Vizianagaram District News
-
ఇంత నిర్లక్ష్యమా..!
విజయనగరం ఫోర్ట్: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందాన తయారైంది జిల్లా క్షయ నివారణ శాఖ అధికారుల పరిస్థితి. పోస్టులు భర్తీ చేయాలని ఉన్నత అధికారులు చెప్పినప్పటకీ ఇంతవరకు చేపట్టకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంతో మంది నిరుద్యోగ అభ్యర్థులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. టీడీపీ సర్కార్ వచ్చిన తర్వాత వైద్య రంగంలో పోస్టులు కొత్తగా భర్తీ చేసిన దాఖలాలు లేవు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. జీరో వేకేన్సీ పాలసీ ద్వారా వైద్య శాఖల్లో పోస్టులు ఖాళీ అయిన వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేశారు. ఇలా విజయనగరం జిల్లాలో రెండు వేలకు పైగా పోస్టులు వైద్య రంగంలో భర్తీ చేశారు. ఐదు పోస్టుల భర్తీకి ఆదేశాలు క్షయ నివారణ శాఖలో ఐదు పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు రెండు నెలలు క్రితం ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇంతవరకు పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. దీంతో పోస్టులు భర్తీ చేస్తారో.. లేదోనని నిరుద్యోగ అభ్యర్థుల్లో సందేహం నెలకొంది. పబ్లిక్, ప్రైవేటు పార్టనర్షిప్ కో ఆర్డినేటర్ (పీపీసీ) పోస్టు–1, సీనియర్ టీబీ సూపర్వైజర్ పోస్టు–1. ట్యూబర్క్యూలొసిస్ ల్యాబ్ సూపర్వైజర్ (ఎస్టీఎల్ఎస్) పోస్టులు–2, అకౌంటెంట్ పోస్టు ఒకటి భర్తీ చేయాల్సి ఉంది. వేలాది మంది ఎదురుచూపులు వైద్య రంగంలో వివిధ కోర్సులు చదివిన వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు ఉన్నారు. కొంతమంది బీ ఫార్మసీ, డీ ఫార్మసీ, ఎంఎల్టీ, డీఎంఎల్టీ, డీఎంఐటీ, జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్, థియేటర్ అసిస్టెంట్, ఆడియోమెట్రిషిన్, ఫిజియోథెరపిస్టు ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, ఆఫ్తామాలజీ టెక్నీషియన్ వంటి కోర్సులు చదివిన అనేక మంది నిరుద్యోగులు ఉన్నారు. వీరంతా పోస్టుల భర్తీకి ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేస్తుందా... అని ఆశగా ఎదురు చూస్తున్నారు. క్షయ రోగుల పర్యవేక్షణ కోసం.. క్షయ వ్యాధి బారిన పడ్డ వారు సకాలంలో మందులు వాడుతున్నారా.. లేదా.. మందులు మధ్యలో ఏమైనా మానివేస్తున్నారా.. అని సూపర్వైజర్లు పర్యవేక్షిస్తారు. కఫం పరీక్ష కోసం వచ్చిన వారికి సకాలంలో పరీక్ష చేస్తున్నారా.. లేదా, ఆశ వర్కర్లు ద్వారా వారికి సకాలంలో మందులు అందుతున్నాయా.. లేదా, నెలకు అందించే రూ.1000 ప్రోత్సహకం వారికి అందుతుందా.. లేదా అని పర్యవేక్షిస్తారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే రోగుల్లో క్షయ లక్షణాలు ఉన్న వారిని ప్రభుత్వ ఆస్పత్రులకు పంపిస్తున్నారా.. లేదా అని పీపీసీ పర్యవేక్షిస్తారు.ఆదేశాలొచ్చాయి.. క్షయ నివారణ శాఖలో ఐదు పోస్టులు భర్తీ చేయమని ఆదేశాలు వచ్చాయి. త్వరలోనే పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేస్తాం. – డాక్టర్ కె.రాణి, జిల్లా క్షయ నివారణ అధికారిణి క్షయ నివారణ శాఖ పోస్టుల నియామకంలో జాప్యం భర్తీకి ఆదేశాలొచ్చినా పట్టించుకోని వైనం నోటిఫికేషన్ విడుదల చేయని ఉన్నతాధికారులు -
అంతర్ వర్సిటీ ఖోఖో పోటీలకు జీఎంఆర్ విద్యార్థులు
రాజాం సిటీ: సౌత్జోన్ అంతర్ విశ్వవిద్యాలయాల ఖోఖో పోటీలకు జీఎంఆర్ ఐటీ డీమ్డ్ టుబీ యూనివర్సిటీ విద్యార్థులు ఎంపికయ్యారని పీడీ బీహెచ్ అరుణ్కుమార్ మంగళవారం తెలిపారు. ఈ పోటీలు ఈ నెల 26 నుంచి 29 వరకు కర్నాటక రాష్ట్రం దావన్గిరీలో జరగనున్నాయని పేర్కొన్నారు. ఇటీవల రఘు ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన ఎంపికలో జి.సాయిగణేష్, ఎస్.రోహిత్ చక్కని ప్రతిభ కనబరిచి సౌత్జోన్కు ఎంపికయ్యారని తెలిపారు. వీరిని వీసీ డాక్టర్ జె.గిరీష్, ప్రిన్సిపాల్ డాక్టర్ సీఎల్వీఆర్ఎస్వీ ప్రసాద్, స్టూడెంట్స్ డీన్ డాక్టర్ వి.రాంబాబు, విద్యార్థులు తదితరులు అభినందించారు. కళ్లికోటలో గజరాజులు కొమరాడ: నాగావళి నది ఆవల వైపున్న గజరాజుల గుంపు మంగళవారం నది దాటి కళ్లికోట గ్రామ పరిసరాల్లోకి చేరుకుంది. దీంతో ఈ ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. రూ.వేలల్లో పెట్టుబడి పెట్టిన పంట దిగుబడులు ప్రస్తుతం వచ్చే తరుణంలో గజరాజుల సంచారంతో నాశనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గజరాజులను ఈ ప్రాంతం నుంచి తరలించాలని రైతులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా కళ్లికోట, దుగ్గి, గుణానపురం గ్రామాల ప్రజలు, రైతులు రాత్రి వేళ పొలాల్లోకి వెళ్లొద్దని అటవీ శాఖ అధికారులు సూచించారు. ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని కోరారు. కురుపాం: కురుపాం సర్కిల్ పరిధిలో వివిధ కేసులలో సీజ్ చేసిన సుమారు 148 లీటర్ల నాటుసారా, ఆరు లీటర్ల మద్యం విజయనగరం డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు పార్వతీపురం మన్యం జిల్లా అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఎ.సంతోష్ సమక్షంలో ధ్వంసం చేసినట్టు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ పి.శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. అక్రమ మద్యం, సారా విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. ఎక్కడైనా సారా విక్రయాలు జరిగితే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
రైతులను ఆదుకుంటాం..
● 33 శాతం కంటే ఎక్కువ నష్టం జరిగితే పరిహారం ● జిల్లా వ్యవసాయాధికారిణి సత్యవతివీరఘట్టం: పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని జిల్లా వ్యవసాయ శాఖాధికారిణి జి.సత్యవతి అన్నారు. మండలంలో ఇటీవల వీచిన ఈదురుగాలులకు నేలమట్టమైన మొక్కజొన్న, అరటి పంటలను మంగళవారం ఆమె తమ బృందంతో కలిసి పరిశీలించారు. కిమ్మి, చిట్టపులివలస, నడిమికెల్ల తదితర గ్రామాల్లో పంటలను పరిశీలించారు. 33 శాతం కంటే ఎక్కువ నష్టం జరిగితే పరిహారం వస్తుందని, అటువంటి రైతుల పేర్లు నమోదు చేస్తామని సూచించారు. అలాగే పిందె దళలో ఉన్న పంటలను కాపాడుకునేందుకు చేపట్టాల్సిన చర్యలను రైతులకు వివరించారు. ఆమెతో పాటు ఏడీఏ రత్నకుమారి, వీరఘట్టం ఏఓ జె.సౌజన్య తదితరులున్నారు. -
29న ‘నరసం’ ఉత్తరాంధ్ర మహిళల సదస్సు
విజయనగరం టౌన్: నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర మహిళల సదస్సును ఈ నెల 29న ఆదివారం క్షత్రియ కల్యాణ మండపంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు చివుకుల శ్రీలక్ష్మి, భోగరాజు సూర్యలక్ష్మి తెలిపారు. ఈ మేరకు గురజాడ స్వగృహంలో సదస్సుకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరవుతారన్నారు. ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు. విశిష్ట అతిథులుగా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, సంస్కృత, తెలుగు అకాడమీ చైర్మన్ ఆర్డి.విల్సన్, శరత్ చంద్ర, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ తదితరులు హాజరవుతారని తెలిపారు. సంఘం గౌరవ అధ్యక్షురాలు తేళ్ల అరుణ సభాధ్యక్షతన నిర్వహించే కార్యక్రమంలో ప్రముఖ సాహతీవేత్తలు రచించిన పుస్తకావిష్కరణలు, నవ్యాంధ్ర కీర్తి పురస్కారాలు, జిల్లా ప్రముఖులకు సత్కారాలు ఉంటాయన్నారు. సాహితీవేత్తలందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు కె.అనూరాధ, సహాయ కార్యదర్శి దాసరి పద్మ, గురజాడ ఇందిర తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల హామీలు నెరవేర్చాలి : సీపీఐ
పార్వతీపురం రూరల్ : ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిర్వహించిన ఆందోళనలో జిల్లా కార్యదర్శి కూరంగి మన్మధరావు పాల్గొని మాట్లాడారు. అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం ఇవ్వాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇంటి నిర్మాణ ఆర్థిక సాయాన్ని రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న టిడ్కో ఇళ్లను తక్షణమే లబ్ధిదారులకు స్వాధీనం చేయాలని, కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లను మంజూరు చేయాలని, 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్న్ హామీని అమలు చేయాలని, పెన్షన్ల తొలగింపు ప్రక్రియను ఆపాలని కోరారు. దళిత, గిరిజన వాడల్లో శ్మశాన వాటికలకు స్థలాలు కేటాయించి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. సీపీఐ జిల్లా నాయకులు ఆర్వీఎస్ కుమార్, ఈవీ నాయుడు, గోపి నాయుడు, పువ్వల ప్రసాద్, ఎం.గోపాల్, సింహాద్రి దుర్గారావు, రవికుమార్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ వద్ద ధర్నా -
పోలీస్ కుటుంబాల సంక్షేమానికి కృషి
● ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ రవిశంకర్రెడ్డిడెంకాడ: ఐదవ ఏపీఎస్పీ బెటాలియన్ పోలీస్ కుటుంబాల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని కమాండెంట్ వై.రవిశంకర్రెడ్డి అన్నారు. విజయనగరానికి చెందిన స్వామి కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో బెటాలియన్లో యూనియన్ ఫంక్షన్ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. శిబిరంలో 237 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది, వారి కుటంబాలకు వైద్య పరీక్షలు చేశారు. శిబిరంలో ప్రముఖ కంటి వైద్యులు మంచు కుమారస్వామి, రాహుల్, రంజిత్ తదితరులు వైద్య సేవలు అందించారు. కార్యక్రమంలో అదనపు కమాండెంట్ సి.రాజారెడ్డి, అసిస్టెంట్ కమాండెంట్లు సి.రాజారెడ్డి, ఎం.గోపాలకృష్ణ, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
క్షయ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి
● ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ దేవీమాధవి విజయనగరం ఫోర్ట్: క్షయ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ దేవీమాధవి అన్నారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో మంగళవారం నిర్వహించిన ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు వారాలకు మించి దగ్గు ఉంటే దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలన్నారు. క్షయ వ్యాధిని త్వరగా గుర్తించడం ద్వారా వ్యాధి వ్యాప్తిని తగ్గించవచ్చునని తెలిపారు. మందులు క్రమం తప్పకుండా వాడాలన్నారు. అనంతరం సర్వజన ఆస్పత్రి పలమనాలజిస్టు డాక్టర్ సంతోష్కుమార్ను సన్మానించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ, డీటీసీఓ డాక్టర్ రాణి, ప్రభుత్వ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లోక్నాథ్ తదితరులు పాల్గొన్నారు. -
సమన్వయంతో పార్టీ పటిష్టతకు కృషి చేయాలి
● జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు విజయనగరం: అధికారంలో ఉన్నా.. లేకున్నా నిత్యం ప్రజల పక్షాన నిలిచే వైఎస్సార్సీపీ పటిష్టతకు పార్టీ శ్రేణులతో కలిసి సమన్వయంతో పని చేయాలని విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు సూచించారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోని బొబ్బిలి నియోజకవర్గ పరిశీలకులుగా నియామకమైన రొంగలి జగన్నాధంతో పాటు శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్తగా నియామకమైన చింతాడ రవి తమ అనుచరులతో మజ్జి శ్రీనివాసరావును మంగళవారం మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ సిద్ధాంతాలను, అమలు చేసిన పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని సూచించారు. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజ్యా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని చెప్పారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
వక్ఫ్బోర్డ్ మాజీ అధ్యక్షుడు కరీమ్ మృతికి సంతాపం
విజయనగరం టౌన్: వక్ఫ్బోర్డ్ మాజీ అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది అబ్దుల్ కరీమ్ (59) సోమవారం రాత్రి మృతి చెందారు. ముస్లింల అభ్యున్నతికి విశేషంగా కృషి చేయడమే కాకుండా సమాజ సేవకులుగా, న్యాయవాద వృత్తిలో రాణిస్తూ అందరి మన్ననలు పొందిన అబ్దుల్ కరీమ్ అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందడం పట్ల ముస్లిం పెద్దలు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాడ సానుభూతి తెలిపారు. రైలు ఢీకొని యువకుడి దుర్మరణం పార్వతీపురం రూరల్: పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన ఘటన పార్వతీపురం మండలం నర్సిపురం సమీపంలో చోటుచేసుకుంది. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాలు.. నర్సిపురం గ్రామానికి చెందిన నాగిరెడ్డి వెంకటేశ్వర్లు (31) మంగళవారం ఉదయం బహిర్భూమికి వెళ్లే క్రమంలో రైలు పట్టాలను దాటుతున్నాడు. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న రైలును గమనించకపోవడంతో అది బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన వెంకటేశ్వర్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రైల్వే హెచ్సీ రత్నకుమార్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ కార్యాలయంలో అల్యూమినియం వైర్లు చోరీ రామభద్రపురం: స్థానిక విద్యుత్ సబ్స్టేషన్ కార్యాలయంలో అల్యూమినియం విద్యుత్ వైర్లు సోమవారం రాత్రి చోరీకి గురయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానిక విద్యుత్ సబ్స్టేషన్ కార్యాలయానికి వేసిన తాళం విరగ్గొట్టి అందుల్లో ఉన్న విద్యుత్ వైర్లు దొంగలు చోరీ చేశారు. మంగళవారం ఉదయం కార్యాలయం శుభ్రపరిచేందుకు వెళ్లిన సిబ్బంది తాళం విరిగ్గొట్టి ఉండడం చూసి పక్కనే ఉన్న సబ్స్టేషన్ షిప్ట్ ఆపరేటర్కు చెప్పారు. వెంటనే షిప్ట్ ఆపరేటర్ విద్యుత్ శాఖ ఏఈ సత్యనారాయణకు సమాచారం ఇచ్చారు. సమాచారం తెలిసిన వెంటనే ఏఈ కార్యాలయానికి చేరుకుని పరిశీలించిన అనంతరం సుమారు 3.2 కిలోమీటర్లు సరిపడా ఉన్న అల్యూమినియం వైరు చోరీ జరిగినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు విద్యుత్ కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం ఏఈ ఫిర్యాదు మేరకు ఎస్ఐ వి.ప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
క్షయ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం
● జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి జీవనరాణివిజయనగరం ఫోర్ట్: క్షయ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి బాధితులకు మెరుగైన చికిత్స అందించడంతో విజయనగరాన్ని క్షయరహిత జిల్లాగా తీర్చిదిద్దవచ్చని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఎస్.జీవనరాణి అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం టీబీ ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల ప్రత్యేక కార్యక్రమ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హైరిస్క్ గ్రా మాలు, జన సామర్థ్యం ఎక్కువగా ఉండే ప్రాంతాలు, వ్యాధిసోకే ప్రమాదం ఉన్న వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించి స్క్రీనింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ప్రతిరోజూ ఒక హైరిస్క్ గ్రామంలో ప్రత్యేక వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేసి జిల్లాలోని అన్ని ప్రాంతాలను కవర్చేస్తామన్నారు. హ్యాండ్ హెల్త్ ఎక్సరే పరికరంతో క్షేత్ర స్థాయిలోనే త్వరితగతిన పరీక్షలు నిర్వహించే వీలుంటుందని తెలిపారు. పరీక్షలు చేయించుకున్న ప్రతి వ్యక్తి వివరాలను తప్పనిసరిగా నిక్షయ్ పోర్టల్లో నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ కె. రాణి, డిప్యూటీ డీఎంహెచ్ఓ సూర్యనారాయణ, డీఐఓ రెడ్డి అచ్చుతకుమారి, ఎన్సీడీ పీఓ సుబ్రమణ్యం, ఐసీడీఎస్ పీడీ బాలామణి, తదితరులు పాల్గొన్నారు. -
చిన్నారులతో కలెక్టర్ ముచ్చట
రాజాం సిటీ: మండలంలోని సారథి అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి మంగళవారం తనిఖీ చేశారు. అక్కడి రికార్డులతో పాటు పౌష్టికాహార నిల్వలను పరిశీలించారు. పిల్లలకు ఇస్తున్న పౌష్టికాహారం, వారి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. సకాలంలో పౌష్టికాహారం అందించాలని అంగన్వాడీ కార్యకర్తను ఆదేశించారు. అనంతరం చిన్నారులతో కాసేపు ముచ్చటించి అభ్యసనా సామర్థాలు తెలుసుకున్నారు. ముందుగా రాజాం మున్సిపాల్టీ పరిధి లచ్చయ్యపేట, సారథి, మిర్తిరెడ్డివీధి సచివాలయాలను ఆకస్మికంగా సందర్శించారు. సిబ్బంది హాజరు రిజిస్టర్ను తనిఖీ చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలు అమలు, ప్రభుత్వ సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పింఛన్ల పంపిణీ, పారిశుద్ధ్య నిర్వహణ, వీధిలైట్లు, తాగునీటి సరఫరా, వాట్సాప్ గవర్నెన్స్ సేవలపై ఆరా తీశారు. ఆయన వెంట తహసీల్దార్ ఎం.రాజశేఖర్, మున్సిపల్ కమిషనర్ ఎ.రామచంద్రరావు, పలువురు సిబ్బంది పాల్గొన్నారు. -
పునర్విభజన జోష్
● పెరగనున్న అసెంబ్లీ నియోజకవర్గాలు ● కొత్తనేతలకు అవకాశాలు ● మారనున్న అసెంబ్లీ ముఖచిత్రాలువిజయనగరం సాక్షిప్రతినిధి: అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన వార్త రాజకీయ ఆశావహుల నోట్లో అమృతం పోసినట్టుంది. ఎంతసేపూ వాళ్లేనా... సీట్లు వాళ్లకేనా.. మేం ఒకసారైనా మైకుపట్టుకుని అధ్యక్షా అని మాట్లాడొద్దా... అసెంబ్లీ కారిడార్లో రాయల్గా నడవద్దా? మనకు గన్మ్యాన్ వద్దా... ఎన్నాళ్లీ మండలస్థాయి పదవులు.. ఇక మన రేంజి మారాలి.. ఎంతఖర్చయినా ఫర్లేదు.. ఈసారి మనం పోటీ చేయాల్సిందే అనుకుంటూ కలలు కంటున్న ద్వితీయకేటగిరీ నాయకులకు ఇది తీయని వార్త. రాష్ట్రంలో భారీగా అసెంబ్లీ స్థానాలు పెరుగుతున్నాయంటూ కేంద్రం చెప్పిన కబురు మండుటెండలో నడుస్తున్న వాళ్లకు చిరుజల్లులా అనిపిస్తోంది. ఆశల పల్లకిలో... సరాసరి 1,60,000 మంది జనాభాకు ఒక ఎమ్మెల్యే ఉండేలా కేంద్రం నియోజక వర్గాలను పునర్విభజిస్తుండడంతో జిల్లాలోని పలువురు నాయకులు ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాలు కాస్తా 12 కానుండగా, పార్వతీపురం జిల్లాలోని నాలుగు సెగ్మెంట్లు ఇప్పుడు ఆరుకు పెరగనున్నాయి. దీంతో పాటు మహిళలకు కూడా ఈసారి రిజర్వేషన్ కల్పిస్తుండడంతో ఆ దిశగా కూడా నాయకులు ఆలోచనలు మొదలుపెట్టారు. గతంలో నియోజవర్గాలుగా ఉంటూ రద్దయిన ఉణుకూరు, సతివాడ, భోగా పురం వంటి నియోజకవర్గాలు మళ్లీ పునరుద్ధరణ జరుగుతుందా? లేక ఇప్పటికే ఉన్న నియోజకవర్గాల్లో భాగంగా ఉన్న మండలాలను విడదీసి కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తారా అనేది ఇంకా స్పష్టత రాలేదు. ఏది ఏమైనా కానీ జిల్లా కేంద్రాలకు అనుబంధంగా ఇప్పుడు గ్రామీణ నియోజకవర్గాలు రావచ్చని భావిస్తున్నారు. ఈ క్రమంలో విజయనగరం రూరల్, పార్వతీపురం రూరల్ వంటి నియోజకవర్గాలు ఏర్పాటు కానున్నట్లు ప్రాథమిక సమాచారం. పార్వతీపురం మన్యం జిల్లా నేతలకు తీపి కబురు పార్వతీపురం మన్యం జిల్లాలో నాలుగు నియోజకవర్గాలుండగా అవన్నీ రిజర్వ్ స్థానాలు కావడం గమనార్హం. కురుపాం, పాలకొండ, సాలూరు ఎస్టీ స్థానాలు కాగా పార్వతీపురం మాత్రం ఎస్సీ రిజర్వ్ స్థానం. వాస్తవానికి ఈ నాలుగు చోట్లా బీసీలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నప్పటికీ వారికి ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం దక్కడం లేదు. దీంతో అక్కడి వెలమ, కాపు సామాజిక వర్గ నేతలు తమకు అసెంబ్లీ ఛాన్స్ రావడంలేదని లోలోన కుమిలిపోతున్నారు. కాగా బయటపడి ఏమీ చేయలేని పరిస్థితి. కానీ ఇప్పుడు అక్కడ రెండు స్థానాలు కొత్తగా వస్తుండటంతో ఆ రెండూ ఖచ్చితంగా జనరల్ సీట్లు అవుతాయని ,వాటిలో పోటీ చేసే అవకాశం తమకు దక్కుతుందని ఆశిస్తున్నారు. -
‘ఆదర్శ’చదువులకు ఆహ్వానం
విజయనగరం అర్బన్: జిల్లాలోని 13 ఆదర్శ పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకోసం విద్యార్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు డీఈఓ యు.మాణిక్యంనాయుడు తెలిపారు. పాఠశాలల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపుల్లో ఆంగ్ల మాధ్యమంలో ఉచిత విద్య బోధిస్తామన్నారు. జల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు వచ్చేనెల 30వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు రూ.200, ఎీస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.150లు దరఖాస్తు ఫీజును చెల్లించాల్సి ఉంటుందన్నారు. పదో తరగతిలో సాధించిన మార్కులు, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ప్రవేశాలు కల్పిస్తామన్నారు. మిమ్స్ డైరెక్టర్కు జాతీయ అవార్డు నెల్లిమర్ల: మిమ్స్ వైద్యకళాశాల అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ వేణుగోపాలరావు తన్నీరు అనస్థీషియా బోధన విభాగంలో అందిస్తున్న సేవలకు తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్ కేంద్రంగా పనిచేస్తున్న నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ (ఎన్ఎఫ్ఈడీ) సంస్థ ప్రతినిధులు అవార్డును ప్రకటించారు. ఇటీవల కోయంబత్తూర్లో జరిగిన గ్లోబల్ కాంక్లేవ్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సదస్సులో 39వ సమగ్ర జాతీయ అవార్డు–2026ను సంస్థ చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్.గణేషన్ చేతుల మీదుగా వేణుగోపాలరావు అందుకున్నారు. ఆయనకు జాతీయస్థాయి అవార్డు రావడం పట్ల మిమ్స్ చైర్మన్ అల్లూరి సత్యనారాయణరాజు, మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ ప్రవీణ్ వర్మ, లైఫ్ ట్రస్టీ రామకృష్ణరాజు, డీన్ డాక్టర్ లక్ష్మీకుమార్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నాయక్, మెడికల్ డైరెక్టర్ రఘురాం, తదితరులు హర్షం వ్యక్తంచేశారు. ఆయనకు అభినందనలు తెలిపారు. -
అలసత్వం వద్దు
ప్రభుత్వ భవనాల నిర్మాణంలో విజయనగరం: జిల్లాలో కొనసాగుతున్న వివిధ ప్రభుత్వ భవనాల నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పనలో అలసత్వం వద్దని, పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులు, ఇంజినీరింగ్ విభాగాల అధికారులతో పనుల ప్రగతిపై మంగళవారం సమీక్షించారు. అంగన్వాడీ కేంద్రాలు, ఏపీఐపీ, ఆర్ఐడీఎఫ్ 15 శాతం నిధులు, ఎంబీఎంబీ, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాల కల్పన, పీహెచ్సీ, సీహెచ్సీ, అర్బన్ హెల్త్ సెంటర్ భవనాల నిర్మాణంపై శాఖలవారీగా సమీక్షించారు. వచ్చేజూన్ నాటికి అన్ని భవనాలను పూర్తిచేయాలని, పంచాయతీ నిధులతో అంగన్వాడీ కేంద్రాలకు తాగునీటి సదుపాయం కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ జీవనరాణి, డీసీహెచ్ఎస్ పద్మశ్రీరాణి, ఐసీడీఎస్ పీడీ బాలామణి, ఏపీడీసీఎల్ ఎస్ఈ లక్ష్మణరావు, పీఆర్ ఎస్ఈ శ్రీనివాసరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కవిత, వివిధ శాఖల ఇంజినీర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. 1331 దరఖాస్తులకు ఆమోదం ఈ ఏడాది జనవరి 21 నుంచి మార్చి17వ తేదీ వరకు జిల్లాలో పరిశ్రమల స్థాపనకు 1359 దరఖాస్తులు అందగా 1331 దరఖాస్తులకు సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన భూములను ఇచ్చేందుకు ఏపీఐఐసీ, రెవిన్యూ అధికారులు సానుకూలంగా ఉండాలన్నారు. పీఎంఈజీపీ కింద 2025–26 సంవత్సరానికి 499 దరఖాస్తులు అందాయని తెలిపారు. బ్యాంకులకు 387 దరఖాస్తులను పంపామని, మొత్తం 270 దరఖాస్తులు గ్రౌండింగ్ పూర్తయినట్టు వెల్లడించారు. జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో జిల్లా పరిశ్రమలశాఖ జనరల్ మేనేజర్ ఎం.వి.కరుణాకరన్, ఏపీఐఐసీ అధికారులు పాల్గొన్నారు. త్వరితగతిన ప్రాజెక్టుల భూసేకరణ జిల్లాలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వివిధ ప్రాజెక్టుల భూసేకరణకు సంబంధించి కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం సాయంత్రం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. తోటపల్లి, తారకరామ తీర్థసాగర్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, హైవేలు, రైల్వేలైన్లకు భూసేకరణపై సమీక్షించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్, డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, ఆర్డీఓలు, ఆర్అండ్బీ ఈఈలు పాల్గొన్నారు. -
రైలులోనే గర్భిణి ప్రసవం
● తల్లీబిడ్డ క్షేమంపార్వతీపురం రూరల్: రైలులో ప్రయాణిస్తూ ఓ గర్భిణి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఒడిశాలోని రూర్కెలా నుంచి తమిళనాడులోని జోలార్పైట్టె జంక్షన్కు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లో సప్నకుమారి అనే మహిళ భర్తతో కలిసి మంగళవారం ప్రయాణిస్తోది. ఏడు నెలల గర్భిణి అయిన ఆమెకు రాయగడ దాటిన తర్వాత ఒక్కసారిగా పురిటినొప్పులు మొదలయ్యాయి. రైలు పార్వతీపురం బెలగాం స్టేషన్ సమీపించేసరికి పురినొప్పులు ఎక్కువ కావడంతో తోటి ప్రయాణికులు ఆమెవద్దకు చేరుకుని ప్రసవానికి సహకరించారు. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీస్ (జీఆర్పీ) సిబ్బంది, హెచ్సీ రత్నకుమార్ రైల్వే స్టేషనన్కు చేరుకుని తల్లీబిడ్డను పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. -
రైతన్న వెన్నువిరుస్తున్న చంద్రబాబు సర్కార్
సాలూరు: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వ్యవసాయం పండగలా ఉండగా.. నేటి చంద్రబాబు ప్రభుత్వ పాలనలో వ్యవసాయం దండగగా మారిందని, రైతన్న వెన్నువిరుస్తున్నారని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తంచేశారు. సాలూరు పట్టణంలో వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొరతో కలిసి మంగళవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా వంటి కష్టకాలంలోను రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు అప్పటి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అండగా నిలిచిందని, పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించిందని గుర్తుచేశారు. పంట చేతికొచ్చే సమయానికి ముందే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతన్నకు మద్దతు ధర అందించేదన్నారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం మొక్కజొన్న పంట కొనుగోలుకు కనీస చర్యలు తీసుకోవడం లేదని, రైతుకు క్వింటాకు రూ.2,400 మద్దతు ధర అందాల్సి ఉండగా దళారులకు రూ.1600లకే విక్రయించాల్సిన దుస్థితి నెలకొందన్నారు. విత్తనాలు, ఎరువుల కోసం రైతులు లాఠీదెబ్బలు, వడదెబ్బ తినాల్సి వస్తోందన్నారు. అన్నదాత సుఖీభవ పథకం సక్రమంగా అందక పంట పెట్టుబడి కోసం రైతులు వడ్డీవ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఇకనైనా ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తెరిచి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రూ.లక్షల కోట్లు అప్పులుతెచ్చి అభివృద్ధి పనులు చేపట్టడం లేదని, మరోవైపు సంక్షేమ పథకాల అమలే మరిచిపోయారని, కనీసం కొత్తగా ఒక్క వృద్ధాప్య, వితంతు పింఛన్ మంజూరు చేయడంలేదని విమర్శించారు. ● గిరిజన సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి గిరిజనులను పట్టించుకోవడం లేదని, వారికి ఇచ్చిన హామీలను అమలుచేయడం లేదని జెడ్పీ చైర్మన్ ఆరోపించారు. ఇదే తొలిసారి, ఆఖరిసారని భావించి అన్ని విధాలుగా సర్దుకుంటున్నారన్నారు. సాలూరు నియోజకవర్గంలో కుమ్ములాటలు, అవినీతి, దోపిడీ పాలన, ఉద్యోగాల తొలగింపులే కనిపిస్తున్నాయని విమర్శించారు. కొత్తగా సంక్షేమం, అభివృద్ధి పనులు చేపట్టకుండా, గత ప్రభుత్వంలో చేపట్టిన పనులను ప్రారంభోత్సవాలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సాలూరు వందపడకల ఆస్పత్రి ప్రారంభోత్సవంలో అందరినీ పిలిచి, ఏ ప్రభుత్వ హయాంలో ఎంత మేర పనులు జరిగాయో బహిరంగంగా చెప్పి ఉండాల్సిందన్నారు. పాచిపెంటలో పెద్దగెడ్డ రిజర్వాయర్కు వైఎస్సార్ శంకుస్థాపన చేసి ప్రారంభించారని, రాజన్నదొర జగన్మోహన్రెడ్డితో మాట్లాడి పార్లమెంట్లో ప్రత్యేక బిల్లు పెట్టించి నియోజకవర్గానికి కేంద్రీయ గిరిజన యూనివర్సిటీని తీసుకువచ్చారని వివరించారు. పాలకులకు వత్తాసు పలుకుతూ నిబంధనలకు నీళ్లు వదలడం అధికారులకు తగదన్నారు. అధికారం శాశ్వతం కాదన్న విషయం గుర్తించుకోవాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే ఇబ్బందులు తప్పవన్నారు. ● మున్సిపాలిటీలో బోసుబొమ్మ కూడలి వద్ద గతంలో వైఎస్సార్ విగ్రహ ఏర్పాటుకు నాటి టీడీపీ కౌన్సిలర్లు అడ్డుకున్నారని రాజన్నదొర గుర్తుచేశారు. అప్పుడు ప్రత్యేక జీఓ తీసుకువచ్చి విగ్రహాన్ని ఏర్పాటుచేశామన్నారు. అంబేడ్కర్, కూనిశెట్టి వెంకటనారాయణదొర విగ్రహ ఏర్పాటును కూడా నాడు అడ్డుకున్నారని, నేడు ఎటువంటి తీర్మానాలు లేకుండా ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు అధికారులు ఎలా చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. విగ్రహ ఏర్పాటుకు వ్యతిరేకం కాదని, రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని సూచించారు. ఉపాధిహామి పథకంలో అవినీతి, అక్రమాలపై కోర్టును ఆశ్రయిస్తామన్నారు. యూరియా, ఇంధన కష్టాలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పాలనలో వ్యవసాయం దండగగా మారింది పంటలకు మద్దతు ధర లేదు.. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు కానరావు పంటను పారబోస్తున్నా పాలకులకు పట్టడంలేదు గిరిజన సంక్షేమాన్ని విస్మరించిన మంత్రి సంధ్యారాణి ప్రభుత్వ తీరును ఎండగట్టిన జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర -
అవకతవకలు జరిగితే ఉపేక్షించేది లేదు
గజపతినగరం: కార్యాలయంలో రికార్డులు పారదర్శకంగా ఉండేలా చూసుకోవాలని, అవకతవకలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఎకై ్స జ్శాఖ జిల్లా డిప్యూటీ కమిషనర్ వై.శ్రీనివాసచౌదరి అన్నారు. గజపతినగరం ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ను ఆయన సోమవారం సందర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు జరగకుండా చూడాలన్నారు. అనంతరం మద్యం షాపుల యజమానులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో స్థానిక ఎకై ్సజ్ సీఐ జె.జనార్దనరావు, పలువురు ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. నేడు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ టీచర్లకు శిక్షణ విజయనగరం అర్బన్: భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్పై ఉపాధ్యాయులకు విజయనగరం కంటోన్మెంట్ మున్సిపల్ హైస్కూల్లో మంగళవారం శిక్షణ తరగతులు నిర్వహిస్తామని స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి వాక చిన్నంనాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. డీఈఓ యు.మాణిక్యంనాయుడు ఆదేశాల మేరకు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ చరిత్ర, నియమ నిబంధనలు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కలిగే ప్రయోజనాలు, యూనిట్ నిర్వహణ విధానం, పాఠశాలలో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై శిక్షణ ఇస్తామన్నారు. ప్రతి మండలం నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి కనీసం ముగ్గురు ఉపాధ్యాయులు హాజరుకావచ్చన్నారు. ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు రూ.381, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు రూ.211 రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుందని, పూర్తి వివరాల కోసం సెల్: 94409 12863 నంబర్ను సంప్రదించాలని కోరారు. తగ్గిన మడ్డువలస నీటినిల్వ వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టులో నీటి నిల్వ గణనీయంగా తగ్గింది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 65 మీటర్లు కాగా, ప్రస్తుతం 62.70 మీటర్ల మేర నిల్వ ఉంది. కనిష్టంగా 1.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వేగావతి, సువర్ణముఖి నదుల నుంచి 372 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులో చేరుతుండగా, కుడి ప్రధాన కాలువ నుంచి ఆయకట్టుకు 550 క్యూసెక్కుల సాగునీటిని అధికారులు సరఫరా చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మరో 20 రోజుల్లో ప్రాజెక్టు వద్ద డెడ్ స్టోరేజీ నమోదు కావచ్చని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
కర్షకులు.. దివ్యాంగులు.. వృద్ధులు.. పల్లె/పట్టణ ప్రజలు కలెక్టరేట్ వేదికగా సోమవారం తమ సమస్యలు వినిపించారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిరసన తెలిపారు. హామీల అమలులో సీఎం చంద్రబాబు మోసపూరిత విధానాన్ని ఎత్తిచూపారు. కలెక్టర్కు వినతులు అందజేశారు
● ప్రభుత్వం మొక్కజొన్న క్వింటా మద్దతు ధర రూ.2,400 ప్రకటించింది... ఎక్కడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు.. చేతికొచ్చిన పంటను క్వింటా రూ.1600 నుంచి రూ.1700లకే దళారులకు విక్రయించాల్సి వస్తోంది.. రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదంటూ ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సూర్యనారాయణతో కలిసి రైతులు కలెక్టరేట్ గేటు వద్ద ధర్నా చేశారు. మొక్కజొన్న రైతుల కష్టాలను పాలకులు కళ్లుతెరచి చూడాలన్నారు. రైతులు నష్టపోతున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాంబాబు, రాములు, గోపాలం, బాలి హరి, శివాజీ, తదితరులు పాల్గొన్నారు. ● దేవుపల్లి గ్రామం మీదుగా జాతీయ రహదారి వరకు ఉన్న మార్గాన్ని డీ–పట్టా భూమి యజమాని మూసివేశారు.. ఇప్పుడు గ్రామానికి దారి కరువైంది... తక్షణమే అధికారులు చర్యలు తీసుకుని ‘మార్గం’ చూపాలంటూ బొండపల్లి మండలంలోని గొల్లుపాలెం పంచాయతీ పరిధిలోని చినగూడెం గ్రామస్తులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. కలెక్టర్ రాంసుందర్రెడ్డికి తమ గోడు వినిపించారు. -
రెండు దశల్లో జనగణన
● కలెక్టర్ రాంసుందర్రెడ్డి విజయనగరం: జనాభా గణన–2027 రెండు దశల్లో జరుగుతుందని, మొదటి దశలో బ్లాకుల వారీగా గృహాల లెక్కింపు చేపడతామని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. రెండవ దశలో జనాభా గణన వచ్చే ఏడాదిలో జరుగుతుందన్నారు. కలెక్టరేట్ ఎన్నికల కంట్రోల్ రూమ్లో ముఖ్య ప్రణాళిక అధికారి ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి శిక్షకులకు జనగణనపై సోమవారం శిక్షణ ఇచ్చారు. గతంలో జనాభా లెక్కింపు మాన్యువల్గా జరిగేదని, ఈ సారి అంతా ఎలక్ట్రానిక్ విధానంలోనే జరుగుతుందన్నారు. మొదటి దశలో గృహాల లెక్కింపు జరుగుతుందని, జనగణనకు సంబంధించి నిబంధనలు, పద్ధతులను పాటిస్తూ తప్పులు జరగకుండా చేపట్టాలన్నారు. ఎన్యూమరే టర్లు, సూపర్వైజర్లకు శిక్షణ ఉంటుందని, అన్ని స్థాయిల్లో శిక్షణ సజావుగా జరగాలన్నారు. సీపీఓ బాలాజీ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇది 8వ జనాభా లెక్కింపు కార్యక్రమమని, బ్రిటిష్ కాలంలో మొదటగా 1881లో జనాభా లెక్కింపు జరిగిందని తెలిపారు. కోవిడ్ కారణంగా అప్పుడు జరగాల్సినవి ఇప్పుడు జరుగుతున్నాయని, ఇక్కడ శిక్షణ పొందిన వారు క్షేత్ర స్థాయిలో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, డిగ్రీ కళాశాల లెక్చరర్, టీఓటీ డాక్టర్ వి.రాఘవస్వామి, మున్సిపల్, మండల స్థాయి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
తాగునీటి కోసం.. ఖాళీ బిందెలతో నిరసన
రాజాం సిటీ: తాగునీటి కోసం రెండేళ్లుగా అల్లాడుతున్నాం.. ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ప్రారంభించిన ఓవర్హెడ్ వాటర్ ట్యాంకు నాలుగు నెలల్లోనే అలంకార ప్రాయంగా మారింది.. తాగునీటి కష్టాలు యథాతథమయ్యాయి... తక్షణమే తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలంటూ రాజాం మండలంలోని అంతకాపల్లి, మొగిలివలస గ్రామస్తులు సోమవారం ఆందోళన చేశారు. రాజాం–శ్రీకాకుళం రోడ్డులో బారికేడ్లు అడ్డంగా పెట్టి రోడ్డు నిర్బంధించారు. తాగునీటి సదుపాయం కల్పనలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై నినదించారు. బిందెడు నీరు సరఫరా చేసి గొంతు తడపాలని డిమాండ్ చేశారు. రెండు గ్రామాల ప్రజల ఆందోళనతో రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువకులను చెదరగొట్టారు. విషయం తెలుసుకున్న మహిళలు యువకులకు తోడుగా రోడ్డుపైకి ఖాళీ బిందెలతో చేరి ఆందోళన చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో 24 గంటలు తాగనీరు సరఫరా అయ్యేదని, రాజాం రోడ్డు విస్తరణలో భాగంగా మరమ్మతులకు గురైన పైపులైన్ను అధికారులు బాగుచేయకుండా వదిలేశారని, దీంతో తాగునీటి సమస్య మరింత తీవ్రతరమైందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి గ్రామానికి తాగునీరు యథావిధిగా సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
నిర్లక్ష్యయం వద్దు
● నేడు ప్రపంచ క్షయ నివారణ దినం క్షయ వ్యాధి రోగులకు మద్దతుగా నిలవాలి క్షయవ్యాధి నిర్ధారణ అయిన రోగులు మందులు క్రమబద్ధంగా ఆరు నెలల పాటు వాడేలా కుటుంబ సభ్యులు బాధ్యత తీసుకోవాలి. అంటరానివారిగా చూడకూడదు. మందులు వాడితే తగ్గిపోయే వ్యాధి కాబట్టి తరచూ దగ్గువస్తే అశ్రద్ధ చేయకుండా క్షయవ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. – డాక్టర్ బొత్స సంతోష్కుమార్, పలమనాలజిస్టు, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వ్యాధి నివారణకు కృషి క్షయవ్యాధి నివారణకు కృషి చేస్తున్నాం. కఫం పరీక్ష కేంద్రాల్లో ఎక్కువ మందికి క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తూ వ్యాధి వ్యాప్తిని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. క్షయ రోగి కుటుంబ సభ్యులకు కూడా కఫం పరీక్ష చేస్తున్నాం. క్షయ రోగులకు హెచ్ఐవీ పరీక్షలు, హెచ్ఐవీ రోగులకు క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాం. – డాక్టర్ కె.రాణి, జిల్లా క్షయ నివారణ అధికారి క్షయ వ్యాధి లక్షణాలు ఇలా.. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం ఆకలి మందగించడం, బరువు తగ్గడం ఛాతిలో నొప్పి, మూత్రంలో రక్తం, నిరంతరం తలనొప్పి కఫంలో రక్తం పడడం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది మెడలో వాపు, మెడ దగ్గర గడ్డలు కడుపులో నిరంతరం నొప్పి వ్యాధి సోకే అవకాశం వీరికి ఎక్కువ.. హెచ్ఐవీ, కేన్సర్ రోగులకు మధుమేహాం ఉన్న వారికి డయాలసిస్ రోగులకు -
క్షయవ్యాధి నిర్మూలనకు వంద రోజుల కార్యక్రమం
జిల్లాలో క్షయవ్యాధి నిర్మూలనకు వంద రోజుల కార్యక్రమం నిర్వహించనున్నట్టు డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ... క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు ముందుస్తు గుర్తింపు సమయానికి చికిత్స, పర్యవేక్షణ చాలా ప్రధానమన్నారు. వంద రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లాలో అనుమానిత రోగులను గుర్తించి వారికి తక్షణ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. క్షయవ్యాధిని ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, ఆకలి మందగించడం, ఆలసట, బరువు తగ్గడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతిలో నొప్పి తదితర లక్షణాలు ఉంటే సమీపంలోని ప్రభుత్వాస్పత్రిని సంప్రదించాలన్నారు. సమావేశంలో జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ రాణి, డీఐఓ అచ్యుతకుమారి, తదితరులు పాల్గొన్నారు. -
అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారం..
