ముమ్మరంగా వాహన తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

ముమ్మరంగా వాహన తనిఖీలు

Feb 9 2026 8:19 AM | Updated on Feb 9 2026 8:19 AM

ముమ్మ

ముమ్మరంగా వాహన తనిఖీలు

ముమ్మరంగా వాహన తనిఖీలు

లక్కవరపుకోట : మండలంలోని అరుకు – విశాఖపట్నం జాతీయ రహదారిలో ఎస్‌ఐ నవీన్‌పడాల్‌ ఆధ్వర్యంలో పోలీసులు గడిచిన రెండు రోజులుగా ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 5వ తేదీన ‘ప్రమాదం గురూ..’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి పోలీసు అధికారులు స్పందించారు. ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా ఈ మార్గంలో ప్రమాదకరంగా వెళ్తున్న గడ్డి ట్రాక్టర్లను లక్ష్యంగా చేసుకొని తనిఖీలు చేస్తున్నారు. ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నట్టు అనిపిస్తే భారీ జరిమానాలు విధిస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. రహదారి నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ముమ్మరంగా వాహన తనిఖీలు 1
1/1

ముమ్మరంగా వాహన తనిఖీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement