breaking news
Hanamkonda District News
-
పిల్లల భద్రత, ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక దృష్టి
హనుమకొండ అదనపు కలెక్టర్ రవి హన్మకొండ అర్బన్ : బాలల సంరక్షణ కేంద్రాల్లో పిల్లల భద్రత, సంక్షేమం, ఆరోగ్యం, విద్య, వసతి, ప్రాథమిక అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ రవి సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా తనిఖీ కమిటీ సమావేశం జరిగింది. గత త్రైమాసిక తనిఖీల్లో గుర్తించిన లోపాలు, సూచనలపై సమీ క్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ అంశాలను త్వరగా పరిష్కరించి తీసుకున్న చర్యల నివేదికలను సమర్పించాలని కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి విశ్వజ, బాలల సంక్షేమ సమితి సభ్యుడు దామోదర్ పాల్గొన్నారు. -
బుధవారం శ్రీ 19 శ్రీ ఆగస్టు శ్రీ 2026
ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ అటానమస్, గురుకుల డిగ్రీ కళాశాలలు 241పీజీ కళాశాలలు 62ఫార్మసీ 24ఇంజనీరింగ్ 06బీఈడీ 43ఫిజికల్ ఎడ్యుకేషన్ 03ఎంసీఏ 10ఎంబీఏ 22 హోటల్ మేనేజ్మెంట్ 03లా 04 కేయూ పరిధిలోని కొత్తగూడెం ఇంజనీరింగ్ కళాశాలను మన్మోహన్సింగ్ ఎర్త్ వర్సిటీగా మార్చారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ స్వర్ణోత్సవ శోభ సంతరించుకుంది. నిత్య చైతన్య దీప్తిగా ఉంటూ లక్షలాది మంది విద్యార్థులను అక్షర దివిటీలుగా తీర్చిదిద్దిన ఘనచరిత్ర ఈ యూనివర్సిటీది. సామాజిక ఉద్యమాలు, పోరాటాల గడ్డగా పేరొందింది. బుధవారంతో యూనివర్సిటీ 50 వసంతాలు (గోల్డెన్ జూబ్లీ) పూర్తి చేసుకొని 51వ వసంతంలోకి అడుగిడుతోంది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ప్రస్థానంతోపాటు స్థానికంగా నెలకొన్న సమస్యలపై ప్రత్యేక కథనం. కేయూ తొలుత పీజీ సెంటర్గా తొలుత ఉస్మానియా యూనివర్సిటీ పీజీ సెంటర్గా 1968లో మొదలైంది. నాడు పోరాటాల ఫలితంగానే 1976 ఆగస్టు 19న కాకతీయ యూనివర్సిటీగా ఆవిర్భవించింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. ఈ 50 వసంతాల్లో ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసించి వివిధ రంగాల్లో, దేశవిదేశాల్లో స్థిరపడ్డారు. ఇక్కడే ఆచార్యులు అయినవారూ ఉన్నా రు. మొదట కేయూ నాలుగు విభాగాలతో మొదలై నాడు రేకుల షెడ్లలోనే విద్య కొనసాగింది. అంచ లంచెలుగా ఎదిగి 29 విభాగాలతో కొనసాగుతోంది. ప్రస్తుతం యూనివర్సిటీలోని అన్ని కాలేజీల్లో 1.20 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. కేయూలో వివిధ సెంటర్లు కాకతీయ యూనివర్సిటీలో అంబేడ్కర్ స్టడీస్ సెంటర్, స్టూడెంట్ వెల్ఫేర్, ఎస్సీ, ఎీస్టీ సెల్, బీసీసెల్, దివ్యాంగసెల్, మహిళా అధ్యయన కేంద్రం, యోగా సెంటర్ ఉన్నాయి. వీటిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. విద్యతోపాటు జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. డిగ్రీ, జూనియర్, పీజీ కళాశాలల్లో కలిపి 360 ఎన్ఎస్ఎస్ యూనిట్లు ఉండగా అందులో 36వేల మంది ఎన్ఎస్ఎస్ వలంటీర్లు ఉన్నారు. రక్తదానంలో అనేక అవార్డులు పొందింది. స్పోర్ట్స్బోర్డు కూడా ఉంది. ప్రతీఏటా సౌత్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ, ఆల్ఇండియా ఇంటర్ యూనివర్సిటీల వివిధ పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చి పంపిస్తున్నారు. నిధుల మంజూరుపై ఆశలు యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకుంటు న్న వేళ.. మౌలిక సదుపాయల కల్పనకు రూ.400 కోట్ల నిధుల కోసం వీసీ ప్రతాప్రెడ్డి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఆనిధులు మంజూరు చేస్తే యూనివర్సిటీలో గోల్డెన్జూబ్లీ, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలనే యోచనలో ఉన్నారు. కేయూ పరిధిలోని కాలేజీలు గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు తొలుత ఓయూ పీజీ సెంటర్గా ఆ తర్వాత కేయూ నాలుగు విభాగాలతో మొదలై నేడు 29 విభాగాలు యూనివర్సిటీ అభివృద్ధికి రూ.400 కోట్లతో ప్రతిపాదనలుకాకతీయ యూనివర్సిటీకి 50 వసంతాలు పూర్తి కేయూలో 332 అధ్యాపక పోస్టులు ఖాళీ బోధన, పరిశోధనలపై ప్రతికూల ప్రభావం విద్యార్థులకు సరిపడా హాస్టళ్లు ఏవీ?స్వర్ణోత్సవం భవిష్యత్కు బలమైన పునాది కాకతీయ యూనివర్సిటీ స్వర్ణోత్సవం గతానికి గర్వకారణం భవిష్యత్కు బలమైన పునాది. విద్య, నాణ్యమైన పరిశోధనల దిశగా కృషి చేస్తున్నాం. రూసా ప్రాజెక్టు కింద రూ.60 కోట్ల నిధులు రాగా, రూ.35 కోట్లతో 42 పరిశోధన ప్రాజెక్టులు, రూ.15 కోట్లతో కెహబ్ అభివృద్ధి చేస్తున్నాం. బీఎస్ఎన్ఎల్కు సంబంధించి అండర్గ్రౌండ్ ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్టు పూర్తయ్యింది. అకడమిక్ బ్లాక్లు, వర్క్షాప్లు,సెమినార్ హాల్స్, స్వర్ణోత్సవ శతాబ్ది పైలాన్ తదితర పనులకు ఆమోదం లభించింది. రూ.400 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఇవి ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. 50 ఏళ్ల విద్యాప్రస్థానాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తాం. – కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్రెడ్డి -
నగర సుందరీకరణకు సహకరించాలి
● అనుమతి లేని వాణిజ్య ఫ్లెక్సీలు, కటౌట్లపై క్రిమినల్ కేసులు ● ఫ్లెక్సీ తయారీదారుల సమావేశంలో బల్దియా కమిషనర్ వెంకన్న వరంగల్ అర్బన్: నగరంలో అనుమతి లేకుండా కమర్షియల్ ఫ్లెక్సీలు, కటౌట్లను ముద్రించినా, అనధికారికంగా ఏర్పాటు చేసినా క్రిమినల్ కేసులు తప్పవని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్న హెచ్చరించారు. బల్దియా కార్యాలయంలోని ఫ్లెక్సీ తయారీదారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందస్తుగా అనుమతి తీసుకున్న తర్వాతనే ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. నగరంలోని ఫ్లెక్సీ తయారీదారులతో ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి నిబంధనలు చేరవేస్తామని తెలిపారు. నగర సుందరీకరణకు సహకరించాలని కోరారు. జిల్లా అగ్నిమాపక అధికారి శంకర్లింగం, సిటీప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య, స్టేషన్ ఫైర్ఆఫీసర్ రాజేశ్వర్రావు, శానిటరీ సూపర్వైజర్ గోల్కొండ శ్రీను తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కమిషనర్ జన్మభూమి జంక్షన్లో పారిశుద్ధ్య పనులు తనిఖీ చేశారు. ఎస్ఈ రాజ్కుమార్, ఎంహెచ్ఓ రాజేశ్, ఈఈ రవికుమార్, శానిటరీ సూపర్వైజర్లు నరేందర్, గోల్కొండ శ్రీను, డీఈ రాజ్కుమార్, ఎస్ఐ భీమయ్య ఉన్నారు. పారిశుద్ధ్య నిర్వహణపై అధ్యయనం చేసేందుకు చైన్నెలోని స్వామినాథన్ పరిశోధనా సంస్థ బృందం కమిషనర్ టి.వెంకన్నతో సమావేశమైంది. -
కాళేశ్వరం పాత గర్భగుడి కూల్చివేత
కాళేశ్వరం: జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా మంగళవారం ఆలయ పాత గర్భగుడిని కూల్చివేశారు. మంత్రి శ్రీధర్బాబు ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధి, పునర్నిర్మాణ పనులను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని ఆలయ చైర్మన్ మోహన్శర్మ అన్నారు. ఆర్అండ్బీ డీఈఈ దేవేందర్, నిపుణుల సూచనలతో పాత గర్భగుడిని తొలగించినట్లు ఈఓ మహేశ్ పేర్కొన్నారు. పెద్దరాళ్ల తొలగింపు.. గర్భగుడిని పెద్ద రాళ్లు, ఇనుము, మట్టి, సిమెంట్ ఇటుకలతో నిర్మాణం చేయగా తొలగించారు. 11వ శతాబ్దంలో కాకతీయులు, చాళుక్యుల కాలం నాటి ఆలయానికి అప్పటి రవాణాశాఖ మంత్రి జువ్వాడి చొక్కారావు 1978 నుంచి 1982లో జీర్ణోద్దరణ చేసి కుంభాభిషేకం నిర్వహించిన విషయం తెలిసిందే. శ్రీకాళేశ్వరముక్తీశ్వరుల లింగాలకు ఎలాంటి ప్రమాదం లేకుండా పైనుంచి ఇనుప కప్పు ఏర్పాటు చేసి జాగ్రత్తగా పాత గర్భగుడిని తొలగించారు. ద్విలింగాలకు ఆనుకుని ఉన్న మిగిలిన నాలుగు స్తంభాలను యంత్రాలతో కాకుండా మనుషులతో తొలగించనున్నారు. దీంతో పూర్తిగా తొలగింపు ప్రక్రియ ముగియనుంది. -
బీఆర్ఎస్ కార్యాలయం వద్ద హైడ్రామా
శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ అరెస్ట్ హన్మకొండ: హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయం వద్ద హైడ్రామా నెలకొంది. నర్సంపేటలో పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహం తొలగింపు నేపథ్యంలో మంగళవారం ఆందోళనలు చేపడతారని భావించిన పోలీసులు ముందుజాగ్రత్తగా బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేశారు. కొందరిని పోలీస్స్టేషన్కు తరలించగా, మరికొందరిని గృహ నిర్బంధం చేశారు. పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన అనంతరం శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి నర్సంపేటకు బయలుదేరుతుండగా కార్యాలయం గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఏపీ రాజకీయాన్ని ఇక్కడ రుద్ద దలచుకున్నారా అని మధుసూదనాచారి పోలీసులను ప్రశ్నించారు. తన బలగం ఏమైందని సుదర్శన్రెడ్డి ఆత్మ ఎదురు చూస్తుందని, వందల మంది పోలీసులు రండి వెళదామని చెప్పినా వదలకుండా మధుసూదనాచారిని అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నించగా నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. చివరకు పోలీసులు పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహాన్ని తొలగించడం అన్యాయమని అన్నారు. సహచర ఉద్యమకారులుగా వెళ్లేందుకు రేవంత్రెడ్డి సర్కారు అడ్డుకుంటోందని, దీనికి వెనుక ఆంధ్ర కుట్ర దాగి ఉందని ఆరోపించారు. చంద్రబాబు ద్వారా ఆంధ్రా నుంచి రిమోట్ ఆపరేషన్ జరుగుతోందని, తెలంగాణ నామరూపాలు లేకుండా చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. -
మోసం చేయడంలో ఆరితేరిన రేవంత్
హన్మకొండ: సామాజిక న్యాయమని ఉచ్చరించే నైతిక హక్కు సీఎం రేవంత్ రెడ్డికి లేదని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనా చారి అన్నారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని 100 మీటర్ల లోతున పాతిపెట్టిందని ధ్వజమెత్తారు. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో బీసీలకు తగిన ప్రాధాన్యం దక్కలేదని, బీసీ సబ్ప్లాన్కు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి ఇప్పటి వరకూ అమలు చేయలేదని దుయ్యబట్టారు. పరకాల సభలో సీఎం రేవంత్ దుర్మార్గంగా మాట్లాడారన్నారు. పాలనపై ఆలోచన, అవగాహన లేదని విమర్శించారు. ప్రజలను నమ్మించి మోసం చేసే విద్యలో సీఎం రేవంత్ ఆరితేరారని విమర్శించారు. దీనిని ప్రజలు గమనించారని, తగిన సమయంలో బుద్ధి చెప్పుతారన్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించడాన్ని తీవ్రంగా ఖండించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు వింటేనే సీఎం రేవంత్ రెడ్డికి భయం పట్టకుంటుందన్నారు. పరకా ల పర్యటనకు ముందు తొలగిస్తే వరంగల్ జిల్లా భ గ్గుమంటుందనే ఉద్దేశంతోనే పర్యటన తర్వాతే విగ్రహం తొలగింపు దుశ్చర్యకు పూనుకున్నారని దు య్యబట్టారు. మాజీ జెడ్పీ చైర్మన్ సాంబారి సమ్మారావు, నాయకులు తాళ్లపల్లి జనార్దన్ గౌడ్, శోభన్, శ్రీధర్, సల్వాజీ రవీందర్ రావు పాల్గొన్నారు. శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి -
పునరుత్పాదక ఇంధనంతో విప్లవాత్మక మార్పులు
హన్మకొండ: డిజిటలైజేషన్, పునరుత్పాదక ఇంధనం ద్వారా విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని హైటెక్స్ నోవాటెల్లో మంగళవారం నిర్వహించిన ఇండియా ఎనర్జీ సమ్మిట్ – ఎక్స్పో 2026 కార్యక్రమంలో ‘మోడర్నయిజింగ్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ స్మార్ట్ గ్రిడ్స్ ఫర్ ఎ రిలయబుల్ పవర్ ఫ్యూచర్’’ అనే అంశంపై కర్నాటి వరుణ్ రెడ్డి ప్రసంగించారు. ఐఏఎస్ సంస్థలో అమలు చేస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధస్సు, నెట్వర్క్ మ్యాపింగ్, స్మార్ట్ మీటరింగ్ కార్యక్రమాలను వివరించారు. సమ్మిట్లో రాష్ట్ర ప్రభుత్వ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ చేతుల మీదుగా జ్ఞాపిక, సావనీర్ అందుకున్నారు. వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 21వ తేదీన వరంగల్ జిల్లాస్థాయి అండర్–14, 16, 18, 20 బాలబాలికల అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కిషన్, యుగేంధర్రెడ్డి మంగళవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఇందులో ఎంపికై న క్రీడాకారులు ఈనెల 26, 27 తేదీల్లో జేఎన్ఎస్లో జరగనున్న 12వ తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఉదయం 9 గంటలకు జనన ధ్రువీకరణ పత్రం లేదా పదో తరగతి మెమోతో హాజరుకావాలని వారు సూచించారు. పూర్తి వివరాలకు 9866564422, 9000354465 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు. కాజీపేట రూరల్: కాజీపేట సబ్ డివిజన్ పరిధిలో డోర్నకల్–గుండ్రాతిమడుగు మధ్య మూడో లైన్ నిర్మాణం కారణంగా కాజీపేట జంక్షన్ మీదుగా నడిచే చర్లపల్లి–షాలిమార్ (18046) వెళ్లే ఎక్స్ప్రెస్ను బుధవారం వయా పగిడిపల్లి, గుంటూరు, విజయవాడ మీదుగా దారి మళ్లించి నడిపిస్తున్నట్లు మంగళవారం రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని కోరారు. హన్మకొండ అర్బన్: జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం కింద ల్యాబ్ టెక్నీషియన్్ ఒకటి, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ రెండు పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు హనుమకొండ డీఎంహెచ్ఓ అప్ప య్య తెలిపారు. కలెక్టర్ అనుమతితో ఈ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేసినట్లు పేర్కొన్నారు. వీటిలో ఒకటి జనరల్, మరొకటి ఎస్సీ కేటగిరీకి కేటాయించారని తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 19వ తేదీ ఉదయం 10.30 నుంచి 24వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు హనుమకొండ కలెక్టరేట్లోని వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. వివరాల కోసం హనుమకొండ జిల్లా అధికారిక వెబ్సైట్ను పరిశీలించాలని పేర్కొన్నారు. నయీంనగర్: భద్రకాళి బండ్పై సందర్శకుల సౌకర్యార్థం బ్యాటరీ వాహనం సేవలను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మంగళవారం ప్రారంభించి అందుబాటులోకి తెచ్చారు. అనంతరం ఆ వాహనంలో నాయినితోపాటు, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, బల్దియా కమిషనర్ వెంకన్న, కుడా సీపీఓ అజిత్రెడ్డి ప్రయాణించారు. కెనరా బ్యాంకు ఫాతిమానగర్ బ్రాంచ్ తన సీఎస్ఆర్ నిధుల కింద ఈ బ్యాటరీ వాహనం కొనుగోలు చేసి కుడాకు అందించింది. కార్యక్రమంలో కుడా ఈఈ భీంరావు, కెనరా బ్యాంకు అధికారులు పాల్గొన్నారు. -
పాపన్నను స్ఫూర్తిగా తీసుకోవాలి
హన్మకొండ అర్బన్: సామాజిక సమానత్వం, బడుగు, బలహీనవర్గాల హక్కుల కోసం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ చేసిన పోరాటాన్ని నేటితరం స్ఫూర్తిగా తీసుకోవాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సూచించారు. హనుమకొండ కలెక్టరేట్లో మంగళవారం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి నిర్వహించారు. ఎమ్మెల్యే నాగరాజు, హను మకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, అదనపు కలెక్టర్ రవి, అధికారులు పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ‘కుడా’ మాజీ చైర్మన్్ సుందర్రాజ్యాదవ్, బీసీ సంక్షేమ శాఖ అధికారి లక్ష్మణ్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. పాపన్నగౌడ్ జీవితం ఆదర్శం : ఎమ్మెల్యే నాగరాజు, కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జీవితం అందరికీ ఆదర్శమని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. మంగళవారం వరంగల్ కలెక్టరేట్లో కలెక్టర్ డాక్టర్ సత్యశారదతో కలిసి పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ. గణేశ్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్ఓ విజయలక్ష్మి, బీసీ సంక్షేమశాఖ అధికారి పుష్పలత, గౌడ సంఘం నాయకులు రాజుగౌడ్, రమేశ్, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, లక్ష్మణ్ పాల్గొన్నారు. అనంతరం వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధిపై కలెక్టర్ సత్యశారదతో కలిసి ఎమ్మెల్యే నాగరాజు సమీక్ష నిర్వహించారు. -
బీఏఎంఎస్ అడ్మిషన్లకు లైన్ క్లియర్!
● వరంగల్ ఆయుర్వేద కళాశాలలో ఆయుష్ సీట్లు పదిలం ● కండీషన్ అఫిడవిట్తో అంగీకరించిన ఎన్సీఐఎస్ఎం ● 2026–2027 వైద్యవిద్య ప్రవేశాల అభ్యర్థులకు అవకాశం కాశిబుగ్గ: వరంగల్ లేబర్కాలనీలోని అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో ఆయుష్ (బీఏఎంఎస్) అడ్మిషన్లకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. 2026–2027లో వైద్యవిద్య ప్రవేశాలకు సంబంధించిన సీట్ల భర్తీ కోసం డోకా లేనట్లు సమాచారం. ఢిల్లీలోని నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టం ఆఫ్ మెడిసిన్ (ఎన్సీఐఎస్ఎం) హెల్త్ సెక్రటరీ తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల మేరకు కళాశాలలో ఉన్న 50 జనరల్ సీట్లతో పాటు 13 ఈడబ్ల్యూఎస్ సీట్లు కలిపి మొత్తం 63 బీఏఎంఎస్ సీట్లను భర్తీ చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. నీట్ ద్వారా బీఏఎంఎస్ కోర్సులో చేరడానికి మార్గం సుగమం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది 12 సీట్లకు కోత.. కళాశాలలోని అధ్యాపకులు, ఇతర సౌకర్యాలను లేమిగా చూపుతూ గత సంవత్సరం 12 సీట్లకు కోత పెట్టారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సకాలంలో సదుపాయాలు కల్పించకపోవడం వల్ల సీట్లను కోల్పోవాల్సి వచ్చిందని నిరసన తెలిపారు. దీంతో వచ్చే విద్యా సంవత్సరానికి ఫ్యాకల్టీతో పాటు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని అప్పుడు కండీషన్ అఫిడవిట్ ఇవ్వడంతో సీట్లను యథావిధిగా భర్తీ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఈ విద్యా సంవత్సరం వరకు ఫ్యాకల్టీతోపాటు ఎలాంటి సదుపాయాలు కల్పించలేదు. ఈ ఏడాది ఏప్రిల్లో తనిఖీ కోసం వచ్చిన ఉన్నతాధికారులు సౌకర్యాల లేమి చూపినట్లు తెలుస్తోంది. అవసరమైన సదుపాయాలు.. 2024 గెజిట్ ప్రకారం 30 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఉండాలి. ఈ ఏడాది మరో 50 మందిని పెంచారు. అలాగే, టీచింగ్ స్టాఫ్ 60 మంది ఉండాలి. మరో 30 మందిని అదనంగా పెంచినట్లు తెలుస్తోంది. దీంతో మొత్తం 80 మందిని నియమించడం సాధ్యంకాని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే కళాశాలలో 40 శాతం వరకు ఖాళీలు ఉన్నట్లు సమాచారం. మళ్లీ కండీషన్ అఫిడవిట్..! ఆయుష్ విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం గతంలో మాదిరిగా ఈసారి కూడా కండీషన్ అఫిడవిట్ తీసుకున్నట్లు సమాచారం. 31 జనవరి 2027లోపు పూర్తిస్థాయిలో ఫ్యాకల్టీతో పాటు సౌకర్యాలు కల్పిస్తామని అండర్ టేకింగ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా ఈడబ్ల్యూఎస్ కలుపుకుని 63 ఆయుష్ సీట్లు భర్తీ చేసే అవకాశం ఏర్పడింది. కండీషన్ అఫిడవిట్కు ఎన్సీఐఎస్ఎం అంగీకరించినట్లు సమాచారం. -
విద్యుత్ ఉద్యోగుల క్రీడలు ప్రారంభం
హన్మకొండ: ™ðlÌS…V>׿ {sꯌSÞ Mø, yìlçÜP… Æ>çÙ‰ Ýë¦Æ‡$$ C…rÆŠ‡ çÜÇPÌŒæ {MîSyé ´ùsîæ-Ë$ {´ëÆý‡…-¿ýæ-Ð]l$-Ķæ*ÅÆ‡$$. {sꯌSÞ-Mø Ð]lÆý‡…-VýSÌŒæ gZ¯ŒS B†£ýlÅ…ÌZ Ð]lÊyýl$ ÆøkÌS ´ër$ fÆý‡-VýS-¯]l$¯]l² »êÅyìlÃ…r¯Œl, çœ#sŒæ-»êÌŒæ {MîSyýl-ÌS¯]l$ Ð]l$…VýS-âýæ-ÐéÆý‡… çßæ¯]l$-Ð]l$-Mö…yýl-ÌZ° iyýl-º*ÏÅ-G…ïÜ C…yøÆŠ‡ õÜtyìl-Ķæ$…-ÌZ {sꯌSÞ-Mø Ð]lÆý‡…-VýSÌŒæ gZ¯ŒS `‹œ C…f±ÆŠ‡ Ð]l¬Æý‡-äÝë-VýSÆŠ‡ {´ëÆý‡…-À…^éÆý‡$. °™èlÅ… ç³° J†¢yìl-ÌZ E…yól E§øÅ-VýS$-ÌSMýS$ CÌê…sìæ {MîSyýl-Ë$ Ð]l*¯]l-íÜ-MøÌêÏçÜ… MýSÍWÝë¢-Ķæ$-¯é² Æý‡$. ÝùµÆŠætÞ Mú°ÞÌŒæ Ð]lÆý‡…-VýSÌŒæ A«§ýlÅ-„ýS$yýl$, G‹ÜD Æý‡Ò…{§ýl, G‹ÜDË$ sìæ.Ñ.Æ>Ð]l#, }°ÐéçÜ$-Ë$, Æ>çÙ‰ ÝùµÆŠætÞ BïœçܯЇ fVýS-¯é²£Šl, Ð]lÆý‡…-VýSÌŒæ ÝùµÆŠætÞ Mú°ÞÌŒæ f¯]l-Æý‡ÌŒæ òÜ{MýS-rÈ ç³#ÌêÅÌS Æ>hÆð‡yìlz, sîæi G±µyîl-ïÜGÌŒæ ÝùµÆŠætÞ Mú°ÞÌŒæ f¯]l-Æý‡ÌŒæ òÜ{MýS-rÈ õßæÐ]l$…™Œæ MýS$Ð]l*-ÆŠæ, ™èl¨™èl-Æý‡$-Ë$ ´ëÌŸY-¯é²Æý‡$.˘వన్యప్రాణులను చంపితే జైలు ● ఎఫ్ఆర్వో జి. ప్రసాదరావు గూడూరు: అటవీ జంతువులను వేటాడినా, చంపినా జైలు శిక్ష తప్పదని ఎఫ్ఆర్వో జి. ప్రసాదరావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో చుక్కల దుప్పిని చంపిన ఇద్దరు వేటగాళ్ల అరెస్ట్ చూపి వివరాలు వెల్లడించారు. మచ్చర్లకు చెందిన యువకులు కొట్టెం మనోజ్కుమార్, తొర్రెం సందీప్, నవీన్.. దామరవంచ ఫారెస్ట్ బీట్లో అటవీ జంతువులను చంపడానికి ఉచ్చులు అమర్చారు. ఆ ఉచ్చులో సోమవారం ఓ చుక్కల దుప్పి పడగా దానిని మచ్చర్ల సమీపంలోని ఓ చేనులో చంపి మాంసం విక్రయానికి సిద్ధపడ్డారు. దీనిపై విశ్వసనీయ సమాచారం అధికారులు ఘటనాస్థలికి చేరుకుని గాలించారు. ఇందులో నవీన్ పరారు కాగా, ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. అనంతరం విచారించగా ఆ జంతువును తామే చంపామని అంగీకరించారు. దీంతో దుప్పి మాంసం స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని, పరారైన యువకుడి కోసం గాలిస్తున్నట్లు ఎఫ్ఆర్వో తెలిపారు. రోడ్డు ప్రమాదంలో పాస్టర్ మృతి కాజీపేట అర్బన్ : ఆటో బోల్తాపడి పాస్టర్ మృతి చెందాడు. ఈ ఘటన మడికొండ శివారు ధర్మసాగర్ ఓఆర్ఆర్ వద్ద చోటు చేసుకుంది. మృతుడి కుమారుడు నలిమేల పీటర్ కథనం ప్రకారం.. కాజీపేట విష్ణుపురి కాలనీలో నివాసముంటున్న నలిమేల ప్రభాకర్(52) ధర్మసాగర్లోని పెంథెకోస్ట్ చర్చిలో పాస్టర్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం విష్ణుపురి కాలనీ నుంచి ధర్మసాగర్ చర్చి వద్దకు తానే ఆటో డ్రైవింగ్ చేస్తూ అసోసియేట్ పాస్టర్ రాసమల్ల విజయ్కుమార్తో కలిసి బయలుదేరాడు. ఆటో ధర్మసాగర్ ఓఆర్ఆర్ వద్దకు చేరుకోగా అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తాపడింది. ఈ ఘటనలో పాస్టర్ ప్రభాకర్, విజయ్కుమార్ ఆటో కింద పడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను 108లో ఎంజీఎం తరలించారు. ప్రభాకర్ చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మడికొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పాస్టర్ ప్రభాకర్ మృతితో విశ్వాసులు కన్నీటి పర్యంతమయ్యారు. -
ఉత్సాహంగా నేషనల్ అథ్లెటిక్స్ సిరీస్
● హాజరైన 495 మంది అథ్లెట్లు వరంగల్ స్పోర్ట్స్: అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన నేషనల్ అథ్లెటిక్స్ సిరీస్–13 ఉత్సాహంగా సాగింది. ఒక్కరోజు పోటీల్లో భాగంగా క్రీడలు ఉదయం ప్రారంభమై సాయంత్రం 6గంటలకు ముగిశాయి. మెన్ అండ్ ఉమెన్ విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 495 మంది అథ్లెట్లు హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. 12 ఈవెంట్లలో పోటీలు నిర్వహించగా విజేతల జాబితాను అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఆన్లైన్లో అందించనున్నట్లు తెలిపారు. సర్టిఫికెట్లు సైతం ఆన్లైన్లోనే తీసుకోవాలని సూచించారు. -
ఇంటర్ విద్యలో ఆధునిక బోధన
● వరంగల్ డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ కాళోజీ సెంటర్: ప్రస్తుత సాంకేతిక విప్లవానికి అనుగుణంగా ఇంటర్మీడియట్ సిలబస్ను మార్చినట్లు వరంగల్ డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ అన్నారు. హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మంగళవారం అధ్యాపకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ సుమన్ మాట్లాడుతూ జనరల్ విభాగంలో చదివే విద్యార్థుల కోసం తెలుగు ద్వితీయ భాషా పాఠ్యపుస్తకాన్ని పూర్తిగా నూతన శైలిలో రూపొందించారని, సమకాలీన అంశాలు, నైతిక విలువలు, సృజనాత్మకత పెంపొందించేలా నూతన పాఠ్యాంశాలను చేర్చారన్నారు. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా కృత్రిమ మేథ(ఏఐ) డిజిటల్ తరగతుల ద్వారా బోధించే ప్రణాళిక ఉందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు శ్రీనివాస్రావు, మాధవరావు, పరశురాం, శ్రీదేవి, అధ్యాపకులు, రిసోర్స్పర్సన్స్ పాల్గొన్నారు. -
వేధిస్తున్న అధ్యాపకుల కొరత
కేయూ క్యాంపస్ : వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీ బుధవారం నాటికి 50 వసంతాలు పూర్తి చేసుకుని (గోల్డెన్ జూబ్లీ) 51 వసంతంలోకి అడుగిడుతోంది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీని పలు సమస్యలు వేధిస్తున్నాయి. ప్రధానంగా రెగ్యులర్ అధ్యాపకుల కొరతతో విద్యాబోధనపై, పరిశోధనలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. రెగ్యులర్ అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్లు కలిపి ప్రస్తుతం 77మంది ఉన్నారు. వీరిలో కొందరు రెండు, మూడు అంతకంటే ఎక్కువగా పాలన పదవుల్లోనే కొనసాగుతున్నారు. దీంతో బోధనపై వీరు అంతగా ఆసక్తి చూపడం లేదని ఆరోపణలున్నాయి. పొలిటికల్ సైన్స్, విద్యా కళాశాల, ఫిజికల్ ఎడ్యుకేషన్, జర్నలిజం, సైకాలజీ, తెలుగు, బయోకెమిస్ట్రీ విభాగాల్లో ఒక్కరు కూడా రెగ్యులర్ అధ్యాపకులు లేరు. బాటనీ, హిస్టరీ, జియాలజీ, ఎకనామిక్స్ విభాగాల్లో ఒకరు చొప్పున రెగ్యులర్ అధ్యాపకులు ఉండగా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఇద్దరు ఉండగా, అందులో ఒకరు తెలంగాణ వర్సిటీ వీసీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 172 మంది కాంట్రాక్టు లెక్చరర్లు ఉండగా 165 మంది వరకు పార్ట్టైం లెక్చరర్లు ఉన్నారు. మరో 99 మంది వరకు నూతనంగా పార్ట్టైం లెక్చరర్లకు త్వరలోనే నియామక పత్రాలు ఇవ్వనున్నారు. 332 అధ్యాపక పోస్టులు ఖాళీ.. కేయూలో రెగ్యులర్ అధ్యాపకుల పోస్టులు 409 మంజూరు ఉండగా ప్రస్తుతం 77మంది పనిచేస్తున్నారు. 332 పోస్టులు వెకెన్సీలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో 136 అధ్యాపకుల పోస్టులకు మంజూరు ఇచ్చి నియమించలేదు. క్యాంపస్లోని రెండు ఇంజనీరింగ్ కళాశాలల్లోనూ రెగ్యులర్ అధ్యాపకులను నియమించాల్సింది. నాన్టీచింగ్ పోస్టుల మంజూరు 626 ఉండగా ప్రస్తుతం రెగ్యులర్ 311మంది పనిచేస్తున్నారు. 315 వెకెన్సీలున్నాయి. నాన్టీచింగ్ కాంట్రాక్టులో 167 మంజూరు ఉండగా 155 మంది పనిచేస్తున్నారు. 12వెకెన్సీలు ఉన్నాయి. ఔట్సోర్సింగ్ పోస్టుల మంజూరు 330 ఉండగా 327 వెకెన్సీలు 3 ఉన్నాయి. సర్వీస్ పెన్షనర్లు టీచింగ్ నాన్టీచింగ్ కలిపి 498 మంది ఉన్నారు. ఫ్యామిలీ పెన్షనర్లు 294 మంది ఉన్నారు. పీజీసెంటర్ల బలోపేతంపై దృష్టి ఏది? కేయూ పరిధిలో జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, నిర్మల్ జిల్లాలో పీజీ సెంటర్లున్నాయి. కానీ వీటి అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టడంలేదు. అక్కడ పీజీ సెంటర్లలో రెగ్యులర్ అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు లేరు. తూతూ మంత్రంగా నడిపిస్తుండడంతో అడ్మిషన్ల సంఖ్య తగ్గిపోతోంది. సరిపడా హాస్టళ్లులేవు.. విద్యార్థులకు సరిపడా హాస్టళ్లు లేవు. ముఖ్యంగా పీ జీ తదితర కోర్సుల్లో విద్యార్థినులు( మహిళలు) ఎ క్కువ మంది అడ్మిషన్లు పొందుతున్నారు. వీరికి స రిపడా హాస్టళ్ల సదుపాయం కల్పించలేకపోడంతో ఇ బ్బందులు పడుతున్నారు. ఇక మెస్లలో నాణ్య మైన భోజనం అందించాలని తదితర సమ్యలతో తరచూ ఆందోళనలు చేస్తున్న విషయం విధితమే.కాకతీయ యూనివర్సిటీ స్వర్ణోత్సవ వేడుకలు, యూనివర్సిటీ ఆవిర్భావాన్ని బుధవారం ఉదయం 11గంటలకు క్యాంపస్లోని సెనెట్హాల్లో నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ వి. రామచంద్రం మంగళవారం తెలిపారు. యూనివర్సిటీ ఐదు దశాబ్దాల ప్రస్థానంలో విద్య, పరిశోధన సంస్థాగత అభివృద్ధి, ఉన్నత విద్యారంగంలో అందించిన విశిష్ట సేవలను ఈ సందర్భంగా స్మరించుకోనున్నారని తెలిపారు. కేయూలో 332 పోస్టులు ఖాళీ బోధన, పరిశోధనలపై ప్రతికూల ప్రభావం విద్యార్థులకు సరిపడా హాస్టళ్లు ఏవీ? -
మొక్కలు నాటడం బాధ్యతగా భావించాలి
ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ● కాకతీయ వైద్య కళాశాలలో వనమహోత్సవం కాశిబుగ్గ: మొక్కలు నాటడం బాధ్యతగా భావించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి సూచించారు. కాకతీయ వైద్య కళాశాలలో వరంగల్ పూర్వ విద్యార్థుల సంఘం, కళాశాల యాజమాన్యం సహకారంతో మంగళవారం వనమహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని హాజరై మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ బాధ్యతగా తీసుకోవాలన్నారు. అనంతరం అటవీ శాఖ అధికారులు అందించిన వెయ్యి మొక్కలను కేఎంసీ ప్రాంగణంలో నాటారు. అలాగే, పూర్వ విద్యార్థి, ఎన్ఆర్ఐ డాక్టర్ జంధ్యం దివాకర్ రూ.లక్ష విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. అలుమిని అధ్యక్షుడు డాక్టర్ కస్తూరి శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.వెంకన్న, కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్దాసు, జిల్లా అటవీశాఖ అధికారి ముకుందరెడ్డి, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ రాంకుమార్రెడ్డి, డాక్టర్ పి.విజయ్చందర్రెడ్డి, రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యారాణి, పి.ఉపేందర్రెడ్డి, పి.విజయకుమారి, రాంచందర్, లక్ష్మారెడ్డి, కూరాకుల భారతి, మట్టెవాడ సీఐ కరుణాకర్ పాల్గొన్నారు. -
శిలాఫలకాలు, సర్క్యులర్లకే పరిమితం..!