పార్వతీపురం: పీజీఆర్ఎస్లో అందిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించి అర్జీదారులకు న్యాయం చేయాలని కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో జేసీ యశ్వంత్కుమార్ రెడ్డి, డీఆర్ఓ కె. హేమలత, సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్లతో కలిసి పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి 70 వినతులు స్వీకరించగా.. ఇందులో రెవెన్యూ సమస్యలు 18 కాగా.. మిగిలిన 52 ఇతర శాఖలకు చెందినవి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. వినతులను క్షుణ్ణంగా పరిశీలించి, అర్జీదారులకు సంతృప్తికరమైన పరిష్కారం చూపాలన్నారు. పరిష్కరించిన అర్జీల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. -
మనస్తాపంతో కానిస్టేబుల్ ఆత్మహత్య
విజయనగరం క్రైమ్: తల్లి మరణాన్ని జీర్ణించుకోలేని పోలీస్ కానిస్టేబుల్ తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని దాసన్నపేటలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై కృష్ణమూర్తి తెలియజేసిన వివరాల మేరకు.. ఏపీఎస్పీ చింతలవలస బెటాలియన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న గెడ్డం నారాయణమూర్తి తల్లి, భార్యా పిల్లలు, ఇద్దరు తమ్ముళ్లతో కలిసి దాసన్నపేటలో నివాసముంటున్నారు. అయితే ఇటీవల అతని తల్లి అనారోగ్యంతో మృతి చెందింది. తల్లి మరణాన్ని జీర్ణించుకోలేని నారాయణమూర్తి అప్పటి నుంచి ముభావంగా ఉంటున్నారు. ఈక్రమంలో ఆదివారం రాత్రి భోజనం కూడా చేయకుండా తన రూమ్లో పడుకున్నాడు. సోమవారం ఉదయం తలుపు తట్టినా ఎటువంటి స్పందన లేకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపులు విరగ్గొట్టి చూడగా.. నారాయణమూర్తి ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించాడు. మృతుడి భార్య సౌందర్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూటౌన్ ఎస్సై కృష్ణమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అంతర్జాతీయ సైన్స్ఫెయిర్కు పూజిత
లక్కవరపుకోట: మండలంలోని జమ్మాదేవిపేటలో గల జ్యోతిబాపూలే బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన గేదెల పూజిత అంతర్జాతీయ సైన్స్ఫెయిర్కు ఎంపికై ందని ప్రిన్సిపాల్ యు.విజయ్కుమార్ పాత్రో సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 28 నుంచి జూలై 4 వరకు జపాన్ దేశంలో సైన్స్ ఫెయిర్ జరుగుతుందని పేర్కొన్నారు. అరటి పంటలో వృథాగా వదిలేసిన దవ్వతో బయో సంచులు తయారీపై పూజిత చేసిన ప్రాజెక్ట్ అంతర్జాతీయ స్థాయికి ఎంపిక కావడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని పూజిత, ప్రాజెక్ట్ గైడ్ జి.ఇంద్రజను అభినందించారు. -
జాప్యం వద్దు
వినతుల పరిష్కారంలోవిజయనగరం గంటస్తంభం: ప్రజలు తెలియజేసిన సమస్యలను పరిష్కరించే విషయంలో ఎటువంటి జాప్యం తగదని కలెక్టర్ ఎస్. రాంసుందర్రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూక్లినిక్ కార్యక్రమాలకు విశేష స్పందన వచ్చింది. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు హాజరై తమ సమస్యలను వినతుల రూపంలో అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ, వినతుల పరిష్కారంలో ఎలాంటి అలసత్వం సహించబోమని హెచ్చరించారు. పెండింగ్లో ఉన్న అన్ని వినతులను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, జిల్లా రెవెన్యూ అధికారి సత్తిబాబు, జిల్లా స్పెషల్ డిప్యూటి కలెక్టర్ ఈ.మురళి, కళావతి, ఆర్డీఓలు, వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. రెవెన్యూ వినతులే అధికం.. మొత్తం అందిన 202 వినతుల్లో 93 వినతులు రెవెన్యూ శాఖకు సంబంధించినవే కావడం గమనార్హం. రెవెన్యూ సమస్యలు, ముఖ్యంగా భూ సంబంధిత, సర్వే సమస్యలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు.. పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లో తెలియజేసే సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అన్నారు. ప్రతి వినతిని ఆన్లైన్లో పర్యవేక్షిస్తూ వేగవంతమైన పరిష్కారం చూపించాలని తెలిపారు. శాఖల వారీగా వినతులు.. రెవెన్యూశాఖకు 93 వినతులు రాగా.. డీఆర్డీఏ–17, పంచాయతీరాజ్–19, మున్సిపల్–23, విద్యుత్–3, హౌసింగ్–3, డీసీహెచ్ఎస్–2, వైద్య ఆరోగ్యశాఖ–5, గ్రామ సచివాలయం–4, విద్యాశాఖ–3, ఇతర శాఖలకు 30 వినతులు అందాయి. పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్కు భారీ స్పందన 202 వినతులను స్వీకరించిన అధికారులు ఇందులో 93 రెవెన్యూ సమస్యలే పెండింగ్ వినతులపై కలెక్టర్ సీరియస్ -
పీజీఆర్ఎస్కు 37 ఫిర్యాదులు
విజయనగరం క్రైమ్: నగరంలోని కంటోన్మెంట్లో గల పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఏఎస్పీ సౌమ్యలత ఆధ్వర్యంలో జరిగిన పీజీఆర్ఎస్కు 37 వినతులు అందాయి. ఇందులో భూ తగాదాలకు సంబంధించి 11, కుటుంబ కలహాలకు సంబంధించి 6, మోసాలకు సంబంధించి 7, ఇతర అంశాలపై 13 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా ఏఎస్పీ సౌమ్యలత మాట్లాడుతూ.. ఫిర్యాదులను పరిశీలించి చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తీసుకున్న చర్యలను డీపీఓకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, డీసీఆర్బీ సీఐ కె.కుమారస్వామి, ఎస్సై ప్రభావతి, సిబ్బంది పాల్గొన్నారు. -
కలెక్టరేట్కు పోటెత్తిన అర్జీదారులు
● కబ్జాల నుంచి కష్టాల వరకు ఫిర్యాదులుపార్వతీపురం రూరల్: జిల్లా కలెక్టరేట్ సోమవారం అర్జీదారులతో కిటకిటలాడింది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అర్జీదారులు పోటెత్తారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన బాధితులు, సంఘాల ప్రతినిధులు వివిధ సమస్యలపై అధికారులకు వినతులు సమర్పించారు. కేబుల్ ప్రసారాల అంతరాయం నుంచి చెరువుల కబ్జాల వరకు, గిరిజన గ్రామాల్లో మౌలిక వసతుల లేమి నుంచి వన్యప్రాణుల సంరక్షణ వరకు అనేక సమస్యలకు పరిష్కారం కోసం వినతులు అందజేశారు. గంటకోసారి ‘ఫైబర్’ కట్.. ఆపరేటర్ల ఆవేదన ఏపీఎస్ఎఫ్ఎల్ (ఫైబర్ నెట్) నెట్వర్క్ తరచూ నిలిచిపోవడంతో వినియోగదారులు ఇతర సంస్థల వైపు మళ్లుతున్నారని కేబుల్ ఆపరేటర్లు సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్కు విన్నవించారు. ఓఎల్టీలకు యూపీఎస్ సౌకర్యం లేకపోవడమే ప్రధాన సమస్యని, వెంటనే ఇన్వర్టర్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఆపరేటర్ల ఆదాయం నుంచి బాక్స్ రెంట్ పేరిట రూ. 59 అదనంగా మినహాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం వినియోగదారుల నుంచి పాత బాక్సులను రికవరీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. చెరువు కబ్జాలపై విచారణ చేపట్టాలి పార్వతీపురం పట్టణంలోని నెల్లి చెరువు స్థలంలో వెలసిన అక్రమ కట్టడాలపై విచారణ జరపాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు వంగల దాలినాయుడు డిమాండ్ చేశారు. చెరువు శిఖం భూమిలో సుమారు 20 పక్కా భవనాలు నిర్మించారని, వీటికి అనుమతులిచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీఆర్ఓ కె. హేమలతకు వినతిపత్రం ఇచ్చారు. పురిపాకలోనే పాఠశాల.. వసతులు కరువు పార్వతీపురం మండలం కొత్తవూరు గిరిజన గ్రామంలో మౌలిక వసతుల లేమిపై గిరిజనులు ఫిర్యాదు చేశారు. గ్రామంలో పాఠశాల భవనం పూర్తికాకపోవడంతో విద్యార్థులు పురిపాకలో చదువుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలకు ప్రహరీ లేకపోవడం, ఇంటింటికీ కుళాయిలు, మురుగు కాలువలు, శ్మశానానికి రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. వాణిజ్య గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలి గత మార్చి నుంచి వాణిజ్య అవసరాల గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో హోటళ్ల నిర్వహణ కష్టతరంగా మారిందని జిల్లా హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. గ్యాస్ కొరత వల్ల తమపై ఆధారపడిన కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని, తక్షణమే సరఫరా పునరుద్ధరించాలని కోరారు. -
హత్యాయత్నానికి పాల్పడిన నిందితుల అరెస్ట్
కొత్తవలస: మండల కేంద్రంలోని కొత్తవలస గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు మేలాస్త్రి చల్లంనాయుడు, అప్పలలక్ష్మిలపై ఈ నెల 19న వారి ఇంటిలో హత్యాయత్నానికి పాల్పడిన ఆరుగురు నిందితులను సోమవారం అరెస్ట్ చేసినట్లు సీఐ సీహెచ్ షణ్ముకరావు తెలిపారు. ఈమేరకు సీఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చల్లంనాయుడు దంపతులకు పిల్లలు లేకపోవడంతో కొద్ది సంవత్సరాల కిందట వేపాడ మండలం బానాది గ్రామానికి చెందిన డేగల సన్యాసినాయుడు ఉరఫ్ గణేష్ను దత్తత తీసుకున్నారు. కొద్ది సంవత్సరాల తర్వాత చెల్లంనాయుడు దంపతులకు కుమారుడు కలిగాడు. ఈక్రమంలో తనపై ప్రేమ తగ్గిందనే ఉద్దేశంతో గణేష్ పది సంవత్సరాల కిందట తన సొంత తల్లిదండ్రుల వద్దకు వెళ్లి పోయాడు. అయితే పెంపుడు తండ్రి తనకు ఆస్తి ఇవ్వలేదనే కక్షతో ఎలాగైన అతడ్ని హతమార్చేందుకు పథకం రచించాడు. దీంతో విశాఖపట్నం జిల్లా నాయుడుతోట, వేపగుంట ప్రాంతాలకు చెందిన శ్రీలం మనోహర్, మెండి బ్రహ్మయ్య, శ్రీలం రాజేష్, చింతల రాంబాబు, రవి అజయకాంత్లతో మాట్లాడి రూ. 5 లక్షలకు సుపారీ కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగా ఈ నెల 19న వృద్ధ దంపతులపై వారి ఇంటిలోనే మారణాయుధాలతో దాడి చేశారు. అయితే వారు గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు పోగయ్యారు. దీంతో నిందితులు అక్కడ నుంచి పరారయ్యారు. ఈ మేరకు చెల్లంనాయుడు దంపతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పెందుర్తి జంక్షన్ వద్ద నిందితులను సోమవారం అరెస్ట్ చేశారు. -
సమస్యలకు సత్వర పరిష్కారం
● ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డిపార్వతీపురం రూరల్: ప్రజలు తెలియజేసిన సమస్యలకు సత్వర పరిష్కారం చూపించాలని ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (పీజీఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాధవ్రెడ్డి బాధితుల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, భూ వివాదాలు, ఆన్లైన్ వేధింపులు, ఇతర సమస్యలపై పది ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం సంబంధిత అధికారులతో ఎస్పీ ఫోన్లో మాట్లాడుతూ.. ఫిర్యాదులపై చట్ట పరిధిలో తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. సద్వినియోగం చేసుకోవాలి ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే పీజీఆర్ఎస్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ మాధవ్రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రానికి రాలేని వారు తమ పరిధిలోని సబ్ డివిజన్ కార్యాలయాలు లేదా పోలీస్ స్టేషన్లలోనూ ఫిర్యాదు చేసుకోవచ్చాన్నారు. కార్యక్రమంలో డీసీఆర్బీ ఎస్సై సురేష్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
ముగిసిన రాష్ట్రస్థాయి టెన్నిస్ టోర్నమెంట్
విజయనగరం: నగర శివారులోని విజ్జీ స్టేడియంలో రెండు రోజలుగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సారథ్యంలో జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న టెన్నిస్ టోర్నమెంట్ సోమవారంతో ముగిసింది. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి 40 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. తుది పోరులో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు కలెక్టర్ రాంసుందర్రెడ్డి , జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ ట్రోఫీలు, మెడల్స్ అందజేశారు. విజయనగరంనకు చెందిన బి.మహేశ్వరరావు టెన్నిస్ సింగల్స్ విజేతగా నిలిచారు. అలాగే విజయనగరంనకు చెందిన టి.రామారావు, ఎ.సుదర్శనరాజు డబుల్స్ విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాంసుందర్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోందన్నారు. విజేతలు వీరే.. టెన్నిస్ సింగల్స్ రన్నర్గా జి.ప్రభజనరెడ్డి (నంద్యాల), మూడవ ప్లేస్లో పి.రామకృష్ణారావు (కాకినాడ) నిలిచారు. అలాగే డబుల్స్ రన్నర్స్గా ఎంవీఎల్ఎన్ రాజు, కె.రమేష్ (విశాఖపట్నం), మూడో స్థానంలో ఎన్.రాము, ఆర్.రవికుమార్ (మన్యం పార్వతీపురం) నిలిచారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్.సత్తిబాబు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్. వెంకటేశ్వరరావు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గోన్నారు. -
25లోగా ఎం.బుక్ రికార్డులు పూర్తి చేయాలి
పార్వతీపురం: జిల్లాలో ఉపాధిహామీ, పంచాయతీరాజ్ శాఖల ద్వారా జరుగుతున్న రహదారి, అభివృద్ధి పనులకు సంబంధించి ఈనెల 25వ తేదీలోగా ఎంబుక్ రికార్డులు పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ ఎం. ప్రభాకరరెడ్డి సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ నుంచి ఇంజినీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవలం వాల్యూయేషన్ సర్టిఫికెట్తో బిల్లులు వస్తాయని భావించడం సరికాదని, ఆన్లైన్లో ఉన్న ఎంబుక్ రికార్డుల ప్రకారం బిల్లులు మంజూరు చేయడం జరుగుతుందనానరు. ఇంతవరకు జరిగిన ప్రతి పనికీ ఎంబుక్ రికార్డు చేసి, పాస్ ఆర్డర్ వేసి ఎంసీసీకి అందజేయాలన్నారు. సమావేశంలో జేసీ సి.యశ్వంత్కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్లు ఆర్.వైశాలి, పవర్ స్వప్నిల్ జగన్నాథ్, డ్వామా పీడీ కె. రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. నిజాయితీకి చిరు సత్కారంవిజయనగరం క్రైమ్: నిజాయితీతో వ్యవహరించిన వ్యక్తిని పోలీసులు సత్కరించిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని విజయనగరం డిఫెన్స్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న సీతారామ్ అనే వ్యక్తికి స్థానిక గుమ్చీ వద్ద రెండు తులాల బంగారు బ్రేస్లెట్ ఆదివారం దొరికింది. దీంతో ఈ విషయాన్ని అకాడమీ డైరెక్టర్ డి. అనిల్కుమార్కు తెలియజేయగా.. ఆభరణాన్ని పోలీసులకు అందజేయాలని చెప్పడంతో వెంటనే సీతారామ్ ఆ బ్రేస్లెట్ను టూటౌన్ పోలీస్స్టేషన్లో అందజేశాడు. దీంతో సీఐ టి. శ్రీనివాసరావు విచారణ చేపట్టి బాధితుడు మస్తాన్కు బ్రేస్లెట్ అందజేశారు. అలాగే నిజాయితీగా వ్యవహరించిన సీతారామ్తో పాటు అనిల్కుమార్ను సత్కరించారు. కార్యక్రమంలో ఎస్సైలు ప్రమీల, కనకరాజు, క్రైమ్ పార్టీ సిబ్బంది వాసు, షఫీ, గణేష్ పాల్గొన్నారు. ఘనంగా దొమ్మేటి జయంతివిజయనగరం: ప్రముఖ సామాజిక సంస్కర్త, శెట్టిబలిజ సంఘ వ్యవస్థాపకుడు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సోమవారం స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్, జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్ సత్తిబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దొమ్మేటి వెంకటరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. సమాజంలోని వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం, సామాజిక సమానత్వం కోసం వెంకటరెడ్డి చేసిన అలుపెరగని పోరాటం చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని, ప్రతిఒక్కరూ వెనుకబడినవర్గాల అభివృద్ధికి, సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. శెట్టిబలిజ సంఘ జిల్లా అధ్యక్షుడు చోడి ఆదినారాయణ మాట్లాడుతూ.. సమాజ సేవనే పరమావధిగా జీవించిన వెంకటరెడ్డి జీవన ప్రస్థానం నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమాధికారి జె. జ్యోతిశ్రీ, నాయీ బ్రాహ్మణ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టీవీ దుర్గారావు, తూర్పుకాపు సంఘ నాయకుడు గండ్రేటి శ్రీను, వివిధ సంఘాల ప్రతినిధులు, జిల్లా అధికారులు, బీసీ సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
విశ్వగురు స్థానంలో భారత్ ..
బాడంగి: భారతదేశాన్ని 2047 నాటికి విశ్వగురు స్థానంలో నిలపడమే తమ ధ్యేయమని.. అందుకోసం అహర్నిశలు శ్రమిస్తామని ఆర్ఎస్ఎస్ కండ కార్యవాహక కార్యదర్శి ఎం.గణపతి అన్నారు. తొలుత స్థానిక మెయిన్రోడ్డుపై పద సంచలనం పేరుతో భారతమాత జెండాలు పట్టుకుని ఆదివారం ర్యాలీ చేపట్టారు. అనంతరం స్థానిక స్వామి కల్యాణ మంటపంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ను రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ దేశం, ధర్మం పట్ల బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక కార్యకర్తలు బేతనపల్లి శంకరరావు, అంబటి గణపతి, లగుడు పరశునాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
సౌత్జోన్ ఖోఖో పోటీలకు గర్భాం యువకుడు
మెరకముడిదాం: మండలంలోని గర్భాం గ్రామానికి చెందిన రెడ్డి సాయికిరణ్ సౌత్జోన్ జాతీయస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యాడు. జేఎన్టీయూ (కె) యూనివర్సిటీ, విజయనగరం జిల్లా తరఫున సాయికిరణ్ ఈనెల 26 నుంచి 29వ తేదీ వరకు కర్ణాటక రాష్ట్రం బెంగుళూరులో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గోనున్నాడు. జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు సాయికిరణ్ ఎంపిక కావడంపై గర్భాం గ్రామస్తులతో పాటు జేఎన్టీయూ సిబ్బంది అభినందించారు. ఆరుగురు జూదరుల అరెస్ట్ ● రూ.42,420 నగదు సీజ్ తెర్లాం: పేకాటాడుతున్న ఆరుగురు వ్యక్తులను ఎస్సై సాగర్బాబు ఆదివారం సాయంత్రం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని వి.చిన్నయ్యపేట గ్రామానికి సమీపంలోని మామిడితోటలో ఆరుగురు వ్యక్తులు పేకాట ఆడుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే దాడి చేసి నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు వారి వద్ద నుంచి రూ. 42,450 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై సాగర్బాబు మాట్లాడుతూ.. పేకాట శిబిరాలు నిర్వహించినా, ఆడినా చర్యలు తప్పవన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి ● అతడి భార్యకు, పాపకు తీవ్రగాయాలు రణస్థలం: లావేరు మండలంలోని బుడుమూరు జాతీయ రహదారిపై ఆదివారం బైక్ను కారు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యారు. లావేరు పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. స్కూటీపై కె.రమేష్(32) తన భార్య సుజాత, రెండేళ్ల కుమార్తె ధాతిశ్రీతో శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వైపు వస్తున్నారు. ఆదివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో బుడుమూరు దగ్గరకు వస్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. దీంతో గాయపడిన రమేష్ను స్థానికులు హుటాహుటిన 108 వాహనంపై శ్రీకాకుళం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే చనిపోయారు. భార్య సుజాత, పాప ధాతిశ్రీకి బలమైన గాయాలు కావడంతో శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రమేష్ స్వగ్రామం విజయనగరం జిల్లాలోని దాకమర్రి. గార మండలం నిజామాబాద్లో ఉన్న అత్తవారింటికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీనిపై లావేరు ఎస్ఐ కె.అప్పలసూరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. జియ్యమ్మవలస: మండలంలోని వెంకటరాజపురం గ్రామానికి చెందిన మర్రాపు ప్రసాదరావు(60) ఆదివారం ఉదయం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలియజేసిన వివరాల ప్రకారం.. అరటి గెలలు లోడ్ చేయడానికి కూలీలతో కలసి వెళ్లగా తెగిన విద్యుత్ తీగ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న చినమేరంగి ఎస్సై అనీష్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతుడు పెదదోడిజలోని జీపీఎస్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. మృతుడికు భార్యతో పాటు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం జరగ్గా.. కుమారుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఉద్యోగం చేస్తున్నాడు. ఉపాధ్యాయుడి మృతిపై ఎంఈఓలు గౌరునాయుడు, శ్రీనివాసరావు, తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. మూడు మేకలు మృతి జామి: మండలంలోని రామయ్యపాలెం గ్రామానికి చెందిన గురపంల్లి పోలయ్య, నిమ్మకాయల అప్పారావుకు చెందిన మూడు మేకలు విద్యుదాఘాతంతో మృతి చెందాయి. ఎస్సీ కాలనీకి చెందిన వీరు గ్రామ సమీపంలో మేకలను మేపుతుండగా.. ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా వర్షం కురిసింది. దీంతో మేకలు సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ వద్దవకు వెళ్లగా, షాక్కు గురై మృతి చెందాయి. దీంతో బాధితులు లబోదిబోమంటూ రోదిస్తున్నారు. -
నిర్లక్ష్యపు అంచున చంపావతి ప్రాజెక్ట్
● మసకబారుతున్న నిర్వహణ ● కొన్ని రోజులుగా సరఫా కాని నీరు ● ఇబ్బంది పడుతున్న ప్రజలుపూసపాటిరేగ: చంపావతి ప్రాజెక్ట్ నిర్వహణ మసకబారుతోంది. ప్రాజెక్ట్ పాడై వారం రోజులు గడుస్తున్నా ఇంతవరకు పనులు చేపట్టకపోవడంతో ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. నెల్లిమర్ల నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉండడంతో చంపావతి నదిపై ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్పైనే ఎక్కువ మంది ప్రజలు ఆధారపడుతున్నారు. ఒక్క పూసపాటిరేగ మండలంలోనే 20 గ్రామాల ప్రజలకు చంపావతి ప్రాజెక్ట్ ద్వారా నీరు అందించడానికి పైప్లైన్లు వేశారు. పదేళ్ల కిందట ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసినప్పటినుంచి తాగునీటి సరఫరా సక్రమంగానే సాగింది. అయితే కొద్ది నెలలుగా ప్రాజెక్ట్ నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పూసపాటిరేగ మండల పరిధిలోని 20 గ్రామాల్లో ఏ ఒక్క గ్రామంలో కూడా పూర్తిస్థాయిలో తాగునీటి సరఫరా జరగడం లేదు. ప్రాజెక్ట్ నిర్వహణ కాంట్రాక్ట్ను అధికారంలో ఉన్న కీలకనేత అనుచరుడు దక్కించుకోవడం వల్లే ఎవ్వరూ ప్రశ్నించలేని పరిస్థితి నెలకొంది. ప్రాజెక్ట్కు వెంటనే మరమ్మతులు చేపట్టడంతో పాటు నిర్వహణ సక్రమంగా చేపట్టాలని సంబంధిత కాంట్రాక్టర్ను ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రశ్నించలేకపోతున్నారు. ఇదిలా ఉంటే తాగునీటి ఇబ్బందిని ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నాతవలస వద్ద చంపావతి నది నుంచి పూసపాటిరేగ ఏతపేట సమీపంలో స్టోరేజీ ట్యాంక్కు పైపులైన్ల ద్వారా నీరు సరఫరా చేసి, అక్కడ నుంచి మండలంలోని వివిధ గ్రామాలకు నీరు సరఫరా చేయాలి. అయితే సంబంధిత అధికారుల నిర్లక్ష్యం, ఉదాశీనత కారణంగా ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికై నా పాలకులు, అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.తరుచూ మరమ్మతులే.. చంపావతి ప్రాజెక్ట్ తరచూ పాడవుతోంది. నెలలో కనీసం సగం రోజులు కూడా ప్రాజెక్ట్ నుంచి నీరు సరఫరా కావడం లేదు. కొన్ని రోజులుగా సుదూర ప్రాంతాలకు వెళ్లి నీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలి. –ఎస్. గౌరి, గృహణి, పూసపాటిరేగ తాగునీరు అందించాలి.. ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉండడంతో గ్రామంలోని బోర్ల నీటిని వినియోగించలేకపోతున్నాం. ఏళ్ల తరబడి చంపావతి ప్రాజెక్ట్ నీటినే వినియోగిస్తున్నాం. కొద్ది రోజులుగా నీరు సరఫరా కాక ఇబ్బంది పడుతున్నాం. అధికారులు స్పందించి తాగునీరు అందించాలి. – సీహెచ్ చిన్న, గ్రామస్తుడు, పూసపాటిరేగ -
పారా అథ్లెటిక్స్లో క్రీడాకారుల సత్తా..
● సత్తా చాటిన కిల్లక లలిత, కరణం గౌతమ్ విజయనగరం: ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ కళింగ స్టేడియం వేదికగా మార్చి 18 నుంచి 21 వరకు నిర్వహించిన 24వ జాతీయ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీల్లో జిల్లాకు చెందిన పారా క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరచి పతకాలు సాధించారు. దీంతో క్రీడాకారులను పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె. దయానంద్ అభినందించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. గుమ్మలక్ష్మీపురం మండలం గుల్లలంక గ్రామానికి చెందిన పరుగుల రాణి కిల్లక లలిత (టి –11 కేటగిరి) 400 మీటర్ల పరుగులో గోల్డ్ మెడల్, 1500 మీటర్ల పరుగులో బ్రాంజ్ మెడల్ సాధించిందన్నారు. అలాగే బొబ్బిలి మండలం ఎం.వలసకు చెందిన క్రీడాకారుడు కరణం గౌతమ్ (టి –12 కేటగిరి) లాంగ్జంప్లో బ్రాంజ్ మెడల్ గెలుచుకుని జాతీయ స్థాయిలో జిల్లా పేరు మారుమోగేలా చేశాడని కొనియాడారు. బలమైన సంకల్పం, నిరంతర సాధన ఉంటే అనుకున్నది సాధించేందుకు వైకల్యం ఏమాత్రం అడ్డుకాదని జిల్లాకు చెందిన పారా క్రీడాకారులు నిరూపిస్తున్నారన్నారు. విజేతలకు కలెక్టర్ రాంసుందరరెడ్డి, జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్. వెంకటేశ్వరరావు అభినందనలు తెలియజేశారు. -
గంజాయి నిందితులపై హిస్టరీ షీట్లు
గంజాయి కేసులో నిందితుడికి రిమాండ్ విజయనగరం క్రైమ్: గంజాయి రవాణా కేసులో అల్లంగి భగవాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశామని విజయనగరం రూరల్ సీఐ లక్ష్మణరావు తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఏఓబీ పరిధిలోని ముంచంగిపుట్టు మండలం బుంగపుట్టుకి చెందిన అల్లంగి భగవాన్ను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించారన్నారు. కొద్ది రోజుల కిందట భగవాన్ మరో ఐదుగురితో కలిసి విజయనగరానికి ఆటోల గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నట్లు చెప్పారు. అయితే ఆ సమయంలో భగవాన్ తప్పించుకోగా.. గంట్యాడ మండలం కొటారుబిల్లి జంక్షన్ వద్ద ఆదివారం అరెస్ట్ చేసి న్యాయమూర్తి ముందు హాజరపరిచామని చెప్పారు. మిగిలిన నలుగురు నిందితులను అప్పుడే అరెస్ట్ చేశామని తెలిపారు.కొత్తవలస: గంజాయి కేసుల్లో పట్టుబడిన నిందుతులపై హిస్టరీ షీట్లు తెరవడంతో పాటు అక్రమంగా సంపాదించిన ఆస్తులను జప్తు చేయాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను ఆదివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ సమయాల్లో పట్టుబడిన గంజాయి కేసులపై సమీక్షించారు. పరారీలో ఉన్న నిందితులను అరెస్ట్ చేసి సకాలంలో కోర్టులో అభియోగ పత్రాలను దాఖలు చేయాలని సూచించారు. వివిధ కేసుల్లో, రోడ్డు ప్రమాదాల్లో పట్టుబడిన వాహనాలను నిబంధనల మేరకు విడుదల చేయాలన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గంజాయి రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎస్.కోట మండల సమీపంలోని బొడ్డవర చెక్పోస్టును మరింత పటిష్టంగా నిర్వహిస్తామన్నారు. కొత్తవలస పోలీస్స్టేషన్ పరిధిలో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐలు సీహెచ్.షణ్ముకరావు, ఎల్.అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ ఏఆర్ దామోదర్ -
రబీలో రాగిదే పెత్తనం..
గోమాతకు సీమంతం..చికెన్● నియోజకవర్గంలో 659 హెక్టార్లలో సాగు ● ఒక్క రాజాం మండలంలో 520 హెక్టార్లలో సాగవుతున్న చోడి ● క్వింటా ధర రూ. 3500 ● ఆశాజనకంగా సాగుభీమసింగి వేణుగోపాలస్వామి ఆలయలో గోమాతకు ఆదివారం సీమంతం ఘనంగా నిర్వహించారు. భక్తులు గోవుపై వస్త్రాలు ఉంచి పసుపు, కుంకుమలు రాసి శాస్త్రోక్తంగా వేడుకను జరిపారు. – జామిరాజాం: నియోజకవర్గ వ్యాప్తంగా గత రబీ సీజన్లో మొక్కజొన్న పంట సాగు అధికంగా కనిపించేది. ఒకానొక సమయంలో రబీ సాగు అంటేనే మొక్కజొన్నగా ఉండేది. చంద్రబాబు సర్కారు వచ్చిన తర్వాత మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో పాటు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో సాగు విస్తీర్ణం తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం రబీలో సాగుచేసిన మొక్కజొన్న పంటకు దళారీలే దిక్కుగా మారారు. గతంలో క్వింటా మొక్కజొన్న ధర రూ. 2400 ఉండగా, ఇప్పుడు 1800 రూపాయలకు పడిపోయింది. దీంతో చాలామంది రైతులు మొక్కజొన్న సాగుకు స్వస్తి పలికి, రాగి సాగుపై దృష్టి సారించారు. ప్రస్తుతం ఆరోగ్య అవసరాల రిత్యా రాగి పిండి వినియోగం పెరిగింది. మార్కెట్లో పిండి ధర అధికంగా ఉంది. రైతు పండించే పంటకు మంచి ధర వస్తుండడంతో రాగిపంట సాగు మండలంలో అధికమైంది. నియోజకవర్గంలో 659 హెక్టార్లలో.. గతంలో ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది నియోజకవర్గంలో రాగి పంట సాగు కనిపిస్తోంది. మొత్తం 659 హెక్టార్లలో ఈ పంట సాగుచేయగా, అత్యధికంగా రాజాం మండలంలో 520 హెక్టార్లలో సాగవుతోంది. రాగి పంట కాలం 75 రోజులు కాగా, పెట్టుబడి చాలా తక్కువుగా ఉంటుంది. ఎకరా సాగుకు 200 రూపాయల విత్తనాలు, ఒక యూరియా బస్తా సరిపోతుంది. ఇతర ఎరువులు, పురుగు మందుల అవసరం ఉండదు. పంట ప్రారంభ దశలో మినహా ఈ పంటకు సాగునీరు అవసరం లేదు. నియోజకవర్గ పరిధిలో చాలా చోట్ల ఇప్పటికే రాగుల పంట కోతలు కూడా పూర్తయ్యాయి. ఎకరాకు ఆరు నుంచి ఎనిమిది క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటా రూ. 3100 నుంచి 3500 రూపాయల మధ్య కొనుగోలు చేస్తున్నారు. పెద్దగా పెట్టుబడి అవసరం లేని రాగి పంట రబీలో రైతుకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. నువ్వు పంటదీ అదే రూటు.. నియోజకవర్గ పరిధిలో రబీ సీజన్లో రాగి పంటతో పాటు పలుచోట్ల నువ్వు పంట వేశారు. రాజాం, సంతకవిటి మండలాల్లో ఈ పంట అధికంగా కనిపిస్తోంది. నియోజకవర్గంలో 72 హెక్టార్లలో ఈ పంట సాగులో ఉంది. నువ్వుల పెట్టుబడి నామమాత్రం కాగా, ఎకరా సాగులో నువ్వు పంట ద్వారా రైతుకు రూ. 15 వేల మేర ఆదాయం వచ్చే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. -
నేడు పీజీఆర్ఎస్
● కలెక్టర్ రాంసుందర్రెడ్డి విజయనగరం: జిల్లా ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) నిర్వహించనున్నట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయి అధికారులందరూ కార్యక్రమంలో పాల్గొని నేరుగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తారని పేర్కొన్నారు. గతంలో ఫిర్యాదు చేసిన వారైతే, దానికి సంబంధించిన పాత అర్జీ రశీదును తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. కలెక్టరేట్కు రాలేని వారు 1100 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయడం ద్వారా ఫిర్యాదు చేయవచ్చని, అలాగే సమీపంలోని మండల, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా దరఖాస్తులు అందజేయవచ్చని సూచించారు. భూ సమస్యల కోసం ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ ప్రభుత్వ ఆదేశాల మేరకు భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లో రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. ముగ్గురు ఆర్డీవోలు, తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, వీఆర్వోలు తమ వద్ద ఉన్న రికార్డులతో ఈ క్లినిక్కు హాజరవుతారని రైతులు తమ భూ వివాదాలు, మ్యుటేషన్లు లేదా ఇతర రెవెన్యూ సమస్యల కోసం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల భద్రతపై ముందస్తు జాగ్రత్తలు : కలెక్టర్ విజయనగరం: జిల్లాలో 10వ తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయని, ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయిన నేపథ్యంలో విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సూచించారు. పరీక్షల సమయంలో, పరీక్షలు పూర్తయిన తరువాత ఖాళీ సమయాల్లో కొంతమంది విద్యార్థులు చెరువులు, కాల్వలు, ఇతర జల వనరుల వద్దకు వెళ్లి ఈత కొట్టే అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు తమ పిల్లలను ముందుగానే హెచ్చరించి జాగ్రత్తలు పాటించేలా చూడాలని కోరారు. తెలియని నీటి వనరుల్లో ఈత కొట్టడం ప్రమాదకరమని విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. జిల్లాలోని డీపీఎంలు ముందడుగు వేసి తల్లిదండ్రులు, విద్యార్థులకు మునిగిపోవడం వంటి ప్రమాదాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. జిల్లా పరిపాలన, విద్యాశాఖ, విపత్తుల నిర్వహణ శాఖ, మీడియా సంస్థలు సమన్వయంతో విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. పోలీసు, అగ్నిమాపక, ఇతర శాఖల సహకారంతో ప్రమాదకర జలవనరుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై రాష్ట్ర హోం శాఖా మంత్రి రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్, సంబంధిత ఉన్నతాధికారులతో జరిగిన గత సమావేశంలో కూడా చర్చించామని గుర్తు చేశారు. ఒక అడుగు ముందుకు వేస్తే – ఒక ప్రాణాన్ని కాపాడవచ్చు అనే సందేశంతో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి విద్యార్థుల ప్రాణ భద్రతకు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగులను మోసం చేసిన చంద్రబాబు సర్కార్ కొమరాడ: ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ పేరిట చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను నిలువునా మోసం చేసిందని వైఎస్సార్సీపీ పార్వతీపురం మన్యం జిల్లా యూత్ అధ్యక్షుడు నంగిరెడ్డి శరత్బాబు ధ్వజమెత్తారు. మండలంలోని రాజ్యలక్ష్మీపురంలో ఆయన విలేకరులతో ఆదివారం మాట్లాడారు. ఉద్యోగాలు ఇవ్వకుండానే ఇచ్చేశామని ప్రచారం చేసుకుంటున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు జాబ్ క్యాలెండర్ పేరుతో మళ్లీ నిరుద్యోగులను మోసపుచ్చిందన్నారు. అధికారంలోకి రాగానే ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన కూటమి నేతలు గడిచిన రెండేళ్లుగా ఇచ్చిన ఉద్యోగాల లెక్క తేల్చాలని డిమాండ్ చేశారు. కొత్త ఉద్యోగాలు వేయలేదు.. సరికదా.. ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టిందన్నారు. వలంటీర్లను తొలగించి వారిని రోడ్డు పాల్జేసిందన్నారు. ఎన్నికల సమయంలో రూ.పది వేలు నెలకు ఇస్తామని చెప్పి వలంటీర్లను పూర్తిగా తొలగించిందని ధ్వజమెత్తారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఆరు లక్షల 31 వేల 310 ఉద్యోగాలు కల్పించారని చెప్పారు. అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే 1.34 లక్షల గ్రామ, వార్డు సచివాలయ శాశ్వత ఉద్యోగాలు ఇచ్చారని గుర్తు చేశారు. లక్షల మందికి వలంటీర్లుగా నియమించి ఉపాధి ఇచ్చారన్నారు. -
రెండేళ్లలో 452 కేసులు
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో నిత్యం ఎక్కడో ఓ చోట ఆడ పిల్లల నుంచి మహిళల వరకు వేధింపులు, లైంగిక దాడులు, అత్యాచారాలకు గురవుతున్నారు. కొందరు మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తుంటే.. మరి కొందరు బయటకు పొక్కితే ఎక్కడ సమాజంలో తమ పరువు పోతుందోనన్న ఆందోళనతో ఇంట్లోనే ఆవేదన చెందుతున్నారు. బయటకు చెప్పుకోలేక లోలోపన మదనపడుతున్నారు. ఇంకొందరు మహిళలైతే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలా జిల్లాలో బాలికలు, యువతులు, మహిళల రక్షణ విషయంలో ఆందోళన నెలకొంది. ఇంటి నుంచి బయటకు వెళ్లే వారు మళ్లీ ఇంటికొచ్చే వరకు ఎక్కడ ఏం జరుగుతుందోనన్న ఆందోళన కన్నవారిలో నెలకొంటుంది. ● టీడీపీ జమానాలో పెరిగిన దాడులు టీడీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత బాలికలు, మహిళలపై వేధింపులు, లైంగిక దాడులు పెరిగిపోయాయి. మహిళలపై దాడులకు పాల్పడిన వారిపై సకాలంలో చర్యలు చేపట్టకపోవడం వల్లే కామాంధులు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల మహిళలపై వేధింపులకు పాల్పడిన వ్యక్తులకు అధికార పార్టీ నేతలే అండగా నిలుస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. ఆడపిల్లపై చేయి వేస్తే తాట తీస్తాం... అంటూ ఎన్నికల సమయంలోనూ... ఇప్పుడూ బీరాలు పలుకుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ ఇప్పుడేమి చేస్తున్నారన్న ప్రశ్న వినిపిస్తోంది. కూటమి సర్కార్ హయాంలో ఈ దాడులు మరింత పెచ్చుమీరాయని అయినా.. తీసుకుంటున్న చర్యలు కంటితుడుపుగానే ఉంటున్నాయన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. వన్స్టాప్ సెంటర్లో కౌన్సెలింగ్ ఇస్తున్న సిబ్బంది ఏ సహాయం అవసరమైనా చేస్తున్నాం.. వేధింపులు, హింస వంటి వాటికి గురైన మహిళలు వనస్టాప్ సెంటర్కు వస్తే ముందుగా వారిలో ధైర్యం నింపేందుకు కౌన్సెలింగ్ ఇస్తున్నాం. వారికి ఏ సహాయం అవసరమైనా అందిస్తున్నాం. బాలికలు, మహిళల రక్షణ, సంరక్షణ, వైద్య, న్యాయ, వసతి సహాయాల్లో ఏ సాయం అవసరమైతే ఆ సాయం అందిస్తాం. – పి.సాయివిజయలక్ష్మి, సెంటర్ అడ్మినిస్ట్రేటర్, వన్స్టాప్ సెంటర్ మహిళలపై పెరుగుతున్న దాడులు..! నిత్యం ఎక్కడో ఓ చోట ఆడ పిల్లలపై దాడులు టీడీపీ ప్రభుత్వ హయాంలో పెరిగిన వైనం 2024 జనవరి నుంచి డిసెంబర్ వరకు 227 కేసులు నమోదు 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు 225 కేసులు నమోదు బాలికలు, మహిళలపై లైంగిక, గృహహింస, అత్యాచారాలకు పాల్పడుతున్న మృగాళ్లు గడిచిన రెండేళ్ల కాలంలో మహిళలపై జరుగుతున్న దాడులకు సంబంధించి జిల్లాలో అధిక సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. 2024, 2025 సంవత్సరాల్లో 452 కేసులు నమోదయ్యాయి. 2024లో 227 కేసులు, 2025లో 225 కేసులు నమోదు అయ్యాయి. గృహ హింస, అత్యాచారాలు, ఫోక్సో, లైంగిక వేధింపులు, వరకట్న వేధింపులు, సైబర్ క్రైమ్, మిస్సింగ్ వంటి కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. -
సుప్రీం ఆదేశాలను పాటించండి
శృంగవరపుకోట: కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని న్యాయమూర్తులు పని చేయాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి చీకటి మానవేంద్రనాథ్రాయ్ అన్నారు. ఎస్.కోటలో రూ.8.5 కోట్లతో నిర్మించనున్న సింగిల్ కోర్టు కాంప్లెక్స్ భవన శంకుస్థాపన కార్యక్రమానికి హైకోర్టు మరో న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి తర్లాడ రాజశేఖరరావుతో కలిసి ఆదివారం హాజరయ్యారు. ముందుగా పాత కోర్టు భవన ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమానికి వచ్చిన న్యాయమూర్తులను జిల్లా అధికారులు, పలువురు న్యాయమూర్తులు ఆహ్వానించగా పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. రుత్వికులు మంత్రోచ్ఛారణతో పూర్ణకలశంతో స్వాగతించిన అనంతరం న్యాయమూర్తులు భవన నిర్మాణానికి భూమి పూజ చేసి, శంకుస్థాపన చేశారు. తరువాత శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్థానిక వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో ఎస్.కోట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోగాడ సూరిదేముడు నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్ మాట్లాడుతూ ఎస్.కోటలో కోర్టు భవనానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. 1978లో ఆరంభమైన ప్రస్తుత కోర్టు భవనం సుమారు అర్ధ శతాబ్దం పాటు సేవలందించిందన్నారు. దేశ వ్యాప్తంగా నేటికీ బ్రిటీష్ కాలం నాటి భవనాల్లో కోర్టులు నడుస్తున్నాయన్నారు. ఏడేళ్ల కిందట అవసరమైన చోట ఆధునిక వసతులు, సౌకర్యాలతో కోర్టు భవనాలు నిర్మించాలని సుప్రీంకోర్టు ప్రభుత్వంతో చర్చించిదని, నాటి ప్రతిపాదనలు నేడు కార్యరూపం దాల్చాయని చెప్పారు. విజయనగరం, బొబ్బిలి, ఎస్.కోట కోర్టులకు బిల్లులు సమస్య రాకుండా చూస్తామన్నారు. తాము కోర్టులకు అవసరమైన సహకారం అందిస్తున్నామని చెప్పారు. కోర్టులు, సిబ్బంది, ఉద్యోగులు ఉన్నా ఎందుకు సకాలంలో తీర్పులు రావడం లేదో ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు మీడియేషన్పై దృష్టి పెట్టిందని, ట్రైన్డ్ మీడియేటర్ల ద్వారా కేసులు రాజీ చేసేందుకు అంతే వేగంగా ప్రయత్నాలు చేస్తున్నామని, మనకు అన్నీ ఇస్తున్న కోర్టుకు మనం ఏమిస్తున్నామో న్యాయవాదులు ఆలోచించాలన్నారు. తాను ఇక్కడి వాడినని.. అందుకే ఉత్తరాంధ్రపై మక్కువ అని, విజయనగరంపై మరింత అభిమానం సహజంగానే ఉంటుందన్నారు. 60 సెంట్లు స్థలంలో రూ.850 లక్షలతో ఎస్.కోట కోర్టు తయారవుతుందని, బార్ హాల్ కొలతలు పెంచాలని ఆదేశించామని చెప్పారు. హైకోర్టు మరో న్యాయమూర్తి టి.రాజశేఖరరావు మాట్లాడుతూ కేసులు క్లియర్ చేయాలన్న హడావుడిలో సరైన నిర్ణయాలు తీసుకోకుంటే మళ్లీ కేసులు కోర్టుల్లో పడే అవకాశం ఉందన్నారు. దీనికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లా న్యాయమూర్తి బి.బబిత మాట్లాడుతూ ఎస్.కోటలో 15 నెలల్లో మూడంతస్తుల కోర్టు భవనం అన్ని హంగులతో సిద్ధమవుతుందని, న్యాయవాదులు ఆశించిన ఫలితాలు సాధించాలని అన్నారు. గుంటూరు జిల్లా న్యాయమూర్తి సాయికళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ ఉన్నత స్థాయికి ఎదిగినా కొందరు వ్యక్తులే తాను పుట్టిన ఊరు, ప్రాంతం కోసం పని చేస్తారని, అటువంటి వారిలో మానవేంద్రనాథ్ రాయ్ ఒకరని కొనియాడారు. ఎస్.కోట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.సూరిదేముడు మాట్లాడుతూ తమ విజ్ఞాపనను మన్నించి శరవేగంగా కోర్టు భవనం నిర్మాణ అనుమతులు ఇప్పించి, నిధులు మంజూరు చేసిన న్యాయమూర్తి మానవేంద్రనాథ్రాయ్కు తామంతా రుణపడి ఉంటామన్నారు. అనంతరం జిల్లాలోని పలు బార్ అసోసియేషన్ల సభ్యులు హైకోర్టు న్యాయమూర్తులను సన్మానించి, జ్ఞాపికలు, పుష్పగుచ్ఛాలు అందజేశారు. న్యాయవాది డబ్ల్యూఎన్ శర్మ ముగింపు ఉపన్యాసంలో ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ రాంసుందర్రెడ్డి, జిల్లా న్యాయమూర్తి ఎం.బబిత, ఎస్పీ ఏఆర్ దామోదర్, మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి, డీఎస్పీ గోవిందరావు, ఎస్.కోట న్యాయమూర్తి బి.కనకలక్ష్మి, ఏజీపీ టీవీ రమణమూర్తి, ఆర్డీవో డి.వెంకటేశ్వరరావు, తహసీల్దార్ డి.శ్రీనివాసరావు, జిల్లాలోని పలు కోర్టుల న్యాయమూర్తులు, కోర్టు ఉద్యోగులు, సిబ్బంది, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించండి హైకోర్టు న్యాయమూర్తి మానవేంద్రనాథ్రాయ్ తీర్పులు న్యాయాన్ని ప్రతిబింబింపజేయాలి హైకోర్టు న్యాయమూర్తి రాజశేఖరరావు -
బొత్స త్వరగా కోలుకోవాలి..
