విజయనగరం
న్యూస్రీల్
కార్మికా.. రేపటి భద్రత మర్చిపోవద్దు..!
అసంఘటిత రంగ కార్మికులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పెన్షన్ పథకాలను అమలు చేస్తోంది.
ఆదివారం శ్రీ 8 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
ఈ చిత్రంలోని రైతు పేరు కొమ్మాన వీరభద్రుడు. కర్లాం గ్రామం. ఈయన తల్లి కొమ్మాన పైడమ్మ పేరుతో సర్వే నంబర్ 76లో 0.66 సెంట్లు భూమి ఉంది. ఆ భూమిని 1980లో దాట్ల వెంకట గోపాలకృష్ణ రాజు కొమ్మాన పైడమ్మకు రిజిస్ట్రేషన్ చేశారు. డాక్యుమెంటు నంబర్ 209/80తో కూడిన రిజిస్టర్డ్ పత్రాలు కూడా ఉన్నాయి. ఈ భూమిని కొమ్మాన వీరభద్రుడు, కొమ్మాన గవరయ్య అన్నదమ్ములు చెరో 0.33 సెంట్లు భూమిని అప్పటి నుంచి సాగు చేసుకుంటున్నారు. అయితే, ఈ భూమిని జి.సిగడాం మండలంలోని గెడ్డకంచరాం గ్రామానికి చెందిన శిరువూరు సూరీడమ్మ పేరున రికార్డులు మార్చేశారు. ఈ భూమిని కూడా ఆమె కుమార్తె పేరుపై రిజిస్ట్రేషన్ చేసేశారు. ఇదెక్కడి అన్యాయం అంటూ వీరభద్రుడు వాపోతున్నాడు.
విజయనగరం


