breaking news
Vizianagaram District News
-
ఏనుగుల సంచారంతో బెంబేలు
వంగర: మండలంలోని వివిధ గ్రామాల్లో ఏనుగుల గుంపు సంచరించడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గడిచిన ఐదు రోజులుగా ఒకే ప్రదేశంలో తిష్ఠవేయడంతో అటు ప్రయాణికులు, ఇటు రైతులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం కూడా మడ్డువలస వంతెన ఆవరణలోని పంటపొలాల్లో తొమ్మిది ఏనుగుల గుంపు సంచరిస్తోంది. పంట పొలాల్లో చొరబడి పంటలను నాశనం చేస్తున్నాయి. దీంతో మడ్డువలస, సంగాం, మగ్గూరు గ్రామాలకు చెందిన రైతులు ఆందోళన చెందుతున్నారు. అలాగే వంగర–రాజాం రోడ్డును ఆనుకుని ఏనుగుల గుంపు తిష్ఠ వేయడంతో పలుమార్లు పోలీస్, అటవీశాఖ అధికారులు రోడ్డును బ్లాక్ చేస్తూ వాహనాలను నిలుపుదల చేస్తున్నారు. రైతులు, వాహనచోదకులు అప్రమత్తంగా ఉండాలని, ఎలిఫెంట్ ట్రాకర్స్, రోడ్డుపై ఉన్న వివిధ శాఖల అధికారుల పరిశీలన అనంతరం ఏనుగులు సంచరించే ప్రదేశాలు దాటుకుని వెళ్లాలని సూచిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి ఏనుగులు సంచరించే ప్రాంతంలో రైతులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ హరి రమణారావు తెలిపారు. మడ్డువలస వద్ద ఏనుగుల గుంపును బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం అటవీశాఖ అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. కార్యక్రమంలో అటవీ, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది ఉన్నారు. మడ్డువలస బ్రిడ్జి ఆవరణలో తిష్ఠ -
సర్వజన ఆస్పత్రిలో ఎస్టీ సెల్ ఏర్పాటు
● ఎస్టీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకర రావు విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, ఘోషాఆస్పత్రుల్లో షెడ్యూల తెగల ప్రజల సహాయం కోసం ప్రత్యేకంగా ఎస్టీ సెల్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకర రావు అఽధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిని బుధవారం ఆయన తనిఖీ చేశారు. ముందుగా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఓపీ విభాగాలను, జనరల్ వార్డు, సర్జరీ విభాగం, ఐసీయూ, రేడియాలజీ, సిటిస్కాన్ విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రోగులతో మాట్లాడి వైద్యసేవలు, భోజన నాణ్యత గురించి తెలుసుకున్నారు. అనంతరం ఘోషాఆస్పత్రిని సందర్శించి ప్రసూతి విభాగం, పిల్లల వార్డు, ఐసీయూ, చిన్నారులకు, పోషకాహారం అందించే వార్డులను తనిఖీ చేశారు. గర్భిణులు, బాలింతలతో మాట్లాడి ఆస్పత్రిలో అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, ఘోషాఆస్పత్రిలో ప్రజలకు అందుతున్న వైద్యసేవలు, ప్రజల అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకుని అవసరమైన సేవల ఏర్పాటు గురించి ప్రభుత్వానికి తెలియజేసేందుకు ఆస్పత్రిని సందర్శించినట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్. జీవనరాణి, డీసీహెచ్ఎస్ డాక్టర్ పద్మశ్రీ రాణి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంబంగి అప్పలనాయుడు, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ పీఏ.రమణి తదితరులు పాల్గొన్నారు. -
ఫీల్డ్ అసిస్టెంట్స్కు బకాయి జీతాలివ్వాలి
విజయనగరం ఫోర్ట్: ఫీల్డ్ అసిస్టెంట్స్ అందరినీ రెన్యువల్ చేసి వెంటనే బకాయి ఉన్న మూడు నెలల జీతాలు ఇప్పించాలని ఏపీ గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎస్. రాజారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్స్ బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మ్యాన్ డేస్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. సస్పెన్షన్కు గురైన ఫీల్డ్ అసిస్టెంట్స్ను విధుల్లోకి తీసుకోవాలని ఎన్ఎంఎంఎస్యాప్ సాఫ్ట్వేర్లో మార్పులు చేసి సాంకేతిక లోపాలను సరిదిద్దాలని డిమాండ్ చేశారు. టార్గెట్ పేరుతో ఫీల్డ్ అసిస్టెంట్స్పై పని ఒత్తిడిని పెంచే విధానాన్ని విడనాడాలని కోరు. కార్యక్రమంలో లక్ష్మి, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్స్ యూనియన్ విజ్ఞప్తి -
రాజధానికి జిందాల్ సెగ
● షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్కు నిర్వాసితుల వినతి శృంగవరపుకోట: జిందాల్ పరిశ్రమ తమతో ఆడుతున్న ఆటలతో అలిసిపోయిన నిర్వాసితులు తమ నిరసన సెగ రాజధానిని తాకేలా చేశారు. ఈ మేరకు బుధవారం పలువురు జిందాల్ నిర్వాసితులు రాజధాని అమరావతిలో షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ కె.ఎస్.జవహర్ను కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. జిందాల్ పరిశ్రమ ఏర్పాటు కానందున తమ భూములు తమకివ్వాలని కోరారు. ఎంఎస్ఎంఈ పార్కులకు కావాలంటే కొత్తగా భూసేకరణ చేయాలని, తాటిపూడి నీరు తాగునీటి అవసరాలకు కేటాయించాలని, శాంతియుతంగా పోరాడుతున్న తమపై పోలీసుల దమనకాండను నిరోధించాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. అలాగే ప్రజాదర్బార్లోను, జనసేన కేంద్ర కార్యాలయంలోను వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో నిర్వాసితులు ఎం.సన్యాసిరావు, జి.ఈశ్వరరావు, ఎం.సన్యాసమ్మ, డి.సింహాచలం, బి.లక్ష్మణరావు, పి.రేవతి, కె.పైడితల్లి, బి,విజయ్బాబు, కేత వీరన్న, కిల్లో అర్జున, కె.సన్యాసిరావు, టి.అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
పనుల పూర్తికి ఆరుమాసాల గడువు
● ఇంజినీర్లను ఆదేశించిన కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్పార్వతీపురంటౌన్: పార్వతీపురం మన్యం జిల్లాలో ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్, డ్వామా, ఆర్డబ్ల్యూఎస్, జలవనరులు, ప్రజా ఆరోగ్యం, గిరిజన సంక్షేమం, ఏపీ ఎంఎస్ఐడీసీ, ఏపీఈడబ్ల్యూ ఐడీసీ, ఏపీ టిడ్కో, గృహ నిర్మాణ సంస్థల ద్వారా చేపట్టిన పనులన్నీ ఆరు మాసాల్లోగా పూర్తికావాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే ఇంకా చేపట్టాల్సిన పనుల వివరాలను సిద్ధం చేసి శాసనసభ్యుల ఆమోదంతో ప్రతిపాదనలను సమర్పించాలని పేర్కొన్నారు. నిధుల లభ్యతను బట్టి ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులకు కలెక్టర్ స్పష్టం చేశారు. అనంతరం శాఖల వారీగా చేపట్టిన పనుల వివరాలను అడిగి తెలుసుకున్న ఆయన సంబంధిత ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలు, మార్గదర్శకాలు జారీచేశారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అన్ని శాఖల ఇంజినీరింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జన్మన్ పనులపై ప్రత్యేక శ్రద్ధసమావేశంలో కల్టెర్ శ్యామ్ప్రసాద్ మాట్లాడుతూ పీఎం జన్మన్ కార్యక్రమం కింద చేపట్టిన రహదారుల పనులను వేగవంతం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమమైన పీఎం జన్మన్ పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఇకపై ప్రతిరోజూ, ప్రతివారం, ప్రతి మాసం సాధించిన ప్రగతి వివరాలను తనకు సమర్పించాలని, ఆగస్టు 15 నాటికి పనులు పూర్తయ్యేలా బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రారంభించి కొనసాగుతున్న పల్లె పండుగ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, బిల్లులు పెండింగ్ లేకుండా చూడాలని తేల్చిచెప్పారు. అలాగే శతశాతం పనులు పూర్తయి ప్రారంభం కాని గ్రామ సచివాలయ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, ఇతర కట్టడాలను శాసనసభ్యుల ద్వారా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి నియోజక వర్గంలో అవసరమైన పనులను గుర్తించి, వాటి జాబితాలను సిద్ధం చేయాలన్నారు. అటువంటి వాటిని ఆయా నియోజక వర్గ శాసనసభ్యుల ఆమోదంతో ప్రతిపాదిస్తే, వాటికి నిధులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఏపీ టిడ్కో ఆధ్వర్యంలో పూర్తయిన గృహాలను, అదేవిధంగా లేఅవుట్స్లో పూర్తయిన గృహాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ప్రత్యేక ఉపకలెక్టర్ డా.పి.ధర్మచంద్రారెడ్డి, డీఎంహెచ్ఓ డా.ఎస్.భాస్కరరావు, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, డీపీఓ టి.కొండలరావు, మునిసిపల్ కమిషనర్ సీహెచ్.వెంకటేశ్వర్లు, ఆర్డబ్ల్యూఎస్ అధికారి ఒ.ప్రభాకరరావు, సమగ్ర శిక్ష ఏపీసీ ఆర్.తేజేశ్వరరావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ గ్రావెల్ తవ్వకాలకు జరిమానా
నెల్లిమర్ల రూరల్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం బోడికొండను సీతారామునిపేట జంక్షన్ వద్ద పలువురు అక్రమార్కులు గ్రావెల్ తవ్వకాలు చేపడుతున్న అంశంపై గత నెల 27న ‘రామయ్యా..చూడవేమయ్యా..! శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై అధికార యంత్రాంగం స్పందించింది. రెవెన్యూ, మైనింగ్, దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది తవ్వకాలు జరుగుతున్న ప్రదేశానికి బుధవారం వెళ్లి పరిశీలించారు. అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్టు నిర్ధారించి తవ్వకాలపై ఆరా తీశారు. తంగుడుబిల్లి గ్రామానికి చెందిన రామారావు అనే వ్యక్తికి రూ.15 వేలు జరిమానా విధించారు. గ్రావెల్ అక్రమ తవ్వకాలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్ఐ సతీష్, వీఆర్వో షలీమా, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. -
చిల్లంగి నెపంతో మహిళ హత్య?
బొబ్బిలి: పట్టణంలోని బండారు వీధిలో నివాసముంటున్న కరగాని పద్మ(45) అనే మహిళ హత్య అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. బుధవారం సాయంత్రం తాను నివసిస్తున్న ఇంట్లోంచి తీవ్ర గాయాలతో అరుస్తూ వచ్చి గుమ్మం వద్ద పడిపోవడంతో స్థానికులు, కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించడంతో పోస్ట్మార్టం రూమ్కు తరలించారు. పక్క పక్క ఇళ్లలో ఉంటున్న కుటుంబసభ్యులే హతమార్చి ఉంటారని పలువురు అనుమానిస్తున్నారు. కరగాని పద్మ పలువురి ఇళ్లలో పనులు చేసుకుంటోంది. భర్త పైడిరాజు మేకలు కాస్తూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు. పెళ్లిళ్లై ఆటోలు నడుపుకుంటూ వేరే చోట ఉంటున్నారు. పద్మ చిల్లంగి పెట్టడం వల్ల తన భార్య చనిపోయిందని, కుమారుడు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చిందని, దీనందటికీ పద్మే కారణమన్న అనుమానంతో ఓ గుర్తు తెలియని వ్యక్తి హత్య చేసినట్లు పట్టణ వాసులు చర్చించుకుంటున్నారు. డీఎస్పీ పరిశీలన ఈ విషయం తెలుసుకున్న డీఎస్పీ జి.భవ్యారెడ్డి మృతురాలు పద్మ నివసిస్తున్న ఇంటిని పరిసరాలను పరిశీలించారు. ఎస్సై రమేష్కుమార్తో కలిసి కుటుంబసభ్యులు, స్థానికులను విచారణ చేశారు. అనంతరం క్లూస్ టీమ్ వచ్చి ఆధారాలు సేకరించారు. కత్తిపీటపై పడిపోయిందని.. డీఎస్పీ, పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి మృతికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులను విచారణ చేయగా పద్మ కత్తిపీటమీద పడిపోయిందని, గాయాల పాలై చనిపోయిందని కుటుంబసభ్యులు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చి దర్యాప్తు చేస్తున్నారు. -
రక్తహీనత నివారణలో పురోగతి ఉండాలి
పార్వతీపురం రూరల్: రక్తహీనత నివారణే ధ్యేయంగా పార్వతీపురం మన్యం జిల్లాలో చేపడుతున్న ఎనీమియా ఏక్షన్ కమిటీల ద్వారా పురోగతి సాధించే దిశగా కార్యాచరణ చేపట్టాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్.భాస్కరరావు స్పష్టం చేశారు. ఈ మేరకు మండలంలోని తాళ్లబురిడి, పెదబొండపల్లిలో నిర్వహించిన ఎనీమియా ఏక్షన్ కమిటీలను(ఏఏసీ) బుధవారం ఆయన పర్యవేక్షించారు. రక్తహీనత నివారణకు ఏ విధమైన కార్యాచరణ చేపడుతున్నారు? చేసిన కమిటీ తీర్మానం, రక్తహీనతగా గుర్తించిన గర్భిణి, బాలింతల వివరాలు అయన రికార్డులో పరిశీలించారు. గతనెలలో రక్తహీనత నివేదికల్లో ప్రస్తుతం పురోగతిపై ఆరా తీశారు. అనంతరం గర్భిణి, బాలింతలకు తగు సూచనలు, జాగ్రత్తలు తెలియజేశారు. పౌష్టికాహారం ఆవశ్యకతపై వివరించి అంగన్వాడీ కేంద్రం నుంచి అందజేస్తున్న టీహెచ్ఆర్ సద్వినియోగం చేసుకోవాలని, కిల్కారీ మొబైల్ సందేశాన్ని పాటించాలని సూచించారు. ఐరన్ మాత్రలు క్రమం తప్పకుండా వేసుకోవాలన్నారు. గర్భిణి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షణ చేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. అనంతరం డీఎంహెచ్ఓ గర్భిణులకు పౌష్టికాహారం అందజేసి సీమంతం కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి.జగన్మోహన్రావు, డీపీఎంఓ డా.పీఎల్ రఘుకుమార్, వైద్యాధికారులు డా.కౌశిక్, ధరణి తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ భాస్కరరావు -
హోటల్స్పై విజిలెన్స్ దాడులు
రాజాం సిటీ: పట్టణంలోని పలు హోటల్స్లో విజిలెన్స్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. గృహావసరాలకు వినియోగించే గ్యాస్ను హోటల్స్లో అక్రమంగా వినియోగిస్తున్నారన్న సమాచారం మేరకు దాడులు చేపట్టామని విజిలెన్స్ ఎస్సై రామారావు తెలిపారు. మూడు హోటల్స్లో రూ.24,432లు విలువ చేసే 10 సిలిండర్లు సీజ్ చేయడంతో పాటు 6ఎ కేసులు నమోదుచేశామన్నారు. ఈ దాడుల్లో హెచ్సీ కామేశ్వరరావు, పురుషోత్తం, కన్నబాబు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 6న చెస్పోటీలుసాలూరు: ఆంధ్రా చెస్ అసోసియేషన్ తరఫున సాలూరు పట్టణంలోని చినబజారు వద్ద గల ఆర్యవైశ్యధర్మశాలలో ఈ నెల 6న చెస్పోటీలను నిర్వహించనున్నట్లు అసోసియేషన్ కో ఆర్డినేటర్ తిరుమలేష్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.16 సంవత్సరాల లోపు బాల బాలికలకు నిర్వహించే ఈ పోటీలను బాలబాలికలకు వేర్వేరుగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ 8008008272,9182337499 నంబర్లను సంప్రదించాలని సూచించారు. మహిళలకు ఉచిత శిక్షణ విజయనగరం అర్బన్: నిరుద్యోగ యువతకు ఉపాధి కలిగించే పలు కోర్సులకు ఉచిత శిక్షణా తరగతులను స్థానిక మహిళా ప్రాంగణంలోని స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ వసతిగృహంలో నిర్వహిస్తామని సంస్థ డైరెక్టర్ డి.భాస్కరరావు బుధవారం తెలిపారు. పురుషుల కోసం 30 రోజుల సెల్ఫోన్ రిపేరింగ్ అండ్ సర్వీసు కోర్సు, లైట్ మోటార్ వెహికల్ ఓనర్ డ్రైవర్ కోర్సులపై శిక్షణ ఉంటుందని తెలిపారు. వసతి భోజన సౌకర్యాలను ఉచితంగా కల్పించే ఈ కోర్సులకు తెల్లకార్డుదారులు, 45 ఏళ్లలోపున్న గ్రామీణ ప్రాంత మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గల అభ్యర్ధులు ఆ నెల 15వ తేదీ లోపు దరఖాస్తులను కార్యాలయానికి పంపాలని కోరారు. పూర్తి వివరాల కోసం 9959521662, 9985787820 ఫోన్ నంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు. అయ్యరకులకు తీవ్ర అన్యాయం●● కులస్తుల రాష్ట్ర అసోషియేషన్ అధ్యక్షుడు పీఎస్ఎన్ పాత్రుడుకొత్తవలస: కూటమి ప్రభుత్వం అయ్యరక కులస్తులకు తీవ్ర అన్యాయం చేస్తోందని, అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా నేటికీ అయ్యరక కులస్తులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోవడం అన్యాయమని ఆ కులస్తుల రాష్ట్ర ఆసోసియేషన్ అధ్యక్షుడు పీఎస్ఎన్ పాత్రుడు అన్నారు. ఈ మేరకు కొత్తవలస మండలంలోని కొత్తసుంకరపాలెం గ్రామంలో ఆయన స్థానిక విలేకరులతో బుధవారం మాట్లాడారు. అయ్యరక కులస్తులకు ఓసీ రిజరేషన్ ఉండగా అనాటి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేకరరెడ్డి చలించి బీసీ రిజరేషన్ కల్పించి అక్కున చేర్ఛుకున్నారని గుర్తుచేవారు. అదేవిధంగా ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్.జగన్మోహన్రెడ్డి అయ్యరక కులస్తులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక చైర్మన్, 11 మంది డైరెక్టర్లను నియమించి సముచిత స్థానం కల్పించారన్నారు. కూటమి ప్రభుత్వం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనలో అయ్యరక కులస్తులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేద వ్యక్తం చేశారు. 2014–19 చంద్రబాబు పాలనలో అయ్యరక కులస్తులను కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పాలన పూర్తయినా నేటికీ తమ కులస్తులకు కార్పొరేషన్ ఏర్పాటు చేకపోవడం వద్ద తమ కులస్తులను చిన్నచూపు చూసి అవమాన పరుస్తున్నారన్నారు. రాష్ట్రంలో సుమారు 5 లక్షల మంది అయ్యరక కులస్తులు ఉన్నారని గుర్తు చేశారు. వారంతా తిరగబడకక ముందే గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన అయ్యరక కార్పొరేషన్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేదంటే పోరాటం తప్పదని హెచ్చరించారు. -
విద్యుత్ తీగలు తగిలి మూడు మేకల మృతి
రామభద్రపురం: మండలంలోని కొండకెంగువ గ్రామంలో విద్యుత్ తీగలు తగిలి మూడుమేకలు మృతిచెందాయి. బుధవారం జరిగిన ఈ సంఘటనపై మేకల యజమానులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బడ్నాన సోములు, పెరుమాల అప్పారావు, తోకల చిన్నమ్మతల్లి వారి మేకలను పొలాల్లోకి మేతకు తోలారు. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడం వల్ల అదే గ్రామానికి చెందిన సిరిపురం రమణ పొలంలో ఉన్న విద్యుత్ స్తంభం తీగలు తెగి కిందపడ్డాయి. ఆ పొలంలోకి మేతకు వెళ్లిన మేకలు కిందపడి ఉన్న తీగలకు తగిలి షాక్కు గురై గిలగిల కొట్టుకుంటూ మృతిచెందాయి. మేకల యజమానులు పరిగెత్తి వెళ్లి చూశారు. విద్యుత్ తీగల కింద పడి మేకలు ఉండడంతో ముట్టుకోకుండా వెనక్కు జంకారు. దీంతో పెనుప్రమాదమే తప్పింది. మృతి చెందిన మేకలను చూసి యజమానులు భోరున విలపించారు. గుంతలో పడి 30 గొర్రెలు..వేపాడ: మండలంలో రామస్వామిపేట గ్రామంలో ఇద్దరు వ్యక్తులకు చెందిన 30 గొర్రెలు ప్రమాదవశాత్తు గుంతలో జారిపడి మృతిచెందడంతో వాటి యజమానులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇందుకు సంబంధించి స్థానికులు, బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బుధవారం గ్రామానికి చెందిన పత్రి బాలకృష్ణ, రామారావులకు సంబంధించిన గొర్రెల మందను మేత కోసం తోలారు. గ్రామసమీపంలో ఊరమెట్ట వద్ద వాటిని మేపి కిందికి దిగుతుండగా అక్కడే ఉన్న పెద్ద గుంతలో 30 గొర్రెలు జారిపడి చనిపోయాయి. ఈ సమాచారం గ్రామంలో తెలియగానే సర్పంచ్ వడ్లమాని శర్మ, పశువైద్యాధికారి అనిల్కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతి చెందిన గొర్రెలను పరిశీలించారు. దీనిపై నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని తెలిపారు. సుమారు రూ.నాలుగు లక్షల నష్టం వాటిల్లిందని స్థానికులు అంచనా వేస్తున్నారు. విద్యుత్ స్తంభం పడి మూడు మూగజీవాలు.. శృంగవరపుకోట: ఎస్.కోట పరిధిలోని కాపు వారి కళ్లాల వద్ద కరెంట్ స్తంభం కూలి ఒక చూడి గేదె, పాడిగేదె, గేదెపెయ్యి ప్రాణాలు వదిలాయి. ముందుగా స్తంభం కూలి పెయ్యిపై పడి చనిపోగా, పక్కనే ఉన్న గేదెలపై విద్యుత్ తీగలు పడడంతో విద్యుత్ఘాతానికి గురై మృతి చెందాయి. దీంతో బాధితుడు వేమలి వెంకటరమణ, కుటుంబసభ్యులు వాటి వద్ద గుండెలు బాదుకుని రోదించారు. రూ.3లక్షలు విలువ చేసే పశువులు చనిపోయాయని వాపోయారు. కాగా ఈ ఘటనపై విద్యుత్శాఖ అధికారులు నోరు మెదపక పోవడం శోచనీయం. -
సిద్దూ సైకిల్ భళా..!
తెర్లాం: మండలంలోని పూనువలస పంచాయతీ పరిధిలోని జె.కొత్తవలస గ్రామానికి చెందిన రాజపు సిద్దూ రాజాంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఎంపీసీ గ్రూపులో ఇంటర్ సెకెండియర్ చదువుతున్నాడు. ప్రతిరోజూ ఇంటి నుంచి రాజాంలో తను చదువుతున్న కళాశాలకు వెళ్లేందుకు 17 కిలోమీటర్ల దూరం. మూడు కిలోమీటర్లు కాలినడకన వెళ్లి, అక్కడ నుంచి బస్సు, లేదంటే ఆటో ఎక్కివెళ్లాలి. బస్సు రావడం ఆలస్యమైతే కళాశాలకు సమయానికి చేరుకోలేని పరిస్థితి. రానుపోను చార్జీలకు రోజుకు రూ.60లు ఖర్చయ్యేది. ఈ సమస్యలను అధిగమించాలని సిద్దూ తలచాడు. రూ.30వేలు ఖర్చుచేసి ఆన్లైన్లో రాజస్థాన్, ఢిల్లీ నుంచి సామగ్రిని తెప్పించుకున్నాడు. పాఠశాల దశలో విజ్ఞాన ప్రదర్శనల్లో ప్రదిర్శంచేందుకు రూపొందించిన ప్రాజెక్టుల అనుభవాన్ని రంగరించి మరో స్నేహితుడితో కలిసి బ్యాటరీతో నడిచే సైకిల్ను తీర్చిదిద్దాడు. కేవలం 3 గంటల విద్యుత్ చార్జింగ్తో 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు వీలుగా మలిచాడు. కేవలం రూ.6 ఖర్చుతో కళాశాలకు వెళ్లి తిరిగొస్తున్నాడు. కుమారుడి ప్రతిభను చూసి కూలీలైన తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. విద్యార్థి సృజనాత్మక ఆలోచనతో ముందుకు సాగుతున్న విద్యార్థిని గ్రామస్తులతో పాటు కళాశాల అధ్యాపకులు అభినందిస్తున్నారు. ఆ విజ్ఞానంతోనే.. ఇంటి నుంచి తరగతులకు సమయానికి వెళ్లేలేకపోవడంతో చాలా ఇబ్బందికరంగా ఫీలయ్యేవాడిని. తన సమస్యకు పరిష్కారంకోసం నిరంతరం ఆలోచించేవాడిని. హైసూల్లో చదువుకొనే రోజుల్లో పాల్గొనే సైన్స్ విజ్ఞాన ప్రదర్శనల అనుభవంతో ఎలక్ట్రికల్ చార్జింగ్ సైకిల్ తయారు చేసేందుకు పూనుకున్నాను. దీనిని తయారు చేయడానికి అవసరమైన పరికరాలు రాజస్థాన్, ఢిల్లీ నుంచి ఆన్లైన్లో తెప్పించుకున్నాను. వీటిని స్నేహితుని సహాయంతో రెండు రోజుల్లో సైకిల్కు బిగించాను. ప్రస్తుతం ప్రతిరోజూ కళాశాలకు ఎలక్ట్రికల్ చార్జింగ్ సైకిల్పైనే వెళ్తున్నాను. నా సమస్య పరిష్కారం కావడం ఆనందంగా ఉంది. – సిద్దూ, జె.కొత్తవలస మూడు గంటల చార్జింగ్తో 80 కిలోమీటర్ల ప్రయాణం జె.కొత్తవలస గ్రామ ఇంటర్ విద్యార్థి బ్యాటరీ సైకిల్ ఆవిష్కరణ -
ఏర్పాట్ల పరిశీలన
విజయనగరం: అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన నిలబడే వైఎస్సార్సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పూల్బాగ్లోని జగన్నాథ కళ్యాణ మండపంలో గురువారం ఉదయం 10 గంటలకు నిర్వహించే సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లను బుధవారం పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. శాసనమండలి విపక్షనేత బొత్ససత్యనారాయణ, పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబుల ఆధ్వర్యంలో సాగే సమావేశంలో కూటమి ప్రభుత్వం ప్రజావ్యతిరేక పాలనపై చర్చించడంతోపాటు భవిష్యత్ కార్యాచరణ ప్రణా ళిక రూపొందిస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు వర్రి నర్సింహమూర్తి, జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసరావు, బూత్ కమిటీ అధ్యక్షుడు బూర్లె నరేష్, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్కుమార్, పార్టీ నాయకులు కె.వి.సూర్యనారాయణరాజు, ఎంఎస్ఎన్ రాజు, తదితరులు పాల్గొన్నారు. -
● వర్షంలోనూ కొనసాగిన ఆందోళన
జిందాల్ నిర్వాసితులు వర్షాన్ని కూడా లెక్కచేయకుండా బొడ్డవరలో బుధవారం ఆందోళన కొనసాగించారు. భూములకు పూర్తిస్థాయి పరిహారం అందజేయాలని, పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. భూములు కోల్పోయి, జీవనాధారం లేక, పరిహారం అందక రోడ్డున పడి రోదిస్తున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడంలేదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజల పక్షం వహించాల్సిన ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు రెడ్కార్పెట్ వేయడం తగదన్నారు. జిల్లా కలెక్టర్, జిందాల్ కలెక్టర్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఐదు పంచాయతీలకు చెందిన నిర్వాసితులతో పాటు ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి చల్లా జగన్ పాల్గొన్నారు. – ఎస్.కోట -
● టార్పాలిన్లే రక్షణ
చిత్రంలో కనిపిస్తున్నది లక్కవరపుకోట మండల కేంద్రంలోని స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా భవనం. సుమారు 15 ఏళ్లుగా ఇక్కడి అద్దె భవనంలో బ్యాంకు నిర్వహిస్తున్నారు. భవనం శిథిలావస్థకు చేరడంతో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు పూర్తిగా కారిపోతోంది. విధుల నిర్వహణకు సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. కంప్యూటర్లపై టార్పాలిన్లు వేసి విధులు నిర్వర్తిస్తున్నారు. రికార్డులు తడిసి ముద్దవుతుండడంతో బ్యాంకు ఉద్యోగులతో పాటు ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. త్వరితగతిన బ్యాంకును వేరే భవనంలోకి మార్చాలంటూ ఖాతాదారులు కోరుతున్నారు. – లక్కవరపుకోట -
రాజీయే ఉత్తమ మార్గం
విజయనగరం క్రైమ్: రాజీయే రాజమార్గమని, జిల్లాలో ఈ నెల 5న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో అధిక కేసులు పరిష్కారమయ్యేలా పోలీస్ సిబ్బంది చొరవచూపాలని ఎస్పీ వకుల్ జిందల్ బుధవారం పిలుపునిచ్చారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల్లో ఇరువర్గాలు రాజీ అయ్యేందుకు అవకాశం ఉన్న కుటుంబ, ఆస్తి, క్రిమినల్, ట్రాఫిక్ కేసులు, ఇతర కాంపౌండ్ కేసులను ముందుగా గుర్తించాలన్నారు. కేసుల్లోని ఇరు వర్గాలపై ఒత్తిడి లేకుండా, సహకారాత్మక వాతావరణంలో రాజీ అయ్యేలా కక్షిదారులను ప్రోత్సహించాలన్నారు. కేసుల రాజీ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాలని సూచించారు. నాన్ బెయిలబుల్ వారెంట్లను ఎగ్జిక్యూట్ చేయడంలో సంబంధిత పోలీసు అధికారులు చొరవ చూపాలన్నారు. ● లోక్ అదాలత్లలో కేసుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి ● పోలీస్ సిబ్బందికి ఎస్పీ పిలుపు -
రైతన్నకు ఎరువు కష్టాలు!
ఎరువు కోసం మూడు రోజులుగా తిరుగుతున్నాం.. ఎరువు కోసం మూడు రోజులుగా బొబ్బిలికి 12 కిలోమీటర్ల దూరంలోని కమ్మవలస నుంచి బస్సులో వచ్చి వెళ్తున్నాం. యూరియా, డీఏపీ కావాలి. మొక్కజొన్న, వరివెద, తదితర పంటలకు అవసరమైన యూరియా కోసం రోజూ తిరగాల్సి వస్తోంది. గతంలో ఇటువంటి పరిస్థితి లేదు. – రాగాల లోకనాథం, కమ్మవలస, బొబ్బిలి మండలం బొబ్బిలి/బాడంగి: రైతన్నకు ఎరువు కష్టాలు ఆరంభమయ్యా యి. ఎరువుల కోసం పల్లెల నుంచి పట్టణాల్లోని ప్రైవేటు దుకాణాలకు పరుగుతీయాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ ఆధార్ కార్డులు పట్టుకుని గంటల తరబడి క్యూ కట్టాల్సి వస్తోంది. అప్పటికీ ఎరువు దొరకకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. వ్యయప్రయాసలకు గురవుతున్నారు. ఎరువుల కోసం చెప్పులు, సంచులు లైన్గా పెట్టుకునే రోజులను కూటమి ప్రభుత్వం మళ్లీ తెచ్చిందంటూ వాపోతున్నారు. గతంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఖరీఫ్ సీజన్ ముందే రైతన్నకు కావాల్సిన ఎరువు అందేది. ఎలాంటి వ్యయప్రయాసలు లేకుండా ఎరువు ఇంటికి చేరేది. వైఎస్సార్ రైతు భరోసా పథకం ఏటా పెట్టుబడి సాయం అందేది. పంట సాగుకు ధీమా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని, ఆర్బీకేలను ఆర్ఎస్కేలుగా పేరుమార్చడమే తప్ప కూటమి ప్రభుత్వం రైతుకు చేసిన సాయం శూన్యమని విమర్శిస్తున్నారు. పంటల సాగు సమయంలో పొలాల్లో ఉండాల్సిన రైతులు ఎరువుల కోసం తిరగాల్సి వస్తోందంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రైతన్న ఎరువు కష్టాలను వ్యవసాయ శాఖ ఏడీ ఎం.శ్యాంసుందర్ వద్ద ప్రస్తావించగా యూరియా కొరత లేదని, అన్ని రైతు సేవా కేంద్రాల్లో నిల్వలున్నాయని, వీటిని ఈనెల 5 నుంచి పంపిణీ చేస్తామని చెప్పారు. రైతులు నిల్వ చేసుకోవడానికి తీసుకువెళ్తున్నారే తప్ప ఇప్పుడు అంత అవసరం లేదన్నారు. -
మంత్రి ఇలాకాలో తప్పని డోలీమోత..
సాలూరు/సాలూరురూరల్: డోలీమోతలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చిన సీ్త్ర శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రాతినిథ్యం వహిస్తున్న సాలూరు నియోజకవర్గంలో డోలీ మోతలు నిత్యకృత్యంగా మారాయి. సాలూరు మండలం కరడవలస పంచాయతీ ఎగువకాసాయివలస గ్రామానికి చెందిన ఆశ కార్యకర్త కూనేటి శ్యామల వాంతులు, విరోచనాలు, తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురైంది. లేవలేని స్థితిలో ఉన్న ఆమెను కుటుంబ సభ్యుల సుమారు 5 కిలోమీటర్ల మేర రాళ్లదారిలో డోలీలో సువర్ణముఖి నదిని దాటి కురుకూటి పీహెచ్సీకి తరలించారు. అక్కడి వైద్యులు ప్రాథమిక వైద్యం అందించిన తర్వాత మెరుగైన వైద్యసేవల కోసం సాలూరు ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. డోలీ మోతలు లేకుండా కంటైనర్ ఆస్పత్రిని ఏర్పాటుచేశామని మంత్రి ప్రకటించిన కరడవలస పంచాయతీ పరిధిలోని ఎగువ కాసాయివలసకు చెందిన ఆశ వర్కర్నే డోలీలో తరలించడం గమనార్హం. గిరిజనులకు డోలీ మోతలు తప్పిస్తామన్న మంత్రి సంధ్యారాణి ప్రకటనలకే పరిమితమవుతున్నారని, చేసేదేమీ లేదని సీపీఎం సాలూరు మండల కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు విమర్శించారు. సాలూరు ఏరియా ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతున్న ఆశవర్కర్ శ్యామలను ఆయన పరామర్శించారు. గిరిజన గ్రామాలకు మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం విఫలమవుతోందన్నారు. -
హామీల అమలుపై అబద్ధాలు
● కూటమి ఏడాది పాలనలో చితికిపోయిన పేదకుటుంబాలు ● ప్రజల్లోకి ప్రభుత్వ మోసకారి పాలన ● ఏడాదిలో కనీస అభివృద్ధికి నోచుకోని జిల్లా ● జనాదరణ చూసి ఓర్వలేకే జగన్మోహన్రెడ్డిపై అక్రమ కేసులు ● ఈ నెల 3న వైఎస్సార్ సీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం ● జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు జగన్పై తప్పుడు కేసులు ఏడాది కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడం, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనలకు అత్యంత ప్రజాదరణ వస్తుండడం చూసి ఓర్వలేక అక్రమ కేసులు పెడుతున్నారని మజ్జి శ్రీనివాసరావు చెప్పారు. కేవలం భయబ్రాంతులను చేసేందుకు పోలీసులను ఉపయోగించి కట్టడి చేసేందుకు ప్రయత్నించినా జగన్మోహన్రెడ్డిపై ప్రజలకున్న అభిమానాన్ని అడ్డుకోలేరన్నారు. విజయనగరం: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయకుండా అబద్ధాలు చెబుతూ పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలోనే ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుందని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ప్రజలకు ఏం మేలు చేశామని ఈ నెల 2వ తేదీ నుంచి ఇంటింటికీ వెళ్లి కూటమి నేతలు చెప్పగలరని ప్రశ్నించారు. కూటమి నాయకత్వంపై ఆ పార్టీ నాయకులకే నమ్మకం పోయిందని, ముఖ్యమంత్రి సమావేశం పెడితే ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యే పరిస్థితి నెలకొందని విమర్శించారు. ధర్మపురిలోని సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్లో పార్టీ జిల్లా నాయకులతో కలిసి మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి కూటమి ఏడాది పాలనలో ప్రజలకు జరిగిన అన్యాయం, మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా దిశానిర్దేశం చేశారన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన అనేక హమీలను అమలుచేయకుండా చేశామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతుండడం విడ్డూరంగా ఉందన్నారు. హమీల అమలుపై ఎవరైనా నిలదీస్తే ఊరుకునేది లేదంటూ పరుషపదజాలం ప్రయోగించడం ఆశ్చర్యకరంగా ఉందని పేర్కొన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు హమీలు అమలుపై అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏడాది పాలనపై మోసకారి మాటలు చెబుతున్న కూటమి ప్రభుత్వ విధానాలను క్షేత్ర స్థాయిలో ప్రజలకు వివరించేలా పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తామని తెలిపారు. గత ఎన్నికల్లో కూటమి నేతలు ఇచ్చిన బాండ్లుతో పాటు, చేసిన హమీలు, బాబూ ష్యూరిటీ భవిష్యత్ గ్యారింటీ ప్రచారాలు ఎంత వరకు అమలు చేశారో ప్రజలతో చెప్పిస్తామన్నారు. ఏడాది కాలంలో బాబు ష్యూరిటీ... మోసం గ్యారెంటీ అన్న చందంగా పాలన సాగిందని ఎద్దేవా చేశారు. ఇదే విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామని చెప్పారు. హామీల అమలెక్కడ? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 50 సంవత్సరాలకే వృద్ధాప్య పింఛన్, నిరుద్యోగులకు నెలకు రూ.3వేల భృతి, ఆడపిల్ల నిధి కింద నెలకు రూ.1500 తదితర హమీలు అమలెప్పుడో చంద్రబాబు చెప్పాలని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. రైతాంగానికి ఇస్తామన్న రెండేళ్ల పెట్టుబడి సాయం ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు కూటమి నేతలు ఇచ్చిన 140కు పైగా హమీల అమలుపై ప్రతి ఇంటికీ వెళ్లి అడిగి తెలుసుకుంటామని, వారికి జరుగుతోన్న నష్టాన్ని వివరిస్తామని స్పష్టం చేశారు. పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం రేపు ఏడాదిలో ఏం అభివృద్ధి చేశారు...? ఏడాది కూటమి పాలనలో విజయనగరం జిల్లాలో ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో చెప్పాలని మజ్జి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పింఛన్లు కోసం గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం మూడు నెలల కిందట స్పౌజ్ పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు జీఓ ఇచ్చి ఇప్పటికీ అమలు చేయలేకపోయారని చెప్పారు. ఒక్క విజయనగరం జిల్లాలో 4000 మంది లబ్ధిదారులు పింఛను కోసం ఎదురు చూసే దుస్థితి నెలకొందన్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వచ్చే పరిస్థితి లేదని, కనీసం అధికారులు నిర్వహించే సమావేశాలకు హాజరుకాకుంటే సమస్యలు ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు. విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చామంటూ చెప్పుకుంటున్న కూటమి నాయకులు ఎందుకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య ఏడాదిలో గణనీయంగా తగ్గిపోయిందో చెప్పాలన్నారు. జిల్లాలోని మెరకమూడిదాం మండలంలో ఏడాది కాలంలో ప్రభుత్వ బడుల్లో 1100 మంది విద్యార్థులు తగ్గిపోయారని చెప్పారు. అన్ని వ్యవస్థలు, రంగాలను అవినీతిమయంగా మార్చేశారని... ప్రజాప్రతినిధులకు, అధికారులకు మధ్య సమన్వయం లేకపోవటం దురదృష్టకరమని వాఖ్యానించారు. ఇలా అయితే ప్రజా సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని ప్రశ్నించారు. జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 3వ తేదీన వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు మజ్జి శ్రీనివాసరావు వెల్లడించారు. నగరంలోని పూల్బాగ్ జగన్నాథ కళ్యాణ మండపంలో ఆ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు పాల్గొని పార్టీ భవిష్యత్ కార్యాచరణపై దిశా నిర్దేశం చేస్తారన్నారు. సమావేశానికి ఎమ్మెల్సీలు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, మాజీ ఎంపీలు, పార్టీ జిల్లా నాయకులు, అనుబంధ విభాగాల నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పార్టీ మండలాధ్యక్షులతో పాటు రాష్ట్ర పార్టీలో వివిధ పదవుల్లో ఉన్న నాయకులు, వైఎస్సార్సీపీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు వర్రి నర్సింహమూర్తి, సంగంరెడ్డి బంగారునాయుడు, ఇప్పిలి అనంత్, జిల్లా పార్టీ కోశాదికారి సిరిపురపు జగన్మోహన్రావు, ఉపాధ్యక్షుడు పతివాడ సత్యనారయణ, వెలమ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నెక్కల నాయుడుబాబు, రాష్ట్ర కార్యదర్శి కె.వి.సూర్యనారాయణరాజు, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు పీరుబండి జైహింద్కుమార్, జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు వల్లిరెడ్డి శ్రీనివాస్, జిల్లా బూత్ కమిటీ అధ్యక్షుడు బూర్లె నరేష్, అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలు పతివాడ కృష్ణవేణి, జెడ్పీటీసీ సభ్యుడు గార తవుడు, తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ విస్తృత సమావేశం విజయవంతం చేద్దాం
పార్వతీపురంటౌన్: వైఎస్సార్సీపీ పార్వతీపురం మన్యం జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేద్దామని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం పార్టీ ముఖ్యనాయకులతో కలిసి తన క్యాంప్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 5న శనివారం మధ్యాహ్నం 3గంటలకు జిల్లా కేంద్రంలో గల రాయల్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ వద్ద వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు అధ్యక్షతన వైఎస్సార్సీపీ శ్రేణులతో పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నామన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా శాసన మండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, పార్టీ రీజినల్ కోఆర్డినేర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబులు హాజరవుతారని తెలియజేశారు. పార్లమెంట్ పరిశీలకులు, ఎంపీ, ఎమ్మెల్సీలతో పాటు ముఖ్యనాయకులు హాజరు కానున్నారన్నారు. అందరూ హాజరుకావాలి ఈ సమావేశానికి పార్వతీపురం నియోజకవర్గం పరిధిలో గల మూడు మండలాలు, పురపాలక సంఘం నుంచి పార్టీ అధ్యక్షులు, జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి పార్టీ కమిటీలో వివిధ హోదాల్లో గల సభ్యులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మాజీ కార్పొరేషన్ సభ్యులు, మాజీ డీసీసీబీ, మాజీ డీసీఎంఎస్ సభ్యులు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు అందరూ తప్పక పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఆయనతో పాటు పార్టీ మండల అధ్యక్షులు కొండపల్లి బాలకృష్ణ, బొంగు చిట్టిరాజు, బొమ్మి రమేష్, పాలవలస మురళీకృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ బోను గౌరీశ్వరి, ఎంపీపీలు మజ్జి శోభారాణి, గుడివాడ నాగమణి, జెడ్పీటీసీ అలజంగి రవికుమార్, వైస్ ఎంపీపీలు సిద్ధా జగన్నాథం, బంకురు రవికుమార్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి తప్పెట ప్రసాద్, అధికార ప్రతినిధి మువ్వల సత్యం నాయుడు, జిల్లా ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు పీఎస్ఆర్ నాయుడు, ఎంపీటీసీలు బడే రామారావు, వై.రమణ, సర్పంచ్లు తీళ్ల కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు -
డాక్టర్ దీనకుమార్కు సత్కారం
సీతానగరం: పార్వతీపురం బదిలీ అయిన పశుసంవర్థక ఎ.డి డాక్టర్ సీహెచ్ దీనకుమార్ను పశువైద్య సహాయకులు మంగళవారం ఘనంగా సత్కరించారు. దీర్ఘకాలంగా మండల పశువైద్యాధికారి, సీతానగరం పశువైద్య శాఖసబ్ డివిజినల్ ఎ.డిగా డాక్టర్ దీనకుమార్ సేవలందించిచారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బదిలీలు కావడంతో పార్వతీపురం సబ్డివిజన్ ఎ.డి గా బదిలీ అయినందున పశువైద్య సహాయకులు ఆయనను ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. సన్మాన గ్రహీత డాక్టర్ దీనకుమార్ మాట్లాడుతూ ఉద్యోగులకు పదోన్నతులు, బదిలీలు అనివార్యమే అయినా విధుల్లో అందించిన సేవలు చిరస్మరణీయంగా ఉండిపోతాయన్నారు. సుదీర్ఘకాలం మండలంలో పశువులకు సేవలందించే సదవకాశం తనకు దక్కిందన్నారు. విధి నిర్వహణలో సహకరించిన ఉన్నతాధికారులు, సహచర ఉద్యోగులు. ,శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలియజేశారు. -
పోటాపోటీగా పింఛన్ల పంపిణీ
● రెండు ప్రాంతాల్లో రెండు వర్గాలుగా అందజేత ● టీడీపీలో రాజుకుంటున్న గ్రూపుల కుంపటి శృంగవరపుకోట: మేజర్ పంచాయతీ ఎస్.కోటలో మంగళవారం అధికార టీడీపీ నేతలు రెండు వర్గాలుగా, పోటాపోటీగా పింఛన్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే లలితకుమారి తన అనుయాయులతో కలిసి కోటవీధిలో, ఏపీ టూరిజం బోర్డు డైరెక్టర్ సుధారాజు తన అనుయాయులతో కలిసి పుణ్యగిరిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు మంగళవారం పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీలో రాజుకుంటున్న అసమ్మతి కుంపటికి ఇది నిదర్శనం. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో ఆరంభం నుంచి రెండు గ్రూపులు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఎమ్మెల్యే లలితకుమారి, ఎమ్మెల్యే సీటు కోసం ఆశించి భంగపడి, డీసీఎంఎస్ చైర్మన్గిరితో సరిపెట్టుకున్న గొంప కృష్ణ రెండు వర్గాలుగా ఉన్నారు. గొంప కృష్ణ వర్గానికి ఎంపీ భరత్ ఆశీస్సులు మెండుగా ఉన్న విషయం విదితమే. కాగా ఇటీవల శాసనసభ ఎన్నికల్లో నారా లోకేష్ హామీతో టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఎంపీపీ సోమేశ్వరరావు, వైస్ ఎంపీపీ సుధారాజు, ఎస్.కోట సర్పంచ్ సంతోషికుమారితో పాటు కొందరు వైఎస్సార్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. అసంతృప్తిలో మూడో వర్గం మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న వైస్ ఎంపీపీ సుధారాజు వర్గం అధికార పార్టీ నేతల తీరుపై గుర్రుగా ఉన్నారు. పార్టీలో తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని, కార్యక్రమాలు వేటికీ తమకు సమాచారం ఇవ్వకుండా, తమ ప్రాతినిధ్యం లేకుండా చేస్తున్నారని మధనపడుతున్నారు. నాడు పార్టీలో తగిన ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చి, నమ్మించి నట్టేట ముంచుతున్నారని కలత చెందుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, నిధులు, విధులు, సంక్షేమ కార్యక్రమాలు ఇలా ఎక్కడా తమ మాట చెల్లడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ దగ్గకు పంచాయితీ? తమకు తగిన గౌరవం దక్కడం లేదని నేరుగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్కు ఫిర్యాదు చేసి, నాడు ఇచ్చిన హామీలను గుర్తుచేయాలని సుధారాజు వర్గం యోచిస్తోంది. ఇందుకోసం లోకేష్ అపాయింట్మెంట్ కోసం చూస్తున్నారని, త్వరలోనే అధిష్టానం పెద్దలకు వాస్తవాలు చెప్పేందుకు అమరావతి వెళ్లనున్నట్లు కచ్చితమైన సమాచారం. -
● రేషన్ కష్టాలు
రేషన్ కోసం వరండాలో నిరీక్షిస్తున్న లబ్ధిదారులు గత ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ఇంటింటికీ రేషన్ పంపిణీ ప్రక్రియను కూటమి ప్రభుత్వం నిలుపుదల చేయడంతో లబ్ధిదారులకు ప్రతినెలా కష్టాలు తప్పడం లేదు. పనులు మానుకుని రేషన్ కోసం గంటల తరబడి డిపోల వద్ద నిరీక్షిస్తున్నారు. గతంలో వలే ఇంటివద్దకే వచ్చి సరుకులు అందజేస్తే ఈ కష్టాలు ఉండేవి కావని చెబుతున్నారు. రేషన్ కోసం విజయనగరంలోని ధర్మపురి వద్ద నిరీక్షిస్తున్న లబ్ధిదారులను చిత్రంలో చూడొచ్చు. – సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం -
కొంతమందికే ప్రోత్సాహకం..!
● ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించే గర్భిణులకు జేఎస్వై లబ్ధి ● ఏప్రిల్ నుంచి జూన్ 26వరకు 1842 మంది ఆన్లైన్లో నమోదు ● 1232 మందికి మాత్రమే నగదు జమ ● ఆరోగ్య ఆసరాకు మంగళం పాడేసిన కూటమి సర్కారువిజయనగరం ఫోర్ట్: మాతాశిశు సంక్షేమానికి కోట్లాది రుపాయలు ఖర్చు చేస్తున్నామని కూటమి సర్కార్ గొప్పలు చెబుతోంది, కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంటోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించే మహిళలను ప్రోత్సహించడం కోసం అందించే జేఎస్వై ప్రోత్సాహకాలు అందించడంలో కూటమి సర్కార్ అలసత్వం వహిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రోత్సాహకాలు అందరికీ కాకుండా కొంతమందికి ఇచ్చినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా ఆస్పత్రుల్లో ప్రసవించే మహిళలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.5 వేలు ఆరోగ్య ఆసరా కింద ఇచ్చేది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్య ఆసరాకు మంగళం పాడేసిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రసవాలు జరిగే ఆస్పత్రులు జిల్లాలో ఎస్.కోట, గజపతినగరం, రాజాం, చీపురుపల్లి ఏరియా ఆస్పత్రులు, బాడంగి, నెల్లిమర్ల, భోగాపురం, బొబ్బిలి సీహెచ్సీలు, ఘోషాఆస్పత్రిలో ప్రసవాలు జరుగుతాయి. అదేవిధంగా జిల్లాలో ఉన్న 48 పీహెచ్సీల్లోనూ ప్రసవాలు జరుగుతాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించే బాలింతలకు జననీ సురక్ష యోజన కింద ప్రోత్సాహకం (జేఎస్వై) అందజేస్తారు. గ్రామీణ ప్రాంత తల్లులకు రూ.1000, పట్టణ ప్రాంత తల్లులకు రూ.600 ఇస్తారు. 1842మంది తల్లుల నమోదు ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి జూన్ 26వతేదీ నాటికి ఎంఎస్ఎస్ పోర్టల్లో 1842 తల్లులు వివరాలు అప్లోడ్ చేశారు. అందులో 1232 మందికి మత్రమే నగదు జమ అయింది. 610 మందికి జేఎస్వై ప్రోత్సాహకం అందాల్సి ఉంది.మిగిలిన వారికి త్వరలో అందజేతజేఎస్వై కింద గ్రామీణ ప్రాంత మహిళలకు రూ.1000, పట్టణ ప్రాంత మహిళలకు రూ.600 చొప్పన ప్రోత్సాహకం అందించనున్నాం. ఈ ఏడాది ఇంతవరకు 1842 మందికి గాను 1232 మందికి ప్రోత్సాహకం వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయింది. మిగతా 610 మందికి కూడా త్వరలో వారి ఖాతాల్లో జమ అవుతుంది. డాక్టర్ ఎస్. జీవనరాణి, డీఎంహెచ్ఓ -
మీ సేవలు వెలకట్టలేనివి
● ఎస్పీ వకుల్ జిందల్ ● ఉద్యోగవిరమణ పొందిన ఐదుగురు అధికారులకు ఘన సన్మానం విజయనగరం క్రైమ్: సుదీర్ఘకాలం పోలీస్ శాఖలో బాధ్యతాయుతంగా, క్రమశిక్షణతో విధులు నిర్వహించిన పోలీస్ ఉద్యోగుల సేవలు వెలకట్టలేనివని ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. ఉద్యోగ విరమణ పొందిన ఎస్ఐలు సర్దార్ ఖాన్, ముడసాల వేణుగోపాలస్వామి, కుచ్చర్లపాటి తిరుమలరాజు, జామి ఏఎస్ఐ ఆర్వీఏ నర్సింగరావు, ఆర్మ్డ్ రిజర్వ్ ఏఆర్ఎస్ఐ ఊయక గుంపస్వామిలను జిల్లా పోలీస్శాఖ తరఫున జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగం అంటేనే క్లిష్టపరిస్థితులు, విభిన్న వాతావరణంలో ఆరోగ్యంపై కూడా శ్రద్ధచూపేందుకు అవకాశం లేని పరిస్థితుల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. ఐదుగురు అధికారులు పోలీస్ శాఖలో ఎలాంటి రిమార్కులు లేకుండా విధులు నిర్వర్తించడంతో పాటు పిల్లలను ఉన్నత విద్యావంతులుగా, ఉద్యోగులుగా తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. విశ్రాంత జీవితాన్ని ఆనందంగా సాగించాలని, సమాజానికి సేవ చేయాలని, పోలీస్ శాఖ తరఫున ఎలాంటి సాయం కావాలన్నా సంప్రదించాలని సూచించారు. అనంతరం ఉద్యోగుల దంపతులను దుశ్శాలువ, జ్ఞాపికలతో సత్కరించారు. జిల్లా కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ తరఫున గిఫ్ట్ చెక్కులను అందజేశారు. ఉద్యోగ విరమణ చేసిన అధికారులు మాట్లాడుతూ తమ సర్వీసులో సహాయ, సహకారాలను అందించిన అధికారులు, సహోద్యోగులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అడ్మిన్ అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఏఆర్ అదనపు ఎస్పీ ఏఆర్ జి.నాగేశ్వరరావు, ఏఆర్ డీఎస్పీ వై.రవీంద్రారెడ్డి, ఎస్బీ సీఐలు ఎ.వి.లీలారావు, ఆర్.వి.కె.చౌదరి, రిజర్వు ఇన్స్పెక్టర్లు ఎన్. గోపాలనాయుడు, టి.శ్రీనివాసరావు, ఆర్.రమేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
తాగునీటి సమస్యలు పరిష్కరించాలి
విజయనగరం అర్బన్: తాగునీరు, భూమస్యలను పరిష్కరించాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం కారిగూడ పంచాయతీ దొందమానుగూడ గ్రామ గిరిజనులు పలువురు రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీశంకరరావును కలిసి వినతపత్రాన్ని అందజేశారు. ఈ మేరకు మంగళవారం స్థానికంగా ఉన్న చైర్మన్ ఇంటికి వెళ్లి తమ గోడు చెప్పుకున్నారు. మంచినీటి సమస్య వల్ల ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. గ్రామస్థాయిలో భూ సమస్యలపై చైర్మన్తో చర్చించారు. పైనాపిల్, కొండచీపుళ్లు, చిరుధాన్యాలు వంటి పంటలకు గిట్టుబాబు ధర లేక నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై చైర్మన్ సానుకూలంగా స్పందించి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కారమయ్యేలా కృషి చేస్తానని గిరిజనులకు హామీ ఇచ్చారు. చైర్మన్ను కలిసిన వారిలో సవర సింహాచలం, హడ్డుబంగి శేషమ్మ ఉన్నారు. ఎస్టీ కమిషన్ చైర్మన్కు గిరిజనుల వినతి -
గిరిజన యూనివర్సిటీలో స్పాట్ అడ్మిషన్లు
● 8, 9 తేదీల్లో ఓపెన్ కౌన్సెలింగ్ విజయనగరం అర్బన్: కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో 2025–26 విద్యాసంవత్సరానికి పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్లను ఈ నెల 8, 9వ తేదీల్లో ఓపెన్ కౌన్సెలింగ్లో భర్తీ చేస్తామని విశ్వవిద్యాలయం ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ తంత్రవాహి శ్రీనివాసన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. స్పాట్ అడ్మిషన్ షెడ్యూల్లో 8వ తేదీన ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ బయోటెక్నాలిజీ, ఎంబీఏ, 9వ తేదీన పీజీ ఇంగ్లిష్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, సోషియాలజీ, ట్రైబల్ స్టడీస్, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తామన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆయా రోజుల్లో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే కౌన్సెలింగ్కు సంబంధిత విద్యార్హత ధ్రువపత్రాలతో నేరుగా యూనివర్సిటీకి హాజరుకావాలని కోరారు. మరిన్ని వివరాల కోసం యూనివర్సిటీ వెబ్సైట్ ‘సీటీయూఏపీ.ఏసీ.ఐఎన్’ను సందర్శించాలన్నారు. గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యవకుల అరెస్టు విజయనగరం క్రైమ్: విజయనగరం సీఎంఆర్ కూడలి వద్ద గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను మంగళవారం అరెస్టు చేసినట్టు వన్టౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. గాజులరేగకు చెందిన బెవర గణేష్, పద్మావతి నగర్కు చెందిన బోగి రాహుల్ 300 గ్రాముల గంజాయిని ప్యాకెట్లలో విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారన్నారు. వారి నుంచి 300 గ్రాముల గంజాయి, రూ.200 నగదు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. మున్సిపల్ ఉద్యోగుల వినూత్న నిరసన నెల్లిమర్ల: కూటమి ప్రభుత్వ తీరుపై నెల్లిమర్ల నగర పంచాయతీ అవుట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులు, ఇంజినీరింగ్ విభాగం ఉద్యోగులు చెవిలో పూలుపెట్టుకుని వినూత్నరీతిలో మంగళవారం నిరసన తెలిపారు. నగర పంచాయతీ కార్యాలయం వద్ద మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకుడు జగన్మోహన్రావు మాట్లాడుతూ కనీస వేతనాలు చెల్లించాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, రిటైర్మెంట్ వయస్సు 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం కమిషనర్ తారక్నాథ్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో గోవింద్, బాబూరావు, శేఖర్, తదితరులు పాల్గొన్నారు. దొంగతనానికి వెళ్లి.. అక్కడే నిద్రపోయి.. బొబ్బిలి: ఓ ఇంటిలో ఐదు రోజులుగా దొంగతనం చేస్తూ అదే ఇంటింలో మద్యం మత్తులో నిద్రపోయిన దొంగను బొబ్బిలి పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బొబ్బిలి పట్టణం గొల్లపల్లి అంబేడ్కర్ కాలనీలో నివసిస్తున్న శీర శ్రీనివాసరావు వ్యవసాయ పనుల నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి ఐదు రోజుల కిందట స్వగ్రామమైన అలజంగి వెళ్లారు. ఈ విషయాన్ని కనిపెట్టిన పిరిడి గ్రామానికి చెందిన కె.కృష్ణ ఆ ఇంటిలోకి ప్రవేశించాడు. ఇంటిలో ఉన్న వెండి, ఇత్తడి సామాన్లు దొంగిలించి విక్రయించడం, కొనకపోతే తాకట్టు పెట్టడం చేసి మద్యం కొనుగోలు చేసి ఆ ఇంట్లోకే వెళ్లి తాగుతూ, తింటూ గడిపాడు. ఐదు రోజులుగా ఇదే తంతు జరుగుతోంది. ఇంటి యజమాని మరో రెండు రోజులు రాడనుకున్నాడో ఏమో మంగళవారం కూడా మరికొన్ని సామాన్లు విక్రయించి పూటుగా మద్యం తాగి ఎప్పటివలే చల్లగా ఉందని ఇంటి గచ్చుపై నిద్రపోయాడు. స్థానికులు దొంగను గుర్తించి అలజంగిలో ఉన్న శ్రీనివాసరావుకు సమాచారమందించారు. ఈ లోగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారమందుకున్న ఎస్ఐ ఆర్.రమేష్ కుమార్ తన సిబ్బందితో వచ్చ దొంగను పట్టుకున్నారు. అప్పటికే నిద్రమత్తులో ఉండడంతో పిరిడిలోని కృష్ణ ఇంటికి ఫోన్ చేశారు. అతడిని ఇంటికి పంపొద్దంటూ కుటుంబ సభ్యులు తిరిగి పోలీసులను వేడుకోవడం గమనార్హం. కేసు నమోదు చేయడమా, లేదంటే దొంగకు కౌన్సెలింగ్ ఇవ్వడమా అన్నది బుధవారం తేల్చుతామని ఎస్ఐ తెలిపారు. -
కళ్లకు గంతలతో నిరసన
శృంగవరపుకోట: జిందాల్ పరిశ్రమ కళ్లు మూసి జెల్ల కొట్టిందని, తడి గుడ్డతో రైతుల గొంతు కోసిందని నిర్వాసిత రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్సీ రఘురాజు నివాసం వద్ద మంగళవారం మధ్యాహ్నం 3గంటల సమయంలో రోడ్డుమీద కళ్లకు గంతలు కట్టుకుని జిందాల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిందాల్తో చేతులు కలిపి అన్ని పార్టీల నాయకులు, జిల్లా అధికారులు తమను కళ్లు మూసి జెల్ల కొట్టారని, జిందాల్ యాజమాన్యానికి కొమ్ము కాస్తున్నారని, వాపోయారు. జిల్లా పెద్దదిక్కు అయిన కలెక్టర్ తన ఉద్యోగం మరిచిపోయి జిందాల్ ప్రతినిధిలా మాట్లాడటం విద్డూరంగా ఉందని, నాడు నమ్మించి ఓట్లు వేయించుకున్న ఎమ్మెల్యేలు, మంత్రులు నాలుగు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని చెప్పి వెళ్లిపోయారని, ఇప్పటికీ ముఖం చూపడం లేదన్నారు. నాడు జిందాల్ ఇచ్చిన హామీలు ఎవరు తీరుస్తారు? ఎలా తీరుస్తారని అడిగితే చెప్పకుండా ముఖం చాటేయడం న్యాయమా? జీవనోపాధి అయిన భూములు కోల్పోయి న్యాయం అడిగితే మమ్మల్ని పోలీసుల్ని పెట్టి బెదిరిస్తున్నారని వాపోయారు. కార్యక్రమంలో పలువురు రైతులు, మహిళలు పాల్గొన్నారు. కలెక్టర్, ఎస్పీలకు ఎమ్మెల్సీ లేఖ జిందాల్ భూసమస్య చుట్టూ తతెత్తుతున్న పరిస్థితి అర్దం చేసుకోవాలని, తొలుత నిర్వాసితుల శాంతియుత నిరసనకు అనుమతించి తర్వాత వారిని అనుమతించక పోవడం వల్ల నిర్వాసితులు తన ఇంటికి వస్తున్నారని, స్థానికుడిని కావడం వల్ల వారిని కాదనలేక విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఎమ్మెల్సీ రఘురాజు అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో వారి అభిప్రాయాలు వ్యక్తం చేసుకోవడానికి అనుమతించి, తనపై ఒత్తిడి తగ్గించాలని ఎమ్మెల్సీ రఘురాజు కలెక్టర్, ఎస్పీలకు లేఖలు ఇచ్చారు. జిందాల్ మోసం చేసిందని నిర్వాసితుల ఆందోళన -
సోషల్ మీడియా వరమా? శాపమా?
అడిక్షన్ ఉందో లేదో ఇలా గుర్తించొచ్చు... సోషల్ మీడియాను మితిమీరి ఉపయోగించడం వల్ల ఉద్యోగం, చదువు, పనులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అంటే ఏదైనా నిర్దిష్ట సమయంలో చేయాల్సిన పనికి బదులు ఫోన్లో యాప్లను తెరిస్తే అది వ్యసనానికి సంకేతంగా చెబుతున్నారు. ● స్నేహితులు, కుటుంబసభ్యులతో కలిసి ఉన్నప్పుడు, భోజనం చేసేటప్పుడు స్మార్ట్ ఫోన్ను తీసుకోవడం, మెస్సేజ్లను చూడడం. ● ప్రతి చిన్న సమస్యకు పరిష్కారంగా ఆన్లైన్, సోషల్ మీడియాపై అధికంగా ఆధారపడడం.విజయనగరం గంటస్తంభం: సోషల్ మీడియా ఇప్పుడు మనిషి నిత్యకృత్యాల్లో ఓ భాగమైంది. బంధుమిత్రులతో కనెక్ట్ అవ్వడానికి మంచి వేదికై ంది. అనుభావాలను, అలవాట్లను, ఆలోచనలను పంచుకునే చోటు. ఇది కొంతమేర బాగానే ఉన్నా ఎదుటివారి ‘సోషల్ బతుకు’లను చూస్తూ కుంగుబాటుకు లోనవుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఇతరుల వివరాలు, వినోదాలు, విలాసాలను చూస్తూ.. చాలామంది.తమను తాము తక్కువ చేసుకుంటున్నారు. మరి సోషల్ మీడియాలో మనం చూసే ప్రతిదీ నిజమేనా? అంటే..‘కాదు’ అనే చెప్పాల్సి వస్తుంది. ఎందుకుంటే ‘ఫ్యామిలీ ఓవర్ ఎవ్రీఽథింగ్’ అంటూ ఫొటోను స్టేటస్ పెట్టుకునేవారు పట్టుమని పది నిమిషాలు కూడా ఫ్యామిలీతో గడపకపోవచ్చు. ‘ఫ్రెండ్స్ ఫర్ లైఫ్’ అనేవారు అసలు స్నేహితులే లేకపోవచ్చు. ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అంటూ అర్ధరాత్రి పూట పోస్టులు పెడుతుండవచ్చు, నిద్రపోకుండా ఆరోగ్యం పాడుచేసుకోవచ్చు. ‘అమ్మే దైవం’ అని ఎమోషనల్ క్యాప్షన్స్ పెట్టేవారంతా అమ్మకు పనుల్లో సాయం చేస్తారన్నది అపోహే. పొద్దున నిద్ర లేదగానే దేవుడి వీడియోలను స్టేటస్లుగా పెట్టుకున్నవారు మంచి మనుషులని ఏ తప్పూ చేయని వారని అనుకుంటే పొరపాటే. పిల్లికి బిచ్చం వేయనివారే ‘సొంత లాభం కొంత మానుకుని పొరుగువానికి తోడుపడవోయ్’ అంటూ ఫోజులు కొట్టవచ్చు. నువ్వు లేనిదే నేను లేనంటూ ఇన్ బాక్స్ల్లో ప్రేమ పాఠాలు వల్లె వేసేవారు..ఆ మాటే మరొకరికి చెప్పరని గ్యారంటీ లేదు. ఖరీదైన కారు ముందో, విలాసవంతమైన భవనం ముందో నిలబడి ఫొటోలు పెడితే వాళ్ల వైభోగాన్ని చూసి అసూయ కలుగుతుంది. కానీ అవి వాళ్ల సొంతమేనా కాదా? వారికి ఆ తాహతుందా, లేక ఆర్భాటాలకు పోయి ఆనక అప్పులతో ఇబ్బందులు పడుతున్నారా? అవేవీ మనకు తెలియదు. ఫొటోల కోసం ఎవరికో ఏదో సాయం చేస్తున్నట్లు నటించేవారు పెరుగుతున్నారని వారి సోషల్ మీడియా పోస్టులే చెబుతుంటాయి. ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్లలో అందమైన అమ్మాయిలు ఫొటోలు చూసి ఆత్మన్యూనతకు లోనయ్యేవారు, తామూ అలాగే కనపడాలని రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ కొంటున్న వారూ లేకపోలేదు. ఫొటోలకు ఫిల్టర్లు ఉంటాయని ఎలాంటి వారైనా అందంగా కనిపించవచ్చని ఆ క్షణం స్ఫురించదు. తెరమీద కనిపించేవన్నీ ఫిల్టరేసిన బతుకులు. నిజజీవితాలు కాదు. నిజాయతీగా ఉన్నదున్నట్లు చూపించుకునేవారూ ఉంటారు. కాకపోతే వారిది ప్రదర్శనలా ఉండదు. ఎవరికీ ఇబ్బంది కలిగించదు. లేనిది ఉన్నట్లూ ఉన్నది లేనట్లూ చూపించుకోవడానికి సోషల్ మీడియాను మయసభలా వాడుకునేవారితోనే సమస్యంతా. మంచికి వాడుకుందాం.. పోస్టులు పెడుతుంటారు, సమాచారాన్ని షేర్ చేస్తుంటారు. ఇటీవల సోషల్ మీడియాలో రాజకీయ, విధానాపరమైన పోస్టులే ఎక్కువగా దర్శనమిస్తుంటాయి.ఈ క్రమంలో ప్రభుత్వ నిర్ణయాలు, న్యాయపరమైన విధానాలపై వచ్చే పోస్టులను ఇతరులకు పంపడం ద్వారా చిక్కుల్లో పడుతుంటాం. అనవసరంగా పోలీసు కేసుల బారిన పడుతుంటాం.అటువంటి సమయంలో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు సాక్ష్యాలుగా చూపుతున్నారు పోలీసులు. లేనిపోని లింకులు క్లిక్ చేయడం, పరిచయం లేని వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్టులకు దూరంగా ఉండడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. యువతపై అత్యధిక ప్రభావం సెల్ఫీల మోజు బాగా పెరిగింది..సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవడానికి వినియోగించుకోవాలి. అతిగా సెల్ఫోన్ వినియోగంచడం వల్ల తీవ్ర నష్టం జరుగుతుంది. ఇక యువతకు సెల్ఫీ మోజు బాగా పెరిగింది. సెల్ఫీ మోజులో ఎక్కడపడితే అక్కడ ఫొటోలు దిగుతున్నారు. దీంతో ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. వై.సతీష్ కుమార్, సీనియర్ కెమిస్ట్రీ లెక్చరర్, విజయనగరం తల్లిదండ్రులు నియంత్రించాలి.. అనవసరమైన వయస్సులో పిల్లలకు సెల్ఫోన్ ఇవ్వకూడదు. యువత ఫోన్లను విపరీతంగా వాడుతోంది. సరదా కోసం తీస్తున్న సెల్ఫీలు చివరకు ప్రాణాల మీదికి తెస్తున్నాయి. – ప్రశాంత్ కుమార్ ఎంఎస్సీ సైకాలజీ, విజయనగరం -
మడ్డువలసలోనే ఏనుగులు
వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు సమీపంలో తొమ్మిది ఏనుగుల గుంపు తిష్ఠవేసింది. గత మూడు రోజులుగా సంగాం గ్రామ పరిసరాల్లోని చెరకు, పామాయిల్ తోటల్లో సంచరిస్తూ ధ్వంసం చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి ఏనుగుల తరలించాలని రైతులు కోరుతున్నారు. అప్రమత్తంగా అధికారులు..... ఏనుగులు గుంపు వంగర–రాజాం రోడ్డు మార్గం ఆనుకొని ఉండడంతో అటవీ, రెవెన్యూ, పోలీస్ శాఖల సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. రోడ్డుపై వెళుతున్న వాహనదారులను అప్రమత్తం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో రోడ్డు మార్గంలో వాహనాలు నిలుపుదల చేస్తున్నారు. -
● నిరసన గళం
వివిధ సమస్యలపై జిల్లా ప్రజలు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక సాక్షిగా ఆందోళనలు చేశారు. తమ నిరసనగళం వినిపించారు. విజయనగరానికి సమీపంలో గుంకలాం వద్ద ఉన్న వైఎస్సార్జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు. తక్షణమే రాకపోకలకు వీలుగా సీసీ రోడ్లు, కాలువలు నిర్మించాలని, వీధి దీపాలు అమర్చాలని, తాగునీటి బోర్లు వేయాలని, వైద్యసేవలు అందేలా ఆరోగ్య సబ్ సెంటర్ నెలకొల్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జేసీ సేతుమాధవన్కు వినతిపత్రం అందజేశారు. తమ కాలనీ ప్రజల కష్టాలపై మీడియా సాక్షిగా గోడు వినిపించారు.సిబిల్స్కోర్ పేరుతో రుణాలు నిలిపివేయడం తగదంటూ నాయీబ్రాహ్మణులు ఆందోళన చేశారు. వృత్తిలో శిక్షణపొందిన వారికి టూల్కిట్లు అందజేయాలని, స్టైఫండ్ ఇవ్వాలని కోరుతూ ఏపీ నాయీబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. – విజయనగరం అర్బన్ -
విద్యార్థులకు వైద్య ‘పరీక్ష’..!
విజయనగరం ఫోర్ట్: కోరుకొండ సైనిక్ స్కూల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన రాత పరీక్షలో ఎంపికైన విద్యార్థులు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం సోమవారం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వచ్చారు. వీరికి వివిధ రకాల వైద్యపరీక్షలతో పాటు, కంటి, ఈఎన్టీ పరీక్షలు నిర్వహించి మెడికల్ సర్టిఫికెట్స్ను ఆస్పత్రి వైద్యులు జారీ చేయాల్సి ఉంది. వైద్య పరీక్షల కోసం ఒక్కో విద్యార్థి రూ.300 చలానా కూడా తీశారు. అయితే, ఆస్పత్రి సిబ్బంది కొందరు ఈ వ్యవహారంతో తలదూర్చారు. డబ్బుల ఆక్రమ వసూలే లక్ష్యంగా... అన్ని సేవలు ఆస్పత్రిలో అందుబాటులో ఉన్నా ప్రైవేటు ల్యాబ్లలో చేయించుకోవాలని సూచించారు. ఆ ల్యాబ్ సిబ్బందితో ముందస్తుగానే కమీషన్ కోసం ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. మొత్తం 90 మంది విద్యార్థులను ప్రైవేటు ల్యాబ్లకు పంపించి అక్కడ ఒక్కొక్కరి దగ్గర మరో రూ.450 నుంచి రూ.500 వసూలు చేశారు. దీనిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గోడు వినిపించినా పట్టించుకునేవారే కరువయ్యారు. మెడికల్ సర్టిఫికెట్ అత్యవసరం కావడంతో అడిగినంత ఇచ్చుకున్నారు. అంతా ఆ ఇద్దరు ఉద్యోగుల కనుసన్నల్లోనే.. ఈ తతాంగాన్ని ఇద్దరు ఉద్యోగులు నడిపించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్వజన ఆస్పత్రికి చెందిన ఒకరు, సైనిక్ స్కూల్కు చెందిన ఉద్యోగి ఒకరు విద్యార్థులను ప్రైవేటు ల్యాబ్లకు పంపించడంలో కీలక పాత్ర పోషించినట్టు సమాచారం. దీనికోసం ల్యాబొరేటరీల నుంచి వారికి కమీషన్లు ముట్టాయన్న విమర్శలు ఉన్నాయి. మెడికల్ సర్టిఫికేట్స్ కోసం ఒక్కో విద్యార్ధి రూ. చలానాకు రూ. 300 , వైద్య పరీక్షలకు రూ. 500 వరకు వెచ్చించారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం సైనిక్ స్కూల్కు ఎంపికై న విద్యార్థులు మెడికల్ సర్టిఫికెట్స్ కోసం వచ్చారు. వైద్యపరీక్షలు అన్నీ ఆస్పత్రిలో ఉన్నాయి. వారిని ప్రైవేటు ల్యాబొరేటరీలకు ఎవరు వెళ్లమన్నారో తెలియదు. విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ కామేష్, ఆర్ఎంఓ, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సర్వజన ఆస్పత్రిలో వైద్యపరీక్షలకు వచ్చిన కోరుకొండ సైనిక్ స్కూల్ చిన్నారులు సర్టిఫికెట్ కోసం ఒక్కొక్కరి నుంచి రూ.300 చొప్పున చలానా అన్ని సేవలూ అందుబాటులో ఉన్నా ప్రైవేటు ల్యాబ్లో చేయించుకోవాలని సూచన అక్కడ మరో రూ.450 నుంచి రూ.500 చొప్పున వసూలు -
535 ఎంఎస్పీలకు స్థానచలనం
విజయనగరం క్రైమ్: ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఐదేళ్ల సర్వీసు పూర్తయిన 535 మంది మహిళా సంరక్షణ పోలీసుల(ఎంఎస్పీ)కు స్థానచలనం కలిగినట్టు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్హాల్లో సోమవారం రాత్రి 10 గంటల వరకు కౌన్సెలింగ్ ప్రక్రియ సాగింది. ఎస్పీతో పాటు ఏఎస్పీ సౌమ్యలత కౌన్సెలింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. రోగులైన వారు, వైవాహిక పరిస్థితులు, విజువల్ ఇంప్లైయిడ్, తదితర అంశాలపై బదిలీల్లో పరిగణనలోకి తీసుకున్నట్టు ఎస్పీ తెలిపారు. మొత్తం 635 మందికి 535 మందికి కౌన్సెలింగ్ నిర్వహించి వార్డు/గ్రామ సచివాలయాలను కేటాయించామన్నారు. కలెక్టర్ ఉత్తర్వులు మేరకు బదిలీ ఉత్తర్వులను రెండు, మూడు రోజుల్లో విడు దల చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీపీఓ ఏఓ శ్రీనివాసరావు, ఎస్బీ సీఐలు లీలారావు, చౌదరి, సూపరింటెండెంట్ వెంకటలక్ష్మి, ఎస్ఐ ప్రభావతి, ఆర్ఎస్ఐలు నీలిమ, మంగలక్ష్మి, డీపీఓ సిబ్బంది తేజ, రాంబాబు, శ్రీనివాసరావు, సుధారాణి, హేమంత్, పీఆర్వో కోటేశ్వరరావు, ఐటీ కోర్ టీమ్ పాల్గొన్నారు. -
ిసీపీఓ సేవలు అభినందనీయం
పార్వతీపురంటౌన్: జిల్లా ప్రణాళిక అధికారి వీరరాజు సేవలు అభినందనీయమని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అన్నారు. జిల్లా ప్రణాళిక అధికారి వీరరాజు ఉద్యోగ విరమణ కార్యక్రమం సోమవారం కలెక్టరేట్లో జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై వీరరాజు దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వీరరాజు మంచి సేవాతత్పరతతో వృత్తిని నిర్వహించారని ప్రశంసించారు. అంకితభావంతో సేవలు అందించడం వల్ల మన్ననలు పొందగలరని పేర్కొన్నారు సీనియర్ల సేవలను జూనియర్లు గుర్తించి వారిని మార్గదర్శకంగా తీసుకుని పనిచేయాలని సూచించారు. రిటైర్ అయిన సీపీఓ పి.వీరరాజు మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లాలో పనిచేయడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. వృత్తిలో సంతృప్తి పొందానని పేర్కొన్నారు. విధులు సక్రమంగా నిర్వర్తించేందుకు సహకరించిన కలెక్టర్, ఇతర అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎస్ఓ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
సర్పంచ్ ఆరోగ్యంపై ఆరా
విజయనగరం ఫోర్ట్: ఇటీవల ప్రమాదానికి గురై విజయనగరంలోని మెడికర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భీమిలి నియోజకవర్గం పద్మనాభం సర్పంచ్ తాలాడ పద్మనాభంను విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు, భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు సోమవారం పరామర్శించారు. పద్మనాభం ఆరోగ్య వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట పద్మనాభం మండల ఎంపీపీ కె.రాంబాబు, యూత్ ప్రెసిడెంట్ బుగత సత్య నారాయణ, చీపురుపల్లి జెడ్పీటీసీ సభ్యుడు వలిరెడ్డి శ్రీను, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పి.సత్యనారాయణ ఉన్నారు. సచివాలయ ఏఎన్ఎంలకు బదిలీ కౌన్సెలింగ్ విజయనగరం ఫోర్ట్: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సచివాలయం ఏఎన్ఎంలకు జూమ్లో సోమవారం బదిలీ కౌన్సెలింగ్ నిర్వహించారు. విజయనగరం డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్. జీవనరాణి, పార్వతీపురం డీఎంహెచ్ఓ డాక్టర్ భాస్కరరావు, ఏఓ ప్రభూజీ, సూపరింటెండెంట్ నాగరాజు కౌన్సెలింగ్ నిర్వహించారు. మడ్డువలసలో ఏనుగులు తిష్ట వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు పరిసరాల్లో తొమ్మిది ఏనుగులు తిష్టవేశాయి. చెరకు, వరినారు మడులను ధ్వంసం చేస్తున్నాయి. వంగర–రాజాం రోడ్డు పక్కన సోమవారం సంచరించడంతో అటవీ, పోలీస్ శాఖ సిబ్బంది అప్రమత్తమై రాకపోకలను కాసేపు నిలిపివేశారు. పార్వతీపురం మన్యం జిల్లా అటవీశాఖ రేంజర్ మణికంఠేశ్వరరావు, సిబ్బంది ఏనుగుల గమనాన్ని పరిశీలిస్తూ గ్రామస్తులను అప్రమత్తం చేస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ● డీఈఐసీ వైద్యాధికారి ఆదిత్య శేషసాయి విజయనగరం ఫోర్ట్: విద్యార్థులకు విద్యాబోధనతోపాటు వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని డీఈఐసీ (జిల్లా సత్వర చికిత్స కేంద్రం) వైద్యులు డాక్టర్ ఉండవల్లి ఆదిత్య శేషసాయి సూచించారు. మహారాణిపేట బాలసదన్లోని విద్యార్థులకు సోమవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన మందులు అందజేశారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువుపై దృష్టి సారించగలరన్నారు. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలపట్ల అశ్రద్ధ చూపొద్దని సూచించారు. కార్యక్రమంలో వైద్యుడు బి.చక్రవర్తి, సోషల్ వర్కర్ వై.శ్రీనివాస్రావు, బాలసదన్ మేనేజర్ శోభారాణి పాల్గొన్నారు. -
● పింఛన్ ఇప్పించండి సారూ..
ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి పేరు జీవన్కుమార్. గంట్యాడ మండలం మదనాపురం గ్రామం. సికిల్సెల్ వ్యాధితో బాధపడుతున్నాడు. 2023 నవంబర్ 24న వ్యాధిని నిర్ధారిస్తూ కేజీహెచ్ వైద్యులు సర్టిఫికెట్ జారీచేశారు. దీంతో వ్యాధిగ్రస్తులకు ఇచ్చే రూ.10వేల పింఛన్ కోసం పీహెచ్సీ వైద్యాధికారి ద్వారా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి దరఖాస్తు చేశారు. ఆ దరఖాస్తును అధికారులు తిరస్కరించారు. దీనిపై చిన్నారి తల్లిదండ్రులు అర్జున, సూర్యనారాయణ ప్రశ్నిస్తే... మెడికల్ సర్టిఫికెట్పై అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫొటో ఉందని చెప్పారు. ఇదెక్కడి అన్యాయం అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పటి సీఎం ఫొటో ఉండడం మా తప్పా అంటూ వాపోతున్నారు. పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలంటూ కలెక్టరేట్లో అధికారులకు సోమవారం విన్నవించారు. ఇదే విషయంపై ఆర్బీకేఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జీవన్కుమార్కు ఇచ్చిన సికిల్ సెల్ వ్యాధి సర్టిఫికెట్పై వైఎస్సార్ పింఛన్కానుక, జగన్మోహన్ రెడ్డి ఫొటో ఉన్నందున తిరస్కరించాం. ఇప్పడు సర్టిఫికెట్పై ఎన్టీఆర్ పింఛన్ భరోసా అని ఉండాలన్నారు. – విజయనగరం ఫోర్ట్ -
కౌన్సిలర్ల అధికారాలు కత్తిరిస్తా..
