breaking news
Hanamkonda District News
-
వినియోగదారుల చట్టంపై అవగాహన ఉండాలి
● వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణి రామన్నపేట: వినియోగదారుల చైతన్యంతో మోసాలకు అడ్డుకట్ట వేయవచ్చని వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ ఏవీవీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి, కాలేజ్ కన్జ్యూమర్ క్లబ్స్ కోఆర్డినేటర్ కోడిమాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బుధవారం వినియోగదారుల హక్కులు, పరిరక్షణపై చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని హైస్కూల్, కళాశాల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు అదనపు కలెక్టర్ సంధ్యారాణి బహుమతులు అందించారు. అనంతరం కోడిమాల శ్రీనివాసరావు రూపొందించిన వాల్ పోస్టర్ను అధికారులతో కలిసి ఆవిష్కరించారు. డీసీఎస్ఓ కృష్ణయ్య, క్యాట్కో రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ లాల్ చౌరాసియా, వరంగల్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్, ఇండస్ట్రియల్ మేనేజర్ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. వినియోగదారుల్లో చైతన్యం రావాలి న్యూశాయంపేట: వినియోగదారుల్లో చైతన్యం రావాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. కలెక్టనూటఖలెలో బుధవారం వినియోగదారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వినియోగదారులకు సత్వరం న్యాయం అందించేందుకు ప్రభుత్వం పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టిందన్నారు. ఈ సందర్భంగా వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి కిష్టయ్య, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా ధ్వజస్తంభాల పునఃప్రతిష్ఠ వేడుక
ఎస్ఎస్తాడ్వాయి : మేడారం అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై ధ్వజ స్తంభాల పునః ప్రతిష్ఠాపన వేడుక వైభవంగా జరిగింది. బుధవారం ఉదయం 7 నుంచి మొదలైన పూజ కార్యక్రమాలు మధ్యాహ్నం 2 గంటల వరకు సాగాయి. పగిడిద్దరాజు, గోవిందరాజు పూజారులు సమ్మక్క, సారలమ్మ పూజారులతో కలిసి గద్దెలపై ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించారు. పూజల అనంతరం అమ్మవార్లకు పూజారులు యాటలను నైవేద్యంగా సమర్పించారు. మార్మోగిన గద్దెల ప్రాంగణం.. ధ్వజ స్తంభాలను నూతన గద్దెలపైకి తీసుకొసున్న క్రమంలో ఆదివాసీల డోలు వాయిద్యాల చప్పులతో గద్దెల ప్రాంగణం మార్మోగింది. శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు పూజారులతోపాటు వారి కుటుంబీలు వందల సంఖ్యలో హాజరయ్యారు. భక్తుల దర్శనాలు నిలిపేయడంతో ప్రశాంత వాతావరణంలో పునః ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించారు. నూతన గద్దెలను దర్శించుకున్న మంత్రి సీతక్క గోవిందరాజు, పగిడిద్దరాజు నూతన గద్దెలను మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర్ టీఎస్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, మేడారం ఈఓ వీరస్వామి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, మేడారం సర్పంచ్ భారతి, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పూజారులు దర్శించుకున్నారు. పూనుగొండ్ల, కొండాయి నుంచి వచ్చిన పూజారుల కుటుంబీలు, బంధువులు గద్దెలను దర్శించుకుని పూజలు చేశారు. పూర్వీకుల సిద్ధాంతాన్ని ఆచరిస్తున్నాం.. ఆదివాసీ సంప్రదాయ పద్ధతిలో పగిడిద్దరాజు, గోవిందరాజుల ఽగద్దెలపై ధ్వజ స్తంభాల పునః ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా జరిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. బుధవారం గద్దెల పునఃప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను వరుస క్రమంలో పూజారుల అనుమతితోనే ప్రతిష్ఠాపన చేస్తున్నామని, పూర్వీకుల ఆదేశాలతో పాటు ప్రకృతి సిద్ధాంతాన్ని ఆచరిస్తున్నామని తెలిపారు. నేడు మొదటి ఘట్టం ప్రారంభమైందని, అన్ని కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తామని తెలిపారు. పూర్వకాలంలో గిరిజనులకు పసుపుతో ఎంతో అనుబంధం ఉందన్నారు. శాసీ్త్రయంగా పసుపుతో పలు వ్యాధులను నయం చేసుకునే అవకాశం ఉందని, దీనిని వినియోగంతో పూర్వంలో గిరిజనులు ఎలాంటి వ్యాధుల బారిన పడలేదన్నారు. సమ్మక్క తల్లి గోత్రం బండాన్నీ అని కోయ భాషలో బండారి అని కూడా పిలుస్తారని మంత్రి తెలిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొనసాగిన పూజలు తరలొచ్చిన పూజారుల కుటుంబీకులు, ఆడపడుచులు -
బకాయిలు చెల్లించాలి
● రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ హన్మకొండ: రిటైర్డ్ ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ల ధర్మేంద్ర, పెన్షనర్స్ జేఏసీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు జి.నర్సింహా రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిల సాధన కమిటీ, తెలంగాణ ప్రభుత్వ పెన్షన్దారుల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు వద్ద ఒక్కరోజు దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో వారు మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బకాయిలు 20 నెలలైనా చెల్లించకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 35 మంది బకాయిలు రాక బాధతో ఆరోగ్యం క్షీణించి చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. బీ జేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్రెడ్డి, మాజీ అధ్యక్షురాలు రా వు పద్మ, వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్, ఆయా ఉద్యోగ, ఉపాధ్యా య సంఘాల బాధ్యులు దీక్షకు సంఘీభా వం తెలిపారు. ఈదీక్షలో ఆయా సంఘాల బాధ్యులు ఈ.రాంమనోహర్, కడారి భోగేశ్వర్, టి.పురుషోత్తం, కె.సుధీర్బాబు, టి.వీరయ్య, దేవదాసు, సాంబయ్య, సమ్మారెడ్డి, మహబూబ్ అలీ, ఇంద్రసేనారెడ్డి, విశ్వనాథం, రవీందర్, రఘువీర్, రాజిరెడ్డి, సమ్మయ్య పాల్గొన్నారు. -
తిమ్మరాయినిపహాడ్లో జిల్లాలోనే అతిపెద్ద చర్చి ..
నర్సంపేట: వరంగల్ జిల్లాలో పెద్ద చర్చిగా పిలువబడుతున్న తిమ్మరాయినిపహాడ్లోని పునీత రాయప్ప దేవాలయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. 1924లో కమ్మ కులస్తులు ఈ గ్రామాన్ని స్థాపించారు. 1930లో ఫాదర్ పజలీనా కాజీపేట నుంచి వస్తూ స్వరూపాలు, పటాలు అందిస్తూ దైవ కార్యాలు నిర్వహించేవారు. చిన్న పూరి గుడిసెలో మొదట క్రిస్మస్ వేడుకలు నిర్వహించేవారు. 1956లో నూతన చర్చి పనులు ప్రారంభించి 1967లో పూర్తి చేశారు. యూఎస్ఏలో స్థిరపడిన నేను క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి స్వగ్రామం చేరుకున్నా. నాన్నతో ఈ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉంది. బెల్లంకొండ విజయరాజు, తిమ్మరాయినిపహాడ్ ప్రార్థనలకు ఏర్పాట్లు పూర్తి ప్రార్థనలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గ్రామంలో 90 శాతం మంది ప్రజలు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. క్రిస్మస్ సందర్భంగా చర్చిని విద్యుత్ దీపాలతో అలంకరించాం. రాత్రి నుంచి ప్రార్థనలు జరుగుతున్నాయి. -
86 ఏళ్లుగా ప్రభు సేవలో..
డోర్నకల్: డోర్నకల్లో ప్రసిద్ధిగాంచిన ఎఫిఫనీ చర్చి 86 ఏళ్లుగా ప్రభు సేవలో తరిస్తోంది. నాటి మద్రాస్ బిషప్ వైట్ హెడ్ ఆధ్వర్యంలో 1915 జనవరి 24న చర్చి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ నిర్మాణం 1939లో పూ ర్తికాగా డోర్నకల్ బిషప్ అజరయ్య నేతృత్వంలో అదే సంవత్సరం ఎఫిఫనీ పండుగ రోజున ప్రారంభించి ఎఫిఫనీ చర్చిగా నామకరణం చేశారు. ద్రవిడ, క్రైస్తవ, హిందూ, ముస్లిం మతాల ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ చర్చిని నిర్మించారు. చర్చి ముఖ శిఖ రాలు మసీదు గుమ్మటాలను పోలి ఉండగా వాటిపై రెండు పద్మాలు, రెండు శిలువలు ఉంటాయి. ఆలయం లోపల ఏసుక్రీస్తు 12 మంది శిష్యుల పేరుతో 12 స్తంభాలను నిర్మించారు. స్తంభాలకు ఇరువైపులా ఉమ్మెత్త పుష్పాలు, అరటి మొగ్గలు నిర్మించారు. దీంతో అద్భుత శిల్ప సౌందర్యంతో నిర్మించిన ఈ చర్చిని సందర్శించేందుకు ప్రతీ సంవత్సరం దేశ, విదేశాల నుంచి అనేకమంది డోర్నకల్కు వస్తున్నారు. కాగా, ఎఫిఫనీతోపాటు డోర్నకల్ పరిధిలోని పలు చర్చిల్లో బుధవారం అర్ధరాత్రి నుంచి క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. -
‘అంపశయ్య నవీన్’ ఓరుగల్లుకు సాహిత్య సంపద
● కేయూ విశ్రాంతాచార్యుడు అయిలయ్య హన్మకొండ కల్చరల్ : అంపశయ్య నవీన్ ఓరుగల్లుకు సాహిత్య సంపదలాంటి వారని కేయూ విశ్రాంతాచార్యుడు బన్న అయిలయ్య అన్నారు. బుధవారం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ 85వ జన్మదిన వేడుక నిర్వహించారు. అదే విధంగా ప్రధమ నవల పురస్కార ప్రదానోత్సవం జరిగింది. ఈ మేరకు మిత్రమండలి, వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ, నేరేళ్ల వేణుమాధవ్ కల్చరల్ ట్రస్ట్ సౌజన్యంతో బుధవారం హనుమకొండ ఎకై ్సజ్ కాలనీలోని నవీన్ రెసిడెన్సీలో జరిగిన సమావేశానికి బన్న అయిలయ్య అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా బ్యాంక్ రిటైర్డ్ ఆఫీసర్ దర్భశయనం శ్రీనివాసాచార్య, బన్న అయిలయ్య పాల్గొని నవీన్ రచించిన భిన్న ధృవాలు, బుచ్చిబాబు జీవితం– సాహిత్యం పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం ‘అమ్మడైరీ’ నవలకు గాను రచయిత్రి వసంతశ్రీ, ‘పడిలేచిన కెరటం’ నవలకు గాను రచయిత జీవీ శ్రీనివాస్కు ఉత్తమ ప్రథమ, ద్వితీయ నవలాపురస్కారాలను అందజేశారు. సాహితీవేత్త అశోక్కుమార్, దొంగరి శశికిరణ్ నవీన్ నవలలను పరిచయం చేశారు. ప్రముఖ విమర్శకుడు గన్నమరాజు గిరిజామనోహర్బాబు, సాహితీవేత్తలు వకుళవాసు, వీఆర్ విద్యార్థి, నాగిళ్ల రామశాస్త్రి, నెల్లుట్ల రమాదేవి, ఘంటా రామారెడ్డి, పందిళ్ల అశోక్కుమార్, డి. రాజేశ్వరరావు, దొంగరి స్వప్న, దొంగరి శశికిరణ్, సతీశ్, పాల్గొన్నారు. -
విద్యుత్ వెలుగుల్లో ‘సీబీసీ’ జిగేల్ ..
ఖిలా వరంగల్: వరంగల్ క్రిస్టియన్ కాలనీలో 137 సంవత్సరాల చరిత్ర గల సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. చర్చి ఫాదర్లు రెవరెండ్ పుల్ల జగ్జీవన్ బాబ్జీ, ఎం. ఆత్యుష్, కార్తీక్ అబ్రహ్మ సంయూక్త ఆధ్వర్యంలో బుధవారం రాత్రి 9 గంటల నుంచి క్రైస్తవులు అర్ధరా త్రిని స్వాగతించారు. 12 గంటలకు కేక్ కేట్ చేసి పరస్పరం శు భాకాంక్షలు తెలుపుకున్నారు. కాగా, సీబీసీ విద్యుత్ దీపాల వె లుగులో జిగేల్మంటోంది. వేడుకలకు లక్ష మంది భక్తులు తరలొచ్చిన నేపథ్యంలో అందుకు తగ్గట్లు చర్చి నిర్వాహకులు ఏ ర్పాట్లు చేశారు. చర్చి ఎదుట ప్రత్యేక దుకాణాలు, రంగుల రా ట్నాలు ఏర్పాటు చేయడంతో జాతరను తలపిస్తోంది. కార్యక్రమంలో చర్చి కమిటీ ప్రెసిడెంట్ పోలెపాక మనోహర్, ఉపాధ్యక్షుడు పోలెపాక రత్న బాబు, కార్యదర్శి మేగల భరత్, కోశాధికారి బషికే విజయ్కుమార్, పోలేపాక కిరణ్ కుమార్, బైరపా క సామేల్ రాజ్, గుండేటి శ్యామ్, మడిపెల్లి ప్రాన్సిస్ జాశ్వా , లిమ్యూల్, తదితరులు పాల్గొన్నారు. -
చరిత్రకు సజీవ సాక్ష్యం.. ఉండ్రుపుర చర్చి
జనగామ: జనగామలోని ఉండ్రుపుర సెంటనరీ బాపిస్టు చర్చి చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలు స్తోంది. లోకరక్షకుడి సేవలో 125 ఏళ్లుగా సేవలందిస్తోంది. 1901లో స్థాపితమైన చర్చి.. అనేక సేవా కార్యక్రమాలతో జిల్లాలో తల్లి సంఘం చర్చిగా నామకరణం పొందింది. రష్యా చెందిన దంపతులు అన్న ఉన్రు(భార్య), హెర్ని ఉన్రు (భర్త) అనేక దేశాలు పర్యటిస్తూ జనగామకు చేరుకున్నారు. 1901 నుంచి వారి సేవలను కొనసాగిస్తూ ప్రెస్టన్ ఇన్స్టిట్యూట్ నుంచి చర్చి సేవలు, ప్రార్థనలు కొనసాగాయి. ఆ తర్వాత ఆర్టీసీ బస్టాండ్ ఎదుట(ప్రస్తుతం)కు మార్చారు. రష్యాకు చెందిన ఉన్రు దంపతులకు 8 మంది సంతా నం కలగగా చదువు ఇక్కడే పూర్తి చేశారు. తదనంతరం వారు రష్యా, అమెరికాకు వెళ్లి పోయారు. కాలక్రమేనా 1912లో భర్త హెర్ని ఉన్రు మృతి చెందగా, భార్య అన్న ఉన్రు 1921లో రష్యాలో మృతి చెందారు. ఉన్రు పెద్ద కూతురు తండ్రితోనే జనగామలో ఉంటూ సేవా కార్యక్రమాల్లో పాల్గొనే వారు. ఆమె కూడా చనిపోవడంతో ప్రెస్టన్లోని తండ్రి సమాధి పక్కనే ఖననం చేశారు. 2002లో నూతన చర్చి ప్రారంభం.. 2000లో నూతన భవన నిర్మాణం కోసం భూమి పూజ చేసి 2002లో చర్చిని ప్రారంభించారు. 2005లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీ దుగా ఉండ్రుపుర సెంటనరీ బాపిస్టు చర్చిలో విద్యుత్ వెలుగులు ప్రారంభించారు. ఇప్పటి వరకు అనేక మంది పాస్టర్లు కరుణామయుడి సన్నిధిలో సేవలందించారు. -
స.హ.. కహా?
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్లో సమాచార హక్కు చట్టం దరఖాస్తుల పరిష్కారం అథమ స్థాయిలో ఉంది. పౌరులు అడిగిన సమాచారాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని దశాబ్దాల క్రితం అమల్లోకి తెచ్చింది. నిబంధన ప్రకారం దరఖాస్తు చేసిన పౌరులకు నిర్దేఽశిత కాలంలో అడిగిన సమాచారాన్ని అందించాలి. కానీ, గ్రేటర్ వరంగల్లో సమాచార హక్కు చట్టం దరఖాస్తులు ఏళ్ల తరబడి మూలుగుతున్నాయి. సమాచారం కోసం దరఖాస్తుదారులు బల్దియా కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నిబంధనలు ఇవీ.. సమాచార హక్కు చట్టం ప్రకారం కోరిన సమాచారాన్ని 30 రోజుల్లో దరఖాస్తుదారుడికి అందించాలి. లేకపోతే సంబంధిత అధికారి అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. సమాచారం ఇవ్వడంలో జాప్యం వంద రోజులు దాటితే సంబంధిత అధికారి రూ.25 వేల వరకు అపరాధ రుసుం చెల్లించాలి. దరఖాస్తు ఏ విభాగానికి చెందినదో ఆ విభాగ అధికారి ఇందుకు బాధ్యత వహించాల్సి ఉండగా.. మహా నగర పాలక సంస్థలో కొన్ని దరఖాస్తులకు తూతూమంత్రంగా సమాచారం అందిస్తూ, మరి కొ న్నింటికి సమాచారం లేదని రాత పూర్వకంగా అందిస్తుండడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల అలసత్వం.. బల్దియాలో పౌరులు సమాచారం కావాలని దరఖాస్తు చేస్తే నెలలు గడిచినా అడిగిన సమాచారం అందడం లేదు. ప్రశ్నలు అడిగే తీరులో లోపాలు పట్టుకుని సమాచారాన్ని తిరస్కరిస్తున్నారు. సూటిగా, స్పష్టంగా ఇవ్వకుండా తెలుగులో దరఖాస్తు చేస్తే ఇంగ్లిష్లో సమాచారం ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. తెలుగు మాత్రమే తెలిసిన వారికి ఇంగ్లిష్ సమాచారం ఎలా అర్థమవుతుందనేది అధికారులకే తెలియాలి. అప్పిలేట్ అథారిటీకి ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. అప్పీళ్లపై సహేతుకంగా విచారణలు నిర్వహించి, చర్యలు తీసుకునే విధానం తగ్గిపోయింది. దీంతో దరఖాస్తుదారులు చేసేదేం లేక మళ్లీ దరఖాస్తులు పెడుతున్నా కోరిన సమాచారం రావడం లేదంటూ ఫిర్యాదుదారులు ఆందోళన చెందుతున్నారు. గ్రేటర్ పరిధి ప్రధాన కార్యాలయంలో, కాశిబుగ్గ, కాజీపేట ఏ సర్కిల్లో సమాచార హక్కు చట్టానికి దరఖాస్తు చేసినా నిర్లక్ష్యమే కనిపిస్తోంది. గ్రేటర్ పరిధిలో సమాచార హక్కు చట్టం ద్వారా 320 పైచిలుకు దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయంటే అధికారుల నిర్లక్ష్యం ఎలా ఉందో తెలుస్తోంది. సమాచార హక్కు చట్టం నిర్వీర్యం అమలులో ‘గ్రేటర్’ అధికారుల నిర్లిప్తత కాళ్లరిగేలా అర్జీదారుల ప్రదక్షిణలు సమావేశాలు, సమీక్షలు కరువు గ్రేటర్ వరంగల్లో అధ్వాన పరిస్థితి కొరవడిన జవాబుదారీతనం సమాచార హక్కు చట్టం అమలులో వరంగల్ నగర పాలక సంస్థ అధికారులు ఆది నుంచి అలసత్వం వహిస్తున్నారు. విభాగాల వారీగా ఎన్ని దరఖాస్తులు అందాయి? నిర్ణీత గడువులోగా ఎన్నింటికి సమాచారం అందించారు? ఎన్ని పెండింగ్లో ఉన్నాయి? అనే అంశాలపై సమీక్షలు జరగడం లేదు. దీంతో సమాచార హక్కు చట్టం దరఖాస్తులు పెద్ద ఎత్తున పెండింగ్లో పడిపోతున్నాయి. వాస్తవానికి వారానికోసారి సమీక్షలు నిర్వహించాలి. సకాలంలో సమాచారం అందించని అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. -
రెండు విభాగాల్లో గోల్డ్ మెడల్ ఏర్పాటు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని లైబ్రరీ సైన్స్లో దివంగత బండారి చంద్రశేఖర్, దివంగత బండారి రమణిరత్నం పేర గోల్డ్మెడల్, స్వాతంత్య్ర సమర యోధులు, జనధర్మ, వరంగల్వాణి పత్రికల వ్యవస్థాపకులు దివంగత ఎంఎస్ ఆచార్య, దివంగత రంగనాయకమ్మ స్మారకార్థం జర్నలిజం విభాగంలో మరో గోల్డ్మెడల్ ఏర్పాటు చేశారు. గోల్డ్మెడల్కింద ఆయా విభాగాల్లో రూ.3లక్షల చొప్పున జమ చేశారు. అధిక మార్కులు పొందిన విద్యార్థికి ఆ నగదు (గోల్డ్మెడల్) అందజేయనున్నారు. ఆయా ఉత్తర్వులను వీసీ కె.ప్రతాప్రెడ్డి బుధవారం జారీ చేశారు. విభాగాల అధిపతులు డాక్టర్ బి.రాధికారాణి, ఎం.రాజగోపాలచారి బి.వెంకట్రామ్రెడ్డి, డాక్టర్ సంగని మల్లేశ్వర్, తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం విద్యారణ్యపురి: హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆకళాశాల ప్రిన్సిపాల్ గుర్రం శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మైక్రోబయాలజీలో రెండు, కంప్యూటర్ సైన్స్లో రెండు, తెలుగు సబ్జెక్టులో ఒక వేకన్సీ ఉన్నట్లు తెలిపారు. అర్హులు ఈనెల27 సాయంత్రం వరకు కేడీసీలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పీజీతోపాటు పీహెచ్డీ, నెట్ లేదా సెట్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. మౌఖిక పరీక్షలు ఈనెల 29న నిర్వహించనున్నట్లు తెలిపారు. మిగతా వివరాలకు పీజీ కోర్సుల కో–ఆర్డినేటర్ డాక్టర్ వాసం శ్రీనివాస్ 98850 59533లో సంప్రదించాలని ఆయన కోరారు. శిల్ప కళా సౌందర్యం అద్భుతం ఖిలా వరంగల్: కాకతీయుల కట్టడాలు, ఆనాటి నిర్మాణ శైలి, శిల్ప కళా సౌందర్యం మహాద్భుతంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా జడ్జి నసీమా అన్నారు. బుధవారం వరంగల్ నగరంలోని ఖిలా వరంగల్ మధ్యకోటను జడ్జి నసీమా తన కుటుంబంతో కలిసి సందర్శించారు. శిల్పాల ప్రాంగణంలోని శిల్ప కళా సంపదను వీక్షించారు. కాకతీయుల విశిష్టతను కోట గైడ్ రవియాదవ్.. జడ్జి కుటుంబానికి వివరించారు. జడ్జి వెంట ఎస్సై శ్రావణ, టీజీ టీడీసీ కోట ఇన్చార్జ్ అజయ్, కేంద్ర పురావస్తుశాఖ సిబ్బంది ఉన్నారు. కేయూ క్యాంపస్: చైన్నెలోని అమీట్ యూనివర్సిటీలో ఈనెల 25నుంచి 28వ తేదీ వరకు జరగనున్న సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ టేబుల్ టెన్నిస్ పురుషుల టోర్నమెంటుకు కేయూ పురుషుల జట్టును ఎంపిక చేసినట్లు బుధవారం స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ వై.వెంకయ్య తెలిపారు. జట్టులో కె.శ్రీసాయివర్ధన్, ఎన్.యశ్వంత్ రెడ్డి, బి.చింతేశ్వర్రెడ్డి, ఎస్.ప్రేమ్దినకర్, కె.దీపక్బాబు ఉన్నట్లు పేర్కొన్నారు. నరేశ్ కోచ్కమ్ మేనేజర్గా వ్యవహస్తారని తెలిపారు. టెన్నిస్ మెన్, ఉమెన్ జట్ల ఎంపిక..బెంగళూరులోని జైన్ యూనివర్సిటీలో ఈనెల 25నుంచి 28 వరకు జరగనున్న సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ టెన్నిస్ టోర్నమెంటుకు కాకతీయ యూనివర్సిటీ మెన్ అండ్ ఉమెన్ జట్లను ఎంపిక చేసినట్లు వెంకయ్య తెలిపారు. టెన్నిస్ పురుషుల జట్టులో బి.మనోజ్కుమార్, కె.విశాల్ ఆదిత్య, ఎన్.గౌతమ్, ఎం.రామకృష్ణ, కె.శ్రావణ్ ఉన్నారు. ఉమెన్స్ జట్టులో డి.ప్రదీప్త, టి.సింధు, హెచ్.సంయుక్త, డి.అఖిల ఉన్నారు. ఎస్.మహేశ్ కోచ్ కమ్ మేనేజర్గా వ్యవహరించనున్నారు. -
బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలి
న్యూశాయంపేట: లింకేజీ రుణాల మంజూరుకు బ్యాంకులు చిత్తశుద్ధితో పనిచేయాలని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ అన్నారు. కలెక్టరేట్లో బుధవారం బ్యాంకర్లతో జరిగిన డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ మీటింగ్ (డీసీసీ సమావేశం)లో ఆయన మాట్లాడారు. బ్యాంకులు సామాజిక బాధ్యతగా అర్హులకు రుణాలివ్వాలని సూచించారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలను బ్యాంకర్లు విజయవంతం చేయాలని కోరారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.9,274 కోట్లు లక్ష్యంగా ఎంచుకోగా.. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 7,169 కోట్ల రుణాలు ఇచ్చి 77.30 శాతం లక్ష్యాన్ని సాధించినట్లు ఎల్డీఎం హవేలీ రాజు వివరించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, యూనియన్ బ్యాంకు ఆర్హెచ్ కమలాకర్, ఆర్బీఐ ఏజీఎం రహమాన్, నాబార్డ్ ఏజీఎం రవి ఉన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలి నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయ్భాస్కర్ ఖిలా వరంగల్: మహిళలు వ్యాపారరంగాల్లో ఆర్థికంగా ఎదగాలని తెలంగాణ రాష్ట్ర నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ బి.ఉదయ్ భాస్కర్ సూచించారు. మహిళా స్వయం సహాయ సంఘం సభ్యులకు నైపుణ్యత, సూక్ష్మ వ్యాపారాల ప్రోత్సాహం(ఎం–సువిధ)పై వరంగల్ శంభునిపేటలోని ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో బుధవారం శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. నాబార్డ్ వరంగల్ అభివృద్ధి మేనేజర్ శ్రీ చైతన్య రవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డీజీఎం బొల్లా శ్రీనివాస్, ఏజీఎం చంద్రశేఖర్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా పరిశ్రమల అధికారి నరసింహమూర్తి, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, కార్పొరేటర్ పోశాల పద్మ, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు. డిజిటల్ బ్యాంకింగ్ సేవల విస్తరణకాజీపేట అర్బన్: గ్రామీణ స్థాయిలో డిజిటల్ బ్యాంకింగ్ సేవలను విస్తరించడంతో పాటు పాడి రైతులకు నగదు లావాదేవీలను సులభతరం చేయడానికి మైక్రో ఏటీఎంలు ఉపయోగపడతాయని నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయ్భాస్కర్ అన్నారు. హనుమకొండలోని వరంగల్ డీసీసీబీ కార్యాలయంలో బుధవారం డీసీసీబీ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నాబార్డ్ సీజీఎం ఉదయ్భాస్కర్, డీసీసీబీ సీఈఓ వజీర్ సుల్తాన్, నాబార్డ్ డీడీఎంలు చంద్రశేఖర్, రవి, జీఎం ఉష శ్రీ, డీజీఎం అశోక్ ఉన్నారు.శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ -
‘పది’పై ప్రత్యేక దృష్టి సారించండి
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో టెన్త్ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రణాళికతో ముందుకెళ్లేలా పర్యవేక్షించాలని డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ ఎంఈఓలను ఆదేశించారు. బుధవారం డీఈఓ కార్యాలయంలోని డీసీఈబీ భవనంలో హనుమకొండ జిల్లాలోని అన్ని మండలాల ఎంఈఓలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. టెన్త్ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని, జిల్లాలోని పాఠశాలలను తనిఖీ చేయాలని, పాఠశాలల్లో పరిశుభ్రత ఉండేలా చూడాలన్నారు. పాఠశాలల్లో 5వ తరగతినుంచి 10వ తరగతివరకు పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్ కోసం అర్హులైన విద్యార్థులతో ఇ–పాస్ ద్వారా దరఖాస్తులు చేయించాలని ఆదేశించారు. సమావేశంలో డీసీఈబీ కార్యదర్శి డాక్టర్ బి.రాంధన్, సాంఘిక సంక్షేమ జిల్లా సహాయగణాంక అధికారి జి.రాహుల్, ఎంఈఓలు జి.నెహ్రూనాయక్, బి.మనోజ్కుమార్, ఎ.శ్రీనివాస్, ఎస్.విజయ్కుమార్, ఎం.చంద్రమౌళి, పి.ఆనందం, ఎల్. రాజేశ్కుమార్, కె.శ్రీధర్, భిక్షపతి పాల్గొన్నారు. డీఈఓ గిరిరాజ్గౌడ్ ఎంఈఓలతో సమీక్ష -
తడి, పొడి చెత్తను వేరు చేయాలి
బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ వరంగల్ అర్బన్: డీఆర్సీసీ నిర్వాహకులు పొడి చెత్తను స్వీకరించాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. శానిటేషన్ తనిఖీల్లో భాగంగా కమిషనర్ బుధవారం హనుమకొండ పరిధి 57, 59 డివిజన్లలో ప్రత్యక్షంగా శానిటేషన్ తీరును పరిశీలించారు. స్వచ్ఛ ఆటోలన్నీ భవానీనగర్ వాట ర్ ట్యాంక్ వద్దకు తీసుకొచ్చి తడి, పొడి చెత్తను వేరు చేయాలని, ప్రతీ గృహం నుంచి సేకరించాలని కోరారు. డీఆర్సీసీ కేంద్రం ఇక్కడే ఉన్నందున పొడి చెత్తను డీఆర్సీసీ నిర్వాహకులు స్వీకరించాలని కమిషనర్ అన్నారు. కార్యక్రమంలో సీఎంహెచ్ఓ రాజారెడ్డి, శానిటరీ సూపర్వైజర్ నరేందర్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్రమ్ శ్రీను, ఆస్కి ప్రతినిధి రాజ్మోహన్, వావ్ ప్రతినిధి పవన్ పాల్గొన్నారు. -
మేడారం భక్తులకు ఏర్పాట్లు చేయాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: ములుగు జిల్లా మేడారం జాతరకు వెళ్లే సమక్క–సారలమ్మ భక్తులకు ఏర్పాట్లు చేయాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. బుధవారం జాతర ఏర్పాట్లపై కలెక్టరేట్లో అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముందస్తు ప్రణాళికతో సమర్థవంతంగా ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం భక్తుల కోసం తాత్కాలిక ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటును క్షేత్రస్థాయిలో అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. సమీక్షలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా ఆర్అండ్బీ అధికారి రాజేందర్, డీఎంహెచ్ఓ సాంబశివరావు, ఈఈ సునీత, అధికారులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించాలి.. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను (బ్లాక్స్పాట్లు) గుర్తించి నివారించేందుకు సమగ్ర చర్యలు తీసుకోవాలన్నారు. వరంగల్–ఖమ్మం హైవే, ఇతర ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు కలెక్టర్కు వివరించారు. ఆర్అండ్బీ ఈఈ రాజేందర్, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి శోభన్బాబు, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి ఇజ్జగిరి, ఎన్హెచ్ అధికారులు, అధికారులు పాల్గొన్నారు. -
క్లెయిమ్ చేయని ఆస్తులు పొందొచ్చు
హన్మకొండ అర్బన్: క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తులను హక్కుదారులు తమ బ్యాంకులు లేదా సంబంధిత సంస్థలను సంప్రదించి నిధులు తిరిగి పొందొచ్చని హనుమకొండ జిల్లా ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ వైవీ గణేశ్ సూచించారు. కలెక్టరేట్లో ‘మీ డబ్బు–మీ హక్కు’ అంశంపై బుధవారం ప్రత్యేక శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన గణేశ్ మాట్లాడుతూ.. క్లెయిమ్ చేయని డిపాజిట్లు, షేర్లు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్లు, బీమా ఆదాయాలు, తది తర ఆస్తులు తిరిగి పొందొచ్చని సూచించారు. ఎస్ బీఐ రీజినల్ మేనేజర్ షేక్ అ బ్దుల్ రహీం, ఆర్బీఐ ఏజీఎం ఎం.జెడ్. రెహమాన్, ఎస్బీఐ ఎస్ఎల్బీసీ మేనేజర్ కాళీప్రకాశ్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ జన్ను మహేందర్ పాల్గొన్నారు. హక్కులపై అవగాహన కల్పించాలి.. వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించాలని హనుమకొండ జిల్లా ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ వై.వి గణేశ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా గణేశ్ మాట్లాడుతూ.. వినియోగదారులు ఎక్కువగా తూకాలతో నష్టపోతున్నారని, దీని నివారణకు తూనికలు కొలతల శాఖ అధికారులు క్రమంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. వినియోగదారుల ఫోరం విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. సమావేశంలో డీసీఎస్ఓ వాజీద్ అలీ, తూనికలు కొలతల శాఖ అధికారి వెంకటేశ్, రాష్ట్ర వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు రతన్ సింగ్ ఠాగూర్, కార్యదర్శి సూరజ్, ఓరుగల్లు వినియోగదారుల ఫోరం సభ్యులు దండు యుగేందర్, బండ వివేకానంద, శోభ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ వైవీ గణేశ్ ‘మీ డబ్బు – మీ హక్కు’ అంశంపై శిబిరం -
పీఆర్సీని ప్రకటించాలి
విద్యారణ్యపురి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు వెంటనే పీఆర్సీని ప్రకటించాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి డిమాండ్ చేశారు. బుధవారం హనుమకొండలోని టీఎస్యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఆ సంఘం జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ము ఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికై న ఆరునెలలలోపు మేనిఫెస్టోలో పెట్టినట్లుగా పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు పట్టించుకోకపోవడం శోఛనీయమన్నారు. ఐదు డీఏలు విడుదల చేయకుండా జాప్యం చేస్తోందని విమర్శించారు. ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 23ను సవరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఫ్యామిలీ వెల్ఫేర్ ఫండ్ చైర్మన్ రాజశేఖర్రెడ్డి, టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సోమశేఖర్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు సీహెచ్.రవీందర్రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి పెండెం రాజు, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు డి.కిరణ్కుమార్, ఆల్ పెన్షనర్ల అసోసియేషన్ రాష్ట్ర బాధ్యులు సీతారాం, జిల్లా కార్యదర్శులు సీహెచ్.లింగారావు, మోజెస్, చంద్రయ్య, ప్రసన్నానంద్, కె.సదానందం, జిల్లా ఉపాధ్యక్షుడు ఎ.రాజారాం, ఎస్.జ్యోతి, గురుకుల బాధ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. టెట్ నుంచి టీచర్లను మినహాయించాలి టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రవి -
నేల ఆరోగ్యంతోనే రైతులు బాగు
● ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ ఉమారెడ్డి హన్మకొండ: నేల ఆరోగ్యంతోనే రైతులు బాగుంటారని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకుడు ఆర్.ఉమారెడ్డి అన్నారు. మంగళవారం వరంగల్ పైడిపల్లిలోని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో జాతీ య రైతు దినోత్సవం నిర్వహించారు. దేశ మాజీ ప్రధాని చరణ్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు. ఈ క్రమంలో రైతులు భూసారాన్ని పరిరక్షించుకోవాలన్నారు. అలాగే, వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రైతుల శ్రేయస్సు కోసం చేస్తున్న వివిధ కార్యక్రమాల గురించి పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరిచారు. కార్యక్రమంలో మధ్య తెలంగాణ మండలంలోని రైతు విజ్ఞాన కేంద్రాలైన వరంగల్, జోగిపేట, తోర్నాల కోఆర్డినేటర్లు డాక్టర్ ఎ.విజయభాస్కర్, డాక్టర్ కె.రాహుల్, డాక్టర్ పల్లవి, శాస్త్రవేత్తలు, రైతులు, వ్యవసాయ విద్యార్థులు పాల్గొన్నారు. -
బస్సు ఎక్కేందుకు రోడ్డు దాటుతుండగా..
● కారు ఢీకొని వ్యక్తి మృతి ● వంగాలపల్లిలో ఘటన చిల్పూరు: బస్సు ఎక్కేందుకు రోడ్డు దాటుతున్న సమయంలో కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం మండలంలోని వంగాలపల్లి గ్రామ బస్ స్టేజీ సమీపంలోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఎస్సై నవీన్కుమార్ కథనం ప్రకారం.. ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాల గ్రామానికి చెందిన బొమ్మిరెడ్డి కృష్ణారెడ్డి (54) ఆటోలో చిల్పూరు మండలం చిన్నపెండ్యాలలోని ఎస్బీఐకి వస్తూ కరుణాపురంలో దిగాడు. అక్కడ బస్సు ఎక్కేందుకు రోడ్డు దాటుతుండగా స్టేషన్ఘన్పూర్ నుంచి హనుకొండకు వెళ్తున్న కారు ఢీకొంది. ఈ ఘటనలో కృష్ణారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య విజయ ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్ కదిరె సాయివివేకానందరెడ్డిపై కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. -
టార్గెట్ జనవరి 5..
ఎస్ఎస్తాడ్వాయి : మేడారం సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణ పనులన్నీ డిసెంబర్ 31 కల్లా పూర్తి చేయాలని, అటు ఇటు అయితే జనవరి 5 కల్లా పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి.. అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం మేడారంలోని హరితహోట్లో మంత్రి సీతక్క, సీఎం ముఖ్య సలహాదారు వేం నరేందర్రెడ్డి, ఎంపీ బలరాంనాయక్, కలెక్టర్ దివాకర్ టీఎస్, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా పనుల పురోగతి వివరాలను అధికారులు మంత్రులకు వివరించారు. ప్రాకారం పనులపై సుదీర్ఘ సమీక్ష అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో జరుగుతున్న ప్రాకారం రాతి నిర్మాణ పనులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సుమారు అరగంటకుపైగా సమీక్షించారు. ప్రాకారం చుట్టూ రాతి స్తంభాల ఏర్పాటుతోపాటు వాటిపై డిజైన్ ఏర్పాట్ల పనులు, గోవిందరా జు, పగిడిద్దరాజు గద్దెల పునరుద్ధరణతోపాటు అమ్మవార్ల గద్దెల విస్తరణలో భాగంగా రాతి నిర్మాణ పనులన్నీ డిసెంబర్ 31 వర కు పూర్తి చేయాలని ఆదేశించారు. జనవరి 5వ తేదీ లోపు ఎప్పుడైనా ఎవరికీ తెలియకుండా విజిట్ చేస్తానని, పనుల్లో లోపాలు ఉంటే సహించేది లేదన్నారు. జనవరి 6వతేదీన సీఎం రేవంత్రెడ్డి వచ్చే చాన్స్ ఉందని, ఆలోగా పనులన్నీ పూర్తి చేయాలన్నారు. స్వస్తిక్ గుర్తు ఆదివాసీల సంప్రదాయమే.. స్వస్తిక్ గుర్తును ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయం ప్రకారం ఏర్పాటు చేస్తున్నామని, దీనిపై ఎవరూ రాద్ధాంతం చేయొద్దని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క కోరారు. ప్రకృతి దైవాలుగా భావించి సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గొట్టు, గోత్రాల ప్రకారం పనులు చేస్తున్నారన్నారు. కాగా, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల పునఃప్రతిష్ఠ పూజ కార్యక్రమాల సందర్భంగా నేడు (బుధవారం) అమ్మవార్ల దర్శనాలు నిలిపివేసినట్లు పూజారులు ప్రకటించారని, భక్తులు సహకరించాలన్నారు. క్షేత్రస్థాయిలో పనుల పరిశీలన జాతర పనులను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ధనసరి సీతక్క క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అంతకుముందు మంత్రులు శ్రీనివాస్రెడ్డి, సీతక్క, సీఎం ముఖ్య సలహాదారు నరేందర్రెడ్డి, ఎంపీ బలరాంనాయక్ అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవీచందర్ ఉన్నారు.మేడారం గద్దెల ప్రాంగణంలో పునరుద్ధరించిన గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై నేడు (బుధవారం) ధ్వజ స్తంభాల పునఃప్రతిష్ఠ పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈమేరకు మంగళవారం గోవిందరాజు, పగిడిద్దరాజు పూజారులు పూజ కార్యక్రమాలను సిద్ధం చేశారు. పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు పూజారులు, కొండాయి నుంచి గోవిందరాజు పూజారులు వారి గుడిల వద్ద పూజాకార్యక్రమాలు నిర్వహించుకుని మంగళవారం రాత్రి మేడారానికి చేరుకున్నారు. బుధవారం ఉదయం 9 గంటల సమయంలో గోవిందరాజు, పగిడిద్దరాజు ధ్వజ స్తంభాల ను నిలపనున్నట్లు పూజారులు తెలిపారు. ఆ లోపు అభివృద్ధి పనులు పూర్తి చేయాలి అధికారులకు మంత్రి పొంగులేటి డెడ్లైన్ క్షేత్ర స్థాయిలో పనులు పరిశీలించిన మంత్రులు -
బైక్ను ఢీకొన్న ఇసుక లారీ..
● యువకుడి దుర్మరణం ● దేవన్నపేటలో విషాదం హసన్పర్తి: ఇసుక లారీ.. బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన వడ్డేపల్లి–ఉనికిచర్ల మార్గమధ్యలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హసన్పర్తి మండలం దేవన్నపేటకు చెందిన మాజీ సర్పంచ్ పంజాల నాగలక్ష్మి కుమారుడు చరితకుమార్(27) స్థానికంగా వ్యాపారం చేస్తూ తల్లిదండ్రులకు చేడోడువాడుగా ఉంటున్నాడు. మంగళవారం ఉదయం జాతీయ రహదారి మీదుగా బైక్పై నిరూప్నగర్ తండా వైపునకు బయలుదేరాడు. సుబ్బయ్యపల్లి పెట్రోల్ పంప్ సమీపంలోకి రాగా, వడ్డేపల్లి నుంచి ఉనికిచర్ల వైపునకు వెళ్తున్న ఇసుక లారీ డివైడర్ల పైనుంచి దూసుకొచ్చి బైక్ను ఢీకొంటూ రోడ్డు కిందికి వెళ్లింది. ఈ ప్రమాదంలో చరితకుమార్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సమాచారం అందుకున్న మృతుడి తల్లిదండ్రులు నాగలక్ష్మి, భూపాల్తోపాటు బంధువులు ఘటనా స్థలికి తరలొచ్చి బోరున విలపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతుడి తండ్రి భూపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవి తెలిపారు. చరితకుమార్ మృతితో దేవన్నపేటలో విషా దం అలుముకుంది. కాగా, సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఘటనాస్థలిని సందర్శించి మృతుడి తల్లిదండ్రులను ఓదార్చారు. ఐపీఎల్ సెలక్టర్గా సాయినాథ్రెడ్డి మహబూబాబాద్ అర్బన్ : మానుకోట జిల్లా కేంద్రానికి చెందిన సంకేపల్లి శ్రీనివాస్రెడ్డి, కీర్తన దంపతుల కుమారుడు సాయినాథ్రెడ్డి ఇండియన్ ప్రీమియర్లీగ్ (ఐపీఎల్) క్రికెట్ టోర్నమెంట్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సూపర్ సెలక్టర్గా ఎంపికయ్యారు. ఇటీవల ఐపీఎల్ టెక్నికల్ వింగ్కు దేశ వ్యాప్తంగా ఎంపికలు నిర్వహించారు. ఇందులో సాయినాథ్ రెడ్డి సెలక్టర్గా ఎంపికయ్యారు. దీంతో యూ ఏఈలోని అబుదాబిలో జరిగిన ఐపీఎల్ వేలంలో కోచ్ సంగక్కర, డైరెక్టర్ ఆఫ్ స్రాటజీ జైల్స్తోపాటు సాయినాథ్రెడ్డి.. రాజస్తాన్ రాయల్స్ జట్టుకు క్రీడాకారులను ఎంపిక చేశారు. కాగా, సాయినాథ్రెడ్డి బెంగళూరులో డేటా సైంటిస్ట్ ఉద్యోగం చేస్తున్నారని తల్లిదండ్రులు తెలిపారు. బీసీ మహిళలకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ హన్మకొండ: ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ (ఓబీసీ) ఆధ్వర్యంలో బీసీ మహిళలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగావకాశాలు పొందేందుకు నైపుణ్య శిక్షణలో భాగంగా డ్రైవింగ్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆ సంస్థ చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్, ప్రధాన కార్యదర్శి గడ్డ భాస్కర్ తెలిపారు. మంగళవారం హనుమకొండ రాంనగర్లోని ఓబీసీ కార్యాలయంలో ఫ్రీ ఉమెన్ ట్రైనింగ్ ఫర్ బీసీ ఉమెన్ కార్ పైలట్ బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓబీసీ సంస్థ వివిధ సామాజిక సేవా కార్యక్రమాలతోపాటు బీసీ బాలికల వసతి గృహంలో ఆరోగ్య శిబిరాలు నిర్వహించామన్నారు. ఇదే క్రమంలో మహిళలకు డ్రైవింగ్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. -
సూపర్స్పెషాలిటీ ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స
ఎంజీఎం : పుట్టుకతోనే తీవ్ర వినికిడి లోపం ఉన్న వరంగల్కు చెందిన 16 నెలల చిన్నారికి ఆరోగ్య శ్రీ పథకం ద్వారా కేఎంసీలోని పీఎంఎస్ఎస్వై సూపర్స్పెషాలిటీ ఆస్పత్రిలో ‘కోక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ’ విజయవంతంగా పూర్తి చేసినట్లు ఎంజీఎం సూపరింటెండెంట్ హరీశ్ చంద్రారెడ్డి మంగళవారం తెలిపారు. అత్యంత సంక్లిష్టమైన, ఖరీదైన ఆపరేషన్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పూర్తి ఉచితంగా చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ను హైదరాబాద్లోని కోఠి ప్రభుత్వ ఈఎన్టీ హాస్పిటల్ సూపరింటెండెంట్, సీనియర్ కోక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ ఆనంద్ ఆధ్వర్యంలో సీనియర్ ఈఎన్టీ సర్జన్, తెలంగాణ రాష్ట్ర కోక్లియర్ ఇంప్లాంట్ నోడల్ ఆఫీసర్ మనీష్ గుప్తా చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా హరీశ్ చంద్రారెడ్డి మాట్లాడుతూ పుట్టిన వెంటనే పిల్లలకు వినికిడి పరీక్షలు చేయించుకోవాలన్నారు. వినికిడి లోపం ఉన్నట్లు గుర్తిస్తే కోక్లియర్ ఇంప్లాంట్ ద్వారా సరి చేయొచ్చన్నారు. తద్వారా మూగ, చెవిటి కాకుండా నిరోధించి సామాన్య జీవితం అందించొచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఎంజీఎం ఈఎన్టీ హెచ్ఓడీ సంపత్, ప్రొఫెసర్ విజయ్, కోఠి ఈఎన్టీ వైద్యురాలు వీణ, ఎంజీఎం అనస్థీషియా విభాగం ప్రొఫెసర్ చిలక మురళి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు పద్మావతి, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కీచక అధ్యాపకుడు..!
