breaking news
Vizianagaram District News
-
సాంకేతిక ఆవిష్కరణలతో సమాజాభివృద్ధి
● విద్యార్థుల భవిష్యత్తుకు సాంకేతిక ఉత్సవం దోహదం ● శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ కళాశాల డైరెక్టర్ డాక్టర్ కేవీజీడీ బాలాజీ చీపురుపల్లిరూరల్(గరివిడి): విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు సాంకేతిక ఉత్సవం ఎంతగానో దోహదపడుతుందని శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ కళాశాల డైరెక్టర్ డాక్టర్ కేవీజీడీ బాలాజీ అన్నారు. గరివిడి అవంతీ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం ప్రగ్యాన్–2026 పేరుతో జాతీయస్థాయి సాంకేతిక ఉత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు పాఠ్యపుస్తకాల జ్ఞానంతోనే కాకుండా ఆవిష్కరణాత్మక ఆలోచనలు, సృజనాత్మకత, పరిశోధన దృక్పథంతో ముందుకు వెళ్లాలని సూచించారు. క్వాంటమ్ కంప్యూటర్ భవిష్యత్తులో సాంకేతిక రంగాన్ని మార్చగలదని తెలియజేశారు. విశాఖపట్నం డీఆర్డీఓ ఎన్ఎస్టీఎల్ సైంటిస్టు బి.సురేష్కుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం త్వరితగతిన అభివృద్ధి చెందుతుందన్నారు. విద్యార్థులు సాంకేతిక రంగంలో కొత్త ఆవిష్కరణలు చేసి సమాజాభివృద్ధికి తోడ్పాడాలని సూచించారు. విశాఖపట్నం ఇన్ఫోసిస్ గ్రూపు మేనేజర్ కె.కిషోర్కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు సృజనాత్మక ఆలోచనలు, ఆవిష్కరణలతో ముందుకు సాగాలన్నారు. బ్రహ్మకుమారీస్ కేంద్ర ఇన్చార్జి బి.కె.హేమలత మాట్లాడుతూ సాంకేతికత జీవితాన్ని సులభతరం చేస్తుందన్నారు. అవంతీ విద్యాసంస్థల జనరల్ సెక్రటరీ ఎం.లక్ష్మీ ప్రియాంక మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా.జె.బాలబాస్కరరావు, వైస్ ప్రిన్సిపాల్ బి.వెంకటరమణ, ఏఓ జి.అనిల్కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
క్విజ్బోర్డు ఆవిష్కరణ
విజయనగరం అర్బన్: ఏపీ మోడల్ స్కూల్, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం రూపొందించిన ఇంటరాక్టివ్ క్విజ్ బోర్డును జిల్లా విద్యాశాఖ అధికారి యు.మాణిక్యంనాయుడు శుక్రవారం ఆవిష్కరించారు. నాలుగువేల బిట్స్తో రూ పొందించిన ఈ క్విజ్ బోర్డును నెల్లిమర్ల మండలం చిమల్లుపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కౌలూరి రాజేష్ రూపొందించారు. 4, 5వ తరగతుల అన్ని సబ్జెక్టుల పాఠాలపై సీబీఏ మోడల్లో ప్రాక్టీస్ బిట్స్ అందుబాటు లో ఉండేలా డిజైన్ చేశారు. విద్యార్థులు ఉచితంగా వినియోగించుకునే విధంగా ఈ డాస్బోర్డను ‘రాజ్క్లాస్రూం.కాం’ వెబ్సైట్లో పొందుపరిచారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ క్విజ్బోర్డ్ ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. రాజేష్ ప్రయత్నాన్ని డీసీఈబీ చైర్మన్ టి.సన్యాసిరాజు, ఎంఈఓ–1, 2 మూర్తి, త్రినాథ్, మర్రాపు శ్రీనివాసరావు, ఫ్యాప్టో చైర్మన్ శ్రీనివాస్ అభినందించారు. నైట్ డ్యూటీలపై నిలదీత వంగర: మండలంలోని సంగాం వద్ద ఉన్న సంగమేశ్వర ఆలయం వద్ద ఈ నెల 15 నుంచి 21వ తేదీ వరకు జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాల విధులకు వివిధ గ్రామాలకు చెందిన సచివాలయ ఉద్యోగులను, మహిళా పోలీసులను నియమించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎటువంటి సమాచారం లేకుండా రాత్రిషిప్ట్లో డ్యూటీలు వేయడం సరికాదంటూ వంగర మండల పరిషత్ కార్యాలయం వద్ద శుక్రవారం భోజన విరామం సమయంలో నిరసన తెలిపారు. ఎంపీడీఓ రాజారావును ప్రశ్నించారు. అనంతరం వినతిపత్రం అందజేశారు. శివరాత్రి ఉత్సవాల్లో సచివాలయాల ఉద్యోగులకు రాత్రి పూటీ డ్యూటీవేస్తూ ఆర్డీవో ఆదేశాల మేరకు ఎంపీడీఓ జారీ చేసిన ఆదేశాలపై ఈ నెల 12వ తేదీన సాక్షిలో ‘శివ..శివా’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసినట్లు ఎంపీడీవో ప్రకటించగా, మహిళా ఉద్యోగులకు మహాశివరాత్రి డ్యూటీలను పూర్తిగా రద్దుచేస్తూ కొత్తగా ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రబాబు సర్కారుపై మండిపాటు చంద్రబాబు సర్కారుపై ఎంపీపీ ఉత్తరావెల్లి సురేష్ ముఖర్జీ మండిపడ్డారు. సచివాలయ ఉద్యోగులు, మహిళా పోలీసులకు నైట్ డ్యూటీ లు, అదనపు డ్యూటీలు వేశారన్న విషయం తెలుసుకొని ఉద్యోగులకు అండగా నిలిచారు. ఇప్పటికే వివిధ రకాల సర్వేల పేరుతో సచివాలయాల ఉద్యోగులు ఒత్తిడికి గురిచేస్తున్నారని, ఇదే సమయంలో మహాశిరాత్రి ఉత్సవాలు పేరుతో నైట్ షిఫ్టుల్లో డ్యూటీలు వేయడం తగదన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీని కలిసిన సచివాలయాల ఉద్యోగులకు ఆయన భరోసా కల్పించారు. ఉపాధి పనిదినాలు పెరగాలి విజయనగరం కల్టెరేట్: ఉపాధి హామీ వేతనదారుల కుటుంబాలకు 100 రోజులు పనికల్పించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి శుక్రవారం సంబంధిత అధికారులతో పాటు పలు శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్లో శుక్రవారం మాట్లాడారు. మార్చినెల లోపు ఉపాధి లక్ష్యాలు చేరుకోవాలన్నారు. వాట్సాప్, ఈ సర్వీసు సేవలపై అవగహన కలిగించాలన్నారు. శివరాత్రి ఉత్సవాలకు పక్కా ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో సీపీఓ సత్యనారాయణ, డీపీఓ మల్లికార్జునరావు, డ్వామా పీడీ శారదాదేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. జంతు సంక్షేమానికి కృషిచేయాలి విజయనగరం టౌన్: జంతు సంక్షేమంలోనే మానవ సంక్షేమం ఉందని, జంతు సంక్షేమానికి పౌరులందరూ కృషిచేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి పేర్కొన్నారు. ఏపీ గో సంరక్షణ సమాఖ్య రూపొందించిన గోమాత చిత్ర పటంతో కూడిన క్యాలెండర్ను శుక్రవారం తన చాంబర్లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో గోసంరక్షణ సమాఖ్య అధ్యక్ష్యుడు లోగిశ రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి కేదారిశెట్టి సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి బి.సంధ్యారాణి పాల్గొన్నారు. -
సంగమేశ్వర దర్శనం.. ముక్తికి మార్గం
బలరాముడు ప్రతిష్టించిన శివలింగంసంగాంలో వెలసిన సంగమేశ్వరస్వామి ఆలయం వంగర: సర్వమత సమ్మేళనమే సంగమేశ్వరం. వంగర మండలంలోని సంగాంలో వెలసిన పవిత్ర సంగమేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. ఈ నెల 15 నుంచి 21వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ద్వాపరయుగంలో బలరాముడు ఏక కాలంలో నగావళి నదీ తీరం వెంబడి ఐదు శివలింగాలను ప్రతిష్టించినట్టు పురాణాలు చెబుతున్నాయి. అవి పాయకపాడు, గుంప, సంగాం, శ్రీకాకుళం, కళ్లేపల్లిలో ఉన్నాయి. ఇక్కడి ఆలయ కుడ్యాలపై దేవతా మూర్తులు విగ్రహాలు, గోడలపై విష్ణుమూర్తి విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సంగమేశ్వరస్వామి ఆలయ ప్రదేశంలో వేగావతి, నాగావళి, సువర్ణముఖి నదులు కలుస్తాయి. ఒకే చోట మూడు నదులు కలియడంతో ఈ ప్రాంతాన్ని త్రివేణి సంగమంగా భక్తులు పిలుస్తారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి సంగమేశ్వరుడిని దర్శించుకుంటే పుణ్యం లభిస్తుందన్నది భక్తుల నమ్మకం. ఇక్కడి ఆలయ ప్రాంగణంలో నాలుగు వందల సంవత్సరాల నాటి భారీ మర్రి వృక్షం ఉంది. దీని నీడన వంటావార్పుచేసి పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని భక్తుల విశ్వాసం. శివరాత్రి ఉత్సవాలు ఏడు రోజుల పాటు జరుగుతాయని, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ బోను ఆనందరావు, ఈఓ పొన్నాడ శ్యామలరావు తెలిపారు. 80 మంది పోలీసులతో ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తామని వంగర ఎస్ఐ షేక్ శంకర్ తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం మరో అలహాబాద్గా ఇక్కడ త్రివేణి సంగమం ప్రసిద్ధి ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ కమిటీ -
రాజాంలో సోమవారం నుంచి ఓపీ సేవలు నిలిపివేత
● మూడు రోజుల తర్వాత యథావిధిగా కొనసాగింపురాజాం సిటీ: రాజాంలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో సోమవారం నుంచి ఓపీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాజాం శాఖ అధ్యక్షుడు ఎస్.కిరణ్కుమార్ పేర్కొన్నారు. మూడు రోజుల తర్వాత ఈ సేవలకు రోగులు, వారి బంధువులకు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. రాజాంలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులతో కలిసి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఇటీవల అత్యవసర సమయంలో చికిత్స నిమిత్తం ఓ ఆసుపత్రికి వచ్చిన రోగి మరణిస్తే వారి బంధువులలు వైద్యుడిపై దాడి చేయడం దురదృష్టకరమన్నారు. ఇలా దాడులకు పాల్పడితే గోల్డెన్ అవర్లో అందించాల్సిన సేవలపై ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఇలాంటి సంఘటనలు ఇక ముందు జరగకుండా ఉండేలా ఐఎంఏ రాజాం శాఖ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. అంతకు ముందు ఐఎంఏ రాజాం శాఖ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడుగా డా.సామంతుల కిరణ్కుమార్, ఉపాధ్యక్షుడుగా డా.బి.ఫణికుమార్, కార్యదర్శిగా డా.వై.సురేష్కుమార్, ట్రెజరర్గా డాక్టర్ కె.ప్రతిమ, జాయింట్ సెక్రటరీగా డాక్టర్ జి.భార్గవిలతోపాటు సభ్యులను ఎన్నుకున్నారు. -
ఖైదీల పట్ల వివక్ష తగదు
● జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి డాక్టర్ ఏ.కృష్ణ ప్రసాద్ విజయనగరం ఫోర్ట్: ఖైదీల పట్ల వివక్ష చూపకూడదని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణ ప్రసాద్ అన్నారు. స్థానిక సబ్ జైలును శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ ఖైదీల పట్ల వివక్షత చూపించిన ఎడల కఠినమైన చర్యలు ఉంటాయన్నారు. ఖైదీలు నేరప్రవత్తిని విడనాడాలని మారుమనస్సు పొంది మంచి పౌరులుగా మెలగాలని హితవు పలికారు. సకాలంలో న్యాయ సహాయం పొందించడానికి జైల్లో లీగల్ ఎయిడ్ క్లినిక్ను ఏర్పాటు చేశామని వాటిని సక్రమంగా కొనసాగించాలని తెలిపారు. జైల్లో ఉన్న ముద్దాయిలకు ఉచిత న్యాయ సహాయం అందించడమే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ముఖ్యకర్తవ్యమని తెలిపారు. రిమాండ్లో ఉన్న ముద్దాయిలకు ఎవరు న్యాయవాది లేకుండా ఉండకూడదని , న్యాయవాది లేనివారికి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ న్యాయవాదిని ఉచితంగా అందిస్తుందన్నారు. అనంతరం జైల్లో అమలవుతున్న సౌకర్యాల గురించి ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. స్టోర్రూమ్ను పరిశీలించి పప్పు దినుసులు, వంట సరుకులు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో సబ్జైల్ సూ పరింటెండెంట్ సంపత్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. -
మొండి బకాయిలపై సమగ్ర నివేదిక సిద్ధం చేస్తున్నాం
● మున్సిపల్ కమిషనర్ రత్నాకర్ సాలూరు: మున్సిపాలిటీలో కొందరు పెద్దలకు చెందిన పన్నుల రద్దుకు అధికారులు చేసిన విఫలయత్నంపై ఈ నెల 11న సాక్షిలో ‘పెద్దలకు ఆపన్ను హస్తం’ శీర్షికన ప్రచురితమైన కథనంపై మున్సిపల్కమిషనర్ రత్నాకర్ స్పందించారు.ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.మొండి బకాయిలపై సమగ్ర నివేదిక సిద్ధం చేస్తున్నామన్నారు.ప్రతి సంవత్సరం బకాయిలు వసూవు చేసే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయగా కౌన్సిల్సదరు అంశలను వాయిదావేసిందని పేర్కొన్నారు.దీనిపై తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈ విషయంపై సమగ్ర నివేదిక తయారు చేయడానికి చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొన్నారు. వంగరలో అగ్నిప్రమాదంవంగర: మండల కేంద్రం వంగరలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 40 ఎకరాలకు సంబంధించి గడ్డివాములు, జీడి, మామిడి చెట్లు దగ్దమయ్యాయి. గ్రామానికి చెందిన రైతులు బలగ అప్పలనాయుడు, బలగ అన్నంనాయుడు, బలగ సూరి, బలగ సత్యం, బలగ గోవింద బూరి కూర్మినాయుడు, బొత్స వెంకటనాయుడు, ఆవు సింహాలు, దేవకివాడ సోమినాయుడులకు చెందిన గడ్డివాములు, దేవకివాడ రామినాయుడు, రౌతు అసిరినాయుడులకు చెందిన టేకు,జీడి,మామిడిలు దగ్ధమయ్యాయి. రాజాం అగ్నిమాపక శకటం ఫైర్ ఆఫీసర్ పి.అశోక్ హుటాహుటిన చేరుకొకు మంటలను అదుపుచేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగనీయొద్దుకొమరాడ: మహా శివరాత్రి సందర్భంగా ఆలయాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు జాగ్రతలు తీసుకోవాలని ఎస్పీ మాధవ్రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం మండలంలోని గుంపసోమేశ్వరుడి ఆలయాన్ని ఆయన సందర్శించారు. భక్తుల రద్దీని డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ చేయాలన్నారు. దర్శనాల సమయంలో క్యూలు పక్కాగా ఉండాలన్నారు. వృద్ధులు, చిన్న పిల్లలకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం కొమరాడ పోలీస్స్టేషన్, కూనేరు చెక్ పోస్టును సందర్శించిన ఆయన రికార్డులను పరిశీలించారు చెక్పోస్టు వద్ద ఉన్న సీసీ కెమెరా పనితీరుపై ఆరా తీశారు. అలాగే స్థానిక పోలీస్ స్టేషన్లో రికార్డులు పరిశీలించి ఇటీవల నమోదైన కేసుల దర్యాప్తును అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ మునీషారెడ్డి, సీఐ రంగనాథం, ఎస్సై జగదీష్నాయుడు పాల్గొన్నారు. ఉరివేసుకుని విద్యార్థి మృతి గజపతినగరం: గజపతినగరం శ్రీభవిష్య కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ చదువుతున్న బొత్స రాజేష్(16) గురువారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. విద్యార్థి తన రూమ్లోనే సిస్టం కేబుల్ వైర్తో ఫ్యాన్కు ఉరివేసుకుని మృతి చెందినట్టు ఎస్సై కె.కిరణ్ కుమార్నాయుడు శుక్రవారం తెలిపారు. నీరసంగా ఉందంటూ తోటి విద్యార్థులతో స్టడీ అవర్స్కు వెళ్లకుండా రూమ్లోనే ఉండిపోయాడు. తిరిగి 9.30 గంటలకు రూమ్కు వచ్చిన తోటి విద్యార్థులు డోర్ కొట్టగా ఎంతకీ తీయలేదు. తలుపునకు ఉన్న చిన్నరంద్రం నుంచి చూడగా రాజేష్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించడంతో స్నేహితులంతా కలిసి తలుపులు బద్దలుకొట్టి లోపలకు వెళ్లారు. ఫ్యాన్కు వేలాడుతున్న రాజేష్ను దింపి ఊపిరి ఉందన్న సందేహంతో గజపతినగరం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతుడు తండ్రి బొత్స లక్ష్మణరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
లా అండ్ ఆర్డర్ నియంత్రణలో ఏఆర్ సిబ్బంది కీలకం
విజయనగరం క్రైమ్: లా అండ్ ఆర్డర్ను నియంత్రించడంలో ఏఆర్ సిబ్బంది పనితీరే క్రియాశీలకమని ఎస్పీ దామోదర్ శుక్రవారం అన్నారు. జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బందికి ప్రతి ఏడాదిలో 15 రోజులపాటు నిర్వహించే పునశ్చరణ తరగతులు శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు నిర్వహించిన డి మొబిలైజేషన్ పరేడ్కు ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ హాజరై, ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో పరేడ్ను పరిశీలించి, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పునశ్చరణ తరగతుల వల్ల విధి నిర్వహణలో మరింత పరిపక్వత సాధించే అవకాశం ఏర్పడిందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసుల పనితీరు క్రియాశీలకమన్నారు. ఈ పునశ్చరణ తరగతుల్లో ఎన్నో కొత్త విషయాలను నేర్పడంతోపాటు, బేసిక్ ట్రైనింగులో నేర్చుకున్న విషయాలను మళ్ళీ పునశ్చరణ చేసుకొనే అవకాశం, సహోద్యోగులందరితో కలిసి గడిపే అవకాశం కల్పించామన్నారు. మొబిలైజేషనులో ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులకు శారీరక శిక్షణ, యోగ, మెడిటేషను తరగతులను నిర్వహించామన్నారు. వీటితో పాటు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు అవసరమైన ఆర్మ్డ్ డ్రిల్, లాఠీ డ్రిల్, ఫైనాన్సియల్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంటు, వివిధ రకాలైన తుపాకుల వినియోగం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే గుంపులను చెదరగొట్టడం, రైట్ గేర్ ఎక్విప్మెంట్ను ఏవిధంగా వినియోగించాలన్న విషయాలపట్ల అవగాహన కల్పించామన్నారు. ఈ పునశ్చరణ తరగతులను సద్వినియోగం చేసుకొని, విధుల్లో మరింత పరిణతి సాధించాలని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ సూచించారు. పరేడ్కు రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎన్.గోపాల నాయుడు నాయకత్వం వహించారు.పోలీసు సిబ్బందికి వారి సర్వీసు రికార్డుల్లో నమోదయ్యే విధంగా జి.ఎస్.ఈ లను ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ ప్రకటించారు. ముగింపు వేడుకల్లో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీఎస్పీలు ఎస్.రాఘవులు, పి.నారాయణ రావు, ఎం.వీరకుమార్, డీపీఓ పరిపాలనాధికారి పి.శ్రీనివాసరావు, సీఐలు టి.శ్రీనివాసరావు, ఈ.నర్సింహమూర్తి, రిజర్వ్ ఇన్స్పెక్టర్స్ ఎస్.గోపాల నాయుడు, ఆర్.రమేష్ కుమార్. పి.శ్రీనివాసరావు, రిజర్వు సబ్ ఇన్స్పెక్టర్స్, వలువురు ఏఆర్ఎస్సైలు, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ దామోదర్ -
21న అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం
విజయనగరం: తెలుగు భాషా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని సమితి అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం గురజాడ స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉత్సవ ఆహ్వాన ప్రతులను ఆవిష్కరించి మాట్లాడారు. ఈనెల 21వ తేదీ ఉదయం 10 గంటలకు కొత్త అగ్రహారంలో గల గీతాంజలి విద్యాసంస్థల ప్రాంగణంలో వేడుకలు నిర్వహిస్తున్నామని కార్యక్రమంలో భాగంగా ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన 20 మంది విద్యార్థినులు దేశభక్తిని ప్రబోధించే విధంగా సాంస్కృతిక ప్రదర్శన ఇస్తారన్నారు. ప్రముఖ రంగస్థల కళాకారుడు మండా రమేష్తో దుర్యోధన ఏకపాత్రాభినయం ఉంటుందని అన్నారు. వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు తెలుగు భాష విశిష్టత అనే అంశంపై వక్తృత్వ పోటీల్లో పాల్గొంటారని, పలు నృత్య ప్రదర్శనలతో పాటు ఘంటసాల సంగీత సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో ప్రముఖ గాయనీ గాయకులు ఉమామహేశ్వరి, కూర్మారావు, సూర్యప్రకాష్లతో సినీ సంగీత విభావరి కూడా ఏర్పాటు చేశామని, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ విజేత పి రాజేశ్వరరావుతో చిత్రకళా ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఉత్తరాంధ్ర విభాగం మహిళా శాఖ అధ్యక్షురాలు పలుకూరి ప్రభావతి, సమితి కార్యదర్శి డాక్టర్ జక్కు రామకృష్ణ, గీతాంజలి పాఠశాల కరస్పాండెంట్ ఎ.శ్రీనివాసరావు, సమైక్య భారతి కార్యదర్శి ధవళ సర్వేశ్వరరావు,ఏపీ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ కార్యదర్శి ముళ్లపూడి సుభద్రాదేవి, ప్రముఖ న్యాయవాది దాసరి పద్మ, గురజాడ మునిమనుమడు వెంకటేశ్వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఉత్సవ ఆహ్వానపత్రికల ఆవిష్కరణ -
లారీ ఢీకొని ఆటోడ్రైవర్ దుర్మరణం
తగరపువలస: చెరకుపల్లి అవంతి కళాశాల సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి చెందాడు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం దల్లిపేటకు చెందిన కొండపు నరసింహ (38) ఆటోడ్రైవర్గా పనిచేస్తున్నాడు. భీమిలి మండలం మూలకుద్దులో బంధువుల ఇంట జరిగిన పెద్దకర్మకు వేరే ఆటోలో హాజరయ్యాడు. తిరిగి వెళ్తూ అవంతి కళాశాల వద్ద రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొనడంతో తీవ్రగాయాలపాలయ్యాడు. చికిత్స నిమిత్తం కేజీహెచ్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇంటర్మీడియట్ చదువుతున్న కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆయన భార్య దల్లిపేటలో మినీ అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఈ ఘటనపై భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జీఓ 77 రద్దుకు డిమాండ్
ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 3,480 ప్రొఫెసర్ పోస్టులను తక్షణమే భర్తీ చేసి, పీజీ విద్యార్థులకు భారంగా మారిన జీఓ నంబర్ 77ను వెంటనే రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా తోటపాలెంలో శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రైవేట్ యూనివర్సిటీలలో అవినీతి, అధిక ఫీజుల వసూళ్లను అరికట్టాలని, ఫీజురీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎ.సుమన్, సహాయ కార్యదర్మి పి.గౌరీశంకర్, నాయకులు ఎ.చరణ్, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు. – విజయనగరం గంటస్తంభం -
పగబట్టిన ప్రమాదాలు..
మృతుడు శ్రీనివాసరావుకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు హరీష్ భోగాపురం పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా డ్రైవర్ వృత్తి చేస్తున్నాడు. చిన్న కుమారుడు పురుషోత్తం కూడా తండ్రివలే డ్రైవర్ వృత్తి చేస్తూ భక్తులను సుదూర ప్రాంతాల్లో తీర్ధ యాత్రలకు తీసుకువెళ్లేవాడు. సుమారు ఎనిమిది నెలల కిందట భక్తులను కాశీ యాత్రకు తీసుకెళ్లి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుమారుడిని కోల్పోయిన బాధ నుంచి కోలుకోకముందే తండ్రి కూడా ఇదే విధంగా మృతి చెందడం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. మరో రెండు రోజుల్లో యాత్ర ముగించుకుని వస్తాడనే లోపే పెనువిషాదం జరగడంతో స్వగ్రామమైన సారిపల్లిలో విషాదం అలుముకుంది. ఓ వైపు గుండె సంబంధిత సమస్య, మరోవైపు కొద్ది నెలల వ్యవధిలోనే కుమారుడు, భర్త మృతితో నడిపేన కాసులమ్మ కన్నీరు మున్నీరుగా విలపించడం.. అక్కడి వారిని కంటతడి తెప్పించింది.డివైడర్ను ఢీకొట్టిన బస్సు -
ఊపందుకున్న పోస్టుకార్డు ఉద్యమం
తమ డిమాండ్ల సాధన కోసం ఉపాధ్యాయులు తలపెట్టిన పోస్టుకార్డు ఉద్యమం ఊపందుకుంది. తక్షణమే పీఆర్సీ కమిషనర్ను నియమించాలని, 29 శాతం ఐఆర్ ప్రకటించాలని, ఓపీఎస్ అమలుచేయాలని, బకాయిలు రూ.30వేల కోట్లను చెల్లించాలని కోరుతూ సీఎం చంద్రబాబుకు పోస్టుకార్డులు పంపించారు. వాటిని ముందుగా నెల్లిమర్ల ఎమ్మార్సీ వద్ద ప్రదర్శించారు. యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి పతివాడ త్రినాథ్ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్ధిక సమస్యల పరిష్కారం కోరుతూ ఫిబ్రవరి 17 తేదీన యూటీఎఫ్ తలపెట్టిన చలో విజయవాడను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘ మండలాధ్యక్షుడు మద్దిల సత్యనారాయణ, కోశాధికారి సుంకర చలపతిరావు పాల్గొన్నారు. – నెల్లిమర్ల -
జేఎన్టీయూలో ఉచిత శిక్షణ ప్రారంభం
విజయనగరం రూరల్: స్థానిక జేఎన్టీయూ–జీవీలో ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా హాజరైన జేఎన్టీయూ జీవీ వీసీ వి.వి.సుబ్బారావు ప్రారంభించారు. ప్రపంచబ్యాంక్ మద్దతుతో అమలవుతున్న ర్యాంపు కార్యక్రమం, ఏపీఎంఎస్ఎంఈ అభివృద్ధి కార్పొరేషన్ సహకారంతో ఈఎస్డీపీ, కిక్స్టార్ట్ సిరీస్లో భాగంగా జెన్ ఏఐ, అమెజాన్ వెబ్ సిరీస్ అంశాలపై 20 రోజులపాటు ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఆధునిక సాంకేతికరంగంలో జెన్ ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ కీలకపాత్ర పోషిస్తాయన్నారు. ఇవి స్టార్టప్లు, పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాల అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. ఈ తరహా శిక్షణతో విద్యార్థుల్లో ఆవిష్కరణ దృక్పథం, స్వయం ఉపాధి, వ్యాపార సంస్కృతి మరింత బలోపేతమవుతుందన్నారు. కార్యక్రమంలో టీఎఫ్ఐపీఎల్ డైరెక్టర్ ఎస్.వైభవ్, ప్రోగ్రామ్ మేనేజర్ డాక్టర్ కె.వెంకటేష్, ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఆర్.రాజేశ్వరరావు, ఆచార్యులు జీజే నాగరాజు, పలువురు ఆచార్యులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఘనంగా భారత కోకిల జయంతి భారతకోకిల సరోజినినాయుడు జయంతిని జేఎన్టీయూ జీవీలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపకులపతి వి.వి.కులపతి వి.వి.సుబ్బారావు సరోజినినాయుడు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జేఎన్టీయూ జీవీ అధికారులు, వివిధ విభాగాల అధిపతులు, ఆచార్యులు, తదితరులు పాల్గొన్నారు. -
అంబటి కుటుంబానికి ఎమ్మెల్సీ పరామర్శ
నెల్లిమర్ల రూరల్: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు కుటుంబాన్ని ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్ బాబు శుక్రవారం పరామర్శించారు. శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, సహచర ఎమ్మెల్సీలతో కలిసి గుంటూరులోని అంబటి నివాసానికి వెళ్లి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు. అనంతరం సురేష్బాబు మీడియాతో మాట్లాడుతూ అంబటి నివాసంపై టీడీపీ శ్రేణుల దాడి అత్యంత బాధాకరమన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని, ఏదైనా తప్పు జరిగితే చట్టాలు, న్యాయస్థానాల ద్వారా తేల్చుకోవాలే తప్ప భౌతిక దాడులకు దిగడం ఏ మాత్రం సరికాదన్నారు. కుటుంబ సభ్యులు ఉంటుండగానే అంబటి నివాసంపై దాడి చేశారని, కార్లు సైతం ధ్వంసం చేశారన్నారు. ఇది ముమ్మూటికీ అత్యాచార ప్రయత్నమేనని, పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహించడం బాధాకరమన్నారు. భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. -
మనసున మనసై.. బతుకున బతుకై ..
విజయ నగరం క్రైమ్: ఒకరు ఎంబీఏ, మరొకరు బీటెక్. రామ్గణేష్, శ్యామలవి భిన్న మనస్తత్వాలైనా వారిద్దరిని ప్రేమ ఒక్కటి చేసింది. లక్ష్యాలను ముందుంచుకున్నారు. చదువులో రాణించారు. దేవర రామ గణేష్ స్వస్థలం రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా ఎంబీఏ ఫైనాన్స్. పాచిల శ్యామలాదేవిది అనకాపల్లి జిల్లా రావికమతం. కాకినాడలో ఇద్దరూ చదువుకునే సమయంలో పరియం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారి తీసింది. ఇద్దరికీ వేర్వేరు లక్ష్యాలున్నా..అప్పుడెప్పుడో చిగురించిన ప్రేమ మళ్లీ ఇద్దరినీ గ్రేహౌండ్స్ లో కలిపింది. అనంతరం పోలీస్ శిక్షణ కళాశాలలో ఎస్సై ట్రైనింగ్ తీసుకుని గ్రేహౌండ్స్ లో వృత్తిరీత్యా కలుసుకున్నారు. అప్పటికే ఇద్దరిలో చిగురించిన ప్రేమ కాస్త పెద్దల చెవిన వేయడం..కులాలు వేరైనా అభిమతాలు ఒక్కటే కావడం, ఒకే వృత్తిలో కొనసాగడంతో పెద్దలు అక్షింతలు వేశారు. దీంతో ఇద్దరూ పోలీస్ వృత్తిలో కొనసాగుతూ ముందుకు సాగుతున్నారు. ఎస్సై శ్యామల 2022లో భోగాపురంలో పనిచేసిన అనంతరం మహిళా పోలీస్ స్టేషన్కు ఎస్సైగా బదిలీ అయ్యారు. ప్రస్తుతం పోలీస్ ట్రైనింగ్ సెంట ర్లో అసిస్టెంట్ లా ఇన్ స్ట్రక్టర్గా పనిచేస్తున్నారు. భర్త ఎస్సై రామ్ గణేష్ తొలి పోస్టింగ్ కృష్ణాజి ల్లా తర్వాత విశాఖలో సీఐడీ, విజయనగ రం వన్ టౌన్, నెల్లిమర్ల, ప్రస్తుతం డి స్ట్రిక్ట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో అ సిస్టెంట్ లా ఇన్స్ట్రక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు.విజయనగరం: జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఎస్.వెంకటేశ్వరరావు, ఫిజికల్ డైరెక్టర్ లక్ష్మిలది ప్రేమ క్రీడా బంధం. 1993 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని నల్గొండ జిల్లాలో ఖోఖో, కబడ్డీ కోచ్గా విధులు నిర్వహిస్తున్న ఎస్.వెంకటేశ్వరరావు విజయనగరం జిల్లా కేంద్రంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో విజయనగరం జిల్లా బాలికల జట్టు కెప్టెన్గా వ్యవహరించిన బూడి లక్ష్మి చూపులు కలిశాయి. అదే టోర్నీలో కర్ణాటకలో జరిగిన జాతీయస్థాయి పోటీలకు లక్ష్మి ఎంపిక కాగా ఆ జట్టు కోచ్గా వ్యవహరించిన వెంకటేశ్వరరావుల మనసులు కలిశాయి. అయితే అప్పటికి విజయనగరంలోని గాజులరేగకు చెందిన లక్ష్మి మైనర్ కావడంతో పాటు ఇద్దరు కులాలు వేరు కావడం ప్రేమ బంధానికి ఆటంకంగా నిలిచింది. 1996వ సంవత్సరంలో లక్ష్మి మేజర్ కావడంతో గుంటూరు జిల్లాకు చెందిన కోచ్ వెంకటేశ్వరరావు పెద్దలకు తెలియకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం కోచ్ వెంకటేశ్వరరావు విజయనగరం జిల్లా క్రీడా ప్రాధికారి సంస్థ అధికారిగా విధులు నిర్వహిస్తుండగా, లక్ష్మి ఇదే జిల్లాలో ప్రభుత్వ వ్యాయామ అధ్యాపకురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలుండగా ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటే ప్రేమ వివాహం సుఖ సంతోషాలతో సాగుతుందని వారు చెబుతున్నారు.ఎస్సైలు శ్యామల, రామ్ గణేష్ కుటుంబంకోచ్ వెంకటేశ్వరరావు, పీడీ లక్ష్మి పీ‘ క్యూబ్తో ఒక్కటైన జంట -
రెండు వారాల్లో చోరీ కేసు ఛేదించిన పోలీసులు
విజయనగరం క్రైమ్: జైల్లో పరిచయం అయ్యింది. వారిద్దరూ స్నేహితులయ్యారు. ఒకరికొకరు చేదోడువాదోడుగా ఉంటూ బయటకొచ్చి ఆ స్నేహానికి చెడు వ్యసనాలు తోడవడంతో చేతిలో డబ్బులు అవసరం కావడంతో దొంగతనాన్ని మార్గంగా ఎంచుకున్నారు. మెదడులో వచ్చిన ఆలోచనలతో చేతలకు పని చెప్పారు. ఏకంగా 38 సవర్ల బంగారం,30 తులాల వెండి ఆభరణాలు అపహరించారు. చోరీ జరిగిన 12 రోజుల్లోనే పోలీసులు కేసును ఛేదించారు.ఈ మేరకు విజయనగరంలోని కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం ఎస్పీ దామోదర్ ఆ కేసు వివరాలను వెల్లంచారు. వివరాల్లోకి వెళితే జానపురెడ్డి వెంకటరమణ భార్యతో కలిసి వేపాడలోని బొద్దాంలో ఉంటున్నాడు. ముగ్గురు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపించారు.భద్రత నిమిత్తం పిల్లల ఆభరణాలను కన్న వారింట్లోనే ఉంచారు. ఈ నెల ఒకటవ తేదీన వెంకటరమణ భార్యతో కలిసి పొలం పనుల నిమిత్తం ఇంటికి తాళం వేసి వెళ్లారు.మధ్యాహ్నం ఇంటికొచ్చి చూసేసరికి తాళం తీసి ఉండడం, ఇంట్లోని బీరువాలో ఉండే బంగారం, వెండి అభరణాలు కనిపించక పోవడంతో వెంటనే వల్లంపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి పన్నెండు రోజుల్లో అనకాపల్లి జిల్లా మాడుగలకు చెందిన పిల్లా నూకరాజు,పెచేటి ఉపేంద్రలను పట్టుకున్నారు.ఇద్దరి నుంచి 38సవర్ల బంగారం,30 తులాల వెండి స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ డీఎస్పీ గోవిందరావు, ఎస్.కోట రూరల్ సీఐ అప్పలనాయుడు, వల్లంపూడి ఎస్సై సుదర్శన్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. -
అప్పట్లో ఠంచన్గా పింఛన్
‘తమ్ముళ్లూ.. గుర్తుపెట్టుకోండి.. మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే వెనుకబడిన వర్గాల వారికి 50 ఏళ్ల వయస్సు నిండితే పింఛన్ అందజేస్తాం. ఈ విషయాన్ని ఊరూరా వెళ్లి చెప్పండి..’ అంటూ ప్రస్తుత సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చి 19 నెలలు గడిచినా ఒక్కరంటే ఒక్కరికి కొత్త పింఛన్ మంజూరు చేయలేదు. 50 ఏళ్ల ప్రతిపాదన పక్కన పెడితే 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు సైతం పింఛన్ మంజూరు కాకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. పింఛన్ రాదు.. మా టెన్షన్ పోదు అంటూ తెలిసినవారి దగ్గర, సచివాలయ సిబ్బంది వద్ద వాపోతున్నారు. ఇదెక్కరి రాక్షస పాలన అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు బి.పైడమ్మ. ఈమెది దత్తిరాజేరు మండలం ఇంగిలాపల్లి గ్రామం. ఈమె భర్త నాలుగు నెలల కిందట మరణించారు. వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసేందుకు సచివాలయం అధికారులను అడిగితే వెబ్సైట్ ఓపెన్ కాలేదని చెప్పారు. దీంతో చేసేది లేక మిన్నకుండిపోయారు. విజయనగరం ఫోర్ట్: సార్వత్రిక ఎన్నికల సమయంలో 50 ఏళ్లు నిండిన వెనుకబడిన వర్గాలవారికి పింఛన్లు మంజూరు చేస్తామని చంద్రబాబుతో పాటు కూటమి నాయకులు గొప్పగా ప్రచారం చేశారు. ఓట్లు దండుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక 19 నెలలుగా వారిని ఉసూరుమనిపిస్తున్నారు. కనీసం దరఖాస్తు చేసుకునేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా ఆవేదనకు గురిచేస్తున్నారు. 50 ఏళ్లు మాట దేవుడెరుగు 60 ఏళ్లు నిండిన వృద్ధులు, భర్తలను కోల్పోయిన వితంతువులు, సదరం ధ్రువపత్రాలు పొందిన దివ్యాంగులకు కూడా పింఛన్లు మంజూరు చేయకపోవడంపై మండిపడుతున్నారు. కొత్త పింఛన్ల కోసం ఉమ్మడి విజయనగరం జిల్లాలో సుమారు 25 వేల మంది వరకు ఎదురు చూస్తున్నట్టు సమాచారం. వృద్ధులతో పాటు చేనేత కార్మికులు, గీత కార్మికులు, ఒంటిరి మహిళలు, డప్పు కళాకారులు, మత్య్సకారుల్లోని అర్హులు సైతం పింఛన్లు కోసం ఎదురుచూస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి జనవరి, జూలై నెలల్లో కొత్త పింఛన్లు మంజూరు చేసేవారు. అర్హుల నుంచి ఆరు నెలల పాటు దరఖాస్తులను వలంటీర్లతో ఇంటివద్దనే సేకరించడం... అర్హులను గుర్తించి పింఛన్లు మంజూరు చేయడం నిరంతరాయంగా సాగేది. 60 ఏళ్లు నిండితే చాలు పింఛన్ వస్తుందన్న ధీమా ఉండేది. మత్య్సకారులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, డప్పుకళాకారులకు 50 ఏళ్లు నిండితే చాలు పింఛను మంజూరు చేసేవారు. పర్మినెంట్ సదరం సర్టిఫికెట్ ఉన్నవారికి, 19 ఏళ్లు నిండిన ట్రాన్స్జెండర్స్కు, వయసుతో సంబంధం లేకుండా డయాలసిస్ రోగులకు డీఎంహెచ్ఓ పింఛన్లు అందించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. వెబ్సైట్ ఓపెన్ కాలేదు పింఛన్ల కోసం వేలాది మంది అర్హుల ఎదురుచూపు రెండేళ్లుగా వృద్ధులు, దివ్యాంగులు, వితంతవులకు మంజూరుకాని పింఛన్లు నెరవేరని 50 ఏళ్లు నిండిన బీసీలకు పింఛన్లు ఇస్తామన్న చంద్రబాబు హామీ 60 ఏళ్లు నిండిన వారికీ అందని పింఛన్ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి పింఛన్లు మంజూరు కొత్తగా వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ తదితర పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్ ఇంకా ఓపెన్ కాలేదు. స్పౌజ్ కోటాలో వద్ధాప్య పింఛన్ పొందుతున్న భర్త చనిపోతే భార్యకు మాత్రమే పింఛన్ అందజేస్తున్నాం. – శ్రీనివాసపాణి, డీఆర్డీఏ పీడీ ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు ఎస్.కాంతమ్మ. ఈమెది గంట్యాడ మండలం పెదవేమలి గ్రామం. ఈమె భర్త చనిపోయి ఏడాది అవుతోంది. పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు గ్రామంలోని సచివాలయం అధికారులను పలుమార్లు సంప్రదిస్తూనే ఉంది. ఎప్పుడు వెళ్లినా పింఛన్ కోసం దరఖాస్తు చేయడానికి వెబ్సైట్ ఓపెన్ కాలేదని చెబుతున్నారంటూ వాపోతోంది. ఇదే మండలం పెదవేమలి గ్రామానికి చెందిన ఆర్.నాగేశ్వరావుకు ప్రస్తుతం 62 ఏళ్లు. వృద్ధాప్య పింఛన్ మంజూరైతే జీవన కష్టాలు తొలగుతాయని ఆశపడ్డారు. దరఖాస్తు చేసేందుకు పలుమార్లు సచివాలయం అధికారులను సంద్రించినా ఫలితం లేకపోయింది. కనీసం దరఖాస్తు చేసేందుకు కూడా అవకాశం ఇవ్వలేదంటూ నిట్టూర్చుతున్నారు. -
వైద్య కళాశాల పోస్టుల భర్తీపై నీలినీడలు
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఖాళీ పోస్టుల భర్తీపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి 14 నెలలవుతున్నా ఇంతవరకు భర్తీ పక్రియ పూర్తికాకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన నెల, రెండు నెలల్లో పోస్టులు భర్తీ చేస్తారు. కానీ చంద్రబాబు సర్కార్ పాలనలో ఏడాది దాటినా పోస్టుల భర్తీ పక్రియ పూర్తి కాకపోవడం గమనార్హం. దీంతో దరఖాస్తు చేసిన అభ్యర్థులు అయోమయ స్థితిలో కొట్టుమిట్టుడుతున్నారు. 2024 డిసెంబర్లో నోటిఫికేషన్ 2024 డిసెంబర్ నెలలో ప్రభుత్వ వైద్య కళాశాల, సర్వజన ఆస్పత్రుల్లో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే సిబ్బందికి కొద్ది రోజుల క్రితం అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. కానీ ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసేందుకు ఎంపికై న అభ్యర్థులకు మాత్రం అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వలేదు. మేం అనుమతి ఇచ్చే వరకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వొద్దు ఔట్ సోర్సింగ్ విభాగంలో పనిచేసే సిబ్బందికి సంబంధించి మేము అనుమతి ఇచ్చే వరకు అపాయింట్ మెంట్ ఆర్డర్స్ ఇవొద్దుని వైద్య కళాశాల అధికారులకు అప్కోస్ అధికారులు లెటర్ పంపించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నియామక పక్రియ పూర్తయినప్పటికీ చంద్రబాబు సర్కార్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వకుండా కొర్రీ వేయడం పట్ల ఎంపికై న అభ్యర్థులు మండిపడుతున్నారు. నోటిఫికేషన్ ఇచ్చి 14 నెలలైంది. ఇప్పటికే నియామక పక్రియ పూర్తయింది. ఇప్పుడు మళ్లీ అపాయింట్ మెంట్ ఆర్డర్స్ జాప్యం చేయడం పట్ల అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సకాలంలో అపాయింట్మెంట్ ఆర్డర్స్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు చేపట్టింది. జీరో వెకేన్సీ పాలసీ తీసుకొచ్చి పోస్టులను ఎప్పటకిప్పుడు భర్తీ చేసింది. నోటిఫికేషన్ ఇచ్చిన నెలరోజుల లోపే పోస్టుల భర్తీచేసేవారు. జిల్లాలో 2 వేలకు పైగా పోస్టులను భర్తీ చేశారు. నియామక పక్రియ పూర్తయిన వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి విధుల్లోకి తీసుకునే వారు. చంద్రబాబు ప్రభుత్వంలో అందుకు విరుద్ధమైన పరిస్థితి. నియామక పక్రియ పూర్తి అయినప్పటికీ అపాయింట్ మెంట్ ఆర్డర్స్ ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది. నోటిఫికేషన్ ఇచ్చి 14 నెలలైనా భర్తీ కాని పరిస్థితి ఓపెన్ కానీ అప్కోస్ వెబ్సైట్ అప్కోస్ను ఎత్తేసే అలోచనలో టీడీపీ సర్కార్ అయోమయ స్థితిలో అభ్యర్థులు49 మంది ఎంపిక ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసేందుకు 49 మందిని ప్రభుత్వ వైద్య కళాశాల అధికారులు ఎంపిక చేశారు. వారిలో 25 మంది జూనియర్ అసిస్టెంట్స్, 17 మంది జీడీఏ(జనరల్ డ్యూటీ అటెండర్స్), ఇద్దరు హెల్పర్, ఇద్దరు స్టోర్ అటెండర్స్, 3 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు ఎంపికయ్యారు. అయితే వారికి నియామక పక్రియ పూర్తయినప్పటికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ మాత్రం ఇవ్వలేదు. అప్కోస్ను ఎత్తే వేసే అలోచనలో సర్కారు అప్కోస్ను ఎత్తేవేసే అలోచనలో టీడీపీ సర్కార్ ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా అప్కోస్ వెబ్సైట్ను నాలుగు నెలలుగా మూసేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతులన్నాయి. అప్కోస్ను ఎత్తేసి దాని స్థానంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మాదిరి ఏజెన్సీలకు ఇచ్చే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుయాయులకు ఏజెన్సీలను కట్టబెట్టడం ద్వారా వారికి లబ్ధి చేకూర్చాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఇంటర్ విద్యార్థి అనుమానాస్పద మృతి
గజపతినగరం రూరల్: స్థానిక శ్రీ భవిష్య జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ చదువుతున్న బొత్సరాజేష్ (16) గురువారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. విద్యార్థిది మెరకముడిదాం మండలం ఊటపల్లి గ్రామం. సాయంత్రం కళాశాలలో స్టడీ అవర్స్ అయిన వెంటనే తన గదిలోకి వెళ్లిన రాజేష్ అపస్మారక స్థితిలో ఉన్న పరిస్థితుల్లో కాలేజీ సిబ్బంది గజపతినగరం ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే రాజేష్ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. విద్యార్థి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్టడీ అవర్స్ సమయంలో కాలేజీ సిబ్బంది విద్యార్థిని దండించడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యచేసుకున్నాడన్న వదంతులు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ భాస్కర్నాయుడు వద్ద ప్రస్తావించగా కాలేజీలో ఏం జరిగిందో తనకు తెలియదన్నారు. -
మహాశివరాత్రికి ముస్తాబు
నెల్లిమర్ల రూరల్: ఉత్తరాంధ్రలో అతి పెద్ద పుణ్యక్షేత్రం రామతీర్థం మహాశివరాత్రి జాతరకు ముస్తాభైంది. వైష్ణవ దేవాలయంగా ప్రసిద్ధికెక్కినా ప్రతి ఏటా జరుగుతున్న శివరాత్రి జాతరే రామక్షేత్ర ప్రత్యేకం.ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాలు ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా జరుగుతున్నప్పటికీ హాజరవుతున్న భక్తుల సంఖ్య అంతంత మాత్రమే. కానీ శివరాత్రికి రెండు రోజుల పాటు జరుగుతున్న ఉత్సవాలకు మాత్రం విజయనగరం, పార్వతీపురం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల నుంచే కాకుండా ఒడిశా నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు కుటుంబ సమేతంగా రామక్షేత్రానికి విచ్చేస్తారు. ముఖ్యంగా విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన మత్య్యకార ప్రజలు అధిక సంఖ్యలో రామక్షేత్రానికి విచ్చేసి తొలిరోజు రాత్రంతా స్వామివారి క్షేత్రంలో కాగడాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో జాగరం ఉంటారు. మరుసటి రోజు ఉదయం రామకోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి ముందుగా శ్రీరాముడిని అనంతరం క్షేత్ర పాలకుడైన ఉమాసదాశివ స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. సర్వం సిద్ధం ఆదివారం నుంచి రెండు రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. జాతరకు వచ్చే లక్షలాది మంది యాత్రికులు, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా దేవాదాయశాఖతో పాటు ఇతర శాఖలు పకడ్బంధీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. తాగునీరు, విశ్రాంతి షెల్టర్లు, ప్రత్యేక క్యూలు, మరుగుదొడ్ల నిర్వహణ, రవాణా తదితర సదుపాయాలను కల్పిస్తున్నారు. అలాగే పలు స్వచ్ఛంద సేవా సంస్థలు సేవలందించేందుకు సిద్ధమయ్యాయి. గత ఏడాదిలాగానే ఈ సారి కూడా సుమారు లక్షన్నరకు పైగా భక్తులు రావచ్చునని పోలీస్, దేవాదాయ, రెవెన్యూ అధికారులు అంచనా వేస్తున్నారు. దేవదాయ శాఖ ఏర్పాట్లు భక్తులకు రామతీర్థం ఆలయంలోనికి ఉచిత దర్శనంతో పాటు ప్రత్యేక దర్శనం రూ.50, అలాగే ఉమాసదాశివ ఆలయం లోనికి ఉచిత దర్శనంతో పాటు ప్రత్యేక దర్శనం రూ.50గా కల్పిస్తున్నారు. భక్తుల కోసం 20వేల లడ్డూ ప్యాకెట్లు, పులిహోర ప్రసాదాన్ని సిద్ధం చేశారు. అలాగే ఎండతీవ్రతను దష్టిలో పెట్టుకుని చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. క్యూలలో తాగునీరు, మజ్జిగ, చిన్నపిల్లలకు పాలు పంపిణీ సౌకర్యం కల్పిస్తున్నారు. ఇప్పటికే దేవస్థానానికి విద్యుత్ అలంకరణ పూర్తయింది. శివాలయం, ప్రధాన ఆలయంతో పాటు బోడికొండ మెట్ల మార్గంలోనూ ట్యూబ్లైట్లను ఏర్పాటు చేశారు. పుష్కర ఘాట్వద్ద స్నానాలకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేశఖండన శాల వద్ద తోపులాట జరగకుండా బారికేడ్లు సిద్ధం చేశారు. ఆలయం చుట్టూ టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది ప్రసాదాల పంపిణీ కౌంటర్ను సమీపంలోని కల్యాణ వేదిక ప్రాంగణంలోకి మార్చారు. ప్రత్యేక ఆకర్షణగా శిఖరదీపం శివరాత్రి పర్వదినాన తమిళనాడు రాష్ట్రంలో అరుణాచలేశ్వరుని పర్వతంపై మూడు రోజుల పాటు ఏ విధంగా శిఖరజ్యోతిని వెలిగిస్తున్నారో..రామతీర్థంలో బోడికొండపై కూడా గడిచిన ఆరేళ్ల నుంచి శిఖర జ్యోతిని వెలిగిస్తున్నారు. దాతల సహకారంతో ప్రతి ఏటా నిర్వహిస్తున్న శిఖర జ్యోతి ప్రజ్వలన ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. తొలుత మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఈ శిఖర జ్యోతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేటికీ కూడా ఆ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. ఆదివారం రాత్రి 7గంటల సమయంలో ప్రత్యేక పూజల నడుమ శిఖర జ్యోతిని వెలిగిస్తారు. ఈ మహా ఘట్టాన్ని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో బోడికొండపైకి వెళ్తుంటారు. రామతీర్థం ఇలా చేరుకోవాలి జిల్లా కేంద్రం విజయనగరానికి 13కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉండగా నెల్లిమర్లకు తూర్పుదిక్కున ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. విజయనగరం–శ్రీకాకుళం వయా నెల్లిమర్ల రహదారిలో ఈ పుణ్యక్షేత్రం ఉంది. ఈ క్షేత్రానికి చేరుకోవడానికి విజయనగరంలో కోట నుంచి నేరుగా ప్రైవేట్ వాహనాలు ఉంటాయి. అలాగే శ్రీకాకుళం నుంచి వచ్చే భక్తులు రణస్థలం మార్కెట్ వద్ద దిగి సతివాడ–నెల్లిమర్ల వాహనాలను ఆశ్రయించవచ్చు. రణస్థలం నుంచి 18కిలోమీటర్ల దూరం వస్తుంది. రామతీర్థంలో ఈ నెల 15 నుంచి రెండు రోజుల జాతర సుమారు లక్షన్నరకు పైగా తరలిరానున్న భక్తులు ఏర్పాట్లను పూర్తి చేసిన అధికార యంత్రాంగం ప్రత్యేక ఆకర్షణగా బోడికొండ పర్వతంపై అఖండ శిఖరదీపం అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు రామాలయంలో శివజాగారం -
పర్యాటక గ్రామంగా నోండ్రుకోన
గుమ్మలక్ష్మీపురం: మండలంలోని నోండ్రుకోన గ్రామాన్ని పర్యాటక గ్రామంగా మార్చేందుకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలను జిల్లాయంత్రాంగం తరఫున అందిస్తామని కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి భరోసా ఇచ్చారు. త్వరలోనే పర్యాటక ప్యాకేజీని అమలు చేయబోతున్నామని, తోటపల్లి దేవాలయంతో పాటు తాడికొండ, కుశ సమీప జలపాతాలకు వెళ్లే పర్యాటకులు ఈ గ్రామాన్ని కూడా సందర్శించేలా పర్యాటక ప్యాకేజీలో చేర్చుతామన్నారు. నోండ్రుకోన గ్రామాన్ని కలెక్టర్ గురువారం సందర్శించారు. గ్రామ ముస్తాబును ఒక పండుగలా మార్చడం అభినందనీయమన్నారు. -
విద్యార్థుల ఆరోగ్యంపై ఆరా
● స్కూల్బస్సు ప్రమాదంపై అధికారుల పరిశీలనబొబ్బిలిరూరల్: మండలంలోని అలజంగి వద్ద బుధవారం పాఠశాల బస్సు బోల్తాపడిన సంఘటనలో గాయపడి సీహెచ్సీలో చికిత్స పొందుతున్న విద్యార్థులను జిల్లా అధికారులు గురువారం పరామర్శించారు. ఐసీడీఎస్ పీడీ విమలారాణి, డీఈఓ మల్లికార్జునరావు తదితరులు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో చర్చించారు. నాణ్యమైన వైద్యాన్ని అందించాలని సూచించారు. గాయపడిన విద్యార్థులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అనంతరం బస్సు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ఎంవీఐ శశికుమార్తో కలిసి పరిశీలించారు. బస్సుకు అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నాయని ఎంవీఐ తెలియజేశారు. అక్కడి నుంచి కారాడ గ్రామం వద్ద ఉన్న సన్షైన్ హోం ఆశ్రమాన్ని అధికారులు పరిశీలించారు.విద్యార్థులకు అందుతున్న వసతులు,ఆహారం వంటి అంశాలపై వారిని అడిగి తెలుసుకున్నారు. లైంగిక వేధింపులు, గుడ్ బ్యాడ్టచ్లపై వివరించారు. పోక్సో చట్టంపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. సమస్యలేమైనా ఉంటే తెలియజేయాలని కోరారు. హోంలో మొత్తం 118 విద్యార్థులు ఉండగా వారిలో ఆరు నుంచి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న 66 మంది విద్యార్థినులు, ఎల్కేజీ నుంచి ఏడోతరగతి వరకు చదువుతున్న 52 మంది విద్యార్థులు ఇక్కడి వసతిగృహంలో చదువుకుంటున్నట్లు మేనేజర్ రాజవర్మ వివరించారు. హోంలో బాత్రూంలు, బెడ్రూంలను అధికారులు పరిశీలించారు. శుభ్రమైన ఆహారం అందించాలని, బాలికల అనారోగ్య సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైద్యసిబ్బందితో పరీక్షలు జరిపించి చికిత్స అందించాలని నిర్వాహకుడు రాజవర్మకు సూచించారు. ఆహారపదార్థాలను రుచిచూసి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీసీపీఓ బీహెచ్ లక్ష్మి, ఐసీడీఎస్ సీడీపీఓ విజయలక్ష్మి, పీఓఐసీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
మిషన్ వాత్సల్యకు రూ.కోటి 14లక్షలు మంజూరు
● ఐసీడీఎస్ పీడీ టి.విమలారాణితెర్లాం: మిషన్ వాత్సల్య పథకం కింద జిల్లాకు రూ.కోటి 14లక్షలు మంజూరయ్యాయని ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్, మండల ప్రత్యేకాధికారి టి.విమలారాణి చెప్పారు. ఈ మేరకు గురువారం తెర్లాం ఎంపీడీఓ కార్యాలయానికి విచ్చేసిన సందర్భంగా ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో గల 410మంది అనాథ పిల్లలకు నెలకు రూ.4వేలు చొప్పున 7 నెలలకు మిషన్ వాత్సల్య పథకం కింద నిధులు మంజూరయ్యాయని, త్వరలో వారి బ్యాంక్ ఖాతాల్లో ఈ నిధులు జమ అవుతాయని చెప్పారు. జిల్లాలో 2499 మెయిన్, మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని, వాటిలో 22 కార్యకర్తల పోస్టులు, 277 హెల్పర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు టీహెచ్ఆర్, కిట్లు, బాలామృతం సరఫరా సక్రమంగానే జరుగుతోందని చెప్పారు. తెర్లాం మండలంలో సచివాలయ సిబ్బంది కొరత కారణంగా యుఎఫ్ఎస్ సర్వేలో వెనుకబాటు ఉందన్నారు. శతశాతం సర్వే నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. మండలంలో అసంపూర్తిగా ఉన్న 130 ఇళ్లు ఉగాదిలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, వాటిని గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని ఐసీడీఎస్ పీడీ తెలిపారు. ఆమెతో పాటు మండల ఇన్చార్జ్ ఎంపీడీఓ వెంకటరమణ, డిఫ్యూటీ ఎంపీడీఓ నీలిమ ఉన్నారు. -
రామతీర్ధంలో ఏర్పాట్ల పరిశీలన
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో ఈ నెల 15 నుంచి రెండు రోజుల పాటు జరగనున్న మహా శివరాత్రి ఉత్సవాల్లో సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రామసుందర్రెడ్డి ఆదేశించారు. రామతీర్థంలోని శ్రీసీతారామ స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను గురువారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని, భక్తుల క్యూలను పర్యవేక్షించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. శివరాత్రికి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ దిశగా ఏర్పాట్లు పక్కాగా ఉండాలన్నారు. తాగునీరు, నీడ, పారిశుధ్యం, పార్కింగ్, భద్రతా పరమైన అంశాల్లో ఎక్కడా రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు. శివాలయాన్ని కూడా సందర్శించి క్యూలు పరిశీలించారు. వేడుకలు ప్రశాంతంగా జరిగేలా అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం శ్రీ సీతారామస్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో డి. కీర్తి, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శిరీష, ఆలయ ఈవో శ్రీనివాసరావు, తహసీల్దార్ శ్రీకాంత్, స్థానిక ఎంపీడీఓ కె.రామకృష్ణరాజు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
శివ..శివా..
