breaking news
Vizianagaram District News
-
సమాజం అభివృద్ధికి జర్నలిస్టుల బాధ్యత కీలకం
విజయనగరం గంటస్తంభం: సమాజంలో జరుగుతున్న మంచి, చెడును వెలికి తీసి అభివృద్ధికి దోహదపడే పవిత్ర వృత్తిలో జర్నలిజం కీలకంగా నిలుస్తుందని కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) 68వ ఆవిర్భావ దినోత్సవం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కలెక్టర్ డా.బీఆర్ అంబేడ్కర్, ఎస్పీ వకుల్ జిందల్, ఏటీకే వ్యవస్థాపకుడు డా.ఖలీల్బాబా జ్యోతి ప్రజ్వలన చేశారు. తొలుత స్వర్గీయ గురజాడ అప్పారావు, సర్ సీవైచింతామణి, మానుకొండ చలపతిరావు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇళ్ల స్థలాలు లేని జర్నలిస్టులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని, అయితే అందరూ ఏక తాటిపై నిలిచి ఒకే జాబితా ఇస్తే అర్హులందరికీ ఇవ్వడానికి అవకాశం ఉందన్నారు. ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ నకిలీ జర్నలిస్టులను నిరోధించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అందులో భాగంగా వృత్తిలో ఉన్న జర్నలిస్టుల వాహనాలకు క్యూఆర్ కోడ్తో ఉన్న స్టిక్కరింగ్ వ్యవస్థను సుమారు 15 నుంచి 20 రోజుల్లో తీసుకొస్తామన్నారు. జర్నలిస్టులపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి పీఎస్ఎస్వీ శివప్రసాద్ మాట్లాడుతూ కుటుంబ జీవనానికి సరిపడ ఆదాయం లేనప్పటికీ జర్నలిజం వృత్తినే నమ్ముకున్న జర్నలిస్టు కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. సీనియర్ జర్నలిస్టులకు సత్కారం అనంతరం జిల్లాలో 25 ఏళ్లపాటు జర్నలిజం వృత్తిలో ఉన్న 40 మంది సంఘం సభ్యులను సంఘం జ్ఞాపికలు, దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు మహాపాత్రో అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఎంఎస్ఎన్రాజు, యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు పంచాది అప్పారావు, ఆరిపాక రాము, చిన్న పత్రికల సంఘం జిల్లా అధ్యక్షుడు కేజేశర్మ, కార్యదర్శి సముద్రాల నాగరాజు, సీనియర్ జర్నలిస్టులు ఎలిశెట్టి సురేష్, డేవిడ్ రాజు, చక్రవర్తి, వేదుల సత్యనారాయణ, జె.శేషగిరి, జయరాజ్, లింగాల నర్శింగరావు, మంత్రి ప్రగడ రవి, శంకరావు, గోవింద తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ ఘనంగా ఏపీయూడబ్ల్యూజే 68వ ఆవిర్భావ దినోత్సవం -
చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిరంతర నిఘా
విజయనగరం అర్బన్: జిల్లాలో క్షేత్రస్థాయిలో ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా నిరంతరం నిఘా పెడుతూ విస్తృతంగా దాడులు చేస్తున్నామని ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చట్ట విరుద్ధ చర్యలకు ఎవరు పాల్పడినా ఉపేక్షించేది లేదని వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జూదం, కోడి–గొర్రె పందాలు నిర్వహిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. తరచూ పట్టుబడుతున్న నిందితులపై బైండోవర్ కేసులు నమోదు చేయాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా లే–అవుట్లు, గ్రామ శివారు, నగర శివారు, తోటలు, పాడుబడిన భవనాల్లో జూదం ఆడుతున్న వారిపై పోలీసులు విస్తృత దాడులు నిర్వహిస్తున్నారన్నారు. ఈ క్రమంలో డ్రోన్ల సహాయం తీసుకుంటున్నామని వివరించారు. నిఘా వ్యవస్థను బలోపేతం చేసి ముందుగానే సమాచారం సేకరించి దాడులు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ ఏడాది ఇప్పటి వరకు పేకాట విషయంలో 1,031 మందిపై 141 కేసులు నమోదు చేసి రూ.24,07,398 నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కోడి పందాల విషయంలో 174 మందిపై 35 కేసులు, రూ.1,13,679 నగదు, 75 కోళ్లు, 4 పొట్టేళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెపారు. మహిళా పోలీసుల ద్వారా క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎస్పీ తెలిపారు. ప్రజలు విజ్ఞతతో వ్యవహరించి చట్టవిరుద్ధ కార్యక్రమాలలో పాల్గొనకూడదని అసాంఘిక కార్యకలాపాలపై ఏమైనా సమాచారం తెలిసినా స్థానిక పోలీసులకు లేదా డయల్ 112/100కు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఎస్పీ వకుల్ జిందల్ -
తమ్ముడిని రక్షించి..అన్న అనంతలోకాలకు..
పాలకొండ రూరల్: బంధువుల ఇంట గృహప్రవేశానికి ఎంతో సంతోషంతో వచ్చిన ఓ కుటుంబంలో నాగావళి నది తీరని శోకం మిగిల్చింది. గ్రామంలో శుభకార్యం కావడంతో అంతా సందడిగా ఉండగా కొద్ది క్షణాల్లో తీవ్రవిషాదం గ్రామాన్ని నిశ్శబ్దంలోనికి నెట్టేసింది. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం నవంపాడు గ్రామానికి చెందిన ద్వారంపూడి రవి, వసంత దంపతులకు ఇద్దరు కుమారులు పవన్ (16), భార్గవ్సాయి ఉన్నారు. ఆ కుటుంబం పాలకొండ మండలంలోని అన్నవరం గ్రామాంలో వారి దగ్గర బంధువు పైడితల్లి, రామారావుల నూతన గృహ ప్రవేశానికి శనివారం వచ్చింది. ఆదివారం గృహప్రవేశం కావడంతో పవన్కుమార్ తమ్ముడు భార్గవ్తో పాటు బాబాయి సురేష్తో కలిసి ద్విచక్రవాహనంపై గ్రామ సమీపంలో ఉన్న నాగావళి తీరానికి ఉదయం 6.30గంటల సమయంలో వెళ్లినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ క్రమంలో బాబాయి బహిర్భూమికి వెళ్లగా భార్గవ్సాయి స్నానం చేసేందుకు నదిలో దిగాడు. లోతు ఎక్కువగా ఉండడం, ఇటీవల కురుస్తున్న వర్షాల ప్రభావంతో నదిలో నీటి ప్రవాహం అధికం కావడంతో మునిగి పోయాడు. ఈ విషయం గమనించిన పవన్కుమార్ తన తమ్ముడిని రక్షించేందుకు నదిలోకి దిగాడు. తమ్ముడిని ఒడ్డుకు చేర్చే యత్నం చేశాడు. తమ్ముడు మునిగిపోతున్నట్లు గట్టిగా అరవడంతో సమీపంలో ఉన్న బాబాయి భార్గవ్ సాయి రెక్క పట్టుకుని బడ్డుకు లాగాడు. ఇంతలో పవన్కుమార్ మునిగిపోయాడు. విషయం గుర్తించిన స్థానికులు తక్షణమే స్పందించి మునిగిపోయిన పవన్కుమార్ను బయటకు తీశారు. కొన ఊపిరితో ఉన్న పవన్కుమార్కు సీపీఆర్ చేసి ప్రథమ చికిత్స అందించేందుకు తీసుకు వెళ్లేయత్నం చేస్తుండగా మృతిచెందాడు. విశాఖలో చదువుతున్న అన్నదమ్ములు మృతుడి తండ్రి రవి భవన నిర్మాణ కార్మికుడిగా రెక్కల కష్టంతో కుమారులను విశాఖలో చదివిస్తున్నాడు. పవన్కుమార్ బైపీసీ ప్రథమ సంవత్సరం చదువుతుండగా రెండవ కుమారుడు 10వ తరగతి చదువుతున్నాడు. చేతికి అందివస్తున్న పెద్దకుమారుడు ఇలా ప్రమాదంలో మరణించడంతో భార్య వసంత, రవి గుండెలు పగిలేలా రోదించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ రాధాకృష్ణమూర్తి, ఎస్సై కె.ప్రయోగమూర్తి ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిపై ఆరా తీశారు. తల్లితండ్రులు కుమారుడి మృతదేహాన్ని వారి స్వగ్రామం తీసుకువెళ్లారు. నాగావళి నదిలో పడి ఇంటర్ విద్యార్థి మృతి -
పల్లకిలో పెళ్లికూతురి ఊరేగింపు
● గ్రామాల్లో కొనసాగుతున్న సంప్రదాయం వేపాడ: పూర్వీకుల సంప్రదాయాలను పల్లెల్లో నేటికి ఆచరిస్తూ ఉండడంతో నేటి తరానికి సంప్రదాయాలు, ఆచారాలు తెలుస్తాయని పెద్దలు అంటున్నారు. వేపాడ మండలం వల్లంపూడి గ్రామంలో ఆదివారం జరిగిన వివాహం సందర్భంగా పెళ్లికూతురును వేపాడ, వల్లంపూడి జంట గ్రామాల్లో పల్లకిలో ఊరేగించి పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. శ్రావణమాసంలో ఆఖరు ముహుర్తం కావడంతో పెద్దసంఖ్యలో వివాహాలు జరుగుతున్నాయి. మరో 30రోజుల పాటు వివాహాలకు శూన్యమాసం రావడంతో ముహుర్తాలు లేవని పండితులు చెబుతున్నారు. రెడ్డివానివలసలో కార్డన్సెర్చ్మెంటాడ: నాటుతుపాకుల ఏరివేతలో భాగంగా మెంటాడ మండలం కొండలింగాలవలస పంచాయతీ మధుర గ్రామం రెడ్డివానివలసలో సీఐ జీఏవీ రమణ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ –సెర్చ్ ఆపరేషన్ను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిని సోదా చేశారు. సోదాల్లో భాగంగా 70లీటర్ల సారా, 1000 లీటర్ల మడ్డి కల్లు స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. దీనికి సంబంధించి ఏడుగురిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై కె.సీతారాం తెలిపారు.పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్యరామభద్రపురం: మండలకేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన గోర్జి రమేష్(44) పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీరాంనగర్ కాలనీకి చెందిన రమేష్ కడుపునొప్పితో బాధపడుతున్నాడు.రోజూలాగానే పొలంలో పనిచేస్తుండగా కడుపులో నొప్పి రావడంతో ఈ నెల 15వ తేదీన గడ్డిమందు తాగేశాడు. ఈ విషయం గమనించిన కుటుంబసభ్యులు బాడంగి సీహెచ్సీలో ప్రథమ చికిత్స అనంతరం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ 16న రాత్రి మృతిచెందాడు. మృతుడి భార్య కృష్ణవేణి ఫిర్యాదు మేరకు ఎస్సై వి.ప్రసాదరావు కేసునమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. నాగావళి నదిలో వ్యక్తి గల్లంతుసంతకవిటి: మండలంలోని పోడలి గ్రామానికి చెందిన ఉరదండం పోలయ్య(76) ఆదివారం నాగావళి నదిలో గల్లంతైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎప్పటిలాగానే ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు నాగావళి నదికి వెళ్లాడు. ఎప్పటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో నది దగ్గరికి వెళ్లి చూడగా నది వద్ద దుప్పటి, చెప్పులు ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఎస్సై ఆర్.గోపాలరావు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. అలాగే సంఘటన స్థలాన్ని తహసీల్దార్ బి.సుదర్శనరావు ఆధ్వర్యంలో ఆర్ఐ కృపారావు, వీఆర్ఓ అన్నారావులు పరిశీలించారు. సహాయక చర్యలు చేపట్టేందుకు వీలు లేకుండా నదిలో వరద ఉధృతి అధికంగా ఉండడంతో కలెక్టర్ దృష్టిలో పెట్టామని, ఎస్డీఆర్ఎఫ్ బృందం వచ్చిన వెంటనే గాలిస్తామని తెలిపారు. పోలయ్య అల్లుడు ఎ.చిన్నారావు ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. -
గంటేడ పాటల పుస్తక పరిచయం
పార్వతీపురం: ప్రముఖ కవి గంటేడ గౌరునాయుడు రాసిన ‘పాడుదమా స్వేచ్ఛా గీతం’ పుస్తక పరిచయ కార్యక్రమాన్ని ఆదివారం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌరునాయుడు రాసిన పాటల పుస్తకాన్ని పరిచయం చేస్తూ నేటివరకు ఆయన రాసిన పాటలను గుర్తుచేస్తూ వక్తలు ఉపన్యాసాలు ఇచ్చారు. ముందుగా పాయల మురళీకృష్ణ పుస్తక పరిచయం చేయగా పలువురు గంటేడ రాసిన పాటలను ఆలపించారు. కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో ప్రజల జీవన శైలిని ప్రజలకు ఉన్న ఆకాంక్షలను తన రచనల ద్వారా ప్రపంచానికి తెలియజేసిన గొప్ప సాహితీవేత్త గంటేడ గౌరునాయుడు అని, ‘స్నేహకళా సాహితి’ పేరుతో సంస్థను స్థాపించి కళింగాంధ్ర ప్రాంతంలో ఎందరో యువ కవులను, రచయితలను ప్రోత్సహిస్తున్నారని వక్తలు ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంవీఆర్ కృష్ణాజీ హాజరు కాగా చీకటి దివాకర్ అధ్యక్షత వహించారు. దేశ గత చరిత్ర నెత్తిటి మరక పాటల సీడీని డాక్టర్ వెంకట్రావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఇంటర్ విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు, డాక్టర్ మంచిపల్లి శ్రీరాములు, గజల్ వినోద్, ఉపాధ్యాయులు, సాహితీవేత్తలు, మేధావులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
దోమకాటు.. ప్రాణాంతకం
పార్వతీపురం రూరల్: ప్రతి వ్యాధికి ప్రస్తుత కాలంలో దోమకాటే మూల కారణమవుతుందని వైద్యులు, పరిశోధకులు చెబుతున్నారు. ఈ మేరకు దోమ ఎంత ప్రమాదకరమైందో, దోమలతో సోకే వ్యాధుల గురించి తెలుసుకుందాం. దోమకాటు చాలా ప్రమాదం. లేనిపోని రోగాలన్నీ దోమల ద్వారానే వస్తున్నాయని అనేక అధ్యయనాలు తెలిపాయి. దోమకాటుతో వచ్చే వ్యాధులు–లక్షణాలు మలేరియా: ఆడ అనాఫిలస్ దోమ కుట్టడంతో మలేరియా వ్యాధి సోకుతుంది. లక్షణాలు: చలి, వణుకుతో జ్వరం రావడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం, జ్వరం విడిచి విడిచి వస్తూ ఉంటుంది. డెంగీ: పగటి సమయంలో కుట్టే ఏడిస్ ఆడ దోమల ద్వారా డెంగీ వ్యాధి సంక్రమిస్తుంది. ఇది సాధారణ వైరల్ జ్వరంగా ఎముకలు, కండరాలు, కీళ్లనొప్పులతో మొదలవుతుంది. ప్లేట్లెట్స్ అమాంతం తగ్గిపోతాయి. లక్షణాలు: హఠాత్తుగా తీవ్ర జ్వరం రావడం, కదలలేని స్థితి, ఎముకలు, కండరాలలో భరించలేని నొప్పి, శరీరంపై ఎర్రని దద్దుర్లు, వాంతులు, వికారం, నోరు ఎండిపోవడంతో పాటు చిగుళ్లు, ముక్కు ద్వారా రక్తం వస్తుంది. చికున్ గున్యా: ఏడిస్ ఈజిప్ట్ దోమలతో ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. చేతులు, కాళ్లలో, కీళ్లలో వాపు వచ్చి కనీసం అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. జ్వరంతో మనిషి బలహీనంగా ఉంటాడు. లక్షణాలు: తలనొప్పి, వాంతులు, వికారంతోపాటు హఠాత్తుగా జ్వరం, కీళ్ల నొప్పులు, సరిగా నిలబడలేకపోవడం. ఫైలేరియా: దీనిని బోదకాలు అని కూడా అంటారు. క్యూలెక్స్ దోమ ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. శరీరంలోని ఏ భాగానికై నా బోదకాలు సోకుతుంది. తరచూ జ్వరం, చంకల్లో, గజ్జల్లో బిళ్లలు కట్టడం, వెన్ను పాము దగ్గర నుంచి అన్ని అవయవాలపై ప్రభావం చూపుతుంది. అవయవాలకు వాపు, కాళ్లు, చేతులు, స్తనాలు, వరిబీజం, జ్ఞానేంద్రియాలు పాడవుతాయి. మెదడువాపు క్యూలెక్స్ ఆడదోమ కుట్టడంతో వ్యాధి సంక్రమిస్తుంది. ఎక్కువగా 2 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లల్లో ఈ వ్యాధి వస్తుంది. లక్షణాలు: ఆకస్మిక జ్వరం వచ్చి తీవ్రత ఎక్కువ కావడం, విపరీతమైన తలనొప్పి, వాంతులు రావడం, అపస్మారక స్థితికి లోనుకావడం, శరీరంలో ఏదో ఒకపక్క పక్షవాతానికి గురికావడం, ఫిట్స్ రావడం. నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకే ముప్పునీటి నిల్వలతోనే ప్రమాదం వారం పదిరోజుల వ్యవధిలో పరిసరాల్లో కాని, ఇంట్లో ఉన్న నీటి నిల్వల్లో మలేరియా దోమలు వ్యాప్తి చెందేందుకు అవకాశం ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో నీరు నిల్వ లేకుండా జాగ్రత్త పడాలి. అలాగే ఇంట్లో ఉన్న కూలర్లు, చల్లదనం కోసం వాడే ఎలక్ట్రానిక్ వస్తువుల్లో వాటి ద్వారా వచ్చిన నీటి నిల్వల్లో డెంగీదోమ వ్యాప్తి చెందుతుంది. ఎప్పటికప్పుడు వాటిని శుభ్రం చేసుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికే 915 మలేరియా ప్రభావిత గ్రామాల్లో మొదటి, రెండవ విడతలో స్ప్రేయింగ్ ప్రక్రియ పూర్తి చేశాం. ప్రజలు జ్వరాలు బారిన పడినపుడు కచ్చితంగా నిర్లక్ష్యం వహించకుండా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. అనంతరం వైద్యుల సూచనలు పాటిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. – డా.తెర్లి జగన్మోహన్రావు, జిల్లా ఎన్సీడీ ప్రోగ్రాం అధికారితీసుకోవాల్సిన జాగ్రత్తలుడెంగీ, చికున్ గున్యా, మలేరియా వంటి దోమల ద్వారా వ్యాపించే ప్రాణాంతక వ్యాధులను నివారించాలంటే వైద్యం ఇంటి నుంచే ప్రారంభం కావాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే తప్ప దోమల నియంత్రణ పూర్తిగా సాధ్యం కాదు. కాబట్టి ఎవరికి వారు ఇంటి లోపల దోమలు లేకుండా చూసుకోవడమే మంచిమార్గం. దోమతెర: రాత్రిలో పడుకునే ముందు దోమతెర వాడాలి. లేదంటే శరీరం పూర్తిగా కప్పబడేలా దుస్తులు వేసుకోవాలి. వేపనూనె: వేపనూనె, కొబ్బరినూనెను 1:1 నిష్పత్తిలో తీసుకుని చర్మంపై రాసుకోవాలి. వేప వాసన చూసి దోమలు పారిపోతాయి. నిమ్మనూనె: దోమల నివారణకు యూకలిప్టస్, లెమన్ ఆయిల్ను చర్మంపై రాసుకోవాలి. దీనివల్ల మన చర్మానికి ఎలాంటిహాని ఉండదు. కర్పూరం: చీకటి పడుతున్న వేళలో ఇంటి తలుపులు మూసేసి కర్పూరం వెలిగించి 20 నిమిషాల తర్వాత తలుపు తెరిస్తే దోమలు కనిపించవు. కర్పూరం మంచి కీటక నివారిణిగా పనిచేస్తుంది. -
ఆటోమేటిక్ కష్టాలు
రాజాం: ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగించే డ్రైవర్లకు కష్టాలు మొదలయ్యాయి. గతంలో ఏడాదికో, రెండేళ్లకు ఒకదఫా ఆటో డ్రైవర్లు, యజమానులు తమ ఆటోలను ఆర్టీఓ కార్యాలయం వద్ద తనిఖీలు చేయించి ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందేవారు. వాటికి తోడు గత ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర ద్వారా ప్రతి ఏడాది ఠంచన్గా రూ.10 వేల సాయం అందించేది. వీటితో ఆటో వాలాలు ఇన్సూరెన్స్, ట్యాక్స్ చెల్లించుకునేందుకు అనుకూలంగా ఉండేది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ సాయం కట్చేశారు. ఆటో డ్రైవర్లకు గత ఎన్నికల ముందు కూటమి నేతలు ఇచ్చిన జీఓలు, హామీలు అమలు కాలేదు. వాటికి తోడు అదనపు ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. అధిక ఫైన్లు, కొర్రీలతో ఆటోలు రోడ్డెక్కాలంటే భయపడుతున్నాయి. ఇప్పుడు ఫ్రీ బస్సు వారిలో కొంతమంది పొట్టకొట్టే పరిస్థితి తెచ్చింది. ఆ జీఓ ఎత్తివేత ఉత్తుత్తిదే సార్వత్రిక ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు మహిళలకు ఫ్రీ బస్సు వల్ల ఆటో డ్రైవర్లకు ఇబ్బందులు రాకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ఆటోలను తనిఖీచేసే జీఓ 21ను ఎత్తివేస్తామని, అవసరమైతే సవరిస్తామన్నారు. దీంతో పాటు ట్యాక్స్, ఇనూరెన్స్ల చెల్లింపుల్లో రాయితీ ఇస్తామని ప్రకటించారు. ఎటువంటి ఫైన్లు ఉండవని ఊకదంపుడు ప్రసంగాలు ఇచ్చారు. ఇప్పుడు ఈ జీఓ ఎత్తివేయకపోగా, కొత్త ఆంక్షలు మొదలయ్యాయి. రవాణా వాహనాల ఫిట్నెస్ టెస్టులకు సంబంధించి గత ప్రభుత్వమే నేరుగా నిర్వహించగా, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆటోమేటిక్ టెస్టింగ్ పేరుతో పైవేట్ వారికి అప్పగించి, డ్రైవర్లపై అధిక భారం మోపడం ప్రారంభించింది. పైవేట్ ఏజెన్సీల చేతిలోకి ఫిట్నెస్ టెస్టింగ్ వెళ్లడం ద్వారా రవాణా వ్యవస్థ తారుమారవుతుందని, ఇప్పటికే అధిక ట్యాక్స్లు, పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరల కారణంగా ఆటోలు నడపలేని పరిస్థితి ఎదురవుతోందని ఆటో కార్మికులు వాపోతున్నారు. గతంలో ఆటోవాలకు ఫైన్ నిమిత్తం రూ. 200లు, రూ.300లు ఉండేది. ఇప్పుడు చిన్నపాటి తప్పులను చూపించి రూ.1000లకు మించి ఫైన్లు వేస్తున్నారని ఆటోవాలా వాపోతున్నాడు. కూటమి వచ్చిన తరువాత తమకు ట్యాక్స్, ఇన్సూరెన్స్ తప్పుతాయని అనుకుంటే ఇప్పుడు డబుల్, త్రిబుల్ అవడమే కాకుండా అదనపు కేసులు పెడుతున్నారని గగ్గోలు పెడుతున్నారు. ఏదో ఒక నెపంగతంలోకంటే ఇప్పుడు ఆటోవాలాకు విధిస్తున్న ఫైన్లు పెనుభారంగా మారాయి, ఆటోలు రోడ్డుమీద కనిపించినా, డ్రైవర్ సీటు పక్కన అదనంగా పాసింజర్లు ఉన్నా ఫైన్ పడుతుంది. ఇవి తనిఖీలు సమయంలో ఆటోవాలాకు తెలియడంలేదు. కొంతసమయం తర్వాత సెల్ఫోన్లకు మెస్సేజ్లు వస్తున్నాయి. దీంతో ఇదెక్కడి పరిస్థితిరా బాబూ అంటూ ఆటోడ్రైవర్లు మండిపడుతున్నారు. ఇటు రవాణా శాఖ అధికారులతో పాటు అటు పోలీసులతో ఆటో డ్రైవర్లకు ఇబ్బందులు ప్రారంభమ య్యాయి. పార్కింగ్ పేరుతో అధిక ఫైన్లు పడుతుండడం శోచనీయం. మరో వైపు వాహన మిత్ర అందకపోవడం దురదృష్టకరంగా మారింది. రాజాం నియోజకవర్గంలో రాజాం నుంచి రేగిడి, వంగర, సంతకవిటి, చీపురుపల్లి, తెర్లాం, పొందూరు, జి,సిగడాం ఏరియాలకు ప్రతిరోజూ 1400 ఆటోలు తిరుతుంటాయి. వారందరికీ గతంలో వచ్చే వాహన మిత్ర అటకెక్కింది. ఎప్పటికప్పుడే వాహనాల తనిఖీ చేస్తున్న అధికారులు అటు రవాణా, ఇటు సివిల్ పోలీస్ అధికారులతో ఇబ్బందులు అవిలేవు..ఇవి లేవంటూ ఫైన్లు ఆందోళనలో డ్రైవర్లుచాలా ఇబ్బందిగా ఉందిగతంలో కంటే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. రోడ్డు ట్యాక్స్ పెంచారు. ఇన్సూరెన్స్ చార్జీలకు అదనంగా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. వాటితో పాటు పొల్యూషన్ చార్జీలు, ఇతర ఫైన్లు ఎక్కువగా ఉన్నాయి. గతంలో కంటే ఎక్కడికక్కడే వాహన చెకింగ్లు పెరిగిపోయాయి. పాత బకాయిలు అంటూ, మత్తు పదార్థాల రవాణా తనిఖీలు, డ్రంకెన్ డ్రైవ్ పేరుతో అధికారులు నిత్యం తనిఖీచేసి, ఆటోకు సంబంధించి ఏ చిన్నకాగితం లేకున్నా, ఎక్కువమంది ప్రయాణికులు ఉన్నా అపరాద రుసుం విధిస్తున్నారు. ఆటోతో రోడ్డు ఎక్కాలంటే భయమేస్తోంది. ప్రభుత్వం జీఓ నంబర్ 21ని సవరిస్తామని చెప్పి, ఇంతవరకూ సవరించలేదు. ఎన్. దుర్గారావు, అమ్మానవదుర్గ ఆటోయూనియన్ నాయకుడు, రాజాం కష్టం ఎక్కువ..ఆదాయం తక్కువ గతంలో ఆటోలు నడిపితే కుటుంబాన్ని అవలీలగా పోషించుకున వారం. ఇప్పుడు పరిస్థితి మారింది. పెద్దగా బేరాలు ఉండడంలేదు. లాంగ్ జర్నీ బేరాలు వస్తే హైవే ఎక్కాలంటే భయమేస్తోంది. ట్యాక్స్, ఇతర కాగితాలు పేరుతో ఫైన్లు పడుతున్నాయి. తనిఖీ అధికారులతో మాట్లాడినసమయంలో ఏమీ ఉండడంలేదు. అనంతరం సెల్ఫోన్లకు మెస్సేజ్లు వస్తున్నాయి. రాంగ్ పార్కింగ్ అని, ఎక్కువ మంది ఉన్నారని ఇలా తప్పులు చూపిస్తున్నారు. వీటికి తోడు ట్యాక్స్, ఇన్సూరెన్స్ చెల్లింపులు పెరిగాయి. జీఓ నంబర్ 21లో సవరణ లేకపోవడంతో ఆటోలకు నిత్యం తనిఖీలు, ఇబ్బందులు పెరిగాయి. వి. మజ్జిగౌరి, ఆటో డ్రైవర్, రాజాం -
సంగమేశ్వరస్వామి ఆలయంలో హైకోర్టు జడ్జి ప్రత్యేక పూజలు
వంగర: హైకోర్టు జడ్జి గేదెల తుహిన్కుమార్కు వంగర మండల ప్రజలు ఘన స్వాగతం పలికారు. జిల్లాలోని ప్రఖ్యాతిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం సంగాంలో వెలసిన సంగమేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకునేందుకు కుటుంబ సమేతంగా ఆదివారం వచ్చారు. తొలుత వంగర విచ్చేసిన ఆయనకు ఎంపీపీ ఉత్తరావెల్లి సురేష్ముఖర్జీ, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్లు, ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సంగమేశ్వరస్వామి ఆలయానికి చేరుకుని ప్రధానార్చకులు సిద్దాంతం గణపతి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో రాజాం సీనియర్ సివిల్ జడ్జి కె.శారదాంబ, పలువురు మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వివిధ పార్టీల నాయకులు, వివిధ శాఖల అధికారులు, దేవదాయశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాల, సర్వజన ఆసుపత్రుల్లో పోస్టుల భర్తీకి సంబంధించి కూటమి తీవ్ర జాప్యం ప్రదర్శిస్తోందని అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఎనిమిది నెలల కిందట ప్రకటన విడుదల చేసి ఇప్పటికీ భర్తీ చేయకపోవడంపై అభ్యర్థ
విజయనగరం ఫోర్ట్: ‘తమ్ముళ్లూ.. మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి.. లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.. అది కూడా పూర్తి పారదర్శకంగా నియామకాలు చేపడతాం...’ ఇదీ సార్వత్రిక ఎన్నికల వేళ కూటమి నేతలు చెప్పిన మాటలు. గద్దెనెక్కిన తరువాత కూటమి పాలకులు అప్పుడు చెప్పిన మాటలను ఇప్పుడు పెడచెవిన పెట్టేశారు. పారదర్శకతకు పాతర వేసేలా కూటమి నేతలు వ్యవహరిస్తున్నారన్న తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూటమి సర్కారు నోటిఫికేషన్ ఇచ్చిందే తప్ప ఖాళీలను భర్తీ చేసేందుకు శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నోటిఫికేషన్ ఇచ్చి నెలలు తరబడి జాప్యం చేస్తుండడంతో దరఖాస్తు చేసిన అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే... గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2023 నవంబర్ నెలలో ప్రభుత్వ వైద్య కళాశాల, సర్వజన ఆసుపత్రుల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ తర్వాత ఎన్నికల కోడ్ రావడంతో పోస్టులు భర్తీ నిలిచింది. తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ పోస్టులు భర్తీ చేయకుండా 2024 నవంబర్ నెల వరకు జాప్యం చేసింది. దీంతో ఏడాది అయిపోయిందని చెప్పి వైఎస్సార్సీపీ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ను రద్దు చేసింది. ఆ పోస్టులు భర్తీ చేస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో కూటమి సర్కార్ జాప్యం చేసి రద్దు చేసిందనే ఆరోపణలు వచ్చాయి. ● 2024 డిసెంబర్లో మళ్లీ నోటిఫికేషన్ ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లో పోస్టుల భర్తీకి కూటమి సర్కార్ డిసెంబర్ 28, 2024న మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేసింది. పారా మెడికల్ పోస్టులకు సంబంధించి 20 కేటగిరీల్లో 91 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ పోస్టులకు అర్హత గల 6 వేల మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. ● జాప్యానికి కారణమేంటో... కూటమి నేతలు చెప్పిన వారికి పోస్టులు కట్టబెట్టేందుకు జాప్యం చేస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అందువల్లే నెలల తరబడి పోస్టులు భర్తీ చేయకుండా జాప్యం చేస్తున్నారనే విమర్శలున్నాయి. నోటిఫికేషన్ ఇచ్చిన నెల రోజుల్లోగా పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా ఎనిమిది నెలలైనా భర్తీ చేయకపోవడం పట్ల అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పోస్టులు భర్తీ అత్యంత పారదర్శకంగా నిర్వహించేవారు. ఇప్పడు అందుకు విరుద్ధమైన పరిస్థితి ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎనిమిది నెలల కిందట నోటిఫికేషన్ నేటికీ పోస్టులు భర్తీ చేయని వైనం 20 కేటగిరీల్లో 91 పోస్టులకు ప్రకటన కూటమి నేతల అనుచరులకే పోస్టులు కట్టబెట్టేందుకు ఈ జాప్యమన్న ఆరోపణలు గతంలో ఇదే తరహాలో ఏడాది జాప్యం చేసి నోటిఫికేషన్ రద్దు ఫైల్ కలెక్టర్కు పంపించాం.. ప్రభుత్వ వైద్య కళాశాల, సర్వజన ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైల్ కలెక్టర్కు పంపించాం. అక్కడ నుంచి అనుమతులు రాగానే భర్తీ ప్రక్రియ చేపడతాం. – డాక్టర్ దేవి మాధవి, ప్రిన్సిపాల్, ప్రభుత్వ వైద్య కళాశాల ఎనిమిది నెలలైనా.. పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి ఎనిమిది నెలలు అయినా కూటమి సర్కార్ పోస్టులు భర్తీ చేయకుండా జాప్యం చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నోటిఫికేషన్ కాలపరిమితి ముగియడానికి ఇంకా నాలుగు నెలలే గడువు ఉండడంతో గతంలో మాదిరి నోటిఫికేషన్ రద్దు చేస్తారేమోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. -
నేడు పాఠశాలలకు సెలవు
విజయనగరం అర్బన్: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా సోమవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు ఒక రోజు సెలపు ప్రకటించినట్టు కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం వర్షాల కారణంగా విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందులు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ నిర్ణయాన్ని గమనించాలని ఆయన సూచించారు. వర్షాల కారణంగా ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధిగా నసీర్ విజయనగరం: పార్టీ సంస్థాగత నియామకాల్లో భాగంగా వైఎస్సార్ సీపీ నూతన నియామకాలు చేపట్టింది. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహనరెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన నియామకాలకు సంబంధించి ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీ రాష్ట్ర మైనార్టీ విభాగం అధికార ప్రతినిధిగా విజయనగరం నియోజకవర్గానికి చెందిన మహమ్మద్ నసీర్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మడ్డువలస నుంచి 10వేల క్యూసెక్కుల నీరు విడుదలవంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు వద్ద వరద ఉధృతి పెరుగుతోంది. ఆదివారం ఉదయం సువర్ణముఖి, వేగావతి నదుల నుంచి 7వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టు వద్ద 64.30 మీటర్లు లెవెల్ నీటిమట్టాన్ని అధికారులు స్థిరీకరించారు. ఒక గేటు ఎత్తి 10వేల క్యూసెక్కుల నీటిని నాగావళి నదిలోకి విడిచిపెడుతున్నామని ఏఈ నితిన్ తెలిపారు. కూటమి పాలనలో మహిళా ఉద్యోగులకు వేధింపులు నెల్లిమర్ల రూరల్: కూటమి ప్రభుత్వంలో మహిళా ఉద్యోగులకు వేధింపులు ఎక్కువయ్యాయని జై భీమ్రావ్ భారత్ పార్టీ జిల్లా అధ్యక్షుడు టొంపల నరసయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కనిగిరి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. మండలంలోని గుషిణి గ్రామంలో ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీల నాయకులు, అనుచరుల వేధింపులు రాష్ట్రంలో ఏదో ఒక చోట నిత్యకృత్యమయ్యాయని ఆరోపించారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో గర్భిణి శ్రావణి ఆత్మహత్యే అందుకు ఉదాహరణ అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ రాత్రి 10 గంటల తరువాత మహిళ ఉద్యోగులను పార్టీ కార్యాలయానికి రప్పించడమేమిటని ప్రశ్నించారు. రాత్రి 10.30 దాటిన తరువాత వీడియో కాల్స్ చేసి వేధించడం దుర్మార్గమైన చర్య అన్నారు. పొందూరు కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్యపై కక్ష సాధింపు చర్యలకు దిగి అన్యాయంగా బదిలీ చేయించారన్నారు. ఎమ్మెల్యేకు అనుకూలంగా ఉన్న సొంత సామాజిక వర్గానికి చెందిన ఎస్ఎస్ఏ అధికారి శశిభూషణ్ నుంచి తప్పుడు నివేదికలు తెప్పించి దళిత ఉద్యోగి సౌమ్యకు అన్యాయం చేశారని ఆరోపించారు. శశిభూషణ్పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ పార్లమెంట్ ఇన్చార్జ్ చిన్నం అరుణ్కుమార్ పాల్గొన్నారు. నేడు పీజీఆర్ఎస్ సీతంపేట: స్థానిక ఐటీడీఏలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించనున్నారు. ఏపీవో చిన్నబాబు వినతులు స్వీకరించనున్నారు. గిరిజనులు తమ సమస్యలపై వినతులు సమర్పించవచ్చని ఐటీడీఏ అధికార వర్గాలు తెలిపాయి. -
వ్యవసాయంలో మేము సైతం..
మన్యంలోని వ్యవసాయం సాగులో మేము సైతం అంటూ చిన్నారులు తల్లిదండ్రులకు తోడుగా నిలబడుతున్నారనేందుకు ఈ చిత్రం సజీవ సాక్ష్యం. తండ్రికి తోడుగా తనయులు అన్నట్టు ఖరీఫ్ సీజన్లో ఇటీవల వర్షాలు విస్తారంగా ఏజెన్సీలో కురుస్తుండడంతో ఉభాలు ముమ్మరంగా సాగుతున్నాయి. సాగులో పైపులు వేయడం ద్వారా నీటిని పొలాల్లో నిల్వ చేస్తారు. ఈ క్రమంలో రాయిలంకకు చెందిన ఇద్దరు చిన్నారులు తండ్రిగా సాయంగా పైపులు సుదూరంలో ఉండడంతో వాటిని పొలానికి మోసుకుంటూ ఇలా తీసుకువెళ్తూ... ఆదివారం సాక్షి కెమెరాకు చిక్కారు. వీరిద్దరూ ఓ వైపు చదువుకుంటూనే.. మరోవైపు సాగులో తండ్రికి సాయం చేస్తూ.. ఇలా నిలిచారు. – సీతంపేట -
వేటకు అల్పపీడనం దెబ్బ..!
