విజయనగరం టౌన్: చంద్రగ్రహణం పురస్కరించుకుని జిల్లాలో ఉన్న ఆలయాలన్నింటిని మూసివేశారు. కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కావడంతో మంగళవారం ఉదయం నుంచే ఆలయాలు మూసివేశారు. బుధవారం వేకువజామునుంచి సంప్రోక్షణ పూజలు అనంతరం ఉదయం 8 గంటల నుంచి ఆలయాలు తెరచుకోనున్నాయి.
గ్రహణం పడిన వేళ..
రాజాం: పట్టణంలోని నరసింహనాయుడు కాలనీలో మహిళలు చంద్రగ్రహణం తెలుసుకునేందుకు పూర్వీకులు ఆచరించే సంప్రదాయాన్ని కొనసాగించారు. పాలపర్తి స్వాతి ఇంటి వద్ద ఇత్తడి పల్లెంలో పసుపునీళ్లుపోసి రోకలిని నిలబెట్టి గ్రహణ సమయాన్ని తెలుసుకున్నారు. గ్రహణం ఉన్న సమయంలో నిలిచిన రోకలికి హారతిచ్చి పూజలు చేశారు.


