపతినగరం ఎమ్మెల్యేగా పనిచేసిన కొండపల్లి అప్పలనాయుడు ఆ తర్వాత 2024 వరకు నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నారు. చివరి వరకు టికెట్ ఆశించి చివరకు అన్న కొడుకు శ్రీనివాస్ టికెట్ ఎగరేసుకుపోవడంతో అసంతప్తితో రగిలిపోయారు. ఆయనకు ఎన్నికల వరకు ఎన్నికల సమన్వయకర్తగా బుజ్జగిస్తూ పార్టీ అధిష్టానం వచ్చింది. ఎన్నికల్లో కొండపల్లి శ్రీనివాస్ గెలవడం, మంత్రి అయిపోవడం జరగగానే అప్పలనాయుడును పార్టీ పూర్తిగా పక్కన పెట్టేసింది. నిన్నటి రాష్ట్ర కార్యవర్గంలో ఆయనతోపాటు ఆయన అనుచరులు ఎవరూ చోటు దక్కించుకోలేకపోయారు. అధిష్టానంతో అనుబంధం ఉండే రాష్ట్రస్థాయి పదవి దక్కితే భవిష్యత్తులో తన ఉనికికే ముప్పు వస్తుందని భావించి ఏ పదవీ లేకుండా మంత్రి చక్రంతిప్పారంటూ అప్పలనాయుడు అనుచరవర్గం లోలోన రగిలిపోతుంది. పతివాడ ఫ్యామిలీకి పదవి లేదాయె.. పతివాడ నారాయణ స్వామి నాయుడు ఆరేడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తెలుగుదేశం తరఫున మంత్రిగా కూడా పనిచేసి పార్టీలో కీలక పాత్ర పోషించారు. ఆయన కుమారుడు తమ్మి నాయుడు మొన్నటి వరకు రాష్ట్ర కార్యదర్శిగా ఉండేవారు. నేటి కొత్త కమిటీలో వారికి స్థానం లేకుండా పోయింది. దీంతో ఇక పతివాడ కుటుంబానికి తెలుగుదేశం రాజకీయ తెర దించేసిందన్నది ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నమాట. నాయుడు కరుసైనట్లే... -
ఎం.గుమడాంలో...గంపెడు సమస్యలు
తాగునీటికి ఇబ్బందులు పడుతున్నాం తాగునీటిని దూరంగా ఉన్న బోరు నుంచి తెచ్చుకోవాల్సి వస్తోంది. జల్జీవన్ మిషన్ పనులు పూర్తిచేయలేదు. తాగునీటి పథక నిర్మాణాన్ని అసంపూర్తిగా విడిచిపెట్టేశారు. అధికారులు, పాలకులు స్పందించి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. – ఆవాల సూర్యం, ఎం.గుమడాం బీసీ కాలనీ అసంపూర్తి పనులు బీసీ కాలనీలో పూర్తిస్థాయిలో డ్రైనేజీ నిర్మించలేదు. మురుగునీరు కాలనీలోనే నిల్వ ఉంటోంది. ఇబ్బందులు పడుతున్నాం. కాలువ పనులు పూర్తిచేసి సమస్యను పరిష్కరించాలి. – ఎం.నరసయ్య, ఎం.గుమడాం బీసీ కాలనీ సమస్యలు పరిష్కరిస్తాం గజపతినగరం మండలం ఎం.గుమడాం బీసీ కాలనీలో రక్షిత మంచినీటి పథకం నిర్మాణంలో ఉంది. పనులు పూర్తిచేసి తాగునీటి సమస్యకు పరిష్కారం చూపుతాం. – ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఎం.శ్రీనివాసరావు(గజపతినగరం) గజపతినగరం: గజపతినగరం మండలం ఎం.గుమడాం గ్రామస్తులు సమస్యల చట్రంలో నలిగిపోతున్నారు. బిందెడు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. బీసీకాలనీ వాసులు సుదూరంలో ఉన్న బోరునీటిని తెచ్చుకుని దాహం తీర్చుకుంటున్నారు. బిందెడు నీటికోసం బోరువద్ద గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు. గత ప్రభుత్వం గ్రామంలో చేపట్టిన జల్జీవన్ మిషన్ పనులను ప్రస్తుత ప్రభుత్వం చేపట్టకపోవడంతో తాగునీటి కష్టాలు తప్పడం లేదు. తాగునీటి పథక నిర్మాణం అసంపూర్తిగా ఉన్నా పట్టించుకునేవారే కరువయ్యారు. మరోవైపు మురుగునీటి సమస్య గ్రామస్తులను వెంటాడుతోంది. కాలువల నిర్మాణాలు అసంపూర్తిగా విడిచి పెట్టడంతో గ్రామస్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎక్కడికక్కడ మురుగు నీరు నిలిచిపోయి దుర్వాసన వెదజల్లుతోందని, దోమలు, ఈగలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. బిందెడు నీటికోసం మహిళలకు అష్టకష్టాలు మురుగుకాలువల నిర్మాణంలో అలసత్వం పూర్తికాని జల్జీవన్ మిషన్ పనులు నిలిచిన తాగునీటి పథకం పనులు ఆవేదనలో ఎం.గుమడాం వాసులు -
ఆ లోకంలో... వేధింపులే ప్రసాదం
ఉద్యోగులపై ఆక్రోశమా..! సాక్షి టాస్క్ఫోర్స్: పంచాయతీల్లో ఏ చిన్నపని చేపట్టినా తమ అనుమతి తీసుకోవాలి... చెప్పిందే చేయాలి.. లేదంటే చర్యలు తప్పవు.. ఖబడ్డార్.. అంటూ నెల్లిమర్ల నియోజకవర్గంలో కీలకనేత భర్త హెచ్చరికలు ఉద్యోగ వర్గాల్లో అలజడిరేపుతున్నాయి. ఇప్పటికే ఇక్కడి నేతల వేధింపులు తట్టుకోలేక గతంలో ఎంపీడీఓలు, తహసీల్దార్లు బదిలీపై వెళ్లిపోయారు. ఇప్పుడు సచివాలయ ఉద్యోగుల వంతు వచ్చింది. కీలకనేత సమక్షంలోనే ప్రైవేటు కార్యాలయంలో ఉద్యోగులపై ఆమె భర్త వేధింపులకు దిగడం, ఆమె కిమ్మనకపోవడం ఉద్యోగవర్గాలను కలవరపెడుతున్నాయి. స్థానిక నేతల పదవీకాలం ముగిసి రెండు వారాలు గడిచింది. ప్రత్యేక అధికారుల పాలన ఆరంభమైంది. కీలకనేత కనుసన్నల్లోనే నియోజకవర్గంలో అధికారుల నియామక ప్రక్రియ సైతం పూర్తయినట్టు సమాచారం. ఇది చాలదన్నట్టు... సచివాలయ ఉద్యోగులపై కీలకనేత భర్త వేధింపుల పర్వం మొదలెట్టారు. రికార్డులు పట్టుకుని తన ప్రైవేటు కార్యాలయానికి రావాలంటూ భోగాపురంలోని ఓ ఐదు సచివాలయాల సిబ్బందికి రెండు రోజుల కిందట హుకుం జారీచేశారు. కీలకనేతతో కలిసి విడివిడిగా సమావేశాలు నిర్వహించారు. పంచాయతీల్లో ఎటువంటి పనులు చేయాలన్నా, ఎటువంటి కార్యక్రమం జరగాలన్నా తమ అనుమతి తప్పనిసరి అని, అదే ‘ప్రసాదం’ంగా భావించాలంటూ ఆదేశాలిచ్చారట. గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాల ఏర్పాటుతో పాటు ఏ చిన్న కార్యక్రమం నిర్వహించినా ప్రత్యేకాధికారులతో పాటు సచివాలయ సిబ్బంది తమ అనుమతులు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. లేదంటే చర్యలు తప్పవంటూ బెదిరింపులకు దిగినట్టు సమాచారం. దీంతో సమావేశానికి హాజరైన భోగాపురం మండలంలోని ఎ.రాయివలస, నందిగాం, భోగాపురం–1, భోగాపురం–2, ముక్కాం సచివాలయాలు సిబ్బంది బిక్కమొహం వేశారు. ఏ అధికారంలేని వ్యక్తి పంచాయతీ రికార్డులు చూపించాలంటూ హుకుం జారీచేయడంపై విస్తుపోతున్నారు. భూ అక్రమాల్లో ‘మిరాకిల్’ బయటపడకుండా ఉండేందుకే ఇలా వ్యవహరిస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. నెల్లిమర్ల నియోజకవర్గంలో ఆది నుంచి టీడీపీ, జనసేన నేతల మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. కూటమిగా ఉంటూనే ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నారు. పెత్తనం కోసం ఇరుపార్టీల వారు పాకులాడుతూ.. పలుసార్లు అధికారుల సమక్షంలోనే బాహాబాహీకి దిగారు. దీనిపై ఎవరికి వారు తమ అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఇప్పుడు పంచాయతీ పాలకుల పదవీకాలం ముగియడం, ప్రత్యేకాధికారుల పాలన రావడంతో తమ ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేతలకు చెక్పెట్టేందుకు, వారు చెప్పే ఏ పనిచేయకూడదన్న ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో ఉండే సచివాలయ ఉద్యోగులకు కీలకనేత భర్త హెచ్చరికలు చేస్తున్నట్టు సమాచారం. అందుకే... తన ప్రైవేటు కార్యాలయంలో రికార్డులు చూపించాలని, అన్నీ పక్కాగా ఉండాలంటూ పరోక్షంగా బెదిరింపులకు దిగినట్టు తెలిసింది. ‘అత్తమీద కోసం దుత్తమీద చూపిన’ చందంగా కీలకనేత భర్త వేధింపులు ఉన్నాయంటూ ఉద్యోగులు నిట్టూర్చుతున్నారు. వేధింపులు భరించలేమంటూ కొందరు ఉద్యోగులు సెలవు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఆ ‘లోకం’లో పనిచేసే ఉద్యోగులకు వేధింపులే ‘ప్రసాదం’గా మారాయంటూ వాపోతున్నారు. ఇలాంటి పాలన మునుపెన్నడూ చూడలేదని, పాలనఎప్పుడు ముగుస్తుందా అని ఎదురుచూస్తున్నట్టు కొందరు ఉద్యోగులు బహిరంగంగా చెబుతుండడం గమనార్హం. చెప్పిందే చేయండి.. లేదంటే ఖబడ్డార్.. సచివాలయ ఉద్యోగులకు కీలకనేత భర్త హుకుం తన ప్రైవేటు కార్యాలయంలో ఉద్యోగులతో ‘ప్రత్యేక’ సమావేశం ఏ పనిచేయాలన్నా అనుమతి తీసుకోవాల్సిందే అంటూ హెచ్చరికలు లేదంటే ఉద్యోగాలు ఉండవంటూ బెదిరింపులు భీతిల్లుతున్న ఉద్యోగులు టీడీపీ నేతలపై ఉన్న ఆక్రోశం ఉద్యోగులపై చూపుతున్న వైనం -
● కోనేరు.. కన్నీరు..
ఈ చిత్రంలో పిచ్చిమొక్కల నడుమ అధ్వానంగా మారిన కోనేటిని చూశారా... అది నేనే.. బొబ్బిమండలం కోమటిపల్లిలోని మంచినీటి కోనేరును. దశాబ్దాల తరబడి కోమటిపల్లి ప్రజల స్నానాలు, తాగునీటికి వినియోగపడేదానిని. వేసవిలో సైతం నీరు నిండుగా ఉండేది. ఇక్కడి గట్టుపైన రామాలయం, ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం, షిర్డి సాయిబాబా ఆలయాలు సైతం ఉన్నాయి. దర్శనానికి వచ్చే భక్తులు ఇక్కడే పుణ్యస్నానాలు ఆచరించేవారు. కార్తీకమాసంలో స్వాముల సన్నిధిలతో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లేవి. పవిత్రంగా, శుద్ధిగా ఉండే కోనేటిని ఇటీవల కాలంలో నిర్లక్ష్యం చేశారు. అందుకే.. ఇదిగో ఇలా పిచ్చిమొక్కలు, రెల్లిపొదలతో అధ్వానంగా మారాను. గట్టువద్దనే కొందరు మందుబాబులు మద్యం సేవించి ఆ సీసాలు సైతం కోనేటిలోనే పడేస్తున్నారు. పవిత్రతను మంటగలుపుతున్నారు. ఇప్పటికై నా గ్రామపెద్దలు, యువత, ప్రత్యేకాధికారులు స్పందించి పూర్వవైభవం తీసుకురావాలని ఎదురుచూస్తున్నాను. ఏం చేస్తారో చూడాలి మరి. – బొబ్బిలి రూరల్ -
విద్యార్థి లోకం క్షమించదు!
ఎన్నికల ముందు ఊరూరా తిరిగి విద్యార్థులు, నిరుద్యోగులకు అబద్ధపు హామీలిచ్చి ఓట్లు దండుకున్నారు. తీరా గెలిచాక ఇప్పుడు మొహం చాటేస్తున్నారు. రూ.5,400 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో పెట్టి విద్యార్ధుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారు. ప్రభుత్వం విదిల్చిన రూ.1,200 కోట్లు ఏ మూలకు సరిపోతాయి అని కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తూ సర్టిఫికెట్లు ఆపేస్తుంటే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవాలా..నిరుద్యోగ భృతి ఊసే లేదు. తక్షణమే పూర్తి నిధులు విడుదల చేయకపోతే అసెంబ్లీని ముట్టడిస్తాం. – డి.రాము, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, విజయనగరంనిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేశారు! ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3,000 భృతి ఇస్తాం అని వాగ్దానం చేశారు. కానీ అధికారంలోకి వచ్చాక ఆ హామీని తుంగలో తొక్కారు. చదువుకుని ఉద్యోగాల్లేక నానా అవస్థలు పడుతున్నాం. మాకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించకుండా మా కష్టాలను రెట్టింపు చేస్తోంది. ఇప్పటికై నా హామీని నిలబెట్టుకుని,నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలి. – సూరిబాబు, నిరుద్యోగి -
● మొక్కజొన్న పనుల్లో రైతులు బిజీ
మొక్కజొన్న పంట చేతికొచ్చింది. కండెలు వేరుచేయడం, ఆరబెట్టడం, నూర్పిడిచేసే పనుల్లో జిల్లా రైతులు బిజీ అయ్యారు. పంట చేతికొచ్చినా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయకపోవడంపై నిరాశ చెందుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన క్వింటాకు రూ.2,400 మద్దతు ధర అందడం లేదని, దళారులకు క్వింటా రూ.1700కే విక్రయించాల్సి వస్తోందని వాపోతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ తీరుతో మొక్కజొన్న రైతుకు ఈ ఏడాది పెట్టుబడి కూడా రాలేదని, శ్రమటోడ్చి పండించిన పంటను కారుచౌకగా విక్రయించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. – సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం -
● గోతుల రోడ్డుపై రవాణా పాట్లు
సంతకవిటి మండలంలోని మందరాడ–గోవిందపురం రోడ్డు అధ్వానంగా తయారైంది. అడుగుకోగుంత ఏర్పడడంతో ప్రయాణ, రవాణా కష్టాలు తప్పడం లేదు. మందరాడ నుంచి మోదుగుల పేట గ్రామానికి మొక్కజొన్న బస్తాలతో వెళ్తున్న ట్రాక్టర్ రోడ్డు గోతిలో దిగడంతో నిలిచిపోయింది. ఆ మార్గంలో వెళ్లేవారు, కళాసీలు కలిసి ముందుకు నెట్టడంతో ట్రాక్టర్ కదిలింది. పాలకులు, అధికారులు స్పందించి తక్షణమే రోడ్డును బాగుచేయాలని ఈ ప్రాంతీయులు కోరుతున్నారు. ఓటేసి గెలిపించాక ప్రజల సమస్యలు పట్టించుకోకపోవడం టీడీపీ పాలకులకు అలవాటుగా మారిందన్నారు. – సంతకవిటి -
షార్ట్సర్క్యూట్కు అవకాశం లేకుండా వైరింగ్ చేయాలి
● కలెక్టర్ రాంసుందర్ రెడ్డి విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో షార్ట్ సర్క్యూట్కు అవకాశం లేకుండా విద్యుత్ వైరింగ్ చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఆస్పత్రిలో అత్యవసర పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. వాటర్ పైప్ లీకేజ్ లేకుండా చూడాలని, ఆస్పత్రి నిర్వహణకు అవసరమైన అదనపు పంపులు నిర్మించాలని సూచించారు. సమావేశంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ, ఏపీఎంఎస్ఐడీసీ డీఈ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సోలార్ ప్యానల్స్ దగ్ధంగజపతినగరం రూరల్: మండలంలోని తమ్మారాయుడుపేట గ్రామానికి చెందిన కోరాడ పైడితల్లి పొలంలో కోసి ఆరబెట్టిన మొక్కజొన్న తోటలో శుక్రవారం సంభవించిన అగ్ని ప్రమాదంలో సోలార్ ప్యానల్స్, మోటరు వైర్లు కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.1,50,000 ఆస్తినష్టం జరిగినట్లు అంచనా వేశారు. పక్కనే ఉన్న మొక్కజొన్న తోటకు మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక అధికారి రవిప్రసాద్ ఆధ్వర్యంలో అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో ప్రమాద తీవ్రత తగ్గింది. కాల్చిన సిగరెట్టు/ బీడీ ఆజాగ్రత్తగా పారవేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. త్వరితగతిన పైడితల్లి ఆలయ అభివృద్ధివిజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తయ్యే విధంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు జిల్లా దేవాదాయశాఖ సహాయ కమిషనర్, ఆలయ ఇన్చార్జ్ ఈఓ కె.శిరీష పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆలయ పనులపై అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పనులను స్వీయపర్యవేక్షణ చేసి, పలు సూచనలు, సలహాలు అందించారు. నిర్ణీత సమయంలోపు పనులు పూర్తిచేయిస్తామని చెప్పారు. దాతలు ముందుకు వచ్చి మరింతగా ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు. అనుమానంతో భార్యపై దాడివిజయనగరం క్రైమ్: తాళి కట్టిన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. అది కాస్త తారస్థాయికి చేరింది. కన్న వారింట్లో ఉంటున్న ఇల్లాలి వద్దకు వచ్చిన భర్త కత్తితో ఆమె మెడపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన విజయనగరం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధి పల్లివీధిలో శుక్రవారం జరిగింది. ఇందుకు సంబంధించి టూటౌన్ ఎస్సై కృష్ణమూర్తి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. డెంకాడ మండలం అమకాంకు చెందిన రాంపల్లి శ్రీనివాస్తో విజయనగరానికి చెందిన సాయికళకు 2012లో పైళ్లెంది. వారి దాంపత్య జీవితానికి గుర్తుగా హేమశ్రీ, యశ్వంత్లు ఇద్దరు పిల్లలు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో పిల్ల లను తీసుకుని విజయనగరంలోని కన్నవారింటికి వచ్చి సాయికళ ఉంటోంది. అప్పుడుప్పుడు అత్తగారి ఊరైన అమకాం వెళ్లి వస్తూ ఉంటుంది. భర్త శ్రీనుకూడా విజయయనగరంలో భార్య ఉంటున్న ఇంటికి వచ్చిపోతూ ఉండేవాడు. కన్నవారింట్లో ఉంటున్న భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనమానంతో భార్యతో భర్త గొడవపడి కత్తితో ఆమైపె దాడి చేశాడు. దీంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయిన సాయికళను ఆమె అన్నయ్య చికిత్స కోసం ఆస్పత్రికి తరలించాడు. ఆమె కోలుకున్న అనంతరం తన భర్తే తనపై దాడి చేశాడని ఫిర్యాదు చేసినట్లు ఎస్సై కృష్ణమూర్తి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
రైలు నుంచి జారిపడి ప్రయాణికుడికి తీవ్రగాయాలు
ఖిలా వరంగల్: తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరంలోని చింతల్ ప్లైఓవర్ బ్రిడ్జి వద్ద ప్రమాదవశాత్తు శుక్రవారం తెల్లవారుజామున రైలునుంచి జాడిపడిన ప్రయాణికుడికి తీవ్రగాయాలయ్యాయి. జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ సుదర్శన్, కానిస్టేబుల్ రియాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా సత్తుపల్లి గ్రామానికి చెందిన ఎం.రాముడు(55) హైదరాబాద్లో కపూరి ఎక్స్ప్రెస్ ట్రైన్ఎక్కి ఆంధ్రాకు వెళ్తూ ప్రమాదానికి గురయ్యాడు. అతని పాదం నుజ్జునుజ్జు కాగా.. కుడి భుజానికి తీవ్రగాయాలయ్యాయి. ఆయనను 108 వాహనంలో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. -
ఫ్యామిలీ డాక్టర్కు వైద్యులు డుమ్మా..!
విజయనగరం ఫోర్ట్: ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం లక్ష్యానికి టీడీపీ సర్కార్ తూట్లు పొడుస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కార్యక్రమం అమలుపై పర్యవేక్షణను గాలికి వదిలేసిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో జిల్లాలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం తూతూమంత్రంగా జరుగుతోందనే చర్చ సర్వత్రా సాగుతోంది. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంపై పర్యవేక్షణ కొరవడడంతో వైద్యసిబ్బంది ఇష్టారీతిన వ్యవహరిస్తున్నరనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ కార్యక్రమానికి వైద్యులు డుమ్మా కొట్టడం వల్ల వారు అందించాల్సిన సేవలు రోగులకు అందని పరిస్థితి నెలకొంది. సంపన్నులకే ఉండే ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో సమర్ధవంతంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు. టీడీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యక్రమంపట్ల అలసత్వం వహిస్తోందనే విమర్శలు ఉన్నాయి. ప్రతి పీహెచ్సీ పరిధిలో ఫ్యామిలీ డాక్టర్ జిల్లాలో 48పీహెచ్సీలు ఉన్నాయి. ప్రతి పీహెచ్సీ పరిధిలో ఆదివారం మినహా ప్రతిరోజు ఫ్యామిలీడాక్టర్ కార్యక్రమం నిర్వహించాలి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఫ్యామిలీ డాక్టర్ శిబిరాన్ని నిర్వహించాలి. శిబిరానికి వచ్చిన రోగులను వైద్యులు పరీక్షించి మందులు అందించాలి. మెరుగైన చికిత్స అవసరమైన వారిని రిఫరల్ ఆస్పత్రికి రిఫర్ చేయాలి. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమానికి బీపీ, సుగర్, జ్వరం, దగ్గు, జలుబు ఉన్న రోగులు ఎక్కువగా వస్తారు. బీపీ, సుగర్ రోగులకు పరీక్షలు నిర్వహించి వారికి నెలకు సరిపడా మందులు అందించాలి. గర్భిణులకు వైద్య తనిఖీలు నిర్వహించాలి. హిమోగ్లోబిన్ ( హెచ్బి) తక్కువగా ఉన్నవారికి హెచ్బీ పెరగడానికి ఐరన్ మాత్రలు, సుక్రోజ్ ఇంజక్షన్లు అందించాలి. అదేవిధంగా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి అక్కడ పిల్లలు అనారోగ్యంతో బాధపడతున్నవారు ఉంటే వారికి వైద్య సేవలు అందించాలి. మంచానికే పరిమితమైన రోగుల ఇళ్లకు వెళ్లి వైద్యుడు సేవలు అందించాల్సి ఉంది. కాని ఈకార్యక్రమం జిల్లాలో నిబంధనలకు అనుగుణంగా జరగడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి: సిబ్బందితోనే మమ అనిపిస్తున్నారనే ఆరోపణలు కార్యక్రమంపై కొరవడిన పర్యవేక్షణ టీడీపీ సర్కార్ హయాంలో గాలికి వదిలేసి ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం కానరాని వైద్యులు ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉండాల్సిన వైద్యులు విధులకు డుమ్మా కొడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉదయం 11 గంటలైనా కొన్నిచోట్ల వైద్యులు శిబిరానికి రావడం లేదు. మరి కొన్ని చోట్ల మధ్యాహ్నం 12, ఒంటి గంటకే వెళ్లిపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇంకొన్ని చోట్ల వైద్యులు రాకుండానే సిబ్బందితో మమ అనిపించేస్తున్నట్లు గుసుగుసలు వినిపిస్తున్నాయి. దీని వల్ల ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం లక్ష్యానికి తూట్లు పడుతున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు. డుమ్మా కొడితే చర్యలుఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమానికి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలవరకు వైద్యులు అందుబాటులో ఉండాలి. ఎవరైనా వైద్యులు డుమ్మా కొట్టినా, మధ్యలో వెళ్లిపోయినా చర్యలు తీసుకుంటాం. డాక్టర్ ఎస్. జీవనరాణి, డీఎంహెచ్ఓ -
ప్రాణం తీసిన ఈత సరదా
గుర్ల: ఈత సరదా 17 ఏళ్ల యువకుడి ప్రాణం తీసింది. ఈ విషాద సంఘటన గుర్ల మండల కేంద్రంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. గుర్ల గ్రామానికి చెందిన కమ్మిండి సూర్య చంద్ర, స్నేహితులు కలిసి గుర్లలోని చంపావతి నది పరీవాహక ప్రాంతంలో సహపంక్తి భోజనాలను గురువారం ఏర్పాటు చేసుకున్నారు. సాయంత్రం సమయంలో చంపావతిలో స్నానం చేయడానికి దిగారు. సూర్య చంద్రకు ఈత రాకపోవడంతో మునిగిపోయాడు. ఈ విషయం గమనించిన మిగిలిన యువకులు సూర్యచంద్రను బయటకు తీసి నెల్లిమర్ల సీహెచ్సీకి వైద్య చికిత్స నిమిత్తం తరలించారు. వైద్య పరీక్షలు చేసిన వైద్యాధికారులు ఆస్పత్రికి రాకముందే మృతి చెందినట్లు తెలిపారు. సూర్య చంద్ర మృతిపై కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్త చేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయాలని ఎస్సైకి ఫిర్యాదు చేయగా ఆ మేరకు గుర్ల ఎస్సై పి.నారాయణ రావు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి తల్లి కమ్మిండి లక్ష్మి, సోదరుడు ఉన్నారు. పూసపాటిరేగ: మండలంలోని గోవిందపురం పరిధిలో వ్యవసాయ పొలాల్లో విద్యుత్షాక్తో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. తొత్తడాం గ్రామానికి చెందిన రాయ లక్ష్మణరావు (46) విద్యుత్ కాంట్రాక్ట్ పనులు చేస్తుంటాడు. విధి నిర్వహణలో భాగంగా నూతన విద్యుత్లైన్లు వేస్తుండగా విద్యుత్ సరఫరా అవుతున్న లైన్లు తగలడంతో షాక్కొట్టి అక్కడకక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య అరుణకుమారి, కుమార్తె జయలక్ష్మి ఉన్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం సుందరపేట ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పూసపాటిరేగ ఎస్సై ఐ.దుర్గాప్రసాద్ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గిరిజనుల భూములపై దౌర్జన్యం
సాక్షి, పార్వతీపురం మన్యం: ఏళ్ల తరబడి ఆ భూములు గిరిజనుల సాగులో ఉన్నాయి. వాటికి సంబంధించిన పట్టాదారు పాస్పుస్తకాలూ వారి పేరిటే ఇచ్చారు. అదే భూమిపై కాస్త సర్వే నంబర్లు అటూఇటు మార్చి, నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించారు. దర్జాగా తన ఫొటో పెట్టుకుని, కింద ఉన్న సంతకాన్ని సైతం చెరిపేసి, ఆ భూమి తనదంటూ దౌర్జన్యానికి దిగాడో వ్యక్తి. బాధిత గిరిజనులు ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా..ఆర్టీఐ ద్వారా సమాచారం కోరినా రెవెన్యూ అధికారుల నుంచి స్పందన ఉండడం లేదు. జిల్లా అధికారులే తమ మొర వినాలని బాధిత గిరిజనులు కోరుతున్నారు. సీతంపేట మండలం గొయిది పంచాయతీ ఎంగుపేట రెవెన్యూ పరిధి జక్కరవలస గ్రామంలో సర్వే నంబరు 19–2, 19–3ల్లో దాదాపు పదెకరాల వరకు భూమిని తాతముత్తాతల కాలం నుంచి సవర సన్నాయి, సవర కరువయ్య కుటుంబసభ్యులు సాగు చేసుకుంటున్నారు. వాటికి సంబంధించిన అసలు పాస్ పుస్తకాలు కూడా వారి వద్ద ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం సవర శంకరరావు అనే వ్యక్తి అది తన భూమి అంటూ వచ్చాడు. సాగులో ఉన్న గిరిజనులు అడ్డుకోవడంతో వెనుదిరిగాడు. కొద్దిరోజుల తర్వాత నకిలీ పత్రాలు సృష్టించాడని గిరిజనులు ఆరోపిస్తున్నారు. పట్టాల్లో గతంలో ఉన్న పేరును చెరిపేసి, తన ఫొటో అతికించి, రెవెన్యూ అధికారుల సంతకాలతో పత్రాలు సృష్టించడం గమనార్హం. దీనిపై బాధిత గిరిజనులు రెవెన్యూ అధికారుల చుట్టూ ఏళ్ల తరబడి తిరుగుతున్నారు. కొంతకాలంగా ఈ భూమి ఎవరి పేరిట ఉందో, ఎక్కడ మార్చారో తెలియజేయాలని ఆర్టీఐ ద్వారా కోరారు. దీనికి సంబంధించి స్పష్టమైన సమాచారం లేదంటూ అధికారులు దాటవేశారు. దీంతో చేసేదిలేక గిరిజనులు శుక్రవారం కలెక్టరేట్కు వచ్చారు. తాము గిరిజనులం కావడం వల్లే అధికారులు సైతం మోసం చేస్తున్నారని, కళ్ల ముందే అన్యాయం కనిపిస్తున్నా ఏ ఒక్కరూ న్యాయం చేయడం లేదని వారు వాపోయారు. పేర్లు మార్చేసి..భూములు కొట్టేసి -
భాషా పండితులు, పీఈటీల ఆందోళన
పార్వతీపురం రూరల్: ప్రభుత్వం పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసినా జిల్లా అధికారుల అలసత్వం వల్ల తమకు అన్యాయం జరుగుతోందని భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీ) పార్వతీపురం ఐటీడీఏ వద్ద శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశా రు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయం వద్ద ఉత్తరాంధ్ర గిరిజన సంక్షేమ సంఘం నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. జీవో 27 ప్రకారం తమను స్కూల్ అసిస్టెంట్లుగా అప్గ్రేడ్ చేయాలని వారు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకుడు పాలక రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 417 మందికి పదోన్నతులు లభించగా, పొరుగున ఉన్న సీతంపేట, పాడేరు, రంపచోడవరం ఐటీడీఏల పరిధిలో ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని తెలిపారు. అక్కడ ఏప్రిల్ 1 నుంచే పదోన్నతులు అమల్లోకి వచ్చినా.. పార్వతీపురంలో మాత్రం 33 మంది ఉపాధ్యాయులకు నేటికీ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. జీవో 45 నిబంధనల ప్రకారం క్లియర్ వేకెన్సీ ఉన్న చోట గిరిజన ఉపాధ్యాయులకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉన్నా, అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. పలుమార్లు పీఓ, డీడీలకు విన్నవించినా నిర్లక్ష్యం వీడడం లేదని, తక్షణమే ఉత్తర్వులు జారీ చేయకుంటే శనివారం నుంచి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
జెడ్పీ సీఈఓగా నాగలక్ష్మి
విజయనగరం రూరల్: జిల్లా పరిషత్ సీఈఓగా ఇ.నాగలక్ష్మిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీసేసింది. ఇక్కడ జెడ్పీ సీఈఓగా పనిచేస్తున్న బీవీ సత్యనారాయణకు అనకాపల్లి జిల్లా డీఎస్జీఎస్డబ్ల్యూఓగా బదిలీ చేసింది. ఆయన స్థానంలో విశాఖ జిల్లా డీడీవోగా పనిచేస్తున్న నాగలక్ష్మికి ఉద్యోగోన్నతిపై విజయనగరం జెడ్పీ సీఈవోగా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. పరిశ్రమల స్థాపనకు యువత ముందుకు రావాలి ● కలెక్టర్ రాంసుందర్రెడ్డి విజయనగరం అర్బన్: జిల్లాలో పరిశ్రమల స్థాపనకు యువత ముందుకు రావాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి పిలుపునిచ్చారు. ర్యాంప్ పథకంలో భాగంగా స్థానిక మహారాజా కోటలోని ఆనందగజపతిరాజు ఆడిటోరియంలో ‘లఘు ఉద్యోగ్ భారత్’ ఆధ్వర్యంలో ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో శుక్రవారం ప్రారంభమైన రెండు రోజుల వెండార్ డెవలప్మెంట్ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఇలాంటి వేదికలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి దిశగా ఎదగాలని కోరారు. పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునే వారికి ఇటువంటి సదస్సులు దోహదపడతాయని తెలిపారు. చిన్న తరహా పరిశ్రమల స్థాపనతో జిల్లా ఆర్ధిక ముఖచిత్రం మారుతుందని, యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా పదిమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, పరిశ్రమల శాఖ జీఎం ఎం.వి.కరుణాకర్, వ్యవసాయశాఖ జేడీ వి.టి.రామారావు, ఏపీఎంఐపీ పీడీ పీఎన్వీ లక్ష్మీనారాయణ, సీఐటీడీ డిప్యూటీ డైరెక్టర్ వెంకటకృష్ణ, ఎల్యూబీ జాతీయ కమిటీ సభ్యులు ఎ.కె.బాలాజీ, ఎన్ఎస్ఐసీ బ్రాంచ్ మేనేజర్ టి.కామేశ్వరి, ఎంఎస్ఎంఈ డీఎఫ్ఓ ఏడీ డీవిఎస్ఆర్ మూర్తి, తదితరులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు చర్యలు విజయనగరం క్రైమ్: మాదక ద్రవ్యాల నియంత్రణకు ‘సంకల్పం, చైతన్యం, అభ్యదయం 2.0’ పేరుతో వంద రోజుల కార్యక్రమం తలపెట్టినట్టు విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి తెలిపారు. రేంజ్ కార్యాలయం నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల ఎస్పీలతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. గంజాయి కేసుల్లో ఆస్తి జప్తు, ఎన్డీపీఎస్ చట్టాన్ని కచ్చితంగా అమలుచేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు 19 కేసుల్లో 18 మంది ముద్దాయిల నుంచి సుమారు రూ.11.63 కోట్ల విలువైన ఆస్తులను ఫ్రీజింగ్ చేసినట్టు తెలిపారు. మరో 32 మందికి జైలు శిక్ష పడిందన్నారు. గంజాయి విక్రయం, రవాణాదారులను ఉపేక్షించవద్దని ఐదు జిల్లాల ఎస్పీలను ఆదేశించారు. -
నిరుద్యోగి ఆశలు ఆవిరి!
