breaking news
Hanamkonda District News
-
ప్రకృతి విపత్తుతోనే గుడ్డు ధర పెరిగింది
కాజీపేట అర్బన్ : వాతావరణంలో సమతుల్యత లోపించడం, తీవ్రమైన ఎండలు, ప్రకృతి విపత్తుతోనే కోడి గుడ్డు ధర పెరిగిందని వరంగల్ పౌల్ట్రీ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు అన్నారు. హంటర్ రోడ్డులోని నెక్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 40 ఏళ్లలో ఎన్నడులేని విధంగా మార్చి, ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో తీవ్రమైన ఎండలు, వడగాలులు, 44 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదు కావడంతో గుడ్లు పెట్టే లక్షలాది కోళ్లు మృతి చెందాయని చెప్పారు. దీంతో పౌల్ట్రీ రైతులకు రూ.16 కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెలిపారు. కోళ్ల దాణా సోయా కేక్ టన్నుకు ధర రూ.30 వేల నుంచి రూ.60 వేలకు పెరిగిపోయిందని వాపోయారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ టి.సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
‘దూరవిద్య’లో ఉద్యోగుల చేతివాటం!
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని దూరవిద్య సీడీఓఈ/ఎస్డీఎల్సీఈలో డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లకు, కోర్సు పూర్తయ్యాక వివిధ సర్టిఫికెట్లు తీసుకునేందుకు ఆన్లైన్ పద్ధతిలోనే ఫీజులు చెల్లించేందుకు క్యూఆర్ కోడ్ను అందుబాటులో తీసుకువచ్చారు. దూరవిద్య కేంద్రానికి వచ్చేవారు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఫీజులు చెల్లించి అడ్మిషన్లతో పాటు సర్టిఫికెట్లు తీసుకోవచ్చు. దూరవిద్యలో అడ్మిషన్లు పొందే వారి నుంచి, వివిధ సర్టిఫికెట్లు పొందేవారి నుంచి కొంతమంది ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు నిదర్శనం ఇటీవల దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ బి.సురేష్లాల్ దూరవిద్య కేంద్రానికి సంబంధించిన బ్యాంకుల్లో జమ అవుతున్న ఫీజుల వివరాలను పరిశీలించగా అందులో క్యూఆర్ కోడ్ ద్వారా దూరవిద్య కేంద్రంలోని తొమ్మిది మంది ఔట్సోర్సింగ్ , కాంట్రాక్టు ఉద్యోగుల ఫోన్ల ద్వారానే దూరవిద్య కేంద్రంలోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పే చేసినట్లు వెల్లడైంది. లక్షల్లో పేమెంట్లు.. దూరవిద్య కేంద్రంలోని ఓ ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగి తన ఫోన్ ద్వారా క్యూఆర్ కోడ్కు కొంతమంది అభ్యర్థుల ఫీజులు రూ.6లక్షల 47వేలు, ఓ మహిళా ఉద్యోగి రూ.6లక్షల 6వేలు చెల్లించినట్లు, మరో ఉద్యోగి రూ.4లక్షల 27వేలు, ఇంకో ఉద్యోగి రూ.2లక్షల 30వేలు చెల్లించినట్లు గుర్తించారు. ఇలా మొత్తం 9 మంది ఉద్యోగులు అభ్యర్థుల నుంచి ఫీజుల డబ్బులు తీసుకొని దూరవిద్య కేంద్రానికి క్యూర్ కోడ్ ద్వారా చెల్లించినట్లు గుర్తించారు. ఈ తొమ్మిది మందిలో ఇటీవల ఒకరు ఉద్యోగ విరమణ పొందారు. 9 మంది ఉద్యోగులకు మెమోలు జారీ కేయూ దూరవిద్య కేంద్రంలోని ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు 8 మందికి దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ బి.సురేష్లాల్ మూడ్రోజుల క్రితం మెమోలు జారీచేశారు. అందులో రిటైర్డ్ ఉద్యోగికి కూడా వాట్సాప్లో మెమో పంపారు. మీరు అభ్యర్థుల నుంచి ఫీజుల డబ్బులు తీసుకొని చెల్లించడం అనేది ఆర్థిక పరమైన అవకతవలకు కిందికే వస్తుందని మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదని 7రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆయా ఉద్యోగులకు జారీచేసిన మెమోలో పేర్కొన్నారు. ఇదే విషయం ఇప్పటికే కేయూ వీసీ ప్రొఫెసర్ ప్రతాప్రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని సీరియస్గా పరగిణిస్తున్నారని తెలిపారు. మెమోలకు వివరణ ఇచ్చాక వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఫీజు డబ్బుల కంటే ఎక్కువ వసూలు? దూరవిద్య కేంద్రంలో క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు 9 మంది ఉద్యోగులకు మెమోలు జారీ -
సమస్యలు పరిష్కరించాలి
హన్మకొండ : రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ విద్యుత్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర చైర్మన్ శ్రీనివాస్, కన్వీనర్ మన్నె శశికుమార్ కోరారు. గురువారం రాత్రి హైదరాబాద్లోని టీజీ ట్రాన్స్కో ప్రధాన కార్యాలయంలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (హెచ్ఆర్డీ, కమర్షియల్) శ్రీనివాసులును కలిసి వినతిపత్రం అందజేశారు. ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు వెంటనే పే రివిజన్ కమిటీ వేయాలని, 1999–2004 మధ్య నియామకమైన అర్హులైన ఉద్యోగులకు జీపీఎఫ్ సౌకర్యం కల్పించడంతో పాటు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా శ్రీనివాస్, శశికుమార్ మాట్లాడుతూ.. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని కోరారు. ఆపరేషన్ అండ్ మెయింటినెన్స్ విభాగంలో అదనపు పోస్టులు మంజూరు చేసి జూనియర్ లైన్మెన్, క్షేత్ర స్థాయి సిబ్బంది నియామకాలు చేపట్టాలన్నారు. 2019లో నియామకమైన జేఎల్ఎం, ఏఎల్ఎంలకు బదిలీ అవకాశం కల్పించాలని కోరారు. -
ఐదేళ్ల లా విద్యార్థుల ఆందోళన బాట
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ఐదేళ్ల లా కోర్సు విద్యార్థులు (బాయ్స్) హాస్టల్ వసతి కల్పించాలన్న డిమాండ్తో ఆందోళనబాట పడుతున్నారు. ఈ మేరకు శనివారంనుంచి రిలే నిరాహార దీక్షలకు దిగనున్నారు. యూనివర్సిటీలో సెల్ఫ్ఫైనాన్స్ కోర్సు (ఎస్ఎఫ్సీ) ఐదేళ్ల లా కోర్సు ఏర్పాటుచేశాక తొలుత విద్యార్థినీ విద్యార్ధులకు హాస్టల్ వసతి కల్పించలేదు. పలుమార్లు ఆందోళనలు చేశాక గర్ల్స్కు యూనివర్సిటీ క్యాంపస్లో హాస్టల్ వసతి కల్పిస్తున్నారు. కానీ, బాయ్స్కు మాత్రం మెస్ సదుపాయం కల్పిస్తూ హాస్టల్ వసతి లేదు. వీరు గత ఏడాది సెప్టెంబర్లో యూనివర్సిటీ పరిపాలనాభవనం వద్ద బైఠాయించగా, యూనివర్సిటీ అధికారులు హాస్టల్ వసతిపై చర్చించారు. జులైవాడలోని లా హాస్టల్ భవనంలో మూడేళ్ల లా, ఎల్ఎల్ఎం విద్యార్దులకు హాస్టల్ వసతి ఉంది. కానీ, ఐదేళ్ల లా కోర్సు వారికి మెస్ సదుపాయం అదే హాస్టల్లో కల్పిస్తున్నప్పటికి వసతి లేదు. రిజిస్ట్రార్ రామచంద్రం జులైవాడలోని లా విద్యార్థుల హాస్టల్లో ఐదేళ్ల కోర్సు వారికి వసతికి ఇంకా అవకాశం ఉందా లేదా అనేది పరిశీలించాలని ఓ కమిటీని గత ఏడాది సెప్టెంబర్లో నియమించారు. కమిటీ గదులను మరమ్మతు చేయించి వసతి కల్పించవచ్చని రిజిస్ట్రార్కు నివేదిక సమర్పించింది. రిజిస్ట్రార్ రామచంద్రం కూడా రెండు గదులు కేటాయించాలని హాస్టళ్ల డైరెక్టర్ను ఆదేశిస్తూ ఆర్డర్ తీశారు. ఆర్డర్ ఇచ్చి రెండు నెలలు గడుస్తున్నప్పటికి ఆ గదులకు మరమ్మతులు చేయించలేదు. దీంతో విద్యార్థులకు కేటాయించలేదు. దీంతో మరోసారి ఆందోళన బాట పట్టాలని విద్యార్ధులు నిర్ణయించారు. హనుమకొండ సుబేదారిలోని యూనివర్సి టీ లా కాలేజీ వద్ద నిరాహరదీక్షలకు దిగుతున్నట్లు లా కళాశాల విద్యార్థి స్టాలిన్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం యూనివర్సిటీ లా కాలేజి ఎదుట నిరసన తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు సందీప్, రాకేష్రెడ్డి, అరుణ్, అజయ్, ఈశ్వర్, సాత్విక్, శ్రీను, పవన్, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. హాస్టల్ వసతి కల్పించాలని డిమాండ్ నేటినుంచి విద్యార్థుల నిరాహార దీక్ష -
జేఎన్ఎస్ను సందర్శించిన సీపీ
వరంగల్ స్పోర్ట్స్: వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత శుక్రవారం హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియాన్ని సందర్శించారు. ఈసందర్భంగా హనుమకొండ జిల్లా యువజన క్రీడల అధికారి కొత్త ప్రశాంత్ సీపీకి స్వాగతం పలికి స్టేడియంలోని క్రీడా వసతులు వివరించారు. అనంతరం కమిషనర్ స్టేడియం ఆవరణతో పాటు స్విమ్మింగ్ పూల్ను పరిశీలించి అక్కడ నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాల గురించి డీవైఎస్ఓను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులతో కమిషనర్ ముచ్చటించారు. కార్యక్రమంలో వరంగల్ డీఎఫ్ఓ, ములుగు డీఎఫ్ఓ, స్టేడియం సిబ్బంది, కోచ్లు, క్రీడాకారులు, స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. వరంగల్ స్పోర్ట్స్: హైదరాబాద్లోని హకీంపేటలో నిర్వహించిన రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్లో ప్రతిభ కనబర్చి హనుమకొండ స్పోర్ట్స్ స్కూల్కు ఎంపికైన క్రీడాకారులు ఈనెల 4, 7న రిపోర్ట్ చేయాలని హనుమకొండ జిల్లా యువజన, క్రీడల అధికారి కొత్త ప్రశాంత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న 40 మంది బాలికలకు జూలై 4న, 40 మంది బాలురకు జూలై 7న జిల్లా యువజన, క్రీడల అధికారి కార్యాలయం, జవహర్లాల్ నెహ్రూ స్టేడియం, హనుమకొండలో ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నట్లు తెలిపారు. ఎంపికై న విద్యార్థులు ధ్రువపత్రాలు, 10 పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. అడ్మిషన్ పూర్తయిన వెంటనే హాస్టల్లో చేరాల్సి ఉటుందని, లగేజీతో హాజరుకావాలని పేర్కొన్నారు. రామన్నపేట : వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి స్పాట్ అడ్మిషన్ ప్రక్రియ నేడు (శనివారం) ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ పి.శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్పాట్ అడ్మిషన్ల కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ నిర్ణీత సమయానికి కళాశాలలో తప్పనిసరిగా హాజరు కావాలని పేర్కొన్నారు. హసన్పర్తి: ఇందిరమ్మ రాజ్యం అంటే కూల్చివేతలా.. ఓటు వేసి గెలిపిస్తే రోడ్డున పడేస్తారా అని సీపీఐ జాతీయ మాజీ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్రెడ్డి ప్రశ్నించారు. నగరంలోని 2వ డివిజన్ గుండ్లసింగారంలో అధికారులు ఇటీవల కూల్చిన ఇళ్లను శుక్రవారం ఆయన పార్టీ రాష్ట్ర పహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాస్రావుతో కలిసి సందర్శించారు. వంటవార్పు కార్యక్రమం చేస్తున్న గుడిసెవాసులకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నరసింహ, హనుమకొండ మండల కార్యదర్శి ఎన్.స్టాలిన్, జిల్లా కార్యవర్గసభ్యులు రాములు, లక్ష్మణ్, సదానందం, భి క్షపతి, రాజేందర్, మొగిలి, గోపాల్ ఉన్నారు. వెలుగుల తల్లి సన్నిధిలో చీకట్లుహన్మకొండ కల్చరల్: కోట్ల రూపాయల ఆదాయం లభించే ఈ దేవాలయంలో చాలా రోజుల నుంచి జనరేటర్ పనిచేయట్లేదు. బ్యాటరీ, ఇన్వర్టర్ కూడా పనిచేయట్లేదు. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి దాదాపు రాత్రి 8 గంటల వరకు దేవాలయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అర్చకులు చమురుతో దీపాలు వెలిగించి అమ్మవారికి పూజలు జరిపారు. ఈవిషయంపై సిబ్బందిని ప్రశ్నించగా.. మాడవీధుల నిర్మాణంలో భాగంగా కొత్త జనరేటర్ను తగిన చోట అమర్చాల్సి ఉందని తెలిపారు. భక్తులు చీకట్లోనే అమ్మవారిని దర్శించుకోవాల్సి వచ్చింది. -
మాకు దిక్కెవరు?
‘అమ్మానాన్న.. మమ్మల్ని స్కూల్కు ఎవరు పంపిస్తారు? కొసరి.. కొసరి గోరుముద్దలెవరు తినిపిస్తారు? తమ్ముడిని, నన్ను అనాథల్ని చేసి వెళ్లిపోయారు. ఇప్పుడు మాకు దిక్కెవరు’ అంటూ రవి, శిరీష దంపతుల కుమారులు సుశాంత్, విద్వాన్ష్ రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. కాగా, వ్యాపారం కోసం ఇచ్చిన డబ్బులు వసూల్ చేయడానికి పడుతున్న ఇబ్బందుల వల్ల ఇద్దరు భార్యాభర్తలు 20 రోజులుగా ఇంట్లో గొడవ పడుతున్నారని, కనీసం తిండి కూడా సక్రమంగా తినట్లేదని ఇరుగుపొరుగు వారు తెలిపినట్లు మృతుడి బంధువులు చర్చించుకుంటున్నారు. -
బొగతలో సందడి షురూ
వాజేడు : మండల పరిధిలోని చీకుపల్లి సమీపంలో గల బొగత జలపాతానికి శుక్రవారం పర్యాటకులు తరలివచ్చారు. బొగత నుంచి జాలువారుతున్న జలధారలను తిలకిస్తూ సెల్ఫీలు, ఫొటోలు తీసుకొని సందడి చేశారు. చాలా రోజుల తర్వాత బొగత జలపాతంలో జలధార కనిపించడంతో మంత్ర ముగ్ధులయ్యారు. గోదావరికి ప్రాణహిత వరదకాళేశ్వరం : మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి నదికి ప్రాణహిత గుండా వరద నీరు వచ్చి చేరుతోంది. శుక్రవారం ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా వరదనీరు చేరగా కాళేశ్వరం వద్ద 4.885 మీటర్ల ఎత్తులో నీటి మట్టం దిగువకు ప్రవహిస్తోంది. దిగువన ఉన్న అంబట్పల్లిలోని కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద 19వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో తరలిరాగా, మొత్తం 85గేట్లు ఎత్తి దిగువకు ఔట్ ఫ్లోను అదే స్థాయిలో తరలిస్తున్నారు. -
శనివారం శ్రీ 4 శ్రీ జూలై శ్రీ 2026
స్నేహితులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తే.. అతను మాత్రం పొట్ట చేత పట్టుకుని హైదరాబాద్ వెళ్లాడు. చిన్నప్పటి నుంచి తాను ప్రత్యక్షంగా అనుభవించిన పేదరికాన్ని జయించాలనుకున్నాడు. హైదరాబాద్ వెళ్లి రైస్ మిల్లులో గుమస్తాగా జీవితాన్ని ప్రారంభించాడు. అనుభవాన్ని మూటగట్టుకుని సొంతగా రైస్ షాపు ప్రారంభించాడు. పెళ్లి చేసుకున్నాడు. ఇల్లు కొనుక్కున్నాడు. పేదరికాన్ని తరిమేశాననుకుంటున్న తరుణంలో స్నేహం రూపంలో మోసం ఎదురైంది. చివరికి ఆ స్నేహ బంధం ప్రాణాలనే హరించింది. దిక్కుతోచని స్థితిలో ఇద్దరు చిన్నారులు దిక్కులు పెక్కటిల్లేలా రోదిస్తున్నారు. – చెన్నారావుపేటభరించలేక మనస్తాపంతో దంపతుల బలవన్మరణం వ్యాపారం కోసం రూ.15 లక్షలు తీసుకుని మోసం.. అనాథలైన ఇద్దరు చిన్నారులు వరంగల్ జిల్లా పాపయ్యపేటలో విషాదం -
వినూత్న డిజైన్లతో వస్త్రాలు తయారు చేయాలి
కాజీపేట అర్బన్: మార్కెట్లో డిమాండ్కు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వినూత్న డిజైన్లతో నాణ్యమైన వస్త్రాలు తయారు చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. కాజీపేట మండలం మడికొండలోని ఇండస్ట్రియల్ పార్క్లోని కాకతీయ టెక్స్టైల్ పార్క్, వివర్స్ వెల్ఫేర్స్ పొదుపు పరపతి పరస్పర సహాయక సంఘం, ఐటీ సెజ్, గ్రానైట్ పరిశ్రమలను శుక్రవారం కలెక్టర్ పరిశీలించి మాట్లాడుతూ.. 164 యూనిట్లతో ఉన్న టెక్స్టైల్ పార్క్లో ఉత్పత్తి ప్రారంభించని యూనిట్లను త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఆధునిక టె క్నాలజీతో గ్రానైట్, మార్బుల్స్ తయారు చేయడం అభినందనీయమని అన్నారు. ఐటీ సెజ్లో పని చేస్తున్న యువత ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ జీఎం నవీన్కుమార్, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ స్వామి నాయక్, కాజీపేట తహసీల్దార్ సీహెచ్.రాజు పాల్గొన్నారు. నాణ్యమైన భోజనం అందించాలి.. మడికొండలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ చాహత్ తెలిపారు. మడికొండలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఇండస్ట్రియల్ పార్క్లో విస్తృత పర్యటన -
‘భద్రకాళి’ సాక్షిగా ప్రమాణాల రభస
సాక్షి ప్రతినిధి, వరంగల్ : కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) భూముల వేలం, టెండర్ల వ్యవహారం శుక్రవారం వరంగల్ నగరంలో రాజకీయంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ‘కుడా’భూముల వేలంలో అ క్రమాలు జరిగాయని ఆరోపిస్తూ భద్రకాళి అమ్మవారి సాక్షిగా తడి బట్టలతో ప్రమాణం చేస్తామని బీఆర్ఎస్ ప్రకటించగా, దీనికి ప్రతిగా కుడా చైర్మ న్ వెంకట్రాంరెడ్డి అదే ఆలయంలో ప్రమాణం చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇరు వర్గాల కార్యక్రమాల నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయగా, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డిని ఆలయంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. అనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో భద్రకాళి ఆలయం వద్ద హైడ్రామా నెలకొంది. చన్నీటి స్నానం.. అరెస్టుతో హైడ్రామా శుక్రవారం ఉదయం భద్రకాళి ఆలయానికి చేరుకున్న కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఆలయ సమీపంలో చన్నీటితో స్నానం చేసి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేసేందుకు సిద్ధమయ్యారు. ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన మర్రి యాదవరెడ్డిని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. యాదవరెడ్డిని తీసుకెళ్తున్న పోలీసు వాహనాన్ని కార్యకర్తలు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీసు వాహనంలోనుంచే మర్రి యాదవరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం సత్యానికి భయపడి అరెస్టులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఆలయంలో ప్రమాణం చేయకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. విమర్శలు, ప్రతివిమర్శలు.. ● కుడా లేఅవుట్, టెండర్ల వ్యవహారంలో నూటికి నూరు శాతం అక్రమాలు జరిగాయని, ఫార్మసిస్టులు, వైద్యులు, ఎన్నారైలను బెదిరించి వేలంలో పాల్గొనకుండా కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ ఆరోపించారు. గజం రూ.1.50 లక్షలు పలికే భూమిని సిండికేట్ ద్వారా రూ.60 నుంచి రూ.65 వేలకే కట్టబెట్టారని పేర్కొన్నారు. ప్రమాణం చేసేందుకు వచ్చిన కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని, ఎలాంటి పిలుపు ఇవ్వని తననూ పోలీసులు నిర్బంధించారని విమర్శించారు. ● బీఆర్ఎస్ నేతల విమర్శలపై స్పందించిన ఇనగాల వెంకట్రాంరెడ్డి ఘాటైన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నాయకులు రాజకీయ ఉనికి కోసం అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కుడాలో జరిగిన ప్రతి అక్రమంపై విచారణ జరుగుతోందని తెలిపారు. బాలసముద్రంలో రూ.150 కోట్ల విలువైన కుడా భూమిని ఆక్రమించి పార్టీ కార్యాలయం నిర్మించారని ఆరోపించారు. కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్పై కుడా నిధుల వినియోగం, వెంచర్ల పేరిట జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశించామని వెల్లడించారు.‘కుడా’ భూముల వేలం, టెండర్లపై దుమారం అవినీతి జరిగిందని బీఆర్ఎస్.. జరగలేదని కాంగ్రెస్ పరస్పర సవాళ్లు చన్నీటి స్నానాలు, పసుపు నీళ్లతో శుద్ధి.. అరెస్టులు, ఆందోళనలు వరుస పరిణామాలతో భద్రకాళి దేవస్థానం వద్ద హైడ్రామా చన్నీటి స్నానం చేస్తున్న కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి -
రాజకీయాలకు వాడుకోవడం సరికాదు
● ఏఐటీయూసీ నేత రాజ్కుమార్ భూపాలపల్లి అర్బన్ : సింగరేణి సంస్థను రాజకీయ వేదికగా మార్చడం మానుకోవాలని, కార్మికుల చెమటను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించడం సరికాదని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సింగరేణి బొగ్గు ఉత్పత్తి, గణాంకాల అంశంపై మాజీ మంత్రి హరీష్రావు మాట్లాడాలనుకుంటే శాసనసభ సరైన వేదిక అని, అక్కడ ప్రభుత్వం, అవసరమైతే సింగరేణి యాజమాన్యం అధికారికంగా సమాధానం ఇస్తుందని తెలిపారు. గనుల వద్ద మీడియా సమావేశాలు నిర్వహిస్తూ సంస్థను రాజకీయ వివాదాల్లోకి లాగడం వల్ల సింగరేణి ప్రతిష్ట దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుపై హరీష్రావు చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఆయన, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా బొగ్గు ఉత్పత్తి గణాంకాలపై ఆరోపణలు వచ్చాయని గుర్తు చేశారు. రాబోయే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను దృష్ట్యా సంస్థ పేరును రాజకీయ ప్రచారానికి వాడుకోవద్దని కోరారు. ఉద్యోగుల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వం ● టీఆర్ఈ నాన్గెజిటెడ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొండమల్ల రవి హన్మకొండ : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ నాన్ గెజిటెడ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొండమల్ల రవి పేర్కొన్నారు. తాము పెండింగ్ బిల్లులు అడుగుతుంటే ప్రభుత్వం ప్రమాద బీమా అమలు చేస్తామంటూ మభ్యపెడుతోందని వాపోయారు. ఇప్పటికై నా ప్రభుత్వం, యజమాన్యం 42 శాతం ఫిట్మెంట్తో వేతన సవరణ చేయాలని డిమాండ్ చేశారు. ఆరు డీఏలు వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగుల ఆరోగ్య నిధికి ఉద్యోగుల జీతాల నుంచి కోత విధించకుండా ప్రభుత్వమే చెల్లించాలని కోరారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, 60 ఏళ్లు దాటిన వీఆర్ఏల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులు పదవి విరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన ప్రయోజనాల బకాయిలు ఇప్పించాలని, వీటిని సాధించడానికి ఉద్యమ కార్యాచరణ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. పాముకాటుతో మహిళ మృతి జఫర్గఢ్ : ఇంట్లో నేలపై నిద్రిస్తున్న మహిళ పాము కాటుకు గురై మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని తిడుగు గ్రామంలో శుక్రవారం జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. తిడుగు గ్రామానికి చెందిన మారపల్లి సౌందర్య (44), భర్త అంజయ్య, ఇద్దరు పిల్లలతో కలిసి గురువారం రాత్రి ఇంట్లో నేలపై పడుకున్నారు. అర్ధరాత్రి సౌందర్య నిద్ర నుంచి లేచి ఏదో కుట్టినట్లుగా అనిపించిందని తన భర్తకు చెప్పడంతో అతను లేచి వెతకగా దుస్తుల్లో కట్లపాము కనిపించింది. దీంతో సౌందర్య పాముకాటుకు గురైందని తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే 108లో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తెల్ల వారుజామున మృతి చెందింది. కుటుంబ స భ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామారావు తెలిపారు. కాగా బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. పాముకాటుకు గురైన మహిళ చిల్పూరు : మండలంలోని ఫత్తేపూర్ గ్రామానికి చెందిన వడ్లూరి కోమలత శుక్రవారం పాము కాటుకు గురైంది. 108 సిబ్బంది ఈఎంటీ రాజేంద్రప్రసాద్, పైలట్ అమర్నాథ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కోమలత శుక్రవారం పాఠశాల ఆవరణలో గడ్డి, చెత్తను తొలగిస్తుండగా కాలుపై పాము కాటు వేసింది. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం స్టేషన్ఘన్పూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
స్నేహం పేరిట నమ్మక ద్రోహం
రవి–శిరీష దంపతులు (ఫైల్)చెన్నారావుపేట మండలం పాపయ్యపేటకు చెందిన బుడిగె రవి కుటుంబ పరిస్థితుల దృష్ట్యా పదో తరగతితోనే చదువు ఆపేశాడు. ఉన్నత చదువులకు స్వస్తి చెప్పి హైదరాబాద్కు వెళ్లి రైస్ మిల్లులో గుమస్తాగా జీవితాన్ని ప్రారంభించాడు. ఆ రంగంలో అనుభవం వచ్చాక హైదరాబాద్లోని హయత్నగర్లో ఒక బియ్యం దుకాణం పెట్టుకున్నాడు. తర్వాత కేసముద్రం మండలం నాయక్పల్లి గ్రామానికి చెందిన శిరీషను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కొడుకులు. హయత్నగర్లో సొంత ఇళ్లు కొనుక్కొని పిల్ల లను చదివిస్తున్నాడు. ఆర్థిక స్వేచ్ఛ సాధించానని సంబరపడుతున్న సమయంలో రవి–శిరీష దంపతులకు కొంత మందితో స్నేహం ఏర్పడింది. అది కాస్త ఫ్యామిలీ ఫ్రెండ్షిప్లా మారింది. ఓ వ్యక్తి, అతడి భార్య.. రవి, శీరిష దంపతులను తమ వ్యాపారంలో భాగస్వామిగా చేర్చుకుంటామని మాటిచ్చారు. లాభాల ఆశజూపి రూ.15 లక్షలు తీసుకున్నారు. ఎన్ని నెలలు గడిచినా భాగస్వామ్యం ఇవ్వకపోగా.. ప్రశ్నించిన రవి దంపతులను బెదిరించారు. దీంతో తాము మోసపోయామని గ్రహించి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఘట్కేసర్ బీబీనగర్ మధ్యలో ద్విచక్ర వాహనాన్ని చెట్ల పొదల్లో పెట్టి, రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు వారి బంధువులు చెబుతున్నారు.అమ్మా, నాన్న లేండి.. రవి, శిరీష దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో వారి పిల్లలు తొమ్మిదేళ్ల సుశాంత్, ఆరేళ్ల విద్వాంస్ అనాథలయ్యారు. ‘అమ్మా, నాన్న లేండి’ అంటూ చిన్నారులు రోదించిన తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. తల్లిదండ్రుల మృతితో అనాథలయ్యారు. -
మాజీ సర్పంచ్ ఓటుకే మ్యాపింగ్ కరువు
లింగాలఘణపురం : భారత ఎన్నికల సంఘం చేపట్టిన గణన పత్రంలో ఓ మాజీ సర్పంచ్ ఓటుకే మ్యాపింగ్ కరువైంది. దీంతో ఆమె ఓటు హక్కు ఉంటుందా..? లేక కోల్పోతుందా తెలియని అయోమయంలో పడ్డారు. ఆమెతో పాటు అదే గ్రామంలో మరో 80 మందికిపైగా ఇదే పరిస్థితి నెలకొంది. జనగామ జిల్లా లింగాలఘణపురం మండలంలో 2018లో పిట్టలోనిగూడెం కలుపుకొని ఏనెబావి నూ తన గ్రామ పంచాయతీగా ఏర్పడింది. ఆ సమయంలో ఎస్టీ రిజర్వేషన్ కావడంతో 2019లో జరిగిన ఎన్నికల్లో పిట్టలోనిగూడానికి చెందిన గుజులోతు యాదమ్మ ఏకగ్రీవ సర్పంచ్గా ఎన్నికయ్యారు. 2002లో యాదమ్మకు సంబంధించిన కుటుంబ సభ్యుల ఓటరు జాబితాలో ఎవరి పేర్లు లేకపోవడంతో ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణలో మ్యాపింగ్ అయ్యే పరిస్థితి లేదు. 2002లో ఆమెకు సంబంధించిన తల్లిదండ్రులు, నాయనమ్మ, తాతల ఓటరు వివరాలు ఎక్కడా లేకపోవడంతో వారి పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. పరిశీలించాకే నిర్ణయం.. పిట్టలోనిగూడెంలో సుమారుగా 70 ఇళ్లు ఉండగా 120 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 80 మందికి పైగా మ్యాపింగ్ అయ్యే పరిస్థితి లేదు. ఈ విషయంపై తహసీల్దార్ ఏఈఆర్ఓ అండాలును వివరణ కోరగా ఇలాంటి పరిస్థితుల్లో వీరి ఓటు హక్కుపై నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ (ఈఆర్ఓ) వారికి వద్ద ఉన్న ఆధారాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటారన్నారు. సంచార జాతులు కాబట్టి కొన్ని చోట్ల ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయని వివరించారు. పిట్టలోనిగూడెంలో 80 మందికి పైగా ఇదే పరిస్థితి -
ఓరుగల్లు పీఠాధిపతిగా విజయపాల్ పట్టాభిషేకం
కాజీపేట రూరల్ : కాజీపేట ఫాతిమా కేథడ్రల్ ప్రాంగణంలో శుక్రవారం ఓరుగల్లు కథోలిక పీఠం (డయాసిస్) 4వ నూతన పీఠాధిపతిగా దుగ్గింపూడి విజయపాల్రెడ్డి పట్టాభిషేకం ఘనంగా నిర్వహించారు. రోమ్ నుంచి లియోపోప్ పంపిన అధికార ఉత్తర్వులను పోప్దూత సెక్రటరీ లాటిన్ భాషలో చదివి వినిపించారు. హైదరాబాద్ ఆర్చ్ బిషప్ కార్డినల్ పూల ఆంథోని, విశాఖ ఆర్చ్ బిషప్ ఉడుమల బాల, శ్రీకాకుళం బిషప్ రాయరాల విజయ్కుమార్ సహాకారంతో బిషప్గా ఎన్నికై న ఫాదర్ విజయపాల్రెడ్డిని కతోలిక ఆధ్యాత్మిక సంప్రదాయనుసారం తైలాభిషేకం చేసి తలపై శిరస్త్రాణాన్ని ధరింపజేసి బిషప్గా పట్టాభిషేకం చేశారు. నూతన బిషప్ విజయపాల్రెడ్డి ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. పోప్లియో తనపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటానన్నారు. వరంగల్, కరీంనగర్ జిల్లాల ఫాదర్లు, కథోలికులు, 20 మంది బిషప్లు, 500 మంది ఫాదర్లు, 500 మంది సిస్టర్లు, బ్రదర్లు, ప్రజలు పాల్గొన్నారు. విజయపాల్ను సన్మానించిన ఎమ్మెల్యేలు నూతన బిషప్ విజయపాల్ను వరంగల్ పశ్చిమ ఎ మ్మెల్యే రాజేందర్రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొ ండ రాజయ్య, కొండేటి శ్రీధర్, ‘కుడా’ చైర్మన్ ఇనగా ల వెంకట్రాంరెడ్డి, ఏనుమాముల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ప్రియాంక అనిల్కుమార్ తదితరులు ఘనంగా సన్మానించారు. బిషప్ పట్టాభిషేకం ముందు నూతన బిషప్స్ హౌజ్ను కార్డినల్, సీబీసీఐ అధ్యక్షుడు పూల ఆంథోని ప్రారంభించారు. ఊరేగింపుగా వేదిక వద్దకు.. కార్డినల్ పూల ఆంథోని, నున్షియో సెక్రటరీ ఒక వాహనంలో, నూతన బిషప్గా పట్టాభిషేకం పొందనున్న విజయపాల్ ప్రత్యేక వాహనంలో బ్యాండ్ వాయిద్యాల నడుమ ప్రదర్శనగా హౌజ్ నుంచి పట్టాభిషేక వేదిక వద్దకు తొడ్కోని వచ్చారు. పాల్గొన్న రోమ్ పోప్ దూత సెక్రటరీ, అగ్ర పీఠాధిపతులు, ఫాదర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, దైవ సేవకులు తరలివచ్చిన వరంగల్, కరీంనగర్ జిల్లాల కథోలిక విశ్వాసులు -
నిఘా సరే.. బ్యాకప్ ఏది?
కాజీపేట అర్బన్: వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సీసీ కెమెరాలు ఉన్నా.. బ్యాకప్ లేకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి. చూసి తరించేందుకు తప్ప ఏదైనా ఘటన జరిగితే రికార్డు చేసి తెలిపేలా కెమెరాలకు బ్యాకప్ లేదు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్రతీ రోజు జరిగే రిజిస్ట్రేషన్ ప్రక్రియతోపాటు భూక్రయవిక్రయదారులు, కార్యాలయ సిబ్బంది కార్యకలాపాలు రికార్డు చేయడంతోపాటు అక్రమాలను నిఘా నేత్రం గమనిస్తుందనే భయం ఉంటే ఎలాంటి పొరపాట్లకు తావుండదు. అన్ని కెమెరాలూ అంతే.. వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ల ఎదురుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను కెమెరా కనిపెడుతూ మానిటర్లో డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. కానీ, సబ్ రిజిస్ట్రార్ల ఎదురుగా ఉన్న రెండు సీసీ కెమెరాలు ఎప్పుడు పని చేస్తాయో తెలియని పరిస్థితి. ఒకవేళ అవి పని చేసినా రికార్డు కాదు.. దీంతో ఏదైనా సమస్య ఉత్పన్నమైనప్పుడు మళ్లీ ఫుటేజీ చూసుకునే అవకాశం లేదు. రిజిస్ట్రేషన్ కార్యాలయం చుట్టూ, రికార్డు సెక్షన్లోనూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సైతం సరిగ్గా పనిచేయకపోవడంతో భూక్రయవిక్రయదారులు తమను వేధిస్తున్న వారిని పట్టించేందుకు తోడ్పడని సీసీ కెమెరాలు ఉన్నా.. లేకున్నా ఒకటే కదా అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. రికార్డు సెక్షన్లో దస్త్రాలకు భద్రత కరువు ఒక్క సీసీ కెమెరా వంద మందితో సమానమని నానుడి. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో విలువైన, ఏళ్లనాటి దస్త్రాలను భద్రపర్చే రికార్డు సెక్షన్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కానీ, వీటికి బ్యాకప్ లేక దస్త్రాలకు భద్రత లేకుండాపోయింది. ఖజానాకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయంలో నిఘా వ్యవస్థ సరిగ్గా లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి సీసీ కెమెరాలకు బ్యాకప్ ఏర్పాటు చేయాలని భూక్రయవిక్రయదారులు కోరుతున్నారు. వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సీసీ కెమెరాలకు లేని బ్యాకప్ రికార్డు సెక్షన్లోని దస్త్రాలకు భద్రత కరువు -
బీఎల్ఓలు ఇళ్లను సందర్శించాలి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్న్స్ హాల్లో ఈఆర్ఓలు, సూపర్వైజర్లు, బీఎల్ఓలతో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. బీఎల్ఓలు తమ పోలింగ్ కేంద్రం పరిధిలోని ఇళ్లను స్వయంగా సందర్శించి ఓటరు వివరాలు నమోదు చేయాలని సూచించారు. తూర్పు నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎంత శాతం సర్ పూర్తయ్యింది, ఏ ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయో ఈఆర్ఓలను అడిగి తెలుసుకున్నారు. వెనుకబడిన ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. ట్రాన్స్జెండర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి నియోజకవర్గంలో కొందరు ట్రానన్స్జెండర్లు సర్ నమోదుకు ముందుకు రావడంలో సంకోచిస్తున్నట్లు అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన కలెక్టర్ ప్రతి పౌరుడికి ఓటు రాజ్యాంగబద్ధమైన హక్కు అని తెలిపారు. ట్రాన్న్స్జెండర్లు కూడా దేశ పౌరులేనని, వారికి సర్పై అవగాహన కల్పించి వంద శాతం నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు పి.సంధ్యారాణి, వైవీ గణేశ్, డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, వరంగల్ ఆర్డీఓ సుమ, అధికారులు, సూపర్వైజర్లు, బీఎల్ఓలు తదితరులు పాల్గొన్నారు. -
భద్రతకు హామీ లభించినట్లేనా..?
హన్మకొండ : విద్యుత్ బస్సుల భద్రతపై జేబీఎం సంస్థ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లేనా అనే సందేహాలు ప్రయాణికుల్లో వ్యక్తమవుతున్నాయి. జేబీఎం బస్సులతో ప్రయాణికుల భద్రతకు ప్రమాదం పొంచిఉందని భావించిన టీజీఎస్ ఆర్టీసీ ఈ నెల 2న రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ బస్సులు నిలిపివేసింది. జేబీఎం నుంచి ఏ హామీ లభించిందో ఏమో కానీ.. శుక్రవారం వరంగల్ రీజియన్లో జేబీఎం విద్యుత్ బస్సులు రోడ్డెక్కాయి. 50 బస్సులను సాంకేతికంగా సరిదిద్దామని, వాటిని నడించాలని జేబీఎం సంస్థ ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరిందని, ఈ మేరకు 45 బస్సులు నడిపామని అధికారులు తెలిపారు. జేబీఎం బస్సుల ప్రమాదాలకు కారణాలేమిటి, భవిష్యత్లో ప్రమాదాలు పునరావృతం కాకుండా తీసుకున్న చర్యలు, తీసుకునే చర్యలు ఏమిటో స్పష్టంగా తెలియాల్సిన అవసరముందని ప్రయాణికులు అంటున్నారు. విద్యుత్ బస్సులకు బ్యాటరీల నుంచి పొగలు రావడం క్రమంగా మంటలు వ్యాప్తి చెందుతున్నాయి. అయితే భవిష్యత్లో ప్రమాదం జరిగితే అబాసుపాలు కావాల్సి వస్తోందని భావించిన ఆర్టీసీ యాజమాన్యం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. అయితే ఒక్క రోజు బస్సుల నిలిపివేతతో సమస్య పరిష్కారమైనట్లేనేనా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గందరగోళంలో కార్మికులు సాంకేతిక నిపుణులు బ్యాటరీల వద్ద ఉత్పన్నమయ్యే సమస్యను గుర్తించి వాటిని సరిచేస్తున్నారని ఆర్టీసీ అధికారులు తెలిపారు. వరంగల్–2లోని 115 విద్యుత్ బస్సులు నిలిచిపోవడంతో కార్మికులు గందరగోళానికి గురయ్యారు. బస్సులు ఎన్ని రోజులు నిలిపివేస్తారో తెలియక వరంగల్ రీజినల్ అధికారులు కండక్టర్లను సర్దుబాటు చేయగా అభ్యంతరం, నిరసన వ్యక్తం చేశారు. అవసరమైతే విద్యుత్ బస్సులు వచ్చిన తర్వాత గతంలో ఈ డిపోలో నడిచి సర్దుబాటు చేసిన బస్సులను తిరిగి డిపోనకు తెప్పించాలని, తమను ఇతర డిపోలకు పంపొద్దని అధికారులను డిమాండ్ చేశారు. ఏది ఏమైనా బస్సులు పునరుద్ధరించడంతో కండక్టర్ల సమస్య సమసిపోయింది. వరంగల్ రీజియన్లో రోడ్డెక్కిన 45 విద్యుత్ బస్సులు కండక్టర్ల సర్దుబాటు నిలిపివేత -
అదుపు తప్పిన బైక్..
● కాల్వలో పడి యువకుడి మృతి ● గుండేడు శివారులో ఘటన కమలాపూర్: బైక్ అదుపు తప్పి కాల్వలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన గురువారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గుండేడు శివారులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గుండేడుకు చెందిన దాసి వెంకటేష్ (27) తన తండ్రి సాంబయ్యతో కలిసి జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ దర్గాను దర్శించుకుని అక్కడి నుంచి బైక్పై గుండేడుకు వస్తున్నాడు. మార్గమధ్యలో తన తండ్రిని దింపి ఒంటరిగా వస్తున్నాడు. ఈ క్రమంలో గుండేడు శివారులో బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కెనాల్లో పడింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూరాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి సాంబయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ నవీన్ తెలిపారు. ప్రేమ వివాహం చేసుకుందని.. హసన్పర్తి : చెల్లి ప్రేమ వివాహం చేసుకుందనే ఆ గ్రహంతో అబ్బాయిని చంపుతామని బెదిరించడమే కాకుండా అతడి ఇంటికి నిప్పు అంటించారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి గురువారం నిందితులను అరెస్ట్ చేసి రి మాండ్కు తరలించినట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ మహేందర్ తెలిపారు. పోలీస్ ఇన్స్పెక్టర్ కథనం ప్రకారం.. హసన్పర్తి మండలం పెంబర్తికి చెందిన సౌరం విష్ణువర్ధన్, గుండ్లసింగారానికి చెందిన గాదె కరిష్మా గత నెల 24న ఓ ఆలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వారి వివాహాన్ని పెద్దలు అంగీకరించలేదు. చెల్లి ప్రేమ వివాహం చేసుకుందని కక్ష పెంచుకున్న అమ్మాయి సోదరుడు గాదె పాల్.. తన స్నేహితుడు మహబూబాబాద్ జిల్లా పూరి తండాకు చెందిన గుగులోత్ మనోజ్తో కలిసి జూన్ 24న కత్తులతో దాడికి చేయడానికి విష్ణు వర్ధన్ ఇంటికి వచ్చారు. ఆ తర్వాత మర్నాడు తెల్ల వారుజామున బాధితుడి ఇంటికి నిప్పు అంటించారు. దీంతో ఇంట్లో ఉన్న వారు తృటిలో ప్రాణాలతో తిప్పించుకున్నారు. నిందితుల నుంచి తల్వార్, కత్తిపాటు ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ మహేందర్ తెలిపారు.● అబ్బాయి ఇంటికి నిప్పు..ఆపై బెదిరింపు ● నిందితుల అరెస్ట్.. వివరాలు వెల్లడించిన పోలీసులు -
పాస్పుస్తకమున్నా బెదిరింపులు..
