బ్యానర్...
మూడింటికి ముందు
మొత్తం ఉమ్మడి విజయనగరం జిల్లాలోని ఆరు పథకాల్లో మూడింటిని ముందు ప్రారంభించే అవకాశం ఉంది. మరో మూడింటికి హెడ్ ఆఫీసు నుంచి అనుమతులు వచ్చాక టెండర్లు పిలుస్తారు. అంచనాలు పెరిగిన మేరకు పైప్లైన్ల నిడివి పెరుగుతుంది.
– జ్యోతి, ఈఈ, ప్రజారోగ్యశాఖ విజయనగరం
ఈ చిత్రం చూశారా? ఇది గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బొబ్బిలి పురప్రజలకు 30 సంవత్సరాల పాటు తాగునీటి సమస్యలు రాకుండా ఉండేలా డీపీఆర్ రూపొందించి తలపెట్టిన బృహత్తర తాగునీటి పథకంలోని ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణాల్లో ఒకటి. రూ.94 కోట్లతో టెండర్లు పిలిచి మెయిన్లైన్లు, సబ్ లైన్లతో ప్రారంభించిన ఈ పనులను కూటమి ప్రభుత్వం రాగానే విస్మరించింది. 18 నెలలుగా పట్టించుకోలేదు. ఇప్పుడు పథకం పనులన్నింటికీ అంచనాలు పెంచేసి కొత్తగా టెండర్లు పిలుస్తోంది. పనులు మరింత జాప్యం అవుతాయని, నిర్మాణంలో ఉన్న పనులు కొనసాగించకుండా.. మళ్లీ అంచనాలు పెంచి పనులకు టెండర్లు పిలుస్తుండడంపై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిర్మాణంలో ఉన్న
తాగునీటి పథకాల
అంచనాల పెంపు
రూ.402.97కోట్ల నుంచి రూ.481.63 కోట్లకు
పెంచిన కూటమి ప్రభుత్వం
సగం పట్టణాల్లోని పనులకే కొత్తగా టెండర్లు
ఏఐఐబీ బృహత్తర తాగునీటి పథకాల నిర్మాణాలు
ప్రారంభం మరింత ఆలస్యం?
బ్యానర్...
బ్యానర్...
బ్యానర్...


