Hanamkonda District News
-
33 కేవీ విద్యుత్ లైన్లో డిస్క్ల సమస్య
హన్మకొండ: 33 కేవీ విద్యుత్ లైన్లో తరచూ విద్యుత్ అంతరాయాలు కలుగుతుండడంతో సమస్య గుర్తించేందుకు విద్యుత్ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధి ఆరెపల్లి 220 కేవీ సబ్ స్టేషన్ నుంచి వరంగల్ ఉర్సు, హనుమకొండలోని న్యూ శాయంపేట వరకు మూడు సంవత్సరాల క్రితం 33 కేవీ లైన్ వేశారు. ఈ విద్యుత్ లైన్ ఏర్పాటైనప్పటి నుంచి తమకు అవస్థలు తప్పడం లేదని విద్యుత్ ఉద్యోగులు వాపోతున్నారు. నాసిరకం డిస్క్లు, ఇన్సులేటర్లు వాడడంతో అవి తరచూ పగిలిపోయి విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతోందని, ఈ సమస్యను గుర్తించడానికి పడుతున్న బాధలు వర్ణనాతీతమన్నారు. పగిలిన డిస్క్, ఇన్సులేటర్ గుర్తించడానికి ప్రతీ స్తంభాన్ని ఎక్కి దిగాల్సి వస్తోందని వాపోయారు. స్తంభం ఎక్కితేనే పగిలింది కనిపిస్తుందని, కింది నుంచి చూస్తే ఫాల్ట్ దొరకడం లేదని తెలిపారు. విద్యుత్ లైన్ వేసిన క్రమంలో నాణ్యమైన మెటీరియల్ వాడకపోవడంతోనే ఈ సమస్య తలెత్తుతుందని అంటున్నారు. ఈ విద్యుత్ లైన్లో తరచూ సరఫరాలో అంతరాయం కలుగడం, డిస్క్లు, ఇన్సులేటర్లు ఫెయిల్ కావడంపై టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి సీరియస్గా తీసుకున్నట్లు తెలిసింది. ఏప్రిల్లో జరిగిన సమీక్షలో విద్యుత్ లైన్ వేసిన కాంట్రాక్టర్ ద్వారా డిస్క్లు, ఇన్సులేటర్లన్ని మార్పించాలని సంబంధిత అధికారిని ఆదేశించారని సమాచారం. కానీ, వాటిని మార్చకపోవడంతో సమస్య పునరావృతమవుతూనే ఉంది. వారానికి ఒకసారి డిస్క్, ఇన్సులేటర్ ఫెయిల్, షాట్ సర్క్యూట్తో బ్రేక్ డౌన్ అవుతూ విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. రెండేళ్లలో 18 డిస్క్లు మార్చినట్లు ఉద్యోగ వర్గాలు తెలిపాయి. కాంట్రాక్టర్తో నాణ్యమైన డిస్క్లు, ఇన్సులేటర్లు బిగించకపోతే విద్యుత్ అంతరాయాలు తప్పవని, ఫాల్ట్ కనుక్కోవడానికి ప్రతీ స్తంభం ఎక్కి దిగాల్సిందేనని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికై నా టీజీ ఎన్పీడీసీఎల్ ఉన్నతాధికారులు స్పందించి వెంటనే సీఎండీ ఆదేశాల మేరకు కాంట్రాక్టర్తో నాణ్యమైన డిస్క్లు, ఇన్సులేటర్లు ఏర్పాటు చేయించాలని ఉద్యోగులు కోరుతున్నారు. టైర్ పగిలి డీసీఎం బోల్తా.. ● యువకుడి మృతి.. ముగ్గురికి గాయాలు ● మడికొండ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘటన మడికొండ: టైర్ పగిలి డీసీఎం బోల్తాపడిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం మడికొండ ఔటర్ రింగ్ రో డ్డుపై జరిగింది. మడికొండ ఇన్స్పెక్టర్ కిషన్ కథనం ప్రకారం.. డీసీఎంలో ఎస్బీఐ బ్యాంకు లాకర్లను తీసుకుని హైదరాబాద్ నుంచి భూపాలపల్లికి నలుగురు బయలుదేరారు. ఈ క్రమంలో ఉదయం 8.30 గంటల ప్రాంతంలో మడికొండ శివారు టెక్స్టైల్ పార్కు సమీపంలో డీసీఎం వెనుక టైర్ పగిలింది. దీంతో వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో లాకర్ మీదపడి హైదరాబాద్కు చెందిన ఎండీ జావీద్ఖాన్(24) అక్కడికక్కడే మృతి చెందాడు. వ్యాన్ క్యాబిన్లో ఉన్న ముగ్గురు ఎండి. హబీబ్ఖాన్, ఎండి. మోయిజ్ఖాన్, ఎండి. సలీమ్ఖాన్కు గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఎంజీఎం తరలించి, మృతదేహాన్ని పంచనామ నిమిత్తం ఇదే ఆస్పత్రికి తరలించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. మృతుడి బంధువు మోయిన్ఖాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు. నాసిరకం డిస్క్లు, ఇన్సులేటర్లతో అవస్థలు మార్పించాలని సీఎండీ ఆదేశం రెండున్నర నెలలు గడుస్తున్నా మార్చని అధికారులు విద్యుత్ సరఫరాకు అంతరాయం -
రాజేశ్కు రెండు ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో కొలువులు
పాలకుర్తి టౌన్: పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన చిలుకమారి రాజేశ్ రెండు ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం సాఽధించాడు. హ రియాణాలోని నిట్ కురుక్షేత్ర, చైన్నెలోని కాంచీపురం ట్రిపుల్ ఐటీ అండ్ మా న్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీలో (ఐఐఐటీడీఎం)లో కంప్యూటర్ సైన్స్(సీఎస్సీ) విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం సాధించాడు. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన చిలుకమారి సమ్మయ్య, స్వరూప దంపతుల కుమారుడు రాజేశ్ పాలకుర్తిలోని విద్యాజ్యోతి ఉన్నత పాఠశాలలో పదో తరగతి, వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కంప్యూటర్ ఇంజనీరింగ్లో డిప్లొమా, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని మాతృశ్రీ ఇంజనీరింగ్ క ళాశాలలో సీఎస్ఐ బీటెక్ పూర్తి చేశాడు. నిట్ సిక్కింలో ఎంటెక్, నిట్ వరంగల్లో సీఎస్ఈలో పీహెచ్డీ పూర్తి చేశాడు. ఆంధ్రప్రదేశ్లోని వీఐటీ అమరావతిలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తూనే నిట్ కురుక్షేత్ర, ఐఐఐటీడీఎం కాంచీపురంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం సాధించాడు. దీంతో రాజేశ్ను పలువురు అభినందించారు. పంచకర్మ ప్రాముఖ్యతను తెలుసుకోవాలి జనగామ: ఆయుర్వేద వైద్యంలో పంచకర్మ ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ప్రముఖ వైద్యులు సూచించారు. జనగామ వేద పంచకర్మ వెల్నెస్ సెంటర్, విశ్వ ఆయుర్వేద పరిషత్ తెలంగాణ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో స్టేట్ లెవల్ కౌశలం–2025 సదస్సు జరుగుతోంది. శనివారం వేద డాక్టర్ అంజిరెడ్డి అధ్యక్షతన ఆయుర్వేద వైద్య శాస్త్రంపై నిర్వహించిన సదస్సులో ప్రముఖ అధ్యాపకులు, వైద్య నిపుణులు ప్రయోగాత్మకజ్ఞానంతో పాటు తమ అనుభవాలు పంచుకున్నారు. డాక్టర్ సరస్వతి హిమబాల మాట్లాడుతూ సంప్రదాయ గ్రంథాల నుంచి ఆధునిక వైద్య చికిత్సల వరకు ఆయుర్వేదంలో పొందుపరిచి ఉందన్నారు. డాక్టర్ పంతులు రఘుపతి మాట్లాడుతూ పంచకర్మను సాధారణ వైద్య ప్రయోగాల్లో సమర్థవంతంగా ఎ లా అప్లయ్ చేయాలనే అంశంపై వివరణాత్మకంగా బోధించామన్నారు. డాక్టర్ సురేంద్రశర్మ మాట్లాడుతూ ఔషధ తయారీ ప్రక్రియ గురించి విద్యార్థులకు ప్రత్యక్ష బోధన ద్వారా అవగాహన కల్పించా మన్నారు. డాక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ ఆయుర్వేద వైద్యం గొప్పదనాన్ని తెలుసుకుని రోగులకు చికిత్స చేసే సమయంలో దానిని అమలు పర్చాలన్నారు. డాక్టర్ మల్లికార్జున్ మాట్లాడుతూ కంటి వ్యా ధులు, దుష్ఫలితాలకు సంబంధించి అనేక మందికి ఆయుర్వేద వైద్యం ద్వారా చికిత్సలు చేసి విజయం సాధించామన్నారు. ఆయుర్వేద వైద్యంలో అద్భుత ఫలితాలు సాధించి, రుజువు చేయడమే కాకుండా, యువ వైద్యులకు శాసీ్త్రయం, అనుభవాత్మకంగా పరిపూర్ణత సాధించేందుకే ఇలాంటి రాష్ట్ర స్థాయి సదస్సులను నిర్వహిస్తున్నామన్నారు. -
‘శివాని’ విద్యార్థుల విజయకేతనం
హసన్పర్తి: నీట్–2025 ఫలితాల్లో నగరంలోని ‘శివాని’ కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. కళాశాలకు చెందిన మాధురీముఖేశ్(495/720), ఆడెపు మనోజ్(451/720), ఇ.కార్తీక్(443/720), ఆరికెళ్ల నిస్సి(4 38/720) మార్కులు సాధించినట్లు ‘శివాని’ విద్యాసంస్థల కరస్పాండెంట్ టి. స్వామి తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచి ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాళ్లు జి.సురేందర్రెడ్డి,వి.చంద్రమోహన్,డైరెక్టర్లు రాజు, ఎన్.రమేశ్, ఎ. మురళీధర్, వి. సురేశ్, ఎస్. సంతోశ్రెడ్డి అభినందించారు. -
నీట్–25 ఫలితాల్లో ‘ఎస్ఆర్’ ప్రభంజనం
విద్యారణ్యపురి : నేషనల్ ఎల్జిబిలిటీ కమ్ ఎంట్రెన్స్టెస్ట్ (నీట్–యూజీ –25 ఫలితాల్లో ‘ఎస్ఆర్’ విద్యాసంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని ఆ విద్యాసంస్థల చైర్మన్ ఎ. వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్రెడ్డి, సంతోశ్ రెడ్డి శనివారం తెలిపారు. నీట్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో అన్ని కేటగిరీలు కలిపి పి. సాయిదివ్యాన్ ఆల్ ఇండియాలో 14వ ర్యాంకు, బి. ప్రియాంక 100వ ర్యాంకు, ఎం. వినయ్ 226వ ర్యాంకు, బి. గణేశ్ 671వ ర్యాంకు సాధించారని వారు తెలిపారు. రాష్ట్రంలోని ‘ఎస్ఆర్’ విద్యాసంస్థలకు చెందిన 210 మందికిపైగా విద్యార్థులు మెడిసిన్లో సీట్లు సాధించేలా ర్యాంకులు సాధించారని పేర్కొన్నారు. భవిష్యత్లో మరిన్ని ర్యాంకులు సాధించేలా తమ విద్యార్థులను తీర్చిదిద్దుతామని తెలిపారు. 50 సంవత్సరాల్లో పటిష్ట ప్రణాళికతో హైస్కూల్, జూనియర్ కాలేజీ, ఎంసెట్, ఐఐటీల్లో విద్యనందిస్తూ ప్రతీ ఏడాది జాతీయ స్థాయి పోటీపరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తున్నామన్నారు. ఈఏడాది జేఈఈ మెయిన్స్ –25 జాతీయ స్థాయిలో తమ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని వారు చెప్పారు. ఈ ఫలితాలు విద్యార్థులందరికీ స్ఫూర్తిదాయకం కావాలని తాము ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. -
‘షైన్’ విద్యార్థుల విజయదుందుభి
హన్మకొండ : నీట్–2025 ఫలితాల్లో ‘షైన్’ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి విజయదుందుభి మోగించారు. తమ కళాశాల విద్యార్థులు కార్పొరేట్కు దీటుగా నీట్లో అత్యుత్తమ ఫలితాలు సాధించారని ‘షైన్’ విద్యా సంస్థల చైర్మన్ మూగల కుమార్ తెలిపారు. షైన్ విద్యాసంస్థలు మొదటి నుంచి, నీట్, జేఈఈ, మెయిన్స్, అడ్వాన్స్లో అత్యుత్తమ శిక్షణ ఇస్తున్నాయన్నారు. నీట్లో జాతీయ స్థాయిలో జి. కీర్తన –498 మార్కులు , కె. సహస్ర– 497, డి. ఇందూ– 437, ఇ. వెంకట శివాణి–427 మార్కులు సాధించారని వివరించా రు. వీరితో పాటు 15 మంది విద్యార్థులు 300 పైగా మార్కులు సాధించారని తెలిపారు. ఉత్తమ ఫలి తాలు సాధించిన విధ్యార్థులను షైన్ విద్యాసంస్థల చైర్మన్ మూగల కుమార్, డైరెక్టర్లు మూగల రమ, మూగల రమేశ్, అధ్యాపకులు అభినందించారు. -
ఆస్తి కోసమే హత్య!
హసన్పర్తి: ఆస్తి కోసమే పిన తల్లి (చిన్నమ్మ)ని కుమారుడు గొడ్డలితో నరికి హత్యచేశాడని హనుమకొండ ఏసీపీ నర్సింహారావు అన్నారు. ఈ మేరకు కేయూ పోలీస్స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హత్య వివరాలు వెల్లడించారు. హసన్పర్తి మండలం పెగడపల్లికి చెందిన చల్లా శ్రీనివాస్రెడ్డి మొదటి భార్యకు ముగ్గురు కుమారులు. 30ఏళ్ల క్రితం మొదటి భార్య వనమ్మ మృతి చెందగా, వివిధ కారణాలతో ఇద్దరు కుమారులు కూడా తనువు చాలించారు. చిన్న కుమారుడు చల్లా భూపాల్రెడ్డి ఆలనా పాలనా తండ్రి శ్రీనివాస్రెడ్డి చూసుకున్నాడు. కొంతకాలం తర్వాత సరోజన అనే మహిళను శ్రీనివాస్రెడ్డి రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు. ఆస్తి తగదా.. శ్రీనివాస్రెడ్డి తనకున్న భూమిలో నుంచి 3.20 ఎకరాల భూమిని రెండో భార్య కూతుళ్లు పేర రిజిస్ట్రేషన్ చేయించాడు. దీంతో తనకు తెలియకుండా చెల్లెళ్ల పేరిట భూమి రిజిస్ట్రేషన్ చేయడంతో ఆ కుటుంబంలో గొడవలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు ఆ గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. కొడుకుకు భూమి కౌలుకు ఇవ్వొద్దు.. కాగా, పదిరోజుల క్రితం శ్రీనివాస్రెడ్డి కాలుకు దెబ్బ తగలడంతో వ్యవసాయ పనులకు దూరమయ్యాడు. దీంతో తన పేరిట ఉన్న 2.20 ఎకరాల భూమిని కొడుకు చల్లా భూపాల్రెడ్డికి కౌలుకు ఇవ్వాలని నిర్ణయించాడు. దీంతో భార్య సరోజన నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. ఆ భూమిని అల్లుళ్లకు కౌలుకు ఇవ్వాలని సరోజన వాదిస్తూ వచ్చింది. పథకంప్రకారం హత్య.. తనకు తెలియకుండానే 3.20 ఎకరాల భూమిని కూతుళ్ల పేరిట రిజిస్ట్రేషన్చేసుకోవడమే కాకుండా తండ్రి భూమిని కూడా అల్లుళ్లకు ఇవ్వాలని పినతల్లి గొడవ చేయడంతో ఆమెనుఎలాగైనా హత్యచేయాలని భూపాల్రెడ్డి పథకం పన్నాడు. ఇందులో భాగంగా ఈనెల 11వ తేదీ అర్ధరాత్రి పిన తల్లి సరోజన బయట నుంచి ఇంట్లోకి వస్తుండగా గేట్ వద్ద గొడ్డలితో నరికి హత్యచేశాడు. ఈ ఘటనపై మృతురాలి భర్త శ్రీనివాస్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని 24 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ వివరించారు. కాగా, నిందితుడిని పట్టుకోవడంతో ప్రతిభ కనబరిచిన పోలీస్ ఇన్స్పెక్టర్ రవికుమార్, ఎస్సైలు రవీందర్, శ్రీకాంత్, సిబ్బందిని ఏసీపీ అభినందించారు. పథకం ప్రకారమే మర్డర్ పినతల్లిని చంపిన కొడుకు.. 24 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నాం హనుమకొండ ఏపీసీ నర్సింహారావు -
రెడ్క్రాస్ సంస్థకు ఏడు అవార్డులు
కాజీపేట: ప్రపంచ రక్తదాత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రాజ్భవన్లో శనివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో హనుమకొండ రెడ్క్రాస్ బ్లడ్ సెంటర్ 7 అవార్డులను దక్కించుకుంది. రాష్ట్ర గవర్నర్, రెడ్క్రాస్ రాష్ట్ర అధ్యక్షుడు జిష్ణుదేవ్ వర్మ రక్తదాతలకు అవార్డులు ప్రదానం చేశారు. అ వార్డులు అందుకున్నవారిలో రాజేశ్వర్రావు(ఎస్ఆ ర్ యూనివర్సిటీ ఎన్సీసీ అసోసియేట్ ఆఫీసర్), సతీశ్చంద్ర(కిట్స్ ఎన్ఎస్ఎస్ కో–ఆర్డినేటర్), ప్రొఫెసర్ డి.శ్రీనివాసాచార్య(నిట్ డీన్ స్టూడెంట్ వెల్ఫే ర్), ఆకవరం శ్రీనివాస్, సంపత్రావు(డీఆర్డీఏ), ఎడ్ల రవీందర్(రక్తదానదాత), రవి(అడిషనల్ డీసీ పీ) ఉన్నారు. డాక్టర్ విజయచందర్ రెడ్డి, ఈవీ శ్రీని వాస్రావు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. -
ప్రమాణంచేసి పౌరుల ప్రాణాలు తీస్తారా!
సాక్షిప్రతినిధి, వరంగల్ : ‘ప్రశ్నించేవారంటే నరేంద్రమోదీకి భయం.. ఎర్రజెండా పార్టీలు, కమ్యూనిస్టులను లేకుండా చేయడానికి హత్యాకాండ కొనసాగిస్తున్నారు. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవులు చేపట్టి ఆపరేషన్ కగార్ పేరిట దేశ పౌరుల ప్రాణాలు తీస్తున్నారు’ అని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం హనుమకొండ కాకతీయ హోటల్లో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపెల్లి శ్రీనివాస్రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూనంనేని మాట్లాడారు. 2026 మార్చి నాటికి మావోయిస్టులను అంతం చేస్తామని, ఇంకా 11 మంది కీలక మావోయిస్టు నేతలు ఉన్నారని ప్రకటించడం అప్రజాస్వామికం, ఆటవికమని పేర్కొన్నారు. చట్టపరంగా శిక్షించాల్సి ఉన్నా చంపడం అప్రజాస్వామికమన్నారు. ఆపరేషన్ కగార్ను ఆపేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మాట్లాడుతూ.. ‘కాళేశ్వరం ప్రాజెక్టు తెల్ల ఏనుగు లాంటిది.. ఏటా రూ.25వేల కోట్లకు పైగా మెయింటనెన్స్ కోసం ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఆ ప్రాజెక్టు పనికిరాదు.. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టును వెంటనే రద్దు చేయాలి. జనాల సొమ్మును ఇకపై కాళేశ్వరం కోసం ఖర్చు చేయొద్దని సూచించారు. అర్హులకు పథకాలు అందాలి రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలను రాజకీయాలు, పా ర్టీలకతీతంగా అర్హులకు అందించాలని సాంబశివరావు సూచించారు. ఇందిరమ్మ లబ్ధిదారుల్లో జర్నలి స్టులు, కార్మికులు, అసంఘటిత కార్మికులను కచ్చి తంగా భాగస్వాములను చేయాలని సూచించారు. జర్నలిస్టులకు సర్కారు ఆసరా కావాలని, ఉచిత విద్య, ఆరోగ్యకార్డులు అందజేయాలన్నారు. ఇది లా ఉండగా.. ‘ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏపీసోడ్ ను తాము రాజకీయంగా చూడడం లేదు. కానీ.. అందులో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లుగా కనిపిస్తుంది’ అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు కూనంనేని పై విధంగా స్పందించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, మాజీ జిల్లా కార్యదర్శి సిరబోయిన కరుణా కర్, రాష్ట్ర సమితి సభ్యులు ఆదరి శ్రీనివాస్, మండ సదాలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట భిక్షపతి, ఎం.ఎల్లేశ్ పాల్గొన్నారు. చట్టపరంగా శిక్షించాల్సి ఉన్నా చంపడం అప్రజాస్వామికం ఎన్కౌంటర్లపై ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు -
నీట్గా మెరిశారు..
నేషనల్ ఎల్జిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్–యూజీ –25) ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యార్థులు మెరిశారు. శనివారం విడుదల చేసిన ఫలితాల్లో జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించారు. దీనిపై కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు హర్షం చేశారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల ర్యాంకర్లు, తల్లిదండ్రులను సన్మించారు. మానుకోట విద్యార్థుల ప్రతిభ.. మహబూబాబాద్ అర్బన్: నీట్ ఫలితాల్లో మానుకోట విద్యార్థులు ప్రతిభ చాటారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ కళాశాల అధ్యాపకుడు బొడ్డుపల్లి శ్రీనివాస్, మాధురి దంపతుల కుమారుడు ప్రణీతమ్ సుహాస్ 720 మార్కులకు 408 మార్కులు సాధించాడు. అదేవిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడు కళ్లెం వెంకట్రెడ్డి, సుజాత దంపతుల కుమారై వర్షితారెడ్డి 720 మార్కులకు 431 మార్కులు సాధించింది. అలాగే, పిట్టల శ్రీమతి, మహేందర్ దంపతుల కుమారై అభిన్య 720 మార్కులకు 500 మార్కులు సాధించింది.–సాక్షి నెట్వర్క్ షణ్ముఖకు 48వ ర్యాంకు.. కేయూ క్యాంపస్: జాతీయ స్థాయిలో మెడిసిన్లో ప్రవేశాలకు గాను నిర్వహించిన నీట్ (నేషనల్ ఎల్జిబులిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్) ఫలితాల్లో హనుమకొండకు చెందిన యాండ్రపాటి షణ్ముఖ 720 మార్కులుకు 656 మార్కులు సాధించి ఆల్ఇండియా 48వ ర్యాంకు కై వసం చేసుకున్నాడు. హనుమకొండ టీచర్స్ కాలనీకి చెందిన యాండ్రపాటి శ్యాంసుందర్, రజనీదంపతుల కుమారుడు షణ్ముఖ పదో తరగతి హనుమకొండలోని ఓ ప్రైవేట్ పాఠశాలో, ఇంటర్మీడియట్ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదివాడు. చిన్నప్పటి నుంచే చదువులో చురుకుగా ఉండే షణ్ముఖ డాక్టర్ కావాలనే లక్ష్యంతో కష్టపడి చదివి శని వారం విడుదలైన నీట్ ఫలితాల్లో ఆల్ఇండియా స్థాయిలో సత్తాచాటాడు. దీనిపై తల్లిదండ్రులు శ్యాంసుందర్, రజనీ సంతోషం వ్యక్తం చేశారు. కాగా, షణ్ముఖ ఇటీవల ఆంధ్రప్రదేశ్ విడుదల చేసిన ఏపీ ఎప్సెట్ అగ్రికల్చరల్, ఫార్మసీలోనూ రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు కూడా సాధించాడు. ఢిల్లీ ఎయిమ్స్లో చేరుతా.. నీట్లో ఆల్ఇండియాలో 48వ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉంది. ఢిల్లీ ఎయిమ్స్ మెడిసిన్లో చేరుతా. డాక్టర్ కావాలనే లక్ష్యంతో చదివా. మా తల్లిదండ్రులు కూడా నన్ను ప్రోత్సహించారు. షణ్ముఖ, నీట్ 48వ ర్యాంకర్● -
విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి
హన్మకొండ: విద్యుత్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కను కో రినట్లు ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్–327 అధ్యక్షుడు జి.సంజీవ రెడ్డి, సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ తెలిపారు. గురువారం రాత్రి హైదరాబాద్లోని ప్రజాభవన్లో భట్టి విక్రమార్కను వారు కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమస్యలు చెప్పిన వెంటనే ట్రాన్స్ కో సీఎండీకి ఫోన్ చేసి త్వరలో విద్యుత్ ఉద్యోగ సంఘాలతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఆర్టిజన్ కార్మికులకు గ్రేడ్ మార్పు చేయడంతోపాటు ఏపీఎస్ఈబీ రూల్స్ వర్తింపచేయాలని, 01.02.1999 నుంచి 2004 వరకు ఉద్యోగంలో చేరిన ఉద్యోగులకు పెన్షన్ అందించాలని, విద్యుత్ సంస్థలో మిగిలివున్న 6,500 అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు, కాంట్రాక్ట్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలని కోరినట్లు తెలిపారు. ఖాళీలను భర్తి చేయాలని, ట్రాన్స్కో సీబీడీ గ్యాంగ్లో పనిచేస్తున్న ఆర్టిజన్లకు విద్యార్హతతో పనిలేకుండా గ్రేడ్–1 జీతం ఇవ్వాలని కోరామన్నారు. కారుణ్య నియామకాల వయస్సును 46 సంవత్సరాలకు పెంచాలని కోరినట్లు పేర్కొన్నారు. ఉపముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, రాష్ట్ర కనీస వేతనాల సలహా బోర్డు చైర్మన్ జనక్ప్రసాద్, చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
ట్రాన్స్కో, డిస్కమ్ ఇంటర్ సర్కిల్ కబడ్డీ విజేత నల్లగొండ
● ద్వితీయ స్థానంలో వరంగల్ ● బాల్ బ్యాడ్మింటన్లో వరంగల్ జట్టు విజేతహన్మకొండ: తెలంగాణ ట్రాన్స్కో, డిస్కమ్స్ ఇంటర్ సర్కిల్ కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్ టోర్నీ 2025–2026 శుక్రవారం ముగిసింది. బాల్ బ్యాడ్మింటన్ ఫైనల్లో వరంగల్, మహబూబ్నగర్ జట్లు పోటీ పడగా, వరంగల్ సర్కిల్ విద్యుత్ ఉద్యోగుల జట్టు విజేతగా నిలిచింది. మహబూబ్నగర్ జట్టు ద్వితీయ స్థానంలో, నల్లగొండ జట్టు తృతీయ స్థానంలో నిలిచాయి. కబడ్డీ ఫైనల్లో నల్లగొండ, వరంగల్ జట్లు పోటీపడగా నల్లగొండ జట్టు విజేతగా నిలిచింది. వరంగల్ జట్టు ద్వితీయ స్థానం, నిజామాబాద్ తృతీయ స్థానంలో నిలిచింది. ఈ టోర్నీలో కబడ్డీలో 12 జట్లు, బాల్ బ్యాడ్మింటన్లో 9 జట్లు పాల్గొన్నాయి. కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ ఇన్చార్జ్ డైరెక్టర్లు బి.అశోక్ కుమార్, టి.మధుసూదన్, స్పోర్ట్స్ కౌన్సిల్ చైర్మన్, హనుమకొండ సర్కిల్ ఎస్ఈ పి.మధుసూదన్ రావు, కన్వీనర్ ఎ.విజేందర్ రెడ్డి, సభ్యులు ఎండీ యాకూబ్ పాషా, సునీల్ కుమార్, ఇ.ప్రేమ్ కుమార్, స్పోర్ట్స్ ఆఫీసర్ జగన్నాథ్, హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబరెడ్డి, వరంగల్ టౌన్ డీఈ ఎస్.మల్లికార్జున్ పాల్గొన్నారు. -
అధికారుల డిప్యుటేషన్ రద్దు చేయాలి
హన్మకొండ కల్చరల్: దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారుల డిప్యుటేషన్ రద్దు చేసి ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని తెలంగాణ అర్చక ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మదాయశాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ను జిల్లా దేవాదాయశాఖ అధికారులు, సిబ్బంది, జేఏసీ రాష్ట్ర చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ శుక్రవారం హైదరాబాద్లో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా ఉపేంద్ర శర్మ మాట్లాడారు. ఎండోమెంట్స్ కార్యాలయాల్లో డిప్యూటేషన్పై నియామకాలు చేపట్టాలన్నారు. దేవాదాయ శాఖలో అనేక ఖాళీలు ఉన్నాయని, ఉద్యోగుల పదోన్నతి కల్పించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ రామకృష్ణరావు, ఉపకమిషనర్లు సంధ్యారాణి, శ్రీకాంతరావు, అసిస్టెంట్ కమిషనర్ రామల సునీ త, ఈఓలు రత్నాకర్, శ్రీరాజేష్ పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖకు ఉపేంద్ర శర్మ వినతి -
బీసీలకు ఉత్తుత్తి శాఖలా..?
● వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ హన్మకొండ: రాష్ట్ర మంత్రివర్గంలో ఓసీలకు ఉత్తమ శాఖలను కేటాయించి, బీసీలకు ఉత్తిత్తి శాఖలను కేటాయించడం దేనికి నిదర్శనమని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం హనుమకొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సామాజిక న్యాయం పాటిస్తామని చెప్పిన రాహుల్ గాంధీ మాటలకు విలువ లేదా అని శ్న్రించారు. రాష్ట్ర జనాభాలో 16 శాతం ఉన్న అగ్రవర్ణాలకు అత్యంత కీలకమైన బడ్జెట్ ఉన్న 7 మంత్రి పదవులను కేటాయించి, 86 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాధాన్యత లేని బడ్జెట్ లేని 8 మంత్రి పదవులను కేటాయించడం సామాజిక న్యాయమా అంటూ నిలదీశారు. కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి.. పాలనలో మాత్రం సామాజిక న్యాయం పాటించడం లేదని విమర్శించారు. పిడుగుపాటుతో కొబ్బరి చెట్టుపై మంటలు ● పలు ఇళ్లలో గృహోపకరణాలు దగ్ధం ఖిలా వరంగల్: నగరంలోని కరీమాబాద్లో శుక్రవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. సాయంత్రం 5 గంటలకు కురిసిన వర్షానికి ఉర్సు బొడ్రాయి శివాంజనేయ దేవాలయం వెనుక కుసుమ సుధాకర్, దయాకర్ ఇళ్ల ఆవరణలోని కొబ్బరి చెట్టుపై పిడుగుపడింది. కొబ్బరి చెట్టుపై పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఎగిసి పడుతున్న మంటలను స్థానికులు అదపుచేశారు. పిడుగు పడే సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పిడుగు పడడంతో షార్ట్ సర్క్యూట్తో పలు ఇళ్లల్లో గృహోపకరణాలు ధ్వంసమయ్యాయి. ఎలక్ట్రానిక్ పరికరాలు ఖాళిపోయాయి. స్థానిక కార్పొరేటర్ మరుపల్లి రవి ఘటనా స్థలాన్ని సందర్శించారు. పిడుగుపాటుతో నష్టపోయినవారిని ప్రభుత్వం ఆదుకునేలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. హౌరా రైలులోనుంచి పడి ల్యాబ్ టెక్నీషియన్ మృతి● మృతుడిది సూర్యాపేట జిల్లా.. మంగళగిరి ఏయిమ్స్లో ఉద్యోగం కాజీపేట రూరల్: కాజీపేట జీఆర్పీ పోలీస్టేషన్ పరిధిలోని పెండ్యాల్–నష్కల్ రైల్వే స్టేషన్ల మధ్య శుక్రవారం ఓ వ్యక్తి రైలులోనుంచి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం గుండెబోయిన గూడెం గ్రామానికి చెందిన సామంతపూడి శ్రవణ్కుమార్ (36) ఏపీ మంగళగిరిలోని ఏయిమ్స్లో ల్యాబ్ టెక్నీషీయన్గా పని చేస్తున్నాడు. సికింద్రాబాద్ నుంచి విజయవాడకు జనరల్ టికెట్ తీసుకొని హౌరా (ఈస్ట్కోస్ట్) ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్నాడు. పెండ్యాల్–నష్కల్ రైల్వే స్టేషన్ల మధ్యలో ప్రమాదవశాత్తు రైలులోనుంచి జారి పడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. బంధువులకు సమాచారం అందించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచినట్లు హెడ్కానిస్టేబుల్ తెలిపారు. -
విద్యుత్ అధికారుల ఫోన్ నంబర్ల మార్పు
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్ టౌన్ డివిజన్ విద్యుత్ అధికారుల ఫోన్ నంబర్లు మారాయి. గతంలో ఉన్న బీఎస్ఎన్ఎల్ నంబర్ల స్థానంలో టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం ఎయిర్టెల్ ఫోన్ నంబర్లు కేటాయించింది. ఎన్పీడీసీఎల్ వరంగల్ సర్కిల్అధికారి హోదా ఫోన్ నంబర్ ఆజాంజాహి మిల్స్ ఫ్యూజ్ ఆఫ్ కాల్ 87124 85022 గొర్రెకుంట సబ్స్టేషన్ 87124 85035 ఫోర్ట్ రోడ్ ఫ్యూజ్ ఆఫ్ కాల్ 87124 85023 గొర్రెకుంట ఫ్యూజ్ ఆఫ్ కాల్ 87124 85030 మట్వాడ సెక్షన్ ఆఫీస్ ఫ్యూజ్ ఆఫ్ కాల్ 87124 84965 ఆరెపల్లి సబ్స్టేషన్ 87124 84940 ఆరెపల్లి సెక్షన్ కార్యాలయం ఫ్యూజ్ ఆఫ్ కాల్ 87124 84936 ఏనుమూముల సబ్స్టేషన్ 87124 84941 పోచమ్మ మైదాన్ సబ్ స్టేషన్ 87124 84972 పోచమ్మ మైదాన్ సెక్షన్ ఆఫీస్ ఫ్యూజ్ ఆఫ్ కాల్ 87124 84976 దేశాయి సబ్ స్టేషన్ 87124 84954 దేశాయిపేట సెక్షన్ ఆఫీస్ ఫ్యూజ్ ఆఫ్ కాల్ 87124 84945 మామునూరు సబ్స్టేషన్ 87124 85003 మామునూరు సెక్షన్ ఆఫీస్ ఫ్యూజ్ ఆఫ్ కాల్ 87124 84997 బొల్లికుంట సబ్స్టేషన్ 87124 85002 శంఽభునిపేట సబ్స్టేషన్ 87124 85867 శంభునిపేట సెక్షన్ ఆఫీస్ ఫ్యూజ్ ఆఫ్ కాల్ 87124 85006 కరీమాబాద్ సబ్స్టేషన్ 87124 84990 కరీమాబాద్ సెక్షన్ ఆఫీస్ ఫ్యూజ్ ఆఫ్ కాల్ 87124 84980అధికారి హోదా ఫోన్ నంబర్ ఎస్ఈ 87124 84950, వరంగల్ టౌన్ డీఈ 87124 85067 వరంగల్ ఏడీఈ 87124 85048 ములుగు రోడ్ ఏడీఈ 87124 84977 శంఽభునిపేట ఏడీఈ 87124 85018 ఆజంజాహి మిల్ ఈఆర్ఓ ఏఏఈ 87124 85051 వరంగల్ ఈఆర్ఓ ఏఏఓ 87124 85052 వరంగల్ టౌన్ డివిజన్ కార్యాలయం ఏఈ టెక్ 87124 85068 వరంగల్ టౌన్ డివిజన్ కార్యాలయం ఏఈ కమర్షియల్ 87124 85056 స్టేషన్ రోడ్ ఏఈ 87124 85036 ఆజాంజాహి మిల్స్ ఏఈ 87124 85020 ఫోర్ట్ రోడ్ ఏఈ 8712485028 గొర్రెకుంట ఏఈ 87124 85033 మట్వాడ ఏఈ 87124 84963 ఆరెపల్లి ఏఈ 87124 84938 పోచమ్మ మైదాన్ ఏఈ 87124 84976 దేశాయిపేట ఏఈ 87124 84945 మామునూరు ఏఈ 87124 84998 శంభునిపేట ఏఈ 87124 85005 కరీమాబాద్ ఏఈ 87124 84986 స్టేషన్రోడ్ సబ్ స్టేషన్ 87124 85046 స్టేషన్ రోడ్ సెక్షన్ ఆఫీస్ ఫ్యూజ్ ఆఫ్ కాల్ 87124 85037 ఫోర్ట్ రోడ్ సబ్స్టేషన్ 87124 85029 -
పాఠశాలల్లో సామూహిక అక్షరాభ్యాసం
విద్యారణ్యపురి: బడిబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం హనుమకొండ, వరంగల్ జిల్లాలో ప్రాథమిక పాఠశాలల్లో నూతనంగా ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఉపాధ్యాయులు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. హనుమకొండ డీఈఓ వాసంతి, జిల్లా కమ్యూనిటీ మొబలైజింగ్ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్రెడ్డి నడికుడ మండలం చర్లపల్లి, శాయంపేట పాఠశాలల్లో సామూహిక అక్షరాభ్యసంలో పాల్గొన్నారు. జిల్లాలో 16 ప్రాథమిక పాఠశాలల్లో పూర్వప్రాథమిక తరగతులను ప్రారంభిస్తున్నామని వాసంతి తెలిపారు. తెరుచుకున్న పాఠశాలలు హనుమకొండ జిల్లాలో 41 పాఠశాలలు మూతపడగా బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈ విద్యాసంవత్సరంలో టీచర్లు.. విద్యార్థులను చేర్చుకున్నారు. ఓగ్లాపూర్ ప్రాథమిక పాఠశాలలో నూతనంగా వచ్చిన విద్యార్థులకు టీచర్లు అక్షరాభ్యాసం చేయించారు. ఎర్రబెల్లి తండా ప్రాథమిక పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు ప్రవేశాలు పొందగా ఆ పాఠశాలను టీచర్ శ్రీదేవి తెరిచారు. ఎల్కతుర్తి మండలం ఎంపీపీఎస్ రామకృష్ణాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు పిల్లలు జాయిన్ కాగా వారికి టీచర్ అక్షరాభ్యాసం చేయించారు. మూతపడిన మూడు పాఠశాలలు తెరుచుకున్నాయి -
ప్రాణం పోస్తున్నారు..
నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం ●● రక్తదానంలో యువత ముందంజ●● అవగాహన కల్పించడంలో ఎన్జీఓల కృషి ● అత్యవసర సమయంలో కాపాడుతున్న రక్తదాతలుప్రమాదం జరిగినప్పుడు.. అనారోగ్య అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు రక్తం అందక అనేకమంది మృత్యుఒడికి చేరిన ఘటనలున్నాయి. కానీ ప్రస్తుతం ఎన్జీఓలు, యువజన సంఘాలు రక్తదానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించడం ద్వారా రక్తదానంపై వారిలోని అపోహలను దూరం చేస్తున్నారు. తద్వారా అనేకమంది యువత రక్తదానం చేసి చావుబతుకుల్లో ఉన్నవారికి ప్రాణం పోస్తున్నారు. ఈనేపథ్యంలో నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భం ప్రత్యేక కథనం. టేకుమట్ల: రక్తదానం చేయడం వల్ల నీరసించి ఆరోగ్య ఇబ్బందులు ఏర్పడతాయనే అపోహ ప్రజల్లో ఉంటుంది. కానీ, అలాంటిది జరగదు. కేవలం 21 రోజుల్లోనే పూర్తి స్థాయిలో రక్తం శరీరంలో సమకూరుతుంది. అలాగే 6 నుంచి 12 వారాల్లో పురుషులకు, 6 నుంచి 16 వారాల్లో మహిళలకు హిమోగ్లోబిన్ స్థాయిలు సమంగా చేరుకుంటాయి. ఈవిషయంపై వివిధ స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, రెడ్క్రాస్ వంటి సంస్థలు ప్రజలకు అవగాహన కల్పిస్తూ రక్తదానం చేసేలా చొరవ చూపుతున్నాయి. దీంతో యువత రక్తదానం వైపు అడుగు వేస్తూ ఎంతో మంది ప్రాణాలను నిలబెడుతున్నారు. ఎవరు రక్తదానం చేయాలి.. ఎవరు రక్తదానం చేయాలనే విషయంపై ఎంతో మంది ఆలోచనలో పడి రక్తదానం చేయడంలో కాస్త వెనుకడుగేస్తున్నారు. 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలలోపు ఉన్న ఆరోగ్యవంతులైన ప్రతీ ఒక్కరు రక్తదానం చేయవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. కానీ, హెపటైటిస్ బీ, హెచ్ఐవీ, రక్తహీనత, బలహీనత, షుగర్, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు.. రక్తదానం చేసేందుకు అనర్హులుగా వైద్యులు చెబుతారు. ఎంతో మందికి పునర్జన్మ అత్యవసర సమయంలో రక్తదాతల నుంచి సేకరించిన రక్తంతో ఎంతో మంది పునర్జన్మ పొందారు. కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో రక్త నిల్వలు లేక ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు. అలాంటి పరిస్థితి రాకుండా రక్తదానం చేస్తూ ప్రాణాలను కాపాడాలని పలువురు మానవతావాదులు కోరుతున్నారు. -
ప్రైవేట్లో అధిక ఫీజులను నియంత్రించాలి
విద్యారణ్యపురి: ప్రైవేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల భారాన్ని నియంత్రించాలని విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ విద్యాసంస్థల్లో 25 శాతం పేదవర్గాల పిల్లలకు అడ్మిషన్లు కల్పించేలా చర్యలు చేపట్టాలని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేష్ డిమాండ్ చేశారు. హనుమకొండ డీఈఓ వాసంతి, వరంగల్ డీఈఓ జ్ఞానేశ్వర్కు శుక్రవారం వేర్వేరుగా వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా దాసు సురేష్ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు అడ్డూ.. అదుపు లేకుండా ఫీజులు వసూలు చేస్తున్నాయని అన్నారు. నిబంధనలు పాటించని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. వరంగల్ జిల్లా ఇన్చార్జ్ వంగ రవియాదవ్, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు హైమవతి, రవీందర్, అశోక్, కొడపాక దేవి, శ్రీరామోజు అంజలి, యోగేశ్వర్ పాల్గొన్నారు. నూతన ఔషధ ఆవిష్కరణలు అవసరం కేయూ క్యాంపస్: మానవాళికి ఉపయోగపడే నూతన ఔషధాల ఆవిష్కరణలు చేయాలని కేయూ వీసీ ప్రతాప్రెడ్డి అన్నారు. యూనివర్సి టీలోని జువాలజీ విభాగం ఆధ్వర్యంలో ‘హ్యాండ్స్ ఆన్ మాలిక్యూలర్ డాకింగ్ అండ్ డ్రగ్ డిస్కవరీ టెక్నిక్స్’ అనే అంశంపై మూడు రోజులపా టు జరిగే జాతీయ వర్క్షాప్లో శుక్రవారం ఆయన మాట్లాడారు. ప్రస్తుతం పరిశోధనారంగంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్తో నూతన ఔషధాలు ఆవిష్కరణలపై పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. మాలిక్యూలర్ డాకింగ్ మాన్యువల్ను వీసీ ఆవిష్కరించారు. వరంగల్ నిట్ బయో ఇన్ఫర్మెటిక్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ పెరగు శ్యామ్, జువాలజీ విభాగం అధిపతి ఆచార్య షమిత, సైన్స్ డీన్ హనుమంతు, ప్రొఫెసర్లు ఇస్తారి, వెంకయ్య పాల్గొన్నారు. వాహనం కొంటున్నానంటూ మోసం! రామన్నపేట: వాహనం కొనుగోలు చేస్తున్నా ను.. మీ సాక్షి సంతకం కావాలని పలువురి నుంచి పాన్, ఆధార్ కార్డులు సేకరించి వారి పే రుపైన వాహనాలు కొనుగోలు చేసి విక్రయించిన ఓ వ్యక్తిని శుక్రవారం మట్టెవాడ పోలీసులు అరెస్టు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకా రం.. కొత్తవాడకు చెందిన బిట్ల సందీప్ దుస్తుల దుకాణం నిర్వహించి నష్టపోవడంతో సులభంగా డబ్బులు సంపాదించాలని భావించాడు. ఈక్రమంలో తాను బైక్ కొనుగోలు చేస్తున్నానని.. సాక్షి సంతకం కోసం పాన్, ఆధార్ కార్డులు కావాలని ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద 10 మంది కార్డులు సేకరించి షో రూమ్ల నుంచి వివిధ ఫైనాన్స్ల వద్ద పది వాహనాలు కొనుగోలు చేశాడు. అనంతరం ఈ వాహనాలు దసరా ఆఫర్, దళిత బంద్కు చెందినవిగా చెప్పి పలువురికి విక్రయించాడు. ఈఎంఐలు చెల్లించకపోవడంతో పాన్కార్డు, ఆధార్కార్డులు ఇచ్చిన వారికి మెస్సెజ్లు రావడంతో విషయం బహిర్గతమైంది. విచారణ చేసిన శుక్రవారం నిందితున్ని అరెస్టు చేసి 10 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. -
విలువైన ప్రాణాలను కాపాడొచ్చు..