హసన్పర్తి : హసన్పర్తి పోలీస్ ఇన్స్పెక్టర్ మహేందర్ కబ్జాదారులకు సహకరిస్తూ పట్టాదారులైన తమను బెదిరింపులకు గురి చేస్తున్నాడని రైతులు ఆరోపించారు. ఈ మేరకు గురువారం హసన్పర్తి మండలం అన్నాసాగరం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతులు వైద్యుల స్వరూప, సమ్మిరెడ్డి మాట్లాడారు. అన్నాసాగరం శివారులోని సర్వే నంబర్ 74/బీ, 73/ఏ/1,77/ఏ/1,78/బీలో సుమారు 4.03ఎకరాల భూమి ఉందన్నారు. ఈభూమికి సంబంధించిన పట్టాదారు పాస్పుస్తకం పొంది రైతుభరోసా డబ్బులు కూడా తీసుకుంటున్నట్లు వివరించారు. అయితే ఇందులో 1.06 ఎకరాల భూమిని ఇదే గ్రామానికి చెందిన ప్రతాప్ రెడ్డి కబ్జా చేశాడని ఆరోపించారు. ఈవిషయమై పోలీస్స్టేషన్ను ఆశ్రయిస్తే ఇన్స్పెక్టర్ మహేందర్ తమనే బెదిరింపులకు గురిచేస్తూ కోర్టుకు వెళ్లమని హుకుం జారీచేస్తున్నాడని తెలిపారు. తమ వద్ద రెవెన్యూ అధికారులు సర్వే చేసిన మ్యాప్తో పాటు పట్టాదారుపాస్ పుస్తకాలు ఉన్నాయని చూపిస్తే.. క్షేత్రస్థాయికి వెళ్లినట్లయితే కేసు నమోదు చేస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. భూమి వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ధ్వంసం చేసినట్లు ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్నారు. పోలీస్ ఇన్స్పెక్టర్ నుంచి తమకు ప్రాణభయం ఉందని చెప్పారు. ఇలాగే పోలీస్ ఇన్స్పెక్టర్ వేధింపులకు గురి చేస్తే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయమై కలెక్టర్, పోలీస్ కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేస్తామని వైద్యుల స్వరూప, సమ్మిరెడ్డి తెలిపారు. పోలీస్ ఇన్స్పెక్టర్ నుంచి ప్రాణభయం విలేకరుల సమావేశంలో రైతుల ఆవేదన -
నేడు ఓరుగల్లు పీఠకాపరిగా విజయపాల్రెడ్డికి పట్టాభిషేకం
కాజీపేట రూరల్ : కాజీపేట ఫాతిమానగర్ కేథిడ్రల్ క్యాంపస్లో రోమ్ 14వ పోప్లియో నియమించిన ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన దుగ్గింపుడి విజయపాల్రెడ్డికి శుక్రవారం ఓరుగల్లు మేత్రాసనం 4వ పీఠకాపరిగా పట్టాభిషేకం జరగనుందని మీడియా ఇన్చార్జ్ ఫాదర్ ఎం.జయపాల్ గురువారం తెలిపారు. ఉదయం 9: 00 గంటలకు ఢిల్లీ, ఏపీ, తెలంగాణ, కర్నాటక, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే రోమ్ పోప్లియో దూత, అగ్రపీఠాధిపతులు, ఫాదర్లు, మఠాధిపతులు, మఠకన్యలు, ప్రజాప్రతినిధులు, అధికారులు.. విజయపాల్రెడ్డిని పీఠకాపరిగా అభిషేకిస్తారని చెప్పారు. పట్టాభిషేకానికి తరలొచ్చే వారి కోసం ఫాతిమానగర్ కేథిడ్రల్ చర్చి ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నూతన బిషప్స్ హౌస్ ప్రారంభం.. ఫాతిమానగర్ కేథిడ్రల్ క్యాంపస్ ప్రాంగణంలో ఓరుగల్లు మేత్రాసనం పరిపాలనా సౌలభ్యం కోసం అత్యాధునిక హంగులతో నిర్మించిన నూతన బిషప్స్ హౌస్ను ప్రారంభించనున్నట్లు మీడియా ఇన్చార్జ్ ఎం.జయపాల్ తెలిపారు. -
ఫీవర్.. ఫియర్
● ఆరు నెలల్లో జ్వరాల విజృంభణ ● జిల్లాలో 4,205 కేసులు నమోదు ● వానాకాలంతో సీజనల్ వ్యాధుల ముప్పు ● అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులుఆస్పత్రుల్లో రద్దీ.. వాతావరణంలో మార్పులు, వర్షాకాలం ప్రారంభం కావడంతో జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, విరేచనాల వంటి సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్లలోనూ రోగుల రద్దీ కనిపిస్తోంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ఎక్కువగా చికిత్స కోసం వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. జ్వరం రెండు, మూడు రోజులకు మించి కొనసాగినా, విరేచనాలు తీవ్రంగా ఉన్నా స్వయంగా మందులు వాడకుండా వైద్యులను సంప్రదించాలని, యాంటీబయాటిక్స్ను ఇష్టానుసారంగా వాడొద్దని సూచిస్తున్నారు. సాక్షి, వరంగల్: వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశముంది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ నెలవరకు సాధారణ జ్వరాలు, విరేచనాలు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, టైఫాయిడ్ వంటి రోగాలు జనాలను బెంబెలెత్తించాయి. ఆరు నెలల్లో అత్యధికంగా 4,205 జ్వరాల కేసులు నమోదయ్యాయి. అనంతరం అక్యూట్ డయేరియల్ డిసీజ్ (విరేచనాలు) 3,087 కేసులతో రెండో స్థానంలో నిలిచింది. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు 1,008, టైఫాయిడ్ 218 కేసులు నమోదయ్యాయి. డెంగీ కేసులు ఇప్పటివరకు 27, మలేరియా ఒక్క కేసు మాత్రమే నమోదైంది. వైరల్ హెపటైటిస్, హెచ్1ఎన్1, చికున్గున్యా వంటి వ్యాధులు నమోదుకాకపోవడం కాస్త ఊరటనిచ్చే అంశం. జూలైలో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యారోగ్య విభాగం అధికారులు సూచిస్తున్నారు. సీజన్లో కలుషిత నీరు, పరిసరాల అపరిశుభ్రత కారణంగా ఈ వ్యాధులు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. నీరు నిల్వ లేకుండా చూడాలి..వైద్యులు సూచించిన ప్రకారం మరిగించిన నీటినే కాచి తాగాలి. బయట ఆహారం తినడం తగ్గించాలి. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసి, దోమల నివారణ చర్యలు చేపట్టాలి. మూడు రోజులకుపైగా జ్వరం కొనసాగినా, విరేచనాలు తీవ్రమైతే వెంటనే ప్రభుత్వ ఆస్పత్రిని సంప్రదించాలి. – డాక్టర్ సాంబశివరావు, వరంగల్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారినెల జ్వరాలు విరేచనాలు శ్వాసకోశ టైఫాయిడ్ డెంగీ ఇన్ఫెక్షన్లుజనవరి 745 394 257 31 4 ఫిబ్రవరి 637 242 221 26 8 మార్చి 772 426 254 44 8 ఏప్రిల్ 828 584 115 52 2 మే 672 964 92 38 4 జూన్ 551 477 69 27 1 మొత్తం 4,205 3,087 1,008 218 27 -
నేటి నుంచి ఆర్ట్ చాలెంజ్
హన్మకొండ చౌరస్తా: జాతీయ స్థాయి ఆర్ట్ చాలెంజ్ శుక్రవారం నుంచి 14 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకురాలు సాగంటి మంజుల గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ చిత్రకారుడు శేష బ్రహ్మం కళా యజ్ఞ స్ఫూర్తితో ‘కళాయజ్ఞ మినీ’ అనే పేరుతో జాతీయ స్థాయిలో 7 అంశాలపై ఆర్ట్ చాలెంజ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనే వారికి ప్రతీ రెండు రోజులకు ఓ సారి ఒక సరికొత్త అంశం ఇవ్వనున్నట్లు తెలిపారు. అందులో అద్భుత ప్రతిభ కనబరిచిన చిత్రకారుల చిత్రాలను హైదరాబాద్లో ఆగస్టులో జరిగే చిత్ర కళా ప్రదర్శనలో ప్రదర్శించనున్నట్లు చెప్పారు. ఇందులో 50 మంది ప్రముఖ చిత్రకారులు పాల్గొంటున్నారని, వారు వేసిన పెయింటింగ్స్ సైతం పొందుపరచనున్నట్లు తెలిపారు. ఇతర పూర్తి వివరాలకు 81436 43337 నంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు. ‘కుడా’ భూముల వేలంపై చర్చకు సిద్ధం నయీంనగర్ : ‘కుడా’ భూముల వేలంపై బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలకు కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ (కుడా) చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి బహిరంగ చర్చకు సిద్ధమని కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ను వెంటబెట్టుకుని రావాలని ప్రతి సవాల్ విసురుతూ గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వేలం ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగిందని, ఎలాంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు. ఏ గుడికై నా వచ్చి ప్రమాణం చేసేందుకు తాను సిద్ధమన్నారు. బీఆర్ఎస్ పాలనలో ‘కుడా’ నిధుల వినియోగంపై ఇప్పటికే విచారణ ప్రారంభమైదందని తెలిపారు. ఆధారాలు లేకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. అన్నా.. అక్క మెంటార్షిప్ టీచింగ్ ఇంటర్ ్న షిప్ ప్రారంభం విద్యారణ్యపురి : ఉన్నత విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు అన్నా, అక్క మెంటర్షిప్–కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ టీచింగ్ ఇంటర్న్షిప్ కార్యక్రమంలో భాగంగా హనుమకొండలోని పింగిళి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల తృతీయ సంవత్సరం విద్యార్థినులు గురువారం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్న్షిప్ ప్రారంభించారు. తొలిదశలో 120మంది విద్యార్థినులు హనుమకొండ జిల్లాలోని 19 ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి కృత్రిమ మేధస్సు, డిజిటల్ అక్షరాస్యత సాంకేతిక నైపుణ్యాలు, డిజిటల్ లెర్నింగ్ తదితర అంశాలపై పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారని ఆ కళాశాల ప్రిన్సిపాల్ బి. చంద్రమౌళి తెలిపారు. ఈకార్యక్రమాన్ని నోడల్ అధికారులు బి. మాధవి, బి. స్వర్ణలత, డాక్టర్ పి. రాజిరెడ్డి సమన్వయం చేస్తున్నారు. -
నేతాజీ గౌరవం కోసం 13వేల కిలోమీటర్ల మహా బైక్ యాత్ర
● వరంగల్ యువకుడి అసాధారణ దేశ భ క్తి నయీంనగర్: నేతాజీ గౌరవం కోసం, ఆయన స్ఫూర్తితో దేశ ప్రజల్లో చైతన్యం నింపేందుకు వరంగల్కు చెందిన దేశభక్తుడు ఆడెపు కిశోర్ కుమార్ వరంగల్ నుంచి మొదలైన బైక్ యాత్ర కన్యాకుమారి నుంచి హిమగిరుల కాశ్మీర్ వరకు సాగింది. 13వేల కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణాన్ని ముగించుకున్న ఆయన గురువారం స్వస్థలమైన వరంగల్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని 20కి పైగా రాష్ట్రాల గుండా ఈ యాత్ర సాగిందని తెలిపారు. నేతాజీ లాంటి మహానుభావునికి దేశంలో సరైన గుర్తింపు రావాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుని జపాన్లో ఉన్న ఆయన అస్థికలను వెంటనే భారత్కు తీసుకురావాలని, నేతాజీ స్ఫూర్తి, భావజాలం, దేశభక్తి భావితరాలకు చాటి చెప్పాలన్నారు. -
గుండెల్లో నిలుపుకుంటారు
వరంగల్ పోలీసులు అధికారులనువరంగల్ క్రైం : వరంగల్ పోలీసులు తమతో కలిసి పనిచేసిన అధికారులను గుండెల్లో నిలుపుకుంటారని పూర్వ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్గా విధులు నిర్వహించి ఇటీవల సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్గా బదిలీ అయిన సన్ ప్రీత్ సింగ్కు గురువారం ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసుల ఆధ్వర్యంలో పోలీస్ పరేడ్ మైదానంలో వీడ్కోలు నిర్వహించారు. ఈ సందర్భంగా అలంకరించిన వాహనంపై సన్ ప్రీత్ సింగ్ను నిలబెట్టి పోలీస్ అధికారులు తాళ్లతో ఆ వాహనాన్ని లాగుతూ తమ అభిమానం, గౌరవం చాటుతూ భావోద్వేగ వీడ్కోలు పలికారు. అనంతరం సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ వరంగల్ పోలీస్ కమిషనరేట్లో 15 నెలలపాటు విధులు నిర్వర్తించిన కాలంలో ప్రతీ అధికారి, సిబ్బంది అందించిన సహకారం ఎప్పటికీ మరువలేనన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్తో తనకు ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని, ఇక్కడి అధికారులు, సిబ్బంది, ప్రజల ప్రేమ, ఆదరణ జీవితాంతం గుర్తుండిపోతుందన్నారు. భవిష్యత్లో కూడా వరంగల్ పోలీస్ కమిషనరేట్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. డీసీపీలు ధార కవిత, రాజమహేంద్ర నాయక్, అదనపు డీసీపీలు సురేశ్ కుమార్, శ్రీనివాస్, ప్రభాకర్ రావు, బాలస్వామి, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పూర్వ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ -
నియామకానికి ఇంటర్వ్యూలు
నేటి నుంచి పార్ట్టైం అధ్యాపకుల కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని వివిధ విభాగాల్లో పార్ట్టైం అధ్యాపకుల నియామకానికి ఈనెల 3(శుక్రవారం) నుంచి 8వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహించబోతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి –మార్చిలో 20 విభాగాల్లో 99 మంది పార్ట్టైం అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు స్వీకరించారు. 601 మంది దరఖాస్తు చేసుకున్నారు. తొలుత 16 విభాగాల్లో 69 మంది అధ్యాపకుల నియామకానికి ఈనెల 3 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు సంబంధిత అధికారులు రోస్టర్ ప్రకారం షార్ట్లిస్టు చేసి కొందరికే ఫోన్ద్వారా సమాచారం అందించారు. విభాగాల వారీగా ఇంటర్వ్యూల తేదీలు.. జూలై 3న ‘లా’, సోషియాలజీ, లైబ్రరీ సైన్స్, సైకాలజీ అభ్యర్థులకు, 4న కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, కామర్స్, 6న బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, 7న బాటనీ, జువాలజీ, తెలుగు, 8న పొలిటికల్ సైన్స్, ఇంగ్లిష్, మ్యాథ్మెటిక్స్, ఫార్మసీ విభాగాల అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలిచినట్లు రిజిస్ట్రార్ వి. రామచంద్రం తెలిపారు. వంద మార్కులు.. ఆయా విభాగాల్లో పార్ట్టైం అధ్యాపకుల నియామకానికి వంద మార్కులు కేటాయించారు. అభ్యర్థులకు యూజీ, పీజీ, పీహెచ్డీ, నెట్,సెట్, పబ్లికేషన్స్, టీచింగ్ అనుభవానికి సంబంధించి 80 మార్కుల వరకు కేటాయించారు.10 మార్కులు డెమోన్స్ట్రేషన్,10 మార్కులు ఇంటర్వ్యూలకు కేటాయించారు. ఈ విభాగాలకు తర్వాతే.. కేయూలోని మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్, జియాలజీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాలకు దరఖాస్తులు స్వీకరించినా ప్రస్తుతం ఇంటర్వ్యూలు నిర్వహించడం లేదు. తర్వాత నిర్వహిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. 269 మంది అభ్యర్థులకు పిలుపు 16 విభాగాల్లో 69 మందిని ఎంపిక చేయనున్న అధికారులు ఆయా విభాగాలన్నీ కలిపి దరఖాస్తులు చేసిన అభ్యర్థుల్లో షార్ట్ లిస్టుగా రూపొందించి 269 మంది అభ్యర్థులను డెమో, ఇంటర్వ్యూలకు పిలిచారు. ఇందులో 69 మంది అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. కాగా, 248 మంది అభ్యర్థుల దరఖాస్తులను రిజెక్ట్ చేశారు. -
అప్రెంటిస్ జాబ్మేళాను వినియోగించుకోవాలి
● ఇంటర్ విద్య ఆర్జేడీ గోపాల్ విద్యారణ్యపురి : ఇంటర్ వృత్తి విద్య కోర్సుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈనెల 13న నిర్వహించనున్న అప్రెంటిస్ జాబ్మేళాను వినియోగించుకోవాలని ఇంటర్ విద్య ఆర్జేడీ ఎ. గోపాల్ కోరారు. ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్, హైదరాబాద్ ఆర్డీఎస్డీఈ సంయుక్త ఆధ్వర్యంలో 2023 నుంచి 2026 విద్యాసంవత్సరాల్లో ఇంటర్ వృత్తి విద్య కోర్సుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు హనుమకొండలోని ప్రభుత్వ వృత్తివిద్య జూనియర్ కళాశాలలో అప్రెంటిస్ జాబ్మేళా నిర్వహించబోతున్నామన్నారు. ఈ మేరకు గురువారం ఈ కళాశాలలో అప్రెంటిస్ జాబ్మేళా సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు విస్తృత ప్రచారం కల్పించి ఎక్కువ సంఖ్యలో ఆయా విద్యార్థులు అప్రెంటిస్ జాబ్మేళాకు హాజరయ్యేలా కృషి చేయాలని సూచించారు. ఈ జాబ్మేళాలో ఎంపికై న వారికి ఆర్డీఎస్డీఈ వారు నెలకు రూ. 9,600 స్టైఫండ్ కూడా చెల్లిస్తారన్నారు. పారామెడికల్, ఇంజనీరింగ్, కామర్స్, కంప్యూటర్, హోమ్సైన్స్ కోర్సుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ బి. వెంకన్న, ప్రభుత్వ వృత్తివిద్య జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.శ్రీధర్, వివిధ జిల్లాల ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు ఆర్. శ్రీనివాస్రావు, కె. మాధవరావు, బి.కవిత, భగవద్గీత, ఎం. మంజుల, తదితరులు పాల్గొన్నారు. -
అంగన్వాడీ కేంద్రాలు తనిఖీ చేయాలి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: జిల్లాలోని ప్రతీ సీడీపీఓ తన పరిధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్ప న, పిల్లలకు అందుతున్న పోషకాహారం, ప్రీస్కూల్ విద్యా కార్యక్రమాలపై సీడీపీఓలు, సంక్షేమాధికారితో గురువారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీడీపీఓలు నెలకు కనీసం 150 కేంద్రాలను తనిఖీ చేయాలన్నారు. పిల్లలతో మాట్లాడడం, వంటశాల పరిశుభ్రత, స్టాక్ పరిశీలన, గర్భిణులు, బాలింతలకు అందుతున్న సేవలను పరిశీలించి ఫొటోలు నివేదికలను అదేరోజు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. రోజువారీ నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. కొందరు సీడీపీఓలు విధుల్లో నిర్లక్ష్యం వహించడం, క్షేత్రస్థాయి పరిస్థితులపై అవగాహన లేకపోవడంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబద్ధతతో పనిచేస్తున్న సీడీపీఓలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లను అభినందించారు. జిల్లా సంక్షేమాధికారి రాజమణి, సీడీపీఓలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. సీపీని కలిసిన వరంగల్ కలెక్టర్ న్యూశాయంపేట: వరంగల్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన ఎన్.శ్వేతను కమిషనరేట్ కార్యాలయంలో వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజాసమస్యల సత్వర పరిష్కారం తదితర అంశాలపై చర్చించారు. పోలీస్, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం మరింత బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలందించాల్సిన అవసరాన్ని ఇరువురు అధికారులు ప్రస్తావించారు. -
హరితహారం లక్ష్యం ఇలా..
డివైడర్లలో 4,37,686చెరువు కట్టలు, బండ్లపై 90,720పీపీవీ, పార్కులు 1,74,593సంస్థాగత 70,946ఎంఎల్ఏపీ 1,000ఇతర మొక్కలు 55,032 15.20 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం ● వర్షాలు కురిస్తే 15 రోజులకు.. లేదంటే వచ్చే నెల ప్రారంభం ● వన మహోత్సవానికి గ్రేటర్ ఉద్యాన శాఖ సిద్ధం రహదారి పక్కన 20,023గృహాలకు 6,70,000నర్సరీలో సిద్ధంగా ఉన్న మొక్కలువరంగల్ అర్బన్: చారిత్రక, వారసత్వ ఓరుగల్లు మహా నగరాన్ని హరితమయంగా మార్చేందుకు జీడబ్ల్యూఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. సీఎం రేవంత్రెడ్డి, గ్రేటర్ వరంగల్ ప్రత్యేకాధికారి, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశాల మేరకు కసరత్తులు పూర్తి చేశారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు రంగం సిద్ధం చేశారు. పక్షం రోజుల వ్యవధిలో మొక్కలు నాటాలని నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ వర్షాలు కురవకపోతే ఆగస్టు మొదటి వారంలో 15.20 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేయగా, అందులో బల్దియా పరిధిలో 6 లక్షల మొక్కలు నర్సరీల్లో అందుబాటులో ఉన్నాయి. మరో 9.20 లక్షల మొక్కలను పబ్లిక్, ప్రైవేట్ సంస్థల నుంచి కొనుగోలు చేసి దిగుమతి చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. 16 నర్సరీల్లో మొక్కలు సిద్ధం.. క్రిస్ట్రియన్ కాలనీ, లక్ష్మీ మెగాటౌన్ షిప్లో, తిమ్మాపూర్లో, వెస్ట్సిటీ, సూర్యకుటీర్, బాలసముద్రం ఎల్లపూర్, నక్కలగుట్టలో ప్రభుత్వ బీఈడీ కళాశాలలో, హెచ్ఎండీఏతోపాటు ప్రైవేట్ సంస్థల తదితర ప్రాంతాల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పూలు, పండ్లు, అలంకరణ మొక్కలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. తట్టుకునేలా.. నగర వాతావరణంలో సులువుగా, బలమైన వేర్లతో వృద్ధి చెందే దేశీ జాతి మొక్కలకు వన మహోత్సవంలో అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు అధికారులు వెల్ల డించారు. అవసరమైన చోట రావి, దారుల పొడవునా, పార్కులు, సంస్థల్లో నీడనిచ్చే వివిధ రకాల మొక్కలు పెంచుతామంటున్నారు. గాలి, వానల ను తట్టుకుని నిలిచే వాటిపై దృష్టిపెట్ట కున్నట్లు స్పష్టం చేస్తున్నారు. ప్రతీ ఇంటికి 3 మొక్కల పంపిణీ నగరంలో ప్రతీ ఇంటికి 3 మొక్కలు పంపిణీ చేసేలా లక్ష్యం పెట్టుకున్నారు. ఆయా డివిజన్లలో అందుబాటులో ఉన్న వాటర్ ట్యాంక్లు, పార్కులు, నర్సరీల్లో వీటిని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. పలురకాల పండ్లు, పూల జాతులు, నీడనిచ్చే మొక్కలను అందించనున్నారు. రోడ్లు, అంతర్గత రహదారులు, మోడల్ కా లనీల పొడవునా మాస్టార్ ప్లాన్కు సంబంధించిన 80,60 ఫీట్ల రహదారుల్లో మల్టీ రో అవెన్యూ మొక్కలతో అలంకరణ జాతుల మొక్కలను అవెన్యూ ప్లాంటేషన్ కింద విస్తృతంగా నాటనున్నారు. అందరీని భాగస్వాముల్ని చేస్తాం.. వనమహోత్సవ కార్యక్రమాన్ని నగరంలో అమలు చేసేందుకు ముందుస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాం. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, స్లమ్ సమాఖ్యల ప్రతినిధులను, కాలనీ అసోసియేషన్, వేల్పేర్ కమిటీ ప్రతినిధులను, స్వచ్ఛంద, యువజన సంఘాలందరినీ ఈబహత్తర కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తాం. – లక్ష్మారెడ్డి, బల్దియా ఉద్యాన శాఖ అధికారి నగర వ్యాప్తంగా ఉన్న 149 కిలోమీటర్ల పరిధి రహదారుల వెంట 26,335 మొక్కలు నాటనున్నారు. మీడియం, జంక్షన్లు 65.95 చదరపు కిలోమీటర్లు ఉండగా, 3,23,465 మొక్కలు నాటాలని నిర్ణయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, ఆస్పత్రులు, హాస్టళ్లు తదితర 16 ప్రాంతాల్లో ఇన్స్టలేషన్ ప్రాంతాల్లో 45,800 మొక్కలు నాటనున్నారు. మడికొండ ఓఆర్ఆర్లో 6 ప్రాంతాల్లో 1,000 మొక్కలు, విద్యుత్ నగర్ 1,000 మొక్కలు నాటాలని నిర్ధారించారు. చెరువులు, బండ్ తదితర 18 ప్రాంతాల్లో 32 వేల మొక్కలు నాటనున్నారు. ఖాళీ స్థలాలతోపాటు, శ్మశాన వాటికల్లో మొక్కలు నాటేందుకు ప్రతిపాదించారు. మొక్కలు నాటడంతో పాటు ప్రత్యేకంగా వాటి సంరక్షణకు చర్యలు తీసుకోనున్నారు. -
ఘన వ్యర్థాలను సమర్థంగా నిర్వహించండి
గ్రేటర్ వరంగల్ కమిషనర్ టి.వెంకన్న వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ ఘన వ్యర్థాల నిర్వహణ (సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్)ను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు ట్రాన్స్ఫర్ స్టేషన్ల నిర్వహణను పటిష్టంగా కొనసాగించాలని కమిషనర్ టి.వెంకన్న సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం బల్దియా కార్యాలయంలో ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాల పురోగతిపై కమిషనర్ అధికారులతో సమీక్షించారు. సమావేశంలో ఎస్ఈ రాజ్కుమార్, ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రాజేశ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మహేందర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంతోశ్కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు. బండ్ పనులు త్వరగా పూర్తి చేయండి కాజీపేట రూరల్: గ్రేటర్ వరంగల్ నగరంలోని వడ్డేపల్లి బండ్పై కొనసాగుతున్న అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్న సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం వడ్డేపల్లి బండ్ వద్ద కొనసాగుతున్న అభివృద్ధి పనులను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయన వెంట సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజ్కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికుమార్, కాంట్రాక్టర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ధర్మసాగర్ రిజర్వాయర్ పరిశీలన ధర్మసాగర్: ప్రజలకు రోజూ నల్లాల ద్వారా నీటిని సరఫరా చేయాలని కమిషనర్ ఇంజనీర్లను ఆదేశించారు. ధర్మసాగర్ రిజార్వాయర్ను పరిశీలించిన ఆయన ఇంజినీర్లకు పలు సూచలిచ్చారు. నాణ్యతతో కూడిన తాగు నీరందించాలని కోరారు. -
ఈవీ బస్సు.. భద్రత తుస్సు
శుక్రవారం శ్రీ 3 శ్రీ జూలై శ్రీ 2026హన్మకొండ: విద్యుత్ బస్సులపై భ్రమలు వీడుతున్నాయి. తరచూ జరుగుతున్న అగ్నిప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆర్టీసీ కార్మిక సంఘాలు విద్యుత్ బస్సులను మొదటినుంచీ వ్యతిరేకిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం కాలుష్య నివారణకు, పర్యావరణ పరిరక్షణ కోసమంటూ ఈవీ బస్సులను ప్రవేశపెట్టింది. బస్సుల్లో అగ్నిప్రమాదాలు జరుగుతుండడంతో ఆర్టీసీ యాజమాన్యం ఆలోచనలో పడింది. ప్రయాణికుల భద్రతకు భరోసా లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులను నిలిపేసింది. ఇటీవల కరీంనగర్లో 15 రోజుల వ్యవధిలో రెండు బస్సుల్లో మంటలు లేచి దగ్ధమయ్యాయి. వరంగల్ రీజియన్లో వరంగల్–2 డిపోనకు 115 బస్సులు కేటాయించగా.. ఈ డిపో ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతోంది. వీటన్నింటి సేవలను నిలిపేసింది. స్పందించని జేబీఎం యాజమాన్యం వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతుండడంతో ఆర్టీసీ యాజమాన్యం ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతున్న జేబీఎం సంస్థకు ప్రయాణికుల భద్రతపై లేఖ రాసినట్లు సమాచారం. ప్రయాణికులకు ఎలాంటి రక్షణ కల్పిస్తారని, తరచూ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని అడిగినట్లు తెలిసింది. ఈ లేఖకు జేబీఎం యాజమాన్యంనుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా 500కు పైగా ఎలక్ట్రిక్ బస్సులు నిలిపేసింది. ఈక్రమంలో వరంగల్ రీజియన్లో 115 బస్సులు డిపోనకే పరిమితమయ్యాయి. -
సమన్వయంతో పనిచేయాలి
వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత వరంగల్ క్రైం: లైంగిక దాడులకు గురైన మహిళలు, చిన్నారులకు చట్టబద్ధమైన రక్షణతో పాటు వైద్య, న్యాయ, మానసిక పరామర్శ, పునరావాస సేవలు సకాలంలో అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత సూచించారు. కమిషనరేట్ పరిధి వరంగల్, జనగామ జిల్లాలకు చెందిన భరోసా కేంద్రం ద్వారా అందిస్తున్న సేవలు మరింత సమర్థవంతంగా కొనసాగేందుకు, సంబంధిత ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడానికి గురువారం వరంగల్ పోలీస్ కమిషనరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా పోలీస్ కమిషనర్ సీపీ శ్వేత బాధితుల గౌరవం, గోప్యతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ప్రతీ కేసును సున్నితంగా విచారించాలని సూచించారు. కేసు నమోదు నుంచి దర్యాప్తు, వైద్య పరీక్షలు, ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, కౌన్సెలింగ్, న్యాయ సహాయం, పునరావాసం వరకు ప్రతీ దశలో ఎలాంటి జాప్యం లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ముఖ్యంగా పోక్సో చట్టం కింద నమోదయ్యే కేసుల్లో నిర్దేశిత గడువులో దర్యాప్తు పూర్తి చేసి, కోర్టులో బలమైన సాక్ష్యాధారాలు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమీక్షలో పోలీస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
డీఎఫ్ఓ ముకుందరెడ్డి బాధ్యతల స్వీకరణ
న్యూశాయంపేట : హనుమకొండ, జనగామ జిల్లాల అటవీశాఖాధికారిగా జి.ముకుందరెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను హనుమకొండ రేంజ్ అధికారులు టి.శ్రీనివాస్, జే.శిరీష, కాకతీయ జూపార్క్ అసిస్టెంట్ క్యూరేటర్ బి.మయూరి, పరిపాలన అధికారి పి.మంజుల, సిబ్బంది రాజు తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కాజీపేట అర్బన్ : ఉమ్మడి వరంగల్ జిల్లా రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ రిజిస్ట్రార్గా వల్లి సుబ్బలక్ష్మి గురువారం బాధ్యతలు స్వీకరించారు. చిట్స్ సహాయ రిజిస్ట్రార్ తస్లీమా, సబ్ రిజిస్ట్రార్లు, కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. వరంగల్ లీగల్: రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు నెల 18న చెక్బౌన్స్ కేసులపై ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్లు వీబీ నిర్మలా గీతాంబ, ఎం.రామకృష్ణ సునీత తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో గురువారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ప్రత్యేక లోక్ అదాలత్ కోసం ఇప్పటి వరకు వరంగల్లో 2,364 ఎన్ఐ యాక్ట్ కేసులు, హనుమకొండలో 4,362 ఎన్ఐ యాక్ట్ కేసులు గుర్తించినట్లు తెలిపారు. ఈ కేసులను పరిష్కరించేందుకు వరంగల్, హనుమకొండ జిల్లాల పరిధిలో ప్రత్యేక బెంచ్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. లోక్ అదాలత్పై ఎలాంటి సలహాలు, సందేహాలు, న్యాయ సాయం కోసం న్యాయసేవాధికార సంస్థను ఆశ్రయించి, ఉచిత న్యాయ సలహాలు, సూచనలు పొందవచ్చని సూచించారు. న్యాయమూర్తి జె.మైత్రేయి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ప్రదీప్, వరంగల్ బార్ అసోసియేషన్ అ ధ్యక్షుడు సీహెచ్.ఉపేందర్, చిట్ఫండ్ కంపెనీ, బ్యాంకు అధికారులు, న్యాయవాదులున్నారు. రామన్నపేట: వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి ఖాళీ ఉన్న సీట్ల భర్తీకి నేడు(శుక్రవారం) దరఖాస్తుల స్వీకరణ, జూలై 4న అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ పి.శ్రీనివాస్ తెలిపారు. జూలై 2 నాటికి సివిల్ ఇంజనీరింగ్లో ఒకటి, సివిల్ ఇంజినీరింగ్ (రియల్ ఎస్టేట్ అండ్ వాల్యుయేషన్)లో 21, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్లో 2, మెకానికల్ ఇంజినీరింగ్లో 35 సీట్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.5,080 ఫీజుతో పాటు నిబంధనల ప్రకారం స్పాట్ అడ్మిషన్ ప్రాసెసింగ్ ఫీజును చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు టీజీ పాలిసెట్ ర్యాంక్ కార్డు (అర్హులైతే), ఎస్సెస్సీ మార్కుల మెమో, పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, టీసీ, కుల ధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రం (అవసరమైతే), ఒక సెట్ జిరాక్స్ ప్రతులతో వ్యక్తిగతంగా ప్రభుత్వ పాలిటెక్నిక్, వరంగల్కు హాజరుకావాలని సూచించారు. -
రీ సర్వేతో భూ సమస్యలకు పరిష్కారం
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ కాజీపేట అర్బన్: రీ సర్వే చేయడం ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. కాజీపేట మండలం అమ్మవారిపేటలో గురువారం భూ కొలతల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భూముల రీ సర్వే అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హాజరై మాట్లాడారు. క్షేత్రస్థాయిలో భూముల హద్దు రాళ్లు దొరకడం లేదని, సర్వే నంబర్ గుర్తించడం, హద్దులు నిర్ణయించడం ద్వారా భూ సమస్యలకు చెక్ పెట్టవచ్చని ఇందుకు రీ సర్వే చక్కటి మార్గం అని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రోవర్స్, డీజీపీఎస్ సాయంతో ఇంచు భూమి కూడా తప్పిపోకుండా సర్వే జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో కాజీపేట మండల తహసీల్దార్ సీహెచ్.రాజు, సర్వే విభాగం డిప్యూటీ ఇన్స్పెక్టర్ సారంగపాణి, భూములు కొలతల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నూర్ సింగ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. రుణాల వసూళ్లపై దృష్టి పెట్టాలిసీ్త్ర నిధి రుణాల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించి, రుణాలు దుర్వినియోగం చేసిన వారి నుంచి తప్పనిసరిగా రికవరీ చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. రుణ వసూళ్లు సీ్త్ర నిధి యాప్ ద్వారానే నిర్వహించాలని, అర్హులైన మహిళలకు రుణాల మంజూరులో పురోగతి సాధించాలని సూచించారు. గురువారం కలెక్టరేట్లో సీ్త్ర నిధి రుణాల మంజూరు, వసూళ్లు, బ్యాంక్ అనుసంధానంపై డీఆర్డీఓ మేన శ్రీను, అదనపు డీఆర్డీఓ వెంకటేశ్వర్లు, రీజినల్ మేనేజర్, డీపీఎంలు, ఏపీఎంలతో సమీక్ష నిర్వహించారు. ఇందులో డీపీఎంలు అనిత, రాజేంద్ర ప్రసాద్, రీజినల్ మేనేజర్ రమేశ్, ఏపీఎంలు, సీ్త్ర నిధి సిబ్బంది పాల్గొన్నారు. మెరుగైన పురోగతి సాధించాలివిద్యార్థుల ముఖ గుర్తింపు హాజరు (ఎఫ్ఆర్ఎస్) నమోదు వందశాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్లో గురువారం ఎఫ్ఆర్ఎస్ అమలు, అనుమతి లేని ప్రైవేట్ పాఠశాలల మూసివేత, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల పెంపు, శిథిల భవనాల తొలగింపు తదితర అంశాలపై డీఈఓ, ఎంఈఓలతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ట్రెయినీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, డీఈఓ గిరిరాజ్ గౌడ్, ఎంఈఓలు ఉన్నారు.అంగన్వాడీ టీచర్గా మారిన కలెక్టర్కాజీపేట అర్బన్: కాజీపేట మండలం అమ్మవారిపేటలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలోని అంగన్వాడీ కేంద్రాన్ని గురువారం కలెక్టర్ చాహత్బాజ్పాయ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. టీచర్గా మారి ఆటపాటలతో కూడిన విద్యను బోధించారు. ఈ బొమ్మ ఏంటో మీకు తెలుసా? అని అడుగుతూ చిన్నారులను ఆప్యాయంగా పలకరించారు. చిన్నారులకు ప్రాథమిక విద్యను అందించడంతో పాటు ఆటపాటలతో పాటు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. -
ఓరుగల్లు మేత్రాసనం అభివృద్ధే లక్ష్యం
కాజీపేట రూరల్ : ఓరుగల్లు మేత్రాసనం కేంద్రంగా విశ్వాస ఆధ్మాతిక, విద్య, వైద్య, సాంఘింక రంగాల అభివృద్ధే లక్ష్యంగా అందరి సహకారంతో తన వంతు కృషి చేయనున్నట్లు ఓరుగల్లు మేత్రాసనం నూతన పీఠాధిపతి బిషప్ దుగ్గింపుడి విజయపాల్రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం కాజీపేట ఫాతిమానగర్ పాస్ట్రల్ సెంటర్ గ్రీన్హౌజ్లో మీడియా ఇన్చార్జ్ ఫాదర్ ఎం.జయపాల్ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో బిషప్ విజయపాల్రెడ్డి మాట్లాడారు. ఓరుగల్లు మేత్రాసనం పరిధిలోని 12 జిల్లాల్లో కులమతాలు, ప్రాంతాలు, వర్గాలకతీతంగా ఫాతిమామాత ఆశీర్వాదంతో సకల జనుల ప్రయోజనాలే ధ్యేయంగా పని చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ తర్వాత ఓరుగల్లు మేత్రాసనం విశిష్టమైందని, రోమ్ 14వ లియోపోమ్ తనను 4వ పీఠాధిపతిగా నియమించారని చెప్పారు. 1952లో ఓరుగల్లు మేత్రాసనం ఏర్పడిందని, మొదటి బిషప్గా అల్పోన్స్ బిషప్ బెరెట్టా, 2వ బిషప్గా తుమ్మబాల, 3వ బిషప్గా ఉడుములబాల, 4వ బిషప్గా తాను ఈ నెల 3వ తేదీన పట్టాభిషేకంతోపాటు నూతన వరంగల్ బిషప్స్ హౌజ్ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఫాదర్లు తాటికొండ జోసెఫ్, కాసుమర్రెడ్డి, వై.కిరణ్, బాలరాజ్, బ్రదర్ జార్ట్, టామీ, మథ్యాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫాతిమామాత ఆశీర్వాదంతో సకల జనులకు సేవలు బిషప్ విజయపాల్రెడ్డి -
దూరవిద్య డిగ్రీ , పీజీ అడ్మిషన్లకు నోటిఫికేషన్
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్య (సీడీఓఈ/ఎస్డీఎల్సీఈ)లో 2026–2027 విద్యాసంవత్సరంలో డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు దూరవిద్య కేంద్రం డైరెక్టర్ బి. సురేశ్లాల్ బుధవారం తెలిపారు. ఈనెల 1 నుంచి సెప్టెంబర్ 15వ తేదీవరకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. కేయూ దూరవిద్య వెబ్సైట్లో కోర్సులు, వ్యవధి, విద్యార్హతలు, బోధనామాధ్యమం, అర్హతలు, ఫీజుల వివరాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. అభ్యర్థులు ఆఫ్లైన్ లేదా ఆన్లైన్లో నిర్ణీత ఫీజులు చెల్లించి అడ్మిషన్లు పొందాలని ఆయన కోరారు. పట్టాలిచ్చే వరకూ పోరాడతాం న్యూశాయంపేట : పేదల ఇళ్ల స్థలాలకు పట్టాలిచ్చే వరకు పోరాటాలు కొనసాగిస్తామని వామపక్ష పార్టీల నేతలు స్పష్టం చేశారు. బుధవారం వరంగల్ కలెక్టరేట్ ఎదుట వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. వామపక్షాల ఆందోళనతో కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణం దద్దరిల్లింది. అంతకుముందు సీపీఐ, సీపీఎం, ఎంసీపీఐ(యూ) సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ, లిబరేషన్ పార్టీల ఆధ్వర్యంలో ఏకశిలపార్క్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట నాయకులు, కార్యకర్తలు బైఠాయించి నినాదాలు చేశారు. కార్యక్రమంలో సీపీఐ వరంగల్ జిల్లా కార్యదర్శి షేక్బాషుమియా, సీపీఎం జిల్లా కార్యదర్శి రంగయ్య, ఎంసీపీఐ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్, న్యూడెమోక్రసీ నాయకులు గంగుల దయాకర్, యాదగిరి, రవీందర్, శరత్, కుమారస్వామి తదితర నాయకులు పాల్గొన్నారు. -
చెట్ల కొమ్మలు నరకడం ఇక సులువు
హన్మకొండ: చెట్ల కొమ్మలు నరకడం ఇక నుంచి సులువు కానుందని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. చెట్ల కొమ్మలు నరకడం కోసం సమకూర్చిన హైడ్రాలిక్ బకెట్ ల్యాడర్ వాహనాన్ని బుధవారం హనుమకొండ బాలసముద్రంలో ప్రారంభించారు. అనంతరం ల్యాడర్ ద్వారా కొమ్మల నరికివేతను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎండీ వరుణ్రెడ్డి మాట్లాడుతూ లైన్ల పైకి చెట్ల కొమ్మలు విస్తరించి తరచూ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు. సులువుగా, వేగంగా చెట్ల కొమ్మలు తొలగించేందుకు ఈ వాహనాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం హనుమకొండ సర్కిల్కు సమకూర్చామని, వరుసగా అన్ని సర్కిళ్లకు విస్తరిస్తామన్నారు. వర్షాకాలంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులు వచ్చినా వెంటనే స్పందించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేలా అన్ని బృందాలు సిద్ధంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు వి.మోహన్రావు, వి.తిరుపతిరెడ్డి, టి.మధుసూదన్, సీఈలు కె.తిరుమల్రావు, రాజుచౌహాన్, అశోక్, హనుమకొండ ఎస్ఈ బి.సామ్యనాయక్, డీఈలు జి.సాంబరెడ్డి, మల్లికార్జున్, అనిల్కుమార్, భాస్కర్, ఏడీఈ రాజు, ఏఈ ప్రవీణ్, లైన్మెన్ మల్లికార్జున్, సిబ్బంది శౌర్య, సదానందం, వంశీధర్, సిద్ధిరెడ్డి, రాంరెడ్డి, వినయ్, నరేశ్ పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి హైడ్రాలిక్ బకెట్ ల్యాడర్ సేవలకు శ్రీకారం -
ప్రజలకు మెరుగైన సేవలందిస్తా
గురువారం శ్రీ 2 శ్రీ జూలై శ్రీ 2026విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లా కేంద్రంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న కిడ్స్ ప్లేస్కూల్స్ను బుధవారం అధికారులు సీజ్ చేశారు. డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ ఆదేశాల మేరకు వండర్ కిడ్స్, బచ్పన్, కిడ్జి ప్లేస్కూ ల్స్ను మూసివేశారు. అదేవిధంగా రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఒకే పేరుతో నిర్వహిస్తున్న మై చోటా ప్లేస్కూల్స్ను కూడా సీజ్ చేసినట్లు హనుమకొండ ఎంఈఓ నెహ్రూ తెలిపారు. ఆయా స్కూళ్లలో నోటీసులు అంటించి, తల్లి దండ్రులకు కూడా సూచనలు చేసినట్లు పేర్కొన్నారు. కాజీపేట దర్గా ప్రాంతంలో గుర్తింపు లేకుండా నిర్వహిస్తున్న హ్యాపీహ్యాపీ ప్లేస్కూ ల్ను సీజ్ చేశామని కాజీపేట ఎంఈఓ బి.మనోజ్కుమార్ తెలిపారు. ఈ ప్లేస్కూల్లో చదువుతున్న విద్యార్థులను సమీపంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించాలని ఆయన తల్లిదండ్రులకు సూచించారు. ఎంఈఓ వెంట సీఆర్పీలు ప్రవీణ్కుమార్, రాంప్రసాద్ తదితరులు ఉన్నారు. అనుమతి లేని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించొద్దని గిరిరాజ్గౌడ్ తల్లిదండ్రులను కోరారు. కేయూ క్యాంపస్: ఉన్నత విద్యాశాఖ అధికారులు, వివిధ యూనివర్సిటీల వీసీలు, ప్రొఫెసర్లు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలల లెక్చరర్లు ఎడ్యుకేషన్ స్టడీ టూర్కు జర్మనీ వెళ్లారు. జర్మనీ పర్యటనకు వెళ్లిన బృందంలో ఉన్న కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డి అక్కడ మూడు యూనివర్సిటీలతో కేయూకు అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు. ఈమేరకు బుధవారం వివరాలను వెల్లడించారు. ఆయా విశ్వవిద్యాలయాల అంతర్జాతీయ సంబంధాల విభాగాల అఽధిపతులతో వీసీ ప్రతాప్రెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా, రూసా ప్రాజెక్టు అధికారి సౌందర్యజోసెఫ్, రూసా కేయూ నోడల్ అధికారి ప్రొఫెసర్ ఆర్.మల్లికార్జున్రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎం.కుమార్ చర్చలు జరిపారు. అనంతరం ఎంఓయూ కుదుర్చుకున్నారు. జర్మనీ పర్యటనలో ఆయన ఈనెల 6 వరకు ఉండనున్నారు. నయీంనగర్: టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ‘కుడా’ రెండేళ్ల అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్ను వారికి అందజేశారు. రెండేళ్ల కాలంలో వరంగల్ మహానగర పరిధిలో మౌలిక వసతుల కల్పన, మాస్టర్ ప్లాన్ విస్తరణ, ల్యాండ్ పూలింగ్, కాళోజీ కళాక్షేత్రం వంటి పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి తదితర అంశాలను చైర్మన్ వివరించారు. సీఎం రేవంత్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ‘కుడా’ను ఆర్థిక స్వావలంబన వైపు నడిపిస్తున్నట్లు ఆ యన తెలిపారు. ఇనగాల వెంట ఎమ్మెల్యే నాగరాజు, టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ పింగిలి వెంకట్రాంనరసింహారెడ్డి, నాయకులు ఉన్నారు. హన్మకొండ కల్చరల్: వరంగల్కు చెందిన పురుషోత్తమ ఘనాపాఠికి ఘన పాఠమణి బిరుదు, ప్రముఖ రుగ్వేద పండితుడు సూర్యనారాయణ ఘనాపాఠి, శివసుబ్రహ్మణ్య ఘనాపాఠి సోదరులు రుగ్వేద సుధాకర బిరుదు అందుకున్నారు. ఈ మేరకు శ్రుతి స్మృతి ట్రస్ట్ బాధ్యులు హైదరాబాద్లోని స్కందగిరి దేవాలయంలో 33 రోజులుగా రుగ్వేద ఘనపారాయణం నిర్వహించారు. ఆగమ సామ్రాట్ భద్రకాళి శేషు ఈ కార్యక్రమంలో పాల్గొని పురుషోత్తమ ఘనాపాఠికి ఘన పాఠమణి బిరుదు ప్రదానం చేశారు. కంచికామకోటి పీఠాధిపతి శ్రీశంకర విజయేంద్ర సరస్వతీస్వామి ఘనాపాఠి సోదరులకు రుగ్వేద సుధాకర బిరుదు అందజేశారు. ● శాంతి భద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యం ● వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ● కమిషనరేట్లో బాధ్యతల స్వీకరణ వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని, ఇందుకు ప్రజలం సహకారం ఎంతో అవసరమని వరంగల్ నూతన పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత పేర్కొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్గా సన్ప్రీత్సింగ్ నుంచి బుధవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ పోలీస్ కమి షనరేట్ కార్యాలయానికి చేరుకున్న నూతన సీపీకి సిబ్బంది సాయుధ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా నూతన సీపీని వరంగల్ పోలీస్ కమిషనరేట్కు చెందిన డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు. మొక్కలు, నోట్బుక్స్ అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత మాట్లాడుతూ, ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలకు మరింత మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు కమిషనరేట్ పరిధిలోని ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించే విధంగా పోలీసింగ్ను సమర్థవంతంగా నిర్వహిస్తామని పోలీస్ కమిషనర్ తెలిపారు. అమ్మవారికి సీపీ శ్వేత పూజలు హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయాన్ని బుధవారం వరంగల్ నూతన పోలీస్ కమిషనర్ శ్వేత సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, అర్చకులు ఆమెను ఘనంగా స్వాగతించారు. సీపీ శ్వేత అమ్మవారిని దర్శించుకుని పూజలు జరుపుకున్నారు. అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. కమిషనర్ వెంట ఏసీపీ సత్యనారాయణ, సీఐ సుజాత తదితరులు ఉన్నారు. వరంగల్ క్రైం: వరంగల్ పోలీసులకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ఆపద సమయంలో వీరోచిత సేవల్లో ముందువరుసలో ఉంటారు. చాలామంది అధికారులు ఐక్యతకు మారుపేరుగా నిలుస్తారు. ఇవన్నీ బొమ్మకు ఒక వైపు మాత్రమే.. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో చాలాకాలంగా సమస్యలు తిష్టవేశాయి. కొంతమంది అధికారుల అనైతిక చర్యలు, చేతివాటంతో పోలీస్ శాఖ పరువు మసకబారుతోంది. సీపీలుగా పనిచేసిన తరుణ్జోషి, ఏవీ రంగనాథ్, అంబర్కిషోర్ ఝా, సన్ప్రీత్సింగ్ తమదైన శైలిలో కొంతమేర కట్టడి చేసినప్పటికీ అవినీతి అధికారులపై పూర్తిస్థాయిలో చర్యలు లేకుండా పోయాయి. రాజకీయంగా పలుకుబడి ఉన్న కొంతమంది అధికారులు కమిషనరేట్ను అంటిపెట్టుకుంటున్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ముందు పాలనాపరంగా అనేక సవాళ్లు ఉన్నాయి. పార్కింగ్ సమస్య.. నగరంలో వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. చాలా షాపింగ్ కాంప్లెక్స్లకు పార్కింగ్ లేకుండా పోయింది. హనుమకొండ, వరంగల్ చౌరస్తాలో 10 నిమిషాలు ద్విచక్రవాహనాలను సైతం పార్కింగ్ చేసి షాపింగ్ చేసే పరిస్థితులు లేవు. పార్కింగ్ స్థలాలపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, వరంగల్ పోలీస్ అధికారులు సంయుక్తంగా కలిసి పనిచేసి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. దీనికి తోడు ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్ సమస్య ఉంది. నగరంలో ట్రాఫిక్ పెరగడం వల్ల మరో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను ప్రతిపాదించి చాలా రోజులు అవుతోంది. కొత్త ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఏఆర్లో ఎక్కడి వారు అక్కడే.. పోలీస్ శాఖలో లా అండ్ అర్డర్తో పాటు ఏఆర్ విభాగం చాలా కీలకం. ఏఆర్ విభాగంలో పనిచేస్తున్న కొంతమంది ఆర్ఎస్సై, ఆర్ఐ, ఏసీపీ, అడిషనల్ డీసీపీ స్థాయి అధికారులు కమిషనరేట్ను వదలడం లేదు. రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు బదిలీ అయినప్పటికీ వారికి ఉన్న పలుకుబడితో తిరిగి ఇక్కడికే వచ్చి చేరుతున్నారు. ఇక్కడ రియల్ వ్యాపారం, సెటిల్మెంట్లకు కొంత మందికి పెట్టింది పేరు అనే ఆరోపణలు ఉన్నాయి. నేతల అండ.. నిబంధనలు తూచ్ వరంగల్, హనుకొండ, కాజీపేట సబ్ డివిజన్లోని కొంతమంది అధికారులు నేతల అండ చూసుకొని పెద్ద ఎత్తున సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారని విమర్శలు ఉన్నాయి. ఈఅధికారులపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా పలుకుబడితో చర్యల నుంచి తప్పించుకుంటున్నారు. పోలీస్ స్టేషన్లను వారి ప్రైవేట్ దర్బారులుగా మార్చివేశారు. భూములు రేట్లు పెరగడంతో తగదాలు సృష్టించి సెటిల్మెంట్లు సైతం చేయడం గమనార్హం. గతంలో ఇలా చేసిన అధికారులపై సస్పెన్షన్ వేటుపడినా ఈ అధికారుల్లో మాత్రం మార్పు రావట్లేదు. దృష్టి సారిస్తే... మొదటి నుంచే పాలనాపరంగా కఠినంగా వ్యవహరిస్తూ, శాంతి భద్రతలపై దృష్టి సారిస్తే వరంగల్ ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. చైతన్యానికి మారుపేరుగా ఉన్న వరంగల్ ప్రజలు నిస్వార్థంతో పనిచేసిన ఎంతో మంది అధికారులకు జీవిత కాలం సరిపోయే కీర్తి ప్రతిష్టతలను అందించారు. ఏది ఏమైనా నూతన సీపీ ఆల్ ది బెస్ట్. వరంగల్ సబ్ డివిజన్లో కరువైన లా అండ్ ఆర్డర్.. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: ప్రజారోగ్య రక్షణలో వైద్యులది కీలక పాత్ర అని హనుమకొండ కలెక్టర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ అధ్యక్షురాలు చాహత్ బాజ్పాయ్ అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం హనుమకొండ జిల్లా రెడ్ క్రాస్ భవన్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. హనుమకొండ కలెక్టర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ అధ్యక్షురాలు చాహత్ బాజ్పాయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెడ్క్రాస్ పాలకవర్గ సభ్యులు ప్రముఖ వైద్యుడు, భారతరత్న డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ జయంతి–వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ పి.విజయచందర్రెడ్డి, హనుమకొండ డీఎంహెచ్ఓ ఎస్డీ.రాంకుమార్, జిల్లా పాలకవర్గ సభ్యులు, పలువురు వైద్యులను కలెక్టర్ సన్మానించారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ పెద్ది వెంకట నారాయణగౌడ్, కోశాధికారి బొమ్మినేని పాపిరెడ్డి, రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులు ఈవీ.శ్రీనివాస్రావు, జిల్లా పాలకవర్గ సభ్యులు పుల్లూరు వేణుగోపాల్, డాక్టర్ మాగంటి శేషుమాధవ్, డాక్టర్ కె.సుధాకర్రెడ్డి, రెడ్ క్రాస్ సిబ్బంది, పలువురు వైద్యులు పాల్గొన్నారు. పెద్దమ్మగడ్డలో కలెక్టర్ పర్యటన హన్మకొండ చౌరస్తా: హనుమకొండలోని 4వ డివిజన్ పరిధి పెద్దమ్మగడ్డ ప్రాంతంలో బుధవారం కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పర్యటించారు. స్థానిక సమస్యలు క్షుణ్ణంగా పరిశీలించారు. ఇరుకై న రహదారి, అస్తవ్యస్తంగా మారిన డ్రెయినేజీ వ్యవస్థపై అసహనం వ్యక్తం చేశారు. మెరుగైన వసతుల కల్పన కోసం ప్రతిపాదనలు పంపించాలని అధికారులకు సూచించారు. పెద్దమ్మగడ్డలో అద్దె భవనంలో ఉంటున్న యుపీహెచ్సీకి సొంత భవన నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని మాజీ కార్పొరేటర్ బోడ అనయ్ కలెక్టర్ను కోరారు.పేదల కోసం భూ పోరాటం ఉధృతంసీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు హన్మకొండ అర్బన్: పేదలకు ఇళ్ల స్థలాలు, పట్టాలు సాధించే వరకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెనక్కి తగ్గబోమని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా హనుమకొండ కలెక్టరేట్ ఎదుట వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో బుధవారం భారీ పికెటింగ్ నిర్వహించారు. ఉదయం నుంచే కలెక్టరేట్కు చేరుకున్న వామపక్ష నాయకులు, కార్యకర్తలు అధికారులను, సిబ్బందిని లోపలకు వెళ్లకుండా అడ్డుకోవడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పికెటింగ్ కొనసాగుతుండగా సుబేదారి పోలీసులు వామపక్ష నాయకులను అరెస్ట్ చేశారు. ఈసందర్భంగా కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులకు, వామపక్ష శ్రేణులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. అనంతరం త క్కళ్లపల్లి శ్రీనివాసరావుతోపాటు పలువురు నాయకులను సుబేదారి పోలీస్స్టేషన్కు తరలించారు. కా ర్యక్రమంలో సీపీఐ, సీపీఎం, ఎంసీపీఐ జిల్లా నాయకులు కర్రె భిక్షపతి, జి.ప్రభాకర్రెడ్డి, ఎన్.హంసారెడ్డి, నేదునూరి జ్యోతి, ఆదరి శ్రీనివాస్, మండ సదాలక్ష్మి, తోట భిక్షపతి, మద్దెల ఎల్లేష్, తదితరులు పాల్గొన్నారు.మంత్రి దామోదరను కోరిన ఎమ్మెల్యే నాయిని హన్మకొండ చౌరస్తా: హనుమకొండ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఎస్డీ రాంకుమార్పై పూర్తిస్థాయి విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి.. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కోరారు. డీఎంహెచ్ఓ తీరు అభ్యంతరకంగా ఉందంటూ బుధవారం ఆ శాఖ ఉద్యోగులు ఎమ్మెల్యే రాజేందర్రెడ్డిని బాలసముద్రంలోని క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే నాయిని.. మంత్రి దామోదరకు ఫోన్ చేసి డీఎంహెచ్ఓపై వచ్చిన ఫిర్యాదు గురించి వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి దామోదర విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు పరస్పర గౌరవం, సానుకూల వాతావరణంలో విధులు నిర్వర్తించే పరిస్థితులు ఉండాలన్నారు. ఎమ్మెల్యే నాయిని వెంట ఎమ్మెల్సీ సారయ్య ఉన్నారు. కార్యక్రమంలో టీఎన్జీఓస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్, టీజీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగన్మోహన్రావు, ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కృష్ణారావు, కార్యదర్శి డాక్టర్ రాజిరెడ్డి, ఏఓ కోలా రాజేశ్, నెహ్రూ చందు, యాదానాయక్, సుధాకర్, జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు. చర్చనీయాంశంగా ఫిర్యాదు.. రామన్నపేట: డీఎంహెచ్ఓ రాంకుమార్పై ఎమ్మె ల్యే, కలెక్టర్కు ఉద్యోగులు లిఖితపూర్వకంగా ఫిర్యా దు చేసిన ఘటన చర్చనీయాంశంగా మారంది. మహిళా ఉద్యోగులపై అనుచితంగా వ్యవహరిస్తున్నారని, చిన్న విషయాలకే తీవ్రస్థాయిలో మందలిస్తూ మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని వారు ఫి ర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ఈ విషయమై డీఎంహెచ్ఓ రాంకుమార్ను వివరణ కోరగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పలు పథకాలలో జిల్లా 25 నుంచి 219వ స్థానంలో ఉండడంతో వైద్య సిబ్బంది, అధికారులు పనితీరు మెరుగుపర్చుకోవాలని ఆదేశించాను. కొంతమంది యూ నియన్ నేతలు కార్యాలయాలు వదలకుండా తిష్టవే సి అసత్య ఆరోపణ చేస్తున్నారు. ఏ ఉద్యోగిపై ఎ లాంటి వేధింపులకు పాల్పడలేదని పేర్కొన్నారు.సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లాలో జూన్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం.. భూగర్భజల మట్టం కూడా గణనీయంగా పడిపోవడం భవిష్యత్లో నీటి కొరతకు సంకేతాలిస్తోంది. విస్తారంగా వర్షాలు కురవకపోతే జిల్లాలో ఖరీఫ్ సాగుతోపాటు తాగునీటి సమస్య కూడా తలెత్తే ప్రమాదం లేకపోలేదు. జూలైలో కురవాల్సిన వర్షం కంటే అధికంగా వాన పడితే జనాల తిప్పలు తప్పనున్నాయి. జిల్లాలోని పర్వతగిరి, సంగెం మండలాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారే ప్రమాదముంది. నర్సంపేటలో అత్యధికంగా 80 శాతం వర్షపాతం లోటు నమోదైంది. భూగర్భ జలాలు మరింత పడిపోతే తాగునీటికి సైతం ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. మరింత దిగువకు భూగర్భజలాలు హన్మకొండ: వాతావరణం వేసవిని తలపిస్తోంది. వర్షాలు కురవకపోవడం, పెరిగిన జల వినియోగంతో హనుమకొండ జిల్లాలో జలమట్టం తగ్గుతూ వస్తోంది. హనుమకొండ జిల్లాలో సగటున మే నెలాఖరులో 6.17 మీటర్ల లోతులో ఉన్నాయి. ఈ ఏడాది 69 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీని ప్రభావం భూగర్భజలాలపై పడుతోంది. ఫలితంగా ప్రతీ నెల భూగర్భజలాలు పడిపోతున్నాయి. సకాలంలో వర్షాలు కురవకపోతే సాగు, తాగు నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందని విశ్లేషకుల అంచనా. భూగర్భ జల శాఖ జిల్లాలోని 25 ప్రాంతాల్లో బోర్లు తవ్వించి ఫీజో మీటర్లు అమర్చి వాటి ద్వారా భూగర్భ జల మట్టం కొలతలను సేకరిస్తోంది. ప్రతీ నెల చివరి వారంలో భూగర్భ జల మట్టాన్ని సేకరిస్తోంది. హనుమకొండ జిల్లాలోని వేలేరు మండలం పీచర్లలో అత్యధికంగా 16.3 మీటర్ల లోతున భగర్భజలాలు పడిపోయాయి. విద్యాశాఖ రాష్ట్ర పరిశీలకురాలు విజయలక్ష్మిబాయి విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు లక్ష్యాన్ని చేరుకోవాలని విద్యాశాఖ రాష్ట్ర పరిశీలకురాలు, సైట్ డైరెక్టర్ విజయలక్ష్మిబాయి జిల్లా విద్యాశాఖాధికారి, ఎంఈఓలను ఆదేశించారు. హనుమకొండ డీఈఓ కార్యాలయంలో డీఈఓ, అర్బన్ మండలాల విద్యాశాధికారులు, సమగ్రశిక్ష కో–ఆర్డినేటర్లతో బుధవారం సమీక్ష నిర్వహించారు. జయశంకర్ బడిబాటలో ఎంతమంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు, ప్రీప్రైమరీలో విద్యార్థుల నమోదు ఎలా ఉంది, విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ, హనుమకొండ, కాజీపేట మండలాల పాఠశాలల్లో అల్పాహారం పంపిణీపై ఆరా తీశారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ మాట్లాడుతూ జిల్లాలో విద్యార్థుల నమోదు 33 వేలకుపైగా నమోదు లక్ష్యంగా ఉందని, ఇప్పటివరకు 28 వేల వరకు అడ్మిషన్లు అయ్యాయని తెలిపారు. విద్యార్థుల వివరాలను యూడైస్లో పేర్కొనే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈనెల 10 వరకు వి ద్యార్థుల నమోదు లక్ష్యాన్ని చేరుకునేలా కృషిచేయాలని విజయలక్ష్మిబాయి సూచించారు. ఎంఈఓలు నెహ్రూ, శ్రీనివాస్, సమగ్రశిక్ష కోఆర్డినేటర్లు మ హేశ్, మన్మోహన్, సునీత, సుమాదేవి ఉన్నారు.బల్దియా అడిషనల్ కమిషనర్ ఇసంపల్లి జోనా వరంగల్ అర్బన్: బల్దియా ప్రధాన కార్యాలయంలోని ఇన్వార్డులో ఇద్దరు మహిళా ఉద్యోగుల మధ్య మనస్పర్థలు తలెత్తడం, విధుల్లో బాధ్యతా రహితంగా వ్యవహరించడంతో వారికి విధులను గుర్తు చేసినట్లు అడిషనల్ కమిషనర్ అడిషనల్ కమిషనర్ ఇసంపల్లి జోనా ఒక ప్రకటనలో తెలిపారు. ఇన్వార్డులో నమోదైన దరఖాస్తులు ఆయా విభాగాలకు పంపించడంలో జాప్యం అవుతోందని ఇన్వార్డు ఉద్యోగులు చందన, శ్రుతిని తన చాంబర్కు పిలిపించి దరఖాస్తులను త్వరితగతిన చేరవేయాలని ఆదేశించినట్లు తెలిపారు. వ్యక్తిగత, కుటుంబ ఇబ్బందులతోనే శ్రుతి తన స్వగృహంలో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఆయన తెలిపారు. వాస్తవాలను పక్కన పెట్టిన బల్దియా ఉద్యోగులు, అధికారులపై నింద మోపడం సరికాదన్నారు. ఈ ఘటనలో సీ–1 సూపరింటెండెంట్, ఇతర ఉద్యోగులకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు (డీసీఈబీ) సెక్రటరీగా జిల్లా కేంద్రంలోని టీపీటీ ఉర్దూ మీడియం ప్రభుత్వ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు ఆదిరాజు శైలజ నియమితులయ్యారు. ఈమేరకు డీఈఓ, డీసీఈబీ చైర్మన్ ఎల్వీ గిరిరాజ్గౌడ్ ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు డీసీఈబీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించిన డాక్టర్ బి.రాంధన్ ఉద్యోగ విరమణ చేశారు. ఆయన స్థానంలో నియమించిన శైలజ బుధవారం సాయంత్రం డీఈఓ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఏఆర్లో పాతుకుపోయిన అధికారులు నగరంలో తీవ్రమవుతున్న ట్రాఫిక్ వరంగల్ సబ్ డివిజన్లో ఏసీపీ పోస్టు ఖాళీగా ఉంది. ఇక్కడ అధికార పార్టీకి చెందిన కొంతమంది నేతలు ల్యాండ్ సెటిల్మెంట్లో జోక్యం చేసుకొని సామాన్యులకు ఇబ్బందులు సృష్టిస్తున్నారే ఆరోపణలున్నాయి. ఇదే అదునుగా భావించి సబ్ డివిజన్లోని ఒక్కరిద్దరు అధికారులు సెటిల్మెంట్లను జోరుగా చేస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. సీసీఎస్లో కదలరు.. వదలరు దొంగల భరతం పట్టాల్సిన సీసీఎస్ పోలీసుల వ్యవహారంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. కిందిస్థాయి సిబ్బంది ఏళ్ల తరబడి ఇక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. కొంత మంది 15 ఏళ్లు దాటినా సీసీఎస్ను వదలట్లేదు. రాయపర్తిలో బ్యాంకు దోపిడీ జరిగి రెండేళ్లు గడుస్తున్నా పూర్తిస్థాయిలో రికవరీ చేయడంలో సీసీఎస్ సిబ్బంది విఫలమయ్యారు. వందల సంఖ్యలో జరిగిన దొంగతనాల్లో చోరీ సొత్తు రికవరీ చేయాల్సి ఉంది. వరుసగా చైన్స్నాచింగ్లు జరుగుతున్నా.. దొంగలు దొరకట్లేదు. అధికారులకు విడిదిగా, సిబ్బందికి కాసులు కురిపించే వనరుగా సీసీఎస్ తయారైనట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. అవినీతి ఆరోపణలు రుజువై సస్పెండ్ అయిన చాలామంది అధికారులు కమిషనరేట్ను వదలకుండా ఇక్కడే ఉన్నారు. నేతల సిఫార్సులతో తిరిగి పోస్టింగ్ పొందేందుకు అధికారులపై ఒత్తిడి తెస్తూ ఇక్కడ లూప్లైన్లలో పనిచేస్తున్నారు. కొంత మంది అధికారులు మహిళా సిబ్బంది, మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించారని విమర్శలున్నాయి. ఇలాంటి అధికారులపై కఠినంగా వ్యవహరించాలి. పడిపోతున్న భూగర్భజలాలు హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో కానరాని వాన రైతుల ఎదురుచూపు -
క్యాన్సర్ విభాగంలో కరువైన రేడియేషన్
కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని క్యాన్సర్ విభాగంలో రేడియేషన్ సేవలు కరువయ్యాయి. గతేడాది నుంచి పేషంట్లు రేడియేషన్ చికిత్స చేయించుకోలేకపోతున్నారు. దీనికోసం హైదరాబాద్లోని ఎంఎన్జే క్యాన్సర్ ఆస్పత్రి, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. ముఖ్యంగా పాతకాలం నాటి కోబాల్ట్ పరికరం సోర్స్ లేకపోవడంతో అదిమూలన పడి ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని రిపేర్ చేసేందుకు టెక్నీషియన్లు హైదరాబాద్ నుంచి రావాల్సి ఉండగా జాప్యం జరుగుతున్నట్లు సమాచారం. దీంతో కోబాల్ట్ క్యాన్సర్ రేడియేషన్ పరికరం మరమ్మతుకు నోచుకోవడం లేదు. అయితే, అధునాతన పరికరంతో రేడియేషన్ సేవలు అందించాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ డిపార్ట్మెంట్లో ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లతోపాటు ఒకరు కాంట్రాక్టుపై విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల హెచ్ఓడీ స్థానంలో ఉన్న ప్రొఫెసర్ డిప్యుటేషన్పై హైదరాబాద్కు వెళ్లారు. వైద్య సిబ్బంది కొరత లేకున్నా రేడియేషన్ చికిత్స లేకపోవడం ఇబ్బందిగా మారుతోంది. పేషంట్లకు అందుతున్న కీమోథెరపీ సేవలు.. రేడియేషన్ చికిత్స సౌకర్యం లేకున్నా పేషంట్లకు మెడికల్, కీమోథెరపీ సేవలు రెగ్యులర్గా అందుతుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక దశలో ఉన్న క్యాన్సర్ పేషంట్ల కోసం ప్రత్యేక మెడికల్ సేవలతోపాటు కీమోథెరపీ చికిత్స అందిస్తున్నారు. దీనివల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చిన పేషంట్లకు ఉపశమనం కలుగుతోంది. రేడియేషన్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకురావాలని పేషంట్లు కోరుతున్నారు. -
రూ. 4.70 లక్షల గంజాయి పట్టివేత
సంగెం : సంగెం మండలంలో భారీగా గంజాయి పట్టుబడింది. బుధవారం సంగెం పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పర్వతగిరి సీఐ రాజగోపాల్ వివరాలు వెల్లడించారు. సంగెం మండలం చింతలపల్లి రైల్వే గేట్ సమీపంలో మంగళవారం ఎస్సై వంశీకృష్ణ సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి రెండు బ్యాగులతో అనుమానాస్పదంగా సంచరిస్తున్నా డు. దీంతో అదుపులోకి తీసుకుని అతడి వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా 10 ప్యాకెట్లలో 9.418 కిలోల సుమారు రూ. 4,70,900 విలువైన ఎండుగంజాయి లభించింది. ఉత్తర్ప్రదేశ్కు చెందిన షోయబ్ఖాన్ మరో వ్యక్తి నుంచి కొనుగోలు చేసి సంగెం–గీసుకొండ మండలాల పరిధిలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికులకు అధిక ధరలకు విక్రయించేందుకు తీసుకున్నట్లు నిందితుడు విచారణలో ఒప్పుకున్నాడు. దీంతో అరెస్ట్ చేసి కోర్టులో హజరు పరిచినట్లు తెలిపారు. కాగా, ఎస్సై వంశీకృష్ణ, హెడ్కానిస్టేబుల్ బాబు, కానిస్టేబుళ్లు శ్రవణ్, నవీన్, పాష, వీరన్న, రాజును సీఐ అభినందించారు. వ్యక్తి అరెస్ట్, రిమాండ్ -
తెగిన ఓహెచ్ఈ వైరు.. ఆలస్యంగా నడిచిన రైళ్లు
డోర్నకల్: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ రైల్వే జంక్షన్ పరిధిలోని సిగ్నల్తండా సమీపంలో అప్ లైన్లో ఓహెచ్ఈ (ఓవర్ హెడ్ ఎక్యూప్మెంట్) లైన్ తెగిపడింది. బుధవారం తెల్ల వారుజామున ఓహెచ్ఈ వైరు తెగి డౌన్లైన్పై పడడంతో రెండు మార్గాల్లో విద్యుత్ సరఫరా నిలిచి రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. మహబూబాబాద్, డోర్నకల్, భద్రాచలం రోడ్ మార్గంలో పలు ఎక్స్ప్రెస్తో పాటు గూడ్సు రైళ్లు నిలిచాయి. ఓహెచ్ఈ సిబ్బంది స్పందించి మొదట డౌన్లైన్ మార్గంలో ఓహెచ్ఈ కేబుల్కు మరమ్మతులు చేసిన అనంతరం 50 నిమిషాల తర్వాత రైళ్లను పునరుద్ధరించారు. అనంతరం అప్లైన్లో సుమారు 3.30 గంటలపాటు శ్రమించి కేబుల్కు మరమ్మతులు చేసి ఉదయం 7.30 గంటలకు రైళ్లను పునరుద్ధరించారు. ఓహెచ్సీ కేబుల్ తెగి విద్యుత్ సరఫరా నిలిచి ఎక్కడి రైళ్లు అక్కడ నిలవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి స్థానిక కోర్టులు● సీజీఆర్ఎఫ్ వరంగల్ చైర్మన్ నాగ ప్రసాద్ హన్మకొండ: విద్యుత్ సమస్యల పరిష్కారానికి స్థానిక కోర్టులు నిర్వహిస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ సీజీఆర్ఎఫ్ వరంగల్ చైర్మన్ నాగప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిర్ణీత రోజున ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఈ నెల3న మహబూబాబాద్ జిల్లా మరిపెడ డివిజన్ 33/11 కేవీ కొత్తపేట సబ్స్టేషన్లో కొత్తపేట, కురవి, డోర్నకల్, గార్ల, సీరోల్ మండలాలు, 7న హనుమకొండ రూరల్ డివిజన్ పరకాల రూరల్ 33/11 కేవీ సబ్స్టేషన్లో పరకాల రూరల్, ఆత్మకూరు, దామెర, శాయంపేట, పరకాల టౌన్, 9న భూపాలపల్లి జిల్లా కాటారం డివిజన్ కొయ్యూరు 33/11 కేవీ సబ్ స్టేషన్లో కొయ్యూరు, కాటారం, మహాముత్తారం, మహదేవ్పూర్, పలిమెల, 14న పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ డివిజన్ కాల్వ శ్రీరాంపూర్ సబ్డివిజన్లోని శ్రీరాంపూర్ 33/11 కేవీ సబ్ స్టేషన్లో శ్రీరాంపూర్, పోత్కపల్లి, ఓదెల, 17న ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ డివిజన్, కూసుమంచి సబ్ డివిజన్లోని రాజేశ్వరాపురం 33/11 కేవీ సబ్ స్టేషన్లో రాజేశ్వరాపురం, పాలేరు, నేలకొండపల్లి, కూసుమంచి, బచోడు సెక్షన్ పరిధిలోని వినియోగదారులు ఈ లోకల్ కోర్టులో ఫిర్యాదులు సమర్పించి సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు. బాలుడిపై పోక్సో కేసు నమోదు ఖిలా వరంగల్ : బాలికపై లైంగిక దాడికి పా ల్పడిన ఓ బాలుడిపై పోక్సో నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ సురేశ్ తెలిపారు. వరంగల్ ఏనుమాముల పీ ఎస్ పరిధిలో గత నెల 26న మధ్యాహ్నం ఓ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. ఈ సమయంలో ఓ బాలుడు వెళ్లాడు. అనంతరం సదురు బాలిక చెల్లికి డబ్బు ఇచ్చి కిరాణం పంపించా డు. దుకాణం నుంచి వచ్చిన చెల్లి ఈ ఘటనను చూసి కేకలు వేయడంతో సదరు బాలుడు అ క్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై బా ధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు పో క్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈక్రమంలో పరారీలో ఉన్న బాలుడు బుధవారం పోలీసులకు చిక్కాడు. దీంతో న్యాయస్థానం ఎదుట హాజరు పరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
వాగు వద్ద భద్రత పెంచాలి
జంపన్న వాగు పవి త్రంగా భావించి వేలా ది మంది భక్తులు పు ణ్యస్నానాలు ఆచరి స్తారు. భక్తుల ప్రాణ భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన బాధ్యత సంబంధిత శాఖలపై ఉంది. వాగులో ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు గజ ఈతగాళ్లు, రెస్క్యూ బృందాలను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలి. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో వాగులోకి దిగకుండా భక్తులను మైకుల ద్వారా అప్రమత్తం చే యాలి. భక్తులు కూడా నీటి లోతు తెలియని ప్రాంతాల్లో స్నానాలకు దిగకుండా జాగ్రత్తలు పాటించాలి. అధికారులు భద్రతా ఏర్పా ట్లు కల్పిస్తే ప్రమాదాలను తగ్గించవచ్చు. – సిద్ధబోయిన స్వామి, సమ్మక్క పూజారి, మేడారం -
భార్య హత్య కేసులో భర్త అరెస్ట్
మల్హర్(కాటారం) : మండలంలోని ఇబ్రహీంపల్లి గ్రామంలో గత నెల 29 తేదీన జరిగిన భార్య హత్య కేసులో భర్తను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు కాటారం డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. ఈ మేరకు బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిచారు. ఇబ్రహీంపల్లి గ్రామానికి చెందిన మంతెన సత్యంకు రాజమణితో 14 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు కూతురు రవళి, కుమారుడు మాన్విత్ ఉన్నారు. ఈ క్రమంలో కొంతకాలంగా భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుని తనను దూరం పెడుతుందని ఆగ్రహంతో సత్యం కత్తితో భార్య మెడపై కోసి హత్య చేసి పరారయ్యాడు. హత్యకు ఉపయోగించిన కత్తి, హత్య చేసిన రోజు ధరించిన దుస్తులను పడేసిందుకు బయ్యారం వైపు నుంచి భూపాలపల్లి–కాటారం ప్రధాన రహదారి వైపునకు వస్తున్నాడు. ఈ క్రమంలో పోలీసులను చూసి పరిగెడుతుండగా సీఐ నాగార్జునారావు, సిబ్బంది పట్టుకున్నారు. కత్తి, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకుని నిందితుడు సత్యంను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ వెల్లడించారు. కాగా, హత్య కేసును త్వరగా ఛేదించిన సీఐ నాగార్జునారావు, ఎస్సై శ్రీనివాస్, సిబ్బందిని ఈ సందర్భంగా డీఎస్పీ అభినందించారు. వివరాలు వెల్లడించిన డీఎస్పీ సూర్యనారాయణ -
రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ఖిలా వరంగల్: మార్కెట్ అభివృద్ధి, రైతు సంక్షేమమే లక్ష్యమని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పులి ప్రియాంక అన్నారు. ఈమేరకు బుధవారం మార్కెట్లో జరిగిన పాలకవర్గ మొదటి సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. తాగునీటి సౌకర్యం కోసం పైపులైన్, కొత్త వాటర్ కూలర్స్ ఏర్పాటుకు ప్రతిపాదనాలు, ఆర్ఓ ప్లాంట్ సామర్థ్యాన్ని అదనంగా 4000 లీటర్లకు పెంచడం, రెండు బోర్లు వేయడం, మిర్చియార్డు, పల్లికాయ యార్డు మధ్యన మహిళలకు మరుగుదొడ్ల నిర్మాణం మార్కెట్యార్డ్ చుట్టూ కూలిపోయిన గోడ మరమ్మతులు చేయించడం తదితర అభివృద్ధి పనులు చేపట్టడానికి పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు చైర్పర్సన్ పులి ప్రియాంక తెలిపారు. ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎన్.శ్రీనివాస్, వైస్ చైర్మన్ బండి జనార్దన్, సభ్యులు గాదరబోయిన రాజు, కందుకూరి పూర్ణచందర్, చల్లా వాసుదేవారెడ్డి, గొడుగు భిక్షపతి, బాదావత్ నర్సింహనాయక్, ఆకుల రుద్రప్రసాద్, బొడ్డు ప్రదీప్కుమార్, కత్తి సంపత్, మహమ్మద్ సబేర, అచ్చ నాగరాజు, దుగ్యాల గోపాల్రావు, జిల్లా మార్కెటింగ్ అధికారి కె.సురేఖ, సహాయ సంచాలకులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పులి ప్రియాంక పాలకవర్గ మొదటి సమావేశంలో పలు అంశాలపై తీర్మానాలు -
జంపన్న వాగులో భద్రతేది?
ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలోని జంపన్న వాగులో భక్తుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రతీ వర్షాకాలంలో ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరుతుండడంతో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అయినప్పటికీ పుణ్యస్నానాల కోసం వాగులోకి దిగుతున్న భక్తులు నీటిలోతు అంచనా వేయలేక ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రతీ ఏడాది ఏదో ఒక చోట మునిగి పలువురు మరణిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. శాశ్వత భద్రతా చర్యలు మాత్రం కనిపించడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం, సెలవు రోజులు, వారాంతంలో మేడారానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. చాలామంది కుటుంబ సమేతంగా జంపన్న వాగులో స్నానాలు ఆచరిస్తుంటారు. వాగులో లోతైన గుంతలు, వేగవంతమైన వరద ప్ర వాహం గురించి అవగాహన లేక ప్రమాదాలు జరుగుతున్నాయి. జనవరి నుంచి జూన్ నెల వరకు సు మారు ఆరుగురు భక్తులు జంపన్నవాగులో మునిగి ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి.. వాగులో ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి స్పష్టమైన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు ఏర్పాటు చేయాలని భక్తులు సూచిస్తున్నారు. వర్షాకాలం పూర్తయ్యే వరకు వాగు వద్ద గజ ఈతగాళ్లు, రెస్క్యూ బృందాలు, లైఫ్ జాకెట్లు, లైఫ్ బోయ్లు, ప్రథమ చికిత్స సౌకర్యాలను ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచాలని కోరుతున్నారు. వరద ప్రవాహం అధికంగా ఉన్న సమయంలో మైకుల ద్వారా భక్తులను అప్రమత్తం చేయడంతో పాటు పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక శాఖల సిబ్బందితో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జంపన్న వాగు పవిత్రతతో పాటు భక్తుల ప్రాణ భద్రత కూడా అంతే ముఖ్యమని, ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందస్తు చర్యలే శాశ్వత పరిష్కారమని వారు అభిప్రాయపడుతున్నారు. లోతు తెలియక మునిగి పలువురు భక్తుల మృతి హెచ్చరిక బోర్డులు, గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి -
రిజిస్ట్రేషన్ శాఖలో బదిలీలు
● ఇన్చార్జ్ డీఐజీగా ప్రవీణ్కుమార్, నూతన డీఆర్గా సుబ్బలక్ష్మి కాజీపేట అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలో రెండేళ్లలోపే బదిలీలు షురూ అయ్యాయి. 2024 జూలై 25న అటెండర్ నుంచి డీఐజీ స్థాయి వరకు బదిలీ అయ్యారు. 2026 జూన్ 30న డీఐజీ, డీఆర్ బదిలీ ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టుకుంది. కాగా, ఈసారి పూర్తిస్థాయి జిల్లా రిజిస్ట్రార్ వరంగల్కు వచ్చారు. బదిలీల్లో ఇలా.. వరంగల్ డీఐజీగా విధులు నిర్వర్తిన్న సుభాషిణి రెండేళ్లలోపే రంగారెడ్డి డీఐజీగా బదిలీ కాగా.. ఇటీవల డీఐజీగా పదోన్నతి పొంది ఎఫ్ఏసీ జిల్లా రిజిస్ట్రార్గా విధులు నిర్వర్తిస్తున్న ప్రవీణ్కుమార్ కరీంనగర్ జిల్లాకు డీఐజీగా, ఎఫ్ఏసీగా వరంగల్ జిల్లా డీఐజీగా నియమితులయ్యారు. జిల్లా రిజిస్ట్రార్గా 2024లో బదిలీపై వచ్చిన ఫణీందర్ ఏడాదిలోపే హైదరాబాద్కు డిప్యుటేషన్పై వెళ్లారు. ప్రవీణ్కుమార్ ఎఫ్ఏసీ డీఆర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. మెదక్ జిల్లా రిజిస్ట్రార్ వల్లి సుబ్బలక్ష్మి ఉమ్మడి వరంగల్ జిల్లా రిజిస్ట్రార్గా బదిలీపై వచ్చారు. జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్ ఎ.శ్రీనివాస్ వరంగల్ జిల్లా రిజిస్ట్రార్ మార్కెట్ వాల్యూ అండ్ ఆడిటింగ్ విభాగానికి పదోన్నతిపై వచ్చారు. తర్వాత సబ్ రిజిస్ట్రార్లే.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు చెందిన సబ్ రిజిస్ట్రార్లు 2024లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు బదిలీ అయ్యారు. కాగా, ఖమ్మం జిల్లా సబ్ రిజిస్ట్రార్లు ఉమ్మడి వరంగల్కు వచ్చారు. ఏడాదిలోపే 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని 8 మంది తిరిగి డిప్యుటేషన్ పేరిట ఖమ్మం జిల్లాకు, కొందరు లాంగ్ లీవ్ పేరుతో వెళ్లారు. దీంతో 13 సబ్ రిజిస్ట్రార్కార్యాలయాల్లో ఐదు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పూర్తిస్థాయి సబ్ రిజిస్ట్రార్లు, మిగతా వాటిల్లో ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్లు విధులు నిర్వర్తిస్తున్నారు. డీఐజీ, డీఆర్ బదిలీల తర్వాత సబ్ రిజిస్ట్రార్లను ప్రభుత్వం బదిలీ చేయనున్నట్లు సమాచారం. ఈసారి బదిలీలతోనైనా పూర్తిస్థాయి సబ్ రిజిస్ట్రార్లు వచ్చేనా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. -
రైలింజన్లో సాంకేతిక లోపం
● పలు స్టేషన్లలో నిలిచిపోయిన రైళ్లు డోర్నకల్: రైలింజన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో మంగళవారం పలు రైల్వే స్టేషన్లలో రైళ్లు నిలిచాయి. వివరాలిలా ఉన్నాయి. నాగవల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్(20809) రైలు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గుండ్రాతిమడుగు స్టేషన్ సమీపించగానే ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో రైలు స్టేషన్లో నిలిచింది. దీంతో మనర్గుడి–జోద్పూర్ ఎక్స్ప్రెస్, కేఎస్ఆర్ బెంగళూరు–దానాపూర్ ఎక్స్ప్రెస్ డోర్నకల్ రైల్వే స్టేషన్లలో సుమారు 40 నిమిషాల పాటు నిలిచాయి. భద్రాచలంరోడ్–సికింద్రాబాద్ కాకతీయ ఎక్స్ప్రెస్ డోర్నకల్ సమీపంలోని బ్రాంచ్లైన్లో గంట సేపు నిలవగా, తమిళనాడు, సహారా, ఏపీ ఎక్స్ప్రెస్ రైళ్లు పలు స్టేషన్లలో నిలవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మామను బాత్రూంలో నిర్బంధించిన కోడలు● కుటుంబ, ఆస్తి తగాదాలే కారణం నర్సంపేట రూరల్: స్నానం కోసం బాత్రూంకు వెళ్లిన మామ బయటకు రాకుండా కోడలు గడియపెట్టిన ఘటన వరంగల్ జిల్లా నర్సంపేటలో మంగళవారం కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం.. నర్సంపేటలోని వరంగల్ రోడ్డులో రంగారెడ్డి నివసిస్తున్నాడు. అయితే, ఆయనకు తన కోడలు డాక్టర్ నవతతో ఆస్తి, కుటుంబ తగాదాలున్నాయి. స్నానానికి బాత్రూంకు ఆ యన వెళ్లగా కోడలు బయట గడియపెట్టి నిర్బంధించింది. దీంతో రెండు గంటలు బయటకు రాలేకపోయాడు. ఆయన అరుపులు విన్న స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు వచ్చి రంగారెడ్డిని బాత్రూం నుంచి బయటకు తీసుకొచ్చారు. అనంతరం బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అరుణ్ తెలిపారు. కాశిబుగ్గ: డాక్టర్స్ డే సందర్భంగా వరంగల్ ఐఎంఏ ఆధ్వర్యంలో నగరానికి చెందిన 10 మంది ఉత్తమ డాక్టర్లను ఎంపిక చేశారు. వరంగల్ ఐఎంఏ హాల్లో బుధవారం రాత్రి 8 గంటలకు వారిని సన్మానించి ఉత్త మ డాక్టర్ అవార్డులు అందజేయనున్నారు. ఎస్.గోపినాఽథ్, ఎ.అప్ప య్య, బి.రాధాకృష్ణ, ఎం.పుల్లారెడ్డి, జి.చంద్రశేఖర్, బేతి కవిత, పి.అశోక్కుమార్, జలగం మాధవి, అజిత్ మహ్మద్, జలగం కావ్యారావు ఉత్తమ డాక్టర్ అవార్డులు అందుకోనున్నారు. ముఖ్య అతిథిగా ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ పి.కాళీప్రసాద్, రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ పి.విజయ్చందర్రెడ్డి, కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ దివ్వెల మోహన్దాస్, ఎంజీఎం ఇన్చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ కె.రాంకుమార్రెడ్డి, డీఎంహెచ్ఓలు డాక్టర్ ఎస్డీ రాంకుమార్, డాక్టర్ బి.సాంబశివరావు, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె.నాగార్జునరెడ్డి పాల్గొంటారు. మహిళా ఉద్యోగి ఆత్మహత్యాయత్నం వరంగల్ అర్బన్: వేధింపులు తాళలేక ఓ మహిళా ఉద్యోగి సోమవారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలో కలకలం రేపింది. వివరాలిలా ఉన్నాయి.. ఏడాది క్రితం నర్సంపేట మున్సిపాలిటీ నుంచి శాశ్వత ఉద్యోగి శ్రుతి వరంగల్ బల్దియాకు బదిలీపై వచ్చి డిప్యుటేషన్పై ఇన్వార్డు సెక్షన్లో విధులు నిర్వర్తిస్తోంది. ఇన్వార్డులో నమోదవుతున్న ఫైళ్లను సకాలంలో ఆయా విభాగాలకు పంపించకపోవడంతో అదనపు కమిషన్ ఇసంపల్లి జోనా, సీ–1 సూపరింటెండెంట్ ఆనంద్.. ఇన్వార్డు సెక్షన్ సిబ్బందిని సోమవారం పిలిచి క్లాస్ తీసుకున్నారు. కొత్త కమిషనర్ ఫైళ్లపై సమీక్షిస్తే ఏం సమాధానం చెబుతారని మందలించినట్లు తెలిసింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన శ్రుతి నర్సంపేట మండలంలోని తన ఇంటికి వెళ్లి అల్లోపతి మాత్రలను మింగింది. కుటుంబ సభ్యులు ఆమెను నర్సంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఓ వీడియోలో తన ఆవేదన వెళ్లగక్కింది. తాను మాత్రమే విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిసున్నానని, అక్కడి నుంచి అంతర్గత బదిలీ చేస్తామంటూ బెదరింపులకు పాల్పడడంతో ఇంట్లో ఉన్న అల్లోపతి మాత్రలను మింగినట్లు వెల్లడించింది. సీ–1 సూపరింటెండెంట్ ఆనంద్, అటెండర్ చందన తనపై కక్షపూరితంగా వేధింపులకు గురిచేస్తున్నట్లు చెప్పింది. ప్రస్తుతం శ్రుతి ఆరోగ్య పరిస్థితి కుదుటపడినట్లు తెలిసింది. ఈ విషయంపై బల్దియా కమిషనర్ వెంకన్న మంగళవారం ఆరా తీశారు. సీ–1 సూపరింటెండెంట్ ఆనంద్ వివరణ సమర్పించినట్లు తెలిసింది. ఈ ఘటనపై అడిషనల్ జోనా, సూపరింటెండెంట్ ఆనంద్ను వివరణ కోరగా వేధింపులకు గురిచేసినట్లు ఆరోపించడం తగదని, బాధ్యతగా విధులు నిర్వర్తించాలని సూచించినట్లు తెలిపారు. ఇదేకాకుండా సీ–1 సెక్షన్ సూపరింటెండెంట్ ఆనంద్ తన వద్ద డబ్బులు డిమాండ్ చేశారని ఇటీవల తొర్రూరు మున్సిలిటీ హెల్త్ అసిస్టెంట్ వాయిస్ రికార్డు చేసిన సంఘటన వైరల్గా మారింది. మామునూరులో చైన్స్నాచింగ్మామునూరు: మామునూరులో మంగళవారం చైన్స్నాచింగ్ జరిగింది. పోలీ సుల కథనం ప్రకారం.. మామునూరుకు చెందిన రిటైర్డ్ హెడ్కానిస్టేబుల్ గుండు నాగభూషణం మంగళవారం ఉదయం 5.30 గంటల సమయంలో వాకింగ్ చేస్తుండగా కారులో వచ్చిన గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు నాగభూషణంపై అకస్మికంగా దాడి చేశారు. మెడలోని రెండు తులాల బంగారు చైన్ను లాక్కుని పరారయ్యారు. నాగభూషణం స్వల్పంగా గాయపడగా స్థానికులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మామునూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కాగా, మరో రెండు రోజుల్లో కుమారుడి వివాహం ఉంది. -
ఉపయోగపడే పరిశోధనలు చేయాలి
● కేయూ రిజిస్ట్రార్ రామచంద్రంకేయూ క్యాంపస్: సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేయాలని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం అన్నారు. ద్రవిడియన్ పొలిటికల్ సైన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘అండర్ స్టాండింగ్ డ్రవిడియన్ సొసైటీ అండ్ పాలిటిక్స్’ అనే పుస్తకాన్ని మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈఏడాది మే 9, 10 తేదీల్లో నిర్వహించిన సదస్సుకు సంబంధించిన ప్రొసీడింగ్స్ను పుస్తకం రూపంలోనికి తీసుకురావడం ఎంతో ప్రయోజనకరమని తెలిపారు. కార్యక్రమంలో పొలిటికల్ సైన్స్ విభాగం అధిపతి డాక్టర్ కృష్ణయ్య, పీవీ నర్సింహారావు నాలెడ్జ్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వడ్లకొండ సత్యనారాయణ, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాలాకుల కొమురయ్య, ద్రవిడ పొలిటికల్ సైన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ నాగరాజు, ఉపాధ్యక్షుడు సోమలింగం, సహాయ కార్యదర్శి నరేష్కుమార్, కోశాదికారి డాక్టర్ ప్రశాంత్, కార్యవర్గసభ్యులు సురేష్, లీలావతి, పరిశోధక విద్యార్థిని రుబీనా పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖ ఇల్లు ముట్టడి ● రాంనగర్లో అడ్డుకున్న పోలీసులు ● వినతిపత్రం స్వీకరించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావుహన్మకొండ: తమకు నెలకు రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలని, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఇంటిని ముట్టడించారు. మంగళవారం హనుమకొండలోని మున్సిపల్ గెస్ట్హౌస్ నుంచి సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ర్యాలీగా హనుమకొండ రాంనగర్లోని మంత్రి కొండా సురేఖ ఇంటి ముట్టడికి బయలుదేరారు. సమాచారం అందుకున్న పోలీసులు కొండా సురేఖ ఇంటి సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహించారు. సీఐటీయూ నాయకులు, మున్సిపల్ కార్మికులు ర్యాలీగా చేరుకోగా పోలీసులు అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు అక్కడకు చేరుకుని ఆందోళనకారులనుంచి వినతి పత్రం స్వీకరించారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రాగుల రమేశ్, సీఐటీయూ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు టి.ఉప్పలయ్య, నాయకులు బొట్ల చక్రపాణి, ఆర్.కోటీశ్వర్, బరుపట్ల మహేష్, వై.బాబు, మున్నంగి రఘు, ఎర్ర నరేష్, కొట్టే మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
రైలు భద్రతపై అవగాహన కల్పిస్తున్నాం..
రైలు పట్టాల వెంట నిఘా పెట్టాం. రైలుపై రాళ్లు విసిరితే చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తాం. పట్టాల సమీప కాలనీల ప్రజలు నిరంతరం రైలు భద్రతపై అవగాహన కల్పిస్తున్నాం. పశువులను వదిలేయడం, రైలు ట్రాక్ నుంచి మరో ట్రాక్పై వెళ్లినా, పట్టాలపై చిన్నపిల్లలు ఆటలు ఆడటం అత్యంత ప్రమాదకరం. వాటిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటున్నాం. రైలు భద్రత ప్రయాణికులు, ప్రజల భద్రత అని అవగాహన కల్పిస్తున్నాం. – శ్రీనివాస్గౌడ్ ఇన్స్పెక్టర్ ఆర్పీఎఫ్ వరంగల్ -
మేడారం హుండీ ఆదాయం రూ.63,70,531
ఎస్ఎస్ తాడ్వాయి : మేడారం సమ్మక్క–సారలమ్మ గద్దెలపై ఏర్పాటు చేసిన హుండీల ద్వారా 99 రోజుల్లో రూ.63,70,531 ఆదాయం సమకూరినట్లు మేడారం ఈఓ వీరస్వామి తెలిపారు. ఈ ఏడాది మార్చి 24 నుంచి జూన్ 30 వరకు గద్దెలపై ఉంచిన మొత్తం 40 హుండీల్లోని కానుకలను మంగళవారం మేడారంలోని ఎండోమెంట్ డార్మెటరీ భవనంలో పూజారుల సమక్షంలో లెక్కించారు. ఇందులో సమ్మక్క హుండీ ఆదాయం రూ.34,05,959, సారలమ్మ హుండీ ఆదాయం రూ.25,59,430, గోవిందరాజు హుండీ ఆదాయం రూ.2,26,266, పగిడిద్దరాజు హుండీ ఆదాయం రూ.1,78,876 వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, సూపరింటెండెంట్ క్రాంతి, ఇన్స్పెక్టర్ అనిల్, పూజారులు కాక వెంకటేశ్వర్లు, కిరణ్, సారయ్య, మునీందర్, మహేష్, తదితరులు పాల్గొన్నారు. ‘భద్రకాళి’ ఆదాయం రూ.85,03,997 హన్మకొండ కల్చరల్ : భద్రకాళి దేవాలయంలోని హుండీల్లోని కానుకలను లెక్కించగా.. రూ.85,03,997 ఆదాయం సమకూరినట్లు అసిస్టెంట్ కమిషనర్, ఆలయ ఈఓ రామల సునీత తెలిపారు. మూడు నెలల ఆరు రోజుల్లోలకు సంబంధించి కానుకను మంగళవారం యూనియన్ బ్యాంక్లో జమ చేసినట్లు తెలిపారు. 200 యూఎస్ఏ డాలర్లు, 260 కెనడా డాలర్లు, 30 యూఏఈ దిరమ్స్, 30 ఇంగ్లండ్ పౌండ్స్, 300 ఓమన్, 2 సింగపూర్ డాలర్లు భక్తులు హుండీల్లో వేసినట్లు గుర్తించామని తెలిపారు. లెక్కింపు కార్యక్రమానికి పర్యవేక్షాణాధికారిగా దేవాదాయ ధర్మాదాయశాఖ వరంగల్ ఉప కమిషనర్ కార్యాలయ పర్యవేక్షకులు గౌరీశంకర్ వ్యవహరించారు. అర్చకులు భద్రకాళిశేషుతోపాటు ఆలయసిబ్బంది, శ్రీలక్ష్మి శ్రీనివాస సేవా ట్రస్ట్ అధ్యక్షుడు జి.కృష్ణారెడ్డి, శ్రీలక్ష్మి వెంకటేశ్వర సేవా సమితి జి.నవీన్, 200 మంది సభ్యులు లెక్కింపులో పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలందించాలి
కాశిబుగ్గ: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలందించి, ప్రజల్లో మరింత విశ్వాసం పెంచే విధంగా వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ సత్యశారద తెలిపారు. మంగళవారం వరంగల్లోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిని సందర్శించి రోగులకు అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది హాజరు, పారిశుద్ధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన సేవలు అందించాలని, వారికి అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులను ఆదేశించారు. అనంతరం వైద్యాధికారులు, వైద్యులతో సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రి తనిఖీ సమయంలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఓ వైద్యుడికి, ఏఎన్ఎంకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సూపరింటెండెంట్ను ఆదేశించారు. సూపరింటెండెంట్ డాక్టర్ జీఎస్కే ధర్మరాజు, అనంతలక్ష్మి ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.అనసూర్య, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే, లేబర్కాలనీలోని అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలను కలెక్టర్ సందర్శించారు. కళాశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచుతూ, విద్యార్థులకు అంకితభావంతో విద్యాబోధన చేయాలని సూచించారు. మిషన్ ఎయిడ్స్ సురక్షను విజయవంతం చేయాలి న్యూశాయంపేట: జాతీయ స్థాయిలో లక్ష్య సాధన దిశగా మిషన్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కళను భావితరాలకు అందించాలి హన్మకొండ కల్చరల్: కళను భావితరాలకు అందించాలని, పేరిణి నాట్యం భారతదేశ సాంస్కృతిక వారసత్వంలో ఒక అమూల్యమైన సంపదని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. మంగళవారం వరంగల్కు చెందిన నటరాజ కళాకృష్ణ నృత్యజ్యోతి అకాడమీ నాట్యచార్యులు, పేరిణి ప్రవీణ గజ్జెల రంజిత్కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పేరిణి నాట్య గురుశిష్య పరంపర నాట్యోత్సవం –2026 కార్యక్రమ వాల్పోస్టర్ను కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గజ్జెల రంజిత్కుమార్, ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల పేరిణి నాట్య అధ్యాపకురాలు చాతరాజు నవ్యజ, పేరిణి కళాకారులు గడ్డం విద్యాశ్రీ, తోడెన్గా సంతోష్, తొడసం గురుదేవ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ ఈనెల 18న ఉదయం 10 గంటలకు హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో నాట్యోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
రైళ్లతో ఆటలొద్దు.. జాగ్రత్త
ఖిలా వరంగల్: రైలు ప్రయాణాన్ని మరింత సురక్షి తం చేయడానికి, వ్యవస్థను అస్తవ్యస్తం చేసేవారి ఆగడాలను నియంత్రించడానికి వరంగల్ జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. రైల్వే సిగ్నల్ వ్యవస్థతో చెలగాటమాడినా, రైలు పట్టాలపై పశువులను నిర్లక్ష్యంగా వదిలేసినా, రైలు పట్టాల వెంట పిల్లలు, ప్రయాణికులపై రాళ్లు రువ్వినా, కాలనీల ప్రజలు అజాగ్రత్తగా దాటేందు కు ప్రయత్నించినా, అనవసరంగా అలారం గొలు సు లాగినా, చట్టపరంగా కఠిన చర్యలుంటాయని తాజాగా వరంగల్ ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్ హెచ్చరికలు జారీ చేశారు. సిగ్నల్ వ్యవస్థ సున్నితం.. రైళ్ల రాకపోకలను నియంత్రించే సిగ్నల్ వ్యవస్థ అత్యంత సున్నితమైంది. కొన్నిచోట్లా కొంతమంది ఆకతాయిలు, దుండగులు తెలిసీతెలియక తీగలను ధ్వంసం చేస్తారు. దీంతో లోకో పైలట్లకు తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఏర్పడుతుంది. దీని వల్ల రెండు రైళ్లు ఒకే ట్రాక్పైకి వచ్చే ప్రమాదం ఉంది. అలా చేయడం వందలాది మంది ప్రాణాలను ఫణంగా పెట్టడమేనని అంటున్నారు. అనవసరంగా చైన్ లాగితే నేరం.. ప్రయాణ సమయంలో రైలును అత్యవసరం వేళ ఆపడానికి ప్రతి బోగీలోనూ అలారం చైన్ ఉంటుంది. దీనిని అనవసరంగా లాగితే జరిమానాతోపాటు జైలు శిక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది. చర్యలు ఇలా.. రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 141 ప్రకారం తొలిసారి నేరం చేస్తే రూ.వెయ్యి వరకు జరిమానా, ఏడాదిపాటు జైలు శిక్ష, పదే పదే అదే తప్పుచేస్తే జరిమానాతోపాటు శిక్ష తీవ్రత పెరుగుతుంది. రైలు ఆగి, కదలడానికి అవసరమైన వ్యయాన్ని వసూలు చేస్తారు. ఇతర రైళ్లు తీవ్ర ప్రభావానికి గురైతే బాధ్యుడిపై అదనపు జరిమానా విధిస్తారు. జరిమానా చెల్లించకపోతే జైలు శిక్ష విధిస్తారు. చైన్ ఎప్పుడు లాగొచ్చంటే.. ప్రయాణికుల్లో ఎవరికై నా గుండెపోటు, మూర్ఛ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు, ఎవరైనా ప్రయాణికుడికి సమీపంలోని ఏదైనా స్టేషన్లో తక్షణ చికిత్స, మందులు లేదా ఆస్పత్రిలో అడ్మిట్ చేయడం వంటి వైద్య సాయం అవసరమైనప్పుడు, ప్రయాణికులు ముప్పులో ఉన్నప్పుడు, మంటలు, పేలుళ్లు చెలరేగినప్పుడు, పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు రైలెక్కేటప్పుడు అది కదిలితే, దొంగతనాలు, దోపిడీదారులు దుశ్చర్యలకు పాల్పడినప్పుడు చైన్ లాగాలి. రైలు భద్రత అందరి బాధ్యత పట్టాలపై ఆటలు, పశువులను వదలొద్దు -
సమాజ అభివృద్ధిలో ‘బాలవికాస’
కాజీపేట రూరల్ : సమాజ అభివృద్ధి, సామాజిక పరివర్తనలో బాలవికాస అందిస్తున్న సేవలు అభినందనీయమని ‘కుడా’ చైర్మన్ వెంకట్రామ్రెడ్డి పేర్కొన్నారు. కాజీపేట ఫాతిమానగర్ బాలవికాస పీటీడీసీ సెంటర్లో బాలవికాస, విశ్వయువక్ కేంద్రం న్యూఢిల్లీ సంయ్తుకంగా నిర్వహిస్తున్న జాతీయ వర్క్షాప్ ముగింపులో మంగళవారం మానసిక ఆరోగ్యం, శ్రేయస్సుపై అనే అంశంపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్ వెంకట్రామ్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో 8 రాష్ట్రాల్లో 8 వేలకు పైగా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ 80 లక్షల మందికి పైగా ప్రయోజనం చేకూరుస్తున్న బాలవికాస సేవా కార్యక్రమాలు ఆదర్శనీయమని ఆయన కొనియాడారు. హనుమకొండ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్డీ రాంకుమార్ మాట్లాడుతూ మానసిక ఆరోగ్యం, మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన, సామర్థ్యాభివృద్ధి ప్రాముఖ్యతను వివరించారు. ప్రభుత్వం మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు వివిధ చర్యలు చేపడుతున్నా బాలవికాస వంటి సంస్థలు నిర్వహించే అవగాహన కార్యక్రమాలు గ్రామీణ స్థాయి పరివర్తనలో మార్పు తీసుకురావడానికి ఎంతో దోహదపడుతాయని అన్నారు. అనంతరం వర్క్షాప్లో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో బాలవికాస పీటీడీసీ డైరెక్టర్ సునీతరెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ రవీణ, ప్రోగ్రాం కోఆర్డినేటర్ రమ, ఆఫీసర్ మంజునాథ్ పాల్గొన్నారు. కుడా చైర్మన్ వెంకట్రామ్రెడ్డి -
కమిషనరేట్ పరిధిలో మరికొన్ని ఘటనలు..