నెల్లిమర్ల: నెల్లిమర్ల నగర పంచాయతీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశం కోరం లేక వాయిదాపడింది. సమావేశానికి ఎమ్మెల్యే లోకం నాగ మాధవి, చైర్పర్సన్ బంగారు సరోజిని, జనసేన కౌన్సిలర్లు జానా సంధ్యారాణి, పాండ్రంకి మహాలక్ష్మి, బీజేపీ కౌన్సిలర్ మైపాడ ప్రసాద్ మాత్రమే హాజరయ్యారు. టీడీపీ, వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు హాజరుకాలేదు. సమావేశం వాయిదా పడడంతో ఆమె ఆగ్రహంతో ఊగిపోయారు. టీడీపీ కౌన్సిలర్లు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సమావేశపు అజెండా నచ్చకపోతే హాజరై, చర్చించాలే తప్ప బహిష్కరించడం సరికాదన్నారు. టీడీపీ సభ్యుల తీరును ప్రభుత్వ పెద్దలకు తెలియజేస్తానని చెప్పారు. ఇక్కడి పరిస్థితులు కూలంకషంగా వివరిస్తానని పేర్కొన్నారు. అన్నా క్యాంటీన్లో అవకతవకలను సైతం టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని హెచ్చ రించారు. అవసరమైతే నగర పంచాయతీకి స్పెషల్ ఆఫీసర్ను నియమించి, కౌన్సిలర్ల అధికారాల తొలగింపునకు సిఫారసు చేస్తానన్నారు. కార్యక్రమంలో కమిషనర్ తారక్నాథ్, తదితరులు పాల్గొన్నారు. కూటమిలో కుంపటి నెల్లిమర్ల నగరంలో అధికార పార్టీ కౌన్సిలర్లే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. జనసేన ఎమ్మెల్యే నాగమాధవి హాజరైన సమావేశాలకు గైర్హాజరై తమ వ్యతిరేకతను వ్యక్తంచేస్తున్నారు. నెల్లిమర్ల నగర పంచాయతీ కౌన్సిల్ను పలుమార్లు బాయ్కాట్ చేసి తమ నిరనసను తెలియజేశారు. అందులో భాగంగా సోమవారం జరిగిన కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించారు. ఎమ్మెల్యే నాగమాధవి నగర కౌన్సిల్ సమావేశాన్ని కౌన్సిలర్లు బాయ్కాట్ చేయడంపై ఆగ్రహం అన్నాక్యాంటీన్లో అవకతవకలను పెద్దల దృష్టికి తీసుకెళ్తానన్న ఎమ్మెల్యే కోరం లేక సమావేశం వాయిదా -
మాదక ద్రవ్యాల పట్ల అవగాహన కలిగి ఉండాలి
పార్వతీపురంటౌన్: మాదక ద్రవ్యాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అన్నారు. ఈ మేరకు మాదక ద్రవ్యాల నియంత్రణ జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని సోమవారం కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్యామ్ప్రసాద్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు, మత్తు మందులు కుటుంబాలను, ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయన్నారు. వాటిపై అవగాహన అత్యావశ్యమన్నారు. ఆరోగ్యమే మహా భాగ్యమని, దానిని కాపాడుకోవడం మన కర్తవ్యమని చెప్పారు. యోగా వంటి ఆరోగ్య అంశాల పట్ల ఆసక్తి కలిగి ప్రతిరోజూ సాధన చేయడం వల్ల ప్రయోజనాలు ఉంటాయని హితవు పలికారు. మాదక ద్రవ్యాలు, మత్తు మందులు ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీయడమే కాకుండా ఆర్థికంగా, మానసికంగా కుటుంబాలను నాశనం చేస్తాయన్నారు. పాఠశాలలు, వసతి గృహాలు పునఃప్రారంభమయ్యాయని వాటి చుట్టు పక్కల ఎటువంటి విక్రయాలు, కార్యకలాపాలు జరగకుండా పటిష్టమైన నిఘా ఉండాలని స్పష్టం చేశారు. అటవీ, మారుమూల ప్రాంతంలో సారా తయారీ వంటి అంశాలను గమనించాలని ఆదేశించారు. మాదక ద్రవ్యాల విక్రయాలు వివిధ రూపాల్లో ఉండే అవకాశం ఉందని, సంబంధిత అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. మాదక ద్రవ్యాలు, మత్తు మందుల ఉత్పాదకత, సరఫరా, రవాణా, విక్రయాలు, వినియోగం జరిగితే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వాటికి సంబంధించిన వివరాలు తెలిసినవారు 1972 ఫోన్ నంబర్కు సమాచారం అందించాలని కోరారు. రవాణా వాహనాలను తనిఖీలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఎస్పీ ఎస్వీ మాధవ రెడ్డి, పాలకొండ డీఎస్పీ ఎం.రాంబాబు, జిల్లా రవాణా అధికారి వి.దుర్గాప్రసాద్ రెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ కె.సుమిత్ర, డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆశ షేక్, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ వీవీవీ ఎస్ఎస్బాబు, ఆర్పీఎఫ్ ఎస్సై ఎ.కె.పాణిగ్రహి, పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ సీహెచ్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
బెదిరింపు ప్రకటనలు సరికాదు
● జిందాల్ భూములను రైతులకు అప్పగించాలి ● సీపీఎం జిల్లా కార్యదర్మి తమ్మినేని సూర్యనారాయణవిజయనగరం గంటస్తంభం: 2006లో జిందాల్ పరిశ్రమ ఏర్పాటు కోసం తీసుకున్న భూములను చట్టప్రకారం పరిశ్రమ పెట్టనందున రైతులకు తిరిగి ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. చట్ట ప్రకారం వ్యవహరించాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు బెదిరింపు ప్రకటనలు చేయడం సమంజసం కాదని అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన విజయనగరంలోని ఎల్బీజీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రైతుల నుంచి భూములు తీసుకుని 17 సంవత్సరాలైనా నేటివరకు ఎటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేయలేదని, స్థానిక ప్రజలకు ఉపాధి చూపలేదన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతుల నుంచి తీసుకున్న భూములను ఐదేళ్లలో పరిశ్రమ కట్టకపోతే తిరిగి రైతులకు అప్పజెప్పాలని చట్టంలో ఉన్న విషయం అధికారులకు తెలియదా? అని ప్రశ్నించారు. 2006 భూ సేకరణకు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ఎందుకు అప్పటి జాయింట్ కలెక్టర్ నిర్వహించారని ప్రశ్నించారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భూ సేకరణ చేస్తే ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు ఆ రోజు పరిశ్రమను వ్యతిరేకించిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. పరిశ్రమ పెట్టకపోతే భూములు వెనక్కి ఇవ్వకుండా ఇప్పుడు ఎంఎస్ఎంఈ పార్కు పెడతామని, అడ్డుకుంటే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బెదిరించడాన్ని ఖండిస్తున్నామన్నారు. కేవలం కార్పొరేట్ శక్తులకు ఈ భూములు అప్పగించాలన్న కుట్ర తప్ప మరొకటి కాదన్నారు. ఒక వేళ కొత్త పరిశ్రమ కోసం భూమి కావాలంటే పబ్లిక్ హియరింగ్ పెట్టి మళ్లీ భూ సేకరణ చేపట్టి రైతులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం చెల్లించి తీసుకోవాలి తప్ప బెదిరించి తీసుకుంటామని అనడం సరికాదన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు రెడ్డి శంకరరావు, టీవీ.రమణ పాల్గొన్నారు. -
బదిలీల్లో నిబంధనలు అతిక్రమించొద్దు
● కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విజయనగరం అర్బన్: సచివాలయ సిబ్బంది బదిలీలు పారదర్శకంగా జరగాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిబంధనలను అతిక్రమించరాదని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులతో కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లా డారు. నిబంధనల ప్రకారంగా బదిలీలను చేపట్టి నోటీసుబోర్డులో ప్రదర్శించాలన్నారు. అభ్యంతరాలు స్వీకరించి పరిశీలించాలని సూచించారు. ఎటువంటి అక్రమాలు జరిగినా చర్యలు తప్పవని హెచ్చరించారు. విజన్–2047పై సమీక్ష జిల్లా ఇన్చార్జి మంత్రి అనిత ఆధ్వర్యంలో ఈ నెల 3న ఉదయం 11 గంటలకు విజన్–2047 ప్రణాళికపై సమీక్ష సమావేశం జరగనుందని కలెక్టర్ తెలిపారు. మంత్రి సమీక్ష కోసం ప్రాథమిక, సేవారంగం, పారిశ్రామిక రంగాల జిల్లాస్థాయి ప్రణాళికపై సీపీఓ నోట్ తయారుచేయాలన్నారు. నియోజకవర్గాల ఇన్చార్జిలు నియోజకవర్గ స్థాయి ప్రణాళికలను రూపొందించి ఒక రోజు ముందే అందజేయాలన్నారు. -
వైద్యుడు దేవుడితో సమానం
● విపత్కకాలంలోనూ రోగులకు సేవలు ●నేడు వైద్యుల దినోత్సవం విజయనగరం ఫోర్ట్: వైద్యో నారాయణ హరి అన్నారు పెద్దలు. రోగులు వైద్యుడిని భగవంతుడిలా అరాధిస్తారు. ఎందుకంటే ప్రాణాలు నిలబెట్టగలిగే శక్తి వైద్యుడికి మాత్రమే ఉంటుంది. ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో నైనా వెరవకుండా ధైర్యంగా సేవలు అందించేది వైద్యులే. నాలుగేళ్ల క్రితం కోవిడ్ మహమ్మారి విలయతాండవం చేసినప్పటికీ వైద్యులు ఏమాత్రం భయపడకుండా వైద్యసేవలు అందించారు. వైద్యుల్లో సేవాదృక్పథంతో పనిచేసే వారు ఉన్నారు. ధనార్జనే ధ్యేయంగా పనిచేసే వారు కూడా ఉన్నారు. సమాజంలో కొత్త కొత్త వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. వాటి నివారణ చర్యలు కనుగొని వైద్యులు సేవలు అందిస్తున్నారు. కోవిడ్ సమయంలో రోగులకు సేవలందించే సమయంలో కోవిడ్ బారిన పడి పలువురు వైద్యులు మృత్యువాత పడ్డారు. అయినప్పటికీ మిగిలిన వైద్యులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా కోవిడ్ బాధితులకు సేవలు అందించారు. జిల్లాలో 700 మంది వరకు వైద్యులు జిల్లాలో 50 పీహెచ్సీలు, 7 సీహెచ్సీలు, 18 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, 300 వరకు ప్రైవేట్ ఆస్పత్రులు ఉన్నాయి. వాటిలో సుమారు 700మంది వరకు వైద్యులు పనిచేస్తున్నారు. వైద్యవృత్తి ఉన్నతమైనది వైద్యవృత్తి ఉన్నతమైనది. ప్రజలు డాక్టర్ని గౌరవించాలి. వైద్యం కోసం వచ్చే వారితో ప్రేమగా, అప్యాయంగా మాట్లాడి వారి సమస్యను తెలుసుకుని అవసరమైన వైద్యాన్ని అందించాలి. వైద్యవృత్తిని చేపట్టినందుకు అదృష్టంగా భావించాలి. ప్రతి రోగిని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు కృషిచేయాలి డాక్టర్ శంబంగి అప్పలనాయుడు, సూపరింటెండెంట్, సర్వజన ఆస్పత్రివైద్యులు గౌరవప్రదంగా మెలగాలి సమాజంలో వైద్యులు గౌరవప్రదంగా మెలగాలి. వెద్యులను ప్రోత్సహిస్తే వారు మరింత ఉత్సాహంగా పనిచేస్తారు. వైద్యులపై ఒత్తిడి పెట్టకూడదు. ఒత్తిడి లేకుండా ఉంటే మెరుగైన వైద్యసేవలు అందించగలరు. వైద్యులు రోగులకు ప్రేమతో సేవలు అందించాలి. డాక్టర్ పద్మశ్రీ రాణి, డీసీహెచ్ఎస్ సేవాభావం ఉంటే వైద్య వృత్తి చేపట్టాలి ఓపిక, సహనం ఉంటేనే వైద్య వృత్తిని చేపట్టాలి. సేవాదృక్పథంతో వైద్యసేవలు అందించాలి. సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి వైద్యులు కృషి చేయాలి. ఆధునాతన వైద్యసేవలను ఎప్పటి కప్పుడు తెలుసుకోవాలి. రోగులు వైద్యులను గౌరవించాలి. డాక్టర్ ఎస్.జీవనరాణి, డీఎంహెచ్ఓ -
ప్రైవేట్ స్కూళ్లపై చర్యలు
ఉచిత సీట్లు ఇవ్వని..విజయనగరం అర్బన్: విద్యాహక్కు చట్టం అమలులో భాగంగా ప్రభుత్వం ఎంపిక చేసిన ప్రైవేట్ పాఠశాలలు పేద విద్యార్ధులకు ఉచిత సీట్లు ఇవ్వకపోతే ఆయా స్కూళ్లపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా వినతుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో వచ్చిన అర్జీల్లో ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత సీట్లలో చేర్చుకోవడం లేదని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు వినతులు అందజేశారు. వరుసగా రెండు మూడు వారాల పాటు ఇలాంటి వినతులే రావడంతో సంబంధిత ప్రైవేట్ పాఠశాలలపై కలెక్టర్ ఆగ్రహించారు. కేటాయించిన సీట్లలో ఉచిత ప్రవేశాలను ఇవ్వని పట్టణంలోని బీసెంట్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, సన్ స్కూల్పై క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలని ఆర్డీవో సవరమ్మ, డీఈఓ యూ.మాణిక్యం నాయుడిని ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా వినతుల పరిష్కార వేదికకు వచ్చే వినతులను లాగిన్లో అధికారులు ఎప్పటికప్పుడు చూడాలని, లాగిన్లో ఎప్పుడు చూసినా సున్నా కనపడాలని స్పష్టం చేశారు. ప్రతి రోజూ లాగిన్ అయి అధికారులు వినతులను చూడాలని, అలాగే రీ ఓపెన్ కేసులు కూడా పూర్తిగా విచారణ జరిపి ముగించాలని తెలిపారు. సోమవారం పీజీఆర్ఎస్కు 172 వినతులు అందాయి. కలెక్టర్తోపాటు సంయుక్త కలెక్టర్ సేతు మాధవన్, డీఆర్ఓ శ్రీనివాసమూర్తి, విజయనగరం ఆర్డీఓ సవరమ్మ, డిప్యూటీ కలెక్టర్ మురళి, ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 172 వినతుల్లో అధికంగా 69 వరకు రెవెన్యూ శాఖకు చెందిన వినతులు అందాయి. మిగిలినవి ఇతర శాఖలకు చెందినవి ఉన్నాయి. పోలీస్ గ్రీవెన్స్ సెల్కు 34 ఫిర్యాదులు విజయనగరం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 34 ఫిర్యాదులు వచ్చాయి. ఈ వారం ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాలతో విజయనగరం డీఎస్పీ శ్రీనివాస్ ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. కార్యక్రమంలో స్వీకరించిన ఫిర్యాదుల్లో భూతగాదాలకు సంబంధించి 12, కుటుంబ కలహాలకు సంబంధించి 3, మోసాలకు పాల్పడినట్లు 4, ఇతర అంశాలకు సంబంధించి 15 ఫిర్యాదులు ఉన్నాయని డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో మాట్లాడుతూ ఫిర్యాదు అంశాలను పరిశీలించి అవసరమైతే విచారణ చేసి, ఫిర్యాదులు వాస్తవమైనట్లయితే చట్ట పరిధిలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ బి.సుధాకర్, ఎస్.రాజేష్ పీజీఆర్ఎస్ సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ పీజీఆర్ఎస్కు 172 వినతులు -
800 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
జియ్యమ్మవలస: మండలంలోని చినమేరంగి పరిసర ప్రాంతాల్లో సోమవారం దాడులు చేసి 800 లీటర్ల బెల్లం ఊటను పట్టుకుని ధ్వంసం చేసినట్లు చినమేరంగి ఎస్సై అనీష్ తెలిపారు. గ్రామాల్లో సారా, మద్యం అమ్మినా తెలియజేయాలని, అటువంటి వారిపేర్లు గోప్యంగా ఉంచుతామని ఎస్సై ప్రజలకు సూచించారు.యువత చెడువ్యసనాలకు బానిసకావద్దని హితవు పలికారు. సారా తయారీకి ఉపయోగించిన సామగ్రిని ధ్వంసం చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పోలీస్సిబ్బంది ఉన్నారు. 230 సారా ప్యాకెట్లు సీజ్ సాలూరు రూరల్: మండలంలోని బాగువలస గ్రామం వద్ద ద్విచక్రవాహనంపై తరలిస్తున్న 230 సారా ప్యాకెట్లు సోమవారం పట్టుకున్నట్లు రూరల్ ఎస్సై నరసింహమూర్తి తెలిపారు. నక్కడ వలస గ్రామానికి చెందిన సురగడ రామ్మోహన్ ను పట్టుకుని సారా ప్యాకెట్లతో పాటు ద్విచక్రవాహనాన్ని సీజ్ చేసినట్లు చెప్పారు. డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో రూ.40 వేలు ఫైన్రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తున్నామని ఈ క్రమంలో మద్యం తాగి వాహనాలు నడిపిన నలుగురు వ్యక్తుల నుండి సోమవారం కోర్డులో రూ.40 వేలు ఫైన్ కట్టించినట్లు రూరల్ ఎస్సై నరసింహమూర్తి తెలిపారు. చిన్నబగ్గ సమీపంలో ఏనుగులుసీతంపేట: మండలంలోని చిన్నబగ్గ ఆశ్రమపాఠశాలకు సమీపంలో నాలుగు ఏనుగుల గుంపు ఘీంకరిస్తోంది. సోమవారం రాత్రి ఏనుగులు ఇక్కడికి రావడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. నిన్న, మెన్నటి వరకు చిన్నబగ్గ, గోరపాడు కొండల్లో సంచరించిన ఏనుగులు ఇప్పుడు ఏకంగా గ్రామానికి దగ్గరలోనే తిష్ఠ వేయడంతో ఇళ్ల నుంచి బయటకు రావడానికి గ్రామస్తులు భయపడుతున్నారు. ఏనుగులను కవ్వించవద్దని అటువైపు ఎవ్వరూ తిరగవద్దని స్థానికులకు ట్రాకర్లు తెలియజేస్తున్నారు. ఎఫ్బీవో దాలినాయుడుతో పాటు సిబ్బంది ఏనుగుల గమనాన్ని పరిశీలిస్తున్నారు. -
కూటమి పెద్దలకి పరమాన్నం, పేదలకి గంజి నీళ్లు
● సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.కామేశ్వరరావువిజయనగరం గంటస్తంభం: కాంగ్రెస్, తెలుగుదేశం, నేటి కూటమి ప్రభుత్వాలు గత 20 ఏళ్లుగా కాగ్నిజెంట్, టీసీఎస్, జిందాల్ లాంటి కంపెనీలకు కారుచౌకగా భూములను కట్టబెడుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.కామేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం సీపీఐ జిల్లా కార్యాలయం డీఎన్ఆర్ అమర్ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ..కోనేటి రంగారావు భూకమిటీ సిఫార్సులను అనుసరించి నాటి నుంచి నేటి వరకు ఎక్కడా ఎకరా భూమి కూడా పేద రైతులకు, పేదలకు 3 సెంట్లు ఇంటి స్ధలం ఇచ్చిన ధాఖలాలు లేవని మండిపడ్డారు. భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులను, నివాసం ఉంటున్న పేదల ఇళ్లను తొలగించడమే కానీ పేదలకు భూమి ఇవ్వడానికి చేతులు రాని ప్రభుత్వాలు కార్బొరేట్లకు మాత్రం వేలాది ఎకరాల భూమిని కారుచౌకగా కట్టబెడుతున్నాయని విమర్మించారు. విజయనగరం జిల్లాలోని ఎస్.కోట నియోజవర్గం బౌడార ప్రాంతంలో ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 1100 ఎకరాల్లో 900 ఎకరాలు ప్రభుత్వ భూమిని జిందాల్ కంపెనీకి ఇవ్వడానికి తలపెట్టి బాకై ్సట్ శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలనే తలంపుతో ఆనాటి జిల్లా జాయింట్ కలెక్టర్ జగన్మోహన్ రావు నేతృత్వంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిందన్నారు. ప్రస్తుత ఉన్న కలెక్టర్ ఇటీవల కాలంలో మీడియాలో ఏ ప్రభుత్వం భూ సేకరణ జరపలేదని మాట్లాడారు. భూ సేకరణ చేయకుంటే ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు జరిగిందో నేడున్న కలెక్టర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జిందాల్ భూముల విషయంలో ఆందోళనకారులపై దాడులు, నిర్బంధాలు, అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియచేశారు. పేదలకు అందాల్సిన పరిహారంలో అవకతవకలు జరిగినట్లు అనేక ఆరోపణలు వచ్చాయని దీనిపై తగు న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్మి ఒమ్మి రమణ, అలమండ ఆనందరావు పాల్గొన్నారు. -
ఐదేళ్లూ ఒక్క రూపాయి కట్టలేదు..
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో పంటల బీమా ప్రీమియం ఒక్క రూపాయి కూడా మేము చెల్లించలేదు. అంతా ప్రభుత్వమే చెల్లించేది. విపత్తుల సమయంలో పరిహారం అందేది. నాకు రెండు ఎకరాల పొలం ఉంది. వరి పంట సాగుకు సిద్ధమవుతున్నాను. అధికారులు పంట బీమా ప్రీమియం చెల్లించాలని చెబుతున్నారు. లేదంటే పరిహారం అందదంటున్నారు. ఇది రైతుకు ఆర్థిక భారమే. ప్రభుత్వమే స్పందించి ఉచిత పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించాలి. – రంధి దేముడు, రైతు పెదవేమలి గ్రామం ● ఉచిత పంటల బీమా పథకానికి మంగళం ● పంటల బీమా ప్రీమియం రైతులే చెల్లించాల్సిన పరిస్థితి ● వరి, మొక్కజొన్న, పత్తి, నువ్వు పంటలకు బీమా వర్తింపు ● గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఐదేళ్లు రైతుల తరఫున ప్రభుత్వమే చెల్లించింది విజయనగరం ఫోర్ట్: ఆరుగాలం శ్రమించి అందరికీ అన్నంపెట్టే రైతన్నపై కూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోంది. గతేడాది ఖరీఫ్, రబీ సీజన్లు పూర్తయినా అన్నదాత సుఖీభవ కింద ఇస్తామన్న రూ.20వేల పెట్టుబడి సాయం అందజేయలేదు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ఆరంభమైనా సాయం ఊసెత్తడం లేదు. మరోవైపు గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలుచేసిన ఉచిత పంటల బీమా పథకానికి మంగళం పాడేసింది. రైతులే పంటల బీమా ప్రీమియం చెల్లించుకోవాలి. లేదంటే విపత్తుల సమయంలో పంటలు కోల్పోయిన రైతులకు ఆర్థిక సాయం అందదు. జిల్లాలో సాగవుతున్న వరి, మొక్కజొన్న, పత్తి, నువ్వు పంటల సాగు విస్తీర్ణం ప్రకారం చూస్తే రైతులపై రూ.6.19 కోట్ల భారం పడనుంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు పెట్టుబడి సాయం అందే దారి కనిపించక, మరోవైపు బీమా చెల్లింపునకు చేతిలో డబ్బులు లేక ఆవేదన చెందుతున్నారు. రైతన్నపై కూటమి ప్రభుత్వం కపటప్రేమ చూపుతోందని, తమ ఓట్లతోనే అధికారంలోకి వచ్చి ఇప్పుడు తమనే ఇబ్బందులకు గురిచేస్తోందంటూ మండిపడుతున్నారు. ఖరీఫ్లో నాలుగు పంటలకు బీమా వర్తింపు... ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో నాలుగు పంటలకు పంటల బీమా పథకాన్ని వర్తింపజేశారు. నాలుగు పంటలకు కూడా పంటల బీమా ప్రీమియం రైతులు చెల్లించుకోవాల్సిందే. వరి పంటకు హెక్టారుకు రూ.500, నువ్వు పంటకు హెక్టారుకు రూ.162.50, మొక్కజొన్నకు హెక్టారుకు రూ.412, పత్తి పంటకు హెక్టారుకు రూ.4,807 చెల్లించాలి. ఈ లెక్కన జిల్లాలో ఆయా పంటల సాగువిస్తీర్ణం ప్రకారం రైతులు రూ.6.19కోట్ల బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఉచిత పంటల బీమా నాకు మూడు ఎకరాల మెట్టు భూమి ఉంది. అందులో అరటి తోట సాగు చేస్తున్నాను. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నా తరఫున పంటల బీమా ప్రీమియం చెల్లించడం వల్ల తుఫాన్ సమయంలో పంట నష్టపోతే 50వేల పరిహారం అందింది. ఇప్పడు కూటమి ప్రభుత్వం పంటల బీమా ప్రీమియం రైతులను కట్టుకోమంటోంది. – గనివాడ సన్యాసినాయుడు, రైతు, పెదమధుపాడ గ్రామం రైతులే చెల్లించాలి పంటల బీమా పథకానికి సంబంధించి బీమా ప్రీమియంను రైతులే చెల్లించుకోవాలి. పంటల బీమా కడితే ప్రకృతి వైపరీత్యాల సమయంలో బీమా వర్తిస్తుంది. లేదంటే ఆర్థిక సాయం అందే పరిస్థితి ఉండదు. – వి.తారకరామారావు, జిల్లా వ్యవసాయ అధికారి -
సెప్టెంబర్ 13, 14 తేదీల్లో జేవీవీ రాష్ట్ర మహాసభలు
విజయనగరం అర్బన్: జిల్లా కేంద్రంలో సెప్టెంబర్ 13, 14 తేదీల్లో నిర్వహించే 18వ జనవిజ్ఞాన వేధిక మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంస్థ రాష్ట్ర కార్యదర్శి కె.త్రిమూర్తులు పిలుపునిచ్చారు. స్థానిక ఏపీఎన్జీవో హోమ్లో ఆదివారం జరిగిన ఆహ్వాన సంఘం సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన సభను ఉద్దేశించి మాట్లాడారు. తెలుగు ప్రజలు హేతుబద్దంగా ఆలోచించి జీవించాలని గత 37 సంవత్సరాలుగా జనవిజ్ఞాన వేదిక అవిరళ కృషి జరుపుతున్నదని పేర్కొన్నారు. శాస్త్రవేత్త లు, వైద్యులు, ఉద్యోగులు ఉపాధ్యాయులు, విద్యార్ధులు, యువకులు, మహిళలు మధ్యతరగతి మేధావులు, వృత్తి నిపుణులు దాదాపు 30 వేలకు పైగా సభ్యులున్న అతి పెద్ద సైన్స్ ప్రచార సంస్థ జనవిజ్ఞాన వేదిక అని కొనియాడారు. జేవీవీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎంవీ వెంకట్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎలాంటి అనారోగ్య పరిస్థితులు సంభవించినా సైన్స్కు సంబంధించి ఏ అంశం ముందుకొచ్చి చర్చనీయాంశంగా మారినా జేవీవీ కార్యకర్తలు ముందుండి పరిష్కారం కోసం కృషి చేస్తున్నామన్నారు. అనంతరం రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘానికి చైర్మన్గా ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీవీ రమణను సభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పి.రమణప్రభాత్, సాహితీ స్రవంతీ రాష్ట్ర కార్యదర్శి చీకటి దివాకర్, యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి కె.విజయగౌరి పాల్గొన్నారు. -
రూ.6.19 కోట్లు..!
ఘనంగా జాతీయ గణాంక దినోత్సవం విజయనగరం అర్బన్: గణాంక శాఖ పితామహులు ప్రొఫెసర్ పీసీమహల్నోబిస్ జన్నదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా జరుపుకొనే జాతీయ గణాంక దినోత్సవం కలెక్టరేట్లోని ముఖ్య ప్రణాళికాధికా రి కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. తొలిత ఆయన చిత్రపటానికి సీపీవో పి.బాలాజీ, సిబ్బంది పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం సీపీవో మాట్లాడుతూ ప్రణాళిక వ్యవస్థకు పితామహుడు జవహర్లాల్ నెహ్రూ అయితే భారత ప్రణాళిక పథకానికి పీసీమహలనోబిస్ నిర్దేశకుడిగా ప్రసిద్ధి చెందారని కొనియాడారు. గ్రామంలో భూమికి హద్దులు నిర్ధారించి అందులో సాగైన భూమి, సాగుకి పనికి రాని భూమి, దేవాలయాలు, చెరువులు, శ్మశానాలు, పల్లం భూమి, మెట్టు భూమి, సత్రాలు, పన్నులు వసూలు, వస్తువుల అమ్మకాలు, చారిటీ ద్వారా ఆదాయం వంటి విషయాలను సేకరణ ప్రక్రియ ప్రాధాన్యతను పాలకులకు తెలియజేశారని తెలి పారు. ఏడీ, ఉప గణాంకాధికారులు పాల్గొన్నారు. బీమా భారం -
కూటమి నేతల ఒత్తిళ్లు...!
● సర్వే శాఖలో ఖాళీలపై సందిగ్ధత? విజయనగరం అర్బన్: ఉమ్మడి విజయనగరం జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీల్లో కూటమి నేతల ఒత్తిళ్లు మితిమీరిపోయాయని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు అధికార యంత్రాంగం అదే స్థాయిలో ఎదురొడ్డి నిబంధనల మేరకు బదిలీలు నిర్వహించాలని ప్రయత్నిస్తున్నారు. సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియలో నిబంధనలను కాదని నేరుగా కౌన్సెలింగ్కు పిలవడం దుమారం రేగుతోంది. సర్వే శాఖలో ఖాళీలను బ్లాక్ చేయాలంటూ ఒత్తిళ్లు రెవెన్యూ శాఖలో వీఆర్వో, సర్వేయర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తొలిత ఖాళీలు, సీనియారిటీ జాబితాలను వెల్లడించలేదు. దీన్ని సర్వేయర్ల సంఘం అడ్డుకుంది. బొబ్బిలికి చెందిన 6 పోస్టుల ఖాళీలలో ఒకటి మాత్రమే చూపించారు. ఎస్.కోట, నెల్లిమర్ల, గజపతినగరం నియోజకవర్గాల పరిధిలో ఆయా ప్రజాప్రతినిధుల ఒత్తిడితో ఖాళీలను చూపించలేదు. నియామక ర్యాంకుల ఆధారంగా కాకుండా ఇష్టారీతిన కౌన్సెలింగ్కు పిలవడంతో సర్వేయర్లు తొలిత ఆందోళనకు దిగారు. దీంతో శనివారం అర్ధరాత్రి వరకు బదిలీల ప్రక్రియ ప్రారంభం కాలేదు. జిల్లాలోని తప్పనిసరి బదిలీల్లో 348 మంది సర్వేయర్లు ఉండగా మరో 70 మంది కూడా బదిలీలను ఆశిస్తున్నారు. అయితే డిమాండ్ ఉన్న దాదాపు 30 ఖాళీలను తమకు కావాల్సిన వారికి కేటాయించాలని ఓ మంత్రి ఒక జాబితాను ఇచ్చి అధికారులపై ఒత్తిడి చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఖాళీల జాబితాను వెల్లడించని పరిస్థితిని అధికారులు తీసుకొచ్చారు. దీన్ని సర్వేయర్ల సంఘం ససేమిరా అంటూ బదిలీల ప్రక్రియను జరగనివ్వలేదు. దీంతో సంబంధిత ఉన్నతాధికారులను జిల్లా సర్వే శాఖ సంప్రదించగా జీవో 5 ప్రకారమే బదిలీలు చేపట్టండని ఆదేశాలు వచ్చాయి. దీంతో మొత్తం ఖాళీలను ప్రదర్శించి నిబంధనల మేరకు బదిలీలు చేపట్టారు. అయితే మంత్రి ఇచ్చిన జాబితాలోని 30 ఖాళీలను కేటాయించిన వారికి ఏ క్షణమైనా మార్పు జరిగే అవకాశం ఉండొచ్చని అధికారులు అనధికారిక మౌఖిక సూచనలు ఇచ్చినట్టు తెలుస్తుంది. దీంతో సంబందిత 30 ఖాళీల బదిలీలపై సందిగ్ధత నెలకొంది. సంగాంలో ఏనుగుల సంచారం వంగర: సంగాంలో ఏనుగుల గుంపు హల్చల్ చేశాయి. శనివారం అర్ధరాత్రి రేగిడి మండలం సరసనాపల్లి తోటల్లోంచి మడ్డువలస వంతెన కింది భాగం మీదుగా సంగాం పంట పొలాల్లోకి ప్రవే శించాయి. మొక్కజొన్న, చెరకు, వరి పంటలను నాశనం చేశాయి. దీంతో రైతులు లబోదిబో మంటున్నారు. ఆదివారం రాత్రి వంగర నుంచి రాజాం వెళ్లే రోడ్డును ఆనుకొని సంగాం పంట పొలాల్లో తొమ్మిది ఏనుగులు తిష్ట వేశాయి. అటవీ శాఖ సిబ్బంది, ఎలిఫెంట్ టేకర్స్ వాటి వెంట ఉంటూ ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. -
గిరిజన రైతు విలవిల..!
● అన్నదాత సుఖీభవ కోసం నిరీక్షణ ● ఖరీఫ్లో తప్పని ఆర్థిక వెతలుసీతంపేట: ఖరీఫ్ సీజన్ ఆరంభమైంది. వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాయి. పంటలు పండించడానికి పెట్టుబడులు ఎలా అని రైతులు గిరిజన ఆందోళన చెందుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో ఈపాటికే పీఎం కిసాన్తో పాటు రైతు భరోసా నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యేవి. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. కూటమి ప్రభుత్వం ఇదిగో..అన్నదాత సుఖీభవ..అదిగో..అంటూ కాలం వెళ్లబుచ్చుతోంది తప్ప ప్రయోజనం లేకపోయిందని రైతులు పెదవి విరుస్తున్నారు. పోడు వ్యవసాయంలో పండించే పైనాపిల్, పసుపు, కొండచీపుళ్లు ఇతర అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు దరలు లేవు. ఈ పంటల ద్వారా ఆదాయాలు వస్తే కొంతమేర ఖరీఫ్ వ్యవసాయానికి పెట్టుబడులు పెట్టుకోవడానికి వీలుండేది. వాటికి కూడా సరైన మద్దతు ధరలు లేకపోవడంతో పంటలు ఎలా పండించుకోవాలో తెలియని పరిస్థితి ఉందని గిరిజన రైతులు వాపోతున్నారు. అన్ని విధాలా నష్టపోతున్న తమను ఆదుకునే దిక్కులేదని ఆందోళన చెందుతున్నారు. వాతావరణం అనుకూలించడంతో వరి, రాగులు, కంది, ఇతర కొండపోడు పంటలన్నీ వేసుకోవడానికి సరైన సమయం. తగిన పెట్టుబడి సాయం లేకపోవడంతో గిరిజన రైతులు డీలా పడుతున్నారు. 16,800 మంది రైతుల ఎదురుచూపు సీతంపేట ఐటీడీఏ పరిధిలో 16,800 మంది కొండపోడు పట్టాలు కలిగిన రైతులు అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులు. వైఎస్సార్సీపీ హయాంలో 25 వేల ఎకరాల్లో సాగు భూమిపై పూర్తిహక్కులు కల్పించి, సుమారు 17 వేల మందికి పట్టాలు ఇచ్చి రైతు భరోసా నిధులు రూ.13.500లు చొప్పున జమచేశారు. పీఎం కిసాన్ సాయం కింద రూ.6 వేలు, వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.7,500లు కలిపి మొత్తం రూ.13,500ల మొత్తాన్ని రైతు ఖాతాల్లో జమచేశారు. ఇప్పటి ప్రభుత్వంలో ఖరీఫ్ పనులు ప్రారంభమైనప్పటికీ ఇంతవరకూ ఎటువంటి సాయం లేదు. గతేడాది కూడా ఒక్కపైసా ఇవ్వలేదని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో దుక్కులు దున్నడం, విత్తనాలు కొనుగోలు, నారుమడుల తయారీకి రైతులకు పెద్దమొత్తంలో నిధులు అవసరమవుతాయి. తాము అధికారంలోకి వస్తే రైతులకు ఏడాదికి రూ.20 వేలు అన్నదాత సుఖీబవ ఇస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. ప్రభుత్వం కొలువుదీరి ఏడాదైనా ఆర్థిక సాయం ఇంతవరకు అందడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.గతంలో ఖరీఫ్లో రైతు భరోసా వచ్చేది గతంలో ఖరీఫ్ సీజన్ వచ్చిందంటే రైతుల ఖాతాల్లో నిధులు జమ అయ్యేవి. ఏడాదిగా ఎదురు చూపులే మిగిలాయి తప్ప ఎటువంటి ప్రయోజనం లేదు. ఆ సొమ్ముతో పెట్టుబడి పెట్టి పంటలు పండించే వాళ్లం. – ఎన్.అబ్బాస్, రైతు, కుశిమిత్వరలో నిధుల జమ త్వరలో అన్నదాత సుఖీభవ నిధులు అర్హులందరికీ జమ అవుతాయి. ఈ మేరకు విధివిదానాలు రూపొందాయి. ప్రభుత్వం విడుదల చేసిన నిధులను వ్యవసాయ పంటల సాగుకు వినియోగించాలి. – ఎస్వీ గణేష్, పీఏవో, సీతంపేట ఐటీడీఏ -
‘మధ్యతరగతి మందహాసం’ పుస్తకావిష్కరణ
విజయనగరం టౌన్: బెహరా వెంకట సుబ్బారావు సర్వ లభ్యరచనల పుస్తకం ‘మధ్యతరగతి మందహాసం’ పుస్తకావిష్కరణ కార్యక్రమం అరసం జిల్లాశాఖ ఆధ్వర్యంలో జెడ్పీ సమావేశమందిరంలో ఆదివారం వేడుకగా నిర్వహించారు. కార్యక్రమానికి కలిగొట్ల సన్యాసిరాజు అధ్యక్ష్యత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన బహుభాషా గ్రంథకర్త డాక్టర్ వీవీవీ.రమణ మధ్యతరగతి గాథలు, వ్యథలను స్వయంగా పరిశీలించి, అనుభవించి రాసిన గొప్ప రచయిత బెహరా సుబ్బారావు అని ప్రశంసించారు. మన జీవితాల్లో జరుగుతున్న అనేక సంఘటనల సమాహారం మధ్యతరగి మందహాసమని విశిష్ట అతిథి, వ్యంగ్య కథల రచయిత డాక్టర్ కొచ్చర్లకోట జగదీష్ పేర్కొన్నారు. ప్రముఖ జర్నలిస్ట్ కేఎస్ఎస్ బాపూజీ కథలపై సమీక్ష చేస్తూ సునిశతమైన హాస్యాన్ని కథలలో జోడిస్తూ తాను చెప్పాల్సిన విషయాన్ని సున్నితంగా చెబుతూ ప్రతి కథకు గొప్ప కొసమెరుపులిచ్చారన్నారు. పుస్తక సంపాదకుడి సుబ్బారావు కుమారుడు మూర్తి మాట్లాడుతూ నాన్నగారి కథలు మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా సామాజిక చైతన్యానికి దోహద పడ్డాయన్నారు. సుబ్బారావు కథలు మధ్యతరగతి మహాభారతమని, అటువంటి గొప్ప కథల పుస్తకాన్ని సుబ్బారావు పుత్రుడు మూర్తి పెద్ద గ్రంథంగా తీసుకురావడం తండ్రిరుణం తీర్చుకున్న కుమారుడిగా ధన్యుడయ్యాడని అరసం జిల్లా అధ్యక్ష్యుడు జీఎస్.చలం పేర్కొన్నారు. ప్రముఖ కవి, రచయిత రాజోలు నుంచి హాజరైన ఎం.ఎస్.సూర్యనారాయణ కథల మీద సమగ్రమైన విమర్శ రావాలని, ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో పరిశోధన జరగాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అరసం జిల్లా ప్రధాన కార్యదర్శి రత్నాల బాలకృష్ణ సభా కార్యక్రమాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో సాహితీవేత్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
బియ్యం దొంగలకు భరోసా..!
● వారి జోలికి వెళ్లొద్దని అధికారులకు కూటమి నేతల హుకుం ● అధికారులు మౌనం దాల్చారని విమర్శలువిజయనగరం ఫోర్ట్: బొండపల్లి మండలంలో పెద్దఎత్తున పీడీఎస్ బియ్యం పట్టివేత సంఘటన జరిగి 24 రోజులవుతున్నా చర్యలు శూన్యం. పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టించిన దొంగలకు కూటమి నేతలు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టించిన వారి జోలికి వెళ్లొద్దని కూటమికి చెందిన నేతలు సంబంధిత శాఖ అధికారులకు హుకుం జారీ చేసినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందుచేతనే అధికారులు మిన్నకుండిపోయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టించేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని అధికారం చేపట్టిన తొలినాళ్లలో కూటమి నేతలు ప్రగల్భాలు పలికారు. కానీ ఇప్పడు పీడీఎస్ బియ్యం నేరుగా నారసంచులతోనే దొరికినప్పటికీ కిమ్మనకపోవడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. రేషన్ వాహనాల ద్వారా పీడీఎస్ బియ్యం పక్కదారి పడుతోందనే డీలర్ల ద్వారా బియ్యం పంపిణీ చేపట్టామని కూటమి సర్కార్ గొప్పలు చెప్పింది. రేషన్ డీలర్ల ద్వారా బియ్యం పంపిణీ చేపట్టిన మొదటి నెల ఆరంభంలోనే నార సంచులతో పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలించారు. ఇది పెద్ద ఎత్తున సంచలనమైంది. బొండపల్లి మండలంలో పట్టుబడిన బియ్యం పేదప్రజలకు అందించే పీడీఎస్ బియ్యం కొంతమంది వ్యాపారులు పెద్ద ఎత్తున పక్కదారి పట్టించారు. పీడీఎస్ బియ్యం తరలిస్తున్నారనే సమాచారంతో విజిలెన్స్ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. బొండపల్లి మండలంలోని కొండకిండాంలో గల కోళ్ల ఫారంలో 106 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం, కిండాం ఆగ్రహారం మామిడి తోటలో 43 క్వింటాళ్ల ిపీడీఎస్ బియ్యం అధికారులు గుర్తించారు. రేషన్ దుకాణాల్లో ఉండాల్సిన పీడీఎస్ బియ్యం కోళ్ల ఫారం, మామిడితోటల్లోకి తరలించడం సంచలనమైంది. అయితే ఈ సంఘటన జరిగి 24 రోజులవుతున్నా వ్యాపారులు ఏ రేషన్ షాపు నుంచి తరలించారనేది అధికారులు ఇంతవరకు తేల్చలేదు. ఎంతసేపు 6 ఎ కేసులు నమోదు చేశామని చెప్పడం తప్ప. వ్యాపారులకు సహకరించిన రేషన్ డీలర్ ఎవరనే వివరాలు అధికారులు వెల్లడించలేదు. అయితే పీడీఎస్ బియ్యం ఏ రేషన్ షాపు నుంచి వెళ్లాయన్న విషయం సివిల్ సప్లైస్ అధికారులకు తెలిసినప్పటికీ కూతమి నేతలు బయటకు చెప్పవద్దని ఆదేశించారని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో బయటకు చెప్పడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సంఘటన జరిగి ఇన్ని రోజులైనా సంబంధిత డీలర్లపై చర్యలు తీసుకోకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవినీతి లేని పాలన అందిస్తామని కూటమి నేతలు గొప్పలు చెబుతున్నారు. కానీ పీడీఎస్ బియ్యం తరలింపు ద్వారా జిల్లాలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నా నోరు మెదపడం లేదు. వ్యాపారులపై కోర్టులో కేసులు పీడీఎస్ బియ్యం తరలించిన వ్యాపారులపై కోర్టులో కేసులు పెడతాం. బియ్యం తరలించిన రేషన్ డీలర్ల వివరాలు కూడా తెలిశాయి. వారిపై నిఘా పెట్టాం. వారిపై కూడా చర్యలు తీసుకుంటాం. – కె.మధుసూదన్రావు, జిల్లా పౌరసరఫరాల అధికారి -
ఇంటర్ విద్యార్థి మృతి
బొబ్బిలి: బాడంగి మండలం హరిజన పాల్తేరుకు చెందిన అలమండ ఉదయ రాజ్(16) అనే ఇంటర్ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో ఆదివారం దుర్మరణం చెందాడు. బాడంగి మండలానికి చెందిన అలమండ రవి బైక్ మెకానిక్ షాపు నిర్వహిస్తూ బొబ్బిలిలోనే స్థిరపడ్డాడు. రవికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఉదయరాజ్ విశాఖలోని శశి కాలేజ్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సెలవుల సందర్భంగా ఇంటికి వచ్చిన ఉదయరాజ్ పాత బొబ్బిలిలోని తన స్నేహితుడిని కలిసి వస్తానని చెప్పి బైక్పై వెళ్లాడు. స్నేహితుడితో మాట్లాడి తిరిగి రాతిపనివారి వీధిలోని తన ఇంటికి వస్తుండగా పాత బొబ్బిలిలో ఉన్న గుంతల వద్ద అదుపు తప్పి కిందపడిపోవడంతో లారీ ఢీకొంది. దీంతో ఉదయ రాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తమ్ముడు ప్రేమ్కుమార్ 8వ తరగతి చదువుతున్నాడు. తల్లి ఉష భర్తకు చేదోడు వాదోడుగా షాపు దగ్గర ఉంటోంది. ప్రమాద సమాచారం అందుకున్న ఎస్సై పి జ్ఙానప్రసాద్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని సీహెచ్సీకి తరలించారు. -
చెస్పోటీల్లో దివ్యాంగుల ప్రతిభ
● అంతర్జాతీయ పోటీలకు 21 మంది ఎంపికవిజయనగరం: ‘సరిలేరు మాకెవ్వరు’ అని నిరూపించారు దివ్యాంగ క్రీడాకారులు. మూడు రోజులుగా జిల్లా వేదికగా జరిగిన 5వ జాతీయ దివ్యాంగుల చెస్ చాంపియన్షిప్లో పాల్గొన్న దివ్యాంగులు తమ ప్రతిభ చాటిచెప్పారు. చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం ఆధ్వర్యంలో నగరంలోని మెసానిక్ టెంపుల్లో జరిగిన పోటీల్లో దేశంలోని 15 రాష్ట్రాలకు చెందిన 106 మంది క్రీడాకారులు పాల్గొన్న విషయం విదితమే. శనివారం రాత్రి వరకు 9 రౌండ్ల పోటీలు హోరాహరీగా సాగాయి. అనంతరం 9వ రౌండ్లో అత్యధిక పాయింట్లు సాధించిన క్రీడాకారులను ఆయా విభాగాల వారీగా విజేతలుగా ప్రకటించారు. విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు చిన్నశ్రీను సోల్జర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు మజ్జి సిరిసహస్ర, జిల్లా పౌర వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ, చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం కార్యదర్శి కేవీ.జ్వాలాముఖిలు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు, నగదు ప్రోత్సాహకాలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చిన్నశ్రీను సోల్జర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు మజ్జి సిరిసహస్ర మాట్లాడుతూ మానసిక మేధోసంపత్తికి చెస్ వంటి క్రీడాకారులు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ చదువుతో పాటు క్రీడలను తమ జీవితంలో అంతర్భాగంగా చేసుకున్నప్పుడే ఉజ్వల భవిష్యత్కు బాటలు వేసుకోవచ్చన్నారు. దేశంలోని వివిద ప్రాంతాల నుంచి వచ్చిన దివ్యాంగ క్రీడాకారులు ప్రతిభా పాటవాలు చెప్పలేనివని, పోటీల్లో విజేతలుగా నిలిచిన వారితో పాటు పాల్గొన్న వారు విజేతలేనంటూ అభినందించారు. చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం జిల్లా కార్యదర్శి కేవీ జ్వాలాముఖి మాట్లాడుతూ జాతీయస్థాయిలో నిర్వహించిన దివ్యాంగుల చెస్ చాంపియన్షిప్ పోటీలు మొత్తం 7 కేటగిరీల్లో నిర్వహించామని, ఆయా కేటగిరీల్లో మొదటి మూడు స్థానాలు దక్కించుకున్న వారిని త్వరలో గోవాలో జరగనున్న ప్రపంచస్థాయి పోటీలకు పంపించనున్నట్లు తెలిపారు. అంతే కాకుండా పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు రూ.2.30 లక్షల నగదు బహుమతులను అందజేశామని వివరించారు. కార్యక్రమంలో పలువురు చెస్ అసోసియేషన్ ప్రతినిధులు, అర్బిటర్లు, క్రీడాకారులు, వారి తలిదండ్రులు పాల్గొన్నారు. -
సైబర్ వలకు చిక్కి నగదు పోగొట్టుకున్న బాధితుడు
పాలకొండ రూరల్: ఓవైపు పోలీసులు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ ప్రజలు నేరగాళ్లు, హ్యాకర్ల బారిన పడుతున్నారు. తాజాగా పాలకొండ మండలం సింగన్నవలసకు చెందిన బిల్లకుర్తి ఉపేంద్రకుమార్కు సైబర్ వలకు చిక్కి నగదు పోగొట్టుకున్నాడు. బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈనెల 28 న సమీప గ్రామ సచివాలయానికి చెందిన ఓ కార్యదర్శి నంబర్ నుంచి ఓ ‘లింక్’ మెసేజ్ ఉపేంద్రకుమార్ వచ్చింది. గతంలో వలంటీరుగా పనిచేసిన క్రమంలో బహుశా కార్యదర్శి నుంచి ఈ లింక్ వచ్చి ఉంటుందని భావించి ఆ లింక్ ఓపెన్ చేశాడు. ఇంతలో సెల్ ఫోన్కు పలుమెసేజ్లు వరుసగా వస్తుండడంతో సెల్ స్విచ్ ఆఫ్ చేశాడు. అయితే అప్పటికే సెల్ హ్యాక్ కావడంతో స్నేహితులు, బంధువులకు పలు మెసేజ్లు వెళ్లాయి. తన ఆరోగ్య పరిస్థతి సరిగా లేదని ఆర్ధిక సాయం చేయాలని ఈ మెసేజ్ల సారాంశంగా బాధితుడు తెలుసుకున్నాడు. ఇంతలో తన వ్యక్తిగత బ్యాంక్ ఖాతా ఇదే సెల్కు అనుసంధానం చేసి ఉండడంతో వరుసగా నగదు మాయం అవుతుండడం, సమాచారం సెల్ఫోన్కు మెజేజ్ల రూపంలో వస్తుండడంతో ఆందోళన చెందాడు. తన ప్రమేయం లేకున్నా రూ.56వేల పైచిలుకు నదగు పలు దఫాలుగా మాయం కావడంతో ఆదివారం స్థానిక పోలీసులు, సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేశాడు. -
అలకల్లోలం..!