ప్రతీ సంవత్సరం అక్టోబర్లో నిర్వహించే పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా నిర్వహించే రక్తదాన శిబిరంలో పాల్గొంటాను. గ్రామాల్లోని యువతకు రక్తదానంపై అవగాహన కల్పించి ఎంతో మందిచే రక్తదానాన్ని చేయించాను. రక్తదానంపై అపోహలను నివృత్తి చేస్తూ ముందుకు సాగేలా కృషి చేశాను. భవిష్యత్లో కూడా యువతను రక్తదానం చేసేలా ప్రోత్సహిస్తూ నేను చేసేందుకు సిద్దంగా ఉన్నాను. ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేయడం వల్ల ప్రాణాలను కాపాడొచ్చు. – దాసరి సుధాకర్, ఎస్సై టేకుమట్ల -
కాజీపేట జంక్షన్ మీదుగా ప్రత్యేక రైళ్లు
కాజీపేట రూరల్: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కాజీపేట జంక్షన్ మీదుగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు చర్లపల్లి–తిరుపతి మధ్య 10 ప్రత్యేక రైళ్ల సర్వీస్లను ప్రవేశపెట్టి నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ శుక్రవారం తెలిపారు. ప్రత్యేక రైళ్ల వివరాలు ఇలా.. జూలై 2వ తేదీ నుంచి 30వ తేదీ వరకు చర్లపల్లి–తిరుపతి (07251) ఎక్స్ప్రెస్ ప్రతి బుధవారం కాజీపేట జంక్షన్కు చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో జూలై 3వ తేదీ నుంచి 31వ తేదీ వరకు తిరుపతి–చర్లపల్లి (07252) ఎక్స్ప్రెస్ ప్రతి శుక్రవారం కాజీపేట జంక్షన్కు చేరుకుటుంది. 1 ఏసీ, 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లతో ప్రయాణించే ఈ రైళ్ల సర్వీస్లకు అప్ అండ్ డౌన్ రూట్లో జనగామ, కాజీపేట, వరంగల్, నెక్కొండ, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీ కాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. -
మేనత్తను హతమార్చిన మేనల్లుడి అరెస్టు
వరంగల్ క్రైం: మద్యానికి అలవాటు పడి, జల్సాలకు అవసరమైన డబ్బు కోసం మేనత్తను హత్యచేసి ఒంటి మీద ఉన్న నగలను చోరీ చేసిన వరంగల్లోని మట్టెవాడ రాజీవ్కాలనీకి చెందిన రేకులపెల్లి ప్రణయ్ని గీసుగొండ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసినట్లు ఈస్జోన్ డీసీపీ అంకిత్కుమార్ తెలిపారు. నిందితుడి నుంచి పోలీసులు రూ.18 లక్షల విలువగల సుమారు 170 గ్రాముల బంగా రు, 34 గ్రాముల వెండి అభరణాలతోపాటు రూ.10 వేలు, బైక్, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వెల్లడించారు. ఈ నెల 7వ తేదీన వరంగల్ జిల్లా గీసుగొండ మండలం స్థంభంపల్లి గ్రామానికి చెందిన కొచన స్వరూప (70)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లుగా మృతురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. ఈస్ట్జోన్ డీసీపీ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టిన గీసుగొండ పోలీసులు టెక్నాలజీని వినియోగించి ప్రణయ్ని శుక్రవారం అరెస్టు చేసి గీసుగొండ పోలీస్ స్టేషన్లో విచారించినట్లు తెలిపారు. ఈక్రమంలో ప్రణయ్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జల్సాలు, బైక్ కొనుగోలుకు పెద్ద మొత్తంలో అప్పు చేసినట్లు తెలిపారు. ఇచ్చినవారు ఒత్తిడి చేయడంతో సులభంగా డబ్బు సంపాదించేందుకు చోరీలకు పాల్పడినట్లు తెలిపారు. ఈ క్రమంలో స్థంభంపల్లిలో ఒంటరిగా ఉంటున్న తన మేనత్త స్వరూప వద్ద పెద్ద మొత్తంలో డబ్బు ఉంటుందని, ఆమెను చంపి డబ్బు, బంగారం దోచుకోవచ్చని ప్లాన్వేసినట్లు తెలిపారు. ఈ నెల 7వ తేదీన తన మేనత్త స్వరూప వద్దకు వెళ్లిన ప్రణయ్ ఆమెతో కలిసి మద్యం సేవించిన అనంతరం మృతురాలి ఇంటిలోనే నిద్రించాడు. స్వరూప గాఢ నిద్రలో ఉన్న సమయంలో డంబెల్తో మేనత్త తలపై కొట్టినట్లు తెలిపారు. స్వరూప మరణించినట్లుగా నిర్ధారించుకుని ఒంటిపై ఉన్న బంగారు అభరణాలతోపాటు ఇంట్లోని వెండి ఆభరణాలు, డబ్బును దోచుకొని వెళ్లినట్లు తెలిపారు. 170 గ్రాముల బంగారం, 34 గ్రాముల వెండి స్వాధీనం వివరాలు వెల్లడించిన డీసీపీ అంకిత్కుమార్ -
కళాకారులను ప్రోత్సహించాలి
హన్మకొండ కల్చరల్: కళాకారులను ప్రొత్సహించాలని, కళారంగాన్ని కాపాడుకోవాలని అందుకు కళాపోషకులు ముందుకు రావాలని కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ ఆచార్య బన్న అయిలయ్య అన్నారు. వరంగల్ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగే 16వ జాతీయస్థాయి నాటిక పోటీలు–2025 శుక్రవారం రాత్రి ప్రారంభమయ్యాయి. ఈమేరకు వరంగల్ పోతన విజ్ఞాన పీఠం ఆడిటోరియంలో ఆచార్య బన్న అయిలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి నాటక పోటీలు ప్రారంభించారు. అలాగే పారితోషిక దాతగా వ్యవహరించారు. ఐక్యవేదిక అధ్యక్షుడు డాక్టర్ కాజీపేట తిరుమలయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అతిథులుగా కవి గిరిజామనోహరబాబు, బండారు ఉమామహేశ్వర్రావు, వేదిక సలహాదారు సంజయ్బాబు, తెలంగాణ రాష్ట్ర నాటక సమాజాల సమాఖ్య అధ్యక్షుడు ఆకుల సదానందం, మాడిశెట్టి రమేశ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. అనంతరం చిలుకలూరిపేట మద్దుకూరి ఆర్ట్స్ క్రియేషన్ వారి మా ఇంట్లో మహాభారతం, నిజామాబాద్ తన్మయి ఆర్ట్స్ వారి చదువు నాటక ప్రదర్శనలు అలరించాయి. కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ బన్న అయిలయ్య ప్రారంభమైన ఆహ్వాన నాటిక పోటీలు -
వ్యాధులు ప్రబలకుండా చర్యలు
వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధుల నివారణకు చేపట్టాల్సి న చర్యలపై కలెక్టరేట్లో శుక్రవారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలు, మున్సిపాలిటీల్లో నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఎంహెచ్ఓ సాంబశివరావు, డీఆర్డీఓ కౌసల్యాదేవి, జిల్లా పరిషత్ సీఈఓ రాంరెడ్డి, మలేరియా అధికారి రజినీ, డీబీసీడీఓ పుష్పలత తదితర అధికారులు పాల్గొన్నారు. గిరిజన గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులు జిల్లాల్లోని గిరిజన గ్రామాల్లో సౌకర్యాలు కల్పించడానికి ఈనెల 15 నుంచి 30 వరకు ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్లో ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్(పీఎం జనమన్) నిర్వహణపై అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఆయా గ్రామాల్లో గిరిజనులకు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు. ఈవీఎం గోదాంల తనిఖీ వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్యార్డులోని జిల్లా వేర్హౌస్ గోదాముల్లో భద్రపర్చిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను కలెక్టర్ డాక్టర్ సత్యశారద తనిఖీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతీ మూడు నెలలకోసారి నిర్వహించే సాధారణ తనిఖీల్లో భాగంగా ఈవీఎం గోదాంలను పరిశీలించారు. ఇంకుడు గుంతలు నిర్మించాలి.. లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో భాగంగా ఇళ్ల నుంచి వెలువడే నీరు, వర్షపు నీరు, మురుగు నీరు భూగర్భంలో ఇంకేలా ఇంకుడు గుంతల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో జరిగిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. సాలిడ్ వేస్ట్ నిర్వహణకు మెరుగైన పద్ధతులు అవలంబించాలని సూచించారు. రైతునేస్తం కేంద్రాల్లో వీడియో కాన్ఫరెన్స్కు ఏర్పాట్లు చేయాలి జిల్లాలో ఈ నెల 16న ప్రారంభించనున్న 21 రైతునేస్తం కేంద్రాల్లో వీడియో కాన్ఫరెన్స్కు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి రైతులతో ముఖాముఖి మాట్లాడనున్నట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, అధికారులు పాల్గొన్నారు. -
‘ప్రీప్రైమరీ’లో ఆంగ్ల విద్య
విద్యారణ్యపురి: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేసేందుకు మరో అడుగు ముందుకు పడింది. ఏళ్ల నుంచి ఉన్న డిమాండ్కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీప్రైమరీ విద్య(ఇంగ్లిష్ మీడియం)ను ప్రవేశపెట్టింది. ప్రైవేట్ పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ప్రవేశాలు ఉండడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య క్రమేపీ తగ్గిపోతోంది. కొన్నేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం కొనసాగిస్తున్నారు. ప్రీప్రైమరీ విద్యను ప్రవేశపెట్టడంతో విద్యార్థి ఆ పాఠశాలలోనే పూర్తిస్థాయి విద్యను అభ్యసించే అవకాశం ఉంటుంది. ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని 210 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్యకు ఈవిద్యాసంవత్సరం 2025–26 నుంచి అనుమతులిస్తూ ఇటీవల విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. హనుమకొండ, వరంగల్ జిల్లాలో 29 స్కూళ్లు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ జిల్లాలో 16, వరంగల్ జిల్లాలో 13 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీప్రైమరీ విద్యను ప్రవేశపెట్టారు. ఈమేరకు హైదరాబాద్ నుంచే ఎంపిక చేసిన పీఎస్ల, యూపీఎస్ల జాబితాలను ఆయా జిల్లాల విద్యాశాఖల అధికారులకు పంపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 31 పీఎస్లలో ప్రీప్రైమరీ విద్యను ప్రవేశపెట్టారు. మిగతా మూడు జిల్లాలు మహబూబాబాద్, జనగామ, ములుగు జిల్లాలకు అవకాశం కల్పించలేదు. 12 మంది చేరిక హనుమకొండ ములుగు రోడ్డులోని పెద్దమ్మగడ్డ ప్రాంతంలోని పాలెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీలో 12 మంది చిన్నారులను వారి తల్లిదండ్రులు చేర్పించారు. శుక్రవారం వీరికి ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు సామూహిక అక్షరాభ్యాసం చేయంచారు. కార్యకమంలో ఎంఈఓ నెహ్రూనాయక్, గొల్లపెల్లి పీఎస్లో ఇద్దరు, రాంనగర్ పీఎస్లో ఇద్దరు చిన్నారులు ప్రీప్రైమరీ విద్యలో ప్రవేశాలు పొందారు. వీరికి కూడా టీచర్లు అక్షరాభ్యాసం చేయించారు.ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో యూకేజీ అడ్మిషన్లు హనుమకొండ జిల్లాలో 16.. వరంగల్ జిల్లాలో 13 పాఠశాలలు నాలుగేళ్లు నిండిన బాలలకు ప్రవేశాలు పాలెం ప్రభుత్వ పీఎస్లో 12మంది చిన్నారుల చేరిక ఎస్సీఈఆర్టీ నిపుణులతో సిలబస్ రూపకల్పన యూకేజీ మాత్రమే.. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రవేశపెట్టిన ప్రీప్రైమరీ విద్యలో యూకేజీ విద్యార్థులు మాత్రమే ఉంటారని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. కాగా.. యూకేజీ విద్యార్థుల పాఠాలకు సిలబస్ను కూడా ఎస్సీఈఆర్టీ సబ్జెక్టు నిపుణులు రూపకల్పన చేసినట్లు సమాచారం. యూకేజీ చిన్నారుల కోసం పాఠ్య పుస్తకాలు సైతం ఉచితంగా అందజేయనున్నట్లు తెలిసింది. అదేవిధంగా ప్రీప్రైమరీలో చేరిన చిన్నారుల విద్యాబోధనకు ఒక్కో స్కూల్కు ఒక్కో వలంటీర్ను, చిన్నారుల ఆలనాపాలనా చూసేందుకు ఒక ఆయాను కూడా నియమిస్తారని తెలుస్తొంది. కాగా.. ఒక్కో స్కూల్ ప్రీప్రైమరీలో 30 మంది చిన్నారులకు ప్రవేశాలకు ఉండనుందని సంబంధిత అధికారుల ద్వారా తెలిసింది. ఈ స్కూళ్లలోనే ప్రీప్రైమరీ.. హనుమకొండ జిల్లాలో ఎంపీపీఎస్లు: పరకాల, ఎంపీపీఎస్ సీతారాంపూర్, మాణిక్యాపూర్, కొప్పూరు, (ఎస్సీ కాలనీ) ముల్కనూరు, భావుపేట కే శ్వాపూర్. ఎంపీయూఎస్లు: మైలారం, ప్రగతి సింగారం, రతన్గిరి. ప్రభుత్వ పీఎస్ లు: కాజీపేట, గొల్లపల్లి, పాలెం, రాంనగర్. వరంగల్ జిల్లాలో.. ఎంపీపీఎస్లు: స్వామిరావుపల్లి, లక్కమారిపల్లి, తొగర్రాయి, రామతీర్థం, లింగాపురం, కొండూరు, కొత్తూరు, బుర్హాపల్లి, పైడిపల్లి, జీపీఎస్ శుంభునిపేట. ఎంపీయూపీఎస్లు: రేకంపల్లి, లెంకాలపల్లి, గన్నారం పాఠశాలల్లో ప్రీౖప్రైమరీ విద్యను అందిస్తున్నారు. -
బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లా నూతన కలెక్టర్గా స్నేహ శబరీష్ శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా బాధ్యతలు స్వీకరించిన స్నేహ శబరీష్ను అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీఆర్ ఓ వై.వి గణేశ్, డీఆర్డీఏ మేన శ్రీను, జెడ్పీ సీఈఓ విద్యాలత, అధికారులు పూలమొక్కలు, పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయాన్ని బాధ్యతలు స్వీకరించిన హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ శుక్రవారం రాత్రి సందర్శించారు. ఈసందర్భంగా ఆలయ ఈఓ శేషుభారతి, అర్చకులు భద్రకాళి శేషు దేవాలయానికి వచ్చిన కలెక్టర్ను ఘనంగా స్వాగతించారు. కలెక్టర్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. కలెక్టర్తో పాటు ఆమె తల్లిదండ్రులు, కూతురు, కుమారుడు ఉన్నారు. పూజల అనంతరం అర్చకులు మహదాశ్వీచనం అందజేశారు. ఈఓ శేషుభారతి వారికి అమ్మవారి శేషవస్త్రాలను, ప్రసాదాలను అందజేశారు. -
‘గ్రేటర్’ గాడిన పడేనా?
కాజీపేట జంక్షన్ మీదుగా ప్రత్యేక రైళ్లు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి– తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.ప్రాణం పోస్తున్నారు.. అత్యవసర సమయంలో రక్తదాతల నుంచి సేకరించిన రక్తంతో ఎంతోమంది పునర్జన్మ పొందారు. – 8లోuసాక్షిప్రతినిధి, వరంగల్: బల్దియా కొత్త కమిషనర్ చాహత్ బాజ్పాయ్కి నగరంలోని పలు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు కలెక్టరేట్ల పరిధిలో విస్తరించి ఉన్న గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ), కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా)ల ద్వారా అభివృద్ధి పనుల కోసం రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో కొన్ని విభాగాల్లో కోరలు చాస్తున్న అవినీతి, అక్రమాల వల్ల చెడ్డ పేరు వస్తోంది. పార్కులు, చెరువులు, నాలాల ఆక్రమణలు.. అక్రమ నిర్మాణాలు నగరంలో విచ్చలవిడిగా సాగుతున్నా ఎవరికీ పట్టడం లేదు. భవన నిర్మాణదారుల సంఘం ఏకంగా సీఎం పేషీలోనే ఫిర్యాదు చేసింది. కార్పొరేషన్కు చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధిని ఒప్పించి కాంట్రాక్టర్ల సిండికేట్కు ఎక్సెస్ టెండర్పై పనులు దక్కేలా ఇంజనీరింగ్ విభాగంలో కొందరు చక్రం తిప్పుతుండడం వివాదాస్పదమైంది. ఇదే సమయంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్తోపాటు ‘కుడా’ వైస్ చైర్మన్గా ఉన్న అశ్విని తానాజీ వాకడేపై బదిలీ వేటు పడడం చర్చనీయాంశంగా మారింది. కొత్తగా శుక్రవారం బాధ్యతలు చేపట్టిన చాహత్ బాజ్పాయ్ బల్దియాపై ప్రత్యేక దృష్టి సారిస్తేనే పాలన గాడిన పడుతుందన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. ఎక్కడికెళ్లినా తిరిగి ఇక్కడికే.. జీడబ్ల్యూఎంసీలో పని చేయడానికి అలవాటు పడిన అధికారులు ఎక్కడికి వెళ్లినా కొద్దిరోజులే. ఆరు నెలల నుంచి ఏడాది వ్యవధిలో మళ్లీ ‘బల్దియా’కే వస్తున్నారు. పార్టీలు, ప్రభుత్వాలేవైనా ప్రజా ప్రతినిధులతో లాబీయింగ్ చేయడంలో దిట్ట అయిన అధికారులు ఇక్కడే తిష్ట వేస్తున్నారు. ప్రస్తుతం జీడబ్ల్యూఎంసీలో ఓ విభాగానికి కీలకాధికారిగా ఉన్న ఒకరు అతడి పదవికి ముప్పు వస్తుందంటే చాలు.. పాదరసంలా పావులు కదుపుతారు. ఈ టాలెంట్తోనే 22 నెలల కిందటి వరకు ఏడాదికోసారి రెన్యూవల్ చేయించుకుని నాలుగేళ్లు గడిపిన ఆయన.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కొద్ది రోజులు పని చేశారు. పదోన్నతిపై ఆయన తిరిగి 2024 అక్టోబర్ చివరి వారంలో ‘రాజా’లా బల్దియాలోని కీలకపోస్టులో చేరారు. ఆయన ఉన్న సమయంలోనే బల్దియా నిధుల దుర్వినియోగంతో పాటు పెద్ద సంఖ్యలో జరిగిన ఔట్ సోర్సింగ్ కార్మికుల నియామకాల్లో రూ.లక్షల్లో డబ్బు చేతులు మారాయన్న ఆరోపణలపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, ఏసీబీ, స్పెషల్బ్రాంచ్లు తలోదిక్కు విచారణ చేపట్టాయి. అయినా చాకచక్యంగా తప్పుకున్న సదరు అధికారి 22 నెలల గ్యాప్తో మళ్లీ అదేశాఖలో కీలకపోస్టులో చేరడంపై చర్చ జరిగింది. ● జూనియర్ అసిస్టెంట్గా చేరి ట్యాక్స్ ఆఫీసర్ స్థాయి వరకు ఎదిగిన మరో అధికారి సైతం ‘బల్దియా’ను వదల అన్నారు. ప్రమోషన్కు ముందు.. తర్వాత కొద్ది మాసాలు మాత్రమే ఇతర మున్సిపాలిటీలకు వెళ్తూ వెంటనే జీడబ్ల్యూఎంసీకి రావడం ఇతడికి పరిపాటి. ఎన్నికల నిబంధనల మేరకు ట్యాక్స్ ఆఫీసర్గా వర్ధన్నపేట మున్సిపాలిటీకి బదిలీపై వెళ్లిన ఆయన తిరిగి ఐదు రోజుల కిందటే మళ్లీ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో కీలక పదవిలో చేరారు. ● పీహెచ్సీ వర్కర్ నుంచి టీఓ వరకు ఎదిగిన ఒకరు ‘గ్రేటర్’ను వదలడం లేదు. హెల్త్అసిస్టెంట్, శానిటరీ ఇన్స్పెక్టర్గా ఇక్కడే పని చేసి... కమిషనర్ పదోన్నతిపై భూపాలపల్లి, పరకాల, నర్సంపేట మున్సిపాలిటీలలో కొద్ది రోజులు మాత్రమే పనిచేసిన సదరు అధికారి పన్నుల విభాగం కీలక అధికారిగా చేరారు. ● బల్దియాలో ఇంజనీరింగ్ విభాగంలో చిన్న ఉద్యోగిగా విధుల్లో చేరిన ఒకరు ఓ ఉన్నతస్థాయి అధికారిగా ఎదిగారు. ఉద్యోగ విరమణ చేసే వరకు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ను వదలలేదు. ● ‘కుడా’ ఇంజినీరింగ్లోను డిప్యూటీ ఈఈ నుంచి ఎస్ఈ వరకు ఇక్కడి పనిచేస్తున్న ఓ అధికారి వరంగల్ను వదలడం లేదు. ఇలా చాలామంది కీలక విభాగాల్లో తిష్టవేయడం చర్చనీయాంశం అవుతోంది. కొత్త కమిషనర్ చాహత్ బాజ్పాయ్ కొరడా ఝుళిపించాల్సిందే..అవినీతి ఆరోపణల్లో పలు విభాగాలు..ఇంజినీరింగ్, టౌన్ప్లానింగ్, శానిటేషన్, రెవెన్యూ తదితర శాఖలపై అవినీతి ఆరోపణలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఏకంగా మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారిని సైతం మెప్పించి పనులు కానిచ్చారన్న ఫిర్యాదులున్నాయి. వరంగల్ నగరం చుట్టూ విచ్చలవిడిగా ఏర్పాటవుతున్న రియల్ ఎస్టేట్ వెంచర్లు, నాన్ లేఅవుట్ ప్లాట్లను ‘మామూలు’గా తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గ్రేటర్ వరంగల్ నగరంలో జీ ప్లస్ 12 అపార్ట్మెంట్ నిర్మాణం వరకు అనుమతికి అవకాశం ఉన్నా... అత్యధికంగా జీప్లస్ త్రీ, జీ ప్లస్ 5 భవనాలు, అపార్టుమెంట్లే అత్యధికంగా నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణాలకు పదిహేను మీటర్లు, ఆపై ఎత్తులో నిర్మించే వాటికి ముందువైపు మూడు మీటర్లు, మిగిలిన మూడు వైపులా 1.5 మీటర్లు స్థలం విడిచిపెట్టాలన్న నిబంధనలు పాటించడం లేదని అనుమతి కోసం రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నగరంలో గొలుసుకట్టు చెరువులు, జీడబ్ల్యూఎంసీ స్థలాలు, కీలకమైన నాలాలను ఆక్రమించి వెంచర్ల వేయడంతో పాటు ఇళ్లు నిర్మించుకున్న వారికి అనుమతులు ఇచ్చి పెద్ద మొత్తంలో వసూలు చేశారన్న ఫిర్యాదులపై ‘విజిలెన్స్’ విచారణకు ఆదేశించారు. ఈ విషయమై కొందరు బిల్డర్లు హైదరాబాద్లో ఫిర్యాదులు కూడా చేశారు. ఆరు నెలల వ్యవధిలో ఇంజనీరింగ్ విభాగం ద్వారా నిర్వహించిన సుమారు రూ.314 కోట్ల ఈ–ప్రొక్యూర్మెంట్ టెండర్లలోనూ కాంట్రాక్టర్లను మిలాఖత్ చేసి 4.99 శాతం ఎక్సెస్ టెండర్ పనులు దక్కేలా చక్రం తిప్పారన్న ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా పెద్దమొత్తంలో అందరూ కలిసి వాటాలు పంచుకున్నారన్న ప్రచారం ఉంది. జీడబ్ల్యూఎంసీ, ‘కుడా’లో ఇష్టారాజ్యం.. పలు విభాగాలపై అవినీతి ఆరోపణలు ప్రతీ పనికి రేట్ ఫిక్స్ చేసి వసూళ్లు.. అభివృద్ధి ఉన్నా అవినీతితో చెడ్డపేరు బల్దియాలో ఏళ్ల తరబడిగా అధికారుల తిష్ట ఎక్కడికి బదిలీ చేసినా పదోన్నతులపై ఇక్కడికే.. చెరువులు, పార్కుల ఆక్రమణలు.. అక్రమ నిర్మాణాలు ఎక్సెస్ టెండర్లతో కాంట్రాక్టర్లకు పనులు.. పక్కదారి పడుతున్న నిధులు -
శనివారం శ్రీ 14 శ్రీ జూన్ శ్రీ 2025
బల్దియా కమిషనర్గా బాధ్యతలు స్వీకరిస్తున్న చాహత్ బాజ్పాయ్నగరాభివృద్ధికి సమష్టి కృషి చేద్దాం..● అధికారులకు పిలుపునిచ్చిన కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ● ఉద్యోగ బాద్యతల స్వీకరణ వరంగల్ అర్బన్: నగరాభివృద్ధికి అధికారులంతా సమష్టిగా కృషి చేయాలని గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ పిలుపునిచ్చారు. శుక్రవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) ప్రధాన కార్యాలయంలో ఆమె కమిషనర్గా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది కమిషనర్ను కలిసి పుష్పగుచ్ఛాలు, పూల మొక్కలు అందజేశారు. అనంతరం జరిగిన పరిచయ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తానని, కరీంనగర్లో మున్సిపల్ కమిషనర్గా కరీంనగర్ కార్పొరేషన్లో పనిచేసిన అనుభవం ఉందన్నారు. మున్సిపల్ సర్వీసులపై అవగాహన ఉందని స్పష్టం చేశారు. శానిటేషన్పై ప్రత్యేక దృష్టి సారించి నగర పరిశుభ్రతకు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే లక్ష్యం, భవన నిర్మాణ అనుమతులకు జారీ చేసే విధానం, శానిటేషన్ విభాగంలో విధులు నిర్వహించే సిబ్బంది సంఖ్య, చెత్త తరలింపు వాహనాలకు జీపీఎస్ ఏర్పాటు, తదితర అంశాలను విభాగాల అధికారులను అడిగి తెలుసుకున్నారు. అన్ని విభాగాల అధికారులు సిబ్బంది సహకారంతో నగరాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కమిషనర్ను డిప్యూటీ కమిషనర్లు ప్రసూనారాణి, రవీందర్, (అడ్మిన్)రాజేశ్వర్, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఇన్చార్జ్ ఎస్ఈ శ్రీనివాస్, సిటీ ప్లానర్లు శ్రీనివాస్ రవీందర్ రాడేకర్, పీఆర్ఓ ఆయుబ్ అలీ డిప్యూటీ కమిషనర్లు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.న్యూస్రీల్ -
‘పింగిళి’లో నాణ్యమైన విద్య
హన్మకొండ అర్బన్: వడ్డేపల్లిలోని పింగిళి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని తాజా మాజీ కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. శుక్రవారం ఉదయం పింగిళి కళాశాల 2025–26 అడ్మిషన్ల పోస్టర్ను కలెక్టర్ ప్రావీణ్య క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పింగిళి కళాశాలలోని సైన్స్, ఆర్ట్స్, కామర్స్ మొదలైన అన్ని విభాగాల్లో బోధనను అందిస్తున్న అధ్యాపకులకు అత్యధిక విద్యార్హతలు, దశాబ్దాల సుదీర్ఘ బోధనానుభవం ఉండడం వల్ల నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందిస్తున్నారని తెలిపారు. అలాగే కళాశాలలో విద్యార్థినులకు కావాల్సిన అన్ని రకాల వసతులు, అత్యాధునిక బోధన ఉండడంతో విద్యార్థినులు చేరి తమ భవిష్యత్కు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ చంద్రమౌళి, వైస్ ప్రిన్సిపాల్ సుహాసిని, దోస్త్, ఐక్యూఏసీ కో–ఆర్డినేటర్ సురేశ్ బాబు, అధ్యాపకులు రామకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ప్రయాణికులపై టోల్ భారంహన్మకొండ: ఆర్టీసీ ప్రయాణికులపై టోల్ భారం పెరిగింది. ఈనెల 8 నుంచి టోల్ గేట్ల వద్ద రేట్లు పెంచడంతో ఆమేరకు ఆర్టీసీ చార్జీలు పెంచింది. వరంగల్ రీజియన్ బస్సులు నడిచే రెండు రూట్లలో టోల్ గేట్లు ఉన్నాయి. హనుమకొండ – ఏటూరునాగారం రూట్లో ములుగు సమీపంలో, హనుమకొండ – హైదరాబాద్ రూట్లో రఘునాథపల్లి, బీబీనగర్ వద్ద టోల్ గేట్లు ఉన్నాయి. ఒక్కో టోల్ గేట్కు రూ.10 చొప్పున ఆర్టీసీ అదనంగా వసూలు చేస్తోంది. దీంతో ఇప్పటి వరకు ఉన్న చార్జీలపై ప్రతీ బస్సుకు హైదరాబాద్ రూట్లో రూ.20 చొప్పున, ఏటూరునాగారం రూట్లో రూ.10 చొప్పున, హనుమకొండ – జనగామకు రూ.10 చొప్పున, జనగామ – హైదరాబాద్ రూట్లో తిరిగే బస్సులకు రూ.10 చొప్పున ఆర్టీసీ చార్జీలు పెంచింది. రేపు చేపూరి శ్రీరాం 29వ అష్టావధానంవిద్యారణ్యపురి: హనుమకొండకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, అష్టావధాని చేపూరి శ్రీరాం 29వ అష్టావధానం ఈనెల 15న(ఆదివారం) ఉదయం పదిగంటలకు హనుమకొండలోని లష్కర్బజార్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించనున్నారు. కాకతీయ పద్య కవితావేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగనుంది. ముఖ్య అతిథిగా సహృదయ సాహితీ అధ్యక్షుడు గిరిజామనోహరబాబు, విశిష్ట అతిథిగా దహగాం సాంబమూర్తి, విశ్రాంత విద్యాశాఖ అధికారి రామేశ్వర రాజు పాల్గొంటారని నిర్వాహకులు కొండా యాదగిరి, వెలుగు ప్రభాకర్ తెలిపారు. అనంతరం పద్యకవి సమ్మేళనం నిర్వహిస్తారు. హనుమకొండ డీఎండబ్ల్యూఓగా గౌస్ హైదర్!న్యూశాయంపేట: హనుమకొండ జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి (డీఎండబ్ల్యూఓ)గా కేఏ.గౌస్ హైదర్ను ప్రభుత్వం నియమించనున్నట్లు సమాచారం. వరంగల్ జిల్లా వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఆయన ఫారిన్ సర్వీస్లో భాగంగా వ్యవసాయ శాఖ నుంచి డిప్యుటేషన్పై మైనార్టీ సంక్షేమశాఖకు బదిలీ అయినట్లు తెలుస్తోంది. ఈమేరకు హనుమకొండ మైనార్టీ సంక్షేమాధికారిగా మంగళవారం బాధ్యతలు తీసుకోనున్నట్లు, ఈమేరకు త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు హనుమకొండ డీఎండబ్ల్యూఓగా విధులు నిర్వర్తిస్తున్న డి.మురళీధర్రెడ్డి మే నెలాఖరున ఉద్యోగ విరమణ పొందడంతో డీఎండబ్ల్యూఓ పోస్టు ఖాళీ ఏర్పడింది. తెలుగు విభాగం ఇన్చార్జ్ అధిపతికి షోకాజ్ నోటీస్కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని తెలుగు విభాగం ఇన్చార్జ్ అధిపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కాంట్రాక్ట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.లింగయ్యకు రిజిస్ట్రార్ వి.రామచంద్రం షోకాజ్ నోటీస్ జారీ చేశారు. లింగయ్య తన పట్ల అమర్యాదకరంగా మాట్లాడి అవమానపర్చారని తెలుగు విభాగం విశ్రాంత ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు ఈఏడాది ఏప్రిల్లో రిజిస్ట్రార్కు ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలో మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీస్లో రిజిస్ట్రార్ పేర్కొన్నారు. లింగయ్య ఇచ్చే వివరణను బట్టి ఆయనపై చర్యలు ఉంటాయని భావిస్తున్నారు. -
విద్యుత్ ఉద్యోగుల క్రీడా పోటీలు ప్రారంభం
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో విద్యుత్ ఉద్యోగుల క్రీడా పోటీలను గురువారం టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాడీ వరుణ్రెడ్డి ప్రారంభించారు. ముందుగా క్రీడా ప తాకాన్ని ఆవిష్కరించిన ఆయన క్రీడాకారులను పరి చయం చేసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ని రంతరం విధుల్లో ఉంటూ ఒత్తిడికి గురయ్యే ఉద్యోగులకు క్రీడా పోటీలతో మానసిక, శారీరక విశ్రాంతి లభిస్తుందన్నారు. విద్యుత్ సంస్థల్లో పనిచేసే వారందరం అన్నదమ్ములమే.. పోటీల్లో గెలుపు ఓటములను సహజంగా తీసుకోవాలని సూచించారు. స్పోర్ట్స్ కౌన్సిల్ వరంగల్(ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీ ఎల్, ట్రాన్స్కో) ఆధ్వర్యాన ఈనెల 14 వరకు జరిగే ఇంటర్ సర్కిల్ కబడ్డీ, బాల్బ్యాడ్మింటన్ క్రీడా పో టీలు ఉంటాయని, కబడ్డీ 12 జట్లు, బాల్బ్యాడ్మింటన్ 9 జట్లు పాల్గొంటాయని పేర్కొన్నారు. ఎన్పీడీసీఎల్ ఇన్చార్జ్ డైరెక్టర్లు బి.అశోక్కుమార్, టి.సదర్రలాల్, వి.తిరుపతిరెడ్డి, హనుమకొండ ఎస్ఈ పి.మధుసూదన్రా వు, డీఈ టెక్నికల్ ఎ.విజయేందర్రెడ్డి, స్పోర్ట్స్ ఆఫీసర్ జగన్నాథ్, కోశాధికారి ఎం. సంతోష్, కౌన్సిల్ సభ్యులు యాకూబ్పాషా,సునీల్కుమార్, ప్రేమ్కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనలకు విరుద్ధంగా కమిటీ ఏర్పాటు
హన్మకొండ: నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన కమిటీ నియామకం చెల్లదని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ టీజీ ఎన్పీడీసీఎల్ శాఖ ప్రెసిడెంట్ ఆరెపల్లి శ్రీనివాస్, సెక్రటరీ బక్క దానయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ కె.ఉపేందర్, ఇతర నాయకులు స్పష్టం చేశారు. అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాతంగి శ్రీనివాస్ వాట్సాప్ గ్రూప్లో ఎన్పీడీసీఎల్ శాఖ కొత్త కమిటీ ఏర్పాటు చేసినట్లు పోస్టులు చేస్తున్నారని, దీనిని అసోసియేషన్ సభ్యులు పరిగణనలోకి తీసుకోవద్దని వారు సూచించారు. గురువారం హనుమకొండలో అసోసియేషన్ టీజీ ఎన్పీడీసీఎల్ శాఖ సమావేశం జరిగింది. ఇందులో మాతంగి శ్రీనివాస్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఎన్నికలు నిర్వహించకుండా, అసోసియేషన్ సభ్యులతో చర్చించకుండా కమిటీని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. త్వరలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆరెపల్లి మోహన్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించే వరకు పాత కమిటీనే కొనసాగుతుందన్నారు. సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు రామస్వామి, రౌతు రమేశ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ లక్ష్మీనారాయణ, ట్రెజరర్ దామెర స్వదేశ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు -
కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన ట్రెయినీ కలెక్టర్లు
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో ట్రెయినీ కలెక్టర్లు సౌరభ్ శర్మ, సలోని చోబ్రా, హర్ష చౌదరి, కెరోలిన్ చింగ్తయానమావి, కొయ్యాడ ప్రణయ్ కుమార్ బృందం గురువారం పర్యటించింది. ఈ సందర్భంగా కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెనను పరిశీలించి కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి కన్నెపల్లిలోని లక్ష్మీ పంప్హౌస్ను సందర్శించింది. పంపుహౌస్ వివరాలను ఇరిగేషన్ డీఈ సత్యబాబు వివరించారు. విద్యుత్ వినియోగం, ఎత్తిపోతల వివరాలు, స్టోరేజీ, మో టార్ల సామర్థ్యం, సాగు, తాగు అవసరాల వినియోగంపై వివరించారు. అనంతరం ట్రెయినీ కలెక్టర్ల బృందం మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీని సందర్శించింది. మహదేవపూర్ డిప్యూటీ తహసీల్దార్ కృష్ణ, లైసన్ అధికారి అబ్బాస్, కోర్సు డైరెక్టర్ శ్రీనివాస్, డీఈ సురేశ్ తదితరులు ఉన్నారు. కాగా, ట్రెయినీ కలెక్టర్ సౌరభశర్మ శ్రీకాళేశ్వరముక్తీశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
స్కూళ్ల అభివృద్ధిలో భాగస్వాములుకావాలి
● జిల్లా విద్యాశాఖాధికారి వాసంతి విద్యారణ్యపురి: సర్కారు స్కూళ్ల అభివృద్ధిలో విద్యార్థుల తల్లిదండ్రులు భాగస్వాములు కావాలని హనుమకొండ డీఈఓ డి.వాసంతి కోరారు. గురువారం హనుమకొండలోని ప్రభుత్వ మర్కజీ హైస్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించటం ఉపాధ్యాయుల బాధ్యత అని, అలాగే పాఠశాలల ఆస్తిత్వాన్ని కాపాడే బాధ్యత తల్లిదండ్రులేదనన్నారు. ప్రతి నెలా మూడో శనివారం తల్లిదండ్రుల సమావేశాలు జరుగుతాయని, తప్పనిసరిగా హాజరై తమ పిల్లల చదువు, పాఠశాలల అవసరాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కమ్యూనిటీ మొబలైజింగ్ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్రెడ్డి, పాఠశాల హెచ్ఎం జి.వి. రామారావు, తెలుగు స్కూల్ అసిస్టెంట్ వల్స పైడి తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్ బంగ్లాను పరిశీలించిన ‘కుడా’ చైర్మన్
నయీంనగర్ : హనుమకొండ కలెక్టర్ పాత బంగ్లాలో చేపట్టిన పనుల పురోగతిని ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్రెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం కాలం నాటి చారిత్రక భవనమైన హనుమకొండ కలెక్టర్ బంగ్లాను ఓరుగల్లుకు ఐకాన్గా, హెరిటేజ్ భవనంగా మార్చి చరిత్రలో నిలిచేలా అభివృద్ధి చేసి సందర్శకులకు ఆకర్షణీయ కేంద్రంగా మార్చే దిశగా పనులు జరుగుతున్నాయని చెప్పారు. 7 నుంచి కరీంనగర్, తిరుపతి వీక్లీ స్పెషల్ ట్రైన్ ఖిలా వరంగల్: జూలై 7వ తేదీ నుంచి కరీంనగర్– తిరుపతి వీక్లీ స్పెషల్ ట్రైన్ నడుపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 8న తిరుపతి– కరీంనగర్ వీక్లి వన్స్ ట్రైన్ నడవనుందని పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. 20 వరకు ఫీజు గడువుకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి పీజీ కోర్సుల ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ రెండో సెమిస్టర్ విద్యార్థులు పరీక్షల ఫీజు చెల్లించేందుకు (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) గడువు ఈనెల 20 వరకు ఉన్నట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ తెలిపారు. రూ.250 అపరాధ రుసుముతో 26వ తేదీ వరకు ఉందని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేరు తొలగించారని.. ధర్మసాగర్: గ్రామ పంచాయతీ కార్యదర్శిని ఓ యువకుడు బుధవారం గదిలో ఉంచి తాళం వేసి నిర్బంధించిన సంఘటన హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం రాపాకపల్లిలో గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో ఇటీవల ఎంపిక చేసిన ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో కందుకూరి ప్రశాంత్ అనే యువకుడి పేరు వచ్చింది. ప్రొసీడింగ్ ఇచ్చే సమయంలో అతడి పేరు లేదు. తన పేరు ఎలా తొలగిస్తారంటూ ప్రశాంత్ బుధవారం మధ్యాహ్నం గ్రామ పంచాయతీ కార్యదర్శి భోగి శ్రీనివాస్ను ఆఫీస్ గదిలో ఉంచి తాళం వేసి దూషించాడు. దీంతో అతను పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పగా వారు చేరుకుని ప్రశాంత్ను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా మండలంలో అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించారని, కార్యదర్శులు కూడా అనర్హుల పేర్లనే ఫైనల్ చేశారని ప్రజలు ఆరోపిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. -
సునీల్ కుటుంబానికి అండగా ఉంటా..
ములుగు రూరల్ : అనారోగ్య కారణాలతో ఇటీవల మృతి చెందిన సాక్షి ములుగు ఆర్సీ ఇన్చార్జ్ భూక్య సునీల్ కుటుంబానికి అండగా ఉంటానని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క అన్నారు. ఈ మేరకు గురువారం సునీల్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా సునీల్ చిత్రపటం వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సునీల్ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించడంతోపాటు కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆమె వెంట గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మ న్ బానోత్ రవిచందర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్, నల్లెల భరత్కుమార్, మండల అధ్యక్షుడు చాంద్పాషా, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క -
మరిన్ని పీఎంశ్రీ స్కూళ్ల ఎంపికకు కృషి
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరిన్ని పీఎంశ్రీ స్కూళ్ల ఎంపికకు తనవంతు కృషిచేస్తానని ఎంపీ కడియం కావ్య అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా కాజీపేట మండలం పోచంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నూతన విద్యాసంవత్సరం పాఠశాలల పున:ప్రారంభ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు పోటీపరీక్షల ద్వారానే నియమితులవుతారన్నారు. ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తే సర్కారు బడులు జ్ఞానకర్మాగారాలుగా మారుతాయన్నారు.ఉపాధాయులు నిత్యవిద్యార్థిగా ఉంటూ విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇందులో భాగంగా ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన, కృత్రిమ మేధతో తరగతి గదుల అనుసంధానం డిజిటల్ బోర్డ్స్ ఏర్పాటు చేశారని విద్యాబోధన పద్ధతుల్లో నవీనప్రక్రియలను చేపడుతోందన్నారు. ఈవిద్యాసంవత్సరంలో 135 పాఠశాలల్లో కృత్రిమ మేధ తరగతులను,16 పాఠశాలల్లో పూర్వప్రాథమిక తరగతులను కూడా ప్రారంభిస్తున్నామన్నారు. డీఈఓ డి. వాసంతి మాట్లాడుతూ బడి బాట కార్యక్రమం ద్వారా విద్యార్థుల నమోదు పెంచేందుకు ఉపాధ్యాయులు కృషిచేస్తున్నారన్నారు. కార్యక్రమంలో కమ్యూనిటీ మొబలైజింగ్ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్రెడ్డి, ఎంఈఓ బి. మ నోజ్కుమార్, ఆ పాఠశాల హెచ్ఎం జి. ఉప్పల య్య, రిటైర్డ్ హెచ్ఎం బి. రాధ, పర్యావరణ పరిరక్షణ సమితి బాధ్యులు, రిటైర్డ్ డీఎఫ్ఓ కాజిపేట పురుషోత్తం, అశోక్బాబు, ప్రేరణ ఫౌండేషన్ అధ్యక్షుడు పెండ్లి ఉపేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య -
వ్యవసాయ సర్వీస్లు త్వరగా మంజూరు చేయాలి
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్లోని 16 సర్కిళ్లలో వ్యవసాయ సర్వీస్లను త్వరితగతిన మంజూరు చేయాలని ఆ కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. గురువారం హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 16 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలు, ఏడీఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వరుణ్ రెడ్డి మాట్లాడుతూ ఇంటర్ లింకింగ్ లైన్లు 68 పూర్తి అయ్యాయని, ఈ నెలాఖరు వరకు మిగతా 97 పనులు పూర్తి చేస్తామన్నారు. ప్రతీ సబ్ స్టేషన్కు ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలన్నారు. ట్రాన్స్ఫార్మర్ల ఫెయిల్యూర్స్ కాకుండా నిర్వహణ చేపట్టాలని, పిడుగుల నిరోధకం అమర్చాలని సూచించారు. పురోగతిలో ఉన్న కొత్త సబ్ స్టేషన్ల పనులు వేగవంతం చేయాలన్నారు. పట్టణాల్లో అవసరమైన చోట 8 ఎంవీ పవర్ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ డైరెక్టర్లు టి.సదర్ లాల్, టి.మధుసూదన్, చీఫ్ ఇంజనీర్ రాజుచౌహాన్, జీఎంలు ఉత్తమ్, సురేందర్, డి.ఈలు అనిల్ కుమార్, ప్రభావతి పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి -
వికసిత్ భారత్ దిశగా అడుగులు
● బీజేపీ ఎమ్మెల్సీ మల్కా కొమురయ్యఖిలా వరంగల్: వికసిత్ భారత్ దిశగా దేశం అడుగులు వేస్తోందని బీజీపీ ఎమ్మెల్సీ కొమురయ్య, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమాదేవి అన్నారు. బీజేపీ 11 ఏళ్ల సుపరిపాలనపై వరంగల్ చౌరస్తాలోని ఓ కాన్వెన్షన్ హాల్లో గురువారం సంబురాలు జరుపుకున్నారు. ముఖ్యఅతిథులుగా వారు హాజరై ఎగ్జిబిషన్ను ప్రారంభించి మాట్లాడారు. నరేంద్ర మోదీ అభివృద్ధి ఫలాలు, సాధించిన ఆర్థిక ప్రగతిని ప్రజలకు వివరించాలని నాయకులు, కార్యకర్తలను కోరారు. సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే నినాదంతో నడుస్తున్న ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో దేశం పురోగమిస్తోందని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, మాజీ ఎమ్మెల్యేలు కొండేటి శ్రీధర్, అరూరి రమేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రబెల్లి ప్రదీప్రావు, రత్నం, సతీష్షా, నాయకులు పుల్లారావు, బాకం హరిశంకర్, మల్లాడి తిరుపతిరెడ్డి, రాణా ప్రతాప్రెడ్డి, ఎడ్ల అశోక్రెడ్డి, గజ్జెల శ్రీరాములు, ముండ్రాతి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ఎయిర్పోర్ట్ రోడ్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
న్యూశాయంపేట/ఖిలా వరంగల్: మామునూరు ఎయిర్పోర్ట్ రోడ్ల కనెక్టివిటీ కోసం వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో గురువారం ఆమె పర్యటించారు. రోడ్ల నిర్మాణం చేపట్టే ప్రదేశాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గుంటూరుపల్లి నుంచి నేషనల్హైవే వరకు, నక్కలపల్లి నుంచి గాడిపల్లి–గాడిపల్లి బైపాస్ వరకు రోడ్ల స్థలాలను పరిశీలించి ప్రభుత్వానికి పంపడానికి త్వరితగతిన ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ అధికారి రమేశ్, ఆర్డీఓ సత్యపాల్రెడ్డి, ఇరిగేషన్ డీఈ మధుసూదన్, తహసీల్దార్ నాగేశ్వర్రావు, అధికారులు పాల్గొన్నారు.భూనిర్వాసితులకు త్వరితగతిన పరిహారం.. న్యూశాయంపేట: ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భూములిచ్చిన భూనిర్వాసితులకు పెండింగ్లో ఉన్న పరిహారాన్ని త్వరితగతిన చెల్లించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. ఇన్నర్ రింగ్రోడ్డు భూ నిర్వాసితులకు పరిహారం చెల్లింపు, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో రాజీవ్ మెగా టౌన్షిప్ లేఔట్ అనుమతుల పురోగతి తదితర అంశాలపై కలెక్టరేట్లో గురువారం కుడా చైర్మెన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డితో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గొర్రెకుంట, ఏనుమాములతోపాటు ఖిలా వరంగల్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన రింగ్రోడ్డు భూ నిర్వాసితులకు త్వరితగతిన పరిహారాన్ని చెల్లించాలన్నారు. మెగా టెక్స్టైల్ పార్కులో రాజీవ్ మెగా టౌన్షిప్ ఏర్పాటుకు లేఔట్ అనుమతులు మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, కేఎంటీపీ జోనల్ మేనేజర్ స్వామి, ఆర్డీఓ సత్యపాల్రెడ్డి, కుడా పీఓ అజిత్రెడ్డి, తహసీల్దార్లు నాగేశ్వర్రావు, రాజ్కుమార్, మహ్మద్ ఇక్బాల్, రియాజుద్దీన్, అధికారులు పాల్గొన్నారు. బడిబాటను విజయవంతం చేయాలి.. ఖిలా వరంగల్: తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. ఖిలా వరంగల్ మండల పరిధి గుంటూరుపల్లిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్ సత్యశారద, ఆర్డీఓ సత్యపాల్రెడ్డి, తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించి, విద్యార్థులకు యూనిఫామ్, బుక్స్ పంపిణీ చేసి మాట్లాడారు. ఈనెల 6వ తేదీ నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాఠశాల పునఃప్రారంభమైన సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఐదు సంవత్సరాలు నిండిన చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని, బడిబయట ఉన్న విద్యార్థులను గుర్తించి తిరిగి బడికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. అంతకుముందు నూతనంగా బడిలో చేరిన విద్యార్థులకు అడ్మిషన్ ఫారాలు అందించారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఓ రమేష్, ఎస్సైలు శ్రీకాంత్, కృష్ణవేణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
30 మంది అధికారులు
రెండు గంటలు..కాజీపేట రూరల్ : సౌత్ వెస్ట్రన్ ఇంటర్ రైల్వే సేఫ్టీ ఆడిట్ అధికారుల బృందం గురువారం సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలులో కాజీపేట జంక్షన్కు చేరుకుంది. రైల్వే గేట్లు, వంతెనలు, సిగ్నల్ పాయింట్లు, ట్రాక్ను తనిఖీ చేసుకుంటూ కాజీపేటకు చేరుకున్న సౌత్ వెస్ట్రన్ రైల్వే, దక్షిణ మధ్య రైల్వేకు చెందిన దాదాపు 30 మంది బృంద సభ్యులకు కాజీపేట రైల్వే అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సౌత్ వెస్ట్రన్ రైల్వే హుబ్లీ ప్రిన్సిపాల్ చీఫ్ సేఫ్టీ ఆఫీసర్ రామకృష్ణ నేతృత్వంలో సౌత్ వెస్ట్రన్ రైల్వే, దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్, కాజీపేట అధికారులు రైల్వే సీఆర్ఎస్ఈ వి.ఎం.దాస్పుత్ర, సీనియర్ డీఈఎన్ కోఆర్డినేషన్ రవీంద్రనాథ్, సీటీపీఎఫ్ దినేశ్, సీనియర్ డీఎస్ఓ సురేశ్, సీఈఎల్ఈ, సీనియర్ డీఎస్టీఈ ప్రియ అగర్వాల్, డీఓఎం జనరల్ సుధీర్కుమార్, కాజీపేట డీజిల్ సీనియర్ డీఎంఈ వెంకటకుమార్, కాజీపేట ఈఎల్ఎస్ సీనియర్ డీఈఈ ప్రశాంత్ కృష్ణసాయి, డీఈఎన్ సెంట్రల్ ప్రంజల్ కేశర్వాణి, ఇతర అధికారులు బృందం వివిధ డిపార్ట్మెంట్లలో తనిఖీలు నిర్వహించారు. కాజీపేట రైల్వే స్టేషన్, 140 టన్నుల క్రేన్, యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్, మెడికల్ రిలీఫ్ వ్యాన్ ట్రైన్, క్యారియజ్ అండ్ వ్యాగన్ డిపో, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ డిపో, లోకోపైలెట్ కార్యాలయం, రూట్ రిలే ఇంటర్లాకింగ్ సిస్టం, రైల్వే ఎలక్ట్రిక్లోకోషెడ్, డీజిల్ లోకోషెడ్, రైల్వే ఇంజనీరింగ్ డిపో, సిగ్నల్ వ్యవస్థ, పాయింట్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానం వచ్చిన విషయాలపై ఆరా తీసి నోట్ చేసుకున్నారు. గతంలో పలు చోట్ల జరిగిన రైలు ప్రమాదాలను గుర్తు చేస్తూ అలా జరగకుండా సేఫ్టీ నియమాలు పాటించాలని సలహాలు, సూచనలు చేశారు. మధ్యాహ్నం 3.09 గంటలకు చేరుకున్న అధికారుల బృందం.. రెండు గంటల పాటు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టి సాయంత్రం 5.20 గంటలకు కాజీపేట నుంచి సికింద్రాబాద్కు బయలుదేరి వెళ్లారు. అధికారుల బృందం తనిఖీల్లో కాజీపేట రైల్వే స్టేషన్ మేనేజర్ అగ్గి రవీందర్తోపాటు అన్ని విభాగాల అధికారులు, సూపర్వైజర్లు ఉన్నారు.కాజీపేట జంక్షన్లో రైల్వే సేఫ్టీ బృందం తనిఖీలు ప్రత్యేక స్పిక్ రైలులో కాజీపేటకు చేరుకున్న సౌత్ వెస్ట్రన్ రైల్వే బృందం -
ఉత్సాహంగా 5కే రన్