పరకాల: డిగ్రీ కాలేజీలో విద్యార్థినులపై ఓ అధ్యాపకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా పరకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. బాధిత విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం.. పరకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తున్న మోరె అశోక్ చాలాకాలంగా విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ విషయంపై గతంలో ప్రిన్సిపల్ డాక్టర్ సంతోష్కుమార్కు విద్యార్థినులు ఫిర్యాదు చేయగా అతన్ని మందలించి వదిలేశారు. అయినప్పటికీ ఆ కీచక అధ్యాపకుడు ప్రవర్తనలో మార్పు రాలేదు. మళ్లీ విద్యార్థినులకు వీడియోకాల్స్ చేయడం, ఫోన్లో చాటింగ్ చేయడంతో పాటు లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. ఆ కీచకుడి వేధింపులపై బాధిత విద్యార్థినులు ఈ నెల 18న ప్రిన్సిపల్కు మరోసారి ఫిర్యాదు చేయగానే ఆయన లైంగిక వేధింపుల నిరోధక కమిటీకి విచారణకు ఆదేశించారు. అప్పటికి సెలవుల్లో ఉన్న అధ్యాపకుడు అశోక్ ఈ నెల 22లోపు ఆ కమిటీకి సంజాయిషీ ఇవ్వాల్సి ఉండగా హాజరు కాలేదు. బాధిత విద్యార్థినులు, కుటుంబ సభ్యుల ఆందోళన సెలవుల్లో ఉన్న అధ్యాపకుడు మోరె అశోక్ మంగళవారం కళాశాలకు వచ్చిన విషయం తెలుసుకున్న పలువురు విద్యార్థినుల తల్లిదండ్రులు కాలేజీకి చేరుకొని ఆందోళన నిర్వహించారు. అతనిపై దాడికి ప్రయత్నించగా తప్పించుకొని పారిపోయాడు. ఇలాంటి విషయాలపై తాను క్షమించే ప్రసక్తే లేదంటూ ప్రిన్సిపల్ సంతోష్కుమార్ వారికి నచ్చజెప్పారు. ఈ విషయమై ప్రిన్సిపల్ బి.సంతోష్కుమార్ మాట్లాడుతూ విద్యార్థినుల పట్ల లైంగిక వేఽధింపులకు పాల్పడిన అధ్యాపకుడు మోరె అశోక్పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే లైంగిక వేధింపుల నిరోధక కమిటీకి సంజాయిషి ఇవ్వాలని కోరామని, అయినా పట్టించుకోకపోవడంతో ఉన్నత విద్యాశాఖ బోర్డు కమిషనర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వారి ఆదేశాల మేరకు సదరు అధ్యాపకుడిపై చర్యలు తీసుకుంటామన్నారు. సౌత్ జోన్ టోర్నమెంట్కు కేయూ జట్టు కేయూ క్యాంపస్ : చైన్నెలోని సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ బాస్కెట్ బాల్ టోర్నమెంట్ ఈనెల 24 నుంచి 28 వరకు జరుగబోతుందని, ఈ టోర్నమెంటులో కాకతీయ యూనివర్సిటీ పురుషుల జట్టు పాల్గొననున్నట్లు కేయూ స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ ప్రొఫెసర్ ఆచార్య వై.వెంకయ్య మంగళవారం తెలిపారు. జట్టులో కె.యశ్వంత్, కె. సుధాకర్, విగ్నేష్, ఆర్. నరేందర్ జి. దినేష్కుమార్, టి.మయూర్రాజ్, ఎస్. తారాకేష్ యాదవ్, ఎం.శ్రీహరి, బి. ఈశ్వర్ కె భరత్రాజ్, సిహెచ్జయ చంద్ర, పి.అవినాష్ ఉన్నారని తెలిపారు. జట్టుకు హనుమకొండ గీతాంజలి డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ఇర్ఫాన్ మహ్మద్ కోచ్గాను, యూనివర్సిటీ పీజీ కాలేజి ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ పి.భాస్కర్ మేనేజర్గా వ్యవహరిస్తున్నారని తెలిపారు. మెన్స్ హాకీ టీమ్ ఎంపికలు కేయూ మైదానంలో మంగళవారం ఇంటర్ కాలేజీయేట్ యూనివర్సిటీ హాకీ మెన్స్ టీమ్ ఎంపికలు నిర్వహించినట్లు కేయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ వై.వెంకయ్య తెలిపారు. ఈ ఎంపికలకు వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల నుంచి 40 మంది హాకీ క్రీడాకారులు పాల్గొన్నట్లు తెలిపారు. ఇందులో ఎంపికై న క్రీడాకారులు చెన్నయ్ సత్యభామ యూని వర్సిటీలో జరగబోయే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సెలక్టర్స్ కె.సునీల్రెడ్డి, కె.శ్రీనివాస్, ఎస్డీ యాసిన్, కె.రాకేష్ పాల్గొన్నారు. ● పరకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకుడి లైంగిక వేధింపులు -
మైసమ్మ ఆలయం కూల్చివేత.. నిరసనలు
వరంగల్: నగరంలోని 3వ డివిజన్ పైడిపల్లిలో మై సమ్మ ఆలయాన్ని అధికారులు తొలగించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామంలో ఉన్న మైసమ్మ విగ్రహం వద్ద ఆలయం నిర్మాణం చేపట్టారు. ఇది ‘కుడా’ వెంచర్కు అడ్డుగా ఉందని, రహదారి పక్క నే ఉండడం వల్ల కొంత మంది అధికారులకు ఫిర్యా దు చేసినట్లు తెలిసింది. ఈమేరకు నిర్మాణంలో ఉన్న మైసమ్మ ఆలయాన్ని మంగళవారం రాత్రి భారీ పోలీసు బందోబస్తు మధ్య తొలగించారు. కూ ల్చివేతను అడ్డుకునేందుకు ఆలయ నిర్మాణ దాత బొల్లం రవి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో ఎంజీఎం తరలించారు. హిందూ ఆలయం కూల్చి వేశారన్న విషయం తెలియడంతోనే బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి వరంగల్, ఏటూరునాగారం జాతీయ రహదారిపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ నేతృత్వంలో బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కేవలం హిందూ ఆలయాలనే లక్ష్యం చేసుకున్నారని, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, అర్ధరాత్రి వేళల్లో కూల్చివేతలు చేపట్టడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. కూల్చివేసిన ఆలయాన్ని వెంటనే పునర్నిర్మించాలని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని గంట రవికుమార్ డి మాండ్ చేశారు. ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. నిర్మాణ దాత రవి ఆత్మహత్యాయత్నం -
ప్రపంచం దృష్టి భారత్ వైపు..
కేయూ క్యాంపస్: దేశ పునర్మిర్మాణంలో యువతను భాగస్వామ్యం చేస్తూ ఈ దేశాన్ని విశ్వ గురువుగా నిలబెట్టే ప్రయత్నంలో ఏబీవీపీ నిమగ్నమైందని, ప్రపంచం దృష్టి భారత్ వైపు చూస్తోందని అఖిలభారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) జాతీయ సంఘటన కార్యదర్శి బాలకృష్ణ అన్నారు. రెండురోజుల నుంచి ఏబీవీపీ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీలోని ఆడిటోరియంలో కొనసాగిన రాష్ట్రంలోని యూనివర్సిటీల విద్యార్థుల సమ్మేళనం మంగళవారం సాయంత్రం ముగిసింది. ఈ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కొన్ని విద్యార్థి సంఘాలు విద్యార్థులను తప్పుదోవ పట్టించే యత్నం చేస్తుంటే ఈ దేశం కోసం, మట్టికోసం చివరి శ్వాస వరకు ఏబీవీపీ విద్యార్థులు పోరాడుతున్నారన్నారు. సమాజంలో అందరిని కలుపుకుని దేశం కోసం పనిచేసేది ఏబీవీపీ కార్యకర్తలేనన్నారు. ఏబీవీపీ ప్రాంత ప్రముఖ్ మాసాడిబాబురావు, రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు, యూనివర్సిటీస్ హాస్టళ్ల కన్వీనర్ జీవన్, కేయూ ఇన్చార్జ్ నిమ్మల రాజేశ్, అధ్యక్షుడు ఉబ్బటి హరికృష్ణ ,కార్యదర్శి జ్ఞానేశ్వర్, తదితరులు పాల్గొన్నారు. ఏబీవీపీ జాతీయసహ సంఘటన కార్యదర్శి బాలకృష్ణ -
క్రీడలతో మానసికోల్లాసం
స్టేషన్ఘన్పూర్: క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని స్టేషన్ఘన్పూర్ మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ అన్నారు. ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధి శివునిపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం ఉమ్మడి జిల్లాస్థాయి పాలిటెక్నిక్ కళాశాలల క్రీడాపోటీలు ప్రారంభమయ్యాయి. మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ, నిట్ వరంగల్ పీడీ రవికుమార్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. అనంతరం కమిషనర్ రాధాకృష్ణ మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులు స్ఫూర్తితో వ్యవహరించాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ పోచయ్య మాట్లాడుతూ వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, టేబుల్ టెన్నిస్, చెస్, బాల్బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, తదితర పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 14 పాలిటెక్నిక్ కళాశాలలు ఉండగా 12 కళాశాలల నుంచి దాదాపు 500 మంది క్రీడాకారులు హాజరయ్యారని, పోటీలు రెండు రోజులు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో వరంగల్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్, పీడీలు, పీఈటీలు, అధ్యాపకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ స్టేషన్ఘన్పూర్లో ఉమ్మడి జిల్లా స్థాయి పాలిటెక్నిక్ క్రీడలు ప్రారంభం -
క్రీస్తు బోధనలు మానవాళికి మార్గదర్శకం
క్రిస్మస్ వేడుకల్లో మంత్రి కొండా సురేఖ వరంగల్: యేసుక్రీస్తు బోధనలు సర్వమానవాళికి మార్గదర్శకమని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వరంగల్ ఓసిటీలోని మంత్రి క్యాంపు కార్యాలయ ఆవరణలో మంగళవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాస్టర్లతో కలిసి మంత్రి క్రిస్మస్ కేక్ కట్ చేశారు. పాస్టర్లకు తన సొంత ఖర్చుతో దుస్తులు పంపిణీ చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే క్రిస్మస్ వేడుకలు ప్రేమ, దయ, కరుణకు చిహ్నంగా నిలుస్తాయని అన్నారు. వరంగల్ నగరంలోని చర్చిలకు రంగులు వేసేందుకు సీఎం నిధులు కేటాయించడం హర్షణీయమని మేయర్ సుధారాణి అన్నారు. మంత్రి ఆదేశం మేరకు నగరంలోని చర్చిలు ఉన్న ప్రాంతాల్లో కార్పొరేషన్ తరఫున శానిటేషన్, లైటింగ్కు రూ.10 లక్షలు వెచ్చించినట్లు తెలిపారు. క్రిస్మస్ వేడుకల సందర్భంగా స్టేజీపై ఎలాంటి పదవులు లేని కాంగ్రెస్ నాయకులు ఆసీనులు కావడంపై పలువురు చర్చించుకున్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, అదనవు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సుమ, కార్పొరేటర్లు భోగి సువర్ణ, కావేటి కవిత, అనిల్కుమార్, పద్మ, రవి, సురేష్, ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఒరిగిన విద్యుత్ స్తంభం..
హన్మకొండ: వరద తాకిడికి రోడ్డు కోతకు గురికావడంతో 11 కేవీ విద్యుత్ స్తంభం పక్కకు ఒరిగి ప్రమాదకరంగా మారింది. దీంతో సమీపంలో ఉన్న డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్కు విద్యుత్ సరఫరా నిలిపివేసిన టీజీ ఎన్పీడీసీఎల్ అధికారులు ప్రతామ్నాయ విద్యుత్ సరఫరా చేస్తున్నారు. అక్టోబర్ 29న కురిసిన భారీ వర్షానికి హనుమకొండలో వరద పోటెత్తింది. క్రమంలో ఇంజనీర్స్ కాలనీ సమీపంలోని ఓ ప్రైవేట్ స్కూల్ ఎదుట నాలాను ఆనుకుని ఉన్న రోడ్డు పూర్తిగా కోతకు గురై 11 కేవీ విద్యుత్ స్తంభం పట్టుకోల్పోయి ఒక వైపు ఒరిగింది. విద్యుత్ లైన్ మరో ఇనుప స్తంభానికి తాకి ప్రమాదకరంగా మారగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఒరిగిన స్తంభం సమీపంలోనే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ఉంది. దీంతో ఈ ట్రాన్స్ఫార్మర్కు విద్యుత్ సరఫరా నిలిపివేసి అధికారులు ప్రత్యామ్నాయం ద్వారా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. విద్యుత్ స్తంభం ఒరిగి పోయి, విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ నిరుపయోగంగా ఉన్నా ఎన్పీడీసీఎల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. విద్యుత్ స్తంభాన్ని తిరిగి నాటి విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ను తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని విద్యానగర్ వాసులు కోరుతున్నారు. -
మేడారం.. ముమ్మరం
మేడారంలో గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణం, పలు అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. గద్దెల చుట్టూ ప్రాకారం చుట్టు రాతి స్తంభాల ఏర్పాటుతోపాటు వాటిపై డిజైన్లు, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల పునరుద్ధరణతోపాటు అమ్మవార్ల గద్దెల విస్తరణలో భాగంగా రాతి నిర్మాణ పనులు ఒక రూపునకు వచ్చాయి. గద్దెల ప్రాంగణంలో గ్రానైట్ రాయి పరుస్తున్నారు. అదేవిధంగా జంపన్నవాగు వద్ద స్నానఘట్టాలు, జల్లు స్నానాల పనులు చురుగ్గా సాగుతున్నాయి. – ఎస్ఎస్తాడ్వాయి ఆలోగా మేడారం జాతర పనులు పూర్తి కావాలి మంత్రులు పొంగులేటి, సీతక్క ఆదేశం గద్దెల విస్తరణ, ప్రాంగణ పనుల పరిశీలన -
కేఎంసీ ఆభివృద్ధికి కృషి
కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ రమేశ్రెడ్డి ఎంజీఎం: కాకతీయ వైద్య కళాశాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్చాన్స్లర్ డాక్టర్ రమేశ్రెడ్డి అన్నారు. కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన అవార్డులు, ప్రశంసపత్రాల ప్రదానోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రథమ, ద్వితీయ సంవత్సర ఎంబీబీఎస్ టాపర్లు, పీజీ యూనివర్సిటీ టాపర్లకు అవార్డులు, ప్రశంసపత్రాలు అందజేశారు. అలాగే, ఏఎంబీఐ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికై న ప్రొఫెసర్ డాక్టర్ పుల్లయ్యను శాలువాతో సన్మానించారు. అనంతరం వీసీ రమేశ్రెడ్డి మాట్లాడుతూ కేఎంసీ (1979 బ్యాచ్) పూర్వ విద్యార్థిగా చదివిన తాను ఇప్పుడు ముఖ్య అతిథిగా రావడం ఆనందంగా ఉందని తెలిపారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సూచనల మేరకు ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో గుణాత్మకమైన మార్పులు తీసుకొచ్చేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. అనంతరం వీసీని కళాశాల బృందం ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో కళాశాల విభాగాధిపతులు, అధ్యాపకులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. -
రెండేళ్లు.. 11 ప్రమాదాలు
హసన్పర్తి: వడ్డేపల్లి–ఉనికిచర్ల రోడ్డును రెండేళ్ల క్రితం డబుల్గా విస్తరించారు. ఈ మార్గంలోని సుబ్బయ్యపల్లి పెట్రోల్ పంపు మలుపు ప్రమాదకరంగా మారింది. రెండేళ్లలో ఇక్కడ 11 ప్రమాదాలు జరిగి పలువురు మృతిచెందారు. అనేక మంది గాయపడ్డారు. మంగళవారం జరిగిన ప్రమాదం దిగ్భ్రాంతికి గురిచేసింది. పెట్రోల్ బంకు సమీపంలో ఇసుక లారీ ఢీకొని దేవన్నపేట గ్రామానికి చెందిన చరత్కుమార్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అంతకుముందు ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లో పనిచేస్తున్న ధర్మసాగర్ మండలానికి చెందిన ఓ యువకుడు, ధర్మసాగర్లో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శి మహేశ్, ముప్పారానికి చెందిన మాచర్ల రాజు, శాయంపేటకు చెందిన రాజు, ఉనికిచర్లకు చెందిన సందెల రమేశ్ రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు. రోడ్డు ప్రమాదాలపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ జరిగిన ప్రమాదాల్లో మృతిచెందిన వారందరూ 40 ఏళ్ల లోపు వారేనని వారు తెలిపారు. మలుపు వద్ద ఏదైనా అదృశ్య శక్తి ఉందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇసుకలారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి సుబ్బయ్యపల్లి పెట్రోల్బంకు మలుపు వద్ద ప్రమాదాలు జరుగకుండా హెచ్చరిక బోర్డులు, సూచికలు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. -
సాధారణ నిధులు.. డ్రెయినేజీ పాలు
వరంగల్: వరంగల్ మహానగర పాలక సంస్థలోని సాధారణ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. డివిజన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులే ఇందుకు సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. సాధారణ నిధులు కార్పొరేషన్ పరిధిలో అత్యవసరమైన పనులు, సంస్థ ఆస్తుల పరిరక్షణ కోసం వెచ్చించాలి. కానీ, ఈ నిధులు ప్రజాప్రతినిధులకు ఫలహారంగా మారాయి. ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలో ప్రతి డివిజన్కు రూ.50లక్షల చొప్పున సాధారణ నిధులు కేటాయించి కార్పొరేటర్లకు అప్పగించారు. ఇకేముంది వారి ఇష్టారాజ్యంగా మారింది. అవసరమైన చోట కాకుండా వారికి ఇష్టమున్న చోట, ఎక్కువ కమీషన్ ఇచ్చిన వారికి పనులు ప్రతిపాదిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. 19వ డివిజన్ వివేకానందకాలనీ రోడ్డు నంబర్ –2లోని ఎడమ వైపు ఉన్న వీధిలో రెండేళ్ల క్రితం నిర్మించిన పక్కా డ్రెయినేజీని మంగళవారం తవ్వారు. రెండు రోజుల క్రితం కొత్త డ్రెయినేజీ నిర్మించేందుకు గ్రేటర్ అధికారులు ఇక్కడికి వచ్చారు. డ్రెయినేజీ లేని ప్రాంతంలో నిర్మించాలని స్థానికులు కోరినా పట్టించుకోకుండా వరద నీరు ఎక్కువ వెళ్లేందుకు అంటూ పనులు ప్రారంభించారు. పక్కనే డ్రెయినేజీ లేని చోట నిర్మిస్తే ఇబ్బందులు తప్పేవని ప్రజలు పేర్కొంటున్నారు. ఈ విషయమై అధికారులను ఫోన్లో సంప్రదించగా స్పందించలేదు. -
‘పుర’ పీఠాలపై ప్రధాన పార్టీల గురి..
మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వంలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు మున్సిపాలిటీలపై గురి పెడుతున్నాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మినహా వరంగల్ ఉమ్మడి జిల్లాలో జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి, పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్తో పాటు ములుగు, స్టేషన్ఘన్పూర్, కేసముద్రం మున్సిపాలిటీలకు ఈసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. గత ఎన్నికల సమయంలో 9 మున్సిపాలిటీల్లో 2,50,687 మంది ఓటర్లు ఉండగా, 1,23,802 పురుషులు, 1,26,885 మహిళా ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈసారి ఓటర్ల సవరణలో భాగంగా పెరిగే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పడిన మూడు మున్సిపాలిటీల్లోని 54 వార్డుల్లో 35 వేల వరకు ఓటర్లున్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే నాటికి మున్సిపాలిటీల ఓటర్లపై పట్టు సాధించేందుకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. -
బుధవారం శ్రీ 24 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
హన్మకొండ చౌరస్తా: భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతిని మంగళవారం హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం జంక్షన్లో నిర్వహించారు. పీవీ కాంస్య విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనేక ఆర్థిక సంస్కరణలు చేపట్టి భారతదేశ పురోగతిలో కీలకపాత్ర పోషించిన మహోన్నత వ్యక్తి పీవీ అని కొనియాడారు. మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్, వేయిస్తంభాల ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్రశర్మ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈవీ శ్రీనివాసరావు ఉన్నారు. -
త్వరలో మున్సిపల్
ఫిబ్రవరిలో ఎన్నికలు?.. ‘అధికార’ నేతలకు సంకేతాలుసాక్షిప్రతినిధి, వరంగల్ : మున్సిపాలిటీల ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత మున్సిపాలిటీలపై సర్కారు గురి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయమై అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు సంకేతాలు కూడా వచ్చినట్లు చెబుతున్నారు. మొదట ‘పంచాయతీ’ల తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని అందరూ భావించారు. లేదంటే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు అవకాశం ఉంటుందను కున్నారు. ఇదే సమయంలో గ్రామ పంచాయతీల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ప్రభుత్వం సహకార సంఘాల పాలకవర్గాలను రద్దు చేసింది. దీంతో పీఏసీఎస్ల ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందన్న చర్చ జరుగుతున్న సమయంలో సోమవారం హైదరాబాద్ పోలీసు కమాండ్ కంట్రోల్లో మంత్రులతో భేటీ అయిన సీఎం రేవంత్రెడ్డి మున్సిపల్ ఎన్నికలను తెరమీదకు తెచ్చారన్న చర్చతో అందరి దృష్టి ఆ ఎన్నికల వైపు మళ్లింది. ఉమ్మడి జిల్లాలో 12 మున్సిపాలిటీలు.. 2020 జనవరి 7న తొమ్మిది మున్సిపాలిటీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో భూపాలపల్లి, పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట, జనగామ, తొర్రూరు, మరిపెడ, మహబూబాబాద్, డోర్నకల్ మున్సిపాలిటీలకు జనవరి 22న ఎన్నికలు జరగ్గా.. 25 ఓట్ల లెక్కింపు జరిగింది. 26న మున్సిపాలిటీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. 9 మున్సిపాలిటీల పాలకవర్గాలకు ఈ ఏడాది జనవరి 25న గడువు ముగిసింది. కొద్దిమాసాలు పొడిగిస్తారని పాలకవర్గాలు ఆశించినప్పటికీ ప్రభుత్వం ప్రత్యేక అధికారులను అదే రోజు నియమించింది. దీంతో ఎన్నికల నిర్వహణ అనివార్యంగా మారింది. ఇటీవలే గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తికాగా.. మున్సిపాలిటీలకు కూడా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు మంత్రులతో సమాలోచనలు చేసిన ముఖ్యమంత్రి.. రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు ఆ పార్టీ ముఖ్యనేత ఒకరు చెప్పారు. ఇందుకు సంబంధించి మున్సిపల్ ఓటర్ల ముసాయిదా, సవరణ ప్రక్రియపై త్వరలోనే మార్గదర్శకాలు వెలువడే అవకాశం ఉందని తెలిసింది. ఇదే జరిగితే ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే ఉన్న 9 మున్సిపాలిటీలకు తోడు కొత్తగా ఏర్పాటైన కేసముద్రం, ములుగు, స్టేషన్ఘన్పూర్కు కూడా ఎన్నికలు జరగనున్నాయి. జనవరి చివరి వారంలో షెడ్యూల్కు అవకాశం మంత్రులతో సీఎం రేవంత్ సమాలోచనల్లో చర్చ ప్రధాన పార్టీల్లో మొదలైన సమీకరణలు 9 మున్సిపాలిటీలకు ఇప్పటికే ముగిసిన కాలపరిమితి కొనసాగుతున్న స్పెషల్ ఆఫీసర్ల పాలన ఈసారి కొత్తగా మరో మూడు మున్సిపాలిటీలుఉమ్మడి వరంగల్లో మున్సిపాలిటీలు, జనాభా, వార్డులు.. మున్సిపాలిటీ జనాభా వార్డులు (2011 ప్రకారం) పరకాల 24,444 22 నర్సంపేట 37070 24 వర్ధన్నపేట 13,732 12 మహబూబాబాద్ 68,935 36 డోర్నకల్ 14,425 15 మరిపెడ 17,685 15 తొర్రూరు 19,100 16 భూపాలపల్లి 59,458 30 జనగామ 52,712 30కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, జనాభా, వార్డులు మున్సిపాలిటీ జనాభా వార్డులుములుగు 16,535 20 స్టేషన్ఘన్పూర్ 23,485 18 కేసముద్రం 18,480 16 -
కేయూ పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు వాయిదా
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో జనవరి 3 నుంచి నిర్వహించాల్సిన పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ మంగళవారం తెలిపారు. యూజీసీ నెట్, సెట్, టెట్ పరీక్షలు ఉన్నందున ఈ పరీక్షలు వాయిదావేశామని ఆయన పేర్కొన్నారు. సవరించిన పరీక్షల షెడ్యూల్ తర్వాత ప్రకటిస్తామని తెలిపారు. వరంగల్ లీగల్: నాంపల్లి సీబీఐ కోర్టుకు బదిలీపై వెళ్తున్న హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పట్టాభి రామారావుకు న్యాయవాదులు మంగళవారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు పులి సత్యనారాయణ అధ్యక్షతన ఏర్పాటు వీడ్కోల సభలో జస్టిస్ పట్టాభి రామారావు మాట్లాడుతూ తాను 8 నెలలపాటు హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా చేసిన సేవలు సంతృప్తి కలిగించాయని అన్నారు. అదనంగా ఐదు కొత్త కోర్టులు, నూతన భవనంపై మరో అంతస్తు నిర్మాణానికి తన సారథ్యంలో హైకోర్టు అనుమతి ఇచ్చిందని తెలిపారు. మంచి అనుభూతులతో బదిలీ అవుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. సమావేశంలో వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నిర్మలాగీతాంబ, హన్మకొండ జిల్లా ఇన్చార్జ్ జడ్జి అపర్ణాదేవి, న్యాయమూర్తులు, వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వలస సుధీర్, బార్ నాయకులు కొత్త రవి, అంబేడ్కర్, వెంకటేశ్, సాంబశివరావు, న్యాయవాదులు పాల్గొన్నారు. హసన్పర్తి: అంబులెన్స్లో ఓ మహిళ మంగళవారం ప్రసవించింది. వివరాలిలా ఉన్నాయి. హసన్పర్తి మండలం ఎర్రగట్టుగుట్ట ప్రాంతానికి చెందిన ఝాన్సీకి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ సిబ్బంది సకాలంలో అక్కడికి చేరుకుని ప్రథమ చికిత్స చేసే క్రమంలోనే ఝాన్సీకి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో సిబ్బంది స్వాతి, పైలట్ తిరుపతి అంబులెన్స్లోనే సాధారణ ప్రసవం చేశారు. ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డను హనుమకొండలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా అంబులెన్స్ సిబ్బందికి ఝాన్సీ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ లీగల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఇటీవల జరిగిన ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఐఎల్పీఏ) రాష్ట్ర కమిటీలో వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయవాదులకు చోటు దక్కింది. ఐఎల్పీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా హనుమకొండ బార్కు చెందిన సాయిని నరేందర్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా సీనియర్ న్యాయవాది చిల్లా రాజేంద్రప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వరంగల్ బార్కు చెందిన సీనియర్ న్యాయవాది తీగల జీవన్గౌడ్ను ఎన్నుకున్నారు. అలాగే, రాష్ట్ర కమిటీ కార్యనిర్వాహక సభ్యులుగా జన్ను పద్మ, ఎగ్గడి సుందర్రామ్, పల్లె ప్రశాంత్, నర్సంపేట బార్కు చెందిన పండగ శ్రీనివాస్ను ఎన్నుకున్నారు. రాష్ట్ర కమిటీకి ఎన్నికై న నాయకులకు హనుమకొండ, వరంగల్ బార్ అసోసియేషన్ల అధ్యక్షులు పులి సత్యనారాయణ, వలస సుధీర్, ఐఎల్పీఏ వరంగల్, హనుమకొండ జిల్లాల కన్వీనర్లు విలాసాగరం సురేందర్గౌడ్, ముచ్చు రాజేందర్, బార్ కన్వీనర్లు పెండ్యాల అనిల్కుమార్, పూసపల్లి శ్రీనివాస్, న్యాయవాదులు అంబరీషరావు, కె.నిర్మలాజ్యోతి, లడే రమేశ్, సిరిమల్ల అరుణ, శశిరేఖ తదితరులు అభినందనలు తెలిపారు. వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో ట్రైనీలకు మంగళవారం పరీక్షలు నిర్వహించారు. పలు కోర్సుల్లో శిక్షణ పొందిన 86 మందికి 85 మంది హాజరైనట్లు యువజన సర్వీసుల శాఖ సూపరింటెండెంట్ వై.విజయశ్రీ తెలిపారు. హైదరాబాద్ సెట్విన్ అధికారి మాధవి పర్యవేక్షించారు. -
డిపాజిట్ సొమ్ము తీసుకెళ్లాలి
వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణి న్యూశాయంపేట: బ్యాంకు ఖాతాల్లో క్లెయిమ్ కాని డిపాజిట్ సొమ్మును నిబంధనల మేరకు తీసుకెళ్లాలని వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి కోరారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ హాల్లో జాతీయ ప్రాంతీయ బ్యాంకుల్లో పదేళ్లకు పైబడి అన్క్లెయిమ్ డిపాజిట్లను వారి వారసులకు అప్పగించేందుకు యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మీ డబ్బు– మీ హక్కు కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా జీఎం ముత్యాల గణన్ సుప్రభాత్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ అధికారి గంట కమలాకర్ పాల్గొని మాట్లాడుతూ బ్యాంకులో ఉన్న డిపాజిట్ సొమ్మును సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించి వెంటనే క్లెయిమ్ చేసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 50 మంది నామినీలకు వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన బ్యాంకుల అంగీకార పత్రాల మొత్తాన్ని సమర్పించారు. కార్యక్రమంలో టీఅండ్బీ ఆర్ఎం చైతన్యకుమార్, నాబార్డ్ డీఎం రవి, ఎస్ఎల్బీసీ రిప్రజెంటేటివ్ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
పెన్షన్ వాలిడేషన్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి
హన్మకొండ: పెన్షన్ వాలిడేషన్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉప సంహరించుకోవాలని ఆల్ ఇండియా పెన్సనర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆర్.ఎస్.శర్మ, సెక్రటరీ జనరల్ డి.సుధాకర్ డిమాండ్ చేశారు. సోమవారం హనుమకొండ సర్క్యూట్ హౌజ్ రోడ్లోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో పెన్షనర్స్ దినోత్సవాన్ని జరుపుకున్నారు. నూతన మీటింగ్ హాల్ను ప్రారంభించారు. 2026 డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిలుగా పాల్గొని మాట్లాడుతూ 1982లో వై.వి.చంద్రచూడు ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం డీ.ఎస్.నకార వేసిన కేసులో ఇచ్చిన తీర్పు ప్రకారం ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు పొందుతున్న ప్రయోజనాలన్నీ 2026 జనవరి ఒకటి నుంచి వర్తించకుండా దుర్మార్గమైన పెన్షనర్స్ వాలిడేషన్ చట్టాన్ని రూపొందించారన్నారు. మార్చి 2024 నుంచి నవంబర్ 2025 వరకు రిటైర్డ్ అయిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ న్యాయంగా రావాల్సిన అన్ని బెన్ఫిట్లను చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా పెన్షనర్స్ ఫెడరేషన్ పూర్వ జాతీయ చైర్మన్ ఎస్.ఎస్.దూబే, పూర్వ సెక్రెటరీ జనరల్ జి.పూర్ణచందర్, రాష్ట్ర అధ్యక్షుడు ఎ.రాజేంద్ర బాబు, ప్రధాన కార్యదర్శి ఎంవీ నర్సింగారావు, పెన్షనర్స్ అసోసియేషన్ల నాయకులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా పెన్షనర్ల ఫెడరేషన్ చైర్మన్ ఆర్.ఎస్.శర్మ -
ఒక్కటే జీపీ.. ప్రమాణస్వీకారాలు వేర్వేరు చోట
● బోటిమీది తండా జీపీలో విచిత్ర పరిస్థితి ఖానాపురం : మండల వ్యాప్తంగా అన్ని గ్రామపంచాయతీల్లో సర్పంచ్లతో పాటు పాలకవర్గాలు ప్రమాణ స్వీకారాలు చేశాయి. కానీ మండలంలోని బోటిమీదితండాలో మాత్రం విచిత్ర ప్రమాణ స్వీకారం చేశారు. మొదట ఎంపీడీఓ అద్వైత సమక్షంలో సర్పంచ్ భానుప్రసాద్, నలుగురు వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇదే జీపీలో కొనసాగుతున్న గొల్లగూడెంతండా చెందిన మరో ముగ్గురు వార్డు సభ్యులు మాత్రం బోటిమీది తండా జీపీలో కాకుండా గొల్లగూడెంతండాలోనే పాత జీపీ కార్యాలయం వద్ద కార్యదర్శి సమక్షంలో ఉపసర్పంచ్తో పాటు ముగ్గురు వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఈ జీపీ పాలకవర్గ ప్రమాణస్వీకార ప్రక్రియ విచిత్రంగా ఉందని పలువురు గ్రామస్తులు ఆశ్చర్య వ్యక్తం చేశారు. -
‘అక్షయ పాత్ర’ సేవలు అనిర్వచనీయం
వరంగల్: పేద విద్యార్థుల ఆకలి తీరుస్తున్న అక్షయ పాత్ర సేవలు అనిర్వచనీయమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సోమవారం వరంగల్ ఎనుమాముల మార్కెట్ ఆవరణలోని ఇస్కాన్ అక్షయ పాత్ర ఆధ్వర్యంలో హెచ్డీబీ సహకారంతో ఏర్పాటు చేసిన వంటశాలలోని అధునాతన యంత్రాలను ప్రారంభించి మాట్లాడారు. ఆధ్యాత్మిక, సామాజిక సేవ సంస్థగా కృష్ణ చైతన్యాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి ఏర్పడిన సంస్థ ఇస్కాన్ అన్నారు. అనేక విద్యా సంస్థలను సంస్థ నడుపుతూ హరే కృష్ణ సంకీర్తన ఉచిత ప్రసాద వితరణకు ఎంతో ప్రసిద్ధి చెందిందన్నారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ ఇస్కాన్కు అనుబంధంగా పని చేస్తున్నదన్నారు. ఆకలితో ఏ బిడ్డ చదువుకు దూరం కావొద్దనే లక్ష్యంతో బెంగుళూరు కేంద్రంగా అక్షయపాత్రను ప్రారంభించారని తెలిపారు. వరంగల్ నగరంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా నాణ్యమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మధ్యాహ్న భోజన పథకాన్ని నడుపుతున్న అతిపెద్ద సంస్థ ఇదేనన్నారు. దేశంలో 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న 22 వేల ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు ప్రతీరోజు 20 లక్షల పైచిలుకు విద్యార్థులకు ఆహారం అందిస్తున్నారన్నారు. మేయర్ గుండు సుధారాణి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు, వరంగల్ కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, కార్పొరేటర్ తూర్పాటి సులోచన సారయ్య, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ -
హైదరాబాద్ నిఫ్ట్లో అడ్మిషన్లు
నయీంనగర్: భారత ప్రభుత్వ జౌళిశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) హైదరాబాద్లో 2026 విద్యా సంవత్సరానికి ప్రవేశాలను ఆహ్వానిస్తోందని సెంటర్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ డా.శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం హనుమకొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటుచేసిన సమావేశంలో అడ్మిషన్ల పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిఫ్ట్లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డాక్టోరల్ స్థాయిల్లో కోర్సులున్నట్లు తెలిపారు. ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులు నేడు (మంగళవారం) హనుమకొండ హరిత కాకతీయ హోటల్లో ఉదయం10 నుంచి సాయంత్రం 4గంటల వరకు జరిగే అవగాహన కార్యక్రమంలో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో రామకృష్ణ, శరవణన్ పాల్గొన్నారు. -
పాట తెచ్చిన ‘పంచాయితీ’
● ప్రమాణ స్వీకారంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ● ఇరువర్గాలు కుర్చీలతో గొడవ నర్సంపేట రూరల్ : ప్రమాణ స్వీకారోత్సవంలో డీజే పాట పెద్ద పంచాయితీకి దారి తీసింది. బీఆర్ఎస్, కాంగ్రెస్లు ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. ఈ ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. చెన్నారావుపేట జీపీ కార్యాలయ ఆవరణలో పాలకవర్గం ప్రమాణస్వీకారం సందర్భంగా డీజే సౌండ్స్ ఏర్పాటు చేశారు. అయితే ప్రమాణస్వీకారోత్సవంలో బీఆర్ఎస్కు సంబంఽధించిన పాట వస్తుండగా కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం చెప్పారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటామాట పెరిగింది. దీంతో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా మారి ఒకరిపై ఒకరు కుర్చీలతో దాడులు చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ యూత్ లీడర్ వనపర్తి శోభన్కు, బీఆర్ఎస్ పార్టీ మూడో వార్డుకు చెందిన మూడు రమేశ్కు గాయాలయ్యాయి. ఘటనా స్థలికి ఎస్సై రాజేశ్రెడ్డి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. తొలుత కాంగ్రెస్, అనంతరం బీఆర్ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సాయంత్రం కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. -
సకుటుంబ సపరివారంగా..
● తల్లి సర్పంచ్.. తనయుడు ఉప సర్పంచ్.. ● భార్య సర్పంచ్.. భర్త ఉప సర్పంచ్గా ప్రమాణస్వీకారం సంగెం: వరంగల్ జిల్లా సంగెం మండలంలోని 33 గ్రామపంచాయతీల్లో నూతన పాలకవర్గాలు సోమవారం అట్టహాసంగా ప్రమాణస్వీకారం చేశాయి. ఇందులో తల్లి సర్పంచ్గా తనయుడు ఉప సర్పంచ్గా, భార్య సర్పంచ్గా భర్త ఉప సర్పంచ్గా, నాడు భర్త సర్పంచ్గా, నేడు భర్త సర్పంచ్గా బాధ్యతలు స్వీకరించారు. ● తీగరాజుపల్లి మాజీ సర్పంచ్గా కర్జుగుత్త రమ కొనసాగగా సోమవారం భర్త గోపాల్ సర్పంచ్గా ప్రమాణస్వీకారం చేశారు. మండలంలోని మొండ్రాయిలో తల్లి గూడ స్వరూప సర్పంచ్గా తనయుడు విజయ్కుమార్ ఉపసర్పంచ్గా ప్రమాణస్వీకారం చేశారు. పెద్దతండాలో భార్య గుగులోత్ వినోద సర్పంచ్గా, భర్త రవీందర్నాయక్ ఉపసర్పంచ్గా ప్రమాణస్వీకారం చేశారు. కాగా, అరకొర వసతుల మధ్య నూతన పాలకవర్గాలు ప్రమాణ స్వీకారం నిర్వహించారు. మండలంలోని ఎల్గూర్రంగంపేటలో జీపీ భవనం లేకపోవడంతో మత్స్యపారి శ్రామిక సంఘం కమ్యూనిటీహాల్లో, ముమ్మడివరంలో ప్రభుత్వ పాఠశాల భవనంలో, గొల్లపల్లిలో అద్దె భవనంలో నూతన పాలక వర్గాలు ప్రమాణస్వీకారం చేశాయి. సంగెం మండలం మొండ్రాయిలో సర్పంచ్గా తల్లి స్వరూప, ఉపసర్పంచ్గా తనయుడు విజయ్కుమార్, వార్డు సభ్యులతో ప్రమాణస్వీకారం చేయిస్తున్న అధికారులు -
తహసీల్దార్ కార్యాలయ భవనానికి తాళం
● అద్దె రూ.6లక్షలు బకాయి చెల్లించకపోవడంతో యజమాని తాళం ఖిలా వరంగల్: వరంగల్ ఫోర్ట్ రోడ్డులోని మండల తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు నుంచి ప్రైవేట్ అద్దె భవనంలోనే కొనసాగుతోంది. రెండేళ్లుగా అద్దె చెల్లించేదు. సుమారు రూ.6లక్షల పైగా అద్దె బకాయి ఉండడంతో యజమాని సమ్మయ్య సోమవారం తాళం వేశారు. దీంతో అధికారులు, సిబ్బంది బయటనే ఉండిపోయారు. పలు రకాల పనులపై వచ్చిన ప్రజలు నిరీక్షిస్తూ కనిపించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ ఇక్బాల్, డిప్యూటీ తహసీల్దార్ రమేష్ హుటాహుటిన కార్యాలయానికి చేరుకున్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద దృష్టికి తీసుకెళ్లి అద్దె చెల్లిస్తామని యజమానిని ఒప్పించడంతో తాళం తీశారు. కాగా, అద్దె ఇవ్వాలని పలుమార్లు కలెక్టర్ గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేసినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో చేసేదిలేక భవనానికి తాళం వేసినట్లు సమ్మయ్య తెలిపారు. భవన నిర్మాణానికి బ్యాంకు రుణం తీసుకున్నానని, అద్దె రాకపోవడంతో ఈఎంఐ కట్టలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని వాపోయారు. -
కాలేజీలో ఫ్యాకల్టీని వెంటనే మార్చాలి
● టీటీడబ్ల్యూఆర్సీఈ విద్యార్థినుల డిమాండ్ వరంగల్: ఐఐటీ, నీట్ లాంటి ఉన్నత చదువుకు గిరి జన విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రా రంభించిన తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియ ల్ కాలేజీ ఆఫ్ ఎక్సలెన్సీ(టీటీడబ్ల్యూఆర్సీఈ)కాలేజీల్లో వెంటనే ఫ్యాకల్టీ మార్చాలని పలువురు విద్యార్థినులు డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం వరంగల్ 3వ డివిజన్ పరిధి హనుమకొండ పెద్దమ్మగడ్డలోని టీటీడబ్ల్యూఆర్సీఈ కాలేజీ విద్యార్థినులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సరైన ఫ్యాకల్టీ లేకపోవడంతో తాము ఉన్నత విద్యావకాశాలు కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ప్రస్తుత ఫ్యాకల్టీ బోధన తమకు ఏమాత్రం అర్థం కావడం లేదన్నారు. తమ ఇబ్బందులను ప్రిన్సిపాల్, ఆర్సీఓల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అందుకే విసుగెత్తి తాము ఆందోళన చేపట్టామన్నారు. ఆందోళనపై సమాచారం అందుకున్న ఆర్సీఓ డీఎస్.వెంకన్న, ప్రిన్సిపాల్తో పాటు పలువురు అధ్యాపకులు వచ్చి విద్యార్థినులకు సర్ది చెప్పడంతో వారు కాలేజీలోకి వెళ్లారు. ఈవిషయంపై ఆర్సీఓ డీఎస్.వెంకన్నను వివరణ కోరగా గతేడాది వరకు కాంట్రాక్ట్ లెక్చరర్లు ఉన్నారని, ఇప్పుడు టీఎస్పీఎస్సీ నుంచి వచ్చిన అధ్యాపకులు బోధిస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు అధ్యాపకులను సమన్వయం చేస్తామని తెలిపారు. అంతర్జాతీయ అవార్డుకు ఎంపిక కాళోజీ సెంటర్: అంతర్జాతీయ అవార్డుకు ప్రముఖ జ్యోతిష్య పండితుడు, వాస్తు విద్వాంసులు చేవూరి రమేశ్కుమార్ ఎంపికయ్యారు. హనుమకొండ పరిమళకాలనీకి చెందిన రమే శ్ 26 సంవత్సరాలుగా జ్యోతి ష్య పండితుడిగా సేవలు అందిస్తున్నారు. ఈ మేర కు ఆయన సేవలను గుర్తించిన గ్లోబల్, ఈగల్ యూనివర్సిటీ యునిఎర్త్ హ్యుమానిటీ పీస్ ఫౌండేషన్ సంయుక్తంగా యూనివర్సల్ ఎక్సలెన్సీ అవా ర్డుకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈనెల 27న మధ్యప్రదేశ్లో జరగనున్న సదస్సులో ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు కేతన్, భూపేశ్, గైడ్ రమణారావుతో పాటు ప్రముఖుల చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నట్లు ఆయన తెలిపారు. -
యువత అవకాశాలు అందిపుచ్చుకోవాలి
కేయూ క్యాంపస్: సముద్రాంతర్భాగం నుంచి ఆకాశం వరకు అనేక అవకాశాలున్నాయని, విద్యార్థులు, యువత అందిపుచ్చుకోవాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి కోరారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో సోమవారం కేయూ ఆడిటోరియంలో రెండురోజులపాటు జరిగే రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల విద్యార్థుల సమ్మేళనం ప్రారంభ సభలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచంలోనే అత్యధిక యువత కలిగిన దేశం ఇండియా అన్నారు. ప్రపంచ అవసరాల దృష్ట్యా మన విద్యావ్యవస్థ ఉండాలన్నారు. ప్రస్తుతం 80లక్షల మంది విద్యార్థులకు లక్షమంది అధ్యాపకులు ఉన్నారన్నారు. పదేళ్లుగా యూనివర్సిటీల్లో నియామకాలు లేవనే విషయం వాస్తవమని, ప్రతీ విద్యార్థి, సంస్థలు కూడా నవీకరణ చెందాలన్నారు. రాబోయే కాలంలో దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో సుమారు 20 లక్షల కోట్ల ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయని, వాటిని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రపంచ గతిని మార్చేశక్తి భారతీయ యువతపై ఉందన్నారు. విప్లవాత్మక మార్పులను గమనిస్తూ తీర్చిదిద్దుకోవాలి.. దేశంలో విద్యావ్యవస్థలో వస్తున్న విప్లవాత్మక మార్పులను గమనిస్తూ విద్యార్థులు తమ భవిష్యత్ను తీర్చిదిద్దుకోవాలని కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డి కోరారు. యూనివర్సిటీలు సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సంస్థలతోపాటు ఇండస్ట్రీయల్ కంపెనీలతో ఎంఓయూలతో ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తాయన్నారు. జాతీయ విద్యావిధానం విద్యార్థులకు వరం.. విద్యారంగాన్ని ప్రక్షాళన చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో చేపట్టిన దీర్ఘకాలిక పోరాటాల ఫలితమే జాతీయ విద్యావిధానమని, ఇది నేడు దేశంలోని విద్యార్థులకు వరమని ఏబీవీపీ క్షేత్ర సంఘటన మంత్రి చిరిగే శివకుమార్ అన్నారు. ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు జానారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు, యూనివర్సిటీల హాస్టళ్ల కన్వీనర్ జీవన్, సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ నీతుసింగ్, కేయూ అధ్యక్షుడు హరికృష్ణ, ఏబీవీపీ తెలంగాణ ప్రాంత ప్రముఖ్ మాసాడిబాబురావు మాట్లాడారు. కేయూ ఇన్చార్జ్ నిమ్మల రాజేశ్, కార్యదర్శి జ్ఞానేశ్వర్, విద్యార్థులు పాల్గొన్నారు. బాలకిష్టారెడ్డి దృష్టికి వర్సిటీల్లోని సమస్యలు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి దృష్టికి వివిధ యూనివర్సిటీల విద్యార్థులు పలు సమస్యలు తీసుకెళ్లారు. హైదరాబాద్లోని కోఠి మహిళా యూనివర్సిటీలో అనేక సమస్యలున్నాయని, పరిష్కరించాలని ఆ యూనివర్సిటీ నేత సుమ, అలాగే, ప్రతీ యూనివర్సిటీలోనూ స్కిల్డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఓయూ విద్యార్థి రాజు, పాలమూరు, తెలంగాణ యూనివర్సిటీలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఆయా యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను బాలకిష్టారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయా సమస్యలు పరిష్కరించేలా తమవంతు కృషిచేస్తున్నామని బాలకిష్టారెడ్డి ఈసందర్భంగా తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి కేయూలో వర్సిటీల విద్యార్థుల సమ్మేళనం -
రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ పనులు వేగంగా పూర్తి
● టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డిహన్మకొండ: విద్యుత్ సబ్స్టేషన్ల రియల్ టైమ్ ఫీడర్ మానిటరింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 17 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలు, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 15లోపు హెచ్టీ సర్వీసులకు ఆటోమెటిక్ మీటర్ రీడింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ఇకపై కొత్తగా విడుదల చేసే సర్వీసులు కూడా ఆటో మేటిక్ మీటర్ రీడింగ్ ద్వారా పర్యవేక్షణలోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ డివిజన్లో హై–లాస్ ఫీడర్లను గుర్తించి వాటిని పరిశీలన చేసి పెట్రోలింగ్ నిర్వహించి నష్టాలకు కారణాలను విశ్లేషించి తగ్గించాలని సూచించారు. వచ్చే వేసవి అవసరాలను దృష్టిలో ఉంచుకుని పట్టణాల్లో లోడ్ పెరుగుదల అంచనాల మేరకు ఇప్పటి నుంచే సామర్థ్యం పెంపు, అప్గ్రేడేషన్ పనులు మొదలుపెట్టాలని ఆదేశించారు. సమావేశంలో డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ఈలు టి.సదర్ లాల్, కె.రాజు చౌహాన్, అశోక్, వెంకటరమణ, అన్నపూర్ణ, సురేందర్, సీజీఎంలు చరణ్ దాస్, కిషన్, జీఎంలు వేణు బాబు, కృష్ణమోహన్, వెంకట కృష్ణ, శ్రీనివాస్, వాసుదేవ్, నాగ ప్రసాద్, శ్రీకాంత్, సామ్య నాయక్, కళాధర్ పాల్గొన్నారు. -
.. అనే నేను
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ నెల 11,14, 17వ తేదీల్లో మూడు విడతలుగా నిర్వహించిన జీపీ ఎన్నికల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధులు సోమవారం ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో కొలువుదీరారు. మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామపెద్దలు, అనుచరగణంతో పంచాయతీ కార్యదర్శుల సమక్షంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ప్రమాణస్వీకారం చేసి పదవి బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే పలు చోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని 29 పంచాయతీల్లో అతిచిన్న వయసున్న సర్పంచ్గా వర్సా దీప రికార్డులోకెక్కాకారు. నామాలపాడు సర్పంచ్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థినిగా బరిలో దిగిన 24 సంవత్సరాల దీప ఎన్నికల్లో విజయం సాధించి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. తనపై నమ్మకంతో గ్రామస్తులు గెలిపించారని, గ్రామాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ● నెల్లికుదురు: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం నల్లగుట్ట తండా జీపీ సర్పంచ్గా 22 ఏళ్ల జి. హేమలత సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. గ్రామాభివృద్ధికి కృషి చేస్తానన్నారు.75 ఏళ్ల వయసులో సర్పంచ్లుగా.. జనగామ రూరల్: మండలంలోని ఎర్రగొల్లపహాడ్కు చెందిన చిర్ర సత్యనారాయణ రెడ్డికి 75 ఏళ్ల వయసులో సర్పంచ్గా అవకాశం లభించింది. 50 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఆయన ఇటీవల జరిగిన జీపీ ఎన్నికల్లో గెలుపొంది సర్పంచ్గా సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. అలాగే, గ్రామానికి చెందిన గుండెల్లి కల్పన రెండో సారి ఉప సర్పంచ్గా ప్రమాణస్వీకారం చేశారు. ● భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మండలం బావు సింగ్పల్లికి చెందిన పొనగంటి ముత్తమ్మ సర్పంచ్గా రెండో విడతలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 75 సంవత్సరాల వయసులో సోమవారం గ్రామ సర్పంచ్గా ప్రమాణస్వీకారం చేశారు. -
ప్రహరీ కూల్చివేత
వరంగల్ చౌరస్తా: వరంగల్ తూర్పులో ఓ అధికార పార్టీ నాయకుడు, విల్లా అసోసియేషన్ ప్రతినిధులు తమ పంతం నెగ్గించుకున్నారు. నిబంధనలకు తూ ట్లు పొడుస్తూ సోమవారం అత్యంత ప్రమాదకరమైన ఇంధన డిపో వైపు ప్రహరీ కూల్చేసి, గేట్ ఏ ర్పాటు చేశారు. ఆజంజాహీ మిల్లు మూతపడడంతో ఆస్థలంలోని 32.69 ఎకరాలను రాంకీ విల్లా ఇన్ ఫ్రా కొనుగోలు చేసి 239 విల్లాలను నిర్మించి విక్రయించారు. ఒప్పందంలో భాగంగా కొంత భాగాన్ని హౌజింగ్ బోర్డుకు కేటాయించారు. ఆ స్థలంలో జీ ప్లస్2 పద్ధతిలో భవనాలను 102 ప్లాట్లుగా హౌజింగ్ బోర్డు నిర్మించింది. వాటి అమ్మకానికి నోటిఫికేషన్ను తాజాగా జారీ చేసింది. నిబంధనలు తూచ్.. రాంకీ విల్లాస్లో ప్లాట్లను సంపన్నులు కొనుగోలు చేసి నివాసం ఉంటున్నారు. హౌజింగ్ బోర్డు నిర్మించి.. జీ–ప్లస్–2 భవనాలకు రాంకీ ప్రధాన రహదారి నుంచి రాకపోకలు సాగేలా రోడు నిర్మించారు. సంపన్నులు నివాసం ఉండే కాలనీలోకి హౌజింగ్ బోర్డు రహదారి నిర్మించడంపై ఓ అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుడు, విల్లాస్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి మాజీ ఎమ్మెల్సీని కలిసి విన్నవించగా.. రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మించగా, అదే రోజు హౌజింగ్ బోర్డు రాష్ట్ర ఉన్నతాధికారి ఆదేశంతో కూల్చేశారు. తాజాగా హౌసింగ్ బోర్డు జీ ప్లస్–2 ప్లాట్స్ను అల్పాదాయ వర్గాలకు లక్కీ డ్రా ద్వారా కేటాయిస్తామని నోటిఫికేషన్ జారీ చేశారు. విష యం తెలుసుకున్న నాయకుడు మరోమారు జిల్లా కు చెందిన మంత్రి దృష్టికి తీసుకెళ్లి ఇంధన డిపో వైపు ప్రహరీ కూల్చి భారీ గేట్ ఏర్పాటు చేశారు. ఇక హౌసింగ్ బోర్డు ప్లాట్స్ నివాసితులు అటువైపుగా రాకపోకలు సాగించాల్సి ఉంటుందని కాలనీవాసులకు ధీమా కల్పించారు. వీరు త్వరలో రాంకీ విల్లాస్ వైపు నడిచేందుకు వీలు లేకుండా ప్రహరీ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై హౌసింగ్ బోర్డు అధికారులను వివరణ కోరితే తమకు సమాచారం లేదని దాటవేయడం గమనార్హం. ఇంధన డిపో వైపు గేట్ ఏర్పాటు ఇదెక్కడి దౌర్జన్యం అంటున్న రాజకీయ పార్టీల నేతలు -
రాజకీయాలకతీతంగా అభివృద్ధి
హన్మకొండ అర్బన్ : రాజకీయాలకు అతీతంగా నగరంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు కృషి చేస్తున్నట్లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. సోమవారం నగరంలోని 7వ డివిజన్లో రూ.కోటితో సైడ్ డ్రెయినేజీ, కల్వర్టు నిర్మాణం, పబ్లిక్ గార్డెన్లో చిన్న పిల్లలకు ఆట వసతుల కల్పనకు మేయర్ గుండు సుధారాణితో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా కాకాజీ కాలనీలో డ్రెయినేజీ వ్యవస్థను పరిశీలించారు. వర్షాకాలంలో ప్రధానంగా డ్రెయిన్ ద్వారా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అనంతరం ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి నగరాభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. నియోజకవర్గ పరిధిలో గతంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు ఉన్న ఒక్కో వార్డుకు కనీసం రూ.50 లక్షలు పెట్టిన దాఖలాలు లేవని, నేడు ప్రతీవార్డుకు రూ.5కోట్ల పై మేర నిధులు కేటాయించి, పనులు పూర్తి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, యూత్ నాయకులు తోట పవన్, మాజీ కార్పొరేటర్ శేఖర్, సోమ నాగేశ్వర్ రావు, బిన్నీ లక్ష్మణ్, వాకర్ అసోసియేషన్ బాధ్యులు గాంధీ, తదితరులు పాల్గొన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి -
తప్పుడు కేసుల కలకలం!