● వేటకు అల్పపీడనం దెబ్బ ● ప్రతికూల వాతావరణంతో కొనసాగని చేపల వేట ● ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న మత్స్యకారులుప్రతికూల వాతావరణంతో పతివాడబర్రిపేటలో ఉధృతంగా వస్తున్న కెరటాలుపూసపాటిరేగ: సముద్రమే సర్వస్వంగా జీవిస్తున్న గంగపుత్రులకు ప్రతికూల వాతావరణంతో వేట సాగక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. గడిచిన రెండు నెలలుగా వేట నిషేధం కారణంగా సముద్రంలో వేట నిలిపివేశారు. తీరా వేట ప్రారంభించిన నాటి నుంచి వాతావరణంలో మార్పులతో అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారడం తదితర కారణాలతో కొంత సమయం వేట సాగలేదు. తాజాగా గత మూడురోజులుగా అల్పపీడనం కారణంగా కెరటాలు ఉధృతిగా రావడంతో చేపల వేటకు వెళ్లినా చేపలు వలకు చిక్కని పరిస్థితి నెలకొందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీరంలో గాలులు వీయడం, అలలు ఎగిసి పడుతుండడంతో వేటకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. జిల్లాలో పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో 27 కిలోమీటర్ల మేర తీరప్రాంతం విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో 21 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాల్లో సుమారు 21 వేల మంది మత్స్యకారులు జీవిస్తున్నారు. వేటపై ప్రత్యక్షంగా 6 వేల మంది, పరోక్షంగా 15 వేల మంది ఆధారపడి జీవిస్తున్నారు. సంప్రదాయ బోట్లు, ఇంజిన్బోట్లు రెండు మండలాల్లో 1120 వరకు ఉన్నాయి. వాటిలో 885 బోట్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజిస్టర్ అయి ఉన్నాయి. ఈ ఏడాది వేట నిషేధం తరువాత వేట ప్రారంభించినప్పటి నుంచి చేపలు వలకు చిక్కడం లేదని మత్స్యకారులు వాపోతున్నారు. నిషేధ సమయంలో కుటుంబాలు ఎలాగో నెట్టుకొచ్చినా మళ్లీ కష్టాలు ప్రారంభమయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులుగా బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా అలల ఉధృతి ఎక్కువై బోట్లు తీరానికే పరిమితమయ్యాయి. వేట లేకపోవడంతో వలలకు మరమ్మతులు చేసుకుంటున్నామని పలువురు మత్స్యకారులు చెబుతున్నారు. వేట నిషేధ సమయంలో భృతి మంజూరుకు నిబంధనల పేరిట చాలామంది మత్స్యకారులకు మత్స్యకార భరోసా నిలిపివేశారు. గత ప్రభుత్వంలో వేట చేసిన ప్రతి మత్స్యకారుడికి మత్స్యకార భరోసా మంజూరైంది. కానీ నేడు మత్స్యకారుల పరిస్థితి అయోమయంగా మారింది. గత ఏడాది కూడా మత్స్యకార భరోసా ఊసెత్తని సర్కారు నిబంధనల పేరిట ఈ ఏడాది చాలా మందికి కోత విధించింది. ఏడాదిలో సగం రోజులు ప్రకృతి వైపరీత్యాలు, మరి కొన్ని రోజులు తుఫాన్ హెచ్చరికలు, ప్రతి కూలవాతావరణంతో వేట సాగక ఇబ్బందులు పడుతున్నారు. మత్స్యకార జీవనవిధానంలో మార్పులకు సర్కారు ప్రత్యామ్నాయం ఆలోచించి వేట లేని సమయంలో తమను ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు.అరకొరగా మత్స్యసంపద వేట నిషేధసమయం తరువాత వేటకు వెళ్లినా చేపలు వలకు చిక్కడం లేదు. ప్రతి ఏడాది నిషేధం తరువాత చేపల వేట చేస్తే మత్స్య సంపద సమృద్ధిగా దొరికేది. కానీ ఈ ఏడాది నిషేధం తరువాత చేపల వేట సాగడం లేదు. వేటకు వెళ్లినా డీజిల్ఖర్చు కూడా రాని పరిస్థితి నెలకొంది. అల్పపీడనం కారణంగా మూడురోజులుగా వేట సాగలేదు. – సూరాడ కొర్లయ్య, పతివాడబర్రిపేటప్రతికూల వాతావరణంతో ఇబ్బందులు సముద్రంలో అల్పపీడనం ప్రభావంతో ప్రతికూలవాతావరణం నెలకొని అలల ఉధృతి పెరిగింది. వాతావరణంలో మార్పుల కారణంగా వేట చేయలేని పరిస్థితి. వేట సాగకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. వేటలేని సమయంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఆలోచించి ఆదుకోవాలి. – ఆకుల కాశీలు, పతివాడ బర్రిపేట -
మద్యం వద్దు.. తాగునీరు ముద్దు
● సారిపల్లిలో వినూత్న ప్రచారం ● మద్యపాన నిసేధంపై ఇంటింటికీ కరపత్రాల పంపిణీనెల్లిమర్ల రూరల్: మండలంలోని సారిపల్లి గ్రామంలో మద్యం ఏరులై పారుతోంది. బెల్టు షాపుల ద్వారా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. ఎక్కడ చూసినా మద్యం లభిస్తోంది కానీ తాగునీరు మాత్రం దొరకడం లేదని గ్రామానికి చెందిన పలువురు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాలకులకు కనువిప్పు కలిగేందుకు గ్రామస్తులు వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు. సర్పంచ్ రాయి పైడమ్మ, ఎంపీటీసీ మజ్జి త్రివేణి ఆధ్వర్యంలో ఆదివారం ఇంటింటికీ పర్యటించి మద్యపాన నిషేధంపై ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఇటీవల పార్టీలకు అతీతంగా సమావేశం ఏర్పాటు చేశామని, ఆలయాల నిర్మాణంతో పాటు గ్రామాభివృద్ధికి పలు తీర్మానాలు చేశామన్నారు. పేదలను పీల్చిపిప్పి చేస్తున్న మద్యాన్ని గ్రామంలో అమ్మకూడదని హెచ్చరికలు కూడా జారీ చేశామన్నారు. అయినప్పటికీ కొందరు యథేచ్ఛగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారని మండిపడ్డారు. గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిసేధమే లక్ష్యంగా కరపత్రాల పంపిణీకి శ్రీకారం చుట్టామని తెలిపారు. తాగునీరు దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, జల్జీవన్ మిషన్లో భాగంగా మంజూరైన ఇంటింటి కుళాయిల ఏర్పాటుకు కూటమి నాయకులు సహకరించాలని కోరారు. -
చోరీ కేసులో రెండవ నిందితుడి అరెస్ట్
విజయనగరం క్రైమ్: విజయనగరం వన్ టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో 2017లో డబ్బుల అపహరణ కేసులో రెండవ నిందితుడ్ని ఆదివారం అరెస్ట్ చేసినట్టు వన్టౌన్ సీఐ శ్రీనివాస్ చెప్పారు. ఆ కేసులో బాధితుడు కర్రి రవీంద్రరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టి, దర్యాప్తు పూర్తి చేశారు. ఆ కేసులో గుత్తి ప్రవీణ్ కుమార్, ఆర్.జయ ప్రకాష్ రెడ్డి, మహమ్మద్ అమీనుద్దీన్, చెల్లి రాజు, బూర రత్నాజీ, విశ్వనాథ్ రెడ్డి సంగీత కన్నన్లను ఇదివరకే అరెస్ట్ చేశారు. ఈ కేసులో రెండవ నిందితుడు తమిళనాడుకు చెందిన జీజే శ్రీనివాసులు పరారీలో ఉండగా ట్రాన్సిట్ వారెంట్తో విజయనగరం తీసుకువచ్చి జడ్జి ముందు హాజరుపరచగా 14 రోజలు రిమాండ్ విధించారని సీఐ శ్రీనివాస్ తెలిపారు. రెండు బైక్లు ఢీకొని వ్యక్తి దుర్మరణంవిజయనగరం క్రైమ్: విజయనగరం రూరల్ పీఎస్ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణంలోని నటరాజ్కాలనీకి చెందిన నూకరాజు(41) దుర్మరణం చెందాడు. నూకరాజు ఇంటి నుంచి బైక్పై ధర్మపురి వెళ్లాడు. తిరిగొస్తుండగా మార్గమధ్యంలో ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొట్టడంతో నూకరాజు కింద పడిపోగా తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ మేరకు మృతుడి భార్య సరస్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రూరల్ ఎస్సై అశోక్ తెలిపారు. -
కదంతొక్కిన పంచాయతీ కార్యదర్శులు
కలెక్టరేట్ వద్ద పంచాయతీ కార్యదర్శుల నిరసన ● ఉద్యోగోన్నతులు కల్పించాలి.. పని భారం తగ్గించాలని డిమాండ్ ● కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన, మానవహారం ● అవసరమైతే నిరవధిక సమ్మెకు సిద్ధమని ప్రకటన విజయనగరం: గ్రామీణప్రాంత ప్రజల సమస్యల పరిష్కారంతో పాటు ఆయా ప్రాంతాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే పంచాయతీ కార్యదర్శులు పోరుబాట పట్టారు. కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ రోడ్డెక్కారు. పనిభారం తగ్గించాలని, ఉద్యోగోన్నతులు కల్పించాలంటూ డిమాండ్ చేశారు. జిల్లా పంచాయతీ కార్యదర్శుల సమాఖ్య ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నాచేశారు. ప్లకార్డులు ప్రదర్శించి తమ నిరసన గళం వినిపించారు. కలెక్టరేట్ కూడలి వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ కార్యదర్శులు సమాఖ్య అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.సంగమేశ్వరరావు, బి.శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కార్యదర్శులకు లేనిపోని పనులన్నీ అప్పగిస్తోందన్నారు. ఉదయం 6 గంటలకే ఇంటింటికీ చెత్త సేకరణ, క్లోరినేషన్ ఫొటోలను తీయమనడం దారుణమన్నారు. మహిళా కార్యదర్శులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ప్రభుత్వ నిర్ణయంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. పంచాయతీరాజ్ కమిషనర్ కారదర్శుల పనితీరులో నిజాయితీ లేదంటూ అవహేళన చేస్తూ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడటం సమంజసం కాదన్నారు. ఆ వాఖ్యలు ముమ్మాటికీ మానవ హక్కులను మంటగలిపేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పంచాయతీరాజ్ కమిషనర్ చేసిన వాఖ్యలను వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేరోజు గ్రామ సభలు నిర్వహించడం, యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో పంచాయతీ కార్యదర్శులు రాత్రీ, పగలు శ్రమించి పనిచేసిన విషయాన్ని మర్చిపోకూడదన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే నిరవధిక సమ్మెకు సిద్ధం పంచాయతీ కార్యదర్శులు సమస్యలు పరిష్కరించుకుంటే నిరవధిక సమ్మెకు వెనుకాడేది లేదని జిల్లా పంచాయతీ కార్యదర్శుల సమాఖ్య ప్రతినిధులు స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో గ్రామ పంచాయతీల్లో 36 రకాల సర్వేలను చేపట్టడంతో పాటు అభివృద్ధి పనులు, గ్రామ సభల నిర్వహణ, సంక్షేమ పథకాల అమలు, ఎన్నికల విధులు, ప్రోటోకాల్ విధులతో పంచాయతీ కార్యదర్శులకు పనిభారం పెరిగి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారన్నారు. కొత్త నియామకాలు చేపట్టి పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. పనివేళలను ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటలకు పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. వేతనం, బేసిక్లను మార్పులు చేయాలని, పంచాయతీ కార్యదర్శుల గ్రేడ్లను 6 నుంచి 3కు కుదించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు సిద్ధంగా ఉన్నామని తేల్చిచెప్పారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్తో పాటు జిల్లా పంచాయతీ కార్యదర్శులకు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ కార్యదర్శుల సమాఖ్య ఉపాధ్యక్షుడు అచ్యుత్, ఎం.శ్రీనివాస్, జిల్లా పంచాయతీ కార్యదర్శుల యూనిట్ ప్రతినిధులు ఎ.మురళి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
మడ్డువలసలో ఏనుగుల విధ్వంసం
వంగర: మండల పరిధి మడ్డువలస గ్రామంలో ఏనుగుల గుంపు విధ్వంసం సృష్టించింది. రెండు రోజులుగా ఇక్కడ సంచరిస్తున్న ఏనుగులు గ్రామానికి చెందిన బూరాడ విష్ణు, దత్తి వెంకటనాయుడు, బూరాడ నాయుడు, తివనాన సుబ్బినాయుడు, బూరాడ కృష్ణ, నరసయ్యల వరినారు మడులను ధ్వంసం చేశాయి. ఉభాలకోసం సిద్ధం చేస్తున్న నారుమడులను నాశనం చేయడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అలాగే బూరాడ వెంకటరావుకు చెందిన ధాన్యం బస్తాలు, గొడౌన్ను ఏనుగులు ధ్వంసం చేయగా, తివనాన సుబ్బినాయుడు ధాన్యం బస్తాలను చెల్లచెదురు చేశాయి. అనంతరం ఈ గుంపు మడ్డువలస సమీపంలో ఉన్న రేగిడి మండల సరసనాపల్లి తోటలోకి ప్రవేశించాయి. జర్నలిస్టుల నిరసన ప్రదర్శన ● మీడియా ప్రతినిధిపై దాడులను ఖండించిన పాత్రికేయులు ● విజయనగరం కోట నుంచి మూడులాంతర్ల కూడలి వరకు నిరసన ర్యాలీ విజయనగరం క్రైమ్: ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలపక్షాన నిలిచే పత్రికలు, మీడియా, జర్నలిస్టులపై ఇటీవల కాలంలో జరుగుతున్న దాడులను మీడియా ప్రతినిధులు ముక్తకంఠంతో ఖండించారు. వాటికి నిరసనగా విజయనగరంలోని కోట కూడలి నుంచి గురజాడ అప్పారావు రోడ్డు మీదుగా మూడులాంతర్లు కూడలి వరకు శనివారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అక్కడ జర్నలిస్టు సంఘాల నాయకులు శివప్రసాద్, ఎంఎంఎల్ నాయుడు, కోటేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ రాజకీయ నాయ కులు, పోలీసులు తరచూ జర్నలిస్టులపై దాడులకు పాల్పడుతుండడం విచారకరమన్నారు. విజయనగరంలో ఎన్టీవీ జిల్లా రిపోర్టర్పై టూటౌన్ ఎస్ఐ దురుసుగా వ్యవహరించడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. ఎస్ఐ తీరుపై ఏఎస్పీ సౌమ్యలతకు ఫిర్యాదు చేశామని, తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ఆధునిక పరిజ్ఞానం అందిపుచ్చుకుంటూ ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్న మీడియా ప్రతినిధిపై ఎస్ఐ దాడిచేయడం ఎంతవరకు సమంజమని ప్రశ్నించారు. కార్యక్రమంలో జర్నలిస్టు ప్రతినిధులు భానుప్రసాద్, బూరాడ శ్రీనివాసరావు, సత్యనారాయణ, శ్రీధర్, రాధాకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలకు జిల్లా క్రీడాకారులు
విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరగనున్న ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారులు శనివారం పయనమయ్యారు. ఈ నెల 29నుంచి విజయవాడలో గల డీఎస్సీ ఇండోర్ స్టేడియంలో అండర్ – 10, 12 వయస్సుల విభాగాల్లో జరగనున్న పోటీల్లో సైబర్, ఇప్పి, ఫాయిల్ విభాగాల్లో రాష్ట్ర స్థాయి పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో జిల్లా నుంచి పడాల గణేష్, జాయ్ జబేజ్, టి.నరేంద్ర, హసీనా శ్రీవల్లి, మొహమ్మద్ షేక్ అహ్మద్ ప్రాతినిధ్యం వహించనున్నారు. క్రీడాకారులను జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి ఎస్.వెంకటేశ్వరరావు, జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ చీఫ్ కోచ్ డివి చారిప్రసాద్, సభ్యులు దాలిరాజు, పిల్లా శ్రీనివాస్, వెంకటేష్ తదితరులు అభినందించారు. తైక్వాండో పోటీల్లో జిల్లా క్రీడాకారులకు పతకాలు విజయనగరం: జాతీయ స్థాయిలో జరిగిన తైక్వాండో పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించిన జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఈ పోటీల్లో విజయనగరం జిల్లాకు క్రీడాకారులు మొత్తం 6 పతకాలు సాధించారు. ఈ నెల 23 నుంచి 25 వరకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్లో జరిగిన జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి ఆరుగురు క్రీడాకారులు పాల్గొనగా.. ఆరుగురు క్రీడాకారులు పతకాలు సాధించటం విశేషం. పోటీల్లో షణ్ముఖ సిద్ధార్థ గోల్డ్ మెడల్, హర్షవర్ధన్ సిల్వర్ మెడల్, వైష్ణవి దేవి సిల్వర్ మెడల్, రోహిణి బ్రాంజ్ మెడల్, హర్షిని బ్రాంజ్ మెడల్, తరుణ్ బ్రాంజ్ మెడల్ దక్కించుకున్నారు. అంతేకాకుండా అత్యధిక పతకాలు సాధించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు ఓవరాల్ చాంపియన్షిప్లో తృతీయ స్థానం దక్కించుకున్నారు. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు దక్కించుకున్న జిల్లా క్రీడాకారులను జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు గురాన అయ్యలు, రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి సిహెచ్ వేణుగోపాలరావు, కోచ్లు, యశస్విని, కోటేశ్వరరావు అభినందించారు. ఒక్క రోజు ఎస్ఐగా ఖాన్ ● నలుగురు ఏఎస్ఐలకు పదోన్నతి విజయనగరం క్రైమ్: విశాఖ పోలీస్ రేంజ్ పరిధిలో నలుగురు ఏఎస్ఐలకు ఎస్ఐలుగా పదోన్నతి కల్పిస్తూ విశాఖ పోలీస్ రేంజ్ డీఐజీ గోపినాధ్ జెట్టీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతులు పొందిన వారిలో బి.సురేష్ పార్వతీపురం మన్యం జిల్లాకు, డి.సత్యారావును శ్రీకాకుళం జిల్లాకు కేటాయించారు. మిగిలిన ఇద్దరు కె. శ్రీనివాసరావు, సర్దార్ ఖాన్లను విజయనగరం జిల్లాకు కేటాయించారు. ఎస్ఐగా పదోన్నతి పొందిన సర్దార్ ఖాన్ భోగాపురం ఏఎస్ఐగా పని చేస్తున్నారు. ఈ మేరకు విశాఖ రేంజ్ డీఐజీ కార్యాలయంలో ఆయన్ను సర్దార్ ఖాన్ కలిసి అభినందనలు తెలిపారు. కాగా, ఎస్ఐగా పదోన్నతి పొందిన సర్దార్ ఖాన్ ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. 1982లో పోలీస్ శాఖలో కానిస్టేబుల్గా చేరిన సర్దార్ ఖాన్ 2009లో ఏఎస్ఐగా, ఇప్పుడు ఎస్ఐగా పదోన్నతి పొందారు. సోమవారం రిటైర్ కానున్నారు. -
వైద్య కళాశాలకు చంపావతి నది నీరు
–8లోభగ్గుమన్న జిందాల్ నిర్వాసితులు జిందాల్కు భూములిచ్చి నష్టపోయిన రైతాంగానికి మేలు చేయకుండా తిరిగి నిర్వాసితులను బెదిరించడం కలెక్టర్కు తగదని ఏపీ రైతు సంఘం నాయకులు అన్నారు. విజయనగరం ఫోర్ట్/విజయనగరం అర్బన్: ప్రభుత్వ వైద్య కళాశాలకు మొయిద వద్ద చంపావతి నదిలో రూ.12 కోట్లతో ప్రతిపాదించిన తాగునీటి సరఫరా పథకం నిర్మాణ పనులను 10 రోజుల్లో ప్రారంభించేందుకు చర్యలు తీసుకో వాలని కలెక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోజుకి 1 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేసేలా పథకం పనులు పూర్తిచేయాలన్నారు. మరో ఏడాది తరువాత వైద్య కళాశాల లో పీజీ తరగతులు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున, విద్యార్థుల సంఖ్య మరింత పెరగనుందన్నారు. ప్రస్తుతం కళాశాలలోని ఆరు బోరు బావుల్లో నీరు పునరుద్ధరణ అయ్యేందుకు వీలుగా నీటి సేకరణ కట్టడాలను, నీటిని నిల్వ కోసం సంప్ ట్యాంకును వారం రోజుల్లో నిర్మించాలన్నారు. కళాశాలకు తాత్కాలికంగా విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాలన్నారు. జేఎన్టీ యూ కూడలి నుంచి వైద్యకళాశాల వరకు వీధిదీపాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో వైద్య కళాశాల ప్రిన్సి పాల్ కె.పద్మలీల, మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య, డీపీఓ మల్లికార్జునరావు, భూగర్భ జలశాఖ డీడీ శ్రీనివాస్రావు పాల్గొన్నారు. అనాథ పిల్లల జాబితా పునఃపరిశీలించాలి మిషన్ వాత్సల్య పథకం కింద అనాథ పిల్లలకు అందిస్తున్న ఆర్థిక సహాయం కోసం వచ్చిన 22 దరఖాస్తులను మరోసారి పరిశీలించాలని కలెక్టర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో కోవిడ్, హెచ్ఐవీ ప్రభావిత, అనాథ పిల్లలు 388 మందికి నెలకు రూ.4వేలు అందజేస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో డీసీపీయూ లక్ష్మి, బి.రామకోటి పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ -
విశ్రాంత డీఈవోపై దాడి కేసులో నిందితుడు అరెస్టు
విజయనగరం క్రైమ్ : విజయనగరం టూ టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఉంటున్న విశ్రాంత డీఈవో అప్పలనాయుడుపై దాడి చేసిన నిందితుడ్ని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. దీనికి సంబంధించి సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు... నగరంలోని పూల్బాగ్లో నివాసం ఉంటున్న అప్పలనాయుడు ఇంటికి ఈ నెల 26న సోలార్ ప్యానెల్ పని నిమిత్తం వంకర కృష్ణ వచ్చాడు. అంతకు ముందు ఈ నెల 24న కృష్ణ విశ్రాంత డీఈవో ఇంటికి వచ్చినపుడు ఇంట్లో మహిళల ఒంటిపై బంగారు ఆభరణాలు ఉండడం చూసి పక్కా పథకం రచించాడు. ఈ క్రమంలో 26న ఇంటికి వేట కొడవలిని సంచిలో పెట్టుకుని కృష్ణ వచ్చాడు. ఆ సమయంలో అప్పలనాయుడు ఫోన్ చూస్తుండగా ఒక్కసారిగా వెంట తెచ్చిన వేట కొడవలితో ఆయనపై దాడి చేశాడు. ఈ మేరకు అప్పలనాయుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి భోగాపురానికి చెందిన కృష్ణను శనివారం అరెస్టు చేసినట్టు సీఐ తెలిపారు. -
రైలు ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ మృతి
బాడంగి: మండలంలోని డొంకినవలస–బొబ్బిలి రైల్వేస్టేషన్ల మధ్య గొళ్లాది మంగళ గేటు సమీపంలో రైలు ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. బొబ్బిలి రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు.. శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో సుమారు 45ఏళ్ల వయస్సు కలిగిన మహిళను రైలు ఢీకొనడం లేదా జారిపడి పోవడం వల్ల మృతి చెంది ఉంటుందని రైల్వే హెచ్సీ ఈశ్వరరావు తెలిపారు. మృతురాలి శరీరంపై ఎరుపు, పసుపు రంగుచీర కలిగి ఉందని, గుర్తు పట్టడానికి ఎటువంటి ఆనవాళ్లు లేవని చెప్పారు. మృతదేహాన్ని విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురిలో భద్రపరిచామని తెలిపారు. వివరాలు తెలిసిన వారు ఆర్పీఎస్ఎస్ఐ 9490617089 నంబరుకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పాముకాటుతో వృద్ధుడు.. గుమ్మలక్ష్మీపురం: మండలంలోని ఒప్పంగి గ్రామానికి చెందిన ఎప్పరిక తిరుపతిరావు(63) పాము కాటుతో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. తిరుపతిరావు గ్రామ సమీపంలో పశువుల శాల వద్ద పెంచుతున్న కోళ్లను కప్పేందుకు శుక్రవారం సాయంత్రం వెళ్లగా అక్కడ నాగుపాము కాటేసింది. తిరుపతిరావు ఆ పామును అక్కడే కొట్టి చంపేశాడు. ఇంటికొచ్చి కుటుంబీకులకు తెలియజేయగా వైద్యం నిమిత్తం భద్రగిరి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే తిరుపతిరావు మృతి చెందినట్టు తెలిపారు. అనంతరం భద్రగిరి ఆసుపత్రి వద్ద పోస్టుమార్టం నిర్వహించి తిరుపతిరావు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. -
అరుదైన జువెనరీ గ్లకోమా చికిత్స
బొబ్బిలి: పట్టణంలోని బొబ్బిలి కంటి ఆసుపత్రిలో జాతీయ స్థాయి కంటి శస్త్రచికిత్సల నిపుణులు డాక్టర్ కేవీ ఆప్పారావు అరుదైన కంటి శస్త్ర చికిత్స నిర్వహించారు. పార్వతీపురానికి చెందిన నరేంద్ర పంగి అనే మహిళకు చిన్నతనంలోనే గ్లకోమా (జువెనరీ గ్లకోమా)వ్యాధి సోకింది. ఈమె విశాఖ తదితర ప్రాంతాల్లో పలు ఆసుపత్రులకు వెళ్లి చికిత్సలు పొందినా నయం కాలేదు. చూపు మరింత మందగించింది. చివరికి డాక్టర్ కేవీ అప్పారావు డాక్టర్ను కలసింది. ఆయన చికిత్స చేసి ఇది అరుదైన జువెనరి గ్లకోమా వ్యాధి అని శస్త్ర చికిత్స అవసరమని ఆ ప్రకారం చేయడంతో ఈమెకు కంటి చూపు 70శాతం పైగా వచ్చినట్టు తెలిపారు. అసలు నాకు కంటి చూపు వస్తుందని అనుకోలేదని, బొబ్బిలిలో చికిత్స చేయించుకోవడం వలన తాను మునుపటిలా చూడగలుగుతున్నానని డాక్టర్ అప్పారావుకు కృతజ్ఙతలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ అప్పారావు మాట్లాడుతూ ఈమెకు 21 సంవత్సరాల వయసులోనే గ్లకోమా వచ్చిందన్నారు. ఇటువంటి వారికి వచ్చే అంధత్వాన్ని జువెనరీ గ్లకోమా వ్యాధి అంటారన్నారు. ఏమాత్రం దృష్టి లోపం ఉన్నా వెంటనే వైద్యుల్ని సంప్రదించాలన్నారు. -
1850కి పైగా కేసుల నమోదు
విజయనగరం టౌన్: రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలందించేందుకు ఈస్ట్కోస్ట్ రైల్వే ప్రత్యేక కార్యాచరణ ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో పూరి రథయాత్రకి వెళ్లి, వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై అధికారులు శనివారం విశాఖపట్టణం నుంచి విజయనగరం మీదుగా రైళ్లలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. వెయిటింగ్ హాల్స్, క్యాటరింగ్ స్టాల్స్, ప్యాంట్రీకార్ల వద్ద ఆహార పదార్ధాలను పరిశీలించారు. టికెట్ లేకుండా ప్రయాణాలు చేసే వారిపై దృష్టి సారించారు. 1850 మందికి పైగా టికెట్ లేకుండా ప్రయాణాలు చేస్తున్న వారిని గుర్తించి, వారి నుంచి రూ.11 లక్షలకు పైగా అపరాధ రుసుం వసూలు చేసినట్టు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సందీప్ పేర్కొన్నారు. టికెట్ల కోసం సరైన క్యూలను నిర్వహించాలని, రైళ్లలో బోర్డింగ్ సులభతరం చేయాలని, క్యూఆర్ ఆధారిత కోడ్లతో డిజిటల్ చెల్లింపులను ఉపయోగించాలని, మండే వస్తువులను తీసుకువెళ్లవద్దని, టికెట్ తనిఖీ చేసినప్పుడు సరైన ఐడీ రుజువును చూపించాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. -
విజయవంతం చేయండి
మెరకముడిదాం: విజయనగరం జగన్నాథ్ ఫంక్షన్ హాల్లో వచ్చేనెల 3న నిర్వహించనున్న వైఎస్సార్సీపీ జిల్లా విస్థృతస్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మెరకముడిదాం మండలానికి చెందిన పార్టీ ముఖ్యనాయకులతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశానికి మండలం నుంచి అధికమంది తరలిరావాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎస్.వి.రమణరాజు, కోట్ల విశ్వేశ్వరరావు, కె.ఎస్.ఆర్.కె.ప్రసాద్, బూర్లె నరేష్కుమార్, గుర్ల మండలానికి చెందిన నాయకులు పొట్నూరు సన్యాసినాయుడు పాల్గొన్నారు. -
గురుకులంలో ఇంటర్ విద్యకు మంగళం
● నీట్, ఐఐటీ బ్యాచ్ల పేరుతో రెగ్యులర్ ఇంటర్ను ఎత్తేశారు ● మూడు దశాబ్దాలుగా కొనసాగిన తరగతులు జరగవిక ● ఎంపీసీ, బైపీసీ కోసం జిల్లా శివారు ప్రాంతాలకు పరుగులు ● ఆవేదనలో గ్రామీణ ప్రాంత ఎస్సీ, ఎస్టీ కుటుంబాల బాలికలు చీపురుపల్లి: ‘కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందట’ అన్న చందంగా తయారైంది గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియట్ పరిస్థితి. సాధారణంగా ప్రభుత్వాలు మారినప్పుడు గతంలో ఉన్న సౌకర్యాలు కంటే మరింత మెరుగైన సదుపాయాలు కల్పించడం చూస్తుంటాం. ప్రస్తుత కూటమి పాలనలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. దీనికి పట్టణంలోని సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బీఆర్ అంబేడ్కర్ గురుకుల బాలికల కళాశాలలో మూడు దశాబ్దాలుగా ఉన్న రెగ్యులర్ ఇంటర్మీడియట్ కోర్సుకు మంగళం పాడడమే నిదర్శనం. చీపురుపల్లి గురుకుల బాలికల కళాశాలలో విద్యనభ్యసించేందుకు విద్యార్థినులు పోటీ పడేవారు. ఏటా ప్రవేశాల కోసం అధికమంది దరఖాస్తు చేసేవారు. ఈ ఏడాది ఇంటర్మీడియట్ కోర్సులు నిర్వహించడంలేదని తెలియడంతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన బాలికలు ఆవేదన చెందుతున్నారు. కళాశాల గేటుకు వేటాడుతున్న రెగ్యులర్ ఇంటర్ లేదన్న నోటీస్ బోర్డును చూసి నిరాశతో వెనుదిరుగుతున్నారు. చీపురుపల్లి గురుకుల బాలికల కళాశాలను కేవలం నీట్, ఐఐటీ బ్యాచెస్కు కేటాయించారని, రెగ్యులర్ ఇంటర్ ఇక్కడ లేదని సిబ్బంది చెబుతున్నారు. నీట్, ఐఐటీ లాంటి ఉన్నత కోర్సులకు వెళ్లే విద్యార్థులు కోసం ప్రత్యేకంగా బ్యాచ్లు నడపడం మంచిదే అయినప్పటికీ, రెగ్యులర్ ఇంటర్ పూర్తిగా రద్దు చేయడం అన్యాయమని విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జోనల్ స్థాయిలో ఒక నీట్, ఐఐటీ క్యాంపస్ సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జోనల్ స్థాయిలో ఒక నీట్, ఐఐటీ క్యాంపస్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి విజయనగరం, విశాఖపట్టణం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి చీపురుపల్లి గురుకుల బాలికల కళాశాలలో ఆ క్యాంపస్ను ఏర్పాటు చేసి రెగ్యులర్ ఇంటర్ను రద్దు చేశారు. ఈ క్యాంపస్ గతంలో రాష్ట్ర వ్యాప్తంగా అమరావతిలో ఒక్కటే ఉండేది. తాజాగా జోనల్స్థాయిలో ఒక్కోటి ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో అది కూడా చీపురుపల్లిలో ఏర్పాటు చేయడంతో రెగ్యులర్ ఇంటర్కు మంగళం పాడేలా చేసింది. ఇక్కడ ఏర్పాటు చేసిన నీట్, ఐఐటీ క్యాంపస్లో ఇంటర్మీడియట్ చదవాలనుకునే విద్యార్థులకు సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఎంట్రన్స్ కూడా నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేశారు. మూడు దశాబ్దాల చరిత్ర.. సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 1984లో చీపురుపల్లి కేంద్రంగా గురుకుల బాలికల పాఠశాలను ఏర్పాటుచేశారు. తరువాత కాలంలో 1994లో గురుకుల బాలికల కళాశాలను ఏర్పాటు చేసి ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ కోర్సులను తీసుకొచ్చారు. 31 సంవత్సరాలుగా ఉన్న ఇంటర్మీడియట్ కోర్సు ఇప్పుడిక లేదు. పక్కనే నెలిమర్లలో ఉన్న అంబేడ్కర్ గురుకుల బాలికల కళాశాల ఉన్నప్పటికీ అక్కడ ఎంపీసీ, బైపీసీ గ్రూపులు లేవు. దీంతో ఎంపీసీ, బైపీసీ గ్రూపులు కావాలనుకునే చీపురుపల్లి, నెలిమర్ల, విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి, రాజాం నియోజవకర్గాల్లోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన పిల్లలు జిల్లాలోని సుదూరంగా ఉన్న వేపాడ, వియ్యంపేట వంటి గురుకుల కళాశాలలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకుంది. రెగ్యులర్ ఇంటర్మీడియట్ లేదు.... జోనల్ స్థాయిలో ఏర్పాటు చేసిన నీట్, ఐఐటీ క్యాంపస్ను చీపురుపల్లి గురుకుల కళాశాలలో ఏర్పాటు చేశారు. దీంతో రెగ్యులర్ ఇంటర్మీడియట్ను రద్దు చేసి ఇక్కడి సీట్లను ఇతర కళాశాలల్లో సర్దుబాటు చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన నీట్, ఐఐటీ బ్యాచస్కు సంబంధించి సీట్లు కూడా పూర్తయ్యాయి. – రాణీశ్రీ, ప్రిన్సిపాల్, గురుకుల కళాశాల, చీపురుపల్లి -
కలెక్టర్ తీరుపై భగ్గుమన్న జిందాల్ నిర్వాసితులు
శృంగవరపుకోట: జిందాల్కు భూములిచ్చి నష్టపోయిన రైతాంగానికి మేలు చేయమంటే జిల్లాకు ఉన్నతాధికారి అయిన కలెక్టర్ నిర్వాసితులను బెదిరించడం ఎంత వరకు సమంజమని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్, నిర్వాసిత రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు జరుగుతున్న అన్యాయంపై జిందాల్ నిర్వాసితులు బొడ్డవరలో శనివారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ నిర్వాసితులు ఎవరో మభ్యపెడితే, ఆశ పెడితే ఆందోళనకు దిగారని చెప్పడం సరికాదన్నారు. నిర్వాసితులు తమకు జరుగుతున్న అన్యాయంపై పోరాడేందుకు మద్దతుగా ఉండాలని అన్ని పక్షాల వారిని కోరిన విషయం గుర్తించాలన్నారు. జిందాల్ తమకు ఇస్తామన్న ఉద్యోగం, పరిహారం, షేర్లు, ఇల్లు వంటి హామీలు ఎవరు తీరుస్తారు? ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఉపాధి కల్పిస్తామంటారే తప్ప, నిర్వాసిత కుటుంబాలకు ఉద్యోగం ఇస్తామని ఎందుకు చెప్పరని ప్రశ్నించారు. జిందాల్ ఇచ్చిన హామీలు తీర్చడంలో ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషిస్తామని ఎందుకు హామీ ఇవ్వరని నిలదీశారు. జిందాల్ భూముల్లో ఎవరికీ హక్కు లేదన్న కలెక్టర్ ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటులో ఎందుకు ఉత్సాహం చూపుతున్నారని ప్రశ్నించారు. జిందాల్ నిర్వాసితుల సమస్యలపై తరువాత ఆలోచిద్దాం అన్న కలెక్టర్, ప్రజాప్రతినిధులను ఏమనాలని ప్రశ్నించారు. కంపెనీల ఏర్పాటుకు నిర్వాసితులు వ్యతిరేకం కాదన్న విషయాన్ని కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు గుర్తించుకోవాలన్నారు. నిర్వాసితులను బెదిరించాలనుకోవడం సరికాదని, అధికారులు, ప్రజాప్రతినిధులను జిందాల్ తప్పుదోవ పట్టిస్తుందన్న విషయం తెలుసుకోవాలని సూచించారు. పెద్ద సంఖ్యలో నిర్వాసితులు పాల్గొన్నారు. మేలు చేయమంటే బెదిరించటం కాదు.. -
రోడ్డు ప్రమాదంలో యువకునికి తీవ్ర గాయాలు
బొబ్బిలి: పట్టణంలోని ఫ్లైఓవర్పై వెళ్తున్న లారీ, బైక్లు ఢీకొనడంతో (రెండూ ఒకే వైపు)మండలంలోని శివడవలసకు చెందిన గణేష్ అనే యువకుడి కాలు నుజ్జు నుజ్జయింది. లారీని ఓవర్ టేక్ చేస్తుండగా ముందు చక్రం కింద పడటంతో తీవ్ర గాయాలు కావడంతో ఘటనా స్థలంలో చాలా సేపు ఉండిపోయాడు. అంబులెన్స్ రాక ఆలస్యం కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న క్షతగాత్రుడ్ని ట్రాఫిక్ ఎస్ఐ పి.జ్ఞానప్రసాద్ సిబ్బంది జ్ఞానప్రసాద్ సిబ్బంది, ఇతరుల సాయంతో ఆటోలో ఆసుపత్రికి తీసుకువెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవం
విజయనగరం: ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ, సీతం ఇంజినీరింగ్ కళాశాల సంయుక్తంగా జూలై 1వ తేదీన జాతీయ వైద్యుల దినోత్సవం నిర్వహిస్తున్నామని సీతం ఇంజినీరింగ్ కాలేజి డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు పేర్కొన్నారు. తోటపాలెం సత్య విద్యా సంస్థల వద్ద శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైద్యుల దినోత్సవం ఆహ్వాన ప్రతులను ఆవిష్కరించి మాట్లాడారు. వెద్యులు ప్రాణదాతలని, సమాజంలో వారి స్థానం ఎల్లప్పుడూ గౌరవప్రదంగానే ఉంటుందన్నారు. సాంకేతికంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర అంశాలతో ప్రపంచం ముందుకు వెళ్తుందని ఈ నేపథ్యంలో విద్యార్థులకు వివిధ అంశాలపై జాతీయ వైద్యుల దినోత్సవం నాడు ప్రముఖ వైద్యులతో అవగాహన కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్, సత్య డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ సాయి దేవమణి తదితరులు పాల్గొన్నారు.గంజాయి కేసులో ఐదుగురు అరెస్టు బొండపల్లి: మండలంలోని గొట్లం బైపాస్ రోడ్డు మీదుగా తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకొని ఐదుగురు యువకులతో పాటు గంజాయిని సీజ్ చేసినట్టు సీఐ రమణ, ఎస్ఐ మహేష్ శనివారం తెలిపారు. కురుపాంకు చెందిన డి.కీర్తిరాజ్కుమార్, పి.అమర్, ఎం.అఖిల్, ఒడిశాకు చెందిన టి.రమేష్, ఇ.శ్యామ్లను అదుపులోకి తీసుకొని వారి నుంచి 1200 గ్రాముల గంజాయి, ఆరు సెల్ఫోన్లు, రూ.1000 నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసినట్టు చెప్పారు. గంజాయి పట్టివేత రాజాం సిటీ: అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పట్టుకుని అరెస్టు చేశామని టౌన్ సీఐ కె.అశోక్కుమార్ తెలిపారు. శనివారం చీపురుపల్లి రోడ్డులోని గాయత్రి కాలనీ సమీపంలో వాహన తనిఖీలు చేస్తుండగా 1.148 గ్రాముల గంజాయిని పట్టుకున్నామని తెలిపారు. సీఐ వివరాలు మేరకు మెరకముడిదాం మండలం మర్రివలస గ్రామానికి చెందిన వలిరెడ్డి సత్యనారాయణ ద్విచక్ర వాహనంపై చీపురుపల్లి నుంచి రాజాం వైపు వస్తున్నాడు. వాహన తనిఖీలు చేస్తుండగా అతని వద్ద ఉన్న ప్యాకెట్ను పరిశీలించగా 1.148 కేజీల గంజాయిగా గుర్తించి అరెస్టు చేయడంతో పాటు కేసు నమోదుచేసి రిమాండ్కు తరలించామని అన్నారు. అంతేకాకుండా మల్లిఖార్జునకాలనీ గాయత్రిమఠం సమీపంలో గంజాయి సేవిస్తున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని అన్నారు. మహిళపై దాడి చేసిన వ్యక్తి అరెస్టు వేపాడ: మండలంలోని నల్లబిల్లి గ్రామానికి చెందిన ఈర్లి సీతారాం(65)పై అదే గ్రామానికి చెందిన ఉడతా మణికంఠ కత్తిపీటతో దాడి చేసి గాయపర్చిన సంగతి పాఠకులకు విదితమే. దీనిపై ఎస్.కోట రూరల్ సీఐ అప్పలనాయుడు పర్యవేక్షణలో ఎల్.కోట ఎస్ఐ నవీన్ పడాల్ శుక్రవారం రాత్రి సంఘటనా స్థలానికి చేరుకుని సంఘటనపై ఆరా తీశారు. శనివారం దాడికి పాల్పడిన మణికంఠను అదుపులోకి తీసుకుని ఎల్.కోట ఎస్ఐ నవీన్ పడాల్ కేసు నమోదు చేసి కోర్టుకు తరలించినట్టు చెప్పారు. -
● మూత‘బడి’ంది!