న్యూశాయంపేట: హజ్యాత్రకు వెళ్లే యాత్రికుల కోసం, వరంగల్, కరీంనగర్, ఖమ్మం మైనార్టీలకు ఉపయోగపడుతుందనే కోణంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాధారణ ఎన్నికలకు ముందు వరంగల్ నగరంలో రూ.5 కోట్ల వ్యయంతో హౌజ్హౌస్ నిర్మాణానికి ప్రతిపాదించారు. అంతేకాకుండా హనుమకొండలో రూ.5కోట్ల వ్యయంతో షాదీఖానా నిర్మాణానికి శిలాఫలకాల ఆవిష్కరణ, సర్క్యులర్ల జారీ చకచకా జరిపోయాయి. నాయకుల ప్రకటనలు, అధికారులు వేసిన అంచనాలు చివరికి కాగితాలకే పరిమితమయ్యాయి. వరంగల్లో హజ్హౌస్ కోసం వరంగల్ రైల్వేస్టేషన్ ఎదురుగా సర్వే నంబర్ 10లో 1,400 గజాల స్థలం కేటాయిస్తున్నామని సర్క్యులర్ జారీ చేశారు. మండిబజార్ జెండా వద్ద అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శిలాఫలకాన్ని సైతం ఆవిష్కరించారు. తర్వాత నిధుల విడుదలలో జాప్యం, పాలక వర్గాల నిర్లక్ష్యం కారణంగా పనులు ముందుకు సాగలేదు. కాగా, ఈ స్థలాన్ని ప్రస్తుతం వేరే ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించినట్లు సమాచారం. హనుమకొండలో పేద, మధ్య తరగతి మైనార్టీ కుటుంబాల శుభకార్యాలు, వివాహాలు జరుపుకునేందుకు 2023లో అప్పటి ప్రభుత్వం న్యూశాయంపేటలోని 579 సర్వే నంబర్లో సుమారు 25 గుంటల ప్రభుత్వ స్థలాన్ని కేటాయిస్తూ సర్క్యులర్ జారీ చేసింది. నాటి మంత్రి కేటీఆర్ లష్కర్బజార్లో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అధి కారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణానికి భూమి అనువుగా లేదని కుడా నిధులతో భద్రకాళి చెరువు మట్టిని నింపి వేరే ప్రజోపయోగ కార్యక్రమానికి వినియోగించుకోవాలని భూ కేటాయింపుని రద్దు చేసింది. కాగా, ఇటీవల బీఆర్ఎస్ ఆందోళనలతో అదే భూమిని షాదీఖానాకు కేటాయించారు. ములుగురోడ్డులో గుసూల్ ఖానా.. నగరంలో అద్దె ఇళ్లలో నివసించే కుటుంబాలకు మృతదేహానికి గుసూల్ నిర్వహించడానికి సరైన స్థలం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇస్లాం ఆచారం ప్రకారం మరణించిన వారి అంతిమ సంస్కారాల్లో భాగంగా పవిత్రస్నానం చేయించి, ఖన నం చేయడానికి రూ.20 లక్షలతో ములుగురోడ్డులోని ఖబ్రస్థాన్లో గుసూల్ఖానా, స్నానపు గదులు, మరుగుదొడ్ల నిర్మాణానికి 2023లో అప్పటి మంత్రి మహమూద్ అలీ శంకుస్థాపన చేశారు. పిల్లర్ల వరకు నిర్మాణం పూర్తయ్యింది. అనంతరం పట్టించుకోకుండా వదిలేశారు. నగరంలో నిర్మాణానికి నోచుకోని హజ్హౌస్, షాదీఖానా మండిపడుతున్న మైనార్టీ సంఘాలు -
వరంగల్ డీఎంఓగా నాగరాజు బాధ్యతల స్వీకరణ
ఖిలా వరంగల్: వరంగల్ జిల్లా మార్కెటింగ్ అధికా రిగా నాగరాజు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. డీఎంఓ కలకోట్ల సురేఖ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమెస్థానంలో మెదక్ జిల్లా డీఎంఓ నాగరాజును ఇక్కడికి బదిలీ చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం బాధ్యతలు చేపట్టి కలెక్టర్ సత్యశారదను మార్కెట్ కార్యదర్శి శ్రీనివాస్తో కలిసి మర్యాద పూర్వకంగా కలిశారు. పాము కాటుతో మహిళా కూలీ మృతి మరిపెడ రూరల్: పాము కాటుతో ఓ మహిళా కూలీ మృతి చెందింది. ఈ ఘటన మహబూబాబాద్ జి ల్లా మరిపెడ మండలం బాల్నిధర్మారంలో చోటు చే సుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మక్కల రాములమ్మ (55) సోమవారం గ్రా మంలోని ఓ రైతుకు చెందిన పత్తి చేనులో కలుపు తీస్తుండగా పాము కాటు వేసింది. సహకూలీలు గ మనించి వెంటనే మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందింది. -
ప్రాణం తీసిన విడాకుల పంచాయితీ
● వ్యక్తి దారుణ హత్య..రాంపూర్లో ఘటన ధర్మసాగర్: కూతురు విడాకు ల పంచాయితీ తండ్రి ప్రా ణం తీసింది. కక్షలను మనసులో ఉంచుకుని ఓ వ్యక్తిని పథకం ప్రకారం దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి హనుమకొండ జిల్లా ధర్మసాగర్ పీఎస్ పరిధిలోని కాజీపేట మండలం రాంపూర్లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా చిల్పూరు మండల కేంద్రానికి చెందిన పోలు వెంకటేశ్వర్లు (వెంకన్న)(45) రెండో కుమార్తెకు, వారి పక్క ఇంటికి చెందిన అంబటి వినయ్తో నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. అయితే మనస్పర్థల కారణంగా కొద్దిరోజులకే వారికి విడాకులయ్యాయి. ఆ సమయంలో జరిగిన పంచాయితీలో వినయ్ తండ్రి పరమేశ్వర్.. వెంకటేశ్వర్ల్లుపై దాడికి యత్నించగా స్థానిక పెద్దమనుషులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి 7:45 గంటల ప్రాంతంలో వెంకటేశ్వర్లు తన కుటుంబంతో కలిసి భోజనం చేస్తున్నాడు. ఈ సమయంలో పల్లె గ్రామానికి చెందిన దామర సంపత్ వచ్చి పరమేశ్వర్తో ఉన్న గొడవను మాట్లాడుకుందామని చెప్పి వెంకటేశ్వర్లును బయటకు తీసుకెళ్లాడు. రాత్రి 11:30 గంటలైనా వెంకటేశ్వర్లు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు సంపత్కు ఫోన్ చేయగా గ్రామ పంచాయతీ వద్ద దింపేశానని చెప్పి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం రాంపూర్ ఊర చెరువు మత్తడి వద్ద వెంకటేశ్వర్లు గొంతు కోసి రక్తం మడుగులో చనిపోయి ఉన్నట్లు గ్రామస్తులకు సమాచారం అందింది. ఈఘటనపై పథకం ప్రకారమే పరమేశ్, సంపత్ కలిసి తన భ ర్త వెంకటేశ్వర్లును కత్తితో నరికి హత్య చేశారని మృతుడి భా ర్య రాజమణి ధర్మసాగర్ పీఎస్లో ఫిర్యాదు చేశా రు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వెంకటేశ్వర్లు అంత్యక్రియలు పూర్తి.. చిల్పూరు: రాంపూర్ వద్ద సోమవారం అర్ధరాత్రి హత్యకు గురైన పోలు వెంకటేశ్వర్లు (45) దహన సంస్కారాలు మంగళవారం సాయంత్రం స్వగ్రా మం చిల్పూరులో పూర్తయ్యాయి. జనగామ రూరల్ సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సై నవీన్కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించగా కుటుంబీకులు వెంకటేశ్వర్లు అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, వెంకటేశ్వర్లు స్టేషన్ఘన్పూర్ రిజర్వాయర్ పంప్ హౌజ్ వద్ద వాచ్మెన్గా విధులు నిర్వర్తించేవారు. -
తాళం వేసిన ఇళ్లే టార్గెట్..
జనగామ : తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ భీం శర్మ తెలిపారు. మంగళవారం జనగామ పట్టణ పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ పి.సత్యనారాయణరెడ్డి, ఎస్సై ఎం.భరత్తో కలిసి వివరాలు వెల్లడించారు. వరంగల్కు చెందిన సయ్యద్ హమీద్ ప్రస్తుతం హైదరాబాద్లోని చాంద్రాయణగుట్టలో నివాసముంటూ ఆటో డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గత నెల 28, 29 తేదీల్లో బైక్పై హైదరాబాద్ నుంచి జనగామకు వచ్చిన నిందితుడు.. పట్టణంలోని హౌసింగ్ బోర్డు, రైల్వే ట్రాక్ సమీపంలోని కాలనీలతోపాటు బచ్చన్నపేట మండలం వీఎస్ఆర్ నగర్, సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రాంతాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడ్డాడు. చోరీ సొత్తులో కొంత భాగం విక్రయించి వచ్చిన డబ్బును వ్యక్తిగత అవసరాలతోపాటు జూదం, మద్యం తదితరాలకు ఖర్చు చేశాడు. కేసుల దర్యాప్తులో భాగంగా మంగళవారం మధ్యాహ్నం జనగామ–పెంబర్తి బైపాస్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన హమీద్ను ఆపి విచారించగా చోరీలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడి నుంచి సుమారు 47 గ్రాముల బంగారం, 210 గ్రాముల వెండి, రూ.5.60 లక్షల నగదు, బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీసీ పేర్కొన్నారు. కాగా, హమీద్పై గతంలో తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో 100కు పైగా చోరీ కేసులు నమోదయ్యాయి. నాచారం, సంగారెడ్డి పోలీస్స్టేషన్ల పరిధిలో సదరు దొంగపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించారు. ఇటీవల కర్నాటకలోని గుల్బర్గా, అశోక్నగర్ పోలీస్స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లి విడుదలైన అనంతరం మళ్లీ నేరాలకు పాల్పడుతున్నాడు. నిందితుడిని పట్టుకోవడంలో జనగామ సీఐ పి.సత్యనారాయణరెడ్డి, ఎస్సై ఎం.భరత్, హెడ్ కానిస్టే బుల్ బి.కరుణాకర్, ఎన్.సాగర్, బి.కృష్ణ, ఎన్.బి.భాస్కర్, ఐడీ అసిస్టెంట్ సాల్మన్తదితరులు ప్రతిభ కనబరిచారని, వారిని వరంగల్ సీపీ అభినందించినట్లు అధికారులు తెలిపారు. వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్ బంగారం, వెండి, నగదు స్వాధీనం నిందితుడిపై 100కు పైగా కేసులు -
మెస్ల నిర్వహణలో అక్రమాలపై సబ్కమిటీ
కేయూ క్యాంపస్: హైదరాబాద్లోని సెక్రటేరియట్లో మంగళవారం కేయూ పాలకమండలి సమావేశం నిర్వహించారు. ఇందులో పలు అంశాలపై చర్చించారు. కేయూలోని హాస్టళ్ల మెస్ల నిర్వహణ, అడ్వాన్స్ల పేరుతో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిన రెండు కమిటీల నివేదికలను పరిశీలించారు. నివేదికలు, అవకతవకల ఆరోపణలపై విచారణ జరిపి మరో నివేదిక ఇచ్చేలా పాలకమండలి సమావేశం నిర్ణయించిందని సమాచారం. ఇందుకోసం కేయూ పాలకమండలి సభ్యులు పుల్లూరు సుధాకర్, డాక్టర్ అనితారెడ్డి, ప్రొఫెసర్ మల్లం నవీన్తో సబ్కమిటీని నియమించారు. యంగ్ ఇండియా ఇంట్రిగ్రేటెడ్ స్కూల్కు 15 ఎకరాలు.. వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి ప్రభుత్వం మంజూరు చేసిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి కేయూలోని కెనాల్ సమీపంలో ఉన్న 15 ఎకరాల భూమి కేటాయించాలని తీర్మానం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదించారు. సమావేశం అనంతరం పలువురు పాలకమండలి సభ్యులు సెక్రటేరియట్లో ఉన్న ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డిని కలిసి ఈవిషయాన్ని వివరించారు. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతి, సహకారం అందేలా కృషిచేయాలని ఎమ్మెల్యేను కోరారు. ఎజెండాలో 40 అంశాలు.. నవంబర్లో నిర్వహించే కేయూ 24వ స్నాతకోత్సవానికి పాలకమండలి ఆమోదించింది. యూనివర్సిటీలో వివిధ అభివృద్ధి పనులకు కూడా పాలకమండలి సమావేశంలో ఆమోదించినట్లు తెలిసింది. ఎజెండాలో మొత్తం 40 అంశాలను ప్రవేశపెట్టగా పలు అంశాలు డిపర్ అయ్యాయని సమాచారం. సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా, ఫైనాన్స్ స్పెషల్ సెక్రటరీ సిక్తా పట్నాయక్, ఉన్నత విద్యాకమిషనర్ శ్రీదేవసేన, కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం, పాలకమండలి సభ్యులు బి.సురేశ్లాల్, పి.సుధాకర్, సుదర్శన్, రమ, చిర్ర రాజు, అనితారెడ్డి, బాలుచౌహాన్, మల్లం నవీన్,సుకుమారి పాల్గొన్నారు. -
హనుమకొండ డీపీఆర్ఓగా బండి పల్లవి
హన్మకొండ అర్బన్: జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి గా బండి పల్లవి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. నూతనంగా డీపీఆర్ఓగా బాధ్యతలు స్వీకరించిన పల్లవికి పలువురు అధికారులు, కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. హన్మకొండ అర్బన్: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు టీఎన్జీఓస్ కేంద్ర సంఘం సెప్టెంబర్ 19న హనుమకొండలోని పాత పెన్షన్, పీఆర్సీ సాధన సభ నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్, టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ తెలిపారు. నాంపల్లిలోని టీఎన్జీఓస్ కేంద్ర సంఘం భవన్లో సోమవారం జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేనీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే తొలిసారిగా పాత పెన్షన్, పీఆర్సీ సాధన సభ హనుమకొండలో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో టీఎన్జీఓస్ జిల్లా కార్యదర్శి బైరి సోమయ్య, కేంద్ర సంఘం ఉపాధ్యక్షుడు రామునాయక్ పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవాలని తెలంగాణ యూనివర్సిటీ వీసీ టి.యాదగిరిరావు సూచించారు. కేయూలోని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మానవ వనరుల విభాగాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ఈసందర్భంగా విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో వీసీ మాట్లాడారు. సమావేశంలో విభాగాధిపతి పి.శ్రీనివాస్రావు, అధ్యాపకులు ఎ.శ్రీనివాసులు, చీకటి శ్రీను, ఉమాశంకర్, దేవేంద్రచారి విద్యార్థులున్నారు. న్యూశాయంపేట: టైలరింగ్లో ప్రావీణ్యం ఉన్న నిరుద్యోగులకు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ఉపాధి అవకాశాలు ఉన్నాయని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. డీఆర్డీఓ కార్యాలయంలో నిరుద్యోగులు సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతీ సోమవారం, గురువారాల్లో ఉదయం 11 గంటలకు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును సంప్రదించి కూడా ఉపాధి పొందవచ్చని ఆమె పేర్కొన్నారు. కేయూ క్యాంపస్: అధునాతన సాంకేతిక సాధనాల వినియోగం అత్యంత కీలకమని కేయూ ఓఎస్డీ బి.వెంకట్రాంరెడ్డి అన్నారు. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ లైఫ్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్ అండ్ అలైడ్ డిసిప్లిన్స్ ఆధ్వర్యంలో కేయూ కంప్యూటర్ సెంటర్లో వారం రోజుల వర్క్షాపును సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఆధునిక పరిశోధనలో డేటాను శాసీ్త్రయంగా విశ్లేషించి ప్రయోగాత్మక ఫలితాలను మరింత కచ్చితంగా వినియోగించాలని కోరారు. పుణేలోని అడ్వకేంట్ ఇన్ఫర్మేటిక్స్ సీఈఓ సురోజిత్సాధు, ఇతర బాధ్యులు షమ్షీర్సింగ్, దీపక్శర్మ, రూసా నోడల్ అధికారి ఆర్.మల్లికార్జున్రెడ్డి, వర్క్షాప్ కో–ఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎన్.ప్రసాద్, కో కోఆర్డినేటర్ డాక్టర్ శాస్త్రి, యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ టి.మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
గ్రేటర్ వరంగల్ కమిషనర్ టి.వెంకన్న వరంగల్ అర్బన్: ‘గ్రేటర్’ గ్రీవెన్స్ సెల్కు అందిన ఫిర్యాదులపై ఏ మాత్రం నిర్లక్ష్యం వహించొద్దని కమిషనర్ టి.వెంకన్న అధికారులను, ఉద్యోగులను హెచ్చరించారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయం కౌన్సిల్ హాల్లో జరిగిన గ్రీవెన్స్ సెల్లో ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 95 ఫిర్యాదులు అందాయి. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. సమస్యాత్మక దరఖాస్తులైతే నివేదికలు అందించాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ జోనా, ఎస్ఈ రాజ్కుమార్, ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య, సెక్రటరీ అనిల్ బాబు, హార్టికల్చర్ అధికారి లక్ష్మారెడ్డి, పన్నుల అధికారి రామకృష్ణ, అధికారులు పాల్గొన్నారు. -
అందుబాటులో నీటి నాణ్యత యూనిట్లు
వరంగల్ అర్బన్: వరంగల్ మహానగర ప్రజలకు మరింత నాణ్యమైన, సురక్షితమైన తాగునీటిని అందించేందుకు అధునాతన నీటి నాణ్యత పర్యవేక్షణ వ్యవస్థను (వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టం) అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు గ్రేటర్ వరంగల్ కమిషనర్ టి. వెంకన్న తెలిపారు. సోమవారం బల్దియా కౌన్సిల్హాల్ నుంచి నిర్వహించిన వీడి యో కాన్ఫరెన్స్లో కమిషనర్ పాల్గొని నీటి నాణ్యత పర్యవేక్షణ విధానాన్ని పరిశీలించారు. నగరంలోని ప్రతా పరుద్ర, కేయూసీ, వడ్డేపల్లి ఫిల్టర్ బెడ్లలో వా టర్ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టం యూనిట్లను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్పుట్, ఔట్పుట్ దశల్లో నీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షించేందుకు ఈ అధునాతన వ్యవస్థలు ఉపయోగపడతా యని తెలిపారు. అమృత్ 2.0 ఫేజ్–2లో భాగంగా ఐనెట్ ఆక్వా సొల్యూషన్ రూపొందించిన ‘ఆన్లైన్ఫ్లోరైడ్ క్వాలిటీ మానిటరింగ్’ సాంకేతికతకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రశంసలు లభించాయని కమిషనర్ తెలిపారు. అదేవిధంగా జీడబ్ల్యూఎంసీ ఎస్బీఐ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్వహించిన శాలరీ ప్యాకేజీ అవగాహన సదస్సులో కమిషనర్ మాట్లాడారు. ఎస్ఈ రాజ్కుమార్, ఈఈలు రవికుమార్, మహేందర్, మాధవీలత, డీఈలు, ఏఈలు, పాల్గొన్నారు. మండలస్థాయి ప్రజావాణికి స్పందనన్యూశాయంపేట: ఎంపీడీఓ నోడల్ అధికారిగా మండల స్థాయిలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి స్పందన లభించింది. జిల్లా వ్యాప్తంగా 11 మండలాల పరిధిలోని ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి ఎంపీడీఓలకు వినతి పత్రాలు అందించారు. నెక్కొండలో 13, గీసుకొండ 8, నర్సంపేట 15, నల్లబెల్లి 8, ఖానాపురం 20, పర్వతగిరి 38, సంగెం 20, వర్ధన్నపేట 18, రాయపర్తి 17, చెన్నారావుపేట 7, దుగ్గొండిలో 6 వినతులు (మొత్తం 170) స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించాలి
హన్మకొండ అర్బన్: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరి ష్కార చర్యలను వేగవంతం చేయాలని హనుమకొండ కలెక్టర్, గ్రేటర్ ప్రత్యేకాధికారి చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన, ప రిష్కార చర్యలపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కా ర్పొరేషన్ టౌన్ప్లానింగ్, రెవెన్యూ, సాగునీటిపారుదల శాఖల అధికారులతో కలెక్టర్ సోమవారం స మీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోర్టల్లో నమోదైన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను అధికారులు సమన్వయంతో పరిశీలించాలన్నారు. సిటీ ప్లానర్ రవీంద్ర రాడేకర్, టౌన్ప్లానింగ్ అధికా రి జ్యోతి, అసిస్టెంట్ సిటీప్లానర్లు నస్రీన్భాను, ప్రశాంత్, ఇరిగేషన్ అధికారి వెన్నెల పాల్గొన్నారు. కేటాయించిన డబుల్బెడ్రూం ఇళ్లలో నివసించాలి కాజీపేట అర్బన్: కేటాయించిన డబుల్ బెడ్రూం ఇళ్లలో వెంటనే నివసించాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. గ్రేటర్ 31వ డివిజన్ న్యూశాయంపేటలోని డబుల్ బెడ్రూం ఇళ్లను కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించి మాట్లాడారు. న్యూశాయంపేటలోని 19 బ్లాకుల్లో నిర్మాణం చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్లలో ఆరు బ్లాక్లకు మాత్రమే విద్యుత్ సౌకర్యం ఉందని మిగతా బ్లాక్లకు కూడా వారం రోజుల్లో విద్యుత్ సౌకర్యం కల్పించాలని అధికారులకు సూచించారు. హౌసింగ్ పీడీ సిద్ధార్థ్నాయక్, ఆర్అండ్బీ ఈఈ, హౌసింగ్ ఏఈ పాల్గొన్నారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ -
హౌస్సర్జన్ల రిలే నిరాహార దీక్ష ప్రారంభం
కాశిబుగ్గ: స్టైఫండ్ పెంపుపై ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ఆయుష్ విద్యార్థులు, హౌస్సర్జన్లు వరంగల్ ప్రభుత్వ అనంతలక్ష్మి ఆయుర్వేద వైద్యశాల వద్ద సోమవారం రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. తెలంగాణ ఆయుష్ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు 14వ రోజుకు చేరాయి. దీక్షలో జేఏసీ జాయింట్ సెక్రటరీ డాక్టర్ రోహిత్ బాస్రే, డాక్టర్ గణేశ్, డాక్టర్ సంఘమేశ్వర్రెడ్డి, డాక్టర్ కీర్తన, డాక్టర్ అంకిత పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. న్యాయమైన డిమాండ్ల కోసం తాము శాంతియుతంగా పోరాటం చేస్తూ, అధికారులకు వినతిపత్రాలు అందజేశామని తెలిపారు. పోస్టర్ కార్డు క్యాంపెయిన్, హైదరాబాద్లో ధర్నా చేసినా ఫలితం లేదని వాపోయారు. ములుగు జిల్లాకు విచ్చేసిన సీఎం రేవంత్రెడ్డికి తమ గోడును విన్నవించుకోవడానికి అవకాశం కల్పించకపోవడం మరింత బాధకు గురిచేసిందని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చేవరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. -
బీఆర్ఎస్ నిరసన ఉద్రిక్తం
హన్మకొండ: వరంగల్ కలెక్టరేట్ వద్ద బీఆర్ఎస్ నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ఎగవేతకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నందుకు నిరసిస్తూ సోమవారం హనుమకొండ కాళోజీ కూడలిలోని వరంగల్ కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయం నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా వరంగల్ కలెక్టరేట్కు వద్దకు చేరుకున్నారు. లోపలికి వెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు గేట్ మూసివేశారు. దీంతో గేట్ ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్తో పాటు ఇతర నాయకులను పోలీసులు పోలీస్స్టేషన్కు తరలిస్తుండగా కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వినయ్భాస్కర్తో పాటు, పార్టీ నాయకులను సుబేదారి పోలీస్ స్టేషన్కు తరలించి అనంతరం వదిలిపెట్టారు. ఈసందర్భంగా వినయ్భాస్కర్ మాట్లాడుతూ కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాన్ని రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, నాయకులు కమరున్నీసా బేగం, మిడిదొడ్డి స్వప్న, మర్రి యాదవరెడ్డి, నయీముద్దీన్, జోరిక రమేశ్, రామ్మూర్తి, బైరపాక ప్రశాంత్ తదితరులున్నారు. కల్యాణలక్ష్మి ఎగవేతపై ధర్నా వరంగల్ కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం -
అర్జీల సత్వర పరిష్కారానికి కృషి
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: ప్రజల నుంచి స్వీకరించిన వినతుల పరిష్కారానికి సత్వర పరిష్కారం చూపెట్టాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఆమె వినతులు స్వీకరించారు. వినతుల పరిష్కార చర్యలపై కలెక్టర్.. తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. మండల స్థాయి ప్రజావాణిని సజావుగా నిర్వహిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాగా, ప్రజావాణిలో జిల్లా స్థాయిలో 127, రెవెన్యూ డివిజన్ స్థాయిలో 47, మండల స్థాయిలో 187 కలిపి మొత్తం 361 వినతులు అందాయి. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.రవి, ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) శేషాద్రి, డీఆర్ఓ శ్రీనివాస్, ట్రెయినీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, డీఆర్డీఓ మేన శ్రీను, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. వినతులను తక్షణమే పరిష్కరించాలి: వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: ప్రజావాణిలో వచ్చిన వినతులను తక్షణమే పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అధికారులతో కలిసి ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. మొత్తం 166 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ.గణేశ్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్ఓ విజయలక్ష్మి, డీఆర్డీఓ నాగపద్మజ, డీఎంహెచ్ఓ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం
హన్మకొండ: విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం సాగుతుందని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ అన్నారు. యాదాద్రి పవర్ థర్మర్ పవర్ స్టేషన్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఆవరణలో మధ్యాహ్న భోజన సమయంలో విద్యుత్ ఉద్యోగులు ధర్నా చేశారు. అనంతరం ఈ నెల 19న నిర్వహించనున్న విద్యుత్ ఉద్యోగుల మహాధర్నా పోస్టర్ను తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో జేఏసీ టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్ రమణారావు, నాయకులు సామ్యానాయక్, నార్ల సుబ్రహ్మణ్యేశ్వరరావు, మల్లికార్జున్, పి.మహేందర్ రెడ్డి, కుమారస్వామి, మచ్చిక బుచ్చయ్యగౌడ్. చిట్ల ఓదెలు, జశ్వంత్కుమార్, విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు.ప్రతీ గర్భిణి వివరాలు నమోదు చేయాలి● మాతా శిశు సంక్షేమం కార్యక్రమ అధికారి డాక్టర్ రజిత హన్మకొండ అర్బన్: లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ చట్టం ప్రకారం స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు అన్ని రికార్డులను తప్పనిసరిగా నిర్వహించాలని మాతా శిశు సంక్షేమం కార్యక్రమ అధికారి డాక్టర్ రజిత సూచించారు. సోమవారం హనుమకొండ, పరకాలలోని స్కానింగ్ కేంద్రాలను ఆమె తనిఖీ చేసి రిజిస్ట్రేషన్, ఫీజుల చెల్లింపులు, స్కానింగ్ నివేదికలు, వైద్యుల వివరాలకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు. స్కానింగ్కు వచ్చిన ప్రతీ గర్భిణి పూర్తి వివరాలను ఫారం–ఎఫ్లో నమోదు చేసి, రోజువారీ వివరాలను ఆన్న్లైన్లో నమోదు చేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. లింగ నిర్ధారణ పరీక్షలకు సంబంధించి ఈనంబర్లో 63000 30940 ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యాదు చేసిన వారికి రూ.50 వేల పారితోషికం అందిస్తామన్నారు. అనంతరం శాయంపేట, కమలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి మాతా శిశు సంక్షేమ రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యాధికారి సాయికృష్ణ, ఆరోగ్య పర్యవేక్షకులు పద్మజ, సందీప్ పాల్గొన్నారు. కరాటే మాస్టర్ల గిన్నిస్ రికార్డు కాజీపేట రూరల్: కాజీపేటకు చెందిన రైల్వే ఉద్యోగి పాశం దేవయ్య బ్లాక్ బెల్ట్, నయీంనగర్కు చెందిన దామెర శంకర్ బ్లాక్ బెల్ట్ గిన్నిస్బుక్ వరల్డ్ రికార్డు సాధించారు. పాశం దేవయ్య తెలిపిన వివరాల మేరకు.. వరల్డ్ కరాటే మాస్టర్స్ అసిసియేషన్ (డబ్ల్యూకేఎంఏ) ప్రెసిడెంట్ ఎస్.బాలమురుగన్ ఆధ్వర్యంలో ఈనెల 16న సెయింట్ థామస్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్లో నిర్వహించిన ఆల్ టైం రికార్డ్స్ కరాటే బుడోకాన్ ఇంటర్నేషనల్ వరల్డ్ సభ్యులు అయిన దేవయ్య, శంకర్ పాల్గొని రికార్డు సాధించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర బుడోకాన్ కరాటే ఇంటర్నేషనల్ వరల్డ్ అధ్యక్షుడు బి.చంద్రశేఖర్రెడ్డి, ఉపాధ్యక్షుడు నమిండ్ల శ్రీనివాస్, పాండ దినేశ్, ఎం.రవిదుర్గాప్రసాద్ అభినందించారు. డీఎంఓకు ఘననివాళి ఖిలా వరంగల్: రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన వరంగల్ జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖకు సోమవారం కలెక్టర్ డాక్టర్ సత్యశారద నివాళులర్పించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన సురేఖ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె సేవలను స్మరించుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వై.వీ.గణేశ్, డీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, జిల్లా వ్యవసాయశాధికారి విజయ భాస్కర్, డీఎం సంధ్యారాణి, డీఎస్ఓ కిష్టయ్య, అధికారులు పాల్గొన్నారు. ఉరేసుకుని ట్రైనీ డీటీ బలవన్మరణంమహబూబాబాద్ రూరల్: రెవెన్యూ శాఖలో డిప్యూటీ తహసీల్దార్గా శిక్షణ పొందుతున్న ఓ యువతి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్ప డిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. టౌన్ సీఐ ఎల్.రఘుపతిరెడ్డి కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కేఎస్ఎన్ రెడ్డి ఇంటి సమీపంలో అద్దెకు ఉండే డోలి వెంకటేశ్వర్లు, పద్మ దంపతుల చిన్నకుమార్తె డోలి సంధ్య (28) స్థానిక మున్సిపాలిటీలో వార్డు ఆఫీసర్గా విధులు నిర్వర్తించింది. అనంతరం గ్రూప్–2 రాయగా డిప్యూటీ తహసీల్దార్గా ఉద్యోగం పొందింది. ఖమ్మం జిల్లాలో శిక్షణ పొందుతూ ఉద్యోగం చేస్తోంది. సోమవారం సాయంత్రం తల్లిదండ్రులు ఇంటి నుంచి బయటకు వెళ్లిన కొంతసేపటికి సంధ్య ఇంట్లోని ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొంత సమయం తర్వాత ఇంటికి వచ్చిన తల్లి పద్మ చుట్టుపక్కల వారికి, తండ్రి వెంకటేశ్వర్లుకు సమాచారం ఇచ్చింది. అనంతరం వెంకటేశ్వర్లు పోలీసులకు విషయాన్ని తెలిపారు. సంఘటనా స్థలాన్ని టౌన్ సీఐ రఘుపతిరెడ్డి, క్రైం, టౌన్ ఎస్సైలు వెంకటేశ్వర్లు, సూరయ్య సందర్శించి సంధ్య మృతికిగల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంధ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు అనంతరం ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ తెలిపారు. మృతురాలు సంధ్య ఇటీవల ఒకే సమయంలో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరి మన్ననలు పొందింది. -