వరంగల్ ఏసీపీగా పనిచేసిన నందిరాం నాయక్పై డీజీపీ వేటుసాక్షి,వరంగల్/రామన్నపేట: వరంగల్ కమిషనరేట్ పరిధిలో తప్పుడు కేసులతో పలువురు అధికారులపై వేటు పడడం కలకలం సృష్టించింది. వరంగల్ ఏసీపీగా పనిచేసిన సమయంలో తప్పుడు కేసుల నమోదులో ప్రమేయముందని తేలిన నందిరాం నాయక్ను రాష్ట్ర డీజీపీ శివధర్రెడ్డి సస్పెండ్ చేయడం పోలీస్శాఖ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆయనతోపాటు ప్రస్తుత వరంగల్ సీసీఎస్ సీఐ గోపీ, ఎస్ఐ విఠల్ కూడా మట్టెవాడ ఠాణాలో పనిచేసిన సమయంలో ఈ తప్పుడు కేసులు నమోదు చేసినట్లుగా ఫిర్యాదు రావడంతో విచారణ జరిపిన ఉన్నతాధికారులు నిజమని తేలడంతో మూడు రోజుల క్రితమే సస్పెండ్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు వెంకటేశ్వర్లుకు చెందిన భూవివాదాల కేసులో తప్పుడు కేసు నమోదుచేసినట్టుగా విచారణాధికారులకు స్పష్టమైన సాక్ష్యాలు దొరకడంతో ఈ ముగ్గురు అధికారులపై వేటుపడిందని పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదేవిధంగా కార్పొరేటర్ గుండేటి నరేందర్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు విషయంలోనూ వరంగల్ సబ్ డివిజన్లోని పోలీసులు అత్యుత్సాహం చూపడం అప్పట్లో రాజకీయ రగడ జరిగింది తెలిసిందే. వరంగల్ సబ్ డివిజన్లో అకారణంగా కొందరిని టార్గెట్గా చేసుకుంటూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారని, వీటిపై పునర్విచారణ చేయాలంటూ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య డీజీపీని కొద్దికాలం క్రితం కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఏసీపీ నందిరాం నాయక్ ఉన్న సమయంలో కొందరు పోలీసులపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. పరిధి దాటి వ్యవహరించారంటూ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఏసీపీ నందిరాం నాయక్ను డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేశారు. ఇతర అధికారులను వరంగల్ పోలీస్ కమిషనరేట్కు అటాచ్ చేసి అనంతరం వేర్వేరు ప్రాంతాల్లో పొస్టింగ్లు ఇచ్చారు. ఇదే సమయంలో తనకు జరిగిన అన్యాయంపై వెంకటేశ్ పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో అవి తప్పుడు కేసులని విచారణలో తేలింది. దీంతో అందుకు బాధ్యులైన అధికారులపై వేటు వేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ఇప్పటికే గతంలో సదరు ఏసీపీతో చనువుగా ఉన్న కొందరు అధికారుల్లో అలజడి మొదలైంది. ● వరంగల్ వాసి వెంకటేశ్వర్లు తనకున్న తిమ్మాపూర్లోని 28 ఎకరాల 24 గుంటల భూమిని రూ.1.50కోట్ల వరకు విక్రయిస్తానని చెప్పి, రూ.కోటి అడ్వాన్స్గా తీసుకొని, మిగిలిన డబ్బులు రిజిస్ట్రేషన్ సమయంలో ఇవ్వాలంటూ చెప్పాడని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన వి.మల్లేశ్ 2024లో మట్టెవాడ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. విక్రేత రిజిస్ట్రేషన్ చేయకుండా కావాలని మోసం చేసి, కొంతభూమి ఇతరులకు అమ్మి వారి ద్వారా తనకు లీగల్ నోటీసులు పంపించాడు. అదేవిధంగా భూముల ధరలు రెట్టింపైనా, ఇప్పుడు రూ.రెండు కోట్లు ఇవ్వాలంటూ చెయ్యి చేసుకున్నాడని, ఇవ్వకుండా ఏ సాక్ష్యం లేకుండా చంపుతానని బెదిరించాడని మల్లేశ్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. ● మా బంధువులు శేఖర్, శ్రీనివాస్ తన వద్ద భూమిని కొనుగోలు చేశారని, చింతల్లో తనకున్న 2,178 చదరపు గజాలు అమ్ముతున్నానని కొనాలంటూ సంప్రదించాడని, ఇది నిజమని నమ్మి గజానికి రూ.3,800 చొప్పున ఐదేళ్ల క్రితం అడ్వాన్స్గా రూ.10లక్షలు తీసుకొని వెంకటేశ్వర్లు మోసం చేశాడని వరంగల్ ఎల్బీనగర్కు చెందిన రవి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొన్ని రోజుల తర్వాత అతడికి ఏ భూమి లేదని తెలుసుకొని వెళ్లి నిలదీస్తే మరొక ప్రాంతంలో భూమి ఇస్తానన్నాడు. 2024 సెప్టెంబర్లో ఎంజీఎం మూడో గేట్ వద్దకు తన స్నేహితుడు జుపాక అనిల్తో కలిసి వచ్చి మిగిలిన నగదు ఇవ్వాలంటూ బెదిరించాడు. ఇలా రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంకటేశ్వర్లుపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ రెండు కేసుల్లోనూ వెంకటేశ్వర్లుపై కావాలనే కేసులు నమోదు చేసినట్లు గా పోలీసు విచారణలో తేలడంతో సదరు పోలీసు అధికారులపై డీజీపీ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. సీఐ గోపీ, ఎస్ఐ విఠల్ను కూడా సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు మట్టెవాడ స్టేషన్లో పనిచేసిన సమయంలో ఈ తప్పిదాలు తాజా చర్యలతో వరంగల్ సబ్ డివిజన్లో కొందరు అధికారుల ఉలికిపాటు -
వర్సిటీల సిలబస్ మార్చాలి
కేయూ క్యాంపస్: వర్సిటీలు పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా సిలబస్ మార్చాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ వి.బాలకిష్టారెడ్డి అన్నారు. సోమవారం కేయూలో నిర్వహించిన రెగ్యులర్ అధ్యాపకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సాధారణ విరామాలకు అనుగుణంగా సిలబస్లో మార్పులు చేయాలన్నారు. మల్టీ డిసిప్లిన్ అప్రోచ్ ఉండాలని, జాబ్ మార్కెట్కు తగినట్లుగా ఉండాలన్నారు. సీఎం రేవంత్రెడ్డి అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయస్సును 60 నుంచి 65 వరకు పెంచారన్నారు. అధ్యాపకుల నియామక ప్రక్రియ కూడా చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఫార్మసీలో బల్క్ డ్రగ్ మాన్యుఫ్యాక్చర్ యూనిట్స్తో ఎంఓయూ ఉందని, విద్యాభివృద్ధికి అధ్యాపకులు ప్రధాన భూమికగా వ్యవహరించాలన్నారు. అనంతరం రిజిస్ట్రార్ వి.రామచంద్రం మాట్లాడారు. అకుట్ అధ్యక్షుడు బి.వెంకట్రామ్రెడ్డి, ఫార్మసీ డీన్ గాదె సమ్మయ్య, కేయూ పాలక మండలి సభ్యులు బి.సురేశ్లాల్ పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. నిధులు కేటాయించాలని అకుట్ బాధ్యులు వినతిపత్రం అందించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి -
అంచనాలు సిద్ధం చేయండి
వరంగల్ అర్బన్: యూఐడీఎఫ్ (పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి) ద్వారా గ్రేటర్ వరంగల్లో సమర్థ నీటి సరఫరా కోసం అంచనాలు సిద్ధం చేయాలని మేయర్ గుండు సుధారాణి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం బల్దియా కార్యాలయంలో గ్రేటర్, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లతో ఆమె సమావేశమయ్యారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ప్రాజెక్ట్లో భాగంగా నగరంలో అదనపు పైప్లైన్లు, రిజర్వాయర్ల ఏర్పాటుతో పాటు స్కాడా సిస్టమ్ ఏర్పాటు చేయాలన్నారు. దీంతో పాటు ప్రతీ జోన్లో 24/7 నీటి సరఫరా జరిగేలా చర్యలు చేపట్టడానికి రూ.550 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నట్లు జరుగుతుందని పేర్కొన్నారు. గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలన్నారు. సమావేశంలో బల్దియా ఎస్ఈ సత్యనారాయణ, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ శ్రీనివాస్, ఈఈలు రవికుమార్, సంతోశ్బాబు, పబ్లిక్ హెల్త్ డీఈ మొజామిల్, డీబీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ అర్బన్ : కలెక్టరేట్లో ‘మీ డబ్బు – మీ హక్కు’ అనే అంశంపై ఈ నెల 24న శిబిరం నిర్వహించనున్నట్లు హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఆర్థిక శాఖ పరిధి ఆర్థిక సేవల విభాగం ఆధ్వర్యంలో అనుబంధంగా ఈ క్యాంపెయిన్ చేపట్టినట్లు తెలిపారు. ఈ నెల 31వ తేదీ వరకు ఈ క్యాంపెయిన్ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బ్యాంకు ఖాతాదారులు, బీమా, డివిడెండ్, మ్యూచువల్ ఫండ్, పీఎఫ్ ఖాతా, బాండ్ ఖాతా తదితర వాటికి సంబంధించి ఏళ్లుగా అన్ క్లెయిమ్డ్ (దావా చేయని) మొత్తాలు ఉన్నవారు వాటిని క్లెయిమ్ చేసుకునేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు. క్లెయిమ్ చేయని ఆస్తుల వివరాలు ఉద్గమ్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని, బ్యాంకు శాఖ, బీమా సంస్థ, మ్యూచువల్ ఫండ్ సంస్థ, స్టాక్ బ్రోకర్ లేదా ఆర్థిక సంస్థ ద్వారా స్టాక్ బ్రోకర్లో డివిడెండ్ పొందని వివరాలను కూడా తెలుసుకోవచ్చని తెలిపారు. ఈఅవకాశాన్ని అందరూ సద్విని యోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ట్రాన్స్జెండర్స్కు 100%సబ్సిడీతో పునరావాస పథకం కాజీపేట అర్బన్ : హనుమకొండ జిల్లాలోని ట్రాన్స్జెండర్లకు వందశాతం సబ్సిడీతో ఆర్థిక పునరావాస పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమాధికారి జయంతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన ఐదుగురు ట్రాన్స్జెండర్లకు ఒక్కొకరికి రూ.75వేల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు తెలిపారు. అర్హులైన ట్రాన్స్జెండర్లు ఈనెల 31వ తేదీలోపు హనుమకొండ కలెక్టరేట్లోని సీ్త్ర,శిశు సంక్షేమాధికారి కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని కోరారు. న్యూశాయంపేట : జిల్లాలోని అల్ప సంఖ్యాక వర్గాలు (ముస్లింలు, క్రైస్తవులు, బౌద్దులు, సిక్కులు, జైనులు, పార్శీలు) విదేశాల్లో పై చదువుల నిమిత్తం సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని హనుమకొండ జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి గౌస్హైదర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత గల విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులను వచ్చేనెల 19లోగా సమర్పించాలని కోరారు. పూర్తి వివరాలకు హనుమకొండ కలెక్టరేట్లోని జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి కార్యాలయ వేళలో సంప్రదించాలని సూచించారు. -
రామసక్కని నేలకు రామ్సర్
పచ్చందాలకు నిలయం పాకాల. ఇక్కడి జల సంపద మంత్రముగ్ధుల్ని చేస్తుంది. సహజంగా వినిపించే ప్రకృతి సంగీతం మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. బోటింగ్ రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రపంచంలోనే మంచినీటి సరస్సుగా పేరుగాంచిన ఈ ప్రాంతానికి మరికొద్ది రోజుల్లో అంతర్జాతీయ స్థాయి (రామ్సర్ సైట్గా) గుర్తింపు లభించనుంది. ఆ దిశగా సర్వేలు కొనసాగుతున్నాయి. – ఖానాపురంపాకాలలో ఏర్పాటుకు కసరత్తు నాలుగు దఫాలుగా పక్షులపై సర్వే మొదటి విడత పూర్తి గుర్తింపు లభిస్తే.. అంతర్జాతీయంగా ప్రతిష్ట ప్రత్యేక ప్రణాళికతో అభివృద్ధికి అడుగులు -
బాధితులు చట్టపరమైన సాయం పొందాలి
డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ జడ్జి నిర్మలాగీతాంబ కేయూ క్యాంపస్: లైంగిక వేధింపులకు గురైన బాధితులు భయపడకుండా చట్టపరమైన సాయం పొందాలని వరంగల్ డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ జడ్జి నిర్మలాగీతాంబ అన్నారు. కేయూ పరిపాలన భవనంలో యాంటీ సెక్సువల్ హరాస్మెంట్పై శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. రంగోళి పోటీలు, షార్ట్ఫిలిం పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం, టీషీం సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.సుజాత, కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ వి.శోభ తదితరులు పాల్గొన్నారు. వయోవృద్ధుల సంక్షేమానికి న్యాయసేవలు న్యూశాయంపేట: వయోవృద్ధుల సంక్షేమం కోసం సత్వర ఉచిత న్యాయసేవలు అందిస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలాగీతాంబ తెలిపారు. వరంగల్ ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో వృద్ధుల సంక్షేమం కోసం శనివారం ఏర్పాటు చేసిన న్యాయసేవల శిబిరాన్ని ప్రధాన న్యాయమూర్తి నిర్మలాగీతాంబ, వరంగల్ కలెక్టర్ సత్యశారద శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.సాయికుమార్, ఆర్డీఓ సుమ, డీఏఓ ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ: ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన వారి త్యాగాలు గుర్తించి, వారి సంక్షేమం కోసం తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో తెలంగాణ ఉద్యమకారుల సమావేశం నిర్వహించారు. జనవరి 4న సూర్యాపేటలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వేలాదిగా ఉద్యమకారులు తరలిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ కూరపాటి వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. న్యూశాయంపేట: ప్రభుత్వ భూముల వేలం నిలిపేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి టి.శ్రీనివాస్రావు డిమాండ్ చేశారు. హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం సీపీఐ, సీపీఎం హనుమకొండ జిల్లాల కమిటీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇందులో వామపక్ష పార్టీల, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర చైర్మన్ రిటైర్డ్ ప్రొఫెసర్ కూరపాటి వెంకట్నారాయణ, వామపక్ష నేతలు కె.భిక్షపతి, చుక్కయ్య, ఎన్.హంసారెడ్డి, అప్పారావు, రాజేందర్, శ్రీనివాస్, టి.భిక్షపతి, ఎల్లేశ్, రాజమౌళి, వెంకటరాజం, స్టాలిన్, చక్రపాణి, ఉప్పలయ్య, తిరుపతి, సంపత్, భానునాయక్ తదితరులు పాల్గొన్నారు. కాళోజీ సెంటర్: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణ అభివృద్ధి సంస్థ (సెర్ప్, డీఆర్డీఏ)లో పనిచేస్తున్న వరంగల్ జిల్లా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని డీఆర్డీఏ కార్యాలయంలో శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కందారి సారయ్య, కార్యదర్శిగా గుగులోతు వెంకన్న, ఉపాధ్యక్షులుగా గోలి కొమురయ్య, గుండేటి కుమారస్వామి, శారద, కోశాధికారిగా వనమ్మ, సహాయ కార్యదర్శులుగా రాజయ్య, సంపత్, యాకూబ్, కార్యవర్గ సభ్యుడిగా మెట్టు దాసు, సలహాదారులుగా అనిల్, రమేశ్, కందిక సుధాకర్ను ఎన్నుకున్నారు. -
సృజనాత్మకత పెంపునకు సైన్స్ఫెయిర్ తోడ్పాటు
ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్రెడ్డి, నాగరాజు విద్యారణ్యపురి: విద్యార్థుల్లో సృజనాత్మకతకు సైన్స్ఫెయిర్ దోహదం చేస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. హనుమకొండలోని సెయింట్ పీటర్స్ ఎడ్యూ స్కూల్లో నిర్వహించిన జిల్లాస్థాయి విద్యావైజ్ఞానిక ప్రదర్శనలు శనివారం సాయంత్రం ముగిశాయి. ముఖ్య అతిథిగా వారు హాజరై మాట్లాడారు. మానవాళి ప్రకృతిని నాశనం చేస్తుండడంతో అనేక అనర్థాలు వస్తున్నాయని తెలిపారు. ఇటీవల హనుమకొండ నగరానికి వచ్చిన వరదలే ఉదాహరణ అన్నారు. అనంతరం రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులకు వారు బహుమతులు ప్రదానం చేశారు. విద్యాశాఖ అధికారి ఎల్వీ గిరిరాజ్గౌడ్, జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాసస్వామి, జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్రెడ్డి, డీసీఈబీ కార్యదర్శి బి.రాంధన్, ఓపెన్ స్కూల్ కో–ఆర్డినేటర్ ఎ.సదానందం, సెయింట్ పీటర్స్ ఎడ్యూ స్కూల్ అధినేత నారాయణరెడ్డి, ప్రిన్సిపాల్ హరిత, వడుప్సా జిల్లా అధ్యక్షుడు మాదాల సతీశ్కుమార్, హనుమకొండ, కాజీపేట ఎంఈఓలు నెహ్రూనాయక్, మనోజ్కుమార్, ప్రభుత్వ మర్కజీ హై స్కూల్ ఉపాధ్యాయుడు వల్స పైడి పాల్గొన్నారు. -
22న ప్రకృతి విపత్తులపై మాక్డ్రిల్
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: ప్రకృతి విపత్తులపై హనుమకొండలోని సమ్మయ్యనగర్, రెడ్డిపురం ప్రాంతాల్లో ఎస్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో ఈనెల 22న మాక్డ్రిల్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ మాక్ డ్రిల్ కొనసాగుతుందని వెల్లడించారు. శనివారం కలెక్టరేట్లో ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాక్డ్రిల్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై అధికారులకు బాధ్యతలు కేటాయించారు. ఈ మాక్ డ్రిల్పై స్థానిక ప్రజలకు ముందస్తుగా అవగాహన కల్పించాలని, రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, ఏసీపీ నరసింహారావు, జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి సుదర్శన్రెడ్డి, ఎస్డీఆర్ఎఫ్ అధికారి రవిచౌహాన్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ చిన్నవడ్డేపల్లి చెరువులో.. న్యూశాయంపేట: ప్రకృత్తి విపత్తులపై వరంగల్ నగరంలోని చిన్నవడ్డేపల్లి చెరువు ప్రాంతంలో సోమవారం మాక్డ్రిల్ నిర్వహించనున్నట్లు వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. ఈ మేరకు ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, తదితర శాఖల అధికారులతో కలెక్టరేట్లో శనివారం సమన్వయ సమావేశం నిర్వహించారు. మాక్డ్రిల్ను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులకు పలు సూచనలు చేశారు. -
ఆపదలో ఆదెరువు!
ఆదివారం శ్రీ 21 శ్రీ డిసెంబర్ శ్రీ 2025వడ్డేపల్లి చెరువులో చేరుతున్న మురుగునీరుకాజీపేట: కాజీపేట, హనుమకొండ పట్టణవాసులకు ఒకప్పుడు తాగు నీరందించిన వడ్డేపల్లి రిజర్వాయర్ ప్రస్తుతం మురుగునీటితో నిండిపోయింది. కాకతీయ రాజుల కాలంలో ప్రజల సాగు, తాగునీటి అవసరాలకు వడ్డేపల్లి చెరువును తవ్వించారు. ఈ చెరువు ద్వారా దాదాపు 600 ఎకరాల ఆయకట్టుకు నీరందేది. దాన్ని 1993లో పూర్తిగా సమ్మర్ స్టోరేజీగా అభివృద్ధి చేశారు. అనంతర కాలంలో నగర పాలక సంస్థ నిర్లక్ష్యం కారణంగా కాజీపేట పట్టణ మురుగు నీరంతా వడ్డేపల్లి చెరువులోకి చేరి నీరు కలుషితమవుతూ వస్తోంది. హైదరాబాద్లోని హుస్సేన్సాగర్ తరహాలో ఈ రిజర్వాయర్లో శవాలు తేలుతున్న ఘటనలు కూడా నగరవాసులను ఆందోళన కలిగిస్తున్నాయి. డ్రెయినేజీలన్నీ వడ్డేపల్లి చెరువు వైపే.. కాజీపేట పట్టణ పరిధి ఆయా డివిజన్లలో నిర్మించిన డ్రెయినేజీల నీరంతా వడ్డేపల్లి చెరువులోకి చేరుతోంది. సోమిడి ఊరచెరువు తూము నుంచి మురికి కాల్వల ద్వారా కలుషిత నీరు వడ్డేపల్లి చెరువులో చేరుతోంది. ఊర చెరువును ఆక్రమించుకుని ఇళ్ల స్థలాలుగా మార్చి విక్రయించిన రియల్ వ్యాపారులు తూముకు గండి కొట్టడమే ఈ చెరువు నీరు కలుషితమవడానికి ఒక కారణం. గతంలో వడ్డేపల్లి ఫోర్షోర్ బండ్కు ఆనుకుని ఉన్న రైల్వే ట్రాక్ అవతలి వైపున మురుగు నీరు చెరువులోకి వెళ్లకుండా కట్ట మాదిరిగా రాళ్లతో నిర్మాణాలు చేపట్టారు. అయితే రాళ్ల పక్క నుంచి మురుగు నీరు సవ్యంగా వెళ్లేలా ఏర్పాట్లు చేయకపోవడంతో ఆ నీరంతా కట్ట మీది నుంచి చెరువులోకి ప్రవేశిస్తోంది. అనుమతి పొందడంలో జాప్యం.. మురుగు నీరు వడ్డేపల్లి చెరువులోకి వెళ్లకుండా నివారించాలంటే.. రైల్వే ట్రాక్ కింది నుంచి మోరీ నిర్మించాల్సి ఉంది. ఈ మోరీ నిర్మాణానికి రైల్వే అనుమతి తప్పనిసరి. ఇందుకోసం మున్సిపల్ అధికారులు రైల్వేశాఖకు పలుమార్లు లేఖలు రాసినా అనుమతులు రాకపోవడంతో మిన్నకుండిపోయారు. దీంతో లక్షల రూపాయలతో సోమిడి వైపు నిర్మించిన కట్ట వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని స్థానికులు పేర్కొంటున్నారు. పొంచి ఉన్న ప్రమాదం.. కాజీపేట 61వ డివిజన్లోని సిద్ధార్థనగర్ వైపు నుంచి మురుగు నీరు వడ్డేపల్లి చెరువులోకి వెళ్లకుండా, వడ్డేపల్లి చెరువులోని నీరు సిద్ధార్థనగర్లోకి ప్రవేశించకుండా ఉండడానికి ఫోర్షోర్ బండ్ను నిర్మించారు. ఈ బండ్ నిర్మాణం జరిగినపుడే పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం ఆ బండ్ కోతకు గుౖరవుతుంది. చెరువు నీటి తాకిడికి ఈ బండ్ ఎప్పుడు గండిపడుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ ఫోర్షోర్ బండ్కు ఇరువైపులా పెద్ద ఎత్తున తుమ్మచెట్లు పెరిగాయి. అసాంఘిక కార్యకలాపాలకు కేరాఫ్గా మారింది. మలమూత్రాల విసర్జన చెరువు పరిసరాలను వాడుతున్నారు. కాగా, చెరువు కింద ఉన్న కాలనీల్లోని బోరు బావుల్లో నీరు నల్లగా వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా, వడ్డేపల్లి చెరువు నీరు కలుషితంపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఓ మున్సిపల్ ఉన్నతాధికారిని ‘సాక్షి’ ప్రశ్నించగా.. ‘బల్లార్షా రైల్వే లైన్ కింద నుండి సైడ్ కాల్వ నిర్మించడానికి ప్రత్యేక అనుమతి కోరుతూ ఉన్నతాధికారులకు లేఖ రాశాం. పర్మిషన్ రాగానే పనులు ప్రారంభించి చెరువు కలుషితం కాకుండా చూస్తాం’ అని చెప్పారు. కలుషితం కాకుండా చూడాలి.. వడ్డేపల్లి చెరువు పరిరక్షణకు అధికారులు చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలి. తక్షణమే రిజర్వాయర్ను సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించాలి. అవసరమైతే ప్రజాప్రతినిధులు నియోజకవర్గ అభివృద్ధి నిధులు కేటాయించి తాగునీరు కలుషితం కాకుండా చూడాలి. – మర్యాల కృష్ణ, కాజీపేట కాల్వలను మళ్లించాలి.. వడ్డేపల్లి రిజర్వాయర్లోకి నేరుగా ఉన్న మురికి కాల్వలను అధికారులు గుర్తించి దారి మళ్లించడానికి ఉన్న అవకాశాలపై ప్రత్యేక సర్వే చేయాలి. చెరువులోకి పలు ప్రాంతాల నుంచి వస్తున్న మురికినీరు వల్ల తాగునీరు కలుషితమవుతోంది. దీని నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి. – ఎండీ సోనీ, కాజీపేట కోతకు గురవుతున్న ఫోర్షోర్ బండ్ రిజర్వాయర్లో తేలుతున్న శవాలు కన్నెత్తి చూడని అధికారులు ఆందోళనలో నగరవాసులు -
ఇప్పుడేం చేద్దాం?
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు విడతలుగా ఇటీవల గ్రామ పంచాయతీల ఎన్నికలు ముగిశాయి. తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ మొదలవుతుందని అందరూ భావించారు. లేదంటే మున్సిపల్ ఎన్నికలకై నా షెడ్యూల్ విడుదల కావొచ్చన్న చర్చ జరిగింది. వీటన్నింటికీ భిన్నంగా రెండు రోజుల క్రితం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్లు) పాలకవర్గాలను రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల కంటే ముందు.. సహకార సంఘాల ఎన్నికల నిర్వహణ వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతోందన్న చర్చ తెరమీదకు వచ్చింది. 2020 ఫిబ్రవరి 13న సహకార సంఘాల ఎన్నికలు జరిగాయి. నిబంధనల ప్రకారం ఐదేళ్ల పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరితోనే ముగియగా.. పరిపాలనాపరమైన కారణాల దృష్ట్యా అప్పట్లో ప్రభుత్వం వీటి పదవీ కాలాన్ని 6 నెలలు పొడిగించింది. ఆ పొడిగింపు గడువు కూడా ఆగస్టు 14వ తేదీతోనే ముగియగా, మరో ఆరు నెలలు పొడిగిస్తారని అందరూ భావించారు. ఇదే సమయంలో ప్రస్తుత ప్రభుత్వం పాత పాలకవర్గాలను పూర్తిగా రద్దు చేస్తూ తుది నిర్ణయం తీసుకోవడంతో అందరి దృష్టి సహకార సంఘాల ఎన్నికల వైపు మళ్లింది. 2020లో పీఏసీఎస్ ఎన్నికలు ఇలా.. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2020 ఫిబ్రవరి 13న పీఏసీఎస్ల ఎన్నికలు జరిగాయి. మొత్తం 99 సహకార సంఘాల్లో 97 సంఘాలకే ఎన్నికలు జరగగా, సంగెం, మల్యాల పీఏసీఎస్లు వాయిదా పడ్డాయి. తర్వాత ఆ రెండు సంఘాలకు కూడా నిర్వహించారు. మొదట నిర్వహించిన 97 సహకార సంఘాల్లో దాదాపుగా 88 వరకు అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ దక్కించుకోగా, 11 వరకు కాంగ్రెస్ మద్దతు తెలిపిన అభ్యర్థులు గెలుచుకున్నారు. 1,260 డైరెక్టర్లకు 509 ఏకగ్రీవం కాగా 750 డైరెక్టర్లకు ఎన్నికలు జరిగాయి. వరంగల్ అర్బన్ (హనుమకొండ) జిల్లాలోని 12 సహకార సంఘాల్లో 156 డైరెక్టర్లకు 74 డైరెక్టర్లు ఏకగ్రీవం కాగా 82 డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వరంగల్ రూరల్ (వరంగల్) జిల్లాలోని 31 సంఘాల పరిధిలో ఉన్న 402 డైరెక్టర్లకు 128 ఏకగ్రీవం కాగా 274 డైరెక్టర్లకు ఎన్నికలు నిర్వహించారు. జనగామలోని 14 సొసైటీల్లో 182 డైరెక్టర్లకు 66 ఏకగ్రీవం కాగా 116 డైర్టెర్లకు ఎన్నికలు జరిగాయి. మహబూబాబాద్ జిల్లాలోని 18 సంఘాల్లో ఉన్న 234 డైరెక్టర్లకు 114 ఏకగ్రీవం కాగా 120 డైరెక్టర్లకు ఎన్నికలు నిర్వహించారు. జేఎస్ భూపాలపల్లిలోని 10 సంఘాల్లో 130 డైరెక్టర్లకు 60 ఏకగ్రీవం కాగా 70 డైరెక్టర్లకు ఎన్నికలు, ములుగు జిల్లాలోని 12 సంఘాల్లో 156 డైరెక్టర్లకు 67 ఏకగ్రీవం కాగా 89 డైరెక్టర్లకు ఎన్నికలు జరిగాయి. పర్సన్ ఇన్చార్జ్ల పాలనా? త్వరలో ఎన్నికలా? గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే సహకార సంఘాల పాలకవర్గాలను ప్రభుత్వం రద్దు చేసింది. ఈనేపథ్యంలో పీఏసీఎస్, డీసీసీబీ నిర్వహణ స్తంభించకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. తదుపరి ఎన్నికలు నిర్వహించే వరకు లేదా కొత్త ఉత్తర్వులు వచ్చే వరకు ఈ సంస్థల బాధ్యతలను పర్సన్ ఇన్చార్జ్ లకు అప్పగించింది. ముఖ్యంగా వరంగల్ డీసీసీబీ బాధ్యతలను కలెక్టర్కు అప్పగించగా, పీఏసీఎస్ లకు ఆర్డీఓ, తాలుకా, మండలస్థాయి అధికారులకు పర్సన్ ఇన్చార్జ్లుగా బాధ్యతలు అప్పగించనున్నట్లు ప్రకటించారు. కలెక్టర్ల సారథ్యంలో పర్సన్ ఇన్చార్జ్లు పనిచేయనున్నందున పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు. ఓ వైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై అన్ని పార్టీలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. ఇదే సమయంలో సహకార సంఘాల పాలకవర్గాలను రద్దు చేశారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన డీసీసీబీలు, సంఘాలను పునర్వ్యవస్థీకరించిన తర్వాత ఎన్నికలకు వెళ్లవచ్చంటున్నారు రాజకీయ వర్గాలు. కాగా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పట్లో ఉండవన్న సంకేతాలు వెలువడిన నేపథ్యంలో రద్దయిన సహకార సంఘాలకే ముందుగా ఎన్నికలు జరపవచ్చన్న చర్చ అధికార వర్గాల్లో మొదలైంది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే మళ్లీ సహకార సంఘాల ఎన్నికల చర్చ రాజకీయ పార్టీల్లో మళ్లీ విస్తృతంగా సాగుతోంది. వరంగల్ డీసీసీబీ పర్సన్ ఇన్చార్జ్గా హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలక వర్గాలను రద్దు చేసిన ప్రభుత్వం అధికారులను పర్సన్ ఇన్చార్జ్లుగా నియమించింది. ఈ మేరకు సహకార శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) పర్సన్ ఇన్చార్జ్గా హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ను ప్రభుత్వం నియమించగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. హనుమకొండ జిల్లాలోని 16 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు సహకారశాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్లు, సీనియర్ ఇన్స్పెక్టర్లను పర్సన్ ఇన్చార్జ్లుగా నియమించారు. పరకాల, కమలాపూర్ పీఏసీఎస్లకు పర్సన్ ఇన్చార్జ్గా ఎన్.శ్రీనివాస్రావును నియమించారు. పెగడపల్లి ఎ.కృష్ణవేణి, నందనం ఎస్.సదీప్కుమార్, ధర్మసాగర్, సింగారం కె.రవీంద్ర, హసన్పర్తికి ఎ.జగన్మోహన్రావు, దర్గా కాజీపేట, మల్లారెడ్డిపల్లి ఎం.సునీల్ కుమార్, పెంచికలపేట, శాయంపేటకు రాధిక, ఎల్కతుర్తి సీని యర్ ఇన్స్పెక్టర్ ఎండీ అఫ్జలుద్దీన్, మాదారం సీనియర్ ఇన్స్పెక్టర్ వి.జ్యోతి, పెద్దాపూర్కు సీనియర్ ఇన్స్పెక్టర్ మతీన్సుల్తాన్, వంగపహాడ్ సీనియర్ ఇన్స్పెక్టర్ జె.సత్యానందం, ఆత్మకూరు సీనియర్ ఇన్స్పెక్టర్ ఎం.రాణిశ్రీలక్ష్మిని పర్సన్ఇన్చార్జ్గా నియమించారు. సహకార సంఘాల పాలకవర్గాల రద్దు కలకలం వైదొలిగిన 99 పీఏసీఎస్లు పాలకవర్గాలు.. స్పెషల్ ఆఫీసర్ల నియామకం మరోసారి పొడిగింపుపై ఆశలు.. రద్దు చేస్తూ సర్కారు కీలక నిర్ణయం సహకార సంఘాల ఎన్నికలు జరుగుతాయని ప్రచారం అన్ని పార్టీల్లో ఎలక్షన్స్పై మళ్లీ మొదలైన చర్చ 2020 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పీఏసీఎస్లుమొత్తం సహకార సంఘాలు: 99 డైరెక్టర్ స్థానాలు: 1,260 ఏకగ్రీవంగా ఎన్నికై నవి: 509 ఎన్నికలు జరిగినవి: 751 -
చలికి విలవిల
సాక్షి, వరంగల్/హన్మకొండ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో శనివారం చలి తీవ్రత మరింత పెరిగే అవకాశముందని వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జనగామ జిల్లా వాసులు అప్రమత్తంగా ఉండాలని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మూడు రోజుల నుంచి ఏకంగా రెండు నుంచి నాలుగు డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు తగ్గాయి. పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు రాత్రి ఉష్ణోగ్రత మరీ తక్కువగా నమోదవుతున్నది. గురువారం ఉదయం 8.30 నుంచి శుక్రవారం ఉదయం 8.30 గంటల వరకు ఆటోమేటిక్ వెథర్ స్టేషన్లో నమోదైన వివరాల మేరకు హనుమకొండ, వరంగల్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రత 10.3 సెల్సీయస్ డిగ్రీలు, అత్యధిక ఉష్ణోగ్రత 32 సెల్సియస్ డిగ్రీల వరకు నమోదైంది. అయింది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో అత్యల్ప ఉష్ణోగ్రత 10.3 డిగ్రీలుండగా అత్యధిక ఉష్ణోగ్రత 29.6 డిగ్రీలుగా నమోదైంది. వరంగల్ జిల్లా నెక్కొండలో అత్యల్ప ఉష్ణోగ్రత 10.8 సెల్సియస్ డిగ్రీలు, అత్యధిక ఉష్ణోగ్రత 30.6 సెల్సియస్ డిగ్రీలుగా నమోదైంది. వచ్చే రెండు, మూడు రోజుల్లో మరింత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ అధికారులు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. ఉన్ని దుస్తులకు డిమాండ్.. చలి రోజురోజుకు పెరుగుతుండడంతో మార్కెట్లో స్వెటర్లకు డిమాండ్ బాగా పెరిగింది. పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతిఒక్కరూ ఉన్ని దుస్తులు లేనిదే బయటకు రావడం లేదు. మఫ్లర్లు కూడా వాడుతున్నారు. చెవిలోకి చల్లటి గాలి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉదయం నడక కోసం పార్కులకు వచ్చే వారి సంఖ్య కూడా తగ్గింది. ఉదయం వేళ పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు కూడా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలి.. తెల్లవారుజామునుంచే పొగమంచు కురుస్తుండడంతో నిత్యావసర సరుకులైన కూరగాయలు, ఇతర సామగ్రి తీసుకెళ్లే వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని వరంగల్ కమిషనరేట్ పోలీసులు సూచిస్తున్నారు. ఈ సమయాల్లోనే ఎదురుగా ఉండే వాహనం, ఎదురుగా వచ్చే వాహనం పొగమంచు కారణంగా కనిపించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయే అవకాశముందని, గతేడాది డిసెంబర్లోనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరిగాయని గుర్తు చేశారు. వాహనాల పార్కింగ్ లైట్లు వేసుకోవాలన్నారు. అప్రమత్తంగా ఉండాలి.. చలికాలంలో జలుబు, దగ్గు, జ్వరం వచ్చే అవకాశాలున్నాయి. అలాగే చెవి మూసుకుపోవడం, దురదతో పాటు నొప్పి సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి. అధిక చలి కారణంగా చెవిలో ఇన్ఫెక్షన్ సమస్య ఎదురవుతుంది. ఈ పరిస్థితిలో నొప్పి ఎక్కువ కాకముందే వైద్యులను సంప్రదించాలి. చిన్నపిల్లలకు బ్రోన్కియోలిటిస్ అనే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదముంది. దీనివల్ల ఊపిరితిత్తుల గాలి మార్గాల్లో శ్లేష్మం ఏర్పడి ఇబ్బంది పెడుతుంది. చలికాలంలో బయట ఆహారం తినడం మానేయాలి. ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు తినాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. – డాక్టర్ సాంబశివరావు, వరంగల్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోని ప్రధాన ప్రాంతాల్లో ఉష్ణోగ్రత వివరాలు (డిగ్రీలు సెల్సియస్లలో) ఎల్కతుర్తి ఆత్మకూరు పెద్ద పెండ్యాల మడికొండ కాజీపేట చింతగట్టు హనుమకొండ నెక్కొండ చెన్నారావుపేట నల్లబెల్లి వరంగల్ ఉర్సు కల్లెడ పైడిపల్లి కాశిబుగ్గరోజురోజుకూ తగ్గుతున్న ఉష్ణోగ్రతలు వరంగల్, హనుమకొండ, జిల్లాల్లో 10 నుంచి 11 డిగ్రీలు నేడు చలి తీవ్రత మరింత పెరుగుతుందన్న వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు -
వర్ధన్నపేట ఎమ్మెల్యేకు చుక్కెదురు
వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14వ డివిజన్లో వర్ధన్నపేట ఎమ్మెల్యేకు చుక్కెదురైంది. ఎన్టీఆర్నగర్, బాలాజీనగర్, లక్ష్మీగణపతి, శ్రీసాయిగణేశ్కాలనీ, ముసలమ్మకుంట ప్రాంతాల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులకు నిధులు పెట్టి ముఖ్యమైన ఏనుమాములకు ఒక్క రూపాయి కూడా ఎందుకు పెట్టలేదంటూ స్థానిక ప్రజలు.. ఎమ్మెల్యే నాగరాజును ప్రశ్నించారు. 14వ డివిజన్లో సుమారు రూ.7.70 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు శుక్రవారం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఏనుమాములకు వచ్చారు. గెలిచి రెండేళ్లయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చడం లేదని నిలదీశారు. డివిజన్లో ముఖ్యమైన ఏనుమాములను విస్మరించడం సరికాదని ఎమ్మెల్యేతో స్థానికులు అనడంతో శ్రీనాకు తెలియదు. మీ నాయకులు వివరాలు ఇవ్వాల్సి ఉందిశ్రీ అని ఎమ్మెల్యే సమాధానం ఇచ్చారు. సమస్యలను చెప్పుకునేందుకు ఒంటరిగా మీ దగ్గరికి వస్తే పట్టించుకోవడం లేదని, ఎంతో అవసరమైన ఏనుమాముల శ్మశానవాటికకు కూడా నిధులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఈవిషయాలు తన దృష్టికి రాలేదని, భవిష్యత్లో మీ ప్రాంతంలో అభివృద్ధికి నిధులు కేటాయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడం, పోలీసులు రంగప్రవేశం చేసి ప్రజలను అడ్డుకోవడంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లి పోయారు. ఎమ్మెల్యే నాగరాజు పర్యటనలో మూడు వాహనాలు, ఒక ఇన్స్పెక్టర్, ఇద్దరు ఎస్సైలు, 10మందికి పైగా పోలీసులు బందోబస్తులో ఉండడాన్ని గమనించిన పలువురు మంత్రి పర్యటన కంటే ఎక్కువ బందోబస్తు ఉందన్న చర్చించుకోవడం గమనార్హం. కాగా, డివిజన్లో అధికార పార్టీ ముఖ్య నాయకులు చెప్పిందే పోలీస్ స్టేషన్, ఇతర కార్యాలయాల్లో జరుగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే నాగరాజును కలవనీయకుండా చుట్టూ ఉంటున్న నాయకులే అడ్డుపడుతున్నారని స్థానికులు వాపోయారు. పోలీసుల వేధింపులుడివిజన్లో అధికార పార్టీ నాయకులు తమకు అడ్డుగా ఉన్న నాయకులను పోలీస్ స్టేషన్లకు పిలిపించి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ఒక నాయకుడిని స్టేషన్లో పెట్టించి కొట్టించిన ఘటనలున్నాయి. ఇటీవలి ఎన్నికల్లో ఎమ్మెల్యే ఒక గ్రామానికి వెళ్లగా అడ్డుకున్న వీడియో వైరలైంది. ఈ వీడియోను 14వ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు వాట్సాప్ స్టేటస్ పెట్టుకోగా కాంగ్రెస్ నాయకుడి ఆదేశంతో ఏనుమాముల ఎస్సై పిలిపించి బెదిరించడమే కాకుండా బూతు పురాణం చేసిన ట్లు ఆపార్టీ నాయకులు తెలిపారు. అంతేకాకుండా సాయంత్రం రావాలని ఆదేశించడంతో నాయకులతో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లినట్లు తెలిసింది. అభివృద్ధి నిధులపై ప్రశ్నించిన 14వ డివిజన్ ఏనుమాముల ప్రజలు -
శాస్త్రసాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధించాలి
విద్యారణ్యపురి: భారతదేశం శాస్త్రసాంకేతక రంగాల్లో మరింత అభివృద్ధి సాధిస్తే విశ్వగురువుగా కీర్తించే అవకాశం ఉంటుందని ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యానగర్లోని సేయింట్ పీటర్స్ ఎడ్యూ స్కూల్లో జిల్లా స్థాయి విద్యావైజ్ఞానిక ప్రదర్శనను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీపాల్రెడ్డి మాట్లాడుతూ.. విద్యావైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థుల్లోని నూతన ఆలోచనలు సృజనాత్మక ప్రతిభను వెలికి తీసేందుకు వేదికలవుతాయన్నారు. తాను సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడి వచ్చే ఏడాది సైన్స్ ఫెయిర్ నాటికి జిల్లా సైన్స్కేంద్రం అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానన్నారు. విజ్ఞానాన్ని పరస్పరం పంచుకోవడమే ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. సైన్స్ఫెయిర్ అంటే ఒక మోడల్ను.. ఒక ఎగ్జిబిట్ను ప్రదర్శించడం కాదని పరస్పర విజ్ఞానాన్ని షేర్ చేసుకోవడమేనని పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి అన్నారు. విద్యార్థులు భవిష్యత్లో పరిశోధకులుగా, శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఈ సైన్స్ ఫెయిర్లు దోహదం చేస్తాయన్నారు. అనంతరం డీఈఓ గిరిరాజ్ గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రశ్నించేతత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. ఈ సైన్స్ఫెయిర్, ఇన్స్పైర్లో విద్యార్థులు ప్రదర్శనలను తిలకించాలని సూచించారు. సమావేశంలో హనుమకొండ అదనపు కలెక్టర్ మేన శ్రీను, స్థానిక కార్పొటర్ నల్లా స్వరూపరాణి, జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాస్స్వామి, హనుమకొండ ఎంఈఓ నెహ్రూనాయక్, పీఆర్టీయూ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మంద తిరుపతిరెడ్డి, సెయింట్ పీటర్స్ ఎడ్యూ స్కూల్ అధినేత నారాయణరెడ్డి, ప్రిన్సిపాల్ హరిత, వడుప్సా బాధ్యుడు మాదాల సతీశ్కుమార్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు రామకృష్ణ, హసన్పర్తి ఎంఈఓ ఎ.శ్రీనివాస్, కాజీపేట ఎంఈఓ బి.మనోజ్కుమార్, సమగ్రశిక్ష కో–ఆర్డినేటర్లు బద్దం సుదర్శన్రెడ్డి, డాక్టర్ మన్మోహన్, బి.మహేశ్, సునీత, ఉపాధ్యాయుడు వల్స పైడి పాల్గొన్నారు. ఆకట్టుకున్న ఎగ్జిబిట్లు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళిశ్రీపాల్రెడ్డి వైజ్ఞానిక ప్రదర్శనలతో సృజనాత్మక ప్రతిభ -
ఆయిల్పామ్పై అవగాహన కల్పించాలి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఖిలా వరంగల్: ఆయిల్పామ్ సాగులో నిర్దేశించిన ప్రగతిని సకాలంలో పూర్తి చేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాకు కేటాయించిన 4,250 ఎకరాల లక్ష్యాన్ని ఉద్యాన, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా పూర్తిచేయాలని సూచించారు. ప్రతి క్లస్టర్లో ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారి తనకు నిర్దేశించిన 35 ఎకరాల లక్ష్యాన్ని సాధించాలన్నారు. యాప్ను సద్వినియోగం చేసుకోవాలి.. రైతులకు ఎరువులను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మొబైల్ యాప్ను సద్వినియోగం చేసుకోవాలని, ఈనెల 22 నుంచి యాప్ ద్వారా ఎరువులు పంపిణీ చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. పట్టాదారులు పాస్బుక్ హోల్డర్లు తమ పట్టాదారు పాస్బుక్ నంబర్తో నేరుగా లాగిన్ కావాలని, పట్టాలేని రైతులు ఆధార్కార్డుతో రిజిస్టర్ కావాలని సూచించారు. మండల క్లస్టర్స్థాయి వ్యవసాయ అధికారులు యాప్ వినియోగంపై అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాస్రావు, ఆయిల్పామ్ కంపెనీ జనరల్ మేనేజర్ సతీశ్ నారాయణ, వ్యవసాయ అధికారులు విజ్ఞాన్, రవీందర్, ఉద్యాన అఽధికారులు, విస్తరణ అధికారులు, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బదిలీ