–8లో● ఎమ్మెల్సీల ఆకాంక్ష ● బొత్స సత్యనారాయణను పరామర్శించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల బృందం పారా అథ్లెటిక్స్లో క్రీడాకారుల సత్తా.. 24వ జాతీయ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీల్లో జిల్లాకు చెందిన పారా క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరచి పతకాలు సాధించారు. విజయనగరం: శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆదివారం పరామర్శించారు. నగరంలోని బొత్స నివాసంలో ఎమ్మెల్సీలు మర్యాదపూర్వకంగా కలిసిన వారు ఆయన క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ తలశిల రఘురాం మాట్లాడుతూ ఇటీవల జరిగిన శాసనమండలి సమావేశాల్లో అస్వస్థతకు గురైన బొత్స సత్యనారాయణ త్వరగా కోలుకోవాలని తామంతా ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. విజయనగరం ప్రజల ఇలవేల్పు పైడితల్లమ్మ ఆశీస్సులతో ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉన్నారని.. సంతోషంగా ఉందన్నారు. గతంలో మాదిరి మరింత ఆరోగ్యంగా ఉంటూ తమకు మార్గదర్శిగా నిలవాలని ఆకాంక్షించారు. అంతకు ముందు ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. బొత్స సత్యనారాయణను పరామర్శించిన వారిలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, వరుదు కళ్యాణి, కల్పలతా రెడ్డి, డాక్టర్ పెనుమత్స సురేష్బాబు, పాలవలస విక్రాంత్, కుంభా రవిబాబు, టి.మాధవరావు, కెఆర్జె.భరత్, రమేష్ యాదవ్, బొమ్మి ఇస్రాయిల్, రూహుతలా, సిపాయి సుబ్రహ్మణ్యం, పి.చంద్రశేఖర్ రెడ్డి, నర్తు రామారావు, టి.మాధవరావు, ఇందుకూరి రఘురాజు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, బొత్స అప్పలనరసయ్య, విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు కెకె.రాజు, పార్టీ నాయకులు కాయల వెంకటరెడ్డి తదితరులు ఉన్నారు. -
ఉద్యోగాల పేరిట వంచనపై ఫిర్యాదు
పార్వతీపురం రూరల్: పారిశుధ్య పనుల నియామకాల పేరిట మోసపోయిన బాధితులు శనివారం పార్వతీపురం ఏఎస్పీ మనీషా రెడ్డిని ఉత్తరాంధ్ర గిరిజన సంక్షేమ సంఘం నాయకుడు పి.రంజిత్కుమార్ నేతృత్వంలో ఆశ్రయించారు. తమను నమ్మించి లక్షలాది రూపాయలు వసూలు చేసిన కేటుగాళ్లపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. శ్రీ శబరి నిరుద్యోగ పారిశుధ్య వర్కర్స్ సంఘం ప్రతినిధులు గతేడాది జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) ఇచ్చిన ఒక అవగాహన సర్క్యులర్ను అడ్డం పెట్టుకుని గిరిజన యువతకు వల వేశారు. కురుపాం, జియ్యమ్మవలస, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం మండలాల్లో సుమారు 75 మంది నిరుద్యోగుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.1.70 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేశారు. వీరికి నకిలీ నియామక పత్రాలిచ్చి నాలుగు నెలలుగా పనులు చేయించుకున్నారు. జీతాల విషయమై డీపీవోను సంప్రదించగా.. ప్రభుత్వం నుంచి ఎటువంటి నియామకాలు జరగలేదని తేలడంతో బాధితులు విస్తుపోయారు. సుమారు అరకోటి రూపాయలకు పైగా వసూలు చేసి తమను నట్టేట ముంచారని బాధితులు ఏఎస్పీ ఎదుట వాపోయారు. బీవీవీఎస్ సత్యనారాయణమూర్తి, మజ్జి నారాయణరావు, కొండగొర్రి కృష్ణారావు ఈ వసూళ్లకు పాల్పడినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఏఎస్పీ.. తక్షణమే విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. విచారణకు బాధితులు సహకరించాలని ఆమె సూచించారు. -
దయనీయం..!
విజయనగరం ఫోర్ట్: క్షయ రోగులకు సేవలు అందించే జిల్లా క్షయ నివారణ కేంద్రం దయనీయ స్థితికి చేరింది. అయినా పట్టించుకునే వారు కరువయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భవనం పరిస్థితి చూస్తే ఎవరికై నా అయ్యో అనిపిస్తుంది. జిల్లా క్షయ నివారణ కేంద్రం పరిస్థితిని నిత్యం అధికారులు చూస్తున్నా.. ఏ ఒక్కరూ పట్టించుకోకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నామని, అందుకోసం కోట్లాది రుపాయిలు ఖర్చు చేస్తున్నామని చంద్రబాబు సర్కార్ గొప్పలు చెబుతుంది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. భయానకం.. క్షయ నివారణ కేంద్రం భయానక స్థితిలో ఉంటూ రోగులు, ఉద్యోగులను భయపెడుతుంది. భవనం శిథిలావస్థకు చేరుకొని ఎప్పుడు కూలుతుందో తెలియని దుస్థితి. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని అంతా భయపడుతున్నారు. అయినా ఉన్నతాధికారులు దీనిపై స్పందించడం లేదు. కృంగిన గచ్చు క్షయ నివారణ కేంద్రంలో ఐదు గదులు ఉన్నాయి. ఐదు గదుల్లో ఉన్న గచ్చులు కిందకు కృంగిపోయాయి. నడుస్తుంటే గచ్చు కిందకు కృంగిపోవడం వల్ల తూలిపోయి కింద పడిపోయే పరిస్థితి ఉంది. దీంతో క్షయ నివారణ కేంద్రానికి వచ్చే రోగులతో పాటు, ఉద్యోగులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. విద్యుత్ మీటరు వద్ద వైర్లు అస్తవ్యస్తంగా వేలాడుతున్నాయి. వైర్లు ప్రమాదకర స్థితిలో ఉన్న ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ఆందోళన నెలకొంది. రోజుకు 60 నుంచి 70 మంది వరకు రోగులు జిల్లా క్షయ నివారణ కేంద్రానికి చికిత్స కోసం 60 నుంచి 70 మంది వరకు రోగులు రోజూ వస్తారు. కఫం పరీక్ష నిర్ధారణ అయిన వారికి వైద్యులు చికిత్స అందిస్తారు. హెచ్ఐవీ బారిన పడిన వారికి కూడా ఇక్కడ క్షయ నివారణ పరీక్షలు చేస్తారు. పేరుకు పోయిన చెత్తాచెదారం క్షయ నివారణ కేంద్రం చుట్టూ చెత్తాచెదారం పేరుకు పోయింది. పిచ్చి మొక్కలు, చెత్త పేరుకు పోవడం వల్ల పారిశుధ్యం ఆధ్వానంగా తయారైంది. దీనికి తోడు విష సర్పాలు ప్రవేశిస్తున్నాయి. కొద్ది రోజులు క్రితం విష సర్పం క్షయ నివారణ కేంద్రంలోకి రావడంతో సిబ్బంది పామును కొట్టి బయట పడేశారు. క్షయ వ్యాధి పరీక్ష చేసుకోవడానికి వచ్చే వారికి అక్కడ అపారిశుధ్యం వల్ల వ్యాధి మరింత ఎక్కువ అయ్యే పరిస్థితి ఉందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుప్పు పడుతున్న వాహనాలు క్షయ నివారణ కేంద్రం ఆవరణంలో వాహనాలు తుప్పు పడుతున్నాయి. క్షయ నివారణ కేంద్రం ఉద్యోగులు క్షేత్ర స్థాయి పర్యటనకు గతంలో వాహనాలు ఇచ్చారు. ఆ వాహనాల కాల పరిమిత దాటడంతో వాటిని అలానే వదిలేశారు. టూవీలర్స్తో పాటు , జీపులు కూడా అలానే వదిలేశారు. దీంతో ఆ వాహనాలు తుప్పు పట్టి పాడవుతున్నాయి. ఏళ్ల తరబడి తుప్పు పట్టి పాడువుతున్నా వాటిని పట్టించుకునే వారే కరువయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవమే.. క్షయ నివారణ కేంద్రం శిథిలావస్థకు చేరింది. గచ్చులకు కృంగిపోతున్నాయి. భవనం శిథిల స్థితికి చేరింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. – డాక్టర్ కె.రాణి, జిల్లా క్షయ నివారణ అధికారి -
విద్యుత్ ప్రమాదంలో యువకునికి తీవ్ర గాయాలు
వీరఘట్టం: మండలంలోని తూడి గ్రామం వద్ద శనివారం జరిగిన విద్యుత్ ప్రమాదంలో ఝర్కాండ్కు చెందిన మనోజ్సింగ్ అనే యువకునికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామం వద్ద ఆర్.డి.ఎస్.ఎస్ పనుల్లో భాగంగా కొత్త విద్యుత్ లైన్లు వేస్తున్నారు. విద్యుత్ ఎక్కి పైభాగంలో పని చేస్తుండగా మనోజ్సింగ్ స్తంభం పైనుంచి ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో అతని తలకు తీవ్ర గాయమైంది. వెంటనే సమీపంలో ఉన్న అతని సహచరులు వీరఘట్టం పీహెచ్సీకి తీసుకువచ్చారు. ఇక్కడ వైద్య సిబ్బంది క్షతగాత్రునికి ప్రధమ చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్య చికిత్స కోసం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు.అక్కడి నుంచి అతని సహచరులు అతన్ని విజయనగరం తరలించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా విద్యుత్ పనులు నిర్వహిస్తున్న ప్రదేశంలో సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. -
సమగ్రశిక్షలో అక్రమాలపై సమగ్ర విచారణకు డిమాండ్
విజయనగరం అర్బన్: జిల్లా సమగ్ర శిక్షలో జరిగిన అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. స్థానిక అమర్ భవన్లో శనివారం జరిగిన కమిటీ సమావేశంలో ఈ మేరకు తీర్మానించింది. సమగ్ర శిక్ష కార్యాలయానికి సంబంధించిన పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఇటీవల సమగ్ర శిక్ష ప్రాజెక్టు కో ఆర్టినేటర్ను కలెక్టర్ సరెండర్ చేసిన నేపథ్యంలో జరిగిన వ్యవహారానికి సంబంధించిన అధికారులు, సిబ్బందిని గుర్తించేందుకు విచారణ అవసరమని పేర్కొన్నారు. గడిచిన రెండు సంవత్సరాలుగా నిర్వహించిన శిక్షణా కార్యక్రమాలు, ఇతర కార్యకలాపాలకు సంబంధించిన నిధుల వినియోగంపై సమగ్ర ఆడిట్ నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రధాన కార్యదర్శి డి.శ్యామ్, వి.గోవిందరావు, ఎన్ని అప్పలనాయుడు పాల్గొన్నారు. ఎస్టీయూ జిల్లా కమిటీ -
సమష్టిగా నవమి వేడుకలను విజయవంతం చేద్దాం..
● రామతీర్థం శ్రీరామనవమి ఉత్సవాలపై అధికారుల సమీక్షనెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో ఈ నెల 27న ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్న శ్రీరామనవమి ఉత్సవాలపై అధికారులు శనివారం సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆర్డీఓ ఎం.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ శ్రీరామనవమి వేడుకల విజయవంతానికి అన్ని శాఖల అధికారులు సమష్టిగా కృషి చేయాలన్నారు. కల్యాణ వేదిక, ఆలయ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలని, మూడు రోజుల ముందుగానే పారిశుద్య సిబ్బందిని ఏర్పాటు చేసి చెత్త సేకరణ పనులు చేపట్టాలన్నారు. విద్యుత్, ఫైర్, ఎకై ్సజ్, వైద్యారోగ్య, దేవదాయ శాఖ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈఓ వై.శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీరామనవమి ఉత్సవాలకు సంబంధించి సుమారు 10వేల మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామని, కల్యాణం అనంతరం ప్రత్యేక కౌంటర్ల ద్వారా తలంబ్రాలను పంపిణీ చేస్తామన్నారు. సామాన్య భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా వివిధ శాఖల అధికారులు సహకరించాలని కోరారు. కల్యాణోత్సవంలో పాల్గొనే దంపతులు రూ.1500 చెల్లించి టిక్కెట్లు కొనుగోలు చేయాలని వారికి శేష వస్త్రాలు, తలంబ్రాలు, స్వామి ప్రసాదాన్ని అందిస్తామని చెప్పారు. ఉచిత దర్శనంతో పాటు, టిక్కెట్టుతో ప్రత్యేక దర్శనం ఉంటుందన్నారు. సీఐ రామకృష్ణ మాట్లాడుతూ గత ఏడాది శ్రీరామనవమికి కల్యాణం అనంతరం వేదికపైకి భక్తులు గుంపులుగా వెళ్లి అసౌకర్యం కల్పించారని, అదుపు చేయలేని పరిస్థితి తలెత్తిందన్నారు. ఈ సారి అలా జరగకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని చెప్పారు. ఎమ్మెల్యే లోకం నాగమాధవి, నాయకులు సువ్వాడ రవిశేఖర్, చనమళ్లు వెంకటరమణ, గేదెల రాజారావు, కంచరాపు రాము, తహసీల్దార్ శ్రీకాంత్, ఎస్సై గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు హైకోర్టు న్యాయమూర్తుల రాక
శృంగవరపుకోట: పట్టణంలో ఆదివారం ఉద యం 9.30 గంటలకు జరగనున్న కోర్టు కాంప్లెక్స్ భవనం భూమి పూజకు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు తర్లాడ రాజశేఖరరావు, చీకటి మాన వేంద్రనాథ్రాయ్లు ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నట్టు ఎస్.కోట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోగాడ సూరిదేముడు చెప్పారు. ఏర్పాట్లను ఆర్డీఓ డి.వెంకటేశ్వరరావు, తహసీల్దార్ శ్రీనివాసరావుతో కలిసి శనివారం పరిశీలించారు. ఎన్సీసీ కేడెట్లకు ఎస్పీ అభినందనలు విజయనగరం క్రైమ్: ఎన్సీసీ (నేషన కేడిట్స్ కార్ప్స్) కేడెట్లను ఎస్పీ దామోదర్ జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం అభినందించారు. మహాశివరాత్రి రోజున రామతీర్థం ఆలయంలో కేడెట్లు విశేష సేవలందించడం అభినందనీయమన్నారు. క్రమశిక్షణగా ఉండాలని, ఉన్నతమైన భవిష్యత్తుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించా రు. సమాజానికి సేవలందిస్తూ ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. భారతదేశం అనేక భాషలు, సంస్కృతులు, సంప్రదాయాల సమ్మేళనమని, భిన్నమతాలు, కులాలు ఉన్నప్పటికీ మనమంతా భారతీయులమనే భావనను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐలు లీలారావు, జి.రామకృష్ణ పాల్గొన్నారు. -
నేటి నుంచి శాప్ టెన్నీస్ లీగ్ పోటీలు
● జిల్లా వేదికగా రెండు రోజులు రాష్ట్ర స్థాయి పోటీలువిజయనగరం: క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన టెన్నీస్ లీగ్ పోటీలకు విజయనగరం వేదిక కానుంది. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో విజ్జి స్టేడియంలో టెన్నీస్ క్రీడాంశంలో రెండు రోజుల పాటు జరిగే పోటీల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొననున్నారు. మాస్టర్స్ విభాగంలో నిర్వహించే పోటీలను ఆదివారం ఉదయం విజయనగరం ఎమ్మెల్యే అదితిగజపతిరాజు, కలెక్టర్ ఎం.రామసుందర్రెడ్డి ప్రారంభించనున్నారు. 45 ప్లస్ విభాగంలో నిర్వహించే పోటీల్లో 60 మంది క్రీడాకారులు సింగిల్స్, డబుల్స్ విభాగా ల్లో తలపడనున్నారు. పోటీలకు హాజరైన క్రీడాకారులు భోజన, వసతి సదుపాయాలు కల్పించనున్నట్టు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి ఎస్.వెంకటేశ్వరరావు తెలిపారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు సోమవారం బహుమతులు ప్రదానం చేయనున్నట్టు పేర్కొన్నారు. -
గ్యాస్ ఏజెన్సీ, హోటళ్లపై విజిలెన్స్ దాడులు
బొబ్బిలి: పట్టణంలోని గ్యాస్ ఏజెన్సీలు, హోటళ్లపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, పౌర సరఫరాల శాఖ అధికారులు ఏకకాలంలో శ శనివారం దాడులు నిర్వహించారు. స్థానిక వెంకటేశ్వర గ్యాస్ ఏజెన్సీలో రికార్డులు పరిశీలించారు. నిర్వాహకులు జలగం ప్రసాదరావును గ్యాస్ విడుదలైన తరువాత కొత్త గ్యాస్ బండ రావడానికి మధ్య ఎన్ని రోజులు పడుతుందని ప్రశ్నించారు. వస్తున్న సిలిండర్లెన్ని, ఎన్ని రోజులకు ఓసారి వస్తున్నాయనే వివరాలు నమోదు చేసుకున్నారు. అక్కడి గ్యాస్ సిలిండర్ల గోదామును తనిఖీ చేసి నిల్వలను లెక్కించారు. మరో పక్క పట్టణంలోని విజయలక్ష్మి మెస్–3, గణేష్ రెస్టారెంట్–2, సాయిరాం దాబా–2, విజయలక్ష్మి రెస్టారెంట్–3, రాజు స్వీట్స్ బేకరీ–3 తదితర హోటళ్లలో డొమెస్టిక్ గ్యాస్ వినియోగిస్తున్నట్టు గుర్తించి 13 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారానికి గృహావసరాల సిలిండర్లు వినియోగిస్తే కేసులు అనంతరం సీఐలు బి.సింహాచలం, డీవీవీ సతీష్కుమార్ విలేకర్లతో మాట్లాడుతూ హోటళ్లు, బేకరీలు, ఇతర అవసరాలకు వాణిజ్య సిలిండర్లే వినియోగించాలని, గృహ వినియోగ సిలిండర్లు వినియోగిస్తే కేసులు నమోదు చేస్తున్నట్టు తెలిపారు. గ్రోత్ సెంటర్లోని పలు కంపెనీలకు కూడా వాణిజ్య అవసరాల గ్యాస్ బండలు సరఫరా అవుతున్నాయన్నారు. వెంకటేశ్వర గ్యాస్ ఏజెన్సీ పరిధిలో ఉన్న 51వేల గ్యాస్ కనెక్షన్లకు నిత్యం వెయ్యికి తక్కువ కాకుండా గ్యాస్ బండలు వస్తున్నాయనీ, ముందుగా బుక్ చేసుకోవడం వలన పలువురికి బుక్ కావడం లేదన్నారు. ఎస్సై వి.రామారావు, పౌర సరఫరాల ఉప తహసీల్దార్ రెడ్డి సాయికృష్ణ, సిబ్బంది దాడుల్లో పాల్గొన్నారు. 13 సిలిండర్లు స్వాధీనం -
ఎస్పీకి అభినందనలు
విజయనగరం క్రైమ్ : ఎస్పీ దామోదర్ను ఆయన బంగ్లాలోనే విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శనివారం కలిసి అభినందనలు తెలిపారు. నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ, కేసుల దర్యాప్తు, ఇంటెలిజెన్స్ విభాగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఎస్పీకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్కృష్ట సేవ పథకం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నగరంలోని బాలాజీనగర్లో క్యాంపు కార్యాలయంలో ఎస్పీని కలిసిన ఎంపీ కలిశెట్టి దుశ్శాలువతో సత్కరించారు. జిల్లాకు, రాష్ట్రానికి ఎస్పీ చేస్తున్న సేవలను ఎంపీ కొనియాడారు. రాజ్యలక్ష్మికి ఉత్తమ వైద్యాధికారిణి అవార్డు చీపురుపల్లి రూరల్(గరివిడి): గరివిడి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిణిగా విధులు నిర్వహిస్తున్న కె.రాజ్యలక్ష్మి జిల్లా స్థాయి ఉత్తమ వైద్యాధికారిణి అవార్డుకు ఎంపికయ్యారు. మార్చి 24న ప్రపంచ టీబీ దినోత్సవం పురష్కరించుకుని విజయవాడలో శనివారం నిర్వహించిన నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రాంలో టీబీ అసోసియేషన్ ప్రతినిధులు చేతులు మీదుగా ఈ అవార్డును రాజ్యలక్ష్మి అందుకున్నారు. టీబీకి సంబంధించిన వంద రోజుల కార్యక్రమాన్ని అన్ని విభాగాల్లో ఉత్తమంగా నిర్వహించారు. రాష్ట్ర, సెంట్రల్ టీంలు గరివిడి పీహెచ్సీని సందర్శించినప్పుడు వైద్యాధికారితో పాటుగా వైద్య సిబ్బంది ఈ టీబీ కార్యక్రమంపై మంచి అవగాహన కల్గి ఉండటంతో జిల్లా ఉత్తమ వైద్యాధికారిణిగా ఎంపిక చేశారు. ఈ మేరకు రారష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఎలిమినేషన్ కార్యక్రమంలో అవార్డును అందించారు. విద్యుత్ షాక్తో మేకల మృతి శృంగవరపుకోట : మండలంలోని కిల్తంపాలెం నవోదయ స్కూల్ పరిసరాల్లో శనివారం ఉదయం విద్యుత్ షాక్కు గురై రెండు మేకలు మృతి చెందాయి. ఈ ఘటనకు సంబఽంధించి వివరాలిలా ఉన్నాయి. ముషిడిపల్లి పంచాయతీ బందవలస గ్రామానికి చెందిన దూరి దేముడు మేకలు మేపుతున్న సమయంలో రెండు మేకలు వేలాడుతున్న విద్యుత్ వైర్లు తగిలి విరుచుకు పడిపోయాయి. వాటికి సమీపంలో ఉన్న దేముడు వెనక్కి దూకి ప్రాణాలు దక్కించుకుని గ్రామంలోకి పరుగు తీసి విషయం చెప్పాడు. గ్రామస్తులు విద్యుత్ సిబ్బందికి ఫోన్ చేయటంతో వారు విద్యుత్ సరఫరా నిలిపారు. ఘటనా స్థలం గంట్యాడ పరిధిలో ఉండటంతో విద్యుత్ శాఖ ఏఈ ఎం.శ్రీనివాసరావు వచ్చి పరిశీలించారు. చనిపోయిన మేకలకు నష్ట పరిహారం కోసం సిఫార్సు చేస్తామని తెలిపారు. ఆవు మృతి బలిజిపేట: అంపావల్లి గ్రామానికి చెందిన సురేష్ ఆవు మృతి చెందింది. గత నెలలో పంపుహౌస్ వద్ద క్లోరిన్ గ్యాస్ లీకయిన విషయం విదితమే. ఆ సమయంలో సమీపంలో ఉండే పశువులు, మనుషులకు ప్రమాదం ఎదురైంది. అప్పట్లో చూడుకట్టి ఉండే ఆవు చూడు పోయి, శక్తిహీనమై శనివారం మృతి చెందినట్టు తెలిపారు. ఆవు విలువ రూ.50వేలు ఉంటుందని తెలిపారు. అప్పట్లో వైద్యులు పరీక్షలు నిర్వహించి పశువులకు సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయని తెలిపారని గ్రామస్తులు తెలిపారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత రైతు కోరాడు. ఇదిలా ఉండగా ఈ సమస్యపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం దారుణమని సీపీఎం నాయకుడు మన్మధరావు ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
తప్పు చేసిన అధికారులను దోషులుగా నిలబెడతాం
పూసపాటిరేగ: భోగాపురం మండలం ముంజేరు సిద్ధార్దనగర్ మురుగుకాలువ వివాదంలో తప్పు చేసిన అధికారులను కోర్టులో దోషులుగా నిలబెడతామని హైకోర్టు న్యాయవాది జడ శ్రావణ్కుమార్ అన్నారు. భోగాపురం మండలపరిషత్ కార్యాలయం ఎదుట 106 రోజులుగా కొనసాగుతున్న దళితుల రిలే నిరహారదీక్ష శిబిరాన్ని ఆయన శనివారం సందర్శించారు. దీక్షలో ఉన్న మహిళలకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మురుగు కాలువ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించారన్నారు. అధికారుల ఇళ్ల మీదుగా మురుగునీరు విడిచిపెడితే ఊరుకుంటారా అని ప్రశ్నించారు. చిన్నసమస్యను కూడా పరిష్కరించని స్థితిలో అధికారులు ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్లపై ఇప్పటికే మురుగు కాలువ వివాదంపై కోర్టు ధిక్కరణ పిటిషిన్ వేశామని, త్వరలోనే చర్యలు ఉంటాయన్నారు. అక్రమ కేసులు బనాయిస్తున్న పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు. కార్యక్రమంలో ధళిత సంఘం నాయికులు పాండ్రింకి వెంకటరమణతో పాటు జిల్లా నలుమూలలు నుండి వచ్చిన ధళిత సంఘం నాయికులు పాల్గొన్నారు. -
● లక్ష తులసీదళార్చన
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి వసంతోత్సవాల్లో భాగంగా శనివారం లక్ష తులసీదళార్చనను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేకువజామున ప్రాతఃకాలార్చన పూజలనంతరం వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన 40 మంది వేద పండితులు శ్రీమద్రామాయణ పారాయణం, సుందరాకాండ పారాయణం, దివ్య ప్రబంధ సేవా కాలములు జరిపించారు. అనంతరం స్వామి సన్నిధిలో లక్ష తులసీదళార్చన, లక్ష కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ నెల 27 వరకు లక్ష తులసీ, కుంకుమార్చనలు కొనసాగుతాయని అర్చకులు తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు సాయిరామాచార్యులు, నరిసింహాచార్యులు, కిరణ్, తదితరులు పాల్గొన్నారు. – నెల్లిమర్ల రూరల్ -
బస్సుకు నిప్పు.. తప్పిన పెనుముప్పు
శనివారం తెల్లవారు జామున 3 నుంచి 3.30 గంటల సమయంలో రామభద్రపురం గ్రామం ముందు ప్రయాణికులు టాయిలెట్స్ కోసం బస్సుఆపారు. వారంతా టాయిలెట్స్కు వెళ్లి మరలా బస్సు ఎక్కారు. రామభద్రపురం గ్రామం దాటాక బస్సు ఏదో ఇబ్బంది పెడుతున్నట్టు అనిపించింది. కాలిన వాసన రావడంతో వెంటనే బస్సును పక్కకు నిలిపి దిగి చూడగా మంటలు కనిపించాయి. వెంటనే బస్సులోని ప్రయాణికులందరినీ అప్రమత్రం చేశాను. ప్రయాణికులందరూ బస్సు దిగిపోయారు. కాసేపటికే బస్సులో ఉన్న ఎయిర్ బెలూన్స్ పేలిపోవడంతో వచ్చిన గాలికి బస్సంతా మంటలు చెలరేగాయి. భయపడిపోయాను. అందరూ మేల్కొని ఉండడంతో ప్రమాదం తప్పింది. – సుఖదేవ్ బరిక్, ట్రావెల్ బస్సు డ్రైవర్ రామభద్రపురం: ఆ ప్రయాణికుల పాలిట డ్రైవరే దేవుడు... ఆయన ఏ మాత్రం అప్రమత్తంగా లేకున్నా... బస్సులో రేగిన అగ్నికీలలు గమనించకపోయినా ప్రమాదం ఊహకు అందేదికాదు. ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోయి ఉండేవి. డ్రైవర్ అప్రమత్తతతో బస్సులో ప్రయాణిస్తున్న ఎమ్మెల్యేతో పాటు 32 మంది ప్రయాణికులు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. వివరాల్లోకి వెళ్తే... ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్కు చెందిన ఆరెంజ్ (నీలకంఠేశ్వర) ట్రావెల్స్ స్లీపర్ కోచ్ బస్సు రామభద్రపురం, సాలూరు మీదుగా 32 మంది ప్రయాణికులతో మల్కన్గిరి వెళ్తోంది. ప్రయాణికుల్లో అధికమంది ఒడిశా రాష్ట్రానికి చెందిన వారే. మల్కన్గిరి, చెములగుడ, దామన్జోడి, జయపూర్ తదితర ప్రాంతాల్లోని బంధువుల ఇంటికి, స్వగ్రామాలకు వెళ్తున్నారు. 26వ జాతీయ రహదారిపై వెళ్తుండగా రామభద్రపురం మండలం తారాపురం సమీపంలోని పూడివారి కళ్లాల వద్దకు వచ్చేసరికి శనివారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో బస్సు టైరు పేలినట్లు డ్రైవర్కు అనిపించింది. డ్రైవర్ సఖదేవ్ బరక్ వెంటనే బస్సును పక్కకు నిలిపి కిందకు దిగి చూశాడు. అప్పటికే బస్సు వెనుక మంటలు చెలరేగాయి. వెంటనే ఆయన అప్రమత్తమై ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. కిందకు దిగిపోవాలంటూ గట్టిగా కేకలు వేశాడు. అప్పటికి ఒక గంట ముందు కాలకృత్యాలు తీర్చుకునేందుకు బస్సును రామభద్రపుం ముందు నిలపడంతో ప్రయాణికులందరూ మేల్కొని ఉన్నారు. డ్రైవర్ కేకలకు వెంటనే బస్సు దిగిపోయారు. బస్సుకు అంటుకున్న మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయితే, బస్సు ఎయిర్ బెలూన్లు పేలిపోవడంతో క్షణాల్లో మంటలు బస్సంతా వ్యాపించాయి. ప్రయాణికులతో పాటు డ్రైవర్, క్లీనర్ భయంతో వణికిపోయారు. వీరి హాహాకారాలకు ఘటనా స్థలానికి సమీపంలోని తారాపురం గ్రామస్తులు పలువురు చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే బొబ్బిలి రూరల్ సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ వి.ప్రసాదరావు బాడంగి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం చేరవేశారు. వారు వచ్చి మంటలను అదుపుచేశారు. సాలూరు ఫైర్ స్టేషన్కు ఫోన్చేసినా స్పందించలేదని స్థానికులు వాపోయారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆర్డీఓ ప్రమాద స్థలాన్ని బొబ్బిలి డివిజన్ ఆర్డీఓ రామ్మోహనరావు పరిశీలించారు. ప్రమాద ఘటనతో పాటు ప్రయాణికుల వివరాలు, అందరూ సురక్షితంగా బయటపడిన అంశాలను సీఐ, ఎస్ఐలను అడిగి తెలుసుకున్నారు. క్లూస్టీం పరిశీలన.. బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బస్సు టైరు పేలి ప్రమాదం జరిగిందా? లేదంటే ఏమైనా షార్ట్సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. విజయనగరం నుంచి వచ్చిన క్లూస్టీం ఆధారాలు సేకరించింది. బస్సులోని పలు వస్తువులతో పాటు విద్యుత్ వైర్లు కొన్ని పట్టుకెళ్లారు. బస్సు డ్రైవర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కళ్లముందే తాము ప్రయాణిస్తున్న బస్సు కాలిపోవడాన్ని చూసి ప్రయాణికులు హాహాకారాలు చేశారు. తమ సామగ్రి కాలిపోతోందంటూ ఘొల్లుమన్నారు. రూ.10లక్షల విలువైన బంగారు హారం, చేతిగాజులు, ఉంగరాలు, రూ.7వేలతో కూడిన బ్యాగు కాలిపోతోందంటూ శాంతిలత అనే ప్రయాణికురాలు కన్నీరుపెట్టింది. అయితే... మంటలు పూర్తిగా ఆర్పాక బూడిదలో చెవిదిద్ది మినహా మిగిలిన బంగారు ఆభరణాలు లభించడంతో సంతోషం వ్యక్తంచేసింది. ఆభరణాలు అప్పగించిన సీఐ, ఎస్ఐకు కృతజ్ఞతలు తెలిపి బంధువుల సాయంతో సెములగూడకు పయనమైంది. చాలామంది ప్రయాణికుల విలువైన సామగ్రి కాలిపోవడంతో కట్టుబట్టలతో మిగిలారు. అదే బస్సులో మల్కన్గిరి వెళ్తున్న ఒడిశా రాష్ట్రం చిత్రకొండ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్(ఐ) ఎమ్మెల్యే మంగం ఖిల్లా ప్రమాదం నుంచి బయటపడి, వేరే ట్రావెల్ బస్సులో మల్కన్గిరి చేరుకున్నారు. రామభద్రపురం వద్ద దగ్ధమైన ఒడిశా ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బస్సులో ప్రయాణిస్తున్న ఒడిశా ఎమ్మెల్యేతో పాటు 32 మంది ప్రయాణికులు సురక్షితం డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆధారాలు సేకరించిన క్లూస్టీం -
ఏపీ న్యాయ శాఖ రిటైర్డ్ సిబ్బంది సంఘం జిల్లా అధ్యక్షుడిగా తాడ్డి
విజయనగరం టౌన్: ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ న్యాయ శాఖ సిబ్బంది సంఘం జిల్లా అధ్యక్షుడిగా తాడ్డి ప్రసాదరావు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. స్థానిక మదర్ థెరిసా క్లబ్ పార్క్ ఆవరణలో శనివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఏపీజీఆర్ రిౖటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామచంద్రరావు, రాష్ట్ర న్యాయ శాఖ మాజీ ప్రధాన కార్యదర్శి బొత్స రమేష్, ఎం.అచ్చిబాబు సమావేశానికి హాజరై అజెండాను ఏకగ్రీవంగా ఆమోదించారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా భగవాన్, కోశాధికారిగా కొల్లి పైడిరాజు ఆర్గనైజింగ్ సెక్రటరీగా శ్రీపాద కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులుగా పిబి.కృష్ణంరాజు, వి.నారాయణమూర్తి, ఎన్.చంద్రశేఖర్, సహాయ కార్యదర్శులుగా డివిఎస్ఎన్.పట్నాయక్, టి.మన్మధరావు, చిన్నికృష్ణ ఎంపికయ్యారు. మూడేళ్ల పాటూ కార్యవర్గం కార్యక్రమాలను నిర్వహిస్తారన్నారు. పదవీ విరమణ చెందిన ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు జీపీఎఫ్, లీవ్ ఎన్క్యాష్మెంట్, గ్రాట్యుటీ, డీఏ, పీఆర్సీ తదితర వాటిని వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. -
ప్రజారోగ్యంపై.. ఆ మాత్రం శ్రద్ధకూడా లేదాయె..!