ఉమ్మడి జిల్లాలో భారీగా ఓట్ల కుదింపు విడుదలైన ఎస్ఐఆర్ ముసాయిదా జాబితా
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం ప్రత్యేక సవరణ ముసాయిదా ఇలా..10.06.2026 మొత్తం ఓటర్లు 30,53,238సాక్షిప్రతినిధి, వరంగల్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)తో ఉమ్మడి వరంగల్లో రాజకీయ సమీకరణాల కంటే ముందే ఓటర్ల లెక్కల్లో భారీ మార్పు చోటుచేసుకుంది. జూన్ 10న ఉన్న ఓటర్లతో పోలిస్తే సోమవారం నాటి ముసాయిదా ప్రకారం 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీగా ఓటర్ల వివరాలు మారాయి. 30,53,238 మంది ఓటర్లు ఉండగా.. తాజా జాబితాలో 26,77,498 మంది నమోదయ్యారు. అంటే దాదాపు 12.31 శాతం తగ్గుదల కనిపించింది. 3,75,740 మంది ఓటర్లు తగ్గారు. 4,83,803 మంది ఏఎస్డీడీ (మరణించినవారు, గుర్తించలేని/గైర్హాజరైన వారు, శాశ్వతంగా తరలిపోయినవారు, ఇప్పటికే మరోచోట నమోదైనవారు, ఇతర కేటగిరీ)లలో ఉన్నారు. మరోవైపు పెద్ద సంఖ్యలో ఓటర్లకు మ్యాపింగ్ జరగకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తూర్పులో భారీ మార్పు.. పశ్చిమలో పెద్ద కోత ఉమ్మడి వరంగల్లో అత్యంత ఆసక్తికరమైన గణాంకం వరంగల్ పశ్చిమది. జూన్ 10న 2,86,335 మంది ఓటర్లు ఉండగా.. సోమవారం నాటికి 2,03,719కు తగ్గారు. అంటే 82,616 మంది తగ్గారు. వరంగల్ తూర్పులోనూ దాదాపు ఇదే తరహా పరిస్థితి. 2,60,437 మంది నుంచి ఓటర్ల సంఖ్య 2,09,646కు తగ్గింది. అంటే 50,791 మంది తగ్గారు. ఏఎస్డీడీలో పాలకుర్తి రెండో స్థానం.. ఏఎస్డీడీని పరిశీలిస్తే పాలకుర్తి 23.68 శాతంతో ఉమ్మడి వరంగల్లో రెండో స్థానం, వరంగల్ తూర్పు 23.88 శాతంతో మొదటి స్థానంలో ఉంది. భూపాలపల్లిలో ఏఎస్డీడీ ఓటర్ల శాతం కేవలం 8.63 శాతం ఉంది. అంటే ఒకే ఉమ్మడి ప్రాంతంలో నియోజకవర్గాల మధ్య సవరణ ప్రభావంలో గణనీయమైన తేడా కనిపిస్తోంది. అక్టోబర్ 1న తుది జాబితా.. ఇక నుంచి క్లెయిమ్స్, అభ్యంతరాలు, విచారణ, కొత్తగా చేరే ఓటర్లు, తిరిగి చేర్చే పేర్లతో జాబితా మారనుంది. ఆ ప్రక్రియ పూర్తయ్యాక అక్టోబర్ 1న వెలువడే తుది జాబితానే ఉమ్మడి వరంగల్లో అసలు ఓటర్ల బలాన్ని స్పష్టంగా చూపించనుంది. ఇప్పటివరకు కనిపిస్తున్న గణాంకాలు తుది జాబితా కాదన్నదే కీలకం. ప్రత్యేక సవరణలో ముసాయిదా జాబితా అనంతరం ఓటర్లకు తమ పేరు ఉందో లేదో చూసుకునే అవకాశం, అభ్యంతరాలు చెప్పే అవకాశం ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ముసాయిదా జాబితాపై క్లెయిమ్స్, అభ్యంతరాలకు ఈ నెల 30 వరకు అవకాశం ఉండగా, వాటి పరిష్కార ప్రక్రియ సెప్టెంబర్ 28 వరకు కొనసాగి, తుది ఓటర్ల జాబితా అక్టోబర్ 1న ప్రచురించాల్సి ఉంది. కాగా, ప్రస్తుతం కనిపిస్తున్న తగ్గుదలలో ఎన్ని పేర్లు శాశ్వతంగా తొలగిపోతాయి? ఎన్ని తిరిగి చేరుతాయి? కొత్తగా ఎన్ని పేర్లు చేరతాయి? అనేది త్వరలో తేలనుంది. రంగంలోకి రాజకీయ పార్టీలు మరణించిన వారు, గుర్తించలేని/గైర్హాజరైన వారు, శాశ్వతంగా తరలిపోయిన వారు, ఇప్పటికే మరోచోట నమోదైన వారు, ఇతర కేటగిరీలు ఏఎస్డీడీలో ఉన్నాయి. కాబట్టి రాజకీయ పార్టీలు ఇప్పుడు ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. తమ బూత్లో తొలగించిన ఓటర్ల జాబితాను తీసుకోవడం, నిజంగా అక్కడే నివసిస్తున్న ఓటర్ల పేర్లు తొలగిపోయాయా? అనేది ఇంటింటికీ పరిశీలించడం. అర్హులైన కొత్త ఓటర్లు, మిస్సైన పేర్లు, చిరునామా/పేరు తప్పులపై క్లెయిమ్స్, అభ్యంతరాలు దాఖలు చేయడం. ఇది పార్టీలకు కేవలం రాజకీయ కార్యక్రమం కాదు.. ఎన్నికల బూత్ మేనేజ్మెంట్కు కీలకమైన ప్రక్రియగా మారనుంది. 12 నియోజకవర్గాల్లో 4.84 లక్షల మంది ఏఎస్డీడీలో.. 1.62 లక్షల మందికి నో మ్యాపింగ్ నియోజకవర్గం 10.06.26 17.08.26 ఏఎస్డీడీ ఏఎస్డీడీ నో తగ్గిన ఓటర్లు ఓటర్లు(డిజిటైజ్) శాతం మ్యాపింగ్ ఓటర్లువరంగల్ పశ్చిమ 2,86,335 2,03,719 43,892 21.55 46,238 82,616 పరకాల 2,22,679 2,03,598 37,376 18.36 4,568 19,081 వరంగల్ తూర్పు 2,60,437 2,09,646 50,058 23.88 25,685 50,791 నర్సంపేట 2,40,244 2,21,913 46,321 20.87 5,559 18,331 వర్ధన్నపేట 2,76,272 2,46,981 53,804 21.78 12,966 29,291 జనగామ 2,49,437 2,22,381 46,000 20.69 9,943 27,056 స్టేషన్ఘన్పూర్ 2,56,806 2,39,750 31,215 13.02 6,746 17,056 పాలకుర్తి 2,61,241 2,41,462 57,177 23.68 12,776 19,779 డోర్నకల్ 2,24,165 2,05,085 27,254 13.29 4,715 19,080 మహబూబాబాద్ 2,60,770 2,31,871 39,243 16.92 9,687 28,899 భూపాలపల్లి 2,77,882 2,41,964 20,877 8.63 11,739 35,918 ములుగు 2,36,970 2,09,128 30,586 14.63 11,313 27,84217.08.26 నాటికి ఓటర్లు26,77,498ఉమ్మడి వరంగల్ నియోజకవర్గాల వారీగా ప్రత్యేక సవరణ ముసాయిదా ఇలా..నో మ్యాపింగ్1,61,935ఏఎస్డీడీ4,83,803తగ్గిన ఓటర్లు3,75,740 -
ఎస్సారెస్పీ కాల్వకు నీటిని విడుదల చేయాలి
రాయపర్తి: కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతు చేయించి ఎస్సారెస్పీ కాల్వ నీటిని విడుదల చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. సోమవారం వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని మైలారం నుంచి తొర్రూరు మండలం నాంచారి మడూరు గ్రామం వరకు 7 కిలోమీటర్లు ఉన్న ఎస్సారెస్పీ కాల్వ గుండా రైతులు, గ్రామాల ప్రజలతో కలిసి పాదయాత్ర, ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం నాంచారి మడూరులోని ఎస్సారెస్పీ కాల్వ బ్రిడ్జిపై రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దయాకర్రావు మాట్లాడుతూ సాగు నీరందక పంటపొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకో సభ పెట్టుడు తప్ప రైతులకు ఏమి చేయాలో తెలియని వ్యక్తి సీఎంగా ఉండడం సిగ్గు చేటని రేవంత్రెడ్డిపై మండిపడ్డారు. రైతులకు ఎకరాకు రూ.25వేలు నష్టం వాటిళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుభరోసా, రైతుబీమా రాక, పంట రుణమాఫీ కాక, యూరియా, కరెంట్ కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. తులం బంగారంతోపాటు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఇవ్వకపోతే మహిళలే తన్ని తరిమే పరిస్థితి వస్తుందన్నారు. సాగునీరు ఇవ్వకుంటే రైతుల పక్షాన ప్రభుత్వంపై పోరాటం కొనసాగుతుందని ఆయన హెచ్చరించారు. అనంతరం తొర్రూరు పోలీసులు మాజీ మంత్రి దయాకర్రావు చేస్తున్న ధర్నాను విరమింపజేసి పోలీస్స్టేషన్కు తరలించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్రెడ్డి, నాయకులు మూనావత్ నర్సింహానాయక్, జినుగు అనిమిరెడ్డి, రంగు కుమార్గౌడ్, సురేందర్రాథోడ్, పూస మధు, పాలకుర్తి, తొర్రూరు మండలాల నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చేతకాకపోతే ప్రభుత్వం గద్దె దిగిపోవాలి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నాంచారి మడూరులో రైతులతో కలిసి ధర్నా.. అరెస్ట్ చేసిన పోలీసులు -
వ్యవసాయ అధికారులకు మంత్రి ‘తుమ్మల’ అభినందన
మహబూబాబాద్ రూరల్ : ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం.. రసాయన రహిత సాగుతో నేలకు ఆరోగ్యం, పర్యావరణ పరి రక్షణ, రైతులకు ప్రయోజనాలు, నాణ్య మైన పంట, ఆరోగ్యకరమైన సమాజమే లక్ష్యం శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అభినందనలు తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్లోని తన నివాసం నుంచి కలెక్టర్ స్నేహశబరీష్, డీఏఓ విజయచంద్రను అభినందించి వ్యవసాయ విస్తరణ అధికారి పున్నమికి ఫోన్ చేసి మాట్లాడారు. ‘సాక్షి’ లో ప్రచురితమైన సేంద్రియ వ్యవసాయ కథనం చూశానని, యూరియా, డీఏపీలు వేయకుండా రై తులు ఎలా దిగుబడి తీస్తున్నారని అడిగారు. జాతీ య ప్రకృతి వ్యవసాయ మిషన్లో భాగంగా ఈదులపూసపల్లి క్లస్టర్ ఎంచుకుని 125 మంది రైతులను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చి, ఒక్కో రైతు కనీసం ఎకరం చొప్పున సేంద్రియ వ్యవసాయం చేసేలా మళ్లిస్తున్నామని ఏఈఓ పున్నమి మంత్రితో చెప్పారు. వరి సాగు సమయంలో రైతులు దమ్ములో పశు ఎరువు, వర్మి కంపోస్ట్ నేలలో కలియ దున్నుతారని, పైరు పెరిగిన తర్వాత పురుగుల, తెగుళ్ల నివారణకు జీవామృతం పిచికారీ చేస్తారని వివరించారు. తా ము జీవామృతం, పంచగవ్య, ఘనజీవామృతం, అగ్నిహస్త్రం, నీమాస్త్రం లాంటి సేంద్రియ ఎరువులను తయారు చేసి రైతులకు అందిస్తామని ఏఈఓ చెప్పారు. పచ్చిరొట్ట విత్తనాలు జనుము, జీలుగ రైతులకు ఏమైనా ఇచ్చారా అని మంత్రి అడుగగా సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు అందించామని, జీలుగ పొలాలలో సేంద్రియ ఎరువుగా వినియోగించుకోవడానికి, జనము మిరప వేసే ముందు సేంద్రియ ఎరువుగా వినియోగించుకోవడానికి సబ్సిడీలో అందజేశామని మంత్రికి చెప్పారు. రైల్వేగేట్ ప్రాంతంలో చోరీల కలకలం ఖిలా వరంగల్: వరంగల్ రైల్వేగేట్ ప్రాంతంలో వ రుస చోరీలు కలకలం రేపుతున్నాయి. ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు మిల్స్కాలనీ పోలీస్స్టేషన్ పరిధిలోని వేర్వేరు కాలనీల్లో వరుస చోరీలు జరిగా యి. నాలుగు ఇళ్లలో సుమారు రూ.2.17 లక్షల నగదు, 76.5 గ్రాముల బంగారు ఆభరణాలు, 97 గ్రాముల వెండి వస్తువులు అపహరించిన ఘటనలు సోమవారం ఆలస్యంగా వెలుగుచూశాయి. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలాలను క్లూస్ టీంతో ఇన్స్పెక్టర్ కర్రె స్వామి పరిశీలించారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీని సైతం పరిశీలించారు. నాలుగు చోట్ల ఒకే వ్యక్తి చోరీలకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కాళేశ్వరానికి కృష్ణశిల రాయికాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం నిర్మాణం రాతితో చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత కాంట్రాక్టర్ ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా గురజపల్లి నుంచి కృష్ణశిల రాయిని తీసుకువస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే రాతి నిర్మాణం కోసం ఆర్డర్స్ ఇచ్చినట్లు సమాచారం. కానీ, శిల్పాలకు సంబంధించిన కొలతలు రాలేదని తెలిసింది. -
పట్టాలపై ప్రాణాలు ఫణంగా..
ఖిలా వరంగల్: రైలు ప్రయాణం సురక్షితంగా సాగాలంటే పట్టాలు పటిష్టంగా ఉండాలి. పట్టాలపై చిన్న లోపం తలెత్తినా దాని ప్రభావం భారీగా ఉంటుంది. అలాంటి లోపాలను ముందుగానే పసిగట్టి సరిచేసే బాధ్యత ట్రాక్మెన్ (ట్రాక్ మెయింటెనర్లు)లదే. రైల్వే వ్యవస్థలో వీరు అత్యంత కీలక విధులు నిర్వర్తిస్తున్నారు. కంటికి కనిపించని కష్టం.. రైల్వే ట్రాక్ పటిష్టతను ఎప్పటికప్పుడు పరిశీలించడం, పట్టాలపై లోపాలను గుర్తించడం, అవసరమైన మరమ్మతులు చేయడం, ట్రాక్ పెట్రోలింగ్ నిర్వహించడం వంటి బాధ్యతలను ట్రాక్మెన్ నిర్వర్తిస్తారు. పట్టాలపై చిన్న పగుళ్లు, అమరికలో తేడాలు, ఇతర సాంకేతిక లోపాలు గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించడంతోపాటు అత్యవసర పరిస్థితుల్లో భద్రతా చర్యలు చేపట్టాలి. ప్రయాణికులకు రైలు కొన్ని నిమిషాల ఆలస్యం పెద్ద విషయంగా కనిపించొచ్చు. కానీ, ఆ రైలు పట్టాలపై సురక్షితంగా పరుగెత్తేందుకు గంటల తరబడి ఎండలోనూ, వానలోనూ ట్రాక్మెన్లు పనిచేయాలి. వారి కష్టం మాత్రం సాధారణ ప్రయాణికుడి కంటికి కనిపించదు. వాతావరణ పరిస్థితులు పెద్ద సవాల్.. ట్రాక్మెన్ విధుల్లో వాతావరణ పరిస్థితులు పెద్ద సవాల్గా ఉంటాయి. మండే ఎండలో కిలోమీటర్ల మేర పట్టాల వెంట నడుస్తూ తనిఖీలు చేయాల్సి ఉంటుంది. వర్షాకాలంలో జలమయమైన ప్రాంతాల్లోనూ ట్రాక్ పరిస్థితులను పరిశీలించా లి. రాత్రివేళ పెట్రోలింగ్ చేయాల్సిన సందర్భాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఒక వైపు రైళ్ల రాకపోకలు.. మరోవైపు పట్టాలపై విధులు, ప్రతి క్షణం అప్రమత్తత అవసరమే. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వీరి ప్రాణాలకు ముప్పు తప్పదు. ప్రాణాలతో చెలగాటం.. ట్రాక్మెన్ పని కేవలం పట్టాలపై నడవడం కాదు.. భారీ పరికరాలతో పనిచేయాలి. ట్రాక్ నిర్వహణలో భాగంగా శారీరక శ్రమ చేయడం, రైళ్ల రాకపోకల మధ్య విధులు నిర్వర్తించడం వంటి ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రైళ్ల రాకపోకలు అధికంగా ఉండే మార్గాల్లో ట్రాక్ తనిఖీలు, మరమ్మతులు చేపట్టేటప్పుడు భద్రతా నిబంధలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. తమకు అందుబాటులో ఉండే భద్రతా పరికరాలు, రక్షణ వ్యవస్థలు, సరైన శిక్షణ ఎంతో కీలకమని సిబ్బంది చెబుతున్నారు. పట్టాల భద్రతకు వీరే కాపలా.. సౌత్ సెంట్రల్ రైల్వే రైల్వే పరిధిలో విధులు నిర్వహిస్తున్న ట్రాక్మెన్లు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతూ ప్రా ణాలు సైతం కోల్పోతున్నారని వరంగల్ బ్రాంచ్ సంఘ్ నా యకులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. రైలు కూత వినిపించగానే ప్రయాణికులు అప్రమత్తమవుతారు. కానీ, అదే రైలు సురక్షితంగా వెళ్లేందుకు పట్టాలపై కాపలా కాసే ట్రాక్మెన్ మాత్రం ప్రతి క్షణం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు. ట్రాక్మెన్ల డిమాండ్లు.. ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. బ్రిటిష్ కాలం నాటి అధిక పనిభారాన్ని తగ్గించాలి. మహిళలను మరో డిపార్ట్మెంట్కు కేటాయించాలి. రిస్క్ అలవెన్స్ను గణనీయంగా పెంచాలి. పెట్రోలింగ్ బిట్ లెంత్ తగ్గించి, హంట్లను ఏర్పాటు చేయాలి. పెట్రోలింగ్ సమయంలో నాణ్యతగల టార్చ్లైట్, సేఫ్టీ పనిముట్లు ఇవ్వాలి. తాగునీరు, విశ్రాంతి గదులతోపాటు మెరుగైన రెయిన్కోట్, షూ, వింటర్ జాకెట్ అందించాలి. పదోన్నతులు ఇవ్వాలి. ప్రయాణికుల భద్రత కోసం పనిచేస్తే తమ భద్రత, సంక్షేమాన్ని విస్మరించడం, నిర్లక్ష్యం చేయడం సరికాదని ట్రాక్మెన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్, మహబూబాబాద్, మధిర సెక్షన్ల పరిధిలో సుమారు 8 మంది ట్రాక్మెన్లు విధుల్లో రైళ్లు ఢీకొని ప్రాణాలు పోగొట్టుకున్నారని సిబ్బంది చెబుతున్నారు. రైళ్ల రాకపోకలకు భద్రతా కవచం.. ట్రాక్మెన్ పట్టాల నిర్వహణ, పెట్రోలింగ్లో అత్యంత కీలకం ఎండ, వాన, చీకటి, ఎప్పుడైనా విధుల్లోనే.. సమస్యలు పరిష్కరించాలంటున్న సిబ్బంది రైల్వే ట్రాక్లను నిరంతరం తనిఖీ చేస్తున్నాం. లోపాలను గుర్తించి మరమ్మతులు చేస్తూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. రాత్రి వేళ సరైన టార్చ్లైట్ల లేక చీకట్లో పట్టాలపై నడవలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. నాణ్యమైన రెయిన్కోట్లు, అధునాతన టార్చ్లైట్లు ట్రాక్మెన్లకు అందజేసి భద్రతకు చర్యలు తీసుకోవాలి. రానున్న పీఆర్సీలో ట్రాక్మెన్కు శ్రమ తగ్గ ఫలితం చూపాలి. – ఎండీ రఫీక్, సంఘ్ కోశాధికారి వరంగల్ట్రాక్పై ప్రాణాలను ఫణంగా పెట్టి పనిచేస్తున్న ట్రాక్మెన్ల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలి. రిస్క్ అలవెన్స్ను గణనీయంగా పెంచాలి. పెట్రోలింగ్ బిట్ లెంత్ తగ్గించి హంట్ ఏర్పాటు చేయాలి. – సీహెచ్.వెంకటేశ్, సంఘ్ ఉపాధ్యక్షుడు వరంగల్ -
అంకిత భావంతో ఉన్నత స్థానాలకు..
● కేయూ ఓఎస్డీ వెంకట్రాంరెడ్డి ● ఇంజనీరింగ్ విద్యార్థులకు ఓరియంటేషన్ కేయూ క్యాంపస్: అంకితభావం, క్రమశిఽక్షణ, దృఢసంకల్పం విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరవచ్చని కేయూ ఓఎస్డీ బి.వెంకట్రాంరెడ్డి అన్నారు. సోమవారం కేయూలో ఆడిటోరియంలో కో–ఎడ్యుకేషనల్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్లో ప్రవేశాలు పొందిన నూతన విద్యార్థులకు సోమవారం ఓరియంటేషన్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత లక్ష్యం ఏర్పర్చుకుని సాధించేందుకు కష్టపడి చదవాలని సూచించారు. వరంగల్ నిట్ ప్రొఫెసర్ కోల ఆనందకిషోర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యం, నైతిక విలువలు, మానవీయ దృక్పథం సమన్వయమే సమగ్ర విద్యకు పునాది అన్నారు. కార్యక్రమంలో ఆ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.రమణ, వివిధ విభాగాల అధ్యాపకులు రాధిక, సుమలత, వి.మహేందర్, ఆసీం ఇక్బాల్, విజయ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
సిబ్బందికి అండగా నిలవాలి
వరంగల్ సీపీ శ్వేత వరంగల్ క్రైం: పోలీస్ అధికారుల సంఘం సి బ్బందికి అండగా నిలవాలని వరంగల్ పోలీ స్ కమిషనర్ ఎన్.శ్వేత సూచించారు. ఇటీవల ఎన్నికై న నూతన పోలీస్ అధికారుల సంఘం కార్యవర్గ సభ్యులు సోమవారం సీపీ ఎన్.శ్వేతను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీపీకి మొక్కలు అందజేశారు. ఎన్నికల నోడల్ అధికారి, అదనపు డీసీపీ ప్రభాకర్రావు నూతన కార్యవర్గ సభ్యులను సీపీకి పరిచయం చేశారు. అనంతరం ఆమె నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బంది సమస్యలపై తక్షణమే స్పందించి, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పోలీస్ అధికారుల సంఘం స్ఫూర్తిదాయకంగా పనిచేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులు అదనపు డీసీపీ శ్రీనివాస్, ఏసీపీలు నాగయ్య, సదయ్యతో పాటు నూతన పోలీస్ అధికారుల సంఘం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
అధికారులు బాధ్యతగా పనిచేయాలి
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ అధికారులు, ఉద్యోగులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ప్రత్యేకాధికారి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. శనివారం స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకొని వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, వారు చూపిన దేశభక్తి, సేవా స్ఫూర్తిని ఆచరించాలని పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యంతో జీడబ్ల్యూఎంసీని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు కృషి చేస్తున్నారని తెలిపారు. అనంతరం పలువురు ఉత్తమ అధికారులు సిబ్బందికి కమిషనర్తో కలిసి ప్రశంస పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ జోనా, ఎస్ఈ రాజ్ కుమార్, సీఎంహెచ్ఓ రాజారెడి, ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, అకౌంట్స్ అధికారి శివలింగం డీఎఫ్ఓ శంకర్ లింగం, ఇన్చార్జ్ సీహెచ్ఓ లక్ష్మారెడ్డి, డిప్యూటీ కమిషనర్లు బిర్రు శ్రీనివాస్, ప్రసన్నరాణి, సమ్మయ్య, సెక్రటరీ అనిల్ బాబు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. హనుమకొండ పబ్లిక్ గార్డెన్లోని టౌన్ హాల్లో బల్దియా కమిషనర్ టి.వెంకన్న జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకు ముందు పబ్లిక్ గార్డెన్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి, అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.● గ్రేటర్ వరంగల్ ప్రత్యేకాధికారి, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ -
ప్రగతి పరుగులు
ఆదివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2026● సంక్షేమ పథంలోహన్మకొండ అర్బన్: ప్రజా ప్రభుత్వంలో హనుమకొండ జిల్లా అభివృద్ధి పథంలో పరుగులు పెడుతోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. హనుమకొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో శనివారం స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాస్రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీస్ గౌరవ వందనం స్వీకరించి, స్వాతంత్య్ర సమరయోధులను ఘనంగా సన్మానించారు. పలు పాఠశాలల చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం శకటాల ప్రదర్శన, ఉత్తమ ఉద్యోగులను సత్కరించారు. ఈసందర్భంగా రాష్ట్రం, జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ లక్ష్యాలు మంత్రి తన ప్రసంగంలో ప్రజలకు వివరించారు. జంట నగరాలపై ప్రత్యేక దృష్టి వరంగల్, హనుమకొండ జంట నగరాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వివిధ మౌలిక వసతులు వేగవంతం చేస్తోందని స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. తాగునీరు, భూగర్భ డ్రెయినేజీ, రహదారులు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, మామునూరు విమానాశ్రయం, పర్యాటక అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను ఆయన వివరించారు. గ్రేటర్ వరంగల్ను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రతీరంగంలో గణనీయ అభివృద్ధి.. ● ఎల్నినో పరిస్థితులు ఉన్నప్పటికీ దేవాదుల ద్వారా ధర్మసాగర్, చలివాగు ప్రాజెక్టులను నింపి వచ్చే ఏడాది వరకు తాగునీటి ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ● 2057 జనాభా అవసరాలకు అనుగుణంగా రూ.5,300 కోట్లతో భూగర్భ డ్రెయినేజీ పనులు చేపట్టామని తెలిపారు. ● రూ.572 కోట్లతో 45 కిలోమీటర్ల పొడవునా 200 అడుగుల ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నట్లు తెలిపారు. ● హనుమకొండ–కాజీపేట రూ.78 కోట్లు, ఫాతిమా–మామునూరు రూ.68 కోట్లతో చేపట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. ● ‘కుడా’ ఆధ్వర్యంలో మామునూరు విమానాశ్రయం కోసం 950 ఎకరాల స్థలాన్ని ఎయిర్పోర్ట్స్ అథారిటీకి అప్పగించామని వెల్లడించారు. ● జిల్లాలో నాలుగు తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు, రెండు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ● పరకాలలో రూ.35 కోట్లతో 100 పడకల ఆస్పత్రి నిర్మాణం జరుగుతోందన్నారు. ● భద్రకాళి మాడవీధుల పనులు తుది దశకు చేరాయని పేర్కొన్నారు. ● వంగరలో పీవీ.నరసింహారావు విజ్ఞాన వేదికకు రూ.7 కోట్లు, కాకతీయ మ్యూజికల్ గార్డెన్కు రూ.5 కోట్లతో పునరుద్ధరణ పనులు వేగవంతం చేసినట్లు పేర్కొన్నారు. ● మహిళా రుణాలు–స్మార్ట్ రేషన్న్ కార్డులు: జిల్లాలో 1,445 మహిళా సంఘాలకు రూ.136 కోట్ల సీ్త్రనిధి, బ్యాంకు అనుసంధాన రుణాలు అందించామని తెలిపారు. శనివారం నుంచే జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమైందని మంత్రి ప్రకటించారు. స్వాతంత్య్ర దినోత్సవంలో ప్రజాప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, సీపీ శ్వేత, అదనపు కలెక్టర్ రవి, ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికా రులు, సిబ్బంది, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి హనుమకొండ పరేడ్ గ్రౌండ్స్లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం జాతీయ పతాకావిష్కరణ, జిల్లా ప్రగతి నివేదిక వివరించిన మంత్రి అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు సమరయోధులకు సన్మానం.. ఉత్తమ ఉద్యోగులకు సత్కారం -
జిల్లా ముందంజ
● అన్ని రంగాల్లో..ఖిలా వరంగల్: వరంగల్ జిల్లా అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర అటవీ, పర్యావరణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సీఎం దూరదృష్టితో జిల్లా అన్ని రంగాల్లో ముందంజలో దూసుకెళ్తోందని ఆమె పేర్కొన్నారు. ఖిలా వరంగల్ మధ్యకోటలోని ఖుష్మహల్ మైదానంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధ్యక్షతన శనివారం 80వ స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి కొండా సురేఖ హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ప్రత్యేక వాహనంపై పోలీసులనుంచి గౌరవ వందనం స్వీకరించి మాట్లాడారు. జిల్లాలో సాధారణంగా 1,39,997 ఎకరాల్లో వరి సాగువుతుండగా.. ఈ ఏడాది తక్కువ వర్షపాతంతో 51,045 ఎకరాల్లో మాత్రమే వరి నాట్లు పడ్డాయని తెలిపారు. మరో 44,745 ఎకరాల్లో మొక్కజొన్న, పెసర తదితర ఆరుతడి పంటల సాగవుతున్నాయని పేర్కొన్నారు. 1,40,862 కుటుంబాలకు గృహజ్యోతి.. గృహజ్యోతి పథకం కింద 1,40,862 కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తూ రూ.128.82 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం భరిస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 9,522 ఇళ్లు మంజూరు కాగా, 2,973 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యిందని తెలిపారు. బ్యాంకు లింకేజీ ద్వారా 2,114 మహిళా సంఘాలకు రూ.148.80 కోట్ల రుణాలు మంజూరు చేశామని మంత్రి వెల్లడించారు. 34,964 మంది విద్యార్థుల యూనిఫాం తయారీ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించి ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు. వరంగల్లో రూ.1,371 కోట్లతో 2,100 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం 90 శాతం పూర్తయ్యిందని మంత్రి పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ కింద జిల్లాలో రూ.56.06 కోట్ల వ్యయంతో 10,565 మందికి వైద్యం అందించామని చెప్పారు. టెక్స్టైల్ పార్కుకు 1,357 ఎకరాల భూమి టెక్స్టైల్ పార్కుకు 1,357 ఎకరాల భూమిని సేకరించామని మంత్రి వివరించారు. 866 మంది రైతులకు రూ.145 కోట్ల పరిహారం చెల్లించామని, భూములు ఇచ్చిన రైతులకు ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చామని, ఈప్రాంత ప్రజలకు ఉద్యోగావకాశాలు కల్పించామని స్పష్టం చేశారు. ఎయిర్పోర్ట్లో రన్వే విస్తరణ కోసం 253 ఎకరాల భూమిని సేకరించి 330 మంది రైతులకు రూ.258 కోట్ల పరిహారం చెల్లించినట్లు పేర్కొన్నారు. వరంగల్ బస్స్టేషన్ పనులు కొనసాగుతున్నాయని, రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.94.10 కోట్లతో ప్రతిపాదనలు ఆమోదం పొందాయని చెప్పారు. వనమహోత్సవంలో భాగంగా 25.51 లక్షల మొక్కలు నాటే లక్ష్యంలో భాగంగా ఇప్పటి వరకు 11.50 లక్షల మొక్కలు నాటినట్లు మంత్రి తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం.. స్వాతంత్య్ర సమరయోధులను మంత్రి ఘనంగా సన్మానించారు. అంతకు ముందుగా ఉత్తమ సేవలందించిన ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు ప్రశంసపత్రాలు అందజేశారు. ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి సందర్శించారు. అనంతరం పలు పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాశ్, మేర కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ సంగ వెంకట్రాజం, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్ ,డీసీపీ అంకిత్కుమార్, డీఎఫ్ఓ నిఖిత, డీఎస్ఓ కిష్టయ్య, డీఎం సంధ్యారాణి, ఆర్డీఓ సుమ, తహసీల్దార్లు ఇక్బాల్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. సీఎం దూరదృష్టితో గణనీయమైన ప్రగతి 80వ స్వాతంత్య్ర దినోత్సవంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఖుష్మహల్ మైదానంలో జాతీయ పతాకం ఆవిష్కరణ -
తండ్రి కల నెరవేరకుండానే..