వరంగల్ లీగల్: హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ పట్టాభిరామారావును హైదరాబాద్ సీబీఐ కోర్ట్ చీఫ్జడ్జీగా బదిలీ చేస్తూ హైకోర్టు విజిలెన్స్ రిజిస్ట్రార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు మొదటి అదనపు జిల్లా జడ్జి ఇన్చార్జ్గా ఉంటారు. సోమవారం వరకు రిలీవ్ కావాలని, ఈ నెల 29 వరకు బదిలీ అయిన స్థానంలో బాధ్యతలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మామునూరు: వరంగల్ మామునూరు టీజీ ఎస్పీ నాలుగో బెటాలియన్కు చెందిన స్పెషల్ కానిస్టేబుళ్లు శుక్రవారం నోటిఫికేషన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్కు బదిలీ అయ్యారు. ఈమేరకు ఏపీ రాష్ట్రానికి కేటాయించబడిన స్పెషల్ కానిస్టేబుళ్లను రిలీవ్ చేస్తూ కమాండెంట్ శివప్రసాద్రెడ్డి సిబ్బందిని అభినందించారు. తెలంగాణలో విధులు నిర్వర్తించినట్లుగానే ఆంధ్రప్రదేశ్లోనూ క్రమశిక్షణ, నిబద్ధత, అంకితభావంతో ప్రజలకు మంచి చేయాలని సూచించారు. విధుల్లో పేరు ప్రతిష్టతలు పెంచుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆయన కోరారు. వరంగల్ స్పోర్ట్స్: ఈ నెల 22వ తేదీన హనుమకొండలోని జేఎన్ఎస్లో జిల్లా స్థాయి క్రాస్ కంట్రీ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు హనుమకొండ అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కె.సారంగపాణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–16, 18, 20, మెన్ అండ్ ఉమెన్ విభాగాల్లో ఎంపికలు నిర్వహించున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఎంపిౖకైన క్రీడాకారులు జనవరి 2, 2026న హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్న 11వ రాష్ట్ర స్థాయి క్రాస్ కంట్రీ చాంపియన్షిప్లో పాల్గొంటారని తెలిపారు. విజేతలకు పతకాలు, మెరిట్ సర్టిఫికెట్లతో పాటు, పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు 22న ఉదయం 8గంటలకు జేఎన్ఎస్ వద్ద జనన ధ్రువీకరణ పత్రంతో హాజరు కావాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సారంగపాణి 93901 04499, సాంబమూర్తి 99120 22188, రజనీకాంత్ 70133 03330 మొబైల్ నంబర్లలో సంప్రదించాలని కోరారు. హన్మకొండ అర్బన్: ఈనెల 23న (మంగళవారం) ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హనుమకొండ జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా పాలకవర్గ సభ్యులు తెలిపారు. ఈమేరకు శుక్రవారం రెడ్ క్రాస్ భవన్లో జిల్లా పాలకవర్గ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం హనుమకొండ కలెక్టర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు స్నేహ శబరీష్ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్, పాలకవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి సర్వ సభ్య సమావేశానికి సంబంధించిన బుక్లెట్ను కలెక్టర్కు అందజేశారు. అనంతరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో 30 మంది టీబీ వ్యాధిగ్రస్తులకు ఉచిత న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేయగా.. డీఎంహెచ్ఓ అప్పయ్య లబ్ధిదారులకు కిట్లు అందజేశారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ విజయచందర్రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ది వెంకటనారాయణ గౌడ్, కోశాధికారి బొమ్మినేని పాపిరెడ్డి, రాష్ట్ర పాలకవర్గ సభ్యులు శ్రీనివాస్రావు, జిల్లా పాలకవర్గ సభ్యులు, టీబీ నివారణాధికారి హిమబిందు, రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు. విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో కేజీబీవీల్లో, మోడల్ స్కూళ్లలో తల్లిదండ్రుల, ఉపాధ్యాయులు (పీటీఎం) సమావేశాలు ఈనెల 20న నిర్వహించనున్నారు. ఈసారి నిర్వహించే సమావేశంలో పిల్లల కోసం ప్రత్యేక వంటకాలు(పోషకాహారం) చేసుకుని తీసుకురావాలని తల్లిదండ్రులకు ఆహ్వానం పంపినట్లు సమాచారం. పోషకాహారోత్సవాన్ని పాఠశాలల్లో వినూత్నంగా చేపట్టాలని నిర్ణయించినట్లు హనుమకొండ జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ కో–ఆర్డినేటర్ బద్దం సుదర్శన్రెడ్డి శుక్రవారం తెలిపారు. -
అంగన్వాడీ సెంటర్ తనిఖీ
ఖిలా వరంగల్: వరంగల్ 32వ డివిజన్ కరీమాబాద్ బీఆర్నగర్లోని అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ డాక్టర్ సత్యశారద, ఏఎస్పీ శుభం ప్రకాశ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, కార్పొరేటర్ పల్లం పద్మతో కలిసి రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా పిల్లలు, గర్భిణులు, బాలింతలకు అందించే సేవలపై ఆరా తీశారు. ప్రభుత్వం అందించే పోషకాహారాన్ని లబ్ధిదారులకు అందించాలని అంగన్వాడీ టీచర్కు సూచించారు. మంత్రి వెంట తహసీల్దార్ ఇక్బాల్, అధికారులు ఉన్నారు. -
సమస్యలెన్నో.. పరిష్కరించండి
ఐనవోలు: ఐనవోలు మల్లన్న జాతర జనవరి 13 నుంచి ప్రారంభం కానుంది. ఈనేపథ్యంలో జాతర నిర్వహణపై శనివారం హనుమకొం కలెక్టరేట్లో వివిధ అధికారులతో కలెక్టర్ స్నేహ శబరీష్ సమన్వయ సమావేశం నిర్వహించనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు వసతులు కల్పించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. నిధులు లేక నిలిచిన డార్మెటరీ పనులు మల్లన్న ఆలయంలో కమ్యూనిటీ హాల్ కం డార్మెటరీ హాల్ నిర్మాణానికి కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) గతంలోనే ఆమోదం తెలిపింది. బేస్మెంట్ వరకు పనులు చేసి నిధులు మంజూరు కాకపోవడంతో నిలిపేశారు. అర్ధంతరంగా నిలిచిన పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఆలయ ప్రాంగణంలో షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటుకు ప్రతిపాదనకే పరిమితమైంది. నిర్మాణానికి నిధులు మంజూరు కా లేదు. నిధులు మంజూరు చేయడంతోపాటు గతంలో ‘కుడా’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైటింగ్ టవర్స్ రిపేర్ చేయించాల్సి ఉంది. భక్తుల డిమాండ్లు ● ఆలయ ప్రాంగణంలో పట్నాలు, ఇతరత్రా ఆర్జిత సేవల్లో పాల్గొన్న వారికి ప్రత్యేక లైన్ ద్వారా స్వామి, అమ్మవార్ల దర్శనం కల్పించాలి. ● సేవా టికెట్ కొనుక్కున్న భక్తుల నుంచి ఒగ్గు పూజారులు ఇష్టారీతిన డబ్బులు వసూలు చేయడాన్ని నియంత్రించాలి. ● భక్తుల సంఖ్యకు సరిపోయేలా సులభ్ కాంప్లెక్స్లు తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదికన నిర్మించాలి. ● భక్తులు ఆలయ ప్రాంగణంలో బస చేయడానికి గదులు, పెద్ద డార్మెటరీ హాల్ నిర్మించాలి. ● ఆలయానికి కనీసం రూ.50 కోట్లు మంజూరు చేయించి అభివృద్ధి చేయాలి. ● ఆలయ తూర్పు, దక్షిణం వైపు ఉన్న కీర్తితోరణాలు శిథిలం కాగా మరమ్మతులు చేపట్టాలి. ● ఆర్కియాలజీ శాఖ సహకారంతో పడమర వైపు నాలుగో కీర్తి తోరణం ఏర్పాటు చేయాలి. ఆలయానికి ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా పేరిణి నృత్య మండపాన్ని ఆధునికీకరించాలి. ● రాజగోపురం, కోనేరు ఏర్పాటు, అలాగే ఆలయం చుట్టూ ఉన్న నేల బయ్యారాన్ని నిపుణుల సాయంతో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలి. ● పూర్వం ఊరగుట్టపైనే మల్లికార్జునస్వామి వెలిశాడని ఐనవోలువాసుల నమ్మకం. ఇటీవల ఊరగుట్టపై ఆలయం తరఫున కార్తీక మాసంలో అఖండ దీపం వెలిగిస్తున్నారు. ఊర గుట్ట, కింద ఉన్న చెరువును అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలి. ● జాతర ప్రాంగణంలో 10 స్నాన ఘట్టాలు ఉండగా.. సీ్త్రల డ్రెస్సింగ్ రూమ్స్ ఏర్పాటు చేయాలి. ● గత జాతరలో నీటి సరఫరాలో ఇబ్బందులు పడిన కారణంగా 10 హెచ్పీ మోటార్ 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ● ఆలయ ప్రాంగణంలో ఉన్న పోలీస్ స్టేషన్ను మరో చోటుకు మార్చాలి. ప్రస్తుతం జాతర ప్రాంగణంలో పోలీసులు పట్టుకున్న, యాక్సిడెంట్ ఘటనలకు సంబంధించిన వాహనాలు ఉంచడంతో భక్తులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. నేడు ఐనవోలు జాతర నిర్వహణపై సమావేశం కలెక్టరేట్లో అధికారులతో చర్చించనున్న కలెక్టర్ ఆలయ అభివృద్ధి, వసతుల కల్పనపై దృష్టిసారించాలంటున్న భక్తులు -
21న జిల్లా స్థాయి చదరంగ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: కమల్ కింగ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన ఉమ్మడి వరంగల్ జిల్లా పాఠశాల స్థాయి చదరంగ పోటీలు నిర్వహిస్తున్నట్లు అకాడమీ చైర్మన్ జి.రాంప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హనుమకొండలోని పబ్లిక్గార్డెన్ సమీపంలో గల టీటీడీ కల్యాణ మండపంలో అండర్ –07, 09, 11, 15 విభాగాల్లో బాలబాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజేతలకు నగదు పురస్కారంతో పాటు పాల్గొన్న క్రీడాకారులకు సర్టిఫికెట్లు, పతకాలు అందజేయనున్నట్లు తెలిపారు. పోటీల్లో పాల్గొనే ఆసక్తి గల క్రీడాకారులు పేర్లు రిజిస్ట్రేషన్ ఇతర పూర్తి వివరాలకు 9676056744 , 9154570257 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు. నేటి నుంచి టెమ్రిస్ ఉమ్మడి జిల్లా స్థాయి క్రీడా పోటీలు న్యూశాయంపేట : తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ(టెమ్రిస్) ఆధ్వర్యంలో నేటి(శుక్రవారం) నుంచి మూడో ఉమ్మడి జిల్లాస్థాయి క్రీడా పోటీలు ప్రారంభం కానున్నాయని గురుకులాల ఆర్ఎల్సీ, క్రీడా పోటీల రీజినల్ కన్వీనర్ డాక్టర్ జంగా సతీశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే పోటీల్లో ఉమ్మడి జిల్లా పరిధి ఆరు జిల్లాలలోని బాల, బాలికల గురుకులాల క్రీడాకారులు వివిధ క్రీడా పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. బాలురకు వరంగల్ రంగశాయిపేటలోని వరంగల్(బీ1) గురుకులంలో, బాలికలకు శంభునిపేట దూపకుంటరోడ్లోని వరంగల్(జీ2) గురుకులంలో పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. కేయూలో లాన్ టెన్నిస్ ఎంపికలు కేయూ క్యాంపస్: సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో పాల్గొనేందుకు కాకతీయ యూనివర్సిటీ పరిధిలో వివిధ కళాశాలలకు చెందిన క్రీడాకారులకు గురువారం లాన్ టెన్నిస్ ఎంపికలు నిర్వహించారు. కాకతీయ యూనివర్సిటీలోని స్పోర్ట్స్ బోర్డు ప్రాంగణంలో నిర్వహించిన ఎంపికలకు 30 మంది హాజరయ్యారు. ఇందులో ఐదుగురు మెన్, మరో ఐదుగురు ఉమెన్స్ మొత్తం 10 మందిని ఎంపిక చేశామని కేయూ స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ ఆచార్య వై. వెంకయ్య తెలిపారు. వీరు సౌత్జోన్ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో పాల్గొనబోతున్నారని ఆయన తెలిపారు. కేయూలో అంతర్ కళాశాలల అథ్లెటిక్స్ పోటీలు ● నేటి నుంచి రెండురోజుల పాటు నిర్వహణ కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల అంతర్ కళాశాలల క్రీడా పోటీలు ఈనెల 19 , 20వ తేదీల్లో కాకతీయ యూనివర్సిటీ స్పోర్ట్స్ గ్రౌండ్లో నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో షార్ట్రన్స్, మిడిల్ రన్స్, లాంగ్రన్స్ 400, 4 ్ఠ400 మీటర్ల రిలే పరుగు పందెం పోటీలు నిర్వహించబోతున్నారు.లాంగ్ జంప్, హైజంప్, హ్యామర్త్రో, షార్ట్పుట్, జావెలిన్త్రో విభాగాల్లో పురుషుల, మహిళలకు పోటీలు నిర్వహించనున్నారు. ఈ క్రీడాపోటీలను వీసీ కె. ప్రతాప్రెడ్డి ప్రారంభిస్తారని కేయూ స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ వై. వెంకయ్య ,ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్. కుమారస్వామి గురువారం తెలిపారు. ఈనెల 20 ఈ క్రీడా పోటీల ముగింపు కార్యక్రమంలో కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం, యూనివర్సిటీకాలేజీ ప్రిన్సిపాల్ టి. మనోహర్ పాల్గొంటారని తెలిపారు. ఈ క్రీడల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు. -
మహాజాతరకు కేంద్ర మంత్రులకు ఆహ్వానం
ఎస్ఎస్తాడ్వాయి: 2026 జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు జరగనున్న మేడారం సమ్మక్క– సారలమ్మ మహజాతరకు కేంద్ర మంత్రులు జువల్ ఓరం, కిషన్రెడ్డిని బీజేపీ జిల్లా నా యకులు ఆహ్వానించారు. గురువారం ఆదిలా బాద్ ఎంపీ గోడం నాగేశ్ ఆధ్వర్యంలో బీజేపీ ములుగు జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం, సమ్మక్క పూజారి సిద్ధబోయిన సురేందర్, నాయకులు కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరం, మైనింగ్ శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలిసి జాతరకు ఆహ్వానించారు. ఈసందర్భంగా ఆదివాసీ సంప్రదాయ ప్రకారం మంత్రులను సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు భరతపురం నరేశ్, పోదెం రవీందర్, సంతోష్ కుమార్ ఉన్నారు.బైక్ను ఢీకొన్న బొలెరో ● యువకుడి మృతి, మరొకరి పరిస్థితి విషమం కాటారం: కాటారం మండలం గంగారం ఎక్స్ రోడ్డు కొండంపేట క్రాస్ వద్ద బొలెరో.. బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో బైక్పై ఉన్న యువకుడు మృతి చెందగా మరొ కరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. జయశంకర్ భూ పాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొండంపేటకు చెందిన శనిగరం రాఘవ, వలెంకుంటకు చెందిన మంతెన గణేశ్(20) గురువారం బైక్పై గంగారం ఎక్స్ రోడ్డు వైపునకు వస్తున్నారు. ఈ క్రమంలో మంథని వైపునకు వెళ్తున్న బొలెరో కొండంపేట క్రాస్ దాటుతున్న బైక్ను ఢీకొంది. దీంతో బైక్పై ఉన్న రాఘవ, గణేశ్ ఎగిరి రోడ్డుపై పడడంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు పోలీసులతో పాటు 108కి సమాచారం అందించారు. అనంతరం క్షతగాత్రులను చికిత్స నిమిత్తం భూపాలపల్లి వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా గణేశ్ చికిత్స పొందుతూ మృతి చెందగా రాఘవ పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. సురక్షిత ప్రయాణానికి తోడ్పడాలి ● రైల్వే రక్షక దళం అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ సుభాష్ మహబూబాబాద్ రూరల్ : దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని రైల్వే రక్షక దళం విభాగంలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది ప్రయాణికులు సురక్షిత ప్రయాణం కొనసాగించేలా కృషి చేయాలని రైల్వే రక్షక దళం అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ సుభాష్ అన్నారు. ఈ మేరకు గురువారం రాత్రి మహబూబాబాద్ రైల్వే స్టేష న్ పరిధిలోని రైల్వే రక్షక దళం ఔట్ పోస్టు వి భాగాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైల్వే భద్రతాపరమైన విషయాలపై అధికారులు, సి బ్బందికి అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైల్వే స్టేషన్ పరిధిలో చో రీలు జరగకుండా నిఘా ఏర్పాటు చేసి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైల్వే ఆస్తుల రక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. తనిఖీల్లో కాజీపేట ఆర్పీఎఫ్ సీఐ చటర్జీ, మానుకోట ఆర్పీఎఫ్ ఎస్సై సుభాని, సిబ్బంది ప ద్మ, జయపా ల్, శ్రీను, క న్న,శిరీష పా ల్గొన్నారు. -
భద్రతానైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలి
హన్మకొండ: రోడ్డు భద్రతా నైపుణ్యాన్ని మరింత మెరుగు పరుచుకోవాలని టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను అన్నారు. గురువారం వరంగల్ ములుగు రోడ్డులోని ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో అద్దె బస్సు డ్రైవర్లకు రోడ్డు భద్రత– సురక్షిత డ్రైవింగ్ –నైపుణ్య అభివృద్ధిపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎం డి.విజయభాను మాట్లాడుతూ డ్రైవర్లు సురక్షిత డ్రైవింగ్ చేయాలని సూచించారు. బస్సు నడుపడంలో నైపుణ్యాన్ని పెంచుకోవాలని, జీరో ప్రమాదాలే లక్ష్యంగా ప్రతి డ్రైవర్ తన వృత్తి సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవాలని సూచించారు. ప్రమాద రహిత డ్రైవింగ్ లక్ష్యంగా ప్రతి డ్రైవర్ పనిచేయాలని పిలుపునిచ్చారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, డ్రైవింగ్ సమయంలో సెల్ఫోన్ మాట్లాడవద్దని కోరారు. ప్రతి డ్రైవర్ సరైన పోషకాహారం తగిన విశ్రాంతి తీసుకోవాలన్నారు. కొన్ని సమయాల్లో ప్రమాదాలను నివారించడానికి చాకచక్యంగా డ్రైవింగ్ చేయాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు. శిక్షణలో డిప్యూటీ ఆర్ఎం కేశరాజు భా నుకిరణ్, వరంగల్ రీజియన్లోని అన్ని డిపోల ను ంచి ఎంపిక చేసిన అద్దె బస్సు డ్రైవర్లు పాల్గొన్నారు. ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయ భాను -
క్రీడలతో ఉజ్వల భవిష్యత్
వరంగల్ స్పోర్ట్స్: క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని హనుమకొండ జిల్లా విద్యాశాఖాధికారి గిరిరాజ్గౌడ్ విద్యార్థులకు సూచించారు. 69వ పాఠశాల క్రీడల సమాఖ్య అండర్–14 బాలుర రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలు హనుమకొండ ప్రభుత్వ పాఠశాల మైదానంలోని డీఎస్ఏ బాక్సింగ్ హాల్లో గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు కొనసాగే పోటీలకు డీఈఓ గిరిరాజ్గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, ఓడిన ప్రతి ఆటను ఓ మెట్టుగా మలుచుకుని విజయం వైపు పయనించాలని సూచించారు. విశిష్ట అతిథి, యువజన కాంగ్రెస్ నాయకుడు విష్ణురెడ్డి మాట్లాడుతు బాక్సింగ్ ఆత్మరక్షణకే కాకుండా సమాజంలో బాక్సర్లకు ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తుందన్నారు. సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం క్రీడల అభ్యున్నతికి కృషి చేస్తోందని తెలిపారు. ఎస్జీఎఫ్ అండర్–14, 17 హనుమకొండ జిల్లా కార్యదర్శి వి. ప్రశాంత్కుమార్ మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ వరకు జరగనున్న రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో ఉమ్మడి 10 జిల్లాల నుంచి 150 మంది క్రీడాకారులు, రెఫరీలు పాల్గొన్నారని తెలిపారు. క్రీడాకారులకు భోజన, ఇతర వసతులు కల్పించినట్లు వివరించారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈనెల 25 నుంచి 31వ తేదీ వరకు మధ్యప్రదేశ్లోని గుణలో జరగనున్న ఎస్జీఎఫ్ జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. పీఈటీల సంఘం జిల్లా అధ్యక్షుడు శీలం పార్థసారథి, కార్యదర్శి మల్లారెడ్డి, ఒలింపిక్స్ సంఘం జిల్లా మాజీ కార్యదర్శి మంచాల స్వామిచరణ్, భూపాలపల్లి డీవైఎస్ఓ చిర్ర రఘు, ఆర్మీ రిటైర్డ్ అధికారి శీలం నరేంద్రదేవ్, కోచ్లు ప్రభుదాస్, శ్యాంసన్, శ్రీకాంత్, రెఫరీలు వేణు, కుమార్, సతీష్, రాజు తదితరులు పాల్గొన్నారు. హనుమకొండ జిల్లా విద్యాశాఖాధికారి గిరిరాజ్గౌడ్ హనుమకొండలో రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలు ప్రారంభం ఉమ్మడి 10 జిల్లాల నుంచి 150 మంది క్రీడాకారులు హాజరు -
మా చిట్టి డబ్బులు ఇప్పించండి
కాజీపేట అర్బన్: మా చిట్టి డబ్బులు ఇప్పించండి అంటూ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి గురువారం చిట్స్ బాధితులు పోటెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం, చిట్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చిట్ఫండ్ కంపెనీల ఫిక్స్డ్ డిపాజిట్లను రిలీజ్ చేసి బాధితులకు అప్పగిస్తున్నారు. తొలుత కనకదుర్గ చిట్ఫండ్ బాధితుల్లోని 37 గ్రూపుల్లో 25 మందికి 3 కోట్ల రూపాయల ఎఫ్డీలను జాయింట్ అకౌంట్ జిల్లా రిజిస్ట్రార్, కనకదుర్గ చిట్స్ చైర్మన్ తిరుపతిరెడ్డి అందజేసిన విషయం విదితమే. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అచల, అక్షర, భవితశ్రీ, కనకదుర్గ, శుభనందిని చిట్స్ బాధితులు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి గురువారం చేరుకుని ఫిర్యాదులు అందించారు. తాము పూర్తిగా చిట్టి డబ్బులు చెల్లించాం.. డబ్బులు ఇప్పించండి అంటూ జిల్లా రిజిస్ట్రార్ ప్రవీణ్కుమార్ను వేడుకున్నారు. డీఐజీకి కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. జిల్లా రిజిస్ట్రార్కు ఫిర్యాదుల వెల్లువ -
కంకవనాలు కనుమరుగు
ఎస్ఎస్తాడ్వాయి: మహాజాతర ఏర్పాట్ల పేరుతో మేడారం అటవీ ప్రాంతంలోని కంకవనాలు కనుమరుగువుతున్నాయి. భక్తుల సౌకర్యాల పేరుతో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా విలువైన కంకవనాలను నరికివేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మేడారం ఆర్టీసీ బస్టాండ్లో తాత్కాలికంగా తడకలతో ఏర్పాటు చేస్తున్న గదులకు స్థానికంగా లభించే కంక బొంగులను వినియోగిస్తున్నారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అటవీ సంపదకు నష్టం.. జాతర అభివృద్ధి పనుల్లో భాగంగా అటవీ సంపదను నాశనం చేయడం ఎంత వరకు సమంజసమనే పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తున్నారు. పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు బయట ప్రాంతాల నుంచి కంక బొంగులను కొనుగోలు చేసి తీసుకొచ్చి గదుల ఏర్పాటుకు వినియోగించాల్సి ఉంది. కానీ, అక్రమంగా వెదురు బొంగులను గదులకు వినియోగిస్తున్నా అటవీశాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు పట్టించుకోకపోతే భవిష్యత్లో అడవుల పరిరక్షణ ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని, కంక చెట్లు నరికి వేయకుండా చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంఘాలు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కంకవనాలకు ప్రాధాన్యం.. కంక చెట్లు మేడారం అటవీ ప్రాంతానికి జీవనాడీగా భావిస్తారు. కంక చెట్లు నేల తేమను నిలుపుకోవడంలో, వర్షపు నీటి నిల్వలో, వన్యప్రాణులకు ఆశ్రయంగా కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాదు ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాల్లో కంక వనాలకు ప్రత్యేక ఉంది. అలాగే, సమ్మక్క– సారలమ్మ పూజా కార్యక్రమాల్లో వీటికి విశిష్టత ఉంది. సమ్మక్క–సారలమ్మను గద్దెలపై పూజారులు వెదురు బొంగులతో తయారు చేసిన బుట్టలో తీసుకురావడంతోపాటు తల్లుల గద్దెలపై కూడా కంకవనాలను పూజారులు ప్రతిష్ఠిస్తారు. ప్రతీ జాతరకు ఇదే తంతు.. ప్రతీ ఏటా జాతర సమయంలో కంక వనాలను అక్రమంగా నరికివేస్తున్నారు. కాంట్రాక్టర్లు కొంత కొనుగోలు చేసిన వెదురు బొంగులను మేడారానికి తీసుకొచ్చి వినియోగించి, మిగిలింది మేడారం అటవీ ప్రాంతంలోని బొంగులను నరికి వినియోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. యథేచ్ఛగా అటవీ అనుమతి లేకుండా వినియోగిస్తున్నా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరించడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.చర్యలు తీసుకుంటాం..ఆర్టీసీ బస్టాండ్లోని తడకలు, వె దురు బొంగులతో ఏర్పాటు చేస్తు న్న గదులను పరిశీలిస్తున్నాం. కాంట్రాక్టర్లు తీసుకొచ్చిన వెదురు బొంగులకు సంబంధించిన అనుమతి పత్రాలను పరిశీలిస్తున్నాం. మూడు రోజులు ఎన్నికల విధులకు వెళ్లాం. ఈ సమయంలో అటవీ నుంచి కంక బొంగులను తీసుకొచ్చి వినియోగించినట్లు మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం. – సాగర్రెడ్డి, సెక్షన్ ఆఫీసర్మేడారంలో వెదురు చెట్ల నరికివేత ఆర్టీసీ బస్టాండ్లో తడకల గదులకు వినియోగం పట్టించుకోని అటవీశాఖ అధికారులు -
దర్యాప్తు సంస్థలు దుర్వినియోగం
హన్మకొండ: కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఇ.వి.శ్రీనివాస్రావు, మహిళా కాంగ్రెస్ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు బంక సరళ దుయ్యబట్టారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ద్వారా సోనియాగాంధీ, రాహుల్ గాంధీని వేధింపులకు గురి చేయడంపై కాంగ్రెస్ పార్టీ గురువారం హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం అక్కడి నుంచి హనుమకొండ దీన్దయాళ్ నగర్లోని బీజేపీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్తుండగా నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ కార్యాలయం ఎదురుగా ప్రధాన రహదారిపై పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్యాల మధ్య తోపులాట జరిగింది. నాయకులను అరెస్ట్ సుబేదారి పోలీస్ స్టేషన్కు తరలించారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్, కాంగ్రెస్ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు జక్కుల రవీందర్, విజయ శ్రీ రజాలీ, మామిండ్ల రాజు, దేవరకొండ విజయలక్ష్మి సురేందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బంక సంపత్, అంకుష్, నాయకులు తాడిశెట్టి విద్యాసాగర్, పెరుమాండ్ల రామకృష్ణ, పులి అనిల్, విక్రమ్, గుంటి స్వప్న, సమత, నసీం జా, మాజీ కార్పొరేటర్లు, మహిళా నాయకులు, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వరంగల్ బీజేపీ కార్యాలయ ముట్టడి గీసుకొండ: గ్రేటర్ వరంగల్ నగరం 16వ డివిజన్ ధర్మారం వద్ద ఉన్న బీజేపీ జిల్లా కార్యాలయాన్ని గు రువారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు ముట్ట డించారు. వరంగల్ నగరంతోపాటు గీసుకొండ మండలం నుంచి ఆ పార్టీ నాయకులు పెద్ద సంఖ్య లో కాంగ్రెస్ జెండాలతో తరలివచ్చి బీజేపీ కార్యాలయానికి వెళ్లేదారిలో ధర్నా చేశారు. పరకాల ఎ మ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి, వర్దన్నపేట ఎమ్మెల్యే నా గరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కాంగ్రెస్ జి ల్లా అధ్యక్షుడు అయూబ్ ధర్నాలో పాల్గొన్నారు. బీ జేపీ జిల్లా కార్యదర్శి రాణాప్రతాప్రెడ్డి వాహనంలో వెళ్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. బీ జేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు వారిని చెదరగొట్టారు. మామునూ రు ఏసీపీ వెంకటేశ్, సీఐ విశ్వేశ్వర్ పోలీసు వాహనా ల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతోపాటు ముఖ్య నాయకులను గీసుకొండ పోలీస్ స్టేషన్కు తరలించారు. కాంగ్రెస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బంక సరళ నేషనల్ హెరాల్డ్ కేసుకు నిరసనగా కాంగ్రెస్ నిరసన ర్యాలీ -
జంట హత్యల కేసులో నిందితుడికి పదేళ్ల జైలు
రేగొండ: జంట హత్యల కేసులో నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష పడిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో చోటు చేసుకుంది. ప్రాసిక్యూషన్ శ్రీనివాస్ కథనం ప్రకారం.. మండలంలోని తిరుమలగిరి గ్రామానికి చెందిన కంచరకుంట్ల రాజుకు కొంతకాలంగా మానసిక స్థితి సరిగాలేదు. ఈక్రమంలో అతడు తరచుగా తల్లి హైమావతి, భార్యతో గొడవపడుతుండేవాడు. 2024 జనవరి 4వ తేదీన అర్ధరాత్రి తల్లితో గొడవపడి రోకలిబండతో దాడిచేశాడు. తీవ్ర గాయాలైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇంటిపక్కన ఉన్న ఊకంటి లలిత అడ్డురాగా ఆమైపె కూడా దాడి చేయగా తీవ్రంగా గాయపడింది. చికిత్స పొందుతూ జనవరి 14న మృతిచెందింది. ఈ ఘటనపై అప్పటి ఎస్సై శ్రీకాంత్రెడ్డి కేసు నమోదు చేయగా అప్పటి చిట్యాల సీఐ వేణుచందర్.. నిందితుడు రాజును అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. అనంతరం సీఐ మల్లేశ్యాదవ్ చార్జ్షీట్ దాఖలు చేశారు. గురువారం కోర్టులో విచారణ జరిగింది. నేరం రుజువు కావడంతో నిందితుడు రాజుకు పదేళ్ల జైలుశిక్షతోపాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ న్యాయమూర్తి రమేశ్బాబు తీర్పు వెలువరించారు. కాగా, ఈ కేసులో నిందితుడికి శిక్షపడేలా సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన గణపురం సీఐ కరుణాకర్రావు, రేగొండ ఎస్సై రాజేశ్ను భూపాలపల్లి ఎస్పీ సంకీర్త్ అభినందించారు. 108 ప్రోగ్రాం మేనేజర్గా శివకుమార్ హన్మకొండ అర్బన్ : 108, 102 సర్వీస్ల ఉమ్మ డి వరంగల్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్గా పాటి శివకుమార్ బాధ్యతల స్వీకరించారు. ఇంతకాలం ఖమ్మంలో పనిచేసిన ఆయనను రాష్ట్ర అధికారులు జిల్లాకు బదిలీ చేశారు. త్వరలో జరగనున్న మేడారం జాతర నేపథ్యంలో ప్రాధాన్యతను గుర్తించి ఆయనను ఇక్కడికి బదిలీ చేసినట్లు సమాచారం. వరంగల్లో పనిచేసిన సమయంలో మేడారం జాతరలో సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. విధుల్లో చేరిన ఆయనకు సిబ్బంది పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. -
తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీ
హసన్పర్తి : తాళం వేసి ఉన్న రెండు ఇళ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు.ఈ ఘటన కాకతీయ యూనివర్సిటీ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఈమేరకు బాధితులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పీఎస్ పరిధి లోని సప్తగిరి–6 కాలనీకి చెందిన సిద్దంశెట్టి నిఖిల్ దంపతులు బ్యాంకు ఉద్యోగులు. బుధవారం ఇంటికి తాళం వేసి విధులకు వెళ్లారు. రాత్రికి ఇంటికి వచ్చే సరికి తలుపు ధ్వంసం చేసి కనిపించింది. లోపలికి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న సుమారు 8 తులాల బంగారు ఆభరణాలు మాయమైనట్లు గుర్తించారు. మరో ఘటనలో పక్కనే ఉన్న పరిమళ కాలనీ–22లోని రమేశ్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఇంటిలో చోరీ జరిగింది. బుధవారం తుది దశ ఎన్నికల సందర్భంగా రమేశ్ విధులకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చే సరికి ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించారు. ఈ ఘటనలో దొంగలు బీరువాను ధ్వంసం చేసి 5 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీస్ ఇన్స్పెక్టర్ రవికుమార్ ఘటనాస్థలాలకు చేరుకుని జాగీలాలతో గాలింపు చర్యలు చేపట్టారు. వేలిముద్ర నిపుణులు ఆధారాలు సేకరించారు. 13 తులాల బంగారు ఆభరణాలు మాయం కేయూ పీఎస్ పరిధిలో ఘటన -
సమన్వయంతో ఎన్నికలు ప్రశాంతం
వరంగల్ క్రైం: అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించడంతో కమిషనరేట్ పరిధిలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్్ప్రీత్ సింగ్ అన్నారు. గురువారం డీసీపీలు అంకిత్కుమార్, రాజమహేంద్రనాయక్, కవిత సీపీని మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీపీ సన్ప్రీత్సింగ్ మాట్లాడుతూ డీసీపీ నుంచి మొదలుకొని హోంగార్డు స్థాయి వరకు అందరూ ప్రణాళికాబద్ధంగా పనిచేశారని తెలిపారు. పోలింగ్ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా బందోబస్తు నిర్వహించి ఎన్నికలను విజయవంతంగా పూర్తిచేశామని ఆయన పేర్కొన్నారు. హన్మకొండ: తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్ (బీఎంఎస్ అనుబంధం) టీజీ ఎన్పీడీసీఎల్ కంపెనీ శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈది వెంకట రమణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నే శశికుమార్ తెలిపారు. హనుమకొండలో గురువారం జరిగిన యూనియన్ ఎన్పీడీసీఎల్ కార్యవర్గ సమావేశంలో వెంకటరమణను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తనను ఎన్నుకున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శశికుమార్, ఎన్పీడీసీఎల్ శాఖ అధ్యక్షుడు ఆర్.రమణారెడ్డి, కార్యవర్గ సభ్యులకు వెంకటరమణ కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని, యూనియన్ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. కేయూ క్యాంపస్: యాంటీ సెక్సువల్ హరాస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఈనెల 20న(శనివారం) ఉదయం 10:30 గంటలకు కేయూలో అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా కేయూ వీసీ ప్రతాప్రెడ్డి, గౌరవ అతిథిగా రిజిస్ట్రార్ రామచంద్రం, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి వీబీ నిర్మలా గీతాంబ కీలకోపన్యాసం చేయనున్నారు. వరంగల్ షీ టీం సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.సుజాత, కేయూ ఉమెన్ స్టడీస్ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.శోభ, కేయూ పాలక మండలి సభ్యురాలు డాక్టర్ కె.అనితారెడ్డి, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్, కేయూ స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ మామిడాల ఇస్తారి పాల్గొంటారని కేయూ యాంటీ సెక్సువల్ సెల్ డైరెక్టర్ డాక్టర్ మేఘనారావు తెలిపారు. ప్రముఖ న్యాయవాది రామారావు ఫిర్యాదుతో కేసు నమోదు ఎంజీఎం: వరంగల్ సీకేఎం ఆస్పత్రిలో ఎలుకల సంచారం ఘటనను మానవహక్కుల సంఘం (హెచ్ఆర్సీ) తీవ్రంగా పరిగణించింది. పిల్లల వార్డులో తల్లులతోపాటు శిశువులు సైతం గాయాలపాలైన ఘటనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ న్యాయవాది రామారావు మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఆస్పత్రిలో సెక్యూరిటీ, పరిశుభ్రత గురించి అనేక సందేహాలు వస్తున్నాయి. ఎలుకలు ఆస్పత్రి వార్డులోనే కాకుండా కారిడార్లు, శిశువుల ఊయల దగ్గర కూడా తిరుగుతున్నా ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోకపోవడం గమనార్హం. ఆస్పత్రిలో ఎలుకలు తిరుగుతున్నట్లు సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడం ఆశ్చర్యానికి గురిచేసిందని న్యాయవాది పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించాలని ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ కిస్ట్రినా జడ్చోంగ్త్ను ఆయన కోరారు. -
గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలివ్వాలి
సీపీఎం కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు నాగయ్య ఖిలా వరంగల్: జక్కలొద్ది రామ సురేందర్నగర్ గుడిసె వాసులందరికీ ఇళ్ల పట్టాలివ్వాలని, లేకపోతే గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను పేదలకు పంచాలని సీపీఎం కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు జి.నాగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఖిలా వరంగల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం జిల్లా సహాయ కార్యదర్శి నలిగంటి రత్నమాల అధ్యక్షతన సీపీఎం నాయకుల రిలే నిరాహార దీక్షను ఆయన ప్రారంభించి మాట్లాడారు. తూర్పాటి కవిత, మైదం వినోదమ్మ, దుప్పటి రమ్య పాల్గొన్నారు. -
నిఘా నీడలో కలెక్టరేట్
హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టరేట్లో భద్రతా నిఘాను కలెక్టర్ మరింత కట్టుదిట్టం చేశారు. అధికారుల విధి నిర్వహణతోపాటు కలెక్టరేట్కు వచ్చిపోయే వారిపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కలెక్టరేట్ ప్రాంగణమంతటా సీసీ కెమెరాల సంఖ్యను గణనీయంగా పెంచారు. గతంలో ప్రధాన ప్రాంతాలు, రోడ్ల వెంట వచ్చేపోయే వారిని గమనించేందుకు సుమారు 30 సీసీ కెమెరాలు మాత్రమే ఉండగా.. తాజా ఏర్పాట్లతో మొత్తం సీసీ కెమెరాల సంఖ్య 78కి పైగా చేరనున్నట్లు సమాచారం. కలెక్టరేట్ చుట్టూ పరిసరాలకే పరిమితం కాకుండా కలెక్టర్, అదనపు కలెక్టర్, డీఆర్ఓ చాంబర్లతో పాటు రెవెన్యూ సిబ్బంది కార్యాలయాలు వంటి కీలక విభాగాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కలెక్టర్ స్వయంగా కూడా నిఘా వ్యవస్థను పర్యవేక్షించే విధంగా వ్యవస్థను రూపకల్పన చేసినట్లు తెలిసింది. ఆదర్శంగా కలెక్టర్ నిర్ణయం నిఘా వ్యవస్థను కట్టుదిట్టం చేసే విషయంలో కలెక్టర్ తన కార్యాలయం నుంచే మార్పునకు శ్రీకారం చుట్టినట్లు అధికారులు చెబుతున్నారు. పైస్థాయి నుంచి క్రమశిక్షణ మొదలవ్వాలన్న ఉద్దేశంతో తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచింది. ఇక ఆలస్యానికి తావులేదు.. కలెక్టరేట్లోని కొన్ని విభాగాల్లో సిబ్బంది సమయపాలనపై కొంతకాలంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు ఉద్యోగులు ఉదయం 11 గంటల తర్వాత విధులకు హాజరుకావడం, సాయంత్రం త్వరగా కార్యాలయాలు విడిచిపెట్టడం వంటి అంశాలపై విమర్శలు ఉన్నాయి. ఈ పరిస్థితిని పర్యవేక్షించాల్సి న కొంతమంది అధికారులు కూడా ఉదాసీనంగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నిఘాను మరింత కట్టుదిట్టం చేయడంతో ఇటువంటి వ్యవహారాలకు ఇక చెక్ పడినట్లేనని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఉద్యోగుల బదిలీలు తదితర క్రమశిక్షణ చర్యలతో గాడిన తప్పిన వ్యవస్థను సరిచేస్తున్న కలెక్టర్.. తాజా నిఘా చర్యలతో పనితీరును మరింత కట్టుదిట్టం చేసినట్లు కనిపిస్తోంది. దీని ప్రభావంతో ఉద్యోగుల సమయపాలన కూడా గాడిన పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కలెక్టర్, అదనపు కలెక్టర్, డీఆర్డీఓ చాంబర్లలోనూ సీసీ కెమెరాలు అధికారుల విధులు, కార్యాలయానికి వచ్చివెళ్లే వారిపై పర్యవేక్షణ -
‘పంచాయతీ‘పై పోస్టుమార్టం!
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు విడతల్లో ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ప్రధాన పార్టీలు పోస్టుమార్టం చేస్తున్నాయి. పార్టీ గుర్తు లేనప్పటికీ.. ఆయా పార్టీలు బలపర్చిన అభ్యర్థులు ఏ మేరకు సక్సెస్ అయ్యారు? ఎక్కడ, ఎందుకు పంచాయతీ స్థానాలు తగ్గాయి? పార్టీ బలపర్చిన అభ్యర్థుల ఓటమికి కారణాలు ఏంటి? అభ్యర్థుల ఎంపిక సరిగ్గానే జరిగిందా? అలాగైతే రెబల్స్ ఎందుకు బరిలో ఉన్నారు? ఓటమికి వెన్నుపోట్లు కారణమా? అలాగైతే ఏయే జిల్లాల్లో ఈ వెన్నుపోట్లు ప్రభావం చూపాయి? అన్న కోణాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ విశ్లేషిస్తున్నాయి. త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, సింగిల్విండో ఎన్నికల్లో ఇలాంటి పొరపాట్లకు తావులేకుండా ఉండేలా జాగ్రత్త పడుతున్నట్లు చెబుతున్నారు. ఫలితాలపై విశ్లేషణ.. విడతల వారీగా వెలువడిన ఫలితాలపై ప్రధాన పార్టీలు విశ్లేషిస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి వరంగల్లో 1,682 గ్రామ పంచాయతీలకు మూడు వితల్లో ఈ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఏకగ్రీవాలు కలిపి అధికార కాంగ్రెస్ 1,036 పంచాయతీలను గెలుచుకోగా, బీఆర్ఎస్ 479 స్థానాలతో వెనుకబడింది. బీజేపీ 31 స్థానాలు, ఇతరులు 136 గ్రామ పంచాయతీలు దక్కించుకున్నారు. మొదటి విడతలో 555 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 333, బీఆర్ఎస్ 148, బీజేపీ 17, ఇతరులు 57 మంది గెలుపొందారు. రెండో విడతలో 563కు కాంగ్రెస్ 332, బీఆర్ఎస్ 181 గెలుచుకుని పుంజుకుంది. బీజేపీ 9, ఇతరులు 41 దక్కించుకున్నారు. మూడో విడత 564 స్థానాలకు 371 కాంగ్రెస్, 150 బీఆర్ఎస్, 5 బీజేపీ, 38 మంది ఇతరులను ప్రజలు సర్పంచ్లుగా ఎన్నుకున్నారు. ఇంకొంత దృష్టి సారిస్తే మరిన్ని గ్రామ పంచాయతీలు గెలుచుకునే అవకాశం ఉండేదని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. గతంతో పోలిస్తే ఈసారి తగ్గడంపై ఎక్కడ లోపం జరిగింది? అన్న కోణంలో బీఆర్ఎస్ అగ్రనేతలు నియోజకవర్గ స్థాయి నాయకులను ఆరా తీస్తున్నారు. వెన్నుపోట్లు, రెబల్స్.. అధిష్టానాలు సీరియస్ పంచాయతీ ఎన్నికల్లో గెలుపోటములు, కొరవడిన సమన్వయంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ సీరియస్గానే స్పందించినట్లు తెలిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 65 చోట్ల కాంగ్రెస్, 34 చోట్ల బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులపై ఆయా పార్టీలకు చెందిన వారు రెబల్స్గా బరిలోకి దిగారు. 41 చోట్ల కాంగ్రెస్ రెబల్స్, స్వతంత్రులు గెలుపొందారు. మిగతా 24 చోట్లపార్టీ అభ్యర్థులు గెలిచినా.. నానా తిప్పలుపడి 30 నుంచి 50 ఓట్ల మెజార్టీనే వచ్చింది. అదేవిధంగా 20 పంచాయతీల్లో బీఆర్ఎస్ రెబల్స్, స్వతంత్రులు గెలుపొందగా, 14 చోట్ల బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు అతికష్టం మీద గెలిచారు. జనగామ, హనుమకొండ, వరంగల్, జేఎస్ భూపాలపల్లి జిల్లాల్లో అత్యధికంగా ఇలాంటివి చోటు చేసుకున్నాయని కాంగ్రెస్, బీఆర్ఎస్ అధిష్టానాలకు ఫిర్యాదులు వెళ్లాయి. పార్టీ బలపర్చిన అభ్యర్థులకు వెన్నుపోటు పొడిచేలా వ్యవహరించిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని టీపీసీసీ.. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటికే పలువురు నేతలతో మాట్లాడిన బీఆర్ఎస్ అధిష్టానం కూడా భవిష్యత్లో ఇలాంటి పరిణామాలకు తావులేకుండా చూడాలని ఉమ్మడి జిల్లా ముఖ్యనేతలకు సూచించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, సింగిల్విండో ఎన్నికలు రానున్న దృష్ట్యా నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ ముఖ్యనేతలను అప్రమత్తం చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఎక్కడ ఎందుకు తగ్గాయి.. ఎక్కడ పెరిగాయి? ఫలితాలపై ఆరా తీస్తున్న అన్ని పార్టీల నాయకులు గెలుపు గుర్రాల ఎంపికలో ఏమరుపాటు.. చాలాచోట్ల ఫలితాలు తారుమారు పార్టీలు బలపర్చిన అభ్యర్థులకు వెన్నుపోట్లు.. రెబల్స్గా బరిలో నెగ్గిన పలువురు భవిష్యత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కసరత్తు -
ప్రయోగాలకే పరిమితం!