సంవత్సరంవరంగల్ క్రైం: కాపాడాల్సిన వారే కాటేస్తున్నారు. కంటికి రెప్పలా ఉండాల్సిన వారే కామాంధులవుతున్నారు. బుడిబుడి అడుగులేస్తున్న వారి నుంచి మొదలు.. స్కూలు, కాలేజీకి వెళ్లే వారి దాకా అడుగడుగునా లైంగిక వేధింపులు. అఘాయిత్యాలు. చట్టాలు ఎంత కఠినతరం చేసినా చిన్నారులపై పైశాచికత్వం ఆగట్లేదు. ఇలాంటి హృదయ విదారక ఘటనలు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిత్యం వెలుగుచూస్తున్నాయి. కామాంధుల వికృత చేష్టలను తల్లిదండ్రులు, పిల్లలు సైతం గుర్తించలేకపోతున్నారు. పెరుగుతున్న కేసులు వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ప్రతియేటా పోక్సో, రేప్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ముఖ్యంగా పోలీస్స్టేషన్ వరకు రాని ఘటనలు ఎన్నో ఉన్నాయి. విషయం బయటకు తెలిస్తే అమ్మాయి జీవితం నాశనం అవుతుందని కొందరు తల్లిదండ్రులు.. తండ్రి, తాత, బాబాయ్, ఇలా అయిన వారి నుంచే ప్రమాదం వస్తోందని కుమిలిపోయే చిన్నారులు మరికొందరు. గ్రేటర్ వరంగల్ నగరంలో అనేకం. పోక్సో కేసుల నమోదుపై అవగాహన పెరగడం వల్ల ఫిర్యాదు చేయడానికి తల్లిదండ్రులు ముందుకు రావడంతో కొంతలో కొంతైన బాధితులకు న్యాయం జరుగుతోంది. భరోసా కేంద్రం బాధితులను అక్కున చేర్చుకోని ఓదార్చుతోంది. ‘భరోసా’ఇస్తూ.. కమిషనరేట్లోని ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో పోక్సో కేసులు వేగంగా నమోదు కావడంతో బాధితులు భరోసా కేంద్రానికి వస్తున్నారు. బాధితులకు కావాల్సిన అన్ని రకాల సేవలను భరోసా కేంద్రం అందిస్తోంది. తక్షణమే వైద్య పరీక్షలు చేయించడంతో పాటు నిందితులకు శిక్ష పడే వరకు అన్ని రకాలా అండగా నిలుస్తోంది. కమిషనరేట్ పరిధిలో 2022 నుంచి ఇప్పటి వరకు 45 మందికి శిక్ష పడింది. ఇందులో ఇద్దరికి జీవిత ఖైదు పడగా.. మరికొంత మంది 20 ఏళ్లు జైలు శిక్ష పడింది. జిల్లా మహిళా సంక్షేమ అధికారి నుంచి 587 మంది బాధితులకు రూ.1.84 కోట్ల ఆర్థికసాయం అందింది. జిల్లా న్యాయ సేవా సంస్థ నుంచి 11 మంది బాధితులకు రూ.19.78 లక్షలు ఆర్థిక సాయం అందింది. విక్టిమ్ అసిస్టెంట్ ఫండ్ కింద 87 మంది బాధితులకు రూ. 5.64 లక్షలు అందాయి. భరోసా కేంద్రంలో సత్వర సాయం అందడం వల్ల బాధితులు కొంత ఉపశమనం పొందుతున్నారు. కమిషనరేట్ పరిధిలో తాగిన మైకంలో 12 ఏళ్ల బాలికపై కన్నతండ్రే అత్యాచారానికి పాల్పడ్డాడు. పలుమార్లు కడుపున పుట్టిన బిడ్డపై అత్యాచారం చేయడం చూసిన తల్లి ఫిర్యాదు మేరకు కామాంధుడిపై పోక్సో కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. కోర్టు సుమారు 20 ఏళ్లు జైలు శిక్ష విధించింది. పక్కింట్లో జామకాయలు తెచ్చుకునేందుకు వెళ్లిన 12 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం చేశాడు. ఎవరికై నా చెబితే చంపుతానంటూ బెదిరించాడు. తండ్రి లేని చిన్నారి భయంతో తనకు జరిగిన అన్యాయాన్ని ఎవ్వరికి చెప్పుకోలేదు. దీన్ని అదునుగా తీసుకుని పలుమార్లు బలవంతంగా ఆత్యాచారానికి పాల్పడడంతో చిన్నారి గర్భం దాల్చింది. అనారోగ్యానికి గురవడంతో వైద్యులు పరీక్షించి తల్లికి విషయం చెప్పారు. తల్లి ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదైంది. కోర్టు కామాంధునికి జీవిత ఖైదు విధించింది. మానసికంగా బలహీనురాలైన 16 ఏళ్ల బాలికను వరుసకు చిన్నాన్న ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో అఘాయిత్యం చేశాడు. ఆటోలో ఎక్కించుకుని వెళ్లి అత్యాచారానికి పాల్పడి వదిలేయడంతో ఎక్కడికెళ్లాలో తెలియక నరకం చూసింది. విషయం తల్లికి తెలియడంతో అతడిని జైల్లో పెట్టారు. తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోవడంతో అక్క ఇంట్లో తలదాచుకున్న 15 ఏళ్ల అమ్మాయిపై బావ తమ్ముడు బెదిరింపులకు పాల్పడి అత్యాచారం చేశాడు. అక్క ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదైంది. నిందితుడు ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. కమిషనరేట్ పరిధిలో పెరుగుతున్న పోక్సో కేసులు అభంశుభం తెలియని చిన్నారులపై పైశాచికత్వం శిక్షలు పడుతున్నా తగ్గని ఘోరాలు బాధితులకు అండగా భరోసా కేంద్రం -
నిర్మాణ వ్యర్థాలు.. విలువైన వనరులు
● ఆస్కీ కేంద్ర డైరెక్టర్ డాక్టర్ బి.జనార్దన్రెడ్డి హన్మకొండ అర్బన్: నిర్మాణ వ్యర్థాలు విలువైన వనరులని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) కేంద్ర డైరెక్టర్ డాక్టర్ బి.జనార్దన్రెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఆస్కీ ఆధ్వర్యంలో మంగళవారం హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించిన నిర్మాణ, కూల్చివేత వ్యర్థాల నిర్వహణపై శిక్షణలో ఆయన మాట్లాడారు. నిర్మాణ వ్యర్థాలను చెరువులు, రహదారుల పక్కన, ఖాళీ స్థలాల్లో వేస్తే పర్యావరణ, ప్రజారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. వాటిని సేకరించి, వేరు చేసి, తిరిగి ఉపయోగిస్తే సహజ వనరుల పరిరక్షణతోపాటు నిర్మాణ వ్యయం కూడా తగ్గుతుందన్నారు. ఇటుకలు, కాంక్రీట్, రాళ్ల వంటి వ్యర్థాలతో రహదారులు, పేవర్ బ్లాకులు, ఇతర నిర్మాణ సామగ్రిని తయారు చేయవచ్చని వివరించారు. హనుమకొండ కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ నిర్మాణ వ్యర్థాల నిర్వహణపై ప్రభుత్వ మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్న మాట్లాడుతూ నగరంలో నిర్మాణ వ్యర్థాల శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. -
ప్రత్యేక సవరణతో ఓటర్ల తొలగింపు
వరంగల్ చౌరస్తా: ప్రత్యేక సవరణ పేరుతో అర్హుల ఓటర్లను తొలగిస్తూ పాలకులు రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్య వేదిక (టీఎస్డీఎఫ్) రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ వినాయక రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల హక్కులను కాపాడుకుందాం అనే అంశంపై వరంగల్ అండర్ బ్రిడ్జి ఓంకార్ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం ఎన్రెడ్డి హంసారెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రొఫెసర్ వినాయకరెడ్డి మాట్లాడుతూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్.. స్పెషల్ ఇంటెన్సీ రిమూవ్గా మారిందన్నారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో కోట్లాది ఓట్లు గల్లంతయ్యాయని పేర్కొన్నారు. ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యదర్శి గాద గోని రవి, న్యూ డెమోక్రసీ అధికార ప్రతినిధి జేవి చలపతిరావు, ఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జూపల్లి జానకి రాములు, ఆరెల్లి కృష్ణ, ఇనాం ఉమ్మడి జిల్లా బాధ్యులు మహమ్మద్ జుబేర్ హమ్, బోళ్ల రామకృష్ణ, ఎలకంటి రాజేందర్ , కన్నం వెంకన్న, రాచర్ల బాలరాజు, సుభాన్, మాస్ సావిత్రి, వల్లపు ఉపేందర్రెడ్డి పాల్గొన్నారు. టీఎస్డీఎఫ్ రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ వినాయకరెడ్డి -
పీహెచ్డీ రెన్యువల్ ఫీజు తగ్గించాలి
కేయూ క్యాంపస్: పీహెచ్డీ రెన్యువల్ ఫీజు తగ్గించాలని పరిశోధక విద్యార్థులు మంగళవారం రిజిస్ట్రార్ వి.రామచంద్రంను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెన్యువల్ ఫీజు పెంచడంతో విద్యార్థులపై భారం పడుతోందని పేర్కొన్నారు. పరిశోధక విద్యార్థులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉపకార వేతనాలు అందడం లేదని, రెన్యువల్ ఫీజు తగ్గించి, ఫీజు చెల్లింపునకు గడువు పెంచాలని కోరారు. విద్యార్థులు కలకోట్ల సుమన్, డి.తిరుపతి, బొస్క నాగరాజు, మహబూబ్పాషా, మంద శ్యాం, చందు, గణపాక సురేశ్, గుగులోత్ శ్రీనివాస్ ఉన్నారు. న్యూశాయంపేట : హనుమకొండ, జనగామ జిల్లాల అటవీ శాఖ అధికారిగా జి.ముకుందారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటి వరకు డీఎఫ్ఓగా విధులు నిర్వహించిన లావణ్యను మహబూబాబాద్ డీఎఫ్ఓగా బదిలీ చేశారు. హనుమకొండ జిల్లా డీఎఫ్ఓగా ముకుందారెడ్డి గురువారం బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిసింది. నయీంనగర్ : రోడ్లు, భవనాల శాఖ హనుమకొండ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్గా పి.సురేశ్బాబు మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్కిల్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లను సమన్వయం చేసుకొని రోడ్లు, భవనాల శాఖ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. హన్మకొండ : ప్రయాణికుల సలహాలు, సూచనలు పరిశీలించి పరిష్కరిస్తామని ఆర్టీసీ వరంగల్–2 డిపో మేనేజర్ రవిచందర్ తెలిపారు. మంగళవారం ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 13 ఫోన్ కాల్స్ స్వీకరించారు. ప్రయాణికుల సమస్యలు నమోదు చేసుకున్నారు. కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని జిల్లా అదనపు కలెక్టర్ వైవీ గణేశ్ సందర్శించారు. మంగళవారం సూపరింటెండెంట్ చాంబర్లో సమావేశమయ్యారు. ఆస్పత్రిలో నిర్వహిస్తున్న సదరం క్యాంపు వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు అందుతున్న వైద్యసేవలపై సమీక్షించారు. ఆయన వెంటన ఇన్చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాంకుమార్రెడ్డి తదితరులు ఉన్నారు. ఖిలా వరంగల్: జిల్లాలో కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని వరంగల్ జిల్లా వ్యవసాయాధికారి విజయనిర్మల మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా 1,671 కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు (పీపీబీఎస్) పథకానికి అనుసంధానం చేయబడ్డాయన్నారు. రైతులు తమ క్లస్టర్ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ)ను సంప్రదించి ఆధార్, పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంకు ఖాతా జిరాక్స్లను జూలై 5వ తేదీలోపు అందించాలన్నారు. న్యూశాయంపేట: తెలంగాణ మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైనార్టీ విద్యార్థులు విదేశాల్లో పైచదువుల కోసం అందించే సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకానికి దరఖాస్తుల గడువు పొడిగించినట్లు జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి రమేశ్, హనుమకొండ జిల్లా ఇన్చార్జ్ మైనార్టీ సంక్షేమాధికారి మేన శ్రీను మంగళవారం వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాలకు జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి కార్యాలయాల్లో సంప్రదించాలన్నారు. -
శిక్ష పడుతుందనే భయం కలగాలి
వరంగల్ క్రైం : నేరం చేస్తే కోర్టులో శిక్ష పడుతుందనే భయాన్ని నిందితులకు కలిగించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ కేసుల్లో నిందితులు పాల్పడిన నేరాలను కోర్టు నిరూపించి నేరస్తులకు శిక్ష పడటంలో కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో పాటు దర్యాప్తు అధికారులు, కోర్టు విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందిని సీపీ అభినందిస్తూ మంగళవారం ప్రశంసపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీపీ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. గతేడాది నుంచి నేటివరకు కమిషనరేట్ పరిధిలో మొత్తం 41 కేసుల్లో నిందితులు పాల్పడిన నేరాలకు కోర్టులో శిక్షలు అమలయ్యాయని తెలిపారు. సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్ రాము, ఏసీపీలు డేవిడ్రాజు, సతీశ్బాబు, సదయ్య, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు శ్రీనివాస్, సంతోషి, రవి కిరణ్, హరిచంద్ర ప్రసాద్, బృందా దేవి, దుర్గాబాయి, రాజమల్లారెడ్డి, శ్రీధర్ రెడ్డి, రవీందర్ రావు, కిరణ్ కుమార్, నీజర, ఇన్స్పెక్టర్లు సంజీవ్ రావు, మల్లయ్య పాల్గొన్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి ఉద్యోగ విరమణ అనంతరం పోలీస్ అధికారులు తమ వ్యక్తిగత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సూచించారు.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉద్యోగ విరమణ చేసిన పోలీసు అధికారులను కమిషనర్ మంగళవారం ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. అదనపు డీసీపీలు సురేష్కుమార్, శ్రీనివాస్, ఏసీపీలు అంతయ్య, సురేంద్ర, ఆర్ఐలు సతీష్, స్పర్జన్ రాజ్, హనుమకొండ ఇన్న్స్పెక్టర్ శివకుమార్, ఆర్ఎస్ఐ శ్రావణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ -
పెళ్లయిన వారం రోజులకే..
హసన్పర్తి: పెళ్లయిన వారం రోజుల్లోనే నవవరుడిని విద్యుత్ రూపంలో మృత్యువు కబళించింది. తండ్రిని రక్షించడానికి వెళ్లి తండ్రితో పాటు అతడు మృతిచెందిన విషాద సంఘటన నగరంలోని 55వ డివిజన్ భీమారంలో మంగళవారం చోటు చేసుకుంది. భీమారానికి చెందిన ఉప్పు సాంబయ్య (62) ఎఫ్సీఐలో విధులు నిర్వర్తించి రిటైర్డ్ అయ్యాడు. సాంబయ్యకు భార్య రమ, ముగ్గురు కుమారులు శివ కుమార్, రంజిత్ కుమార్, శరత్ కుమార్ (32) ఉన్నారు. పెద్ద కుమారుడు శివకుమార్ కరోనా సమయంలో మృతి చెందగా.. రంజిత్కుమార్, శరత్కుమార్ మాత్రం తండ్రితోనే ఉంటున్నారు. చిన్న కుమారుడు శరత్కుమార్ సీఏ పూర్తిచేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. జూన్ 24న వివాహం.. శరత్కుమార్ పెళ్లి జూన్ 24న నగరానికి చెందిన ఓ యువతితో ఘనంగా జరిగింది. పెళ్లికి వారం ముందు సెలవు పెట్టి వచ్చినట్లు బంధువులు తెలిపారు. శుక్రవారం భీమారంలోని ఓ ఫంక్షన్హాల్లో విందు నిర్వహించారు. కాగా, సోమవారం రాత్రి నవ వధువుతో కలిసి శరత్కుమార్ తన బర్త్డే వేడుకలు నిర్వహించినట్లు స్థానికులు తెలిపారు. ఫ్లెక్సీ తొలగించే క్రమంలో ప్రమాదం.. పెళ్లిని పురస్కరించుకుని ఇంటి ఎదుట ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. మంగళవారం చినుకులు పడడంతో ఆ ఫ్లెక్సీ తొలగిస్తుండగా విద్యుత్ షాక్కు గురయ్యాడు. తండ్రిని రక్షించే క్రమంలో శరత్కుమార్కు కూడా కరెంట్ షాక్ తగిలింది. ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా ఇద్దరు మృతిచెందారు. తండ్రి కొడుకుల మృతితో భీమారంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విద్యుదాఘాతంతో వరుడి దుర్మరణం తండ్రిని కాపాడే క్రమంలో ఇద్దరి మృతి భీమారంలో విషాదఛాయలు -
వీధి వ్యాపారుల ఆర్థికాభివృద్ధే లక్ష్యం
వరంగల్ అర్బన్ : వీధి వ్యాపారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని హనుమకొండ కలెక్టర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) ప్రత్యేక అధికారి చాహత్ బాజ్పాయ్ పేర్కొన్నారు. మంగళవారం హనుమకొండలోని అంబేడ్కర్ భవన్లో జీడబ్ల్యూఎంసీ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) సంయుక్త ఆధ్వర్యంలో స్వనిధి మహోత్సవ్–2026 కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం జీడబ్ల్యూఎంసీ పరిధిలో సుమారు 48 వేల మంది స్ట్రీట్ వెండర్లు నమోదయ్యారని, కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారికి ఎప్పటికప్పుడు నమోదు అవకాశం కల్పిస్తూ, జాబితాను నిరంతరం నవీకరించాలని అధికారులకు సూచించారు. అంబేడ్కర్ భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వీధి వ్యాపారులు, మహిళా సంఘాల వివిధ ప్రదర్శన స్టాల్స్ను కలెక్టర్ సందర్శించారు. అనంతరం రుణాలు అందించిన బ్యాంకర్లు, వీధి వ్యాపారులను సన్మానించారు. మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ రాజేశ్వర్, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, ఎల్డీఎం మహేందర్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి నవీన్ కుమార్, డీఎంసీ రజిత రాణి, టీఎంసీలు రమేష్ తదితరులు పాల్గొన్నారు. పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయాలిహన్మకొండ అర్బన్: జిల్లాలో కొత్త పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులను గడువులోగా మంజూరు చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పెట్టుబడులను ఆకర్షించేలా అనుకూల వాతావరణం కల్పించాలని, పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతో పాటు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లా పరిశ్రమల కేంద్రం ప్రధాన నిర్వాహకుడు నవీన్ కుమార్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్పాయ్ -
పాఠశాలల్లో అకడమిక్ తనిఖీలు!
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అకడమిక్ ప్యానల్ తనిఖీ బృందాలతో ఈ విద్యాసంవత్సరం 2026–27లోనూ తనిఖీలు చేపట్టనున్నారు. ఈమేరకు ఇటీవల తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈవిద్యాసంవత్సరంలో పాఠశాలలు పునఃప్రారంభమై కొనసాగుతుండగా.. తాజాగా అకడమిక్ ప్యానల్ తనిఖీ బృందాలను కొనసాగించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డీఈఓలను ఆదేశించారు. దీంతో డీఈఓలు మళ్లీ తనిఖీ బృందాల ఏర్పాటు కోసం ఉపక్రమించారు. గత విద్యాసంవత్సరంలో తనిఖీ బృందాల్లో బాధ్యతలను నిర్వర్తించిన ఉపాధ్యాయులకు ఆసక్తి ఉంటే ఈసారి అవకాశం కల్పించనున్నారు. లేకపోతే మళ్లీ కొత్తవారికి అవకాశం ఇస్తారు. తనిఖీ బృందంలో పనిచేసేవారు విధులకు దూరం అవుతారు. దరఖాస్తుల స్వీకరణ హనుమకొండ జిల్లాలో అకడమిక్ ప్యానల్ తనిఖీ బృందాలకు 39 మంది ఉపాధ్యాయులు అవసరం ఉండగా.. డీఈఓలు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గత విద్యాసంవత్సరంలో తనిఖీ బృందాల్లో పనిచేసినవారు ఆసక్తి ఉంటే.. సంబంధిత ఎంఈఓల నుంచి సిఫార్సుతోకూడిన సమ్మతి పత్రాన్ని డీఈఓ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. గత విద్యాసంవత్సరం దరఖాస్తు చేసుకోని ఉపాధ్యాయులు ఈసారి తమ హెచ్ఎంల, ఎంఈఓల ద్వారా తమ దరఖాస్తులను డీఈఓ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. పూర్తి చేసిన దరఖాస్తులను డీఈఓ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. పాఠశాల విధులకు దూరం.. తనిఖీ బృందాల విధుల్లో పాల్గొననుండడంతో కొందరు స్కూల్ అసిస్టెంట్లు పాఠశాల విధులకు దూరం కానున్నారు. ఇప్పటికే ప్రభుత్వ, జిల్లా పరిషత్ హైస్కూళ్లల్లో సబ్జెక్టు టీచర్ల కొరత (ఎస్ఏ) ఉండడంతో హైస్కూళ్లలో సబ్జెక్టుల టీచర్ల కొరత ఏర్పడనుంది. ఫలితంగా విద్యాబోధనపై ప్రతికూల ప్రభావం పడనుంది. అడ్మిషన్ల ప్రక్రియ తర్వాతే ఆయా జిల్లాల్లోని పాఠశాలల్లో టీచర్లను సర్దుబాటు కూడా చేస్తారు. 457743795163946437330 ఆసక్తి ఉన్న టీచర్ల కొనసాగింపు మళ్లీ కొత్తగా దరఖాస్తుల స్వీకరణ విధులకు దూరమవుతున్న పలువురు ఉపాధ్యాయులు ఇప్పటికే హైస్కూళ్లలో సబ్జెక్టు టీచర్ల కొరత!బృందాల వివరాలు ఇలా.. ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యాబోధన విద్యార్థులు అభ్యసన ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులకు సూచనలివ్వడం. ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టుల బోధన పరిశీలన. పాఠశాలల సందర్శన సమయాల్లో గమనించిన అంశాల ఆధారంగా స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలకు ఎజెండాను సిద్ధం చేస్తారు. -
జవాబుదారీతనం పెరగాలి
● గ్రేటర్ వరంగల్ కమిషనర్ టి.వెంకన్న వరంగల్ అర్బన్: పారిశుద్ధ్య నిర్వహణలో జవాబుదారీతనం పెరగాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.వెంకన్న అధికారులను హెచ్చరించారు. మంగళవారం ఉదయం 34వ డివిజన్ పరిధిలోని శివనగర్ తదితర ప్రాంతాల్లో కమిషనర్ ఆయన ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. అనంతరం స్థానిక వార్డు కార్యాలయాన్ని సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఎక్కడా చెత్త పేరుకుపోకుండా చూడాలని ఆదేశించారు. సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఇన్చార్జి సిటీప్లానర్ రవీందర్ రాడేకర్, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, శానిటరీ సూపర్వైజర్లు భాస్కర్, గోల్కొండ శ్రీను పాల్గొన్నారు. -
అప్గ్రేడ్ అయినా స్లో..
కాజీపేట అర్బన్: రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ వెబ్సైట్, సర్వర్ మొరాయించడంతో రిజిస్ట్రేషన్లు స్లోగా ముగిశాయంటూ సోమవారం భూక్రయవిక్రయదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్ల తర్వాత రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ వెబ్సైట్తో పాటు సర్వర్ అప్గ్రేడేషన్లో భాగంగా ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు మూడు రోజుల పాటు రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిపేశారు. కాగా, సోమవారంతో మళ్లీ మొదలైన రిజిస్ట్రేషన్లు స్పీడ్గా జరుగుతాయని ఆశించినప్పటికీ భూక్రయవిక్రయదారులకు నిరాశే మిగిలింది. సోమవారం 108 స్లాట్స్కు గాను 86 స్లాట్స్ బుక్ కాగా, ఉదయం 10.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కేవలం మూడు దస్తావేజులు మాత్రమే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నా యి. సర్వర్ మొరాయించడంతో సోమవారం 86 స్లాట్లకుగాను కేవలం 56 స్లాట్స్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నాయని, మిగతా స్లాట్లు రీస్లాట్స్ చేసుకోవాల్సిందేనని ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్ సైదులు తెలిపారు. దీంతో భూక్రయవిక్రయదారులు సా యంత్రం 7 గంటల వరకు వరంగల్ ఆర్ఓ కార్యాలయంలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. -
ఆర్థిక భారం తగ్గించాలి..
రేడియం రిప్లెక్టివ్ స్టిక్కర్లతో లారీ ఓనర్ల ఆర్థిక భారం పడుతోంది. లారీ టైర్లను బట్టి రూ.6వేల నుంచి రూ.10వేల వరకు వసూలు చేస్తున్నారు. క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు వేస్తే లారీలకు ఫిట్నెస్ పరీక్షలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఫిట్నెస్కు రావాలంటే ఆర్థిక భారాన్ని చూసి భయపడుతున్నాం. భారంగా మారిన క్యూర్ కోడ్స్టిక్కర్లను తొలగించాలి. లేదా వాహనానికి రూ. వెయ్యి మాత్రమే వసూలు చేయాలి. –వేముల భూపాల్, లారీ ఓనర్స్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు ● -
‘రోల్’ మోడల్గా కమిషనరేట్ పోలీస్!
వరంగల్ క్రైం : వరంగల్ కమిషనరేట్ పోలీస్ రాష్ట్రానికి ‘రోల్’మోడల్గా నిలుస్తున్నారు. సీపీ సన్ప్రీత్సింగ్ కమిషనరేట్ పరిధిలో మే 29 నుంచి అమల్లోకి తీసుకొచ్చిన రోల్ కాల్ సిస్టం సత్ఫలితాలు ఇస్తోంది. ఫలితంగా కేసుల ఛేదనలో వేగం పెరిగినట్లు తెలుస్తోంది. రోల్ కాల్ విధానం పోలీస్ వ్యవస్థ ఆవిర్భవించినప్పటి నుంచి ఉన్నా ఈ మధ్య కాలంలో ఎవరూ పాటించడం లేదు. తుతూ మంత్రంగా ఇంతకాలంగా కొనసాగిన రోల్కాల్ విధానం ఇప్పటి నుంచైనా సక్రమంగా పాటించాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని సీపీ హెచ్చరించడంతో ఉదయం 9 గంటలకు కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో స్టేషన్ హౌజ్ ఆఫీసర్లు (ఎస్హెచ్ఓ) రోల్ కాల్ తీసుకుంటున్నారు. దీంతో పీఎస్కు వచ్చిన ఫిర్యాదులపై వెంటనే అధికారులు నిర్ణయం తీసుకుని సిబ్బందిని క్షేత్రస్థాయి విచారణకు పంపిస్తున్నారు. దీంతో పాటు అధికారులు కచ్చితంగా 9 గంటలకు విధులకు హాజరవుతారనే నమ్మకం ప్రజల్లో కలిగింది. విధులకు హాజరు తప్పనిసరి కావడంతో.. రాష్ట్రంలో పోలీస్ బాస్ నిర్ణయాలతో వరంగల్ కమిషనరేట్లో పోలీస్ వ్యవస్థ ఒక్కసారిగా అప్రమత్తమైంది. రోజు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 వరకు సీపీ ప్రజలు, అధికారులు, సిబ్బందికి అందుబాటులో ఉంటున్నారు. ఎస్హెచ్ఓలు ఉదయం 9 గంటలకు రోల్ కాల్ తీసుకోవాలనే నిబంధనతో సబ్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది కచ్చితంగా సమయానికి హాజరవుతున్నారు. దీంతో ఫిర్యాదుదారులకు అధి కారులు అందుబాటులో ఉండడంతో సాయంత్రం వరకు వారి సమస్యలు సైతం పరిష్కారమవుతున్న ట్లు సమాచారం. కమిషనరేట్ పరిధిలో వివిధ మండలాల్లో ఎస్హెచ్ఓలుగా పనిచేస్తున్న చాలా మంది అధికారులు నగరంలో ఉంటున్నారు. దీంతో రాత్రి వచ్చి ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య విధులకు హాజరయ్యేవారు. ఈ నేపథ్యంలో రోల్ కాల్ వ్యవస్థ అమలు జరిగిన నెల వ్యవధిలోనే పోలీస్ వి ధుల్లో చాలా మార్పులు తీసుకొచ్చినట్లు పలువురు అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సమయం సరిపోక ఉక్కిరిబిక్కిరి.. రోల్ కాల్ సత్ఫాలితాలు ఇస్తున్నా ఎస్హెచ్ఓలు స మయం సరిపోక ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు తెలు స్తోంది. ట్రై సిటీ పరిధితోపాటు చుట్టు పక్కల పీ ఎస్లకు ఫిర్యాదుదారుల తాకిడి రాత్రి 11 గంటల వరకు ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచే టెలీ కాన్ఫరెన్స్ మొదలవుతుంది. మొదట సబ్ ఇన్స్పెక్టర్లను ఇన్స్పెక్టర్లు, ఇన్స్పెక్టర్లను ఏసీపీ, డీసీపీ, సీపీ టెలీకాన్ఫరెన్స్ ఉంటుంది. ఈ తంతు ఉదయం 9 గంటల వరకు కొనసాగుతోంది. 9 గంటలకే రోల్ కాల్ ఉండడంతో సమయం సరిపోవడం లేదని, ఈ విషయంలో మార్పు తీసుకొస్తే బాగుంటుందని పలువురు ఎస్హెచ్ఓలు అభిప్రాయపడుతున్నారు. 9 గంటలకు స్టేషన్లో కొలువుదీరుతున్న ఎస్హెచ్ఓలు ఫిర్యాదులపై తక్షణ స్పందన.. ప్రజల్లో కలుగుతున్న నమ్మకం -
గిరిజనుల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది
హన్మకొండ : గిరిజనుల అభివృద్ధికి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా అన్నారు. సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో వికసిత్ తెలంగాణ కోసం గిరిజనుల సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ నుంచి హనుమకొండకు చేరుకున్న నితిన్ నబీన్కు హరిత హోటల్ వద్ద గిరిజన సంప్రదాయప్రకారం స్వాగతం పలికారు. అనంతరం గిరిజనుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మావోయిస్టులు ఉన్నచోట ఇంతకాలం గిరిజనుల అభివృద్ధి ఆగిపోయిందన్నారు. నక్సలైట్ల సమస్య సమసిపోయిందన్నారు. గిరిజనుల సమగ్రాభివృద్ధికి మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగా రూ.15 వేల కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవి నాయక్, మాజీ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్, బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీ గోడెం నగేశ్, కేంద్ర మాజీ మంత్రి అమర్సింగ్ తివారీ, నాయకులు కల్యాణ్ నాయక్, సోలంకి శ్రీనివాస్, బాబీ, రితేష్ రాథోడ్ పాల్గొన్నారు. భద్రకాళికి పూజలు హన్మకొండ కల్చరల్: వరంగల్ శ్రీభద్రకాళి దేవాలయాన్ని సోమవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్, కేంద్రమంత్రి కిషన్రెడ్డి వేర్వేరుగా సందర్శించారు. వీరితోపాటు పార్టీ , ఈ సందర్భంగా వారికి ప్రధానార్చకులు భద్రకాళి శేషు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతించారు. ముందుగా గోమాతకు ప్రదక్షిణ చేసి ఆలయంలోని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు జరుపుకున్నారు. అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. నితిన్ నబీన్ కాన్వాయ్ని అడ్డుకున్న ఎన్ఎస్యూఐ నేతలుహన్మకొండ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కాన్వాయ్ను కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. సోమవారం హనుమకొండ పర్యటనకు వచ్చిన నితిన్ నబీన్ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో జరిగే బీజేపీ ఉమ్మడి జిల్లా బూత్ కమిటీల అధ్యక్షుల సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో కాన్వాయ్ తెలంగాణ అమరవీరుల స్తూపం కూడలి దాటగానే అడ్డంగా పరుగెత్తుకొచ్చారు. వెంటనే పోలీసులు వారిని అడ్డుతొలగించి అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్కు తరలించారు. అనంతరం వదిలేశారు. వరంగల్ పోలీసులపై కేంద్ర మంత్రి ఆగ్రహం.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కాన్వాయ్ను ఎన్ఎస్యూఐ కార్యకర్తలు అడ్డుకునే విషయంలో పోలీసుల తీరుపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ఎస్యూ నాయకులు న్యూసెన్స్ చేస్తుంటే పోలీసులు సైలెంట్గా ఉండడం ఏమిటని ప్రశ్నించారు. ఎన్ఎస్యూ నాయకుల న్యూసెన్స్పై ముందుస్తుగా పోలీసులకు సమాచారం ఇచ్చినా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. వరంగల్ పోలీసుల నిర్లక్ష్యంపై కేంద్ర నిఘావర్గాలు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా -
బాధ్యతాయుతంగా పనిచేస్తా
వరంగల్ అర్బన్/హన్మకొండ అర్బన్: నేను ఉమ్మడి జిల్లాకు చెందిన వాడిని.. మహా నగరంలో పనిచేయడం గొప్ప అవకాశంగా భావిస్తున్నా అని గ్రేటర్ వరంగల్ కమిషనర్ తేజవత్ వెంకన్న అన్నారు. సమన్వయంతో సత్ఫలితాలను అందిస్తానని, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని బాధ్యతాయుతంగా పరిష్కరిస్తానన్నారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. తొలుత భద్రకాళి అమ్మవారి ఆశ్వీరచనం తీసుకున్నారు. అనంతరం హనుమకొండ కలెక్టరేట్లో చాహత్ బాజ్పాయ్ని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందించారు. నగరంలో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి పనులు, నగర ప్రజలకు మెరుగైన సేవలు, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా తదితర అంశాలపై చర్చించారు. బల్దియాలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గ్రేటర్ వరంగల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు, సిబ్బంది సంపూర్ణ సహకారం అవసరమని పేర్కొన్నారు. నగరాభివృద్ధిలో మీడియా పాత్ర కీలకమని, జర్నలిస్టుల సూచనలు, సలహాలు స్వీకరిస్తూ వారి సహకారంతో నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తానన్నారు. అధికారులు, ఉద్యోగులు కమిషనర్ కలిసి పూలమొక్కలు అందించి, శుభాకాంక్షలు తెలిపారు. మెరుగైన పాలన అందిద్దాం..క్షేత్రస్థాయి కార్మికుడి నుంచి వింగ్ అధికారి వరకు సమన్వయంతో పని చేద్దామని, మహా నగర ప్రజలకు మెరుగైన పాలన ఇవ్వాల్సిన అవసరం ఉందని గ్రేటర్ వరంగల్ కమిషనర్ తేజవత్ వెంకన్న సూచించారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్లో పౌరుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 78 ఫిర్యాదులు వచ్చాయి. అడిషనల్ కమిషనర్ జోనా, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, డీఎఫ్ఓ శంకర్ లింగం, ఇన్చార్జ్ సీపీ రవీందర్ రాడేకర్, ప న్నుల అధికారి రామకృష్ణ, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య, సెక్రటరీ అనిల్ బాబు ఉన్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తా మహానగరంలో విధులు నిర్వర్తించాలన్నది నా కల కమిషనర్ తేజవత్ వెంకన్న.. బాధ్యతల స్వీకరణ -
ఒత్తిడిని జయించాలి
● ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత ● బాలవికాసలో జాతీయ వర్క్షాప్ ప్రారంభం కాజీపేట రూరల్: నేటి ఆధునిక సమాజంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడిని జయించాలని, ముఖ్యంగా యువత మానసిక ఆరోగ్యం కోసం జాతీయ వర్క్షాప్ వంటివి ఎంతో దోహదపడతాయని హనుమకొండ ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత అన్నారు. కాజీపేట ఫాతిమానగర్ బాలవికాస పీపుల్ డెవలప్మెంట్ సెంటర్లో సోమవారం బాలవికాస, విశ్వక్ యువ కేంద్ర, న్యూఢిల్లీ వారి భాగస్వామ్యంతో రెండు రోజుల పాటు జరిగే జాతీయ స్థాయి వర్క్షాప్ను ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ప్రారంభించారు. ‘మానసిక ఆరోగ్యం, శ్రేయస్సు–ఒత్తిడి నివారణ, మాదక ద్రవ్యాల వ్యసన విముక్తి’ అంశంపై ముఖ్య అతిథిగా ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రోహిత్నేత మాట్లాడుతూ యువతకు శారీరక దృఢత్వం ఎంత ముఖ్యమో, మానసిక దృఢత్వం అంతే ముఖ్యమన్నారు. బాలవికాస పీడీటీసీ డైరెక్టర్ సునీతారెడ్డి మాట్లాడుతూ.. బాలవికాస పీడీటీసీ 24 ఏళ్లుగా ఎన్నో శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసి సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు, ఈ జాతీయ వర్క్షాప్లు యువతకు ఎంతో మేలు చేస్తాయన్నారు. బ్రహ్మకుమారి సంస్థకు చెందిన నిపుణులు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో విశ్వక్ యువ కేంద్ర, న్యూఢిల్లీ నుంచి హాజరైన ప్రోగ్రాం ఆఫీసర్ మంజునాథ్, 8 రాష్ట్రాల నుంచి 100 మంది స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
టీచర్గా మారిన కలెక్టర్
కాజీపేట అర్బన్: పరిపాలనా విధుల్లో నిత్యం బిజీబిజీగా గడిపే కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ సోమవారం చిన్నారులతో సరదాగా గడిపారు. టీచర్గా మారి పాఠాలు చెప్పారు. చిన్నారుల తో ముచ్చటించారు. కాజీపేట మండలం న్యూశాయంపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలోని అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ చాహత్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రీస్కూల్ విద్యార్థులతో ముచ్చటించి స్కూల్ యూనిఫాం నచ్చిందా, మీ పేర్లు ఏంటి అంటూ ఆప్యాయంగా పలకరించారు. తరగతి గదిలో బోర్డుపై ఏబీసీడీలు రాసి విద్యార్థులను ప్రశ్నించారు. ఇన్చార్జ్ డీడబ్ల్యూఓ విశ్వజ, అంగన్వాడీ టీచర్ పాల్గొన్నారు. హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో సోమవారం ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో రుద్రేశ్వరస్వామికి రుద్రాభిషేకం నిర్వహించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం దంపతులు దేవాలయాన్ని సందర్శించి స్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించుకున్నారు. కాశిబుగ్గ: వరంగల్ సీకేఎం ఆస్పత్రి ఆవరణలో పేరుకుపోయిన చెత్త వల్ల పాములు సంచరిస్తున్నట్లు పేషెంట్లు, అటెండెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం వ్యవధిలో రెండుసార్లు పాములు పిల్లల వార్డులోకి రావడం భయాందోళనకు గురిచేసింది. సోమవారం సాక్షిలో ప్రచురితమైన ‘పిల్లల వార్డులో పాము ప్రత్యక్షం’ వార్తకు అధికారులు స్పందించారు. పాములు పట్టేవారిని పిలిపించారు. ఎంత ప్రయత్నించినా పాము దొరక్కపోవడంతో స్నేక్స్ క్యాచర్ వెనుదిరిగివెళ్లినట్లు తెలుస్తోంది. పిల్లల వార్డుతో పాటు పలు వార్డుల పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, వ్యర్థ పదార్థ్ధాలు, పనికిరాని సామగ్రి ఉండడంతో పాములు తిరుగుతున్నట్లు భావిస్తున్నారు. ఆస్పత్రి పరిసరాలు పరిశుభ్రం చేయించి, పాముల బెడదను తొలగించాలని అటెండెంట్లు కోరుతున్నారు. -
అర్జీలు వెంటనే పరిష్కరించాలి
● వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: ప్రజల అర్జీలను అధికారులు వెంటనే పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. సోమవారం వరంగల్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఆమె వినతులు స్వీకరించారు. ప్రజావాణికి మొత్తం 249 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్ఓ విజయలక్ష్మి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.అవకతవకలకు తావివ్వొద్దు కాళోజీ సెంటర్: వరంగల్ జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు తాటికాయల కుమార్ కోరారు. ఈ మేరకు డీఈఓ రంగయ్య నాయుడికి సంఘం ప్రధాన కార్యదర్శి సి.సుజన్ ప్రసాదరావుతో కలిసి సోమవారం వినతిపత్రం అందించారు. -
రక్షణ పరికరాల అందజేత
ఖిలా వరంగల్: మామునూరు టీజీఎస్పీ నాలుగో బెటాలియన్ను సోమవారం హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ సందర్శించారు. ఈసందర్భంగా కలెక్టర్కు టీజీ ఎస్పీ కమాండెంట్ శివప్రసాద్రెడ్డి పుష్పగుచ్ఛం అందించగా.. కలెక్టర్కు పోలీసులు గౌరవందనం సమర్పించారు. అనంతరం కమాండెంట్తో కలిసి కలెక్టర్.. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందికి అధునాతన రెస్క్యూ పరికరాలు అందించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్స్ ఈ.వీరన్న, రాజేందర్, ఎస్డీఆర్ఎఫ్ ఆర్ఐ రవి, ఆర్ఐలు కార్తీక్, వెంకటేశ్వర్లు, రాజ్కుమార్ ఉన్నారు. -
డిగ్రీ దండగ కాదు.. పండుగ
హన్మకొండ అర్బన్ : రాబోయే రెండు దశాబ్దాలు విద్యారంగానికి అత్యంత కీలకమని, ‘డిగ్రీ దండగ కాదు.. పండుగ’అని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి అన్నారు. నగరంలోని మాస్టర్ జీ పీజీ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన నూతన డిగ్రీ, పీజీ సిలబస్పై సోమవారం అధ్యాపకులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నూతన సిలబస్లో విద్యార్థుల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు, ట్రెండింగ్ సబ్జెక్టులను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. అధ్యాపకులు నూతన సిలబస్పై పూర్తి అవగాహన పెంపొందించుకోవడంతో పాటు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలన్నారు. మాస్టర్ జీ విద్యాసంస్థల చైర్మన్ సంఘం రెడ్డి సుందర్రాజ్ మాట్లాడుతూ అధ్యాపకులు ఎప్పటికప్పుడు సిలబస్లో వస్తున్న మార్పులను తెలుసుకుంటూ విద్యార్థులు ఉద్యోగాల్లో రాణించేలా తీర్చిదిద్దాలన్నారు. కేయూ ఓఎస్డీ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ నూతన సిలబస్ రూపకల్పనలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలికి పలు సూచనలు అందించినట్లు తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ బి. పోలరామ్, జనరల్ సెక్రటరీ సంఘం రెడ్డి అచ్యుత్రాజ్, విశ్వరాజ్, ధనరాజ్, లక్ష్మీనర్సింహారావు, సూర్యనారాయణ, ధనలక్ష్మి, స్రవంతి, శ్రీనివాస్, అశోక్, అనురాధ, తదితరులు పాల్గొన్నారు. దేశాభివృద్ధికి గణాంకాలే బలమైన పునాది.. కేయూ క్యాంపస్: దేశాభివృద్ధికి గణాంకాలే బలమైన పునాది అని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చై ర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి అన్నారు. సోమవా రం భారతీయ గణాంక శాస్త్ర పితామహుడు చంద్రమహబిల నోబిస్ జయంతి సందర్భంగా కేయూలో ని స్టాటిస్టిక్స్ విభాగం సెమినార్హాల్లో నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశాభివృద్ధికి గణాంకాలు కేవలం సంఖ్యల సమాహారం మాత్రమేకాకుండా ప్రభుత్వ విధానాల రూపకల్పన, సంక్షేమ పథకాల అమలు, పారదర్శక పాలనకు సమర్థవంతమైన నిర్ణయాల మూలాధారంగా నిలుస్తాయన్నారు. మహల నోబి స్ శాసీ్త్రయ దృక్పథం నేటికీ దేశ ప్రణాళిక వ్యవస్థకు మార్గదర్శకమన్నారు. కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం మాట్లాడుతూ గణాంక శాస్త్రం ప్రతీవిద్యార్థికి అవసరమైన ప్రాథమిక విజ్ఞానంగా మారిందన్నారు. అనంతరం ఓఎస్డీ బి. వెంకట్రా మ్రెడ్డి, కేయూ స్టూడెంట్స్ ఆఫైర్స్ డీన్ ఇస్తారి, స్టాటిస్టిక్స్ విభాగం అధిపతి జె. శ్రీనివాస్, కేయూ స్టాటిస్టిక్స్ విభాగం రిటైర్డ్ ఆచార్యుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడారు. వైస్ ప్రిన్సిపాల్ మమత, యూత్వెల్ఫేర్ ఆఫీసర్లు బి. నిరంజన్, శ్రీనివాస్, రాధిక, తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి -
సేవలు వేగంగా, పారదర్శకంగా..
● అందుబాటులో ఆధునిక యంత్రం ● వరంగల్ తపాలా కార్యాలయానికి చేరిన మెషీన్ఖిలా వరంగల్ : వరంగల్ డివిజనల్ తపాలా కార్యాలయంలో వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందులోభాగంగా ఆధునిక యంత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. తపాలా కౌంటర్ల వద్ద గంటల కొద్దీ నిలబడాల్సిన అవసరం లేకుండా స్వయంగా పోస్టల్ ఐటమ్స్ (స్పీడ్పోస్ట్) బుక్ చేయడం కోసం ఈ యంత్రాలను సిద్ధం చేశారు. ఫలితంగా వినియోగదారులకు నిరీక్షణ తప్పుతుంది. మెరుగైన సేవలు అందుతాయి. రానున్న రోజుల్లో జిల్లాలోని అన్ని తపాలా కార్యాలయాల్లో స్పీడ్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని డివిజన్ సూపరింటెండెంట్ బి.రవికుమార్ తెలిపారు. పోస్టల్ సేవలు సులభం.. వరంగల్ డివిజనల్ తపాలా కార్యాలయంలో పోస్టల్ సేవలు సులభంగా, వేగంగా పంపేందుకు యూజప్ పెండ్లీ ఇంటర్ఫేస్ బుక్ సౌకర్యం కల్పించారు. వస్తువుల బరువును ఆధునిక యంత్రం తూకం వేస్తుంది. అందుకునుగుణంగా కచ్చితమైన చార్జీ లెక్కిస్తుంది. ఫోన్పే, పేటీఎం, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు చేసే వెసులు బాటు సైతం కల్పించారు. ‘తపాలా ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన యంత్రాన్ని కస్టమర్లు వినియోగించుకోవాలి. చెల్లింపు పూర్తయిన వెంటనే ట్రాకింగ్ నంబరుతో కూడిన రసీదు వస్తుంది. తపాలా వినియోగదారులు తప్పని సరిగా చిరునామా, పిన్కోడ్ తదితర వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది’ అని పోస్టల్ అధికారులు పేర్కొన్నారు. -
‘స్టిక్కర్ల’ పేరిట వసూళ్ల దందా!