ప్రతికూల వాతావరణంతో పతివాడబర్రిపేటలో ఉధృతంగా సముద్ర కెరటాలు పూసపాటిరేగ: సముద్రమే సర్వస్వంగా జీవిస్తున్న గంగపుత్రులకు అల్పపీడన ప్రభావంతో ఏర్పడిన ప్రతికూల వాతావరణం వల్ల వేట సాగక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. అల్పపీడనం వల్ల వాతావరణ మార్పులతో సముద్ర అలలు కల్లోలంగా మారడంతో వేట సాగడం లేదు. తాజాగా గడిచిన మూడు రోజులుగా కెరటాలు ఉధృతి పెరగడంతో చేపల వేటకు వెళ్లలేకపోతున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో 27 కిలోమీటర్ల తీర ప్రాంతం వుంది. 21 మత్స్యకార గ్రామాలు వున్నాయి. ఆయా గ్రామాలలో సుమారు 21 వేల మంది మత్స్యకారులు జీవిస్తున్నారు. వేటపై ప్రత్యక్షంగా ఆరు వేల మంది, పరోక్షంగా 15 వేల మంది ఆధారపడి జీవిస్తున్నారు. సాంప్రదాయ బోట్లు, ఇంజన్ బోట్లు రెండు మండలాల్లో 1120 వరకు వున్నాయి. వాటిలో 885 బోట్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజిష్టర్ అయి వున్నాయి. ఈ ఏడాది వేట నిషేధం తరువాత వేట ప్రారంభించినప్పటి నుంచి ఆశించిన స్థాయిలో చేపలు వలకు చిక్కడం లేదని మత్స్యకారులు వాపోతున్నారు. నిషేధ సమయంలో కుటుంబాలు ఎలాగో నెట్టుకొచ్చినా.. మళ్లీ అల్పపీడనం రూపంలో కష్టాలు ప్రారంభమయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులుగా బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా అలలు ఉధృతి ఎక్కువై బోట్లు తీరానికే పరిమితమయ్యాయని వాపోతున్నారు. వేట సాగకపోవడంతో వలలకు మరమ్మతులు చేసుకుంటున్నామని చెబుతున్నారు. ఏడాదిలో సగం రోజులు ప్రకృతి వైపరీత్యాలు, మరి కొన్ని రోజులు తుఫాన్ హెచ్చరికలు, ప్రతికూల వాతావరణంతో వేట సాగక ఇబ్బందులు పడుతున్నామని వారు పేర్కొంటున్నారు. మత్స్యకార జీవన విధానంలో మార్పులకు సర్కారు ప్రత్యామ్నాయం ఆలోచించి వేట లేని సమయంలో ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. పతివాడబర్రిపేటలో తీరానికే పరిమితమైన బోట్లు ప్రతికూల వాతావరణంతో ఇబ్బందులు సముద్రంలో అల్పపీడనం ప్రభావంతో ప్రతికూల వాతావరణం నెలకొంది. సముద్రంలో అలల ఉధృతి పెరిగింది. వాతావరణంలో మార్పులు కారణంగా వేట చేయలేని పరిస్థితి నెలకొంది. వేట సాగకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. తమకు వేట లేని సమయంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఆలోచించి ఆదుకోవాలి. – బర్రి అమ్మోరు, పతివాడబర్రిపేట ప్రతికూల వాతావరణంతో కొనసాగని చేపల వేట మూడు రోజులుగా తీరంలో కురుస్తున్న భారీ వర్షాలు గంగపుత్రులకు ఆర్థిక కష్టాలు -
అదానీ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్
బొబ్బిలి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అదానీ రాష్ట్రంగా కూటమి ప్రభుత్వం మర్చేస్తుందని ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి బి.ధనలక్ష్మి విమర్శించారు. స్థానిక ఓ ప్రైవేటు రెసిడెన్సీలో ఆదివారం ఆశ వర్కర్స్ యూనియన్ 4వ జిల్లా మహాసభలు నిర్వహించారు. ముందుగా సీఐటీయూ జెండాను యూనియన్ నాయకురాలు లంక శాంతి ఆవిష్కరించారు. అనంతరం జరిగిన మహాసభలో ధనలక్ష్మి మాట్లాడుతూ పారిశ్రామికవేత్త అదానీకి దేశాన్ని అప్పగించేందుకు మోదీ, అమిత్షాలు ప్రయత్నిస్తుంటే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోందని ఆరోపించారు. ఆశ వర్కర్లకు కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని, మెటర్నటీ సెలవులను ఆరు నెలలు ఇవ్వాలని, ఇన్సూరెన్స్ వర్తింపజేయాలని, వయోపరిమితి పెంచాలన్న ఆందోళన చేపడితే కొన్ని డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించిందని, ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆశ వర్కర్ల సమస్యలపై ఐక్యంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పి.శంకర్రావు, ఎస్.గోపాలం, యూటీఎఫ్ నాయకురాలు కె.విజయగౌరి తదితరులు పాల్గొని మాట్లాడారు. ఆశ వర్కర్స్ యూనియర్ రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి -
హామీల జోరు.. అమలులో బేజారు
సాలూరు: కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నుంచి మంత్రులు, నాయకులు హామీలు ఇవ్వడంలో జోరుగా, హుషారుగా ఉంటారని, వాటిని అమలు చేయకుండా ప్రజలను బేజారు పెడుతున్నారని వైఎస్సార్సీపీ ఏపీఏ సభ్యులు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర విమర్శించారు. సాలూరు పట్టణంలోని తన స్వగృహంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ● జీఓ 3ను పునరుద్ధరిస్తామని, గిరిజన గ్రామాలను షెడ్యూల్ గ్రామాలుగా మార్చుతామని, ఆదివాసీలకు స్పెషల్ డీఎస్సీ, 5వ షెడ్యూల్డ్, 1/70 కచ్చితంగా అమలు చేస్తామని, కొఠియా గ్రామాలకు పరిష్కారం చూపుతామని, కుడుమూరు భూ వివాదం పరిష్కారం, డోలీ కష్టాలు లేకుండా చూస్తామని చంద్రబాబునాయుడు, లోకేష్, సంధ్యారాణి ఎన్నికల ముందు, ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఇప్పటివరకు వాటి పరిష్కారం ఊసేలేదు. దీనిపై గిరిజనులు ప్రశ్నిస్తున్నా స్పందన లేదు. ఇది గిరిజనులను మోసం చేయడం కాదా?. అబద్ధాలతో ఎన్నాళ్లు పాలిస్తారని రాజన్నదొర నిలదీశారు. అబద్ధాలు చెప్పడంతో ఆరితేరిన మంత్రి... మంత్రి సంధ్యారాణి ప్రజాదర్బార్, పత్రికా సమావేశాలు, స్వాతంత్య్రదినోత్సవ వేదిక, చివరికి చట్టసభలలోనైనా అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. సాలూరు శ్యామలాంబ పండగ కోసం రూ.2 కోట్ల అప్పుడబ్బులతో చేపట్టాల్సిన పనులకు మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తెలిపినప్పటికీ, కౌన్సిల్ ఆమోదం తెలపలేదని ప్రజలు, పత్రికాసమావేశాల్లో మంత్రి సంధ్యారాణి అబద్ధాలు చెప్పిన విషయాన్ని గుర్తుచేసారు. మహిళల ఆత్మగౌరవం కోసం సాలూరులో మరుగుదొడ్ల మరమ్మతులకు రూ.20లక్షల నుంచి రూ.30లక్షల వరకు నిధులు తీసుకువస్తానని చెప్పిన మంత్రి ఏడాది గడిచినా పట్టించుకోలేదని, ఆ పనులు జరగలేదని, మరి మహిళల ఆత్మగౌరవ నినాదం ఏమైందని రాజన్నదొర ప్రశ్నించారు. ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంల నియామకంపై మంత్రి పెట్టిన తొలి సంతకం నేటికీ కార్యరూపం దాల్చలేదని ఎద్దేవా చేశారు. ● 2014–19 మద్య టీడీపీ హయాంలో సంధ్యారాణి ఎమ్మెల్సీగా ఉండగా తను ఎమ్మెల్యేగా ఉన్నానని, 2015లో నాటి కలెక్టర్ ఎం.ఎం.నాయక్ సాలూరు నియోజకవర్గంలోని వివిధ అభివృద్ధి పనులకు ఉపాధిహామీ కింద సుమారు 100 కోట్ల రూపాయలు మంజూరు చేశారన్నారు. తరువాత కలెక్టర్గా వచ్చిన వివేక్యాదవ్ తాగునీరు, రోడ్డ పనుల కోసం రూ.4.50 కోట్లు మంజూరు చేస్తే ఎమ్మెల్సీగా ఉన్న సంధ్యారాణి ఆ నిధులు రాకుండా అడ్డుకున్నారని రాజన్నదొర విమర్శించారు. ● సాలూరులో వందపడకల ఆస్పత్రికి వైఎస్సార్సీపీ అన్నిరకాల అనుమతులు తీసుకొచ్చి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. టీడీపీది అబద్ధాల పాలన ఏడాదిన్నరగా ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు కనిపించని అభివృద్ధి, సంక్షేమం పథకాల అమలులో కనిపించని చిత్తశుద్ధి మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర -
శ్రీకృష్ణాష్టమి పూజలు
విజయనగరం: శ్రీకృష్ణుని చల్లని దీవెనెలు ప్రజలందరిపై ఉండాలని, అందరూ సుఖసంతోషా లు, ఆయురారోగ్యాలతో ఆనందమయమైన జీవితాన్ని సాగించాలని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఆకాంక్షించారు. ధర్మపురి లో శనివారం శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణాల నడుమ రాధాకృష్ణలకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. కార్యక్రమంలో కుటుంబసభ్యులు మజ్జి పుష్పాంజలి, సిరిసహస్ర, బడ్డుకొండ ప్రదీప్నాయుడు, భక్తులు పాల్గొన్నారు. వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయు డు ప్రాజెక్టుకు నీటితాకిడి పెరిగింది. ప్రాజెక్టు లో సువర్ణముఖి, వేగావతి నదుల నుంచి 7వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది. 64.52 మీటర్ల మేర నీటిమట్టం నమోదైందని ఏఈ నితిన్ తెలిపారు. ప్రాజెక్టులోకి వచ్చిన 7 వేల క్యూసెక్కు ల నీటిని రెండు గేట్లు ఎత్తి నాగావళి నదిలోకి విడిచిపెడుతున్నామన్నారు. భోగాపురం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. అధికారుల హెచ్చరికలతో భోగాపు రం మండలంలోని సముద్రతీర ప్రాంతాల్లో నాలుగు రోజులుగా చేపలవేటను మత్స్యకారు లు నిలిపివేశారు. ముక్కాం, చేపలకంచేరు, కొండ్రాజుపాలెం తదితర సముద్రతీర ప్రాంతా ల మత్య్సకారులు తమ పడవలు, వలలను భద్రపరిచి విశ్రాంతి తీసుకుంటున్నారు. విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆవిర్భావ దినోత్సవం స్థానిక పెన్షన్ సంఘం కార్యాలయంలో శనివారం ఘనంగా జరిగింది. తొలుత అసోసియేషన్ జండాను ఆవిష్కరించా రు. జిల్లా అధ్యక్షుడు రామచంద్రపండ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూపీ హైకోర్టు అడిషనల్ రిజిస్ట్రార్ విద్యాసాగర్, ప్రత్యేక అతిథులుగా రాష్ట్ర అధ్యక్షుడు పి.రామచంద్రరావు, రాష్ట్ర కార్యదర్శి ఎల్.వి.యుగంధర్, రాష్ట్ర కోశాధికారి సొంటి కామేశ్వ రరావు, జిల్లా కార్యదర్శి బి.బాలభాస్కర్, జి ల్లా కోశాధికారి వై.శంకరరావు, ఆదినారాయ ణ, రమణమూర్తి, తదితరులు పాల్గొన్నారు. -
ఏపీజీఈఏ 6వ వార్షికోత్సవం
విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) 6వ వార్షికోత్సవం జిల్లా కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. తొలుత సంఘ పతాకాన్ని జిల్లా అధ్యక్షుడు కంది వెంకటరమణ ఆధ్వర్యంలో ఏపీజీఈఏ రాష్ట్ర నాయకుడు, డిప్యూటీ డైరెక్టర్ అండ్ విశాఖపట్నం రీజనల్ డైరెక్టర్ (మెడికల్) శ్రీనివాస్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎల్.వి.యుగంధర్, జిల్లా కార్యదర్శి బి.బాలభాస్కరరావు, అసోసియేట్ ప్రెసిడెంట్ పువ్వల శ్రీనివాసరావు, కోశాధికారి వై.శంకరరావు, ఉపాధ్యక్షులు ఎన్.వెంకటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి జి.లక్ష్మీనాయుడు, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు చింతల వెంకట సతీష్, బియ్యాల చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు రంభ జ్యోతి, తదితరులు పాల్గొన్నారు. -
ఏకగ్రీవంగా పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం ఎన్నిక
విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరా జ్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ (ఏపీపీఆర్ఎంఈఏ) జిల్లా శాఖ నూతన కమిటీని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయనగరం జిల్లా పరిషత్ సమావేశమందిరంలో శనివారం జరిగిన ఎన్నికల్లో నూత న కమిటీని ప్రకటించారు. సంఘ అధ్యక్షుడిగా సీహెచ్ మురళి, ప్రధాన కార్యదర్శిగా పి.ఎం.రవికుమార్, అసోసియేట్ అధ్యక్షుడిగా బి.వి.నాగభూ షణరావు, ఉపాధ్యక్షుడిగా టి.ప్రవీణ్కుమార్, కోశాధికారిగా వి.రాంబాబు, జాయింట్ సెక్రటరీగా ఎల్.వి.ప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా కె.రాజ్ కుమార్, ఎం.నారాయణరావు, డి.లత, డీహెచ్వీఆర్ ప్రభాకర్, బి.లక్ష్మణ్కుమార్, రాష్ట్ర కౌన్సిలర్లు ఎన్.అర్జునరావు, వి.ఎ.వర్మ, ఎ.రమణమూర్తి, కె.వి.శ్రీనివాసరావు, జేసీసీ మెంబర్గా బి.వి.గోవిందరావు ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా విజయనగరం జిల్లా ఏపీఎన్జీజీఓ అధ్యక్షుడు టి.శ్రీధర్బాబు, సహాయ ఎన్నికల అధికారులుగా పట్టణ ఏపీఎన్జీఓ ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.గోపాలకృష్ణ, ఎన్నికల పరిశీలకులుగా విశాఖ జిల్లా సంఘం అధ్యక్షుడు ఎస్.సత్తిబాబు, తూర్పుగోదావరి జిల్లా ఏపీఎన్జీజీఓ జాయింట్ సెక్రటరీ ఎన్ఎంకేజీ ప్రసాద్ వ్యవహరించారు. ముఖ్య అతిథులుగా సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.వి.వి.రమేష్, రాష్ట్ర గౌరవాధ్యక్షుడు బండి శ్రీనివాస్ హాజరయ్యారు. కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు గంటా వెంకటరావు, ఆర్.వి.రమణమూర్తి, ఏపీఎన్జీజీఓ జిల్లా కార్యదర్శి ఎ.సురేష్, జిల్లా, తాలూకా యూనిట్ల సభ్యులు పాల్గొన్నారు. -
గురజాడ సాహిత్య సంపద, స్మారక భవనాన్ని కాపాడాలి
విజయనగరం గంటస్తంభం: మహాకవి గురజాడ అప్పారావు స్మారక భవనం గురించి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలకూ, మంత్రులకూ పట్టకపోవడం శోచనీయమని జిల్లా పౌర వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ ఆవేదన వ్యక్తం చేశారు. గురజాడ రచనలను భద్రపరచాల్సిన ఆర్కియాలజీ విభాగం, రాష్ట్ర టూరిజం శాఖ పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా గురజాడ గృహాన్ని, గురజాడ సాహిత్యాన్ని కాపాడటంలో పూర్తిగా విఫలమవుతున్నాన్నారు. గురజాడ గృహాంలో గురజాడకి శనివారం ఘన నివాళులు అర్పించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. గురజాడ అప్పారావు ఇంటిలో తాగుబోతు హాల్ చల్ చేసి, సాహిత్య సంపాదని, వస్తువులను చిందరవందర చేసినా అధికార పార్టీకి చెందిన నాయకులు ఎవరూ స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి అనిత, విజయనగరం జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లాలోని ఎమ్మెల్యేలుగాని గురజాడ ఇంటిని సందర్మించడానికి కూడా తీరిక కల్పించుకోలేని పరిస్థితిలో ఉండడం పట్ల ఆయన మండిపడ్డారు. తెలుగు సాహిత్యాన్ని ప్రపంచం నలుమూలలకి పంపి సుసంపన్నం చేసిన గొప్ప వ్యక్తికి మన నేతలు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గురజాడ అప్పారావు సాహిత్య సంపదకు, గురజాడ స్మారక భవనానికి తగిన రక్షణ కల్పించాలని భీశెట్టి కోరారు. పౌర వేదిక కార్యనిర్వాహక అధ్యక్షుడు పిడకల ప్రభాకరరావు, ప్రధాన కార్యదర్మి జలంత్రి రామచంద్ర రాజు, సహాయ కార్యదర్మి తుమ్మగంటి రామ్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. -
కనకాంబరాలతో కనక వర్షం
భామిని: పూల సాగులో కనకాంబరాలది ఓ ప్రత్యేకత. గ్రామీణ ప్రాంతాల్లో వాడంబారాలుగా పిలవబడే వీటిని కనకాంబరాలగానే పట్టణ ప్రాంతాల్లో విక్రయిస్తారు. ఏడాది పొడవునా పూలు పూస్తూ సాగుదారులకు మంచి ఆదాయాన్ని తెచ్చి పెడతాయి. వీటిని ఒకసారి నాటితే మూడేళ్ల వరకు దిగుబడినిచ్చి సాగుదారులకు పుష్కలంగా ఆదాయాన్ని అందిస్తాయి. ఈ పూలు వాసన లేకున్నా వివిధ రంగుల్లో మహిళలను ఆకర్షిస్తాయి. అదే సమయంలో వివిధ శుభకార్యాల్లో వీటికున్న ప్రత్యేకత వేరు. వీటిని సీ్త్రల శిరోజాల అలంకరణతో పాటు శుభ కార్యాల్లో వేర్వేరు రూపాల్లో అలంకరించి ఆదాయాన్ని పొందుతారు. ఇవి ఎక్కువగా ఆరంజ్, ఎల్లో, ఎరుపు రంగుల్లో పూస్తాయి. మార్కెట్లో ఈ రకాలకు మంచి డిమాండ్ ఉండడంతో పాటు గిట్టుబాటు ధరలు వస్తుండడంతో రైతులు వీటి సాగుకు ఆసక్తి చూపుతున్నారు. కొబ్బరి, మామిడి తోటల్లో అంతర పంటలుగా కూడా వీటిని సాగు చేయవచ్చని చెబుతున్నారు. పాలకొండ నియోజకవర్గంలో భామిని, వీరఘట్టం, పాలకొండ మండలాల్లో వీటి సాగు ఎక్కువగా ఉంది. స్థానికంగా వీటిని విక్రయించడంతో పాటు దూర ప్రాంతాలకు ఎగుమతి కూడా చేస్తున్నారు. పాతపట్నం, టెక్కలి, ఒడిశాలోని పర్లాకిమిడి, గుణుపూర్ ప్రాంతాలకు రోజూ రవాణా చేస్తున్నారు. మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఈ సీజన్లోనే... ప్రస్తుతం కనకాంబరాలు నాటుకొనే సమయంగా రైతులు చెబుతున్నారు. ఏటా జూలై – ఆగస్టు నెలల్లో కొత్తగా తోటలు నాటుకుంటారు. రెండు నెలలుగా నారు పోసి సంరక్షించుకుని ఆ నారును మెట్టు భూముల్లో వేస్తారు. నాణ్యమైన నారు కోసం రామభద్రపురం, సాలూరు, రాజమండ్రి నర్సరీల నుంచి దీన్ని తెస్తున్నారు. అధిక తేమ, వేడి కలిగిన నేలల్లో సాగుకు ఇది అనుకూలం. చల్లని వాతావరణ పరిస్థితుల్లో అధిక దిగుబడినిస్తాయి. నీరు నిలువ లేని అన్ని రకాల నేలలు వీటి సాగుకు అనుకూలం. విత్తన తయారీ.. విత్తనం, కాండపు మొక్కల ద్వారా ప్రవర్ధనం చేసుకోవచ్చు. అధిక దిగుబడినిచ్చే రకాలను విత్తనాల ద్వారా తయారు చేస్తారు. ఎకరానికి రెండు కిలోల విత్తనం అవసరం. నిల్వ చేసిన విత్తనం మొలకెత్తే శాతం తక్కువ. అప్పుడే పూల గుత్తిల నుంచి వేరు చేసిన విత్తనాలను సిద్ధం చేసుకోవచ్చు. ఒక మీటరు పొడవు, 15 సెంటీమీటర్ల ఎత్తు గల నారుమడులు సిద్ధం చేసి నారు వేసుకోవాలి. మొక్కలు 4 నుంచి 6 ఆకులు వేసిన 50 నుంచి 60 రోజుల్లో నారును తీసి నాటుకోవచ్చు. నీటి ఎద్దడిని తట్టుకొంటుంది. అయినా అవసరాన్ని బట్టి 10 నుంచి 15 రోజులకు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వారానికి ఒకసారి అందించాలి. డ్రిప్ పద్ధతిలో అయితే 4 లేదా 5 రోజులకు ఒకసారి నీరు పెట్టాలి. సాగుపై పెరుగుతున్న ఆసక్తి -
భవనం పైనుంచి జారి పడి వ్యక్తి మృతి
మెంటాడ: మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనం పిట్టగోడ నిర్మాణంలో పని చేస్తున్న కార్మికుడు ప్రమాదవశాత్తూ జారిపడి తీవ్రంగా గాయపడి అనంతరం మృతి చెందాడు. ఇందుకు సంబంధించి ఎస్ఐ కె.సీతారాం శనివారం అందించిన వివరాలు.. మెంటాడ మండల కేంద్రంలో నిర్మితమవుతున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవన నిర్మాణం జరుగుతుంది. దానికి సంబంధించి పిట్టగోడ నిర్మాణం జరిగే సమయంలో శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం అదపాకకు చెందిన గురజాపు అప్పారావు(32) ప్రమాదవశాత్తూ జారి పడి గాయపడినట్టు ఎస్ఐ తెలిపారు. చికిత్స నిమిత్తం గజపతినగరం ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడిని పోస్టుమార్టం నిమిత్తం విజయనగరంలోని సర్వజన ఆసుపత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. సీతానగరం: మండలంలోని బూర్జ గ్రామానికి చెందిన ఆయకట్టు సంఘం చైర్మన్ ఈదిబిల్లి బలరాంనాయుడు వ్యక్తిగత కారణాలతో మనస్తాపానికి గురై మూడు రోజుల కింద పురుగుల మందు తాగాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం విజయనగరం ఎంఆర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న బలరాంనాయుడు(62) మృతి చెందినట్టు పోలీసులు శనివారం తెలిపారు. మృతుడి భార్య ఈదుబిల్లి అన్నపూర్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్టు ఎస్ఐ ఎం.రాజేష్ తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. భోగాపురం: వీరాస్వామి అనే లారీ డ్రైవర్ విజయవాడ నుంచి వస్తూ సుందరపేట హైవే జంక్షన్ వద్ద యూ టర్న్ తీసుకుని భోగాపురం అన్నపూర్ణ హోటల్ సమీపంలో శనివారం లారీని కాసేపు ఆపాడు. తరువాత లారీ కింద మృతి చెంది కనిపించాడు. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వెళ్తున్న కుంభ జోవేష్ అనే వేరే లారీ డ్రైవర్ వీరాస్వామి మృతి చెందినట్టు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై సీఐ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి డ్రైవర్ వీరాస్వామి గుండెపోటుతో మరణించాడా? వేరే ఏవిధంగానైన మరణించాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. విజయనగరం క్రైమ్ : అలమండ రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం జీఆర్పీ పోలీసులు శనివారం గుర్తించారు. 50 సంవత్సరాల వయసు ఉండే ఈ వ్యక్తి తెలుపు రంగు కట్ బనియన్, ఖాకీ రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడని, రైలు నుంచి జారి పడి ఉండొచ్చని భావిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. రాత్రి సమయంలో జారి పడడంతో తలకు తీవ్ర గాయాలై ఉండొచ్చని జీఆర్పీ ఎస్ఐ బాలాజీరావు తెలిపారు. మృతదేహాన్ని గుర్తించిన వారు 9490617089, 830990038, 9491813163 నంబర్లను సంప్రదించాలని సూచించారు. వ్యక్తి ఆత్మహత్య దత్తిరాజేరు: మండలంలోని దాసరిపేట గోపినాధ పట్నాయక్ చెరువు గట్టుపై మెంటాడ మండలం మీసాలపేట గ్రామానికి చెందిన మహంతి రామునాయడు(55) ఉరి వేసుకొని మృతి చెందినట్టు పెదమానాపురం ఎస్ఐ జయంతి శనివారం తెలిపారు. పొలం పనులకు వెళ్తానని ఇంటి వద్ద చెప్పి దాసరిపేట చెరువు గట్టుపై మృతి చెందడంతో బంధువుల ద్వారా సమాచారం తెలియడంతో కుటుంబంలో ఒక్కసారి విషాదం నెలకొంది. భార్య రమణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ చెప్పారు. మృతుడికి వివాహం అయిన కుమార్తెతో పాటు కుమారుడు, మరో కుమార్తె ఉన్నారు. -
సస్యరక్షణ చర్యలతో అధిక దిగుబడి
మొక్కలు పెరిగే దశలో కలుపు లేకుండా చూడాలి. వేసవిలో ఎండ తీవ్రతను తగ్గించడానికి అవిసె మొక్కలు పెంచితే పాక్షిక నీడ ఏర్పడి మొక్కలు బాగా పెరిగి అధిక పూల దిగుబడి వస్తుంది. పూలు కోసిన తరువాత పూల గుత్తిలను, ఎండు కొమ్మలను తొలగిస్తే ఏడాది పొడవునా పూల దిగుబడి పెరుగుతుంది. మొక్కలు నాటిని రెండు లేక మూడు నెలలకు పూత వస్తుంది. జూన్ నుంచి జనవరి వరకు పూత బాగా ఉంటుంది. వర్షాకాలంలో దిగుబడి తగ్గుతుంది. రెండు రోజులకు పూలు విచ్చుకొంటాయి. ఉదయం లేదా సాయంకాలం మాత్రమే పూలు కోయాలి. – కొల్లి తిలక్, వ్యవసాయాధికారి, భామిని -
కన్యాశుల్కం ప్రదర్శన పూర్వజన్మ సుకృతం
విజయనగరం టౌన్: మహాకవి గురజాడ కలం నుంచి జాలువారిన కన్యాశుల్కం నాటకాన్ని 60 ఏళ్లకు పైబడిన మహిళలతో రవీంద్రభారతిలో ప్రదర్శించడం పూర్వజన్మ సుకృతమని దర్శకులు ఈపు విజయకుమార్ పేర్కొన్నారు. మహాకవి స్వగృహంలో శనివారం సక్సెస్ మీట్ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయసూర్య ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కన్యాశుల్కంలోని బొంకులదిబ్బ సీన్, మధురవాణి ఇల్లు–మంచం సీన్, అగ్నిహోత్రవధాన్లు ఇళ్లు – తాంబూలాల సీన్, సౌజన్యరావు పంతుల ఇళ్లు (డామిట్ కథ అడ్డం తిరిగింది సీన్)ను కేవలం వయోవృద్ధులైన మహిళలతో విజయవంతంగా నిర్వహించడం ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. ఈ నెల 12న రవీంద్రభారతిలో అభినయ నేషనల్ థియేటర్ ఫెస్టివల్–2025లో కన్యాశుల్కం ప్రదర్శించి ఆహుతుల మన్ననలు పొందామన్నారు. గాంధీ జ్ఞానప్రతిష్టాన్ చైర్మన్ డాక్టర్ గున్నా రాజేంద్రరెడ్డి, రిటైర్డ్ తహసీల్దార్ బి.సత్యానందం, సినీన టి, సంఘసేవకురాల కరాటే కల్యాణి, అభినయ శ్రీనివాస్ తదితరుల చేతుల మీదుగా ప్రశంసపత్రాలు, జ్ఞాపికలు అందుకున్నామన్నారు. భోగరాజు సూర్యలక్ష్మి నిర్వహణ బాధ్యతలతో పాటూ గిరీశం పాత్రధారిలో అద్భుతమైన ప్రదర్శన కనబర్చి ఆహుతుల మన్ననలు పొందారన్నారు. వీరితో పాటూ మధురవాణిగా ఎ.సీతామహాలక్ష్మి, కరటకశాస్త్రిగా ముళ్లపూడి సుభద్రాదేవీ, అగ్నిహోత్రవధానులుగా కుమారి సామవేదుల గీతారాణి, వెంకటమ్మగా ఉదయగిరి నీలిమ, రామప్పపంతులుగా సిహెచ్.రాజకుమారి, బుచ్చమ్మగా పూటకూళ్లమ్మ, పోటోగ్రఫీ పంతులు నౌకరుగా సామవేదుల సత్యలత, సౌజన్యరావు పంతులుగా చీకటి చంద్రికారాణిలు పాత్రోచితమైన ప్రదర్శన చేసి ఆహుతుల కరతాళ ధ్వనులందుకున్నారని తెలిపారు. శ్రీకాకుళానికి చెందిన ఎస్.రమణ రంగాలంకరణ, రూపాలంకరణ చేశారన్నారు. ఈ సందర్భంగా కన్యాశుల్కం నాటక ప్రదర్శనకు తోడ్పాటునందించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో భోగరాజు సూర్యలక్ష్మి, సుభద్రాదేవీ, కన్యాశుల్కం టీమ్ సభ్యులు పాల్గొన్నారు. -
18 నుంచి ఆలా హజరత్ ఉత్సవాలు
విజయనగరం టౌన్: దేశ వ్యాప్తంగా ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకూ ఆలా హజరత్ ఉత్సవాలను సున్నీ మసీదుల్లో నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్టు పట్టణ శాఖ ముస్లింల ప్రతినిధి మహమ్మద్ గౌస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్.కోట, కురుపాం, సాలూరు, పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న మసీదుల్లో ఉరుసు ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. ఆబాద్ వీధిలో ఉన్న మదరసా ఆల్ జామియాతుల్ హబీబియా అహ్మదీయా ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఉత్సవ ఊరేగింపు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రత్యేక ప్రార్ధనల అనంతరం భారీ అన్న సమారాధన ఉంటుందని తెలిపారు. స్పా సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు విజయనగరం క్రైమ్: నగరంలోని ఏడు స్పా(మసాజ్) సెంటర్లలో వన్టౌన్ పోలీసులు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మసా జ్ సర్వీసుకు వచ్చే సీ్త్ర, పురుషులను వేర్వేరుగా ఉంచాలని సీఐ ఆర్వీకే చౌదరి నిర్వాహకులకు సూచించారు. డీఎస్పీ శ్రీనివాస్ ఆదేశాల మేర కు సీఐ చౌదరి, ఎస్ఐలు రామ్గణేష్, లక్ష్మీప్రసన్నకుమార్, సురేంద్రనాయుడులు మసాజ్ కేంద్రాలకు వెళ్లి, పరిశీలించారు. తప్పనిసరిగా కేంద్రంలో అర్హులైన ఫిజియోథెరపిస్ట్లు ఉండాలన్నారు. రాత్రి వేళల్లో స్పా సెంటర్లకు అను మతి లేదని, ఎవరూ నిర్వహించవద్దన్నారు. -
హైకోర్టు జడ్జి ఇంట సందడి
వీరఘట్టం: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి గేదెల తుహిన్కుమార్ ఇంట వద్ద శనివారం సందడి నెలకొంది. ఆయన హైకోర్టు జడ్జిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి ఆయన స్వగ్రామమైన వీరఘట్టం మండల కత్తులకవిటి గ్రామానికి వచ్చారు. దీంతో ఆయనను కలసి శుభాకాంక్షలు తెలిపేందుకు స్థానిక నేతలు, అధికారులు క్యూ కట్టారు. హైకోర్టు జడ్జిగా ఈ ప్రాంతానికి చెందిన మీరు ఉండడం మాకు ఎంతో గర్వకారణంగా ఉందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. జడ్జి తుహిన్కుమార్ను కలసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. అలాగే వీరఘట్టం, పాలకొండ, రేగిడి మండలాలకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు కె.సూర్యప్రకాశరావు, డి.వెంకటరమణనాయుడు, కర్రి గోవిందరావు, పొట్నూరు లక్ష్మణరావు తదితరులు కలిశారు. వీరఘట్టం తహసీల్దార్ ఏఎస్ కామేశ్వరరావు తదితరులు జడ్జిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పోలీసుల అదుపులో పొట్టేళ్ల పందెంరాయుళ్లు గరుగుబిల్లి: మండలంలోని ఉల్లిబద్ర గ్రామ శివారులో పొట్టేళ్ల పందెం ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్టు ఎస్ఐ పి.రమేష్నాయుడు శనివారం తెలిపారు. ఉల్లిబద్ర గ్రామ శివారులో పొట్టేళ్ల పందెం నిర్వహిస్తున్న ప్రదేశంలో దాడులు చేసి వీరిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. రెండు పొట్టేళ్లను, రూ.1680 నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. పట్టుబడిన ఆరుగురిపై కేసు నమోదు చేసి పార్వతీపురం మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచనున్నట్టు తెలిపారు. అక్రమంగా పశువుల తరలింపు కొమరాడ: ఒడిశా నుంచి పార్వతీపురం సంతకు కొమరాడ మీదుగా జాతీయ రహదారిపై మూగజీవాల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతుంది. బొలెరా వంటి వాహనాల్లో వందల సంఖ్యలో పశువులను అక్రమంగా తరలించేస్తున్నారు. వీటి రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన అధికార యంత్రాంగం ఏమీ చూడనట్టు వ్యవహరిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. వీటిని కబేళాలకు తరలిస్తున్నట్టు అధికార యంత్రాంగానికి తెలిసినా ఏమీ పట్టనట్టు వ్యవహరించడంపై దుమారం రేగుతోంది. అంతర్రాష్ట్ర ప్రధాన రహదారిపై వందలాది పశువులను తరలిస్తూ అక్రమ సంపాదనపై అక్రమార్కులు గురి పెట్టినా నిఘా వర్గాలకు ఏమీ పట్టడం లేదు. మరోవైపు వందలాది కిలోమీటర్ల పొడవునా వీటిని నడిపిస్తూ కూడా కబేళాలకు తరలిస్తున్నా ఇటు పోలీసులకుగాని, అటు జంతు సంక్షేమ సంఘాలకు అనుమానం కలగకపోవడం విశేషం. ఇప్పటికై నా అధికార యంత్రాంగం మొద్దు నిద్రను వీగి మూగజీవాల పరిరక్షణకు తగు చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. నూతన బార్ పాలసీ విడుదల విజయనగరం టౌన్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబర్లు 275, 276 ప్రకారం 2025–2028 సంవత్సరాలకు సంబంధించి నూతన బార్ పాలసీలను విడుదల చేసినట్టు జిల్లా మద్యనిషేధ, అబ్కారీ శాఖ అధికారి బి.శ్రీనాథుడు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ, నగర పంచాయతీలలో గల 282బి బార్స్ నోటిఫై చేశామన్నారు. వీటిలో మూడు టూబీ బార్స్ కళ్లు గీత కులాలకు కేటాయించామన్నారు. ఈ వేలం ద్వారా ఎంపిక చేస్తామన్నారు. అదే విధంగా పార్వతీపురం మన్యం జిల్లాలో మున్సిపాలిటీ, నగర పంచాయతీలో ఎనిమిది 2బి బార్స్ను నోటిఫై చేశామన్నారు. వాటిలో రెండు 2బి బార్స్ కళ్లుగీత కులాలకు కేటాయించామన్నారు. ఆసక్తి గలవారు వారి పరిధిలో ఉన్న ఎకై ్సజ్ స్టేషన్లలో సంప్రదించాలని కోరారు. వివరాలకు 9440902360, 9440902362 (విజయనగరం), 8348523855, 9398630486 (పార్వతీపురం మన్యం) నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
రెండు ద్విచక్ర వాహనాల దగ్ధం
పాలకొండ రూరల్: మండలంలోని టీకే రాజపురం గ్రామస్తులు శుక్రవారం పాలకొండ పోలీసులను ఆశ్రయించారు. తమ గ్రామానికి చెందిన జాడ దుర్గారావు అలియాస్ చిన్న అనే వ్యక్తి తమను భయబ్రాంతులకు గురి చేస్తున్నాడని వాపోయారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన పెద్దింటి సూరిబాబుకు చెందిన ఎక్సెల్ వాహనంతో పాటు దోర భానుప్రసాద్కు చెందిన డీలక్స్ ద్విచక్ర వాహనం దగ్ధం చేశాడని ఎస్ఐ కె.ప్రయోగమూర్తి వద్ద వాపోయారు. గ్రామస్తుల ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అదుపులోకి తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు. -
వృత్తి వదల్లేరు.. బతుకు చక్రం కదలట్లేదు..!
● వినాయక విగ్రహాలకు డిమాండ్ తగ్గడంతో కుమ్మరుల్లో ఆందోళన ● బతుకు భారమైందంటూ ఆవేదన ● ఆదుకోని కూటమి ప్రభుత్వంసాలూరు: మరో పది రోజుల్లో వినాయకచవితి పండగ రానుంది. ఈ క్రమంలో ఇప్పటికే కుమ్మరి వీధులన్నీ సాధారణంగా వినాయక విగ్రహాల తయారీతో హడావిడిగా ఉండాలి. అయితే ఈ ఏడాది ఆ పరిస్థితి కుమ్మరి వీధుల్లో కనిపించడం లేదు. రథయాత్ర తరువాత ప్రారంభించే ఈ విగ్రహాల తయారీకి రెండు నెలల ముందు నుంచే సాలూరు, ఒడిశా పరిసర ప్రాంతాల నుంచి వినాయక కమిటీ నిర్వాహకులు వచ్చి భారీ పరిమాణంలో, వివిధ ఆకృతుల్లో వినాయక ప్రతిమల తయారీకి ఆర్డర్లు ఇచ్చేవారు. ఈ ఏడాది ఆ పరిస్థితి లేదని కుమ్మరులు వాపోతున్నారు. పెద్దబొమ్మలు ఆర్డర్లు చాలా వరకు తగ్గాయని, ఆ భయంతో గతంతో పోలిస్తే తక్కువ సంఖ్యలోనే బొమ్మలను తయారు చేస్తున్నట్టు తయారీదారులు తెలిపారు. సాలూరు, పాచిపెంట పండగల ఎఫెక్ట్ ప్రతి ఏడాది వినాయక ఉత్సవాన్ని చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఐక్యంగా స్థాయి కొద్దీ మండపాలు ఏర్పాటు చేసుకుని ఘనంగా పూజలు, అన్న సమారాధనలు, అనుపోత్సవం చేస్తుంటారు. ఈ ఏడాది సాలూరు, పాచిపెంట గ్రామదేవతల పండగలు జరగడంతో ప్రజల వద్ద చాలా వరకు డబ్బుల్లేవని దీనితో ఈ ఏడాది వినాయక ప్రతిమల ఆర్డర్లు తగ్గాయని కుమ్మరులు చెబుతున్నారు. వినాయకుడిని పెట్టిన తరువాత అన్న సమారాధన, అనుపోత్సవాలకు రూ.లక్షల్లో ఖర్చవుతుందని, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల వద్ద డబ్బులు లేకపోవడంతో నిర్వాహకులు కొంత వెనుకంజ వేస్తున్నారని వారు పేర్కొంటున్నారు. పెరిగిన తయారీ ఖర్చు బొబ్బిలి నుంచి తీసుకువచ్చే ట్రాక్టర్ మట్టికి కుమ్మరులు సుమారు 3500 రుపాయిలు చెల్లిస్తున్నారు. తయారీలో భాగంగా ముడి సరుకులు, రంగులకు అధిక డబ్బులు ఖర్చవుతున్నాయి. ఇంత డబ్బులతో తయారు చేస్తున్న వినాయక విగ్రహాలు కొనుగోలు జరగకపోతే ఇబ్బందులు పడతామని కావున గతంతో పోలిస్తే తక్కువ సంఖ్యలోనే ఈ ఏడాది వినాయక విగ్రహాలు తయారీచేస్తున్నామని కుమ్మరులు చెబుతున్నారు. రూ.లక్షలు పెట్టి తీసుకువచ్చిన ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో చేసిన పెద్ద విగ్రహాలకు ఇంకా ఆర్డర్లు రాకపోవడంతో ఆందోళన నెలకొందని తయారీదారులు వాపోతున్నారు. కుమ్మరి చక్రం కదలనంటున్నా.... కుమ్మరి వృత్తి తమ పూర్వీకుల నుంచి వస్తున్న సాంప్రదాయమని వారు చెబుతున్నారు. ఒకప్పుడు ఈ వృత్తి తమ కడుపు నింపేదని, నేడు ఆ పరిస్థితులు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మట్టి పాత్రల వినియోగం తగ్గిపోవడంతో తమ బతుకులు రోడ్డున పడ్డాయని చెబుతున్నారు. ఒకప్పుడు ఈ వృత్తే జీవనాధారంగా ఉండేదని, ప్రస్తుతం ఏడాదిలో రెండు నెలలు మాత్రమే ఈ వృత్తి కడుపు నింపుతోందని వారు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా కుమ్మరి చక్రం కదలనంటున్నా.. తమ కుల వృత్తిని వదులుకోలేకపోతున్నామని, ప్రభుత్వం తమకు చేదోడువాదోడుగా నిలవాలని వారు కోరుతున్నారు.పంటల్లేవు.. పథకాల్లేవు..ప్రజలకు గత ప్రభుత్వంలో ప్రతి నెలా ఏదో ఒక పథకం కింద డబ్బులు వారి ఖాతాల్లో జమవ్వడంతో ఆ డబ్బులు వారికి ఇటువంటి పండగలు, ప్రత్యేక కార్యక్రమాలకు ఉపయోగపడేవి. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో పథకాలు లేక ప్రజల వద్ద డబ్బులు కొరత నెలకొందని చర్చించుకుంటున్నారు. మరోవైపు పంటల పరిస్థితులు కూడా అనుకున్నంత సానుకూలంగా ఏమీ లేకపోవడంతో ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితుల్లో పండగ వైపు పెద్దగా దృష్టి సారించడం లేదు. -
బహిరంగ ప్రదేశాల్లో మద్యంతాగితే చర్యలు తప్పవు
● ఎస్పీ వకుల్ జిందల్ ● ఇప్పటికే 13,260 కేసుల నమోదు ● మందుబాబులకు పోలీసుల కౌన్సెలింగ్ విజయనగరం క్రైమ్: జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి, ప్రజా శాంతికి భంగం కలిగించేవారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ వకుల్ జింద ల్ శనివారం హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించేవారిపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక డ్రైవ్స్ చేపట్టామన్నారు. ఇప్పటివరకు 13,260 కేసులు నమోదు చేశామన్నారు. దాడుల్లో పట్టుబడిన మైనర్లైన మందుబాబులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు. రహదారి భద్రత నియమాలు ఉల్లంఘించిన వారి నుంచి ఈ–చలానాలను విధిస్తున్నట్టు వెల్లడించారు. -
బొబ్బిలిని మన్యం జిల్లాలో కలపాలి
బొబ్బిలి: ప్రభుత్వం నియోజకవర్గాలను పునర్విభజనకు సన్నాహాలు చేస్తున్న క్రమంలో బొబ్బిలి నియోజకవర్గాన్ని పార్వతీపురం మన్యం జిల్లాలో విలీనం చేయాలని ఐక్యవేదిక నాయకులు కోరారు. బొబ్బిలిలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలువరు మాట్లాడుతూ మన్యం జిల్లాకు బొబ్బిలి చేరువగా ఉందన్నారు. ఆ జిల్లాలో కలపడం వల్ల ఆర్థికంగా, భౌగోళికంగా ప్రయోజనాలు చేకూరుతాయని అభిప్రాయపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధికి అధిక నిధులు వచ్చే అవకాశం ఉందన్నారు. సమావేశంలో వివిధ పార్టీల నాయకులు మరిశర్ల రామారావు నాయుడు, మువ్వల శ్రీనివాసరావు, ఒమ్మి రమణ, కోట అప్పన్న, రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు వేమిరెడ్డి లక్ష్మునాయుడు తదితరులు పాల్గొన్నారు. -
కొత్తవలసను ముంచెత్తిన వాన
● జలమయమైన రైల్వే అండర్ బ్రిడ్జీలు ● కొత్తవలస జంక్షన్ జలమయం కొత్తవలస : మండలంలోని శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఇంత పెద్ద వర్షం గతంలో ఎన్నడు కురవలేదని స్థానికులు పేర్కొన్నారు. ఏకధాటిగా రెండు గంటలకు పైగా వర్షం కుండపోతగా కురవడంతో రైల్వే అండర్ బ్రిడ్జీలు, కొత్తవలస జంక్షన్ జలమయమమయ్యాయి. ముఖ్యంగా కొత్తవలస జంక్షన్ సమీపంలో నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జి పూర్తిగా వర్షం నీటితో నిండిపోయింది. ఈ వరద నీటిని అరికట్టేందుకు ఇటీవల సుమారు రూ 3.కోట్లతో నిర్మించిన పై కప్పు నిరుపయోగంగా మారింది. బ్రిడ్జి నీటితో నిండిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. అలాగే కొత్తవలస – విజయనగరం, కొత్తవలస – విశాఖపట్నం రోడ్డు పూర్తిగా వర్షం నీటితో నిండిపోయాయి. కొత్తవలస రైల్వే స్టేషన్ను సైతం వర్షం నీరు ముంచేసింది. -
ఎందరో సమరయోధుల త్యాగఫలం స్వాతంత్య్రం
● ఏపీఎస్పీ కమాండెంట్ మలికా గార్గ్ డెంకాడ: ఎందరో సమరయోధుల త్యాగఫలం స్వాతంత్య్రమని చింతలవలస ఐదవ ఏపీఎస్పీ కమాండెంట్ మలికా గార్గ్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చింతలవలస ఐదవ ఏపీఎస్పీ బెటాలియన్లో శుక్రవారం జాతీయ జెండాను కమాండెంట్ మలికా గార్గ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు వందల ఏళ్ల పాటు బ్రిటిష్ బానిసత్వం నుంచి భారతదేశం 1947 సంవత్సరం ఆగస్టు 15న విముక్తి పొందిందన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను వృథా కానివ్వరాదన్నారు. ఉత్తమ సేవలు కనబరిచిన అధికారులు, సిబ్బందికి ప్రసంశా పత్రాలను అందేశారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు జి.లక్ష్మీనారాయణ, ఎస్.బాపూజీ, డీవీ రమణమూర్తి, అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి కొమరాడ: కొమరాడ మండలం విక్రంపురం గ్రామానికి చెందిన వుబ్బిశెట్టి చిట్టిబాబు(62) విద్యుత్ షాక్తో మృతి చెందినట్లు ఎస్ఐ నీలకంఠం తెలిపారు. ఆయన చెప్పిన వివరాలు.. వుబ్బిశెట్టి చిట్టిబాబు తాపీ మేస్త్రిగా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం వర్షం కారణంగా పనిలేక వెళ్లలేదు. తన ఇంటి బయట విద్యుత్ వైర్ వేలాడుతుండగా ప్రమాదవశాత్తు తగిలి షాక్ గురై కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అనుమానాస్పదంగా ఎలక్ట్రీషియన్ మృతి పెందుర్తి: భార్యతో గొడవల నేపథ్యంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన పెందుర్తిలో చోటు చేసుకుంది. సీఐ కేవీ సతీష్కుమార్ తెలిపిన వివరాలు.. పెందుర్తి నటరాజ్ థియేటర్ సమీపంలోని నేల బావిలో ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు శుక్రవారం గుర్తించారు. దీనిపై స్థానిక పోలీస్స్టేషన్కు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న సీఐ సతీష్కుమార్ ఆధ్వర్యంలోని పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మృతుడు విజయనగరం జిల్లా జామి మండలం మామిడిపల్లికి చెందిన రావురు ప్రసాద్(25)గా గుర్తించినట్లు వెల్లడించారు. ప్రాథమిక సమాచారం మేరకు కొన్నాళ్లుగా భార్యతో వివాదాల కారణంగా తల్లితో స్వగ్రామంలో నివాసం ఉంటున్నాడని తెలిపారు. వృత్తి రీత్యా ఎలక్ట్రీషియన్ అయిన ప్రసాద్ మూడు రోజుల క్రితం పని మీద వెళుతున్నానని తల్లికి చెప్పి, తిరిగి ఇంటికి రాలేదన్నారు. ఈ క్రమంలో ప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడ్డాడా? మరేదైనా కారణంతో మృతి చెందాడా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. -
మండల సమాఖ్యకు జాతీయ స్థాయి అవార్డు
గంట్యాడ: గంట్యాడ మండల సమాఖ్యకు జాతీయ స్థాయి ఆత్మనిర్బర్ భారత్ సంఘటన్ అవార్డు వరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు న్యూఢిల్లీలో కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పూస భవన్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆ శాఖ మంత్రి శివజార్ సింగ్ చౌహాన్ చేతుల మీదుగా సమాఖ్య అధ్యక్షురాలు కర్రి అనసూయమ్మ, కార్యదర్శి కంటిపాక సీతమ్మ, ఏపీఎంలు కోరుకొండ సులోచన దేవి, శ్రీనివాస్, ఏపీ సెర్ప్ అదనపు సీఈఓ ఆర్.శ్రీరాములునాయుడు అవార్డును అందుకున్నారు. అవార్డు కింద జ్ఞాపిక, సర్టిఫికెట్, రూ.3లక్షల చెక్కు ఇచ్చినట్టు సమాఖ్య సభ్యులు స్థానిక విలేకరులకు తెలిపారు. పైడితల్లికి అరటిపండ్లతో అలంకరణ విజయనగరం టౌన్: శ్రావణమాసం నాలుగో శుక్రవారం సిరుల తల్లి, ఉత్తరాంధ్రుల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారిని వనంగుడిలో అరటిపండ్లతో అలంకరించారు. ఆలయ అర్చకుడు నేతేటి ప్రశాంత్, వేదపండితులు వెలువలపల్లి నరసింహమూర్తి ప్రత్యేక పూజలు చేశారు. పండ్లను నైవేద్యంగా సమర్పించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆర్మ్డ్ రిజర్వు విభాగంలో జెండా పండగ విజయనగరం క్రైమ్: స్థానిక ఆర్మ్డ్ రిజర్వు విభాగంలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎస్పీ వకుల్ జింద్ ముఖ్యఅతిథిగా హాజరై సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించి, జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) పి.సౌమ్యలత, ఏఆర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు, డీఎస్పీలు పి.శ్రీనివాసరావు, జి.భవ్యారెడ్డి, ఎస్.రాఘవులు, ఆర్.గోవిందరావు, ఎం.వీరకుమార్, పలువురు సీఐలు పాల్గొన్నారు. -
ప్రపంచ దేశాల్లో భారత్ అగ్రరాజ్యంగా ఎదగాలి
● విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ● జిల్లా పరిషత్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ విజయనగరం: అనేక సవాళ్లను ఎదుర్కొంటూ అభివృద్ధి పథంలో ముందంజలో ఉన్న భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యంగా ఎదగాలని ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆకాంక్షించారు. జెడ్పీ కార్యాలయంలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసి జెండా వందనం చేశారు. అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటీష్ వలసపాలకులను తరిమికొట్టి స్వాతంత్య్రసాధనలో సమరయోధుల స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనేక కులాలు, మతాలు, జాతులు, భాషలు, సంస్కృతులు కలిసి ఉన్న భారత దేశం ప్రపంచ దేశాల చూపును ఆకర్షించే స్థాఽయికి ఎదిగిందన్నారు. దేశ పౌరులంతా కలిసిమెలసి అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. అనంతరం కారుణ్యనియామకాల్లో భాగంగా ముగ్గురు జూనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు ఆఫీస్ అసిస్టెంట్లకు నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీలు వర్రి నర్సింహమూర్తి, శాంతకుమారి, కెల్ల శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ సీఈఓ బీవీవీ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
ఆర్డబ్ల్యూఎస్ శకటానికి ప్రథమ బహుమతి
స్వాతంత్య్ర వేడుకల్లో వ్యవసాయ, సెర్ప్గ్రామీణాభివృద్ధి, విద్య, సమగ్ర శిక్ష, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, వైద్యారోగ్య, గృహనిర్మాణ, విజయనగరం మున్సిపాలిటీ, పరిశ్రమలు, ముఖ్య ప్రణాళిక, సీ్త్ర శిశు సంక్షేమం, గ్రామీణ నీటి సరఫరా, తదితర శాఖలు తమ ప్రగతిని తెలియజేసేలా శకటాలు ప్రదర్శించాయి. వీటిలో గ్రామీణ నీటి సరఫరా, విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ మొదటి రెండు బహుమతులు గెలుచుకోగా జిల్లా పరిశ్రమలు, గ్రామీణాభివృద్ధి శాఖలు తృతీయ బహుమతిని ఉమ్మడిగా అందుకున్నాయి. ● అట్టహాసంగా స్వాతంత్య్ర దినోత్సవం ● ఆకట్టుకున్న శకటాలు, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ● జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ జాతీయ జెండాకు గౌరవ వందనం చేస్తున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ అంబేడ్కర్, ఎస్పీ వకుల్ జిందల్, జేసీ సేతుమాధవన్ జాతీయ జెండా రంగుల్లో నీటిని ఫైర్ చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది విజయనగరం ఫోర్ట్/విజయనగరం క్రైమ్: విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సాయుధ దళాల పోలీస్ కవాతు, వివిధ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, వివిధ శాఖల ప్రగతి ని సూచించే శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. వేడుకల్లో రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి పథంలో పయనిస్తోందన్నారు. సీ్త్ర శక్తి పథకాన్ని ప్రారంభించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నట్టు తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు 74 శాతం పూర్తయ్యాయని వెల్లడించారు. ఎంఎస్ఎం పార్కులను ఏర్పాటు చేసి ఉద్యోగ కల్పనకు కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ స్వాతంత్య్ర సమర యోధుల త్యాగాన్ని స్మరించుకోవాలన్నారు. 140 కోట్ల జనాభా కల్గిన భారతావని పరాయిపాలన నుంచి విముక్తి పొందిన నాటి నుంచి నేటివరకు ఎన్నో మైలు రాళ్లను అందుకుందన్నారు. ఆర్థిక, సామాజిక, సేవా రంగాల్లో విశేషమైన ప్రగతిని సాధించిందని తెలిపారు. 2026–27 నాటికి జిల్లాలో అదనంగా 18,515 హెక్టార్లు సాగులోకి తీసుకురావాలని, ప్రకృతి సాగును 15వేల హెక్టార్లకు పెంచాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తల్లికివందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ పథకాల లబ్ధిని వివరించారు. అనంతరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, ఎమ్మెల్యే అదితిగజపతిరాజు, కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్, జేసీ సేతు మాధవన్తో కలిసి ఉత్తమ ఉద్యోగులు, సేవలందించిన వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. ● అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. దేశభక్తి గీతాలకు విద్యార్థులు చేసిన నృత్యప్రదర్శనలు అలరించాయి. ఆపరేషన్ సిందూర్, నెమలి ప్రదర్శనలు ఆసక్తిగా సాగాయి. విజయనగరం, జామి కేజీబీవీలు, ఫోర్ట్ సిటీ స్కూల్, చీపురుపల్లి బాలసదన్, వియ్యంపేట డాక్టర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల, కొత్తవలస జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు నృత్యప్రదర్శనలతో దేశభక్తిని చాటిచెప్పారు. వీరిలో జామి కేజీబీవీ బాలికల ఆపరేషన్ సిందూరం ప్రదర్శనకు మొదటి బహుమతి, రాజాం బాలభవన్ విద్యార్థుల నెమలినృత్యప్రదర్శనకు ద్వితీయ బహుమతి, వియ్యంపే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యార్థుల గిరిజన నృత్యప్రదర్శనకు తృతీయ బహుమతులు లభించాయి. పోలీస్ జాగిలాల విన్యాసాలు అబ్బురపరిచాయి. అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటల ఆర్పే ప్రయోగాలు అవగాహన పెంచాయి. ఏపీఐఐసీ శకటం -
గురువుపై దిద్దుబాటు బరువు
ఏకోపాధ్యాయ పాఠశాలలో అమలు సాథ్యం కాదు ప్రాథమిక విద్య పరీక్ష విధానంలో నూతనంగా అమలు చేస్తున్న సెల్ఫ్ అసెస్మెంట్ బుక్ సిస్టం ఏకోపాధ్యాయ పాఠశాలలో సాధ్యం కాదు. ఐదు తరగతుల ఒక్కో విద్యార్ధికి ఒక్కో సబ్జెక్టు పుస్తకాన్ని నిర్వహించడం వల్ల పాఠ్యాంశాల బోధనలో నాణ్యత లోపిస్తుంది. విద్యార్థి అభ్యసన సామర్థ్యం ఆధారంగా ఆ స్కూల్ టీచర్ చేతనే ప్రశ్నపత్రాన్ని రూపొందించే విధానం ఇందులో తీసుకురావాలి. అదే విధంగా ప్రశ్నపత్రాలలో సరళమైన భాష వాడాలి. – జేఏవీఆర్కే ఈశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్ తలకుమించిన భారం ప్రాథమిక స్థాయిలో ఈ విధానం సరికాదు. పుస్తకాలపై పరీక్ష జవాబు పత్రం రాయించి వాటిని జాగ్రత్త పరచడం ఉపాధ్యాయులకు తలకు మించిన భారం. పాఠాలు చెప్పడానికే సమయం సరిపోదు. అసెస్మెంట్ పేరుతో అమలు చేస్తున్న ఈ విధానం ద్వారా ఫలితాలు ఎలా వస్తాయో తెలియదు. కానీ ఈ విధానాన్ని నిర్వహించడానికి ఇవి పాఠశాలలో లేదంటే ప్రయోగశాలలో అర్థం కావడం లేదు. – చిప్పాడ సూరిబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎస్టీయూ సమయం పెంచాలి అసెస్మెంట్ విధానంలో పరీక్షలు నిర్వహించడానికి ప్రస్తుతం నిర్దేశించిన సమయం సరిపోదు. ఒక్కో విద్యార్థితో పుస్తక రూపంలో జవాబు పత్రాలను రాయించడం కష్టతరమైన పని. అసెస్మెంట్ పుస్తకాన్ని విద్యార్థి భద్రంగా ఉంచకపోతే ఉపాధ్యాయులకు రిమార్క్. విద్యార్ధులందరినీ సబ్జెక్టు వారీగా ఆ పుస్తకాలను ఏడాది పాటు భద్రంగా ఉంచడం ఉపాధ్యాయులకు భారంగా మారుతుంది. – డి.శ్రీనివాస్, జిల్లా ప్రధానకార్యదర్శి, పీఆర్టీయూ విజయనగరం అర్బన్/రాజాం: కూటమి ప్రభుత్వ విద్యావిధానాలు విద్యార్థులతో పాటు గురువులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. సెల్ఫ్ అసెస్మెంట్ విధానం ఉపాధ్యాయులకు తలనొప్పిగా మారింది. పరీక్ష పత్రాల మూల్యాంకనం, మార్కుల నమోదు, రికార్డుల అప్లోడ్ తదితర పనులతో బోధనకు సమయం ఉండదని, విద్యాప్రమాణాలు కుంటుపడతాయ న్నది ఉపాధ్యాయులవాదన. కొత్త విధానంలో ప్రతి విద్యార్థికి సబ్జెక్టుకు ఒకటి చొప్పున అసెస్మెంట్ పుస్తకాన్ని నిర్దేశించారు. అందులోనే ఏడాది పాటు నిర్వహించే పరీక్షల జవాబు పత్రాలు, ఓఎంఆర్ షీట్లు, ప్రాజెక్టు వర్క్ మార్కుల పట్టికల పేజీలను జతజేశారు. ఏడాదికి నాలుగుసార్లు జరిగే ఫార్మేటివ్ పరీక్షలకు 35 మార్కులతో పాటు స్టూడెంట్ హ్యాండ్ రైటింగ్, రెస్పాన్స్, ప్రాజెక్టు వర్క్ల పేరుతో 5 మార్కుల వంతున మరో 15 మార్కులు నమోదుచేయాలి. ఏడాదికి రెండుసార్లు జరిగే సమ్మేటివ్ పరీక్షలను 80 మార్కులు వంతున నిర్వహిస్తారు. ఉమ్మడి విజయనగరం జిల్లాకు 9.06 లక్షల పుస్తకాలు ప్రాథమిక పాఠశాలల్లో 1, 2 తరగతులకు మూడు సబ్జెక్టులుంటాయి. అదే విధంగా 3, 4, 5 వ తరగతులకు నాలుగు, 6, 7 తరగతులకు 6 సబ్జెక్టులు, 8 నుంచి 10వ తరగతి వరకు ఏడు సబ్జెక్టుల పుస్తకాలు ప్రతి విద్యార్ధికీ ఉంటాయి. వీటిని విద్యాసంవత్సర ఏడాది పాటు మాత్రమే కాకుండా ఆ విద్యార్ధి స్కూల్ నుంచి బయటకు వెళ్లిన తరువాత కూడా భద్రపరచాల్సి ఉంటుంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో దాదాపు 1.51 లక్షల మంది విద్యార్ధులు 1 నుంచి 10 తరగతి వరకు చదువుతున్నారు. వీరికి అన్ని సబ్జెక్టులకు 9 లక్షల 6 వేల 679 అసెస్మెంట్ పుస్తకాలు వచ్చాయి. వాటితో ఈ నెల 11 నుంచి ఈ పరీక్షల కొత్త విధానాన్ని నిర్వహిస్తున్నారు. అసెస్మెంట్ పుస్తకంలో విద్యార్థులు తమ అపార్ నంబర్, పరీక్ష కోడ్ రాసి బబ్లింగ్ చేయాలి. పుస్తకంలో జవాబులు రాయడంతో పాటు అందులో పొందుపరిచిన ఓఎంఆర్ షీట్లో సరైన సమాధానాలకు బబ్లింగ్ చేయాలి. వీటిని సరిగ్గా ఉండేలా ఉపాధ్యాయుడు చూడాలి. వెంటవెంటనే మూల్యాంకనం చేయాలి. ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేస్తున్న అంశాలు.. పరీక్షల అనంతరం ఆదే రోజు లేదా తక్షణం మూల్యాంకనం చేసి రిపోర్డులు పంపాల్సి రావడం ఆన్లైన్ సాఫ్ట్వేర్ ద్వారా మార్కుల అప్లోడ్లో సాంకేతిక సమస్యలు చిన్న పాఠశాలల్లో ఒకే ఉపాధ్యాయుడు అన్ని బాధ్యతలు చేపట్టడం వల్ల పాఠ్యాంశాల బోధనకు సమయం ఉండదు. ప్రతి విద్యార్థికి సబ్జెక్టుకు ఒక పుస్తకం ఉండడం వల్ల వాటిని ఏడాది పాటు స్కూల్లో సంరక్షణ క్లిష్టతరం. అసెస్మెంట్ విధానంలో పుస్తక మూల్యాంకనం ఒక్కో సబ్జెక్ట్కు ప్రత్యేకంగా పుస్తకాలు ఉపాధ్యాయులదే మూల్యాంకన బాధ్యత తలలు పట్టుకుంటున్న గురువులు బోధనకు సమయం ఉండడంలేదంటూ ఆందోళన చెప్పలేని కష్టాలు పుస్తకాలకు మూల్యాంకనం నిర్వహించడం ఉపాధ్యాయులపై పెనుభారం. సింగిల్ ఉపాధ్యాయుడు ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఇబ్బందులు తప్పవు. ఉన్నత పాఠశాలల్లో వందలాదిమంది విద్యార్థులు ఉంటే రోజుల తరబడి మూల్యాంకన చేయాల్సి ఉంటుంది. మరోవైపు హోలిస్టిక్ కార్డులను కూడా పూరించాలి. ఇదంతా కష్టతరం. – అదపాక దామోదరరావు, ప్రభుత్వ ఆంగ్ల ఉపాధ్యాయుడు, రాజాం స్కూల్ ఎడ్యుకేషన్ విధానానికి తగ్గట్టుగా ... అసెస్మెంట్ పుస్తకాల విధానం గందరగోళంగా ఉందనే విష యం మా దృష్టికి వచ్చింది. మూల్యాంకనంలో ఉపాధ్యా యులు తీవ్ర ఒత్తిడికి గురౌతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ విషయంపై ఉన్నతాధికారులతో మాట్లాడాం. ఎస్ఎస్ఏ ఆదేశాలతో ఈ విధానం వచ్చింది. స్కూల్ ఎడ్యుకేషన్ ఈ విధానాన్ని అమలుచేస్తోంది. – యాగాటి దుర్గారావు, ఎంఈఓ, రాజాం -