● రోడ్డు ప్రమాదంలో యువ క్రికెటర్ దుర్మరణం ● టీజీ –20లో చోటు.. ● విషాదంలో వరంగల్ క్రీడాభిమానులువరంగల్ స్పోర్ట్స్/ఖిలా వరంగల్: మైదానంలో పరుగులు తీస్తూ.. బంతిని బౌండరీ దాటిస్తూ.. ఒక రోజు జాతీయ జట్టు తరఫున తన కుమారుడు ఆడాలన్నది ఆ యువ క్రికెటర్ తండ్రి కల. తన తండ్రి కలను నెరవేర్చాలని ఆ కుమారుడి తపన మధ్యలో ఆగిపోయింది. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడింది. అటు తండ్రి కన్న కల, ఆ యువ క్రికెటర్ ఆశయం నెరవేరకుండానే ఇటీవల హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి కన్ను మూశాడు. ఈఘటనతో కుటుంబ సభ్యులు, స్నేహితులు, క్రిడాకారులను విషాదంలో ముంచెత్తాడు. వరంగల్ ఎస్ఆర్ఆర్తోటకు చెందిన విశ్వనాధ ఓం ప్రకాశ్, కవిత దంపతులు కుమారుడు వైష్ణవ్(21)కు చిన్ననాటి ఉంచే క్రికెట్పై ఆసక్తి ఉండేది. తన కుమారుడిని జాతీయ స్థాయి క్రికెటర్గా చూడాలన్న ఆశతో హైదరా బాద్లోని ఓ క్రికెట్ కోచింగ్ సెంటర్లో శిక్షణ ఇప్పించారు. మూడు నెలల క్రితం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన తెలంగాణ–20 పోటీల్లో వరంగల్ వారియర్స్ జట్టులో ప్రాతి నిధ్యం వహించాడు. ఈ క్రమంలో జూలై 26వ తేదీన రాత్రి 9 గంటలకు హైదరాబాద్లోని ఉప్ప ల్ స్టేడియానికి నడుచుకుంటూ వెళ్తున్న వైష్ణవ్ను వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన వైష్ణవ్ను సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. సుమారు 20 రోజుల పాటు మృత్యువుతో పోరాడుతూ శనివారం తుదిశ్వాస విడిచాడు. కాగా, విశ్వనాథ్ వైష్ణవ్ వరంగల్ జట్టు నుంచి అండర్–14, 16, 19 విభాగాలతోపాటు వరంగల్–2, 3డే టీములకు ప్రాతినిధ్యం వహించాడు. వేసవిలో జరిగిన శ్రీలంక టూర్లో వరంగల్ జిల్లా నుంచి పాల్గొన్నాడు. కన్నీటి వీడ్కోలు.. నిన్నటి వరకు క్రికెట్ మైదానంలో పరుగులు తీసిన యువకుడు, నేడు విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. క్రికెట్ అభిమానులు కన్నీంటి పర్యంతమయ్యారు. ఎస్ఆర్ఆర్తోటలో యువ క్రికెటర్ వైష్ణవ్ మృతదేహాన్ని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మేనల్లుడు యువ నేత విష్ణువర్ధన్రెడ్డి సందర్శించి నివాళులర్పించారు. సాయంత్రం స్థానిక శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి. -
పగబట్టిన విధి!
హన్మకొండ చౌరస్తా/ఆత్మకూరు/ఖిలా వరంగల్/హన్మకొండ అర్బన్: ఆ కుటుంబాన్ని విధి పగబట్టింది. మృత్యువు ఒక్కొక్కరిని తన ఒడికి చేర్చుకుంది. రెండేళ్లలో కుటుంబాన్ని మొత్తం కబళించింది. రెండేళ్ల క్రితం కొడుకు, ఐదు నెలల క్రితం భర్త మృతి చెందగా.. శనివారం భార్య సైతం అనంతలోకాలకు చేరుకుంది. హనుమకొండ పెద్దమ్మగడ్డకు చెందిన వరంగల్ మార్కెటింగ్ శాఖ అధికారి (డీఎంఓ) కలకోట్ల సురేఖ(43) శనివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందని తెలుసుకున్న స్థానికుల రోదనలతో పెద్దమ్మగడ్డ దుఃఖసాగరంలో మునిగిపోయింది. మృత్యుపాశమైన ఇసుకలారీ.. కలకోట్ల సురేఖ వరంగల్ డీఎంఓగా విధులు నిర్వహిస్తున్నా రు. అదేవిధంగా ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ ఇన్చార్జ్ సెక్రటరీగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. శనివారం ఆమె గుడెప్పాడ్లో మార్కెట్ యార్డులో స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం వ్యక్తిగత పనుల నిమిత్తం కారులో చింత విజయబాబు అనే వ్యక్తితో కలిసి ఏటూరునా గారం వైపు వెళ్తున్నారు. ఎదురుగా వస్తున్న ఇసుకలారీ ఢీకొట్టడంతో సురేఖతోపాటు విజయబాబు కూడా దుర్మరణం చెందారు. రోడ్డు ప్రమాదంలో కొడుకు.. అనారోగ్యంతో భర్త సురేఖ, కిరణ్ స్వస్థలం హనుమకొండలోని పెద్దమ్మగడ్డ అయినప్పటికీ పదిహేనేళ్ల క్రితం జూలైవాడలో ఇల్లు నిర్మించుకుని ఉంటున్నారు. సురేఖ ఒక్కగానొక్క కుమారుడు సుక్రీత్ (16) రెండేళ్ల క్రితం క్రికెట్ ఆడేందుకు స్కూటీపై వెళ్తుండగా.. బాలసముద్రంలోని హయగ్రీవాచారి గ్రౌండ్ వద్ద ఓ ప్రైవేట్ స్కూల్ బస్ ఢీకొట్టడంతో మృతి చెందాడు. సురేఖ భర్త బొక్క కిరణ్ (50) అనారోగ్యంతో బాధపడుతూ ఐదు నెలల క్రితం మృతిచెందాడు. శని వారం సురేఖ కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రెండేళ్లలో కుటుంబమంతా మృత్యు ఒడిలోకి చేరినట్లయ్యిందని కుటుంబీకులు కన్నీటి పర్యంతమవుతున్నారు. చివరి స్టేటస్లో కొడుకు జ్ఞాపకాలు..పతాకావిష్కరణ అనంతరం సురేఖ తన విధి నిర్వహణకు సంబంధించిన ఫొటోలను వాట్సాప్లో స్టేటస్గా పెట్టుకున్నారు. అదే సమయంలో తన కుమారుడు బతికున్నప్పుడు పాఠశాలలో దిగిన ఫొటోలు, అతడితో సరదాగా గడిపిన సందర్భాల ఫొటోలను కూడా స్టేటస్గా ఉంచుకున్నారు. అప్పటివరకు తమతో ఉన్న అధికారి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారన్న విషయం తెలియగానే గూడెప్పాడ్ మార్కెట్ పాలకవర్గం, సిబ్బంది, వరంగల్ మార్కెటింగ్శాఖ అధికారులు విషాదంలో మునిగిపోయారు. మంచి అధికారిని కోల్పోయామని పాలకవర్గం విచారం వ్యక్తం చేసింది. సిబ్బంది.. అధికారి సురేఖతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కంటతడి పెట్టుకున్నారు. ఒకే కుటుంబంలో రెండేళ్లలో ముగ్గురి మృతి తాడ్వాయి రోడ్డు ప్రమాదంలో వరంగల్ డీఎంఓ సురేఖ దుర్మరణం కన్నీరు మున్నీరైన బంధువులుకొడుకు, భర్త మరణించిన తర్వాత సురేఖ తన వృద్ధ తల్లిదండ్రులతో కలిసి జూలైవాడలోని ఇంట్లో నివసిస్తున్నారు. సురేఖ తండ్రి సురేందర్ సీపీఓ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్గా పనిచేసి పదవీ విరమణ చేశారు. కూతురుకు వరుసగా ఎదురైన విషాదాలను తలచుకుంటూ ఇప్పుడు ఆ వృద్ధ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ‘ముందు మనవడిని.. ఆ తర్వాత అల్లుడిని కోల్పోయాం.. ఇప్పుడు కూతురిని కూడా కోల్పోయాం.. ఈ ఘోరాన్ని ఎలా భరించాలి..?’ అంటూ బంధువులను పట్టుకుని వారు గుండెలవిసేలా రోదించడం అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. సురేఖకు చెల్లెలు, తమ్ముడు ఉన్నారు. సురేఖ మృతదేహానికి ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
సాంకేతిక లోపంతో పాలు విరిగాయి
● విజయ డెయిరీ, వరంగల్ డీడీ ధన్రాజ్ హన్మకొండ చౌరస్తా: డెయిరీలోని మిషనరీలో ఏర్పడిన సాంకేతిక లోపం కారణం, పాల శీతలీకరణ ప్రక్రియలో అంతరాయం వల్లనే పాలు విరిగినట్లు గుర్తించామని విజయ డెయిరీ వరంగల్ యూనిట్ డిప్యూటీ డైరెక్టర్ ధన్రాజ్ తెలిపారు. ఈ నెల 15వ తేదీన ‘విరిగిన విజయ డెయిరీ పాలు’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనంపై డెయిరీ డీడీ స్పందించారు. శనివారం హహనుమకొండ అలంకార్ జంక్షన్ సమీపంలో విజయ డెయిరీ కార్యాలయంలో డెయిరీ పరిధిలో పాలు సరఫరా చేస్తున్న డిస్ట్రిబ్యూటర్లు, పాడి రైతుల సంఘం బాధ్యులు, డెయిరీ ఉద్యోగులతో డీడీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇకపై ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా సంబంధిత మిషనరీ పూర్తిగా తనిఖీ చేసి అవసరమైన మరమ్మతులు, సాంకేతిక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. విజయ డెయిరీ వినియోగదారులకు నాణ్యమైన పాలను అందించేందుకు కట్టుబడి ఉన్నామని, మార్కెట్లో పాల సరఫరా, నిల్వ, శీతల సరఫరా వ్యవస్థ నిర్వహణపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని డిస్ట్రిబ్యూటర్లకు సూచించారు. -
లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్కార్డుల పంపిణీ
ఖిలా వరంగల్: మధ్యకోటలోని ఖుష్మహల్ మైదానంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధ్యక్షతన శనివారం స్మార్ట్ రేషన్కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. స్వాతంత్య్ర వేడుకల అనంతరం జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ కార్డుల పంపిణీని లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. ప్రజాపంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ముందుకెళ్తోందని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 2,96,929 కార్డులు, 8,94,791 మంది లబ్ధిదారులు ఉన్నారని పేర్కొన్నారు.ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కార్డులను పంపిణీ చేయగా.. నేడు సీఎం రేవంత్రెడ్డి స్మార్ట్ కార్డులు అందజేస్తున్నట్లు తెలిపారు. గతంలో దొడ్డు బియ్యాన్ని ఎవరూ తినక తక్కువ ధరకే విక్రయించేవారని గుర్తు చేశారు. ప్రతి నెల ఒక్కరికి 6 కిలోల చొప్పున నాణ్యమైన సన్న బియ్యాన్ని ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తోందని వివరించారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ స్మార్ట్కార్డులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతకుముందు రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మోహన్నాయక్ మంత్రి సురేఖను కలిసి డీలర్లకు రూ.ఐదువేల గౌరవ వేతనం, క్వింటాలుకు రూ.300 కమిషన్ ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు. అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, గణేశ్, డీఎస్ఓ కిష్టయ్య, డీఎం సంధ్యారాణి, ఆర్డీఓ సుమ తహసీల్దార్లు ఇక్బాల్, శ్రీకాంత్, మార్కెట్ డైరెక్టర్ గజ్జెల శ్యాం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాశ్, మేర కార్పొరేషన్ చైర్మన్ సంగ వెంకట్రాజం, కాంగ్రెస్ నాయకుడు గోపాల నవీన్రాజు, లబ్ధిదారులు పాల్గొన్నారు. -
వరంగల్ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హన్మకొండ: ప్రభుత్వం వరంగల్ అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబందాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హనుమకొండలోని అంబేడ్కర్ భవన్లో శనివారం నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తమ ప్రభుత్వం పేదల పక్షపాతి అన్నారు. పేదల సంక్షేమమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమన్నారు. పేదలకు సన్నబియ్యం, ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, పేద పిల్లలకు నాణ్యమైన విద్య కోసం హాస్టళ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా రాష్ట్రంలో తొలి విడతలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని, రెండో విడతలో 2.5 లక్షల ఇళ్లు మంజూరు చేశామని వివరించారు. హైదరాబాద్లో స్థలం లేని నిరుపేదలకు ఇందిరమ్మ టవర్లు నిర్మిస్తున్నామన్నారు. పేదలకు సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని, సన్నబియ్యం పంపిణీలో ఎలాంటి లోపాలకు తావివ్వొద్దని సూచించారు. వరంగల్లో రూ.5,700 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మించనున్నట్లు తెలిపారు. కేంద్రాన్ని ఒప్పించి వరంగల్కు ఎయిర్పోర్ట్ తీసుకొచ్చామన్నారు. స్మార్ట్ రేషన్ కార్డులో క్యూ ఆర్ కోడ్ సౌకర్యముందన్నారు. ఎక్కడైనా రేషన్ పొందేలా స్మార్ట్ కార్డులు తీసుకొచ్చామన్నారు. కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కే.ఆర్.నాగరాజు, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, అడిషనల్ కలెక్టర్ రవి, డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేష్ పాల్గొన్నారు. -
రూ.66.36 కోట్ల ధాన్యం మాయం!
సాక్షి ప్రతినిధి, వరంగల్ : సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) బకాయిల వ్యవహారం ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన సీఎంఆర్ బియ్యం /ధాన్యం లెక్కల్లో భారీగా తేడాలు బయటపడుతున్నాయి. విజిలెన్స్, సివిల్ సప్లయీస్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో 25,689.522 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. దీని విలువ సుమారు రూ.66.36 కోట్లుగా తేలింది. సీఎంఆర్ బకాయిల వసూళ్లపై ప్రభుత్వం దృష్టి సారించడంతో అధికారులు తనిఖీలను మరింత ముమ్మరం చేశారు. 20 రోజుల్లో 16 రైస్మిల్లులను తనిఖీ చేయగా.. పలు మిల్లుల్లో ధాన్యం లేనట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఆరు మిల్లులపై కేసులు నమోదు చేసి, స్వల్ప తేడా ఉన్న మిల్లర్లకు నోటీసులు ఇచ్చారు. ఉమ్మడి వరంగల్లో మొత్తం సీఎంఆర్ బకాయి రూ.230 కోట్ల వరకు ఉండగా, వాటి వసూళ్ల కోసం దాడులు, తనిఖీలు కొనసాగుతున్నాయి. పక్కదారి పట్టిన సీఎంఆర్.. ఎక్కడెక్కడ ఎంత? తనిఖీల్లో బయటపడిన మొత్తం కొరత 25,689.522 టన్నులు కాగా, ఆరుగురు మిల్లర్లపై ఎఫ్ఐఆర్లు నమోదు కాగా, ఆయా మిల్లులపై అధికారులు, పోలీసులు చర్యలు చేపట్టారు. కొన్ని మిల్లులకు సంబంధించిన వ్యక్తులు అందుబాటులో లేకపోవడంలో నోటీసులు జారీ చేశామని, మరికొన్ని కేసుల్లో తదుపరి చర్యలు కొనసాగుతాయని అధికారులు చెప్పారు. ● హనుమకొండ జిల్లాలో మూడు మిల్లుల్లో 6,853.306 టన్నుల ధాన్యం కొరతగా, దాని విలువ రూ.17.27 కోట్లుగా నమోదైంది. గట్లకానిపర్తిలో మెస్సర్స్ లక్ష్మీ నర్సింహ ఇండస్ట్రీస్, మెస్సర్స్ శ్రీవినాయక ఇండస్ట్రీస్లపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ● వరంగల్లో రెండు మిల్లుల్లో 2,285.232 టన్నుల ధాన్యం మాయం కాగా, దాని విలువ రూ.5.20 కోట్లుగా అధికారులు గుర్తించారు. నర్సంపేటలోని సుగుణ ఇండస్ట్రీస్పై కేసు నమోదైంది. ● జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రెండు మిల్లుల్లో 3,007.244 టన్నుల ధాన్యం కొరతగా ఉండగా, వాటి విలువ రూ.7.88 కోట్లుగా తేలింది. రూ.4.39 కోట్లు బకాయి ఉన్న గిద్దెముత్తారంలోని వైష్ణవి ఇండస్ట్రీస్ మిల్లుపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ● ములుగులో రెండు మిల్లుల్లో తనిఖీ చేయగా, 1,574.217 టన్నుల ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. ఆ ధాన్యం విలువ రూ.3.59 కోట్లుగా నమోదైంది. ● మహబూబాబాద్ జిల్లాలో నాలుగు మిల్లుల్లో 1,103.250 టన్నుల ధాన్యం లేకపోగా, వాటి విలువ రూ.3.08 కోట్లుగా తేలింది. కేసముద్రంలోని బాలాజీ ఆగ్రో ఇండస్ట్రీ, తిరుమల బిన్నీ రైసుమిల్లులపై కేసులు పెట్టగా, ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ● జనగామ జిల్లా బచ్చన్నపేట శ్రీమిత్ర అగ్రో ఇండస్ట్రీస్, జఫర్గడ్ మండలం తిమ్మంపేటలోని పీఎస్కే ఆగ్రో ఇండస్ట్రీస్లలో విజిలెన్స్, సివిల్సప్లయ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ రెండు మిల్లుల్లో రూ.2.29 కోట్ల విలువైన 833.206 టన్నుల ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. తదుపరి చర్యలకు పౌరసరఫరాలశాఖను ఆదేశించారు. పాత బకాయిలపై నజర్ తనిఖీల్లో బయటపడిన కొరతలో కొంతభాగం 2022–23 ధాన్యానికి సంబంధించిన పాత బకాయిలపై కూడా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నజర్ పెట్టారు. అలాంటి మిల్లులపై సంబంధిత జిల్లా పౌరసరఫరాల అధికారులకు తదుపరి చర్యల కోసం రిక్విజిషన్లు పంపినట్లు సమాచారం. కాగా, సీఎంఆర్ కోసం ప్రభుత్వ ధాన్యాన్ని తీసుకున్న మిల్లుల్లో నిల్వలు, మిల్లింగ్ అనంతరం ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం, మిల్లుల్లో అందుబాటులో ఉన్న ధాన్యం తదితర లెక్కలను అంచనా వేసి బకాయిలు రాబట్టడంపై దృష్టి పెడుతున్నారు. ఇదిలా ఉండగా, సీఎంఆర్ బకాయిలపై సీఎం రేవంత్రెడ్డి ఇటీవల నిర్వహించిన సమీక్ష అనంతరం విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారుల మరింత దూకుడు పెంచారు. పౌరసరఫరాలశాఖ సమన్వయంతో బకాయిదారుల రైసుమిల్లుల్లో తనిఖీలు నిర్వహించి ధాన్యం గుట్టు విప్పుతున్నారు. సీఎంఆర్ చెల్లించక, ధాన్యం నిల్వ చూపని మిల్లర్లను గుర్తించి కేసులు పెడుతున్నారు. అందుబాటులో లేని డిఫాల్టర్లకు నోటీసులు జారీ చేస్తుండగా.. అందుబాటులో ఉన్న మిల్లర్లపై కేసులు, బకాయిల వసూలుకు చర్యలు చేపడుతున్నారు. దీంతో సీఎంఆర్ బకాయిల వ్యవహారంలో ఇక నుంచి మరింత కఠిన చర్యలు తప్పవన్న సంకేతాలు అధికార వర్గాలనుంచి వెలువడుతున్నాయి. ‘విజిలెన్స్–సివిల్ సప్లయీస్’ తనిఖీల్లో బట్టబయలు సీఎంఆర్ ఎగవేతపై కేసుల కొరడా... ఆరుగురు మిల్లర్లపై ఎఫ్ఐఆర్లు.. స్వల్ప తేడా ఉన్నవారికి నోటీసులు.. 25,690 టన్నుల ధాన్యం కొరత... కొనసాగుతున్న తనిఖీలు సీఎం సమీక్ష తర్వాత మరింత దూకుడు పెంచిన అధికారులు -
పోషకాహార లోపాన్ని అధిగమించాలి
● పల్స్ ఫార్మా డైరెక్టర్ ఆచార్య దేవరాజ్రామ్బహు కేయూ క్యాంపస్ : పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు నూతన ఆవిష్కరణలు అవసరమని హైదరాబాద్ పల్స్ ఫార్మా డైరెక్టర్, కేయూ ఫార్మసీ కళాశాల విశ్రాంత ప్రొఫెసర్ దేవరాజ్రామ్బహు పేర్కొన్నారు. శుక్రవారం కాకతీయ యూనివర్సిటీ సెనేట్ హాల్లో దివంగత ఫార్మసీ కళాశాల ప్రొఫెసర్ వై.మధుసూదన్రావు తొలిస్మారకోపన్యాసంలో ఆయన ఇన్నోవేటివ్ నానోడ్రగ్ డెలవరీ ప్లాట్ఫామ్స్ అనే అంశంపై మాట్లాడారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, హైబ్రిడ్ పంటల ప్రభావంతో ముఖ్యమైన ఖనిజాల లోపం పెరుగుతోందన్నారు. ఫార్మసీ విద్యా, పరిశోధన రంగానికి ప్రొఫెసర్ మధుసూదన్రావు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఎండోమెంట్ లెక్చర్కు కేయూ ఓఎస్డీ ప్రొఫెసర్ బి.వెంకట్రామ్రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణవేణి, కమిటీ బాధ్యులు కిషన్, షాయాదా, డాక్టర్ వల్లాల పృథ్వీరాజ్ మాట్లాడారు. తొలుత దివంగత ప్రొఫెసర్ మధుసూదన్రావు చిత్రపటానికి అతిథులు, ఆచార్యులు, పరిశోధలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
ఉత్సాహంగా టెన్నిస్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ జిల్లా టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం హనుమకొండ జేఎన్ స్టేడియంలో ఒక్క రోజు ఇంటర్నల్ టోర్నమెంట్ నిర్వహించారు. 60 ప్లస్ కేటగిరీలో జరిగిన ఫైనల్ మ్యాచ్ డాక్టర్ ఎర్రగట్టు స్వామి–కె.రవిచంద్ర, కుంజ్ బిహారి–పి.వెంకటేశ్వరరావు మధ్య పోటీ ఉత్కంఠగా సాగింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఎర్రగట్టు స్వామి, రవిచంద్ర జట్టు విజేతగా నిలిచింది. ఓపెన్ కేటగిరీ డబుల్స్ విభాగంలో వినీల్కుమార్, శ్రీనివాస్ జట్టు విజేతగా నిలవగా, ద్వితీయ స్థానంలో ప్రదీప్త, కార్తికేయ జట్టు ట్రోఫీని అందుకుంది. సింగిల్స్ విభాగంలో ప్రథమ స్థానంలో టి.సాత్విక్, ద్వితీయ స్థానంలో వినీల్కుమార్ విజేతలుగా నిలిచారు. ముగింపు పోటీలకు ముఖ్య అతిథులుగా అసోసియేషన్ ప్యాట్రన్ శ్రీనివాసరావు, డీవైఎస్ఓ ప్రశాంత్ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ టెన్నిస్ క్రీడాభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తామన్నారు. నయీంనగర్: కాకతీయ మ్యూజికల్ గార్డెన్ను నేడు (శనివారం) నుంచి ప్రజలు సందర్శించడానికి అందుబాటులోకి తీసుకొచ్చామని హనుమకొండ కలెక్టర్, ‘కుడా’ వైస్ చైర్మన్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. ప్రతీరోజు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు వాకర్లు, ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 వరకు సాధారణ సందర్శకులు గార్డెన్ను సందర్శించవచ్చని పేర్కొన్నారు. గార్డెన్ నిర్వహణ, సౌకార్యాల పరిరక్షణ కోసం సందర్శకుల నుంచి కనీస రుసుము వసూలు చేస్తారని తెలిపారు. రోజూ సాయంత్రం 7:30 గంటలకు మల్టీమీడియా షో (మ్యూజికల్ షో) ఉంటుందని తెలిపారు. ఈగార్డెన్.. సందర్శకులకు వినోదంతో పాటు ఆహ్లాదకర వాతావరణం అందించనున్నట్లు, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కాశిబుగ్గ: కాశిబుగ్గలోని సాయి గణేశ్ కాలనీకి చెందిన మైక్రో ఆర్టిస్ట్ కుసుమ లింగమూర్తి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆవగింజపై జాతీయ పతాకం చిత్రించి ఆకట్టుకున్నారు. కాగా, సూక్ష్మ కళలో ఆయన ప్రతిభను గుర్తించిన పలు సంస్థలు గతంలో రాష్ట్ర, జిల్లా స్థాయిలో అవార్డులు అందించాయి. హన్మకొండ అర్బన్: హెచ్ఐవీ పాజిటివ్గా గుర్తించిన ప్రతీ కేసును తప్పనిసరిగా నమోదు చేసి, బాధితులకు ఏఆర్టీ, కౌన్సెలింగ్, వైద్య సేవలు నిరంతరం అందేలా చర్యలు తీసుకోవాలని వరంగల్, హనుమకొండ డీఎంహెచ్ఓలు బి.రాజారెడ్డి, అప్పయ్య సూచించారు. శుక్రవారం వరంగల్ డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా పరిధిలో హెచ్ఐవీ, ఎయిడ్స్ నివారణ, నియంత్రణ కార్యక్రమాలపై సమీక్షించారు. సమావేశంలో నోడల్, కార్యక్రమ అధికారి మదన్మోహన్, వరంగల్ కార్యక్రమ అధికారి అరుణ్జోషి, జిల్లా కార్యక్రమ నిర్వాహకురాలు స్వప్న మాధురి, డేటా మేనేజర్ కమలాకర్, ఏఆర్టీ వైద్యాధికారులు, ఐసీటీసీ కౌన్సెలర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, జిల్లా ఎయిడ్స్ నివారణ, సిబ్బంది పాల్గొన్నారు. హన్మకొండ: విద్యుత్ వినియోగదారులు అపరిచితులనుంచి వచ్చే ఫోన్కాల్స్పై అప్రమత్తంగా ఉండాలని టీజీఎన్పీడీసీఎల్ హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘మేం ఎలక్ట్రిసిటీ వాళ్లమని, మీ మీటర్ ఆగిపోయింది.. కాలిపోయింది.. బకాయి ఉంది’ అని కాల్ చేస్తే స్పందించవద్దని పేర్కొన్నారు. ఇలాంటి వారికి నేరుగా డబ్బులు ఇవ్వొద్దని, డిజిటల్ పేమెంట్ చేయొద్దని సూచించారు. ప్రధానంగా 94945 75271 నంబర్తో వచ్చే ఫోన్ కాల్ను నమ్మొద్దని కోరారు. -
ఆర్ఓబీ పనులు వేగంగా పూర్తి చేయండి
● హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ కాజీపేట రూరల్: కాజీపేట ఫాతిమానగర్లో నూతనంగా నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) పనులు వేగంగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. శుక్రవారం కాజీపేటలో కొనసాగుతున్న ఆర్ఓబీ నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసేలా అధికారులు నిత్యం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఈసందర్భంగా ఆర్అండ్బీ ఎస్ఈ సురేశ్బాబు ఆర్ఓబీ నిర్మాణ పనుల పురోగతిని ఇప్పటివరకు పూర్తయిన పనులు, కొనసాగుతున్న పనుల వివరాలు కలెక్టర్కు వివరించారు. ఈఈ దేవిక, కాంట్రాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు. -
నల్సార్ విద్యార్థులపై చర్య అప్రజాస్వామికం
సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె.నారాయణ ఖిలా వరంగల్: శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న నల్సార్ విద్యార్థులపై చర్య అప్రజాస్వామి కమని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె.నారాయణ అన్నారు. విద్యార్థుల నిరసనను అడ్డుకోవడానికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) ఎవరని, విద్యార్థులను లాయర్లుగా నమోదు చేసుకోవద్దని ఆదేశించడం, వారిని బెదిరించడం వంటి చర్యలు పూర్తి ఆప్రజాస్వామికమని పేర్కొన్నారు. వారం రోజులపాటు వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొనసాగిన సీపీఐ పాదయాత్ర శుక్రవారం నగరంలోని శివనగర్లోని సీసీఐ తమ్మెర భవనంలో ముగిసింది. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి షేక్ బాష్మియా అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో నారాయణ మాట్లాడారు. యూనివర్సిటీ స్నాతకోత్సవానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆహ్వానించవద్దని విద్యార్థులు వీసీకి విజ్ఞప్తి చేయడం వారి నిరసనలో భాగమన్నారు. కేంద్రం రైళ్లు రద్దు చేసినా సెప్టెంబర్ 1న ఢిల్లీ రాంలీల మైదానంలో జరపతలపెట్టిన ధర్నాతో అక్కడి వీధులన్నీ దద్దరిల్లడం ఖాయమన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్రావు, రాష్ట్ర నేతలు జ్యోతి, భిక్షపతి, వెంకట్రాములు, మేకల రవి, పంజాల రమేశ్, వలీ ఉల్లాఖాద్రి పాల్గొన్నారు. కాళోజీ కళాక్షేత్రం సందర్శన హన్మకొండ అర్బన్: హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రాన్ని డాక్టర్ కె.నారాయణ సందర్శించారు. కాళోజీ దుస్తులు, ఆయన రచించిన కవితల పుస్తకాలను పరిశీలించారు. అనంతరం కాళోజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. -
డోర్నకల్–గుండ్రాతిమడుగు మధ్య ప్యాచ్ వర్క్
కాజీపేట రూరల్ : కాజీపేట సబ్డివిజన్ పరిధిలోని డోర్నకల్–గుండ్రాతి మడుగు మధ్య నేటినుంచి (శనివారం) ఈనెల 19వ తేదీ వరకు చేపట్టే మూడో రైల్వేలైన్ ప్యాచ్ వర్క్ నిర్మాణంతో పలు రైళ్లను దారి మళ్లించి నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. పలు రైళ్లకు కాజీపేట, వరంగల్లో తాత్కాలిక హాల్టింగ్ ఎత్తివేసినట్లు వివరించారు. దారి మళ్లించిన రైళ్లు ఇవే.. నేటినుంచి ఈ నెల 18వ తేదీ వరకు విశాఖపట్నం–ఎల్టీటీ (18519) వెళ్లే ఎల్టీటీ ఎక్స్ప్రెస్, ఎల్టీటీ–విశాఖపట్నం (18520)ఎక్స్ప్రెస్, ఈ నెల 17, 18న ముంబాయి–భువనేశ్వర్ (11019) వెళ్లే కోణార్క్ ఎక్స్ప్రెస్, భువనేశ్వర్–ముంబాయి (11020) వెళ్లే ఎక్స్ప్రెస్, ఈ నెల 18న మచిలిపట్నం–శ్రీషిర్డి సాయినగర్ (17208) వెళ్లే ఎక్స్ప్రెస్, శ్రీషిర్డి సాయినగర్–కాకినాడ (17205) వెళ్లే ఎక్స్ప్రెస్, ఈ నెల 18,19న చర్లపల్లి–షాలిమార్ (18046) ఈస్ట్కోస్ వెళ్లే ఎక్స్ప్రెస్ వయా కాజీపేట జంక్షన్, వరంగల్కు రాకుండా వయా విజయవాడ, గుంటూరు, పగిడిపల్లి మీదుగా సికింద్రాబాద్కు దారి మళ్లించారు. అదేవిధంగా ఈ నెల 15,17న రేణిగుంట–నిజాముద్దీన్ (00761) వయా విజయవాడ, వరంగల్ మీదుగా వెళ్లే ఎక్స్ప్రెస్ను వయా కాచిగూడ, మల్కాజ్గిరి, కాజీపేట, బల్లార్షా మీదుగా దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. పలు రైళ్లు తాత్కాలిక రద్దు గుంటూరు–సికింద్రాబాద్ (17201) వెళ్లే గోల్కొండ ఎక్స్ప్రెస్ ఈ నెల 19 వరకు గుంటూరు–కాజీపేట మధ్య రద్దు, ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు భద్రాచలంరోడ్–బల్లార్షా (17033) సింగరేణి వెళ్లే ఎక్స్ప్రెస్ను భద్రాచలంరోడ్–వరంగల్ మధ్య రద్దు, ఈ నెల 18 వరకు సిర్పూర్కాగజ్నగర్–భద్రాచలంరోడ్ (17034) వెళ్లే ఎక్స్ప్రెస్ను వరంగల్–భద్రాచలంరోడ్ మధ్య రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే బ్లాక్తో పలు రైళ్ల దారి మళ్లింపు కాజీపేట వరకే గోల్కొండ -
పీఏసీఎస్ల ద్వారా విత్తనోత్పత్తి
హన్మకొండ : ప్రాథమిక సహకార సంఘాల ద్వారా విత్తనోత్పత్తి కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం సీడ్ డైరెక్టర్ డాక్టర్ ఎం.నగేష్ కుమార్ పేర్కొన్నారు. శాస్త్రవేత్తలు, నాబార్డ్ సహకారంతో బ్రీడర్ విత్తనాలను పీఏసీఎస్ల ద్వారా రైతులకు అందించి, నాణ్యమైన విత్తనాలను రైతుస్థాయిలో పండించి తిరిగి వారికే విక్రయించే విధానంపై ఉమ్మడి వరంగల్ జిల్లా పీఏసీఎస్ చైర్మన్లు, కార్యదర్శులతో చర్చా కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగేశ్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. నాబార్డ్ సహకారంతో ప్రతి పీఏసీఎస్కు తొలిదశలో ఐదెకరాల చొప్పున విత్తనోత్పత్తి కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నారు. వరంగల్ డీసీసీబీ సీఈఓ వజీర్ సుల్తాన్ మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో విత్తనోత్పత్తి చేపట్టడం ద్వారా రైతులకు అధిక లాభం చేకూరుతుందన్నారు. వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పరిశోధన సహ సంచాలకుడు డాక్టర్ ఎం.శ్రీధర్, నాబార్డు డీడీఎం చంద్రశేఖర్, వరంగల్ జిల్లా సహకార అధికారి నీరజ, శాస్త్రవేత్తలు డాక్టర్ విద్యాధర్, దిలీప్, నర్సయ్య, రమ్య, రాజ్కుమార్, విశ్వతేజ, మదన్మోహన్, శివచరణ్, అధికారులు పాల్గొన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం సీడ్ డైరెక్టర్ నగేష్ కుమార్ -
ఉమ్మడి జిల్లా వరప్రదాయిని ‘దేవాదుల’
స్టేషన్ఘన్పూర్ : ప్రస్తుత పరిస్థితుల్లో దేవాదుల ఎత్తిపోతల పథకం ఉమ్మడి వరంగల్ జిల్లాకు వరప్రదాయినిగా మారిందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. స్టేషన్ఘన్పూర్, చిల్పూరు మండలాల పరిధిలోని మల్లన్నగండి రిజర్వాయర్ కుడికాల్వ ద్వారా శుక్రవారం పంట కాల్వలకు నీటిపారుదల శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే సాగునీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ధర్మసాగర్, స్టేషన్ఘన్పూర్, మల్లన్నగండి, అశ్వరావుపల్లి, నవాబుపేటతో పాటు బొమ్మకూరు, చీటకోడూరు రిజర్వాయర్ల ద్వారా స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలకు సాధ్యమైనంతవరకు సాగునీరు అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు నుంచి కూడా సాగునీరు విడుదల చేయడం లేదని, కేవలం దేవాదుల ప్రాజెక్టు నుంచి మాత్రమే పంటలకు సాగునీరు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. రిజర్వాయర్లలో 50శాతం వరకు నీటినిల్వలు ఉన్నాయని, ఆన్అండ్ఆఫ్ పద్ధతిలో సాగునీటి విడుదల చేస్తామని పేర్కొన్నారు. రైతులు నీటిని పొదుపుగా వాడుకుని పంటలను కాపాడుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్రెడ్డి, నాయకులు రాపోలు మధుసూదన్రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మల్లన్నగండి రిజర్వాయర్ నుంచి సాగునీరు విడుదల -
కేయూ ఇంజనీరింగ్ విద్యార్థి ప్రతిభ
కేయూ క్యాంపస్: హైదరాబాద్లోని తెలంగాణ పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో సురక్షా తిరంగా సైబర్ అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఇందులో సైబర్ మోసాల నిరోధానికి కేయూ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి సావస్కర్ వీడియో (రీల్)కు ద్వితీయ బహుమతి దక్కించుకుంది. అనంతరం సర్టిఫికెట్, ప్రశంసపత్రాలు అందించారు. డీజీపీ ఆనంద్, ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున, పోలీస్ ఉన్నతాధికారి సజ్జనార్ చేతుల మీదుగా సావస్కర్ ప్రశంసపత్రం అందుకున్నారు. వర్సిటీ ఎడ్యుకేషనల్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన సాయికుందన్, సంజయ్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందుకున్నట్లు ఫ్యాకల్టీ కో–ఆర్డినేటర్ సంతోష్ తెలిపారు. -