విజయనగరం గంటస్తంభం: అయ్యా..మా బిడ్డ పెద్ద చదువు చదివితే మా దరిద్రం వదులుతాదనుకున్నాం. సర్కారు సాయం చేస్తాదంటే అప్పులు చేసి చేసి కాలేజీలో చేర్పించినాం. తీరా చూస్తే సర్కారు మొహం చా టేసింది. ఇప్పుడు కాలేజీ వాళ్లు సర్టిఫికెట్లు ఇవ్వమంటున్నారు. అటు ఉద్యోగాల్లేవు...ఇటు భృతి లేదు... మా బతుకులు నట్టేట మునిగినట్లేనా?..ఇది జిల్లాలోని ఓ నిరుద్యోగి తండ్రి ఆవేదన మాత్రమే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, త ల్లిదండ్రుల గొంతులో పచ్చి వెలక్కాయ పడిన పరిస్థితి. నమ్మించి గొంతు కోశారు.. ఎన్నికల ముందు ఆర్భాటంగా హామీలిచ్చి, అధికార పీఠమెక్కిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది. మా ప్రభుత్వం వస్తే చదువులకు కష్టముండదు..నిరుద్యోగులకు కొండంత అండగా ఉంటాం అని చెప్పిన మాటలు ఇప్పుడు నీటి మూటలయ్యాయి. రూ.5,400 కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయి ఉంటే, విద్యార్థి సంఘాలు, ఎస్ఎఫ్ఐ నాయకులు రోడ్డెక్కి పోరాటం చేస్తే తప్ప సర్కారులో చలనం రాలేదు. తీరిగ్గా కేవలం రూ.1,200 కోట్లు విదిల్చి, అంతా చేసేశాం అని డబ్బాలు కొట్టుకోవడం చూస్తుంటే..విద్యార్థులను ఎంతలా వంచించారో అర్థమవుతోంది. భృతి అందని ద్రాక్షేనా? నిరుద్యోగికి నెలకు రూ.3,000 ఇస్తాం...ధీమాగా ఉండండి అన్న హామీ ఏమైంది..ప్రభుత్వం వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తోంది. ఒక్క పైసా కూడా నిరుద్యోగి ఖాతాలో పడలేదు. పట్టణాల్లో రూము అద్దెలు కట్టలేక, రీడింగ్ రూమ్ ఫీజులు భరించలేక యువత సతమతమవుతున్నారు. గ్రామాల్లో ఉన్న తల్లిదండ్రులను డబ్బులు అడగలేక, ఇక్కడ కోచింగ్ సెంటర్లకు ఫీజులు కట్టలేక గంజి తాగి గడుపుతున్నారు. నోటిఫికేషన్లు లేవు..బతుకు దెరువు లేదు! చదువు పూర్తయ్యి ఏళ్లు గడుస్తున్నా నోటిఫికేషన్ల ఊసే లేదు. ఒకవైపు చదువు కోసం పెట్టిన ఖర్చు తడిసి మోపెడవుతుంటే, మరోవైపు వయస్సు మారిపోతుందన్న భయం నిరుద్యోగులను వెంటాడుతోంది. ప్రభుత్వం ఇప్పటికై నా కళ్లు తెరిచి, పెండింగ్లో ఉన్న మొత్తం ఫీజు బకాయిలను విడుదల చేయాలని, ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగ భృతిని తక్షణమే అమలు చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో విద్యార్థి లోకం సర్కారు కోటను కదిలిస్తుందని హెచ్చరిస్తున్నారు. ఉద్యోగం లేదు..భృతీ లేదు ఊరించిన భృతి..ఉసూరుమనిపించిన సర్కారు కోచింగ్ ఫీజులు కట్టలేక..ఊరు వెళ్లలేక సతమతం ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు, నిరుద్యోగుల ఆవేదన -
మూలన పెట్టేశారు..!
● అధ్యక్షుడిగా చేసిన సీనియర్కు ఉపాధ్యక్ష పదవి ● మంత్రి‘కళ’ లేనట్టేనా? సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఎన్టీయార్తో కలిసి భోజనం చేశాను.. ఆ రోజుల్లో ఆయనపక్కనే మనకు ప్రత్యేకంగా కుర్చీ ఉండేది.. ఏంటి బ్రదర్ అనేవారు.. అదీ మన రేంజి అంటూ క్యాడర్ వద్ద తరచూ చరిత్ర చిట్టావిప్పే సీనియర్ను టీడీపీ అధిష్టానం మూలనపెట్టేసింది. కలెక్టర్గా చేసిన అధికారిని బిల్లు కలెక్టర్గా వేసినట్లు.. మేనేజర్గా చేసిన పెద్దాయన్ను బంట్రోతుగా మార్చినట్లు.. అప్పుడెప్పుడో మంత్రి పదవులు, ఏకంగా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని చేసేసిన చీపురుపల్లి ఎమ్మెల్యే కళావెంకటరావును తాజా రాష్ట్ర కమిటీలో ఉంచీ ఉంచనట్లుగా ఉంచారు. ఉందో లేదో తెలియని రాష్ట్ర ఉపాధ్యక్ష పదవిలో నియమించడం పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది. ● ‘కళ’ తప్పింది... వాస్తవానికి కళావెంకటరావును మొన్న కొత్తమావాస్యకు కేబినెట్లోకి తీసుకుంటాం అన్నట్లుగా ప్రచారం మొదలెట్టారు. అంతలోనే అమావాస్య అడ్డొచ్చిందో ఏమో కానీ అలాక్కాదు గానీ.. టీటీడీ చైర్మన్ ఇస్తారట అంటూ ఇంకో ఫీలర్ వదిలారు. తీరాచూస్తే పార్టీ పొలిట్ బ్యూరో నుంచి కూడా తొలగించి పార్టీ పరంగా ఎలాంటి అధికారాలు లేని రాష్ట్ర ఉపాధ్యక్ష పదవిని ఇచ్చారు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కళావేంకటరావు ఇప్పుడు కొత్త జనరేషన్ వ్యక్తి అయిన పల్లా శ్రీనివాసరావు సారథ్యంలో పనిచేసి పార్టీని బలోపేతం చేయాలన్నమాట. నాల్రోజులు ఆగండ్రా మన రేంజి మారిపోతుంది అంటూ క్యాడర్ వద్ద చెబుతూ వస్తున్న పెద్దాయన... ఇప్పుడు వారికి ఏం సమాధానం చెప్పాలో.. ఎలా సమాధాన పరచాలో తెలియక సతమతమైపోతున్నారట. మరోవైపు గజపతినగరం నియోజకవర్గానికి చెందిన శ్రీదేవిని పార్టీ పాలిట్ బ్యూరోలోకి తీసుకోవడం కళావెంకటరావుకు మరో షాకింగ్ అంశం. గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్ ప్రస్తుతం మంత్రిగా ఉంటూ లోకేశ్ కనుసన్నల్లో మెలుగుతూ తన పదవిని కాపాడుకుంటూ వస్తున్నారు. ఒక మండల స్థాయి మహిళను ఏకంగా పొలిట్ బ్యూరోలోకి తీసుకునేలా అధిష్టానాన్ని ప్రభావితం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సీనియర్ మోస్ట్ కళావెంకటరావు కన్నా రాజకీయాల్లో ఫ్రెషర్ అయిన కొండపల్లి శ్రీనివాస్కే పార్టీలో పరపతి ఎక్కువ ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇవన్నీ చూస్తుంటే పార్టీలో కళావెంకటరావు ప్రభ మసకబాటుతున్నట్లే అని క్యాడర్ సైతం అర్థం చేసుకుంటోంది. మున్ముందు ఇక ఆయనకు మంత్రి పదవి గట్రా మరి ఇచ్చేది ఉండకపోవచ్చని, అందుకే ఏదో పదవి పేరిట ఉపాధ్యక్ష పదవిని ఇచ్చేసి సరిపెట్టారన్న చర్చ పార్టీలో సాగుతోంది. ఒకనాడు రాష్ట్ర స్థాయిలో కరప్రెత్తనం చేసిన కామందు వార్థక్యంలో కుక్కిమంచానికి పరిమితమైనట్లు.. ఒకనాడు ఊరందరినీ అదలించిన మునసబుగారి మునకాల కర్ర మూలకు చేరినట్లు కళా వైభవం కూడా మసకబారుతోందని అంటున్నారు. వాస్తవానికి కళా రాజకీయ భవిష్యత్తుపై గతంలోనే ‘సాక్షి’ ఓ కథనాన్ని వెలువరించగా దాన్ని పాఠకులు ఇప్పుడు గుర్తు చేసుకుంటూ మున‘కళ’ కర్ర మొత్తానికి మూలకు చేరిందయితే అనుకుంటున్నారు. -
బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య నూతన కార్యవర్గం ఎంపిక
విజయనగరం టౌన్: విజయనగరం జిల్లా బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య 2026–2028కి గాను నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేస్తూ సమాఖ్య గౌరవ అధ్యక్షుడు డాక్టర్ డీవీ శ్రీకాంత్ గురువారం ప్రకటించారు. సమాఖ్య అధ్యక్షుడిగా భరద్వాజ చక్రవర్తి, కార్యదర్శిగా భోగరాజు సూ ర్యలక్ష్మి, కోశాధికారిగా దామరాజు పర్వతాలు, ఉపాధ్యక్షులుగా డాక్టర్ టి.రామారావు, భరద్వాజ ప్రకాష్లు ఎంపికయ్యారు. అదేవిధంగా సహాయ కార్యదర్శులుగా భైరవభట్ల విజయాదిత్య, వెలువర్తి రామకృష్ణలతో పాటు 20 మంది కార్యవర్గ సభ్యులను ఎంపిక చేసినట్లు తెలి పారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు చక్రవర్తి మాట్లాడుతూ సమాఖ్య స్ఫూర్తిని కొనసాగిస్తామని, నిరుపేద విద్యార్థులకు సమాఖ్య తరఫున పూర్తిస్థాయిలో సహకారమందిస్తామన్నారు. ఎంపిక చేసిన సమాఖ్య ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. -
టెట్తో సంబంధం లేకుండా ఉద్యోగోన్నతి కల్పించాలి
విజయనగరం అర్బన్: ఉపాధ్యాయులకు హక్కుగా వచ్చే పదోన్నతుల అర్హత టెట్తో సంబంధం లేకుండా కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.బాలాజీ డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక ప్రైవేట్ హోటల్లో సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల పలు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామన్నారు. టెట్తో సంబంధం లేకుండా పదోన్నతులు కల్పించాలని 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వు 57 అమలు చేసి పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలని కోరారు. అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లకు జూనియర్ లెక్చరర్లుగా ప్రమోషన్లు ఇవ్వాలని, ఏకీకృత సర్వీసు రూల్స్ అమలులో ఉన్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. సరెండర్ లీవ్ మంజూరు చేయాలి హైస్కూల్ ప్లస్లను బలోపేతం చేసి రెగ్యులర్ పద్ధతిలో పీజీటీలను నియమించాలని 12వ వేతన సవరణ సంఘాన్ని తక్షణమే ఏర్పాటు చేసి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇంటర్మ్ రీలీఫ్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ ఆధారంగా ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోకూడదని 2022 నుంచి పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్ను వెంటనే మంజూరు చేయాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులకు ఇప్పటికే వినతిపత్రాలు అందజేసినట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ నియోజవర్గ కన్వీనర్, రాష్ట్ర అధనపు ప్రధాన కార్యదర్శి చిన్ని శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ సలహాదారు తమ్మినేని ఆనందరావు, రాష్ట్ర క్యాదర్శి ఇజ్జురోతు రామునాయుడు, ఎంపీ.శ్రీనివాసరావు, రాష్ట్రనాయకులు వీవీజేసుబ్రహ్మణ్యం, రమణ, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు శివరామప్రసాద్, విజయనగరం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, విశాఖ పట్నం జిల్లా అధ్యక్షుడు అరుణ్కుమార్, ప్రధాన కార్యదర్శి సుదర్శన్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు చెందిన రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు హాజరయ్యారు. ఆపస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.బాలాజీ -
నాగావళి.. ఇసుక ఖాళీ..
● యంత్రాలతో ఇష్టారాజ్యంగా... ● ప్రమాదం అంచున రోడ్లు రాజాం/రేగిడి/వంగర/సంతకవిటి: ఇసుక అక్రమ రవాణాకు రాజాం నియోజకవర్గంలోని నాగావళి నదీ తీరం కేరాఫ్గా మారింది. అధికార బలంతో నదిలో ఇసుకను ఖాళీ చేస్తున్నారు. సాగునీరు అందకుండా నదిలో పెద్దపెద్ద గోతులు చేస్తున్నారు. రేగిడి, వంగర, సంతకవిటి మండలాల్లోని నాగావళి నదీ తీర ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపడుతూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. గతంలో అనుమతులు ఇచ్చి గడువు ముగిసిన ఇసుక రీచ్లను మళ్లీ ప్రారంభించి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. గతంలో ఒకచోట ఇచ్చిన ఇసుకరీచ్ అనుమతులు మళ్లీ అదే ప్రాంతంలో ఇచ్చే నిబంధనలు లేవు. సంతకవిటి మండలంలోని తమరాం–మేడమర్తి గ్రామాల మధ్య ఇసుకరీచ్ గత రెండేళ్లుగా కొనసాగుతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే ఇక్కడ వంతెన సమీపంలో భారీ గోతులు ఏర్పడడంతో నదీతీర ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మేడమర్తి వద్ద ఇసుకరీచ్ల్లో తవ్వకాల కారణంగా గ్రామసమీపంలోకి నదీ ప్రవాహం చేరడం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. నాగావళి నదిలో అనుమతులు ఉన్న ఇసుకరీచ్లలో సైతం యంత్రాలతో ఇసుకను తవ్వేందుకు అనుమతులు లేవు. లారీలకు, ట్రాక్టర్లకు వేతనదారులతో లోడింగ్చేయాలి. ఇక్కడ అలా కాకుండా భారీ పొక్లెయిన్లు పెట్టి, నదిలో రోడ్లు వేసి ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ఒక్కోచోట మూడు నుంచి నాలుగు పొక్లెయిన్లు పనిచేస్తున్నాయి. రాత్రి సమయాల్లో ఇసుక రవాణా జోరుగా సాగుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. ఇసుక వ్యాపారులు ఇచ్చే మామ్మూళ్ల మత్తులో అధికారులు జోగుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణాతో రాజాం నుంచి సంతకవిటి, పొందూరు నుంచి సంతకవిటి వచ్చే రోడ్డు గోతులుమయమయ్యాయి. సింగిల్ రోడ్లలో 20 టన్నులకు మించి లోడుతో వాహనాలు రవాణా చేయకూడదు. ఇసుక రీచ్లు నుంచి 40 టన్నుల ఇసుకను తరలించే వాహనాలు తిరగడంతో రోడ్లన్నీ పాడయ్యాయి. సాగునీటి కాలువులుపై ఉన్న కల్వర్టులు కూలిపోతున్నాయి. గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోతున్నాయి. నాగావళి నదిలో పేట్రేగిపోతున్న ఇసుక మాఫియా భారీ యంత్రాలతో నదిని గుల్లచేస్తున్న వైనం ఇసుక లారీల రాకపోకలతో పాడవుతున్న పల్లె రోడ్లు, కూలుతున్న కాజ్వేలు అధికార పార్టీ నేత కనుసన్నల్లోనే ఇసుక దందా... స్వామిభక్తిచూపుతున్న అధికార యంత్రాంగం! ఆందోళనలో నదీతీర ప్రాంత ప్రజలు -
ఎంపీ లాడ్స్ గడువులోగా పూర్తి చేయాలి
విజయనగరం గంటస్తంభం: ఎంపీ లాడ్స్(పార్టమెంట్ సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం) నిధులతో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదిక గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో కలిసి ఎంపీ లాడ్స్ పనుల ప్రగతిపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఎంపీ నిధులతో మంజూరైన పనులు ఇంకా పెండింగ్లో ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రజలకు తక్షణ ప్రయోజనం చేకూరేలా నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో విజయనగరం ఎంపీ నుంచి 68, విశాఖ ఎంపీ నుంచి 4, ముగ్గురు రాజ్యసభ సభ్యుల నుంచి 8 పనులు మంజూరయ్యాయని వెల్లడించారు. జాప్యం వద్దు..పారదర్శకత ముఖ్యం పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, విద్యుత్, మున్సిపాలిటీలు, ఆర్డబ్ల్యూఎస్ తదితర శాఖల వారీగా పనుల స్థితిగతులను ఆరా తీశారు. సివిల్,విద్యుత్ పనుల్లో జాప్యం ఉండకూడదని, భూ వివాదాలు ఉంటే తహసీల్దార్లతో మాట్లాడి పరిష్కరించుకోవాలని సూచించారు. నిధుల వినియోగంలో పూర్తి పారదర్శకత ఉండాలని, పనులు పూర్తయిన వెంటనే వివరాలను పోర్టల్లో ఆప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సీపీఓ పి.బాలాజీ, ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ లక్ష్మణరావు, పంచాయతీరాజ్ ఎస్ఈ శ్రీనివాసరావు, ఆర్అండ్బీ ఎస్ఈ కాంతిమతితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. అధికారులకు కలెక్టర్ ఆదేశం -
కార్మికులకు భరోసా
విజయనగరం గంటస్తంభం: కార్మిక సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కార్మికశాఖ ఉపకమిషనర్ ఎస్డీవీ ప్రసాదరావు కోరారు. ఈ ఏడాది మార్చి 1వ తేదీ తర్వాత కార్మికశాఖలో రిజిస్టర్ అయిన వారికి కూడా ఆర్థిక సాయం అందుతుందన్నారు. ఇప్పటికే జిల్లాలో సుమారు 90 వేల మంది కార్మికులు పేర్లు నమోదుచేసుకున్నారన్నారు. వీరి కుటుంబ సభ్యుల వివాహాలు, ప్రసూతి, ప్రమాదాలు, మరణాలకు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు.ఈ ఫొటోలో కూలినది రేగిడి–సంతకవిటి మండలాలను అనుసంధానం చేసే సాయన్నచానల్ వంతెన. సంతకవిటి మండలం కొండగూడేం–రేగిడి మండలం ఖండ్యాం గ్రామాల మధ్య ప్రధాన రహదారిని కలిపే ఈ కల్వర్టు భారీ ఇసుకలారీలు రవాణా కారణంగా ఏడాది కిందట కూలిపోయింది. ఇంతవరకూ ఇక్కడ కొత్త వంతెన నిర్మించలేదు. 12 గ్రామాలకు చెందిన ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగుతోంది. కొండగూడెం, మాధవరాయపురం, వన్నలి, కృష్ణంవలస, జావాం, ఖండ్యాం ప్రాంతాలకు చెందిన రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తుల తరలింపునకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడి పాలకులకు ఇసుక రవాణాపై ఉన్న శ్రద్ధ వంతెన నిర్మాణంలో లేదని ఈ ప్రాంతీయులు విమర్శిస్తున్నారు. పొరపాటున ప్రశ్నిస్తే ‘గాండ్రు’మంటున్నారని వాపోతున్నారు. -
అంగన్వాడీ కేంద్రాలకు చేరిన పాలు
విజయనగరం ఫోర్ట్: అంగనవాడీ కేంద్రాలకు సకాలంలో పాలు చేరకపోవడం వల్ల పిల్లలు, గర్భిణులు, బాలింతలు ఇబ్బందిపడుతున్నారనే అంశంపై ‘అంగన్వాడీలకు చేరని పాలు’ అనే శీర్షికన ఈ నెల 12వ తేదీన సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఐసీడీఎస్ అధికారులు స్పందించారు. అంగన్వాడీ కేంద్రాలకు పాలు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకున్నారు. చెరువుల అభివద్ధికి చర్యలు ● డ్వామా పీడీ శారదాదేవి గజపతినగరం రూరల్: జిల్లాలో చెరువుల అభివద్ధికి చర్యలు చేపడుతున్నట్టు డ్వామా పీడీ పి.శారదాదేవి తెలిపారు. మండలంలోని పిడిశిల గ్రామంలోని సింగరాయ చెరువును ఆమె గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జలధార, జలహారతి కార్యక్రమంలో భాగంగా చెరువుల అభివద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. చెరువుల్లో ఏ రకమైన పనులు చేయించాలి, గుర్తించిన పనులను ఏ విధంగా చేయాలి అనే అంశాలపై సమగ్ర ప్రణాళిక తయారుచేసి ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బి.కళ్యాణి, ఏపీఓ కృష్ణవేణి, పలువురు అధికారులు పాల్గొన్నారు. రక్తం ఉచితంగా అందించాలి విజయనగరం ఫోర్ట్: సికిల్సెల్ ఎనీమియా రోగులకు ఉచితంగా రక్తం అందించాలని జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ కె.రాణి వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గురువారం సికిల్సెల్ ఎనీమియాపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సికిల్ సెల్ ఎనీమియా రోగులకు తరచూ రక్తం తగ్గిపోతూ ఉంటుందన్నారు. రక్తం తగ్గినప్పుడల్లా రక్తం ఎక్కించాలన్నారు. కార్యక్రమంలో వైద్యులు అనిల్, విక్రాంత్ వర్మ, తదితరులు పాల్గొన్నారు. హత్యాయత్నం కేసులో వ్యక్తి అరెస్టు బొబ్బిలి: మండలంలోని మెట్టవలస మాజీసర్పంచ్ పువ్వల మాధవరావుపై హత్యాయత్నం చేసిన వ్యక్తిని అరెస్టుచేసి రిమాండ్కు తరలించినట్టు సీఐ కె.నారాయణరావు తెలిపారు. బొబ్బిలి సర్కిల్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. వచ్చేనెల 3 నుంచి మెట్టవలస గ్రామ దేవత పండగ నిర్వహణపై ఈనెల 10న గ్రామస్తులంతా సమావేశమయ్యారు. చందాల రూపంలో వచ్చే ప్రతీపైసాకు లెక్క చెప్పాలని గ్రామానికి చెందిన ఇజ్జాడ అప్పారావు కోరాడు. దీనికి గ్రామ పెద్దలు ఆంగీకారం తెలిపారు. ఇదే విషయంపై అప్పారావు పలురకాలుగా మాట్లాడుతూ ఈ నెల 14న స్థానిక బస్టాండ్లో గ్రామస్తులతో పాటు కూర్చొని ఉన్న మాధవరావుపై తనవెంట తెచ్చుకున్న గొడ్డలితో దాడిచేశాడు. ఆ సమయంలో మాధవరావు పక్కనే కూర్చున్న రౌతు రామకృష్ణ అడ్డుకోవడంతో అతని కాలికి గాయమైంది. ఎప్పటికై నా మాధవరావును చంపేస్తానని బెదించినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నిందితుడు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు బొబ్బిలి రైల్వేస్టేషన్లో ఉన్న సమయంలో గురువారం సాయంత్రం ఏఎస్సై డి.కొండలరావు తన సిబ్బందితో కలిసి పట్టుకుని అరెస్టు చేశారని సీఐ తెలిపారు. -
జిల్లా కోర్టులో ఉచిత వైద్య శిబిరం
విజయనగరం లీగల్: జిల్లా కోర్టు ప్రాంగణంలో ఉన్న కాన్ఫరెన్స్ హాల్లో న్యాయవాదుల సంఘం గురువారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్యశిబిరాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. బబిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ న్యాయవాదులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని హితవు పలికారు. ఉచిత వైద్య శిబి రం ఏర్పాటుకు ముందుకు వచ్చిన స్థానిక వెంకటరామ ఆస్పత్రి యాజమాన్యం డాక్టర్ చిట్టి రమణారావు, వారి వైద్య బృందాన్ని ఈ సందర్భంగా ఆమె అభినందించి మెమెంటోలు అందజేశారు. న్యాయవాదులు, వారి గుమస్తాలు ఈ శిబిరంలో పాల్గొని అన్ని రకాల వైద్యపరీక్షలు చేయించుకున్నారు. ఈ శిబిరంలో సంఘం అధ్యక్షుడు నళితం రమేష్ కుమార్, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు బెల్లాన రవి, తదితరులు పాల్గొన్నారు. -
మాజీ సర్పంచ్పై హత్యాయత్నం
బొబ్బిలిరూరల్: మండలంలోని మెట్టవలస గ్రామ మాజీ సర్పంచ్ పువ్వల మాధవరావుపై అదే గ్రామానికి చెందిన ఇజ్జాడ అప్పారావు మంగళవారం రాత్రి హత్యాయత్నానికి తెగబడ్డాడు. తన పక్కనే ఉన్న స్నేహితుడి సహయంతో మాజీ సర్పంచ్ మాధవరావు త్రుటిలో తప్పించుకోగా స్నేహితుడు రౌతు రామ్మూర్తి కాలిపై గొడ్డలి వేటు పడడంతో గాయమైంది. ఈ ఘటనపై ఏఎస్సై కొండలరావు,స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మే నెలలో గ్రామంలో జరగనున్న గ్రామదేవత పండగను పురస్కరించుకుని పండగ మూడు రోజుల పాటు మద్యం బెల్ట్ షాపు నిర్వహణకు లక్షల్లో వేలం పాట జరిగింది. వేలంపాటలో పాల్గొన్న అప్పారావు తనకు పాట దక్కలేదన్న అక్కసుతో వేలం పాటను వీడియోతీసి సోషల్మీడియాలో పెట్టాడు. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం మాజీ సర్పంచ్ మాధవరావు, అప్పారావుల మధ్య వాగ్వాదం జరిగిన సమయంలో మాధవరావు, అప్పారావుపై చెయ్యి చేసుకున్నాడు. దీంతో కక్షగట్టిన అప్పారావు మంగళవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో ఆటోస్టాండ్ వద్ద కానాపై స్నేహితుడు రామ్మూర్తితో మాధవరావు చర్చిస్తుండగా మోటారు సైకిల్పై వచ్చి వెనుకనుంచి గొడ్డలితో మాధవరావును నరికేందుకు ప్రయత్నించాడు. మాధవరావు త్రుటిలో తప్పించుకోగా అప్పారావు అక్కడినుంచి పరారయ్యాడు. హత్యాయత్నం ఘటనపై మాధరావు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. నిందితుడి బైక్ దగ్ధం నిందితుడు అప్పారావు మోటారుసైకిల్ను అక్కడే వదిలి పరారవగా మంగళవారం రాత్రి మోటారుసైకిల్కు ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. దీంతో మోటార్ సైకిల్ పూర్తిగా దగ్ధమైంది. మోటార్ సైకిల్ దగ్ధమైన విషయం తమ దృష్టికి రాలేదని ఏఎస్సై తెలిపారు. -
కూటమిలో ‘మావిగన్’ కలవరం