కనకమహాలక్ష్మికి లక్ష పసుపు కొమ్ములతో అర్చన
విజయనగరం టౌన్: పట్టణంలోని సిటీబస్టాండ్ వద్దనున్న కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో పంచమిని పురస్కరించుకుని గురువారం లక్ష పసుపు కొమ్ములతో అర్చన జరిపారు. ఆలయ ప్రధాన అర్చకుడు గాయత్రీ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. గాజులతో అమ్మవారిని అలంకరించారు. నీటి సంరక్షణలో ‘విజయ’పథం ● దేశంలోని అత్యుత్తమ పది జిల్లాల్లో విజయనగరానికి చోటు విజయనగరం అర్బన్: నీటి సంరక్షణ కట్టడాల నిర్మాణంలో జిల్లాకు ప్రశంసలు దక్కాయి. దేశంలోని అత్యుత్తమ పది జిల్లాల్లో విజయనగరం జిల్లాకు చోటుదక్కింది. నీటి సంరక్షణ కట్టడాల కారణంగా జిల్లాలో భూగర్భ జలమట్టం పెరిగిందంటూ కలెక్టర్ అంబేడ్కర్ను సీఎం చంద్రబాబునాయుడు గురువారం నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్లో అభినందించారు. నీటి సంరక్షణలో దేశంలోని మొదటి పది జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆరు జిల్లాలు ఉండడం ఆనందంగా ఉందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో భూగర్భ జలమట్టం పెరిగి, జులై నాటికి 4.15 మీటర్లకు చేరిందని తెలిపారు. కార్యక్రమంలో జేసీ ఎస్.సేతు మాధవన్, ఇతర అధికారులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. జేసీకి అభినందనలు విజయనగరం అర్బన్: విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్గా ఏడాది పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న ఎస్.సేతుమాధవన్ను కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురువారం అభినందించారు. కలెక్టర్ చాంబర్లో కలెక్టర్ కేక్ కట్చేసి జేసీకి అభినందనలు తెలిపారు. దుశ్శాలువతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి, జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు తాడ్డి గోవింద, తదితరులు పాల్గొన్నారు. సెంచూరియన్ చాన్స్లర్కు అవార్డు నెల్లిమర్ల రూరల్: మండలంలోని టెక్కలి సెంచూరియన్ విశ్వవిద్యాలయం చాన్స్లర్ ప్రొఫెసర్ జీఎస్ఎన్ రాజు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఫర్ బెస్ట్ ఇంజినీరింగ్ ఎడ్యుకేటర్ అవార్డును అందుకున్నారు. మదనపల్లి ఇనిస్టిట్యూట్లో గురువారం జరిగిన కార్యక్రమంలో ఐఎస్టీఈ అధ్యక్షుడు డాక్టర్ దేశాయ్, అనంతపురం జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ సుదర్శన్ చేతుల మీదుగా అవార్డు, ప్రసంసా పత్రాన్ని తీసుకున్నారు. -
నేడే మువ్వన్నెల పండగ
విజయనగరం అర్బన్: స్వాతంత్ర దినోత్సవ వేడుకలు విజయనగరం పొలీస్ బ్యారెక్స్లో శుక్రవారం నిర్వహిస్తామని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే జాతీయజెండా వందన కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొంటారన్నారు. వివిధ శాఖల పురోగతిని సూచించేలా శకటాల ప్రదర్శన, చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేస్తామని తెలిపారు. కలెక్టరేట్లో కలెక్టర్ అంబేద్కర్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. స్వాతంత్య్రదినోత్సవ ఏర్పాట్లను జేసీ సేతుమాధవన్ పరిశీలించారు. జెండా పండగలో భాగంగా రైల్వేస్టేషన్, కలెక్టరేట్, నగరంలోని పలు కూడళ్లను విద్యుత్ దీపాలతో అలంకరించారు. -
సాగునీటి సరఫరాలో జాప్యం
● డీఆర్సీలో ప్రశ్నించిన జెడ్పీచైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విజయనగరం అర్బన్: ప్రణాళికలు లేని పాలనవల్లే ఖరీఫ్ సాగుకు సకాలంలో సాగునీటిని అందజేయలేకపోయారని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆరోపించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం (డీఆర్సీ) గురువారం నిర్వహించారు. తొలుత ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలోని తోటపల్లి ప్రాజెక్టుపై సమీక్షించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ తోటపల్లి ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదల ఎందుకు ఆలస్యమైందని ప్రశ్నించారు. గత ఐదేళ్ల పాలనలో జూన్ నెలలోనే సాగునీటిని విడుదల చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రాజెక్టులో నీరున్నా ఎందుకు విడుదల చేయలేదో చెప్పాలని అధికారులను నిలదీశారు. కాలవల పూడిక తీత పనులు చేపట్టామని అఽధికారులు చెప్పగా ముందుగా ప్రణాళిక వేసుకోలేదా అని ప్రశ్నించారు. ఇన్చార్జి మంత్రి అనిత కలుగుచేసుకొని మూడు జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, నీటి సంఘాలతో మాట్లాడుకోవాల్సి ఉంటుందని సమాధానం ఇచ్చారు. రైతులకు నీరివ్వడంలో ఈ ఏడాది 15 రోజులు ఆలస్యమైందని అంగీకరించారు. ● డీసీసీబీ చైర్మన్ నాగార్జున మాట్లాడుతూ తోటపల్లి ప్రాజెక్టు పరిధిలో ఎత్తిపోతల పథకం నుంచి రాజాం, చీపురుపల్లి ప్రాంతాలకు సాగునీరు అందడం లేదని ఆరోపించారు. బాడంగి మండలం వాడాడ గ్రామం పరిధిలోని 860 హెక్టార్ల సాగుభూమి కోసం గత ప్రభుత్వ హయాంలో ఈ ఎత్తిపోతల పథకం వినియోగంలోకి వచ్చిందని తెలిపారు. దీనిపై పూర్తినివేదిక ఇవ్వాలని హోంమంత్రి ఆధికారులను ఆదేశించారు. ● వ్యవసాయ శాఖ సమీక్షలో 5 వేల మెట్రిక్ టన్నుల ఎరువుల కొరత ఉన్నట్లు కలెక్టర్ బహిరంగంగానే చెప్పడం, గతంలోనే డిమాండ్ చేసినప్పటికీ ఇంకా పూర్తి సరఫరా జరగలేదని జెడ్పీ చైర్మన్ విమర్శించారు. నానో యూరియా వినియోగంపై ప్రచారం చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా రైతుల్లో సందేహాలు తొలగడంలేదన్నారు. ● పరిశ్రమల సమీక్షలో జిల్లాలో మూతపడిన పరిశ్రమల జాబితాలు ఇవ్వాలని మంత్రి అనిత చెప్పడం జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి స్తబ్దతను తెలియజేసింది. మహిళలకు ఉచిత ప్రయాణం కోసం సీ్త్ర శక్తి బస్సులు ప్రారంభిస్తున్నట్లు మంత్రి చెప్పినా జిల్లాలో 160 బస్సులకు కేవలం 137 బస్సులు మాత్రమే సిద్ధం కావడం, వాటిలో సీసీటీవీ అమలు వంటి పనులు ఇంకా పూర్తికాలేదని తెలియజేశారు. సమావేశంలో వైద్యశాఖ, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్ తదితర శాఖలపై సమీక్షించారు. ఎమ్మెల్సీలు డాక్టర్ పెనుమత్స సురేష్బాబు, డాక్టర గాదె శ్రీనివాసులనాయుడు, ఎంపీ అప్పలనాయుడు, కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జేసీ సేతు మాధవన్, సీపీఓ పీ.బాలాజీ, డీఆర్ఓ శ్రీనివాసమూర్తి, ఆర్డీఏ దాట్ల కీర్తి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఒక్కరు మినహా ఎమ్మెల్యేలందరూ డుమ్మా ప్రజల సమస్యలను జిల్లా స్థాయిలో పాలకులను చెప్పుకొనే అవకాశం ఉన్న వేదిక డీఆర్సీ. ప్రతి మూడునెలకు ఒకసారి జరిగే ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరై జిల్లా అభివృద్ధికి సంబంధించిన సూచనలు, సమస్యల పరిష్కారాలు చేపడతారు. జిల్లాలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో నెల్లిమర్ల ఎమ్మెల్లే లోకం నాగ మాధవి మినహా మిగిలిన వారంతా గైర్హాజరుకావడం గమనార్హం. -
కార్మికుల జీవితాల్లో కారు చీకట్లు
వీరఘట్టం: కార్మికుల జీవితాల్లో కారుచీకట్లు అలుముకున్నాయి. వారికి ఇచ్చిన ఏ హామీ అమలుకు కూటమి ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో వారంతా అయోమయంలో పడిపోయారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు కలగానే మిగిలిపోతోంది. ఎన్నికల సమయంలో హామీలివ్వడం..గెలిచాక ఏదో సాకుతో దానిని అమలు చేయకుండా కాలయాపన చేయడం చంద్రబాబుకు మొదటి నుంచి అలవాటుగా మారిపోయింది. 2014 ఎన్నికల్లో ఆరు వందలకు పైగా హామీలిచ్చి వాటిని అమలు చేయకుండా అన్నివర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత ఆయనది. 2024 ఎన్నికల ప్రచారంలో కూడా ఎన్నో హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచినా ఏ ఒక్క హామీ అమలుపై కూడా మాట్లాడని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా కార్మికుల సంక్షేమం కోసం భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు పునరుద్ధరిస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి సంతకం భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు ఫైల్పై పెడతామని హామీ ఇచ్చారు. అలాగే పెండింగ్లోని 42 వేల క్లెయిమ్ల పరిష్కారం, ఉచిత ఇసుకతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం, 1996 భవన నిర్మాణ కార్మిక చట్టం ప్రకారం అన్నీ అమలు చేస్తామని హామీల వర్షం కురిపించారు. కార్మికుల పిల్లల చదువుకు రూ.20 వేలు, ఇన్సూరెన్స్ సదుపాయం, గర్భిణుల డెలివరీ ఖర్చులు, ఇప్పటివరకు సహజ మరణానికి చెల్లిస్తున్న రూ.లక్షను రూ.5 లక్షలకు పెంచుతాం, ప్రమాద మరణం బీమాను రూ.6 నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. ఇవన్నీ నమ్మి భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న తాపిమేసీ్త్రలు, తాపి పనివారు, రాడ్బెండర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లు, పెయింటర్లు, మార్బుల్ వర్కర్స్, టైల్స్ వర్కర్స్, రోజువారీ కూలీలు ఇలా అందరూ ఓట్లు వేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 80 వేల మంది భవన నిర్మాణ రంగంపై ఆధారపడి పనిచేస్తున్నారు. అయితే ప్రభుత్వం అధికారం చేపట్టి 14 నెలలు గడిచినా తమకు ఇచ్చిన హామీల అమలుపై కూటమి సర్కారు నోరు మెదపకపోవడం పట్ల కార్మికులు పెదవి విరుస్తున్నారు. కార్మికుల ఆశలపై నీళ్లు.. ఎన్నికల ప్రచారం సమయంలో తాడేపల్లిలో జరిగిన సభలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకు తనవంతు సాయంగా కోటి రూపాయలు ఇస్తానని పవన్కల్యాణ్ ప్రకటించారు. అధికారం చేపట్టి 14 నెలలు గడుసున్నా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయలేదు. ఆయన ఇస్తానన్న కోటి రూపాయలు ఇంకా జమ కాలేదు. భవన నిర్మాణ కార్మికులకు చట్ట ప్రకారం అన్ని సౌకర్యాలు కల్పిస్తామని పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీ మాటలకే పరిమితమైందని కార్మికులు మండిపడుతున్నారు. ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్లో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు, పెండింగ్ క్లెయిమ్ల పరిష్కారం, ఇన్సూరెన్స్, నష్ట పరిహారంపై ప్రకటన కోసం కార్మికులంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం వారి ఆశలపై నీళ్లు చల్లింది. ఎన్నికల హామీల అమలుతో పాటు డిమాండ్ల సాధనకు కార్మికలు గతేడాది నవంబర్ 11న ధర్నాకు దిగి నిరసన కూడా తెలియజేయడం జరిగింది. అయినా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేకపోవడం దురదృష్టకరమని, వారి హామీలు నమ్మి మోసపోయామని కార్మికలోకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కలగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు ఎన్నికల ప్రచారంలో బోర్డును పునరుద్ధరిస్తామని చంద్రబాబు హామీ బోర్డు ఏర్పాటుకు రూ.కోటి ఇస్తానని తాడేపల్లి సభలో పవన్ ప్రకటన అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఆ దిశగా చర్యలు శూన్యం ప్రభుత్వ తీరుపై కార్మికుల మండిపాటు -
● రేషన్ అవస్థలు
రేషన్ బియ్యం పంపిణీలో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం..గిరిజనుల పాలిట శాపంగా మారింది. అధికారంలోకి రాగానే వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న ఇంటింటికీ రేషన్ పంపిణీ విధానాన్ని రద్దు చేసి, మళ్లీ పాత విధానంలోనే రేషన్ షాపుల వద్దనే రేషన్ సరుకుల పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో గిరిజనులకు కష్టాలు మొదలయ్యాయి. కొన్ని కిలోమీటర్ల మేర కొండలు, వాగులు, వంకలు దాటుకుని కాలినడకన రేషన్ షాపు వద్దకు చేరుకుని, అక్కడ కొన్ని గంటల పాటు వేచి ఉండగా వచ్చిన రేషన్ను మళ్లీ నెత్తిన పెట్టుకుని కాలినడకన వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో మళ్లీ కష్టాలు మొదలయ్యాయని, జగనన్న హయాంలోనే బాగుండేదని ఎండీయూ వ్యాన్ ద్వారా గ్రామంలోకి రేషన్ వచ్చేదని అంటున్నారు. అదే విధానాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. –సాలూరు రూరల్ -
పంద్రాగస్టు కవాతు సాధన
విజయనగరం క్రైమ్: స్వాతంత్య్ర దినోత్సవ నిర్వహణలో భాగంగా స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోలీసుల కవాతు సాధన గురువారం జరిగింది. ఎస్పీ వకుల్ జిందల్ వారి పరేడ్ పరిశీలనకు వెళ్లగా, వారు ఆయనకు గౌరవ వందనం చేశారు. అనంతరం పలు సూచనలు చేశారు. ఆగస్టు 15వ తేదీన జరిగే స్వాతంత్య్ర వేడుకల్లో మరింత ఉత్సాహంగా కవాతు చేసి, చూపరులను ఆకట్టుకునేలా ప్రదర్శన ఉండాలని ఆ దిశగా సాధన చేయాలని తెలిపారు. వేడుక చూసిన వారిలో దేశభక్తి, జాతీయ భావం పెంపొందేలా కార్యక్రమం ఉండాలన్నారు. వేడుకల్లో ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు, రిజర్వు ఇన్స్పెక్టర్లు ఎన్.గోపాలనాయుడు, ఆర్.రమేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి పోటీలకు దివ్యవాణి మెంటాడ: జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు మెంటాడ మండలం, గుర్లతమ్మిరాజుపేట విద్యార్థిని అల్లు దివ్యవాణి ఎంపికై ంది. ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు బాపట్ల జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో అండర్ 20 విభాగంలో జరిగిన 100 మీటర్లు, 200 మీటర్లు పరుగుపందెంలో ద్వితీయ స్థానంలో నిలిచి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించింది. ఈ మేరకు దివ్యవాణికి ఎంపీపీ రెడ్డి సన్యాసినాయుడు, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు రాయిపల్లి రామారావు, చొక్కాపు సన్యాసినాయుడు, టీడీపీ మండల అధ్యక్షుడు చలుమూరి వెంకటరావు తదితరులు అభినందనలు తెలిపారు. త్రుటిలో తప్పిన ప్రమాదం రాజాం సిటీ: స్థానిక పాలకొండ రోడ్డులోని జీఎంఆర్ ఐటీ సమీపంలో గురువారం త్రుటిలో ఓ ప్రమాదం తప్పింది. రేగిడి మండలం, సరసనాపల్లికి చెందిన వృద్ధ దంపతులు ద్విచక్ర వాహనంపై రాజాం నుంచి స్వగ్రామం వెళుతున్నారు. రోడ్డుపై పెద్దగోతులు ఉండడంతో ఒక్కసారిగా అదుపుతప్పి పడిపోయారు. అదే సమయంలో రాజాం వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవరు ఈ ఘటనను చూసి షడన్ బ్రేక్ వేయడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు అప్రమత్తమై పడిపోయిన వృద్ధ దంపతులను పక్కకు తీసుకువెళ్లి సపర్యలు చేశారు. ఈ విషయం తెలుసుకన్న ఆర్అండ్బీ అధికారులు అప్రమత్తమై రోడ్డుపై గుంతలు పూడ్చే పనిలో నిమగ్నమయ్యారు. సారాబట్టీలపై పోలీసుల దాడులు గుమ్మలక్ష్మీపురం: మండలంలోని చెముడుగూడ పంచాయతీ, మంగన్నగూడ పరిసరాల్లో నిర్వహిస్తున్న సారాబట్టీలపై పోలీసులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఎల్విన్పేట ఎస్ఐ బి.శివప్రసాద్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది సారా తయారీకి సిద్ధం చేసి ఉంచిన 1400 లీటర్ల బెల్లంఊటను గుర్తించి, దానిని బయటకు పారబోశారు. అనంతరం సారా తయారీకి వినియోగిస్తున్న డ్రమ్ములను స్వాధీనం చేసుకుని వాటిని కాల్చివేశారు. ఎక్కడైనా సారా తయారు చేసినా తరలించినా సమాచారం ఇవ్వాలని, సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. పార్వతీపురం రూరల్: మండలంలోని తాళ్లబురిడి గ్రామానికి చెందిన ఓ వివాహిత మహిళ అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు పార్వతీపురం రూరల్ ఎస్ఐ బి.సంతోషికుమారి గురువారం తెలిపారు. బుధవారం ఉదయం నుంచి ఆమె ఆచూకీ తెలియకపోవడంతో ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశామన్నారు. -
ఇది రిగ్గింగ్ గెలుపు
● జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విజయనగరం అర్బన్: వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి ఓర్వలేకే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికార బలంతో రిగ్గింగ్ చేసి గెలిచారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆరోపించారు. కలెక్టరేట్లో గురువారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎంత అపహాస్యం అయిందో పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలే నిలువెత్తు నిదర్శనమన్నారు. పులివెందులలో గెలచామని చెప్పుకునేందుకు అన్నిరకాల కుట్రలు పన్నారని దుయ్యబట్టారు. అక్రమ అరెస్టులతో పాటు బరిలో నిలిచే అభ్యర్థి సైతం ఓటువేయలేని పరిస్థితిని సృష్టించారన్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను జీర్జించుకోలేక, వ్యతిరేకత లేదని చెప్పుకోవడానికి ఇలాంటి అప్రజాస్వామిక ఘటనలకు పాల్పడడం విచారకరమన్నారు. కలెక్టర్ దగ్గరుండి చేయిస్తున్న ఓట్ల రిగ్గింగ్ ఫొటోను ట్వీట్ నుంచి తొలగించి రిగ్గింగ్ అంగీకరించారని ఆరోపించారు. ఏడాది కాలంలోనే ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి పాలన అందించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పులివెందుల ఒక్కటే కాదు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్నింటినీ ఒకేసారి ప్రజాసామ్యబద్ధంగా ఎన్నికలు జరిపితే ఫలితాలు ఎలా ఉంటాయో తెలుస్తుందన్నారు. -
● డోలీలతో నిరసన
గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ శృంగవరపుకోట మండలంలోని దారపర్తి గెడ్డ వద్ద గిరిజనులు గురువారం వినూత్న నిరసన చేపట్టారు. డోలీలు చూపిస్తూ ఇక్కడి గెడ్డను దాటాలంటే నీటి ప్రవాహంలో గెడ్డను దాటలేని చిన్నారులు, వృద్ధులను ఇలా డోలీలో మోసుకుని వెళ్లాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేశారు. దారపర్తి, మారిక డి.కెపర్తి, మూలబొడ్డవార పంచాయతీల్లోని గిరిశిఖర గ్రామాలకు నేటికీ రోడ్డు సదుపాయం లేదని, గెడ్డలపై వంతెనలు కూడా లేవని దీంతో తామంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. పాలకులు మారుతున్నా తమ బాధలు మాత్రం తీరడం లేదని, ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి రోడ్లు, వంతెనలు నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. –శృంగవరపుకోట -
మా భూములు మాకు ఇప్పించండి
శృంగవరపుకోట: మండలంలోని బొడ్డవారలో జిందాల్ నిర్వాసితులు నిర్వహిస్తున్న శాంతియుత నిరసన గురువారం నాటికి 53వ రోజుకు చేరుకుంది. మా భూములు మాకు ఇప్పించాలని డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ను కోరుతూ బ్యానర్ ప్రదర్శించారు. పల్నాడు జిల్లాలో సరస్వతి పవర్ కంపెనీకి ఇచ్చిన భూముల వద్ద మీరు(పవన్ కల్యాణ్) వెళ్లి, విచారణ జరిపి అక్రమాలు జరిగాయని నిర్ధారించి భూముల రిజిస్ట్రేషన్ను రద్దు చేసి రైతులకు న్యాయం చేశారని గుర్తు చేశారు. అదే తరహాలో తమకు కూడా న్యాయం చేయాలని తమ భూములు తమకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. తమ ప్రాంతంలో కూడా ఓసారి పర్యటించి, తమ బాధలు వినాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు, పాలకులు తమను పట్టించుకోవడం లేదని మీరే న్యాయం చేయగలరని నమ్ముతున్నామని, మీరే రావాలని మా సమస్యలు ఆలకించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
కళ తప్పిన కొప్పెర్ల గురుకులం
పూసపాటిరేగ: కొప్పెర్ల బీఆర్ అంబేడ్కర్ గురుకులం... రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు ఉన్న విద్యాలయం. 1983 జాతీయ రహదారిని ఆనుకొని సుమారు 20 ఎకరాలు విశాలమైన స్థలంలో ఏర్పాటైంది. ఇక్కడ సీటు సాధించేందుకు పోటీ పడాల్సి వచ్చేది. ఈ విద్యాలయంలో చదివిన ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. ఇంజినీర్లుగా, డాక్టర్లుగా, ఎస్ఐలుగా, రాజకీయనాయకులుగా రాణిస్తున్నారు. ప్రస్తుతం గురుకులం కళతప్పింది. ఇక్కడ భవనాలు శిథిలావస్థకు చేరినా పట్టించుకునేవారే కరువయ్యారు. సరైన వసతిలేక పోవడంతో తరగతి గదుల్లో విద్యార్థులు విద్యాభ్యాసంతోపాటు నివాసం ఉంటున్నారు. తరగతి గదులు, డార్మిటరీ అధ్వానంగా తయారయ్యాయి. చాలా తరగతి గదులకు డోర్లు లేవు. గు రుకులం ప్రిన్సిపాల్ చొరవతో ఉపాధ్యాయులు చందాలు వేసుకుని ఇటీవల డోర్లును ఏర్పాటుచేశారు. సీట్లు ఖాళీ.. కొప్పెర్ల గురుకులంలో సీటు సాధిస్తే భవిష్యత్తు బంగారుమయం అవుతుందని భావించేవారు. నేడు అదే విద్యాలయంలో 200 సీట్లు ఖాళీగా ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గురుకులంలో 3వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 620 సీట్లు ఉన్నాయి. రాష్ట్రస్థాయి అధికారుల అనుమతితో మరో 50 సీట్లలో ప్రవేశాలు కల్పించవచ్చు. అయితే, ప్రస్తుతం 420 మంది విద్యార్థులు మాత్రమే చదువుతున్నారు. సుమారు 200 సీట్లు ఖాళీగానే ఉన్నాయి. ఎన్నిసార్లు నోటిఫికేషన్ ఇచ్చినా గురుకులంలో చేరేందుకు విద్యార్థులు ఆసక్తిచూపడంలేదు. ఎస్ఎంఎస్ పరిశ్రమ సహకారంతో కొన్ని తరగతి గదులు నిర్మించారు. మైలాన్ పరిశ్రమ సహకారంతో డార్మిటరీ నిర్మాణ పనులు పూర్తయినా ప్రారంభానికి నోచుకోలేదు. విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కరువయ్యాయి. కూటమి ప్రభుత్వం శిథిల భవనాల మరమ్మత్తులకు ఒక్క రూపాయి నిధులు కూడా మంజూరు చేయలేదు. ఇప్పటికై నా ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి గురుకులంలోని సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. శిథిలావస్థలో భవనాలు ప్రారంభానికి నోచుకోని డార్మిటరీ గురుకులంలో చేరేందుకు విద్యార్థులు అనాసక్తి మొత్తంగా 200 సీట్లు ఖాళీఉన్నతాధికారులకు నివేదించాం కొప్పెర్ల గురుకులంలో శిథిల భవనాల మరమ్మతుల విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించాం. గురుకులంలో పదో తరగతి, ఇంటర్మీడియట్లో మంచి ఫలితాలు సాధిస్తున్నాం. శిథిల భవనాల మరమ్మతులకు నిధులు మంజూరు కావాల్సి ఉంది. – అప్పారావు, ప్రిన్సిపాల్, కొప్పెర్ల గురుకులం -
భయపెడుతున్న విష సర్పాలు
అందుబాటులో ఏఎస్వీ వ్యాక్సిన్లు సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, పీహెచ్సీల్లో ఏఎస్వీ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించుకోవాలి. – డాక్టర్ ఎస్.జీవనరాణి, డీఎంహెచ్ఓవిజయనగరం ఫోర్ట్: పల్లె ప్రజలను విషసర్పాల భయం వెంటాడుతోంది. సాధారణంగా వర్షాకాలంలో పాముల సంచారం అధికం. అదే సమయంలో పొలాల్లో పనులు ఎక్కువగా ఉంటాయి. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైనప్పుడు, కూరగాయలు కోసినప్పుడు, పంట పొలాలకు నీరు కట్టే సమయంలోను, పొలం గట్లపై ఏమరపాటుగా వెళ్లిన రైతులు పాముకాటుకు గురవుతున్నారు. ఇటీవల ఇంట్లో నిద్రిస్తున్న వారిని సైతం పాములు విడిచిపెట్టడం లేదు. కొంతమంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడో ఓ చోట పాము కాటు బాధితులు కనిపిస్తూనే ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులకు పాములపై కనీస అవగాహన అవసరమని వైద్యులు అంటున్నారు. కనిపించే పాములన్నీ విషపూరితం కాదు. కట్లపాము, తాచుపాము, రక్తపింజర, నాగుపాము వంటి 15 శాతం పాములతోనే ముప్పు ఉంది. సరైన సమయంలో చికిత్స పొందితే విషసర్పం కరిచినా ప్రాణపాయం నుంచి తప్పించుకోవచ్చు. రాత్రివేళ పొలాలకు వెళ్లేసమయంలో చెప్పులు వేసుకోవాలి. టార్చిలైట్లతో పాటు శబ్ధం చేసే పరికరాలు వెంట తీసుకుని వెళ్లడం మంచిది. పాముకాటుకు గురైన వారు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. తీవ్ర ఒత్తిడికి గురైతే బీపీ పెరగడంతో పాటు గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. పసర వైద్యం, మంత్రాలు అంటూ అలసత్వం వహిస్తే ప్రాణాలకే ప్రమాదం. పాముకాటు వేయగానే పైభాగం గుడ్డతో కట్టాలి. కాటు వేసిన భాగాన్ని కొత్త బ్లేడుతో గాటు వేసి రక్తాన్ని నోటితో లాగేయాలి. నోటి గాయాలు ఉన్న వారు ఇలా చేయకూడదు. ప్రాథమిక వైద్యం అందించిన వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి. కరిచిన పాము ఏదో తెలుసుకుంటే చికిత్స అందించడం సులభం అవుతుంది. జాగ్రత్తలు తప్పనిసరిపాములపై అవగాహన ఉండాలి పంట పొలాల్లోనే ఎక్కువ.. సాధారణంగా నిర్జీవ ప్రదేశాలను ఎక్కువగా ఇష్టపడే పాములు.. ఆహారం కోసం జనారణ్యంలోకి చొచ్చుకు వస్తున్నాయి. చెత్తా చెదారం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, పాడుబడిన భవన శిథిలాలు, పూరి గుడిసెలు, గుబురుగా ఉండే పంట చేలల్లో పాములు ఎక్కువగా నివస్తున్నాయి. ఎలుకలు, కప్పలను ఎక్కువగా ఇష్టపడే పాములు పొలాల్లో సంచరిస్తూ రైతులకు అపాయం తలపెడుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూలై నెలాఖరు నాటికి జిల్లా వ్యాప్తంగా 1222 మంది పాము కాటుకు గురయ్యారు. వీరిలో సీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రుల పరిఽధిలో 921 కేసులు నమోదు కాగా, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో 301 కేసులు నమోదయ్యాయి. నలుగురు మృతి చెందారు. ఏడు నెలల్లో పాముకాటు బాధితులు 1222 మంది వీరిలో నలుగురి మృతి వర్షాకాలం కావడంతో పెరిగిన విషసర్పాల సంచారం పంట పొలాల్లోనే అత్యధికం పొలం పనులకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు -
విజయనగరం
శుక్రవారం శ్రీ 15 శ్రీ ఆగస్టు శ్రీ 2025 విజయనగరం మండలం దుప్పాడ గ్రామానికి చెందిన కె.సత్యవతికి పొలంలో పాము కాటు వేయడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. గరివిడి బిసీ కాలనీకి చెందిన వరదా సత్యవతికి ఇంట్లోనే పాము వేయడంతో కుటుంబ సభ్యులు చీపురపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. ‘ బొండపల్లి మండలం గొట్లాం గ్రామానికి చెందిన తులసీరావు అనే వ్యక్తికి తన ఇంటి వద్ద పాము కాటు వేసింది. కుటుంబ సభ్యులు విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు.’ -
రెండు తులాల బంగారం కోసం చిన్నాన్నని చంపేశాడు..
● నాటు తుపాకీతో హత్య చేసిన వ్యక్తి అరెస్టు ● వివరాలు వెల్లడించిన విజయనగరం డీఎస్పీ శ్రీనివాసరావుకొత్తవలస : కేవలం రెండు తులాల బంగారం కోసం జరిగిన వివాదం వరసకు చిన్నాన్న అయిన సిమ్మ అప్పారావును నాటు తుపాకీతో కాల్చి చంపడానికి దారి తీసిందని విజయగనరం డీఎస్సీ శ్రీనివాసరావు తెలిపారు. మండలంలోని ముసిరాం గ్రామానికి చెందిన సిమ్మ అప్పారావు(70)ను తన మేనకోడలు భర్త అనకాపల్లి జిల్లా కోటపాడు మండలం పాతవలస గ్రామానికి చెందిన సిమ్మ అప్పారావు(36) ఈ నెల 5వ తేదీన అతి సమీపం నుంచి నాటు తుపాకీతో కాల్చి చంపిన విషయం పాఠకులకు తెలిసిందే. ఈ మేరకు గ్రామానికి చెందిన సిమ్మ శివకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ సిహెచ్.షణ్ముఖరావు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా నిందితుడు సిమ్మ అప్పారావును కోటపాడు రోడ్డు సీతంపేట గ్రామ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా బుధవారం పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు స్థానిక విలేకరుల ముందు నిందితుడిని హాజరుపరిచి వివరాలను విజయనగరం డీఎస్పీ శ్రీనివాసరావు వివరించారు. నిందితుడు అప్పారావు భార్య ఏడాదిన్నర క్రితం మృతి చెందింది. ఆమెకు సంబంధించిన బంగారం, భూమి ఇతర ఆస్తులు మేనమామ అయిన మృతుడు సిమ్మ అప్పారావు వద్ద ఉన్నట్టు తెలిపారు. సదరు బంగారం, భూమి ఇవ్వాలని నిందితుడు అప్పారావు మృతుడు అప్పారావుని పలుమార్లు అడిగాడు. అయినా బంగారం ఇవ్వకపోవడంతో ఈ నెల 5న నిందితుడు తన స్వంత ఆటోలో ముసిరాం వచ్చి మరోసారి బంగారం ఇవ్వమని అడిగాడు. ఆయన నిరాకరించడంతో తనతో పాటు తెచ్చుకున్న నాటు తుపాకీతో గుండైపె కాల్చడంతో అప్పారావు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో నిందితుడు అక్కడ నుంచి పరారయ్యాడని తెలిపారు. సీతంపేట వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. తుపాకీ కోసం విచారించగా పాతవలస సమీపంలో వుంచినట్లు తెలపగా తుపాకీని స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి కొత్తవలస జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరచగా రిమాండ్ విధించినట్టు తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసిన సీఐ సిహెచ్.షణ్ముఖరావు, ఎస్ఐ పి.ప్రసాద్రావు, పీసీ లు ఎల్.రమేష్, దేముడు తదితరులను అభినందించారు. రివార్డులకు సిఫార్స్ చేస్తామని తెలిపారు. -
రాష్ట్ర స్థాయి పోటీలకు గంగుబూడి విద్యార్థులు
లక్కవరపుకోట : మండలంలోని గంగుబూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఇటీవల లక్కవరపుకోట మండల కేంద్రం ఏపీ మోడల్ స్కూల్ మైదానంలో జరిగిన ఎంపికలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్టు పాఠశాల పీడి గాడి రవికుమార్ బుధవారం తెలిపారు. సబ్ జూనియర్ విభాగంలో గొర్లె పూర్ణచందు, జూనియర్స్ విభాగంలో వానపల్లి మనోజ్ ఎంపికై నట్టు పేర్కొన్నారు. వీరు ఈ నెల 29 నుంచి 31వ తేది వరకు ప్రకాశం జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో విజయనగరం జిల్లా జట్టు నుంచి ఆడుతారని తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులను ప్రధానోపాధ్యాయురాలు శారదాదేవి, తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ వి.వి.జి.మంగరాజు తదితరులు అభినందించారు. మారెడుబాకలో ఇరు వర్గాల కొట్లాట రాజాం సిటీ: మండల పరిధి మారెడుబాక గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన ఇరువర్గాల కొట్లాటలో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి సీఐ కె.అశోక్కుమార్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన జరజాన కోటేశ్వరరావు, వర్రి రామకృష్ణల మధ్య చెలరేగిన స్థల వివాదం కొట్లాటకు దారితీసింది. వర్రి రామకృష్ణతో పాటు మరో తొమ్మిది మంది జరిపిన దాడిలో జరజాన కోటేశ్వరరావుతో పాటు సునీత, లత, కుంచి నిర్మల, రాయ లక్ష్మి గాయాల పాలయ్యారు. వెంటనే స్థానికులు వీరిని రాజాం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనకు సంబంధించి బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ కె.అశోక్కుమార్ తెలిపారు. ప్రేమ పేరుతో మోసగించిన యువకుడు అరెస్టు తెర్లాం: ఓ యువతిని ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించిన కేసుకు సంబంధించి యువకుడిని అరెస్టు చేసినట్టు బొబ్బిలి రూరల్ సీఐ కె.నారాయణరావు బుధవారం తెలిపారు. సీఐ తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని గొలుగువలస గ్రామానికి చెందిన సిరిపురపు వెంకటరమణ, అదే గ్రామానికి చెందిన యువతి గత కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. ఆ యువకుడు తనను ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా అనుభవించి పెళ్లి చేసుకోమని కోరినప్పుడు పెళ్లి చేసుకొనేందుకు నిరాకరించాడని, వేరొక యువతిని పెళ్లి చేసుకున్నానని చెప్పడంతో ప్రేమించిన యువతి తాను మోసపోయానని, తనకు న్యాయం చేయాలని కోరుతూ స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు యువకునిపై నమ్మించి మోసం చేసినట్టుగా తెర్లాం ఎస్ఐ బి.సాగర్బాబు కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు నిర్వహించిన బొబ్బిలి రూరల్ సీఐ యువతిని ప్రేమించి, మోసగించిన యువకుడిని అరెస్టు చేసి బొబ్బిలి కోర్టులో హాజరుపరచినట్టు తెలిపారు. సెప్టెంబర్ 14న పౌరాణిక ఏకపాత్రాభినయ పోటీలు పార్వతీపురం రూరల్: ఉత్తరాంధ్ర స్థాయిలో పౌరాణిక ఏకపాత్రాభినయ పోటీలు నిర్వహించనున్నట్టు శ్రీ వాణి ఆర్ట్స్ వ్యవస్థాపకులు డాక్టర్ పీజే నాయుడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్వతీపురం పట్టణంలో గల లయన్స్ కల్యాణ మండపం వేదికగా సెప్టెంబర్ 14వ తేదీన ఆదివారం ఉదయం 8 గంటలకు ఈ పోటీలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఆసక్తి గలవారు పోటీలలో పాల్గొనేందుకు ఆగస్టు 25లోగా ప్రవేశ రుసుము రూ.200 చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలతో పాటు ప్రత్యేక స్థానాలుగా గుర్తించి ప్రతిభ కనబరిచిన కళాకారులకు జ్ఞాపకతో పాటు నగదు బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. ఫోన్ ద్వారా నమోదు చేసుకునేందుకు 8186076044, 9849833439, 9948128766 నంబర్లను సంప్రదించాలని కోరారు. శ్రీ వాణి ఆర్ట్స్ 12వ వార్షికోత్సవ సందర్భంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. -
ఆటల్లో సత్తా చాటిన పాఠశాలలకు పురస్కారాలు
● ఈ నెల 18 లోగా దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం ● జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 5 పాఠశాలలకు దక్కనున్న అవార్డులు ● స్కూల్ గేమ్స్ క్రీడలో ప్రతిభ చూపిన వారికి అవకాశంవిజయనగరం: ఆటల్లో మేటిగా నిలిచే క్రీడాకారులున్న పాఠశాలలకు పురస్కారాల పంట పండనుంది. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో ఐదు ఉత్తమ పాఠశాలలకు క్రీడా ప్రతిభా పురస్కారాలు అందజేయాలని, ఆ మేరకు దరఖాస్తులు ఆహ్వానించాలని పాఠశాల విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 18లోగా డీఈవో కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలి. 19న దరఖాస్తుల పరిశీలన, 20న అభ్యంతరాల స్వీకరణ, 21న తుది జాబితా ప్రకటిస్తారు. విద్యార్థులకు ప్రోత్సాహం.. విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు పాఠశాలలకు ఏటా పురస్కారాలు అందజేస్తున్నారు. ఈ ఏడాది హాకీ క్రీడాకారుడు ధ్యానచంద్ జయంతిని పురస్కరించుకొని నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ నెల 29న పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. ఆ రోజు అన్ని పాఠశాలల్లో ఆటల పోటీలు నిర్వహించనున్నారు. క్రీడా ఫలితాల ఆధారంగా.. ఉత్తమ పాఠశాలల ఎంపికకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీని నియమించనున్నారు. సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులతో ఐదు మంది సభ్యులుగా ఉంటారు. జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి అత్యధిక విజయాలు సాధించిన పాఠశాలల్లో ఐదింటిని కమిటీ గుర్తిస్తుంది. ఇందుకు ప్రతి క్రీడలో అత్యధిక స్కోరును పరిగణనలోకి తీసుకుంటారు. 2024 – 2025కు సంబంధించిన క్రీడా ఫలితాల ఆధారంగా జిల్లాలో ఐదు ఉత్తమ పాఠశాలలకు పురస్కారాలు ప్రదానం చేస్తారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ప్రదర్శనలు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. పాఠశాల విద్యా శాఖ పరిధిలోని అన్ని బడుల యాజమాన్యాలు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటితో ప్రధానోపాధ్యాయుడు, పీఈటీ సంతకంతో క్రీడాకారులు సాధించిన ధ్రువపత్రాల నకళ్లతో ఈ నెల 18లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికై న పాఠశాలలకు 29న జ్ఞాపికలు, ధ్రువపత్రాలు అందజేస్తారని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి కృష్ణంరాజు తెలిపారు. -
ఎస్ఎంఎస్ పరిశ్రమ ఉద్యోగి మృతి
● అంబులెన్స్లో మృతదేహంతో గేటు ఎదుట నిరసన ● పరిశ్రమ యాజమాన్యంతో ప్రజాప్రతినిధులు చర్చలు ● రూ.20లక్షలు పరిహారం ప్రకటించిన యాజమాన్యంపూసపాటిరేగ : మండలంలోని ఎస్ఎంఎస్ పరిశ్రమ ఉద్యోగి విధి నిర్వహణలో వుండగా అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. పూసపాటిరేగ మండలం వెంపడాం గ్రామానికి చెందిన పిన్నింటి శ్రీనివాసరావు (26) ఎస్ఎంఎస్ పరిశ్రమలో కెమిస్ట్గా పని చేస్తున్నాడు. ఆదివారం ఏ షిప్టుకు హాజరైన శ్రీను విధులు నిర్వహిస్తుండగా ఆకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయాడు. సొమ్మసిల్లిన శ్రీనివాసరావును చికిత్స నిమిత్తం విజయనగరంలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం విశాఖలో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. పరిశ్రమ ఉద్యోగి మృతి చెందడంతో గ్రామస్తులు, మృతుని బంధువులతో మృతదేహం అంబులెన్సులో వుంచి పరిశ్రమ గేటు ఎదురుగా ఆందోళనకు దిగారు. దీనిపై యాజమాన్య ప్రతినిధులు స్పందిస్తూ పరిశ్రమలో ఎటువంటి ప్రమాదం జరగలేదని, అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్టు తెలిపారు. దీంతో పరిశ్రమ ఉద్యోగికి న్యాయం చేయాలని గ్రామస్తులు, మృతుని బంధువులు పట్టుబట్టడంతో యాజమాన్య ప్రతినిధులు రూ.20 లక్షలు పరిహారం ఇవ్వడానికి అంగీకరించడంతో వివాదం సద్దుమణిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భోగాపురం రూరల్ సీఐ జి.రామకృష్ణ ఆధ్వర్యంలో పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం ఎస్ఐలు ఐ.దుర్గాప్రసాదు, ఎ.సన్యాసినాయుడు, పాపారావు సిబ్బందితో పాటు గేటు వద్ద బందోబస్తు నిర్వహించారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
డెంకాడ: మండలంలోని చింతలవలస వద్ద ఆర్అండ్బీ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడు. ఎస్ఐ ఎ.సన్యాసినాయుడు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం మండలంలోని ధర్మపురి గ్రామానికి చెందిన వలిపల్లి సుధాకర్(37) దివీస్ కంపెనీలో కెమిస్ట్గా పని చేస్తున్నాడు. బి షిప్ట్ కావడంతో బుధవారం మధ్యాహ్నం ధర్మపురి నుంచి తగరపువలస సమీపంలో ఉన్న దివీస్ కంపెనీకి వెళ్తుండగా.. చింతలవలస గ్రామం వద్ద ఎదురెదురుగా రెండు మోటారు సైకిళ్లు ఢీకొన్నాయి. దీనిలో వలిపల్లి సుధాకర్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన సుధాకర్ను చికిత్స నిమిత్తం విజయనగరం కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు డాక్టర్లు తెలిపారని కుటుంబ సభ్యులు ఫిర్యాదులో తెలిపారు. కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సన్యాసినాయుడు తెలిపారు. -
దేవుడితో కూటమి ఆటలు
● ట్రస్టుబోర్డు నియామకంలో కుంపట్లు ● వంశపారంపర్య, వ్యవస్థాపక ధర్మకర్తలకు మొండిచేయి ● నిన్న నవదుర్గామాత ఆలయం.. ● నేడు పోలిపల్లిపైడితల్లి ఆలయంరాజాం: దేవుడితోను..దేవస్థానాలతోను కూటమి ప్రభుత్వం ఆటలు ఆడుతోంది. చోటా మోటా కార్యకర్తలు, నాయకుల మాటలకు దేవదాయశాఖ తల ఊపుతోంది. నిబంధనలు ఉల్లంఘించి రాజకీయాలు చేస్తోంది. దేవాలయాల ట్రస్టు బోర్డు నియామకంలో సిఫార్సులకు అనుగుణంగా వ్యవహరిస్తోంది. రాజకీయాలు చేసి, భక్తుల మనోభావాలు దెబ్బతీస్తోంది. హైందవ ధర్మాన్ని అటకెక్కించే పనిలో పడింది. రాజాంలో నిన్న నవదుర్గామాత ఆలయ ట్రస్టుబోర్డు కమిటీ నియామకంలో నిబంధనలు ఉల్లంఘించిన దేవదాయశాఖ, ప్రస్తుతం నోటిఫికేషన్ ఇచ్చిన పోలిపల్లి పైడితల్లి ఆలయం ట్రస్టు బోర్డు నియామకంలో కూడా వివాదాలకు తావిచ్చి ంది. గతంలో ఎన్నడూ లేని విధంగా.. ఆలయ ట్రస్టు బోర్డులు, అభివృద్ధి కమిటీల ఏర్పాటులో గత ప్రభుత్వాలు రాజకీయ జోక్యం చేసుకోలేదు. ఇప్పుడు అలా కాకుండా కూటమి కుంపటి పెడుతోంది. రాజాం బస్టాండ్ ఆవరణలోని నవదుర్గామాత ఆలయ ట్రస్టు బోర్డు ఎంపిక పక్షం రోజుల క్రితం జరిగింది. ఆ బోర్డులో ఆలయ వ్యవస్థాపక ఽకుటుంబానికి చెందిన ధర్మకర్తను చైర్మన్గా ఉంచాల్సి ఉండగా, ఆయనను తొలగించి, రాజాం పట్టణ పరిధిలోని సారథి గ్రామానికి చెందిన ఓ టీడీపీ కార్యకర్త పేరును ప్రకటించింది. దీంతో ఇక్కడ పెద్దస్థాయిలో వివాదం చెలరేగడంతో పాటు వ్యవస్థాపక ధర్మకర్తలు ఈ నియామకాన్ని తిరస్కరించడంతో ప్రస్తుతం ఈ బోర్డు ఎంపిక వివాదాస్పదంగా మారి గాలిలో ఉంది. గతంలో ఈ బోర్డు ఎంపికలో ఇటువంటి ఇబ్బందులు రాలేదని, వ్యవస్థాపక ధర్మకర్త వానపల్లి తమ్మయ్య గురువు కుమారుడు వానపల్లి నర్సింగరావు తెలిపారు. ధర్మకర్త కుటుంబానికి చెందిన చైర్మన్గా ఉంటారని, మిగిలిన సభ్యులను దేవదాయశాఖ నియమించాల్సి ఉందని తెలిపారు. గత ప్రభుత్వాలు ఈ విధానంలోనే చైర్మన్గా ధర్మకర్తను కొనసాగించి, ఆలయ అభివృద్ధికి సహకరించిన మిగిలిన భక్తులకు కమిటీలో చోటు కల్పించేవారని వెల్లడించారు. ఈ దఫా ఈ నిబంధనలు అటకెక్కించి, ఆలయానికి రానివారిని, ఆలయం అంటే తెలియని వారిని సభ్యలుగా పెట్టిన పరిస్థితి ఉందన్నారు. తాజాగా మరో వివాదం ఇదిలా ఉండగా ఇప్పుడు పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయ ట్రస్టు బోర్డు ఎంపికకు దేవదాయశాఖ నోటిఫికేషన్ జారీచేసింది. ఇందులో ట్రస్టు చైర్మన్ పదవిని ఖాళీ ఉంచి, మిగిలిన కమిటీకి నోటిఫికేషన్ ఇవ్వాలి. అలాకాకుండా మొత్తం కమిటీకి దరఖాస్తులు ఆహ్వానించడంతో వివాదం ప్రారంభమైంది. కొన్నేళ్లుగా ఇక్కడ ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్గా ఆలయ ధర్మకర్త కుటుంబానికి చెందిన వాకచర్ల కుటుంబీకులే వ్యవహరిస్తున్నారు. గతేడాది వరకూ ధర్మకర్త కుమారుడైన వాకచర్ల దుర్గాప్రసాద్ చైర్మన్గా వ్యవహరించారు. పైడితల్లి అమ్మవారి ఆలయానికి సంబంధించి అన్ని ఉత్సవాల్లో వారి భాగస్వామ్యం ఉంటుంది. అటువంటి ధర్మకర్త కుటుంబాన్ని పక్కన పెట్టి, కొత్తవారికోసం నోటిఫికేషన్ ఇవ్వడంతో ఇక్కడ వివాదం ప్రారంభమై, దేవదాయశాఖ తీరుతో పాటు కూటమి ప్రభుత్వ తీరుపై భక్తులు విమర్శలు చేస్తున్నారు. ఇంతటి దురదృష్టకర పాలనను ఇంతకు ముందు చూడలేదని బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఈ కమిటీ ఎన్నిక ఎలా జరుగుతుందో చూస్తామని హెచ్చరిస్తున్నారు.నిబంధనలు మారాయి పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయ ట్రస్టు బోర్డు కమిటీ ఎంపిక నోటిఫికేషన్ ఉన్నతాధికారుల నుంచి వచ్చింది. గతంలో వంశపారంపర్య ధర్మకర్తలే చైర్మన్లుగా ఉండేవారు. ఇప్పుడు కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఇక్కడ పరిస్థితిపై ఉన్నతాధికారులకు నివేదించి వారి ఆదేశాల మేరకే నియామకం ఉంటుంది. నా చేతిలో ఏమీలేదు. బీవీ మాధవరావు, దేవాదాయశాఖ రాజాం మేనేజర్ -
అదుపు తప్పి బోల్తా పడిన పొక్లెయినర్
మెంటాడ: మండలంలో వాణిజి గ్రామం నుంచి అనంతగిరి మండలం బూరుగ గ్రామానికి రోడ్డు వేసే పనులు జరుగుతున్నాయి. మంగళవారం పనులు పూర్తయిన తరువాత పొక్లెయినర్ను ట్రాలీపైకి ఎక్కిస్తుండగా అదుపు తప్పి లైటింగ్ చూపిస్తున్న బీహార్కు చెందిన ట్రాలీ డ్రైవర్ ప్రమోద్కుమార్, మెంటాడకు చెందిన తాడ్డి రాంబాబులపై పడిపోయింది. ఈ ప్రమాదంలో ట్రాలీ డ్రైవర్ ప్రమోద్కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా, తాడ్డి రాంబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకొని సంఘటనా స్థలానికి ఎస్ఐ సీతారాం చేరుకుని గాయాల పాలైన రాంబాబును జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. మృతి చెందిన ప్రమోద్కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సీతారాం తెలిపారు. ఒకరి మృతి -
19న ఐద్వా మహాసభలు
విజయనగరం గంటస్తంభం: విజయనగరంలో ఈ నెల 19న జరిగే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా 9వ మహాసభలను విజయవంతం చేయాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పి.రమణమ్మ కోరారు. ఈ మేరకు బుధవారం స్ధానిక రామకృష్ణ నగర్లో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో విలేకర్లతో ఆమె మాట్లాడారు. మహిళా హక్కులు, మహిళలకు 33 శాతం రిజర్వేషన్, అధిక ధరలకు వ్యతిరేకంగా, ప్రజాసమస్యల పరిష్కారం కోసం మహిళలపై జరిగే దాడులు, హత్యలు, ఆత్యాధారాలు, లైంగిక, వరకట్న వేధింపులు, సీ్త్ర వివక్ష, డ్వాక్రా మహిళల సమస్యలు, మైక్రోఫైనాన్స్, మద్యం, గంజాయి, డ్రగ్స్, అశ్లీలత మొదలైన సమస్యలపై జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు, పోరాటాలు ఐద్వా నిర్వహిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా జాప్యం చేయడం సరైంది కాదని వెంటనే ప్రతి మహిళకు రూ.1500 పథకం అమలు చేయాలన్నారు. అన్ని సర్వీసుల్లో రాష్ట్రం మొత్తం ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఐద్వా జిల్లా నాయకులు ఎం.జగదాంబ, కె.రమణమ్మ పాల్గొన్నారు. -
జిల్లాలో రూ.26 కోట్ల అంచనాతో 44 జలవనరుల పనులు
విజయనగరం అర్బన్: జల వనరుల శాఖ ద్వారా రిపేర్, రెనోవేషన్, రెస్టరేషన్ ఆర్ఆర్ఆర్ కింద రూ.26 కోట్ల అంచనాతో 44 పనులను జిల్లా ఇంప్లిమెంటేషన్ కమిటీలో కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆమోదం తెలిపారు. నీటి వనరుల పునరుద్ధరణ, పరిరక్షణ, ఆక్రమణల నుంచి రక్షించడం, తాగునీటి లభ్యతను పెంచడం, భూగర్భ జలాల రీచార్జ్కు ఉద్దేశించిన ఈ పథకం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించనున్నాయని కలెక్టర్ తెలిపారు. బుధవారం కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా ఇంప్లిమెంటేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ ప్రతిపాదనలను టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం పొందిన తర్వాత పనులు ప్రారంభం అవుతాయని కలెక్టర్ తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు కేటాయిస్తాయని అన్నారు. ఈ పనులకు ఆమోదం లభిస్తే జిల్లాలో 6,873 ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో ఇరిగేషన్ ఈఈ ఎంవీ రమణ, గ్రౌండ్ వాటర్ డీడీ ప్రవీణ్కుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కవిత, సెంట్రల్ వాటర్ కమిషన్ ఏడీ సంజీవ తదితరులు పాల్గొన్నారు. జిల్లా స్థాయి ఇంప్లిమెంటేషన్ కమిటీలో ఆమోదం తెలిపిన కలెక్టర్ -
జర్మన్ భాషపై ఆన్లైన్లో ఉచిత శిక్షణ
పార్వతీపురం టౌన్: జర్మనీ దేశంలో అసిస్టెంట్ నర్సు ఉద్యోగాలు పొందేందుకు జిల్లాలోని జి.ఎన్.ఎమ్ చదువుకున్న నిరుద్యోగ యువతీ యువకులకు జర్మన్ భాషపై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె.సాయికృష్ణ చైతన్య తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఓంకాప్, టి.ఎన్.ఏ.ఐ సంయుక్త ఆధ్వర్యంలో ఆన్లైన్లో శిక్షణ ఉంటుందని వివరించారు. తప్పనిసరిగా జి.ఎన్.ఎమ్ పూర్తి చేసి ఏడాది పాటు సాధారణ ఆసుపత్రుల్లో అనుభవం కలిగి 39 ఏళ్లలోపు వయసున్న వారు జర్మన్ భాష నేర్చుకోవడానికి అర్హులని తెలిపారు. శిక్షణ రోజుకు 2 నుంచి 3 గంటల పాటు సుమారు 8 నెలల వరకు ఉంటుందని అన్నారు. ఇందులో ఏ1, బీ2 లాంగ్వేజ్లపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు రూ.30,000లు సెక్యూరిటీ డిపాజిట్ చేసి, జర్మనీ వెళ్లేందుకు విమాన చార్జీలు, బీ2 పరీక్ష ఫీజు, వీసా చార్జెస్ చెల్లించాలన్నారు. శిక్షణ పూర్తి చేసి బీ2 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి నెలకు రూ.2 లక్షల నుంచి 2,50,000ల వరకు జీతం చెల్లిస్తారని పేర్కొన్నారు. వివరాలకు 7032060773 నంబరును సంప్రదించి తెలుసుకోవచ్చని తెలిపారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె.సాయికృష్ణ చైతన్య -
గంజాయితో సంపాదించిన ఆస్తులు ఫ్రీజ్ : ఎస్పీ
విజయనగరం క్రైమ్ : ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లాకు చెందిన గంజాయి వ్యాపారి నగేష్ అలియాస్ బాలరాజుకు చెందిన రూ.56 లక్షల విలువైన ఆస్తులను ఫ్రీజ్ చేశామని ఎస్పీ వకుల్ జిందల్ బుధవారం తెలిపారు. జిల్లాలోని ఎస్.కోట పోలీస్స్టేషన్ పరిధిలో నమోదైన గంజాయి కేసులో నిందితుడిగా అరెస్టు అయిన నగేష్ ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా పంత్లున్గా పంచాయత్ నందాపూర్ మండలం భాకాపుట్ గ్రామానికి చెందిన వాడని తెలిపారు. గంజాయి అక్రమ రవాణాతో సంపాదించిన సుమారు రూ.56 లక్షల విలువైన స్థిర, చరాస్తులను అటాచ్ చేశామని పేర్కొన్నారు. గంజాయి వ్యాపారుల నుంచి అతని భార్య జమున బ్యాంకు ఖాతాకు పలుమార్లు రూ.6.53 లక్షల నగదు జమ అయినట్టు తమ విచారణలో తేలిందని తెలిపారు. నిందితుడు సంపాదించిన అక్రమ ఆస్తులను ఎవరికీ విక్రయించకుండా చట్ట పరిధిలో ఫ్రీజ్ చేసినట్టు నోటీసులు జారీ చేసినట్టు పేర్కొన్నారు. ఫ్రీజ్ చేసిన ఆస్తులు కొల్కత్తాలోని కాంపిటెంట్ అధారిటీ పరిధిలోకి వెళ్లాయని, సదరు ఆస్తులను ఎవరు కొనుగోలు చేసినా చెల్లనేరవని ప్రజలు దీన్ని గుర్తించాలని ఎసీ కోరారు. ఈ ప్రక్రియలో క్రియాశీలకంగా పని చేసిన అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్.కోట ఇన్స్పెక్టర్ వి.నారాయణమూర్తి ఇతర పోలీసు అధికారులను ఎస్పీ అభినందించారు. -
ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం
పార్వతీపురం రూరల్ : మూడవసారి అధికారంలోకి వచ్చిన కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దేశంలో రైతు, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తూ రైతుకు ద్రోహం చేస్తున్నదని పలు రైతు సంక్షేమ, రైతుకూలి, ప్రజా సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రైతు, కార్మిక నల్ల చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో వ్యవసాయ రంగంలోకి ‘కార్పొరేట్’ సంస్థలను తీసుకువచ్చే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేశారు. పంటలు పండే భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా ఇవ్వడం సరికాదన్నారు. రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికుల రుణాలను రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంఘాల సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ బంటు దాసు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ఈవీ నాయుడు, రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ నాయకులు పి.శ్రీనునాయుడు, కృష్ణ వేణి, ఎం.భాస్కరరావు, సీపీఐ ఎంఎల్ లిబరేషన్ నాయకులు పి.సంగం, కాంగ్రెస్ పార్టీ నాయకులు బత్తిన మోహన్, గేదెల రామకృష్ణ, వంగల దాలినాయుడు, ఏఐటీయూసీ నాయకులు ఆర్వీఎస్ కుమార్, దుర్గారావు, గిరిజన సంక్షేమ సంఘం నాయకులు పాలక రంజిత్కుమార్, తాడంగి సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. -
చర్చించడమేనా..! పరిష్కరించరా...?