ఖిలా వరంగల్ : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతీ వాహనానికి ముందు, వెనుక రిప్లెక్టివ్ స్టిక్కర్లు అతికించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీని పేరుతో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వసూళ్లు చేపడుతున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్యూ ఆర్ కోడ్ స్కాన్చేస్తే వాహనానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రవాణాశాఖ కార్యాలయాల్లో వాహనదారుల నుంచి అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్నట్లు పలువురు ఓనర్లు పేర్కొంటున్నారు. లారీ ఓనర్లకు భారం.. వాహనాలకు క్యూ ఆర్ కోడ్తో ఉన్న స్టిక్కర్లను అతికించే బాధ్యతను ప్రభుత్వం ఓ ప్రైవేట్ కాంట్రా క్టర్కు అప్పగించింది. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలోని రవాణాశాఖ కార్యాలయంలోనే ప్రైవేట్ కాంట్రాక్టర్కు సంబంధించిన సిబ్బంది పనిచేస్తున్నారు. వీరు ఫిట్నెస్కు వచ్చే ప్రతీ వాహనానికి రిప్లెక్టివ్ స్టిక్కర్లు అతికిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో లభించే స్టిక్కర్లు వేసుకుని వచ్చినా లారీకి కనీసం రూ. 5,500 తీసుకుంటున్నారు. అసలే స్టిక్కర్లు లేని వాహనానికై తే రూ.6వేలు నుంచి వాహన సామర్థ్యాన్ని బట్టి రూ.10వేలు వసూలు చేస్తున్నారని లారీ ఓనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చర్యలు తీసుకోవాలి.. వరంగల్ జిల్లా రవాణాశాఖ అధికారి (డీటీఓ) రంగారావును సోమవారం ‘ది వరంగల్ లారీ ఓనర్స్ అసోసియేషన్’ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వేముల భూపాల్, కోశాధికారి మహమ్మద్ జాకీర్, సభ్యులు కలిశారు. స్టిక్కర్ల పేరుతో లారీ యజమానులపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందన్నారు. లారీ ఓనర్లు, డ్రైవర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్టిక్కర్ల వసూళ్లపై తగిన చర్యలు తీసుకోవాలని డీటీఓకు వినతిపత్రం అందజేశారు. లారీ ఓనర్లపై తీవ్ర ఆర్థిక భారం చర్యలు తీసుకోవాలని డీటీఓకు వినతి మార్కెట్లో బస్సు, లారీ వంటి వాహనాలకు రేడియం స్టిక్కర్ వేస్తే రూ. 300 నుంచి రూ.500 వరకు ఖర్చవుతోంది. అయితే కార్యాలయాల వద్ద ఉండే కాంట్రాక్టర్ స్టిక్కర్ తప్పని సరి నిబంధన విధించడంతో అక్రమాలు ఎక్కువయ్యాయి. కాంట్రాక్టర్కు సంబంధించిన సిబ్బంది స్టిక్కర్ అతికించాలనుకుంటే వాహన టైర్లను బట్టి సామర్థ్యం మేరకు రూ.5వేలు నుంచి రూ.10వేల వరకు వసూలు చేస్తున్నారు. దీనిపై వరంగల్ జిల్లా రవాణాశాఖ అధికారి రంగారావును వివరణ కోరగా.. రాష్ట్ర స్థాయి నుంచే ఉత్తర్వులు ఉన్నాయని, కాంట్రాక్టర్ క్యూఆర్ జారీ చేస్తే తాము వాహన సామర్థ్యాన్ని పరీక్షించి ఇక్కడ ధ్రువీకరణ పత్రాలు ఇస్తామన్నారు. సంబంధిత కాంట్రాక్టర్ ఎంత వసూలు చేస్తున్నారనే విషయం తమకు తెలియదన్నారు. ఎక్కువ తీసుకుంటే వాహనదారులు తెలపాలని, అధికంగా వసూలు చేస్తున్నట్లు తేలితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. -
నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫలితాలు విడుదల
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలో సోమవారం నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశా ల (అటానమస్) డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ రెండో, నాలుగో, ఆరో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం, పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్, ఆ కళాశాల ప్రిన్సిపాల్ మల్లం నవీన్తో కలిసి విడుదల చేశారు. కేయూ ఓఎస్డీ బి. వెంకట్రామ్రెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి తిరుమలాదేవి, నర్సంపేట డిగ్రీ కళాశాల పరీక్షల నియంత్రణాధికారి కమలాకర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి రాజీరు తదితరులు పాల్గొన్నారు. ఫలితాలను కళాశాలలోనే అందుబాటులో ఉంచారు. ఖిలా వరంగల్: టీఎన్జీఓ వరంగల్ జిల్లా నూతన కార్యవర్గాన్ని సోమవారం నియమించారు. జిల్లా అధ్యక్షుడిగా గాదె వేణుగోపాల్, కార్యదర్శిగా పాలకుర్తి సదానందం, కోశాధికారిగా కిరణ్కుమార్ నియమితులయ్యారు. టీఎన్జీఓ భవనంలో జిల్లా అధ్యక్షుడు గజ్జల రామ్కిషన్ అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా కేంద్ర సంఘం సహ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ప్రకటించారు. కార్యక్రమంలో సిటీ అధ్యక్షుడు శంకేసి రాజేశ్, కార్యవర్గ సభ్యులు వంశీధర్ బాబు, జి.రాజు, రమాదేవి, ఇంద్రాసేనారెడ్డి, రజినీకాంత్, శరత్, రామకృష్ణ, గణేశ్, యూసూఫ్, జ్యోతి, సునీత, పద్మ, కవిత, నాయర్ పాల్గొన్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు న్యూశాయంపేట: జిల్లా పరిధిలోని మైనార్టీ గురుకులాల్లో ఖాళీగా ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సనా సెక్యురిటీ ఏజెన్సీ బాధ్యుడు సాహెబ్ హుస్సేన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్ (బీ1) జక్కలొద్ది బాలుర గురుకులంలో డిప్యూటీ వార్డెన్ (మేల్–1), జువాలజీ జూనియర్ లెక్చరర్ (జనరల్–1), కేయూ క్రాస్ రోడ్డులోని వరంగల్ (బాలికలు–1) గురుకులంలో జూనియర్ లెక్చరర్ బాటనీ (ఫిమేల్–1) పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు వచ్చే నెల 4వ తేదీలోపు హనుమకొండ పాత ఆర్టీఓ ఆఫీస్ వద్ద ఉన్న సనా సెక్యూరిటీ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని తెలిపారు. మరిన్ని వివరాల కోసం 0870 – 3558539, 81060 78890 నంబర్లో సంప్రదించాలని ఆయన సూచించారు. చెరువులో పడి బాలుడు మృతిఖిలా వరంగల్ : చేపల వేటకు వెళ్లిన ఓ బాలుడు ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి మృతి చెందాడు. ఈఘటన కమ్మరికుంటలో చోటు చేసుకుంది. ఏనుమాముల పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా నల్లబెల్లికి చెందిన ఓ మహిళ బతుకుదెరువు నిమిత్తం తన కుటుంబంతో కలిసి ఆరెపల్లి గ్రామంలో అద్దెకు ఉంటోంది. ఈ క్రమంలో ఆమె కుమారుడు కామెర శ్రీవిష్ణు సహస్ర సూర్యతేజ (11) సోమవారం సాయంత్రం గ్రామంలోని కుమ్మరికుంట చెరువుకు చేపల వేటకు వెళ్లాడు. చేపలు పడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి మృతి చెందాడు. బహిర్భుమికి వెళ్లిన ఓ వ్యక్తి గమనించి పోలీసులకు సమాచారం అందజేయగా.. వారు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి అక్క శ్రావ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ జవ్వాజి సురేశ్ తెలిపారు. -
సీపీగా ఎన్.శ్వేత
● 2012 బ్యాచ్ అధికారిణికి వరంగల్ కమిషనరేట్ బాధ్యతలు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు డీఐజీగా అదనపు బాధ్యతలు ● కమిషనరేట్కు వస్తున్న తొలి మహిళా అధికారి ● సైబరాబాద్ ట్రాఫిక్ విభాగం జాయింట్ కమిషనర్గా సన్ప్రీత్సింగ్ బదిలీ ● క్రైం డీసీపీగా ఎస్పీ(ఎన్సీ) కిషన్ సింగ్ నియామకంసాక్షిప్రతినిధి, వరంగల్ : వరంగల్ పోలీస్ కమిషనర్గా ఎన్.శ్వేత నియమితులయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ సిటీ నార్త్ రేంజ్ జాయింట్ కమిషనర్ (లాఅండ్ఆర్డర్)గా ఉన్న ఆమెను ఇక్కడికి బదిలీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు వరంగల్ సీపీగా పనిచేసిన సన్ప్రీత్ సింగ్ను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ విభాగానికి జాయింట్ కమిషనర్గా బదిలీ చేశారు. శ్వేత తెలంగాణ కేడర్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారిణిగా ఎస్పీ, డీసీపీగా పలు విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. వరంగల్ సీపీ బాధ్యతలతోపాటు భద్రాద్రి కొత్తగూడెం జోన్–4 డీఐజీగా కూడా ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. తొలి మహిళా కమిషనర్.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటైనప్పటినుంచి ఇప్పటివరకు అంతా పురుషులే సీపీగా నియమితులయ్యారు. శ్వేత వరంగల్ కమిషనరేట్కు నియమితులైన తొలి మహిళా పోలీస్ కమిషనర్. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ (బీఈ) పూర్తి చేసిన ఆమె ఆ తరువాత సివిల్స్ రాశారు. 2012 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఆమె జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత, నూతనంగా ఏర్పడిన కామారెడ్డి జిల్లాకు ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ మహిళల భద్రత కోసం ప్రతీ డివిజన్లో ప్రత్యేకంగా ‘షీ టీమ్స్’ ఏర్పాటు చేసి ప్రశంసలు అందుకున్నారు. మహిళా సిబ్బంది స్వయంసమృద్ధి సాధించాలనే ఉద్దేశంతో వారికి ప్రత్యేకంగా డ్రైవింగ్, ఆత్మరక్షణ పద్ధతుల్లో శిక్షణ ఇప్పించారు. అదేవిధంగా హైదరాబాద్ ఉత్తర మండల డిప్యూటీ పోలీస్ కమిషనర్ (డీసీపీ)గా పనిచేశారు. అదేవిధంగా 2021లో సిద్దిపేట పోలీస్ కమిషనర్గా నియమితులయ్యారు. తద్వారా సిద్దిపేట కమిషనరేట్కు తొలి మహిళా కమిషనర్గా సరికొత్త రికార్డు సృష్టించారు. ఆమె టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో, ప్రజా ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించే వినూత్న సర్వే విధానాలను ప్రవేశపెట్టడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 16 మాసాలకే సన్ప్రీత్ సింగ్ బదిలీ... ఇప్పటివరకు పనిచేసిన సీపీ సన్ప్రీత్ సింగ్ సుమారు 16 మాసాల వ్యవధిలోనే బదిలీ అయ్యారు. ఆయన 2025, మార్చి 8న వరంగల్ కమిషనరేట్కు సీపీగా వచ్చారు. మొదట్లో ప్రజలతో సరిగా గ్రీవెన్స్ లేదని, బయట ఎక్కువ కదలికలు లేవన్న ఆరోపణలు తప్ప శాంతిభద్రతల విషయంలో ఎక్కడా తగ్గలేదన్న పేరుంది. బదిలీలు, పోస్టింగ్ల విషయంలో ఒక్కరిద్దరు ప్రజాప్రతినిధుల లేఖల సిఫారసులు పట్టించుకోలేదని, వారడిగిన ఇన్స్పెక్టర్లకు పోస్టింగ్ ఇవ్వలేదన్న ప్రచారం ఉంది. శాంతిభద్రతలు, నిబంధనలను ఉల్లంఘించిన అధికారులపై చర్యల విషయంలో ఎక్కడా రాజీపడలేదని ఆశాఖ అధికారులే చెబుతున్నారు. ఇటీవల ఓ ప్రజాప్రతినిధి చెప్పిన పని చేయలేదని ఫోన్లో పరస్పరం గొడవ పడ్డారన్న ప్రచారం ఉంది. క్రైమ్స్ డీసీపీగా కిషన్ సింగ్.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రైం డీసీపీగా డి.కిషన్ సింగ్ను నియమించారు. ప్రస్తుతం ఆయన టీజీ–ఐసీసీసీ టెక్నికల్ విభాగంలో నాన్ కేడర్ ఎస్పీగా ఉన్నారు. ఇప్పటిదాకా కమిషరేట్లో ఖాళీగా ఉన్న క్రైం డీసీపీ పోస్టులో కిషన్సింగ్ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. -
ఎస్ఐఆర్ గడువు పొడిగించాలి
న్యూశాయంపేట: హనుమకొండ జిల్లాలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియకు సంబంధించిన గడువును ఆరు నెలలు పొడిగించాలని కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ హనుమకొండ, వరంగల్ జిల్లాల కమిటీలు ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశాయి. సోమవారం హనుమకొండలోని సీపీఎం కార్యాలయంలో ఆయా పార్టీల జిల్లా అధ్యక్ష, కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో అనేక మంది ఓటర్లు ఇప్పటికీ తమ వివరాలు నమోదు చేసుకోలేదని, గ్రామీణ ఓటర్లు వివరాల నమోదులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అర్హులను ఓటరు జాబితా నుంచి తొలగించకుండా ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సమావేశం కోరింది. సమావేశంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రాంరెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శులు ప్రభాకర్రెడ్డి, షేక్ బాషుమియా, సీపీఐ జిల్లా కార్యదర్శి కె.భిక్షపతి, నాయకులు చుక్కయ్య, దుర్గయ్య, వెంకట్, వీరన్న, టి.భిక్షపతి, అశోక్ స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు. -
అదనపు డీసీపీ పనితీరు అభినందనీయం
● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం: అడిషనల్ డీసీపీ రవి పనితీరు అభినందనీయమని వరంగల్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ తెలిపారు. పోలీస్శాఖలో సుదీర్ఘకాలంగా వివిధ హోదాల్లో పనిచేసి వరంగల్ పోలీస్ కమిషనరేట్ అడిషనల్ డీసీపీ, అడ్మిన్ హోదాలో ఉద్యోగ విరమణ చేస్తున్న అడిషనల్ డీసీపీకి పరిపాలన విభాగం సిబ్బంది వీయం.కల్యాణ వేదికలో ఏర్పాటు ఆత్మీ య వీడ్కోలు సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని అడిషనల్ డీసీపీని ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈసందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. సిబ్బందికి సంబంధించి శాఖాపరమైన సమస్యలపై తక్షణమే స్పందించడంతో పాటు తనను సంప్రదించి వాటిని త్వరితగతిన పరిష్కరించి సిబ్బందికి సత్వరమే న్యాయం అందించేవాడని, అప్పగించిన పనులను సమర్థవంతంగా నిర్వహించడంలో అడిషనల్ డీసీపీ రవి ప్రత్యేకతని సీపీ తెలిపారు. కార్యక్రమం ఏఓ సంపత్కుమార్, సూపరింటెండెంట్లు రమేశ్, యాకుబ్ బాబా, సంధ్య, వహీద్, గిరి, పూజితతో పాటు సీపీఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. భవనాల తొలగింపుపై సీపీ సమీక్ష వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నూతన కమిషనరేట్ భవనం పరిసరాల్లోని పాత భవనాలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈసందర్భంగా పాత భావనాల్లో కొనసాగిస్తున్న వివిధ కార్యాలయాలను ఇతర ప్రాంతాలకు తరించాల్సి వస్తే సంబంధిత విభాగాలకు సంబందించిన కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే అంశంపై పోలీస్ కమిషనర్ అధికారులతో చర్చించారు. ఈసమీక్షలో అదనపు డీసీపీలు రవి, సురేశ్కుమార్, శ్రీనివాస్, ఏసీపీ సురేంద్ర, అంతయ్య, ఆర్ఐలు శ్రీధర్, సతీశ్, స్పర్జన్ రాజ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
వరంగల్ క్లబ్ కార్యదర్శిగా డాక్టర్ ప్రవీణ్
● హోరాహోరీగా సాగిన ఎన్నికలు హన్మకొండ: వరంగల్ క్లబ్ ఎన్నికలు ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగాయి. మధ్యాహ్నం నుంచి రాత్రి 10.30 వరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగగా.. క్లబ్ కార్యదర్శిగా డాక్టర్ పొక్కుల ప్రవీణ్, జాయింట్ జాయింట్ సెక్రటరీగా బొల్లెడ్ల కన్నారెడ్డి, ట్రెజరర్గా డాక్టర్ పి.సుధీర్కుమార్ ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి కె.సత్యనారాయణరావు ప్రకటించారు. వీరితోపాటు కార్యవర్గ సభ్యులుగా గట్టు రాజు, చంద్ర ప్రకాశ్రెడ్డి, కల్యాణ్ రెడ్డి, టి.చాడ సునిల్ రెడ్డి, పల్లం రవి, చల్లా శ్రీధర్రెడ్డి, డాక్టర్ ప్రవీణ్కుమార్ మంచికట్ల, రాజేశ్ అజ్మీరా, చెన్నారెడ్డి గోనెల విజయం సాధించినట్లు తెలిపారు. ఈ ఎన్నికలకు సహాయ ఎన్నికల అధికారులుగా ప్రొఫెసర్ ఎరగట్టు స్వామి, ఆర్.బుచ్చయ్య, ఈగ మల్లేశం వ్యవహరించినట్లు పేర్కొన్నారు. సుధీర్కుమార్, కోశాధికారి బి.కన్నారెడ్డి, జాయింట్ సెక్రటరీడాక్టర్ పి.ప్రవీణ్ కుమార్, కార్యదర్శి -
నేడు వరంగల్కు నితిన్ నబీన్
● బీజేపీ జాతీయ అధ్యక్షుడి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి ● గిరిజన ప్రతినిధులతో సహపంక్తి భోజనం.. సమావేశం ● ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలమైదానంలో కార్యకర్తలతో సమావేశం హన్మకొండ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా సోమవారం వరంగల్ నగరంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ యంత్రాంగం అన్ని ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం హనుమకొండ హరిత కాకతీయ హోటల్లో గిరిజన ప్రతినిధులతో సహపంక్తి భోజనం చేస్తారు. అనంతరం 2 గంటలకు గిరిజన ప్రతినిధులతో జరిగే చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. 3.10 గంటలకు సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానానికి చేరుకుని పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం 4.40 గంటలకు హరిత కాకతీయ హోటల్కు చేరుకుంటారు. 4.40 నుంచి 5 గంటల వరకు హోటల్లో ఉంటారు. 5.10కి భద్రకాళి దేవస్థానం చేరుకుని అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు సమర్పించుకుంటారు. అనంతరం హైదరాబాద్కు వెళ్తారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం పార్టీ నాయకులు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ బీజేపీ జాతీయ అధ్యక్షుడి పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. వచ్చే ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేలా దిశా నిర్దేశం చేయనున్నారని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పార్టీ కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్ రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, నాయకులు రావు పద్మ, కొండేటి శ్రీధర్, చాడా శ్రీనివాస్ రెడ్డి, రావుల కిషన్, డాక్టర్ పెసరు విజయ్చందర్ రెడ్డి, వన్నాల వెంకటరమణ, జలగం రంజిత్, కుసుమ సతీశ్, గుజ్జ సత్యనారాయణ రావు, సండ్ర మధు తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన జిల్లా స్థాయి చెస్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ రెడ్డికాలనీలోని వికాస్ మాస్టర్జీ హైస్కూల్ మైదానంలో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి ఓపెన్ టు ఆల్ చదరంగ పోటీలు ఆదివారం ముగిశాయి. ‘కుడా’ మాజీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన గ్రాండ్ చాంపియన్ అర్జున్ను స్ఫూర్తిగా తీసుకుని చెస్లో రాణించాలన్నారు. పాఠశాల ఏఓ నాగరాజు మాట్లాడుతూ చిన్నారులు సెల్ఫోన్కు దూరంగా ఉంటూ ఆట, చదువుపై శ్రద్ధ వహించాలన్నారు. నిర్వహణ కార్యదర్శి కన్నా మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 60 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు తెలిపారు. గెలుపొందిన క్రీడాకారులు జూలై 11, 12వ తేదీల్లో హైదరాబాద్లో జరగనున్న అంతర్జాతీయ స్థాయి రాపిడ్ రేటింగ్ టోర్నమెంట్లో పాల్గొంటారని తెలిపారు. ఆర్బిటర్స్ ప్రేమ్సాగర్, రజనీకాంత్, పవన్ తదితరులు పాల్గొన్నారు. -
కట్టు తప్పుతున్న ఖాకీలపై కొరడా
వరంగల్ క్రైం : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కట్టు తప్పుతున్న అధికారులపై పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ కొరడా ఝులిపిస్తున్నారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వేటు వేస్తున్నా మిగతా వారికి భయం ఉండడం లేదు. భూ వివాదంలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలపై ధర్మసాగర్ ఇన్స్పెక్టర్ శ్రీధర్రావును ఏఆర్కు అటాచ్డ్ చేసి 24 గంటల గడవకముందే పీడీఎస్ బియ్యం వ్యవహారంలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు వచ్చిన నర్మెట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం.అబ్బయ్య, బచ్చన్నపేట సబ్ ఇన్స్పెక్టర్ ఎస్కే హమీద్ను సస్పెండ్ చేస్తూ సీపీ ఆదివారం ఉత్తర్వులు జారీ చేయడం కమిషనరేట్లో కలకలం సృష్టించింది. భూ వివాదాల్లో తలదూర్చవద్దని, ఇతర సెటిల్మెంట్లు చేయొద్దని పోలీస్ ఉన్నతాధికారులు నెలవారీ నేర సమీక్ష సమావేశాల్లో పదేపదే చెబుతున్నా కొందరి తీరులో మార్పురావడంలేదు. పోస్టింగ్ ఉన్న రోజుల్లోనే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలన్న కక్కుర్తి.. చివరికి ఉద్యోగం ఊడేదాకా తెచ్చుకుంటోంది. పోలీస్ శాఖకు అవినీతి మరకలు.. వరంగల్ పోలీస్ కమిషనర్గా సన్ప్రీత్ సింగ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మిస్టర్ కూల్గా పేరుంది. కానీ నిబంధనలను అతిక్రమించిన అధికారులపై తనదైన శైలిలో చర్యలు చేపడుతున్నారు. ఆరోపణలు వచ్చిన అధికారులపై నిఘా (ఎస్బీ) అధికారులతో నివేదికలు తెప్పించుకోవడంతోపాటు క్యాట్పార్టీ అధికారులతో కూడా సమాచారం తెప్పించుకుని చర్యలు తీసుకుంటున్నారు. ● ఒకే సబ్ డివిజన్లో పనిచేసిన ఏసీపీ నందిరాంనాయక్, ఇన్స్పెక్టర్ గోపి, సబ్ ఇన్స్పెక్టర్ విఠల్పై సస్పెన్షన్ వేటు పడడం అప్పట్లో కమిషనరేట్లో సంచలనంగా మారింది. ● మామునూరు ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తించిన సమయంలో అవినీతికి పాల్పడినట్లు రుజువు కావడంతో ఒంటేరు రమేశ్తోపాటు ఆయన గన్మెన్పై వేటు పడింది. ● ఏప్రిల్ 29న హసన్పర్తి పోలీస్ స్టేషన్లో రాత్రి విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ టి.రాములు మ ద్యం మత్తులో ఉండడంతో అతనిపై సస్పెన్షన్ వేటు పడింది. ● ఏఆర్ విభాగంలో హెడ్ కానిస్టేబు ల్గా పనిచేస్తూ అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చి వాటిని తీర్చలేని వారిపై వేధింపులకు పాల్పడిన ట్లు వచ్చిన ఆరోపణలపై ఏఆర్ హెడ్ కానిస్టేబు ల్ యాదగిరిపై వేటు పడింది. అదేరోజు చెన్నారావుపేట పీఎస్ కానిస్టేబుల్పై వచ్చిన ఆరోపణల్లో సతీశ్పై వేటు పడింది. ● ఏప్రిల్ 23న అవినీతి ఆరోపణలపై నర్సంపేట ఎస్సై రవికుమార్, ఎల్కతుర్తి ఎస్సై ప్రవీణ్కుమార్పై వేటు పడింది. ● విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలపై ఏప్రిల్ 10న ఆత్మకూరు ఎస్సై సతీశ్పై వేటు పడింది. ● మద్యం మత్తులో ఓ షాపు యజమానిపై చెయ్యి చేసుకున్నందుకు మిల్స్కాలనీ ఎస్సై శ్రీకాంత్, మద్యం మత్తులో విధులు నిర్వర్తించిన మడికొండ హెచ్సీ మోహన్రావుపై వేటు పడింది. ● న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే తప్పుడు మాటలు చెప్పి నాలుగేళ్లు లైంగికదాడి, ఆపై బెదిరింపులకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై సీసీఎస్ సబ్ ఇన్స్పెక్టర్ గోదారి రాజ్కుమార్ను హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ● మహిళా సిబ్బంది పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందుకు మిల్స్ కాలనీ సబ్ ఇన్స్పెక్టర్ సురేశ్పై వేటు పడింది. ..ఇలా పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది కాసుల కోసం వెంపర్లు ఆడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూములు..సెటిల్మెంట్లకే ప్రాధాన్యం.. పలు పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న అధికారుల ప్రాధాన్యాలు మారిపోయాయి. భూములు, సెటిల్మెంట్లకు ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వర్షాకాలం మొదలవడంతో వ్యవసాయ భూముల దగ్గర జరుగుతున్న పంచాయితీలు అధికారులకు కాసులు కురిపిస్తున్నాయి. వరంగల్ సబ్ డివిజన్లో పర్యవేక్షణ అధికారి (ఏసీపీ )లేకపోవడంతో ఓ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఇన్స్పెక్టర్ తన పరిధిలో పెద్ద ఎత్తున సెటిల్మెంట్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన సొంత కారు వచ్చింది అంటే ఆ రోజు పెద్ద సెటిల్మెంట్ జరిగి నట్లు సిబ్బంది కోడై కూస్తున్నారు. ● పరకాల సబ్ డివిజన్లో పనిచేస్తున్న ఓ ఇన్స్పెక్టర్ తన దగ్గర పనిచేసే ఎస్సైలకు నెలవారీ మామూళ్ల చిట్టాను అందించి వాటి వసూళ్లకు హుకుం జారీ చేసినట్లు సమాచారం. ఆయన నోటి నుంచి పెద్ద రాజకీయ నాయకుల పేర్లు చెప్పి సిబ్బందిని భయాభ్రాంతులకు గురి చేస్తున్నట్లు ఆరోపణాలు వినిపిస్తున్నాయి. ● కాజీపేట సబ్ డివిజన్లో ఓ పీఎస్లో వింత పరిస్థితి నెలకొంది. అక్కడ ఓ ఇన్స్పెక్టర్ కేసుల నమోదులో తీవ్ర నిర్లక్ష్యంగా పని చేస్తున్నట్లు ఆరోపణాలు ఉన్నాయి. దీంతో ఇన్స్పెక్టర్ రైటర్ ఇదే అదునుగా భావించి నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్పీడ్ పెంచిన వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులపై అవినీతి ఆరోపణలు.. వరుస సస్పెన్షన్లతో కలకలం -
జాతరకు వెళ్లొస్తూ మృత్యుఒడికి..
కమలాపూర్ : అసోంలో జరిగిన కామాక్యదేవి జాతరకు వెళ్లొస్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఇదే ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్లో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్కు చెందిన కళ్లెం శ్రీనివాస్(50), చల్లా వెంకటేష్, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్కు చెందిన తూర్పాటి భార్గవ్(35), హనుమకొండ జిల్లా ఉప్పల్ గ్రామానికి చెందిన తూర్పాటి హరిబాబు కలిసి అసోంలో ఇటీవల జరిగిన కామాక్యాదేవి జాతరకు వెళ్లి తిరిగి వస్తున్నారు. హైదరాబాద్ నుంచి వస్తున్న క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు ఉప్పల్లో అదుపు తప్పి ఓ ఇంటి గోడను ఢీకొని డ్రైనేజీలోకి దూసుకెళ్లి నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కళ్లెం శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందగా, తూర్పాటి భార్గవ్, సీహెచ్.వెంకటేష్, తూర్పాటి హరిబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కమలాపూర్, నడికూడ 108 అంబులెన్స్ల్లో వెంటనే క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి తూర్పాటి భార్గవ్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని సందర్శించి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై మృతుడు కళ్లెం శ్రీనివాస్ కుమారుడు పవన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ నవీన్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం మరో ఇద్దరికి తీవ్ర గాయాలు ఉప్పల్లో ఘటన -
పీవీ .. ఆధునిక ఆర్థిక సంస్కరణల రూపశిల్పి
హన్మకొండ: ఆధునిక ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మాజీ ప్రధాన మంత్రి పీవీ నర్సింహారావు అని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. ఆదివారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కా ర్యాలయంలో మాజీ ప్ర ధాని పీవీ నర్సింహారావు జయంతి నిర్వహించా రు. ఈ సందర్భంగా ిపీవీ చిత్ర పటానికి సీఎండీ, డైరెక్టర్లు, అధికారులు పూలమాల వేసి నివాళుర్పించారు. డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి. తిరుపతి రెడ్డి, సి.ప్రభాకర్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బోనాల కిషన్, సి.ఈలు కె.వెంకటరమణ, నాగ ప్రసాద్, సీజీఎంలు రవీంద్రనాథ్, కిషన్, జాయింట్ సెక్రటరీ శ్రీ కృష్ణ, జీఎంలు హేమంత్ కుమార్, మనోహర్ స్వామి, వేణు బాబు, కళాధర్, జయరాజ్, వెంకట కృష్ణ, తిరుపతి, ప్రభావతి, డి.ఈ టెక్నికల్ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి -
అలరించిన స్వరవైభవం
హన్మకొండ చౌరస్తా : ఘంటసాల గంధర్వ గానా మృత వేదిక, లిటిల్ గంధర్వ ఘంటసాల అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గానకళ తపస్వి డా క్టర్ శరత్ చంద్ర దర్శకత్వంలో ఆదివారం హనుమకొండ పద్మాక్షి రోడ్డులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి కాన్ఫరెన్స్హాల్లో నిర్వహించిన ‘స్వర వైభవం’ అలరించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ జగదీశ్ బాబు, ప్రొఫెసర్ తిరుపతయ్య హాజరై మా ట్లాడుతూ వర్ధమాన గాయనీగాయకులను ప్రోత్సహించడం, సంగీత సంస్కృతిని భావితరాలకు చేరవేయడమే ఈ సంస్థ లక్ష్యమన్నారు. సుమారు 50 మంది గాయనీగాయకులు పాల్గొని ఘంటసాలతో పాటు పలువురు ప్రముఖ గాయకుల మధుర గీతాలను ఆలపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఉపేందర్, నిమ్మల శ్రీనివాస్, ఎంఎల్ రావు, దేవేంద్రాచారి, టీవీ రమేశ్, చోటు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకున్న టీజీపీఎస్సీ చైర్మన్ హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయాన్ని ఆదివారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం ఐఏఎస్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారిని పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందించారు. ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాన్ని సందర్శించారు. -
సమస్యలు.. సవాళ్లు
నేడు గ్రేటర్ వరంగల్ పరిపాలన పగ్గాలు చేపట్టనున్న కమిషనర్ వెంకన్న ● గ్రేటర్లో అభివృద్ధికి ప్రతిబంధకాలెన్నో.. ● కీలక ప్రాజెక్టులు ● రానున్న ఎన్నికలు, పౌర వేదనలు ప్రతిష్టాత్మకంవరంగల్ అర్బన్: నలుగురు యువ ఐఏఎస్ అధికారుల తర్వాత గ్రేటర్ వరంగల్కు నాన్ ఐఏఎస్ అధికారి తేజవత్ వెంకన్న కమిషనర్గా సోమవారం(నేడు) బాధ్యతలు స్వీకరించనున్నారు. అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్న గ్రేటర్ వరంగల్లో కీలక ప్రాజెక్టులను పరుగులు పెట్టించాల్సిన అవసరం ఉంది. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ), ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాల్సి ఉంది. ప్రస్తుతమున్న 66 డివిజన్లను 100 డివిజన్లుగా పునర్విభజన చేయాలని మహా నగరానికి చెందిన ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఒకవేళ డివిజన్లు పెరిగితే డీ లిమిటేషన్ ప్రక్రియ కత్తిమీద సాము వంటింది. ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్లో మున్సిపల్ ఎన్నికలకు వెళ్లే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. పాలకవర్గం లేకపోయినప్పటికీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆదేశాలను అమలు చేయడం, పరిపాలన చక్కదిద్దడం కొంత కఠినమైన వ్యవహారమే. ఈనేపథ్యంలో.. రాష్ట్ర మున్సిపల్ శాఖకు చెందిన నాన్ ఐఏఎస్ అధికారి (గూప్–1) అధికారిగా పలు మున్సిపాలిటీల్లో, జీహెచ్ఎంసీలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం కలిగి ఉన్న కొత్త కమిషనర్ తేజవత్ వెంకన్న చాకచక్యంతో బాధ్యతతో పనిచేస్తూ, సమస్యలను సవాళ్లను అధిగమించాల్సిన తరుణమిది. పాలన గాడినపడేనా? మహా నగరంలో మరోమారు నాన్ ఐఏఎస్ పాలన మొదలుకానుంది. 2011లో ఐఏఎస్యేతర కమిషనర్గా జక్కుల శంకరయ్య పనిచేశారు. తర్వాత 2019 జీహెచ్ఎంసీలో అడిషనల్ కమిషనర్గా పనిచేసిన గ్రూప్–1 అధికారి రవికిరణ్ ఆరునెలల పాటు పని చేశారు. తాజాగా అదే స్థాయి అధికారి వెంకన్న కమిషనర్గా విధుల్లో చేరనున్నారు. జవాబుదారీతనమేది? కాశిబుగ్గ, కాజీపేట సర్కిల్ కార్యాలయాల్లో సమస్యలపై ప్రజలు నిత్యం ప్రదక్షిణలు చేస్తున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారి వరకు జవాబుదారీతనం కరువైంది. వింగ్ అధికారులు, ఉద్యోగుల మధ్య సమన్వయం కొరవడింది. కొత్త ఇంటి నంబర్లు, పేరు మార్పిడి, ఆస్తుల విభజన, కొత్త నల్లా కనెక్షన్, ట్రేడ్ లైసెన్స్, మార్టిగేజ్ రిలీజ్ ఇలా.. ఏది కావాలన్నా పైసలిస్తేనే పనులు చేస్తున్నారని ప్రజలు బాహాటంగా ఆరోపిస్తున్నారు. సిటిజన్ చార్టర్ నిబంధనలు పట్టించుకోవట్లేదు. నెలల తరబడి దరఖాస్తులు పెండింగ్లో ఉంటున్నాయి. -
అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంకు ఆదర్శం
కాశిబుగ్గ: తెలంగాణలో ఆదర్శ బ్యాంకుగా అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంకు సేవలు అందిస్తున్నామని ఆ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు అన్నారు. ఆదివారం వరంగల్ తిలక్ రోడ్డులోని కేవీఎస్ ఫంక్షన్ హాల్లో బ్యాంక్ 30వ మహాజన సభ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్యాంకు మంచి లాభాలతో నడుస్తోందని, వచ్చే సంవత్సరం నుంచి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో శాఖలను విస్తరించనున్నట్లు తెలిపారు. వాటాదారుల సంక్షేమంలో భాగంగా కి డ్నీ ఆపరేషన్ చేయించుకున్న వారికి వైద్య సాయం కింద రూ.25,116 అందిస్తున్నట్లు, ఇక నుంచి ఈ డ బ్బులను రూ.40 వేలకు పెంచుతామన్నారు. గుండె జబ్బులతో బాధపడే వాటాదారుల పిల్లలకు బ్యాంకు తరఫున ఆర్థికసాయం చేస్తున్నట్లు పేర్కొన్నారు. బ్యాంకు సేవలను వరంగల్ జిల్లా ప్రజలు విరివిగా ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. సమావేశంలో బ్యాంక్ వైస్ చైర్మన్ తోట జగన్నాథం, డైరెక్టర్లు కూరపాటి చంద్రమౌళి, పొన్న హరినాథ్, వడ్నాల సదానందం, ముందాడ వేణుగోపాల్, చకిలం ఉపేందర్, నీలం మల్లేశం, పత్తి కృష్ణ, ఎండీ పాషా, కృష్ణమూర్తి, సుజన్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రవీందర్రెడ్డి, బ్యాంక్ సీఈఓ సత్యనారాయణరావు పాల్గొన్నారు.● చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు● ఘనంగా 30వ మహాజన సభ -
చేపల వేటకు వెళ్లి..
● విద్యుదాఘాతంతో యువకుడి మృతి చిట్యాల: మానేరు వాగులో చేపల వేటకు వెళ్లిన ఓ యువకుడు విద్యుదాఘాతంతో మృతి చెందా డు. ఈ ఘటన ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం కాల్వపల్లి గ్రామ శివా రులో చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మనబోతుల రఘుపతి, బిస్కుల ఈశాంత్, ఏదుల రంజిత్, భుక్యా సమ్మయ్య గ్రామ శివారులోని మానేరు వాగులో విద్యుత్ తీగలతో చేపల వేటకు వెళ్తూ మేకల రాజు(30)కు ఫోన్ చేసి రమ్మని పిలిచారు. దీనికి మొదటగా రాజు నిరాకరించినా బలవంతంగా ఒప్పించి తీసుకెళ్లారు. వాగు వద్ద అక్రమంగా మోటారు స్టార్టర్ ఫ్యూజ్ నుంచి తీగలు లాగి నీటిలో కరెంట్ షాక్ పెడుతూ చేపలు పట్టడం ప్రారంభించారు. ఈ క్రమంలో కట్టె విద్యుత్ వైరుకు అడ్డు రావడంతో వాగు ఒడ్డున ఉన్న రాజును పిలిచి ఆ వైరును తీయమని కోరారు. దీంతో ఆ కట్టెను తీస్తుండగా విద్యుత్ షాక్ తగలడంతో రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో నలుగురిని పోలీసులు అదుపుతోకి తీసుకుని కేసు నమోదు చేశారు. మృతుడి తల్లి దేవక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పోచంపల్లి సతీశ్ తెలిపారు. మృతుడికి భార్య మళ్లీశ్వరి ఉంది. -
పోలియో రహిత సమాజాన్ని నిర్మించాలి
● ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి హన్మకొండ చౌరస్తా: ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి.. పోలియో రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పిలుపునిచ్చారు. హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం వారు సంయుక్తంగా ప్రారంభించి, చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. జూన్ 28, 29, 30 తేదీల్లో నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో చిన్నారులకు తప్పనిసరి చుక్కల మందు వేయించాలన్నారు. కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ.. 84,301 మంది చిన్నారులకు పోలియో వ్యాక్సిన్ అందించేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ దుర్గారామ్ కుమార్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మహేందర్, మాస్ మీడియా అధికారి సుభాష్, ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి, ఈవీ శ్రీనివాస్ పాల్గొన్నారు. పల్స్పోలియో 96 శాతం పూర్తి రామన్నపేట: జాతీయ పల్స్పోలియో కార్యక్రమం తొలి రోజు (ఆదివారం) హనుమకొండ జిల్లాలో విజయవంతంగా నిర్వహించినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్.డి. రామ్కుమార్ తెలిపారు. జిల్లాలో 0 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల 84,301 మంది చిన్నారులకు గాను పోలియో బూత్లు, ట్రాన్సి ట్ పాయింట్లు, మొబైల్ బృందాల ద్వారా 81,139 మంది చిన్నారులకు (96 శాతం) పోలియో చుక్కలు అందించినట్లు వెల్లడించారు. మొదటి రోజు పోలియో చుక్కలు తీసుకోలేని మిగిలిన చిన్నారులను గుర్తించి జూన్ 29, 30 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. జిల్లాలోని ప్రతీ చిన్నారికి తప్పనిసరిగా పోలియో వ్యాక్సిన్ అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. తల్లిదండ్రులు.. ఆరోగ్య సిబ్బందికి సహకరించి చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని డీఎంహెచ్ఓ రామ్కుమార్ విజ్ఞప్తి చేశారు. -
నర్మెట సీఐ, ఎస్సైల సస్పెన్షన్
బచ్చన్నపేట/ నర్మెట : నర్మెట సీఐ అబ్బయ్య, బచ్చన్నపేటలో గతంలో పని చేసి వీఆర్ఎస్కు అటాచ్డ్ అయిన ఎస్సై ఎస్కే అబ్దుల్ హమీద్ను సస్పెండ్ చేస్తూ వరంగల్ సీపీ సన్ప్రీత్సింగ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. 2025లో బచ్చన్నపేట ఎస్సైగా వచ్చిన హమీద్ దాదాపు 16 నెలల పాటు ఇక్కడ విధులు నిర్వర్తించారు. సుమారు నాలుగు నెలల క్రితం మండలంలోని సాల్వాపూర్ గ్రామ సమీపంలో పీడీఎఓస్ బియ్యం పట్టుకుని నిర్వాహకులపై కూడా కేసు నమోదు చేశారు. కానీ పట్టుకున్న మొత్తం బియ్యం చూపించకుండా తక్కువ తూకం నమోదు చేశారనే విషయంలో సీఐ, ఎస్సైలు ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఈ విషయమై సీపీకి ఫిర్యాదు చేయగా ఎస్బీ, ఇంటెలిజెన్స్ అధికారులతో విచారణ చేయించారు. ఇందులో పీడీఎస్ బియ్యం తక్కువ తూకం నమోదు చేశారనే విషయం నిరూపణ అయ్యింది. దీంతో సీఐ అబ్బయ్య, ఎస్సై ఎస్కే అబ్దుల్హమీద్ను సస్పెండ్ చేస్తూ సీపీ ఆదేశాలు ఇచ్చారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న హమీద్.. ఎస్సై ఎస్కే అబ్దుల్హమీద్ పలు చోట్ల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దేవరుప్పుల మండలంలో పని చేసిన సమయంలో కూడా ఏసీబీ ట్రాప్నకు అయ్యారు. ఆ తర్వాత వీఆర్ అటాచ్డ్ అయి బచ్చన్నపేటకు వచ్చినప్పటి నుంచి పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇటీవల పోచన్నపేట గ్రామ వాగు నుంచి ఇసుకను అనుమతులు లేకుండా తరలించడానికి కొంత మొత్తాన్ని ఆశించారని సీపీకి ఆ గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఆ ఆరోపణ వాస్తవమని రుజువు కావడంతో వీఆర్కు అటాచ్డ్ చేస్తూ సీపీ ఆదేశాలు ఇచ్చారు. తిరిగి పీడీఎస్ బియ్యం ఆరోపణ కూడా నిరూపణ కావడంతో ఏకంగా సస్పెండ్ చేశారు. బచ్చన్నపేటలో సస్పెండ్ల పర్వం.. బచ్చన్నపేటలో పని చేసిన పలువురు పోలీసు అధికారులు సస్పెండ్ అయ్యారు. 2024లో పని చేసిన అప్పటి ఎస్సై నవీన్కుమార్ కూడా ఓ కేసు విషయంలో సస్పెండ్ అయ్యారు. ఆ సమయంలో ఉన్న నర్మెట సీఐ నాగబాబు మరో కేసులో సస్పెండ్ అయ్యారు. ఇప్పుడు పీడీఎస్ బియ్యం విషయంలో సీఐ అబ్బయ్య, ఎస్సై హమీద్ ఇద్దరూ సస్పెండ్ అయ్యారు. -
మరో రెండు నెలలైతే..
మరో రెండు నెలలైతే ఏడాది కాలం (80శాతం శిక్షణ) పూర్తవుతుంది. ఆగస్టు–సెప్టెంబర్ నెలలో తిరిగి సుమంత్ స్వదేశానికి వచ్చేవాడు. పెళ్లిచేసుకున్నాక మరో 20 శాతం శిక్షణ పూర్తి చేసుకోవడానికి తిరిగి దక్షిణాఫ్రికాకు వెళ్తానని సుమంత్ చెప్పినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఫోన్ కాల్తో కుప్పకూలిన కుటుంబం శనివారం వచ్చిన ఒక ఫోన్కాల్ ఆ కుటుంబాన్ని తలకిందులు చేసింది. ‘సుమంత్ ప్రయాణిస్తున్న శిక్షణ విమానం ప్రమాదానికి గురైంది... అతడు ఇక లేడు’ అనే వార్త వినగానే తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. -
నేటి కేటీఆర్ పర్యటన వాయిదా
హన్మకొండ: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం వరంగల్ పర్యటన వాయిదా పడినట్లు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తెలిపారు. సోమవారం ఆయన హనుమకొండ హంటర్ రోడ్డులోని మైదానంలో బీఆర్ఎస్ వరంగల్ తూర్పు కార్యకర్తల శిక్షణ శిబిరంలో పాల్గొనాల్సి ఉంది. అయితే కేటీఆర్ జ్వరంతో బాధపడుతుండడంతో వాయిదా వేసినట్లు వివరించారు. ఎప్పుడు జరిగేది తర్వాత తెలుపుతామని నరేందర్ తెలిపారు. నేడు బల్దియా గ్రీవెన్స్వరంగల్ అర్బన్: వరంగల్ మహానగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ)లో సోమవారం గ్రీవెన్స్ సెల్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అడిషనల్ కమిషనర్ ఇసంపెల్లి జోనా ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ సెల్ ఎంతగానో ఉపయోగపడుతుందని, నగర పౌరులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేటి నుంచి కేయూ బీఫార్మసీ పరీక్షలు కేయూ క్యాంపస్: కేయూ పరిధిలో బీఫార్మసీ (సీబీసీఎస్) 8వ సెమిస్టర్ పరీక్షలు (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) ఈనెల 29 నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి ఆసీం ఇక్బాల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 29, జూలై 1, 3, 6 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలు సంబంధిత కేయూ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నట్లు వారు తెలిపారు. జర్మనీ పర్యటనకు పింగిళి కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ సురేశ్బాబు విద్యారణ్యపురి: జర్మనీలో స్టడీ టూర్కు రాష్ట్రం నుంచి వెళ్తున్న అధికారిక విద్యా ప్రతినిధి బృందంలో హనుమకొండలోని పింగిళి ప్రభుత్వ మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాలకు చెందిన కంప్యూటర్ సైన్స్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్, ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ సురేశ్బాబు ఎంపికైనట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రమౌళి ఆదివారం తెలిపారు. జూన్ 28 నుంచి జూలై 6వ తేదీ వరకు పర్యటన కొనసాగుతుందని తెలిపారు. జర్మనీలో ఉన్నత విద్యావిధానాలు, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమ విద్యాసంస్థల భాగస్వామ్యం, పరిశోధన, వినూత్న పాఠ్యప్రణాళికలపై అధ్యయనం చేసే బృందంలో మొత్తం 35మంది ఉంటారని స్పష్టం చేశారు. ిసీకేఎం పిల్లల వార్డులో పాము ప్రత్యక్షం కాశిబుగ్గ: వరంగల్ సీకేఎం ప్రసూతి ఆస్పత్రిలో పాముల భయం నెలకొంది. తాజాగా శనివారం ఎస్ఎన్సీయూ పిల్లల వార్డులోని సింక్ వరకు ఓ పాము రావడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. పసికందులు ఉండే ఫొటోథెరపీ రూంలోకి పాము వచ్చి బల్లిని నోటకర్చుకోవడంతో సిబ్బందితోపాటు బాలింతలు భయంతో పరుగులు తీశారు. కొంతసేపటి తర్వాత పాము వెళ్లిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా, మూడు రోజుల క్రితం కూడా ఓ పాము వచ్చిందంటూ పేషెంట్ల అటెండెంట్లు తెలిపారు. ఇలా పాములు వస్తే తమ బిడ్డలు, పసికందుల పరిస్థితి ఏంటని వారు ఆందోళన చెందుతున్నారు. పాముల విషయంపై ఇన్చార్జ్ ఆర్ఎంఓ సృజన్ను వివరణగా కోరగా... పాము వార్డులో కి వచ్చినట్లు తెలిసిందని, అప్పుడు తాను కలెక్టరేట్లో ఉన్నానని చెప్పారు. అయినా వెంటనే పాములు పట్టేవారికి సమాచారం అందించామని, పాములు సంచరించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. -
గిరిజనుల అభివృద్ధికి కేంద్రం ప్రాధాన్యం
● మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ హన్మకొండ : గిరిజనుల అభివృద్ధికి కేంద్రంలోని న రేంద్ర మోదీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని మాజీ ఎంపీ ప్రొఫెసర్, అజ్మీరా సీతారాం నాయక్ అన్నారు. ఆదివారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐదు గిరిజన తెగలను ఎస్టీలో కలిపిందని వివరించారు. ఆదివాసీ గిరిజన మహిళ ద్రౌపది ము ర్మును రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీది అన్నారు. ‘వికసిత్ భారత్–2047– గిరిజన అభివృద్ధి’ అనే అంశంపై నేడు హరిత కాకతీయ హోటల్లో గిరిజన ప్రతినిధులతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ మేధోమధనం నిర్వహించనున్నారన్నారు. బీ జేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ మాట్లాడుతూ రాష్ట్రాన్ని 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీలు గిరిజన అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. గిరిజన మహిళను రాష్ట్రపతిని చేస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్లు వ్యతిరేకించాయన్నారు. గిరిజన అభివృద్ధికి ప్రాధాన్యం ఇ స్తున్న మోదీ ప్రభుత్వం 23 ఏకలవ్య స్కూళ్లు ఏర్పా టు చేసిందని, సమ్మక్క సారలమ్మ గిరిజన యూ నివర్సిటీ ఏర్పాటుతోపాటు రూ.899 కోట్లు కేటా యించిందని వివరించారు. బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవి నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ట్రైబల్ డిక్లరేషన్ పేరుతో మోసం చేసిందని దుయ్యబట్టారు. నాయకులు మార్తినేని ధర్మారావు, వన్నాల వెంకటరమణ, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, యాప సీతయ్య, రావు పద్మ, గంట రవికుమార్, కొండేటి శ్రీధర్, దిలీప్ నాయక్, మల్లాడి తిరుపతి రెడ్డి, బన్న ప్రభాకర్, అజ్మీరా కృష్ణవేణి, స్వరూప, పగడాల కాళీప్రసాద్, త్రిలోకేశ్వర్ పాల్గొన్నారు. -
పీవీకి ఘన నివాళి
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 105వ జయంతి సందర్భంగా హనుమకొండలోని కొత్త బస్టాండ్ జంక్షన్ వద్ద గల ఆయన కాంస్య విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సతీశ్, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్, రెడ్క్రాస్ రాష్ట్ర పాలక మండలి సభ్యులు ఈవీ శ్రీనివాస్, పీవీ మదన్మోహన్ పాల్గొన్నారు. – హన్మకొండ చౌరస్తా -
తల్లిదండ్రులూ.. ఆలోచించండి!