ఎంజీఎం : నేషనల్ సర్జన్స్ డేను పురస్కరించుకొని ఏఎస్ఐ వరంగల్ బ్రాంచ్ ఐఎంఏ వరంగల్ డిపార్ట్మెంట్ ఆఫ్ సర్జరీ, కేఎంసీ ఎన్ఎస్ ఎస్ యూనిట్ ఆధ్వర్యాన గురువారం కేఎంసీ నుంచి ఐఎంఏ హాల్ వరకు 5కే రన్ నిర్వహించారు. ఏఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మోహన్దాస్, ఐఎంఏ వరంగల్ అధ్యక్షుడు డాక్టర్ నాగార్జునరెడ్డి జెండా ఊపి రన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేశ్ మాట్లాడుతూ ఈ రన్ ద్వారా ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడమే కాకుండా సర్జన్ల పాత్రను సమాజానికి వివరిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సర్జన్ డాక్టర్లు శ్రీనివాస్గౌడ్, నాగేందర్, విద్యాసాగర్, రూప, కార్తీక్, కేఎంసీ ఎన్ఎస్ ఎస్ కోఆర్డినేటర్, పీజీ, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. సెర్ప్ ఏపీడీగా వెంకటేశ్వర్లు హన్మకొండ అర్బన్ : హనుమకొండ డీఆర్డీఏ పరిధి సెర్ప్ అదనపు డైరెక్టర్గా బొజ్జ వెంకటేశ్వర్లును నియమిస్తూ ఆ సంస్థ సీఈఓ ఉత్తర్వులు జారీ చేశారు. డీఆర్డీఏ ఆధ్వర్యాన చేపట్టిన సాధారణ బదిలీల్లో ట్రాన్స్ఫర్ చేశారు. గతంలో వెంకటేశ్వర్లు జిల్లాలో డీపీఎంగా కొంతకాలం పనిచేశారు. కేయూలో నేటినుంచి జాతీయ వర్క్షాప్ కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీజువాలజీ విభాగం ఆధ్వర్యాన ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు జాతీయ వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు ఆ విభాగం అఽధిపతి ఆచార్య జి.షమిత తెలిపారు. ‘హ్యాండ్ ఆన్ మాలిక్యూలర్ డాకింగ్ అండ్ డ్రగ్ డిస్కవరీ టెక్నిక్స్’ అనే అంశంపై జువాలజీ సెమినార్ హాల్లో నిర్వహించే ఈ వర్క్షాప్ ప్రారంభం సమావేశంలో కేయూ వీసీ ప్రతాప్రెడ్డితోపాటు సైన్స్ డీన్ జి.హనుమంతు, ఆర్గనైజింగ్ సెక్రటరీ మామి డాల ఇస్తారి, కన్వీనర్ వై.వెంకయ్య, బీఓఎస్ ఈసం నారాయణ పాల్గొంటారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమష్టి కృషితో ఉత్తమ ఫలితాలుపాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ రామన్నపేట : విద్యార్థులు, అధ్యాపకుల సమష్టి కృషితో టీజీఈసెట్లో ఉత్తమ ఫలితాలు సాధ్యమయ్యాయని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ బైరి ప్రభాకర్ అన్నారు. టీజీఈసెట్–2025లో ఉత్తమ ప్రతిభ కబర్చి రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించిన పలువురు విద్యార్థులను గురువారం కళాశాల ఆవరణలో ప్రిన్సిపాల్తోపాటు అధ్యాపక బృందం అభినందించారు. ఈ సందర్భంగా కళాశా ల ప్రిన్సిపాల్ బైరి ప్రభాకర్ మాట్లాడుతూ.. విద్యార్థులు టాప్ ర్యాంకులు సాధించడం కళాశాలకు ఎంతో గర్వకారణమని అన్నారు. ఈ స్ఫూర్తిదాయక ప్రదర్శన ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. భవిష్యత్లో వారు మరిన్ని విజయాలు సాధించి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. అరుణాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సు హన్మకొండ: తమిళనాడులోని అరుణాచలం గిరి ప్రదక్షిణకు వెళ్లి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సు నడుపుతున్నట్లు వరంగల్ రీజినల్ మేనేజర్ దర్శనం విజయభాను తెలి పారు. వరంగల్–1 డిపో సూపర్ లగ్జరీ బస్(సర్వీస్ నంబర్ 92222) ఈనెల 27న మధ్యాహ్నం 3 గంటలకు హనుమకొండ జిల్లా బస్ స్టేషన్ నుంచి బయలుదేరి 28న ఉదయం 6 గంటలకు ఆంధ్రప్రదేశ్లోని కాణిపాకం చేరుకుంటుంది. విఘ్నేశ్వరుడి దర్శనం అనంతరం బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు వెల్లూరులోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సన్నిధికి చేరుకుంటుందన్నారు. ఇక్కడ దర్శనం అనంతరం సాయంత్రం 7 గంటలకు అరుణాచలానికి చేరుకుంటుందని ఒక ప్రకటనలో వివరించా రు. గిరి ప్రదక్షిణ పూర్తయిన తర్వాత 29న మధ్యాహ్నం బయలుదేరి 30న ఉదయం శ్రీ జోగులాంబ అమ్మవారి శక్తిపీఠం, తర్వాత బీచుపల్లి హనుమాన్ దర్శనం అనంతరం హనుమకొండకు బయలుదేరుతుందన్నారు. ఈ ప్యాకేజీ ధర పెద్దలకు రూ.5,000, పిల్లలకు రూ.3,500 నిర్ణయించినట్లు తెలిపారు. ఆర్టీసీ వెబ్సైట్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చ ని, పూర్తి సమాచారానికి 9063407493, 7780565971, 9866373825, 9959226047 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
ఆన్లైన్ జీరో పర్మిట్ అమలుచేయాలి
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య హన్మకొండ అర్బన్ : ప్రభుత్వ పనులకు సంబంధించి చిన్న తరహా ఖనిజాలైన కంకర, మట్టి కోసం ఆన్లైన్ జీరో పర్మిట్ అమలు చేయాలి.. ఈ విధానంపై కాంట్రాక్టర్లకు అవగాహన కల్పించాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లో మైనింగ్, టీజీఎండీసీ, రెవెన్యూ, పోలీస్, రవాణా తదితర శాఖల అధికా రులతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇంజనీరింగ్ శాఖల అధికారులు ప్రభుత్వ పనులను చేపట్టిన కాంట్రాక్టర్లు ఆన్లైన్ జీరో పర్మిట్కు దరఖాస్తు చేసుకుంటే వెంటనే ఆమోదించడం వల్ల అక్రమ ఖనిజ రవాణాను అరికట్టవచ్చని చెప్పారు. వాగుల్లో ఇసుక వెలికితీత, అక్రమ రవాణాపై పరిపాలనా పరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణా నికి ఇసుక అవసరం ఎంతో ఉందని, సాండ్ బజార్ ద్వారా ఆన్లైన్ తీసుకునేలా చర్యలు చేపట్టాలన్నా రు. ధర్మసాగర్, హసన్పర్తి, ఆత్మకూరు మండలా ల్లో సాండ్ బజార్ కోసం ఐదు ఎకరాల చొప్పున స్థలం గుర్తించాలని, శుక్రవారం నుంచి లబ్ధిదారులకు కూపన్లు ఇవ్వాలని తహసీల్దార్లను ఆదేశించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, డీఆర్ఓ వైవీ.గణేశ్, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, డాక్టర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ‘భోజన’ పథకం పక్కాగా అమలుచేయాలి ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని పక్కాగా అమలు చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో విద్యాశాఖ, డీఆర్డీఓ, వైద్య ఆరోగ్య, ఫుడ్ సేఫ్టీ తదితర శాఖల అధికారులతో నిర్వహించిన స్టీరింగ్, మానిటరింగ్ కమిటీ జిల్లా స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో 470 పాఠశాలలు ఉండగా 324 స్కూళ్లకు వంట గదిలు అందుబాటులో ఉన్నాయని, మిగతా వాటికి నిర్మించాల్సి ఉందని, ప్రతిపాదనలు త్వరగా పంపించాలని డీఆర్డీఓ మేన శ్రీనును ఆదేశించారు. అన్ని పాఠశాలల్లో అవసరమైన వంట సామగ్రికి రూ.50 లక్షలు వెచ్చించినట్లు పేర్కొన్నారు. వంట కార్మికులకు కనీసం మూడు నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. అన్ని పాఠశాలల్లో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలని, మధ్యాహ్న భోజనం వండేందుకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి సిలిండర్లు సరఫరా చేయాలని తెలిపారు. మూడు నెలలకోసారి ఆహార పదార్థాల నాణ్యత పరీక్షలను నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. సమావేశంలో డీఈఓ వాసంతి, అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆపద సమయంలో సిద్ధంగా ఉండాలి హన్మకొండ: విపత్తు, ప్రమాదాలు వంటి ఆపద సమయాల్లో సహాయం అందించేందుకు ఆపద మిత్రలు సిద్ధంగా ఉండాలని హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థల ఆదేశాల మేరకు జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యాన ఆపద మిత్రలకు హనుమకొండలో ని అంబేడ్కర్ భవన్లో నిర్వహించిన శిక్షణ శిబిరం గురువారం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ తమ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనుకోని ప్రమాదాలు జరిగినా.. విపత్తులు సంభవించినా వెంటనే అధికారులకు సమాచారం అందించడంతో పాటు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రకృతి విపత్తులు, ఆపద సమయాల్లో కాపాడటం, సహాయం చేయడంపై శిక్షణలో నేర్చుకున్న అంశాలను పదిమందికి నేర్పించాలని పేర్కొన్నారు. జిల్లా అగ్నిమాపక అధికారి నాగరాజు మాట్లాడుతూ మడికొండలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో 126 మంది, పరకాలలో 131 మంది వలంటీర్లకు 12 రోజులపాటు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం ఆపద మిత్ర వలంటీర్లకు సర్టిఫికెట్లు అందజేశారు. నెహ్రూ యువ కేంద్ర డిప్యూటీ డైరెక్టర్ అన్వేష్ చింతల, పరకాల మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం జిల్లా మేనేజర్ జయశ్రీ, సైకాలజిస్ట్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
విద్యార్థులకు గ్రాండ్ వెల్కమ్
విద్యారణ్యపురి: వేసవి సెలవులు ముగియడంతో విద్యార్థులు గురువారం బడిబాట పట్టారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో పండుగ వాతావరణంలో ప్రభుత్వ పాఠశాలలకు వచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు. వివిధ చోట్ల స్కూళ్లను మామిడి తోరణాలు, పూలు, బెలూన్లతో అలంకరించి పిల్లలకు తొలిరోజే గొప్ప అనూభూతి కలిగేలా ఆహ్వానం పలికారు. పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు పూలు అందజేసి స్వాగతించారు. ‘బడిబాట’ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు సమావేశాలు కూడా నిర్వహించారు. కొందరు తమపిల్లలతోపాటు పాఠశాలలకు వచ్చారు. వేసవి సెలవుల్లో ఆటపాటలతో గడిపిన చిన్నారులు మారాం చేస్తుండగా బుజ్జగించడం కనిపించింది. పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ హనుమకొండ జిల్లాలో 477, వరంగల్ జిల్లాలో 558 పాఠశాలల్లో తొలిరోజు హాజరైన విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, స్కూల్ యూనిఫామ్ అందజేశారు. హనుమకొండ పోచంపల్లి పాఠశాలలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ ప్రావిణ్య, డీఈఓ వాసంతి, కమలాపూర్ భీంపెల్లిలో జెడ్పీసీఈఓ విద్యాలత, ఎలకతుర్తి మండలం వల్బాపూర్ జెడ్పీఎస్ఎస్లో అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి పాల్గొన్నారు. వరంగల్ జిల్లా సంగెం మండలం మొండ్రా యి జెడ్పీహెచ్ఎస్, పల్లారిగూడెం యూపీఎస్లను జిల్లా కమ్యూనిటీ మొబలైజింగ్ కోఆర్డినేటర్ కె.సుభాష్ సందర్శించారు. వరంగల్ కృష్ణాకాలనీ ప్రభుత్వ పాఠశాలలో 300ల మంది విద్యార్థులకు 150 మంది, హనుమకొండ పోచంపెల్లి పాఠశాలలో 180 మందికి 100 మంది హాజరయ్యారు. వరంగల్ జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ సుజన్తేజ పలు పాఠశాలలను సందర్శించి పర్యవేక్షించారు. పునఃప్రారంభమైన పాఠశాలలు మామిడి తోరణాలతో అలంకరణ విద్యార్థులకు పూలతో స్వాగతం తొలిరోజు 30శాతం వరకే విద్యార్థుల హాజరు -
కమిషనరేట్లో వరుస దొంగతనాలు
● ఒక్కో పోలీస్ స్టేషన్లో పదుల సంఖ్యలో కేసులు పెండింగ్ ● స్టేషన్ల చుట్టూ తిరిగి విసిగి పోతున్న బాధితులు ● కనిపించని పోలీస్ పెట్రోలింగ్.. ● సమీక్షలకే అధికారులు పరిమితం కమిషనరేట్ పరిధిలో చోరీలు ఇలా..● ఈ ఏడాది జనవరి 21న హనుమకొండ పోలీస్స్టేషన్ పరిధిలోని కొత్తూరుజెండా, సుభాష్కాలనీలో తాలం వేసిన ఓ ఇంట్లో దొంగలు పడి 178 గ్రాముల బంగారు అభరణాలు ఎత్తుకెళ్లారు. ఇదే నెలలో కొత్తూరుజెండాలో రూ.3.50 లక్షల విలువైన బంగారు ఆభరణాల చోరీ జరిగింది. ఇదే పోలీస్స్టేషన్ పరిధి కాకాజీ కాలనీలోని ఓ ఆస్పత్రిలో ఏప్రిల్ 8న బ్యాగులో బంగారం పెట్టి స్నానింగ్కు వెళ్లి వచ్చే సరికి బ్యాగు అపహరణకు గురైంది. అందులో 7 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. ● ఏప్రిల్ 5న హనుమకొండ పోలీస్స్టేషన్ పరిధి నయీంనగర్లో 5 తులాల బంగారం, రూ.50 వేల నగదు దొంగతనం జరిగింది. ● మామునూరు పోలీస్స్టేషన్ పరిధి బొల్లికుంట, సింగారంలో ఏప్రిల్లో రూ.15 లక్షల నగదు, రూ.2.50 లక్షల విలువైన బంగారు అభరణాలు చోరీకి గురయ్యాయి. ● మే నెలలో ఖానాపూర్ మండల కేంద్రంలో చోరీ జరిగి రూ.10 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు పోయాయి. అలాగే.. కాకతీయ యూనివర్సిటీ పోలీస్స్టేషన్ పరిధి కృష్ణాకాలనీలో రూ.10 లక్షల నగదు, 15 తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. మిల్స్కాలనీ పోలీస్స్టేషన్ పరిధి వెంకటేశ్వర కాలనీలో రూ.17 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ● ఈనెల 8న మిల్స్కాలనీ పోలీస్స్టేషన్ పరిధి పడమర కోటలో జల్సాలకు అలవాటు పడిన ఓ యువకుడు తన ప్రేయసిని సంతోష పెట్టడానికి తన ఇంట్లోనే చోరీ చేసి 16 తులాల బంగారం ఎత్తుకుపోయి పోలీసులకు చిక్కిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదే పోలీస్స్టేషన్ పరిధి గణేశ్నగర్లో ఈనెల 11న చోరీ జరిగి 7 తులాల బంగారం, 70 తులాల వెండి ఆభరణాలు పోయాయి. వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుసగా జరుగుతున్న చోరీలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ట్రైసీటీల్లో ఎక్కడ ఎప్పడు దొంగతనం జరుగుతుందో.. ఎంత నష్టపోవాల్సి వస్తుందో ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. కమిషనరేట్ పరిధిలో అంతర్రాష్ట్ర దొంగలతోపాటు స్థానిక దొంగలు రెచ్చిపోయి చోరీలకు పాల్పడుతున్నారు. పోలీసులు కేసులు నమోదు చేసి, ఒకటి రెండు రోజులు హడావుడి చేసి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో బాధితులు పోలీస్స్టేషన్ల చుట్టూ తిరిగి విసిగిపోతున్నారు. కమిషనరేట్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఒక్క హన్మకొండ పోలీస్స్టేషన్ పరిధిలోనే ఈ ఏడాది ఇప్పటి వరకు 35 చోరీలు జరిగాయంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో చోరీలు రాత్రి పూట ఎక్కువగా జరిగేవి. అయితే ఇటీవల రాత్రి, పగలు తేడా లేకుండా దొంగతనాలు జరుగుతున్నాయి. పోలీసులు కేవలం పండుగల సమయంలోనే దొంగతనాలు ఎక్కువగా జరుగుతాయని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మిగితా సమయంలో పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే కమిషనరేట్ పరిధిలో రూ.కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదు ఇంకా రికవరీ కాలేదు. జాడలేని పెట్రోలింగ్ ఒకపక్క జోరుగా చోరీలు జురుగుతుంటే మరో పక్క పోలీస్ పెట్రోలింగ్ జాడ లేకుండా పోయిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పోలీస్ ఉన్నత అధికారులు ప్రతీ సమీక్ష సమావేశంలో విజుబుల్ పోలీసింగ్ పెంచాలని కింది స్థాయి అధికారులకు పదే పదే చెబుతున్నా.. చాల మంది అధికారులు పట్టించుకున్న దాఖలాలు కనిపించడంలేదు. అధికారుల ఆదేశాలను అలా విని ఇలా వదిలేస్తున్నారనే విమర్శలున్నాయి. రాత్రి సమయంలో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో పెట్రోలింగ్ వాహనాలు తిరగడం లేదు. స్థానిక దొంగలు ఇలాంటి విషయాలను పసిగట్టి ఆ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. దొంగతనం జరిగిన తర్వాత పోలీసులు అప్రమత్తమై పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో ఫలితం లేకుండా పోతోంది. పోలీస్ ఉన్నతాధికారులు కేవలం సమీక్షలకే పరిమితం అవ్వడం వల్లే క్షేత్ర స్థాయిలో అధికారులు దొంగలను పట్టుకోవడంలో విఫలం అవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు దృష్టిసారించేనా..? కమిషనరేట్ పరిధిలో చోరీలతో పాటు చైన్స్నాచింగ్లు, ద్విచక్ర వాహనాలు పదుల సంఖ్యలో పోతున్నాయి. అధికారులు రికవరీ మాత్రం నామమాత్రంగా చూపిస్తున్నారు. ద్విచక్ర వాహనాలను పోగొట్టుకున్న బాధితులు పోలీస్స్టేన్ల చుట్టూ తిరుగుతున్నా అధికారులు కేసులు నమోదు చేయడం లేదు. వెతుకుతున్నాం.. దొరికితే అప్పగిస్తాం.. కేసులు పెడితే కోర్టు నుంచి రికవరీ చేసుకోవాల్సి ఉంటుందని భయపెట్టి కేసుల నమోదులో జాప్యం చేస్తున్నారు. నెలల తరబడి తిరిగినా కేసులు నమోదు చేయకపోవడంతో బాధితులు వారి బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక మధ్యలోనే వదిలేస్తున్నారు. నగరంలోని చాల పోలీస్స్టేషన్ల పరిధిలో ఎన్ని చోరీలు జరిగినా వాటి రికవరీ విషయంలో అధికారులు శ్రద్ధ పెట్టడం లేదనే విషయం ఉన్నత అధికారుల సమీక్షల్లో వెల్లడయినా చర్యలు లేకపోవడంతో రికవరీ ఎక్కడ వెసిన గొంగ ళి అక్కడే అన్న చందంగా తయారైంది. -
హనుమకొండ కలెక్టర్గా స్నేహ శబరీష్
సాక్షిప్రతినిధి, వరంగల్ : హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య సంగారెడ్డి కలెక్టర్గా బదిలీ అయ్యా రు. ఆమె స్థానంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సి పల్ కార్పొరేషన్లో అడిషనల్ కమిషనర్గా పనిచేస్తున్న స్నేహ శబరీష్ను కలెక్టర్గా నియమించారు. 2017 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఈమె గతంలో కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్గా పని చేశారు. స్నేహ శబరీష్ ములుగు జిల్లా ఎస్పీగా పని చేస్తున్న శబరీష్ సతీమణి. గురువారం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఇక్కడి నుంచి బదిలీ అయిన 2016 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన పి.ప్రావీణ్య 2019–20లో కరీంనగర్ ట్రెయినీ కలెక్టర్గా, కొద్ది రోజులు జీహెచ్ఎంసీ లో అడిషనల్ కమిషనర్గా పనిచేశారు. ఆ తర్వా త 2021 సెప్టెంబర్ 3 నుంచి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా నియమితులయ్యారు. 2023లో వరంగల్ కలెక్టర్గా ఉన్న గోపి బదిలీ అయిన నేపథ్యంలో ఆయన స్థానంలో అదే ఏడాది మార్చి 13న ప్రావీణ్య నియమి తులయ్యారు. కాగా హనుమకొండ కలెక్టర్గా ఉన్న సిక్తా పట్నాయక్ 2024 జూన్ 16న బదిలీ కాగా.. ఆమె స్థానంలో వరంగల్ కలెక్టర్ పి.ప్రావీణ్యను నియమించిన ప్రభుత్వం.. వరంగల్ కలెక్టర్గా సత్య శారదను నియామకం చేశారు. సుమారు ఏడాదిగా హనుమకొండ కలెక్టర్గా పనిచేసిన ప్రావీణ్య అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, అధికారులు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసి ప్రభుత్వ కార్యక్రమాలను ముందు కు తీసుకెళ్లడంలో కీలకంగా వ్యవహరించారు. బల్దియా కమిషనర్పై బదిలీ వేటు.. ఇదిలా ఉండగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడేపై బదిలీ వేటు పడింది. ఆమె స్థానంలో 2019 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన చాహత్ బాచ్పాయ్ని నియమించారు. 2020 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన అశ్విని తానాజీ వాకడేను 2023లో వరంగల్ అడిషనల్ కలెక్టర్ నుంచి బదిలీ చేసి వరంగల్ మున్సి పల్ కమిషనర్గా నియమించారు. బల్దియా అభివృద్ధి పనులు, బిల్లుల చెల్లింపుల విషయంలో జాప్యం చేయడం తదితర ఆరోపణలు ఎదుర్కొన్నారు. జీడబ్ల్యూఎంసీ, స్మార్ట్సిటీ పనుల్లో అవినీ తి, అక్రమాలు, టెండర్లు లేకుండా పనుల కేటా యింపు, బిల్లుల చెల్లింపుల్లో పర్సెంటేజీలు తదిత ర విషయాల్లో కీలక ప్రజాప్రతినిధికి వంతపాడారన్న ఆరోపణల నేపథ్యంలో ఆమెను కరీంనగర్ అడిషనల్ కలెక్టర్గా నియమించారన్న ప్రచారం జరుగుతోంది. కాగా ప్రస్తుతం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్గా నియమితులైన చాహత్ బాచ్పాయ్ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి సతీమణి. సంగారెడ్డి కలెక్టర్గా ప్రావీణ్య బదిలీ బల్దియా కమిషనర్గా చాహత్ బాజ్పాయ్ అశ్విని తానాజీ వాకడేపై బదిలీ వేటు.. కరీంనగర్ అడిషనల్ కలెక్టర్గా నియామకం -
పేదల సంక్షేమమే లక్ష్యంగా మోదీ పాలన
హన్మకొండ: సేవా, సుపరిపాలన, పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలన సాగుతున్నదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్నగర్ ఎంపీ డి.కె.అరుణ అన్నారు. గురువారం హనుమకొండ హంటర్ రోడ్డులోని సత్యం కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ 11 ఏళ్ల నరేంద్ర మోదీ పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ లేదని, ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంతో అభివృద్ధి, సంక్షేమానికి, సుపరిపాలన, దేశ భద్రతకు, అలాగే రోడ్లు, రైల్వే, విద్య, వైద్యం, ఉపాధికి అంత్యంత ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంఎంటీఎస్ విస్తరణకు సహకరించకపోతే కేంద్ర ప్రభుత్వం నిధులతో యాదగిరి గుట్ట వరకు రూ.400 కోట్లతో విస్తరిస్తున్నట్లు తెలిపారు. మామునూర్ విమానాశ్రయం ఏర్పాటు చేస్తున్నామని, రూ.500 కోట్లతో వరంగల్లో టెక్స్టైల్స్ పార్కు, గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటు చేసినట్లు వివరించారు. పీఎం సూర్యఘర్ బిజిలీ యోజన పథకం ద్వారా పేదలకు సోలార్ విద్యుత్ సౌకర్యాన్ని కల్పించామని, ఒక్కరికి నెలకు ఉచితంగా 5 కిలోల బియ్యం కేంద్రం ఇస్తున్నదని, మహిళలకు ముద్ర రుణాలు రూ.20 లక్షల వరకు పెంచినట్లు వివరించారు. అంతకు ముందు మోదీ ప్రభుత్వ 11 ఏళ్ల పాలనపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించారు. కార్యక్రమంలో బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి, మాజీ అధ్యక్షురాలు రావు పద్మ, మాజీ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్, నాయకులు చొల్లేటి కృష్ణమాచారి, డాక్టర్ పగడాల కాళీప్రసాద్, దొంతి దేవేందర్రెడ్డి, డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి, గుజ్జ సత్యనారాయణ రావు, రావుల కిషన్, బైరి లక్మి, రావుల కోమల, చాడ స్వాతి, గుజ్జుల వసంత, గొట్టికొప్పుల రాంబాబు, కందగట్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 11 ఏళ్లలో ఒక్క అవినీతి ఆరోపణ లేదు అన్ని రంగాల అభివృద్ధిలో దేశం పరుగులు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే.అరుణ -
బాలలను పనిలో పెట్టుకోవద్దు
జిల్లా ప్రధాన న్యాయమూర్తి పట్టాభిరామారావు విద్యారణ్యపురి: బాలలను పనిలో పెట్టుకోవద్దు.. వారితో పనిచేయించుకునేవారు చట్టపరంగా శిక్షార్హులవుతారని హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పట్టాభిరామారావు అన్నారు. ప్రపంచ బాలకార్మికుల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యాన హనుమకొండలోని జెడ్పీహాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 14 ఏళ్ల వయసు వరకు బాలకార్మికులే.. ఆ వయసు వారు పనుల్లో కనబడి తే దగ్గరలోని సామాజిక సహాయ సంస్థలకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమావేశంలో హనుమకొండ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ జడ్జి క్షమాదేశ్పాండె, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సి.రాము, గవర్నమెంట్ ప్లీడర్ కె.నర్సింహారావు, అసిస్టెంట్ కమిషన ర్ ఆఫ్ లేబర్ నారాయణ స్వామి, డీడబ్ల్యూఓ జయంతి, కేయూ పాలకమండలి సభ్యురాలు డాక్టర్ కె.అనితారెడ్డి, ఎఫ్ఎంఎం ఎన్జీఓ డైరెక్టర్ సహాయసిస్టర్, యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఎస్ఐ పి.ఫిలిప్రాజ్, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. లోక్ అదాలత్ను వినియోగించుకోవాలివరంగల్ క్రైం: ఈనెల 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు వినియోగించుకోవాల ని వరంగల్ సీపీ సన్ప్రీత్సింగ్ సూచించారు. చిన్న కేసులతో కక్ష పెంచుకుని కోర్టుల చుట్టూ తిరిగి సమయాన్ని, డబ్బులను వృథా చేసుకోవద్దని పేర్కొన్నా రు. పోలీస్ అధికారులు, కోర్టు కానిస్టేబుళ్లు, రాజీపడదగిన కేసుల్లో ఇరు వర్గాలను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తారని, రాజీపడాలని అనుకునే వారు పోలీస్ అధికారులను సంప్రదించాలని కోరారు. -
నేటి నుంచి విద్యుత్ ఉద్యోగుల క్రీడోత్సవాలు
హన్మకొండ: విద్యుత్ ఉద్యోగులకు రాష్ట్రస్థాయి క్రీడోత్సవాలకు విద్యుత్ స్పోర్ట్స్ కౌన్సిల్ ఏర్పాట్లు చేసింది. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ నెల 12, 13, 14 తేదీల్లో కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్ క్రీడలు నిర్వహిస్తున్నట్లు స్పోర్ట్స్ కౌన్సిల్ బాధ్యులు తెలిపారు. ఈ ఇంటర్ సర్కిల్ కబడ్డీ, బాల్బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో రాష్ట్రంలోని టీజీ ట్రాన్స్కో, టీజీ ఎస్పీడీసీఎల్, టీజీ ఎన్పీడీసీఎల్కు చెందిన 12 జట్ల చొప్పున పాల్గొననున్నాయని స్పోర్ట్స్ కౌన్సిల్ సభ్యులు వి.సునీల్కుమార్, ఎండీ.యాకూబ్ పాషా, ఇ.ప్రేంకుమార్ పేర్కొన్నారు. గురువారం ఉదయం 9 గంటలకు టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని టోర్నమెంట్ ప్రారంభిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ ఇన్చార్జ్ డైరెక్టర్లు, స్పోర్ట్స్ కౌన్సిల్ కమిటీ బాధ్యులు, అధికారులు పాల్గొంటారని వివరించారు. మనబడి పాట ఆవిష్కరణ విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోషల్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న పాలకుర్తి రవి రాసిన మనబడి పాటను బుధవారం హనుమకొండ డీఈఓ కార్యాలయంలో డీఈఓ డి.వాసంతి ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ ఎశ్రీనివాస్, కమ్యూనిటీ మొబిలైజింగ్ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్రెడ్డి, శాయంపేట ఎంఈఓ భిక్షపతి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మందల తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఫలిత శ్రీహరి, ఓదెల నరేందర్, పెద్దకోడెపాక జెడ్పీహెచ్ఎస్ పధానోపాధ్యాయుడు సారయ్యనాయక్, ఉపాధ్యాయులు చంద్రయ్య, భాస్కర్, సారంగపాణి పాల్గొన్నారు. పోలీస్ కుటుంబానికి భద్రత చెక్కు అందజేతవరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ కంట్రోల్ రూంలో కానిస్టేబుల్గా పనిచేస్తూ అనారోగ్యంతో ఈ ఏడాది జనవరి 28న మరణించిన వెంకటరమణ కుటుంబానికి పోలీస్ భద్రత విభాగంనుంచి మంజూరైన రూ.7.32 లక్షల చెక్కును సీపీ సన్ప్రీత్సింగ్ బుధవారం ఆ కానిస్టేబుల్ భార్య వాణికి అందజేశారు. కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ రవి, సూపరింటెండెంట్ రమాదేవి పాల్గొన్నారు. పరీక్షల పర్యవేక్షణ అధికారిగా శ్రీదేవి కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో కెమిస్ట్రీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ ఎన్. శ్రీదేవి పరీక్షల పర్యవేక్షణాధికారిగా నియమితులయ్యారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. డిగ్రీ, పీజీ పరీక్షలతోపాటు ఇతర పోటీల పరీక్షల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను శ్రీదేవి నిర్వహిస్తారని తెలిపారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ శ్రీలత, డాక్టర్ నహీద తదితరులు శ్రీదేవిని అభినందించారు. నేడు జస్టిస్ పీసీ ఘోష్ పర్యటనహన్మకొండ: కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ చైర్మన్, సుప్రీంకోర్టు పూర్వ జడ్జి జస్టిస్ పీసీ ఘోష్ గురువారం హనుమకొండ, ములుగు జిల్లాల్లో పర్యటించనున్నారు. బుధవారం రాత్రి హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్కు చేరుకున్న ఆయనకు కలెక్టర్ పి.ప్రావీణ్య మొక్క అందించి స్వాగతం పలికారు. గురువారం ఉదయం 9.30 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి 10.45 గంటలకు రామప్పకు చేరుకుంటారు. రామప్పలో దైవదర్శనం చేసుకుని, పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం తిరుగు ప్రయాణమవుతారు. మధ్యాహ్నం 12.15 గంటలకు రామప్పలో బయలుదేరి 1.30 గంటలకు హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్కు చేరుకుంటారు. మధ్యాహ్న భోజనం అనంతరం తిరిగి మూడు గంటలకు హైదరాబాద్ వెళ్తారు. -
బ్లాకేజ్ ప్రాంతాల్లో మెష్లు ఏర్పాటు చేయండి
నగర మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: నగర డ్రెయినేజీల్లోని నీటి బ్లాకేజ్ ప్రాంతాల్లో మెష్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మేయర్ గుండు సుధారాణి.. ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని తన చాంబర్లో ఇంజనీరింగ్ అధికారులతో సమావేశమై వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో డివిజన్లలోని డ్రెయిన్లలో బ్లాకేజ్ ఏరియాలను గుర్తించి మెష్లు ఏర్పాటు చేయాలన్నారు. మొత్తం 66 డివిజన్లకు ఎన్ని మెష్లు అవసరమో నివేదిక సమర్పించాలని సూచించారు. సమావేశంలో ఇన్చార్జ్ ఎస్ఈ శ్రీనివాస్, ఈఈలు రవికుమార్, సంతోష్బాబు, మహేందర్, మాధవీలత, డీఈలు రాజ్ కుమార్, సారంగం, కార్తీక్రెడ్డి, రోజా రాణి, రవి కిరణ్, రంగారావు, ఏఈలు పాల్గొన్నారు. మేయర్ను కలిసిన అకౌంట్స్ ఆఫీసర్ బల్దియా అకౌంట్స్ ఆఫీసర్గా (ఏఓ)గా బాధ్యతలు స్వీకరించిన శివలింగం బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో మేయర్ గుండు సుధారాణిని మర్యాద పూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు. బాధ్యతాయుతంగా పనిచేయాలని మేయర్ సూచించారు. -
519 మంది విద్యార్థులు.. 15 మంది టీచర్లు
ప్రైవేట్కు దీటుగా కరీమాబాద్ ప్రభుత్వ పాఠశాలలో బోధన ఖిలా వరంగల్: కరీమాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు 75 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ పాఠశాలలో చదివిన ఎంతోమంది విద్యార్థులు ప్రయోజకులయ్యారు. దేశవిదేశాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం 519 మంది విద్యార్థులకు 15 మంది ఉపాధ్యాయులు, 9 మంది బోధనేతర సిబ్బంది ఉన్నారు. ప్రధానోపాధ్యాయురాలు మాధవి విద్యార్థుల భవితకు బాటలు వేస్తున్నారు. ఈ సంవత్సరం పదో తరగతిలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా బోధనతోపాటు మెరుగైన వసతులు ఉన్నాయి. విశాలమైన తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయం, కంప్యూటర్లు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులకు డిజిటల్ విధానంలో పాఠాలు బోధిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థల బాధ్యులు అందిస్తున్న ఉచిత నోట్బుక్స్, పెన్నులు, బ్యాగులు, సైకిళ్లను విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటున్నారు. -
పట్టపగలే మున్సిపల్ స్థలం కబ్జా!
● రూ.నాలుగు కోట్ల విలువైన భూమి ఆక్రమణ ● పట్టించుకోని గ్రేటర్ వరంగల్ అధికారులువరంగల్ అర్బన్: వరంగల్ కాశిబుగ్గలోని ఎల్బీనగర్ భారత్ గ్యాస్ కేంద్రం దగ్గర సర్వే నంబర్ 199, బై7లో ఉన్న మున్సిపల్ స్థలాన్ని(అసైన్డ్) కొందరు కబ్జా చేసి చుట్టు ప్రహరీ నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కబ్జాదారులు పట్టపగలే కిరాయి మనుషులను పెట్టి రూ.నాలుగు కోట్ల విలువైన 1800 గజాల మున్సిపల్ స్థలం చుట్టూ గోడ నిర్మించడానికి గుంతలు తవ్వారు. కబ్జా వెనుక అధికార పార్టీ నాయకుల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో పేరొందిన ఓ సబ్రిజిస్ట్రార్, ఓ హోటల్ యజమాని, మరో ఇద్దరు కార్పొరేటర్ల ప్రమేయం ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇదే అసైన్డ్ భూమిలో పేద ప్రజలకు అప్పటి ఎమ్మెల్యే దోనెపూడి రమేశ్బాబు పట్టాలు ఇచ్చినట్లు పేర్కొంటున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మున్సిపల్ స్థలాలను పట్టపగలే కబ్జా చేస్తున్నా అడిగే నాథుడు లేడా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కబ్జాదారులపై చర్యలు తీసుకుని మున్సిపల్ స్థలాన్ని కాపాడాలని వారు కోరుతున్నారు. -
బడికి.. రారండోయ్!
ఆటపాటలకు సెలవు.. ఇక పుస్తకాలతో కుస్తీ ● పాఠ్యపుస్తకాలు, స్కూల్ యూనిఫామ్ సిద్ధం ● ఈసారి వేసవిలోనే టీచర్లకు శిక్షణ పూర్తి ● డీఈఓ మొదలు కిందిస్థాయి సిబ్బందికి సైతం.. ● వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని పలు పాఠశాలల్లో పండుగ వాతావరణంలో స్వాగత కార్యక్రమాలు విద్యారణ్యపురి: వేసవి సెలవులు ముగిశాయి. ఇన్నాళ్లు ఆట పాటలతో గడిపిన విద్యార్థులు గురువారం నుంచి బడిబాట పట్టనున్నారు. పుస్తకాలతో కుస్తీ షురూ కానుంది. పిల్లలను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు కూడా కొద్దిరోజులుగా సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు మొదటిరోజు పిల్లలను పండుగ వాతావరణంలో పాఠశాలల్లోకి ఆహ్వానించేందుకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పచ్చని మామిడితోరణాలు, పూలతో అందంగా అలంకరించారు. మొదటిరోజు నుంచే విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, జత యూనిఫామ్ ఇవ్వనున్నారు. డీఈఓ నుంచి ఉపాధ్యాయులు, ప్రతి విభాగం సిబ్బంది వరకు.. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ఈసారి సమగ్రశిక్ష ద్వారా డీఈఓల నుంచి ఎంఈఓలు, ఉపాధ్యాయులు, చివరికి వంట మనుషుల వరకు వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చింది. ఒక్కో టీచర్కు ఐదు రోజులపాటు శిక్షణ పూర్తిచేసింది.విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంచేలా, ఐసీటీ టూల్స్ ద్వారా విద్యాభోధన చేసేలా, ఏఐ ఆధారిత విద్యాబోధన తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. మధ్యాహ్న భోజన కార్మికులకు సుచి, శుభ్రతగా వంటలు చేయడంపై, పారిశుద్ధ్య కార్మికులకు పరిసరాల పరిశుభ్రతపై శిక్షణ ఇచ్చారు. పండుగ వాతావరణంలోస్వాగత కార్యక్రమాలు హనుమకొండ జిల్లాలో 14 మండలాల్లోని ఒక్కో పాఠశాలలో పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా విద్యార్థులకు స్వాగత కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు డీఈఓ వాసంతి ఆయా ఎంఈఓలను ఆదేశించారు. విద్యార్థి పాఠశాలలోకి ప్రవేశించగానే పండుగ వాతావరణం కనిపించేలా మామిడి తోరణాలు, బెలూన్లు, పూలతో అలంకరించారు. మొదటిరోజు తల్లిదండ్రులను కూడా ఆహ్వానిస్తున్నారు.నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభంటీచర్లు సమయపాలన పాటించాలి పాఠశాలలు పునఃప్రారంభం రోజున టీచర్లు తప్పనిసరిగా సమయపాలన పాటించాలి. ఈ నెల 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాలు కొనసాగించాల్సి ఉంటుంది. బడిబాట ఉదయం 7 నుంచి 9 గంటల వరకు నిర్వహించాలి. విద్యార్థుల నమోదు పెంచాలి. ఆ తర్వాత యఽథావిధిగా పాఠశాల విధుల్లో ఉండాలి. తరగతి గదుల్లో సెల్ఫోన్లు వినియోగించకూడదు. డి.వాసంతి, హనుమకొండ డీఈఓ -
ఆహ్లాదం.. పోచంపల్లి పాఠశాల
బడి ఆవరణలో 830 మొక్కలతో ప్లాంటేషన్ విద్యారణ్యపురి: దాతలు, ప్రేరణ ఫౌండేషన్ సహకారంతో కాజీపేటలోని పోచంపల్లి ప్రభుత్వ పాఠశాల ఆహ్లాదాన్ని పంచుతోంది. డీఆర్ఓ గణేశ్, ఉద్యానశాఖ అధికారి రమేశ్ దాతల సహకారంతో 830 మొక్కలను సమకూర్చి పాఠశాల ఆవరణలో ప్లాంటేషన్ తయారు చేయించారు. రిటైర్డ్ డీఎఫ్ఓ పురుషోత్తం ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ ప్రాథమిక పాఠశాలను తీర్చిదిద్దిన హెచ్ఎం ఉప్పలయ్య 2023 డిసెంబర్లో పోచంపల్లి ప్రాథమిక పాఠశాలకు బదిలీ అయ్యారు. అక్కడ మురికివాడలోని పిల్లలను బడికి వచ్చేలా చేశారు. ప్రస్తుతం 180 మంది విద్యార్థులకు ఆరుగురు ఉపాధ్యాయులున్నారు. కలెక్టర్ ప్రావీణ్య గురువారం పాఠశాలను సందర్శించి విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం పంపిణీ చేసి, గార్డెన్ను ప్రారంభిస్తారు. -
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి
బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే హన్మకొండ: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతీ ఒక్కరి సామాజిక బాధ్యత అని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. వంద రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా వరంగల్ మహానగర పాలక సంస్థ 58, 59వ డివిజన్ పరిధి హనుమకొండలోని ఇందిరానగర్, ఎన్జీవోస్ కాలనీ, భవానినగర్లో ర్యాలీ నిర్వహించారు. కరపత్రాలు పంపిణీ చేశారు. పారిశుద్ధ్య పనులను, డిసిల్టేషన్ ప్రక్రియ, తడి, పొడిచెత్తను వేరు చేసి స్వచ్ఛ ఆటోలకు అందించడం, సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా దోమలను అరికట్టడానికి చేపట్టే యాంటీ లార్వా ఆక్టివిటీస్, ట్రేడ్ లైసెన్స్ వసూళ్ల తీరును కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడొద్దన్నారు. బట్ట సంచులు, జ్యూట్ బ్యాగులను వినియోగించాలని నగరవాసులకు సూచించారు. కార్పొరేటర్లు గుజ్జుల వసంత, ఇమ్మడి లోహిత రాజు, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, డీఈ సారంగం, శానిటరీ ఇన్స్పెక్టర్ బాషానాయక్, హెల్త్ ఇన్స్పెక్టర్ మధుకర్ పాల్గొన్నారు. -
నిజాం కాలం నాటి మర్కజీ హైస్కూల్
ప్రొఫెసర్ జయశంకర్ ప్రాథమిక విద్యాభ్యాసం ఇక్కడే.. విద్యారణ్యపురి: వివిధ రంగాల్లో ఉన్నతస్థానాలకు ఎదగిన ఎంతో మంది మేధావులను అందించింది హనుమకొండలోని మర్కజీ ప్రభుత్వ ఉన్నతపాఠశాల. నిజాం కాలంలో 1940లో ప్రారంభించిన ఈ పాఠశాల తొలుత ఊర్దూ మీడియంగా, తర్వాత తెలుగు మీడియంగా, ప్రస్తుతం ఇంగ్లిష్ మీడియంలో విద్యార్థులకు విద్య అందిస్తున్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఈ పాఠశాలలోనే ఉర్దూమీడియంలో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. ఇక్కడ చదువుకున్న అనేక మంది విద్యార్థులు వివిధ దేశాల్లో, రాష్ట్రంలో వివిధ ఉన్నత రంగాల్లో స్థిరపడ్డారు. ఈ స్కూల్లో ప్రస్తుతం 676 మంది విద్యార్థులు ఉండగా, 26మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ప్రాథమిక పాఠశాలలో 284 మంది చదువుతుండగా 10 మంది టీచర్లు ఉన్నారు. జిల్లాలో అత్యధికంగా విద్యార్థులు కలిగిన ప్రభుత్వ పాఠశాలగా గుర్తింపు పొందింది. -
మట్టికట్టలు.. ముంపు జాడలు!
హనుమకొండ నయీంనగర్ పెద్ద మోరీ పొడవునా ఇరువైపులా కాంక్రీట్ గోడ పనులు దాదాపుగా పూర్తి కావొస్తున్నాయి. కానీ.. గోడ నిర్మించేటప్పుడు నీరురాకుండా మట్టితో అడ్డుకట్టలు వేశారు. గోడ పని పూర్తయినా.. మట్టి కట్టలను తొలగించలేదు. దీంతో నాలాలోకి వచ్చిన నీరు బయటకు వెళ్లకుండా ఎక్కడికక్కడే నిలుస్తోంది. దీంతోపాటు పోచమ్మకుంట, సమ్మయ్యనగర్ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. భారీ వర్షం వస్తే వరద అంతా కాలనీల్లోకి వచ్చే ప్రమాదం ఉంది. బల్దియా అధికారులు స్పందించి మట్టి కట్టలను తొలగించి వరద సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, హన్మకొండ -
భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య హన్మకొండ అర్బన్: జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లాలోని రెవెన్యూ సదస్సుల నిర్వహణ, వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై ఆర్డీఓలు, తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, భూమి కొలతల శాఖ ఏడీ శ్రీని వాసులు, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, నారాయణ, తహసీల్దార్లు పాల్గొన్నారు. రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలి..భూసేకరణ పూర్తయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డితో కలిసి భీమదేవరపల్లి, వేలేరు మండలాల పరిధి గౌరవెల్లి ప్రాజెక్టు, పరకాల నియోజకవర్గ పరిధి గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ప్రాజెక్ట్, జిల్లాలో వివిధ రైల్వే ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియ, రైతులకు పరిహారం చెల్లింపు, భూసేకరణ పురోగతి అంశాలపై నేషనల్ హైవే అధికారులు, రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సఖి భవన ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలికాజీపేట అర్బన్: హనుమకొండ లష్కర్బజార్లో నూతనంగా నిర్మించిన సఖి కేంద్ర భవనాన్ని త్వరలో ప్రారంభించాలని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. సఖి నూతన భవనాన్ని మంగళవారం ఆమె పరిశీలించారు. డీడబ్ల్యూఓ జయంతి, ఆర్అండ్బీ ఈఈ సురేశ్బాబు, సఖి కేంద్ర కో–ఆర్డినేటర్ హైమావతి, డీఈ గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
అనుమతి లేని మెరీడియన్ స్కూల్ సీజ్
విద్యారణ్యపురి/హన్మకొండ: హనుమకొండ రాంనగర్ ప్రాంతంలోని మెరీడియన్ ప్రైవేట్ పాఠశాలను మంగళవారం ఎంఈఓ నెహ్రూ సీజ్ చేశారు. ఈపాఠశాలను అనుమతి లేకుండా నడిపిస్తున్నారని, తగిన చర్యలు తీసుకోవాలని టీఎస్ఎఫ్, బీఎస్ఎఫ్,టీజీవీపీ, ఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల బాధ్యులు డీఈఓ వాసంతికి పిర్యాదు చేశారు. ఆమె ఆదేశాల మేరకు ఎంఈఓ పాఠశాలను సందర్శించి సీజ్ చేశారు. ఎంఈఓ వెంట ఆయా విద్యార్థి సంఘాల బాధ్యులు కన్నం సునీల్, మేడ రంజిత్, కాడపాక రాజేందర్, సాంబరాజు, నాగారం ఫణితేజ ఉన్నారు. 8వ సెమిస్టర్ ఫలితాలు విడుదలకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఇంజనీరింగ్ కాలేజీల ఫైనలియర్ 8వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ తెలిపారు. 955మందికిగాను 945 మంది విద్యార్థులు ఉత్తీర్ణత (98.5శాతం) సాధించినట్లు పేర్కొన్నారు. నాసిరకాన్ని అరికట్టేందుకు పటిష్ట చర్యలుసీపీ సన్ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం: వానాకాలం సాగు ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. రైతులు నాసిరకం విత్తనాల బారిన పడకుండా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసుల ఆధ్వర్యంలో పటిష్ట ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. ఈమేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రచార పోస్టర్లను మంగళవారం పోలీస్ అధికారులతో కలిసి సీపీ ఆవిష్కరించారు. ఈసందర్భంగా సీపీ సన్ప్రీత్సింగ్ మాట్లాడుతూ.. ఇప్పటికే కమిషనరేట్ పరిధిలో రూ.1.23 కోట్ల విలువైన నాసిరకం పురుగు మందులు, విత్తనాలతో పాటు పెద్ద ఎత్తున గడ్డి మందును స్వాధీనం చేసుకోవడంతో పాటు 14 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఎవరైనా నాసిరకం విత్తనాలు, పురుగు మందులు విక్రయిస్తున్నట్లు సమాచారం అందితే తక్షణమే స్థానిక పోలీసులకు లేదా.. వరంగల్ పోలీస్ కమిషనర్కు 77998 48333 నంబర్లో సమాచారం అందించాలని కోరారు. -
సీడ్.. ఫ్రాడ్
● యాసంగిలో ములుగు జిల్లా వెంకటాపురం, కన్నాయిగూడెం, వాజేడు, మండలాల్లోని 55 గ్రామాల్లో పేరొందిన కంపెనీలవని నమ్మిన రైతులు.. 1,370 ఎకరాల్లో మొక్కజొన్న వేశారు. అవి నకిలీవి కావడంతో 618 మంది రైతులు నష్టపోగా, అందుకు బాధ్యులైన వారిపై కేసులు నమోదయ్యాయి. ● మార్చి నెలాఖరులో హనుమకొండ జిల్లాలో రూ.78.63 లక్షల విలువైన నాసిరకం పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠాసభ్యులు గతంలో కూడా నాసిరకం పత్తి, మొక్కజొన్న విత్తనాలు విక్రయించినట్లు కేసులున్నాయి. ● తాజాగా వరంగల్ టాస్క్ఫోర్స్, గీసుకొండ, పరకాల పోలీసులు దాడులు నిర్వహించి ఏడుగురిని అరెస్టు చేసి రూ.63.62 లక్షల విలువ చేసే 166 కిలోల నాసిరకం విత్తనాలు, 800 లీటర్ల గడ్డిమందు, నకిలీ పురుగుల మందు తయారీకి అవసరమైన సామగ్రి, 7 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సాక్షిప్రతినిధి, వరంగల్: ప్రస్తుత వానాకాలం సీజన్కు నాసిరకం పత్తి విత్తనాలు పోటెత్తుతున్నాయి. ఓ వైపు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ తదితర రాష్ట్రాలనుంచి భారీగా రవాణా అవుతుండగా.. మరోవైపు ముఠాలుగా ఏర్పడిన కొందరు ఉమ్మడి వరంగల్వాసులు ఈ ‘నకిలీ’లను మార్కెట్లో విక్రయిస్తున్నారు. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలను కేంద్రాలుగా చేసుకుని ఈ దందా సాగిస్తున్నారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో ముందు జాగ్రత్తగా టాస్క్ఫోర్స్ పోలీసులు జరిపిన దాడుల్లో బయటపడిన నాసిరకం విత్తనాలే ఇందుకు ఉదాహరణ. వరి తర్వాత పత్తి వైపే రైతుల మొగ్గు.. ఉమ్మడి వరంగల్లో వరి తర్వాత రైతులు పత్తి సాగుపైనే ఆసక్తి చూపుతున్నారు. గత వానాకాలంలో 15,83,692 ఎకరాల్లో వివిధ పంటలు వేశారు. ఇందులో 8.72 లక్షల ఎకరాల్లో వరి పంటలు వేయగా 6.17 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. సుమారుగా 1.14 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, శనగ, పెసర తదితర పంటలు సాగయ్యాయి. గత వానాకాలం సాగు విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకున్న వ్యవసాయశాఖ.. ఈ సీజన్లో 15.85 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యే అవకాశం ఉందని, ఇందులో 9.02 లక్షల ఎకరాల్లో వరి, 5.67 లక్షల ఎకరాల్లో పత్తి పంటలు వేస్తారని అంచనా వేసింది. పత్తి వర్షాధార పంట కావడంతో ఈ నెల రెండు, మూడు వారాల్లో విత్తుకునేందుకు 20 రోజుల ముందునుంచే విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. ఈమేరకు 5.67 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కోసం ఎకరానికి రెండు బస్తాల చొప్పున సుమారు 11,34,716 ప్యాకెట్లు అవసరం. ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా బీటీ–2 రకం వాడకంలో ఉండగా, ఈసారి బీటీ–3 పేరిట వ్యాపారులు నాసిరకం విత్తనాల్ని విక్రయిస్తున్నారు. దీంతో చాలా మంది రైతులు విత్తనాల కొనుగోలు విష యంలో ఏటూ తేల్చుకోలేక పోతున్నారు. బ్లాక్ మార్కెట్లో విత్తనాలు.. రూ.400 వరకు అదనం.. ఉమ్మడి జిల్లాలో ఈసారి 5,67,358 ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేసిన వ్యవసాయశాఖ అధికారులు.. ఆమేరకు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. కానీ.. ఓవైపు నాసిరకం బెడద.. మరోవైపు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నా యి. ఎకరానికి 475 గ్రాములున్న విత్తన ప్యాకెట్లు రెండు అవసరం కాగా.. ఉమ్మడి జిల్లాకు 11.35 లక్షల విత్తన ప్యాకెట్లు కావాల్సి ఉంది. ఈ మేరకు నిల్వలు ఉన్నాయని అధికారులు చెప్తున్నా... కొందరు డీలర్లు, వ్యాపారులు మాత్రం సరిపడా రాలేదంటున్నారు. బీటీ–2 రకాలకు మార్కెట్లో డిమాండ్ ఉండగా.. ఇప్పటి నుంచే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. కాగా.. బీటీ–2 రకాలకు చెందిన ఒక్కో ప్యాకెట్ను రూ.901కు విక్రయించాల్సిన వ్యాపారులు లేవు.. లేవంటూ రూ.1,350ల నుంచి రూ.1,450ల వరకు అమ్ముతున్నట్లు చెబుతున్నారు. వర్షాలు పడితే ఆ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. నాసిరకం విత్తనాలు, మందులు విక్రయిస్తే కఠిన చర్యలు నాసిరకం విత్తనాలు, పురుగు మందులు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎవరైన వ్యాపారస్తులు, సంస్థలు, వ్యక్తులు రైతన్నను మోసం చేస్తూ నకిలీ విత్తనాలు, పురుగు మందులు విక్రయిస్తే పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తాం. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించి టీమ్లను రంగంలోకి దింపాం. నకిలీల సమాచారం తెలిస్తే తక్షణమే మాకు అందించాలి. వివరాలు గోప్యంగా ఉంచుతాం. – సన్ ప్రీత్సింగ్, పోలీస్ కమిషనర్రైతుల మెడపై నాసిరకం విత్తనాల కత్తి సీజన్ ఆరంభం నుంచే దందా పత్తి విత్తనాల కృత్రిమ కొరత... తప్పని అధిక ధరల మోత పత్తి, వరి విత్తనాల్లోనే నకిలీ ఎక్కువ.. ఇటీవల పట్టుకున్న పోలీసులు నిఘా పెంచాలని కోరుతున్న రైతులుజిల్లాల వారీగా పత్తిసాగు, విత్తనాల అంచనా జిల్లా సాగు అంచనా అవసరమయ్యే (ఎకరాల్లో..) విత్తన ప్యాకెట్లు హనుమకొండ 85,000 1,70,000 వరంగల్ 1,22,358 2,44,716 మహబూబాబాద్ 84,070 1,68,140 భూపాలపల్లి 1,01,500 2,03,000 జనగామ 1,45,000 2,90,000 ములుగు 29,430 58,860 -
తహసీల్దార్లకు బదిలీ ఫీవర్!