వారి హయాంలోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి దివంగత నేత డాక్టర్ వైఎస్సార్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనే ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధికి నోచుకుందని మజ్జి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. వైఎస్సార్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తే, జగన్మోహన్రెడ్డి హయాంలో మూలపాడు పోర్టు, భోగాపురం ఎయిర్పోర్ట్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంటి భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. విజయనగరం: అమరావతి స్థానంలో మాజీ ముఖ్య మంత్రి, వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదించిన ‘మావిగన్’ (మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్) అంశానికి అధిక మంది ప్రజలు, మేధావులు మద్దతు తెలుపుతుండడం కూటమి ప్రభుత్వంలో అలజడి సృష్టిస్తోందని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ఈ అంశాన్ని పక్కకుతప్పించేందుకు సీఎం చంద్ర బాబు డైవెర్షన్ పాలిటిక్స్కు తెరతీశారని విమర్శించారు. అమరావతి నిర్మాణానికి అయ్యే ఖర్చులో 10 శాతం ఖర్చు చేస్తే మావిగన్ కారిడార్ అభివృద్ధి చేసుకోవచ్చని, అయితే టీడీపీ నేతలు తమ స్వార్థ ఆర్ధిక ప్రయోజనాలకోసం పాకులాడటం దురదృష్టకరమన్నారు. ధర్మపురిలోని సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర రాజకీయాల్లో అసలు సమస్యలపై చర్చ జరగకుండా దారి మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ‘మావిగన్’ వంటి కీలక అంశాన్ని పక్కదారి పట్టించేందుకే మంత్రి అచ్చెన్నాయుడు అనవసరంగా దశాబ్దాల కిందట జరిగిన విషయాలను లేవనెత్తుతున్నారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం మళ్లీ ప్రస్తావించడం అత్యంత దురదృష్టకరమన్నారు. ఆ మహానేతతో 16 ఏళ్ల అనుబంధం కలిగిన శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి గురై మాట్లాడితే వాటిని వక్రీకరించడం దారుణమన్నారు. చంద్రబాబు తన మామ ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడించేందుకు ఇదే విజయనగరంలోని బంగ్లాలో అంకురార్పణ చేయడం నిజంకాదా అని ప్రశ్నించారు. కుట్ర రాజకీయాలు టీడీపీ నాయకులకు కొత్త కాదన్నారు. అచ్చెన్నాయుడు టీడీపీపై చేసిన ‘పార్టీ లేదూ, బొక్కా లేదు’ వంటి వ్యాఖ్యలు ఇప్పటికీ ప్రజల మదిలో ఉన్నాయని గుర్తుచేశారు. పార్థసారధి, కన్నా లక్ష్మీనారాయణ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వంటి నాయకులు గతంలో చంద్రబాబునాయుడు గురించి చేసిన విమర్శలను ప్రజలు మరచిపోలేదన్నారు. చంద్రబాబుపై వచ్చిన విమర్శలతో పాటు టీడీపీ హయాంలో ప్రభుత్వ వైఫల్యాలపై జిల్లా, నియోకవర్గ స్థాయిల్లో పార్టీ నేతలతో చర్చించి ఫొటో ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు కె.వి.సూర్యనారాయణ రాజు, నెక్కల నాయుడుబాబు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు ఇప్పిలి అనంత్, గొర్లె రవికుమార్, వర్రి నరసింహమూర్తి, జిల్లా ఆర్టీఐ విభాగ అధ్యక్షుడు అప్పాన సుబ్రహ్మణ్యం, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్ కుమార్, భోగాపురం, గరివిడి మండల పార్టీ అధ్యక్షులు ఉప్పాడ సూర్యనారాయణ, విశ్వేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి కనకల రఘు, పార్టీ జిల్లా యాక్టివిటీ కార్యదర్శి పోలీస్ కృష్ణనాయుడు, తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్టుల పేరిట భూదందాను అడ్డుకుంటాం భోగాపురం ఎయిర్పోర్ట్ పేరుతో పరిసర ప్రాంతాల్లో భారీ స్థాయిలో భూ స్కాం జరుగుతోందని మజ్జి శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ ప్రాజెక్టుల పేరుతో అధికారులు హడావుడి చేయడంతో దానిని ఆసరాగా తీసుకుని కూటమి ప్రజాప్రతినిధులు, దళారులు రైతులను బెదిరించి, ఒత్తిడి తెచ్చి వారి భూములను తక్కువ ధరకే లాక్కునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తమకు విక్రయించకుంటే ప్రభుత్వమే భూములను స్వాధీనం చేసుకుంటుందంటూ సాగుతున్న ప్రచారంపై కలెక్టర్తో పాటు అధికార యంత్రాంగం స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాకు కొత్తగా ఏ ప్రాజెక్టులు మంజూరయ్యాయి.. ఎక్కడ ఏర్పాటు చేస్తారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల దగ్గర నుంచి అన్యాయంగా భూములు తీసుకుంటే పోరాటం చేస్తామన్నారు. రైతుల హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని గుర్తుచేశారు. అధికమంది ప్రజలు మావిగన్కు మద్దతు దీనిని పక్కదోవ పట్టించేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలి‘ట్రిక్స్’ 15 ఏళ్ల కిందట జరిగిన వైఎస్సార్ మృతిపై నీచరాజకీయాలు సీఎం చంద్రబాబు నీచరాజకీయాలు ప్రజలందరికీ తెలుసు మాజీ సీఎం ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచేందుకు విజయనగరం బంగ్లాలోనే అంకురార్పణ వైఎస్సార్, జగన్ హయాంలోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి ఎయిర్పోర్టు పేరిట భూ దోపిడీకి ప్రయత్నిస్తే ప్రతిఘటిస్తాం జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు -
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
విజయనగరం క్రైమ్: విజయనగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి శ్రీనగర్ కాలనీ సమీపంలో గల బావిలో గుర్తు తెలియని మృతదేహాన్ని బుధవారం స్థానికులు కనుగొన్నారు. స్థానికుల నుంచి ఈ సమాచారం అందుకున్న వన్ టౌన్ సీఐ ఆర్వీఆర్కే చౌదరి స్టేషన్ సిబ్బందిని ఘటనా స్థలికి పంపించి వివరాలు సేకరించారు.సుమారు 40 నుంచి 50 ఏళ్లు వయస్సు కలిగి ఉండి, నాలుగు రోజుల క్రితం నూతిలో పడి ఉన్నట్లు గుర్తించామని సీఐ చౌదరి తెలిపారు. తెలుపు రంగుపై నలుపు గడులు కలిగిన షర్ట్, సిమెంట్ రంగు ఫ్యాంట్, నడుముకు లుంగీ, మాసిన తెలుపు రంగు గడ్డం ఉన్న మృతదేహాన్ని ఎవరైనా గుర్తిస్తే ఫోన్ నంబర్ 9121109419 కు తెలియజేయాలని సీఐ కోరారు. -
ఓవరాల్ చాంపియన్ భువనేశ్వర్ సైనిక్ స్కూల్
● ముగిసిన ఆలిండియా సైనిక పాఠశాలల హాకీ టోర్నీ ● విజేతలకు ట్రోఫీలు అందజేతవిజయనగరం రూరల్: ఆలిండియా సైనిక సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 13 నుంచి 15 వరకు కోరుకొండ సైనిక పాఠశాలలో నిర్వహించిన ఆలిండియా సైనిక పాఠశాలల హాకీ టోర్నీ– 2026 (ఇంట్రా గ్రూఫ్– ఎఫ్) ఓవరాల్ చాంపియన్గా భువనేశ్వర్ సైనిక పాఠశాల నిలిచింది. అండర్–15 సబ్ జూనియర్ (బాలురు), అండర్– 17 జూనియర్ (బాలురు, బాలికలు) విభాగాల్లో నిర్వహించిన ఈ టోర్నీలో కోరుకొండ సైనిక పాఠశాల జట్టుతో పాటు, అంబికాపూర్ సైనిక పాఠశాల (ఛత్తీస్గఢ్) భువనేశ్వర్, సంబల్పూర్ సైనిక పాఠశాలల (ఒడిశా) జట్లు పాల్గొని హోరాహోరీగా తలపడ్డాయి. అండర్– 15 బాలుర సబ్ జూనియర్ విభాగంలో కోరుకొడ సైనిక పాఠశాల విజేతగా నిలవగా, అండర్–17 బాలికల జూనియర్ విభాగంలో విజేతగా సంబల్పూర్ జట్టు నిలిచింది. అండర్– 17 బాలుర విభాగం విజేతగా భువనేశ్వర్ పాఠశాల జట్టు విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కోరుకొండ సైనిక పాఠశాల ప్రిన్సిపాల్, గ్రూప్ కెప్టెన్ ఎస్ఎస్ శాస్త్రి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడలు పోటీతత్వమే కాకుండా, క్యాడెట్ల మధ్య ఐక్యత, క్రమశిక్షణ, స్నేహభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ టోర్నీలో నిజమైన విజయం కేవలం గెలుపుకాదని, మైదానంలో క్యాడెట్లు ప్రదర్శించిన వ్యక్తిత్వం, దృఢత్వం, క్రీడాస్ఫూర్తి గెలుపు అని అన్నారు. రాబోయే ఇంటర్ గ్రూప్ జాతీయ హాకీ చాంపియన్షిప్లో గ్రూప్ ఎఫ్ విజేత జట్టు ప్రాతినిధ్యం వహిస్తుందని తెలిపారు. అనంతరం విజేతలకు ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ వింగ్ కమాండర్ కిరణ్.వి, పరిపాలనాధికారి స్క్వాడ్రన్ లీడర్ అతుల్ జాన్ థామస్, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. -
జీడి పిక్కల కొనుగోలు ప్రారంభం
గుమ్మలక్ష్మీపురం: మన్యంలో జీడి పిక్కల కొనుగోలు ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే జీడి పిక్కలు దిగుబడి అవుతుండడంతో వాటిని సేకరించే పనిలో జీడి రైతులు నిమగ్నమవుతున్నారు. జీడి పిక్కలను జిసీసీ, ఐటీడీఏ, వన్ధన్ వికాస్ కేంద్రాల ద్వారా కొనుగోలు చేపట్టేందుకు ప్రభుత్వాధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో ఎప్పటిలాగానే ఈ ఏడా ది కూడా స్థానిక వ్యాపారులే జీడిపిక్కలకు ధర నిర్ణయించి కొనుగోలు చేస్తున్నారు. ఈ మేరకు కిలో జీడి పిక్కలను రూ.157కు కొంటున్నారు. పూత పింద దశల్లో బాగున్నా..దిగుబడులు మాత్రం ఈ ఏడాది ఆశాజనకంగా లేదని గిరి జన రైతులు వాపోతూ, కిలోకు మద్దతు ధర రూ.200కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. హెల్త్ స్కీమ్ గడువు పెంపుపార్వతీపురం: వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీంను 2026–27 ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తూ ప్రభుత్వం జీఓ ఎంఎస్ నంబర్ 43 జారీ చేసింది. ఈస్కీంలో జర్నలిస్టు ప్రీమియం రూ. 2,500 కాగా జర్నలిస్టు వాటాగా రూ.1250, ప్రభుత్వం రూ.1250 చెల్లిస్తుంది. అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. సీఎఫ్ఎంఎస్.ఏపీ.జీఓవీ.ఇన్ ద్వారా రూ.1250 చెల్లించి లబ్ధి పొందవచ్చునన్నారు. ప్రీమియం చెల్లించిన వారు చలానా, కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు ఆధార్, ఫొటోలు తదితర పత్రాలను కార్యాలయాలకు సమర్పించాలన్నారు. ఈ స్కీమ్ జర్నలిస్టులు వారి భార్య, పిల్లలు, ఆధారిత తల్లిదండ్రులకు వర్తిస్తుందని పేర్కొన్నారు. పదోన్నతితో మరింత బాధ్యతగా విధులు నిర్వహించాలివిజయనగరం క్రైమ్: పదోన్నతితో విధులు మరింత బాధ్యతగా నిర్వహించాలని ఎస్పీ దామోదర్ అన్నారు. పోలీసుశాఖ సివిల్ విభాగంలో పనిచేస్తున్న 21మంది సిబ్బందికి ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్స్గా పదోన్నతులను కల్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఎస్పీ దామోదర్ బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేసి, వారికి స్వీట్స్ ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సిబ్బంది సంక్షేమంలో భాగంగా వారి సేవలు, క్రమశిక్షణ, పనితీరు, సీనియారిటీ ప్రకారం పదోన్నతులు ఇచ్చామన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి, శాఖకు మంచి పేరు తీసుకు రావాలని కోరారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీపీఓ ఏఓ పి.శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ వెంకటలక్ష్మి, జూనియర్ సహాయకురాలు చాముండేశ్వరి, డీఎస్పీలు ఆర్.గోవిందరావు, ఎస్.రాఘవులు, ఎం.వీరకుమార్, పలువురు సీఐలు, ఎస్ఐలు, జిల్లా పోలీస్ శాఖ అడ్హాక్ ప్రెసిడెంట్ కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు. భార్య హంతకుడికి జీవిత ఖైదువిశాఖ లీగల్: అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న భార్యను వివాహేతర సంబంధం నెపంతో అతికిరాతకంగా హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు విధిస్తూ విశాఖ నగరం ఆరో అదనపు జిల్లా కోర్టు కం మహిళా కోర్టు న్యాయమూర్తి వి.శ్రీనివాసరావు బుధవారం తీర్పునిచ్చారు. జైలు శిక్షతోపాటు రూ.10 వేలు జరిమానా చెల్లించాలని, లేనిపక్షంలో అదనంగా ఆరు నెలలు సాధారణ జైలుశిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. ఈ కేసుపై ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.ఖజానారావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా డెంకాడ మండలం పెదతాడివాడ గ్రామానికి చెందిన ధవలేశ్వరం పంచముఖేశ్వర రావు అలియాస్ ఈశ్వరరావు (56) విశాఖ నగరంలోని శ్రీకృష్ణాపురం జైలు రోడ్డు దగ్గర భార్యా పిల్లలతో నివసించేవాడు. వ్యసనాలకు బానిసైన నిందితుడు ఏ పనిచేయకుండా జులాయిగా తిరుగుతూ భార్యపై అనుమానం పెంచుకున్నాడు. తరచూ గొడవలు పడడంతోపాటు ఆమెను శారీరకంగా హింసించేవాడు. భర్త ఆగడాలను భరించలేక ఆమె నగరంలోని టూటౌన్ ప్రాంతానికి వచ్చి పిల్లలతో నివసించేది. కొంతకాలం గడిచిన తర్వాత నిందితుడు భార్య వద్దకు వచ్చి కలిసి ఉంటానని చెప్పి అందర్నీ నమ్మించాడు. కొంతకాలం కలిసి ఉన్నారు. అయినా నిందితుడికి భార్యపై అనుమానం ఏమాత్రం తగ్గలేదు. ఈ నేపథ్యంలో 2022 అక్టోబర్ 20వ తేదీన భార్యాభర్తలు గొడవపడ్డారు. నిందితుడు ముందుగా తెచ్చుకున్న కత్తితో భార్యను తీవ్రంగా గాయపరిచాడు. తీవ్ర గాయాల మధ్య ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె బంధువుల ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి నేరాభియోగ పత్రాన్ని దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పై విధంగా తీర్పునిచ్చారు. -
దర్యాప్తు నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలి
● డీపీఓలో జిల్లాస్థాయి నేర సమీక్ష సమావేశంవిజయనగరం క్రైమ్: ఇటీవల మారుతున్న నేరాలకు అనుగుణంగా దర్యాప్తు నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని ఎస్పీ దామోదర్ అన్నారు. ఈ మేరకు స్థానిక డీపీఓలో బుధవారం నెలవారీ నేర సమీక్ష సమావేశం జరిగింది. జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లలో పనిచేస్తున్న సిబ్బందితో నేర సమీక్ష సమావేశం నిర్వహించి, దర్యాప్తులో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్, ఎన్.డి.పి.ఎస్., పోక్సో, అట్రాసిటీ, మిస్సింగ్, రోడ్డు ప్రమాద కేసులు, సోషల్ మీడియా కేసులు, హిస్టరీ షీట్లను ఎస్పీ దామోదర్ సమీక్షించారు. మారుతున్న కాలంతో పాటు నేరస్తులు కొత్త పంథాలను ఎంచుకోవడంతో కొత్త తరహా నేరాలు నమోదవుతున్నాయన్నారు. అధికారులు వాటిని చాలెంజ్గా స్వీకరించి, ఆయా కేసుల మిస్టరీని ఛేదిచేందుకు నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని, సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలు కొద్ది రోజుల్లో రానున్నందున సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని, క్షేత్ర స్థాయిలో నిఘా వ్యవస్థను ఏర్పరుచుకోవాలని, గ్రామ సందర్శనలు తరచూ చేయాలని ఎస్పీ ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో సమాచార సేకరణకు, ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాల్లో మహిళా సంరక్షణ పోలీసుల (ఎం.ఎస్.పి) సేవలను వినియోగించుకోవాలని సూచించారు. దర్యాప్తు పెండింగులో ఉండేందుకు గల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకుని దర్యాప్తు పూర్తి చేసేందుకు ఎస్పీ దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీఎస్పీలు ఆర్.గోవిందరావు, ఎస్.రాఘవులు, ఎం.వీరకుమార్, లీగల్ అడ్వైజర్ వై.పరశురాం, సీఐలు చౌదరి, శ్రీనివాస్, లక్ష్మణరావు, సూరినాయుడు, నరసింహమూర్తి, రమణ, ఎస్సైలు ప్రసన్నకుమార్, లీలావతి, రవి, లక్ష్మునాయుడు, సురేంద్ర నాయుడు, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. నేర నియంత్రణ, గంజాయి రవాణానియంత్రణకు ఆకస్మిక తనిఖీలు ఒకసారి పట్టుబడితే వదిలిస్తామని తరువాత పట్టుబడితే కేసులు ఖాయమని ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. నేర నియంత్రణ, గంజాయి రవాణా నియంత్రణ కోసం విజయనగరంలో 200 చోట్ల 1200 మంది సిబ్బందితో నాకాబందీ, ఆపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్బంగా స్తానిక బాలాజీ జంక్షన్లో గజపతినగరం సీఐ రమణ, వన్ టౌన్ సీఐ ఆర్వీఆర్కే.చౌదరిలు హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న ఐదుగురితో అప్పటికప్పుడు కొత్త హెల్మెట్ కొనుగోలు చేసుకుని పెట్టుకునే చర్యలు చేపట్టడాన్ని ఎస్పీ దామోదర్ అభినందించారు. ఈ సందర్బంగా బాలాజీ జంక్షన్ వద్ద రికార్డులు సక్రమంగా లేని వాహనాలను ఎస్పీ దామోదర్ స్వయంగా పర్యవేక్షించారు. -
సమస్యలు పరిష్కరించకుంటే ఎలా?
రైతు శ్రేయస్సుకు పెద్దపీట అంటున్న యంత్రాంగం సీజన్కు ముందే సమస్యలు పరిష్కరించకుంటే ఎలా? గత ఏడాది తోటపల్లి కాలువల పరిధిలో లస్కర్లు, డిస్ట్రిబ్యూటరీ చానల్స్, షట్టర్ల మరమ్మతులు, నీటి సరఫరాకు సంబంధించి అధికారులకు విన్నవించాం. పాలకొండలో సబ్కలెక్టర్, ఇరిగేషన్ అధికారులతో రైతుల సమన్వయ సమావేశం నిర్వహించి సమస్యలు విన్న అధికారులు ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. రాయితీలు అంతంత మాత్రమే, స్వల్పకాలిక విత్తనాలు వేయమంటున్నారు. ఎరువులు, యూరియా కొరత వేధిస్తోంది. ఈ క్రమంలో మదుపులు పెరిగాయి. కండాపు ప్రసాదరావు, అభ్యుదయ రైతు, రుద్రిపేట.. -
మార్కులే జీవితం కాదు..
విజయనగరం: ప్రస్తుత పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు తమ పిల్లల మార్కులనే వారి పరువు, ప్రతిష్టలుగా భావిస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను ఇతర విద్యార్థుల మార్కులతో పోల్చుతూ వారిలా సాధించాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంట్లో కొందరు విద్యార్థులు విజయం సాధిస్తున్నప్పటికీ..చాలామంది వెనుకబడిపోతూ తల్లిదండ్రుల అంచనాలను అందుకోలేకపోతున్నామనే ఆత్మన్యూనతా భావనతో ఆందోళనలో తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే పరీక్షల్లో మార్కులు పిల్లల భవితను, వారి సామర్థ్యాన్ని నిర్ణయించే కొలమానంగా చూడొద్దని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. పదో తరగతిలో ఒకసారి, ఇంటర్లో రెండుసార్లు ఫెయిలైన రాజస్థాన్కు చెందిన అంజుశర్మ కుంగిపోకుండా పట్టుదలతో చదివి డిగ్రీలో గోల్డ్ మెడల్ సాధించారు. అదే ఊపుతో ఎంబీఏ పూర్తి చేసి సివిల్స్లో సత్తా చాటి ఐఏఎస్కు ఎంపికయ్యారు. ఇవి గుర్తుంచుకోండి.. ● పరీక్ష మీ తలరాతను మార్చలేదు. ● అపజయం అనేది మరింత నేర్చుకునేందుకు ఒక అవకాశం. ● మీ ప్రాణం, ఆరోగ్యం ముందు ఏదీ విలువైనది కాదు.ఇవి చేస్తే మేలు..పిల్లలు వారి సమస్యలు చెప్పుకునే చొరవ ఉండేలా చిన్నతనం నుంచే స్నేహపూర్వకంగా వారితో తల్లిదండ్రులు మెలగాలి. ఓటమి నుంచే విజయం వరిస్తుందని..స్ఫూర్తి పొందే విజయ గాథలు వివరించాలి. పరీక్షల్లో ఫెయిలైనా.. మార్కులు తక్కువొచ్చినా.. తర్వాత ప్రయత్నించవచ్చని ప్రోత్సహించాలి. జీవితంలో, చదువులో ప్రతికూల ఫలితాలు సర్వసాధారణమనే విషయాన్ని వారికి చెప్పాలి. అపజయాలకు కుంగిపోతే జీవితం ఎలా నాశనం అవుతుందో ఉదాహరణలతో వివరించాలి. ఏ అంశంలోనూ ఇతర పిల్లలతో పోల్చి చూడకూడదు. అపజయం ఎదురైనప్పుడు పిల్లల్లో వివిధ అంశాల్లో ఉండే ప్రతిభను వివరిస్తూ ధైర్యాన్ని నింపాలి. ఓటమి తర్వాత వచ్చే గెలుపు రుచి ఎలా ఉంటుందో అనుభవిస్తేనే తెలుస్తుందని ప్రోత్సహించాలి. మార్పు తెచ్చే మార్గాలు ఎన్నో చదువులో సాధించే మార్కులే శాశ్వతం కాదుఫెయిలైనా, తక్కువ మార్కులొచ్చినా, మళ్లీ ప్రయత్నించి ఓటమి నేర్పిన పాఠాలతో జీవితంలో అత్యున్నత ఉద్యోగాలు సాధించినవారు చాలా మంది ఉన్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని మార్కులు తక్కువ వస్తే జీవితమే ఆగిపోయినట్లు భావించకుండా మళ్లీ ప్రయత్నించాలి. అపజయం తర్వాత వచ్చే విజయం ఎంతో బలాన్ని అందిస్తుంది. డాక్టర్ సూర్యనారాయణ, సైకాలజిస్ట్, విజయనగరం -
సర్వజన ఆస్పత్రిలో అకస్మాత్తుగా రోగి మృతి
● పోలీసులు, సూపరింటెండెంట్కు బంధువుల ఫిర్యాదు ● ఆస్పత్రిలో బైఠాయింపువిజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఓ రోగి ఆకస్మాత్తుగా మృతిచెందాడు. దీంతో మృతికి గల కారణాలు చెప్పాలని మృతుడి బంధువులు వైద్యులతో వాగ్వాదానికి దిగారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గరివిడికి చెందిన ఆర్. గోపాలకృష్ణ(53) బైక్పై వెళ్తూ కింద పడిపోయాడు. గాయాలు కావడంతో కుటుంబసభ్యులు మంగళవారం అర్ధరాత్రి 12:15 గంటల ప్రాంతంలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చేర్పించారు. క్యాజువాలిటీ డ్యూటీ డాక్టర్ వైద్య పరీక్షలు నిర్వహించి ఎంఎస్ వార్డులో చేర్పించారు. అయితే బుధవారం మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా రక్తం కక్కుకుంటూ గోపాలకృష్ణ మృతి చెందాడు. అప్పటివరకు మాట్లాడిన వ్యక్తి ఒక్కసారిగా ఎలా చనిపోతాడు. మీరు సక్రమంగా వైద్యం చేయకపోవడం వల్లే మృతి చెంది ఉంటాడు. మృతికి గల కారణాలు తెలియకుండా కదిలేదిలేదని బంధువులు ఆస్పత్రిలో బైఠాయించి అక్కడి వైద్య సిబ్బందిని గదిలో పెట్టి బంధించారు. అనంతరం పోలీసులు, ఆస్పత్రి సూపరింటెండెంట్ అల్లు పద్మజకు ఫిర్యాదు చేశారు. దీంతో మృతికి గల కారణాలు తేల్చేందుకు పోస్టుమార్టం చేయిస్తామని పోలీసులు చెప్పడంతో మృతుని బంధువులు శాంతించారు. గురువారం గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ పోస్టుమార్టం చేస్తారని ఆస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు. -
వైఎస్సార్సీపీ పీఏసీ మెంబర్గా పుష్పశ్రీవాణి
గుమ్మలక్ష్మీపురం: వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్లమెంటరీ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) మెంబర్గా మాజీ డిప్యూటీ సీఎం, కురుపాం మాజీ ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణిని నియమించినట్టు పార్టీ కేంద్రకార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఆమె నియామకంపై జిల్లాతో పాటు కురుపాంలోని వైఎస్సార్సీపీ శ్రేణులు హర్షం వ్యక్తంచేశాయి. ఆమెకు అభినందనలు తెలిపాయి. స్పందించిన అధికారులు విజయనగరం ఫోర్ట్: జిల్లా వైద్య విధాన్ పరిషత్ పరిధిలోని ఓ వైద్యురాలు ఉద్యోగం చేస్తున్నట్టు జీతం తీసుకోవడంతో పాటు పీజీ చదువుతున్నట్టు స్టైఫండ్ కూడా తీసుకుంటున్నారనే అంశంపై ‘వైద్యురాలి అత్యాశ’ అనే శీర్షికన ‘సాక్షి’లో ఈ నెల 13న ప్రచురితమైన వార్తకు వైద్య విధాన్ పరిషత్ అధికారులు స్పందించారు. వైద్యురాలు పనిచేసిన ఎస్.కోట ఏరియా ఆస్పత్రిలో చీపురపల్లి ఏరియా ఆస్పత్రి డాక్టర్ కృష్ణారావు, ఏఎఫ్ఓ ఆదిత్య సింగ్లు బుధవారం విచారణ చేపట్టారు. సంబంధిత వైద్యురాలని పిలిపించి వివరాలు సేకరించారు. అధికారులను అడ్డుకున్న రైతులు ● కార్లకు అడ్డంగా బైక్లు గుర్ల: మండలంలోని కెల్ల, బెల్లాన పేట, మన్యపురిపేట, దమరసింగి, వల్లాపురం గ్రామాలకు చెందిన 1085 ఎకరాల్లో ఇంటిగ్రేటేడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం కంపెనీ ప్రతినిధులు, ఆర్డీఓ సుధారాణి, తహసీల్దార్ పి.ఆదిలక్ష్మి బుధవారం భూముల పరిశీలను వెళ్లారు. అధికారులు వస్తున్న విషయం తెలుసుకున్న ఆయా గ్రామాలకు చెందిన రైతులు అధికారులను అడ్డుకున్నారు. అధికారుల కార్లకు అడ్డంగా ద్విచక్ర వాహనాలు, ఆటోలు పెట్టి నిరసన తెలిపారు. రైతులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా భూములు ఎలా పరిశీలిస్తారని నిలదీశారు. కనీసం రైతుల అభిప్రాయాలు స్వీకరించకుండా భూములు కేటాయింపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు పరిశీలిస్తున్న మన్యపురిపేట వద్దకు రైతులు ఒక్కొక్కరుగా చేరుకోవడంతో అధికారులు అక్కడ నుంచి వెనుదిరిగారు. -
అధికారులూ జాగ్రత్త.. !
కొత్తవలస: ‘పెద్ద నాయకులు చెప్పారని రూల్ఫొజీషన్కు వ్యతిరేకంగా పనిచేస్తే.. సంతకాలు పెట్టింది మీరే,.. భవిష్యత్తులో జరిగే పరిణామాలకు మీరే బాధ్యులవుతారు.. గుర్తించుకోండి... ఈ విషయాలను మీడియా మిత్రుల సమక్షంలో చెప్పకూడదు.. అందుకే వారిని అనుమతించలేదు.. గుర్తుపెట్టుకొని పనిచేయండి.. కాదు, కూడదు అంటే మిమ్మలను రక్షించేవారు ఉండరు.. గుర్తుంచుకోండి’ అంటూ విశాఖపట్నం ఎంపీ ఎం.శ్రీభరత్ ఎస్.కోట నియోజకవర్గ పరిధిలోని అధికారులకు హుకుం జారీచేశారన్న అంశం చర్చనీయాంశంగా మారింది. పరోక్షంగా ఎమ్మెల్యే లలితకుమారి హవాకు చెక్పెట్టేందుకు, తమ అనుకూలమైన గొంప కృష్ణ వర్గం చెప్పింది వినాలన్న భావనతో అధికారులకు హెచ్చరికలు జారీచేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే ఉండగానే అధికారులకు రూల్ పొజీషన్ వివరించడం చర్చకు దారితీసింది. ఎస్.కోట నియోజకవర్గంలో ఎంపీ భరత్ బుధవారం సుడిగాలి పర్యటన చేశారు. పలు ప్రారంభోత్సవాల అనంతరం కొత్తవలస మండల పరిషత్ భవనంలో నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాలకు చెందిన మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనికి మీడియా ప్రతినిధులను కూడా అనుమతించలేదు. ప్రభుత్వ పఽథకాలపైన, శాఖల ప్రగతి నివేదికలపై సమీక్షించకుండా... కేవలం మీరు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులే చెప్పాలని అధికారులను ప్రశ్నించినట్టు తెలిసింది. ఎమ్మెల్యే ఏవిధంగా ఇబ్బంది పెడుతున్నారన్నది ఆమె సమక్షంలోనే తెలుసుకునేందుకు ప్రయత్నించినట్టు సమాచారం. నేరుగా ఎమ్మెల్యేను ప్రశ్నించలేక అధికారులతో కట్టడి చేసేందుకు చూస్తున్నారన్న గుసగుసలు వినిపించాయి. ఎమ్మెల్యే చెప్పిన పనులు చేయొద్దని పరోక్షంగా హెచ్చరికలు జారీచేసినట్టు తెలిసింది. ఇది కోళ్ల వర్గంలో కలకలం రేపింది. శ్రీభరత్ స్వయంగా సీఎం చంద్రబాబు తనయుడు లోకేశ్కు తోటల్లుడు కావడం, పార్టీ అధిష్టానం వద్ద పలుకుబడి ఉండడంతో మున్ముందు ఎస్.కోటలో స్థానిక ఎమ్మెల్యేను కాదని తను చెప్పిందే జరగాలన్న భావనతో ముందుకు వెళ్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. సమీక్ష సమావేశంలో ఎంపీ పక్కన వేదికపై ఎటువంటి ప్రజాప్రతినిధికాని వారు ఆశీనులు కావడం చర్చకు దారితీసింది. జనసేన పార్టీకి చెందిన ఎస్.కోట నియోజకవర్గం ఇన్చార్జి ఒబ్బిన సత్యనారాయణ, టీడీపీ నాయకుడు గొరపల్లి రామును డయాస్పై కూర్చోబెట్టి అధికారులతో ఎంపీ సమీక్షించడం విమర్శలకు తావిచ్చింది. అధికారులకు ఎంపీ హెచ్చరిక! పెద్దలు చెప్పారని సంతకాలు చేస్తే ఇరుక్కుపోతారు... మిమ్మలను ఎవరూ కాపాడలేరంటూ వ్యాఖ్యలు ఎంపీ హెచ్చరికలతో ఉద్యోగుల్లో అలజడి ఎమ్మెల్యే లలితకుమారి హవాకు చెక్పెట్టేందుకే ఈ హెచ్చరికలంటూ గుసగుసలు -
కోటిన్నర అప్పుచేసి మహిళ పరార్!
● ఆందోళన చెందుతున్న బాధితులు బొబ్బిలిరూరల్: మండలంలోని ఎం.బూర్జివలసకు చెందిన సుమారు 60 మంది నుంచి కోటిన్నర రూపాయల అప్పుచేసిన గేదెల పుణ్యవతి అనే మహిళ పరారైంది. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. నమ్మకంగా ఉంటూ నట్టేట ముంచిందంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పదిరోజులుగా పుణ్యవతి ఇంటి తలుపులు మూసి ఉండడం, ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడంతో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు ప్రాంశరీనోట్లు పట్టుకుని బాధితులు వచ్చారు. సీఐ నారాయణరావు అందుబాటులో లేకపోవడంతో తహసీల్దార్ కార్యాలయం వద్ద బాధితులు పి.రత్నమ్మ, జి.పార్వతి, జి.కృష్ణమ్మ, కోలా నారాయణరావు గోడువెళ్లబోశారు. -
21 నుంచి నిరవధిక ధర్నా
పాలకొండ రూరల్: పీఆర్టీయూ రాష్ట్ర శాఖ పిలుపుతో సీపీఎస్ రద్దు కోరుతూ ఈ నెల 21 నుంచి కలెక్టరేట్ వద్ద నిరవధిక ధర్నా చేపట్టనున్నట్లు పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు వాలేటి తవిటినాయుడు, అసోసియేట్ అధ్యక్షుడు శశికుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం పాలకొండ వచ్చిన వారు ఎంఆర్సీ వద్ద స్థానిక ఉపాధ్యాయులతో సమావేశమై మద్దతు కోరారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికులకు పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. 30 శాతం ఐఆర్ అందించాలని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2003 డీఎస్సీ వారికి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, ఉపాధ్యాయ సమస్యలపై ప్రభుత్వం ఇచ్చిన హామీలు నేరవేర్చాలని కోరుతూ ఈ ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంఽధించిన కరపత్రాలను విడుదల చేశారు. -
స్మార్ట్ కిచెన్ల ఆలోచన మానుకోవాలి
పూసపాటిరేగ: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, మధ్యాహ్న భోజన కార్మికులకు నష్టం కలిగించే స్మార్ట్ కిచెన్ల ఏర్పాటు ఆలోచనను విరమించుకోవాలని సీఐటీయూ జిల్లా నాయకుడు బి.సూర్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న స్మార్ట్ కిచెన్ సెంటర్లను వ్యతిరేకిస్తూ మండల కేంద్రంలోని మధ్యాహ్న భోజన కార్మికులంతా మంగళవారం నిరసన చేపట్టారు. అంబేడ్కర్ జయంతిలో పాల్గొని, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. రెండు దశాబ్దాలుగా నడుస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటీకరించి, నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుండడం దుర్మార్గమని, చాలీచాలని వేతనాలతో కాలం వెల్లదీస్తున్న కార్మికుల ఉపాధిపై దెబ్బకొట్టడం తీవ్ర అన్యాయమన్నారు. స్మార్ట్ కిచెన్ సెంటర్ల ఏర్పాటుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని, మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలు పెంచాలని కోరారు. -
రైల్వేగేటు వద్ద రహదారి సౌకర్యం కల్పించాలి
సీతానగరం: రైతులు పంట పొలాలకు, నిత్యావసర సరుకుల కొనుగోలుకు మనుషుల రాకపోకలకు మండలంలోని చినభోగిలి రైల్వేగేటు సమీపంలో రహదారి సౌకర్యం కల్పించాలని చినభోగిలి గ్రామస్తులు అరకు ఎంపీ డాక్టర్ గుమ్మ తనూజారాణిని కోరారు. అరకు ఎంపీ డాక్టర్ తనూజారాణి పర్యటనలో భాగంగా మంగళవారం చినబోగిలి రైల్వే పాతగేటు మూసి వేయడంతో రాకపోకలకు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావుతో కలిసి గ్రామస్తులు ఎంపీ దృష్టికి తీసుకువెళ్లారు. చినభోగిలి గ్రామానికి చెందిన భూములు రైల్వే గేటుకు అవతల భాగాన ఉన్నందున సువర్ణముఖి నది సమీపంలో ఉన్న అండర్బ్రిడ్జి చుట్టూతిరిగి వెళ్లవలసి వస్తోందని గ్రామస్తులు వాపోయారు. గేటు మూతపడడం వల్ల 1400 ఎకరాల పంట పొలాలకు పనులు సక్రమంగా జరగక, కూలి పనులకు సకాలంలో వెళ్లలేక, నిత్యావసర సరుకుల కొనుగోలుకు, పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపించడానికి ఇబ్బందులు పడుతున్నామని ఎంపీ దగ్గర గ్రామస్తులు వాపోయారు. అలాగే కిరాణాషాపులకు కొనుగోలు నిమిత్తం రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతుండడంతో కొనుగోలు దారులులేక ఇబ్బందులు పడుతున్నామని షాపుల యజమానులు ఎంపీకి తెలియజేశారు. తమ సమస్యల పరిష్కారానికి పాత రైల్వే గేటు సమీపంలో చిన్నగేటును ఏర్పాటు చేయాలని కోరారు. ఎంపీ డాక్టర్ తనూజారాణిని కలిసిన వారిలో ఎంపీపీ బలగ రమణమ్మ, జెడ్పీటీసీ ఎం.బాబ్జీ, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బి.శ్రీరాములునాయుడు, మాజీ సర్పంచ్లు ఎస్.జగన్నాథం, కె.శ్రీనివాసరావు,గంట రమేష్, మాజీ ఎంపీటీసీలు,చుక్క వెంకటనాయుడు, ఎన్.వెంకయ్య, వి.గుంపస్వామి,చుక్క రాంబాబు,బి అప్పారావు, గణేష్ ఉన్నారు. అరకు ఎంపీకి వినతి -
రోడ్డుపైకి పొగ
రాజాం సిటీ: మండల పరిధి కంచరాం–కొత్తకంచరాం గ్రామాల మధ్యలో రోడ్డు పక్కన వేసిన చోడిచేను చెత్తకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. దీంతో పొగ మొత్తం రోడ్డుపైకి చేరింది. ఈ సందర్భంగా రోడ్డుపై అటూ ఇటూ వచ్చేవారు కనిపించకుండా పోయేంతగా పొగ కమ్మేసింది. దీంతో స్థానికులు ఫైర్ స్టేషన్కు సమాచారం అందించడంతో సిబ్బంది చేరుకుని మంటలను అదుపుచేశారు. ఇసుక ట్రాక్టర్ బోల్తా.. ఇదిలా ఉండగా అదే దారిలో ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పరిమితికి మించి ఇసుకను తరలించడంతోపాటు టార్పాలిన్లు కూడా కప్పకుండా వెళ్తుండడంతో వెనుక నుంచి వచ్చే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విచ్చలవిడిగా ఇసుకను తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని పలువురు వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి నిబంధనలు అతిక్రమించి ఇసుకను తరలిస్తున్న వాహనదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
కార్పొరేట్లకు వేల ఎకరాలు
బొబ్బిలి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్పొరేట్ సంస్థలు, పెద్దలకు వేల ఎకరాలు అప్పనంగా దోచిపెడుతున్నా పేదలకు మాత్రం రెండు సెంట్ల స్థలాన్ని ఆవ్వడం లేదని ఉత్తరాంధ్ర సాధన సమితి వ్యవస్థాపక కన్వీనర్ వేమిరెడ్డి లక్ష్మునాయుడు విమర్శించారు. ఈ మేరకు మంగళవారం పట్టణంలోని కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో జరిగిన అగ్నిప్రమాదాల వల్ల ఇళ్లు కాలిపోయిన వారికి ఆర్థిక సహాయం కానీ, ఇళ్లు లేని వారికి సెంటు స్థలం కానీ ఇవ్వడం లేదన్నారు. తెర్లాం మండలం చిన గొలుగువలసలో మూడు నెలలకిందట 12 పూరిళ్లు కాలిన సంఘటనలో సజీవదహమైన వృద్ధురాలి కుటుంబానికి ఎటువంటి సహాయం కూడా చేయలేదన్నారు. కొంతమంది బడాబాబులు రాజకీయ నాయకులను ప్రసన్నం చేసుకుని పట్టణాల్లో స్థలాలు, గ్రామాల్లో భూములను ఆక్రమించుకుంటున్నారని, అదే రాజకీయ నాయకులు మాత్రం పేద ప్రజలకు ఇంటి స్థలం ఇవ్వడంలో తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో వజ్జి రవికుమార్, రాంబార్కి తిరుపతిరావు, తమ్మిరెడ్డి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర సాధన సమితి -
రెచ్చిపోతున్న కలప మాఫియా
● ఇష్టారాజ్యంగా చెట్ల నరికివేత, సామిల్లులకు తరలింపు ● పట్టించుకోని అధికారులుబొబ్బిలిరూరల్: మండలంలో కలప మాఫియా ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ఇష్టారాజ్యం టేకు, మద్ది లాంటి విలువైన చెట్లను నరికి బహిరంగంగా సామిల్లులకు తరలిస్తున్నారు. బొబ్బిలి మండల పరిధిలో నాలుగు సామిల్లులుండగా కలప అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఉదయం నుంచి అర్ధరాత్రివరకు ట్రాక్టర్లు, లారీలతో కలపను సామిల్లులకు తరలిస్తున్నారు. అడ్డుకోవాల్సిన ఫారెస్ట్, రెవెన్యూ యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తున్నారు. కాశిందొరవలస, రామన్నదొరవలస, మోసూరువలస తదితర గ్రామాల్లో ప్రభుత్వ భూముల్లోని టేకుచెట్లను రాత్రిళ్లు నరికి పగటపూట ఎంచక్కా రవాణా చేస్తున్నారు. ఇందులో కొందరు టీడీపీ నాయకులు కలప వ్యాపారంలో ఆరితేరగా అడ్డుకున్న అధికార సిబ్బందికి బొబ్బిలి కోట పేరు చెప్పి తమ పని సులువుగా కానిస్తు అక్రమార్జనకు పాల్పడుతున్నారు. కోటలో మనుషుల మంటూ ఇష్టారీతిన రెచ్చిపోతున్నారు. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి టేకు చెట్ల అక్రమరవాణా కొనసాగింది. మల్లమ్మపేట గ్రామ శివారు నుంచి ఓ డీపట్టాభూమిలో ఉన్న టేకు చెట్లను నరికి కోమటిపల్లి తరలిస్తున్న ట్రాక్టర్లను కొందరు విలేకరులు ఫొటోలు తీశారు. దీంతో సదరు యజమాని తాను ఓ గ్రామానికి ఉప సర్పంచ్నని, అధికార పార్టీకి చెందిన వాడినంటూ హూంకరించాడు. ఎన్నాళ్లుగానో ఈ ప్రాంతంలో కలప వ్యాపారం చేస్తున్నానని,అడ్డు తప్పుకోవాలని ఫొటోలు తీస్తున్న విలేకరులకు బెదిరింపు ధోరణిలో సమాధాన మిచ్చాడు. అనుమతులు లేకుండానే రవాణా నిబంధనల ప్రకారం ఎక్కడైనా టేకు,మద్దిలాంటి విలువైన చెట్లను నరికేటప్పుడు అది జిరాయితీ, రెవెన్యూ, డీపట్టాలేదా ఫారెస్టు భూములా అన్నది రెవెన్యూ,ఫారెస్టు శాఖలు నిర్ధారించి నిర్ణయించి అనుమతులు మంజూరు చేస్తాయి.కానీ ఇక్కడ కలప వ్యాపారులు అనుమతులకోసం దరఖాస్తు చేసుకోరు. ఆశాఖల అధికారులు పట్టించుకోరు. అలాంటి ఏ నియమనిబంధనలు ఇక్కడ వర్తించవనేందుకు నిత్యం బొబ్బిలి పట్టణంలోని రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్న అక్రమ కలప ట్రాక్టర్లే నిదర్శనం. అలాగే దుగ్గేరు అటవీ ప్రాంతం నుంచి బొబ్బిలి మీదుగా రాజాం ప్రతిరోజూ రాత్రిపూట అక్రమంగా తరలిస్తున్న విలువైన కలపను అడ్డుకునే సాహసం ఆయా శాఖల అధికారులు చేయలేకపోతున్నారు. కేసులు పెడుతున్నాం అక్రమంగా తరలుతున్న టేకు కలప ట్రాక్టర్లపై ఫారెస్టు బీట్ ఆఫీసర్ను వివరణ కోరగా ఎన్నో మార్లు కేసులు పెడుతున్నామని అయినా వారి ఆగడాలు ఆగడం లేదన్నారు. ఇదే అంశంపై తహసీల్దార్ ఎం శ్రీనును వివరణ కోరగా మల్లమ్మపేటలో టేకు చెట్లు నరికేందుకు ఎవరికి రెవెన్యూ పరంగా అనుమతులు లేవన్నారు. అనుమతుల కోసం దరఖాస్తులు కూడా రాలేదని చెప్పారు. -
వన్టౌన్ను మోడల్ స్టేషన్గా మార్చాలి
విజయనగరం క్రైమ్: విజయనగరం వన్ టౌన్ పీఎస్ను జిల్లాలోనే ఒక మోడల్ పోలీస్ స్టేషన్ గా నిలిపేందుకు సిబ్బంది అంతా కృషి చేయాలని ఎస్పీ దామోదర్ అన్నారు. నగరంలోని వన్ పోలీసు స్టేషన్, సెంట్రల్ క్రైమ్ స్టేషన్ను ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మంగళవారం సందర్శించి, పోలీసు స్టేషన్ పరిసరాలను, స్టేషన్ లోని ప్రతి గదిని పరిశీలించారు. స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని, యువత గంజాయి ప్రభావానికి గురికాకుండా అవగాహన కల్పించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలైన క్రికెట్ బెట్టింగ్, జూదం ఆడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారు చెప్పిన సమస్యలను ఓపికగా విని తగు చర్యలు చేపట్టాలని అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. విజిబుల్ పోలీసింగ్ విధిగా నిర్వహిస్తూ, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టాలని సూచించారు. నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టాలి స్టేషన్ పరిధిలో దొంగతనాలు జరగకుండా పగలు, రాత్రి గస్తీలు ముమ్మరం చేయాలని, మరిన్ని సీసీటీవీ కెమెరాలను దాతల సహాయంతో అమర్చాలని, వాహన తనిఖీలు చేపట్టాలని, నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. ఆకస్మికంగా లాడ్జిలు, రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించాలన్నారు. ప్రతి ద్విచక్ర వాహన దారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించే విధంగా చూడాలని, ప్రజలకు రహదారి భద్రతా ప్రమాణాల పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. సైబర్ నేరాలు, వాట్సాప్ ద్వారా అరెస్ట్ (డిజిటల్ అరెస్ట్) పట్ల ప్రజలకు ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులకు అవగాహన కల్పించాలని చెప్పారు. సి.సి.టి.ఎన్.ఎస్.లో ఎప్పటి కప్పుడు కేసుల వివరాలను అప్డేట్ చేయాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. ఈ సాక్ష్యలో అప్లోడ్ చేయాలి హిట్ అండ్ రన్, మిస్సింగు కేసుల్లో ఆధారాలు సేకరించేందుకు సిసిటివి 360 యాప్ ను అధికారులు తప్పనిసరిగా వినియోగించాలన్నారు. కేసుల దర్యాప్తులో చేపట్టిన చర్యలను ఈసాక్ష్య యాప్లో అప్లోడ్ చేయాలన్నారు. ప్రమాదాలకు ఎవ్వరూ అతీతులు కారని, పోలీసు సిబ్బంది కూడా ద్విచక్ర వాహనం నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆదేశించారు.అనంతరం, పోలీసు స్టేషన్లో పనిచేసే పోలీసు సిబ్బందితో ఎస్పీ మమేకమై, వారి సమస్యలను అడిగి తెలుసుకుని, పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఈ తనిఖీల్లో విజయనగరం ఇన్చార్జ్ డీఎస్పీ ఎస్.రాఘవులు, సీఐ ఆర్.వి.ఆర్.కే.చౌదరి, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, సీసీఎస్ సీఐ బి.వెంకటేశ్వరరావు, ఎస్సై రవి, సురేంద్ర నాయుడు,కమల్ భార్గవ్, లక్ష్మునాయుడు, లక్ష్మీ ప్రసన్న కుమార్, స్టేషన్ సిబ్బంది ఇమ్రాన్,శివ,గౌరీశంకర్, శ్రీను,రమణ,అంజి,సూర్య,అప్పలనాయుడు పాల్గొన్నారు. ఎస్పీ ఆదేశాలు -
అంబేడ్కర్ విగ్రహానికి వినతి
విజయనగరం గంటస్తంభం: ఏళ్ల తరబడి భోజన నిర్వాహకులుగా పనిచేస్తున్నాం.. రుచికరమైన వంటలు చేస్తూ విద్యార్థుల కడుపునింపుతున్నాం.. ఉపాధి పొందుతున్నాం.. ఇప్పుడు స్మార్ట్ కిచెన్లు అంటూ మా ఉపాధికి గండికొట్టేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు సర్కారు సద్బుద్ధిని ప్రసాదించాలంటూ భోజన కార్మికులు జిల్లా వ్యాప్తంగా అంబేడ్కర్ విగ్రహాలకు మంగళవారం వినతిపత్రాలు అందజేశారు. ప్రభుత్వం తీరుపై నిరసన తెలిపారు. స్మార్ట్ కిచెన్ల ఏర్పాటు ప్రతిపాదనలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. దాదాపు 80 వేలమంది డ్వాక్రా మహిళల ఉపాధికి గండికొట్టొద్దని విన్నవించారు. కనీస వేతనం రూ.10 వేలకు పెంచాలని, ప్రమాద బీమా, గ్రూప్ ఇన్సూరెన్స్ అమలు చేయాలని, మెనూ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. బిల్లుమడలో బీభత్సం భామిని: మండలంలోని బిల్లుమడలో ఏనుగుల గుంపు మంగళవారం రెచ్చిపోయి బీభత్సం సృష్టించింది. వివిధ రకాల తోటలపై పడి నాశనం చేసి రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. బిల్లుమడకు చెందిన బూస సుగ్రీవులు, కలిశెట్టి రాజు, రాంబాబు రాజు అనే రైతుల తోటలను పీకి తినివేశాయి. చేతి బోర్లు పీకి పైపులను పాడు చేశాయి. అరటి, కొబ్బరి, మామిడి తోటలను ధ్వంసం చేసి తినివేశాయి. దీంతో బాధిత రైతులతో పాటు గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు. ఇసుక తవ్వేస్తే నీరెలా వచ్చేది? రేగిడి: నాగావళి నదిలో ఇష్టారాజ్యంగా ఇసుకను తవ్వేస్తున్నారు... లారీలు, ట్రాక్టర్లతో తరలించి సొమ్ముచేసుకుంటున్నారు... రైతుల సాగుభూమలకు నీరందకపోయినా ఫరవాలేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.. అధికార బలంతో యంత్రాల సాయంతో నదిలో పెద్దపెద్దగోతులు పెడుతున్నారు.. ఇలా అయితే సాగునీరు అందేది ఎలా అంటూ రేగిడి మండలంలోని కందిశ–తునివాడ గ్రామాల రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. రేగిడిబట్టి ఓపెన్హెడ్ చానల్లో ప్రవహిస్తున్న అరకొర నీటిని చూపిస్తూ అధికార యంత్రాంగం తీరుపై నిరసన తెలిపారు. ఇసుక అక్రమ తవ్వకాలు అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం రెవెన్యూ, పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అగ్నిప్రమాదాల నివారణపై అప్రమత్తం పాలకొండ: వేసవిలో అగ్నిప్రమాదాల నివారణపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ అన్నారు. పాలకొండ అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాలను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించాలన్నారు. ప్రమాద సమయంలో ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలని సూచించారు. -
రారండోయ్ దివ్యదక్షిణ యాత్రలకు
విజయనగరం టౌన్: దేశవ్యాప్తంగా ప్రయాణికులకు ఈస్ట్కోస్ట్ రైల్వే అందిస్తున్న విలువైన సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఐఆర్సీటీసీ టూరిజం జనరల్ మేనేజర్ డీఎస్జీపీ కిశోర్ కోరారు. ఈ మేరకు విజయనగరంలోని రైల్వే కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో టూర్ ప్యాకేజీ వివరాలను ఆయన వెల్లడించారు. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ గమ్యస్ధానాలకు వెళ్లే భారత్ గౌరవ్ పర్యాటక రైలును విశాఖ నుంచి తొలిసారిగా ప్రారంభిస్తున్నామన్నారు. అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం దివ్యదక్షిణ యాత్ర పేరుతో ఏప్రిల్ 27న రైలు బయలుదేరనుందని తెలిపారు. 9 రోజుల పాటు యాత్ర ప్రముఖ పుణ్యక్షేత్రాలైన కాంచీపురం, మహాబలిపురం, రామేశ్వరం, మధురై, తిరుచ్చి, తంజావూరు, తిరువణ్ణామలై దర్శనం కల్పిస్తూ హోటల్స్, రోడ్డు ట్రాన్స్పోర్ట్, అల్పాహారం, భోజనం, ప్రయాణ బీమా, రైలు భద్రత, గైడ్తో సహా అన్ని సౌకర్యాలను అందిస్తున్నామని వివరించారు, దివ్యయాత్రలో పాల్గొనేందుకు యాత్రికులను, ఆహ్వానిస్తున్నా మన్నారు. అవకాశం ఉన్నవారందరూ 9281030748, 9281495847, లేక ఐఆర్సీటీసీ వెబ్సైట్లో కానీ సంప్రదించవచ్చని సూచించారు. -
పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం వనంగుడిలో పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకుడు నేతేటి ప్రశాంత్ అమ్మవారికి శాస్త్రోక్తంగా పూజాదికాలు నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అమ్మవారిని అలంకరించారు. మూడులాంతర్లు వద్దనున్న చదురుగుడి బాలాలయంలో కొలువైన అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ, సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్లు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమ సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈఓ కె.శిరీష కార్యక్రమాలను పర్యవేక్షించారు. తీరప్రాంతంలో మాక్డ్రిల్పూసపాటిరేగ: మండలంలోని తీర ప్రాంత జంక్షన్లలో సాగర కవచ్ కార్యక్రమంలో భాగంగా పోలీసులు మాక్డ్రిల్ నిర్వహించారు. కోనాడ జంక్షన్, చింతపల్లి, గోవిందపురం, ముక్కాం, గూడెపువలస జంక్షన్లలో ఈ సందర్భంగా పోలీసులు మంగళవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. తీర ప్రాంతంలో అపరిచిత వ్యక్తుల ఆచూకీ కనిపెట్టడానికి ఈ మాక్డ్రిల్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఈ తనిఖీల్లో భోగాపురం రూరల్ సీఐ జి.రామకృష్ణ, భోగాపురం సీఐ కె.దుర్గాప్రసాదరావు, ఎస్ఐలు దుర్గాప్రసాద్, సూర్యకుమారి, పాపారావు లతో పాటు పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వేడి తగ్గించిన వర్షంభామిని: మండలంలో భగభగ మండుతున్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మంగళవారం మధ్యాహ్నం తరువాత వీచిన ఈదురు గాలులు వాతావరణాన్ని మార్చేశాయి. వీచిన గాలుల కు బండ్రసింగి, కడంబసింగి గిరిజన గ్రామా ల మధ్య పెద్ద చెట్టుకొమ్మ విరిగి పడింది. వాహన రాకపోకలకు ఇబ్బంది కలిగింది. అనంతరం కురిసిన వర్షానికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.ఈ అకాల వర్షానికి మొక్కజొన్న రైతులు నానా అవస్థలు పడ్డారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతిబొండపల్లి: మండలంలోని గరుడుబిల్లి గ్రామంలో గల రైల్వే సిల్పర్ ప్యాక్టరీలో సిల్పర్లు లోడ్ చేస్తుండగా లారీ నుంచి జారి పడి గాయాలపాలైన వ్యక్తి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఈ ప్రమాదానికి సంబంధించి ఎస్సై యు.మహేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరంలోని పూల్బాగ్కు చెందిన షణ్ముఖరావు కొన్ని రోజుల క్రితం లారీలో సిల్పర్లు లోడ్ చేస్తుండగా అదుపు తప్పి పడిపోవడంతో తీవ్రగాయాలయ్యాయన్నారు. దీంతో క్షతగాత్రుడిని విశాఖ పట్నంలోని కేజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. -
పక్వానికి రాని పండ్లు..!