దేవాలయాల్లో భక్తుల రద్దీ
హన్మకొండ కల్చరల్: శ్రావణంలోని మొదటి శుక్రవారాన్ని పురస్కరించుకుని నగరంలోని పలు దేవాలయాలు భక్తుల రద్దీతో కిక్కిరిశాయి. వేయిస్తంభాల ఆలయంలో ఇష్టకామేశ్వరిగా రుద్రున్ని అలంకరించి పూజలు నిర్వహించారు. భద్రకాళి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వందలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి చీర, సారె, ఒడి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రాజరాజేశ్వరీ దేవాలయం, సంతోషిమాత ఆలయం, పద్మాక్షి దేవాలయం, ఎకై ్సజ్ కాలనీలోని వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో ఘనంగా పూజలు నిర్వహించారు. -
అవమానించడం బీజేపీ సంస్కృతి
హన్మకొండ/హన్మకొండ చౌరస్తా: అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేపై బీజేపీ నాయకులు వ్యవహరించిన తీరు వారి సంస్కృతికి నిదర్శనమని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి విమర్శించారు. హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి ఆధ్వర్యంలో ఖర్గేకు సంఘీభావంగా సత్యాగ్రహ నిరసన ర్యాలీని శుక్రవారం నిర్వహించారు. తొలుత అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి పాదయాత్రగా పబ్లిక్ గార్డెన్లోని గాంధీ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కేఆర్.నాగరాజుతో కలిసి ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి పాల్గొన్నారు. అనంతరం పబ్లిక్గార్డెన్లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ర్యాలీలో కాంగ్రెస్ టీపీసీసీ, డీసీసీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే, నాయకుల అర్ధనగ్న ప్రదర్శన వరంగల్ చౌరస్తా: మల్లికార్జున ఖర్గేకు జరిగిన అవమానాన్ని నిరసిస్తూ శుక్రవారం సాయంత్రం వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, డీసీసీ ప్రసిడెంట్ అయూబ్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు చిలువేరు శ్రీనివాస్ అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. వరంగల్ వెంకట్రామ జంక్షన్ నుంచి అర్ధనగ్న ప్రదర్శనగా కాశిబు గ్గ జంక్షన్కు చేరుకున్నారు. పెద్దఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అంబేడ్కర్ జంక్షన్ నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు కాంగ్రెస్ నిరసన ర్యాలీ -
విరిగిన విజయ డెయిరీ పాలు
హన్మకొండ చౌరస్తా : ‘రసాయనాలు లేకుండా ప్రజలకు స్వచ్ఛమైన పాలు అందించడం అభినందనీయం’ అని కలెక్టర్ చాహత్బాజ్పాయ్ ఈ నెల 13న హనుమకొండలోని విజయ డెయిరీని సందర్శించిన సమయంలో చెప్పిన మాటలు.. డెయిరీని క్షుణ్ణంగా పరిశీలించిన కలెక్టర్ పాడి రైతులు, వినియోగదారుల నమ్మకాన్ని చూరగొని, వారికి మరింత దగ్గర కావాలని అధికారులకు సూచించారు. కానీ వరంగల్ యూనిట్ పరిధిలోని ప్రభుత్వ విద్యా సంస్థలకు శుక్రవారం సరఫరా చేసిన పాలు మొత్తం విరిగిపోయాయి. కలెక్టర్ చెప్పిన మరుసటి రోజే పాలు విరగడంతో డెయిరీ అధికారుల చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతోంది. ఉమ్మడి జిల్లాలో రూ.3.85లక్షల నష్టం ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది సైతం ప్రభుత్వ విద్యా సంస్థలకు పాల సరఫరా చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లకు అప్పగించారు. లీటర్కు రూ.55 చొప్పున విజయ డెయిరీ డిస్ట్రిబ్యూటర్కు చెల్లిస్తుండగా, ప్రభుత్వ విద్యా సంస్థలు డిస్ట్రిబ్యూటర్లకు లీటరుకు రూ.65.50లు చెల్లిస్తున్నాయి. ప్రతిరోజు ఉమ్మడి జిల్లాల పరిధిలోని సుమారు 294 సంస్థలకు డిస్ట్రిబ్యూటర్లు విజయ పాలను సరఫరా చేస్తున్నారు. సుమారు 7వేల లీటర్ల పాలకు రూ.55 చొప్పును రూ.3,85,000ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ నష్టం ఆయా జిల్లాల డిస్ట్రిబ్యూటర్లు భరించాలా, డెయిరీ భరిస్తుందా అని తేలాల్సి ఉంది.సుమారు 7వేల లీటర్ల్లు నేలపాలు ప్రభుత్వ విద్యాసంస్థలకు సరఫరా తప్పెవరిది.. నష్టం ఎవరికీ కలెక్టర్ సందర్శించిన మరుసటి రోజే ఘటనజిల్లా విద్యా పాల సరఫరా సంస్థలు లీటర్లలో..వరంగల్ 60 1,300 హనుమకొండ 65 2,200 భూపాలపల్లి 29 650 ములుగు 28 600 మహబూబాబాద్ 60 1,500 జనగామ 40 1,400 -
శక్తి పాలసీని రద్దు చేయాలి
● ఎంజీఎం జంక్షన్లో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల నిరసన వరంగల్ చౌరస్తా : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాలిటెక్నిక్ విద్యను కుట్రపూరితంగా శక్తి పాలసీ ద్వారా నిర్వీర్యం చేయాలని చూస్తున్నాయని, ఈ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం వరంగల్ ఎంజీఎం నుంచి పాలిటెక్నిక్ కాలేజీ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన శక్తి పాలసీని ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. కాజీపేట అర్బన్ : హనుమకొండ జిల్లాలోని బీడీ కార్మికుల పిల్లలు 2026–27 సంవత్సరానికిగాను నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని బీడీ కార్మికుల సంక్షేమ దవాఖానా డాక్టర్ బి.సురేష్కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.1 నుంచి 10వ తరగతి విద్యార్థులు ఈనెల 31వ తేదీ వరకు, ఇంటర్ ఆపై చదువుతున్న వారు అక్టోబర్ 31వ తేదీన దరఖాస్తు చేసుకోవాలని కోరారు. -
ఎంజీఎంలో వైద్యసేవలపై కలెక్టర్ ఆరా
కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని బుధవారం కలెక్టర్ సత్యశారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు వార్డుల్లో రోగులకు అందుతున్న సేవలు, మీడియాలో వచ్చిన కథనాలపై స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ముందుగా.. ఆమె ఎంఏసీ, క్యాజువాలిటీతోపాటు డైట్ సెంటర్ను పరిశీలించారు. ఈసందర్భంగా రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఎంఏసీ వద్ద ఓ రోగి బయట పడుకున్నట్లు సోషల్ మీడియాలో వచ్చిన దాని గురించి అడిగి అధికారులనుంచి వివరణ తీసుకున్నారు. ఓ సెక్యూరిటీ గార్డు డబ్బులు తీసుకుంటున్నట్లు వచ్చిన మీడియా కథనంపై ఆరా తీశారు. తమ పేషెంట్ను ఎంఏసీ వార్డులో అడ్మిట్ చేసుకోవడం లేదని, తమ యూనిట్ కాదని చెబుతున్నారని రోగి బంధువులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. క్యాజువాలిటీకి వెళ్లి వైద్య సేవల విషయంలో ఎందుకు ఇలా నిర్లక్ష్యం చేస్తున్నారని డ్యూటీ డాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పేషెంట్ అటెండెంట్ కలెక్టర్కు తమ సమస్యలు విన్నవించారు. దీంతో ఆమె వార్డుల్లోకి వెళ్లి స్వయంగా రోగులకు అందుతున్న వైద్య సేవల తీరును తెలుసుకున్నారు. ఆస్పత్రిలోని కంప్లైంట్ బాక్స్ పరిశీలించారు. అనంతరం రోగులకు ఆహారాన్ని అందించే డైట్ను ఆమె ప్రత్యేకంగా పరిశీలించారు. అంతకుముందు అకడమిక్ కాన్ఫరెన్స్ హాల్లో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. కలెక్టర్ వెంట ఎంజీఎం సూపరింటెండెంట్ రాంకుమార్రెడ్డి, ఆర్ఎంఓ డాక్టర్ అశ్విని, నర్సింగ్ సూపరింటెండెంట్ దయాశీల, పలువురు వైద్యులు ఉన్నారు. డైట్ సెంటర్ను సందర్శించిన డాక్టర్ సత్యశారద మీడియా కథనాలకు స్పందించి వార్డుల పరిశీలన -
పకడ్బందీగా పన్ను వసూలు చేయాలి
హన్మకొండ/వరంగల్ అర్బన్: పన్నుల వసూళ్ల లక్ష్య సాధనకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. బుధవారం హనుమకొండలోని కలెక్టరేట్లో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్నతో కలిసి కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ట్యాక్సేషన్, రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సర్కిళ్ల వారీగా ఆస్తి పన్ను వసూళ్లు, కొత్త నిర్మాణాల గుర్తింపు తదితర అంశాలపై సమీక్షించారు. అధికారులతో సమీక్ష పకడ్బందీగా పన్నులు వసూలు చేసి నగర ప్రజలకు మెరుగైన సేవలందించాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ టి.వెంకన్న అధికారులకు సూచించారు. బుధవారం బల్దియా కార్యాలయంలో పన్నుల వసూళ్లు, పెండింగ్ బకాయిలపై ఆయన సమీక్షించారు. అనంతరం చేయూత పింఛన్ల దరఖాస్తుల పురోగతిని కమిషనర్ వెంకన్న సమీక్షించారు. సర్కిళ్ల వారీగా దరఖాస్తుల ప్రక్రియ గురించి డిప్యూటీ కమిషనర్లను అడిగి తెలుసుకున్నారు. పరిశుభ్రత పాటించాలి పేదలకు రూ.5కే నాణ్యమైన భోజనం అందిస్తున్న అన్నపూర్ణ భోజన కేంద్రాలకు ఆహారాన్ని సరఫరా చేసే హరే కృష్ణ ఫౌండేషన్ ప్రధాన వంటశాలను కమిషనర్ పరిశీలించారు. నాణ్యత, పరిశుభ్రత పాటించాలని సూచించారు. అనంతరం నూతనంగా నిర్మించిన వరంగల్ కలెక్టరేట్లో ప్లాంటేషన్ పనులు పరిశీలించారు. ఆయా సమావేశాల్లో అదనపు కమిషనర్ జోనా, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, బిర్రు శ్రీనివాస్, పన్నుల అధికారి రామకృష్ణ, ఐటీ మేనేజర్ రమేశ్, ఆర్ఓలు శ్రీనివాస్, బాకం సంతోశ్, రామకృష్ణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జీడబ్ల్యూఎంసీ ప్రత్యేకాధికారి చాహత్ బాజ్పాయ్ మెరుగైన సేవలందించండి: బల్దియా కమిషనర్ వెంకన్న అధికారులతో సమీక్ష -
విద్యార్థుల చెంతకు సమాచారం..
● నిట్లో డిజిటల్ ఎల్ఈడీల ఏర్పాటు.. కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్ తన ప్రత్యేకతను ఎప్పటికప్పుడు చాటుకుంటూనే ఉంటోంది. ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రత్యేకంగా విద్యార్థుల చెంతకు సమాచారం అందజేసేందుకు కొత్తగా రెండు డిజిటల్ ఎల్ఈడీ బోర్డులు ఏర్పాటు చేశారు. సాధారణంగా అధికారులు తమ అఫీషియల్ పోర్టల్ అయిన వెబ్సైట్, ఇన్స్టాగ్రాంలో కళాశాల ప్రాధాన్యం కలిగిన సమాచారం పొందుపరుస్తుంటారు. ప్రతీ రోజూ విద్యార్థులు ఆ వెబ్సైట్, ఇన్స్టాగ్రాంను ఓపెన్ చేయడం కుదరకపోవడంతో కీలక సమాచారం మిస్సవుతున్నారు. ఏ చిన్న సమాచారం మిస్సవ్వొద్దని క్యాంపస్లో రెండు డిజిటల్ ఎల్ఈడీ బోర్డులు ఏర్పాటు చేశారు. ఉదయం 8.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు ఎల్ఈడీ బో ర్డులు తాజా సమాచారాన్ని తెలియజేస్తుంటా యి. విద్యార్థులకు ఇంటర్న్షిప్, పేపర్ ప్రజంటేషన్, పెటెంట్ హక్కులు సాధించిన వారి వివరాలతోపాటు క్యాంపస్లో చోటుచేసుకునే వివరాలను తెలుసుకునేందుకు కేరాఫ్గా డిజిటల్ ఎల్ఈడీ సమాచారం నిలుస్తోంది. బోర్డుల్లో డిస్ప్లే అవుతూ.. నిట్ వరంగల్లో బీటెక్, ఎంటెక్, పీజీ, పీహెచ్డీ విద్యార్థులు సుమారు 6,500 మంది విద్యనభ్యసిస్తున్నారు. కాలి నడకన, సైక్లింగ్లో కళాశాల తరగతి గదులు, ల్యాబ్స్, ఆడిటోరియం, హాస్టళ్లు, కెఫెలకు వెళ్తుంటారు. ఇక్కడికి మెయిన్ బిల్డింగ్, కలాం గెస్ట్హౌజ్ వద్దనుంచి వెళ్లాల్సి ఉంటుండడంతో ఆ డిజిటల్ బోర్డుల్లో ప్లే అవుతున్న సమాచారాన్ని ఆసక్తిగా తిలకిస్తూ తమకు అవసరమైన వాటిని నోట్ చేసుకుంటున్నారు. -
ఓరుగల్లుకు ‘పీఎం మిత్ర’నే
సాక్షి, వరంగల్: కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు (కేఎంటీపీ)కు పీఎం మిత్ర హోదా రావడంతో ఓరుగల్లు జౌళి రంగంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలకు కేంద్రంగా మారుతోంది. పార్కులో మౌలిక వసతుల కల్పనకు ఇప్పటివరకు రూ.200 కోట్లు వెచ్చించామని కేంద్ర జౌళిశాఖ సహాయ మంత్రి సబిత్రా మార్గరేటా లోక్సభలో వెల్లడించారు. ఇప్పటికే దశలవారీగా మంజూరవుతున్న నిధులతో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. పరిశ్రమలను ఆకర్షించేందుకు కాంపిటేటివ్ ఇన్సెంటివ్ సపోర్ట్ కింద రూ.300 కోట్ల వరకు ప్రోత్సాహకం ఇవ్వనున్నారు. దీంతో కొత్త పెట్టుబడులు మరింత వేగంగా వచ్చే అవకాశముంది. ప్రస్తుతం వచ్చిన పెట్టుబడులతోనే 24,400 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. వీరిలో అత్యధికంగా మహిళలే ఉండడం గమనార్హం. పీఎం మిత్ర పథకం ద్వారా పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందితే ఒక లక్ష మందికి ప్రత్యక్షంగా, రెండు లక్షల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించే సామర్థ్యం ఉందని కేంద్రం పేర్కొంది. రూ.6 వేల కోట్లకు పైగా పెట్టుబడులు.. పీఎం మిత్ర పథకం కింద తెలంగాణ నుంచి వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును 2023లో ఎంపిక చేశారు. గీసుకొండ, సంగెం మండలాల్లోని శాయంపేట హవేలీలో 1,327 ఎకరాల్లో విస్తరించిన ఈ పార్కులో పత్తి నుంచి నూలు, దుస్తుల తయారీ, ఎగుమతుల వరకు పూర్తి విలువ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. పార్కు అభివృద్ధికి మొత్తం రూ.1,695.54 కోట్ల వ్యయం అంచనా కాగా.. వివిధ మార్గాల ద్వారా రూ.6 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పార్కులో 548 ఎకరాల్లో పరిశ్రమలు వచ్చాయి. ఇందులో పీఎం మిత్రగా ఎంపికై న తర్వాతే 310 ఎకరాల్లో పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. కై టెక్స్, యంగ్వన్, గణేశా తదితర సంస్థలు సిబ్బందిని నియమించుకుని ఉత్పత్తిని ప్రారంభించడంతో పార్కులో సందడి నెలకొంది. మరిన్ని సంస్థలు పెట్టుబడులతో రావడానికి ఆసక్తి చూపుతున్నాయి. 5ఎఫ్ విధానంతో పార్కు అభివృద్ధి.. ఫామ్ టు ఫైబర్.. ఫైబర్ టు ఫ్యాక్టరీ.. ఫ్యాక్టరీ టు ఫ్యాషన్.. ఫ్యాషన్ టు ఫారిన్ అనే 5ఎఫ్ విధానంతో పీఎం మిత్ర పార్కును అభివృద్ధి చేస్తున్నారు. ప్రత్యేక విద్యుత్ సబ్స్టేషన్, నిరంతర నీటి సరఫరా, అంతర్గత రహదారులు, కార్మిక వసతి, ఉమ్మడి బాయిలర్, 10 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్, సీఈటీపీ వంటి మౌలిక వసతులు కల్పిస్తున్నారు. 2017లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేఎంటీపీకి శ్రీకారం చుట్టగా.. 2023లో పీఎం మిత్రలో ఎంపికతో దీనికి జాతీయ ప్రాధాన్యం లభించింది. ప్రస్తుతం కేంద్రం వెల్లడించిన పెట్టుబడులు, ఉపాధి గణాంకాలు పార్కు భవిష్యత్ సామర్థ్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ యువత, మహిళలకు స్థానికంగా ఉపాధి లభించే అవకాశం ఉండడంతో సామాజికంగా దీని ప్రాధాన్యం పెరుగుతోంది. పీఎం మిత్రతో ఓరుగల్లు జాతీయ జౌళి కేంద్రంగా, పెట్టుబడులు, ఉపాధికి కొత్త గమ్యస్థానంగా ఎదిగే అవకాశాలు బలపడుతున్నాయి. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులోని షెడ్లు రూ.200 కోట్లతో కేఎంటీపీలో మౌలిక వసతుల కల్పన కాంపిటేటివ్ ఇన్సెంటివ్ సపోర్ట్ కింద మరో రూ.300 కోట్లు ఇప్పటికే పలు కంపెనీలతో 24,400 మందికి ఉపాధి లోక్సభలో కేంద్ర జౌళిశాఖ సహాయ మంత్రి సబిత్రా మార్గరేటా వెల్లడితో చర్చ -
హెచ్ఐవీపై అవగాహన అవసరం
హన్మకొండ: యువతకు హెచ్ఐవీపై అవగాహన అవసరమని హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య అన్నారు. అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధ వారం హనుమకొండలోని ప్రభుత్వ టీబీ ఆస్పత్రిలో హెచ్ఐవీ, ఎయిడ్స్, లైంగిక సంక్రమణ వ్యాధులపై విస్తృత అవగాహన కార్యక్రమాలను ప్రారంభించారు. ఈసందర్భంగా క్యూఆర్ కోడ్ పోస్టర్ను ఆవిష్కరించారు. డాక్టర్ అప్పయ్య మాట్లాడుతూ.. హెచ్ఐవీకి సంబంధించిన సమాచారం, సేవలను జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ రూపొందించిన ‘బ్రేక్ ఫ్రీ’ యాప్ ద్వారా యువత పొందవచ్చని తెలిపారు. అదనపు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ మదన్న్మోహన్రావు మాట్లాడుతూ.. ఈ నెల 12 నుంచి అక్టోబర్ 12 వరకు జిల్లాలోని 181 గ్రామాలు, పాఠశాలలు, కళాశాలలు, మహిళా సంఘాల్లో హెచ్ఐవీ, ఎయిడ్స్పై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ రాష్ట్ర పాలక మండలి సభ్యుడు ఈవీ.శ్రీనివాస్రావు, టీబీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రవి, ఆర్ఎంఓ వెంకటరమణ, డీటీసీఓ ప్రదీప్రెడ్డి, అధికారులు, వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: కేయూ ఫార్మసీ కళాశాల దివంగత ప్రొఫెసర్ వై.మధుసూధన్రావు తొలి స్మారకోపన్యాసాన్ని ఈనెల 14న ఉదయం 11 గంటలకు క్యాంపస్లో నిర్వహించనున్నట్లు బుధవారం కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమాన్ని వీసీ ప్రతాప్రెడ్డి అధ్యక్షతన నిర్వహించనున్నారు. కేయూ ఫార్మసీ కళాశాల రిటైర్డ్ ప్రొఫెసర్ రామ్బహు ‘ఇన్నోవేటివ్ నానో డ్రగ్ డెలివరీ ప్లాట్ఫామ్స్’ అంశంపై స్మారకోపన్యాసం చేయనున్నట్లు తెలిపారు. బోధన, బోధనేతర ఉద్యోగులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొనాలని రిజిస్ట్రార్ కోరారు. ఎంజీఎంలో సీబీపీ టెస్ట్ లేక ప్రైవేట్కు పరుగులు కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో సాధారణంగా చేయించుకునే బ్లడ్ గ్రూపింగ్ టెస్ట్ లేక పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. అత్యసవర విభాగంతో పాటు సెంట్రల్ ల్యాబ్లో ఈ పరీక్ష అందుబాటులో లేకపోవడంతో పేషెంట్లకు ఇబ్బందులు తప్ప డం లేదు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు సర్జరీ చేయాలన్నా, రక్తం ఎక్కించాలన్నా బ్లడ్ గ్రూప్ తెలుసుకోవడం ముఖ్యం. ఈ గ్రూపు తెలుసుకోవడానికి అవసరమైన సిరాస్ లేకపోవడం వల్ల టెస్ట్లు చేయడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా ఒక పేషెంట్ ఏ రక్త గ్రూపునకు సంబంధించిన వారో తెలుసుకోవడానికి యాంటీ ఏ, యాంటీ బి, యాంటీ ఓ అందుబాటులో ఉండాలి. ఇందులో ఏమీ లేకపోవడంతో పేషెంట్లు ప్రైవేట్ డయాగ్నొస్టిక్ సెంటర్లకు వెళ్లాల్సి వస్తోంది. అయితే ప్రైవేట్గా తీసుకొచ్చిన బ్లడ్ గ్రూప్ రిపోర్ట్ను వైద్యులు అంగీకరించడం లేదని పేషెంట్లు, వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. అత్యవసరంగా సర్జరీ చేయాలంటే బ్లడ్ గ్రూప్ లేకుంటే సర్జరీలు ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. అధికారులు ఈ పరీక్షలపై ప్రత్యేక చొరవ చూపాలని, అడ్వాన్స్గా కెమికల్స్ ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. -
శ్రావణం.. నిత్యోత్సవం
గురువారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 2026హన్మకొండ కల్చరల్: గ్రేటర్ వరంగల్ పరిధి ఆలయాలకు శ్రావణ శోభ సంతరించుకుంది. నేటి (గురువారం) నుంచి సెప్టెంబర్ 11వ తేదీ శుక్రవారం వరకు శ్రావణ మాసోత్సవాలు నిర్వహించనున్నారు. నగరంలోని వేయిస్తంభాల ఆలయంలో శ్రావణం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ప్రతీ సోమవారం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, సామూహిక రుద్రాభిషేకాలు, బిల్వార్చానలు, రుద్రాహోమాలు, అన్నపూజలు నిర్వహించనున్నారు. 17న నాగపూజలు, 28న రాఖీ పండుగ, సెప్టెంబర్ 9న మాస శివరాత్రిని పురస్కరించుకుని ఉదయం 11గంటలకు రుద్రేశ్వరీరుద్రేశ్వరస్వామి వారి కల్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, ఈఓ అనిల్కుమార్ తెలిపారు. క్యూలైన్ల ఏర్పాట్లు శ్రావణమాసం సందర్భంగా దేవాదాయ శాఖ పరిధి ఆలయాల్లో భక్తులకు ఇబ్బందులు కల్గకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. భద్రకాళి ఆలయంలో శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా భద్రేశ్వర శివలింగానికి ప్రతీ సోమవారం ప్రత్యేక పూజలు, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, ప్రతీ శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజలు, ఒడిబియ్యం సమర్పణలు ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. పద్మాక్షి ఆలయంలో, వరంగల్ ఎంజీఎం ఎదురుగా ఉన్న రాజరాజేశ్వరీదేవి దేవాలయంలో, హంటర్ రోడ్డులోని సంతోషిమాత ఆలయం, లష్కర్బజార్లోని సంతోషిమాత ఆలయాల్లో వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్నారు. వీటితో పాటు నగరంలోని పలు వేంకటేశ్వరస్వామి, ఆంజనేయస్వామి, పోచమ్మ దేవాలయాల్లోనూ శ్రావణమాస పూజలు, పండిత ప్రవచనాలు ఏర్పాటు చేయనున్నారు. నేటి నుంచి శ్రావణమాసం ప్రారంభం దేవాలయాల్లో ప్రత్యేక పూజలు -
సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి హన్మకొండ: సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్లో హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, సత్యశారదతో కలిసి జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈనెల 16న సీఎం రేవంత్రెడ్డి పరకాల పర్యటనకు సంబంధించి సభా వేదిక, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, బారికేడింగ్, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, వైద్య, అగ్నిమాపక, భద్రతా ఏర్పాట్లు, హెలిపాడ్ తదితర అంశాలపై చర్చించారు. భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున పార్కింగ్ ప్రాంతాలను ముందుగానే గుర్తించి, ట్రాఫిక్ నిర్వహణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వైద్య బృందాలు, అంబులెన్స్లు సిద్ధంగా ఉంచడంతోపాటు విద్యుత్ సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతీ శాఖకు అప్పగించిన బాధ్యతలను సమన్వయంతో నిర్వహించి, నిర్ణీత గడువులోగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. -
రొచ్చు రొచ్చు
వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ ఆవరణ అపరిశుభ్రతకు కేంద్రంగా మారింది. అసలే వర్షాకాలం. ఓ వైపు ఈగలు, దోమల మోత, మరో వైపు విచ్చలవిడిగా సంచరించే పశువులు. అడుగేస్తే జారిపడేలా బురద.. వీటన్నింటి నడుమ కూరగాయల క్రయవిక్రయదారులు అవస్థలు పడుతున్నారు. కొందరైతే వామ్మో కూరగాయల మార్కెట్ అంటూ.. అక్కడికి వెళ్లడానికే జంకుతున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే.. మార్కెట్ బయటి వాతావరణం సైతం అపరిశుభ్రంగా మారింది. వ్యాపారులు విక్రయించగా మిగిలిన వ్యర్థాలు, మిగిలిన, పాడైపోయిన కూరగాయలు పడేస్తుండడంతో మార్కెట్ చుట్టుపక్కల దుర్వాసన వస్తోంది. బల్దియా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. -
హక్కులు, బాధ్యతలను తెలుసుకోవాలి
వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత వరంగల్ క్రైం/విద్యారణ్యపురి: రాజ్యాంగం కల్పించిన హక్కులతోపాటు పౌరులు బాధ్యతలను కూడా తెలుసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత సూచించారు. హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘హర్ ఘర్ తిరంగా’పై రెండు రోజుల ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేషన్ అండ్ ఔట్రీచ్ ప్రోగ్రాం, ఫొటో ఎగ్జిబిషన్ను సీపీ, కలెక్టర్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలను కాపాడడంతోపాటు దేశ అభివృద్ధిలో యువత క్రియాశీలకంగా భాగస్వాములు కావాలని కోరారు. రాజ్యాంగంలో రాసుకున్న హక్కులు, బాధ్యతలను ఇలాంటి కార్యక్రమాలు గుర్తు చేస్తాయని ఆమె వివరించారు. కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు క్విజ్, వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ రజినీలత, ప్రోగ్రాం ఇన్చార్జ్ సమత, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పప్పు దినుసుల సాగును ప్రోత్సహించాలి
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్ : ప్రత్యామ్నాయ పంటల సాగులో భాగంగా పప్పు దినుసులను అధిక విస్తీర్ణంలో సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆత్మనిర్భరత ఇన్పల్సెస్’ కార్యక్రమంపై మంగళవారం కలెక్టరేట్లో వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రత్యామ్నాయ పంటల సాగు పరిస్థితులు, రైతుబీమా క్లెయిమ్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎరువులు, విత్తనాల నాణ్యతా ప్రమాణాలపై ఎరువుల దుకాణాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించాలని సూచించారు. రైతుబీమా క్లెయిమ్లను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఫార్మర్ రిజిస్ట్రీలో ఇప్పటివరకు 87.8 శాతం నమోదు పూర్తయ్యిందని, మిగిలిన రైతుల నమోదును త్వరగా పూర్తిచేయాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి విజయ్చంద్ర, సహాయ సంచాలకులు ఆదిరెడ్డి, అవినాష్వర్మ, సాంకేతిక వ్యవసాయ అధికారి కమలాకర్, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు. -
మూడు నెలల ప‘రేషన్’!
హన్మకొండ అర్బన్ : మూడు నెలల రేషన్బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు తగిన ఏర్పాట్లు లేక కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాల్సి ఉంది. ఈ నెల ఒకటో తేదీ నుంచే పంపిణీ ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ ఇప్పటికీ అనేక రేషన్ దుకాణాలకు స్టాక్ చేరలేదు. దీంతో బియ్యం పంపిణీ ఎప్పుడు పూర్తిస్థాయిలో ప్రారంభమవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ముందుగా స్టాక్ చేరిన దుకాణాల్లోనూ రెండు రోజుల్లోనే బియ్యం ఖాళీ కావడంతో కార్డుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హనుమకొండ జిల్లాలో మొత్తం 414 రేషన్ దుకాణాలు ఉన్నాయి. వీటికి హనుమకొండ, పరకాలలోని రెండు ఎంఎల్ఎస్ (మండల స్థాయి నిల్వ) పాయింట్ల నుంచి బియ్యం సరఫరా అవుతున్నాయి. హనుమకొండ ఎంఎల్ఎస్ పాయింట్ పరిధిలో 264 దుకాణాలు ఉండగా.. ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అన్ని షాపులకు బియ్యం సరఫరా కాలేదు. వచ్చిన స్టాక్ రెండు రోజుల్లోనే ఖాళీ.. ముందుగా బియ్యం చేరిన దుకాణాలకు కార్డుదారులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో రెండు రోజుల్లోనే స్టాక్ ఖాళీ అయిపోయింది. మళ్లీ బియ్యం వచ్చేవరకు రావద్దని డీలర్లు చెబుతున్నా.. సరైన సమాచారం లేక కార్డుదారులు ఉదయంనుంచే షాపుల వద్దకు చేరుకుంటున్నారు. కొన్నిచోట్ల ఉదయం 6 గంటల నుంచే క్యూలు మొదలవుతుండగా.. రాత్రి 9 గంటల వరకు డీలర్లు దుకాణాలు తెరిచి ఉంచాల్సిన పరిస్థితి నెలకొంది. బియ్యం కోసం కొన్ని చోట్ల డీలర్లు, కార్డుదారుల మధ్య వాగ్వాదాలు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా బియ్యం ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ప్రధాన కారణాలు.. ఎస్డబ్ల్యూఎస్, ఎఫ్సీఐ గోదాముల నుంచి బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్లకు తరలించడం స్టేజ్–1 కాంట్రాక్టర్ బాధ్యత కాగా.. అక్కడి నుంచి దుకాణాలకు చేర్చడం స్టేజ్–2 కాంట్రాక్టర్ బాధ్యత. ఈ రెండు దశల రవాణా బాధ్యతలు ఒకే కాంట్రాక్టర్ పరిధిలో ఉండటంతో తగినన్ని వాహనాలు ఏర్పాటు చేయకపోవడం. ● బియ్యం రవాణా, పంపిణీ ప్రారంభమైన సమయంలో హమాలీల అదనపు డబ్బుల డిమాండ్ కూడా మరో కారణమని చెబుతున్నారు. ● దుకాణాల వారీగా స్టాక్ ఎప్పుడు చేరుతుంది.. ఎప్పుడు పంపిణీ చేస్తారనే సమాచారాన్ని ప్రజలకు ముందుగానే తెలియజేయకపోవడం. ఒకటో తేదీ నుంచే పంపిణీ.. ఇప్పటికీ సగం షాపులకు చేరని బియ్యం స్టాక్ వచ్చిన చోట రెండు రోజుల్లోనే ఖాళీ ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు దుకాణాల వద్ద పడిగాపులు అదనపు కలెక్టర్కు రేషన్డీలర్ల వినతి హన్మకొండ అర్బన్ : రేషన్దుకాణాలకు వెంటనే పూర్తిస్థాయిలో బియ్యం సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ప్రతినిధులు మంగళవారం హనుమకొండ అదనపు కలెక్టర్ ఎన్.రవిని కలిసి వినతిపత్రం సమర్పించారు. పరకాల, హనుమకొండ గోదాములనుంచి షాపులకు ఇప్పటివరకు 30శాతం బియ్యం మాత్రమే సరఫరా చేశారని, మరో 70శాతం రావాల్సి ఉందని డీలర్లు తెలిపారు. దీంతో లబ్ధిదారులకు పంపిణీలో జాప్యం జరుగుతోందని, క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేడ్కర్ గోదాం శిథిలావస్థకు చేరినందున దాన్ని వెంటనే సురక్షిత ప్రాంతానికి మార్చి, అక్కడ బియ్యం నిల్వ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేష్బాబు, ప్రధాన కార్యదర్శి చలిగాని మోహన్, ప్రతినిధులు మహేశ్వరం గౌరీ శంకర్, పోతరాజు రమేష్, శ్రీశైలం ఉన్నారు. -
బీజేపీని గద్దె దింపే వరకు పోరు
సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్రెడ్డిహన్మకొండ చౌరస్తా: దేశంలోని ప్రజావ్యతిరేక బీజేపీని గద్దె దింపే వరకు సీపీఐ పోరాటం కొనసాగిస్తుందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. హనుమకొండలోని వేయిస్తంభాల ఆలయం నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు సీపీఐ జిల్లా సమితి నాయకులు మంగళవారం ప్రదర్శన నిర్వహించారు. సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు ఈనెల 6న ప్రారంభమైన పాదయాత్ర జిల్లాలో ముగిసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకట్రెడ్డి హాజరై మాట్లాడారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం సీపీఐ ప్రచార జాత పాదయాత్ర నిర్వహిస్తోందని, ప్రజావ్యతిరేక విధానాలే బీజేపీ పతనానికి దారి తీస్తాయని అన్నారు. దేశంలో మార్పు కోసం సీపీఐ పోరాటం సాగిస్తోందని, 12 ఏళ్ల పాలనలో బీజేపీ ఒక్క మంచి పని చేయలేదన్నారు. పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, సీపీఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, సీనియర్ రాష్ట్ర నాయకుడు టి.వెంకట్రాములు, రాష్ట్ర సమితి సభ్యుడు సిరబోయిన కరుణాకర్, ఆదరి శ్రీనివాస్, మండ సదాలక్ష్మి జిల్లా సహాయ కార్యదర్శులు తోట భిక్షపతి, మద్దెల ఎల్లేశ్ పాల్గొన్నారు. -
వదలరు.. కదలరు!
కేఎంసీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ‘ఔట్సోర్సింగ్’ హ వాకాశిబుగ్గ: వరంగల్ కాకతీయ వైద్య కళాశాల ఆవరణలోని ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యసేవల తీరుపై విమర్శలు వస్తున్నాయి. అవసరం ఉన్న చోట విధులు నిర్వర్తించాల్సిన ఔట్సోర్సింగ్ సిబ్బంది ఇష్టానుసారంగా పనిచేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. వాస్తవానికి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి పరిఽధిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పనిచేయాల్సి ఉంది. వైద్యసిబ్బంది సైతం ఎక్కడ వైద్యసేవలు అవసరం ఉంటే అక్కడికి వెళ్లక తప్పదు. అయితే, సూపర్ స్పెషాలిటీలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బంది తీరే వేరుగా ఉంది. చివరకు వారు అధికారుల ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఎంజీఎంకు అనుబంధంగా హాస్పిటల్.. వరంగల్ ఎంజీఎంకు అనుబంధంగా పీఎంఎస్ఎస్వై పఽథకం కింద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను వరంగల్ కాకతీయ వైద్యకళాశాల ఆవరణలో ఏర్పాటు చేశారు. ఎంజీఎంలో అందిస్తున్న వైద్యసేవలతోపాటు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రత్యేకంగా సూపర్ సేవలు అందిస్తోంది. ఇందులో పనిచేసే ఔట్సోర్సింగ్ సిబ్బంది కూడా ఈ రెండు హాస్పిటల్స్లో అధికారుల ఆదేశాల ప్రకారం విధులు నిర్వర్తించాల్సి ఉంది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పనిచేస్తున్న సిబ్బంది తీరు వేరే అన్నట్లు తాము ఇక్కడే పనిచేస్తామంటూ కొందరు సిబ్బంది పట్టుబడుతున్నట్లు సమాచారం. వైద్యసిబ్బంది తీరు ఇలా.. సూపర్ స్పెషాలిటీలో ఎక్కువ మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. చివరకు ఎక్కువ మంది వైద్యులు కూడా కాంట్రాక్టు పద్ధతిపై విధులు నిర్వర్తిస్తున్నారు. 120 మంది స్టాఫ్నర్సులు ఉండగా.. ఇటీవల 20 మంది వరకు ఉద్యోగాలు వచ్చి రాజీనామా చేసి వెళ్లారు. ఐదారుగురు మూడు నెలల నుంచి రాకుండా ఉంటున్నట్లు తెలుస్తోంది. కొందరూ మెడికల్ లీవ్లో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం 90 మంది వరకు విధులు నిర్వర్తిస్తున్నారు. పారామెడికల్ సిబ్బంది 98 వరకు ఉండగా, వీరిలో ఆరుగురు రాజీనామా చేసి వెళ్లారు. కొందరు రెండు నెలల నుంచి లాంగ్ లీవ్లో ఉంటూ ఏమి చేస్తున్నారో తెలియదు. ఇక 115 మంది వరకు పేషంట్ కేర్, శానిటేషన్, సెక్యూరిటీ గార్డులు పనిచేస్తున్నారు. వీరిలో కొంతమంది విధులకు సరిగా హాజరు కావడం లేదని సమాచారం. ఆస్పత్రిలో ఇష్టానుసారంగా విధులు నిర్వర్తిస్తున్నారని ఆరోపణలు ఎంజీఎంలో అవసరం ఉన్నా వెళ్లనంటున్న మిగులు సిబ్బంది అధికారుల ఆదేశాలను పట్టించుకోని తీరు పేషంట్లు తక్కువ.. వైద్యసిబ్బంది ఎక్కు ప్రతిరోజు ఓపి ఉన్నప్పుడు 400 నుంచి 500 వరకు పేషంట్లు వస్తుంటారు. ఇక ఇన్పేషంట్లు పరంగా 20 నుంచి 25 వరకు మాత్రమే ఉంటారని సమాచారం. దీనిని బట్టి చూస్తే పేషంట్లు తక్కువగా ఉన్నా వైద్య సిబ్బంది అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అధికారులు ఏం చేస్తారో వేచి చూడాల్సిందే. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి ఎంజీఎంకు వెళ్లాలంటూ అఽధికారులు లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేసినా కొందరు సిబ్బంది మేము వెళ్లమంటూ చెబుతూ సూపర్లోనే పనులు చేస్తున్నట్లు సమాచారం. వీరిలో స్టాఫ్నర్సులు, పేషంట్ కేర్, శానిటేషన్, సెక్యూరిటీ గార్డులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడే పనిచేస్తామని పట్టుబట్టడానికి కారణమేమిటో అంతుపట్టడం లేదని అధికారులే తలపట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఇంకా కొంతమంది సిబ్బంది ఇష్టానుసారంగా విధులకు వచ్చి వెళ్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వీరిని గాడిలో పెట్టాల్సిన సూపర్వైజర్లు ఏం చేస్తున్నారో వారికే తెలియాలి. కొన్ని సందర్భాల్లో కచ్చితంగా పనిచేయాలని చెబితే వారికి ఉద్యోగ అవకాశం కల్పించిన ప్రజాప్రతినిధి నుంచి టక్కున ఫోన్కాల్ వస్తుంది. దీంతో అధికారులు ఏమి చేయలేని పరిస్థితి ఉంది. ఇదంతా బహిరంగమే అయినా ‘ఎవరికీ వారే యమునా తీరే’ అన్నట్లు ఉందనే ప్రచారం లేకపోలేదు. ఇటీవల ముగ్గురు సెక్యూరిటీ గార్డులపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఎంజీఎంకు పంపించినట్లు తెలుస్తోంది. -
గ్రాడ్యుయేట్ సీటుపై గురి!
సాక్షిప్రతినిధి, వరంగల్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఇంకా సమయం ఉన్నా.. ప్రధాన రాజకీయ పార్టీల్లో మాత్రం అప్పుడే కసరత్తు మొదలైనట్లు కనిపిస్తోంది. వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 2027లో ఎన్నిక జరగనున్న నేపథ్యంలో గత ఎన్నికల్లో పొటీ చేసిన ముఖ్య నేతలతోపాటు కొత్తగా తెరపైకి వచ్చే ఆశావహులపైనా పార్టీలు దృష్టి సారిస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో పట్టభద్రులు, ఉద్యోగులు, నిరుద్యోగుల్లో పట్టున్న నాయకుల కోసం అన్వేషణ సాగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పట్టభద్రుల ఓటర్లపై పట్టు సాధించేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. 2024 ఉప ఎన్నికపై అధ్యయనం... 2024 ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. తొలి ప్రాధాన్యత ఓట్లలోనూ ఆయన 1,22,813 ఓట్లు సాధించి ముందంజలో నిలిచి చివరకు ఎలిమినేషన్ ప్రక్రియలో విజేతగా నిలిచారు. తదనంతర పరిణామాలతో మల్లన్న సొంతంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థాపించారు. అయితే.. ఎన్నికల సమయానికి ఆ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందో? అన్న చర్చ ఉంది. బీఆర్ఎస్ తరఫున ఏనుగుల రాకేశ్రెడ్డి పోటీచేసి గట్టి పోటీ ఇచ్చారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో ఆయనకు 1,04,248 ఓట్లు వచ్చాయి. మల్లన్న తర్వాత చివరివరకు పోటీలో నిలిచిన అభ్యర్థి కూడా రాకేశ్రెడ్డే. దీంతో బీఆర్ఎస్ మరోసారి ఆయనకే అవకాశం ఇస్తుందా? అన్న చర్చకు ఆస్కారం ఉంది. కొత్త అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేం. బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్రెడ్డి బరిలో నిలిచారు. కాగా, ప్రధాన పార్టీలు కేవలం సీనియర్ రాజకీయ నాయకుల వైపే కాకుండా విద్యావంతులు, ఉద్యోగ సంఘాల నాయకులు, నిరుద్యోగ ఉద్యమాల్లో పనిచేసిన నేతలు, యువ నాయకుల పేర్లను కూడా పరిశీలిస్తుండడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎన్నికకు ఇంకా సమయం.. అప్పుడే కసరత్తు ప్రస్తుత ఎమ్మెల్సీ పదవీకాలం 2027 మార్చి వరకు ఉండటంతో, ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఎన్నికల సంఘం కూడా ఆరు నెలల ముందే సన్నద్ధం కానున్న నేపథ్యంలో అభ్యర్థి ఎంపిక, ఓటర్ల నమోదు, నియోజకవర్గాల వారీగా బలాబలాలు, ఉద్యోగులు–నిరుద్యోగుల్లో ఉన్న అసంతృప్తి తదితర అంశాలపై పార్టీలు దృష్టి సారిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు రాజకీయంగా కీలకమైన ఓటు బ్యాంకు ఉంది. వరంగల్ నగరం, హనుమకొండలో ఉద్యోగులు, విద్యావంతులు, యువత అధికంగా ఉండగా.. మిగిలిన జిల్లాల్లో గ్రామీణ ప్రాంత పట్టభద్రుల ఓటర్లు కీలకంగా మారనున్నారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అగ్ర నాయకులు ఇటీవల ఆ వర్గాలే టార్గెట్ సెమినార్లు, సభలు, సమావేశాలే నిర్వహిస్తుండడం గమనార్హం. 2027 ఎన్నికలపై ముందస్తు లెక్కలు.. ఇప్పటి నుంచే కసరత్తు.. పట్టభద్రుల ఎన్నికలే టార్గెట్.. బలాబలాలపై బేరీజు.. ఆశావహుల జాబితాపైన ఆరా.. గెలుపు గుర్రాల వేటలో ప్రధాన పార్టీలు -
‘కాళోజీ’ రిజిస్ట్రార్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ వెంకటేశ్వర్లు
కాశిబుగ్గ: వరంగల్ కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్గా డాక్టర్ జాటోతు వెంకటేశ్వర్లు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న డాక్టర్ వెంకటేశ్వర్లును ఫారెన్ సర్వీసు కింద డిప్యూటేషన్పై రిజిస్ట్రార్గా మూడేళ్లపాటు పనిచేయడానికి ప్రభుత్వం ఇటీవల నియమించింది. కాళోజీ హెల్త్వర్సిటీలో ఇన్చార్జ్ రిజిస్ట్రార్గా పనిచేసిన డాక్టర్ నాగార్జున రెడ్డి జాయింట్ రిజిస్ట్రార్గా విధులు నిర్వహించనున్నారు. కాగా, డాక్టర్ వెంకటేశ్వర్లును కాశోజీ వీసీ డాక్టర్ రమేష్రెడ్డి, జాయింట్ రిజిస్ట్రార్ డాక్టర్ నాగార్జునరెడ్డి సన్మానించారు. హన్మకొండ కల్చరల్: ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన మాసం శ్రావణం అని, ఆలయాల్లో పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామని దేవాదాయశాఖ వరంగల్ జోన్ డిప్యూటీ కమిషనర్ రామల సునీత అన్నారు. వేయిస్తంభాల ఆలయంలో మంగళవారం ఉదయం ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు గణపతి ఆరాధన, శ్రీరుద్రేశ్వరస్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం, సామూహిక రుద్రాభిషేకాలు చేశారు. డీసీ రామల సునీత స్వామివారికి పూజలు చేశారు. ఈ నెల 13 నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకు ఆలయంలో నిర్వహించనున్న శ్రావణ మాసోత్సవాల కరపత్రాన్ని రామల సునీత ఆవిష్కరించి మాట్లాడారు. ఈఓ అనిల్కుమార్, ఆలయ వేదపండితుడు గంగు మణికంఠశర్మ, మధుకర్, రామకృష్ణ పాల్గొన్నారు. వరంగల్ లీగల్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ) విద్యార్థిని ప్రీతి హత్య కేసు విచారణ హనుమకొండ ఎస్సీ, ఎస్టీ కోర్టులో ప్రారంభమైంది. కేసు విచారణ షెడ్యూల్ మంగళవారం నుంచి ఐదు మాసాల వరకు నిర్ణయించారు. మొత్తం 99మంది సాక్షులను విచారించనున్నారు. మొదటి రోజు మృతురాలి తండ్రిని విచారించారు. 2023లో మృతి చెందిన మెడికో ప్రీతి హత్య విషయమై నాడు పీజీ విద్యార్థి అయిన మహ్మద్ షఫీని నిందితుడిగా భావించి కాలేజీ నుంచి తొలగించిన విషయం విదితమే. విచారణను ఎస్సీ, ఎస్టీ కోర్డు జడ్జి పద్మజ బుధవారానికి వాయిదా వేశారు. విద్యారణ్యపురి: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం దశల వారీగా పోరాటాలు చేస్తామని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు టి.లింగారెడ్డి, నన్నబోయిన తిరుపతి తెలిపారు. హనుమకొండలోని సుబేదారి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హనుమకొండ, వరంగల్ జిల్లాల యూఎస్సీఎస్ శాఖల దశలవారీ పోరాటాల సన్నాహక సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 12, 13 తేదీల్లో అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ద, 19న జిల్లాకేంద్రంలో ధర్నాలు, 29న హైదరాబాద్లో మహాధర్నా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పీఆర్సీని 2023నుంచి అమలు చేయాలని, సీపీస్ను రద్దుచేసి పాత పెన్షన్ను పునరుద్ధరించాలని డిమాండ్లతో ఆందోళలు చేపడతామని పేర్కొన్నారు. కమిటీ రాష్ట్ర బాధ్యులు రావుల రమేష్, ఎ.శ్రీనివాస్రెడ్డి, జిల్లాల బాధ్యులు పెండెం రాజు, గొడిశాల సత్యనారాయణ, జి. ఉప్పలయ్య, కె.శ్రీనివాస్, బైరి స్వామి, భీమళ్ల సారయ్య, శ్రీనివాస్, డి.శ్రీరామ్, సూరయ్య, ఎ.మల్లయ్య, ఆర్.రాంరెడ్డి పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం విద్యారణ్యపురి: హనుమకొండలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో హిందీ, పీఈటీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ గిరిరాజ్గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 12 నుంచి 18వ తేదీ వరకు ఉదయం 10నుంచి సాయంత్రం 4 గంటలవరకు అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో దరఖాస్తులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. హిందీ పోస్టుకు హిందీ సబ్జెక్టుతోపాటు బీఏ లేదా బీఓఎల్ హిందీ ప్రవీణ/విధ్వాన్ లేదా ఎంఏ హిందీతోపాటు బీఈడీ లేదా ప్రచారక్ లేదా శిక్షణా కళా ప్రవీణ డిప్లొమా లేదా హిందీపండిట్ కలిగి ఉండాలన్నారు. పీఈటీకి ఇంటర్ లేదా బీఏతోపాటు బీపీఈడీ అర్హతగా పేర్కొన్నారు. -
చికిత్స పొందుతున్న వ్యక్తి..
ఖిలా వరంగల్ : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. రామన్నపేట రఘునాథ్కాలనీకి చెందిన బుర్ర సంపత్ (57) సోమవారం ఉదయం వరంగల్ ఫోర్ట్రోడ్డులో నడుచుకుంటూ రంగశాయిపేట వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో వరంగల్ నుంచి రంగశాయిపేట వైపు అతివేగంగా వెళ్తున్న కారు సంపత్ను బలంగా ఢీకొట్టింది. దీంతో సంపత్ తీవ్రంగా గాయపడగా స్థానికులు 108 వాహనంలో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి తల్లి ఈశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ కర్రె స్వామి తెలిపారు. పోతురాజు వేషధారణలో వినూత్న ప్రచారం● మత్తు పదార్థాల నిర్మూలనపై ప్రభుత్వ ఉపాధ్యాయుడి అవగాహన పాలకుర్తి టౌన్ : మత్తు పదార్థాలతో కలిగే అనర్ధాలపై సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గోరెంట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్ పోతురాజు వేషధారణలో వినూత్న ప్రచారం చేస్తున్నారు. సోమవారం పాలకుర్తి మండల కేంద్రంలోని సంతలో మైకులో మత్తు పదార్థాలు–అనర్ధాలు, రోడ్డు భద్రత, హెల్మెట్, సీటు బెల్ట్ వాడకంపై అవగాహన కల్పించారు. ‘నో డ్రగ్స్–సేవ్ లైఫ్’ అంటూ కరపత్రాలు పంపిణీ చేసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ.. యువతను నన్మార్గంలో నడిపించేందుకు తన వంతు ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు చైతన్యవంతులై డ్రగ్స్, గంజాయికి యువతను దూరంగా ఉంచాలని కోరారు. -
వలలో చిక్కుకుని మత్స్యకారుడి మృతి
శాయంపేట : చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడు వలకు చిక్కుకొని మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన సోమవారం తెల్లవా రు జామున చోటుచేసుకుంది. ఎస్సై జక్కుల పరమేష్ కథనం ప్రకారం.. మండలంలోని మైలారం గ్రామానికి చెందిన మత్స్యకారుడు పల్లెబోయిన భిక్షపతి (45) చేపలు పట్టుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం చేపలు పట్టేందుకు మండలంలోని జోగంపల్లి శివారులో చలివాగు ప్రాజెక్టుకు వెళ్లాడు. ఈ క్రమంలో వలలో ఉన్న చేపలు తీస్తుండగా ప్రమాదవశాత్తు భిక్షపతి కాళ్లు, చేతులు వలలో చిక్కుకోగా మృతిచెందాడు. తెల్లవారిన కూడా భిక్షపతి రాకపోయే సరికి కుటుంబ సభ్యులు, తోటివారు చలివాగు వద్దకు వెళ్లి వెతకగా వలలో చిక్కుకొని భిక్షపతి మృతి చెంది కనిపించాడు. మృతుడి భార్య సరిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పరమేష్ తెలిపారు. మృతుడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
ఎస్ఎస్తాడ్వాయి : మేడారంలోని సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద చేపట్టిన తుది దశ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అధికారులను ఆదేశించారు. ఈ నెల 16న సీఎం రేవంత్రెడ్డి మేడారం పర్యటన నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు. సోమవారం మేడారంలో సీఎం పర్యటన ఏర్పాట్లతో పాటు ఆలయ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నూతన క్యూ లైన్ స్థలాన్ని పరిశీలించి భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం పర్యటనలో భాగంగా ప్రతి శాఖకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. ముందుగా మంత్రి సీతక్క అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అదనపు కలెక్టర్లు సీహెచ్ మహేందర్జీ, సంపత్రావు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగ కళ్యాణి, డీపీఓ వెంకయ్య, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, ఈఓ వీరస్వామి, సర్పంచ్ భారతి పాల్గొన్నారు. మంత్రి సీతక్క -
పీఆర్సీ అమలు చేయాలి
విద్యారణ్యపురి: ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీ ప్రకటించి అమలు చేయాలని, పెండింగ్ డీఏలను విడుదల చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నబోయిన తిరుపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం హనుమకొండలో నిర్వహించిన టీపీటీఎఫ్ జిల్లా స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమావేశంలో టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రావుల రమేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గొడిశాల సత్యనారాయణ, రాష్ట్ర కౌన్సిలర్ ముత్యాల రఘుపతి, జిల్లా ఉపాధ్యక్షుడు కుమారస్వామి, గొడిశాల రమేశ్, జిల్లా కార్యదర్శి అంకం శ్రీనివాస్, భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి జగపతిరావు, సీనియర్ బాధ్యులు సుబ్బారావు, జిల్లా కమిటీ బాధ్యులు వీరభద్రం, చక్రునాయక్, కుమారస్వామి, సదానందం, చంద్రమౌళి, చందర్నాయక్, కొమురయ్య ఉపాధ్యాయులు పాల్గొన్నారు. హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం విద్యుత్ ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించనుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలిసారిగా ఈనెల 11, 12 తేదీల్లో టోర్నమెంట్ నిర్వహణకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు టోర్నమెంట్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 11న ఉదయం 10 గంటలకు ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి టోర్నమెంట్ను ప్రారంభిస్తారు. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. బ్యాడ్మింటన్, క్రికెట్, క్యారమ్స్, చెస్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మహిళలు, పురుషులకు ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. కలెక్టరేట్ బంగ్లా ఎదుట జైల్ భరో.. హన్మకొండ అర్బన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీఐటీయూ, ఏఐఏడబ్ల్యూ, ఏఐకేఎస్ ఆధ్వర్యంలో సోమవారం సుబేదారి కలెక్టర్ బంగ్లా ఎదుట సోమవారం జైల్ భరో కార్యక్రమం నిర్వహించారు. రాస్తారోకోతో అరగంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసే క్రమంలో తోపులాట చోటుచేసుకుంది. అరెస్టు చేసిన వారిని సుబేదారి పోలీస్స్టేషన్కు తరలించగా, అక్కడే బైఠాయించి మరో అరగంట పాటు ధర్నా చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రాగుల రమేష్, సీపీఎం జిల్లా కార్యదర్శి జి.ప్రభాకర్రెడ్డి, ఎంసీపీఐ జిల్లా కార్యదర్శి హంసారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జి.రాములు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు టి.ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు. -
డిగ్రీ పాస్ అంతంతే!
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒకప్పుడు వార్షిక పరీక్షలు ఉండేవి. సంవత్సరం మొత్తం పాఠాల బోధన, అనంతరం పరీక్షలు నిర్వహించేవారు. అందులో ఉత్తీర్ణత తక్కువగా ఉండేది. ఈ విధానాన్ని రద్దుచేసి సెమిస్టర్ సిస్టమ్ను ప్రవేశపెట్టారు. అయినా విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించలేకపోతున్నారు. సెమిస్టర్ విధానంలో ఒక సబ్జెక్టుకు 100 మార్కులు ఉంటే అందులో 20 మార్కులు ఇంటర్నల్, 80 మార్కులకు సెమిస్టర్ పరీక్ష ఉంటుంది. ఇందులో వచ్చినవి ఇంటర్నల్ మార్కులతో కలిపి ఉత్తీర్ణత ప్రకటిస్తున్నారు. అయినా పాస్ మార్కులు రావడం లేదు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, గురుకులాల్లో డిగ్రీ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో నిర్వహించిన డిగ్రీ మొదటి, రెండో, మూడవ, నాల్గవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను ఇటీవల అధికారులు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో ఉత్తీర్ణతశాతం అంతంత మాత్రంగానే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఎందుకిలా? డిగ్రీకోర్సుల్లో సెమిస్టర్ సిస్టమ్లోనూ మెరుగైన ఫలితాలు సాధించలేకపోవడానికి పలు కారణాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. ● విద్యార్థులు సక్రమంగా తరగతులకు హాజరుకాకపోవడం. వాస్తవంగా 75శాతం హాజరు ఉండాలనే నిబంధన ఉంది. కానీ, ఏ కళాశాలలోనూ అమలుచేయడం లేదు. ● ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థుల్లో ఎక్కువమంది పేదవారే ఉంటున్నారు. కొందరు కళాశాలలకు అప్పుడప్పుడు వస్తూ కుటుంబ పరిస్థితులను బట్టి ప్రైవేట్గా ఉపాధి పొందుతుంటారని తెలుస్తోంది. ● ప్రైవేట్ కళాశాలల్లోనూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేలా యాజమాన్యాలు సరిపడా బోధనా సిబ్బందిని నియమించుకోవడం లేదు. ● కొన్నేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో రాకపోవడంతో కొన్ని ప్రైవేట్ కళాశాలలైతే వి ద్యార్థులకు సరిగ్గా ప్రాక్టికల్స్ నిర్వహించడం లేదు. మరోవైపు సెల్ఫోన్ ప్రభావం కూడా వారి చదువుపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్న వాదన వినిపిస్తోంది. డిగ్రీ కళాశాలలపై ఉన్నతా ధికారుల పర్యవేక్షణ కొరవడిందనేది మరో కారణంగా భావిస్తున్నారు. విద్యార్థులు సక్రమంగా క్లాస్లకు హాజరయ్యేలా, కళాశాలల్లో నాణ్యమైన బోధన అందేలా చర్యలు చేపడితేనే పరీక్షల్లో ఫలితాలు మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుందని విద్యావేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేయూ పరిధిలో సెమిస్టర్ సిస్టమ్లోనూ మెరుగుపడని ఫలితాలుబాలికలదే పై చేయినాలుగు సెమిస్టర్ పరీక్షల్లో బాయ్స్కంటే బాలికలే అధిక ఉత్తీర్ణత సాధించారు. మొదటి సెమిస్టర్లో బాలికలు 11,295 మందికిగాను 3,776 మంది (33.43శాతం) ఉత్తీర్ణత సాఽధించారు. బాయ్స్ 14,166 మందికిగాను 3,336 మంది (23.55శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాయ్స్కంటే బాలికదే పైచేయి. రెండో సెమిస్టర్లో బాలికలు 25,603మందికిగాను 10,742మంది ఉత్తీర్ణత (41.96శాతం) సాధించగా, బాయ్స్ 24,689 మందికి గాను 5,644మంది (22.86శాతం) పాసయ్యి ఉత్తీర్ణత సాధించారు. మూడో సెమిస్టర్లో బాలికలు 7,834 మందికిగాను 3,591 మంది (45.83శాతం), బాయ్స్ 10,452 మందికిగాను 3,400 (32.53శాతం) ఉత్తీర్ణత సాధించారు. 4వ సెమిస్టర్లో బాలికలు 19,947మందికిగాను 9,587మంది ఉత్తీర్ణత (48.06శాతం), బాయ్స్ 18,086 మందికిగాను 5,032 మంది (27.82శాతమే) ఉత్తీర్ణత సాధించారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో తేటతెల్లం నాలుగు సెమిస్టర్లలో బాలికలదే హవా -
పెద్ది జ్ఞాపకాలతో.. కన్నీటిపర్యంతం
నల్లబెల్లి: ఓవైపు విషాదం.. మరోవైపు ఉద్యమ జ్ఞాపకం.. ఇంకోవైపు అభిమానుల ఆప్యాయత.. ఇలా పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభ భావోద్వేగ వేదికగా మారింది. సోమవారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభకు గులాబీ నేతలు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పెద్దితో ఉన్న అనుబంధాన్ని, ఉద్యమ కాలం నాటి రోజులను గుర్తుచేసుకుంటూ నేతలు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు.. సంస్మరణ సభలో తమ ఉద్యమ సహచరుడు పెద్దితో తనకున్న అనుబంధాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగంలో తెలియజేస్తూ.. ‘ఎంత కాలం బతికామన్నది కాదు.. ఎ ట్లా బతికామన్నదే ముఖ్యం.. సమాజం కోసం, ప్రజల కోసం జీవించిన వ్యక్తి ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు’ అని కొనియాడారు. పెద్ది అంతిమయాత్ర, దశదినకర్మ, సంస్మరణ సభకు ప్రజలు స్వచ్ఛందంగా అధిక సంఖ్యలో తరలిరావడం ఆయనపై ఉన్న అభిమానానికి నిదర్శనమని, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గంటల తరబడి ప్రజలు నిలబడి కడసారి చూపుకోసం ఎదురుచూసిన తీరు ఆయనకున్న ప్రజాదరణను తెలియజేస్తుందన్నారు. నర్సంపేటలో నిర్మించిన మెడికల్ కాలేజీకి సుదర్శన్రెడ్డి పేరు పెడతామని కేటీఆర్ చేసిన కీలక ప్రకటనతో పెద్ది అభిమానుల్లో భావోద్వేగాన్ని నింపింది. పెద్ది లేని నర్సంపేట.. నర్సంపేటలో పెద్ది సుదర్శన్రెడ్డిలేని మీటింగ్లో పాల్గొంటామని కలలో కూడా ఊహించలేదంటూ మాజీ మంత్రి హరీశ్రావు తన ప్రసంగంలో కంటతడి పెట్టుకుంటున్నారు. సభలో పెద్ది కుటుంబ సభ్యులు, అభిమానుల కన్నీరు పెట్టుకున్న దృశ్యాలు అందరినీ కలచివేశాయి. పెద్ది సుదర్శన్ రెడ్డితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న పలువురు అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. సంస్మరణ సభలో మాజీమంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, తాటికొండ రాజయ్య, డీఎస్ రెడ్యానాయక్, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్కుమార్, మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, అరూరి రమేశ్, శంకర్నాయక్, నాయకులు గండ్ర జ్యోతి, సతీశ్రెడ్డి ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటం వద్ద నివాళి అర్పించి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభలో నేతలు, అభిమానుల కన్నీరు భారీగా తరలివచ్చిన గులాబీ నాయకులు, శ్రేణులు ఉద్యమ సహచరుడిని తలుచుకుని కేటీఆర్, హరీశ్రావు భావోద్వేగం -
‘పెద్ది’ విగ్రహ ఏర్పాటు గద్దె కూల్చడం దుర్మార్గం
నర్సంపేట : దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి స్మారకంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసేందు కు నిర్మించిన గద్దెను మున్సిపల్ అధికారులు కూల్చేయడం దుర్మార్గమని మాజీ ఎంపీ వినోద్కుమార్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. నర్సంపేట పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నల్లబ్యాడ్జీలతో నిరసన చేపట్టి ధర్నా నిర్వహించా రు. అనంతరం విగ్రహావిష్కరణకు ఏర్పాటు చేసిన గద్దె కూల్చేసిన ప్రదేశాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్ని ఆటంకాలు సృష్టించిన పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహం ఆవిష్కరించి తీరుతామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాయిడి రవీందర్రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, ఆకుల శ్రీనివాస్, డాక్టర్ లెక్కల విగ్యాసాగర్రెడ్డి, నల్ల మనోహర్రెడ్డి, బత్తిని శ్రీనివాస్, నాగెల్లి వెంకటనారాయణగౌడ్, నాడెం శాంతికుమార్, గోనె యువరాజు తదితరులు పాల్గొన్నారు. -
కర్రెగుట్టల్లో డీజీపీ ఆనంద్ పర్యటన
వెంకటాపురం(కె): తెలంగాణ– ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ సోమవారం పర్యటించారు. ఈసందర్భంగా ఆయన పామూనూరు, తడపల బెస్ క్యాంపులను పరిశీలించి తెలంగాణ బోర్డర్లో జాతీయ జెండాను ఎగురవేశారు. ఛత్తీస్గఢ్ 196 సీఆర్పీఎఫ్ బెటాలియన్ క్యాంప్ను పరిశీలించి సీఆర్పీఎఫ్ అధికారులు, ఛత్తీస్గఢ్ పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం పామూనూరు గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు, వారికి నిత్యావసర సరుకులు, దుస్తులు, పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా డీజీపీ విలేకర్లతో మాట్లాడుతూ 50 ఏళ్ల తర్వాత కర్రెగుట్టల చిత్రం మారిందన్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో పోలీస్, రెవెన్యూ, అటవీశాఖతో పాటు అన్ని శాఖల అధికారుల బృందం పర్యటించిందన్నారు. ఐదు దశాబ్ధాలుగా మావోయిస్టులకు సురక్షిత స్థావరంగా ఉండి, భద్రతా దళాలకు అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా ఉన్న కర్రెగుట్టల అటవీప్రాంతంలో చారిత్రక మార్పు చోటు చేసుకుందని వెల్లడించారు. ఆపరేషన్ కగార్తో తెలంగాణ ప్రాంతంలో ఇప్పటి వరకు 700 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన కీలక నేతలు ఎన్కౌంటర్లో మరణించడంతో పాటు పలువురు లొంగిపోయారని వివరించారు. ప్రస్తుతం ముప్పాల లక్ష్మణ్రావుతో పాటు ఒకరిద్దరు నేతలు మినహా మిగిలిన ప్రధాన నాయకత్వం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందన్నారు. మావోయిస్టుల ప్రభావం తగ్గడంతో అటవీ ప్రాంతంలోని గిరిజన గ్రామాలకు ప్రభుత్వ ఫలాలు అందించడమే లక్ష్యంగా అధికారులు అడుగులు వేస్తున్నారని తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రివార్డుల మొత్తం, ఆర్థికసాయం, ఇళ్ల స్థలాలు, వ్యవసాయ సదుపాయాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ డీఐజీ కార్తికేయ, ఎస్ఐబీ అడ్మిన్ సింధుశర్మ, కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఏఎస్పీ మనన్భట్, సీఐ ముత్యం రమేశ్, ఎస్సై కొప్పుల తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.లొంగిపోయిన వారికి ఉపాధి కల్పిస్తాం.. డీజీపీ సీవీ ఆనంద్ పామూనూరు, తడపల బేస్ క్యాంపుల పరిశీలన ఆపరేషన్ కగార్తో 700మంది లొంగుబాటు -
ఆర్థిక సాయమందించినా నిలవని ప్రాణం
● వైద్యం కోసం విరాళాల సేకరణ.. ఆలోపే మృతి ● వీధిన పడిన ఆటోడ్రైవర్ కుటుంబం హసన్పర్తి: మానవత్వంతో స్పందించారు. తోచినంత ఆర్థిక సాయం చేశారు. ఒక ప్రాణం నిలబడాలని ప్రయత్నించారు. ఆస్పత్రిలో చేర్పించారు. కానీ, అనారోగ్యం.. ఆ ఆటో డ్రైవర్ను కబలించింది. చికిత్స పొందుతున్న అతడు మృతి చెందాడు. హసన్పర్తిలో విషాధచాయలు అలుముకున్నాయి. హసన్పర్తికి చెందిన చిలగాని భిక్షపతి(38) ఆటో డ్రైవర్గా పనిచేస్తూ భార్య రాధిక, కుమారుడు మీరాక్ను పోషించుకుంటున్నాడు. భిక్షపతి కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా.. నాలుగు రోజుల క్రితం ఆస్పత్రిలో చేర్పించారు. కుటుంబీకులు విరాళాల సేకరణ కోసం ఓ వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేశారు. దాతలు ముందుకు వచ్చి రూ.ఆర్థిక సాయం చేశారు. భిక్షపతి పరిస్థితిని స్థానిక నాయకులు వీసం సురేందర్రెడ్డి, దీకొండ భిక్షపతి, కనపర్తి కిరణ్.. ఎమ్మెల్యే నాగరాజు దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే స్పందించి ఎల్ఓసీ ఇప్పించడమే కాకుండా ఆర్థికసాయానికి హామీ ఇచ్చారు. దీంతో ఆదివారం భిక్షపతిని హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆయన సోమవారం ఉదయం మృతి చెందాడు. -
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
హన్మకొండ: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో ‘ఆత్మ’ సౌజన్యంతో హనుమకొండ జిల్లా స్థాయి రైతు మేళా నిర్వహించారు. ఈ మేళా ముగింపు కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. భూములు కలిగిన రైతులకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో భూభారతికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. తొలి విడతగా ప్రతీ జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాల్లో భూముల సర్వే పనులు కొనసాగుతున్నాయన్నారు. అనంతరం హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ.. ఆధునిక వ్యవసాయ పద్ధతులను విస్తృతంగా అమలు చేయాలని, పంట మార్పిడి, నీటి యాజమాన్యంపై రైతులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కార్పొరేషన్ ఎన్నికలపై దృష్టి సారించాలి.. హన్మకొండ చౌరస్తా: రాబోయే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై ఇప్పటి నుంచే ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి నాయకులకు దిశానిర్దేశం చేశారు. హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో సోమవారం డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్రెడ్డి అధ్యక్షతన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ పీఏసీఎస్ డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ల పదవుల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన 13 మంది మండల అధ్యక్షులు, 10 డివిజన్ల అధ్యక్షులతో కలిసి రాబోయే రోజుల్లో పారీ క్షేత్రస్థాయి బలోపేతానికి కార్యాచరణ రూపొందించారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డి, కేఆర్.నాగరాజు, కడియం శ్రీహరి, హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితెల ప్రణవ్, టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు ఎరబ్రెల్లి స్వర్ణ, గ్రేటర్ కమిషనర్ వెంకన్న, వివిధ శాఖల అధికారులు వి.విజయ్చంద్ర, కమలాకర్రెడ్డి, శ్రీనివాస్రావు, వెంకన్న, రాధాకిషన్, నిమ్మ సత్యప్రసాద్రెడ్డి, వేదాంతి, ఆదిరెడ్డి, అవినాష్ వర్మ, తదితరులు పాల్గొన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ముగిసిన రైతు మేళా -
లొంగిపోయిన వారికి ఉపాధి కల్పిస్తాం..