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో తహసీల్దార్లకు మరోసారి బదిలీ ఫీవర్ పట్టుకుంది. కొద్దిరోజుల క్రితమే రాష్ట్రస్థాయిలో తహసీల్దార్ల బదిలీలు చేసిన ప్రభుత్వం ఇటీవల కేబినెట్లో ఈ విషయంపై మాట్లాడింది. ఎన్నికల సమయంలో బదిలీ అయిన తహసీల్దార్లు సొంత జిల్లాలకు వెళ్లాల్సి ఉంటుందని నిర్ణయించింది. దీంతో రాష్ట్రస్థాయిలో మరోసారి భారీగా తహసీల్దార్ల బదిలీలు ఉంటాయన్న చర్చ అధికారుల్లో సాగుతోంది. ఇదిలా ఉంటే కొద్దిరోజుల క్రితమే జరిగిన బదిలీల్లో జిల్లాకు కొత్తగా నలుగురు తహసీల్దార్లు రాగా, మరికొందరు హనుమకొండనుంచి ఇతర జిల్లాలకు వెళ్లారు. జిల్లాకు వచ్చిన వాళ్లకు కలెక్టర్ ప్రావీణ్య పోస్టింగ్లు ఇచ్చారు. దీంతో అంతా సర్ద్దుమణిగింది అనుకున్న సమయంలో మరోసారి తహసీల్దార్లపై బదిలీల పిడుగు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఎవరికివారు ఈ బదిలీ గండంనుంచి బయటపడేందుకు తమవంతుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎన్నికల సమయంలో వచ్చిన వారు.. గతేడాది జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో జిల్లాకు వచ్చిన తహసీల్దార్లు చాలావరకు ఇక్కడే ఉన్నారు. ఇటీవల బదిలీల్లో ఒకరిద్దరు మారారు. ఉద్యోగ సంఘాలు రాష్ట్రస్థాయిలో ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తులు చేశాయి. ఎన్నికల సమయంలో బదిలీ అయిన తహసీల్దార్లను తిరిగి తమ సొంత జిల్లాలకు పంపించాలని కోరాయి. వారి అభ్యర్థనకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీంతో వచ్చిన వారు తిరిగి వెళ్లక తప్పదనే వినిపిస్తోంది. అదే జరిగితే ప్రస్తుతం హనుమకొండ జిల్లాలోని వేలేరు, ధర్మసాగర్, కాజీపేట, ఎల్కతుర్తి తహసీల్దార్లతోపాటు ఒక డీఈఓ, కలెక్టరేట్లో ఒక సూపరింటెండెంట్ ఈ బదిలీ పరిధిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా గత ఎన్నికల సమయంలో జిల్లా నుంచి వెళ్లిన వారిలో తహసీల్దార్లు పాక రాజ్కుమార్, రియాజ్ మహేందర్, బండి నాగేశ్వరరావు, పూజారి కిరణ్ కుమార్, తదితరులు తిరిగి జిల్లాకు వచ్చే అవకాశం ఉంటుంది. హనుమకొండ జిల్లాకు వచ్చేవారు ఉత్సాహంగా ఉన్నప్పటికీ ఇక్కడినుంచి వెళ్లే వారికి కాస్త అసంతృప్తి ఉన్నట్లు సమాచారం. బదిలీలు తప్పించుకునేందుకు ఇక్కడివారు ఎంత ప్రయత్నం చేస్తున్నారో, రావాల్సిన వారు రెట్టింపు ప్రయత్నిస్తున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. తహసీల్దార్ల బదిలీలు పూర్తయి జిల్లాలు కేటాయిస్తే వచ్చిన వారికి పోస్టింగ్స్ ఇచ్చే క్రమంలో మరోసారి జిల్లా స్థాయిలో తహసీల్దార్లకు స్థానచలనం కలిగే అవకాశం ఉంటుంది. బదిలీ భయంతోనే శ్రీపాల్ మృతి? ఇటీవల హనుమకొండ తహసీల్దార్ శ్రీపాల్ రెడ్డి అకాల మరణం ఉద్యోగ వర్గాల్లో కలకలంరేపింది. బదిలీల విషయంపై పదేపదే ఆలోచించి ఆయన కొంత ఆందోళనకు గురైనట్లు సన్నిహితులు చెబు తున్నారు. ఇప్పటికే ప్రమాదవశాత్తు కాలు విరిగి ఇబ్బందులు పడుతున్న శ్రీపాల్రెడ్డి మరోసారి బదిలీ పేరుతో దూర ప్రాంతానికి వెళ్లడం ఎలా? అని మదనపడుతుండేవాడని సమాచారం. హనుమకొండ జిల్లా నుంచి ఏడుగురు బయటకి.. వచ్చేవాళ్లు ఐదుగురు బదిలీ గండం తప్పించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు -
జీఎంహెచ్ అభివృద్ధికి సీఎంను కలుస్తాం..
హన్మకొండ చౌరస్తా: పేదలకు వైద్య సేవలందించిన హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి అభివృద్ధికి కావాల్సిన నిధుల కోసం, జిల్లా ప్రజాప్రతినిధులంతా కలిసి సీఎం రేవంత్రెడ్డిని కోరుతామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఈఆస్పత్రిని హెరిటేజ్ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. మంగళవారం కలెక్టర్ ప్రావీణ్య, ఎంపీ కావ్య, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డితో కలిసి నాయిని రాజేందర్రెడ్డి ప్రసూతి ఆస్పత్రిలో జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించారు. ముందుగా ఆస్పత్రిలోని వివిధ విభాగాలు, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఓపీ విభాగంలో రోగుల ఇన్ పేషెంట్ రికార్డులు పరిశీలించారు. రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సమీక్షలో నాయిని మాట్లాడుతూ.. ఆస్పత్రిలోని వైద్య సేవల స్థితిగతులు, రోగులకు అవసరమైన అదనపు వసతులు తదితర అంశాలపై పలు సూచనలిచ్చారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. 16 ఏళ్ల తర్వాత ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించడం, పేదలకు వైద్య సేవలందించడం కాంగ్రెస్ సర్కార్కు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. సమావేశంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి ఈవీ శ్రీనివాసరావు, డీఎంహెచ్ఓ అప్పయ్య, జీఎంహెచ్ సూపరింటెండెంట్ విజయలక్ష్మి, ఆర్ఎంఓ అంబరీష్, స్థానిక కార్పొరేటర్ లక్ష్మి పాల్గొన్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి -
ప్రజాస్వామ్యంపై ఏపీ ప్రభుత్వం దాడి
హన్మకొండ అర్బన్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జర్నలిస్టులు, సాక్షి మీడియా కార్యాలయాలపై పాశవికంగా దాడులు చేస్తూ.. అక్రమ కేసులు నమోదు చేయడాన్ని హనుమకొండ జిల్లా జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు, సీనియర్ జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. ఏపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మంగళవారం హనుమకొండ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లకార్డులు పట్టుకుని ఆందోళన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా జర్నలిస్టు సంఘాల నాయకులు మాట్లాడుతూ.. జర్నలిస్టులు, మీడియా కార్యాలయాలపై దాడులు ప్రజాస్వామ్యంపై దాడిగా వారు అభివర్ణించారు. ఏపీ ప్రభుత్వం హామీలను అమలు చేయలేక ప్రజలను పక్కదారి పట్టించేందుకు సాక్షి జర్నలిస్టులు, సాక్షి మీడియా కార్యాలయాలపై దాడులు, అక్రమ కేసులకు పాల్పడుతోందన్నారు. ఇవి పునరావృతమైతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పత్రికా స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకు సీనియర్ జర్నలిస్టులు, మేధావులు, ప్రజాసంఘాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఆయనను భేషరతుగా విడుదల చేయాలని, పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈనిరసనలో టీయూడబ్ల్యూజే(ఐజేయూ) హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, సాక్షి బ్యూరో ఇన్చార్జ్ గడ్డం రాజిరెడ్డి, ఎడిషన్ ఇన్చార్జ్ వర్ధెల్లి లింగయ్య, వరంగల్ స్టాఫ్ రిపోర్టర్ వాంకే శ్రీనివాస్, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు తోట సుధాకర్, టీవీ.రాజు, బొక్క దయాసాగర్, బొల్లారపు సదయ్య, పొడిశెట్టి విష్ణువర్ధన్, గాడిపెల్లి మధు, వల్లాల వెంకటరమణ, కంకణాల సంతోశ్, నల్లాల బుచ్చిరెడ్డి, అంతడుపుల శ్రీనివాస్, ఊటుకూరు సాయిరాం, నరేశ్, బత్తిని రాజేందర్గౌడ్, కొల్లా కృష్ణ్ణ కుమార్రెడ్డి, యాంసాని శ్రీనివాస్, దామెర రాజేందర్, కొలనుపాక కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. కొమ్మినేని అరెస్ట్.. సాక్షి కార్యాలయాలపై దాడులు నిరసిస్తూ జర్నలిస్టు సంఘాల ఆందోళన హనుమకొండ కలెక్టరేట్ ఎదుట నిరసన -
ఇంత నిర్లక్ష్యమెందుకు?
● ఇంజనీర్లకు మేయర్ సుధారాణి క్లాస్ ● పద్ధతి మార్చుకోవాలని హెచ్చరిక వరంగల్ అర్బన్: వాహనాలపై ఇంత నిర్లక్ష్యం తగదని మేయర్ గుండు సుధారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. బల్దియాకు చెందిన బాలసముద్రంలోని వెహికిల్ షెడ్డును మంగళవారం మేయర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా మరమ్మతులకు గురైన వాహనాలు, వాటి స్థితిగతులు, ఎదురవుతున్న ఇబ్బందులు తదితర అంశాలపై ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. 41 స్వచ్ఛ ఆటోలు, 9 ట్రాక్టర్లు, 4 డంపర్ పెసర్లు, 4 జేసీబీలు, 2 హిటాచీలు, 4 కాంపాక్టర్లకు వారంలోగా మరమ్మతులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికకు సంబంధించిన కార్యక్రమాలను స్వచ్ఛ ఆటో మైకుల ద్వారా ప్రజలకు అవగాహన కలిగించేలా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా దోమల వ్యాప్తిని అరికట్టడానికి నగరవ్యాప్తంగా ఉన్న 66 డివిజన్లలో ప్రణాళికాబద్ధంగా ఫాగింగ్ చేపట్టాలని సీఎంహెచ్ఓను ఆదేశించారు. కార్యక్రమంలో సీఎంహెచ్ఓ రాజారెడ్డి, ఈఈ మహేందర్, డీఈ శివానంద్, ఏఈలు సంతోశ్కుమార్, ఫణి, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. -
పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ షురూ!
హన్మకొండ: పీఎం కుసుం పథకంలో భాగంగా రైతులతో ఏర్పాటు చేయనున్న సోలార్ పవర్ ప్లాంట్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ కార్యక్రమం షురూ అయ్యింది. టీజీ ఎన్పీడీసీఎల్లో రెండు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో సోమవారం హనుమకొండలోని కంపెనీ కా ర్యాలయంలో ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం సోలార్ విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు, సోలార్ ప్లాంట్ ఏర్పాటుపై రైతులను ప్రోత్సహించేందుకు ప్రధాన మంత్రి కిసాన్ ఉర్జా సురక్షా ఎవం ఉత్థాన్ మహాభీయాన్ (పీఎం కుసుం) పథకం తీసుకొచ్చింది. ప్రధానంగా రైతులను సౌర విద్యుత్ ఉత్పత్తి వైపు ప్రోత్సహిస్తుంది. రాష్ట్రాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. తెలంగాణ పు నరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ, టీజీ ఎన్పీడీసీఎల్, టీజీ ఎస్పీడీసీఎల్ ద్వా రా ఈ పథకాన్ని అమలు చేస్తోంది. రైతులు ఉ త్పత్తి చేసిన విద్యుత్ను స్థానిక డిస్కంలు ముందుగా నిర్ణయించిన టారిఫ్ ధరలకు కొనుగోలు చేస్తాయి. సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి స్థలం 33/11 కేవీ సబ్ స్టేషన్కు 5 కిలో మీటర్ల లోపు దూరం మాత్రమే ఉండాలి. 500 కిలో వాట్ల నుంచి 2 మెగావాట్ల ఉత్పత్తి వరకు సోలా ర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యా ప్తంగా 4 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉ త్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో వెయ్యి మెగావాట్లు మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగతా 3 వేల మె గావాట్లు రైతులతో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చే యించి ఉత్పత్తి చేయాలదే ఈ పథం ఉద్దేశం. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలోని 16 సర్కిళ్ల పరిధిలో దరఖాస్తు చేసుకుని రూ.లక్ష చొప్పున ఈఎండీ చెల్లించిన 461 మందికి రెడ్ కో లెటర్ ఆఫ్ ఆక్సెప్టెనీ జారీ చేసింది. వీరితో ఇప్పుడు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. కాగా, మొదటి రోజు 80కి పైగా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు జరిగాయి. ఈ కార్యక్రమం మంగళవారం కూడా కొనసాగనుంది. ఇన్చార్జ్ డైరెక్టర్లు బి.అశోక్ కుమార్, వి.తిరుపతిరెడ్డి, టి.మధుసూదన్, ఐపీసీ అండ్ రాక్ చీఫ్ ఇంజనీర్ కె.వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీల్ ప్రధాన కార్యాలయంలో ప్రారంభం తొలి రోజు 80కి పైగా పీపీఏలు రెండు రోజుల పాటు కొనసాగింపు -
భార్య వేధింపులు.. ఆర్మీ జవాన్ ఆత్మహత్యాయత్నం
శాయంపేట : భార్య వేధింపులు తట్టుకోలేక ఓ ఆర్మీ జవాన్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగింది. కుటుంబీకుల కథనం వివరాల ప్రకారం.. మండలంలోని మైలారం గ్రామానికి చెందిన అరికిల్ల ప్రవీణ్ సికింద్రాబాద్ తిరుమలగిరిలోని టెరిటోరియల్ ఆర్మీ 125 బెటాలియన్లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో పరకాల మండలం నాగారం గ్రామానికి చెందిన రజనికతో 2020లో వివాహమైంది. కొంత కాలంగా దంపతుల మధ్య తరుచూ గొడువలు జరుగుతున్నాయి. భార్యతోపాటు అత్తింటి వారు కూడా ప్రవీణ్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రవీణ్ ఉద్యోగానికి వెళ్లకుండా ఐడీ కార్డు దాచిపెట్టి వేధించారు. ఈక్రమంలో ప్రవీణ్ రెండు నెలల క్రితం విధులకు వెళ్లగా తన భార్య బెటాలియన్ వద్దకు వెళ్లింది. అక్కడ గొడవ చేసి ప్రవీణ్ పరువు తీయడంతో మనస్తాపం చెందాడు. దీంతో సెలవుల నిమిత్తం ప్రవీణ్.. ఈ నెల 6న ఇంటికొచ్చి కుటుంబీకులతో మాట్లాడి హనుమకొండకు వెళ్లాడు. 8న హనుమకొండలోనే గడ్డి మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడి తన అన్న ప్రసాద్కు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో వెంటనే ప్రవీణ్ను తిరుమలగిరిలోని మిలటరీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రవీణ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆత్మహత్యాయత్నానికి ముందు ప్రవీణ్ సూసైడ్ నోట్ రాశాడు. అందులో ‘డియర్ ఫ్రెండ్స్ నేను చనిపోతున్నా.. నా చావుకి కారణమెవరో వాళ్లకు తెలుసు. వాళ్ల టార్చర్ తట్టుకోలేకపోతున్నా. అన్నా అమ్మను జాగ్రత్తగా చూసుకో. మన గ్రామంలో వాలీబాల్ టీమ్ బతకాలి, ఎప్పుడూ గేమ్ను వదలొద్దు’ అని పేర్కొన్నారు. -
రేపటి నుంచి రాష్ట్రస్థాయి ఆయుర్వేద వైద్య సదస్సు
● 11న ఉచిత మెగా వైద్యశిబిరం జనగామ: పట్టణంలోని హైదరాబాద్ రోడ్డున ఉన్న వేద పంచకర్మ వెల్నెస్ సెంటర్లో ఈనె ల 11 నుంచి 15వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి ఆ యుర్వేద వైద్య సదస్సు నిర్వహిస్తున్నట్లు వెల్నెస్ సెంటర్ ఫౌండర్ అంజిరెడ్డి సోమవారం తెలిపారు. ‘కౌశలం 2025 ఆయుర్వేదం’ పేరుతో విశ్వ ఆయుర్వేద పరిషత్ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో జనగామ వేద పంచకర్మ, వెల్నెస్ సహకారంతో నిర్వహించే ఈ సదస్సుకు ఢిల్లీ, ముంబాయి, కర్ణాటక, ఏపీ, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి వైద్య విద్యార్థులు, వైద్యులు, ప్రముఖులు హాజరుకానున్నట్లు చెప్పారు. పంచకర్మ విధానాలపై హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్, ఓపీ, ఐపీడీ సందర్శనలు, ఆయుర్వేద చికిత్స విధానాలపై చర్చా గోష్టి, ప్రాక్టికల్ శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఈ సదస్సు ద్వారా ఆయుర్వేద వైద్య విద్యార్థులు నైపుణ్య చికిత్స విధానం, భవిష్యత్ అవకాశాలు తెలుసుకోవచ్చన్నారు. ఇదిలా ఉండగా 11వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉచిత ఆయుర్వేద మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనుమతిలేని విత్తనాలు విక్రయించొద్దు ● విజిలెన్స్ డీఎస్పీ మల్లయ్య ● విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆధ్వర్యంలో దాడులు ఖిలా వరంగల్ : ప్రభుత్వ అనుమతులు లేని పు రుగు మందులు, విత్తనాల విక్రయించినా, నిల్వచేసినా చట్టరీత్యా చర్యలు తప్పవని విజిలెన్స్ డీఎస్పీ బి.మల్లయ్య, ఏఓ రవీందర్ హెచ్చరించారు. సోమవారం వరంగల్ స్టేషన్రోడ్డు, ఫోర్ట్రోడ్డులోని సీడ్స్, పురుగు మందుల షాపులపై విజిలెన్స్, వ్యవసాయశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. పలు విత్తనాల షాపుల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఫెర్టిలైజర్ షాపుల్లో రికార్డుల్లో నమోదు చేయని రూ.1,12, 03,718ల విలువైన పురుగు మందులను అధికారులు గుర్తించి సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ, ఏఓలు మాట్లాడుతూ నిబంధనల మేరకు విత్తనాలు విక్రయించాలని, రికార్డుల ప్రకారం స్టాక్ మెంటేన్ చేయాలని సూచించారు. రైతులు ఎరువులు, విత్తనాలు, పురుగు మందులను కొనుగోలు చేసేటప్పుడు డీలర్ను కచ్చితంగా రశీదు తీసుకో వాలని సూచించారు. ఆలాగే బీటీ–3 విత్తనాలు ఎవరైనా అమ్మితే పోలీసు, వ్యవసాయశాఖ ఆధికా రులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. తనిఖీలో ఇన్స్పెక్టర్ రాకేష్, రెవెన్యూ అధికారి ఏవీ భాస్కర్, పీ.రవి తదితరులు పాల్గొన్నారు. -
టీపీసీసీలో ఉమ్మడి జిల్లా నేతలకు కీలక పదవులు
సాక్షిప్రతినిధి, వరంగల్: కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐసీసీ తాజాగా 27 మంది నేతలకు పార్టీ ఉపాధ్యక్ష పదవి, 69 మందికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవులకు అవకాశం కల్పించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సీ.వేణుగోపాల్ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, నమిండ్ల శ్రీనివాస్, లకావత్ ధన్వంతి, టి.కుమార్రావులను రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించారు. అదేవిధంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శులుగా బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఈవీ శ్రీనివాసరావు, కత్తి వెంకటస్వామి, మల్లాడి రాంరెడ్డిలకు అవకాశం దక్కింది. ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులుగా పలువురికి అవకాశం -
కేయూలో ఉద్యోగుల ఎన్నికల సందడి
● ముగిసిన నామినేషన్ల ప్రక్రియకేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలో ఉద్యోగుల ఎన్నికల సందడి నెలకొంది. కే యూలో ఎన్జీఓ, క్లాస్ఫోర్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎన్నికల ప్రక్రియకు ఇటీవలనే అధికారులు నోటిఫికేషన్ ఇచ్చి నామినేషన్లను స్వీకరించారు. వివిధ పదవులకు నామినేషన్లను స్వీకరించారు. సోమవారం సాయంత్రం నామినేషన్ల ప్ర క్రియ ముగిసింది. కేయూ ఎన్జీఓ అధ్యక్ష పదవికి నవీన్కుమార్, ని రంజన్, పోతు రాజు, జనరల్ సెక్రటరీగా తిరుపతి, నిరంజన్, అక్రమ్ మహ్మద్ నామినేషన్లు వేశారు. కోశాధికారి పదవికి దామోదర్, రాజు, సహెచ్ ప్రవీణ్కుమార్లు పోటీపడుతున్నారు. మిగతా పదవులకు నలుగురి చొప్పున అభ్యర్థులు పోటీపడుతున్నారు. మహిళా కార్యదర్శి కోసం ముగ్గురు ఉద్యోగులు పోటీపడుతున్నారు. క్లాస్ ఫోర్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎన్నికలల్లో అధ్యక్ష పదవికి గుమ్మయ్య, కోర్నెల్, నిజాముద్దీన్లు, జనరల్ సెక్రటరీ కోసం బొక్క మొగిలి ,అంకూస్లు నామినేషన్లు వేశారు. ఈనెల 13వరకు నామినేషన్ల ఉపసంహరణ గ డువు ఉంది. ఓటింగ్ ఈనెల 20న నిర్వహించనున్నారు. 21న ఫ లితాలను వెల్లడిస్తారు. ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా అసిస్టెంట్ రిజిస్ట్రార్ పంజాల శ్రీధర్ వ్యవహరిస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ ముగిశాక జాబితాను రాత్రి 8 గంటలకు వెల్లడించారు. -
‘క్రూ’ వర్కింగ్ సిస్టంపై చిన్నచూపు
కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే డ్రైవర్ల కార్యాలయ కేంద్రంగా పని చేస్తున్న క్రూ (లోకోపైలెట్, అసిస్టెంట్ లోకోపైలెట్)లను మెయిన్లైన్లో కాకుండా బొగ్గు, సిమెంట్ సైడిండ్ పాయింట్లకే పరిమితం చేసి పని చేయిస్తున్నారని రన్నింగ్స్టాఫ్ రైల్వే కార్మికులు ఆరోపిస్తున్నారు. కాజీపేట క్రూ డిపో ఏర్పాటు చరిత్రలో ఇప్పటి వరకు లోకోపైలెట్లు, అసిస్టెంట్ లోకోపైలెట్లు మెయిన్లైన్లో కాజీపేట–బల్లార్షా వరకు అప్ అండ్ డౌన్లో విధులు నిర్వర్తించేవారని వారు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో సికింద్రాబాద్ రైల్వే యంత్రాంగం అనాలోచితంగా కాజీపేట క్రూ డిపోను చిన్నచూపు చూస్తూ క్రూ వర్కింగ్ సిస్టం నిర్వీర్యం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల నుంచి కొంత సిబ్బందిని (కాజీపేట క్రూలు) మంచిర్యాల, మందమర్రి, రామగుండం, బెల్లంపల్లిలో సైడింగ్లకు పరిమితం చేసి వర్కింగ్ చేయిస్తున్నారని, ఖాళీ వ్యాగన్లతో గూడ్స్ను తీసుకెళ్లి లోడింగ్ చేయించడం, అక్కడ ఉండి మళ్లీ లోడింగ్ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కోచింగ్ క్రూ లింక్లను కూడా విడదీస్తూ గూడ్స్ డ్రైవర్ల వర్కింగ్ మాదిరి ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ విధానంలో కోచింగ్ క్రూలను బుక్ చేస్తున్నారని రన్నింగ్స్టాఫ్ పేర్కొంటున్నారు. హెడ్క్వార్టర్స్, ఔట్ స్టేషన్లలో ఈ విధానం పాటించడం వల్ల హెచ్ఓఈఆర్ (అవర్స్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ రూల్స్) నిబంధనలు ఉల్లంఘనకు గురై ప్రయాణికులకు భద్రత లేకుండా పోయే ప్రమాదం ఉందంటున్నారు. దీనిపై ఇప్పటికై నా సికింద్రాబాద్ రైల్వే యంత్రాంగం స్పందించి కాజీపేట క్రూ డిపో, లోకోపైలెట్ల, అసిస్టెంట్ లోకోపైట్ల ప్రాధాన్యం తగ్గించొద్దని రైల్వే నాయకులు, రన్నింగ్స్టాఫ్ కార్మికులు సోమవారం కోరారు. కాగా, ఇటీవల వరుసగా ప్రజాప్రతినిధులు, దక్షిణ మధ్య రైల్వే అధికారులతో ఏదో ఒక విషయంపై చర్చిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం క్రూల పనితీరుపై లోకోపైలెట్, అసిస్టెంట్ లోకోపైలెట్లు ఆరోపణలు చేయడం గమనార్హం. సైడింగ్ పాయింట్లకే కాజీపేట రైల్వే క్రూల పరిమితం ఆందోళనలో రన్నింగ్ స్టాఫ్ కార్మికులు -
భూమి కబ్జా చేశారని మనస్తాపం..
ఖిలా వరంగల్: తమ జీవనాధారమైన 14 గుంటల భూమిని కబ్జా చేశారనే మనస్తాపంతో ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై ఉర్సుగుట్ట తాళ్లపద్మావతి కాలేజీ సమీపంలో చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. వరంగల్ కరీమాబాద్కు చెందిన పోలపాక కుమారస్వామి ఆటో డ్రైవర్గా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వారసత్వంగా సంక్రమించిన భూ మిని విక్రయించగా.. మిగతా 14గంటల భూమి ఉర్సు గుట్ట తాళ్లపద్మావతి కళాశాల సమీపంలో ఉంది. ఇటీవల తాళ్ల మల్లేశం, బండి కుమారస్వామి, పులి రజింత్రెడ్డి అనే వ్యక్తులు 14 గుంటల భూమి కబ్జా చేసి ప్రహరీ నిర్మించారు. ఆ భూమి తమదేన ని పత్రాలతో వెళ్తే ఎస్సీ, ఎస్టీ పేరుతో దుర్బాషలా డుతూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో మనస్తా పం చెందిన కుమారస్వామి సోమవారం సాయంత్రం తన భూమి వద్దకు వెళ్లాడు. తనకు న్యాయం చేయాలని కలెక్టర్కు సూసైడ్ నోట్ రాసి ఒంటిపై పె ట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈవి షయం తెలిసిన వెంటనే మిల్స్కాలనీ ఎస్సై శ్రీకాంత్ ఘటనా స్థలికి చేరుకున్నారు. బాధితుడి బంధువులతో మాట్లాడి వివరాలు సేకరించారు. బాధితుడికి 80 శాతంపైగా గాయాలు కావడంతో బంధువులు హుటాహుటిన 108లో ఎంజీఎం తరలించారు. ముగ్గురిపై కేసు నమోదు.. తన 14 గంటలు భూమిని కబ్జా చేశారని ఆరోపిస్తూ పొలెపాక కుమారస్వామి ఆత్మహత్యకు యత్నించి ఎంజీఎంలో చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. దీనిపై కుమారస్వామి కుమారుడు రాంకుమార్ ఫిర్యాదు మేరకు పులి రజింత్రెడ్డి, బండి కుమారస్వామి, తాళ్ల మల్లేశంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. వ్యక్తి ఆత్మహత్యాయత్నం ఉర్సుగుట్టలో ఘటన న్యాయం చేయాలని కలెక్టర్కు సూసైడ్నోట్ -
వివాహిత హత్యకేసులో నిందితుడి అరెస్ట్
ఎల్కతుర్తి : వివాహిత హత్యకేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ముల్క నూరు పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్కు చెందిన మృతురాలు కోల సుమలత, నిందితుడు గూళ్ల రాజు ఇళ్లులు పక్కపక్కన ఉంటాయి. ఈ క్రమంలో మూడు సంవత్సరాల క్రితం రాజుకు చెందిన లేగదూడ చని పోయిన విషయంలో గొడవ జరిగింది. ఈ ఘటనలో సుమలత బావ సంపత్ను కొట్టిన విషయంలో రాజుపై ముల్కనూరు పీఎస్లో కేసు నమోదైంది. దీంతో రాజు రెండు రోజులు జైలుల్లో ఉండి బెయిల్ పై బయటకు వచ్చాడు. ఈ కేసులో సుమలత ప్రత్య క్ష సాక్షిగా ఉండగా నిందితుడు తనను పలుమార్లు రాజీ పడాలని కోరగా సుమలత వినలేదు. ఈ కేసులో సాక్ష్యం చెప్పొద్దని, రాజీ పడాలని రాజు.. సుమలత ఇంటికెళ్లి చంపుతానని బెదిరిస్తున్న సమయంలో మృతురాలి కుమారుడు వెంకటేశ్ అడ్డొచ్చాడు. దీంతో అతడిపై గొడ్డలితో దాడికి పాల్పడిన ఘటనలో ఇదే పీఎస్లో రాజుపై హత్యాయత్నం కేసు న మోదు కాగా నిందితుడు 60 రోజుల పాటు జైలులో ఉండి మెయిల్పై బయటకు వచ్చాడు. ఈ క్రమంలోనే మొదటి కేసు ట్రయల్కు వచ్చింది. ఈ నెల 11న పేషీ ఉంది. ఈ కేసులో సుమలత సాక్ష్యం చెప్పితే శిక్ష పడుతుందని తెలిసి కొన్ని రోజుల నుంచి రాజు.. సుమలతను రాజీపడమని బెదిరించగా ఆమె వినలేదు. ఈ క్రమంలో ఈనెల 5న సుమలత ఇంటివద్ద ఉంది. దీంతో సుమలతను చంపితే కేసులో శిక్ష నుంచి తప్పించుకోచ్చని భావించిన రాజు.. గొడ్డలితో ఆమైపె దాడికి పాల్పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈక్రమంలో ముల్క నూరు గ్రామ శివారులో కనిపించగా పట్టుకుని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ తెలిపారు. కాగా, నిందితుడిని పట్టుకోవడంలో సమర్థవంత విధులు నిర్వర్తించిన సీఐ పులి రమేశ్, ఎస్సైలు సాయిబాబు, ప్రవీణ్కుమార్, దివ్యను ఏసీపీ అభినందించారు. వివరాలు వెల్లడించిన కాజీపేట ఏసీపీ -
విద్యుదాఘాతంతో వృద్ధుడి మృతి
● కాపాడే ప్రయత్నంలో మరో ఇద్దరికి షాక్ ● తండాధర్మారం గ్రామంలో సంఘటన మరిపెడ రూరల్: విద్యుదాఘాతంతో ఓ వృద్ధుడు మృతి చెందాడు. అతడిని కాపాడే యత్నంలో మరో ఇద్దరు షాక్కు గురయ్యారు. ఈ ఘటన సోమవారం మరిపెడ మండలం తండాధర్మారం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ధరంసోత్ పత్యానాయక్ (70) ఎదురింటి కప్పుపై పట్టాలు కల్పి దానికి ఇనుప తీగ బిగించారు. కరెంట్ తీగ ఆ ఇంటిపై బిగించిన ఇనుప తీగకు ఆనుకుని విద్యుత్ సరఫరా అయ్యింది. ఈ క్రమంలో పత్యానాయక్ ఆ ఇంటి ఎదుట పని చేస్తుండగా ఇనుప తీగ తగలడంతో షాక్ తగిలి కిందపడ్డాడు. అతడిని కాపాడే ప్రయత్నంలో మనవడు సతీశ్, కోడలు బుజ్జి షాక్ గురయ్యారు. ఇది గమనించిన మరో మనవడు రాజేశ్ కర్ర సాయంతో వారిని రక్షించాడు. ప్రాణాపాయస్థితి నుంచి కోడలు, మనవడు బయటపడగా పత్యానాయక్ మాత్రం అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కారు బోల్తా.. ముగ్గురికి గాయాలుమడికొండ: ప్రమాదవశాత్తు కారు బోల్తా పడటంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మడికొండ–ధర్మసాగర్ రోడ్డులో సోమవారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ధర్మసాగర్ మండలం దామెరకు చెందిన అశోక్ ప్రైవేట్ సర్వేయర్గా పనిచేస్తు కారులో పని నిమిత్తం హనుమకొండకు వెళ్లి తిరిగి మడికొండ నుంచి ధర్మసాగర్ వైపు వెళ్తున్నాడు. ధర్మసాగర్ పెట్రోల్ పంపు సమీపంలో టైరు బ్లాస్ట్ కావడంతో కారు బోల్తా పడింది. ఈ సంఘటనలో అశోక్తో పాటు అతని కుటుంబ సభ్యులకు సైతం గాయాలయ్యాయి. స్థానికులు చికిత్స నిమిత్తం 108వాహనంలో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని వివరాలను సేకరించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
అర్జీలు త్వరగా పరిష్కరించాలి
● హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో వివిధ రకాల సమస్యలపై ప్రజలనుంచి స్వీకరించిన వినతులు ఆయా శాఖల అధికారులు త్వరగా పరిష్కరించాల ని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రావీణ్య హాజరై ప్రజలనుంచి వినతులు స్వీకరించారు. వివిధ శాఖల సంబంధించి మొత్తం 137 వినతులు స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీఆర్ఓ వై.వి గణేష్, డీఆర్డీఓ పీడీ మేన శ్రీను, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రమేష్, నారాయణ, అధికారులు పాల్గొన్నారు. లోపాలు చూపినందుకు బహిష్కరించారు..పెద్ద మనుషుల లోపాలు ఎత్తి చూపినందుకు తనను కుల బహిష్కరించి ఇబ్బందులకు గురి చేసున్నారని, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని న్యాయం చేయాలని హసన్పర్తి మండలం జయగిరికి చెందిన తాళ్లపల్లి రామకృష్ణ వాపోయారు. తనకు జరిగిన అన్యాయంపై చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం అందించారు. గౌడ వృత్తిమీద జీవనోపాధి పొందుతున్న తనను పెద్ద మనుషుల తప్పులను లేవనెత్తినందుకు తాళ్లు ఎక్కకుండా కుల బహిష్కరణ చేసి పరువు తీస్తూ, ఐదు నెలలుగా జీవనోపాధిని దూరం చేసి ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. వృద్ధాశ్రమంలో చేర్పించండి..నాభర్త వెంకటరెడ్డి 14 ఏళ్ల క్రితం చనిపోయాడు. మాకున్న 16 ఎకరాల భూమిని పిల్లలకు సమానంగా పంచేశాం. నాభర్త చనిపోయాక నన్ను ఎవరూ సాకడం లేదు. వారితో పోరాడి వారిని ఎదురించే స్తోమత నాకు లేదు. నాకున్నది ఒక ఇల్లు, ఇంటి స్థలం మాత్రమే. నన్ను వృద్ధాశ్రమంలో చేర్పించండి. నా ఆలనాపాలనా చూసి, నా అంత్యక్రియలు చేసిన వారికే నా ఇల్లు, ఇంటి స్థలం చెందేలా అఽధికారులు చర్యలు తీసుకోండి. – చింతకుంట్ల కమలమ్మ, ఊరుగొండ -
గర్భిణులకు మెరుగైన వైద్యసేవలందించాలి
● వరంగల్ కలెక్టర్ సత్యశారద ● సీకేఎం ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు ఎంజీఎం: ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి వచ్చే గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. వరంగల్లోని సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిని సోమవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్, నవజాత శిశువులకు అందిస్తున్న వైద్యసేవల గదులతోపాటు ల్యాబ్లు, పలు విభాగాలను పరిశీలించారు. పలు రికార్డులను తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని ఐపీ, ఓపీ సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. సాధారణ ప్రసవాలు పెంచాలన్నారు. పలువురు గర్భిణులు, బాలింతలతో మాట్లాడి అందుతున్న వైద్యం గురించి తెలుసుకున్నారు. శానిటేషన్ వ్యవస్థ మెరుగుపర్చాలని, సెప్టిక్ ట్యాంకు వేగంగా శుభ్రం చేయాలన్నారు. బాలింత ప్లేట్లో భోజనాన్ని గమనించిన కలెక్టర్ మెనూ పాటించకపోవడంపై వార్డు ఇన్చార్జ్ స్టాఫ్ నర్స్, ఇన్చార్జ్ డైటీషియన్, కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెమో జారీ చేయాలని ఆర్ఎంఓను ఆదేశించారు. అన్నపూర్ణ భోజనం క్యాంటీన్ను ఆస్పత్రి బయటికి మార్చాలని, ఆస్పత్రి ఇరువైపులా వెంటనే సీసీ కెమెరాలు అమర్చాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆస్పత్రి ఆర్ఎంఓలు మురళి, రమేశ్, ఇన్చార్జ్ సూపరింటెండెంట్ స్వరూప, సృజన, కుమార్, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
గోకుల్ జంక్షన్ అభివృద్ధిపై దృష్టి
పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హన్మకొండ: హనుమకొండ గోకుల్ జంక్షన్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. సోమవారం గోకుల్ జంక్షన్ను కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, మేయర్ గుండు సుధారాణితో కలిసి ఆయన పరిశీలించారు. కాలనీవాసులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు వారికి వివరించారు. అశోక కాలనీ వరద ముంపునకు గురవుతోందని, భారీ వర్షానికి గోకుల్నగర్లో వరద ఉప్పొంగుతుందని, ఎగువనుంచి వస్తున్న వరద వెళ్లే మార్గం లేక కాలనీలు ముంపునకు గురవుతున్నాయని వివరించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. అంబేడ్కర్ భవన్ నుంచి సమ్మయ్యనగర్ వరకు ప్రస్తుత డ్రెయినేజీకి ప్రత్యామ్నాయంగా మరోవైపు తాత్కాలిక కాలువ తవ్వాలని ఆదేశించారు. గోకుల్ జంక్షన్ అభివృద్ధిలో భాగంగా తగిన విద్యుద్దీపాలు, ఫుట్పాత్లు, సిగ్నల్ వ్యవస్థలు తదితర అంశాలపై ప్రణాళిక రూపొందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో పీసీసీ మెంబర్ ఈవీ శ్రీనివాస్రావు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ సంపత్ యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని లక్ష్మారెడ్డి, బంక సంపత్ యాదవ్, అశోక కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ఎం.కృష్ణారెడ్డి, రిటైర్డ్ ఇంజనీర్ నల్ల సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దీపావళి నాటికి గృహ ప్రవేశాలు
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు హన్మకొండ/హసన్పర్తి: ఇందిరమ్మ పథకం కింద ఇల్లు నిర్మిస్తున్న వారు దీపావళి నాటికి గృహ ప్రవేశాలు చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు అన్నారు. నగరంలోని 1, 2, 3, 43, 44, 45, 46, 55, 56, 65, 66వ డివిజన్ల్లోని ఇందిరమ్మ లబ్ధిదారులకు సోమవారం అంబేడ్కర్ భవన్లో జరిగిన కార్యక్రమంలో మంజూరు పత్రాలు అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలకతీతంగా అర్హులందరికీ ఇళ్లు ఇస్తామన్నారు. ఇళ్లు ఇప్పిస్తామని వచ్చే దళారులను నమ్మొద్దని సూచించారు. ఇల్లు కట్టుకునేందుకు ఆర్థికస్థోమత లేనివారికి మహిళా సంఘాల ద్వారా రుణసాయం చేయాలని సూచించారు. మేయర్ సుధారాణి మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల మేరకు ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, కాజీపేట డిప్యూటీ కమిషనర్ రవీందర్, హౌసింగ్ పీడీ రవీందర్నాయక్, కార్పొరేటర్లు జక్కుల రజిత, సిరంగి సునీల్కుమార్, షీబారాణి, అరుణకుమారి, డివిజన్ అధ్యక్షుడు కిరణ్, పొన్నాల రఘు, హరిబాబు, గడ్డం శివరాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
సమష్టి కృషితో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య హన్మకొండ అర్బన్ : ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల సమష్టి కృషి, సమన్వయంతో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సాధ్యపడుతుందని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఈనెల 9 నుంచి 15వ తేదీ వరకు చేపట్టనున్న స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంపై జిల్లా సంక్షేమ అధికారి జయంతి అధ్యక్షతన సోమవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. స్పెషల్ డ్రైవ్ టీమ్ జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతాలు, షాపులు, ప్రమాదకర ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. 14 సంవత్సరాల్లోపు బాల బాలికలు పనిచేస్తున్నట్లు గుర్తిస్తే సంబంధిత యజమానులపై చట్ట ప్రకారం కేసు నమోదు చేయాలని, 18 సంవత్సరాల్లోపు వారైతే బాలల న్యాయ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలన్నారు. జిల్లా సంక్షేమ అధికారి జయంతి మాట్లాడుతూ.. కార్మిక శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం వారి ఆధ్వర్యంలో సేకరించి నివేదికలు అందజేయాలన్నారు. అనంతరం కలెక్టర్ ప్రావీణ్య స్పెషల్ డ్రైవ్కు సంబంధించిన వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా పబ్లిక్ గార్డెన్లో ర్యాలీ, అనంతరం లేబర్ అడ్డా వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ఏఎస్ వినీత, ఎన్సీఎల్పీ డైరెక్టర్ బుర్ర అశోక్ కుమార్, బాలల సంక్షేమ సమితి సభ్యులు కజాంపురం దామోదర్, సందసాని రాజేంద్ర ప్రసాద్, జిల్లా బాలల పరిరక్షణ ఇన్చార్జ్ అధికారి ప్రవీణ్ కుమార్, చైల్డ్ హెల్ప్ లైన్ కో–ఆర్డినేటర్ ఎస్ భాస్కర్, ఏహెచ్టీయూ ఎస్సై ఫిలిప్ రాజ్, కానిస్టేబుల్ రాము, సోషల్ వర్కర్స్ శ్రీనివాసులు, సునీత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
మూడు నెలల రేషన్ కోసం మూడు రోజులు లైన్లో!