కూటమి ప్రభుత్వం చేపట్టిన పాఠశాలల విలీనం నిర్ణయంతో సంతకవిటి మండలం చిత్తారపురం పంచాయతీ గుజ్జన్నపేట ప్రాథమిక పాఠశాల మూతపడింది. దశాబ్దాలుగా 1 నుంచి 5 తరగతుల పిల్లలకు విద్యను బోధించే ప్రాథమిక పాఠశాలను ఇటీవల 1, 2 తరగతులు మాత్రమే బోధించే ఫౌండేషన్ స్కూల్గా ప్రభుత్వం మార్చింది. ప్రభుత్వ నిర్ణయాన్ని గ్రామస్తులు వ్యతిరేకించారు. ప్రాథమిక పాఠశాలగానే ఉంచాలని ఆందోళనలు చేశారు. అయినా, నిర్ణయం మారకపోవడంతో గ్రామస్తులు తమ పిల్లలను 1, 2 తరగతులు ఇక్కడ చదివించి 3, 4, 5 తరగతులను బయట గ్రామాల్లో చదివించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గ్రామంలో 1వ తరగతి చదివే వయసున్న విద్యార్థులున్నా ఎప్పుడైనా 3, 4, 5 తరగతులు బయట చదివించాల్సిందేనన్న ఉద్దేశంతో 1, 2 తరగతులు పిల్లలను కూడా ఇక్కడ చేర్పించడం మానేశారు. విద్యార్థులు లేకపోవడంతో ఇక్కడ నిన్నటివరకు పనిచేసిన టీచర్ ఎస్.నారాయణమ్మను డిప్యుటేషన్పై ఎస్.అగ్రహారం ప్రాథమిక పాఠశాలకు వేశారు. చివరకు ఫౌండేషన్ పాఠశాల మూతపడింది. – సంతకవిటి -
ఉద్యోగాల పేరిట మోసం చేసిన నాల్గో వ్యక్తి అరెస్టు
విజయనగరం క్రైమ్ : ఉద్యోగాల పేరిట యువతను మోసం చేసిన కేసులో నాల్గో నిందితుడిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. వన్టౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. 2022లో రైల్వే, డాక్యార్డులో ఉద్యోగాలిస్తామంటూ నలుగురు ముఠాగా ఏర్పడి నిరుద్యోగ యువత నుంచి డబ్బులు వసూలు చేశారు. అప్పట్లో అందిన ఫిర్యాదు మేరకు అప్పటి సీఐ వెంకటరావు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. అయితే ఈ కేసులో నాల్గో నిందితుడైన కొత్తవలసకు చెందిన కోసూరు శివ వెంకట సత్యనారాయణను శనివారం అరెస్టు చేసి రిమాండ్కు పంపించామని సీఐ తెలిపారు. రూ.80వేలు రికవరీ చేసినట్టు తెలిపారు. -
మద్యం మత్తు వల్లే ప్రమాదం
రామభద్రపురం: మండలంలోని జోగిందొరవలసలో ఈ నెల 21వ తేదీన వల్లం నాయుడు అనే వ్యక్తి మద్యం మత్తులో ట్రాక్టర్ నడిపి ప్రమాదానికి పాల్పడ్డాడని డీఎస్పీ ఎస్. రాఘవులు తెలిపారు. జొగిందొరవలసలో ట్రాక్టర్ ప్రమాదానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకుని అరెస్ట్ చూపారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రమాదానికి సంబంధించి వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. బొబ్బిలి మండలం మోసూరువలసకు చెందిన వంగపండు వల్లంనాయుడు, మోసూరు భాస్కరరావు, లక్ష్మణరావులు స్నేహితులు. అయితే వల్లంనాయుడు స్నేహితులిద్దరికి ఫోన్చేసి మద్యం తాగుదాం రమ్మని ఆహ్వానించాడు. ముగ్గురులో ఇద్దరు ద్విచక్రవాహనంపై, ఒకరు బ్లేడ్ ట్రాక్టర్పై రామభద్రపురం మండలంలోని జోగిందొరవలస గిరిజన గ్రామానికి వెళ్లి అక్కడ మందు తాగారు. ఆ తర్వాత వల్లంనాయుడు మద్యం మత్తులో భాస్కరరావు బైక్ తాళం తీసుకున్నాడు. నా తాళం ఇవ్వు అని భాస్కరరావు ఎంతసేపు అడిగినా వల్లం నాయుడు ఇవ్వలేదు. దీంతో భాస్కరరావు ట్రాక్టర్ వెళ్లనివ్వనని చెప్పి బోయినెట్పై కూర్చున్నాడు. మద్యం మత్తులో ఉన్న వల్లంనాయుడు కూడా ట్రాక్టర్ ఎక్కి స్టార్ట్ చేసి ముందుకు లాగించేశాడు. ఆ రోడ్డు గోతులమయంగా ఉండడం వల్ల ప్రమాదవశాత్తు భాస్కర రావు కింద పడిపోవడంతో ట్రాక్టర్ చక్రాలు వెళ్లిపోగా వెనుక ఉన్న బ్లేడ్స్ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ మేరకు కేసునమోదు చేసిన సీఐ కె.నారాయణరావు, ఎస్సై వి.ప్రసాదరావు దర్యాప్తు చేశారు. ప్రమాదం జరుగుతుందని తెలిసి కూడా నిందితుడు అలా వ్యవహరించం వల్ల ప్రమాదకేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. కార్యక్రమంలో ఏఎస్సై అప్పారావు పాల్గొన్నారు. ప్రమాదానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్ -
పైడితల్లికి స్వర్ణపుష్పార్చన
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, సిరుల తల్లి శ్రీ పైడితల్లి అమ్మవారికి ఆలయంలో శుక్రవారం స్వర్ణ పుష్పార్చన చేశారు. వేకువజామునుంచి అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, వేదపండితులు సాయికిరణ్, అచ్యుతశర్మ, దూసి శివప్రసాద్లు శాస్త్రోక్తంగా అమ్మవారికి స్వర్ణ పుష్పార్చన సేవను నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ ఇన్చార్జ్ ఈఓ కె.శిరీష కార్యక్రమాలను పర్యవేక్షించారు. త్రుటిలో తప్పిన పెనుప్రమాదంబాడంగి: ఓ కారు అదుపుతప్పి భోజనం హోటల్లోకి దూసుకు పోయిన సంఘటనలో అదృష్టవశాత్తు పెనుప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. టెక్కలి నుంచి జయపూర్ వెళ్తున్న కారు స్పీడ్ బ్రేకర్ల ములంగా ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ముందుటైర్లు రాయిపైకి ఎక్కి పోవడంతో స్టీరింగ్ అదుపుతప్పింది. దీంతో మండలకేంద్రంలో పోలీస్స్టేషన్ ఎదురుగా గల ఎం.చైతన్య భోజనం హోటల్లోకి కారు ఒక్కసారిగా దూసుకుపోయింది. అయితే ఆ హోటల్లో టిఫిన్ సెక్షన్ లేకపోవడంతో పాటు ఉదయం 8గంటల సమయం కావడంతో పనివారు హోటల్ లోపల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బయట ఎవరూ లేకపోవడంతో ప్రాణహాని తప్పిందని హోటల్ సిబ్బంది భయాందోళనతో చెప్పారు. మహిళపై కత్తిపీటతో దాడివేపాడ: మండలంలోని నల్లబిల్లి గ్రామానికి చెందిన మహిళపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి కత్తి పీటతో దాడి చేసినట్లు వల్లంపూడి పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం గ్రామానికి చెందిన ఉడతా మణికంఠ గ్రామంలోని ఈర్లి సీతారాం (62)ఇంటికి వెళ్లి మంచినీళ్లు అడిగాడు. మంచినీళ్లు ఇవ్వడానికి ఆమె గదిలోకి వెళ్లగా మెడలోని బంగారం తాడు తుంచి వేయడానికి మణికంఠ ప్రయత్నం చేశాడు. దీంతో సీతారాం కేకలు వేయగా పరిసరాల్లో ఉన్న వ్యక్తులు వచ్చేసరికి ఇంట్లో ఉన్న కత్తిపీటతో సీతారాం మెడపై మణికంఠ దాడి చేసి గాయపర్చాడు. స్థానికులు వెంటనే 108కు సమాచారమిచ్చి కోటపాడు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యసేవలకు విశాఖ కేజీహెచ్కు తీసుకువెళ్లారు. సమాచారం మేరకు ఎస్.కోట రూరల్ ఎస్సై ఎల్.అప్పలనాయుడు గ్రామానికి వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితురాలి కుమారుడు శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై తెలిపారు. -
వాచ్మన్ హత్య కేసులో నిందితుడి అరెస్టు
బొబ్బిలి: పట్టణంలోని గ్రోత్సెంటర్లో గల రాఘవ కన్స్ట్రక్షన్స్లో వాచ్మన్గా పనిచేస్తున్న కనిమెరకల వెంకట రమణ హత్య కేసును ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు చీపురుపల్లి డీఎస్పీ ఎస్ రాఘవులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రాఘవులు నిందితుడి అరెస్టు చూపించి వివరాలను వెల్లడించారు. హతుడు వెంకటరమణ కుమార్తెతో వివాహేతర సంబంధం పెట్టుకున్న పాత బొబ్బిలిలోని చికెన్షాపులో పనిచేస్తున్న కోట సర్వేశ్వర రావు ఈ కేసులో నిందితుడని స్పష్టం చేశారు. వాచ్మన్ కనిమెరకల వెంకటరమణ విధుల్లో ఉండగా ఈనెల 20న రాత్రి గుర్తు తెలియని దుండగులు దాడి చేయడంతో బొబ్బిలి ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రానికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించాడు. భర్తతో గొడవలున్న తన కుమార్తెతో వివాహేతర సంబంధం పెట్టుకున్న సర్వేశ్వర రావును వెంకటరమణ గట్టిగా హెచ్చరించాడు. దీంతో కక్ష పెంచుకున్న సర్వేశ్వరరావు గ్రోత్ సెంటర్కు వెళ్లి వెంకటరమణపై దాడి చేశాడు. సీసీ టీవీ పుటేజీ, కాల్డేటా, సంఘటన స్థలం వద్ద దొరికిన పర్స్ ఆధారంగా విచారణ జరిపి నిందితుడ్ని ప్రశ్నించడంతో నేరం అంగీకరించాడని డీఎస్పీ తెలిపారు. నిందితుడ్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసును త్వరగా ఛేదించడంలో ప్రతిభ కనబర్చిన సీఐ కె.సతీష్కుమార్, ఎస్సై రమేష్, సిబ్బందిని డీఎస్పీ రాఘవులు అభినందించారు. -
సికిల్ సెల్ వ్యాధిని పూర్తిగా అరికట్టాలి
విజయనగరం ఫోర్ట్: సికిల్సెల్ వ్యాధిని పూర్తిగా అరికట్టాలని కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్లోని తన చాంబర్లో శుక్రవారం ఆయన వైద్యారోగ్యశాఖ, గిరిజన సంక్షేమశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ వ్యాధి గ్రస్తులకు సికిల్సెల్ వ్యాధిపై అవగాహన కల్పించాలని కోరారు. గిరిజన గ్రామాల్లో 44 వేల మంది జనాభా నివసిస్తున్నారని, వారిలో 40 సంవత్సరాల లోపు జనాభా 22 వేలు ఉన్నారన్నారు. 17 వేల మందికి సికిల్ సెల్ టెస్టులు చేయగా ఇద్దరికి వ్యాధి ఉన్నట్లు తేలిందని చెప్పారు. 118 మందికి వ్యాధి వచ్చే అవకాశం ఉందని నిర్ధారణ అయినట్లు తెలిపారు. వారే కాకుండా ప్రస్తుతం జిల్లాలో 160 మంది వ్యాధిగ్రస్తులు చికిత్స పొందుతున్నారని, వారికి అందిస్తున్న వైద్యంపై వారం రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వ్యాధి వచ్చే అవకాశం ఉన్న 118 మందితో సమావేశం నిర్వహించి వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.పద్మలీల, డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి, డీఎల్ఓ డాక్టర్ రాణి, డీఈఓ మాణిక్యం నాయుడు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె.శ్రీనివాసరావు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ అన్నపూర్ణ, ఐసీడీఎస్ ఇన్చార్జి పీడీ అరుద్ర, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ శివకుమార్, డాక్టర్ అర్చన, డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ బీఆర్. అంబేడ్కర్ -
జిందాల్ రైతులకు వారంలో పరిహారం
విజయనగరం అర్బన్: జిందాల్ భూములకు సంబంధించి రైతులకు ప్రభుత్వం చెల్లించాల్సిన పరిహారాన్ని వారంరోజుల్లో అందజేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. జిందాల్ కోసం సేకరించిన భూములపై తన చాంబర్లో సంబంధిత అధికారులతో కలెక్టర్ శుక్రవారం సమీక్షించారు. ఇప్పటివరకు చెల్లించిన పరిహారం, పెండింగ్ బకాయిలపై ఆరా తీశారు. సుమారు 28 ఎకరాలకు సంబంధించి 15 మంది రైతులకు మాత్రమే పరిహారం పెండింగ్ ఉందని, వారికి వెంటనే పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు జిందాల్ చెల్లించాల్సిన పరిహారంపైనా చర్చించారు. పదిరోజుల్లో పెండింగ్ బకాయిలను రైతులకు చెల్లించాలని జిందాల్ యాజమన్యాన్ని కలెక్టర్ ఆదేశించారు. జిందాల్ భూముల్లో ఎంఎస్ఎంఈ పార్క్ జిందాల్ భూముల్లో ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ చెప్పారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిందాల్ భూములకు సంబంధించి కేవలం 15 మంది రైతులకు మాత్రమే బకాయి ఉందని చెప్పారు. జిందాల్ పరిశ్రమకు అప్పట్లోనే సుమారు 1,166 ఎకరాలను ప్రభుత్వం అప్పటించిందన్నారు. ఈ భూముల్లో 180 ఎకరాలను జిందాల్ యాజమాన్యమే నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసిందని చెప్పారు. ఇది కాకుండా మొత్తం 375 మంది రైతుల నుంచి 834 ఎకరాల అసైన్డ్ భూమిని, 151 ఎకరాల ప్రభుత్వ భూమిని జిందాల్కు కేటాయించినట్లు తెలిపారు. జిందాల్ కోసం ఒక్క ఎకరం భూమిని కూడా రైతుల దగ్గర సేకరించలేదని, 2013 భూసేకరణ చట్టం ఇక్కడ వర్తించదని కలెక్టర్ స్పష్టం చేశారు. మొత్తం 28.72 ఎకరాలకు సంబంధించి 15 మంది రైతులకు ఉన్న బకాయిని వారం రోజుల్లో చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 1962లో మొత్తం 20 మందికి పట్టాలు ఇవ్వగా వారిలో నలుగురు మాత్రమే ఇళ్లు కట్టుకోగా, వారికి అప్పట్లోనే పరిహారం చెల్లించినట్లు తెలిపారు. షేర్లు, ఉద్యోగ కల్పన, వన్టైమ్ సెటిల్మెంట్కు సంబంధించి జిందాల్ యాజమాన్యమే రైతులతో నేరుగా ఒప్పందం కుదుర్చుకుందని దానిలో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, డీసీఎంఎస్ చైర్మన్ గొంపకృష్ణ, జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్, ఎస్కోట తహసీల్దార్ డి. శ్రీనివాసరావు, కలెక్టరేట్ డి సెక్షన్ సూపరింటెండెంట్ తాడ్డి గోవింద, ఇతర అధికారులు, జిందాల్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. సమీక్షించిన కలెక్టర్ అంబేడ్కర్ -
అక్కరకు రాని ఈఎస్ఐ
● ఎక్స్రేకు దిక్కులేదు ● అరకొరగా రక్తపరీక్షలు ● శిథిలావస్థలో భవనాలు ● జరగని ఎల్ఎఫ్టీ పరీక్షలు విజయనగరం ఫోర్ట్: కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తాం. ఈఎస్ఐ డిస్పెన్సరీ, డయోగ్నొస్టిక్ సెంటర్స్లో సౌకర్యాలు కల్పిస్తాం అంటూ కూటమి ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. కానీ ఆ గొప్పమాటలు అమలుకు నోచుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంక్షేమం మాట దేవుడెరుగు. కార్మికులకు కనీస సౌకర్యాలు కూడా అందని పరిస్థితి ఉంది. దీంతో కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. కార్మికులు ఏదైనా జబ్బు చేసినా, ప్రమాదం జరిగినా చికిత్స కోసం వచ్చే ఈఎస్ఐ డయోగ్నొస్టిక్ సెంటర్లో సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఎక్స్రేకు రేడియాగ్రాఫర్ కరువు ఈఎస్ఐ డయోగ్నొస్టిక్ సెంటర్లో ఎక్స్రేకు దిక్కు లేకుండా పోయింది. సెంటర్కు ఎక్కువగా ఎముకల సంబంధిత వ్యాధులతో కార్మికులు వస్తారు. అదేవిధంగా పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగినప్పడు గాయాలతో వస్తారు. వారికి వ్యాధి నిర్ధారణ కోసం ఎక్స్రే తీయాల్సి ఉంటుంది. అయితే డయోగ్నొస్టిక్ సెంటర్లో ఎక్స్రే మిషన్ ఉన్నప్పటికీ తీసే నాథుడు లేకపోవడం వల్ల కార్మికులు ప్రైవేట్ ల్యాబొరేటరీలకు కార్మికులు వెళ్లి రూ. 300 నుంచి రూ. 350 వరకు వెచ్చించాల్సి వస్తోంది. అదేవిధంగా అల్ట్రాసౌండ్ స్కాన్ ఉన్నప్పటికీ రేడియాలజిస్టు లేకపోవడంతో గైనకాలజిస్టులు అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తున్నారు. సెంటర్లో ఓపీ విభాగాలు ఈఎస్ఐ డయోగ్నొస్టిక్ సెంటర్లో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఎముకల విభాగం, అప్తమాలజీ, గైనిక్, ఈఎన్టీ, పిడియాట్రిక్ ఓపీ విభాగాలు ఉన్నాయి. ఆయా ఓపీ విభాగాల్లో సేవలు పొందేందుకు కార్మిక కుటుంబసభ్యులు ప్రతి రోజు 50 నుంచి 60 మంది వరకు వస్తారు. జాడే లేని ఎల్ఎఫ్టీ పరీక్ష డయోగ్నొస్టిక్ సెంటర్లో ఎల్ఎఫ్టీ (లిఫిడ్ ప్రొఫైల్ టెస్ట్) జరగడం లేదు. దీంతో కార్మికులు ఈ టెస్టు కోసం ప్రైవేట్ ల్యాబ్లను ఆశ్రయిస్తూ రూ.300 నుంచి రూ.400 వరకు ఖర్చు చేస్తున్నారు. సెంటర్ పరిధిలో 21 వేల మంది కార్మికులు ఈఎస్ఐ డయోగ్నొస్టిక్ సెంటర్ పరిధిలో 21 వేల మంది కార్మికులు ఉన్నారు. వారంతా ఏదైనా జబ్బు చేస్తే చికిత్స కోసం వస్తారు. ఓపీ సేవలు అవసరమైన వారికి ఇక్కడ చికిత్స అందిస్తారు. ఇన్పేషేంట్ సేవలు అవసరమైన వారికి విశాఖలోని మల్కాపురంలో ఉన్న ఈఎస్ఐ ఆస్పత్రికి రిఫర్ చేస్తారు. శిధిలావస్థకు చేరిన భవనాలు ఈఎస్ఐ డయోగ్నొస్టిక్ సెంటర్ భవనాలు శిథిలావస్థకు చేరాయి. భవనాలన్నీ పెచ్చులు ఊడిపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని కార్మికులు, సెంటర్ వైద్య సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. గాజులరేగ వద్ద నిర్మాణంలో ఉన్న ఈఎస్ఐ 100 పడకల ఆస్పత్రి నిర్మాణం ఏళ్లు గడుస్తున్నా ఇంకా పూర్తి కాలేదు. రేడియోగ్రాఫర్ లేరు ఎక్స్రేలు తీసే రేడియోగ్రాఫర్ వేరే ఉద్యోగం వచ్చి వెళ్లి పోయారు. దీంతో ఎక్స్రేలు తీయడం లేదు. రేడియాగ్రాఫర్ను నియమించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. సెంటర్ను ప్రైవేట్ భవనంలోకి మార్చాలని ప్రతిపాదన ఉంది. త్వరలోనే మార్చే అవకాశం ఉంది. డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి, సూపరింటెండెంట్, ఈఎస్ఐ డయోగ్నొక్ సెంటర్ -
సీ్త్రనిధి జిల్లా టార్గెట్ రూ.86 కోట్లు
సీతానగరం: జిల్లాలోని స్వయం సహాయక సంఘాల సభ్యుల జీవనోపాధికి వివిధరకాల వృత్తులపై శిక్షణ ఇవ్వడంతోపాటు బ్యాంకుల ద్వారా రుణసదుపాయం కల్పించనున్నట్లు వెలుగు సీ్త్రనిధి జిల్లా ఏజీఎం పి.కామరాజు అన్నారు. ఈ మేరకు మండలకేంద్రంలోని మండల వెలుగు సమాఖ్య కార్యాలయంలో వెలుగు ఏపీఎం రెడ్డిశ్రీరాములు అధ్యక్షతన సిబ్బందితో సీ్త్ర నిధి రుణసదుపాయాలపై ఆయన శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏజీఎం కామరాజు మాట్లాడుతూ 2025–26 సంవత్సరానికి జిల్లా టార్గెట్ రూ.86 కోట్లుండగా ఇప్పటి వరకూ రూ.9 కోట్ల 20లక్షలు పొదుపు సంఘాల సభ్యులకు ఇచ్చినట్లు చెప్పారు. మండలసమాఖ్య పర్యవేక్షణలో అర్హులైన వారందరికీ జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా సీ్త్ర నిధి రుణాలు బ్యాంకుల ద్వారా సమకూర్చనున్నామన్నారు. అలాగే సీతానగరం మండలం టార్గెట్ రూ.8 కోట్లు ఉండగా ఇప్పటివరకూ రూ.90 లక్షలు రుణ సదుపాయం కల్పించినట్లు చెప్పారు. వృత్తి పనిలో శిక్షణ పొందిన వారంతా అర్థికంగా లబ్ధిపొందడానికి వివిధ రకాల వ్యాపారాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో మండల సమాఖ్య సభ్యులు సీసీలు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎత్తుకు పై ఎత్తు వేస్తున్న ఆటగాళ్లు..!
విజయనగరం: చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం జిల్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 5వ జాతీయ స్థాయి దివ్యాంగుల జాతీయ చెస్ చాంపియన్ షిప్ పోటీలు రెండవ రోజు ఆసక్తికరంగా సాగాయి. జిల్లా కేంద్రంలోని మెసానిక్ టెంపుల్లో నిర్వహిస్తున్న రెండోరోజు పోటీలను చిన్న శ్రీను సోల్జర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు మజ్జి సిరిసహస్ర శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో ఆత్మీయంగా మాట్లాడిన ఆమె పోటీల్లో విజేతలుగా నిలవాలంటూ ప్రోత్సహించారు. ఇదిలా ఉండగా దేశంలోని 16 రాష్ట్రాలకు చెందిన106 మంది క్రీడాకారులు జాతీయ చెస్ చాంపియన్ షిప్ పోటీల్లో తలపడుతుండగా..రెండవ రోజు ముగిసే సమయానికి 8 రౌండ్లు పూర్తయినట్లు చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం జిల్లా కార్యదర్శి కేవీ జాల్వాముఖి తెలిపారు. శనివారం 9వ రౌండ్ ముగిసిన అనంతరం విజేతలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. వివిద కేటగిరీల్లో నిర్వహించే జాతీయస్థాయి పోటీల్లో మొదటి మూడు స్థానాలు కై వసం చేసుకున్న క్రీడాకారులను త్వరలో జరగనున్న అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నామన్నారు. కార్యక్రమంలో చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం ప్రతినిధులు పలువురు పాల్గొన్నారు. ఆసక్తికరంగా చెస్ పోటీలు -
మడ్డువలస ప్రాజెక్టు సమీపంలో ఏనుగుల గుంపు
వంగర: మండల పరిధి మడ్డువలస ప్రాజెక్టు సమీపంలో ఏనుగుల గుంపు శుక్రవారం సంచరించింది. మూడురోజుల కిందట మండలంలోని కొత్త మరువాడ వద్ద ప్రవేశించిన తొమ్మిది ఏనుగుల గుంపు సీతాదేవిపురం, గంగాడ, నారంనాయుడువలస, నీలయ్యవలస, జగన్నాథవలస గ్రామాల మీదుగా మడ్డువలస ప్రాజెక్టు సమీపానికి చేరుకుని తిష్ఠ వేశాయి. అనంతరం పటువర్ధనం గ్రామ సమీపంలో ఉన్న వెంకన్న చెరువు వైపు ఏనుగుల గుంపు పయనమైంది. దీంతో పరిసర గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అటవీశాఖ సిబ్బందితో పాటు వీఆర్వో కృష్ణ, వీఆర్ఏ శ్రీరాములు, పోలీస్సిబ్బంది ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఆర్టీసీ డీపీటీఓగా వరలక్ష్మి విజయనగరం అర్బన్: ఆర్టీసీ జిల్లా ప్రజారవాణా అధికారి (డీపీటీఓ)గా జి.వరలక్ష్మి ఆర్టీసీ కాంప్లెక్స్లో ఉన్న తన చాంబర్లో శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. విజ యనగరం జోనల్ వర్క్షాప్ మేనేజర్గా ఇంతవరకు పనిచేసిన ఆమె బదిలీపై వచ్చారు. గతంలో జోనల్ స్టాఫ్ శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్గా, వివిధ హోదాల్లో ఆర్టీసీలో సర్వీసు చేసిన అనుభవం ఉంది. ఇంతవరకు ఇక్కడ డీపీటీఓగా పనిచేసిన సీహెచ్ అప్పలనారాయణ దీర్ఘకాలిక సెలవులో ఉండడంతో ఆమెకు బాధ్యతలు అప్పగించారు. ఆమెకు కార్మిక సంఘాల ప్రతినిధులు, కార్యాలయ సిబ్బంది అభినందనలు తెలిపారు. డీపీటీఓను కలిసిన వారిలో ఎంప్లాయీస్ యూని యన్ జోనల్ కార్యదర్శి పి.భానుమూర్తి, జిల్లా కార్యదర్శులు జి.రవికిరణ్, ఎన్ఎంయూ జిల్లా కార్యదర్శి రాఫెల్, అధ్యక్షుడు దుర్గరాజు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పడు, తదితర సంఘం సభ్యులు ఉన్నారు. పీహెచ్సీల్లో ప్రసవాల సంఖ్య పెరగాలి ● డీఎంహెచ్ఓ జీవనరాణి పూసపాటిరేగ: పీహెచ్సీల్లో ప్రసవాల సంఖ్య పెరగాలని డీఎంహెచ్ఓ జీవనరాణి అన్నారు. పూసపాటిరేగ పీహెచ్సీని ఆమె శుక్రవారం ఆకస్మికంగా తనిఖీచేశారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు అందిస్తున్న వైద్యసేవలపై వైద్యులు ప్రమీలాదేవి, బి.కృష్ణ చైతన్యను అడిగి తెలుసుకున్నారు. అతిసార నియంత్రణ కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలన్నారు. ఆమె వెంట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ చంద్రశేఖరరాజు, హెల్త్ ఎడ్యుకేటర్ అనిల్ప్రేమ్కుమార్, సీహెచ్ఓ వేదమణి, సిబ్బంది మహేశ్వరి, నానమ్మ, జానకమ్మ ఉన్నారు. జగన్నాథునికి పూజలు విజయనగరం టౌన్: విజయనగరం కన్యకపరమేశ్వరీ ఆలయం వద్ద నిర్వహించిన జగన్నాథస్వామి రథయాత్రలో జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు సతీమణి మజ్జి పుష్పాంజలి, అల్లుడు ప్రదీప్ నాయుడు, కుమార్తె సిరిసహస్ర పాల్గొన్నారు. స్వామివారిని దర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమలను సమర్పించారు. వేదపండితులు వేదాశీస్సులు అందజేశారు. -
రాజాంలో రియల్ దందా!
● సాగునీటి చెరువులు కబ్జా ● మాయమవుతున్న ఎరుకువాని చెరువు రాజాం: రాజాంలో రియల్ ఎస్టేట్ దందా సాగుతోంది. సాగునీటి చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయి. రాత్రికి రాత్రి నివాస స్థలాలుగా మారుతున్నాయి. దీనికి రాజాం మండలం మొగిలివలస గ్రామ పరిధిలోని శ్రీ చైతన్య స్కూల్ సమీపంలోని ఎరుకువాని చెరువే నిలువెత్తు నిదర్శనం. 20 ఎకరాల చెరువు గర్భంతో ఉన్న చెరువు ఏడాది కాలంలో 20 సెంట్లు మిగిలిఉందంటే ఆక్రమణల పర్వం ఏ స్థాయిలో జరుగుతుందో గుర్తించవచ్చు. నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు చెరువు గర్భంలో ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి ఆక్రమణలు తొలగించాలని కోరుతున్నారు. ఈ విషయంపై రాజాం తహసీల్దార్ ఎం.రాజశేఖరం స్పందిస్తూ ఎరుకువాని చెరువు ఆక్రమణలకు గురవుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆర్ఐలు, వీఆర్వోలు, సర్వేయర్లతో కొలతలు వేసి, ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చే కార్యక్రమం చేపట్టామన్నారు. జిల్లా అధికారులు దృష్టిలోపెట్టి ఆక్రమణలు పూర్తిగా తొలగిస్తామని స్పష్టంచేశారు. -
3న వైఎస్సార్సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం
విజయనగరం: వైఎస్సార్సీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం వచ్చేనెల 3న నిర్వహించనున్నట్టు విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు జగన్నాథ ఫంక్షన్ హాల్లో జరిగే సమావేశంలో శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబుతోపాటు ఎమ్మెల్సీలు, ఎంపీలు, పీఏసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ఇతర ముఖ్యనాయకులు పాల్గొంటారని పేర్కొన్నారు. జిల్లాలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారన్నారు. సమావేశానికి కార్పొరేషన్/ మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, పార్టీ మండలాధ్యక్షులు, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర/జిల్లా/నియోజకవర్గ/మండల స్థాయి పార్టీ కమిటీలో వివిధ హోదాలోగల సభ్యులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్ని విజయవంతం చేయాలని కోరారు. జెడ్పీచైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు -
● ఒక విద్యార్థిని.. ఒక టీచర్
చిత్రం చూశారా.. ఒకే ఒక్క బాలికకు పాఠ్యాంశాలు బోధిస్తున్నది దత్తిరాజేరు మండలం చినవంగర గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు సత్యమూర్తి. ఆ పాఠశాలలో గతేడాది లెన్సీ అనే ఒకేఒక్క చిన్నారి చేరింది. ఆ బాలికకే ఉపాధ్యాయుడు పాఠ్యాంశ బోధన చేస్తూవచ్చారు. ఈ ఏడాది కూడా రెండో తరగతికి వచ్చిన ఆ చిన్నారికి చదువు చెబుతున్నారు. కొత్తగా ఒకటో తరగతిలో ఇప్పటివరకు ఒక్క విద్యార్థి కూడా చేరలేదని ఉపాధ్యాయుడు తెలిపారు. విద్యార్థులు బడిలో చేరితే చక్కని బోధన అందిస్తానని చెప్పారు. – దత్తిరాజేరు -
పీఎంఎఫ్బీవైపై విస్తృత ప్రచారం
విజయనగరం అర్బన్: ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై) పథకాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకునేలా విస్తృత ప్రచారం చేయాలని జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ అధికారులకు సూచించారు. పంటల బీమా పథకం వివరాలు తెలియజేసే కరపత్రాలు, పోస్టర్లను జేసీ తన చాంబర్లో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి విపత్తుల సమయంలో వరి, మొక్కజొన్న, సువ్వులు, పత్తి తదితర పంటల పాడైతే పీఎంఎఫ్బీవై కింద పరిహారం అందుతుందన్నారు. రైతులు ప్రీమియం చెల్లించి లబ్ధిపొందాలని కోరారు. జిల్లా వ్యవసాయ అధికారి వీటీ రామారావు మాట్లాడుతూ పంటల బీమా పథకాన్ని వరి పంటకు గ్రామం యూనిట్గాను, మొక్కజొన్న, నువ్వు పంటలకు మండలం యూనిట్గా అమలు చేస్తారని, పత్తి పంటకు వాతావరణ పరిస్థితులు ఆధారంగా మండలం యూనిట్గా అమలు చేస్తారని తెలిపారు. ఎకరానికి వరి పంటకు రూ.200, మొక్కజొన్నకు రూ.165, నువ్వుల పంటకు రూ.65 చొప్పున రైతులు ప్రీమి యం చెల్లించాలన్నారు. పత్తి పంటకైతే ఎకరాకు రూ.1923 చొప్పున రైతులు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ రమణమూర్తి, డీసీసీబీ సీఈఓ ఉమామహేశ్వరరావు, ఇప్కోప్రతినిధి రామకృష్ణ, వ్యవసాయ ఇన్సూరెన్స్ కంపెనీ జోనల్ మేనేజర్ జనార్దన్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. జేసీ సేతు మాధవన్ -
వైభవంగా జగన్నాథుని రథయాత్ర
● ముహూర్తానికి కదిలిన జగన్నాథ రథచక్రాలు ● స్వామివారిని దర్శించి, తరించిన భక్తలోకం విజయనగరం టౌన్: మంగళ వాయిద్యాలు, భక్తుల జయజయ ధ్వానాలు, మహిళల కోలాట ప్రదర్శనలు, వేదపండితుల వేదమంత్రోచ్ఛారణల నడుమ విజయనగరం సంతపేట జగన్నాథస్వామి రథయాత్ర శుక్రవారం వైభవంగా సాగింది. ఉదయం 9.15 గంటలకు శాస్త్రోక్తంగా జగన్నాథస్వామివారితో పాటు బలభద్ర, సుభద్ర విగ్రహా లను ఆశీనులు చేశారు. అనంతరం దేవదాయశాఖ జిల్లా అసిస్టెంట్ కమిషన్, ఆలయ ఈఓ కె.శీరీష రథం లాగి రథయాత్రను ప్రారంభించారు. రథంపై వచ్చిన స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. దాసన్నపేట, మూడుకోవెళ్లు, కొత్తపేట శ్రీమన్నార్ రాజగోపాలస్వామి ఆలయం ఆవరణలోనూ రథోత్సవం వేడుకగా జరిగింది. రాత్రి స్వామివారిని గుండిచా మందిరానికి తరలించారు. తోమాలమందిరం వద్ద శనివారం నుంచి స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ సందర్భంగా ఈఓ శిరీష మాట్లాడుతూ ఈ నెల 28న శనివారం నుంచి జూలై 4వ తేదీ శుక్రవారం వరకు ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు, విష్ణు సహస్రనామాలు, జగన్నాథస్వామివారి చరిత్ర, భగవద్గీత, గోవిందనామస్మరణ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. జూలై 5న శనివారం మారు రథయాత్ర ఉత్సవం వేడుకగా నిర్వహిస్తామని తెలిపారు. భక్తులందరూ స్వామివారిని దర్శించి, తరించాలని కోరారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
రసాభాసగా టీడీపీ గ్రామ కమిటీల ఎన్నిక సమావేశం
● డెంకాడలో వర్గపోరు ● సమావేశం సాక్షిగా కేకలు వేసుకుంటూ, ఒకరినొకరు తోసుకున్న నాయకులు, కార్యకర్తలు ● నిలిచిన గ్రామ కమిటీల ఎన్నిక ప్రక్రియ డెంకాడ: విజయనగరం జిల్లా డెంకాడ మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన టీడీపీ సమావేశం, గ్రామ కమిటీ ఎన్నిక రసాభాసగా సాగింది. పార్టీ గామ ఎన్నికల కమిటీ పరిశీలకుడు, విజయనగరానికి చెందిన కనకల మురళీమోహన్ సమక్షంలోనే పార్టీ నాయకులు, కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఒకరిపై ఒకరు కేకలు వేసుకుంటూ, తోసుకుంటూ గందరగోళాన్ని సృష్టించారు. ఎన్నిలక పరిశీలకుడితో పాటు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కర్రోతు బంగార్రాజు, మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖరరావు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పతివాడ అప్పలనారాయణ, పార్టీ మండలాధ్యక్షుడు పల్లె భాస్కరరావు గ్రామాల వారీగా నాయకులు, కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. ఆ సమయంలో పల్లెల్లోని పార్టీ శ్రేణుల్లో విభేదాలు ఒక్కసారి పొడచూపాయి. ఒకరిపై ఒకరు దూషణకు దిగారు. ఎన్నిక ప్రక్రియ రచ్చగా మారడంతో కొన్ని గ్రామ కమిటీ ఎన్నిక ప్రక్రియను నిలిపివేశారు. వాస్తవంగా చాలా రోజులుగా నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు వర్గాలుగా చీలిపోయాయి. ఓ వర్గం జనసేనకు చెందిన ప్రస్తుత ఎమ్మెల్యే నాగమాధవికి మద్దతు ఇవ్వడంతో మరోవర్గం గుర్రుగా ఉంది. ఎమ్మెల్యేతో తిరిగిన వర్గానికి చెందిన వారికే పనులు జరుగుతుండడం, మిగిలిన వారి పనులు పెండింగ్లో ఉండిపోతుండడంతో తరచూ అలజడి రేగుతోంది. దీని ప్రభావం ఇప్పుడు గ్రామకమిటీల ఎన్నికలపై పడింది. పల్లెల్లోనూ పార్టీ శ్రేణులు రెండు వర్గాలుగా విడిపోవడమే ఈ అలజడికి ప్రధాన కారణమని పార్టీ నాయకులు కొందరు బహిరంగంగా చెబుతున్నారు. -
సిగ్నల్ లేక.. సకాలంలో 108 రాక..
సీతంపేట: మొబైల్ సిగ్నల్ లేక.. సకాలంలో 108 అంబులెన్స్ రాక రోడ్డు ప్రమాద బాధితుడు గంటన్నర పాటు నరకం చూసిన ఘటన సీతంపేట మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... సీతంపేట మండలంలోని మారుమూలన ఉన్న బంజారుగూడ–పుట్టిగాం మధ్య ఎత్తైన ఘాట్రోడ్డులో శుక్రవారం మధ్యాహ్నం 12.10 గంటల సమయంలో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో గగాలి గ్రామానికి పరామర్శకు వెళ్లి వస్తున్న కొత్తరు మండలం మెట్టూరుకు చెందిన వీరన్నకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సమయంలో అక్కడ 108కు ఫోన్ చేద్దామని ఆటోలో ఉన్న కుటుంబ సభ్యులంతా ఎంత ప్రయత్నించినా సెల్సిగ్నల్ లేకపోవడంతో వీలుపడలేదు. స్థానికులు సెల్సిగ్నల్ చోటకు పరుగుతీసి 108కు సమాచారం అందించారు. సీతంపేట, కొత్తూరు 108 అంబులెన్స్లు ఖాళీగా లేవని, భామిని అంబులెన్స్ వస్తుందని సమాచారం ఇచ్చా రు. మారుమూల ప్రాంతం కావడం, సిగ్నల్ సమ స్యతో భామిని అంబులెన్స్ వచ్చేసరికి మధ్యాహ్నం 1.50 అయ్యింది. అంబులెన్స్ సిబ్బంది వీరన్నకు ప్రాథమిక చికిత్స అందించి సీతంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. గంటన్నర పాటు నరకం చూసిన రోడ్డు ప్రమాద బాధితుడు ఆస్పత్రికి తరలించేందుకు అవస్థలు ఘాట్ రోడ్లో ఆటోబోల్తా -
మత్తుపదార్థాలకు బానిసలు కావద్దు
విజయనగరం క్రైమ్: మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని, బంగారంలాంటి జీవితాన్ని ఏ ఒక్కరూ నాశనం చేసుకోవద్దని విశాఖ పోలీస్ రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు, అక్రమ రవాణా నివారణ దినోత్సవం సందర్భంగా విజయనగరం రింగ్ రోడ్డు వద్ద ఉన్న ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో పోలీస్శాఖ గురువారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పొరుగు జిల్లాలు, రాష్ట్రంలో సాగుచేస్తున్న గంజాయి జిల్లా మీదుగా ఏడాది పొడవునా అక్రమ రవాణా సాగుతోందన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అక్రమంగా పండిస్తున్న గంజాయి నిర్మూలనకు చర్యలు చేపట్టామన్నారు. 500 ఎకరాల్లో విస్తరించిన గంజాయి తోటలను ధ్వంసం చేశామన్నారు. డీఐజీ హరీష్ గుప్తా ఆదేశాల మేరకు గంజాయి అక్రమ రవాణా చేసేవారిపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ డ్రగ్స్కు యువత అలవాటు పడవొద్దని, క్షణికానందానికి లోనుకావద్దని కోరారు. కలిసికట్టుగా పనిచేస్తే గంజాయి రవాణా, వినియోగాన్ని అరికట్టవచ్చని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ గంజాయి నిర్మూలనకు సంకల్పం కార్యక్రమాన్ని చేపట్టామని, యువతలో మార్పు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 200లకు పైగా సంకల్ప సభలు నిర్వహించినట్టు వెల్లడించారు. కార్యక్రమం అనంతరం కళాశాలల విద్యార్థులతో వేదికపై ఉన్న అధికారులందరూ డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం రింగ్ రోడ్డు నుంచి ఐస్ ఫ్యాక్టరీ, ఆయోధ్య మైదానం, సంస్కృత కళాశాల, సింహాచలం మేడ, కోట వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. కోటవద్ద దాదాపు 40 నిమిషాల పాటు కళాశాలల విద్యార్థులు డ్రగ్స్కు అలవాటు పడితే జీవితాలు నాశనమవుతాయంటూ నృత్య రూపకం ప్రదర్శించారు. కార్యక్రమాన్ని డీఐజీ, కలెక్టర్, ఎస్పీ దగ్గరుండి తిలకించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సౌమ్యలత, మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, సహకార బ్యాంకు చైర్మన్ గొంప కృష్ణ, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు స్వప్నహైందవి, డాక్టర్ వెంకటేశ్వరరావు, డీఎస్పీలు శ్రీనివాస్, కాంతారావు, సీఐలు లక్ష్మణరావు, శ్రీనివాస్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అంతర్జాతీయ మాదకద్రవ్యాల అక్రమరవాణా దినోత్సవంలో విశాఖరేంజ్ డీఐజీ పిలుపు -
వినతులకు నాణ్యమైన పరిష్కారం చూపాలి
విజయనగరం అర్బన్: రెవెన్యూ వినతులకు న్యాయమైన, నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్కు వచ్చే వినతుల్లో 90 శాతం రెవెన్యూకు సంబంధించినవే ఉంటున్నాయన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జేసీ సేతుమాధవన్తో కలిసి రెవెన్యూ అధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ, అందరికీ గృహాలు, ఇళ్ల స్థలాల రీ వెరిఫికేషన్, నీటి తీరువా, ఆన్లైన్ సేవలపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. అందరికీ గృహాలు పథకం కింద జిల్లాలో 6 వేల దరఖాస్తులు అందాయని, వీటిని వెరిఫైచేసి వెంటనే ఆన్లైన్ చేయాలని తెలిపారు. సచివాలయ సర్వేయర్లు విధులకు సక్రమంగా హాజరు కావడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయని, వారికి వెంటనే మెమోలు జారీ చేసి జీతాలను నిలుపుదల చేయాలని ల్యాండ్ రికార్ుడ్స ఏడీ రమణమూర్తిని ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో శ్రీనివాసమూర్తి, ఆర్డీఓలు సవరమ్మ, రామ్మోహన్రావు, ఆశయ్య, డిప్యూటీ కలెక్టర్ మురళీ, హౌసింగ్ పీడీమురళీ, తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, డీటీలు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ -
నీలయ్యవలసలో ఏనుగుల గుంపు
వంగర: మండల పరిధి నీలయ్యవలస గ్రామ సమీపంలోకి ఏనుగుల గుంపు గురువారం చేరుకుంది. రెండు రోజుల కిందట కొత్తమరువాడలో ప్రవేశించిన తొమ్మిది ఏనుగులు సీతాదేవిపురం, గంగాడ, నారంనాయుడువలస గ్రామాలను దాటుకొని నీలయ్యవలస గ్రామం అక్కసాగరం సమీపంలోకి చేరుకున్నాయి. వరి వెద, మొక్కజొన్న పంటల్లో సంచరిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఏనుగుల తరలింపునకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఏడీకి భోజన కార్మికుల సమ్మెనోటీసు విజయనగరం గంటస్తంభం: మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ జూలై 9న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటామని యూనియన్ ప్రధాన కార్యదర్శి బి.సుధారాణి తెలిపారు. ఈ మేరకు విద్యాశాఖ ఏడీకి ఏపీ మధ్యాహ్నభోజన పథకం కార్మికులు గురువారం సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా సుధారాణి మాట్లాడుతూ 45వ కార్మిక సదస్సు నిర్ణయం ప్రకారం మధ్యాహ్న భోజన కార్మికులను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని, లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, మెనూ చార్జీల కింద ఒక్కో విద్యార్థికి కనీసం రూ.20లు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల నుంచి తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ప్రమాద బీమాను వర్తింపజేయాలన్నారు. సమ్మెనోటీసు ఇచ్చిన వారిలో లక్ష్మి, ఉమా, రాములమ్మ, తదితరులు పాల్గొన్నారు. కూటమి నిద్ర పోతోందా? ● గిరిజన సంఘం సూటిప్రశ్నశృంగవరపుకోట: మండలంలోని ధారపర్తి పంచాయతీకి చెందిన గిరిజన మహిళ పురిటి నొప్పులతో అల్లాడి శిశువుకు జన్మనిచ్చింది. ప్రసవానంతరం తల్లీబిడ్డలకు వైద్యం నిమిత్తం గ్రామస్తులు, కుటుంబసభ్యులు హుటాహుటిన డోలీ కట్టి వర్షం కురుస్తుండగా, జారుతున్న రాళ్లు, రప్పలు, కొండ బురద మధ్య 20కి.మీ మోసుకొచ్చి దబ్బగుంటకు చేర్చారు. అక్కడి నుంచి ఎస్.కోట ప్రభుత్వాస్పత్రిలో తరలించారు. ఆస్పత్రిలో వైద్యసిబ్బంది తల్లీ బిడ్డలకు ప్రాథమిక వైద్యం అందించారు. ఈ ఘటనపై గిరిజన సంఘం నేతలు, స్థానిక యువకులు మాట్లాడుతూ కూటమి సర్కారు కొలువు తీరగానే డిప్యూటీ సీఎం గిరిజన గ్రామాలకు రోడ్లు వేస్తామన్నారు. గిరిశిఖర గ్రామాలకు డోలీ మోతలు ఉండవని కూటమి పెద్దలు సెలవిచ్చారు. మంజూరైన రోడ్డు పనులు ఎందుకు చేయడం లేదు? కూటమి పెద్దలు కునుకు నిద్రపోతున్నారా? అని మండిపడ్డారు. -
గ్రామ సర్వేయర్ల సమస్యలు పరిష్కరించాలి
పార్వతీపురం: గ్రామసర్వేయర్లు ఎదుర్కొంటున్న స మస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం కలెక్టరేట్కు ర్యాలీగా వచ్చి కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా స ర్వేయర్ల సంఘం నాయకుడు ఉదయ్ కుమార్ మా ట్లాడుతూ ఐదేళ్ల సర్వీసు పూర్తయినప్పటికీ రేషనలైజేషన్లో కానీ, బదిలీ ప్రక్రియనులోకానీ తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. గ్రామ సర్వేయర్లుగా ఉన్న తమకు సొంత మండలాల్లో పోస్టింగ్ ఇవ్వాలని కోరుతూ కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో గరుగుబిల్లి, పార్వతీపురం, కొమరాడ, కురుపాం, జియ్యమ్మవలస, పాలకొండ, వీరఘట్టం, సీతంపేట తదితర మండలాల నుంచి సర్వేయర్లు పాల్గొన్నారు. కలెక్టర్కు వినతిపత్రం అందజేత -
ఏపీ పీజీసెట్లో విజయకేతనం
విజయనగరం అర్బన్/బొబ్బిలిరూరల్: రాష్ట్రంలోని గుర్తింపు పొందిన యూనివర్సిటీల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ పీజీసెట్–2025లో విజయనగరం జిల్లా విద్యార్థులు ప్రతిభ చూపారు. జియాలజీ సబ్జెక్టులో మహరాజా అటానమస్ కళాశాలకు చెందిన డి.నవీన్ ఫస్ట్, వై.ఈశ్వర్గేయ సెకెండ్ ర్యాంకులు సాధించారు. వీరిని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.సాంబశివరావుతో పాటు వివిధ విభాగాల అధ్యాపకులు టి.శంకరరావు, కె.సత్యనారాయణ నాయుడు, జియాలజీ విభాగాధిపతి డాక్టర్ పి.గణపతిరావు గురువారం అభినందించారు. ● బొబ్బిలి మండలం పెంట గ్రామానికి చెందిన చింతల గౌరీశ్వరి తెలుగు సబ్జెక్టులో 88 మార్కులతో రాష్ట్రస్థాయిలో ఫస్ట్ ర్యాంకు సాధించింది. ఆమెను తల్లిదండ్రులు చింతల సత్యం, అనసూర్యతో పాటు గ్రామస్తులు అభినందించారు. -
రామయ్యా..చూడవేమయ్యా..!