మైనర్ డ్రైవింగ్తో పెరుగుతున్న ప్రమాదాలు సాక్షి, వరంగల్: ‘మా బాబు బాగా డ్రైవింగ్ చేస్తా డు..’ ‘స్కూల్కు వెళ్లడానికి మాత్రమే..’ అంటూ మై నర్ల చేతికి బైక్లు ఇస్తున్న తల్లిదండ్రులు.. తెలియకుండానే వారి ప్రాణాలతో పాటు అమాయకుల ప్రాణాలనూ ప్రమాదంలో పడేస్తున్నారు. వారం రోజుల క్రితం పర్వతగిరి మండల కేంద్రంలో మైనర్ నడిపిన బైక్ ఢీకొని ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో పాటు తన ప్రాణం కూడా పోయింది. క్షణం నిర్లక్ష్యం ముగ్గురి కుటుంబాలను విషాదంలోకి నెట్టింది. ఈ నేపథ్యంలో మైనర్ డ్రైవింగ్ను సీరియస్గా తీసుకున్న వరంగల్ పోలీసు కమిషనర్ సన్ ప్రీత్ సింగ్.. మైనర్ డ్రైవింగ్ హాట్స్పాట్లుగా ఉండే స్కూళ్లు, కళాశాలల వద్ద ఉదయం, సాయంత్రం ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తూ వాహనాలు స్వాధీనం చేసుకుంటున్నారు. ఉదయం ఎనిమిది నుంచి పది గంటలు, సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల మధ్య మైనర్లు ఎక్కువ వాహనాలు నడుపుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు గుర్తిస్తున్నారు. అందుకే ఈ ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రమాదం సెకనులోనే.. మైనర్లకు ట్రాఫిక్ నిబంధనలపై పూర్తి అవగాహన ఉండదు. అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో తెలియదు. ఓవర్టేకింగ్, వేగ నియంత్రణ, బ్రేకింగ్ వంటి విషయాల్లో అనుభవం లేకపోవడంతో చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రమాదంగా మారుతోంది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడుతున్న విద్యార్థుల్లో గణనీయమైన సంఖ్య మైనర్లేనని పోలీసులు చెబుతున్నారు. ‘ఈ నెల 21న పర్వతగిరి మండల కేంద్రంలో 17 ఏళ్ల చరణ్ నడుపుతున్న బైక్.. ఎదురుగా వస్తున్న వడ్లకొండ ఎల్లగౌడ్(58), ఎండీ అహ్మద్ (58) ప్రయాణిస్తున్న బైక్ను వేగంతో ఢీకొనడంతో చరణ్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాలైన ఎల్లగౌడ్, అహ్మద్ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. అలాగే, చరణ్ బైక్పై ఉన్న అతడి స్నేహితుడు చరణ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇదంతా సెకన్ల వ్యవధిలో జరిగింది’ అని పోలీసులు గుర్తు చేస్తున్నారు. శిక్ష పిల్లలకే కాదు.. తల్లిదండ్రులకు కూడా.. ‘ఇంటి నుంచి స్కూల్కు దగ్గర దూరమే అనే భావన. పిల్లల ఒత్తిడికి తల్లిదండ్రులు లొంగిపోవడం. పోలీసులు పట్టుకోరనే నిర్లక్ష్యం. స్నేహితుల ప్రభావంతో బైక్ నడపాలనే ఆసక్తి. సోషల్ మీడియాలో స్టంట్ల ప్రభావం’ ఈ అంశాలతోనే మైనర్ డ్రైవింగ్లు ఎక్కువవుతున్నాయుని సీపీ సన్ప్రీత్ సింగ్ అన్నారు. ‘18 ఏళ్లలోపు పిల్లలు బైక్ నడిపితే కేసు కేవలం వారిపైనే కాదు. వాహనం ఇచ్చిన తల్లిదండ్రులు లేదా యజమానిపైనా నమోదవుతుంది. భారీ జరిమానాతో పాటు జైలు శిక్షకూ అవకాశముంది. భవిష్యత్లో లైసెన్స్ రావడం కష్టమవుతుంది. పిల్లలు అడిగారని బైక్ ఇవ్వడం కంటే వారి భద్రత కోసం ‘ఇంకా రెండేళ్లు ఆగు’ అని చెప్పడం గొప్ప ప్రేమ. చిన్న నిర్లక్ష్యం జీవితాంతం తీరని విషాదంగా మారకముందే తల్లిదండ్రులు అప్రమత్తం కావాలి’ అని సీపీ సన్ప్రీత్ సింగ్ సూచించారు. పిల్లలకు ప్రేమతో ఇచ్చే బైక్.. ప్రాణాలకే ముప్పు చట్టం కఠినమే.. అయినా మారని పేరెంట్స్ తీరు స్కూళ్లు, కాలేజీలు ప్రారంభమవడంతో పోలీసుల ప్రత్యేక డ్రైవ్లు ఇటీవల పర్వతగిరిలో ఇద్దరి ప్రాణాలు తీసి మృతి చెందిన మైనర్ఉమ్మడి వరంగల్ జిల్లాలో మైనర్ డ్రైవింగ్పై నమోదైన కేసుల వివరాలు సంవత్సరం కేసులు 2024 174 2025 191 2026 96 ఏం పరిణామాలుంటాయంటే.. 18 ఏళ్లు పూర్తయితేనే ద్విచక్ర వాహనం నడపాలి ౖలెసెన్స్ తప్పనిసరి మైనర్కు బైక్ ఇస్తే వాహన యజమానిపై కూడా కేసు రూ.25 వేల వరకు జరిమానా మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం వాహనం రిజిస్ట్రేషన్పై చర్యలు భవిష్యత్లో డ్రైవింగ్ లైసెన్స్పై ప్రభావం -
వృద్ధులకూ హాస్టల్
● గ్రేటర్ నగరంలో పెరుగుతున్న కల్చర్ ● సకల వసతులతో హాస్టళ్ల ఏర్పాటు ● ఫుల్ ఎనర్జిటిక్ అవుతున్న వృద్ధులుసాక్షి, వరంగల్: మార్కెట్లో బాయ్స్, గర్ల్స్ హాస్టల్ చూశాం. మారుతున్న కుటుంబ వ్యవస్థకు అనుగుణంగా ప్రస్తుతం వృద్ధుల హాస్టళ్లు అందుబాటులోకి వచ్చాయి. విదేశాల్లో ఉన్న వారు.. ఉద్యోగరీత్యా బాగోగులు చూసుకోలేనివారు తమ తల్లిదండ్రులను ఈ హాస్టళ్లలో చేర్పిస్తున్నారు. హాస్టల్లో చేరిన వృద్ధులు సైతం తమ ఏజ్ గ్రూప్ వాళ్లతో ఆనందంగా గడుపుతున్నారు. ప్రత్యేక శ్రద్ధ.. ఒంటరిగా జీవించలేని వృద్ధులు. నిరంతర వైద్య పర్యవేక్షణ కరువైన వారు. తమ వయసు వారితో ఆనందంగా గడపాలనుకునే వారి కోసం నగరంలో వృద్ధుల హాస్టళ్లు ఏర్పాటయ్యాయి. కాగా వీటిలో స్టార్ హోటల్కు తీసిపోకుండా ఇక్కడ వసతులు కల్పిస్తున్నారు. వృద్ధుల ఆరోగ్య దృష్ట్యా ప్రత్యేక ఆహార నియమాలు, నెలనెలా వైద్యపరీక్షలు, నర్సింగ్ సేవలు, మందుల పర్యవేక్షణ, అత్యవసర అంబులెన్స్, సీసీ కెమెరాల భద్రత, పిల్లలు విదేశాల్లో ఉన్నా వీడియో కాల్ ద్వారా ప్రతీ రోజు మాట్లాడే అవకాశం కల్పిస్తున్నారు. ఒంటరితనానికి మందు... కొత్త స్నేహాలు ఈ హాస్టళ్లలో వృద్ధులు కేవలం గదుల్లోనే ఉండిపోవడం లేదు. ఉదయం యోగా, ధ్యానం, సాయంత్రం నడక, భజనలు, పుస్తక పఠనం, పుట్టినరోజు వేడుకలు, పండుగల సంబరాలు... ఇలా రోజంతా చురుకుగా ఉండేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తమలాంటి వయసువారితో గడపడంతో చాలామంది వృద్ధులు మళ్లీ జీవితంపై ఆసక్తి పెంచుకుంటున్నారు. కొందరైతే ‘ఇక్కడికి వచ్చిన తర్వాతే మళ్లీ స్నేహితులు దొరికారు’ అని చెప్పడం ఈ హాస్టళ్ల ప్రత్యేకతను తెలియజేస్తోంది. సకల వసతులు కల్పిస్తున్నాం..నేను గర్ల్స్ హాస్టల్ నిర్వహిస్తున్న సమయంలో ఓ అమ్మను తప్పనిసరి పరిస్థితుల్లో చేర్చుకున్నాం. అప్పుడే ఆలోచన పుట్టింది వృద్ధుల హాస్టల్ ఏర్పాటు చేయాలని. సకల వసతులతో నెలన్నర క్రితం హాస్టల్ ఏర్పాటు చేశాం. హెల్త్ కండీషన్ను బట్టి రూ.10 వేల నుంచి చార్జ్ చేస్తున్నాం. – మెరుగు సంపత్, వృద్ధుల హాస్టల్ నిర్వాహకుడు, హనుమకొండ -
ఆసక్తి ఉంటే అపార అవకాశాలు
హసన్పర్తి: నేర్చుకోవాలనే ఆసక్తిన్నవారికి సృజనాత్మక రంగంలో అపార అవకాశాలు ఉన్నాయని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, జాతీయ అవార్డు గ్రహీత నీతా లుల్లా అన్నారు. ఎస్సార్ యూనివర్సిటీ, హామ్స్టెక్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్సార్ యూ ‘స్కూల్ ఆఫ్ డిజైన్ పవర్డ్ బై హాక్స్టెక్’ను శనివారం నీతా లుల్లా ప్రారంభించారు. ఈ సందర్భంగా నీతా లుల్లా మాట్లాడుతూ.. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా డిజైన్ విద్య కూడా నిరంతరం మారాలని సూచించారు. హామ్స్టెక్ గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈఓ అజితా యోగేష్ మాట్లాడుతూ మూడు దశలుగా డిజైన్ విద్యలో హామ్స్టెక్ సంపాదించిన అనుభవాన్ని ఎస్సార్ యూనివర్సిటీ ద్వారా తెలంగాణ విద్యార్థులకు అందించడం సంతోషంగా ఉందన్నారు. ఈ భాగస్వామ్యంతో విద్యార్థులకు పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన శిక్షణ నిపుణుల మార్గదర్శకత్వం, అంతర్జాతీయ అవకాశాలు, విజయవంతమైన కెరీర్కు అవసరమైన నైపుణ్యాలు లభిస్తాయన్నారు. ఎస్సార్ యూనివర్సిటీ వైస్చాన్స్లర్ ప్రొఫెసర్ దీపక్ గార్గ్ మాట్లాడుతూ.. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యను అందించడంలో ఎస్సార్ యూ స్కూల్ ఆఫ్ డిజైన్ ముందు వరుసలో ఉంటోందని చెప్పారు. ఈ సందర్భంగా నీతా లుల్లా బృందం ర్యాంపుపై ప్రదర్శనలు ఇచ్చింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నీతా లుల్లా ఎస్సార్యూలో డిజైన్ స్కూల్ ప్రారంభం -
రాలని చినుకు.. రైతుల్లో వణుకు
సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 17 జిల్లాలు వర్షపాతం లోటుతో ఉండగా.. ఉమ్మడి వరంగల్లోని హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్ జిల్లాలు ఆ జాబితాలో ఉన్నాయి. వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉన్న ఈ ప్రాంతాల్లో రైతులు విత్తనాలు సిద్ధం చేసుకున్నా, సరిపడా వానలు లేక సాగు పనులు నత్తనడకన సాగుతున్నాయి. జూన్ 1 నుంచి 24 వరకు రాష్ట్రంలో సాధారణంగా 101.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 84.9 మిల్లీమీటర్లే కురిసింది. ఈ లెక్కన ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ఇప్పటివరకు జిల్లాలో 58 శాతం లోటు వర్షపాతం నమోదైంది. వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే సాగు పనులు ఊపందుకునే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. హనుమకొండ జిల్లాలో 27 మిల్లీమీటర్ల వర్షపాతం హన్మకొండ: వాతావరణంలో వచ్చిన మార్పులు, ఎల్నినో ప్రభావంతో హనుమకొండ జిల్లాలో వర్షాలు రోజురోజుకూ దూరమవుతున్నాయి. గత సంవత్సరం జూన్ 26 నాటికి జిల్లాలో సగటు సాధారణ వర్షపాతం 117.8 మిల్లీమీటర్లు కాగా.. 79.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈ ఏడాది ఇదే సమయానికి జిల్లా సగటు సాధారణ వర్షపాతం 117.8 మిల్లీమీటర్లు కాగా.. 27 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గతేడాది సాధారణ సాగు విస్తీర్ణం 2,43,357 ఎకరాలు కాగా.. ఇప్పటి వరకు అన్ని పంటలు కలిపి 54,790 ఎకరాల్లో సాగు చేశారు. ఉమ్మడి జిల్లాలో 58 శాతం లోటు వర్షపాతం నత్తనడకన సాగుతున్న వ్యవసాయ పనులు -
సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయాలి
మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, సీతక్కసాక్షిప్రతినిధి, వరంగల్: ములుగు జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రామప్ప–లక్నవరం గ్రావిటీ కెనాల్, పొట్లాపూర్ ప్రాజెక్టుతో పాటు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సచివాలయంలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధ్యక్షతన ములుగు నియోజకవర్గ పరిధిలోని నీటిపారుదల శాఖ అభివృద్ధి పనులపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. మంత్రి సీతక్క పాల్గొన్న ఈ సమావేశంలో రామప్ప–లక్నవరం గ్రావిటీ కెనాల్కు అవసరమైన భూసేకరణపై అధికారులు నివేదిక సమర్పించారు. తాజా మార్కెట్ ధరల ప్రకారమే భూసేకరణ.. కాసిందేవిపేట, ఇంచెర్ల, రామచంద్రాపూర్ గ్రామాల్లో ఈ ప్రాజెక్టుకు మొత్తం 244.23 ఎకరాల భూమి అవసరమని, ఇప్పటివరకు 201.03 ఎకరాలకు మాత్రమే అవార్డులు జారీ అయినప్పటికీ భూసేకరణ పూర్తికాలేదని తెలిపారు. 2020–21లో జారీ చేసిన అవార్డుల ప్రకారం ఎకరాకు రూ.2.47 లక్షల నుంచి రూ.8.26 లక్షల వరకు మాత్రమే పరిహారం నిర్ణయించగా, ప్రస్తుతం భూముల మార్కెట్ విలువలు భారీగా పెరగడంతో ఆ ధరలకు రైతులు భూములు ఇచ్చేందుకు అంగీకరించడం లేదని అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, మంత్రి సీతక్క భూసేకరణకు తాజా మార్కెట్ విలువల ఆధారంగా కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించారు. రెండేళ్లలో రామప్ప–లక్నవరం కెనాల్ రామప్ప–లక్నవరం గ్రావిటీ కెనాల్ నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రామప్ప చెరువు నుంచి లక్నవరం చెరువుకు గ్రావిటీ ద్వారా నీటి తరలింపు సాధ్యమై 8,700 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. అలాగే మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర సందర్భంగా తాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు లక్నవరం పర్యాటకాభివృద్ధికి కూడా ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని వివరించారు. అదేవిధంగా పొట్లాపూర్ ప్రాజెక్టు పనులను మరింత ఆలస్యం చేయకుండా వెంటనే ప్రారంభించి, వచ్చే వారంలోనే శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. -
శనీశ్వరుడికి పూజలు
హన్మకొండ కల్చరల్: శనిత్రయోదశిని పురస్కరించుకొని రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో శనివారం శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితుడు మణికంఠశర్మ, అర్చకులు సందీప్శర్మ, ప్రణవ్శర్మ ఉదయం నుంచి రుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం చేశారు. అనంతరం ఆలయ నాట్యమండపంలో శనీశ్వర ఉత్సవమూర్తిని ప్రతిష్ఠించారు. విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని డైట్ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ప్రవేశాలకు ఈనెల 29న మూడోదశ సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నట్లు హనుమకొండలోని ప్రభుత్వ డైట్ (జిల్లా విద్యాశిక్షణ సంస్థ) ఎఫ్ఏసీ ప్రిన్సిపాల్ బి.రంగయ్యనాయుడు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు విద్యార్హతల ఒరిజనల్ సర్టిఫికెట్లు, ర్యాంకు కార్డు, హాల్టికెట్, ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్ మార్కుల మెమో, నాలుగో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, కుల, ఆదాయ ధ్రువపత్రాలు, టీసీ, ఎన్సీసీ, క్రీడలు, పీఎస్ ధ్రువపత్రాలు తీసుకొని హాజరుకావాలని సూచించారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకున్న అభ్యర్థులు ఈనెల 30న ఆప్షన్లు ఇచ్చుకోవాలని, జూలై 4న మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందని, 9న కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని ఆయన కోరారు. హన్మకొండ: నూతనంగా పట్టాదారు పాస్పుస్తకాలు పొందిన రైతులు జూలై ఐదో తేదీలోపు రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాలని హనుమకొండ జిల్లా వ్యవసాయాధికారి వి.విజయచంద్ర కోరారు. ఈ నెల 15వ తేదీలోపు సీసీఎల్ఎ ద్వారా భూభారతి పోర్టల్ నమోదైన రైతులు ఏఈఓలను కలిసి వివరాలు అందించాలని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత సీజన్లో రైతు భరోసా సాయం అందని రైతులు తమ బ్యాంకు ఖాతాలు సరి చేసుకుని, ఫోన్ నంబర్గా తప్పుగా నమోదైన రైతులు, ఒకటి కంటే ఎక్కువ ఆధార్ నంబర్లు అనుసంధానమైన రైతులు వెంటనే సవరణలు చేసుకోవాలని, ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ విధిగా చేయించుకోవాలని కోరారు. వరంగల్ స్పోర్ట్స్: కిక్ బాక్సింగ్ అసోసియేషన్ హనుమకొండ జిల్లా నూతన కార్యవర్గ సమావేశం శనివారం హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని రెజ్లింగ్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల పరిశీలకులుగా తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సి.రామాజంనేయులు, ఒలింపిక్స్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. కై లాశ్యాదవ్, లీగల్ అడ్వైజర్లు సత్యనారాయణ, తిరుమల, విరందరి ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. అసోసియేషన్ ప్రెసిడెంట్గా బండారి సంతోష్, జనరల్ సెక్రటరీగా సిరిగిరి తిరుపతి, కోశాధికారిగా సాదినేని శ్యాంకుమార్, వైస్ ప్రెసిడెంట్గా సీహెచ్ సుప్రియ, జాయింట్ సెక్రటరీగా ఎస్.సాంబశివ, కార్యవర్గ సభ్యులుగా పి.దినేశ్తేజ, పి.గణేశ్తేజ ఎన్నికయ్యారు. -
రేవంత్ పాలనలో ఒరిగిందేమి లేదు
బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ హన్మకొండ: రేవంత్రెడ్డి పాలనలో ప్రజలు, రాష్ట్రానికి ఒరిగిందేమి లేదని బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. శనివారం హనుమకొండ హంటర్రోడ్డులోని వేద బాంక్వెట్ హాల్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశం మొత్తాన్ని సమదృష్టితో చూస్తోందన్నారు. ఓటరు జాబితా ప్రక్షాళన కొత్తగా చేస్తున్నదేమి కాదని, దీనిపై కాంగ్రెస్ పార్టీ రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనతోనే వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయని, 12 ఏళ్ల నరేంద్రమోదీ పాలనలో రాష్ట్రానికి కేంద్రం రూ.130 లక్షల కోట్ల నిధులు ఇచ్చిందన్నారు. ఒక్క రైల్వేకు రూ.3,000 కోట్లు ఇచ్చిందని, రైల్వే స్టేషన్లను అధునీకరించినట్లు చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈ నెల 29న హనుమకొండలోని అశోక హోటల్లో జరిగే ఆదివాసీ గిరిజన సదస్సు, అనంతరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగే కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని లక్ష్మణ్ వివరించారు. మాజీ ఎంపీ గరికపాటి మోహన్రావు, బీజేపీ హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు కొలను సంతోష్రెడ్డి, గంట రవికుమార్, నాయకులు మార్తినేని ధర్మారావు, వన్నాల శ్రీరాములు, గువ్వల బాలరాజు, గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, రావు పద్మ, డాక్టర్ పగడాల కాళీప్రసాద్, కొండేటి శ్రీధర్, ఎర్రబెల్లి ప్రదీప్రావు, డాక్టర్ వన్నాల వెంకటరమణ, బన్న ప్రభాకర్, రత్న లక్ష్మి, మల్లాడి తిరుపతిరెడ్డి, కుసుమ సతీశ్ పాల్గొన్నారు. -
కమిషనర్కు కారు ఏది?
వరంగల్ అర్బన్: మహానగర ప్రజలు పన్నుల రూపంలో చెల్లిస్తున్న సొమ్ము దుర్వినియోగమవుతోంది. ప్రజాప్రతినిధుల పాలనలో ఒకరకమైన అక్రమాలు జరిగితే.. వారి పాలన రద్దయిన నాటి నుంచి గ్రేటర్ వరంగల్లో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు కొంతమంది వింగ్ అధికారులు వ్యవహరిస్తున్నారని, ఖరీదైన వాహనాలను వినియోగించుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వారికి ప్రజాధనం ఆటవిడుపుగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ప్రస్తుతం కొత్తగా వచ్చిన కమిషనర్కు వాహనం కరువైంది. మేయర్, కమిషనర్ కార్లు వింగ్ అధికారులకు.. పదేళ్ల కిందట బల్దియా కొనుగోలు చేసిన విలువైన ఫార్చునరీ, ఇన్నోవా క్రిష్టా కార్లను గ్రేటర్ వరంగల్ మేయర్లు, కమిషనర్లు వినియోగించుకున్నారు. ఈ ఏడాది మే6న పాలకవర్గం రద్దయ్యింది. అప్పటి నుంచి ఫార్చునరీ కారు బల్దియాకు పరిమితమైంది. మూడు నెలల కిందట బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ పదోన్నతిపై హనుమకొండ కలెక్టర్గా బదిలీపై వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వ ఆస్థానంలో ఎవరిని నియమించకపోవడంతో ఇన్చార్జ్ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తించారు. కానీ, ఆకారును పెద్దగా వినియోగించుకోలేదు. మే మొదటి వారంలో మేయర్ పదవీ కాలం పూర్తయ్యింది. ఆరోజు నుంచి మేయర్ వాహనం కుడా బల్దియా ప్రధాన కార్యాలయానికే పరిమితమైంది. మేయర్, కమిషనర్ వినియోగించిన బల్దియా కార్లు పదేళ్లు దాటిపోయినందున కొత్త వాహనాలు కొనుగోలు చేయాలని ఇంజనీర్లు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పట్లో పాలకవర్గం ఏర్పడే పరిస్థితులు లేవు. మరో ఆరు నెలల కాలం పట్టనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నెలకు రూ.34వేలకు బదులు మూడింతల భారం బల్దియాలో వింగ్ అధికారికి కారు సౌకర్యం కల్పిస్తారు. అందుకోసం నెలకు రూ.34 వేల వేతనం చెల్లిస్తారు. అద్దెకారు, డ్రైవర్, డీజిల్, వాహన నిర్వహణ బాధ్యతలు సదరు వ్యక్తి భరిస్తాడు. దీంతో బల్దియాకు పెద్ద అదనపు భారం లేదు. మేయర్ వాహనాన్ని బల్దియా ఎస్ఈ రాజ్కుమార్, కమిషనర్ వాహనాన్ని అదనపు కమిషనర్ ఇసంపల్లి జోనా వినియోగించుకుంటున్నారు. వీరు మేం తక్కువ అంటూ తాటికాయ అక్షరాలతో ఆ వాహనాలకు నేం బోర్డులు ఏర్పాటు చేసుకున్నారు. కానీ, ఒక్కో వాహనానికి ఇద్దరు డ్రైవర్లు పనిచేస్తుంటారు. ఔట్సోర్సింగ్ కార్మికుల వేతనం నెలకు రూ.20వేలపైనే. ఇలారెండు వాహనాల డ్రైవర్లకు నెలకు రూ.80 వేల వేతనం చెల్లించాల్సి వస్తోంది. డీజిల్, వాహనాల నిర్వహణ, అంతేకాకుండా బల్దియా సొమ్ముతో ఈ వాహనాలకు మరమ్మతులు చేయించాల్సి ఉంటుంది. ఇలా సగటున నెలవారీగా రెండు వాహనాలకు వ్యయం రూ.1.60 లక్షలు వెచ్చించాల్సిన పరిస్థితి ఉంది. వాస్తవానికి అద్దె కార్లు కేటా యిస్తే రూ.68 వేలతో సరిపోతోంది. కానీ, బల్దియా అధికారులు మాత్రం ఆ వాహనాలను మూలకు చేర్చితే ఏం వస్తుందని వింత ప్రశ్నలు వేస్తున్నారు. ముందుచూపులేని జీడబ్ల్యూఎంసీ యంత్రాంగం ఖరీదైన వాహనాలు వినియోగిస్తున్న వింగ్ అధికారులు డీజిల్, మరమ్మతులు, డ్రైవర్ల పేరుతో రూ.లక్షల ప్రజాధనం వృథా -
ఇందిరమ్మ ఇళ్లను పూర్తిచేయాలి
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు పూర్తిచేయాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన అధికారుల సమీక్షలో ఆమె మాట్లాడారు. జిల్లాకు తొలి విడత మంజూరైన 3,243 ఇళ్ల నిర్మాణాన్ని సెప్టెంబర్ 15 నాటికి పూర్తి చేయాలని పేర్కొన్నారు. వనమహోత్సవం కింద 8 లక్షల మొక్కలను నాటాలని సూచించారు. గుడిసెల్లో నివసిస్తున్న 2,074 మంది అర్హతలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రతిపాదనలు పంపాలని, రూఫ్ రీప్లేస్మెంట్ దశలో ఉన్న 615 మంది లబ్ధిదారుల వివరాలను కూడా పరిశీలించాలని సూచించారు. . పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలి ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పిలుపునిచ్చారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. 0–5 సంవత్సరాల వయస్సు గల 84,301 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. చిన్నారుల ఆరోగ్యంపై శ్రద్ధచూపాలి అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల ఆరోగ్యం, పోషణ, ప్రీ స్కూల్ విద్యపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ప్రీ స్కూల్ వయస్సు పిల్లలందరూ క్రమం తప్పకుండా అంగన్వాడీ కేంద్రాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని, హాజరును ఫేస్ రికగ్నిషన్ ద్వారా నమోదు చేయాలన్నారు. -
వామపక్షాల ర్యాలీ ఉద్రిక్తం
హన్మకొండ: పేదల ఇళ్లను కూల్చివేయడాన్ని నిరసిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ, ప్రదర్శన ఉద్రిక్తంగా మారింది. హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు నుంచి హనుమకొండ కలెక్టరేట్ వరకు హనుమకొండ, వరంగల్ జిల్లా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో శనివారం పేదలతో కలిసి ర్యాలీ ప్రదర్శన, ధర్నా కార్యక్రమం చేపట్టారు. బాలసముద్రంలోని ఏకశిల పార్కు వద్ద పేదలతో కలిసి వామపక్ష పార్టీల నాయకులు రోడ్డుపై బైఠాయించి కొద్దిసేపు నిరసన తెలిపారు. అనంతరం ఇక్కడి నుంచి ర్యాలీగా బయల్దేరారు. హనుమకొండలోని తెలంగాణ అమరవీరుల స్తూపం కూడలికి చేరుకోగానే మరోసారి ప్రధాన రోడ్డుపై బైఠాయించారు. దీంతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, సీపీఐ ఎంఎల్ (మాస్ లైన్) నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావుతోపాటు మరికొందరు నాయకులను అరెస్టు చేశారు. పోలీసులు వాహనంలో నాయకులను తరలిస్తుండగా కార్యకర్తలు, పేదలు వాహనాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ జూలై 1న హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టరేట్ల ఎదటు పికెటింగ్, 6న హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద దర్నా నిర్వహిస్తామని చెప్పారు. సీపీఐ హనుమకొండ, వరంగల్ జిల్లాల కార్యదర్శులు కర్రె భిక్షపతి, షేక్ బాష్ మియా, సీపీఎం హనుమకొండ, వరంగల్ జిల్లాల కార్యదర్శులు జి.ప్రభాకర్ రెడ్డి, సీహెచ్ రంగయ్య, నాయకులు నేదునూరి జ్యోతి ఉన్నారు. తెలంగాణ అమరవీరుల స్తూపం కూడలిలో బైఠాయింపు కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట, వాగ్వాదం సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు, నాయకుల అరెస్ట్ -
కేటీఆర్పై విజిలెన్స్ విచారణ చేయాలి
కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డిహన్మకొండ చౌరస్తా: కుడాకు సంబంధించిన రూ.45 కోట్ల నిధులను చట్టవిరుద్ధంగా కార్పొరేషన్కు బదిలీ చేయించిన మాజీ మంత్రి కేటీఆర్పై విజిలెన్స్ విచారణ చేయాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి అన్నారు. హనుమకొండలోని డీసీసీ భవన్లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫార్ములా ఈకార్ కేసు మాదిరిగా కుడా నిధులను సైతం మంత్రి హోదాలో ఆనాడు కేటీఆర్ తన ఇష్టానుసారంగా కార్పొరేషన్కు మళ్లించాడని, తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. వేలంలో కుడాకు రూ.50 కోట్ల నష్టం జరుగుతుందని కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో రూ.150 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసి పార్టీ కార్యాలయం నిర్మించుకున్నారని వివరించారు. హనుమకొండ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్ మాట్లాడుతూ 500 డబుల్ బెడ్రూం ఇళ్లకు రెండు వేల మంది వద్ద లక్షల రూపాయలను బీఆర్ఎస్ నాయకులు వసూలు చేశారని ఆరోపించారు. మేరు కార్పొరేషన్ చైర్మన్ వెంకట్రాజం, మాజీ కార్పొరేటర్ జక్కుల రవీందర్, నాయకులు నాయిని లక్ష్మారెడ్డి, బంక సంపత్ పాల్గొన్నారు. -
6వేల మందికి ఉద్యోగాలు
హసన్పర్తి: హసన్పర్తి మండలం కిట్స్ కళాశాలలో కౌశల్ మహోత్సవ్–2026 కార్యక్రమం శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయినిరాజేందర్రెడ్డి, పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, కిట్స్ కళాశాల అదనపు కార్యదర్శి సతీశ్కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమారు 101 కంపెనీలను ఆహ్వానించి ఇంటర్వ్యూలు నిర్వహించారు. సుమారు 6 వేల మంది నిరుద్యోగులు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారని నిర్వాహకులు తెలిపారు. స్కిల్ ఇండియా తెలంగాణ డైరెక్టర్ కపిలవాయి దిలీప్కుమార్, కిట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అశోక్రెడ్డి, కేంద్ర ప్రభుత్వ ఎంఎస్ఎంఈ డైరెక్టర్ వీఎస్ అరవింద్, మాజీఎంపీ సీతారాంనాయక్, ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, డాక్టర్ వినోద్కుమార్, యూబీఐ చీఫ్ మేనేజర్ చంద్రశేఖర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కోమల్రెడ్డి, ఏఓ డాక్టర్ రమేశ్రెడ్డి, పీఆర్వో డాక్టర్ ప్రభాకరాచారి తదితరులు పాల్గొన్నారు. -
కమిషనర్కు అద్దె వాహనమే దిక్కు..
హెచ్ఎండీఏలో జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్న తేజావత్ వెంకన్న గ్రేటర్ కమిషనర్గా బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఆయనకు వాహనం లేదు. అద్దె వాహనాన్ని తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ విషయమై బల్దియా వాహనాల ఇన్చార్జ్ డీఈ మహేందర్ను వివరణ కోరగా తాను ఇటీవల బదిలీపై వచ్చాను. కమిషనర్ వినియోగించిన వాహనం పదేళ్లు దాటినందున మూడుసార్లు టెండర్లు పిలిచారు. కానీ, కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. తాజాగా కొత్త వాహనం కోసం షో రూంకు ప్రతిపాదనలు అందించినట్లు తెలిసింది. కొత్త కమిషనర్కు వాహనం కేటాయించే విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు. -
‘కుడా’లో కుంభకోణం
మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ హన్మకొండ: ప్లాట్ల వేలంలో ‘కుడా’లో పెద్ద ఎత్తున అవినీతి, కుంభకోణానికి పాల్పడ్డారని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ తీవ్ర స్థాయిలో ఆరోపించారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్లాట్ల వేలంలో కమీషన్ తీసుకుని కాకతీయ పట్టణాభివృద్ధికి తీవ్ర నష్టం కలిగించారన్నారు. గజానికి బహిరంగ మార్కెట్లో రూ.1.30 లక్షలుండగా.. అగ్గువకు గజానికి రూ.65 వేల నుంచి రూ.69 వేల వరకు విక్రయించారని ఆరోపించారు. ‘కుడా’ వైస్ చైర్మన్గా ఉన్న కలెక్టర్ ప్లాట్ల వేలంలో జరిగిన అక్రమాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. దాదాపు రూ.50 కోట్ల నష్టం వాటిల్లిందని, వేలాన్ని రద్దు చేసి తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు సిరాజుద్దీన్, దర్శన్ సింగ్, సోదా కిరణ్, బొంగు అశోక్ యాదవ్, జోరిక రమేష్, కుసుమ లక్ష్మీ నారాయణ, పులి సారంగపాణి, నయీమొద్దీన్, నార్లగిరి రమేశ్, సల్వాజి రవీందర్ రావు, గండు అశోక్ యాదవ్, గౌస్ ఖాన్, శ్రీధర్, అఫ్జల్, రామ్మూర్తి, ప్రభాకర్, గండ్రకోట రాకేష్ యాదవ్, శివకుమార్, షాబాద్, ఎస్కే మహమూద్, ఫెరోజ్, శ్యామ్ రెడ్డి, మనోజ్, కనకరాజు, నాయిని రవి యాదవ్, తక్కళ్లపల్లి వినీల్ రావు, శ్రీకాంత్ చారి, పాల్గొన్నారు. -
జీడబ్ల్యూఎంసీ కమిషనర్గా వెంకన్న
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) కమిషనర్గా తేజావత్ వెంకన్నను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్ఎండీఏలో జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్గా (కోర్ అర్బన్ రీజియన్–మెట్రో రైలు) కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గ్రేటర్ వరంగల్ కమిషనర్గా సుమారు సుమారు 8 నెలు పనిచేసిన చాహత్ బాజ్పాయ్కు హనుమకొండ కలెక్టర్గా పదోన్నతి లభించింది. ప్రభుత్వం బల్దియాకు కమిషనర్ను నియమించకపోవడంతో ఇన్చార్జ్ కమిషనర్గా సుమారు మూడు నెలలుగా కొనసాగుతున్నారు. అంతేకాకుండా ఆమెకే జీడబ్ల్యూఎంసీ ప్రత్యేకాధికారిగా బాధ్యతలు అప్పగించారు. జీడబ్ల్యూఎంసీ ఇన్చార్జ్ కమిషనర్గా కొనసాగుతున్న చాహత్ బాజ్పాయ్ని ప్రభుత్వం బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది. వెంకన్న మరిపెడ వాసి.. కొత్త కమిషనర్ తేజావత్ వెంకన్న మహుబూబాబాద్ జిల్లాలోని మరిపెడ మండలం తానంచర్ల గ్రామానికి చెందిన వారు. 2007లో గ్రూప్–1 అధికారి (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్)గా ఎంపికయ్యారు. బోధన్ మున్సిపల్ కమిషనర్, మంచిర్యాల మున్సిపల్ కమిషనర్, జీహెచ్ఎంసీలోని చందానగర్, శేరిలింగంపల్లి డిప్యూటీ కమిషనర్, జీహెచ్ఎంసీలోనే సౌత్ జోన్ జోనల్ కమిషనర్గా సేవలందించారు. ప్రస్తుతం హెచ్ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్గా పనిచేస్తున్నారు. పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, నగరపాలన, ప్రజాసేవల మెరుగుదలలో విశేష అనుభవం కలిగిన వెంకన్నను ప్రభుత్వం తాజాగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా నియమించింది. ఆయన నేడో రేపో కమిషనర్గా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం.ఇన్చార్జ్ బాధ్యతల నుంచి చాహత్ బాజ్పాయ్ ఇక రిలీవ్ -
డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలి: సీపీ
వరంగల్ క్రైం: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం యువత ముందుకు రావాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ పిలుపునిచ్చారు. ప్రపంచ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం సెంట్రల్ జోన్ పోలీసులు కమిషనరేట్ కార్యాలయం నుంచి ఆర్ట్స్ కళాశాల మైదానం వరకు ఏర్పాటు చేసిన 2కే రన్ను సీపీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా సీపీ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ యువత, విద్యార్థులు మాదకద్రవ్యాల జోలికి పోవద్దని సూచించారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, వరంగల్, హనుమకొండ కలెక్టర్లు సత్యశారద, చాహత్ బాజ్పాయ్, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంట్రాంరెడ్డి, డీసీపీలు ధార కవిత, అంకిత్కుమార్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. వరంగల్ చౌరస్తా: నూతన హంగులతో రోల్ మోడల్గా నిర్మిస్తున్న వరంగల్ ఆర్టీసీ బస్ స్టేషన్ నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం తగదని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్రెడ్డి ఆదేశించారు. స్మార్ట్సిటీలో భాగంగా రూ.75 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న వరంగల్ ఆర్టీసీ బస్స్టేషన్ను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరంగల్ నగర ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. వరంగల్ బస్ స్టేషన్ నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించకుండా చూడాలని, పనుల్లో మరింత వేగం పెంచాలని సంబంధిత కాంట్రాక్ట్ ఏజెన్సీలను, అధికారులను ఆయన హెచ్చరించారు. వరంగల్ నగరాన్ని అద్భుతమైన ఐటీ, పర్యాటక హబ్గా తీర్చిదిద్దే క్రమంలో మెరుగైన రవాణా వ్యవస్థ ఎంతో కీలకమని, ఇందుకోసం ‘కుడా’ ఆధ్వర్యంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. వరంగల్ క్రైం: వరంగల్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఇద్దరు ఎస్సైలను బదిలీ చేస్తూ సీపీ సన్ప్రీత్ సింగ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిషరేట్ కార్యాలయంలో పనిచేస్తున్న ఈ.వీరభద్రరావును దామెర ఎస్హెచ్ఓగా, దామెర ఎస్హెచ్ఓగా పనిచేస్తున్న కె.అశోక్ను ఐనవోలు పోలీస్స్టేషన్ ఎస్హెచ్ఓగా బదిలీ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హన్మకొండ కల్చరల్: శనిత్రయోదశి పుస్కరించుకుని శనివారం ఉదయం 5 గంటల నుంచి శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో శనిపూజలు, నవగ్రహ పూజలు నిర్వహించనున్నట్లు ఈఓ అనిల్కుమార్, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. వసతుల కల్పనే లక్ష్యం గీసుకొండ : ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి తెలిపారు. శుక్రవారం గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ 15, 16వ డివిజన్లలో హనుమకొండ కలెక్టర్, బల్దియా ప్రత్యేకాధికారి చాహత్ బాజ్పాయ్, మాజీ మేయర్ గుండు సుధారాణితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రతిపాదనల స్వీకరణ కాళోజీ సెంటర్ : భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖ పాఠశాల విభాగం న్యూఢిల్లీ ఆధ్వర్యంలో 2026 సంవత్సరానికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు ఆన్లైన్ ద్వారా ప్రతిపాదనలు కోరుతున్నట్లు వరంగల్ డీఈఓ రంగయ్యనాయుడు తెలిపారు. జిల్లాలోని అర్హులైన ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు జూలై 10వ తేదీలోపు http:nationalawa rdstoteachers.education.gov.in ద్వారా ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. ఆన్లైన్ ప్రింట్ ప్రతులు రెండు సెట్లు ఆయా మండల విద్యాశాఖ అధికారి ద్వారా జూలై 14 సాయంత్రం 5 గంటల్లోపు తమ కార్యాలయంలో సమర్పించాలని డీఈఓ కోరారు. -
వరంగల్ ఓసిటీలో ప్లాట్ల వేలం
కాశిబుగ్గ: వరంగల్ ఓ సిటీలోని ప్లాట్ల వేలం ఉద్రిక్తతకు దారితీసింది. ఆజంజాహి మిల్లు కార్మిక సంఘం నాయకులు ర్యాలీగా రావడం, ఓ కార్మికుడు ఏకంగా వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపాడు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు. వరంగల్ ఓ సిటీలోని 98 ప్లాట్లకు అధికారులు శుక్రవారం ఉదయం వేలానికి ఏర్పాట్లు చేశారు. అయితే, దీనికి ముందే పలు కార్మిక సంఘాల నాయకులు పురాతన వాటర్ ట్యాంకు ప్రాంతం నుంచి ర్యాలీగా వేలం నిర్వహించే క్లబ్ వరకు తరలివచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆజంజాహిమిల్లు కార్మికులకు ప్లాట్లు కేటాయించాలని, ప్లాట్ల వేలం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో గద్దల సంజీవ అనే కార్మికుడు వాటర్ ట్యాంకు ఎక్కి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. తర్వాత యశోద అనే కార్మికురాలితో పాటు మరో నలుగురు ట్యాంకు ఎక్కడానికి ప్రయత్నించారు. అలాగే, పోలీసులు పైకి రాకుండా ఉండేందుకు వాటర్ ట్యాంకు మెట్ల మధ్యలో టైరు కాల్చి కార్మికులకు న్యాయం చేయాలని, లేకుంటే ట్యాంకుపై నుంచి దూకుతామంటూ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి నిరసనకారులను కిందికి దింపారు. అనంతరం కార్మిక సంఘాల నాయకులతో కలిసి ట్యాంకు వరకు ర్యాలీకి యత్నించారు. తాము కలెక్టర్ను కలిసి సమస్యలు విన్నవిస్తామని పోలీసులకు తెలిపారు. దీంతో హనుమకొండ ఏసీపీ నర్సింహారావు, సీఐలు కర్రె స్వామి, షూకూర్ ఆధ్వర్యంలో 17 మందిని పోలీసు వాహనం ఎక్కించి మట్టెవాడ పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం యథాఽవిధిగా వేలం కొనసాగించారు. వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపిన ఏజే మిల్లు కార్మికుడు 17 మందిని అరెస్టు చేసిన పోలీసులు.. ఉద్రిక్తత -
సర్దుబాటుకు సన్నాహాలు!
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్ల వర్క్ అడ్జెస్ట్మెంట్ చేయనున్నారు. ఈమేరకు జిల్లా విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. గత విద్యాసంవత్సరంలో విద్యార్థుల నమోదు, సబ్జెక్టుల వారీగా టీచర్ల అవసరాలను పరిగణనలోకి తీసుకొని వర్క్ అడ్జెస్మెంట్ చేశారు. అవసరం ఉన్న పాఠశాలలకు విద్యార్థుల నమోదు తక్కువగా ఉండగా.. మిగులు ఉన్న 158 మంది టీచర్లను అడ్జెస్ట్ చేశారు. ఆతర్వాత జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని సుమారు 30 మంది టీచర్లను అకడమిక్ ప్యానల్ తనిఖీ బృందాలుగా నియమించారు. ఆయా టీచర్ల స్థానంలో మరో 30 మంది టీచర్లను వర్క్ అడ్జెస్ట్ చేశారు. మొత్తం 188 మంది టీచర్లను వర్క్ అడ్జెస్ట్మెంట్ చేశారు. తనిఖీ బృందాల్లోని 30 మంది టీచర్లు ఈ విద్యాసంవత్సరం ప్రస్తుతం తిరిగి తమ పాఠశాలల్లోనే విధులు నిర్వర్తిస్తున్నారు. 158 మంది టీచర్లు గత విద్యాసంవత్సరం ఏ పాఠశాలల్లోనైతే వర్క్ అడ్జెస్ట్మెంట్ కింద పనిచేశారో ఆయా పాఠశాలల్లో ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. వారిని యథావిధిగా ఆయా పాఠశాలల్లో కొనసాగిస్తున్నారు. 29న ఎంఈఓలతో డీఈఓ సమావేశం.. జిల్లాల్లో అవసరం మేరకు పాఠశాలల్లో మిగులు ఉపాధ్యాయులను వర్క్ అడ్జెస్ట్మెంట్ చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్నికోలస్ ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు. ముఖ్యంగా ఉద్యోగ విరమణ పొందిన, దీర్ఘకాలిక సెలవులో ఉన్న టీచర్ల స్థానంలో వర్క్ అడ్జెస్ట్మెంట్ చేయాలని ఆదేశించారు. టీచర్ల వర్క్ అడ్జెస్ట్మెంట్పై ఈనెల 29 హనుమకొండ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ ఎంఈఓల సమావేశం నిర్వహించనున్నారు. రిటైర్డ్, సెలవుల్లో ఉన్న టీచర్ల స్థానంలో వర్క్ అడ్జెస్ట్మెంట్ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులతో అధికారుల కసరత్తు -
ప్రబలేదాకా పట్టించుకోరా?