● 2011 ఆహార భద్రత, ప్రమాణాల నిబంధనల ప్రకారం ప్రభుత్వం కార్బైడ్, ఎసిటిలిన్ రసాయనాలను నిషేధించింది. ● సహజంగా పండించే ఇథిలిన్ను మాత్రమే 100 పీపీఎం వరకు వినియోగించేందుకు అనుమతిచ్చింది ● ప్రభుత్వ నిబంధనల ప్రకారం సుమారు 20 కిలోల పండ్లకు 5 గ్రాముల ఇథిలిన్ను వినియోగించాల్సి ఉంటుంది. ● వ్యాపారులు మేలిమి పండులా కనిపించేందుకు కార్బైడ్ను వినియోగిస్తున్నారు. ఆమోదించిన ఇథిలిన్తో పోలిస్తే కార్బైడ్, ఇతర రసాయనాలు మార్కెట్లో చౌకగా లభిస్తుండడంతో వాటిని వ్యాపారులు యథేచ్ఛగా వాడుతున్నారు.విజయనగరం: వేసవి ప్రారంభమైంది. మార్కెట్లో ఫలాలు నోరూరిస్తున్నాయి. కొందరు వ్యాపారుల అత్యాశ కారణంగా ఫలరాజుగా పేరొందిన మామిడి విషతుల్యంగా మారుతోంది. ప్రస్తుతం కాయలను కృత్రిమంగా ముగ్గబెడుతున్నారు. నిషేధిత కాల్షియం కార్బైడ్, ఇతర ప్రమాదకర రసాయనాలను వ్యాపారులు వినియోగిస్తున్నారు. వాటి వినియోగం వల్ల ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తప్పని ముప్పు.. రసాయనాలతో పక్వానికి తెచ్చిన పండ్లను తింటే ఆరోగ్య సమస్యల బారినపడే ప్రమాదముంది. దీర్ఘకాలంగా ఇలాంటి పండ్లను తీసుకోవడం ద్వారా కేన్సర్, అల్సర్, కాలేయం (లివర్), మూత్రపిండం(కిడ్నీ), జీర్ణ సంబంధిత వ్యాధులు, కాళ్లు, చేతుల తిమ్మిర్లు, నరాల బలహీనతకు గురయ్యే ఆస్కారముంది. కాల్షియం కార్బైడ్ ద్వారా వెలువడే ఎసిటిలిన్ వాయువు నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపి తలనొప్పి, దీర్ఘకాలిక మత్తు, శక్తిని కోల్పోయే ప్రమాదముంది. చిన్నారుల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గి శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తుతాయి. గర్భిణుల్లో హార్మోన్లు దారి తప్పుతాయి. రంగును చూసి గుర్తించొచ్చు రంగును చూసి పండ్లను చాలా వరకు గుర్తించే అవకాశముంది. కార్బైడ్, ఇతర రసాయనాలు ఉపయోగించిన మామిడి పండ్లు బయటికి లేత పసుపు, లోపల లేత తెలుపు రంగులో ఉంటాయి. సహజంగా పండిన పండు బయట, లోపల ఒకే వర్ణంలో ఉంటుంది. రసాయనాలు విడుదల చేసే ఎసిటిలిన్ వాయువుతో పండ్లు బయటి వైపు రంగు మారుతుందే తప్ప అంత రుచిగా ఉండవు. పరిమితికి మించి కార్బైడ్ ● మామిడి కాయలను ఎథ్రిల్ లిక్విడ్లో 5 నిమిషాలపాటు ముంచి మూడు, నాలుగు రోజులు నిల్వ చేస్తే సహజత్వానికి దగ్గరగా ముగ్గుగుతాయి. ముంచడం సాధ్యం కానిపక్షంలో ఎథ్రిల్ లిక్విడ్ను కాయలకు స్ప్రే చేస్తున్నారు. ● కాయలు 24 గంటల్లోనే మేలిమి పండులా కనిపించేందుకు పరిమితికి మించి కార్బైడ్ను వినియోగిస్తుండడంతో.. ఆరోగ్యానికి ముప్పు తప్పడం లేదు. ప్రభుత్వం ఆమోదించిన ఇథిలిన్తో పోలిస్తే కార్బైడ్, ఇతర రసాయనాలు మార్కెట్లో చౌకగా లభిస్తుండడంతో యథేచ్ఛగా వినియోగిస్తున్నారు. రసాయనాలతో ముగ్గబెట్టి మార్కెట్లో విక్రయం పండు రంగు చూసి ఖరీదు చేస్తున్న వినియోగదారులు ఆరోగ్య సమస్యల బారిన పడి అవస్థలు కల్తీ పండ్ల విక్రయాలపై పట్టించుకోని అధికారులుతియ్యని పండ్ల వెనుక చేదు నిజాలు ఇవే..జైలు శిక్ష, జరిమానా..ఆహార సురక్ష ప్రమాణాల చట్టం–2006 ప్రకారం కాల్షియం కార్బైడ్తో మామిడి పండ్లను మగ్గించకూడదు. కార్బైడ్ వాడిన పండ్లను తినడం వల్ల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. నిబంధనలకు విరుద్ధంగా కార్బైడ్తో ముగ్గబెట్టిన వారికి, అమ్మేవారికి ఏడాది జైలుశిక్ష, జరిమానా తప్పదు. –ఈశ్వరి, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ అధికారి, విజయనగరం -
ఆదర్శనీయుడు అంబేడ్కర్
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని మంగళవారం వాడవాడలా నిర్వహించారు. ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేడ్కర్ అందరివాడని, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగంతో బాసట కల్పించారని ప్రజాప్రతినిధులు, అధికారులు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అందరికీ రాజ్యాంగంలో సమాన హక్కులు కల్పించారన్నారు. – సాక్షి నెట్వర్క్ విజయనగరంలో అంబేడ్కర్ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఏపీ శాసన సభ మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి -
వైఎస్సార్సీపీని మరింత బలోపేతం చేద్దాం
● వైఎస్సార్ సీపీ కార్యాలయ పునఃప్రారంభోత్సవంలో ఎంపీ గుమ్మ తనూజారాణి, మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పార్వతీపురం రూరల్: వైఎస్సార్సీపీ మరింత బలోపేతానికి అందరం కలిసికట్టుగా పాటుపడదామని, రానున్న అన్ని ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థులను విజేతలుగా నిలుపుదామని ఎంపీ గుమ్మ తనూజారాణి, మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్వతీపురం పట్టణంలోని పార్టీ నియోజకవర్గ కార్యాలయాన్ని మంగళవారం పునఃప్రారంభించారు. సంస్థాగతంగా పార్టీ నిర్మాణానికి చేపట్టాల్సిన చర్యలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ గుమ్మా తనూజారాణి మాట్లాడుతూ జగనన్న నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీ కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు ఏ కష్టం వచ్చినా అండగా నిలుస్తానన్నారు. పార్వతీపురం నియోజకవర్గంలో కమిటీల నిర్మా ణం వేగంగా పూర్తి కావడం హర్షణీయమని, జోగారావు అన్న పిలుపు మేరకు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని, ‘కాఫీ విత్ క్యాడర్’ వంటి వినూత్న కార్యక్రమాలు కార్యకర్తలకు మరింత చేరువయ్యేలా దోహదపడతాయన్నారు. మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేసేందుకు ఏర్పాటు చేసిన గ్రామస్థాయి, దాని అనుబంధ కమిటీల ఏర్పాటులో పార్వతీపురం నియోజకవర్గం అగ్రస్థానంలో నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్యకర్తలకు ఆయన అభినందనలు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు ముందుకు సాగాలన్నారు. ’రెడ్ బుక్’ పాలనకు, అరాచకాలకు ఎవరూ భయపడాల్సిన పనిలేదన్నారు. పార్వతీపురం మున్సిపాలిటీలోని అన్నివార్డుల్లోనూ వైఎస్సార్సీపీ పోటీచేసి విజయకేతనం ఎగురవేస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో మూడు మండలాలు, పురపాలక సంఘం పార్టీ అధ్యక్షులు కొండపల్లి బాలకృష్ణ, బొమ్మి రమేష్, పాలవలస మురళీకృష్ణ, బలగ శ్రీరాములునాయుడు, జెడ్పీటీసీ సభ్యులు అలజంగి రవి కుమార్, మామిడి బాబ్జి, బలగ నాగే శ్వరరావు, ఎంపీపీలు మజ్జి శోభారాణి, గుడివాడ నాగమణి, బలగ రవణమ్మ, వైఎస్ ఎంపీపీలు సిద్ధా జగన్నాథం, బి.రవికుమార్, వెలిది సాయిరాం, పార్టీ ప్రధాన కార్యదర్శులు పోల సత్యనారాయణ, తప్పిట ప్రసాద్, పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు సర్వీశెట్టి శ్రీనివాసరావు, మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ షఫీ, మాజీ చైర్ పర్సన్ బోను గౌరీశ్వరి, మాజీ వైఎస్ చైర్ పర్సన్ కొండపల్లి రుక్మిణి, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, ప్రధాన కర్యదర్శులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. -
రాములోరితో రాజకీయాలా?
డెంకాడ: రామతీర్థం రాములోరితో కూటమి నేతలు రాజకీయాలు చేస్తుండడం విచారకరమని, అసత్యాలు పలకడం వారి దిగజారుడు తనానికి నిదర్శనమని నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. డెంకాడ పంచాయతీ పరిధి దొడ్డిబాడువ గ్రామంలో ఆయన మంగళవారం మాట్లాడారు. రామతీర్థం ఆలయ అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందో భక్తులకు తెలుసన్నారు. ఆలయాలు కూల్చివేసిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదేనని విమర్శించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాల హయాంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి సాయంతో రాములవారి ఆలయ అభివృద్ధికి కోట్లాది రూపాయలు వెచ్చించామన్నారు. రామతీర్థం కొండపైకి మార్గంతోపాటు కొండపైన శిఖర దీపాన్ని వెలిగించామన్నారు. కొందరు దుండగులు రామతీర్థంలోని కోదండరామాలయంలోని రాముడు శిరస్సు ఖండించి భక్తుల మనోభావాలు దెబ్బతీశారన్నారు. వెంటనే పరిస్థితిని అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డికి వివరిస్తే ఆయన వెంటనే సుమారు నాలుగున్న కోట్ల రూపాయలు మంజూరు చేయించడంతో కొండపై నూతన ఆలయాన్ని 11 నెలల్లో నిర్మించామని, నూతన విగ్రహాలను కూడా శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారన్నారు. విగ్రహం ధ్వంసంపై కేసు ఉండడంతో శిరస్సు ఖండన విగ్రహాలను ముందుగా నెల్లిమర్ల పోలీస్టేషన్లోను, తర్వాత రామతీర్థంలో ఉంచారన్నారు. అప్పట్లో సూరిబాబు అనే వ్యక్తిపై పోలీసులు కేసుకూడా నమోదు చేశారని వివరించారు. అప్పుడు హడావుడి చేసిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత రాముడు శిరస్సు ఖండించిన వ్యక్తి ఎవరన్నది తేల్చకుండా ధ్వంసమైన శ్రీరాముడి విగ్రహంతో పాటు సీతాదేవి, లక్ష్మణుడు మూర్తులను కోటిపల్లి రేవులో జలాధివాసం చేయడం వారి చిత్తశుద్ధిని తేటతెల్లంచేస్తోందన్నారు. రామతీర్ధం నుంచి రణస్థలం రోడ్డు విస్తరణ పనులు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే సాగాయన్నారు. మిగులు పనులు పూర్తిచేసి రోడ్డు వేశామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కూటమి ప్రభుత్వం, నేతల తీరుపై మండిపడిన నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు టీడీపీ హయాంలో ఆలయాలకు రక్షణ కరువు ఆలయాల కూల్చివేసిన చరిత్ర చంద్రబాబుదే.. రాముడు శిరస్సు ఖండించిన వారు తేలకుండా జలాధివాసమా..? కూటమి నేతలు, ప్రజాప్రతినిధులువి దిగజారుడు రాజకీయాలు మండిపడిన నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు -
రక్తం సరఫరాలో నిర్లక్ష్యం..!
విజయనగరం ఫోర్ట్: రక్తం సరఫరాలో ప్రైవేటు బ్లడ్ బ్యాంక్లు నిబంధనలు పాటించడం లేదు. సేకరించిన రక్తంలో ప్రభుత్వ రక్తనిధి కేంద్రానికి ఇవ్వాల్సిన రక్తం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. నిబంధన ప్రకారం ప్రతి ప్రైవేటు బ్లడ్బ్యాంక్ తాము సేకరించిన దాంట్లో 30 శాతం రక్తం ప్రభుత్వ రక్తనిధి కేంద్రానికి ఇవ్వాలి. కొన్ని బ్లడ్ బ్యాంక్లు అసలు ఇవ్వడం లేదని సమాచారం. జిల్లాలో మొత్తం 9 బ్లడ్ బ్యాంక్లు ఉన్నాయి. వీటిలో ఒకటి సర్వజన ఆస్పత్రిలోని ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ కాగా, జీఎంఆర్వీ, మిమ్స్, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ, ఎన్వీఎన్, న్యూలైఫ్, విజయ, రోగరీ పవిత్రదేవి, బొబ్బిలి బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్లో రక్తం అవసరమైన రోగులకు ఉచితంగా రక్తాన్ని అందిస్తారు. ప్రైవేటు బ్లడ్ బ్యాంక్లో అయితే టెస్టింగ్ చార్జీల నిమిత్తం రూ.1000 నుంచి రూ.1200 వరకు తీసుకుంటారు. 2025–26లో 25,040 యూనిట్లు సేకరణ జిల్లాలో ఉన్న బ్లడ్బ్యాంక్ల నిర్వాహకులు 2025–26లో 25,040 యూనిట్ల రక్తం సేకరించారు. స్వచ్ఛంద రక్తదానం ద్వారా 18,783 యూనిట్లు, జిల్లాలో నిర్వహించిన 204 రక్తదాన శిబిరాల్లో 6,257 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 30 శాతం లెక్కన 6 వేల యూనిట్లను ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్కు రక్తం అందజేయాలి. అయితే, కొన్ని బ్లడ్ బ్యాంక్లు 30 శాతం రక్తం ఇవ్వలేదని ఆస్పత్రివర్గాలు చెబుతున్నాయి. దీనివల్ల పేద రోగులకు ఉచితంగా రక్తం సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంటున్నాయి. నిబంధనలు పాటించాలని కోరుతున్నాయి. ప్రభుత్వ రక్తనిధికి ఇవ్వని ప్రైవేటు బ్లడ్ బ్యాంక్లు 30 శాతం రక్తం సరఫరాలో కోత జిల్లాలో 9 బ్లడ్ బ్యాంక్లు 2025–26లో బ్లడ్ బ్యాంక్లు సేకరించిన రక్తం: 25,040 యూనిట్స్ స్వచ్ఛంద రక్తదానం ద్వారా 18,783 యూనిట్ల సేకరణ నిర్వహించిన రక్తదాన శిబిరాలు: 204 నిబంధనలు పాటించకపోతే చర్యలు ప్రైవేటు బ్లడ్ బ్యాంక్లు సేకరించిన రక్తంలో 30 శాతం ప్రభుత్వ రక్తనిధి కేంద్రానికి ఇవ్వాలి. ఏ బ్లడ్ బ్యాంక్ అయినా నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ కె.రాణి, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి -
ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ హాకీ టోర్నీ ప్రారంభం
విజయనగరం రూరల్: విజయనగరం కోరుకొండ సైనిక పాఠశాలలో ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ హాకీ టోర్నమెంట్ (గ్రూప్–ఎఫ్) 2026–27 సోమవారం ప్రారంభమైంది. అండర్–15 సబ్ జూనియర్ బాలురు, అండర్–17 జూనియర్ బాలికలు, బాలుర విభాగాల్లో మూడురోజుల పాటు జరగనున్న పోటీలను పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్.ఎస్.శాస్త్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... క్రీడలతో మానసిక, శారీరక ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు. క్రమశిక్షణ పెంపొందించడంలో క్రీడల కీలకపాత్ర పోషిస్తాయని చెప్పారు. క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని క్రీడాకారులకు సూచించారు. సైనిక్ స్కూల్స్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్న టోర్నమెంట్లో కోరుకొండ (ఆంధ్రప్రదేశ్), అంబికాపూర్ (ఛత్తీస్గఢ్), భువనేశ్వర్, సంబల్పూర్(ఒడిశా) సైనిక పాఠశాలల క్యాడెట్లు తలపడనున్నారు. అండర్–15 సబ్ జూనియర్ బాలురు,అండర్–17 జూనియర్ బాలికలు,బాలుర విభాగాల్లో క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్మించనున్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్, వింగ్ కమాండర్ వి.కిరణ్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, స్క్వాడ్రన్ లీడర్ అతుల్ జాన్ థామస్, సిబ్బంది, ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు. -
పాలిసెట్ నిర్వహణకు ఏర్పాట్లు
● జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్విజయనగరం అర్బన్: పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్–2026) నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సమన్వయ కమిటీతో నిర్వహించిన సమావేశంలో పరీక్ష ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 25న నిర్వహించనున్న పాలిసెట్–2026 పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 8,053 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. వీరి కోసం విజయనగరంలో 8, నెల్లిమర్లలో ఒకటి, గజపతినగరంలో 6, చీపురుపల్లిలో 5, బొబ్బిలిలో 4 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాలలో తగిన మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను సూచించారు. ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాల రవాణాకు పోలీస్ బందోబస్తు కల్పించాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144వ సెక్షన్ అమలు చేయాలన్నారు. పరీక్ష సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖకు.. కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని వైద్యశాఖకు.. తాగునీటి సదుపాయం కల్పించాలని మున్సిపాల్ శాఖకు సూచించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్ సత్తిబాబు, పాలిసెట్ జిల్లా కన్వీనర్ జి.సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
మౌలిక వసతులకు ప్రాధాన్యం
● జేసీ యశ్వంత్కుమార్ రెడ్డిపార్వతీపురం రూరల్: గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన.. విద్య, వైద్య రంగాల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని జేసీ సి. యశ్వంత్కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ఐటీడీఏ గిరిమిత్ర హాల్లో 2026 – 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రాస్పెక్టివ్ యాక్షన్ ప్లాన్ రూపకల్పనపై గిరిజన సంఘాల ప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గిరిజన గ్రామాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయి పరిశీలన చేసిన తర్వాతే అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం, రక్షిత మంచినీటి సరఫరా, విద్యుదీకరణ, అంగన్వాడీ భవన నిర్మాణాలు చేపట్టనున్నట్లు చెప్పారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతిగృహాల్లో మెరుగైన సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, గిరిజన సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు. -
పోటెత్తిన అర్జీదారులు
● 223 వినతుల స్వీకరణ విజయనగరం అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్లకు వచ్చే వినతుల పరిష్కారంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని జేసీ ఎస్.సేతుమాధవన్ అన్నారు. స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన పీజీఆర్ఎస్కు అర్జీదారులు పోటెత్తారు. మొత్తం 223 వినతులు రాగా.. అందులో రెవెన్యూ శాఖకు చెందినవి 95 కాగా మున్సిపల్ 12, ఏపీఈపీడీసీఎల్ 7, డీపీఓ 15, డీఎంహెచ్ఓ 2, గ్రామ సచివాలయ శాఖ 4, విద్యాశాఖ 3, డీఆర్డీఏ 22, ఇతర శాఖలకు చెందినవి 61 వినతులు వచ్చాయి. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. పిటీషనర్లతో అధికారులు నేరుగా మాట్లాడాలని, పదే పదే వచ్చే ఫిర్యాదులను సునిశితంగా పరిశీలించాలని సూచించారు. గడువుదాటక ముందే సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. 1100 టోల్ఫ్రీ నంబర్పై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఈ నంబర్కు వచ్చే ఫిర్యాదులను కూడా పరిష్కరించాలని తెలిపారు. డీఆర్ఓ సీహెచ్.సత్తిబాబు, ఇతర అధికారులతో కలిసి ప్రజల నుంచి వినతుల స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు, వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు. -
అంగన్వాడీ కార్యకర్త పనితీరుపై విచారణ
విజయగరం ఫోర్ట్: పట్టణంలోని ధర్మపురి సెంటర్ – 2 కార్యకర్త సీహెచ్ రమాదేవి పనితీరుపై ఐసీడీఎస్ సూపర్వైజర్ తెంటు త్రినాథ సోమవారం విచారణ చేపట్టారు. కేంద్రానికి వచ్చే పిల్లలు, గర్భిణులు, బాలింతలను దుర్భాషలాడుతూ, ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందనే ఫిర్యాదులు రావడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఈ మేరకు సూపర్వైజర్ లబ్ధిదారులు, ఆయాను విచారించి, వివరాలు తెలుసుకున్నారు. నివేదికను సీడీపీఓకు అందజేస్తామని సూపర్వైజర్ తెలిపారు.రోడ్డు ప్రమాదంలో విద్యార్థినికి గాయాలు బొండపల్లి: మండలంలోని బోడసింగిపేట జాతీయ రహదారి 26పై సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యార్థినికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. దత్తిరాజేరు మండలం పెదకాద గ్రామానికి చెందిన సీహెచ్ పద్మ బోడసింగిపేటలోని సాయిసిద్ధార్థ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. మధ్యాహ్నం కళాశాల ముగిసిన తర్వాత గజపతినగరం వైపు నడుచుకుంటూ వస్తుండగా.. గజపతినగరం వైపు నుంచి విజయనగరం వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురు మైనర్లు విద్యార్థినిని ఢీ కొట్టారు. దీంతో పద్మకు గాయాలు కావడంతో సహచర విద్యార్థినులు, స్థానికులు ఆమెను గజపతినగరంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తుమ్మికాపల్లిలో అగ్ని ప్రమాదం ● మామిడి, టేకు తోటలు దగ్ధం గజపతినగరం రూరల్: మండలంలోని తుమ్మికాపల్లిలో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో గ్రామానికి చెందిన ఎస్.శంకర్, ఎస్.పైడితల్లి, ఎస్. నారాయణప్ప, కె .తాతి నాయుడు, కె.నారాయణలకు చెందిన సుమారు పదెకరాల మామిడి,టేకు తోటలు కాలిపోయాయి. గుర్తు తెలియని వ్యక్తి కాల్చిన సిగరెట్టు/బీడీ పడేయడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేసున్తన్నారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో సుమారు లక్ష రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేశారు. ముద్దాయికి రెండేళ్ల జైలుశిక్ష డెంకాడ: పోలీసుల విధులకు ఆటంకం కల్పించడంతో పాటు వారిపై దాడి చేశారన్న అభియోగాలపై మండలంలోని గుణుపూరుపేట గ్రామానికి చెందిన పి. నారాయణరావు అనే వ్యక్తికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమాన విధిస్తూ విజయనగరం మహిళా కోర్టు న్యాయమూర్తి ఎన్.పద్మావతి సోమవారం తీర్పు చెప్పినట్లు ఎస్సై ఎ.సన్యాసినాయుడు తెలిపారు. కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 2024 మార్చి 5న సతీష్, శంకర్ అనే కానిస్టేబుళ్లు విధి నిర్వహణలో భాగంగా పెద తాడివాడ పంచాయతీ పరిధి ఏఎస్ఆర్ నగర్ వద్ద వాహన తనిఖీలు చేపడుతుండగా.. నిందితుడు నారాయణరావు కానిస్టేబుల్ సతీష్ను మోటార్ సైకిల్తో ఢీ కొట్టి వెళ్లిపోయాడు. దీంతో సతీష్ ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై కృష్ణమూర్తి కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి వాదోపవాదాలు విన్న తర్వాత ముద్దాయి జైలు శిక్ష, జరిమాన విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి విజయనగరం క్రైమ్: జిల్లా కేంద్రంలోని గాయత్రీనగర్కు చెందిన భవన నిర్మాణ కార్మికుడు లెంక అప్పలనాయుడు చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. రూరల్ ఎస్సై అశోక్ తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల పదో తేదీన ఇంటిలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తూ కాలుజారి పడిపోవడంతో అప్పలనాయుడుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు విశాఖ కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య రామలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
40 ప్యాకెట్ల గంజాయి స్వాధీనం
విజయనగరం క్రైమ్: నలుగురు నిందితుల నుంచి 40 ప్యాకెట్లలో 49.147 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... ఇటీవల కాలంలో కర్ణాటకకు చెందిన భార్యాభర్తలు వరుణ్కుమార్ మణి (23), నిషా బైరపురం (19) అనుమానాస్పదంగా సంచరిస్తుండగా టాస్క్ఫోర్స్ సీఐ శోభన్బాబు నేతృత్వంలో సిబ్బంది అరెస్ట్ చేశారన్నారు. వారిచ్చిన సమాచారంమేరకు ప్రదీప్సురేష్ (22), అభిలాష్ రవిరావు (21)లను అదుపులోకి తీసుకోగా.. వారి వద్ద 40 ప్యాకెట్ల గంజాయి పట్టుబడిందన్నారు. వీరంతా కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారని.. ఒడిశా నుంచి గంజాయి తీసుకువస్తూ విజయనగరంలో పట్టుబడ్డారన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వన్టౌన్సీఐ ఆర్వీఆర్కే చౌదరి, ప్రొబేషనరీ ఎస్సై జి.కమలభార్గవ్, ఎస్సై లక్ష్మీ ప్రసన్నకుమార్, హెచ్సీలు రమణ, గౌరీశంకర్, నాయుడు పాల్గొన్నారు. -
నిర్ణీత గడువులోగా పరిష్కరించాల్సిందే..
● కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డిపార్వతీపురం: పీజీఆర్ఎస్కు వచ్చిన వినతులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాల్సిందేనని కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి స్పష్టం చేశారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో జేసీ సి.యశ్వంత్కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్లు ఆర్. వైశాలి, స్వప్నిల్ జగన్నాథ్, డీఆర్ఓ కె. హేమలతతో కలిసి 70 అర్జీలు స్వీకరించారు. ఇందులో రెవెన్యూకు సంబంధించి 14 వినతులు రాగా.. మిగిలినవి వివిధ శాఖలకు సంబంధించినవి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎక్కువ కాలంగా పెండింగ్లో ఉన్న ఫిర్యాదులను గుర్తించి, వాటికి పరిష్కార మార్గం చూపాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే అధికారులపై చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వచ్చిన వినతుల్లో కొన్ని .. ● పార్వతీపురం పట్టణం బెలగాంలో తమ అనుభవంలో ఉన్న ఖాళీ స్థలాన్ని తప్పుడు డాక్యుమెంట్లతో ఎం. కృష్ణమూర్తి ఆక్రమించుకుని, నిర్మాణం చేస్తున్నాడని చింత తవిటినాయుడు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ● మహిళా సంఘాల రుణం కోసం రెండేళ్ల నుంచి వెలుగు కార్యాలయాల చుట్టూ సిబ్బంది తిప్పించుకుంటున్నారని పార్వతీపురం మండలం కొత్తచందలింగి గ్రామానికి చెందిన దుర్గాదేవి గ్రూపు సభ్యులు కొర్రా సూరమ్మ, తామల సుమిత్ర తదితరులు ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించి తక్షణమే రుణం మంజూరు చేయాలని కోరారు. ● పదిహేనేళ్ల నుంచి భర్తతో విడిగా ఉంటున్నానని.. తనకు తెలియకుండా తనకు వారసత్వంగా వచ్చిన స్థిరాస్తి ఖాళీస్థలాన్ని తప్పుడు సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్ చేయించి విక్రయించారని, అతనిపై చర్యలు తీసుకుని తన ఆస్తిని తనకు అప్పగించాలని కోరుతూ పాలకొండ పట్టణం ఇందిరానగర్ కాలనీకి చెందిన పప్పల పద్మావతి వినతిపత్రం అందజేశారు. -
స్వీయ జనగణనపై విస్తృత ప్రచారం
● కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డివిజయనగరం అర్బన్: సెన్సస్–2027 ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వీయగణన విధానంపై జిల్లా వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేపట్టాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో అధికారులను ఆదేశించారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ప్రజలే స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే ఈ వినూత్న అవకాశం ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తిగల పౌరులు నిర్ణీత గడువులోగా ‘ఎస్ఈ.సెన్సెస్.జీఓవీ.ఐఎన్’ పోర్టల్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం తరఫున 15 రోజుల పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. సమాజంలోని ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు ముందుండి తమ వివరాలను నమోదు చేసుకుని ఇతరులకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. స్వీయగణన పూర్తిగా స్వచ్ఛందమని ఎవరిపైనా ఒత్తిడి తీసుకురావొద్దని స్పష్టం చేశారు. -
అర్జీలు పరిష్కరించే అధికారులకు గుర్తింపు
● జేసీ సేతుమాధవన్ విజయనగరం గంటస్తంభం: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు అందిన అర్జీలను సకాలంలో పరిష్కరించే అధికారులకు ప్రభుత్వం గుర్తింపు ఇస్తుందని జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్జీల పరిష్కారానికి తొలి ప్రాధాన్యమివ్వాలని అధికారులకు సూచించారు. ప్రీ ఆడిట్, ఆడిట్ ప్రక్రియల్లో అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం ఉండాలని, మండల ప్రత్యేక అధికారులు మండల స్థాయిలో పర్యవేక్షణ చేయాలని సూచించారు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాలను తనిఖీ చేసి సిబ్బంది హాజరు, పనితీరును పరిశీలించాలని ఆదేశించారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, రీ వెరిఫికేషన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, రెవెన్యూ శాఖకు సంబంధించిన మ్యుటేషన్లు, సబ్ డివిజన్ సమస్యలను పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్ సత్తిబాబు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
● రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాల్సిందే..
రజకులను ఎస్సీ జాబితాలో చేర్పించేందుకు ప్రభుత్వం చొరవతీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట రజక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మహిళలు, వృద్ధులు సహా పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను వెళ్లగక్కారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే రజకులను ఎస్సీ జాబితాలో చేర్చారని, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కూడా తీర్మానం జరిగిందని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఎస్సీ జాబితాలో కులాన్ని చేర్పించాలని కోరారు. దోబి ఘాట్ల అభివృద్ధి, రుణ సదుపాయాలు, సబ్సిడీలు, ఆధునిక యంత్రాలు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కెల్ల సత్యం, రాష్ట్ర సహాయ కార్యదర్మి ఎం.పైడిరాజు పాల్గొన్నారు. -
న్యాయవాదులకు రక్షణ కల్పించండి
● విధులు బహిష్కరించిన న్యాయవాదులు విజయనగరం లీగల్: అన్నమయ్య జిల్లాలో సీనియర్ న్యాయవాది పూజారి ఎల్లయ్యను హత్యచేయడంపై విజయనగరం న్యాయవాదులు సోమవారం తమ విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో నల్లబ్యాడ్జీలు ధరించి నినాదాలు చేశారు. ఈ సందర్బంగా న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు నళితం రమేష్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టం అమలులోకి తేవాలని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి ఈ చట్టం ప్రతిపాదనదశలోనే ఉండిపోయిందన్నారు. సవరణల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేయ డం తగదన్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చొరవతీసుకొని తక్షణమే రక్షణ చట్టం అమలులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నిరసన కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు గడి మురళీకృష్ణ, పి.బ్రహ్మాజీ, పి.వరలక్ష్మి, గీతా ప్రవీణ్, జేవీఎస్ఎన్ మూర్తి, రామచంద్రరావు, తదితరులు పాల్గొన్నారు. భోగాపురం ఎయిర్పోర్టుకు ప్రత్యేక బస్సులు ● ఏపీఎస్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అప్పలరాజు వెల్లడి పూసపాటిరేగ: ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ఫీల్డు ఎయిర్పోర్టుకు నేరుగా చేరుకునేందుకు ప్రత్యేక బస్సులు నడపాలని విమానయాన సంస్థ నుంచి ప్రతిపాదనలు అందాయని ఏపీఎస్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అప్పలరాజు సోమవారం తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న ఎయిర్పోర్టుకు విశాఖపట్టణం నుంచి 20 ఎలక్ట్రికల్ బస్సులు నడిపేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, రాజాం, పార్వతీపురం, పలాస తదితర ప్రాంతాల నుంచి బస్సులు నడిపేందుకు ఆలోచనలు చేస్తున్నామన్నారు. భోగాపురం ఎయిర్పోర్టుకు ప్రజారవాణా విషయమై ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు సైతం సమీక్షా సమావేశాలు నిర్వహించారన్నారు. ఖైదీలపట్ల వివక్ష చట్టరీత్యా నేరం ● సబ్జైలును తనిఖీ చేసిన న్యాయసేవా సంస్థ కార్యదర్శి కృష్ణప్రసాద్ బొబ్బిలి: జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్ స్థానిక సబ్ జైలును సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తోటి ఖైదీల పట్ల వివక్ష చూపడం చట్టరీత్యా నేరమన్నారు. లీగల్ ఎయిడ్ క్లినిక్ను సందర్శించి అక్కడి విధులను పరిశీలించారు. అక్కడున్న ఖైదీలను, వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సౌకర్యాలపై ఆరా తీశారు. నేరప్రవృత్తిని వీడాలని హితవు పలికారు. వారికి ప్రభుత్వ పరంగా అందజేసే ఉచిత న్యాయసేవలను వివరించారు. వంట సరుకుల నాణ్యతను తనిఖీ చేశారు. -
వ్యాన్ను ఢీకొట్టిన లారీ
● వ్యాన్ డ్రైవర్కు గాయాలురాజాం సిటీ: మండల పరిధిలోని శ్రీకాకుళం రోడ్డు అంతకాపల్లి బ్రిడ్జి వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ తీవ్ర గాయాలపాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం పోరుపు గ్రామానికి చెందిన పోరుపోలు వీరబాబు కొరియర్ వ్యాన్తో శ్రీకాకుళం వైపు వెళ్తున్నాడు. అదే సమయంలో శ్రీకాకుళం వైపు నుంచి రాజాం వైపు వస్తున్న లారీ అతివేగంగా వస్తూ వ్యాన్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ ముందుభాగం నుజ్జునుజ్జు కాగా అందులోని డ్రైవర్ వీరబాబుకు చేయి విరగడంతో పాటు కాలుకు తీవ్రగాయలయ్యాయి. వెంటనే స్థానికులు 108కు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని బాదితుడ్ని రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడ నుంచి శ్రీకాకుళం ఆస్పత్రికి రిఫర్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సీఐ కె.అశోక్కుమార్ తెలిపారు. -
ఆడుతూ పతకాలు పట్టేద్దాం..
● క్రీడా అకాడమీల్లో ప్రవేశాలకు ఎంపికలు ● ఉత్తర్వులు జారీ చేసిన శాప్ అర్హతలివే.. ● దరఖాస్తు చేసుకునేందుకు 15 నుంచి 19 ఏళ్ల లోపు వయసున్న క్రీడాకారులు మాత్రమే అర్హులు. ● క్రీడాకారులు 01–01–2008 నుంచి 01–01–2011 మధ్య జన్మించిన వారై ఉండాలి. ● జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, చదువుతున్న పాఠశాల/కళాశాల నుంచి సర్టిఫికెట్, క్రీడా ప్రతిభా సర్టిఫికెట్ (రాష్ట్ర/జాతీయ స్థాయి ఉంటే), మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్, పది పాస్ పోర్టు సైజు పొటోలు తీసుకెళ్లాలి. ● ఎంపికల సమయంలో క్రీడా దుస్తులు, కిట్ తప్పనిసరి. ● ఎంపికై న వారికి శాప్ క్రీడా అకాడమీలలో వసతి, భోజనం, శిక్షణ సౌకర్యాలు అందించనున్నారు. ● అర్హత గల క్రీడాకారులు స్పోర్ట్స్ ఏపీ.జీఓవీ.ఇన్ వైబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. విజయనగరం: రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో క్రీడా అకాడమీల పునఃప్రారంభానికి రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా తిరుపతి, విశాఖపట్నం, కాకినాడలలో స్పోర్ట్స్ అకాడమీలు తిరిగి ప్రారంభించనుంది. 2026 – 27 సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి ఈ నెల 26 నుంచి మే 6 వరకు రాష్ట్ర స్థాయిలో ఎంపికలను చేపట్టనుంది. మూడు అకాడమీలలో మొత్తం 12 క్రీడాంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. అథ్లెటిక్స్, వాటర్ స్పోర్ట్స్, సైక్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, జిమ్నాస్టిక్స్, హాకీ, ఖోఖో, జూడో, బ్యాడ్మింటన్, బాక్సింగ్, రైఫిల్ షూటింగ్, లాన్ టెన్నిస్ విభాగాల్లో ఎంపికై న బాల,బాలికలకు శిక్షణ అందనుంది. ఆరు విభాగాల్లో.. తిరుపతి క్రీడా అకాడమీలో అత్యధికంగా ఆరు విభాగాల్లో (జూడో, బ్యాడ్మింటన్, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, రైఫిల్ షూటింగ్, లాన్ టెన్నిస్) రెసిడెన్షియల్ కోచింగ్ బాలురు, బాలికలకు వేర్వేరుగా ఇవ్వనున్నారు. జూడో, బ్యాడ్మింటన్, రైఫిల్ షూటింగ్, లాన్ టెన్నిస్లో ఒక్కో విభాగం నుంచి పది మంది బాలురు, పది మంది బాలికలను తీసుకోనున్నారు. బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్లో ఒక్కో విభాగం నుంచి 15 మంది బాలురకు శిక్షణ అందించనున్నారు. మూడు క్రీడాంశాల్లో.. విశాఖపట్నంలోని స్పోర్ట్స్ అకాడమీలో మూడు క్రీడాంశాల్లో (అథ్లెటిక్స్, వాటర్ స్పోర్ట్స్ , సైక్లింగ్) బాలురుకు రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనున్నారు. ఒక్కో క్రీడ నుంచి 15 మంది బాలురును ఎంపిక చేయనున్నారు. మే 4న అథ్లెటిక్స్, మే 5న సైకింగ్, మే 6న వాటర్ స్పోర్ట్స్ విభాగాలకు సంబంధించి విశాఖపట్నం కొమ్మాదిలో ఎంపికలు చేపట్టనున్నారు. బాలికలకు మాత్రమే.. కాకినాడలోని క్రీడా అకాడమీలో బాలికలకు మాత్రమే నాలుగు క్రీడాంశాల్లో (వెయిట్లిఫ్టింగ్, జిమ్నాస్టిక్స్, హాకీ, ఖోఖో) రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నెల 29న వెయిట్ లిఫ్టింగ్, జిమ్నాస్టిక్స్లో, 30న హాకీ, ఖోఖో విభాగాల్లో బాలికలకు కాకినాడ డీఎస్ఏలో ఎంపికలు చేపట్టనున్నారు. మంచి అవకాశం.. క్రీడల్లో రాణించాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ఈ ఏడాది నుంచి మూడు జిల్లాల్లోని అకాడమీల్లో శిక్షణ ఇచ్చేందుకు శాప్ నిర్ణయించింది. ప్రవేశాలకు సంబంధించి ఎంపికలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. – ఎస్.వెంకటేశ్వరరావు, జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి, విజయనగరం. -
సమస్యలకు చట్టబద్ధమైన పరిష్కారం
● ఎస్పీ మాధవ్రెడ్డిపార్వతీపురం రూరల్: ప్రజలు తెలియజేసిన సమస్యలకు చట్టబద్ధమైన పరిష్కారం చూపించి, వారికి భరోసా ఇవ్వాలని ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించి, ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడుతూ.. కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, ఆస్తి వివాదాలపై ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. బాధితులు తెలియజేసిన సమస్యలను నిర్ణీత వ్యవధిలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే చేపట్టిన చర్యలపై సమగ్ర నివేదికను జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి పంపాలని స్పష్టం చేశారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ మాధవ్రెడ్డి కోరారు. అర్జీదారులకు న్యాయం చేయడమే తమ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ ఆదాం, ఎస్సై అశోక్ చక్రవర్తి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పీజీఆర్ఎస్కు 50 ఫిర్యాదులు.. విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 50 ఫిర్యాదులు స్వీకరించారు. వీటిలో భూ తగాదాలకు సంబంధించినవి 10, కుటుంబ కలహాలకు సంబంధించినవి 4, చీటింగ్ కేసులు 6, నగదు వ్యవహారాలకు సంబంధించినవి 5, ఇతర అంశాలకు చెందినవి 25 అర్జీలున్నాయి. ఈ సందర్భంగా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఫిర్యాదుదారులతో మాట్లాడుతూ..సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఫోన్లో ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీసీఆర్బీ సీఐ కె.కుమారస్వామి, ఎస్బీ సీఐ ఎ.వి.లీలారావు, ఎస్సైలు రాజేష్, ప్రభావతి పాల్గొన్నారు. -
ప్రజల్లోకి చంద్రబాబు ప్రజావ్యతిరేక పాలన
● శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ పూసపాటిరేగ: ప్రజల్లోకి చంద్రబాబు ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనను తీసుకెళ్లాలని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పూసపాటిరేగ మండలం రెల్లివలస గ్రామంలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమానికి నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడుతో కలిసి బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలుచేస్తున్న అరకొర సంక్షేమ పథకాలు సైతం అర్హులకు అందడం లేదని, దీనిపై అర్హుల తరఫున పోరాడాలని సూచించారు. రెండేళ్లవుతున్నా జిల్లాలో ఒక్కరికీ కూడా కొత్తపింఛన్ మంజూరుచేయకపోవడం విచారకరమన్నారు. బడుగు బలహీన వర్గాలకు 50 ఏళ్లకే పింఛన్ అంటూ ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ ఏమైందని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలన్నారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో మండలాల వారీగా వైఎస్సార్సీపీ కార్యకర్తలతో సమావేశాన్ని త్వరలో ఏర్పాటు చేయాలని నాయకులకు సూచించారు. పార్టీ శ్రేణులకు ఎటువంటి సమస్యలు ఎదురైనా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం కార్యకర్తలతో విడివిడిగా మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకొన్నారు. సమావేశంలో పార్టీ పూసపాటిరేగ మండలాధ్యక్షుడు పతివాడ అప్పలనాయు డు, నాయకులు అంబళ్ల శ్రీరాములు నాయుడు, బొత్స సందీప్, బొత్స చైతన్యబాబు, మహంతి శ్రీనివాసరావు, జనార్దనరావు, టొంపల సీతారాం, కొత్తకోట శ్రీరాములు, దాడిశెట్టి త్రినాథరావు, గుజ్జు సురేష్రెడ్డి, గొర్లె రమణ, పిన్నింటి ఎల్లంనాయుడు, ఎం.కె.మోహన్, గాబు సూరప్పన్నరెడ్డి, మహంతి లక్ష్మణరావు, పతివాడ గోపి, మలుకుర్తి శ్రీనివాసరావు, గొర్లె రమా, డి.ఈశ్వరరావు, జనపాల అప్పారావు, పడాల శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు. -
రైతన్న ‘రుణం’ తీర్చుకోని.. చంద్రబాబు సర్కారు
జిల్లాలో 2లక్షల హెక్టార్లకు పైగా పంటల సాగవుతున్నాయి. వరి, చెరకు, మొక్కజొన్న, గోగు, నువ్వులు, పెసర, మినుము, కంది, చోడి, కొర్ర, సామ వంటి పంటలు సాగువుతున్నాయి. ఉద్యాన పంటలైన మామిడి, జీడిమామిడి, సపోట, అరటి, పామాయిల్, బొప్పాయి, డ్రాగన్ ఫ్రూట్, కూరగాయలు, ఆకుకూరలు కూడా పండిస్తున్నారు. రైతులకు ఖరీఫ్ 2025–26లో పంట రుణాల లక్ష్యం రూ.3,525.148 కోట్లు కాగా 2,06,809 మంది రైతులకు 3,194.53 కోట్లు రుణాలు ఇచ్చారు. రూ.330.518 కోట్లు రుణాలు ఇవ్వలేక పోయారు. జిల్లాలో 4.45 లక్షల మంది వరకు రైతులు ఉంటే 2.06 లక్షల మంది రైతులకు మాత్రమే రుణాలు ఇచ్చారు. సాగు పెట్టుబడికి డబ్బులు అందక రైతులు వడ్డీలకు అప్పులు తెచ్చి పంట పెట్టుబడి పెడుతున్నారు. తీరా పంట చేతికొచ్చినా మద్దతు ధర అందడం లేదు. తక్కువ ధరకే దళారులకు విక్రయించడంతో పెట్టుబడి కోసం తీసుకున్న అప్పు వడ్డీతో చెల్లిస్తే రైతులకు ఏమీ మిగలడం లేదని రైతులు వాపోతున్నారు. 2025–26 ఖరీఫ్ సీజన్లో బ్యాంకుల నుంచి రూ.3,194 .63 కోట్లు రుణాలు మాత్రమే అందించినట్టు జిల్లా వ్యవసాయాధికారి వి.టి.రామారావు తెలిపారు. విజయనగరం ఫోర్ట్: రైతు సంక్షేమంపై చంద్రబాబు ప్రభుత్వం కినుకవహిస్తోంది. సాగుకు కనీసం సహకరించడంలేదంటూ రైతన్నలు గగ్గోలు పెడుతున్నా పట్టించుకోవడం లేదు. అన్నదాత సుఖీభవ కింద పెట్టుబడి సాయం సరిగా అందని పరిస్థితి. విత్తనాల నుంచి యంత్రసాయం వరకు అరకొరే. ఎరువుల కోసం బారులు తీరాల్సిన దుస్థితి. రుణాల మంజూరులోనూ లక్ష్యం చేరుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. పంట రుణాలు పూర్తిస్థాయిలో ఇవ్వక పోవడంతో అన్నదాతలు ప్రైవేటు వ్యాపారుల నుంచి వడ్డీకి అప్పులు చేసి పంటల సాగుకు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి. ఇదీ పరిస్థితి.. 2025–26 ఖరీఫ్ పంట రుణాల లక్ష్యం రూ.3,525.148 కోట్లు జిల్లాలో రైతుల సంఖ్య 4.45లక్షలు రుణాలు అందినది కేవలం 2.06 లక్షల మందికి రూ.330.518 కోట్లు మంజూరు చేయని పరిస్థితి అప్పుచేసి పంటల సాగు పంటల విక్రయంలో లభించని మద్దతు ధర– ఆవేదనలో అన్నదాత -
ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
వివిధ వర్గాల ప్రజల ధర్నాలతో కలెక్టరేట్ సోమవారం దద్దరిల్లింది. సమస్యల పరిష్కారంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, ప్రజా సంక్షేమ పథకాలు మంజూరు చేయాలని, భూ సమస్యలకు పరిష్కారం చూపాలని, పల్లెలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పింఛన్లు, రేషన్కార్డులు మంజూరు చేయాలని విన్నవించారు. పీజీఆర్ఎస్ లో జిల్లాస్థాయి అధికారులకు వినతులు అందజేశారు. సమస్యలపై గోడు వినిపించారు. – విజయనగరం గంటస్తంభం ● మురుగునీటితో నిత్యనరకం సమస్యను వివరించేందుకు కలెక్టరేట్కు వస్తున్న దివ్యాంగుడుకొత్తవలస మండల కేంద్రంలో సర్వే నంబర్ 168,173 భూముల్లో ఇళ్ల పట్టాలిచ్చి ఏళ్లు గడుస్తున్నాయే తప్ప స్థలాలు చూపలేదంటూ లబ్ధిదారులు ఆవేదన వ్యక్తంచేశారు. ఇళ్ల స్థలాల కేటాయింపులో రాజకీయ వివక్ష తగదన్నారు. అలమండ హుద్హుద్ కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి కార్యవర్గ సభ్యుడు డేగల అప్పలరాజు, ఇళ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు. జామి మండలం భీమసింగి పంచాయతీ పరిధిలోని కె.భీమసింగి గ్రామం రాజావీధిలో మురుగునీరు ప్రవహిస్తోంది... కాలువల్లో పూడికలు తీసి మురుగునీటి కష్టాలు తీర్చాలని మండల స్థాయి అధికారులకు విన్నవించినా స్పందించడంలేదంటూ గ్రామస్తులు ఆందోళన చేశారు. జేసీ సేతుమాధవన్కు వినతిపత్రం అందజేశారు. తక్షణమే మురుగునీటి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తిచేశారు. -
గ్రామ రూపురేఖలు మారాలి
బలిజిపేట: ఫైలేరియా గ్రామంగా పేరుబడిన పెదపెంకి గ్రామం రూపురేఖలు మార్చాలని పార్వతీపురం సబ్ కలెక్టర్ వైశాలి అధికారులకు సూచించారు. పెదపెంకి గ్రామాన్ని ఆమె సోమవారం పర్యవేక్షించారు. గ్రామంలో ఇంతవరకు జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించారు. జరగాల్సిన పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలలని, మురుగునీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో డ్వామా పీడీ రామచంద్రరావు, ఎంపీడీఓ శ్రీవాణి, అధికారులు పాల్గొన్నారు. ● సబ్ కలెక్టర్ వైశాలి -
దాడి చేసే అధికారం ఎవరిచ్చారు..?
● వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి కొయ్యాన శ్రీవాణిరాజాం: మహిళలపై పెత్తనం చెలాయించి, రౌడీయిజం చేసే అధికారం కూటమి నాయకులకు ఎవరిచ్చారని మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి కొయ్యాన శ్రీవాణి ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్త దాడిలో గాయాలపాలైన సారథి గ్రామానికి చెందిన నిర్మలను ఆమె స్వగృహంలో ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్యంపై ఆరా తీశారు. ఆమెకు, కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇస్తూ, అక్కడ నుంచే ఫోన్లో రాజాం పోలీసులతో మాట్లాడారు. దాడి జరిగి మూడు రోజులు గడుస్తున్నా నిందితుడు టీడీపీ కార్యకర్త అడపా శ్రీనును ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. తప్పు చేసిన వ్యక్తి ఎంతటివాడైనా సరే శిక్షించాలని.. నిర్మలపై దాడిచేసిన అడపా శ్రీనుపై గతంలో కూడా కేసులు ఉన్నాయని చెప్పారు. ఈ విషయమై ఎస్పీని కలిసి బాధితురాలికి న్యాయం జరిగేలా పోరాటం చేస్తామన్నారు. అనంతరం ఆమె ఇంటివద్ద పలువురు మహిళలతో కలిసి దాడిని ఖండిస్తూ నిరసన తెలిపారు. నిర్మలపై దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కూటమి పాలనలో అరాచకం రాజ్యమేలుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వైఎస్సార్సీపీ హయాంలో మహిళలపై దాడి చేసే వారిని దిశ చట్టం ద్వారా కఠినంగా శిక్షించామని గుర్తు చేశారు. ప్రస్తుతం కూటమి పాలనలో మహిళలకు న్యాయం జరగడం లేదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకురాలు అల్లెన జయలక్ష్మి, పలు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. -
నేడు పీజీఆర్ఎస్
విజయనగరం అర్బన్: జిల్లా ప్రజల సమస్యల ను త్వరితగతిన పరిష్కరించేందుకు సోమవా రం కలెక్టరేట్ ఆడిటోరియంలో ‘ప్రజా సమస్య ల పరిష్కార వేదిక’ నిర్వహించనున్నట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి ఆదివారం తెలిపారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు పాల్గొని నేరుగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తారని పేర్కొన్నారు. అర్జీదారులు దరఖాస్తుల్లో పేరు, చిరునామా, ఫోన్ నంబర్ వంటి పూర్తి వివరా లను స్పష్టంగా నమోదు చేయాలని, సమస్య కు సంబంధించిన ఆధారాలను జతపరచాలని సూచించారు. గతంలో ఫిర్యాదు చేసిన వారు పాత అర్జీ రశీదును తప్పనిసరిగా తీసుకురావా లని తెలిపారు. అర్జీల స్థితిగతులను తెలుసుకు నేందుకు ప్రభుత్వం ఎస్ఎంఎస్ సౌకర్యాన్ని కల్పించిందని, సమస్య పరిష్కారం అనంతరం నోటీసులు లేదా ఎండార్స్మెంట్లు వాట్సాప్, రిజస్టర్ పోస్టు ద్వారా పంపుతారని వివరించా రు. కలెక్టరేట్కు రాలేని వారు 1100 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయడం ద్వారా లేదా ‘మీకోసం.ఏపీ.జీఓవి.ఐఎన్’ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. సమీపంలోని మండల, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా దరఖాస్తులు అందజేయవచ్చని పేర్కొన్నారు. రేగిడి/సీతంపేట: రేగిడి మండలానికి చెందిన 108 వాహనంలో పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం తురైమానుగూడకు చెందిన గిరిజన మహిళ ఆదివారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. సీతంపేట మండలం తురైమానుగూడకు చెందిన బిడ్డిక యమున పురిటి నొప్పులతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు 108కి సమాచారం ఇచ్చారు. సీతంపేటతో పాటు పరిసర 108 వాహనాలు వేరే కేసుల్లో ఉండడంతో రేగిడి మండలం 108 వాహనానికి సమాచారం వచ్చింది. వెంటనే ఇక్కడి పైలెట్ గర్భాపు నారాయణరావు వాహనాన్ని తురైమానుగూడకు తీసుకువెళ్లగా అక్కడ యమున బంధువులు ఆమెను ఆ వాహనంలో పాలకొండ తరలించే ప్రయత్నం చేశారు. అప్పటికే యమునకు పురిటినొప్పులు ఎక్కువ కావడంతో వాహనంలో ఈఎంటీ మీసాల ఈశ్వరరావు ప్రాథమిక చికిత్సను అందించడంతో వాహనంలోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. వారిని పాలకొండ ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. బొబ్బిలి: అమెరికా తన సామ్రాజ్యవాదాన్ని ప్రపంచానికి మరోసారి ప్రకటించుకునేందుకే ఇరాన్పై యుద్ధం చేస్తోందని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వి.రాంభూపాల్ అన్నారు. గురజాడ అధ్యయన వేదిక ఆధ్వర్యంలో అమెరికా సామ్రాజ్యవాద యుద్ధం – అంతర్జాతీయ పరిణామాలు – భారత్పై ప్రభావం అనే అంశంపై ఆదివారం సెమినార్ జరిగింది. యూటీఎఫ్ రాష్ట్ర నాయకురాలు కె.విజయగౌరి అధ్యక్షతన జరిగిన సెమినార్కు ఆయన ముఖ్యవక్తగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన సామ్రాజ్యవాదం కోసం ఇరాన్, వెనిజుల, క్యూబా, తదితర దేశాలపై అమెరికా యుద్ధం పేరుతో దాడులు చేస్తోందన్నారు. ఇరాన్లోని పాఠశాలపై చేసిన దాడుల్లో పాఠశాలపై బాంబులేసి ఉపాధ్యాయుల్ని, విద్యార్థుల్ని పొట్టన పెట్టుకుంటే మోదీ ప్రభుత్వం కనీసం ఖండించకపోవడం దారుణమన్నారు. మోదీ ఒంటెత్తు పోకడలతో దేశానికి తీరని నష్టం జరుగుతుందన్నారు. భూమార్గంలో పైపుల ద్వారా గ్యాస్ పంపుతామంటే మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. వెనిజులా అధ్యక్షుడిని ఆయిల్ నిక్షేపాల కోసమే నిర్భంధించారని ఇటువంటి సామ్రాజ్యవాదాన్ని ప్రతీ ఒక్కరూ ఖండించాలన్నారు. సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి చీకటి దివాకర్, ఏపీటీఎఫ్ రాష్ట్ర అకడమిక్ కౌన్సిలర్ జేసీ రాజు, రిటైర్డు ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బొత్స సత్యనారాయణ, జేఏసీ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్, జేవీవీ జిల్లా గౌరవాధ్యక్షుడు కె.శివానంద్, పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
●సందడి చేసిన సినీనటి శ్రీలీల
విజయనగరం టౌన్: సినీనటి శ్రీలీల ఆదివారం సాయంత్రం జిల్లా కేంద్రంలో సందడి చేశారు. స్థానిక వైఎస్సార్ కూడలి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన కళ్యాణ్ జ్యూవెలర్స్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఆమె హాజరయ్యారు. వందలాది మంది అభిమానులను చూసి ఆమె తన్మయత్వానికి లోనయ్యారు. తన అభిమానులందరికీ రుణపడి ఉంటామన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగానే తన పాత్రలు ఉంటాయన్నారు. భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలలో నటించి అందరికీ దగ్గరవుతామన్నారు. కళ్యాణ్ జ్యూవెలర్స్ వంటి బ్రాండ్తో అనుబంధం ఏర్పడ డం తనకు దక్కిన గౌరవమన్నారు. కళ్యాణ్ జ్యూవెలర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ కల్యాణ్ రామన్ మాట్లాడుతూ విజయనగరంలో వినియోగదారుల విభిన్నమైన అవసరాలను షోరూమ్ ద్వారా తీర్చడమే తమ సంస్ధ లక్ష్యమన్నారు. అనంతరం అభిమానులతో సెల్ఫీలు దిగారు. -
సముద్రంలో చేపల వేట నిషేధం
వేట చేసి ఒడ్డుకు వస్తున్న బోటు పూసపాటిరేగ : సముద్రంలో చేపల వేటను ఈ నెల 15 నుంచి నిషేధిస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడిన ట్టు మత్స్యశాఖ డెప్యూటీ డైరెక్టర్ విజయకృష్ణ ఆదివారం తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు వేట నిషేధిస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడినట్లు తెలిపారు. జూన్ 14 నుంచి సముద్రంలో వేటను పునరుద్ధరిస్తారని తెలిపా రు. ఏటా ఏప్రిల్, మే, జూన్ నెలలో సముద్రంలో చేపలు, రొయ్యలు, తాబేళ్లు వంటి మత్స్య జాతులు గుడ్లు పెట్టి పొదిగే సమయంగా ఈ కాలం భావిస్తా రు. సముద్రంలో చేపల వేట సాగిస్తే మత్స్య సంప ద నాశనం అవుతోందని ప్రభుత్వమే ప్రతి ఏటా ఏప్రిల్ నెలలో వేట నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుందన్నారు. జిల్లాలో 885 బోట్లు జిల్లాలో భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో 21 మత్స్యకార గ్రామాలలో 885 బోట్లులో వేట సాగిస్తున్నట్టు అధికారంగా రికార్డులు వున్నాయి. చింతపల్లిలో 412 బోట్లు, తిప్పలవలసలో 226 బో ట్లు, పతివాడబర్రిపేటలో 163, కోనాడలో నాలు గు, తమ్మయ్యపాలెంలో 25, పులిగెడ్డలో 10, ము క్కాంలో 91, చోడిపల్లిపేట 38, కొండ్రాజుపాలెం 60, చేపలుకంచేరులో 91 బోట్లు వున్నాయి. ఇంజ ను బోటుకు ఐదుగురు, సాంప్రదాయ బోటుకు ముగ్గురు చొప్పున సాయం అందచేయడానికి ఉత్తర్వులు ఇచ్చారు. 18 నుంచి 60 ఏళ్లలోపు వున్న మత్స్యకారులు మాత్రమే మత్స్యకార భరోసాకు అర్హులు అని ప్రకటించారు. వేట నిషేధాన్ని ఉల్లంఘించిన మత్స్యకారులకు పరిహారం నిలిపి వేస్తామని. ప్రతి మత్స్యకారుడుకి ఈకేవైసీ తప్పనిసరిగా వుండాలని, భరోసా సాయంకు విధివిధానాలు ఖరారు చేశారు. అయితే ప్రభుత్వం వేట నిషేధ భృతి ఇచ్చినప్పటికి చాలా మంది మత్స్యకారులకు ప్రభుత్వం పెట్టిన ఆంక్షలతో అనర్హులుగా ప్రకటించి వేట నిషేధభృతిని నిలిపివేస్తున్నారు. -
వైద్యురాలి అత్యాశ..!