● పవిత్ర బోడికొండను తవ్వేస్తున్న అక్రమార్కులు ● మనోభావాలను దెబ్బతీస్తున్నారని భక్తుల ఆగ్రహం ● స్పందించని అధికార యంత్రాంగంనెల్లిమర్ల రూరల్: సాక్షాత్తు శ్రీరాముడే నడయాడిన నేలగా రామతీర్ధాన్ని భక్తులు విశ్వసిస్తుంటారు. నీలాచలం పర్వతంగా పిలుస్తున్న రామతీర్థంలోని బోడికొండపై పాండవులు సంచరించినట్లు చరిత్ర చెబుతోంది. కొండపై శ్రీ కోదండరాముడి ఆలయంతో పాటు అలనాటి చారిత్రక గుర్తులను చూసేందుకు సందర్శకులు నిత్యం కొండపైకి వెళ్తుంటారు. అంతటి సుదీర్ఘ చరిత్ర కలిగిన బోడికొండను సైతం అక్రమార్కులు విడిచిపెట్టడం లేదు. గడిచిన కొద్ది నెలలుగా ధనార్జనే లక్ష్యంగా శ్రీరాముడి కొండనే తవ్వేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. సీతారామునిపేట జంక్షన్ సమీపంలో ఉన్న కొండవద్ద గడిచిన కొన్ని రోజులుగా గ్రావెల్ అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. సమీప గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు జరుగుతుండడంతో కొందరు అక్రమార్కులు జేసీబీలు, ట్రాక్టర్లను పెట్టి కొండను తవ్వేస్తున్నారు. పట్టపగలే ఈ వ్యవహారం జరుగుతున్నా..ఇటు దేవస్థానం అధికారులు కానీ, అటు రెవెన్యూ యంత్రాంగం కానీ స్పందించకపోవడం బాధాకరం. కొండపై ఉన్న పెద్దపెద్ద బండరాళ్లు సైతం కిందపడుతున్నాయంటే తవ్వకాలు ఏ విధంగా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ట్రాక్టర్ లోడును పరిధిని బట్టి రూ.600 నుంచి రూ.1000 వరకు అమ్మేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నెల్లిమర్ల–రణస్థలం ప్రధాన రహదారి పక్కనే ఈ అక్రమ తవ్వకాలు జరుగుతుండడం గమనార్హం. ప్రభుత్వ భూములకు ఎలాగూ రక్షణ లేదు సరికదా.. సాక్షాత్తు దేవుడి కొండనైనా అక్రమార్కుల నుంచి కాపాడలేరా..? అంటూ భక్తులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి బోడికొండను తవ్వేస్తున్న అక్రమార్కులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
దోమల కాయిల్స్తో అనర్థాలు
● మార్కెట్లో విచ్చలవిడిగా నాశిరకం బ్రాండ్ల విక్రయాలు ● సహజ పద్ధతులే మేలంటున్న వైద్యులుపార్వతీపురం: దోమకాటుతో అనారోగ్యానికి గురవుతామన్న భయంతో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా మార్కెట్లో లభించే మస్కిటో కాయిల్స్ను వాడడం పరిపాటిగా మారింది. మార్కెట్లో లభించే మస్కిటో కాయిల్స్తో పాటు మస్కిటో అగరబత్తీలను విరివిగా వినియోగిస్తున్నారు. వాటి ద్వారా వచ్చే పొగతో దోమలు రావని భావించి వెలిగిస్తుంటారు. పొగ బయటకు పోకుండా ఇంట్లోని తలుపులన్నీ బిగించి ఈ కాయిల్స్ను వెలిగిస్తారు. ఈ పొగలో కార్సినోజెనిక్ రసాయనాలు కలిగిఉండడం వల్ల ఆస్తమా ఉన్న వారికి, చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులకు శరీరంలో పలు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. నిజానికి మస్కిటో కాయిల్స్ వినియోగం వల్లే కేవలం దోమలు చనిపోవడం లేదు. ఆ పొగ ఉన్నంత సేపు దోమలు సంచరించేందుకు వీలులేక మగతగా ఉండి వాసన తగ్గిన తరువాత అలాగే పొగ ప్రభావం తగ్గిన వెంటనే యథావిధిగా మళ్లీ దోమలు దాడికి పాల్పడతాయి. రోజురోజుకు దోమలు ప్రబలడంతో మార్కెట్లోకి నాశిరకం బ్రాండ్లు కూడా వచ్చి ప్రజల ఆరోగ్యాన్ని మరింత ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. ప్రకటనలతో మరింత ఆకర్షణగా.. గతంలో రీఫిల్స్ను 30, 35, 60 రాత్రులు పనిచేస్తాయంటూ విక్రయించేవారు. ప్రస్తుతం హై, లో ఆప్షన్లతో 45 ఎంఎల్ రీఫిల్స్ను విక్రయిస్తున్నారు. వాటిని హైలో పెట్టుకుంటే 10 నుంచి 15 రోజులు వస్తాయి. లో ఆస్షన్లో పెడితే 20 నుంచి 25రోజుల వరకు వస్తాయన్న ప్రత్యేకమైన ప్రకటనలతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు. అయితే ఇది తాత్కాలిక ఉపశమనంగా ఉన్నప్పటికీ ముందుముందు ఆరోగ్యానికి ప్రమాదమేనని వైద్యునిపుణులు హెచ్చరిస్తున్నారు, రీఫిల్స్లో ఉండే ప్రాలేత్రిన్, పెర్మేత్రిన్, ట్రాన్స్ఫ్లోత్రిన్ వంటి కృత్రిమ కీటక నాశకాలు వెలువడే పొగతో మన శ్వాసకోస వ్యవస్థ మరింత ప్రభావితం అవుతుంది. ఈ రసాయనాలు వాయువులో చేరి ఊపిరితిత్తులను బాధించి ఆస్తమా, బ్రాంకై టీస్ వంటి శ్వాససంబంధిత వ్యాధులకు దారితీసే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధనలు సైతం వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే పార్వతీపురం, పాలకొండ, కురుపాం పరిసరాలలో ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు.సహజ మార్గాలను ఉపయోగిస్తే మేలుప్రజలు ఈ దోమల ప్రభావం నుంచి కాపాడుకునేందుకు కాయిల్స్, రీఫిల్స్ వాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వాడిన తరువాత గదిని బాగా వెంటిలేట్ చేయాలి. ఈ నేపథ్యంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే రసాయన రీఫిల్స్కు బదులు సహజ మార్గాలను ఉపయోగించాలి. నిమ్మ, లవంగం, తులసి వంటి సహజ పదార్థాల ద్వారా దోమలను దూరం చేసే ప్రయత్నాలు అనారోగ్యానికి గురిచేయండా మేలుచేస్తాయి. వీలైనంత మేరకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పడుకోవడానికి ఉపయోగించే బెడ్షీట్లు ఎండలో ఉంచుతూ శుభ్రం చేసుకోవాలి. కిటికీలు, వెంటిలేషన్స్కు మెస్ల అమరిక మంచిది. పడుకునే గదిలో గాలి ఆడేలా చూసుకుంటూ అవసరమైతే దోమతెరలు వినియోగించాలి. – డా.ఎన్ఎంకే తిరుమల ప్రసాద్, పీహెచ్సీ వైద్యాధికారి, బందలుప్పి -
విద్యుత్ షాక్తో యువకుడి మృతి
శృంగవరపుకోట: ఇంటిముందు మావిడాకుల తోరణాలు వాడనేలేదు. పెళ్లింట సందడి ముగియనే లేదు. విధి ఆడిన ఆటలో నవవరుడు ప్రాణాలు చాలించాడు. తాళికట్టిన భర్త తరలిరాని లోకాలకు వెళ్లాడని తెలిసి నవవధువు శోకంతో కుప్పకూలిపోయింది. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన లగుడు ప్రదీప్(26)కు ఇటీవల పెళ్లయింది. ప్రదీప్ తల్లితో కలిసి గురువారం గడ్డి కోసేందుకు వెళ్లాడు. గడ్డిమోపు పట్టుకుని తిరిగి వస్తున్న సమయంలో తెగి ఉన్న విద్యుత్ తీగ తగిలి షాక్కు గురయ్యాడు. దీంతో తల్లి అరుపులతో పక్క పొలాల్లో ఉన్న గ్రామస్తులు పరుగున వచ్చి చూసేసరికే ప్రదీప్ అనంతలోకాలకు వెళ్లిపోయాడు. భర్త పార్ధివదేహాన్ని చూసి భార్య ఏడుస్తుంటే గ్రామస్తుల కళ్లు చెమర్చాయి. కాగా ఈ ఘటనపై ఇటు విద్యుత్శాఖ అధికారులు కానీ, అటు పోలీస్ ఉద్యోగులు కానీ నోరు మెదపలేదు. ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. -
● సర్వేయర్ల నిరసన బాట
సమస్యల పరిష్కారం కోరుతూ సచివాలయ సర్వేయర్లు రోడ్డెక్కారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద గురువారం ధర్నా చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ప్లకార్డులు ప్రదర్శించారు. నిరసన గళం వినిపించారు. జీఓ నంబర్ 5ను సవరించాలని, గుమస్తాకంటే తక్కువ ఉద్యోగాలకు గెజిటెడ్ ఉద్యోగుల స్థాయి నిబంధనలు విధించడం తగదన్నారు. బదిలీలు పారదర్శకంగా చేపట్టాలని కోరారు. పనిభారం ఉన్నా ఉద్యోగోన్నతులు కల్పించకపోవడం విచారకరమన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. – సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం -
వృద్ధిరేటు పెరిగేలా ప్రణాళికలు
పార్వతీపురంటౌన్: వ్యవసాయం, అనుబంధ రంగాలతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల్లో వృద్ధిరేటు గణనీయంగా పెరిగేలా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ పేర్కొన్నారు. సుపరిపాలన కార్యక్రమం నేపథ్యంలో ప్రభుత్వ శాఖాధికారులతో సమీక్ష సమావేశాన్ని కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ శ్యామ్ప్రసాద్ గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో నిర్దేశించిన లక్ష్య సాధన దిశగా ప్రతి ఏటా 15 శాతం కంటే ఎక్కువ వృద్ధి రేటు సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ముందుకు వెళ్లేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. ముఖ్యంగా వ్యవసాయం, తృణధాన్యాలు, డ్రోన్ల వినియోగం, ఆధునిక వ్యవసాయ యాంత్రీకరణతో అధిక ఆదాయం పొందాలని అభిప్రాయ పడ్డారు. అదేవిధంగా పాల దిగుబడి గతేడాది కంటే ఈ ఏడాది మరింత పెరిగేలా చర్యలు చేపట్టాలని, పశు సంపదను ప్రోత్సహించడంతో అధిక ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు. అలాగే మిగిలిన అన్ని ప్రభుత్వ శాఖల వారికి నిర్దేశించిన లక్ష్యాల ప్రగతిలో వృద్ధి రేటు గణనీయంగా పెరగాలని కలెక్టర్ కోరారు. సమావేశంలో జిల్లా ప్రణాళిక, వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య, అటవీ, పశుసంవర్థక, వైద్యారోగ్య, ఇంటర్మీడియట్ విద్యశాఖల అధికారులు పి.వీర్రాజు, కె.రాబర్ట్ పాల్, వై.క్రాంతి కుమార్, వై.శ్రీదేవి, జేపీఏ ప్రసూన, డా.ఎస్.మన్మథ రావు, డా.ఎస్.భాస్కరరావు, జిల్లా టీబీ నియంత్రణ అధికారి డా.ఎం.వినోద్ కుమార్, డీఆర్డీఏ పీడీలు ఎం.సుధారాణి, డా.టి.కనకదుర్గ, వై.నాగేశ్వరరావు, పరిశ్రమల కేంద్రం ఎ.డి పి.సీతారాము, జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం, ఆర్అండ్బీ ఇరిగేషన్ ఈఈలు ఒ.ప్రభాకరరావు, ఎస్.రామచంద్రరావు, డీఎస్.ప్రదీప్, ఎ.ఢిల్లీశ్వర రావు, పంచాయతీ రాజ్ డీఈఈ కె.సంజీవరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ -
న్యాయం చేయండి బాబూ..!
ఎస్.కోట: జిందాల్ కోసం భూములు కోల్పోయాం.. ఏళ్లు గడిచినా మాకు న్యాయం జరడంలేదు.. పిల్లలకు ఉద్యోగాలు లేవు.. పరిహారం పూర్తిస్థాయిలో అందలేదు.. ప్రస్తుత ధరల ప్రకారం పరిహారం అందజేసే దారి కనిపించడం లేదు.. మా సమస్యపై శాంతియుతంగా నిరసన దీక్షలు చేస్తామంటే అనుమతులు లేవంటూ అడ్డగోలు నిబంధనలు విధిస్తున్నారని పలువురు మహిళలు మీడియా ముందు గురువారం వాపోయారు. మాగోడు ఎవరికి చెప్పాలంటూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆవేదన వ్యక్తంచేశారు. కంపెనీలు రావాలి.. కావాలి అంటూ బిర్యానీలు తింటూ నిరసన తెలిపేవారికి అనుమతులు ఉన్నాయట.. మా కుటుంబాల ఆకలి కేకలు వినిపించేందుకు అనుమతులు తెచ్చుకోవాలట.. ఇదెక్కడి న్యాయం ‘బాబూ’ అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. నిరసన శిబిరం నిర్వహించేందుకు అనుమతివ్వాలని ఎస్.కోట సీఐ నారాయణమూర్తికి విజ్ఞప్తిచేస్తే, రెవెన్యూ అధికారులను అడగాలని కసురుకున్నారన్నారు. ఇక్కడికి వచ్చి తహసీల్దార్ శ్రీనివాసరావుకు మా గోడు చెబితే అంతా ఆలకించిన ఆయన మీకు పర్మిషన్ ఇచ్చే అధికారం నాకు లేదమ్మా అంటూ పంపించేశారన్నారు. మా భూముల్లో చెట్ల తొలగింపునకు అనుమతులు ఎవరిచ్చారో చెప్పాలన్నారు. పేదవారిని ఏం చేసినా అడిగేవారు లేరనే అధికారంతో మా జీవితాలను నాశనం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇప్పటికై నా ప్రభుత్వ పెద్దలు వాస్తవాలు తెలుసుకోవాలని, దళారీల మాటలు నమ్మి అమ్ముడుపోవద్దని విజ్ఞప్తిచేశారు. -
దేవదాయ భూముల పరిరక్షణకు చర్యలు
● జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్విజయనగరం అర్బన్: దేవస్థానం భూముల్ని అన్ని విధాలా పరిరక్షించడానికి చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన జిల్లా స్థాయి దేవాదాయ భూముల పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ 11 వేల ఎకరాల భూమి దేవదాయ శాఖ పరిధిలో ఉందని అందులో కొంత ఆక్రమిత భూమి ఉందని, ఈ భూమికి వెంటనే సర్వే చేయించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అలాగే మాన్సాస్ ట్రస్టుకు చెందిన భూమిలో కూడా ఆక్రమణలు ఉన్నాయని, ఇందులో వ్యవసాయ, నివాస, వాణిజ్య పరంగా ఆక్రమించిన వివిధ సంస్థల ఆక్రమిత భూములకు సంబంధించి రూ.50 లక్షల వరకు యూజర్ చార్జీల కింద ఆక్రమణదారులు చెల్లించారని తెలిపారు. అయితే ఎటువంటి యూజర్ చార్జీలు చెల్లించకుండా కమర్షియల్గా వినియోగిస్తున్న దేవదాయ భూముల్లోని సముదాయాలను తొలగించాలని, అందుకు రెవెన్యూ అధికారులు పోలీస్ వారి సహకారాన్ని తీసుకోవాలని సూచించారు. భూముల విషయంలో కోర్టు ఆర్డర్స్ను వెంటనే అమలు చేయాలని స్పష్టం చేశారు. మ్యుటేషన్స్ చేయవలసిన వాటి వివరాలను మండలాల వారీగా ఆర్డీఓలకు అందజేయాలని, ఆర్డీఓలు వెంటనే మ్యుటేషన్ జరిగేలా చూడాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్ఓ శ్రీనివాసమూర్తి, దేవదాయశాఖ ఎ.సి శిరీష, ఆర్డీఓలు సవరమ్మ, రామ్మోహన్ రావు, ఆశయ్య, సర్వే ఎ.డి రమణమూర్తి, జిల్లా పంచాయతీ అధికారి మల్లికార్జున రావు, డీఎస్పీ వీరకుమార్, డిప్యూటీ కమిషనర్, ఏఓలు పాల్గొన్నారు. -
నేడు జగన్నాథుని రథయాత్ర
విజయనగరం టౌన్: జగన్నాథస్వామి రథయాత్ర మహోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో స్వామివారికి గురువారం వేకువజామునుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక సంతపేట, దాసన్నపేట, మన్నార్ రాజ గోపాలస్వామి ఆలయం ఆవరణలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. విశ్వక్సేనపూజ, పుణ్యాహవచనం, కళావాహన, బింబ దర్శనం, నేత్రోత్సవం, ప్రసాద వినియోగం గావించారు. సాయంత్రం స్వామివారి శాంతి కల్యాణోత్సవం, రాత్రి రథోత్సవానికి స్వామివారిని సిద్ధం చేశారు. రక్షాబంధనాలు ధరించారు. శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 9.30 గంటలకు మేళతాళాలతో స్వామివారి రథారోహణ కార్యక్రమం చేపట్టనున్నట్లు అధికారులు, కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. భక్తులందరూ స్వామివారిని దర్శించి, తరించాలని కోరారు. ఇసుక ట్రాక్టర్ పట్టివేతబొబ్బిలిరూరల్: మండలంలోని పారాది గ్రామం వద్ద వేగావతి నదిలో అక్రమంగా ఇసుకను తవ్వి తరలిస్తున్న ట్రాక్టర్ను ఆర్డీఓ జేవీవీ రామ్మోహనరావు గురువారం పట్టుకున్నారు. ట్రాక్టర్ను నిలువరించేందుకు ప్రయత్నించినా డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోవడంతో ఆర్డీఓ ఆదేశాల మేరకు మెట్టవలసలోని యజమాని మీసాల చంద్రశేఖర్ ఇంటి వద్ద ట్రాక్టర్ను ఆర్ఐ రామకుమార్, సిబ్బంది గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇసుక అక్రమ తరలింపు, ఆపకుండా వెళ్లిపోయినందుకుగాను రూ.20వేల జరిమానా విధించామని ఆర్ఐ రామకుమార్ తెలిపారు. బ్యాటరీల చోరీ● ఆందోళన చెందుతున్న వాహన యజమానులు పార్వతీపురం రూరల్: పట్టణంలోని కొత్తవలస ఫ్లైఓవర్ కింద పార్కింగ్ చేసి ఉంచిన మూడు లగేజీ వ్యాన్లు, ఒక లారీకి ఉన్న బ్యాటరీలను గుర్తుతెలియని దుండగులు అపహరించారని వాహన యజమానులు ఆందోళన చెందారు. గతంలో కూడా ఎన్నోమార్లు ఈ విధంగా వాహనాలకు ఉన్న బ్యాటరీలను వైర్లను చిందరవందరంగా కోసి దొంగిలించారని వాపోయారు. ఈ మేరకు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. గురువారం ఉదయం వాహనాల వద్దకు వెళ్లేసరికి వైర్లు కట్చేసి ఉండడంతో బ్యాటరీలు లేకపోవడాన్ని గమనించినట్లు తెలిపారు. దీంతో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దాడికి గురైన వ్యక్తి మృతిబొబ్బిలి: పట్టణ పరిధిలోని గ్రోత్సెంటర్లో రాఘవ కన్స్ట్రక్షన్స్ స్టోర్లో వాచ్మన్గా పనిచేస్తున్న కనిమెరకల వెంకటరమణ(55) పై ఈనెల 20న గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. వెంకట రమణ కుమారుడు పురుషోత్తమరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ కె.సతీష్ కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎప్పటిలాగానే వెంకట రమణ విధులకు హాజరయ్యాడు. సరిగ్గా రాత్రి 12.30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి కంపెనీలోకి ప్రవేశించి బలమైన ఆయుధంతో వెంకటరమణ ముఖం, తలపై బలంగా దాడి చేశాడు. దీంతో వెంటనే స్థానికులు బొబ్బిలి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రాథమిక చికిత్స అనంతరం విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం వేకువజామున మృతి చెందాడు. దాడి చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు మూడు టీమ్లను నియమించామని, త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని సీఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
ఈఈను నేను.. కాదు నేను..!
–8లోదోమల కాయిల్స్తో అనర్థాలు దోమకాటుతో అనారోగ్యానికి గురవుతామన్న భయంతోమార్కెట్లో లభించే నాసిరకం మస్కిటో కాయిల్స్ను వినియోగించవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సీతంపేట: సీతంపేట ఐటీడీఏ గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ శాఖలో ఈఈ (ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్) పోస్టుపై ఉత్కంఠ నెలకొంది. ఇద్దరు ఈఈల మధ్య గురువారం కుర్చీలాట కొనసాగింది. కార్యాలయంలో వేర్వేరు కుర్చీల్లో ఇద్దరు కూర్చోవడంతో ఎవరు తమ ఈఈ అన్న ప్రశ్న కిందిస్థాయి ఉద్యోగుల్లో తలెత్తింది. కార్యాలయానికి వచ్చేవారు ఎవరికి రిపోర్టు చేయాలో తెలియక సందిగ్దంలో పడ్డారు. వివరాలు పరిశీలిస్తే.. ఏడు నెలల కిందట సీతంపేట ఈఈ పోస్టు ఖాళీగా ఉండడంతో రమాదేవిని నియమించారు. ఇటీవల జరిగిన బదిలీల్లో ఈ నెల 9న ఆమె స్థానంలో కె.వి.ఎస్.ఎన్ కుమార్ను ఇక్కడ నియమించి రమాదేవిని నెల్లూరుకు బదిలీ చేశారు. ఈ నెల 11న కుమార్ సీతంపేట ఈఈగా బాధ్యతలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా బాధ్యతలు స్వీకరించిన ఏడు నెలలకే తనను బదిలీ చేశారంటూ రమాదేవి హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు బదిలీ జీఓను హైకోర్టు ఆరువారాల పాటు సస్పెండ్ చేసింది. కోర్టు ఆదేశాలతో తను ఇక్కడే ఈఈగా కొనసాగుతున్నట్టు రమాదేవి స్పష్టం చేశారు. ప్రభుత్వ బదిలీ జీఓ ప్రాప్తికి తనుకూడా ఇక్కడే ఈఈగా విధులు నిర్వహిస్తున్నట్టు కుమార్ తెలిపారు. బదిలీల్లో అక్రమాల వల్లే ఇలాంటి ఘటనలు తలెత్తుతున్నాయంటూ ఉద్యోగులు గుసగుసలాడుతున్నారు. ఈ సమస్యను ఉన్నతాధికారులు ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాల్సిందే. ఇద్దరు ఈఈల మధ్య కుర్చీలాట ప్రభుత్వం నియమించిందని ఒకరు, కోర్టు జీఓ సస్పెండ్ చేసిందని మరొకరు.. ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ ఈఈ పోస్టుపై నెలకొన్న ఉత్కంఠ -
త్రుటిలో తప్పిన ప్రమాదం
● అంగన్వాడీ కేంద్రం శ్లాబ్కు ఊడిన పెచ్చులు మెంటాడ: మండలంలోని కుంటినవలసలో రెండవ అంగన్వాడీ కేంద్రం శ్లాబ్ పెచ్చులు రాలడం ఆందోళన కలిగించింది. బుధవారం కేంద్రంలో 17 మంది పిల్లలు ఉన్నారు. అప్పుడే వచ్చిన ఆ గ్రామ యువతిపై ఆ పెచ్చులు పడడంతో స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలిసిన అంగన్వాడీ సూపర్వైపర్ హైమావతి వచ్చి ఆ పిల్లలను ఇళ్లకు పంపించారు. పిల్లలకు ఏమీకాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. శిథిలావస్థకు చేరిన భవనం శ్లాబ్ కింద పిల్లలను ఉంచి కేంద్రాన్ని నడపడంపై పలువురు విమర్శలు చేసిన పట్టించుకోక పోవడం గమనార్హం.కూలిన వైన్షాపు ముందుభాగంబొబ్బిలి: పట్టణంలోని మేదరి బంద వద్ద గల మద్యం దుకాణ భవనం శ్లాబ్ ముందుభాగం బుధవారం కూలిపోయింది. అదృష్టవశాత్తు మద్యం కొనుగోలుకు ఆ సమయంలో ఎవరూ రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ సమాచారం అందుకున్న ఎకై ్సజ్ సీఐ పి.చిన్నం నాయుడు అక్కడికి వెళ్లి దుకాణం మూసివేయించారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు మద్యం దుకాణాన్ని మార్పు చేశాక తిరిగి తెరిచేందుకు అనుమతిస్తామని వ్యాపారులకు తెలియజేశారు. గురుదేవాలో చోరీ కేసులో మరో ఇద్దరి అరెస్టు● మిస్టరీగా చోరీ సొత్తు రికవరీ కొత్తవలస: మండలంలోని మంగళపాలెం గ్రామం సమీపంలో గల గురుదేవా చారిటబుల్ ట్రస్టు చైర్మన్ రాపర్తి జగదీష్బాబు ఇంట్లో గత నెల 28వ తేదీన దొంగలు చొరబడి భారీ ఎత్తున బంగారం, నగదు దోచుకుపోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే మహారాష్ట్రకు చెందిన పార్థగ్యాంగ్లో ఒకరిని మహారాష్ట్ర వెళ్లి పట్టుకుని అరెస్టు చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే. కాగా ఇదే కేసులో మహారాష్ట్రలోని బుల్దాన్ జిల్లాకు చెందిన ముత్తుపవర్ అక్షయ్, లక్ష్మణ పవర్లను అరెస్టు చేసి కొత్తవలస కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు సీఐ షణ్ముఖరావు బుధవారం తెలిపారు. కాగా ఇప్పటివరకు ఈ కేసులో కేవలం నిందితులను మాత్రమే పట్టుకుంటున్నట్లు పోలీసులు చూపుతున్నారే తప్ప ఎక్కడా చోరీకి గురైన సొత్తును రికవరీ చేస్తున్నట్లు చెప్పకపోవడం కొసమెరుపు. ఈ చోరీలో సుమారు 10కేజీల బంగారం,రూ 50లక్షలకు పైగా నగదు మాయమైనట్లు సమాచారం. నేడు ఫెన్సింగ్ క్రీడాకారుల ఎంపికవిజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా బాల, బాలికల ఎంపిక పోటీలు ఈనెల 26న నిర్వహించనున్నట్లు జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ ముఖ్య శిక్షకుడు డీవీ.చారి ప్రసాద్ బుధవారం తెలిపారు. నగరంలోని విజ్జి స్టేడియంలో ఉదయం 9 గంటల నుంచి అండర్ –10, 12 విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎంపిక పోటీల్లో అండర్–10 విభాగంలో 2016 జనవరి 1వ తేదీ అనంతరం, అండర్–12 విభాగంలో 2014 జనవరి 1వ తేదీ అనంతరం జన్మించిన క్రీడాకారులు మాత్రమే పాల్గొనేందుకు అర్హులుగా స్పష్టం చేశారు. క్రీడాకారులు విధిగా ఫెన్సింగ్ అసోసియేషన్ గుర్తింపు కార్డు వెంట తీసుకురావాలని సూచించారు. జిల్లా స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈనెల 29వ తేదీన విజయవాడలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. అర్హత, ఆసక్తి గల క్రీడాకారులు ఎంపిక పోటీల్లో పాల్గొనవచ్చని మరిన్ని వివరాలకు ఫోన్ 8374737707 నంబర్ను సంప్రదించాలని సూచించారు. -
ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య
రామభద్రపురం: మండలంలోని కొట్టక్కి వట్టిగెడ్డ పాత బ్రిడ్జి సమీపంలో చెట్టుకు ఉరివేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం జీగిరాం గ్రామానికి చెందిన నూలక ప్రశాంత కుమార్(26) లారీ క్లీనర్గా పనిచేస్తున్నాడు. ఇది వరకే వివాహం జరిగి ఇద్దరు పి ల్లలు ఉండగా భార్యతో విడాకులు తీసుకున్నాడు. తరువాత తల్లిదండ్రుల వద్ద ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ప్రశాంత కుమార్ మరో అమ్మయితో ప్రేమలో పడి ఆమెను ఇంటికి తీసుకొస్తానని తల్లిదండ్రులతో చెప్పగా వద్దని మందలించారు. దీంతో ఈనెల 5వ తేదీన ఇంటి నుంచి బ్యాగ్తో వెళ్లిపోయి కొట్టక్కి బ్రిడ్జి వద్ద తన షర్ట్తో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లిదండ్రులు పరిసర ప్రాంతాలతో పాటు బంధువుల గ్రామాల్లో కూడా వాకబు చేశారు. ఎక్కడా ఆచూకీ లేకపోవడంతో సాలూరు రూరల్ పోలీస్స్టేషన్లో తమ కుమారుడు అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో బుధవారం కొట్టక్కికి చెందిన పశువుల కాపరి చెట్టు కింద కుళ్లిపోయి దుర్వాసన కొడుతూ కింద పడి ఉన్న మృతదేహాన్ని చూసి గ్రామ వీఆర్వో మహేష్కు సమాచారం ఇచ్చాడు. ఈ మేరకు వీఆర్వో పరిశీలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.వ సమాచారం అందిన వెంటనే సీఐ కె.నారాయణరావు, ఎస్సై వి.ప్రసాదరావు, ఏఎస్సై అప్పారావులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరివీలించారు. మృతదేహం వద్ద పడి ఉన్న సెల్ఫోన్ ఆధారంగా జీగిరాం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి బ్యాగుతో పాటు అందులో ఉన్న బట్టల ఆధారంగా తమ కుమారుడేనని గుర్తించి భోరున విలపించారు. మృతదేహం తీయలేని దుస్థితిలో ఉండడం వల్ల పోలీసు అధికారులు ఘటనా స్థలంలోనే బాడంగి సీహెచ్సీ వైద్యాధికారితో పోస్టుమార్టం నిర్వహించారు. కుటుంబసభ్యుల సమక్షంలో అక్కడే ఖననం చేశారు. ఎస్సై వి.ప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. -
తరచూ అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణ
● ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ విమలరాణి విజయనగరం ఫోర్ట్: అంగన్వాడీ కేంద్రాలను తరచుగా పర్యవేక్షించాలని సీడీపీఓలకు ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ టి.విమలరాణి సూచించా రు. విజయనగరం ఐసీడీఎస్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాల సేవలు సంపూర్ణంగా అందేలా చూడాలన్నారు. మాద క ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై యువతలో అవగాహన కల్పించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్య పె రిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ప్రథమ కోఆర్డినేటర్ రమణ పాల్గొన్నారు. సమగ్ర విపత్తు నిర్వహణ ప్రణాళికలు రూపొందించాలి ● విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ సంయుక్త సలహాదారు ఎస్.ప్రకాష్ విజయనగరం అర్బన్: జిల్లాలో ఎదురయ్యే విపత్తులపై సన్నద్ధమయ్యేలా ప్రతిశాఖ సమగ్ర ప్రణాళిక రూపొందించి రాష్ట్ర విపత్తుల శాఖకు పంపాలని విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ సంయుక్త సలహాదారు ఎస్.ప్రకాష్ కోరారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో విపత్తుల నిర్వహణపై బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల భాగస్వామ్యంతోనే విపత్తుల నుంచి గట్టెక్కడం సాధ్య మన్నారు. ప్రకృతి వైపరీత్యాలపై రియల్ టైం హెచ్చరికల వ్యవస్థలో సచేచేత్ యాప్ కీలకమని, దీనిపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. సమావేశంలో విపత్తుల శాఖ కార్యదర్శి అభిషేక్ బిస్వాస్, సీనియర్ కన్సల్టెంట్ అభినవ్ వాలియ, డీఆర్వో శ్రీనివాసమూర్తి, అదనపు ఎస్పీ సౌమ్యలత, ఆర్డీఓ సవరమ్మ, డీపీఎం రాజేశ్వరి, సీపీఓ పి.బాలాజీ, డీఆర్డీఏ పీడీ కళ్యాణ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. కొత్త మరువాడలో ఏనుగుల గుంపు ● భయాందోళనలో రైతులు, ప్రజలు వంగర: మండలంలోని కొత్త మరువాడ గ్రామ పంటపొలాల్లోకి మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఏనుగుల గుంపు చేరింది. ప్రస్తుతం గ్రామ సమీపంలోని బోడికొండ వద్ద సంచరిస్తున్నాయి. రైతులు ఒంటరిగా పొలాల్లోకి వెళ్లవద్దని, ఏనుగులను కవ్వించవద్దని అటవీశాఖ సిబ్బందితో పాటు వీఆర్ఓ ఈశ్వరరావు, వీఆర్ ఏ భూలోక గ్రామస్తులను అప్రమత్తం చేశారు. సీతాదేవిపురం, కింజంగి గ్రామాల వైపు ఏనుగులు వెళ్లే అవకాశం ఉండడంతో ఆయా గ్రామాల ప్రజలకు సమాచారం చేరవేశారు. -
విబా ద్వారా ఉచిత శిక్షణ
విజయనగరం బ్యూటీ అసోసియేషన్ ద్వారా ఆసక్తి ఉన్న మహిళలకు, యువతకు ఉచిత శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మహిళలకు లబ్ధి చేకూర్చే బ్యూటీషీయన్ కోర్సు నేర్చుకునేందుకు దూరప్రాంతాలకు వెళ్లేవారు. ఇప్పుడు అటువంటి వారందరూ విజయనగరం జిల్లా కేంద్రంలోనే శిక్షణ తీసుకునేందుకు అనువుగా విబా ఏర్పాటుచేశాం. అసోసియేషన్ ఇక్కడ ఉండడం వల్ల పెద్దపెద్ద బ్యూటీ కంపెనీలు ఉచిత తరగతులను అందించేందుకు ముందుకు వస్తుండడం ఆనందంగా ఉంది. –బోని భాగ్యలక్ష్మి, వ్యవస్ధాపక అధ్యక్షురాలు, విజయనగరం బ్యూటీషియన్స్ అసోసియేషన్, విజయనగరం. -
రక్తికడుతున్న జిందాల్ డ్రామా!
● ఓ వైపు జందాల్ కంపెనీ ఏర్పాటు చేయాలని.. ● మరోవైపు న్యాయం చేయాలంటూ వేర్వేరుగా శిబిరాల నిర్వహణ ● తాజాగా చదునుచేసే పనులతో నిర్వాసితుల్లో ఆందోళన శృంగవరపుకోట: ఓ వైపు జిందాల్ కర్మాగారం కావాలంటూ స్థానికులతో సంబంధం లేనివారు శిబిరం నిర్వహణ... మరోవైపు తమకు తమ పిల్లల కు ఉద్యోగ భరోసా, పరిహారం చెల్లింపులో న్యా యం చేసి పరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ నిర్వాసితుల ఆందోళన... సమస్యపై స్పందించని అధికార యంత్రాంగం వెరసి ‘జిందాల్’ నాటకాన్ని ఎవరికి వారే రక్తికట్టిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శిబిరాల హైడ్రామాను చూసి స్థానికులు మండిపడుతున్నారు. ప్రాణాలు పోతుంటే పీక్కుతినే రాబంధుల మాదిరిగా జిందాల్ నిర్వాసితుల పై రాజకీయ రాబంధులు వాలిపోతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఎవరికి తగ్గట్లు వారు నాటకీయంగా డైలాగులు చెబుతూ హైడ్రామా నడిపించడంపై ఆవేదన చెందుతున్నారు. జిందాల్ యాజమాన్యం రైతుల నుంచి తీసుకున్న భూముల్లో ఎంఎస్ఎంఈ పార్కులు పెడతామన్న ప్రతిపాదన ప్రస్తుతం నిర్వాసితుల్లో అలజడి రేపుతోంది. గతంలో జిందాల్ చేసిన ఒప్పందాలను ఎలా అమలు చేస్తారు? ఎవరు అమలు చేస్తారు.? ఉద్యోగాలు, పరిహారం, జీవన భృతి మాటేమిటంటూ రోడ్డెక్కా రు. నిర్వాసితులకు సరైన హామీ ఇచ్చాకే ఎంఎస్ఎంఈ పార్క్లు ప్రారంభించాలని ఎమ్మెల్సీ రఘురాజు కూటమి ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. చెట్ల తొలగింపుపై ఆందోళన పోలీస్ బందోబస్తు నడుమ బందవలస వద్ద జిందాల్కు చెందని భూముల్లో పాతికేళ్ల వయస్సున్న మామిడి తోటలను బుధవారం జిందాల్ దౌర్జన్యంగా తొలగించిందంటూ నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేశారు. జిందాల్కు సంబంధం లేని భూము లు కూడా లాక్కుందామని చూస్తున్నారని గిరిజన మహిళలు, రైతులు స్థానిక నాయకుల వద్ద ఆవేదన వ్యక్తంచేశారు. 1960లో తాటిపూడి నుంచి తగిలేసి నిర్వాసితుల్ని చేశారని, ఇప్పుడు భూములు లాక్కు ని పొమ్మంటున్నారంటూ జిందాల్ సమస్య విచార ణకు వచ్చిన అధికారి కరుణాకరణ్ ఎదుట రైతులు వాపోయారు. మా భూములు మాకివ్వాలి.. 2013 భూహక్కు చట్టం ప్రకారం జిందాల్ యాజమాన్యం కంపెనీ ఏర్పాటు చేయనందున తమ భూములు తమకు ఇవ్వాలని కోరుతూ కొత్త అడ్డతీ గ కూడలి వద్ద నిర్వాసితులు బుధవారం నిరసన శిబిరం ప్రారంభించారు. వీరికి సీపీఎం, గిరిజన సంఘాలు మద్దతు తెలిపాయి. మరోవైపు కంపెనీ కావాలంటూ కూటమి వర్గీయులు కొందరు మరో శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. రాజకీయ పార్టీలు అటు, ఇటు వత్తాసు పలుకుతుండడంతో న్యాయం జరుగుతుందా? లేదా? అన్న సంకట స్థితిలో నిర్వాసితులు కొట్టుమిట్టాడుతున్నారు. -
ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు భద్రతకు బైక్స్
● అత్యాధునిక టెక్నాలజీతో తయారీ ● జిల్లాకు వచ్చిన 16 బైక్స్ విజయనగరం క్రైమ్: జిల్లాలో ట్రాఫిక్ నియంత్రణ, రహదారి భద్రత కోసం కొత్తగా 16 మోటార్ సైకిల్స్ జిల్లా కేంద్రానికి వచ్చాయని ఎస్పీ వకుల్ జిందల్ బుధవారం తెలిపారు. డీజీపీ ఆఫీస్ నుంచి జిల్లాకు వచ్చిన బైక్స్ను ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారి భద్రత, ట్రాఫిక్ నియంత్రణ విధులను సమర్థవంతంగా నిర్వహిచేందుకు ఆ బైక్స్ను ఉపయోగిస్తామన్నారు. వాటిలో 15 టీవీఎస్ అపాచీ మోటార్సైకిల్స్, ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఉన్నాయని తెలిపారు. ఈ మోటార్ సైకిల్స్ను సైరన్, బ్లింకర్స్, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం, క్రౌడ్ కంట్రోల్ చేసేందుకు అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించారన్నారు. జిల్లాలో ట్రాఫిక్ అవాంతరాలు తరచూ ఏర్పడుతున్న పోలీస్స్టేషన్లకు అలాగే రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతున్న స్టేషన్లకు వాటిని కేటాయించనున్నా మని తెలిపారు. ఫోర్వీలర్స్ వెళ్లలేని మారుమూల ప్రాంతాలకు కూడా ఈ మోటార్ సైకిల్స్ వినియోగించి, పోలీస్ సిబ్బంది, అధికారులు చేరుకునే అవకాశముంటుందన్నారు. రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలని, ప్రమాదాల నియంత్రణలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఎస్పీ వకుల్ జిందల్ పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐలు ఏవీ లీలారావు, ఆర్వీఆర్కే చౌదరి, ఆర్ఎస్సై(ఎంటీఓ) ఆర్.రమేష్ కుమార్, ఆర్ఎస్సై (అడ్మిన్) ఎన్.గోపాలనాయుడు పాల్గొన్నారు. -
కొత్తవలస కేజీబీవీలో అగ్నిప్రమాదం
● కాలిబూడిదైన 280 పరుపులు, 79 మంది విద్యార్థుల అభ్యసన సామగ్రి ● సురక్షితంగా బయటపడిన 270 మంది బాలికలు ● విద్యుత్ షార్ట్సర్క్యూట్ వల్ల ప్రమాదం కొత్తవలస: మండలంలోని తుమ్మికాపల్లి పంచాయతీ శివారు అడ్డూరువానిపాలెం వద్ద గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో బుధవారం తెల్లవారు జూమున 3.30 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదంలో విశాఖపట్నానికి చెందిన రోటరీ క్లబ్ సంస్థ వారు బాలికలకు వితరణగా మంగళవారం అందజేసిన 280 పరుపులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు 79 మందికి చెందిన అభ్యసన సామగ్రి కాలిబూడిదయ్యా యి. కాలకృత్యాలు తీర్చుకునేందుకు లేచిన ఇద్దరు బాలికలు ప్రమాదాన్ని గుర్తించి అందరినీ అప్రమత్తం చేశారు. వెంటనే బాలికలందరూ భవనం నుంచి బయటకు పరుగుతీశారు. విద్యాలయం సిబ్బంది అందించిన సమాచారం మేరకు కొత్తవలస, ఎస్.కోట అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. పై అంతస్తులో ప్రమాదం కావడంతో మంటలు అదుపుచేయడం కష్టమైంది. ఉదయం 7 గంటలకు మంటలు అదుపులోకి వచ్చాయి. బాలికలకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఎస్ఓ విజయకుమారితో పాటు బాలికల తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. కొందరు తల్లిదండ్రులు పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లారు. విద్యాలయాన్ని సందర్శించిన పీఓ ప్రమాద వార్త తెలిసిన వెంటనే సర్వశిక్షా అభియా న్ పీఓ డాక్టర్ అవగడ్డ రామారావు విద్యాలయానికి చేరుకున్నారు. ప్రమాదం తీరును ఎస్ఓ, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేశారు. ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, డీఈఓ మాణిక్యంనాయుడు సందర్శించి విద్యార్థినులకు ధైర్యం చెప్పారు. కాలిపోయిన అభ్యసన సామగ్రి, ఇతర వస్తువులు కొనుగోలుకు రూ.2లక్షలు మంజూరు చేసినట్లు పీఓ రామారావు తెలిపారు. సహాయక చర్యలు ప్రమాద స్థలాన్ని కొత్తవలస మండల పరిషత్ మాజీ అధ్యక్షులు గొరపల్లి శివ, మేజర్ పంచాయ తీ సర్పంచ్ మచ్ఛ ఎర్రయ్యరామాస్వామి, వైఎస్సార్సీపీ నాయుకులు చెల్లయ్యలు పరిశీలించా రు. పాఠశాలకు 20 మంది పారిశుద్ధ్య కార్మికులు, ఎలక్ట్రికల్ సిబ్బందిని పంపించి సహాయక చర్యలు అందించారు. -
ఆత్మీయ కలయిక
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని బుధవారం విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో జరిగిన పార్టీ రాష్ట్ర స్థాయి ముఖ్య నాయకుల సమావేశం అనంతరం జరిగిన కలయికలో విజయనగరం జిల్లాలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు. పార్టీ బలోపేతంతో పాటు ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేలా పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని పార్టీ అధినేత సూచించినట్టు జెడ్పీ చైర్మన్ ఫోన్లో తెలిపారు. –విజయనగరం -
కలెక్టరేట్ను ముట్టడించిన వీఆర్ఏలు
విజయనగరం గంటస్తంభం: వేతనాలు పెంచాలని, పే స్కేల్, డీఏ వర్తింపజేయాలంటూ గ్రామ రెవె న్యూ సహాయకులు (వీఆర్ఏ) విజయనగరం కలెక్టరేట్ను బుధవారం ముట్టడించారు. సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా నినాదాలు చేశారు. అటెండర్లుగా, స్వీపర్లుగా, డ్రైవ ర్లుగా, కంప్యూటర్ ఆపరేటర్లుగా అదనపు పనిభా రం మోపడాన్ని తప్పుబట్టారు. కేవలం నెలకు రూ. 11వేలు వేతనంతో ఎలా బతకాలంటూ ఆవేదన వ్యక్తంచేశారు. అర్హులైన వీఆర్ఏలకు ఉద్యోగోన్నతు లు కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణా రాష్ట్ర అమలుచేస్తున్న పే స్కేల్ను వర్తింపజేయాలని కోరారు. సమస్యలు పరిష్కారం కాకపోతే ఈ నెల 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాలు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో వీఆర్ఏ సంఘం జిల్లా అధ్యక్షుడు కె.గురుమూర్తి, జిల్లా గౌరవాధ్యక్షుడు బి.సూర్యనారాయణ, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్మి కె.సురేష్, ప్రసాద్, పైడిరాజు, సన్యాసప్పుడు, రామప్పుడు, జయరా వు, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. -
పారదర్శకంగా విధులు నిర్వహించాలి
బొబ్బిలి: వీఆర్వోలు, రెవెన్యూ సిబ్బంది క్షేత్ర స్థాయిలో పారదర్శకంగా విధులు నిర్వహించాలని బొబ్బిలి తహసీల్దార్ ఎం.శ్రీను సూచించారు. మ్యుటేషన్లలో అక్రమాలపై ‘మ్యుటేషన్కు రూ.30 వే లు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా తహసీల్దా ర్ కార్యాలయంలో వీఆర్వోలు, రెవెన్యూ సిబ్బంది తో బుధవారం సమావేశం నిర్వహించారు. భూము లు ఆన్లైన్ వ్యవహారాలు చేసేటప్పుడు ఆ విధానా లు అందుబాటులో ఉన్నాయా? లేవా? అని తెలుసుకోవాలన్నారు. ఏదేని మ్యుటేషన్ పనులు జరిగినప్పుడు తన దృష్టికి తీసుకురావాలన్నారు. తాను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానన్నారు. ఇటీవల మండలంలో జరుగుతున్న, జరిగిన ఆన్లైన్ వ్యవహారాలపై ఆరా తీశారు. సమావేశం, నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామన్నారు. ఇంటెలిజెన్స్ ఆరా! ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీశాయి. సంబంధిత ఉద్యోగులు మండలంలోని వీఆర్వోల తీరుతెన్నులపై ఉన్నతాధికారులకు సమాచారమందించినట్టు తెలిసింది. అసలు ఈ వ్యవహారంపై ముందుగానే ఆ అధికారులకు సమాచారం ఉంది. ఈ వ్యవహారంపై అధికారులకు నివేదించే పనిలో సిబ్బంది ఉన్నారని తెలిసింది. రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు కూడా భూముల ఆన్లైన్ వ్యవహారాలపై విచారణకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. -
ల్యాప్టాప్స్,సెల్ఫోన్ దొంగల అరెస్ట్
విజయనగరం క్రైమ్ : సెల్ఫోన్, ల్యాప్టాప్లను దొంగిలించిన కేసులో ఇద్దరు నిందితులను టూటౌన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. తమిళినాడు రాష్ట్రంలోని ఉదయరాజపాల్యంకు చెందిన మురుగన్ వెంకటస్వామి, గణేష్లను ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేశామని సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఉదయ రాజ పాల్యంకు చెందిన ఇద్దరు వ్యక్తులు నగరంలోని వీటీ అగ్రహరంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. నగరంలోని స్టూడెంట్స్ రూమ్స్ లక్ష్యంగా చేసుకుని ల్యాప్ టాప్లు, సెల్ఫోన్ల అపహరణకు పాల్ప డేవారు. ఇలా విజయనగరంలోని కోటవీధి, కాటవీధి, విశాఖలోని పీఎంపాలెం వద్ద గల స్టూడెంట్స్ రూమ్ లలో దొంగతనాలకు పాల్ప డ్డారు. అయితే ఈ నెల ఆరవ తేదీన విజయనగరంలోని శివాలయం వీధికి చెందిన ఓ వ్యక్తి ల్యాప్టాప్, రెండు సెల్పోన్లు పోయినట్లు ఫిర్యాదు చేయడంతో క్రైమ్ పార్టీని రంగంలోకి దించామని టూటౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపారు.ఈ క్రమంలోనే స్టేషన్ పరిధిలోని సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించగా ఈ ఇద్దరు నిందితులు నేరం చేసినట్లు నిర్థారణ అయిందన్నారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశామని వివరించారు. విచారణలో మొత్తం 57 సెల్ ఫోన్లు, 16 ల్యాప్టాప్లు, రెండు ఆపిల్ ఐ ప్యాడ్లు దొంగతనం చేసి అమ్మేసినట్లు నిందితులు అంగీకరించారని సీఐ చెప్పారు. 20 లీటర్ల సారా స్వాధీనం పార్వతీపురం రూరల్: మండలంలోని వెలగవలసలో అక్రమంగా సారా విక్రయిస్తున్న చోడిపల్లి రాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విక్రయానికి సిద్ధంగా ఉంచిన 20 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లు పార్వతీపురం రూరల్ ఎస్సై బి.సంతోషి కుమారి తెలిపారు. ఈ మేరకు పట్టుబడిన వ్యక్తిని, స్వాధీనం చేసుకున్న సారాను స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్లు చెప్పారు. -
అందమే ఆనందం..!