వంగర: పింఛన్ల పంపిణీ అంటే సరే అన్నారు.. సర్వేలు చేయమని ఆదేశిస్తే ఊకొట్టారు.. ఇతర శాఖల పనులు అప్పగిస్తే అయిష్టంగా చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఏకంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా శివరాత్రి ఉత్సవాల విధులను సచివాలయ ఉద్యోగులకు కేటాయించడంతో ఆందోళన చెందుతున్నారు. ఇదెక్కడి అన్యాయం అంటూ వాపోతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సచివాలయ ఉద్యోగుల పరిస్థితి అత్యంత దుర్భరంగా తయారైందంటూ ఆవేదన చెందుతున్నారు. వివిధ రకాల సర్వేలు, టార్గెట్లతో ఒత్తిడికి గురవుతున్న ఉద్యోగులను మరింత అవమానకర రీతిలో మరుగుదొడ్ల వద్ద, ఉత్సవాల్లోని నదీతీర రేవుల వద్ద, క్యూలు, ఆసీల వసూళ్లు, పార్కింగ్ ప్రదేశాల్లో విధులు అప్పగించడంతో మానసిక క్షోభకుగురవుతున్నారు. తాము చదివిన చదువు ఏంటి? అప్పగిస్తున్న విధులు ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. శివరాత్రి ఉత్సవాలకు షిప్టుల వారీ విధులు వంగర మండలం సంగాంలో వెలసిన పవిత్ర సంగమేశ్వరస్వామి ఆలయం వద్ద సాగే శివరాత్రి ఉత్సవాలకు సచివాలయ ఉద్యోగులకు చీపురుపల్లి ఆర్డీఓ ఆదేశాల మేరకు విధులను కేటా యిస్తూ ఎంపీడీఓ తులా రాజారావు ఉత్తర్వులు జారీ చేశారు. మండల పరిషత్ నుంచి 32 మంది, రెవెన్యూ శాఖ నుంచి ఏడుగురు వీఆర్ఓలకు సంగాంలో డ్యూటీలు వేశారు. ఈ నెల 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఎవరెవరు ఏఏ షిఫ్టులలో విధులకు హాజరు కావాలో అందులో పేర్కొన్నారు. ఎన్నడూ లేని విధంగా మహిళా ఉద్యోగులు అని చూడకుండా రాత్రి సమయంలో డ్యూటీలకు షిఫ్ట్లు వేయడం పట్ల ఉద్యోగులు మండిపడుతున్నారు. కొంత మంది మహిళా ఉద్యోగుల్లో సచివాలయాల కార్యదర్శులు, మహిళా పోలీసులకు ఉదయం 6 గంటలకే తొలి షిఫ్ట్కు హాజరుకావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విధులకు డుమ్మా కొడితే బాధ్యతారాహిత్యం కింద సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు కూడా చేశారు. ఉన్నత చదువులు చదువుకొని..... ఉన్నత చదువులు చదువుకొని లక్షలాది మంది నిరుద్యోగ యువతతో పోటీపడి గత ప్రభుత్వ హయాంలో సచివాలయ ఉద్యోగాలు సాధించారు. గత ఐదేళ్లూ పల్లె ప్రజలకు సేవలందించి సమాజంలో గౌరవాన్ని పొందారు. చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చాక రాజకీయ కారణాలతో సచివాలయాల ఉద్యోగులను పదేపదే వేధిస్తోందని పలువురు ఉద్యోగులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఆలయం వద్ద క్యూలైన్లు, స్నానాలు రేవు వద్ద, పిండ ప్రదానాలు చేసే ప్రదేశంలో, పార్కింగ్ ప్రదేశాల్లో విధులు కేటాయించడమంటే.. వ్యవస్థను నిర్వీర్యం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని పలువురు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. సంగాంలో వెలసిన సంగమేశ్వరస్వామి ఆలయం గతంలో రాత్రి విధులు కేటాయించలేదు గతంలో ఉత్సవాలు సమయంలో రాత్రి విధులకు సచివాలయాల ఉద్యోగులు, మహిళా పోలీసులకు కేటాయించలేదు. ఇప్పటికే వివిధ రకాల సర్వేలు, వివిధ శాఖల పరిధిలో ఉన్న అదనపు పనులు చేస్తున్నాం. పని భారంగా ఉంది. దీనికి తోడు రాత్రి సమయంలో డ్యూటీలు వేయడం తగదు. – అల్లెన కృష్ణవేణి, మహిళా పోలీస్, సంగాం ఆర్డీఓ ఆదేశాలతో.. చీపురుపల్లి ఆర్డీఓ ఆదేశాలతో సచివాలయాల ఉద్యోగులకు షిఫ్ట్ల వారీగా విధులు కేటాయించాం. వీరంతా సంగాంలో ఈ నెల 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాల్లో విధులు నిర్వహిస్తారు. ఉన్నతాధికారులు ఆదేశాలు అమలు చేశాం. – తులా రాజారావు, ఎంపీడీఓ, వంగర సచివాలయ సిబ్బందికి మహాశివరాత్రి ఉత్సవాల విధులు ఆర్డీఓ ఆదేశాల మేరకు జాబ్ చార్టును వేసిన ఎంపీడీఓ మహిళా పోలీసులు, ఉద్యోగులకు రాత్రి విధులు గర్భిణులైన ఉద్యోగులకూ విధుల కేటాయింపు చంద్రబాబు ప్రభుత్వ తీరుపై భగ్గుమంటున్న ఉద్యోగులు -
రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దు
రేగిడి: చెరకు రైతులను ఇబ్బందులు పెట్టవద్దంటూ సంకిలి వద్ద ఉన్న ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగార యాజమాన్యానికి పలువురు రైతులు గురువారం వినతిపత్రం అందజేశారు. రైతులు చెరకును నాటిన కాలాన్ని నమోదుచేయకపోవడం వల్ల సకాలంలో కటింగ్ ఆర్డర్లు ఇవ్వక నష్టపోతున్నామన్నారు. యాజమాన్యం స్పందించి సమస్యను పరిష్కరించాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు నారు జనార్దనరావుతో పాటు రైతులు గేదెల సత్యం, తాడేల తవిటినాయుడు, గేదెల రామకృష్ణ, సౌరోతు నీలంనాయుడు, చల్లా స్వామినాయుడు తదితరులు విజ్ఞప్తిచేశారు. పోలీస్ దర్బార్తో సమస్యల పరిష్కారం విజయనగరం క్రైమ్: ఆర్మ్డ్డ్ రిజర్వు పోలీసుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ‘పోలీసు దర్బార్’ను ఎస్పీ ఏఆర్ దామోదర్ గురువారం నిర్వహించారు. పోలీస్ సిబ్బంది వ్యక్తిగత, వత్తిపరమైన సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. పదోన్నతులు, ఇంక్రిమెంట్ల అంశాన్ని ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. పోలీస్ సిబ్బంది చక్కగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలందించాలని సూచించారు. వృత్తిలో ప్రతిభ చూపేవారికి రివార్డులు అందజేస్తున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో సీఐలు ఎ.వి.లీలారావు, విద్యాసాగర్, రిజర్వు ఇన్స్పెక్టర్లు ఎన్.గోపాల నాయుడు, ఆర్.రమేష్ కుమార్, పి.శ్రీనివాసరావు, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు. దోపిడీకి పాల్పడితే క్రిమినల్ చర్యలు విజయనగరంక్రైమ్: హెచ్ఆర్సీ, ఆర్టీఐ అధికారులమంటూ ఎవరైనా దోపిడీలకు, అక్రమ వసూళ్లకు పాల్పడితే క్రిమినల్ చర్యలు తప్పని ఎస్పీ దామోదర్ గురువారం హెచ్చరించారు. ఇటీవల కొంతమంది నేషనల్ హ్యుమన్ రైట్స్ కమిషన్, ఆర్టీఐ అధికారుల పేరుతో అమాయక ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి వ్యక్తుల గురించి సమాచారం అందిస్తే రౌడీ షీట్స్ తెరుస్తామన్నారు. పుణ్యగిరిని సందర్శించిన కలెక్టర్ శృంగవరపుకోట: భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శివరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ రాంసుందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. పలువురు అధికారులతో కలిసి పుణ్యగిరిని గురువారం సందర్శించారు. పుణ్యగిరి మెట్లమార్గం నుంచి ప్రధాన ఆలయం వరకు చేస్తున్న ఏర్పాట్లను తహసీల్దార్ శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు. భక్తుల రద్తీ నియంత్రణకు ఏం చర్యలు తీసుకుంటున్నారంటూ సీఐ నారాయణమూర్తిని అడిగి తెలుసుకున్నారు. పుణ్యగిరి, రామతీర్థం క్షేత్రాలకు శివరాత్రి వేళ 50 వేలకు పైగా భక్తులు వస్తారని అంచనా ఉందని, ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆయన వెంట ఆర్డీఓ కీర్తి, తహసీల్దార్ శ్రీనివాసరావు, దేవస్థానం ఈఓ నాగేంద్ర, ఎస్.కోట పంచాయతీ ఈఓ చంద్రశేఖర్, ఉత్సవకమిటీ చైర్మన్ పెదగాడి రాజు, తదితరులు ఉన్నారు. -
ఉద్యోగ మేళాకు స్పందన
విజయనగరం రూరల్: స్థానిక జేఎన్టీయూ–జీవీ ప్రాంగణంలో జేఎన్టీయూ–జీవీ, హైదరాబాద్కు చెందిన నిర్మాణ్–ఇన్ఫోసిస్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఉద్యోగ మేళాకు విశేష స్పందన లబించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జేఎన్టీయూ జీవీ ఉపకులపతి వీవీ సుబ్బారావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఉద్యోగ మేళాకు హాజరైన నిరుద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ కృత్రిమ మేధస్సు (ఏఐ) వ్యాపిస్తున్న ప్రస్తుత కాలంలో ఇటువంటి ఉద్యోగ మేళాను నిర్వహించడంతో సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలను సాధించాలని సూచించారు. ఉద్యోగాలు సాధించిన వారు సమాజానికి, దేశానికి ఉపయోగపడే విధంగా తయారు కావాలన్నారు. ఉద్యోగం ఎక్కడైనా వెళ్లి చేయడానికి సిద్ధం కావాలన్నారు. ఈ ఉద్యోగ మేళాకు రాయల్ ఎన్ఫీల్డ్, మేధా, టాటా ఎలక్ట్రానిక్స్, కియా, వోల్టాస్, హుండయ్, యోకోహామా సంస్థలు ముందుకురాగా వివిధ ప్రాంతాల నుంచి 632 మందికి పైగా నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకోగా 497 మంది హాజరయ్యారు. వారిలో నుంచి 301 మందికి ఉద్యోగాలకు ఎంపిక కావడం ఆనందంగా ఉందని ఉపకులపతి సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నిర్మాణ్– ఇన్ఫోసిస్ సంస్థ ప్రతినిధి జి.శ్రీనివాసరావు, జేఎన్టీయూ జీవీ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ ఆర్.రాజేశ్వరరావు, సమన్వయకర్తలు జీజే నాగరాజు, వి.ఎస్.వకుళ, తదితరులు పాల్గొన్నారు. -
శివరాత్రి ఉత్సవాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ తప్పనిసరి
● ఎస్పీ ఏఆర్ దామోదర్ నెల్లిమర్ల రూరల్: రామతీర్థంలో ఈ నెల 15 నుంచి రెండు రోజుల పాటు జరగనున్న మహా శివరాత్రి ఉత్సవాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ తప్పనిసరి అని ఎస్పీ ఏఆర్ దామోదర్ అధికారులకు సూచించారు. రామతీర్థంలో శివరాత్రి ఉత్సవాల బందోబస్తు ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరకు సుమారు లక్ష మంది భక్తులు విచ్చేసే అవకాశం ఉందని, సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను చేస్తున్నామన్నారు. ఆర్టీసీ బస్సులను వేరే ప్రాంతంలో పార్కింగ్ చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కోనేరు, బాత్ ఘాట్స్, కేశఖండన శాల, నీలాచలం పర్వతంపై బందోబస్తు నిర్వహించాలన్నారు. ఈవ్టీజింగ్, దొంగతనాలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సీతారామునిపేట, దన్నానపేట రహదారిలో వాహనాలు నిలుపుదల కాకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ గోవిందరావు, సీఐ రామకృష్ణ, ఎస్ఐ గణేష్, ఈఓ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.రెండు బైక్లు ఢీ: ఇద్దరికి గాయాలువంగర: మండల పరిధి రుషింగి వద్ద రెండు బైక్లు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. గురువారం రుషింగి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో మండలంలోని లక్ష్మీపేట గ్రామానికి చెందిన కలమట వెంకటేష్ కుడిచేయి విరిగింది. వీరఘట్టం మండలం చిట్టిపూడివలస గ్రామానికి చెందిన ఏడాకుల వంశీకి కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్సీ గణపతి తెలిపారు. 80 లీటర్ల సారా పట్టివేతకొమరాడ: మండల కేంద్రం కొమరాడ గ్రామంలోని కొత్త కాలనీకి చెందిన గొర్లి సత్యనారాయణ 80 లీటర్ల సారాతో పట్టుబడినట్లు ఎస్ఐ జగదీష్నాయుడు గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సారాతో పాటు ఒక మోటారు సైకిల్ను స్వాధీనం చేసుకుని సత్యనారాయణపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని చెప్పారు. -
రేడియాలజీ ప్రొఫెసర్ శిక్షణ ఇవ్వరట..!
● సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్కు సింహగిరి కాలేజీ విద్యార్థుల ఫిర్యాదువిజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి రేడియాలజీ ప్రొఫెసర్ ఎం.శివశ్రీధర్ తమకు శిక్షణ ఇవ్వనంటున్నారని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజకు పట్టణంలోని కేఎల్పురానికి చెందిన సింహగిరి కాలేజ్ ఆఫ్ పారామెడికల్ ఇనిస్టిట్యూట్ విద్యార్థులు , కళాశాల ప్రతినిధులు గురువారం ఫిర్యాదు చేశారు. సర్వజన ఆస్పత్రిలో శిక్షణ పొందడానికి పారామెడికల్ బోర్డు, ఆస్పత్రి సూపరింటెండెంట్ అనుమతి ఇచ్చారని , అయినప్పటికీ తమకు శిక్షణ ఇవ్వనని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిప్లమో మెడికల్ ఇమేజ్ టెక్నాలజీ(డీఎంఏటీ) కోర్సు చదివేందుకు సింహగిరి కాలేజీలో చేరామని తెలిపారు. 16 మంది విద్యార్ధులకు సర్వజన ఆస్పత్రిలో సిటిస్కాన్, ఎంఆర్ఐ స్కాన్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఎక్స్రే విభాగాల్లో శిక్షణ పొందడానికి అవసరమైన అన్ని అనుమతులు, ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బులు కూడా కాలేజీ వారు చెల్లించారని తెలిపారు. ఈనెల 9న శిక్షణ పొందేందుకు రేడియాలజీ విభాగానికి వెళ్లగా మీకు ఇక్కడ ట్రైనింగ్ (శిక్షణ) ఇవ్వమని చెప్పడంతో నాలుగు రోజులుగా ఆస్పత్రికి వచ్చి వెళ్లిపోతున్నామని వాపోయారు. ఇదేవిషయంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ వద్ద సాక్షి ప్రస్తావించగా డాక్టర్ శివశ్రీధర్ సింహగిరి కాలేజ్ విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వనని చెప్పడం వాస్తవమేనన్నారు. దీనిపై డీఎంఈ, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్కు తెలిపానని, ఒకటి రెండు రోజుల్లో సమస్య పరిష్కరించి విద్యార్థులకు శిక్షణ ఇచ్చేవిధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు ఎం.భాను, సీహెచ్.అశ్విని, కె. పావని, డి.కొండమ్మ, ఆర్.ప్రవీణ్, తేజ, కళాశాల ప్రతినిధి పైడినాయుడు తదితరులు ఉన్నారు. -
డోలీలో 6 కిలోమీటర్లు...
ఎస్.కోట మండలం రేగపుణ్యగిరి గ్రామానికి చెందిన గిరిజనుడు గమ్మెల సాంబ కాలికి బుధవారం తీవ్రగాయమైంది. గ్రామానికి వాహనం వచ్చే మార్గంలేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఆయన నడవలేని స్థితిలో ఉండడంతో వైద్యం కోసం సుమారు 6 కిలోమీటర్ల మేర రాళ్లదారిలో డోలీలో తీసుకొచ్చి ఎస్.కోట ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. రేగపుణ్యగిరికి 3.5 కి.మీ మేర రోడ్డు వేసేందుకు ఏడాదికి కిందట రూ.4 కోట్లు నిధులు మంజూరు చేసినా పనుల్లో నిర్లక్ష్యంపై గిరిజనులు మండిపడుతున్నారు. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం గిరిజనులకు శాపంగా మారిందని జనసేన నాయకుడు ఒబ్బిన సన్యాసినాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. – శృంగవరపుకోట -
చాలా మంది రైతుల భూములు 22–ఏలో చేరడం, అస్సైన్డ్ భూములుగా నమోదుకావడంతో క్రయవిక్రయాలు జరగక ఇబ్బందులు పడుతున్నారు. రైతుల నుంచి అందిన అర్జీల మేరకు సరిచేయాలని ఆదేశాలిస్తూ ప్రభుత్వం ఓ సర్క్యులర్ను జారీచేసింది. దీనినే అదునుగా చేసుకుని కొందరు రాజకీయనాయకుల అండదండ
● 22ఏ భూముల క్రమబద్ధీకరణ పేరుతో దోపిడీ ! ● ప్రతిఫైలుకు ఓ రేటు ● నచ్చిన అధికారులతో ప్రత్యేక బృందం ● చకచకా అస్సైన్డ్ భూముల ఫైళ్ల క్లియరెన్స్కు ఏర్పాట్లు సాక్షి ప్రతినిధి, విజయనగరం: చిన్న గడ్డిపరక ఆదరువు దొరికితే చాలు.. దానిని పట్టుకుని సముద్రాన్ని ఈదేసేవాళ్లున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే చిన్న జీవో కాపీ చాలు.. దానిని అడ్డం పెట్టుకుని మొత్తం రెవెన్యూ వ్యవస్థను చాపలా చుట్టబెట్టి చంకలో పెట్టుకుని వెళ్లిపోయేవాళ్లకూ కొదవలేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఒక జీవో కాపీని ఆధారం చేసుకుని అధికారపార్టీ నేతల అండదండలతో కొందరు రెవెన్యూ ఉద్యోగులు సిండికేటుగా మారి మొత్తం కథను మార్చేసి.. రెవెన్యూలో రూ.కోట్ల కథ రాసుకునేందుకు పథకం వేశారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. వాస్తవానికి కొన్నేళ్లుగా వివాదాల్లో ఉన్న భూములు, పొరపాటున 22–ఏలో చేర్చబడిన ప్రైవేటు భూము లు, రాజకీయ కక్షల నేపథ్యంలో ఇలాంటి చిక్కుల్లో పడినవారి భూములు, మాజీ సైనికులకు చెందిన భూముల మ్యుటేషన్లకు సంబంధించి పూర్తి హక్కు లు దఖలుపర్చే అంశంలో ఉన్న చిక్కుముడులు విప్పే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 2న ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఇందులో భాగంగా తహసీల్దార్, రెవెన్యూ డివిజనల్ అధికారులకు కొన్ని అధికారాలు కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఒక్కో విధమైన వివాదం.. చిక్కుముడులు సంబంధించి వాటిని ఎలా పరిష్కరించాలి.. దానికి ఎలాంటి డాక్యుమెంట్లు ఉండాలి అనేది కూడా ఆ సర్క్యులర్లో పొందుపర్చింది. సేవలన్నీ ఉచితంగా అందజేయాలి. ఉన్నఫళంగా అన్ని ఫైళ్లు చదవడం.. వివాదాలు.. దాని ఇబ్బందులు పరిష్కరించడం ఉన్న కొద్దిమందితో కుదరదని, కొందరు సిబ్బంది అదనంగా కావాలని కోరిన సంబంధిత అధికారులు... నలుగురు డిప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారులను తమకు సహాయకులుగా తెచ్చుకున్నట్లు సమాచారం. ఆ నలుగురిలో ఇద్దరు తనకు అనుకూలమైనవాళ్లను చేర్చి మొత్తం టీమ్ తనకనుసన్నల్లో ఉండేలా చేసుకున్నారన్నది రెవెన్యూ వర్గాల బోగట్టా. ఈ బృందానికి అస్సైన్డ్ భూముల క్రమబద్ధీకరణ ముసుగులో రూ.కోట్ల కొల్లగొట్టేందుకు ‘అస్సైన్’మెంట్ ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివాదాస్పద భూములకు సంబంధించిన ఫైళ్లను చకచకా చదివేసి.. ఆ భూ యజమానులతో బేరం మాట్లాడుకుని వాటిని పై స్థాయి అధికారి లాగిన్కు పంపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం దందా విలువ రూ.కోట్లలోనే ఉంటుందని రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దశాబ్దాలుగా వివాదాల్లో ఉంటున్న భూములకు సంబంధించి వివాదం క్లియర్ చేయడానికి ఎంతైనా సమర్పించుకునేందుకు సంబంధిత భూ యజమానులు సిద్ధంగా ఉండడంతో ఆ బలహీనతను క్యాష్ చేసుకునేందుకు రెవెన్యూ మాఫియా కౌంటర్ తెరిచిందని తెలుస్తోంది. తక్షణం పరిష్కరించగలిగే ఫైళ్లను ఎంపిక చేసుకుని గమ్మున తేల్చేసి అందినకాడికి దండుకునేందుకు రంగం సిద్ధమైందని.. ఈ మేరకు ఫైలు స్థాయి.. ఆ భూమి విలువను బట్టి కోట్లలో చేతులు మారేందుకు రూట్ క్లియర్ అయిందని అంటున్నారు. మేం క్లియర్ చేయడమే కాదు.. డివిజన్ .. జిల్లా స్థాయి అధికారులతోనూ బేరం తామే మాట్లాడి అక్కడ కూడా క్లియర్ చేసేందుకు పూర్తి బాధ్యత వహిస్తామని సంబంధిత సెక్షన్ అధికారులు చెప్పడంతో ఇక భూ యజమానులకు నమ్మకం కలిగి.. డబ్బులు ముట్టజెబుతున్నట్లు తెలుస్తోంది. దీనివెనుక కొందరు రాజకీయ నాయకుల మంత్రాంగం గట్టిగా పనిచేస్తున్నట్టు సమాచారం. కాసులిచ్చే ఫైళ్లకే కదలిక.. -
గ్రోత్సెంటర్లో ఐదు పరిశ్రమలకు స్థలాల కేటాయింపు
● డిప్యూటీ జోనల్ మేనేజర్ జయచంద్ర బొబ్బిలి: స్థానిక గ్రోత్సెంటర్లో ఐదు పరిశ్రమలకు స్థలాలు కేటాయించినట్టు ఏపీఐఐసీ డిప్యూటీ జోనల్ మేనేజర్ జయచంద్ర తెలిపారు. గతనెల 29న ‘అందుబాటులో ఉన్నా కేటా‘యింపే’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఏపీఐఐసీ అధికారులు స్పందించారు. ఇటీవల మంగళగిరిలో జరిగిన సమావేశంలో గ్రోత్సెంటర్లో మిగులు స్థలాల వివరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని జయచంద్ర బుధవారం తెలిపారు. ఇక్కడి పరిశ్రమల ఏర్పాటు అవకాశాలను తెలియజేశామన్నారు. సోనీ ఇండస్ట్రియల్ గేసెస్, సిద్ధి వినాయక ప్రాసెసింగ్, అమీనా ఇంజినీరింగ్ వర్క్స్, సన్రైజ్ కంపెనీ, అను ఇండస్ట్రీస్ కంపెనీలకు 4.35 ఎకరాల్లో ప్లాట్లు కేటాయించినట్టు డీజడ్ఎం చెప్పారు. స్థానిక గ్రోత్సెంటర్లో 307.20 ఎకరాల్లో 129 ప్లాట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు పరిశ్రమల ఏర్పాటుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రస్తుతం గ్రోత్సెంటర్లో స్క్వేర్మీటర్ ధర రూ.2,362లుగా ఉందన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేసేవారికి నీరు, రోడ్ల సదుపాయం కల్పిస్తామని చెప్పారు. -
కూటమి వైఫల్యాలపై పోరుబాట
● యువతే పార్టీకి ఆయువుపట్టు ● ఉత్తరాంధ్ర యువజన విభాగం ● విస్తృత స్థాయి సమావేశంలో జక్కంపూడి రాజాసాక్షి, విశాఖపట్నం: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజల గొంతుకగా యువజన విభాగం నిలవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీలో లేని విధంగా వైఎస్సార్సీపీ యువజన విభా గం అత్యంత బలంగా మారనుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.70 లక్షల మంది యువజన విభాగం సైనికులు తయారవుతున్నారని తెలిపారు. బుధవారం ఎండాడలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఉత్తరాంధ్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నంరెడ్డి అదీప్రాజ్ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర యువజన విభాగం విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జక్కంపూడి రాజా, పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు హాజరయ్యారు. ముందుగా రాజాకు ఉత్తరాంధ్ర యువజన విభాగం జోనల్ అధ్యక్షుడు అంబటి శైలేష్ ఆధ్వర్యంలో భారీ గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్, ఇతర యువజన విభాగం నాయకులతో కలిసి రాజా.. వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. యువజన విభాగమే గొంతుక కావాలిఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. పార్టీ అనుబంధ విభాగాల్లో యువజన విభాగం అత్యంత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. యువజన విభాగం ఎంత బలంగా ఉంటే, ఆ పార్టీ భవిష్యత్తు అంత రెట్టింపు స్థాయిలో పుంజుకుంటుందని అభిప్రాయపడ్డారు. విద్యార్థి దశ నుంచే వైఎస్సార్ సీపీలో పని చేసిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని, ఎమ్మెల్యేలుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా అనేక అవకాశాలు కల్పించామని గుర్తు చేశారు. జగన్ 2.0లో కార్యకర్తలకే పెద్దపీటజిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు. యువజన విభాగమే పార్టీ భవిష్యత్తుకు బాటగా మారుతుందన్నారు. జగన్ 2.0లో కార్యకర్తల ద్వారానే పాలన సాగుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ మాట్లాడుతూ.. గతంలో వైఎస్సార్ హయాంలో యూత్ కాంగ్రెస్లో కష్టపడి పనిచేశానని, అందుకే తనను పిలిచి వైఎస్సార్ సీపీలో ఎమ్మెల్యేగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అవకాశం కల్పించారని గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో విజయనగరం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల యువజన విభాగం అధ్యక్షులు ఉరుకూటి చందు, పుల్లేటి వెంకటేష్, గబ్బిడి శేఖర్, అల్లు అవినాష్, ఎం.పృథ్వీ, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. -
బడి అభివృద్ధి భారం.. దాతలే ఆధారం..!
దాతల వెంటబడి.. ● సర్కారు తీరుపై విస్తుపోతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు ● జిల్లాలో 1,784 బడులకు రూ.100 కోట్ల అవసరాలు ● నాడు–నేడు నిధులను పక్కనపెట్టి దాతల కోసం ఎదురుచూపు ● దాతలొస్తేనే అభివృద్ధి.. లేదంటే నిరీక్షణ విజయనగరం అర్బన్: ప్రభుత్వ వైద్యకళాశాలలను పీపీపీ విధానంలో నిర్వహించేందుకు సిద్ధమైన ప్రభుత్వం... ఇప్పుడు సర్కారు బడుల అభివృద్ధి బాధ్య తలను దాతలకు బదిలీ చేస్తోంది. దీనికోసం విద్యాంజలి–2.0 పేరుతో అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. పాఠశాలలను అభివృద్ధి చేయాల్సిన ప్రభు త్వం.. ఆ బాధ్యతలను క్రమంగా సమాజం, పూర్వ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల భుజాలపైకి నెట్టేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ వైపు నాడు–నేడు నిధులు ఖర్చుచేయరాదని ఆదేశాలిస్తూ... మరోవైపు పాఠశాలల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలంటూ విద్యాశాఖ అధికారులతో అవగాహన కల్పిస్తుండడంపై మేధావులు పెదవి విరుస్తున్నారు. దాతలు దొరికేవరకు విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించరా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2022 లో ప్రారంభించిన విద్యాంజలి 2.0 కార్యక్రమం అప్పట్లో పూర్తిగా విఫలమైనా... కారణాలను సమీక్షించకుండా, నిధుల భరోసా ఇవ్వకుండా మళ్లీ అదే పథకాన్ని అమలులోకి తెచ్చేందుకు ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించడాన్ని ఉపాధ్యాయ సంఘాలు తప్పుబడుతున్నాయి. ప్రభుత్వమే ఖర్చుచేయాల్సిన విద్యారంగాన్ని ‘లాగిన్–రిజిస్ట్రేషన్–వాలంటీర్’ మోడల్కు పరిమితం చేయడాన్ని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. ఉన్న నిధులు ఖర్చుచేయకుండా... గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ‘మనబడి నాడు–నేడు’ పథకం కింద మొదటి విడతగా రూ.183 కోట్ల నిధులను వెచ్చించి జిల్లాలోని 841 స్కూళ్లలో అభివృద్ధి పనులు చేపట్టింది. ఆధునిక హంగులు కల్పించింది. రెండో విడతగా పాఠశాలలతో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, సంక్షేమ పాఠశాలలు కలిపి 738 విద్యాలయాల అభివృద్ధికి రూ. 231 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.126 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు జరిగాయి. తర్వా త వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం రూ.105 కోట్ల నిధులు విడుదల చేయకుండా అభివృద్ధి పనులను మధ్యలోనే ఆపేసింది. మరోవైపు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఆధ్వర్యంలో పాఠశాలల బ్యాంక్ ఖాతాల్లో ఉన్న నాడు–నేడు నిధులు రూ.10 కోట్లను వినియోగించవద్దని ఆదేశాలు ఇచ్చింది. కనీసం స్కూళ్ల ఖాతాల్లో ఉన్న నిధులను కూడా వినియోగించవద్దని ఆదేశిస్తూ.. ఇప్పుడు దాతల కోసం ఎదురుచూడమంటున్న ప్రభుత్వ విధానాలు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది. రూ.100 కోట్లు దాతలు సమకూర్చగలరా? జిల్లా 1,784 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలోని 1235 పాఠశాలలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు సుమారు రూ.225 కోట్లు అవసరమని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అదే సమయంలో తరగతి గదులు, విద్యుత్, డిజిటల్ మౌలిక సదుపాయాలు, మరమ్మతుల కోసం మరో రూ. వంద కోట్లు అవసరమవుతాయి. ఇంత మొత్తంలో ప్రభుత్వం ఒక్క రూపాయి నిధిని కేటాయించకుండా ‘నగదు వద్దు వస్తువులే ఇవ్వండి’ అంటూ దాతల చుట్టూ తిరగడం పాలనావైఫల్యానికి నిదర్శమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సదుపాయాలు కలిగేనా?జిల్లాలో 992 పాఠశాలల విద్యుత్ సౌకర్యాలకు రూ.9.9 కోట్లు, 1.363 పాఠశాలల తరగతి గదుల నిర్మాణావసరాలకు రూ.16.47 కోట్లు, 1,111 పాఠశాలల డిజిటల్ మౌలిక సదుపాయాలకు రూ.15.25 కోట్లు, 1,130 పాఠశాలల భవనాల మరమ్మతుల కోసం రూ.8.65 కోట్లు అవసరమని విద్యాశాఖ వద్ద ఉన్న గణాంకాలు చెబుతున్నాయి. ఈ అవసరాలు తీరాలంటే దాతలు ముందుకు రావాలన్న షరతు పెట్టడం ద్వారా... ప్రభుత్వ బడులు భవిష్యత్తును అనిశ్చితలోకి నెట్టేస్తున్నారని విమర్శకులు అంటున్నారు. దాతల రాకపోతే ఆ పాఠశాలల విద్యార్థులు శాశ్వతంగా వెనుకబడిపోవాలా? అన్న ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాలన్న డిమాండ్ వినిపిస్తోంది. విద్యాంజలి 2.0 పథకం అమలు నేపథ్యంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఇటీవల జిల్లా, మండలస్థాయి అవగాహన సదస్సులను సమగ్ర శిక్ష అధికారులు నిర్వహించారు. యోగా, క్రీడలు, సబ్జెక్టుల బోధనకు వలంటీర్లు రావాలంటూ ఆ సదస్సుల్లో సమగ్రశిక్షా ఏపీసీ అధికారి పిలుపునివ్వడం ఒక ఎత్తయితే... తరగతి గుదులు, విద్యుత్, మరుగుదొడ్లు, భద్రత వంటి మౌలిక వసతుల కోసం కూడా దాతలనే ఆశ్రయించడం మరో ఎత్తు. ఇది సమాజ భాగస్వామ్యమా? లేక ప్రభుత్వ బాధ్యతల నుంచి తప్పించుకోవడమా? అన్నచర్చ ఉపాధ్యాయ వర్గాలు, మేధావుల్లో జోరుగా సాగుతోంది. దాతలు స్పందించకుంటే సర్కారు బడుల్లో చదువుకునే విద్యార్థులకు సదుపాయాలు కలగవని, చదువులో వెనుకబడిపోతారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. -
పరిహారం చెల్లించకుండా పనులెలా చేస్తారు?