విజయనగరం అర్బన్: జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి పనుల ప్రతిపాదనలు, పనుల మంజూరుకు చక్కని వేదిక... జిల్లా అభివృద్ధి సమావేశం(డీఆర్సీ). కూటమి ప్రభుత్వం వచ్చాక డీఆర్సీకి అర్థమే మారిపోయే పరిస్థితి. వివిధ సమస్యలపై చర్చించడమే తప్ప పరిష్కారం కనిపించడంలేదని జిల్లా ప్రజలు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి నాలుగు సార్లు సమావేశాలు నిర్వహించినా స్వపక్ష ప్రజాప్రతినిధులు తీసుకొచ్చిన సమస్యలను కూడా పరిష్కరించిన దాఖలాలు లేవు. ఎప్పటికప్పుడు ప్రజలకు క్షేత్రస్థాయిలో వచ్చిన సమస్యలతో పాటు రాష్ట్రస్థాయిలో నిధులు అవసరమైన సమస్యలను పరిష్కరించేందుకు కూటమి నేతలు చొరవ తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు లేకపోవడం వల్ల జిల్లా అభివృద్ధి సమావేశాన్ని మమ అనిపించేస్తున్నారని, జిల్లా ప్రజల సమస్యలపై చిత్తశుద్ధితో చర్చసాగడంలేదన్న వాదన వినిపిస్తోంది. ● మే నెలలో జరిగి డీఆర్సీ సమావేశంలో చర్చకు వచ్చిన రోడ్లు భవనాల శాఖ ప్రతిపాదిత పనులు ఇంకా ప్రారంభించలేదు. పూర్తిగా శిథిలమైన బొబ్బిలి–తెర్లాం రోడ్డు, బాడంగి మండలంలోని ఆకులకట్ట– పినపెంకి రోడ్డు, జిల్లా కేంద్రంలోని ఐస్ ఫ్యాక్టరీ కూడలి నుంచి ఐనాడ రోడ్డు, రాజాం–పాలకొండ రోడ్డు, రణస్థలం–రామతీర్థం రోడ్ల పనులకు ప్రతిపాదనలన్నీ మంజూరు చేసినట్టు చెబుతున్నా నిధులు విడుదలకాలేదు. దీంతో పనులు ప్రారంభించలేదు. ● జిల్లాలో తల్లికివందనం పథకం అందలేదంటూ సుమారు 18వేల మంది పీజీఆర్ఎస్లో దరఖాస్తు చేశారు. వీరిలో 12వేల మంది దరఖాస్తులు పరిశీలించి అర్హులుగా అధికారులు నిర్ధారించారు. వీరి ఖాతాలకు ఇప్పటివరకు డబ్బులు జమకాలేదు. ఎప్పుడు నిధులు విడుదల చేస్తారో తెలియదు. దీనిపై డీఆర్సీలో కొందరు నేతలైనా ప్రస్తావించి పరిష్కారానికి కృషిచేస్తారని లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ● వ్యవసాయం రంగంలో సేవలు మరింత దిగజారిపోయాయి. ఖరీఫ్ సీజన్లో రైతుకు ఎరువు కొరత వెంటాడుతోంది. అన్నదాత సుఖీభవ నిధులు చాలామంది కౌలురైతులు, డీ పట్టా భూములున్న రైతుకు జమకాలేదు. కొందిరికి పీఎం కిసాన్ నిధులు మాత్రమే జమయ్యాయి. వీటికి పరిష్కారం చూపాలి. ● కూటమి ప్రభుత్వం వచ్చి 14 నెలలవుతున్నా స్పౌజ్ పింఛన్లు మినహా ఏ ఒక్కరికీ కొత్త పింఛన్లు మంజూరు కాలేదు. మరోవైపు జిల్లాలో 25వేల మంది పింఛన్లు రద్దుచేసింది. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం జరిగే డీఆర్సీలో ప్రజాప్రతినిధులు ఈ సమస్యలను ప్రస్తావిస్తారని ఎదురు చూస్తున్నారు. ● జలాశయాల్లో నీరున్నా ఆయకట్టుకు అందడంలేదు. సాగునీటి కాలువలు సకాలంలో బాగుచేయకపోవడమే దీనికి కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. దీనికి పరిష్కారం చూపుతారోలేదో చూడాల్సిందే. ● కొత్త రేషన్ కార్డుల కోసం వేలామంది దరఖాస్తు చేశారు. ఇప్పటివరకు కొత్తగా ఒక్కరికీ మంజూరు కాలేదు. ● జిల్లాలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. బాగుచేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. నేడు ఇన్చార్జ్ మంత్రి ఆధ్వర్యంలో డీఆర్సీ -
హెచ్ఐవీపై అవగాహన కలిగి ఉండాలి
● జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి రాణి విజయనగరం ఫోర్ట్: హెచ్ఐవీ, ఎయిడ్స్పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగిఉండాలని జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ కె.రాణి తెలిపారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద బుధవారం నిర్వహించిన ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత సత్ప్రవర్తన కలిగి ఉండాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. హెచ్ఐవీ బారిన పడితే జీవితం అంధకారం అవుతుందన్నారు. వ్యాధి వచ్చిన తర్వాత బాధపడేకంటే రాకుండా జాగ్రత్తలు వహించాలని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కె.రేఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మండలి ప్రోగ్రాం మేనేజర్ ఉమామహేశ్వరరావు, సూపర్ వైజర్ బద్రి, గిరి, శ్రీనివాస్, మేఘన, తదితరులు పాల్గొన్నారు. ప్రతీ పనికి ఒక రేటు ● రెవెన్యూ సిబ్బంది తీరుపై జేసీకి రైతు సంఘం ఫిర్యాదు విజయనగరంఫోర్ట్: జిల్లాలో పనిచేస్తున్న పలువురు రెవెన్యూ సిబ్బంది ప్రతీ పనికి ఓ రేటు నిర్ణయించారు. భూముల రీసర్వే, మ్యుటేషన్ కోసం సెంటుకు రూ.500 నుంచి రూ.1000 డిమాండ్ చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకుంటే పనిచేయడం లేదని, దీనిపై చర్యలు తీసుకోవాలంటూ జేసీ సేతుమాధవన్కు రైతు సంఘం కార్యదర్శి బుద్దరాజు రాంబాబు బుధవారం ఫిర్యాదు చేశారు. రాజకీయ బ్రోకర్లు ద్వారా డబ్బులు ఇచ్చిన వారికే పనిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎరువుల అధిక ధరలను కట్టడి చేయాలని, ఈక్రాప్ బుకింగ్ లోపాలను సరిచేయాలని విన్నవించారు. జేసీని కలిసిన వారిలో రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి వర్మ, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాములు, పైడిపినాయుడు పాల్గొన్నారు. వచ్చారు.. వెళ్లారు.. విజయనగరం: శాప్ చైర్మన్ రవినాయుడు జిల్లా పర్యటన వచ్చారు... వెళ్లారు అన్న చందంగా సాగింది. ముందస్తుగా ప్రకటించిననిర్ణీత సమయం కన్నా ఆలస్యంగా వచ్చిన చైర్మన్ కోసం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారులతో పాటు, వివిధ అసోసియేషన్ ప్రతినిధులు వేచి చూడాల్సి వచ్చింది. జిల్లా కేంద్రంలోని పలు క్రీడా మైదానాలను స్థానిక ఎమ్మెల్యే అదితిగజపతి రాజుతో కలిసి బుధవారం పరిశీలించారు. జిల్లాను స్పోర్ట్స్ హబ్గా తయారు చేస్తామని, దశలు వారీగా క్రీడా మైదానాలను ఆధునీకరిస్తామని చెప్పారు. స్పోర్ట్స్ స్కూల్ బిల్డింగ్ను త్వరలోనే పూర్తిచేసి స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభిస్తామని, స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. కేంద్రం నిధులతో విజ్జి స్టేడియంలో 400 మీటర్లు సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ను, హాకి కోర్టును ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ పనులన్నీ ఎప్పటిలోగా పూర్తిచేస్తామన్నది చెప్పకపోవడంపై క్రీడాకారులు పెదవి విరుస్తున్నారు. ఆయన వెంట కె.జగదీశ్వరి, ఎం.డి.రమేష్, పీబీఎన్ రాజు ఉన్నారు. -
ఒకే బెడ్పై ఇద్దరు రోగులకు చికిత్స
ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు ఆదిలక్ష్మి. ఈమెది బొండపల్లి గ్రామం. ఊపిరితిత్తుల్లో కఫం చేరడంతో సర్వజన ఆస్పత్రిలో చేరింది. వైద్య పరీక్షల కోసం ఆమె ల్యాబొరేటరీ దగ్గరకు వెళ్లింది. వైద్య సిబ్బంది వీల్చైర్ ఇవ్వక పోవడంతో ఆమె బంధువే ఆమెను యూరిన్ బ్యాగ్తో పాటు వార్డుకు తీసుకెళ్లింది. ఒకే బెడ్పై ఇద్దరు రోగులు చికిత్స పొందుతున్నది సర్వజన ఆస్పత్రిలోనే. బెడ్స్ ఖాళీ లేక పోవడంతో జనరల్ మెడిసిన్ వార్డులో ఇద్దరికి ఒకే బెడ్పై ఉంచి వైద్య సిబ్బంది చికిత్స అందిస్తున్నారు. విరేచనాలతో బాధపడుతూ విజయనగరం పట్టణంలోని బలిజివీధికి చెందిన ఎం.శ్రీను, పాముకాటు వేయడంతో బొండపల్లి మండలం గొట్లాంకు చెందిన రెడ్డి అప్పలనాయుడు ఆస్పత్రిలో చేరారు. వీరిద్దరికీ ఒకే బెడ్పై చికిత్స అందిస్తున్నారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు ఎ.చిన్నారావు. ఇతనిది అల్లూరి సీతారామారాజు జిల్లా (పాడేరు) అనంతగిరి మండలంలోని కోటపత్తివలస గ్రామం. ఈ నెల 12న శరీరం అంతా నొప్పులు, కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడే స్థితిలో ఆస్పత్రిలో చేరాడు. 13వ తేదీ ఉదయం 11 గంటల వరకు ఎవరూ పట్టించుకోలేదని, నొప్పి భరించలేక పోతున్నానంటూ ఆవేదన వ్యక్తంచేశాడు. ● సర్వజన ఆస్పత్రిలో బెడ్స్ఫుల్.. వసతులు నిల్..! ● ఒకే బెడ్పై ఇద్దరు రోగులకు చికిత్స ● చికిత్స అందించడంలో వైద్యుల అలసత్వం! ● ఆస్పత్రిలో రోజుకు 1200 వరకు ఓపీ నమోదు ● ఆస్పత్రిలో బెడ్స్ సంఖ్య 368 ● రూ. 500 కోట్లతో గాజులరేగ వద్ద బోధనాస్పత్రి నిర్మాణం ● ప్రభుత్వ వైద్య కళాశాల ప్రాంగణంలో 1500 పడకలతో విశాలమైన భవనం నిర్మాణం ● ఆస్పత్రిని అక్కడికి తరలించక పోవడంతో రోగులకు తప్పని ఇబ్బందులు విజయనగరం ఫోర్ట్: విజయనగరం జిల్లాలో అతిపెద్దది ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి. జిల్లా ప్రజలకు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా ఈ ఆస్పత్రినే ఆశ్రయిస్తారు. రోజుకు 1200 వరకు ఓపీ నమోదవుతుంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఆస్పత్రిలో సేవలు మృగ్యంగా మారాయి. వసతులు లోపించాయి. రోగులకు సకాలంలో సేవలు అందడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జనరల్ వార్డుల్లో ఆస్పత్రిలో చేరిన 24 గంటల వరకు వైద్యులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రోగులను వార్డులకు, ల్యాబ్కు, సిటీస్కాన్, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, ఆపరేషన్ థియేటర్స్, ఐసీయూ, డ్రెస్సింగ్ రూమ్లకు వెళ్లేందుకు వీల్ చైర్, స్టెచ్చర్ సదుపాయం కల్పించడంలేదని రోగులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజారోగ్యానికి భరోసా లేకుండా పోయిందని, గతంలో అందే స్థాయిలో సేవలు అందడం లేదని, పర్యవేక్షణ లోపించిందని వాపోతున్నారు. విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో వరండాలోనే చికిత్స పొందుతున్న రోగులు కూటమి నేతల తీరుతో తప్పని ఇబ్బందులు ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించేదుకు వీలుగా గత ప్రభుత్వం గాజులరేగ సమీపంలో సుమారు 70 ఎకరాల్లో రూ.500 కోట్లతో ప్రభుత్వ వైద్యకళాశాల, బోధనాస్పత్రి, హాస్టల్ భవనాల నిర్మాణాన్ని తలపెట్టింది. వైద్య విద్యార్థులకు తరగతులు కూడా ప్రారంభించింది. బోధనాస్పత్రి నిర్మాణం కూడా దాదాపు పూర్తయింది. జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ సమీపంలో ఉన్న ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిని 1500 పడకలతో విశాలంగా ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉన్న బోధనాస్పత్రికి తరలించేందుకు కూటమి నేతలు అభ్యంతరం చెబుతున్నారు. వసతులు లేక పోయినా, రోగు లు ఇబ్బంది పడుతున్నా ఆస్పత్రిని తరలించేందుకు ససేమిరా అంటున్నారు. దీంతో రోగులతో పాటు వైద్యసేవలందించేందుకు వైద్య విద్యార్థులు, ప్రొఫెసర్లకు తిప్పలు తప్పడం లేదు. కోట్లాది రూపాయలు వెచ్చించి విశాలమైన భవనాలు నిర్మించిన వైద్య కళాశాలకు ఆస్పత్రిని తరలించకపోవడంపై జనం మండిపడుతున్నారు. ఇప్పటికే పలువురు కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్లో కలెక్టర్ అంబేడ్కర్కు వినతులు కూడా అందజేశారు. సర్వజన ఆస్పత్రి, ఘోషా ఆస్పత్రిలో కలిపి కేవలం 500 బెడ్లే ఉన్నాయని, ఇన్పేషేంట్ల సంఖ్య పెరిగిన సమయంలో సరిపడడంలేదని, ఒకే బెడ్పై ఇద్దరు ముగ్గురు రోగులు సేవలు పొందాల్సి వస్తోందని, బోధనాస్పత్రి వద్దకు సర్వజన ఆస్పత్రిని తరలించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఆస్పత్రికి అధిక సంఖ్యలో రోగులు వస్తున్నారు. రోజుకి 1200 వరకు ఓపీ నమోదవుతుండగా, వీరిలో 90 నుంచి 100 మంది వరకు ఆస్పత్రిలో ఇన్ పేషేంట్స్గా చేరుతున్నారు. ఆస్పత్రిలో 368 పడకలు మాత్రమే ఉన్నాయి. ఇన్ పేషేంట్లు 400 నుంచి 450 మంది వరకు ఉంటున్నారు. దీంతో పడకలు చాలక ఒకే బెడ్పై ఇద్దరిని ఉంచి చికిత్స అందిస్తున్నారు. బెడ్స్ చాలకపోవడం వల్లే... వ్యాధుల సీజన్ కావడంతో రోగులు అధిక సంఖ్యలో ఆస్పత్రికి వస్తున్నారు. సాధ్యమైనంతవరకు ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నాం. బెడ్స్ చాలాక పోవడం వల్ల ఒకేబెడ్పై ఇద్దరు చికిత్స తీసుకోవడానికి అంగీకరించేవారికి చికిత్స అందిస్తున్నాం. – డాక్టర్ సంబంగి అప్పలనాయుడు, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి -
కొలతల్లో తేడా వస్తే కఠిన చర్యలు
విజయనగరం: వినియోగదారులు కోనుగోలుచేసే వస్తువుల కొలతల్లో తేడావస్తే కఠిన చర్యలు తప్పవని లీగల్ అండ్ మెట్రాలజీ డీడీ బి.మనోహర్ హెచ్చరించారు. నగరంలోని ఆ శాఖ కార్యాలయంలో బేకరీ, స్వీట్ దుకాణదారులతో బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. వినియోగదారులు ఆహారపదార్థాలు కొనుగోలు చేసే సమయంలో బాక్స్ బరువును మినహాయించి తూకం వేయాలని సూచించారు. ఎలక్ట్రానిక్ కాటా వినియోగంలో జీరో రీడింగ్ కచ్చితంగా పాటించాలన్నారు. ప్యాకేజీ ఫుడ్స్ విషయంలో ప్రాథమిక నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం కో ఆర్డినేటర్ చదలవాడ ప్రసాద్, లీగల్ మెట్రాలజీ ఏడీ పి.వి.రంగారెడ్డి, పరిశీలకులు ఎస్.ఉమా సుందరి, తదితరులు పాల్గొన్నారు. లీగల్ అండ్ మెట్రాలజీ డీడీ బి.మనోహర్ -
వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి
విజయనగరం అర్బన్: రానున్న ఐదు రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతారవరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగమంతా అప్రమతంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మండల ప్రత్యేకాధికారులు, ఈఓపీఆర్డీలు, మున్సిపల్ కమిషనర్లతో ఆయన బుధవారం వెబెక్స్లో మాట్లాడారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులంతా వారి ప్రధాన కేంద్రాల్లోనే ఉండాలని, ఏ ఒక్కరికీ సెలవులు మంజూరు చేయడం జరగదని స్పష్టం చేశారు. పూసపాటి రేగ, భోగాపురం మండలాల్లో అధికారులు ఎక్కువ దృష్టి పెట్టాలని, మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చూడాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఎటువంటి ప్రాణ, ధన నష్టం జరగకుండా చూడాలని సూచించారు. ఆర్డబ్ల్యూస్ అధికారులు పైప్లైన్లను తనిఖీ చేయాలని, మంచినీటి పైపులు ఉన్నచోట డ్రైనేజీ పైపులు లేకుండా చూడాలని, ప్రజలకు నురక్షిత తాగు నీరందించాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా అత్యవసర మందులు, క్లోరిన్, బ్లీచింగ్ తదితర సామగ్రితో సిద్ధం ఉండాలని తెలిపారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూం 089222 36947 ఏర్పాటుచేశామని, 24 గంటల పాటు సిబ్బంది డ్యూటీలో ఉంటారని, అత్యవసర సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 2 వేల గృహనిర్మాణాలు పూర్తి చేయాలి ఆగస్టు నెలాఖరులోగా జిల్లాలో 2 వేల గృహ నిర్మాణాలు పూర్తిచేసేలా ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. జిల్లాలో పీఎంఏవై అర్బన్, గ్రామీణ కింద 72,496 గృహాలు మంజూరు కాగా 49,127 గృహాలు పూర్తయ్యాయని, మిగిలినవి వివిధ స్థాయిల్లో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ మురళీ మోహన్ పాల్గొన్నారు. ఉద్యోగులకు సెలవులు మంజూరు చేయం కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ -
పైడితల్లి జాతర తేదీలు ఖరారు
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి జాతర తేదీలు ఖరారైనట్టు ఆలయ ఇన్చార్జి ఈఓ కె.శిరీష బుధవారం తెలిపారు. ఆలయ ఆవరణలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఉత్సవ నిర్వహణ తీరును వివరించారు. సెప్టెంబర్ 12న శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మండల దీక్షలు ప్రారంభమవుతాయని తెలిపారు. అదేరోజు చదురుగుడి వద్ద ఉదయం 9.30 గంటలకు, వనంగుడి వద్ద 11 గంటలకు పందిరిరాట వేస్తామన్నారు. అక్టోబరు 2న అర్ధమండల దీక్షలు ఉంటాయన్నారు. అక్టోబర్ 6న తొలేళ్ల ఉత్సవం, 7న సిరిమానోత్సవం, 14న పెద్దచెరువులో తెప్పోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. 19న సాయంత్రం 5.30 గంటల నుంచి వనంగుడి వద్ద కలశ జ్యోతి ఊరేగింపు, 21న మంగళవారం ఉయ్యాలకంబాల మహోత్సవం, 22న చండీహోమం, పూర్ణాహుతి, దీక్షావిరమణ ఉదయం 8 గంటల నుంచి వనంగుడి వద్ద నిర్వహిస్తామన్నారు. దీంతో ఉత్సవం ముగుస్తుందన్నారు. సమావేశంలో ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, ఆలయ సూపరింటెండెంట్ రమణి, ఏడుకొండలు, తదితరులు పాల్గొన్నారు. -
జేఎన్టీయూ జీవీలో 130 మంది రక్తదానం
విజయనగరం అర్బన్: జేఎన్టీయూ జీవీ ఇంజినీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్, ఎన్టీర్ట్రస్ట్ సౌజన్యంతో బుధవారం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది 130 మంది 130 యూనిట్ల రక్తాన్ని దానం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.రాజేశ్వరరావు స్వయంగా రక్తదానంచేసి విద్యార్థులకు ప్రేరణగా నిలిచారు. కార్యక్రమంలో వర్సిటీ వీసీ డి.రాజ్యలక్ష్మి, రిజిస్ట్రార్ జి.జయసుమ, డాక్టర్లు సోమశేఖర్, సునీత, యోగానంద్ పాల్గొన్నారు. -
జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలి
విజయనగరం లీగల్: వచ్చేనెల 13వ తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం నేషనల్ ఇన్సూరెన్స్, బజాజ్ జనరల్ ఇన్సూరెన్న్స్, శ్రీరామ్ జనరల్ ఇన్సూరెనన్స్ కంపెనీల మేనేజర్లు, ఇన్సూరెన్స్ కంపెనీ న్యాయవాదులతో ప్రీ సిట్టింగ్ లోక్ అదాలత్ను నిర్వహించారు. ఈ సందర్భంగా 12 ప్రమాద బీమా కై ్లమ్ కేసులు రాజీకి వచ్చినట్లు ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. కార్యక్రమంలో ఫ్యామిలీ కోర్టు జడ్జి కె.విజయ కల్యాణి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణ ప్రసాద్, ఇన్సూరెనన్స్ కంపెనీ అధికారులు పాల్గొన్నారు.నులిపురుగుల నివారణతో పిల్లలకు ఆరోగ్యం: కలెక్టర్ అంబేడ్కర్గంట్యాడ: పిల్లల్లో నులిపురుగుల నివారణతో ఆరోగ్యం సిద్ధిస్తుందని, పోషకాహారలోపం తొలగి ఆరోగ్యంగా పెరుగుతారని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. ఏడాది నుంచి 19 ఏళ్ల వయస్సు మధ్యన ఉన్న పిల్లలు, విద్యార్థులందరితో ఆల్బెండజోల్ మాత్రలు మింగించాలని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు సూచించారు. డీ వార్మింగ్ డే సందర్భంగా గంట్యాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో మంగళవారం ఆల్బెండజోల్ మాత్రలు మింగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడుపులోని నులిపురుగుల నివారణకు ప్రతీ ఒక్కరూ ఆల్బెండజోల్ మాత్రను ఒకే డోస్గా వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి, డీఈఓ మాణిక్యంనాయుడు, ఆర్బీఎస్కే కో ఆర్డినేటర్ డాక్టర్ సుబ్రహ్మణ్యం, తహసీల్దార్ నీలకంఠేశ్వర రెడ్డి, డాక్టర్ హేమలత, పాఠశాల హెచ్ఎం ఝాన్సీ, తదితరులు పాల్గొన్నారు.పాత మార్కొండపుట్టిలో గజరాజులుకొమరాడ: తోటపల్లి ముంపు ప్రాంతమైన పాత మార్కొండపుట్టి గ్రామ పరిసరాల్లో మంగళవారం ఏనుగులు సంచరించాయి. వరి, పత్తి, కూరగాయలు, అరటి పంటలను నష్టపరుస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏనుగుల తరలింపునకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
బొబ్బిలిలో రెడ్బుక్ రాజ్యాంగం!
