జాతీయ స్థాయి కుస్తీ పోటీలకు గుర్ల యువకుడు
గుర్ల: మండల కేంద్రానికి చెందిన పొన్నాడ ఉమామహేశ్వరరావు జాతీయస్థాయి కుస్తీ పోటీలకు ఎంపికై నట్లు కుస్తీ కోచ్ కర్రోతు జగదీశ్ ఆదివారం తెలిపారు. గత ఏడాది గుజరాత్లో జరిగిన జాతీయ స్థాయి పోటీలలో ఉమామహేశ్వర రావు ఉత్తమ ప్రదర్శన కనబరిచి స్వర్ణ పతకం సాధించాడు. కుస్తీలో రాణించడంతో రాష్ట్రం తరఫున జాతీయస్థాయి పెడరేషన్ కుస్తీ పోటీల్లో పాల్గొంటున్నాడు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాధ్ ఈనెల12 నుంచి 14 వరకు ఈపోటీలు జరగనున్నాయి. ఉమామహేశ్వరరావు నెల్లిమర్లలోని ఒక కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు.