● జీఎంఆర్ సంస్థ చేపట్టిన పనులను అడ్డుకున్న తూడెం గ్రామస్తులు భోగాపురం: తాత ముత్తాతల నుంచి సాగుచేస్తున్న భూములకు పరిహారం చెల్లించకుండా.. కనీసం సమాచారం ఇవ్వకుండా చదునుచేసే పనులు ఎలా చేపడతారంటూ భోగాపురం మండలం బసవపాలెం రెవెన్యూ పరిధిలోని తూడెం గ్రామస్తులు ఆందోళన వ్యక్తంచేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్కు సదుపాయాల కల్పనలో భాగంగా జీఎంఆర్ సంస్థ బుధవారం చేపట్టిన భూమి చదును పనులను అడ్డుకున్నారు. జేసీబీ ముందునిల్చొని నిరసన తెలిపారు. పరిస్థితిని గమనించిన జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు తహసీల్దార్తో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పి అక్కడి నుంచి వెనుదిరిగారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపబోమని గ్రామస్తులు స్పష్టం చేశారు. -
ఆయుష్మాన్ భారత్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో 70 ఏళ్లు దాటిని ప్రతిఒక్కరూ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (పీఎంజేఏవై), ప్రధానమంత్రి వయోవందన యోజన (పీఎంవీవీవై) కార్డులు పొందాలని డీఎంహెచ్ఓ ఎస్.జీవనరాణి తెలిపారు. కార్డుల పంపిణీ కోసం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తామని చెప్పారు. ఆదాయంతో సంబంధం లేకుండా కార్డులు పొందవచ్చన్నారు. సమీపంలోని పీహెచ్సీ వైద్యులు, గ్రామానికి చెందిన ఏఎన్ఎం, ఎంఎల్హెచ్పీలను సంప్రదించి తమ వివరాలను నమోదు చేసుకుని కార్డు పొందాలన్నారు. ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు పొందవచ్చన్నారు. పార్సిల్ సేవల్లో తెర్లాం ముందంజ తెర్లాం: ఏపీఎస్ ఆర్టీసీ సంస్థ తెర్లాంలో నిర్వహిస్తున్న పార్సిల్ సర్వీస్ కౌంటర్ వినియోగదారుల సేవల్లో జిల్లా స్థాయిలో ముందంజలో నిలిచింది. మెరుగైన సేవలతో ఆర్టీసీకి ఆదా యం రాబట్టడంలో ఇక్కడి కౌంటర్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ మేరకు కౌంటర్ నిర్వాహకుడు వెలగాడ రమేష్ను ఆర్టీసీ ఉన్నతాధికారులు బుధవారం అభినందించారు. నేడు ఎన్జీఓల నిరసన విజయనగరం కలెక్టరేట్: కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఇచ్చిన సార్వత్రిక సమ్మె పిలుపుమేరకు ఏపీ ఎన్జీఓ సంఘం జిల్లా శాఖ కలెక్టరేట్ వద్ద గురువారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన తెలియజేయనున్నట్టు ఆ శాఖ జిల్లా అధ్యక్షుడు ఎ.సురేష్ తెలిపారు. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు చేపట్టే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ నిధులు సద్వినియోగం చేసుకోవాలి విజయనగరం కలెక్టరేట్: కేంద్ర ప్రభుత్వ పథకాల కింద మంజూరు చేసిన రూ.40 నిధులను మార్చి నెలాఖరులోగా వినియోగించుకోవాలని కలెక్టర్ రాంసుందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో సమీక్షిస్తూ నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ మిషన్ పనులు పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డీఆర్వో మురళి, సీపీఓ మురళి, డీఈఓ మాణిక్యంనాయుడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పైడితల్లి చదురుగుడి హుండీల ఆదాయం లెక్కింపు విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి చదురుగుడి హుండీల ఆదాయాన్ని అమ్మవారి కల్యాణ మండపం ఆవరణలో బుధవారం లెక్కించారు. 90 రోజులకు రూ.32లక్షల39వేల788ల నగదు, 39 గ్రాముల 200 మిల్లీ గ్రాముల బంగారం, 285 గ్రాముల వెండి వచ్చినట్టు దేవదాయశాఖ జిల్లా సహాయ కమిషనర్, ఆలయ ఈఓ కె.శిరీష తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు రమేష్, పద్మావతి, స్వాతికుమారి, పర్యవేక్షణ అధికారి జి.శ్రీనివాస్, సేవా సంఘం సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. 18 నుంచి టెక్నికల్ సర్టిఫికెట్ పరీక్షలు విజయనగరం అర్బన్: టెక్నికల్ సర్టిఫికెట్ లోయర్, హయ్యర్ గ్రేడ్ పరీక్షలు ఫిబ్రవరి 18 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు డీఈఓ మాణిక్యంనాయుడు బుధవారం తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు అధికారిక వెబ్సైట్ ‘బీఎస్ఈ.ఏపీ.జీఓవి.ఐఎన్’లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. హాల్టికెట్, ఐడీకార్డుతో అభ్యర్థులు నిర్దేశిత సమయానికి పరీక్ష కేంద్రాలకు హాజరుకావావాలని సూచించారు. -
పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
● కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి విజయనగరం అర్బన్: పదో తరగతి, ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. మార్చి 16 నుంచి జరిగే పరీక్షల నిర్వహణకు చేపట్టాల్సిన చర్యలపై తన చాంబర్లో వివిధ శాఖల అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలకు జిల్లాకు చెందిన 23,523 మంది విద్యార్థులు హాజరుకానున్నారని, వీరిలో 22,959 మంది రెగ్యులర్ విద్యార్థులు, 564 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నారన్నారు. పరీక్షల కోసం మొత్తం 119 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి పరీక్షా కేంద్రాన్ని తహసీల్దార్లు, ఎంపీడీఓ/ మున్సిపల్ కమిషనర్లు తనిఖీ చేసి సోమవారం నాటికి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. పరీక్షల పర్యవేక్షణకు 7 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 29 స్టోరేజ్ పాయింట్లు, సుమా రు 1,350 మంది ఇన్విజిలేటర్లను వినియోగిస్తున్నామని తెలిపారు. హాల్ టికెట్పై క్యూఆర్కోడ్ రూపంలో పరీక్ష కేంద్ర వివరాలు ముద్రించి ఉంటాయని, వాటిని స్కాన్ చేసి తెలుసుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ బస్సుల సమయాల్లో మార్పులు చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో ఇ.మురళి, డీఈఓ యు.మాణిక్యంనాయుడు, డీపీటీఓ జి.వరలక్ష్మి, వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. -
గాయకుడిగా మారిన దర్శకుడు
వేపాడ: 30 సంవత్సరాలుగా సినీరంగంలో పలు ప్రయోగాలు చేసి జాతీయ, అంతర్జాతీయంగా పలు అవార్డులు అందుకుని అందరి మన్ననలు పొందిన సినీ దర్శకుడు పీసీ ఆదిత్య నేడు గాయకుడిగా కొత్త అవతారమెత్తారు. వేపాడ మండలం కుమ్మపల్లి గ్రామానికి చెందిన పీసీ ఆదిత్య సినీరంగంలో అడుగుపెట్టి సొంత ఊరికి దూరంగా ఉన్నా ఉత్తరాంధ్రపై అభిమానంతో గాయకుడిగా మారి శ్రీకాకుళం, కొత్తవలస పేర్లతో పాడిన పాట పలువురిని ఆకట్టుకుంటోంది. దర్శకుడు ఆదిత్య గాయకుడిగా సాంకేతిక విప్లవంలో భాగంగా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) విధానంలో నాలుగు నిమిషాల నిడివితో ఓ ప్రేమగీతాన్ని రచించి గానం చేశారు. రాయే నా లచ్చి అంటూ జానపద శైలిలో ఉత్తరాంధ్ర యాసలో సాగిన ఈ గీతం టీజర్లో ప్రజాదరణ పొందడంతో 11తేదీ 11 గంటల 11 నిమిషాలకు యూట్యూబ్లో విడుదల చేసినట్లు ఆదిత్య చెప్పారు.భవిష్యత్లో ఏఐ విధానంలో మరిన్ని ఆడియో వీడియో గీతాలను రూపొదించనున్నట్లు తెలిపారు. పీసీ ఆదిత్యది కుమ్మపల్లి గ్రామం 30 సంవత్సరాలుగా దర్శక, రచయితగా గుర్తింపు ఉత్తరాంధ్ర యాసతో పాడిన పాట యూట్యూబ్లో విడుదల -
కేసుల పరిష్కారంలో వేగం.. శాంతిభద్రతలకు ప్రాధాన్యం
● అపరిష్కృత ఫైళ్లపై ఎస్పీ మాధవ్రెడ్డి సమీక్షపార్వతీపురం రూరల్: నేరాల నియంత్రణలో వేగం..దర్యాప్తులో సాంకేతికత తోడైనప్పుడే బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం జిల్లా పోలీస్ మల్టీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మాసాంతపు నేర సమీక్షా సమావేశంలో ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. ‘దర్యాప్తులో నైపుణ్యం–నేరస్థులకు శిక్షే లక్ష్యం’గా పని చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని, గడువులోగా చార్జ్ షీట్లు దాఖలు చేసి బాధితులకు భరోసా కల్పించాలని ఆదేశించారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల్లో ఏమాత్రం అలసత్వం వహించకుండా, శాసీ్త్రయ పద్ధతుల్లో ఆధారాలు సేకరించాలని సూచించారు. గంజాయి వంటి మాదకద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపాలని, గ్రామస్థాయిలో నిఘా వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని స్పష్టం చేశారు. రానున్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాల వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. విజిబుల్ పోలీసింగ్తో పాటు రాత్రి గస్తీని ముమ్మరం చేయాలన్నారు. విధి నిర్వహణలో విశేష ప్రతిభ కనబరిచిన పలువురు అధికారులకు, సిబ్బందికి ఈ సందర్భంగా ఎస్పీ ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ వెంకటేశ్వరరావు, ఏఎస్పీ మనీషా రెడ్డి, జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
శివరాత్రికి పక్కా ఏర్పాట్లు చేయాలి
● కలెక్టర్ రాంసుందర్రెడ్డి విజయనగరం కలెక్టరేట్: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులకు పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాం సుందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యత పనులు, రెవెన్యూ అంశాలు, సంక్షేమ పథకాల అమలుపై కలెక్టర్ బుధవారం క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్లో సమీక్షించారు. రామతీర్థం, పుణ్యగిరి, ధర్మవరం, సంగమేశ్వర స్వామి ఆలయం, పాల్తేరు, కోటిపల్లి తదితర శివాలయాలకు భారీసంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. భక్తుల తాకిడి ముందే అంచనా వేసి తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. క్యూలు ఏర్పాటుచేసి దర్శనాలకు ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలన్నారు. ఉచిత బస్సు పథకం వల్ల గతం కంటే మహిళలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా ఏర్పాటు చేయాలని చెప్పారు. తొక్కిసలాటలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆలయ కమిటీలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, డీఆర్ఓ మురళి, డీపీవో మల్లికార్జునరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ● ప్రతిరోజూ ప్రధాన జంక్షన్లలో తనిఖీ చేయాలి ● డీపీఓలో నేర సమీక్ష సమావేశం విజయనగరం క్రైమ్ : స్ఫూర్తిదాయకమైన పని తీరుతో ప్రజలకు మెరుగైన సేవలందించాలని ఎస్పీ దామోదర్ సిబ్బందితో అన్నారు. ఈ మేరకు స్థానిక కంటోన్మెంట్లోని జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం నేరసమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎస్పీ దామోదర్, ఏఎస్పీ సౌమ్యలతలు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసుశాఖ వినియోగిస్తున్న టెక్నాలజీ పట్ల సిబ్బంది, అవగాహన పెంచుకోవాలని సూచించారు. నేరాలు జరగకుండా రాత్రి గస్తీని, పెట్రోలింగ్ను ముమ్మరం చేయాలని చెప్పారు. నేరాలు జరిగేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రతిరోజూ ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వేస్టేషన్, ముఖ్యమైన జంక్షన్లు, లాడ్జిల్లో తనిఖీలు నిర్వహించాలన్నారు. నాన్ బెయిలబుల్ వారంట్లను ఎగ్జిక్యూట్ చేసేందుకు ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేయాలని, కేసుల దర్యాప్తులోను నేరాలను కట్టడిచేసేందుకు సాంకేతికతను విరివిగా వినియోగించుకోవాలని సూచించారు. మైనర్ డ్రైవింగ్, హెల్మెట్ ధారణ, డ్రంకెన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్పై ప్రత్యేక దృష్టిపెట్టి, కేసులు నమోదు చేయాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. ఈ సమావేశంలో డీఎస్పీలు ఆర్.గోవిందరావు, జి.భవ్య రెడ్డి, ఎస్.రాఘవులు, ఎం.వీరకుమార్, న్యాయ సలహాదారులు వై.పరశురాం, పలువురు సీఐలు 34మంది ఎస్సైలు పాల్గొన్నారు. వన్టౌన్ హెచ్సీకి సేవా పతకంవిజయనగరం క్రైమ్: విజయనగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో హెచ్సీగా విధులు నిర్వహిస్తున్న ఎం.అప్పలనాయుడికి విశిష్ట సేవా పతకం లభించింది. గతంలో ఏసీబీలో పని చేసినందుకు గాను ఆయన సేవలను గుర్తించి ఈ పథకానికి ఎంపిక చేశారు. ఈ మేరకు విజయవాడ లో ఏసీబీ డీజీ అతుల్ సింగ్, ఏసీబీ డైరెక్టర్ జయలక్ష్మిలు హెచ్సీ అప్పలనాయుడికి విశిష్ట సేవా పతకాన్ని బుధవారం బహూకరించారు. ఈ సందర్భంగా హెచ్సీ అప్పలనాయుడు మాట్లాడుతూ 2019 నుంచి 2025 వరకు తాను ఏసీబీలో పని చేశానని, ఆ సమయంలో సక్రమంగా విధులు నిర్వహించి శాఖకు, ప్రభుత్వ పరంగా చేసిన తన సేవలను గుర్తించారన్నారు. -
సర్వజన ఆస్పత్రిలో గుర్తు తెలియని రోగి మృతి
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి క్యాజువాలిటీ వద్ద 45 ఏళ్ల వయసు గల గుర్తు తెలియని వ్యక్తి బుధవారం మృతిచెందాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే రణస్థలానికి చెందిన గుర్తు తెలియని వ్యక్తి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద బుధవారం స్పృహ తప్పిపడిపోయి ఉండడంతో వన్టౌన్ పోలీసులు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఆస్పత్రిలో చేర్పించిన తర్వాత ఏమైందో ఏమో కాని ఆస్పత్రి క్యాజువాలిటీ ఎదురుగా శవమై కనిపించాడు. నన్ను బతికించిండి, బతికించిండని సదరు రోగి అర్తనాదాలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ వ్యక్తి అనాథ కావడంతో ఏ ఒక్కరూ పట్టించుకోకపోవడం వల్ల అనాథ గానే మృతిచెందినట్లు తెలుస్తోంది. ఇదేవిషయాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ వద్ద సాక్షి ప్రస్తావించగా ఒక అనాథ వ్యక్తిని ఆస్పత్రిలో పోలీసులు చేర్పించినట్లు, ఆ వ్యక్తికి చికిత్స అందించినట్లు క్యాజువాలిటీ వైద్యులు తెలిపారన్నారు. మృతికి గల కారణాలు తెలుసుకుంటామని చెప్పారు. -
సెంచూరియన్లో ఉత్కళ కృషి మేళా
పర్లాకిమిడి: వికసిత్ భారత్, వికసిత్ ఒడిశా లక్ష్యంగా సెంచూరియన్ వర్సిటీలో చదివే వ్యవసాయ, వెటర్నరీ, ఫిషరీస్ విద్యార్థులు చక్కటి ప్రణాళికతో పది మందికీ ఉపాధి కల్పించేలా ఎదగాలని రాష్ట్ర మత్స్య, సూక్ష, చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ గోకులానంద మల్లిక్ ఆకాంక్షించారు. ఆయన ఆర్.సీతాపురం సెంచూరియన్ వర్సిటీలో బుధవారం మధ్యాహ్నం నాల్గో ఉత్కళ కృషి మేళా–2026ను ప్రారంభించారు. ఆయనతో పాటు పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతి రావు, ఉపకులపతి ప్రొఫెసర్ సుప్రియా పట్నాయిక్, ప్రొఫెసర్ వీసీ అజయ్ కుమార్ నాయక్, ఉపాధ్యక్షులు ఆచార్య డి.ఎన్.రావు, రిజిస్ట్రార్ అనితా పాత్రో, ఎంఎస్ స్వామినాథన్ వ్యవసాయ విద్యాలయం డీన్ ఎస్పీ నందా, తదితరులు పాల్గొన్నారు. మంత్రి గోకులా నంద నాయక్ సెంచూరియన్ వర్సిటీ ఆవరణలో పూలతోట ప్రదర్శన, మేకలు, కోళ్ల స్లాటర్ హౌస్ను ప్రారంభించారు. రాష్ట్ర మంత్రి గోకులానంద మల్లిక్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కామధేను యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పథకంలో ఒక లక్షా 30 వేల వరకూ సబ్సిడీలు అందజేస్తున్నామని అన్నారు. గజపతి జిల్లాలో పాడి రైతులు 634 మంది దరఖాస్తు చేసుకోగా 312 మంది రైతులకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి తెలిపారు. రైతులు కేవలం వరి పంట వేసి వేసవిలో సేద తీర్చు కోకుండా వనరాజా కోళ్లు, రొయ్యల చెరువులు నిర్మించాలని జిల్లా పరిషత్ చైర్మన్ గవర తిరుపతి రావు అన్నారు. కార్యక్రమంలో కోర్సండ గ్రామానికి చెందిన చేపల పెంపకంలో అధిక లాభాలు పొందిన జి.కల్పనకు, రైతు చిన్నయ్యకు మంత్రి గోకులనంద మల్లిక్ చేతులమీదుగా మెమొంటో, ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమానికి విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ అనిత పాత్రో అతిథులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో వెటర్నరీ డీన్ ప్రొఫెసర్ ఆర్కే స్వయిని, డీన్ ఫిషరీస్ గిరీష్ మహంతి, విజయనగరం సెంచూరియన్ కళాశాల డీన్ జోన్నలగడ్డ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతీ నెల శాప్ లీగ్ టోర్నమెంట్
● 17న చెస్, 24న సైక్లింగ్ క్రీడాకారుల ఎంపిక ● జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి ఎస్.వెంకటేశ్వరరావువిజయనగరం: ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహించడంలో భాగంగా స్పార్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సారథ్యంలో ప్రతినెలా వివిధ క్రీడాంశాల్లో లీగ్ టోర్నమెంట్లు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి ఎస్.వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం స్థానిక రాజీవ్ క్రీడామైదానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొత్తం 31 క్రీడాంశాలకు సంబంధించి జిల్లాస్థాయిలో ఎంపికలు నిర్వహించి వారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపించనున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు శాప్ రూపొందించిన క్రీడా యాప్లో తమ వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని స్పష్టం చేశారు. యాప్లో వివరాలు నమోదు చేసుకోని క్రీడాకారులను పోటీలకు అనుమతించమని తెలిపారు. ఇందులో భాగంగా మార్చి నెలలో లాన్ టెన్నిస్, సెప్టెంబర్లో వాలీబాల్ క్రీడాంశాల్లో జిల్లా వేదికగా రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఈనెలలో తిరుపతిలో జరగనున్న చెస్ పోటీలకు సంబంధించి 17న రాజీవ్ స్టేడియంలో అండర్–13, 15, 17, 19 విభాగాల్లో బాలబాలికల ఎంపికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో జరగబోయే ఓపెన్ లెవెల్ సైక్లింగ్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపికలు ఈనెల 24న విజ్జి స్టేడియంలో నిర్వహించనున్నామన్నారు. ఎంపిక పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి గల క్రీడాకారులు రెండు రోజులు ముందుగానే క్రీడా యాప్లో తమ వివరాలను పొందుపరుచుకోవాలని సూచించారు. జిల్లా స్కూల్ గేమ్స్ అసోసియేషన్, ఆయా క్రీడా సంఘాల సమన్వయంతో ఈ పోటీలు నిర్వహిస్తామని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులకు సదుపాయాలు కల్పించడంతో పాటు క్రీడాదుస్తులు అందజేయనున్నట్లు చెప్పారు. -
సమాజంలో మార్పులకు అనుగుణంగా పోలీస్ ఉద్యోగం
● కానిస్టేబుళ్ల ట్రైనింగ్ పరిశీలనలో ఎస్పీ దామోదర్విజయనగరం క్రైమ్: సమాజంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పోలీసు ఉద్యోగం మారుతుందని ఎస్పీ దామోదర్ అన్నారు. ఈ మేరకు నగర శివారు సారిపల్లిలో గల జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న ట్రైనీ కానిస్టేబుళ్లను ఉద్దేశించి ఎస్పీ మాట్లాడారు. డీపీటీసీలో జరుగుతున్న శిక్షణను ఏఎస్పీతో కలిసి ఎస్పీ బుధవారం పరిశీలించారు. కేంద్రంలో జరుగుతున్న శిక్షణను దర్గరుండి పర్యవేక్షించారు. శిక్షణార్థుల వసతి గదులను, తరగతి గదులను పరిశీలించారు. శిక్షణలో ఇన్ డోర్, ఔట్ డోర్ తరగతుల నిర్వహణ గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకుని వారికి కొన్ని సూచనలు చేశారు. శిక్షణార్థులతో కలిసి ఎస్పీ భోజనం చేశారు. సమాజంలో మార్పులకు అనుగుణంగా పోలీసింగ్ మారుతుందని, బేసిక్ పోలీసింగ్తో పాటు కొత్తగా వచ్చిన సాంకేతికతను వినియోగించుకుంటూ ముందుకు సాగాలని ఎస్పీ సూచించారు. అందరితో కలిసి భిన్న వాతావరణం, విభిన్నమైన ప్రాంతాల్లో శిక్షణ పొందడం వల్ల ఎవరితో ఏవిధంగా మెలగాలో తెలియడంతో పాటు, ప్రతి ఒక్కరూ శారీరకంగా, మానసికంగా మెరుగవుతారన్నారు. కార్యక్రమంలో డీపీటీసీ డీఎస్పీ పి.నారాయణరావు, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, సీఐలు, ఆర్ఐ టి. శ్రీనివాసరావు, ఎస్సైలు, ఆర్ఎస్సైలు, ఇతర పోలీసు అధికారులు, శిక్షణ కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. ఫైరింగ్ చేసేటప్పుడు లక్ష్యం గురి తప్పకూడదు ఫైరింగ్ చేసేటప్పుడు లక్ష్యం గురి తప్పకూడదని ఎస్పీ దామోదర్ అన్నారు. జిల్లాలో పని చేస్తున్న పోలీసు అధికారులకు వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ ను సారిపల్లి జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ ఏఆర్ దామోదర్ ముఖ్య అతిధిగా హాజరై, అధికారుల ఫైరింగ్ ప్రాక్టీసును పర్యవేక్షించి, ఫైరింగ్ ప్రాక్టీసులో పాల్గొన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి. సౌమ్యలత, డీఎస్పీలు తదితరులు పాల్గొన్నారు. -
ఎవరు సైకోలో ప్రజలకు తెలుస్తోంది
● రెవెన్యూ శాఖ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుబలిజిపేట: గత ఐదేళ్ల పరిపాలనలో ఏ ముఖ్యమంత్రికి సాధ్యంకాని సంక్షేమ పథకాలను ప్రజలకు అందించి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సైకోనా... లేదంటే అధికారంలోకి వచ్చి 19 నెలలు గడిచినా ప్రజలకు ఎటువంటి మేలు చేయని చంద్రబాబు, లోకేశ్లు సైకోలా అనేది ప్రజలకు తెలుస్తోందని రెవెన్యూశాఖ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలంలోని గలావిల్లిలో తూర్పుకాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ మామిడి శ్రీకాంత్ ఇంటివద్ద బుధవారం గ్రామస్తులతో సమావేశమయ్యారు. సమస్యలను తెలుసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు ఎటువంటి సంక్షేమం అందలేదని, పంటకు తగిన గిట్టుబాటు ధర లేదని, ఎరువులు అందడంలేదని, సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని, ఏరకంగా రైతుకు మేలు జరగలేదని గ్రామస్తులు తెలిపారు. దీనిపై ధర్మాన స్పందిస్తూ గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ పరిపాలనకు, చంద్రబాబు ప్రభుత్వ పరిపాలనకు తేడాను మీరే గుర్తించాలన్నారు. వృద్ధులకు పింఛన్లు లేవని, మహిళలకు ఎటువంటి ఆర్థిక సాయం అందించలేదని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందని పరిస్థితి నెలకొందన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఎదురవుతున్న సమస్యలను ప్రజలకు వివరించాలని నాయకులకు సూచించారు. విశాఖపట్నంలో రూ.కోట్ల విలువైన భూమిని చంద్రబాబు నాయుడు తన బంధువులకు దారాదత్తం చేశారని, ఇది అక్రమం, అవినీతి కాదా? అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నామని ఇష్టానుసారం పరిపాలన చేస్తున్నారన్నారు. ఎవరైనా గట్టిగా మాట్లాడితే వారిపై కేసులు పెడుతున్నారన్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అరాచకపాలన గతంలో ఎప్పుడూ, ఎవరూ చేయలేదన్నారు. చంద్రబాబు పాలనపై గ్రామాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలే ఇంటింటా తిరిగి అందరికీ తెలియపరచాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాజాం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త తలే రాజేష్, జెడ్పీటీసీ సభ్యుడు రవికుమార్, పార్టీ మండలాధ్యక్షుడు పి.మురళీకృష్ణ, మండల ఉపాధ్యక్షుడు వి.సాయిరాం, పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి టి.ప్రసాదరావు, జిల్లా మేధావుల సంఘం అధ్యక్షుడు పీఎస్ఆర్ నాయుడు, రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శి కామేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
రాముడికీ తప్పని ఆక్రమణల బెడద..!
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానానికి గణనీయమైన చరిత్ర ఉంది. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో రామక్షేత్రానికి విచ్చేసి శ్రీ సీతారామస్వామి వారిని అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. ఆలయానికి సుదీర్ఘ చరిత్ర కూడా ఉండడంతో ఏటా భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ఇంతవరకూ బాగానే ఉన్నా ఆలయానికి వెళ్లేందుకు సరైన మార్గం లేక భక్తులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దేవస్థానానికి వెళ్లే మార్గంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఇటీవల కాలంలో ఆక్రమణలు విపిరీతంగా పెరిగిపోయాయి. స్థానిక కూటమి నాయకుల ప్రోత్సాహంతో స్వామి ఆలయానికి వెళ్లే రహదారి సైతం ఆక్రమణకు గురి కావడం భక్తులను విస్మయానికి గురిచేస్తోంది. సాధారణ రోజుల్లో భక్తుల సంఖ్య అంతంత మాత్రమే కావడంతో సమస్య కనిపించకపోయినప్పటికీ ఉత్సవాల వేళ స్వామి దర్శనానికి సగటు భక్తుడు నరకయాతన అనుభవిస్తున్నాడు. ముఖ్యంగా తూర్పు రాజగోపురం ఎదుట ఉన్న ప్రధాన రహదారిని మాడ వీధులుగా మారిస్తేనే ఇబ్బందులు తప్పుతాయనేది భక్తుల అభిప్రాయం. శివరాత్రికి హాజరుకానున్న లక్షలాది మంది భక్తులు రామతీర్థం పుణ్యక్షేత్రంలో ఏటా రెండు రోజుల పాటు జరిగే శివరాత్రి ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఆలయానికి వెళ్లే రహదారి ఇరుకుగా ఉండడంతో ప్రతి ఏటా భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో ఆ ప్రాంతమంతా భక్తులతో కిక్కిరిసి గందరగోళ పరిస్థితులు తలెత్తుతున్నాయి. దీనికి తోడు అదే ప్రాంతంలో విచ్చలవిడిగా షాపులు ఏర్పాటు చేయడంతో పాటు ఆ షాపులు కాలక్రమేణా రహదారిపైకి విస్తరించడంతో సమస్య మరింత జఠిలంగా మారుతోంది. ఉత్సవాల నేపథ్యంలో ముందస్తు చర్యలు లేవని భక్తులు ఆరోపిస్తున్నారు. ఇటీవల పలుచోట్ల తోపులాటలు జరిగి భక్తులు ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి ఎదురైంది. ప్రమాదం జరగక ముందే మేల్కొంటే మంచిదనే అభిప్రాయాలు భక్తుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అనుకోని ఘటనలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారనేది భక్తుల వాదన. శివరాత్రికే కాకుండా ప్రతి ఏటా జరిగే రథయాత్రకు కూడా నానా అవస్థలు పడాల్సి వస్తోంది. రోడ్డుపైకి షాపులు ఉండడంతో రథం అత్యంత కష్టంగా తిరిగే పరిస్థితి ఏర్పడుతోంది. ఇటీవల జరిగిన రథయాత్ర ఉత్సవంలో కూడా ఇదే సమస్య తలెత్తింది. ఆక్రమణల తొలగింపు ఉన్నతస్థాయిలోనే.. రామ దేవస్థానం చుట్టూ ఉన్న షాపులన్నీ ప్రస్తుతం పంచాయతీ పరిధిలో ఉన్నాయి. ఈ నెల 15 నుంచి జరగనున్న శివరాత్రి ఉత్సవాల నేపథ్యంలో భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని డిప్యూటీ ఎంపీడీఓ శంకర జగన్నాథం, సిబ్బంది ఇటీవల పర్యటించి ఆక్రమణలో ఉన్న షాపులకు కొలతలు వేసి స్థలాన్ని నిర్ణయించేందుకు ప్రయత్నించారు. సమీపంలోని ఇళ్లల్లో నివసిస్తున్న కొంతమంది తమ వద్ద ఉన్న రిజిస్టర్ డాక్యూమెంట్లను చూపించడంతో ఆక్రమణల తొలగింపు అధికారులకు తలనొప్పిగా మారింది. కాగా వారు చూపిస్తున్న డాక్యుమెంట్లు తప్పులతడకగా ఉన్నాయని, డాక్యుమెంట్ల ప్రకారమైతే రాముడి ఆలయానికి చేరుకునేందుకు రోడ్డు కూడా ఉండదనేది అధికారులు చెబుతున్న మాట. ఈ పరిస్థితుల్లో ఉన్నతాధికారులే రంగంలోకి దిగితే సమస్య పరిష్కారమవుతుందనే అభిప్రాయాలు భక్తుల నుంచి వ్యక్తమవుతున్నాయి. పూర్తిస్థాయిలో ఆక్రమణలు తొలగించి మాడ వీధులుగా మారిస్తేనే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని భక్తులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికై నా స్పందించాలని కోరుతున్నారు. ఇరుకుగా మారిన దేవాలయానికి వెళ్లే రహదారి ఉత్సవాల వేళ భక్తులకు తప్పని అవస్థలు సమీపిస్తున్న శివరాత్రి ఉత్సవాలు, కనిపించని ముందస్తు చర్యలు -
ప్రజా సమస్యలే అజెండా కావాలి
పార్వతీపురం రూరల్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వివాదాలకు స్వస్తి పలికి, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం హితవు పలికారు. ఈ మేరకు బుధవారం ఆయన పార్వతీపురంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వంగల దాలినాయుడు అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లడ్డూ వివాదానికి తక్షణమే చరమగీతం పాడాలని, అపచారానికి కారకులైన వారిపై విచారణ జరిపి కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల వేళ ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీల అమలు ఎటు పోయిందని ఆయన ప్రశ్నించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని, చట్టం నుంచి గాంధీ పేరును తొలగించడం అన్యాయమని పేర్కొన్నారు. ఉపాధి హామీ పరిరక్షణలో భాగంగా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి త్వరలోనే జిల్లాలో పర్యటించనున్నట్లు వెల్లడించారు.దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న జంఝావతి ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేయాలని శీలం డిమాండ్ చేశారు. ఐటీడీఏ సమావేశాలు నిర్వహించి గిరిజన విద్యార్థుల మరణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. పార్వతీపురం మున్సిపాలిటీలో తాగునీరు, డంపింగ్ యార్డ్ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు మాని, రాజ్యాంగ బద్ధంగా, సర్వమత సామరస్యంతో పాలన సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మహేష్, శాంతి కుమారి, కిసాన్ సెల్ అధ్యక్షుడు ప్రభాకర్, పలువురు నియోజకవర్గ కోఆర్డినేటర్లు, నాయకులు పాల్గొన్నారు. మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం -
భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో ఈ నెల 15 నుంచి రెండు రోజుల పాటు జరగనున్న శివరాత్రి ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని ఈఓ వై శ్రీనివాసరావు తెలిపారు. శివరాత్రి ఉత్సవ ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాన్య భక్తులు స్వామి దర్శనానికి ఇబ్బందులు పడకుండా క్యూల ఏర్పాటు జరుగుతుందన్నారు. సీఎఫ్ఓ ఆదేశాల మేరకు అన్ని ప్రాంతాల్లోను క్యూలను పటిష్టంగా ఏర్పాటు చేశామని చెప్పారు. ఎండతీవ్రత దృష్ట్యా ఆలయం చుట్టూ టెంట్లు ఏర్పాటు చేస్తున్నామని, భక్తులకు మంచినీరు, మజ్జిగతో పాటు చిన్నపిల్లలకు పాలు సరఫరా చేస్తామని చెప్పారు. ముందస్తు జాగ్రత్తగా రామకోనేరు వద్ద 10 మంది గజఈతగాళ్లను పెడుతున్నామన్నారు. ఈ ఏడాది ప్రసాదాల పంపిణీ స్థలాన్ని మార్పు చేశామని, కల్యాణ వేదిక మైదానంలో లడ్డు, పులిహోర ప్రసాదాల పంపిణీ జరుగుతుందన్నారు. ఉత్సవాల విజయవంతానికి భక్తులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. ఈఓ వై శ్రీనివాసరావు -
బ్యానర్...
మూడింటికి ముందు మొత్తం ఉమ్మడి విజయనగరం జిల్లాలోని ఆరు పథకాల్లో మూడింటిని ముందు ప్రారంభించే అవకాశం ఉంది. మరో మూడింటికి హెడ్ ఆఫీసు నుంచి అనుమతులు వచ్చాక టెండర్లు పిలుస్తారు. అంచనాలు పెరిగిన మేరకు పైప్లైన్ల నిడివి పెరుగుతుంది. – జ్యోతి, ఈఈ, ప్రజారోగ్యశాఖ విజయనగరం ఈ చిత్రం చూశారా? ఇది గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బొబ్బిలి పురప్రజలకు 30 సంవత్సరాల పాటు తాగునీటి సమస్యలు రాకుండా ఉండేలా డీపీఆర్ రూపొందించి తలపెట్టిన బృహత్తర తాగునీటి పథకంలోని ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణాల్లో ఒకటి. రూ.94 కోట్లతో టెండర్లు పిలిచి మెయిన్లైన్లు, సబ్ లైన్లతో ప్రారంభించిన ఈ పనులను కూటమి ప్రభుత్వం రాగానే విస్మరించింది. 18 నెలలుగా పట్టించుకోలేదు. ఇప్పుడు పథకం పనులన్నింటికీ అంచనాలు పెంచేసి కొత్తగా టెండర్లు పిలుస్తోంది. పనులు మరింత జాప్యం అవుతాయని, నిర్మాణంలో ఉన్న పనులు కొనసాగించకుండా.. మళ్లీ అంచనాలు పెంచి పనులకు టెండర్లు పిలుస్తుండడంపై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిర్మాణంలో ఉన్న తాగునీటి పథకాల అంచనాల పెంపు రూ.402.97కోట్ల నుంచి రూ.481.63 కోట్లకు పెంచిన కూటమి ప్రభుత్వం సగం పట్టణాల్లోని పనులకే కొత్తగా టెండర్లు ఏఐఐబీ బృహత్తర తాగునీటి పథకాల నిర్మాణాలు ప్రారంభం మరింత ఆలస్యం? -
విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన కారు
వీరఘట్టం: స్థానిక మేజర్ పంచాయతీలోని బీసీ కాలనీ వద్ద మంగళవారం సాయంత్రం ఓ కారు రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో విద్యుత్ స్తంభం విరిగిపడింది. ప్రమాదం జరిగిన సమయంలో విద్యుత్ సరఫరా ఉండడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించినట్లు స్థానికులు తెలిపారు.విద్యుత్ లైన్లు కలవడంలో లైన్ ట్రిప్ అవగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇక్కడ జరిగిన ప్రమాదాన్ని స్థానికులు విద్యుత్ కార్యాలయానికి తెలియజేయడంతో పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అనంతరం విద్యుత్ శాఖ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బంది వచ్చి మరమ్మత్తులు చేపట్టారు. విరిగిన చోట కొత్త విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేశారు. దీంతో వీరఘట్టం పట్టణమంతా సుమారు రెండు గంటలకు పైగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. కారు నడుపుతున్న రెడ్డి అనే వృద్ధుడికి పెద్దప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. విద్యుత్ స్తంభం విరిగినందుకు గాను కొత్తగా వేసిన విద్యుత్ స్తంభానికి ఎస్టిమేషన్ వేసి ప్రమాదానికి కారణమైన వ్యక్తి నుంచి పెనాల్టీ కట్టిస్తామని ట్రాన్స్కో ఏఈ సోమేశ్వరరావు తెలిపారు. -
పోలమాంబ దర్శనానికి పోటెత్తిన భక్తులు
మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబరపోలమాంబ అమ్మవారి మూడవ జాతర మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. తెల్లవారు జామునుంచి ఇతర జిల్లాలు, మండలాల నుంది వేలాదిమంది భక్తులు శంబర గ్రామానికి చేరుకున్నారు. భక్తులతో శంబర గ్రామం కిటకిటలాడింది. చదురుగుడిలో కొలువైన శంబర పోలమాంబ అమ్మవారిని భక్తులు దర్శించుకుని, అనంతరం గోముఖి నది ఆవలి ఒడ్డున ఉన్న వనంగుడిలో కొలువుదీరిన పెదపోలమాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వెనుక ఉన్న వేపచెట్టు వద్ద భక్తులు పూజలు నిర్వహించారు. మొక్కుబడులు చెల్లించుకున్న భక్తులు చదురుగుడి, వనంగుడి, గోముఖి నది ఒడ్డున భక్తులు అమ్మవారికి కోళ్లు, మేకలు, చీరలు మొక్కుబడులు చెల్లించుకున్నారు. చిన్నారులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు చీపుళ్లతో రహదారులను శుభ్రపరుస్తూ, ఘటాలను అమ్మవారికి సమర్పిస్తూ మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఎండలో బారులు తీరిన భక్తులు పోలమాంబ అమ్మవారి దర్శనానికి వేలాదిమంది భక్తులు ఉదయం 9గంటల తరువాత ఒక్కసారిగా చేరుకోవడంతో, క్యూలన్నీ భక్తులతో నిండిపోయాయి. ఆరుబయట ఎండలో గోముఖి బ్రిడ్జి వరకు భక్తులు అమ్మదర్శనానికి బారులు తీరారు. భక్తులు అత్యధికంగా ఉచితదర్శనం క్యూల వైపు చేరుకోవడంతో, స్వల్ప తోపులాటలకు తావివ్వడంతో, పోలీస్ సిబ్బంది అప్రమత్తమై బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులను అమ్మదర్శనానికి పంపించారు. అమ్మవారిని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్యెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు దర్శించుకున్నారు.గోముఖి నది బ్రిడ్జిపై భక్తులు -
తప్పిన పెనుప్రమాదం
రాజాం సిటీ: నిత్యం రద్దీగా ఉండే పాలకొండ రోడ్డులో మంగళవారం చెరకు లారీ బోల్తాపడి పెనుప్రమాదం తప్పింది. సంకిలి షుగర్ ఫ్యాక్టరీకి చెరకును తరలిస్తున్న లారీని డ్రైవర్ పాలకొండ రోడ్డులో నిలుపుదల చేసి కిందకు దిగాడు. అదే సమయంలో ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయి పడిపోయింది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ఆ సమయంలో ఎవరూలేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రోడ్డుపై లారీ ఉండిపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. పరిమితికి మించి చెరకును తరలిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఇలా ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు వాపోతున్నారు. వారం రోజుల క్రితం రేగిడి మండలం బూరాడ వద్ద ట్రాక్టర్, చిన్నశిర్లాం జంక్షన్ వద్ద లారీ బోల్తాపడ్డాయి. పది రోజుల వ్యవధిలో ఇలా చెరకు తరలింపు వాహనాలు పడిపోవడంతో బాటసారులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి అధికలోడుతో వెళ్తున్న వాహనాలను కట్టడి చేయాలని పలువురు కోరుతున్నారు. కర్రల లోడు లారీ బోల్తా బొబ్బిలి: పట్టణంలోని రాయగడ రోడ్డులో పాత బొబ్బిలి వెళ్లే దారిలో దాబాల వద్ద సోమవారం వేకువజామున పెద్ద ప్రమాదం తప్పింది. పార్వతీపురం నుంచి బొబ్బిలి వెళ్తున్న కర్రల లారీ బోల్తా పడిన సమయంలో నలుగురు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అక్కడి భవనాల వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ప్రకారం బైక్పై వస్తున్న ఇద్దరిని తప్పించే క్రమంలో కర్రల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. రెప్పపాటులో వారిద్దరూ తప్పించుకున్న దృశ్యం సీసీ కెమెరాల్లో రికార్డయింది. అలాగే బోల్తా పడిన ప్రాంతంలోనే ఓ వ్యక్తి తన కుమార్తెతో కలిసి దుకాణాల వద్ద ఉన్న గచ్చును తడిపే క్రమంలో పైపు మడత పడడంతో వెనక్కు వెళ్లారు. మడత విప్పి వచ్చేలోగానే లారీ పెద్ద శబ్దంతో బోల్తాపడింది. దీంతో వారు హతాశయులయ్యారు. -
శాంతిభద్రతలపై ఎస్పీ సమీక్ష
పార్వతీపురం రూరల్: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఎస్పీ ఎస్.వి.మాధవ్రెడ్డి అధికారులను ఆదేశించారు. పోలీస్ అధికారులతో మంగళవారం నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాలు, మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు నిఘా పెంచాలన్నారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి 60 రోజుల్లోపు చార్జిషీట్లు దాఖలు చేయాలని, సిబ్బంది అందరూ సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాలని ఎస్పీ స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, వివిధ విభాగాల సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
పెద్దలకు ఆపన్నుహస్తం!
సాలూరు: పట్టణంలో కోటిరుపాయల మేర పన్నుల ఆదాయానికి గండికొట్టే ప్రయత్నం చేసిన మున్సిపల్ అధికారులు తీరుపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశిస్తారా? లేక సీ్త్ర,శిశుసంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖమంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావున మౌనంగా ఊరుకుంటారా? అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మరింది. పట్టణంలో ఉన్న కొంతమంది పెద్దల ఆస్తులు, ఖాళీ స్థలాలకు సంబంధించి సుమారు కోటి రుపాయల మేర పన్నుల రద్దుకు అధికారులు విఫలయత్నం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంత గోప్యం సుమారు కోటి రుపాయల పన్నులను రద్దుచేసినట్లు కౌన్సిల్లో ఆమోదం తెలిపి ప్రభుత్వానికి పంపించాలని మున్సిపల్ అధికారులు వారి వెనకున్న కొందరు అధికార పార్టీ నేతల ప్రయత్నం విఫలమైంది. జనవరి 31న మున్సిపల్ సర్వసభ్య సమావేశం జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్ పువ్వల ఈశ్వరమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సాధారణ అజెండా కాపీలను కౌన్సిలర్లకు, హాజరైన మీడియా సభ్యులకు అందించారు.అత్యవసర సమావేశానికి సంబంధించిన టేబుల్ అజెండా కాపీలను ఎవరికీ అందించకుండా అధికారులు గోప్యతను ప్రదర్శించారు. సాధారణ సమావేశం ముగిసిన తరువాత టేబుల్ అజెండాలో ఉన్న కోటిరుపాయల పన్ను రద్దు అంశాన్ని అధికారులు చదివి వినిపించారు. వెంటనే పలువురు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఈ అజెండాలోని అంశాన్ని ఆమోదించబోమంటూ తిరస్కరించారు. కళ్లున్న కబోదుల్లా..? మరోవైపు కొందరు అధికారులు మరో అడుగు ముందుకు వేశారు. కళ్ల ముందే వారసులు పట్టణంలో తిరుగుతూ కనిపిస్తున్నా, ఇంటిపేర్లలో చిన్న చిన్న తప్పిదాలున్నా అటువంటి ఆస్తుల పన్నుల రద్దుకు అధికారులు సిఫారసు చేయడంపై సంబంధిత మున్సిపల్ అధికారులపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మండవల్లి కామరాజు అండ్ సన్స్కు సంబంధించిన ఖాళి స్థలాల పన్నుల బకాయి రూ.54,12,053 ఉంది. వారసులు కళ్లముందు తిరుగుతున్నా పన్ను రద్దుకు అధికారులు సిఫారసు చేశారు. సుతాపల్లి రాముకు సంబంధించి ఖాళీ స్థలాల పన్ను రూ.23 వేల 331 రద్దుకు అధికారులు నాన్ ట్రేస్డ్ అని చెప్పి సిఫారసు చేశారు. పేద, మధ్యతరగతి ప్రజల నుంచి పన్నులను ముక్కు పిండి వసూలు చేసే అధికారులు, పెద్దల వద్ద ఇంత ఉదాసీనంగా వ్యవహరించడం వెనుక అధికారులు, అధికార పార్టీ నేతల పరస్పర ఒడంబడికలే కారణమై ఉండొచ్చన్న చర్చ నడుస్తోంది. కోటి రూపాయల మేరకు కత్తెర? మున్సిపాలిటీలో రూ.కోట్ల మేర పన్నులు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. మొత్తం రూ.4.4 కోట్ల డిమాండ్లో 106 అసెస్మెంట్లకు రూ.20 లక్షల మేరకు రద్దు చేయాలని కౌన్సిల్ ఆమోదానికి సిఫార్సు చేశారు. అదే కాక మున్సిపాలిటీలో ఉన్న కొందరు పెద్దలకు చెందిన 39 అసెస్మెంట్ల సొమ్ము రూ.87 లక్షల 25 వేలనుసైతం రద్దు చేయాలని అధికారులు సిఫార్సు గమనార్హం. సుమారు రూ.కోటి రద్దుకు అధికారుల విఫలయత్నం ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేందుకు తెరవెనుక డ్రామాలు అధికారులు, సిబ్బందిపై విచారణ జరిగేనా? -
వేగావతిలో సైఖతం..!