బొబ్బిలి: ఇప్పుడున్నది మా ప్రభుత్వం.. నడుస్తున్నది రెడ్బుక్ రాజ్యాంగం.. ఇక్కడ బంకును మేమే నిర్వహిస్తాం.. తక్షణమే ఖాళీచేసి వెళ్లిపో.. లేదంటే లారీలను అడ్డుగా పెడుతాం.. బంకులోకి వాహనాలు రాకుండా అడ్డుకుంటాం.. వ్యాపారమే సాగనీయం... ఇదీ బొబ్బిలి పట్టణంలోని పాతకోర్టు జంక్షన్లోని హెచ్పీ పెట్రోల్బంకు నిర్వాహకునికి స్థానిక నేతల నుంచి ఎదురైన బెదిరింపులు. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని లొకర్నో ఏజెన్సీకి ఉన్న స్థలంలో హెచ్పీ పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసింది. స్థల యజమాని మృతి చెందారు. తదనంతరం కంపెనీకి సమర్పించాల్సిన డాక్యుమెంట్ల విషయంలో ఉన్న సమస్యల కారణంగా స్థల యజమానికి కంపెనీ ఏళ్ల తరబడి అద్దె చెల్లింపు పెండింగ్లో పెట్టింది. పెట్రోల్ బంక్ లైసెన్సుదారు, సామర్లకోటకు చెందిన దళితుడైన చక్రవర్తి ఇక్కడ బంకును నిర్వహిస్తున్నారు. వ్యాపారం ఆపేయాలని స్థానిక నేతల నుంచి ఆయనకు హెచ్చరికలు వచ్చాయి. లైసెన్సు తమకు వదిలేయాలని, నిర్వహణ చూసుకుంటామంటూ బెదిరించారు. ఎమ్మెల్యేను కలవాలంటూ ఆదేశాలిచ్చారు. చేసేదిలేక ఆయన స్థానికంగా బంకులు నిర్వహిస్తున్న విజయ్, రెడ్డిల సహాయం అర్ధించారు. వారి సూచనలతో ఎమ్మెల్యేకు సమస్య చెప్పేందుకు వెళ్లగా కొందరు నాయకులు కలవనీయలేదు. బంక్కు లారీని అడ్డం పెట్టడంతో వ్యాపారం తగ్గిపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు భయపడి విజయనగరం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో కలెక్టర్ అంబేడ్కర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ డీఎస్ఓ మురళీనాథ్ను విచారణకు ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం స్థానిక పౌరసరఫరాల ఉపతహసీల్దార్ రెడ్డి సాయికృష్ణతో కలిసి పెట్రోల్ బంక్కు వెళ్లి విచారణ జరిపారు. లైసెన్సు ఎంత వరకూ ఉంది. స్థల లైసెన్సు, బంక్ నిర్వాహణకు సమయం ఎంత అనే కోణంలో విచారణ చేశారు. బంకుకు అడ్డంగా పెట్టిన లారీలను పరిశీలించారు. ఈ విషయమై మురళీనాథ్ను ప్రశ్నించగా కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణకు వచ్చాననీ, ఇక్కడి పరిస్థితులపై కలెక్టర్కు నివేదిక అందజేస్తానన్నారు. పెట్రోల్ బంక్ నిర్వహించనీయకుండా బెదిరింపులు బంకులోకి వాహనాలు రాకుండా అడ్డుగా పెడుతున్న లారీలు కలెక్టర్కు ఫిర్యాదు చేసిన నిర్వాహకుడు డీఎస్ఓను విచారణకు ఆదేశించిన కలెక్టర్ -
పస్తులతో హాస్టల్ విద్యార్థుల నిరసన
శృంగవరపుకోట: భోజనం బాగులేదంటూ ఎస్.కోట పట్టణం పుణ్యగిరి రోడ్డులో ఉన్న గిరిజన బాలుర సంక్షేమ వసతి గృహం విద్యార్థులు మంగళవారం ఆందోళన చేశారు. పస్తులతో ఉంటూ నిరసన తెలిపారు. చాలా రోజులుగా హాస్టల్లో మెనూ పాటించడం లేదని, భోజనం తినలేకపోతున్నామని వాపోయారు. ఒక్క ఫ్యాన్కూడా లేకపోవడంతో దోమలతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విజయనగరంలో ఉన్న ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయకార్యదర్శి రమేష్, నాయకులు మహేష్, చైతన్య స్పందించారు. భోజనం బాగులేదని చెప్పిన విద్యార్థులపై వార్డెన్ సత్యనారాయణ బెదిరింపులకు దిగుతున్నారని, తక్షణమే ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళన అంశాన్ని వార్డెన్ వద్ద ప్రస్తావింగా ఇటీవల కురిసిన పిడుగుల వానకు ఫ్యాన్లు పాడయ్యాయని, రెండు రోజుల్లో బాగుచేయిస్తామని చెప్పారు. -
గురజాడ ఇంటిలో తాగుబోతు హల్చల్
● కోటవెనుక గోడ ఎక్కి మహాకవి ఇంట్లోకి చొరబడిన దొంగ ● పుస్తకాలను విసిరేసిన వైనం ● ఆవేదనలో సాహితీవేత్తలు విజయనగరం టౌన్: విచ్చలవిడిగా దొరుకుతున్న మద్యం సేవించి.. ఆ మత్తులో మహాకవి గురజాడ ఇంటిలోకి కోట వెనుక భాగం నుంచి ఓ దొంగ మంగళవారం వేకువజామున చొరబడ్డాడు. మహాకవి రచనలు తప్పితే అక్కడ ఏమీ కనిపించకపోయే సరికి... ఆ పుస్తకాల విలువ తెలియని తాగుబోతు వాటిని గోడమీదనుంచి బయటకు విసిరేశాడు. చిందరవందర చేశాడు. మద్యం మత్తులో తూగుతూ గోడపై నుంచి దూకేసి అక్కడే మత్తులోకి జారు కున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మహాకవి రచనలకు భద్రత కరువు? మహాకవి గురజాడ రచనలను భద్రం చేయాల్సిన ఆర్కియాలజీ విభాగం, జిల్లా అధికార యంత్రాంగం ఎటువంటి చర్యలు చేపట్టలేదు. మహాకవి ఇంటిని పరిరక్షణ చేయమని, పక్కన ఉన్న ఖాళీ స్థలం వల్ల స్మారకభవనానికి ఇబ్బందులు వస్తున్నాయని, అధికారులకు పలుమార్లు వినతులు అందజేసినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. తాజా ఘటనతో మహాకవి అభిమానులు, సాహితీ సంఘాల ప్రతినిధులు ఆవేదన చెందుతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి మహాకవి రచనలకు భద్రత కల్పించాని కోరుతున్నారు. మహాకవి.. మా పాలకులను మన్నించుమా...విజయనగరం గంటస్తంభం: తెలుగు జాతికి తన రచనలతో వెలుగు దారి చూపిన మహోన్నత వ్యక్తి, కన్యాశుల్కం నాటక రచయిత, మహాకవి గురజాడ అప్పారావు గృహానికి, ఆయన సాహిత్య సంపదను కాపాడడంలో పాలకులు విఫలమయ్యారని జిల్లా పౌర వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి ఆరోపించారు. ఒక తాగుబోతు గురజాడ అప్పారావు గృహంలోకి చొరబడి అక్కడి ఫ్యాన్లు, విలువైన పుస్తకాలు, వస్తువులు చిందరవందర చేసిన విషయం తెలుసుకుని పౌర వేదిక సభ్యులతో కలిసి గురజాడ గృహాన్ని మంగళవారం సందర్శించారు. గురజాడ ఇందిర, ప్రసాద్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గురజాడ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ గురజాడ జయంతి, వర్ధంతి సభల్లో అధికారులు, నాయకులు ఊదరగొట్టే ప్రసంగాలు చేస్తూ వెంటనే మర్చిపోతున్నారన్నారు. గురజాడ గృహం పరిసరాలను ఉచ్చలదొడ్డి మాదిరిగా తయారుచేశారన్నారు. అపరిశుభ్రతలో భవనం ఉన్నా పట్టించుకునేవారే కరవయ్యారన్నారు. మద్యం మత్తులో ఓ దొంగ ఇంటిలో చొరబడి, విలువైన పుస్తకాలను గోడబయ టకు విసిరేయడాన్ని చూస్తే భద్రతలోని డొల్లతనం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. భవన నిర్వహణ బాధ్యతను విజయనగరం కార్పొరేషన్, జిల్లా టూరిజం, పురావస్తు శాఖ అధికారులు తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. గురజాడ అభిమాను లు దేశవ్యాప్తంగా ఉన్నారని, ఇక్కడ జరుగుతున్న పరిణామాలు చూసి వారంతా ఆవేదన చెందుతున్నారన్నారు. గురజాడ గౌరవం కాపాడే దిశగా మంత్రి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పౌర వేదిక సభ్యు లు ప్రభాకరరావు, రామచంద్ర రాజు, రామ్మోహన్రావు, పద్మావతి, కనకాచారి, గోపి పాల్గొన్నారు. -
50వేల బంగారు కుటుంబాల దత్తత
విజయనగరం అర్బన్: ఆగస్టు 15 నాటికి 50వేల బంగారు కుటుంబాల దత్తత ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. పీ4 కార్యక్రమం, హర్ ఘర్ తిరంగా, సీజనల్ వ్యాధులు, భారీ వర్షాలు తదితర అంశాలపై ఆన్లైన్లో కలెక్టర్ సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో మొదట 67,066 బంగారు కుటుంబాలను గుర్తించగా, వడపోతల అనంతరం ఆ సంఖ్య 60,612 కు తగ్గిందని కలెక్టర్ చెప్పారు. ఇంకా ఎవరైనా అనర్హులు ఉంటే తొలగించాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆగస్టు 15 నాటికి జిల్లాలో 50వేల బంగారు కుటుంబాల దత్తతను పూర్తిచేయాల్సి ఉందని, మార్గదర్శులను గుర్తించే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి, ఫొటోలను సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్, సీపీఓ పి.బాలాజీ, జిల్లా అధికారులు, నియోజకవర్గ, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. భారీ వర్షాలపట్ల అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ -
గడువు దాటినా పరిష్కరించకపోతే చర్యలు
విజయనగరం అర్బన్: ప్రజా వినతుల పరిషార వేదికకు వచ్చే వినతులను నిర్దేశించిన గడువులోగా పరిష్కరించని జిల్లా అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో కలెక్టర్ ప్రజల నుంచి 149 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ ప్రతిరోజూ లాగిన్లో అధికారులు ఎప్పటికప్పుడు చూడాలని సూచించారు. నిర్దేశించిన గడువులోగా పరిష్కరించడానికే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ఎప్పుడు చూసినా పరిష్కారాల నమోదు సున్నా కనబడాలని తెలియజేశారు. ప్రతి రీ ఓపెన్ కేసును పూర్తిగా విచారణ జరిపి పరిష్కార మార్గం చూడాలని సూచించారు. గడువులోగానే వినతులకు సమాధానాలు పంపాలని అలా చేయని అధికారులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అర్జీల స్వీకరణలో కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్, డీఆర్ఓ శ్రీనివాసమూర్తి, విజయనగరం డిప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వరరావు, ప్రమీల గాంధీ పాల్గొన్నారు. ఎస్పీ గ్రీవెన్స్ సెల్కు 37 ఫిర్యాదులు విజయనగరం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు’ప్రజా సమస్యల పరిష్కార వేదిక‘ (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టం) కార్యక్రమాన్ని ఎస్పీ వకుల్ జిందల్ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను శ్రద్ధగా విని, సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. ఫిర్యాదుదారుల సమస్యలను సంబంధిత అధికారులకు వివరించారు. ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని,వాటి పరిష్కారానికి చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. కార్యక్రమంలో భాగంగా ఎస్పీ 37 ఫిర్యాదులను స్వీకరించారు. ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, ఏడు రోజుల్లో సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, డీసీఆర్బీ సీఐ బి.సుధాకర్, ఎస్సై రాజేష్, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పీజీఆర్ఎస్కు 149 వినతులు -
ఉచిత బస్సుపేరుతో కార్మికుల పొట్ట కొట్టొద్దు
● కలెక్టరేట్ ఎదుల ఆటో డ్రైవర్ల ఆందోళనపార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలో పలు మండలాలకు చెందిన వందలాదిమంది ఆటో కార్మికులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. ముందుగా పట్టణ ప్రధాన రహదారిపై నిరసన ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ నాయకుల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 15 నుంచి ఉచిత బస్సు పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తే ఆటో కార్మికులలో 60శాతం మందికి ఉపాధి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏదైనా పథకం ప్రవేశపెట్టినప్పుడు దాని ప్రభావం వల్ల ఎంతమంది నష్టపోతారో ఆలోచన చేసి పరిశీలించి శాసీ్త్రయంగా నష్టపరిహారాన్ని, ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే అనేక విధాలుగా ఉపాధిలేక అవస్థలు పడుతున్న ఆటో కార్మికుల పరిస్థితి ఈ ఉచిత బస్సుతో మరింత దయనీయంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం వారికి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి పింఛన్లు వంటివి చెల్లించి వాహన మిత్ర తరహాలో పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి ఆటో, ట్యాక్సీ డ్రైవర్కు ఏడాదికి రూ. 25వేలు పరిహారం చెల్లించాలని, అలాగే ఇప్పటికే తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారానికి నిర్దిష్టమైన కార్యాచరణ ప్రభుత్వం రూపొందించకపోతే ఆటో, ట్యాక్సీ కార్మికులను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీ యూ జిల్లా కార్యదర్శి వై.మన్మథరావు, బీవీ రమణ, కోశాధికారి జి.వెంకటరమణ, కె.గంగునాయుడు, సాంబమూర్తి, ఉమామహేశ్వరరావు, ఆటో యూని యన్ నాయకులు శంభాన చిన్న, డి. రాము, క్రాంతి, నారాయణ, సత్యనారాయణ, శ్రీను, శంకరరావు , పోలినాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో ప్రతిభ
పాచిపెంట: ఈనెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు చీరాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ 2025 అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీల్లో పాచిపెంట మండల కేంద్రానికి చెందిన యువత ప్రతిభ కనబరిచారు. 10000, 5000 మీటర్ల పరుగు పందెంలో బొడ్డు సాయి మొదటి స్థానం సాధించగా, వాడాడ సతీష్ ద్వితీయ స్థానం సాధించాడు. 3000, 1500 మీటర్ల పరుగు పందెంలో ముల్లు హరీష్ మొదటి స్థానం సాధించాడు, అలాగే 5000 మీటర్ల రేస్వాక్ లో బుగత హరీష్ రెండవ స్థానం సాధించగా అండర్ 18 బాలికల విభాగంలో..ఉత్తరావల్లి మహాలక్ష్మి 1000 మీటర్ల పరుగు పందెంలో మూడవ స్థానం సాధించింది. మొత్తంగా..6బంగారు, 2రజత, 1కాంస్య పతకం సాధించారు. ఈ సందర్భంగా విజేతలకు కోచ్ నేతేటి శేఖర్తో పాటు పలువురు గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు. -
రాష్ట్ర పోటీలకు గుణుపూరుపేట విద్యార్థినులు
డెంకాడ: రాష్ట్ర సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు గుణుపూరుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఎంపికయ్యారు. ఈనెల 29 నుంచి 31వ తేదీ వరకూ ప్రకాశం జిల్లాలోని చెవ్వూరులో జరగనున్న పోటీలకు గుణుపూరుపేట ఉన్నత పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థినులు ఆబోతుల తేజస్విని, గేదెల మానస ఎంపికయ్యారు. అలాగే వచ్చే నెల అనంతపురంలో జరగబోయే జూనియర్ బాల్ బాడ్మింటన్ రాష్ట్రస్థాయి పోటీలకు పదవ తరగతి విద్యార్థినులు సీహెచ్ రోహిణి, కెల్ల నవ్య, కెల్ల రేష్మ ఎంపికయ్యారు. వారిని పాఠశాల హెచ్ఎం సీహెచ్ అరుణ, వ్యాయామ ఉపాధ్యాయుడు సారిపల్లి గౌరీశంకర్ తదితరులు అభినందించారు. -
అర్జీదారుల ఆకలి తీరుతోంది
పార్వతీపురం రూరల్: కలెక్టర్ కార్యాలయానికి ప్రతి సోమవారం జిల్లా నలుమూలల నుంచి వచ్చి తమ సమస్యల పరిష్కారానికి సొంత గ్రామాల్లో ఉదయం బయలు దేరి 10గంటల సమయానికి కలెక్టరేట్కు అర్జీదారులు చేరుకుంటారు. అయితే చార్జీలు భరించి వ్యయ ప్రయాసాలతో సామాన్యులు, దివ్యాంగులు తమ సమస్య పరిష్కారం కావాలనే ఆశతో వచ్చిన వారికి అర్జీలు అందజేసిన అనంతరం ఉచితంగా కలెక్టరేట్ ఆవరణలో భోజనం చేసేందుకు ఇటీవల కలెక్టర్ ఎ. శ్యామ్ప్రసాద్ ఆలోచన మేరకు భోజన సదుయాపం కల్పించారు. ఎంతోమంది అర్జీదారులు ఈ ఉచిత భోజన కార్యక్రమాన్ని వినియోగించుకుంటున్నారు. ఇంతమంచి ఆలోచన చేసిన కలెక్టర్కు పలువురు అభినందనలు తెలుపుతున్నారు. రాష్ట్రస్థాయి యోగా పోటీలకు 44 మంది ఎంపికవిజయనగరం అర్బన్: రాష్ట్రస్థాయి యోగా పోటీలకు జిల్లాలోని 44 మంది క్రీడాకారులు ఎంపికయ్యారని జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఎం.శశిభూషణరావు తెలిపారు. స్థానిక సీతం ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి యోగా స్పోర్ట్స్ చాంపియన్షిప్ –2025 పోటీల్లో పాల్గొన్న 100 మంది నుంచి ఈ ఎంపిక జరిగిందన్నారు. ఈ పోటీలలో స్వర్ణ పతకాలు సాధించిన 44 మంది త్వరలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత పొందారన్నారు. విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలను అందజేశారు. న్యాయనిర్ణేతలుగా జుట్టాడ ప్రీతి, ఎ.నారాయణ, రమేష్, హర్ష, భాస్కర్, కరుణ వ్యవహరించారు. -
ఫ్రీ బస్సు మీద కస్సుబుస్సు
● రోడ్డున పడిన ఆటోడ్రైవర్లు ● ఆందోళనలో సుమారు 28వేల కుటుంబాలు ● తమ పరిస్థితి ఏమిటని ఆవేదన ● వాహనమిత్ర అమలు చేయాలని భారీ ర్యాలీ ● కలెక్టరేట్ వద్ద ఆందోళనమా గోడు వినండి .. ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ నుంచి అమలు చేయడానికి నిర్ణయించిన మహిళలకు ఫ్రీ బస్సు పథకం వల్ల స్వయం ఉపాధి రంగంగా జీవనం సాగిస్తున్న ఆటో, క్యాబ్ డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతారు. కరోనా అనంతరం ఆర్థికంగా దెబ్బతిన్న ఆటో, క్యాబ్ డ్రైవర్ల కుటుంబాలు నేటికీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నాయి. ఉపాధి అవకాశాలు లేక స్వయం ఉపాధిగా సొంత పెట్టుబడితో ఒక పక్క ఫైనాన్స్ చెల్లించుకుంటూ మరోవైపు ప్రభుత్వనికి చెల్లించాల్సిన రోడ్, గ్రీన్ టాక్స్, రెన్యువల్, పొల్యూషన్ వంటి పన్నులు చెల్లిస్తూ జీవనం సాగిస్తున్నారు. పట్టణంలో కార్పొరేట్ సంస్థలైన రాపిడో, ఉబర్, ఓలా వంటి కంపెనీలకు అనుమతులు ఇవ్వడం వల్ల ఆటో, క్యాబ్ డ్రైవర్ల ఉపాధి దెబ్బతింది. వ్యక్తిగత వాహనాలపై పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నిర్వహించకూడదని కర్ణాటక హైకోర్టు తీర్పు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బహుళ జాతి సంస్థలకు అనుమతులను ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆటో, క్యాబ్ డ్రైవర్లను ఆదుకుంటామని చెప్పి హామీ గాలికొదిలేసింది. – కె.సురేష్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శివాహనమిత్ర అమలు చేయాలి.. కూటమి ప్రభుత్వం వాహనమిత్ర కింద ఏడాదికి రూ.15వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. జీవో నం 21 రద్దు చేసి అపరాధ రుసుం భారం తగ్గిస్తామని చెప్పింది. వాహనాలపై పెంచిన గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తామని, వాహన కొనుగోలుకు సంబంధించి వడ్డీపై సబ్సిడీ అందిస్తామని నేతలు హామీ ఇచ్చారు. అధికారం చేపట్టి ఏడాదైనా నేటీకీ అవేమీ అమలు కావడం లేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమంటూ చెబుతున్నారు. ఈ క్రమంలో అంత కంటే ముందు వాహనమిత్ర అమలు చేయాలి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు చేసే వరకు పోరాడతాం. – ఆటో కార్మికుడు, జి.కూర్మారావు, విజయనగరంవిజయనగరం గంటస్తంభం: ఏపీలో మహిళలకు ఫ్రీ బస్ హామీ కాకరేపుతోంది. ఆ హామీ అమలు చేసి తమ పొట్ట కొట్టొదంటూ ఆటోడ్రైవర్లు ర్యాలీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించొద్దంటూ విజయనగరంలో ఆటోడ్రైవర్లు రోడ్డెక్కారు. చలో కలెక్టరేట్ నినాదంతో ర్యాలీ చేశారు. ప్రభుత్వం ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని కోరారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలతో తమకు ఉపాధి తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్రీ బస్సు నడిపే ముందు తమ వ్యవహారం చూడాలని ఆటో డ్రైవర్లు కోరుతున్నారు. ఎక్కడికక్కడ మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తే తమకు ఉపాధి అవకాశాలు దెబ్బ తింటాయని విజయనగరం ఆటో కార్మిక సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆటో చక్రం కదిలితేనే బతుకు బండి సాగేది దశాబ్దాలుగా వారి జీవనాధారం ఆటోలే. ఉమ్మడి విజయనగరం జిల్లాలో సుమారు 28వేల మంది ఆటో, క్యాబ్ కార్మికులు ఉన్నారు. వైఎస్సార్సీపీ ప్ర భుత్వం హయాంలో వారికి వైఎస్సార్ వాహన మిత్ర పథకం ఏటా అమలయ్యేది. ప్రతి ఒక్కరికీ ఈ పథ కం వర్తింపజేయడం ద్వారా లబ్ధి చేకూరేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాహన మిత్ర కింద రూ.15వేలు ఇస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచి విస్తృత ప్రచారం కల్పించారు. దాన్ని నమ్మి వారంతా కూటమి ప్రభుత్వానికి ఓటేశారు. ఇప్పుడు మోసపోయామని గుర్తించి ఆందోళన చెందుతున్నారు. జగనన్న ప్రభుత్వంలో ఏటా వాహనమిత్ర పథకం తమకు అందేదని ఇప్పుడు దాన్ని కూటమి పాలకులు పక్కన పెట్టారని వాపోతున్నారు. ఆటో, క్యాబ్ డ్రైవర్ల ఆందోళన.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాహన మిత్ర పథకం కింద ఇస్తామన్న రూ. 15వేలు నేటికీ ఇవ్వలేదు. ఆ ఊసే ఎత్తడం లేదు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన తొలి వంద రోజుల్లోనే ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ,క్యాబ్ డ్రైవర్లు సంక్షేమం కోసం రూ. 400 కో ట్లు బడ్జెట్ కేటాయించి నాడు అర్హులందరికీ రూ. 10వేలు చొప్పున అందించారు. కూటమి ప్రభుత్వం ఆ మాదిరిగానే ఇస్తుందని ఆశించిన డ్రైవర్లకు నిరాశే మిగిలింది. ఇదే సమయంలో సీ్త్రశక్తి కింద మహిళలకు ఉచిత బస్సు పథకం తీసుకువస్తున్నట్లు ప్రభుత్వ పెద్దలు ప్రకటించిన క్రమంలో తమ బతుకు బండి సంగతేంటని వారంతా ఆందోళన చెందుతున్నారు. హమీల అమలుకు ర్యాలీ.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాహనమిత్ర హామీతో పాటు మోటారు కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డ్రైవర్లు, మోటారు కార్మికులు డిమాండ్ చేశారు. సీ్త్రశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు అమలు చేసేలోపు వాహనమిత్ర అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో సోమవారం డ్రైవర్లు, కార్మికులు విజయనగరంలో ర్యాలీ నిర్వహించారు. -
మేనమామను కడతేర్చిన మేనల్లుడు
బొండపల్లి: మండలంలోని కెరటాం గ్రామానికి చెందిన వ్యక్తిని సొంత మేనల్లుడు చంపి ఆ తరువాత సహజంగానే చనిపోయినట్లు అందరినీ నమ్మించి దహనసంస్కారాలు నిర్వహించాడు. ఈ విషయంపై 100కు సమాచారం అందడంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు సోమవారం రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నీడిగేటి అప్పల కృష్ణ (42), మేనల్లుడు నారపాటి సాయి శనివారం మద్యం తాగడానికి గ్రామం బయటకు వెళ్లారు. అక్కడే మద్యం మత్తులో మేనమామ కృష్ణను సాయి హత్య చేసి ఏమీ తెలియనట్లు ఇంటికి వచ్చేశాడు. మేనమామ ఏడని, ఇద్దరు కలిసి వెళ్లి ఒక్కడివే వచ్చావని మృతుడి భార్య అడగ్గా మద్యం ఎక్కువై పడుకున్నాడని సమాధానం చెప్పాడు. కొద్దిసేపటి తరువాత మృతుడు కృష్ణను సాయి బైక్పై తీసుకు వచ్చి చలనం లేదని, చనిపోయి ఉంటాడని అందరిరినీ నమ్మించే ప్రయత్నం చేసి మృతదేహానికి దహన సంస్కారాలు చేశారు. శవాన్ని వారి ఆచారం ప్రకారం పూడ్చిపెట్టారు. కార్యక్రమం అనంతరం సాయి విశాఖపట్నంలోని గోపాలపట్నం వెళ్లి పోయాడు. మృతుడు కృష్ణ సొంత చెల్లెలి కొడుకు సాయి కాగా కొంతకాలంగా వారు గోపాలపట్నంలో ఉంటున్నారు. తరచూ సాయి మేనమామ ఇంటికి వస్తూ పోతుంటాడు. ఈ క్రమంలోనే శనివారం వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణ చనిపోవడం పట్ల పోలీసులకు 100కాల్ రావడంతో సోమవారం రంగంలోకి దిగారు. శవాన్ని పాతిపెట్టిన ప్రదేశానికి తహసీల్దార్ డోలా రాజేశ్వరావుతో పాటు ఎస్సై యు.మహేష్ వెళ్లి మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్మార్టం నిమిత్తం విజయనగరంలోని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమా? మృతుడి భార్య రాజుతో మేనల్లుడు సాయికి కొన్ని సంవత్సరాలనుంచి వివాహేతర సంబంధం ఉందని ఈ విషయంపై మేనమామతో సాయికి గొడవ జరిగి హత్యకు దారి తీసిఉంటుందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతునికి భార్య, కొడుకు, కూతురు ఉండగా పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు. ఈ సంఘటన తర్వాత నిందితుడు పరారీలో ఉన్నాడు. -
కొత్తవలసలో మరో చోరీ
కొత్తవలస: మండలంలోని మంగళపాలెం గ్రామం సమీపంలో గల గురుదేవా చారిటబుల్ ట్రస్టులో సుమారు 5 కేజీల బంగారం, పెద్ద మొత్తంలో నగదును దొంగలు దోచుకుపోయిన విషయం మరవక ముందే మరో ఇంటిలో పడి పెద్ద ఎత్తున బంగారం, వెండి, నగదును దోచుకుపోయారు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనతో వరుస దొంగతనాలు కొత్తవలస పోలీసులకు తలనొప్పిగా మారింది. ఘటన వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రంలో గల విద్యుత్ సబ్స్టేషన్ సమీప బాలాజీ నగర్లో నివాసం ఉంటున్న ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న మోపాడ కృష్ణంనాయుడి ఇంటిలో శనివారం రాత్రి దొంగలు పడి 15 తులాల బంగారం, 50 తులాల వివిధ రకాల వెండిసామగ్రి, ఆయన కుమారుడి కళాశాల ఫీజు కట్టేందుకు దాచుకున్న రూ.లక్షా 50వేల నగదు దోచుకుపోయారు. కృష్ణంనాయుడు శనివారం రాఖీ పండగ సందర్భంగా ఎస్.కోటలో గల తన స్వగ్రామానికి కుటుంబంతో సహా వెళ్లారు.అదే రోజు సమీప బంధువైన ఓ వృద్ధురాలు మృతి చెందింది. దీంతో అంత్యక్రియల్లో పాల్గొని శనివారం రాత్రి ఎస్.కోటలోనే ఉండిపోయారు. మరుసటి రోజు ఆదివారం సాయంత్రం కొత్తవలసలో గల ఇంటికి కుటుంబంతో సహా వచ్చేసరికి ఇంటి ఇనుప కటకటాలకు సబంధించిన గడియలను కోసి ఇంటిలోకి దొంగలు చొరబడి ఇంట్లోని సామాన్లు, బీరువాలో బట్టలను చిందర వదంగా పడేశారు. అన్నీ పరిశీలించగా బంగారం, వెండి, నగదు పోయినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సోమవారం విజయనగరం నుంచి క్లూస్టీమ్ వచ్చి ఘటనా స్థలంలో పరిశీలించి వేలిముద్రలను సేకరించారు. బాధితుడు కృష్ణంనాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 15 తులాల బంగారం, 50 తులాల వెండి, రూ.లక్షా 50వేల నగదు దోచుకున్న దొంగలు పోలీసులకు తలనొప్పిగా మారిన వరుస దొంగతనాలు -
ఎరువుల ధరలకు రెక్కలు..!
●చర్యలు తీసుకుంటాం విజయనగరం ఫోర్ట్: కూటమి ప్రభుత్వంలో రైతన్నకు తిప్పలు తప్పడం లేదు. సకాలంలో సాగుసాయం అందక, విత్తనాలు, ఎరువులు అందుబాటులో లేక ఆవేదన చెందుతున్నారు. ఎరువులకు కృత్రిమకొరత సృష్టిస్తూ అధిక ధరలకు విక్రయంతో రైతుల జేబులు గుళ్లవుతున్నాయి. ప్రైవేటు డీలర్లు అడిగినంత ఇవ్వకపోతే ఎరువులు ఇవ్వడం లేదు. ఎమ్మార్పీకి మించి వసూలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని పలు సాగునీటి ప్రాజెక్టుల కింద సుమారు 58వేల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. ప్రస్తుతం వీటికి జల్లేందుకు అవసరమైన ఎరువును రైతులు కొనుగోలు చేస్తున్నారు. రైతు సేవా కేంద్రాల్లో ఎరువులు దొరకకపోవడంతో ప్రైవేటు డీలర్లను ఆశ్రయిస్తున్నవారికి చేతిచమురు వదులుతోంది. బస్తాకు అదనంగా రూ. 50 వరకు వసూలు ఎరువులను డీలర్లు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. యూరియా బస్తా వాస్తవ ధర రూ.267కాగా రూ.300 నుంచి రూ.350వరకు వసూలు చేస్తున్నారు. అలాగే, డీఏపీ బస్తా రూ.1350 కాగా రూ.1400కు విక్రయిస్తున్నారు. ఇతర కాంప్లెక్స్ ఎరువులదీ ఇదే పరిస్థితి. డీలర్లు ఎరువుల ధరలు పెంచేసి రైతులను దోచేస్తున్నా పట్టించుకునే నాథుడే లేరన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డీఏపీ ఎరువు బస్తాలుఎరువులు ఎమ్మార్పీ కంటే అధిక ధరకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. ఏ డీలర్ అయినా అధిక ధరకు విక్రయిస్తే సంబంధిత వ్యవసాయ అధికారికి రైతులు ఫిర్యాదు చేయాలి. – వి.తారకరామారావు, జిల్లా వ్యవసాయ అధికారి ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తున్న డీలర్లు డీఏపీ బస్తాకు అదనంగా రూ.50 వసూలు యూరియా బస్తాకు రూ.30 నుంచి రూ.80లు చెల్లించాల్సిందే ఆవేదనలో రైతన్న ప్రశ్నిస్తే ఎరువులేదని కసురుతున్న వ్యాపారులు -
స్వచ్ఛంద నిర్ణయం.. అందరికీ ఆదర్శనీయం
చీపురుపల్లి: వారంతా డిగ్రీ చదువుతున్నారు. సామాజిక బాధ్యతతో ఎన్ఎస్ఎస్ విభాగంలో చేరి పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అక్కడితో ఆగకుండా 56 మంది ఎన్ఎస్ఎస్ వలంటీర్లు తమ మరణానంతరం నేత్ర, అవయవదానం చేసేందుకు ముందుకొచ్చారు. పట్టణంలోని శ్రీ సత్యరామ డిగ్రీ కళాశాలలో చదువుతున్న వారంతా ఒకే మాటపైకి వచ్చి స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకున్నారు. నేత్ర, అవయవదానం చేసేందుకు మూకుమ్మడిగా ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీకు చెందిన బ్లడ్ బ్యాంక్కు వచ్చి అక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.శంకరరావు చేతులమీదుగా మానవీయత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు, రెడ్క్రాస్ డివిజినల్ కో ఆర్డినేటర్ బి.వి.గోవిందరాజుకు అంగీకార పత్రాలు అందజేశారు. నేత్ర, అవయవదానం ఉద్యమంలో భాగస్వామ్యులై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని స్పష్టం చేశారు. అత్యవసర సమయాల్లో (గోల్డెన అవర్) ప్రాణాలు కాపాడే బేసిక్ ఫస్ట్ ఎయిడ్లో శిక్షణ తీసుకునేందుకు సిద్ధమయ్యారు. నేత్ర, అవయవదానానికి ముందుకొచ్చిన 56 మంది ఎన్ఎస్ఎస్ వలంటీర్లు -
ప్రభుత్వ స్థలాలు, భూముల రీ సర్వే
● జేసీ సేతు మాధవన్ విజయనగరం అర్బన్: ప్రభుత్వ స్థలాలు, భూ ముల రీ సర్వే జరుగుతోందని, ప్రభుత్వ అధికారులంతా తమ పరిధిలోని భూములను పరిరక్షించుకునేందుకు ఇది మంచి అవకాశమని జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ తెలిపారు. ిపీజీఆర్ఎస్ అనంతరం అధికారులతో మాట్లాడుతూ ప్రభుత్వ, వివిధ సంస్థల, అతుకుబడి భూముల సరిహద్దులు నిర్ణయించేందుకు నవంబర్ నెల లోపల రీ సర్వే జరుగుతుందన్నారు. రెవెన్యూ, దేవదా య, అటవీ, పంచాయతీ, పంచాయతీ రాజ్, ఆర్అండ్బీ, జిల్లా రిజిస్ట్రార్, మున్సిపల్, మైనారిటీ శాఖల అధికారులు తమ శాఖల భూములను రీ సర్వే చేసుకొని సరిహద్దులను నిర్ణయించుకోవాలని, మ్యుటేషన్లు చేయించుకోవాలని తెలిపారు. శివారు ఆయకట్టుకు సాగునీరు అందాలి విజయనగరం అర్బన్: ప్రాజెక్టుల పరిధిలో శివారు భూములకు సైతం సాగునీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ, నీటిపారుదలశాఖ అధికారులను కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. జిల్లాలో పంటల స్థితిగతులు, సాగునీటి సరఫరా, వర్షపాతం తదితర అంశాలపై తన చాంబర్లో సంబంధిత అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సుమారు 60 శాతం సాగు విస్తీర్ణానికి కాలువల ద్వారా సాగునీరు అందుతోందని మిగిలిన 40 శాతం సాగు భూములు వర్షాధారంగా పేర్కొన్నారు. తోటపల్లి ప్రాజెక్టు నీరు శివారు భూములకు సరఫరా అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు. జిల్లాలో సగటు వర్షపాతం నమోదు కాకపోవడంతో సాగునీటి ఎద్దడి ఉందన్నారు. సమావేశంలో సీపీఓ పి.బాలాజీ, వ్యవసాయశాఖ జేడీ వి.టి.రామారావు, ఉద్యానశాఖ డీడీ సీహెచ్ చంద్రశేఖర్, తోటపల్లి ఈఈ పి.అప్పలనాయుడు పాల్గొన్నారు. పరిమిత బస్సుల్లోనే ఉచిత ప్రయాణం ● మహిళలకు గుర్తింపు కార్డు తప్పనిసరి ● జిల్లా ప్రజారవాణా అధికారిణి జి.వరలక్ష్మి విజయనగరం అర్బన్: ఆర్టీసీ అందించే వివిధ రకాల సర్వీసుల్లో కొన్నింటిలోనే మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15 నుంచి కల్పిస్తుందని జిల్లా ప్రజారవాణా అధికారిణి జి.వరలక్ష్మి తెలిపారు. ‘సీ్త్ర శక్తి పథకం’ పేరుతో అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సోమవారం ఆమె మార్గదర్శకాలు విడుదల చేశారు. రాష్ట్రంలో నివాసం ఉన్న బాలికలు, మహిళలు, లింగమార్పిడి చేసుకున్న వ్యక్తులు ఈ సౌకర్యానికి అర్హులన్నారు. దీనికోసం గుర్తింపుకార్డు తప్పనిసరన్నారు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం అనుమతిస్తామన్నారు. నాన్స్టాప్, అంతర్రాష్ట్ర సర్వీసులు, కాంట్రాక్టు సర్వీసులు, అల్ట్రాడీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, అన్ని ఏసీ బస్సు సర్వీసులకు వర్తించదని స్పష్టంచేశారు. అర్హత ఉన్న మహిళా ప్రయాణికులందరికీ జీరో ఫేర్ టిక్కెట్లను జారీ చేస్తామన్నారు. 12న డీవార్మింగ్ డే విజయనగరం ఫోర్ట్: జాతీయ నులిపురుగుల నివారణ దినాన్ని పురస్కరించుకుని జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలలు, కళాశాలల్లో ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీచేయాలని కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడతూ జిల్లాలో ఏడాది నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలు, విద్యార్థులు సుమారు 3,60,000 మంది ఉన్నారని, వీరందరికీ ఆల్బెండజోల్ మాత్రలు మధ్యాహ్న భోజనం చేసిన అరగంట తర్వాత మింగించాలన్నారు. ఒకటి నుంచి రెండేళ్ల వయస్సువారికి 400 ఎంజీ అరమాత్ర, 2 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్కులకు పూర్తిమాత్ర వేయాలన్నారు. సమావేశంలో జేసీ సేతు మాధవన్, డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి, డీఎల్ఓ డాక్టర్ రాణి, తదితరులు పాల్గొన్నారు. 14న జిల్లా సమీక్ష సమావేశం విజయనగరం అర్బన్: జిల్లా సమీక్ష సమావేశం (డీఆర్సీ) ఈ నెల 14న జరుగుతుందని కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రి వంగలపూడి అనిత, జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొంటారని తెలిపారు. -
స్పందించిన అధికారులు
తెర్లాం: తెర్లాం మండల కేంద్రంలోని జగనన్న కాలనీ సమీపంలో గల చెత్త కుప్పల్లో ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర బ్యాగ్లను ఎంఈఓ జె.త్రినాథరావు సోమవారం పరిశీలించారు. ఈ నెల 11న ‘సాక్షి’ దినపత్రికలో ‘చెత్త కుప్పల్లో విద్యార్థి మిత్ర బ్యాగ్లు’ అన్న శీర్షికన ప్రచురితమైన వార్తకు ఎస్ఎస్ఏ ఏపీసీ రామారావు, డీఈఓ మాణిక్యంనాయుడు స్పందించారు. చెత్త కుప్పల్లో ఉన్న విద్యార్థి మిత్ర స్కూల్ బ్యాగ్లను పరిశీలించాలని, అవి ఏ పాఠశాల నుంచి విద్యార్థులకు ఇచ్చారో వివరాలు తెలుసుకోవాలని ఎంఈఓ త్రినాథరావును ఆదేశించారు. ఈ మేరకు ఆయన చెత్త కుప్పలో వేసిన విద్యార్థి మిత్ర బ్యాగ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ బ్యాగ్లు చిరిగిపోవడంతో వాటిని విద్యార్థులు చెత్త కుప్పలో పడేశారని, ఏ విద్యార్థి వాటిని చెత్తకుప్పలో వేశారో గుర్తించి వాటి స్థానంలో కొత్త బ్యాగులను విద్యార్థులకు అందజేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీనిపై నివేదిక తయారుచేసి డీఈఓకు పంపిస్తామని చెప్పారు. చెత్త కుప్పల్లో ఉన్న ‘విద్యార్థి మిత్ర’ బ్యాగ్లు పరిశీలించిన ఎంఈఓ -
ఉత్తమ పాఠశాలగా వంగర కేజీబీవీ
వంగర: రాష్ట్రస్థాయి ఉత్తమ పాఠశాల అవార్డుకు వంగర కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం (కేజీబీవీ) ఎంపికై ంది. ఈ మేరకు కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 352 అన్ని యాజమాన్య పాఠశాలల్లో టాప్–10 పాఠశాలలను ఎంపిక చేయగా అందులో వంగర కేజీబీవీ ఉందన్నారు. కేజీబీవీలలో విద్యార్థుల హాజరు, విద్యాప్రమాణాలు, విద్యార్థుల సరాసరి మార్కులు, ఉత్తీర్ణత శాతం, గత ఏడాది 10వ తరగతి ఉత్తీర్ణత శాతం, గరిష్ఠంగా వచ్చిన గణాంకాలు ఆధారంగా ఎంపిక చేశారు. ఆగస్టు 15 పర్వదినాన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతులు మీదుగా ప్రిన్సిపాల్ బౌరోతు రోహిణి, సిబ్బంది అవార్డులు అందుకోనున్నారు. రాష్ట్ర స్థాయిలో కేజీబీవీకి ఉత్తమ అవార్డు లభించడం పట్ల కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ హర్షం వ్యక్తంచేశారు. డీఈఓ యు.ముత్యాలునాయుడు, సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు సమన్వయకర్త ఎ.రామారావు, స్పెషల్ ఆఫీసర్ బౌరోతు రోహణి, సిబ్బందిని అభినందించారు. గతంలో కూడా వంగర కేజీబీవీ రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికై ంది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అవార్డును ప్రదానం చేశారు. ఆనందంగా ఉంది కేజీబీవీ విద్యాలయంలో విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషిచేస్తున్నాం. ఏటా మంచి ఫలితాలు సాధిస్తున్నాం. ఈ ఏడాది కూడా ఉపాధ్యాయులు కష్టపడి పని చేశారు. పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించినందుకు అవార్డు దక్కింది. అవార్డుకు ఎంపిక కావడం ఆనందంగా ఉంది. కలెక్టర్, డీఈఓ, సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు సమన్వయకర్తకు కృతజ్ఞతలు. ఈ ఏడాది కూడా మంచి ఫలితాల సాధనకు కృషిచేస్తాం. – బౌరోతు రోహిణి, స్పెషల్ ఆఫీసర్, కేజీబీవీ, వంగర ఆగస్టు 15న సీఎం చేతుల మీదుగా అవార్డు ప్రదానం ప్రకటించిన కలెక్టర్ అంబేడ్కర్ -
పోక్సోకేసులో ముద్దాయికి20 ఏళ్ల జైలు శిక్ష
విజయనగరం క్రైమ్/గుర్ల: జిల్లాలోని గుర్ల పోలీస్ స్టేషన్లో 2022 సంవత్సరంలో నమోదైన పోక్సో కేసులో ముద్దాయి గుషిడి సూర్యనారాయణ (23)కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.3,000లు జరిమానా విధిస్తూ పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి కె.నాగమణి తీర్పు వెల్లడించినట్టు ఎస్పీ వకుల్జిందల్ సోమవారం తెలిపారు. కేసు వివరాలను వెల్లడించారు. గుర్ల మండలానికి చెందిన ఇంటర్మీడియట్ బాలిక కనిపించడంలేదని తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై గుర్ల పోలీసులు మిస్సింగ్ కేసు నమోదుచేశారు. బాలిక ఆచూకీని కనిపెట్టారు. విచారణలో నిందితుడు ప్రేమపేరుతో లైంగిక వేధింపులకు గురిచేసి, అత్యాచారయత్నానికి పాల్పడినట్టుగా తెలపడంతో అప్పటి ఎస్సీఎస్టీ సెల్ డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు పోక్సోకేసుగా మార్పుచేసి దర్యాప్తు చేశారు. మహిళా పీఎస్ డీఎస్పీ టి.త్రినాథ్ నిందితుడిని అరెస్టుచేసి రిమాండుకు తరలించారు. కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. ముద్దాయి మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టుగా నేరం రుజువు కావడంతో విజయనగరం పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి తీర్పును వెల్లడించారు. కేసులో బాధితురాలికి రూ.2 లక్షల పరిహారాన్ని అందజేయాలని తీర్పులో పేర్కొన్నారు. కేసులో ముద్దాయిపై నేరం నిరూపణయ్యేలా పోక్సో కోర్టు ఇన్చార్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.ఖజానారావు వాదనలు వినిపించగా, గుర్ల ఎస్ఐ పి.నారాయణరావు, చీపురుపల్లి సీఐ శంకరరావు పర్యవేక్షణలో ఏఎస్ఐ వై.రమణమ్మ, సీఎంఎస్ హెచ్సీ సీహెచ్ రామకృష్ణ సాక్షులను కోర్టులో హాజరుపర్చారు. కేసులో ముద్దాయికి శిక్షపడేలా సాక్షులు ప్రవేశపెట్టిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. -
15న ప్రతి ఇంటా మువ్వన్నెల రెపరెపలు
విజయనగరం: దేశభక్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్రమోదీ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం చేపట్టారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా విజయనగరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కోట నుంచి గంటస్తంభం వరకు జాతీయ పతాక ప్రదర్శన ర్యాలీను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ సమైక్యతను చాటిచెబుతూ ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లాలో ప్రతి ఇంటిపైన మువ్వన్నెల జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కోట వద్ద నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన హర్ ఘర్ తిరంగా సెల్ఫీ స్టాండ్లో జాతీయ జెండా చేబట్టుకొని మంత్రి సెల్ఫీ దిగారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అదితి గజపతి రాజు, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్ పర్సన్ పాలవలస యశస్విని, మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య, పర్యాటక అధికారి కుమార స్వామి, వివిధ కళాశాలల విద్యార్థినీవిద్యార్థులు పాల్గొన్నారు. గొయ్యి ఉంది.. జాగ్రత్త..! కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పల్లె పండగ పేరుతో గుంతల రహిత రోడ్లుగా తీర్చిదిద్దుతామన్న ప్రకటనలు ఉత్తుత్తివే అని తేలిపోయింది. దీనికి విజయనగరంలో కనిపిస్తున్న గుంతల రోడ్లే నిదర్శనం. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నగరంలోని కోట నుంచి గంటస్తంభం వరకు సోమవారం ఉదయం నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్న పాలకులు, అధికారులకు గుంతల రోడ్లే స్వాగతం పలికాయి. కస్పా ఉన్నత పాఠశాల ముందు రోడ్డుపై ఉన్న గుంతవద్ద అప్రమత్తమై ముందుకు సాగారు. ఈ దృశ్యాన్ని చూసిన వారు ఇదేనా గుంతల రహిత రోడ్ల నిర్మాణమంటూ గుసగుసలాడారు. దేశభక్తితో సాగిన హర్ఘర్ తిరంగా ర్యాలీ -
డీఎస్సీ–2025 ఫలితాల్లో జిల్లా అభ్యర్థుల ప్రతిభ
విజయనగరం అర్బన్: వివిధ కేటగిరీల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ–2025 ఫలితాలను ఎట్టకేలకు సోమవారం విడుదలయ్యాయి. టెట్ మార్కులతో డీఎస్సీ పరీక్ష మార్కులు జోడించి పాయింట్లను ప్రకటించారు. ఎస్జీటీలో యల్లంటి గణేష్ (గేదెలవలస) 94.5, పెదిరెడ్ల రామలక్ష్మి (కుంటినవలస) 92.8, నడిజాన శ్యామల (అయ్యన్నపేట) 92.8, వల్లే చంద్రకళ (అయ్యన్నపేట)కి 92.2, కోండ్రు అశ్వని (విజయనగరం) 92.13, దేవ హరిణి (చీపురుపల్లి) 91.54, టొంప జ్యోష్ణ 90.8, బాలి కుమారి (పత్తికాయవలస) 90.144 పాయింట్లు సాధించారు. పూర్తి ఫలితాలు రావాల్సి ఉంది. టెట్ మార్కులు తప్పుగా నమోదు చేసిన వారికి సవరించే అవకాశం కల్పించారు. -
పేదల కాలనీపై కూటమి శీతకన్ను
లే అవుట్లో పూర్తికాని గృహనిర్మాణాలువిజయనగరానికి సమీపంలో గుంకలాం వద్ద గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పేదల కోసం ఓ పెద్ద ఊరు నిర్మాణాన్ని తలపెట్టింది. 394.06 ఎకరాల విస్తీర్ణంలో రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద లే అవుట్ వేసింది. ఇందులోని 12,216 ఇళ్లస్థలాలకు గాను 11,091 ఇళ్ల స్థలాలను పేదలకు కేటాయించింది. 10,625 మందికి ఇళ్లను మంజూరు చేసింది. నాడు చకచకా సాగిన నిర్మాణాలు నేడు చతికలపడ్డాయి. కాలనీకి మౌలిక సదుపాయాల కల్పనపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం శీతకన్నువేసింది. అసంపూర్తి పనులు పూర్తిచేయాలంటూ కాలనీ వాసులు పలుసార్లు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేసినా స్థానిక పాలకులు, అధికారులు పట్టించుకోలేదు. సరైన సదుపాయాలు లేక కాలనీవాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కొందరు నిర్మాణాలను అసంపూర్తిగానే విడిచిపెట్టేశారు. దీనికి ఈ చిత్రాలే సాక్ష్యం. – సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం నిలిచిన నిర్మాణం ఇలా.. -
సచివాలయ వ్యవస్థపై నిర్లక్ష్యం
● ఆధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా పట్టించుకోని వైనం ● వినియోగంలోకి తేవాలని ప్రజల విజ్ఞప్తిసాలూరు రూరల్: ఎంతో ప్రతిష్టాత్మకంగా గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థను ప్రవేసపెట్టి గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరా జ్యం అన్న నినాదానికి తగ్గట్లు సేవలు అందించిన సచివాలయ భవన నిర్మాణాలపై కూటమి ప్రభుత్వం సీతకన్ను వేసిందనే చెప్పవచ్చు. సాలూరు మండలంలోని 29 పంచాయతీల్లో 22 సచివాలయ భవనాలు మంజూరు చేసిన గత ప్రభుత్వం దాదా పు 15 సచివాలయాలు పూర్తిచేయడమే కాకుండా మరికొన్నింటికి శ్లాబులు వేసి ఉన్నాయి. కొన్ని పారంభానికి సిద్దంగా ఉన్న భవనాలు కూడా రంగులు వేసి ప్రజలకు సేవలంచేందుకు సిద్ధం చేయాల్సి న కూటమి ప్రభుత్వం కనీసం ఏడాది పూర్తయినా వాటిని పట్టించుకోకపోవడంతో ఆయా పంచాయతీల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయాలు గ్రామాల్లో ఉంటే ప్రజలకు దగ్గరగా సేవలు అందుతాయని నమ్ముతున్నారు. ఇంటింటికీ సేవలందించే సచివాలయ వ్యవస్థను బలోపేతం చేయాలని మేధావులతో పాటు పలు పంచాయతీ ప్రజలు కోరుతున్నారు. -
10 మంది జూదరుల అరెస్టు
● రూ 42,300 నగదు స్వాదీనం ● 6 ద్విచక్రవాహనాలు సీజ్లక్కవరపుకోట: మండలంలోని తామరాపల్లి గ్రామం శివారులో రహస్యంగా నిర్వహిస్తున్న కాయిన్ ఆటపై ఎస్సై నవీన్పడాల్ తన సిబ్బందితో ఆదివారం సాయంత్రం దాడి చేశారు. కాయిన్ ఆట ఆడుతున్న 10 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ 42,300 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. అలాగే జూదరులకు సంబంధించిన 6 ద్విచక్రవాహనాలను సీజ్ చేసినట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించే శక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని పట్టుబడితే ఎంతటి వారైనా శిక్ష తప్పదని ఎస్సై హెచ్ఛరించారు.కార్యక్రమంలో హెచ్సీ పాపారావు, కానిస్టేబుల్స్ గౌరినాయుడు తదితరులు పాల్గొన్నారు. కోడి పందాల రాయుళ్లు.. బొండపల్లి: మండలం లోని కొత్త పాలెం గ్రామం పరిధిలో ఆదివారం కోడిపందాలు ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. పందెంలో పాల్గొన్న ఏడుగురితో పాటు, 5పందెం కోళ్లు, రూ.7,140 నగదు సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు చెప్పారు. -
శ్రీనిధిలో మెరుగైన వైద్య సేవలు
● ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం ఫోర్ట్: ఆస్పత్రికి వచ్చే రోగులకు సేవాదృక్పథంతో వైద్య సేవలు అందించాలని ఎంఎస్ఎంఈ, ఎన్ఆర్ఐ వ్యవహారాలశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు విజయనగరం పట్టణంలోని ఐనాక్స్ థియేటర్ వెనుక నూతనంగా నిర్మించిన శ్రీనిధి మెడికేర్, క్రిటికల్ కేర్, మల్టిస్పెషాలిటీ హాస్పిటల్ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధునాతన వైద్య పరిజ్ఞానాన్ని వినియోగించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. జిల్లా కేంద్రంలో అన్ని రకాల వైద్య సేవలతో కూడిన శ్రీనిధి మెడికేర్, క్రిటికల్ కేర్ ఆస్పత్రి అందుబాటులోకి రావడం శుభపరిణామమన్నారు. సూపర్ స్పెషాలిటీ సేవల కోసం గతంలో విశాఖపట్నం వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పడు జిల్లా కేంద్రంలో అందుతున్నాయన్నారు. ఆస్పత్రి ఎం.డి డాక్టర్ వి. నవీన్ కుమార్ మాట్లాడుతూ ఆస్పత్రిలో ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్, ఐసీయూ, జనరల్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, న్యూరోసర్జరీ, నెఫ్రాలజీ, యురాలజీ, పలమనాలజీ సేవలు అందిస్తామన్నారు. డయాలసిస్, ఎక్స్రే, ల్యాబొరేటరీ, సిటిస్కాన్, ఫిజియోథెరపీ, క్యాజువాలిటీ, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్, మాడ్యులర్, లామినర్ ఆపరేషన్ థియేటర్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆస్పత్రిలో 24 గంటల పాటు వైద్య సేవలు అందించనున్నామని తెలిపారు. కార్యక్రమంలో విజయనగరం ఎమ్మెల్యే అదితిగజపతిరాజు, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ ఎం. జయచంద్రనాయుడు పాల్గొన్నారు. -
బాల్బ్యాడ్మింటన్ సెలక్షన్కు స్పందన కరువు
లక్కవరపుకోట: మండల కేంద్రంలో గల ఏపీ మోడల్ స్కూల్లో బాల్బాడ్మింటన్ జిల్లా జట్టుకు సంబంధించి 10వ సబ్ జూనియర్స్, 11వ సీనియర్ బాల, బాలికల జిల్లా జట్ల ఎంపికలకు క్రీడాకారుల నుంచి స్పందన కరువైంది. ఈ ఎంపికలకు క్రీడాకారులు అనుకున్న మొత్తంలో రాకపోవడంతో వచ్చిన వారిని తప్పని పరిస్థితిలో జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. కాగా ఈ ఎంపిక పోటీలను ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ప్రారంభించి మాట్లాడుతూ క్రీడలతోనే ఉజ్వలభవిష్యత్ ఉంటుందన్నారు. అనంతరం జిల్లా బాల్బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ టి.శ్రీనివాస్రావు, కార్యదర్శి జి.లక్ష్మణరావులు మాట్లాడుతూ నేడు ఎంపిక చేసిన క్రీడాకారులు ఈ నెల 29 నుంచి 31వ తేదీ వరకు ప్రకాశం జిల్లా చెవ్వూరులో నిర్వహించే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కాగా ఎంపికకు వచ్చిన అతి కొద్ది మంది క్రీడాకారులకు సైతం నిర్వాహకులు కనీసం భోజనం, మంచినీటిసౌకర్యం ఏర్పాటు చేయకపోవడంతో నానా అవస్థలు పడ్డారు. తూతూమంత్రంగా ఎంపికలను నిర్వహించి మమ అనిపించారు.కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు గాడి రవికుమార్, జి.సింహాచలం,ఎస్.గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. తప్పని పరిస్థితిలో సెలక్షన్కు వచ్చిన వారి ఎంపిక -
రిమ్స్లో అరుదైన చికిత్స
శ్రీకాకుళం: శ్రీకాకుళం రిమ్స్ సర్వజన ఆస్పత్రి వైద్యులు అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న రోగికి చికిత్స అందించి ప్రాణాలు నిలబెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా ఏ ప్రభుత్వ ఆస్పత్రిలోనూ ఇలాంటి క్లిష్టమైన చికిత్స జరగలేదని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే... జూలై 8వ తేదీన సీతంపేటకు చెందిన సిద్ధమంగుల బారికి అనే 58 ఏళ్ల గిరిజన వృద్ధుడు తీవ్రమైన ఆయాసం, తలనొప్పితో పాటు చర్మం, నాలుక నీలం రంగులోనికి మారి రిమ్స్లో చేరాడు. అప్పటికే అతనికి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. దీంతో రిమ్స్ వైద్యులు రోగికి వెంటిలేటర్ను అమర్చి ఆక్సిజన్ అందిస్తూ చికిత్స ప్రారంభించారు. రోగిని అప్పటికే చాలా ఆస్పత్రుల్లో చూపించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పడంతో రిమ్స్కు తీసుకువచ్చారు. అతనికి అప్పటికి రక్తంలో ఆక్సిజన్ శాతం 53 మాత్రమే ఉంది. రిమ్స్లోని వైద్యులు ఐసీయూలో ఉంచి మందులు ఇస్తూ ప్రయత్నం చేశారు. ఓ దశలో రక్తంలో ఉన్న ఆక్సిజన్ శాతం 87కు చేరినప్పటికీ, అది ఎక్కువ రోజులు నిలబడలేదు. అప్పుడు రక్తాన్ని పరీక్ష నిమిత్తం విశాఖపట్నం పంపించారు. అక్కడ పరీక్షల్లో అతనికి ఉన్న వ్యాధి ‘మెథెమోగ్లోబినిమియా’గా నిర్ధారణ అయింది. అయితే అప్పటికే అతని పరిస్థితి కష్టతరంగా మారడంతో రిమ్స్లోని ఐదు విభాగాల వైద్యులు పరస్పరం చర్చించుకున్నారు. రోగికి శరీరంలో ఉన్న రక్తమంతా తీసి వేస్తూ, మరో వంక కొత్త రక్తాన్ని ఎక్కించడం ద్వారా రోగి ప్రాణాన్ని రక్షించవచ్చునని భావించారు. అయితే ఈ సమయంలో రోగి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉండే అవకాశాలు ఉండడంతో, రోగి బంధువులతో మాట్లాడారు. పరిస్థితిని వారికి వివరించారు. ఏ రకమైన చికిత్స చేయకపోయినా వారం పది రోజుల్లో మృతి చెందే అవకాశం ఉండడంతో, బంధువులు చికిత్స జరపాలని వైద్యులను కోరారు. దీంతో వైద్యులు రంగంలోకి దిగి ఓ పక్క రక్తం ఎక్కిస్తూనే మరో వంక శరీరంలో ఉన్న రక్తాన్ని తొలగిస్తూ వచ్చారు. సుమారు 17 యూనిట్ల రక్తం అంటే 4.2 లీటర్ల రక్తాన్ని ఎక్కించారు. అదే స్థాయిలో పాత రక్తాన్ని తొలగించారు. అటు తర్వాత రక్తంలో ఆక్సిజన్ శాతం పరీక్షించగా 97 శాతం చేరుకోవడం అది నిలకడగా ఉండడంతో, క్రమేపి వెంటిలేటర్ను అటు తర్వాత ఆక్సిజన్ తొలగించి పరీక్షించారు. అప్పుడు కూడా ఆక్సిజన్ శాతం తగ్గకపోవడంతో పూర్తిగా ఆక్సిజన్ తీసివేశారు. మళ్లీ పరీక్షించగా రక్తంలో ఆక్సిజన్ శాతం 97 ఉండడం పల్స్, బీపీ రేటు నిలకడగా ఉండటంతో జూలై 24న రోగిని డిశ్చార్జ్ చేశారు. జూలై చివరివారంలో రోగిని మరోసారి రప్పించి పరీక్షలు చేయగా అప్పుడు కూడా నిలకడగానే ఉండడంతో మళ్లీ ఇంటికి పంపించేశారు. ఈ నెల 5వ తేదీన మళ్లీ తనిఖీ చేయగా అతను ఆరోగ్యకరంగా ఉన్నట్లు గుర్తించారు. మళ్లీ 15 రోజుల తర్వాత తనిఖీలకు రావాలని చెప్పి పంపించేశారు. రోగి మృతి చెందుతాడని భావించగా రిమ్స్ వైద్యులు విశేష సేవలు అందించి ప్రాణం నిలబెట్టారని వారికి బంధువులు ఆనందం వ్యక్తం చేస్తూ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. రోగికి వైద్య సేవలు అందించి ప్రాణం నిలబెట్టిన ఎమర్జెన్సీ విభాగం పేథాలజీ విభాగం, నెఫ్రాలజీ విభాగం జనరల్ మెడిసిన్ విభాగం, బ్లడ్ బ్యాంక్ విభాగం వైద్యులను పలువురు అభినందించారు. ఐదు విభాగాల వైద్యుల కృషితో నిలబడిన ప్రాణం -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
భోగాపురం: మండలంలోని ముక్కాం గ్రామానికి చెందిన గనగళ్ల రామచంద్ర(28) విజయనగరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఎస్సై సూర్యకుమారి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గతంలో రామచంద్ర చేపలవేటకు వెళ్తూ కుటుబంతో జీవనం సాగించేవాడు. ఆయనకు భార్య యల్మాజీతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మధ్య చేపలవేటకు వెళ్లకుండా ఆటో నడుపుకుంటున్నాడు. ఈక్రమంలో మద్యానికి బానిసైన రామచంద్ర శనివారం మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వమని భార్యను అడిగాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఎంతకీ భార్య డబ్బులు ఇవ్వకపోవడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు హుటాహుటిన విజయనగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఈ మేరకు భార్య యల్మాజి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సూర్యకుమారి తెలిపారు.గాయపడిన యువకుడు..లక్కవరపుకోట: మండలంలోని అరకు–విశాఖ జాతీయ రహదారిలో గత నెల 29వ తేదీన రంగరాయపురం జంక్షన్ జోడుబందల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు బొబ్బరి వెంకటేష్ (24) కేజీహెచ్లో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. ఎస్.కోట నుంచి తన సొంత గ్రామం కొత్తవలస మండలం చిన్నమన్నిపాలెం ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఒక వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే.కాగా ఈ ప్రమాదంలో వెంకటేష్ తీవ్రంగా గాయపడడంతో విశాఖ కేజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు హెచ్సీ పాపారావు చెప్పారు. పోస్ట్మార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించామన్నారు.పాము కాటుతో మహిళ..విజయనగరం క్రైమ్: విజయనగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి పాత దుప్పాడకు చెందిన సత్యవతి (44)అనే మహిళ పాము కాటు వేయడంతో మృతి చెందినట్లు ఎస్సై దేవి ఆదివారం చెప్పారు. భర్తతో కలిసి ఆమె చల్లపేటలో పొలం పనులు చేసి తిరిగి వస్తున్న సమయంలో పొలం గట్టుపై నుంచి నడుస్తుండగా ఎడమ పాదంపై పాము కాటేయడంతో హుటాహుటిన భర్త నరసింగరావు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకు వెళ్లగా వైద్యచికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేస్తున్నట్లు వన్టౌన్ ఎస్సై దేవి చెప్పారు.విద్యుత్షాక్తో యువకుడు..చీపురుపల్లి రూరల్(గరివిడి): గరివిడి పట్టణంలోని వైఎస్సార్ కాలనీకి చెందిన జగదీష్(23) అనే యువకుడు విద్యుత్షాక్తో మృతి చెందాడు. చీపురుపల్లి–గరివిడి ప్రధాన రహదారిని ఆనుకుని ఎస్డీఎస్ కళాశాల ఎదురుగా ఉన్న వాటర్ సర్వీసింగ్ కారుషెడ్డులో వాహనాన్ని వాష్ చేసేందుకు మోటార్ ఆన్ చేసి వాష్గన్ పట్టుకోగా షాక్ తగిలి మృతి చెందాడు. -
ఏటీఎంలో చోరీకి యత్నం
పాచిపెంట: మండల కేంద్రంలో ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా బయట గల ఏటీఎంలో గుర్తు తెలియని వ్యక్తి శనివారం అర్ధరాత్రి చోరీకి యత్నించినట్లు ఎస్సై వెంకటసురేష్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం..శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తి ఏటీఎంలో చోరీకి ప్రయత్నం చేసి ముందుగా వెలుపల ఉన్న సీసీకెమెరాలు పూర్తిగా ధ్వంసం చేస్తున్న సమయంలో బ్యాంకు ఉద్యోగుల సెల్ఫోన్లకు మెసేజ్లు వెళ్లాయి. మండల కేంద్రంలో నివాసముంటున్న బ్యాంకు ఉద్యోగులు బ్రాంచ్ వద్దకు వచ్చేసరికి, వారి రాకను గుర్తించిన ఆ వ్యక్తి పారిపోయాడు. దీనిపై బ్రాంచి మేనేజర్ దేవిగణేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.డివైడర్ను ఢీకొన్న లారీపార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ కూడలి వద్ద మలుపులో పాలకొండ నుంచి వస్తున్న లారీ డివైడర్ను ఢీకొట్టడంతో డీవైడర్ ప్రారంభ భాగం శిథిలమైంది. అలాగే ఢీకొన్న లారీ మొరాయించి మలుపువద్దే నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్రస్థాయిలో అవస్థలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీసులు మరోదారి నుంచి వాహనాలను ట్రాఫిక్ అంతరాయం లేకుండా మళ్లించే ప్రయత్రం చేశారు. శనివారం అర్ధరాత్రి లారీ ఢీకొని ఉండవచ్చునని స్థానికులు చెబుతున్నారు.14.850 కేజీల గంజాయి స్వాధీనంకొమరాడ: మండలంలో కూనేరు చెక్ పోస్టు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆదివారం 14.850 కేజీల గంజాయి పట్టబడిందని ఎస్సై కె.నీలకంఠం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందస్తు సమచారం మేరకు రాయగడ నుంచి పార్వతీపురం వైపు వస్తున్న ఆటోలో రెండు బ్యాగులతో ఇద్దరు ఆడ, మగ వ్యక్తులు పట్టబడ్డారన్నారు. వారిని అదుపుల్లోకి తీసుకుని విచారణ చేయగా మరో నిందితుడిని ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అయ్యండిగా గుర్తించామన్నారు. పట్టుబడిన ఇద్దరిపై కేసు నమోదు చేశామని గంజాయ అక్రమంగా తరలిస్తున్న వారిని తహసీల్డార్ సత్యన్నారాయణ సమక్షంలో విచారణ చేసి కేసు నమోదు చేసి అరెస్టు చేసి గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.ఆటో, బైక్ ఢీ: నలుగురికి గాయాలుబొబ్బిలిరూరల్: మండలంలోని పారాది గ్రామం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు గాయపడగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.ఆదివారం సాయంత్రం తన కుమార్తె కుసుమాంజలికి జ్వరంగా ఉందని చిట్టి సీతారాపురం గ్రామానికి చెందిన ఎ.లక్ష్మణరావు మోటార్సైకిల్పై బయలు దేరి పారాది గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటోను ప్రమాదవశాత్తు ఢీకొట్టాడు. దీంతో ఆటో బోల్తా పడగా అందులో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో లక్ష్మణరావు తలకు తీవ్ర గాయాలు కాగా 108 వాహనంలో బొబ్బిలి సీహెచ్సీకి తరలించి ప్రాథమిక చికిత్సానంతరం అత్యవసర చికిత్స కోసం విజయనగరం తరలించారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రైతు సమస్యలు పట్టని ప్రభుత్వం
● ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, తలే రాజేష్వంగర: రైతు సమస్యల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజాం నియోజకవర్గ ఇన్చార్జి తలే రాజేష్ అన్నారు. పంటలు సాగుచేసేందుకు రైతులు నానా అవస్థలు పడుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆదివారం మండల పరిధి కె.కొత్తవలసలో వారు విలేకరులతో మాట్లాడారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా తోటపల్లి కుడిప్రధాన కాలువ ద్వారా వంగర మండలంలోని అనేక గ్రామాలకు సాగునీరందలేదని, దమ్ములు చేసేందుకు సాగునీరు లేక రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. తోటపల్లి శివారు గ్రామాల రైతులు స్వచ్ఛందంగా కాలువల్లో పనులు చేసుకుని సాగునీటిని మళ్లించుకునే పరిస్థితి దాపురించిందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు అందుబాటులో ఎరువులు లేవని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ప్రతి గ్రామ సచివాలయంలో పుష్కలంగా కావలసినన్ని ఎరువులు అందుబాటులో ఉండేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని కూటమి ప్రభుత్వం తీరును ఎండగట్టారు. అన్నదాత సుఖీభవ పథకంలో అధిక సంఖ్యలో పేర్లు గల్లంతయ్యాయని, అర్హులైన రైతులకు పథకం వర్తింపజేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కార్యక్రమంలో, డాక్టర్ నరేంద్ర, ఎంపీపీ ఉత్తరావెల్లి సురేష్ముఖర్జీ, సర్పంచ్లు పోలిరెడ్డి రమేష్, గర్భాపు నారాయుడు, వైఎస్సార్సీపీ నాయకులు బొక్కేల వెంకటప్పలనాయుడు, కనగల పారినాయుడు, యలకల వాసునాయుడు, పెంకి గౌరునాయుడు, పెంకి లక్ష్మునాయుడు, పెంకి జంగంనాయుడు, వంజరాపు గోవిందరావు, పెంకి గౌరీశ్వరరావు, బెవర రామకృష్ణ, పొదిలాపు నారాయణరావు, పారిశర్ల రామకృష్ణ ఉన్నారు. -
మాజీ ఎంపీపీకి పరామర్శ
చీపురుపల్లిరూరల్(గరివిడి): గరివిడి మండలంలోని గెడ్డపువలస గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ కొణిసి కృష్ణంనాయుడిని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనువాసరావులు ఆదివారం పరామర్శించారు. ఇటీవల వారం రోజుల క్రితం మాజీ ఎంపీపీ కృష్ణంనాయుడు గుండెపోటుకు గురై విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుని ఇంటికి చేరుకున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న నాయకులిద్దరూ గెడ్డపువలస గ్రామానికి వెళ్లి కృష్ణంనాయుడిని పరిమర్శించి ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని, ఆరోగ్యం కుదుటపడేంత వరకు కూడా ఎలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని, ఎలాంటి ఒత్తిడికి లోనవ్వద్దని సూచించారు. కార్యక్రమంలో గరివిడి వైఎస్సార్సీపీ నాయకులు మీసాల విశ్వేశ్వరరావు, బమ్మిడి కార్తీక్, కడుమల రాంబాబు, గుడివాడ తమ్మినాయుడు, యల్లంటి పోలీస్నాయుడు, వలిరెడ్డి లక్ష్మణ, చీపురుపల్లి మండల నాయకులు ఇప్పిలి అనంతం, మీసాల వరహాలనాయుడు తదితరులు ఉన్నారు. -
ప్రైవేటులో దోపిడీ..