ములుగు రూరల్ : మావోయిస్టు పార్టీ నుంచి లొంగిపోయిన వారు సమాజంలో విలీనమై జీవించాలని డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. సోమవారం కర్రెగుట్టల పర్యటన అనంతరం జిల్లా కేంద్రంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు పార్టీ సభ్యులకు హెల్త్ కార్డులు, రివార్డు చెక్కులు అందజేశారు. రాజమండ్రి జిల్లా ఆర్యాపురం గ్రామానికి చెందిన మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు కాకరాల సమత అలియాస్ మాధవి అలియాస్ దుర్గ అలియాస్ షకీల (దివంగత మావోయిస్టు పటేల్ సుధాకర్ రెడ్డి భార్య) డీజీపీ పర్యటన సందర్భంగా ములుగు జిల్లాలో ఆమె లొంగుబాటును చూపించారు. ఆమెకు ప్రభుత్వం నుంచి అందించే రూ. 20 లక్షల రివార్డు చెక్కును అందించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. సమత 40 ఏళ్లపాటు మావోయిస్టు పార్టీలో వివిధ కేడర్లో పని చేసినట్లు తెలిపారు. మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసి బతకడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని వివరించారు. మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్న ముప్పాల లక్ష్మణ్రావు అలియాస్ గణపతి, అతడి భార్య లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో లొంగిపోయిన మావోయిస్టులు తమపై ఉన్న కేసులు ఎత్తివేయాలని, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరినట్లు తెలిపారు. కేసులు ఎత్తివేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలతో చర్చించి తీసుకోవలసిన నిర్ణమని పేర్కొన్నారు. తెలంగాణలో మావోయిజం పూర్తిగా పోయిందని తెలిపారు. కర్రెగుట్టల ప్రాంతంలో పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా అభివృద్ధి పనులు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. కార్యక్రమంలో మల్టీజోన్ వన్ ఐజీ చంద్రశేఖర్రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ కార్తికేయ, రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా, సీఆర్పీఎఫ్ ఏడీజీ విక్రమ్సింగ్, ఇంటెలిజెన్స్ ఎస్పీ సింధు శర్మ, కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, డీఎఫ్ఓ వికాస్ మీనా, ఏఎస్పీ మమన్ భట్ పాల్గొన్నారు. రివార్డు చెక్కులు, హెల్త్ కార్డులు అందజేత మావోయిస్టు సీనియర్ నాయకురాలు సమత లొంగుబాటు విలేకరుల సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్ -
కేయూలో రెండ్రోజుల జాతీయ సదస్సు
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా ఈనెల 12, 13 తేదీల్లో కేయూ పరిపాలన భవనం సెనెట్ హాల్లో జాతీయ సదస్సు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం ఇందుకు సంబంఽధించిన ఆహ్వాన పత్రికను కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రంతో కలిసి పలువురు ఆవిష్కరించారు. కేయూ విశ్వవిద్యాలయం కెమిస్ట్రీ విభాగం, తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీఎస్పీసీబీ), స్టేట్ ఎక్సఫర్ట్ అప్రైజరల్ కమిటీ (ఎస్ఈఏసీ), ఎన్విరాన్మెంటల్ ప్రొఫెషనల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సినరైజింగ్ ఇనిస్టిట్యూషన్స్ ఆఫర్ సస్టేయినబుల్ డెవలప్మెంట్ స్ట్రాటెజిక్ అండ్ మల్టి–షేక్ హెల్డర్ అప్రోచ్ టూ పొల్యూషన్ కంట్రోల్ అనే అంశంపై ఈ జాతీయ సదస్సును రెండు రోజుల పాటు నిర్వహించనున్నామని తెలిపారు. ఈ సదస్సులో దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు, పరిశ్రమల నుంచి ఇప్పటికే 150 మంది ప్రతినిధులు నమోదు చేసుకున్నారని తెలిపారు. ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన రిజిస్ట్రార్ -
ఉద్యోగ భద్రత కల్పించాలి
● సీఎంను కలిసిన డీడీఎన్ అర్చకులు హన్మకొండ కల్చరల్ : ధూపదీప నైవేద్య (డీడీఎన్) అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ అర్చక, ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ, ధూపదీప నైవేద్య అర్చక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అన్నావజ్జుల ప్రసాద్శర్మ, ప్రధాన కార్యదర్శి వెగ్గళం సంతోష్శర్మ, జేఏసీ రాష్ట్ర కన్వీనర్ పరాశరం రవీంద్రాచార్యులు, నల్లగొండ జిల్లా డీడీఎన్ అధ్యక్షుడు పైడిమర్రి ప్రసాద్శర్మ తదితరులు సీఎం రేవంత్రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. సోమవారం నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద వరుణయాగానికి హాజరైన సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసి వారు సమస్యలను వివరించారు. ఉద్యోగ భద్రత కోసం దేవాదాయశాఖ ద్వారా నియామక పత్రాలు అందించాలని, పేస్కేల్ వర్తింపచేయాలని కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి డీడీఎన్ అర్చకుల సమస్యలను పరిష్కరించాలని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖను ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు నిధులు మంజూరు కాళేశ్వరం : మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు నిర్వహించనున్న గోదావరి నది పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా మొదటి ప్రాధాన్యత కింద టెయిర్–1లో రూ. 88.80కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిసింది. ఇరిగేషన్శాఖ రూ.60 కోట్లు, ఆర్అండ్బీ రూ.20.90 కోట్లు, పంచాయతీరాజ్ రూ. 5.90 కోట్లు, ఎండోమెంట్ రూ. 2 కోట్లు మంజూరు చేయగా.. త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయా శాఖలు క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల వివరాలు సేకరించినట్లు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా నిజామాబాద్ నుంచి భద్రాచలం వరకు ఉన్న పుష్కర ఘాట్లకు రూ. వివిధ శాఖల ద్వారా రూ. 645 కోట్లు ప్రభుత్వం మంజూరు చేశారు. కాళేశ్వరంలో.. రూ.88.80కోట్లతో వివిధ శాఖలతో పాటు ఇరిగేషన్శాఖ నిధులతో అష్ట తీర్ధాల అభివృద్ధి, ఘాట్ల విస్తరణ, పలు దేవత విగ్రహాలు, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. ఆర్అండ్బీ శాఖతో పలు చోట్ల కల్వర్టులు, హైలెవల్ వంతెనలు నిర్మించనున్నారు. పంచాయతీ రాజ్ నిధులతో మజీద్పల్లి, ప్రధాన రహదారి, ఇతర రహదారులు నిర్మించనున్నారు. రూ.198 కోట్లతో దేవస్థానం.. రూ.198కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం దేవస్థానం జీర్ణోద్దరణలో భాగంగా పునర్నిర్మాణం పనులు ముమ్మరం చేసింది.రాతి నిర్మాణం కోసం శ్రావణ మాసంలో భూమి పూజకు సిద్ధం అవుతున్నారు. ఈనెల 13 తర్వాత ఆలయ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనుంది. ఇప్పటికే పది రోజులుగా కూల్చివేత పనులు తుది దశకు చేరాయి. చిన్నారిపై పిచ్చికుక్క దాడి టేకుమట్ల : మండల కేంద్రానికి చెందిన వారాల ఉమేష్ కూతురు ఆద్య సోమవారం ఇంటి ఎదుట ఆడుకుంటుండగా అక్కడే ఉన్న పిచ్చికుక్క పాప ముఖంపై దాడి చేసింది. వెంటనే చిన్నారి తల్లిదండ్రులు కుక్కను తరిమి వేయడంతో ప్రాణాపాయం తప్పింది. కాగా కుక్క దాడిలో పాపకు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకు వెళ్లినట్లు తెలిపారు.కన్నాయిగూడెంలో ఆరుగురిపై.. కన్నాయిగూడెం : మండలంలో వివిధ గ్రామాల్లో సోమవారం ఒక్కరోజే ఆరుగురిపై దాడులు చేసినట్లు తెలుస్తోంది. బుట్టాయిగూడెంలో ముగ్గురిపై, మండల కేంద్రంలో ఇద్దరిపై దాడి చేసినట్లు సమాచారం. -
సందడిగా సందల్
కాజీపేట రూరల్ : కాజీపేట హజ్రత్ సయ్యద్ షా అప్జల్ బియాబాని దర్గా ఉర్సులో ప్రధాన ఘట్టం సందల్ వేడుకలు సోమవారం అర్ధరాత్రి ముస్లిం మత సంప్రదాయ ప్రకారం వైభవంగా నిర్వహించారు. దర్గా ఉర్సులో బియాబాని పూర్వీకుల నుంచి ఆనాదిగా వస్తున్న సందల్కు ఎంతో ప్రత్యేకత ఉంది. దర్గా పీఠాధిపతి ఖుస్రుపాషా ఆధ్వర్యంలో బడేఘర్లో ప్రత్యేక ప్రార్థనల అనంతరం గంధం, చాదర్తో ఉన్న వెవెండి గిన్నెను, తలపై పెట్టుకొని ఊరేగింపుగా భక్తుల మధ్య తీసుకెళ్తుండగా వెండిగిన్నెను తాకేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఖవ్వాలి, కీర్తనలు, డీజేలు, యువకుల కేరింతలు, నృత్య విన్యాసాలతో దర్గా ప్రాంగణం మార్మోగింది. అర్ధరాత్రి సందల్తో దర్గాకు చేరుకున్న ఖుస్రుపాషా హజ్రత్ సయ్యద్ షా అప్జల్ బియాబాని సమాధిని రోజ్వాటర్తో కడిగి, గంధ లేపనం చేసి, పూల్ చాదర్కప్పి ప్రత్యేక ప్రార్థనలు చేసి దర్గా ఉర్సు ఉత్సవాలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ వేడుకలో వివిధ రాష్ట్రాల పీఠాధిపతులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అధికారులు, పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. దర్గాను సోమవారం రాత్రి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖ, అజారుద్దీన్తోపాటు ఎమ్మెల్యేలు కే.ఆర్.నాగరాజు, రేవూరి ప్రకాశ్రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, టీపీసీసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, దర్గా పీఠాధిపతి ఖుస్రుపాషా, ఉప పీఠాధిపతి భక్తియార్ బియాబాని, జిల్లా అధికారులు తదితరులు సందర్శించారు. హజ్రత్ సయ్యద్ షా అప్జల్ బియాబాని మజార్పై పూలు చల్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. అల్లా కృపతో దర్గా ఉత్సవాలు గొప్పగా జరగాలని ఆకాంక్షించారు. దర్గా అభివృద్ధిపై సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. బడేఘర్ నుంచి దర్గా వరకు ఊరేగింపు ఉత్సవాలను ప్రారంభించిన పీఠాధిపతి ఖుస్రుపాషా దేశ నలుమూలల నుంచి వచ్చిన భక్తులు దర్గాను దర్శించుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు -
సొంతింటి కల సాకారమే ధ్యేయం
కమలాపూర్ : అర్హులైన పేద కుటుంబానికి సొంతిళ్లు అందించి వారి కల సాకారం చేయడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్, గూడూరు, మర్రిపల్లిగూడెం గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, ఏఎంసీ చైర్పర్సన్ తౌటం ఝాన్సీరాణితో కలిసి మంత్రి పొంగులేటి సోమవారం గూడూరులో ప్రారంభించారు. కమలాపూర్లోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్ల పట్టాల పంపిణీ చేసి మంత్రి మాట్లాడారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులుగా ఎన్నికై న తర్వాత ప్రజా సమస్యల పరిష్కారమే తమ ఎజెండాగా ముందుకు సాగుతున్నామన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి మాట్లాడుతూ.. కమలాపూర్ మండలంలో కేసీఆర్ నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లు పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఉప్పల్ను, వీణవంక మండలంలోని చల్లూరును మండలాలుగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్లు బండి వనజకళాధర్, పబ్బు సతీశ్, అదనపు కలెక్టర్ రవి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్, గృహ నిర్మాణ శాఖ పీడీ సిద్దార్థ నాయక్, ఎంపీడీఓ బాబు, తహసీల్దార్ సురేష్కుమార్, లబ్ధిదారులు పాల్గొన్నారు. అంతకుముందు గూడూరులో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు. అర్హులైన ప్రతీ కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మంత్రి పొంగులేటితో ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి వాగ్వాదం డబుల్ బెడ్రూం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో రసాభస చోటుచేసుకుంది. కమలాపూర్లో సోమవారం డబుల్ బెడ్రూం లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పుడు పంపిణీ చేస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్లు కేసీఆర్ హయాంలో నిర్మించినవేనని, మీరిచ్చిన హామీలు అమలు చేయాలని, మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం, ఆడపిల్లల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వాలని మంత్రులను కోరారు. ఇందుకు మంత్రి పొన్నం కౌంటర్ ఇవ్వగా స్టేజీపైనే పొంగులేటి, కౌశిక్రెడ్డి కాసేపు వాగ్వాదం చేసుకున్నారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాట్లాడాతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అప్పట్టి ప్రభుత్వం కొల్లగొట్టిన కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వం వెనుకడుగు వేయకుండా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తోందన్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి మంత్రి ప్రసంగానికి అడ్డు తగులుతూ అబద్ధాలు చెప్పొద్దు, నిజాలు మాట్లాడాలని, ఇది రాజకీయాలు చేయాల్సిన వేదిక కాదని, ప్రజలకు వాస్తవాలు చెప్పాలంటూ స్టేజీపైనే మంత్రితో వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు స్టేజీపైకి దూసుకెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. -
విమానాశ్రయ పనులు వేగవంతం చేయాలి
హన్మకొండ/వర్ధన్నపేట : వరంగల్ మామునూరు విమానాశ్రయ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వన్నాల వెంకటరమణ కోరారు. సోమవారం న్యూఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడిని కలిసి వారు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల దశాబ్దాల చిరకాల వాంఛ మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణకు ప్రధానమంత్రి నాయకత్వంలో, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చూపిన చొరవ, ప్రత్యేక శ్రద్ధ అభినందనీయమన్నారు. మహబూబాబాద్ ఎంపీగా ఉన్న సమయంలో వరంగల్తో పాటు భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల్లో విమానాశ్రయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేశానని, నేడు ఆ కల నెరవేరుతుండటం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా వరంగల్ పర్యటనకు రావాల్సిందిగా కేంద్ర మంత్రిని ఆహ్వానించారు. మామునూరు విమానాశ్రయంలో భూములు కోల్పోయిన కుటుంబాలకు, సమీప ప్రాంత ప్రజలకి ఉద్యోగాలు కల్పించాలని కొండేటి శ్రీధర్, వన్నాల వెంకటరమణ మంత్రిని కోరారు. విమానాశ్రయం పునరుద్ధరణతో వరంగల్ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఉద్యోగ, ఉపాధితో పాటు వ్యాపార రంగానికి అవకాశాలు లభిస్తాయని వివరించారు. కేంద్ర మంత్రిని కలిసిన బీజేపీ నేతలు -
బైక్ను ఢీకొట్టిన కారు.. ఒకరి దుర్మరణం
ఖిలా వరంగల్ : వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం వరంగల్ హంటర్రోడ్డు ఉర్సుగుట్ట తాళ్ల పద్మావతి కళాశాల సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్ ఆర్టీఏ జంక్షన్ సమీపంలోని నాయుడు పెట్రోల్ పంప్ కాలనీకి చెందిన బంక కొమురయ్య (70) పని నిమిత్తం ఉర్సుగుట్ట వైపు వెళ్లి ఇంటికి బయల్దేరాడు. ఈ క్రమంలో కారు అతివేగంగా వచ్చి బైక్ను ఢీకొట్టడంతో కొమురయ్య మృతి చెందాడు. సమాచారం అందుకున్న మిల్స్కాలనీ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహంపై పడి కన్నీరుమున్నీరయ్యారు. గుండెపోటుతో ఏఆర్ ఎస్సై.. వరంగల్ క్రైం : వరంగల్ కమిషనరేట్ ఆర్మూడ్ రిజర్వ్ విభాగంలో ఏఆర్ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న ఎస్.శామ్యూల్ (57) సోమవారం గుండెపోటుతో మృతిచెందారు. హనుమకొండలోని ప్రకాశ్రెడ్డిపేట జంక్షన్ వద్ద తన నివాసం నుంచి రోజు వారీగా విధులకు హాజరయ్యేందుకు బయలుదేరుతున్న సమయంలో ఆయనకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. శామ్యూల్ మృతితో వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
ఇక తప్పించుకోలేరు!
సాక్షి, వరంగల్: సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మార్గాల్లో పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారిని గుర్తించేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగించడంపై వరంగల్ పోలీసు కమిషనరేట్ పోలీసులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా సైబర్, లా అండ్ అర్డర్ పోలీసులకు నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ (నాట్ గ్రిడ్) సాంకేతికతపై శిక్షణ ఇస్తున్నారు. వివిధ వనరుల నుంచి లభించే సమాచారాన్ని అనుసంధానం చేసి.. అనుమానితుడి కదలికలు, సంబంధాలు, గత నేరచరిత్ర వంటి అంశాలను విశ్లేషించడం ఈ వ్యవస్థ ప్రధాన ఉద్దేశం. ఇది కమిషనరేట్లో పూర్తిస్థాయిలో వినియోగించగలిగితే నేరాల పురోగతిలో కీలకమవుతుంది. డీజీపీ సీవీ ఆనంద్ కూడా ఈ సాంకేతికతను వాడాలని వరంగల్ పోలీసులకు సూచించారు. ‘డేటా’తో దర్యాప్తులో వేగం.. గతంలో వివిధ విభాగాల నుంచి సమాచారం సేకరించేందుకు ఎక్కువ సమయం పట్టేది. ఇప్పుడు అనుమతించిన పరిధిలో అందుబాటులో ఉన్న డేటాను సమగ్రంగా విశ్లేషించడం ద్వారా దర్యాప్తులో కీలకమైన లీడ్స్ త్వరగా గుర్తించే అవకాశం ఉంటుంది. అయితే నాట్గ్రిడ్ను అధీకృత సంస్థలు, చట్టపరమైన విధానాల ప్రకారం మాత్రమే వినియోగిస్తాయి. మొత్తంగా.. నేరగాడు ఎక్కడున్నాడన్నదే కాదు.. అతడి వెనుక ఎవరున్నారు? ఎక్కడికి వెళ్లాడు? గతంలో ఏం చేశాడు? ఎవరితో సంబంధాలున్నాయి? అనే ప్రశ్నలకు డేటా ఆధారంగా సమాధానాలు వెతికే అవకాశం నాట్గ్రిడ్తో లభిస్తుంది. వరంగల్ సైబర్ పోలీసులకు అందుతున్న శిక్షణతో సాంకేతిక ఆధారాల విశ్లేషణ మరింత బలోపేతమై.. సైబర్, ఆర్థిక, అంతర్రాష్ట్ర నేరాల దర్యాప్తులో నిందితుల గుర్తింపు వేగవంతమయ్యే అవకాశం ఉంది. వరంగల్ పోలీసు కమిషనరేట్లో ఇప్పటివరకు 2,400 సైబర్ కేసులు నమోదు కాగా.. రూ.6.85 కోట్లు నష్టపోయారు. పదుల సంఖ్యలోనే నిందితులు పట్టుకున్నారు. ఈ డేటాతో మరింత పురోగతి సాధించే అవకాశముంది. ‘నాట్గ్రిడ్తో నేరగాళ్ల జాడ ఆధారాలను అనుసంధానించి నిందితుల గుర్తింపు వరంగల్ సైబర్, లా అండ్ ఆర్డర్ పోలీసులకు ప్రత్యేక శిక్షణ కమిషనరేట్లో 2,400 సైబర్ కేసులు.. రూ.6.85 కోట్ల నష్టం ఇక నేరస్తులను పట్టుకోవడంలో పెరగనున్న మరింత వేగంనేరస్తులను ఎలా గుర్తిస్తారంటే.. ఒక ఆధారం.. ఎన్నో లింకులు: నిందితుడికి సంబంధించిన పేరు, గుర్తింపు వివరాలు, ప్రయాణం, ఫోన్ లేదా ఇతర అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సంబంధిత రికార్డులను అనుసంధానించి పరిశీలించే అవకాశం ఉంటుంది. కదలికలపై నిఘా: నిందితుడు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారినా.. అందుబాటులో ఉన్న ప్రయాణ, ఇతర సంబంధిత డేటా ఆధారాలతో అతడి కదలికలపై ఆధారాలు సేకరించవచ్చు. పాత నేరచరిత్ర గుర్తింపు: ఒక కేసులో అనుమానితుడిగా ఉన్న వ్యక్తికి గతంలో ఇతర ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయా? ఏదైనా నేర ముఠాతో సంబంధం ఉందా? వంటి అంశాలను పరిశీలించేందుకు ఉపయోగపడుతుంది. నేర ముఠాల గుట్టురట్టు: ఒకే వ్యక్తి కాకుండా పలువురు కలిసి నేరాలకు పాల్పడుతున్నప్పుడు.. వారి మధ్య ఉన్న సంబంధాలను డేటా విశ్లేషణ ద్వారా గుర్తించే అవకాశం ఉంటుంది. అంతర్రాష్ట్ర నేరాలకు చెక్: వరంగల్లో నేరం చేసి మరో రాష్ట్రానికి వెళ్లిన నిందితుడి విషయంలో స్థానిక సమాచారం మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాలకు సంబంధించిన సంబంధిత రికార్డులను కూడా పరిశీలించేందుకు ఉపయోగపడుతుంది.ఆన్లైన్ మోసాల్లో నేరగాళ్లు తరచూ ఇతరుల బ్యాంకు ఖాతాలు, ఫోన్ నంబర్లు, తప్పుడు గుర్తింపు వివరాలు ఉపయోగిస్తుంటారు. దీంతో అసలు నిందితుడిని చేరుకోవడం పోలీసులకు సవాల్గా మారుతుంది. ఇలాంటి కేసుల్లో వివిధ ఆధారాలను కలిపి చూడడం ద్వారా ఒక నంబర్ నుంచి ఖాతా.. అక్కడి నుంచి వ్యక్తి.. ఆ వ్యక్తి నుంచి నేర ముఠా వరకు దర్యాప్తును విస్తరించేందుకు సాంకేతిక ఆధారాలు తోడ్పడతాయి. -
నేడు మంత్రుల పర్యటన
హన్మకొండ: రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి నేడు(సోమవారం) హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి 10 గంటలకు ఎల్కతుర్తికి చేరుకుంటారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం 11.10 గంటలకు కమలాపూర్ మండలం గూడూరుకు చేరుకుని డబుల్ బెడ్రూం పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు హనుమకొండ నగరానికి చేరుకుని సుబేదారిలోని రెడ్క్రాస్ సొసైటీలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కంచరకుంటలో ఓ ఆస్పత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. 1.45 గంటలకు కలెక్టరేట్కు చేరుకుంటారు. 2.50 గంటలకు బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో జరిగే కిసాన్ మేళాలో, సాయంత్రం 4 గంటలకు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగే పార్టీ సమావేశంలో పాల్గొంటారు. 5 గంటలకు భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. మ్యూజికల్ గార్డెన్ ప్రారంభిస్తారు. ఇక్కడి నుంచి కాజీపేట దర్గాకు చేరుకుని దర్గా ఉర్సు ఉత్సవాల్లో పాల్గొంటారు. రాత్రి 8.15 గంటలకు ఇక్కడి నుంచి హైదరాబాద్కు బయల్దేరుతారు. పొంగులేటి శ్రీనివాస్రెడ్డిపొన్నం ప్రభాకర్ -
పోలీస్ శాఖలో ఎన్నికల సందడి
సాక్షి ప్రతినిధి, వరంగల్: పోలీస్ శాఖలో ఎన్నికల సందడి పెరిగింది. సుమారు పదమూడేళ్ల తర్వాత పోలీస్ అధికారుల సంఘానికి ఎన్నికలు జరగలేదు. తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీజీపీఓఏ) కొత్త కార్యవర్గాల ఎన్నికల నిర్వహణకు ఇటీవలే డీజీపీ సీవీ.ఆనంద్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈమేరకు జిల్లాలు, కమిషనరేట్లు, బెటాలియన్లు, వివిధ యూని ట్లలో ఎన్నికల ప్రక్రియకు తెరలేచింది. ఇందులో భాగంగా.. వరంగల్ పోలీస్ కమిషనరేట్లోనూ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఎన్నికల అధికారిగా అడిషనల్ డీసీపీ (అడ్మిన్) ఆర్.ప్రభాకర్రావు వ్యవహరిస్తుండగా.. మూడు జిల్లాల్లో 110 మంది ప్రతినిధుల ఎంపిక పూర్తయ్యింది. వీరంతా కార్యవర్గ సభ్యుడి నుంచి అధ్యక్షుడి వరకు 13 మంది ఆఫీస్ బేరర్లను ఎన్నుకోవాల్సి ఉంది. 13 ఏళ్ల తర్వాత.. టీజీపీఓఏకు మూడేళ్లకోసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కొన్నేళ్లుగా ఎన్నికలు జరగలేదు. దీంతో సుమారు 13 ఏళ్లుగా పోలీస్ అధికారుల సంఘానికి ఎన్నికలు లేకుండాపోయాయి. డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు చేపట్టిన అనంతరం సంఘం ఎన్నికలపై దృష్టి సారించారు. డీజీపీ ఉత్తర్వుల ప్రకారం.. జిల్లాలు, కమిషనరేట్ల యూనిట్ కమిటీల్లో అధ్యక్షుడు, ఇద్దరు ఉపాధ్యక్షులు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, ఆర్గనైజింగ్ కార్యదర్శి, కోశాధికారి, ఆరుగురు కార్యవర్గ సభ్యుల పదవులకు ఈ ఎన్నికలు జరుగుతాయి. అధ్యక్ష పదవిని సివిల్ లేదా ఆర్ముడ్ వింగ్కు చెందిన కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ స్థాయి వరకు చేపట్టవచ్చు. ఎస్ఐ/ఇన్స్పెక్టర్ ఎన్నికై తే ఇద్దరు ఉపాధ్యక్షుల్లో ఒకరు హెడ్ కానిస్టేబుల్ లేదా కానిస్టేబుల్ స్థాయి నుంచి ఉండాలి. అదే హెడ్ కానిస్టేబుల్ లేదా కానిస్టేబుల్ అధ్యక్షుడైతే ఇద్దరు ఉపాధ్యక్షులు ఎస్ఐ/ఇన్స్పెక్టర్ స్థాయికి చెందిన వారై ఉండాలి. సివిల్ పోలీస్ కోటాలో ఒక స్థానాన్ని మహిళా పోలీసులకు రిజర్వ్ చేసినట్లు పోలీసువర్గాల సమాచారం. కాగా, ఎగ్జిక్యూటివ్ మెంబర్ నుంచి అధ్యక్షుడి వరకు 13 పోస్టులకు 13న ఎన్నికలు జరగనున్నాయి. ‘పొలిటికల్’ను తలపిస్తూ.. కమిషనరేట్ పరిధి అన్ని సర్కిళ్ల వారీగా 50 మందికి ఒకరు చొప్పున మొత్తం 110 మంది ప్రతినిధులను ఇప్పటికే ఎన్నుకున్నారు. ఈనెల 13న జరిగే ఎన్నికల్లో అందులో నుంచి 13 మందిని ఆఫీస్ బేరర్లుగా ఎన్నుకున్న తర్వాత మరో ఇద్దరు సభ్యులను నామినేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈనేపథ్యంలో సంఘం ద్వారా పోలీస్ అధికారులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు, సంక్షేమం, సేవా పరిస్థితులు, ఇతర అంశాలపై తమ గళాన్ని వినిపించే అవకాశం ఉండడంతో ఎన్నికలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఎన్నో ఏళ్ల తర్వాత పోలీస్ అధికారుల సంఘానికి ఎన్నికలు జరుగుతుండడంతో వరంగల్ కమిషనరేట్లోనూ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. వివిధ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది తమకు అనుకూలమైన అభ్యర్థులను బరిలో నిలిపేందుకు సిద్ధమయ్యారు. కార్యవర్గ సభ్యుడు మొదలుకొని అధ్యక్ష పదవి కోసం అర్హులైన పలువురు పోటీ పడుతున్నారు. ఇందులో కొందరు ఏసీపీ, డీసీపీ స్థాయి అధికారులు తమ అనుయాయులను ఎన్నికల బరిలోకి దింపుతున్నట్లు ప్రచారం. అభ్యర్థులుగా బరిలోకి దిగే కొందరు మద్యం, డబ్బుల పంపిణీకి శ్రీకారం చుట్టారన్న ప్రచారం కూడా జరుగుతోంది. పొలిటికల్ పార్టీలను తలపించే రీతిలో మరికొందరు ప్రచారం నిర్వహిస్తుండడం పోలీస్శాఖలో చర్చనీయాంశమవుతోంది.సుమారు 13 ఏళ్ల తర్వాత పోలీస్ అధికారుల సంఘానికి ఎన్నికలు 110 మంది ప్రతినిధుల ఎంపిక పూర్తి 13 పోస్టులకు 13న ప్రత్యక్ష ఎన్నిక పోటాపోటీగా ప్రచారం -
పోలీసింగ్లో వరంగల్ భేష్