విజయనగరం ఫోర్ట్: వైద్య విధాన్ పరిషత్ (ఏపీవీపీ)కి చెందిన ఓ వైద్యురాలు అత్యాశతో వ్యవహరించినట్టు ఆరోపణ లు వినిపిస్తున్నాయి. ఉద్యోగం చేస్తున్నట్టు జీతం తీసుకోవడంతో పాటు పీజీ చదువుతున్నట్టు స్టైఫండ్ కూడా తీసుకుంటున్నట్టు వైద్య విధాన్ పరిష త్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. రెండు చో ట్ల భారీగానే ఆమె లబ్ధి పొందినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. వైద్య విధాన్ పరిషత్లోని ఓ ఆస్పత్రిలో కాంట్రాక్ట్ పద్ధతిపై పని చేసిన ఓ వైద్యురాలు కొద్ది నెలలు క్రితం సూపర్ స్పెషాలటీ విభాగంలో పీజీ రావడంతో వెళ్లిపోయారు. అయితే ఇక్కడ ఉద్యోగానికి రాజీనామా చేసి అక్కడ చేరాల్సి ఉంది. కానీ సదరు వైద్యురాలు ఉద్యోగానికి రాజీనామా చేయకుండా మెటర్నటీ లీవు పెట్టి 6 నెలలకు సంబంధించి నెలకు రూ.2 లక్షలు చొప్పన జీతం తీసుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏవీవీపీ ఆస్పత్రిలో మెటర్నటీ లీవు పెట్టిన సమయంలోనే పీజీలో చేరి అక్కడ కూడా మెటర్నిటీ లీవు పెట్టి స్టైఫండ్ తీసుకున్నట్టు పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నిబంధన ప్రకారం పీజీ కోర్సులో చేరే ముందు ఇక్కడ ఉద్యోగానికి రాజీనా మా చేయాలి. పీజీలో చేరిన తర్వాత స్టైఫండ్ మాత్రమే తీసుకోవాలి. కానీ సదరు వైద్యురాలు స్టైఫండ్, జీతం రెండు తీసుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏపీవీపీ అధికారుల తీరుపై అనుమానాలు వైద్యురాలు జీతం, స్టైఫండ్ తీసుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో వైద్య విధాన్ పరిషత్ అధికారుల తీరుపైన పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అధికారుల పాత్ర లేకుండా సదరు వైద్యురాలు రెండు చోట్ల ఏ విధంగా లబ్ధి పొందగలరనే విమర్శలున్నాయి. ఈ వ్యవహారంలో ఓ ఉద్యోగి పెద్ద మొత్తంలో చేతి వాటం ప్రదర్శించిన ట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. పీజీ కోర్సులో జాయిన్ అయ్యేవారు ముందుగా కాంట్రాక్ట్ ఉద్యోగులు అయితే రాజీనామా చేయాలి. రెగ్యులర్ ఉద్యోగులు అయితే రిలీవింగ్ ఆర్డర్స్ తీసుకోవాలి. ఉద్యోగానికి రాజీనామా చేయకుండా పీజీలో చేరకూడదు. రెండు చోట్ల లబ్ధి పొందకూడదు. దీనిపై వైద్యురాలు పీజీ చదువుతున్న వైద్య కళాశాల ప్రిన్సిపాల్కు లెటర్ రాసి విచారణ చేపడతాం. – డాక్టర్ ఎన్.పద్మశ్రీ రాణి, డీసీహెచ్ఎస్ -
జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు తూడెం విద్యార్థులు
పూసపాటిరేగ: భోగాపురం మండలంలోని తూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు జాతీయస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికయ్యారు. గతేడాది నవంబర్లో పులివెందులలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలలో మంచి ప్రతిభ కనబరిచిన పాఠశాల విద్యార్థులు వి. వసంత్, యు. దీపిక జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అలాగే గతేడాది డిసెంబర్లో చిత్తూరులో జరిగిన రాష్ట్రస్థాయి బేస్బాల్ పోటీలలో మంచి ప్రతిభ కనబరిచిన ఇదే పాఠశాలకు చెందిన ఆర్. ప్రవీణ్ కూడా జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నెల 16 నుంచి జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో విద్యార్థులు రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ మేరకు విద్యార్థులను హెచ్ఎం వి.అప్పన్న, పీడీ సత్యనారాయణ, ఉపాధ్యాయులు అభినందించారు. -
స్వీట్ పాయిజన్
గజపతినగరం: మండల కేంద్రంలోని పురిటిపెంట న్యూ కాలనీ దగ్గరలో ఉన్న ఓ స్వీట్ ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న దట్టమైన పొగ..వాయు కాలుష్యానికి కారణమవుతోంది. స్వీట్లు తయారు చేసే పరిశ్రమ పొగగొట్టాల నుంచి వెలువడుతున్న దట్టమైన పొగ కాలనీ ప్రాంతాన్ని పూర్తిగా ఆవరించి, శీతాకాలంలో పడే పొగమంచు మాదిరి కనిపిస్తోంది. పొగ వల్ల కళ్లమంటలు, దగ్గు వంటివి వస్తున్నాయని, పలువురు శ్వాసకోశ, ఊపిరితిత్తుల సమస్యలతో ఆస్పత్రిపాలవుతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం అధికార యంత్రాంగానికి తెలిసినా పట్టించుకోవడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం పొగమంచులా.. ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల క్రీడా మైదానానికి ఉదయం, సాయంత్రం వాకింగ్, జాగింగ్కు వెళ్లే వారు, అదే గ్రౌండ్లో క్రికెట్, వాలీ బాల్ ఆడేవారంతా పొగమంచును తలపిస్తున్న ఆ పొగను చూసి తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఆరోగ్యం కోసం వస్తే రోగం తెచ్చుకున్నట్లు ఉందని, ఇటువంటి కలుషిత గాలిని పీల్చితే ఆరోగ్యం పోదా అని అంటున్నారు. కమ్ముకున్న దట్టమైన పొగ వల్ల ఒక్కోసారి దారి కూడా కనిపించడం లేదని, ఇలా అయితే ఇక్కడి వారమంతా రోగాల బారినపడి మరణించే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి, కాలుష్య నివారణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. స్వీట్ ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న దట్టమైన పొగలు తీవ్ర కాలుష్యంతో నిండిపోతున్న పరిసర ప్రాంతాలు రోగాల బారినపడుతున్న స్థానికులు పట్టించుకోని అధికార యంత్రాంగం -
మెరమెక్ జలపాతంలో.. బొబ్బిలి యువకుడి మృతి
● అమెరికాలోని కాలిఫోర్నియాలో ఘటన ● పిరిడిలో అలుముకున్న విషాదం బొబ్బిలి రూరల్: మండలంలోని పిరిడి గ్రామాని కి చెందిన సింగిరెడ్డి సా యి శ్రీహరికృష్ణ(26) శనివారం అమెరికాలోని కాలిఫోర్నియాలో మెరమెక్ జలపాతంలో ఈతకు దిగి ప్రమాదవశాత్తు నదిలో చిక్కుకుని మృతి చెందాడు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. పిరిడి గ్రామానికి చెందిన సింగిరెడ్డి శ్రీనివాసరావు, రమాదేవిల ఏకై క కుమారుడైన హరికృష్ణ ఆంధ్రా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ పూర్తి చేసి ఎంఎస్ చేసేందుకు గతేడాది అమెరికా వెళ్లి చదువు పూర్తి చేశాడు. మూడు నెలల క్రితం కాలిఫోర్నియాలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యో గంలో చేరాడు. శనివారం తన పుట్టిన రోజు కావ డంతో స్నేహితులతో కలసి మెరమెక్ జలపాతా నికి సరదాగా గడిపేందుకు వెళ్లారు. ఈతకు స్నేహితులతో దిగాడు. స్నేహితులంతా జలపా తం నుంచి బయటకు రాగా.. ప్రమాదవశాత్తు జలపాతంలో కొట్టుకుపోయాడు. దీంతో అక్కడి పోలీసులు జలపాతంలో గాలింపు చర్యలు చేప ట్టగా కొంత దూరంలో హరికృష్ణ మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రు లు, బంధువులు స్వగ్రామంలో కన్నీరుమున్నీరవుతున్నారు. చిన్నవయస్సులోనే అమెరికాలో ఉద్యోగాన్ని సాధించాడని సంబరపడ్డామని, ఇంతలో ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదంటూ బోరుమంటున్నారు. ఇటీవల తమకు డబ్బు పంపాడని ఇంతలో అనంత లోకాలకు చేరుకున్నాడని కన్నీటి పర్యంతమవుతున్నారు. తమకున్న ఒకే ఒక్క కుమారుడిని భగవంతుడు ఇలా తీసుకుపోయాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. హరికృష్ణ తండ్రి శ్రీనివాస్ ఆటో నడుపుతుండగా, తల్లి వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు ఉద్యోగినిగా పనిచేస్తున్నారు. ఉన్నంతలో బాగా చదివించామని, ఇంతలోనే విధికి తమ కుమారు డిపై కన్ను కుట్టిందని తల్లిదండ్రులు రోదిస్తున్నా రు. కాగా హరికృష్ణ మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి తెచ్చేందుకు ఇప్పటికే ప్రభుత్వంతో చర్చించామని, కేంద్ర ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని జిల్లా మంత్రి శ్రీనివాస్, ఎమ్మెల్యే బేబినాయన తెలిపారు. -
విజయనగరం
సోమవారం శ్రీ 13 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026ఆకాశం కొంచెం మబ్బు పట్టిందంటే చాలు.. వాన పడుతుందని సంబరపడాలో, లేక ఎప్పుడు ఏ పిడుగు మీద పడుతుందోనని భయపడాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. –8లోవిజయనగరం ఫోర్ట్: ఉపాధి హామీ పథకంపై చంద్రబాబు సర్కార్ వ్యవహరిస్తున్న తీరు పట్ల వేతనదారులు ఇదేం కర్మరా.. ‘బాబు’ అంటూ నిట్టూర్చుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిబంధనలు పెట్టడం సర్వత్రా చర్చనీయాంశమైంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లోకి వచ్చి రెండు దశాబ్ధాలు దాటింది. గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ సర్కార్ వ్యవహరించడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 3.45 లక్షల జాబ్ కార్డులు జిల్లాలో 3.45 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. వీటిలో 6,26,094 మంది వేతనదారులు ఉన్నారు. వీరిలో 5,17,126 మంది పనికి వెళ్లేవారు ఉన్నారు. జిల్లాలో 775 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. సర్కార్ వింత పోకడ టీడీపీ సర్కార్ వింత పోకడపై వేతనదారులు విస్తుపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆది వారం పూట పనులు పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. ఎండలు మండుతున్నాయి. ఎండలో పని చేయ డం వల్ల డీహైడ్రేషన్కు కూడా గురయ్యే ప్రమాదం ఉంది. వారంలో ఆరు రోజుల పాటు పని చేసి ఒక్క రోజు సెలవు ఉంటే వేతనదారులకు కాస్త విశ్రాంతి దొరికేది. కానీ ఇప్పడు వారం రోజులు పని చేయా ల్సి రావడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వా రంలో ఒక్క రోజు కూడా విశ్రాంతి దొరికే పరిస్థితి లేకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుట్టుగా.. ఉపాధి హామీ అధికారులు ఆదివారం పనులు పెడుతున్న విషయం ఇంతవరకు బయటకు పొక్కనీయలేదు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే ఆదివారం, పండగ పూట కూడా పనులు పెట్టుకోమని ఆదేశాలు వచ్చాయని ఉపాధి హామీ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని అధికారులు బయటకు చెప్పకపోవడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సెలవు లేకుండా నిరంతరం ఎండలో పని చేయడం కష్టతరంగా ఉందని వేతనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల పాటు సెలవు లేకుండా పని చేయడం ఇష్టం లేక చాలా మంది పనులకు రావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేసే వేతనదారులకు ఆదివారం కూడా సెలవు లేదట. ఈ పథకం అమల్లోకి వచ్చి 25 ఏళ్లు అవు తుంది. అప్పటి ఉపాధి వేతనదారులు వారంలో ఆరు రోజులు (సోమవారం నుంచి శనివారం) వరకు పనికి వెళ్లేవారు. ఆదివారం వేతనదారులకు సెలవు ఉండేది. దీంతో వారంలో ఒక్క రోజు విశ్రాంతి దొరికేది. ఇప్పుడు ఆదివా రం కూడా పనులకు రమ్మని కొత్తగా నిబంధన తేవడంతో వేతనదారులు మండిపడుతున్నారు. ఆదివారం పూట పనులు పెట్టుకోవచ్చునని ఉన్నత అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. అందుకే పనులు పెడుతున్నాం. పనికి ఆదివా రం రావడం,రాకపోవడం వేతనదారుల ఇష్టం. – ఎస్.శారదదేవి, పీడీ, డీఎంహెచ్ఓ -
నివాళులు..
విజయనగరం క్రైమ్ : జిల్లా నేర సమీక్ష విభాగంలో (డీసీఆర్బీ) హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్న ఎ. జగదీశ్వరరావు (49) గుండెపోటుతో ఆదివారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎస్పీ ఏఆర్ దామోదర్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మృతుని కుటుంబ సభ్యులకు ప్యూనరల్ ఖర్చులు, ఫ్లాగ్ ఫండ్ అందజేశారు. జగదీశ్వరరావుకు 11వ తేదీ రాత్రి గుండెపోటు రాగా కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఎస్పీ వెంట డీఎస్పీ ఆర్.గోవిందరావు, సీఐలు కె.కుమారస్వామి, ఆర్వీఆర్కే చౌదరి, సీహెచ్ సూరిదేముడు, బి.లక్ష్మణరావు, పోలీస్ అసోసియేషన్ కె. శ్రీనివాసరావు, తదితరులున్నారు. ఎస్ఎస్సీ సీజీఎల్లో పట్టణ యువకుడి ప్రతిభ విజయనగరం అర్బన్: కఠిన శ్రమ, పట్టుదలతో ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని పట్టణానికి చెందిన యువకుడు చిప్పాడ రవిప్రసాద్ నిరూపించారు. ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ సీజీఎల్ (స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్) ఫలితాల్లో ఆయన ఇన్కమ్ ట్యాక్స్ సూపరింటిండెంట్గా ఎంపికయ్యాడు. పట్టణంలోని సీబీ కాలనీకి చెందిన రవిప్రసాద్ మొదటి ప్రయత్నంలోనే ఈ ఉద్యోగాన్ని సాధించడం విశేషం. బీటెక్ పూర్తి చేసిన అనంతరం ప్రభుత్వ రంగంలో పని చేయాలనే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా చదివానని రవిప్రసాద్ తెలిపారు. ఇతని తండ్రి ప్రభుదాస్ జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖలో సహాయ సంబంధాల అధికారిగా పనిచేస్తున్నారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి బలిజిపేట: మండలంలోని పెదపెంకిలో విద్యుదాఘాతంతో ఒకరు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన మజ్జి శంకరరావు (60) ప్రైవేట్ ఎలక్ట్రీషియన్గా పని చేస్తుంటాడు. గ్రామంలోని సచివాలయానికి విద్యుత్ సరఫరా లేదని చెప్పడంతో మరమ్మతులకు ఆదివారం వెళ్లాడు. మరమ్మతులు చేపడుతుండగా..విద్యుత్షాక్తో ఒక్కసారిగా కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సబ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
మెరుపు చూసి మసులుకో...!
విజయనగరం గంటస్తంభం: ఆకాశం కొంచెం మబ్బు పట్టిందంటే చాలు.. వాన పడుతుందని సంబరపడాలో, లేక ఎప్పుడు ఏ పిడుగు మీద పడుతుందోనని భయపడాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ముసురు పట్టిందంటే ముచ్చటగా ఉండాలి కాని ముంచుకొచ్చే ముప్పులా మారుతోంది. వానకాలం వచ్చిందంటే చాలు.. ఆకాశంలో మెరుపులు మెరవడం, ఉరుములు ఉరమడం మామూలే అనుకుంటే పొరపాటే. ఆ మెరుపు వెనుక మృత్యువు దాగి ఉంది. ఆకాశం నుంచి నిప్పుల కొలిమి పిడుగు రూపంలో వచ్చి పడుతోంది. ఈ మధ్య కాలంలో విజయనగరం జిల్లాలో జరుగుతున్న దారుణాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఒక్క నిమిషం అజాగ్రత్తగా ఉన్నామా.. ఇంక అంతే సంగతులు. పిడుగుపాటు...చావు దెబ్బ..! ఏటా పదుల సంఖ్యలో పిడుగులు పడి ప్రజలు చనిపోతుండడం బాధిస్తోంది. పొలం గట్ల మీద పని చేసే రైతన్నలు, వానొస్తుందని చెట్ల కింద తలదాచుకునే కూలీలు, గొర్రెలు, మేకలు కాసే కాపరులే ఎక్కువగా ఈ పిడుగులకు బలైపోతున్నారు. మెరుపు కనిపించినప్పుడు గుండె ధైర్యం ప్రదర్శిస్తే కుదరదు.. అక్కడ నుంచి తెలివిగా తప్పించుకోవడమే ముఖ్యం. ఏప్రిల్ – జూన్ మధ్యనే అధికం.. ఏటా ఏప్రిల్, మే, జూన్ నెలల్లోనే పిడుగుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించే వరకు పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయి. ఆ సమయంలో సముద్రంలో నుంచి వచ్చే గాలుల్లో తేమ శాతం పెరిగి దట్టమైన క్యూములోనింబస్ మేఘాలు కమ్ముకుంటాయి. అప్పుడే ఉరుములు ప్రారంభమై పిడుగులు పడుతుంటాయి. గడిచిన కొద్ది రోజుల్లోనే విజయనగరం జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు రైతులు మృతి చెందారు. ముందస్తు సమాచారం ఇచ్చేలా... పిడుగు పాటును ముందుస్తుగా గుర్తించి ప్రజలను అప్రమత్తం చేసే పరిజ్ఞానాన్ని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ వినియోగిస్తోంది. దీనికోసం ఎర్త్ నెట్వర్క్ ద్వారా రాష్ట్రంలో సెన్సార్లు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏ సమయంలో పిడుగులు పడే అవకాశముందో ఈ సెన్సర్ల ద్వారా అధికారులు ఓ అంచనాకు వస్తారు. దాంతో మండలాల వారీగా ప్రజల ఫోన్లకు ఎస్సెమ్మెస్లు పంపి అప్రమత్తం చేస్తున్నారు. దీని ద్వారా 30 నుంచి 40 నిమిషాల ముందే పిడుగు పడబోయే ప్రాంతాన్ని గుర్తించవచ్చు. కళ్లెదుటే ప్రమాదాలు.. మొన్నటికి మొన్న వంగర మండలంలో జరిగిన ముచ్చట వింటే ఎవరికై నా కన్నీళ్లు ఆగవు. ఇనముల నర్సమ్మ (48) అనే మహిళా రైతు పొలంలో పనులు చేసుకుంటా ఉండగా..ఒక్కసారిగా ఉరుము ఉరిమి పిడుగు పడింది. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. అట్లాడే రేగ గ్రామంలో కూడా పిడుగు పడి ఎనిమిదో తరగతి చరువుతున్న చరణ్ తేజ అనే కుర్రాడు చనిపోవడం ఊరందరినీ కలిచివేసింది. ఇలాంటి సంఘటనలు జిల్లా వ్యాప్తంగా మరెన్నో చోటుచేసుకుంటున్నాయి. ప్రాణాలు తీస్తున్న పిడుగులు ఏటా పదుల సంఖ్యలో మరణాలు అప్రమత్తతతోనే ప్రమాదాలకు దూరం రైతులు, కూలీలు, పశువులు, గొర్రెల కాపరులే బలి అప్రమత్తతే ప్రాణాలకు రక్ష.. పత్రికలు, టీవీల ద్వారా వాతావరణ సమాచారం తెలుసుకోవడంతో పాటు స్థానిక అధికారులు చేసే హెచ్చరికలు పాటించాలి. పిడుగులు ఎత్తైన భవనాలు, స్తంభాలు, వృక్షాలపై పడే అవకాశం ఎక్కువ. దీంతో వీలైనంత వరకు ఎత్తైన ప్రదేశాలకు దూరంగా ఉండాలి. ఉరుముల సమయంలో తప్పించుకునేందుకు స్థలం లేకపోతే కిందకు వంగి ఉండాలి. కూర్చున్నప్పుడు పాదాల ముందు భాగం మాత్రం నేలను తాకాలి. మిగిలిన ఏ భాగం నేలను తాకకుండా జాగ్రత్త పడాలి. ఉరుములు, మెరుపుల సమయంలో సెల్ఫోన్లో మాట్లాడకూడదు. మేఘాల్లోని విద్యుత్ తరంగాలతో ఎలక్ట్రానిక్ పరికరాలు పేలుడుకు గురయ్యే ప్రమాదం ఉంది. గృహాల్లో ఉండే టీవీలు, ఫ్రిజ్లు ,ఇన్వర్టర్లు తదితర ఎలక్ట్రానిక్ పరికాలకు విద్యుత్ కనెక్షన్ తొలగించాలి. -
కొట్టి పడేశారు..
● వ్యక్తి కాళ్లు, చేతులు కట్టేసి పొదల్లో పడేసిన దుండగులు ● ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడుబొండపల్లి: మండల కేంద్రమైన బొండపల్లి మధుర గ్రామమైన గొల్లలపేటలో దారుణం చోటు చేసుకున్న సంఘటన ఆదివారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి ఏఎస్సై ఎల్.గోపి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పీతల సత్యం శనివారం ఉదయం 11 గంటల సమయంలో గొర్రెల మందను చూసేందుకు గ్రామ సమీపంలోని చింతల చెరువు వద్దకు వెళ్లాడు. కొద్ది సేపటి తర్వాత ఇంటికి వెళ్లిపోతానని చెప్పిన సత్యం ఇంటికి చేరుకోలేదు. దీంతో కుటుంబ సభ్యులు గ్రామ పరిసరాల్లో వెతకగా.. ఆదివారం ఉదయం గ్రామ సమీపంలోని పొదల్లో కాళ్లు, చేతులు కట్టేసి పడిఉన్నాడు. ఎవరో తనపై దాడి చేసి కాళ్లు, చేతులు కట్టేసి పడేశారని చెప్పి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు స్పందించి సత్యంను బొండపల్లి పీహెచ్సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం గజపతినగరం ఏరియా ఆస్పత్రికి రిఫర్ చేశారు. పోలీసులు బాధితుడితో మాట్లాడి వివరాలు సేకరించి, కేసు నమోదు చేశారు. -
రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యం
రామభద్రపురం: రోడ్డు ప్రమాదాల నియంత్రణే ప్రధాన లక్ష్యమని అందుకు తగ్గ పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. స్థానిక పోలీస్స్టేషన్ను ఆదివారం ఆయన సందర్శించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, గంజాయి అక్రమ రవాణా జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బొబ్బిలి రూరల్, టౌన్ సీఐలు శ్రీనివాసరావు, నారాయణరావులకు పలు సూచనలు చేశారు. బ్లాక్ స్పాట్లతో పాటు కిలోమీటర్ దూరంలో స్టాపర్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాదిలో జిల్లాలోని మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన సుమారు 200 మందిని జైలుకు పంపించామన్నారు. అతివేగం ప్రాణాలు తీస్తోందన్నారు. రహదారి ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. జిల్లాలో 200 మంది వరకు పోలీస్ సిబ్బంది కొరత ఉందని, ప్రస్తుతం పోలీస్ శిక్షణలు జరుగుతున్నందున కొద్ది రోజుల్లో స్టేషన్కు పది మంది చొప్పున్న సిబ్బంది నియామకం జరుగుతుందన్నారు. ఎవరైనా క్రికెట్ బెట్టింగులకు పాల్పడితే రౌడీషీట్ ఓపెన్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సైబర్ నేరగాళ్లు రకరకాల సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని, ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలన్నారు. రామభద్రపురం అంతర్రాష్ట్ర కూడలి కావడంతో గంజాయి అక్రమ రవాణా జరిగే అవకాశం ఉన్నందున నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆయన వెంట ఎస్ఐ జ్ఞానప్రసాద్, ఏఎస్ఐ అప్పారావు ఉన్నారు. -
ఉత్తరాంధ్ర ట్రావెల్ హబ్గా భోగాపురం ఎయిర్పోర్టు
పూసపాటిరేగ: భోగాపురం గ్రీన్ఫీల్డు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు చివరిదశకు చేరుకున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ట్రావెల్హబ్గా ఎయిర్పోర్టు సేవలందించనుంది. మరో నాలుగు నెలల వ్యవధిలో విమానాశ్రయం ప్రారంభానికి అడుగులు పడుతున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎయిర్పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు చకచకా పూర్తిచేయించింది. ఈ ఏడాది జూలై లేదా ఆగష్టు నెల నాటికి భోగాపురం గ్రీన్ఫీల్డు అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు విశాఖపట్టణంలో ఉన్న విమానాశ్రయాన్ని డిఫెన్స్ అవసరాలకే పరిమితి చేయనున్నట్టు సమాచారం. భోగాపురం ఎయిర్ పోర్టును తొలుత కార్గో సేవలకు వినియోగించాలని ప్రతిపాదించినా, నగరాలు పూర్తిస్థాయిలో విస్తరించడం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఎయిర్పోర్టు కేంద్రం కావడంతో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారని అంచనా వేస్తున్నారు. ఏటా ఆరు మిలియన్లు మంది ప్రయాణికులు ఎయిర్పోర్టు ద్వారా రాకపోకలు సాగి స్తారని అంచనా. అందుకు అనుగుణంగా ఎయిర్పోర్టును తీర్చిదిద్దారు. ప్రధాన మంత్రి చేతుల మీదుగా విమానాశ్రయం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్హెచ్–16కు రోడ్లు అనుసంధానం చేస్తూ పలుచోట్ల వంతెనలు నిర్మిస్తున్నారు. ఈ పనులన్నీ జూన్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఏ జిల్లా నుంచి అయినా ఎయిర్పోర్టుకు గంట వ్యవధిలోపు చేరుకునేలా రోడ్లను అభివృద్ధి చేస్తున్నారు. పనులను కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలకు భోగాపురం గ్రీన్ఫీల్డు ఎయిర్పోర్టు త్వరలో ట్రావెల్హబ్గా తయారుకానుంది. ఇక్కడ నుంచి ప్రయాణానికి ప్రత్యేక విమాన సర్వీసులు విమానాశ్రయానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం శంకుస్థాపన జోరుగా సాగిన పనులు ఈ ఏడాది జూలై/ఆగస్టులో అందుబాటులోకి.. విశాఖపట్టణం ఎయిర్పోర్టు డిఫెన్స్ అవసరాలకే పరిమితం -
కలెక్టరు సారూ.. ఇదేం తీరు!