జ్వరాల బారిన పడి ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్న రోగులకు బిల్లులు తడిసిమోపుడు అవుతున్నాయి. జ్వరాలకు రూ.వేలు, లక్షల్లో ఖర్చవుతుంది. జిల్లాలో ఎక్కడికక్కడ క్లినిక్లు, నర్సింగ్ హోమ్ లు వెలిశాయి. రెండు మూడు రోజుల పాటు చికిత్స కోసం ఉంటే రూ.20వేల నుంచి 30 వేల వరకు వసూలు చేస్తున్నారు. వారం రోజు ల పాటు ఉంటే రూ.70 వేల నుంచి లక్ష వరకు వసూలు చేస్తున్నారు. పొరపాటున వ్యాధి తగ్గక పది రోజులు దాటితే ఏదో ఒక రూపాన రూ. లక్షల్లో ఫీజులు దోచేస్తున్నారు. ఆసుపత్రులు కిటకిట జిల్లాలో ఏ ఆసుపత్రి చూసినా జ్వర పీడితుల తో కిటకిటలాడుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు జ్వర పీడితులతో నిండిపోతున్నా యి. జిల్లాలో ప్రైవేటు క్లినిక్లు, నర్సింగ్ హోమ్ లు 300 వరకు ఉన్నాయి. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు 50 వరకు ఉన్నాయి. ఏరియా ఆసుపత్రులు, సీహెచ్సీలు ఏడు ఉన్నాయి. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఒకటి ఉంది. పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు మరో 18 ఉన్నాయి. వీటిల్లో జ్వర పీడితులు ఓపీలో కొందరు చికిత్స పొందుతుండగా, మరికొందరు ఇన్ పేషంట్లుగా చికిత్స పొందుతున్నారు. -
కోటదుర్గమ్మ ఆలయ అభివృద్ధికి చర్యలు
పాలకొండ: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పాలకొండ కోటదుర్గమ్మ ఆలయం అభివృద్ధికి అడుగులు ముందుకు పడుతున్నాయి. ఏన్నో ఏళ్లుగా ఆలయానికి ఆనుకుని ఉన్న స్థలం అమ్మవారి ఆలయానికి కేటాయించేందుకు చేస్తున్న ప్రయత్నాలు కొంత మేరకు ఫలించాయి. ఆలయానికి ఆనుకుని ఉన్న ప్రైవేటు వ్యక్తుల స్థలం అమ్మవారి ఆలయానికి ఇచ్చేందుకు ముందుకు రావడంతో ఆలయ పరిసరాల్లో జేసీబీలతో చదును చేస్తున్నారు. వాస్తవానికి కోటదుర్గమ్మ ఆలయం సమీపంలో పశువుల ఆసు పత్రి ఉంది. ఈ స్థలం ఆలయానికి అందించి, అందుకు దేవదాయ శాఖకు చెందిన స్థలం మరో చోట అందించాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదన ఇంతవరకు పూర్తి కాలేదు. ఇదే సమయంలో ఆలయం పక్కనే ఉన్న కళాభారతి భవనాల స్థలం పట్టణానికి చెందిన పైడి కృష్ణప్రసాద్ ఆలయానికి అందించా రు. దీంతో కొంత స్థల సమస్య తీరింది. పశువుల ఆసుపత్రి స్థలం కూడా ఆలయానికి అందిస్తే అమ్మ వారి ఆలయం మరింత అభివృద్ధి చెందుతుంది. రూ.10లక్షలతో పనులు ప్రస్తుతం ఆలయ పరిసరాల్లో రూ.10లక్షల మేర ఖర్చు చేసి స్థలం చదును చేసేందుకు పట్టణానికి చెందిన ఆధ్యాత్మిక వేత్త పల్లా కొండలరావు ముందుకు వచ్చారు. గత నాలుగు రోజులుగా జేసీబీలతో పనులు చేయిస్తున్నారు. దసరా ఉత్సవాల సమయంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఈ పనులు పూర్తి చేస్తున్నారు. -
అటకెక్కిన వాహనమిత్ర
హామీల అమలుకు ర్యాలీ ఇదిలా ఉండగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాహనమిత్ర హామీతో పాటు మోటారు కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డ్రైవర్లు, మోటారు కార్మికులు డిమాండ్ చేశారు. సీ్త్రశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు అమలు చేసే లోపు వాహనమిత్ర అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో ఆదివారం డ్రైవర్లు, కార్మికులు సాలూరులో ర్యాలీ నిర్వహించారు. ఇందులో వందల సంఖ్యలో డ్రైవర్లు, కార్మికులు పాల్గొన్నారు. సాలూరు: చక్రం కదిలితేనే వారి బతుకు బండి సాగేది. దశాబ్దాలుగా వారి జీవనాధారం ఆటోలే.. సాలూరు నియోజకవర్గంలో ఆటో డ్రైవర్లు వందల సంఖ్యలో ఉన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వీరికి వైఎస్సార్ వాహన మిత్ర పథకం ఏటా అమలయ్యేది. ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తింపజేయడం ద్వారా రూ.వేల లబ్ధి చేకూరేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాహన మిత్ర కింద రూ.15వేలు ఇస్తామని మేనిఫెస్టోలో పొందుపరచి విస్తృత ప్రచారం కల్పించారు. దాన్ని నమ్మి వీరంతా కూటమికి ఓటేశారు. ఇప్పుడు మోసపోయామని గుర్తించారు. ఆందోళన చెందుతున్నారు. జగనన్న ప్రభుత్వంలో ఏటా వాహన మిత్ర పథకం తమకు అందేదని ఇప్పుడు దాన్ని కూటమి పాలకులు పక్కన పెట్టారని వాపోతున్నారు. డ్రైవర్ల ఆందోళన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాహన మిత్ర పథకం కింద ఇస్తామన్న రూ.15వేలు నేటికీ ఇవ్వలేదు. ఆ ఊసేత్తడం లేదు. గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన తొలి వంద రోజుల్లోనే ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్ల సంక్షేమం కోసం రూ.400 కోట్లు బడ్జెట్ కేటాయించి నాడు అర్హులందరికీ రూ.పది వేల చొప్పున అందించారు. కూటమి ప్రభుత్వం ఆ మాదిరిగానే ఇస్తుందని ఆశించిన డ్రైవర్లకు నిరాశే మిగిలింది. ఇదే సమయంలో సీ్త్రశక్తి కింద మహిళలకు ఉచిత బస్సు పథకం తీసుకువస్తున్నట్టు ప్రభుత్వ పెద్దలు ప్రకటించిన క్రమంలో తమ బతుకు బండి సంగతేంటని వారంతా ఆందోళన చెందుతున్నారు. దీని ప్రభావం ఆటో, ట్యాక్సీ వాలాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ పథకానికి తాము వ్యతిరేకం కాదని తమను కూడా ఆదుకోవాలని కోరుతున్నారు. వాహన మిత్ర అమలు చేయాలి కూటమి ప్రభుత్వం వాహనమిత్ర కింద ఏడాదికి రూ.15వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. జీవో 21 రద్దు చేసి అపరాధ రుసుం భారం తగ్గిస్తామని చెప్పారు. వాహనాలపై పెంచిన గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తామని, వాహ న కొనుగోలుకు సంబంధించి వడ్డీపై సబ్సిడీ అందిస్తామని నేతలు హామీ ఇచ్చారు. అధికారం చేపట్టి ఏడాదైనా నేటికీ అవేమి అమలు కావడం లేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమంటూ చెబుతున్నారు.. ఈ క్రమంలో అంత కంటే ముందు వాహనమిత్ర అమలు చేయాలి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు పోరాడుతాం. – ఎన్వై నాయుడు, ఆటో, మ్యాక్సీ, క్యాబ్ యూనియన్ గౌరవాధ్యక్షుడునేతలు ఇచ్చిన హామీలు ఇలా.. ఎన్నికల సమయంలో కూటమి నేతలు డ్రైవర్లకు అమలు కాని హామీలు ఇచ్చారు. బ్యాడ్జ్ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్, ట్యాక్సీ డ్రైవర్, హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ, టిప్పర్ డ్రైవర్లకు ఏటా రూ.15వేలు ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. జీవో 21 రద్దు చేసి ఫైన్ల భారం తగ్గిస్తామని, వాహనాలపై పెంచిన గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తామని, డ్రైవర్లను యజమానులను చేసే లక్ష్యంతో వాహన కొనుగోలుకు రూ.4 లక్షల వరకు పొందే రుణాలపై ఐదు శాతం పైబడిన వడ్డీ సబ్సిడీ అందిస్తామని చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇందులో ఏ ఒక్కటీ అమలు కావడం లేదు. మేనిఫెస్టోలో హామీనిచ్చి మరిచారు నిరాశలో ఆటో డ్రైవర్లు మహిళలకు ఉచిత బస్సు అమలైతే.. తమ పరిస్థితి ఏంటని ఆందోళన సాలూరులో వందల మంది ఆటో డ్రైవర్లు వాహనమిత్ర అమలు చేయాలని భారీ ర్యాలీ -
రెడ్క్రాస్ ఆధ్వర్యంలో శిక్షణ
చీపురుపల్లి: ఇండియన్ రెడ్క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో బేసిక్ ఫస్ట్ ఎయిడ్పై నిష్ణాతులైన వారితో శిక్షణ ఇవ్వనున్నట్టు ఆ సంస్థ రెవెన్యూ డివిజినల్ కోఆర్డినేటర్ బివి.గోవిందరాజులు చెప్పారు. పట్టణంలోని ఏరియా ఆసుపత్రి ఆవరణలో ఉన్న రెడ్క్రాస్ సంస్థకు చెందిన బ్లడ్ బ్యాంక్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరు ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతీ ఒక్కరికీ చివరి క్షణాల్లో గోల్డెన్ పీరియడ్ ఉంటుందని ఆ సమయంలో బేసిక్ ఫస్ట్ ఎయిడ్ అందించడం ద్వారా ప్రాణాలు కాపాడే అవకా శం ఉంటుందన్నారు. అలాంటి బేసిక్ ఫస్ట్ ఎయిడ్పై వివిధ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. దీని కోసం రెడ్క్రాస్ సంస్థ జిల్లా చైర్మ న్ కెఆర్డి.ప్రసాద్ ఆదేశాల మేరకు అబోతుల రమణ అనే నిష్ణాతులైన ఉద్యోగిని నియమించినట్టు తెలిపారు. ఎవరైనా మృతి చెందినప్పుడు నేత్ర దానం, అవయవ దానం చేసేందుకు ముందుకు వస్తే తక్షణమే రెడ్క్రాస్ 89192 649 93, 9247818604 నంబర్లకు సంప్రదించాలని సూచించారు. కళ తప్పిన చంపావతి గజపతినగరం:ప్రతి ఏటా ఇదే సీజన్లో నీటి తో నిండుగా దర్శనమిచ్చే చంపావతి నది నేడు నీరు లేక పిచ్చిమొక్కలతో దర్శనమిస్తోంది. వర్షాలు కురవకపోవడంతో నదిలో పిచ్చి మొక్కలు పేరుకుపోయాయి. మరోవైపు ఇసుకాసురులు ఎక్కడికక్కడ గోతులు తవ్వేసి ఇసుకను ఎత్తుకెళ్లడంతో మరింత ప్రమాదకరంగా కనిపిస్తుంది. ఆగస్టు నాటికి నీటితో నిండుగా ఉండాల్సిన చంపావతి నేడు జల కళ తప్పి బోసిపోయింది. ఈ పరిస్థితుల్లో దీని ఆయకట్టు రైతులు సాగుపై ఆందోళన చెందుతున్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి పార్వతీపురం రూరల్: పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆ పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జి.వరలక్ష్మి డిమాండ్ చేశారు. భోజన పథకం యూనియన్ జిల్లా రెండో మహాసభలు జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో ఆదివారం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వరలక్ష్మి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించే కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఈ పథకంలో దేశంలో 25 లక్షల మంది, రాష్ట్రంలో 85 వేల మంది సిబ్బంది నిర్వహణలో నిమగ్నమై ఉన్నారని తెలిపారు. వీరంతా నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలే అన్న విషయం పాలకులు గుర్తించాలన్నారు. ఇందులో ఎక్కువగా వితంతువులు, ఒంటరి మహిళలు ఉన్నారని వెల్లడించారు. మహిళ సాధికారత కోసం జపించే పాలకులు 11 సంవత్సరాలుగా భోజన కార్మికుల వేతనాలు పెంచకపోవడం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బి.సుధారాణి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కేటాయింపులు అంతంతమాత్రంగానే ఉన్నాయని, ఇది సరికాదన్నారు. -
విజయనగరం
సోమవారం శ్రీ 11 శ్రీ ఆగస్టు శ్రీ 2025సచివాలయ వ్యవస్థపై నిర్లక్ష్యం ఎంతో ప్రతిష్టాత్మకంగా గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థను నేటి కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. –8లో●మెంటాడ మండలానికి చెందిన 12 ఏళ్ల బాలుడికి జ్వరం రావడంతో విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ వైద్య పరీక్షలు చేయగా డెంగీ అని తేలింది. ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోవడంతో పరిస్థితి విషమం కావడంతో ఆసుపత్రిలో వారం రోజుల పాటు చికిత్స తీసుకుని తరువాత డిశ్చార్జ్ అయ్యాడు. రూ.70 వేల వరకు ఖర్చయింది. ●బొండపల్లి మండలానికి చెందిన హుస్సేన్ జ్వరంతో విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. ఇతనికి మలేరియా అని నిర్ధారణ అయింది. అక్క డ చికిత్స అందించినప్పటికీ పరిస్థితి మెరు గుపడకపోవడంతో విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రూ.లక్ష వరకు ఖర్చయింది. ●విజయనగరం పట్టణానికి చెందిన రమణ అనే వ్యక్తి జ్వరంతో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చేరాడు. అతనికి ప్లేట్లెట్స్ తగ్గిపోవడంతో సర్వజన ఆసుపత్రి లోని బ్లడ్ బ్యాంక్ నుంచి ప్లేట్లెట్స్ తీసుకువెళ్లి ఎక్కించారు. ●పెరుగుతున్న మలేరియా కేసులు ●డెంగీది అదే పరిస్థితి ●రోగులతో కిటకిటలాడుతున్న ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు ●చర్యలు తీసుకుంటున్నాం... మలేరియా, డెంగీ, వైరల్ జ్వరాల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. గ్రామాల్లో సీహెచ్వోలు, ఏఎన్ఎంలు జ్వరపీడితులు ఉంటే గుర్తించి వారికి మలేరియా, డెంగీ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. వ్యాధి నిర్ధారణ అయితే రిఫరల్ ఆసుపత్రికి పంపుతున్నారు. అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. – డాక్టర్ ఎస్.జీవనరాణి, డీఎంహెచ్వో న్యూస్రీల్ -
● తప్పని డోలీ కష్టాలు..!
ఈ చిత్రంలో డోలీలో మోస్తున్న బాలిక పేరు సవర ఒబిగోల్. ఈమెది కొండాడ పంచాయతీ పరిధి చీడిమానుగూడ గ్రామం. కొద్ది రోజులుగా టైఫాయిడ్, మలేరియా, కడుపు నొప్పితో బాధపడుతుండగా గ్రామం నుంచి ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అయితే గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేదు. రోడ్డుపై రాళ్లు తేలడంతో 108 అంబులెన్స్ కూడా గ్రామానికి రావడం లేదు. దీంతో చేసేదేమీ లేక చీడిమానుగూడ నుంచి కొండాడ వరకు బాలికను ఇలా శనివారం మధ్యాహ్నం మూడు కిలోమీటర్ల దూరం మేర డోలీలో మోసుకుంటూ వచ్చారు. అక్కడ నుంచి ఆటోలో పాలకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. – సీతంపేట -
ఉచిత బియ్యానికి రూ.200 ఖర్చు
జీపుదిగి రేషన్ సరుకుల కోసం నేరళ్లవలస డిపోకు వస్తున్న గిరిజనులుచిత్రంలో జీపు దిగి వస్తున్నవారంతా ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని వివాదాస్పద కొటియా గ్రూపు గ్రామాల గిరిజనులు. రేషన్ తీసుకోవాలంటే కొండలపై నుంచి దిగి దండిగాం, నేరళ్లవలస, కురుకూటి డిపోలకు రావాల్సిందే. దీనికోసం ప్రయాణ ఖర్చుల కింద రూ.100, బియ్యం మూటకు రూ.100 చెల్లిస్తున్నట్టు లబ్ధిదారులు వాపోయారు. ఎండీయూ వాహనాలతో సరుకుల పంపిణీని కూటమి ప్రభుత్వం రద్దుచేయడంతో డిపోల్లో ఇచ్చే ఉచిత బియ్యం తీసుకెళ్లేందుకు ప్రతినెలా రూ.200 ఖర్చు అవుతోందని, ఒక రోజంతా పనిపోతోందని వాపోయారు. – సాలూరు రూరల్ -
10న జిల్లా స్థాయి యోగా పోటీలు
విజయనగరం అర్బన్: జిల్లా స్థాయి యోగా పోటీలను ఈ నెల 10న స్థానిక మెసానిక్ టెంపుల్ ప్రాంగణంలో నిర్వహిస్తున్నామని విజయనగరం జిల్లా యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ మజ్జి శశిభూషణరావు ఒక ప్రకటనలో శుక్రవారం తెలిపారు. పోటీల షెడ్యూల్ బ్రోచర్ను ఆయన విడుదల చేశారు. జిల్లాలో ప్రతిభ చూపిన విజేతలు రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికవుతారని పేర్కొన్నారు. పోటీలు 10 నియోజకవర్గాల్లో, 10 నుంచి 55 సంవత్సరాల వయస్సు గల పురుషులు, మహిళల కేటగిరిల్లో ఉంటాయని తెలిపారు. పోటీలు ఆ రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. పోటీల పూర్తి వివరాల కోసం ఫోన్ 7702134568నంబర్ను సంప్రదించాలని సూచించారు. ప్రకటన విడుదల చేసిన వారిలో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వడ్లమాని నరసింహమూర్తి, కోశాధికారి పి.సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ డి.శివ తదితరులు ఉన్నారు. -
అరకొర బస్సులతో ఉచిత ప్రయాణమా?
విజయనగరం అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అందించే విధానం ఆర్టీసీ అధికారుల్లో టెన్షన్ పుట్టిస్తోంది. జిల్లాలో ఉన్న మహిళల సంఖ్యకు సరిపడే బస్సులు లేకపోవడం వల్ల వాటి నిర్వహణ సాధ్యాసాధ్యాలు ప్రశ్నార్థకంగా ఉన్నాయని వాపోతున్నారు. ప్రస్తుతం అరకొర సంఖ్యలోని బస్సులతో ప్రయాణ సేవలు ఎలా అందజేయాలో అర్థంకాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కొత్త బస్సులు ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. కూటమి ప్రభుత్వం కొత్త బస్సులపై ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదు. మరోవైపు ఎప్పటికప్పుడు కాలంచెల్లిన బస్సులు వినియోగానికి దూరమవుతున్న నేపథ్యంలో రద్దయిన రూట్లకు కూడా బస్సులు వేయమని ఆయా ప్రాంతాల స్థానికుల నుంచి ఒత్తిడి తప్పదని ఆందోళన చెందుతున్నారు. ఉన్నవి 160 బస్సులే.. జిల్లాలోని 27 మండలాల పరిధిలో 934 పంచాయతీలున్నాయి. వీటిలో రోడ్డురవాణా సౌకర్యం ఉన్న 70 శాతం గ్రామాల్లో 40 శాతం గ్రామాలకే బస్సు రూట్లు అధికారికంగా ఉన్నాయి. ప్రస్తుతం అమలు చేయబోతున్న మహిళల ఉచిత ప్రయాణ పథకం ఆయా గ్రామాలకు మాత్రమే పరిమితం కానున్నాయి. జిల్లాలోని అందుబాటులో ఉన్న 160 బస్సులలో విజయనగరం డిపో పరిధిలో 116, ఎస్.కోట డిపో పరిధిలో 44 సర్వీసులు నడుస్తున్నాయి. ఏడాది కిందటి వరకు విజయనగరం డిపోలోనే 150 వరకు బస్సులు ఉండేవి. కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులు వేయకపోవడం వల్ల వాటి సంఖ్య తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం ఉన్న 160 బస్సుల ద్వారా రోజుకు 49వేల మంది ప్రయాణికులకు మాత్రమే రవాణా సేవలు సాధ్యమవుతున్నాయి. జిల్లాలోని మహిళా ఓటర్ల సంఖ్య 7.7లక్షలు ఉండగా, మహిళా ఓటర్లలో 10 శాతం ప్రయాణం చేసినా బస్సుల సామర్థ్యం సరిపడదని ఆర్టీసీ వర్గాలు టెన్షన్ పడుతున్నాయి. కొన్ని కేటగిరీ బస్సుల్లోనే ఉచిత ప్రయాణం మహిళలకు ఉచిత ప్రయాణం కొన్ని ఆర్టీసీ సర్వీసులకే ప్రభుత్వం పరిమితం చేసింది. సూపర్ లగ్జరీ, ఆల్ట్రా డీలక్స్ సర్వీసులకు ఉచిత ప్రయాణం అర్హత లేదు. రోజుకు 160 బస్సులు 62,843 కిలోమీటర్ల మేర సర్వీసులు అందిస్తే, వాటిలో 10,864 కిలోమీటర్ల మేర ఉచిత రవాణా అర్హతలేని 23 బస్సు సర్వీసులు ఉన్నాయి. మిగిలిన 51,979 కిలోమీటర్ల దూరం సేవలు మాత్రమే ఎక్స్ప్రెస్, మెట్రో, ఆల్ట్రా పల్లెవెలుగు, పల్లెవెలుగు వంటి బస్సులలో అందుతాయి. జిల్లాలోని బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం, విజయనగరం, రాజాం, చీపురుపల్లి మధ్యలోనే మహిళలకు నిత్యం ప్రయాణ అవసరాలుంటాయి. అయితే, ఆయా రూట్లలో ఉచిత ప్రయాణం అర్హత లేని ఆల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీలే అత్యఽధింగా ఉన్నాయి. అరకొర ఉన్న మిగిలిన బస్సుల కోసం పడిగాపులు తప్పవు. మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై ఆర్టీసీ అధికారుల్లో టెన్షన్ జిల్లాలో 27 మండలాలకు రెండు డిపోలలో ఉన్న బస్సులు 160 మాత్రమే.. కొన్ని కేటగిరీ బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణానికి అవకాశం ప్రస్తుతం రోజుకు 49 వేల మంది ప్రయాణికలకు జిల్లాలో రవాణా సామర్థ్యం జిల్లాలో 40 శాతం పంచాయతీలకు మాత్రమే ఆర్టీసీ రవాణా సేవలు -
వంగర తహసీల్దార్ సస్పెన్షన్
● విచారణ అధికారిగా కేఆర్సీ ఎస్డీసీ ● ఇన్చార్జ్గా రాజాం తహసీల్దార్కు అదనపు బాధ్యతలువిజయనగరం అర్బన్/వంగర: వంగర ఇన్చార్జ్ తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ తహసీల్దార్ సీహెచ్.రమణారావుపై సస్పెన్షన్ విధిస్తూ కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రమణారావు విధి నిర్వహణలో ఉండగా కార్యాలయంలోనే మద్యం తాగినట్లు వివిధ పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన కథనాల నేపథ్యంలో కలెక్టర్ ఈ ఆదేశాలను జారీ చేశారు. వంగర మండలానికి ఇన్చార్జ్ తహసీల్దార్గా రాజాం తహసీల్దార్కు అదనపు బాధ్యతలను అప్పగించారు. అదే విధంగా ఈ వ్యవహారంపై విచారణాధికారిగా కేఆర్సీ ఎస్డీసీ మురళిని నియమిస్తూ ఆదేశాల్లో కలెక్టర్ పేర్కొన్నారు. రహదారి భద్రతకు ప్రత్యేక డ్రైవ్● ఎస్పీ వకుల్ జిందల్ విజయనగరం క్రైమ్: రహదారి భద్రతను దృష్టిలో పెట్టుకుని, రోడ్డు ప్రమాదాలను నియంత్రించడమే లక్ష్యంగా ఈ నెలలో ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు ఎస్పీ వకుల్జిందల్ శుక్రవారం తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్, ఓవర్ స్పీడ్, హెల్మెట్ ధారణ, బ్లాక్ స్పాట్స్ వద్ద ఎన్ఫోర్స్మెంట్ కేసులు నమోదు చేసేందుకు, ఈ చలానాలు విధించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని అధికారులను ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలతో రహదారి భద్రతకు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నామన్నారు. -
అమ్మ పాత్ర..
వ్యక్తిత్వ నిర్మాణంలో అమ్మపాత్ర కీలకం.ఉదయమే నిద్రలేపడం,పిల్లలకు ఇస్టమైన మెనూ సిద్ధం చేయడం,పుస్తకాలు సర్ధి పాఠశాలకు పంపడం వరకు క్షణం తీరికలేనిది.ఇది రొటీన్గా మారకుండా చిన్నారుల్ని చదువులో మమేకం చేసేందుకు వీలున్న అంశాలపై తల్లులు అవగాహన పెంచుకోవాలి.పాఠశాల నిబంధనలు మేరకు పెన్సిళ్లు,పెన్నులు,స్కేళ్లు రబ్బర్లు చూడడానికి ఇవి చిన్నవే అన్నట్లు కనిపిస్తాయి.ఇందులో ఏ ఒక్కటి లేకున్నా తరగతి గదిలో పిల్లలు ఇబ్బంది పడక తప్పదు. వాటిని తప్పకుండా బ్యాగులో ఉంచాలి.ఉన్నత తరగతికి వెళ్తున్నారు కదా అని సరిపెట్టుకోకుండా పాత పుస్తకాల్లోని అంశాలను పిల్లల చేత ఒకసారి పునశ్చరణ చేయించాలి. – ఎం.దీప, కేజీబీవీ ప్రిన్సిపాల్, బూసాయవలస ● -
ఎన్నికల సమయంలోనే స్వాధీనం
సాక్షి, పార్వతీపురం మన్యం: ఉమ్మడి విజయనగరం జిల్లాలో నాటు తుపాకీల వినియోగం ఇటీవల కాలంలో అధికమైంది. వాటి తో ప్రత్యర్థుల ప్రాణాలు తీస్తుండడం సామాన్య ప్రజానీకంతో పాటు పోలీస్ వర్గాలను కలవర పెడుతోంది. గతంలో తమ పంటలను కాపాడుకోవడానికి.. అడవి జంతువుల నుంచి రక్షణకు ఏజెన్సీ గ్రామాల్లో గిరిజనులు వీటిని అనధికారికంగా వాడేవారు. కొన్నాళ్లుగా వీటి జాడ లేదు అనుకుంటున్న సమయంలో ఒక్క విజయనగరం జిల్లాలోనే వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు నాటు తుపాకీ కాల్పులకు ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోవడం కలకలం రేపింది. అనుమతులు లేకుండా వీటిని వాడడం చట్ట విరుద్ధం అయినప్పటికీ.. కొందరు చట్టాన్ని విస్మరిస్తున్నారు. నాడు రక్షణకు.. నేడు ప్రతీకారానికి! విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల పరిధిలోని ఏజెన్సీ గ్రామాల్లో అడవి పందుల నుంచి పంటలను కాపాడుకోవడానికి.. వాటిని వేటాడేందుకు నాటు తుపాకులు వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పుడు కొన్ని మైదాన ప్రాంతాల్లో కూడా ఇవి లభ్యమవుతుండడం గమనార్హం. గంజాయి, సారా తరలింపు సమయంలో వన్య ప్రాణుల నుంచి రక్షణ కోసం నాటు తుపాకులను వెంట ఉంచుకుంటున్నారని తెలుస్తోంది. మరోవైపు అక్రమ వ్యాపారానికి ఎవరూ అడ్డు రాకుండా ఆయుధాలను కూడా సమకూర్చుకుంటున్నారని సమాచారం. ఇప్పుడు పచ్చని పల్లెల్లో పగలు, ప్రతీకారాలకు వీటిని వాడుతుండడం ఆందోళన కలిగించే అంశం. మందుగుండుకు ఉపయోగించే సామగ్రిని తుపాకీ గుళ్లుగా వాడుతున్నారు. తయారీలో సీసా పెంకులు, ఇతర పేలుడు పదార్థాలను వినియోగిస్తుండటం వల్ల మనిషికి తగిలిన వెంటనే ప్రాణాలు కోల్పోతున్నారు. రెండు జిల్లాల్లో ముమ్మరంగా కార్డన్ సెర్చ్ నాటు తుపాకులు, గంజాయి, సారా కట్టడికి అటు విజయనగరం జిల్లాతోపాటు.. పార్వతీపురం మన్యం జిల్లాలోనూ పోలీసులు ముమ్మరంగా కార్డన్ సెర్చ్ చేపడుతున్నారు. అనుమానిత ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు. ఎస్.కోట, వేపాడ, బాడంగి, సీతంపేట, గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. వేపాడ, పార్వతీపురం ప్రాంతాల్లో కొన్ని చోట్ల అనధికారికంగా కలిగి ఉన్న నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. రావివలసలో పోలీసు సోదాలు గిరిజన ప్రాంతాల్లో నాటు తుపాకీల వినియోగం క్షణికావేశంలో హత్యలు అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం ముమ్మరంగా కార్డన్ సెర్చ్ ప్రస్తుతం అధికారులు నాటు తుపాకీలకు అనుమతులు ఇవ్వడం మానేశారు. సార్వత్రిక, స్థానిక ఎన్నికల సమయంలో లైసెన్సుడు తుపాకీలను పోలీస్ శాఖ స్వాధీనం చేసుకుంటుంది. ఆ సమయంలో నాటు తుపాకీల మీద కూడా నిఘా ఉంచేది. తాజాగా జరుగుతున్న కాల్పులతో పోలీసు శాఖ ఉలిక్కి పడింది. బాడంగి: మండలంలోని అల్లవానివలస పంచాయతీ శివారు గ్రామమైన రావివలసలో నాటుతుపాకీలున్నాయన్న సమాచారంతో బొబ్బిలి రూరల్ సీఐ కె.నారాయణరావు ఆధ్వర్యంలో పోటీలసులు శుక్రవారం ఇంటింటా సోదాలు జరిపారు. గతంలో రావివలసలోని ఎస్.టి.దొరలు, ఎరుకలవారు అడవిమృగాల నుంచి రక్షణకోసం నాటు తుపాకులు వినియోగించేవారు. ఆ మేరకు గ్రామంలో సోదాలు చేశారు. అయితే, పోలీసులకు ఎలాంటి నాటుతుపాకీలు దొరకలేదు. గ్రామస్తులకు నాటుతుపాకీ కలిగి ఉండడం వల్ల కలిగే అనర్థాలు, చట్టపరంగా తీసుకునే చర్యలపై సీఐ అవగాహన కల్పించారు. ఈ సోదాలో సీఐతో పాటు బాడంగి, తెర్లాం, రామభద్రపురం ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. స్వచ్ఛందంగా అప్పగించాలి.. నాటు తుపాకుల ఏరివేత, సారా, గంజాయి కట్టడి లక్ష్యంగా గుర్తించిన ఏజెన్సీ ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాం. నాటు తుపాకులు కలిగి ఉండడం, వినియోగించడం చట్టరీత్యా నేరమన్న విషయాన్ని గిరిజనులకు అవగాహన కల్పించాలని అధికారులకు, సిబ్బందికి ఆదేశించాం. తుపాకులు కలిగి ఉండడం ఇండియన్ ఆర్మీ యాక్టు ప్రకారం తీవ్రమైన నేరం. ఎవరి వద్దనైనా ఉన్నట్లయితే స్వచ్ఛందంగా అప్పగించాలి. – వకుల్ జిందల్/ఎస్.వి.మాధవ్ రెడ్డి, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల ఎస్పీలు -
సర్వజన ఆస్పత్రిలో ఫార్మసిస్టుల కొరత..!
● ఏడాదిన్నరగా పోస్టులు ఖాళీ ● భర్తీ చేయని ప్రభుత్వం ● ప్రస్తుతం ఉన్నది 10 మంది ● మరో 15 మంది అవసరంవిజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఫార్మసిస్టులు (ఫార్మసీ ఆఫీసర్లు) పూర్తిస్థాయిలో లేక పోవడంతో రోగులకు సక్రమంగా సేవలు అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్న వారిపైనే అధిక భారం పడుతుండడంతో ఇబ్బంది పడుతున్నారు. జిల్లా ఆస్పత్రి నుంచి ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిగా మారిన నేపథ్యంలో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సేవలు కూడా పెరిగాయి. దీంతో ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య కూడా పెరిగింది. రోగులకు చికిత్స అందించే వైద్యుల తర్వాత అంతటి ప్రాధాన్యం ఫార్మసిస్టులకు ఉంది. వైద్యులు రాసి ఇచ్చిన మందులు అందించేంది ఫార్మసిస్టులే. అయితే వారి సంఖ్య ప్రస్తుతం తక్కువగా ఉంది. రోగుల సంఖ్యకు తగ్గట్టు ఫార్మసిస్టులను నియమించడంలో కూటమి సర్కార్ అలసత్వం వహిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏడాదిన్నరగా భర్తీ కాని ఖాళీలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో 11 మంది ఫార్మసిస్టులు ఉండేవారు. వారిలో ఒకరు ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఏడాదిన్నరగా అపోస్టు ఖాళీగా ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం భర్తీ చేయకుండా మీనమేషాలు లెక్కిస్తోంది. మరో 15మంది అవసరం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ప్రస్తుతం 10 మంది ఫార్మసిస్టులు ఉన్నారు. ఆస్పత్రిలో రోగులకు పూర్తిస్థాయిలో సేవలు అందించడానికి ఇంకా 15 మంది వరకు ఫార్మసిస్టులు అవసరం. జిల్లా ఆస్పత్రిగా ఉన్నప్పుడు ఆస్పత్రికి 500 నుంచి 600 వరకు ఓపీ వచ్చేది. ఇప్పడు 1200 నుంచి 1400 వరకు ఓపీ వస్తోంది. 24 గంటల పాటు ఫార్మసిస్టులు సేవలు అందించాల్సి ఉంటుంది. మూడు షిఫ్టుల్లో ఫార్మసిస్టులు సేవలు అందిస్తారు. సర్వజన ఆస్పత్రిలో ఓపీ వివరాలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఎన్సీడీ, ఈఎన్టీ, డెంటల్, పలమనాలజీ, న్యూరో మెడిసిన్, న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ, యురాలజీ, ఎముకలు, చర్మ, మానసిక, ఏఆర్టీ, అంకాలజీ, కంటి విభాగాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో వెకెన్సీ ద్వారా పోస్టుల భర్తీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పోస్టులను ఎప్పటికప్పడు భర్తీ చేశారు. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య రంగంలో 50 వేలకు పైగా పోస్టుల భర్తీ జరిగింది. పీహెచ్సీ నుంచి జిల్లా ఆస్పత్రి వరకు ఏ ఆస్పత్రిలో నైనా పోస్టు ఖాళీ అయితే వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసేవారు. కాని ఇప్పడా పరిస్థితి లేదు. పోస్టు ఖాళీ అయితే ఏడాదిన్నర అయినా భర్తీ చేసిన దాఖలాలు లేవు. -
ఎత్తిపోతలకు చేతులెత్తేశారు..!
● వరినారు ముదురుతున్నా అందని సాగునీరు ● ఆవేదనలో రైతన్న ● కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం ● తక్షణమే జంఝావతి ఎత్తిపోతల పథకం నుంచి నీరు సరఫరా చేయాలని డిమాండ్ కొమరాడ: జంఝావతి నదిపై 1975లో తలపెట్టిన ప్రాజెక్టు ఒడిశాతో ఉన్న చిన్నపాటి వివాదంతో నిలిచిపోయింది. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి కృషితో 2006లో జంఘావతిపై రబ్బర్డ్యామ్ ఏర్పాటైంది. సుమారు 12వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. అక్కడే లో లెవల్ కెనాల్ నుంచి కుడికాలువ పరిధిలోని సుమారు 1000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఎత్తిపోతల పథకం నిర్మించారు. అప్పటి నుంచి ఏటా జూలై నెలలో ఎత్తిపోతల పథకం నుంచి సాగునీరు అందించేవారు. అయితే, ఈ ఏడాది వర్షాలు అనుకూలించకపోవడం, ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించేందుకు అధికారులు, పాలకులు చొరవచూపకపోవడంతో రాజ్యలక్ష్మీపురం, రావికర్రవలస, కుమ్మరిగుంట, కందివలస తదితర గ్రామాల్లోని భూములు సాగుకునోచుకోలేదు. ఓ వైపు వరినారు ముదిరిపోతున్నా ఎత్తిపోతల పథకం నుంచి సాగునీరు విడుదలకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకోకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. ఎత్తిపోతల పథకంపై నిర్లక్ష్యం... జంఝావతి ఎత్తిపోతల పథకం నిర్వహణపై నిర్లక్ష్యం చూపుతున్నారన్నది రైతుల వాదన. మరమ్మతులకు గురైన మోటార్లను సకాలంలో బాగుచేయకపోవడం, విద్యుత్ సరఫరాలో అంతరాయాలతను తొలగించకపోవడం వల్లే ఎత్తిపోతల పథకం నుంచి నీరు ఇప్పటికీ విడిచిపెట్టలేదని ఆరోపిస్తున్నారు. గతంలో ఈ పరిస్థితి ఉండేదికాదని, పథకంలో ఏ సమస్య ఎదురైనా వెంటనే పరిష్కరించేవారని చెబుతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే కనీసం రైతుల గురంచి, పంటల సాగు గురించి పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. -
టిడ్కో గృహాలకు గ్రహణం
● కూటమి పాలనలో ముందుకు సాగని ఇళ్ల నిర్మాణం ● రాజన్నదొర కృషితో సాలూరులో తొలిసారిగా.. టిడ్కో ఇళ్ల గృహప్రవేశాలుసాలూరు: గ్రామాలతో పోలిస్తే పట్టణాల్లో సొంత ఇల్లు అంటే పేద, మధ్య తరగతి కుటుంబాలకు చాలా కష్టమైన పని. అటువంటి పేదవాడి సొంతింటి కలను సాలూరు పట్టణంలో సాకారం చేసిన అంశంలో మాజీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర చెరగని ముద్ర వేసుకున్నారు. ఓ వైపు టిడ్కో ఇళ్లతో పాటు మరోవైపు నెలిపర్తి, గుమడాం తదితర ప్రాంతాల్లో ఇండ్ల స్థలాలు మంజూరు చేయించి పేదవాడికి సొంత గూడుకు తనవంతు భగీరథ ప్రయత్నం చేశారు. గతం ఘనం–నేడు దైన్యం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో శరవేగంగా జరిగిన టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు తుది దశ మౌలిక వసతుల పనులు పూర్తిచేయాల్సి ఉండగా ఎన్నికల కోడ్ అమలు కావడంతో పనులు నిలిచిపోయాయి. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పాలనలో టిడ్కో గృహాల నిర్మాణాల విషయంలో అలసత్వం ప్రదర్శిస్తోందని ప్రజలు నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది పాలనలో టిడ్కో గృహాల నిర్మాణాలపై పాలకులు, అధికారులు కన్నెత్తి చూసిన దాఖలాలు లేకపోవడం ఈ విమర్శలకు బలం చేకూరుస్తోంది. ఉమ్మడి విజయనగరంలో జిల్లాలోనే టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి ప్రజలకు అందించి గృహప్రవేశాలు జరిగింది సాలూరు నియోజకవర్గంలోనే కావడం విశేషం. రూ.82.85 కోట్లతో ఇళ్ల నిర్మాణం టిడ్కో ఇళ్ల నిర్మాణాలు రూ.82.85 కోట్లతో పూర్తయ్యాయి. ఇందులో 2014–19 మధ్య గత టీడీపీ ప్రభుత్వంలో పునాదులు అంతకన్నా తక్కువ దశలో నిర్మాణాలు చేసి వదిలేయగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.70.28 కోట్లు ఖర్చు పెట్టి ఇళ్లతో పాటు మౌలిక వసతులు కల్పించింది. రివర్స్ టెండరింగ్ ద్వారా కేవలం పునాదులు అంతకంటే తక్కువ స్థాయి దశలో నిర్మాణంతో 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వం విడిచిపెట్టిన సాలూరు టిడ్కో ఇళ్లకు గత వైఎస్సార్సిపీ ప్రభుత్వంలో రివర్స్ టెండరింగ్ జరిగింది.1 చదరపు అడుగుకు నాటి టీడీపీ ప్రభుత్వం రూ.2,200లకు టెండర్లు పిలవగా, రివర్స్ టెండరింగ్ ద్వారా గత జగన్మోహన్రెడ్డి పాలనలో రూ.1,700లకే టెండర్లు పిలిచి నిర్మాణం చేపట్టారు. ఒక్కక్కరి తలపై రూ.7లక్షల అప్పు గతంలో 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వం టిడ్కో గృహాల లబ్ధిదారుల తలపై సుమారు రూ.7లక్షలు అప్పు పెట్టాలని చూస్తే, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి సుమారు రూ.10 లక్షల విలువైన మౌలిక వసతులతో కూడిన ఇళ్లను ఉచితంగా అందించారని పలువురు లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేసిన దాఖలాలు ఉన్నాయి. పనులు పూర్తి చేయాలి కూటమి ప్రభుత్వంలో నేటికీ పనులు పూర్తిచేయలేదని, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉన్నాయని పలువురు ప్రజలు వాపోతున్నారు. ఇకనైనా పాలకులు, అధికారులు స్పందించి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దాదాపు పూర్తయిన ఈ టిడ్కో గృహాలకు మౌలిక వసతులు పనులు పూర్తి చేయించాలని కోరుతున్నారు. -
గురువు బాధ్యత..
విద్యార్ధికి జీవితాన్ని నేర్పించేది గురువే. పోటీ ప్రపంచంలో గట్టెక్కేవాడు విజేత.ఆ దిశగా విద్యార్ధిని తీర్చిదిద్దడంలో గురువుదే బాధ్యత.మూస పద్ధతిలో కాకుండా సబ్జెక్టులతో పాటు సమాజం గురించి వినూత్న రీతిలో బోధించాలి.ప్రతి విద్యార్ధిపైనా దృష్టిపెట్టాలి.సమకాలీన ప్రపంచంలో వస్తున్న మార్పుల్ని వారు ఔపోసన పట్టాలి.వృత్తి నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలి.అప్పుడే విద్యార్థుల ఉజ్వల భవితకు దిక్సూచి కాగలరు. –యు మాణిక్యంనాయుడు, డిఈవో, విజయనగరం● -
యూరియా ఏది బాబూ..!