వరంగల్ అర్బన్: వరంగల్ మహా నగరపాలక సంస్థ కమిషనర్లు మారిన ప్రతీసారి వారు అమలు పారిశుద్ధ్య నిర్వహణ విధానాలూ మారుతున్నాయి. ఒక కమిషనర్ రూపకల్పన చేసిన విధానాలను మరో కమిషనర్ లెక్క చేయడం లేదనే ఆరోపణ లున్నాయి. వీరి ఆలోచనలు వేర్వేరుగా ఉన్నా అమల్లో ఉన్న నిబంధనలకు పదును పెట్టి మరిన్ని ఫలితాలు సాధించాలి. కానీ, రూ.కోట్లు వెచ్చించి చేసిన ప్రయోగాలు విఫలమవుతున్నాయి. 2012 నుంచి అదే వరుస.. సుప్రీం కోర్టు 2001లో చెత్త ప్రక్షాళన నిబంధనావళి (సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్) మార్గదర్శకాలను జారీ చేసింది. 2012 అక్టోబర్ 10–17 తేదీల్లో అప్పటి కమిషనర్ వివేక్యాదవ్ క్లిన్ సిటీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చెత్త రెడ్యూస్, రీయూజ్, రీ సైక్లింగ్ చేపట్టారు. ఇంటింటా తడి, పొడి చెత్త సేకరణ చేపట్టారు. డస్ట్బిన్ లెస్ నగరంగా తీర్చిదిద్దేందుకు నగర ప్రజలను జాగృతం చేసి మంచి ఫలితాలు రాబట్టగలిగారు. బాలసముద్రంలో బయోగ్యాస్ గ్యాస్ విద్యుత్ ఆధారిత ప్లాంట్లు నెలకొల్పారు. విద్యుత్తోపాటు సేంద్రియ ఎరువు ఉత్పత్తికి అంకురార్పణ చేశారు. ఈనేపథ్యంలో నగరానికి పెద్ద ఎత్తున అవార్డులు, ప్రశంసపత్రాలు లభించాయి. దేశ వ్యాప్తంగా నగరాల దృష్టి వరంగల్పై పడింది. ‘క్లీన్ సిటీ.. అగ్లీ సిటీగా మారింది’ 2013 తర్వాత అది కాస్తా తిరోగమన దిశగా పయనించింది. కమిషనర్గా జి.సువర్ణ పండాదాస్ వచ్చారు. నగరంలో క్లిన్సిటీ వాస్తవ పరిస్థితులను పరిశీలించి క్లిన్సిటీ అగ్లీసిటీగా మారిందన్నారు. విజయవాడలో రూపొందించిన వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టును రూపొందించాలని ఆదేశించారు. తడి, పొడి చెత్త కాకుండా అంతా సేకరించాలని ఆదేశాలిచ్చారు. నగర వీధుల్లో చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయని, డస్ట్బిన్ డబ్బాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో క్లిన్సిటీ నిర్ణయాలు నిరూపయోగమయ్యాయి. మారుతున్న కమిషనర్లు, ప్రణాళికలు తొలుత తోపుడు బండ్లు, రిక్షాలు, ఇప్పుడు స్వచ్ఛ ఆటోలు ఇలా.. కమిషనర్లు మారినప్పుడల్లా మార్పులు జరుగుతూనే ఉన్నాయి. పొడి చెత్త సేకరణ డ్రై వేస్ట్ కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. డీఆర్సీసీ సెంటర్లు మాత్రం విజయవంతంగా నడుస్తున్నాయి. రోడ్ల వెంట డస్ట్ బిన్లకు సుమారు రూ.2 కోట్లు వెచ్చించారు. ఇవి మచ్చుకు కూడా కనిపించట్లేదు. వరంగల్ గోపాలస్వామి దేవాలయం బస్ స్టాప్, హనుమకొండ పబ్లిక్ గార్డెన్ నుంచి కరీంనగర్ రోడ్డులోని పోలీస్ కమిషనరేట్ ప్రహరీ పక్కన రూ. 17లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన భూగర్భ డస్ట్ బిన్లు కాలగర్బంలో కలిపోయాయి. వరంగల్ హెడ్పోస్టాఫీస్ సెంటర్లోని బల్దియా షెట్టర్లలో ఆర్గానిక్ కంపోస్ట్ ఎరువు పరికరాలు రూ.11 లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసినా ఇవీ ఎందుకూ పనికి రాకుండా పోయాయి. ఇలా చెత్తశుద్ధీకరణ కోసం కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా కావడం, కమీషన్ల పాలైందనే ఆరోపణలున్నాయి. చెత్త ప్రక్షాళనపై ఫోకస్ పెట్టాలి.. మూడు నెలల కిందట పాలక వర్గం పెద్దలు, అధికార యంత్రాంగం మధ్యప్రదేశ్లోని ఇండోర్, రాజస్తాన్లోని జైపూర్ సిటీలో పర్యటించి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలు పరిశీలించారు. ఇటీవల కమిషనర్ చాహత్ బాజ్పాయ్ గోవాను సందర్శించి, అక్కడి విధానాలు పరిశీలించారు. 2012 క్లీన్ సిటీ కార్యక్రమం తరహాలో మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అమలు చేయాలనే దిశగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో చెత్త ప్రక్షాళనపై కమి షనర్, మేయర్ ఫోకస్ పెట్టాలని, గ్రేటర్ను ఆదర్శంగా తీర్చిదిద్దాలని నగరవాసులు కోరుతున్నారు.ఫలితాలు నామమాత్రం విధానాల మార్పుతో ప్రజాధనం దుర్వినియోగం అభివృద్ధి పనుల్లో కొరవడిన శాసీ్త్రయత గ్రేటర్ కమిషనర్లది ఒక్కొక్కరిదీ ఒక్కో తీరుఇది జేపీఎన్ రోడ్డు నిర్మల మాల్ ఎదురుగా మెయిన్ రోడ్డుపై డ్రెయినేజీ. ఆరు నెలల నుంచి పొంగి పొర్లుతోంది. ఫలితంగా మురుగునీరు రోడ్డుపై పారుతోంది. దుర్వాసనతో ముక్కుమూసుకుని నడవాల్సిన పరిస్థితి. ఈప్రాంతంలో వ్యాపారం చేసుకునే వారు. పాదచారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇదే విషయమై పలుమార్లు స్థానికులు బల్దియా గ్రీవెన్స్లో కమిషనర్ చాహత్ బాజ్పాయ్కి వినతిపత్రాలు అందించారు. మంత్రి కొండా సురేఖ దృష్టికి సైతం తీసుకెళ్లారు. ‘మా సెక్షన్ కాదు.. రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వారిది’ అని బల్దియా అధికారులు చెబుతుండగా.. తమ పరిధిలోకి రాదని ఆర్అండ్బీ అధికారులు చెబుతున్నారు. -
మరుగుదొడ్లను పట్టించుకోరా?
● నిర్వహణ సక్రమంగా ఉండాలి ● నగర మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: రూ.లక్షలు వెచ్చించి పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాం.. వృథాగా వదిలేస్తే ఎలా అంటూ నగర మేయర్ గుండు సుధారాణి ప్రజారోగ్య విభాగం అధికారులను మందలించారు. గురువారం వరంగల్ ఫైర్ స్టేషన్ను ఆనుకొని ఉన్న పబ్లిక్ టాయిలెట్ల స్థితిగతులను మేయర్ పరిశీలించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ నగరంలో పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టాయిలెట్ల నిర్వహణ కోసం కేటాయించిన సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని, లేనిపక్షంలో బిల్లుల చెల్లింపులు నిలిపివేయాలని పేర్కొన్నారు. అనంతరం పోతననగర్లోని సెకండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ను పరిశీలించారు. ఎన్ని కంటైనర్లు పనిచేస్తున్నాయి అని అడిగి తెలుసుకున్నారు. కంటైనర్లు మరమ్మతులకు గురైతే వెంటనే పునరుద్ధరించాలని, ట్రాన్స్ఫర్ స్టేషన్ ఆవరణ శుభ్రంగా ఉంచాలని, ఉద్యానశాఖ సిబ్బంది మొక్కలు నాటాలని మేయర్ సూచించారు. ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, శానిటరీ సూపర్వైజర్లు పసునూరి భాస్కర్, గోల్కొండ శ్రీను పాల్గొన్నారు. -
మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట
ఖిలా వరంగల్: మైనార్టీల సంక్షేమాభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని మంత్రి కొండా సురేఖ అన్నారు. గురువారం వరంగల్ కరీమాబాద్ రామస్వామి గుడి ప్రాంగణంలోని క్రీడామైదానంలో జరుగుతున్న క్రికెట్ కీడా పోటీలను మేయర్ గుండు సుధారాణి, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్, ఏఎస్పీ శుభం ప్రకాశ్తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఖిలా వరంగల్ ఈద్గా మైదానంలో రూ. కోటి అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈద్గా అభివృద్ధి పనులను ఈద్గా కమిటీ ప్రతినిధి ఎంఏ జబ్బార్, మైనార్టీ పెద్దలతో కలిసి ఆమె శంకుస్థాపన చేశారు. 38వ డివిజన్ పడమర కోటలో రూ.73 లక్షల వ్యయంతో నిర్మించిన మున్నూరు కాపు సంఘ భవనంను, వరంగల్ 37వ డివిజన్ ఎంఎంనగర్లో లబ్ధిదారుడు రూ.5 లక్షల వ్యయంతో నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని మేయర్ సుధారాణి, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్, ఏఎస్పీ శుభంప్రకాశ్, కార్పొరేటర్లు వేల్పుగొండ సువర్ణ, బైరబోయిన ఉమతో కలిసి మంత్రి సురేఖ ప్రారంభించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఇక్బాల్, బల్దియా డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, ఆర్ఐ ప్రతిభ, ఆర్ఓ శ్రీనివాస్, ఏఈ తేజస్విని, నాయకులు గోపాల నవీన్రాజు, మీసాల ప్రకాశ్, సురేశ్, దామోదర్యాదవ్, శ్రీరాం రాజేశ్, పగడాల సతీశ్, ఎండి ఉల్ఫత్, ఎండీ చాంద్పాషా, మహ్మద్ ముగ్ధుం పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖ అభివృద్ధి పనులు ప్రారంభం -
సైన్స్ ఫెయిర్కు సర్వం సిద్ధం
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాస్థాయి విద్యావైజ్ఞానిక ప్రదర్శన (సైన్స్ ఫెయిర్)కు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. హనుమకొండ విద్యానగర్లోని సెయింట్ పీటర్స్ ఎడ్యూస్కూల్లో శుక్ర, శనివారాల్లో విద్యావైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. వికసిత్భారత్, ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా శాస్త్రసాంకేతికత, గణితం, ఇంజనీరింగ్ ప్రధాన ఇతివృత్తంగా ఈ ప్రదర్శనలు ఉంటాయి. ఏడు ఉప అంశాలతో ఎగ్జిబిట్లు జిల్లా విద్యావైజ్ఞానిక ప్రదర్శనలో ఉప అంశాల ఎగ్జిబిట్లు ఉంటాయి. సుస్థిర వ్యవసాయం, వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయం, గ్రీన్ ఎనర్జీ, ఉద్భవిస్తున్న సాంకేతికత, గణిత నమూనాలు, ఆరోగ్యం, పరిశుభ్రత, నీటి సంరక్షణ నిర్వహణ అనే ఏడు ఇతివృత్తాల అంశాలతో విద్యార్థులు ఎగ్జిబిట్లు ప్రదర్శించనున్నారు. 300 మంది విద్యార్థులు తమ గైడ్టీచర్లతో హాజరుకానున్నారు. ఇన్స్పైర్కు 93 మంది విద్యార్థులు ఇన్స్పైర్కు 93 మంది విద్యార్థులు హాజరై ఎగ్జిబిట్లు ప్రదర్శించనున్నారు. ఒక్కో విద్యార్థి కేంద్ర ప్రభుత్వంలోని సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా రూ.10 వేల చొప్పున అవార్డు పొందారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు.. జిల్లాస్థాయి విద్యావైజ్ఞానిక ప్రదర్శనకు గురువారం మధ్యాహ్నం నుంచి విద్యార్థులు తమ ఎగ్జిబిట్లు, గైడ్ టీచర్లతో సెయింట్ పీటర్స్ ఎడ్యూ స్కూల్కు చేరుకున్నారు. ఎగ్జిబిట్ల ప్రదర్శనకు సంబంధిత ఉపాధ్యాయ కమిటీల వద్ద రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించారు. సాయంత్రం 5 గంటలరకు 170 మంది సైన్స్ ఫెయిర్కు, 70 మంది ఇన్స్పైర్ ఎగ్జిబిట్లతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఎగ్జిబిట్ల కోసం గదులను కేటాయించారు. మిగిలిన విద్యార్థులు కూడా శుక్రవారం ఉదయం వరకు చేరుకుంటారు. విద్యావైజ్ఞానిక ప్రదర్శనకు ఏర్పాట్లు : డీఈఓ జిల్లా విద్యావైజ్ఞానిక ప్రదర్శనకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు హనుమకొండ డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ తెలిపారు. గురువారం సాయంత్రం హనుమకొండలోని సెయింట్ పీటర్స్ ఎడ్యూ స్కూల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన విద్యావైజ్ఞానిక ప్రదర్శనలకు సంబంఽధించిన వివరాలను వెల్ల డించారు. సైన్స్ఫెయిర్లో విద్యార్థులు ఎగ్జిబిట్లను ప్రదర్శిస్తారని తెలిపారు. ఈనెల శుక్రవారం ఉదయం 10 గంటలకు విద్యావైజ్ఞానిక ప్రదర్శనల ప్రారంభోత్సవానికి పలువురు ప్రజాప్రతినిధులు, కలెక్టర్, అధికారులు హాజరవుతారని వివరించారు. 20న సాయంత్రం ముగింపు కార్యక్రమంలో బహుమతుల ప్రదానం ఉంటుందన్నారు. జిల్లాస్థాయిలో ప్రతిభచూపిన విద్యార్థుల ఎగ్జిబిట్లను రాష్ట్రస్థాయికి కూడా ఎంపిక చేస్తారని తెలిపారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభచూపితే జాతీయ స్థాయి ప్రదర్శనలకు కూడా అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ మండలాల విద్యార్థులు ఎగ్జిబిట్లను తిలకించేందుకు కూడా ఏర్పాట్లు చేశామని తెలిపా రు. విద్యావైజ్ఞానిక ప్రదర్శనకు 15 కమిటీలు ఏర్పా టు చేశామని, విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలు కల్పించామని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాసస్వామి, జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్రెడ్డి, ఎంఈఓలు నెహ్రూనాయక్, బి.మనోజ్కుమార్, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ ఎసదానందం, గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రామకృష్ణ, సెయింట్ పీటర్స్ ఎడ్యూస్కూల్ అఽఽధినేత నారాయణరెడ్డి, వడుప్సా అధ్యక్షుడు సతీష్కుమార్, బాధ్యులు ముక్తీశ్వశ్వర్రావు ,శ్రీకాంత్రెడ్డి, టీఆర్టీఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎల్.నరేందర్నాయక్ పాల్గొన్నారు. నేడు, రేపు ఎగ్జిబిట్లు ప్రదర్శించనున్న విద్యార్థులు హనుమకొండ సెయింట్ పీటర్స్ ఎడ్యూస్కూల్లో ఏర్పాట్లు -
నేటి నుంచి విద్యావైజ్ఞానిక ప్రదర్శనలు : డీఈఓ గిరిరాజ్
విద్యారణ్యపురి: జిల్లా స్థాయి బాలబాలికల విద్యావైజ్ఞానిక ప్రదర్శనలు ఈనెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ గిరిరాజ్ గౌడ్ తెలిపారు. బుధవారం డీఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వికసిత్ భారత్, ఆత్మనిర్భర భారత్ కోసం శాస్త్ర సాంకేతిక, గణితం, ఇంజనీరింగ్ ప్రధాన ఇతివృత్తంగా ఈ ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. హనుమకొండ విద్యానగర్లోని సెయింట్ పీటర్స్ ఎడ్యూ స్కూల్లో ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా, విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను డీఈఓ ఆవిష్కరించారు. విలేకరుల సమావేశంలో జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాస స్వామి, సమగ్ర శిక్ష కో– ఆర్డినేటర్లు బద్దం సుదర్శన్రెడ్డి, బి.మహేశ్, బండారు మన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
కమిషనరేట్ పరిధిలో ఎన్నికలు విజయవంతం
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మూడు విడతలుగా జరిగిన పంచాయితీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ వెల్లడించారు. ఈనెల 11వ తేదీ నుంచి 17 వరకు మూడు విడతల్లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన అభ్యర్థులు, ప్రజలు, పోలీస్ అధికారులు, సిబ్బంది, ప్రభుత్వ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు డీసీపీ స్థాయి నుంచి హోంగార్డు స్థాయి వరకు మొత్తం 2 వేలకు పైగా పోలీసులు విధులు నిర్వహించారని తెలిపారు. కమిషనరేట్ పరిధిలో మొత్తం ఏడు చెక్పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించామని, గ్రామాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించడం ద్వారా రూ. 6.74 లక్షలు, 128 కేసుల్లో రూ.12.42 లక్షల విలువైన మద్యం సీసాలు, 49 కేసుల్లో రూ.1.27 లక్షల విలువైన 343 లీటర్ల గుడుంబా, రూ.1.23 లక్షల విలువైన గంజాయిని పోలీసులు వివిధ ప్రాంతాల్లో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల సందర్భంగా లైసెన్స్ కలిగిన 156 తుపాకులు స్వాధీనం చేసుకుని గత ఎన్నికల్లో గొడవలకు పాల్పడిన వ్యక్తులు, రౌడీషీటర్లు, అనుమానాస్పద వ్యక్తులకు సంబంధించి 432 కేసుల్లో మొత్తం 2,638 మందిని బైండోవర్ చేసినట్లు సీపీ తెలిపారు. పోలింగ్ కేంద్రాల పరిశీలన పోలీస్ కమిషనరేట్ పరిధిలో బుధవారం నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను సీపీ సన్ ప్రీతిసింగ్ సందర్శించారు. పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లు ఎన్నికల తీరుతెన్నులను అధికారులతో కలిసి సమీక్షించారు. పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ -
కల్పలత సూపర్ బజార్పై సమగ్ర దర్యాప్తు
హన్మకొండ: కల్పలత కో–ఆపరేటివ్ స్టోర్స్ (కల్పలత సూపర్ బజార్)పై సమగ్ర దర్యాప్తునకు హనుమకొండ జిల్లా సహకార అధికారి బి.సంజీవరెడ్డి ఆదేశాలు జారీ జేశారు. ఈమేరకు ఆర్సీ నంబర్ 2518/2025–బి, తేదీ 17–12–2025తో ప్రొసీడింగ్ జారీ చేశారు. కల్పలత కో–ఆపరేటివ్ స్టోర్స్లో అక్రమాలు, అవకతవకలు జరిగాయని వచ్చిన ఫిర్యాదు మేరకు ప్రాథమిక విచారణ జరుపగా ఆర్థిక అవకతవకలు, అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. దీంతో తెలంగాణ స్టేట్ కో–ఆపరేటివ్ సొసైటీస్ చట్టం సెక్షన్ 51 ప్రకారం సమగ్ర దర్యాప్తుకు జిల్లా సహకార అధికారి ఆదేశాలు జారీ చేశారు. పరకాల సర్కిల్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎన్.శ్రీనివాస్ రావును విచారణ అధికారిగా నియమించారు. 30 రోజుల్లో నివేదిక సమర్పించాలని సూచించారు. హన్మకొండ అర్బన్: ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాల భర్తీకి ఈనెల 20న (శనివారం) జాబ్ మేళా నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా ఉపాధి కల్పన అధికారి యం.మల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు. కాజీపేటలోని హెచ్ఆర్హెచ్, వరంగల్లోని కార్స్ ఫిన్టెక్, వెస్ట్ సైడ్, విజయ ఫర్టిలైజర్స్, హైదరాబాద్లోని నికోమాక్, హెట్రో ప్రొడక్షన్, గ్రోవెల్ ఫీడ్స్ కంపెనీల్లో టెలీకాలర్స్, రిటైల్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, హెల్పర్, ప్రొడక్షన్, మార్కెటింగ్ శాఖలోని 70 ఉద్యోగాల భర్తీకి ఈ జాబ్మేళా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 78933 94393 నంబర్లో సంప్రదించాలని సూచించారు. కాజీపేట అర్బన్: స్మార్ట్ ఇండియా హ్యాకథాన్–25 పోటీల్లో నిట్ వరంగల్ విద్యార్థులు ప్రథమ బహుమతి సాధించి సత్తాచాటారు. నిట్ వరంగల్ క్యాంపస్లోని డైరెక్టర్ కార్యాలయంలో నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ హ్యాకథాన్–25లో ప్రథమ స్థానంలో నిలిచిన ది సిక్స్త్ సెన్స్ టీంను అభినందించి మాట్లాడారు. జైపూర్లోని మణిపాల్ యూనివర్సిటీలో ఈనెల 8 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించిన స్మార్ట్ ఇండియా హ్యాకథాన్–25లో నిట్ వరంగల్కు చెందిన బీటెక్ విద్యార్థులు వత్సల్ సైనీ, కలాష్ జైన్, ముదిత్ శర్మ, రోమ సునీల్ధర్, రాజ్శేఖర్సింగ్, దృవ్ కర్నాకర్లు ది సిక్స్త్ సెన్స్ టీంగా పాల్గొన్నారు. 36 గంటల పాటు కోడింగ్ మారథాన్ పోటీల్లో నిట్ విద్యార్థులు గ్రాండ్ఫైనల్కు చేరుకుని ప్రథమ స్థానం సాధించడం అభినందనీయమన్నారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ ఇంటర్ కాలేజీయెట్ అథ్లెటిక్ మీట్–2025(పర్ మెన్, అండ్ ఉమెన్) ఈనెల 19, 20 తేదీల్లో నిర్వహించనున్నట్లు స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ ఆచార్య వై.వెంకయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్.కుమారస్వామి బుధవారం తెలిపారు. కేయూ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలోని డిగ్రీ, పీజీ కళాశాలల క్రీడాకారులు పాల్గొననున్నట్లు తెలిపారు. -
మూడో విడత ప్రశాంతం
సాక్షి, వరంగల్/హన్మకొండ అర్బన్: వరంగల్, హనుమకొండ జిల్లాల్లో మూడు విడతల్లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. హనుమకొండ జిల్లాలో మూడో విడతలో 86.44 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దామెర, నడికూడ, శాయంపేట మండలాల్లో మొత్తం 1,11,341 మంది ఓటర్లు ఉండగా.. 96,239 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒంటి గంట వరకు పోలింగ్ ముగిసిన తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుంచి లెక్కింపు చేపట్టిన అధికారులు ఫలితాలు వెల్లడించారు. పోలింగ్, ఫలితాల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. విజయోత్సవాలకు అనుమతి అనుమతి లేకపోయినా గెలిచిన అభ్యర్థుల ఆనందో త్సాహాలు అడ్డుకునే పరిస్థితి కనిపించలేదు. వరంగల్ జిల్లాలో తొలి, రెండు దశలను మించి పెరిగిన ఓటింగ్ శాతం వరంగల్ జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. చెన్నారావుపేట, ఖానాపురం, నర్సంపేట, నెక్కొండ మండలాల్లోని 946 పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. నాలుగు మండలాల్లో 60,987 మంది పురుషులకు 53,959 మంది, 63,561 మంది మహిళలకు 55,908 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే పురుషులు 88.47 శాతం వినియోగించుకుంటే మహిళలు కాస్త తక్కువగా 87.95 శాతం ఓటేశారు. మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నా కూడా ఓటు హక్కు వినియోగంలో పురుషులే ముందున్నారు. 1,24,555 మంది ఓటర్లకు 1,09,870 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొన్నిచోట్ల మధ్యాహ్నం ఒంటిగంటలోపు క్యూలో నిలుచున్న ఓటర్లకు అవకాశం ఇవ్వగా.. మధ్యాహ్నం 2 నుంచి 2.30 గంటల వరకు కొనసాగింది. కొన్నిచోట్ల ఓటరు స్లిప్పులు లేక ఇబ్బందులు పడడం, ఒకటి రెండు చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకోగా పోలీసులు ఇరువర్గాలను చెదరగొ ట్టారు.ఇవి మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఊపిరి పీల్చుకున్న అధికార యంత్రాంగం హనుమకొండ జిల్లాలో 86.44 శాతం, వరంగల్జిల్లాలో 88.21 శాతం నమోదు సంబురాల్లో మునిగిన విజేతలు -
చిన్నారుల్లో సృజనాత్మకత పెంపొందించాలి
మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: పిల్లల్లో సృజనాత్మకత కలిగించేలా ప్రణాళికలు రూపొందించాలని మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని మేయర్ చాంబర్లో మేయర్, కమిషనర్, డబ్ల్యూఆర్ఐ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. నర్చరింగ్ నైబర్ హుడ్ ఛాలెంజ్లో భాగంగా నగరంలో 0–5 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లల మానసిక వికాసం పక్వతపై దృష్టి సారించాలని డబ్ల్యూఆర్ఐ ప్రతినిధులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన కార్యక్రమాల ఫొటోలు వీడియోలను మేయర్, కమిషనర్ ఎదుట ప్రదర్శించి వివరించారు. బల్దియా అధికారులను ప్రధాన భాగస్వామ్యం చేస్తూ రెండు వర్క్షాప్లు నిర్వహించి అవగాహన కలిగించాలని కోరారు. సమావేశంలో ఎస్ఈ సత్యనారాయణ, ఈఈ రవికుమార్, డీఈ కార్తీక్రెడ్డి, డబ్ల్యూఆర్ఐ ప్రతినిధులు సోహానీ గుప్తా, ఎలెన్ వీఎల్ఎఫ్ ఫౌండేషన్ ప్రతినిధి అమీర్ తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవానికి సిద్ధం చేయండిబల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అనిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) కేంద్రంలో నూతన యూనిట్ (షెడ్డు) ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. బుధవారం హసన్పర్తి భీమారం సమీపంలో ఎస్ఆర్ఎస్పీ వద్ద బల్దియా నిర్మించిన ఏబీసీ కేంద్రంతో పాటు, హనుమకొండ పరిధిలో ఇటీవల నిర్మించిన సీసీ రోడ్లకు బిల్లుల చెల్లింపుల కోసం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం హనుమకొండ పరిధి 56వ డివిజన్ పరిమళ కాలనీ, 60వ డివిజన్ టీచర్స్ కాలనీ ఫేజ్–2తో పాటు 61వ డివిజన్ ప్రశాంత్నగర్ డాక్టర్ కాలనీ, 49వ డివిజన్ జూలై వాడ ప్రాంతాల్లో నిర్మించిన సీసీ రోడ్లను కొలతలు వేసి పరిశీలించి నిర్మాణ తీరుపై సంతప్తి వ్యక్తం చేశారు. ఈ తనిఖీల్లో ఈఈ రవికుమార్, డీఈలు సారంగం, రవికిరణ్, వర్క్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. -
హస్తం గెలిచి.. కారు నిలిచి
మూడో దశ ఎన్నికల్లో హనుమకొండ జిల్లాలో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారుల విజయంసాక్షి, ప్రతినిధి, వరంగల్: హనుమకొండ జిల్లాలో బుధవారం జరిగిన మూడో దశ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు మెజార్టీ స్థానాల్లో గెలిస్తే...బీఆర్ఎస్ పార్టీ కూడా తామేమీ తక్కువకాదంటూ గట్టి పోటీనిచ్చింది. ఆత్మకూరు, నడికూడ, దామెర, శాయంపేట మండలాల్లోని 68 పంచాయితీల్లో 37 మంది కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే...22 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు విజయఢంకా మోగించారు. బీజేపీ పార్టీ నాలుగు, స్వతంత్రులు ఐదు స్థానాల్లో నెగ్గారు. ఈ ఐదుగురు స్వతంత్రుల్లో శాయంపేట, పత్తిపాక, తెహరపూర్ పంచాయితీల్లో ముగ్గురు కాంగ్రెస్ రెబల్స్ ఉన్నారు. పరకాల నియోజకవర్గంలోనే ఈ నాలుగు మండలాలు ఉండడంతో ఎమ్మెల్యే రేవూరికి కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు గెలవడం కాస్త సంతృప్తినిచ్చినా, బీఆర్ఎస్ కూడా ప్రభావం చూపడం హస్తం పార్టీ శ్రేణులను కలవరపరుస్తోంది. వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరగనుండడంతో అప్పటివరకు ఎక్కడా బలహీనంగా ఉన్నామో, అందుకు గల కారణాలు విశ్లేషించుకొని ముందుకెళ్లాలన్న చర్చ కార్యకర్తల్లో జరుగుతోంది. పట్టు నిలుపుకున్న డీసీసీ అధ్యక్షుడు ఆత్మకూరు: హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి స్వగ్రామం ఆత్మకూరులో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి పర్వతగిరి మహేశ్వరి గెలుపొందారు. మహేశ్వరి గెలుపు కోసం వెంకట్రామ్రెడ్డి ప్రచారం నిర్వహించారు. తన మద్దతుదారు గెలవడంతో వెంకట్రామ్రెడ్డి అభినందనలు తెలిపారు. మహేశ్వరి గెలుపు సొంత గ్రామంలో డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న తనకు తొలి విజయమని ఆయన పేర్కొన్నారు. వరంగల్లో హస్తం హవా సాక్షి, వరంగల్: పంచాయతీ మూడో విడత పోరులో కాంగ్రెస్ మద్దతుదారులు మెజారిటీ స్థానాల్లో గెలుపొందారు. చెన్నారావుపేట, ఖానాపురం, నర్సంపేట, నెక్కొండ మండలాల్లో బుధవారం జరిగిన ఎన్నికల్లో 109 పంచాయతీల్లో 72 మంది కాంగ్రెస్ మద్దతుదారులు గెలిస్తే.. 33 మంది బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించారు. బీజేపీ ఖాతా కూడా తెరవలేకపోయింది. నలుగురు స్వతంత్ర అభ్యర్థులు విజయబావుటా ఎగురవేశారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సొంత మండలం చెన్నారావుపేట మండలంలో 30 పంచాయతీలకు 22 స్థానాలు కాంగ్రెస్ దక్కించుకుంది. ఏడు స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్ 6 మేజర్, పెద్ద పంచాయతీల్లో పాగా వేయడం కాస్త ప్రతికూలమనే చర్చ జరుగుతోంది. చెన్నారావుపేట, పాపాయిపేట, జల్లీ, లింగగిరి, తిమ్మరాయినిపహాడ్ మేజర్, ఎక్కువ ఓటర్లున్న గ్రామ పంచాయతీలను బీఆర్ఎస్ కై వసం చేసుకుంది. ముఖ్యంగా చెన్నారావుపేట మేజర్ గ్రామ పంచాయతీలో 11 వార్డులు కాంగ్రెస్ గెలుచుకున్నా.. సర్పంచ్ మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి గెలవడం పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. అయితే దొంతి సొంతూరు అమీనాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి ధారా రజిత విజయం సాధించడం కాస్త ఊరటనిచ్చినట్లయ్యింది. ఖానాపురం మేజర్ గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ గెలవగా, నర్సంపేట, నెక్కొండ మండలాల్లోని పెద్ద పంచాయతీల్లో హస్తం పైచేయి సాధించింది. మూడో విడత ఫలితాలు..హనుమకొండ జిల్లాలో.. మండలం పంచాయతీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇతరులుఆత్మకూరు 16 10 4 1 1 నడికూడ 14 08 06 0 0 దామెర 14 04 08 02 0 శాయంపేట 24 15 04 01 04 మొత్తం 68 37 22 4 5 వరంగల్ జిల్లాలో..చెన్నారావుపేట 30 22 7 0 01 ఖానాపూర్ 21 12 09 0 0 నర్సంపేట 19 11 06 0 02 నెక్కొండ 39 27 11 0 01 మొత్తం 109 72 33 0 04 దామెర మండలంలో బీఆర్ఎస్ జోరు, నడికూడలోనూ ప్రభావం శాయంపేట: 24 పంచాయితీల్లో 15 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు వరంగల్ 66 స్థానాల్లో కాంగ్రెస్, 34చోట్ల బీఆర్ఎస్ విజయం -
వీకర్స్ కాలనీకి రోడ్డు వేయండి
వరంగల్: వరంగల్ ఓసిటీ ఇండోర్ స్టేడియం ఎదుట ఉన్న వీకర్స్ కాలనీకి వెంటనే సీసీ రోడ్డు వేయాలని మంత్రి కొండా సురేఖ కలెక్టర్ డాక్టర్ సత్యశారదను ఆదేశించినట్లు కాలనీ ప్రతినిధులు తెలిపారు. మంగళవారం మంత్రి క్యాంపు ఆఫీస్లో జరిగిన గ్రీవెన్స్లో కాలనీ వాసులు కలసి వినతి పత్రం అందించారు. తమ కాలనీలోకి వెళ్లే ప్రధాన రోడ్డును స్థానిక కార్పొరేటర్ 2010లో సొసైటీ సభ్యులతో కుమ్మకై ్క పాట్లుగా చేసి అమ్ముకున్నారని మంత్రికి వివరించారు. ఆ రహదారిని మూసేయడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన మంత్రి కలెక్టర్కు ఫోన్ చేసి రహదారిపై విచారణ జరిపించి అట్టి స్థలాన్ని స్వాధీనం చేసుకుని కాలనీవాసుల కోసం రోడ్డు నిర్మించాలని ఆదేశించారు. జంక్షన్ను అభివృద్ధి చేయాలి.. కాశిబుగ్గ అంబేడ్కర్ విగ్రహం చుట్టూ గ్రీనరీ ఏర్పాటు చేయాలని, ఈ రహదారిని అంబేడ్కర్ మార్గ్గా వాడుకలోకి తీసుకురావాలని తెలంగాణ అంబేడ్కర్ సంఘం వ్యవస్థాపకులు జన్ను భాస్కర్, సలహాదారులు ఖల్నాయక్, ప్రధాన కార్యదర్శి వస్కుల విజయ్ మంత్రికి వినతి పత్రం ఇచ్చారు. కలెక్టర్కు మంత్రి సురేఖ ఆదేశాలు గ్రీవెన్స్కు ఫిర్యాదుల వెల్లువ -
కల్పలత కో–ఆపరేటివ్ సొసైటీలో కుంభకోణం
రామన్నపేట: హనుమకొండ జిల్లా ది కో–ఆపరేటివ్ స్టోర్స్ లిమిటెడ్ కల్పలత సూపర్ బజార్ కార్యాలయాన్ని మంగళవారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి తనిఖీ చేశారు. కార్యాలయంలో సిబ్బంది లేకపోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రిజిస్టర్లో ఏడుగురు సిబ్బంది ఉన్నప్పటికీ కేవలం ముగ్గురు మాత్రమే హాజరుకావడం, అందులో ఇద్దరు మాత్రమే విధుల్లో ఉండడంపై ధ్వజమెత్తారు. రిజిస్టర్, జమ, ఖర్చులు, తదితర రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించారు. కలెక్టర్ దృష్టికి.. గత పాలకుల సమయంలో సభ్యత్వ నమోదులో ఆర్థికపరమైన అవకతవకలు జరిగాయని ఎమ్మెల్యే నాయిని గుర్తించారు. సభ్యత్వ నమోదుకు చెల్లించిన రుసుము మొత్తాన్ని పక్కదారి పట్టించి వాటికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకుండా చేశారని తెలుసుకున్నారు. పాలకమండలి సభ్యులు తమ స్వప్రయోజనాలకు ఉపయోగించిన డీజిల్, పెట్రోల్ గడిచిన 3 ఏళ్లుగా చెల్లించలేదని, కో–ఆపరేటివ్ ఆధీనంలో నడుస్తున్న పెట్రోల్ బంక్లో 10 మంది సిబ్బంది పేరుతో నెలకు రూ.10 వేల చొప్పున జీతాలు తీసుకుంటున్నారని, వారి వివరాలు రిజిస్టర్లో ఉన్నప్పటికీ వారి సంతకాలు లేవని తనిఖీల్లో గుర్తించారు. ఈ విషయాన్ని కలెక్టర్కు ఫోన్ చేసి కార్యాలయంలో రిజిస్టర్లను వెంటనే జప్తు చేయాలని ఫిర్యాదు చేశారు. దీంతో రెవెన్యూ అధికారులు ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చాలా రోజులుగా కల్ప లత సూపర్ బజార్లో జరుగుతున్న అవకతవకలు తన దృష్టికి వస్తున్నాయన్నారు. ఇక్కడ జరిగిన కుంభకోణంపై వెంటనే విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరినట్లు తెలిపారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి లేని బస్సుల పేరిట బిల్లులు, లేని ఉద్యోగులను సృష్టించి జీతాలు వసూలు రికార్డులు స్వాధీనం చేసుకుని విచారించిన అధికారులు -
తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించాలి
వరంగల్ అర్బన్: ఇంటింటా తడి, పొడి చెత్త వేరు చేసేలా కాలనీల్లో అవగాహన కల్పించాలని బల్ది యా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. మంగళవారం వరంగల్లోని 25, 26వ డివిజన్లలో కమి షనర్ క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య విధానాలు తనిఖీ చేశారు. ఈసందర్భంగా రెండు కాలనీల్లో పర్యటించి స్వచ్ఛ ఆటోల పనితీరును, 26వ డివిజన్ లక్ష్మీపురంలోని కమేలాను పరిశీలించారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో కొనసాగుతున్న పనులు పరిశీలించారు. ఎంహెచ్ఓ రాజేశ్, ఏసీపీ ఖలీల్, శానిటరీ సూపర్వైజర్ భాస్కర్, ఏఈ హబీబ్, టీఎంసీ రమేశ్, కమ్యూనిటీ ఆర్గనైజర్ అలీ పాల్గొన్నారు. -
నేడే తుది సం‘గ్రామం’
సాక్షి, వరంగల్/హన్మకొండ అర్బన్: వరంగల్, హనుమకొండ జిల్లాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే రెండు విడతలుగా పూర్తికాగా, బుధవారం మూడో విడతలో హనుమకొండ జిల్లాలో ఆత్మకూరు, దామెర, నడికూడ, శాయంపేట మండలాలు, వరంగల్ జిల్లాలో ఖానాపురం, చెన్నారావుపేట, నర్సంపేట, నెక్కొండ మండలాల్లో పోలింగ్ జరగనుంది. ఈ మేరకు ఆయా జిల్లాల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయా మండలకేంద్రాల్లో మంగళవారం ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలనుంచి సిబ్బంది పోలింగ్ సామగ్రిని తీసుకుని వారికి కేటాయించిన గ్రామాలకు తరలివెళ్లారు. పోలింగ్ బూత్లను సిద్ధం చేసుకున్నారు. బుధవరం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ కొనసాగనుంది. తదనంతరం లెక్కింపు, విజేతలను ప్రకటిస్తారు. హనుమకొండ జిల్లాలో.. 68 గ్రామ పంచాయతీల్లో ఒక గ్రామ పంచాయతీ, 634 వార్డులకు 71 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 67 గ్రామ పంచాయతీలు, 563 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. సర్పంచ్ స్థానాలకు 230 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 1,424 మంది బరిలో ఉన్నారు. 666 పోలింగ్ కేంద్రాలు, 897 అదనపు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పురుషులు 54,293, మహిళలు 57,528, ఇతరులు ఒకరు మొత్తంగా 1,11,822 ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్తో పాటు జిల్లా ఎన్నికల పరిశీలకుడు శివకుమార్నాయుడు, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ పోలింగ్ సామగ్రి పంపిణీ, పోలింగ్ కేంద్రాలను సందర్శించి సిబ్బందికి సూచనలు చేశారు. వరంగల్ జిల్లాలో... జిల్లాలో మొత్తం 102 పంచాయతీలకు 312 మంది, 890 వార్డుల కోసం 1,974 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. చెన్నారావుపేట మండలం చెరువుకొమ్ముతండాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య గొడవలు, దాడులు జరగడంతో అప్రమత్తమైన పోలీసులు ఎక్కడ గొడవలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 1,28,756 మంది ఓటర్లు ఉండగా అందులో 63,059 మంది పురుషులు, 65,690 మంది మహిళలు, ఏడుగురు ఇతరులు ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరిగే నాలుగు మండలాలు నర్సంపేట నియోజకవర్గంలోనే ఉండడంతో ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటాపోటీ వాతావరణం ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సొంతూరు చెన్నారావుపేట మండలం అమీనాబాద్ పంచాయతీ ఫలితం కూడా జనాల్లో ఆసక్తిని రేపుతోంది. -
గ్రామాలను అభివృద్ధి చేయాలి : ఎర్రబెల్లి
హన్మకొండ: నూతన సర్పంచ్లు నిబద్ధతతో పనిచేసి గ్రామాలను అభివృద్ధి చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు. మంగళవారం హనుమకొండ రాంనగర్లోని స్వగృహంలో పర్వతగిరి, వర్ధన్నపేట, ఐనవోలు, హసన్పర్తి మండలాల్లో బీఆర్ఎస్ మద్దతుతో విజయం సాధించిన నూతన సర్పంచ్లను ఎర్రబెల్లి దయాకర్రావు శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సహకరించకపోయినా సర్పంచ్లు ధైర్యంగా ఉండండి.. మీ వెనుక పార్టీ, కేసీఆర్, తాను ఉన్నాను.. ప్రజల పక్షాన కొట్లాడి నిధులు సాధించుకుందామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా తట్టుకుని బీఆర్ఎస్ మద్దతుదారులు విజయం సాధించారని తెలిపారు. మేజర్ గ్రామాలన్నీ బీఆర్ఎస్ వైపే ఉన్నాయని ఈ ఎన్నికలు నిరూపించాయన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ముందంజలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, నూతన సర్పంచ్లు పాల్గొన్నారు. -
విలీన గ్రామాలపై దృష్టి సారించండి
సమీక్షలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి, వరంగల్ అర్బన్: విలీన గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి, అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయ కౌన్సిల్ హాల్లో మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్పాయ్, అధికారులతో కలిసి 15, 16, 17 డివిజన్లలో చేపట్టిన అభివృద్ధి పనులపై మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే సమీక్షించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ.. డ్రెయినేజీలు, సీసీ రోడ్ల నిర్మాణానికి ముందు ఎన్పీడీసీఎల్ అధికారులతో సమన్వయం కావాలని సూచించారు. విద్యుత్ స్తంభాల తొలగింపు, నూతన స్తంభాల ఏర్పాటుపై దృష్టి సారించాలన్నారు. టౌన్ప్లానింగ్ అధికారులు జంక్షన్ల విస్తరణకు చొరవ తీసుకోవాలన్నారు. డివిజన్లలోని రామకృష్ణాపురం, ఏకశిల జంక్షన్లను అభివృద్ధి చేయాలని, గొర్రెకుంటలో అంబేడ్కర్ జంక్షన్కు చెందిన ఆక్రమణలపై స్థానికులతో చర్చించి, భూసేకరణ చేపట్టాలని ఆదేశించారు. ఎస్ఈ సత్యనారాయణ, ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, వెటర్నరీ డాక్టర్ గోపాల్రావు, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, ఈఈలు సంతోష్బాబు, మాధవీలత, డీఈ సతీశ్, టీఎంసీ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బుధవారం మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం దామెర, ఆత్మకూరు, శాయంపేట మండల కేంద్రాల్లో పోలింగ్ సామగ్రి పంపిణీని పరిశీలించారు. పోలీసు బందోబస్తు ఏర్పాట్లను సీపీ సమీక్షించారు. అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. 1,991 మంది పోలీస్ సిబ్బంది.. ఎన్నికల నిర్వహణకు 1,991 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు సీపీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. ముగ్గురు డీసీపీలు, ఐదుగురు అదనపు డీసీపీలు, 16 మంది ఏసీపీలు, 29 మంది ఇన్న్స్పెక్టర్లు, 131 మంది ఎస్సైలు, 339 మంది ఏఎస్సైలు/హెడ్ కానిస్టేబుళ్లు, 1,218 మంది కానిస్టేబుళ్లు, 258 హోంగార్డులతోపాటు డిస్ట్రిక్ట్ గార్డ్స్, బాంబ్ డిస్పోజబుల్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని వివరించారు. మొబైల్ పార్టీలు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తాయని సీపీ వెల్లడించారు. రేపు ఉదయం వరకు నిషేధాజ్ఞలు.. రాష్ట్ర ఎన్నికల అధికారి ఉత్తర్వుల మేరకు పోలింగ్ కేంద్రాల వద్ద గురువారం ఉదయం 10 గంటల వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని సీపీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడడం నిషేధించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట అదనపు డీసీపీ బాల స్వామి, ఏఎస్పీ శుభం, ఏసీపీలు సతీశ్బాబు, సత్యనారాయణ, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు ఉన్నారు. -
‘చలి’ంచరా?