విజయనగరం ఫోర్ట్: సర్వజన ఆస్పత్రిలో తరచూ వివిధ రకాల మందుల కొరత రోగులను వెంటాడుతోంది. వ్యయప్రయాసలకు గురిచేస్తోంది. ప్రజారోగ్యంపై చంద్రబాబు ప్రభుత్వ అలసత్వాన్ని ఎత్తిచూపుతోంది. పేద రోగులకు కనీసం మందు బిళ్లలు కూడా పూర్తిస్థాయిలో ఇవ్వడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రితో పాటు, పీహెచ్సీ, సీహెచ్సీ, ఏరియా ఆస్పత్రిల్లో కూడా ఇదే పరిస్థితి ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ● ఆస్పత్రే ఆధారమైనా... పేద, మధ్య తరగతి వర్గాలకు ప్రభుత్వాస్పత్రులే ఆధారం. ఏ మాత్రం అనారోగ్యానికి గురైనా ప్రభుత్వాస్పత్రులకు వెళ్లి ఉచిత వైద్యసేవలు పొందుతారు. అయితే, అక్కడ వైద్యులు రాసిన మందులు ఇవ్వకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. జ్వరం, జలుబు, నీరసం, బీపీ వంటి వ్యాధులకు వినియోగించే మందుల కొరత ఉండడంపై రోగులు మండిపడుతున్నారు. ● జిల్లాలో ఆస్పత్రులు ఇలా... జిల్లాలో 50 పీహెచ్సీలు ఉన్నాయి. బాడంగి, భోగాపురం, నెల్లిమర్ల, బొబ్బిలి సీహెచ్సీలు, గజపతినగరం, చీపురుపల్లి, రాజాం, ఎస్.కోటల్లో ఏరియా ఆస్పత్రులు, 18 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఉన్నాయి. పీహెచ్సీలకు రోజుకి 20 నుంచి 30 మంది వరకు, సీహెచ్సీకి 60 నుంచి 80 మంది వరకు రోగులు, ఏరియా ఆస్పత్రికి 200 నుంచి 300 మంది, సర్వజన ఆస్పత్రికి 1200 నుంచి 1400 మంది వరకు రోగులు వైద్యం కోసం వస్తారు. అయితే, పలు ఆస్పత్రుల్లో పారాసిట్మాల్–500 ఎం.జీ, బి–కాంప్లెక్సు మాత్ర లు, ఎటిన్లాల్, ఎమ్లాడోఫిన్, సిట్రిజన్ మాత్రలు, కాలిన గాయాలకు వినియోగించే సిల్వర్ ఎక్స్ అయింట్ మెంట్ కొరత ఉంది. వైద్యులు ఈ మందులను రాసినా రోగులు ప్రైవేటు దుకాణాల్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ మాత్రలు సరఫరా కావడం లేదు.. ఎటిన్లాల్, ఎమ్లాడోఫిన్, పారాసిట్ మాల్–500 ఎంజి, సిట్రిజన్, బి–కాంప్లెక్సు మాత్రలు సర్వజన ఆస్పత్రికి సరఫరా లేదు. సిల్వర్ ఎక్స్ ఆయింట్ మెంట్ కూడా రావడం లేదు. – బి.సన్యాసినాయుడు, ఫార్మసీ ఆఫీసర్, సెంట్రల్ డ్రగ్ స్టోర్ ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో మందుల కొరత పీహెచ్సీ, సీహెచ్సీ, ఏరియా ఆస్పత్రుల్లోనూ అదే పరిస్థితి..! కాలిన గాయాలకు ఉపయోగించే సిల్వర్ఎక్స్ ఆయింట్మెంట్కు కటకట ఎటిన్లాల్, ఎమ్లాడోఫిన్, సిట్రిజన్ మందుల కొరత బి–కాంప్లెక్స్ మాత్రలూ లేవు ప్రైవేటు దుకాణాల్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి గంట్యాడ మండలానికి చెందిన భవానీ అనే మహిళకు కాలు కాలిపోవడంతో సర్వజన ఆస్పత్రిలో చూపించింది. అక్కడి వైద్యులు మాత్రలతో పాటు సిల్వర్ఎక్స్ ఆయింట్మెంట్ రాశారు. అది పట్టుకుని మందులగది దగ్గరకు వెళ్తే సిల్వర్ఎక్స్ అయింట్ మెంట్ సరఫరా లేదని చెప్పడంతో ప్రైవేటు మందుల దుకాణంలో రూ.170 పెట్టి కొనుగోలు చేశారు. విజయనగరం పట్టణానికి చెందిన సత్యారావు అనే వ్యక్తి తలనొప్పి ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వచ్చారు. అక్కడ వైద్యులు బీపీ చెక్ చేయగా బీపీ ఉందని తేలడంతో మందులు రాసి ఇచ్చారు. అదిపట్టుకుని ఫార్మసీ గది వద్దకు వెళ్తే అతను వైద్యుడు రాసిన ఎమ్లాడోఫిన్ మాత్రలు లేవని చెప్పడంతో ఇంటికి వెళ్లి పోయారు. -
దొంగతనానికి వెళ్లి జారిపడి మృతి చెందిన వ్యక్తి
విజయనగరం క్రైమ్ : విజయనగరం టూటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో దొంగతనం చేసేందుకు బహుళ అంతస్తుల భవనం ఎక్కి అక్కడ నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన దాసన్నపేటలో శుక్రవారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఎస్ఐ కృష్ణమూర్తి తెలిపిన వివరాలు.. దాసన్నపేట ఫుడ్ కార్పొరేషన్ గోదాం సమీపంలో దాట్ల ఆస్పత్రి వెనుక ఓ ఇంట్లో దొంగతనం చేసేందుకు 55 సంవత్సరాల వ్యక్తి టెర్రస్ మీదకు వెళ్లాడు. అక్కడ చిన్న స్లోప్ ఉండడంతో రాత్రి కావడంతో చీకట్లో అది కనిపించకపోవడం జారిపడి కింద పడిపోయాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న టూ టౌన ఎస్ఐ కృష్ణమూర్తి ఘటనా స్థలికి వెళ్లారు. అప్పటికే ఆ వ్యక్తి మృతి చెందినట్టు గుర్తించారు. అక్కడ క్లోజడ్ సర్క్యూట్ కెమెరాను పరిశీలించారు. దొంగతనం చేసేందుకు వచ్చినట్టు గుర్తించారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు 9121109438, 9121109420 ఫోన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు. గోడ కూలి బాలుడు మృతి కొమరాడ: మండలంలోని ఆర్తాం గ్రామంలో ఓ ఇంటి గోడ కూలి తొమ్మిదేళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. ఆర్తాం గ్రామంలో ఒడిశా నుంచి వచ్చి కూలి పనులు చేసుకుంటూ బిడ్డక కొండ, జ్యోతి దంపతులు నాలుగేళ్లుగా నివసిస్తున్నారు. వీరికి తొమ్మిదేళ్ల బాలుడు బిడ్డిక హేమంత్ ఉన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు వీరు అద్దెకుంటున్న ఇంటి బాత్రూమ్ గోడ కూలిపోయింది. ఆ సమయంలో సమీపంలో ఆడుతున్న హేమంత్ (9)పై గోడ కూలిపోయింది. దీంతో బాలుడి తలకు తీవ్ర గాయమైంది. చికిత్స కోసం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కొమరాడ ఎస్ఐ జగదీష్నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు విజయనగరం క్రైమ్: విజయనగరం పరిధిలోని రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రణాళికా బద్దమైన చర్యలు చేపడుతున్నట్టు ఎస్పీ దామోదర్ శుక్రవారం తెలిపారు. విజయనగరం ఇన్చార్జ్ డీఎస్పీ గోవిందరావుతో కలిసి చెల్లూరు, వై జంక్షన్, మోదవలస, గంట్యాడ చెక్పోస్టులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా ప్రాంతాల్లో రహదారులపై రోడ్డు ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్లతో పాటు స్టాపర్లు పెట్టాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. ప్రమాద నియంత్రణకు స్పీడ్ బ్రేకర్లతో పాటు జీబ్రా లైన్లు వేయాలని సూచించారు. ప్రమాదాలు జరిగే దాదాపు 20 బ్లాక్ స్పాట్లను ఎస్పీ గుర్తించారు. చెల్లూరుతో పాటు బైపాస్రోడ్డు జంక్షన్, అయినాడలలో ఈ స్పాట్లను గుర్తించారు. ప్రమాదాల నివారణకు వాహనదారులు కనీస జాగ్రత్తలు పాటించాలన్నారు. మద్యం సేవించి పట్టుబడితే రూ.10వేల జరిమానాతో పాటు జైలు శిక్ష ఖాయమని హెచ్చరించారు. ఎస్పీతో పాటు ఎస్బీ సీఐ లీలారావు, భోగాపురం సీఐ రామకృష్ణ, విజయనగరం రూరల్ సీఐ లక్ష్మణరావు, ఎస్ఐలు అశోక్, సన్యాసినాయుడు పాల్గొన్నారు. -
రంజాన్కు సర్వం సిద్ధం
విజయనగరం టౌన్: పవిత్ర రంజాన్ మాసం శుక్రవారం షవ్వాల్ మాసం చంద్ర దర్శనంతో ముగిసింది. భారతదేశంలో యావత్ ప్రపంచ ముస్లింలు శనివారం ఈదుల్ ఫితర్ నిర్వహించుకోనున్నారు. నెల రోజుల పాటూ కఠోర ఉపవాస దీక్షలు, ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించి, అత్యంత భక్తిభావంతో మెలిగిన ప్రతీ ముస్లిం సోదరుడు పవిత్రమైన రంజాన్ పండగ కోసం వేచి చూస్తాడు. ఎందరో నిరుపేదలకు దానధర్మాలు చేసి, ప్రత్యేక ప్రార్ధనలు చేసి, ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ఆనంద పరవశులవుతారు. భారతదేశ సౌభ్రాత్వత్వానికి ప్రతీకగా అంతా మంచి జరగాలని ప్రార్ధనలు నిర్వహిస్తారు. నెల రోజుల పాటూ చేసే ఉపవాస దీక్షలు, దానధర్మాలు ఏడాది పాటూ చేసేందుకు నెలరోజుల దీక్ష ఎంతగానో ఉపయోగపడతాయని విశ్వసిస్తారు. పవిత్ర రంజాన్ పండగను శనివారం నిర్వహించేందుకు ముస్లిం పెద్దలు నిర్ణయించుకున్నారు. జిల్లాలోని అన్ని మసీదుల్లోనూ, ఈద్గాల్లోనూ ప్రత్యేక ప్రార్ధనలకు సిద్ధం చేశారు. మసీదులన్నీ విద్యుత్ కాంతులతో శోభాయమానంగా వెలిగిపోతున్నాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా ముస్లిం సోదరులందరూ రంజాన్ వేడుకలకు సిద్ధమవుతున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఈద్గాలో.. జిల్లా కేంద్రమైన విజయనగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దనున్న ఈద్గాలో ముస్లిం సోదరులందరూ ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహిస్తుంటారు. కణపాక ఈద్గా, చోటీ మసీదు, జామియా మసీదు, మెహమాన్ మసీదు, డకినివీధి మసీదు తదితర ప్రాంతాల్లో వైభవంగా రంజాన్ వేడుకలు నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఉదయం 7.30 గంటల నుంచే... ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఈద్గాలో ఉదయం 7.30 గంటలకు, జామియా మసీదులో 8 గంటలకు ప్రత్యేక ప్రార్ధనలు చేయనున్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ప్రత్యేక ప్రార్ధనలు చేయనున్నారు. పూర్తయిన ఏర్పాట్లు ముస్తాబయిన మసీదులు ఈద్గాలో ప్రత్యేక ప్రార్ధనలు మసీదు, ఈద్గాల్లో నేటి ఉదయం 7.30 నుంచే నమాజ్లు నేడు పవిత్ర రంజాన్ పర్వదినంబోధనలకనుగుణంగా జీవితాన్ని గడపాలి ముస్లిం సోదరులు పవిత్ర రంజాన్ మాసంలో ఖురాన్ బోధనలను విన్నారు. ఖురాన్ బోధనలకు అనుగుణంగా తమ జీవితాన్ని గడపాలి. అదే రంజాన్ ప్రత్యేక సందేశం. మానవులంతా సమానమేనని, ఈదుల్ ఫిత్ర్ పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ దాన ధర్మాలు చేయాలని పండగ సూచిస్తుంది. సమత, మమతలకు అద్దం పడుతుంది. దేవున్ని స్మరి ప్రతీ ముస్లిం సోదరుడు ఆనందంతో నిర్వహించుకునే పండగ. – మహమ్మద్ హబీబ్, జమాతే ఇస్లామీ హింద్ సంస్థ ప్రతినిధి, విజయనగరం -
● రోడ్డు వేశాం.. మాకేం స్తంబంధం..
ఈ చిత్రం చూశారా... ఇది నెల్లిమర్ల–రణస్థలం ప్రధాన రోడ్డు. ఇటీవల గొర్లిపేట, కొత్తపేట సమీపంలో తారురోడ్డు వేశారు. కనీసం విద్యుత్ స్తంభాలను పక్కకు జరపకుండా రోడ్డు వేయడంతో ఈ ప్రాంతీయులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ నెల 27న రామతీర్థంలో రాములోరి కల్యాణోత్సవం జరగనుంది. వేలాది మంది భక్తులు ఈ రోడ్డు మీదుగానే ప్రయాణాలు సాగిస్తారు. విద్యుత్ స్తంభాలు రోడ్డుపైనే ఉండడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటూ ఆందోళన చెందుతున్నారు. అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతున్నారు. – నెల్లిమర్ల రూరల్ -
విద్యుత్ స్తంభాన్ని బొలెరో ఢీకొని వ్యక్తి మృతి
బొండపల్లి: అతి వేగంగా వస్తూ వాహనాన్ని అదుపు చేయకపోవడంతో రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బొలెరో వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి ఎస్ఐ యు.మహేష్ తెలిపిన వివరాలు.. పూసపాటిరేగ మండలం కోళ్లాయివలస గ్రామానికి చెందిన బొలెరో వాహనంలో అదే గ్రామానికి చెందిన ఐదుగురు గజపతినగరంలో గల కాంక్రీట్ మిక్సర్ యంత్రాన్ని వాహనంలో ఎక్కించి బయలుదేరారు. అతివేగంగా నడుపుతున్న బొలెరో జాతీయ రహదారి 26పై రోళ్లవాక జంక్షన్ వద్దకు వచ్చేసరికి అదుపు తప్పించి రహదారి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన నీలాపు రామసూరి(40) అక్కడికక్కడే మృతి చెందాడు. కాకి అసిరప్పడు, లావేటి అసిరినాయుడు, కంప పైడిరాజుతో పాటు వ్యాన్ డ్రైవర్ సాడి రాజేంద్ర తీవ్రంగా గాయపడినట్టు ఎస్ఐ తెలిపారు. క్షతగాత్రులను 108 వాహనంలో జిల్లా కేంద్రంలో కేంద్ర సర్వజన ఆస్పత్రికి తరలించారు. రామసూరి మృతదేహాన్ని పంచనామా నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. నలుగురికి తీవ్ర గాయాలు -
పోలీసు సమస్యల పరిష్కారానికి ‘వెల్ఫేర్ డే’
చికెన్పార్వతీపురం రూరల్ : జిల్లా పోలీసు సిబ్బంది ఎదుర్కొంటున్న శాఖాపరమైన, వ్యక్తిగత, ఆరోగ్య సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యమిస్తామని ఎస్పీ ఎస్.వి.మాధవ్రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన పోలీసు వెల్ఫేర్ డే (గ్రీవెన్స్ డే) నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సిబ్బంది తమ విన్నపాలను ఎస్పీకి నేరుగా అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. సిబ్బంది నుంచి అందిన వినతులను క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రధానంగా బదిలీలు, ఆరోగ్య సమస్యలకు సంబంధించిన విన్నపాలు అధికంగా వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా పోలీసు కార్యాలయ సీసీ సంతోష్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎండు ఉసిరి కిలో రూ.90
● కిలోకు రూ.30 ధర పెంచిన జీసీసీ ● ఎండు ఉసిరి తయారీలో గిరిజనుల నిమగ్నం ● పంట దిగుబడి లేదంటున్న ఉసిరి రైతులు సీతంపేట: ఎండు ఉసిరి ధరను గిరిజన సహకార సంస్థ పెంచింది. గత సీజన్లో కిలో ఎండు ఉసిరిని రూ.60కు కొనుగోలు చేసిన జీసీసీ ఏకంగా రూ.30 పెంచి రూ.90కి కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చింది. జీసీసీ ధరలు పెంచడంతో మైదాన ప్రాంతాల వ్యాపారులు సైతం ఇదే అదునుగా కిలోకు రూ.2 నుంచి రూ.5 వరకు అదనంగా మద్దతు ధర పెంచి కొనుగోలు చేస్తున్నారు. అయితే, తూకంలో మోసాల వల్ల నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. కొండపోడులో సాగైన ఉసిరికి కాయలు పచ్చివి ప్రస్తుతం కావిడ రూ.400ల నుంచి రూ.500లకు విక్రయిస్తున్నామని, గతేడాది ఒక్కో కావిడ ధర రూ.700 పలికేదని రైతులు చెబుతున్నారు. ఎండు ఉసిరి తయారీ కష్టమే... ఎండు ఉసిరి తయారీ కష్టమే. పచ్చి ఉసిరి విక్రయించగా మిగిలిన ఉసిరిని చిదకగొట్టిన తర్వాత ఎండలో పక్షం రోజుల పాటు ఆరవేసిన తర్వాత ఎండుఉసిరిగా మారుతుంది. దీనిని మార్కెట్కు తరలించి అమ్మకాలు చేస్తాం. గిట్టుబాటు ధర ఉంటే జీసీసీకే విక్రయిస్తామని, లేని పక్షంలో వ్యాపారులకు అమ్మకాలు జరుపుతామని గిరిజనులు తెలిపారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఒడిశా ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఇక్కడకు వచ్చి పంటను కొనుగోలు చేస్తారు. ఉసిరి పంట అంతగా లేదు. ఎండు ఉసిరి తయారీ కష్టంగా ఉంది. గతంలో పండేదంటే జీసీసీ ఎటువంటి ధరలు పెంచలేదు. ఇప్పుడు పెంచినప్పటికీ అంత దిగుబడులు లేకపోవడంతో ఏటా గిరిజన రైతులకు నష్టాలు తప్పడం లేదు. పచ్చి ఉసిరిని ఎండు ఉసిరిగా తయారు చేయడం కష్టసాధ్యమైన పని. – జోషి, అడ్డంగి -
మాస్టారూ.. మీకిది తగునా..!
బడిలో ఉండాల్సిన ఉపాధ్యాయులు విధులను విస్మరించి గ్రామంలోని తాగునీటి ట్యాంకు, వివిధ కార్యాలయాల ప్రారంభోత్సవంలో నిమగ్నమయ్యారు. అంతే... పిల్లలకు పాఠాలు చెప్పేవారే కరువయ్యారు. తరగతి గదిలోనే పిల్లలు ఆడుకున్నారు. అనంతరం పిల్లలు కూడా ప్రారంభోత్సవం వద్దకు చేరుకుని ఉపాధ్యాయులు పాఠశాలకు ఎప్పుడు వస్తారా? అని ఎదురు చూశారు. తీరా ఎప్పటికీ రాకపోయేసరికి తరగతిలోని ఓ విద్యార్థినే ఉపాధ్యాయురాలిగా మారి బోర్డుపై రాసిన పేర్లును తోటి విద్యార్థులతో చదివించింది. ఈ దృశ్యాలు రామభద్రపురం మండలం రొంపల్లి, వంగపండువలస ప్రాథమిక పాఠశాలల్లో శుక్రవారం చోటుచేసుకున్నాయి. మాస్టార్ల తీరును ఆయా గ్రామాల ప్రజలు తప్పుబట్టారు. విద్యాబోధన చేయాల్సిన ఉపాధ్యాయులు.. పాలకులు వస్తున్నారన్న అత్యుత్సాహంతో పాఠశాలలను వదిలేసి ప్రారంభోత్సవాల్లో పాల్గొనడం.. నేతలు వెళ్లిపోయే వరకు అక్కడే ఉంటూ వారిని ప్రసన్నం చేసుకునేందుకు పాకులాడడాన్ని తప్పుబట్టారు. ఇదే విషయాన్ని ఎంఈఓ–1 తిరుమలప్రసాద్ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా వంగపండువలస ప్రాథమిక పాఠశాలకు వెళ్లి అక్కడి టీచర్ను విచారించి శాఖాపరమైన చర్యలు తీసుకుంటానన్నారు. పాఠశాల సమయంలో ఏ టీచర్ అయినా పిల్లలను తరగతి గదిలో విడిచిపెట్టి బయటకు వెళ్లకూడదన్నారు. రొంపల్లిలో ప్రభుత్వ కార్యాలయాల ప్రారంభోత్సవంలో తను పాల్గొన్నానని, అక్కడి రెగ్యులర్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎంను తనే స్వయంగా పిలిచినట్టు సెలవిచ్చారు. – రామభద్రపురం -
అల్లాహ్ విశ్వాసకులకు రంజాన్ శుభాకాంక్షలు
● జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు విజయనగరం: ఆధ్యాత్మిక చింతన, త్యాగం మానవత్వానికి ప్రతీకగా నిలిచే రంజాన్ పండగ ప్రజలందరిలోనూ వెలుగులు నింపాలని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) ఆకాంక్షించారు. శనివారం పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని ముస్లింలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఆధ్యాత్మిక చింతన, క్రమశిక్షణ, దానగుణం, సోదరభావానికి రంజాన్ పండగ ప్రతీక అని కొనియాడారు. పేదలకు చేసే సహాయమే ఈ పండుగలోని అసలైన పరమార్థమని, మానవత్వమే మతమని చాటిచెప్పే గొప్ప పండగ రంజాన్ అని ఆయన పేర్కొన్నారు. అల్లాహ్(భగవంతుని) దయ అందరిపైనా ఉండాలని, జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని, ప్రజల్లో మత సామరస్యత పెంపొందాలన్నారు. ఈవీఎం గోదాముల తనిఖీ నెల్లిమర్ల: ఈవీఎం గోదాములను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. మూడు నెలలకోసారి గోదాముల తనిఖీలో భాగంగా గోదాము షట్టర్లకు అమర్చిన సీల్స్, తాళాలను తెరిపించి లోపలి గదులను, ఈవీఎం యంత్రాల నిల్వను సమగ్రంగా పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేకంగా సమీక్షించారు. గోదాం పరిసర ప్రాంతాలను సీసీ కెమెరాల ద్వారా పరిశీలించి, అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులకు, పోలీస్ సిబ్బందికి సూచించారు. భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, ఇన్చార్జి ఆర్డీఓ డి.వెంకటేశ్వరరావు, నెల్లిమర్ల తహసీల్దార్ శ్రీకాంత్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, రాజకీయ పార్టీల ప్రతినిధులు పి.లక్ష్మీవరప్రసాదరావు, సముద్రపు రామారావు, డి.గౌరీశంకర్, బి.వి. రామారావు, టి.శ్రీనివాసరావు, టి.వి.రామారావు తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్–02న పదోతరగతి ఇంగ్లిష్ పరీక్ష విజయనగరం అర్బన్: రంజాన్ (ఈద్–ఉల్–ఫితర్) సందర్భంగా శనివారం ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించిన నేపథ్యంలో ఆ రోజున జరగాల్సిన పదో తరగతి తృతీయ భాష ఇంగ్లిష్ పరీక్షను ఏప్రిల్ 02వ తేదీకి వాయిదా వేసినట్టు డీఈఓ యు.మాణిక్యంనాయుడు తెలిపారు. పేపర్ కోడ్లు 13ఈ, 14ఈ లకు సంబంధించిన పరీక్షను ఆ రోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల మధ్య నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ మార్పును ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు విద్యార్థులకు తెలియజేయాలని సూచించారు. 30కి ఏపీ ఓపెన్ స్కూల్ పరీక్ష వాయిదా పార్వతీపురం రూరల్: రంజాన్ సందర్భంగా ఈ నెల 21న ప్రభుత్వం సెలవు ప్రకటించిన నేపథ్యంలో ఆ రోజు జరగాల్సిన ఏపీ ఓపెన్ స్కూల్ పరీక్షలను వాయిదా వేసినట్టు జిల్లా విద్యాశాఖాధికారి పి. బ్రహ్మాజీరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 21న జరగాల్సిన 211 గణితం, 223–భారతీయ సంస్కృతి, వారసత్వము పరీక్షలను ఈనెల 30వ తేదీ (సోమవారం) ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఆయా కేంద్రాల్లోనే ఈ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. పరీక్షల వాయిదా సమాచారాన్ని ప్రతివిద్యార్థికి చేరవేయాలని ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులను డీఈఓ ఆదేశించారు. ఈనెల 21న విధులకు కేటాయించిన ఇన్విజిలేటర్లు సిబ్బంది అందరూ యథావిధిగా 30వ తేదీన తమ విధులకు హాజరు కావాలని, పరీక్ష కేంద్రాల్లో అవసరమైన లాజిస్టిక్ ఏర్పాట్లు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచించారు. -
● మొక్కజొన్నను మద్దతు ధరకు కొనుగోలు చేయండి
మొక్కజొన్న గింజలను ప్రభుత్వం ప్రకటించిన క్వింటా రూ.2,400 మద్దతు ధరకు మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. తక్షణమే జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని కోరారు. మొక్కజొన్న గింజల కొనుగోలులో చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రాష్ట్ర రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి గోపాలం ఆధ్వర్యంలో పాల్తేరు గ్రామంలో శుక్రవారం ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రబీ సీజన్లో జిల్లాలో సుమారు 60వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగుచేశారని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో చేతికొచ్చిన పంటను క్వింటా రూ.1600 నుంచి రూ.1700కు విక్రయించాల్సి వస్తోందని వాపోయారు. ఈదుర గాలులతో పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ మంజూరులో ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఈ నెల 23న కలెక్టరేట్ వద్ద చేపట్టే ధర్నాలో రైతులు పెద్దసంఖ్యలో పాల్గొనాలని రైతుసంఘం నాయకుడు గోపాలం పిలుపునిచ్చారు. – బాడంగి -
జాబ్ క్యాలెండర్ పేరిట మోసం
విజయనగరం గంటస్తంభం: ఉగాది సందర్భంగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్పై ఏఐవైఎఫ్ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది జాబ్ క్యాలెండర్ కాదు.., డూప్ క్యాలండర్ అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. నగరంలోని సీపీఐ అమర భవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు బూర వాసు, ఉపాధ్యక్షుడు వెలగాడ రాజేష్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. నిరుద్యోగులు అడుగుతున్నవి పెద్ద కోరికలు కావని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే కోరుతున్నారని తెలిపారు. రెండు సంవత్సరాలు గడిచినా కేవలం 10 వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం నిరుద్యోగ యువతను నిరాశకు గురి చేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న గంజాయి సమస్యను నిర్మూలిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. డ్రగ్స్ నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని, ప్రజలను గాలికి వదిలేసినట్టుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. మెడికల్ మాఫియాపై కూడా వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అనుమతులు లేకుండా నడుస్తున్న ఆస్పత్రులు, మెడికల్ షాపులు ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయని చెప్పారు. కాలం చెల్లిన మందులను విక్రయించడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి అక్రమాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరచి యువతకు ఇచ్చిన హామీలను అమలు చేసి న్యాయం చేయాలని, లేని పక్షంలో భవిష్యత్తులో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఏఐవైఎఫ్ సహాయక కార్యదర్మి గంగరాజు, రవి, వినోద్, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు. ఉగాది గిఫ్ట్ కాదు..యువతను మోసం చేసే డూప్ క్యాలెండర్ డ్రగ్స్ నిర్మూలనలో వైఫల్యం.. మెడికల్ మాఫియా విజృంభణ ఎన్నికల హామీలు మరిచిన ప్రభుత్వం ఏఐవైఎఫ్ ఆగ్రహం -
బొలెరో వాహనాన్ని ఢీకొట్టిన ఆటో
వీరఘట్టం: రాంగ్ రూట్లో వచ్చిన ఓ ఆటో ఎదురుగా వస్తున్న బొలెరా వాహనాన్ని ఢీ కొట్టిన ప్రమాదంలో ఐదుగురు గాయపడినట్టు ఎస్.ఐ ఎస్.షణ్ముఖరావు తెలిపారు. దీనికి సంబంధించి వివరాలు... మండలంలోని కడకెల్ల సమీపంలో సీఎస్పీ రహదారిపై శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో చింతా వీర్రాజు, వరలక్ష్మి, ఇసుకపల్లి మంగమ్మ, చింతా జీవన్కుమార్, మన్య హర్షవర్ధన్కు గాయాలయ్యాయి. పాలకొండ మండలం బడ్డుమాసింగికి చెందిన వీరంతా ఉదయం రాయగఢ మజ్జి గౌరమ్మను దర్శించుకునేందుకు ఆటోలో వెళ్లి తిరిగి వస్తుండగా కడకెల్ల–రావివలస మధ్యలో ఈ ప్రమాదం జరిగినట్లు ఎస్.ఐ తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్.ఐ తెలిపారు. క్షతగాత్రుల్లో చింతా వీర్రాజు, వరలక్ష్మిలకు తీవ్ర గాయాలవ్వడంతో పాలకొండ తరలించారు. ఇసుకపల్లి మంగమ్మకు కాలు విరిగిపోగా చేతికి గాయాలయ్యాయి. చింతా జీవన్కుమార్, మన్య హర్షవర్ధన్లకు తలపై గాయాలయ్యాయి. వీరిని కూడా పాలకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అంతకు ముందు 108 సిబ్బంది జగదీష్, తిరుపతిరావులు క్షతగాత్రులకు ప్రధమ చికిత్స అందజేశారు. ఆటోలో ఉన్న ఐదుగురికి గాయాలు -
డిమాండ్కు తగ్గట్టుగా గ్యాస్ సరఫరా
● అవసరం మేరకు మాత్రమే బుకింగ్ చేసుకోవాలి ● గ్యాస్ పొదుపుగా వాడుకోవాలి ● కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి విజయనగరం: జిల్లాలో గృహవినియోగ గ్యాస్కు కొరత లేదని, డిమాండ్కు తగ్గట్టుగా సరఫరా జరుగుతుందని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడారు. గ్యాస్ కోసం ప్రజలు ఆందోళన చెందవద్దని, డిమాండ్కు సరిపడా గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. గ్యాస్ పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ప్రజల అవసరం మేరకు మాత్రమే గ్యాస్ కొనుగోలు చేయాలని, ఆందోళన చెంది అనవసరంగా బుకింగ్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. డిమాండ్, సప్లయిలో అంతరాన్ని తగ్గించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సివిల్ సప్లయి అధికారులను అదేశించారు. సమావేశంలో సీపీఓ, డీఎస్ఓ పాల్గొన్నారు. -
ఏనుగుల తరలింపు ఎప్పుడు?
–8లోజాబ్ క్యాలెండర్ పేరిట మోసం ఉగాది సందర్భంగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్పై ఏఐవైఎఫ్ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.జియ్యమ్మవలస రూరల్: చేతికొచ్చిన పంటలను ఏనుగులు నాశనం చేస్తున్నాయి. రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. జియ్యమ్మవలస మండలంలోని నిమ్మలపాడు, బిత్రపాడు, బాసంగి గ్రామా ల్లో రెండు రోజులుగా సంచరిస్తూ అరటి, చెరకు, జొన్న, పామాయిల్ పంటలను నాశనంచేస్తున్నాయి. రాత్రి వేళల్లో గ్రామ పరిసరాల్లో సంచరిస్తూ భయాందోళనకు గురిచేస్తున్నాయి. కుంకీ ఏనుగులను తీసుకొచ్చి ఏనుగులను తరలిస్తామంటూ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నిస్తున్నారు. ఓట్లకోసం ఉచిత హామీలు ఇవ్వడం సరికాదని, ఏనుగుల తరలింపుపై దృష్టిసారించి రైతులకు మేలుచేయాలని డిమాండ్ చేశారు. బిత్రపాడు, నిమ్మలపాడు గ్రామాల ప్రధాన రోడ్డుకు దగ్గరలో ఏనుగులు సంచరించడంతో అటువైపుగా ప్రయాణించిన వాహన చోదకులు, ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రజలు ఆందోళనకు గురయ్యారు. రాత్రివేళల్లో నిద్ర లేకుండా చేస్తున్నాయని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం స్పందించి ఏనుగుల తరలింపునకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
గేట్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ
రేగిడి: మండల పరిధి కొ మెర గ్రామానికి చెందిన బొత్స మనోహర్నాయు డు ఈ నెల 19న విడుద లైన గేట్ ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో 59వ ర్యాంకు సాధించి చక్కని ప్రతిభ కనబరిచాడు. ఈ యన తల్లి గృహిణి కాగా తండ్రి బొత్స వెంకటరమ ణ ప్రధానోపాధ్యాయులు గా విధులు నిర్వహిస్తున్నారు. మనోహర్నాయుడును ఎంఈఓ ఎంవీ ప్ర సాదరావు, ఉపాధ్యాయ సంఘాలు, గ్రామస్తులు అభినందించారు. శివ్వాం యువకుడు ప్రతిభ వంగర: మండల పరిధి శివ్వాం గ్రామానికి చెందిన కోడూరు సత్యనారాయణ నాయుడు గేట్ ఫలితాల్లో సత్తా చాటాడు. జియాలజీ అండ్ జియో ఫిజిక్స్ విభాగంలో పరీక్ష రాయగా ఆల్ ఇండియా స్థాయిలో 722 ర్యాంకుతో 329 స్కోర్ పాయింట్లు సాధించాడు. సత్యనారాయణ ప్రస్తుతం విజయనగరం ఎం.ఆర్ కాలేజీలో జియాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ప నిచేస్తున్నాడు. గేట్లో సత్తా చాటడడంతో పలువురు అభినందించారు. -
యథా రాజా.. తథా అధికారి..!
సాక్షి, పార్వతీపురం మన్యం: ‘ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా!’ అన్న చందాన ఉంది జిల్లాలోని అధికార యంత్రాంగం తీరు. చంద్రబాబు పాలనలో జిల్లాలోని పాలకులకు.. తోటి ప్రజాప్రతినిధులంటే లెక్క లేదు. మహిళలన్న గౌరవమూ ఉండదు. ఎన్నికల వరకే రాజకీయాలు చూడాలన్న విషయాన్నీ మర్చిపోతున్నారు. ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధులకు కనీస విలువ ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది. వారు తానా అంటే.. జిల్లా యంత్రాంగం తందానా అంటోంది. ఎమ్మెల్యేలు డైరెక్షన్ చెబితేనే.. అధికారులు యాక్షన్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ● యువ ఎంపీకి ఇచ్చిన గౌరవం ఇదేనా? ఉన్నత విద్యావంతురాలు.. డాక్టర్ వృత్తిని వదిలి, రాజకీయాలంటే ఆసక్తితో అరకు పార్లమెంట్ స్థానం నుంచి గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున గుమ్మా తనూజారాణి పోటీ చేశారు. ఎమ్మెల్యే స్థానాలన్నింటినీ కూటమి పార్టీలు కై వసం చేసుకున్నప్పటికీ.. ఎంపీగా ప్రజా మద్దతు తనూజారాణికే లభించింది. మొదటిసారిగా ఎన్నికై నా ఆమె ఎప్పుడూ హూందా రాజకీయాలనే చేసుకుంటూ వస్తున్నారు. ప్రత్యర్థులను విమర్శించడం అరుదు. ప్రజా సమస్యలపైన, పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిపైనే ఆమె గళం వినిపిస్తున్నారు తప్ప.. ప్రత్యేకించి ఏ ఒక్కరినీ లక్ష్యంగా చేసుకుని రాజకీయంగా విరుచుకుపడడం కనిపించదు. చిన్న వయసులోనే ఎంపీగా రాణిస్తున్న సాటి గిరిజన మహిళను.. జిల్లాలోని తోటి ప్రజాప్రతినిధులే అవమానిస్తుండడం.. అందుకు అధికార యంత్రాంగం సహకరిస్తుండడం గమనార్హం. అరకు పార్లమెంట్ పరిధిలోని సాలూరులో 30 పడకల ఆస్పత్రిని.. వంద పడకలకు అప్గ్రేడ్ చేస్తూ, నిర్మించిన నూతన భవనాన్ని శుక్రవారం ప్రారంభించారు. స్థానిక శాసనసభ్యురాలు, రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆస్పత్రిని ప్రారంభించగా, అధికారులు కనీస ప్రొటోకాల్ను పాటించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏదో పిలిచామన్నట్లుగా ముందు రోజు సాయంత్రం ఎంపీ తనూజారాణిని సంప్రదించి, ఆస్పత్రి ప్రారంభ విషయం తెలియజేశారు. ఎంపీగా దిల్లీ, అరకు పార్లమెంట్ పరిధిలో ఆమె ఎక్కువగా ప్రయాణించాల్సి ఉంటుంది. ముందుగా తెలియజేస్తే.. అందుకు తగ్గ విధంగా షెడ్యూల్ నిర్ణయించుకుంటారు. అందుకు భిన్నంగా ముందు రోజు వరకూ పిలవకపోవడంపై అధికారుల మీద ఎవరి ఒత్తిడైనా ఉందా? లేక వీరే విస్మరించారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీనిపై ఎంపీ తనూజారాణి తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఎంపీ పట్ల ఇలా వ్యవహరించడం తగదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సభ్యురాలు తనూజారాణి పట్ల చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచీ చిన్నచూపు చూస్తోంది. అరకు ఎంపీగా 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి తనూజారాణి ఘన విజయం సాధించారు. పార్లమెంట్లో భాగమైన జిల్లాలోని సాలూరు, పార్వతీపురం, కురుపాం, పాలకొండ నియోజకవర్గాలకూ ఆమెనే ఎంపీ. జిల్లాలో అందరూ కూటమి ఎమ్మెల్యేలే ఉండడంతో అధికారిక కార్యక్రమాలకు ఆమెను భాగస్వామ్యం చేయడం లేదు. గతంలో సీతంపేట ఐటీడీఏలో జరిగిన సమావేశంలోనూ అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టరేట్లో ఎంపీ అధ్యక్షతన జరిగిన జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ (దిశ) కమిటీ సమావేశాన్నీ మొక్కబడిగా నిర్వహించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు పూర్తిస్థాయిలో రాకపోవడం, అడిగిన సమాచారం ఇవ్వకపోవడంపై అసహనం చెందారు. ప్రొటోకాల్ పక్కన పెట్టేస్తున్న అధికారులు ప్రజల ఓట్లతో ఎన్నికై న ఎంపీని అవమానిస్తున్న వైనం రాజ్యాంగానికి అపహాస్యం ఎమ్మెల్యేల డైరెక్షన్.. అధికారుల యాక్షన్ -
మంచానికి పరిమితమైనా.. కనికరం లేదా..?