వరంగల్ అర్బన్: వర్షాకాలం ప్రారంభమైంది. డెంగీ, మలేరియా, టైఫాయిడ్, విషజ్వరాలు, అతిసారా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. ఏటా జూన్ మొదటి వారంలోనే సీజన్ వ్యాధులపై ముందస్తుగా అప్రమత్తం కావాలి. బల్దియా, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఐసీడీఎస్ సిబ్బంది, సామాజిక కళాకారులతో కలిసి ఉమ్మడిగా సమావేశం ఏర్పాటు చేసేవారు. ఈ ఏడాది ఇంతవరకు కార్యాచరణ లేదు. వ్యాధులు విజృంభించిన తర్వాత మందులు ఇచ్చే కన్నా ముందు జబ్బులు రాకుండా నివారించగలిగితే అందరికీ ఎంతో ప్రజయోజనమని మహానగర ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కనిపించని చర్యలు.. ప్రజారోగ్య విభాగం, అర్బన్ మలేరియా విభాగం ఉమ్మడిగా గ్యాంగ్వర్క్ చేయాలి. 66 డివిజన్ల వారీగా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి. ఎందుకో రెండేళ్లుగా ఇలాంటి చర్యలేమీ కనిపించడం లేదు. వీధుల్లో ఎక్కడ చూసినా చెత్తే పేరుకుపోయి కనిపిస్తోంది. ఇంటింటా చెత్త సేకరణ చేపడుతున్నా.. సాధారణ పారిశుద్ధ్య పనులు చేయట్లేదు. వారానికోసారి మురుగు కాల్వలు తీయట్లేదు. డ్రెయినేజీల్లో వ్యర్థాలు పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. మురుగు కాల్వలు శుభ్రం చేసేందుకు ప్రైవేట్ శానిటేషన్ కార్మికులతో గ్యాంగ్వర్క్ నిర్వహించేవారు. ఈసారి ఆలస్యంగా మొదలు పెట్టారు. కొన్ని డివిజన్లలో ఇంతవరకు గ్యాంగ్వర్క్ ప్రారంభం కాలేదు. కొందరు శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దోమల బెడద తప్పదా? నగరంలో దోమల బెడద తప్పేలా లేదు. వర్షాకాలం మొదలైంది. అక్కడక్కడా చిరుజల్లులు కురుస్తున్నాయి. దోమల తీవ్రత పెరిగింది. వాస్తవానికి లార్వా దశలోనే దోమల ఉత్పత్తి పెరగకుండా చూడాలి. దోమల నివారణ అర్బన్ మలేరియా విభాగానికి పెను సవాలే. కాజీపేట, హనుమకొండ, వరంగల్, విలీన గ్రామాల్లోని పలు కాలనీల నుంచి దోమలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఖాళీ స్థలాలు, డ్రెయినేజీల్లో వ్యర్థాలు పెద్దఎత్తున పేరుకుపోయాయి. వీటి నివారణ కోసం అర్బన్ మలేరియా సిబ్బంది బృందాలుగా ఏర్పడి డివిజన్ల వారీగా గ్యాంగ్వర్క్ చేయాలి. అందుకోసం ప్రత్యేక షెడ్యూల్ను ఇంతవరకూ తయారు చేయలేదు. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో మలేరియా సిబ్బంది ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే దోమల నివారణ సాధ్యమవుతుంది. దోమల ఉత్పత్తి పెరగకుండా నగర ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఇంటింటా తిరగాలి. డెంగీ, మలేరియా, విషజ్వరాలు ప్రబలితే వెంటనే అర్బన్ మలేరియా సిబ్బంది రంగంలోకి దిగాలి. ఆ దిశగా చర్యలేమి లేకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆరోగ్య శిబిరాల ఊసే లేదు నగరంలో అధికారికంగా 185 మురికివాడలు, విలీన గ్రామాల్లో 80 మురికివాడలు ఉన్నాయి. పారిశుద్ధ్య పనులు, దోమల నివారణ చర్యలతోపాటు పేదలుంటున్న కాలనీల్లో ఉచిత వైద్యశిబిరాల కోసం షెడ్యూల్ ప్రకటించాలి. రోగాలపై కళాకారులతో ప్రజలను జాగృతం చేయాలి. కానీ, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఇంతవరకు మేల్కొనకపోతే రానున్న రోజుల్లో గడ్డు పరిస్థితే. అర్బన్ మలేరియా విభాగానికి సుస్తీ.. బల్దియా అర్బన్ మలేరియా విభాగం 14 నెలలుగా అనారోగ్యం బారిన పడింది. మలేరియా అధికారి మాధవరెడ్డి హైదరాబాద్కు బదిలీపై వెళ్లారు. దీంతో సీఎంహెచ్ఓ రాజారెడ్డి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. బల్దియాలో ఇద్దరు హెల్త్ ఇన్స్పెక్టర్లు, ఆరుగురు హెల్త్ అసిస్టెంట్లు, 160 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిపై రోజువారీగా పర్యవేక్షణ కరువైంది. కనీసం రోజువారీగా బావుల్లో మందు వేయడం, డ్రెయినేజీల్లో రసాయనాలు చల్లడం, ఖాళీ స్థలాల్లో ఆయిల్ బాల్స్ వేయడం, ఫాగింగ్ చేయడం వంటి పనులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. దీంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు చొరవ తీసుకొని బయాలజిస్ట్ పోస్టు భర్తీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. కార్యాచరణ రూపొందిస్తున్నాం.. నగరంలోని చాలాకాలనీల్లో 8 వేల వరకు ప్రైవేట్ ఖాళీ స్థలాలు ఉన్నాయి. వీటిలో పిచ్చి మొక్కలు పెరిగి, మురుగునీరు స్తంభించిపోయి దోమల ఉధృతి పెరుగుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాం. అన్ని విభాగాల సహకారం తీసుకుంటాం. – రాజారెడ్డి, ఇన్చార్జ్ బయాలజిస్ట్హనుమకొండ రాగన్న దర్వాజ ప్రధాన రహదారిపై పారుతున్న మురుగు నీరు -
ఎంజీఎం ఆస్పత్రికి స్టాఫ్ నర్సులొచ్చారు
కాశిబుగ్గ: ఎట్టకేలకు ఎంజీఎం ఆస్పత్రికి స్టాఫ్ నర్సులొచ్చారు. దవాఖానా నుంచి బదిలీ అయిన వారి స్థానంలో కొత్తగా ఎవరూ జాయిన్ అవకపోవడంతో తొలుత అధికారుల్లో ఆందోళన వ్యక్తమైంది. దీంతో నర్సింగ్ సూపరింటెండెంట్ దయాశీల, డిప్యూటీ సూపరింటెండెంట్ సుజాత అధికారుల ఆదేశాల మేరకు ఎంజీఎంలో పేషెంట్లకు ఇబ్బందుల్లేకుండా ఉండేందుకు బీఎస్సీ, జనరల్ నర్సింగ్, పీఎంఎస్ఎస్వై సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నుంచి నర్సింగ్ స్టాఫ్ను రప్పించారు. స్టాఫ్ నర్సుల స్థానంలో వీరు ప్రత్యామ్నాయంగా సేవలందిస్తున్నారు. ఖాళీగా 284 పోస్టులు ఎంజీఎం దవాఖానలో రోగులకు సేవలు అందించడానికి 478 మంది స్టాఫ్నర్సులు అవసరం ఉండగా.. కేవలం 194 మందితో వైద్యసేవలు అందిస్తున్నారు. మరో 284 పోస్టులు ఖాళీగానే ఉంటున్నాయి. ఈనేపథ్యంలో ఎంజీఎంలో పేషెంట్ల సేవల కోసం స్టాఫ్ నర్సుల (నర్సింగ్ ఆఫీసర్లు) కొరత గుర్తించిన డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఉన్నతాధికారులు బదిలీ అయిన వారి స్థానంలో 170 మంది నర్సింగ్ ఆఫీసర్లను కేటాయించారు. అలాగే హనుమకొండ ప్రసూతి ఆస్పత్రి, వరంగల్ సీకేఎం ఆస్పత్రికి ఐదుగురు స్టాఫ్ నర్సులను అలాట్ చేసినట్లు తెలుస్తోంది. 2024 సంవత్సరం బ్యాచ్కు సంబంధించిన వీరు రెండు రోజుల నుంచి ఎంజీఎంలో జాయిన్ అవుతున్నారు. ఇప్పటి వరకు 60 మంది స్టాఫ్ నర్సులు జాయినింగ్ రిపోర్టు ఇచ్చారు. మిగతావారు కూడా సోమవారం వరకు జాయిన్ కావొచ్చని నర్సింగ్ అధికారులు చెబుతున్నారు. దీంతో ఎంజీఎంలోని అత్యవసర చికిత్సలు, పలు వార్డుల్లో నర్సింగ్ సేవలు ఉపయోగించుకునే అవకాశం ఏర్పడింది. 170 మంది కేటాయింపు 60 మంది జాయినింగ్ -
మహిళా సాధికారతకు పెద్దపీట
పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి హన్మకొండ అర్బన్: మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం సంక్షేమంతో పాటు మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తోందని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని 30వ డివిజన్ శ్రీనివాస్ నగర్లో సుమారు రూ.50 లక్షల వ్యయంతో చేపట్టిన మహిళా కమ్యూనిటీహాల్కు ఆయన శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి కృషి చేస్తోందన్నారు. కమ్యూనిటీహాల్ నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా నిర్ణీత గడువులోగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్ను ఎమ్మెల్యే ఆదేశించారు. -
జూనియర్ లెక్చరర్ల ప్రొబేషన్ ప్రకటించాలి
హన్మకొండ అర్బన్/విద్యారణ్యపురి: 2023 బ్యాచ్ జూనియర్ లెక్చరర్లకు వెంటనే ప్రొబేషన్ ప్రకటించి, ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ (టీజీజేఎల్ఏ–475) రాష్ట్ర కౌన్సిల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈమేరకు శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్ ఆవరణలోని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీజీఓ) భవన్లో రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న టీజీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగన్మోహన్రావు మాట్లాడుతూ.. సమస్య పరిష్కారంలో జాప్యం కొనసాగితే.. చేపట్టే ప్రతీ ఉద్యమానికి టీజీఓ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. అనంతరం 2023 బ్యాచ్ జూనియర్ లెక్చరర్ల ప్రొబేషన్ ప్రకటన, ఇంక్రిమెంట్ల మంజూరు తదితర డిమాండ్లపై పలు తీర్మానాలను రాష్ట్ర కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది జీవీఎల్ మూర్తి, టీజీఓ నాయకులు ఆసనాల శ్రీనివాస్, డాక్టర్ వసుకుల శ్రీనివాస్, డాక్టర్ కొప్పిశెట్టి సురేశ్, డాక్టర్ ప్రవీణ్కుమార్, టీజీజేఎల్ఏ నాయకులు జె.కురుమూర్తి, శోభన్బాబు, శ్రీనివాస్, రేమిడి మల్లారెడ్డి, గోస్కుల హరగోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
గోడ కూలుస్తుండగా ప్రమాదం
మామునూరు: పాత ఇంటి గోడ కూల్చివేస్తుండగా ప్రమాదవశాత్తు కూలి మృతిచెందిన సంఘటన వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలంలోని మామునూరులో గురువారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన సూర యాకయ్య (45) కుటుంబంతో కలిసి బతుకుదెరువు నిమిత్తం వరంగల్ ఆర్టీఏ జంక్షన్ లెనిన్నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. అదేకాలనీకి చెందిన కుంచం పురుషోత్తంతో కలిసి యాకయ్య కూలి పనులకు వెళ్తున్నాడు. రోజు వారీగానే మామునూరు గ్రామంలో ఎర్ర సంతోష పాత ఇంటిని కూల్చివేసేందుకు గురువారం ఉదయం యాకయ్య, పురుషోత్తం కూలికి వెళ్లారు. కూల్చివేసే క్రమంలో ఆకస్మికంగా కూలీలపై గోడ పడిపోవడంతో సూర యాకయ్య అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. పురుషోత్తంకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని వెంటనే 108 వాహనంలో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే మామునూరు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. యాకయ్య మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించినట్లు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఒకరి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు మామునూరులో ఘటన -
పెండింగ్ డీఏలు విడుదల చేయాలి
విద్యారణ్యపురి/కాళోజీసెంటర్: పెండింగ్ డీఏలు విడుదల చేయాలని, పీఆర్సీని వెంటనే ప్రకటించాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రంజిత్కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు టీఎస్యూటీఎఫ్ హనుమకొండ, వరంగల్ జిల్లాశాఖ ఆధ్వర్యంలో హనుమకొండలోని కాళోజీ సెంటర్ వద్ద గురువారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం టీఎస్యూటీఎఫ్ హనుమకొండ జిల్లా బాధ్యులు అదనపు కలెక్టర్ రవి, వరంగల్ జిల్లా బాధ్యులు డీఆర్ఓ విజయలక్ష్మికి వినతిపత్రం ఇచ్చారు. టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు డి.కిరణ్కుమార్, హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు సీహెచ్.రవీందర్రాజు, తాటికాయల కుమార్, జిల్లా జనరల్ సెక్రటరీలు పెండెం రాజు, సుజన్ప్రసాద్రావు, ములుగు జిల్లా అధ్యక్షుడు వాసుదేవరెడ్డి, జిల్లా కోశాధికారి రవూఫ్, రెండు జిల్లాల బాధ్యులు లింగారావు, మోజెస్, రమేశ్ సీఎస్ఆర్ మల్లిక్, ప్రసన్నానంద్, కరుణాకర్, భాస్కర్రావు, గిరి ధరాచారి బ్రహ్మచారి, సత్యనారాయణ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యారణ్యపురి: టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను గురువారం విద్యాశాఖ ఉన్నతాధికారులు విడుదల చేశారు. హనుమకొండ జిల్లాలో 187 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 173 మంది ఉత్తీర్ణత (93.35 శాతం)సాధించారని జిల్లా విద్యాశాఖ ఏసీజీఈ మధుసూదన్రావు తెలిపారు. వరంగల్ జిల్లాలో 86.88 శాతం ఉత్తీర్ణత కాళోజీ సెంటర్: సప్లమెంటరీ పరీక్ష ఫలితాల్లో వరంగల్ జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 86.88 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం 503 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 437 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 208 మంది బాలికల్లో 185 మంది, 295 మంది బాలురలో 252 మంది ఉత్తీర్ణులయ్యారు. ఖిలా వరంగల్: మామునూరు టీజీ ఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో వన్యప్రాణుల సంరక్షణ సంస్థ, సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ స్టడీస్ (సీడబ్ల్యూఎస్) ఆధ్వర్యంలో వైల్డ్ సురక్ష పేరుతో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా అసిస్టెంట్ కమాండెంట్ బాలయ్య హాజరై మాట్లాడారు. వన్యప్రాణుల ప్రవర్తన, వాటి వల్ల మానవాళికి తలెత్తే సంఘర్షణలు, వన్యప్రాణుల వేట, అక్రమ రవాణా వంటి కీలక అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ఏసీ రాజేందర్, ఆర్ఐలు రవి, వెంకటేశ్వర్లు, రాజ్కుమార్, కృష్ణ, సురక్ష త్రివేణి, సిబ్బంది పాల్గొన్నారు. రామన్నపేట: వైద్య సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హనుమకొండ డీఎంహెచ్ఓ ఎస్డీ రాంకుమార్ హెచ్చరించారు. గురువారం ఆయన పెద్దమ్మగడ్డ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పీహెచ్సీలో సేవలందిస్తున్న సిబ్బంది, ఎవరెవరు ఎక్కడ సేవలందిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ముందస్తు సెలవు, అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైతే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అనంతరం రంగంపేట–3 అంగన్వాడీ సెంటర్ను సందర్శించారు. నమోదైన గర్భిణుల వివరాలను పరిశీలించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవానికి ప్రోత్సహించాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులతో ముచ్చటించారు. తర్వాత హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలోని నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు. రెండు నెలలుగా ఎంతమందికి సేవలందించారు. ఎక్కువగా ఏ సమస్యలతో అక్కడికి వచ్చారు అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రికవరీకి సంబంధించిన రికార్డులు ఆయన పరిశీలించారు. జీఎంహెచ్ ఆర్ఎంఓ మంజుల, పిల్లల వైద్య నిపుణులు సుభాష్, ప్రశాంత్, జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్రెడ్డి, మురళి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద కాళోజీ సెంటర్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన మిడ్ డే మిల్స్ కమిటీ సమావేశంలో పథకం అమలు తీరును కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్దేశించిన మెనూను కచ్చితంగా అమలు చేయాలన్నారు. అన్ని ఇంటర్ కళాశాలలకు ప్రత్యేక అధికారులను నియమించే ప్రక్రియను వెంటనే చేపట్టాలని అదనపు కలెక్టర్ వైవీ గణేశ్ను ఆదేశించారు. డీఐఈఓ శ్రీధర్ సుమన్, డీఎంహెచ్ఓ సాంబశివరావు, టీబీసీడీఓ పుష్పలత తదితరులు పాల్గొన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు జిల్లాలోని వివిధ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, కేర్టేకర్లు, సీఆర్పీలు, ఐజీఆర్పీ, ఏఎన్ఎంలు, హాస్టల్ సిబ్బంది పనితీరుపై ఉన్నతాధికారులతో కలిసి ఆమె సమీక్షించారు. కొంతమంది సిబ్బంది పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులతో మర్యాదపూర్వకంగా, స్నేహపూర్వకంగా వ్యవహరించాలని, అసభ్యకర భాష, ప్రవర్తన సహించేది లేదని స్పష్టం చేశారు. అదనపు కలెక్టర్ గణేశ్, డీఈఓ రంగయ్య నాయుడు, డీబీసీడీఓ పుష్పలత, ఏఎంఓ ఉండ్రాతి సుజన్ తేజ, సీఎంఓ కట్ల శ్రీనివాస్, జీసీడీఓ ఫ్లో రెన్స్, ప్లానింగ్ కోఆర్డినేటర్ విజయ్ కుమార్, స్టాటిస్టికల్ కోఆర్డినేటర్ వేణుగోపాల్రావు ఉన్నారు. గడువులోగా స్కూల్ పనులు పూర్తి చేయాలి వరంగల్ చౌరస్తా: తెలంగాణ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (టీఐఆర్ఎస్) పనులు గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. వరంగల్ మండలం పైడిపల్లిలో నిర్మాణంలో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్ పనులు గురువారం ఆమె పరిశీలించారు. నిర్మాణంలో వాడుతున్న సిమెంట్ గ్రేడ్, ఇనుము నాణ్యత, ఇటుకల దృఢత్వం గురించి ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అ ధికారులు, కాంట్రాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ గణేశ్ డీఈఓ రంగయ్య నాయుడు, తహసీల్దార్ శ్రీకాంత్ ఉన్నారు. -
సాంకేతిక పురోగతితో సమగ్రాభివృద్ధ్ది
కేయూ క్యాంపస్: వికసిత్ భారత్–2047 లక్ష్యం ఆర్థికాభివృద్ధికి మాత్రమే పరిమితం కాదని, సాంకేతిక పురోగతితో సమగ్రాభివృద్ధి సాధ్యమని కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డి అన్నారు. కేయూలోని కామర్స్అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల సెమినార్హా ల్లో గురువారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర కా మర్స్ అసోసియేషన్ ఏడో వార్షిక సదస్సులో ఆయ న మాట్లాడారు. విలువలే దేశ భవిష్యత్ను నిర్దేశిస్తాయని, వికసిత్ భారత్–2047 సాధనలో కామర్స్, మేనేజ్మెంట్ విద్య కీలకంగా నిలవనుందన్నారు. ఉపాధి అవకాశాలకు మార్గం సుగమం : బాలకిష్టారెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ కామర్స్మేనేజ్మెంట్ విద్య విస్తృత ఉపాధి అవకాశాలకు మార్గం సుగమం చేస్తుందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ వి.బాలకిష్టారెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి ఆన్లైన్లో ఆయన మాట్లాడారు. డిగ్రీ, పీజీలో సిలబస్ సంస్కరణలు కొనసాగుతాయని తెలిపారు. రానున్న రెండు మూడు దశాబ్దాల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఉన్నత స్థానానికి చేరుకుంటుందన్నారు. అలాగే, రాష్ట్రం కూడా రైజింగ్ తెలంగాణ దిశగా పురోగమిస్తోందని వివరించారు. యువతకు ఉపాధికోసం ప్రత్యేక పోర్టల్ : చెన్నప్ప, తెలంగాణ కామర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలంగాణ కామర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ డి.చెన్నప్ప అన్నారు. 2017లో స్థాపించిన కామర్స్ అసోసియేషన్లో ప్రస్తుతం 1,177 మంది సభ్యులు ఉన్నారని వవరించారు. ఉచిత శిక్షణ ద్వారా వందమంది విద్యార్థులకుపైగా ఉన్నత విద్యలో ప్రవేశాలు పొందారన్నారు. ఎస్బీఐ ఆర్ఎం బండి మురళీమోహనకృష్ణ, హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్ ఎస్.శ్రీనివాసమూర్తి, కేయూ మాజీ రిజిస్ట్రార్ శంకరయ్య, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపాల్ నర్సింహాచారి, సదస్సు సెక్రటరీ పి.వరలక్ష్మి, కామర్స్ డీన్ కె.రాజేందర్, పి.అమరవేణి, తెలంగాణ కామర్స్ అసోసియేషన్ సెక్రటరీ అకాహ్రాయ్జాస్తి, రిటైర్డ్ ఆచార్యులు కృష్ణమాచార్య, రవికుమార్ మాట్లాడారు. సదస్సులో 150 పరిశోధన పత్రాల సారాంశాల (అబ్స్ట్రాక్ట్) సంకలనాన్ని విడుదల చేశారు. తెలంగాణ కామర్స్ అసోసియేషన్ వెబ్సైట్ను కూడా అతిథులు ఆవిష్కరించారు. కేయూ వీసీ ఆచార్య ప్రతాప్రెడ్డి -
ఎకై ్సజ్ శాఖలో భారీ బదిలీలు
సాక్షిప్రతినిధి, వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం ఎకై ్సజ్ శాఖలో భారీస్థాయిలో బదిలీలు చేపట్టింది. డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారుల (డీపీఈఓ) స్థాయిల్లో జారీ చేసిన ఉత్తర్వుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు అధికారులు ఇతర జిల్లాలకు బదిలీ అయ్యారు. అదే సమయంలో ఇతర జిల్లాల నుంచి కొందరు అధికారులు వరంగల్ అర్బన్ (హనుమకొండ), వరంగల్ రూరల్ (వరంగల్), ఎన్ఫోర్స్మెంట్ విభాగాల్లో పోస్టింగ్ పొందారు. అంజన్రావుకు ప్రమోషన్.. వరంగల్ డిప్యూటీ కమిషనర్ అంజన్రావుకు జాయింట్ కమిషనర్గా ప్రమోషన్ రాగా, ఇన్చార్జ్ డీసీగా కూడా ఉన్నారు. ఈ బదిలీల్లో డీజీబీసీఎల్ ఆర్ఆర్–1 చీఫ్ మేనేజర్గా ఉన్న హెచ్.దత్తురాజ్గౌడ్ను వరంగల్ డిప్యూటీ కమిషనర్గా నియమించారు. మల్కాజ్గిరి డీపీఈఓ కె.నవీన్కుమార్కు వరంగల్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్గా పోస్టింగ్ లభించింది. హనుమకొండ డీపీఈఓగా పనిచేస్తున్న కె.చంద్రశేఖర్కు ఇటీవల అసిస్టెంట్ కమిషనర్గా పదోన్నతి లభించగా ఆయనను టీజీబీసీఎల్ చీఫ్ మేనేజర్గా నియమించారు. ఆయన స్థానంలో కరీంనగర్ డీపీఈఓ పి.శ్రీనివాస్రావును వరంగల్ అర్బన్ డీపీఈఓగా, వరంగల్ రూరల్ డీపీఈఓ డి.అరుణ్కుమార్ను నిజామాబాద్ ఎన్ఫోర్స్మెంట్ ఏసీగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో సంగారెడ్డికి చెందిన ఎం.మణెమ్మను వరంగల్ రూరల్ డీపీఈఓగా నియమించారు. భూపాలపల్లి డీపీఈఓ వి.శ్రీనివాస్ను నిర్మల్కు, ఎన్ఫోర్స్మెంట్ వరంగల్లో పనిచేస్తున్న డి.శ్రీనివాస్రెడ్డిని వికారాబాద్ డీపీఈఓగా పంపించారు. జనగామ డీపీఈఓ కె.అనితకు సూర్యాపేట బాధ్యతలు అప్పగించారు. భూపాలపల్లి (ఏపీఈఎస్) ఎం.లింగాచారి వనపర్తి డీపీఈఓగా బదిలీ చేశారు. ఐదు నెలల నిరీక్షణకు తెర... ఎట్టకేలకు పోస్టింగ్ ఐదు నెలలుగా పోస్టింగుల కోసం ఎదురుచూస్తున్న అధికారులకు ఎట్టకేలకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఈ ఏడాది జనవరి చివరన పలువురికి ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఈ సందర్భంగా అసిస్టెంట్ ప్రొహిబిషన్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ (ఏపీఈఎస్)లకు జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ (డీపీఈఓ)లుగా, డీపీఈఓలకు అసిస్టెంట్ కమిషనర్(ఏసీ)లుగా, ఏసీలకు డిప్యూటీ కమిషనర్ (డీసీ)లుగా పదోన్నతి కలిగింది. అయితే, పదోన్నతులు పొందినప్పటికీ ఆ అధికారులు పాతస్థానాల్లోనే 5 నెలలుగా కొనసాగుతున్నారు. పదోన్నతుల తర్వాత విధుల కేటాయింపు లేకపోవడంతో పలువురు అధికారులు తాత్కాలిక ఏర్పాట్లతో కొనసాగాల్సి వచ్చింది. జిల్లాలు, విభాగాల్లో ఖాళీలు ఉన్నప్పటికీ పోస్టింగ్ ప్రక్రియ ఆలస్యం కావడంతో అసంతృప్తి వ్యక్తమైంది. అయితే, తాజాగా ప్రభుత్వం ఒకేసారి డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, డీపీఈఓ, ఏపీఈఎస్ స్థాయి అధికారులకు పోస్టింగ్ ఇవ్వడంతో ఐదు నెలలుగా ఎదురుచూస్తున్న వారికి ఊరట లభించింది. డిప్యూటీ కమిషనర్, ఏసీ, డీపీఈఓలకు స్థానచలనం వరంగల్ డీసీగా దత్తురాజ్గౌడ్.. ఏసీగా నవీన్కుమార్ హనుమకొండ డీపీఈఓగా శ్రీనివాస్రావు.. వరంగల్కు మణెమ్మ ఉమ్మడి వరంగల్లో అధికారుల రాకపోకలు.. పలువురికి కొత్త బాధ్యతలు -
తినుబండారాలపై టాస్క్ఫోర్స్ దాడులు
● పాడైన రూ.1.06 లక్షల విలువైన సరుకులు స్వాధీనం రామన్నపేట/ఖిలావరంగల్ : పాడైపోయిన వంటనూనెలు, హానికర రసాయనాలతో తినుబండారాలు తయారు చేస్తున్న వ్యాపారి ఇంటిపై టాస్క్ఫోర్స్ అధికారులు గురువారం దాడి నిర్వహించారు. ఇందులో సుమారు రూ.1,06,780 విలువైన పాడైపోయిన ఆహార పదార్థాలు, రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ అధికారుల కథనం.. టాస్క్ఫోర్స్ బృందం.. ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి చింతల్ ప్రాంతంలోని ఓ ఇంట్లో నిర్వహిస్తున్న మరియా ట్రేడర్స్పై తనిఖీలు నిర్వహించారు. ఇందులో పరిశ్రమలో వినియోగానికి అనర్హమైన వంటనూనెలు, ఫుడ్ కలర్లు, ఇతర ఆహార పదార్థాలు నిల్వ ఉంచినట్లు గుర్తించారు. అనంతరం పరిశ్రమ యజమానిని తరమం ఆశీర్వాదంగా గుర్తించి 361 కిలోల ఖారా, 114 కిలోల భోంది, 80 కిలోల చేగోడి, 30 కిలోల కారం, 8 బాక్సుల ఫుడ్ కలర్తోపాటు సుమారు 60 కిలోల పాడైపోయిన వంటనూనెలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మొత్తం రూ.1,06,780 ఉంటుందని అధికారుల అంచనా. షాపు సీజ్ చేసి స్వాధీనం చేసుకున్న సరుకులను ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించినట్లు టాస్క్ఫోర్స్ అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ మంగీలాల్, ఎస్సై చందర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మౌనిక, తదితరులు పాల్గొన్నారు. -
హాట్ సీట్ దక్కేదెవరికో?
కాజీపేట అర్బన్: రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలో కీలక బాధ్యతలు నిర్వర్తించే ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్ పోస్ట్ మళ్లీ ఓ సారి ఖాళీ కానుంది. దీంతో హాట్ సీట్గా పేరుగాంచిన వరంగల్ డీఆర్ పోస్ట్ దక్కేదెవరికో అంటూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. 2024లో అటెండర్ స్థాయి నుంచి డీఐజీ స్థాయి వరకు జరిగిన బదిలీల్లో భాగంగా జిల్లా రిజిస్ట్రార్గా విధులు నిర్వహిస్తున్న హరికోట్ల రవి హైదరాబాద్ ఆడిట్ విభాగంలో చేరగా, హైదరాబాద్లో విధులు నిర్వహిస్తున్న ఫణీందర్ జిల్లా రిజిస్ట్రార్గా బాధ్యతలు స్వీకరించారు. ఏడాదిలోపే డిప్యుటేషన్పై.. హైదరాబాద్ నుంచి వరంగల్ జిల్లా రిజిస్ట్రార్గా బాధ్యతలు స్వీకరించిన ఫణీందర్ ఏడాదిలోపే డిప్యుటేషన్పై హైదరాబాద్, మహబూబ్నగర్ జిల్లా ఎఫ్ఏసీగా బదిలీ అయ్యారు. దీంతో కరీంనగర్ జిల్లా రిజిస్ట్రార్ ప్రవీణ్కుమార్ గతేడాది జూలైలో వరంగల్ జిల్లా రిజిస్ట్రార్ ఎఫ్ఏసీగా బాధ్యతలను స్వీకరించారు. ఏడాదిలోపే కరీంనగర్ జిల్లా రిజిస్ట్రార్గా, వరంగల్ ఎఫ్ఏసీ జిల్లా రిజిస్ట్రార్గా విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్కుమార్ ఇటీవల డీఐజీగా పదోన్నతి పొంది ఖాళీగా ఉన్న కరీంనగర్ డీఐజీ పోస్ట్ ఉత్తర్వులు అందుకున్నారు. దీంతో ఏడాదిలోపే మళ్లీ జిల్లా రిజిస్ట్రార్ పోస్ట్ ఖాళీ అయ్యింది. తిరిగి డిప్యుటేషన్పై వెళ్లిన ఫణీందర్ బాధ్యతలు స్వీకరిస్తారా? లేక పూర్తిస్థాయి అధికారిగా హాట్ సీట్ను దక్కించుకుంటారా? అనే చర్చ కొనసాగుతోంది. పైరవీల పరంపర.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్ స్థాయి అధికారులు పదోన్నతి రేసులో ఉన్నారు. దీంతో జిల్లా రిజిస్ట్రార్గా వరంగల్లో చేరేందుకు ఇద్దరు జాయింట్ –1 సబ్ రిజిస్ట్రార్లు గురిపెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉండగా.. ఖమ్మం జిల్లాకు చెందిన జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్లు సైతం పదోన్నతి లభిస్తే వరంగల్ డీఆర్ పోస్ట్ మాకే కావాలంటూ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకునేందుకు పైరవీలు ముమ్మరం చేసినట్లు సమాచారం. వరంగల్ రిజిస్ట్రార్ పోస్టు కోసం పైరవీలు ఏడాదిగా ఎఫ్ఏసీ.. ఇటీవల పదోన్నతితో ఖాళీ నియామకంపై సర్వత్రా చర్చ -
నాణ్యత పాటించకపోతే బిల్లుల్లో కోత
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ వరంగల్ అర్బన్: అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించకపోతే బిల్లుల్లో కోత పెడతామని హనుమకొండ కలెక్టర్, గ్రేటర్ వరంగల్ ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. వరంగల్లో ఏనుమాముల ఏరియా, ధర్మారం రోడ్డు, డాక్టర్స్కాలనీ, కాశిబుగ్గలో గురువారం ఆమె పర్యటించారు. అభివృద్ధి పనులు పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలిచ్చారు. కాశిబుగ్గ సీతారామాంజనేయ ఆలయంలో పూర్తి చేసిన గ్రానైట్ ఫ్లోరింగ్ పనులను కలెక్టర్ కొలతలు వేసి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఈఈ సంతోశ్బాబు, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, డీఈలు రంగారావు, సురేశ్, వర్క్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
చివరి దశలో భూసేకరణ
సాక్షి, వరంగల్: మామునూరు విమానాశ్రయ అభివృద్ధి కోసం చేపట్టిన భూసేకరణ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే అత్యధిక భూములకు పరిహారం చెల్లించిన అధికారులు ప్రస్తుతం గుంటలుగా ఉన్న భూములపై దృష్టి సారించారు. ఈ భూములకు సంబంధించి సర్వే పూర్తి చేసి పరిహారం చెల్లిస్తే ఎయిర్పోర్టు విస్తరణకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తయినట్లేనని అధికారులు భావిస్తున్నారు. విమానాశ్రయ అభివృద్ధికి అవసరమైన భూముల్లో ఇప్పటికే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) వద్ద 696.14 ఎకరాలు ఉన్నాయి. అదనంగా 253 ఎకరాల భూమి అవసరమైంది. ఇందులో 30 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా, మిగిలిన 223 ఎకరాలు ప్రైవేట్ వ్యక్తుల పట్టా భూములు. అలాగే 12 కుటుంబాల ఇళ్లకు పరిహారం కూడా ఈ ప్రక్రియలో భాగంగా ఉంది. అయితే ఈ ప్రైవేట్ భూముల్లో 216 ఎకరాలకు పరిహారం చెల్లింపు ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. భూ యజమానుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేశారు. ఇక కోర్టు వివాదాల్లో ఉన్న 15 ఎకరాల భూమికి సంబంధించిన పరిహారం మొత్తాన్ని జిల్లా కోర్టులో డిపాజిట్ చేశారు. న్యాయపరమైన వివాదం తేలిన తర్వాత సంబంధిత భూ యజమానులకు ఆ మొత్తం అందేలా చర్యలు తీసుకున్నారు. మొత్తంగా 330 మంది భూనిర్వాసితుల్లో సుమారు 295 మందికి పరిహారం అందింది. వ్యవసాయ భూమికి రూ.1.20 కోట్లు, వ్యవసాయేతర భూమికి గజానికి రూ.4,887 ధరగా నిర్ణయించిన జిల్లా నెగోషియేషన్ కమిటీ నిర్ణయం మేరకు నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లిలో 203 ఎకరాల వ్యవసాయ భూమి, 13 ఎకరాల వ్యవసాయేతర భూమికి కలిపి రూ.270 కోట్ల వరకు చెల్లించారు. గుంటలుగా ఉన్న మరో ఏడు ఎకరాల భూమిని సర్వే చేసి వారికి వ్యవసాయభూమి ధరకు అనుగుణంగా చెల్లించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు రెండు విడతలుగా రూ.295 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.మామునూరు ఎయిర్పోర్టుకు ఇప్పటికే 216ఎకరాల అప్పగింత భూనిర్వాసితులకు రూ.270 కోట్ల చెల్లింపు దశలవారీగా ఏఏఐకు భూ బదలాయింపు గుంటల లెక్కన ఉన్న మరో ఏడు ఎకరాల సర్వేకు సన్నాహాలు నెలరోజుల్లో పూర్తి చేసి కేంద్రానికి అప్పగించేలా చర్యలు -
ఏడు ఎకరాలకు ప్రత్యేక సర్వే..
మిగిలిన ఏడు ఎకరాల భూమి గుంటలుగా ఉండటంతో వాటి స్వరూపం, విస్తీర్ణం, యాజమాన్య వివరాల నిర్ధారణ కోసం ప్రత్యేక సర్వే చేపట్టాలని రెవెన్యూ అధికారులు నిర్ణయించారు. ఈ సర్వే పూర్తయిన వెంటనే పరిహారం చెల్లించనున్నారు. మరో 30 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు ముందుకెళ్తున్నారు. ఇంకోవైపు భూమి హద్దుల స్థిరీకరణకు ఇప్పటికే ఏఏఐ బిడ్లు పిలిచిన సంగతి తెలిసిందే. సాధ్యమైనంత తొందరగా ఏఏఐకు ఆయా కన్సల్టెన్సీ సంస్థలు ఇచ్చే మార్కింగ్ నివేదికతో ఆ తర్వాత నిర్మాణ పనులను టెండర్లు పిలిచే అవకాశముంది. ఇప్పటికే రన్వే రహదారి గురించి నిట్ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. చిన్న నగరాలను రాష్ట్ర, దేశ రాజధానులతో కలిపేందుకు కేంద్రం తీసుకొచ్చిన ఉడాన్ –2016 (ఉడో దేశ్ కీ ఆమ్ నాగరిక్) పథకం కింద మామూనూరు విమానాశ్రయాన్ని 2022 సెప్టెంబర్లో ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇది అందుబాటులోకి వస్తే అనేకమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కడంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశముంది. -
‘సర్’లో భాగస్వాములు కావాలి
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో ఓటర్లు భాగస్వాములు కావాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పిలుపునిచ్చారు. క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తన కుటుంబ సభ్యుల వివరాలను ఇంటింటి గణన ఫారంలో స్వయంగా నమోదు చేసి బూత్ స్థాయి అధికారులకు (బీఎల్ఓలు) అందజేశారు. ఈసందర్భంగా కలెక్టర్ జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటి గణన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. బీఎల్ఓలు ప్రతి ఇంటిని సందర్శించి కుటుంబ సభ్యుల వివరాలను సేకరించడంతో పాటు గణన ఫారాలను అందజేస్తారని చెప్పారు. అర్హులైన ప్రతీ ఓటరు తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకుని బీఎల్ఓలకు పూర్తి సహకారం అందించాలని కోరారు. ప్రత్యేక సమగ్ర సవరణ విజయవంతం కావడానికి ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, అధికారులు, సిబ్బంది అందరూ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కోరారు. హనుమకొండ ఎన్నికల నాయబ్ తహసీల్దార్ విఠల్, ఆర్ఐ దశరథ్రాంరెడ్డి, సూపర్వైజర్, బీఎల్ఓ విజయ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ తహసీల్లో హెల్ప్ డెస్క్ ప్రారంభం కాశిబుగ్గ: ఓటర్ల సందేహాలను నివృత్తి చేయడానికి వరంగల్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్ హెల్ప్ డెస్క్ను కలెక్టర్ డాక్టర్ సత్యశారద గురువారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె హెల్ప్ డెస్క్ పనితీరును పరిశీలించి పలు సూచనలిచ్చారు. అర్హులు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని ఆమె ఆదేశించారు. అదనపు కలెక్టర్ గణేశ్, వరంగల్ తహసీల్దార్ శ్రీకాంత్ పాల్గొన్నారు. వరంగల్ కొత్తవాడలో ప్రారంభమైన ఇంటింటి ఎస్ఐఆర్ సర్వేను కలెక్టర్ సత్యశారద పరిశీలించారు. బీఎల్ఓను సర్వే విధానం, వివరాలు అడిగి తెలుసుకున్నారు. సర్ సర్వే విజయవంతం కావడానికి పూర్తిస్థాయిలో ప్రజలు సహకరించాలని పేర్కొన్నారు. తహసీల్దార్ శ్రీకాంత్, బీఎల్ఓలు, అధికారులు పాల్గొన్నారు. అలాగే, దేశాయిపేటలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం నిర్వహించారు. -
కాజీపేట క్రూ డిపోకు ట్రైన్ మేనేజర్లు
● ఉత్తర్వులు జారీ చేసిన అధికారులు కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే లోకోపైలెట్ల క్రూ డిపో కార్యాలయానికి 8 మంది ట్రైన్ మేనేజర్లకు సంబంధించి బదిలీ ఉత్తర్వులు జారీ అయినట్లు రైల్వే నాయకులు తెలిపారు. రెండు సంవత్సరాల నుంచి కాజీపేట క్రూ డిపోకు సిబ్బంది బదిలీపై వచ్చారని, ఈ ఏడాది 8 మంది ట్రైన్ మేనేజర్లును కాజీపేటకు బదిలీ చేస్తూ సికింద్రాబాద్ రైల్వే అధికారులు గురువారం ఉత్తర్వులు జారీ చేసినట్లు రైల్వే సంఘ్ లోకోరన్నింగ్ బ్రాంచ్ సెక్రటరీ పాక రాజ్కుమార్ తెలిపారు. విజయవాడ వద్ద గల గాలా క్రూ డిపో కార్యాలయం నుంచి 8 మంది ట్రైన్ మేనేజర్లు రెక్వెస్ట్ బదిలీపై త్వరలో కాజీపేటకు రానున్నట్లు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ జనరల్ సెక్రటరీ మర్రి రాఘవయ్య కృషితో ట్రైన్ మేనేజర్ల బదిలీలు జరుగుతున్నాయని రాజ్కుమార్ తెలిపారు.అల్పాహారంలో బల్లి ప్రత్యక్షం ● కాశిబుగ్గలోని ఓ హోటల్లో ఘటన ● రూ.10వేల జరిమానా విధించిన అధికారులు కాశిబుగ్గ: వరంగల్ కాశిబుగ్గలోని ఓ టిఫిన్ సెంటర్లో అల్పాహారంలో చనిపోయిన బల్లి ప్రత్యక్షమైంది. దీనిని చూసిన వినియోదారుడు షాక్కు గురయ్యాడు. గురువారం కాశిబుగ్గలోని ఓ టిఫిన్ సెంటర్కు వెళ్లిన ఆ వ్యక్తి వడ తింటున్న సమయంలో బల్లి కళేబరం ముక్కలుగా కనిపించడంతో ఆందోళనకు గురయ్యాడు. వెంటనే టిఫిన్ సెంటర్ యజమానిని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడని బాధితుడు ఆరోపించారు. ఈ విషయంపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించగా వారు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. తనిఖీలు చేపట్టి బ్రేక్ఫాస్ట్కు సంబంధించిన ఆహార పదార్థాలు, పిండిని పరిశీలించారు. అనంతరం ఫుడ్ సేఫ్టీ అధికారి మౌనిక హోటల్ నిర్వాహకుడికి రూ.10వేల జరిమానా విధించడంతో పాటు వారం రోజులు టిఫిన్ సెంటర్ మూసివేయాలని ఆదేశించారు. బాలుడిపై లైంగిక దాడి! రామన్నపేట: వరంగల్ రామన్నపేట ప్రాంతంలో 8 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి జరిగినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. బాధితుడి తల్లి తన ఇద్దరు కుమారులతో కలిసి 6 సంవత్సరాలుగా తన తల్లి ఇంటి వద్ద ఉంటోంది. ఈనెల 18వ తేదీన ఆమె విధులకు వెళ్లగా పిల్లలు పాఠశాలకు వెళ్లి సాయంత్రం ఇంటికి చేరుకున్నారు. రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో ఇంటి బయట ఆడుకుంటున్న 8 ఏళ్ల బాలుడిని పొరుగింటికి చెందిన 16 ఏళ్ల బాలుడు తన ఇంటికి తీసుకెళ్లి తలుపులు మూసివేసి లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బంధువైన మహిళ వెతుకుతూ వెళ్లి విషయం గుర్తించి బాలుడి తల్లికి సమాచారం అందించింది. తల్లి అక్కడికి చేరుకోగా తన కుమారుడు దుస్తులు సరిచేసుకుంటుండగా గుర్తించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. బాలుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించిన కారణంగా ఫిర్యాదు చేయడంలో ఆలస్యం జరిగినట్లు పేర్కొన్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మట్టెవాడ సీఐ కరుణాకర్ తెలిపారు. -
నీటితొట్టెలో పడి చిన్నారి మృతి
చిట్యాల: నీటితొట్టెలో పడి రెండేళ్ల చిన్నారి మృతి చెందిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి చిట్యాల మండలంలోని తిర్మలాపూర్లో గురువారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. తిర్మలాపూర్ గ్రామానికి చెందిన కంచు మౌనిక–బీరన్న దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా, బీరన్న తన గొర్రెలమందను మేతకోసం గ్రామ శివారులోకి తీసుకెళ్లాడు. మందలోని ఒక గొర్రెపిల్లకు పాము కరవడం గమనించి ఆయన భార్య మౌనికకు సెల్ఫోన్ ద్వారా సమాచారం అందించి మందులు, ఇంజక్షన్లు పంపించమని చెప్పాడు. దీంతో ఆమె తన బంధువుల ద్వారా గొర్రెలమంద వద్దకు మందులు పంపించింది. పాము కరిచిన గొర్రెపిల్ల ఎలా ఉందని తెలుసుకునేందుకు మౌనిక పక్కింటికి వెళ్తుండగా.. కూతురు హాన్వి ఆమె వెనుకే వెళ్లింది. తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో కూతురు కనిపించలేదు. చుట్టు పక్కల వెతికినా చిన్నారి ఆచూకీ తెలియలేదు. తన ఇంటి ఎదుట ఉన్న నీటి తొట్టెలో చూడగా కనిపించింది. దీంతో ఆమె కేకలు వేస్తూ కూతురు హాన్విని బయటకు తీయగా అప్పటికే మృతి చెందింది. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ఆదరణ అంతంత మాత్రమే!