బొబ్బిలి: బొబ్బిలిలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. రాజుల అండదండలతో వేగావతి నదిలోని ఇసుకను తోడేస్తూ కాసులవేట సాగిస్తున్నారు. వీరికి చట్టాలు, నియమనిబంధనలతో పనిలేదు. ప్రజలకు తాగునీరు అందదన్న ఆందోళన వారిలో కనిపించదు. కనిపించిన ఇసుకను ఖతం చేయడమే వారి పని. పారాది వద్ద వేగావతి నదిలో సుమారు రెండు కిలోమీటర్ల మేర ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా జరుపుతున్నారు. అలజంగిలో ఒకేసారి పదుల సంఖ్యలో ట్రాక్టర్లకు ఇసుకను లోడ్చేసి తరలిస్తున్నారు. బాడంగి మండలం పాల్తేరు, భీమవరం, గొల్లాది ప్రాంతాల్లోనూ నదిని గుల్లచేస్తున్నారు. రామభద్రపురం మండలంలోని కొట్టక్కి వద్ద గల వంతెన కింద నుంచే ఇసుకను నిత్యం తోడుకు పోతున్నారు. దీనివలన కొత్త వంతెన బలహీన పడుతుందని జనం బెంగపడుతున్నా తవ్వకాలు మాత్రం ఆపడంలేదు. దొరికితేనే కేసులు... ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పొరపాటున ఇసుక ట్రాక్టర్ను అధికారులు పట్టుకున్నా ప్రజాప్రతినిధి నుంచి ‘మనవాడే వదిలేయ్’ అన్న ఫోన్ సమాచారంతో చర్యలు తీసుకోలేకపోతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆర్డీఓ జేవీఎస్ఎస్ రామమోహనరావు పర్యటించే సమయంలో పలుసార్లు ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకుని జరిమానా విధించారు. స్థానిక అధికారులు మాత్రం కళ్లముందే నదిని గుల్లచేస్తున్నా పట్టించుకోవడంలేదంటూ స్థానికులు విమర్శిస్తున్నారు. ఇసుక తవ్వకాలను స్థానిక తహసీల్దార్ ఎం.శ్రీను వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా తరచూ తనిఖీలు చేస్తున్నామని, ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకుని జరిమానా విధిస్తున్నట్టు తెలిపారు. అలజంగి వద్ద వేగావతి నదిలో ఇసుక తవ్వకాలు రాత్రీపగలు తేడాలేకుండా ఇసుక అక్రమ తవ్వకాలు ప్రమాదకరంగా మారుతున్న వంతెనలు, బావులు మిన్నకుంటున్న యంత్రాంగం! -
12న జాతీయ సమ్మెకు సంపూర్ణ మద్దతు
● సీపీఎం జిల్లా కార్యదర్మి తమ్మినేని సూర్యనారాయణవిజయనగరం గంటస్తంభం: కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న కార్మిక సంఘాలు చేపట్టిన జాతీయ సమ్మెకు సీపీఎం సంపూర్ణ మద్దతు ఇస్తుందని పార్టీ జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన స్థానిక ఎల్బీజీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, లేబర్ కోడ్ల అమలుతో కార్మికుల హక్కులు కాలరాస్తున్నారని, వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలని కోరారు. రైతు వ్యతిరేక చట్టాలు, పెరుగుతున్న ధరలు ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూర్చే విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ దేశభక్తి యుత సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమ్మెలో సీపీఎం ప్రత్యక్షంగా పాల్గొంటుందని స్పష్టం చేశారు. సమావేశంలో సీపీఎం జిల్లా నాయకులు రెడ్డి శంకరరావు, టీవీ రమణ తదితరులు పాల్గొన్నారు. -
రెవెన్యూ ‘లీలల’పై దర్యాప్తు
● నేడు ఆర్డీఓ కార్యాలయంలో విచారణచీపురుపల్లి: మండలంలోని కర్లాం గ్రామంలో నాలుగు దశాబ్దాలుగా భూములు సాగు చేసుకుంటున్న రైతులకు జరిగిన అన్యాయంపై దర్యాప్తు ప్రారంభమైంది. కర్లాం గ్రామంలో రైతుల భూములు వేరొకరి పేరుపై వన్బీలు చేసి చేతివాటం చూపిన రెవెన్యూ యంత్రాంగం వ్యవహారంపై ఈ నెల 8న సాక్షి పత్రికలో కథనం వెలువడిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వ్యవహారంపై సీరియస్ అయిన కలెక్టర్ రాంసుందర్రెడ్డి దర్యాప్తుకు ఆదేశించారు. తొలుత నివేదిక ఇవ్వాలంటూ తహసీల్దార్ ధర్మరాజును ఆదేశించినప్పటికీ ఈ నెల 9న దర్యాప్తుకు ఆర్డీఓను నియమించినట్లు తెలిసింది. దీంతో చీపురుపల్లి ఆర్డీఓ సమక్షంలో విచారణ జరగనుంది. అందులో భాగంగానే కర్లాం గ్రామానికి చెందిన రైతులతో బాటు ఆ భూములను వన్బీ చేయించుకున్న వారిని కూడా తమ దగ్గర ఉన్న ధ్రువీకరణ పత్రాలతో సహా బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆర్డీఓ కార్యాలయంలో హాజరవ్వాలని నోటీసులు అందజేశారు. పీఏసీఎస్పై విచారణకు ఆదేశం ఇదిలా ఉండగా కర్లాంలో జరిగిన భూమి రికార్డుల తారుమారు వ్యవహారంలో అవే భూములపై కర్లాం పీఏసీఎస్ నుంచి రూ.15 లక్షలు రుణం మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయమై మంగళవారం సాక్షి పత్రికలో ‘సాగు ఒకరిది రుణం మరొకరిది’ అనే శీర్షికన కథనం వెలువడిన విషయం విదితమే. దీనిపై స్పందించిన జిల్లా కేంద్రసహకార బ్యాంక్ చైర్మన్ కిమిడి నాగార్జున ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీసీసీబీ సీఈఓను ఆదేశించినట్లు తెలిసింది. -
స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యం
విజయనగరం: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో విజయనగరంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను, అమలు చేసిన సంక్షేమపథకాలు, ప్రజలకు చేకూర్చిన లబ్ధిని గర్వంగా, ధైర్యంగా చెప్పాలని పార్టీ శ్రేణులకు ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్, పార్టీ పీఏసీ సభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి పిలుపునిచ్చారు. ఆ ధైర్యంతోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీని విజయపథంలో నడిపించాలని కోరారు. కోలగట్ల నివాసంలో మంగళవారం పార్టీ విజయనగరం నగర సమావేశం నిర్వహించారు. పార్టీ ఆదేశాల మేరకు నగరంలో క్లస్టర్ ఇన్చార్జిలుగా నియమితులైన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో పార్టీ కమిటీల నియామకం వల్ల మరింత బలోపేతమయ్యామన్నారు. పార్టీ సిద్ధాంతాలను, అధికార పార్టీ చేస్తున్న ప్రజ్యావతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కమిటీల ముఖ్య ఉద్దేశంగా పేర్కొన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కమిటీలో ఉన్న సభ్యులు క్రియాశీలకంగా వ్యవహరించాలని కోరారు. ● ఇచ్చిన హమీలు అమలు ఏమయ్యాయి...? మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ఇచ్చిన ప్రతి హమీని ప్రకటించిన తేదీల్లో అమలు చేస్తామని ధైర్యంగా చెప్పగలిగామని, ప్రతి 6 నెలలకోసారి కొత్త పింఛన్లు మంజూరు చేశామన్నారు. ● 2024 జూన్ నెల నుంచి ఇప్పటి వరకు కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు కనీసం దరఖాస్తులు సేకరించని దీనస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందన్నారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు ఆడబిడ్డ నిధి , నిరుద్యోగ యువతకు రూ.3వేల నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాలు, అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని కూటమి నేతలు చెప్పిన హమీలు ఏమయ్యాయని నిలదీశారు. ప్రజలు ఓటుతో తమ అభిప్రాయాన్ని చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ● ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవిని లాక్కున్న చంద్రబాబు అదే ఎన్టీఆర్ ఫొటోకు దండం పెట్టి దండవేసి ఓట్లు దండుకోవడం నిజం కాదా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ ఛరిష్మా లేకపోతే చంద్రబాబు పరిస్థితి ఒకటికి ముందు సున్నాలా ఉండేదన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.సూర్యనారాయణరాజు, నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, పార్టీ నగర అధ్యక్షుడు ఆశపు వేణు, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ శెట్టి వీరవెంకట రాజేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి సంగంరెడ్డి బంగారునాయుడు, పార్టీ నాయకులు కోలగట్ల కృష్ణారావు, కంటుభుక్త తవిటిరాజు, అవనాపు లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు. కూటమి 20 నెలల పాలనలో చేసింది శూన్యం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గడిచిన 5 ఏళ్లలో విజయనగరం మండలం, నగరం పరిధిలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని, కూటమి అధికారంలోకి వచ్చిన 20 నెలల కాలంలో ఏం చేశారో చెప్పుకునేందుకు లేదని కోలగట్ల పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మన హయాంలో జరిగిన అభివృద్ధిని ధైర్యంగా, గర్వంగా చెప్పగలమన్నారు. మండువేసవిలో తాగు నీటికి ఇబ్బందులు లేకుండా 13 వాటర్ ట్యాంక్లు నిర్మించడంతో పాటు, నూతన పైప్లైన్ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా మహిళా పార్కు నిర్మించామని, అచంటా గార్డెన్ను సుందరంగా తీర్చిదిద్దామని, చెరువులు, జంక్షన్లు, పార్కులు అభివృద్ధి చేసి నగరానికి కార్పొరేషన్ రూపు తీసుకొచ్చామన్నారు. మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేశామన్నారు. టీడీపీ నేతలు కరపత్రాలు పంచడం మినహా చేసినది శూన్యమన్నారు. పంది ఫొటో వేసి నందిగా ప్రచారం చేసి ప్రజలను నమ్మించడం చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్య అని ఎద్దేవాచేశారు. డివిజన్ కమిటీల నియామకాలను త్వరితగతిన పూర్తిచేయాలి పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి వైఎస్సార్సీపీ హయాంలోనే అభివృద్ధి, ప్రజాసంక్షేమం 20 నెలల కూటమి పాలనలో చెప్పుకునేందుకు చేసిందేమీ లేదు ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి -
అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఉపేక్షించం
● డిప్యూటీ ఈఓ మోహనరావు రామభద్రపురం: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలపై ఉపాధ్యాయులతో పాటు వేరెవరైనా తరగతి గదిలో అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని డిప్యూటీ ఈఓ కె.మోహనరావు హెచ్చరించారు. రామభద్రపురం ఉన్నత పాఠశాలలో 6, 7 తరగతులకు బోధించే ఓ ఉపాధ్యాయుడి వికృత చేష్టలపై హెచ్ఎంకు ఈ నెల 8న ఏఎంసీ చైర్మన్తో కలిసి బాలికలు ఫిర్యాదు చేయడం, ఆయన మందలించిన అంశం తెలిసిందే. దీనిపై డీఈఓ మాణిక్యంనాయుడు స్పందించారు. పాఠశాలకు వెళ్లి విచారణ జరపాలని డిప్యూటీ ఈఓ మోహనరావు, ఎంఈఓ తిరుమల ప్రసాద్ను ఆదేశించారు. ఈ మేరకు వారు పాఠశాలను మంగళవారం సందర్శించారు. హెచ్ఎం వి.గోపాలనాయుడుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాలికలతో మాట్లాడి ఉపాధ్యాయుడి చేష్టలపై ఆరా తీశారు. నివేదికను డీఈఓకు అందజేస్తామన్నారు. పుణ్యగిరిని పరిశీలించిన ఎస్పీ శృంగవరపుకోట: శివరాత్రి జాతరకు సిద్ధమవుతున్న పుణ్యగిరి క్షేత్రాన్ని ఎీస్పీ ఏ.ఆర్.దామోదర్ మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ట్రాఫిక్ రెగ్యులేషన్, పార్కింగ్ పాయింట్లు, భద్రత ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. కొండపైన, దిగువన ఏర్పాటు చేస్తున్న కంట్రోల్ రూమ్లు, సీసీ కెమెరాలు, బారికేడింగ్, క్యూలతో పాటు జాతరకు వచ్చే భక్తుల రద్దీ విషయాలను స్థానిక పోలీసులు, దేవదాయశాఖ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు. అనంతరం ఉమాకోటిలింగేశ్వరుని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆయన వెంట డీఎస్పీ ఆర్.గోవిందరావు, సీఐ నారాయణమూర్తి, ఎస్బీ సీఐ ఎ.వి.లీలారావు, ఎస్.కోట ఎస్ఐ చంద్రశేఖర్ ఉన్నారు. ఫైలేరియాను అరికడదాం గుర్ల: ౖఫైలేరియా వ్యాధిని అరికడదామని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. గుర్ల మండలం పాలవలస హైస్కూల్ విద్యార్థులతో ౖఫైలేరియా నివారణ మాత్రలను మంగళవారం మింగించారు. ఫైలేరియా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్య ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ జీవనరాణి, ఎంపీపీ పొట్నూరు ప్రమీల, ఎంపీడీఓ రవికుమార్, ఎంఈఓ ఎస్.భానుప్రకాష్, వైద్యాధికారి శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు మార్కెట్ భరోసా కల్పించాలి
● కలెక్టర్ రాంసుందర్ రెడ్డి విజయనగరం ఫోర్ట్: రైతులకు మార్కెట్ సదుపాయం ఉందన్న భరోసా కల్పించినప్పుడే ఉద్యాన మిషన్ విజయవంతం అవుతుందని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు. ఉద్యాన మిషన్పై మంగళవారం సాయత్రం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టణాల్లో కూరగాయలు విక్రయించేందుకు అవుట్లెట్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఆ తర్వాత దశలో విశాఖపట్నంకు పంపించి విక్రయించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. రబీలో అదనంగా 3,300 ఎకరాల్లో రైతులు ఉద్యాన పంటలు సాగుచేసినట్టు వెల్లడించారు. ఆకుకూరలు, కూరగాయాలు, కోకో, బొప్పాయి లాంటి పంటలతో పాటు 30 ఏళ్ల పాటు ఆదాయాన్నిచ్చే ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వి.తారకరామారావు, జిల్లా ఉద్యానశాఖ అధికారి చిట్టిబాబు, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్పాణి, తదితరులు పాల్గొన్నారు. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయండి విజయనగరం కలెక్టరేట్: జిల్లాలో గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ రాంసుందర్రెడ్డి అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. గృహ నిర్మాణ ప్రగతికి కలెక్టరేట్ నుంచి మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షించారు. ఇంజినీరింగ్ కార్యదర్శులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, గృహ నిర్మాణ ఏఈలు క్షేత్ర స్థాయిలో ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. సమావేశంలో హౌసింగ్ పీడీ మురళీమోహన్ పాల్గొన్నారు. -
బ్రిడ్జికోర్సును సద్వినియోగం చేసుకోవాలి
బాడంగి: పదవ తరగతిలో వెనుకబడిన పిల్లలకోసం విద్యాశాఖకమిషనర్ ఏర్పాటుచేసిన బ్రిడ్జి కోర్సును విద్యార్థులు సద్వినియోగపరుచుకోవాలని డీఈఓ యు.మాణిక్యం నాయుడు అన్నారు. ఈ మేరకు జిల్లాలోని 8మండలాలకు చెందిన పదోతరగతిలో వెనుకబడిన సీ,డీ గ్రేడ్ విద్యార్థులు 58 మందికి విద్యాశాఖ స్థానిక గురుకుల బాలుర పాఠశాలలో ఏర్పాటుచేసిన బ్రిడ్జి కోర్స్ తరగతులు ఏవిధంగా సాగుతున్నాయో తెలుసుకునే నిమిత్తం డీఈఓ మాణిక్యం నాయుడు మంగళవారం ఇక్కడికి వచ్చారు. సబ్జెక్టు టీచర్లు వారి వెనుకబాటుకు గలకారణాలను తెలుసుకుని వారిసందేహాలను నివృత్తిచేయాలని డీఈఓ ఈ సందర్భంగా ఆదేశించారు. పిల్లలుచక్కగా చదువుకుని ప్రతి ఒక్కరూ పాస్కావాలని అన్నారు. ఈ సందర్శనలో డీఈఓతో పాటు ఎంఈఓలు లక్ష్మణదొర, రాజేశ్వరి, గురుకుల ప్రిన్సిపాల్ కేవీ.రమణ, సీఆర్టీలు,సిబ్బంది పాల్గొన్నారు. షైనింగ్ స్టార్లుగా మారాలి రైజింగ్స్టార్లుగా ఉన్న విద్యార్థులు మరింతబాగా చదివి షైనింగ్స్టార్లుగా మారాలని డీఈఓ యు.మాణిక్యంనాయుడు అన్నారు. గురుకులంలో గల బ్రిడ్జికోర్స్ సెంటర్ను సందర్శించిన అనంతరం ఆయన పక్కనేగల పీఎంశ్రీ ప్రభుత్వ హైస్కూల్కు వవెళ్లారు.అక్కడ జరుగుతున్న తరగతులను పరిశీలించారు. హెచ్ఎం కార్యాలయంలో ఉపాధ్యాయులందరినీ సమావేశ పరిచి పదోతరగతివారికి 100రోజుల ప్రణాళిక ఏవిధంగా అమలు చేస్తున్నదీ అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఈఓతో పాటు హెచ్ఎం సత్యనారాయణ, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. -
హామీల అమలులో చంద్రబాబు ప్రభుత్వం విఫలం
విజయనగరం అర్బన్: పీఆర్సీ కమిటీ ఏర్పాటు, ఐఆర్ మంజూరు, బకాయిల చెల్లింపు, సీపీఎస్ రద్దు వంటి ఎన్నికల మేనిఫెస్టో హామీల అమలులో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) విమర్శించింది. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేరకపోవడం పాలనా నిర్లక్ష్యానికి నిదర్శనమని జిల్లా కమిటీ సభ్యులు పేర్కొన్నారు. విజయనగరం మహారాజా సంస్కృత ఉన్నత పాఠశాలలో సంఘ జిల్లా అధ్యక్షుడు వై.అప్పారావు అధ్యక్షతన జిల్లా ఆర్ధిక కార్యదర్శి ఎస్ఎస్ దొర, జిల్లా కార్యవర్గ సభ్యులతో కలిసి మంగళవారం నిర్వహించిన అత్యవసర సమావేశంలో ధర్నా కార్యాచరణను ఖరారు చేశారు. రాష్ట్ర సంఘం ప్రకటించిన మూడు దశల పోరాట కార్యక్రమంలో భాగంగా రెండవ దశలో ఈ నెల 13వ తేదీన జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద జిల్లా స్థాయి ధర్నా నిర్వహిస్తామని ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ఉద్యోగ వర్గాలను ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు. పెరిగిన ధరలు, జీవన వ్యయానికి అనుగుణంగా వేతన సవరణ, డీఏల చెల్లింపు అత్యవసరమైనప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం ఉపాధ్యాయులను రోడ్డెక్కే పరిస్థితికి నెట్టిందని ఆరోపించారు. తక్షణమే అమలు చేయాల్సిన మేనిఫెస్టో హామీలు.... ● 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసి 30 శాతం ఐఆర్ ప్రకటించాలి. ● పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు గ్రాట్యూటీని వెంటనే మంజూరు చేయాలి. ● ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను తక్షణమే చెల్లించాలి. ● సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలి. ● 2004 సెప్టెంబర్ 1కు ముందు నోటిఫికేషన్ ద్వారా నియామకం పొందిన 2003 డీఎస్సీ ఉపాధ్యాయులు, పోలీసులు, ఇతర శాఖల ఉద్యోగులకు ఓపీఎస్ వర్తింపజేయాలి. ● ఈనెల 13న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల వద్ద జరిగే రెండవ దశ ధర్నాకు స్పందికపోతే మూడవ దశగా ఈ నెల 25న నిర్వహించే ‘చలో విజయవాడ’ కార్యక్రమంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని జిల్లా కమిటీ హెచ్చరించింది. ఈ నెల 13న కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ధర్నాకు రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు, కౌన్సి లర్లు, మండల, నగరంపాలక, పురపాలక సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. టీచర్ల సహనానికి పరీక్ష 13న కలెక్టరేట్ ముట్టడి స్పందించకపోతే ఈనెల 25న ‘చలో విజయవాడ’ అత్యవసర సమావేశంలో ఎస్టీయూ జిల్లా కమిటీ తీర్మానం -
అన్నదమ్ముల మధ్య కొట్లాట
● ఇద్దరికి తీవ్ర గాయాలులక్కవరపుకోట: మండలంలోని చందులూరు గ్రామంలో చింతచెట్టు విషయమై మంగళవారం ఇద్దరు అన్నదమ్ముల మధ్య చెలరేగిన వివాదం కొట్లాటకు దారితీసింది. కిలపర్తి దేముడు తన కుమారుడితో కలిసి చింతచెట్టును నరికేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఎర్రినాయుడు ఆయన కుమారుడు సింహాచలం అడ్డుకున్నారు. దీంతో వివాదం రేగి నలుగురూ తీవ్రంగా కొట్టుకున్నారు. ఈ క్రమంలో ఎర్నాయుడికి, దేముడు కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికుల సహాయంతో వారిద్దరినీ ఎస్.కోట సీహెచ్కి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం తరలించినట్లు ఎస్సై నవీన్పడాల్ తెలిపారు. ఈ మేరకు ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ముగ్గురికి గాయాలుగుర్ల: మండలంలోని గూడెం జంక్షన్ వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారని ఎస్సై నారాయణ రావు మంగళవారం తెలిపారు. చీపురుపల్లికి చెందిన నవీన్, ధనుంజయ్ ద్విచక్ర వాహనంపై విజయనగం నుంచి చీపురుపల్లి వస్తుండగా గుజ్జింగివలసకు చెందిన ఆవాల రమణ ద్విచక్ర వాహనంపై గుర్ల వెళ్తుండగా రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం విజయనగరంలోని మహరాజా ఆస్పత్రికి తరలించారు. గుర్ల ఎస్సై నారాయణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స పొందుతూ వృద్ధురాలి మృతిగజపతినగరం రూరల్: అగ్ని ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మండలంలోని కొత్త బగ్గాం గ్రామానికి చెందిన వృద్ధురాలు బగ్గాం శ్యామల (75 ) మంగళవారం మృతి చెందింది. దీనిపై ఎస్సై కె.కిరణ్ కుమార్ నాయుడు తెలిపిన వివరాల ప్రకారం, గత నెల 25వ తేదీన వృద్ధురాలు బగ్గాం శ్యామల ఉదయం 10 గంటల సమయంలో తన ఇంటి ముందు గల తులసి చెట్టు వద్ద దీపం వెలిగించి, ప్రదక్షిణ చేస్తుండగా ఆమె చీరకు నిప్పంటుకుంది. దీంతో కాలిన గాయాలతో విజయనగరంలోని సర్వజన ఆస్పత్రిలో కుటుంబసభ్యులు ఆమెను చేర్పించారు. కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్న ఆమె మృతిచెందడంతో కుమారుడు బగ్గాం పూర్ణచంద్రరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిరణ్ కుమార్ నాయుడు తెలిపారు. -
లబ్ధిదారులను భయపెట్టండి
● ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు మండల ప్రత్యేకాధికారి ఆదేశం ● ఇళ్ల లక్ష్యం నెరవేరడమే ప్రధానం బాడంగి: ఇళ్ల లబ్ధిదారులను భయపెట్టి 101 ఇళ్ల లక్ష్యం ఉగాదినాటికి పూర్తిచేయాలని మండలప్రత్యేకాధి కారి ఎం.కిరణ్కుమార్ ఇంజినీరింగ్ సహాయకులను ఆదేశించారు. బాడంగి మండల పరిషత్ కార్యాలయంలో ఈఏలతో మంగళవారం హౌసింగ్ ప్రగతిపై సమీక్షించారు. గృహప్రవేశాల్లో ప్రగతి లేదని అసహనం వ్యక్తంచేశారు. లబ్ధిదారులను ఏవిధంగా భయపెడితే వింటారో చెప్పాలని ఈఏలను సలహా అడిగారు. అందుకు కొంతమంది జగనన్నకాలనీలో ఇచ్చిన పట్టాలు రద్దుచేస్తారని, తిరిగి తీసుకుంటారని, ఇల్లు కట్టకపోతే వేరేవారికి బదిలీ చేస్తారని, రేషన్ కార్డులు రద్దుచేస్తామని భయపెడితే తప్పకదారికొస్తారని చెప్పగా ఆ విధానం పాటించాలంటూ సూచించారు. ఈ సూచనపై అక్కడ ఉన్న కొందరు ఉద్యోగులు ఇదేం తీరు అంటూ గుసగుసలాడారు. సమీక్ష సమావేశంలో ఏఓ శ్రీలక్ష్మి, ఏపీఎం రత్నకుమార్, ఏపీఓ సాయిబాబా, హౌసింగ్ సిబ్బంది, ఈఏలు పాల్గొన్నారు. -
రుణం మరొకరికి
సాగులో ఒకరు..చీపురుపల్లి: ‘వడ్డించే వాడు మనవాడైతే కడపంక్తిలో కూర్చున్నా’ అనే సామెతను పీఏసీఎస్ ఉద్యోగులు ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. వ్యవసాయ భూములను తనఖా పెట్టుకుని ఇచ్చే రుణాల్లో నిబంధనలు పాటించకుండా లక్షల రూపాయలు రుణాలు మంజూరు చేయడం చర్చశనీయాంశమవుతోంది. వ్యవసాయ భూములు సాగు చేసేది ఒకరైతే పీఏసీఎస్ ఉద్యోగులు రుణం ఇచ్చేది మరొకరికి కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. భూముల తనఖా ద్వారా రుణాలు ఇచ్చే అంశంలో క్షేత్రస్థాయి పరిశీలన చాలా కీలకమైన నిబంధన. ఆ నిబంధనను పక్కన పెట్టి ఆ భూముల్లో ఎవరున్నారో నిర్థారించుకోకుండా రుణాలు మంజూరు చేయడం వెనుక ఆంతర్యమేమిటనే చర్చ సాగుతోంది. చీపురుపల్లి మండలంలోని కర్లాం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్)లో సరిగ్గా అలాంటి సంఘటనే వెలుగుచూసింది. భూములు సాగు చేసుకుంటున్న వారికి కాకుండా వేరే వారికి ఆ భూముల్లో రూ.15 లక్షల రుణాన్ని మంజూరు చేయడం ప్రస్తుతం హాట్టాపిక్గా మారింది. అన్ని ధ్రువీకరణ పత్రాలు చూసే రుణం మంజూరు చేశామని పీఏసీఎస్ ఉద్యోగులు చెబుతుంటే నాలుగు దశాబ్దాలుగా ఆ భూములు తమవని తాతతండ్రుల నుంచి తామే సాగు చేసుకుంటున్నామని, రిజిస్టర్డ్ ధ్రువీకరణ పత్రాలు కూడా ఉన్నాయని రైతులు శనపతి సూర్యనారాయణ, కొమ్మాన వీరభద్రుడు, బాలి రామినాయుడు, బాలి అప్పారావులు అంటున్నారు. -
బొబ్బిలి, సాలూరుకు కొత్త మార్గం
● గిరిజన గ్రామాలకు తీరనున్న దశాబ్దాల కష్టాలు ● వైస్సార్సీపీ ప్రభుత్వంలోనే అనుమతులు, నిధులు మంజూరుబొబ్బిలిరూరల్: బొబ్బిలి నుంచి రామన్నదొరవలస, మోసూరువలస మీదుగా సాలూరు వెళ్లేందుకు నూతన రహదారి నిర్మాణం దాదాపు పూర్తయింది. సుమారు మూడు దశాబ్దాలుగా ఈ ప్రాంత గిరిజనులు ఈ రహదారి నిర్మాణం కోసం ఎదురుచూస్తున్నారు. బొబ్బిలి నుంచి రామభద్రపురం మీదుగా కంటే ఈ రహదారి నుంచి సాలూరు పట్టణానికి చేరుకుంటే దాదాపు 6 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. సమయం ఆదా అవుతుంది. దీంతో అందరూ ఇదే మార్గాన్ని ఎంచుకుంటూ ప్రయాణాలు సాగిస్తున్నారు. అలాగే దాదాపు 12 గిరిజన గ్రామాలకు ఇదే ప్రధాన మార్గం కావడంతో ఇన్నాళ్లూ వారంతా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అటవీశాఖకు చెందిన కొంత భూమి ఈ రహదారి గుండా ఉండడంతో ఆశాఖ రహదారి నిర్మాణ పనులను అడ్డుకుంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఈ రహదారి నిర్మాణానికి అన్ని అనుమతులు ఇస్తూ 9 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి దాదాపు రూ.9 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇంతలో ఎన్నికలు రావడంతో పనులు నిలిచిపోయాయి. ప్రస్తుత ప్రభుత్వం ఈ రహదారినిర్మాణానికి పూనుకుంది. దాదాపు రూ.8.24 కోట్ల వ్యయంతో రామన్నదొరవలస నుంచి సాలూరు మండలం బోరబందవరుకు బీటీ రోడ్డును నిర్మిస్తోంది. ప్రస్తుతం రోడ్డు పనులు 90శాతం పూర్తికాగా ఈ నెలాఖరుకు రహదారి నిర్మాణం పూర్తిచేస్తామని పీఆర్పీఐయూ ప్రాజెక్టు డీఈ ఎన్.సీతంనాయుడు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన రహదారి పనులను పర్యవేక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. మార్చినాటికి రహదారి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. -
పాముకాటుతో వ్యక్తి మృతి
సంతకవిటి: మండలంలోని సిరిపురం పంచాయతీ యాగాటిపేట గ్రామానికి చెందిన చీర ఆనందరావు (పత్రికా ప్రతినిధి) పాముకాటుతో సోమవారం మృతి చెందారు. దీనిపై మృతుడి కుటుంబసభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆనందరావు మధ్యాహ్నం పొలానికి వెళ్లగా పొలంలో పాముకాటు వేసింది. పాము కరిచిన విషయం తన తమ్ముడికి సమాచారం అందించి అక్కడే కుప్పకూలిపోయాడు. కుటుంబసభ్యులు వెళ్లే సరికి అపస్మారక స్థితిలో ఆనందరావు పడి ఉండడం గమనించి 108కు సమాచారం అందించారు. 108 వాహనం ద్వారా శ్రీకాకుళం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు. ఆయనకు భార్య సత్యవతి, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. రైలు ఢీకొని వ్యక్తి మృతినెల్లిమర్ల: పట్టణ పరిధిలో రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. దీనిపై స్థానికులు అందించిన వివరాల ప్రకారం పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో నివసిస్తున్న బుడుమూరి రాము(32) సోమవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో వ్యక్తిగత పనినిమిత్తం మిమ్స్ వైపు వెళ్లాడు. స్థానిక బ్రిడ్జి దిగువన రైలు పట్టాలు దాటుతుండగా గుర్తు తెలియని రైలు ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే రాము చనిపోయాడు. ఆయనకు భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి,దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తి ఆత్మహత్యాయత్నంపార్వతీపురం రూరల్: భార్య తనను విడిచి వెళ్లిందన్న మనస్తాపంతో ఓ వ్యక్తి గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఆదివారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. పరజపాడు గదబవలస గ్రామానికి చెందిన బొడ్ల శ్రీనివాసరావు భార్య 20 ఏళ్ల క్రితం ఆయనను విడిచి వెళ్లిపోయింది. నాటి నుంచి ఒంటరిగా జీవిస్తున్న ఆయన, ఆ వేదనతో మద్యం మత్తులో గడ్డిమందు తాగడంతో గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హుటాహుటిన జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. పశువుల పాక, ధాన్యం, గడ్డివాములు దగ్ధంమెంటాడ: మండలంలోని తమ్మిరాజుపేట గ్రామంలో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించి గ్రామానికి చెందిన రైతు మన్నేల అక్కయ్యకు సంబంధించిన పశువుల పాక, ధాన్యం నిల్వ చేసే పురి, నాలుగు గడ్డివాములు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ మంటలు పక్కనే ఉన్న మన్నేల సోమేష్, సిరిపురం సత్యం, సిరిపురం పెద్ద నారాయణ, పంచాడ కొండమ్మలకు చెందిన టేకు తోటలకు వ్యాపించడంతో పరిస్థితి తీవ్రమైంది. స్థానికులు వెంటనే గజపతినగరం ఫైర్ స్టేషన్న కు సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది తక్షణమే ఫైర్ ఇంజిన్తో సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ అగ్నిప్రమాదంలో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. ఈ అగ్నిప్రమాదం ఉదయం బహిర్భూమికి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తి సిగరెట్ కాల్చి పూర్తిగా ఆర్పకుండా వెళ్లిపోవడం వల్లే సంభవించి ఉండవచ్చని భావిస్తున్నారు. -
ఆరు అడుగుల స్థలం కోసం ఆందోళన
వేపాడ: చనిపోయిన వారిని ఖననం చేసేందుకు ఆరడుగుల స్థలం లేదు.. ఎక్కడ ఖననం చేయాలో తెలియడం లేదు.. తక్షణమే శ్మశానవాటిక (ఖబర్స్థాన్) కోసం స్థలం కేటాయించాలంటూ వేపాడ మండలం జాకేరు గ్రామానికి చెందిన ముస్లింలు ఆందోళన చేశారు. చిన్నారి మృతదేహాన్ని ఎక్కడ ఖననం చేయాలో చెప్పాలంటూ మతపెద్దలు అబ్దుల్, రెహమాన్, సిద్దిక్ తదితరులు అధికారులను ప్రశ్నించారు. గ్రామానికి చెందిన రెహమాన్, మీరాబీ దంపతుల కుమారై అమీద (07) చోడవరం మండలంలోని చెట్టుపల్లిలో ఉన్న తాతగారింటి వద్ద అడుకుంటూ ప్రమాదవశాత్తు గుంతలో పడి చనిపోయింది. బాలిక మృతదేహాన్ని స్వగ్రామం జాకేరుకు సోమవారం తీసుకొచ్చారు. ఖననం చేసే స్థలం లేదంటూ బాలిక మృతదేహంతో ముస్లిం పెద్దలు నిరసన తెలిపారు. దీనిౖపై తహసీల్దార్ రాములమ్మ మత పెద్దలతో ఫోన్లో మాట్లాడారు. శ్మశానం సమస్య తమ దృష్టికి ఇప్పటివరకు తీసుకురాలేదని, వీఆర్వోతో మాట్లాడి స్థలాన్ని గుర్తించి సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. దీంతో నిరసన విరమించి గతంలో తమ పూర్వీకుల మృతదేహాలను ఖననం చేసే చెరువు సమీపంలో చిన్నారి మృతదేహాన్ని ఖననం చేశారు. -
లక్ష్య శుద్ధితోనే వృత్తి నైపుణ్యం
● పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవ్రెడ్డి ● పోలీసుల వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ పార్వతీపురం రూరల్: జిల్లా పోలీసు అధికారులు, ఆర్మడ్ రిజర్వ్ (ఏఆర్) సిబ్బందికి వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ను సోమవారం నెల్లిమర్ల మండలం సారిపల్లిలోని పోలీసు శిక్షణ కేంద్రంలో నిర్వహించారు. కార్యక్రమానికి పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, సిబ్బంది ఫైరింగ్ తీరును పర్యవేక్షించడంతో పాటు స్వయంగా పాల్గొని లక్ష్యాలను ఛేదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ఎదురయ్యే అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, ఆయుధాల వినియోగంలో నైపుణ్యం పెంపొందించుకోవడానికి వార్షిక శిక్షణ దోహదపడుతుందన్నారు. పోలీస్ సిబ్బంది మానసిక ఒత్తిడిని జయించి, పూర్తి ఏకాగ్రతతో లక్ష్యాన్ని ఛేదించాలని సూచించారు. ఆధునిక ఆయుధాల నిర్వహణపై పట్టు సాధించడం వల్ల వృత్తిపరమైన ఆత్మవిశ్వాసం పెరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం ఎస్పీ మాధవ్రెడ్డి గ్లాక్ పిస్టల్, ఎంపీ–5 వంటి అత్యాధునిక ఆయుధాలతో ఫైరింగ్ చేయగా, ఏఆర్ బలగాలు ఏకే–47, ఎస్ఎల్ఆర్ తుపాకులతో సాధన చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, పాలకొండ డీఎస్పీ రాంబాబు, ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, ఆర్ఐలు నాయుడు, రాంబాబు, పలువురు సీఐలు, ఎస్సైలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. గ్లాక్ పిస్టల్, ఎంపీ–5 ఫైర్ చేస్తున్న ఎస్పీ మాధవ్ రెడ్డి -
ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత ప్రవేశాలకు ఆహ్వానం
● 1వ తరగతిలో 25 శాతం సీట్ల కేటాయింపు ● ఈ నెల 20 నుంచి దరఖాస్తుల స్వీకరణవిజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాహక్కు చట్టం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 2026–27 విద్యాసంవత్సరంలో అన్ని ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 1వ తరగతిలో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు సోమవారం డీఈఓ యూ.మాణిక్యంనాయుడు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఐబీ, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, స్టేట్ సిలబస్ అనుసరించి ఉన్న అన్ని ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలకు ఈ ప్రవేశాలు వర్తిస్తాయి. ఆర్ధికంగా వెనుకబడిన, బలహీన వర్గాల పిల్లలు అర్హులు, ఈ సీట్లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు 8వ తరగతి వరకు ఉచిత విద్య అందుబాటులో ఉంటుంది. ఆయా స్కూల్ స్థాయిలో ఉన్న ఫీజులను ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రస్తుతం 5 సంవత్సరాలు నిండిన పిల్లల తల్లిదండ్రుల నుంచి ఈ నెల 20వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ప్రధానంగా ‘సీఎస్ఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్’ వెబ్సైట్లో ఆధార్ ద్వారా ప్రాథమిక వివరాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో అయితే గ్రామ/వార్డు సచివాలయం, మండల విద్యా వనరుల కేంద్రం, సంబంధిత ప్రైవేట్ పాఠశాలల్లో కూడా దరఖాస్తు సమర్పించవచ్చు. అర్హత ధ్రువీకరణ తర్వాత లాటరీ విధానంలో సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఎంపికై న విద్యార్థుల జాబితా సంబంధిత పాఠశాలల్లో ప్రదర్శిస్తారు. 2020 ఏప్రిల్ 2 నుంచి 2021 మార్చి 31వ తేదీ మధ్యలో జన్మించిన పిల్లలు (5 సంవత్సరాలు నిండి ఉండాలి) మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. చిరునామా ధ్రువీకరణకు తల్లిదండ్రుల ఆధార్కార్డు, ఓటరు కార్డు, రేషన్కార్డు, భూమి హక్కుల పత్రాలు, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కార్డు, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, విద్యుత్ బిల్లు లేదా రెంటల్ అగ్రిమెంట్ కాపీ వంటి పత్రాలలో ఏదైనా ఒకటి, పిల్లల వయస్సు ధ్రువీకరణ పత్రంగా జతచేయాల్సి ఉంటుంది. సందేహాల నివృత్తి కోసం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సంప్రదించవచ్చు. టోల్ ఫ్రీ నంబర్ 18004258599. జిల్లా సమాచారం, సమస్యల పరిష్కారం కోసం సమగ్రశిక్ష జిల్లా అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ను సంప్రదించాలి. పేద, బలహీన వర్గాల పిల్లలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ కోరారు. -
నిరసన హోరు
విజయనగరం గంటస్తంభం: చంద్రబాబు ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, వివిధ సమస్యల పరిష్కారంలో జాప్యంపై పలు వర్గాల ప్రజలు ఆందోళనలు చేశారు. కలెక్టరేట్ సాక్షిగా సోమవారం నిరసన గళం వినిపించారు. కలెక్టర్కు అర్జీలు అందజేశారు. ● తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలలో జాప్యం చేయడంపై ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళన చేశారు. కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్ష చేశారు. తక్షణమే రూ.7వేల కోట్ల ఫీజు బకాయిల విడుదలకు అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేయాలని, లేదంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. విద్యార్థుల చదువుతో రాజకీయం చేయొద్దని హితవుపలికారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు వి.చిన్నబాబు, జిల్లా కార్యదర్మి డి.రాము, జిల్లా ఉపాధ్యక్షులు ఎం.వెంకీ, జగదీష్, రమేష్, సహాయ కార్యదర్ములు రమేష్, రమణ, నాయకులు మధు,సూరిబాబు, నాని, శ్రీలత, విద్యార్థులు పాల్గొన్నారు. ● సర్వేనంబర్ 43–ఎలోని 0.47సెంట్ల విస్తీర్ణంలో ఉన్న శ్మశాన వాటికను ఆక్రమిస్తున్నారని, శ్మశాన వాటికకు వెళ్లే మార్గాన్ని మూసివేశారని, తక్షణమే హద్దులు నిర్ణయించి రుద్రభూమిని కాపాడాలంటూ రాజాం మండలం బొద్దాం గ్రామస్తులు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. కలెక్టర్ రాంప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. ● మెంటాడ మండలం పోరాం గ్రామానికి చెందిన రెల్లి, మాల కులస్తులకు భూములు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ అంబేడ్కర్ పోరాట సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సుమారు 200 నిరుపేద కుటుంబాలకు ఒక్క సెంటు భూమికూడా లేకుండా, వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తునామని తెలిపారు. సర్వే నంబర్ 126లోని ప్రభుత్వ భూములను మహిళల పేరుమీద పట్టాలుగా పంపిణీ చేయాలని కోరారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. స్పందించకుంటే ఈనెల 16 నుంచి కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపడతామని అంబేడ్కర్ పోరాడ సమితి అధ్యక్షుడు సోరు సాంబయ్య హెచ్చరించారు. ఫీజురీయింబర్స్మెంట్ పెండింగ్ నిధులు విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ నిరాహార దీక్ష శ్మశానవాటిక కోసం బొద్దాం గ్రామస్తుల కన్నీటి పోరాటం పోరాం గ్రామ భూముల పంపిణీకి అంబేడ్కర్ పోరాట సమితి డిమాండ్ -
హామీల అమలుకు డిమాండ్
నిరుద్యోగ యువత, వలంటీర్లకు ఎన్నికల సమ యంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) జిల్లా అధ్యక్షుడు బూర వాసు విమర్శించారు. ఏఐవైఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. నిరుద్యోగ భృతి రూ.3వేలు వెంటనే అమలు చేయాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగ సమస్యలపై చర్చ జరిపి స్పష్టమైన కార్యాచరణ ప్రకటించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్మి వి.రాజేష్ నరేంద్రతో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. -
ప్రణాళికతో చదివితే ఉత్తమ మార్కులు
● ‘పది’ పరీక్షలపై ఉపాధ్యాయుల సూచనతెలుగు తెలుసుకుంటే సులువు ప్రశ్నపత్రం సరళిపై అవగాహనతో చదివితే మంచి మార్కులు సాధించవచ్చు. పద్యం,గద్యం, ఉపవాచకం నుంచి ప్రశ్నలు ఉంటాయి. కరపత్రం, లేఖ, సంభాషణలో ఏదో ఒక అంశంపై నాలుగు ప్రశ్నలు ఇస్తారు.అలాగే అలంకారాలు, ఛందస్సు, అర్థాలు, పర్యాయపదాలు, ప్రకృతి–వికృతులు, నానార్థాలు, వ్యుత్పత్తి అర్థాలు, జాతీయాలు 22 నుంచి 32 వరకు ప్రశ్నలు భాషాంశాలపై ఉంటాయి. ఇప్పటి నుంచి ప్రతిరోజూ క్లాస్ రూంలో బోధించే అంశాలను అదే రోజు ఇంటి వద్ద ప్రాక్టీస్ చేయడం ఎంతో ఉపకరిస్తుంది.చేతి రాత ఆకట్టుకునేలా ఉండాలి. – పి.గంగ ,తెలుగు పండిట్, ఉన్నత పాఠశాల, రామభద్రపురంసాధన చేస్తే భౌతిక శాస్త్రం సులభం.. సాధన చేస్తే విద్యార్థులకు బౌతిక శాస్త్రం సులభమవుతుంది.ప్రశ్నపత్రం మొత్తం మీద విషయ అవగాహన అంశాలను వివరించడం, కృత్యాలను రాయడం, ప్రశ్నించడం, కారణాలు తెలపడం,ఉపయోగాలు రాయడం, ప్రమాణాలు రాయడం, పటాలు గీయడం తదితర విద్యాప్రమాణాలను సాధన చేస్తే విద్యార్థులందరూ దాదాపు 70 శాతం మార్కులు తెచ్చుకోవచ్చు. రసాయనిక చర్యల సమీకరణాలు, ఆమ్లాలు, క్షారాలు, కార్బన్, దాని సమ్మేళనాలు, మానవుని కన్ను రంగుల ప్రపంచం,కాంతి పరివర్తనం చదివితే మంచి మార్కులు సాధించవచ్చు. – ఎం.శ్రీనివాసరావు, భౌతికశాస్త్రం స్కుల్ అసిస్టెంట్రామభద్రపురం: పదో తరగతి ప్రతి విద్యార్ధి జీవితంలో కీలకం. పదిలో సాధించిన మార్కులే ఉన్నత విద్య,ఉద్యోగాల కోణంలో ప్రతి దశలోనూ పరిగణనలోకి తీసుకుంటున్నారు. విద్యార్ధులకు మార్చి 16 నుంచి పది పబ్లిక్ పరీక్షలు ఆరంభం కానున్నాయి. ఉత్తీర్ణత శాతం పెంచేందుకు విద్యాశాఖ 100 రోజుల ప్రణాళిక అమలుచేస్తోంది. విద్యార్థులు అత్యధిక మార్కుల సాధన కోసం ఆయా సబ్జెకుకు సంబందించిన సిలబస్ను,పరీక్ష విధానాన్ని అవగాహన చేసుకుని పటిష్ట ప్రిపరేషన్కు ప్రణాళిక రూపొందించుకుంటే మంచి మార్కులు సాధించే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్ధులు 16,287 మంది, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు 6,878 మంది పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. దాదాపు అన్ని పాఠశాలల్లో ఇప్పటికే సిలబస్ పూర్తిచేసి ప్రత్యేక తరగతుల నిర్వహణతో పాటు రోజూ టెస్టులు నిర్వహిస్తూ ఉత్తమ ఫలితాలు సాధించాలన్న లక్ష్యంతో ఉపాధ్యాయులు కృషిచేస్తున్నారు. విద్యార్థులు ఉత్తీర్ణత సాధించాలన్నా..అత్యధిక మార్కులు పొందాలన్నా తీసుకోవాల్సిన జాగ్రత్తలు,సూచనలను పలువురు సబ్జెక్టు నిపుణులు ఇలా వివరించారు.ప్రాక్టీస్తోనే ఉత్తమ మార్కులు.. గణితంలో వందకు వంద మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. అందుకోసం ప్రతి చాప్టర్ను సంపూర్ణంగా అధ్యయనం చేయడంతో పాటు వాటికి సంబంధించిన ప్రశ్నలు(ప్రాబ్లమ్స్) ప్రాక్టీస్ చేయాలి. విద్యార్థులు ముఖ్యమైన నిర్వచనాలు, సూత్రాలను నోట్స్ రూపంలో రాసుకుంటే రివిజన్ సమయంలో ఉపయుక్తంగా ఉంటుంది.టెక్స్ట్బుక్లో ప్రతి చాప్టర్ చివరన ఇచ్చే సమస్యలను తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. – ఆర్ రామారావు, గణితశాస్త్రం ఉపాధ్యాయుడు, ఉన్నత పాఠశాలహిందీలో సాధనతోనే.. భాగం–1లో 5 పాసేజ్ ప్రశ్నలు 25 మార్కులకు ఉంటాయి, భాగం–2లో 4 మార్కుల ప్రశ్నలు నాలుగు రాయాలి. 16 మార్కులు, లేఖ, కవి పరిచయాలు 10 మార్కులు ఉంటాయి. పద్యభాగం, గద్య బాగాలకు సంబంఽధించి 2 పేరాగ్రాఫ్లు ఉంటాయి. ఒక్కోదానికి 8 మార్కులు, లెటర్ రైటింగ్ 8 మార్కులకు ఉంటుంది.జనరల్ ఎస్సే 10 మార్కులకు, గ్రామర్ బిట్స్ 15 మార్కులకు ఉంటాయి. – జి.సుజాత, హిందీ టీచర్, కొట్టక్కి -
న్యాయవాదుల నిరసన
విజయనగరం లీగల్: తెలంగాణాకు చెందిన మహిళా న్యాయవాది హత్యకు నిరసనగా విజయనగరంలోని న్యాయవాదులు సోమవారం విధులను బహిష్కరించారు. నల్లబ్యాడ్జీలు ధరించి కోర్టు ప్రాంగణంలో ఆందోళన చేశారు. ఈ సందర్బంగా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కలిశెట్టి రవిబాబు, ప్రధాన కార్యదర్శి నళితం సురేష్కుమార్ మాట్లాడుతూ దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఇటువంటి వాటిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని రూపొందించి అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో సంఘ సంయుక్త కార్యదర్శి బార్నాల సీతారామరాజు, కోశాధి కారి కళ్లెంపూడి వెంకటరావు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. విద్యార్థులకు మేలుచేసేలా ఈఎస్డీపీ విజయనగరం కలెక్టరేట్: విద్యార్థుల్లోని కొత్త తరహా ఆలోచనలను వాస్తవికతవైపు తీసుకెళ్లడమే ఎంటర్ప్రెన్యూర్ షిప్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఈఎస్డీపీ) ఉద్దేశమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉత్తర కోస్తాంధ్రలోని కళాశాలల్లో కార్యక్రమం ప్రారంభంపై హర్షం వ్యక్తంచేశారు. స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను పెంపొందించేందుకు గుర్తించిన శిక్షణ బ్యాచ్లలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన స్టార్టప్లను ప్రతిష్టాత్మకమైన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో అనుసంధానించనున్నామని మంత్రి పేర్కొన్నారు. ఉపాధ్యాయుడి కీచక పనులపై హెచ్ఎంకు ఫిర్యాదు రామభద్రపురం: విద్యాబుద్ధులతో పాటు గుడ్టచ్, బ్యాడ్టచ్పై అవగాహన కల్పించాల్సిన ఉపాధ్యాయుడే బాలికలను బ్యాడ్టచ్ చేస్తూ ఇబ్బందిపెట్టాడు. వీడియోలు తీస్తూ ఆందోళనకు గురిచేశాడు. ఉపాధ్యాయుడి చేష్టలతో విసుగెత్తిన రామభద్రపురం ఉన్నతపాఠశాల బాలికలు పేరెంట్స్ కమిటీ చైర్మన్, మరో పేరెంట్తో కలిసి ఈ నెల 8న పాఠశాల హెచ్ఎం వి.గోపాలనాయుడుకు ఫిర్యాదు చేసిన విషయం ఆలస్యంగా తెలిసింది. దీనిపై హెచ్ఎం వెంటనే స్పందించి సంబంధిత ఉపాధ్యాయుడిని ఆఫీస్ రూంలోకి పిలిపించి మందలించారు. ఇదే విషయాన్ని ఎంఈఓ తిరుమలప్రసాద్, హెచ్ఎం గోపాలనాయుడు, పేరెంట్స్ కమిటీ చైర్మన్ అప్పారావు వద్ద ప్రస్తావించగా ఉపాధ్యాయుడి తీరుపై బాలికలు ఫిర్యాదు చేసిన విషయం వాస్తవమేనన్నారు. చదవాలని మందలిస్తున్నానే తప్ప వేరే ఉద్దేశం లేదని, తరగతి గదిలో గోలచేస్తే హెచ్ఎంకు చూపిస్తానంటూ వీడియో తీస్తున్నట్టు ఆ ఉపాధ్యాయుడు సమాధానం ఇచ్చా రని తెలిపారు. మరోసారి ఫిర్యాదు వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించామని, సంబంధిత ఉపాధ్యాయుడితో లిఖితపూర్వక వివరణ తీసుకున్నామని హెచ్ఎం వివరించారు. మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబరపోలమాంబ అమ్మవారి మూడోజాతర నేడు జరగనుంది. జాతరకొచ్చే భక్తుల సౌకర్యార్థం ఈవో బి.శ్రీనివాస్, ట్రస్ట్బోర్డు సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పా ట్లు పూర్తి చేశారు. జాతరలో భక్తుల అవసరా ర్థం 10వేల లడ్డూప్రసాదాన్ని దేవాదాయశాఖ తయారు చేయించింది. క్యూల వద్ద చిన్న పిల్లలకు పాలు, తాగునీరు సరఫరా చేయనున్నట్లు ఈవో తెలిపారు. అవసరమైన మేరకు పులిహో ర భక్తులకు అందించనున్నట్లు ఈవో తెలిపా రు. జాతరకొచ్చే భక్తులకు సేవలందించేందు కు 30మంది దేవాదాయశాఖ సిబ్బంది శంబర గ్రామానికి చేరుకున్నారు. జాతరలో 140మంది పోలీస్ సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహించనున్నట్లు సీఐ రామకృష్ణ తెలిపారు. -
సమాచార లోపం.. అర్జీదారులకు కష్టం
● కొలువు తీరని ప్రజా సమస్యల పరిష్కార వేదిక ● ప్రత్యామ్నాయంగా వినతుల స్వీకరణపార్వతీపురం రూరల్: కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (పీజీఆర్ఎస్)ను ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో విజయవాడలో మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులతో జరిగే కీలక సమావేశం కారణంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి ఆదివారం రాత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు అధికారులు అందరూ ఈ సమీక్షలో వర్చువల్గా పాల్గొనాల్సి రావడంతో గ్రీవెనన్స్ సెల్తో పాటు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను కూడా నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే, రద్దు ప్రకటన ఆదివారం రాత్రి పొద్దుపోయాక వెలువడడంతో జిల్లాలోని మారుమూల ప్రాంతాల ప్రజలకు ఈ సమాచారం చేరలేదు. ఎప్పటిలాగానే తమ గోడు వెళ్లబోసుకోవచ్చని భావించిన అర్జీదారులు సోమవారం ఉదయమే భారీ సంఖ్యలో కలెక్టరేట్కు చేరుకున్నారు. తీరా అక్కడికి వచ్చాక కార్యక్రమం రద్దయిందని తెలియడంతో అర్జీదారులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. దూరాభారం నుంచి వచ్చిన వారి ఇబ్బందులను గమనించిన కలెక్టరేట్ అధికారులు, తహసీల్దార్ స్థాయి అధికారితో వినతులను స్వీకరించేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా పింఛన్ల మంజూరు, రెవెన్యూ వివాదాలు, ఏనుగుల గుంపు వల్ల జరుగుతున్న పంటనష్టం వంటి సమస్యలపై బాధితులు అధికారులకు విన్నవించుకుని వెనుదిరిగారు. -
ఫార్మర్ రిజిస్ట్రీ లేకుంటే.. పీఎం కిసాన్ కట్..!