హన్మకొండ అర్బన్: మండుతున్న ఎండలో రేషన్ షాపుల వద్ద బియ్యం కోసం జనం అల్లాడుతున్నారు. ప్రభుత్వం మూడు నెలల బియ్యం ఒకేసారి ఇస్తుండడంతో క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఓ వైపు ఇరుకు గదుల్లో షాపులు, మరోవైపు మండుతున్న ఎండలు, తాగేందుకు నీరు, నిల్చునేందుకు నీడలేక రేషన్ లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. మరో వైపు సర్వర్ డౌన్ కారణంగా గంటలు గంటలు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. నగరంలో దాదాపు అన్ని రేషన్ షాపుల వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, కనీస వసతుల విషయంలో జిల్లా అధికారులు పట్టించుకోకపోవడంతో జనం ఆపసోపాలు పడుతున్నారు. ఒక్కొక్కరికి పది నిమిషాలు.. ప్రస్తుతం ఒక్కో కార్డుకు మూడు నెలల బియ్యం ఇస్తుండడంతో నెలకు ఒక సారి చొప్పున ముడు సార్లు కాంటా వేయాలి. మూడు సార్లు లబ్ధిదారుడు బయోమెట్రిక్ ఇవ్వాలి. వాతావరణం వేడిగా ఉండడం, ఒకేసారి అందరు ఉపయోగిస్తుండడంతో సర్వర్ మొరాయిస్తోంది. ఒక్కరికి కనీసం పది నిమిషాల సమయం పడుతోంది. అది కూడా సర్వర్ సరిగ్గా ఉంటే.. దీనివల్ల గంటకు కేవలం ఐదు, లేదా ఆరుగురికి మాత్రమే రేషన్ ఇవ్వగలుగుతున్నట్లు రేషన్ డీలర్లు చెబుతున్నారు. బియ్యం ఐపోతాయని.. రాష్ట్రంలో ఎక్కడి వారైనా.. ఎక్కడైనా రేషన్ తీసుకునేందుకు అవకాశం ఉండడంతో తమకు బియ్యం వస్తాయో రావో అనే బెంగతో జనం షాపులు తెరవక ముందు నుంచే బస్తాలు, చెప్పులు, వాటర్ బాటిళ్లు లైన్లో పెట్టి ఉంచుతున్నారు. షాపు తీయగానే జనం విరగబడుతున్న పరిస్థితులు అన్ని చోట్ల కనిపిస్తున్నాయి. దీంతో.. డీలర్లు కూడా ఏం చేయలేని పరిస్థితి నెలకొంటోంది. డీలర్లు టోకెన్ పద్ధతిని ప్రారంభించారు. ఉదయం షాపు తీయడానికి అరగంట ముందు రోజుకు 50 టోకెన్లు ఇస్తున్నారు. ఇచ్చిన 50 మందికి పూర్తిగా మూడు నెలల రేషన్ ఇస్తే సాధారణ రోజుల్లో 150 మందికి ఇచ్చినట్లు లెక్క. దీనివల్ల అంతకన్నా ఎక్కువ టోకెన్లు ఇవ్వలేనమని డీలర్లు చెబుతున్నారు. కొత్త సాఫ్ట్వేర్తో ఇబ్బందులు ఇటీవల పౌరసరఫరాల శాఖ రేషన్ డీలర్ల వద్ద ఉన్న ఈ పాస్ మిషన్లలో కొత్త సాఫ్ట్వేర్ ఏర్పాటు చేసింది. దీనిలో కేంద్ర ప్రభుత్వ కోటా ఒక్క వ్యక్తికి ఐదు కిలోలు, రాష్ట్ర ప్రభుత్వం కోటా ఒక కిలో బియ్యం విడివిడిగా నమోదు చేయాలని, విడిగా తూకం వేయాలని చెప్పారు. దీంతో మూడు నెలలకు సంబంధించిన బియ్యం పంపిణీ క్రమంలో ఒక్కొక్కరి నుంచి ఆరుసార్లు బయోమెట్రిక్ తీసుకుంటున్నారు. ఆరుసార్లు తూకం వేస్తున్నారు. దీంతో రోజంతా ఈ ప్రక్రియ కొనసాగినా ఒక్కో డీలర్ 15 మందికి కూడా బియ్యం ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి గమనించి దిద్దుబాటుగా నెలకు రెండు సార్లు బదులు ఒక్కసారి తూకం వేసేలా మార్పు చేశారు. దీనికితోడు గతంలో కన్నా అదనంగా సమాచారం నమోదు చేయాల్సి వస్తుండడం అనవసర ఆప్షన్లు ఎక్కవగా ఉండడంతో సమయం వృథా అవుతోందని డీలర్లు చెబుతున్నారు. పౌరసరఫరాల శాఖ నిర్లక్ష్యం క్షేత్రస్థాయిలో ఇంత జరగుతున్నా.. జిల్లా పౌరసరఫరాల అధికారులు మాత్రం రేషన్ షాపుల వైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలున్నాయి. సాధారణంగా రేషన్ షాపులకు బియ్యం నెలాఖరులో చేరవేస్తారు. నెల ఒకటో తారీఖు నుంచి 15వ తేదీ వరకు పంపిణీ చేసి అధికారులకు లెక్కలు అప్పగిస్తారు. మిగిలిన స్టాకునుబట్టి తదుపరి నెలకు కోటా కేటాయిస్తారు. అయితే ప్రస్తుతం మూడు నెలల కోటా విషయంలో జనం అయోమయానికి గురవుతున్నారు. ఎప్పటి మాదిరిగానే 15వ తేదీ వరకు షాపులు క్లోజ్ చేస్తారని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈవిషయంలో పౌరసరఫరాల శాఖ అధికారులు కార్డుదారులకు కనీసం భరోసా ఇవ్వలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు షాపుల వద్ద పరిస్థితిని పర్యవేక్షించడం లేదని అంటున్నారు. ఎండ మండుతున్నందున షాపుల వద్ద టెంట్లు వేయించడం, తాగునీరు అందుబాటులో ఉంచడం కూడా చేయడం లేదని రేషన్ లబ్ధిదారులు మండిపడుతున్నారు. ఒక్కో వ్యక్తికి మూడు నెలల బియ్యం చేతికి అందాలంటే కనీసం మూడు రోజులపాటు లైన్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సత్వరమే చర్యలు తీసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని కోరుతున్నారు. నెలాఖరు దాకా పంపిణీ నెలాఖరుదాకా బియ్యం ఇస్తాం. ఎవరూ ఆందోళన చెందవద్దు. ఈ విషయం అధికారులు చెబితే ప్రజలు నమ్ముతారు. గతంలో మాదిరిగా 15వ తేదీ వరకు అనుకుని జనం ఎగబడుతున్నారు. సర్వర్ సమస్య తీవ్రంగా ఉంది. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే మంచిది. ఎండల వల్ల జనం ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే. – మహేశ్వరం గౌరీశంకర్, హనుమకొండ డీలర్ల సంఘం అధ్యక్షుడు ప్రజలకు అవగాహన కల్పించని సివిల్సప్లయ్ అధికారులు నీరు, నీడ లేక జనం అవస్థలు జిల్లాలో మొత్తం రేషన్ కార్డులు 2,31,516పంపిణీ చేస్తున్న బియ్యం (మూడు నెలల కోటా) 1,28,17,586 (మె.టన్నులు) -
విమానాశ్రయానికి మరో అడుగు
సాక్షి, వరంగల్: మామునూరు ఎయిర్పోర్ట్ పునర్నిర్మాణానికి అవసరమైన భూ సేకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈనేపథ్యంలో సమీప గ్రామాల ప్రజల నుంచి సేకరించే భూమికి పరిహారం నిర్ణయించడం.. అందుకు భూనిర్వాసితులు సానుకూలత వ్యక్తం చేయడంతో విమానాశ్రయ నిర్మాణానికి మరో అడుగు పడినట్లయ్యింది. కలెక్టర్ సత్యశారద నేతృత్వంలోని జిల్లా చర్చల కమిటీ నిర్వాసితులతో చర్చింది. వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.కోటి 20 లక్షలు, వ్యవసాయేతర భూములకు చదరపు గజానికి రూ.4,887 ఇస్తామని, అంతకు మించి పెంచే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. దీంతో నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లి భూనిర్వాసితులు భూములు ఇచ్చేందుకు సానుకూలత వ్యక్తం చేశారు. వీరిలో గుంటూరుపల్లికి చెందిన కొందరు రైతులు తమ భూములు మెయిన్ రోడ్డుకు ఉన్నాయని, ఇంకాస్త ఎక్కువ ధర వస్తుందన్న ఆలోచనలో ఉన్నవారితో తహసీల్దార్, ఆర్ఐ తదితరులు చర్చించి ఎక్కువ ధర ఇచ్చే అవకాశం లేదని చెప్పారు. కలెక్టర్ తనకున్న విచక్షణాధికారాలతో జనరల్ అవార్డు కింద రూ.65లక్షలు ఉంటే కన్సంట్ అవార్డు కింద రూ.కోటి 20లక్షల వరకు తీసుకొచ్చారని వివరించారు. ఇదిలా ఉండగా.. 253 ఎకరాల భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 205 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. తాజా గా కలెక్టర్ సత్యశారద నిర్ణయంతో మరో రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్లు అదనంగా అవసరం కానుండడంతో ఇప్పటికే ఆమె రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక సమర్పించినట్లు తెలిసింది. భూసేకరణ కాగానే పనులు మొదలు.. ఇప్పటికే ఎయిర్పోర్ట్ పరిధిలో 696.14 ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి అదనంగా మరో 253 ఎకరాల భూమిని 136 మంది రైతుల నుంచి సేకరించాల్సి ఉండగా, అది కూడా పూర్తి కావొచ్చింది. భూ నోటిఫికేషన్ ప్రకారం రైతులు తమ భూపత్రాల వివరాలు ఇవ్వగానే, వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తూనే భూమి సేకరించనుంది. ఇప్పటికే రెవెన్యూ అధికారులు సర్వే చేసి సరిహద్దులు నిర్ణయించారు. ఈవిమానాశ్రయం అందుబాటులోకి వస్తే 150 నుంచి 186 మంది ప్రయాణించే వీలున్న 37.6 మీటర్లు పొడవున్న ఏ–320, బీ–737 విమానాలు రాకపోకలు సాగించనున్నాయి. ధరల నిర్ణయాలపై మెజార్టీ నిర్వాసితుల సానుకూలత వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.కోటి 20 లక్షలు.. వ్యవసాయేతర భూములకు గజానికి రూ.4 వేలకు పైగా.. -
సైన్స్ కోర్సుల అసిస్టెంట్ డైరెక్టర్గా శ్రీనివాస్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ (సీడీఓఈ) సైన్స్ కోర్సుల అసిస్టెంట్ డైరెక్టర్గా మైక్రోబయాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ముంజం శ్రీనివాస్ను నియమిస్తూ సోమవారం రిజిస్ట్రార్ రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఆ పదవిలో ఉన్న వెంకటగోిపీనాథ్ ఏడాది గడువు ముగియడంతో ముంజం శ్రీనివాస్ను నియమించారు. ప్రస్తుతం శ్రీనివాస్ మైక్రోబయాలజీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నిట్ ఓపెన్ హౌస్కు అనూహ్య స్పందనకాజీపేట అర్బన్: నిట్ వరంగల్లోని అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో సోమవారం ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్కు తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఈ కార్యక్రమాన్ని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ ప్రారంభించి మాట్లాడారు. జోసా ప్రవేశ పరీక్ష ద్వారా ఐఐటీ, ఎన్ఐటీల్లో బీటెక్ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్ పొందేందుకు విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకు ఓపెన్ హౌస్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏమరపాటుతో ఛాయిస్ ఫిల్లింగ్లో తప్పులు చేస్తే సీటు కోల్పోయే ప్రమాదం ఉందని, జాగ్రత్తగా అడ్మిషన్ అప్లికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలన్నారు. జోసా ప్రవేశపరీక్ష అర్హత సాధించి బీటెక్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం కళాశాల, కోర్సుల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులు, తల్లిదండ్రులు.. నిట్ ప్రొఫెసర్లతో ముఖాముఖి మాట్లాడారు. కార్యక్రమంలో నిట్ డీన్లు, ప్రొఫెసర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరుల్ని చేయడమే లక్ష్యంహన్మకొండ అర్బన్: రాష్ట్రంలో కోటి మంది మహిళా సంఘాల మహిళలను కోటీశ్వరుల్ని చేయాలనే లక్ష్యంతో పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి మంత్రి సీతక్క, సీఎస్ రామకృష్ణారావుతో కలిసి బడిబాట, ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో సమీక్ష నిర్వహించారు. ఇందులో హనుమకొండ కలెక్టరేట్ నుంచి హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీఆర్డీఓ మేన శ్రీను, జిల్లా విద్యాశాఖ అధికారులు, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు. పర్యాటక ప్రదేశాలకు ఆర్టీసీ టూర్ ప్యాకేజీహన్మకొండ: పర్యాటక ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రవేశపెట్టినట్లు టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ దర్శనం విజయ భాను అన్నారు. సోమవారం హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్ రీజియన్ కార్యాలయంలో ప్రత్యేక టూర్ ప్యాకేజీ పోస్టర్లను ఆర్ఎం ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరంగల్ రీజియన్లోని ఆయా డిపోల నుంచి పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు తెలిపారు. హనుమకొండ నుంచి పంచరామాలు, అరుణాచలం, భద్రాచలం, వేములవాడ, నాగార్జునసాగర్, బొగత, రామప్ప, లక్నవరం, మల్లూరు, ఇతర పర్యాటక ప్రదేశాలకు బస్సులు నడుపనున్నట్లు వివరించారు. ప్రయాణికులు ఈసౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. ప్రత్యేక టూర్ ప్యాకేజీల వివరాల కోసం వరంగల్–1 డిపో మేనేజర్ 99592 26047, వరంగల్–2 99592 26048, హనుమకొండ 89777 81103, పరకాల 99592 26051, నర్సంపేట 99592 26052, భూపాలపల్లి 99592 26707, తొర్రూరు 99592 26053, మహబూబాబాద్ 99592 26054, జనగామ డిపో మేనేజర్ 99592 26050ను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్ కేశరాజు భానుకిరణ్, అకౌంట్స్ ఆఫీసర్ రవీందర్, పర్సనల్ ఆఫీసర్ సైదులు, డిపో మేనేజర్లు అర్పిత, వి.జోత్స్న, ధరమ్సింగ్ పాల్గొన్నారు. -
యూనిఫామ్ రెడీ
విద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలలు ఈనెల 12వ తేదీ నుంచి పునఃప్రారంభం కాబోతున్నాయి. ఓవైపు బడిబాటలో బడీడు పిల్లలను గుర్తించి స్కూల్లో చేర్పేంచేందుకు ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరుగుతున్నారు. ఇంటింటి సర్వేను కొనసాగిస్తున్నారు. పాఠశాలలు తెరిచిన రోజే విద్యార్థులకు యూనిఫామ్ను అందజేయాలనే కృతనిశ్చయంతో సంబంధిత విద్యాశాఖ అధికారులున్నారు. ఈమేరకు హనుమకొండ, వరంగల్ జిల్లాలో సంబంధిత అధికారులు అన్ని మండలాల్లో పాఠశాలల స్థాయిలోని సెల్ఫ్హెల్ప్ గ్రూపుల మహిళా సమాఖ్యలతో స్కూల్ యూనిఽఫామ్లు కుట్టించారు. పట్టణ ప్రాంతంలో మెప్మాకు సంబంధించిన టీఎల్ఎఫ్ల ద్వారా స్టిచ్చింగ్ చేయించారు. ఈసారి స్టిచ్చింగ్ డిజైన్లో మార్పులు చేశారు. షర్టులు, లాంగ్ఫ్రాక్లకు పట్టీలు, భుజాలపై కప్స్ వంటి ప్యాచ్లు లేకుండా స్టిచ్చింగ్ చేశారు. వేసవి సెలవుల్లోనే పాఠశాలల్లోని విద్యార్థులకు కొలతలు కూడా తీసుకుని మహిళా సమాఖ్యలకు అప్పగించడంతో కుట్టించే ప్రక్రియ కొనసాగింది. తరగతుల వారీగా యూనిఽఫామ్ ఇలా.. ఒకటి నుంచి ఐదో తరగతి బాలురకు చొక్కా, నిక్కర్, ఆరు నుంచి 12 తరగతుల బాలురకు చొక్కా, ప్యాంట్, ఒకటి నుంచి మూడో తరగతి బాలికలకు చొక్కా, లాంగ్ఫ్రాక్, 4, 5 తరగతులకు బాలికలకు షర్ట్, స్కర్ట్, ఆరు నుంచి 12వ తరగతి బాలికలకు పంజాబీ డ్రెస్ మోడల్లో ఉండేలా లాప్బాటమ్ చున్నీ లేకుండా కుట్టించారు. హనుమకొండ జిల్లాలో.. సోమవారం వరకు 317 పాఠశాలలకు 66 శాతం యూనిఫామ్స్ చేరవేశారు. హనుమకొండ జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఎయిడెడ్, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, యూఆర్ఎస్ స్కూల్స్ కలిపి 477 పాఠశాలల్లో 30,922 మంది విద్యార్థులున్నారు. అందులో బాలికలకు 16,070 మంది బాలురు 14,832 మంది ఉన్నారు. జిల్లాలో 91 శాతం స్కూల్ యూనిఫామ్స్ ఒక్కో విద్యార్థికి ఒక్కో జత కుట్టించే ప్రక్రియ పూర్తయ్యింది. ఇప్పటి వరకు 66 శాతం స్కూల్ యూనిఫామ్స్ ఆయా పాఠశాలల హెచ్ఎంలకు అందజేశారు. పాఠశాలలు తెరిచే నాటికి ఈనెల 12వ తేదీలోపు వందశాతం అన్ని స్కూళ్లకు చేర్చనున్నారు. పాఠశాలలు తెరిచిన రోజే విద్యార్థులకు ఒక్కో జత స్కూల్ యూనిఫామ్ అందించనున్నారు. వరంగల్ జిల్లాలో 98 శాతం.. వరంగల్ జిల్లాలో 558 పాఠశాలల్లో స్కూల్ ఫామ్స్ను అందించనున్నారు. 98 శాతం స్కూల్ యూనిఫామ్స్ ఒక్కో విద్యార్థి కోసం ఒక్కో జత మహిళా సమాఖ్యలచే స్టిచ్చింగ్ ప్రక్రియ 98 శాతం పూర్తయ్యింది. పాఠశాలలకు 98 శాతం పంపిఽణీ అయినట్లు సమాచారం. జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్, జిల్లా పరిషత్, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, యూఆర్ఎస్, టీఎస్ఆర్ఐఈఎస్లు కలిపి 558 పాఠశాలలున్నాయి. అందులో మొత్తం 33,878 మంది విద్యార్థులున్నారు. వారిలో బాలికలు 17,853 మంది ఉండగా.. బాలురు 16,025 మంది ఉన్నారు. వీరికి ఒక్కో జత స్కూల్ యూనిఫామ్ను ఈనెల 12న పాఠశాలలు పునఃప్రారంభం రోజున అందజేయనున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. కాగా.. రెండోజత యూనిఫామ్ కోసం ఈనెలలోనే జిల్లాలకు టెస్కో నుంచి క్లాత్ రానుందని సమాచారం. స్టిచ్చింగ్ చేసి విద్యార్థులకు అందించే వరకు ఆగస్టు 15 కావొచ్చని భావిస్తున్నారు. స్టిచ్చింగ్ చేసినందుకు ఒక్కోజతకు మహిళా సమాఖ్యలకు రూ.75 చొప్పున అందజేస్తున్నారు. పాఠశాలల పునఃప్రారంభం రోజే అందజేస్తాం హనుమకొండ జిల్లాలో స్కూల్ యూనిఫామ్స్ ఒక్కో జత విద్యార్థులకు అందజేసేందుకు మహిళా సమాఖ్యలు వందశాతం స్టిచ్చింగ్ ప్రక్రియ పూర్తయ్యింది. పాఠశాలలకు చేరేవేసే ప్రక్రియ కొనసాగుతోంది. సోమవారం వరకు ఎక్కువ శాతం స్కూల్ యూనిఫామ్స్ పాఠశాలలకు చేరాయి. మరో రెండు రోజుల్లో వందశాతం పూర్తి చేసేలా ఆదేశించాం. తప్పనిసరిగా విద్యార్థులకు పాఠశాలలు పునఃప్రారంభమయ్యే రోజున అందజేస్తాం. – వాసంతి, డీఈఓ, హనుమకొండ హనుమకొండ జిల్లాలో 30,922 మంది.. వరంగల్ జిల్లాలో 33,878 మంది విద్యార్థులకు ఒక్కోజత పాఠశాలలకు పంపిణీ రెండో జతకు రావాల్సి ఉన్న క్లాత్ -
మృగశిర సందడి
రోహిణి ముగిసి ఆదివారం మృగశిర కార్తె ప్రారంభమైంది. మృగశిర ప్రారంభం రోజు చేపలు తినడం వల్ల వానా కాలంలో వచ్చే వ్యాధులు దూరమవుతాయని, గుండె జబ్బులు, అస్తమా వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుందనేది ప్రజల నమ్మకం. ఈనేపథ్యంలో గ్రేటర్ వరంగల్ నగరంలోని ప్రధాన రోడ్ల వెంట చేపల విక్రయాలు జోరుగా సాగాయి. కొర్రమీను, రోహు, కట్ల, రవ్వ, బొమ్మె చేపలను ఎక్కువ మంది కొనుక్కుని వెళ్లారు. కొందరు ఏపీ నుంచి రొయ్యలు, ఇతర రకాల చేపలను ఆర్డర్పై తెప్పించుకున్నారు. కాగా.. చేపలు తిననివారు ఇంగువను చిన్న ముద్దలుగా చేసి మింగారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, హనుమకొండ -
వరంగల్ నగరంలో మరో విద్యార్థి
మృతుడు నెక్కొండ వాసి హసన్పర్తి: స్నేహితులతో ఈతకు వెళ్లిన ఓ విద్యార్థి చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కాకతీయ యూనివర్సిటీ పోలీస్స్టేషన్ పరిధిలోని రెడ్డిపురం చెరువు వద్ద శనివారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం టేకులకుంట తండాకు చెందిన తేజావత్ గణేశ్ నగరంలోని అతిథి హాస్టల్లో ఉంటూ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అదే హాస్టల్లో ఉంటున్న మాలోతు కార్తీక్, రాకేశ్, సాయి కిరణ్తో కలిసి గణేశ్ శనివారం రెడ్డిపురం సమీపంలోని చెరువులోకి ఈతకు వెళ్లాడు. నలుగురు చెరువులోకి దిగి ఈతకొట్టడం ప్రారంభించారు. గణేష్ ఈత కొడుతూ ముందుకు వెళ్లి మునిగిపోయాడు. గణేశ్ మునిగినట్లు గ్రహించిన స్నేహితులు ఈ విషయాన్ని బంధువులు, మిత్రులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. చెరువులోనుంచి గణేశ్ మృతదేహాన్ని వెలికి తీశారు. పంచనామా చేసి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. మృతుడి తండ్రి తేజావత్ రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవీందర్ తెలిపారు. -
భక్తిశ్రద్ధలతో బక్రీద్
ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు బక్రీద్ పండుగను గ్రేటర్ వరంగల్ పరిధిలో ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పేదలకు ఖుర్బానీ ఇచ్చారు. ఈద్గాల వద్ద సామూహిక ప్రార్థనలు చేశారు. మతపెద్దలు ఖురాన్ చదివి వినిపించారు. ఒకరికొకరు అలయ్బలయ్ ఇచ్చుకున్నారు. ఖిలావరంగల్ ఈద్గాలో జరిగిన ప్రార్థనల్లో మాజీ ఎమ్మెల్యే కొండా మురళీధర్రావు పాల్గొన్నారు. హనుమకొండ బొక్కలగడ్డ ఈద్గాలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య పాల్గొన్నారు. బక్రీద్ త్యాగానికి, విశ్వాసానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈద్గాలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ సందర్శించి శాంతిభద్రతలను పర్యవేక్షించారు. – మరిన్ని వివరాలు, ఫొటోలు: 9లో -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలి..
హన్మకొండ: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని గృహ నిర్మాణ సంస్థ హనుమకొండ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ ధరావత్ రవీందర్ సూచించారు. రెండు రోజులు మంచి ముహూర్తాలు ఉన్నాయని, జిల్లాలోని లబ్ధిదా రులు 9వ తేదీలోపు ముగ్గులు పోసుకుని పనులు ప్రారంభించాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు. లబ్ధిదారులు సామూహికంగా ముగ్గులు పోసుకోవాలని ఈమేరకు కలెక్టర్ ఆదేశించినట్లు ఆయన వివరించారు. రుణం పేరిట వేధింపులుకాజీపేట: కాజీపేట పట్టణంలోని కొంతమందికి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్లు చేసి రుణం చెల్లించాలని బెదిరిస్తున్నారు. రుణ యాప్లో లోన్ తీసుకున్న వ్యక్తికి మీరు వ్యక్తిగత పూచీకత్తు ఇచ్చారని.. తిరిగి చెల్లించాలంటూ బెదిరిస్తున్నారు. ‘దాదారి శశిధర్ అనే యువకుడు ఐడీఎఫ్సీ బ్యాంకులో రుణం తీసుకున్నారు. దానికి మీరు షూరిటీ పెట్టినందున లోన్ మొత్తం కట్టాలి’ అంటూ బీఆర్ఎస్ జిల్లా నాయకుడు గబ్బెట శ్రీనివాస్తో పాటు మరో ఇద్దరికి వరుసగా 81849–56121 నంబరు నుంచి ఫోన్లు వస్తున్నాయి. తాము ఎవరికీ షూరిటీ పడలేదని ఎంత చెప్పినా వినిపించుకోకుండా కాల్ చేస్తూనే ఉన్నారు. ఫోన్ చేసిన వ్యక్తులు తెలుగులోనే మాట్లాడుతున్నారు. ఎదుటి వారు చెప్పింది కూడా వినకుండా ఇష్టారితీన మాట్లాడుతున్నట్లు బాధితులు వాపోతున్నారు. లేదంటే తమ వద్ద ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పెడతామని హెచ్చరిస్తున్నట్లు చెబుతున్నారు. లోన్ యాప్ ద్వారా రుణం తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బాధితులంతా శశిధర్ ఇంటికి వెళ్లగా.. తనకు ఎవరూ తెలియదని, ఇదంతా సైబర్ నేరగాళ్ల పన్నాగం కావొచ్చని శశిధర్ వాపోయాడు. అందరూ కలిసి శనివారం కాజీపేట పోలీస్ స్టేషన్కు వెళ్లి తమను గుర్తు తెలియని వ్యక్తులు వేధిస్తున్నట్లుగా ఫిర్యాదు చేశారు. ఘ టనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇంటింటి సర్వేలో టీచర్లువిద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో ‘బడిబాట’ కార్యక్రమంలో భాగంగా.. రెండో రోజు శనివారం ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. అలాగే.. ఇంటింటి సర్వే నిర్వహించారు. జిల్లాలోని ఉపాధ్యాయులు తమ పాఠశాల గ్రామ పరిధిలో ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించారు. బడీడు పిల్లల వివరాలు సేకరిస్తున్నారు. వారి వయస్సుకు తగిన తరగతిలో చేర్పించేలా తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. అర్ధంతరంగా బడి మానేసిన విద్యార్థులుంటే వారి వివరాలు సేకరించి ఓపెన్ స్కూల్లో నమోదు చేయించాలని సూచిస్తున్నారు. జిల్లాలో 372 పాఠశాలల్లోని ఉపాధ్యాయులు ఇంటింటి సర్వేలో భాగస్వాములైనట్లు జిల్లా విద్యాశాఖ కమ్యునిటీ మొబిలైజింగ్ కో–ఆర్డినేటర్ బద్దం సుదర్శన్రెడ్డి తెలిపారు. వరంగల్ జిల్లాలో బడిబాట కా ర్యక్రమంలో భాగంగా.. ఇంటింటి ప్రచారం, సర్వే నిర్వహించారు. ‘స్పోకెన్ ఇంగ్లిష్’ తరగతులను వినియోగించుకోవాలి..కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో నిర్వహించనున్న స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులను వినియోగించుకోవాలని సెల్ట్ (సెంటర్ ఫర్ లాంగ్వేజ్ ఫర్ ఇంగ్లిష్ టీచింగ్) డైరెక్టర్ డాక్టర్ మేఘనారావు శనివారం ఒక ప్రకటనలో కోరారు. సెల్ట్ ఆధ్వర్యంలో ఆరువారాల స్పోకెన్ ఇంగ్లిష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్పై విశ్వవిద్యాలయంలోని ఇంగ్లిష్ విభాగంలో తరగతులు నిర్వహించనున్నట్లు ఆ సెల్ట్ డైరెక్టర్ డాక్టర్ మేఘనారావు తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు, గృహిణులు, బోధన, బోధనేతర ఉద్యోగులు ఈనెల 14 తేదీ వరకు తమ పేర్లు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. వర్సిటీ విద్యార్థులకు ఫీజు రూ.1,000, బయటివారికి రూ.1,500 ఉంటుందని, ఫీజును యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ నాన్ యూనివర్సిటీ ఫండ్ ఖాతాలో చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈనెల 16 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని, ఆసక్తి ఉన్న వారు వినియోగించుకోవాలని కోరారు. ఐలోని మల్లన్నకు వరంగల్ కలెక్టర్ పూజలుఐనవోలు: ఐనవోలు మల్లికార్జునస్వామిని వరంగల్ కలెక్టర్ సత్యశారద దంపతులు శనివారం దర్శించుకున్నారు. ఆలయ ఈఓ అద్దంకి నాగేశ్వర్రావు, ఉప ప్రధాన అర్చకులు పాతర్లపాటి రవీందర్ సత్యశారద దంపతులకు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ముఖ్య అర్చకుడు ఐనవోలు మధుకర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. -
డైవర్లకు త్వరలోనే శిక్షణ
విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. రవాణాశాఖ నిబంధనల మేరకు ఫిట్నెస్ పరీక్షలు చేయిస్తున్నాం. వందశాతం ఫిట్నెస్ పరీక్షలు పూర్తయ్యేలా చూస్తాం. ఐదేళ్ల అనుభవం ఉన్న డ్రైవర్లను నియమిస్తున్నాం. రోడ్డు ప్రమాదాలకు తావులేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టనున్నాం. పిల్లలను జాగ్రత్తగా పాఠశాలలకు తీసుకెళ్లి తీసుకొచ్చేందుకు డ్రైవర్లకు త్వరలోనే నిపుణులతో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తాం. – గాదె స్వరూప్రెడ్డి, ప్రైవేట్ విద్యాసంస్థల బస్సుల ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు -
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పూర్తికాని బడి బస్సుల పరీక్షలు
‘పిల్లలున్నారు జాగ్రత్త’ అని బడి బస్సుల వెనకాల రాసి ఉంటుంది. కానీ.. చాలా బస్సుల నిర్వాహకులు మాత్రం.. ఆ విషయాన్నే మరిచిపోతున్నారు. నిబంధనల ప్రకారం.. ఏటా పాఠశాలల ప్రారంభానికి ముందే బడి బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయించాలి. కానీ.. క్షేత్రస్థాయిలో అవేమీ అమలు కావడం లేదనే విమర్శలున్నాయి. – సాక్షి, వరంగల్/ఖిలా వరంగల్ఇవీ నిబంధనలు..● 15 ఏళ్లు నిండిన వాహనాలను స్టూడెంట్స్ రవాణాకు ఉపయోగించకూడదు. స్కూల్ బస్సు పూర్తి కండిషన్లో ఉండాలి. ● విద్యా సంస్థ పేరు, సెల్ఫోన్ నంబరు, పూర్తి అడ్రస్ బస్సు ఎడమ వైపు, ముందు భాగంలో స్పష్టంగా కనిపించేలా రాయాలి. ● ప్రతీ విద్యాసంస్థ యాజమాన్యం డ్రైవర్ ఆరోగ్య పట్టిక నిర్వహించాలి. ● డ్రైవర్ షుగర్, బీపీ, కంటిచూపు వంటి ప్రాథమిక పరీక్షలను ప్రతి 3 నెలలకోసారి చేయించాలి. డ్రైవర్కు ఐదేళ్ల అనుభవం తప్పనిసరి. ● బస్సులో ప్రథమ చికిత్స పెట్టె అందుబాటులో ఉండాలి. అత్యవసర ద్వారం ఉండాలి. బస్సుకు సంబంధించి వైపర్స్, విండ్ స్క్రీన్, పార్కింగ్ లైట్స్, లైటింగ్ ఉండాలి. ● ప్రతి బస్సులో మంటలు ఆర్పే పరికరాలు ఉండాలి. డ్రైవర్కు విద్యార్థులు బస్సు ఎక్కడం, దిగడం స్పష్టంగా కన్పించేలా అద్దాలు అమర్చుకోవాలి. ● ప్రతి బస్సులో అటెండర్ ఉండాలి. బస్సులో ప్రయాణిస్తున్న స్టూడెంట్స్ పట్టిక కూడా ఉండాలి. బస్సులో స్టూడెంట్స్ బ్యాగులు పెట్టుకొనేలా అరలు ఏర్పాటు చేయాలి. ● కిటికీలకు మధ్యలో లోహపు కడ్డీలు కచ్చితంగా ఉండాలి. ● ఫుట్బోర్డ్పై మొదటి మెట్టు భూమికి 325 మిల్లీ మీటర్ల ఎత్తు మించకుండా చూడాలి. అన్ని మెట్లు జారకుండా లోహంతో నిర్మించాలి. ● 1,820కి ఇప్పటివరకు పూర్తి చేసుకుంది 887 ● పరీక్షలు చేసుకోవాల్సింది 917.. ● ఫిట్నెస్ తనిఖీలకు రాని వందల బస్సులు ● ఈనెల 12న పాఠశాల పునఃప్రారంభంతో చర్చ ● స్పెషల్ డ్రైవ్లకు సిద్ధమవుతున్న ఆర్టీఏ అధికారులుబడి గంట మోగే సమయం ఆసన్నమవుతోంది.. ఇప్పటికే అడ్మిషన్ల బిజీలో ఉన్న పాఠశాలలు బడి బస్సుల భద్రతపై దృష్టి సారించడం లేదు. ప్రతీ ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఫిట్నెస్ పరీక్షలకు వందలాది బస్సులు దూరంగా ఉండడం తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,820 పాఠశాలల, కాలేజీల బస్సులు ఉన్నా.. ఇప్పటివరకు 863 బస్సులు మాత్రమే ఫిట్నెస్ పరీక్షలు చేయించుకుని సర్టిఫికెట్లు పొందాయి. పదిహేనేళ్ల కాల పరిమితి పూర్తి చేసుకున్నా.. వివిధ కారణాల చేత 225 బస్సులను అధికారులు ఫిట్నెస్ చేయకుండా తిరస్కరించారు. ఇంకా మిగిలిన 692 బస్సులకు ఆన్లైన్ చేసి ఫిట్నెస్ సర్టిఫికెట్స్ తీసుకోవాలి. మరో ఐదు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఆయా బస్సులు వచ్చి సాధ్యమైనంత త్వరగా ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలని ఆర్టీఏ అధికారులు కోరుతున్నారు. ఫిట్నెస్ పరీక్షల్లో పాసైతే విద్యార్థుల భద్రతకు భరోసా ఉంటుందని చెబుతున్నారు. ‘యాబై రోజులకుపైగా మూసి ఉన్న విద్యా సంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఇన్నాళ్లూ విద్యార్థులను తరలించే బస్సులు షెడ్డుకే పరిమితమయ్యాయి. వాటి సామర్థ్య పరీక్షల గడువు కూడా మే 15కే ముగిసింది. ఇప్పటికీ ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోని బడి బస్సులు వచ్చి త్వరగా చేసుకోవాలి’ అని వరంగల్ ఆర్టీఓ శోభన్బాబు కోరారు. ఇలా చేస్తే మంచిది.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల బస్సుల ఫిట్నెస్ పరీక్షలను సంబంధిత అధికారులు తూతూ మంత్రంగానే నిర్వహిస్తున్నారు. కనీసం పది నిమిషాలైనా చెక్ చేయకుండానే బస్సులను పంపించేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం అధికారులు అప్రమత్తమవుతున్నారని.. ప్రమాదాలు జరగకుండా ముందుగానే బస్సుల తనిఖీ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ‘పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతి బస్సు ఫిట్నెస్ పకడ్బందీగా చూడాలి. చాలా పాఠశాలలకు ఎక్కువ సంఖ్యలో బస్సులుంటాయి. ఒకటి రెండు బస్సులను చూసే ఫిట్నెస్ అయ్యిందని మమ అనిపించకుండా ప్రతి బస్సును చెక్ చేయాలి. నెల, రెండు నెలలకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి బస్సుల పరిస్థితి డ్రైవర్ల పరిస్థితి చెక్ చేస్తూ ఉండాలి. ఏవైనా లోపాలు ఉంటే ఒత్తిళ్లకు లొంగకుండా బస్సును సీజ్ చేయాలి’ అని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇలా..జిల్లా.. మొత్తం ఫిట్నెస్ చేయించు బస్సులు చేసుకున్నవి కోవాల్సినవివరంగల్ 350 172 178 హనుమకొండ 920 485 435 జనగామ 103 54 49 భూపాలపల్లి 130 58 72 ములుగు 95 46 49 మహబూబాబాద్ 222 48 134 మొత్తం 1,820 863 917 (917 బస్సుల్లో 225 బస్సులను వివిధ కారణాలతో తిరస్కరించారు) -
నదీతీరం.. శోకసంద్రం
కాళేశ్వరం: ఒకటే ఊరు. వారంతా 20 ఏళ్లలోపు విద్యార్థులు. సమీప బంధువులు. అదే గ్రామానికి చెందిన బంధువుల వివాహ వేడుకల్లో విందులు, వినోదాలతో ఆనందంగా గడిపారు. సరదాగా గడుపుదామని కాళేశ్వరం గోదావరి నదికి వెళ్లారు. ఈతరాని వారు ఒడ్డున నీటిలో ఆడలాడుతున్నారు. నది నీటి మట్టం పెరిగిన విష యం తెలియక మోకాళ్ల లోతు నీటిలో ఆడుకుంటుండగా.. ఒకరు ప్రమాదవశాత్తు లోతులోకి వెళ్లిపోతుండగా అతడిని కాపాడబోయి మరొ కరు.. ఇలా ఆరుగురు గల్లంతయ్యారు. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లి గ్రామ సమీపంలోని మేడిగడ్డ ఎగువ భాగంలో మూడో బ్లాక్ వద్ద శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనతో విషాదం అలుముకుంది. అర్ధరాత్రి వరకు సాగిన గాలింపు.. రాత్రి 6 గంటలకు ఆరుగురు విద్యార్థులు నదిలో మునగగా, సుమారు 8 గంటల సమయంలో స్థానికులు, పోలీసులకు సమాచారం అందింది. వెంటనే జిల్లా యంత్రాంగం, పోలీసులు అప్రమత్తమయ్యారు. భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి ఆరు రెస్క్యూ బృందాలతోపాటు మహారాష్ట్రలోని సిరొంచకు చెందిన ‘ఆపద మిత్ర’ గజ ఈతగాళ్ల బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. కాగా.. రాత్రివేళ కావడం, నదిలో 5,100 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉండడంతో రాత్రి 11.50 గంటలకు గాలింపు చర్యలు ఆపేశారు. ఆదివారం ఉదయం 5 గంటల నుంచి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించనున్నారు. కాగా.. కాటారం డీఎస్పీ రాంమోహన్రెడ్డి గోదావరిలోకి దిగి నది ప్రవాహాన్ని అంచనా వేశారు. ఆదివారం ఉదయం గాలింపు చర్యల కోసం రెస్క్యూ టీం ప్రత్యేక బోట్లను సిద్ధం చేసింది. ఐదు కుటుంబాల్లో విషాదం... పెళ్లి వేడుకలను సంతోషంగా గడిపిన ఐదు కుటుంబాల్లో ఒకే రోజులో విషాదం నెలకొంది. పట్టి వెంకటస్వామి ఇద్దరు కుమారులతో పాటు మరో నాలుగు కుటుంబాలకు చెందిన విద్యార్థులు చనిపోవడంతో ఆయా కుటుంబాలతో పాటు పెళ్లింట విషాదం నెలకొంది. బిడ్డల కోసం ఎదురుచూస్తూ... గల్లంతైన ఆరుగురు విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు రాత్రి నుంచి గోదావరి నది ఒడ్డునే ఉండి వేచి చూస్తున్నారు. అధికారులు గాలింపు చర్యలను నిలిపేసి వెనుదిరిగినప్పటికీ గల్లంతైన వారి కుటుంబ సభ్యులు అక్కడే ఉండి రోదించసాగారు. తమ పిల్లలు ప్రాణాలతో బయటకు రాకపోతారా... అని వేచి చూస్తుండడం స్థానికులను కలచివేసింది. అడ్డుకున్నప్పుడు ఆగి ఉంటే.. ఈతకు వెళ్లిన వారిలో అంబట్పల్లి గ్రామానికి చెందిన పట్టి వెంకటస్వామికి కుమారులు మధుసూదన్, శివమనోజ్ కూడా ఉన్నారు. వీరితో పాటు మిగిలిన ఐదుగురు గోదావరి నదిలో స్నానం చేసేందుకు వెళ్తుండగా నదిలో నీటి మట్టం ఎక్కువగా ఉందని, స్నానానికి వెళ్లొద్దని వెంకటస్వామి వారించాడు. అయినా వారు వినకుండా వెళ్తామనడంతో అతను కూడా వెంటవెళ్లాడు. వీరు లోపలికి వెళ్తుండగా వెళ్లొద్దని, వెనక్కి రండని పిలిచాడు. కానీ అప్పటికే లోతులోకి వెళ్లిపోయారు. కళ్లెదుటే మునిగిపోతున్నా వెంకటస్వామిది ఏమీ చేయలేని పరిస్థితి. మేడిగడ్డ వద్ద గోదావరిలో ఆరుగురు విద్యార్థుల గల్లంతు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11:50 వరకు సాగిన గాలింపు.. లభించని ఆచూకీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లిలో విషాదం నేను సచ్చిపోయేవాడినే: పట్టి శివమణి (ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్న వ్యక్తి) స్నానం చేసేందుకు మొదట నలుగురు దిగారు. తర్వాత మరో ఇద్దరు దిగారు. ఒకరి వెనుక ఒకరు నీట మునిగారు. క్షణాల్లోనే అందరూ మునగసాగారు. కన్నుమూసి తెరిచే లోపే ఆరుగురు మునిగిపోయారు. మధుసూదన్ మునిగిపోతుంటే చేయి పట్టుకొని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఆయన నీట మునిగాడు. దీంతో నేను భయపడి ఒడ్డుకు చేరుకున్నా. -
గుండెపోటుతో తహసీల్దార్ శ్రీపాల్రెడ్డి మృతి
నివాళులర్పించిన ఎమ్మెల్యే, కలెక్టర్, అధికారులు హన్మకొండ అర్బన్: హనుమకొండ తహసీల్దార్ కర్రే శ్రీపాల్రెడ్డి (47) శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. గురువారం రాత్రి వరకు నగరంలోని బాలసముద్రంలో డబుల్ బెడ్రూం ఇళ్ల పంచాయితీలో పాల్గొన్న ఆయన.. వారందరిని ఖాళీ చేయించి త్వరలోనే అర్హులకు ఇళ్లు కేటాయిస్తారని చెప్పి ఇంటికి వెళ్లారు. శుక్రవారం ఉదయం లేచి రెవెన్యూ సదస్సులు ఉన్నాయంటూ స్నానానికి సిద్ధమవుతున్న శ్రీపాల్రెడ్డి ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు స్థానిక ఓ ఆస్పత్రికి తరలించడంతో అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారని కుటుంబ సభ్యులు తెలిపారు. వరంగల్ జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేసిన శ్రీపాల్రెడ్డి పదోన్నతి పొంది ఆసిఫాబాద్ జిల్లాకు తహసీల్దార్గా బదిలీ అయ్యారు. అనంతరం మళ్లీ తహసీల్దార్గా హనుమకొండ జిల్లాకు వచ్చి డిప్యుటేషన్పై ‘కుడా’లో పనిచేశారు. హనుమకొండ ఆర్డీఓ కార్యాలయంలో డీఏఓగా కొద్దిరోజుల క్రితమే విధులు పూర్తి చేసుకుని వస్తున్న ఆయన రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో ఆయన కాలుకు తీవ్ర గాయం కాగా, ప్రస్తుతం కర్ర సహాయంతోనే విధులు నిర్వహిస్తున్నారు. తమ సహచరుడిని కోల్పోవడం పట్ల రెవెన్యూ ఉద్యోగులు ఒక్కసారిగా ఆవేదనకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే హనుమకొండ రాంనగర్లోని ఆయన నివాసానికి పెద్దఎత్తున చేరుకున్నారు. ఆయన భౌతికకాయానికి నివాళి అర్పించారు. శ్రీపాల్రెడ్డికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కుమార్తె బీటెక్, చిన్న కుమార్తె ఇంటర్ చదువుతున్నట్లు బంధువులు తెలిపారు. కాగా, ఎన్నికల సమయంలో జరిగిన బదిలీల్లో వెళ్లిన వారు తిరిగి అదే ప్రాంతానికి వెళా ల్సి ఉంటుందని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంతో డిప్యుటేషన్పై వచ్చిన ఆయన తిరిగి ఆసిఫాబాద్కు వెళ్తాననే బెంగ పెట్టుకున్నట్లు రెవెన్యూ వర్గాలు చర్చించుకుంటున్నాయి. నివాళులర్పించిన ఎమ్మెల్యే, కలెక్టర్ తహసీల్దార్ శ్రీపాల్రెడ్డి భౌతికకాయాన్ని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, ఉన్నతాధికారులు సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వపరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. -
‘వరంగల్ బస్స్టేషన్’ ఆలస్యంపై అసహనం
తనిఖీ చేసిన ‘కుడా’చైర్మన్, వైస్ చైర్పర్సన్ వరంగల్ చౌరస్తా : వరంగల్ ఆర్టీసీ బస్స్టేషన్ నిర్మాణం ఎందుకింత ఆలస్యమవుతుందని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి అధికారులను ప్రశ్నించారు. శుక్రవారం సాయంత్రం బస్స్టేషన్ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించి, పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ అశ్విని తానాజీ వాకడే, సీపీఓ అజిత్ రెడ్డి, ఈఈ భీంరావు పాల్గొన్నారు. అలాగే, భద్రకాళి బండ్ పరిసరాలను పరిశీలించారు. -
అధ్యాపకులకు పీహెచ్డీ గైడ్షిప్
కేయూ స్టాండింగ్ కమిటీలో నిర్ణయం కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల అధ్యాపకులకు పీహెచ్డీ గైడ్షిప్ ఇవ్వనున్నారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం కాకతీయ యూనివర్సిటీలో జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. పలు అకాడమిక్ సిలబస్ల మార్పు, పరీక్షలు, దూరవిద్యలో సర్టిఫికెట్ డిప్లొమా కోర్సులు, తదితర అంశాలపై చర్చించి ఆమోదించారు. ఒక క్లస్టర్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల పరిధిలోకి వచ్చే అధ్యాపకులు ఆ క్లస్టర్ డిగ్రీ కళాశాల నుంచే పీహెచ్డీ గైడ్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఎంతమందికి గైడ్షిప్ ఇవ్వనున్నది కొద్దిరోజుల్లో తేలనుంది. అదేవిధంగా కేయూ పరిధిలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, లా విద్య (నాన్ ప్రొఫెషనల్, ప్రొఫెషనల్) కోర్సుల్లో కొన్ని సంత్సరాలుగా ఫెయిల్ అయి బ్యాక్లాగ్ సబ్జెక్టులు కలిగిన విద్యార్థులకు పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పిస్తూ స్టాండింగ్ కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. 2025–2026 విద్యా సంవత్సరంలో రెగ్యులర్ కోర్సుల సెమిస్టర్ల పరీక్షలతో వారు రాసుకునే అవకాశం కల్పిస్తారు. దూరవిద్యలోని ఇయర్వైజ్ స్కీం విద్యార్థులు కూడా బ్యాక్లాగ్ సబ్జెక్టులు రాసుకోవచ్చు. కేయూ దూరవిద్యలో 16వివిధ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులను ప్రవేశపెట్టాలని, ఎమ్మెస్సీ జియాలజీ కోర్సులో సిలబస్ మార్పునకు ఆమోదించారు. సమావేశంలో వీసీ కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం, వివిధ విభాగాల డీన్లు, పలువురు పాలక మండలి సభ్యులు, యూనివర్సిటీ కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. -
పనులు చేసినవారు నిరీక్షిస్తున్నారు..
● హనుమకొండ ప్రభుత్వ మర్కజీ హైస్కూల్లో వివిధ పనులకు రూ 4.50 లక్షల మంజూరీ ఇచ్చారు. తొలుత 25శాతం నిధులు రూ.లక్షా 50 వేలు అడ్వాన్స్డ్గా విడుదల చేశారు. మిగతా పనులు పూర్తయ్యాయని, పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించాల్సిందని సంబంధిత ఉన్నత పాఠశాల హెచ్ఎం రామారావు తెలిపారు. ● హనుమకొండలోని లష్కర్బజార్ ప్రభుత్వ బాలికల హైస్కూల్లో పనులు పూర్తయ్యాయి. ఆయా పనులకు అంచనాగా రూ.5.80 లక్షలు మంజూరీ ఇచ్చారు. మొదట 25శాతం నిధులు మాత్రమే విడుదల అయ్యాయని ఆ హైస్కూల్ హెచ్ఎం ఉమ తెలిపారు. పనులు చేసిన వారు బిల్లుల కోసం నిరీక్షిస్తున్నారు. -
పాఠశాలలు ప్రారంభమయ్యేలోపు పూర్తిచేయాల్సింటుంది
పనులు మంజూరైన పాఠశాలల్లో చాలావరకు 80శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు ఈనెల 12న పాఠశాలలు పునఃప్రారంభమయ్యేలోగా పూర్తిచేయాల్సింటుంది. ఆ దిశగా పర్యవేక్షణ కొనసాగుతోంది. ఇంకా పనులు ప్రారంభించని పాఠశాలల్లో ఈనెల చివరి వరకు పూర్తిచేయాలి. – బి.మహేష్, జిల్లా విద్యాశాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ వినియోగంలోకి తేవాలి..ధర్మసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలికల కోసం ప్రత్యేక టాయిలెట్లను మరమ్మతులు చేయడం సంతోషదాయకం. పాఠశాలలు తెరిచే నాటికి వాటిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చేలా పనులు పూర్తి చేయాలి. – వల్లెపు దేవి, విద్యార్థి తల్లి -
బడిబాటను పకడ్బందీగా నిర్వహించాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: విద్యార్థుల పెంపు లక్ష్యంగా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. బడిబాట కార్యక్రమంపై కలెక్టరేట్లో శుక్రవారం విద్యాశాఖ, సంక్షేమశాఖ, డీఆర్డీఓ, పంచాయతీ, కార్మిక, మున్సిపల్, మెప్మా, తదితర శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. షెడ్యూల్ ప్రకారం విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించాలని, బడీడు పిల్ల లను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలన్నారు. విద్యార్థులకు ఉచిత యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు నోట్బుక్స్, మధ్యాహ్న భోజన సౌకర్యాలు కల్పిస్తున్నామని, ఇవన్నీ ప్రజలకు తెలియపర్చాలని చెప్పారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గత నెలలో నిర్వహించిన క్యాంపెయిన్లో ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించిన నివేదికలను సమర్పించాలని ఎంఈఓలను కలెక్టర్ ఆదేశించారు. ఏఐ ద్వారా శిక్షణ పొందిన ఉపాధ్యాయుల ద్వారా విద్యాబోధన జరుగుతుందని ప్రజలకు వివరించాలన్నారు. జిల్లాల్లో 635 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, వాటిలో 135 జీరో నమోదు పాఠశాలలు ఉన్నాయని, వాటిల్లో విద్యార్థుల నమోదుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తహసీల్దార్లు, స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీఓలు, ఏపీఓ, మెప్మా, ఏపీఎంలు స్వయం సహాయక బృందాలు, అంగన్వాడీలను గ్రామసభల్లో భాగస్వాములను చేయాలన్నారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ.. అన్ని శాఖల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషిచేయాలన్నారు. ఇటుక బట్టీల దగ్గర పనిచేసే పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులను ఒప్పించి ప్రతి విద్యార్థిని పాఠశాలలో చేర్పించాలని తెలిపారు. సమావేశంలో డీఈఓ జ్ఞానేశ్వర్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, ఆర్డీఓలు సత్యపాల్రెడ్డి, ఉమారాణి, డీపీఓ కల్పన తదితరులు పాల్గొన్నారు. బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ జిల్లాలోని ముస్లింలకు కలెక్టర్ సత్యశారద ఈద్ ఉల్ అజ్హా(బక్రీద్) పండుగ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ అని పేర్కొన్నారు. భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. -
పరిశోధనా పద్ధతులపై అవగాహన ఉండాలి
కేయూ క్యాంపస్: వివిధ సామాజిక అంశాలపై పరిశోధనలు చేసేటప్పుడు పద్ధతులపై అవగాహన అవసరమని కాకతీయ యూనివర్సిటీ సోషియాలజీ అండ్ ఎంఎస్డబ్ల్యూ విభాగం అధిపతి ప్రొఫెసర్ స్వర్ణలత అన్నారు. శుక్రవారం యూనివర్సిటీలోని రాజనీతిశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో సోషల్సైన్స్ పరిశోధకులకు రీసె ర్చ్ మెథడాలజీపై ఏర్పాటుచేసిన అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు. పరిశోధకులకు పరిశీలనలో నమూనా పద్ధతులను ఆమె వివరించారు. కేస్ స్టడీ అనేది కీలకంగా ఉంటుందన్నారు. సమావేశంలో ఆ విభాగం అధిపతి సంకినేని వెంకటయ్య, అధ్యాపకులు డాక్టర్ నాగరాజు, పరిశోధకులు పాల్గొన్నారు. మిల్స్కాలనీ ఇన్స్పెక్టర్గా బొల్లం రమేష్వరంగల్ క్రైం: వరంగల్ సబ్ డివిజన్లోని మిల్స్కాలనీ పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్గా బొల్లం రమేష్ను నియమిస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. బొల్లం రమేష్ గతంలో ధర్మసాగర్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. ‘ఎన్ఎంఎంఎస్’కు విద్యార్థుల ఎంపికవిద్యారణ్యపురి: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) కోసం గత ఏడాది నవంబర్లో నిర్వహించిన పరీక్షను అప్పటి ప్రభుత్వ యాజమాన్యాల్లోని పాఠశాలల 8వ తరగతి విద్యార్థులు రాశారు. హనుమకొండ జిల్లాలో 628మంది పరీక్ష రాయగా, అందులో స్కాలర్షిప్నకు 68మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వారికి ప్రతి ఏడాది ఒక్కొక్కరికి ఇంటర్ వరకు రూ.12వేల చొప్పున స్కాలర్షిప్ వస్తుంది. బడిబాట షురూవిద్యారణ్యపురి: హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోని పలు పాఠశాలల్లోని ఉపాధ్యాయులు శుక్రవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. గ్రామసభలు నిర్వహించి బడీడు పిల్ల లను పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. మండల విద్యాధికారులు హెచ్ఎంలు, ఉపాధ్యాయులు భాగస్వాములయ్యారు. ఈనెల 19వ తేదీవరకు ఈ బడిబాట కొనసాగనుంది. డీఈఈసెట్ అభ్యర్థులకు 9నుంచి సర్టిఫికెట్ల పరిశీలనవిద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలో డీఈఈసెట్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల ప్రవేశాలకుగాను ఈనెల 9నుంచి 13వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని హనుమకొండ ప్రభుత్వ డైట్ కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ ఎండీ అబ్దుల్హై శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు ర్యాంకు కార్డు, హాల్టికెట్, ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్, 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు స్టడీ సర్టిఫి కెట్లు తీసుకురావాలని పేర్కొన్నారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం ఈనెల 14నుంచి 17వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సింటుందని తెలిపారు. పూర్తి వివరాలకు టీజీడీఈఈసెట్ వెబ్సైట్లో చూడాలని సూచించారు. కొత్తమెనూ ప్రకారం వంటచేయాలివిద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలోని కేజీబీవీ, టీజీఆర్ఈఐఎస్, యూఆర్ఎస్, మోడల్ స్కూళ్లలోని హాస్టళ్లలో కొత్త మెనూ ప్రకారం వంట చేయాలని ఇన్చార్జ్ డీఈఓ మధుసూదన్ సూచించారు. కామన్ మెనూపై హసన్పర్తి కేజీబీవీలో శుక్రవారం వంట మనుషులకు శిక్షణ ఇచ్చారు. రాష్ట్రస్థాయిలో శిక్షణ పొందిన డీఆర్పీలు వివిధ రకాల వంటకాలు ఎలా చేయాలో ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. సమావేశంలో జెండర్ ఈ్వకిటీ కోఆర్డినేటర్ సునీత, కేజీబీవీల స్పెషల్ ఆఫీసర్లు జ్యోతి, స్వప్న పాల్గొన్నారు. రెండు కేజీబీవీల్లో ఎంఎల్టీ కోర్సు విద్యారణ్యపురి: వరంగల్ జిల్లాలోని దుగ్గొండి, పర్వతగిరి కేజీబీవీల్లో ఈ విద్యాసంవత్సరం (2025–26) కళాశాల స్థాయిలో ఇంటర్మీడియట్ ఎంఎల్టీ (మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్) కోర్సును నూతనంగా ప్రవేశపెట్టినట్లు డీఈఓ మామిడి జ్ఞానేశ్వర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒక్కో కేజీబీవీలో ప్రథమ సంవత్సరానికి 40 సీట్లు కేటాయించినట్లు తెలిపారు. ఆసక్తిగల బాలికలు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. -
బడిబాటకు వేళాయె..