బుధవారం శ్రీ 17 శ్రీ డిసెంబర్ శ్రీ 202 ‘నిరాశ్రయులకు జీవించే హక్కు ఉంది. వారికి అన్నపానీయాలతోపాటు కనీస మౌలిక వసతులు కల్పించాలి’ అని 2010లో సుప్రీం కోర్టు ఆదేశించింది. బల్దియాలు బాధ్యత తీసుకుని నిరాశ్రయులకు నీరు, ఆహారం, మరుగుదొడ్డి, పారిశుద్ధ్యం వంటి వసతులు కల్పించాలని సూచించింది. గ్రేటర్ వరంగల్ మహానగరంలో బల్దియా, మెప్మా అధికారులు, సిబ్బంది ప్రతీ ఏటా నిరాశ్రయులపై సర్వే నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ వందలాది మంది రోడ్ల వెంట, ఫుట్పాత్లపై నిద్రిస్తూ కనిపిస్తూనే ఉన్నారు. వారిపాలిట చలి యమపాశంలా మారింది. పడిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఫుట్పాత్లపై కాలం వెళ్లదీస్తున్న వారంతా చలి తీవ్రతకు అల్లాడిపోతున్నారు. ఎంజీఎం: జిల్లాలో లెప్రసీ కేసులు గుర్తించడానికి, ప్రజలకు లెప్రసీపై అవగాహన కల్పించడానికి రేపటి (గురువారం) నుంచి 31వ తేదీ వరకు లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ నిర్వహించనున్నట్లు హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య తెలిపారు. మంగళవారం హనుమకొండ కలెక్టరేట్లోని డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి క్యాంపెయిన్ నిర్వహణకు సంబంధించి జిల్లాలోని వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బందితో ఆయన జూమ్ మీటింగ్ నిర్వహించారు. పీహెచ్సీల వారీగా హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, టీబీ, ఎన్సీడీ, మాతా శిశు సంక్షేమం కార్యక్రమాలు సమీక్షించారు. ఈసందర్భంగా డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ.. క్యాంపెయిన్లో భాగంగా.. ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు వ్యాధి లక్షణాలు ఉన్న వారిని పరీక్షించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్ఓ మదన్మోహన్రావు, ప్రోగ్రాం అధికారులు మహేందర్, హిమబిందు, ప్రభుదాస్, శ్రీనివాస్, రుబీనా, జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్రెడ్డి ,హెల్త్ ఎడ్యుకేషన్ అధికారి శ్రీనివాస్, డీపీఎంఓలు సతీశ్రెడ్డి, రవీందర్ పాల్గొన్నారు. కాజీపేట అర్బన్: నిట్ సెమినార్హాల్ కాంప్లెక్స్లో స్పార్క్ (స్కీం ఫర్ ప్రమోషన్ ఆఫ్ అకడమిక్ అండ్ రీసెర్చ్ కొలాబరేషన్) సౌజన్యంతో సస్టేనబుల్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ అనే అంశంపై 6 రోజుల ఇంటర్నేషనల్ వర్క్షాప్ మంగళవారం ప్రారంభమైంది. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ జ్యోతి ప్రజ్వలన చేసి ఇంటర్నేషనల్ వర్క్షాప్ను ప్రారంభించి మాట్లాడారు. నిట్ వరంగల్, ఐఐటీ ఖరగ్పూర్, ఎంసీ గిల్ యూనివర్సిటీ కెనడా సంయుక్తంగా వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ, ప్రొఫెసర్ శిరీష్ హరి సోనావానే, ఐఐటీ ఖరగ్పూర్ ప్రొఫెసర్ ఎంఎం గంగేశ్వర్, ఎంసీ గిల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ విజయరాఘవన్, డీన్ కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ అర్బన్/కాజీపేట: విధి వక్రించి వీధిలో కాలం వెళ్లదీస్తున్నవారు కొందరు. యాచక వృత్తిలో జీవితాన్ని మోస్తున్నవారు ఇంకొందరు. దిక్కుమొక్కులేక ఫుట్పాత్లపై నిద్రించేవారు మరికొందరు. వీరంతా చలి విసురుతున్న పంజాకు విలవిల్లాడుతున్నారు. వీరికి ఆశ్రయం కల్పించాల్సిన బల్దియా అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నామమాత్రంగా హోం లెస్ సెంటర్లు ఎక్కడో దూర ప్రాంతంలో ఏర్పాటు చేసి చేతులు దులుపుకుందని ఆరోపణలున్నాయి. కాగా, గ్రేటర్ మహా నగరంలో ఇలాంటి వారు వరంగల్లో 92 మంది, హనుమకొండ, కాజీపేటలో 38 మంది జీవిస్తున్నట్లు బల్దియా, మెప్మా అధికారులు, సిబ్బంది చెబుతున్నారు. హోంలెస్.. యూస్లెస్! నగరంలో యాచకులు 586 మంది ఉన్నట్లు అధికారుల అంచనా. వీరికి భీమారంలోని పలివేల్పులలో 50 మంది చొప్పున ఆశ్రయం కల్పించి స్మైల్ ఎన్జీఓ ఆధ్వర్యంలో వైద్యం, ఆరోగ్యం, ఉపాధిపై అవగాహన కల్పిస్తున్నారు. అదేవిధంగా వరంగల్, కాజీపేట, హనుమకొండలో 130 మంది నిరాశ్రయులు ఉన్నట్లు అధికారుల అంచనా. వీరికి బల్దియా ఆధ్వర్యంలో పలివేల్పుల, వరంగల్ నగరంలోని ప్రతాప్నగర్లో హోం లెస్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ కేవలం రాత్రి పూట నిద్రించేలా, ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేలా బల్దియా ఏర్పాట్లు చేసింది. 2 సెంటర్లు నామమాత్రమే మహా నగర పాలక సంస్థలోని పలివేల్పుల, వరంగల్ రైల్వే స్టేషన్, నెహ్రూ పార్కుకు ఎస్ఎన్ఎం క్లబ్ పక్కన హోంలెస్ సెంటర్లు నిర్మించారు. రెండేళ్లలోనే క్లబ్ పక్కన ఉన్న సెంటర్ను కూల్చేసి, గాంధీనగర్లోని అంబేడ్కర్ సెంటర్లో ఆశ్రయం కల్పించారు. ఈ రెండు నైట్ షెల్టర్లు అందుబాటులో లేకపోవడం, సౌకర్యాలు నామామత్రమే కావడంతో నిరాశ్రయులు అక్కడికి వెళ్లేందుకు వ్యయప్రయాసాలతో కూడి ఉండడంతో ఆసక్తి చూపడం లేదు. ఈ సెంటర్ల నిర్వహణను ఆరేళ్ల కిందట ఎన్జీఓలకు అప్పగించారు. వరంగల్లోని సెంటర్ డాన్ బాస్కో, హనుమకొండ, కాజీపేటకు సంబంధించి పలివేల్పుల సెంటర్ను లార్డ్ ఎన్జీఓలు ఐదేళ్ల పాటు ఈ సంస్థలకు నామమత్రపు సొమ్ముతో నిర్వహణ బాధ్యలు చేపట్టారు. ఏడాది క్రితం వీరి కాంట్రాక్టు గడువు ముగిసింది. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు వీరే ఈ సెంటర్లను నిర్వహించాలి. కానీ వీరు పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. కొద్ది నెలల నుంచి కేంద్ర ప్రభుత్వం యాచక వృత్తిని నిర్మూలన కోసం ప్రత్యేక ఎన్జీఓలను నియమించింది. అందులో భాగంగా ప్రస్తుతం స్మైల్ ఎన్జీఓ యాచకుల జీవితాలు మార్చడానికి కృషి చేస్తోంది. యాచకులను గుర్తించి కేంద్రానికి తరలించి ముడు నెలల పాటు విద్య, వైద్యం, జీవనోపాధిపై కౌన్సెలింగ్ ఇచ్చి, ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తోంది. గోదామాధవ ఆధ్యాత్మిక ప్రచార కేంద్రంలో తులసిమాల చూపిస్తున్న ఆరుట్ల శ్రీనివాసాచార్యస్వామికాజీపేట, వరంగల్ రైల్వే స్టేషన్ల సమీపంలో, హనుమకొండ బస్ స్టేషన్ సమీపంలో ఫుట్పాత్లపై పదుల సంఖ్యలో నిరాశ్రయులు, యాచకులు చలిలో విలవిల్లాడుతున్నారు. కనీసం కప్పుకోవడానికి సైతం చద్దర్లు లేక అలమటిస్తున్నారు. వారిలో చిన్నపిల్లలు సైతం ఉన్నారు. పోలీసులు రైల్వే స్టేషన్లలో, బస్ స్టేషన్లలో తమ ను నిద్రపోనివ్వడం లేదని, పోకిరీలు తమను ఆటపట్టిస్తున్నారని..బల్దియా అధికారులు స్పందించి తమకు ఆశ్రయం కల్పించాలని వారంతా కోరుతున్నారు. కాగా, హోంలెస్ సెంటర్ల నిర్వహణపై మెప్మా టీఎంసీ రమేశ్ను ‘సాక్షి’ వివరణ కోరగా.. ఆయా కేంద్రాల్లో నిరాశ్రయులు రాత్రివేళల్లో ఉంటున్నారని, తెల్లవారుజామున వెళ్లిపోతున్నారని తెలిపారు. గ్రేటర్లో చలిపంజాకు నిరాశ్రయుల విలవిల నైట్ షెల్టర్లపై అంతులేని నిర్లక్ష్యం దూర ప్రాంతాల్లో ఉండడంతో నిరుపయోగం హనుమకొండ జిల్లాలో ఆత్మకూరు, దామెర, నడికూడ, శాయంపేట మండలాల్లో.. వరంగల్ జిల్లాలో ఖానాపురం, చెన్నారావుపేట, నర్సంపేట, నెక్కొండ మండలాల్లో పోలింగ్ ఏర్పాట్లు పరిశీలించిన సీపీ, జిల్లా ఎన్నికల పరిశీలకులు, కలెక్టర్లు -
ఇక.. ఇక్కట్లు ఉండవు
హన్మకొండ : సమ్మక్క, సారలమ్మ జాతర జరిగే మే డారం, పరిసరా ప్రాంతాల్లో నిరంతరాయంగా వి ద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నా యి. దాదాపు రూ.15 కోట్ల అంచనా వ్యయంతో ప నులు చేపట్టారు. 2026 జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు జరగనున్న మహాజాతరకు వారం రో జుల ముందు నుంచే భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఈలోపు విద్యుత్ సరఫరా పనులు యు ద్ధ ప్రాతిపదిక జరుగుతున్నాయి. ప్రస్తుతమున్న మే డారం 33/11 కేవీ, సమ్మక్క 33 /11 కేవి సబ్ సబ్ స్టేషన్ల నుంచి విద్యుత్ సరఫరా జరిగేలా లైన్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ రెండు సబ్ స్టేషన్లపై భారం పడకుండా నార్లాపూర్ వద్ద కొత్తగా 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మిస్తున్నారు. దీంతో పాటు గట్టమ్మ దేవాలయం వద్ద విద్యుత్ సమస్య తలెత్తకుండా ఇక్కడ కూడా కొత్తగా 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మిస్తున్నారు. జాతర నాటికి ఈ రెండు సబ్ స్టేషన్లు వినియోగంలోకి రానున్నా యి. వీటి నిర్మాణంతో అంతకు ముందున్న సబ్ స్టేషన్లపై భారం తగ్గి బ్రేక్డౌన్లు, అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా జరగనుంది. కవర్ కండక్టర్తో విద్యుత్ లైన్.. 11 కేవీ విద్యుత్ లైన్కు కొక్కెలు వేయడం, చెట్ల కొమ్మలు తాకడం, ఇతరత్రా కారణాలతో గతంలో విద్యుత్ సరఫరాకు తరచూ అంతరాయాలు కలిగే ది. ఈ సారి ఈ సమస్యను అధిగమించేందుకు 25 కిలో మీటర్ల పొడవునా కవర్ కండక్టర్ ద్వారా 11 కేవీ విద్యుత్ లైన్ నిర్మిస్తున్నారు. 15 కిలో మీటర్లు 33 కేవీ విద్యుత్ లైన్ కవర్ కండక్టర్తో వేస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ లైన్లు తెగిపడితే ప్రమాదం జరిగే అవకాశముండడంతో లైన్లు తెగి కింద పడకుండా ఫోర్ వైర్ స్పేషర్స్ ఏర్పాటు చేస్తున్నారు. పెట్రోలింగ్ టీమ్లు ఏర్పాటు.. జాతరలో విద్యుత్ సరఫరాలో సమస్య తలెత్తకుండా 50 స్థానాల్లో 50 బృందాలను ఏర్పాటు చేయనున్నారు. వీరు నిరంతరాయంగా అందుబాటులో ఉంటారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తిన వెంటనే పరిష్కరిస్తారు. అదే విధంగా 33 కేవీ లైన్లలో పస్రా నుంచి మేడారం, తాడ్వాయి నుంచి స మక్క సబ్స్టేషన్ వరకు పెట్రోలింగ్ టీమ్లను ని యమించనున్నారు. సబ్ స్టేషన్లలో సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే సరిదిద్దేందుకు ఎమ్మార్టీ టీ మ్ను సిద్ధం చేస్తున్నారు. ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్ల పర్యవేక్షణలో జాతర సాగనుంది. విద్యుత్ సబ్ స్టేషన్లపై భారం పడకుండా మేడారం, సమ్మక్క సబ్ స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచారు. అదే విధంగా 132 కేవీ సబ్ స్టేషన్ నుంచి వచ్చే ఫీడర్లో ఏదైనా అవాంతరం ఎదురైతే విద్యుత్ అంతరాయం లేకుండా ఉండేందుకు ప్ర త్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం పస్రా 132/33 కేవీ సబ్ స్టేషన్ నుంచి మేడారం, సమ్మక్క 33/11 కేవీ సబ్ స్టేషన్కు విద్యుత్ సరఫరా జరుగుతోంది. ఇక్కడ సమస్య ఉత్పన్నమైతే ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరాను కమలాపూర్ 132/33, ములుగు 132/33 కేవీ సబ్ స్టేషన్ నుంచి తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా విద్యుత్ సరఫరాలో వైఫల్యాలకు తావు లేకుండా 259 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నారు. జంపన్న వాగు వద్ద భక్తుల రక్షణ, ప్రమాదం జరగకుండా విద్యుత్ లైన్ల ఎత్తు పెంచేందుకు 180 మీటర్ల పొడవున 6 టవర్లు నిర్మిస్తున్నారు. ఈ టవర్ల ద్వారా 33 కేవీ, 11 కేవీ విద్యుత్ లైన్ వేస్తున్నారు. గతంలో విద్యుత్ లైన్ను వాహనాలు క్రాస్ చేసే సమయంలో లైన్లకు నష్టం వాటిల్లడంతోపాటు ప్రమాదకారంగా మారేవి. ఈ సమస్యను అధిగమించేందుకు టవర్లు నిర్మిస్తున్నారు. వేగంగా ఏర్పాట్లు.. రెండు సబ్స్టేషన్ల ద్వారా సరఫరా సబ్ స్టేషన్ల సామర్థ్యం పెంపు నార్లాపూర్, గట్టమ్మ దేవాలయం వద్ద నూతన సబ్ స్టేషన్ల నిర్మాణం 259 విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల్ల ఏర్పాటు అంతరాయాలు లేకుండా కవర్ కండక్టర్తో 11 కేవీ విద్యుత్లైన్ జంపన్న వాగు వద్ద ఆరు టవర్ల నిర్మాణంమేడారం జాతర విద్యుత్ సరఫరా పనులు వేగంగా జరుగుతున్నాయి. లక్షలాది మంది భక్తులు వచ్చే జాతరలో ఎలాంటి అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా చేసేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. జాతర విజయవంతంలో విద్యుత్ శాఖది కీలక పాత్ర. ప్రతీ పనిని నాణ్యతతో చేస్తున్నాం. విద్యుత్ సరఫరాలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులుండవు. కర్నాటి వరుణ్ రెడ్డి, సీఎండీ, టీజీ ఎన్పీడీసీఎల్ -
మారిన ఎన్నికల స్వ‘రూపం’..
భూపాలపల్లి అర్బన్: దేశానికి పల్లెలే పట్టుగొమ్మలు. అలాంటి పల్లెలు అభివృద్ధి చెంది పచ్చగా ఉన్నప్పుడే గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుంది. అయితే నోటుస్వామ్యం వర్ధిల్లుతున్న నేటి రోజుల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. డబ్బులు, మద్యమే ఇప్పటి ఎన్నికలను శాసిస్తూ పల్లెల్లో అశాంతికి కారణమవుతున్నాయి. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు కులసంఘాలను కూడగడుతూ.. యువజన సంఘాలకు గాలం వేస్తూ.. మహిళా సంఘాలను మచ్చిక చేసుకుంటున్నారు. పార్టీ రహితంగా సాగాల్సిన గ్రామపంచాయతీ ఎన్నికలకు పార్టీల రంగులద్ది అభ్యర్థులు చేస్తున్న ప్రచారం అంతా ఇంతా కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకు ఎంతో విలువ ఉంది. అలాంటి ఓటును అమ్ముకునే, కొనుగోలు చేసే సంస్కృతి రోజురోజుకూ పెరుగుతోంది. ఇది నాటితరం సర్పంచులకు మనోవేదన కలిగిస్తోంది. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు మొదటి, రెండు విడతలు పూర్తికాగా బుధవారం మూడో విడత జరగనుంది. ఈ నేపథ్యంలో నేటి ఎన్నికల తీరుపై నాటితరం సర్పంచుల మనోగతంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.గతంలో ఓటర్లు నమ్మకంగా ఉండేవారు. మాట మీద ఓటు వేసేవారు. గ్రామాభివృద్ధి జరిగేది. ఇప్పుడు రాజకీయాలు చూస్తే బాధ కలుగుతోంది. ఎన్నికల్లో ఖర్చుపెట్టడం, తిరిగి సంపాదించుకోవడమే లక్ష్యమవుతోంది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఎన్నికల ప్రచార ఆర్భాటాలు.. గెలుపు కోసం అభ్యర్థులు పడే పాట్లు చూస్తే ఇబ్బందిగా ఉంది. ఓటర్ల తీరులోనూ మార్పు రావాలి. నేను 1988–1993 మధ్య చిట్యాల సర్పంచ్గా పని చేశా. – బుర్ర నర్సయ్య, మాజీ సర్పంచ్, చిట్యాల మాది భూపాలపల్లి మండలం గొల్లబుద్దారం. 2001లో గ్రామ సర్పంచ్గా పనిచేశా. అప్పట్లో ప్రజలు మాట మీద ఉండే వారు. మేం ఏదైనా చెబితే గౌరవించే వారు. సర్పంచ్గా గుర్తింపు, గౌరవం ఉండేది. మా ఊరి అభివృద్ధికి అనేక పనులు చేశా. ఇప్పుడు డబ్బుల ప్రభావం ఎక్కువైంది. విలువలు పతనమయ్యాయి. నాటి గౌరవం, మర్యాద నేటి తరంలో కనిపించడం లేదు. రాజకీయం అర్థం మారిపోయింది. ఇప్పటి ఎన్నికల తీరు చూస్తే బాధగా ఉంది. డబ్బులు తీసుకుని ఓటు వేస్తే ఏదైనా పనిపడితే.. అడిగే హక్కు ఉంటుందా? అనే అనుమానం కలుగుతోంది. – లావుడ్య దాసునాయక్, మాజీ సర్పంచ్, గొల్లబుద్దారం ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలిపెట్టు నాటితరం సర్పంచుల మనోగతం -
నిన్న ఎన్నికల పోరులో.. నేడు జీవన పోరాటంలో
బయ్యారం: ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ బయ్యారం ఉప సర్పంచ్గా ఎన్నికై న ఎనుగుల ఉమ. నిన్నటి వరకు క్షణం తీరిక లేకుండా ఎన్నికల పోరులో పాల్గొన్న ఆమె.. ఎన్నికల ప్రక్రియ పూర్తికాగా నేడు జీవన పోరాటంలో నిమగ్నమైంది. బయ్యారం ఆరో వార్డు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన ఉమ సోమవారం ఉప సర్పంచ్గా ఎన్నికై ంది. ఎన్నిక తర్వాత మంగళవారం తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో ఆరబెడుతోంది. ఈ దృశ్యాన్ని ‘సాక్షి’ క్లిక్మనిపించింది.సర్పంచ్ బరిలో తోటికోడళ్లు కొడకండ్ల : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కొడకండ్ల సర్పంచ్ పదవికి తోటికోడళ్లు పోటీ పడుతున్నారు. కొడకండ్ల జనరల్ మహిళకు రిజర్వ్ అయ్యింది. దీంతో సీనియర్ నాయకుడు మసురం వెంకటనారాయణ సతీమణి రాధాలక్ష్మి బీఆర్ఎస్ అభ్యర్థిగా, మసురం లక్ష్మీనర్సింహాస్వామి సతీమణి మమత స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలించారు. కాగా, కొడకండ్ల సర్పంచ్ పదవికి ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. -
సరదా విషాదమైంది..
ఖిలా వరంగల్ : సరదా విషాదమైంది. సవారీ చే సేందుకు కట్టేసిన గుర్రం వద్దకు వెళ్లిన బాలుడిని గుర్రం తన్నింది. దీంతో బాలుడికి తీవ్రగా గాయాలు కావడంతో కుటుంబీకులు హైదరాబాద్ నిలో ఫర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆది వారం తెల్లవారుజామున మృతి చెందాడు. దీంతో గుర్రం యజమాని నిర్లక్ష్యంతోనే బాలుడు మృతి చెందాడని సోమవారం సాయంత్రం ఖిలా వరంగల్ ఏకశి చిల్డ్రన్పార్క్ గేట్ ఎదుట నిర్వహించారు. గుర్రం యజమాని, పార్కు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మిల్స్కాలనీ పో లీసులు ఘటనాస్థలికి చేరుకుని గుర్రం యజమాని పై కేసు నమోదు చేయడంతోపాటు బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో మృతుడి బంధువుల ధర్నా విరమించా రు. మృతుడి బంధువుల క థనం ప్రకారం.. వరంగల్ శివనగర్ ఏసీరెడ్డినగర్కు చెందిన ఆటో డ్రైవర్ మిర్యాల కృష్ణ కు మారుడు గౌతం(12) ఈనెల 10వ తేదీన ఉదయం బాబాయి రాజేందర్తో కలిసి ఏకశిల చిల్డ్రన్ పా ర్కుకు వెళ్లాడు. పార్కులో సవారీ చేసేందుకు సోదరుడు మహేశ్తో కలిసి గుర్రం వద్దకు వెళ్లాడు. అంతలోనే గుర్రం వెనుక నుంచి తన్నడంతో గౌతంకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గౌతంను రాజేందర్ హుటాహుటిన ఎంజీఎం త రలించారు. అనంతరం హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు విలపించారు. కాగా, శివనగర్లో బాలుడి అంత్యక్రియలు నిర్వహించగా కార్పొరేటర్ ప్రవీణ్, పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు తరలొచ్చి గౌతం మృతదేహం వద్ద నివాళులర్పించారు. సవారీ కోసం గుర్రం వద్దకు వెళ్లిన బాలుడు వెనుక నుంచి తన్నగా తీవ్రగాయాలు.. చికిత్స పొందుతూ మృతి ఏకశిల పార్కు ఎదుట బంధువుల ధర్నా -
నయా ట్రెండ్!
● సర్పంచ్ అభ్యర్థుల ప్రమోషనల్ కాల్స్ ● తనకు ఓటు వేయాలని అభ్యర్థన కాళేశ్వరం: హలో..హలో.. నేను మీ సర్పంచ్ అభ్యర్థిని అంటూ ఫలాన గుర్తుకు ఓటు వేయాలని ఫోన్లో అభ్యర్థిస్తున్నారు. కాటారం సబ్డివిజన్ పరిధిలో మూడో విడత ఎన్నికలకు ఈనెల 17న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో సర్పంచ్ అభ్యర్థులు నయా ట్రెండ్ను ఫాలో అవుతున్నారు. కాటారం, మహాముత్తారం, మహదేవపూర్, మల్హర్ మండలాల్లో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికలకే పరిమితమైన ప్రమోషనల్ కాల్స్తో సెల్ఫోన్లు రింగ్..రింగ్..రింగ్మంటూ మోగుతున్నాయి. అభ్యర్థులు వాయిస్తో ప్రమోషనల్ కాల్స్ పల్లెల్లో సందడి చేస్తూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. కాగా, సోమవారం సాయంత్రం 5గంటల వరకు ప్రచారానికి తెర పడడంతో కొత్తట్రెండ్తో ప్రచారం మొదలైందని చర్చించుకుంటున్నారు. ఏదీఏమైనా అభ్యర్థుల కొత్త ట్రెండ్ పల్లెల్లో సాధారణ ఎన్నికలను తలపిస్తోంది. -
అప్పట్లో డబ్బుల ప్రభావం లేదు
మాది కొత్తపల్లిగోరి గ్రామం. నేను 1995–2001 సంవత్సరాల మధ్య సర్పంచ్గా పని చేశా. అనంతరం 2001–2006 వరకు మా భార్య కాటం స్వరూప సర్పంచ్గా పని చేశారు. అప్పడు కేవలం ఎన్నికల ఖర్చు రూ.14వేలు మాత్రమే వచ్చింది. ఆ రోజుల్లో ఎన్నికల్లో పోటీ చేసే వారికి పెద్దగా ఖర్చులు ఉండేవి కావు. డబ్బుల ప్రభావం అంతగా లేదు. ఇప్పుడు డబ్బు లేనిదే ఎన్నికల్లో నిలబడే పరిస్థితి లేదు. ఎవరికి ఏ పని ఉన్నా నేను వెంట ఉండి చేయించేవాడిని. ఒక్క పైసా ఆశించేవాడిని కాదు. ప్రజలకు సేవ సేవ చేయడమే. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తి భిన్నమైంది. – కాటం సదయ్య, కొత్తపల్లిగోరి -
నాడు భార్య.. నేడు భర్త
● సర్పంచ్లుగా దంపతులు ఎన్నిక బచ్చన్నపేట: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం చిన్నరామన్చర్ల గ్రామ సర్పంచ్గా బీఆర్ఎస్ అభ్యర్థి ఎం.డి ఆజామ్ గెలుపొందారు. 2019లో ఆయన భార్య ఖలీల్బేగమ్ కూడా బీఆర్ఎస్ నుంచి సర్పంచ్గా గెలుపొందింది. ఇప్పుడు అదే గ్రామం జనరల్ అన్రిజర్వ్ అయ్యింది. దీంతో ఆజామ్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పిన్నింటి కావ్యశ్రీపై గెలుపొందారు. రెండు సార్లు సర్పంచ్గా ఆదరించిన గ్రామస్తులకు ఆ కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. -
ఆర్ట్స్, సైన్స్ కళాశాల ఎంఓయూ
కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ విభాగం ఆధ్వర్యంలో కోల్కత్తా కేంద్రంగా పని చేస్తున్న అనుదీప్ ఆర్గనైజేషన్తో ఒక సంవత్సర కాలానికి ఎంఓయూ కుదుర్చుకుంది. ఈమేరకు సోమవారం ఆకళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.జ్యోతి, ప్లేస్మెంట్ సెల్ ఆఫీసర్ డాక్టర్ ఎల్.జితేందర్ కలిసి అనుదీప్ కొల్కతా ఆర్గనైజేషన్ మేనేజర్ అండ్ ట్రైనర్ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ శ్వేతతో అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఈమేరకు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్, అధ్యాపకురాలు డాక్టర్ అలేటి సరిత పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: నోయిడాలోని ఇంజనీరింగ్ ఆఫ్ ఇన్నోవేటివ్ ఇంజనీర్స్ ఇండియా, కాకతీయ యూనివర్సిటీ మధ్య నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమ ఆధారిత శిక్షణను బలోపేతం చేసేందుకుగాను అవగాహన ఒప్పందం (ఎంఓయూ)ను కేయూలో సోమవారం కుదుర్చుకున్నారు. కేయూ వీసీ ఆచార్య ప్రతాప్రెడ్డి సమక్షంలో ఇరు సంస్థల మధ్య ప్రతినిధులు సంతకాలు చేసి ఎంఓయూ పత్రాలు మార్చుకున్నారు. కేయూ తరఫున రిజిస్ట్రార్ రామచంద్రం, నోయిడా ఇంజనీర్స్ ఇండియా ప్రతినిధి పటేల్రోహన్ ఆండే పాల్గొని ఒప్పందంపై సంతకాలు చేశారు. -
నేటినుంచి ధనుర్మాసోత్సవాలు..
హన్మకొండ కల్చరల్: ధనుర్మాసోత్సవాలు నేటి (మంగళవారం) నుంచి జనవరి 14వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందుకోసం పలు వైష్ణవ దేవాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వరంగల్లోని బాలా వెంకటేశ్వరాలయం, హనుమకొండ గోపాల్పూర్ సదాశివ కాలనీలోని గోదామాధవ ఆధ్యాత్మిక ప్రచారకేంద్రంలో ధనుర్మాసోత్సవాలు జరగనున్నాయి. గోదామాధవ కేంద్రం ఆచా ర్యుడు డాక్టర్ ఆరుట్ల శ్రీనివాసాచార్యస్వామి ఆధ్వర్యంలో మంగళవారం ఉద యం నుంచి స్వామివారికి అభిషేకం, అలంకరణ, ఆపదుద్ధారక పారాయణం, ప్ర త్యేక పూజలు నిర్వహిస్తారు. అదేవిధంగా ఎకై ్సజ్కాలనీలోని వేంకటేశ్వరస్వామి దేవాలయం, అదాలత్ వెనుకగల ఎస్వీ కాలనీలోని శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి దేవాలయం తదితర వైష్ణవ దేవాలయాలలో భక్తులకు ఏర్పాట్లు చేశారు. వైష్ణవ దేవాలయాలలో ప్రత్యేక ఏర్పాట్లు -
ప్రిన్సిపాల్ సమ్మయ్యకు షోకాజ్ నోటీస్
● ఆర్డీఓ, తహసీల్దార్ల వద్ద విద్యార్థుల లేఖలు ● కలెక్టర్కు చేరిన ‘చిట్టి చేతులు.. వెట్టి చాకిరీ’ నివేదిక ● చర్యలకు రంగం సిద్ధం.. వరంగల్ క్రైం: ఒగ్లాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల (పరకాల)లో విద్యార్థులతో బలవంతంగా అంట్లు తోమించి.. టిఫిన్లు చేయించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఈ ఘటనపై రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జోనల్ అధికారి అలివేలు క్షేత్ర స్థాయిలో పర్యటించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. అనంతరం ‘చిట్టి చేతులు.. వెట్టి చాకిరీ’ కథనానికి సంబంధించిన అంశాలపై సోషల్ వెల్ఫేర్ సెక్రటరీకి ని వేదిక సమర్పించారు. సెక్రటరీ ఆదేశాల మేరకు డీ సీఓ ఉమామహేశ్వరి సోమవారం సదరు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సమ్మయ్యకు, ఆ పాఠశాలలో పనిచేస్తున్న క్యాటరింగ్ కాంట్రాక్టర్కు షోక్జ్ నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో రాతపూర్వక వివరణ ఇవ్వలని పేర్కొన్నారు. విద్యార్థులు ఫిర్యాదులో పెట్టెలో వేసిన ఫిర్యాదు లేఖలను పరకాల ఆర్డీఓ, దామెర తహసీల్దార్లు స్వాధీనం చేసుకున్న ట్లు సమాచారం. వారు పాఠశాలలో విద్యార్థులతో వెట్టి చాకీరి చేయించిన ఘటనతోపాటు పాఠశాలలో నెలకొన్న సమస్యలు, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాళ్లపై విద్యార్థులు లేవనెత్తిన అవినీతి విషయాలపై హనుమకొండ కలెక్టర్కు నివేదిక అందజేసినట్లు తె లిసింది. ఈనెల 12న ‘చిట్టి చేతులు..వెట్టి చాకిరీ’, 13న ‘వెట్టి చాకిరీపై కదిలిన యంత్రాంగం’ అనే శీర్షి కలతో సాక్షిలో కథనాలు ప్రచురితమయ్యాయి. వీ టిపై స్పందించిన అధికారులు చర్యలకు ఆదేశించా రు. ఇదిలా ఉండగా భద్రాద్రి కొత్తగూడెం జోనల్ అధికారి తన నివేదికలో క్రమ శిక్షణ చర్యలకు సిఫా ర్సు చేసినట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాళ్లపై చర్యలు తీసుకుని క్యా టరింగ్ కాంట్రాక్టర్ లైసెన్స్ను బ్లాక్ లిస్ట్లో పెట్టనున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ప్రిన్సిపాల్ సమ్మ య్య కొంత మంది విద్యార్థులను తనకు వ్యతిరేకంగా చెప్పుతే టీసీలు ఇస్తానంటూ బెదిరించిన విషయానికి సంబంధించిన ఆడియో కూడా వైరలైంది. ఇప్పటికై నా అధికా రులు గతి తప్పిన గు రుకులాన్ని గా డిలో పెట్టాలని త ల్లిదండ్రులు వేడుకుంటున్నారు. -
ఓటమెరుగని నాయకులు..
● ఆ దంపతులు ఐదుసార్లు సర్పంచ్గా గెలుపు దంతాలపల్లి : ప్రస్తుత పరిస్థితుల్లో ఒకసారి సర్పంచ్గా పని చేసి మరోసారి గెలువడం కష్టమే. అలాంటిది ఏకంగా ఐదుసార్లు సర్పంచ్గా గెలుపొంది ప్రజల మన్ననలు పొంది ప్రజానాయకులుగా పేరొందారు కొమ్మినేని రవీందర్, మంజుల దంపతులు. మండలంలోని దాట్లకు చెందిన ఆ దంపతులు 25 సంవత్సరాలుగా ప్రజాప్రతినిధులుగా వారి కుటుంబం నుంచే కొనసాగుతున్నారు. ఉమ్మడి నర్సింహులపేట మండలంలోని దాట్ల గ్రామానికి మూడుసార్లు సర్పంచ్గా ఎన్నిక కాగా రెండు పర్యాయాలు రవీందర్, ఒక పర్యాయం మంజుల ఎన్నికయ్యారు. దంతాలపల్లి మండలం ఏర్పడిన అనంతరం దాట్ల సర్పంచ్గా రవీందర్ గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో 260 ఓట్లపైచిలుకు ఆధిక్యంతో స్వతంత్ర అభ్యర్థిగా మంజుల గెలుపొందారు. ఇలా వరుసగా ఐదుసార్లు సర్పంచ్గా ఎన్నికై ఓటమెరగని నాయకులుగా పేరు తెచ్చుకున్నారు. ఆ కుటుంబం నుంచి నాలుగో సర్పంచ్.. బచ్చన్నపేట : మండలంలోని తమ్మడపల్లి సర్పంచ్గా గెలుపొందిన బేజాడి సిద్ధులు తన కుటుంబం నుంచి నాలుగో సర్పంచ్. 1995లో తన తండ్రి రాములు, 2006లో తన భార్య సునీత, 2013లో సిద్ధులు, ప్రస్తుతం సిద్ధులే గెలుపొంది ఆ కుటుంబంలో నాలుగో సర్పంచ్ అయ్యారు. నాటి నుంచి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నందుకు గ్రామస్తులు తమ కుటుంబం పట్ల ఆదరణ, అభిమానం చూపుతున్నారని సిద్ధులు తెలిపారు. భర్త ఉప సర్పంచ్.. భార్య వార్డు సభ్యురాలు కమలాపూర్: కమలాపూర్ మండలం పంగిడిపల్లిలో భార్యాభర్తలు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. గ్రా మానికి చెందిన ఆసాల శ్రీ కాంత్ బీఆర్ఎస్ తరఫున 4 వ వార్డు నుంచి, ఆయన భా ర్య మౌనిక 9వ వార్డు నుంచి వార్డు సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నెల 11న జరిగిన మొదటి విడత జీపీ ఎన్నికల అనంతరం శ్రీకాంత్ ఉపసర్పంచ్గా ఎన్నికయ్యారు. ఆసాల శ్రీకాంత్, మౌనిక -
గెలిచిన తిరుగుబాటు సర్పంచ్లను తిరిగి ఆహ్వానిస్తున్న అధికార పార్టీ
సాక్షిప్రతినిధి, వరంగల్ : గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు రెబల్స్ బెడద తప్పలేదు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దతు ఆశించిన పలువురు.. చివరికి వరకు ఫలితం కనిపించకపోవడంతో చేసేది లేక తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీలోకి దిగారు. రెబల్స్ ధాటికి పలుచోట్ల అధికార పార్టీ అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టగా.. పలుచోట్ల రెబల్స్ విజయం సాధించారు. ఉమ్మడి వరంగల్లో ఆదివారం జరిగిన రెండో విడతలో 563 పంచాయతీల్లో 41 మంది రెబల్స్గా గెలిస్తే.. హనుమకొండ జిల్లాలో ఆరు ఏకగ్రీవంకాగా, 67 స్థానాలకు ఏడు చోట్ల తిరుగుబాటు అభ్యర్థులు గెలుపొందారు. హనుమకొండ జిల్లాలో గెలిచిన వారిని ఇప్పుడు సొంతగూటికి రమ్మని నేతలు ఆహ్వానిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. వేలేరు, హసన్పర్తిలో షాక్.. అభ్యర్థుల ఎంపికలో ఏమరుపాటు అధికార కాంగ్రెస్కు షాక్ తగిలేలా చేసింది. ఆదివారం జరిగిన పోలింగ్ సందర్భంగా హనుమకొండ జిల్లాలో ముగ్గురు స్వంతంత్రులు గెలుపొందగా, ఏడుగురు కాంగ్రెస్ రెబల్స్ విజయఢంకా మోగించారు. సుమారు 4,800 ఓటర్లున్న వేలేరు గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను ఓడించి భారీ షాక్ ఇచ్చారు. ఇక్కడ మూడు ముక్కలాట ఆడారు. కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులుగా విజయపురి మల్లికార్జున్ గెలుపు కోసం స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రచారం చేశారు. మరో అభ్యర్థి సద్దాం హుస్సేన్ కోసం రాష్ట్ర సహకార అయిల్ సీడ్స్, గ్రోయర్ ఫెడరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉన్న బిల్ల యాదగిరి 9 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం సంచలనగా మారింది. ● హసన్పర్తి మండలంలోని నాలుగు చోట్ల రెబల్స్ గెలిచి కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు, కాంగ్రెస్ నేతలకు షాక్ ఇచ్చారు. ● హసన్పర్తి మండలం మల్లారెడ్డి పల్లెలో మేడిపల్లి సునీతకు అధికార పార్టీ మద్దతు తెలుపగా రెబల్ అభ్యర్థి గాజుల కృష్ణవేణి గెలుపొందారు. ● హరిశ్చంద్రనాయక్ తండాలో భూక్య రాజు రెబల్ అభ్యర్థి నునావత్ దేవందర్ చేతిలో ఓడిపోగా, బైరాన్పల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి కల్లెబోయిన కుమారస్వామి రెబల్ అభ్యర్థి కల్లెబోయిన సురేందర్ చేతిలో ఓటమి చెందారు. ● సూదనపల్లిలో కాంగ్రెస్ మద్దతుదారు తిక్క మాధవి రెబల్ అభ్యర్థి ఆకారపు లచ్చమ్మ చేతిలో రెండోట్ల తేడాతో అపజయం పాలయ్యారు. ● ధర్మసాగర్ మండలం రాపాకపల్లిలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి కందుకూరు సుధాకర్ రెబల్ అభ్యర్థి కందుకూరి జయందర్ చేతిలో ఓడిపోయారు. ● ఐనవోలు మండలం ఒంటిమామిడి, లింగమోరి గూడెంలలో ఇదే జరిగింది. ఇప్పుడు రెబల్స్ అందరినీ పార్టీలో చేరాలని నేతలు ఆహ్వానిస్తుండగా.. పార్టీ పరంగా మద్దతు తెలిపి బరిలోకి దింపిన నాయకులు రెబల్స్ను అదుపు చేయకపోవడం వల్ల ఓటమి చెందాల్సి వచ్చిందని ఓడిపోయిన అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘కారు’ ఇంకా కలబడితే.. ఇంకా ‘చేయి’జారేవి... పొరుగు జిల్లా జనగామ ఫలితాల ప్రభావం హనుమకొండ జిల్లాలోనూ పడినట్లు ఫలితాలను బట్టి అవగతమవుతోంది. మిగతా మండలాల్లోనూ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం గట్టిగా కృషి చేస్తే మరిన్ని స్థానాలు దక్కేవన్న చర్చ జరుగుతోంది. రెండో విడతలో మొత్తంగా 73 గ్రామ పంచాయతీల్లో 39 కాంగ్రెస్, 22 బీఆర్ఎస్, రెండు బీజేపీ మద్దతుదారులు, 10 చోట్ల రెబల్స్, ఇండిపెండెట్లు గెలిచారు. వేలేరు మండలంలో 12 పంచాయతీలకు రెండు ఏకగ్రీవం కాగా.. ఆ ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ మండలంలో ఒక రెబల్ మినహాయిస్తే ఐదు కాంగ్రెస్కు, ఆరు బీఆర్ఎస్కు సూచిస్తున్నాయి. అదే విధంగా పరకాలలో 10 సర్పంచ్లకు ఆరు కాంగ్రెస్ గెలుచుకోగా, నాలుగు బీఆర్ఎస్, ఇద్దరు ఇండిపెండెట్లు గెలిచారు. ఐనవోలులో 17 పంచాయతీలకు 9 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్, ఒక బీజేపీ, ఇద్దరు ఇండిపెండెట్లు గెలిచారు. ఇక్కడ గట్టి కృషి జరిగినా ఫలితాలు ‘కారు’ పెరిగేవంటున్నారు. ధర్మసాగర్లో 19 పంచాయతీలకు 13 కాంగ్రెస్, ఐదు బీఆర్ఎస్, ఒకచోట కాంగ్రెస్ రెబల్ గెలుపొందగా.. ఇక్కడ మూడు చోట్ల సమీప మెజార్టీతో బీఆర్ఎస్ మద్దతుదారులు ఓటమి చెందారన్న చర్చ జరుగుతోంది. ‘రెండో’ పోరులో పలుచోట్ల సత్తా చాటిన అభ్యర్థులు కాంగ్రెస్ బలపర్చిన వారికి తప్పని బెడద చివరి వరకు మద్దతు ఆశించి.. రెబల్స్గా బరిలోకి దిగిన ఆశావహులు వేలేరులో ‘కడియం’, ‘జంగా’కు షాక్... -
యాచకులు లేని నగరంగా తీర్చిదిద్దాలి..
మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ను యాచకులు లేని నగరంగా తీర్చిదిద్దాలని, గుర్తించిన యాచకులను స్మైల్ కేంద్రంలో చేర్పించాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. సోమవారం హనుమకొండ భీమారంలో జీడబ్ల్యూఎంసీ, హెల్త్ కేర్ సొసైటీ ఎన్జీఓ సంయుక్తంగా నిర్వహిస్తున్న స్మైల్ కేంద్రాన్ని మేయర్ పరిశీలించారు. కేంద్రంలో యాచకులకు అందుతున్న వసతులు, వైద్య సేవలు, భోజనం తదితర అంశాలపై ఆరా తీశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నగరంలో బిచ్చగాళ్లు, బాల కార్మికులు, వృద్ధులను సర్వే చేసి, కనీసం మూడు నెలల పాటు స్మైల్ హోంలో ఆశ్రయం కల్పించి, తదుపరి వారికి స్థిరమైన జీవనోపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమం విజయవంతమయ్యేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, ఎంహెచ్ఓ రాజేశ్, మెప్మా టీఎంసీ రమేశ్, వెంకట్ పాల్గొన్నారు. గడువులోగా పనులు పూర్తి చేయాలి:బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ నిర్దేశిత గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం హనుమకొండలోని కుడా కార్యాలయంలో బల్దియా ఇంజనీరింగ్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. అసంపూర్తిగా ఉన్న స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులు ఈ నెలాఖరులోగా డెడ్లైన్ ఉందని గుర్తు చేశారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, బయోమైనింగ్ పనులపై సీరియస్గా దృష్టి కేంద్రీకరించాలన్నారు. స్వీపింగ్ మిషన్ల పనితీరు బాగాలేదని, ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఇంజినీర్లను కోరారు. సమావేశంలో ఎస్ఈ సత్యనారాయణ, ఈఈలు మహేందర్, రవికుమార్, సంతోశ్బాబు, మాధవీలత, ఏఈలు నరేశ్, సంతోశ్కుమార్ స్మార్ట్ సిటీ ప్రతినిధి ఆనంద్ ఓలేటి పాల్గొన్నారు. -
అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదుల వెల్లువ
వరంగల్ అర్బన్: అనధికారిక భవన నిర్మాణాలు, అక్రమ కట్టడాలపై గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్ సెల్కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సోమవారం కౌన్సిల్ హాల్లో జరిగిన కార్యక్రమంలో కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఫిర్యాదులు స్వీకరించారు. దరఖాస్తుదారులతో కార్యాలయ ఆవరణంతా కిటకిటలాడింది. గ్రీవెన్స్ సెల్కు మొత్తం 117 ఫిర్యాదులు అందగా.. టౌన్ ప్లానింగ్ విభాగానికి 63 వచ్చాయి. నగరంలో ఎంత పెద్ద మొత్తంలో అనధికారిక నిర్మాణాలు జరుగుతున్నాయో ఈ ఫిర్యాదుల సంఖ్యను చూస్తే అర్థమవుతోంది. మౌలిక వసతుల కల్పన కోసం 41, పన్నుల విభాగానికి 4, ప్రజారోగ్య సెక్ష న్కు 3, నీటి సరఫరాకు 5, ఉద్యాన వన విభాగానికి 1 చొప్పున ఫిర్యాదులు అందినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, డీఎఫ్ఓ శంకర్ లింగం, ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్న రాణి, బిర్రు శ్రీనివాస్, టీఓ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని.. ● వరంగల్ దేశాయిపేట చార్లెస్ కాలనీ రోడ్డు–1లో డ్రెయినేజీ నిర్మాణాన్ని చేపట్టాలని ఆర్గనైజర్స్ కోరారు. ● వరంగల్ 25వ డివిజన్ ఎల్లంబజార్ రిషి స్కూల్ లైన్లో రోడ్డు పూర్తిగా దెబ్బతిందని, కొత్తగా నిర్మించాలని కాలనీవాసులు విన్నవించారు. ● మట్టెవాడ 13–3–52 వద్ద తాగునీటి పైపులైన్ నెల రోజులుగా లీకేజీగా మారి నీరు వృథాగా పోతోందని, రోడ్డు దెబ్బతింటుందని స్థానికులు ఫిర్యాదు చేశారు. ● 19వ డివిజన్ గాంధీనగర్లో విద్యుత్ స్తంభాలు, వీధిదీపాలు ఏర్పాటు చేయాలని రామా యాదగరి విజ్ఞప్తి చేశారు. ● 2028లో లక్ష్మీటౌన్ షిప్ నుంచి ఆరేపల్లి వరకు రూ.4 కోట్లతో రోడ్డు విస్తరణ, అభివృద్ధి చేపట్టారని, కానీ, కొన్నేళ్లకు రోడ్డు దెబ్బతిందని మరమ్మతులు చేపట్టాలని ఇట్యాల సురేశ్కుమార్ కోరారు. ● వరంగల్ చింతల్లో నల్లాలు, డ్రెయినేజీలు లేవని, రోడ్లు నిర్మించాలని మహ్మద్ అంకూస్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ● వరంగల్ 28వ డివిజన్ విశ్వకర్మ, చకిలం ఉపేందర్ వీధిలో సీసీ రోడ్డు నిర్మించాలని స్థానిక కార్పొరేటర్ గందె కల్పన అర్జీ పెట్టుకున్నారు. ● 62వ డివిజన్ విష్ణుపురి రెహ్మత్ నగర్ మరుగుదొడ్ల నుంచి మల వ్యర్థాలను నేరుగా డ్రెయినేజీలకు పంపిస్తుండడంతో దుర్వాసన వస్తోందని మాట్ల రాజశేఖర్ ఫిర్యాదు చేశారు. ● హంటర్ రోడ్డులోని వేదవతి నిలయం అపార్ట్మెంట్కు సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మించాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు. ● ఆర్టీసీ కాలనీలో సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మించాలని రాంచందర్ పేర్కొన్నారు. ● 59వ డివిజన్ ఇందిరా నగర్ కాలనీలో 4 చోట్ల కల్వర్టులు, కేఎల్ఎన్ రెడ్డి నగర్లో డ్రెయినేజీ నిర్మించాలని గుగ్గిళ్ల వసంత విన్నవించారు. ● 52వ డివిజన్ శంకర్నగర్ కాలనీ రోడ్డు నంబరు 6లో సీసీ రోడ్డు నిర్మించాలని, ఇళ్లకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వాలని కాలనీవాసులు కోరారు. ● 11వ డివిజన్ కాపువాడలో ‘మిషన్’ పైపులైన్లు పునరుద్ధరించాలని బక్కి రాజ్కుమార్ కోరారు. ● 41వ డివిజన్ ఖిలా వరంగల్ శివారు శంభునిపేట విశ్వనాథ కాలనీ సర్వే నంబర్ 1135/ఏ స్థలంలో అక్రమంగా 1,210 గజాల స్థలాన్ని ఓ వ్యక్తి కబ్జా చేసి పర్మిషన్ లేకుండా నిర్మిస్తున్నారని చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ నాయకులు నమిండ్ల శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. కనీస వసతులు కల్పించాలని విన్నపాలు బల్దియా గ్రీవెన్స్కు 117 దరఖాస్తులు స్వీకరించిన కమిషనర్ చాహత్ -
వేసవిలో డిమాండ్ ఎదుర్కోవాలి..