చీపురుపల్లి: పై చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి చీపురుపల్లి పట్టణంలోని అన్నపూర్ణకాలనీకు చెందిన దువ్వూరి సాయికృష్ణ. ఈయన 2023 ఏడాది చివరిలో అనారోగ్యం బారిన పడడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా బైలేటరల్ లోవర్ లింబ్, ఇంపైర్డ్ రీచ్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసింది. దీంతో విశాఖపట్టణం, హైదరాబాద్లో చికిత్స తీసుకున్నాడు. ఇందుకోసం అతను సంపాదించిన సొమ్మంతా ఖర్చు కాగా ఇంకా అప్పులు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఇంటివద్దే ఉంటూ వైద్యం చేయించుకుంటున్నారు. ఇతనికి ఛాతి నుంచి కింద భాగం అచేతనంగా మారిపోయింది. దీంతో అన్నీ మంచంపైనే జరుగుతుండడంతో ఆయన భార్య సేవలు అందిస్తోంది. వీరికి పిల్లలు కూడా లేరు. అయితే ప్రస్తుతం వీరు డైపర్లు, యూరిన్ బ్యాగులు కొనుక్కునే పరిస్థితుల్లో కూడా లేరు. అనాథలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రభుత్వం ఇచ్చే పింఛన్ కోసం పీజీఆర్ఎస్లో పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదు. ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయారు. కనీసం పింఛన్ మంజూరైనా గంజినీళ్లు తాగి బతుకుతామని భార్యాభర్తలు అంటున్నారు. ఇలాంటి వారెందరో.. ఇది సాయికృష్ణ లాంటి ఎంతో మంది ఆదరణ లేని వారి ఆవేదన. టీడీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో ఒక్క కొత్త ఫించన్ కూడా ఇవ్వకపోవడంతో ఇలాంటి ఎంతో మంది పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. పాత పింఛన్ల పంపిణీ కోసం ప్రతినెలా ఒకటో తేదీన ఎమ్మెల్యేల నుంచి సీఎం వరకు కోట్లాది రూపాయలతో ప్రచారం చేసుకుంటున్నారే తప్ప ఇలాంటి ఎంతోమంది అర్హులకు న్యాయం చేయలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 90 శాతం వికలాంగత్వం ఉన్నా పింఛన్ మంజూరు చేయని అధికారులు, ప్రజాప్రతినిధులు అరుదైన వ్యాధితో బాధపడుతున్న సాయికృష్ణ కనీసం డైపర్లు, యూరిన్ బ్యాగ్లు కొనుగోలు చేయలేని పరిస్థితి దుర్భర జీవితం అనుభవిస్తున్న భార్యాభర్తలు -
కారుణ్య నియామకం
విజయనగరం క్రైమ్: గజపతినగరంలోని పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ, ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టి.తిరుపతిరావు భార్య దమయంతికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పించారు. ఈ మేరకు గురువారం స్థానిక పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆమెకు నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కానిస్టేబుల్ టి.తిరుపతిరావు కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేవలం రెండు నెలల్లో ఆయన భార్య దమయంతికి పోలీసుశాఖలో టైపిస్ట్గా ఉద్యోగం కల్పించామన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి. సౌమ్యలత, డీపీఓ ఏఓ పి. శ్రీనివాసరావు, జూనియర్ సహాయకురాలు చాముండేశ్వరి, తదితరులు పాల్గొన్నారు. -
అలరించిన భరతనాట్య ప్రదర్శన
చికెన్● ఉగాది వేడుకల్లో భాగంగా విద్యార్థినులకు ప్రశంసాపత్రాల అందజేత విజయనగరం టౌన్: ఉగాది సందర్భంగా నగరంలోని రామనారాయణం వేదికగా జరిగిన భరతనాట్య ప్రదర్శన భక్తులు, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. గురువారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో వరలక్ష్మి నాట్యాలయం విద్యార్థినులు తమ అద్భుత కళా ప్రదర్శనతో అలరించారు. నాట్యాలయం గురువు పేరి వరలక్ష్మి పర్యవేక్షణలో విద్యార్థినులు ప్రదర్శించిన భరతనాట్య భంగిమలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రదర్శన అనంతరం ఆలయ నిర్వాహకులు కళాకారులను అభినందిస్తూ ప్రశంసా పత్రాలను అందజేశారు. భారతీయ సంస్కతి, కళలను భావితరాలకు అందించడంలో ఇటువంటి ప్రదర్శనలు దోహదపడతాయని నిర్వాహకులు కొనియాడారు. ప్రత్యేక ఆకర్షణగా లేజర్ షో.. నాట్య ప్రదర్శన అనంతరం ఆలయ ప్రాంగణంలోని భారీ ఆంజనేయ స్వామి విగ్రహంపై ఏర్పాటు చేసిన లేజర్ షో భక్తులను మంత్రముగ్ధులను చేసింది. కాంతి పుంజాల మధ్య స్వామివారి రూపం విద్యుత్ దీపాల వెలుగులో కాంతులీనుతూ భక్తి పారవశ్యాన్ని నింపింది. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, విద్యార్థినుల తల్లిదండ్రులు, భక్తులు పాల్గొన్నారు. -
పోటెత్తిన భక్తులు
శ్రీపరాభవ నామ ఉగాది వేడుకలు పురస్కరించుకుని, విజయనగరంలోని పలు ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. వేకువజాము నుంచే ఆలయాలకు క్యూ కట్టారు. తమ ఇష్టదైవాన్ని దర్శించుకుని, విశేష పూజలు చేశారు. ఈ కొత్త సంవత్సరమంతా సకల శుభాలు కలగాలని వేడుకున్నారు. ఇదిలా ఉంటే చదురుగుడిలోని పైడితల్లి దర్శనానికి భక్తజనం పోటెత్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. ప్రత్యేకాలంకరణలో దర్శనమిచ్చిన పైడితల్లికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. కొత్త ఏడాది కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇచ్చేలా దీవించాలని అమ్మవారిని వేడుకున్నారు. –సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం -
వ్యక్తి ఆత్మహత్య
లక్కవరపుకోట: చేసిన అప్పులు తీర్చలేక తీవ్ర మనస్తాపానికి గురై ఒడిశాకు చెందిన గజేంద్ర బెహరా (31) ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని సీతారాంపురం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. గజేంద్ర బెహరా తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన దేవిని పదేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి మండల పరిధిలోని పలు కంపెనీల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొద్ది నెలల కిందట సోంపురం జంక్షన్ సమీపంలో గల అట్టల కంపెనీలో పనికి కుదిరి.. సీతారాంపురం గ్రామంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నారు. ఈక్రమంలో జీవనోపాధి నిమిత్తం అప్పులు చేశాడు. ఇతని భార్య దేవి కొద్దిరోజుల కిందట పుట్టింటికి వెళ్లగా.. గజేంద్ర ఒక్కడే ఉంటున్నాడు. అయితే అప్పులు ఎక్కువ కావడంతో గజేంద్ర బెహరా ఇంటిలో ఉన్న ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించగా.. హెడ్కానిస్టేబుల్ పాపారావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి భార్య దేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం.. కొత్తవలస మండలంలోని 202 కాలనీ సమీపంలో గల లెజెండ్ లే అవుట్లో గల తుప్పల్లో గుర్తు తెలియని పురుషుడు మృతదేహాన్ని స్థానికులు గురువారం గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, ఐదారు రోజుల కిందట మృతి చెందినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఆ వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడా..? లేదా ఎవరైనా చంపి ఇక్కడికి తీసుకొచ్చి పడేసారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతి ఆత్మహత్యాయత్నం పార్వతీపురం రూరల్: తండ్రి మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మండలంలోని మార్కొండపుట్టి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన విద్యార్థిని ఎ.సౌజన్య ఇటీవల ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి ఇంట్లోనే ఉంటోంది. గురువారం ఉగాది పండుగ సందర్భంగా తన తండ్రిని విధులు ముగించుకుని ఇంటికి త్వరగా రావాలని ఆమె కోరింది. ఈ క్రమంలో నువ్వు నాకు చెప్పవద్దు అని సౌజన్యను తండ్రి మందలించడంతో తీవ్ర ఆవేదనకు గురైన సౌజన్య ఇంట్లో ఉన్న చీమల మందును నీటిలో కలిపి తాగేసింది. వెంటనే కుటుంబ సభ్యులు గుర్తించి ఆమెను జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతోంది. భవనంపై నుంచి జారిపడి కార్మికుడి మృతి లక్కవరపుకోట: భవనంపై నుంచి ప్రమాదవశాత్తూ జారిపడి కార్మికుడు మృతి చెందిన సంఘటన మండలంలోని సీతాగొర్లెవానిపాలెం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. కొత్తవలస మండలం మింది రామచంద్రపురం గ్రామానికి చెందిన దాడి చిన్నప్పారావు (35) ఈ ప్రమాదంలో మృతి చెందాడు. ఏఎస్సై శ్రీనివాసరావు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. చిన్నప్పారావు మండలంలోని సీతాగొర్లెవానిపాలెంలో ఓ భవనానికి డెకింగ్ పనులు చేస్తుండగా.. ప్రమాదవశాత్తూ జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే సహచర కూలీలు ఆయన్ను సమీపంలో గల ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా కలెక్టర్
పార్వతీపురం రూరల్: మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, పట్టణ అభివృద్ధిపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో పారిశుధ్య నిర్వహణ పక్కాగా ఉండాలని.. చెత్త సేకరణ, కాలువల్లో పూడికతీత పనుల్లో ఎటువంటి జాప్యం జరగకూడదని ఆదేశించారు. వేసవి దృష్ట్యా ప్రజలకు తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఇంజినీరింగ్ సిబ్బందికి సూచించారు. పట్టణంలో కొనసాగుతున్న రోడ్లు, భవనాల నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మున్సిపాలిటీకి వచ్చే అర్జీలను తక్షణమే పరిష్కరించి, బాధితులకు న్యాయం చేయాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
రౌడీషీటర్ ఘాతుకం.. యువకుడి హత్య
● కత్తిపోట్లకు 19 ఏళ్ల యువకుడు బలి ● మరొకరి పరిస్థితి విషమం ● ఇసుకతోటలో దారుణం ఎంవీపీకాలనీ: నగరంలోని ఇసుకతోట రామాలయం సమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన హత్యోదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పాతకక్షల నేపథ్యంలో బొచ్చు వెంకటేష్(19) అనే యువకుడు రౌడీషీటర్ చేతిలో దారుణ హత్యకు గురవగా, బాకీ సంతోష్ అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం సంతోష్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో రౌడీషీటర్ పల్లా అనీల్ ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడికావడంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. నిత్యం రౌడీషీటర్లను పర్యవేక్షిస్తున్నా, తరచూ కౌన్సిలింగ్లు ఇస్తున్నా.. ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాలివి.. రణస్థలం, పూసపాటిరేగ ప్రాంతాలకు చెందిన బొచ్చు వెంకటేష్, బాకీ సంతోష్ వరుసకు అన్నదమ్ములు. ఉపాధి నిమిత్తం వీరిద్దరూ విశాఖలో ఉంటున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న పల్లా అనీల్పై ఎంవీపీకాలనీ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ ఉంది. గతంలో ఇతని ఆగడాలు మితిమీరడంతో పోలీసులు నగర బహిష్కరణ కూడా చేశారు. కొంతకాలం రణస్థలంలో ఉన్న అనిల్, ఇటీవల మళ్లీ నగరానికి చేరుకున్నాడు. రణస్థలంలోనే అనీల్కు, వెంకటేష్కు పరిచయాలు ఉన్నాయి. కాగా.. వెంకటేష్ భార్య విషయంలో ఇద్దరి మధ్య కొంతకాలంగా తగాదాలు నడుస్తున్నాయి. దీనిపై గతంలోనే వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, మూడు నెలల కిందట పోలీసులు ఇరువర్గాలకు కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు. అయినా వీరి మధ్య వివాదం సద్దుమణగలేదు. ఇటీవల మరోసారి గొడవ జరగడంతో ‘చూసుకుందాం రా’ అంటూ వెంకటేష్ సవాల్ విసిరినట్లు సమాచారం. ఈ క్రమంలో బుధవారం రాత్రి అర్ధరాత్రి సమయంలో ఇసుకతోట రామాలయం వద్ద వెంకటేష్, అనీల్ తరఫు వాళ్లు తలపడ్డారు. ముందస్తు పథకం ప్రకారం కత్తితో సిద్ధంగా వచ్చిన అనీల్, ఒక్కసారిగా వెంకటేష్, సంతోష్లపై దాడి చేశాడు. బలమైన కత్తిపోట్లు తగలడంతో వెంకటేష్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సంతోష్ తీవ్ర గాయాలపాలవగా, స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నైట్ బీట్ పోలీసులు అక్కడికి చేరుకుని సంతోష్ను వెంటనే కేజీహెచ్కు తరలించారు. ఈ ఘటనలో సుమారు 12 మంది యువకులు పాల్గొన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించి, నిందితులను వెంటనే పట్టుకోవాలని ఆదేశించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీపీ నరసింహమూర్తి గురువారం తెలిపారు. -
ఎన్ఎంఎంఎస్ ఫలితాల విడుదలెప్పుడో..?
రామభద్రపురం: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) ప్రతిభా పరీక్షల ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. జిల్లాలో గతేడాది డిసెంబర్ 7న నిర్వహించిన ఎన్ఎంఎంఎస్ ప్రతిభా పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 4009 మంది హాజరుకాగా.. ఇందులో రామభద్రపురం మండలానికి చెందిన వారు 55 మంది ఉన్నారు. అయితే పరీక్షలు నిర్వహించి మూడు నెలలు దాటినా ప్రభుత్వం ఫలితాలు విడుదల చేయకపోవడంతో వీరంతా ఆందోళన చెందుతున్నారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, తదితర జిల్లాల్లో ఇప్పటికే ఎన్ఎంఎంఎస్ ప్రతిభా పరీక్షల ఫలితాలు విడుదల చేశారన్న సమాచారం ఉందని.. మన జిల్లాలో ఎందుకు ఆలస్యం అవుతుందో అర్థం కావడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. అధికారులు స్పందించి ఫలితాలు త్వరితగతిన విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ పరీక్షలో ప్రతిభ చాటిన విద్యార్థులకు తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏటా రూ.12 వేలు చొప్పున్న నాలుగేళ్లు ఉపకార వేతనం అందించనున్నారు. ఆకట్టుకున్న ఎడ్లబళ్ల పందాలు వేపాడ: మండలంలోని వావిలపాడులో నూకాలమ్మ పండగ సందర్భంగా గురువారం నిర్వహించిన ఎడ్లబళ్ల పందాలు ఆకట్టుకున్నాయి. ఈ పోటీల్లో 15 ఎడ్ల బళ్లు పాల్గొనగా.. విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. అంతకుముందు నూకాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. -
టేకు తోటలో మంటలు
బలిజిపేట: మండలంలోని వెంగాపురం అగ్రహారం వీధి వెనుకున్న టేకుతోటల్లో గురువారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇదే సమయంలో ఈదురుగాలులు వీయడంతో మంటలు ఎగసిపడ్డాయి. కొద్ది సేపటి తర్వాత వర్షం పడడంతో మంటలు చల్లారాయి. చుట్టో, సిగరెట్టో కాల్చి పారేయడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పామాయిల్ తోటలో.. గజపతినగరం రూరల్: మండలంలోని బంగారమ్మపేటలో పల్లా చంద్రరావుకు చెందిన 30 ఎకరాల పామాయిల్ తోటలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తోటలో గల డ్రిప్ ఇరిగేషన్ పైపులు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. సుమారు రూ.లక్ష వరకు నష్టం జరిగినట్లు అగ్నిమాపక అధికారి ప్రసాద్ తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి సిగరెట్, బీడీ కాల్చి పడేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. చెరకు తోటలో.. బాడంగి: మండలంలోని భీమవరంలో జరిగిన అగ్ని ప్రమాదంలో విశ్వనాథం వెంకట సుబ్రహ్మణ్యంనకు చెందిన సుమారు నాలుగు ఎకరాల్లోని చెరకు పంట అగ్నికి ఆహుతైంది. ఇదే సమయంలో గాలి వీయడంతో పక్కనే ఉన్న రెండు గడ్డి కుప్పలు కూడా బూడిదయ్యాయి. డొంకినవలస నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. -
సాయితేజకు 423వ ర్యాంక్
గజపతినగరం రూరల్: గేట్ (గ్రాడ్యూయేట్ ఆప్టిట్యూట్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్)లో గజపతినగరం మండలం లోగిస గ్రామానికి చెందిన సామంతల జీవన్సాయితేజ ఆలిండియా స్థాయిలో 423 ర్యాంకు సాధించాడు. 100 మార్కులకు 58 మార్కులు స్కోర్ లభించడంతో సాయితేజకు ఈ ర్యాంక్ వచ్చింది. సాయితేజ ప్రస్తుతం హైదరాబాద్లో డీఆర్డీఓలో ట్రైయినీ రీచర్చ్ ఫెలోగా పనిచేస్తున్నారు. తల్లిదండ్రులు సామంతుల సోంబాబు, తల్లి పైడిరాజు వ్యవసాయదారులు. మరోవైపు సాయితేజ కోల్ ఇండియా లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజ్మెంట్ ట్రెయినీ, ఎయిర్ఫోర్ట్ ఆఽథారిటీ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. కుమారుడు అటు చదువు, ఇటు ఉద్యోగ పరీక్షల్లో విజేతగా నిలవడంతో తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు. -
మర్యాద పూర్వక కలయిక
చీపురుపల్లి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డిను మాజీ ఎంపీ, పీఏసీ మెంబర్ బెల్లాన చంద్రశేఖర్ తాడేపల్లిలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర బార్ కౌన్సిల్మెంబర్గా ఎన్నికై న తన సోదరుడు, న్యాయవాది బెల్లాన రవిని పరిచయం చేశారు. పుష్పగుచ్ఛం అందజేశారు. బాధ్యతల స్వీకరణ విజయనగరం: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ ఉత్తర్వుల మేరకు విజయనగరం నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారిగా కలెక్టర్ ఎం.రాంసుందర్రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యమిస్తానన్నారు. నగర ప్రజలకు మౌలిక సదుపాయా లు, కనీస అవసరాలను సంపూర్ణగా కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాల సంరక్షణ వంటి అత్యవసర సేవలు నిరంతరాయంగా కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని, వాటిని మరింత మెరగుపరిచే దిశగా కార్యాచరణ చేపడతాన్నారు. నగరపాలక సంస్థ అధికారులు, పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రజలకు మరిం మెరుగైన సేవలందించేలా కృషి చేయాలని సూచించారు. శ్రీవారిని దర్శించుకున్న ఎన్నికల అధికారి సీతంపేట: సీతంపేటలో టీటీడీ నిర్మించిన వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని గురువారం ఉగాది పర్వదినాన దర్శించుకున్నారు. అర్చకులు ఆమెకు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయాన్ని ఆమె సందర్శించారు. పాలకొండ సబ్కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జి పీఓ పవార్ స్వప్నిల్తో కాసేపు ముచ్చటించారు. -
మన భాష, సంస్కృతులను భావితరాలకు అందించాలి
● రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం/విజయనగరం టౌన్: పరాభవ నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని విజయనగరం రాజమన్నార్ వేణుగోపాలస్వామి ఆలయంలో జిల్లా యంత్రాంగం గురువారం ఏర్పాటు చేసిన ఉగాది వేడుకలు ఉత్సాహంగా సాగాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్కు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పంచాంగ కర్త వారణాసి వెంకటనారాయణ ధర్మారావు శర్మ పంచాంగ పఠనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి మాట్లాడుతూ ఉగాది పండగ ప్రజల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. తెలుగు భాష, సంస్కృతులను భావితరాలకు అందించాలని, మన సంప్రదాయాలను పిల్లలకు తెలియజేయాలని కోరారు. కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో వృద్ధిసాధించాలని, మంచి వర్షాలు సకాలంలో కురవాలని, కర్షకులు, కార్మికులు, వ్యాపారులు, వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు ఆర్థికంగా, కుటుంబాలతో సంతోషంగా ఉండాలని కోరారు. వేదపండితులు యర్రమిల్లి ప్రసాద శర్మ, అర్చకులు ఆరవిల్లి నరసింహమూర్తి, జయంతి వెంకట దుర్గా కామేశ్వర విశ్వనాథ్, నరసింగరావుకు అతిథులు పండిత సత్కారం చేశారు. మహారాజా సంగీత కళాశాల విద్యార్థినులు ఆలపించిన సంగీతకృతులు, ప్రార్థనా గీతాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ, డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, ఆర్డీఓ వెంకటేశ్వరరావు, దేవదాయశాఖ సహాయ కమిషనర్ కె.శిరీష, జిల్లా పర్యాటకశాఖ అధికారి లక్ష్మీనారాయణ, వ్యవసాయాధికారి తారకరామారావు, తదితరులు పాల్గొన్నారు. -
రామతీర్థానికి శ్రీరామనవమి శోభ
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం రామ స్వామి వారి దేవస్థానానికి శ్రీరామనవమి శోభ సంతరించుకుంది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా గురువారం నుంచి కల్యాణ వసంతోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. వేకువజామున స్వామికి సుప్రభాత సేవ, బాలభోగం తదితర కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. అనంతరం ఆస్థాన మండపంలోని స్వామివారిని ఆశీనులను చేసి విశ్వక్సేరాధన, అంకురారోపణ, రుత్విగ్వరణం, తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు. రాత్రి 7 గంటలకు స్వామివారిని రామతీర్థం తిరువీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఉగాది పర్వదినం మొదలుకొని శ్రీరామ నవమి వరకు తొమ్మిది రోజుల పాటు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన 40 మంది వేదపండితులతో శతసహస్ర నామ తులసీ దళార్చన, కుంకుమార్చన కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 27న శ్రీరామనవమిని పురస్కరించుకొని సీతారాముల కల్యాణాన్ని రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో వేడుకగా జరిపిస్తామని చెప్పారు. కార్యక్రమంలో అర్చకులు సాయిరామాచార్యులు, నరిసింహాచార్యులు, కిరణ్, పవన్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వైభవంగా ప్రారంభమైన కల్యాణ వసంతోత్సవాలు వేద పండితులతో శాస్త్రోక్తంగా పారాయణాలు ఈ నెల 27న ప్రభుత్వ లాంఛనాలతో సీతారాముల కల్యాణం -
మనోహరమైన విజయం
పాలకొండ: గేట్–2026 ఫలితాల్లో పాలకొండకు చెందిన బొత్స మనోహరనాయుడు ప్రతిభ కనబరిచి ఆల్ ఇండియా స్థాయిలో 50వ ర్యాంకు సాధించాడు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 872 స్కోర్ 69.33 మార్కులతో ఆల్ ఇండియా స్థాయిలో 50వ ర్యాంకు, ఇన్స్ట్రుమెంట్ ఇంజినీరింగ్లో 705 స్కోర్ 65.67 మార్కులతో ఆల్ ఇండియా స్థాయిలో 122వ ర్యాంకు సాధించాడు. విద్యార్థి తండ్రి బొత్స వెంకటరమణ పాలకొండ పట్టణంలోని వెంకమ్మపేట ప్రభుత్వ పాఠశాల హెచ్ఎంగా పనిచేస్తుండగా, తల్లి ప్రభావతి గృహిణి. ఉత్తమ ర్యాంకు సాధించిన విద్యార్థిని పాలకొండ వాసులు అభినందించారు. -
గెలుపు గేట్ తెరిచారు..
ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు గురువారం విడుదలైన గేట్ ఫలితాల్లో సత్తా చూపారు. ఉత్తమ ర్యాంకులు సాధించారు. జిల్లాకు, ఊరికి పేరుతెచ్చారు. ఉన్నత విద్యాభ్యాసానికి అర్హత సాధించారు. వీరఘట్టం: మండలంలోని మొట్ట వెంకటాపురం గ్రామానికి చెందిన కుర్రోడు కందల రాజశేఖర్ గేట్ ఫలితాల్లో సత్తాచాటాడు. రెండు పేపర్లలో పరీక్షలు రాయగా ఆలిండియా స్థాయిలో ఈసీఈలో 735 స్కోర్ పాయింట్లతో 423వ ర్యాంకు, ఇనిస్ట్రిమెంటేషన్లో 275 స్కోర్ పాయింట్లతో 273వ ర్యాంకు సాధించాడు. తల్లిదండ్రులు రాములమ్మ, రామారావు, సోదరుడు తిరుపతిరావు వ్యవసాయం చేస్తూ రాజశేఖర్ను చదివించారు. గేట్లో మంచి ర్యాంకు సాధించడంతో మురిసిపోతున్నారు. గేట్లో మెరిసిన ఎం.వి.పురం కుర్రోడు -
విజయనగరం
● పరాభవనామ సంవత్సరాదికి స్వాగతం గురువారం శ్రీ 19 శ్రీ మార్చి శ్రీ 20268 మంది పోలీస్ ఉద్యోగులకు ఉగాది పురస్కారాలు విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న ఎనిమిది మందికి ఉగాది పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. సేవా పతకాలు లభించిన వారందరూ ఎస్పీ దామోదర్ను బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. మున్ముందు అకుంఠిత దీక్షతో పనిచేయాలని వారికి ఎస్పీ సూచించారు. ఎనిమిది మందిలో ఒకరి ఉత్తమ సేవా పతకం, మిగిలిన ఏడుగురురికి సేవా పతకాలు వరించాయి. పతకాలకు ఎంపికై న వారిలో చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు, ఏఎస్ఐ దేవీ, ఏఎస్ఐ త్రినాథరావు, ఏఆర్ ఎస్ఐ నాగేశ్వరరావు, రామపండు, హెచ్సీలు రామరాజు, కృష్ణ, కానిస్టేబుల్ రాంబాబు ఉన్నారు. చైత్రమాసం.. వసంత రుతువు.. శిశిరంలో మోడైపోయిన చెట్లన్నీ చిగుళ్లు తొడిగే ఆహ్లాదకర వాతావరణంలో వచ్చే పరాభవనామ తెలుగు సంవత్సరాదికి విజయనగరం బాబామెట్టలోని వరలక్ష్మి నాట్యాలయం విద్యార్థినులు సంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు. షడ్రుచుల సమ్మేళనమే జీవితమని చెబుతూ ఉగాది పచ్చడిని బుధవారం పంచిపెట్టారు. తెలుగు సంవత్సరాది జిల్లా ప్రజలందరికీ శుభాలివ్వాలని ఆకాంక్షించారు. – సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం -
ఇఫ్తార్ సహార్ గురు (సా) శుక్ర (ఉ) 06.08 04.48
పారదర్శకత కల్పనకే ఆర్టీఐ చట్టం ● జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కృష్ణ ప్రసాద్ విజయనగరం ఫోర్ట్: ప్రజలకు ప్రభుత్వ వ్యవహారాల్లో పారదర్శకత కల్పించేందుకు, బాధ్యాతాయుత పరిపాలనను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని 2005లో అమలు చేసిందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డాక్టర్ ఎ.కృష్ణప్రసాద్ తెలిపారు. స్థానిక డీఆర్డీఏ సమావేశ మందిరంలో ఏపీఎంల సమాఖ్య అకౌంటెంట్లు, డీఈఓలకు సమాచార హక్కు చట్టంపై బుధవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ చట్టం ద్వారా ఎవరైనా భారత పౌరుడు ప్రభుత్వ కార్యాలయాలకు దరఖాస్తుచేసిన 30 రోజుల్లోపు అవసరమైన సమాచారాన్ని పొందవచ్చన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు, యువత, రైతులు ఈ చట్టాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శ్రీనివాసపాణి, ఏపీడీ సావిత్రి, ఏఓ దొర, డీపీఎం చిరంజీవి, రవికుమార్, లక్ష్మినాయుడు, తదితరులు పాల్గొన్నారు. ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం విజయనగరం అర్బన్: దివ్యాంగులకు ఉచిత బస్సుప్రయాణ సౌకర్యం కల్పించే ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బుధవారం విజయనగరం ఆర్టీసీ డిపో ఆవరణలో ప్రారంభించారు. దివ్యాంగులకు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్, సిటీ బస్సుల్లో వంద శాతం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఏసీ, ప్రీమియం బస్సుల్లో 50 శాతం రాయితీ కొనసాగుతుందని చెప్పారు. దివ్యాంగులకు సహాయకులుగా వచ్చే వారికి కూడా నిబంధనల మేరకు 50 శాతం రాయితీ ఉంటుందని వివరించారు. జిల్లాలో సుమారు 30 వేల మంది దివ్యాంగులు ఉన్నప్పటికీ కేవలం 1,200 మందికే బస్సు పాసులున్నాయని, మిగిలిన వారు సదరం సర్టిఫికెట్, ఆధార్తో పాసులు పొందాలని సూచించారు. అనంతరం దివ్యాంగులకు పాసులు అందజేసారు. కార్యక్రమంలో జేసీ సేతుమాధవన్, ఎమ్మెల్యే అదితి, రాష్ట్ర తూర్పుకాపు కార్పొరేషన్ చైర్పర్సన్ యశస్విని, జెడ్పీ సీఈ ఓ సత్యనారాయణ, జి ల్లా ప్రజారవాణా అధికారి జి.వరలక్ష్మి, దివ్యాంగుల సంక్షేమ అధికారి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
జీఓ 5ను ఉపసంహరించుకోవాలి
పార్వతీపురం రూరల్ : దుకాణాలు, వాణిజ్య సంస్థలను 24 గంటల పాటు తెరిచి ఉంచేందుకు అనుమతినిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నంబరు 5ను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం పార్వతీపురంలోని సుందరయ్య భవనం నుంచి కలెక్టరేట్ వరకు ఆ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బారావమ్మ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయం కార్మిక చట్టాల మౌలిక లక్ష్యాలకు విరుద్ధంగా ఉందన్నారు. అహోరాత్రులు సంస్థలు తెరిచి ఉంచడం వల్ల అసంఘటిత రంగంలోని చిన్న దుకాణాలు, హోటళ్లు, మాల్స్ కార్మికులపై పని భారం పెరిగి శ్రమదోపిడీకి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే లేబర్ కోడ్ల వల్ల ఉద్యోగ భద్రత దెబ్బతింటుందని, తాజా జీఓ కార్మికులకు మరింత నష్టం చేస్తుందని పేర్కొన్నారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే కార్మిక సంఘాలను ఏకం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నేతలు డి.రమణారావు, వై.మన్మధరావు, ఎన్.వై.నాయుడు, వి.ఇందిర, రెడ్డి వేణు, జి.జ్యోతి పాల్గొన్నారు. -
మారథాన్ పరుగులో రాణిస్తున్న ‘బుగత’
● అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న శ్రీను ● ఆర్మీలో ఉద్యోగం చేస్తూ.. దేశం తరఫున ప్రాతినిధ్యం గజపతినగరం రూరల్: మండలంలోని బంగారమ్మపేట గ్రామానికి చెందిన బుగత శ్రీను అంతర్జాతీయ స్థాయి మారథాన్ పరుగులో రాణిస్తూ అందరి మన్నలు పొందుతున్నాడు. ఓ వైపు దేశ సేవలో తరిస్తూ అథ్లెటిక్స్లో రాణిస్తున్నారు. 2010లో ఆర్మీలో జనరల్ డ్యూటీలో సిపాయిగా చేరిన శ్రీను ప్రస్తుతం మహారాష్ట్రలోని పుణేలో సుబేధార్గా పని చేస్తున్నాడు. ఇదే సమయంలో అథ్లెటిక్స్పై ఉన్న ఆసక్తితో జాతీయ, అంతర్జాతీయ పరుగు పందెంలో దేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ ఇప్పటి వరకు సుమారు వంద పతకాలు సాధించాడు. ఈ క్రమంలోనే ఈ నెల 14న న్యూఢిల్లీలో జరిగిన ఐఏయూ 50 కిలోమీటర్ల ప్రపంచ చాంపియన్షిప్లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించి రజిత పతకం సాధించాడు. వివిధ దేశాల నుంచి 42 మంది పాల్గొనగా శ్రీను 14వ స్థానంలో నిలిచాడు. 50 కిలోమీటర్ల పరుగును రెండు గంటల 57 నిమిషాల 49 సెకన్ల వ్యవధిలో ఛేదించి ఈ మైలురాయిని అందుకున్నాడు. అథ్లెటిక్స్పై ఆసక్తి బుగత శ్రీనును సాక్షి బుధవారం కలవగా తనకు చిన్నప్పటి నుంచి పరుగు పందెం అంటే ఇష్టమని చెప్పాడు. చదువుకున్న రోజుల నుంచే పరుగు పందెంలో పాల్గొనేవాడినని, దీని వల్లే తనకు ఆర్మీలో ఉద్యోగం లభించిందని చెప్పుకొచ్చాడు. ఆర్మీలో శిక్షకుల వద్ద తర్ఫీదు పొందానని చెప్పాడు. ఇప్పటి వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వంద పతకాలు సాధించినట్టు తెలిపాడు. యువత తమ లక్ష్యాలను నిర్దేశించుకుని క్రీడల వైపు పయనించాలని సూచించాడు. -
రెవెన్యూ అంశాల పరిష్కారంలో జాప్యం వద్దు : జేసీ
విజయనగరం: జిల్లాలోని వివిధ రెవెన్యూ అంశాలపై జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ బుధవారం ఆన్లైన్ ద్వారా తమ చాంబర్ నుంచి మండల స్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల నుంచి వచ్చే రెవెన్యూ దరఖాస్తులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ముఖ్యంగా మీసేవ ద్వారా అందిన 22ఎ నిషేధిత జాబితా సవరణ దరఖాస్తులను 22ఎ–(1)(ఎ), 22ఎ–(1)(బి) విభాగాల వారీగా సమీక్షించారు. జేసీ, ఆర్డీఓ, ఎమ్మార్వో కార్యాలయాల స్థాయిలో ఏ దశలోనైనా దరఖాస్తులు నిలిచిపోకుండా తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. వెనుకబడ్డ తహసీల్దార్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రీ సర్వే ప్రక్రియలో భాగంగా వెబ్ల్యాండ్ పోర్టింగ్ను వేగవంతం చేయాలని, ముద్రించిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు తక్షణమే పంపిణీ చేయాలని సూచించారు. ఏప్రిల్ నెలలో చేపట్టాల్సిన పంపిణీపై సమీక్షించారు. వీటితో పాటు మ్యుటేషన్లు, జీరో ఖాతాల సవరణ, ఫిలైన్ మరియు సబ్ డివిజన్ల ప్రక్రియను నిబంధనల ప్రకారం పూర్తి చేయాలన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా వచ్చే వినతులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని, రెవెన్యూ క్లినిక్ల సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సంక్షేమ పథకాలకు సంబంధించి సివిల్ సప్లైస్ విభాగంలో కొత్త రైస్ కార్డుల దరఖాస్తుల స్థితిగతులను, ఇ–ఆఫీస్ ఫైళ్ల కదలికను పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో డీఆర్ఓ సిహెచ్.సత్తిబాబు, సీపీఓ పి.బాలాజీ, డీఎస్ఓ మురళీనాథ్, డీఎం బి.శాంతి, ఆర్డీఓ వెంకటేశ్వరరావు, సర్వే ఏడీ విజయకుమార్, జిల్లాలోని ఆయా విభాగాల అధికారులు, తహసీల్దార్లు, సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
పది పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
జియ్యమ్మవలస: మండలంలోని చినమేరంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ప్రభాకర రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ, వసతులను పరిశీలించి తాగునీరు, వెలుతురు, ఫ్యాన్ల పనితీరుపై ఆరా తీశారు. పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ కఠినంగా అమలు చేసి మాల్ ప్రాక్టీస్కు తావులేకుండా చూడాలని ఆదేశించారు. ఎండ తీవ్రత దృష్ట్యా మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సంబంధిత ఉద్యోగులకు సూచించారు. మామిడి పంటకు ఆశించే తెగుళ్లపై అవగాహన విజయనగరం ఫోర్ట్: జిల్లాలో సుమారు 21,060 హెక్టార్లలో మామిడి పంట సాగులో ఉందని, ఇందులో 28,500 హెక్టార్లలో కాపు దశలో ఉన్నాయని జిల్లా ఉద్యాన శాఖాధికారి పి.చిట్టిబాబు బుధవారం తెలిపారు. డిసెంబర్ నెలలో కురిసిన అకాల వర్షాలు, ప్రస్తుతం పగలు అధిక ఉష్ణోగ్రతలు, రాత్రిపూట పొగ మంచు వంటి ప్రతికూల వాతావరణం వల్ల మొదటి దఫా పూతకు కొంత నష్టం వాటిల్లిందన్నారు. దీని వల్ల తామర పురుగులు, తేనే మంచు పురుగులు, బూడిద తెగులు ఉధృతి పెరిగిందన్నారు. 21 నుంచి గజపతినగరంలో ఇంటర్మీడియట్ మూల్యాంకనం విజయనగరం అర్బన్: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు బుధవారంతో ముగిశాయని, జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఈ నెల 21 నుంచి గజపతినగరంలోని ప్రగతి జూనియర్ కళాశాలలో ప్రారంభిస్తామని ఆర్ఐఓ ఎస్.తవిటినాయుడు తెలిపారు. జిల్లాకు వచ్చిన రెండు లక్షల 30 వేల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను రెండు విడతలుగా చేపడతామని తెలియజేశారు. జిల్లాకు వచ్చిన వాటిలో ఇంగ్లిష్, హిందీ, తెలుగు, మాథ్స్, హిస్టరీ, సంస్కృతం సబ్జెక్టు పేపర్లతో పాటు 85 వేల వరకు ఒకేషనల్ జవాబు పత్రాలు ఉన్నట్టు వెల్లడించారు. రెండో విడత మూల్యాంకన ప్రక్రియను ఈ నెల 25 నుంచి చేపడతామని స్పష్టంచేశారు. బేకరీలపై విజిలెన్స్ దాడులు రాజాం సిటీ: పట్టణంలోని పలు బేకరీలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. బుధవారం చేపట్టిన ఈ దాడుల్లో అక్రమంగా వినియోగిస్తున్న గృహ అవసరాలకు వాడే గ్యాస్ సిలిండర్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కమర్షియల్ సిలిండర్లకు బదులుగా డొమెస్టిక్ సిలిండర్లు వినియోగించడంతో తొమ్మిది సిలింబర్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు సంబంధిత యజమానులపై కేసులు నమోదు చేశారు. -
బాసంగి సమీపంలో ఏనుగులు
జియ్యమ్మవలస: మండలంలోని వెంకటరాజపురం – సుభద్రమ్మవలస పంట పొలాల్లో బుధవారం ఉదయం ఏనుగులు సంచరిస్తూ కనిపించాయి. దీంతో పార్వతీపురం నుంచి గుమ్మలక్ష్మీపురం ప్రాంతాల ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఈ మార్గంలో రోజూ వేల సంఖ్యలో ద్విచక్ర వాహనదారులతో పాటు బస్సులు ఇతరత్రా ప్రయాణ వాహనాల ద్వారా తమ గమ్యానికి ప్రజలు చేరుకుంటారు. ప్రస్తుతం ఈ మార్గంలో ఏనుగులు సంచరిస్తుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. మంగళవారం ఉదయం జొన్న, పామాయిల్ తోటల నుంచి బాసంగి ముంపుడు గుండా వెళ్లడంతో ప్రయాణికులు గంటల తరబడి ఎక్కడికక్కడ నిలిచిపోయారు. మధ్యాహ్నం బాసంగి ముంపుడులో తిష్ట వేశాయి. బుధవారం కూడా ఈ ప్రాంతంలోనే ఉండడంతో సర్వత్రా భయాందోళనలు నెలకొన్నాయి. -
వ్యక్తి అరెస్ట్
వంగర: మండల పరిధి అరసాడలో గత నెల ఫిబ్రవరి 13న దొంతల దుర్గారావు స్క్రాప్ షాపులో జరిగిన దొంగతనం కేసులో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు ఎస్సై షేక్ శంకర్ బుధవారం తెలిపారు. 96 కేజీల ఇత్తడి సామగ్రి, 100 ఫ్యాన్ కోన్స్, ఒక ఎలక్ట్రిక్ కాటా, రూ.4600 నగదు చోరీ జరిగినట్టు ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేశామన్నారు. ఈ కేసులో విశాఖపట్నం పరిధి పాతగాజువాకకు చెందిన ఆసనాలు కృష్ణ గుర్తించామన్నారు. అరసాడలో మిగిలిన స్క్రాప్ షాపుల్లో దొంగతనం చేసేందుకు ఈ ప్రాంతంలో సంచరించడంతో నిందితుడు పట్టుబడ్డాడని, అరెస్ట్ చేసి పాలకొండ జ్యుడీషియల్ కస్టడీకి తరలించామని ఎస్సై తెలిపారు. మత సామరస్యం పాటించాలి : ఎస్పీ విజయనగరం క్రైమ్ : ఉగాది, రంజాన్ పర్వదినాల సందర్భంగా మత సామరస్యం పాటించాలని ఎస్పీ దామోదర్ ఒక ప్రకటనలో కోరారు. ఈ రెండు పండగలు సాంప్రదాయాలకు ప్రతీకలని పేర్కొన్నారు. పండగల సందర్భంగా మత సామరస్యం పాటించాలని, శాంతిభద్రతలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండాలని కోరారు. సోషల్ మీడియా వదంతులు, అసత్య ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. మతపరమైన కార్యక్రమాలు నిర్వహించే సమయంలో పోలీసుల సూచలను తప్పకుండా పాటించాలని కోరారు. మసీదులు, దేవాలయాల వద్ద పటిష్ట ముందస్తు భద్రత చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులు, సిబ్బందికి సూచించారు. మోటారుసైకిలు ఢీకొని వ్యక్తి మృతి సీతానగరం: మండలంలోని విశాఖ– రాయగడ రహదారిపై మరిపివలస వద్ద మంగళవారం మోటారు సైకిలు ఢీకొట్టిన ప్రమాదంలో గాయపడిన వ్యక్తి విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. స్థానిక పోలీసులు అందించిన వివరాలు.. మంగళవారం సాయంత్రం మరిపివలస గ్రామానికి చెందిన గెంబలి మోహనరావు (66) తన ఇంటి నుంచి సరుకులు కొనుగోలు నిమిత్తం రోడ్డు దాటుతుండగా పార్వతీపురం నుంచి సీతానగరం వైపు వస్తున్న మోటారుసైకిలు ఢీ కొట్టడంతో గాయాల పాలయ్యాడు. పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రిలో చికిత్స పొందినప్పటికీ పరిస్థితి విషమించడంతో కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందినట్టు తెలిపారు. స్థానికుడు బి.చిట్టిరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతదేహానికి పంచనామా చేసిన అనంతరం హెచ్సీ సోమరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 23న మెగా జాబ్ మేళా విజయనగరం అర్బన్: స్థానిక టీఏటీ ఐటీఐ కాలేజీ ప్రాంగణంలో ఈ నెల 23న మేగా జాబ్ మేళా నిర్వహించనున్నట్టు కాలేజీ డైరెక్టర్ కొయిలాడ వెంకటేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఆర్ఓ కార్యాలయం సమీపంలోని బొడ్దువారి జంక్షన్ వద్ద ఉన్న కాలేజీలో ఈ కార్యక్రమం జరగనుంది. హెచ్ఎస్ఎన్ టెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేళాలో డిక్సన్, ప్రీమియర్, రేడియంట్, స్కైక్వాడ్ ఎలక్ట్రానిక్స్, టీసీఎల్ వంటి సంస్థలు పొల్గొననున్నాయి. ఎంఎఫ్జీ ఆపరేటర్, ఎస్ఎంఏటీ ఆపరేటర్, టెక్సీషియన్, ప్రొడక్షన్, అసెంబ్లీ ఆపరేటర్ వంటి పోస్టులకు నియామకాలు చేపడతారు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ అర్హత కలిగిన పురుషులు, మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అభ్యర్థుల వయస్సు గరిష్టంగా 28 సంవత్సరాలు ఉండాలని, ఎంపికై న వారికి రూ.13 వేల నుంచి 25 వేల వరకు నెలసరి వేతనంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ, భోజనం, రవాణా సౌకర్యాలు కల్పించనున్నట్టు తెలిపారు. వెయ్యికి పైగా ఉద్యోగాలు అందుబాటులో ఉండగా స్పాట్ ఆఫర్లు కూడా ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 9866902665, 9908472726 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. సారా ధ్వంసం పాలకొండ రూరల్: పాలకొండ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన 172 లీటర్ల నాటుసారా, 10 లీటర్ల మద్యం సీసాలను బుధవారం ధ్వంసం చేసినట్టు ఆ శాఖ సీఐ కిమిడి సూర్యకుమారి తెలిపారు. సంబంధిత శాఖ కమిషనర్, జిల్లా సూపరింటెండెంట్ ఎ.సంతోష్కుమార్ సూచనలతో అక్రమ మద్యం, సారా తరలింపులో పట్టుబడిన మూడు వాహనాలకు బహిరంగ వేలం ద్వారా ఔత్సాహికులకు అందించినట్టు తెలిపారు. -
కానిస్టేబుల్ కుటుంబానికి చేయూత
విజయనగరం క్రైమ్ : కానిస్టేబుల్ టి.తిరుపతిరావు కుటుంబానికి తోటి సిబ్బంది, బ్యాచ్మేట్స్ తమ వంతు ఆర్థిక సాయం చేశారు. గజపతినగరం పోలీసు సర్కిల్, జుడిషియల్ సిబ్బంది రూ.4.30 లక్షల నగదును ఎస్పీ ఏఆర్ దామోదర్ చేతుల మీదుగా డీపీఓలో ఈ మేరకు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సహోద్యోగి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. 2012 బ్యాచ్కు చెందిన గజపతినగరం కానిస్టేబుల్ టి.తిరుపతిరావు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. తిరుపతిరావు కుటుంబ పరిస్థితిని గుర్తించిన సహచర సిబ్బంది, అతని కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు నగదు సేకరించి కుటుంబ సభ్యులకు అందజేశారు. తిరుపతిరావు కుటుంబానికి జిల్లా పోలీసు శాఖ అండగా ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు. అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, గజపతినగరం సీఐ జీఏవీ రమణ, ఎస్ఐ కె.కిరణ్కుమార్నాయుడు తదితరులు ఉన్నారు. -
కాసులతోనే... కు.ని. ఆపరేషన్..!