హన్మకొండ: పీఎం కుసుం పథకంలో సోలార్ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే చెల్లించే యూనిట్ ధరపై ఇప్పటికే రైతులు పెదవి విరుస్తుండగా.. ఉరుము ఉరిమి మీదపడిన చందంగా డిస్కంలు రైతులకు చెల్లించే యూనిట్ ధరను తగ్గించాలని నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. యూనిట్ కాస్ట్ తక్కువగా ఉందని సోలార్ప్లాంట్ ఏర్పాటు చేయడానికి చాలా మంది ముందుకు రాలేదు. పీఎం కుసుం పథకం కింద యూనిట్ ధర రూ.3.13 చెల్లిస్తామని డిస్కం పీపీఏ (పవర్ పర్చేజ్ అగ్రిమెంట్) చేసుకుంది. ప్లాంట్కు ఉపయోగించే ఉపకరణాలపై జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ప్లాంట్ ఏర్పాటు వ్యయం తగ్గుతున్న క్రమంలో యూనిట్ కాస్ట్ తగ్గించాలని డిస్కంలు నిర్ణయం తీసుకున్నాయి. రూ.3.13 నుంచి రూ.2.98కి అంటే 15 పైసలు తగ్గించాలని కోరుతూ టీజీ ఎన్పీడీసీఎల్ తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలిలో పిటిషన్ వేసింది. దీనిపై జూలై 8న బహిరంగ విచారణ చేపట్టాలని ఈఆర్సీ నిర్ణయం తీసుకుంది. ఈనెల 30 వరకు ఈఆర్సీ అభ్యంతరాలు స్వీకరిస్తుంది. బహిరంగ విచారణ తర్వాత ఈఆర్సీ ఏ నిర్ణయం తీసుకుంటుందో అనే ఆసక్తి నెలకొంది. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలోని 18 జిల్లాలో మొత్తం 2098 మంది 2,788.900 మెగావాట్ల సోలార్ప్లాంట్ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 520 మంది రైతులు 683.800 మెగావాట్లకు రూ. లక్ష చొప్పున ఈఎండీ చెల్లించారు. పీపీఏ మాత్రం 643 మెగావాట్లకు 447 మంది రైతులు చేసుకున్నారు. వేలల్లో దరఖాస్తులు వస్తే వందల్లో మాత్రమే పీపీఏలు చేసుకోవడాన్ని చూస్తే రైతులు డిస్కంలు చెల్లించే రేటుపై విముఖత ఉన్నట్లు అర్థమవుతోంది. గిట్టుబాటు కాని ధర.. రుణవాయిదాలు 12 ఏళ్ల వరకు చెల్లించాల్సి రావడం.. 25 ఏళ్ల వరకు యూనిట్ రేట్ పెంచకపోవడం వంటి కారణాలతో రైతుకు ప్రయోజనం లేకపోవడం.. ఈఎంఐలు చెల్లించడం ఇబ్బంది కావొచ్చనే ఆలోచన.. రైతు వాటాగా రూ.లక్షల్లో చెల్లించాల్సి రావడం.. ప్రతీ నెల ఆదాయం నిలకడగా వస్తుందనే నమ్మకం లేకపోవడం వెరసి సోలార్ప్లాంట్ ఏర్పాటుపై విముఖత వ్యక్తమైంది. దరఖాస్తులు చేసిన నాటి ఉత్సాహం ఈఎండీ చెల్లింపులో కనిపించలేదు. ఈఎండీ చెల్లించడంలో కనిపించిన శ్రద్ధ పీపీఏ చేసుకోవడంలో లేదు. పీపీఏ చేసుకున్న వారందరు కూడా సోలార్ప్లాంట్ ఏర్పాటు అంశంపై సందిగ్ధంలో పడ్డారు. దీంతో 447 మంది 643 మెగావాట్లకు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లకు 18 మెగావాట్ల 9 సోలార్ ప్లాంట్లు పూర్తికావడం చూస్తే రైతుల్లో విముఖతకు నిదర్శనం. రైతుల నుంచి ఆశించినస్థాయిలో స్పందన రాకపోవడం, ప్రాజెక్టులో పురోగతి మందగించడంతో విద్యుత్ కొనుగోలు ధర తగ్గింపు ప్రతిపాదనపై ఈఆర్సీ తీసుకునే నిర్ణయం కీలకం కానుంది. రైతులు ఆగ్రహంగా ఉన్నారని తెలిసి కూ డా డిస్కంలు ఈఆర్సీకి 15 పైసలు తగ్గింపు కోరు తూ పిటిషన్ దాఖలు చేయడం వెనుక ఉద్దేశమేమిటో అర్థం కావడం లేదని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే తక్కువగా ఉన్న ధరను మరింత తగ్గిస్తే పథకం అమలుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు ఆసక్తి కనబరచని రైతులు యూనిట్కు 15 పైసలు తగ్గించాలని డిస్కంల నిర్ణయమే కారణం ఈఆర్సీలో పిటిషన్ దాఖలు చేసిన టీజీ ఎన్పీడీసీఎల్ దరఖాస్తులు 2,098.. పీపీఏ చేసుకున్నది 447 మంది ఇప్పటి వరకు పూర్తయిన సోలార్ప్లాంట్లు 9 మాత్రమేసోలార్ పవర్ను ప్రోత్సహించేందుకు పీఎం కుసుం..కేంద్ర ప్రభుత్వం సోలార్ విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు, సోలార్ ప్లాంట్ ఏర్పాటుపై రైతులను ప్రోత్సహించేందుకు ప్రధాన మంత్రి కిసాన్ ఉర్జా సురక్షా ఎవం ఉత్థాన్ మహాభియాన్ (పీఎం కుసుం) పథకాన్ని తీసుకొచ్చింది. ప్రధానంగా రైతులను సౌర విద్యుత్ ఉత్పత్తి వైపు ప్రోత్సహిస్తోంది. రాష్ట్రాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వ నరుల అభివృద్ధి సంస్థ, టీజీ ఎన్పీడీసీఎల్, టీజీ ఎ స్పీడీసీఎల్ ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తోంది. -
పచ్చళ్ల తయారీ కేంద్రంపై దాడి
కాశిబుగ్గ: వరంగల్ కాశిబుగ్గలో అపరిశుభ్ర వాతావరణంలో పచ్చళ్లు తయారు చేస్తూ, నిల్వ ఉంచుతున్న కేంద్రంపై టాస్క్ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు. గురువారం ఇంతెజార్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాశిబుగ్గ సాయి వీధిలో ఉన్న ఓ గృహంలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో పెద్ద ఎత్తున కుళ్లిన పచ్చడి ముడి సరుకులు, ఆహార పదార్థాలు నిల్వ ఉంచినట్లు గుర్తించారు. వీటిని చిన్న ప్యాకెట్లలో ప్యాక్ చేసి స్థానిక కిరాణా షాపులు, ఇతర చిన్న వ్యాపార కేంద్రాలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించిన అరికెల శ్రీనివాస్ను అదుపులో తీసుకున్నారు. అలాగే, 750 కిలోల టమాట, 900 కిలోల మామిడి, 200 కిలోల నిమ్మకాయలు, 100 కిలోల ఉసిరికాయలు, 150 కిలోల అల్లం–వెల్లుల్లి ఫేస్ట్తో కూడిన మొత్తం రూ.2,25, 000 విలువైన కుళ్లిన కల్తీ ఆహార నిల్వ లను స్వాధీనం చేసుకున్నారు. కాగా, పట్టుబడిన వ్యక్తిని, స్వాధీనం చేసుకున్న సరుకును తదుపరి చర్యల నిమిత్తం ఇంతెజార్గంజ్ పోలీసులకు అప్పగించినట్లు టాస్క్ఫోర్స్ అధికారులు తెలిపారు. దాడిలో టాస్క్ఫోర్స్ ఏసీపీ ఎ.మధుసూదన్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ బండారి రాజు, ఆర్ఎస్సై భానుప్రకాశ్, సిబ్బంది పాల్గొన్నారు. రూ.2.25 లక్షల కల్తీ నిల్వలు స్వాధీనం చేసుకున్న పోలీసులు -
గ్రేటర్ వరంగల్ నగరంలో మాయమవుతున్న ఫుట్పాత్లు
ఆక్రమణలతో ఇబ్బంది పడుతున్న పాదచారులు షాపులు.. షెడ్లు.. డబ్బాలతో గందరగోళం అద్దెకిస్తూ నాయకుల వసూళ్లు అధికారుల మౌనంతో ప్రజలకు అవస్థలు హైకోర్టు ఆగ్రహంతోనైనా ఆక్రమణలు తొలగేనా?●నగరంలోని హనుమకొండ చౌరస్తా, నయీంనగర్, బాలసముద్రం, కిషన్పుర, కేయూసీ, ఎంజీఎం, పోచమ్మ మైదాన్, జేపీఎన్ రోడ్డు, హంటర్ రోడ్డు, నక్కలగుట్ట, బస్టాండ్ ఏరియా, కాజీపేట తదితర ప్రాంతాల్లో ఫుట్పాత్లు పూర్తిగా ఆక్రమణకు గురయ్యాయి. ఎక్కడో ఒక చోట చిరు వ్యాపారులు తాత్కాలికంగా వ్యాపారం చేస్తుండగా, మరికొన్ని చోట్ల శాశ్వత ఆక్రమణలు ఏర్పడ్డాయి. -
నగరాభివృద్ధి, వ్యాపార విస్తరణకు సీఎల్పీ దోహదం
వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: నగరాభివృద్ధి, వ్యాపార కార్యకలాపాల విస్తరణ, రవాణా ఖర్చుల తగ్గింపు, సరుకు రవాణా సామర్థ్య పెంపుకు సిటీ లాజిస్టిక్ ప్లాన్ (సీఎల్పీ) దోహదపడుతుందని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. సిటీ లాజిస్టిక్ ప్లాన్ (సీఎల్పీ) అమలుపై బుధవారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. నగర పరిధిలో సరుకు రవాణాకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితులు, రవాణా సౌకర్యాలు, ట్రాఫిక్ సమస్యలు, గిడ్డంగులు, మార్కెట్లు, లాజిస్టిక్ అవసరాలపై సమగ్రంగా చర్చించారు. సీఎల్పీ రూపకల్పనకు అవసరమైన సమాచారాన్ని సంబంధిత శాఖలు సమన్వయంతో అందించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డీఆర్వో విజయలక్ష్మి, జీఎం ఇండస్ట్రియల్ నరసింహమూర్తి, డిప్యూటీ డైరెక్టర్ (సీఅండ్ ఈపీ) హైదరాబాద్ సుధీన్పాల్, జిల్లా ప్రణాళిక శాఖ అధికారి చంద్రకళ, అధికారులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీఖిలా వరంగల్: వరంగల్ శివనగర్లోని మండల తహసీల్దార్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జి.సంధ్యారాణి బుధవారం ఆకస్మిక తనిఖీ చేపట్టారు. భూ ఆక్రమణలపై సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె స్పందించారు. ఈ మేరకు కార్యాలయంలోని భూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులను విచారించినట్లు తెలిసింది. ల్యాండ్ రికార్డులను సమగ్రంగా సేకరించి మరింత లోతైన అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. దీనిపై అదనపు కలెక్టర్ సంధ్యారాణిని వివరణ కోరగా.. విచారణ ఏమీ లేదని, సాధారణంగా తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించినట్లు స్పష్టం చేశారు. -
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులు గడువులోగా పూర్తి చేయాలని జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లకు వెంటనే నోటీసులు జారీ చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలోని ప్రధాన, ఉప డ్రైనేజీల్లో పూడికతీత పనులు యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని చెప్పారు. కొత్తగా కమర్షియల్, గృహ నల్లా కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి నిర్ణీత వ్యవధిలో మంజూరు చేయాలని ఆదేశించారు. బల్దియా ఎస్ఈ రాజ్కుమార్, ఈఈలు రవికుమార్, సంతోష్బాబు, మహేందర్, మాధవి, సంజయ్, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. -
గురువారం శ్రీ 25 శ్రీ జూన్ శ్రీ 2026
నేటి నుంచి ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ వివరాలు సేకరిస్తున్న బీఎల్ఓ ● నెల రోజులపాటు కొనసాగనున్న ప్రక్రియ ● అవగాహన కోసం ప్రజలకు పలు సూచనలు ● హనుమకొండ జిల్లాలో ఇప్పటివరకు ఓటర్ల మ్యాపింగ్ 76.48 శాతం.. ● దామెర మండలం అగ్రస్థానం, వరంగల్ మండలం చివరి స్థానంహన్మకొండ అర్బన్: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో జూన్ 25 (గురువారం) నుంచి జూలై 24 వరకు ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్ –2026) కార్యక్రమం చేపట్టనున్నారు. అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో నమోదు కావడం, వివరాల్లో ఉన్న పొరపాట్లను సరిచేయడం, అనర్హుల పేర్లను తొలగించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. హనుమకొండ జిల్లాలో ఇప్పటివరకు ఓటర్ల మ్యాపింగ్ 76.48 శాతం పూర్తయ్యింది. జిల్లాలో కార్యక్రమాలు ఇలా.. హనుమకొండ జిల్లాలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో భాగంగా బీఎల్ఓ యాప్ ద్వారా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలోని పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల పరిధిలో జూన్ 24 నాటికి మొత్తం 5,09,014 మంది ఓటర్లలో 3,89,306 మంది ఓటర్ల మ్యాపింగ్ పూర్తికాగా, 1,19,708 మంది ఓటర్ల మ్యాపింగ్ పెండింగ్లో ఉంది. జిల్లా వ్యాప్తంగా మ్యాపింగ్ శాతం 76.48గా నమోదైంది. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటి ఇంటి వివరాల సేకరణ, జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా విడుదల, జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణ, జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు దరఖాస్తులు, అభ్యంతరాల పరిశీలన, అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా విడుదల చేస్తారు. ఈ ప్రక్రియ ద్వారా చేయగలిగేవి.. కొత్త ఓటరుగా పేరు నమోదు చేసుకోవచ్చు. పేరు, వయస్సు, చిరునామా తదితర వివరాల్లో మార్పులు చేయించుకోవడం. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మారిన వివరాలను నవీకరించుకోవడం. మరణించిన లేదా అనర్హుల పేర్ల తొలగింపునకు సమాచారం అందించడం. ప్రజలకు సూచన.. అర్హులైన ప్రతిఒక్కరూ తమ పేరు ఓటరు జాబితా లో ఉందో లేదో నిర్ధారించుకోవాలి. బూత్ స్థాయి అధికారులకు సహకరించి అవసరమైన వివరాలు, పత్రాలు అందించాలి. వివరాలకు ఓటరు సహాయ కేంద్రం నంబర్ 1950లో సంప్రదించవచ్చు. పర్యవేక్షణ.. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎన్నికల అధికారులు, నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారులు, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పర్యవేక్షిస్తారు. నియోజకవర్గాలవారీగా చూస్తే.. ● పరకాల నియోజకవర్గం 87.36 శాతం మ్యాపింగ్తో ముందంజలో ఉండగా, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 68.02 శాతం మాత్రమే నమోదైంది. రెండు నియోజకవర్గాల మధ్య దాదాపు 19.34 శాతం వ్యత్యాసం కనిపిస్తోంది. ● మండలాల వారీగా చూస్తే దామెర మండలం 92.12 శాతం మ్యాపింగ్తో జిల్లాలో అగ్రస్థానంలో నిలిచింది. ఆత్మకూరు మండలం (90.94 శాతం), నడికూడ (90.92 శాతం) మండలాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు వరంగల్ మండలంలో 66.02 శాతం మాత్రమే మ్యాపింగ్ నమో దై జిల్లాలో చివరి స్థానంలో నిలిచింది. హనుమకొండ మండలంలో 67.73 శాతం, కాజీపేట మండలంలో 69.50 శాతం మ్యాపింగ్ నమోదైంది. ● ఓటర్ల సంఖ్య పరంగా హనుమకొండ మండలం ముందంజలో ఉంది. ఈ మండలంలో 2,10,521 మంది ఓటర్లు ఉండగా, వారిలో 1,42,584 మంది మ్యాపింగ్ పూర్తయ్యింది. అదే మండలంలో అత్యధికంగా 67,937 మంది ఓటర్ల మ్యాపింగ్ ఇంకా పెండింగ్లో ఉంది.హనుమకొండ జిల్లా మొత్తం మ్యాపింగ్ : 76.48%జిల్లా మొత్తం ఓటర్లు: 5,09,014మ్యాపింగ్ పూర్తయిన ఓటర్లు: 3,89,306వ స్థానం నడికూడవ స్థానం ఆత్మకూర్వరంగల్ పశ్చిమ 68.02%పరకాల 87.36%నియోజకవర్గాల వారీగా మ్యాపింగ్పెండింగ్లో ఉన్న ఓటర్లు: 1,19,708అవసరమైన ఆధారపత్రాలుజనన ధ్రువీకరణ పత్రం, పాస్పోర్టు, పాన్కార్డు, ఆధార్కార్డు, డ్రైవింగ్ లైసెన్్స్, విద్యాసంస్థల ధ్రువీకరణ పత్రాలు, ప్రభుత్వ శాఖలు జారీ చేసిన గుర్తింపు పత్రాలు, వెనుకబడిన తరగతులు, ఎస్సీ, ఎస్టీ ధ్రువీకరణ పత్రాలు, ఇతర అధికారిక ఆధార పత్రాలు. ఇంటింటి సర్వేలో ఏం జరుగుతుంది? బూత్స్థాయి అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలను ధ్రువీకరిస్తారు. అనంతరం ప్రతి ఓటరుకు వివరాల నమోదు పత్రం అందజేస్తారు. ఓటర్లు పత్రాన్ని పూర్తిగా నింపి అవసరమైన ఆధారాలతో అధికారికి అందజేయవచ్చు. ఇంటర్నెట్ ద్వారా కూడా వివరాలను సమర్పించే అవకాశం ఉంటుంది. 85 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, ప్రత్యేక వర్గాల వారికి బీఎల్ఓలు, బీఎల్ఏలు సాయం అందిస్తారు. -
పారదర్శక ఓటరు జాబితే లక్ష్యం
హన్మకొండ అర్బన్: పారదర్శక ఓటరు జాబితా రూపకల్పనే లక్ష్యంగా జిల్లాలో నిర్వహించనున్న ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం (ఎస్ఐఆర్–2026) విజయవంతానికి ప్రజలు, రాజకీయ పార్టీలు, మీడియా ప్రతినిధులు సహకరించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్–2026 అమలు విధానం, ఎన్యుమరేషన్ ప్రక్రియ, ఓటర్ల బాధ్యతలపై అవగాహన కల్పించేందుకు బుధవారం కలెక్టరేట్లో మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ ప్రజలకు సరైన సమాచారం చేరవేయడంలో మీడియా కీలక పాత్ర పోషించాలన్నారు. జిల్లాలోని వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గాల్లో చేపట్టిన ముందస్తు ప్రక్రియకు మంచి స్పందన లభించిందని, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 68 శాతం, పరకాలలో 87 శాతం మేర మ్యాపింగ్ పూర్తయ్యిందని వెల్లడించారు. జూలై 24 వరకు బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు అందజేస్తారని తెలిపారు. ఇంట్లో లేని ఓటర్లను కనీసం మూడుసార్లు సందర్శించి ఫారాలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 2002 జాబితాలో ఇప్పటికే ఉన్న అర్హులైన ఓటర్లకు ఈ దశలో ఎలాంటి అదనపు పత్రాలు అవసరం లేదని, వివరాలు ధ్రువీకరించి సంతకం తీసుకుంటే సరిపోతుందని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన అర్హులైన వారిని కొత్త ఓటర్లుగా నమోదు చేయాలని, మరణించిన లేదా శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్ల వివరాల ను నిబంధనల ప్రకారం నమోదు చేయాలని సూచించారు. ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటు నమోదు కావడం లేదా తప్పుడు వివరాలు సమర్పించడం చట్టవిరుద్ధమని కలెక్టర్ హెచ్చరించారు. ఎన్నికల చట్టంలోని సెక్షన్–31 ప్రకారం డబుల్ ఓటు నమోదు నేరమని, అలాంటి వారిపై క్రిమినల్ కేసులతోపాటు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. ఎస్ఐఆర్కు సంబంధించిన సందేహాల నివృత్తి కోసం కలెక్టరేట్, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అలాగే, 1800 425 1126 టోల్ఫ్రీ నంబర్ను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. అదనపు కలెక్టర్ ఎన్.రవి, డీఆర్ఓ కె.శ్రీనివాస్, డీపీఆర్ఓ అయూబ్అలీ, ఆర్డీఓ వెంకటేశ్, తహసీల్దార్ రవీందర్రెడ్డి పాల్గొన్నారు. ఎస్ఐఆర్–2026 విజయవంతానికి సహకరించాలి డబుల్ ఓట్లపై చర్యలు తప్పవు హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ -
పల్స్పోలియోను విజయవంతం చేయాలి
రామన్నపేట: జిల్లాలో ఈనెల 28 నిర్వహించే పల్స్పోలియోను విజయవంతం చేయాలని హనుమకొండ డీఎంహెచ్ఓ ఎస్డీ రాంకుమార్ వైద్యాధికారులను అదేశించారు. కలెక్టరేట్లోని డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి జిల్లాలోని పీహెచ్సీల వైద్యాధికారులు, సూపర్వైజర్లతో బుధవారం జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ జిల్లాలో 84,301 మంది ఐదు సంవత్సరాల్లోపు పిల్లలకు పోలియో చుక్కలు ఇప్పించా ల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జిల్లాలోని 42 మంది టీబీ వ్యాధిగ్రస్తుల ఖాతాల్లో నిక్షయ్ పోషణ్ యోజన ద్వారా రూ.వెయ్యి చొప్పున జమ చేసినట్లు డీఎంహెచ్ఓ రాంకుమార్ తెలిపారు. డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ ఎస్.రజిత, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ జ్ఞానేశ్వర్ తదితరులు ఏర్పాట్లపై సమీక్షించారు. -
విస్తృతంగా మొక్కలు నాటాలి
హనుమకొండ అదనపు కలెక్టర్ రవి హన్మకొండ అర్బన్: వనమహోత్సవంలో భాగంగా గ్రామాల్లో విస్తృతంగా మొక్కలు నాటాలని హనుమకొండ అదనపు కలెక్టర్ ఎన్.రవి అధికారులను ఆదేశించారు. వనమహోత్సవం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, ఉపాధి హామీ పనులు, మరుగుదొడ్ల నిర్మాణంపై జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, ఎంపీఓలతో బుధవారం ఆయన కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. జెడ్పీ సీఈవో శేషాద్రి, డీఆర్డీఓ మేన శ్రీను, డీపీఓ లక్ష్మీరమాకాంత్, పంచాయతీరాజ్ ఈఈ సైదుల్రెడ్డి, అడిషనల్ డీఆర్డీఓ లక్ష్మీప్రసన్న పాల్గొన్నారు. -
పక్కాగా విద్యుత్ వినియోగం లెక్క
హన్మకొండ: విద్యుత్ వినియోగంపై కచ్చితమైన లెక్కలు సాధించడం, విద్యుత్ చౌర్యం అరికట్టడం, ట్రాన్స్ఫార్మర్లపై పెరుగుతున్న భారం (ఓవర్లోడ్)ను సకాలంలో గుర్తించేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ట్రాన్స్ఫార్మర్లకు స్మార్ట్మీటర్లను అమర్చే కార్యక్రమాన్ని చేపట్టింది. ముందుగా పైలట్ ప్రాజెక్టుగా హనుమకొండ మచిలీబజార్ 33/11 కేవీ సబ్స్టేషన్ పరిధిలోని అన్ని డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు బిగించాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. మచిలీబజార్ 33 కేవీ సబ్స్టేషన్ పరిధిలో మొత్తం 106 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు 224 ఫీడర్లున్నాయి. ప్రతి ఫీడర్కు స్మార్ట్మీటరు బిగిస్తున్నారు. డ్యాష్బోర్డులో వివరాల నమోదు.. స్మార్ట్మీటర్లు ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ ప్రవాహం, వినియోగం, నష్టాలపై రియల్టైంలో వివరాలు అందుబాటులోకి వస్తాయి. టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేంద్రీకృత వ్యవస్థలో (డ్యాష్బోర్డు) ప్రతి అంశం నమోదు అవుతుంది. దీని ద్వారా ట్రాన్స్ఫార్మర్ ద్వారా సరఫరా అయిన విద్యుత్ పరిమాణం, అదేపరిధిలోని వినియోగదారుల మీటర్లలో నమోదైన వినియోగాన్ని పోల్చడం ద్వారా విద్యుత్ చౌర్యం జరిగిన ప్రాంతాలను సులభంగా గుర్తించే అవకాశం ఉంది. సాధారణ సాంకేతిక నష్టాలను మించి వ్యత్యాసం కనిపిస్తే సంబంధిత ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకునేందుకు మార్గం సులభమవుతుంది. అధికభారం పడడంతో చాలా ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. నాణ్యమైన విద్యుత్ సరఫరాకు దోహదం.. స్మార్ట్మీటర్లతో ట్రాన్స్ఫార్మర్పై పడుతున్న లోడ్ను నిరంతరం పర్యవేక్షించవచ్చు. భారం ప్రమాదకర స్థాయికి చేరక ముందే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడం, అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం లేదా లోడ్ పంపిణీ చేయడం సులభం కానుంది. ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే విద్యుత్ చౌర్యం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. పంపిణీ నష్టాలపై కచ్చితమైన అంచనా తెలుసుకోవచ్చు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం వంటి ఘటనలు నియంత్రించవచ్చు. నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరాకు దోహదపడుతుంది. వినియోగదారులకు మెరుగైన సేవలు స్మార్ట్మీటర్ల ఏర్పాటు ద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించే అవకాశముంది. మచిలీబజార్ సబ్స్టేషన్ పరిధిలో చేపడుతున్న ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే దశలవారీగా హనుమకొండ జిల్లా అంతటా, అనంతరం ఇతర ప్రాంతాల్లో కూడా విస్తరించే అవకాశాలు ఉన్నాయి. స్మార్ట్ మీటర్ల ద్వారా అనేక ప్రయోజనాలున్నాయి. – బి.సామ్యానాయక్, హనుమకొండ ఎస్ఈ ట్రాన్స్ఫార్మర్లకు స్మార్ట్మీటర్లు ఏర్పాటు చేస్తున్న టీజీ ఎన్పీడీసీఎల్ విద్యుత్ చౌర్యం, ట్రాన్స్ఫార్మర్పై పెరుగుతున్న భారం సులువుగా గుర్తింపు పైలట్ ప్రాజెక్టుగా మచిలీబజార్ సబ్స్టేషన్ పరిధిలో పనులు ముమ్మరం -
ఆధునిక నమూనాలతో నగర పార్కులు
హనుమకొండ కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్పాయ్హన్మకొండ అర్బన్/వరంగల్ అర్బన్/హసన్పర్తి: నగరంలోని పార్కులను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఆధునిక నమూనాలు రూపొందించి అభివృద్ధి పనులు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ (డబ్ల్యూఆర్ఐ) ప్రతినిధులు, జీడబ్ల్యూఎంసీ అధికారులతో నగర పార్కుల అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ బాలసముద్రంలోని చిల్డ్రన్స్ పార్కును డబ్ల్యూఆర్ఐ రూపొందించిన ఆధునిక నమూనాల ఆధారంగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. వరంగల్ పరిధి కీర్తినగర్ పార్కుతోపాటు ఇతర పార్కులు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలను ఎంపిక చేసి సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ప్రజల అవసరాలు, పిల్లల వినోదం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. నగరంలో పచ్చదనం పెంపొందించడానికి, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడంలో పార్కులు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. సమావేశంలో డబ్ల్యూఆర్ఐ కన్సల్టెంట్ ప్రతినిధి ఎలైన్ అగీత్, జీడబ్ల్యూఎంసీ ఎస్ఈ రాజ్కుమార్, ఈఈలు రవికుమార్, సంతోశ్బాబు, డీఈ రాజ్కుమార్ పాల్గొన్నారు. గోపాల్పూర్ ఊరచెరువు పరిశీలన.. గోపాల్పూర్ ఊరచెరువును మంగళవారం హనుమకొండ కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్పాయ్ సందర్శించారు. డీసిల్టేషన్, రిటైనింగ్ వాల్ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. పనుల నాణ్యత, వేగంపై ఇరిగేషన్, డబ్ల్యూఎంసీ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో చెరువు అభివృద్ధి పనులకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. పనులను వారంరోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆమె వెంట జీడబ్ల్యూఎంసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికుమార్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజ్కుమార్, తహసీల్దార్ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. -
అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి
హన్మకొండ: అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటిస్తూ నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. హనుమకొండ వాజ్పేయి నగర్, లష్కర్ బజార్లోని ఆర్అండ్బీ క్వార్టర్స్లో నిర్మిస్తున్న ఇండోర్ సబ్స్టేషన్ల పనులను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరం, పట్టణ ప్రాంతాల్లో స్థలభావ సమస్యను అధిగమించడానికి ఇండోర్ సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నామన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు సంస్థ పరిధిలోని పలు జిల్లాల్లో ఇండోర్ సబ్స్టేషన్ల నిర్మాణ పనులను వేగవంతం చేసినట్లు తెలిపారు. హనుమకొండ ఎస్ఈ బి.సామ్య నాయక్, టౌన్ డీఈ (ఆపరేషన్) జి.సాంబారెడ్డి, డీఈ (ఎమ్మార్టీ, కన్స్ట్రక్షన్) ఎ.విజేందర్ రెడ్డి, డి.ఈ టెక్నికల్ భాస్కర్, నయీంనగర్ ఏడీ రాజు, సివిల్ ఈఈ వెంకటేశ్వర్లు, ఏ.డీ.ఈ హుస్సేన్, ఏఈలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి -
లక్షణాలు గుర్తిస్తే వివరాలివ్వండి
రామన్నపేట: మీజిల్స్, రుబెల్లా, పోలియో నియంత్రణలో భాగంగా పిల్లల్లో జ్వరంతో పాటు దద్దుర్లు ఉన్నా, పిల్లల శరీరంలోని ఏ భాగమైన పాక్షికంగా బలహీనపడినా వారి పూర్తి వివరాలను వెంటనే డీఎంహెచ్ఓ కార్యాలయంలో అందించాలని హనుమకొండ డీఎంహెచ్ఓ ఎస్డీ రామ్కుమార్ సూచించారు. మీజిల్స్ రుబెల్లా సర్వేలెన్స్ (నిఘా)లో భాగంగా మంగళవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న పిల్ల ల వైద్య నిపుణులు, ఇండియన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్స్ అసోసియేషన్ బాధ్యులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో పరకాల ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వంశీకృష్ణ, పిల్లల వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ పి.రమేశ్, కోశాధికారి డాక్టర్ అన్వేషిని, డిప్యూటీ సివిల్ సర్జన్లు డాక్టర్ రజిత, డాక్టర్ మురళి, జీఎంహెచ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మానస నరహరి, ప్రోగ్రాం అధికారులు జ్ఞానేశ్వర్, శ్రీనివాస్, రుబీనా, డెమో వి.అశోక్రెడ్డి, స్టాటిస్టికల్ అధికారి విజయలక్ష్మి, తదితరులున్నారు. వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సోమవారం ప్రారంభమైన పోలీస్ డ్యూటీ మీట్ రెండో రోజు ఉత్సాహంగా కొనసాగింది. మూడు రోజుల పాటు జరుగనున్న పోలీస్ డ్యూటీ మీట్ పోటీల్లో అధికారులు, సిబ్బంది కంప్యూటర్ పరిజ్ఞానం, ఫోరెన్సిక్ సైన్స్, ఫింగర్ ప్రింట్స్ లిఫ్టింగ్ అండ్ ప్యాకింగ్, బాంబ్ డిస్పోజల్, డాగ్ స్క్వాడ్, ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ విభాగాల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించనున్నారు. కేయూ క్యాంపస్: తెలంగాణ కామర్స్ అసోసియేషన్ 7వ వార్షిక సదస్సును ఈనెల 25న కేయూలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలో నిర్వహించనున్నారు. వర్సి టీ కాలేజీ ఆఫ్ కామర్స్, తెలంగాణ కామర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో వికసిత్భారత్–47 న్యూ డైమెన్షన్స్ ఇన్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ ఇన్ది ఎరా ఆఫ్ యాక్ట్’ అంశంపై ఈసదస్సును నిర్వహించనున్నారు. ఇందులో కృత్రిమ మేధ ప్రభావం, వ్యాపార విశ్లేషణ, ఆర్థిక రంగం, ఫిన్టిక్ స్టార్టప్లు, మార్కెటింగ్, మానవ వనరుల అభివృద్ధిపై చర్చలు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కాజీపేట అర్బన్: నిట్ కళాశాలలో అగ్నిమాపక భద్రత అవగాహన, శిక్షణలో భాగంగా సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫెసిలిటీ (సీఆర్ఐఎఫ్) తెలంగాణ అగ్నిమాపక విపత్తు ప్రతిస్పందన, అత్యవసర సేవలు, పౌర రక్షణ శాఖ సహకారంతో మంగళవారం ఉద్యోగులు, పరిశోధన విద్యార్థుల కోసం అగ్నిప్రమాదాల నివారణపై మాక్ డ్రిల్ నిర్వహించారు. హనుమకొండ జిల్లా అగ్నిమాపక అధికారి సుదర్శన్ రెడ్డి రిసోర్స్ పర్సన్గా పాల్గొని అగ్నిమాపక భద్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో నిట్ వరంగల్ విద్యార్థి సంక్షేమ విభాగం డీన్ ప్రొఫెసర్ కె.కిరణ్కుమార్, సీఆర్ఐఎఫ్ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎ.వీరేశ్బాబు, ప్రిన్సిపల్ సైంటిఫిక్ ఆఫీసర్ డి.రవీందర్రెడ్డి, నిట్ వరంగల్ అగ్నిమాపక భద్రతా అధికారి, కార్యక్రమ సమన్వయకర్త సజిత్, అగ్నిమాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యారణ్యపురి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ, పీజీ ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ కోర్సుల్లో 2026–27 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థి సేవావిభాగం (స్టూడెంట్స్ సర్వీసెస్) డైరెక్టర్ డాక్టర్ వై.వెంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ లేదా పీజీ చేయాలనుకునేవారు సమీపంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనూ, ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రాల్లోనూ ఆగస్టు 7లోగా సంప్రదించవచ్చునని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 18005990101, 04023680333, 040 23680444, ఫోన్ చేయొచ్చని సూచించారు. -
హోదా లభించేనా?
కాశిబుగ్గ: వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి మహర్దశ రానుందా? ఎంతోకాలం నుంచి వైద్యులు ఎదురు చూస్తున్న ‘అడిషనల్ డీఎంఈ’ హోదా లభించే అవకాశం ఉందా అంటే.. ఆస్పత్రి వర్గాల నుంచి అవుననే సమధానాలు వస్తున్నాయి. ఇన్నాళ్లు ఇన్చార్జ్ సూపరింటెండెంట్లతో నడుస్తున్న ఎంజీఎం ఆస్పత్రికి రెగ్యులర్ సూపరింటెండెంట్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దాదాపు 20 రోజుల నుంచి సూపరింటెండెంట్ లేకుండా ఖాళీగా ఉంటున్న ఈ పోస్టును రెగ్యులర్గా ఉండేలా ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు ప్రభుత్వం కూడా సానుకూలత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. మూడు, నాలుగు నెలల్లో వరంగల్లో 24 అంతస్తుల సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో రెగ్యులర్ సూపరింటెండెంట్ను నియమిస్తేనే అన్ని విధాలా శ్రేయస్కరంగా ఉంటుందని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి నుంచి ఇన్చార్జ్ల పాలనే.. వరంగల్లో ఎంజీఎం ఆస్పత్రి ప్రారంభం నుంచి ఇన్చార్జ్ సూపరింటెండెంట్ల పాలన కొనసాగుతోంది. ఇక్కడ అడిషనల్ డీఎంఈ పోస్టు లేకపోవడంతో ఇన్చార్జ్ సూపరింటెండెంట్లను ప్రభుత్వం నియమిస్తుంది. ఈ పోస్టు ఇన్చార్జ్ కావడంతో దూర ప్రాంతాల నుంచి సీనియర్ వైద్యులు రావడానికి సానుకూలత వ్యక్తం చేయట్లేదు. ఎంజీఎంలో పనిచేస్తున్న సీనియర్ వైద్యులచే ఇన్చార్జ్ల పాలన చేయిస్తున్నారు. సదరు వైద్యులు ఉద్యోగ విరమణ పొందేవరకు కూడా ఇక్కడే విధులు నిర్వహించారు. వీరిలో డాక్టర్ అశోక్ ఎగ్బోటే, డాక్టర్ రఘురాం, డాక్టర్ సత్యదేవ్, డాక్టర్ ఏఎన్ఆర్ లక్ష్మి, డాక్టర్ సురేందర్, డాక్టర్ కరుణాకర్రెడ్డి, డాక్టర్ దొడ్డా రమేశ్ ఉన్నారు. ఇన్చార్జ్ల పాలనకు తెరపడేనా? ఇన్నాళ్లు ఇన్చార్జ్ సూపరింటెండెంట్లతో నడుస్తున్న ఎంజీఎం సర్కారు దవాఖానకు మోక్షం లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రానున్న కాలంలో 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో రెగ్యులర్ సూపరింటెండెంట్ ఎంతైనా అవసరం అనే కోణంలో ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఈ కారణంగానే ఇన్చార్జ్ సూపరింటెండెంట్ నియామకంలో జాప్యం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నూతనంగా ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లాలోని మహబూబాబాద్, నర్సంపేట, జయశంకర్ భూపాలపల్లి, ములుగు ప్రభుత్వ ఆస్పత్రులకు రెగ్యులర్ సూపరింటెండెంట్లను నియమించిన ప్రభుత్వం ఉత్తర తెలంగాణ జిల్లాలకు పెద్దాస్పత్రి అయిన ఎంజీఎంకు లేకపోవడమేంటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఎంజీఎంపై నిర్లక్ష్యం చేస్తున్నారని ఇటీవల వరంగల్లో జరిగిన దిశ సమావేశంలో మండిపడ్డారు. ఎంజీఎం ఆస్పత్రి అధ్వానంగా మారుతోందని ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులను ప్రశ్నించారు. అడిషనల్ డీఎంఈ పోస్టు వస్తే.. వరంగల్ ఎంజీఎంకు అడిషనల్ డీఎంతో పోస్టు వస్తే రెగ్యులర్ సూపరింటెండెంట్ వస్తారు. ఇన్చార్జ్ల పాలనకు తెరపడుతుంది. ఈపోస్టులో జాయిన్ కావడానికి సీనియర్ వైద్యులు ఆసక్తి చూపుతారు. పదోన్నతుల అవకాశం ఉంటుంది. ఆస్పత్రికి పవర్తో పాటు ప్రత్యేక శ్రద్ధ పెరుగుతుంది. ఆస్పత్రి కూడా అన్ని విధాలా అభివృద్ధి జరుగుతుంది. రోగులకు మెరుగైన సేవలు అందుతాయి. కాగా, ఉస్మానియాలో రెండు సూపరింటెండెంట్ పోస్టులు, ఒక ప్రిన్సిపాల్ పోస్టు, వరంగల్లో ఎంజీఎంలో సూపరింటెండెంట్ పోస్టుకు అడిషనల్ డీఎంఈ క్యాడర్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎంజీఎంకు ‘అడిషనల్ డీఎంఈ’ హోదా కోసం ఎదురుచూపులు రెగ్యులర్ సూపరింటెండెంట్ పోస్టుతో తీరనున్న వెతలు -
సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగుల ధర్నా
హన్మకొండ: గ్రామీణ తపాలా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని అఖిల భారత గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు బొద్దున వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. దేశవ్యాప్త పిలుపులో భాగంగా మంగళవారం హనుమకొండ అదాలత్ కూడలిలోని హనుమకొండ పోస్టల్ డివిజన్ కార్యాలయం వద్ద గ్రామీణ తపాలా ఉద్యోగులు ధర్నా చేశారు. ఈధర్నాలో యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి, డివిజన్ ప్రెసిడెంట్ పెరుమాండ్ల తిరుపతి, నాయకులు జె.కుమారస్వామి, జాటోత్ బాపూజీ, ఎం.ఆనందం, ఎన్.శ్రీనివాస్, జి.వీరన్న, బి.సుధాకర్రెడ్డి, జి.లక్ష్మీనారాయణ, రమేశ్, శ్రీలత, దేవి, ఇందిర, కల్పన, రాణి, సాంబమూర్తి, యూసుఫుద్దీన్, పిట్టల అశోక్, రాజ్కుమార్, సోమలింగం, ఉద్యోగులు పాల్గొన్నారు. -
పీజీ సైన్స్ కోర్సుల నూతన సిలబస్కు ఆమోదం
కేయూ క్యాంపస్ : అంతర్జాతీయ విద్యాప్రమాణాలకు అనుగుణంగా నాన్ప్రొఫెషనల్ పీజీ సైన్స్ కోర్సుల నూతన సిలబస్ను ఆమోదించారు. మంగళవారం కేయూలో సైన్స్ విభాగాల బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్లు, అధ్యాపకులతో నిర్వహించిన సమావేశంలో కేయూ ఓఎస్డీ బి. వెంకట్రామ్రెడ్డి, ఓయూ, కేయూ సైన్స్ విభాగాల డీన్లు జితేందర్నాయక్, హనుమంతు, అకడమిక్ విభాగం అసిస్టెంట్ రిజి స్ట్రార్ కోలశంకర్ పాల్గొన్నారు. నాన్ ప్రొఫెషనల్ పీజీ సైన్స్ కోర్సుల సవరించిన సిలబస్ను ఇప్పటికే రూపొందించిన అంశాలపై బీఓఎస్లు వివరించాక ఆమోదించారు. వాల్యూయాడెడ్ ఇంటర్డిసిప్లినరీ, స్కిల్హెన్హ్యాన్స్మెంట్, ఒకేషనల్, ఓపెన్ ఎలక్టివ్ కోర్సులతోపాటు క్లాంటంటెక్నాలజీ, ఏఐ, రీసెర్చ్ మెథడాలజీ, రీసెర్చ్ప్రాజెక్టు వంటి అంశాలను ప్రవేశపెట్టి చర్చించారు. అంతర్జాతీయ విద్యాప్రమాణాలకు అనుగుణంగా అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్, సస్టెయినబుల్ గోల్స్ ఆధారంగా పాఠ్యాంశాలను రూపొందించినట్లు తెలిపారు. -
ఈసీ మార్గదర్శకాల ప్రకారం ఎస్ఐఆర్
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: అర్హులు ఓటరు జాబితాలో ఉండేలా, ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) చేపట్టనున్నట్లు వరంగల్ కలెక్టర్ సత్యశారద తెలిపారు. కలెక్టరేట్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 25 నుంచి ప్రారంభంకానున్న ఎస్ఐఆర్ ఓటర్ల జాబితా పారదర్శకంగా రూపొందించేందుకు బూత్ లెవల్ అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి దరఖాస్తులను అందజేసి నమోదు ప్రక్రియ చేపడతారని పేర్కొన్నారు. మరణించిన ఓటర్లు, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వెళ్లినవారు, ఒకే వ్యక్తి పేరు రెండుసార్లు నమోదైన సందర్భాల్లో మాత్రమే పేర్ల తొలగింపు చేపడతామని స్పష్టం కలెక్టర్ చేశారు. 1200 మందికి పైగా ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాల అవసరాన్ని బట్టి అదనపు బూత్లు కూడా ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అందరు సహకరించాలని కోరారు. ఓటర్లకు ఎస్ఐఆర్పై అవగాహన కల్పించేందుకు మీడియా పాత్ర కీలకమన్నారు. ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, సందేహాలుంటే ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాలల్లో సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, ఆర్డీలు సుమ, ఉమారాణి ఉన్నారు. -
మైనర్లకు వాహనం ఇవ్వొద్దు
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం: వాహనదారులు మైనర్లకు వాహనం ఇచ్చి రోడ్డు ప్రమాదాలకు కారణమై చట్టపరమైన చిక్కుల్లో పడొద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతీ పోలీస్ అధికారి నిరంతరం కృషి చేయడంతోపాటు, ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లుపేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వాహనదారులకు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా కొంతమంది బాధ్యతారాహిత్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటిలో అధికంగా మైనర్ వాహనదారులు ఉంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం పర్వతగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వృద్ధులతో పాటు, ఓ బాలుడు మరణించగా, మరో బాలుడు తీవ్ర గాయాలతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు వివరించారు. ఈ రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం మైనర్ అతి వేగంగా వాహనం నడపడమేనని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనపై ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కోరారు. రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే ప్రతీ వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలకు కట్టుబడి ఉండాలని, ముఖ్యంగా మైనర్లకు వాహనం అందజేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. ఇలాంటి ఘటనల్లో వాహన యజమాని, మైనర్ తల్లిదండ్రులను బాధ్యులుగా చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు జైలుకు తరలిస్తామని సీపీ హెచ్చరించారు. -
సీజీఆర్ఎఫ్–1 వరంగల్ చైర్మన్గా నాగప్రసాద్
హన్మకొండ : వరంగల్ విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక (సీజీఆర్ఎఫ్–1) చైర్మన్గా జి.నాగప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు పని చేస్తున్న ఎన్.వేణుగోపాలచారి పదవీ కాలం పూర్తి కావడంతో టీజీ ఎన్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో కమర్షియల్ చీఫ్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్న జి.నాగప్రసాద్ను పూర్తి అదనపు బాధ్యతలతో సీజీఆర్ఎఫ్–1గా నియమిస్తూ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. నాగప్రసాద్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సఽభ్యులు, సిబ్బంది పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. -
కేడర్తో సమావేశాలు.. సభ్యత్వ నమోదు.. శిక్షణ తరగతులు
సాక్షిప్రతినిధి, వరంగల్ : హైదరాబాద్ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యం కలిగిన నగరంగా గ్రేటర్ వరంగల్కు ప్రత్యేక స్థానం ఉంది. దీంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు ప్రత్యేక దృష్టి సారించాయి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు, ఆ తదుపరి అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మరింత బలపడేందుకు ఆ మూడు పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. కాంగ్రెస్: అధికార బలాన్ని కేడర్ బలంగా మార్చే ప్రయత్నం.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వరంగల్లో తన పట్టు మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో తరచూ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, మహిళా సంక్షేమ పథకాల అమలును ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతలను కేడర్కు అప్పగిస్తున్నారు. ఇటీవల జిల్లా, నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తల సమావేశాలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకత్వం సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. సోమవారం ఏఐసీసీ కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్లు మంత్రులు, ఎమ్మెల్యేలు, కేడర్ సదస్సులు నిర్వహించి జోష్ నింపారు. భవిష్యత్లో సీఎం రేవంత్రెడ్డి, రాష్ట్ర మంత్రులు, పార్టీ రాష్ట్ర నాయకులతో భారీ బహిరంగ సభలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్: కోల్పోయిన బలాన్ని తిరిగి సాధించే యత్నం ఒకప్పుడు గ్రేటర్, ఉమ్మడి వరంగల్లో బలమైన ఆధిపత్యం చెలాయించిన బీఆర్ఎస్ ప్రస్తుతం తిరిగి కేడర్ను సమీకరించే పనిలో నిమగ్నమైంది. గ్రామ, వార్డు, డివిజన్ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపే ప్రయత్నం చేస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రి టి.హరీష్రావు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు వరుస పర్యటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హామీల అమలు, రైతు సమస్యలు, నిరుద్యోగం, అభివృద్ధి పనుల ఆలస్యం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రాజకీయంగా లాభపడాలని పార్టీ భావిస్తోంది. సభ్యత్వ నమోదు, కేడర్ సమావేశాలు, సోషల్ మీడియా బలోపేతంపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. ఈ సందర్భంగా సోమవారం హనుమకొండ జిల్లాలో పర్యటించిన కేటీఆర్ కేడర్ను ఉత్తేజపరిచారు. బీజేపీ: ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనే లక్ష్యం... ఉమ్మడి వరంగల్లో తన ఓటు బ్యాంకును పెంచుకుంటూ వస్తున్న బీజేపీ ఈసారి మరింత దూకుడుగా ముందుకు సాగుతోంది. బూత్ స్థాయి కమిటీల ఏర్పాటు, సభ్యత్వ నమోదు, శిక్షణ తరగతులు, యువతపై ప్రత్యేక దృష్టితో పార్టీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు, కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్లు సహా జాతీయ నాయకుల పర్యటనలకు ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 29న జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటన ఉంటుందని పార్టీ నేతలు ఇటీవల ప్రకటించారు. మోదీ ప్రభుత్వ అభివద్ధి, కేంద్ర నిధులు, జాతీయత అంశాలను ప్రధాన అజెండాగా తీసుకొని ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వరుస కార్యక్రమాలతో ఎన్నికల వేడి.. సభ్యత్వ నమోదు, బూత్, వార్డు స్థాయి కమిటీల ఏర్పాటు, కేడర్ శిక్షణ శిబిరాలు, సోషల్ మీడియా విభాగాల బలోపేతం, యువత, మహిళా విభాగాల విస్తరణపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు వరుస కార్యక్రమాలు చేస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రాజకీయ పరిణామాలు ఉత్తర తెలంగాణ రాజకీయాలపై ప్రభావం చూపుతాయి. అందుకే ప్రతి పార్టీ గ్రేటర్ ఎన్నికలను కేవలం స్థానిక ఎన్నికలుగా కాకుండా భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్గా భావిస్తోంది. బలపడేందుకు ప్రధాన పార్టీల ప్రయత్నాలు ‘గ్రేటర్’ గెలుపే లక్ష్యంగా కసరత్తు హైదరాబాద్ తర్వాత కీలకంగా మారిన వరంగల్ -
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ షురూ
కేయూ క్యాంపస్: టీజీఈఎప్సెట్ 2026 (ఎంపీసీ–స్ట్రీమ్) అభ్యర్థులకు సోమవారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభమైంది. హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో, వర్సిటీ క్యాంపస్లోని అడ్మిషన్ల డైరెక్టర్ కార్యాలయం, వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల హెల్ప్లైన్ సెంటర్లలో అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించారు. ఈ ప్రక్రియ ఈనెల 29 వరకు కొనసాగనుంది. సోమవారం ఆయా హెల్ప్ లైన్ సెంటర్లలో సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించుకున్న అభ్యర్థులకు అధికారులు ధ్రువపత్రాలు అందించారు. -
గ్రేటర్లో చెప్పులరిగేలా తిరిగినా ఫలితం శూన్యం
పెండింగ్లో 400నల్లా కనెక్షన్ దరఖాస్తులు వరంగల్ అర్బన్: వందలాది మంది నగరవాసులు నల్లా కనెక్షన్ కోసం బల్దియా కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆరు నెలలుగా 400కు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయంటే అధికారుల పనితీరు ఎలా ఉందో చెప్పవచ్చు. కాగా డబ్బులిస్తే మాత్రం కొత్త నల్లా కనెక్షన్ వారంలోగా వస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, కొత్త నల్లా కనెక్షన్ కోసం ఇంటి నంబరు కలిగి ఉన్న అర్హులు రూ.100 చెల్లించి దరఖాస్తు చేసుకుంటే నల్లా కనెక్షన్ మంజూరు చేయాలి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేలా ఉంది. రోడ్డు కట్టింగ్, పైపులైన్ దూరం తదితర కారణాలతో అధిక రుసుం వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇంత వరకు బాగానే ఉన్నా.. క్షేత్రస్థాయిలో లైన్మెన్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, ఏఈలు దరఖాస్తుదారులు అడిగినంత ఇస్తేనే నల్లా కనెక్షన్ మంజూరు చేస్తున్నట్లు.. లేదంటే జాప్యం చేస్తూ అనేక కొర్రీలు పెట్టి కాలయాపన చేస్తుండడంపై దరఖాస్తుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేరుకే రూ.వంద.. ఖర్చు రూ.10 వేలు! నల్లా కనెక్షన్ దరఖాస్తు చేసుకునే మందు ప్లంబర్ను ఆశ్రయిస్తే రూ. 500 ఖర్చవుతోంది. బల్దియాకు దరఖాస్తు చేస్తే రూ.100. తదుపరి విచారణ పేరిట వర్క్ ఇన్స్పెక్టర్, లైన్మెన్ రూ. 2వేల నుంచి రూ.3 వేలు వసూలు చేస్తున్నారు. నల్లా కనెక్షన్ మంజూరు చేయాలంటే ఏఈ నుంచి ఈఈ వరకు రూ.5 వేలు చెల్లించాల్సి వస్తోందని పేద, మధ్య తరగతి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైప్లైన్, కనెక్షన్ సామగ్రి తదితర పరికరాల కొనుగోలుతో మరో రూ.3 వేలు ఖర్చవుతోంది. విచారణ లేదు.. మంజూరూ లేదు.. సిటిజన్ చార్టర్ ప్రకారం దరఖాస్తు చేసుకున్న వా రం రోజుల్లోగా క్షేత్రస్థాయిలో విచారించాలి. నిబంధనల మేరకు వారం రోజుల్లో నల్లా కనెక్షన్ మంజూ రు చేయాలి. ఆరు నెలల కాలంలో సుమారు 400 కొత్త దరఖాస్తులు పెండింగ్లో ఉన్నప్పటికీ అధికా రులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంపై దరఖాస్తుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటాం కొత్త నల్లా కనెక్షన్లు నిబంధనల మేరకు మంజూరు చేయాలి. నిర్లక్ష్యం చేస్తే మోమోలు జారీ చేస్తాం. అక్రమ కనెక్షన్లు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – రాజ్కుమార్, బల్దియా ఎస్ఈ 3వ డివిజన్కు చెందిన రాజేశ్ మూడు నెలల క్రితం నల్లా కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇంత వరకు క్షేత్ర స్థాయి విచారణ చేయలేదు. కనెక్షన్ ఇవ్వలేదు. నీళ్ల కోసం గోస పడుతున్నాడు. ఖిలా వరంగల్కు చెందిన పబ్బ నరేశ్ గత నెల రోజుల క్రితం నల్లా కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇప్పటికీ కనెక్షన్ ఇవ్వలేదు. కాశిబుగ్గ, బల్దియా కార్యాలయం చూట్టూ ప్రదక్షిణలు చేసినా ప్రయోజనం శూన్యం. డబ్బులిస్తేనే పనవుతోందనే ఆరోపణలు