సాక్షి, పార్వతీపురం మన్యం: ● ‘కలెక్టరు గారూ.. మీ దగ్గర నుంచి సమాధానం ఆశించడం లేదు. ఐయామ్ ఎక్స్పెక్టింగ్ ఓన్లీ వర్క్ ఫ్రం యు సార్! ఇన్కేస్ నా వర్క్స్ కన్సిడర్ చేయకపోతే మీ మీద ప్రివిలైజ్ మోషన్ స్పీకర్కు ఇవ్వడానికి కూడా వెనుకాడను.’ ● ‘కలెక్టర్ గారూ, మీరు నన్ను తప్పుగా అనుకోకండి. నన్ను వేరే విధంగా చూపించకండి. మీకు, నాకు పర్సనల్గా ఎటువంటి ఇష్యూలు లేవు. మీ చదువుకు, మీ ఉద్యోగాన్ని నేను గౌరవిస్తున్నాను. మీ దగ్గర నుంచి నేను.. నాకు ఓటేసిన ప్రజల డెవలప్మెంట్ మాత్రమే ఆశిస్తున్నాను. ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ నేను సమాధానం చెప్పాలి. ఎంపీగా నేను వారి కోసం ఏదైనా చేయాలి.’ ● అరకు పార్లమెంట్ సభ్యురాలు గుమ్మ తనూజరాణి ఇటీవల జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో చేసిన వ్యాఖ్యలివి. జెడ్పీ సర్వసభ్య సమావేశం సాక్షిగా పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి తీరును ఎత్తిచూపారు. తనకు ఓటేసిన ప్రజలకు సేవ చేసుకునే అవకాశానికి మోకాలడ్డుతున్నారని వాపోయారు. ఎంపీ ల్యాడ్స్ కింద కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేస్తున్నా.. వాటితో అభివృద్ధి పనులు చేయడానికి ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఓటేసిన ప్రజలకు అందరికీ తాను సమాధానం చెప్పుకోవాలని తెలిపారు. యువ ఎంపీ.. గిరిజన బిడ్డ.. ప్రజలకు సేవ చేయా లన్న ఆకాంక్షతో తొలిసారిగా పార్లమెంట్లో అడుగు పెట్టి, అనతికాలంలోనే ధీటైన నాయకురాలిగా ఎదిగిన అరకు పార్లమెంట్ సభ్యురాలు తనూజూరాణి చేసిన వ్యాఖ్యలు.. రెండు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆమె ఆవేదన వెనుక అంతులేని ‘రాజకీయ వివక్ష’ ఉంది. అభివృద్ధి కంటే కక్షపూరిత రాజకీయమే ముఖ్యమనుకునే ప్రజాప్రతినిధుల అసూయ దాగి ఉంది. ఎమ్మెల్యే లు ఒక నియోజకవర్గానికే ప్రజాప్రతినిధి.. ఎంపీ ఏడు నియోజకవర్గాలకు ప్రజాప్రతినిధి. అధికార పార్టీలో ఎమ్మెల్యేకు ఇస్తున్న విలువ.. పార్లమెంట్ సభ్యురాలికి ఇవ్వకపోవడం.. జిల్లా యంత్రాంగం అందుకు వంతపాడటం బహుశా పార్వతీపురం మన్యం వంటి ప్రాంతంలోనే జరిగి ఉండొచ్చంటూ రాజకీయ విశ్లేషకులు, మేధావులు పేర్కొంటున్నారు. ఎవరు నిధులిచ్చినా.. ప్రజల కోసమే కదా! గత ఎన్నికల్లో అరకు ఎంపీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి గుమ్మ తనూజరాణి ఘన విజయం సాధించారు. నిత్యం ప్రజల మధ్యే ఉంటూ.. గిరిజన ప్రాంత సమస్యలపై పార్లమెంట్ సాక్షిగా గళం వినిపిస్తున్నారు. తన పార్లమెంట్ పరిధిలోని ఎంపీ ల్యాడ్స్ నుంచి పార్వతీపురం మన్యం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు పెద్ద ఎత్తున నిధులు ఆమె అందజేస్తున్నారు. పార్వతీపురం నియోజకవర్గానికి రూ.75 లక్షలు, పాలకొండకు రూ.75 లక్షలు, కురుపాం రూ.40 లక్షలు, సాలూరు నియోజకవర్గానికి రూ.30 లక్షలు చొప్పున 2024, సెప్టెంబర్ నుంచి ఇస్తున్నారు. సీసీ రహదారులు, కల్వర్టులు, తాగునీరు, వీధి దీపాలు, సోలార్ లైట్ల కోసం నిధులు వెచ్చించాలని అధికార యంత్రాంగాన్ని కోరారు. ఏఎస్ఆర్ జిల్లాలో ఎంపీ ల్యాడ్స్ను చక్కగా వినియోగించుకుని వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాకు వచ్చేసరికి అందులో ఒక్క రూపాయి కూడా అధికార యంత్రాంగం ఖర్చు చేయకపోవడంపై ఆమె ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అభివృద్ధి పనులకు మోకాలడ్డేదెవరు..? ఎంపీ ల్యాడ్స్ వినియోగంలో తాత్సారం ఎందుకు? నిధులిస్తున్నా.. ఎమ్మెల్యేల అభ్యంతరం ఏమిటి? జిల్లాను అభివృద్ధి చేయడం ఇష్టం లేదా? కేవలం అధికారుల వల్లే ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నామని అరకు ఎంపీ ఆవేదన ఆది నుంచి ఇదే తీరు... ఎంపీ తనూజరాణి పట్ల జిల్లా అధికార యంత్రాంగం ఆది నుంచి నిర్లక్ష్యం, వివక్షనే చూపిస్తోంది. గిరిజన ప్రాంతమైన మన్యంలో.. ఒక గిరిజన ఎంపీపై ఇటువంటి బేధాలు చూపడం పట్ల పలుమార్లు సమావేశాల్లోనే ఆమె వాపోయారు. అభివృద్ధి కార్యక్రమాలకు, సమావేశాలకు, ప్రారంభోత్సవాలకు ఎంపీగా పిలుపు ఉండడం లేదు. ఆమె వచ్చిన సందర్భాల్లో ప్రొటోకాల్ విస్మరిస్తున్నారు. ఎంపీ అధ్యక్షతన జరగాల్సిన దిశ సమావేశాల్లోనూ అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో హాజరు కాని పరిస్థితి. ఎంపీ ల్యాడ్స్ వినియోగించకపోవడంపై గత దిశ సమావేశంలోనే అందరి ముందు ఆమె కలెక్టర్ దృష్టిలో పెట్టారు. సుమారు మూడు నెలలవుతోంది. ఇప్పటి వరకు వాటిపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోనూ కూటమి ఎమ్మెల్యేలే ఉన్నారు. వారు అభ్యంతరం చెప్పడం వల్లే అధికారులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వివక్ష కారణంగానే, ఓటేసిన ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నామన్న ఆవేదనతో రెండు రోజుల కిందట జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్కు అంతా తెలిసే జరుగుతుందన్న అభిప్రాయం ఆమె మాటల్లో వ్యక్తమైంది. -
కుష్ఠు రోగులపై కూటమి వివక్ష..!
–8లో‘జలధార – జలహారతి’పై సమీక్ష ‘జలధార – జలహారతి’పై ఏపీఎస్ఏసీ జియోసైన్సెస్ విభాగాధిపతి ఎ.మరియరాజుతో కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి శనివారం తన చాంబర్లో సమీక్షించారు. అంగన్వాడీలకు చేరని పాలు అంగన్వాడీ కేంద్రాలకు సకాలంలో పాలు సరఫరా కాకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. రాజాం: కుష్ఠురోగులపై చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి సర్కారు వివక్ష చూపుతోంది. కుష్ఠు ఆస్పత్రులకు సౌకర్యాల కల్పనలో జాప్యం రోగులకు శాపంగా మారింది. విరిగిన మంచాలు, చాలీచాలని భోజనం, పెంకులూడి కారిపోతున్న భవనాలు, చుట్టూ ముళ్లపొదలతో అధ్వానంగా ఉన్న పరిసరాలు రోగులను భయపెడుతున్నాయి. దీనికి రాజాం మండలం పొగిరి గ్రామంలోని కుష్ఠువ్యాధి నిర్మూలన ఆస్పత్రే నిలువెత్తు నిదర్శనం. ఆస్పత్రిని 1962లో నిర్మించారు. ఇక్కడ రాజాం, చీపురుపల్లి, బొబ్బిలి నియోజకవర్గాల్లోని రోగులతో పాటు అటు ఎచ్చెర్ల, శ్రీకాకుళం, నరసన్నపేట, ఆమదాలవలస నియోజకవర్గాలకు చెందిన రోగులు వైద్యసేవలు పొందుతున్నారు. ఒకప్పుడు ఆరేడు భవనాలతో రోగులకు విశేష సేవలందించిన ఆస్పత్రి ఇప్పుడు కునారిల్లుతోంది. భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. కిటికీల తలుపులు ఊడిపోయాయి. ఆస్పత్రికి రక్షణగోడలేదు. ఆస్పత్రి చుట్టూ ముళ్లపొదలు, పాముల పుట్టలు అధికమయ్యాయి. ఆస్పత్రికి వచ్చిన రోగులు రాత్రి సమయాల్లో ఉండలేక రాజాం ఆర్టీసీ కాంప్లెక్స్, ప్రభుత్వ సామాజిక ఆస్పత్రి, పార్కులు వద్ద నిద్రించి.. ఉదయాన్నే మళ్లీ ఇక్కడకు వస్తున్నారు. అప్పట్లో ఇద్దరు వైద్యులు, 12 మందికిపైగా సిబ్బంది ఉండే ఈ ఆస్పత్రిలో ఇప్పుడు కేవలం ఒక వైద్యుడు, ముగ్గురు సిబ్బంది మాత్రమే సేవలు అందిస్తున్నారు. వీరు కూడా కేవలం పగటి సమయంలో మాత్రమే ఉంటారు. రాత్రైతే ఇక్కడ ఆస్పత్రికి సంబంధించి ఒక్క ఉద్యోగి కూడా ఉండరు. అత్యవసర వైద్య సేవలు అందక రోగులు మృత్యువాత పడినా, ప్రమాదాలకు గురైనా దేవుడే వీరికి దిక్కు. ● తిండీ తిప్పలు ఉండవు పొగిరి లెప్రసీ ఆస్పత్రిలో ప్రతీనెల సగటున 20 నుంచి 22 కేసులు నమోదవుతాయి. 13 నుంచి 18 మంది రోగులు ఇన్పేషెంట్లుగా వైద్యసేవలు పొందుతున్నారు. వీరికి ప్రభుత్వం ఎటువంటి భోజన సదుపాయాలు ఏర్పాటుచేయలేదు. కనీసం వంటగది లేదు. దాతలు భోజనాలు తెస్తే వీరికి పెద్ద పండగే. ఇక్కడ పరిస్థితి చూసి కొంతమంది దాతలు అప్పుడప్పుడు భోజన ఏర్పాట్లు చేస్తుంటారు. ఉదయం సమయంలో రోగులంతా తలో రూపాయి పోగేసి గంజి అన్నాన్ని వండించుకుంటున్నారు. జీఎంఆర్వీఎఫ్ నుంచి సరుకులు రాకుంటే వీరికి పస్తులు తప్పడంలేదు. ● నిలిచిపోయిన కిట్లు గతంలో రోగులకు దుప్పట్లు, అన్నంప్లేట్లు వంటివి సరఫరా చేసేవారు. రోగులకు ప్రత్యేకమైన బూట్లు, చెప్పులు అందించేవారు. ప్రస్తుత ప్రభుత్వం సరఫరాను నిలిపివేసిందని రోగులు చెబుతున్నారు. మందులు కూడా అరకొరగా అందుతున్నాయి. మరోవైపు పింఛన్ కూడా కొందరికి అందడంలేదు. గతంలో దివ్యాంగ ఫించన్ వచ్చేదని, చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత పింఛన్ నిలిపివేశారంటూ రేగిడి మండలం అరసాడ గ్రామానికి చెందిన ఓ బాధితుడు వాపోయాడు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.. పొగిరి లెప్రసీ ఆస్పత్రి భవనాలు శిథిలావస్థకు చేరాయి. సిబ్బంది కొరత ఉంది. దాతల సాయంతో మౌలికవసతులు కల్పిస్తున్నాం. తలుపులు, కిటికీలు, కొత్త అదనపు భవనాలు, మరుగుదొడ్లు, స్నానం గదులు నిర్మించాలని ఏడాది కిందటే వైద్యశాఖ ఉన్నతాధికారులకు నివేదికలు ఇచ్చాం. ఇంతవరకూ ఎలాంటి నిధులు మంజూరు కాలేదు. – జె.కృష్ణమోహన్, ఆస్పత్రి మెడికల్ ఆఫీసర్, పొగిరి లెప్రసీ ఆస్పత్రి ఈ ఫొటోలోని మంచాలు చూడండి. ఇవి పాత ఇనుపసామాన్లు షాపుల్లో కనిపించే వస్తువుల్లా ఉన్నాయి కదా. ఇవి కూడా పొగిరి లెప్రసీ ఆస్పత్రిలో రోగుల కోసం ఉంచిన బెడ్లు. పూర్తిగా పాడైన, విరిగిన బెడ్లపైనే రోగులు వైద్యసేవలు పొందుతున్నారు. కొత్తమంచాలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు సర్కారు రెండేళ్లవుతున్నా పట్టించుకోవడం లేదు. రోగులకు బెడ్ల సమస్య తప్పడం లేదు. ఆస్పత్రులకు కనీసవసతులు కల్పించని వైనం శిథిలభవనాల్లో బిక్కుబిక్కమంటున్న రోగులు తిండీతిప్పలులేక అవస్థలు రాత్రి రక్షణలేని గదులు పైసా కూడా విదల్చని చంద్రబాబు ప్రభుత్వం -
అణగారిన వర్గాల ఆశాజ్యోతి పూలే
విజయనగరం అర్బన్: మహాత్మా జ్యోతిరావు పూలే అణగారిన వర్గాల హక్కులకోసం పోరాడని, ఆయన ఆశయాలు గొప్పవని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. పూలే జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్ కూడలిలోని పూలే విగ్రహానికి శనివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. పూలే సేవలను కొనియాడారు. జిల్లా బీసీ సంక్షేమశాఖ అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ముద్దాడ మధు, ఓబీసీ రాష్ట్ర జనరల్ కార్యదర్శి ఎలిగాపు విజయలక్ష్మి, గొలగాని రమేష్, బీటీప్రసాద్, జిల్లా బీసీ సంక్షేమాధికారిణి జ్యోతిశ్రీ, తదితరులు పాల్గొన్నారు. పూలే ఆశయాలు గొప్పవి విజయనగరం రూరల్: మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలు ఎంతో గొప్పవని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. పూలే జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్ ఆవరణలోని పూలే దంపతుల విగ్రహాలకు ఆయన శనివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాటి సమాజంలో సాంఘిక దురాచారాలు రూపుమాపడానికి పూలే దంపతుల కృషి ఎనలేనిదన్నారు. బాలికుల, మహిళల అభ్యున్నతికి వారు చేసినకృషి వెలకట్టలేనిదన్నారు. వారి ఆశయాలు నేటి తరానికి ఆదర్శనీయమని కొనియాడారు. కార్యక్రమంలో పలువురు ఎంపీపీలు పాల్గొన్నారు. జిల్లా సెషన్స్ కోర్టు జడ్జిగా నిర్మల చీపురుపల్లి: రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో సివిల్, సీనియర్ డివిజనల్ జడ్జిలుగా పనిచేస్తున్న 15 మంది జిల్లా సెషన్స్ జడ్జిలుగా ఉద్యోగోన్నతి పొందారు. వారిలో చీపురుపల్లి పట్టణంలోని ఆంజనేయపురానికి చెందిన బంకపల్లి నిర్మల జిల్లా సెషన్స్ జడ్జిగా ఉద్యోగోన్నతి పొందారు. ప్రస్తుతం ఆమె శ్రీకాకుళం జిల్లా టెక్కలి కోర్టు జడ్జిగా పనిచేస్తున్నారు. నిర్మల జిల్లా జడ్జిగా నియామకం కావడంపై తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
దయనీయం.. కుష్ఠు రోగుల పరిస్థితి
టి.హెచ్ వార్డు దుస్థితివిజయనగరం ఫోర్ట్: సమాజం మాపై చిన్నచూపు చూస్తోందని, పాలకులైనా కనికరించి సదుపాయాలు కల్పించాలంటూ కుష్ఠు రోగులు కోరుతున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆవరణలో ఉన్న టీహెచ్ వార్డు దయనీయ పరిస్థితిని చూడాలంటూ విన్నవిస్తున్నారు. భవనం శిథిలావస్థకు చేరిందని, మరుగుదొడ్లు లేవని, రాత్రి వేళ విషసర్పాల భయం వెంటాడుతోందంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వార్డులో ఆరు ఫ్యాన్లుకు రెండు ఫ్యాన్లు మాత్రమే తిరుగుతున్నా పట్టించుకునేవారే లేరని వాపోతున్నారు. ఇదే విషయంపై జిల్లా కుష్ఠునివారణ అధికారి కె.రాణి స్పందిస్తూ టీహెచ్ వార్డులో సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. -
పైడితల్లిని దర్శించుకున్న సుశీల
విజయనగరం టౌన్: విజయనగరం చదురుగుడిలోని పైడితల్లి అమ్మవారిని ప్రముఖ సినీ నేపథ్యగాయని పి.సుశీల శనివారం దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం వేదపండితులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం ఆమెకు వేదాశీస్సులు అందజేశారు. అమ్మవారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఏటా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో శ్రీ గురునారాయణ కళాపీఠం ప్రతినిధులు బి.ఎ.నారాయణ, జి.సన్యాసమ్మ, తదితరులు పాల్గొన్నారు. -
చింత తీరేనా..!
● గిట్టుబాటు ధర లేని చింతపండు ● జీసీసీ కేజీ ధర రూ.46 ● కొనుగోలులో జీసీసీ కంటే వ్యాపారులే నయమంటున్న గిరిజనులు ● కేజీ చింతపండును రూ.75 నుంచి 80 వరకు కొనుగోలు కురుపాం: చింతకు గిట్టుబాటు ధర అంతేనా...? ఇలా ఐతే జీసీసీ బలోపేతమెలా..? అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది చింతపండు దిగుబడి తక్కువగా ఉండటంతో స్థానిక మార్కెట్లో మంచి డిమాండ్ పలుకుతుంది. కేజీ చింతపండు రూ. 75 నుంచి 80 వరకు స్థానిక వ్యాపారులు నేరుగా గిరి శిఖరాలకు వెళ్లి గిరిజనుల వద్ద కొనుగోలు చేస్తున్నారు. నాణ్యత బట్టి రూ.80 వరకు కొనుగోలు చేస్తున్నారు. అయితే గిరిజన సహాకార సంస్థ (జీసీసీ) మాత్రం వ్యాపారుల కంటే తక్కువకే గిట్టుబాటు ధర ఇస్తుండటంతో మరో దారి లేని గిరిజన రైతులు నేరుగా వ్యాపారులకే తాము సేకరించిన చింతపండును విక్రయిస్తున్నారు. ● జీసీసీ విఫలం ఈ ఏడాది ఏజెన్సీలో చింతపండు దిగుబడి చాలా తక్కువగా ఉండటంతో మార్కెట్లో మంచి డిమాండ్ పలుకుతుంది. ఇటువంటి సమయంలో జీసీసీ గిట్టుబాటు ధర కల్పించటంలో విఫలమైందని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతీ ఏడాది ఇదే తంతు జరుగుతుందని ఇలా ఐతే జీసీసీ బలోపేతమయ్యేది ఎప్పుడని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. స్థానిక మార్కెట్లో వ్యాపారులు కేజీ చింతపండును రూ.75 వరకు కొనుగోలు చేస్తుంటే జీసీసీ మాత్రం కేజీ చింతపండుకు రూ.46 గిట్టుబాటు ధర ఇస్తున్నట్లు ప్రకటించటం ఏమిటని గిరిజన రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తూకంలో తేడా... కొంత మంది వ్యాపారులు తమ ఎలక్ట్రానిక్ కాటాలలో చేతి వాటం కారణంగా గిరిజనులు విక్రయిస్తున్న చింతపండుకు 25 కేజీల చింతపండు 22 కేజీలు ఉన్నట్లు చూపటం చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఎలక్ట్రానిక్ కాటాలపై అంత పరిజ్ఞానం లేని గిరిజనులు మోసపోతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇంత తంతు జరుగుతున్నా సంబంధిత తూనికలు, కొలతల అధికారులు మాత్రం జాడ కానరావడం లేదు. ఇప్పటికై నా అధికారులు దృష్టి సారించాల్సి ఉంది. -
‘జలధార – జలహారతి’పై సమీక్ష
విజయనగరం అర్బన్: జిల్లాలో అమలవుతున్న జలధార – జలహారతి వంద రోజుల కార్యక్రమంపై ఆంధ్రప్రదేశ్ స్పేస్ అప్టికేషన్స్ సెంటర్ (ఏపీఎస్ఏసీ) జియోసైన్సెస్ విభాగాధిపతి ఎ.మరియరాజుతో కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి శనివారం తన చాంబర్లో సమీక్షించారు. తొలిత ఆయన్ని కలెక్టర్ మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిల్లాలో భూగర్భ జలాల పెరుగుదల కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. ట్యాంకుల ప్రస్తుత స్థితి, కొత్తగా నిర్మించాల్సిన చెక్డ్యామ్లు, నీటి వనరుల అభివృద్ధి చర్యలపై ఏపీఎస్ఏసీ అందిస్తున్న సాంకేతిక సహకారం గురించి మరియరాజు వివరించారు. ఉపగ్రహ చిత్రాలు, జీఐఎస్ ఆధారిత మ్యాప్స్ ద్వారా గ్రామ, మండల స్థాయిలో చేపట్టాల్సిన పనులను ఖచ్చితంగా గుర్తించి సంబంధిత శాఖలకు అందజేస్తామని తెలిపారు. క్షేత్ర స్థాయిలో శాస్త్రవేత్తలు పర్యటిస్తూ ఇరిగేషన్, గ్రౌండ్ వాటర్, డ్వామా శాఖలతో సమన్వయం చేసుకుంటూ కార్యాచరణను ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నీటి వనరుల సంరక్షణకు, భూగర్భ జలాల పెరుగుదలకు ఈ కార్యక్రమం ఎంతో కీలకమని అన్నారు. ఏపీఎస్ఏసీ అందిస్తున్న సాంకేతిక సహకారాన్ని సమర్ధవంతంగా వినియోగించి శాఖల సమన్వయంతో లక్ష్యాలను సమాయానికి సాధించాలని అధికారులను ఆదేశించారు. -
జెడ్పీ చైర్మన్ విరాళం
విజయనగరం రూరల్: జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న శేషగిరి విజ్ఞాన కేంద్ర భవనానికి జెడ్పీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు రూ.2 లక్షలు విరాళం ప్రకటించారు. శనివారం ఆయన కార్యాలయంలో కలిసిన యూటీఎఫ్ నాయకులు భవన నిర్మాణ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకురాగా, భవన నిర్మాణం మొదటి అంతస్తు టైల్స్ నిర్మాణానికి రూ.2 లక్షలు విరాళం అందిస్తానని వారికి హామీనిచ్చారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా శాఖ సీనియర్ నాయకులు కె.విజయగౌరి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ భాస్కరరావు, కె.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జేఏబీఆర్ ఈశ్వరరావు, తదితరులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ట్రాక్టర్ పైనుంచి పడి వ్యక్తి మృతి బొబ్బిలి రూరల్: పార్వతీపురం మండలం కారాడవలస గ్రామానికి చెందిన అడారి వంశీ శుక్రవారం రాత్రి ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పైనుంచి పడిపోవడంతో మృతి చెందాడు. సీఐ నారాయణరావు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని డొంగురువలస గ్రామంలో ఓ వివాహానికి హాజరై శుక్రవారం రాత్రి ట్రాక్టర్పై తిరుగు ప్రయాణంలో వెళ్తుండగా ట్రాక్టర్ పైనుంచి ప్రమాదవశాత్తు వంశీ రోడ్డుపై పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన వంశీని స్థానిక సీహెచ్సీలో చేర్పించి వైద్యం అందించే క్రమంలోనే వంశీ మృతి చెందినట్టు మృతుడు తల్లి అడారి కళావతి ఫిర్యాదు చేసినట్టు సీఐ తెలిపారు. శనివారం పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్టు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ చెప్పారు. ఎస్పీ బంగ్లా సమీపంలో గుర్తు తెలియని మృతదేహం విజయనగరం క్రైమ్ : ఎస్పీ బంగ్లా సమీపంలో గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు శనివారం గుర్తించారు. విజయనగరం వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్టు కంట్రోల్ రూమ్కు వచ్చిన సమాచారంతో వన్టౌన్ పోలీసులు నగరంలోని మయూరి జంక్షన్ వద్ద ఎస్పీ బంగ్లాకు చేరువలో నాగోజీపేట రైల్వే ట్రాక్ వద్ద మృతదేహాన్ని గుర్తించారు. చామనఛాయ రంగుతో బ్లాక్ జీన్ ఫ్యాంట్ ధరించి షర్ట్ లేకుండా ఉన్న మృతదేహాన్ని ఎవరైనా గుర్తిస్తే సమాచారం ఇవ్వాలని ఏఎస్ఐ జగన్మోహనరావు కోరారు. -
డాక్టర్ నీలిమకు సత్కారం
విజయనగరం అర్బన్: ఐక్యరాజ్య సమితికి చెందిన వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ (డబ్ల్యూపీఓ) నిర్వహణలోని ‘వరల్డ్ ఐపీ డే–2026’ అంతర్జాతీయ వీడియో పోటీల టాప్–20లో స్థానం సాధించిన భారతదేశానికి చెందిన డాక్టర్ నీలిమను సీతం కళాశాల యాజమాన్యం స్థానిక జేఎన్టీయూ జీవీలో శనివారం ఘనంగా సత్కరించింది. ప్రపంచ వ్యాప్తంగా 43 దేశాల నుంచి మొత్తం 182 వీడియోలు పోటీలో పాల్గొనగా భారతదేశం నుంచి ఎంపికై న ‘కలరిపయట్టు’ అనే ఏకై క వీడియో కావడం విశేషమని జేఎన్టీయూ జీవీ వీసీ ప్రొఫెసర్ వీవీసుబ్బారావు కొనియాడారు. భారతదేశపు ప్రాచీన యుద్ధకళను మోధో సంపత్తి హక్కుల ద్వారా ఎలా పరిరక్షించుకోవచ్చో ఈ వీడియోలో డాక్టర్ నీలిమ వివరించారు. ఈ పోటీలో తుది విజేతను ప్రజల ఓటింగ్ ద్వారా నిర్ణయించనున్నారని, ప్రతి ఒక్కరూ గరిష్టంగా ఐదు ఓట్లు వేయవచ్చునని, ఓటింగ్కు ఈ నెల 19వ తేదీ వరకు గడువు ఉందన్నారు. కార్యక్రమంలో రిజస్ట్రార్ ప్రొఫెసర్ డి.రాజ్యలక్ష్మి, సీతం కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీ రాంమూర్తి తదితరులు పాల్గొన్నారు.