సంతకవిటి: మండలంలోని తాలాడ గ్రామ రైతులు యూరియా కోసం స్థానిక సచివాలయం వద్ద శుక్రవారం ఆందోళనకు దిగారు. వీఏఏను చుట్టుముట్టి ఎరువుకోసం నిలదీశారు. తమ గ్రామంలో దాదాపు 875 ఎకరాల్లో వరి ఉభాలు వేస్తే కేవలం 260 బస్తాల యూరియా సరఫరాకు సన్నద్ధం కావడంపై నిలదీశారు. అరకొర ఎరువు మాకొద్దంటూ యూరియా తీసుకునేందుకు నిరాకరించారు. మిగిలిన రైతులకు సోమవారం తెచ్చి ఇస్తామని ఇన్చార్జి వీఏఏ వి.శివశంకర్ చెప్పడంతో ఆందోళన విరమించారు. మండల రైతులు ఎరువుకోసం నానా తిప్పలు పడుతున్నా వ్యవసాయాధికారి యశ్వంత్రావు, స్థానిక ఎమ్మెల్యే కనీసం పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓట్లు అవసరమైనప్పుడే రైతు గుర్తుకు వస్తారని, తర్వాత రైతు కష్టాలను పట్టించుకునేవారే కరువయ్యారంటూ వాపోయారు. తాలాడలో రైతుల ఆందోళన -
6 తులాల బంగారు ఆభరణాల అప్పగింత
విజయనగరం క్రైమ్: విజయనగరం వన్ టౌన్ పోలీస్ స్టేష్న్ క్రైమ్ పార్టీ సిబ్బంది ఫిర్యాదు అందిన కొద్ది గంటల వ్యవధిలోనే పోయిన బంగారాన్ని స్వాధీనం చేసుకుని బాధితురాలికి శుక్రవారం అప్పగించారు. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. విజయనగరంలోని కామాక్షి నగర్ కు చెందిన పిల్ల పద్మ సొంత పని నిమిత్తం ఈనెల 7న సాయంత్రం కామాక్షినగర్ వద్ద ఆటో ఎక్కి నగరంలోని రైల్వే స్టేషన్ వద్ద దిగింది. ఆటోలో బ్యాగు మర్చిపోయినట్లు గుర్తించి వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సీఐ ఆర్వీఆర్కే చౌదరి ఆదేశాలతో స్టేషన్ క్రైమ్ ఎస్సై సురేంద్ర నాయుడు, సిబ్బంది శ్రీను, రమణలు ఆటోను సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ట్రేస్ చేశారు. ఆటో వెనక సీటు భాగంలో బ్యాగ్ ను గుర్తించడంతో పాటు అందులో ఆరు తులాల బంగారు ఆభరణాలను ఫిర్యాదురాలైన పిల్ల పద్మకు అప్పగించారు. బ్యాగును, విలువైన బంగారు ఆభరణాలను అప్పగించడంలో క్రియాశీలకంగా పని చేసిన ఎస్పై సురేంద్ర నాయుడు, సిబ్బందిని సీఐ చౌదరి అభినందించారు. -
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు వెంపడాం విద్యార్థులు
పూసపాటిరేగ: మండలంలోని వెంపడాం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్ధులు రాష్ట్రస్థాయి అధ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 3 వతేదీన విజయనగరంలోని విజ్జీ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల ఎంపికలలో పాఠశాలకు చెందిన పి.వెంకటలక్ష్మి (లాంగ్జంప్), వి.కల్యాణి (హైజంప్), పి.శ్రీను (100 మీటర్లు, 200 మీటర్లు రన్నింగ్)లు ఎంపికయ్యారు. దీంతో ఈనెల 9,10 తేదీలలో రాష్ట్రస్థాయిలో బాపట్ల జిల్లా చీరాలలో జరగబోయే అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొననున్నారు. పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపిక కావడంతో పాఠశాల హెచ్ఎం పి.లచ్చన్న, పీడీ గణేష్కుమార్తో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.జాతీయ పోటీల్లో దివ్యాంగ విజేతకు అభినందనలువిజయనగరం అర్బన్: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిలాస్పూర్లో మేధోవైకల్యం గల ప్రత్యేక అవసరాల పిల్లలకు ఇటీవల జరిగిన జాతీయ స్థాయి స్పెషల్ ఒలింపిక్ గేమ్స్ బేస్బాల్లో కాంస్యపతక విజేత అయిన తెర్లాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని తోషినిని జిల్లా విద్యాశాఖ అధికారి యూ.మాణిక్యంనాయుడు, సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ ఎ.రామారావు అభినందించారు. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని వారి కార్యాలయాలకు వచ్చి అధికారులను తోషిని కలిసింది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ సాధారణ విద్యార్థుల మాదిరిగానే ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు కూడా ప్రతిభ చూపడం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. అనంతరం విజేతను, కోచ్లుగా వ్యవహరించిన పి.సునీల్, ఎస్.బంగారునాయుడిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా సహిత విద్య సమన్వయకర్త ఎస్.సూర్యారావు, సహ సమన్వయకర్త ఎం.భారతి, తెర్లాం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్ఎస్ఎం రమేష్, కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.నాటుతుపాకీతో ఇద్దరి అరెస్ట్వేపాడ: మండలంలోని సోంపురం గ్రామంలో నాటుతుపాకీ ఉన్నట్లు అందిన సమాచారం మేరకు తనిఖీ చేయడంతో నాటుతుపాకీ పట్టుబడినట్లు ఎస్సై సుదర్శన్ తెలిపారు. ఇందుకు సంబంధించి ఆయన అందించిన వివరాలిలా ఉన్నాయి. సోంపురం గ్రామానికి చెందిన గొర్లె ఈశ్వర్రావు ఇంటిలో తనిఖీలు నిర్వహించగా నాటుతుపాకీ పట్టుబడినట్లు చెప్పారు. తుపాకీపై ఆరాతీయడంతో గుడివాడ గ్రామానికి చెందిన రొంగలి బంగారయ్య వద్ద రూ.4500కు కొనుగోలు చేసినట్లు ఈశ్వర్రావు తెలిపాడని చెప్పారు. ఎటువంటి ప్రభుత్వ అనుమతులులేకుండా తుపాకీ కలిగి ఉన్నందున ఈశ్వర్రావును, నాటు తుపాకీ అమ్మడం చట్ట రీత్యా నేరమైనందున విక్రయించిన బంగారయ్యను ఎస్.కోట రూరల్ సీఐ అప్పలనాయుడు అరెస్టు చేసినట్లు ఎస్సై చెప్పారు.ఆర్టీసీ డార్మిటరీలో వ్యక్తి మృతివిజయనగరం క్రైమ్: విజయనగరం ఆర్టీసీ డార్మిటరీలో ఓ వ్యక్తి మృతి చెందాడు. దీనిపై వన్ టౌన్ పోలీసులకు గురువారం అందిన ఫిర్యాదు మేరకు స్టేషన్ హెచ్సీ ఆవాల రమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విశాఖ జిల్లా తగరపు వలసకు చెందిన సబ్బిశెట్టి కృష్ణమూర్తి(54) శశికాలేజీలో కుక్గా పని చేస్తున్నాడు. మందుల కోసం విజయనగరం వచ్చి రాత్రి కావడంతో ఆర్టీసీ డార్మిటరీలో రూమ్ తీసుకుని ఉండిపోయాడు. నిద్ర సమయంలోనే గుండె పోటు రావడంతో మృతి చెంది ఉండవచ్చని మృతుడి అల్లుడు మక్కడపల్లి శ్రీనివాస్ చేసిన ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
తప్పుడు రిజిస్ట్రేషన్ కలకలం
భోగాపురం: స్థానిక సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన తప్పుడు రిజిస్ట్రేషన్పై కలకలం రేగింది. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని గూడెపువలసకు చెందిన రైతు ఆళ్ల ముకుందరావు తాతయ్య పేరు మీద ఉన్న 2.49 ఎకరాల భూమిని, వారసత్వ ఆస్తిగా కుమారుడైన శంకాబత్తుల అప్పలగురువుకు వచ్చింది. ఆయన మృతి చెంది మూడేళ్లు అయినప్పటికీ.. బతికున్నట్లు బినామీ డాక్యుమెంట్లు సృష్టించి ఆ భూమిని ఇద్దరి పేరుమీద అన్లైన్ చేసేశారు. ఎలాంటి వన్బీ, గానీ, ఈసీ గాని చూడకుండా ఎక్కడో సృష్టించిన డాక్యుమెంట్ల ఆధారంగా తప్పుడు రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. దీనిపై భూహక్కుదారుడైన ఆళ్ల ముకుందరావు తనకు చెందాల్సిన భూమికి సంబంధించి రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్లి జరిగిదంతా చెప్పడంతో రిజిస్ట్రార్ ఒక్కసారిగా కంగుతిన్నారు. ఈ విషయం బయట పెట్టొద్దని దీనిపై పరిశీలిస్తానన్నారంటూ రిజిస్ట్రార్పై ముకుందరావు ఆగ్రహం వ్యక్తం చేశాడు. సర్వే నంబర్ 159–2లో ఎకరం భూమి అరం జ్యోతి పేరుమీద ఉండగా మళ్లీ అదే సర్వే నంబర్ మీద 2.49 ఎకరాల భూమిని రిజిస్టేషన్ చేయించేశారు. తనకు సంబంధించిన ఆస్తులను ఎలా తప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తారంటూ ముకుందరావు ప్రశ్నించాడు. డబ్బులకు అమ్ముడుపోయి ఇలా చేయాడం మీకు తగదని న్యాయం జరిగే వరకు విడిచి పెట్టనని అవసరమైతే కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్తానం టూ హెచ్చరించాడు. ముందుగా తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి ముకుందరావు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ రమణమ్మ ఆయనకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. సబ్రిజిస్ట్రార్ను ప్రశ్నించిన రైతు -
ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలి
● రహదారులపై అక్రమణలు తొలగించాలి ● జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్విజయనగరం అర్బన్: రహదారులపై ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని రహదారులపై అక్రమణలు తొలగించాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లా స్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశం గురువారం జాయింట్ కలెక్టర్ చాంబర్లో నిర్వహించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రహదారిపై ప్రమాదాల నివారణకు చేపట్టవలసిన చర్యలు తీసుకోవడమే కాకుండా నిబంధనలను కఠినంగా అమలు చేయాలన్నారు. రహదారులు, జంక్షన్లు, బ్లాక్ స్పాట్స్, పాఠశాలల వద్ద ఆక్రమణలను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఐఆర్ఏడీ యాప్లో రోడ్డు ప్రమాద వివరాలను నమోదు చేయాలని తెలిపారు. ఐఆర్ఏడీ యాప్పై అన్ని శాఖల అవగాహన కోసం జూమ్ మీటింగ్ నిర్వహించాలని సూచించారు. రోడ్లు భవనాలు, పోలీసు, రవాణా, పంచాయతీరాజ్ శాఖల సంయుక్త బృందాలు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అవసరమైన చోట హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గత సమావేశం నుంచి ఇప్పటివరకు పెండింగ్ ఉన్న కేసులను తక్షణమే క్లియర్ చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ సౌమ్యలత, రహదారులు భవనాల శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ కె.కాంతిమతి, డీసీహెచ్ఎస్ పద్మశ్రీరాణి, విజయనగరం మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య, బొబ్బిలి మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మి, ఎంవీఐ మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
సహాయక చర్యలందక వ్యక్తి మృతి
రామభద్రపురం: మండలంలోని ఆరికతోట పరిధిలో బుధవారం ప్రమాదవశాత్తు కింద పడిపోయిన వ్యక్తికి సకాలంలో సహాయక చర్యలందకపోవడంతో మృతిచెందాడు. ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని నాయుడువలస పంచాయతీ మధుర గ్రామం కొండపాలవలసకు చెందిన లెంక ధనుంజయ(33)ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తుంటాడు. రోజులాగానే బుధవారం కూడా ట్రాక్టర్ తోలడానికి వెళ్లిపోయి అదే మండలం ఆరికతోట గ్రామ పొలంలో మొక్కజొన్న కంకులు రెండు లోడులు పెరిగాడు. మూడో లోడుకు వెళ్లకుండా పొలంలో ట్రాక్టర్ వదిలేసి చెట్ల నీడకు వెళ్దామన్న ఉద్దేశంతో అక్కడికి కొద్ది దూరంలో ఉన్న నీలగిరి తోటలోకి వెళ్తుండగా తోటలో గతంలో నరికిన చెట్ల మొదళ్లు తన్నుకుని కంకర రోడ్డులో బోర్లా పడిపోయాడు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పాటు ఎండవేడిమి ఎక్కువగా ఉండడంతో వెంటనే సహాయక చర్యలందక మృతిచెందాడు. బుధవారం రాత్రికి కూడా ధనుంజయ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికారు. మద్యం తాగే అలవాటు ఉన్నోడు కదా ఏదో టైమ్లో ఇంటికి వచ్చేస్తాడులే అన్న ఉద్దేశంతో అలా వదిలేశారు. ట్రాక్టర్ ఓనర్ కూడా వెతికి తన ట్రాక్టర్ను తీసుకెళ్లిపోయాడు. గురువారం ఉదయం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ట్రాక్టర్ వదిలేసిన పరిసరాల్లో మళ్లీ వెతికారు. అయినా కనిపించకపోవడంతో తిరిగి ఇంటికి వెళ్లిపోతున్న సమయంలో ఆరికతోట గ్రామానికి చెందిన ఓ రైతు గడ్డిమోపు పట్టుకుని కనిపించి నీలగిరి తోటలో ఎవరో పడి ఉన్నారని చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు వెళ్లి అప్పటికే మృతిచెంది ఉన్న ధనంజయను చూసి అవాక్కయ్యారు. బోర్లా పడి ఉన్న మృతదేహం ముఖంపై రక్తం మరకలు ఉండడం చూసి ఎలా మృతి చెంది ఉంటాడు? ఎవరైనా చంపి పడేశారా? మృతుడికి ఎవరూ శత్రువులు లేరే అని అలోచించి అనుమానాస్పద మృతిగా భావించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఎస్సై వి. ప్రసాదరావు సిబ్బందితో కలిసి ఘటనా చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ను రప్పించి సాధారణ మృతా? లేక హత్యా? అని పరిశీలించి సాధారణ మృతిగా నిర్ధారించారు.కుటుంబ సభ్యుల సమక్షంలో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాడంగి సీహెచ్సీకి తరలించి అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుడి భార్య గౌరీశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య గౌరీశ్వరి, పాప, బాబు ఉన్నారు. -
ముర్రుపాలు అమూల్యం
విజయనగరం ఫోర్ట్: బిడ్డ పుట్టిన ఐదు నిమషాల లోపు తల్లి ఇచ్చే ముర్రుపాలు ఎంతో అమూల్యమైనవని కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. ఆ పాలలో అద్భుతమైన పోషకాలు, ఔషధ గుణాలు ఉంటాయని, అవి బిడ్డ ఎదుగుదలకు ఉపయోగపడతాయన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల ముగింపు కార్యక్రమం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తల్లిపాల గొప్పదనం గురించి నిత్యం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి మహిళకు దీని గురించి వివరించాలన్నారు. మహిళలు బిడ్డకు పాలు అందించేందుకు బ్రెస్ట్ ఫీడింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వేస్టేషన్, కలెక్టరేట్లలో బ్రెస్ట్ ఫీడింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇప్పటికే ఉన్నట్లయితే వాటిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెస్తామన్నారు. బ్రెస్ట్ కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తామన్నారు. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మాట్లాడుతూ తల్లి కావడమే గొప్ప అదృష్టమన్నారు. బిడ్డ పుట్టిన వెంటనే పాలు అందించడం తల్లి బిడ్డలిద్దరికీ శ్రేయస్కరమన్నారు. ఆ తర్వాత గర్భిణులకు సామూహిక సీమంతం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ 5వ స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ శాంతికుమారి, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ హిమబిందు, ఐసీడీఎస్ పీడీ విమలారాణి, డీఎల్ఓ డాక్టర్ రాణి, సాంఘిక సంక్షేమ శాఖ అధికారిణి అన్నపూర్ణ, బీసీ సంక్షేమ శాఖ అధికారిణి జ్యోతి శ్రీ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కవిత, నేచర్ సంస్థ డైరెక్టర్ వికాస్ బాలరాజ్, ఘోషా ఆస్పత్రి గైనకాలజిస్ట్ డాక్టర్ సుజాత పాల్గొన్నారు. కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ -
రాజాంలో స్థిర పారిశుద్ధ్య వ్యవస్థ
● కేంద్ర జలశక్తి ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ ● రాజాం మండలం యూనిట్గా ఎంపికరాజాం: స్థిరమైన పారిశుద్ధ్య వ్యవస్థ నిర్మాణ దిశగా కేంద్ర జలశక్తి, జీఎంఆర్ ఫౌండేషన్లు సంయుక్తగా కృషిచేస్తున్నాయని కేంద్ర జలశక్తి ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ టీం లీడర్ సంజయ్కుమార్ పాండే, డిప్యూటీ కన్సల్టెంట్ శృతి మక్కర్ అన్నారు. స్వచ్ఛభారత్ ఫేజ్–2లో భాగంగా పారిశుద్ధ్య వ్యర్థాల నిర్వహణ కోసం కొత్త ప్రమాణాల ద్వారా గ్రామాలను లైట్ హౌస్ ఇనిషియేటివ్గా తయారుచేసేందుకు రాజాం మండలాన్ని ఎంపికచేసినట్టు వెల్లడించారు. ఈ మేరకు రాజాం మండలపరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ శ్రీనివాసరావుతో పాటు ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ రాజేష్, జేఈ జగన్మోహనరావు తదితరులతో కలిసి గురువారం ససమీక్షించారు. రాజాం మండలంలో పారిశుద్ధ్య పరిస్థితి, వ్యర్థాల నిర్వహణకు అవసరమైన వనరులు, వసతులపై ఆరా తీశారు. అనంతరం స్థానిక విలేకరులతో మట్లాడుతూ మెరుగైన పారిశుద్ధ్యం, పరిశుభ్రత కోసం ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా అమలుచేసేందుకు 15 రాష్ట్రాల్లో 75 గ్రామ పంచాయతీలను కేంద్ర జలశక్తి ఎంపికచేసిందన్నారు. ఇందులో రాజాంకు స్థానం దక్కిందని వెల్లడించారు. జీఎంఆర్ వీఎఫ్తో కలిసి రాజాంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. బ్లాక్ స్థాయిలో ఒక స్వచ్ఛ సాతీని నియమిస్తామన్నారు. కార్యక్రమంలో జీఎంఆర్ ఫౌండేషన్ ప్రోగ్రాం మేనేజర్ సాయి కిషోర్, హెచ్ఆర్డీ కన్సల్టెంట్ టి.సుధాకర్, ఎంఆర్సీ వైకుంఠరావు, జీఎంఆర్ వీఎఫ్ సభ్యులు పాల్గొన్నారు. -
అడవితల్లి ఒడిలో ప్రశాంత జీవనం
● చూడముచ్చటగా కట్టూబొట్టు, ఆచారాలు ● కొండపోడే ఆధారంగా జీవనం ● మౌలికవసతులు అంతంతమాత్రమే ● ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రేపు సీతంపేట: నవ్యసమాజానికి దూరంగా కొండకోనల్లో జీవనం సాగించే వారే గిరిపుత్రులు. కొండకోనల్లో ప్రత్యేక భాష, సంస్కృతి, సంప్రదాయాల నడుమ ఆదివాసీల జీవనం వైవిధ్యంగా సాగుతోంది. కాయకష్టం చేసి జీవించడం వారి జీవన విధానం. భిన్నమైన సంస్కృతి, సంప్రదాయాలు గిరిజనుల సొంతం. కొండల్లో తమ సంప్రదాయ వ్యవసాయాన్ని చేసుకుంటూ జీవిస్తున్న గిరిజనుల ఆచార వ్యవహారాలు, కట్టుబొట్టుల్లో మార్పులేదు. అటవీఉత్పత్తుల సేకరణ, పోడుపంటలు, వ్యవసాయ పంటల దిగుబడులు వచ్చినప్పుడు గిరిజనులు ప్రత్యేక పండగలు జరుపుకోవడం ఆనవాయితీ. విభిన్నం–వైవిధ్యం.. సంప్రదాయ ఆచార వ్యవహారాల్లో ఎంతో వైవిధ్యం కనబరిచే గిరిజనులు అటవీ సంస్కృతికి ప్రతీకలు. ఘన చరిత్రకు వారసులు. వారి ఆధ్యాత్మిక చింతన వినూత్నం.వారి కట్టూ బొట్టూ చూడముచ్చటగా ఉంటాయి. తెల్లారితే కొండపోడు వ్యవసాయం, అటవీఉత్పత్తుల సేకరణతోనే వారి జీవనం సాగుతుంది. ప్రతి మూడు నెలలకు ఒక్కో అటవీ ఉత్పత్తుల సీజన్ ఆరంభమవుతుంది. పైనాపిల్, సీతాఫలం, పసుపు, జీడి, కందులు, నిమ్మ, బత్తాయి, పెండలం ఇలా అటవీ ఉత్పత్తులతోనే వారి జీవనం ముడిపడి ఉంది. వారం వారం జరిగే వారపు సంతలకు వెళ్లి వారి ఉత్పత్తులు విక్రయించి వారానికి సరిపడా నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకుంటారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో 819 కిలోమీటర్ల మేర ఏజెన్సీ విస్తరించి ఉంది. 42 వేల 246 గిరిజన కుటుంబాల్లో 2లక్షల 62వేల మంది కుటుంబ సభ్యులున్నారు. మొత్తం 1187 గిరిజన గూడలుండగా వాటిలో ఆదిమ గిరిజనులు నివసించే గూడలు 467 ఉన్నాయి. గిరిజనుల్లో ప్రధానంగా కొండ సవర, జాతాపు, కాపు సవర తెగలున్నాయి. వివాహాలు, పండగలు, వ్యవసాయం తదితర సందర్భాల్లో ప్రత్యేక పండగలు నిర్వహించుకోవడం ఎంతో వైవిధ్యం. భార్యకు కట్నం ఇచ్చి వివాహం చేసుకునే ‘మొగనాలి’ ఇప్పటికీ కొన్ని చోట్ల అమల్లో ఉంది. అభివృద్ధికి ఆమడదూరంలో.. మన్యంలో గిరిజనుల అభివృద్ధి అంతంతమాత్రంగానే ఉంది. గిరిజనులకు మౌలికవసతులు లేక అల్లాడుతున్నారు. విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలు చాలా గ్రామాలకు లేవు. రక్షిత మంచీనీటి వ్యవస్థ అందుబాటులో లేదు. అనాదిగా గిరిజనులు ప్రకృతి ఆధారంగానే జీవన మనుగడ సాగిస్తున్నారు. సుమారు 120కి పైగా గ్రామాలకు రహదారి సౌకర్యం ఇప్పటికీ లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతంతమాత్రంగా వైద్యసేవలుఎపిడమిక్ సీజన్లో ఏజెన్సీలో మలేరియా విజృంభిస్తుంది. పీహెచ్సీల్లో డాక్టర్ల కొరత వేధిస్తోంది. ఇప్పటి వరకు దోమతెరల పంపిణీ లేదు. ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు వైద్యసేవల కోసం ఇంతవరకు హెల్త్ వలంటీర్లను నియమించలేదు. పాఠశాలల్లో కనీస మౌలికవసతులైన మరుగుదొడ్లు, అదనపు తరగతుల గదుల సమస్యలు వేధిస్తున్నాయి. గిరిజనోత్పత్తులకు గిట్టుబాటు ధరలు లేవు. అన్ని అటవీ ఉత్పత్తులు జీసీసీ కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. ముఖ్యంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇంటింటికి రేషన్ ఇవ్వడం కోసం ప్రవేశపెట్టిన ఎండీయూ వాహనాలు రద్దు చేయడంతో రేషన్ కొండలపైకి మోసుకుని తీసుకువెళ్తూ గిరిజనులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.అక్షరాలే ఆరాధ్యదేవతలు–లిపివారిప్రాణం.. శ్రీకాకుళం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో మరో వైవిధ్యముంది. ఇక్కడ అక్షరాలను ఆరాధ్యదేవతలుగా గిరిజనులు పూజిస్తారు. ఏ దేవతకై నా పూజలు చేసినా నైవేద్యంగా సారా పెట్టి పూజ అనంతరం పూటుగా తాగుతారు. జీలుగు సారా వంటివి చెట్టునుంచి దించితే ముందుగా తెడ్డులతో సేవిస్తారు. వారి పండగలు, సంప్రదాయాలను బొమ్మల రూపంలో వేయడంలో వారికి వీరేసాటి. ఏజెన్సీలో అక్షరబ్రహ్మ, మడిబ్రహ్మ వంటి ఆలయాలు వెలిశాయి. అక్కడి గిరిజనులు ప్రతి గురువారం పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఆగం పండగ వంటివి చేస్తుంటారు. సవర లిపి ద్వారా కొంతమంది ఆదిమ గిరిజనులు జీవనం సాగిస్తున్నారు. వారు వేసే లిపికి మైదాన ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉంది. ఇటీవల కాలంలో దీనిని అభివృద్ధి చేస్తున్నారు.ఆదివాసీ దినోత్సవం నిర్వహణ ఎందుకంటే.. ఆదివాసీల జీవన స్థితిగతులను ప్రపంచానికి తెలియజేసేందుకు ఐక్యరాజ్యసమితి 1194 ఆగస్టు 9న జెనీవాలో ప్రపంచ ఆదివాసీ వర్కింగ్ గ్రూప్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ వర్కింగ్ గ్రూప్ ఆదివాసీలపై అధ్యయనం చేసి ప్రపంచ దేశాల్లో ఆదివాసీల సమస్యలన్నీ దాదాపు ఒకేలా ఉన్నాయని గుర్తించింది. దీంతో ఏటా ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించాలని యూఎన్వో ప్రకటించింది.కొండపోడే ఆధారం.. పోడు వ్యవసాయం ప్రధాన జీవనాధారంగా కుటుంబాలతో ఆనందంగా జీవిస్తారు. భూ ఉపరితలానికి అత్యంత ఎత్తైన భాగంలో గూడల్లో నివసిస్తూ భయమంటే తెలియదన్నట్లు క్రూరమృగాల నడుమ, విష సర్పాల పడగ నీడలో సాహస జీవితం గడుపుతుంటారు. జిల్లాలోని అటవీ ప్రాంతమంతా ప్రకృతి సోయగాలతో అలరారుతుంది. -
పుష్పధరహాసం
రాజాం: పూల ధరలకు రెక్కలొచ్చాయి. ఓ వైపు పెళ్లిళ్ల సీజన్, మరోవైపు శ్రావణ శుక్రవారం, మంగళవారం పూజలతో పూలకు డిమాండ్ పెరిగింది. గతంలో కంటే కిలోకు రూ.100లు నుంచి రూ.400లు ధర పెరిగింది. రాజాంలో కిలో మల్లెలు రూ.800 నుంచి రూ.900లు, చామంతి రూ. 450, బంతిపూలు రూ.200, లిల్లీలు కిలో రూ.350, గులాబీలబుట్ట ధర రూ.750లు, కనకాంబరాలు బారు ధర రూ.350, వివాహ దండలు రూ.800లు నుంచి రూ.2,500లు మధ్య, గులాబీ పెళ్లి దండలు రూ.1200లు, గుమ్మపు దండలు రూ.1000లు చొప్పున పలుకుతున్నాయి. చామంతి ధర గతంలో కంటే కిలోకు రూ.150లు పెరగగా, కనకాంబరాల దండలు ధర గతంలో కంటే రెట్టింపు అయ్యాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కడియం, ఆలమూరు, ఆత్రేయపురం, చిత్తూరు, కర్ణాటక, తమిళనాడు నుంచి ఇక్కడి వ్యాపారులు పూలను దిగుమతి చేసుకుంటున్నారు. -
డీపీటీసీ పరిశీలన
● ఆరంభం కానున్న పోలీస్ అభ్యర్థుల శిక్షణ తరగతులు విజయనగరం క్రైమ్: సారిపల్లిలోని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం (డీపీటీసీ)ను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ గురువారం పరిశీలించారు. త్వరలో సుమారు 150 మంది ట్రైనీ కానిస్టేబుళ్లు శిక్షణకు రానున్నందు న, అవసరమైన అన్ని మౌలిక వసతులను త్వరితగతిన కల్పించాలని అధికారులను ఆదేశించారు. శిక్ష ణ కేంద్రంలోని తరగతి గదులు, వంటగది, డైనింగ్ హాల్, స్టోర్, వాష్రూమ్, స్నానపు గదులు, లైబ్రరీ, పరేడ్ గ్రౌండ్, ఫైరింగ్ రేంజ్లను ఎస్పీ పరిశీలించారు. శిక్షణ కేంద్రంలో కంప్యూటర్లు, ఫ్యాన్లను వినియోగంలోకి తీసుకురావాలని సిబ్బందిని ఆదేశించారు. మున్సిపల్ అధికారులతో మాట్లాడి తాగునీటి సరఫరాకు అంతరా యం లేకుండా చూడాలన్నారు. ఆయన వెంట అద నపు ఎస్పీ పి.సౌమ్యలత, ఏఆర్ అదనపు ఎస్పీ జి. నాగేశ్వరరావు, సీఐలు ఎ.వి.లీలారావు, జి.రామకృష్ణ, బి.లలిత, ఏఆర్ ఎస్ఐ జి.గోపాలనాయుడు, నెల్లిమర్ల ఎస్ఐ గణేష్, తదితరులు ఉన్నారు. -
నాటుతుపాకీల ఏరివేతకు కార్డన్ సెర్చ్
● ఎస్పీ వకుల్ జిందల్ విజయనగరం క్రైమ్: నాటు తుపాకులు వినియోగించడం చట్టరీత్యా నేరమని, గిరిజనులు, వేటగాళ్ల వద్ద ఉన్న నాటు తుపాకీల ఏరివేతే లక్ష్యంగా కార్డన్ సెర్చ్ నిర్వహించాలని ఎస్పీ వకుల్ జిందల్ పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని తన చాంబర్ నుంచి మూడు సబ్ డివిజ న్ల పోలీస్ అధికారులతో గురువారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. లైసెన్సు లేకుండా తుపాకుల వినియోగించడం చట్టరీత్యా నేరమన్న విషయాన్ని గిరిజనులకు అవగాహన కల్పించాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అడవి పందుల నుంచి పంటలను రక్షించుకునేందుకు, వేటాడేందుకు కొంతమంది నాటు తుపాకులను అనధికారంగా వినియోగిస్తున్నట్టు మా దృష్టికి వచ్చిందన్నారు. క్షేత్ర స్థాయిలో నాటు తుపాకులు వినియోగించే వ్యక్తుల సమాచారాన్ని సేకరించాలన్నారు. సోదాల్లో గంజాయి, సారా, నాటు తుపాకులు లభ్యమైతే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేయాలని ఎస్పీ సూచించారు. టెలికాన్ఫరెన్స్లో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, బొబ్బిలి డీఎస్పీ జి.భవ్యారెడ్డి, చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు, పలువురు సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
చంద్రబాబు పతనం ఆరంభం
విజయనగరం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పతనం ఆరంభమైంది. రాష్ట్రంలో 50 శాతానికి పైబడి ఓటర్లున్న బీసీ నాయకులపై దాడులను ప్రోత్సహించడం ఆయన చేసిన ఘోర తప్పిదమని వైఎస్సార్సీపీ జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు మహంతి జనార్దన్ హెచ్చరించారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై టీడీపీ గుండాలు, నాయకులు చేసిన దాడిని, హత్యాప్రయత్నాలను ఖండించారు. బీసీలపై జరుగుతున్న దాడులకు నిరసనగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో విజయనగరం కలెక్టరేట్ కూడలి వద్ద ఉన్న జ్యోతీరావు పూలే విగ్రహం వద్ద గురువారం నిరసన చేపట్టారు. ముందుగా మహా త్మా జ్యోతీరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులంతా నివాళులర్పించారు. అనంతరం బీసీ నాయకునిపై జరిగిన దాడికి నిరసనగా సీఎం చంద్రబాబు డౌన్డౌన్... బీసీల ఐక్యత వర్ధిల్లాలి, బీసీలపై దాడులు సిగ్గుసిగ్గు అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఏడాది వ్యవధిలోనే ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న చంద్రబాబు, తాజాగా ప్రకటించిన ఉపఎన్నికల్లో ఓటమి భయంతో దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. ఈవీఎంల ట్యాంపరింగ్తో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మరల అటువంటి చర్యలకు ఆస్కారం లేదని, ఓడిపోతే పరువుపోతుందన్న భయం పట్టుకుందంటూ ఆరోపించారు. రాబోయే రోజుల్లో బీసీలంతా ఐకమత్యంగా ఉండి ప్రభుత్వ ప్రజా వ్యతి రేక విధానాలను ఎండగడతామన్నారు. ●వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ విభాగం ఉపాధ్యక్షుడు బర్రి చిన్నప్పన్న మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియను ఓటమి భయంతో చంద్రబాబు అతని అనుచరులతో అల్లకల్లోలం సృష్టించేందుకు ప్రయత్నించారన్నారు. గెలుపుకోసం ఎన్ని అడ్డదారులు తొక్కినా.. ప్రజలు మాత్రం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంట ఉంటారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ విభాగం ప్రధాన కార్యదర్శులు బమ్మిడి అప్పలనాయుడు, బొమ్మి శ్రీను, పార్టీ జిల్లా నాయకులు వర్రి నరసింహమూర్తి, ఎస్.బంగారునాయుడు, అల్లు అవినాష్, కె.సాయికుమార్, డోల మన్మథకుమార్, పతివాడ కృష్ణవేణి, కె.శ్రీనివాస్, డి. కొండబాబు, ఎ.వేణు, ఎంపీపీ అప్పలనాయుడు, కె.త్రినాథ్, జి.సూర్యప్రకాశ్, లంక వెంకటరావు, అప్పలకృష్ణ పాల్గొన్నారు. రాష్ట్రంలో 50 శాతం ఓటర్లు ఉన్న బీసీలపై దాడులా...? బీసీలు కన్నెర్ర చేస్తే టీడీపీ బంగాళాఖా తంలో కలిసిపోవడం ఖాయం వైఎస్సార్సీపీ జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు మహంతి జనార్దన్ కడప ఎమ్మెల్సీ రమేష్యాదవ్పై దాడిని ఖండించిన జిల్లా వైఎస్సార్సీపీ నాయకులు జిల్లా కేంద్రంలోని జ్యోతిరావుపూలే విగ్రహం వద్ద నిరసన -
నేను తాగుతూ ఉంటా.. బయట తాళం వేయండి..!
● మద్యం మత్తులో సిబ్బందికి వంగర తహసీల్దార్ హుకుం వంగర: మద్యం మందిరంగా తన చాంబర్ను మార్చిన ఒక తహసీల్దార్ ఉదంతమిది. ప్రజలను తీవ్ర ఆగ్రహానికి గురిచేసిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా వంగర మండల తహసీల్దార్ హరిరమణారావు తన చాంబర్లో గురువారం మద్యం మత్తులో ఊగిపోయారు. కార్యాలయ సిబ్బందితో ‘నేను లోపలే ఉంటాను.. మీరు బయట వ్యక్తులను లోపలకు పంపకుండా తాళం వేయాలి’ అంటూ అంతకుముందు ఆదేశించారు. అనంతరం ఆయన తన గదిలో మద్యం తాగుతూ మత్తులోకి జారుకున్నారు. ఈ తతంగాన్ని వివిధ పనులపై కార్యాలయానికి వచ్చిన వ్యక్తులు గమనించి మీడియాకు సమాచారం అందించారు. మీడియా సిబ్బంది అక్కడకు చేరుకుని సిబ్బందితో గది తాళాలు తీయించారు. ఊగిపోతూ కనిపించిన తహసీల్దార్ను చూసి అవాక్కయ్యారు. ఇటీవల ఏఎంసీ వైస్ చైర్మన్ పదవి దక్కించుకున్న అరసాడ గ్రామానికి చెందిన లచ్చుభక్తు ధనలక్ష్మిని కలిసేందుకు గురువారం తాహసీల్దార్ తన సిబ్బందితో వెళ్లారు. అక్కడ నుంచి తిరిగి వచ్చిన తహసీల్దార్ తన చాంబర్కు వెళ్లి మద్యం తాగినట్టు సమాచారం. అయితే కార్యాలయానికి ప్రతి నిత్యం తహసీల్దార్ మద్యం సేవించి వస్తున్నారని, కార్యాలయంలో కూడా మద్యం తాగి నిద్రిస్తుండడం పరిపాటిగా మారిందని సిబ్బంది చెబుతుండడం గమనార్హం. ఈ విషయంపై ఆర్డీఓ ఆశయ్య, తహసీల్దార్ హరిరమణారావును ఫోన్లో సంప్రదించే ప్రయత్నం చేసినా లిఫ్ట్ చేయలేదు. కాగా ఈ ఘటనపై కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్పందించారు. వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీస్ జారీచేశారు. -
ప్రైవేటు విద్యపై పర్యవేక్షణ లోపం
● గుర్తింపులేని ప్రైవేటు పాఠశాలపై కలెక్టరేట్కు ఫిర్యాదుల వెల్లువ ● ఈ విద్యాసంవత్సరంలో పీజీఆర్ఎస్కు 57 ఫిర్యాదులు ● ఒక స్కూల్కి గుర్తింపు తీసుకొని నాలుగు స్కూళ్లు నడుపుతున్న వైనం ● ప్రభుత్వ పాఠశాలల పిల్లలే లక్ష్యంగా ప్రవేశాల గాలం విజయనగరం అర్బన్: ‘అనుమతులు లేకుండా విజయనగరం జిల్లా కేంద్రం నడిబొడ్డున చైతన్య భారతి ప్రైవేటు విద్యాలయం నిర్వహిస్తున్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావినతుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో రెండుసార్లు ఫిర్యాదుచేశారు. రెండోసారి ఫిర్యాదు రావడంతో విద్యాశాఖ అధికారులపై కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సీరియస్ అయ్యారు. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండునెలలు కావస్తోందని, ఇంతవరకు క్షేత్రస్థాయి పరిశీలన చేయలేదా? అంటూ ఆగ్రహించారు. ఆయన ఆదేశాల మేరకు తనిఖీ చేసిన అధికారులు చైతన్య భారతి స్కూల్కు గుర్తింపులేదని నిర్ధారించి సీల్వేశారు. జిల్లా కేంద్రంలోనే ఎలాంటి గుర్తింపులేకుండా పాఠశాలలు నిర్వహిస్తుంటే జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో పరిస్థితి ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. విద్యార్థుల భవితవ్యం ఏమవుతోందన్న అంశం చర్చనీయాంశంగా మారింది.’ ఫిర్యాదులు వస్తున్నా... ప్రస్తుత విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి ఇంతవరకు వివిధ పాఠశాలలపై వివిధ సమస్యలపై పీజీఆర్ఎస్కు 57 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో అత్యధికం తల్లికి వందనం ఉంటే ప్రైవేటు స్కూళ్ల అక్రమ ఫీజుల వసూళ్లు, అసౌకర్యాలపై అధిక వినతులు అందాయి. విద్యాశాఖ అధికారుల క్షేత్రస్థాయి పర్యవేక్షణ లేకపోవడం వల్లే వసతుల లేమిపైనా ఫిర్యాదులు అందుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలు 434 నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు. అయితే, చాలా పాఠశాలకు మైదానాలు, తాగునీటి సదుపాయం, గ్రాంథాలయాలు, పక్కా భవనాలు వంటివి లేవు. కొన్ని పాఠశాలలు పూర్తిగా రేకులషెడ్లలోను, పెట్రోల్ బంకుల సమీపంలో నిర్వహిస్తున్నారు. ఒక స్కూల్ గుర్తింపుతో నాలుగు స్కూళ్ల ఏర్పాటు బొబ్బిలి, విజయనగరం, చీపురుపల్లి, ఎస్.కోట, కొత్తవలస ప్రాంతాలతో పాటు వివిధ మండల కేంద్రాల్లో కొన్ని కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలు నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయి. ఒక అనుమతి తీసుకుని, పట్టణంలోగాని పక్క మండల కేంద్రంలోగాని ఒకే సంస్థ పేరుతో మూడు నుంచి నాలుగు శాఖలను నడుతున్నాయి. ప్రత్యేకించి రాష్ట్ర వ్యాప్తంగా పేరు పొందిన రెండు సంస్థలు ఇదే పద్ధతిలో విద్యాలయాలు నిర్వహిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. వీటి వెనుక ఉన్న రాజకీయ నేతల అండదండలతో వాటిజోలికెళ్లేందుకు అధికారులు భయపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ మండల కేంద్రాలు, పెద్ద గ్రామాల్లో సుమారు 29 పాఠశాలలు గుర్తింపు లేకుండా నిర్వహిస్తున్నట్టు సమాచారం.గుర్తింపులేని స్కూళ్లపై చర్యలు తీసుకుంటాం విద్యాసంవత్సరం ప్రారంభమైనందున కొత్తగా పాఠశాలలకు అనుమతి, గుర్తింపు ఇవ్వడం లేదు. గుర్తింపులేని స్కూళ్లపై చర్యలు తీసుకుంటాం. సరైన నిబంధనలు అమలు చేయని పాఠశాలలు ఉంటే వాటి గుర్తింపును రద్దు చేస్తాం. పాఠశాలలను తనిఖీ చేయడంతోపాటు నిబంధనలు అమలయ్యేలా చూస్తాం. – యు.మాణిక్యంనాయుడు, డీఈఓ -
గాయత్రీమాతకు పసుపు కొమ్ములతో అలంకరణ
రాజాం సిటీ: రాజాం గాయత్రికాలనీలో వెలసి న గాయత్రిమాతను పసుపు కొమ్ములతో ఆల య ధర్మకర్త కొండవేటి వివేకానంద, ఆలయ అర్చకులు వాస జగదీశ్వరరావు గురువారం అలంకరించారు. శ్రావణ మాసంలో వచ్చే మూడో శుక్రవారాన్ని పురస్కరించుని అమ్మవారిని అలంకరించినట్టు అర్చకులు తెలిపారు. వైవాహిక బంధంపై అవగాహన కల్పించాలి విజయనగరం ఫోర్ట్: అమ్మాయి, అబ్బాయిలకు వైవాహిక బంధంపై అవగాహన కల్పించిన తర్వాతే పెళ్లిజరిపించాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలోని వన్స్టాప్ సెంటర్లో గురువారం కొత్తగా ప్రీ మేరిటల్ కౌన్సెలింగ్ సెంటర్ను ప్రారంభించారు. దీనిపై రుపొందించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. పెళ్లి చేసుకోబోయే అమ్మా యి, అబ్బాయి ఈ కేంద్రాన్ని సంప్రదిస్తే పెళ్లి గురించి, ఆ తర్వాత కలిగే లాభనష్టాలపై అవగాహన కల్పిస్తారన్నారు. దీనివల్ల వివాహ జీవి తం ఆనందంగా సాగించేందుకు అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ విమలారాణి, డీఎల్ఓ డాక్టర్ రాణి, సెంటర్ ఆడ్మినిస్ట్రేటర్ సాయి విజయలక్ష్మి పాల్గొన్నారు. సీసీ కెమెరాలతో నిఘా విజయనగరం క్రైమ్: విజయనగరం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం కొత్తగా 16 సీసీ కెమెరాలను అమర్చారు. నేర నియంత్రణలో భాగంగా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాల మేరకు వైఎస్సార్ నగర్, మెడికల్ కాలేజ్, కాటవీధి, డబుల్ కాలనీ తదితర చోట్ల సీసీ కెమెరాలు పెట్టామని సీఐ శ్రీనివాస్ తెలిపారు. వీటి సాయంతో నేర ప్రవృత్తికలిగిన వ్యక్తుల కదలికలపై నిఘావేస్తామన్నారు. పంచాయతీలకు నిధులు రాక ఇబ్బందులు ● జెడ్పీ సీఈఓ సత్యనారాయణ రామభద్రపురం: పంచాయతీలు, మండల పరిషత్లకు 15వ ఆర్థిక సంఘం నిధులు సకాలంలో రాకపోవడంతో గ్రీన్ అంబాసిడర్లకు వేతనా లు ఇవ్వలేక ఇబ్బందులు పడుతున్నది వాస్తవమేనని జెడ్పీ సీఈఓ బి.వి.సత్యనారాయణ అన్నారు. రామభద్రపురం మండలంలోని బూసాయవలస, ముచ్చర్లవలస గ్రామాలను ఆయన గురువారం సందర్శించారు. పారిశు ద్ధ్య పనులు, తాగునీటి పథక పనులను పరిశీ లించారు. ఇంటింటి చెత్త సేకరణ తీరును ఆయా గ్రామాల మహిళలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి పథకాల శుభ్రత తేదీలు తెలిపేలా బోర్డులు ఏర్పాటుచేయాలని సిబ్బందిని ఆదేశించారు. క్లాప్ మిత్రలకు వేతన బకాయి లు లేకుండా చూడాలన్నారు. అనంతరం స్థాని క విలేకరులతో మాట్లాడుతూ గ్రామాల్లో సుస్థ ర అభివృద్ధే లక్ష్యంగా 30 నుంచి 40 మంది మహిళలతో క్లస్టర్ ఏర్పాటు చేసి వారిలో ఒకరి ని క్లస్టర్ కోఆర్డినేటర్ నియమిస్తూ పరిశుభ్రత పై అవగాహన కల్పించేలా శిక్షణ ఇస్తామన్నా రు. ఈ నెలలో 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీడీఓ సీహెచ్ సన్యాసిరా వు, వెంకటరమణ, పాల్గొన్నారు. -
పల్లెనిద్రతో ప్రజలకు భరోసా
విజయనగరం క్రైమ్: క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలను భాగస్వాములను చేయడమే లక్ష్యంగా ‘పల్లె నిద్ర’ కార్యక్రమం చేపట్టామని ఎస్పీ వకుల్ జిందల్ బుధవారం తెలిపారు. ప్రతి నెలలో రెండు గ్రామాల్లో ’పల్లె నిద్ర’ చేయాలని ఎస్సైలు, సీఐలను ఆదేశించామని ఎస్పీ అన్నారు. ప్రజలతో మమేకమై, వారి సమస్యలను తెలుసుకుంటూ, వివిధ నేరాలు, చట్టాల మీద అవగాహన కల్పిస్తున్నామన్నారు. జిల్లాలోని ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలోగల గ్రామం లేదా వార్డులో ఎస్సై లేదా సీఐ స్థాయి అధికారులు, దత్తత గ్రామాల కానిస్టేబుల్స్ ‘పల్లె నిద్ర’ చేపట్టే విధంగా అధికారులను ఇప్పటికే ఆదేశించామని ఎస్పీ వకుల్ జిందల్ స్పష్టం చేశారు. ‘పల్లె నిద్ర’ కార్యక్రమంతో ప్రజలకు పోలీసు వ్యవస్థపై నమ్మకాన్ని పెంచుతున్నామన్నారు. నేరాల నియంత్రణ, ప్రజల సహకారంతో పోలీసింగ్ను మరింత బలోపేతం చేయడమే ‘పల్లె నిద్ర’ ప్రధాన లక్ష్యమన్నారు. జిల్లాలో ‘వల్లె నిద్ర’ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 300 గ్రామాల్లో పోలీసు అధికారులు కార్యక్రమం చేపట్టారని తెలిపారు. ఎస్పీ వకుల్ జిందల్ -
ఉపాధికోసం వెళ్లి..!