విద్యారణ్యపురి : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపు లక్ష్యంగా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహణకు ఉపాధ్యాయులు సన్నద్ధమయ్యారు. నేటి(శుక్రవారం)నుంచి 19వరకు జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు తమ పరిధిలోని ప్రాంతాల్లో బడిబాట నిర్వహించాల్సి ఉంటుంది. అందుకు ప్రభుత్వ మార్గదర్శకాలు ఇప్పటికే జారీ అయ్యాయి. విద్యార్థులు లేని పాఠశాలలను తెరుస్తారు.. హనుమకొండ జిల్లాలో అసలు విద్యార్థులు లేని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 41 ఉన్నాయి. అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులను గతేడాది విద్యార్థులున్న పాఠశాలలకు సర్దుబాటు చేశారు. ఈ ఏడాది ఆయా పాఠశాలలను తెరిచేందుకు డీఈఓ వాసంతి అవకాశం ఇచ్చారు. 41 పాఠశాలల్లోని టీచర్లు బడిబాట కార్యక్రమం ద్వారా తమతమ ప్రాంతాల పాఠశాలల పరిధిలో విద్యార్థులను నమోదు చేయిస్తే అవే పాఠశాలల్లోనే ఆయా టీచర్లు కొనసాగించేందుకు కూడా నిర్ణయించారు. కనీసం పది మంది విద్యార్థులను చేర్పించిన కూడా ఆయా పాఠశాలలు కొనసాగనున్నాయి. విద్యార్థులను చేర్పించలేని పరిస్థితుల్లో ఆయా పాఠశాలల టీచర్లను విద్యార్థులున్న ఇతర పాఠశాలలకు సర్దుబాటు చేస్తారు. జిల్లాలో 10లోపు విద్యార్థులున్న పాఠశాలలు మరో 45 వరకు ఉన్నాయి. ఆయా పాఠశాలల టీచర్లు కూడా తమతమ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచుకోవాల్సిందే. 20 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో కూడా కొన్నింటిలో తక్కువగానే విద్యార్థులు ఉన్నారు. బడిబాట కార్యక్రమం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం కలిగించేలా కృషిచేసి విద్యార్థులను చేర్పించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఆయా పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకంగా మారనుందని భావిస్తున్నారు. వరంగల్ జిల్లాలో 126 పాఠశాలల్లో అసలు విద్యార్థులే లేరు. గతేడాది ఆయా టీచర్లను వేరే పాఠశాలలో సర్దుబాటు చేశారు.విద్యార్థులను చేర్పించని పాఠశాలల టీచర్లకు ఇతర స్కూళ్లలో సర్దుబాటు చేస్తారు. రోజువారీగా కార్యక్రమాలు ఇలా.. ● 6న బడిబాటలో భాగంగా గ్రామసభలు, అవగాహన ర్యాలీలు నిర్వహించాలి. స్వయం సహాయక సంఘాలు ,హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు తదితరులను భాగస్వాములను చేయాలి. ● 7న ఇంటింటికి తిరుగుతూ బడిఈడు పిల్లలను గుర్తించాలి. గ్రామ విద్యార్థి రిజిస్టర్ను నవీకరించాలి. ● 8 నుంచి 10వ తేదీవరకు ఇంటింటికివె వెళ్లి ప్రచారం చేయటంతోపాటు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలను సందర్శించాలి. అందులోని బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. ప్రత్యేక అవసరాల పిల్లలను గుర్తించి భవిత కేంద్రాల్లో చేర్పించేలా ప్రోత్సహించాలి. ● 11న బడిబాట ద్వారా చేసిన ప్రగతిని చర్చించేందుకు గ్రామసభ నిర్వహించాలి. ● 12న అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులను ప్రజాప్రతినిధులతో ప్రారంభించి అదే రోజు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, స్కూల్ యూనిఫామ్స్ అందించాలి. ● 13న సామూహిక అక్షరాభ్యాసం, బాలలసభ నిర్వహించాలి. ● 16న ఎఫ్ఎల్ఎన్, లిప్ దినోత్సవం జరపాలి. ● 17న విలీన విద్య, బాలికా దినోత్సవంను నిర్వహించాలి. ● 18 తరగతి గదుల డిజిటలీకరణపై అవగాహన కల్పించి మొక్కల పెంపకం ప్రాధాన్యాన్ని వివరించాలి. ● 19 బడిబాట ముగింపు సందర్భంగా విద్యార్థులకు వివిధ క్రీడాపోటీలు నిర్వహించాలి. విద్యార్థుల నమోదు లక్ష్యం.. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థుల నమోదుకు బడిబాట నిర్వహించాలి. జిల్లా కేంద్రంలోని మడికొండ జెడ్పీ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి ప్రారంభిస్తారు. అక్కడే గ్రామసభ నిర్వహించి, తల్లిదండ్రులను, మహిళా సమాఖ్యలను, స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములయ్యేలా చూస్తాం. – బద్దం సుదర్శన్రెడ్డి, హనుమకొండ జిల్లా కమ్యూనిటీ మొబలైజింగ్, కోఆర్డినేటర్ నేటినుంచి 19వరకు నిర్వహణ వివిధ కార్యక్రమాల రూపకల్పన చివరి రోజు విద్యార్థులకు క్రీడాపోటీలు జిల్లాల్లో విద్యార్థులు లేని స్కూళ్ల పునఃప్రారంభానికి ఓకే.. కనీసం పదిమందినైనా చేర్పించాలి.. హనుమకొండలో 41, వరంగల్లో 126 పాఠశాలల్లో సున్నా సంఖ్య జిల్లాల వారీగా పాఠశాలల వివరాలు జిల్లా పీఎస్లు యూపీఎస్లు హైస్కూల్స్ హనుమకొండ 314 72 147 వరంగల్ 321 68 123 -
సీఎంఆర్ గడువులోగా పూర్తయ్యేనా?
సాక్షిప్రతినిధి, వరంగల్ : రైతులు పండించిన ధాన్యాన్ని వానాకాలం, యాసంగి సీజన్లలో ఏటా సేకరిస్తున్న ప్రభుత్వం.. మర ఆడించేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రైస్మిల్లులకు అప్పగిస్తోంది. కస్టం మిల్లింగ్ రైస్(సీఎంఆర్) కోసం ఇచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మరాడించి బియ్యాన్ని గడువులోగా పౌరసరఫరాల కార్పొరేషన్, ఎఫ్సీఐలకు మిల్లర్లు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఉమ్మడి జిల్లాలో గతేడాది రెండు సీజన్లలో సీఎంఆర్ ప్రక్రియ అనుకున్నంత వేగంగా జరగలేదు. అయినప్పటికీ అధికారులు ఈ వానాకాలానికి సంబంధించి కూడా సుమారు 281 రా రైస్, పారాబాయిల్డ్ రైసుమిల్లులకు సీఎంఆర్ ధాన్యం సరఫరా చేశారు. రెండు నెలలు కావొస్తున్నా కేవలం 2.19 శాతం మాత్రమే రైస్మిల్లర్లు బియ్యం ప్రభుత్వరంగ సంస్థలకు అప్పగించారు. సర్కారు ధాన్యంతో మిల్లర్ల వ్యాపారం.. సీఎంఆర్ కింద ధాన్యం ఇచ్చే క్రమంలో రైస్మిల్లుల యజమానులకు గడువు విధించి నిర్దేశించిన సమయంలోగా అప్పగించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. అయితే ఏటా మిల్లుల యజమానులు గడువును లెక్కచేయకుండా ధాన్యాన్ని బియ్యంగా మార్చి సొంత వ్యాపారం చేసుకుంటూ.. వారికి నచ్చినప్పుడు పౌరసరఫరాల సంస్థ, ఎఫ్సీఐలకు బియ్యం అప్పగిస్తున్నారు. ఇది ప్రతి ఏటా జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో రైస్మిల్లులకు ఈ సీజన్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన 7,42,261 మెట్రిక్ టన్నుల ధాన్యం సీఎంఆర్ కింద ఇచ్చారు. ఇందుకు 5,04,737 మెట్రిక్ టన్నుల బియ్యం ఆగస్టు వరకు పూర్తిగా ఇవ్వాల్సి ఉండగా.. రెండు నెలల్లో కేవలం 11,068(2.19 శాతం) మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లర్లు ఇచ్చారు. గతేడాది వా నాకాలం, యాసంగి సీఎంఆర్కు సంబంధించి సుమారు రూ.561 కోట్ల విలువైన బియ్యం పెండింగ్లో ఉండగా..ఈవానాకాలం సీజన్కు సంబంధించి 4,93,669 మెట్రిక్ టన్నుల బియ్యం మిల్ల ర్లు ఎప్పటి వరకు ఇస్తారన్న చర్చ జరుగుతోంది. సీఎంఆర్ జాబితాలో డిఫాల్టర్లు.. గత వానాకాలం, యాసంగి సీజన్లలో సీఎంఆర్ కింద ధాన్యం తీసుకుని ఇంకా బియ్యం ఇవ్వని డిఫాల్టర్లకు ఈ వానాకాలంలో సీఎంఆర్ కింద ధాన్యం ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎక్కువగా హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో జరిగినట్లు ఫిర్యాదులున్నాయి. ● హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో రెండు రైస్మిల్లులను నడుపుతున్న హసన్పర్తికి చెందిన ఓ వ్యాపారి రూ.కోట్లలో సీఎంఆర్ ఎగవేసినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అతడిపై రెవెన్యూ రికవరీ యాక్టు పెట్టే అవకాశం ఉన్నా.. అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తూ ధాన్యం కేటాయించడం వివాదాస్పదం అవుతోంది. ● హసన్పర్తి మండలం సీతంపేట సమీపంలోని ఓ రైస్మిల్లును లీజుకు తీసుకుని సివిల్సప్లయీస్ ద్వారా తీసుకున్న సుమారు రూ.15 కోట్ల విలువైన ధాన్యానికి మంగళం పాడినా పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అలాగే గత వానాకాలం, యాసంగి సీఎంఆర్ ఇవ్వని డిఫాల్టర్లకు ఈ సీజన్లో ధాన్యం ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఈ సీజన్లోనూ రైస్మిల్లులకు బ్యాంకు గ్యారంటీ, ష్యూరిటీలు తీసుకుని సీఎంఆర్ కింద ధాన్యం కేటాయించామని, సీఎంఆర్ ప్రక్రియను గడువులోగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉమ్మడి వరంగల్కు చెందిన పౌరసరఫరాలశాఖ అధికారి ఒకరు తెలిపారు. వానాకాలం బియ్యం మరాడింపు మరీ స్లో.. ఉమ్మడి వరంగల్లో మిల్లర్లకు 7.42 లక్షల మె.టన్నుల ధాన్యం సీఎంఆర్ కింద ఇవ్వాల్సిన బియ్యం 5.04 లక్షల మె.టన్నులు... రెండు నెలల్లో ఇచ్చింది 11,068 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే యాసంగి సీఎంఆర్పైన నిర్లక్ష్యమే.. డిఫాల్టర్లకు సీఎంఆర్ ధాన్యం? -
పీహెచ్సీలను శుభ్రంగా ఉంచాలి
హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య ఎంజీఎం/హసన్పర్తి : జిల్లాలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచాలని హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య సూచించారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంజీఎం ఆస్పత్రి ప్రాంగణంతో పాటు లష్కర్ సింగారం పట్టణ ఆరోగ్య కేంద్రంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ ఆస్పత్రికి వచ్చే రోగులకు ఆస్పత్రి ప్రాంగణం శుభ్రంగా పచ్చదనంతో ఆహ్లాదంగా కనిపించాలని సూచించారు. అదేవిధంగా టీబీ నిర్మూలనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని డీఎంహెచ్ఓ పిలుపునిచ్చారు. హసన్పర్తి మండల కేంద్రంలోని దళితవాడ పాఠశాలలో టీబీ టెస్ట్లు నిర్వహించారు. ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ రజాహైదర్, హెల్త్ సూపర్వైజర్ బాబు, ఎంజీఎం సూపర్వైజర్ నర్మద, విప్లవకుమార్, టీబీ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ డాక్టర్ హిమబిందు, టెక్నీషియన్ అయ్యుతరావు,హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఫార్మసీ ఆఫీసర్, నర్సింగ్ అధికారులు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత
వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని కలెక్టర్ సత్యశారద అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురష్కరించుకుని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి వరంగల్ ఆధ్వర్యంలో గురువారం హనుమకొండ పబ్లిక్ గార్డెన్లో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వరంగల్ డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని కలెక్టర్ అందరితో ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా అటవీశాఖ అధికారి అనూజ్ అగర్వాల్ మాట్లాడుతూ.. రోజువారీ జీవితంలో సింగిల్యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నివారించాలన్నారు. ఈసందర్భంగా ‘ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఓడించండి’ అంశంపై విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన వారికి ప్రశంస పత్రాలు జ్ఞాపికలతో కలెక్టర్ సత్యశారద సన్మానించారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి ఉమ్మడి జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సునీత, ఎన్ఐటీ ప్రొఫెసర్ వేణు, వినోద్, డాక్టర్ శ్రీనివాస్, గణేశ్ ఈకో కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
క్రీడల్లో ప్రోత్సహించడం అభినందనీయం
వరంగల్ స్పోర్ట్స్/హన్మకొండ అర్బన్ : క్రీడల ప్రాధాన్యతను గుర్తించి తల్లిదండ్రులు వారి పిల్ల లను నచ్చిన క్రీడల్లో ప్రోత్సహించడం అభినందనీయమని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. హనుమకొండ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో 35 రోజులపాటు నిర్వహించిన వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు గురువారం ముగిశాయి. హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని బాస్కెట్ బాల్ గ్రౌండ్లో జరిగిన ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా కలెక్టర్ ప్రావీణ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జేఎన్ స్టేడియంతోపాటు సుబేదారిలోని కలెక్టర్ నివాసంలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. క్రీడలతో మానసిక, శారీరక ఆరోగ్యం లభిస్తుందన్నారు. డీవైఎస్ఓ గుగులోత్ అశోక్కుమార్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు 2,500 మంది క్రీడాకారులు హాజరయ్యారని తెలిపారు. 35 రోజుల పాటు జరిగిన శిబిరంలో వివిధ క్రీడాంశాల్లో క్రీడాకారులు క్రమశిక్షణ, సమయపాలన పాటిస్తూ శిక్షణ పొందారన్నారు. అనంతరం శిక్షణ పొందిన క్రీడాకారులకు పతకాలు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో డీఆర్ఓ గణేష్, జెడ్పీ సీఈఓ విద్యాలత, డీపీఓ లక్ష్మీరమాకాంత్, శ్రీనివాస్కుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్, వివిధ క్రీడాసంఘాల బాధ్యులు, డీఎస్ఏ కోచ్లు తదితరులు ఉన్నారు. హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య ముగిసిన వేసవి క్రీడా శిక్షణ శిబిరం -
9న ‘జోసా’ ఓపెన్ హౌజ్
కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్లోని అంబేడ్కర్ లర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో ఈనెల 9వ తేదీన జోసా (జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ) ద్వారా నిట్, ఐఐటీల్లో ప్రవేశాలపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు ఓపెన్ హౌజ్ నిర్వహించనున్నట్లు నిట్ యాజమాన్యం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల సందేహాలకు సమాధానాలు ఇచ్చేందుకు నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ, డీన్లు, ప్రొఫెసర్లు ఉదయం 10:30 నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉంటారని తెలిపారు. నేరుగా హజరుకాలేకపోతున్న వారి కోసం నిట్ అధికారిక యూట్యూబ్ అందుబాటులో ఉంటుందని వివరించారు. నిట్ను అగ్రగామిగా నిలబెడదాంనిట్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ చైర్పర్సన్ మోహన్రెడ్డి కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్ను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెడదామని నిట్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ చైర్పర్సన్, ఐఐటీ హైదరాబాద్, రూర్కీ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ చైర్పర్సన్ డాక్టర్ బీవీఆర్.మోహన్రెడ్డి పేర్కొన్నారు. నిట్ వరంగల్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ చైర్ పర్సన్గా ఎంపికై న సందర్భంగా తొలిసారిగా వరంగల్కు విచ్చేసిన మోహన్రెడ్డి గురువారం నిట్ క్యాంపస్ను పరిశీలించి మాట్లాడారు. ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా సిలబస్ను విద్యార్థులకు అందజేయాలని నిట్ యాజమాన్యానికి సూచించారు. ఈ సందర్భంగా నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ మోహన్రెడ్డికి పూలబొకే అందజేసి అభినందించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తనిఖీకాజీపేట : కాజీపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ అదనపు డీసీపీ రాయల ప్రభాకర్ రావు గురువారం తనిఖీ చేశారు. స్టేషన్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ కేసుల నమోదు, ఈ–చలాన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వాహనాలకు నంబరు ప్లేట్లు లేకుండా తిరగడం, మైనర్ డ్రైవింగ్ వంటి విషయాల్లో ఎవరిని ఉపేక్షించొద్దని సిబ్బందికి సూచించారు. ఏసీపీ సత్యనారాయణ, సీఐ వెంకన్న, ఎస్సైలు కనక చంద్రం, రామారావు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానంకాజీపేట అర్బన్ : జిల్లాలోని గిరిజన విద్యార్థులు బెస్ట్ అవైలబుల్ స్కీమ్లో భాగంగా 2025–26 విద్యా సంవత్సరానికి గాను 3, 5, 8వ తరగతుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ప్రేమకళారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 9వ తేదీనుంచి 13వ తేదీలోపు హనుమకొండ అంబేడ్కర్ భవన్ ఎదురుగా ఉన్న జిల్లా గిరిజన అభివృద్ధి కార్యాలయంలో దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. పరిశోధనపత్రాల ప్రొసీడింగ్స్ ఆవిష్కరణకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని జువాలజీ విభాగం ఆధ్వర్యంలో ఈఏడాది మార్చి 11, 12వ తేదీల్లో ‘ఇన్నోవేటివ్ టెక్నిక్స్ ఇన్ యానిమల్ బయా టెక్నాలజీ అండ్ ఇమ్యునాలజీ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ మేనేజ్మెంట్’ జాతీయ సదస్సు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో వచ్చిన 26 పరిశోధన పత్రాలతో కూడిన ప్రొసీడింగ్స్ (పుస్తకం)ను రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రంతో కలిసి కేయూ వీసీ ప్రొఫెసర్ ప్రతాప్రెడ్డి గురువారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో జువాలజీ విభాగం అధిపతి ప్రొఫెసర్ షమిత, ఆ విభాగం ప్రొఫెసర్లు మామిడాల ఇస్తారి, డాక్టర్ వెంకయ్య, ఈసం నారాయణ, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కృష్ణవేణి, డీన్ ప్రొఫెసర్ గాదె సమ్మయ్య పాల్గొన్నారు. -
సహజ వనరులను రక్షించుకోవాలి
న్యూశాయంపేట : సహజ వనరులను రక్షించుకోవాలని భద్రాద్రి జోన్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (సీసీఎఫ్) భీమా నాయక్ సూచించారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హనుమకొండలోని సుబేదారి ఫారెస్ట్ కాంప్లెక్స్ నుంచి హంటర్రోడ్లోని కాకతీయ జూ పార్క్ వరకు నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జూ పార్క్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రతీ ఒక్కరు పాటుపడాలన్నారు. కాకతీయ జూ పార్క్ను ప్లాస్టిక్ రహిత జూ గా మార్చేందుకు కృషిచేయాలని అధికారులను ఆదేశించారు. జూ పార్క్లో తెల్లపులి, సింహాలు తెచ్చే ప్రయత్నంలో ఉన్నామని సందర్శకులకు మరి కొద్ది రోజులల్లో వీక్షించే వీలు కలుగుతుందన్నారు. ఈ సందర్భంగా జూ పార్క్లో మొక్కలు నాటారు. విద్యార్థులకు పోటీలు నిర్వహించగా గెలుపొందిన వారికి బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ అనుజ్ అగర్వాల్, ఎఫ్ఆర్ఓ మయూరీ, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు రవిబాబు, తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ను నిషేధించాలి:ఆర్డీఓ వైవీ గణేష్ హన్మకొండ కల్చరల్ : ప్లాస్టిక్ వినియోగాన్ని ప్రతిపౌరుడు నిషేధించాలని జిల్లా రెవెన్యూ అధికారి వైవీ గణేష్ పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం వరంగల్లోని అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యకళాశాల ప్రాంగణంలో యునైటెడ్ నేషన్స్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ తెలంగాణ రాష్ట్ర చాప్టర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో ఆయుర్వేద వైద్యకళాశాల ప్రిన్సిపాల్ అనసూర్య, హార్టికల్చర్ అధికారి రమేశ్, కమిటీ సభ్యులు డాక్టర్ బి.సాంబమూర్తి, సంస్థ కోఆర్డినేటర్ రాజగోవిందు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ పోతు మహేష్, కొంతం కృష్ణ, వడ్నాల నరేందర్, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సీసీఎఫ్ భీమా నాయక్ -
పర్యావరణాన్ని కాపాడుకోవాలి
న్యూశాయంపేట : పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భద్రాద్రి సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (సీసీ ఎఫ్) భీమా నాయక్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హనుమకొండ సుబేదారి ఫారెస్ట్ కాంప్లెక్స్లో బుధవారం ప్లాస్టిక్ ప్రీ కార్యక్రమాన్ని ప్రారంభించా రు. అనంతరం కాంప్లెక్స్ ఆవరణలోని ప్లాస్టిక్ వస్తువులు, బ్యాగులు సిబ్బంది సేకరించి డంపింగ్ యార్డ్కు తరలించి, ఆవరణను శుభ్రం చేశారు. కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల అటవీ అధికారి అనుజ్ అగర్వాల్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, మినిస్ట్రీరియల్ సిబ్బంది పాల్గొన్నారు. రైల్వేవర్క్స్ సెక్షన్ల తనిఖీ కాజీపేట రూరల్ : కాజీపేట సబ్ డివిజన్ పరిధిలోని బెల్లంపల్లి–రెచ్నీరోడ్ సెక్షన్లో చేపట్టనున్న రైల్వే ఎన్ఐ ఇంజనీరింగ్ వర్క్స్ లోకేషన్ను బుధవారం సికింద్రాబాద్ రైల్వే అధికారులు తనిఖీ చేశారు. రైల్వే ఏడీఆర్ఎం ఆపరేటింగ్ విభాగం గోపాలకృష్ణన్, ఇతర అధికారులు ఎన్ఐ బ్లాక్ సెక్షన్లను పరిశీలించి తనిఖీ చేసి పలు సాంకేతిక విషయాలపై ఇంజనీరింగ్ అధికారులకు సూచనలు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాగా బెల్లంపల్లి–రెచ్నీ మధ్య ఎన్ఐ ఇంజనీరింగ్ బ్లాక్ పనులు ఈ నెల 20వ తేదీ వరకు ఉంటుందని, దీంతో దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్, కాజీపేట–బల్లార్షా రూట్లలో పలు రైళ్లను రద్దు, దారి మళ్లింపు, దూరం తగ్గించి నడిపిస్తున్నట్లు అధికారులు వివరించారు. 1,220 దరఖాస్తుల స్వీకరణ హన్మకొండ అర్బన్ : జిల్లావ్యాప్తంగా 14 గ్రామాల్లో బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో భూ సమస్యలపై రైతులనుంచి 1,220 దరఖాస్తులు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. ఈ సదసుల్లో సర్వే నంబర్ల మిస్సింగ్–90, పెండింగ్ మ్యూటేషన్–17, డీఎస్ పెండింగ్–49, ఎక్స్టెంట్–113, అసైన్డ్ భూ సమస్యలు–179, సక్సేషన్–101, ఇతర సమస్యలపై 625లతో పాటు తదితర సమస్యలపై మొత్తం 1,220 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. ఈ సదస్సులో ఆర్డీఓలు, తహసీల్దార్లు, నయాబ్ తహసీల్దార్లు, ఆర్ఐలు, సర్వేయర్లు పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి న్యూశాయంపేట: భూసమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. బుధవారం ఏనుమాములలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొని మాట్లాడారు. అనంతరం బాలాజీనగర్లో రేషన్ షాపును ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఇక్బాల్, సిబ్బంది పాల్గొన్నారు. హిందీ పరీక్షకు 8మంది హాజరువిద్యారణ్యపురి : జిల్లాలోని మూడు పరీక్ష కేంద్రాల్లో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు కొనసాగుతున్నాయి. బుధవారం హిందీ పరీక్షకు మొత్తం 12మందికి 8మంది విద్యార్థులు హాజరైనట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ మార్కజీ హైస్కూల్ పరీక్ష కేంద్రంలో ముగ్గురు, బస్టాండ్ రోడ్డులోని ప్రభుత్వ హైస్కూల్ కేంద్రంలో ఇద్దరు, పెట్రోల్ పంపు బాలికల హైస్కూల్ కేంద్రంలో ముగ్గురు విద్యార్థులు హాజరయ్యారు. -
ఆదరణ బాగానే ఉంది
బక్రీద్ పండుగ దృష్ట్యా ఆరు నెలల ముందునుంచే గొర్రె పోట్టేళ్లను పెంచుతాం. ఇవి ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత మంచి ధర వస్తుంది. ప్రస్తుతం విక్రయాలతో ఆరునెలల కష్టానికి తగిన గిట్టుబాటు ధర లభిస్తుంది. – జక్కుల గట్టయ్య, మల్లక్పల్లి ప్రతి ఏటా రెండు పొట్టేళ్లు కొంటాం ఖర్చుకు వెనకాడకుండా ప్రతిఏటా బక్రీద్ పర్వదినం రోజుకు రెండు పొట్టేళ్లను కొంటాం. మూడు భాగాలు చేసి పంపిణీ చేస్తాం. ఈసారి ధరలు బాగానే ఉన్నాయి. ప్రతీ ముస్లిం విధిగా తమ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా పొట్టేళ్లను కొనుగోలు చేసి మాంసం దానం చేస్తారు. – సయ్యద్ యాకూబ్, కాజీపేట -
‘సూపర్ స్పెషాలిటీ’ బలోపేతానికి చర్యలు
ఎంజీఎం : రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కాకతీయ మెడికల్ కళాశాలలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో శాశ్వత ప్రాతిపదికన అవసరమయ్యే సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. బుధవారం కేఎంసీలోని పీఎంఎస్ఎస్వై సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరు రిజిస్టర్ను పరిశీలించి, ఆలస్యంగా విధులకు హాజరైన ఇద్దరు డాక్టర్లు, హెడ్నర్సునుంచి సంజాయిషీ కోరాలని పర్యవేక్షకులను ఆదేశించారు. ఆస్పత్రి ఆవరణలో డాక్టర్లు, అధికారులతో కలిసి పర్యటించి తక్షణమే కావాల్సిన అవసరాలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్యసేవలపై రోగులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. వివిధ విభాగాల ఇంజనీరింగ్ అధికారులతో నియమించిన సభ్యులు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రితోపాటు ఎంజీఎం ఆస్పత్రిలో అత్యవసరంగా కావాల్సిన సౌకర్యాలను పరిశీలించి రేపటిలోగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఫార్మసీలో మందుల నిల్వలను పరిశీలించారు. ఆస్పత్రిలో హిటింగ్ వెంటిలేషన్, ఏయిర్ కండిషన్ సిస్టం మరమ్మతులతోపాటు ఆపరేషన్ థియేటర్లలో ఏసీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆస్పత్రి ఐదో అంతస్తులోని ఆపరేషన్ థియేటర్ ఈనెల 10వ తేదీలోగా రోగులకు సేవలు అందించేందుకు సిద్ధం చేయాలన్నారు. డయాలసిస్ కేంద్రంలో అదనంగా ఏడు పడకలు, బ్లడ్ ప్యూరిఫైయింగ్ థియేటర్, రోగులు వారి అటెండెంట్ల కోసం షెడ్, ఇందిరా మహిళా క్యాంటీన్ను ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ వెంట కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ రామ్కుమార్ రెడ్డి, డాక్టర్ మురళి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, బీసీ సంక్షేమ జిల్లా అధికారి పుష్పలత, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ గోపాల్ రెడ్డి టీజీఈడబ్ల్యూఐడీసీ, టీజీఎంఐడీసీ, ఇరిగేషన్ శాఖల ఈఈలు ప్రసాద్, రవీందర్, సునీత, సంబంధిత శాఖల అధికారులు, డాక్టర్లు ఉన్నారు. వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సదుపాయాలపై రేపటిలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం -
ద్విచక్ర వాహనంపై 109 చలాన్లు
వరంగల్ క్రైం : ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించి ఏకంగా 109 ఆన్లైన్ చలాన్లు పెండింగ్లో ఉన్న ఓ ద్విచక్ర వాహనదారుడిని మంగళవారం ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. హనుమకొండ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సీతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండకు చెందిన భిక్షపతి తన ద్విచక్ర వాహనం (టీఎస్03 ఈఎస్ 9020)పై వరంగల్ ట్రై సిటీలో ట్రాఫిక్ సిగ్నల్స్ జంపింగ్, హెల్మెట్ లేకుండా వాహనం నడపటంతోపాటు మరికొన్ని ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించి తిరుగుతున్నాడు. బుధవారం ట్రాఫిక్ సిబ్బంది నగరంలోని అశోక జంక్షన్లో ద్విచక్ర వాహనాల పెండింగ్ చలాన్లు తనిఖీ చేస్తున్న క్రమంలో సదరు వాహనాన్ని ఆపి పోలీస్ వెబ్ పోర్టల్లో తనిఖీ చేశారు. ఆ వాహనంపై ఏకంగా 109 చలాన్లు పెండింగ్లో ఉన్నట్లు చూపడంతో పోలీసులు షాక్కు గురయ్యారు. భిక్షపతికి పెండింగ్లో ఉన్న చలాన్ల మొత్తం రూ.26,310 చెల్లిం చాల్సిందేనని రశీదు అందజేశారు. చల్లాన్లు చెల్లించేంతవరకు ద్విచక్ర వాహనం పోలీస్ కస్టడీలో ఉంటుందని వారు తెలిపారు. -
పొట్టేల్.. అధరహో..
గురువారం శ్రీ 5 శ్రీ జూన్ శ్రీ 202 – 12లోuకాజీపేట : బక్రీద్ పర్వదినం అంటేనే గొర్రె పొట్టేళ్ల విక్రయాలు.. ఈ పండుగ సందర్భంగా ఖుర్బానీ (దానం) ఇవ్వడం ముస్లింల ఆచారం. బక్రీద్ వచ్చిందంటే వారం ముందునుంచే నగరంలో పొట్టేళ్ల విక్రయాలకు భలే డిమాండ్ ఉంటుంది. ట్రైసిటీతో పాటు నగరంలోని 25 ప్రాంతాల్లో కొద్దిరోజులుగా పొట్టేళ్ల అమ్మకాలు జోరుగా మొదలయ్యాయి. ఈనెల 7వ తేదీన బక్రీద్ వేడుకను ముస్లింలు జరుపుకోనున్నారు. ఈ పర్వదినానికి శరీరంపై ఎటువంటి గాయాలు లేని పొట్టేళ్లనే ఎక్కువగా ముస్లింలు కొనుగోలు చేయడానికి ఇష్ట పడుతుంటారు. ధర ఎంతైనా సరే పొట్టేళ్లు మాత్రమే కొనుగోలు చేస్తారు.ఆర్థికంగా ఉన్నవారు రెండు, మూడు పొట్టేళ్లను బలిఇస్తారు. వారు కొంత మటన్ను వండుకుని మిగతాది పేదలకు, బంధువులకు ఖుర్చానీ (దానం) ఇస్తారు.పొట్టేళ్లను విక్రయించేందుకు గ్రామాలనుంచి కాపరులు నగరానికి వస్తుంటారు. అయితే ఏజెంట్లు కలగజేసుకొని తమకు పరిచయం ఉన్నవారికి అమ్మిస్తాం.. మాకు కమీషన్ ఇవ్వాలని నమ్మించి పొట్టేళ్లు తెచ్చిన కాపరులను పక్కన పెట్టేస్తున్నారు. దీంతో ఏజెంట్లే రేట్లు నిర్ణయించి తెలిసిన వారికి విక్రయించి లాభాలు గడిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఈ ఏజెంట్ల వల్ల ధరలు పెరగడమేనని పలువురు వాపోతున్నారు. బక్రీద్ సందర్భంగా పొట్టేళ్ల ధరలను చూసి పలువురు ఇంత రేటా! అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.బక్రీద్ విక్రయాలకు తెచ్చిన పొట్టేళ్ల ధరలు రూ.5వేల నుంచి రూ.25వేల వరకు పలుకుతున్నా యి. పొట్టేల్ ఉన్నది ఉన్నట్టుగా తూకం వేసి కిలోకు రూ.430ల చొప్పున విక్రయిస్తున్నారు. ఆరోగ్యంగా, బలంగా ఉన్న పొట్టేళ్లను గొర్రెల కాపరులు అధిక ధరలకు అమ్ముతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈఏడాది ధరలు కొంత ఎక్కువగానే ఉన్నాయని కొనుగోలుదారులు పేర్కొంటున్నారు. బక్రీద్ రోజు వరంగల్ నగరంలో దాదాపు 10వేలకు పైగా పొట్టేళ్లు బలిస్తారని ముస్లింలు చెబుతున్నారు. ధర రూ.5వేల నుంచి మొదలు -
ఆలయాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
హన్మకొండ కల్చరల్ : చారిత్రాత్మక దేవాలయాల అభివృద్ధ్దే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర దేవాదాయశాఖ, అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం భద్రకాళి దేవాలయం సమీపంలోని ఊళ్లో ఆంజనేయస్వామి దేవాలయం ప్రాంగణంలో రూ.1.30 కోట్లతో నిర్మించ తలపెట్టిన భద్రకాళి సాంగవేద ఆగమ సంస్కృత విద్యాలయ భవన(వేదపాఠశాల) నిర్మాణ పనులను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి మంత్రి కొండా సురేఖ శంకుస్థాపన చేశారు. అనంతరం భద్రకాళి ఆలయం ఎదుట రాజగోపురం నిర్మాణం పనులకు భూమిపూజ చేసి శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. సరైన వసతులతో వేదపాఠశాల లేక విద్యార్థులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో తనకు తెలుసని, వేదపాఠశాల నిర్మాణం వీలైనంత తొందరగా పూర్తిచేయాలన్నారు. దేవాదాయశాఖ పరిధిలో ఉన్న భూములను ఆక్రమించడం చట్టవిరుద్ధమని ఆమె అన్నారు. దేవాలయాల భూముల్లో ఆయా ఆలయాలకు ఉపయోగపడేలా వేదపాఠశాలలు, గోశాలలు, ధ్యానమందిరాలు, ప్రవచన మండపాలు నిర్మాణం చేయడానికి ప్రభుత్వం నిధులు సమకూరుస్తుందని తెలిపారు. భద్రకాళి ఆలయం అభివృద్ధిలో భాగంగానే మాడవీధుల నిర్మాణానికి రూ.30కోట్లు మంజూరు అయ్యాయన్నారు. భద్రకాళి చెరువు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకే పూడికతీత కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఇక ముందు వరంగల్లోని అన్ని ఆలయాలను, పురావస్తుశాఖ పరిధిలోని దేవాలయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, దీనివల్ల టూరిజం స్పాట్గా అభివృద్ధి చెందుతుందన్నారు. ఆలయాలను పరిశీలించి సరైన మాస్టర్ ప్లాన్ను రూపొందించాలని ప్రభుత్వ ధార్మిక సలహాదారు గోవింద్ హరిని సూచించినట్లు తెలిపారు. వైభవంగా పూజా కార్యక్రమం.. అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు శంకుస్థాపన పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఎనిమిది సాల్రగామశిలలను (బ్లాక్ గ్రానైట్) కలశాలపై ఉంచి వాస్తునాభి పూజ, హోమం నిర్వహించారు. మంత్రి, ఎమ్మెల్యే శిలాన్యాసం చేయడంతో పూజా కార్యక్రమం పూర్తయిన అనంతరం రాజగోపుర నిర్మాణాలకు శిలా న్యాసం నిర్వహించారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ సంధ్యారాణి, అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత, డీఈఈ సీహెచ్.రమేష్బాబు, కార్పొరేటర్ విజయలక్ష్మి, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ప్రముఖ వైద్యులు డాక్టర్ శివసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈఓ శేషు భారతి, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. మంత్రి కొండా సురేఖ రూ. 1.30కోట్ల వ్యయంతో వేదపాఠశాల భవన సముదాయానికి శంకుస్థాపన భద్రకాళి ఆలయ రాజగోపుర నిర్మాణ పనులకు సైతం.. -
కాలనీ రోడ్లు కకావికలం
గుంతలమయంగా రహదారులు ● చిన్నవర్షానికే గుంతల్లో నిలుస్తున్న నీళ్లు.. దీనికితోడు మురుగునీరు ● ప్రమాదాలబారిన వాహనదారులునయీంనగర్/కాజీపేట రూరల్ : పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఉంది గ్రేటర్ వరంగల్ స్మార్ట్ సిటీ రోడ్ల పరిస్థితి. పలు కాలనీల్లోని ప్రధాన లింక్ రోడ్లు పల్లెటూరు కంటే అధ్వానంగా గుంతలు తేలి ప్రమాదకరంగా ఉన్నాయి. చిన్నపాటి వర్షం వచ్చినా గుంతల్లో నీరు నిలిచిపోతోంది. వాహనదారులు గుంతలు ఎక్కడున్నాయో తెలియక ప్రమాదాల బారిన పడుతున్నారు. గ్రేటర్ వరంగల్ 8వ డివిజన్ అశోక జంక్షన్ కాంగ్రెస్ భవన్ నుంచి మార్కెట్ వెళ్లే రోడ్డు అధ్వానంగా తయారైంది. బొందలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రైల్వే ఈఎల్ఎస్ కాలనీ రోడ్లు అధ్వానం.. కాజీపేట బాపూజీనగర్ నుంచి రైల్వే ఎలక్ట్రిక్ లోకోషెడ్ (ఈఎల్ఎస్) కాలనీకి వెళ్లే రోడ్లు కంకర తేలాయి. బాపూజీనగర్ మెయిన్ రోడ్డు నుంచి కడిపికొండ బ్రిడ్జి కింది నుంచి ఎలక్ట్రిక్ లోకోషెడ్కు, కాజీపేట రైల్వే స్టేషన్కు వెళ్లే రెండు వైపులా రోడ్లు అక్కడక్కడ దెబ్బతిని గుంతలు పడ్డాయి. ఈ రోడ్డు మార్గాల్లో వర్షాలు పడినప్పుడల్లా గుంతల్లో వర్షం నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. రాత్రి,పగలు విధులకు వెళ్లే రైల్వే కార్మికులు, కాజీపేట రైల్వే స్టేషన్కు వెళ్లే ప్రజలు గుంతల మీదుగా వెళ్లడంతో వాహనాలు దెబ్బతింటున్నాయని వాపోతున్నారు. అదేవిధంగా కడిపికొండ బ్రిడ్జి కింద నుంచి కాజీపేట రైల్వే స్టేషన్ వరకు వెళ్లే ప్రధాన రోడ్డు మార్గం కూడా ఇదే పరిస్థితి. గుంతలు పడడంతో ఈ మార్గం గుండా వెళ్లి రావాలంటే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. కడిపికొండ బ్రిడ్జి కింద బయటి వారు చెత్త చెదారం వేయడంతో ఈ రోడ్డు మార్గం అంత దుర్గంధం వెదజల్లుతోంది. రైల్వే అధికారులు ఈ రోడ్డు మార్గం గుండా తనిఖీల నిమిత్తం రైల్వే కార్యాలయాలకు, రైల్వే కాలనీలకు వెళ్తున్నప్పటికి పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
ఎకరం @ రూ.1.20కోట్లు
సాక్షి, వరంగల్ : మామునూరు విమానాశ్రయం కోసం సేకరించే వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.కోటి 20 లక్షలు పరిహారం ఇచ్చేలా వరంగల్ జిల్లా అధికారులు నిర్ణయించారు. కలెక్టర్ సత్యశారద తనకున్న విచక్షణాధికారాలతో కన్సంట్ అవా ర్డు కింద ఈ మేరకై తే ఇవ్వగలమని భూములు కోల్పోతున్న నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లి రైతులతో కలెక్టరేట్లో బుధవారం రాత్రి జరిగిన డిస్ట్రిక్ లెవెల్ ల్యాండ్ నెగోషియేషన్ కమిటీ సమావేశంలో తేల్చిచెప్పారు. జనరల్ అవార్డు కింద రూ.65లక్షల వరకే ఇవ్వాల్సి ఉన్నా.. స్పెషల్ (కన్సంట్) అవార్డు కింద రూ.కోటి 20 లక్షలు ఇస్తున్నామని రైతులకు ఆమె హామీ ఇచ్చారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న విమానాశ్రయ నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించిన ధరకు రైతులు అంగీకరించి సహకరించాలని కోరారు. కాగా, రెండురోజుల్లో చర్చించుకుని భూమి పాస్బుక్లు ఇస్తామని రైతులు చెప్పారు. స్థల సేకరణ కోసం రూ.205 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. నేడు వ్యవసాయేతర భూముల రైతులతో సమావేశం గుంటూరుపల్లి రైతులు కొత్తగా రోడ్డు ఏర్పాటు చేయాలని కోరగా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికను తయారు చేసుకొని జిల్లా ఇన్చార్జ్ మంత్రి దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. విమానాశ్రయ నిర్మాణంలో వ్యవసాయేతర భూములు కోల్పోతున్న రైతులతో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్లో నేగోషియేషన్ కమిటీ సమావేశం ఉంటుందన్నారు. సమావేశంలో అదనవు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి, ఆర్అండ్బీ, ఇరిగేషన్ ఈఈలు రమేష్, శంకర్, తహసీల్దార్ నాగేశ్వర్, ఇరిగేషన్ డీఈ మధుసూదన్ రెడ్డి, గుంటూరుపల్లి, నక్కలపల్లి, గాడిపెల్లి, రైతులు పాల్గొన్నారు. ‘మామునూరు’ వ్యవసాయ భూ నిర్వాసితులకు చెల్లింపునకు నిర్ణయం కలెక్టర్ విచక్షణాధికారాలతో కన్సంట్ అవార్డు కింద పరిహారం నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లి రైతులతో భేటీలో సానుకూల పరిణామం మరో రెండు రోజుల్లో చర్చించుకుని పాస్బుక్లు ఇస్తామన్న రైతులు మరో రూ.83 కోట్లు అవసరమే వ్యవసాయ సాగుకు సంబంధించి 240 ఎకరా లకు భూపరిహారం రూ.288 కోట్లు అవుతున్నా యి. ఇప్పటికే ప్రభుత్వం రూ.205 కోట్లు కేటా యించింది. ఎకరాకు రూ.కోటి 20లక్షల ధర నిర్ణయంతో మరో రూ.83 కోట్లు అదనంగా అవసరం కానున్నాయి. వీటికితోడు మరో 13 ఎకరా ల వ్యవసాయేతర భూములకు గజం లెక్కన ఎంత చెల్లిస్తారన్నది గురువారం జరిగే సమావేశంలో తేలనుంది. ఈ లెక్కన అదనంగా రూ.100 కోట్లకుపైగానే భూపరిహారం కింద రైతులకు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. ఇదిలా ఉండగా హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డుకు భూసేకరణకు ఎకరానికి రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు చెల్లిస్తున్నారు. ఈ లెక్కన చూసుకుంటే ఇక్కడున్న స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రూ.కోటి 20లక్షలు ఎకరానికి పరిహారం కింద చెల్లించడం అధికమని రెవెన్యూ అధికారులు అంటున్నారు. -
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు
రవాణాశాఖ కమిషనర్ సురేంద్ర మోహన్ న్యూశాయంపేట: వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్, మార్కెటింగ్ శాఖ సంచాలకులు సురేంద్రమోహన్ అన్నారు. వరంగల్ కలెక్టరేట్లో కలెక్టర్ సత్యశారద, డీసీపీ ప్రభాకర్, సంబంధిత శాఖల అధికారులతో రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ఆయన మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదాలు నివారించి విలువైన ప్రాణాలు కాపాడేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఒకే ప్రాంతంలో ఐదు ప్రమాదాలు జరిగితే బ్లాక్ స్పాట్గా గుర్తించాలని.. భద్రతా ప్రమాణాలపై విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. సమావేశంలో రవాణా శాఖ అధికారులు పురుషోత్తం, శోభన్బాబు, ఆర్అండ్బీ అధికారి రమేశ్, డీఈఓ జ్ఞానేశ్వర్, ఎన్హెచ్ఐఎ టీం లీడర్ సంపత్ తదితర అధికారులు పాల్గొన్నారు. సహకార సంఘాల బలోపేతానికి కృషి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల బలోపేతానికి కృషి చేయాలని రాష్ట్ర రవాణాశాఖ, మార్కెటింగ్శాఖ సంచాలకులు, సహకారశాఖ రిజిస్ట్రార్ సురేంద్రమోహన్ పేర్కొన్నారు. జిల్లాలో సహకార శాఖ, మార్కెటింగ్శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యకలాపాలపై కలెక్టరేట్లో మంగళవారం సమీక్ష నిర్వహించారు. రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రాథమిక సహకార సంఘాలు కృషి చేయాలన్నారు. సమావేశంలో కలెక్టర్ సత్యశారద, జిల్లా కో–ఆపరేటివ్ అధికారి నీరజ, అసిస్టెంట్ రిజిస్ట్రార్ జగన్మోన్రావు, తదితరులున్నారు. -
‘డబుల్’ ఇళ్లను ఆక్రమించుకున్న పేదలు
హన్మకొండ అర్బన్: హనుమకొండ బాలసముద్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను పలువురు పేదలు మంగళవారం రాత్రి ఆక్రమించుకోవడంతో పరిసర ప్రాంతాలు ఉద్రిక్తంగా మారాయి. ఇక్కడ మొత్తం 592 డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించారు. కానీ, కేటాయింపు జరగలేదు. దీంతో వెంటనే అర్హులైన నిలువనీడ లేని నిరుపేదలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎంతో కాలంగా డబుల్ బెడ్ రూంలు ఇవ్వాలని ఆందోళన చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో గదుల తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడినట్లు పలువురు మహిళలు తెలిపారు. ఖాళీగా ఉన్న గదుల్లో వంటావార్పు చేసుకుని భోజనాలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి స్పందించి అర్హులకు డబుల్ బెడ్ రూంలు కేటాయించాలని కోరారు. -
పోలీసింగ్పై దృష్టి పెట్టాలి : సీపీ
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రతీ అధికారి పోలీసింగ్పై దృష్టి సారించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ సూచించారు. మంగళవారం కమిషనరేట్లో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న చోరీలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆస్తి నేరాలను తగ్గించాలని కోరారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులకు కారణాల్ని అడిగి తెలుసుకున్నారు. పరిష్కారానికి సూచనలిచ్చారు. ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన కమ్యునిటి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. సీసీ కెమెరాల ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. వాహనాల చోరీలకు సంబంధించి అవగాహన కల్పించాలన్నారు. బక్రీద్ను పురస్కరించుకుని మూగజీవాల రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పండుగ రోజు దర్గాల వద్ద బందోబస్తు పటిష్టం చేయాలని, వరంగల్కు ఉన్న కీర్తి ప్రతిష్టలు తగ్గకుండా పోలీసింగ్ ఉండాలని ఆయన పేర్కొన్నారు. ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో బేసిక్ పోలీసింగ్ ఉండాలని సీపీ ఆదేశించారు. కార్యక్రమంలో డీసీపీలు షేక్ సలీమా, రాజమహేంద్రనాయక్, అంకిత్ కుమార్, జనగామ ఏఎస్పీ చైతన్య, అదనపు డీసీపీలు రవి, సురేశ్కుమార్, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు. నిజాయితీగా పనిచేయాలి..నిజాయితీగా పని చేస్తూ.. పోలీస్ శాఖకు కీర్తి ప్రతి ష్టలు తీసుకురావాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ సూచించారు. మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏఎస్సైలుగా పని చేస్తూ.. సబ్ ఇన్స్పెక్టర్లుగా పదోన్నతి పొందిన జనార్దన్, నారాయణ, సీతారాములు సీపీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పోలీసులపై ప్రజలకు నమ్మకం కలిగేలా విధులు నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో పరిపాలనా విభాగం అదనపు డీసీపీ రవి పాల్గొన్నారు. -