హన్మకొండ: వచ్చే వేసవిలో డిమాండ్ను ఎదుర్కొనేందుకు అధికారులు సన్నద్ధం కావాలని టీజీ ఎన్పీడీసీఎల్ ఆపరేషన్ డైరెక్టర్ టి.మధుసూదన్ సూచించారు. సోమవారం హనుమకొండ పెద్దమ్మగడ్డలోని ట్రాన్స్కో జోనల్ కార్యాలయంలో టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ డీఈలు, ఏడీఈలు, ఏఈలతో సమీక్ష నిర్వహించారు. ఇందులో ఆపరేషన్ చీఫ్ ఇంజనీర్ రాజు చౌహాన్తో కలిసి డైరెక్టర్ టి.మధుసూదన్ సెక్షన్, సబ్ డివిజన్, డివిజన్ వారీగా ప్రగతిని సమీక్షించారు. ఈసందర్భంగా డైరెక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ.. వేసవిలో విద్యుత్ అవసరాలు పెరుగుతాయని, దీంతో డిమాండ్ పెరుగుతుందన్నారు. ఈమేరకు విద్యుత్ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల వైఫల్యాలు తగ్గించిన ఏఈలను అభినందించారు. సమావేశంలో హనుమకొండ ఎస్ఈ పి.మధుసూదన్ రావు, డీఈలు ఐరెడ్డి విజేందర్రెడ్డి, జి.సాంబరెడ్డి, ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: ముఖ గుర్తింపు హాజరుతో సమయపాలన అలవడుతుందని కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం పరిపాలనాభవనంలో ఉద్యోగులకు ముఖ గుర్తింపు హాజరు ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రతీ ఉద్యోగి తమ కార్యాలయం, విభాగానికి హాజరును విధిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ముఖ గుర్తింపు హాజరు విధానం, వ్యవస్థ సీసీటీవీ పర్యవేక్షణలోనూ కొనసాగనుందన్నారు. కార్యక్రమంలో కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం, యూనివర్సిటీ నెట్వర్కింగ్ సెల్ డైరెక్టర్ డి.రమేశ్, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి బి.రమ పాల్గొన్నారు. హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయాన్ని సోమవారం మధ్యాహ్నం మోగ్లీ సినిమా కథానాయకుడు రోషన్ కనకాల, హీరోయిన్ సాక్షి మడోల్కర్, చిత్రం యూనిట్ సభ్యులు సందర్శించారు. ఈసందర్భంగా వారు మోగ్లీ సినిమా పెద్ద హిట్ సాధించాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ స్నపన మందిరంలో అర్చకులు వారికి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందించారు. కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు క్రాంతికుమార్, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, గాదె శ్రవణ్కుమార్రెడ్డి, మయూరి, స్రవంతి, అనంతుల శ్రీనివాస్, సిబ్బంది కృష్ణ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ క్రైం: రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా వారం రోజులుగా ట్రై సిటీ పరిధిలో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 437 కేసులు నమోదైనట్లు వరంగల్ పోలీస్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. పట్టుబడిన వారిని కోర్టులో హాజరుపర్చగా.. రూ.1,58,200 జరిమానా విధించడంతో పాటు 24 మందికి జైలు శిక్ష విధించినట్లు పేర్కొన్నారు. వరంగల్ ట్రాఫిక్ పరిధిలో నమోదైన 158 కేసుల్లో 14 మంది జైలు శిక్ష విధించగా, రూ.72,900 జరిమానా, కాజీపేట పరిధిలో 142 కేసుల్లో 9 మందికి జైలు శిక్ష, మిగతా కేసుల్లో రూ.79,500 జరిమానా, హనుమకొండ ట్రాఫిక్ పరిధిలో 137 కేసులకు రూ.5,800 జరిమానాతో పాటు ఒక్కరి జైలు శిక్ష విధించినట్లు సీపీ వెల్లడించారు. వాహనదారులు మద్యం సేవించి వాహనం నడపడం ద్వారా మీకు, మీ కుటుంబానికి క్షేమకరం సీపీ సూచించారు. పోలింగ్ కేంద్రం పరిసరాల్లో నిషేధాజ్ఞలు ఈ నెల 17న కమిషనరేట్ పరిధి వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో జరిగే మూడో విడత ఎన్నికల్లో శాంతి భద్రత పరిరక్షణలో భాగంగా పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో బీఎన్ఎస్, ఎస్ఆర్పీసీ 163 ( 144 సెక్షన్) అమలు చేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ మేరకు ప్రజలు ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుంపులుగా చేరడం నిషేధమని పేర్కొన్నారు. ఈనిషేధాజ్ఞలు 17 తేదీ రాత్రి 8 గంటల వరకు అమలులో ఉంటాయని, ఎవరైనా ఈ ఉత్తర్వులు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. -
మంగళవారం శ్రీ 16 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
వరంగల్ అర్బన్: గ్రేటర్ మహా నగర అభివృద్ధి పనుల్లో పర్సంటేజీల పర్వం కొనసాగుతున్నట్లు ఆ రోపణలు వెల్లువెత్తుతున్నాయి. అగ్రిమెంట్ మొదలుకొని పనులు ప్రారంభించి, వివిధ స్థాయిలో ఇంజినీరింగ్, ఇతర విభాగాల్లో పర్సంటేజీల రూపంలో 13 శాతం సొమ్ము ముట్టజెప్పాల్సి వస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో ఇంజనీర్లు, అధికారులు జీతాలు, రవాణా సదుపాయాలు పొందుతున్నప్పటికీ పర్సంటేజీల కోసం చేతులు చాస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతా మామూళ్ల వ్యవహారమే! జీడబ్ల్యూఎంసీ పరిధిలో ఏటా రూ.వందల కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరుగుతుంటాయి. ఆయా పనులకు సంబంధించి అంచనాల తయారీ, టెండర్ల కేటాయింపు, కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుల బాధ్యతను ఇంజినీరింగ్ విభాగం చూస్తుంటుంది. ఇందుకోసం డ్రాయింగ్ సెక్షన్ అగ్రిమెంట్ సిబ్బంది నుంచి ఎస్ఈ స్థాయి వరకు పని చేస్తుంటారు. ఆయా అభివృద్ధి పనుల్లో కింది స్థౠయి నుంచి పై స్థాయిలో ఉన్న అధికారులందరికీ పర్సంటేజీలు అందుతాయనేది బహిరంగ రహస్యంగా మారింది. పర్యవేక్షకులే పక్కదారి పడితే? కాంట్రాక్టర్లు లాభాపేక్షతో పనులు చేస్తుంటారు. ఇంజినీర్లు పనులు దగ్గర ఉండి శాసీ్త్రయత, నాణ్యతను పరిశీలించాలి. నిబంధనల మేరకు పనులు చేపట్టకపోతే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి. నోటీసులు అందించి బ్లాక్ లిస్టులో పెట్టాలి. కానీ ప్రజాధనానికి సంరక్షకులుగా ఉండాల్సిన కొందరు ఇంజనీర్లు కాసుల కోసం నిబంధనల్ని పక్కన పెట్టి చేతులు చాస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో రోడ్లు, డ్రెయినేజీలు, కల్వర్టులు నిర్మించిన కొద్ది నెలలకే పగుళ్లు చూపుతున్నాయి. బిల్లులు రావట్లేదని కాంట్రాక్టర్ల గగ్గోలు.. ప్రతీ పనికి కమీషన్ల భారం పెరిగిపోతోందని, బిల్లులు మాత్రం సకాలంలో చెల్లించడం లేదని కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. బడా కాంట్రాక్టర్లకు మినహా మధ్య, సాధారణ కాంట్రాక్టర్లకు టెండర్లు గిట్టుబాటు అవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టెండర్ అగ్రిమెంట్ బిల్లు రికార్డు, చివరి చెక్కు చేతికందే వరకు ఏఈకి 3శాతం, డీఈకి 2శాతం, ఈఈకి 1 శాతం, ఎస్ఈకి 1శాతం, డీబీ, సెక్షన్, 1.5 శాతం, క్వాలిటీ కంట్రోల్, అడిట్, అకౌంటింగ్ విబాగంలో, కార్పొరేటర్ వరకు మొత్తంగా 13 వరకు కమీషన్ల రూపంలో చెల్లిస్తున్నట్లు కాంట్రాక్టర్లు వాపోతున్నారు. చర్యలు తీసుకుంటాం.. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించా ల్సిందే. థర్డ్ పార్టీ క్వాలిటీ నిపుణులు పరిశీలిస్తుంటారు. ఏమైనా తేడాలోస్తే బిల్లుల్లో కోత పెడతాం. – సత్యనారాయణ, ఎస్ఈఅభివృద్ధి పనుల్లో అవినీతి జలగలు! ఇసుకకు బదులు స్టోన్ క్రషర్ వాడకం నాసిరకం కంకర, సిమెంట్.. మేసీ్త్రలే క్వాలిటీ ఇన్స్పెక్టర్లు మూణ్నాళ్లకే నాణ్యతా ప్రమాణాలకు మంగళం ఏజెంట్ల ద్వారా ఇంజనీర్ల వసూళ్లు కాంట్రాక్టర్ల నుంచి ప్రజాప్రతినిధులకు వాటాలు -
పరీక్షల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు
కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణకు పటిష్ట చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా స్థాయి సమన్వయ కమిటీ చైర్మన్, కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. త్వరలో జిల్లాలో నిర్వహించనున్న జేఈఈ (మెయిన్న్స్)–2026 పరీక్షల నిర్వహణపై సోమవారం కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. జనవరి 21 నుంచి 30 వరకు (మొదటి సెషన్), ఏప్రిల్ 2 నుంచి 9 వరకు (రెండో సెషన్) జరిగే జేఈఈ (మెయిన్)– 2026 పరీక్షల కోసం జిల్లాలోని 4 పరీక్ష కేంద్రాల ఆడిట్ నిర్వహణకు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి నివేదికను సమర్పించాలన్నారు. కమిటీ సభ్యులు డీసీపీ రవి, ఏసీపీ నర్సింహారావులు ఎన్టీఏ ద్వారా నామినేట్ చేయబడిన జిల్లా నోడల్ అధికారి, జవహర్ నవోదయ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ కె.శ్రీమతి, డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్, ఈడీఎం శ్రీధర్, కలెక్టరేట్ ఏఓ గౌరీశంకర్ సమన్వయంతో జిల్లాకు సంబంధించి ఎన్టీఏ అందించిన జాబితా ప్రకారం పరీక్ష కేంద్రాలను సందర్శించి సమగ్ర ఆడిట్ నిర్వహించాలన్నారు. ఆడిట్ పూర్తయిన అనంతరం ఫీడ్బ్యాక్ ఫారమ్ సమర్పించాలన్నారు. -
ముగిసిన తుది విడత ప్రచారం
సాక్షిప్రతినిధి, వరంగల్ : గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు అఖరి అంకానికి చేరుకుంది. హనుమకొండ జిల్లాలోని ఆత్మకూరు, శాయంపేట, నడికూడ, దామెర మండలాల్లో మూడో విడతలో 67 పంచాయతీలకు ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. ఆఖరి విడత ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ముగిసింది. ఈలోగా అత్యధిక ఓట్లను సంపాదించుకునేందుకు మద్యం డబ్బులతోపాటు గిఫ్ట్లను పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే పనిలో అభ్యర్థులు పడ్డారు. ఒక్కో గ్రామంలో ఓటుకు రూ.500 నుంచి రూ.1,000లు పంపిణీ చేస్తుండగా, ఆన్రిజర్వుడు, మేజర్ పంచాయతీల్లో రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు పంపిణీ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. మూడో దశలో మొత్తం 68 పంచాయతీలు, 634 వార్డులకు గాను ఒక గ్రామ పంచాయతీ, 71 వార్డులకు సభ్యులు ఏకగ్రీవం అయ్యారు. దీంతో 67 జీపీలు, 563 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ బరిలో 230 మంది, వార్డుల్లో 1,424 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇందుకోసం మొత్తం 626 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు వెల్లడించారు. ఆత్మకూరు, శాయంపేట, నడికూడ, దామెర మండలాల్లో జరిగే ఈ పోలింగ్లో 626 మంది ప్రిసైడింగ్ అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొననున్నారు. వరంగల్జిల్లాలో నాలుగు మండలాల్లో.. వరంగల్: వరంగల్ జిల్లాలో మూడో దశ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 5గంటలకు ముగిసింది. టీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ విడత పూర్తిగా నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని చెన్నారావుపేట, ఖానాపూరం, నర్సంపేట, నెక్కొండ మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 109 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుండగా, ఇందులో ఏడుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా 102 సర్పంచ్ స్థానాల కోసం 307 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. అలాగే, 946 వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించి 137 మంది ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, మిగిలిన 809 స్థానాల కోసం 1,895 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పల్లెల్లో పంపకాల జోరు హనుమకొండ జిల్లాలో 67 జీపీలు, 563 వార్డులకు.. వరంగల్ జిల్లాలో 102 సర్పంచ్, 809 వార్డులకు ఎన్నికలు ఏర్పాట్లు సిద్ధం చేసిన అధికారులు -
రెండు ఓట్లతో లచ్చమ్మ గెలుపు
హసన్పర్తి: హసన్పర్తి మండలం సూదన్పల్లిలో ఫ్యామిలీ పోరు జోరుగా సాగింది. గ్రామానికి చెందిన ఆకారపు లచ్చమ్మ (కాంగ్రెస్ రెబల్), ఆమె కూతురు శైలజ(కాంగ్రెస్ రెబల్) పోటీలో ఉన్నారు. వీరితో పాటు శైలజ బావ కోడలైన తిక్క మాధవి (కాంగ్రెస్), మాధవి అత్త అయిన జయమ్మ (స్వతంత్ర) అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఫ్యామిలీ పోరులో తిక్క మాధవికి 292 ఓట్లు రాగా, అకారపు లచ్చమ్మకు 294 ఓట్లు వచ్చాయి. రెండు ఓట్ల తేడాతో మనవరాలిపై అమ్మమ్మ (లచ్చమ్మ) సర్పంచ్గా ఎన్నికై ంది. కాగా, జయమ్మకు ఏడు, శైలజకు 74 ఓట్లు వచ్చాయి. మాజీ సర్పంచ్ భర్తపై మాజీ ఉప సర్పంచ్ గెలుపు మడిపల్లిలో మాజీ సర్పంచ్ చిర్ర సుమలత భర్త చిర్ర విజయ్కుమార్పై మాజీ ఉప సర్పంచ్ బుర్ర రంజిత్కుమార్ 21 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. లెక్కింపు సందర్భంగా విజయ్కుమార్కు 910కు పోలవ్వగా, రంజిత్కుమార్కు 930 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్ ఓటు రంజిత్కు నమోదైంది. -
పల్లెవించిన ఓటరు చైతన్యం
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో రెండో విడత పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయ్యింది. మొత్తం 87.25% పోలింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు. రెండో విడతలో భాగంగా ధర్మసాగర్ హసన్పర్తి, ఐనవోలు, వేలేరు, పరకాల మండలాల్లోని 1,25,735 ఓటర్లు ఉండగా.. 1,09,703 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో 87.25గా పోలింగ్ శాతం నమోదైంది. ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు.. రెండో విడత పోలింగ్కు జిల్లాలోని ధర్మసాగర్, హసన్పర్తి, ఐనవోలు, వేలేరు, పరకాల మండలాల్లోని గ్రామ పంచాయతీలకు ఓటర్లు ఉదయం నుంచే పోటెత్తారు. ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా పోలింగ్ ప్రారంభానికి ముందే కేంద్రాల వద్ద బారులుదీరారు. ఓటు వేసేందుకు ఓపికతో క్యూ లైన్లో నిలబడ్డారు. ఒంటిగంట వరకు పోలింగ్ ప్రక్రియ సాగింది. అనంతరం భోజన విరామం తర్వాత వార్డు సభ్యులు, సర్పంచ్ ఓట్ల లెక్కింపును అధికారులు ప్రారంభించారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. రెండో విడత పోలింగ్లో కూడా మహిళల పోలింగ్ శాతం తక్కువగానే నమోదైంది. మొత్తం ఓటర్లు 1,25,735మంది ఉండగా, పురుషులు 54,274, మహిళలు 55,429 ఓటు హక్కు వినియోగించుకున్నారు. థర్డ్ జెండర్ కేటగిరీలో ఇద్దరు ఓటు హక్కు వినియోగించుకోలేదు. పోలింగ్ శాతం చూస్తే మాత్రం పురుషుల కంటే మహిళా ఓట్లు రెండు శాతం తక్కువగా పోలింగ్కు హాజరయ్యారు. తొలి విడత జిల్లాలో 83.95 పోలింగ్ శాతం నమోదవ్వగా రెండో విడతలో 87.25 శాతంగా పోలింగ్ నమోదైంది. దీంతో మొదటి విడత కంటే రెండో విడతలో సుమారు మూడు శాతం ఎక్కువ పోలింగ్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. పర్యవేక్షించిన కలెక్టర్ హనుమకొండ జిల్లాలోని ఐదు మండలాల్లో జరుగుతున్న పోలింగ్ను కలెక్టర్ స్నేహ శబరీష్ పర్యవేక్షించారు. హసన్పర్తి, ధర్మసాగర్, వేలేరు, ఐనవోలు మండలాలను స్వయంగా సందర్శించి పోలింగ్ పరిశీలించి స్థానిక అధికారులకు సూచనలిచ్చారు. వరంగల్ జిల్లాలో పోటెత్తిన ఓటర్లు.. సాక్షి, వరంగల్: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరిగిన నల్లబెల్లి, దుగ్గొండి, గీసుకొండ, సంగెం మండలాల్లోని 1,008 పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. 1,36,191 మంది ఓటర్లకు 1,20,001 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆదివారం సెలవు దినం కలిసి రావడంతో నగరాలు, పట్టణాల్లో స్థిరపడిన వలస ఓటర్లు పల్లెలకు భారీగా తరలివచ్చారు. తొలి విడత నమోదైన 86.52 శాతం కంటే ఈసారి 88.11 శాతం నమోదైంది. ఉదయం ఏడు నుంచి మొదలైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాగింది. గీసుకొండ మండలం గీసుకొండ, గంగదేవిపల్లి, దుగ్గొండి మండలం వెంకటాపూర్, దేశాయిపల్లి, నల్లబెల్లి మండలం నల్లబెల్లి ఉన్నత పాఠశాల, నందిగామ, సంగెం మండలం సంగెం ఉన్నత పాఠశాల, మొండ్రాయిలో హరిత పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల ఓటరు స్లిప్పులు లేక ఇబ్బందులు ఎదురవడం మినహా అంతా ప్రశాంతంగానే సాగింది. మహిళా ఓటర్లు ఎక్కువ.. వినియోగించుకున్నది ఎక్కువ పురుషులే.. ఈ నాలుగు మండలాల్లో 66,427 మంది పురుషులుంటే 58,688 మంది, 69,722 మంది మహిళలుంటే 61,311 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే పురుషులు 88.30 శాతం వినియోగించుకుంటే మహిళలు కాస్త తక్కువగా 87.94 శాతం ఓటేశారు. అంటే మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నా కూడా ఓటు హక్కు వినియోగంలో పురుషులే ముందున్నారు. రెండో విడతలో హనుమకొండ జిల్లాలో 87.25 శాతం పోలింగ్ మొదటి విడత కన్నా 3.3 శాతం అధికం -
నేడు గ్రేటర్ గ్రీవెన్స్
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ సెల్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ సెల్ ఎంతోగానో ఉపకరిస్తుందని, నగర ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. సౌత్జోన్ వర్సిటీ టోర్నమెంట్కు కేయూ జట్టుకేయూ క్యాంపస్: చైన్నెలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఈనెల 15 నుంచి 19వ తేదీ వరకు సౌత్జోన్ ఇంటర్ వర్సిటీ వాలీబాల్ టోర్నమెంట్కు కాకతీయ యూనివర్సిటీ వాలీబాల్ ఉమెన్స్ జట్టు పాల్గొననున్నట్లు కేయూ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ వై.వెంకయ్య ఆదివారం తెలిపారు. ఈజట్టులో ఎం.శ్యామల, ఎ.నందిని, పి.ఉమ, యు.మాధురి, షేక్ ఆఽశాబేగం, జి.ఐశ్వర్య, బి.అక్షిత, ఎం.మౌనిక, జె.సుప్రజ, వి.వెన్నెల, బి.ఆశ, ఎస్.శ్రీలత, జె.పావని, జి.వెన్నెల ఉన్నట్లు వెంకయ్య తెలిపారు. వరంగల్ కిట్స్ ఫిజికల్ డైరెక్టర్ కె.వీరస్వామి కోచ్గా, కొత్తగూడెం (టీజీటీడబ్ల్యూఆర్డీసీ ఉమెన్) ఫిజికల్ డైరెక్టర్ డి.శ్వేత మేనేజర్గా వ్యవహరించనున్నట్లు వెంకయ్య తెలిపారు. వరంగల్ అర్బన్: సూరత్లోని ప్రఖ్యాత లక్ష్మీపతి టెక్స్టైల్స్ ఇండస్ట్రీనీ ఆదివారం గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి సందర్శించారు. ఇండస్ట్రీ నిర్వహణను పరిశీలించారు. గుజరాత్లోని సూరత్లో జరుగుతున్న ఆల్ ఇండియా 116వ మేయర్ల సదస్సుకు ఆమె హాజరయ్యారు. ఈసందర్భంగా మేయర్లతో కలిసి 40 ఎంఎల్డీ టెర్షిషియరీ (తృతీయ) శుద్ధి కర్మాగారాన్ని సందర్శించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ.. అమృత్ 2.0 కార్యక్రమంలో భాగంగా వచ్చే నిధులతో నగరంలో 15 ఎంఎల్డీ సామర్థ్యంతో టెర్షిషియరీ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సూరత్ లో నిర్వహించే ప్లాంట్ నుంచి వచ్చే వాటర్ను అమ్మడం ద్వారా ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారని, నగరంలోనూ అదే తరహా విధానాలు అవలంబించనున్నట్లు పేర్కొన్నారు. తడి వ్యర్థాలను కంపోస్ట్గా మార్చడంపై పౌరులకు అవగాహన కల్పించడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్కు షాక్కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగంలో పార్ట్టైం అధ్యాపకుడిగా పని చేస్తూ కొన్నేళ్ల క్రితం పోస్ట్ డాక్టరల్ ఫెల్లో షిప్ (పీడీఎఫ్) పొందిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శంకరయ్యకు ఎదురు దెబ్బ తగిలింది. పార్ట్టైం అధ్యాపకుడిగా పని చేస్తూ పోస్ట్ డాక్టరల్ ఫెల్లోషిప్ పొందడం నిబంధనలకు విరుద్ధమని పోస్ట్ డాక్టరల్ను తిరిగి రీఫండ్ చేయాలని కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం ఈ నెల 10న ఆదేశాలు జారీ చేశారు. పోస్ట్ డాక్టరల్ ఫెల్లోషిప్గా పొందిన రూ. 6,89,400 కేయూ యూజీసీకి నెలరోజుల్లో రీఫండ్ చేయాలని ఆదేశాలు జారీచేశారు. శంకరయ్య ప్రస్తుతం హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో తెలుగు విభాగంలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షుల నియామకం కాజీపేట: అఖిల భారతీయ బ్రాహ్మణ సేవా సంఘం (చాణక్య దళ్)ను పటిష్టంగా తీర్చిదిద్దడంలో భాగంగా రాష్ట్రంలోని పలు జిల్లాలకు నూతనంగా జిల్లా అధ్యక్షులను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు అయినవోలు మల్లిఖార్జున శాస్త్రి తెలిపారు. కాజీపేటలో ఆదివారం సంఘం సభ్యులతో కలిసి జిల్లా అధ్యక్షులను ప్రకటించారు. చిలుకపాటి వెంకటశివకుమార్ (హనుమకొండ), గూడా వెంకటరమణ శర్మ (వరంగల్ అర్బన్), కాంచనపల్లి సిద్ధేశ్వర శర్మ (వరంగల్), యల్లంబట్ల కరుణాకర శర్మ (జనగామ), కొట్లావజ్జుల రామమూర్తి శర్మ (మహబూబాబాద్), విరాళ చంద్రశేఖర్ శర్మ (సిద్దిపేట), చిన్నోజుల లక్ష్మీరాజం శర్మ (రాజన్న సిరిసిల్ల), జి.శ్రావణ్ కుమార శర్మ (జయశంకర్ భూపాలపల్లి)ను నియమించారు. ఈ మేరకు నూతన అధ్యక్షులకు నియామక పత్రాలు అందించి అభినందించారు. -
ఎంజీఎంలో సిబ్బంది కొరత వాస్తవమే
ఎంజీఎం: ‘ఎంజీఎంలో పరికరాలు, సిబ్బంది కొరతను గుర్తించాం. ఔషధాల బడ్జెట్ విడుదల జరిగేలా చర్యలు తీసుకుంటా’ అని వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ) నరేంద్రకుమార్ అన్నారు. ఎంజీఎం రోగిని ఎలుకలు కొరిన ఘటన నేపథ్యంలో ఆదివారం ఆయన ఆస్పత్రిని పరిశీలించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రిలోని ఆర్ఐసీయూ, క్యాజువాలిటీ, ఎంఎంసీ, ఐఎంసీ, ఎస్ఎన్సీయూ విభాగాలు పరిశీలించినట్లు తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న క్యాజవాలిటీ రోగుల రద్దీకి సరిపడేలా లేదని గుర్తించినట్లు పేర్కొన్నారు. అత్యవసర విభాగాల్లో పరికరాలు, సిబ్బంది కొరత ఉందని, రోగులకు మరిన్ని మెరుగైన సేవలందించేందుకు ఔషధాల బడ్జెట్ ఎప్పటికప్పుడు విడుదలయ్యేలా కృషి చేస్తామన్నారు. ఎంజీఎం ఆస్పత్రి క్యాజువాలిటీ అడ్మిట్ అయిన రోగులను ఎందుకు రెఫరల్ చేస్తున్నారనే విషయాలపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని ఎంజీఎం పరిపాలనాధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఆర్ఎంఓలకు ప్రత్యేక నంబర్లు కేటాయించి రోగులకు వైద్యులు అందుబాటులో ఉండేలా చూడనున్నామన్నారు. ఎంజీఎం ఆస్పత్రికి సూపర్స్పెషాలిటీ వైద్యుల నియామకం జరిగేలా చర్యలు తీసుకుంటామని, ఆస్పత్రిలో నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో అందుతున్న సేవలను ప్రత్యేకంగా పరిశీలించినట్లు తెలిపారు. వైద్యుల హాజరు శాతం మెరుగపర్చేలా చర్యలు చేపడతామని, ఆర్ఎంఓల నియామకం చేపడతామన్నారు. ఎంజీఎంలో అందుతున్న వైద్య సేవలపై రోగులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో డీఎంఈ వెంట ఎంజీఎం సూపరింటెండెంట్ హరీశ్చంద్రారెడ్డి, ఆర్ఎంఓ అశ్విన్ తదితరులు పాల్గొన్నారు.● ఆర్ఎంఓల నియామకం చేపడతాం ● రెఫరల్ వైద్య సేవలపై ఆడిట్ చేపడతాం.. ● వైద్య విద్య సంచాలకుడు నరేంద్రకుమార్ -
వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రెండో విడతలోనూ ‘పై చేయి’..
సాక్షిప్రతినిధి, వరంగల్ : హనుమకొండ జిల్లాలో ఆదివారం జరిగిన గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ పై చేయి సాధించింది. ఓటర్లు అత్యధికంగా తమ ఓటుహక్కును వినియోగించుకుని చైతన్యం కనబరిచారు. జిల్లా పరిధి ఐదు మండలాల్లోని 73 గ్రామ పంచాయతీలకు ఆరు ఏకగ్రీవం కాగా.. అందరూ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే. ఆదివారం పోలింగ్ జరిగిన 67 గ్రామ పంచాయతీల్లో 33 చోట్ల కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. 22 పంచాయతీల్లో బీఆర్ఎస్ బలపరచిన అభ్యర్థులు గెలుపొందగా, రెండు చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. నలుగురు కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థులు కలుపుకుని మొత్తం 10 మంది స్వతంత్రులు సర్పంచ్లుగా గెలుపొందారు. మండలాల వారీగా ఫలితాలు ఇలా... వేలేరులో బీఆర్ఎస్ మొదటి స్థానంలో నిలిచింది. మొత్తం 12 స్థానాలకు ఆరు చోట్ల బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు గెలవగా, రెండు ఏకగ్రీవం కలుపుకుని ఐదు పంచాయతీల్లో కాంగ్రెస్ పాగా వేసింది. ఒకచోట స్వతంత్రులు గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. హసన్పర్తి మండలంలో 15 పంచాయతీలకు రెండు ఏకగ్రీవం కలిపి ఆరు కాంగ్రెస్, రెండు బీఆర్ఎస్, ఒకటి బీజేపీ మద్దతుదారులు గెలుచుకోగా నాలుగు పంచాయతీలలో కాంగ్రెస్ రెబల్స్, రెండు చోట్ల ఇండిపెండెంట్లు విజయం సాధించారు. ఐనవోలు 17 పంచాయతీలకు 9 కాంగ్రెస్, ఐదు బీఆర్ఎస్, ఒకటి బీజేపీ మద్దతుదారులు, ఒకచోట ఇండిపెండెంట్ గెలిచా రు. పరకాలలో 10 పంచాయతీలకు ఆరు కాంగ్రెస్, నాలుగు బీఆర్ఎస్, ధర్మసాగర్లో 19 గ్రామ పంచాయతీలకు రెండు ఏకగ్రీవం కలిపి 13 చోట్ల కాంగ్రెస్, ఐదుచోట్ల బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. ఒకరు ఇండిపెండెంట్ గెలిచారు. రెండో విడతలోనూ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అనూహ్య విజయం సాధించగా.. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబురాల్లో మునిగారు. హసన్పర్తిలో అధికార పార్టీని దెబ్బతీసిన రెబల్స్ రెండో స్థానంలో నిలిచిన ‘కారు’ సంబురాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంతర్మథనంలో బీఆర్ఎస్, బీజేపీలు -
నవోదయ ప్రవేశ పరీక్ష ప్రశాంతం
ఖిలా వరంగల్: మామునూరు జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశం కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతగా ముగిసింది. 28 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. మొత్తం 5,648 మంది విద్యార్థులకు 4,383 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 89 శాతం విద్యార్థులు హాజరుకాగా 1,265 మంది గైర్హాజరయ్యారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంట వరకు నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని పర్యవేక్షకురాలు, నవోదయ ప్రిన్సిపాల్ డాక్టర్ పూర్ణిమ తెలిపారు. 80 సీట్లకు 4,383 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు చెప్పారు. ఉన్నతాధికారులు, పోలీసు బలగాలు ఉదయం నుంచే ఆయా పరీక్ష కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశాయి. విద్యార్థులను గంటముందే పరీక్ష హాళ్లలోకి అనుమతించారు. పరీక్ష ప్రశాంతంగా నిర్వహించినందుకు అధికారులు, పోలీసులు, పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులకు ప్రిన్సిపాల్ పూర్ణిమ కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 28 కేంద్రాల్లో ఎంట్రెన్స్ మొత్తం 5,648 మందికి 4,383 మంది హాజరు -
108 సిబ్బంది ఉత్తమ సేవలందించాలి
హన్మకొండ అర్బన్: అత్యవసర సేవలందించే ఉద్యోగులు ఎప్పటికప్పుడు అధునాతన పద్ధతులు పాటిస్తూ విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, మెరుగైన సేవలందించడానికి సిద్ధంగా ఉండాలని డీఎంహెచ్ఓ అప్పయ్య అన్నారు. 108 ఉద్యోగుల శిక్షణను కలెక్టరేట్లోని టీజీఓస్ భవనంలో కొనసాతుగుతుండగా శనివారం డీఎంహెచ్ఓ అప్పయ్య పాల్గొని సిబ్బందికి పలు సూచనలిచ్చారు. జీవీకే ఈఎంఆర్ఐ ఈఎంఎల్సీ నిర్వాహకుడు ప్రమోద్ 108 ఉద్యోగులకు శిక్షణ ఇచ్చారు. జిల్లాలో ఈఎంటీ క్రాంతికుమార్, సుధామల్ల సుధా బెస్ట్ కేసు విషయంలో స్టార్ అవార్డును డాక్టర్ అల్లం అప్పయ్య చేతుల మీదుగా అందుకున్నారు. 108 ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి నసీరుద్దీన్, పాటి శివకుమార్, మేనేజర్ మహేశ్గౌడ్, శిక్షకులు ప్రమోద్కుమార్, హనుమకొండ జిల్లా మేనేజర్లు మండ శ్రీనివాస్, గుర్రపు భరత్ కుమార్, రాజ్కుమార్, రాజునాయక్, పైలెట్లు, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు హాజరయ్యారు. హెచ్పీవీ వ్యాక్సిన్తో క్యాన్సర్ను అరికట్టవచ్చు ఎంజీఎం: ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా 14 ఏళ్ల బాలికలకు హెచ్పీవీ వాక్సిన్ ఇవ్వడం ద్వారా వారిని గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ బారిన పడకుండా కాపాడవచ్చని డీఎంహెచ్ఓ అప్పయ్య సూచించారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్లో పీహెచ్సీ, యూపీహెచ్సీ వైద్యాధికారులకు హెచ్పీవీ వ్యాక్సినేషన్పై శిక్షణ నిర్వహించారు. డీఐఓ మహేందర్, శిక్షణాధికారి భార్గవ్ హెచ్పీవీ సంబంధిత కేన్సర్లపై వ్యాక్సిన్ ఇచ్చే రక్షణ చర్యలను వివరించారు. ప్రోగ్రాం అధికారులు ప్రభుదాస్, రుబీనా, భార్గవ్, వైద్యాధికారులు అశోక్రెడ్డి, శిరీష, ప్రవీణ్, సునీల్, జయంతి, విప్లవ్, జ్యోతి, మురళి పాల్గొన్నారు. ఉద్యోగులకు పునశ్చరణ తరగతులు హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య -
నేడే రెండో విడత పోలింగ్
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో ఆదివారం జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్కు అధికార యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. ఐదు మండలాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్, తదుపరి ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటుంది. రెండో విడతలో ధర్మసాగర్, హసన్పర్తి, ఐనవోలు, వేలేరు, పరకాల మండలాల్లో పోలింగ్ జరగనుంది. శనివారం ఆయా మండలకేంద్రాల్లోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి సిబ్బంది కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఈ 5 మండలాల్లో మొత్తం 1,28,315 మంది ఓట ర్లు ఉన్నారు. అధికారుల నియామకం.. 5 మండలాల్లో జీపీలు 73, వార్డులు 694 ఉన్నాయి. ఇందులో 5 ఏకగ్రీవమయ్యాయి. ఒక సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైంది. ప్రస్తుతం 677 జీపీల్లో ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ స్థానానికి 248 మంది, వార్డుస్థానాలకు 1,442 మంది పోటీలో ఉన్నారు. 120 వార్డులు ఏకగ్రీవం కాగా 574 చోట్ల పోలింగ్ జరగనుంది. హసన్పర్తిలో సిబ్బందికి సూచనలిస్తున్న కలెక్టర్ స్నేహ శబరీశ్ -
పోస్టల్ ప్రొడక్ట్స్, స్టాంప్స్పై ఇంటర్న్షిప్
నిట్ వరంగల్ విద్యార్థులు పోస్టల్ ప్రాడక్ట్స్, స్టాంప్స్పై ఇంటర్న్షిప్ చేస్తే ప్రోత్సాహం కల్పిస్తాం. విద్యార్థులు పోస్టల్ సేవల్ని వినియోగించుకునేందుకు జెన్ జెడ్ పోస్టోఫీస్ను నిట్ వరంగల్ క్యాంపస్లో ఏర్పాటు చేశాం. విద్యార్థులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాం. నిట్ వరంగల్ విద్యార్థులతో పాటు అధ్యాపకులకు, సిబ్బందికి ఆధునిక టెక్నాలజీతో సేవలందిస్తాం. సెక్యూరిటీ సిబ్బంది, నాన్ టీచింగ్ స్టాఫ్కు పోస్టల్ ప్రమాద బీమాపై అవగాహన కల్పించి ప్రీమియం చెల్లించేలా ఆసక్తి కనబర్చాం. – వి.హనుమంతు, సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీస్, హనుమకొండ కార్పొరేట్ ఆఫీస్ను తలపిస్తోంది.. మా క్యాంపస్లో ఏర్పాటు చేసిన మా జెనరేషన్కు తగ్గట్టు జెన్ జెడ్ పోస్టాఫీస్ కార్పొరేటర్ స్థాయి ఆఫీస్ను తలపిస్తోంది. ఫ్రీ వైఫై సేవలు ఆస్వాదిస్తున్నాం. కాఫీ లాంజ్లో కూర్చున్న ఫీలింగ్ కలుగుతోంది. ఇతర ఇంజనీరింగ్ కళాశాలల్లోని మా ఫ్రెండ్స్ నిట్లోని జెన్జెడ్ పోస్టాఫీస్ను వీక్షించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. పోస్టాఫీస్లో అందించే సేవలు సద్వినియోగించుకుంటాం. – చిన్న వెంకటరమణ, ఈసీఈ బీటెక్ ఫైనలియర్● -
ఆధునిక టెక్నాలజీతో నేటితరానికి సేవలందించేందుకు మరో అడుగు ముందుకేసింది కేంద్ర సమాచారశాఖ. ఈనెల 10వ తేదీన తెలంగాణలోనే తొలి జెన్ జెడ్ పోస్టాఫీస్ను నిట్ వరంగల్ క్యాంపస్లో అట్టహాసంగా ప్రారంభించింది. తరాల వారధిగా నిలుస్తూ.. రూపాంతరం చెందుతూ వస్తున్న పోస్టల
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా నాటి నుంచి నేటి వరకు అందుబాటులో ఉన్న పోస్టల్ స్టాంప్స్తో ప్రీ మాటిక్ స్టాంప్స్ పేరిట కాకతీయ కళాతోరణం స్టాంప్స్ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. చేర్యాల పెయింటింగ్స్, పోచంపల్లి చీరలు, సంక్రాంతి పండుగ, తాడు బొంగరం ఆట, జాతీయ సమైక్యతను ప్రతిబింబించే స్టాంపులతో ఏర్పాటు చేసిన కాకతీయ కళాతోరణం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. స్టాంపులతో కాకతీయ కళాతోరణం● ఇటీవల ప్రారంభమైన ఆధునిక తపాలా సేవలు ● పురాతన పోస్టల్ స్టాంపులతో కాకతీయ కళాతోరణం ● గోడల చుట్టూ వివిధ స్టాంపుల నమూనాలతో ముస్తాబు ● సాఫ్ట్వేర్ హబ్ టచ్, ఫ్రీ వైఫై, రౌండ్ టేబుల్ సిట్టింగ్ -
సాఫ్ట్వేర్ హబ్ను తలపించేలా
నిట్ వరంగల్ క్యాంపస్లో ఉత్తరం ప్రయాణాన్ని వ్యక్తపరుస్తూ జర్నీ ఆఫ్ లెటర్ పేరిట సాఫ్ట్వేర్ హబ్ను తలపించేలా జెన్ జెడ్ పోస్టాఫీస్ నిలుస్తోంది. విద్యార్థులకు ఆధునిక టెక్నాలజీని అందిస్తూనే ప్రత్యేకను చాటుకునేందుకు నేటి తరం పోస్టల్ సేవల్ని అందుకునేందుకు చెల్లింపులు క్యూఆర్ కోడ్ ద్వారా, ఉచిత వైఫై సౌకర్యం, లైబ్రరీని తలపించేందుకు ముగ్గురు సిట్టింగ్ చేసేలా కాఫీ టేబుల్ మాదిరిగా టేబుల్ను ఏర్పాటు చేశారు. రెండు తెలుగు పేపర్లు, రెండు ఇంగ్లిష్ మ్యాగజైన్లు, ఒక హిందీ మ్యాగజైన్ అందుబాటులో ఉంచారు. ఈ పోస్టాఫీస్ మీటింగ్ స్పాట్ను తలపిస్తోంది. -
క్రీస్తు దీవెనలు ఉండాలి
కాజీపేట రూరల్: సర్వమానవాళి రక్షకుడు ఏసుక్రీస్తు దీవెనలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఓరుగల్లు పీఠం పాలనాధికారి రెవరెండ్ ఫాదర్ దుగ్గింపుడి విజయపాల్ అన్నారు. కాజీపేట ఫాతిమా కేథడ్రల్ చర్చిలో శనివారం ఏసు క్రీస్తు జయంతి 2025, జూబ్లీ వేడుకలు కనులపండువగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాలనాధికారి ఫాదర్ విజయపాల్ మాట్లాడుతూ.. రోమ్ పరిశుద్ధ పోప్ ఫ్రాన్సిస్ ఈ సంవత్సరాన్ని జూబిలీ సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో.. సంవత్సరం పీఠస్థాయిలో, విచారణ, గ్రామ స్థాయిలో ఈ ఉత్సవాలు నిర్వహించాలని ప్రకటించినట్లు తెలిపారు. ఈ జూబ్లీ వేడుకల్లో విశ్వాసులు ఏసుక్రీస్తు జన్మ రహస్యాన్ని ధ్యానిస్తూ జూబిలీ అంతరార్థాన్ని తెలుసుకోవాలన్నారు. ఫాదర్ విజయపాల్ పూజ బలిని సమర్పించి జూబిలీ సందేశాన్ని అందించి ప్రజల కోసం ప్రార్థించారు. కార్యక్రమంలో ఓరుగల్లు దైవాంకితులు, విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లా స్థాయి స్సైన్స్ ఫేర్, విద్యాసంవత్సరానికి మంజూరైన ఇన్స్పైర్ మనక్ అవార్డు ప్రదర్శనలు ఈనెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్వీ.గిరిరాజ్గౌడ్, జిల్లా సైన్స్ అఽధికారి శ్రీనివాసస్వామి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇన్స్పై ర్కు సంబంధించి మంజూరైన ప్రతీ విద్యార్థి ప్రదర్శనలు ఏర్పాటు చేసేలా ప్రధానోపాధ్యాయుడు బాధ్యత వహించాలని పేర్కొన్నారు. హనుమకొండ విద్యానగర్లోని సెయింట్ పీటర్స్ ఎడ్యూ స్కూల్లో ఈవైజానిక ప్రదర్శనల ఏర్పాటు ఉంటుందని తెలిపారు. బాల వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనేందుకు ప్రకటించిన ఏడు ఇతివృత్తాల్లో ఏవైనా రెండింటికి సంబంధించిన జూనియర్ విభాగం నుంచి ఇద్దరు, సీనియర్ విభాగం నుంచి ఇద్దరు విద్యార్థుల చొప్పున పాఠశాల నుంచి నలుగురు విద్యార్థులతో 4 ప్రదర్శనలకు అవకాశం ఉంది. కాగా, 15న సన్నాహక సమావేశాన్ని అదే స్కూల్లో నిర్వహించబోతున్నట్లు డీఈఓ తెలిపారు. ఆయా కమిటీల కన్వీనర్లు, కోకన్వీనర్లు హాజరుకావాలని సూచించారు. వరంగల్ క్రైం: పోలీస్ అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. కమిషనరేట్లో సివిల్ ఎస్సైలుగా పదోన్నతి పొందిన సుదర్శన్రెడ్డి, రవీంద్రచారి, యాదగిరి, కృష్ణమూర్తి, అజీదుద్దీన్, ఉప్పలయ్య, సారంగపాణి, రాజేశ్వరి సీపీని శుక్రవారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ.. అప్పగించిన పనులు సమర్థవంతంగా పూర్తి చేయాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని సూచించారు.. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ ఎంటీఎం, ఎంఎస్డబ్లూ, ఎంహెచ్ఆర్ఎం తదితర కోర్సుల (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) మూడవ సెమిస్టర్ పరీక్షలు జనవరి 3వ తేదీనుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 3న మొదటి పేపర్, 5న రెండో పేపర్, 7న మూడవ పేపర్, 9న నాల్గవ పేపర్, 12న ఐదవ పేపర్, 16న ఆరవ పేపర్ పరీక్షలు ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహించనున్నట్లు వివరించారు. వెబ్కాస్టింగ్ ఏర్పాట్ల పరిశీలనన్యూశాయంపేట: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నల్లబెల్లి, దుగ్గొండి, సంగెం, గీసుగొండ మండలాల్లోని 74 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియను వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించేందుకు అవసరమైన ఏర్పాట్లను కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సిద్ధం చేశారు. వెబ్కాస్టింగ్ ఏర్పాట్లను సాధారణ ఎన్నికల పరిశీలకురాలు బాలమాయాదేవితో కలిసి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సత్యశారద శనివారం పరిశీలించారు. -
వరంగల్ జిల్లాలో..
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లాలో రెండో విడతలో దుగ్గొండి, గీసుకొండ, నల్లబెల్లి, సంగెం మండలాల్లో ఆదివారం పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి 1,008 పోలింగ్ కేంద్రాలకు పటిష్ట భద్రత మధ్య బ్యాలెట్ బాక్సులు శనివారం సాయంత్రం తీసుకెళ్లారు. దుగ్గొండి మండలంలో 282, గీసుకొండ మండలంలో 188, నల్లబెల్లి మండలంలో 252, సంగెం మండలంలో 286 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1,39,100 మంది ఓట్లు ఉండగా, 85 శాతంపైనే పోలింగ్ నమోదవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కలెక్టర్ సత్యశారద ఆదివారం గీసుకొండ, సంగెం, నల్లబెల్లి, దుగ్గొండి మండల కేంద్రాల్లోని పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాలను సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోటాపోటీ.. జిల్లాలో మొత్తం గ్రామ పంచాయతీలు 117 ఉండగా, ఒక పంచాయతీకి నామినేషన్లు దాఖలు కాలేదు. ఐదు ఏకగ్రీవంకాగా, 111 పంచాయతీల్లో పోలింగ్ జరగనుంది. ఇందులో 354 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. వార్డులు 1,008 ఉండగా, 978 ఏకగ్రీవమయ్యాయి. 906 వార్డులకుగాను 2,203మంది పోటీ పడుతున్నారు. సంగెం : ఎన్నికల సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్న సిబ్బంది -
గుడులు కట్టిస్తాం.. బడులు బాగు చేస్తాం
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్లో రోజులు గడిచినా కొద్ది గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం పీక్కు చేరుతోంది. ‘మీరేం అడిగితే అది చేస్తాం. అభివృద్ధికి పాటుపడతాం. గుడులు కడతాం, బడులు బాగు చేస్తాం’ అంటూ అలవి కాని హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు సర్పంచ్ అభ్యర్థులు. రెండో విడత ప్రచారానికి శుక్రవారం తెరపడగా.. శనివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 15న (సోమవారం) సాయంత్రం 5 గంటలకు మూడో విడత ప్రచారం ముగియనున్న నేపథ్యంలో ప్రచారం కొత్తపుంతలు తొక్కుతోంది. వ్యూహాలతో ముందుకు వెళ్తూ.. మొదటి విడతలో ఉమ్మడి జిల్లాలో 555 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 53 ఏకగ్రీవమయ్యాయి. 502 చోట్ల ఈనెల 11న పోలింగ్ నిర్వహించారు. 333 జీపీలను కాంగ్రెస్ మద్దతుదారులు కై వసం చేసుకోగా, బీఆర్ఎస్ 148, బీజేపీ 17, సీపీఐ 1, ఇతర్లు 56 చోట్ల గెలుపొందారు. ఈ ఫలితాలపై పోస్టుమార్టం నిర్వహించిన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు.. రెండు, మూడు విడతల్లో మరింత మెరుగైన ఫలితాల కోసం వ్యూహాలు రూపొందిస్తున్నారు. కొంచెం ఎఫర్ట్ పెడితే మరిన్ని స్థానాలు పెరిగేవని కాంగ్రెస్ నేతలు చెప్పుకొస్తుండగా, మరింత వ్యూహాత్మకంగా ముందుకు సాగుతామని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. బీజేపీ సైతం తమ మద్దతుదారులను గెలిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామంటున్నారు. రెండో విడతలో ఉమ్మడి జిల్లాలో మొత్తం 564 పంచాయతీలకు 57 ఏకగ్రీవం కాగా, 507 గ్రామాల్లో ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి జోరుగా ప్రలోభాలు.. పంపకాలు రెండో విడత అభ్యర్థుల గెలుపు కోసం అన్ని పార్టీల నాయకులు శనివారం రాత్రి నుంచే విచ్చలవిడిగా ధనప్రవాహానికి శ్రీకారం చుట్టారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు గ్రామ పంచాయతీలను బట్టి ఓటుకు రూ.500ల నుంచి రూ.2,500ల వరకు పంపిణీ చేశారన్న ప్రచారం ఉంది. ఒక ఇంట్లో నలుగురు ఓటర్లుంటే ఫుల్బాటిల్.. కిలో చికెన్ చొప్పున చాలా గ్రామాల్లో సరఫరా చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ సాగిందనే ఆరోపణలూ ఉన్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థుల పాట్లు డబ్బు, మద్యం కానుకల ఎర గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల నేతలు రెండో విడతలో ఉమ్మడి జిల్లాలో 564లో 57 ఏకగ్రీవం 507 పంచాయతీలకు హోరాహోరీపరకాల మండలానికి చెందిన ఓ మేజర్ గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్గా పోటీ చేస్తున్న అభ్యర్థి ఒకరు ఓ సామాజిక వర్గానికి చెందిన ప్రజల డిమాండ్ నెరవేర్చేందుకు అడిగిందే తడవుగా గుడి కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఇది తెలిసిన మరో అభ్యర్థి సైతం ఆ సామాజిక వర్గం ఓటర్ల వద్దకు వెళ్లి తన సంసిద్ధతను వ్యక్తం చేయడం వివాదాస్పదమైంది. ఇద్దరూ తేల్చుకునేలోపే రెండో విడత ప్రచారం ముగిసింది. -
సినిమాకు వెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల
● 25 తులాల బంగారు ఆభరణాలు చోరీ హసన్పర్తి: సినిమాకు వెళ్లొచ్చేసరికి దుండగులు ఆ ఇంటిని గుల్ల చేశారు. తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన కేయూ పీఎస్ పరిధిలోని వెంకటేశ్వరకాలనీ–5లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కాలనీకి చెందిన ఆకాశ్ శ్రీకార్ ఓ ప్రైవేట్ ఫైనాన్స్లో పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి కుటుంబీకులతో కలిసి సినిమాకు వెళ్లాడు. తిరిగి ఇంటికొచ్చే సరికి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. అనుమానంతో లోపలికి వెళ్లి చూడగా.. బీరువాలో ఉన్న సుమారు 25 తులాల బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. బాఽధితుడు వెంటనే కేయూ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో హనుమకొండ ఏసీపీ నర్సింహారావు, ఇన్స్పెక్టర్ రవికుమార్ ఘటనాస్థలిని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం జాగిలాలతో గాలించారు. క్లూస్ టీం వేలిముద్రలు సేకరించింది. -
చెత్త శాంపిళ్లను సమర్థంగా సేకరించాలి
బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ వరంగల్ అర్బన్: నగరవ్యాప్తంగా పలు డివిజన్ల నుంచి ఏరకమైన తడి, పొడి చెత్త సేకరణ జరుగుతుందని క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి, నివేదిక సమర్పించాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ సూచించారు. శుక్రవారం వరంగల్ పరిధి పోతన నగర్, బల్దియా ఆవరణలోని బయో మిథనైజేషన్ ప్లాంట్తో పాటు ఎన్ఐయూఏ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ ఎఫ్సైర్స్) వారు సేకరిస్తున్న చెత్త శాంపిళ్ల తీరును కమిషనర్ పరిశీలించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏ రకమైన చెత్త వస్తుందో ఎన్ఐయూఏ ప్రతినిధులు చేస్తున్న అధ్యయనానికి సిబ్బంది సహకరించాలని కోరారు. కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్లు గోల్కొండ శ్రీను, నరేందర్. శానిటరీ ఇన్స్పెక్టర్లు మధు, రాజు పాల్గొన్నారు. -
సేవల వినియోగంపై చైతన్యపర్చాలి
ఎంజీఎం: ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలు వినియోగించుకునేలా చైతన్యపర్చాలని హనుమకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాది ఎం.కవిత అన్నారు. శుక్రవారం లష్కర్ సింగారం పట్టణ ఆరోగ్య కేంద్రంలో లీగల్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో న్యాయవాది కవిత మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది అందిస్తున్న సేవలను ప్రజలు వినియోగించుకుని వైద్య పరంగా ప్రజలు ఖర్చు తగ్గించుకునేలా అవగాహన కలిగించడంలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితోపాటు పారా లీగల్ వలంటీర్లు కూడా కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వపరంగా అందిస్తున్న ఆరోగ్య కుటుంబ సంక్షేమ సేవలు, ఉచితంగా అందించే డయాగ్నస్టిక్ సేవలు, మందులు, వైద్య సలహాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఒత్తిడిని అధిగమించడం అలాగే మంచి ఆహారపు అలవాట్ల ద్వారా జీవనశైలి వ్యాధులు నియంత్రించవచ్చన్నారు. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే సందర్భంగా హనుమకొండ డీఎల్ఎస్ఏ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సంయుక్తంగా ఈకార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి హైదర్, జిల్లా మాస్ మీడియా అధికారి వి.అశోక్రెడ్డి, హెల్త్ సూపర్వైజర్లు ఈ.బాబు, మరియా థామస్, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఏఎన్ఎంలు, ఆశాలు పాల్గొన్నారు. -
ఘనంగా ఐఎంఏ ప్రమాణ స్వీకారం
ఎంజీఎం: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 2025–26 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. వరంగల్ నగరంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్, యాక్షన్ కమిటీ చైర్మన్ రవీందర్రెడ్డితో పాటు నూతన కార్యవర్గ సభ్యులు జ్యోతి ప్రజ్వళన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా నూతన అధ్యక్షుడు డాక్టర్ మన్మోహన్రాజు, ప్రస్తుత అధ్యక్షుడు డాక్టర్ నాగర్జునరెడ్డి నుంచి అధ్యక్ష మెడల్ను స్వీకరించారు. అనంతరం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై న శిరీష్కుమార్, ఉపాధ్యక్షులు రాజిరెడ్డి, రంజిత్కుమార్, కూరపాటి రాధిక, జాయింట్ సెక్రటరీలు షఫీ, ప్రసన్నకుమార్, దిడ్డి స్వప్నలత, ఆర్థిక కార్యదర్శి వేములపల్లి నరేశ్తో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సెంట్రల్ కౌన్సిల్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈకార్యక్రమానికి విశిష్ట అతిథులుగా డాక్టర్ కాళీ ప్రసాద్, శేషుమాధవ్, కస్తూరి ప్రమీల, డీఎంహెచ్ఓ అప్పయ్య, డాక్టర్ సుధీర్, విజయ్చందర్రెడ్డి, బందెల మోహన్రావు హాజరయ్యారు. -
ప్రజాస్వామ్య పరిరక్షణ అందరి బాధ్యత
విద్యారణ్యపురి: ప్రజాస్వామ్య పరిరక్షణ అందరి బాధ్యత అని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం.కోదండరాం అన్నారు. హనుమకొండ ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో ‘ఇండియా 2047 రియలైజింగ్ ది విజన్ ఆఫ్ ఎ డెవలప్డ్ ఈక్విటబుల్ అండ్ సస్టెయినబుల్ రిపబ్లిక్’ అంశంపై నిర్వహిస్తున్న జాతీయ సదస్సు శుక్రవారం ముగిసింది. ముగింపు సభకు ముఖ్య అతిథిగా హాజరైన కోదండరాం మాట్లాడుతూ.. ఇలాంటి జాతీయ సదస్సుల్లో చర్చల ద్వారా పలు అంశాలపై అవగాహన పెంపొందుతుందన్నారు. ఈసదస్సులో విశిష్ట అతిథిగా ఆంధ్రప్రదేశ్ సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ కన్వీనర్, ఆల్ఇండియా ఫోరం ఫర్ రైట్ ఎడ్యుకేషన్ మెంబర్ ప్రిసిడియం డి రమేష్ పట్నాయక్ హాజరై మాట్లాడారు. పబ్లిక్ పాలసీ ఎక్స్పర్ట్ అండ్ కన్సల్టెంట్ ఎట్ది ఫెస్టిసైడ్ ఆక్షన్ నెట్వర్క్స్ ఇండియా ప్రొఫెసర్ దొంతి నర్సింహారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ బి.చంద్రమౌళి, సదస్సు కన్వీనర్ డాక్టర్ సామ్యూల్ ప్రవీణ్కుమార్, నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వాగేషన్, ప్రఖ్యాత ట్రాన్స్జెండర్ రచన మందరబోయిన, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి.సుహాసిని, అధ్యాపకులు సురేశ్బాబు, ఎం.అరుణ, సుజాత, మధు, కె.శ్రీనివాస్, రామకృష్ణారెడ్డి, పద్మ, సారంగపాణి, యుగేందర్ తదితరులు పాల్గొన్నారు. 46 మంది పరిశోధన పత్రాలు సమర్పించారు. పాల్గొన్న ప్రతినిధులకు సర్టిఫికెట్లు అందజేశారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ముగిసిన జాతీయ సదస్సు -
సకాలంలో పరిహారం అందించాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో అత్యాచార కేసుల్లో బాధితులకు సకాలంలో పరిహారం అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అత్యాచార కేసుల్లో బాధితులకు పరిహారం చెల్లింపుపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అత్యాచార బాధితులకు పరిహారం చెల్లింపులో ఆలస్యం జరగకుండా చూడాలన్నారు. ప్రతీ రెండు నెలలకోసారి కమిటీ సమావేశమవ్వాలని, అందులో చర్చించే అంశాలను ముందస్తుగా తెలియజేయాలన్నారు. అదేవిధంగా అధికారులు అత్యాచార ఘటనలు జరగకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సమావేశంలో డీడబ్ల్యూఓ జయంతి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ నిర్మల, గిరిజన సంక్షేమ శాఖ అధికారి ప్రేమకళ, బీసీ సంక్షేమ శాఖ అధికారి నరసింహస్వామి, సీఎంఓ సుదర్శన్ రెడ్డి, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ సంజీవరావు, ఇన్చార్జ్ డీసీపీఓ ఎస్.ప్రవీణ్ కుమార్, ఈఓ సింధురాణి, డీవీ యాక్ట్ కౌన్సిలర్ పావని, భరోసా ఎస్సై శ్రీలత, పీఎంహెచ్ఎన్ డాక్టర్ రూబీన, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, తదితరులున్నారు. -
డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్ల ఏర్పాటు
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాల్లోని ఐదు మండలాల్లో ఈనెల 14న రెండో విడత ఎన్నికల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. రెండో విడతలో ఎన్నికలు నిర్వహించే ధర్మసాగర్, హసన్పర్తి, ఐనవోలు, వేలేరు, పరకాల మండలాల ఎంపీడీఓలు, ఇతర అధికారులు ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షించారు. ధర్మసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, హసన్పర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో, ఐనవోలు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో, వేలేరు, పరకాల మండల కేంద్రాలలోని ఎంపీడీఓ కార్యాలయాల్లో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో టెంట్లు, కౌంటర్లు, ఫర్నిచర్, తాగునీరు, భోజన వసతి, తదితర ఏర్పాట్లు కల్పించారు. శనివారం ఉదయం నుంచి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఎన్నికల సామగ్రితో సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లేలా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. -
‘కోచ్’.. చకచకా...