పాలకొండ రూరల్: నగరపంచాయతీ పరిధి జంగాలవీధిలో నివాసముంటున్న దేవళ్ల శంకరరావు, ఉషారాణి దంపతుల ఒక్కగానొక్క కుమారుడు సందీప్(24) హైదరాబాద్లో జరిగిన ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. సందీప్ డిగ్రీ వరకూ చదువుకున్నాడు. ఉపాఽధి మార్గంలో భాగంగా తనకు ఇష్టమైన హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేశాడు. ఈ క్రమంలో ఆరు నెలల క్రితం ఉద్యోగ అన్వేషణలో హైదరాబాద్ చేరాడు. అక్కడి జూబ్లీహిల్స్లో గల ఓ కేఫ్లో కొలువు పొందాడు. కొడుకు అందుకొస్తున్నాడని తల్లిదండ్రులు భావిస్తున్న తరుణంలో విధి కన్నుకుట్టింది. కేఫ్ యాజమాన్యం సమకూర్చిన మూడంతస్తుల భవనంలో వసతి పొందుతున్న సందీప్ బుధవారం ఉదయం 5 గంటల సమయంలో భవనం పైనుంచి జారి పడిపోయాడు. ఈ విషయాన్ని సందీప్ సహచరులు పాలకొండలో ఉన్న తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. విషయం తెలుసుకుని ఉలిక్కిపడిన వారు హుటాహుటిన హైదరాబాద్ పయనమయ్యారు. సందీప్ తలకు గాయం కావడంతో గాంధీ ఆస్పత్రికి అంబులెన్స్లో తరలిస్తున్నట్లు సహచరులు తెలియజేయడంతో కంగారు పడ్డారు. ఇంతలో సందీప్ తుదిశ్వాస విడిచాడన్న వార్త తెలియగానే షాక్కు గురైనట్లు తండ్రి శంకరరావు తెలిపాడు. తాను టైలరింగ్ చేస్తూ, తన భార్య మెప్మాలో అత్యంత చిన్న ఉద్యోగం చేస్తూ రెక్కల కష్టంపై పిల్లలను అల్లారు ముద్దుగా పెంచామని, వారి భవిష్యత్తు కోసం కన్న కలలు తీరకుండానే తిరిగిరాని లోకానికి చెయ్యెత్తు కొడుకు వెళ్లిపోయాంటూ తల్లిదండ్రులు రోదించారు. ఈ విషయం తెలియడంతో స్థానిక జంగాల వీధితోపాటు మృతుని బంధువులు, స్నేహితుల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. -
వృద్ధుడి అదృశ్యం
విజయనగరం క్రైమ్ : నగరంలోని ఇందిరానగర్ లో నివాసముంటున్న పతివాడ కాశయ్య (69) అదృశ్యమైనట్లు బుధవారం విజయనగరం వన్ టౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. కాశయ్య కొడుకు తిలక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్టేషన్ హెచ్సీ అప్పలనాయుడు కేసు నమోదు చేయగా సీఐ ఆర్వీకే చౌదరి దర్యాప్తు ప్రారంభించారు.గత నెల 23న ఇంటి నుంచి వెళ్లిపోయిన కాశయ్య ఇప్పటివరకు ఇంటికి తిరిగాలేదని కొడుకు తిలక్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా కాస్త మతిస్థిమితం లేదని ఇంట్లో గొడవపడి గత నెలలోనే ఇంటి నుంచి వెళ్లిపోయాడన్నారు. క్రైమ్ పార్టీ కాశయ్య కోసం వెతుకులాట చేపట్టారని సీఐ చౌదరి ఈ సందర్భంగా చెప్పారు -
హెచ్సీ కుటుంబానికి ఆర్థిక సహాయం
డెంకాడ: రోడ్డు ప్రమాదంలో మరణించిన చింతలవలస ఐదవ ఏపీఎస్పీ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ కోరాడ రామునాయుడు కుటుంబానికి పోలీస్ వాట్సాప్గ్రూప్ సభ్యులు రూ.లక్షా 50వేల 662ల ఆర్థిక సహాయం చేశారు. ఏపీ పోలీస్ వాట్సాప్ గ్రూపులోని సభ్యులు వితరణగా ఇచ్చిన మొత్తాన్ని మృతుడు హెచ్సీ రామునాయుడు కుటుంబ సభ్యులకు బుధవారం అందజేశారు. కార్యక్రమంలో గ్రూపు సభ్యులు లెంక రాము, మిత్తిరెడ్డి అప్పలనాయుడు, శీర గణేష్, అక్కుపల్లి గోవింద, మజ్జి కూర్మారావు, గొర్లె శ్రావణ్కుమార్, మీసాల చంద్రమౌళి, కల్యాణపు అప్పలనాయుడు, వైస్ ఎంపీపీ పిన్నింటి తమ్మునాయుడు తదితరులు పాల్గొన్నారు.16న రాష్ట్రస్థాయి క్విజ్ పోటీలుకొత్తవలస: మండలంలోని అప్పన్నపాలెం గ్రామంలో శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా 16వ తేదీన రాష్ట్రస్థాయి క్విజ్ పోటీలను నిర్వహించ నున్నట్లు ఉత్తరాంధ్ర క్విజ్ మాస్టర్ కర్రి రాము బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలు 16వ తేదీన ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయన్నారు.అన్ని రకాల పోటీ పరీక్షలు రాసేందుకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు అర్హులని తెలిపారు . ఆరుగురు అభ్యర్థులు ఒక గ్రూప్గా ఏర్పండి పోటీల్లో పాల్గొన వచ్చన్నారు. హైటెక్ విజయరహస్యం–2025 మ్యాగజైన్, ఇంగ్లీష్, కరెంట్ అఫెర్స్ తదితర అంశాలపై పోటీలు ఉంటాయన్నారు. పోటీల్లో గెలుపొందిన గ్రూప్లకు వరుసగా రూ.5వేలు, రూ.4వేలు, రూ 3వేలు, రూ.2వేలు నగదు బహుమతి ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.ఈ పోటీలు గ్రామ మాజీ సర్పంచ్ తిక్కాన చిన్నదేముడు ఆర్థిక సహాయంతో నిర్వహించనున్నట్లు చెప్పారు. 9న జిల్లా స్థాయి యోగా పోటీలువిజయనగరం: జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 9న జిల్లా స్థాయి యోగా పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు అవనాపు విక్రమ్ బుధవారం తెలిపారు. ఆ రోజు ఉదయం 8 గంటలకు విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో గల తోటపాలెం గాయత్రి టెక్నో స్కూల్లో ఎంపిక పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. సబ్జూనియర్, జూనియర్, సీనియర్స్ విభాగాల్లో 8 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల వారికి ఎంపికలు జరుగుతాయని తెలిపారు. పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు తమ పేర్లను 8వ తేదీ సాయంత్రం లోగా నమోదు చేసుకోవాలని సూచించారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెంలో నిర్వహించే రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో పాల్గొంటారని, రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారు, మైసూర్ (కర్ణాటక)లో నిర్వహించే జాతీయస్థాయి యోగా పోటీల్లో పాల్గొంటార ని వివరించారు. జిల్లా స్థాయి యోగా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు పేర్ల నమోదు, మరిన్ని వివరాలకు ఫోన్ 8374904262,7993696087 నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
జాతీయలోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి
విజయనగరం లీగల్: జాతీయ లోక్ అదాలత్ను చిట్స్ అండ్ ఫైనాన్స్ కంపెనీలు, జాతీయ, ప్రైవేట్ బ్యాంకులు సద్విని యోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత అన్నారు. ఈ మేరకు బుధవారం జిల్లా కోర్టు సముదాయంలో ప్రముఖ చిట్ఫండ్ కంపెనీల బ్యాంక్ మేనేజర్లు, బ్యాంకులకు సంబంధించిన అధికారులు, కంపెనీ న్యాయవాదులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిట్ కంపెనీలకు, బ్యాంక్కు సంబంధించిన కేసులను సెప్టెంబర్ 13న జరగబోయే జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ సంఖ్యలో పరిష్కరించుకోవచ్చన్నారు. పెండింగ్లో ఉన్న బ్యాంకు దావాలను ఎక్కువ కేసులను రాజీ చేయాలని కంపెనీలకు సంబంధించిన బ్రాంచ్ మేనేజర్, బ్యాంక్ మేనేజర్లకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా న్యా య సేవ అధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్, లీడ్ బ్యాంక్ మేనేజర్, మార్గదర్శి చిట్ఫండ్స్, కపిల్ చిట్ఫండ్స్ శ్రీరామ్ చిట్ఫండ్స్, శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ బ్రాంచ్ మేనేజర్లు పాల్గొన్నారు. -
పీఏసీఎస్లకు పర్సన్ ఇన్చార్జ్లు
● ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ● జిల్లాలో మొత్తం పీఏసీఎస్లు 42 ● 18 సొసైటీలకు గతంలో త్రీమెన్ కమిటీ నియామకం ● మిగిలిన 24 సొసైటీల్లో కొలిక్కిరాని కమిటీలు ● 24 సొసైటీలకు పర్సన్ ఇన్చార్జ్ల నియామకంవీరఘట్టం: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పీఏసీఎస్లలో నామినేటెడ్ పదవులు వస్తాయని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. పార్వతీపురం మన్యం జిల్లాలోని పలు చోట్ల సొసైటీల్లో త్రీమెన్ కమిటీ నియామకాలకు కూటమిలో ఏర్పడిన కుమ్ములాటలతో పీఏసీఎస్లో చైర్మన్ కుర్చీలు ఖాళీగా మిగిలాయి. ముఖ్యంగా జిల్లాలోని పాలకొండ, పార్వతీపురం డివిజన్లలో ఈ నియామకాలు ఆగిపోయాయి. మిగిలిన చోట్ల నెల రోజుల క్రితమే త్రీమెన్ కమిటీలను ఎమ్మెల్యేల సిఫార్సులతో నియమించారు. చైర్మన్ కుర్చీలు ఖాళీగా ఉన్న చోట ఆ ఖాళీలను భర్తీ చేసేందుకు ఈనెల 1న ప్రభుత్వం పర్సన్ ఇన్చార్జ్లను ఈ సొసైటీలకు నియమించింది. ఆరు నెలల పాటు 2026 జనవరి 30 వరకు పర్సన్ ఇన్చార్జ్లు ఇక్కడ ప్రత్యేకాధికారులుగా వ్యవహరించేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో చాలా రోజులుగా పీఏసీఎస్లలో చైర్మన్ పదవి వస్తుందని ఆశించిన వారికి నిరాశే మిగిలిందని పలువురు చర్చించుకుంటున్నారు. ఇదీ పరిస్థితి..జిల్లాలో 42 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘా(పీఏసీఎస్)లు ఉన్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పీఏసీఎస్లలో నియమించిన త్రీమెన్ కమిటీలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 జూన్ 28న స్వచ్ఛందంగా తప్పుకున్నారు.దీంతో గత 14 నెలలుగా పీఏసీఎస్లలో త్రీమెన్ కమిటీలు లేక పాలన గాడి తప్పుతోంది. ఈ క్రమంలో గతేడాది అన్ని సొసైటీలకు ఆరు నెలల పాటు ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. తొలుత పీఏసీఎస్లకు ఎన్నికలు నిర్వహించాలని ఆలోచన చేసిన ప్రభుత్వం తర్వాత నామినేటెడ్ పద్ధతిలో త్రీమెన్ కమిటీలను నియమించాలని ఆలోచన చేసింది. దీంతో జిల్లాలోని ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫార్సులతో 18 పీఏసీఎస్లకు నెలరోజుల క్రితం త్రీమెన్ కమిటీలు నియమించారు. చైర్మన్ పదవి కోసం అటు టీడీపీ, ఇటు జనసేన నేతల మధ్య పోటీ ఏర్పడడంతో జిల్లాలో 24 పీఏసీఎస్లలో త్రీమెన్ కమిటీ నియామకాల కోసం ఎమ్మెల్యేలు, మంత్రులు కుస్తీ పడుతున్నారు. ఇంతలో ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ప్రత్యేకాధికారులను మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో ఆశావహులు కంగుతిన్నారు. 24 పీఏసీఎస్లకు ప్రత్యేధికారులు..పాలకొండ నియోజకవర్గంలో 8 పీఏసీఎస్లు ఉండగా ఇక్కడ ఏ ఒక్క సొసైటీలో కూడా త్రీమెన్ కమిటీలను నియమించలేకపోయారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణకు, టీడీపీ ఇన్చార్జ్ భూదేవిల మద్య సయోద్య కుదరకపోవడంతో సొసైటీల్లో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయలేకపోయారని అందరూ చర్చించుకుంటున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలోని భామిని, బత్తిలి, అర్ధలి, బాసూరు, పాలకొండ, ఆర్బీఆర్.పేట, తంపటాపల్లి, వీరఘట్టంలో త్రీమెన్ కమిటీలు వేయలేదు. అలాగే పార్వతీపురం డివిజన్లోని గరుగుబిల్లి, చినమేరంగి, కృష్ణపల్లి, పలగర, గలావిల్లి, అజ్జాడ, బూర్జ, సీతానగరం, కాశీపేట, గెడ్డలుప్పి, పార్వతీపురం, తామరఖండి, అంటిపేట, ఆర్.వెంకమ్మపేట, మరిపివలస, పాపమ్మవలస సొసైటీలకు కూటమి నాయకులు త్రీమెన్ కమిటీలను వేయకపోవడంతో ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది.ప్రత్యేకాధికారులను నియమించారు జిల్లాలో త్రీమెన్ కమిటీలు లేని 24 సొసైటీలకు ప్రభుత్వం పర్సన్ ఇన్చార్జ్లను నియమించింది.వచ్చే ఏడాది జనవరి 30 వరకు ఇన్చార్జ్లు ఉంటారు.ఒక వేళ ఇంతలో త్రీమెన్ కమిటీలు వస్తే పర్సన్ ఇన్చార్జ్లు మరి ఉండరు. పి.శ్రీరామమూర్తి, జిల్లా కోపరేటివ్ అధికారి -
గిరిజన రైతుల హక్కులు కాలరాస్తే సహించం
● సాగుచేసిన భూములు వారి స్వాధీనంలోనే ఉండాలి ● మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, ● మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు ● కాకర్లవలస, కారేడువలసలో భూముల పరిశీలనరామభద్రపురం: ఎన్నోఏళ్లుగా సాగులో ఉన్న భూములపై సర్వ హక్కులు గిరిజన రైతులవేనని వారి హక్కులను కాలరాస్తే సహించేది లేదని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు హెచ్చరించారు. ఈ మేరకు రామభద్రపురం మండలంలోని కాకర్లవలస, కారేడువలస గిరిజన రైతులు చాలా రోజులుగా భూసమస్యలపై పోరాడుతున్న సమాచారం తెలుసుకున్న వారు బుధవారం ఎంపీపీ చొక్కాపు లక్ష్మణరావు, పలువురు వైఎస్సార్సీపీ నాయకులతో కలిిసి ఆయా భూములను పరిశీలించారు.ఈ భూముల్లో ఎప్పటి నుంచి సాగులో ఉన్నారు? మీ దగ్గర నుంచి తీసుకునేటప్పుడు మీకు నోటీసులు ఇచ్చారా లేదా? అని ఆరా తీస్తూ గిరిజన రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏపీఐఐసీ అధికారులు, ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు కోసం పేదల పొట్టగొడుతూ మేము ఎన్నో ఏళ్లుగా కష్టపడి సాగుచేసుకుంటున్న పంటలు సైతం దౌర్జన్యంగా నాశనం చేయడంతో పాటు లాక్కుంటున్నారని గిరిజన రైతులు వారి దృష్టికి తీసుకెళ్లారు.అలాగే దశాబ్దాల కాలంగా మేము సాగులో ఉన్న ఇవే భూములకు పట్టాలు ఇవ్వాలని పోరాటాలు చేస్తే రెవెన్యూ అధికారులు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చారని వారి వద్ద గిరిజన రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ అధికారం ఉపయోగించి పోలీసుల సహకారంతో దౌర్జన్యంగా చేసి గిరిజనులను భయపెట్టడం సమంజసం కాదన్నారు. ఆరుగాలం కష్టపడి పెంచుకుంటున్న మామిడి తోటలు, జీడి తోటలు, మొక్కజొన్న, పత్తి పంటలు ధ్వంసం చేయడానికి ఏపీఐఐసీ అధికారులకు మనసు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. తాము అభివృద్ధికి అడ్డుకాదని, ప్రభుత్వ ప్రయోజనాలు, ప్రజాప్రయోజనాల కోసమో సాగుభూముల్లో పనులు చేస్తే పద్ధతిని పాటిస్తూ ముందుకెళ్లాలన్నారు. పాలన ఇలాగేనా? ఇక్కడ పంచాయతీ సర్పంచ్కు గాని, గిరిజన రైతులకు కానీ కనీస సమాచారం ఇవ్వకుండా ఎలా లాక్కుంటారని ప్రశ్నించారు. గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని,గిరిజన ప్రజలకు మంచి చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లు ఇలాగేనా పాలించేది అని ప్రశ్నించారు. 2009లో వనసంరక్షణ కింద అప్పటి కలెక్టర్ వీర బ్రహ్మయ్య గిరిజనులకు పట్టాలు ఇచ్చారని,అప్పటికే ఎన్నో ఏళ్ల నుంచి బీడు భూములను బాగు చేసుకుని గిరిజన రైతులు సాగులో ఉంటే ఇప్పుడు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. గిరిజన రైతులేమీ దొంగతనంగా ఆక్రమించుకోలేదన్నారు. దౌర్జన్యంగా ధ్వంసం చేసిన పంటలకు నష్టపరిహారం ఇవ్వడంతో పాటు గిరిజన రైతులకు కొండ ప్రాంతంలో కాకుండా ఈ భూములకే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గిరిజన రైతులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ చొక్కాపు లక్ష్మణరావు, గ్రామ సర్పంచ్ మజ్జి రాంబాబు, మండల జేసీఎస్ కన్వీనర్ చింతల సింహాచలం నాయుడు, మండల యూత్ అధ్యక్షుడు పత్తిగుళ్ల ఏక్నాథ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ కిర్ల చంద్రశేఖర్ సీఐటీయూ నాయకుడు బలస శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
గుర్తుతెలియని మృతదేహం లభ్యం
విజయనగరం క్రైమ్: విజయనగరం రైల్వేస్టేషన్ ఫ్లాట్ ఫాం నంబర్ 5పై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని బుధవారం జీఆర్పీ సిబ్బంది గమనించారు. మృతుడి వయస్సు 50 నుంచి 55 ఉంటుందని సుమారు ఆరడుగుల ఎత్తు, సిమెంట్ రంగు షర్ట్ , నీలిరంగు ఫ్యాంట్ ధరించిన వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్నామని జీఆర్పీ హెచ్సీ అశోక్ తెలిపారు. మృతుడి కుడి చేతికి ఎర్రటి తాడు ఉందని సదరు వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే ఫోన్ 9490617089, 6301365605 నంబర్లకు కానీ ల్యాండ్ లైన్ 08912883218 నంబర్కు కానీ ఫోన్ చేయాలని హెచ్సీ అశోక్ తెలిపారు. -
నిందితుడి కోసం తీవ్ర గాలింపు
కొత్తవలస: మండలంలోని ముసిరాం గ్రామంలో నాటు తుపాకీతో తన సమీప బంధువును మంగళవారం సాయంత్రం కాల్చి పరారైన నిందితుడు సిమ్మ అప్పారావు (35) ఆచూకీ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఈ మేరకు ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగినట్లు సీఐ షణ్ముఖరావు తెలిపారు. ముసిరాం గ్రామానికి చెందిన సిమ్మ అప్పారావును అనకాపల్లి జిల్లా కోటపాడు మండలం పాతవలసకు చెందిన సిమ్మ అప్పారావు మంగళవారం తుపాకీతో కాల్చి చంపిన విషయం పాఠకులకు విదితమే. నిందితుడు అప్పారావు తుపాకీతో కాల్చి తోటల్లోంచి పరెగెత్తుకుంటూ పోయాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి పరుగెత్తుకుంటూ అనకాపల్లి జిల్లా కోటపాడు మండలం గొట్లాం గ్రామం రోడ్డువరకు ద్విచక్రవాహనంపై వెళ్లి అక్కడ బండి దిగి ముసిరాం గ్రామానికి చెందిన సిమ్మ అప్పారావును తుపాకీతో కాల్చి చంపేశానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడని నిందితుడి చినాన్న తెలిపాడు. కాగా తోటల్లోంచి వచ్చిన సమయంలో నిందితుడి వద్ద తుపాకీ లేదని తెలిపాడు. తుపాకీని తోటలోనే ఎక్కడో పడేశాడని పోలీసులు అంచనాకు వచ్చి వెతికేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దించారు. ఉదయం నుంచి గ్రామం సమీపంలో గల జీడి, మామిడితోటల్లో వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. పలు గ్రామాల్లో గల నిందితుడి బంధువుల ఇళ్లల్లోను తనిఖీ చేశారు. అయినా ఆచూకీ లభించలేదు. కాగా నిందితుడికి హెవీ వెహికల్ డ్రైవర్గా పని చేసిన అనుభవం ఉండడంతో గొట్లాం జంక్షన్ నుంచి ఇతర ప్రాంతానికి వెళ్లి పోయి ఉంటాడని స్థానికులు చెబుతున్నారు. పోలీసులకు మాత్రం ఈ కేసు సవాల్గా మారింది. కాగా మృతుడు సిమ్మ అప్పారావు కుమారుడు అంజి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించామని సీఐ షన్ముఖరావు తెలిపారు. సవాల్గా తీసుకున్న పోలీసులు -
అయిన వారు వదులుకున్నారు,.108 సిబ్బంది ఆదుకున్నారు
కొత్తవలస: కష్టపడి పని చేసి కుటుంబాన్ని పోషించిన వ్యక్తి అవసరం తీరిపోవడంతో అయిన వారు వదులుకున్నారు. అయితే ఆ వ్యక్తిని 108 సిబ్బంది ఆదుకున్నారు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. కొత్తవలస మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో ఒక వ్యక్తి సొమ్మసిల్లి పడిపోయాడని స్థానికులు 108 వాహనం సిబ్బందికి సమాచారం అందించారు.దీంతో 108 వాహసం సిబ్బంది టెక్నీషయన్ సీహెచ్.సన్యాసినాయుడు, పైలెట్ విజయ్కుమార్లు 108 వాహనంలో వచ్చి పరిశీలించగా ఆ వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నాడు. వెంటనే ప్రథమ చికిత్స నిర్వహించి విశాఖపట్నం కేజీహెచ్కు తరలించారు.అక్కడికి వెళ్లేసరికి సంబంధిత వ్యక్తికి మెలకువ రావడంతో వివరాలు అడగ్గా తాను ఉప్పల వెంకటరావును. కారు డ్రైవర్నని తెలిపాడు. భార్య,ఇద్దరు ఆడపిల్ల లు ఉన్నారని, పిల్లలకు పెళ్లిళ్లు జరిపించినట్లు తెలిపాడు. తాను ఆనారోగ్యం పాలుకావడంతో కుటుంబసభ్యులు చిన్నచూపు చూడడంతో అక్కడక్కడ తింటూ రోడ్డుపైనే కాలక్షాపం చేస్తున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం ఆ వ్యక్తి పరిస్థితి నిలకడగా ఉందని ఆయన బంధువులకు సమాచారం అందించామని 108 సిబ్బంది తెలిపారు. -
దేశ రాజధాని పెద్దల దృష్టికి జిందాల్ సమస్య
శృంగవరపుకోట: భూములు కోల్పోయి ఉపాధి కరువై రోడ్డున పడిన జిందాల్ పరిశ్రమ నిర్వాసితుల గోడును దేశరాజధానికి తీసుకెళ్లామని ఎమ్మెల్సీ రఘురాజు చెప్పారు. ఈ మేరకు బుధవారం బొడ్డవరలో ఆయన తన స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 45రోజులు రైతులు రోడ్డున పడి ఆందోళన చేస్తుంటే స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, రాష్ట్ర సర్కారులో కనీస స్పందన కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యకు పరిష్కారం చూపాలని, ఢిల్లీలో జాతీయ మానవహక్కుల సంఘం, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల కమిషన్ల చైర్మన్లను కలిసి జిందాల్ రైతాంగ సమస్యలు వివరించామన్నారు. ఎన్హెచ్ఆర్సీ ఇప్పటికే 15 రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ను ఆదేశించినట్లు చెప్పారు. కలెక్టర్ను కలిసి ఆర్అండ్ఆర్ అమలులో జరిగిన లోపాలు, చెల్లింపుల్లో తప్పిదాలను వివరించామన్నారు. జిందాల్ నిర్వాసితులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. -
అంగన్వాడీ కేంద్రాలకు కుళ్లిన గుడ్లు
విజయనగరం ఫోర్ట్: విజయనగరం పట్టణంలోని పలు అంగన్వాడీ కేంద్రాలకు కుళ్లిన గుడ్లు సరఫరా చేయడంపై సిబ్బంది ఆందోళన వ్యక్తంచేశారు. కుళ్లిన గుడ్లను బయటపడేశారు. విజయనగరం అర్బన్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 300 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో కొన్నింటికి కుళ్లిన గుడ్లు సరఫరా అయ్యాయి. గుడ్లును కాంట్రాక్టర్ సరఫరా చేసినప్పుడు సూపర్ వైజర్, సీడీపీఓ పర్యవేక్షించకపోవడమే దీనికి కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కుళ్లిన గుడ్లు సరఫరా చేయడంవల్ల లబ్ధిదారులకు కోతపడే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని అర్బన్ సీడీపీఓ ప్రసన్న వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. డీఎస్ఓగా మురళీనాథ్ విజయనగరం ఫోర్ట్: జిల్లా పౌర సరఫరాల అధికారిగా మురళీనాథ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇప్పటివరకు డీఎస్ఓగా పనిచేసిన మధుసూదనరావు ఉద్యోగవిరమణ పొందారు. ఈ సందర్భంగా డీఎస్ఓ మాట్లాడుతూ లబ్ధిదారులందరికీ రేషన్ సరుకులు అందేలా కృషి చేస్తానన్నారు. రేషన్ పంపిణీలో ఇబ్బందులు లేకుండా చూస్తానని తెలిపారు. గ్యాస్ రాయితీ పొందలేని వారు ఆధార్ అప్డేట్ చేసుకోవాలన్నారు. 13 మంది సచివాలయ సిబ్బందికి షోకాజ్ నోటీసులు విజయనగరం అర్బన్: విధులు సకాలంలో నిర్వహించలేదనే ఆరోపణపై జిల్లాలోని 13 మంది సచివాలయ సిబ్బందికి బుధవారం షోకాజ్ నోటీసులను జిల్లా అధికారులు జారీచేశారు. నిర్దేశించిన రోజుల్లో చేపట్టాల్సిన వివిధ సేవలపై ప్రచారం, వర్క్ ఫ్రమ్ హోం సర్వే, పీ–4 మార్గదర్శకుల సేకరణ వంటి విధులను సకాలంలో నిర్వహించలేదని నోటీస్లో కారణం చూపారు. దీనిపై సచివాలయ సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. పింఛన్ల పంపిణీతో పాటు వివిధ ప్రభుత్వ సర్వేలతో తీరిక లేకుండా పనిచేస్తుంటే నోటీసులు ఇవ్వడం ఎంతమేర సమంజసమని ప్రశ్నిస్తున్నారు. మహిళలకు రక్షణ విజయనగరం ఫోర్ట్: గృహహింసకు గురికాబడిన మహిళలకు జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ, సాధికారత అధికారితో పాటు సోషల్ కౌన్సిలర్, లీగల్ కౌన్సిలర్, డేటా ఆపరేటర్, పోలీస్శాఖ నుంచి ఇద్దరు హోంగార్డ్స్ రక్షణ కల్పిస్తారని సీ్త్ర, శిశుసంక్షేమ శాఖ అధికారి టి.విమలారాణి తెలిపారు. సంబంధిత శాఖ కార్యాలయం కలెక్టరేట్లో ఉందన్నారు. గృహహింసకు గురైన మహిళలు కార్యాలయాన్ని సంప్రదించవచ్చన్నారు. -
ప్రభుత్వ బడుల్లో రెడ్బుక్ రాజ్యాంగమా?
విజయనగరం గంటస్తంభం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారాలోకేశ్ బాధ్యత వహిస్తున్న విద్యాశాఖలో రెడ్బుక్ రాజ్యాంగం అమలుపై విద్యావేత్తలు, మేధావులు, విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే విద్యావ్యతిరేక విధానాలతో ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం... తాజాగా ఈ నెల 1వ తేదీన ఆర్సీ నెం: 30/67/2025ను తీసుకురావడాన్ని తప్పుబడుతున్నారు. ఈ సర్క్యులర్ ప్రకారం పాఠశాలల్లోకి తల్లిదండ్రులకు, ఎస్ఎంసీ సభ్యులు మినహా ఇతరులు ఎవరూ వెళ్లకూడదు. ఎటువంటి ఫిర్యాదులైనా పరిపాలనా విభాగంలోనే ఇవ్వాలి. విద్యార్థులతో మరెక్కడా ఫిర్యాదులు చేయించరాదు. వీటిని విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఆర్టికల్ 19(1)(సి) ప్రకారం దేశ పౌరులకు సంఘాలు ఏర్పా టు చేసుకునే హక్కును రాజ్యాంగం ఇచ్చిందని, ఇది విద్యార్థులకు వర్తిస్తుందని, విద్యార్థి సంఘాలను విద్యాసంస్థలకు దూరం చేస్తే అక్కడి సమస్యలపై ప్రశ్నించేవారు, అధికారులకు తెలియజేసేవారు ఎవరని ప్రశ్నిస్తున్నాయి. 1975లో తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ఎన్ఎస్యూఐ విద్యార్థి సంఘంలో ఉంటూనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టిన విషయాన్ని ఆయన కుమారుడు లోకేశ్ గుర్తించాలని పేర్కొన్నాయి. విద్యార్థి సంఘాల నోరునొక్కేసి ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తే ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాయి. పాఠశాలల్లోకి తల్లిదండ్రులకు, ఎస్ఎంసీ సభ్యులు మినహా మిగిలిన వారికి అనుమతి బంద్ రాజ్యాంగానికి విరుద్ధంగా 30/67/2025 సర్క్యులర్ జారీ రాజ్యాంగ విరుద్ధ సర్క్యులర్ రాజ్యాంగ హక్కులను కూటమి ప్రభుత్వం కాలరాస్తోంది. విద్యా సంస్థల్లో విద్యార్ధి సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు రాజ్యాంగం ఎప్పుడో ఇచ్చింది. దానిని రద్దు చేయడంలో అంతర్యం ఏమిటో చెప్పాలి. రాష్ట్రంలో పాఠశాలల్లో అనేక సమస్యలు పేరుకుపోయాయి. విద్యాశాఖ మంత్రిగా వాటి మీద దృష్టి పెట్టాల్సిన నారా లోకేశ్.. పాఠశాలలో విద్యార్థి సంఘాలను నిషేధించాలంటూ రాజ్యాంగ వ్యతిరేక సర్క్యులర్ జారీ చేయడం తన చేతకానితనానికి నిదర్మనం. – డి.రాము, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు, విజయనగరం విద్యార్థి సంఘాలను అనుమతించకపోవడం దుర్మార్గం విద్యావ్యవస్థలో విద్యార్థి సంఘాల ఏర్పాటు, జోక్యం వంటి హక్కులను రాజ్యాంగం మనకు కల్పించింది. ఆ హక్కును మీ రెడ్బుక్ రాజ్యాంగంతో కాలరాస్తే ఎలా?. విద్యార్థుల సమస్యలపై పోరాటం చేసే సంఘాలను పాఠశాలల కార్యక్రమాల్లో పాల్గొనకుండా చేయడం దుర్మార్గ చర్య. ఇప్పటికైనా ఇటువంటి ప్రజావ్యతిరేక విధానాలు మానుకోవాలి. లేకుంటే పెద్దఎత్తున ఉద్యమానికి సన్నద్ధమవుతాం. – జె.రవికుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు, విజయనగరంరాజ్యాంగ విరుద్ధ సర్క్యులర్ రాజ్యాంగ హక్కులను కూటమి ప్రభుత్వం కాలరాస్తోంది. విద్యా సంస్థల్లో విద్యార్ధి సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు రాజ్యాంగం ఎప్పుడో ఇచ్చింది. దానిని రద్దు చేయడంలో అంతర్యం ఏమిటో చెప్పాలి. రాష్ట్రంలో పాఠశాలల్లో అనేక సమస్యలు పేరుకుపోయాయి. విద్యాశాఖ మంత్రిగా వాటి మీద దృష్టి పెట్టాల్సిన నారా లోకేశ్.. పాఠశాలలో విద్యార్థి సంఘాలను నిషేధించాలంటూ రాజ్యాంగ వ్యతిరేక సర్క్యులర్ జారీ చేయడం తన చేతకానితనానికి నిదర్మనం. – డి.రాము, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు, విజయనగరం విద్యార్థి సంఘాలను అనుమతించకపోవడం దుర్మార్గం విద్యావ్యవస్థలో విద్యార్థి సంఘాల ఏర్పాటు, జోక్యం వంటి హక్కులను రాజ్యాంగం మనకు కల్పించింది. ఆ హక్కును మీ రెడ్బుక్ రాజ్యాంగంతో కాలరాస్తే ఎలా?. విద్యార్థుల సమస్యలపై పోరాటం చేసే సంఘాలను పాఠశాలల కార్యక్రమాల్లో పాల్గొనకుండా చేయడం దుర్మార్గ చర్య. ఇప్పటికై నా ఇటువంటి ప్రజావ్యతిరేక విధానాలు మానుకోవాలి. లేకుంటే పెద్దఎత్తున ఉద్యమానికి సన్నద్ధమవుతాం. – జె.రవికుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు, విజయనగరం -
‘విద్యాశక్తి’పై ఫ్యాప్టో అభ్యంతరం
విజయనగరం అర్బన్: విద్యాశాఖ అమలు చేస్తున్న విద్యాశక్తి కార్యక్రమంపై ఫ్యాప్టో అభ్యంతరం తెలిపింది. మొదట ఐచ్చికంగా ప్రకటించిన కార్యక్రమాన్ని ఇప్పుడు నిర్బంధంగా అమలు చేయడాన్ని ఫ్యాప్టో జిల్లా కమిటీ తప్పుబట్టింది. ఈ మేరకు కమిటీ ప్రతినిధులు డీఈఓ యు.మాణిక్యంనాయుడును బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం డీఈఓ కార్యాలయం బయట ఉపాధ్యాయ సంఘ నాయకులు మాట్లాడుతూ మొదట ఉపాధ్యాయ సంఘాల సమక్షంలో అధికారులు విద్యాశక్తి కార్యక్రమం ఐచ్చికమని స్పష్టంగా చెప్పారని, ఇప్పుడు మార్చి 31 వరకు తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వడం సరికాదన్నారు. ఇప్పటికే 10వ తరగతి విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహిస్తున్న తరుణంలో 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు కూడా అదేరీతిలో తరగతులు నిర్వహించమని చెప్పడం అన్యాయమన్నారు. డీఈఓను కలిసిని వారిలో ఫ్యాప్టో నాయకులు పాల్తేరు శ్రీనివాస్, జేఏవీఆర్కే ఈశ్వరరావు, ఎన్వీ పైడిరాజు, కె.జోగారావు, టి.సన్యాసిరాజు, ఎస్.భాస్కరరావు, కె.శ్రీనివాసరావు, సూరిబాబు, ఎం.ఎ.స్వామి, ఎన్.ఆదివిష్ణు, తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగుల డిమాండ్ల సాధనకోసం వినూత్న నిరసన
విజయనగరం అర్బన్: ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం ఏపీజీఈఏ సంఘం జిల్లా కమిటీ ‘టీ తాగుతూ మాట్లాడుకుందాం’ పేరుతో కలెక్టరేట్ టీ పాయింట్ వద్ద బుధవారం వినూత్న రీతిలో నిరసన తెలిపింది. ఈ సందర్భంగా సంఘ జిల్లా ప్రతినిధులు మాట్లాడుతూ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైమ్స్కేల్ వంటి అంశాల సాధన కోసం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘ నాయకులు కంది వెంకటరమణ, బాలభాస్కర్, సీహెచ్ సతీష్, ఎంటీఎస్ ఉద్యోగులు శంకరరావు, రాంబాబు, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. -
మత్స్యకారులకు బయోమెట్రిక్ కార్డులు తప్పనిసరి
విజయనగరం అర్బన్: తీరప్రాంత రక్షణకు పటిష్ట ఏర్పాట్లు చేస్తామని, మత్స్యకారులకు బయోమెట్రిక్ కార్డులు తప్పనిసరని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. తీరప్రాంత భద్రతపై కలెక్టర్ చాంబర్లో బుధవారం భద్రతా కమిటీ సమావేశం జరిగింది. తీరప్రాంత భద్రతపై కమిటీ పలు ప్రతిపాదనలు చేసింది. విజయనగరం జిల్లాలో 29 కిలోమీటర్ల తీరప్రాంతం ఉందని, దాని కోసం రహదారి ఏర్పాటు, భద్రతా సిబ్బంది గస్తీకి వీలుగా వాచ్టవర్, సముద్రం వెంబడి గస్తీ కోసం రెండు వాహనాలు, 16 సీసీ కెమెరాలు ఏర్పాటుకు కమిటీ ప్రతిపాదించింది. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ బీచ్ కారిడార్ పనుల్లో భాగంగా మన తీరం వెంబడి 29 కిలోమీటర్ల రహదారి కోసం ప్రతిపాదిస్తామని చెప్పారు. తీర ప్రాంత గస్తీ కోసం రెండు వాహనాలు ఒక్కో తీరప్రాంతానికి ఒక వాచ్ టవర్ను సీఎస్ఆర్ నిధుల నుంచి సమకూరుస్తామని చెప్పారు. సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో తీర భద్రత విభాగం విశాఖపట్నం డీఎస్పీ ఎ.ఎం.శ్రీనివాసరావు, తూర్పు తీర నావికాదళ లెఫ్ట్నెంట్ కమాండర్ స్వప్నిల్ చౌహాన్, సీనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఎ.వరప్రసాద్, ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ వెంకటేష్ నాయుడు, మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ విజయకృష్ణ, కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బీవీజీ రాజు పాల్గొన్నారు. -
● వరుణదేవా.. కరుణించరావా..!
● వర్షాకాలంలో మండుతున్న ఎండలు కోట వద్ద గొడుగు నీడలో వ్యాపారం తలపై చున్నీతో పాద చారి వర్షాలతో చల్లని వాతావరణం ఉండాల్సిన సమయంలో భానుడు భగభగమండుతున్నాడు. ఉదయం 10 గంటలైతే చాలు ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు భయపడాల్సిన పరిస్థితి. గొడుగులు, చున్నీలు, మర్ఫీల చాటున బుధవారం రాకపోకలు సాగిస్తున్న విజయనగర పట్టణ వాసులను చిత్రాల్లో చూడొచ్చు. – సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం వరుణుడు కరుణించడం లేదు. భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఈ ప్రభావంతో జిల్లాలోని చాలా ప్రాంతాల్లో వరి వెదలు, నాట్లు, నారుమడులు ఎండిపోతున్నాయి. ఆశ్లేష కార్తె ఆరంభంలో వర్షాలు కురుస్తాయని ఆశించిన రైతన్నకు నిరాశే ఎదురైంది. ఆకాశం వైపు ఆశగా చూస్తున్నా చినుకుజాడ కనిపించడం లేదు. వంగర మండలంలో ఎస్.ఎస్.చానల్ నుంచి సాగునీరు సరఫరా కాకపోవడం, వర్షాలు కురవకపోవడంతో కొప్పర, కె.కొత్తవలస, కొండచాకరాపల్లి తదితర గ్రామాల్లోని సుమారు 800 ఎకరాల్లో వరి వెదలు ఎండిపోతున్నాయి. మరో వారం రోజులు ఇదే పరిస్థితి ఉంటే పంటపై ఆశలు వదులుకోవాల్సిందేనని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. – వంగర ఇప్పుడు ఏ పల్లె, పట్టణం, వీధిలో అయినా మద్యం విచ్చలవిడిగా లభిస్తోంది. బహిరంగ మద్యపానం యథేచ్ఛగా సాగుతోంది. ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. పేద, మధ్యతరగతి కుటుంబాల్లో చిచ్చుపెడుతోంది. వివాదాలకు కారణంగా మారుతోంది. వీటిని కట్టడిచేసేందుకు పోలీసులు డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. బొబ్బిలి సీఐ కె.సతీష్కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది డ్రోన్ కెమెరాలతో పలు ప్రాంతాలను చిత్రీకరించగా టీబీఆర్ థియేటర్ ప్రాంతంలో కాలువ గట్టుపై బహిరంగంగా మద్యం తాగుతున్న వారిని గుర్తించారు. వెంటనే పోలీసులను పంపించి వారిని పట్టుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా, మద్యం సేవించి వాహనాలను నడిపినా కేసులు నమోదుచేస్తామని సీఐ హెచ్చరించారు. – బొబ్బిలి -
కీచకు గురువు అరెస్టు
భోగాపురం: భోగాపురం మండలం గుడివాడ గ్రామంలో ట్యూషన్ సెంటర్ నిర్వాహుకుడు విజయ్కుమార్ ఓ బాలిక పట్ల ఇటీవల అసభ్యకరంగా ప్రవర్తించడం, ఆయనకు స్థానిక మహిళలు దేహశుద్ధి చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఎస్ఐ సూర్యకుమారి మంగళవారం గ్రామానికి వెళ్లి దర్యాప్తు చేశారు. స్థానికులు, బాలిక కుటుంబ సభ్యులతో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయ్కుమార్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించినట్టు ఎస్ఐ తెలిపారు. ప్రసవాల సంఖ్యను పెంచాలి ● డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి గంట్యాడ: పీహెచ్సీలో ప్రసవాల సంఖ్యను పెంచాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి తెలిపారు. మండలంలోని పెదమజ్జిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీలో అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. సీజనల్ వ్యాధుల వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. తాగునీటి వనరులను క్లోరినేషన్ చేయించాలన్నారు. వ్యాధులు ప్రబలే గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ పల్లవి, ఈఓ రాజు, తదితరులు పాల్గొన్నారు. చిత్తశుద్ధితో పనిచేశారు విజయనగరం: రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్గా చిత్తశుద్ధితో పనిచేయడమే కాకుండా కమిషన్ పరిధిలో ఎస్టీ సామాజిక వర్గానికి చక్కటి సేవలందించారని డాక్టర్ డీవీజీ శంకరరావును మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభినందించారు. కమిషన్ చైర్మన్గా పనిచేసే అవకాశం కల్పించిన జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలో శంకరరావు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. మూడేళ్లపాటు తన బాధ్యతలు అంతఃకరణ శుద్ధితో నెరవేర్చానని చెప్పారు. -
గుర్తింపులేని స్కూల్ సీజ్
విజయనగరం అర్బన్: పట్టణంలోని బొడ్డు వారి జంక్షన్లో ప్రభుత్వ గుర్తింపులేకుండా నిర్వహిస్తున్న చైతన్య భారతి ప్రైవేటు స్కూల్ను విద్యాశాఖ అధికారులు మంగళవారం సీజ్చేశారు. ఇటీవల అందిన ఫిర్యాదు మేరకు తనిఖీ చేయాలని విద్యాశాఖ అధికా రులను కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు. ఈ మేరకు డిప్యూటీ ఈఓ కె.వి.రమణ, ఎంఈఓ సత్యవతి పర్యవేక్షణలో ప్రత్యేక బృందం మంగళవారం స్కూల్ను తనిఖీ చేసింది. గుర్తింపు లేకపోవడంతో సీజ్చేసినట్టు డీఈఓ యు.మాణిక్యంనాయుడు తెలిపారు. మడ్డువలసకు 1500 క్యూసెక్కుల ఇన్ఫ్లో వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టుకు 1500 క్యూసెక్కుల ఇన్ఫ్లో నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు వద్ద మంగళవారం 64.35 మీటర్ల మేర నీటిమట్టం నమోదు కాగా, ఎగువ ప్రాంతాల్లో వర్షపు జల్లులు కురుస్తుండడంతో వేగావతి, సువర్ణముఖి నదుల నుంచి ప్రాజెక్టులోకి 1500 క్యూసెక్కుల నీరు చేరుతోంది. వస్తున్న నీటిని ఒక గేటు ఎత్తి కిందకు విడిచిపెడుతున్నామని ఏఈ నితిన్ తెలిపారు. కుడి ప్రధాన కాలువ ద్వారా పంట పొలాలకు 700 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నామన్నారు. -
విద్యార్థుల జీవితాలతో చెలగాటమా...?
–10లోలోకేష్ నోరు మూగబోయిందా? ఆంధ్రా ప్రజలను విద్యుత్ చార్జీలు, అదానీ స్మార్ట్ మీటర్లతో నిలువు దోపిడీ చేస్తున్న కూటమి ప్రభుత్వ తీరును సీపీఐ, సీపీఎం, ప్రజా సంఘాల నాయకులు దుయ్యబట్టారు.విజయనగరం: విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది. ఉన్నత చదువులు చదువుకుని కుటుంబానికి అండగా నిలవాలన్న ఆకాంక్షతో ఉన్న ఊరిని, కన్న తల్లిదండ్రులను వదిలివచ్చి హాస్టళ్లలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందని వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాల నాయకులు విమర్శించారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, గురుకుల విద్యాలయాలు, కేజీబీవీల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలపై వారంరోజుల పాటు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విద్యార్థుల సమస్యలను గుర్తించారు. వాటిని పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని అన్ని సంక్షేమ హాస్టల్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, విద్యార్థులకు కనీస సదుపాయాలు కల్పించాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. అనంతరం వైఎస్సార్సీపీ జిల్లా విద్యార్ధి విభాగం అధ్యక్షుడు కరుమజ్జి సాయికుమార్, యువజన విభాగం అధ్యక్షుడు అల్లు అవినాష్, యువజన విభాగం నాయకులు జి.ఈశ్వర్కౌశిక్, చీపరుపల్లి నియోజకవర్గం విద్యార్థి విభాగం అధ్యక్షుడు బమ్మిడి కార్తీక్ మీడియాతో మాట్లాడుతూ హాస్టళ్లలో పారిశుద్ధ్యం నిర్వహణ సరిగాలేదని, మెనూ అమలుకావడం లేదని, కాస్మోటిక్ చార్జీలు అందడం లేదని, ఇన్వెర్టర్లు లేకపోవడంతో విద్యుత్ సరఫరా అంతరాయం సమయంలో అంధకారం అలముకుంటోందని, ప్రహరీలు లేక విషసర్పాల భయం వెంటాడుతోందని తెలిపారు. విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు, స్నానపు గదులు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వ హాస్టళ్లలో జిల్లా విద్యాశాఖ అధికారులు వారంలో ఒక రోజు బసచేసే కార్యక్రమాన్ని రూపొందించాలని, క్షీణించిన పారిశుధ్యం మెరుగు పరచాలని ప్రభు త్వాన్ని కోరారు. కార్యక్రమంలో విద్యార్థి విభాగం రాజాం నియోజకవర్గం అధ్యక్షుడు భీమేశ్వరరావు, విద్యార్థి విభాగం నాయకులు దీరుయాదవ్, మణికంఠ, భగవాన్, ప్రవీణ్, నవీన్, యువజన విభాగం నాయకులు భార్గవ్, సురేష్, గౌతం, పవన్, తదితరులు పాల్గొన్నారు. హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాల నాయకులు -
ఎవరీ కిల్లో స్వప్న... ఎందుకు సరిచేయలేదు..?
తల్లికి వందనం పథకం అమలు తీరు సక్రమంగా లేకపోవడం వల్ల అర్హుల జాబితాలు విస్తుగొలుపుతున్నాయి. ‘కిల్లో స్వప్న’ పేరుతో కూడిన ఆధార్ నంబర్ జిల్లాలోని 3 వేల మంది పిల్లలకు తల్లిగా నమోదైంది. ఆమె వివిధ సాంకేతిక కారణాలతో పథకానికి అనర్హురాలు కావడంతో ఆమె పేరు నమోదైన పిల్లలందరికీ పథకం అందని పరిస్థితి. మరోవైపు గతంలో అమ్మఒడి పథకం అందిన వారిలో వేలాది మందికి తల్లికివందనం వర్తింపజేయలేదు. వీరంతా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. బొబ్బిలి మండలం కోమటిపల్లి హైస్కూల్ విద్యార్థుల తల్లులు 40 మంది, రేగిడి ఆమదాలవలస మండలంలోని ఖండ్యాం జెడ్పీ హైస్కూల్ విద్యార్థుల తల్లులు మరో 30 మంది కలెక్టరేట్లో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్కు వచ్చి అధికారులకు గోడు వినిపించారు. ఇవి నిజంగానే తప్పిదాలా.. లేక కూటమి నేత స్కామ్లా..? అంటూ అనుమానం వ్యక్తంచేశారు. తమకు అర్హత ఉన్నట్టు గ్రామ, మండల స్థాయి అధికారులు ఇచ్చిన ధ్రువపత్రాలు సమర్పించినా పథకం లబ్ధిని ఎందుకు జమచేయడంలేదంటూ అధికారులను ప్రశ్నించారు. -
ప్రాణం తీసిన కుటుంబ కలహాలు
కొత్తవలస: మండలంలోని ముసిరాం గ్రామానికి చెందిన సిమ్మ అప్పారావు (60)ను తన మేనకోడలి భర్త, అనకాపల్లి జిల్లా కోటపాడు మండలం పాతవలస గ్రామానికి చెందిన సిమ్మ అప్పారావు అనే యువకుడు నాటు తుపాకీతో కాల్చిచంపిన ఘటన మంగళవారం సాయంత్రం కలకలం రేపింది. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు అప్పారావు చెల్లెలు అయిన చెల్లయ్యమ్మ కుమార్తె లక్ష్మిని పాతవలస గ్రామానికి చెందిన నిందితుడు అప్పారావుకి ఇచ్చి వివాహం జరిపించారు. వారికి ఒక కుమార్తె ఉంది. ఏడాదిన్నర కిందట కుటుంబ కలహాలతో నిందితుడి భార్య లక్ష్మి పాతవలస గ్రామంలో ఉరివేసుకుని మృతి చెందింది. ఆమెను నిందితుడే హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడన్న ఆరోపణ ఉంది. అప్పటి నుంచి మృతుడు తన చెల్లెలు (లక్ష్మి తల్లి) కుటుంబ వ్యవహారాలను చక్కబెడుతున్నాడు. నిందితుడి కుమార్తె ఇటీవల రజస్వల అయింది. లక్ష్మికి చెందిన నగలు, డబ్బు ఇవ్వాలని మృతుడు అప్పారావును నిందితుడు అప్పారావు గత కొన్నిరోజుల నుంచి అడుగుతున్నాడు. ఈ విషయమై రెండు రోజుల కిందట నిందితుడు పాతవలస నుంచి ముసిరాం వచ్చి కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ పడ్డారు. నగలు, డబ్బులు ఇవ్వకపోతే తుపాకీతో కాల్చిచంపేస్తానని హెచ్చరించి తిరిగి పాతవలస వెళ్లిపోయాడు. మరలా మంగళవారం సాయంత్రం ముసిరాం వచ్చి మృతుడి ఇంటికి వెళ్లి అప్పారావు ఎక్కడ ఉన్నాడని వాకాబు చేశాడు. పశువుల కళ్లంలో ఉన్నాడని కుటుంబ సభ్యులు తెలపడంతో అక్కడకు వెళ్లి మరోసారి బంగారం, డబ్బుల కోసం మృతుడిని అడిగాడు. గ్రామ పెద్దల సమక్షంలో ఇస్తానని చెప్పడంతో నిందితుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అక్కడే ఉన్న సిమ్మ స్వామినాయుడు నిందితుడికి సర్ది చెబుతున్నా వినిపించుకోకుండా తనవెంట తెచ్చుకున్న నాటు తుపాకీతో అప్పారావును కాల్చేశాడు. చనిపోయినట్టు నిర్ధారించుకున్నాక అక్కడి నుంచి పరారయ్యాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో కొత్తవలస సీఐ షణ్ముఖరావు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. మృతుడికి భార్య అచ్చియ్యమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వృద్ధుడిని నాటు తుపాకీతో కాల్చిచంపిన మేనకోడలి భర్త