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో అనేక మంది మహిళలు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స కోసం రూ.వేలల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ సర్కార్ హయాంలో ఈ ఆపరేషన్లకు సొంత డబ్బులు పెట్టుకోవాల్సి రావడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జనాభా నియంత్రణలో ప్రధానమైన కుటుంబ నియంత్రణ పట్ల టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో అనేక ప్రభుత్వ ఆస్పత్రులు ఉన్నా.. ప్రైవేటులో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకోవాల్సి రావడం పట్ల మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 48 పీహెచ్సీలు జిల్లాలో 48 పీహెచ్సీలు ఉన్నాయి. బాడంగి, బొబ్బిలి, భోగాపురం, నెల్లిమర్ల సీహెచ్సీలు ఉన్నాయి. ఎస్.కోట, చీపురుపల్లి, రాజాం, గజపతినగరం ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. ఘోషాస్పత్రి, పట్టణంలో కుటుంబ సంక్షేమ కేంద్రం, బొబ్బిలిలో కుటుంబ సంక్షేమ కేంద్రం ఉన్నాయి. వీటిల్లో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేస్తారు. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయడానికి పీహెచ్సీ వైద్యులకు శిక్షణ కూడా ఇచ్చారు. అయినప్పటకీ వీటిల్లో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించుకోవడానికి వెళ్లిన వారికి ఏదో ఒక కుంటి సాకులు చెప్పి చేయకుండా పంపించేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.20 వేల వరకు వసూలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయకపోవడం వల్ల మహిళలు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. అక్కడ మహిళలు నుంచి రూ.10 వేల నుంచి రూ.20 వేలు వరకు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి బాగోలేని మహిళలు ఒకరు, ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకుంటున్నారు. కొంతమంది ఒక పిల్లతో శస్త్రచికిత్స చేయించుకోగా, మరికొందరు ఇద్దరు పిల్లలతో చేయించుకుంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేయని వైనం! ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న మహిళలు ఉచితంగా జరగాల్సిన వాటికి డబ్బులు చెల్లింపు మెంటాడ మండలానికి చెందిన కె.కొండ ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రిని ఆశ్రయించింది. అక్కడ ఆమెకు ఈ శస్త్రచికిత్స చేసేందుకు సదరు ఆస్పత్రి వారు రూ.10వేలు తీసుకున్నారు. ఉచితంగా చేయాలి.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు ఉచితంగా చేయాలి. ఎక్కడైనా చేయకపోతే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. – డాక్టర్ ఎస్.జీవనరాణి, డీఎంహెచ్ఓ, విజయనగరం -
పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలి : ఎస్పీ
● నేర సమీక్షా సమావేశంలో అధికారులకు ఆదేశం ● హెల్మెట్పై అవగాహన లఘుచిత్రం ఆవిష్కరణపార్వతీపురం రూరల్ : జిల్లాలో పెండింగ్లో ఉన్న గ్రేవ్, పోక్సో, ఎన్డీపీఎస్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మాసాంతపు నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి కేసులో దర్యాప్తు పూర్తి చేసి, సకాలంలో చార్జ్షీట్లు దాఖలు చేయాలని, కోర్టులతో సమన్వయం చేసుకొని సీసీ, ఎస్సీ నంబర్లు పొందాలని సూచించారు. పోలీసింగ్లో సాంకేతికత నేర నియంత్రణలో కృత్రిమ మేధ (ఏఐ) కీలక పాత్ర పోషిస్తోందని ఎస్పీ తెలిపారు. ఏఐ4 ఏపీ పోలీస్ లోని సోషియంట్, 360న్యూస్ సేవలను అధికారులు వినియోగించుకోవాలన్నారు. గంజాయి రవాణా అడ్డుకట్టకు డ్రోన్ల ద్వారా నిఘా పెట్టాలని, హాట్ స్పాట్లను గుర్తించి నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పశువుల అక్రమ రవాణాపై దృష్టి సారించాలన్నారు. రహదారి భద్రతపై పార్వతీపురం పట్టణ సీఐ వెంకట్రావు రూపొందించిన హెల్మెట్ అవగాహన లఘుచిత్రాన్ని ఎస్పీ ఆవిష్కరించారు. నిబంధనలు అతిక్రమించే వారిపై ఈ–చలాన్లు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. రాబోయే ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా ప్రార్థనా మందిరాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత పెంచాలని సూచించారు. విధి నిర్వహణలో, వార్షిక ఫైరింగ్ ప్రాక్టీసులో ప్రతిభ కనబరిచిన అధికారులకు, సిబ్బందికి ఎస్పీ ప్రశంసా పత్రాలను అందజేశారు. అదనపు ఎస్పీ వెంకటేశ్వరరావు, డీఎస్పీలు రాంబాబు, థామస్ రెడ్డి, వివిధ విభాగాల సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
అవగాహన ఒప్పందం
విజయనగరం రూరల్: విజయనగరం జేఎన్టీయూ–జీవీ, హైదరాబాద్కు చెందిన మెటా–గేట్ కోచింగ్ సంస్థ మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. స్థానిక జేఎన్టీయూ జీవీలో మంగళవారం జరిగిన ఎంఓయూలో ఇరు సంస్థల ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా జేఎన్టీయూ జీవీ ప్రిన్సిపాల్ కేసీబీ రావు మాట్లాడుతూ మెటా–గేట్ కోచింగ్ విద్యా సంస్థ మెటలర్జికల్ ఇంజినీరింగ్ విభాగంలో దేశంలోనే చురుగ్గా పని చేస్తున్న సంస్థని తెలిపారు. ఇంజినీర్ల కోసం గేట్ ప్రవేశ పరీక్షకు సిద్ధం చేయడంలో సహాయపడుతుందని తెలిపారు. ఆనన్లైన్ శిక్షణ, స్టడీ మెటీరియల్స్, కెరీర్ గైడెన్స్ అందిస్తారని పేర్కొన్నారు. గతంలో ఉత్తీర్ణులైన కొందరు విద్యార్థులు వారి శిక్షణ ద్వారా ప్రయోజనం పొందుతున్నారని తెలియజేశారు. మెటలర్జికల్ ఇంజినీరింగ్లో బీటెక్/ఎం.టెక్ చదువుతున్న, ప్రతిభావంతులైన, ఆర్థికంగా వెనుకబడిన జేఎన్టీయూ–జీవీ విద్యార్థులకు సహాయం చేయడానికి, గేట్ పరీక్షకు నాణ్యమైన శిక్షణను అందించడానికి మెటా–గేట్ కోచింగ్ ముందుకు వచ్చిందన్నారు. విశ్వవిద్యాలయం విద్యార్థులకు గేట్ ఆన్లైన్ వీడియో లెక్చర్లను చూసేందుకు యాక్సెస్ అందించడం, ఆన్లైన్ టెస్ట్ సిరీస్లను రాసేందుకు యాక్సెస్ అందించడం, ప్రత్యేక సందేహల నివృత్తి సందేహాలను నిర్వహించడం, బార్క్ పరీక్షకు ప్రిపరేషన్, ఇంటర్వ్యూలపై మార్గదర్శకత్వం అందిస్తుందన్నారు. పీఎస్యూ, ప్రభుత్వ పరీక్షల (మెటలర్జికల్ – మెటీరియల్స్ ఇంజినీరింగ్కు సంబంధించినవి) ప్రిపరేషన్ ఇంటర్వ్యూల కోసం మార్గదర్శకత్వం వంటి సేవలను అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో మెటలర్జీ విభాగం హెచ్ఓడీ డాక్టర్ కె.శ్రీనివాస ప్రసాద్, మెటా–గేట్ కోచింగ్ సంస్థ ప్రతినిధి సుభ్రదీప్ పాల్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిభ కనబరిస్తే ప్రోత్సాహకం : ఎస్పీ
విజయనగరం క్రైమ్ : విధి నిర్వహణలో ప్రతిభ కనబరిస్తే ప్రోత్సాహకాలు అందిస్తామని ఎస్పీ దామోదర్ అన్నారు. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలను కాపాడడంతో, చోరీలు, హిట్ అండ్ రన్ కేసులను ఛేదించడం తదితర అంశాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన పోలీసు అధికారులు, సిబ్బందిని డీపీలో మంగళవారం ఎస్పీ అభినందించారు. ప్రోత్సాహక నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు సిబ్బందిని ప్రోత్సహిస్తే మరిన్ని మంచి ఫలితాలు వస్తాయన్నారు. క్షేత్ర స్థాయిలో క్రియాశీలకంగా పని చేసే వారిని గుర్తించి ప్రోత్సహిస్తే మిగతా వారు స్ఫూర్తిగా తీసుకుంటారన్నారు. ప్రశంసా పత్రాలు అందుకున్న వారిలో సీఐలు టి.శ్రీనివాసరావు, ఎల్.అప్పలనాయుడు, హెచ్ ఉపేంద్ర, ఎస్ఐలు డి.సాయికృష్ణ, వై.వీరజనార్దన్, యు.మహేష్, ఎస్.సుదర్శన్, చంద్రశేఖర్, ఆర్.గోపాలరావు, కె.లక్ష్మణరావు, హెచ్సీలు ఎండీ ఇమ్రాన్ఖాన్, డి.శంకరరావు, పీసీలు ఎరుబోతు సురేష్కుమార్, ఎం.వాసు, కేవీ గణేష్, షేక్ షపీ, ఆర్.శివరావు, బి.నర్సింగరావు, సీహెచ్ జగ్గునాయుడు, పి.శివ, ఎ.సంతోష్, వై.సురేష్కుమార్, ఎం.రమేష్, జి.సింహాచలం, ఎన్.కృష్ణకిశోర్, టి.సురేష్, కె.అప్పారావు, సీహెచ్ పవన్కుమార్, జె.చంద్రరావు, పి.పాపినాయుడు, ఎం.వెంకటరమణ, బొంతు రాంబాబు తదితరులు ఉన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సైలెన్స్ర్లు ధ్వంసం భారీ శబ్దాలు, దట్టమైన పొగలతో సైలెన్స్ర్లు వాడితే సంబంధిత బైక్స్ను సీజ్ చేస్తామని ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా బైక్లకు అమర్చిన 550 సెలెన్స్ర్లను సీజ్ చేశారు. అనంతరం ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఎస్పీ సమక్షంలోనే నగరంలోని ట్యాంక్ బండ్ వద్ద రోడ్డు రోలరుతో వాటిని ధ్వంసం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సైలెన్స్ర్లు అమర్చిన వారికి ఒక్కొక్కరికీ రూ.1500 జరిమానా విధించారు. ఇన్చార్జ్ డీఎస్పీ ఆర్.గోవిందరావు, ట్రాఫిక్ సీఐ సూరినాయుడు, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, టుటౌన్ సీఐ టి.శ్రీనివాసరావు, వన్టౌన్ ఎస్ఐ శంభాన రవి, ట్రాఫిక్ ఎస్ఐలు ఎస్.భాస్కరరావు, నూకరాజు, చిన్నారావు, హెచ్సీ సింహాచలం, భాస్కర్, సిబ్బంది పాల్గొన్నారు. -
నిరసన తెలిపితే నిర్బంధమా?
సీతంపేట: టీటీడీ చైర్మన్ బీఆర్నాయుడు వెంటనే తన పదవి నుంచి వైదొలగాలంటూ మహిళలు తిరుపతిలో ఆయన బస చేసిన హోటల్ వద్ద నిరసన వ్యక్తం చేస్తే టీడీపీ గుండాలతో దాడి చేయించడం ఎంతవరకు సమంజసమని పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పార్టీ నాయకులతో కలసి అంబేడ్కర్ చిత్ర పటం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. కళంకితుడిగా తేలినా ప్రశ్నిస్తే దాడిచేయడం, విజిలెన్స్ వారితో బెదిరించడం, ఇంకా కేసులు పెట్టడం, పదవి పట్టుకుని వ్రేలాడడం, జాతీయ మీడియా ఏకి పారేస్తున్నా చంద్రబాబులో మాత్రం ఎటువంటి చలనం లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. తిరుమల పవిత్రతను కాపాడుకోవాల్సిన సమయం ఇదేనని వెంటనే బీఆర్ నాయుడుని టీడీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలన్నారు. అడ్డంగా వీడియో, ఫొటోలతో దొరికిపోయినా నిస్సిగ్గుగా మళ్లీ తిరుమలకు వచ్చి వెంకటేశ్వరస్వామి క్షేత్రాన్ని అపవిత్రం చేస్తున్నాడన్నారు. చంద్రబాబు ప్రోత్సాహంతోనే ఇవన్నీ జరుగుతున్నాయన్నారు. తనను లైంగికంగా వేధిస్తున్నారని ఇలాంటి వ్యక్తికి ఎటువంటి బాధ్యతలు ఇవ్వొద్దని, ఒక మహిళ స్వయంగా గతంలో పూర్తి వివరాలతో లేఖ రాసినా చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. కార్యక్రమంలో పలువురు వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. -
టిప్పర్ పట్టివేత
బొబ్బిలి రూరల్: మండలంలోని ఎం బూర్జివలస వద్ద ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా జేసీబీతో చెరువులో మట్టిని తవ్వి తరలిస్తున్న టిప్పర్ను రెవెన్యూ అధికారులు సోమవారం రాత్రి దాడి చేసి పట్టుకున్నారు. జేసీబీ డ్రైవర్ తప్పించుకుని అక్కడ నుంచి పారిపోగా.. మట్టితో నిండిన టిప్పర్ను స్వాధీనం చేసుకున్నామని ఆర్ఐ రామ్కుమార్ తెలిపారు. ఈ మేరకు మైనింగ్ శాఖ సూచనలతో మట్టితో దొరికిన టిప్పర్కు 16,200 రూపాయిలు జరిమానా విధించిందని తహసీల్దార్ ఎం.శ్రీను తెలిపారు. ఇక మీదట మట్టి, గ్రావెల్ అక్రమ తవ్వకాలు, తరలింపులకు పాల్పడితే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. -
‘ఉపాధి’ని నిర్వీర్యం చేస్తున్న పాలకులు
జామి: ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. జామిలో ఎస్.కోట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ గేదెల తిరుపతి ఆధ్వర్యంలో ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా మంగళవారం రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పేరు మార్చిందన్నారు. వేతనదారులకు అన్యాయం చేసిందన్నారు. ఎక్కడ కూడా వంద రోజుల పనిదినాలు కల్పించడం లేదని, చేసిన పనులకు సకాలంలో బిల్లులు చెల్లించడం లేదని ధ్వజమెత్తారు. ఉపాధి పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం భరించాలని బీజేపీ ప్రభుత్వం చెప్పడం కేవలం పథకాన్ని నీరుగార్చడమేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఫ్రీ బస్సుల పుణ్యమా అని విద్యార్థులకు బస్సులు ఆపడం లేదన్నారు. పలువురు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంటు విడుదల చేయడం లేదని దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తాండ్రంగి, విజినిగిరి తదితర గ్రామాలకు బస్సులు లేవని కళాశాలలకు వెళ్లాలంటే నానా అవస్థలు పడుతున్నామని విద్యార్థులు చెప్పడంతో బస్సులు లేకుండా ఫ్రీ బస్సు పథకం ఎందుకని ప్రశ్నించారు. చంద్రబాబు సూపర్ సిక్స్ పథకంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు కూటమిలోని నేతలు ఇచ్చిన హామీలు మరచిపోయారన్నారు. ఎస్.కోట మండలంలో జిందాల్ కంపెనీ బాధిత రైతులను మోసం చేసిందన్నారు. జామిలో ఇనాం భూముల సమస్య తీవ్రంగా ఉందని, రైతులు ఇబ్బందులు పడుతున్నామని షర్మిలకు తెలిపారు. కలెక్టర్తో ప్రత్యేకంగా మాట్లాడతానని, కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎంకు లేఖ రాస్తానని చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం, జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎం.విద్యాసాగర్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు సుంకరి గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఏపీసీసీ చీఫ్ షర్మిల -
రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యునిగా బెల్లాన
విజయనగరం లీగల్: రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యునిగా బెల్లాన రవి ఘన విజయం సాధించారు. ఈ మేరకు రాష్ట్ర బార్ కౌన్సిల్ మంగళవారం ప్రకటించింది. రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. బెల్లాన రవి విజయనగరం న్యాయవాదుల సంఘం అధ్యక్షునిగా, జిల్లా వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షునిగా పని చేశారు. ఈయన చీపురుపల్లికి చెందిన ప్రముఖ న్యాయవాది, దివంగత బెల్లాన సింహాచలం రెండవ కుమారుడు. చీపురుపల్లిపల్లికి చెందిన బెల్లాన రవి విజయనగరం మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్కి స్వయానా సోదరుడు. ఈయన ఎంపిక పట్ల బార్ కౌన్సిల్ మాజీ వైస్ చైర్మన్ కోలగట్ల తమ్మన్న శెట్టి, జిల్లా వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఏఎన్వీకే అంజనీకుమార్ హర్షం వ్యక్తం చేశారు. విజయనగరం న్యాయవాదుల సంఘం అధ్యక్షులు కలిశెట్టి రవిబాబు, కార్యదర్శి నళితం సురేష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. బాక్సింగ్లో మోడల్ స్కూల్ విద్యార్థుల సత్తా భామిని: స్థానిక ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు బాక్సింగ్లో సత్తా చాటారు. ఈ నెల 16న విశాఖపట్నంలో జరిగిన జూనియర్ బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో పలు విభాగాల్లో విజేతలుగా నిలిచారు. ఎస్.శ్రావ్య, పి.ప్రసన్న, సీహెచ్ వాహిని, సీహెచ మనీషా, డి.చందు, ఎ.అమృతవల్లి పలు స్థానాల్లో నిలిచారు. వీరిని ప్రిన్సిపాల్ బాబూరావు, పీజీటీ శివరాంప్రసాద్, కోచ్ కె.సోమేష్తో పాటు సిబ్బంది తదితరులు సన్మానించారు. దుర్గాదేవి ఆలయంలో చోరీ గుర్ల: మండలంలోని పున్నపురెడ్డిపేట దుర్గాదేవి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. సుమారు అర తులం బంగారు, 240 గ్రాముల వెండి అభరణాలు అపహరణకు గురయ్యాయని ఆలయ ధర్మకర్త పి.రామరావు గుర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ఎస్ఐ పి.నారాయణరావు సంఘటన స్థలానికి చేరుకొని దుర్గాదేవి ఆలయాన్ని పరిశీలించారు. జిల్లా కేంద్రం నుంచి డాగ్, క్లూస్ టీంలు రంగంలోకి దిగి ఆలయ ప్రాంగణాన్ని క్షుణంగా పరిశీలించి క్లూస్ సేకరించారు. వారం రోజులు కిందట కూడా పున్నపురెడ్డిపేటలో ఒక ఇంట్లో సుమారుగా ఆరు తులాలు బంగారు అభరణాలు దొంగతనానికి గురయ్యాయి. వరుసగా జరుగుతున్న దొంగతనాలతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. దుర్గాదేవి ఆలయంలో బంగారు అభరణాలు దొంగతనంపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని ఎస్ఐ నారాయణరావు తెలిపారు. ఎస్పీ ఇఫ్తార్ విందు విజయనగరం క్రైమ్ : పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఎస్పీ ఏఆర్ దామోదర్ ముస్లిం పోలీసు అధికారులు, సిబ్బందికి జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రంజాన్ మాసం శాంతి, సహనం, సేవాభావానికి ప్రతీకని పేర్కొన్నారు. మనందరం భారతీయులమని అన్నారు. మన మధ్య కుల, మత బేధాలు లేవని, సోదర భావం మాత్రమే ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ముస్లిం పోలీసు అధికారులు, సిబ్బంది ఎస్పీని వారి మత సాంప్రదాయం ప్రకారం సత్కరించారు. అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎస్పీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రామతీర్థంలో వైభవంగా మాసశివరాత్రి పూజలు
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ సీతారామస్వామి దేవస్థాన క్షేత్ర పాలకులగా విరాజిల్లుతున్న ఉమాసదాశివస్వామి వారి ఆలయంలో మాస శివరాత్రి పూజలు మంగళవారం వైభవం జరిగాయి. ఆలయ అర్చకులు రేజేటి మల్లిఖార్జున శర్మ ఆధ్వర్యంలో ముందుగా గణపతి పూజ, ప్రత్యేక హోమం అనంతరం శివుడికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, వివిధ రకాల ఫల రసాలతో విశేష అభిషేకాలు జరిపించారు. అనంతరం కామాక్షి అమ్మవారి సన్నిధిలో కుంకుమ పూజలు చేపట్టి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కా ర్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
పనుల్లేక..
నా చిన్నతనం నుంచి టైలరింగ్ చేస్తున్నా.. గతంలో ఎంతో వైభవంగా ఉండే ఈ వృత్తి ప్రస్తుతం రడీమేడ్ రాకతో కుదేలైంది. ప్రస్తుతం పనుల్లేక ఖాళీగా ఉంటున్నాం. పండగల సమయంలో కూడా పనులు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ఇంతకు ముందు పండగల సమయంలో రాత్రి పగలు పనిచేసేవాళ్లం. –డి.సూర్యగణపతి, టైలర్, రాజాం ప్రభుత్వం ఆదుకోవాలి.. టైలరింగ్ పనిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాం. పనుల్లేక చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. చాలా మంది రడీమేడ్ దుస్తులు వాడడంతో కుట్టించుకునే వారి సంఖ్య తగ్గిపోతుంది. ఇతర వృత్తి చేసుకోలేక జీవనాన్ని నెట్టుకొస్తున్నాం. రోజు కూలి గిట్టుబాటు అయితే చాలు అన్న చందంగా టైలర్ల పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఆదుకోవాలి. – కె.సత్యం, టైలర్, వస్త్రపురి కాలనీ, రాజాం -
మహనీయుడు పొట్టి శ్రీరాములు : డీఈఓ
విజయనగరం టౌన్: భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు విశేష కృషి చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములని డీఈఓ మాణిక్యం నాయుడు అన్నారు. మహారాజా ప్రభుత్వ సంస్కృత ఉన్నత పాఠశాల ఆవరణలో మంగళవారం పొట్టి శ్రీరాముల విగ్రహావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 58 పాఠశాలల్లో అమరజీవి విగ్రహం ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. ఎంఈఓ ఆనందమూర్తి మాట్లాడుతూ తెలుగువారికి ఆంధ్రరాష్ట్రం ప్రత్యేకంగా ఉండాలని ఆమరణ దీక్ష చేసిన మహనీయుడన్నారు. ఎంఈఓ 2వ అధికారిణి సత్యవతి పొట్టి శ్రీరాములు త్యాగ నిరతని వివరించారు. హెచ్ఎం లలిత విగ్రహ ఏర్పాటు చేసిన సమితి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సమితి వ్యవస్ధాపక అధ్యక్షుడు చెరుకూరి నాగరాజు, ముఖ్య సలహాదారు రవ్వా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బత్తుల కామేష్, కోశాధికారి ఆరిశెట్టి సందీప్, ఉపాధ్యక్షుడు డిమ్స్ రాజు, కోచైర్మన్ సముద్రాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
కుప్పిలి పద్మకు పతంజలి పురస్కారం
విజయనగరం టౌన్: కెఎన్వై.పతంజలి సాహితీ పురస్కారానికి ఈ ఏడాది ప్రముఖ సీ్త్రవాద రచయిత్రి కుప్పిలి పద్మని ఎంపిక చేసినట్టు పతంజలి సాంస్కృతిక వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి పేర్కొన్నారు. ఈ మేరకు గురజాడ స్వగృహంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 29న గురజాడ కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించే పతంజలి జయంతి కార్యక్రమంలో పురస్కారాన్ని ఆమెకు ప్రదానం చేస్తామన్నారు. ఇప్పటివరకూ మోహన్, దేవీప్రియ, సతీష్ చందర్, జిఆర్.మహర్షి, గంటేడ గౌరునాయుడు, అట్టాడ అప్పలనాయుడు, చింతకింది శ్రీనివాసరావు, రౌతు బంగారునాయుడు, అరుణ పప్పు, తాడి ప్రకాష్లకు అందజేశామన్నారు. ఈ ఏడాది కుప్పిలి పద్మను కమిటీ ఎంపిక చేసిందన్నారు. ఆమె వార్తలో మైదానం శీర్షికన సమకాలీన అంశాలపై స్పందించిన తీరు తెలుగు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారన్నారు. సుమారు 159 కథలు రాశారన్నారు. వాటిలో ఆరు నవలలు ఉన్నాయని, ప్రధానంగా కరోనా సమయంలో మళ్లీ తేయాకు తోటలోకి పేరిట కార్మికుల జీవితాల్లోని ఒడిదుడుకులను చాలా హృద్యంగా రచించారన్నారు. ఆమె ప్రతిభా పాటవాలకు గుర్తుగా ఎన్నో అవార్డులు ఆమెను వరించాయన్నారు. పద్మ మన ఉత్తరాంధ్రాకు చెందిన ప్రముఖ మహిళా రచయిత్రి కావడం మరింత గర్వకారణమన్నారు. సమావేశంలో వేదిక కార్యదర్శి ఎన్కె.బాబు, ప్రతినిధులు విఎమ్కె.లక్ష్మణరావు, బి.నాగేంద్రప్రసాద్, పి.ప్రభాకరరావు, జలంత్రి రామచంద్ర, తాడేపల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనల మేరకే క్వారీ నిర్వహణ జరగాలి : జేసీ
సీతానగరం: మండలంలోని నిడగల్లు గ్రామ పరిధిలో రెండు ప్రతిపాదిత క్వారీల నిర్వహణపై మంగళవారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తుల నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలను ఆయన స్వయంగా స్వీకరించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ క్వారీ నిర్వహణలో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయాలని, కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను తు.చ తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులు, నిర్వాహకులను ఆదేశించారు. క్వారీ వల్ల చుట్టుపక్కల పొలాలకు, గాలికి ఎటువంటి నష్టం కలగకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలన్నారు. గ్రామస్తులు లేవనెత్తిన అంశాలను రికార్డు చేశామని, వాటిని నివేదిక రూపంలో ప్రభుత్వానికి, పర్యావరణ కమిటీకి పంపిస్తామని జేసీ తెలిపారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. -
19న ఉగాది వేడుకలు
● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి విజయనగరం: శ్రీపరాభవ నామ సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ నెల 19న గురువారం ఉగాది పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. స్థానిక శ్రీ మన్నార్ రాజగోపాల స్వామి ఆలయంలో జిల్లాస్థాయి ఉగాది వేడుకల నిర్వహణకు కావలసిన ఏర్పాట్లు పూర్తిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. జిల్లా పర్యాటక శాఖాధికారి వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని సూచించారు. వేదపండితుల ఆశీర్వచనం, పంచాంగ శ్రవణం, పండిత సత్కారం, కార్యక్రమానికి వచ్చిన అందరికీ పులిహోర, చక్కెర పొంగలి, ఉగాది పచ్చడి ఏర్పాటు చేయాలని దేవదాయశాఖ సహాయకమిషనర్కు ఆదేశాలు జారీచేశారు. 12 మంది బినామీలకు నోటీసులు ● జిందాల్ చెల్లింపుల్లో తప్పులు... ● రూ.36.10లక్షల రికవరీకి చర్యలు శృంగవరపుకోట: జిందాల్ కంపెనీకి కేటాయించిన భూములకు సంబంధించిన పరిహారం చెల్లింపుల్లో అవకతవకలు జరిగినట్టు నిర్ధారణ అయ్యిందని తహసీల్దార్ డి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సూచనల మేరకు 12 మంది బినామీదారులు తీసుకున్న మొత్తం రూ.36.10 లక్షలు రికవరీకి మంగళవారం జప్తు నోటీసులు జారీచేశామన్నారు. 12 మంది బినామీదారుల నుంచి సొమ్ము వసూలు చేసేందుకు ఆర్.ఆర్.యాక్ట్ను అనుసరించి గతంలో రెండు దఫాలుగా నోటీసులు జారీ చేసినా వారు స్పందించక పోవడంతో జప్తు నోటీసులు జారీ చేసినట్టు వెల్లడించారు. వారి ఆస్తులు వివాదాస్పద భూముల రిజిస్టర్లో నమోదు చేస్తామని, క్రయవిక్రయాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. బినామీదారుల్లో ఐదుగురి నివాస గృహాలను గుర్తించామని, వాటిని జప్తు చేసేందుకు నోటీసులు ఇచ్చామని, కాగా ఐదుగురికి ఎస్.కోట మండలంలో ఎటువంటి చర,స్థిర ఆస్థులు లేవని తెలిసిందని, వారిపై తదుపరి చర్యలకు కలెక్టర్కు నివేదిక సమర్పిస్తామన్నారు. -
‘దివ్యాంగ శక్తి’తో ఉచిత బస్సు ప్రయాణం
విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘దివ్యాంగ శక్తి’ పథకం బుధవారం నుంచి అమలులోకి వస్తుందని జిల్లా ప్రజారవాణా అధికారి జి.వరలక్ష్మి తెలిపారు. ఈ పథకం కింద సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. 40 శాతం, అంతకంటే ఎక్కువ దివ్యాంగత్వం కలిగిన ఆర్థో, మూగ, చెవిటి, అంధులు, మరుగుజ్జులు, కుష్టు, మానసిక రోగులు, వణుకుడు వ్యాధిగ్రస్తులు, తలసేమియా తదితర 21 రకాల వ్యాధులు కలిగిన వారు ఈ సదుపాయం పొందవచ్చన్నారు. ఇంటర్స్టేట్, ఆల్ట్రాడీలక్స్, సప్తగిరి బస్సుల్లో దివ్యాంగులకు 50 శాతం రాయితీ ఇవ్వనున్నారు. వంద శాతం అంధులు, ఐక్యూ 69 లోపు ఉన్న మానసిక దివ్యాంగులకు సహాయకుడు (ఎస్కార్టు)కు కూడా 50 శాతం రాయితీ వర్తిస్తుంది. మూగ, చెవిటి దివ్యాంగులకు ఎస్కార్టు సౌకర్యం ఉండదు. ఉచిత లేదా రాయితీ ప్రయాణం పొందేందుకు దివ్యాంగులు సంబంధిత సదరం సర్టిఫికెట్తో పాటు ఆర్టీసీ జారీచేసిన బస్సుపాస్ను చూపించాల్సి ఉంటుంది. ఉచిత టికెట్, ఎస్కార్టు టికెట్ వేర్వేరుగా జారీ చేస్తామని జిల్లా ప్రజారవాణా అధికారి తెలిపారు. -
అరాచక పాలన ఇది
టీటీడీ చైర్మన్ను పదవి నుంచి తొలగించాలంటూ విజయనగం అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ శ్రేణుల నిరసన రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం కాకుండా, రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోంది. పవిత్రమైన టీటీడీ పాలకమండలి చైర్మన్ పదవిలో ఉన్న బీఆర్ నాయుడు ఆశ్లీల పనులకు పాల్పడుతుంటే తిరుపతికి వెళ్లే మహిళా భక్తులకు ఏ విధంగా రక్షణ కల్పిస్తారు. సనాతన ధర్మమంటూ గొప్పలుచెప్పే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ విషయంపై ఎందుకు స్పందించడం లేదు. అశ్లీల పనులు, అక్రమాలు చేసే వారికి పదవులు కట్టబెట్టడం ఎంత వరకు సమంజసం. టీటీడీ చైర్మన్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బాధ్యతగల ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నాం. ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధులు మేలుచేయకపోగా ఎన్నికలకు ముందు ప్రకటించిన హమీలు తుంగలోకి తొక్కుతున్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులపై ప్రశ్ని స్తే భయబ్రాంతులకు గురిచేసి జైల్లో పెట్టిస్తున్నారు. అలాంటి వాటికి వైఎస్సార్సీపీ శ్రేణులు భయపడే ప్రసక్తే లేదు. రానున్నరోజుల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ప్రజలతోనే తగిన బుద్ధిచెప్పిస్తాం. – కోలగట్ల వీరభద్రస్వామి, ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్, వైఎస్సార్సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు విజయనగరం: రాష్ట్రంలోని కళంకిత పాలనపై విజయనగర ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేశారు. కోట్లాది మంది ప్రజల ఆరాధ్యదైవం తిరుమల వేంకటేశ్వరస్వామి ప్రతిష్టను దిగజార్చేలా, భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా అశ్లీల వీడియోలతో అడ్డంగా దొరికిపోయిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుని తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. టీటీడీ చైర్మన్కు వ్యతిరేకంగా తిరుపతిలో ఆందోళన చేసిన మహిళలపై టీడీపీ గూండాల అరాచకత్వంపై నిరసన గళం వినిపించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో విజయనగరం బాలాజీ కూడిలిలోని అంబేడ్కర్ విగ్రహం సాక్షిగా మంగళవారం ధర్నాచేశారు. చంద్రబాబు ప్రభుత్వ తీరును దుమ్మెత్తిపోశారు. సీఎం డౌన్ డౌన్... ప్రశ్నించే గొంతులపై దాడులు ఆపాలి... టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును తొలగించాలంటూ పెద్దఎత్తు నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గదుల సత్యలత, అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలు పతివాడ కృష్ణ వేణి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.సూర్యనారాయణరాజు, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ శెట్టివీరవెంకట రాజేష్, ఎంపీపీ మామిడి అప్పలనాయుడు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సంగంరెడ్డి బంగారునాయుడు, జిల్లా యువజన విభాగం నాయకుడు జి.ఈశ్వర్కౌశిక్, విజయనగరం నగర పార్టీ అధ్యక్షుడు ఆశపు వేణు, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్కుమార్, పెన్షనర్లు/ ఉద్యోగుల విభాగం అధ్యక్షుడు డోల మన్మథకుమార్, నెల్లిమర్ల నగర పంచాయతీ వైస్చైర్మన్ సముద్రపు రామారావు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అల్లు అవినాష్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు కరుమజ్జి సాయికుమార్, పార్టీ నాయకులు గొర్లె రవికుమార్, కనకల రఘురామారావు, తదితరులు పాల్గొన్నారు. కళంకిత పాలనపై ప్రజాగ్రహం అడ్డంగా దొరికిపోయి సిగ్గుమాలిన మాటలా? అశ్లీల వీడియోలతో అడ్డంగా దొరికిపోయిన బీఆర్ నాయుడు... తొలుత ఆయనపై వచ్చినవి ఫేక్ వీడియోలని, అనంతరం ఏఐలో మార్పు చేసినవని, ఆ తరువాత అందులో తప్పేముందంటూ మాట్లాడటం సిగ్గుచేటు. బీఆర్ నాయుడు అశ్లీలత పనులతో తిరుపతి ప్రతిష్టను దిగజార్చడంతో పాటు భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. జరిగిన ఘటనపై సరైన వివరణ ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్న టీటీడీ చైర్మన్ సోమవారం తిరుపతికి వచ్చిన సందర్భంలో వైఎస్సార్సీపీ మహిళా నాయకులు ప్రశ్నించేందుకు వెళ్తే వారిపైకి టీడీపీ గూండాలను ఉసిగొల్పి దాడులు చేయించడం, అక్రమ కేసులు బనాయించి పీడీయాక్టు పెట్టడం చంద్రబాబు ప్రభుత్వ అరాచక పాలనకు అద్దంపడుతోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పోలీసులు ఇలా వ్యవహరించడం దారుణం. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్నారు. టీటీడీ చైర్మన్పై తక్షణమే చర్యలు తీసుకోవాలి. టీటీడీ ప్రతిష్టను కాపాడాలి. అప్పటి వరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హిందూదేవాలయాలకు రక్షణ కరువైంది. రెండేళ్లలో హిందువులపై దాడులు పెరిగాయి. గంజాయి, డ్రగ్స్ వాడకం పెరిగింది. టీడీపీకి చెందిన ఎంపీ డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయినా చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. – మజ్జిశ్రీనివాసరావు, జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో గర్జించిన జనం టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు అనర్హుడు అశ్లీల చర్యలతో టీటీడీ ప్రతిష్టను దెబ్బతీశారు చర్యలు తీసుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం తాత్సారం తగదు తప్పులను ప్రశ్నించే వారిపై దాడులు, అక్రమ కేసులు, పీడీయాక్టు టీటీడీ చైర్మన్ను తొలగించేంత వరకు పోరాటం జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు తిరుపతిలో వైఎస్సార్సీపీ మహిళలపై దాడికి వ్యతిరేకంగా నిరసన -
పాసుపుస్తకాల పంపిణీ వేగంగా పూర్తికావాలి
● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి విజయనగరం: జిల్లాలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీని వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు మంగళవారం రాష్ట్ర సచివాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టాదారు పాసుపుస్తకాలు, రీసర్వే, 22 ఏ భూములు, తదితర రెవెన్యూ అంశాలపై దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని పరిస్థితులను సీఎస్కు కలెక్టర్ వివరించారు. ఈ వీసీ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతినెలా 9వ తేదీలోగా నిర్దేశించిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీని పూర్తిచేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మ్యుటేషన్లను వీలైనంత వేగంగా వేగంగా పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో జేసీ ఎస్.సేతుమాధవన్, డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, ఆర్డీఓలు వెంకటేశ్వరరావు, సుధారాణి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. న్యూరోసర్జరీ పరికరంపై పరిశోధనకు గుర్తింపు విజయనగరం ఫోర్ట్: అధునాతన న్యూరోసర్జరీ పరికరంపై పరిశోధనకు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి న్యూరోసర్జరీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రెడ్డి శంకరరావు, వైద్య కళాశాల ఎంబీబీఎస్ విద్యార్థి వి. డానీకి గుర్తింపు లభించింది. ఈ నెల 16న విశాఖపట్నంలోని గీతం మెడికల్ కాలేజీలో జరిగిన సమ్మిట్లో సమర్పించిన ‘ సర్టన్ లెడ్ నోవెల్ క్రానియోటోట్ అడాప్టర్ టు కన్వర్ట్ సర్టిఫైడ్ ఇంటి/డెంటల్ డ్రిల్ సిస్టమ్ ఆన్ ఎ న్యూరోసర్జరీ డ్రిల్ సిస్టం’ అనే విన్నూత పరిశోధన పత్రానికి ద్వితీయస్థానం లభించింది. రూ.34 వేలు నగదు లభించింది. పరిశోధకులను స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ బి.దేవీమాధవి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లోక్నాఽథ్, సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ అభినందించారు. నేటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన ● ముగిసిన కార్పొరేషన్ పాలకవర్గం పదవీ కాలం విజయనగరం: విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్లో బుధవారం నుంచి ప్రత్యేక అధికారి పాలన ప్రారంభం కానుంది. ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం మంగళవారంతో ముగియనుంది. బుధవారం నుంచి కార్పొరేషన్ ప్రత్యేకాధికారిగా కలెక్టర్ రామ సుందర్ రెడ్డి వ్యవహరించనున్నారు. కార్పొరేషన్ ఎన్నికలు జరిగేంత వరకు ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలో పాలన సాగనుంది. విజయనగరం ఆర్డీఓగా సుధాసాగర్ విజయనగరం: విజయనగరం రెవెన్యూ డివిజనల్ అధికారిగా సనపల సుధాసాగర్ నియామకమయ్యారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ జి.సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఆయనను ఆర్డీఓగా బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు ఆర్డీఓ గా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు బాధ్యతలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా విజయనగరం ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న ఎం.నూకరాజును అల్లూరి సీతారామరాజు జిల్లా రెవెన్యూ అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నూకరాజు నెల రోజుల వ్యవధిలో ఉద్యోగ విరమణ పొందనున్నారు. ఫైర్ ఆఫీసర్కు ఉగాది పురస్కారం విజయనగరం క్రైమ్: విశిష్టసేవలందించే వారికి రాష్ట్ర ప్రభుత్వం ఏటాఇచ్చే ఉగాది పురస్కారానికి ఉమ్మడి విజయనగరం జిల్లా అగ్నిమాపక ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రమేష్ ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన పార్వతీపురం అగ్నిమాపక కేంద్రం అధికారిగా పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో అంకిత భావం, సేవను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం ఇచ్చే పురస్కారానికి రమేష్ ఎంపిక కావడంపై ఆ శాఖ ఉద్యోగులు హర్షం వ్యక్తంచేశారు. -
● బడిని కాపాడాలంటూ ఎస్ఎఫ్ఐ పోరుబాట
విజయనగరంలోని 18వ వార్డు సుద్దవీధిలో ఉన్న కేపీబీ ప్రాథమిక పాఠశాలను కాపాడాలంటూ ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. విజయనగరం కమిషన్ కార్యాలయం వద్ద మంగళవారం బైఠాయించారు. పాఠశాలలో 65 మంది విద్యార్థులు చదువుతున్నారని, ఐదు తరగతులను కేవలం రెండు ఇరుకు గదుల్లో నిర్వహిస్తుండడంతో ఇబ్బంది పడుతున్నారన్నారు. పాఠ్యాంశ బోధనకు అవరోధం కలుగుతోందని వాపోయారు. మరోవైపు పాఠశాల స్థలాన్ని కబ్జాచేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. విద్యార్థుల తల్లిదండ్రుల వినతిమేరకు మంజూరుచేసిన రూ.22.18 లక్షలతో పాఠశాల నూతన భవనం నిర్మించాలని, బడి స్థలాన్ని కాపాడాలని కోరారు. కమిషనర్ కారుముందు బైఠాయించడంతో చేసేదిలేక కమిషనర్ బాలస్వామి వేరొకరి బైక్పై అక్కడి నుంచి వెళ్లిపోయారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కె.జగదీష్, ఆర్.శిరీష, జిల్లా సహాయ కార్యదర్శులు సోమేశ్, వంశీ, భారతి, రమణ నాయకులు గుణ, మురళి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. – సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం -
మా బాధలువినే ఓపిక లేదా?