నేడు వేదపాఠశాల భవనానికి శంకుస్థాపన
హన్మకొండ కల్చరల్: చారిత్రక భద్రకాళి దేవాలయంలో కొనసాగుతున్న మాడవీధుల నిర్మాణంలో భాగంగా బుధవారం రాజగోపురాల నిర్మాణానికి, భద్రకాళి సాంగ ఆగమ సంస్కృత వేద పాఠశాల భవనానికి శంకుస్థాపన నిర్వహిస్తున్నట్లు దేవాలయ ఈఓ శేషుభారతి తెలిపారు. ఈమేరకు దేవాలయం తూర్పు వైపు (మెయిన్ గేటు వద్ద) నుంచి రాజగోపురాల నిర్మాణం ప్రారంభం కానుంది. దేవాలయానికి వాయువ్య దిశలోని దేవాదాయశాఖ ఆధీనంలో ఉన్న ఆంజనేయస్వామి దేవాలయం భూమిలో వేద పాఠశాల నిర్మాణం చేపట్టనున్నారు. ఈసందర్భంగా దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి చేతుల మీదుగా శిలాన్యాసం జరుగుతుందని తెలిపారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధార్మిక సలహాదారు ఆర్.గోవింద హరి దేవాలయాన్ని సందర్శించారు. ఆయనను శేషుభారతి, అర్చకులు భద్రకాళి శేషు పూర్ణకుంభంతో ఆలయ మర్యాదలతో స్వాగతించారు. ఆదిశంకరులను, వల్లభగణపతిని దర్శించి ఆలయంలోని అమ్మవారికి ప్రత్యేకపూజలు చేశారు. పూజల అనంతరం భద్రకాళి శేషు, వేదపండితులు తీర్థప్రసాదాలు, అమ్మవారి శేషవస్త్రాలు అందజేసి మహదాశీర్వచనం అందించారు. గోవింద హరి వెంట రాష్ట్ర ప్రధాన స్థపతి వల్లీ నాయగం, రాష్ట్ర దేవాదాయశాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె.దుర్గాప్రసాద్, ఆలయ పర్యవేక్షకులు అద్దంకి విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. భద్రకాళి ఆలయాన్ని సందర్శించిన రాష్ట్ర ప్రభుత్వ ధార్మిక సలహాదారు -
ప్రజల సంక్షేమానికి పథకాల తోడ్పాటు
పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి నయీంనగర్: ప్రజల సంక్షేమానికి ప్రభుత్వ పథకాలు తోడ్పడతాయని, ప్రజల భాగస్వామ్యంతో పథకాలు విజయవంతమవుతాయని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధి ప్రాంతాలను నివాస యోగ్యమైన, స్థిరమైన అనుకూలమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం వంద రోజుల కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా 53వ డివిజన్ ఆదర్శకాలనీలో మంగళవారం నాయిని ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యక్రమం విజయవంతం కావడానికి కాలనీవాసులు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఎంహెచ్ఓ రాజిరెడ్డి, కార్పొరేటర్ సోదా కిరణ్, కాలనీ అధ్యక్షుడు తూడి విద్యాసాగర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి పరికిపండ్ల వేణు, నరసింహస్వామి, జగదీశ్వర్ పాల్గొన్నారు. -
కేయూకు సోషియాలజీ, ఎంఎస్డబ్ల్యూ విభాగాలు
కేయూ క్యాంపస్: ఎట్టకేలకు కాకతీయ యూనివర్సిటీలోని ఓల్డ్ అడ్మిషన్స్ డైరెక్టరేట్ బిల్డింగ్లో సో షియాలజీ డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేశారు. గతంలో హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ నుంచి ఎంఏ సోషియాలజీ విభాగం (రెగ్యులర్ కోర్సు) ఏడాది క్రితం కాకతీయ యూనివర్సిటీకి తరలింది.. కానీ.. ఆ విభాగాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంలో జాప్యం జరిగింది. ఈనెల 2న యూనివర్సిటీ అధికారులు ఉత్తర్వులు ఇవ్వగా.. మంగళవారం సోషియాలజీ విభాగాన్ని ఓల్డ్ అడ్మిషన్ల డైరెక్టరేట్కు షిప్ట్ చేశారు. కాగా.. మంగళవారం అక్కడే సోషియాలజీ విభాగంలో ఫైనలియర్ విద్యార్థులు ఫేర్వెల్ పార్టీ నిర్వహించుకున్నారు. కేయూకు ఎంఎస్డబ్ల్యూ.. హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో కొనసాగుతున్న మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ (ఎంఎస్డబ్ల్యూ)ను కూడా కాకతీయ యూనివర్సిటీకి షిఫ్ట్ చేశారు. కాగా.. 2018లో నిర్మల్ పీజీ సెంటర్ నుంచి సోషియాలజీ కోర్సు యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి సోషియాలజీ, ఎంఎస్డబ్ల్యూ ఒకే విభాగంగా కొనసాగుతూ వస్తోంది. సోషియాలజీ విభాగంలో 90 మంది, ఎంఎస్డబ్ల్యూలో 120 మంది విద్యార్థులున్నారు. సోషియాలజీ విభాగంతోపాటే ఎంఎస్డబ్ల్యూను కొనసాగించాలని విద్యార్థులు, అధ్యాపకులు అప్పటి వీసీ ఆచార్య ప్రతాప్రెడ్డి దృష్టికి తీసకెళ్లారు. చివరికి ఎంఎస్డబ్ల్యూను కూడా వర్సిటీ క్యాంపస్కు షిఫ్ట్ చేస్తూ కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం ఈనెల 2న ఉత్తర్వులు జారీచేశారు. ఒకటి రెండురోజుల్లో ఎంఎస్డబ్ల్యూ విభాగం కూడా కేయూలోని ఓల్డ్ అడ్మిషన్ల డైరెక్టరేట్కే తరలించనున్నారు. కేయూకు తరలడం హర్హనీయం.. ఎప్పటి నుంచో సోషియాలజీ, ఎంఎస్డబ్ల్యూ.. క్యాంపస్లో ఉండాలని అందరూ కోరుకున్నారు. ఎట్టకేలకు షిఫ్ట్ చేయడం హర్షనీయం. వీసీ, రిజిస్ట్రార్కు కృతజ్ఞతలు. – ప్రొఫెసర్ స్వర్ణలత, సోషియాలజీ, ఎంఎస్డబ్ల్యూ విభాగాధిపతి -
బుధవారం శ్రీ 4 శ్రీ జూన్ శ్రీ 2025
– 8లోuఅప్రమత్తంగా ఉన్నాం.. ఆందోళన వద్దు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం జిల్లాలో కరోనా నియంత్రణ కోసం వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. జిల్లాలో కరోనా కేసులు నమోదయ్యాయని సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లుకొట్టాయి. అదంతా అవాస్తవం. ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నిర్ధారణ కాలేదు. ప్రజలు ఆందోళన చెందొద్దు. దగ్గు, జలుబు, జ్వరం వస్తే సీజనల్ వ్యాధులే. ఈ ప్రకారం వైద్యులు ట్రీట్మెంట్ అందించాలి. – డాక్టర్ సాంబశివరావు, డీఎంహెచ్ఓ, వరంగల్ సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తులున్యూశాయంపేట: మైనార్టీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం ద్వారా ఆర్థిక సాయం కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హనుమకొండ కలెక్టర్, చైర్పర్సన్ మైనార్టీ సంక్షేమశాఖ ప్రావీణ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్లో తమ దరఖాస్తులు ఈనెల 30వ తేదీ వరకు సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాల కోసం హనుమకొండ సుబేదారి కలెక్టరేట్లోని మైనార్టీ సంక్షేమాధికారి కార్యాలయంలో సంప్రదించాలని కలెక్టర్ కోరారు. నేటి నుంచి పరిశోధన పద్ధతులపై తరగతులుకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈనెల 4 నుంచి 10వ తేదీ వరకు పరిశోధనా పద్ధతులపై అవగాహన తరగతులు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్ను ఆ విభాగాధిపతి డాక్టర్ సంకినేని వెంకట్, బీఓఎస్ డాక్టర్ కిష్టయ్యతో కలిసి ఆవిష్కరించారు. యూనివర్సిటీకి చెందిన సీనియర్ ఆచార్యులతో ఈఅవగాహన తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. సోషల్ సైన్సెస్ పరిశోధకులు కూడా ఈపరిశోధనా పద్ధతుల అవగాహన తరగతుల్ని వినియోగించుకోవాలని కోరారు. ఈనెల 4న ఈతరగతులను కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం, సోషల్ సైన్స్ ఆచార్య టి.మనోహర్ ప్రారంభిస్తారని సంకినేని వెంకటయ్య తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ వి.సత్యనారాయణ, డాక్టర్ వి.నాగరాజు పాల్గొన్నారు. నేడు రైల్వే అధికారుల తనిఖీలుకాజీపేట రూరల్: కాజీపేట సబ్ డివిజన్ పరిధిలో చేపట్టిన పలు రైల్వే నాన్ ఇంటర్ లాకింగ్ ఇంజనీరింగ్ వర్క్స్ను తనిఖీ చేసేందుకు సికింద్రాబాద్ డివిజన్ నుంచి రైల్వే అధికారులు తనిఖీ నిమిత్తం వస్తున్నట్లు మంగళవారం స్థానిక రైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కాజీపేట నుంచి బల్లార్షా, ఖమ్మం, సికింద్రాబాద్ సెక్షన్లలో చేపట్టిన నాన్ ఇంటర్ లాకింగ్ వర్క్స్ను వారు తనిఖీ చేయనున్నట్లు స్థానిక రైల్వే అధికారులు తెలిపారు. ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్ల బదిలీవరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్లో పరిధిలో ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిషనరేట్లోని సీసీఆర్బీ విభాగంలో పనిచేస్తున్న ఎస్.రాజేందర్ను రాయపర్తి పోలీస్ స్టేషన్కు, అక్కడ పనిచేస్తున్న శ్రవణ్కుమార్ను వీఆర్కు బదిలీ చేశారు.సాక్షి, వరంగల్: మున్ముందు కరోనా మహమ్మారి వస్తే కట్టడి చేసేందుకు వరంగల్, హనుమకొండ జిల్లాల వైద్యారోగ్య విభాగాధికారులు సన్నద్ధమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మహాత్మాగాంధీ మెమోరియల్(ఎంజీఎం) ఆస్పత్రితోపాటు గతంలో సేవలందించిన వివిధ ఆస్పత్రుల్లో ఎన్ని పడకలున్నాయనే వివరాలను సేకరిస్తున్నారు. ఈ జాబితాను ఆయా జిల్లాల విభాగాధికారులు కలెక్టర్ల ద్వారా ఉన్నతాధికారులకు పంపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వంనుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా కరోనా పరీక్షలు చేసేలా సరిపడా సిబ్బందిని అందుబాటులో ఉంచేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల ప్రభావం పెద్దగా లేకపోవడంతో ఊపిరి పీల్చుకుంటున్న వైద్యులు, ఒకవేళ ప్రబళితే ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా గతంలో కరోనా ఫస్ట్, సెకండ్, థర్డ్ వేవ్లలో పాజిటివ్ రోగులకు మెరుగైన వైద్యం అందించి వేలాది మంది ప్రాణాలు కాపాడిన ఎంజీఎం ఆస్పత్రిలో ఇప్పటికీ 500 నుంచి 800 ఆక్సిజన్ పడకలు అందుబాటులో ఉండడంతో ఏ పరిస్థితి వచ్చినా సన్నద్ధంగా ఉండడం కలిసొచ్చే అంశమని వరంగల్ జిల్లా వైద్యారోగ్యవిభాగాధికారులు భావిస్తున్నారు. కరోనాను నిర్ధారించే ర్యాపిడ్ యాంటీ జెన్, ఆర్టీపీసీఆర్ కిట్లు రాష్ట్ర ప్రభుత్వంనుంచి జిల్లాలకు రాగానే ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా పరీక్షలు చేసే వీలుంటుందని అంటున్నారు. వాతావరణ మార్పులతో జ్వరాలు.. మే నెల మూడో వారం నుంచి వాతావరణం చల్ల బడి అప్పుడప్పుడు వర్షాలు కురుస్తుండడంతో వాతావరణంలో మార్పులు వచ్చాయి. దీంతో దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నవారి సంఖ్య పెరిగింది. వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రిలోని ఫీవర్ వార్డులోనూ పదుల సంఖ్యలో చికిత్స తీసుకుంటున్నారు. దగ్గు, జలుబు, జ్వరం వంటివి సీజన్ వ్యాధులుగానే పరిగణించి వైద్యాధికారులు వైద్యం అందిస్తున్నారు. కరోనా లక్షణాలు అనుకొని భయపడవద్దని, వాతావరణ మార్పులతో సీజనల్ వ్యాధులు వస్తుంటాయని అంటున్నారు. పల్లె దవాఖానా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులందరూ అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. వరంగల్లో కరోనా బెల్స్●●●● ఎంజీఎంలో ఓ పీజీ వైద్యురాలికి పాజిటివ్? ● మరో ఆరుగురికి కూడా.. ప్రైవేట్లో చికిత్సలు ● నిర్ధారించని వైద్యాధికారులుఎంజీఎం : వరంగల్ నగరంలో కరోనా డేంజర్ బెల్స్ మోగాయి. ఎంజీఎం ఆస్పత్రిలోని జనరల్ మెడిసిన్ విభాగంలో పీజీ వైద్యురాలికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. సదరు వైద్యురాలు దగ్గు, జ్వరంతో బాధపడుతుండగా కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్ రావడంతో వెంటనే హైదరాబాద్లోని తన స్వృగృహానికి ఐసోలేషన్కు వెళ్లిపోయింది. ఈ విషయంపై ఎంజీఎం పరిపాలనాధికారులను వివరణ కోరగా ప్రభుత్వపరంగా తమ వద్ద ఎలాంటి నిర్ధారణ పరీక్షలు జరగలేదని తెలిపారు. ప్రైవేట్ ల్యాబ్ కేంద్రంగా చేసిన పరీక్షల్లో వస్తే తాము పాజిటివ్గా నిర్ధారించలేమని పేర్కొన్నారు. మరో ఆరుగురికి కూడా.. వరంగల్ నగరంలోని ఓ ప్రైవేట్ ల్యాబ్లో చేసిన పరీక్షల్లో ఆరుగురికి పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. వీరంతా వివిధ ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై వైద్యారోగ్యశాఖ అధికారులను వివరణ కోరగా, తమ వద్ద ఎలాంటి పాజిటివ్ కేసులు నమోదు కాలేదని పేర్కొంటున్నారు. లోపించిన పాలన.. గ్రేటర్ వరంగల్లో పరిధిలోని ప్రైవేట్ ల్యాబ్లు, క్లినిక్లపై వైద్యారోగ్యశాఖ అధికారుల తనిఖీలు, సిబ్బంది వివరాలు, వివిధ కేసుల నమోదుపై ఎప్పటికప్పుడు నివేదికలు తీసుకోకపోవడంతో ఎవరి ఇష్టారాజ్యంగా వారు వ్యవహరిస్తున్నారు. ప్రైవేట్ ల్యాబ్లు, క్లినిక్ల అనుమతులు, రెన్యువల్ విషయాల్లో పెద్ద ఎత్తున చేతులు తడుపుతున్న క్రమంలో ప్రైవేట్ నిర్వాహకులు కీలకమైన వ్యాధి నిర్ధారణ విషయాలు అధికారులకు అందించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరోనా పాజిటివ్ కేసుల వివరాలతో ఈ విషయం స్పష్టమవుతుందన్న వాదన వినిపిస్తోంది. 20 పడకలతో ప్రత్యేక వార్డు.. ఎంజీఎంలో కరోనా చికిత్స కోసం 20 పడకలతో ప్రత్యేక వార్డు అందుబాటులో ఉంచాం. గతంలో కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో పనిచేసిన వైద్యులు, వారి బృందం అందుబాటులో ఉంది. దీనికితోడు 500 నుంచి 800 ఆక్సిజన్ బెడ్లు కూడా ఉన్నాయి. ఎంత పెద్ద ఆపద వచ్చినా ఆదుకునేందుకు ఈ పెద్దాస్పత్రి సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు కరోనాతో ఎంజీఎంలో ఎవరూ చేరలేదు. – కిశోర్, ఎంజీఎం సూపరింటెండెంట్ ●● ఓల్డ్ అడ్మిషన్స్ బిల్డింగ్లో అన్ని ఏర్పాట్లు ● ఉత్తర్వులు జారీ చేసిన వర్సిటీ అధికారులు న్యూస్రీల్ రెండు జిల్లాల్లోని వివిధ ఆస్పత్రుల బెడ్ల సంఖ్య వివరాల సేకరణపై దృష్టి గతంలోనే 1,100 పడకలతో సేవలందించిన ఎంజీఎం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కరోనా కిట్లు రాగానే పరీక్షలు షురూ ఇప్పటివరకు కరోనా ప్రభావం లేదంటున్న వరంగల్, హనుమకొండ జిల్లాల వైద్యారోగ్యశాఖ అధికారులు -
పద్మశ్రీ సమ్మయ్యకు గవర్నర్ సన్మానం
దేవరుప్పుల: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం రాజ్ భవన్లో నిర్వహించిన సాంస్కృతిక సమ్మేళనం కార్యక్రమంలో జనగామ జిల్లా దేవరుప్పుల మండలానికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత గడ్డం సమ్మయ్యను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ప్రిన్సిపల్ సెక్రటరీ దానం కిశోర్ సన్మానించారు. ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడుతూ చిందు యక్షగాన కళల వైభవం కోసం పాటుపడినందుకు సన్మానం లభించిందన్నారు. కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ, గంటా చక్రపాణి, డైరెక్టర్ తరుణ్, ఐఐసీటీ డైరెక్టర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.చెస్లో దేవాన్ష్కు అంతర్జాతీయ రేటింగ్ వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం వంగపహాడ్కు చెందిన బైరి దేవాన్ష్రెడ్డి చదరంగంలో అంతర్జాతీయ రేటింగ్ సాధించినట్లు జిల్లా చదరంగ సమాఖ్య ప్రతినిధి పి. కన్నా తెలిపారు. హనుమకొండ రాంనగర్లోని చిల్డ్రన్స్ మాంటిస్సోరి స్కూల్లో ఒకటో తరగతి చదువుతున్న దేవాన్ష్రెడ్డి ఈ ఏడాది ఏప్రిల్ 26 నుంచి 30వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో జరిగిన అంతర్జాతీయ క్లాసికల్ విభాగంలో 1508 రేటింగ్ సాధించడం హర్షణీయమన్నారు. దేవాన్ష్రెడ్డి ఆరుగురు అంతర్జాతీయ రేటెడ్ క్రీడాకారులతో తలపడి విజయం సాధించారన్నారు. ఈ రేటింగ్ సాధించడంపై తల్లిదండ్రులు రఘువీరారెడ్డి, దివ్య సంతోషం వ్యక్తం చేశారు. లోకో పైలెట్ల భర్తీకి గ్రీన్సిగ్నల్ ● కాజీపేట రైల్వే అభివృద్ధిలో ఫలించిన ఎంపీ కావ్య కృషికాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే అభివృద్ధిలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పలుమార్లు చేసిన విజ్ఞప్తులపై దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్జైన్ సానుకూలంగా స్పందించి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్ కాజీపేట లోకో రన్నింగ్ డిపో క్రూ లింక్లు మార్చడం, ఖాళీ ఉద్యోగాలు భర్తీ చేయడంపై ఎంపీకి లేఖ రాశారు. సోమవారం ఎంపీ కావ్య విలేకరులకు తెలిపిన వివరాలు. విజయవాడ–బల్లార్షా మధ్య 24 వందేభారత్ రైళ్లు..130 కి.మీ.వేగంతో నడుస్తున్నాయని, ఇందుకు విజయవాడ, కాజీపేట, సికింద్రాబాద్ డిపోల్లో కొన్ని క్రూ లింక్లు మార్చారని, సికింద్రాబాద్ డివిజన్లో ఖాళీల భర్తీకి 272 మంది అసిస్టెంట్ లోకోపైలెట్లు శిక్షణ తీసుకుంటున్నారని చెప్పా రు. జూలై నాటికి శిక్షణ పూర్తి చేస్తారని, 56 మంది కొత్త వాళ్లకు శిక్షణ ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నారని తెలిపారు. అలాగే 1,498 మంది అసిస్టెంట్ లోకోపైలెట్ల ఉద్యోగాల కోసం ఎంపిక ప్రక్రియ కూడా జరుగుతుందని జీఎం లేఖలో పేర్కొన్నారు. అసిస్టెంట్ లోకో పైలెట్లకు శిక్షణ పూర్తయిన తర్వాత కాజీపేట డ్రైవర్ల డిపోలో ఖాళీలు భర్తీ చేస్తామని జీఎం లేఖలో తెలియజేశారు. కాజీపేట జంక్షన్ ప్రాముఖ్యతను కాపాడేందకు అవసరమైన చర్యలు తీసుకుంటామని జీఎం హామీ ఇచ్చారని ఎంపీ తెలిపారు. కాజీపేట రైల్వే బస్టాండ్ నిర్మాణానికి త్వరితగతిన స్థల కేటాయింపు నిర్ణయం తీసుకోవాలని రైల్వే జీఎంను కోరగా జీఎం సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. రైల్వే విస్తరణ అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం సమాన విలువ గల భూమిని కేటాయించడానికి సిద్ధంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం చూపిన భూమి విషయంలో రైల్వే అధికారులు ఆమోదం తెలిపితే త్వరితగతిన రైల్వే బస్టాండ్ పనులు వేగంగా జరుగుతాయని అన్నారు. బస్టాండ్ ఏర్పాటుతో ప్రయాణికులకు మరిన్ని మెరుగైన రవాణా సేవలు అందుతాయని ఆమె పేర్కొన్నారు. -
రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యమవుదాం
కేయూ క్యాంపస్: తెలంగాణ రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యమవుదామని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్ర తాప్రెడ్డి అన్నారు. సోమవారం యూనివర్సిటీలోని పరిపాలనభవ నం ప్రాంగణంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దశాబ్దాల కల తెలంగాణ సాకారం చేసుకున్నామన్నారు. రాష్ట్ర సాధనలో ఎంతోమంది అసువులు బాశారని, అమరులకు శ్రద్ధాంజలి ఘటించాలన్నారు. రాష్ట్రసాధనలో కాకతీయ యూ నివర్సిటీకీలక పాత్ర వహించిందన్నారు. కేయూ మాజీ వీసీ దివంగత జయశంకర్ భూమిక మన కు గర్వకారణమన్నారు. కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం మా ట్లాడుతూ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ ఎదుగుతున్న క్రమంలో ప్రజలందరి తోడ్పా టు అవసరమన్నారు. కేయూ పాలకమండలి సభ్యులు అనితారెడ్డి, సురేశ్లాల్, రమ, చిర్రరాజు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ వల్లాలపృథ్వీరాజ్ పాల్గొన్నారు. కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి -
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ‘ఎస్ఆర్’ ప్రభంజనం
విద్యారణ్యపురి: దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక జేఈఈ అడ్వాన్స్డ్ –2025 ఫలితాల్లో ఎస్ఆర్ విద్యాసంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని ఆ విద్యాసంస్థల చైర్మన్ ఎ. వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్రెడ్డి, సంతోశ్ రెడ్డి సోమవారం తెలిపారు. ఈ ఫలితాల్లో ఎస్ఆర్ విద్యాసంస్థల విద్యార్థులు జాతీయ స్థాయిలో అన్ని కేటగిరీల్లో కలిపి ఎం. రవిచంద్రారెడ్డి 8వ ర్యాంకు, వి. నాగసిద్దార్థ 13వ ర్యాంకు, పి. సాక్షి 40వ ర్యాంకు, ఎ. అనుశ్రీ 47వ ర్యాంకు సాధించి ఎస్ఆర్ కీర్తి ప్రతిష్టను జాతీయ స్థాయిలో నిలబెట్టారని వారు తెలిపారు. బి. సాయి 68వ ర్యాంకు, బి. భరణి శంకర్ 90వ ర్యాంకు, జి. రాజేశ్ 106వ ర్యాంకు, బి. వినోద్ 115వ ర్యాంకు, ఎం. వెంకటకౌసిక్ 123వ ర్యాంకు, ఎస్. పవన్ 204వ ర్యాంకు, ఎ. సంతోశ్ 265వ ర్యాంకు, బి. వాగ్దేవి 269వ ర్యాంకు సాధించారని వారు పేర్కొన్నారు. ఇంకా పలువురు ఎన్నో ర్యాంకులు సాధించారని వారు వివరించారు. భవిష్యత్లో మరింత అత్యత్తమ ర్యాంకులు సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతామని వారు పేర్కొన్నారు. 50 సంవత్సరాలుగా పటిష్ట ప్రణాళికతో హైస్కూల్, జూనియర్ కాలేజీ ఎంసెట్ , ఐఐటీల్లో విద్యనందిస్తూ ప్రతీ ఏడాది రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో తమ తమ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తున్నారని వారు తెలిపారు. -
టీజీ ఎన్పీడీసీఎల్లో కొత్త ఒరవడికి శ్రీకారం
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్ కొత్త ఒరవడికి శ్రీకా రం చుట్టిందని ఆ కంపెనీ ఇన్చార్డ్ డైరెక్టర్ (హెచ్ఆర్డీ) బి.అశోక్ కుమార్ అన్నారు. సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ముందు జాతీయ పతాకాన్ని ఇన్చార్డ్ డైరెక్టర్ బి.అశోక్ కుమార్ ఆవిష్కరించారు. అనంతరం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన విద్యుత్ ఉద్యోగులకు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా అశోక్ కుమార్ మాట్లాడుతూ సీఎండీ వరుణ్ రెడ్డి టీజీ ఎన్పీడీసీఎల్లో సాంకేతిక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ రూ. కోటీ ప్రమాద బీమా సౌకర్యం కల్పించారన్నారు. విద్యుత్ ఉద్యోగులకు శిక్షణ నిర్వహణ, ఇ–స్టోర్స్, డిస్ట్రిబ్యూషన్ ఆటోమేషన్ – కంట్రోల్, కస్టమర్ కేర్ సెంటర్, విద్యుత్ ప్రజావాణి, సైది సైఫీ లాంటి ఎన్నో నూతన విధానాలకు సీఎండీ రూపకల్పన చేశారని వివరించారు. ప్రస్తుతం రూ.2780 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. మినిస్ట్రీ ఆఫ్ పవర్ 2023 సంవత్సరానికి కన్జ్యూమర్ సర్వీస్ రేటింగ్ లో ‘ఎ’ గ్రేడ్ సాధించామన్నారు. ఎన్పీడీసీఎల్కి ఇప్పా యి పవర్ అవార్డులు 4 దక్కాయని తెలిపారు. కార్యక్రమంలో ఇన్చార్జి డైరెక్టర్లు టి.సదర్లాల్, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, చీఫ్ ఇంజనీర్లు కె.తిరుమల్ రావు, రాజుచౌహాన్, రవీంద్రనాథ్, కె.వెంకట రమణ, జాయింట్ సెక్రటరీ కె.రమేశ్, కంపెనీ కార్యదర్శి కె.వెంకటేశం, వరంగల్ ఏపీటీఎస్ సీఐ కిరణ్, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఇన్చార్జ్ డైరెక్టర్ బి.అశోక్కుమార్ -
వైద్యసేవలు సమర్థవంతంగా అందించాలి
ఖిలా వరంగల్: పేదలకు వైద్య సేవలు మరింత సమర్థవంతంగా అందించాలని రాష్ట్ర పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు. ప్రధానమంత్రి స్వస్త్య యోజన సురక్ష యోజన (పీఎంఎస్ఎస్వై) సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండీషన్ (హెచ్వ్యాక్) సిస్టమ్నకు మరమ్మతులు చేసి వెంటనే రోగులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా సోమవారం ఖిలా వరంగల్ ఖుష్మహాల్ ప్రాంగణంలో జరిగిన వేడుకల అనంతరం ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, శ్రీపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్రెడ్డి, కలెక్టర్ సత్యశారదతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఎంజీఎం, కాకతీయ మెడికల్ కళాశాలలోని పీఎంఎస్ఎస్వై సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్వహణ, వైద్య సేవలు తదితర అంశాలపై సమీక్షించి మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం పెరిగేలా మెరుగైన సేవలందించాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి -
ఐదుగురు ఏఆర్లకు అంతర్గత బదిలీలు
కేయూ క్యాంపస్: కేయూలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఐదుగురు అసిస్టెంట్ రిజిస్ట్రార్ల (ఏఆర్)ను అంతర్గంగా బదిలీలు చేశారు. అలాగే, వారికి అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. మరో ఏఆర్కు మరో రెండుచోట్ల అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రిజిస్ట్రార్ వి. రామచంద్రం సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ● యూనివర్సిటీ కాలేజీలో ఏఆర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పి. శ్రీధర్ను పరిపాలనాభవనంలోని టీచింగ్,నాన్టీచింగ్ విభాగాలకు బదిలీ చేశారు. అదనంగా లీగల్ సెల్ బాధ్యతలు అప్పగించారు. ● టీచింగ్, నాన్టీచింగ్ విభాగంలో ఏఆర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీహెచ్ ప్రణయ్కుమార్ను సీడీసీ విభాగానికి బదిలీ చేశారు. యూనివర్సిటీ ఫార్మసీకాలేజీ, కేయూ గెస్ట్హౌజ్ అదనపు బాధ్యత అప్పగించారు. ● కేయూ పరీక్షల విభాగంలో ఏఆర్గా పనిచేస్తున్న ఆర్. శ్రీలతాదేవిని పరిపాలన భవనంలోని అకౌంట్స్ విభాగానికి బదిలీచేశారు.సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల డైరెక్టర్ కార్యాలయం అదనపు బాధ్యతలు అప్పగించారు. ● కేయూ అకౌంట్స్ విభాగంలో ఏఆర్గా పనిచేస్తున్న కె.శ్రీలతను హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్కాలేజీకి బదిలీ చేశారు. సుబేదారి యూనివర్సిటీ పీజీ కాలేజీ, యూనివర్సిటీ మహిళా పీజీ కాలేజీ అదనపు బాధ్యతలు అప్పగించారు. ● కేయూ ఇంజనీరింగ్కాలేజీ(కోఎడ్యుకేషన్) ఏఆర్గా పనిచేస్తున్న బి. నేతాజీని పరీక్షల విభాగానికి బదిలీ చేశారు. అలాగే, అదే ఇంజనీరింగ్కాలేజీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ అదనపు బాధ్యతలు అప్పగించారు. ● కేయూ అకడమిక్ బ్రాంచ్లో ఏఆర్గా పనిచేస్తున్న కోలశంకర్ను క్యాంపస్లోని యూనివర్సిటీ కాలేజీ, అలాగే ఎడ్యుకేషన్ కాలేజీ అదనపు బాధ్యతలు అప్పగించారు. అదనపు బాధ్యతలు కూడా.. మరో ఏఆర్కు సైతం అదనపు బాధ్యతలు -
పురోగతిలో ఆర్టీసీ వరంగల్ రీజియన్
● రీజినల్ మేనేజర్ దర్శనం విజయభాను హన్మకొండ: గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం అన్ని పారామీటర్లలో పురోగతిని సాధించామని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ దర్శనం విజయభాను అన్నారు. సోమవారం హనుమకొండలోని వరంగల్ రీజియన్ కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 2024 నుంచి మార్చి 2025 వరకు గత సంవత్సరంతో పోలిస్తే అదనంగా 29.51 లక్షల కిలోమీటర్లు బస్సులు నడిపి, రూ.134.66 కోట్ల అదనపు ఆదాయం పొందామన్నారు. మహాలక్ష్మి పథకం ప్రారంభమైనప్పటి నుంచి వరంగల్ రీజియన్లో సుమారు రూ.617.18 కోట్ల ఆదాయం పొందామన్నారు. అదే విధంగా గత నెలలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రకటించిన గ్రాండ్ పీక్ చాంలెంజ్లో కూడా వరంగల్ రీజియన్ టార్గెట్ మీద 109 శాతం అధిక ఆదాయం సాధించి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచామన్నారు. అదే విధంగా మే 15 నుంచి 26 వరకు జరిగిన సరస్వతీనది పుష్కరాల సందర్భంగా వరంగల్ రీజియన్ మొత్తం 1,503 బస్సులు నడిపి దాదాపు 4.86 లక్షల ప్రయాణికులను సురక్షితంగా చేరవేసి అధికారుల నుంచి ప్రశంసలు అందుకున్నామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎం కేశరాజు భాను కిరణ్, అకౌంట్స్ ఆఫీసర్ ఎ.రవీందర్, తదితరులు పాల్గొన్నారు. తనయుడి మృతి.. మరునాడే తండ్రి మరణంఎల్కతుర్తి: అనారోగ్యం బారిన పడిన కొడుకు ఎంజీఎంలో చికిత్స పొదుతూ ఆదివారం మృతి చెందాడు. కొడుకు మరణవార్త తెలిసిన తండ్రి మరునాడు సోమవారం మరణించిన ఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. ములుగూరి శ్రీని వాస్కు 15 ఏళ్ల క్రితం పెరాలసిస్ వచ్చింది. ఇటీవల వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి తండ్రి పోచయ్యకు ఇటీవల గుండెపోటు రావడంతో హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. మూడు వాల్స్ బ్లాక్ అయ్యాయి.. స్టంట్ వేయలేం.. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయలేం.. తీసుకువెళ్లమని వైద్యులు సూచించడంతో కు టుంబసభ్యులు పోచయ్యను ఇంటికి తీసుకొచ్చారు. అతడి ఆరోగ్యం క్షీణించి మంచం పట్టిన విషయం తెలిసిన కుమారుడు శ్రీనివాస్కు ఆస్పత్రిలోనే ఫిడ్స్ వచ్చి ఆదివారం మృతి చెందాడు. కొడుకు మరణవార్త విన్న తండ్రి పోచయ్య(75) కలత చెంది సోమవారం సాయంత్రం మరణించాడు. -
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి : సీపీ సన్ప్రీత్ సింగ్
వరంగల్ క్రైం : పదవీ విరమణ అనంతరం పోలీస్ అధికారులు తమ వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. కమిషనరేట్ పరిధిలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన పలువురు పోలీస్ అధికారులను సీపీ సోమవారం సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఉద్యో గ విరమణ పొందిన అధికారుల సేవలు నేటితరం పోలీసులకు ఆదర్శమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ విరమణ పొందిన డీసీపీ జనార్దన్, ఎస్సైలు అలీ మహ్మద్, అఫ్జల్ పాషా, రాజిరెడ్డి, పురుషోత్తం, మహేందర్రావు, క్రిష్టాచారి, యాకూ బ్ అలీ, ఏఎస్సై భీంరాజు, హెడ్ కానిస్టేబుల్ రమేశ్ గుప్తా, కానిస్టేబుల్ కొండయ్య పాల్గొన్నారు. -
రెండో రాజధానిగా వరంగల్ అభివృద్ధి
2040 అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ ● మామూనూరు విమానాశ్రయ భూసేకరణకు రూ.205 కోట్లు ● రాష్ట్ర అవతరణ వేడుకల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సాక్షి, వరంగల్ : కాకతీయులు పాలించిన గొప్ప చరిత్ర కలిగిన వరంగల్ నగరాన్ని తెలంగాణకు రెండో రాజధానిగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో కార్యాచరణ రూపొందించిన ప్రభుత్వం.. గతంలో ఎన్నడూ లేని విధంగా నగర అభివృద్ధికి రూ. 4,962 కోట్లు కేటాయించిందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖిలావరంగల్ మైదానంలో సోమవారం నిర్వహించిన వేడుకల్లో మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. 2040 సంవత్సరం వరకు జనాభా పెరుగుదలకు అనుగుణంగా వరంగల్ నగర అవసరాలకు సరిపోయేలా మాస్టర్ ప్లాన్ను తీసుకువచ్చామన్నారు. వరంగల్ ప్రజల చిరకాల స్వప్నమైన మామునూరు ఎయిర్ పోర్టు త్వరలో సాకా రం కాబోతోందని, విమానాశ్రయ భూసేకరణకు ప్రభుత్వం రూ.205కోట్లు ఇప్పటికే విడుదల చేసిందని చెప్పారు. గత ప్రభుత్వం ఆర్భాటంగా శంకుస్థాపన చేసి గాలికి వదిలేసిన వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులను వేగవంతం చేశామని, నర్సంపేటలోని మెడికల్ కాలేజీ, ఆస్పత్రి సేవలు ఇప్పటికే ప్రారంభించామన్నారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కాళోజీ కళాక్షేత్రం పనులను యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేసి సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించి నట్లు పేర్కొన్నారు. వరంగల్ పాత బస్స్టేషన్ స్థానంలో అధునాతన సౌకర్యాలతో కొత్త బస్స్టాండ్ నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. రూ.80 కోట్ల వ్యయంతో వరంగల్లో నిర్మిస్తున్న సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనం(కలెక్టరేట్) పనులు శరవేగంగా పూర్తి చేస్తామని చెప్పారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పనులను చిత్తశుద్ధితో త్వరలోనే పూర్తి చేస్తామని, కొన్ని రోజులుగా ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఇప్పటికే ఇక్కడికి కొన్ని కంపెనీలు వచ్చాయని, ఇటీవల సీఎం విదేశీ పర్యటనలోనూ కొన్ని కంపెనీలు రావడానికి అంగీకరించాయని వివరించారు. వేడుకల్లో కలెక్టర్ డాక్టర్ సత్యశారద, మేయర్ గుండు సుధారాణి, శాసనమండలి సభ్యుడు బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్రెడ్డి, కేఆర్.నాగరాజ్, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, డీసీపీ అంకిత్కుమార్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, స్థానిక ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మరిన్ని చిత్రాలు 8,9లో -
తెలంగాణ రైజింగ్–2047
సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కార్యాచరణ ● రైతుల సమస్యలు తీర్చేందుకు ‘భూభారతి’ ● ఇందిరమ్మ ఇళ్లతో పేదల కల సాకారం ● రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో మంత్రి కొండా సురేఖ హన్మకొండ అర్బన్ : తెలంగాణ సమగ్రాభివృద్ధి–2047 విజన్తో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది.. అందులో పేదల సంక్షేమం, సమగ్ర పాలసీ రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శకత, సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యమిస్తూ లక్ష్య సాధనకు కృషి చేస్తున్నామని రాష్ట్ర పర్యావరణ అటవీ, దేవాదా యశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సోమవారం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హనుమకొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆమె జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్రంలో, జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ముఖ్యంగా మహిళల అభ్యున్నతి, పర్యాటక అభివృద్ధి, నూతన ఉద్యోగాల కల్పన, మహిళా సాధికారికత వంటి అంశాలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నట్టు తెలిపారు. అనంతరం 25 మంది తెలంగాణ అమరవీరుల కుటుంబాల బంధువులను సత్కరించారు. పాఠశాల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను వివరిస్తూ శకటాలను ప్రదర్శించారు. వైద్య ఆరోగ్య శకటానికి మొదటి బహుమతి లభించిందని డీఎంహెచ్ ఓ డాక్టర్ అప్పయ్య తెలిపారు. ఆడబిడ్డలకు అండగా.. ప్రభుత్వం ఆడబిడ్డల అభ్యున్నతికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నదని, ఇందులో భాగంగానే ఆర్టీసీలో ఉచిత ప్రయాణంతో జిల్లాలో ఇప్పటి వరకు 5.50 కోట్ల మంది ప్రయాణించి రూ.222.50 కోట్లు ఆదా చేశారని మంత్రి సురేఖ చెప్పారు. రూ.500లకే వంట గ్యాస్ ఇస్తున్నామని, అలాగే పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో మొదటి దశలో 705, రెండో దశలో 5వేల ఇళ్లు మంజూరు చేశామన్నారు. రైతు రుణ విముక్తి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 54,734 మందికి రూ.450 కోట్లు మాఫీ చేసినట్లు తెలిపారు. రైతులకు పెట్టుబడి సాయం, సన్న వడ్లకు రూ.500 బోనస్ చెల్లిస్తున్నామన్నారు. భూమి లేని పేదలకు రూ.12 వేలు ఆత్మీయ భరోసా అందజేస్తున్నామని, మహిళల ఆర్థికాభివృద్ధికి పెద్దపీట వేసేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 5,052 స్వయం సహాయక సంఘాలకు రూ.511 కోట్లు అందజేశామన్నారు. 8,446 సంఘాలకు రూ.18.33 కోట్లు వీఎల్ఆర్ ఇచ్చినట్లు వివరించారు. కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగ ల్ సీపీ సన్ప్రీత్ సింగ్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అమరవీరులకు మంత్రి నివాళి రాష్ట్ర సాధనలో ప్రాణత్యాగం చేసిన అమరులకు మంత్రి సురేఖ నివాళులర్పించారు. హనుమకొండలోని తెలంగాణ అమరవీరు ల స్తూపం వద్ద మంత్రి సురేఖ, హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ఆశ్విని తానాజి వాఖడే నివాళులర్పించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి కొండా సురేఖ, పక్కన కలెక్టర్ ప్రావీణ్య -
స్వరాష్ట్రంలో ప్రజాస్వామిక శకం ఆరంభం
రాష్ట్ర అవతరణ వేడుకల్లో మేయర్ సుధారాణి న్యూశాయంపేట : ప్రజలు పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో ప్రజాస్వామిక శకం ఆరంభమైందని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా ఆమె మహానగర పాలక సంస్థ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో వరంగల్ నగరం అగ్రగామిగా నిలవడానికి ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారు ల నిబద్ధత, సమన్వయమే కారణమని పేర్కొన్నా రు. సీఎం రేవంత్రెడ్డి వరంగల్ను పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, నగరం రానున్న రోజుల్లో టూరిజం హబ్గా ఏర్పడనుందని చెప్పారు. నగర ప్రజల చిరకాల వాంఛ అయిన అండర్గ్రౌండ్ డ్రెయినేజీ, స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.4,170 కోట్లు మంజూరు చేసిందని, భారీ వర్షాలు కురిసినా ప్రజ లకు ఇబ్బందులు ఉండకుండా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మేయర్ తెలిపారు. స్మార్ట్ సిటీ పథకం ద్వారా రూ.944 కోట్ల 67లక్షలతో 108 అభివృద్ధి పనులు మంజూరు కాగా 70 పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. సోమవారం నుంచి సెప్టెంబర్ 9 వరకు బల్దియా ఆధ్వర్యాన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలను రూపొందించినట్టు తెలిపారు. -
కేడీసీ డిగ్రీ పరీక్షల ఫలితాలు విడుదల
విద్యారణ్యపురి : హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల(అటానమస్)లో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ తదితర కోర్సుల ఫస్టియ ర్ రెండో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను సోమవా రం కేడీసీ కళాశాలలో కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.రాజేందర్, ప్రిన్సి పాల్ డాక్టర్ జి.శ్రీనివాస్తో కలిసి విడుదల చేశారు. రెండో సెమిస్టర్ పరీక్షల్లో 39 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో కేయూ అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ తిరుమలాదేవి, కేడీసీ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ శివనాగశ్రీను, వైస్ ప్రిన్సిపాల్ రజనీలత, అధ్యాపకులు త్యాగ య్య, ఇందిరాదేవి, కొమురయ్య, సమ్మయ్య, వెంకన్న, సీతారాములు, ఎం.వెంకన్న, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ప్రాంగణ నియామకాలుకేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధి కొత్తగూడెం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు హైదరాబాద్ హైటెక్ సిటీలోని డీఎస్కే సాఫ్ట్వేర్ కంపెనీలో ఫ్రంట్ అండ్ డెవలపర్లుగా ప్రాంగణ నియామకాల్లో ఎంపికయ్యారు. కంప్యూటర్ సైన్స్ విభాగానికి చెందిన ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు డి.సత్యారెడ్డి, ఎం.సాయిపవన్, ఎస్.అరవింద్, టి.పుష్కరాణి, ఎం.మనస్విని, ఎ.వర్షిత ఎంపికై పట్లు కొత్తగూడెం కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ జగన్మోహన్రాజు కేయూలో జరిగిన కార్యక్రమంలో తెలిపారు. ఒక్కొక్కరికి వార్షిక వేతనం రూ.6లక్షలు ఉంటుందని, తొలుత మూడునెలలపాటు శిక్షణ కూడా ఇస్తారని, అనంతరం హైటెక్ సిటీలోని డీఎస్కే సాఫ్ట్వేర్ కంపెనీలో పూర్తిస్థాయిలో పనిచేయాల్సింటుందన్నారు. ఆయా విద్యార్థులకు నియమాక పత్రాలను సోమవారం యూనివర్సిటీలో కేయూ వీసీ ప్రొఫెసర్ కె. ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం, ఆ కాలేజీ ప్లేస్మెంట్ డైరెక్టర్ డాక్టర్ వి.రాము, కేయూ పాలకమండలి సభ్యులు డాక్టర్ చిర్ర రాజు అందజేశారు. గ్లోబల్ యూత్ సమ్మిట్కు ప్రియచందనకేయూ క్యాంపస్ : కర్ణాటకలోని మంగుళూరు యోనేసోయి డీమ్డ్ యూనివర్సిటీలో ఈనెల 5, 6వ తేదీల్లో జరగబోయే గ్లోబల్ యూత్ సమ్మిట్–2025కు కేయూ మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థిని కృతిక ప్రియచందన ఎంపికయ్యారు. ఈమేరకు సోమవా రం కేయూలో వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్రెడ్డి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఈసం నారాయణ, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ భిక్షాలు ప్రియచందనను అభినందించారు. గతంలో ప్రియచందన జీ–20 దేశాల ప్రెసిడెన్సీ వక్తృత్వ పోటీల్లో పాల్గొని రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి సాధించి అప్పటి గవర్నర్ నుంచి అభినందనలు అందుకున్నారని నారాయణ తెలిపారు. నియామకం కేయూ క్యాంపస్ : హనుమకొండ సుబేదారిలోని యూనివర్సిటీ పీజీ కళాశాల ప్రిన్సిపాల్గా కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రొఫెసర్ ఎస్.నర్సింహాచారి నియమితులయ్యారు. వీసీ ప్రొఫెసర్ ఆదేశాల మేరకు కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు ప్రిన్సిపాల్గా బాధ్యతలు నిర్వర్తించిన ప్రొఫెసర్ పి.వరలక్ష్మి నుంచి నర్సింహా చారి బాధ్యతలను స్వీకరించనున్నారు. రుద్రేశ్వరుడికి పూజలు హన్మకొండ కల్చరల్ : శ్రీరుద్రేశ్వర స్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో సోమవా రం తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రుద్రేశ్వరస్వామి వారికి పాశుపత ఏకాదశ రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు ఉదయం సుప్రభాతసేవ, సామూహిక రుద్రాభిషేకాలు, అర్చనలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, మానసిక ప్రశాంతతతో జీవించాలని ఆకాంక్షిస్తూ స్వామివారికి పాశుపత ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించామని గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. -
తెలంగాణకు నాడు.. నేడు కాంగ్రెస్సే శాపం
హన్మకొండ: తెలంగాణకు నాడు.. నేడు కాంగ్రెస్ పార్టీ శాపంగా మారిందని రాజ్యసభ మాజీ సభ్యుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కెప్టెన్ వొడితల లక్ష్మీకాంతరావు అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్తో కలిసి మహాత్మా గాంధీ చిత్ర పటానికి పూలమాల వేశాక.. కెప్టెన్ జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి, మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంత చారి, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్, భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్.అంబేద్కర్ చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత వినయ్భాస్కర్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ 60 ఏళ్ల తెలంగాణ కలను సాకారం చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని, కాంగ్రెస్ పార్టీ నాడు.. నేడు తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందగా.. 18 నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగమైందని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మర్రి యాదవ రెడ్డి, ఎల్లావుల లలితా యాదవ్, తాళ్లపల్లి జనార్ధన్, పులి రజనీకాంత్, రామ్మూర్తి, జానకీ రాములు, బొంగు అశోక్, సోదా కిరణ్, ఇమ్మడి రాజు, కడేరావు నర్సింహారావు, ఇమ్మడి లోహిత, నయీముద్దీన్, కంజర్ల మనోజ్ తదితరులు పాల్గొన్నారు. 18 నెలల పాలనలో రాష్ట్రం ఆగమైంది రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు -
డివిజన్ సరే.. సిబ్బంది నియామకమేది..?