● భవిష్యత్తులో ఎరువులు, పంటల బీమా అందవు ● జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రీకి దూరంగా 48 వేల మంది రైతులు విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ కొత్త నిబంధనల ప్రకారం ప్రతీరైతు ఫార్మర్ రిజిస్ట్రీ యాప్లో పేరు, భూముల వివరాలు నమోదు చేసుకోవాలి. లేదంటే పీఎం కిసాన్తో పాటు ఎరువులు అందవు. రైతు సంక్షేమ పథకాలు మంజూరు కావు. రైతుల్లో నిరక్షరాస్యత, వ్యవసాయ సిబ్బంది అలసత్వంతో జిల్లాలో సుమారు 48 వేల మంది రైతుల వివరాలు నమోదు కాలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతులకు పథకాల్లో కోతపెట్టేందుకే ప్రభుత్వం ఏదో ఒక కారణం తెరపైకి తెస్తోందని రైతులు విమర్శిస్తున్నారు. ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోకపోతే రైతులకు ప్రధానమంతి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఏడాదికి ఇచ్చే రూ. 6 వేలు అందవు. పంటల బీమా వర్తించదు. ప్రభుత్వ పథకాలు వర్తించవు. ఎరువులు కూడా ఇవ్వరు. నిరక్షరాస్యులైన రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నమోదులో వెనుకబడి ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే అన్నదాత సుఖీభవ పథకం కౌలురైతులకు అందడంలేదు. ఎరువుల కోసం నానా తిప్పలు పడుతున్నారు. ఇప్పుడు ఈ కొత్తనిబంధనతో ఇబ్బందులు తప్పవని రైతులు వాపోతున్నారు. భూములు ఉన్నా రీ సర్వే పూర్తికాకపోవడంతో ఒన్బీలు రావడంలేదని, తామంతా పథకానికి దూరమవుతామంటూ మరికొందరు రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రతీ రైతుకు 11 అంకెలతో కూడిన డిజిటల్ ఐడీ.. నమోదు తప్పనిసరి జిల్లాలో 48 వేల మంది రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోలేదు. వ్యవసాయ సిబ్బంది రైతులందరికీ ఫార్మర్ రిజిస్ట్రీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఫార్మర్ రిజిస్ట్రీ లేకపోతే పీఎం కిసాన్, ప్రభుత్వ పథకాలు, పంటల బీమా కూడా ఇవ్వరు. – వి.తారకరామారావు, జిల్లా వ్యవసాయ అధికారి ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకున్న ప్రతీ రైతుకు 11 అంకెలతో కూడిన డిజిటల్ ఐడీ వస్తుంది. ఈ ఐడీ ఎంటర్ చేయగానే రైతుకు సంబంధించిన పూర్తి వివరాలు వచ్చేస్తాయి. రైతులు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ నంబర్, అధార్ నంబర్తో లింక్ అయిన ఫోన్ నంబర్ను విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గరకు పట్టుకుని వెళితే రైతుకు ఫార్మర్ రిజిస్ట్రీ నమోదుచేసి ఐడీ ఇస్తారు. జిల్లాలో 2,77,011 మంది రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాల్సి ఉంది. ఇంతవరకు 2,29,011 మంది రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకున్నారు. 48 వేలు మంది ఇంకా చేయించుకోవాల్సి ఉంది. -
ప్రియుడి కోసం భర్తపై హత్యాయత్నం
చికెన్● తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త ● నిందితులకు 14 రోజులు రిమాండ్పాచిపెంట: తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని భావించి తమ్ముడితో కలిసి భర్తను హతమార్చేందుకు ఓ భార్య యత్నించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ కేసుకు సంబంధించి సాలూరు రూరల్ సీఐ రామకృష్ణ తన కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. పాచిపెంట మండలంలోని విశ్వనాథపురం గ్రామానికి చెందిన కిర్ల కుమార్ అనే వ్యక్తికి 23 ఏళ్ల క్రితం కొట్టక్కి గ్రామానికి చెందిన ఇష్టం ఈశ్వరమ్మతో వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాబు చైన్నెలో ఉద్యోగం చేయగా, పాప ప్రస్తుతం చదువుకుంటోంది. అయితే ఈశ్వరమ్మ అదే గ్రామానికి చెందిన సారిక తవిటినాయుడు అనే వ్యక్తితో నాలుగేళ్ల క్రితం నుంచి వివాహేతర సంబంధం నడుపుతోంది. ఈ విషయంపై భర్తతోపాటు గ్రామస్తులు పలుమార్లు ఆమె హెచ్చరించినప్పటికీ ఈశ్వరమ్మలో మార్పు రాలేదు. ఈనెల 4వ తేదీన ఈశ్వరమ్మ తన ఇంట్లో తవిటినాయుడుతో కలిసి మరోసారి భర్త కుమార్కు పట్టుబడింది. ఈ విషయం ఎవరికై నా చెబితే చంపేస్తామని భర్త కుమార్ను ఈశ్వరమ్మ బెదిరించడంతో కుమార్ ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. మరుసటి రోజు ఉదయం కుమార్ పొలానికి వెళ్లి పని చేసుకుంటుండగా, ఈశ్వరమ్మ,ఆమె తమ్ముడు పాపారావుతో కలిసి పొలం వద్దకు వెళ్లి అటుగా ఎవరూ రాకుండా తవిటినాయుడిని కాపలా ఉంచి కుమార్ను హతమార్చేందుకు కొడవలితో దాడికి పాల్పడింది. ఈ దాడిలో కుమార్ మెడపైన ముక్కు పైన పెద్ద గాయాలయ్యాయి, ఆ సమయంలో కుమార్ అక్కడి నుంచి తప్పించుకుని వచ్చి గ్రామస్తుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు, బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పాచిపెంట ఎస్సై లాలా అర్జున్ దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేసి సోమవారం కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ను కోర్టు విధించింది. -
పీజీఆర్ఎస్కు 260 వినతులు
విజయనగరం కలెక్టరేట్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు 260 వినతులు వచ్చాయి. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఈ.మురళి, డిప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వరరావు, రాజేశ్వరి, బి.శాంతి,నూకరాజు, కళావతి తదితరులు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వారి సమస్యల పరిష్కారం కోరుతూ 260 మంది తమ సమస్యలు వినతుల రూపంలో చెప్పుకున్నారు. వాటిలో పీజీఆర్ఎస్కు 186 వినతులు రాగా, రెవెన్యూక్లినిక్కు 74 ఆర్జీలు వచ్చాయి. వాటిని సంబంఽధిత అధికారులకు పంపించి పరిష్కరించాలని కోరారు. నిర్ణీత గడువు లోగా వాటికి పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా నెల్లిమర్ల సామాజిక ఆరోగ్యకేంద్రంలో సరైన పరిష్కారం చూపారని గుర్ల మండలం కెల్ల గ్రామానికి చెందిన కర్రోతు పైడిరాజు తెలియజేయడం విశేషం. కార్యక్రమంలో జిల్లాలోని వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. -
పెరుగుతున్న కేసులు..
● జనాన్ని భయపెడుతున్న శునకాలు ● ఏడాదిలో 26,368 మందికి కుక్కకాట్లు ● ఓ బాలుడి మృతి ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో నమోదైన కేసులు 4,470 సీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రుల్లో నమోదైన కేసుల సంఖ్య 8,508 పీహెచ్సీల పరిధిలో నమోదైన కేసులు 13,390 ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధుడి పేరు అరసవిల్లి. ఇతనిది బొండపల్లి మండలం. ఇంటి నుంచి పొలానికి వెళ్తుండగా కుక్క వెంటబడి విచక్షణ రహితంగా కరిచేసింది. రెండు కాళ్లు, చేతులపై గాయాలయ్యాయి. ఆయన విజయనగరం సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందారు. విజయనగరం ఫోర్ట్: జిల్లాలో అనునిత్యం కుక్కలు స్థైరవిహారం చేస్తున్నాయి. జనంపై దాడి చేస్తున్నాయి. తీవ్రంగా గాయపరుస్తున్నాయి. కుక్కలు కరవడంతో వైద్యసేవల కోసం ఆస్పత్రికి వచ్చేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పగలు, రాత్రి తేడా లేకుండా శునకాలు దాడిచేస్తుండంతో జనం హడలిపోతున్నారు. ఒంటిరిగా కనిపిస్తే చాలు.. గుంపుగా వచ్చి దాడిచేస్తుండడంతో పాఠశాలకు, పొలానికి, మార్కె ట్కు వెళ్లేందుకు భయపడుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో కుక్కలు సంచరించకుండా, కనిపించకుండా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా కొన్నిచోట్ల అధికారులు మిన్నకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు జిల్లాలో 26,368 మందిని కుక్కలు కరిచాయి. వీరంతా జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యసేవలు పొందారు. పీహెచ్సీల పరిధిలో 13,390 కేసులు, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో 4,470 కేసులు, సీహెచ్సీ, ఏరియా ఆస్పత్రుల పరిధిలో 8,508 కేసులు నమోదయ్యాయి. ప్రతిరోజు 70 నుంచి 75 మంది కుక్కకాటుబారిన పడుతున్నట్టు ఆస్పత్రి రికార్డులు చెబుతున్నాయి. వ్యాక్సిన్ వేయించాలి కుక్కలు కరిస్తే వెంటనే యాంటీ రేబిస్ వ్యాక్సిన్ (ఏఆర్వీ) వేయించాలి. జిల్లాలోని అన్ని పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రులు, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఏఆర్వీ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. నిర్లక్ష్యం చేస్తే రేబిస్ వ్యాధిబారిన పడే అవకాశం ఉంది. – డాక్టర్ జీవనరాణి, డీఎంహెచ్ఓ బొబ్బిలి మండలం దిబ్బగుడ్డివలస గ్రామానికి చెందిన రామవరపు రమణ అనే 9 ఏళ్ల బాలుడిపై పిచ్చికుక్క దాడిచేసి మొఖంపై కరిచింది. కుటుంబ సభ్యులు వెంటనే బొబ్బిలి సీహెచ్సీకి తరలించి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ (ఏఆర్వీ) వేయించారు. ఈ నెల 3వ తేదీన బాలుడిలో రేబిస్ లక్షణాలు కనిపించడంతో కుటుంబ సభ్యులు విశాఖపట్నం కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు ఈ నెల 4వ తేదీన మరణించాడు. -
జాతీయ స్థాయి కుస్తీ పోటీలకు గుర్ల యువకుడు
గుర్ల: మండల కేంద్రానికి చెందిన పొన్నాడ ఉమామహేశ్వరరావు జాతీయస్థాయి కుస్తీ పోటీలకు ఎంపికై నట్లు కుస్తీ కోచ్ కర్రోతు జగదీశ్ ఆదివారం తెలిపారు. గత ఏడాది గుజరాత్లో జరిగిన జాతీయ స్థాయి పోటీలలో ఉమామహేశ్వర రావు ఉత్తమ ప్రదర్శన కనబరిచి స్వర్ణ పతకం సాధించాడు. కుస్తీలో రాణించడంతో రాష్ట్రం తరఫున జాతీయస్థాయి పెడరేషన్ కుస్తీ పోటీల్లో పాల్గొంటున్నాడు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాధ్ ఈనెల12 నుంచి 14 వరకు ఈపోటీలు జరగనున్నాయి. ఉమామహేశ్వరరావు నెల్లిమర్లలోని ఒక కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. -
గడ్డిమందు తాగి వ్యక్తి ఆత్మహత్య
రాజాం సిటీ: మండల పరిధి అంతకాపల్లి గ్రామానికి చెందిన వాకముళ్ల శంకరరావు (34) గడ్డిమందుతాగి ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి ఎస్సై ఉమావెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు తాపీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్న శంకరరావు కొన్ని రోజులుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఈ నెల 7న ఉదయం తన భార్య అశ్విని వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లిన సమయంలో తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ ఇంట్లో ఉన్న గడ్డిమందు తాగేశాడు. భర్త వాంతులు చేసుకుంటుండడాన్ని ఇంటికి వచ్చిన భార్య గమనించి ఆరా తీసింది. గడ్డిమందు తాగినట్లు తెలపడంతో వెంటనే కుటుంబసభ్యుల సహాయంతో రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారు జామున మృతిచెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
డెంకాడ: మండలంలోని గుణపూరుపేట గ్రామం సమీపంలో ఉన్న గ్రీన్ఫీల్డ్ లే అవుట్ వద్ద మోటార్ సైకిల్ అదుపు తప్పి స్తంభాన్ని ఢీకొట్టడంతో పూసపాటిరేగ మండలంలోని రెల్లివలస గ్రామానికి చెందిన ముసినేని మురళి(41) దుర్మరణం చెందాడు. మృతుడి భార్య సరోజిని ఫిర్యాదు మేరకు ఎస్సై ఎ.సన్యాసినాయుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం నుంచి గుణుపూరుపేట మీదుగా స్వగ్రామం రెల్లివలస వస్తుండగా ప్రమాదం జరిగింది. శనివారం రాత్రి 9 గంటల నుంచి 10:30 గంటల వరకూ తనతో ఫోన్ మాట్లాడారని, అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందని భార్య సరోజిని తెలిపింది. ఆదివారం తెల్లవారుజామున తన భర్త మురళి గుణుపూరుపేట వద్ద స్తంభాన్ని మోటార్ సైకిల్తో ఢీకొట్టడం వల్ల తీవ్ర గాయాలై మరణించినట్లు తనకు సమాచారం రావడంతో వెళ్లి చూసే సరికి తీవ్రగాయాలతో మరణించి ఉన్నాడని సరోజిని ఫిర్యాదులో పేర్కొంది. -
ఎన్నాళ్లీ అద్దె కష్టాలు..!
విజయనగరం ఫోర్ట్: అంగన్వాడీ కేంద్రాలకు అద్దె కష్టాలు తప్ప డం లేదు. సొంత భవనాలు లేకపోవడంతో అద్దె భవనాల్లోనే కేంద్రాలను నిర్వహించాల్సిన పరిస్థితి. పట్టణంలో అద్దెలు ఎక్కువగా ఉండడంతో చిన్న చిన్న గదుల్లోనే కేంద్రాలను నిర్వహిస్తున్నారు. దీని వల్ల అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణం దూరం అవుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీటికి నెలకు రూ. లక్షల్లో అద్దె చెల్లిస్తున్నారు. ఏళ్ల తరబడి ఇలాగే వెచ్చిస్తున్నారు. ఈ మొత్తంతో కొన్ని భవనాలు నిర్మించి ఉంటే అద్దె కష్టాలు తప్పేవని అంగన్వాడీలు పేర్కొంటున్నారు. పట్టణ ఐసీడీఎస్ ప్రాజెక్ట్లో 317 కేంద్రాలు పట్టణ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో 317 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో సొంత భవనాలు 68 మాత్రమే ఉన్నాయి. 34 కేంద్రాలు సామాజిక భవనాల్లో నిర్వహిస్తున్నారు. 215 కేంద్రాలు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల పరిధిలో 11,964 మంది చిన్నారులు అంగన్వాడీ కేంద్రాల పరిధిలో పిల్లలు 11,964 మంది చిన్నారులు ఉన్నారు. గర్భిణులు, బాలింత లు 3215మంది ఉన్నారు. 317 కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు సేవలు అందించాల్సి ఉంటుంది. అంతే కాకుండా బుధ, శనివారాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహిస్తారు. ఒక్కో కేంద్రానికి రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు అద్దె చెల్లింపు అద్దె భవనాల్లో నడుస్తున్న కేంద్రాలకు ఒక్కో దానికి రూ.వేలల్లో అద్దె చెల్లిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు అద్దె చెల్లిస్తున్నా రు. మరికొన్ని ప్రాంతాల్లో రూ.6 వేల నుంచి రూ. 6500 వరకు అద్దె చెల్లిస్తున్నారు. ఇలా మొత్తంగా నెలకు రూ.7 లక్షల వరకు అద్దె చెల్లిస్తున్నారు. ఈ లెక్కన ఏడాదికి రూ.కోటి వరకు అద్దె చెల్లిస్తున్నారు. దీనికి బదులు ఆ మొత్తంతో సొంత భవనాలు నిర్మిస్తే ఎంతో ప్రయోజమని పలువురు పేర్కొంటున్నారు. జిల్లా కేంద్రంలో అంగన్వాడీ కేంద్రాల నిర్వాహ ణకు భవనాలు అద్దెకు దొరకడం సమస్యగానే ఉంది. చిన్న చిన్న భవనాలకు సైతం అద్దె ఎక్కువగా అడుగుతుండడంతో రెండు, మూడు కేంద్రాలను ఒకే చోట నిర్వహిస్తున్నారు.దీంతో పిల్లలకు కాస్త ఇబ్బందిగా ఉంటుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టణ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో 317 కేంద్రా లు ఉన్నాయి. వీటిలో 215 కేంద్రాలు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. సొంత భవనాలు నిర్మించడానికి స్థల సమస్య ఉంది. భవనం నిర్మించడానికి ప్రహరీతో కలిసి ఐదు సెంట్లు వరకు స్థలం అవసరం ఉంటుంది. అంత స్థలం దొరకడం కష్టంగానే ఉంది. – కె.సత్యవతి, ఇన్చార్జ్ సీడీపీఓ, విజయనగరం అర్బన్ -
బైక్ను ఆటో ఢీకొని వ్యక్తి మృతి
రాజాం సిటీ: మండల పరిధి పొగిరి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జి.సిగడాం మండలం సంతవురిటికి చెందిన ప్రమిదల శ్రీనివాసరావు (56) ఆదివారం మృతిచెందాడు. ఈ ఘటనపై స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీనివాసరావు తన కుమార్తె కన్యసికతో కలిసి ద్విచక్రవాహనంపై రాజాం వచ్చి స్వగ్రామం తిరుగు ప్రయాణమయ్యాడు. పొగిరి వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న ఆటో ముందున్న లారీని తప్పించబోయి ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో రోడ్డుపై పడిన ఇద్దరూ గాయాలపాలయ్యారు. వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను రాజాంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రమాదంలో కాలికి గాయమైన కుమార్తె చికిత్స పొందగా, తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరావు చికిత్సపొందుతూ మృతిచెందాడని పోలీసులు తెలిపారు. ఆయనకు భార్య ఉమాపార్వతి, మరో ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఉమావెంకటేశ్వరరావు తెలిపారు. -
ఉపాధి దొరికేనా..!
విజయనగరం ఫోర్ట్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేసే వేతనదారులకు పనులు దొరకడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఉపాధి హామీ పథకానికి పూర్తి స్థాయిలో నిధులు కేంద్ర ప్రభుత్వమే భరించేది. అయినప్పటకీ చంద్రబాబు సర్కార్ వేతనదారులకు పనులు పూర్తి స్థాయిలో కల్పించలేకపోయిందనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో కంటే పని దినాలు కూడా తగ్గిపోయాయి. ఉపాధి హామీ పథకానికి అధిక శా తం కేంద్రమే నిధులు కేటాయించినప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. కేంద్రం వెచ్చించే నిధులు వాటా శాతాన్ని భారీగా తగ్గించేసి రాష్ట్ర ప్రభుత్వం వాటాను మూడు రెట్లు పెంచింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం వేతనదారులందరికి పూర్తి స్థాయిలో పని కల్పిస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రం 40 శాతం వాటా భరించాలి జాతీయ గ్రామీణ ఉపాధి పథకానికి సంబంధించి కేంద్రం 90 శాతం, రాష్ట్రం 10 శాతం వాటా చొప్పన అమలు చేసేవి. ఇప్పుడు కేంద్రం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి వీబీజీ రామ్జీ పథకంగా పేరు మార్చింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి దీన్ని అమలు చేయనుంది. దీని ప్రకారం ఉపాధి హామీ పథకానికి కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం వాటా భరించాల్సి ఉంటుంది. ఉపాధి హామీ పథకం ద్వారా పనులకు వెళ్లే వేతనదారులకు ఏడాదికి రూ.400 కోట్లు, మెటీరియల్కు మరో రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్లు వరకు వెచ్చిస్తారు. ఇందులో 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాలి. దీనిని అంత పెద్ద మొత్తంలో చంద్రబాబు సర్కార్ పేదల కోసం వెచ్చిస్తుందా? అనే దానిపై సర్వత్రా అనుమానాలున్నాయి. జిల్లాలో 3.37 లక్షలు జాబ్ కార్డులు జిల్లాలో 3.37 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. వీటిలో 6,26,094 మంది వేతనదారులు ఉన్నారు. వీరిలో 5,17,126 యాక్టివ్ వేతనదారులు ఉన్నారు. తగ్గిన పని దినాలు చంద్రబాబు సర్కార్ అధికారంలో వచ్చిన తర్వాత వేతనదారులకు పని దినాలు తగ్గాయి. 2023–24 సంవత్సరానికి సంబంధించి ఉపాధి హామీ పథకం కింద 2.18 కోట్ల పనిదినాలు కల్పించారు. వీరికి వేతనాల కింద రూ.502.36 కోట్లు వెచ్చించారు. 2025–26 సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు 1.11 కోట్ల పనిదినాలు కల్పించారు. దీనికిగాను రూ.242.64 కోట్లు వెచ్చించారు. 2023–24 సంవత్సరం కంటే 1.07 కోట్ల పనిదినాలు తగ్గాయి. ఉపాధి హామీ పథకం ఏప్రిల్ నెల నుంచి వీబీజీ రామ్జీగా అమలవుతుంది. మహాత్మాగాంధీ ఉపాధి పథకంగా ఉన్నప్పుడు కేంద్రం 90 శా తం వాటా..రాష్ట్రం పది శాతం వాటాగా అమలు చేసేవి. వీబీజీ రామ్జీ పథకం అమలైతే కేంద్రం వాటా 60 శాతం, రాష్ట్రం వాటా 40 శాతంగా ఉంటుంది. – ఎస్.శారదాదేవి, పీడీ, డ్వామా -
ఆక్రమణ దారుల పాగా
రామభద్రపురం: మండలంలో విలువైన స్థలాలు కబ్జాదారుల చేతుల్లోకి చేరిపోతున్నాయి.విలువైన ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని పక్కా భవనాలు నిర్మించుకుంటున్నా సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.రూ.కోట్లు విలువ చేసే స్థలాలు కబ్జాదారుల బారిన పడుతున్నా పట్టించుకోవడం లేదు.పంచాయతీ అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా పక్కాగా కట్టుకుంటున్నా కట్టుకోండి..కన్నెత్తి చూడం అన్నట్లు పంచాయతీ అధికారులు కూడా వ్యవహరిస్తున్నారు.అసలు మండలంలో ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి? ఏఏ శాఖలకు ఇచ్చామో ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఫిర్యాదులు వస్తే గాని సంబంధిత అధికారులకు తెలియని పరిస్థితి. పరిస్థితి ఇలా.. కొన్నేళ్ల క్రితం సాలూరు నియోజకవర్గం ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలో ఉండడం,అలాగే రామభద్రపురం మండలానికి సంబంధించి పలు శాఖలు సాలూరు నియోజకవర్గం పరిధిలో ఉండేవి.అయితే అప్పట్లో మోటారు వెహికల్ ఇన్స్పెక్షన్ కార్యాలయం నిమిత్తం మండలంలోని కొట్టక్కి రెవెన్యూ పరిధి,జాతీయ రహదారి పక్కన ఉన్న డి పట్టా భూమి సర్వే నంబరు 9–14 లో 2.13 ఎకరాలు రూ.కోట్ల విలువ చేసే స్థలం రెవెన్యూ అధికారులు ఇచ్చారు.అయితే ఐదేళ్ల క్రితం జిల్లా విడిపోవడంతో సాలూరు నియోజకవర్గం పార్వతీపురం మన్యం జిల్లాలో ఉండగా,రామభద్రపురం మండలం విజయనగరం జిల్లాలో ఉంది.అయితే అప్పటి నుంచి అక్కడ మోటార్వెహికల్ ఇన్స్పెక్షన్ కార్యాలయం నిర్మించకపోవడం,అలాగే సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కబ్జాకోరులు ఆక్రమించుకుని వ్యాపారాల కోసం ఐరన్తో పిల్లర్లు వేసుకుని పక్కా షెడ్లు నిర్మించుకుంటున్నారు.అలాగే పంచాయతీ అనుమతి లేకుండా పక్కాగా షెడ్లు నిర్మించుకుంటున్నా సంబంధిత అధికాకారులు కన్నెత్తి చూడడం లేదు. ఫీజీఆర్ఎస్లో ఫిర్యాదు.. నిబంధనలకు విరుద్ధంగా మోటార్ వెహికిల్ కార్యాలయానికి ఇచ్చిన స్థలం ఆక్రమణలకు గురవడం పట్ల సాలూరుకు చెందిన ప్రైవేట్ వ్యక్తులు జరజాపు లక్ష్మణరావు,మోకర సన్యాసిరావులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులకు ఫిర్యాదు చేయడం,అలాగే కలెక్టర్ కార్యాలయానికి గ్రీవెన్స్సెల్కు వెళ్లడంతో ఈ ఉదంతం వెలుగుచూసింది. దీంతో పరిశీలించాలని స్థానిక తహసీల్దార్ను కలెక్టర్ ఆదేశించినంత వలరకు అక్కడ డి పట్టా భూమి ఉందని తెలియదు.22ఎ రికార్డులు పరిశీలిస్తే గతంలో మోటార్ వెహికల్ కార్యాలయానికి ఆ స్థలం ఇచ్చినట్లు నమోదై ఉందన్న విషయం తెలిసింది. అలాగే సంబంధిత మోటార్ వెహికల్ అధికారులకు వారికి సంబంధించిన స్థలం ఉందన్న విషయం కూడా తెలియకపోవడం విశేషం. ఈ విషయంపై సాలూరు ఆర్టీవో ప్రసాద్, బొబ్బిలి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శశికుమార్లను వివరణ కోరగా జిల్లా మారిపోయిన తర్వాత సంబంధిత ఫైలు పరిశీలించలేదని, ఆ ఫైలు కమిషనర్ వద్ద ఉండే అవకాశం ఉందని తెలిపారు.అలాగే తాను కొత్తగా మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్గా వచ్చి విధులు నిర్వహించడం వల్ల పూర్తి సమాచారం తెలియదని శశికుమార్ తెలిపారు. గతంలో ఎంవీఐ కార్యాలయానికి డి పట్టా భూమి కేటాయింపు 2.13 ఎకరాలు ఇచ్చిన రెవెన్యూ అధికారులు పక్కా భవనాలు, షెడ్లు నిర్మిస్తున్న ఆక్రమణదారులు కన్నెత్తి చూడని ఎంవీఐ అధికారులు -
రోడ్డెక్కిన రైతులు
● ప్రభుత్వానికి వ్యతిరేకంగా మిన్నంటుతున్న నిరసనలుభోగాపురం: విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో జిల్లా ఉన్నతాధికారులు వివిధ సంస్థలకు భూములను అప్పగించేందుకు భూములను పరిశీలించడంతో పాటు నిర్వహిస్తున్న సర్వేలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న అందోళనలు ఉద్రిక్తంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే వేల ఎకరాలు సేకరించిన తరువాత కూడా మళ్లీ అదనపు భూసేకరణకు సిద్ధమవడం రైతాంగంలో తీవ్ర అసంతృప్తి నింపింది. రైతన్నలను కాపాడాల్సిన కూటమి ప్రభుత్వం అదే రైతుల పొట్ట మీద కొట్టేందుకు సిద్ధమవుతోంది. విమానాశ్రయానికి సుమారు మూడు వేల ఎకరాల భూములను సేకరించిన ఈ ప్రభుత్వం చుట్టుపక్కల గ్రామాల నుంచి మరో మూడు వేల ఎకరాలను రైతుల నుంచి తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దీంతో భోగాపురం మేజర్ పంచాయతీ, మండలంలోని నందింగాం పంచాయతీ పరిధిలోని ఐదు గ్రామాలకు చెందిన రైతులు ఏకమై మా ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వమంటూ ఆదివారం నిరసనకు దిగారు. వ్యవసాయ భూములే ఆధారంగా బతుకుతున్న రైతులకు, భూమి కోల్పోవడం వల్ల వారికి భవిష్యత్తుపై భయం కలుగుతుంది. రక్షణగా ఉండాల్సిన ప్రభుత్వమే తమ భూములను సేకరించడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో భోగాపురం పంచాయతీకి చెందిన రైతులు జాతీయ రహదారిని అనుకుని భారీ టెంట్లు వేసి పెద్దఎత్తున రైతాంగమంతా వేదికను ఏర్పాటు చేసుకుని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. -
● నివేదిక పంపాలని తహసీల్దార్కు ఆదేశాలు ● ఇద్దరు, ముగ్గురు ఉద్యోగులపై చర్యలు తీసుకునే అవకాశం ● రెవెన్యూ ఉద్యోగుల్లో టెన్షన్
చీపురుపల్లి: తహసీల్దార్ కార్యాలయంలో ఉద్యోగులు నిబంధనలకు విరుద్ధంగా రికార్డు లు తారుమారు చేయడం, ఒకరి భూములు మరొకరికి కట్టబెట్టడంపై కలెక్టర్ రాంసుందర్రెడ్డి సీరియస్ అయ్యారు. చీపురుపల్లి మండలంలోని కర్లాం గ్రామంలో రైతులు భూములు వేరొకరికి మార్చి, రిజిస్ట్రేషన్లు కూడా జరిగిపోయిన ఉదంతంపై ఆదివారం సాక్షి దినపత్రిక లో ‘రెవెన్యూ లీలలు’ అనే శీర్షికన కథనం వెలువడిన సంగతి తెలిసిందే. ఈ కథనానికి స్పందించిన కలెక్టర్ సీరియస్ అయ్యారు. కర్లాంలోని సర్వే నంబర్ 76 లో భూములు రికార్డులు తా రుమారుకు సంబంధించి తక్షణమే నివేదిక ఇవ్వాలని తహసీల్దార్ డి.ధర్మరాజును ఆదేశించారు. దీంతో తహసీల్దార్ నివేదిక తయారు చేసే పనిలో ఉన్నారు. అయితే ఆదివారం కావడంతో తాత్కాలిక నివేదిక పంపించి సోమవారం పూర్తి స్థాయిలో విచారణ జరిపి తుది నివేదిక కలెక్టర్కు సమర్పించనున్నట్టు తహసీల్దార్ తెలిపారు. రెవెన్యూ ఉద్యోగుల్లో టెన్షన్ ఇదిలా ఉండగా కర్లాం భూములు రికార్డులు తారుమారు అంశంపై సాక్షి పత్రికలో కథనం వెలువడడంతో రెవెన్యూ ఉద్యోగుల్లో టెన్షన్ మొదలైంది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఉద్యోగులు వారికి తెలిసిన రాజకీయ నాయకులు వద్దకు పరుగులు తీసి తమకేం కా కుండా చూడాలని కోరుతున్నట్టు సమాచారం. ఈ వ్యవహారంపై కలెక్టర్ సీరియస్ కావడం, నివేదిక కోరడంతో చీపురుపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఇద్దరు ముగ్గురు ఉద్యోగులు సస్పెండ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు కార్యాలయంలో చర్చ జరుగుతోంది. విజయనగరం ఫోర్ట్: కనీస వేతనం సాధించే వరకు పోరాటం ఆగదని ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం జరిగిన ఆ యూనియన్ రాష్ట్ర మహాసభలకు ఆమె హాజరై మాట్లాడారు. ఐసీడీఎస్ ఏర్పాటై 50 ఏళ్లు గడిచినా కేంద్ర బడ్జెట్లో సరిపడ నిధులు కేటాయించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 26 లక్షల మంది అంగన్వాడీలు 10 కోట్ల మందికి సేవలందిస్తున్నారని అయితే రూ.23 వేల కోట్లు కేటాయించి చేతులు దులిపేసుకున్నారని విమర్శించారు. ఒక్కొక్కరికి రూ.38 పైసలు మాత్రమే పెంచారని, పెరుగుతున్న ధరలతో ఎలా బతకాలన్నారు. గతంలో అంగన్వాడీలకు వేతనాలు పెంచుతామని హామీ కూడా ఇచ్చి మినిట్స్ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. ఈ నెల 11వ తేదీ నుంచి జరిగే రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో అయినా వేతనాలు పెంచేలా నిర్ణయం తీసుకోవాలన్నారు. జీవో ఇచ్చినా నేటికీ గ్రాట్యుటీ అమలు చేయడం లేదన్నారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, మినీ అంగన్వాడీ కార్యకర్తలందరినీ మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలుగా మార్చాలన్నారు. అనంతరం కొత్త కార్యవర్గం ఎన్నిక జరిగింది. జిల్లా అధ్యక్షులుగా ప్రభావతి, ప్రధాన కార్యదర్శిగా ఎస్.అనసూయ, కోశాధికారిగా ఎం.కృష్ణమ్మ, జిల్లా గౌరవాధ్యక్షులుగా టి.మాలతి, ఉపాధ్యక్షులుగా పి.జ్యోతి, పి.కుమారి, బి.పైడిరాజు, టి.తులసి సహాయ కార్యదర్శులుగా సరళ, రూప, నిర్మల తదితరులు ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన సభ్యులు అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తామని వెల్లడించారు. -
భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు
● దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ శోభారాణినెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో ఈ నెల 15 నుంచి జరగనున్న శివరాత్రి ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్(సీఎఫ్ఓ) కె. శోభారాణి ఆదేశించారు. రామతీర్థంలో శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను ఆదివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందితో మాట్లాడుతూ ఉత్సవాల్లో స్వామి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరుకానున్న నేపథ్యంలో ఏర్పాట్లు పక్కాగా ఉండాలన్నారు. ముఖ్యంగా క్యూల ఏర్పాటు అత్యంత కీలకమని, నిర్ణీత గడువులోగా క్యూలను దృఢంగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఎటువంటి తోపులాటలకు ఆస్కారం లేకుండా ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఈఓ వై. శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
ముమ్మరంగా వాహన తనిఖీలు
లక్కవరపుకోట : మండలంలోని అరుకు – విశాఖపట్నం జాతీయ రహదారిలో ఎస్ఐ నవీన్పడాల్ ఆధ్వర్యంలో పోలీసులు గడిచిన రెండు రోజులుగా ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 5వ తేదీన ‘ప్రమాదం గురూ..’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి పోలీసు అధికారులు స్పందించారు. ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా ఈ మార్గంలో ప్రమాదకరంగా వెళ్తున్న గడ్డి ట్రాక్టర్లను లక్ష్యంగా చేసుకొని తనిఖీలు చేస్తున్నారు. ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నట్టు అనిపిస్తే భారీ జరిమానాలు విధిస్తున్నామని ఎస్ఐ తెలిపారు. రహదారి నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
వేంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురికాక తప్పదు
విజయనగరం: కోట్లాది మంది భక్తులు కోలిచే తిరుమల వేంకటేశ్వరస్వామి ప్రతిష్టకు భంగం కలిగించటంతో పాటు ఆయన భక్తుల మనోభావాలను దెబ్బతీసే లా నిరాధార ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి నేతలు ఆ స్వామి ఆగ్రహానికి గురికాక తప్పదని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు హెచ్చరించారు. ఏ ఆధారం లేకుండానే లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారంటూ చేసిన ఆరోపణలపై సీబీఐ దాఖలు చేసి న ఛార్జీషీట్ కూటమికి చెంపపెట్టని పేర్కొన్నారు. చంద్రబాబు, కూటమి నేతలు విష బీజాలు ప్రజలు నమ్మరని, లడ్డూ ప్రసాదం ఆరోపణలపై లెంప లేసుకుని భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదివారం ధర్మపురిలో గల సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమల లడ్డూ కల్తీ ప్రచారం ప్రభుత్వానికి మాయని మచ్చగా మిగిలిపోతుందని మజ్జి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్య మంత్రి పదవుల్లో ఉన్న వ్యక్తులు పవిత్రమైన తిరుప తి లడ్డూలో గత ప్రభుత్వ హయాంలో జంతు కొవ్వు, పంది కొవ్వు వినియోగించారంటూ ఆరోప ణలు చేయటంతో పాటు అనుకూల మీడియాతో దుష్ప్రచారం చేశారన్నారు. తమ స్వార్ధ రాజకీయా ల కోసం వేంకటేశ్వరస్వామిని వాడుకోవటం దుర్మార్గమని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలపై సీబీఐ నేరుగా స్పందించి ఎన్డీఆర్ఐ, ఎన్డీబీ ల్యాబ్లలో పరీక్షలు జరిపి ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని తేటతెల్లం చేసిందన్నారు. సీబీఐ నివేదికతో వేంకటేశ్వరస్వామి భక్తులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. సనాతన ధర్మమంటూ గొప్పలు చెప్పే డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ నాడు లడ్డూపై అబద్దపు ప్రచా రం చేసి నేడు మాటలు మార్చటం హాస్యాస్పదంగా ఉందన్నారు. 2024 ఎన్నికలకు ముందు పవన్కళ్యాణ్ అదే తరహాలో జగన్మోహన్రెడ్డిపై ఆరోపణ లు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయటం నిజం కాదా అని ప్రశ్నించారు. దేవుడిపై తనకు నమ్మకం లేదని, తన కమ్యూనిస్టునంటూ పూటకో స్టేట్మెంట్ ఇచ్చి ప్రజలను మభ్యపెట్టారని విమర్శించారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ తన ఛార్జిషీట్లో ఎటువంటి కల్తీ జరగలేదంటూ నివేదిక ఇవ్వటంతో చంద్రబా బు, కూటమి నేతలు మళ్లీ ఏకమై కొత్త నాటకానికి తెరలేపటం సిగ్గుచేటన్నారు. ప్రజల నుంచి వ్యతిరేఖత పెరిగిందన్న భయంతోనే సీబీఐ సంస్థను కాద ని ఏకసభ్య కమిషన్ వేస్తామంటూ ప్రకటించారన్నా రు. వచ్చే ఎన్నికల వరకు పాలనను పక్కనపెట్టి ఇదే అంశంపై ప్రజలను మభ్యపెట్టేందుకు కొత్త డ్రామాలు ఆడుతుండటం దారుణమని, ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చేసిన రూ.3వేల కోట్ల అప్పు ఎవరి జేబుల్లోకి వెళ్లిందో చెప్పాలని మజ్జి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. తమ హయాంలో అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయటంతో పాటు ప్రతి గ్రామంలో ఆలయాలు నిర్మాణం చేపట్టామని గుర్తు చేశారు. రుషికొండలో భారీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించామని చెప్పారు. కూటమి ప్రభుత్వం విశాఖలో ఖరీదైన భూములను తమ తాబేదారులకు, ఎన్నికలకు ముందు ధన సహాయం చేసిన వారికి ఉచితంగా ధారాదత్తం చేస్తుందన్నారు. రాష్ట్రంలో కూటమి హయాంలో విద్య, వైద్య రంగాలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయని, పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందని, మధ్యాహ్న భోజనంలో నాణ్యత లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే నూతన విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య మరింత తగ్గుముఖం పట్టడం ఖాయమన్నారు. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పీహెచ్సీలో వైద్యులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అవగాహన లేని ప్రకటనలు చేస్తున్నారని మజ్జి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. పీపీపీ విధానంపై భోగాపురం ఎయిర్పోర్టు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు బేరీజు వేయటాన్ని తప్పుపట్టారు. ఎయిర్పోర్టుకు వెళ్లేవారు ఏ స్థాయిలో ఉంటారో... ప్రభు త్వ ఆస్పత్రికి వచ్చే వారు ఏ స్థాయిలో ఉంటారో అర్ధం చేసుకోవాలని హితవు పలికారు. పీపీపీ విధానం పెడితే ఎయిర్పోర్టుకు వెళ్లి రూ.వేలు చెల్లించి ప్రయాణించే వారిలా.... ఆస్పత్రికి వచ్చిన వారు డబ్బులు ఖర్చు చేసి వైద్యం చేయించుకోవాలా అంటూ ప్రశ్నించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు కెవి.సూర్యనారాయణరాజు, నెక్కల నాయుడుబాబు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్కుమార్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో పాలన సాగటం లేదని తెల్లారితే కల్తీ నెయ్యి అంటూ ఆరోపణలు చేయటం, ప్రశ్నించే వారిపై రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేయటమే వారి ప్రధాన కర్తవ్యంగా పెట్టుకున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హమీలు, ప్రకటించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టేందుకు కల్తీ నెయ్యి వ్యవహరాన్ని వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక్క కొత్త పింఛ ను మంజూరు చేయలేదని, ఆడబిడ్డ నిధి అమ లు కాలేదని, యువతకు నిరుద్యోగ భృతి ఏమైందని, సూపర్సిక్స్ హమీలు అమలు ఎప్పుడు చేస్తారని నిలదీశారు. ఇక అభివృద్ధి, సంక్షేమం అనే పదాలు ఈ ప్రభుత్వానికి పట్టకుండా పోయాయన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్ని స్తే రెడ్బుక్ రాజ్యాంగం పేరిట పెట్రోల్ బాంబులు, మారణాయుధాలుతో దాడులు చేయి స్తూ కొత్త సంస్కృతికి తెరలేపుతుండటం భాధాకరమన్నారు. రాష్ట్రంలో శాంతి భధ్రతలు పూర్తిగా క్షీణించిపోయాయని ధ్వజమెత్తారు. -
గాలిలో దీపంలా ప్రాణాలు
పార్వతీపురం రూరల్: జిల్లాలో మెరుగైన వైద్యం అందని ద్రాక్షలా మారుతోంది. నాడు వైఎస్సార్సీసీ ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాలో మెరుగైన వైద్యసేవలు అందించే దిశగా, మారుమూల ప్రాంతాల ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని చేరువ చేయాలని సంకల్పించిన ‘మల్టీ స్పెషాలిటీ’ ఆస్పత్రి కల నేడు చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యపు నీడలో చిక్కుకుంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రజల ప్రాణాలకు భరోసా కల్పించేలా అడుగులు పడితే.. నేటి పాలకులు ఆ ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. ఫలితంగా అత్యవసర సమయాల్లో ఆపన్నహస్తం అందక, విశాఖ కేజీహెచ్కు వెళ్లే దారిలోనే నిరుపేదల ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోతున్నాయి. నాడు సంకల్పం..నిధుల వెల్లువ గిరిజన ప్రాంతాల్లో వైద్య విప్లవానికి నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2020 అక్టోబర్ 2న శ్రీకారం చుట్టారు. పార్వతీపురంతో పాటు ఐదు ఐటీడీఏల పరిధిలో ఏడు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులకు వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేశారు. ఒక్క పార్వతీపురానికే రూ.49.26 కోట్లు కేటాయించడమే కాకుండా, మాతా శిశు సంరక్షణ కోసం అదనంగా మరో రూ.21.15 కోట్లు మంజూరు చేశారు. కరోనా వంటి కష్టకాలంలోనూ వెనకడుగు వేయకుండా, స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు పర్యవేక్షణలో స్థల సేకరణ, అనుమతుల ప్రక్రియను పరుగులు పెట్టించారు. గిరిజనులు అత్యవసర చికిత్స కోసం దాదాపు 140 కిలోమీటర్ల దూరంలోని విశాఖ కేజీహెచ్కు పరుగులు తీయాల్సిన అవసరం లేకుండా, ’ఆరోగ్యశ్రీ’ ద్వారా స్థానికంగానే సూపర్ స్పెషాలిటీ సేవలు అందించడమే లక్ష్యంగా పనులు ప్రారంభమయ్యాయి. నేడు ఉదాసీనత 2024 ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం, ఈ ప్రాంత ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసింది. అప్పట్లో శరవేగంగా సాగిన ఆస్పత్రి పనులు నేడు కుంటుపడ్డాయి. జిల్లా కేంద్రాస్పత్రి నుంచి రిఫరల్ గండాన్ని గట్టెక్కించే ఈ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని పూర్తి చేయడంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఫలితంగా రోడ్డు ప్రమాదాలకు గురైన వారైనా, గుండెపోటు వంటి అత్యవసర బాధితులైనా 146 కిలోమీటర్ల సుదూర ప్రయాణం చేయాల్సి వస్తోంది. సమయానికి వైద్యం అందక మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోతున్న హృదయ విదారక దశ్యాలు నిత్యకత్యమవుతున్నాయి. పాలకుల నిర్లక్ష్యంతో ఆగిన పనులు ప్రజలకు మంచి చేయాలన్న ఉన్నతమైన ఆశయంతో, ప్రజలకు, నిరుపేద గిరిజన బిడ్డల ప్రాణాలను కాపాడాలన్న సంకల్పంతో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి రూపకల్పన చేశారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, నిర్మాణాలు యుద్ధ ప్రాతిపదికన పూర్తి కావాలన్న తపనతో అవసరమైన నిధులను కూడా మంజూరు చేశారు. కానీ, నేడు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేయాలన్న కనీస ఇంగితం లేకుండా పోయింది. గత ప్రభుత్వంలో నిధులు మంజూరై, నిర్మాణం తుది దశలో ఉన్నా నేటి పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. ముందుకు జరిగే దిశగా అడుగులు పడడం లేదు. ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసి, ప్రైవేటుపరాన్ని చేయాలని చూడడం అలాగే రాజకీయ కక్ష సాధింపులకు ప్రాధాన్యం ఇవ్వడం అత్యంత బాధాకరం. అలజంగి జోగారావు, మాజీ ఎమ్మెల్యే, పార్వతీపురం విశాఖ చేరేలోపే ఆగిపోతున్న ఊపిరి నత్తనడకన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు నాటి ప్రభుత్వంలో రూ.61 కోట్లు మంజూరు అయినా ముందుకు సాగని పనులు -
దరఖాస్తుల ఆహ్వానం
గజపతినగరం : గజపతినగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వ్యాయామ అతిథి అధ్యాపక నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రావాడ సత్యనారాయణ శనివారం తెలిపారు. వ్యాయామ సబ్జెక్టుకు సంబంధించిన అభ్యర్థులు తమ విద్యార్హతలతో కూడిన దరఖాస్తును కళాశాలకు ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5గంటల లోపుగా పంపాల్సిందిగా ఆయన సూచించారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్ట్లో కనీసం 55 శాతం మార్కులతో పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నారు. నెట్, స్లెట్, సెట్, పీహెచ్డీ వంటి అదనపు విద్యార్హతలు కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీల్లో వాసు సత్తా గుర్ల: రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలలో గుర్లకు చెందిన మంత్రి వాసు రాణించి వెండి పతకాన్ని కై వసం చేసుకున్నాడు. చిత్తూరులోని 75 కేజీల విభాగంలో జరిగిన కుస్తీ పోటీలలో ఉత్తమ ప్రదర్శన చేసి వెండి పతకాన్ని గెలిచినట్టు కుస్తీ కోచ్ కర్రోతు జగదీశ్ శనివారం తెలిపారు. మంత్రి వాసు ప్రస్తుతం గరివిడిలోని ఎస్డీఎస్ కాలేజీలో డిగ్రీ మూడో ఏడాది చదువుతున్నాడు. వెండి పతకాన్ని గెలిచిన వాసుకు గ్రామస్తులు, కళాశాల అధ్యాపకులు అభినందించారు. -
కార్మికా.. రేపటి భద్రత మర్చిపోవద్దు..!