ఎమ్మెల్యేసారూ... చీపురుపల్లి/గుర్ల: ఎమ్మెల్యే గారికి రైతుల బాధలు వినే ఓపిక లేదట.. రైతుల కష్టాలు తెలుసుకునే అవసరం కూడా లేదట... కనీసం రైతులతో మాట్లాడే తీరిక కూడా లేదట.. కష్టాలు చెప్పుకుందామని వస్తే పోలీసులతో తోయించేస్తారా?.. పోలీసులు తమను తోసేస్తుంటే ఎదురుగా ఉన్న ఎమ్మెల్యే గారు నవ్వుతారా?.. ఇందుకేనా ఓట్లు వేసి గెలిపించుకున్నాం.. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ఇంటింటికీ వచ్చారు... తీరా ఓట్లు వేయించుకుని గెలిచిన తరువాత ఎమ్మెల్యేకు రైతులకు మధ్య పోలీసులు ఎందుకు వచ్చారు... ఎమ్మెల్యేను కలిసేందుకు వచ్చింది రైతులే కదా సంఘ విద్రోహ శక్తులు కాదు కదా.. పోలీసులు తోసేస్తుంటే రైతులకు గాయాలవుతున్నా నవ్వుతూ వెళ్లిపోతున్నారు తప్ప పట్టించుకోలేదంటూ చీపురుపల్లి ఎమ్మెల్యే కళావెంటరావు తీరును గుర్ల మండలంలోని కెల్ల, దమరసింగి, వల్లాపురం, మన్యపురిపేట, బెల్లానపేట గ్రామాలకు చెందిన రైతులు దుమ్మెత్తిపోశారు. ఓట్లేసి గెలిపించినందుకు తగిన శాస్తి చెప్పారంటూ మనోవేదనకు గురవుతున్నారు. పచ్చని భూముల్లో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుచేస్తే రైతుల భవిష్యత్ నాశనమవుతుందని కొద్ది నెలలుగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోగా కనీసం స్థానిక ఎమ్మెల్యే కూడా ఓట్లు వేసి గెలిపించిన ప్రజల పక్షాన నిలబడకపోతే ఎలా అంటూ రైతులు మండిపడ్డారు. పచ్చని పొలాల్లో పారిశ్రామిక మంటల రాజేయడం తగదని, ఈ ప్రాంతానికి జరిగే నష్టాన్ని వివరించి తమ బాధలు చెప్పుకునేందుకు వెళ్తే ఎమ్మెల్యే అవకాశం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రైతులేమైనా సంఘ విద్రోహ శక్తులా... ఎన్నికల ముందు ఇదే రైతులతో చేతులు పట్టుకుని భుజాలు రాసుకుని దద్ద, పెద్దయ్య, తమ్ముడు అంటూ మాట్లాడిన ఎమ్మెల్యే... ఇప్పుడెందుకు కలవనివ్వడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. తాము రైతులమే తప్ప సంఘ విద్రోహ శక్తులం కాదు కదా... శాంతియుతంగా తమ కష్టాలు చెప్పుకోవాలని వస్తే పోలీసులతో అడ్డగించి తోయించడం ఎంతవరకు న్యాయమంటూ రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. రైతుకు స్వల్ప గాయాలు ఎమ్మెల్యేను కలిసేందుకు వెళ్లిన రైతులను తాడుతో పోలీసులు అడ్డుకున్నారు. ఎదురుగానే ఎమ్మెల్యే ఉన్నప్పటికీ రైతులను పంపించండని అనలేదు. దీంతో ఆవేదన చెందిన రైతులు ఎలాగైనా ఎమ్మెల్యేను కలిసి తమ గోడు చెప్పుకోవాలని ముందుకు సాగారు. దీంతో అడ్డుకున్న పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించే చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో దమరసింగి గ్రామానికి చెందిన మీసాల అసిరినాయుడు అనే రైతు కిందపడిపోవడంతో స్వల్ప గాయమైనట్లు రైతులు చెబుతున్నారు. ఓ వైపు రైతన్నా మీకోసం... మరోవైపు రైతులకు మోసం.. ప్రభుత్వం ఓ వైపు రైతన్న మీ కోసం అంటూ కార్యక్రమం చేస్తూనే మరోవైపు అదే రైతులను మోసం చేస్తోంది. రైతులపై ప్రేమ ఉన్నట్లు కపట నాటకాలు ఆడుతున్నారు. కనీసం కష్టాలు చెప్పుకునేందుకు ఎమ్మెల్యే వద్దకు వెళ్తే పోలీసులతో అడ్డగించారు. రైతుల కష్టాలు వినకపోవడం దారుణం. – మీసాల ప్రసాద్, స్టీల్ప్లాంట్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు, దమరసింగి, గుర్ల మండలం కళా తీరు దారుణం స్టీల్ప్లాంట్ ఏర్పాటు వల్ల ఎంతో నష్టం కలుగుతుంది. పచ్చని పొలాల్లో పంటలు పండించకుండా పరిశ్రమలు ఏర్పాటు చేస్తే రైతాంగం కుదేలు అవుతుంది. ఇదే విషయాన్ని ఎమ్మెల్యేకు చెప్పాలని రైతులం వెళ్తే పోలీసులతో అడ్డగించడం దారుణం. రైతులు ఎదుర్కొంటున్న బాధలు వినకపోతే ఎలా? – కెల్ల సూర్యనారాయణ, కెల్ల, గుర్ల మండలం కష్టాలు చెప్పుకునేందుకు వస్తే పోలీసులతో తోయించేస్తారా? ఇందుకేనా ఓట్లు వేసి తమరిని గెలిపించుకున్నాం.. రైతులమా లేక సంఘ విద్రోహ శక్తులమా చెప్పండి రైతులను మోసం చేయడం న్యాయమేనా? పోలీసు చర్యలతో అసిరినాయుడు అనే రైతుకు స్వల్ప గాయాలు -
క్రికెట్ టోర్నీ పోస్టర్ల ఆవిష్కరణ
పార్వతీపురం: జియ్యమ్మవలస మండలం ఆర్ఆర్బీ పురం జీటీడబ్ల్యూఏహెచ్ఎస్లో ఈనెల 19 నుంచి 21 వరకు నిర్వహించనున్న మన్యం లీగ్ – 2026 జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్కు సంబంధించిన వాల్పోస్టర్లను కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి సోమవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువతలో దాగి ఉన్న క్రీడలను వెలికితీసేందుకు ఈ టోర్న్మెంట్ ఎంతో దోహదపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో జేసీ సి.యశ్వంత్కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్, డీఎస్డీఓ కె. శ్రీధరరావు, తదితరులు పాల్గొన్నారు. న్యాయం చేయండి.. విజయనగరం క్రైమ్: ఓ ఆకతాయి నుంచి తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని నిండు గర్భిణి వేడుకుంది. ఈ మేరకు సోమవారం స్థానిక పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. డెంకాడ మండలం చింతలవలస ఏపీఎస్పీ బెటాలియన్ దగ్గర్లో ఉన్న కృష్ణాపురంలో అనురాధ, కల్యాణ్ దంపతులు నివసిస్తున్నారు. వీరి ఇంటిలో ఉన్న మామిడిచెట్టు కాయలు ఎదురుగా ఉన్న పృథ్వి ఇంటి ఆవరణలో పడడంతో వాటిని తీసుకునేందుకు ఇటీవల అనురాధ వెళ్లింది. దీంతో నా అనుమతి లేకుండా ఇంటిలోకి ఎందుకువచ్చావంటూ అనురాధతో పృథ్వి గొడవపడ్డాడు. తర్వాత అనురాధ ఇంటి నుంచి ఆమె కుమార్తె, అత్త, మరిది ఇలా ఎవరు ఇంటి బయటకు వచ్చినా బూతులు తిట్టడంతో పాటు దుస్తులు విప్పి అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. దీంతో బాధిత కుటుంబం ఈ నెల 11న స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో సోమవారం స్థానిక పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసింది. ఆకతాయి నుంచి తమకు రక్షణ కల్పించాలని వేడుకుంది. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం ● తెగిపడిన విద్యుత్ తీగలు పార్వతీపురం రూరల్: పట్టణంలో సోమవారం సాయంత్రం త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకుని ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని తెలుగుతల్లి విగ్రహం వద్ద విద్యుత్ తీగలు ఒక్కసారిగా తెగిపడ్డాయి. రోడ్డుపక్కనే ఉన్న ద్విచక్ర వాహనాలు, ఓ కూరగాయల దుకాణంపై తీగలు పడ్డాయి. అయితే ఈ సమయంలో అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. వెంటనే స్థానికుల సమాచారంతో విద్యుత్ శాఖాధికారులు స్పందించి సరఫరాను నిలిపివేశారు. దీంతో వాహనదారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. చోరీ కేసులో ముగ్గురి అరెస్ట్ పార్వతీపురం రూరల్: మండల పరిధిలోని వైకేఎం కాలనీ, చర్చి వీధిలో జరిగిన వరుస దొంగతనాలకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 8వ తేదీ రాత్రి జరిగిన ఈ చోరీలపై బాధితురాలు మత్స తవిటమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు ఏఎస్పీ మనీషా రెడ్డి సారథ్యంలో రూరల్ సీఐ పి. రంగనాథం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్కు చెందిన షేక్ అస్రాఫుల్, షేక్ బాబు, ఒడిశాకు చెందిన రూపేష్ నాగ్లను సోమవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 18 గ్రాముల బంగారు ఆభరణాలు, 200 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకుని, నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్సై ఎం. రాజేష్ తెలిపారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
సమున్నత రీతిలో నగరాభివృద్ధికి కృషి
విజయనగరం: కార్పొరేషన్ హోదా దక్కించుకున్న విజయనగరంలో మొదటి పాలకవర్గంగా సమున్నతరీతిలో సుపరిపాలన సాగించి విజయనగరం జిల్లా కేంద్రం రూపురేఖలు మార్చామని, నగరాన్ని సుందరంగా మలిచామని విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు ఉద్ఘాటించారు. గడిచిన ఐదేళ్లలో సుమారు రూ.200 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని స్పష్టంచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఎమ్మెల్యే, ఎంపీ నిధులు నుంచి రూపాయి కేటాయించలేదని, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు తామే చేస్తున్నామంటూ చెప్పుకోవడం సిగ్గుచేటుగా పేర్కొన్నారు. మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి హయాంలో జరిగిన అభివృద్ధిపై కౌన్సిల్ సభ్యులు ప్రశంసలు కురిపించారు. నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి అధ్యక్షతన సోమవారం విజయనగరం కార్పొరేషన్ అత్యవసర సమావేశం నిర్వహించారు. సమావేశంలో భాగంగా ప్రధాన అజెండాలో 14 అంశాలు పొందుపరచగా... టేబుల్ అజెండాలో మరో 3 అంశాలను పొందుపరిచారు. వీటిపై చర్చించిన కౌన్సిల్ రెండు అంశాలను తిరస్కరించి మిగిలిన 15 అంశాలకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ శెట్టివీరవెంకట రాజేష్ మాట్లాడుతూ టీడీపీ కార్పొరేటర్ కర్రోతు రాధామణి ఐదేళ్లలో అభివృద్ధి జరగలేదంటూ చేసిన వాఖ్యలకు ధీటుగా బదులిచ్చారు. ఐదేళ్ల కిందట టీడీపీ కౌన్సిల్ సభ్యులు మధ్య సమన్వయలేమితో రూ.60 కోట్ల సాధారణ నిధులు ఖర్చు చేయకుండా వదిలేశారని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆలోచనలతో ఆ నిధులతో పాటు వివిధ గ్రాంట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. తమ హాయాంలోనే ప్రభుత్వ మెడికల్ కళాశాలతో పాటు డిగ్రీ కళాశాలలు ప్రారంభించామని చెప్పారు. దేశంలోనే రెండవ ప్రభుత్వ ఏసీ పాఠశాలుగా కొత్తపేటలోని వివేకానంద పాఠశాల గుర్తింపు పొందిందన్నారు. నగర వ్యాప్తంగా 23 ఫౌంటైన్లు ఏర్పాటు చేయడంతో పాటు మహిళలు, చిన్నారుల కోసం ప్రత్యేకంగా పార్కులు నిర్మించామన్నారు. నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు 11 వాటర్ ట్యాంక్లు నిర్మించడంతో పాటు రోడ్ల విస్తరణ, వార్డుల్లో రోడ్లు, కాలువలు నిర్మాణాలు, ప్రాంతాల వారీగా ప్రభుత్వాస్పత్రుల నిర్మాణాలు చేపట్టామని వివరించారు. టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయం కోసం గతంలో కేటాయించిన స్థలాన్ని రద్దు చేసి తాజాగా వారు కోరిన ప్రాంతంలో స్థలం కేటాయించిన ఘనత ఈ పాలకవర్గానికే దక్కుతుందన్నారు. ● నగర డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభధ్రస్వామి ఆలోచనలతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దామని కౌన్సిల్ మొత్తం గర్వంగా చెబుతుందన్నారు. ప్రతి డివిజన్లో సుమారు రూ.2.50 కోట్ల నుంచి రూ.5 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పాలన సాగించామని పేర్కొన్నారు. ● కార్పొరేటర్లు మారోజు శ్రీనివాసరావు, అల్లు చాణక్య, మీసాల రమాదేవి, బాలి పద్మావతి, కడియాల రామకృష్ణ, పిన్నింటి కళావతి, రేగాన రూపాదేవి, తాళ్ల పూడి సంతోషికుమారి తదితరలు మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి, సంతృప్తికర పాలనపై చర్చించడంతో పాటు రానున్న రోజుల్లో నగర అభివృద్ధికి అధికారులు ప్రాధాన్యమివ్వాలని కోరారు. సామూహిక మరుగుదొడ్లు, పారిశుధ్య నిర్వహణపై దృష్టి సారించాలని సూచించారు. ఆప్కోస్లో పారిశుధ్య కార్మికులుగా విధులు నిర్వహిస్తూ మృతి చెందిన 9 మంది కార్మికుల కుటుంబాలకు ఆ విధులు అప్పగించాలని కోరారు. కార్పొరేటర్గా సేవలందిస్తూ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన పొట్నూరు శ్రీనివాసరావు మృతికి కౌన్సిల్ సభ్యులు సంతాపం తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటామని కో ఆప్షన్ సభ్యుడు ఆశపు వేణు భరోసా ఇచ్చారు. పాలనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు మున్సిపల్ కార్పొరేషన్ మొదటి మేయర్గా పాలనకు సహకరించిన తోటి కార్పొరేటర్లకు, అధికారులకు, ప్రజలకు మేయర్ విజయలక్ష్మి ధన్యవాదాలు తెలిపారు. అందరి సహకారంతో నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని చెప్పారు. తాము చేసిన అభివృద్ధి ఫలాలను పరిరక్షిస్తూ భవిష్యత్లో విజయనగరం మరింత అభివృద్ధి దిశగా పయనించాలని ఆకాంక్షించారు. మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభధ్రస్వామి సారధ్యంలో నగరంలో చేపట్టిన పనులకు అన్ని వర్గాల ప్రజల నుంచి ఆనందం వ్యక్తం చేయడం పాలనకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. సమావేశంలో కార్పొరేషన్ కమిషనర్ బాలస్వామి, అసిస్టెంట్ కమిషనర్ కిల్లాన అప్పలరాజు, కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రూ.200కోట్లతో అన్నిరంగాల్లో విజయనగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాం ప్రజాసంక్షేమం, అభివృద్ధి కోసం అకింత భావంతో పనిచేశాం టీడీపీ కార్యాలయం నిర్మాణానికి స్థలం కేటాయించిన ఘనత మాదే పాలనకు సహకరించిన ప్రజలకు, అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపిన కార్పొరేటర్లు -
అలసత్వం వహిస్తే సహించేది లేదు..
● కలెక్టర్ ఎస్. రాంసుందరరెడ్డి ● పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లకు పోటెత్తిన అర్జీదారులువిజయనగరం కలెక్టరేట్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్లో అర్జీదారులు తెలియజేసిన సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ ఎస్. రాంసుందరరెడ్డి అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు రాగా.. అధికారులు 233 వినతులు స్వీకరించారు. ఇందులో 130 వినతులు రెవెన్యూ శాఖకు సంబంధించినవి కావడం విశేషం. ఈ సందర్భంగా కలెక్టర్ రాంసుందరరెడ్డి మాట్లాడుతూ.. అర్జీలను సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూ విభాగానికి సంబంధించి 130 వినతులు రాగా..డీఆర్డీఏ –13, పంచాయతీరాజ్ – 20, మున్సిపల్–9, విద్యుత్ శాఖ–7, హౌసింగ్–3, డీసీహెచ్ఎస్–1, గ్రామ సచివాలయ శాఖ–6, విద్య శాఖ–2, ఇతర శాఖలకు సంబంధించి 42 వినతులు వచ్చాయన్నారు. డిజిటల్ పర్యవేక్షణ.. పీజీఆర్ఎస్ కార్యక్రమంపై డిజిటల్ పర్యవేక్షణ చేస్తున్నట్లు కలెక్టర్ ఎస్. రాంసుందరరెడ్డి అన్నారు. 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా అందిన కాల్స్ పట్ల బాధ్యతగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. అర్జీదారునితో మాట్లాడిన తేది, సమయం కూడా వారికిచ్చే రిపోర్ట్లో నమోదు చేయాలన్నారు. పీజీఆర్ఎస్ టోల్ఫ్రీ నంబర్ 1100పై ప్రజలకు అవగాహన కలిగించాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్.సత్తిబాబు, జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కళావతి, సీపీఓ బాలాజీ, విజయనగరం, చీపురుపలి, బొబ్బిలి ఆర్డీఓలు, జిల్లా సర్వే శాఖ ఎ.డి. ఆర్.విజయకుమార్, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ పాణి, హౌసింగ్ పీడీ మురళీధర్, మైక్రో ఇరిగేషన్ పీడీ లక్ష్మీనారాయణ, జెడ్పీ సీఈఓ సత్యనారాయణ, మార్క్ఫెడ్ మేనేజర్ డి.వెంకటేశ్వరరావు, డీఎంహెచ్ఓ జీవనరాణి, కలెక్టరేట్ పరిపాలనాధికారి దేవీప్రసాద్, జిల్లా పరిషత్ సీఈఓ బీవీ సత్యనారాయణ, జిల్లా అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. 48 ఫిర్యాదుల స్వీకరణ.. విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యాక్రమంలో పోలీస్ ఉన్నతాధికారులు 48 ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో భూతగాదాలు, కుటుంబ కలహాలు, చీటింగ్, నగదు వ్యవహారాలకు సంబంధించిన కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఈ సందర్భంగా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ.. ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. -
25న న్యాయవాదుల సంఘం ఎన్నికలు
విజయనగరం లీగల్: ప్రతిష్టాత్మకమైన జిల్లా కేంద్ర న్యాయవాదుల సంఘ ఎన్నికలు ఈనెల 25 న జరుగనున్నాయి. సంఘంలో సుమారు 600 మంది సభ్యులున్నారు. అధ్యక్ష పదవికి నళితం రమేష్కుమార్, గువ్వల తిరుపతిరావు పోటీపడుతున్నారు. వీరిద్దరూ తమ మద్దతుదారులతో సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఈనెల 25న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఓటింగ్ నిర్వహిస్తామని ముఖ్య ఎన్నికల అధికారి కంటుభుక్త శ్రీనివాస్ తెలిపారు. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తామన్నారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ ఆదేశాలు, సూచనల మేరకు ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అధ్యక్ష పదవితో పాటు కార్యదర్శి, ఉపాధ్యక్ష, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, గ్రంథాలయ కార్యదర్శి, స్పోర్ట్స్ సెక్రటరీ, సీనియర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యుల పదవికి ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. నామినేషన్ల ప్రక్రియలో ఎన్నికల అధికారులు వై. హరికృష్ణ, దాసరి పద్మ పాల్గొన్నారు. -
అమరజీవికి నివాళి
విజయనగరం కలెక్టరేట్: ఆంధ్రరాష్ట్ర సాధకుడు పొట్టి శ్రీరాములు 125వ జయంతిని కలెక్టరేట్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, పీసీఓ బాలాజీ, ఆర్య వైశ్య సంఘం సభ్యులు రవ్వ శ్రీనివాస్, బండారు చంద్ర శేఖర్, ఎస్వీఎన్ శివ, కాపుగంటి ప్రకాష్, చెరుకూరి నాగార్జున, తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన త్యాగం అందరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు. మహనీయుడు పొట్టి శ్రీరాములు విజయనగరం క్రైమ్: భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని ఎస్పీ దామోదర్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు 125వ జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. అమరజీవి చిత్రపటానికి ఎస్పీ, ఏఎస్పీలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ ఇ.కోటిరెడ్డి, డీపీఓ ఏఓ పి.శ్రీనివాసరావు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
బాధను దిగమింగి..
● తల్లి మరణించిన మరుచటి రోజే పరీక్షకు హాజరురామభద్రపురం: తండ్రి ఎలా ఉంటాడో తెలియదు.. అన్నీ తానై పెంచిన తల్లి అనారోగ్యంతో మృతి చెందింది.. తల్లి కళ్లెదుటే విగతజీవిగా పడి ఉంటే కుమిలి కుమిలి ఏడ్చిన కుమారుడు అంతటి బాధను కూడా దిగమింగుకుని మరుచటి రోజు పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కొట్టక్కి గ్రామానికి చెందిన ముల్లు రామలక్ష్మి (33) గర్భిణిగా ఉన్నప్పుడు ఆమె భర్త విడిచిపెట్టి మరో మహిళతో వెళ్లిపోయాడు. అప్పటి నుంచి రామలక్ష్మి ఇళ్లల్లో పనులు చేసుకుంటూ బిడ్డను (కోటేశ్వరావు) సాకుతూ వచ్చింది. కుమారుడిని గారాబంగా పెంచుకుంటూ పదో తరగతి వరకు చదివించింది. ఇక పై చదువులు చదివి తనను ఆదుకుంటాడనుకున్న సమయంలో విధి వక్రించింది. అనారోగ్యంతో రామలక్ష్మి ఆదివారం కన్నుమూసింది. దీంతో గుండెలవిసేలా ఏడ్చిన కోటేశ్వరరావు.. ఇంతటి బాధలోనూ సోమవారం జరిగిన పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడు. -
చేతివృత్తులకు కష్టకాలం..
మంగలి, చాకలి వృత్తులు కూడా అంతంతమాత్రమే..పూర్వం గ్రామాల్లో మంగలి, కలి వృత్తులకు ప్రత్యేక గౌరవం ఉండేది. కానీ ఇప్పుడు ఆధునిక సెలూన్లు, వాషింగ్ మెషీన్లు, లాండ్రీలు పెరగడంతో ఈ వృత్తుల ప్రాధాన్యం తగ్గిపోయింది. ఇతర కులస్తులు పట్టణాల్లో ఆధునిక సెలూన్లు, లాండ్రీ షాపులు నిర్వహిస్తుంటే.. అసలైన కులవృత్తిదారులు వారితో పోటీ పడలేక వృత్తినే వదిలేస్తున్నారున.విజయనగరం గంటస్తంభం: ఒకప్పుడు గ్రామాలు అన్నిరకాల వృత్తిదారులతో సందడిగా ఉండేవి. సూర్యోదయం నుంచే చేతివృత్తిదారులు తమ పనుల్లో బిజీగా కనిపించేవారు. ప్రతి రోజూ కుమ్మరి ఇంట్లో మట్టిచక్రం తిరిగేది. చేనేత కార్మికుడి ఇంట్లో మగ్గం సవ్వడి చేసేది. కంసాలి పనిముట్ల శబ్దం ఊరంతా వినిపించేది. మంగలి కత్తెర చప్పుడు.. చాకలి ఇస్సు ఇస్సు శబ్దాలతో గ్రామాలన్నీ కళకళలాడేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి మారిపోయింది. గ్రామం అంటే కేవలం ఇళ్లు, పొలాలకే పరిమితమైపోయింది. ఆధునిక జీవన విధానం పెరిగింది. యంత్రాలు, ఫ్యాక్టరీలు, ప్లాస్టిక్ వస్తువులు మార్కెట్ను ఆక్రమించాయి. ఫలితంగా శతాబ్దాలుగా కొనసాగిన సంప్రదాయ కులవృత్తులు నిశ్శబ్దంగా కనుమరుగవుతున్నాయి. ఈ వృత్తులు కేవలం జీవనోపాధి మాత్రమే కాదు..మన సంస్కృతీ, సంప్రదాయాలకు పునాది. కానీ నేడు ఆ వృత్తులపై ఆధారపడి జీవించే కుటుంబాలు తీవ్ర కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. కంసాలి వృత్తికి కాలం పరీక్ష.. వ్యవసాయ పనులకు కావాల్సిన పరికరాలు గొడ్డళ్లు, కొడవళ్లు, కత్తులను గతంలో గ్రామాల్లో ఉండే కంసాలులే తయారు చేసేవారు. ఇప్పుడు ఫ్యాక్టరీల్లో తయారయ్యే వస్తువులు మార్కెట్ను ఆక్రమించడంతో కంసాలి వృత్తి కూడా క్షీణిస్తోంది. ఇనుప మోగులు మసకబారుతున్నాయి. ఆ వృత్తిపై ఆధారపడి జీవించిన కుటుంబాలు ఆర్థికంగా బలహీనపడుతున్నాయి. తండ్రి వృత్తి కొనసాగించని కొత్త తరం.. పూర్వం తండ్రి చేసే వృత్తినే కొడుకు కొనసాగించడం సంప్రదాయంగా వచ్చేది. కానీ నేటి పరిస్థితుల్లో యు వత ఆ వృత్తులపై ఆసక్తి చూపడం లేదు. తక్కువ ఆ దాయం, కష్టమైన పని, భవిష్యత్పై భయం కారణంగా యువత పట్టణాలకు వెళ్లి ఇతర ఉద్యోగాలు వెతు క్కుంటోంది. దీంతో పూర్వీకుల వృత్తుల కొత్త తరానికి చేరకుండా నెమ్మదిగా కనుమరుగవుతున్నాయి. గ్రామ సంస్కృతికి ముప్పు.. కులవృత్తులు కేవలం పనులు కాదు. అవి గ్రామ జీవన విధానానికి ప్రతిబింబం. ఆ వృత్తులు మాయమ్తెతే గ్రామ సంస్కృతీ, సంప్రదాయాలు కూడా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఇప్పుడు అవి గతకాల జ్ఞాపకాలుగా మాత్రమే మిగిలిపోతున్నాయి. ప్రభుత్వం – సమాజం కలిసి రక్షించాలి.. ఈ సంప్రదాయ వృత్తులను కాపాడాలంటే ప్రభుత్వంతో పాటు సమాజం కూడా ముందుకు రావాలి. సంప్రదాయ వృత్తులకు ప్రోత్సాహక పథకాలు, మార్కెట్ అవకాశాలు కల్పించడం, హస్తకళల పదర్శనలు నిర్వహించడం, యువతకు శిక్షణ ఇవ్వడం. వంటి చర్యలు తీసుకుంటేనే ఈ వృత్తులు తిరిగి బతికే అవకాశం ఉంటుంది. చేతిలో పని లేక ఇబ్బంది పడుతున్న వృత్తిదారులు పాత వృత్తులను దెబ్బతీస్తున్న ఆధునికత కనమరుగవుతున్న గ్రామ సంస్కృతి -
డాక్టర్ ఇంట్లో చోరీ
● 23 తులాల బంగారం, 12 కేజీల వెండిని దోచుకుపోయిన దొంగలు ● లబోదిబో మంటున్న వైద్యుడు సుబ్బారావు కొత్తవలస: మండల కేంద్రంలోని సబ్బవరం రోడ్డులో నివసిస్తున్న తెన్నేటి సుబ్బారావు ఇంటిలో దొంగలు పడ్డారు. బంగారు ఆభరణాలు, వెండిని దోచుకుపోయారు. బాధితులు, సీఐ సీహెచ్ షణ్ముకరావు తెలిపిన వివరాల ప్రకారం.. డాక్టర్ సుబ్బారావు హైదరాబాద్లో నివసిస్తున్న భార్యను తీసుకువచ్చేందుకు రెండు రోజుల కిందట వెళ్లారు. శనివారం రాత్రి ఇంటి వెనుకభాగంలోని గోడ, కిటికీలను తొలిగించి దుండగులు ఇంట్లోకి ప్రవేశించారు. బీరువా, మంచం కింద దాచిపెట్టిన 23 తులాల బంగారం, 12 కేజీల వెండిని దోచుకుపోయారు. సోమవారం ఉదయం సుబ్బారావు తన భార్యతో కలిసి వచ్చి ఇంటిలో చూడగా సామాన్లు చిందర వందరగా పడి ఉన్నాయి. చోరీ జరిగినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ షణ్ముకరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. విజయనగరం క్లూస్ టీం వేలిముద్రలను సేకరించింది. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. తొలిరోజు పరీక్ష ప్రశాంతం విజయనగరం అర్బన్: జిల్లాలో తొలిరోజు సోమవారం నిర్వహించిన పదో తరగతి తెలుగు పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా 119 పరీక్ష కేంద్రాల్లో 23,015 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 75 మంది గైర్హాజరయ్యారు. పట్టణంలోని పలు పరీక్ష కేంద్రాలను కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి సోమవారం పరిశీలించారు. సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రశాంత వాతావరణలో పరీక్షలు రాసేలా నిరంతరం పర్యవేక్షించాలని పర్యవేక్షకులకు సూచించారు. -
ఈసీహెచ్ఎస్ పాలిక్లినిక్ ప్రారంభం
చికెన్విజయనగరం అర్బన్: మాజీ సైనికులు, వారి కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ముఖ్యమైన అడుగు వేసింది. మాజీ సైనికుల కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ (ఈసీహెచ్ఎస్) పరిధిలో విజయనగరంలో కొత్త పాలిక్లినిక్ను ఏర్పాటు చేశారు. ఈ వైద్య కేంద్రాన్ని ఈస్టర్న్ నేవల్ కమాండ్ చీఫ్ స్టాఫ్ ఆఫీసర్ (పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్) రియర్ అడ్మిరల్ ఎం.మురళీమోహన్ రాజు సోమవారం ప్రారంభించారు. కార్యక్రమంలో కమాండ్ మెడికల్ ఆఫీసర్ సర్జన్ రియర్ అడ్మిరల్ దిలీప్ రాఘవన్, మాజీ సైనికుల ప్రతినిధులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా పరిధిలో నివసిస్తున్న సుమారు 15 వేల మంది ఈసీహెచ్ఎస్ లబ్ధిదారులకు ఈ పాలీక్లినిక్ ద్వారా వైద్య సేవలు అందనున్నాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఎం. మురళీ మోహన్రాజు మాట్లాడుతూ.. దేశానికి సేవలందించిన మాజీ సైనికులకు సమయానుకూలంగా నాణ్యమైన వైద్య సేవలు అందించడం ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో రీజినల్ సెంటర్ ఈసీహెచ్ఎస్ సెల్ అధికారి కెప్టెన్ ఎంవీఎస్ కుమార్, మాజీ సైననికులు పాల్గొన్నారు. -
రైతుల క(న)ష్టాలు పట్టించుకోరా..?
విజయనగరం ఫోర్ట్: మామిడి, జీడి మామిడి రైతులు కష్టాల్లో కూరుకుపోయారు. పూత ఆశాజనకంగా వచ్చినప్పటికీ వాతావరణంలో మార్పులు, పొగమంచు, తెగుళ్లు, పురుగు ఆశించడం కారణంగా పూతనల్లగా మాడిపోయింది. జిల్లా వ్యాప్తంగా రైతులు నష్టపోయారు. మెట్ట, కొండ ప్రాంత భూములు ఉన్న చిన్న, సన్నకారు రైతులకు మామిడి, జీడి మామిడి పంటలే జీవనాధారం. ప్రకృతి సహకరించకపోవడంతో పంటపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో పంటల బీమా ఉంటే పరిహారం అందేదని, ఆర్థికంగా ఆదుకునేదని రైతులు చెబుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉచిత పంటల బీమా పథకానికి మంగళం పాడేయడంతో రైతులకు కష్టాలు మొదలయ్యాయని వాపోతున్నారు. అధికారంలోకిరాక ముందు ఒకలా, వచ్చిన తర్వాత మరోలా చంద్రబాబు వ్యవహరించడంతో రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, బీమా ప్రీమియం చెల్లించినా పరిహారం ఇవ్వని పరిస్థితి నెలకొందని ఆరోపించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా కలెక్టరేట్ వద్ద ఏపీ రైతు, కౌలు, మామిడి, జీడిమామిడి రైతుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేశారు. రైతులను ఆదుకోవాలని, తక్షణమే ఉచిత పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రైతుల కష్టాలు, నష్టాలు పట్టించుకోరా అంటూ నిలదీశారు. ఏపీ రైతు సంఘం కార్యదర్శి బి.రాంబాబు మాట్లాడుతూ గత ఏడాది పంటల బీమా చెల్లించిన రైతులకు బీమా కంపెనీతో ప్రభుత్వ పెద్దల మాట్లాడి బీమా సొమ్మును ఇప్పించాలన్నారు. నష్ట పోయిన మామిడి, జీడి మామిడి రైతులకు ఉచిత పంటల బీమా అమలు చేయాలన్నారు. ఎకరానికి లక్ష రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీడిమామిడికి కేజీకి మద్దతు ధర రూ.200 ప్రకటించి ఆర్ఎస్కేల ద్వారా కొనుగోలు చేయాలన్నారు. ఆందోళనలో రైతు సంఘం నాయకులు పైడపునాయుడు, ఆదినారాయణమూర్తి, శ్రీను, రవిరాజు, రైతులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా అమలు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతులకు ఉచిత పంటల బీమాను అమలుచేసింది. విపత్తుల సమయంలో రైతులకు మేలు జరిగేది. బీమా సాయం ఠంచన్గా అందేలా ఏర్పాట్లు చేసేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదంటూ రైతులు వాపోతున్నారు. పరిహారం.. పరిహాసం.. గతేడాది మామిడి, జీడిమామిడి రైతులు వేలాదిమంది బీమా ప్రీమియం చెల్లించారు. మామిడి పంట నష్టపోతే ఎకరానికి రూ.40వేలు, జీడి మామిడికి రూ.30 వేలు బీమా వస్తుందని చెప్పడంతో మామిడి పంటకు 10,104 మంది రైతులు 6,358 ఎకరాలకు బీమా ప్రీమియం కింద రూ.1,27,16,000లు చెల్లించారు. జీడి మామిడి పంటకు 566 మంది రైతులు 378 ఎకరాలకు రూ.5,67,000లు బీమా ప్రీమియం చెల్లించారు. మామిడి పంటకు ఎకరానికి రూ.2 వేలు, జీడిమామిడికి రూ.1500 చొప్పన ప్రీమియం చెల్లించారు. గతేడాది మామిడి, జీడి మామిడి పంటలు దెబ్బతిన్నాయి. పంట దిగుబడి కూడ బాగా తగ్గిపోయింది. ప్రకృతి వైపరీత్యాలు కారణంగా పంట దెబ్బతింటే పంటలబీమా వర్తిస్తుందని ఆశపడ్డారు. ఏడాది గడిచినా ఇంతవరకు రైతులకు రూపాయి బీమా రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కలెక్టరేట్ వద్ద ఆందోళన చేసి ఉన్నతాధికారులకు తమకు జరిగిన అన్యాయాన్ని తెలియజేశారు. -
ఫిర్యాదులపై చర్యలు చేపట్టాలి
● ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డిపార్వతీపురం రూరల్: అర్జీదారులు తెలియజేసిన సమస్యలను పరిష్కరించాలని ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డి సిబ్బందిని ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఏడుగురు అర్జీదారులు తమ సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. ప్రధానంగా కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, భూ వివాదాలు, ఆన్లైన్ దగా, వేధింపులు, అధిక వడ్డీలకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి. అధికారులకు ఆదేశం.. బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న ఎస్పీ.. అక్కడికక్కడే సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఫిర్యాదులపై క్షుణ్ణంగా విచారణ జరిపి, వాస్తవాల ఆధారంగా చట్టపరిధిలో తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఫిర్యాదులపై తీసుకున్న చర్యలపై నివేదికను జిల్లా కార్యాలయానికి పంపాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ సీఐ ఆదాం, ఎస్సై రమేష్నాయుడు, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధి..
● కలెక్టర్ ప్రభాకరరెడ్డిపార్వతీపురం రూరల్: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కారవేదిక (పీజీఆర్ఎస్)లో ఆయన పాల్గొని అర్జీదారుల నుంచి 110 వినతులు స్వీకరించారు. ఇందులో రెవెన్యూ విభాగానికి 40, ఇతర శాఖలకు 70 దరఖాస్తులు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, క్షేత్రస్థాయిలో పరిశీలన తప్పనిసరని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వచ్చిన వినతుల్లో కొన్ని.. ● పార్వతీపురం బైపాస్ రోడ్డు ధూళి సమస్యను పరిష్కరించి, మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరారు. ● కురుపాం మండలం దొమ్మిడిని కొత్త పంచాయతీగా ప్రకటించాలని సర్పంచ్ ఎం. గౌరి, తదితరులు అర్జీ సమర్పించారు. ● గరుగుబిల్లి మండలంలో చెరువుల ఆక్రమణలను తొలగించాలని.. కొమరాడ, ఉక్కాడవలస ప్రాంతాల్లో భూములను ఆన్లైన్ చేయాలని అర్జీలు సమర్పించారు. ● బీఈడీ పూర్తి చేసిన తమకు ఉద్యోగ అవకాశం కల్పించాలని, వ్యవసాయానికి బోర్ మంజూరు చేయాలని గిరిజన యువకులు కోరారు. ● నాగావళి నదిపై 20 ఏళ్లుగా అసంపూర్తిగా ఉన్న పూర్ణపాడు – లాభేసు వంతెన నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు వంగల దాలినాయుడు డిమాండ్ చేస్తూ జేసీ యశ్వంత్కుమార్కు వినతిపత్రం అందజేశారు. ● గిరిజన వేతనదారుల నుంచి సొమ్ము వసూలు చేస్తున్న డ్వామా పీడీని సస్పెండ్ చేయాలని.. డీఈఓ కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న డిప్యుటేషన్లను రద్దు చేయాలని గిరిజన సంక్షేమ సంఘం నేత పాలక రంజిత్కుమార్ కోరుతూ వినతిపత్రం అందజేశారు. -
దారి చూపండి.. ప్లీజ్..
గజపతినగరం: ఓ వ్యక్తి ఇంటి నిర్మాణంలో రోడ్డుకు అడ్డంగా గోడ కట్టేశారు.. కనీసం ఆటో కూడా వెళ్లడంలేదు.. తక్షణమే సమస్యకు పరిష్కారం చూపాలంటూ గజపతినగరం మండలం పురిటిపెంట న్యూకాలనీ వాసులు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ను చుట్టుముట్టి గోడు వినిపించారు. అనంతరం వినతిపత్రం అందజేశారు. రహదారికి అడ్డంగా ఉండే గోడను తొలగించి రహదారి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. రైతులు ఉద్యానవన పంటల సాగుకు ప్రాధ్యాన్యమివ్వాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. గజపతినగరం పంచాయతీ ఎమ్.వెంకటాపురం గ్రామంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పలు రకాల నూతన వంగడాలు, పరికరాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ జేడీ వి.టి.రామారావు, పశుసవంర్ధక శాఖ ఎ.డి. ఎన్.చంద్ర శేఖర్, ఎ.డి.ఎ. ఎ.నిర్మళాజ్యోతి, ఎంపీపీ బెల్లాన జ్ఞానదీపిక, జెడ్పీటీసీ సభ్యుడు గార తవుడు, ఏఓ కిరణ్ కుమార్ పాల్గొన్నారు. -
వ్యవస్థ మెరుగుపడేలా కథనాలు..
