వ్యక్తి ఆత్మహత్య
సాలూరు: పట్టణంలోని డబ్బివీధిలో నివాసముంటున్న బొబ్బిలి పరమేశు(37) తన ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గురువారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పరమేశు మూర్ఛవ్యాధితో బాదపడుతున్నాడు. దీంతో మనస్తాపానికి గురై తన ఇంటిలో ఉరివేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఒలింపియాడ్లో శ్రీజన్ విద్యార్థుల ప్రతిభ
పార్వతీపురం రూరల్: సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 33వ సర్ సీవీ రామన్ యంగ్ జీనియస్ ఒలింపియాడ్ (2025–26)లో పార్వతీపురంలోని శ్రీజన్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో గురువారం జరిగిన కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ పోటీల్లో నాలుగో తరగతి విద్యార్థిని పి.చందనశ్రీ రాష్ట్రస్థాయిలో బంగారు పతకం సాధించింది. జిల్లా స్థాయిలో ఎం.లాలిత్య (3వ తరగతి), పి.మోక్షితాప్రియ (4వ తరగతి), కె.పార్థసారథి (5వతరగతి) ప్రథమ బహుమతులు, డి.రుత్ (4వ తరగతి), వి.ఉమామహేశ్ (7వ తరగతి) ద్వితీయ బహుమతులు అందుకున్నారు.