విజయనగరం టౌన్: పెళ్లికుమార్తె ముస్తాబు చేస్తున్న బ్యూటీషియన్విజయనగరం టౌన్: ఫేషియల్ చేస్తున్న దృశ్యం● సౌందర్యానికి ప్రాధాన్యం ఇస్తున్న మహిళలు ● కాలానికి అనుగుణంగా మారుతున్న మహిళల తీరు ● ఔత్సాహికులకు శిక్షణ ఇస్తున్న సంస్థలు ● స్వయం ఉపాధికి మార్గం అంటున్న శిక్షకులు ● నేడు జాతీయ బ్యూటీషియన్ల దినోత్సవంరాజాం సిటీ:/విజయనగరం టౌన్: అందానికి ఎవరు ఎన్ని అలంకారాలు ఇచ్చినా, ఉపమానాలు చూపినా అందమే ఆనందం అంటున్నారు మహిళలు. ఆ అందం వెనుక మరో మహిళ ఉండి ఆ అందానికే వన్నెతెస్తోంది. ఇంట్లో, వీధిలో, బంధువుల ఇళ్లల్లో జరిగే వేడుకల్లో ప్రత్యేకంగా కనిపించేందుకు మహిళలు శ్రద్ధ తీసుకుంటున్నారు. కిట్టీ పార్టీల నుంచి పెళ్లిళ్ల వరకు ఏ శుభకార్యకమైనా అతివలదే సందడి. వేడుక ఏదైనా మేకప్ అదరాల్సిందే. వారి ఆశలకు అనుగుణంగానే పట్టణాల్లో బ్యూటీ పార్లర్లు కూడా విస్తరిస్తున్నాయి. అవుట్ డోర్ షూట్లు, పుట్టినరోజు, నిశ్చితార్థం ఇలా వేడుక ఏదైనా వనితకు ప్రత్యేకమే. ప్రతి శుభకార్యానికి ముందస్తు వేడుక ఇప్పుడో ట్రెండ్గా మారిపోయింది. అప్పటికప్పుడు పార్టీలకు వెళ్లేందుకు సైతం అభిరుచికి తగ్గట్టు మగువల అందానికి బ్యూటీషియన్లు మరింత వన్నె తెస్తున్నారు. నేడు జాతీయ బ్యూటీషియన్ల దినోత్సవం మహిళలు, విద్యార్థినులు సైతం అందానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒకప్పుడు పట్టణ ప్రాంతాల్లో ఉన్న పాశ్చాత్య ధోరణి ఇప్పుడు పల్లెలకు సైతం పాకింది. పట్టణాల్లో ఏర్పాటుచేసిన బ్యూటీపార్లర్లు కూడా మగువల అభిరుచులకు తగ్గట్లు నిర్వహణ చేపడుతున్నారు. ఇదిలా ఉండగా కొద్దో గొప్పో బ్యూటీషియన్ కోర్సులు నేర్చుకున్న వారికి ఓ ఆదాయ వనరుగా కూడా కలిసొస్తోంది. ఇంటివద్దే ఉంటూ నాలుగు డబ్బులు సంపాదించి కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. పట్టణం నుంచి పల్లెల వరకు నేడు మహిళలు, చిన్నారులు సైతం అందంపైనే మక్కువ చూపుతున్నారు. ఇంట్లో చిన్న చిన్న వేడుకలతో పాటు పెళ్లిళ్ల సీజన్లో నిశ్చితార్థం మొదలుకుని ఫొటోషూట్, పెళ్లి తంతు ముగిసే వరకు మగువలు అందంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వారితో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. బ్రెడల్ మేకప్, శారీ డ్రాపింగ్, కేశాలంకరణ ఇలా ఎక్కడా మేకప్ విషయంలో రాజీపడడంలేదు. ఆదాయ వనరుగా.. బ్యూటీషియన్ కోర్సు చేసిన మహిళలకు ఇంటి వద్దే ఆదాయవనరుగా బ్యూటీ పార్లర్లు కలిసివస్తున్నాయి. ప్రతి నిత్యం ఐ బ్రో అందంగా తీర్చిదిద్దడంలో మెలకువలు పాటిస్తూ ఆదాయమార్గాలను అన్వేషిస్తున్నారు. మహిళల ఆసక్తిని, అభిరుచిని గమనించి బ్యూటీ పార్లర్లలో ప్రత్యేక అలంకరణ చేస్తున్నారు. సింగిల్ ప్యాకేజీ, హోమ్ సర్వీసెస్ ద్వారా మగువలు వారి అందాన్ని మరింత మెరుగు పరుచుకుంటున్నారు. శరీరతత్వం, మనిషిరంగు, వేడుకను బట్టి వారికి అమరేలా మేకప్ చేస్తున్నారు. మేకప్ రకం, వాడే మెటీరియల్ బట్టి పారితోషికం కూడా తీసుకుంటున్నారు. ఒక్కోసారి ఇళ్లకు తీసుకువెళ్లి మేకప్ చేయించుకునేందుకు బ్యూటీషియన్లతో ముందుగానే ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఇళ్లకు వెళ్లి మేకప్ చేసేందుకు సైతం మెటీరియల్కు అనుగుణంగా రూ.4 వేల నుంచి రూ.10వేల వరకు రేట్లు నిర్ణయించి ఆదాయం సంపాదిస్తున్నారు. శిక్షణతో ప్రోత్సహిస్తున్న సంస్థలు.. మహిళలకు ఉపాధిమార్గాలు చూపేందుకు శిక్షణ సంస్థలు కూడా బ్యూటీషియన్ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ అందిస్తున్నాయి. దీంతో మహిళలు కూడా ఆసక్తి కనబరిచి శిక్షణ పొందుతున్నారు. అలాగే బ్యూటీ పార్లర్లలో పనిచేసుకుంటూ చిన్నచిన్న చిట్కాలను, మెలకువలను సైతం నేర్చుకుంటూ సొంతంగా పార్లర్లను ఏర్పాటు చేసుకుంటూ తమ కాళ్లపై తాము నిలబడగలుగుతున్నారు. -
ఇన్చార్జ్ తహసీల్దార్గా సంజీవకుమార్
పూసపాటిరేగ: పూసపాటిరేగ ఇన్చార్జ్ తహసీల్దార్గా సంజీవకుమార్ను నియమిస్తూ కలెక్టర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడినట్టు రెవెన్యూ అధికారులు తెలిపారు. సాక్షి దినపత్రికలో ‘తహసీల్దార్ ఎక్కడ?’ శీర్షికన బుధవారం కథనం వెలువడింది. దీనిపై స్పందించిన రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు పూసపాటిరేగ డిప్యూటీ తహసీల్దార్గా బాధ్యతలు నిర్వహిస్తున్న సంజీవకుమార్కు ఇన్చా ర్జ్ బాధ్యతలు అప్పగించారు. పదిరోజులుగా తహసీల్దార్ కార్యాలయంలో ఎటువంటి రెవెన్యూ సేవలు అందకపోవడంతో విద్యార్థులు, వివిధ అవసరా ల నిమిత్తం వచ్చే ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ఎట్టకేలకు తహసీల్దార్ బాధ్యతలు ఇన్చార్జికి అప్పగించడంతో రెవెన్యూ సమస్యలు పరిష్కారం కానున్నాయి. -
చిత్తశుద్ధితో పనిచేయండి
● కలెక్టర్ అంబేడ్కర్ విజయనగరం అర్బన్: అధికారులంతా చిత్తశుద్ధితో విధులు నిర్వహించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అధికారులకు సూచించారు. జూన్ 25తో కలెక్టర్గా బాధ్య తలు తీసుకొని ఏడాది పూర్తయిన సందర్భంగా జేసీ సేతు మాధవన్, జిల్లా అధికారులు, రెవెన్యూ సంఘం సభ్యులు, పలువురు పాత్రికేయులు కలెక్టర్ను కలిసి అభినందించారు. డీఆర్ఓ ఆధ్వర్యంలో జిల్లా రెవిన్యూ అసోసియేషన్ సభ్యులు, జిల్లా అధికారులు కలెక్టర్తో కేక్ కట్ చేసి దుశ్శాలువలు కప్పి అధినందనలు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్ఓ శ్రీనివాసమూర్తి, సీపీఓ పి.బాలాజీతోపాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ అవార్డు సాధించాలి గ్రామీణస్థాయిలో పరిశుభ్రతకు అందించనున్న స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్–2025 అవార్డుకు ప్రతి మండలం నుంచి రెండు గ్రామ పంచాయతీలు పోటీపడేలా తీర్చిదిద్దాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్–2025పై వెబెక్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. జిల్లాలో 37 పంచాయతీలను మోడల్ పంచాయతీలుగా తీర్చిదిద్దామని, కేంద్ర బృందం వస్తున్న వేళ పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలన్నా రు. సమావేశంలో జెడ్పీ సీఈఓ సత్యనారాయణ, డీపీఓ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా వేదికగా జాతీయ చెస్పోటీలు
● ఈనెల 28 వరకు జరగనున్న దివ్యాంగుల జాతీయ చెస్ చాంపియన్షిప్ ● పోటీలకు హాజరైన 16 రాష్ట్రాలకు చెందిన 150 మంది క్రీడాకారులువిజయనగరం: జాతీయస్థాయి చెస్ పోటీలకు విజయనగరం వేదికగా నిలిచింది. ఈనెల 25 నుంచి 28వ తేదీ వరకు చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం సారథ్యంలో నిర్వహించ తలపెట్టిన 5వ జాతీయ స్థాయి దివ్యాంగుల చెస్ చాంపియన్ షిప్ పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని మెసానిక్ టెంపుల్లో నిర్వహిస్తున్న పోటీలను స్థానిక ఎమ్మెల్యే పూసపాటి అదితిగజపతిరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయస్థాయి పోటీలు విజయనగరంలో నిర్వహించడం అభినందనీయమన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి పోటీలకు వచ్చిన క్రీడాకారులను ఆమె అభినందించారు. చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం జిల్లా కార్యదర్శి కేవీ జ్వాలాముఖి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలకు చెందిన 150 మంది దివ్యాంగ క్రీడాకారులు మంగళవారం జిల్లాకు చేరుకున్నారన్నారు. వారందరికీ మంగళవారం అన్ని రకాల మెడికల్ చెకప్ చేశామని చెప్పారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారు అంతర్జాతీయ పోటీలకు వెళ్లనున్నారని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరగాలి
పార్వతీపురం టౌన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్లు పెరగాలని, గురువారం జిల్లావ్యాప్తంగా ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేపట్టాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. డిజిటల్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ సూపర్ వైజర్లు, వీఆర్ఓలు, ఉపాధ్యాయులు ఎన్రోల్మెంట్ డ్రైవ్లో పాల్గొనాలని అన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 4,132 మంది 1వ తరగతి విద్యార్థులు తక్కువగా ఉన్నారని, అవన్నీ ఈ డ్రైవ్ ద్వారా భర్తీ కావాలని తేల్చిచెప్పారు. ఇప్పటికే పాఠశాలల్లో చేరి ఆన్లైన్లో నమోదు కాని వారి వివరాలను రానున్న రెండు రోజుల్లో పూర్తిచేయాలని పేర్కొన్నారు. ఇందుకు తల్లితండ్రులకు అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించాలని, డ్రాపౌట్ విద్యార్థులను కూడా బడిలో చేర్పించేలా ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో తల్లికి వందనం కార్యక్రమంపై విద్యాశాఖాధికారులు, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్తో కలెక్టర్ సమీక్షించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అత్యుత్తమ విద్యా ప్రమాణాలతో పాటు అన్ని వసతులు కల్పించినట్లు పేర్కొన్నారు. ఇటువంటి తరుణంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అడ్మిషన్లు పెరగాలని, ఆ దిశగా తల్లితండ్రులు, విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి బి.రాజ్కుమార్, నోడల్ అధికారి డి.మంజులవాణి, ఐసీడీఎస్ పీడీ డా.టి.కనకదుర్గ, ఎంఈఓలు, కళాశాలల ప్రిన్సిపాల్స్, ఇతర అధికారులు పాల్గొన్నారు. 27న సుపరిపాలన కార్యక్రమం సుపరిపాలన కార్యక్రమం ఈ నెల 27వ తేదీన నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఎ శ్యామ్ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. 27వ తేదీ ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్లో కార్యక్రమం ప్రారంభం అవుతుందని చెప్పారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి, రాష్ట్ర వ్యవసాయ, పశు సంవర్థక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారన్నారు. సమావేశంలో పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఎం.సుధారాణి, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి ఎస్.మన్మథ రావు, జిల్లా ప్రణాళిక అధికారి పి.వీరరాజు, జిల్లా విపత్తు స్పందన/అగ్నిమాపక అధికారి పి.సింహాచలం తదితరులు పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేపట్టాలి కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ -
పోలీస్ వెల్ఫేర్ పాఠశాలలో టీచర్ పోస్టుల భర్తీ
విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పోలీస్ వెల్ఫేర్ ఇంగ్లీషు మీడియం పాఠశాలలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఎస్పీ వకుల్ జిందల్ బుధవారం తెలిపారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోదలచిన అభ్యర్థులు తమ విద్యార్హతలతో పాటు, కచ్చితంగా ఆంగ్లంలో విద్యాబోధన చేయగలిగిన సామర్థ్యం ఉండాలని స్పష్టం చేశారు. ఉద్యోగ ఖాళీలు, విద్యార్హత వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. ప్రీ ప్రైమరీ ఉపాధ్యాయ ఉద్యోగం 1: డీఈడీ లేదా బీఈడీ విద్యార్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి 2వ తరగతి కోసం సింగిల్ మదర్ టీచర్ ఉద్యోగం 1సింగిల్ మదర్ టీచర్గా పని చేసేందుకు డీఈడీ, లేదా బీఈడీ అర్హతతో పాటు అన్ని సబ్జెక్టులను బోధించగలగాలి 3 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఇంగ్లీషు సబ్జెక్టును బోధించేందుకు ఉపాధ్యాయ ఉద్యోగం ఖాళీ 1డీఈడీ లేదా బీఈడీ విద్యార్హత కలిగి ఉండాలి 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు గణితం బోధించేందుకు ఉపాధ్యాయ ఉద్యోగం ఖాళీ 1బీఈడీ విద్యార్హత కలిగి ఉండాలి కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం ఖాళీ 1 కంప్యూటర్ ఆపరేటర్గా పని చేసేందుకు బీఎస్సీ లేదా బీకాం లేదా ఇతర కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన డిగ్రీ లేదా సర్టిఫికెట్ కోర్సులను అర్హతగా కలిగి ఉండాలి. తోటమాలి ఖాళీ 1 పాఠశాలలో తోటమాలిగా పని చేసేందుకు ఆసక్తి కలిగిన వ్యక్తులు దరఖాస్తు చేసుకోవచ్చు పైన తెలిపిన ఉద్యోగాలను భర్తీ కోసం ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 30వ తేదీన ఉదయం 10గంటలకు విజయనగరం కంటోన్మెంట్ పోలీస్ క్వార్టర్స్ సమీపంలో గల పోలీస్ వెల్ఫేర్ ఇంగ్లీషు మీడియం పాఠశాలలో జరిగే ఇంటర్వ్యూ, డెమో క్లాసులకు నేరుగా హాజరుకావచ్చని ఎస్పీ పేర్కొన్నారు. మరిన్ని వివరాలు, సందేహాల నివృత్తి కోసం స్కూల్ ఆఫీసు నంబర్లు 9441022874, 6305883484 లేదా రిజర్వ్ ఇన్స్పెక్టర్ 9121109485, వెల్ఫేర్ ఆర్ఎస్సై 9121109484 నంబర్లను సంప్రదించ వచ్చని ఎస్పీ వకుల్ జిందల్ సూచించారు. దరఖాస్తుల ఆహ్వానం -
పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునుంచి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్, నేతేటి ప్రశాంత్లు శాస్త్రోక్తంగా నిత్య పూజాదికాలు చేశారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలను చెల్లించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయం వెనుక ఉన్న వేప,రావిచెట్ల వద్ద దీపారాధన చేశారు. ఆలయ ఇన్చార్జ్ ఈఓ కె.శిరీష కార్యక్రమాలను పర్యవేక్షించారు.క్రికెట్ పోటీల్లో రాణిస్తున్న అక్కాచెల్లెళ్లుకొత్తవలస: విశాఖపట్నంలో ప్రస్తుతం జరుగుతున్న అండర్–19 విభాగంలో బాలికల వన్డే ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ పోటీల్లో కొత్తవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10,8 తరగతులు చదువుతున్న అక్కాచెల్లెళ్లు రాణిస్తున్నట్లు పాఠశాల హెచ్ఎం సీహెచ్.ఈశ్వరరావు మంగళవారం తెలిపారు. పుష్పలతగౌడ్ (10 వతరగతి) అత్యంత వేగంగా డబుల్ సెంచరీ సాధించినట్లు తెలిపారు. అలాగే చెల్లి హర్షిత గౌడ్ (8వ తరగతి)తో కలిసి 240 పరుగుల భాగస్వామ్యం చేసినట్లు చెప్పారు. పుష్పలతగౌడ్ 144 బాల్స్కు గాను 27 ఫోర్స్, 5 సిక్స్లతో మొత్తం 215 పరుగులు సాధించిందన్నారు. అలాగే హర్షితగౌడ్ 109లు పరుగులు సాధించి నాటౌట్గా నిలిచిందని చెప్పారు. ఈ సందర్భంగా ఆ అక్కాచెల్లెళ్లను పాఠశాల ఉపాధ్యాయులు గోవిందనాయుడు, గిరి తదితరులు అభినందించారు. -
పునరావాస సమస్యలను పరిష్కరించాలి
పార్వతీపురంటౌన్: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులందరికీ 2013 భూ సేకరణ చట్టప్రకారం సంపూర్ణమైన పునరావాస సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలని కొండ మొదలు సర్పంచ్ చేపట్టిన నిరాహార దీక్షకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా మంగళవారం కలెక్టరేట్ వద్ద రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ముందుగా జిల్లా కేంద్రంలో ఉన్న రహదారిపై ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్కు చేరుకుని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. కార్యక్రమంలో రైతు కూలీ సంఘం నాయకుడు శ్రీనునాయుడు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులందరికీ 2013 భూసేకరణ చట్టప్రకారం సమస్యలు పరిష్కరించాలని, నేటికి 18ఏళ్లు గడుస్తున్నా ఏ ఒక్కరికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందలేదని, తక్షణమే అందించాలని, నిర్వాసితులందరికీ పునరావాసం కల్పించి డీపట్టా సాగు చేస్తున్న ఆదివాసీలకు పూర్తి నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఆర్ఓ హేమలతకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా ఉన్న పలు గిరిజన గ్రామాల రైతులు, తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి వ్యాపారి ఆస్తుల సీజ్
విజయనగరంక్రైమ్: జిల్లాలోని రామభద్రపురం పోలీస్స్టేషన్ పరిధిలో గంజాయి ఆక్రమ రవాణా కేసులో ప్రధాన నిందితుడైన శెట్టి ఉమామహేశ్వరరావు ఆలియాస్ హుస్సేన్ ఆలియాస్ పుతిన్కు చెందిన సుమారు రూ.2 కోట్ల విలువైన స్తిరాస్తులు సీజ్ చేసినట్లు ఎస్పీ వకుల్ జిందల్ మంగళవారం తెలిపారు. విశాఖలో ఉంటున్న ఉమామహేశ్వరరావు కొంతమంది సహచరులతో కలిసి 147 కేజీల గంజాయిని తరలిస్తూ రామభద్రపురం మండలం కొట్టక్కి చెక్పోస్టు వద్ద పోలీసులకు పట్టుబడ్డాడన్నారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసినప్పటికీ విచారణలో ఉమామహేశ్వరరావును ప్రధాన నిందితుడిగా గుర్తించి ఈ ఏడాది ఏప్రిల్ 25న పీటీ వారెంట్తో అరెస్టు చేశామన్నారు. విచారణలో 2019 నుంచి 2025 మధ్యకాలంలో ఉమామహేశ్వరరావుతో పాటు ఆయన భార్య స్వరూపరాణి, సోదరుడు వెంకటరావు పేరిట రూ.కోటి 89 లక్షల 84,768 ఆస్తులను గుర్తించి సీజ్ చేశామని, ఇంక ఎవరూ కొనుగోలు చేయకుండా చట్టపరమైన నోటీసు జారీ చేశామన్నారు. ఈ కేసు విచారణలో ప్రధాన నింధితుడైన శెట్టి ఉమామహేశ్వరరావుపై అల్లూరి సీతారామరాజు జిల్లా, విజయనగరం జిల్లా, విశాఖ సిటీల్లో 7కు పైగా గంజాయి కేసులు నమోదయ్యా యని తెలిపారు. ఈ ఆపరేషన్లో పాల్గొన్న అదనపు ఎస్పీ సౌమ్యలత, బొబ్బిలి రూరల్ సీఐ నారాయణరావు, రామభధ్రపురం ఎస్సై ప్రసాదరావులను ఎస్పీ వకుల్ జిందల్ అభినందించారు. -
రైలులోనుంచి జారి పడి వ్యక్తి మృతి
సీతానగరం: మండలంలోని చినభోగిలి వద్ద విజయవాడ పాసింజర్ రైలులో నుంచి జారిపడి మంగళవారం ఓ వ్యక్తి మృతిచెందాడు. దీనిపై స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చినభోగిలి గ్రామానికి చెందిన సవరపు మనోజ్(18) విశాఖపట్నం నుంచి విజయవాడ పాసింజర్లో వస్తూ సీతానగరం రైల్వేస్టేషన్లో దిగాల్సి ఉంది. అయితే స్వగ్రామానికి వచ్చే సమయానికి ముందుగానే రైలులోనుంచి జారిపడి మనోజ్ మృతి చెందినట్లు గుర్తించామని స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించినట్లు రైల్వే పోలీసులు తరలించారు. పురుగు మందు తాగి వ్యక్తి..కొమరాడ: మండలంలోని కళ్లికోట గ్రామానికి చెందిన మక్కా వ్యాపారినాయుడు(49) ఈనెల 3తేదీన మద్యం మత్తులో పురుగు తాగేయడంతో అస్వస్థతకు గురికాగా పార్వతీపురంలోని ఓ ప్రైవేట్ అస్పత్రికి కుటుంబసభ్యులు తరలించారు. అక్కడినుంచి మెరుగైన చిక్సిత కోసం విశాఖ కేజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడికి భార్య గౌరీశ్వరి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీనిపై కొమరాడ ఎస్సై నీలకంఠం మాట్లాడుతూ పోస్టుమార్టం నిమత్తం మృతదేహాన్ని పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. వ్యాన్ ఢీకొని వ్యక్తి..పార్వతీపురం టౌన్: పార్వతీపురం మున్సిపాలిటీలోని వివేకానంద కాలనీ గణేష్ రామ వీధికి చెందిన పతివాడ శ్రీను (52) వ్యాన్ ఢీకొని మంగళవారం మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పతివాడ శ్రీను కొత్తవలస శివారులో నూడిల్స్, చికెన్ అమ్ముతూ ఉంటాడు. మంగళవారం మోటార్ సైకిల్పై ఇంటి నుంచి పార్వతీపురం పట్టణంలోకి వస్తుండగా రాయగడ రోడ్డులోని సాహు హాస్పిటల్ సమీపంలో రాయగడ నుంచి గుడ్లు లోడుతో వస్తున్న వ్యాన్ వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ సంఘటనలో శ్రీనుకు తీవ్ర గాయాలు కాగా గమనించిన స్థానికులు వెంటనే పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగా మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై నిమ్మకాయల భాస్కరరావు తెలిపారు.కడుపునొప్పి తాళలేక వివాహిత ఆత్మహత్యరాజాం సిటీ: మండల పరిధి గార్రాజుచీపురుపల్లి గ్రామానికి చెందిన కె.అఖిల (23) మంగళవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన కంటు చండీ ప్రసాద్కు గరివిడి మండలంలోని మందిరివలస గ్రామానికి చెందిన అఖిలతో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. మంగళవారం ఉదయం ఆమెకు ఒక్కసారిగా భరించలేని కడుపునొప్పి రావడంతో ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆమెకు సపర్యలు చేసినప్పటికీ ఫలితంలేకుండా పోయింది. ఈ ఘటనకు సంబంధించి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
క్రీడాకారులకు అండగా ఉంటాం
పాలకొండ: క్రీడాకారులకు అండగా ఉంటామని కబడ్డీ ఆసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు పల్లా కొండలరావు అన్నారు. జాతీయ స్థాయి కబడ్డీ అండర్–18 జట్టుకు ఎంపికై న రాష్ట్ర క్రీడాకారులకు మంగళవారం ఆయన అవసరమైన బ్యాగులు, కిట్లు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గడిచిన 10 రోజులుగా ఇక్కడ శిక్షణ పొంది, జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. క్రీడాస్ఫూర్తితో వ్యవహరించి విజయం సాధించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 27న హరిద్వార్లో జరగనున్న జాతీయస్థాయి అండర్–18 పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు మంగళవారం ఇక్కడి నుంచి బయలు దేరారు. ఈ సందర్భంగా క్రీడాకారులు కొండలరావుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కబడ్డీ ఆసోసియేషన్ జిల్లా కార్యదర్శి వెన్నపు చంద్రశేఖర్, మాజీ క్రీడాకారులు దూబ వెంకటరమణ, మాజీ పీఈటీ రెడ్డి మాస్టర్ తదితరులు ఉన్నారు. -
పొదుపు సంఘాల లక్ష్యంలో ప్రభుత్వం విఫలం
విజయనగరం గంటస్తంభం: ఏ లక్ష్యంతో పొదుపు సంఘాలు పెట్టారో ఆ లక్ష్యం నేరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి సీహెచ్.రమణి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఐద్వా జిల్లా అధ్యక్షురాలు కె.పుణ్యవతి ఆధ్వర్యంలో స్థానిక ఎన్పీఆర్ భవనంలో సదస్సు జరిగింది. ఈ సందర్భంగా రమణి మాట్లాడుతూ..డ్వాక్రా సంఘాలను ఏ లక్ష్యంతో ఏర్పాటు చేశారో ఆ లక్ష్యం నెరవేరలేదన్నారు. పొదుపు చేసిన డబ్బులే రూ.లక్ష నుంచి రూ.ఐదు లక్షల వరకు బ్యాంకులో ఇవ్వడం సరికాదన్నారు. సీ్త్ర నిధి రుణాల్లో అనేక లోపాలు ఉన్నాయని ఆరోపించారు. సక్రమంగా కట్టినా అఽధిక వడ్డీలు తీసుకుంటు న్నారని మండిపడ్డారు. విజయనగరం జిల్లాలోని కళ్లేపల్లి గ్రామంలో రూ.18 లక్షల వరకు అవినీతి జరిగితే ఐద్వా పోరాడి డబ్బులు సుమారు రూ.13 లక్షలు వరకు ఇప్పించినట్లు చెప్పారు. పెన్షన్ ఇస్తామని చెప్పి మహిళల దగ్గర వసూలు చేసిన అభయ హస్తం డ బ్బులు ఏమయ్యామని ప్రశ్నించారు. అత్యధిక బ్యాంకులు డ్వాక్రా మహిళాలకు గౌరవం ఇవ్వడం లేదన్నారు. అప్పును సక్రమంగా కట్టిన వారు ఎవరైనా ఉన్నారంటే వారు డ్వాక్రా మహిళలేనన్నారు. పొదుపు మహిళల సమస్యలు పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శులు పుణ్యవతి, లక్ష్మి, సహాధ్యక్షురాలు ఆర్.కృష్ణవేణి, జిల్లా కమిటీ సభ్యులు జి.అరుణ, కరుణ పాల్గొన్నారు. ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి రమణి -
డీఏ జుగా కార్యక్రమానికి విశేష స్పందన
పార్వతీపురంటౌన్: ధర్తీ ఆబాజన్ జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ కార్యక్రమం జిల్లాలో బాగా జరుగుతోందని, గిరిజన ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నట్లు కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన జిల్లా అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెనన్స్ లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నెల 15 నుంచి 30 వరకు డీఏ జుగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతిని కలెక్టర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో గిరిజనులు తమకు కావలసిన అవసరాలను, ధ్రువపత్రాలను, మౌలిక వసతులను ఎక్కువగా కోరుతున్నట్లు చెప్పారు. అలాగే పీఎం జన్మన్ గృహాలను కోరుతున్నట్లు తెలిపారు. కేంద్రప్రభుత్వం అమలుచేసే పథకాలతో గిరిజన ప్రాంతాల్లో సేవలు, మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయమన్నారు. గ్రామ, క్లస్టర్ స్థాయి శిబిరాల ద్వారా వివిధ సౌకర్యాలను క్షేత్రస్థాయిలో అందించేలా జిల్లా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గిరిజనులు వినియోగించుకోవాలి ఈ నెల 30 వరకు గిరిజనులకు అవసరమయ్యే ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఆయుష్మాన్ భారత్ కార్డ్, కుల ధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రం, కిసాన్ క్రెడిట్ కార్డ్, పీఎం కిసాన్ కార్డులు, జన్ధన్ ఖాతా, పీఎం జేజేబీవై, పీఎం ఎస్బీవై బీమా కవరేజ్, వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ సామాజిక భద్రత పింఛన్లు, ఉపాధిహామీ, పీఎం విశ్వకర్మ, ముద్ర తదితర జీవనోపాధి పథకాలు, పీఎం ఎంవీవై, ఇమ్యునైజేషన్ తదితర సీ్త్ర శిశు సంక్షేమ ప్రయోజనాలను గిరిజన ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ వివరించారు. పీవీటీజీ గృహాలు, గిరిజన గ్రామాలను గుర్తించడం, గ్రామ, క్లస్టర్ స్థాయి శిబిరాలను నిర్వహించడం, ఆరోగ్యం, ఆహారం, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, సామాజిక న్యాయం, వ్యవసాయం, రెవెన్యూ ఇతర విభాగాల సమన్వయంతో కార్యకలాపాలు చేపట్టాలన్నారు. ఆధార్, ఈ– కేవైసీ డాక్యుమెంటేషన్ సంబంధిత సేవల కోసం సంబంధిత విభాగాలు పనిచేస్తాయని స్పష్టం చేశారు. ఆధార్లో నమోదు కాని వారిని అంగన్వాడీ సిబ్బంది నమోదు చేయించాలని, గ్రామస్థాయిలో ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా అధికారులు, మండల ప్రత్యేకాధికారులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ -
తహసీల్దార్ ఎక్కడ?
● 10 రోజులుగా స్తంభించిన రెవెన్యూ సేవలు ● అయోమయంలో పూసపాటిరేగ మండల ప్రజలుపూసపాటిరేగ: పూసపాటిరేగ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ విధుల్లో చేరి రోజు తిరగక ముందే వచ్చిన స్థానానికే మళ్లీ వెనక్కి వెళ్లడంతో పూసపాటిరేగ మండల ప్రజల్లో అయోమయం నెలకొంది. ఈనెల 13వ తేదీన పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నుంచి ఎన్వీ రమణ తహసీల్దార్గా పూసపాటిరేగలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన మరుసటి రోజు నుంచే ఏమైందో ఏమో కానీ ఆయన విధులకు హాజరు కావడం లేదు. తహసీల్దార్ కార్యాలయానికి ధ్రువీకరణ పత్రాలతో పాటు వివిధ అవసరాల నిమిత్తం వచ్చిన విద్యార్థులు, ప్రజలు నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఇంటర్వ్యూలు, విద్యాసంస్థల్లో జాయిన్ అవడానికి ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కనీసం ఇన్చార్జ్ బాధ్యతలు ఎవరికి ఇచ్చినా ఇబ్బందులు ఉండేవి కావని పలువురు వాపోతున్నారు. గంటల వ్యవధిలో ఉద్యోగంలో చేరడం, వెనక్కి వెళ్లడం ఏమిటనేది అంతు చిక్కని ప్రశ్నగా పూసపాటిరేగ మండల ప్రజలకు మిగిలింది. పూసపాటిరేగ తహసీల్దార్గా పనిచేసిన తాడ్డి గోవిందను కలెక్టరేట్లోని ‘సి’ సెక్షన్కు బదిలీ చేశారు. ఆయన స్థానంలో సాలూరు నుంచి ఎన్వీ రమణ వచ్చి విదుల్లో చేరారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ తహసీల్దార్ను రిలీవ్ చేయకుండానే పూసపాటిరేగలో ఆయన విధుల్లో చేరడంతో ఆగ్రహించిన కలెక్టర్ తహసీల్దార్ను వెనుక్కి పిలిచారని ఓవాదన వినిపిస్తుండగా, మరో వాదన మాత్రం రాజకీయంగానే తహసీల్దార్ను వెనక్కి పంపించారని బలంగా వినిపిస్తోంది. ఏది ఏమైనా పూసపాటిరేగ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నియామకంపై చర్చ జరుగుతోంది. కనీసం ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా కనీసం పట్టించుకోవడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి కనీసం ఇన్చార్జ్ తహసీల్దార్ను అయినా నియమించి ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు పడకుండా సమస్య పరిష్కరించాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
సర్వజన ఆస్పత్రిలో పనిచేయని ఎంఆర్ఐ
విజయనగరం ఫోర్ట్: గంట్యాడ మండలానికి చెందిన ఎన్.సతీష్ తీవ్రమైన నడుం నొప్పితో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఎముకల విభాగానికి వెళ్లాడు. ఎంఆర్ఐ స్కాన్ అవసరమని వైద్యులు నిర్ధారించారు. అయితే ఎంఆర్ఐ స్కాన్ పనిచేయకపోవడంతో స్కాన్ బాగైన తర్వాత ఆస్పత్రికి రావాలని వైద్యులు చెప్పడంతో వెనుదిరిగాడు. ఇలా అనేక మంది రోగులు ఎంఆర్ఐ స్కాన్ కోసం వచ్చి నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఎంఆర్ఐ స్కాన్ ఆస్పత్రిలో కొద్ది రోజులుగా పనిచేయకపోవడం వల్ల రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎంఆర్ఐ స్కాన్ పనిచేయకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రిలో ఎంఆర్ఐ స్కాన్ ఉన్నప్పటికీ రోగులు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్కు వెళ్లాల్సిన పరిస్థితి. అధిక మొత్తంలో వెచ్చిస్తున్న రోగులు: ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లో ఎంఆర్ఐ కోసం అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్కో స్కానింగ్కు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు ప్రైవేటు స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు వసూలు చేస్తున్నారు. అయినప్పటికీ గత్యంతరం లేక రోగులు చేయించుకుంటున్నారు. ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్న రోగులు వారం రోజులుగా ఇదే పరిస్థితిత్వరలో బాగు చేయిస్తాం ఎంఆర్ఐ స్కాన్ ప్రస్తుతం పనిచేయడం లేదు. ఎంఆర్ఐ స్కాన్ అత్యవసరమైన వారికి ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లో ఉచితంగా తీయిస్తున్నాం. ఎంఆర్ఐ స్కాన్ను త్వరితగతిన బాగు చేయిస్తాం. డాక్టర్ ఎస్.అప్పలనాయుడు, సూపరింటెండెంట్, ప్రభుత్వసర్వజన ఆస్పత్రి -
జగన్నాథుని రథయాత్రకు సర్వంసిద్ధం
● జిల్లా దేవదాయ శాఖ సహాయ కమిషనర్ కె.శిరీషవిజయనగరం టౌన్: జగన్నాథస్వామి రథయాత్ర మహోత్సవానికి సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా దేవదాయశాఖ సహాయ కమిషనర్, ఆలయ ఇన్చార్జ్ ఈఓ కె.శిరీష పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం స్థానిక సంతపేటలో ఉన్న జగన్నాథస్వామి ఆలయం ఆవరణలో ఉత్సవ కరపత్రాలను ఆమె ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఈ నెల 27 నుంచి జూలై 5వ తేదీ వరకూ ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. 26న గురువారం స్వామివారికి విశ్వక్సేనపూజ, పుణ్యాహవచనం, కళావాహన, బింబ దర్శనం, నేత్రోత్సవం, ప్రసాద వినియోగం పాణింగిపల్లి వాసుదేవాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు. అదేరోజు సాయంత్రం జగన్నాథస్వామి శాంతి కల్యాణం, రాత్రి స్వామివారిని రథోత్సవానికి సిద్ధం చేయడం, రక్షాబంధనాలు ఉంటాయన్నారు. 27న శుక్రవారం ఉదయం 5 గంటలకు స్వామివారికి సుప్రభాతసేవ, విశేష అర్చనలు, నీరాజనం, 9.30 గంటలకు మేళతాళాలతో స్వామివారి రథారోహణ, రక్షాబంధనాలు, అనంతరం స్వామివారి తొలి రథయాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. 28న శనివారం నుంచి జూలై 4వ తేదీ శుక్రవారం వరకూ ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, మహిళా మండలి ఆధ్వర్యంలో విష్ణు సహస్ర నామ పారాయణం, జగన్నాథస్వామి వారి చరిత్ర పారాయణం, గోవిందనామస్మరణ ఉంటుందన్నారు. 5న మారు రథయాత్ర జూలై ఒకటో తేదీన మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు శ్రీ మహాలక్ష్మి దేవి తిరువీధి ఉత్సవం, స్వామివారిని దర్శించడం, శ్రీ లక్ష్మీనారాయణ సంవాదం, శీలవిరుపు ఉత్సవం నిర్వహిస్తామని తెలిపారు. జూలై 5న శనివారం మారు రథయాత్ర, అనంతరం దర్శనాలు ఉంటాయన్నారు. జూలై 6న స్వామివారికి ప్రధాన ఆలయంలో సంప్రోక్షణ, శాంతి హోమాలు, ప్రసాద వినియోగం చేస్తామన్నారు. జూలై 10న ఆషాడ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీసత్యనారాయణస్వామివారి సామూహిక వ్రతం నిర్వహిస్తామని, భక్తులందరూ స్వామివారిని దర్శించి, తరించాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ రమణి, ఆలయ పూజారులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఏపీ పీజీఈసెట్లో ర్యాంకుల పంట
విజయనగరం అర్బన్: ఆంధ్రయూనివర్సిటీ పరిధిలోని ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఏపీపీజీఈసెట్–2025 ప్రవేశ పరీక్షలో ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన అభ్యర్థులు ఉత్తమ ప్రతిభ చూపారు. వివిధ గ్రూప్లలో టాప్ టెన్ ర్యాంక్లు సాధించారు. మంగళవారం విడుదలైన ఫలితాల్లో కెమికల్, సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, మెకానికల్, నానో ఇంజినీరింగ్ పీజీ కోర్సులలో ర్యాంకుల పంట పండించారు. భరత్కు మూడో ర్యాంక్ నెల్లిమర్ల రూరల్: ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ పీజీఈసెట్–2025 ఫలితాల్లో నెల్లిమర్ల మండలం అలుగోలు గ్రామానికి చెందిన కురిమినేని భరత్ నాయుడు ప్రతిభ చూపాడు. కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో 76 మార్కులు సాధించి విశాఖ ఆంధ్రా యూనివర్శిటీ పరిధిలో మూడో ర్యాంక్ను సొంతం చేసుకున్నాడు. ఉత్తమ ర్యాంక్ను సాధించిన విద్యార్థిని తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందించారు. అంపిలి విద్యార్థి ప్రతిభ పాలకొండ రూరల్: మండలంలోని అంపిలి గ్రామానికి చెందిన గేదల లక్ష్మీనారాయణ ఏపీ పీజీఈసెట్లో ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో ఏయూ పరిధిలో రెండవ ర్యాంక్ సాధించాడు. విద్యార్థి తండ్రి అప్పలనాయుడు వ్యవసాయ కూలీకాగా, తల్లి పార్వతి మరణించారు. ఎలక్ట్రికల్ విభాగంలో ఉత్తమ పరిశోధనలు చేయాలన్న తపనతో చదువుసాగిస్తున్నట్టు లక్ష్మీనారాయణ తెలిపాడు. -
100 రోజులు పనికల్పించకపోతే చర్యలు
జామి: వేతనదారు కుటుంబానికి 100 రోజులు పని కల్పించకపోతే చర్యలు తప్పవని డ్వామా పీడీ ఎస్.శారదాదేవి ఉపాధిహామీ సిబ్బందిని హెచ్చరించారు. జామి మండలపరిషత్ కార్యాలయంలో మంగళవారం 19వ విడత సామాజిక ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. ఏప్రిల్ 24 నుంచి మార్చి 2025 వరకు ఉపాధిహమీ పథకం కింద చేపట్టిన పనులపై గ్రామాల్లో సోషల్ ఆడిట్ బృందాలు తనీఖీలు నిర్వహించి తయారు చేసిన నివేదికలను చదివి వినిపించారు. మండలంలో రూ.18 కోట్ల 40 లక్షలతో చేపట్టిన పనుల వివరాలను తెలియజేశారు. చాలా గ్రామాల్లో 100 రోజులు పని కల్పించకపోవడం, పనుల వద్ద బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, పనుల కొలతల్లో తేడాలు వంటివి పరిశీలనకు వచ్చినట్టు సమావేశంలో వెల్లడించారు. కార్యక్రమంలో ఏపీడీ పద్మజ, ఎంపీడీఓ ఎన్.అప్పలనాయుడు, ఎస్టీఎం కె.సత్యనారాయణ, ఎస్ఆర్పీ రామచంద్రరావు, జిల్లా విజిలెన్స్ అధికారి వెంకటరమణ, ఏపీఓ కిరణ్మయి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ గొర్లె రవికుమార్, పలు గ్రామాల సర్పంచ్లు, డీఆర్పీలు పాల్గొన్నారు. డ్వామా పీడీ శారదాదేవి -
ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాలి
● ఐసీడీఎస్ పీడీ విమలారాణి విజయనగరం ఫోర్ట్: ఆపదలో ఉన్న మహిళలకు అండగా నిలవాలని విజయనగరం వన్స్టాప్ సెంటర్ సిబ్బందికి ఐసీడీఎస్ పీడీ టి.విమలారాణి సూచించారు. వన్స్టాప్ సెంటర్ను మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీచేశారు. రికార్డులను పరిశీలించారు. ఇంతవరకు ఎంతమందికి సంరక్షణ కల్పించారన్న అంశంపై ఆరా తీశారు. మహిళల సంరక్షణ కోసం ట్రోల్ ప్రీ నంబర్ 181ను సంప్రదించాలనే విష యాన్ని మహిళలకు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో సెంటర్ ఆడ్మినిస్ట్రేటర్ పి.సాయివిజయలక్ష్మి, కౌన్సిలర్ రమాదేవి, తదితరులు పాల్గొన్నారు. పక్కి గ్రామానికి గజరాజుల గుంపు బొబ్బిలి రూరల్: మండలంలోని పలు గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న తొమ్మిది ఏనుగుల గుంపు మంగళవారం పక్కి గ్రామ పరిసరాల్లోకి చేరుకుంది. సీతానగరం మండలం నుంచి ముత్తాయివలస, కమ్మవలస, శివడవలస మీదుగా పక్కి గ్రామ పరిసరాల్లోని అరటితోటల్లో తిష్టవే శాయి. స్థానిక ప్రజలను అటవీ సిబ్బంది అప్రమత్తం చేశారు. అభినందనలు విజయనగరం ఫోర్ట్: డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నియమితులైన డాక్టర్ ఎం.జయచంద్రనాయుడుకు రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు అభినందనలు తెలిపారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని సూపరింటెండెంట్ చాంబర్లో మంగళవారం ఆయనను సత్కరించి శుభకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంబంగి అప్పలనాయుడు, డిప్యూటీ సూపరింటెండెంట్ శివశ్రీధర్, ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జయధీర్, వైద్యులు లోక్నాథ్, అప్పలనాయుడు, వెంకటనాయుడు, మణికుమార్, వంశీకృష్ణ పాల్గొన్నారు. యువతకు సదావకాశం పార్వతీపురం టౌన్: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సాలూరు శ్రీ సత్యసాయి డిగ్రీ కళాశాలలో ఈ నెల 28న ఉదయం 9 గంటలకు జాబ్మేళా జరగనుందని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, ఏదైనా డీగ్రీ చదువుకొని 18 నుంచి 28 ఏళ్ల మధ్య వయసున్న నిరుద్యోగ యువతీ యువకులు జాబ్మేళాకు అర్హులని తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన యువకులు httpr://naipunyam.ap.gov.in వెబ్సైట్ లో పేరు నమోదు చేసుకొని, రిఫరెన్స్నంబర్తో పాటు బయోడేటా, ఆధార్ కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లు ఒరిజినల్, జెరాక్స్, ఒక పాస్ఫొటోతో జాబ్మేళాకు హాజరు కావాలని కోరారు. 12 కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై అర్హత కలిగిన అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారన్నారు. మరిన్ని వివరాలకు సెల్: 94947 77553, 73825 59022 నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
● ఓపీ @1200
–8లోరథయాత్రకు సర్వంసిద్ధం జగన్నాథస్వామి రథయాత్ర మహోత్సవానికి సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా దేవదాయశాఖ సహాయ కమిషనర్, ఆలయ ఇన్చార్జ్ ఈఓ కె.శిరీష పేర్కొన్నారు. సర్వజన ఆస్పత్రిలో పనిచేయని ఎంఆర్ఐ ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వెళ్లే రోగులకు ఎమ్మార్ఐ స్కానింగ్ కష్టాలు తప్పడంలేదు. చిత్రాల్లోని జనాన్ని చూసి రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ అనుకుంటే పొరపాటు పడినట్టే. ఇది విజయనగరం జిల్లా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఓపీ విభాగం. మంగళవారం ఒక్కరోజు 1200 ఓపీ నమోదైంది. జ్వరాలు, వివిధ వ్యాధులతో బాధపడుతూ వచ్చిన వారితో ఆస్పత్రి రద్దీగా మారింది. ఓపీ నమోదు కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా వ్యాధులు, జ్వరాల వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఈ చిత్రాలే నిలువెత్తు సాక్ష్యం. – విజయనగరం ఫోర్ట్/ సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం -
● అడ్డగో(డ)లుగా ఆక్రమణ!