● కలెక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డిపార్వతీపురం: వ్యవస్థను మెరుగుపరిచేలా, ప్రజలకు ఉపయోగపడేలా వార్త కథనాలు ఉండాలని కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి అన్నారు. సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా మీడియా అక్రిడేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు 196 కార్డులు అందజేసినట్లు చెప్పారు. జర్నలిజం సూత్రాలపై రిపోర్టర్లకు ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేయాలని పలువురు జర్నలిస్టులు కోరారు. కార్యక్రమంలో జేసీ యశ్వంత్కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్లు ఆర్. వైశాలి, పవర్ స్వప్నిల్ జగన్నాథ్, డీపీఆర్ఓ కె. బాల్మాన్సింగ్, తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా శ్రీవారి తెప్పోత్సవం
డెంకాడ: చింతలవలస ఐదవ ఏపీఎస్పీ బెటాలియన్ వద్ద ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారి తెప్పోత్సవం ఆదివారం సాయంత్రం వైభవంగా జరిగింది. వెంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవంలో భాగంగా ఆదివారం ఉదయం సుప్రభాతసేవ, వేదపండితులు పూజలు ప్రారంభించారు. అర్చన, మంత్రపుష్పం, నైవేద్యం, సేవాకాలం, భక్తుల దర్శనాలు, తులసి అర్చన పూజలు చేశారు. యాగశాల పూజలు, విశేష హోమాలు, నీరాజనం, మంత్రపుష్పం పూజలు నిర్వహించారు. లక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన పూజ చేశారు. అనంతరం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేరులో పూలు, రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరణ చేసి హంస వాహనంపై స్వామివారు శ్రీదేవి, భూదేవి సమే తంగా విహరించారు. చింతలవలస ఐదవ ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ వై.రవిశంకర్రెడ్డి తదితరులు తెప్పోత్సవంలో భాగంగా పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
పదో తరగతి పరీక్షలపై సమీక్ష
● పరీక్షలు సజావుగా నిర్వహించాలి ● ఎస్ఎస్సీ పరీక్షల రాష్ట్ర పరిశీలకురాలు తహేరా సుల్తానా విజయనగరం అర్బన్: పదవ తగరతి పబ్లిక్ పరీక్షలను సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై ఎస్ఎస్సీ పరీక్షల రాష్ట్ర పరిశీలకురాలు తహేరా సుల్తానా జిల్లా స్థాయి స్క్వాడ్ బృందాలతో ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో రెవెన్యూ, విద్యా శాఖ, పోలీస్ శాఖల అధికారులతో కూడిన స్క్వాడ్ బృందాలు పాల్గొన్నాయి. పరీక్ష కేంద్రాల్లో చేపట్టిన ఏర్పాట్లను రాష్ట్ర పరిశీలకురాలు సమీక్షించి, పరీక్ష లు నిష్పక్షపాతంగా, క్రమశిక్షణతో నిర్వహించేందు కు అవసరమైన సూచనలు అధికారులకు అందించారు. పరీక్షల సమయంలో ఎలాంటి అవాంఛనీ య సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. స్క్వాడ్ బృందాలు పరీక్ష కేంద్రాలను నిరంతరం తనిఖీ చేస్తూ పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. విద్యా శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. రెవెన్యూ, విద్యా శాఖ అధికారు లు కేంద్ర సూపరింటెండెంట్లతో సమన్వయం చేసుకుంటూ పరీక్షల నిర్వహణను సమర్ధవంతంగా పర్యవేక్షించాలని సూచించారు. సమావేశంలో డీఈఓ యు.మాణిక్యంనాయుడు, పరీక్షల కమిషన ర్ టి.సన్యాసిరాజు తదితరులు పాల్గొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు విజయనగరం క్రైమ్ : జిల్లాలో టెన్త్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా పోలీసు వర్గాలు తెలిపాయి. విద్యార్థులు ఎటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కేంద్రాలకు తీసుకురాకూడదని పేర్కొంది. పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు కట్టుదిట్టమైన పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టు తెలిపాయి. -
దుర్గాదేవి నిజరూప దర్శనానికి పోటెత్తిన భక్తులు
వీరఘట్టం: స్థానిక శ్రీకోటదుర్గ తల్లి ఆలయ తృతీయ వార్షికోత్సవం ఆదివారం కనులపండువగా నిర్వహించారు. యజ్ఞకర్త ఎస్.వి.ఎల్.ఎన్ శర్మయాజీ ఆధ్వర్యంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, పరిషత్ కృఛ్చత్రయం, పంచగవ్వ ఆరాధన, అఖండ దీపారాధన, ఋత్విక్ వరుణ ప్రధానం, యాగశాల ప్రవేశ ద్వారపూజ, ధ్వజ పతాకావిష్కరణ, మండల మండపారాధనతో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు అమ్మవారి నిజరూప దర్శనాన్ని భక్తులు తిలకించారు. నిజరూపంలో ఉన్న దుర్గాదేవికి భక్తులు మట్టి కుండలతో తెచ్చిన పాలతో అర్చకులు దుర్గాదేవిరి క్షీరాభిషేకాలు చేశారు. సాయంత్రం దుర్గాదేవి భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. -
స్టీల్ప్లాంట్ ఏర్పాటుకు వ్యతిరేకం
● జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణగుర్ల: మండలంలోని కెల్ల, బెల్లానపేట, దమరసింగి, వల్లాపురం, మన్యపురిపేట గ్రామాలలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేయునున్న ఇంటిగ్రేటేడ్ స్టీల్ ప్లాంట్కు జనసేన వ్యతిరేకమని జనసేన రాష్ట్ర నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ స్పష్టం చేశారు. మండలంలోని బెల్లానపేటలో ఐదు గ్రామాల రైతులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టీల్ప్లాంట్కు వ్యతిరేకంగా, రైతుల పక్షాన పోరాటం చేస్తామని హమీ ఇచ్చారు. పరిశ్రమలు మొట్ట ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని, మూడు పంటలు పండే పల్లం ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం వల్ల రెతులుకు అన్యాయం జరుగుతుందన్నారు. సాగు భూములను పరిశ్రమలకు కట్టబెట్టడాన్ని తప్పుబట్టారు. పంచాయతీల తీర్మానం లేకుండా ప్లాంట్లు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఈ సమస్యను జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. కార్యక్రమంలో జనసేన చీపురుపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు, జనసేన నేత రమేష్ రాజు ఉన్నారు. -
ఉపాధ్యాయులపై పనిభారం తగ్గించాలి..
● పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్యగజపతినగరం రూరల్: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులపై తీవ్రమైన పని ఒత్తిడి ఉందని.. వెంటనే ప్రభుత్వం స్పందించి పనిభారం తగ్గించాలని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య డిమాండ్ చేశారు. మండలంలోని మరుపల్లిలో గల బాలాజీ పాలిటెక్నిక్ కళాశాలలో పీఆర్టీయూ ఐదో జిల్లా కార్యనిర్వాహక వర్గ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఆర్టీయమూ సంఘాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, అందుకు అవసరమైన సభ్యత్వ నమోదు మరింత ఎక్కువ స్థాయిలో చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏఎం గిరిప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉపాధ్యాయలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో పోరాటాలు చేయక తప్పదన్నారు. అనంతరం జనరల్ సెక్రెటరీ డి. శ్రీనివాస్ సంఘ వార్షిక నివేదికను సభకు సమర్పించారు. ఈ సందర్భంగా మూడోసారి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా తమ సంఘం తరఫున ఎన్నికై న గాదె శ్రీనివాసులునాయుడును రాష్ట్ర నాయకులు ఘనంగా సత్కరించారు. అంతకుముందు ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు వలిరెడ్డి రవీంద్రనాయుడు, జిల్లా జనరల్ సెక్రెటరీ డి.శ్రీనివాస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రావాడ రాంబాబు, బైరి అప్పారావు, పప్పల రాజశేఖర్, ఆల్తి రాంబాబు, డెక్క వెంకటరావు, బండారు రవికుమార్, బూడి వెంకటరావు, పీఆర్టీయూ మండల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఏరియా ఆస్పత్రిని సందర్శించిన వైద్య బృందం
సీతంపేట: స్థానిక ఏరియా ఆస్పత్రిని రాష్ట్ర కాయకల్ప వైద్య బృందం ఆదివారం సందర్శించింది. ఆస్పత్రి సర్టిఫికేషన్కు అర్హత ఉందా.. లేదా.. అనేది పరిశీలించారు. ఆస్పత్రి పరిసరాలు, పారిశుధ్యం, బయో వేస్ట్ మేనేజ్మెంట్ ఇతర అంశాలను క్షుణ్నంగా తనిఖీ చేశారు. బెడ్ల సౌకర్యాలు, రోగుల వివరాలు తెలుసుకున్నారు. రక్త పరీక్షల రికార్డులు, కిట్లు చూశారు. రోగులతో ఆస్పత్రిలో కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో టీం లీడర్ ప్రవీణ్, బయో మెడికల్ ఇంజినీర్ సంతోష్, ఎన్క్వాస్ నోడల్ ఆఫీసర్ మణికంఠ, ప్రాంతీయ ఆస్పత్రి సూపరింటెండెంట్ బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ సక్సెస్ మీట్
విజయనగరం అర్బన్: నగరంలోని ఓ ప్రైవేట్ సమావేశ మందిరంలో ఆర్ఎస్ రెడ్డి ఇన్న్స్టిట్యూట్ సక్సెస్ మీట్ ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఆఫ్లైన్ కోచింగ్తో పాటు ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ యాప్ ద్వారా ఆన్లైన్ శిక్షణ అందించడం గొప్ప విషయమన్నారు. గ్రూప్ వన్లో ఒకరు, గ్రూప్–2లో 66 మంది అభ్యర్థులు ఉద్యోగాలు సాధించడం విజయనగరం జిల్లాకే గర్వకారణమన్నారు. అనంతరం గ్రూప్స్ విజేతలను సన్మానించారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు, మాజీ ఎమ్మెల్సీ రఘువర్మ, ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డి. రామకృష్ణ, ఎయిమ్స్ గ్రూప్స్ ప్రతినిధి కడగల ఆనంద్, ఏఎంసీ ప్రతినిధి గేదెల రాజారావు, సువ్వాడ రవిశేఖర్, తదితరులు పాల్గొన్నారు. -
పీడీఓ జిల్లా కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవం
విజయనగరం రూరల్: పంచాయతీ అభివృద్ధి అధికారుల (పీడీఓ) జిల్లా సంఘం ఎన్నిక ఏకగ్రీవమైంది. పట్టణంలోని ఏపీ ఎన్జీఓ భవనంలో పంచాయతీ అభివృద్ధి అధికారుల జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా మంత్రి రమణ, కార్యదర్శిగా కె. శ్రీకాంత్ ఎన్నికయ్యారు. అసోసియేట్ అధ్యక్షుడిగా తాడి వెంకటరావు.. ఉపాధ్యక్షులుగా ఎం.జగదీష్, సీహెచ్ ప్రసాద్, ఎ. ప్రవీణ్కుమార్, ఎస్.సురేష్, బి.భవానీ.. సంయుక్త కార్యదర్శులుగా ఎస్.హేమాంజలి, పి. రాంబాబు, కె. వెంకటరావు, ఎ. ముజీబ్, టి. రజని.. కోశాధికారిగా వి. శ్రీనివాస్.. కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎం.స్వామినాయుడు.. గౌరవ అధ్యక్షుడిగా యర్ర రమణలతో పాటు 8 మంది సభ్యులు ఎన్నికయ్యారు. అలాగే ప్రధాన సలహాదారుగా అచ్యుతరావు, న్యాయ సలహాదారునిగా పప్పు త్రినాథ్ ఎన్నికై నట్లు ఏపీ ఎన్జీఓ జిల్లా ఉపాధ్యక్షుడు కె. శ్రీనివాసరావు తెలిపారు. సహాయ ఎన్నికల అధికారిగా ఎం. శ్రీనివాసరావు, ఎన్నికల పరిశీలకుడిగా కె. చంద్రశేఖర్ వ్యవహరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు ఎ. సురేష్ మాట్లాడుతూ.. పీడీఓల సమస్యలపై పోరాటం చేయడానికి ఏపీ ఎన్జీఓ అండగా ఉంటుందన్నారు. వన్ పీడీఓ – వన్ యూనియన్ నినాదంతో సభ్యులందరూ ఏకమై సమస్యల పరిష్కరానికి కృషి చేయాలని తీర్మానించారు. కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా సుమారు 300 పైగా పీడీఓలు హాజరయ్యారు. -
పాలనపై పట్టులేని చంద్రబాబు
రేగిడి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు 40 సంవత్సరాల అనుభవమని డప్పు కొట్టుకోవడమే తప్ప పాలనపై పట్టులేదని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. మండలంలోని అక్కన్నఅగ్రహా రం గ్రామానికి ఆదివారం వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి కాకుండా కేవలం అబద్దపు ప్రచారాలకే పరిమితమైందని అన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో చేసి న అప్పు కంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కాకముందే రూ.3.35 లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ప్రజలకున్న అభిమానాన్ని చూసి ఓర్వలేకే పార్టీపై బురదజల్లే కార్యక్రమం చేపడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా గాలికొదిలేసి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని డబ్బా కొట్టుకోవడమేనని అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇంత వరకు బడుగు బలహీన వర్గాల వారికి ఇళ్లు, అర్హులైన వారికి పింఛన్లు అందజేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను చంద్రబాబు ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా రద్దు చేసిందని మండిపడ్డారు. గతంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రైతులకే ఏటా రూ.13వేలు పెట్టుబడి సాయం అందించి ఆదుకుందని, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో రూ.20 వేలు పెట్టుబడి సాయం ఇస్తామని హామీ ఇచ్చి మొండి చేయి చూపించారని విమర్శించారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు టి.అచ్చెన్నాయుడు, మండల పార్టీ కన్వీనర్ వి.జగన్మోహనరావు, మండల పార్టీ ఉపాధ్యక్షులు కె.వెంకటేశ్వరరావు, బీసీ సెల్ అధ్యక్షులు కరణం శ్రీనివాసరావు, సర్పంచ్లు కె.గోవిందరావు, గార రమణ, ఉప సర్పంచ్ బాలి తవిటినాయుడు, పి.ధవళేశ్వరరావు ఉన్నారు. -
బండి నడవదు..
విజయనగరంసోమవారం శ్రీ 16 శ్రీ మార్చి శ్రీ 2026బండ రానిదే..ఎండాకాలం వచ్చిందంటే కొన్ని రకాల వ్యాధు లు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ల సరఫరాపై అనిశ్చితి నెలకొంది. యుద్ధానికి ముందు రోజు వారి ఇండెంట్ పెడితే సరఫరా చేసే ఏజెన్సీలు ప్రస్తుతం 10 రోజులు ముందుగా డీడీల రూపంలో నగదు చెల్లించినా సరఫరా చేసేందుకు ముందుకు రావటం లేదు. దీంతో గ్యాస్ తక్కువగా వినియోగమయ్యే వంటలు మాత్రమే వండుతున్నాం. ప్రభుత్వం ఓ వైపు గ్యాస్ కొరత లేదంటూ ప్రకటనలు చేస్తున్నా వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఈ విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. లేకుంటే హోటల్ రంగం నష్టాల ఊబిలో కూరుకుపోతుంది. – జి.శ్రీనివాస్, అధ్యక్షుడు, ఏపీ హోటల్స్ అసోసియేషన్ విజయనగరం: పశ్చిమాసియాలో యుద్ధం భారత్లో వంట గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది. వంట గ్యాస్ ఫిల్లింగు టెర్మినల్స్లో నాన్ డొమిస్టిక్ సిలిండర్ల (ఎన్టీసీ) ఉత్పత్తి, అమ్మకాలపై ఇప్పటికే కోత పడగా.. గత రెండు రోజుల నుంచి ఏకంగా వంట గ్యాస్ సిలిండర్ల ఫిల్లింగ్ కూడా మందకొడిగా సాగుతోంది. ఉత్తరాంధ్రలోని అన్ని గ్యాస్ ఏజెన్సీల డీలర్లకు.. ఒక్కో డీలరుకి రోజుకు ఒక్క లోడు మాత్రమే ఇచ్చేందుకు ఆయిల్ కంపెనీలు ఉత్తర్వులను జారీ చేసినట్టు సమాచారం. యుద్ధ ప్రభావానికి ముందు ఒక్కో డీలరుకు గరిష్టంగా రెండు లేదా మూడు లోడ్ల వరకు ఫిల్లింగ్ జరిగేది. ఇప్పుడు ఒక్క లోడుకే పరిమితం చేయడంతో డీలర్ల వద్ద క్రమేణ నిల్వలు తగ్గుతున్నాయి. మరో వైపు వాణిజ్య సిలిండర్ల సరఫరా నిలిచి హోటళ్లు, చిరు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. విజయనగరంలోనే సగటున 70 వేల వరకు వాణిజ్య సిలిండర్లు వినియోగిస్తారు. వాటికి సరఫరా నిలిచి పలు హోటళ్లలో వంటకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఇదే పరిస్థితి జిల్లా వ్యాప్తంగా ఉంది. ఇదే సమయంలో గృహాలకు వంటగ్యాస్ సరఫరాలో సైతం ఆంక్షలు మొదలయ్యాయి. గ్యాస్ సిలిండరు తీసుకున్న 25 రోజులు పూర్తయితేనే మరొక సిలిండర్ బుకింగ్కు అవకాశం ఉంది. పలువురు బుకింగ్ కోసం ప్రయత్నిస్తున్నా కావడం లేదు. వారం రోజుల నుంచి గ్యాస్ బుకింగ్ చేద్దామని ఆన్లైన్ నెంబరుకు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ అని వస్తోంది. దీంతో డీలర్ల వద్దకు పరుగెడుతున్నారు. భారీగా తగ్గిన కమర్షియల్ గ్యాస్ సరఫరా జిల్లాలో గ్యాస్ ధరల భారం మోస్తున్న పెద్ద, చిన్న హోటళ్ల నిర్వాహకులకు వేధిస్తున్న గ్యాస్ కొరత గోరుచుట్టుపై రోకటిపోటులా మారింది. కొరతను సాకుగా చూపి కొందరు డీలర్లు చేస్తున్న నల్లబజారు వ్యాపారంతో నలిగిపోతున్నామని వాపోతున్నారు. ఫలితంగా ఎంతో మంది ఉపాధికి కష్టం అవుతోంది. ధరలు పెరిగితే ప్రజలపై ఆర్థిక భారం పడుతుంది. ధర పెరగడంతో పాటు సరఫరా నిలిచిపోయింది. రోజుకు 5 సిలిండర్లు అవసరమైతే అసలు అందడం లేదు. బ్లాక్ మార్కెట్లో రూ.500 నుంచి రూ.1000 అదనపు వసూలు చేస్తున్నారు. జిల్లా హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు అందించిన సమాచారం ప్రకారం జిల్లాలోని ఆహార పదార్దాలు తయారు చేసి విక్రయించేందుకు అవసరమైన కమర్షియల్ గ్యాస్ ప్రతి నెల 30వేల కేజీల అవసరం కాగా... ప్రస్తుతం కేవలం 8వేల కేజీల అందిస్తుండటం గమనార్హం. ఇదే ప్రభావం మరికొన్ని రోజులు కొనసాగితే టిఫిన్లు, ఫాస్ట్ఫుడ్, బిర్యానీలు, స్వీట్లు, పిండి వంటలు, కర్రీ పాయింట్లు, బేకరీ ఆహారాల రేట్లు పెరిగిపోతాయి. బయట ఉండి చదువుకుంటున్న విద్యారులు, ఉద్యోగులపై పెనుభారం పడనుంది. పెరిగిన ధరలు గ్యాస్ బండ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. వంట గ్యాస్పై రూ.60, వాణిజ్య (కమర్షియల్) సిలిండరుపై రూ.115 పెంచింది. యుద్ధం ఇలానే కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయి. జిల్లాలో రోజుకు సరాసరి 4 వేల నుంచి 6 వేల సిలిండర్లు వినియోగదారులకు ఏజెన్సీల నుంచి పంపిణీ జరుగుతోంది. పెరిగిన ధరలతో వినియోగదారులపై రూ.5 లక్షల వరకు భారం పడే అవకాశాలున్నాయి. ప్రతీ రోజు వేలాది మంది స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారు ఆకలిని తీర్చుకునేందుకు హోటల్స్, మెస్లును ఆశ్రయిస్తుంటారు. గ్యాస్ కొరత తీవ్ర ఇబ్బందికరంగా మారింది. కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తున్నాం. మూసివేసే పరిస్థితులు నెలకొన్నాయి. – పి.వాసు, అధ్యక్షుడు, విజయనగరం హోటల్ అసోసియేషన్ నగరంలో పలు హోటళ్ల నిర్వాహకులు వాణిజ్య సిలిండర్లకు ప్రత్యామ్నాయాల వైపు దృష్టి పెట్టారు. కొన్ని చిన్న హోటళ్ల నిర్వాహకులు ఏకంగా కట్టెల పొయ్యిలు వాడుతున్నారు. కొన్ని హోటళ్ల యాజమాన్యాలు గతంలో మాదిరి అన్ని రకాలు పెట్టలేమని చెబుతున్నారు. ఆహార సరఫరాలో సైతం మూడు, నాలుగు రకాలు మాత్రమే అందిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో వందల సంఖ్యలో చిన్నహోటళ్లు, టిఫిన్ తోపుడు బళ్లు, వాహన టిఫిన్ సెంటర్ల ఆధారంగా వేల మంది జీవనోపాధి పొందుతున్నారు. ఒక్కో హోటల్లో ముగ్గురు నుంచి పది మంది వరకు పని చేస్తున్నారు. వీరి సంఖ్య క్రమంగా తగ్గించుకుంటున్నారు. -
రూ.3.20 కోట్ల గంజాయి పట్టివేత
బొండపల్లి: ఒడిశా కేంద్రంగా విశాఖపట్నంకు భారీగా తరలిస్తున్న గంజాయిని విశాఖకు చెందిన నార్కోటిక్ సెంట్రల్ బ్యూరో(ఎన్సీబీ) పోలీసులు ఆదివారం వేకువజామున పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు.. ఒడిశాలోని సిమిలిగూడ ప్రాంతానికి చెందిన అజయ్రాయ్ తన బొలెరో వ్యాన్లో వేకువజామున వ్యాన్లో కింద గంజాయి ప్యాకెట్లు పేర్చి పైన క్యాబేజీలను వేసి రవాణా చేస్తుండగా ఎన్సీబీ పోలీసులకు అందిన సమాచా రం మేరకు బొండపల్లి పోలీస్స్టేషన్ మీదుగా వెళ్తు న్న బొలెరో వాహనాన్ని పట్టుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. 647 కేజీల గంజాయి స్వాధీనం విశాఖపట్నం ఎన్సీబీకి అందిన సమాచారం మేర కు ఒడిశాలోని సిమిలిగూడ నుంచి విశాఖపట్నం తరలిస్తున్న 647కేజీల గంజాయిని పట్టుకోవడంతో పాటు వ్యాన్ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. దాడుల్లో ఎన్సీబీ పోలీసులు, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్ఐలతో పాటు సిబ్బంది పాల్గొని బొలెరో వ్యాన్ను పట్టుకున్నారు. ఆరా తీ యగా కాయగూరలు రవాణా మాటున గంజాయి తరలింపు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గంజాయి విలువ రూ.3.20 కోట్లు పోలీసులకు పట్టుబడిన గంజాయి విలువ సుమా రు రూ.3.20 కోట్లు ఉంటుందని పోలీసులు గుర్తించారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకోవడంతో పాటు అందుకు సహకరించిన వారిపై ఆరా తీసే పనిలో ఎన్సీబీ పోలీసులు నిమగ్నమయ్యారు. -
కాపాడాల్సిన మీరే ఆక్రమిస్తే ఎలా..?
● బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయనకు ఫోన్ చేసి ప్రశ్నించిన పీసీసీ చీఫ్ షర్మిలబొబ్బిలి: ప్రజల ఆస్తులను కాపాడాల్సిన మీరే సమస్యగా మారితే ఎలా అని.. బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయనను పీసీసీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు. మండలంలోని పారాదిలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర – రచ్చబండ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సమయంలో బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట గ్రామానికి చెందిన ఏడుగురు పేదలు ఆమెను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. 1991లో ప్రభుత్వం తమకు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ భూములను పంపిణీ చేయగా..సాగు చేసుకుంటున్నట్లు బాధితులు పీసీసీ చీఫ్ దృష్టికి తీసుకువచ్చారు. అయితే ఇటీవల బేబినాయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ భూమిని రియల్టర్లకు అప్పగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ దగ్గర భూమికి సంబంధించి ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలు, బ్యాంకుల్లో చెల్లిస్తున్న క్రాప్లోన్లు, రైతుభరోసా వచ్చిన వివరాలు వైఎస్ షర్మిలకు చూపిస్తూ న్యాయం చేయాలని కోరారు. దీంతో ఆమె వెంటనే ఎమ్మెల్యే బేబి నాయనకు ఫోన్ చేయగా.. ఆ భూముల విషయం తర్వాత వివరిస్తానని బదులిచ్చారు. నాకు చెప్పవద్దు.. బాధితులకు వివరించాల్సిన బాధ్యత మీపై ఉంది కాబట్టి వెంటనే సమాధానం చెప్పాలని పీసీసీ చీఫ్ పట్టుబట్టగా, ఎమ్మెల్యే స్పందిస్తూ వారి ఆరోపణల్లో నిజం లేదు.. వారు చెప్పిన సర్వే నంబర్ వేరు.. ఈ సర్వే నంబర్ వేరు.. నేను ఇప్పుడు రాజాంలో ఉన్నాను. తర్వాత చెప్తాను అంటూ ఫోన్ కట్ చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, బాధితుల వినతి మేరకు ఆమె అధికారులకు ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు విద్యాసాగర్, ఇన్చార్జ్ మువ్వల శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. -
సమాజాన్ని చైతన్యపరచాలి
● యూటీఎఫ్ మహిళా సదస్సులో సీఐటీయూ రాష్ట్ర నాయకురాలు పి.మణివిజయనగరం అర్బన్: మహిళలపై జరుగుతున్న అణచివేత, లింగవివక్ష, భౌతిక దాడులలను ఎదుర్కొనేందుకు ఉపాధ్యాయులు సమాజంలో చైతన్యం తీసుకురావాలని సీఐటీయూ రాష్ట్ర నాయకురాలు పి.మణి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని యూటీఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక జిల్లా పరిషత్ మినిస్ట్రీరియల్ హాల్లో ‘సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర’ అనే అంశంపై జరిగిన సదస్సుకు ఆమె ముఖ్యవక్తగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల మూసివేత కారణంగా బాలికలు విద్యకు దూరమవుతున్నారని, ఇది సమాజాభివృద్ధికి ప్రతికూలమన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహనరావు మాట్లాడుతూ.. మహిళా ఉపాధ్యాయుల కోసం పాఠశాలల్లో మౌలిక వసతులు, ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ డిమాండ్ల సాధనకు యూటీఎఫ్ పోరాటం చేస్తోందన్నారు. మహిళా కమిటీ కన్వీనర్ జి.సుశీల, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కె.కస్తూరి, రాష్ట్ర కౌన్సిలర్ బీబీఎల్ మాధవీలత, తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ భాస్కరరావు, కోశాధికారి సీహెచ్ తిరుపతినాయుడు, జిల్లా కార్యదర్శులు కె.ప్రసాద్, ఎ.శంకరరావు, జి.రాజారావు, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు జేఆర్సీ పట్నాయక్, రాష్ట్ర కుటుంబ సంక్షేమ డైరెక్టర్ జేఏవీఆర్కే ఈశ్వరరావు, సీనియర్ నాయకుడు డి.రాము, తదితరులు పాల్గొన్నారు. -
ఎక్స్పోలో సీతం విద్యార్థుల ప్రతిభ
విజయనగరం అర్బన్: విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో విశాఖపట్నంలో శనివారం నిర్వహించిన ఎలెక్సెంట్రా – 2026లో భాగంగా నిర్వహించిన ప్రాజెక్ట్ ఎక్స్పోలో పట్టణానికి చెందిన సీతం ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో సీతం కళాశాల విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్ట్కు ద్వితీయ బహుమతి అభించింది. కళాశాల ఈసీఈ విభాగానికి చెందిన బీటెక్ రెండో సంవత్సరం విద్యార్థులు ఎం.హైమ, ఎస్.తేజశ్రీవల్లి, పి.అఖిల్, కె.శ్రీనివాసరావు బృందం ‘ఓపెన్ సివిని ఉపయోగించి వర్చువల్ డాష్బోర్డ్’ అనే వినూత్న ప్రాజెక్ట్ రూపొందించారు. కంప్యూటర్ వెబ్కెమెరా ద్వారా చేతి కదలికలను గుర్తించి సంబంధిత లోడ్లను పనిచేయించే విధంగా ఈ సిస్టమ్ పనిచేస్తుంది. ఈ సాంకేతికతను ముఖ్యంగా ఏటీఎంలు, పరిశ్రమలలో వినియోగించవచ్చని విద్యార్థులు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు, ఈసీఈ విభాగాధిపతి టి.దామోదరనాయుడు విజేతలకు సర్టిఫికెట్లు, బహుమతులు అందజేసి అభినందించారు. ముగిసిన ఎలక్ట్రిక్ వెహికల్ డిజైన్ శిక్షణ సీతం ఇంజినీరింగ్ కళాశాలలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (ఈఈఈ) విభాగం ఆధ్వర్యంలో ‘ఎలక్ట్రికల్ వెహికల్ డిజైన్’ అంశంపై వారం రోజుల పాటు నిర్వహించిన నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం శనివారంతో ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతితిగా హాజరైన ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రతినిధి ఎస్.విష్ణువర్థన్ ఎలక్ట్రిక్ వెహికల్ డిజైన్, సిమ్యులేషన్ ప్రాజెక్ట్ల రూపకల్పనపై అవగాహన కల్పించారు. అనంతరం కళాశాల డైరెక్టర్ డాక్టర్ శశిభూషణరావు ఆయన్ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీ రామమూర్తి, ఈఈఈ విభాగాధిపతి డాక్టర్ వై.నరేంద్రకుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఎంపికలో ప్రాధాన్యం..
యువికా ఎంపిక ప్రక్రియంలో మార్కులకు ఉండే ప్రాధాన్యతను విద్యార్థులు గుర్తించాలి. ముఖ్యంగా 8వ తరగతిలో వచ్చే మార్కులకు 50 శాతం, రాష్ట్ర, జాతీయ స్థాయి సైన్స్ ప్రదర్శనలు, ప్రతిభా పరీక్షల్లో తొలి మూడు స్థానాలు సాధించిన విద్యార్థులకు 10 శాతం, స్కౌట్, ఎన్సీసీ విభాగాలకు చెందిన విద్యార్థులకు 5 శాతం రిజర్వేషన్లు ఉంటాయి. ఎంపికై న విద్యార్థుల ఖర్చులు ఇస్రో భరిస్తుంది. దేశంలో ఉన్న ఏడు ఇస్రో కేంద్రాల్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ ప్రాంత పరిధిలో ఉండే శ్రీహరికోట, హైదరాబాద్ కేంద్రాల్లో శిక్షణ పొందే అవకాశం ఉంటుంది. – గిరడ లక్ష్మణరావు, జిల్లా సైన్స్ అధికారి, పార్వతీపురం మన్యం -
ప్రాణం తీసిన అజాగ్రత్త..
● లారీ టైర్ కింద పడి డ్రైవర్ మృతి కొత్తవలస: మండలంలోని కంటకాపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ఒక డ్రైవర్ అజాగ్రత్త వల్ల మరో డ్రైవర్ ప్రాణం పోయింది. శనివారం జరిగిన ఈ ప్రమాదంలో మొయ్యి శ్రీను (53) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. లక్కవరపుకోట మండలం జమ్మాదేవిపేట గ్రామానికి చెందిన మొయ్యి శ్రీను లారీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో కొత్తవలస మండలం కంటకాపల్లి గ్రామ సమీపంలో గల రైల్వేస్టేషన్ బొగ్గు యార్డు నుంచి లారీలో బొగ్గు లోడ్ చేసుకుని సమీపంలోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ఆపాడు. లారీ నుంచి బొగ్గు ధూళి పైకి ఎగరకుండా ఉండేందుకు టార్పాలిన్ కప్పుతున్నాడు. ఈ క్రమంలో లారీ కింద పడుకుని తాడు కడుతుండగా.. అదే సమయంలో అక్కడే ఉన్న మరో లారీ రివర్స్గా వస్తూ శ్రీను తలపైనుంచి వెళ్లిపోయింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. లారీని రివర్స్ చేస్తున్న డ్రైవర్ అజాగ్రత్త వల్ల మరో లారీ డ్రైవర్ మృతి చెందడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. నేడు ఉల్లాస్ ఎఫ్ఎల్ఎన్ఏటీ పరీక్ష విజయనగరం అర్బన్: వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ఉల్లాస్ అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఉల్లాస్ ఎఫ్ఎల్ఎన్ఏటీ పరీక్ష ఆదివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు వయోజన విద్య నోడల్ అధికారి ఎ.వేణుగోపాలకృష్ణ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని 27 మండలాలు, 4 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 1,11,369 మంది అభ్యాసకులు పరీక్షకు హాజరుకానుండగా ఇందుకు 1,356 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు ఎస్జీటీలు, అంగన్వాడీ ఉపాధ్యాయులను ఇన్విజిలేటర్లుగా నియమించినట్లు తెలిపారు. పరీక్షల పర్యవేక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం వయోజన విద్యా విభాగానికి చెందిన ప్రదీప్ బి.హెదాపూను జిల్లా పరిశీలకుడిగా నియమించిందని తెలిపారు. అదేవిధంగా జిల్లా సమన్వయ కమిటీతో పాటు మండల స్థాయిలో ఎంపీడీఓలు, ఏపీఎంలు సీడీపీఓలు, మున్సిపల్ స్థాయిలో సీఎంఎంలు, వయోజన విద్యాశాఖ పర్యవేక్షకులు పరీక్షల నిర్వహణను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించనున్నారన్నారు. మృతిపై అనుమానాల్లేవు.. విజయనగరం క్రైమ్: విజయనగరం వన్టౌన్ పీఎస్ పరిధిలోని తోటపాలెం రామ మందిరం సమీపంలో నివసిస్తున్న మోహన్ అనే వ్యక్తి శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈయన రక్తపు మడుగులో పడి ఉండడంపై మొదట్లో అనుమానాలు వ్యక్తం చేసినా ప్రస్తుతం ఎటువంటి అనుమానాలు లేవని సీఐ చౌదరి తెలిపారు. ఈ మేరకు మృతుని భార్య పద్మావతి కుమార్తెతో కలిసి శనివారం స్టేషన్కు వచ్చి తన భర్త మృతిపై ఎటువంటి అనుమానాల్లేవని చెప్పిందన్నారు. మద్యం మత్తులో మంచంపై పడిపోవడం వల్ల తలకు గాయమై రక్తం కారినట్లు క్లూస్ టీమ్ సభ్యులు కూడా తేల్చారన్నారు. ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన విజయనగరం రూరల్: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన రామనారాయణంలో శనివారం నిర్వహించిన బాలల నృత్య ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. బొబ్బిలి గ్రామానికి చెందిన పవిత్ర నృత్యాలయం బృందంచే ప్రదర్శించిన వివిధ నృత్య రూపకాలు అలరించాయి. అనంతరం బాలలకు ఆలయ మేనేజర్ ఏవీ రమణ ప్రశంసాపత్రాలు అందించారు. ఉచిత నేత్ర వైద్యశిబిరానికి స్పందన విజయనగరం టౌన్: నగరంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో స్వామి కంటి ఆస్పత్రి సౌజన్యంతో శనివారం నిర్వహించిన ఉచిత నేత్ర వైద్యశిబిరానికి విశేష స్పందన లభించింది. బీఎస్ఎన్ఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ దోసూరి దాలినాయుడు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగస్తులతో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో మురళీధర్, శ్రీధర్, అశోక్, సాయి ప్రసాద్, ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఆలుగు వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు. -
హెచ్పీవీ టీకాతో క్యాన్సర్కు చెక్..
సీతానగరం: మహిళలకు ఆశించే ప్రమాదకర గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్ నుంచి రక్షణకు హెచ్పీవీ టీకా ఉపయోగపడుతుందని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి ఎస్. భాస్కరరావు తెలిపారు. స్థానిక పీహెచ్సీలో చేపడుతున్న హెచ్పీవీ వ్యాక్సినేషన్ ప్రక్రియను జిల్లా ఎన్సీడీ అధికారి టి. జగన్మోహన్రావుతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ భాస్కరరావు మాట్లాడుతూ.. 14 సంవత్సరాలు నిండి పదిహేనేళ్ల లోపున్న బాలికలకు ఈ టీకా వేస్తున్నట్లు చెప్పారు. ఏ ఒక్క బాలిక సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వం టీకా ఉచితంగా వేస్తోందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సుమారు పది వేల బాలికలకు టీకాలు వేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. వ్యాక్సినేషన్కు ముందు ఆభా ఐడీతో యువిన్లో రిజిస్ట్రేషన్ చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వైద్యాధికారి పి. ఉషారాణి, యుడీసీ మురళి, సూపర్వైజర్ వెంకటరమణ, ఆ రోగ్య పర్యవేక్షకులు భవానీ, రవణమ్మ, గోపాల్నాయుడు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ భాస్కరరావు -
వాహనాల్లో కుక్కేసి ప్రమాదాల్లోకి నెట్టేసి..
ఒక్క నిమిషం ఆలోచిస్తే ప్రమాదాలకు దూరంగా ఉండొచ్చు.. ఆలస్యమైనా సురక్షితంగా ఇంటికి వెళ్లాలన్నా ఆలోచనా ఉన్నా ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఓవర్ లోడ్ వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా అటు ఆటో డ్రైవర్లలో గాని ఇటు ప్రయాణికుల్లో గాని మార్పు రావడం లేదు. ముగ్గురు, నలుగురు ఎక్కాల్సిన ఆటోలో పదుల సంఖ్యలో ప్రయాణికులను కుక్కేస్తున్నారు.. దీంతో ఏమాత్రం అదుపు తప్పినా విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోక తప్పదు. అలాగే ద్విచక్ర వాహనదారులు కూడా ప్రమాదకర ప్రయాణాలు సాగిస్తున్నారు.. జిల్లా కేంద్రంలో శనివారం సాక్షి కంట పడిన ప్రమాదకర ప్రయాణాలు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం లగేజ్ వాహనంలో ప్రయాణికులుఆటోల్లో కిక్కిరిసిన ప్రయాణికులు -
కనులపండువగా శ్రీనివాసుని కల్యాణం
డెంకాడ: చింతలవలస ఐదో ఏపీఎస్పీ బెటాలియన్లో గల వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామి కల్యాణం శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేకువజాము నుంచే సుప్రభాత సేవ, అర్చనలు, ప్రత్యేక హోమాలు చేపట్టారు. సాయంత్రం వేదపండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల జయజయ ధ్వానాల మధ్య స్వామి కల్యాణాన్ని కనులపండువగా నిర్వహించారు. బెటాలియన్ కమాండెంట్ వై.రవిశంకర్, ఉమాదేవి దంపతులు శ్రీదేవి, భూదేవి సహిత శ్రీనివాసునికి కల్యాణంలో పాల్గొన్నారు. వందలాది మంది భక్తులు, బెటాలియన్ అధికారులు, సిబ్బంది కల్యాణాన్ని తిలకించారు. -
బస్సులో ప్రయాణం.. నరకప్రాయం
● యూఎన్ఓకు విద్యార్థిని ఫిర్యాదు భామిని: పాఠశాలలకు వెళ్లడానికి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్న బాలికలు శారీరక హింస, అసభ్యకరమైన మాటలు, దూషణలకు గురవుతున్నట్టు హోలీక్రాస్ గ్రో క్లబ్ సభ్యురాలు చాందిని ఐక్యరాజ్యసమితికి శనివారం ఫిర్యాదు చేశారు. జనాలతో నిండిన బస్సుల్లో ప్రయాణంతో విద్యార్థినులు నిత్యం నరకం అనుభవిస్తున్నట్టు వివరించారు. ఐక్యరాజ్యసమితి నిర్వహించే మహిళల స్థితిగతుల కమిషన్ సమావేశం (సీఎస్డబ్ల్యూ – 70) సందర్భంగా జరిగిన అంతర్జాతీయ వర్చువల్ కార్యక్రమంలో గర్ల్స్ రోడ్ మ్యాప్ టు జస్టీస్లో యువ ప్యానల్ స్పీకర్గా చాందిని తన అభిప్రాయాలు వెల్లడించారు. బాలికలు హింసకు గురైనప్పుడు వారి తల్లిదండ్రులు నిర్భయంగా పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయగలిగే స్నేహపూర్వక పోలీస్ వ్యవస్థ ఉండాలన్నారు. ిఫిర్యాదు చేసే వారి వివరాలు గోప్యంగా ఉంచాలని కోరారు. హోలీక్రాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గ్లో క్లబ్లు బాలికల అవసరాలను గుర్తించి చైతన్యపరుస్తున్నట్టు డైరెక్టర్ ప్రభుదాస్ తెలిపారు. -
వడగాడ్పులతో తస్మాత్... : కలెక్టర్
విజయనగరం కలెక్టరేట్: రాబోయే ఎండా కాలంలో ఎండ తీవ్రత, వడగాడ్పుల ప్రభావం పెరిగే అవకాశం ఉన్నందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సూచించారు. ప్రజలు పలుచటి కాటన్ దుస్తులు ధరించడం, తలపై టోపీ లేదా రుమాలు ధరించడం, తరచుగా మంచినీరు, మజ్జిగ, నిమ్మరసం వంటి ద్రవాలు తీసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఎండలో ఎక్కువసేపు పని చేయకూడదని తెలిపారు. వడదెబ్బకు గురైన వారిని వెంటనే నీడ ఉన్న చల్లటి ప్రదేశానికి తరలించి తడి గుడ్డతో శరీరాన్ని చల్లబరచాలని, అవసరమైతే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించాలని సూచించారు. జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపడుతున్నందున ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరూ అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ కోరారు. -
గూడ్స్ రైలులో మంటలు
● అర్ధ గంట పాటు కనిమెరక గేటు సమీపంలో నిలిచిపోయిన రైలు ● మంటలు ఆర్పిన తర్వాత బయలుదేరిన రైలు బొండపల్లి: మండలంలోని కనిమెరక – దావాలపేట రెల్వేగేట్లకు సమీపంలో విశాఖపట్టణం నుంచి గజపతినగరం వైపు బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలులో బొగ్గు వ్యాగిన్లో శనివారం మంటలు రావడంతో అర్ధ గంట పాటు నిలిపేశారు. బొగ్గు వ్యాగన్లో మంటలు రావడాన్ని గ్యాంగ్మన్లు పైడి సీతారాం, బి.సూర్యనారాయణ గమనించి అప్రమత్తమై రైలుకు ఎర్ర జెండా ఊపి నిలిపేశారు. దీంతో గూడ్స్ డ్రైవర్ల వద్ద ఉన్న మంటలను ఆర్పే యంత్రాలతో వాటిని అదుపు చేశారు. తరువాత రైలును యధావిధిగా పంపించారు. దీంతో ఆ మార్గంలో కాసేపు రైళ్ల రాకపోకలను నిలిపేశారు. అదే మార్గంలో వస్తున్న వందేభారత్ రైతులను వేరే మార్గం ద్వారా పంపించి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా రైల్వే అధికారులు చర్యలు తీసుకున్నారు.


