చదువుతోనే గౌరవం
● డీఈఓ యు.మాణిక్యంనాయుడు
సంతకవిటి:
చదువుతోనే జీవితంలో గౌరవం లభిస్తుందని జిల్లా విద్యాశాఖాధికారి యు.మాణిక్యంనాయుడు అన్నారు. మండలంలోని సంతకవిటి జెడ్పీ హైస్కూల్, ప్రాథమిక పాఠశాల, మందరాడ, జీఎస్ పురం జెడ్పీ హైస్కూల్ను బుధ వారం సందర్శించారు. పదోతరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న 100 రోజుల ప్రణాళికలో విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను పరీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సెల్ఫోన్లు చూడకూడదని, బాగా చదువుకుంటే ఎవరికాళ్లపై వారు ఉన్నతంగా నిలవగలరన్నారు.