చిత్రం చూశారా... కాలువ పక్కనే ప్రహరీ నిర్మించి ఆక్రమించిన స్థలం బొబ్బిలి మున్సిపాలిటీది. అధికార బలంతో ఓ వ్యక్తి ఇలా అడ్డంగా గోడకట్టి మున్సిపాలిటీ స్థలాన్ని సొంతం చేసుకున్నారు. మున్సిపల్ కార్మికులు ఇళ్లు నిర్మించుకునేందుకు ఈ స్థలాన్ని కేటాయించాలని అధికారులకు విన్నవించినా స్పందించ లేదు. ఇప్పుడు అడ్డగోలుగా ఆక్రమించినా మిన్నకుండడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటూ సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పొట్నూరు శంకరరావు, నాయకులు ఎం.ప్రసాద్, వి.సత్యనారాయణ అన్నారు. ఆక్రమణ స్థలాన్ని మంగళవారం పరిశీలించి ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే ప్రహరీ కూలదోసి మున్సిపల్ స్థలాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. – బొబ్బిలి -
కూటమిది వెన్నుపోటు పాలన
ప్రభుత్వ తీరుపై ప్లకార్డులతో నిరసనవిజయనగరంలో నిర్వహించిన యువతపోరు ర్యాలీలో పాల్గొన్న వెఎస్సార్సీపీ యువజన, విద్యార్థి విభాగం నాయకులు, నిరుద్యోగులు, విద్యార్థులు విజయనగరం: కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పాలనపై యువత, నిరుద్యోగులు గర్జించారు. ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీలు తక్షణమే అమలుచేయాలంటూ వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విజయనగరంలో సోమ వారం పోరుబాట సాగించారు. నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ విడుదలలో జాప్యంపై నిరసన గళం వినిపించారు. దగా చేసిన పాలకుల వైఖరిని నిరసిస్తూ.. తమకు కావాల్సింది యోగాంధ్ర కాదు.. ఉద్యోగాంధ్ర అంటూ నినదించారు. అధికారం చేపట్టి ఏడాది గడిచినా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన రూ.3 వేల భృతి, 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడని ప్రశ్నించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడాన్ని ఖండించారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచన మేరకు పార్టీ జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో ‘యువత పోరు’ పేరిట వందలాది మంది యువత, నిరుద్యోగులు, విద్యార్థులు కలిసి జ్యోతిరావుపూలే విగ్రహం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. బాబు వచ్చాడు.. జాబు పోయింది.. నిరుద్యో భృతి ఎప్పుడు?.. తొలగించిన వారికి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలి... కల్లబొల్లి మాటలొద్దు ఉద్యోగాలు ఇవ్వండి.. వసతి దీవెన డబ్బులు ఇవ్వాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తికి వినతిపత్రాన్ని అందజేశారు. నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు న్యాయం చేయాలని.. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను తక్షణం అమలు చేయాలని కోరారు. చిరుద్యోగుల తొలగింపు అన్యాయం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, చిరుద్యోగులను రాజకీయ కక్షతో తొలగిస్తుండడం అన్యాయమని వైఎస్సార్సీపీ యువజన విభాగం నాయకుడు జి.ఈశ్వర్ కౌశిక్ అన్నారు. వలంటీర్ వ్యవస్థ రద్దుతో 2.66 లక్షల మందికి ఉపాధి పోయిందని, వారి కుటుంబాలు రోడ్డునపడ్డాయని వాపోయారు. ఇస్తానన్న రూ.10వేలు జీతం ఇవ్వక, ఉన్న ఉద్యోగాన్ని పీకేయడం ఎంత వరకు సమంజసమని సీఎం చంద్రబాబును నిలదీశారు. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్లలో పనిచేసిన 18 వేలమంది రోడ్డున పడ్డారని, వైద్యఆరోగ్యశాఖలో స్పెషలిస్ట్ వైద్యుల నియామకం ఆపేశారన్నారు. ఎండీయూ వాహనాలు రద్దు చేయడంతో 20 వేల కుటుంబాల ఉపాధికి గండిపడిందన్నారు. పశు సంవర్థక శాఖలో చిరుద్యోగులనూ తొలగించేందుకు ఉపక్రమిస్తుండడం విచారకరమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4 లక్షల కుపైగా ఉద్యోగాలను తొలగించారని, వారందరినీ తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు వర్రి నర్సింహమూర్తి, సంగంరెడ్డి బంగారునాయుడు, ఇప్పిలి అనంత్, జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు పి.సత్యనారాయణ, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు కరుమజ్జి సాయికుమార్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్కుమార్, అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలు పతివాడ కృష్ణవేణి, ఆర్టీఐ విభాగం అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, సోషల్ మీడియా అధ్యక్షుడు వాసునాయుడు, పార్టీ జామి మండలాధ్యక్షుడు గొర్లె రవి, ఎస్.కోట నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు వాకాడ సతీష్, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి ఫణి, కార్పొరేటర్లు జి.వి.రంగారావు, పట్నాన పైడిరాజు, ఎన్ని లక్ష్మణరావు, పార్టీ నాయకులు బోడసింగి ఈశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. ఆందోళనలో విద్యార్థిలోకం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ నిరుద్యోగ యువతను నమ్మించి మోసం చేయడంపై ఆగ్రహం జాబ్ క్యాలెండర్ ఎక్కడంటూ ప్రశ్నల వర్షం కూటమి పాలనకు వ్యతిరేకంగా యువత నిరసన గళం జోరువానలో సాగిన నిరసన హోరు జ్యోతిరావుపూలే విగ్రహం నుంచి కలెక్టర్ వరకు సాగిన ర్యాలీ డీఆర్వోకు వినతిపత్రం అందజేత ఎన్నికలకు ముందు ఓట్లు దండుకునేందుకు నిరుద్యోగ యువతకు హామీలిచ్చి.. నేడు అమలుచేయకపోవడం కూటమి ప్రభుత్వ వెన్ను పోటు పాలనకు నిదర్శనమని వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అల్లు అవినాష్ అన్నారు. అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలిస్తామని, నిరుద్యోగ యువతకు ఉద్యోగం వచ్చేవరకు నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీలను తక్షణమే అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల తొలగింపును వెంటనే ఆపాలన్నారు. ఇప్పటికే తొలగించినవారిని వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వ మోసకారి పాలనతో రాష్ట్రంలో యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. విద్యాదీవెన, వసతిదీవెన అందక, చదువుకునే లక్షలాదిమంది యువత తీవ్రకష్టాలు పడుతుంటే ప్రభుత్వం వేడుక చూస్తుందా అంటూ ప్రశ్నించారు. పేదకుటుంబాల విద్యార్థుల ఉన్నత చదువులు సాకారం కావాలన్న సమున్నత లక్ష్యంతో గత జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన విద్యాదీవెన, వసతిదీవెన పథకాలకు నిధులు మంజూరు నిలిపివేయడం దారుణమన్నారు. దీనివల్ల యువకుల తల్లిదండ్రులు అధికవడ్డీలకు అప్పులు చేసి మరీ ఫీజులు కట్టాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి సుందర హరీష్, చీపురుపల్లి యువజన విభాగం అధ్యక్షుడు బెల్లాన వంశీలు మాట్లాడుతూ షెడ్యూల్ ప్రకారం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులు నిలిచిపోవడంతో విద్యార్థిలోకం ఆందోళన చెందుతోందన్నారు. తక్షణమే 2024–25 విద్యాసంవత్సరానికి ఫీజురీయింబర్స్మెంట్ కింద రూ.2,800 కోట్లు, హాస్టల్ మెయింట్నెన్స్ ఖర్చులు కింద రూ.1,100 కోట్లు కలిపి మొత్తం 5.3,900 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉన్నతమైన లక్ష్యంతో జిల్లాకు గత ప్రభుత్వం మంజూరుచేసిన ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటుపరం చేసే యత్నాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. -
రోడ్డు ప్రమాదంలో హెచ్సీకి తీవ్ర గాయాలు
డెంకాడ: విజయనగరం – విశాఖ జాతీయ రహదారిపై మండలంలోని చింతలవలస ఐదో ఏపీఎస్పీ బెటాలియన్ మెయిన్ గేట్ వద్ద సోమవారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్, ఏపీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోరాడ రామునాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఎస్సై ఎ.సన్యాసినాయుడు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. హెచ్సీ రామునాయుడు బెటాలియన్ మెయిన్ గేట్కు ఎదురుగా ఉన్న అయినాడ పంచాయతీలోని సత్యనారాయణపురం గ్రామంలో ఉంటున్నారు. సోమవారం 5.30 గంటల ప్రాంతంలో విధులు నిర్వహించేందుకు బెటాలియన్కు ద్విచక్ర వాహనంపై వస్తుండగా.. విజయనగరం నుంచి విశాఖ వైపు వెళ్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రామునాయుడు తలకు, కాళ్లు, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే సమీపంలో ఉన్న పోలీసులు వచ్చి రామునాయుడును విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ వాహనంతో పరారయ్యాడు. కొద్ది సేపటి తర్వాత కారును గుర్తించినట్లు ఎస్సై సన్యాసినాయుడు తెలిపారు. -
శాశ్వత పరిష్కారం చూపండి..
● జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి ● పీజీఆర్ఎస్కు 166 వినతులువిజయనగరం అర్బన్: ప్రజా వినతుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చే వినతులకు శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు లాగిన్లో ఎప్పటికప్పుడు సమస్యలను చూసుకుంటూ రీ ఓపెన్ కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజూ లాగిన్ అయ్యి వినతులను శతశాతం పరిష్కరించాలని ఆదేశించారు. 166 వినతుల స్వీకరణ.. కలెక్టరేట్లో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్కు 166 వినతులు వచ్చాయి. డీఆర్ఓ శ్రీనివాసమూర్తి, డిప్యూటీ కలెక్టర్లు, విజయనగరం ఆర్డీఓ సవరమ్మ, పౌరసరఫరాల డీఎం బి.శాంతి, డీఈఓ యూ.మాణిక్యంనాయుడు హాజరై వినతులు స్వీకరించారు. రెవెన్యూ శాఖకు అత్యధికంగా 69 వినతులు.. పంచాయతీ శాఖకు 17.. పింఛన్లు మంజూరు చేయాలని, తదితర అంశాలపై డీఆర్డీఏకు 22 వినతులు అందాయి. మున్సిపాలిటీకి 5, విద్యాశాఖకు 15, హౌసింగ్కు 2 అందగా వైద్యశాఖకు 4, విద్యుత్ శాఖకు 4 వినతులు రాగా.. మిగిలినవి ఇతర శాఖలకు చెందిన సమస్యలు.చట్ట పరిధిలో పరిష్కరించాలి ● ఏఎస్పీ సౌమ్యలత విజయనగరం క్రైమ్: అర్జీదారులు తెలియజేసిన సమస్యలను చట్టపరిధిలో పరిష్కరించాలని ఏఎస్పీ పి. సౌమ్యలత అన్నారు. స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల పరిష్కార వేదిక కార్యక్రమంలో 43 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఎస్పీ ఆదేశాల మేరకు ప్రజా సమస్యలు తెలుసుకున్నామన్నారు. సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. మొత్తం 43 వినతులు రాగా భూ తగాదాలకు సంబంధించినవి 15.. కుటుంబ కలహాలకు సంబంధించినవి 4.. మోసాలకు సంబంధించినవి 7.. ఇతర అంశాలకు సంబంధించినవి 17 ఉన్నాయన్నారు. ఏడు రోజుల్లో సమస్యలపై స్పందించి, వాటిపై తీసుకున్న చర్యలను నివేదిక రూపంలో జిల్లా పోలీస్ కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐలు ఏవీ లీలారావు, ఆర్వీఆర్కే చౌదరి, డీసీఆర్డీ సీఐ బి.సుధాకర్, ఎస్సై ప్రభావతి, సిబ్బంది పాల్గొన్నారు. -
ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు 248 మంది ఎంపిక
విజయనగరం అర్బన్: పదోతరగతిలో చూపిన ప్రతిభ ఆధారంగా రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీ కళాశాలల్లో ప్రవేశాలకు జిల్లా నుంచి 248 మంది (6.14 శాతం) ఎంపికయ్యారు. నూజివీడు ట్రిపుల్ ఐటీ కళాశాలకు 68 మంది, ఆర్కేవేలీ ట్రిపుల్ ఐటీకు 24 మంది, ఒంగోలు ట్రిపుల్ ఐటీకు 34 మంది, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ కళాశాలకు 122 మంది ఎంపికై నట్టు విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఒకే పాఠశాల నుంచి 16 మంది ఎంపిక బొబ్బిలి: మండలంలోని కోమటిపల్లి (కారాడ) మహాత్మా జ్యోతిరావు పూలే బాలుర పాఠశాలకు చెందిన 16 మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీ (ఆర్జీయూకేటీ)కి ఎంపికై నట్టు ప్రిన్సిపాల్ గుణుపూరు పురుషోది సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. నూజివీడు ట్రిపుల్ ఐటీకి ఆరుగురు, శ్రీకాకుళం– ఐదుగురు, ఒంగోలు– నలుగురు, ఇడుపులపాయ ఆర్కే వ్యాలీకి ఒకరు ఎంపికై నట్టు చెప్పారు. ఒకే సారి 16 మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీ కళాశాలల్లో ప్రవేశాలకు ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు. ఉపాధ్యాయ సిబ్బందిని అభినందించారు. భోజన పథక బిల్లులను చెల్లించాలి ● డీఈఓకు మధ్యాహ్న భోజన పథక కమిటీ వినతి విజయనగరం అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతి విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనం బిల్లుల బకాయిలను తక్షణమే చెల్లించాలని భోజన పథకం రాష్ట్ర అధ్యక్షురాలు కె.స్రవంతి డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట సోమవారం నిరసన తెలిపారు. అనంతరం డీఈఓ యు.మాణిక్యంనాయుడుకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాలుగునెలలుగా మెస్ బిల్లు లు, గౌరవ వేతనాలు ఇవ్వక పోవడం వల్ల కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ నెలాఖరులోగా బిల్లులు చెల్లించకపోతే జూలై 1 నుంచి పనులు నిలిపివేస్తామని హెచ్చరించారు. భోజన పథక కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాల న్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు ఉంగరాల విజయలక్ష్మి, కార్యదర్శి పి.లక్ష్మి, రాజీ, ధనలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. గ్రామ సర్వేయర్ల నిరసన డెంకాడ: సమస్యలు పరిష్కరించాలంటూ గ్రామ సర్వేయర్లు డెంకాడ మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం నిరసన తెలిపారు. హేతుబద్ధీకరణలో భాగంగా మిగులు సిబ్బంది 4,722 మంది సర్వేయర్ల భవిష్యత్పై సమగ్ర నివేదిక సమర్పించాలని డిమాండ్ చేశారు. గ్రేడ్–3 నుంచి గ్రేడ్–2కి మార్చినందున పే స్కేల్లో తగిన మార్పులు చేయాలని కోరారు. అన్ని జిల్లాల్లో సీనియారిటీ జాబితాలు పబ్లిష్ చేయాలన్నారు. అర్హులందరికీ ఉద్యోగోన్నతి కల్పించేలా సర్వీస్ రూల్స్లో తగిన మార్పులు చేయాలని, ఇప్పటివరకు జరిగిన రీ సర్వే పెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీ విలేజ్ సర్వేయర్స్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి ప్రసాద్, గ్రామ సర్వేయర్లు పాల్గొన్నారు. -
● పీజీఆర్ఎస్కు 203 దరఖాస్తులు
పార్వతీపురం టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే వినతులను పారదర్శకంగా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె. హేమలత అన్నారు. స్థానిక కలెక్టరేట్ పీజీఆర్ఎస్ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకురాలు సుధారాణితో కలిసి అర్జీలు స్వీకరించారు. మొత్తం 203 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఫిర్యాదునూ మానవతాకోణంలో ఆలోచించి శాశ్వత పరిష్కారం చూపించాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయిలో కూడా వినతులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖాకారి కె.రాబర్ట్పాల్, డీఎంహెచ్ఓ ఎస్.భాస్కరరావు, జిల్లా పంచాయతీ అధికారి టి.కొండలరావు, జిల్లా గ్రామీణ నీటి సరఫరా ఇంజినీరింగ్ అధికారి ఓ.ప్రభాకరరావు, ఇన్చార్జ్ జిల్లా విద్యాశాఖధికారి బి.రాజ్కుమార్, పార్వతీపురం కో–ఆపరేటివ్ అధికారి, ఇతర జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని.. ● వీరఘట్టం మండలం యు.వెంకంపేటలో ప్రస్తుతం ఉన్న పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుందని, వర్షాకాలంలో శ్లాబ్ నుంచి నీరు లీకవడంతో విద్యార్థులు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని, అదనపు భవనం మంజూరు చేయాలని గ్రామానికి చెందిన ఎస్. సింహాచలం వినతి అందజేశారు. ● గుమ్మలక్ష్మీపురం మండలం పి.ఆమటి గ్రామంలో ప్రాథమిక పాఠశాల మూసి వేయడం వల్ల విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని, వి ద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని పాఠ శాలను పునఃప్రారంభించాలని తాడంగి దమ యంతమ్మ, తదితరులు వినతి సమర్పించారు. ● సర్వే నంబర్ 85–2లో ఉన్న భూమికి విద్యుత్ కనెక్షన్ పొందడానికి అవసరమైన రుసుం, సర్టిఫికెట్లను విద్యుత్ శాఖకు సమర్పించానని.. అయితే కొంతమంది కావాలనే పనిని అడ్డుకుంటున్నారని పార్వతీపురం మండలం డొంకలకోటపట్నం గ్రామానికి చెందిన డి.లక్ష్మి వినతి సమర్పించారు. ● గరుగుబిల్లి మండలం హిక్కింవలస గ్రామ పాఠశాలలో 3,4,5వ తరగతులు చదువుతున్న విద్యార్థులను గరుగుబిల్లి హైస్కూల్లో విలీనం చేయడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. గ్రామంలోని పాఠశాలను మోడల్ ప్రై మరీ పాఠశాలగా మార్చి విద్యార్థులు స్థానికంగా చదువుకునేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. -
జంఝావతి లిఫ్ట్ పనిచేసేలా చూడండి
పార్వతీపురం టౌన్: కొమరాడ మండలంలో గల జంఝావతి ప్రాజెక్ట్కు సంబంధించి రబ్బర్ డ్యామ్ లిఫ్ట్ పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు వి. దాలినాయుడు, తదితరులు కోరారు. ఈ మేరకు సోమవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా వినతుల పరిష్కార వేదికలో డీఆర్ఓ కె. హేమలతను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దాలినాయుడు మాట్లాడుతూ.. ప్రస్తుతం ఖరీఫ్ పనులు ప్రారంభమైన నేపథ్యంలో జంఝావతి సాగునీరు రైతులకు అవసరమవుతాయన్నారు. రబ్బర్డ్యామ్ లిఫ్ట్ను బాగుచేస్తే సుమారు 24,640 ఎకరాలకు సాగునీరు అందించవచ్చని చెప్పారు. ట్రాన్స్ఫార్మర్ పాడవ్వడంతో కొంతకాలంగా లిఫ్ట్ పనిచేయడం లేదని చెప్పారు. రైతులకు జంఝావతి నీరు అందించడంలో కూటమి నాయకులు, అధికారులు ఘోరంగా విఫలమయ్యారని తెలిపారు. కార్యక్రమంలో సిరిసిపల్లి సాయి శ్రీనివాస్, పాలక రంజిత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. రైతులకు న్యాయం చేయండి : కాంగ్రెస్ నాయకులు -
‘తోటపల్లి’ నిర్వాసితులకు ఇళ్ల బిల్లులు చెల్లించాలి
పార్వతీపురం టౌన్: తోటపల్లి బ్యారేజీ నిర్వాసిత గ్రామాలైన పాతకల్లికోట, దుగ్గి గ్రామాలలో నిర్వాసితులు నిర్మించుకున్న ఇళ్లకు బిల్లులు వెంటనే చెల్లించాలని ఏపీ రైతు సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు బంటు దాసు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక కలెక్టరేట్ వద్ద నిర్వాసిత రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం డీఆర్ఓ కె.హేమలతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్వాసితులు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద ఇళ్లు నిర్మించుకున్నా ఇంతవరకు బిల్లులు చెల్లించలేదన్నారు. రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు ఎం.కృష్ణమూర్తి మాట్లాడుతూ.. నిర్వాసిత మహిళలకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం మహిళలకు ప్యాకేజీ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. అధికారులు స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో దుగ్గి, పాతకల్లికోట, తోటపల్లి, పెద్దగెడ్డ నిర్వాసిత రైతులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. రైతు సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు బంటు దాసు -
మిగులు సీట్లకు రాతపరీక్ష రేపు
విజయనగరం అర్బన్: ఉమ్మడి విజయనగరం జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలలో 2025 – 26 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 7, 8, 9వ తరగతుల్లో మిగులు సీట్లకు ఈ నెల 25న రాత పరీక్ష నిర్వహించనున్నట్లు ఉమ్మడి జిల్లా గురుకుల సమన్వయకర్త ఎస్.రూపావతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 6, 7 తరగతులకు సంబంధించి బాలురకు కొప్పెర్ల గురుకులంలో.. బాలికలకు నెల్లిమర్ల గురుకులలో ఉదయం 10 గంటల నుంచి 11 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా 8, 9 తరగతులకు సంబంధించి బాలురకు కొప్పెర్లలో.. బాలికలకు నెల్లిమర్లలో మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 వరకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు గంట ముందు కేంద్రానికి చేరుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 89858 83015, 63038 38657 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఐదో తరగతిలో ఉన్న ఖాళీలను ఎటువంటి ప్రవేశ పరీక్ష నిర్వహించకుండా కేటాయిస్తామని.. ఆసక్తి ఉన్న విద్యార్థులు జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ జంక్షన్లో ఉన్న సమన్వయకర్త అధికారి కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని పేర్కొన్నారు.లారీ బోల్తా ..జామి: మండలంలోని అలమండ సమీపంలో ఓ లారీ అదుపుతప్పి బోల్తా పడిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. విశాఖపట్నం నుంచి రాయపూర్ వైపు బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్త్రెవర్కు స్పల్పగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రుడ్ని అలమండ పీహెచ్సీకి తరలించారు. ట్రాక్టర్ బోల్తా – డ్రైవర్ మృతి పార్వతీపురం రూరల్: మండలంలోని జిల్లేడువలస సమీపంలో ట్రాక్టర్ బోల్తాపడడంతో డ్రైవర్ మృతి చెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల ద్వారా సమాచా రం అందుకున్న పోలీసులు మృతుడిని మక్కు వ మండలం ఎర్రసామంతవలస గ్రామానికి చెందిన మండంగి సుబ్బారావు(35) గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. విద్యుదాఘాతంతో యువకుడి మృతి తెర్లాం: విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని డి.గదబవలస గ్రామం వద్ద సోమవారం సాయంత్రం జరిగింది. దీనికి సంబంధించి ఎస్సై సాగర్బాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని గంగన్నపాడు గ్రామానికి చెందిన పోరపు రామకృష్ణ (18) తెర్లాం నుంచి పెరుమాళి వైపు కొత్తగా వేసిన విద్యుత్ లైన్లో కూలి పనికోసం వెళ్తున్నాడు. సోమవారం కూడా విద్యుత్ స్తంభం ఎక్కి పని చేస్తుండగా.. ఒక్కసారిగా విద్యుత్ సరఫరా రావడంతో స్తంభం పైనుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి తల్లిదండ్రులు, చెల్లి ఉన్నారు. మృతిడి తండ్రి సోదన్నదొర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శవపంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాడంగి సీహెచ్సీకి తరలించారు. -
నొప్పితో రోదిస్తున్నా
కనికరం లేదాయె..! చిత్రంలో కాలుకి కట్టుతో నేలపై సేదతీరుతున్న వృద్ధురాలి పేరు ఎర్రయ్యమ్మ. పూసపాటిరేగ గ్రామం. కాలుకు ఇన్ఫెక్షన్ కావడంతో నెలరోజుల కిందట విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందింది. అప్పట్లో కాస్త నయమైంది. మళ్లీ రెండు రోజుల కిందట ఇన్ఫెక్షన్ సోకడంతో వైద్యంకోసం కుటుంబ సభ్యులు ఆమెను అదే ఆస్పత్రికి సోమవారం ఉదయం తీసుకొచ్చారు. జనరల్ సర్జరీ విభాగంలో చూపించారు. కాలుకి డ్రెస్సింగ్ చేయాలని వైద్యులు సూచించడంతో డ్రెస్సింగ్ గది వద్దకు తీసుకెళ్లారు. అక్కడ సిబ్బంది లేక పోవడంతో తిరిగి జనరల్ సర్జరీ విభాగం వద్ద ఉన్న స్టీల్ టేబుల్పై కూర్చోబెట్టారు. నొప్పి భరించలేక వృద్ధురాలు నేలపై పడుకుని రోదిస్తున్నా సత్వర సేవలు అందించేందుకు సిబ్బంది ఎవరూ ముందుకు రాలేదు. కనికరించలేదు. కుటుంబ సభ్యులు ఆందోళన చేయడం, సిబ్బందిని నిలదీయడంతో మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత డ్రెస్సింగ్ సేవలందించారు. – విజయనగరం ఫోర్ట్ -
‘జిందాల్’కు నీరిస్తే రైతులకు నష్టం
విజయనగరం ఫోర్ట్: జిందాల్ పరిశ్రమలకు బుచ్చి అప్పారావు జలాశయం (తాటిపూడి) నుంచి నీరు ఇస్తే రైతులు నష్ట పోతారని ఆయకట్టు పరిరక్షణ కమిటి సభ్యులు తెలిపారు. ఈ మేరకు సోమవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిందాల్ భూముల్లో పెట్టనున్న చిన్న పరిశ్రమల పార్కుకు బుచ్చి అప్పారావు జలాశయం నుంచి నీరు ఇచ్చేందుకు విడుదల చేసిన జీఓ 14ను రద్దు చేయాలన్నారు. జలాశయం కింద ఉన్న శివారు కాలువలకు సిమెంట్ లైనింగ్, తూములు, షట్టర్ల ఏర్పాటుతో పాటు రాకపోకలకు వీలుగా వంతెనలు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రాజెక్ట్ మెయింటినెన్స్కు ఇచ్చే సాధారణ నిధులు వెంటనే విడుదల చేయాలన్నారు. ధర్నాలో జామి మండల జెడ్పీటీసీ మాజీ సభ్యులు గొర్లె రవికుమార్, బండారు పెదబాబు, ఏపీ రైతు సంఘం కార్యదర్శి బి. రాంబాబు, గులిపల్లి జయపాల్, కొత్తలి ఎర్నాయుడు, కోడెల ముత్యాలనాయుడు, కోడెల శ్రీను, బండారు సూర్యారావు, జాగారపు అప్పారావు, కిలపర్తి శ్రీరామ్మూర్తి, గనివాడ సన్యాసినాయుడు, తమటపు పైడినాయుడు, తదితరులు పాల్గొన్నారు. బుచ్చి అప్పారావు జలాశయం ఆయకట్టు పరిరక్షణ కమిటీ సభ్యులు -
ఓర్వలేకే మాజీ సీఎంపై కేసులు
రేగిడి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డికి వస్తున్న ప్రజాధరణ చూసి ఓర్వలేకే కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తోందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి ఇటీవల పల్నాడులో పర్యటించిన సమయంలో చీలి సింగయ్య అనే వ్యక్తి ప్రమాదవశాత్తూ మరణించాడని, దీన్ని సాకుగా చూపి జగన్ మోహన్రెడ్డి, తదితరులపై కేసులు నమోదు చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. మండలంలోని బూరాడ గ్రామంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విషాదకరమైన ప్రమాదాలను కూడా రాజకీయం చేయడం తగదని సూచించారు. ప్రమాదవశాత్తూ జరిగిన మరణాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నించడం దురదృష్టకరమన్నారు. బస్సు ప్రమాదాల్లో ఎవరైనా మరణిస్తే డ్రైవర్పై కేసు నమోదు చేయడం పరిపాటని.. అంతేకాకుండా బస్సులో ప్రయాణిస్తున్న వారందరిపై కేసులు నమోదు చేస్తారా అని ప్రశ్నించారు. పల్నాడు సంఘటనకు సంబంధించి లేనిపోని కథనాలను మీడియాలో చూపించి జగన్ మోహన్రెడ్డిని ఏ–2గా చేర్చడం విడ్డూరంగా ఉందన్నారు. వాస్తవానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డికి భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు టంకాల అచ్చెన్నాయుడు, మండల కన్వీనర్ వావిలపల్లి జగన్మోహనరావు, కరణం శ్రీనివాసరావు, కెంబూరు వెంకటేశ్వరరావు, వావిలపల్లి శశిభూషణరావు, బంకి చంద్రశేఖర్, టంకాల ఉమాపాపినాయుడు, రణస్థలం రమాదేవి, రాంబాబు, పిల్లా గౌరునాయుడు, దార గుర్నాథరావు, వైశ్యరాజు గోవిందరాజు, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ -
ఫ్రాన్సిస్కోలో సెంచూరియన్ విశ్వవిద్యాలయం ప్రదర్శన
భువనేశ్వర్: సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ–మేనేజ్మెంట్ (సీయూటీఎం) అరుదైన ఘనత సాధించింది. శాన్ఫ్రాన్సిస్కోలో ప్రారంభమైన 62వ డిజైన్ ఆటోమేషన్ కాన్ఫరెన్స్ (డీఏసీ)లో పాల్గొనే అరుదైన అవకాశాన్ని చేజిక్కించుకోవడమే కాకుండా తన సామర్థ్యాన్ని ప్రదర్శించి ప్రశంసలు అందుకుంది. ఈ కాన్ఫరెన్స్ ఈ నెల 22న ప్రారంభమైంది, 25 వరకు కొనసాగనుంది. సెమీకండక్టర్, డిజైన్ ఆటోమేషన్ పరిశ్రమ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కాన్ఫరెన్స్లో సెంచూరియన్ ప్రాతినిధ్యం వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ‘చిప్స్ టు సిస్టమ్స్’ అనే శీర్షికతో నిర్వహిస్తున్న డీఏసీ కార్యక్రమానికి ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ (ఈడీఏ), సెమీకండక్టర్ టెక్నాలజీలు, సిస్టమ్ ఇన్నోవేషన్ రంగంలో దిగ్గజాలు హాజరు కావడం విశేషం. వర్సిటీ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ డీఎన్ రావు ఆధ్వర్యంలో ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్ దాస్, లక్ష్మీకాంత్ సుతార్లతో కూడిన బృందం సెంచూరియన్ తరఫున ప్రాతినిధ్యం వహించింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ డీఎన్ రావు మాట్లాడుతూ ప్రపంచ స్థాయి వేదికపై సామర్థ్యాన్ని ప్రదర్శించిన తొలి వర్సిటీగా సెంచూరియన్ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. వర్సిటీలో సెమీకండక్టర్ టెక్నాలజీ పాఠ్యాంశాలు మెరుగుపరచడానికి మార్క్యూ సెమీ కండక్టర్స్తో ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. విద్యతో పాటు సాంకేతిక ఆవిష్కరణల్లోనూ వర్సిటీ గుర్తింపు సాధించడం ఆనందంగా ఉందన్నారు. అధునాతన పారిశ్రామిక రంగానికి అక్కరకు వచ్చే రీతిలో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. రానున్న కాలంలో ప్రపంచ స్థాయిలో సెంచూరియన్ తన ఉనికి చాటుకుంటుందని ఆశాభవం వ్యక్తం చేశారు. -
పీఏఏపీ జిల్లా అధ్యక్షుడిగా ‘వంగల’
పార్వతీపురం: ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (పీఏఏపీ) పార్వతీపురం జిల్లా అధ్యక్షుడిగా వంగల దాలినాయుడు నియామకయ్యారు. ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శిఖరం నరహరి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఈశ్వరయ్య ఆదివారం ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్వతీపురం మన్యం జిల్లాలో గల విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం వంగల దాలినాయుడు మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి అప్పగించిన బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తానని చెప్పారు. తనకు అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు జిల్లా క్రీడాకారులు విజయనగరం: ఈ నెల 23 నుంచి 25 వరకు ఉత్తరాఖండ్ హరిద్వార్లో జరగనున్న జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి ఆరుగురు క్రీడాకారులు అర్హత సాధించారు. ఈ నెల 10, 11 తేదీల్లో అనంతపురం జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలలో బంగారు పతకం సాధించిన హర్షిణి, తరుణ్, రోహిణి సత్య, బి. హర్షవర్థన్, వైష్ణవీదేవి, షణ్ముఖ సిద్ధార్థ్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ మేరకు క్రీడాకారులను జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గురాన అయ్యలు, సీహెచ్ వేణుగోపాలరావు, కోచ్ యశస్విని ఆదివారం ప్రత్యేకంగా అభినందించారు. జాతీయ స్థాయి పోటీల్లో రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. సెల్ఫోన్ల దొంగ అరెస్ట్ విజయనగరం క్రైమ్: జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఒకటో నంబర్ ప్లాట్ఫారంపై అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒకరిని జీఆర్పీ సిబ్బంది ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జీఆర్పీ ఎస్సై బాలాజీరావు మాట్లాడుతూ.. వైజాగ్ జీఆర్పీ డీఎస్పీ రామచంద్రరావు ఆదేశాలతో సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్లో తనిఖీలు చేపడుతుండగా అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇతడ్ని విచారించగా.. రెండు సెల్ఫోన్లు అపహరించినట్లుగా తేలిందన్నారు. నిందితుడ్ని బొబ్బిలి మండలం చల్లవలసకు చెందిన ప్రసాద్గా గుర్తించామన్నారు. ఇతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం విశాఖ రైల్వేకోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. మద్యం సీసాల స్వాధీనం పూసపాటిరేగ: మండలంలోని మత్సవానిపాలెం అనధికారికంగా మద్యం కలిగి ఉన్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని, అతడి దగ్గర నుంచి ఎనిమిది మద్యంసీసాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ వి.రవికుమార్ ఆదివారం తెలిపారు. ఎవరైనా అక్రమంగా మద్యం తరలించినా, అమ్మినా కేసులు తప్పవని సీఐ హెచ్చరించారు. -
క్రైం కార్నర్
రామాలయంలో చోరీ జామి: మండల కేంద్రంలోని చుక్కవారి వీధిలో గల రామాలయంలో ఆదివారం మధ్యాహ్నం చోరీ జరిగింది. స్థానికులు తెలియజేసిన వివరాల ప్రకారం.. అర్చకుడు వి. సాయి ఎప్పటిమాదిరిగా పూజా కార్యక్రమాలు ముగించుకుని ఆలయానికి తాళం వేసుకుని వెళ్లిపోయారు. మధ్యాహ్న సమయంలో ఆలయంలో ఎవ్వరూ లేకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తులు ఆలయ తలుపులు తొలగించి, హుండీ తాళాలను పగులగొట్టి నగదు అహహరించుకుపోయారు. హుండీలో సుమారు 15 వేల రూపాయల వరకు ఉండవచ్చని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ట్రాక్టర్ ఢీకొని యువకుడి మృతి బొబ్బిలి రూరల్: మండలంలోని కాశిందొరవలస పంచాయతీ మోసూరువలస గిరిజన గ్రామానికి చెందిన మోసూరు భాస్కరరావు (26) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. భాస్కరరావు రామభద్రపురం మండలం జోగిందొరవలస గ్రామ సమీపంలో పనులు ముగించుకుని శనివారం రాత్రి తిరిగి వస్తుండగా.. వెనుక నుంచి వస్తున్న ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భాస్కరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు స్పందించి స్థానిక సీహెచ్సీకి తరలించగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి ఒక కుమారుడు ఉండగా.. భార్య ధనలక్ష్మి ప్రస్తుతం తొమ్మిది నెలల గర్భిణి. కుమారుడి మృతితో తల్లిదండ్రులు గోపాలు, తవుడమ్మలు కన్నీరుమున్నీరుగా రోధిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వృద్ధురాలి మిస్సింగ్ డెంకాడ: మండలంలోని ఆకులపేట గ్రామానికి చెందిన నిడిగట్టు జేజమ్మ(65) కనిపించకపోవడంపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎ. సన్యాసినాయుడు ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 19వ తేదీన తెల్లవారుజాము 4 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన జేజమ్మ తిరిగి ఇంటికి చేరుకోలేదన్నారు. ఇంటి నుంచి వెళ్లినప్పుడు నీలిరంగు చీర, ఎరుపు రంగు జాకెట్ వేసుకుందని తెలిపారు. మతిస్థిమితం లేకపోవడంతో తప్పిపోయినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని చెప్పారు. ఎవరికై నా కనబడితే 91211 09446, 91548 74492 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
మాజీ సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు తగవు
రేగిడి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు శోచనీయమని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. మండలంలోని చిన్నశిర్లాంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ల మన్ననలు పొందేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై, నాయకులపై లేనిపోని ఆరోపణలు చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. బుచ్చయ్యచౌదరికి వయసు పెరుగుతున్నకొద్దీ బుద్ధి మందగిస్తోందన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డిని ఉద్దేశించి నీ తల నరకవచ్చు కదా అని అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ నాయకులను ధూషిస్తే పదవులు వస్తాయని ఆశతో టీడీపీ నాయకులు ఇలా నీచంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సూపర్సిక్స్ హామీలు పూర్తిస్థాయిలో అమలు చేయకపోయినప్పటికీ అమలు చేశామని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించడంపై ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు అధిక సంఖ్యలో తరలివస్తున్నారని.. దీన్ని చూసి ఓర్వలేకే టీడీపీ నాయకులు పనికిమాలిన మాటలు అంటున్నారన్నారు. బుచ్చయ్యచౌదరి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈయనతో పాటు పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు టంకాల అచ్చెన్నాయుడు, మండల కన్వీనర్ వావిలపల్లి జగన్ మోహనరావు, యూత్ కన్వీనర్ మజ్జి శ్రీనివాసరావు, మీసాల ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ -
ఎన్నాళ్లీ ఇబ్బందులు..!
● రేకుల షెడ్డులో విద్యార్థులకు తరగతులు ● మా ఊరి పాఠశాల గోడు వినరా అంటున్న కె. పెద్దవలస గిరిజనులు ● చిన్నారుల భవిత కోసం నడుం బిగించిన గ్రామస్తులు ● రేకుల షెడ్కు ఎదురుగా పూరిపాక నిర్మాణంమక్కువ: వారంతా గిరిజనులు.. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు.. వారి జీవితాల వలే పిల్లల జీవితాలు కాకూడదనే ఉద్దేశంతో విద్యార్థులకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. ఎన్ని ప్రభుత్వాలు మారిన పాఠశాల తీరు మారకపోవడంతో ఆవేదన చెందారు. గతంలో నిర్మించిన పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం హయాంలో భవనాన్ని తొలగించారు. అప్పటి నుంచి గ్రామంలో పాఠశాలే లేదు. ఉపాధ్యాయులు కొన్నాళ్ల పాటు ఓ చెట్టు కింద పాఠాలు బోధించేవారు. పిల్లలు అవస్థలు చూసి తల్లిదండ్రులు, గ్రామస్తులు చలించిపోయారు. ఎంతోమంది అధికారులకు, పాలకులకు పాఠశాల దీనస్థితిని వివరించారు. అయినా సమస్యకు పరిష్కారం దొరకకపోవడంతో గ్రామస్తులంతా నడుంబిగించి, చందాలు పోగుచేసుకొని రేకులషెడ్ను నిర్మించుకున్నారు. ప్రస్తుతం ఆ రేకుల షెడ్కు ఎదురుగా పూరిపాక నిర్మిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం కె.పెద్దవలస పాఠశాల దనస్థితిపై కథనం. రేకుల షెడ్లోనే తరగతులు.. పాఠశాలలో 52 మంది విద్యార్థులు ఒకటో తరగతి నుంచి ఐదు వరకు చదువుతున్నారు. పాఠశాలకు పక్కా భవనం లేకపోవడంతో గ్రామస్తులు చందాలు వేసుకుని ఏర్పాటు చేసుకున్న రేకుల షెడ్లోనే తరగతులు చెబుతున్నారు. అయితే వర్షం కురిస్తే విద్యార్థులు, ఉపాధ్యాయులు తడిసిపోతున్నారు. పాఠశాలలో గతేడాది ముగ్గురు ఉపాధ్యాయులు విధులు నిర్వహించేవారు. ఈ ఏడాది పాఠశాలను మోడల్ ప్రైమరీ పాఠశాలగా ప్రభుత్వం గుర్తించడంతో, మరో లాంగ్వేజ్ పండిట్ పోస్టును మంజూరు చేశారు. దీంతో పాఠశాలలో 52 మంది విద్యార్థులతో పాటు నలుగురు ఉపాధ్యాయులు బిక్కుబిక్కుమంటూ ఉండాల్సిన పరిస్థితి దాపురించింది. పూరిపాక నిర్మాణం.. గ్రామస్తులు గతంలో నిర్మించిన రేకుల షెడ్ విద్యార్థులకు సరిపోవడం లేదు. దీంతో పూరిపాక నిర్మాణం చేయాలని నిర్ణయించుకుని, ఆదివారం సమీపంలో ఉన్న కొండకు వెళ్లి వెదురుకర్రలు, మానికర్రలు తీసుకొచ్చి పూరిపాక నిర్మాణానికి నడుం బిగించారు. అలాగే గ్రామంలో గతంలో నిర్మించిన అంగన్వాడీ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో దాన్ని తొలగించారు. దీంతో ఓ అద్దె ఇంటిలో చిన్నారులకు విద్యాబుద్ధులు చెబుతున్నారు. మరికొద్ది రోజుల్లో అంగన్వాడీ భవనం కోసం పూరిపాకను నిర్మించేందుకు స్థలాన్ని గ్రామస్తులు కేటాయించుకున్నారు. నాడు – నేడు నిధులతో పునాదులు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర చొరవతో గ్రామంలో పాఠశాల భవనం నిర్మించేందుకు నాడు – నేడు ఫేజ్–2లో 38 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. సుమారు 10 లక్షల రూపాయలతో పునాదులు, పిల్లర్లు వేశారు. అలాగే స్పెషల్గ్రాంట్ నిధులు మరో 10 లక్షల రూపాయలను రాజన్నదొర మంజూరు చేయించినప్పటకీ, ఎన్నికల కోడ్ వల్ల నిధులు మంజూరుకు అంతరాయం ఏర్పడంది. దీంతో పనులు జరగలేదు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం స్పందించి పాఠశాలకు పక్కా భవనాలు నిర్మించాలని గ్రామ పెద్దలు కోరుతున్నారు. -
కబడ్డీ క్రీడాకారులకు ప్రోత్సాహం..
పాలకొండ: కబడ్డీ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు కె. ప్రభావతి అన్నారు. పాలకొండలో అండర్ –18 కబడ్డీ జట్టు క్రీడాకారుల ఎంపిక ఆదివారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కబడ్డీలో మన రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహించే వారి సంఖ్య తక్కువగా ఉంందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిభ కలిగిన వారు మన రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నారని తెలిపారు. వీరిని ప్రోత్సహించేందుకు అసోసియేషన్ కృషి చేస్తుందని తెలిపారు. 14 మంది క్రీడాకారులు ఎంపిక ఈ నెల 27 నుంచి హరిద్వార్లో జరగనున్న అండర్ 18 కబడ్డీ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే క్రీడాకారులను ఎంపిక చేశారు. 10 రోజులుగా పట్టణంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు పల్లా కొండలరావు సహకారంతో క్రీడాకారులకు శిక్షణ అందించారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన 20 మంది క్రీడాకారులు శిక్షణ పొందారు. వీరిలో 14 మందిని జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఇందుకోసం ప్రభావతితో పాటు అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వై. శ్రీకాంత్, వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఎన్. అప్పారావు క్రీడాకారులకు పోటీలు నిర్వహించి జట్టును ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అసోసియేషన్ నాయకులు సబ్బరాజు, నాంచారయ్య, రాంబాబు, సుధాకర్ మాట్లాడుతూ.. కబడ్డీ క్రీడాకారులకు పలు సూచనలు అందించారు. పది రోజుల పాటు ఉచిత భోజనం, వసతి కల్పించిన పల్లా కొండలరావుకు అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జిల్లా అసోయేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర అసోషియేషన్ నాయకులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సీఎల్ నాయుడు, వి. చంద్రశేఖర్, గార లక్ష్మణ్, కె. రమేష్, పలువురు మాజీ క్రీడాకారులు పాల్గొన్నారు.