హన్మకొండ: డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసిన టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం సిబ్బంది నియామకంపై స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రారంభం.. సేవలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్ వినియోగదారుల విజ్ఞప్తులు.. పరిపాలనా సౌలభ్యం కోసం ఏటూరునాగారం కేంద్రంగా ఎన్పీడీసీఎల్ సేవలు అందించేందుకు యాజమాన్యం ప్రత్యేక డివిజన్ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు గత నెల 31న సీఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. ములుగు డివిజన్ పరిధిలోని ప్రస్తుత సెక్షన్లను విభజించి ఏటూరునాగారం డివిజన్ ఏర్పాటు చేశారు. సీఎండీ పేషీలోని ఒక డీఈ పోస్టును ఏటూరునాగారం డీఈ పోస్టుగా మళ్లించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ డివిజన్ ఏర్పాటుకు అవసరమైన ఇతర ఇంజనీర్లు, సిబ్బంది నియామకంపై ఎలాంటి ఉత్తర్వులు వెలువడక పోవడంతో డివిజన్ ఎప్పుడు ఏర్పాటవుతుంది..? ఎప్పటి నుంచి సేవలు అందుబాటులోకి వస్తా యి..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టీజీ ఎన్పీడీసీఎల్ ములుగు డివిజన్ పరిధిలో ములుగు టౌన్, మల్లంపల్లి, వెంకటాపూర్, పస్రా, తాడ్వాయి సెక్షన్లు, ఏటూరునాగారం సబ్ డివిజన్లోని ఏటూరునాగారం, కమలాపూర్, కన్నాయిగూడెం సెక్షన్లు, ఎన్.వి.పురం సబ్ డివిజన్లోని కె.వెంకటాపురం, వాజేడు సెక్షన్లు ఉన్నాయి. వీటి నుంచి ఏటూరునాగారం, కె.వెంకటాపురం సబ్ డివిజన్లలోని ఏటూరునాగారం, కమలాపూర్, కన్నాయిగూడెం. ఎన్.వెంకటాపురం, వాజేడు సెక్షన్లను కలిపి ఏటూరునాగారం డివిజన్గా ఏర్పాటు చేశారు. డీఈ పోస్టు ఒకటే మంజూరు.. డివిజన్ పాలనా వ్యవహారాలు సాగించేందుకు డివిజనల్ ఇంజనీర్, ఏఈ కమర్షియల్, ఏఈ టెక్నికల్, ఇద్దరు జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్లు, నలుగురు సీనియర్ అసిస్టెంట్లు, ఆరుగురు జూనియర్ అసిస్టెంట్లు, ఒక రికార్డు అసిస్టెంట్, ఇద్దరు ఆఫీస్ సబార్డినేట్లు అవసరం. కాగా ఇందులో ఒక డీఈ పోస్టును మాత్రమే మంజూరు చేశారు. ఇతర పోస్టుల గురించి ఉత్తర్వుల్లో ఎలాంటి ప్రస్తావన లేదు. సీఎండీ పేషీలోని ఒక డీఈ పోస్టును ఏటూరునాగారం డీఈగా మళ్లించినప్పటికీ నియామకం చేపట్టలేదు. ఇతర పోస్టుల మంజూరు, అధికారులు, సిబ్బంది నియామకంపై స్పష్టత లేకపోవడంతో డివిజన్ పరిపాలన కార్యక్రమాల ప్రారంభంపై స్పష్టత లేకుండా పోయింది. పని భారం పెరుగుతుందని ఆందోళన.. అదనపు పోస్టులు మంజూరు చేయకుండా.. అదనపు సిబ్బందిని నియమించకుండా ప్రస్తుత డివిజన్లోని ఉద్యోగులను విభజిస్తే వారిపై పని భారం పెరుగుతుందని ఉద్యోగ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పోస్టులు, సిబ్బందిని నియమించకుండా నూతన డివిజన్ ఏర్పాటు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయి సిబ్బందిని నియమించిన తర్వాతే నూతన కార్యాలయాన్ని ప్రారంభించాలని ఉద్యోగ సంఘాలు, అసోసియేషన్లు డిమాండ్ చేస్తున్నాయి. జిల్లాలు, సర్కిళ్ల పునర్విభజన జరిగి పదేళ్లు దాటుతున్నా ఇప్పటికీ వాచ్మెన్. స్వీపర్ పోస్టుల బైఫరికేషన్ ప్రక్రియ పూర్తి చేయలేదు. బైఫరికేషన్ చేయాలని ఆదేశాలున్నా చర్యలు లేదు. ఇప్పటికై నా యాజమాన్యం వాచ్మెన్, స్వీపర్ పోస్టుల విభజన ప్రక్రియ పూర్తి చేయాలని విద్యుత్ ఉద్యోగ సంఘాల బాధ్యులు కోరుతున్నారు. ఏటూరునాగారం కేంద్రంగా విద్యుత్ డివిజన్ ఏర్పాటు ఉత్తర్వులు జారీ చేసిన టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ అధికారులు, సిబ్బంది నియామకంపై స్పష్టత కరువు ములుగు డివిజన్లోని సెక్షన్ల బదలాయింపుతో సరి.. -
భారీ వాహనాలతో బెంబేలు
సోమవారం శ్రీ 2 శ్రీ జూన్ శ్రీ 2025ఔషధ నిల్వల్లో అధికారుల ఇష్టారాజ్యం ● ఇరుకు గదుల్లో వందలాది రకాల ఔషధాలు ● కానరాని రిఫ్రిజిరేటర్లు.. ఏసీలు ● మౌలిక వసతుల కొరత.. ఎంజీఎం: రోగులకు మెరుగైన మందులు అందించేందుకు ప్రతీ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ డ్రగ్స్ స్టోర్స్ (సీఎంఎస్) నిర్వహణ ప్రశ్నార్థకంగా మారుతోంది. తెలంగాణ రాష్ట్రానికి రెండో రాజధానిగా పేర్కొంటున్న వరంగల్ మెడికల్ హబ్గా మారుతున్న క్రమంలో రెండు ఇరుకై న గదుల్లో సెంట్రల్ డ్రగ్స్ స్టోర్స్ను మౌలిక వసతుల లేని ప్రదేశంలో ఏర్పాటు చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే వరంగల్ జిల్లా కేంద్రంలో 1,500 పడకల ఎంజీఎం ఆస్పత్రి తో పాటు 100 పడకల సీకేఎం ఆస్పత్రి, 100 పడకల నేత్ర వైద్యశాలకు వరంగల్ సెంట్రల్ డ్రగ్స్ స్టోర్స్ నుంచే మందులు సరఫరా అవుతాయి. అంతేకాకుండా వరంగల్ జిల్లా కేంద్రంలో ఉన్న పీహెచ్సీ, యూపీహెచ్సీలకు సైతం ఈ సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ నుంచే ప్రభుత్వం అందించే మందులు సరఫరా చేయాల్సి ఉంది. నిత్యం వేలాది మంది రోగులకు పంపిణీ చేసే సెంట్రల్ డ్రగ్స్ స్టోర్స్ నిర్వహణ చూస్తే పేదలపై అధికారుల ప్రేమ ఏపాటిదో ఇట్టే అర్థమవుతుంది. ఉర్సులో ఇరుకు గదుల్లో.. వరంగల్ జిల్లా కేంద్రంలోని సీకేఎం, ఉర్సు ప్రసూ తి ఆస్పత్రిలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సీఎంఎస్(సెంట్రల్ డ్రగ్ స్టోర్)ను ఇరుకై న రెండు గదుల్లో ఏర్పాటు చేశారు. వరంగల్ జిల్లా పరిధిలో ఎంజీ ఎం, ప్రాంతీయ కంటి దవాఖాన, సీకేఎం ప్రసూతి తో పాటు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నర్సంపేట, వర్ధన్నపేట కమ్యూనిటీ ఆస్పత్రి, అర్బన్ హెల్త్ సెంటర్లు, 14 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మందులు, సర్జికల్స్ ఈ సీఎంఎస్ నుంచే పంపిణీ చేయాల్సి ఉంది. ఇంత ప్రాముఖ్యం ఉన్న మందుల గిడ్డంగికి ముందస్తుగా క్షేత్రస్థాయిలోప్రణాళిక లేకుండా అప్పటికప్పుడు రెండు చిన్న గదుల్లో ఏర్పాటు చేయడం విస్మయానికి గురిచేస్తోంది. అవసరమైన విశాలమైన భవనాలను సమకూర్చాల్సింది. ఔషధాలు పాడవకుండా అవసరమైన రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషన్ రూములు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మౌలిక సౌకర్యాలు లేకుండా బూత్ బంగ్లాను తలపించే విధంగా స్టోర్ భవనం ఉండడం అధికారుల పనితీరుకు నిదర్శనం. సీఎంఎస్ను ఎంజీఎంలోకి మార్చాలి తాత్కాలికంగా సీఎంఎస్ను ఎంజీఎంలో ఖాళీగా ఉన్న ఏదైనా బ్లాక్లోకి మార్చితే సమస్యకు పరి ష్కారం లభిస్తుంది. సీఎంఎస్ మందులలో 75 శాతం మందులను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రే వినియోగించుకుంటోందని బడ్జెట్ గణాంకాల ద్వారా తెలుస్తోంది. అలాంటప్పుడు ఉత్తర తెలంగాణ జిల్లాలకు పెద్దదిక్కుగా, రోగులకు బాసటగా నిలుస్తున్న ఎంజీఎంలో తాత్కాలిక సీఎంఎస్ ఏర్పాటు చేస్తే అత్యవసర సమయాల్లో మందుల సరఫరా కూడా సౌకర్యంగా ఉంటుందని కొందరు వైద్యులు అభిప్రాయ పడుతున్నారు. కొత్తగా నిర్మిస్తున్న బహుళ అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోకి మరికొద్ది నెలల్లో ఎంజీఎం వెళ్లనున్న నేపథ్యంలో ఎంజీఎం లేదా, కేఎంసీలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో తాత్కాలికంగా సీఎంఎస్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అంటున్నారు.న్యూస్రీల్వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఉర్సు ప్రాంతంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్కు ఇరుకై న రోడ్లపై భారీ వాహనాలు మందులతో వస్తుంటాయి. దాంతో రాకపోకలు కష్టతరంగా మారాయని పలువురు వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎంఎస్ ప్రహరీ ప్రధాన గేటులోకి వచ్చిన వాహనాలు కిటెల్ గార్డ్(ఐరన్ ర్యాంప్)లో ఇరుక్కుపోతున్నాయి. -
పోలీస్ అధికారులకు సేవా పతకాలు
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్లో పనిచేస్తున్న 12 మంది పోలీస్ అధికారులకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సేవా పతకాలను ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ఒకరు ఉత్తమ సేవా పతకాని కి, 11 మంది పోలీస్ అధికారులు సేవా పతకా లకు ఎంపికయ్యారు. వీరిని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ ఆదివారం అభినందించారు. ఉత్తమ సేవా పతకానికి హనుమకొండ పోలీస్స్టేషన్ ఏఎస్సై ఎ.రఘునారెడ్డి, సేవా పతకానికి ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, సీసీఆర్బీ ఎస్సై జె.విల్సన్, సుబేదారి ఎస్సై పి.ప్రకాశ్రెడ్డి, ఏఆర్ఎస్సై ఎండీ.మక్బుల్పాషా, ఏఆర్ఎస్సై ఎం.రాంధన్, కాజీపేట ఏఎస్సై వి.చంద్రమౌళి, ఏఆర్ ఎస్సై షేక్ పాషా, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఎండీ.ఖాజానజీముద్దీన్, ఏఆర్ హెడ్కానిస్టేబుల్ బస్సు భీమయ్య, మామునూర్ పోలీస్స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ బి.రమేష్, వంగర పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ కె.తిరుపతిగౌడ్ ఎంపికయ్యారు. డొనేషన్ల వసూలుపై చర్య తీసుకోవాలికేయూ క్యాంపస్: హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ముందస్తు అడ్మిషన్లు కల్పిస్తూ డొనేషన్లు వసూలు చేస్తున్నారని, సదరు కాలేజీపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) రాష్ట్ర అధ్యక్షుడు మొగిలి వెంకటరెడ్డి కోరారు. ఈమేరకు ఆదివా రం కాకతీయ యూనివర్సిటీలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ఇ.పురుషోత్తంను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్లు ఇవ్వడం సరికాదని సంబంధిత కళాశాలపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ కుమార్, బాధ్యులు శంకర్ పాల్గొన్నారు. ‘ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేయొద్దు’విద్యారణ్యపురి: ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేయొద్దు.. ఇటీవల పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన టీచర్ల సర్దుబాటు ఉత్తర్వులు ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేసేలా ఉన్నాయి.. వాటిని వెనక్కి తీసుకోవాలని పీఆర్టీయూ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మంద తిరుపతిరెడ్డి, జనరల్ సెక్రటరీ ఫలిత శ్రీహరి డిమాండ్ చేశా రు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే విధంగా సర్దుబాటు ఉత్తర్వులు ఉండాలని, అనవసరమైన రేషనలైజేషన్ నిబంధనలను పాటించడం వల్ల ప్రాథమిక విద్యపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ‘బడిబాట’ కార్యక్రమం పూర్తయ్యాకే టీచర్ల సర్దుబాటు చేపట్టాలని ఒక ప్రకటనలో కోరారు. ‘బెస్ట్ అవైలబుల్ స్కీం’ దరఖాస్తుల ఆహ్వానం న్యూశాయంపేట : బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం పథకం ద్వారా షెడ్యూల్ కులాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులకు 2025–26 విద్యాసంవత్సరం అడ్మిషన్ల కోసం అర్హులు దరఖాస్తు చేసుకోవాలని వరంగల్ జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి పి.భాగ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్ జిల్లాకు 1వ తరగతి 60 సీట్లు, 5వ తరగతి 62 సీట్లు కేటాయించారని, ఈనెల 16వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని, ఇతర వివరాలకు సహాయ సాంఘిక సంక్షేమ అధికారి కార్యాలయం, వరంగల్, సహాయ సాంఘిక కార్యాలయం సంక్షేమాధికారి, నర్సంపేటలో సంప్రదించాలని సూచించారు. రామ్కిషన్కు సన్మానంహన్మకొండ: ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహా ప్యానెల్ సభ్యుడిగా నియమితుడైన హనుమకొండకు చెందిన డాక్టర్ అజ్మీరా రామ్కిషన్ను వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఆదివారం సన్మానించారు. హనుమకొండ కనకదుర్గ కాలనీలోని స్వగృహంలో ఎంపీ డాక్టర్ కావ్యను అజ్మీరా రామ్కిషన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ కావ్య ఆయనను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. పరకాల నియోజకవర్గంలోని బావుసింగ్పల్లికి చెందిన రామ్కిషన్ ప్రస్తుతం ఢిల్లీలో జాయింట్ డ్రగ్ కంట్రోలర్గా పనిచేస్తున్నారు. వైద్యరంగంలో అపారమైన సేవలందిస్తూ ప్రపంచంలోని ప్రముఖ సంస్థకు సలహాదారుడిగా వ్యవహరించడం గొప్ప విషయమని ఎంపీ కావ్య కొనియాడారు. -
హనుమకొండ పరేడ్ గ్రౌండ్స్లో..
హన్మకొండ అర్బన్: తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా హనుమకొండలోని పోలీస్ పరేడ్గ్రౌండ్ను ముస్తాబు చేశారు. జిల్లా యంత్రాంగం వేడుకలకు అవసరమైన ఏర్పాట్లు చేసింది. హనుమకొండలో జరిగే వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఉదయం 9.40 గంటలకు హనుమకొండ అదాలత్లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన అనంతరం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అమరుల కుటుంబాలకు సత్కారం తదితర కార్యక్రమాలు ఉంటాయి. అవతరణ వేడుకల సందర్భంగా కలెక్టరేట్, టౌన్హాల్ తదితర భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, జిల్లా ప్రముఖులను కలెక్టర్ ప్రావీణ్య ఆహ్వానించారు. -
సైక్లింగ్తో ఒత్తిడి దూరం
● ఇన్చార్జ్ డీవైఎస్ఓ దేవిక వరంగల్ స్పోర్ట్స్: నిత్యం ఉదయం గంట పాటు సైక్లింగ్ చేయడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఒత్తిడిని జయించవచ్చని హనుమకొండ ఇన్చార్జ్ డీవైఎస్ఓ దేవిక అన్నారు. అంతర్జాతీయ సైక్లింగ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం హనుమకొండలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యాన చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. ఉరుకుల పరుగులు జీవితంలో ప్రతీ ఒక్కరు శారీక వ్యాయామాన్ని తప్పనిసరిగా అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సైక్లింగ్ సంఘం జిల్లా అధ్యక్షుడు రాజయ్య, వాకర్స్ సైక్లింగ్ సంఘం అధ్యక్షుడు గోపాల్రెడ్డి, వివిధ క్రీడా సంఘాల బాధ్యులు పవన్కుమార్, శ్యాంప్రసాద్, డీఎస్ఏ కోచ్లు నరేందర్, రమేష్, విష్ణువర్ధన్, అఫ్జల్, శంకర్, వెంకట్, ప్రభుదాస్ పాల్గొన్నారు. -
ఆఫీసర్స్ క్లబ్ నిధుల్లో అక్రమాలు
వరంగల్ క్రైం: సుబేదారి పోలీస్స్టేషన్ పరిధి ఆఫీసర్స్ క్లబ్లో మేనేజర్ ముసుగులో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు సుబేదారి ఇన్స్పెక్టర్ సత్యనారాయణరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన పోలీస్స్టేషన్లో వివరాలు వెల్లడించారు. 2015 సంవత్సరంలో గోలి గోపాల్రెడ్డి ఆఫీసర్స్ క్లబ్లో చేరి సభ్యత్వం కోసం వచ్చే వారి నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.1,40 లక్షలు వసూలు చేసి ఆ మొత్తాన్ని క్లబ్ అకౌంట్లో జమ చేయకుండా ఇలా రూ.130 కోట్లు సొంతానికి వాడుకున్నట్లు పేర్కొన్నారు. గోలి గోపాల్రెడ్డి క్లబ్లో షటిల్ బాయ్గా పనిచేస్తున్న పొడిశెట్టి రవీందర్కు డబ్బు ఆశచూపి ఏడుగురు సభ్యులను తీసుకురాగా వారి నుంచి రూ.1.50 లక్షల చొప్పున వసూలు చేసి అకౌంట్లో జమచేయలేదని తెలిపారు. అలాగే.. 2019లో జాయింట్ సెక్రటరీగా ఉన్న చెరుకు వెంకటరాజిరెడ్డి ముగ్గురు సభ్యుల డబ్బులు రూ.4.20 లక్షలు, ఇతర డబ్బులు రూ.60 లక్షలు కూడా సొంతానికి వాడినట్లు వివరించారు. అంతేకాకుండా క్లబ్లో పనిచేస్తున్న శ్రీనివాస్కు రూ.10 లక్షలు ఇస్తానని ఆశ చూపి ఇవ్వకపోవడంతో అతను 2024 ఏప్రిల్ 18న క్లబ్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. తన ఆత్మహత్యకు గోలి గోపాల్రెడ్డి, రాజిరెడ్డి, రవీందర్ కారణామని శ్రీనివాస్ తన కుమారుడికి ఫోన్లో వీడియో పంపడంతో కేసు నమోదు చేసినట్లు వివరించారు. క్లబ్ డబ్బులు రూ.2 కోట్లు సొంతానికి వాడుకోవడమే కాకుండా.. శ్రీనివాస్ ఆత్మహత్యకు కారణమైన ఆ ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు పంపించినట్లు ఇన్స్పెక్టర్ సత్యనారాయణరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై రామారావు, ఏఎస్సై వెంకటేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసస్వామి, రోషన్ అలీ, కానిస్టేబుళ్లు ఉమేష్, దేవేందర్లను ఇన్స్పెక్టర్ అభినందించారు. రూ.2కోట్లు స్వాహా.. ముగ్గురి అరెస్టు -
లంచం అడిగేవారిని పట్టిస్తే రూ.25వేల గిఫ్ట్
కాజీపేట అర్బన్ : ‘ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తామని లంచం అడిగేవారిని నాకు పట్టిస్తే రూ.25వేలు గిఫ్ట్గా ఇస్తాను.. అలాగే సదరు వ్యక్తిని పార్టీ నుంచి బహిష్కరిస్తానని’ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి తెలిపారు. హంటర్రోడ్డులోని అభిరామ్ గార్డెన్స్లో ఆదివారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ప్రారంభించి మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లను పూర్తి పారదర్శకంగా అర్హులకే అందజేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్కరికై నా ఇల్లు మంజూరు చేసిందా అని ప్రశ్నించారు. అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఓర్వడం లేదన్నారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేస్తున్నామని, అందులో 660 పత్రాలు ఇచ్చామని, త్వరలో మిగతావి అందజేస్తానని చెప్పారు. మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారులు 3వ తేదీన ముగ్గుపోసుకుని నిర్మాణాలు ప్రారంభించి దావతు చేసుకుని తనను ఆహ్వానిస్తే ఆనందంగా వస్తానని తెలిపారు. గత ప్రభుత్వం నిర్మించి పంపిణీ చేయకుండా వదిలేసిన డబుల్ బెడ్రూం ఇళ్ల పని పడతానని, 15 రోజుల్లో అర్హులకు వాటిని అందజేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ, డిప్యూటీ కమిషనర్ రవీందర్, తహసీల్దార్ బావుసింగ్, కార్పొరేటర్లు మామిండ్ల రాజు, జక్కుల రవీందర్యాదవ్, విజయశ్రీ రజాలీ, తోట వెంకన్న, పోతుల శ్రీమాన్, దేవ్రాజ్, సురేష్ పాల్గొన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి -
వేడుకలు వైభవంగా నిర్వహించాలి
న్యూశాయంపేట: రాష్ట్ర అవతరణ వేడుకలను వైభవంగా నిర్వహించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్లో ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్, అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణితో కలిసి రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణపై శనివారం సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయం అవసరమన్నారు. ఖుష్మహల్లో ఏర్పాటు చేయనున్న అవతరణ వేడుకలను అధికారికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జ్ మంత్రి, రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వస్తున్న సందర్భంగా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వేదిక ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ శాఖల సంక్షేమ అభివృద్ధి స్టాల్స్, శకటాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆ ఏర్పాట్లు ఆదివారం లోపు పూర్తి చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ విజయలక్ష్మి, వరంగల్ ఆర్డీఓ సత్యపాల్రెడ్డి, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, జెడ్పీ సీఈఓ రామ్రెడ్డి, హౌజింగ్ పీడీ గణపతి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, వరంగల్, ఖిలా వరంగల్ తహసీల్దార్లు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. 3 నుంచి 20 వరకు రెవెన్యూ సదస్సులు భూభారతి చట్టం–25 అమల్లో భాగంగా వరంగల్ జిల్లాలోని (వర్ధన్నపేట మండలం మినహాయించి) అన్ని మండలాల్లోని రెవెన్యూ గ్రామాల్లో భూసమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ సత్యశారద శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అన్ని మండలాల రెవెన్యూ గ్రామాల పంచాయతీ కార్యాలయాల ఆవరణలో సదస్సులు ఉంటాయని తెలిపారు. రైతులు తమ వ్యవసాయ భూములతో పాటు గ్రామస్థాయిలో ఉండే భూసమస్యల పరిష్కారం కోసం సదస్సులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా అధికారులు రెండు బృందాలుగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉంటారన్నారు. సమస్యల పరిష్కారానికి రైతులు సదస్సులు వినియోగించుకోవాలని కోరారు. 3నుంచి రెవెన్యూ సదస్సులు వరంగల్ కలెక్టర్ సత్యశారద -
ప్రభుత్వాల మెడలు వంచుదాం
హన్మకొండ: ఉద్యమాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి, కార్మికుల హక్కులు సాధించుకుందామని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కార్మిక మాసోత్సవం ముగింపు సందర్భంగా హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు వద్ద శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల హక్కుల సాధన కోసం బలమైన ఉద్యమాలు నిర్మించాల్సిన సమ యం ఆసన్నమైందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే ఉపసంహరించుకోవాలని సూచించారు. కేసీఆర్ పాలనలో వీధి వ్యాపారులకు రుణాలు అందించడంతో పాటు వెండింగ్ జోన్లను ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. నాడు తెచ్చిన 2014 చిరు వ్యాపారుల రక్షణ చట్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు బొంగు అశోక్ యాదవ్, చెన్నం మధు, సంకు నర్సింగ్, సోదా కిరణ్, కార్యక్రమ కన్వీనర్ నాయిని రవి, కార్మిక నాయకులు, తెలంగాణ ఆటో యూనియన్, ప్రతాపరుద్ర ఆటో యూనియన్, భవన నిర్మాణ రంగంలోని 14 రంగాల కార్మికులు, చిరు వ్యాపారులు, తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ -
ఆదివారం శ్రీ 1 శ్రీ జూన్ శ్రీ 2025
– 8లోuచిన్న పెండ్యాల గ్రామంలో సుమారు 250 కుటుంబాలు ఉంటాయి. వీరి ప్రధాన జీవనాధారం వ్యవసాయం, కులవృత్తులు. మబ్బుల్నే నిద్రనుంచి లేవడం, పొలంబాట పట్టడం, వ్యవసాయ పనులు చేసుకుని సాయంత్రానికి ఇంటికి చేరడం వీరి రోజువారీ విధి. వరంగల్, జనగామ, మహా అంటే హైదరాబాద్ తప్ప ఇతర పెద్ద నగరానికి వెళ్లింది లేదు. బస్సు, కారు తప్ప ఇతర వాహనం ఎక్కింది లేదు. కానీ వారిలోని ఐక్యమత్యం.. వారిని రాష్ట్రం దాటించింది. ఎప్పుడూ ఆకాశంలో వెళ్తుంటే చూసిన విమానాన్ని సైతం తమ దరికి చేర్చింది. పరపతి సంఘాల ఏర్పాటుతో రూపాయి, రూపాయి పొదుపు చేసుకుని అందులోనుంచే ఖర్చు చేసి విమానాన్ని ఎక్కారు. ఎప్పుడూ చూడలేమనుకున్న అనేక ప్రాంతాలను చుట్టివచ్చారు. ఈ గ్రామంలో మొత్తం కలిపి 22 పరపతి సంఘాల దాకా ఉంటాయి. అందులో పెద్దవి ఐదు (చైతన్య, ప్రగతి, శ్రీలక్ష్మీ, సిరి, శ్రీగణేశ్) ఉన్నాయి. ఇందులో అన్ని కులాలు, వృత్తుల వారు సభ్యులుగా ఉన్నారు. ప్రతీ సభ్యుడు నెలకు రూ.100 వేసుకుంటున్నారు. ప్రతీనెలా ఒకరు ఎత్తుకుని 1 శాతం చొప్పున వడ్డీ కడతారు. ఇలా కొన్నేళ్లుగా జమచేసిన డబ్బులే వారి ఆర్థిక ప్రగతికి సహకారం అందిస్తున్నాయి. ● పరపతి సంఘం ద్వారా సామాన్యుల విమానయానం ● కల నెరవేర్చుకున్న రైతులు, కూలీలు, వృత్తిదారులు ● కుటుంబ సమేతంగా ఛార్ధామ్, ఆగ్రా, కాశీ విహారయాత్రలు ● దేశాన్ని చుట్టివస్తున్న చిన్నపెండ్యాల గ్రామస్తులు విమానం పోతుంటే చూసేటోడిని.. నా కులవృత్తి తాళ్లు ఎక్కడం. రోజూ ఉదయం, సాయంత్రం తాటిచెట్లు ఎక్కి కల్లు అమ్ముకుంటాం. బయటి ఊర్లకు ఎక్కువగా వెళ్లింది లేదు. ఎప్పుడైనా ఆకాశంలో విమానం వెళ్తుంటే తాటిచెట్టుపైనుంచి చూసేటోడిని. కానీ ఆ విమానం నేను ఎక్కగలనా.. అనుకున్నా. ఆ కల నెరవేరింది. పరపతి సంఘం ద్వారా సభ్యులంతా కుటుంబంతో కలిసి ఛార్ధామ్యాత్రకు విమానంలో వెళ్లాం. మొదటిసారి విమానం ఎక్కినప్పుడు ఎంతో సంతోషం వేసింది. – గీసగోని రాజయ్య, గీతకార్మికుడు ప్రముఖులెవరైనా సభకో, సమావేశానికో వస్తే వాళ్లంతా వరుసకట్టేవారు. వారి మాటలు వినడానికో, సమావేశంలో పాల్గొనడానికో కాదు.. వారిని తీసుకొచ్చిన హెలికాప్టర్ను చూడ్డానికి.. అది కూడా అరకిలోమీటరు దూరం నుంచి.. జీవితంలో ఒక్కసారైనా కనీసం వాటిని తాకుతామా? అని ఆలోచించేవారు. కానీ చిన్నమొత్తాల పొదుపే వారిని ఆకాశంలో విహరించేలా చేసింది. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం చిన్నపెండ్యాల గ్రామస్తుల కలలకు రెక్కలు తొడిగింది.గాల్లో వెళ్తుంటే బాగుంది..గ్రామంలో రోజూ కూలి పనికి వెళ్తా. వరినాట్లు, ఇతర వ్యవసాయ పనులకు వెళ్తుంటా. మేం పరపతి సంఘంలో సభ్యులుగా చేరాం. అందరితో కలిసి విమానం ఎక్కిన తర్వాత మొదట కొంచెం భయం వేసింది. ఆ తర్వాత గాల్లో వెళ్తుంటే బాగుంది. యాత్రలో అందరితో కలిసి పడవ ఎక్కినం, స్టీమర్ ఎక్కినం. ఛార్ధామ్ యాత్రలో గుర్రాలు ఎక్కినం. పరపతి సంఘం ద్వారా ఇదంతా సాధ్యమైంది. – రామగిరి సరోజ, వ్యవసాయ కూలీ, చిన్నపెండ్యాల అందరి కృషి.. పల్లెటూరి వాళ్లను కంపల్స రీ ఫ్లైట్ ఎక్కించాలని అనుకున్నాం. అందుకు ఏం చేయాలని మీటింగ్ పెట్టి నిర్ణయించుకున్నాం. డబ్బులు సమకూర్చుకున్నాం. అనుకున్నట్లుగానే టూర్కు వెళ్లాం. ఛార్ధామ్ యాత్రకు వెళ్లాం. ఇది మా అందరి కృషి. రోజూ కూలీ పని చేసే వాళ్లం. విమానాశ్రయానికి వెళ్లాక అందరి కళ్లు ఆనందభాష్పాలను రాల్చాయి. – చావ కుమారస్వామి, మల్లారెడ్డి, సంఘం సభ్యులు చిన్నపెండ్యాల సెల్ఫీ తీసుకుని మురిసిపోయా.. గ్రామంలో అందరం కుటుంబ సభ్యుల్లా ఉంటాం. గ్రామం దాటి బయటికి వెళ్లింది లేదు. కానీ, పరపతి సంఘం ద్వారా ఫ్లైట్ ఎక్కినం. మొదటిసారి విమానం ఎక్కిన అనుభూతి మాటల్లో చెప్పలేనిది. నేను, నా భార్య విమానంలో సెల్ఫీ తీసుకుని మా బంధువులకు పంపి ఆనందపడ్డాం. ఈసారి పూరి జగన్నాథ్యాత్రకు వెళ్దామనుకుంటున్నాం. – కీర్తిసత్యం, గ్రామస్తుడు, చిన్నపెండ్యాల పరపతి సంఘాల సభ్యులంతా 2023లో కాశీకి వెళ్లాలనుకున్నారు. ‘రెక్కల కష్టం నమ్ముకున్నాం.. జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కుదాం’.. అని సభ్యులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా.. 50 కుటుంబాలు (భార్యాభర్త) విమాన ప్రయాణానికి ఎంత ఖర్చు అవుతుందని సంబంధిత టూర్స్, ట్రావెల్స్ వాళ్లను అడగగా రూ.20 నుంచి రూ.24 లక్షలు అవుతుందని చెప్పారు. ఇందుకు అవసరమైన డబ్బుల కోసం కమిట్మెంట్ చిట్టీలు వేసుకుని రూ.20 లక్షలు పోగేసుకున్నారు. చేతి ఖర్చుకు ఒక్కో కుటుంబం రూ.10 వేల వరకు దగ్గర ఉంచుకుంది. ఇంకేముంది వారనుకున్న విమానయాన కల నెరవేరింది. ఇలా ఒక్కసారి కాదు.. ఇప్పటికే ఐదుసార్లు తమ కలను నెరవేర్చుకున్నారు.ఆలోచన వచ్చిందిలా.. గ్రామ పరపతి సంఘాల సభ్యులు ఇప్పటివరకు ఛార్ధామ్, కాశీ టూర్, రామేశ్వరం, ఢిల్లీ, ఆగ్రా యాత్రలకు వెళ్లారు. నగరంలోని హనుమకొండలోని ఓ ప్రైవేట్ ట్రావెల్స్కు డబ్బులిస్తే వాళ్లు మొత్తం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి విమానంలో వెళ్లి.. అక్కడ ప్రత్యేకంగా బస్సు మాట్లాడుకుని ప్రదేశాలకు తిరిగారు. ఆవిమానం మొత్తం ఒకే ఊరు వాళ్లు ఉండడం.. మొదటిసారి విమానం ఎక్కిన వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.న్యూస్రీల్పరపతి సంఘాలు.. ఐకమత్యానికి నాంది ఎక్కడికెళ్లినా ఫ్యామిలీతోనే.. -
ప్రభుత్వ పాఠశాలల పటిష్టతే టీచర్ల లక్ష్యం
విద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలల పటిష్టతే ఉపాధ్యాయుల లక్ష్యం కావాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేయాలని ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్రెడ్డి కోరారు. హనుమకొండ జిల్లాలో స్కిల్స్టార్క్ స్కూల్లో ఐదు రోజులుగా కొనసాగుతున్న ఉపాధ్యాయుల మూడో విడత శిక్షణ కార్యక్రమం శనివారం ముగిసింది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమంలో నేర్చుకున్న అంశాలను తరగతి గదుల్లో అమలు చేయాలని సూచించారు. జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ శ్రీనివాస్, యాంటీ నార్కొటిక్స్ బ్యూరో ఎస్సై ఎం.రాజు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఎస్సై పిలిప్స్రాజు, షీటీమ్స్ ఎస్సై విద్యాసాగర్, సైబర్ క్రైమ్స్ ఎస్సై శివకుమార్ మాట్లాడారు. శిక్షణ కేంద్రం ఇన్చార్జ్లు విజయ్ మోహన్, మధుసూదన్ రెడ్డి, డీఆర్పీలు శానుగుల భద్రయ్య, జీవీ.ప్రసాద్, అజయ్, అలీ, శశికళాధర్, శివకుమార్, సంపత్, శ్రీను, విద్యానంద్, అట్ల రవి, సీఆర్పీ రఘు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ముగిసిన టీచర్ల శిక్షణ హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, టీజీఆర్ఈఐఎస్ ఉపాధ్యాయులు, ఉమ్మడి జిల్లాలోని ఉర్దూమీడియం పాఠశాలల ఉపాధ్యాయులకు మే 13నుంచి 31వ తేదీ వరకు మూడు దశల్లో సుమారు 2,700 మందికి శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు నైపుణ్యాలు, అభ్యసనాల అభివృద్ధి వంటి అనేక అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్రెడ్డి ముగిసిన ఉపాధ్యాయుల శిక్షణ -
డ్రెయినేజీల పరిశీలన
న్యూశాయంపేట: నగరంలోని 28, 29వ డివిజన్ల పరిధిలోని 12 మోరీల నుంచి మేదరి బస్తీ వరకు ఉన్న డ్రెయినేజీలను కమిషనర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి నగర మేయర్ గుండు సుధారాణి క్షేత్రస్థాయిలో శనివారం పరిశీలించారు. వర్షాకాలం నేపథ్యంలో రెండు డివిజన్ల పరిధిలోని ప్రధాన నాలాతో పాటు రైల్వేట్రాక్ వైపు, మేదరి బస్తీ వద్ద ఉన్న డ్రెయినేజీల పరిస్థితిని పరిశీలించారు. సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఇన్చార్జ్ ఎస్ఈ సీపీలు రవీందర్, వాడేకర్, శ్రీనివాస్ ఎంహెచ్ఓ డాక్టర్ రాజేష్, ఏసీపీ శ్రీనివాస్, ఈఈ రవికుమార్, టీపీఎస్ శ్రీకాంత్, ఏఈ ముజామిల్ పాల్గొన్నారు. -
విదేశాల్లో విద్యకు దరఖాస్తుల ఆహ్వానం
న్యూశాయంపేట: పేద మైనారిటీ వర్గాల వారు విదేశాల్లో విద్యనభ్యసించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంప్రవేశపెట్టిన సీఎం ఓవర్సిస్ స్కాలర్షిప్ పథకం కింద అర్హులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వరంగల్ జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి టి.రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, లండన్, ప్రాన్స్, జపాన్, సౌత్కొరియా, న్యూజిలాండ్, సింగపూర్ దేశాల్లో పీజీ, పోస్ట్ డాక్టరోల్ విద్యనభ్యసించే వీలుందని పేర్కొన్నారు. ఈనెల చివరి వరకు గడువు ఉందని, పూర్తి వివరాలకు హనుమకొండ సుబేదారిలోని కార్యాలయంలో లేదా 93988 60995 నంబర్లో సంప్రదించాలని ఆయన సూచించారు. లైంగిక వేధింపుల ఫిర్యాదులకు ప్రత్యేక కమిటీలు● జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ.నిర్మలా గీతాంబ వరంగల్ లీగల్: లైంగిక వేధింపుల ఫిర్యాదులను పరిష్కరించడానికి ప్రత్యేక కమిటీలు ఉన్నాయని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ.నిర్మలా గీతాంబ అన్నారు. ‘పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నుంచి మహిళలకు రక్షణ ప్రోష్ యాక్ట్ –2013’ చట్టంపై జిల్లాల ప్యానెల్ న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్లకు వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయసేవాధికార సంస్థలు సంయుక్తంగా శని వారం అవగాహన సదస్సు నిర్వహించాయి. ఈ సందర్భంగా హనుమకొండ ఇన్చార్జ్ ప్రధాన న్యాయమూర్తి బి.అపర్ణాదేవితో కలిసి ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ మాట్లాడారు. పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ, పరిష్కారానికి చట్టా లు ఉన్నాయని పేర్కొన్నారు. లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు న్యాయ సహాయం ఎలా పొందాలి, ఎవరిని ఎలా సంప్రదించాలో న్యాయమూర్తులు రితిక, ఫరీనా అహ్మ, డాక్టర్ అనితారెడ్డి వివరించారు. కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థల కార్యదర్శులు ఎం.సాయికుమార్, క్షమాదేశ్ పాండే, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.సుధఋర్, తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి● హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచేలా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ పి.ప్రావీణ్య ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, పొజిషన్ సర్టిఫికెట్లు, రెవెన్యూ సదస్సులు, రాజీవ్ యువ వికాసం, తదితర అంశాలపై అధికారులతో శనివారం సమీక్షించారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతున్న తీరును గృహ నిర్మాణ శాఖ డీఈ సిద్ధార్థ నాయక్ వివరించారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు, నగర కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ వైవీ.గణేష్, ఆర్డీఓ కె.నారాయణ, డీపీఓ లక్ష్మి రమాకాంత్, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ జి.రవీందర్తో పాటు ఎంపీడీఓలు, తహసీల్దార్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులపై ముందస్తు ప్రణాళికలు● డీఎంహెచ్ఓ అప్పయ్య ఎంజీఎం: వర్షాకాలంలో వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని వైద్య సిబ్బందిని హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య ఆదేశించారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ సమావేశ మందిరంలో ల్యాబ్ టెక్నీషియన్లు, హెల్త్ సూపర్వైజర్లు, మలేరియా నోడల్ పర్సన్స్, హెల్త్ అసిస్టెంట్లతో శనివారం సమీక్షా సమావేశఽం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమలు వృద్ధి చెందకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు. వర్షాకాలంలో వ్యాప్తి చెందే వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వివిధ విభాగాలతో కలిసి మంగళవారం, శుక్రవారం డ్రై డే పాటించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్ఓ మదన్మోహన్, వైద్యుడు నరేష్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
వంద రోజుల ప్రణాళిక పక్కాగా అమలు
మేయర్ సుధారాణి న్యూశాయంపేట: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) ద్వారా రూపొందించిన వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను పక్కాగా అమలు చేయాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. బుధవారం జీడబ్ల్యూఎంసీ కార్యాలయంలో వంద రోజుల ప్రణాళిక అమలు తీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మేయర్ సుధారాణి మాట్లాడుతూ.. జూన్ 2 నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు బల్దియా ద్వారా వంద రోజుల పాటు చేపట్టే కార్యాక్రమాల గురించి వివరించారు. ఈవంద రోజుల ప్రణాళికలో భాగంగా మొక్కలు నాటడం, ముంపు నివారణకు 36 ప్రధాన నాలాల్లో రూ.1.21 కోట్లతో పూడికతీత పనులు పూర్తి చేయడం, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై నగరంలోని గోడలపై మృనాల్ పెయింటింగ్లు వేయడం, వరద నీరు సాఫీగా వెళ్లేలా నాలాల్లో ఉన్న బ్లాకేజ్ ప్రాంతాలను గుర్తించి మెష్లు ఏర్పాట్లు చేయాలని, జంక్షన్లలో సుందరీకరణ పనులు, రెండు పార్కుల అభివృద్ధి, రహదారుల మరమ్మతులు, శిథిలావస్థ నిర్మాణాల తొలగింపు, అంతర్గత మురుగు కాల్వల పరిశుభ్రత, తదితర పనులు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అధికారులు సమన్వయంతో పనిచేసి వంద రోజుల ప్రణాళిక విజయవంతానికి కృషి చేయాలన్నారు. సమావేశంలో జీడబ్ల్యూఎంసీ అదనపు కమిషనర్ జోనా, సీఎంహెచ్ఓ రాజిరెడ్డి, ఇన్చార్జ్ ఎస్ఈ శ్రీనివాస్, ఇన్చార్జ్ సీపీ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్ ప్రసన్నారాణి, డీఎఫ్ఓ శంకర్ లింగం, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. -
నగరాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
ఖిలా వరంగల్: నగరాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం వరంగల్ 19వ డివి జన్ వివేకానంద కాలనీలో రూ.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న తాగునీటి పైప్ లైన్లు, డ్రెయినేజీ పనులు, 41వ డివిజన్ ప్రతాప్నగర్ ఉర్సు కరీమాబాద్లో రూ.34 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మాణ పనులకు మేయర్ సుధారాణి, కలెక్టర్ సత్యశారద, స్థానిక కార్పొరేటర్లతో కలిసి మంత్రి సురేఖ వేర్వేరుగా శిలాఫలకాలు ఆవిష్కరించారు. ఈసందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. అంతర్గత సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, తాగునీటి పైపులైన్ల నిర్మాణాలకు అఽధిక ప్రాధాన్యమిస్తున్నామని, పేదల కాలనీల్లో ప్రధాన సమస్యలను గుర్తించి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు, టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాశ్, నాయకులు నవీన్రాజ్, కేడల పద్మ, ట్రాన్స్జెండర్ రంజిత పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖ -
వైద్యసేవలు మరింత సులభం
కాజీపేట రూరల్: భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖలోని రైల్ టెల్ కార్పొరేషన్ రైల్వే రిటైర్డ్ పెన్షనర్స్, సర్వీస్లో ఉన్న ఎంప్లాయీస్ కోసం మొబైల్ యాప్స్ అప్లికేషన్ డిజిటల్ సేవలు ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. దేశవ్యాప్తంగా 18 లక్షల మంది రిటైర్డ్ రైల్వే పెన్షనర్స్, 12 లక్షల మంది రైల్వే సర్వీస్లోని ఎంప్లాయీస్ కోసం హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం (హెచ్ఎంఐఎస్), హాస్పిటల్ రిసోర్స్మేనేజ్మెంట్ సిస్టం (హెచ్ఆర్ఎంఎస్)ను దేశవ్యాప్తంగా 714 ఆస్పత్రులు/హెల్త్ యూనిట్ల అనుసంధానంతో పాటు, మొబైల్ యాప్స్తో డిజిటల్ సేవలు అమలు చేయనున్నారు. హెచ్ఎంఐఎస్ను 2019లో, హెచ్ఆర్ఎంఎస్ను 2020లో ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఉమిత్కార్డు (యూనిక్ మెడికల్ ఐడీకార్డు)తో ఇండియన్ రైల్వేలో రూ.60 లక్షలు, సికింద్రాబాద్ డివిజన్లో 26 వేల మంది పెన్షనర్స్ మెడికల్ సేవలు పొందుతున్నారు. హెచ్ఎంఐఎస్ యాప్లో రైల్వే పెన్షనర్స్, సర్వీస్ ఎంప్లాయీస్కు కావాల్సిన వైద్య సదుపాయాల కోసం, రెఫరల్ ఆస్పత్రి ఆస్పత్రుల వివరాలు, మందులు అందుబాటులో ఉంటాయి. హెచ్ఆర్ఎంఎస్ యాప్లో రైల్వే ఎంప్లాయిస్ లీవ్స్, పీఎఫ్, సాలరీ, ఎస్ఆర్, ఈ–పాస్లు (పెన్షనర్స్ కోసం–సంవత్సరానికి రెండు ఉచిత ట్రైన్ పాస్ ఉంటుంది) హెచ్ఎంఐఎస్, హెచ్ఆర్ఎంఎస్ యాప్లను డౌన్లోడ్ చేసుకొని వాటిలోకి వెళ్లి డిజిటల్ సేవలు పొందాలి. డిజిటల్ సేవలు ఉపయోగకరం.. రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే పెన్షనర్స్, రైల్వే ఎంప్లాయీస్ కోసం ప్రవేశపెట్టిన డిజిటల్ సేవలను వినియోగించుకోవాలి. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పెన్షనర్స్, సర్వీస్ ఎంప్లాయీస్కు డిజిటల్ సేవలు ఎంతో ఉపయోగం. రైల్వే పెన్షనర్స్ యాప్ తెలియకుంటే ఇంట్లో పిల్లలతో, లేదంటే తెలిసిన వారితో సేవలు పొందాలి. దేశవ్యాప్తంగా 16 రైల్వే జోన్లు, 70 రైల్వే డివిజన్లలో ఈ డిజిటల్ సేవలపై రైల్వే శాఖ అధికారుల సహకారంతో ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే మెన్స్ ఫెడరేషన్ (ఎఐఆర్ఆర్ఎఫ్)తో వర్క్షాపులు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నాం. – ఎస్.శ్రీధర్, ఏఐఆర్ఆర్ఎఫ్ నేషనల్ ప్రెసిడెంట్ పెన్షనర్లు, ఎంప్లాయీస్ కోసం ప్రత్యేక యాప్లు ప్రారంభించిన రైల్వే మంత్రిత్వ శాఖ -
వైట్ హౌస్ సదస్సులో వరంగల్ వాసి
ఖిలా వరంగల్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారిక నివాసం వైట్ హౌస్లో గురువారం జరిగిన ఏషియన్ అమెరికన్ పసిఫిక్ ఐస్లాండ్ హెరిటేజ్ సదస్సుకు వివిధ దేశాలకు చెందిన 50 మంది ప్రతినిధులను ఆహ్వానించారు. ఇందులో వరంగల్ నగరానికి చెందిన ఒయాసిస్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ జేఎస్ పరంజ్యోతి కుమారుడైన యూనివర్సిటీ సౌత్ ఫ్లోరిడా అసిస్టెంట్ ఫ్రొఫెసర్ జన్ను చిరంజీవి భరత్కు ఆహ్వానం అందింది. ఈమేరకు గురువారం హాజరై భారతీయ వారసత్వ సంపదపై పలు అంశాలను ప్రతినిధులకు వివరించినట్లు ఆయన పేర్కొన్నారు. -
జూన్ 3 నుంచి భూభారతి దరఖాస్తుల స్వీకరణ
వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట : జిల్లాలో జూన్ 3 నుంచి 20వ తేదీ వరకు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి భూ భారతి పథకంపై రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం, రేషన్ కార్డుల మంజూరుపై సంబంధిత శాఖ అధికారులతో కలెక్టరేట్లో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ‘భూభారతి’లో రైతులనుంచి స్వీకరించిన దరఖాస్తులు పరిశీలించి నిబంధనల ప్రకారం రైతులకు న్యాయం చేయాలని సూచించారు. మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లు నెల రోజుల్లో పూర్తి కావాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. రెండో విడత అర్హులైన పేదలను ఎంపిక చేయాలన్నారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో ఆమోదం పొందిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యేల ఆమోదంతో పంపిణీ చేయాలన్నారు. రాజీవ్ యువ వికాసానికి ఎంపికై న వారికి జూన్ 2న మంజూరు పత్రాలు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని ఈడీ ఎస్సీ కార్పొరేషన్ అధికారి సురేశ్ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, హౌసింగ్ పీడీ గణపతి, డీఆర్ఓ విజయలక్ష్మి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సత్యపాల్రెడ్డి, ఉమారాణి, తహసీల్దార్లు, ఎంపీడీఓలు ఉన్నారు. -
అడిషనల్ డీసీపీగా ప్రభాకర్రావు
హసన్పర్తి: వరంగల్ పోలీస్ కమిషనరేట్ లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ విభాగం అడిషనల్ డీసీపీగా రాయల ప్రభాకర్రావు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఆసిఫాబాద్ అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ప్రభాకర్రావును వరంగల్ పోలీస్ కమిషనరరేట్ అడిషనల్ ఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ప్రభాకర్రావు వరంగల్ జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లలో పనిచేశారు. ఈమేరకు కమిషనర్ సన్ప్రీత్సింగ్ను ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు : కలెక్టర్ ప్రావీణ్య హన్మకొండ అర్బన్: జిల్లాలో 2024–25 యాసంగి సీజన్లో 157 కొనుగోలు కేంద్రాల ద్వారా రికార్డు స్థాయిలో ఇప్పటి వరకు 1,16,290.240 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఇది గతేడాది రబీ సీజన్తో పోలిస్తే 40,330.240 మెట్రిక్ టన్నులు అధికమని పేర్కొన్నారు. ఽ24,814 మంది రైతుల వద్ద ధాన్యం కొనుగోళ్లు చేసి వారి బ్యాంకు ఖాతాల్లో రూ. 252.37 కోట్లు జమ చేసినట్లు వివరించారు. సేకరించిన ధాన్యాన్ని జిల్లాలో కేటాయించిన 53 రైస్ మిల్లులకు ఎప్పటికప్పుడు తరలిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో మిగిలి ఉన్న ధాన్యాన్ని కూడా త్వరిగతిన కొనుగోలు పూర్తి చేసి మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. రైతులు పండించిన ప్రతీ ధాన్యం గింజ కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భరోసా కల్పించారు. యువత మత్తు వలలో పడొద్దుహన్మకొండ అర్బన్: యువత వారి భవిష్యత్, దేశ భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని మత్తు మహమ్మారి వలలో పడొద్దని హనుమకొండ జిల్లా రెవెన్యూ అధికారి వైవీ గణేశ్ కోరారు. శుక్రవారం కలెక్టరేట్లో ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా చేపట్టనున్న మాదకద్రవ్యాలు, గుట్కా వ్యతిరేక కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను సైకాలజిస్టుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ పరికిపండ్ల అశోక్తో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా డీఆర్ఓ వైవీ గణేశ్ మాట్లాడుతూ.. డ్రగ్స్ , గుట్కా రహిత జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా మాదకద్రవ్యాలపై ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ చేపట్టనున్న కార్యక్రమం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో భారతి చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ ఆడెపు రాజేంద్రప్రసాద్, ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సహజ తదితరులు పాల్గొన్నారు. ఆదాయం పెంచాలి..ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ పి.సోలమన్ హన్మకొండ: డిపో ఆదాయాన్ని పెంచాలని ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ పి.సోలమన్ అన్నారు. శుక్రవారం హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్–1, హనుమకొండ డిపోను ఆయన సందర్శించారు. డిపో పరిసరాల్ని పరిశీలించారు. వరంగల్–1 డిపోలో మొక్క నాటారు. ఈసందర్భంగా కార్మికులను ఉద్దేశించి సోలమన్ మాట్లాడుతూ.. ప్రయాణికులకు మెరుగైన సేవలందించాలని సూచించారు. వివిధ హోదాలో ఉన్న 20 మందితో ఒక టీమ్ ఏర్పాటు చేసి డిపో ఆదాయం పెంచేందుకు కృషి చేయాలన్నారు. ఈసందర్భంగా అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన డ్రైవర్లను సన్మానించారు. కార్యక్రమంలో వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను, డిప్యూటీ ఆర్ఎం కేశరాజు భానుకిరణ్, వరంగల్–1 డిపో మేనేజర్ పుప్పాల అర్పిత, హనుమకొండ డిపో మేనేజర్ ధరంసింగ్, అసిస్టెంట్ మేనేజర్ భవాని, సూపర్వైజర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
అవతరణ వేడుకలకు అతిథులు వీరే!
హనుమకొండకు మంత్రి కొండా సురేఖ, వరంగల్కు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సాక్షిప్రతినిధి, వరంగల్: జూన్ 2 ఉదయం 10 గంటలకు తెలంగాణ అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథుల జాబితాను శుక్రవారం ప్రకటించింది. హనుమకొండ జిల్లా పోలీస్ పరేడ్గ్రౌండ్స్లో రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించనున్నారు. వరంగల్లో రాష్ట్ర రెవెన్యూశాఖ, ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ములుగులో పంచాయతీరాజ్శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) జాతీయ పతాకాలను ఆవిష్కరించనున్నారు. అదే విధంగా జయశంకర్ భూపాలపల్లిలో టీడీఎఫ్డీసీ చైర్మన్ పోదెం వీరయ్య, మహబూబాబాద్లో ప్రభుత్వ విప్ జె.రాంచంద్రునాయక్, జనగామలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య జాతీయ పతాకాలను ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి జిల్లాకు చెందిన మంత్రులు, ప్రముఖులు తెలంగాణ అమరవీరుల స్మారకచిహ్నాల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించాలని, ఆ తర్వాత అతిథులు జాతీయ జెండాను ఆవిష్కరించాలని పేర్కొన్నారు. -
రెవెన్యూ వసూళ్లు వందశాతం సాధించాలి
● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డిహన్మకొండ: రెవెన్యూ వసూళ్లు వందశాతం సాధించాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. గురువారం రాత్రి హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 16 సర్కిళ్ల ఎస్ఈ, డీఈ, ఎస్ఏఓలకు వీడియో కాన్ఫరెన్స్ (వీసీ) నిర్వహించారు. డివిజన్, జిల్లా వారీగా ప్రగతి సమీక్షించారు. ప్రధానంగా రెవెన్యూ వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. సర్కిళ్లు, డివిజన్ల, సెక్షన్ వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి రెవెన్యూ వసూళ్లు వంద శాతం సాధించేలా ప్రణాళిక రూపొందించుకుని ముందుకెళ్లాలని సూచించారు. విద్యుత్ చౌర్యం అరికట్టాలని చెప్పారు. రైతులు తమ మోటార్లకు కెపాసిటర్లు అమర్చుకునేలా అవగాహన కల్పించాలన్నారు. కేబుల్ ఆపరేటర్లు ఉపయోగించే విద్యుత్ స్తంభాలకు అద్దె వసూలు చేయాలని ఆదేశించారు. అలాగే, కేబుల్ ఆపరేటర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి, స్తంభాల వెంట గుత్తులుగా ఉన్న కేబుళ్లతో తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, క్రమపద్ధతిలో తీగలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ డైరెక్టర్ వి. తిరుపతి రెడ్డి, 16 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలు, ఎస్ఏఓలు పాల్గొన్నారు. -
విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరిస్తే మెరుపు సమ్మె
హన్మకొండ: కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించాలని చూస్తోందని, ఇదే జరిగితే దేశ వ్యాప్తంగా మెరుపు సమ్మెకు దిగుతామని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్ఈఈయూ)–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ హెచ్చరించారు. ఉత్తర్ ప్రదేశ్లో కార్మికుల హక్కుల కాలరాసేలా పోరాటాలు, సమ్మె చేయకుండా రెగ్యులరైజేషన్ అమైండ్మెంట్ తీసుకురావడాన్ని నిరసిస్తూ అక్కడి విద్యుత్ ఉద్యోగులకు మద్దతుగా గురువారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట మధ్యా హ్న భోజన సమయంలో తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరిస్తే ప్రజలకు ఎక్కువ ఇబ్బందులుంటాయన్నారు. ఉద్యోగావకాశాలు పోతాయన్నారు. ప్రైవేట్ నిర్వాహకులను భరించలేమన్నారు. ఈ క్రమంలో ప్రజలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఎన్పీడీసీఎల్ బాధ్యుడు సామ్యా నాయక్ మాట్లాడుతూ ఉత్తర్ ప్రదేశ్ ఉద్యోగుల పట్ల అక్కడి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఇక్కడ ధర్నా చేశామన్నారు. ఈ ధర్నాలో శ్రీకాంత్, వెంకటేశం, కుమారస్వామి, జానకీరాంరెడ్డి, మధుకర్, పి.మహేందర్ రెడ్డి, మచ్చిక బుచ్చయ్య గౌడ్, చిట్ల ఓదెలు, తదితరులు పాల్గొన్నారు. టీఎస్ఈఈయూ–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్