శరవేగంగా కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులుకాజీపేట రూరల్: కాజీపేట మండలం అయోధ్యపురంలో రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ (ఆర్ఎంయూ–కోచ్ ఫ్యాక్టరీ) నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 200 మల్టిపుల్ కోచ్ల సామర్థ్యం గల యూనిట్ను రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, పవర్ మెక్ ప్రాజెక్ట్ లిమిటెడ్ అత్యాధునిక టెక్నాలజీ సిస్టంతో రాత్రి, పగలు నిర్మిస్తున్నాయి. 160 ఎకరాల్లో రూ.586 కోట్లతో 2023లో ప్రారంభించిన ఆర్ఎంయూ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్లో మల్టీపర్పస్ కోచ్ల తయారీ, వందేభారత్ కోచ్లను తయారు చేయనున్నారు. ఇప్పటి వరకు రైల్వే జీఎం, ఎంపీ, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు ఈ ప్రాజెక్ట్ను తనిఖీ చేసి పనులు పరిశీలించారు. త్వరగా ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయాలని అధికాలను ఆదేశించారు. ఆర్ఎంయూ ప్రధాన షెడ్లలో యంత్రాల ఫిట్టింగ్ జరుగుతోంది. ఇప్పటికే 80 శాతం నిర్మాణ పనులు పూర్తయినట్లు రైల్వే అధికారులు తెలిపారు. 2026 మార్చి లేదా ఏప్రిల్ నెలలో కోచ్ల ఉత్పత్తి ప్రారంభించేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 10 వేల మందికి ఉపాధి లభించనుంది. చిన్న పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. ట్రాక్ పనులు, ఆర్యూబీ నిర్మాణం ఆర్ఎంయూలో తయారైన ఇంజన్లు బయటకు వెళ్లేందుకు రైల్వే ట్రాక్ నిర్మిస్తున్నారు. ఈ ట్రాక్ 15 రోజుల్లో పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అయోధ్యపురం గ్రామ ప్రజల కోసం, రైల్వే గేట్లో నుంచి వివిధ గ్రామాలకు రాకపోకలు సాగించే ప్రజల సౌకర్యార్థం రోడ్ అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వారం రోజుల్లో ఆర్యుబీని అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. భూములిచ్చాం.. ఉద్యోగాలివ్వాలి: నిర్వాసితులు ‘జీవనోపాధికి ఆధారమైన భూములను రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఇచ్చాం. ఫ్యాక్టరీలో మాకు ఉద్యోగాలు కల్పించాలని ఇప్పటి వరకు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్రెడ్డి, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాగరాజు, రైల్వే అధికారులు, జిల్లా అధికారులను కలిసి కోరాం. ఇప్పటికై నా మా గోడును ఆలకించి ఉద్యోగాలు కల్పించి ఆదుకోవాలి’ అని 114 మంది అయోధ్యపురం భూనిర్వాసితుల కుటుంబాలు కోరుతున్నాయి. రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రధాన షెడ్లలో కొనసాగుతున్న యంత్రాల ఫిట్టింగ్ షెడ్డునుంచి బయటకు కనెక్టివిటీ ట్రాక్ సిద్ధం రాకపోకలకు ఆర్యూబీ నిర్మాణం వచ్చే ఏప్రిల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు ఆర్ఎంయూ ప్రాజెక్ట్లో నిర్మించేవి ఇవే..మెయిన్షాప్, పేయింట్ షాప్, స్టోర్ వార్డు, టెస్ట్ షాప్, క్యాంటీన్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఎలక్ట్రిక్ సబ్స్టేషన్, సెక్యూరిటీ పోస్ట్, రెస్ట్ హౌజ్, సేవగ్ ట్రీట్మెంట్ ప్లాంట్, పంప్హౌజ్, టాయిలెట్ బ్లాక్, ప్యాకెజ్ సబ్స్టేషన్, శౌవర్ టెస్ట్, రోడ్ వే బ్రిడ్జి, పంప్ హౌజ్, జీఎల్ఆర్, పిట్ ట్రావెర్సర్, వ్యాగన్ వే బ్రిడ్జి, గార్డు పోస్టు, ట్రాక్ గేట్, ఆర్యూబీ, పార్కింగ్, 2,000 కేఎల్ కెపాసిటీ పాండ్, స్కార్ప్ బిన్స్, టర్న్బ్రిడ్జి, బౌండ్రివాల్, బాలెస్ట్ట్రాక్, రోడ్, పాత్వే, డ్రెయినేజీలు నిర్మిస్తున్నారు. -
అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని
హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయాన్ని శుక్రవారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, భూపాలపల్లి జిల్లా ఎలక్షన్ అబ్జర్వర్, టీజీఎంఎస్ఐడీసీ, ఏండీ ఫణింద్రరెడ్డి ఐఏఎస్ సందర్శించారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు భద్రకాళి శేషు, పార్నంది నరసింహమూర్తి వారిని ఆలయ మర్యాదలతో స్వాగతించారు. వారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ధర్మకర్తలు ఓరుగంటి పూర్ణచందర్, పాలడుగుల అంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా అమ్మవారిని దర్శించుకున్న భారతీయ హిందూ పరిషత్ అంతర్రాష్ట్రీయ సంస్థ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కోల శివరామకృష్ణ మాట్లాడుతూ.. భారతదేశాన్ని హిందూ దేశంగా, గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈమేరకు దేవాలయ ప్రాంగణంలో ఐదు కోట్ల సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంప శ్రవణ్కుమార్, సభ్యులు వరుణ్కుమార్, దిడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జేఎన్ఎస్లో శుక్రవారం 11వ సబ్ జూనియర్స్ అండర్–14 బాలబాలికల జిల్లా స్థాయి టెన్నికాయిట్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి. కాంగ్రెస్ యువజన నాయకుడు విష్ణురెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఎంపికలు ప్రారంభించారు. ఉజ్వల భవిష్యత్కు క్రీడలు దోహదపడతాయన్నారు. ఇందులో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు మేడ్చల్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని అసోసియేషన్ వరంగల్ జిల్లా సెక్రటరీ గోకారపు శ్యామ్కుమార్ తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర, ఉమ్మడి జిల్లా కోశాధికారులు రాజ్కుమార్, మహ్మద్ జాహూర్, పీఈటీ, పీడీలు నర్సయ్య, శ్రీధర్, శ్రీనివాస్, నిర్మల, సీనియర్ క్రీడాకారులు సీతారాం, శ్రీనివాస్ పాల్గొన్నారు.వరంగల్ క్రైం: ఈనెల 21వ తేదీన జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్ను కక్షిదారులు వినియోగించుకోవాలని, రాజీమార్గం ద్వారా వారి కేసులు పరిష్కరించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం లోక్ అదాలత్కు సంబంధించి వరంగల్ కమిషనరేట్ పోలీసులు రూపొందించిన వాల్ పోస్టర్లను సీపీ సన్ప్రీత్ సింగ్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఈ జాతీయ మెగా లోక్ అదాలత్లో రాజీ పడదగిన క్రిమినల్, సివిల్, ఆస్తి, కుటుంబ, వైవాహిక, బ్యాంకు రికవరీ, విద్యుత్, చెక్ బౌన్స్, తదితర కేసులు పరిష్కరించుకోవచ్చని సూచించారు. చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బులను వృథా చేసుకోవద్దన్నారు. ఎవరైనా కేసుల్లో రాజీ కావాలనుకున్నవారు పోలీస్ అధికారులను సంప్రదించాలని, లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమం వరంగల్ ఏఎస్పీ శుభం, ఏసీపీ డేవిడ్ రాజు, ఇన్న్స్పెక్టర్లు రమేశ్, కరుణాకర్ పాల్గొన్నారు. ఖిలా వరంగల్: ఖిలా వరంగల్ కోటను ప్రపంచ పర్యాటకులను ఆకర్శించే స్థాయిలో అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వర్చువల్ రియాల్టీని అందుబాటులో తీసుకుని రావడానికి మంత్రి కొండా సురేఖ కసరత్తు చేశారు. ఆమె ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం ఖిలా వరంగల్ మధ్యకోటలోని శిల్పాల ప్రాంగణాన్ని హైదరాబాద్కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి రంజిత్ నాయక్, డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్, వరంగల్ డీఆర్ఓ విజయలక్ష్మి, తహసీల్దార్ ఇక్బాల్, డీటీఓ శివాజీ సందర్శించారు. ఆనాటి కట్టాడాలు, నిర్మాణాల్ని వారు పరిశీలించారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి పనులపై కసరత్తు చేశారు. చేయాల్సిన అభివృద్ధి పనులపై ప్రత్యేక నివేదిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు బైరబోయిన ఉమ, వేల్పుగొండ సువర్ణ, టార్చ్ కార్యదర్శి అరవింద్ ఆర్య, గైడ్ రవియాదవ్, కాంగ్రెస్ నేతలు బోగి సురేశ్, బైరబోయిన దామోదర్ తదితరులు పాల్గొన్నారు. -
గైర్హాజరైన వారికి నోటీసులు జారీ చేయాలి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: మొదటి విడతలో ఎన్నికల విధులకు గైర్హాజరైన సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీచేయాలని జిల్లా పంచాయతీ అధికారి కల్పనను వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నోడల్ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికలు పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాల్సిన అవసరాన్ని అధికారులకు గుర్తుచేశారు. అధికారులు పోలింగ్ రోజున ఎలాంటి లోపాలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెెక్టర్ జి.సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, నోడల్ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర వాలీబాల్ జట్టు కోచ్గా జీవన్గౌడ్ వరంగల్ స్పోర్ట్స్: రాజస్తాన్ రాష్ట్రం ఝాంజహు జిల్లాలోని పీలానీలో ఈనెల 16వ తేదీ నుంచి జరగనున్న 49వ జూనియర్ జాతీయస్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొనే తెలంగాణ బాలుర జట్టు కోచ్గా హనుమకొండ డీఎస్ఏ కోచ్ బత్తిని జీవన్గౌడ్ నియమితులయ్యాడు. ఈ మేరకు తెలంగాణ వాలీబాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు గజ్జెల రమేష్బాబు, ఎన్వీ హన్మంతరెడ్డి శుక్రవారం నియామక ఉత్తర్వులను జారీ చేశారు. హనుమకొండ జిల్లా పంథిని గ్రామానికి చెందిన జీవన్గౌడ్ జిల్లా క్రీడా ప్రాథికార సంస్థ వాలీబాల్ కోచ్గా జేఎన్ స్టేడియంలో విధులు నిర్వహిస్తున్నాడు. జాతీయస్థాయిలో తెలంగాణ నుంచి ప్రా తినిధ్యం వహిస్తున్న రాష్ట్ర జట్టుకు కోచ్గా ఎంపికై న జీవన్గౌడ్ను డీవైఎస్ఓ గుగులోత్ అశోక్కుమార్, వాలీబాల్ అసోసియేషన్ బాధ్యులు, క్రీడాకారులు అభినందించారు. 15నుంచి ఎఫ్ఆర్ఎస్ హాజరుకేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిపాలనాభవనంలో ఉద్యోగులకు ముఖ గుర్తింపు (ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్) హాజరును ఈనెల 15నుంచి అమలుచేయనున్నట్లు శుక్రవారం రిజిస్ట్రార్ వి.రామచంద్రం తెలిపారు. వీసీ కె.ప్రతాప్రెడ్డి సమక్షంలో ఈ కొత్త హాజరు విధానాన్ని ప్రారంభించనున్న ట్లు పేర్కొన్నా. మొదటి విడతగా యూనివర్సిటీ క్యాంపస్ కాలేజీ, దూరవిద్యాకేంద్రం, ఫార్మసీ కాలేజి, కో–ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాల, పరీక్షల విభాగం, హా స్టళ్ల కార్యాలయాల్లో ఈ ముఖగుర్తింపు హాజ రును తప్పనిసరి చేయనున్నట్లు వివరించారు. ‘ఓపెన్’ అడ్మిషన్లకు అవకాశం విద్యారణ్యపురి: ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్లో ఈ విద్యాసంవత్సరం 2025–26లో ప్రవేశాలకుగాను తత్కాల్ స్కీంలో భాగంగా మరోసారి అవకాశం కల్పించారు. అపరాధ రుసుంతో ఈనెల 15, 16, 17 తేదీల్లో దరఖాస్తులు చేసుకోవచ్చని హనుమకొండ డీఈఓ ఎల్వి గిరిరాజ్గౌడ్, ఓపెన్ స్కూల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ ఎ.సదానందం ఒక ప్రకటనలో తెలిపారు. టాస్ వెబ్సైట్ హెచ్టీటీఎస్//డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.తెలంగాణస్కూల్.ఓఆర్జీ లేదా మీసేవా , టీజీఆన్లైన్ సెంటర్లలో దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న తర్వాత సంబంధిత డాక్యూమెంట్లు అక్రిడిటెడ్ విద్యాసంస్థలో హైస్కూల్స్, కాలేజీల్లో సంబంధిత దరఖాస్తుతోపాటు సమర్పించాలన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. -
కాజీపేట టు పెంబర్తి..
విద్యారణ్యపురి : మూడేళ్లక్రితం మహబూబాబాద్, ములుగు జిల్లా కేంద్రాల్లో మహాత్మాజ్యోతిబా పూలే బీసీ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలు ఏర్పాటుచేశారు. వివిధ డిగ్రీకోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం కల్పించగా అప్పట్లో అడ్మిషన్లు ఆశించిన స్థాయిలో కాలేదు. దీంతో ఆ తర్వాత మహబూబాబాద్, ములుగులోని ఆ రెండు బీసీ మహిళా డిగ్రీ కళాశాలలను అదే పేర్లతోనే కాజీపేటలోని మహాత్మాజ్యోతిబా పూలే బీసీ ఐదేళ్ల ‘లా’కోర్సు నడుస్తున్న భవనంలోనికి షిఫ్టింగ్ చేశారు. రెండేళ్ల నుంచి ఆ భవనంలోనే అరకొర సౌకర్యాలతోనే ఆయా డిగ్రీ కళాశాలలను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఐదు కోర్సుల్లోనే అడ్మిషన్లు అయ్యాయి. బీఏ, బీకాం సీఏ, ఎంపీసీఎస్, ఎంఎస్డీఎస్, బీఎస్సీ బీజెడ్సీ కోర్సుల్లో సుమారు 230 మంది వరకు విద్యార్థినులు చదువుతున్నారు. ఫస్టియర్, సెకండియర్ కోర్సులు కొనసాగుతుండగా వచ్చే సంవత్సరం ఫైనలియర్ విద్యార్థినులు కూడా ఉంటారు. పది మంది రెగ్యులర్ లెక్చరర్లు ఉండగా ఆరుగురు గెస్ట్ ఫ్యాకల్టీ విద్యాబోధన చేస్తున్నారు. స్పెషల్ ఆఫీసర్గా విశ్రాంత అధ్యాపకుడు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ‘లా’విద్యార్థినుల ఆందోళన ఒకే భవనంలో ఐదేళ్ల ‘లా’కోర్సులో మూడు సంవత్సరాలకు సంబంధించిన విద్యార్థినులు చదువుతున్నారు. ఈభవనంలోనే డిగ్రీ కళాశాల విద్యార్థినులు కూడా ఉండడంతో తమకు కూడా సదుపాయాలు సరిపోవడం లేదని ‘లా’విద్యార్థినులు ఇటీవల ఆందోళనకు దిగారు. డిగ్రీ కళాశాలల వేరే చోట నిర్వహించుకోవాలని ఆందోళన చేపట్టారు. డిగ్రీ కళాశాలను పెంబర్తికి షిఫ్టింగ్ చేయాలని ఆదేశాలు ‘లా’కళాశాల భవనంలోనే కొనసాగుతున్న బీసీ మహిళా డిగ్రీ కళాశాలల (మహబూబాబాద్, ములుగు)ల్లోని విద్యార్థినులను జనగామ జిల్లా పెంబర్తిలో ఇప్పటికే నిర్వహిస్తున్న మహాత్మాజ్యోతిబాపూలే బీసీ మహిళా డిగ్రీ గురుకుల కళాశాలకు షిష్టింగ్ చేయాలని (ఈనెల 20వతేదీవరకు) బీసీ గురుకులాల వెల్ఫేర్ రాష్ట్ర కార్యదర్శి సైదులు ఇటీవల ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు ఇందుకు సంబంఽధించిన ఉత్తర్వులు ఉమ్మడి వరంగల్ బీసీ గురుకులాల ఆర్సీఓకు, మహబూబాబాద్, ము లుగు డిగ్రీ కళాశాలల కలిపి నిర్వహిస్తున్న డిగ్రీ కళా శాల స్పెషల్ ఆఫీసర్కు అందాయి. దీంతో కొన్నినెలలుగా ఈ కళాశాలకు వివిధ చోట్ల అద్దెభవనం చూశారు.కానీ అనువైన భవనం లభించడం లేదంటున్నారు. ఇప్పుడు కళాశాలలోని విద్యార్థినులను పెంబర్తి కళాశాలకు తరలించాలని యోచిస్తున్నారు. ససేమిరా అంటున్న విద్యార్థినుల తల్లిదండ్రులు ఈ కళాశాల మహబూబాబాద్, ములుగు జిల్లాలకు సంబంధించినది కావడంతో ఆయా జిల్లాల్లోని గ్రామీణ ప్రాంత విద్యార్థినులు కూడా కాజీపేటలోని ఈ కాలేజీలో చదువుకుంటున్నారు. తాము పట్టణ ప్రాంతంలో ఉందని ప్రవేశాలు పొందామని, ఇప్పుడు మళ్లీ తమను పెంబర్తి మహిళా గురుకుల కళాశాలకు తరలిస్తే దూరం అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము వెళ్లబోమని స్పెషల్ ఆఫీసర్ ,అధ్యాపకులతోనూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈవిషయం తల్లిదండ్రులకు తెలియడంతో ఇటీవల కొందరు కాజీపేటకు వచ్చి ఇక్కడి నుంచి తరలించొద్దని స్పెషల్ ఆఫీసర్కు విన్నవించుకున్నారు. పలువురు తల్లిదండ్రులు బీసీ గురుకులాల ఉమ్మడి వరంగల్ ఆర్సీఓతోనూ మాట్లాడారని సమాచారం. ఎంజేపీటీబీసీడబ్ల్యూ ఆర్డీసీ రాష్ట్ర సెక్రటరీ ఆదేశాల మేరకు పెంబర్తిలోని బీసీ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలకు తరలించాలనే యోచనలో ఉన్నారు.బీసీ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల షిఫ్టింగ్కు ఆదేశాలు వ్యతిరేకిస్తున్న విద్యార్థినులు, తల్లిదండ్రులు మహబూబాబాద్, ములుగు జిల్లాలకు కలిపి కాజీపేటలో ఏర్పాటు మరోసారి తరలింపునకు ఆదేశాలు జారీ -
లక్ష్యంతో చదివితే ఉన్నతస్థితికి..
కేయూ క్యాంపస్: విద్యార్థులు పట్టుదల, లక్ష్యంతో చదివితే ఉన్నత స్థితికి చేరుకోవచ్చని కాకతీయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ప్రతాప్రెడ్డి అన్నారు. శుక్రవారం కాకతీయ యూనివర్సిటీలోని యూనివర్సిటీ కాలేజీ పరిధిలోని అన్ని విభాగాల్లో ఈ విద్యాఏడాది పీజీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు కేయూలోని ఆడిటోరియంలో ఇండక్షన్ ప్రోగ్రాం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వీసీ ప్రతాప్రెడ్డి పాల్గొని మాట్లాడారు. కాకతీయ స్వర్ణోత్సవ విద్యార్థిగా గర్వపడాలన్నారు. యూనివర్సిటీలో విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పిస్తామన్నారు. పరిపక్వత చెందిన పీజీ విద్యార్థులుగా నాలెడ్జ్ అటిట్యూడ్ స్కిల్స్, లీడర్షిప్, వ్యక్తిత్వంపై దృష్టి సారించాలన్నారు. కాకతీయ యూనివర్సిటీని డ్రగ్స్ రహిత, ఆల్కాహాల్ రహిత క్యాంపస్గా మార్చుకుందామన్నారు. త్వరలో ఎఫ్ఆర్ఎస్ హాజరును కూడా ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ కలిగిన కేయూలోని కే హబ్ను రూసానిధులతో వినియోగంలోనికి తీసుకురానున్నట్లు చెప్పారు. టీ హబ్తో ఎంఓయూతో కూడా ముందుకెళ్లబోతున్నామన్నారు. ఆంగ్ల భాషపై పట్టు సాధించాలన్నారు. ఏసీపీ జితేందర్రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ర్యాగింగ్కు దూరంగా ఉండాలన్నారు. ర్యాంగింగ్కు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు. నార్కోటిక్స్ డిప్యూ టీ కమిషనర్ రమేష్కుమార్ మాట్లాడుతూ.. మా దక ద్రవ్యాలకు బానిసలు కావొద్దన్నారు. మాదక ద్రవ్యాలు వాడిని విక్రయించినా నేరమేనన్నారు. ప్రముఖ న్యాయవాది మాతంగి రమేష్బాబు మాట్లాడుతూ లీగల్ అవేర్నెస్ ఆన్ సెక్సువల్ హరాస్మెంట్ అండ్ స్టూడెంట్ రైట్స్ అనే అంశంపై మాట్లాడారు. ప్రతి కళాశాలలో ఇంటర్నల్ కంప్లెయింట్ సెల్ ఉండాలన్నారు. సమావేశంలో కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్, కేయూ పాలకమండలి సభ్యులు సురేష్లాల్, డాక్టర్ చిర్ర రాజు, డాక్టర్ రమ, సైన్స్ డీన్ ఆచార్య హనుమంతు, స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ మామిడాల ఇస్తారి, కేయూ యూజీసీ కోఆర్డినేటర్ మల్లికార్జున్రెడ్డి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఈసం నారాయణ, ఆచార్య వెంకయ్య, డాక్టర్ సుజాత, డాక్టర్ రాధికారాణి, దీపాజ్యోతి, డాక్టర్ మేఘనరావు, మమత, డాక్టర్ శంకర్, హాస్టల్ డైరెక్టర్ రాజ్కుమార్ పాల్గొన్నారు. ఆంగ్ల భాషపై పట్టుసాధిస్తే ఉపాధి అవకాశాలు కేయూ వీసీ ప్రతాప్రెడ్డి -
జాతర పనులు త్వరగా పూర్తి చేయాలి
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం జాతర పనులన్నీ త్వరగా పూర్తి చేయాలని రెవెన్యూ, హౌసింగ్, పౌరసంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం, మేడారంలో రోడ్ల విస్తర్ణ పనులతోపాటు భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న పనులన్నీ ఈనెల 30 వరకు పూర్తి చేయాలని ఇది లాస్ట్ డెడ్లైన్ అని మంత్రి శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన మంత్రి సీతక్కతో కలిసి అమ్మవార్ల గద్దెల ప్రాంగణం అభివృద్ధి పనులు, సమ్మక్క సారలమ్మ గద్దెల పునరుద్దరణ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల రాతి నిర్మాణాలు, గద్దెల ప్రాంగణంలో ఫ్లోరింగ్ పనులు, రాతి స్తంభాల స్థాపన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం రోడ్ల నిర్మాణం, జంపన్న వాగు వద్ద ఏర్పాట్లు, వాగులో ఇసుక లెవలింగ్ పనులను పరిశీలించారు. అనంతరం జాతర అభివృద్ధి పనులపై ఆయాశాఖల అధికారులతో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించి జాతర పనుల పురోగతి వివరాలపై ఆరా తీశారు. గద్దెల ప్రాంగణం సాలహారం, గద్దెల విస్తర్ణ, ఆర్చీ ద్వారా స్థంబాల స్థాపన పనుల్లో నెమ్మదిగా సాగుతున్నాయని పూజారులు మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఈసందర్భంగా పొంగులెటి మాట్లాడుతూ.. గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం పనులతోపాటు, జాతర అభివృద్ధి పనులన్నీ ఈనెల 30 వరకు పూర్తి చేయాలని అధికారులను అదేశించారు. పనులు త్వరగా పూర్తి చేసేందుకు కార్మికుల సంఖ్యను పెంచడంతోపాటు అదనంగా మరో రెండు క్రేన్లను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. క్యూలైన్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, గుత్తేదారులను ఆదేశించారు. అంతకుముందు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్శన్ రేగ కల్యాణి. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు పాల్గొన్నారు. పనులను పరిశీలించిన మంత్రులు పొంగులేటి, సీతక్క ఈనెల 30 లాస్ట్ డెడ్లైన్ అధికారులతో సమీక్ష సమావేశం -
వెట్టి చాకిరీపై.. కదిలిన యంత్రాంగం
వరంగల్ క్రైం: విద్యార్థులతో బలవంతంగా అంట్లు తోమించి.. టిఫిన్లు తయారు చేయించిన ఓగ్లాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వ్యవహారంపై శుక్రవారం సాక్షిలో ‘చిట్టి చేతులు.. వెట్టి చాకిరీ’ పేరిట కథనం ప్రచురితమైంది. దీంతో రాష్ట్ర, జిల్లా అధికారులు కదిలారు. సాక్షి కథనంపై స్పందించిన పరకాల కోర్టు న్యాయమూర్తి జి.సాయి శరత్ పాఠశాలను సందర్శించడంతో వెట్టి చాకిరీ వ్యవహారం ఒక్కసారిగా వెడెక్కింది. దామెర తహసీల్దార్, జ్యోతి వరలక్ష్మి, డీసీఓ ఉమామహేశ్వరి, భద్రాది కొత్తగూడెం జోనల్ అధికారి అలివేలు, దామెర ఎస్సై అశోక్ కుమార్, ఎంఈఓ రాజేష్ ఉదయం పాఠశాలను సందర్శించారు. ముందుగా టిఫిన్ చేసిన విద్యార్థులను వేర్వేరుగా ప్రశ్నించారు. విచారణలో విద్యార్థులు తమతో బలవంతంగా పనులు చేయించినట్లు అధికారులకు చెప్పినట్లు సమాచారం. పాఠశాలలో పనిచేస్తున్న సంబంధిత కాంట్రాక్టర్ తన దగ్గర వంట మనుషులు లేకపోవడంతో విద్యార్థులను పనిలో పెట్టుకున్నట్లు అధికారులకు చెప్పినట్లు తెలిసింది. చిట్టి వెట్టి చాకిరి కథనంపై స్పందించిన న్యాయమూర్తి సాయి శరత్ ఈఅంశాన్ని సుమోటాగా తీసుకుని పాఠశాల లో విచారణ చేపట్టి నివేదికను జిల్లా ప్రధాన న్యామూర్తికి అందజేసినట్లు తెలిసింది. సమస్యల స్వాగతం.. పాఠశాలలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉండడంతో అధికారులు ప్రిన్సిపాల్పై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్లు తెలిసింది. పాఠశాలలో చోటుచేసుకున్న ఘట నపై లోతుగా విచారణ చేసినట్లు తెలిసింది. భద్రా ది కొత్తగూడెం జోనల్ అధికారి అలివెలు, విద్యార్థులు, ఉపాధ్యాయులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి వివరాలు సేకరించారు. విద్యార్థులు టిఫిన్ వండటం, విద్యార్థులను కులం పేరుతో దూషించిన ఘటనలపై సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శికి నివేదిక సమర్పిస్తామని, ఆ తర్వాత శాఖాపరమైన చర్యలు ఉంటాయని జోనల్ అధికారి అలివేలు తెలిపారు. ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలి: విద్యార్థి సంఘాలు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్న ప్రిన్సిపాల్ సమ్మయ్య ను సస్పెండ్ చేయాలని కోరుతూ టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కన్నం సునిల్, టీజీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడ రంజిత్ కుమార్, విద్యార్థి సంఘాల జేఏసీ కోఆర్డినేటర్ అనిల్ భద్రాది కొత్తగూడెం జోనల్ అధికారికి వినతి పత్రం అందజేశారు. విద్యార్థులతో మాట్లాడిన పరకాల జడ్జి ప్రిన్సిపాల్ సస్పెన్షన్కు విద్యార్థి సంఘాల డిమాండ్ ‘సాక్షి’ కథనంతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు -
14న షైన్ స్కాలర్ షిప్ టెస్ట్
హన్మకొండ : హనుమకొండ బాలసముద్రంలోని షైన్ జూనియర్ కళాశాలలో ఈనెల 14న షైన్ స్కాలర్ షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు షైన్ విద్యాసంస్థల చైర్మన్ మూగల కుమార్యాదవ్ తెలిపారు. శుక్రవారం కళాశాలలో స్కాలర్షిప్ టెస్ట్ బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ టెస్ట్లో 96 నుంచి 100 శాతం మా ర్కులు సాధించిన విద్యార్థులకు ఇంటర్ ప్రవేశంలో పూర్తి రాయితీ అందించనున్నట్లు తెలిపారు. 91 నుంచి 95 మార్కులు సాధించిన విద్యార్థులకు 75 శాతం, 86 నుంచి 90 మార్కులు సాధించినవారికి 50 శాతం, 81 నుంచి 85 మార్కులు సాధించిన విద్యార్థులకు 25 శాతం ట్యూషన్ ఫీజు రాయితీ మొదటి ఐదుగురు విద్యార్థులకు అందించనున్నట్లు వివరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో షైన్ విద్యాసంస్థల డైరెక్టర్లు మూగల రమ, ఏ.కవిత, మూగల రమేష్, ప్రిన్సిపాల్స్ పి.శ్రీనివాస్, ప్రశాంత్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో నిట్ అసోసియేట్ ప్రొఫెసర్ మృతి
ధర్మసాగర్ : అనుమానాస్పద స్థితిలో నిట్ ప్రొఫెసర్ మృతి చెందిన ఘటన మండల కేంద్రంలోని రిజర్వాయర్ వద్ద చోటుచేసుకుంది. పోలీసులు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. వెంకట సుబ్బారెడ్డి(43) వరంగల్ ఎన్ఐటీలో కంప్యూటర్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తూ ఎన్ఐటీ క్యాంపస్లో నివాసం ఉంటున్నాడు. కొన్ని రోజులుగా మానసిక రుగ్మతతో బాధపడుతూ మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అతని మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో శుక్రవారం అనుమానాస్పద స్థితిలో రిజర్వాయర్లో పడి మృతి చెందాడు. ప్రమాదవశాత్తు మృతిచెందాడా.. లేదా.. ఆత్మహత్యకు పాల్పడ్డాడా.. తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. సుబ్బారెడ్డికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ శ్రీధర్ రావు తెలిపారు. మహిళా న్యాయవాదిపై హత్యాయత్నం కాజీపేట: కాజీపేట మండలం దర్గాకాజీపేటలో మహిళా న్యాయవాది యామినిపై ప్రవీన్ కుమార్ అనే యువకుడు హత్యాయత్నం చేసినట్లు సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. బాధితురాలి తండ్రి వీరస్వామి గురువారం రాత్రి ఫిర్యాదు చేసిన మేరకు.. సీఐ తెలిపిన వివరాలి ఉన్నాయి.. న్యాయవాదిగా పనిచేసే యామినికి ఓ కేసు విషయంలో ప్రవీన్కుమార్తో వివాదం తలెత్తింది. దీంతో ఆగ్రహించిన ప్రవీన్కుమార్ చేతిలో ఉ న్న కత్తెరతో దాడిచేయగా స్వల్పంగా గాయపడింది. వెంటనే బాధితురా లిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతుంది. వీరస్వామి ఫిర్యాదు మేరకు నిందితుడిపై హత్యాయత్నం చేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. హనుమకొండ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొత్త రవి బాధితురాలిని ఆస్పత్రిలో పరామర్శించినట్లు సమాచారం. -
ఎమ్మెల్సీ వర్గంలోకి నల్గొండ రమేష్
వరంగల్: వరంగల్ తూర్పు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా కొండా దంపతులకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న నల్గొండ రమేష్ మరో వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య వర్గంలోకి చేరినట్లు శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. తూర్పులో కొండా దంపతులు పార్టీ వ్యవహరాలతోపాటు ఇతర విషయాలు చక్కదిద్దే బాధ్యతలను ఒక నాయకుడికి అప్పగించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ నాయకుడికి రమేష్కు పొసగక పోవడంతో ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు వచ్చినట్లు తెలిసింది. ఈక్రమంలోనే రమేష్కు చెందిన నాయకుడిని పోలీసు కేసులు పెట్టించి కొట్టించడం వల్ల ఆయన తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్కు వెళ్లి తన వర్గం వారికి ఏమైనా చేసేందుకు ప్రయత్నిస్తే అధికార వ్యవహరాలు చేస్తున్న నాయకుడి సూచనలతో అధికారులు వ్యతిరేకం కావడమే కాకుండా కేసులు నమోదు అవుతున్నాయని ఆయన ఎమ్మెల్సీ వర్గం నాయకుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతుంటే ఆ వర్గంలో ఎందుకు ఉండడం తమ వర్గంలోకి రావాలని సూచించడంతో పార్టీ కార్యక్రమాల్లో కొండ వర్గీయులతో కాకుండా ఎమ్మెల్సీ వర్గంతో పాల్గొంటున్నారు. దీనికి తోడుగా ఎమ్మెల్సీకి అత్యంత దగ్గరగా ఉన్న అయూబ్ డీసీసీ అధ్యక్షుడు కావడంతో మరింత ధైర్యంతో నల్గొండ రమేష్ ఎమ్మెల్సీ సారయ్య వర్గంలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. అందువల్ల శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్సీ సారయ్య తన వర్గంతో కలసి నల్గొండ రమేష్ ఇంటికి వెళ్లారు. ఈసందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో పార్టీ వాళ్లపై కేసులు పెట్టించే సంస్కృతి నెలకొందన్నారు. అందువల్ల ఎమ్మెల్సీ సారయ్యతో తన రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తానని తెలిపారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ గుండేటి నరేంద్రకుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోరంటల రాజు, మాజీ నాయకులు తత్తర లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. సదరు నాయకుడి చర్యలతో తూర్పులోని మరిమంది నాయకులు సారయ్య వర్గంలోకి మారే అవకాశాలున్నట్లు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. -
‘నమస్తే’ను వినియోగించుకోవాలి
వరంగల్ అర్బన్: డీ స్లడ్జింగ్ ఆపరేటర్లు,సెప్టిక్ ట్యాంక్ వర్కర్లు ‘నమస్తే (నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైడ్జ్ శానిటేషన్ ఏకో సిస్టిమ్)ను సద్వియోగం చేసుకోవాలని గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి సూచించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో బుధవారం ‘నమస్తే’ కార్యక్రమంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మేయర్ మాట్లాడుతూ.. మల వ్యర్థాలు నిర్వహించే సిబ్బందికి ఈకార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రతీ మూడు నెలలకోసారి సెప్టిక్ ట్యాంకుల డీ–స్లడ్జింగ్ తప్పనిసరిగా చేపట్టేలా షెడ్యూల్ రూపొందిస్తున్నట్లు చెప్పారు. సెప్టిక్ ట్యాంక్ ఆపరేటర్లు టోల్ ఫ్రీ నంబర్ 11420పై ప్రజల్లో చైతన్యం కలిగించాలని కోరారు. కార్యక్రమంలో సీఎంహెచ్ఓ రాజారెడ్డి, ఎంహెచ్ఓ రాజేశ్, ఆస్కీ ప్రతినిధి డాక్టర్ రాజ్మోహన్, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ప్లాంట్ ఏర్పాటు వేగం చేయండిగ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బయో మిథనైజేషన్ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి చర్యలు వేగంగా కొనసాగుతున్నట్లు మేయర్ గుండు సుధారాణి తెలిపారు. గురువారం హనుమకొండలోని మున్సిపల్ అతిథి గృహంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ (ఎన్యూఏ) ప్రతినిధులు, పి.డబ్ల్యూసి నిపుణులు, అధికారులతో కలిసి మేయర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. కార్యక్రమంలో ఏఎస్యూఐ కన్సల్టెంట్ రాహుల్, సీఎంహెచ్ఓ రాజిరెడ్డి, ఎంహెచ్ఓ రాజేశ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. మేయర్ గుండు సుధారాణి సెప్టిక్ ట్యాంక్ వర్కర్ల అవగాహన సదస్సు -
పార్ట్ టైం లెక్చరర్ల నియామకానికి ఓకే..
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని వివిధ విభాగాల్లో, యూనివర్సిటీ కాలేజీల్లో విద్యాబోధనకు పార్ట్టైం లెక్చరర్ల నియామకానికి త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఈమేరకు గురువారం సాయంత్రం కేయూ స్టాండింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. విద్యార్హతలతోపాటు ఇంటర్వ్యూల ద్వారా రోస్టర్ ద్వారా పార్ట్టైం లెక్చరర్లను నియమించనున్నారు. ఏవిభాగంలోని ఆవిభాగం అధిపతి, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్, డీన్, ఇద్దరు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో ఇంటర్వ్యూలు నిర్వహించాలని నిర్ణయించారు. ఏదైనా కోర్సులో సబ్జెక్టులో గోల్డ్మెడల్కు ఎవరైనా తమపేరును పెట్టాలనుకుంటే ఇక నుంచి రూ.5 లక్షలు యూనివర్సిటీకి చెల్లించాల్సి ఉంటుంది 2025–26 వరకు ఆయా కోర్సుల్లో డిటెన్షన్ను ఎత్తి వేయాలని స్టాండింగ్ కమిటీలో నిర్ణయించారు. కేయూ పరిధి ఏ పీజీ కోర్సులోనైనా ఈవిద్యాసంవత్సరంలో ప్రథమ సంవత్సరంలో 15లోపు విద్యార్థులు ప్రవేశాల సంఖ్య ఉంటే.. వేరేచోటకు షిఫ్ట్ చేయాలని స్టాండింగ్ కమిటీలో నిర్ణయించారు. కేయూ స్టూడెంట్స్ అఫైర్స్ డీన్, యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ల పదవులకు స్టాండింగ్ కమిటీలో అప్రూవల్ లభించింది. సుమారు 4:30 గంటలపాటు నిర్వహించిన ఈ కమిటీ సమావేశంలో వివిధ కోర్సుల సిలబస్లపై చర్చించారు. 35 అంశాలకుపైగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం, వివిధ విభాగాల అధిపతులు, డీన్లు, ప్రిన్సిపాళ్లు, స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ పాల్గొన్నారు. రూ.5 లక్షలిస్తే వారిపేరుపై గోల్డ్ మెడల్ ఫార్మసీ, బీటెక్ కోర్సుల్లో డిటెన్షన్ ఎత్తివేత! కేయూ స్టాండింగ్ కమిటీలో నిర్ణయం -
లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి
వరంగల్ లీగల్: రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థల ఆదేశాల మేరకు ఈనెల 21న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు వీబీ నిర్మలాగీతాంబ, డాక్టర్ కె.పట్టాభిరామారావు సూచించారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసదన్ భవన్లో వరంగల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. లోక్ అదాలత్లో రాజీ పడదగు కేసులను పరిష్కరించుటకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇన్సూరెన్న్స్, బ్యాంకు, చిట్ఫండ్ అధికారులు తమ కేసులను పరిష్కరించుకోవాలని, కోర్టుల్లో లేని కేసులను ప్రీ–లిటిగేషన్ ద్వారా న్యాయసేవాధికార సంస్థలో పరిష్కరించుకోవాలని కోరారు. సలహాలు, సూచనల కోసం న్యాయసేవాధికార సంస్థను నేరుగా సంప్రదించాలని సూచించారు. అధిక కేసుల పరిష్కారానికి ఈనెల 4 నుంచే ప్రీలోక్ అదాలత్ను వరంగల్ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభించామని తెలిపారు. కక్షిదారుల కేసులను ఇరుపక్షాల అంగీకారంతో రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవడానికి సులభతరం అవుతుందని వివరించారు. వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయసేవాధికార సంస్థల కార్యదర్శులు ఎ.ప్రదీప్, జి.రామలింగం పాల్గొన్నారు. వరంగల్ జిల్లాలో 8, హనుమకొండ జిల్లాలో 12 బెంచ్లు లోక్ అదాలత్ కోసం వరంగల్ జిల్లా కోర్టులో 7, నర్సంపేట కోర్టులో 1 బెంచ్లు ఏర్పాటు చేసినట్లు జడ్జిలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గుర్తించిన 692 రాజీపడదగిన వివిధ రకాల పెండింగ్ కేసుల్లోని కక్షిదారులకు నోటీసులు జారీ చేశామని పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా కోర్టులో 10, పరకాల కోర్టులో 2 బెంచ్లు ఏర్పాటు చేసినట్లు, అలాగే జిల్లా వ్యాప్తంగా గుర్తించిన 743 పెండింగ్ కేసుల్లోని కక్షిదారులకు నోటీసులు జారీ చేసినట్లు వివరించారు.వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు నిర్మలాగీతాంబ, పట్టాభిరామారావు -
రెండో విడతకు పటిష్ట ఏర్పాట్లు
హన్మకొండ అర్బన్: జిల్లాలో రెండో విడత జీపీ ఎన్నికలు జరగనున్న ధర్మసాగర్, హసన్పర్తి, ఐనవోలు, వేలేరు, పరకాల మండలాల్లో పటిష్ట ఏర్పాట్లు చేయాలని హనుమకొండ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి స్నేహ శబరీష్ ఆయా మండలాల ఎంపీడీఓలను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి ఆయా మండలాల ఎంపీడీఓలు, నోడల్ అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల వారీగా సర్పంచ్, వార్డు స్థానాల బ్యాలెట్ పేపర్లను సరిగ్గా ఉన్నాయా లేదా? అని ఎంపీడీఓలు, ప్రత్యేకాధికారులు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని సూచించారు. మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసే డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రాల (డీఆర్సీ)లో గ్రామపంచాయతీలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల వారీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. డీఆర్సీలలో పోలింగ్ సిబ్బందికి సరిపోయేలా టేబుల్స్, కుర్చీలు, టెంట్లు వేయించాలన్నారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల వివరాలు తెలిసేలా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. డీఆర్సీతో పాటు, పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బందికి నాణ్యమైన భోజనం అందించాలని తెలిపారు. ఈసందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్, డీఆర్డీఓ మేన శ్రీను పోలింగ్ నిర్వహణ, కౌంటింగ్ ఏర్పాట్లపై ఎంపీడీఓలకు పలు సూచనలిచ్చారు. సమావేశంలో ఎంపీడీఓలు అనిల్ కుమార్, సుమనవాణి, నర్మద, లక్ష్మీ ప్రసన్న, ఇతర అధికారులు పాల్గొన్నారు. హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ -
పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్
కమలాపూర్: మండలంలోని శంభునిపల్లి ప్రాథమిక పాఠశాల, ఉప్పల్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలల్లోని పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ స్నేహ శబరీష్ గురువారం పరిశీలించారు. కౌంటింగ్కు సంబంధించిన ఏర్పాట్లు పరిశీలించి, పోలింగ్ కేంద్రాల వారీగా త్వరగా పూర్తి చేసేలా అధికారులకు పలు సూచనలిచ్చారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పోలింగ్ నిర్వహణతో పాటు కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ గుండె బాబు, తహసీల్దార్ సురేశ్కుమార్, స్పెషల్ ఆఫీసర్ నరసింహస్వామి ఇతర అధికారులు పాల్గొన్నారు.రాయపర్తి87.34%పర్వతగిరి86.59%వర్ధన్నపేట85.65%కమలాపూర్72.75%ఎల్కతుర్తి86.17%భీమదేవరపల్లి82.61%సాక్షి, వరంగల్/హన్మకొండ అర్బన్: హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో మొదటి విడత పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్, లెక్కింపు, ఫలితాల వెల్లడి కార్యక్రమాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగియడంతో ఆయా జిల్లాల యంత్రాంగాలు ఊపిరి పీల్చుకున్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాల్లో ఉదయం నుంచి ఉత్సాహంగా ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం ఒంటిగంటకు ముగిసింది. పోలింగ్ ముగిసే సమయానికి కేంద్రాల్లో ఉన్న ఓటర్లకి అధికారులు స్లిప్పులు ఇచ్చి నంబర్లు వేసి పోలింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు బారులుదీరి ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలోని మూడు మండలాల్లో ఓట ర్లు 1,28,651 ఉండగా 1,08,003 ఓట్లు పోలయ్యాయి. , వీరి లో పురుషులు 62,653మందికిగాను 53,026మంది, మహిళలు 65,997 మందికిగాను 54,976మంది ఓటు హక్కు విని యోగించుకోగా, మొత్తం 83.95శాతం పోలింగ్ నమోదైంది. ఉత్సాహంగా ఓటేసిన గ్రామాలు వరంగల్ జిల్లాలో ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లాలోని 731 పొలింగ్ స్టేషన్లలో ఓట్ల జాతర సాగింది. జిల్లాలోని 80 గ్రామ పంచాయతీలు, 585 వార్డు స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో 1,10,487 మంది ఓటర్లకు గానూ 95,939 మంది ఓటేశారు. ఈ లెక్కన 86.83 శాతం పోలింగ్ నమోదైంది. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు చేశారు. మహిళలే ఎక్కువున్నా ఓటేసింది ఎక్కువగా పురుషులే జిల్లాలోని ఈ మూడు మండలాల్లో 54,519 మంది పురుష ఓటర్లు, 55,967 మంది మహిళ ఓటర్లు, ఇతరులు ఒకరు ఉన్నారు. అయితే వీరిలో 47,593 మంది పురుషులు, 48,345 మంది మహిళలు, ఇతరులు ఒకరు ఓటేశారు. అయితే పురుషుల కన్నా మహిళ ఓటర్లు ఎక్కువగా ఉన్న ఎక్కువగా 87.30 శాతం మంది పురుషులు ఓటేయగా, 86.38 శాతం మహిళలు ఓటేశారు. రెండో స్థానంలో బీఆర్ఎస్, 56 మంది ఇతరుల విజయం స్వతంత్రులతో కాంగ్రెస్, బీఆర్ఎస్ల మంతనాలుతొలి విడతఓటింగ్ జరిగిందిలా..హనుమకొండ జిల్లా.. మండలం ఓటర్లు ఓటేసినవారు భీమదేవరపల్లి 40,897 33,783 ఎల్కతుర్తి 31,915 27,621 కమలాపూర్ 55,839 46,599 వరంగల్ జిల్లాలో.. వర్ధన్నపేట 28,358 24,290 పర్వతగిరి 38,631 33,449 రాయపర్తి 43,498 38,200 మరిన్ని ఎన్నికల వార్తలు : 10లో..