● 18–45 ఏళ్లలో పథకాల్లో చేరితే.. 60 ఏళ్ల తర్వాత రూ.3వేలు ● జిల్లాలో 10,234 మంది కార్మికుల నమోదువిజయనగరం గంటస్తంభం: రోజూ కష్టపడి పని చేసే అసంఘటిత రంగ కార్మికుడికి వృద్ధాప్యంలో ఆర్ధిక భద్రత కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం శ్రమ యోగి మాన్ ధన్, లఘువ్యాపారి మాన్ ధన్ పెన్షన్ పథకాలను అమలు చేస్తోంది. 18 నుంచి 40 ఏళ్లలోపు అర్హులైన వారు ఈ పథకాల్లో చేరితే 60 ఏళ్ల తర్వాత ప్రతి నెల రూ.3 వేల పెన్షన్ నేరుగా బ్యాంకు ఖాతాలో జమవుతుంది. తక్కువ చందాతో జీవిత భరోసా.. నెలకు కేవలం రూ.55 నుంచే చందా చెల్లించి భవిష్యత్తుకు భద్రత పొందవచ్చు. లబ్ధిదారుడు చెల్లించే మొత్తానికి సమానంగా కేంద్ర ప్రభుత్వం కూడా జమ చేస్తుంది. జిల్లాలో ఇప్పటివరకు 10,234 మంది కార్మికులు ఈ పథకాలలో నమోదు అయ్యారు. అర్హులు ఎవరంటే... శ్రమ యోగి మాన్ ధన్ పథకానికి వీధి వ్యాపారులు, రిక్షా కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు, గృహ కార్మికులు, మధ్యాహ్న భోజన కార్మికులు అర్హులు. నెలసరి ఆదాయం రూ.15వేల లోపు ఉండి, ఈఎస్ఐ, ఈసీఎఫ్ లేని వారు ఈ పథకంలో చేరవచ్చు. లఘువ్యాపారి మాన్ ధన్ పథకానికి చిన్న దుకాణ యజమానులు, స్వయం ఉపాధిదారులు, రిటైల్ వ్యాపారులు, హోటల్ యజమానులు అర్హులు. కుటుంబానికీ రక్షణ ఈ పథకంలో చేరిన వారికి 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3వేలు పెన్షన్ లభిస్తుంది. పెన్షనుదారు మృతి చెందితే జీవిత భాగస్వామికి 50 శాతం పెన్షన్ జీవితకాలం అందుతుంది. నమోదు విధానం సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (మీ–సేవ) ద్వారా ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, నామినీ ఆధార్తో నమోదు చేసుకోవచ్చు. వృద్ధాప్య భద్రత కార్మికుడి చేతుల్లోనే.. కార్మికుడు తన వృద్ధాప్యాన్ని తానే భద్రపరుచుకునే అవకాశం ఇది. నెలకు కొద్ది మొత్తం చందాతో జీవితాంతం పెన్షన్ భరోసా లభించే ఈ పథకాలను నిర్లక్ష్యం చేయకూడదు. అసంఘటిత రంగ కార్మికులు, చిన్న వ్యాపారస్తులు అర్హత ఉన్నప్పుడు చేరితేనే రేపటి భద్రత సాధ్యమవుతుంది. జిల్లాలో ఇప్పటికే వేల మంది ముందడుగు వేశారు. ఇంకా మిగిలిన ప్రతి అర్హుడు తప్పకుండా ఈ పథకాలలో చేరాలి. & G‹ÜyîlÒ {ç³Ýë§ýl-Æ>Ð]l#, hÌêÏ M>ÇÃMýS Ô>Q ˘ ఉప కమిషనర్, విజయనగరం -
ప్రమాదాలకు కారణాలను అన్వేషించాలి
● ప్రమాదాల బ్లాక్ స్పాట్స్ను గుర్తించి నియంత్రణ చర్యలు చేపట్టండి ● ఎస్పీ ఎ.ఆర్.దామోదర్డెంకాడ: రహదారి భద్రతలో భాగంగా జాతీయ రహదారి 16పై బ్లాక్ స్పాట్స్ ప్రాంతాలను పరిశీలించి ప్రమాద కారణాలను గుర్తించాలని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ అన్నారు. డెంకాడ పోలీస్స్టేషన్ పరిధిలో బ్లాక్ స్పాట్స్ను ఆయన శనివారం పరిశీలించారు. ప్రమాదాల నియంత్రణకు సెంట్రల్ రెయిలింగు, సైన్ బోర్డులు, లైటింగ్, జిగ్ జాగ్ స్టాపర్లు, సర్వీసు రోడ్లపై స్పీడు బ్రేకర్లు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. బ్లాక్ స్పాట్స్ వద్ద డ్రోన్ సహాయంతో ఇంజినీరింగ్ లోపాలను గుర్తించి, నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. జాతీయ రహదారికి ఇరువైపుల ఉన్న గ్రామాల వద్ద పాదచారులు రహదారి దాటే క్రమంలో ప్రమాదాలకు గురవుతున్నారని, ఆయా ప్రాంతాల్లో సెంటర్ డివైడర్పై రైలింగ్ వేయాలన్నారు. ప్రమాదాలు జరిగేందుకు కొన్ని ప్రాంతాల్లో లైటింగ్ సరిగ్గా లేకపోవడం గుర్తించామని, ఆయా ప్రాంతాల్లో లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. అంతేకాకుండా, జాతీయ రహదారి, సర్వీసు రోడ్లు కనెక్ట్ అయ్యే ప్రాంతాల్లో సర్వీస్ రోడ్లపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు జిగ్ జాగ్ స్టాపర్స్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు వాహనాల నంబర్లను గుర్తించే విధంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని టోల్ ప్లాజా అధికారులకు తెలియజేయాలన్నారు. ఆయన వెంట డెంకాడ ఎస్ఐ ఎ.సన్యాసి నాయుడు, ఎస్బీ సీఐ ఎ.వి.లీలారావు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొనారు. -
కేంద్ర సాయుధ దళాల్లో ఎంపికై న ఎన్సీసీ క్యాడెట్లు
విజయనగరం అర్బన్: సత్య డిగ్రీ కళాశాలకు చెందిన ఎనిమిది మంది ఎన్సీసీ క్యాడెట్లు కేంద్ర సాయుధ దళాలైన సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్లలో ఉద్యోగాలకు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీ సాయిదేవమణి తెలిపారు. సీఐఎస్ఎఫ్లో బి.పూర్ణిమ, స్వాతి, మోహన్, శ్రీను, ఎం.శ్రీను, పి.సాయికుమార్, సీఆర్పీఎఫ్లో వెంకటేష్, బీఎస్ఎఫ్లో శ్రవణకుమార్ ఉద్యోగాలకు ఎంపికయ్యారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం కళాశాల ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ డాక్టర్ బొత్స ఝాన్సీలక్ష్మి, కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు, కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది అభినందించారు. -
హ్యాకథాన్లో జీఎంఆర్ ఐటీ విద్యార్థుల ప్రతిభ
రాజాం సిటీ: విజయవాడలో నిర్వహించిన అమరావతి క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్ ఫైనల్స్లో జీఎంఆర్ ఐటీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచారని ప్రిన్సిపాల్ డాక్టర్ సీఎల్వీఆర్ఎస్వీ ప్రసాద్ శనివారం తెలిపారు. జాతీయ స్థాయిలో ఉన్నత విద్యా మండలి పది ప్రొబ్లమ్ స్టేట్మెంట్ల్పై నిర్వహించిన ఈ పోటీల్లో దేశం నలుమూలల నుంచి 800 మంది విద్యార్థులు పాల్గొన్నారని పేర్కొన్నారు. ఒక్కొక్క ప్రొబ్లం నుంచి 12 టీంలను ఫైనల్స్కు ఎంపిక చేశారని, అందులో తమ విద్యార్థులు రూపొందించిన క్వాంటమ్ స్టేట్ విజువలైజర్ అనే ప్రాజెక్టుకు ప్రథమ బహుమతి లభించిందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా క్విబిట్స్, సూపర్ పొజిషన్, ఎంటాంగిల్మెంట్ వంటి క్వాంటమ్ కంప్యూటింగ్ మౌలిక భావాలను సులభంగా, దృశ్య రూపంలో అర్ధం చేసుకోవచ్చని తెలిపారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.మధుమూర్తి రూ.50 వేలు చెక్కుతో పాటు విజేతలకు జ్ఞాపికలు అందజేశారని తెలిపారు. విద్యార్థుల ప్రతిభ పట్ల జీఎంఆర్ వీఎఫ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ జె.గిరీష్, సీఈసీ విభాగం నుంచి డాక్టర్ ఏవీ రమణ తదితరులు అభినందించారు. -
ఇటలీలో ఉద్యోగ అవకాశాలు
● జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ప్రశాంత్కుమార్ రామభద్రపురం: ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఇటలీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోందని.. అర్హత ఉన్న యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ప్రశాంత్కుమార్ అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. కాంక్రీట్ పంపు డ్రైవర్, కన్స్ట్రక్సన్ కార్పెంటర్, కన్స్ట్రక్సన్ ఫోర్మెన్, ఐరన్ వర్కర్, ట్రక్ డ్రైవర్ తదితర ఉద్యోగాలకు అవకాశం ఉందన్నారు. ఆయా ఉద్యోగాలకు ఇంటర్, ఐటీఐ, డిప్లమా విద్యార్హతతో పాటు మూడేళ్ల పాటు ఆయా వృత్తులలో పూర్తి అనుభవం ఉండాలన్నారు. నెలకు జీతం రూ.2.30 లక్షలు ఇస్తారన్నారు. ఇటలీ వెళ్లడానికి ఇంగ్లిష్ పరిజ్ఞానం ఉండాలన్నారు. అలాగే వెళ్లే అభ్యర్థులు రూ.1 లక్ష సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.1లక్ష, రిజిస్ట్రేషన్, సర్వీస్ చార్జీలు కింద రూ.35 వేలు చెల్లించాలన్నారు. ఈ డబ్బులు ఇటలీలో సెలక్ట్ అయి ఆరు నెలలు పని చేసిన తర్వాత మొత్తం రూ.1.35 లక్షలు తిరిగి ఇచ్చేస్తారని చెప్పారు. ఎంపికై న అభ్యర్టులకు న్యూఢిల్లీలోని ఇటాలియన్ ఎంబసీలో శిక్షణ ఇస్తారన్నారు. ఎంపికై న అభ్యర్ఠులకు సెక్యూరిటీ అంతా ప్రభుత్వమే చూసుకుంటుందన్నారు. ఇంట్రస్ట్ ఉన్న అభ్యర్థులు నైపుణ్య.ఏపీ.గోవ్,ఇన్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో డీటీ గిరిధర్ పాల్గొన్నారు. -
అగ్ని ప్రమాదం
సంతకవిటి: మండలంలోని గోవిందపురం గ్రామంలో కరెంట్ వైర్లు తెగి పడిన కారణంగా శనివారం రాగోలు గణనాధకు చెందిన 10 ధాన్యం బస్తాలు, 2 ఎకరాలు మినప చేను, 3 ఎకరాలు గడ్డి వాములు దగ్ధమైనట్టు రాజాం ఫైర్ సిబ్బంది తెలిపారు. వీటి విలువ దాదాపు రూ.60 వేలు ఉంటుందని తెలిపారు. రాజాం ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి సకాలంలో చేరుకుని మంటలను అదుపు చేయడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. గరికిపాడులో.. మండలంలోని గరికిపాడు గ్రామానికి చెందిన వావిలపల్లి రమణకు చెందిన ఎకరం చెరకు తోట అగ్నికి ఆహుతైంది. ఫైర్ సిబ్బంది గ్రామానికి చేరుకున్నప్పటికీ చెరకు తోట దగ్గరకు వెళ్లే మార్గం లేక పోవడంతో వెనుదిరిగింది. గ్రామస్తులు స్పందించి మంటలను అదుపుచేశారు. లేదంటే చుట్టూ ఉన్న దాదాపు నాలుగు ఎకరాల చెరకు తోట దగ్ధమయ్యేదని గ్రామస్తులు తెలిపారు. -
పారా జాతీయ స్థాయి పోటీలకు జిల్లా క్రీడాకారులు
విజయనగరం: జాతీయ స్థాయిలో జరగనున్న పారా అథ్లెటిక్స్ పోటీలకు జిల్లాకు చెందిన క్రీడాకారులు అర్హత సాధించారు. ఇటీవల నెల్లూరులో జరిగిన పారా (దివ్యాంగుల) రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభతో పతకాలు సాధించిన ముగ్గురు క్రీడాకారులు త్వరలో ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్లో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్టు జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్ శనివారం తెలిపారు. జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించిన వారిలో కిల్లక లలిత 100, 400, 1500 మీటర్ల పరుగు పోటీల్లో, కొత్తింటి పైడిరాము డిస్కస్ త్రోలో, కరణం గౌతమ్ లాంగ్ జంప్లో పాల్గొంటారని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచటంతో పాటు జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించిన క్రీడాకారులను అభినందించారు. జాతీయ పోటీల్లో ప్రతిభ కనబరిచి విజయనగరం జిల్లా కీర్తి ప్రతిష్టలను చాటి చెప్పాలని ఆకాంక్షించారు. -
గోల్డ్ మెడల్ విజేతలకు ఎస్పీ అభినందన
విజయనగరం క్రైమ్ : అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధించిన విజయనగరం వన్ టౌన్ లేఎస్ఐ ఆల్తి త్రినాధరావు, రిటైర్డ్ ఏఆర్ హెచ్సీ మజ్జి శంకరరావును ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ శనివారం తన చాంబర్లో అభినందించారు. ఇటీవల నేపాల్లోని పోకరాలో జరిగిన అంతర్జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ మీట్లో వీరు రాణించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించి యువతకు, ఔత్సాహిక క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ పోటీల్లో 60+ విభాగంలో వన్ టౌన్ ఏఎస్ఐ ఆల్తి త్రినాధరావు పాల్గొనగా, 70+ విభాగంలో రిటైర్డ్ ఏఆర్ హెచ్సీ మజ్జి శంకరరావు పాల్గొన్నారన్నారు. ఐదు దేశాలకు చెందిన క్రీడాకారులతో పోటీపడి, అన్ని విభాగాల్లో గోల్డ్ మెడల్స్ సాధించారన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, విజయనగరం వన్ టౌన్ సీఐ ఆర్.వి.ఆర్.కె.చౌదరి, ఎస్బీ సీఐ ఎ.వి.లీలారావు, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా
విజయనగరం కలెక్టరేట్: రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై రాష్ట్ర 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లెంకా దినకర్ ఆరా తీశారు. కలెక్టరేట్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జల్జీవన్మిషన్, గృహనిర్మాణం, ఉపాధి, విద్యాపథకాల అమలును సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని చాలా పాఠశాలల్లో ఇప్పటికీ కట్టెలపొయ్యిలపైనే మధ్యాహ్నభోజనం వండుతున్నారన్నారు. ఎస్.కోట ప్రాంతంలో శుద్ధిచేయని నీటితోనే వంట చేస్తున్నారని, వేపాడలో బురదనీటిని తాగునీటిగా వినియోగిస్తున్నారని తెలిపారు. జల్జీవన్ మిషన్ పనులు పూర్తిచేసి తాగునీటి కష్టాలకు చెక్చెప్పాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురేష్బాబు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు, కలెక్టర్ రామ్సుందర్రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
భూములు లాక్కుంటే ఊరుకునేది లేదు
● గర్జించిన భోగాపురం, సుందరపేట రైతులు భోగాపురం: తరతరాలుగా సాగు చేసుకుంటున్న జీవనాధారమైన భూములను అభివృద్ధి పేరుతో లాక్కుంటే ఊరుకునేది లేదని భోగాపురం, సుందరపేట గ్రామాల రైతులు స్పష్టం చేశారు. తమ పొలాల వద్ద శనివారం ప్లకార్డులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. కూటమి ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ పార్కులు, ఎడ్యుకేషన్ హబ్లు అంటూ రహస్యంగా భూముల సర్వే చేయడంపై మండిపడ్డారు. రైతుల పోరాటానికి స్థానిక ప్రజా ప్రతినిధులు పడాల శ్రీనివాసరావు, కొమ్మూరు సుభోషణరావు, సుందర హరీష్, పడాల భానుప్రకాష్, పల్లంట్ల జగదీష్ తదితరులు మద్దతు ప్రకటించారు. -
రెవెన్యూ లీలలు..!
అలా ఎలా మార్చేస్తారు..?చీపురుపల్లి: జిల్లాలో కొందరు రెవెన్యూ అధికారులు, ఉద్యోగుల తప్పిదాలు రైతులకు శాపంగా మారుతున్నాయి. ఒకరి ఆధీనంలో ఉన్న భూమి వేరొకరిపేరుపై మారిపోతున్న తీరు ఆవేద నకు గురిచేస్తోంది. లంచాల ముసుగులో ఇష్టారాజ్యంగా రికార్డులు తారుమారు చేస్తుండడంతో అమాయకులైన రైతులు బలైపోతున్నారు. లబోదిబోమంటూ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటి కొత్తతరహా రెవెన్యూ అక్రమాలు ఎన్నడూ చూడలే దంటూ చీపురుపల్లి మండలం కర్లాం గ్రామ రైతులు గగ్గోలుపెడుతున్నారు. 1980 నుంచి భూములు సాగు చేసుకుంటున్న రైతులకు తెలియకుండానే పక్క జిల్లాలోని సంబంధం లేని వ్యక్తుల పేరున భూములు మార్చేయడం, ఒన్బీలు మంజూరు చేసిన ఘటన రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. రిజిస్ట్రేషన్ పత్రాలు ఉండి, భూములు తమ సాగులోనే ఉన్నప్పటికీ రికార్డులు ఎలా మార్చేస్తారన్న కర్లాం రైతుల ప్రశ్నకు అధికారుల వద్ద సమాధానం కరువవుతోంది. 46 సంవత్సరాల కిందట రిజిస్టర్ కాబడిన ఆ భూములు ఇప్పుడు సంబంధంలేని వ్యక్తుల పేర్లుతో మార్చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లంచాలు తీసుకుని తమకు అన్యాయం చేయాలని చూస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. కర్లాం గ్రామంలో సర్వే నంబర్ 76లో 21 ఎకరాల భూములు ఉండేవి. ఆ భూములు అప్పటి వరకు రాజుల ఆధీనంలో ఉండేవి. అయితే, తరువాత కాలంలో వేరే ప్రాంతానికి వెళ్లిపోయిన రాజులు.. 1980లోనే చాలా మంది రైతులకు రిజిస్ట్రేషన్లు చేసి మరీ భూములు ఇచ్చేశారు. ఆ భూములను తాజాగా సంబంధం లేని వారసులను పుట్టించి గెడ్డకంచరాం గ్రామానికి చెందిన శిరువూరు సూరీడమ్మ పేరున 3.11 ఎకరాలకు వన్బీలను చీపురుపల్లి రెవెన్యూ కార్యాలయం నుంచి మంజూరు చేశారు. ఆమె భూమిని తన కుమార్తె గొట్టిముక్కల నాగమ ణికు రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో నాగమణి కర్లాం సహకార బ్యాంకులో రూ.15 లక్షల రుణం కూడా తీసుకున్నారు. విషయం తెలుసుకున్న రైతులు మా భూములను సూరీడమ్మ పేరున ఎలా ఒన్బీలు ఇస్తారంటూ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఒకరి భూమి వేరొకరికి బదలాయింపు భూములతో సంబంధం లేని వారికి కొత్తగా ఒన్బీల మంజూరు వాటితోనే రిజిస్ట్రేషన్లు ఈ వ్యవహారంలో రూ.లక్షలు చేతులు మారినట్టు సమాచారం ఆవేదనలో కర్లాం గ్రామ రైతులు -
9న ‘డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎమ్డీ’
విజయనగరం రూరల్: విద్యుత్ సమస్యలు పరిష్కారానికి ఈ నెల 9వ తేదీన ‘డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎమ్డీ’ కార్యక్రమానికి శ్రీకారం చుడతామని సీఎమ్డీ పృధ్వీతేజ్ ఇమ్మడి తెలిపారని విజయనగరం ఎస్ఈ మువ్వల లక్ష్మణరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సంబంధిత సమస్యలను మరింత వేగవంతంగా పరిష్కరించాలన్నదే దీని ప్రధాన ఉద్దేశమన్నారు. ఉత్తరాంధ్ర విద్యుత్ వినియోగదారులు ఫోన్ నంబర్ 86884 00499కు ఫోన్చేసి విద్యుత్ సమస్యలు తెలియజేయవచ్చన్నారు. డయల్యువర్ సీఎమ్డీ కార్యక్రమాన్ని విశాఖపట్నం ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు నిర్వహిస్తారన్నారు. ఏపీపీఎస్సీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి విజయనగరం కలెక్టరేట్: అటవీశాఖలో నాలుగు, దేవదాయశాఖలో ఒక పోస్టు భర్తీకి ఏపీపీఎస్సీ ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్న పరీక్షలకు ఏర్పాట్లు పూర్తిచేశామని డీఆర్వో నూకరాజు తెలిపారు. పరీక్షలకు 6,700 మంది హాజరవుతున్నారని, విజయనగరం సమీపంలో జేఎన్టీయూ, సీతం కాలేజీల్లో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. రెవెన్యూ లీలలు.. కూటమి మాయలు ● ఐదేళ్ల కిందట చనిపోయిన వ్యక్తి పేరుతో పాస్పుస్తకం రాజాం/సంతకవిటి: గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భూముల రీసర్వే చేపట్టింది. ఎన్నోఏళ్లుగా రైతులను వెంటాడుతున్న భూ సమస్యలకు పరిష్కారం చూపింది. ఈ సర్వేను వక్రీకరించిన కూటమి ప్రభుత్వం... అధికారంలోకి వచ్చిన తరువాత గత సర్వేలో జరిగిన తప్పులు సరిదిద్దుతున్నామంటూ తప్పులతడకలతో కూడిన పాసుపుస్తకాలను అందజేస్తోంది. దీనికి సంతకవిటి మండలం మందరాడ గ్రామానికి చెందిన గార అసిరినాయుడుకు అందజేసిన పాస్పుస్తకమే నిలువెత్తు నిదర్శనం. ఆయన కుటుంబానికి మందరాడలో 47 సెంట్లు భూమి ఉంది. తన తల్లి సత్తెమ్మ పేరుమీద ఉండేది. ఆమె ఐదేళ్ల కిందట మృతిచెందింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన రీ సర్వేలో భూ హక్కుపత్రం ఆయన పేరుకు మారింది. ఒన్బీ రావడంతో సంతోషపడ్డారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొత్తగా మళ్లీ ఆయన తల్లి సత్తెమ్మపేరుతో పాస్పుస్తకం ఇవ్వడంతో సమస్య మొదటికొచ్చిందంటూ గగ్గోలు పెడుతున్నారు. గ్రామ సచివాలయానికి వెళ్లి వీఆర్వో సత్యనారాయణను కలిస్తే మళ్లీ భూ సర్వేకు, రీ మ్యుటేషన్కి పెట్టమంటున్నారంటూ ఆయన వాపోయారు. ఐరోపా పర్యటనకు మన్యం మహిళ పార్వతీపురం రూరల్: ప్రకృతి వ్యవసాయంలో విశేష అనుభవం గడించిన పార్వతీపురం మన్యం జిల్లా దురుబిలి గ్రామానికి చెందిన ఆరిక నరసమ్మ అంతర్జాతీయ అధ్యయన పర్యటనకు ఎంపికయ్యారు. శనివారం ఆమెను కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి అభినందించారు. బెర్లిన్లోని ‘ఫౌండేషన్ ఆన్ ఫ్యూచర్ ఫార్మింగ్’ సంస్థ ఆధ్వర్యంలో ఐరోపాలోని ఏడు దేశాల్లో 30 రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎంపికై న 611 మంది రైతు శాస్త్రవేత్తలు, 350 మంది మెంటర్లలో జిల్లా నుంచి నరసమ్మకు చోటు లభించింది. పర్యటనలో భాగంగా 2,000 చదరపు మీటర్ల గ్లోబల్ ఫీల్డ్ మోడల్, వివిధ దేశాల్లోని సేంద్రియ వ్యవసాయ క్షేత్రాలు, పరిశోధనా సంస్థలను సందర్శించడంతో పాటు అక్కడి విధాన నిర్ణేతలతో చర్చల్లో ఆమె పాల్గొననున్నారు. -
భూ ఆక్రమణదారులకు నోటీసులు
రాజాం: పట్టణంలోని పాలకొండ రోడ్డులో ప్రభుత్వ, దేవదాయశాఖ భూముల ఆక్రమణదారులకు దేవదాయశాఖ అధికారులు శనివారం నోటీసులు ఇచ్చారు. రాజాంలోని దేవదాయశాఖకు చెందిన స్థలాల ఆక్రమణపై ‘చూసెయ్ జాగా.. వేసెయ్ పాగా..!’ అనే శీర్షికన శనివారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. పట్టణంలో సర్వే నంబర్ 8లో కొన్ని స్థలాల అంశంపై వివాదం హైకోర్టులో పెండింగ్లో ఉన్నట్టు దేవదాయశాఖ రాజాం ఈఓ బీవీ మాధవరావు తెలిపారు. త్వరలో తీర్పు వెలువడనుందని, హైకోర్టు ఆదేశాలతో అక్కడ ఆక్రమణలు తొలగిస్తామని చెప్పారు. మిగిలిన స్థలాల ఆక్రమణదారులకు దేవదాయ భూముల రికవరీ చట్టం సెక్షన్–83 ప్రకారం నోటీసులు ఇచ్చామని, ఉమామహేశ్వర లక్ష్మీనారాయణ స్వాముల దేవాలయానికి చెందిన ఈ స్థలాలు రక్షణకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఆక్రమణలు, కోర్టు వివాదాల స్థలాల వివరాలతో కూడిన నివేదికను ఉన్నతాధికారులకు అందించామని ఈఓ తెలిపారు. -
ఎస్సీ కమిషన్కు వినతుల వెల్లువ
● దళితుల సమస్యలను యంత్రాంగం పట్టించుకోవడంలేదంటూ నిట్టూర్పు విజయనగరం అర్బన్: జిల్లాలో దళితుల సమస్యల పేరుకుపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పలువురు దళితులు ఎస్సీ కమిషన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారాం శనివారం జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా పరిషత్ అతిథి గృహంలో వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన దళిత నాయకులు భూ సమస్యలు, పట్టాల మంజూరులో జాప్యం, భూముల ఆక్రమణ, రిక్షా కార్మికులకు రుణాల మంజూరు లోపాలు, సంక్షేమ పథకాల అమలు కాగితాలకే పరిమితవుతున్నాయని కమిషన్ సభ్యునికి వినతులు సమర్పించారు. కొన్నేళ్లుగా ఫిర్యాదులు ఇస్తున్నా అధికారులు స్పందించడం లేదని తెలిపారు. అందిన వినతులపై సంబంధిత అధికారులతో చర్చించి, బాధితులకు న్యాయం జరిగేలా కమిషన్ స్థాయిలో జోక్యం చేసుకుంటామని హామీ ఇచ్చారు. ఆయనకు తొలుత డీఆర్వో ఎం.నూకరాజు, ఆర్డీఓ దాట్ల కీర్తి, డీడీ అన్నపూర్ణమ్మ, ఈడీ వెంకటేశ్వరరావు, పలువురు దళిత నాయకులు ఘన స్వాగతం పలికారు. -
ఖాళీ పేపర్లే విద్యుత్ బిల్లులు
● అయోమయంలో వినియోగదారులు భోగాపురం: విద్యుత్శాఖ సిబ్బంది నిర్లక్ష్యం వినియోగదారులను ఆవేదనకు గురిచేస్తోంది. భోగాపురంలో మీటర్లను స్కాన్చేసి ఇచ్చిన బిల్లులపై వినియోదారుని పేరు, వినియోగించిన యూనిట్లు, చెల్లించాల్సిన మొత్తం వివరాలేవీ లేకుండా ఖాళీ కాగితం పేపర్లు ఇవ్వడంతో వినియోగదారులు భగ్గుమంటున్నారు. ఎంత బిల్లు చెల్లించాలో ఎలా తెలుస్తుందని ప్రశ్నిస్తున్నారు. యంత్రాల్లోని సాంకేతిక లోపానికి తాము మూల్యం చెల్లించాలా అని ప్రశ్నిస్తున్నారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే వినియోగదారులకు సరైన బిల్లులు అందజేసి ఆలస్య రుసుము లేకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. -
విజయనగరం
కార్మికా.. రేపటి భద్రత మర్చిపోవద్దు..! అసంఘటిత రంగ కార్మికులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పెన్షన్ పథకాలను అమలు చేస్తోంది.ఆదివారం శ్రీ 8 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026ఈ చిత్రంలోని రైతు పేరు కొమ్మాన వీరభద్రుడు. కర్లాం గ్రామం. ఈయన తల్లి కొమ్మాన పైడమ్మ పేరుతో సర్వే నంబర్ 76లో 0.66 సెంట్లు భూమి ఉంది. ఆ భూమిని 1980లో దాట్ల వెంకట గోపాలకృష్ణ రాజు కొమ్మాన పైడమ్మకు రిజిస్ట్రేషన్ చేశారు. డాక్యుమెంటు నంబర్ 209/80తో కూడిన రిజిస్టర్డ్ పత్రాలు కూడా ఉన్నాయి. ఈ భూమిని కొమ్మాన వీరభద్రుడు, కొమ్మాన గవరయ్య అన్నదమ్ములు చెరో 0.33 సెంట్లు భూమిని అప్పటి నుంచి సాగు చేసుకుంటున్నారు. అయితే, ఈ భూమిని జి.సిగడాం మండలంలోని గెడ్డకంచరాం గ్రామానికి చెందిన శిరువూరు సూరీడమ్మ పేరున రికార్డులు మార్చేశారు. ఈ భూమిని కూడా ఆమె కుమార్తె పేరుపై రిజిస్ట్రేషన్ చేసేశారు. ఇదెక్కడి అన్యాయం అంటూ వీరభద్రుడు వాపోతున్నాడు. -
ఫీజుల భారం మోయలేం
విజయనగరం గంటస్తంభం: ప్రైవేట్, కార్పొరేట్, డీమ్డ్ యూనివర్సిటీల్లో విద్యార్థులను ఆర్థికంగా దోచుకుంటున్నారు.. ఫీజులు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారు... ఈ ఫీజుల భారం మోయలేమంటూ విద్యార్థులు కదం తొక్కారు. విద్యాహక్కును వ్యాపారంగా మార్చుతున్న విధానాలపై నిరసన తెలిపారు. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మయూరి కూడలి నుంచి విజయనగరం కాంప్లెక్స్ వరకు శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కాంప్లెక్స్ వద్ద మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్మి డి.రాము, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్మి నాగభూషణ్ మాట్లాడుతూ... విద్యార్ధుల భవిష్యత్తును తాకట్టుపెట్టేలా జరుగుతున్న అక్రమ ఫీజుల వసూళ్లను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. విద్య అనేది హక్కు తప్ప లాభసాటిగా మార్చే వస్తువు కాదని, పేద–మధ్యతరగతి విద్యార్థులు చదువు కొనసాగించలేని స్థితికి నెట్టబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజురీయింబర్స్ మెంట్ బకాయిల చెల్లింపులో జాప్యం తగదన్నారు. విద్యార్థుల కన్నీళ్లు, తల్లిదండ్రుల కష్టాన్ని పట్టించుకోని పాలక విధానాలకు వ్యతిరేకంగా ఈ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మోహన్బాబు యూనివర్సిటీకి ఇచ్చిన అనుమతులను రద్దు చేసి, యూనివర్సిటీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఎస్ఎఫ్ఐ నాయకుల కిడ్నాప్ ఘటనలో బాధ్యులైన నటుడు మోహన్బాబు, విష్ణు, పీఆర్ఓ సతీష్లను వెంటనే అరెస్టు చేయాలని, విద్యార్ధుల నుంచి అక్రమంగా వసూలు చేసిన డబ్బును పూర్తిగా తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు శిరీష, భారతి, జయ, వంశీ, సూరిబాబు, ఏఐఎస్ఎఫ్ నాయకులు రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. రోడ్డెక్కిన విద్యార్థులు విజయనగరంలో ఆందోళన మోహన్బాబు యూనివర్సిటీపై చర్యలు తీసుకోవాలి ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ డిమాండ్ -
జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు చర్యలు
పూసపాటిరేగ: జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను ఆయన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీస్స్టేషన్ పరిసరాలను ఆహ్లాదకరంగా ఉంచాలని, అలాగే పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని, వారి చెప్పే సమస్యలను శ్రద్ధగా విని పరిష్కరించాలన్నారు. స్టేషన్ పరిధిలో ఎక్కువగా సీసీ కెమెరాలు అమర్చాలని, గస్తీ, జాతీయ రహదారిపై పెట్రోలింగ్ వంటి చర్యలను కట్టుదిట్టం చేయాలన్నారు. అనంతరం పోలీస్స్టేషన్ రికార్డులు, సీడీ ఫైల్స్, హిస్టరీ సీట్లు, నాన్బెయిలబుల్ వారెంట్లపై సమీక్షించారు. మహిళలు, బాలలు, సైబర్ నేరాలు, రహదారి భద్రత పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేలా అవగాహన సదస్సులు నిర్వహించాలని చెప్పారు. డయల్ యువర్ 100, 112 ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, సంఘటన స్థలానికి వెంటనే చేరుకుని సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అలాగే పూసపాటిరేగ మండలంలోని కొండగుడ్డిలో జరిగిన హత్య వివరాలను రూరల్ సీఐ రామకృష్ణను అడిగి తెలుసుకున్నారు. ఆ కేసులో నిందితుడికి శిక్ష పడేలా సాక్ష్యాలను సేకరించాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని తెలిపారు. ఆయన వెంట ఎస్బీ సీఐ ఎ.వి.లీలారావు, పూసపాటిరేగ ఎస్ఐ ఐ.దుర్గాప్రసాద్ తదితరులు ఉన్నారు. -
డాక్టర్ల నిర్లక్ష్యంతోనే బాలుడి మృతి
బొబ్బిలి: చిన్న పిల్లాడిని కుక్క కరిచింది చూడండి బాబూ అంటే వాక్సిన్లు వేసిన వైద్యులు తిరగబెట్టిందని మళ్లీ వస్తే కేజీహెచ్కు తీసుకెళ్లమన్నారు. ఇక్కడే చికిత్స చేయడమో లేక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకుపొమ్మనో చెబితే మా కుమారుడు బతికేవాడని దిబ్బగుడ్డివలస గ్రామానికి చెందిన మృతుడు రామవరపు రమణ (9) తల్లిదండ్రులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుక్కకాటుతో గత నెల 8వ తేదీన స్థానిక సీహెచ్సీలో తల్లిదండ్రులు రమణను వైద్యానికి చేర్చారు. వైద్యులు వ్యాక్సిన్ వేసి ఆస్పత్రిలో ఉంచారు.అంతా నయమైపోయిందని 13వ తేదీన ఇంటికి వెళ్లిపోవచ్చని డాక్టర్లు చెప్పడంతో తల్లిదండ్రులు కృష్ణవేణి, సంగమేశ్వర్రావులు కుమారుడిని తీసుకుని ఇంటికి చేరుకున్నారు. ఇంతలో తెల్లవారుజామున జ్వరం రావడంతో తల్లిదండ్రులు బాలుడు రమణను మళ్లీ సీహెచ్సీకి తరలించారు. దీంతో వైద్యులు పరీక్షించి ఇక్కడ నయం కాదని విజయనగరం జీజీహెచ్కు రిఫర్ చేశారు.అక్కడి డాక్టర్లు బాలుడి పరిస్థితి గమనించి కేజీహెచ్కు తీసుకువెళ్లాలని రిఫర్ చేశారు. కేజీహెచ్కు తరలిస్తుండగా బాలుడు మృత్యువాత పడ్డాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇదంతా స్థానిక సీహెచ్సీ డాక్టర్ల నిర్లక్ష్యం, రిఫర్ కారణంగా జరిగిందని వాపోతున్నారు. రోగులను పట్టించుకోవడం లేదని, అందరినీ వేరే ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారని, మాలాంటి పేదోళ్లకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించే స్థోమత లేదని ప్రభుత్వాస్పత్రిలో వైద్యాన్ని నమ్ముకుంటే తమ పిల్లాడు బలైపోయాడని అల్లాడిపోయారు. ఎమ్మెల్యేకు చెప్పి ఆవేదన: గ్రామంలో మరో నలుగురికి కుక్క కరిస్తే వారు ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం తీసుకోవడంతో బతికిబట్టకట్టారని, మాలాంటి పేదోళ్లం ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లలేక కొడుకును బలిచ్చామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో జరుగుతున్న నిర్లక్ష్యం, చికిత్సను అందించక ప్రైవే టు ఆస్పత్రులకు వెళ్లాలని రిఫర్ చేస్తున్నారని బాలుడి తల్లిక్రి కృష్ణవేణి ఆస్పత్రి కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే బేబినాయన ముందు వాపోయింది. మావైద్యం మేం చేశాంబాలుడి మృతిపై సీహెచ్సీ సూపరింటెండెంట్ శశిభూషణరావు వివరణ కోరగా బాలుడికి అవసరమైన చికిత్సనంతా అందించామన్నారు. బాలుడి పరిస్థితి విషమించడంతోనే జీజీహెచ్, కేజీహెచ్లకు రిఫర్ చేశామని చెప్పారు. -
చూసెయ్ జాగా.. వేసెయ్ పాగా..!
నోటీసులు ఇచ్చాం రాజాం: వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుతున్న రాజాంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ప్రధాన రహదారి పక్కన ఉన్న స్థలాలకు మంచి డిమాండ్ ఉంది. ఇదే అదునుగా ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారు. అధికార బలంతో ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలాలను ఆక్రమించేస్తున్నారు. నిన్నమొన్నటి వరకూ మురుగుకాలువలను సైతం మూసేసిన ఆక్రమణదారులు... ఇప్పుడు ఏకంగా దేవదాయశాఖ భూములను కబ్జాచేస్తున్నారు. అనధికారికంగా నిర్మాణాలు చేపడుతున్నారు. ● 20 ఎకరాల మేర ఆక్రమణ.. రాజాంలోని పాలకొండ ప్రధాన రహదారిని ఆనుకుని డోలపేట పరిధిలో రూ.కోట్ల విలువచేసే దేవదాయశాఖ భూములు ఉన్నాయి. డోలపేటలోని ఉమామహేశ్వర లక్ష్మీనారాయణస్వామి ఆలయానికి సంబంధించి సర్వే నంబర్ 8లో 20.56 ఎకరాల భూమి ఉంది. ఈ భూములు మొత్తం ఆక్రమణదారుల చేతుల్లో ఉంది. కొంతమంది ఈ భూములు జీవితకాలపు లీజుకు తీసుకున్నామంటూ హైకోర్టులో కేసులు వేయడం గమనార్హం. మరికొంత మంది ఎమ్మెల్యే చెప్పారని, ఎంపీ చెప్పారని చిన్నచిన్న షెడ్లువేసి రాత్రికిరాత్రే శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారు. ఇక్కడ సెంటు భూమి ధర రూ.15 లక్షల నుంచి రూ.18 లక్షలు పలుకుతుండడంతో ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారు. ● మమ్మల్ని అడగొద్దు.. రాజాం పట్టణంలో ఇళ్లు, భవంతుల నిర్మాణాలకు మున్సిపల్ ప్లాన్ అప్రూవుల్ ఉండాలి. పక్కా జిరాయితీ స్థలాలైతేనే వీటికి పర్మిషన్ ఇస్తారు. అవి కూడా జీ ప్లస్ నిర్మాణాలు చేయాల్సి ఉంది. లేకుంటే టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్మాణాలను అడ్డుకోవాలి. రాజాంలో మాత్రం దీనికి పూర్తి భిన్నం. మామ్మూళ్లు ఇస్తే చాలు... కొందరు అధికారులు, ఉద్యోగులు అక్రమ మార్గంలో అనుమతులు ఇచ్చే దారి చూపుతారట. విద్యుత్ మీటర్లు కూడా మంజూరు చేయిస్తారు. ఇక్కడి మున్సిపల్ కార్యాలయంలో దీనికోసం ప్రత్యేక దళారీ వ్యవస్థే నడుస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు దేవదాయశాఖ అధికారులు తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. అధికారుల అడ్డంకులు లేకపోవడంతో రాత్రికి రాత్రే భూములు మాయమవుతున్నాయి. రాజాంలో ఆక్రమణల జోరు దేవదాయశాఖ భూముల దురాక్రమణ అధికార బలంతో నిర్మాణాలు నోటీసులు ఇచ్చినా ఫలితం సున్నా ఆక్రమణల గుప్పిట్లో విలువైన ఆస్తులు Æ>gê…ÌZ §ólÐ]l§é-Ķæ$Ô>Q ¿¶æ*Ñ$° GMýSP-yìlMýS-MýSPyól B{MýS-Ð]l$-׿Ë$ ^ólçÜ$¢-¯é²Æý‡$. ´ëÌSMö…yýl Æøyýl$zÌZ §ólÐ]l-§é-Ķæ$Ô>Q ¿¶æ*Ñ$ B{MýS-Ð]l$-׿-ÌSOò³ ¯øsîæ-çÜ$Ë$ C^éa…. Æð‡Ððl¯]l*Å A«¨-M>-Æý‡$-ÌSMýS$ íœÆ>ŧýl$^ólÔ>…. ^èlÆý‡ÅË$ ¡çÜ$-MýS$¯ól…§ýl$MýS$ GÐ]lÆý‡* Ð]l¬…§ýl$MýS$-Æ>-Ìôæ§ýl$. B{MýS-Ð]l$׿Ë$ BVýSyýl… Ìôæ§ýl$. E¯]l²-™é«¨-M>-Æý‡$ÌSMýS$ ™ðlÍ-Ķæ$-gôæ-Ô>…. B{MýS-Ð]l$׿-§éÆý‡$-ÌSOò³ MøÆý‡$tÌZÏ MóSçÜ$Ë$ ÐólçÜ$¢-¯é²…. MýSv¯]l ^èlÆý‡ÅË$ ¡çÜ$-Mø-ÐéÌS° hÌêÏ A«¨M>-Æý‡$-ÌS¯]l$ MøÆ>…. ˘ – బి.వి.మాధవరావు, దేవదాయశాఖ ఈఓ, రాజాం -
తీరప్రాంత భద్రత దేశ రక్షణకు కీలకం
భోగాపురం: దేశరక్షణలో తీరప్రాంత భద్రత అత్యంత కీలకమని ఎస్పీ ఏఆర్ దామోదర్ పేర్కొన్నారు. ఈ మేరకు భోగాపురం మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) అధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా సైకిల్ ర్యాలీని శుక్రవారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తీరప్రాంత భద్రతపై ప్రజల్లో ముఖ్యంగా విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు సీఐఎస్ఎఫ్ సిబ్బంది చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కోస్టల్ సెక్యూరిటీ, నేషనల్ యూనిటీ (జాతీయ సమైక్యత) నేషనల్ ప్రైడ్ గురించి స్కూళ్లు, కాలేజీ విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం సీఐఎస్ఎఫ్ సిబ్బంది రెండు బృందాలుగా విడిపోయి కోల్కతా, గుజరాత్ల నుంచి ప్రారంభించిన మెగా సైకిల్ ర్యాలీని కేరళ వరకు కొనసాగించనున్నట్లు చెప్పారు. సుమారు 100 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఒక టీమ్గా ఏర్పడి ఈ యాత్రను చేపట్టారన్నారు. ఈ క్రమంలో భోగాపురం చేరుకున్న ర్యాలీ బృందంతో కలిసి భాగస్వాములు కావడం, వారికి భద్రత ఏర్పాట్లను కల్పించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వారి యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ, జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో సీఐ కె.దుర్గాప్రసాద్, ఎస్సై వి.పాపారావు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ ఏఆర్ దామోదర్ -
రైతన్నపై వడ్డీ ఒత్తిడి
మెరకముడిదాం: రైతు సంక్షేమమే ధ్యేయమన్నారు... సాగును బంగారు మయం చేస్తామన్నారు.. పెట్టుబడి సాయం ఠంచన్గా ఇస్తామంటూ హామీ ఇచ్చారు... తీరా అధికారంలోకి వచ్చాక రైతన్న నడ్డి విరిచేలా పంట రుణాలు తీసుకున్న రైతులపై వడ్డీ భారం మోపుతున్నారు. 19 నెలలుగా సున్నా వడ్డీ రాయితీని వర్తింపజేయకుండా ఆవేదనకు గురిచేస్తున్నారు. ఇప్పటికే ఉచిత పంటల బీమా పథకానికి చంద్రబాబు ప్రభుత్వం మంగళం పాడేసింది. పంటలకు అవసరమైన యూరియా అందకుండా రైతన్నను ఆవేదనకు గురిచేస్తోంది. విత్తు నుంచి పంట విక్రయం వరకు అడుగడుగునా అడ్డంకులు అధిగమించాల్సిన దుస్థితి. ఏడాదిన్నరగా సున్నావడ్డీ రాయితీని అందజేయకుండా జిల్లాలోని లక్షలాది మంది రైతులను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. ● రైతులపై వడ్డీ భారం... విజయనగరం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) పరిధిలో 24 బ్రాంచ్లు ఉండగా, వారి పరిధిలో 94 ప్రాథమిక వ్యవసాయ సహకార సరసతి సంఘాలు (సొసైటీలు) ఉన్నాయి. వీటి పరిధిలో లక్ష మంది వరకూ సభ్యులున్నారు. ప్రస్తుతం వీరికి ఏటా రూ.320 కోట్లు వరకూ బ్యాంకు అధికారులు పంట రుణాలు మంజూరు చేస్తున్నారు. డీసీసీబీతో పాటు పలు వాణిజ్య బ్యాంకులు కూడా రైతులకు కనిష్టంగా రూ.లక్ష నుంచి గరిష్టంగా రూ.3 లక్షల వరకూ పంట రుణాలను ఇస్తున్నాయి. లక్ష రూపాయలు రుణం తీసుకున్న రైతులకు వడ్డీ రాయితీ పథకం వర్తిస్తుంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం రాయితీకి ఎగనామం పెట్టడంతో వాణిజ్య బ్యాంకులతో పాటు సొసైటీల నుంచి తీసుకున్న రుణాలకు సంబంధించి అసలుతో పాటు మొత్తం వడ్డీని రైతులే చెల్లించాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఏటా రుణాలు సక్రమంగా చెల్లించే ప్రతి రైతుకు క్రమం తప్పకుండా రూ.3వేలు చొప్పున వడ్డీ రాయితీ ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన వాటా కింద ఇవ్వాల్సిన 4శాతం వడ్డీ రాయితీని గత 19 నెలలుగా ఇవ్వడం లేదు. జిల్లాలో సుమారు రూ.120 కోట్లు మేర వడ్డీ రాయితీ చెల్లించాల్సి ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల వల్ల ప్రతిరైతు ఏటా దాదాపు రూ.8వేల వరకు నష్టపోవాల్సి వస్తోంది. పంట రుణాలపై ప్రభుత్వం 19 నెలలుగా వడ్డీ రాయితీ ఇవ్వకపోవడంతో ఆ భారం రైతులపైనే పడుతోంది. ప్రభుత్వం వడ్డీ రాయితీ విడుదల చేస్తే ఆ మొత్తాన్ని తిరిగి జమ చేస్తామని చెబుతూ, వాణిజ్య బ్యాంకులతో పాటు సొసైటీలు కూడా రైతుల నుంచి వడ్డీ వసూలు చేస్తున్నాయి. ఎవరైనా రైతులు వడ్డీ చెల్లించకపోతే వారికి రుణాలిచ్చేందుకు ఆయా బ్యాంకులు నిరాకరిస్తున్నాయి. రుణం చెల్లింపులో ఏడాదిలో ఒక్కరోజు దాటినా 13 శాతం వడ్డీతో వసూలు చేస్తున్నాయి. వడ్డీల భారం భరించలేక రైతులు తల్లడిల్లుతున్నారు. రైతన్నకు సున్నం.. సర్కారుకు వడ్డీ లాభం సున్నావడ్డీ రుణాలకు చంద్రబాబు ప్రభుత్వం ఎసరు! తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించినా సున్నావడ్డీని అందించని వైనం సమయానికి సున్నావడ్డీ వాటాను చెల్లిస్తున్న కేంద్రప్రభుత్వం 19 నెలలు కావస్తున్నా సున్నావడ్డీ ఊసెత్తని చంద్రబాబు సర్కారు ఏటా రూ.120 కోట ్లవరకు వడ్డీభారం ఆవేదనలో రైతాంగం -
బ్యాంకర్లు ఆర్థిక వృద్ధికి తోడ్పడాలి
పార్వతీపురం: ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, రుణాల మంజూరు ప్రక్రియలో బ్యాంకర్లు ఉత్సాహంగా పాల్గొని జిల్లా ఆర్థిక వృద్ధికి తోడ్పడాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బ్యాంకర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ పాల్గొని బ్యాంకర్లకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా యంత్రాంగంతో బ్యాంకర్లు నిరంతరం సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. ప్రజల్లో ఆర్థిక క్రమశిక్షణ, ఆర్థిక అక్షరాస్యతపై బ్యాంకర్లు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి ఒక్కరికీ బ్యాంకింగ్ సేవలు అందేలా చూడాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉందన్నారు. ఈ సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎస్.సోమశేఖర్, డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణి, డీటీఓ బి.ప్రసాదరావుతో పాటు వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి -
గ్రంథాలయాల అభివృద్ధికి కృషి అవసరం
● మంత్రులు శ్రీనివాస్, సంధ్యారాణి ● జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా డొంకాడ రామకృష్ణ విజయనగరం టౌన్: జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేయాలని మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి గ్రంథాలయాల సిబ్బందికి సూచించారు. గ్రంథాలయాలను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఉమ్మడి విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా డొంకాడ రామకృష్ణ శుక్రవారం ప్రమాణం స్వీకారం చేశారు. జిల్లా కేంద్ర గ్రంథాలయం ప్రాంగణంలోని గురజాడ కళాభారతిలో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రులు ముఖ్య అతిఽథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞానగనులని, వాటి అభివృద్ధికి తమవంతు కృషిచేస్తామని హామీ ఇచ్చారు. అన్నిదానాల్లో కెల్లా విద్యాదానం శాశ్వతమని పేర్కొన్నారు. జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి తనవంతు కృషిచేస్తానని సంస్థ చైర్మన్ రామకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అదితి విజయలక్ష్మిగజపతిరాజు, బేబీనాయన, తోయక జగదీశ్వరి, రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు కె.మల్లేశ్వరరావు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ రౌతు రామ్మూర్తి, జిల్లా గ్రంథాలయ సంస్ధ కార్యదర్శి లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
వడ్డీ రాయితీ ఇవ్వాలిలా..
అన్నదాతకు ఎంతో మేలు చేసే సున్నావడ్డీ పథకానికి 2004లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్రెడ్డి శ్రీకారం చుట్టారు. పంట రుణాలను సకాలంలో చెల్లిస్తే 4 శాతం వడ్డీ రాయితీని తిరిగి రైతులకు చెల్లిస్తామని ప్రకటించారు. ఆచరణలోకి తెచ్చారు. పథకం కింద రుణాలు తీసుకున్న రైతుల నుంచి ఏడాదికి వసూలు చేసే వడ్డీలో కేంద్ర ప్రభుత్వం 3 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 4 శాతం భరించాలి. ఒక రైతు రూ.లక్ష పంట రుణం తీసుకుంటే ఏడాదికి సుమారు 7 వేలు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. సకాలంలో రైతు రుణం చెల్లిస్తే... సున్నావడ్డీ కింద కేంద్రం రూ.3 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ 4 వేలు చొప్పున బ్యాంకులకు చెల్లిస్తాయి. దీనివల్ల రైతుపై వడ్డీభారం పడదు. ఈ సున్నావడ్డీ పథకం రైతుకు ఆర్థికంగా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. సాగుకు ఊతంగా మారుతుంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతులకు ఐదేళ్లూ పూర్తి వడ్డీ రాయితీ అందించి అండగా నిలిచిందని రైతులు చెబుతున్నారు. 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం సున్నావడ్డీ పఽథకం అమలును పూర్తిగా విస్మరించడంపై ఆందోళన చెందుతున్నారు. -
వడ్డీ రాయితీని వెంటనే విడుదల చేయాలి
ప్రభుత్వం వడ్డీరాయితీ చెల్లిస్తుందని గత ఏడాది బ్యాంకులకు చెల్లించలేదు. ఇటీవల రుణం కోసం బ్యాంకుకు వెళ్తే ప్రభుత్వం వడ్డీ రాయితీ విడుదల చేయలేదని అక్కడి అధికారులు చెప్పి గత ఏడాది తీసుకున్న రుణంపై వడ్డీ వసూలు చేశారు. అధికారంలోకి వస్తే రైతును రాజును చేస్తామని గొప్పలు చెప్పడం తప్ప, పథకాలకు నిధులు కేటాయించకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రభుత్వం వెంటనే వడ్డీ రాయితీ బకాయిలను విడుదలచేసి రైతులను ఆదుకోవాలి. – బంటుపల్లి వెంకటేశ్వర్లు, రైతు, మెరకముడిదాం -
అక్రమ వడ్డీలపై పోలీసుల నిఘా
● నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు ● వడ్డీ వ్యాపారులతో పట్టణ సీఐ సమావేశంపార్వతీపురం రూరల్: అనుమతి లేకుండా వడ్డీ వ్యాపారం సాగించినా, పరిమితికి మించి వడ్డీలు వసూలు చేస్తూ ప్రజలను వేధించినా చట్టపరమైన చర్యలు తప్పవని పార్వతీపురం పట్టణ సీఐ వెంకట్రావు హెచ్చరించారు. ఈ నెల 5న సాక్షి దినపత్రికలో వెలువడిన అప్పుల ఊబిలో చిరు వ్యాపారులు శీర్షికపై ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం పట్టణ పోలీస్ స్టేషన్లో వడ్డీ వ్యాపారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. లైసెన్స్ లేకుండా వ్యాపారం చేయడం నేరమని, అప్పుల పేరుతో సామాన్యులను ఇబ్బందులకు గురిచేయకూడదని స్పష్టం చేశారు. నిబంధనల పరిధిలోనే వ్యాపారాలు నిర్వహించాలని, వేధింపులపై ఫిర్యాదులు అందితే కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. అధిక వడ్డీల కోరల్లో చిక్కిన బాధితులు ధైర్యంగా పోలీసులను ఆశ్రయించాలని కోరారు. సమావేశంలో పట్టణ ఎస్సైలు ప్రయోగమూర్తి, గోవింద్, సిబ్బంది పాల్గొన్నారు. -
రుణాలు చెల్లించినా అందని వడ్డీరాయితీ
ఏటా పంట రుణాలు సక్రమంగా చెల్లిస్తున్నా వడ్డీ రాయితీ అందడంలేదు. రెండేళ్లుగా ఇదే పరిస్థితి. బ్యాంకులు తిరిగి రుణాలిస్తున్నాయే తప్ప రాయితీ విషయం ప్రస్తావించడంలేదు. బ్యాంకు అధికారులు ఒత్తిడి తెస్తుండడంతో మరో గత్యంతరం లేక వడ్డీ కూడా చెల్లిస్తున్నాం. రైతులకు ఉపయోగపడే పథకాల్లో కోతలు పెట్టడం ప్రభుత్వానికి తగదు. రైతులకు ఇచ్చే రుణాలకు సున్నావడ్డీ పథకాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. – గంట్యాడ జనార్దనరావు, ఎం.పాలెం, మెరకముడిదాం మండలం -
ఈ ఏడాదైనా పాట పాడతారా?
వండువ పంచాయతీలోని జీడి తోటల నుంచి గత కొనేళ్లుగా ఫలసాయం అందుతోంది. ఏటా పూత సమయంలో అటవీ శాఖాధికారులు వేలం నిర్వహిస్తున్నారు.అలా వచ్చిన మొత్తంలో 60 శాతం పంచాయతీకి, 40 శాతం అటవీ శాఖకు చెందుతుంది. అయితే మూడేళ్లుగా వేలంపాట జరగకపోవడంతో పంచాయతీ ఆదాయానికి గండి పడుతోంది. రెండేళ్ల క్రితం ఫలసాయం రూ.1.26 లక్షలు రావడంతో ఇందులో 60 శాతం వాటా కింద రూ.75 వేలను వండవ పంచాయతీకి అటవీశాఖ అధికారులు జమచేశారు. గతేడాది వేలం పాటకు ఎవరూ ముందుకు రాకపోవడంతో అటవీశాఖ అధికా రులే పర్యవేక్షణ చేశారు. 510 కిలోల జీడి పిక్కలు దిగుబడి వచ్చింది. అంటే గతేడాది ధర ప్రకారం కేవలం రూ.59 వేలు మాత్రమే ఆదా యం వచ్చింది. ఈ ఏడాది ఎలాగైనా వేలం పాట నిర్వహించి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుతామని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.ఏం జరుగుతుందో వేచి చూడాలి మరి. ●జిల్లాలోని వీరఘట్టం మండలం వండవ కొండపై ఉన్న 150 ఎకరాల్లో ఉన్న 1302 జీడి మొక్కలకు ఫిబ్రవరి 10న పార్వతీపురం మన్యం జిల్లా అటవీశాఖ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు వేలం పాట నిర్వహిస్తారు. ఈ వేలం పాటలో తోటలు లీజుకు వెళ్లకపోతే మళ్లీ ఫిబ్రవరి 20న వేలం పాట నిర్వహిస్తారు. ●వేలం పాటలో పాల్గొనే వా రు ముందుగా వారు పాడబో యే తోటలను చూసుకోవాలి. ●ప్రతి పాటదారు ధరావత్తు సొమ్ము రూ.5000తో పాటు రూ.25వేలు నగదు చెల్లించి వేలంపాటలో పాల్గొనాలి. ●పాట ముగిసిన వెంటనే నగదు సాల్వెన్సీ కాకుండా ధరావత్తు సొమ్ముతో కలిపి 1/3 వంతు అదే రోజు విధిగా చెల్లించాలి. ●పాట ఖరారైన వ్యక్తికి పాన్కార్డు, ఆధార్కార్డు తప్పకుండా కలిగి ఉండాలి. వీరఘట్టం: మార్కెట్లో జీడి పిక్కల ధర ప్రస్తుతం కిలో రూ.140 నుంచి రూ.150 ధర పలుకుతోంది. గతేడాది సీజన్లో రూ.160 వరకు ధర పలికింది. అదే జీడి పప్పు ప్రస్తుతం నాణ్యతను బట్టి కిలో రూ.820 నుంచి రూ.870 ధర పలుకుతోంది. ఈ తరుణంలో ఎకరా జీడితోటలో పంట బాగా పండితే ఆ రైతుకు కనకవర్షం కురుస్తుంది. అయితే వీరఘట్టం మండలంలోని వండువ కొండపై 150 ఎకరాల జీడి తోటలు ఉన్నా జిల్లా అటవీశాఖకు మాత్రం గడిచిన మూడేళ్లుగా అరకొర ఆదాయం మాత్రమే వస్తోంది. గతంలో ప్రతి ఏటా జీడితోటలకు వేలం జరిగే సమయంలో దళారులు రంగప్రవేశం చేసి ధర తగ్గించేసి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేవారు. గడిచిన మూడేళ్లుగా ఎవరూ వేలం పాటకు ముందుకు రాకపోవడంతో అటవీశాఖ అధికారులే సాగు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్లీ సీజన్ మొదలు కావడంతో ఈనెల 10న పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో జీడితోటలు వేలం వేసేందుకు జిల్లా అటవీశాఖాధికారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరఘట్టం మండలంలోని వండువ కొండల్లో 1980లో 62.5 ఎకరాల్లో జీడితోటలు వేశారు. మళ్లీ 1982లో 87.5 ఎకరా ల్లో జీడితోటలు వేశా రు. మొత్తం 150 ఎకరా ల్లో సుమారు 3750 జీడిమొక్కలను వేసి ఈ కొండలో సాగుచేశా రు. మొక్కలు వేసిన ఐదేళ్ల తర్వాత ఫలసాయం బాగా రావడంతో అటవీశాఖకు, గ్రా మ పంచాయతీకి బాగానే ఆదాయం వచ్చేది. కాలక్రమేణా ప్రకృతి వైపరీత్యాలు, తుపాన్లు, ఈదురుగాలుల ధాటికి వాటిలో రెండు వంతుల మొక్కలు నేలమట్ట మయ్యాయి. ప్రస్తుతం 1302 జీడి మొక్కలు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు.ఈ మొక్కలకు మాత్రమే వేలం పాట నిర్వహించనున్నారు. క్రమేపీ వండువ కొండల్లో ఉన్న జీడి మొక్కల సంఖ్య తగ్గుతోంది. 1980–82 మధ్య కాలంలో సుమా రు 3750 మొక్కలు వేస్తే ప్రస్తుతం 1302 మొక్కలే ఉన్నాయి. ప్రతి ఏటా సీజన్లో ఉపాధిహామీ పథ కం ద్వారా సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అలాగే కొత్త మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలి. అప్పు డు పాత మొక్కలు నేలమట్టమైనా కొత్త మొక్కలతో ఫలసాయం పెరుగుతుంది. నాణ్యమైన పంట దిగుబడి వస్తుంది. అయితే ఈ కొండల్లో జీడి తోటలపై సస్యరక్షణ చర్యలు చేపట్టక, నిర్వహణ లేక ఏటా ఫలసాయం తగ్గుతోంది. ఇలాగే వదిలేస్తే మరో మూడేళ్లలో ఉన్న మొక్కలు కూడా కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. ప్రభుత్వానికి, పంచాయతీకీ ఆదాయం రావాలంటే అధికారులు సమన్వయంతో ఇక్కడ జీడితోటల పెంపకంపై దృష్టి సారించాల్సి ఉంది.జీడి తోటల వేలానికి గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా వేలం పాటను పక్కాగా నిర్వహిస్తాం. వేలం పాటను సిండికేట్ చేస్తే రద్దు చేస్తాం. ప్రభుత్వ ఆదాయానికి గండిపడేలా ఎవరైనా లోపాయికారీగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. –టీవీ రమణమూర్తి, డిప్యూటీ రేంజర్, వీరఘట్టం -
వెట్టిచాకిరీ నిర్మూలనకు కృషి చేయాలి
● కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ ప్రసాదరావు విజయనగరం ఫోర్ట్: వెట్టిచాకిరీ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ ఎస్డీవీ ప్రసాదరావు కోరారు. వియనగరం యూత్ హాస్టల్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం (1976లో) వచ్చాక వెట్టి చాకిరీ తగ్గిందన్నారు. సమావేశంలో నేచర్ సంస్థ ప్రతినిధులు దుర్గ, చైతన్య, బంగారుబాబు, గౌరీ శంకర్, సీహెచ్ చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు. శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యం ● ఆర్జేడీ విజయ్భాస్కర్ బొండపల్లి: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదోతరగతి విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా విద్యాప్రణాళిక అమలుచేస్తున్నామని ఆర్జేడీ విజయ్ భాస్కర్ తెలిపారు. బొండపల్లి ఎంఈఓ కార్యాలయాన్ని శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రిజియన్ పరిధిలోని ఆరుజిల్లాల్లోని విద్యార్థులకు గతేడాది డిసెంబర్ 6 నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ పదోతరగతి పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నామన్నారు. ఈ ఏడాది విజయనగరం జిల్లా నుంచి 14,744 మంది, పార్వతీపురం మన్యం జిల్లా నుంచి 5,117 మంది, శ్రీకాకుళం జిల్లా నుంచి 19,370 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు. పోలమాంబ హుండీల ఆదాయం రూ.25.47 లక్షలు మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి ఆలయ హుండీల ఆదాయాన్ని దేవదాయశాఖ ఆధ్వర్యంలో చదురుగుడిలో శుక్రవారం లెక్కించారు. చదురుగుడిలోని ఆరు హుండీల నుంచి రూ.18,47,354లు, వనంగుడిలోని ఆరు హుండీల నుంచి రూ.7,00,065లు కలిపి రూ.25,47,419లు ఆదాయం వచ్చినట్టు ఈఓ శ్రీనివాస్ తెలిపారు. 27 గ్రాముల 520 మిల్లీ గ్రాముల బంగారం, 243 గ్రాముల వెండి లభించిందన్నారు. హుండీల ఆదాయం లెక్కింపులో పార్వతీపురం మన్యం జిల్లా దేవదాయశాఖ అధికారి ఎస్.రాజారావు, ఆలయ చైర్మన్ నైదాన చిన్నతిరుపతి, సర్పంచ్ వి.సింహాచలమమ్మ, ఎంపీటీసీ సభ్యుడు టి.పోలినాయుడు, ఉప సర్పంచ్ అల్లు వెంకటరమణ, సేవకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. స్పందించిన సర్వజన ఆస్పత్రి అధికారులు విజయనగరం ఫోర్ట్: సర్వజన ఆస్పత్రిలో వసతులు చాలక రోగులు ఇబ్బంది పడుతున్నారనే అంశంపై ‘అమాత్యా కాస్త ఇటు చూడండి..!’ అనే శీర్షికన ఈనెల 2వ తేదీన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి అధికారులు స్పందించారు. మూలనపడిన వీల్చైర్లు, స్ట్రెచర్స్ను శుక్రవారం బాగుచేయించారు. -
పూరిల్లు దగ్ధం
నెల్లిమర్ల రూరల్: మండలంలోని ఒమ్మి గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ పూరిల్లు దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన లెంక కసవయ్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలి భారీగా మంటలు వ్యాపించి పూరిల్లు కాలిబూడిదైంది. స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. బీరువాలో ఉన్న సుమారు రూ.30వేల నగదు, తులం బంగారం, దుస్తులు అగ్నికి ఆహుతై బాధిత కుటుంబం కట్టుబట్టలతో మిగిలింది. నిరుపేద కుటుంబం కావడంతో ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రెవెన్యూ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆకట్టుకున్న అశ్వాల దౌడులక్కవరపుకోట: మండలంలోని జమ్మాదేవిపేట గ్రామంలో శ్రీనందీశ్వరస్వామి తీర్ధం మహోత్సవం సందర్భంగా గుర్రాల పరుగు పందెం పోటీలను శుక్రవారం నిర్వహించారు. ఈ పోటీల్లో విశాఖపట్నం, అనకాపల్లి, విజయనరగం జిల్లాల నుంచి 13 గుర్రాలు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో అలమండ శ్రీనురాజుకు చెందిన గుర్రం మొదటి స్థానం సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన అశ్వాల యజమానులకు నిర్వాహకులు నగదు బహుమతులను అందజేశారు. బొబ్బిలి: స్థానిక రైల్వే స్టేషన్ను అనుసరించి ఉన్న రైలుపట్టాలపై అనుమానాస్పదంగా సంచరిస్తూ ఆత్మహత్య కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తిని పట్టుకుని కౌన్సెలింగ్ చేసి బంధువులకు అప్పగించిన ఆర్పీఎఫ్ సిబ్బందిని పలువురు అభినందిస్తున్నారు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం నారాయణపురం గ్రామానికి చెందిన పొదిలాపు రాంబాబు(32) అనే వ్యక్తి బొబ్బిలి శివారులో సీతానగరం స్టేషన్ మధ్యలో ప్లాట్ఫాం నంబర్ 1 లైన్లో ఉన్న పట్టాలపై అనుమానాస్పదంగా సంచరిస్తున్నాడు. ఆ వ్యక్తిని గమనించిన రైల్వే ఏఎస్సై హెచ్కే పాణిగ్రహి, హెచ్సీ బి.ఈశ్వర రావు, సిబ్బంది వెంటనే వెళ్లి పట్టుకుని రైల్వేపోస్టుకు తీసుకువచ్చారు. అతనిని విచారణ చేయగా కుటుంబ, వైవాహిక పరయిన సమస్యలతో తాను ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పడంతో కుటుంబసభ్యులు, బంధువుల నంబర్లకు సమాచారమందించి రప్పించి ఆ వ్యక్తిని అప్పగించారు. 8న రా.ర.వే సమావేశం రాజాం సిటీ: ఈ నెల 8న స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాజాం రచయితల వేదిక సమావేశం నిర్వహించనున్నామని వేదిక నిర్వాహకు ఛిజీ గార రంగనాథం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నల్లా రవికుమార్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ‘మనుషులు మాయమయే కాలం’ అనే నవలపై పొదిలాపు శ్రీనివాస్ ముఖ్య ప్రసంగం చేయనున్నారని పేర్కొన్నారు. సమావేశానికి భాషాభిమానులు, రచయితలు, సాహిత్యాభిమానులు, కవులు హాజరుకావాలని కోరారు. భక్తిశ్రద్ధలతో లలితాదేవి పారాయణం రాజాం సిటీ: స్థానిక సంతమార్కెట్ ఆవరణలో వెలిసిన మల్లికార్జున స్వామి దేవాలయంలో శుక్రవారం లలితా పారాయణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అర్చకుడు ధూపం యశ్వంత్స్వామి ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
రైలు ప్రయాణికులకు మెరుగైన వసతి లక్ష్యం
విజయనగరం టౌన్: రైలు ప్రయాణికులకు మెరుగైన వసతి, సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ఈస్ట్కోస్ట్ రైల్వే పనిచేస్తోందని డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా పేర్కొన్నారు. ఈ మేరకు విజయనగరం రైల్వేస్టేషన్ ఒకటో నంబర్ ఫ్లాట్ఫామ్లో ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటుచేసిన ఏసీ డార్మిటరీ, రిటైరింగ్ రూమ్లను శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం వీఐపీ లాంజ్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ పీఎన్ఆర్ కలిగి ఉన్న ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలను అతి తక్కువ ఖర్చుకే అందజేస్తున్నామన్నారు. ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనూ బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పించామని తెలిపారు. పారదర్శకత, యాక్సెస్, డిజిటల్ సౌలభ్యం ఉందన్నారు. రైలు ప్రయాణం చేసే ప్రయాణికులకు దీర్ఘకాలం వేచి ఉండేవారికి, సీనియర్ సిటిజన్లకు, పిల్లలతో ప్రయాణించే కుటుంబాలకు ఐఆర్సీటీసీ ద్వారా క్యాటరింగ్, హాస్పిటాలిటీ సేవలను లైసెన్స్డ్ మెస్సర్స్ గుడ్పుడ్ క్యాటరింగ్ సర్వీసులను అందజేస్తుందని చెప్పారు. అనంతరం నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్ కుమార్, ఐఆర్సీటీసీ రీజనల్ మేనేజర్ అనూజ్ దత్తా తదితరులు పాల్గొన్నారు. డీఆర్ఎం లలిత్ బోహ్రా -
మన్యంలో సికిల్ సెల్ సెగ..!
పార్వతీపురం రూరల్: గిరిజన హృదయాల్లో ప్రాణాంతక సికిల్సెల్ ఎనీమియా నిశ్శబ్దంగా మృత్యుఘంటికలు మోగిస్తోంది. మన్యం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తూ, గిరిపుత్రుల ప్రాణాలను హరిస్తోంది. జన్యుపరంగా సంక్రమించే ఈ మహమ్మారి బారిన పడి పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు విలవిలలాడుతుంటే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. గతంలో బాధితులకు కొండంత అండగా నిలిచిన ప్రత్యేక వైద్యసేవలు నేడు ’బాబు ’ పాలనలో అటకెక్కాయి. ఐటీడీఏ నిధుల విడుదలలో చూపుతున్న జాప్యం, పాలకుల అలసత్వం వెరసి..గిరిజనుల రక్తం తెల్లబారుతోంది. పంజా విసురుతున్న సికిల్సెల్ జిల్లాలోని ఎనిమిది మండలాల్లో నాలుగు పూర్తిగా నాలుగు పాక్షికంగా ఏజెన్సీ పరిధిలో ఉండగా, ఇక్కడ సికిల్సెల్ రక్కసి పంజా విసురుతోంది. ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల్లో ఏకంగా 304 మందికి వ్యాధి నిర్ధారణ కాగా, మరో 4,808 మందిని ఈ వ్యాధి వాహకులుగా గుర్తించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. వారికి ప్రతి నెలా రక్తమార్పిడి, నిరంతర వైద్య పర్యవేక్షణ ప్రాణావసరం. కానీ, దురదృష్టవశాత్తు జిల్లాలో ఉన్న ఏకై క ప్రత్యేక ’డే కేర్ సెంటర్’ నిధులు లేక రెండేళ్లుగా మూతపడి ఉండడం గమనార్హం. గతంలో ప్రత్యేక వైద్యులు, సిబ్బందితో సేవలు అందించేందుకు ఉన్న కేంద్రం, నేడు పాలకుల నిర్లక్ష్యం వల్ల వెలవెలబోతోంది. జనరల్ వార్డుల్లో పడి ఉండాల్సిన దుస్థితి ఒకప్పుడు బాధితులకు నేరుగా రక్తమార్పిడి, ఉచిత మందులు, సలహాలు అందించే ఈ వ్యవస్థను ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. ఇప్పుడు బాధితులు సాధారణ రోగుల మాదిరిగా జనరల్ వార్డుల్లో పడి ఉండాల్సిన దుస్థితి నెలకొంది. ప్రత్యేక విభాగం లేకపోవడంతో గర్భిణులు, కౌమార బాలికల ఆరోగ్యం తీవ్ర ప్రమాదంలో పడింది. నెలకు కేవలం రూ. 30 లక్షల నిధులు కేటాయించలేక, గిరిజనుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు సర్కారు, ఏజెన్సీలో కొడిగడుతున్న ప్రాణాలను కాపాడడంలో ఎందుకు విఫలమవుతోందని గిరిజన సంఘాలు నిలదీస్తున్నాయి. తక్షణమే ఐటీడీఏ నిధులు విడుదల చేసి, ప్రత్యేక చికిత్స కేంద్రాన్ని పునఃప్రారంభించాలని కోరుతున్నాయి. గిరిజనుల ప్రాణం..గాలిలో దీపం మూతపడిన ఏకై క భరోసా కేంద్రం.. పట్టించుకోని చంద్రబాబు సర్కారు నిధులు నిలిపివేత..వైద్యం అందక గిరిపుత్రుల విలవిల జిల్లాలో 304 మంది వ్యాధిగ్రస్తులు.. మరో 4,808 మంది వాహకులు రక్తమార్పిడి లేక..మందులు దొరక్క నరకయాతన కేంద్రాస్పత్రిలో అవసరమైన సేవలు జిల్లా కేంద్రాస్పత్రిలో సికిల్సెల్ బాధితులకు అవసరమైన అన్ని వైద్య సేవలు నిరంతరం అందుతున్నాయి. వ్యాధి నిర్ధారణ పరీక్షల అనంతరం రక్తమార్పిడి అవసరమైన వారికి కేంద్రాస్పత్రిలో సేవలు అందుతున్నాయి. డే కేర్ సెంటర్కు ప్రతిపాదనలు పంపించాం. చికిత్స అందించడంలో ఎలాంటి జాప్యం చేయడం లేదు. వ్యాధిగ్రస్తులకు క్షేత్రస్థాయిలోనే పరీక్షలు నిర్వహించి, సకాలంలో వైద్యం అందేలా పర్యవేక్షణ చేస్తున్నాం. డా.ఎం.వినోద్ కుమార్ ప్రత్యేకాధికారి -
సినీ ఆర్టిస్ట్ జయవాహిని మృతి
● పుట్టి పెరిగింది విజయనగరంలోనే ● కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి ● సంతాపం వ్యక్తం చేసిన సినీ, టీవీ ఆర్టిస్టులువిజయనగరం టౌన్: విజయనగరంలోని పూల్బాగ్ కాలనీలో జన్మించి, మహారాజా కళాశాలలో విద్యాభ్యాసం పూర్తిచేసుకుని, సినీ ఇండస్ట్రీపై మక్కువతో మద్రాస్ వెళ్లి అంచెలంచెలుగా ఎదిగి, తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న నటి పద్మక్కగా పిలుచుకునే జయవాహిని కొంతకాలంగా ప్రాణాంతక కేన్సర్ వ్యాధితో బాధపడుతూ బుధవారం రాత్రి విజయనగరంలోనే తుదిశ్వాస విడిచారు. ఆమె మృతిచెందారన్న వార్త విన్న సినీ, టీవీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఆమె సన్నిహితురాలు విజయనగరం వాసి, మూవీ, టీవీ ఆర్టిస్ట్ కరాటే కల్యాణి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయనగరంలో పద్మక్కగా పిలుచుకునే వాళ్లమని, కరాటే విద్య నేర్చుకున్నారని, అప్పట్లో పద్మక్కను రాంబో అని అందరూ పిలుచుకునేవాళ్లమన్నారు. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో సహాయనటిగా, టెలివిజన్, సినీరంగాల్లో చిన్న పాత్రలతో తన నట ప్రస్ధానాన్ని ప్రారంభించి ప్రేక్షకుల అభిమానం చూరగొన్నారన్నారు. రఘుపతి వెంకయ్యనాయుడు చిత్రంలో కథానాయికగా నటించి ప్రశంసలు పొందారన్నారు. చివరిగా బహిర్భూమి, పోలీస్ వారి హెచ్చరిక సినిమాల్లో నటించారని తెలిపారు. టీవీ సీరియల్స్లో నిన్నే పెళ్లాడతా, నాగమ్మ, జయం, అభిమానం వంటి వాటిలో తనదైన శైలిలో ప్రతిభ చూపి అందరి మన్ననలు పొందారన్నారు. విజయనగరంలోని దాసన్నపేట సింగపూర్ సిటీలో డాల్పిన్ హైట్స్లో ఉన్న ఆమె స్వగృహం వద్ద విషాదఛాయలు అలముకున్నాయి. రోటరీ స్వర్గధామంలో ఆమె అంత్యక్రియలను కుటుంబసభ్యులు పూర్తిచేశారు. టీవీ,సినీ ఆర్టిస్ట్లు, కుటుంబ సభ్యులు, అభిమానులు తమ సంతాపం వ్యక్తం చేశారు. -
జూలై 15 కి ఆస్పత్రుల భవన నిర్మాణాలు పూర్తి చేయాలి
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో వేర్వేరు ఇంజినీరింగ్ ఏజెన్సీల ద్వారా నిర్మాణంలో ఉన్న ఆస్పత్రుల భవనాలన్నీ జూలై 15లోగా పూర్తి చేసి అప్పగించాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, ఇంజినీరింగ్ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. హెల్త్ క్లినిక్ భవనాలు, పీఎం హెల్త్ మిషన్ కింద మంజూరైన భవనాలు, 15వ ఆర్థిక సంఘం నిధులతో మంజూరైన 24 హెల్త్ క్లినిక్ భవనాలు, ఇప్పటికే పూరైన వాటిని డీఎంహెచ్ఓకు అప్పగించాలని స్పష్టం చేశారు. ఇంకా శ్లాబ్ లెవెల్లో ఉన్న వాటిని పూర్తి చేయాలని, ప్రారంభం కాని వాటికి వెంటనే టెండర్లు పిలవాలని తెలిపారు. స్థలం లేని వాటి వివరాలు ఇస్తే స్థలం కేటాయించనున్నామన్నారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి, డీసీహెచ్ఎస్ డాక్టర్ పద్మశ్రీ రాణి, ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ భారతి, పంచాయతీ రాజ్ ఈఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
మైనింగ్ భూముల సర్వే
మెరకముడిదాం: మండలంలోని కొత్తకర్ర, బుదరాయవలస, చినరవ్యాం, చినబంటుపల్లి గ్రామాల రెవెన్యూ పరిధిలో ఐరన్ఓర్ మైనింగ్ తవ్వకాలకు సంబంధించిన భూములను ఆర్ఐ డి.రామ్కుమార్, సర్వేయర్ రామకృష్ణలు గురువారం సర్వే చేశారు. అయితే ఆయా గ్రామాల్లో మైనింగ్ తవ్వకాలను జరుపుకునేందుకు గతంలో తమ సంస్థలకు ప్రభుత్వం భూములు కేటాయిస్తూ అనుమతులను ఇచ్చిందని, అందులో కొంత భూమిలో మాత్రమే మైనింగ్ తవ్వకాలు జరిపామని, అప్పట్లో తవ్వకుండా వదిలేసిన మిగులు భూముల్లో ఇప్పుడు తవ్వకాలకు అనుమతులను ఇవ్వాలని ప్రభుత్వాన్ని సంబంధిత యాజమాన్యాలు కోరాయి. దీంతో ఈ భూములను పూర్తిస్థాయిలో సర్వే చేసి తనకు నివేదికను అందజేయాలని కలెక్టర్ రామసుందరరెడ్డి స్థానిక తహసీల్దార్ సులోచనారాణిని అదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక రెవెన్యూ అధికారులు ఆర్ఐ డి.రామ్కుమార్, సర్వేయరు రామకృష్ణలు గురువారం ఆయా గ్రామాల రెవెన్యూపరిధిలో గతంలో మైనింగ్తవ్వకాలకు అనమతులు ఇచ్చిన భూములను సర్వే చేశారు. దీనిపై పూర్తిస్థాయి నివేదికను త్వరలో జిల్లా అదికారులకు అందజేయనున్నట్టు రెవెన్యూ అధికారులు తెలిపారు. -
12న జాబ్ మేళా
● జేఎన్టీయూ జీవీ వీసీ వీవీ సుబ్బారావు విజయనగరం రూరల్: స్థానిక జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయంలో ఈ నెల 12న జాబ్ ఫెయిర్–2026 నిర్వహించనున్నట్లు ఉపకులపతి వీవీ సుబ్బారావు తెలిపారు. జాబ్ ఫెయిర్ను పురస్కరించుకుని వాల్పోస్టర్ను విశ్వవిద్యాలయం డైరెక్టర్లతో కలిసి గురువారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జేఎన్టీయూ జీవీ, నిర్మాణ్ ఆర్గనైజేషన్–ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 12న ఉదయం 9 గంటలకు ఈ జాబ్ ఫెయిర్ను నిర్వహించనున్నామన్నారు. బీటెక్, డిగ్రీ, డిప్లమో, ఐటీఐ చదివిన నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా జాబ్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ జాబ్ ఫెయిర్లో మేధా సర్వో, రాయల్ ఎన్ఫీల్డ్, టాటా ఎలక్ట్రానిక్స్, వోల్టాస్, కియా మోటార్స్, హ్యుండయ్, యోకోహామా వంటి ప్రతిష్టాత్మక కంపెనీలు పాల్గొని ట్రైనీ, అసెంబ్లీ ఆపరేటర్, ఆపరేటర్, ఎన్ఏపీఎస్ ట్రైనీ ఉద్యోగాలు అందిస్తున్నాయన్నారు. ఉద్యోగ స్థానాలు ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఉంటాయని పేర్కొన్నారు. జీతభత్యాలు నెలకు రూ.11 వేల నుంచి రూ. 21 వేలు ఉంటాయని తెలిపారు. జేఎన్టీయూలో ఓరియంటేషన్ అభ్యర్థులను ఇంటర్యూలు, ఎంపిక ప్రక్రియలకు సిద్ధం చేయడానికి ఈ నెల 9 నుంచి 11 వరకు జేఎన్టీయూలో ఓరియంటేషన్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆసక్తిగల అభ్యర్థులు రూ.100 రిజిస్ట్రేషన్ రుసుం చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు వారి విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు బయోడెటాతో జతచేసి అందించాలని, విజయనగరం, సమీప జిల్లాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలరని కోరారు. -
వ్యక్తి ఆత్మహత్య
సాలూరు: పట్టణంలోని డబ్బివీధిలో నివాసముంటున్న బొబ్బిలి పరమేశు(37) తన ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గురువారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పరమేశు మూర్ఛవ్యాధితో బాదపడుతున్నాడు. దీంతో మనస్తాపానికి గురై తన ఇంటిలో ఉరివేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒలింపియాడ్లో శ్రీజన్ విద్యార్థుల ప్రతిభపార్వతీపురం రూరల్: సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 33వ సర్ సీవీ రామన్ యంగ్ జీనియస్ ఒలింపియాడ్ (2025–26)లో పార్వతీపురంలోని శ్రీజన్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో గురువారం జరిగిన కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ పోటీల్లో నాలుగో తరగతి విద్యార్థిని పి.చందనశ్రీ రాష్ట్రస్థాయిలో బంగారు పతకం సాధించింది. జిల్లా స్థాయిలో ఎం.లాలిత్య (3వ తరగతి), పి.మోక్షితాప్రియ (4వ తరగతి), కె.పార్థసారథి (5వతరగతి) ప్రథమ బహుమతులు, డి.రుత్ (4వ తరగతి), వి.ఉమామహేశ్ (7వ తరగతి) ద్వితీయ బహుమతులు అందుకున్నారు. -
డిఫెన్స్ అకాడమీలో విద్యార్థి అత్మహత్య
కొత్తవలస: మండలంలోని విజయనగరం రోడ్డులో గల ఒక డిఫెన్స్ అకాడమీలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి ముడికి వికాస్(16) తీవ్రమైన తలనొప్పితో బాధ భరించలేక బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై సీఐ సీహెచ్.షణ్ముఖరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాకినాడ జిల్లా కాజులూరు మండలం పల్లెపాలెం గ్రామానికి చెందిన వికాస్ స్థాని డిఫెన్స్ అకాడమీలో ఇంటర్మీడియట్లో ప్రస్తుత విద్యాసంవత్సరంలో చేరాడు. కాగా కొద్ది నెలలుగా వికాస్ తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నట్లు తండ్రి సుబ్రహ్మణ్యంతో పాటూ తోటి విద్యార్థులు తెలిపారు.ఈ క్రమంలో బుధవారం మరోమారు తీవ్రమైన తలనొప్పి రావడంతో కళాశాల సిబ్బంది వికాస్ తండ్రికి ఫోన్లో సమాచారం అందించారు. ఇంటికి పంపించేస్తామని చెప్పగా ఇప్పడు బయల్దేరితే ఇంటికి వచ్చేసరికి అర్ధరాత్రి అవుతుందని, మరుసటిరోజు పంపించాలని కళాశాల సిబ్బందిని మృతుడి తండ్రిని కోరాడు. కాగా తోటి విద్యార్థులు డ్రిల్ కోసం మైదానంలోకి వెళ్లగా హాస్టల్ రూమ్లో ఎవరూ లేని సమయంలో బెడ్షీట్తో ఫ్యాన్కు ఊరివేసుకున్నాడు. తోటి విద్యార్థులు రూమ్కు వచ్చి చూసేసరికి ఫ్యాన్కు వేలాడుతూ కనిపించడంతో వెంటనే కళాశాల సిబ్బంది సహాయంతో కిందికి దించి స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కాగా ఒక్కగానొక్క కొడుకు అర్ధాంతరంగా తనువు చాలించడంతో తండ్రి లబోదిబోమంటూ రోదించాడు. -
సివిల్ సర్వీసెస్ కబడ్డీ పోటీలకు భాను
డెంకాడ: ఈనెల 9 నుంచి 12వ తేదీ వరకూ చండీగఢ్లో జరగనున్న ఆలిండియా సివిల్ సర్వీసెస్ కబడ్డీ నేషనల్ పోటీలకు రఘుమండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయిని కుర్మాన భాను ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా జట్టు తరఫున ఆమె కబడ్డీ పోటీల్లో పాల్గొంటారు. జాతీయ పోటీలకు ఎంపికై న ఆమెను పాఠశాల హెచ్ఎం బమ్మిడి ఇందిరాదేవి, కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు కోరాడ ప్రభావతి, దొర, ఐవీపీ రాజు, ఉపాధ్యాయులు అభినందించారు. సచివాలయం ఉద్యోగి శంకర్రావు నెల్లిమర్ల: ఆలిండియా సివిల్ సర్వీస్ ఉద్యోగుల కబడ్డీ పోటీలకు సచివాలయం ఉద్యోగి కాళ్ల శంకర రావు ఎంపికయ్యారు. మొయిద సచివాలయంలో సంక్షేమ, విద్యా సహాయకుడిగా పని చేస్తున్న కాళ్ల శంకర రావు ఈ నెల 9 నుంచి 14వరకు పంజాబ్ రాజధాని చండీగఢ్లో జరగబోయే జాతీయస్థాయి సివిల్ సర్వీస్ ఉద్యోగుల కబడ్డీ చాంపియ్ షిప్లో ఆంధ్ర సివిల్ సర్వీస్ ఉద్యోగుల జట్టు తరఫున ఎంపికయ్యారు. అలాగే జరజాపుపేటకు చెందిన కాళ్ల శంకర రావు జాతీయ పోటీలకు 4వ సారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శంకర రావు జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికవడం పట్ల ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్ బాబు, ఎంపీడీఓ కె. రామకృష్ణ రాజు, జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారులు, రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ బొమ్మన రామారావు, జరజాపుపేట, మొయిద గ్రామ పెద్దలు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ పెద్దలు అభినందించారు. -
సచివాలయంలో పాఠశాల
● శిథిలావస్థకు చేరుకున్న పాఠశాల భవనాలు ● ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు చీపురుపల్లిరూరల్(గరివిడి): ఆ పాఠశాలలో 11 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆ విద్యార్థులకు సరైన తరగతి భవనాలు, కనీసం మరుగుదొడ్ల సదుపాయం లేదు. ఎన్నో ఏళ్లుగా తరగతి భవనాలు శిథిలావస్థకు చేరుకున్నా సరే నాడు–నేడులో ఎలాంటి నిర్మాణాలు చేయలేదు. అయినా సరే ఆ శిథిల భవనాల్లోనే ఉపాధ్యాయులు బోధన చేసేవారు. చివరికి ఐదు నెలల క్రితం వచ్చిన మోంథా తుఫాన్ ప్రభావానికి శిథిలావస్థలో ఉన్నా భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వర్షం వల్ల శ్లాబ్ నుంచి లీకై న నీరు తరగతి భవనాల్లోకి ప్రవేశించి విద్యార్థలు కూర్చునే గచ్చులు బురదమయంగా తయారయ్యాయి. ఆ భవనాలు ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి. ఈ క్రమంలో గత్యంతరం లేక ప్రత్నామ్నాయంగా విద్యార్థులకు బోధన చేసేందుకు స్థానికంగా ఉన్న సచివాలయాన్ని కేటాయించారు. గరివిడి మండలంలోని ఏనుగువలస ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రస్తుతం స్థానిక సచివాలయమే పాఠశాలగా మారింది. స్థానికంగా ఉపాధ్యాయులకు, విద్యార్థులకు పాఠశాల లేకపోవడంతో వారంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గడిచిన ఐదు నెలలుగా సచివాలయంలో బోధన చేస్తున్నప్పటికీ పాఠశాల వాతావరణం ఏమాత్రం కనిపించదు. విద్యార్థులు ఆడుకునేందుకు ఆటస్థలం లేదు. పాఠశాల ఉన్నట్లయితే సరిపడా తరగతి భవనాలతో పాటు విద్యార్థులు ఆడుకునేందుకు ఆటస్థలం ఉంటుంది. పాఠశాలకు వెళ్లాలనే ఆసక్తి విద్యార్థుల్లో పెరుగుతుంది. పాఠశాలలో ఉండే సౌకర్యాలు, సదుపాయాలు, ఆటస్థలం లాంటివి సచివాలయంలో లేనందున పిల్లల్లో పాఠశాలకు వెళ్లాలని, పంపించాలని తల్లిదండ్రుల్లో నిరాసక్తి కలుగుతోంది. ప్రస్తుతం గ్రామంలో విద్యార్థులు చదువుకునేందుకు సరైన తరగతి భవనాలు లేకపోయిన కారణంగా పిల్లలను పాఠశాలల్లో చేర్పించడం లేదన్న విమర్శలు గ్రామస్తుల నుంచి వస్తున్నాయి. ఈ కారణంగా పిల్లలు తక్కువగా ఉన్నారని, తరగతి భవనాలు నిర్మించి ఉంటే పిల్లల అడ్మిషన్లు పెరుగుతాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఎన్నో ఏళ్లుగా భవనాలు శిథిలావస్థకు చేరుకున్నా సంబంధిత శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పాఠశాల అభివృద్ధికి నోచుకోలేదని వాపోతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాడు–నేడు కార్యక్రమం పేరుతో ఎన్నో పాఠశాలలు రూపుదిద్దుకున్నాయి. ఆ పాఠశాలల మాదిరిగా ఈ పాఠశాల తరగతి భవనాలను అభివృద్ధి చేయాల్సి ఉండగా నిర్లక్ష్యంతో వదిలేశారని ఆరోపిస్తున్నారు. ఈ నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థులు సచివాలయానికి వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఇప్పటికై నా విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా పాఠశాల తరగతి భవనాలను నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం
పార్వతిపురం రూరల్: పట్టణంలోని 29వ వార్డు రామాపురం కాలనీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఓ ఇల్లు గురువారం అగ్నికి ఆహుతైంది. స్థానిక నివాసి చింతల రమణమ్మ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఫ్రిడ్జ్, బీరువా, దుస్తులతో పాటు రూ.10 వేల నగదు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. సర్వం కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితురాలు వేడుకుంటోంది. గుండెపోటుతో హెడ్కానిస్టేబుల్ మృతివంగర: స్థానిక పోలీస్స్టేషన్లో హెడ్కానిస్టేబుల్గా పనిచేస్తున్న నడిపిల్లి సత్యనారాయణ(55) గురువారం గుండెపోటుతో మృతిచెందారు. ఎని మిది నెలలుగా ఆయన వంగర పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. రెండు రోజుల క్రితం గుండె సంబంధిత సమస్య రావడంతో విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. గురువారం ఒక్కసారిగా గుండెపోటు రావడంతో మృతిచెందారు. విజయనగరానికి చెందిన ఆయనకు భార్య క్రాంతిసౌజన్య ఉన్నారు. ఆయన మృతి పట్ల సీఐ హెచ్ ఉపేంద్రరావు, ఎస్సై షేక్ శంకర్, పోలీస్ సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు. పొట్టేళ్ల పందాలపై పోలీసుల దాడులువీరఘట్టం: మండలంలోని కడకెల్ల గ్రామ శివారులో జరుగుతున్న పొట్టేళ్ల పందాలపై ఎస్సై ఎస్.షణ్ముఖరావు తన సిబ్బందితో గురువారం దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.1500 స్వాధీనం చేసుకున్నారు. అలాగే పందెంలో ఉపయోగించిన రెండు పొట్టేళ్లను స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యంవిజయనగరం క్రైమ్ : విజయనగరం రైల్వే స్టేషన్ సమీపంలోని పోలీస్ అవుట్ పోస్ట్ వద్ద గుర్తు తెలియని మృతదేహాన్ని వన్టౌన్ పోలీసులు గురువారం కనుగొన్నారు. మృతుడి వయస్సు 55 ఉంటుందని చామన ఛాయ రంగుతో నీలం రంగు షార్ట్, వైట్ కలర్ ఫుల్హ్యాండ్స్ బనియన్ వేసుకున్నాడని ఏఎస్సై, రైటర్ జగన్మోహన్ తెలిపారు. హెచ్సీ రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారన్నారు. ఇద్దరికి గాయాలుగజపతినగరం: స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రగాయాలపాలయ్యారు. దత్తిరాజేరు మండలం రాజుల రామచంద్రపురం గ్రామానికి చెందిన వెంకటరమణ జాతీయ రహదారి దాటుతుండగా కొరాపుట్కు చెందిన సిద్దూరాత్ తన ద్విచక్రవాహనంతో ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈఘటనలో గాయపడిన ఇద్దరిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వెంకటరమణ పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎస్సై కిరణ్ కుమార్ నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చేపల చెరువు వ్యాపారి ఆత్మహత్యబలిజిపేట: చేపల చెరువు వ్యాపారంలో నష్టం రావడంతో మండలంలోని గౌరీపురం గ్రామానికి చెందిన ఎస్.సత్యనారాయణ(48) తట్టుకోలేక గుళికలు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై సింహాచలం తెలిపారు. గ్రామానికి చెందిన సత్యనారాయణ వృత్తిరీత్యా చేపల చెరువు లీజుకు తీసుకుని నిర్వహిస్తున్నాడు. దీనిలో రూ.5లక్షలు నష్టం రావడంతో భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుమారుడు నాగరాజు ఇచ్చిన ఫిర్యాదుమేర కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
రెవెన్యూ వసూళ్లలో వెనుకబాటు
● కీలకశాఖల్లో లక్ష్యాలకు దూరంగా ప్రగతి ● సమీక్షలో గుర్తించిన కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి విజయనగరం అర్బన్: జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ శాఖల రెవెన్యూ వసూళ్ల పురోగతిపై కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి గురువారం తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో పలుశాఖల్లో తీవ్ర లోటుపాట్లు ఉన్నట్లు స్పష్టమైంది. శాఖల వారీగా నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా వసూళ్లు జరగకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలో 98.29 శాతం పురోగతి నమోదైనప్పటికీ ఇంకా పూర్తి లక్ష్యసాధన జరగకపోవడంపై గుర్తుచేశారు. ఫిబ్రవరి నెలలో అదనపు భారం పడనున్న నేపథ్యంలో వసూళ్లపై మరింత శ్రద్ధ చూపి లక్ష్యాలను సాధించుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ అసహనం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖలో రూ.1,373.10 కోట్ల లక్ష్యానికి గాను ఇప్పటివరకు రూ.1,275.01 కోట్లు మాత్రమే వసూలవడంతో దాదాపు రూ.98 కోట్ల లోటు నెలకొంది. ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటున్నప్పటికీ వసూళ్లలో ఆశించిన వేగం లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. వాణిజ్యపన్నుల శాఖలో జనవరి వరకు రూ.322.20 కోట్ల లక్ష్యానికి గాను కేవలం రూ.238.20కోట్లు మాత్రమే వసూలవడం వల్ల 73.92 శాతానికి పురోగతి పరిమితమైంది. ఇతర శాఖలతో సమన్వయం లోపించకుండా చూసుకుని లక్ష్యాలను సాధించుకోవాలని సూచించారు. గనులు, భూగర్భశాఖలో రూ.124 కోట్ల లక్ష్యానికి రూ.71.93 కోట్లు మాత్రమే వసూలవడం ద్వారా పెద్దస్థాయిలో ఆదాయ లోటు స్పష్టమైంది. లే అవుట్లు, లీజులు, రవాణా అంశాలపై పర్యవేక్షణ బలహీనంగా ఉండడమే ఇందుకు కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ పరిధిలో డిటెక్షన్, క్వార్టర్లీ లైఫ్ ట్యాక్స్, ఫీజుల వసూళ్లలోనూ నిర్లక్ష్యం కనిపిస్తోందని సమీక్షలో అధికారులపై అసంతృప్తి కలెక్టర్ వ్యక్తం చేశారు. అటవీశాఖ ద్వారా జనవరి వరకు రూ.35.857 లక్షలు మాత్రమే వసూలవడం కూడా ఆశించిన స్థాయికి తగ్గిందని సమీక్షలో వెల్లడైంది. దీంతో అక్రమ కార్యకలాపాల నియంత్రణలో రోజువారీ పర్యవేక్షణలో లోపాలు ఉన్నాయని జిల్లా యంత్రాంగం స్వయంగా అంగీకరించిన పరిస్థితి నెలకొంది. సమావేశంలో జీఎస్టీ జాయింట్ కమిషనర్ జి.నిర్మలజ్యోతి, జిల్లా అటవీశాఖ అధికారి ఆర్.కొండలరావు, చిట్స్ రిజిస్ట్రార్ ఎస్ఎస్రేవతి, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఎ.శ్రీరంగందొర, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డి.మణికుమార్, మైన్స్ అండ్ జియోలజీ జిల్లా అధికారి సీహెచ్.సూర్యచంద్రరావు, ఎంవీఐ దుర్గాప్రసాద్ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
పైడితల్లి హుండీల ఆదాయం రూ.7,08,473లు
డెంకాడ: మండలంలోని జొన్నాడ పైడితల్లి అమ్మవారి హుండీల ఆదాయాన్ని దేవదాయ శాఖ అధికారులు గురువారం లెక్కించారు. ఈనెల 2 నుంచి 5వ తేదీ వరకు జరిగిన జాతరలో భక్తులు సమర్పించిన కానుకల రూపంలో రూ.7లక్షల 8వేల 473లు వచ్చినట్టు ఈఓ శ్రీనివాస్ తెలిపారు. సిద్ధమవుతున్న వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయం ● త్వరలో ప్రారంభం... ఇక అక్కడి నుంచే కార్యకలాపాలు సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం రింగురోడ్డులో దాసన్నపేట వద్ద చేపట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభానికి ముస్తాబవుతోంది. తుది నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్నశ్రీను) నిరంతరం పనులను పర్యవేక్షిస్తున్నారు. ఉగాది నాటికి అన్ని పనులూ పూర్తిచేసుకుని ప్రారంభానికి సిద్ధం చేస్తామని ఆయన తెలిపారు. ప్రారంభోత్సవం తరువాత నుంచి పార్టీ కార్యకలాపాలన్నీ ఇక్కడ నుంచే కొనసాగిస్తామన్నారు. మీడియా సమావేశాలు, పార్టీ కార్యకర్తలకు శిక్షణ, జిల్లా స్థాయి విస్తృత సమావేశాలు ఇక్కడే నిర్వహిస్తామని చెప్పారు. మీడియాసెల్ కూడా ఇక్కడే ఉంటుందని, పార్టీ పరమైన సమాచారం మీడియాకు అందించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని, మీడియాకోసం ప్రత్యేక రూమ్ కేటాయిస్తామని తెలిపారు. జిల్లాలో ఎస్సీ కమిషన్ సభ్యుడి పర్యటన రేపు విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం ఈ నెల 7వ తేదీన జిల్లాలో పర్యటించనున్నట్టు ఆధికారులు తెలిపారు. ఆయన శనివారం ఉదయం 9.30 గంటలకు విజయనగరానికి చేరుకుంటారు. స్థానిక జెడ్పీ గృహం వద్ద షెడ్యూల్డ్ కులాల సామాజిక వర్గానికి చెందిన ప్రజల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యల పరిష్కారంపై సంబంధిత అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం ఉదయం 11 గంటలకు విజయనగరం నుంచి బయలుదేరి చీపురుపల్లి వెళ్లనున్నారు. అక్కడి నుంచి రాజాం నియోజకవర్గంలో పర్యటించి ఎస్సీ వర్గాల సమస్యలను ప్రత్యక్షంగా తెలుకుంటారు. లంక దినకర్ జిల్లాకు రాక రేపు విజయనగరం అర్బన్: 20 సూత్రాల ప్రణాళిక చైర్మన్ లంక దినకర్ శనివారం ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందింరలో కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టుల అమలు తీరుపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు కలెక్టరేట్లో పత్రికా సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు కూటమి నాయకులతో సమావేశమై తిరిగి విశాఖపట్నం బయలుదేరి వెళ్తారని అధికారులు తెలిపారు. 7న జాబ్మేళా విజయనగరం అర్బన్: జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల7న పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐలో జాబ్మేళా నిర్వహిస్తామని జిల్లా ఉపాధిఅధికారి ఆర్.వహీదా తెలిపారు. ఫెనెస్ట్రీ విండోస్ అండ్ డోర్స్, టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేటు లిమిటెడ్, ఫ్లిప్కార్ట్, యాజాకి ఇండియూ ప్రైవేట్ లిమిటెడ్, ద్వారకా ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, జెఫ్టో తదితర ప్రైవేటు సంస్థలు పాల్గొని వివిధ విభాగాల్లో ఉద్యోగనియామకాలు చేపడతాయన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, పీజీ అర్హతలు కలిగిన అభ్యర్థులు జాబ్మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తిగల అభ్యర్థులు ముందుగా ‘ఎంప్లాయిమెంట్.ఏపీ.జీఓవీ.ఐఎన్’ వెబ్సైట్లో జాబ్ సీకర్ లాగిన్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. -
11 బార్లకు లైసెన్సుల మంజూరు
● కలెక్టర్ రాంసుందర్ రెడ్డి చేతుల మీదుగా లాటరీ ప్రక్రియ ● ప్రభుత్వానికి రూ.3.10 కోట్ల ఆదాయం విజయనగరం రూరల్: జిల్లాలో మిగిలిపోయిన 11 బార్లకు లైసెన్స్లు మంజూరయ్యాయి. కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి లాటరీతీసి బార్లు కేటాయించారు. జిల్లాలోని 31 బార్లకు గతంలోనే 20 బార్లకు లైసెన్సులు మంజూరు చేయగా మిగిలిన 11 బార్లకు ఎకై ్సశాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. బార్ల లైసెన్సులకు 62 మంది దరఖాస్తు చేసుకోగా, దరఖాస్తు ఫీజు రూపంలోనే ప్రభుత్వానికి రూ.3.10 కోట్లు ఆదాయం లభించింది. లాటరీ ప్రక్రియ నిర్వహణకు ఆడిటోరియంలో 6 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్ వద్ద తహసీల్దార్, ఒక సీఐను నియమించారు. రిజర్వ్ 1, రిజర్వ్ 2 దరఖాస్తుదార్ల పేర్లను సైతం లాటరీలో ఎంపిక చేశారు. రెండు రౌండ్లలో లాటరీ ప్రక్రియ ముగించారు. కార్యక్రమంలో అబ్కారీశాఖ డీసీ వై.శ్రీనివాసచౌదరి, ఈఎస్ బి.శ్రీనాథుడు, ఏఈఎస్ ఎ.శ్రీరంగందొర, ఎకై ్సజ్ సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
జాతర ఖర్చుల సంగతేంటి?
● సమన్వయ సమావేశంలో ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు ● స్పందించని ఎమ్మెల్యే కళావెంకటరావు, ఆలయ కమిటీ చీపురుపల్లి: కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర నిర్వహణకు సుమారు రూ.40 లక్షల వరకు ఖర్చు అవుతుంది.. ఆ డబ్బులను ఎక్కడి నుంచి పోగుచేస్తారో ఆలయ కమిటీ సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు సమక్షంలో గురువారం జరిగిన జాతర సమన్వయ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, పౌరసరఫరాల కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గద్దే బాబూరావు ప్రశ్నించారు. దీనికి ఎమ్మెల్యే ‘కళా’తో సహా ఆలయ కమిటీ సభ్యులు ఒక్కరూ స్పందించలేదు. సమాధానం ఇవ్వలేదు. అక్కడే ఉన్న దేవదాయశాఖ ఈఓ తమ శాఖ నుంచి రూ.15 లక్షలు ఇస్తామని వెల్లడించారు. మిగిలిన డబ్బు గురించి ఆయన పదేపదే ప్రశ్నించినా సమాధానం లేకపోవడంతో ఎమ్మెల్యే, కమిటీ సభ్యులే జాతర నిర్వహణ చూసుకోవాలంటూ ప్రసంగాన్ని ముగించారు. జాతర విజయవంతానికి ప్రతీ ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎస్.రాఘవులు, సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.శంకరావు, తహసీల్దార్ డి.ధర్మరాజు, ఎంపీడీఓ ఐ.సురేష్, ఆలయ కమిటీ చైర్మన్ గవిడి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలు ప్రశ్నిస్తేచాలు... ఇదిగో పనులు పూర్తి చేసేస్తామంటూ టీడీపీ నేతలు ప్రకటనలు చేస్తారు.. వాటిని ప్రజలు నమ్మేలే ఎల్లోమీడియా వార్తలు వడ్డిస్తుంది. వంతెన పూర్తయినట్టే అన్న రీతిలో కథనాలతో మభ్యపెడుతుంది. తీరా క్షేత్రస్థాయిలో చూస్తే.. పనుల ఆనవాళ్లు కనిపించవు.
గత ప్రభుత్వం బలసల రేవు వంతెన కోసం నిర్మించిన పిల్లర్లు పునఃప్రారంభిస్తాం వాల్తేరు వద్ద నాగావళి నదిపై వంతెన నిర్మాణం పనులు తాత్కాలికంగా నిలిచాయి. కాంట్రాక్టర్కు నోటీసులు ఇచ్చాం. త్వరలో పనులు ప్రారంభిస్తాం. ఇక్కడి వంతెన ఆవశ్యకతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. వంతెన నిర్మాణం వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటాం. – బీవీ నాయక్, ఆర్అండ్బీ ఏఈ, బలసలరేవు వంతెన విభాగం రాజాం/సంతకవిటి: సంతకవిటి మండలంలోని వాల్తేరు గ్రామం వద్ద నాగావళి నదిపై తలపెట్టిన బలసలరేవు వంతెన... 50 గ్రామాల ప్రజల రాకపోకల కష్టాలను తీర్చే వారధి. వంతెన నిర్మాణం ఆవశ్యకత, దశాబ్దాలుగా ప్రజల పోరాటాన్ని గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గుర్తించింది. ఆర్అండ్బీ నుంచి రూ.87 కోట్లు మంజూరు చేయించి వంతెన పనులను ప్రారంభించింది. పిల్లర్ల స్థాయి వరకు నిర్మాణం పూర్తిచేసింది. ఇంతలో ఎన్నికలు రావడం.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వంతనె నిర్మాణం ‘ఎక్కడవేసిన గొంగలి అక్కడే’ అన్న చందంగా మారింది. ఏడాదిన్నరగా వంతెనవైపు కన్నెత్తి చూసేవారే కరువయ్యారు. పనులు ఒక్కడుగు కూడా ముందుకు కదలలేదు. చిన్న ఇసుకరేణువు పనికూడా చేపట్టలేదు. ఇప్పటికే అందుబాటులోకి రావాల్సిన వంతెన పనులు నిలిచిపోవడంతో ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ప్రయాణ కష్టాలు యథాతథంగా మారిపోయాయంటూ వాపోతున్నారు. ● బాబు చేతిలో మోసపోతున్న ప్రజలు సంతకవిటి మండలం వాల్తేరు వద్ద 1998లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనే వంతెన నిర్మా ణానికి నిధులు మంజూరు చేసినట్లు చంద్రబాబునాయుడు ప్రకటించారు. కానీ ఒక్క పైసా కూడా మంజూరు చేయలేదు. అప్పటి నుంచి వాల్తేరు గ్రామస్తులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు వంతెన కోసం పోరుబాట సాగించారు. అధికారులు, పాలకులకు వినతులు అందజేశారు. 2014లో రెండేళ్ల పాటు నిరవధిక నిరాహార దీక్షలు కొనసాగించారు. అయినా, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కనికరించలేదు. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజల వంతెన సమస్యను గుర్తించింది. నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించింది. 560 మీటర్ల పొడవున నిర్మించే వంతెనకు 16 పిల్లర్లకు తొలుత నాగావళి నదీ గర్భంలోని 8 పిల్లర్లను స్లాబ్ స్థాయివరకు పూర్తిచేసింది. రెండు వైపులా వంతెన అప్రోచ్ రోడ్డు నిర్మాణం కోసం రైతుల నుంచి 14 ఎకరాల భూమిని సేకరించింది. వంతెన పూర్తవుతుందని, కొద్దినెలల్లో ప్రయాణ కష్టాలు తొలగుతాయని ప్రజలు సంతోషించిన వేళ.. ఎన్నికలు రావడం.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. పనులు పూర్తిచేసేందుకు శ్రద్ధచూపే నాథుడే కరువయ్యారు. పూర్తయితే ప్రయోజనం వంతెన నిర్మాణం పూర్తయితే సంతకవిటి నుంచి ఆమదాలవలస, శ్రీకాకుళం ప్రాంతాలకు రహదారి సౌకర్యం కలుగుతుంది. వాల్తేరు, పనసపేట, గారన్నాయుడపేట, చిత్తారిపురం, కావలి, గోకర్ణపల్లి, సిరిపురం, జీఎన్పురం, జానకీపురం, శేషాద్రిపురం, అప్పలఅగ్రహారం, బూరాడపేట, మంతిన, మల్లయ్యపేట, రామారాయపురం, మల్లయ్యపేట, చింతలపేట, మందరాడ, మండాకురిటి తదితర గ్రామాలతో పాటు ఆమదాలవలసలో పలు మండలాలుకు రహదారి సౌలభ్యం కలుగుతుంది. దూరం తగ్గుతుంది. నాటుపడవలపై నదిని దాటాల్సిన అవసరం ఉండదు. పనులు సాగువు.. కష్టాలు తీరవు..! వాల్తేరు వద్ద నాగావళి నదిపై వంతెన నిర్మించాలని దశాబ్దాలుగా ప్రజల పోరాటం అధికారంలోకి రాగానే రూ.87 కోట్లతో పనులు ప్రారంభించిన గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పిల్లర్ల స్థాయి వరకు నిర్మాణం అప్పట్లో చకచకా సాగిన పనులు ఏడాదిన్నరగా పనులను పట్టించుకోని చంద్రబాబు సర్కారు నీరుగారిన డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ హామీ ఆవేదనలో 50 గ్రామాల ప్రజలు -
రోడ్లు ఇలా.. భక్తులు వచ్చేది ఎలా?
● దుమ్మధూళితో నిండిన రామతీర్థం ● ఈ ఏడాది శివరాత్రి ఉత్సవాలకు ఇబ్బందులు తప్పవంటూ భక్తుల నిట్టూర్పు ఆలయానికి వెళ్లే ప్రధాన రోడ్డులో కొనసాగుతున్న పనులు నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని రాములోరి ఆలయంలో ఈ నెల 15 నుంచి రెండు రోజుల పాటు శివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. వీటికి రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. ఉత్సవాలు సమీపిస్తున్నా రోడ్డు విస్తరణ పనులు పూర్తిచేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. నెల్లిమర్ల–రణస్థలం రోడ్డులో నెల్లిమర్ల నుంచి రామతీర్థం మీదుగా ఎంబేరేయగుళ్లు వరకు రెండు నెలలే కిందట ప్రారంభించిన విస్తరణ పనులు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో జరగనున్న శివరాత్రి ఉత్సవాలకు అవస్థలు తప్పేలా లేవని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేవస్థానానికి వెళ్లే రోడ్డు అసంపూర్తిగా వదిలేయడంపై అసహనం వ్యక్తంచేస్తున్నారు. రెండు నెలల కిందట ప్రారంభించిన పనులు పూర్తి కాకపోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా మట్టి కుప్పలు వేయడంతో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోందని, జాతరకు విచ్చేసే భక్తులు ఇబ్బందులు పడే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. శివరాత్రి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని పనులు చకచకా పూర్తిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికే రామతీర్థం పరిసర ప్రాంతాలు అస్తవ్యస్తంగా మారాయని, రోడ్డంతా దుమ్ముధూళితో దర్శనమిస్తోందని, జాతర నాటికి ఈ పరిస్థితులను చక్కదిద్దాలని అధికార యంత్రాంగానికి భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. కొనసాగుతున్న విస్తరణ పనులు... నెల్లిమర్ల నుంచి రామతీర్థం మీదుగా సతివాడ వరకు రోడ్డు విస్తరణ పనులకు గత ప్రభుత్వంలోనే నిధులు మంజూరయ్యాయి. పనులు కూడా అప్పట్లో చకచకా జరిగాయి. రహదారికి ఇరువైపులా బెర్ముల ఏర్పాటు చేయడంతో పాటు సుమారు ఎనిమిది చోట్ల మినీ కల్వర్టులు నిర్మించారు. ప్రభుత్వం మారడంతో విస్తరణ పనులకు బ్రేకులు పడ్డాయి. 16 నెలల సుదీర్ఘ విరామం తరువాత విస్తరణ పనులు ఇటీవల పునఃప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా సంక్రాంతికి ముందు తంగుడుబిల్లి కూడలి నుంచి నెలివాడ ఆలయం వరకు సుమారు కిలోమీటరు మేర మాత్రమే తారుపోసి వదిలేశారు. అనంతరం రామతీర్థం ప్రధాన రోడ్డులో ప్రధాన కాలువ పనులు ప్రారంభించారు. నిర్మాణం పూర్తయిన చోట కాలువలపై పలకలువేస్తూ కొందరు రోడ్డును ఆక్రమిస్తుండడంతో రోడ్డు విస్తరణ చేపట్టినా ప్రయోజనం శూన్యంగా కనిపిస్తోందని స్థానికులు వాపోతున్నారు. -
డిప్యూటీ సీఎం ఎక్కడ?
డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇక్కడ వంతెన నిర్మాణం నిమిత్తం ప్రజలు పోరాటాన్ని చూసి సంఘీభావం తెలిపారు. వంతెన పోరాట కమిటీ ఏర్పాటుచేసిన నిరవధిక దీక్షల్లో భాగంగా 2018 అక్టోబర్ 20న పవన్ వాల్తేరుకు వచ్చి దీక్షలో పాల్గొన్నారు. తమకు అధికారం వచ్చిన తరువాత ఇక్కడ వంతెన ఎందుకు నిర్మాణం జరగదో చూస్తామంటూ ప్రగల్బాలు పలికారు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. ప్రజలను వంచించడం సబబుకాదని చంద్రబాబుకు అల్టిమేటం ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా బలసలరేవు వంతెన పరిస్థితిని కనీసం పట్టించుకోవడంలేదు. ఈయన కూడా చంద్రబాబు బడిలో చేరడంతో వంతెన నిర్మాణంపై నమ్మకం సన్న గిల్లుతోందన్న వ్యాఖ్యలు ఈ ప్రాంత ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. -
ముగిసిన దివ్యాంగ విద్యార్థుల కళా సాంస్కృతిక పోటీలు
విజయనగరం అర్బన్: స్థానిక యూత్ హాస్టల్లో విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో రెండురోజుల పాటు దివ్యాంగ విద్యార్థులకు నిర్వహించిన కళలు–సాంస్కృతిక పోటీలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దివ్యాంగ విద్యార్థుల దేశభక్తి, జానపద, భక్తిగీతాలకు నృత్యప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. లఘునాటికలు, ఏకపాత్రాభినయాలతో అలరించారు. పలువురు విద్యార్థులు గీతాలాపన చేయగా కార్యక్రమం మొత్తం ఉత్సాహభరితంగా సాగి ఆహూతులను మంత్రముగ్ధులను చేసింది. రెండోరోజున జిల్లా సమగ్ర శిక్ష ఏపీపీ డాక్టర్ ఎ.రామారావు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయన్నారు. జిల్లా సహిత విద్య సమన్వయకర్త ఎస్.సూర్యారావు, సహ సమన్వయకర్త ఎం.భారతి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారులు, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దివ్యాంగ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సహిత విద్య ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
రైతన్నకు దన్నేది..?
అగ్రి టెస్టింగ్ ల్యాబ్లో ఏర్పాటు చేసిన విత్తన పరీక్ష పరికరాలు విజయనగరం ఫోర్ట్: రైతులకు ఉపయోగపడే అగ్రిల్యాబ్లు నిర్వీర్యమవుతున్నాయా అంటే... జిల్లాలో అవుననే సమాధానం వినిపిస్తోంది. జిల్లాలో ఉన్న ఏడు అగ్రిల్యాబ్లలో జిల్లాస్థాయి ల్యాబ్ను ఇంకా అందుబాటులోకి తేకపోవడం.. మరోవైపు సారిక, గజపతినగరంలోని ల్యాబ్లలో విత్తన, ఎరువుల పరీక్షలు నిలిచిపోవడం రైతన్నను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సాగుకు దన్నుగా ఉండే ల్యాబ్లపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యవసాయంపై చంద్రబాబు ప్రభుత్వం చిన్నచూపుచూస్తోందని, రైతుసేవా కేంద్రాల్లో గతంలో వలే సాగు సేవలు అందడంలేదని, ఉచిత పంటల బీమా పథకానికి మంగళం పాడేసిందని, విపత్తుల సమయంలో పరిహారం అందడంలేదని, పెట్టుబడి సాయం కూడా సకాలంలో అందని పరిస్థితి నెలకొందంటూ రైతులు వాపోతున్నారు. వ్యవసాయం దండగన్న ధోరణిలో యూరియా కూడా అందించడంలేదని ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడు అగ్రిల్యాబ్లను కుదించి సేవలను అందని ద్రాక్షగా మార్చుతోందని ఆరోపిస్తున్నారు. రైతులకు ఉపయోగకరం... రాష్ట్రంలోని తిరుపతి, తాడేపల్లి గూడెం, అమరావతి, విశాఖపట్నంలో ఉన్న రీజనల్ కోడింగ్ సెంటర్స్ నుంచి జిల్లాలోని అగ్రి టెస్టింగ్ ల్యాబ్లకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులకు సంబంధించి శాంపిల్స్ వస్తాయి. వీటిని పరీక్షలు చేసిన తర్వాత వాటి ఫలితాలను ఆన్లైన్లో సంబంధిత వ్యవసాయ శాఖ కార్యాలయానికి పంపిస్తారు. విత్తనాలకు సంబంధించి మొలక శాతం, తేమశాతం, ప్యూరిటీ పరీక్షలు, ఎరువులకు సంబంధించి ఎరువు బస్తాపై తెలిపిన విధంగా నత్రజని, పొటాష్, పాస్పరస్, ప్రీపాస్పరిక్ యాసిడ్స్ ఉన్నాయో లేదో పరీక్షిస్తారు. జిల్లాలో ఉన్న రైతులు తమ సమీపంలోని ల్యాబ్లను నేరుగా శాంపిల్స్ను తీసుకెళ్లి పరీక్షలు చేయించుకోవచ్చు. భూ సార పరీక్షల ఫలితాలను తెలుసుకోవచ్చు. ల్యాబ్లను కుదించే యత్నం.. జిల్లాలో ఉన్న అగ్రి టెస్టింగ్ ల్యాబ్లను చంద్రబాబు ప్రభుత్వం కుదించే ప్రయత్నం చేస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజయనగరం నియోజకవర్గం పరిధిలోని సారిక గ్రామంలో ఉన్న నియోజకవర్గ స్థాయి అగ్రి టెస్టింగ్ ల్యాబ్ను, చీపురుపల్లిలో ఉన్న అగ్రి టెస్టింగ్ ల్యాబ్లలో సేవలు నిలిచిపోయినట్టు సమాచారం. విత్తనాలు, ఎరువులకు సంబంధించిన పరీక్షలు కూడా నిలిపివేయడంపై రైతులు ఆవేదన చెందుతున్నారు. నెలివాడ వద్ద నిర్మించిన జిల్లాస్థాయి ల్యాబ్ను అందుబాటులోకి తేవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని రైతులు ప్రశ్నిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. రైతులకు ఉపయోగపడే ల్యాబ్ల నిర్వహణపై ప్రభుత్వం కినుక నిర్వీర్యంచేసే ఎత్తుగడ జిల్లాలో ఏడు అగ్రి ల్యాబ్లు ఇప్పటికీ అందుబాటులోకి రాని జిల్లాస్థాయి ల్యాబ్ గత ప్రభుత్వ హయాంలో ఒక్కోల్యాబ్ రూ.62 లక్షలతో నిర్మాణం పరికరాలకు మరో రూ.60 లక్షల వరకు ఖర్చు సాగుకు భరోసాగా ల్యాబ్ల ఏర్పాటు ల్యాబ్లను తగ్గించాలని ఆదేశాలొచ్చాయి... జిల్లాలో ఆరు నియోజకవర్గ స్థాయి, ఒకటి జిల్లా స్థాయి అగ్రిటెస్టింగ్ ల్యాబ్లు ఉన్నాయి. నెలివాడ వద్ద ఉన్న జిల్లా స్థాయి ల్యాబ్ ఇంకా ప్రారంభించలేదు. ఈ ఖరీఫ్ సీజన్కు అందుబాటులో తెచ్చేందుకు చర్యలు తీసుకుంటాం. కొన్ని నియోజకవర్గ స్థాయి ల్యాబ్లను తగ్గించాలని ఆదేశాలు వచ్చాయి. – వి.తారకరామారావు, జిల్లా వ్యవసాయ అధికారి రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, భూసార పరీక్ష ఫలితాలు అందించి వారికి అన్నివిధలా అండగా నిలవాలనే గొప్ప సంకల్పంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నియోజకవర్గానికో అగ్రిల్యాబ్లను ఏర్పాటు చేసింది. విజయనగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల, రాజాం, బొబ్బిలి, కొత్తవలసల్లో నియోజకవర్గ స్థాయి అగ్రి టెస్టింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేయగా, గజపతినగరం నియోజకవర్గంలోని బొండపల్లి మండలం నెలివాడ వద్ద జిల్లా స్థాయి అగ్రిల్యాబ్ను నిర్మించింది. ఒక్కోల్యాబ్ ఏర్పాటుకు రూ.62 లక్షలు వెచ్చించించింది. మరో రూ.60 లక్షల వరకు వెచ్చించి పరికరాలు సమకూర్చింది. సాగును లాభసాటిగా మార్చడంలో అగ్రిల్యాబ్లు రైతుకు దన్నుగా నిలవాలన్నది ప్రధాన లక్ష్యం. సకాలంలో భూ పరీక్ష ఫలితాలు అందడం వల్ల నేలకు తగ్గట్టుగా పంటలు పండించేందుకు... భూ లోపాలను సరిచేసుకునేందుకు రైతుకు అవకాశం కలుగుతుంది. అధిక దిగుబడుల సాధనకు వీలుకలుగుతుంది. నాణ్యమైన విత్తనాలు, ఎరువులను వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇంతటి ప్రయోజనం ఉన్న అగ్రిల్యాబ్ల పట్ల చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం చేస్తుందని రైతులు వాపోతున్నారు. అగ్రిటెస్టింగ్ ల్యాబ్లను పట్టించుకోవడం మానేసిందని రైతులు ఆరోపిస్తున్నారు. -
మీటర్ రీడర్స్కు స్మార్ట్ గుబులు..!
● ఉపాధికి గండి పడుతుందని ఆందోళన ● కొద్ది రోజులుగా సమ్మెబాట ● జిల్లాలో ఏడు లక్షలపైగా విద్యుత్ కనెక్షన్లు మీటర్ రీడర్స్ డిమాండ్స్ విద్యుత్సంస్థలోకి విద్యార్హతను బట్టి ఔట్సో ర్సింగ్ ఉద్యోగులుగా తీసుకోవాలి ● ఉద్యోగ భద్రత కల్పించాలి ● ఖాళీ సమయాల్లో పని కల్పించాలివిజయనగరం ఫోర్ట్: ఏరు దాటిందాకా ఏటి మల్ల న్న..ఏరు దాటాక బోడి మల్లన్న అన్న చందంగా తయారైంది కూటమి ప్రభుత్వం పరిస్థితి. ఎన్నికల ముందు తమ్ముళ్లూ స్మార్ట్మీటర్లు బిగిస్తే బద్దలుగొట్టండి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు విద్యుత్ వినియోగదారులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అదే నోటితో స్మార్ట్ మీటర్లు బిగించుకోండని చెబుతున్నారు. దీంతో విద్యుత్ వినియోగదారులు విస్తుపోతున్నారు. టీడీపీ నేతల రెండు నాలుకల ధోరణి పట్ల మండిపడుతున్నారు. జిల్లాలో విద్యుత్ వినియోగదారులకు బిగిస్తున్న స్మార్ట్ మీటర్లు మీటర్ రీడర్స్ గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. స్మార్ట్ మీటర్లు పూర్తి స్థాయిలో బిగించినట్లయితే తమకు ఉద్యోగ భద్రత ఉండదని మీటర్ రీడర్స్ మధనపడుతున్నారు. ఇప్పటికే జిల్లాలో వేలాది స్మార్ట్ మీటర్లు బిగించేశారు. దీంతో తమ ఉద్యోగాలకు ఎసరు వస్తుందని ఉద్యోగ భద్రత కల్పించాలని గడిచిన ఏడు రోజులుగా మీటర్ రీటర్స్ సమ్మె చేస్తున్నారు. రీడర్ తీసే రీడింగ్ 3,500 నుంచి 4 వేలు జిల్లాలో 170 మంది మీటర్ రీడర్స్ ఉన్నారు. ప్రతినెల ఒకటో తేదీ నుంచి 10 వతేదీ లోగా ఇంటింటికీ వెళ్లి వారు మీటర్ రీడింగ్ తీస్తారు. సర్వీసులు ఎక్కువ ఉన్నచోట 12 వతేదీ వరకు కూడా పడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో మీటర్కు రూ.3.25, పట్టణ ప్రాంతాల్లో రూ.3 చొప్పున చెల్లిస్తారు. 91,224 స్మార్ట్ మీటర్ల లక్ష్యం జిల్లాలో 91,224స్మార్ట్ మీటర్లు బిగించాలని విద్యుత్శాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ఇప్పటివరకు 40 వేల స్మార్ట్ మీటర్లు బిగించేశారు. స్మార్ట్ మీటర్ల వల్ల మీటర్ రీడర్స్కు పని ఉండదు స్మార్ట్ మీటర్లు బిగించడం వల్ల సంబంధిత వినియోగదారుడి సెల్కు విద్యుత్ బిల్లు ఎంత అనేది మేసేజ్ వచ్చేస్తుంది. ప్రత్యేకించి రీడింగ్ తీయాల్సిన పని ఉండదు. దీనివల్ల మీటర్ రీడర్స్ అవసరం ఉండదు. దీంతో తమకు ఉద్యోగం ఉండదనే ఆందోళన వారిలో నెలకొంది. టీడీపీ సర్కార్ తీరు పట్ల మీటర్ రీడర్స్ పెదవి విరుస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా , అధికారంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నారు. నారాలోకేష్ యువగళం పాదయాత్రలో మీటర్ రీడర్స్ కలిసినప్పుడు అధికారంలోకి వస్తే ఉద్యోగ భద్రత కల్పిస్తామని మాట ఇచ్చారు. అయితే స్మార్ట్ మీటర్లు బిగించడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం తమ పొట్ట కొడుతోందని మీటర్ రీడర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీటర్ రీడర్స్కు కనీస వేతనాలు అమలు కావడం లేదు. ఉద్యోగ భద్రత కూడా లేదు. నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉండడం వల్ల డిగ్రీచదివిన వారు సైతం కొందరు మీటర్ రీడర్స్గా చేస్తున్నారు. 10, 15 ఏళ్లుగా మీటర్ రీడర్స్గా పనిచేస్తున్నారు. ఆందోళనలో వినియోగదారులు: ప్రతి నెలా 10 వతేదీ లోగా మీటర్ రీడర్స్ రీడింగ్ తీస్తారు. ఒక్కరోజు ఆలస్యం అయినా వినియోదారులపై భారం పడుతుంది. మరింతజాప్యం జరిగితే మీటర్రీడింగ్ మారిపోయి చెల్లించాల్సిన టారిఫ్ భారీగా పెరిగిపోతుందని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. గృహ వినియోగదారులకు ఫర్వాలేదుకాని వాణిజ్య వినియోగదారులకు మరింతగా భారం పడే అవకాశం ఉంది. జిల్లాలో విద్యుత్ కనెక్షన్ల వివరాలుకేటగిరి విద్యుత్ కనెక్షన్ల సంఖ్య కేటగిరి–1 5,99,932 కేటగిరి–2 65,383 కేటగిరి–3 2513 కేటగిరి–4 14,356 కేటగిరి–5 41,007 హెచ్టీ –సర్వీస్ 434మీటర్ రీడింగ్కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మీటర్ రీడర్స్ గత నెల 29వతేదీ నుంచి సమ్మె చేస్తున్నారు.మీటర్ రీడింగ్ తీసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. 91 వేల స్మార్ట్ మీటర్లు బిగించాలన్నది లక్ష్యం కాగా ఇంతవరకు 40 వేలు బిగించాం. మువ్వల లక్ష్మణరావు, ఎస్.ఈ, ఏపీఈపీడీసీఎల్ -
ఉద్యోగ బకాయిల చెల్లింపునకు ఏపీజీఈఏ డిమాండ్
విజయనగరం అర్బన్: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల బకాయిలు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) డిమాండ్ చేసింది. ఇప్పటికే మంజూరైన వివిధ రకాల ఆర్థిక ప్రయోజనాలు దాదాపు రూ.35 వేల కోట్లకు చేరినప్పటికీ, ఇంకా మంజూరు కావాల్సిన బకాయిలు ఉన్నాయని, వాటిని రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపు చేయాలని కోరింది. తమ తరఫున ప్రభుత్వానికి విన్నవించాలని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణకు బుధవారం వినతిపత్రాన్ని అందజేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలను అందజేసే కార్యక్రమాన్ని ఆ సంఘ సభ్యులు చేపట్టారు. ఇందులో భాగంగా బకాయిలను, ఇతర ఆర్థిక అంశాలకు సంబంధించి 2026–27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టే రాష్ట్ర బడ్జెట్లో తగిన కేటాయింపులు చేయాలని కోరారు. ఈ అంశాన్ని శాసనసభ, శాసన మండలిలో బలంగా ప్రస్తావించి ప్రభుత్వం సానుకూలంగా స్పందించేలా చూడాలని విజ్జప్తి చేశారు. దీనిపై స్పందించిన బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఉద్యోగుల బకాయిలకు సంబంధించి పద్దులవారీగా పూర్తి వివరాలు సేకరించిన అనంతరం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఫైనాన్స్బిల్లు వచ్చిన సమయంలో అవసరమైన సందర్భాల్లో ఈ అంశాన్ని సభలో ప్రస్తావిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీని కలిసిన వారిలో సంఘం జిల్లా అధ్యక్షుడు పువ్వల శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి లెంక సత్తిబాబుతో పాటు శైలాడ ఈశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు సీహెచ్ వెంకటసతీష్, మహిళా విభాగం అధ్యక్షురాలు వి.రాజేశ్వరి, పెన్షనర్ల విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు. బడ్జెట్లో నిధులు కేటాయించాలి తమ తరుఫున పోరాటం చేయాలని శాసన మండలి విపక్షనేత బొత్సకు ఏపీజీఈఏ వినతి -
భూముల హక్కుదారులకే పాస్పుస్తకాలు ఇవ్వాలి
● ఫిబ్రవరి, మార్చిలో పంపిణీ వేగవంతం చేయాలి ● కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డివిజయనగరం అర్బన్: ఆయా భూముల హక్కుదారులకే పట్టాదారు పాస్పుస్తకాలను అందజేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్ నుంచి జిల్లా రెవెన్యూ అధికారులు, సర్వేయర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీ, రెవెన్యూ క్లినిక్, రీసర్వే, ఐవీఆర్ఎస్ సర్వే, జాయింట్ ఎల్పీఎంఎస్, స్వమిత్వ, రైస్ మిల్లుల తనిఖీలు తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టాదారు పాస్పుస్తకాలను పంపిణీ చేసేటప్పుడు వీలైనంతవరకు వాటిని అసలు హక్కుదారుకే అందజేయాలని స్పష్టం చేశారు. ప్రతినెలా 9వ తేదీలోపు పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. 10 నుంచి 14వ తేదీ వరకు మ్యుటేషన్ (ఫారం–8) ప్రక్రియను చేపట్టాలని సూచించారు. అలాగే 15 నుంచి 17వ తేదీ వరకు సుమోటో కరెక్షన్లు పూర్తి చేయాలన్నారు. మ్యుటేషన్ ప్రక్రియలో ట్రాన్జాక్షన్, కరెక్షన్, డెడ్ కరెక్షన్స్గా విభజించి పనులు చేయాలని, ప్రతి నెలా 30వ తేదీలోపు అన్ని దిద్దుబాట్లను పూర్తి చేసి, ఈ–కేవైసీ అనంతరం తప్పులు లేని పట్టాదారు పాస్పుస్తకాలను పంపిణీ చేయాలని వివరించారు. మ్యుటేషన్ దరఖాస్తులు పునఃసమీక్షించాలి జిల్లాలో పెండింగ్లో ఉన్న రెవెన్యూ అంశాలు, భూసర్వేలు, ప్రభుత్వ ప్రాధాన్యత పథకాల అమలుపై కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఫిబ్రవరి నెలకు సంబంధించి 12 గ్రామాల్లో, మార్చి నెలకు సంబంధించి 61 గ్రామాల్లో పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. తిరస్కరించిన మ్యుటేషన్ దరఖాస్తులను పునఃసమీక్షించాలని, పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ ద్వారా వచ్చిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలను సమర్పించాలని సూచించారు. రీ–సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, జాయింట్ ఎల్పీఎంల విభజన, ఆన్లైన్ సేవలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కాన్ఫరెన్స్లో జిల్లా కేంద్రం నుంచి డీఆర్ఓ ఈ.మురళి, సర్వేశాఖ ఎ.డి విజయకుమార్తో పాటు ఆర్డీఓలు, డీఎల్డీఓలు, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. -
ఐసీడీఎస్ పీడీకి బదిలీ
● శ్రీకాకుళం వికలాంగుల శాఖ ఎ.డిగా నియామకంవిజయనగరం ఫోర్ట్: ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ టి.విమలారాణికి వికలాంగులు, వయోద్ధులు, ట్రాన్స్జెండర్స్శాఖ (శ్రీకాకుళం)కు అసిస్టెంట్ డైరెక్టర్ (ఎ.డి)గా బదిలీ అయినట్లు సమాచారం. అయితే బదిలీ ఉత్తర్వులు వచ్చి నెలరోజులు కావస్తున్నా ఇప్పటి వరకు ఆమె బదిలీ అయిన శాఖలో చేరలేదు. ఐసీడీఎస్ పీడీగానే కొనసాగుతున్నారు. వికలాంగులశాఖకు ఫారిన్ సర్వీస్ కింద డిప్యుటేషన్పై బదిలీ చేయాలని ఆమె గతంలో దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. దీంతో అశాఖ ఉన్నతాధికారులు ఆమె అభ్యర్ధనను అమోదిస్తూ వికలాంగుల శాఖకు ఎ.డిగా బదిలీ చేశారు. ఫారిన్ సర్వీస్ కింద బదిలీ కావాలని కోరిన ఆమె ఉత్వర్వులు వచ్చిన తర్వాత వెళ్లక పోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదేవిషయాన్ని ఐసీడీఎస్ పీడీ టి.విమలారాణి వద్ద సాక్షి ప్రస్తావించగా పీడీగా బాధ్యత చేపట్టిన తొలినాళ్లలో ఫారిన్ సర్వీసెస్ కోసం దరఖాస్తు చేసిన మాట వాస్తవమేనన్నారు. అయితే పీడీగా ఇక్కడే కొనసాగాలని ఉన్నతాధికారులు చెప్పినందున కొనసాగుతున్నట్లు తెలిపారు. -
ఆస్పత్రిలో అధ్వానంగా పారిశుధ్యం
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో పారిశుధ్యం ఆధ్వానంగా తయారైంది. వివిధ విభాగాల నుంచి దుర్వాసన వస్తోందని రోగులు, వారి బంధువులు చర్చించుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేలో ఈవిషయాన్ని రోగులు వెల్లడించారు. మిగతా సేవల కంటే పారిశుధ్యం బాగోలేదని ఎక్కువ శాతం మంది తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. పారిశుధ్యం నిర్వహణ కోసం అధిక మొత్తంలో వెచ్చిస్తున్నప్పటికీ పారిశుధ్యం ఆధ్వానంగా ఉండడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఐవీఆర్ఎస్ సర్వేలో పారిశుధ్యం బాగోలేదని రోగులు అధిక సంఖ్యలో చెప్పినప్పటికీ అధికారులు మాత్రం 100కి 96 శాతం పారిశుధ్యం బాగున్నట్లు స్కోర్ ఇవ్వడం గమనార్హం. పారిశుధ్యంతో పాటు మిగతా సేవల పట్ల కూడా పలువురు రోగులు పెదవివిరిచారు. 37.05 శాతం మంది పారిశుధ్యం బాగోలేదని వెల్లడి 2025 డిసెంబర్ నెలలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో వివిధ సేవలపై 2882 మందిని ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా సర్వే చేశారు. ఇందులో 37.05 శాతం మంది పారిశుధ్యం బాగోలేదని తెలిపారు. డ్రైనేజేల వద్ద మురుగు నీరు నిల్వ ఉండడంతో దుర్వాసన వస్తుంది. అదేవిధంగా చెత్తాచెదారం సేకరణ కూడా సక్రమంగా జరగడం లేదని రోగులు గుసగుసలు ఆడుకుంటున్నారు. సర్వజన ఆస్పత్రిలో పారిశుధ్య నిర్వహణకు నెలకు రూ. 19.96 లక్షలు చెల్లిస్తారు. అయినప్పటికీ పారిశుధ్యం మెరుగుపడకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. మిగతా సేవల పట్ల కూడా అసహనం పారిశుధ్యం నిర్వహణతో పాటు మిగతా సేవల పట్ల కూడా ఐవీఆర్ఎస్ కాల్స్లో రోగులు పెదవివిరిచారు. వైద్యులు ఓపీల్లో అందుబాటులో ఉంటున్నారా? అన్ని అడగ్గా 22.83 శాతం మంది వైద్యులు అందుబాటులో ఉండడం లేదని తెలిపారు. వైద్యులు రాసిచ్చిన మందులు ఉచితంగా అందుతున్నాయా? అన్న దానిపై 24.68 శాతం మంది మందులు ఉచితంగా అందడం లేదని, ప్రైవేట్ దుకాణాల్లో కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. వైద్య సేవలు పొందడానికి ఎవరైనా డబ్బులు అడుగున్నారా? అన్న దానిపై 23.54 శాతం మంది అడుతున్నారని వెల్లడించారు. అన్ని విభాగాల సేవలకు సంబంధించి 27 శాతం మంది సేవలు బాగా అందడం లేదని తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. సర్వజన ఆస్పత్రిలో కొంతమంది వైద్యులు ఆస్పత్రికి వచ్చినప్పటికీ టీ, కాఫీ పేరుతో మధ్యలో క్లినిక్లకు వెళ్లివస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మధ్యాహ్నం 3 గంటలనుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీల్లో వైద్యులు అందుబాటులో ఉండాలి. అయితే కొంతమంది వైద్యులు మధ్యాహ్నం 12, 12:30 గంటలకు వెళ్లిపోయి సాయంత్రం నాలుగు గంటలకు వచ్చి బయోమెట్రిక్ వేస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా కొంతమంది వైద్యులు ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చిన రోగులను వారి క్లినిక్లకు తరలించి అక్కడ చికిత్స అందించి ఫీజులు తీసుకున్నట్లు కూడా ఆరోపణులు వినిపిస్తున్నాయి. డ్రెస్సింగ్ చేయడానికి, ఆపరేషన్ థియేటర్స్ల్లో సిబ్బంది చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పారిశుధ్యం మెరుగుపడేలా చర్యలు పారిశుధ్యం మినహా మిగతా సేవల్లో బాగున్నట్లు ఐవీఆర్ఎస్ సర్వేలో రోగులు వెల్లడించారు. పారిశుధ్యం కూడా మెరుగుపడేవిధంగా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ అల్లు పద్మజ, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి పారిశుధ్యం బాగోలేదని ఐవీఆర్ఎస్ సర్వేలో వెల్లడి మిగతా సేవల పట్ల కూడ పెదవి విరుపు అయినప్పటికీ పారిశుధ్యానికి 96 శాతం స్కోర్ ఇచ్చేసిన అధికారులు నెలకు పారిశుధ్య నిర్వహణకు లక్షల్లో చెల్లింపు -
కనకమహాలక్ష్మి హుండీల ఆదాయం రూ.2,42,060
చీపురుపల్లి: భక్తుల కొంగుబంగారం, శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో హుండీల ద్వారా రూ.2,42,060 ఆదాయం లభించినట్లు దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ జి.శ్యామ్ప్రసాద్ చెప్పారు. ఈ మేరకు పట్టణంలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో బుధవారం హుండీల ఆదాయం లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. 2025 డిసెంబర్ 10 నుంచి 2026 ఫిబ్రవరి 4 వరకు ఆదాయం లెక్కింపు జరగ్గా భక్తులు మొక్కుబడులు, కానుకల ద్వారా హుండీల నుంచి రూ.2,42,060 లభించింది. కార్యక్రమంలో దేవస్థానం ఈఓ ఎస్.నానాజీబాబు, ఆలయ కమిటీ చైర్మన్ గవిడి నాగరాజు, సభ్యులు ఇప్పిలి పార్వతి, లెంక చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. పోలీసులకు ‘సేఫ్టీ డ్రైవింగ్’పై అవగాహనపార్వతీపురం రూరల్: సేఫ్టీ డ్రైవింగ్పై జిల్లా పోలీసు సిబ్బందికి బుధవారం అవగాహన తరగతులు నిర్వహించారు. ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో విజయనగరం ఆర్టీసీ రీజినల్ సేఫ్టీ డ్రైవింగ్ ఇన్న్స్పెక్టర్ సీహెచ్ వేణు శిక్షణ ఇచ్చారు. విధి నిర్వహణలో భాగంగా వాహనాలు నడిపే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బ్రేకులు, లైట్లు, టైర్ల పనితీరును తనిఖీ చేసుకోవడంపై సిబ్బందికి వివరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, హెల్మెట్, సీటుబెల్ట్ ధరించడం ద్వారా ప్రమాదాలను ఎలా నివారించవచ్చో తెలిపారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, ఆర్ఐ నాయుడు, ఆర్ఎస్సైలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. రేబిస్తో బాలుడి మృతిబొబ్బిలిరూరల్: మండలంలోని దిబ్బగుడ్డివలస గ్రామానికి చెందిన రామవరపు రమణ(9) కుక్కకాటు వచ్చిన రేబిస్తో మృతి చెందాడు. సంక్రాంతి పండగ సందర్భంగా గ్రామంలోని పిచ్చికుక్క రమణ ముఖంపై కాటువేసింది. అప్పట్లో బొబ్బిలి సీహెచ్సీకి తరలించి వ్యాక్సిన్ వేయించి చికిత్స అందించారు. మంగళవారం మళ్లీ జ్వరం రావడంతో స్థానిక వైద్యులు పరిశీలించి మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్కు తరలించగా రమణ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతిచెందినట్లు తల్లిదండ్రులు వెంకటరత్నం,తండ్రి సంగమేశ్వర్రావులు తెలిపారు.కుక్క కాటు కారణంగా రేబిస్ వ్యాధి సోకడంతోనే విద్యార్థి రమణ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని తల్లిదండ్రులు చెప్పారు. రమణ స్థానిక ప్రభుత్వ ఎలిమెంటరీ పాఠశాలలో మూడోతరగతి చదువుతున్నాడు. విజయనగరం లీగల్: జిల్లా న్యాయసేవా అధికార సంస్థలో ఖాళీగా ఉన్న రికార్డ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ కో–ఆర్డినేటర్ పోస్టుల భర్తీకి ఈ నెల 9వ తేదీన రాత పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అధ్యక్షురాలు ఎం.బబిత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలు విజయనగరం కోటలోని మోతీమహల్, ఎంఆర్ కాలేజీ (అటానమస్) వేదికగా జరుగుతాయని పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం.. రికార్డ్ అసిస్టెంట్ పోస్టుకు ఉదయం 10గంటల నుంచి 11:30 గంటల వరకు, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు మధ్యాహ్నం 1గంట నుంచి 2 గంటల వరకు, ఫ్రంట్ ఆఫీస్ కో–ఆర్డినేటర్ పోస్టుకు మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నామని, దరఖాస్తుతో పాటు స్టాంపులు అంటించిన కవర్లు పంపిన అభ్యర్థులకు హాల్ టిక్కెట్లను రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఇప్పటికే పంపించినట్లు తెలిపారు. అభ్యర్థులు జిల్లా కోర్టు అధికారిక వెబ్సైట్ (httpr://vizianagaram. dcourts.gov.in) నుంచి హాల్టెకెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. హాల్ టికెట్లపై ఫొటో అటెస్టేషన్ లేని వారు వెంటనే గెజిటెడ్ అధికారితో ధ్రువీకరణ చేయించుకోవాలని, అభ్యర్థులు పరీక్షా సమయానికి కనీసం గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.