సాక్షిప్రతినిధి, వరంగల్/వరంగల్ క్రైం: రాష్ట్రంలో ఇతర జిల్లాలతో పోలిస్తే వరంగల్ జిల్లా పోలీసింగ్ బాగుందని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. ఆదివారం వరంగల్కు వచ్చిన ఆయన వరంగల్ నిట్లో పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనూ ఆయన పలు విషయాలను వెల్లడించారు. ప్రజల భద్రతను బలోపేతం చేయాలి.. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని నేరాలపై సమీక్ష జరిపిన డీజీపీ సీవీ ఆనంద్.. పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. దోపిడీ కేసులు 29కి పెరగగా, సైబర్ మోసాల కేసులు 25 నుంచి 59కి, 2026 జనవరి–జూలైలోనే 119 కేసులుగా నమోదయ్యాయి. ఉద్యోగాల పేరుతో మోసాల కేసులు 40 నమోదు కాగా, ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)కు సంబంధించిన 117 కేసులు నమోదైనట్లు డీజీపీకి అధికారులు వివరించారు. చోరీల ముఠాలపై ప్రత్యేక నిఘా పెట్టామని కమిషనర్ శ్వేత వివరించగా.. వారిపై మరింత అప్రమత్తంగా వ్యవహరించా లని డీజీపీ సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాల ఏర్పాటుకు చేపట్టిన ‘నేను సైతం’ కార్యక్రమాన్ని డీజీపీ అభినందించారు. డ్రగ్స్, సైబర్ మోసాలపై పీపీటీ.. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) టీ–స్పార్క్, సీఐడీ అధికారులు సైబర్ నేరాల ధోరణులు, దర్యాప్తు విధానాలు, నూతన సాంకేతిక వ్యవస్థలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. సీపీ శ్వేత కమిషనరేట్ పరిధిలో పోలీసింగ్ పనితీరు, నేరాల పరిస్థితి, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, మహిళల భద్రత, ఆర్థిక నేరాల ధోరణులు తదితర అంశాలపై పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా డీజీపీకి వివరించారు. సైబర్ నేరాల ఛేదనలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని, అయితే ప్రజలు ఇంకా అప్రమత్తంగా ఉండాలని డీజీపీ సూచించారు. అధిక లాభాల ఆశతో వ్యాపారులు, ప్రైవేట్ ఉద్యోగులు సైబర్ మోసాలకు గురవుతున్నారని, ఇలాంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. పిల్లలే టార్గెట్.. గ్రామాలకూ డ్రగ్స్.. డ్రగ్ పెడ్లర్లు చిన్న పిల్లలను సైతం మత్తుకు బానిసలుగా మార్చుతున్నారని డీజీపీ హెచ్చరించారు. విద్యాసంస్థల్లో డ్రగ్స్ తీసుకునే వారిని గుర్తిస్తున్నామని, అయితే కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు ఈ అంశాన్ని పట్టించుకోవడం లేదన్నారు. పట్టణాలకే పరిమితమైన డ్రగ్స్ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నాయని డీజీపీ ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసింగ్ మరింత ప్రజా కేంద్రంగా.. మారుతున్న నేరాల స్వభావానికి అనుగుణంగా పోలీసు వ్యవస్థను మార్చుతున్నామని డీజీపీ తెలిపారు. ప్రజల భద్రత, ఆస్తుల రక్షణ, సైబర్ మోసాల నియంత్రణ, డ్రగ్స్ కట్టడి ప్రధాన ప్రాధాన్యతలుగా కొనసాగుతాయని చెప్పారు. ఆన్లైన్ బెట్టింగ్లతో నేరాలు పెరుగుతున్నాయన్నారు. బేసిక్ పోలీసింగ్కు ప్రాధాన్యం... సాంకేతికత పోలీసింగ్కు తోడ్పాటే కానీ ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులను వెంటనే స్వీకరించి పరిష్కరించాలని, దర్యాప్తులు, కోర్టు కేసుల పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డీజీపీ ఆదేశించారు. వరంగల్ పోలీసు కమిషనర్ ఎన్.శ్వేత, సీసీటీఎన్, టీ ఈగల్ఫోర్స్, సీఐడీ ఎస్పీలు రూపేశ్, సాయిశ్రీ, గిరిధర్, శ్రీనివాస్రెడ్డి, అడిషనల్ డీసీపీలు, డీసీపీలు, ఏసీపీలు, ఎస్హెచ్ఓలు పాల్గొన్నారు. వరంగల్తో అనుబంధం తన ఐపీఎస్ ఉద్యోగ జీవితం వరంగల్లో జిల్లా శిక్షణతో ప్రారంభమైందని, అనంతరం వరంగల్ రూరల్ ఎస్పీగా పనిచేసిన రోజులు మరువలేనివని డీజీపీ సీవీ ఆనంద్ గతాన్ని గుర్తు చేసుకున్నారు. హనుమకొండ హంటర్రోడ్డులో నివాసం ఉన్నానన్న ఆయన నక్సలిజం తీవ్రంగా ఉన్న రోజుల్లో ప్రతి రోజు ప్రమాదకరంగా ఉండేదని చెప్పారు. ఇంటినుంచి బయటకు వెళ్తే తిరిగి ఇంటికి వెళ్తామా.. లేదా? అన్న ఆందోళనకర పరిస్థితులు అప్పట్లో ఉండేవన్నారు. ప్రస్తుతం మావోయిజం పూర్తిగా అంతరించిపోవడం సంతోషకరమన్నారు. ఇతర జిల్లాలతో పోలిస్తే మెరుగు డ్రగ్స్, సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి సమీక్ష సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్ వరంగల్తో అనుబంధం విడదీయరానిది.. ఐపీఎస్గా ఇక్కడి నుంచే ప్రస్థానం నిట్ మీడియా సమావేశంలో గతాన్ని గుర్తుచేసుకున్న పోలీస్ బాస్పోలీస్ అమరుల త్యాగాలతోనే నేడు శాంతి : డీజీపీ -
పెద్ది కుటుంబానికి కేసీఆర్ ఓదార్పు
సాక్షి, వరంగల్/నల్లబెల్లి: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆత్మీయ ఓదార్పునిచ్చారు. సుదర్శన్రెడ్డి దశదినకర్మ సందర్భంగా ఆదివారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని పెద్ది స్వగృహానికి కేసీఆర్ వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు. విషాదంలో ఉన్న పెద్ది సతీమణి స్వప్నను ఓదార్చి ధైర్యం చెప్పారు. రోడ్డు మార్గంలో కేసీఆర్ మధ్యాహ్నం 3.50 గంటలకు నల్లబెలికి చేరుకున్నారు. తొలుత సుదర్శన్రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పి ంచారు. అనంతరం ఇంట్లోకి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేసీఆర్ను చూడగానే స్వప్న భావోద్వేగానికి గురై బోరున విలపించారు. సుదర్శన్రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న కేసీఆర్ సైతం భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం పెద్ది కుమారుడు నిదర్శన్రెడ్డి, కుమార్తె ధర్మిష్ఠకు రూ.కోటి చొప్పున, సుదర్శన్రెడ్డి తల్లి అమృతమ్మకు రూ.25 లక్షల చొప్పున చెక్కులు అందించారు. మొత్తం రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం అందించారు. కుటుంబ సభ్యులతో సుమారు 45 నిమిషాల పాటు ముచ్చటించారు. సాయంత్రం 4.35 గంటలకు నల్లబెల్లి నుంచి హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. అనంతరం మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్ సెంటర్లో వేలాది మంది కార్యకర్తలతో కలిసి భోజనం చేశారు. పార్టీ సీనియర్ నేత కెప్టెన్ లక్ష్మీకాంతారావుతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. అనంతరం ఎర్రవెల్లి నివాసానికి తిరుగు ప్రయాణమయ్యారు. కేసీఆర్ వెంట మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, రెడ్యానాయక్, మాజీ ఎంపీలు వినోద్కుమార్, మాలోత్ కవిత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి ఉన్నారు. సంతాప సభ ఏర్పాట్లపై ఆరా నల్లబెల్లిలో సోమవారం నిర్వహించనున్న పెద్ది సంతాప సభ ఏర్పాట్లపై మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ మాట్లాడారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా డీసీపీ రవీందర్రెడ్డి, నర్సంపేట రూరల్ సీఐ సాయి రమణ పర్యవేక్షణలో నల్లబెల్లి ఎస్సై సాయి ప్రసన్నకుమార్తో పాటు ఏడుగురు ఎస్సైలు, 200 మంది పోలీసులు బందోబస్తు నిర్వర్తించారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి దశదినకర్మకు మాజీ సీఎం హాజరు చిత్రపటం వద్ద నివాళి.. పెద్ది స్వప్నను పరామర్శించి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా రూ.2.25 కోట్ల చెక్కులను కుటుంబ సభ్యులకు అందించిన మాజీ సీఎంప్రముఖుల పరామర్శ..మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, సిరికొండ మధుసూదనాచారి, జీవన్రెడ్డి, తాటికొండ రాజయ్య, బీఆర్ఎస్ నాయకులు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, బోయినపల్లి వినోద్కుమార్, వినయ్భాస్కర్, అరూరి రమేశ్, బండా ప్రకాశ్, డీఎస్ రెడ్యానాయక్, మాలోత్ కవిత, శంకర్నాయక్, నన్నపునేని నరేందర్, గండ్ర జ్యోతి, ఎర్రోళ్ల శ్రీనివాస్, హరిరమాదేవి, సాంబారి సమ్మారావు, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తదితరులు పెద్ది కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
న్యాయ వ్యవస్థపై నమ్మకంతో పోరాడుతున్నాం
కాశిబుగ్గ: న్యాయ వ్యవస్థపై తమకు అపారమైన విశ్వాసం ఉందని, అదే నమ్మకంతోనే కార్మికుల పక్షాన పోరాడుతున్నామని ఆజంజాహి మిల్స్ వీఆర్ఎస్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు తెలిపారు. ఆదివారం వరంగల్ చింతల్ బ్రిడ్జి వద్ద వీఆర్ఎస్ అసోసియేషన్ కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు కుడికాల కుమారస్వామి, జన్ను రమేశ్ మాట్లాడుతూ.. 134 మంది మిల్లు కార్మికులకు 200 గజాల చొప్పున ఇచ్చినట్లుగానే మిగతా 318 మందికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో పాండవుల సమ్మయ్య, తౌటం రమేశ్, సంజీవ్ పాల్గొన్నారు. ● ఆజంజాహి మిల్స్ వీఆర్ఎస్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు -
కేయూకు రూ.500 కోట్లు కేటాయించాలి
కేయూ క్యాంపస్: మౌలిక వసతుల కల్పనకు కేయూకు రూ.500 కోట్లు కేటాయించాలని కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ (కుర్తా) అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎ.సదానందం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేయూ గెస్ట్హౌస్లో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాడు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఉన్నత విద్య అవకాశాలు పరిమితంగా ఉన్నరోజుల్లో కాకతీయ యూనివర్సిటీ ఏర్పాటుతో బడుగు, బలహీనవర్గాల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోనికి వచ్చిందని గుర్తుచేశారు. తొలి ఉపకులపతి వెంకట్రామయ్య అంకితభావం, కఠోరశ్రమ, ముందుచూపుతో కాకతీయ యూనివర్సిటీకి బలమైన పునాదులు వేశారన్నారు. తర్వాత వీసీలుగా బాధ్యతలు నిర్వర్తించిన జాఫర్నిజాం, వాసుదేవ్ తదితరులు అదేస్ఫూర్తిని కొనసాగించారని వివరించారు. దివంగత వీసీ ఎన్.లింగమూర్తి హయాంలో అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేశారని, అధ్యాపకుల నియామకాలు కూడా చేపట్టినట్లు వివరించారు. గోల్డెన్జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ఈనెల 11న ఉదయం10 గంటలకు కుర్తా ఆధ్వర్యంలో పరిపాలన భవనంలోని సెనేట్హాల్లో విశ్రాంత ఆచార్యుల సమావేశం (మీట్) ను నిర్వహిస్తామని చెప్పారు. యూనివర్సిటీలో 204 మంది విశ్రాంత అధ్యాపకులు ఉన్నారని, 70 ఏళ్లపైబడిన విశ్రాంత అధ్యాపకులను కేయూ గోల్డెన్జూబ్లీ ఉత్సవాల మీట్లో సన్మానించనున్నట్లు వివరించారు. ఉత్సవాలకు కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించామని తెలిపారు. సమావేశంలో కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ప్రొఫెసర్ వడ్డె రవీందర్, కోశాధికారి జి.వీరన్న, జాయింట్ సెక్రటరీ కృష్ణారెడ్డి, ికుర్తా కార్యవర్గసభ్యులు ప్రొఫెసర్లు సీహెచ్ సమ్మయ్య, సుధాకర్ తదితరులుపాల్గొన్నారు. కుర్తా అధ్యక్షుడు ప్రొఫెసర్ సదానందం -
ఆదివాసీల సంస్కృతిని పరిరక్షించుకోవాలి
ఖిలా వరంగల్: ఆదివాసీ, గిరిజన సంస్కృతీసంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని జూనియర్ సివిల్ జడ్జి రాజ్ నిధి అన్నారు. ఆదివాసీల దినోత్సవం సందర్భంగా వరంగల్ యాకూబ్పురంలోని ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలలో గిరిజనుల హక్కులు, చట్టపరమైన రక్షణ, సమానత్వం, సామాజిక న్యాయం, ఉచిత న్యాయ సహాయం వంటి అంశాలపై ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సివిల్ జడ్జి రాజ్నిధి హాజరై మాట్లాడారు. గిరిజనులు తమ హక్కులపై అవగాహన పెంపొందించుకోవాలని కోరారు. అవసరమైన సందర్భాల్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించి ఉచిత న్యాయ సాయం పొందవచ్చునని సూచించారు. సదస్సులో సబ్ ఇన్స్పెక్టర్ నిహారిక, న్యాయవాది పి.శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ హేమంత్, సిబ్బంది పాల్గొన్నారు కాజీపేట అర్బన్: కాజీపేట మండలం టేకులగూడెం గ్రామానికి చెందిన మాతంగి ప్రవీణ్ తైక్వాండో గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించినట్లు గ్రాండ్ మాస్టర్ ఎం.జయంత్రెడ్డి ఆదివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈనెల 9న హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ఎంజేఆర్ ఇంటర్నేషనల్ తైక్వాండో అకాడమీ, సుమన్ ఆర్ట్స్ సంయుక్తంగా తైక్వాండో పోటీలు నిర్వహించారు. మాతంగి ప్రవీణ్ బ్లాక్ బెల్ట్ మూడో డాన్ విభాగంలో పాల్గొని ప్రతిభ కనబర్చి తైక్వాండో గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించినట్లు తెలిపారు. కాజీపేట రూరల్: కాజీపేట రైల్వేస్టేషన్లోని స్టేషన్ మాస్టర్ కార్యాలయంలో ఆదివారం టీడీ సేవర్ 101 ఎమర్జెన్సీ మెడికల్ బాక్స్ను రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు. ఈ మెడికల్ కిట్లో గాయాలకు డ్రెస్సింగ్లు, బ్యాండేజీలు, రక్తస్రావాన్ని నియంత్రించే సామగ్రి తదితర అత్యవసర వైద్య పరికరాలు అందుబాటులో ఉంటాయి. రైల్వేస్టేషన్, రైళ్లలో ప్రయాణికులు అనుకోకుండా ఏదైనా ప్రమాదాలకు గురైనప్పుడు లేదా అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైనప్పుడు తక్షణ ప్రథమ చికిత్స అందించేందుకు ఈ మెడికల్ బాక్స్ ఉపయోగపడుతుందని రైల్వే అధికారులు తెలిపారు. -
విశ్వబ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం రాష్ట్ర కమిటీ ఎన్నిక
హన్మకొండ కల్చరల్ : విశ్వబ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం రాష్ట్ర కమిటీ ఎన్నిక శుక్రవారం రాత్రి వరంగల్ భద్రకాళిరోడ్లోని శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం ధ్యానమండపంలో నిర్వహించారు. రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మాతృ సంఘం ప్రధాన కార్యదర్శి చొల్లేటి కృష్ణమాచారి ఆధ్వర్యంలో కమిటీ ఎన్నిక నిర్వహించారు. సంఘం అధ్యక్షుడిగా కారెంపూడి కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శిగా గొళ్లపల్లి రామానందస్వామి, కోశాధికారిగా గొళ్లపల్లి రామన్నాచార్యులు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో మాతృసంఘం కన్వీనర్ శ్రీరామోజు రవీంద్రాచారి, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం అధ్యక్షుడు మారేడోజు సదానందాచారి, ప్రధాన కార్యదర్శి జల్లిపల్లి పెంటయ్యచారి తదితరులు పాల్గొన్నారు. -
ఆదివాసీ.. మానవాళికి మూలవాసి
ప్రకృతితో పెనవేసుకుని జీవిస్తున్న గొత్తికోయలుఏటూరునాగారం: ఆదివాసీలు.. మానవాళి మూలవాసులు. వీరి జీవనం పూర్తిగా ప్రకృతితో పెనవేసుకుని ఉంటుంది. కట్టు, బొట్టూ.. ఆహారం, ఆహార్యం.. వేషధారణ, వస్త్ర ధారణ, ఆలోచన, ఆచారాలు పూర్తిగా మైదాన ప్రాంతవాసులకు భిన్నం. అడవి తల్లే వీరి జీవనాధారం. గుట్టలు, గూడేలే వీరి ఆవాసం. అడవుల్లోనే జీవించే ఆదివాసీలు నేటికీ సంస్కృతి, సంప్రదాయాలను ఆచరిస్తూ నవజీవనాన్ని కొనసాగిస్తున్నారు. పండుగలు, శుభాకార్యాలను సైతం తమ కట్టుబాట్లు, నిబంధల మేరకే కొనసాగించుకుంటూ తమకంటూ ఓ జీవన విధానాన్ని ఏర్పరుచుకున్నారు. ఈ క్ర మంలో ఆదివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. ఈ సందర్భంగా వారి జీవనం విధానం, అభివృద్ధి, తదితర అంశాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సేంద్రియ వ్యవసాయం.. నేటి సమాజంలో ఏ పంట దిగుబడి తీయాలన్నా రసాయన ఎరువులను అధికంగా వాడడం గమనార్హం. కానీ ఏజెన్సీలోని గొత్తికోయలు, ఆదివాసీలు సేంద్రియ వ్యవసాయం పాటిస్తున్నారు. కేవలం పశువుల పేడ, వేప ఆకులతో పంటలు పండిస్తున్నారు. కల్తీ లేని పంటలు పండించుకుంటున్నారు. ఇంటి చుట్టూ అరటిపండ్లు, కూరగాయలు, ఇతర పంటలు వేసుకుని వాటినే ఆహారంగా తీసుకుంటున్నారు. అభివృద్ధికి ఆమడ దూరం.. ఆదివాసీ గూడేలు అభివృద్ధికి ఆమడ దూరంలో మగ్గుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చి 79 సంవత్సరాలైనా ఇంకా రోడ్లు, రవాణా సౌకర్యం లేదంటే అతిశయోక్తి కాదు. ఆదివాసీల ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఐటీడీఏ నేడు అనారోగ్యంతో మూలుగుతోంది. ప్రభుత్వాలు, పాలకులు మారిన తమ తలరాతలు మారడం లేదని ఆదివాసీ ప్రజలు పేర్కొంటున్నారు. కాగా, 1986లో ఏటూరునాగారంలో సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) కార్యాలయాన్ని స్థాపించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 ఏజెన్సీ మండలాలు, 177 షెడ్యూల్డ్ గ్రామాలుగా గుర్తించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లా ఐటీడీఏ వ్యాప్తంగా 1,86,607 మంది ఆదివాసీ జనాభా ఉంది. పథకాలు అందని ద్రాక్ష.. ఐటీడీఏ పరిధిలో ఇంకా 30 వేల వరకు అటవీ హక్కు పత్రాలు కోసం ఆదివాసీలు ఎదురు చూస్తున్నారు. మాతా శిశు సంచార వైద్యశాల(వాహనాల) తొలగించడంతో గూడేలకు వాహనం వెళ్లడం లేదు. హార్టికల్చర్, అగ్రికల్చర్, మత్స్యశాఖ, పశుసంవర్థకశాఖ, మైనర్ ఇరిగేషన్ వంటి శాఖలు కనుమరుగయ్యాయి. గతంలో ఈ శాఖల ద్వారా ఆదివాసీలకు లబ్ధిచేకూరేది. ఇలా అనేక పథకాలు రోజు రోజుకూ కనుమరువుతున్నాయి.ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఐటీడీఏ పరిధిలో ఆదివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు పీఓ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బస్టాండ్ నుంచి వై జంక్షన్ వరకు ర్యాలీ, విగ్రహాలకు పూలమాలలు వేస్తామన్నారు. గిరిజన భవన్లో సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పీఓ పేర్కొన్నారు. గొత్తికోయగూడేలకు మిషన్ భగీరథ పైపులైన్, ప్రభుత్వ చేతి పంపులు లేవు. దీంతో వర్షాకాలంలో వాగులు, తోగుల నీరు మురికిగా ఉంటుంది. దీనికి ప్రత్యామ్నాయంగా వ ర్షం కురుస్తున్న సమయంలో బయట కర్రకు నాలుగు మూలలకు చీర కట్టి మధ్యలో రాయివేసి ఆ నీటిని బిందెలో నింపుకుంటారు. వాటిని తాగు నీటికి ఉపయోగించడం నానాటికీ కొనసాగుతోంది. గొత్తిగోయ గూడేలకు ఇప్పటి వరకు విద్యుత్ సౌకర్యం లేదు. కేవలం దిగిటిలు, నెగల్లు పెట్టుకుని కారుచీకట్లలో కాలం వెళ్లదీస్తున్నారు. ములుగు జిల్లాలోని ఐదు మండలాల్లో 51 గొత్తికోయగూడేలు ఉన్నాయి. ఇందులో 3,154 మంది జనాభా ఉంది. వారికి సరైన రోడ్లు, పాఠశాలలు, అంగన్వాడీలు, పక్కా ఇళ్లు లేవు. తాత్కాలికంగా పెంకుటిల్లులు వేసుకుని జీవిస్తున్నారు. పాఠశాలలకు సరైన భవనం లేకపోడంతో మంత్రి సీతక్క కంటైనర్ పాఠశాలలు మంజూరు చేయించారు. అయితే మరికొన్ని గ్రామాల పాఠశాలలు పక్కా భవనం లేక గుడిసెల్లోనే కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా గుండెంగవాయి, మామిడిగూడెం వంటి గ్రామాలకు అంగన్వాడీ కేంద్రం లేకపోవడంతో పౌష్టికాహారం కోసం మూడు కిలోమీటర్ల మేర పిల్లలను ఎత్తుకుని సమీపంలోని బూటారం కేంద్రానికి కాలినడకన చేరుకోవాల్సి దుస్థితి నెలకొంది. ఆ గూడెంలోని 0–5 చిన్నారులకు అంగన్వాడీ కేంద్రం లేకపోవడంతో ఇంటి వద్దే ఉంటూ చాలీచాలని ఆహారం తీసుకుని రక్తహీనతకు లోనవుతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం గొత్తికోయలకు అంగన్వాడీ కేంద్రం మంజూరు చేయడం లేదని ఆదివాసీలు పేర్కొంటున్నారు. నేటికీ సంస్కృతి, సంప్రదాయాల ఆచరణలోనే.. నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం -
నేడు ‘థానా’ వార్షిక రాష్ట్ర మహాసభ
కాశిబుగ్గ: తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ (థానా) 11వ వార్షిక రాష్ట్ర మహాసభ ‘థానాకాన్’–2026ను ఆదివారం ఉదయం 8 గంటలకు నిర్వహించనున్నారు. వరంగల్ ఐఎంఏ హాల్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో నిర్వాహకులు వార్షికోత్సవ వివరాలను వెల్లడించారు. ములుగురోడ్డులోని వజ్ర గార్డెన్స్లో జరిగే వార్షిక కాన్ఫరెన్స్ థానాకాన్కు తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాల ప్రతినిధులు, వైద్యనిపుణులు, వైద్యులు, ఆరోగ్యరంగానికి చెందిన ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలిపారు. సభకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర దేవాదాయ , అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, వరంగల్ ఎంపీ కడియం కావ్య, పశ్చిమ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. అలాగే, వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ప్రత్యేక అతిథిగా హాజరై ‘వైద్యుల కోసం సైబర్ భద్రత’ అంశంపై అవగాహన ఉపన్యాసం చేస్తారని వివరించారు. వరంగల్కు చెందిన నేత్ర వైద్య నిపుణుడు పి.ప్రవీణ్ 2026–27 సంవత్సరానికి థానా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించనున్నారు. సమావేశంలో థానా వరంగల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ముక్కా దిలీప్కుమార్, ప్రధాన కార్యదర్శి ఎల్.నాగేశ్వర్రావు, కోశాధికారి వి.నరేశ్కుమార్, వద్దిరాజు రాకేశ్, ప్రవీణ్, రమేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాన్ఫరెన్స్కు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. -
కాళోజీ హెల్త్వర్సిటీ రిజిస్ట్రార్గా వెంకటేశ్వర్లు
కాశిబుగ్గ: వరంగల్ కాళోజీ నారాయణరావు యూనివర్సి టీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ రిజిస్ట్రార్గా డాక్టర్ జేవీ వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా చోంగ్తు శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ వెంకటేశ్వర్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలకు అదనపు డీఎంఈ హోదాలో ప్రిన్సిపాల్గా ఉన్నారు. ఆయన మూడు సంవత్సరాల పాటు ఫారెన్ సర్వీసు డిప్యుటేషన్పై విధులు నిర్వర్తించారు. ఇప్పటి వరకు హెల్త్ వర్సిటీ ఇన్చార్జ్ రిజి స్ట్రార్గా ఉన్న డాక్టర్ నాగార్జునారెడ్డి ఇకనుంచి జాయింట్ రిజిస్ట్రార్గా పనిచేయనున్నారు. కాగా, నూతన రిజిస్ట్రార్ డాక్టర్ వెంకటేశ్వర్లు సోమవారం లేదా మంగళవారం బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఓరుగల్లుతో రిజిస్ట్రార్కు అనుబంధం.. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్గా నియమితులైన డాక్టర్ వెంకటేశ్వర్లుకు ఓరుగల్లుతో అనుబంధం ఉంది. ఎంజీఎం ఆస్పత్రిలోనే ఆయన 26 సంవత్సరాలపాటు ఆర్థోపెడిక్ విభాగంలో విధులు నిర్వర్తించారు. 1998 నుంచి 2024 వరకు ఎంజీఎంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా, అసోసియేట్ ప్రొఫెసర్గా, ప్రొఫెసర్గా, హెచ్ఓడీగా, డిప్యూటీ సూపరింటెండెంట్గా పనిచేశారు. 2024 నుంచి 2025 వరకు యాదాద్రి జిల్లా భువనగిరిలో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా విధులు నిర్వర్తించారు. 2025 నుంచి 2026 సంవత్సరం ఇప్పటి వరకు భూపాలపల్లి వైద్య కళాశాలలో అడిషనల్ డీఏంఈ హోదాలో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు. -
వరంగల్లో జెన్ జీ మూవ్మెంట్ తీసుకొద్దాం
‘యూత్ మీటప్ విత్’ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హన్మకొండ: వరంగల్లో జెన్జీ మూవ్మెంట్ తీసుకొద్దామని ఎమ్మెల్సీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న యువత, విద్యార్థులకు పిలుపునిచ్చారు. హనుమకొండలోని అంబేడ్కర్ భవన్లో శనివారం యూత్ మీటప్ విత్ తీన్మార్ మల్లన్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జెన్జీ యువత తలుచుకుంటే రాజకీయాల్లో అనేక మార్పులు సాధ్యమవుతాయన్నారు. విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. రిజర్వేషన్లు తొలగించాలనే డిమాండ్ వస్తోందని, అయితే దీనికి ముందు కులాన్ని తీసివేయాలని పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో బీసీలు ముఖ్యమంత్రి కాలేదని, తాను బీసీలకు రాజ్యాధికారం సాధించే దిశగా పాటుపడుతున్నట్లు స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన కులగణనను వ్యతిరేకించినందుకు తనను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించారని గుర్తుచేశారు. రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తానని, కుల, మతాలకతీతంగా అన్ని వర్గాల ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందించడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. బీసీ సబ్ ప్లాన్ నిధులను మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరానికి మళ్లిస్తే, సీఎం రేవంత్రెడ్డి కొడంగల్కు మళ్లిస్తున్నారని ఆరోపించారు. కేయూ సమస్యలను శాసనమండలిలో ప్రస్తావించానని, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయానన్నారు. గతంలో ఎమ్మెల్సీలకు ఉన్న అభివృద్ధి నిధులను సీఎంగా రేవంత్ వచ్చాక లేకుండా చేశారని విమర్శించారు. అనంతరం విద్యార్థులు, యువత అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. -
ఆషాఢంలో మైదాకు పెట్టుకునేందుకు మహిళల ఆసక్తి
కుల మతాలతో సంబంధం లేకుండా శుభకార్యాల్లో మహిళల చేతికి గోరింటాకు మరింత అందాన్ని తెచ్చిపెడుతుంది. గోరింటాకు దొరకనప్పుడు మార్కెట్లో దొరికే మె హందీ అయినా పెట్టుకుంటారు. గోరింటాకు చేతికి అందాన్ని వ్వడమే కాకుండా శరీరానికి ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. ఆషాఢంలో ముత్తయిదువలు చేతికి గోరింటాకు పెట్టుకుని, చేతి నిండా గాజులు వేసుకుంటే మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కొత్తగా పెళ్లయిన మహిళలు ఆషాఢమాసంలో పుట్టింటికి వస్తారు. వారు తమ కుటుంబసభ్యులతో కలిసి చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు. ఈ వేడుకలను స్థానిక మహిళలు, బంధువులతో కలిసి ఘనంగా జరుపుకుంటారు. కాలనీలు, అపార్ట్మెంట్లలో సైతం ఆషాఢ మాసంలో మహిళలంతా గోరింటాకు సంబరాలు జరుపుకుంటారు. తద్వారా బంధాలు బలపడతాయి. బ్యాక్టీరియా బారిన పడకుండా కాళ్లు, చేతులకు రక్షణ అందం, ఆరోగ్య ప్రయోజనాలెన్నో.. -
మరో స్వాతంత్య్ర పోరాటానికి సిద్ధం కావాలి
హసన్పర్తి: భారత రాజ్యాంగాన్ని, ప్రభుత్వ రంగ సంస్థను రక్షించుకోవడానికి మరో స్వాతంత్య్ర పోరాటానికి సిద్ధం కావాలని సీపీఐ జాతీయ నాయకుడు చాడా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. సీపీఐ చేపట్టిన ప్రచార యాత్ర శనివారం హసన్పర్తి మండల కేంద్రానికి చేరుకుంది. ఈసందర్భంగా జరిగిన సమావేశంలో సీపీఐ జాతీయ నాయకుడు చాడా వెంకట్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ సర్కార్ పేద ప్రజల వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని ఆరోపించారు. రూ.రెండు లక్షల కోట్ల అప్పు చేసి సంపదను పెట్టుబడిదారీ వర్గానికి దోచి పెట్టాడని ఆరోపించారు. దోపీడీ వర్గానికి వ్యతి రేకంగా యువత కార్మికవర్గం తిరుగుబాటుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ పేరుతో దేశాన్ని విభజిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ ఈనెల 14వ తేదీ వరకు ప్రచార యాత్రను కొనసాగించాలని చాడా వెంకట్రెడ్డి సూచించారు. సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. కార్యదర్శి మెట్టు శ్యాంసుందర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జ్యోతి, మోతె లింగారెడ్డి, శ్రీనివాస్, మండ సదాలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శి మిద్దెల ఎల్లేశ్, తోట భిక్షపతి, లక్ష్మణ్, రాజమౌళి పాల్గొన్నారు. వికసిత్ భారత్ పేరుతో దేశాన్ని విభజిస్తున్నారు సీపీఐ జాతీయ నాయకుడు చాడా వెంకట్రెడ్డి -
తెగిన రైల్వే విద్యుత్ తీగ
కాజీపేట రూరల్: కాజీపేట సబ్ డివిజన్ పరిధిలోని హసన్పర్తి–ఉప్పల్ మధ్య ఉన్న మెయిన్ డౌన్లైన్లో శనివారం రైల్వే ఓహెచ్ఈ విద్యుత్ తీగ తెగిపోయింది. దీంతో సెక్షన్లో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హసన్పర్తి–ఉప్పల్ మధ్య గల ఆర్వో బ్రిడ్జిపై కేబుల్ లాగుతుండగా రైల్వే ఓహెచ్ఈ విద్యుత్ తీగపై పడింది. ట్రిప్ అయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో బల్లార్షా నుంచి కాజీపేట వెళ్లే నాగ్పూర్ ప్యాసింజర్ సుమారు గంటన్నర పాటు ఉప్పల్–హసన్పర్తి మధ్య నిలిపివేసినట్లు తెలిపారు. అదేవిధంగా గూడ్స్ రైలు కూడా నిలిచిపోయిందని పేర్కొన్నారు. సమాచారం అందుకున్న జమ్మికుంట, కాజీపేట రైల్వే ఓహెచ్ఈ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉదయం 8:30 గంటల నుంచి సుమారు 11 గంటల వరకు మరమ్మతులు చేసి యథావిధిగా రైళ్ల రాకపోకలను పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. నాగ్పూర్ ప్యాసింజర్ ఆలస్యంతో కాజీపేటకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉప్పల్–హసన్పర్తి మధ్య ప్యాసింజర్, గూడ్స్ రైలు నిలిపివేత మరమ్మతులు చేపట్టి రాకపోకలను పునరుద్ధరించిన రైల్వే సిబ్బంది -
పోలీసులు అంకితభావంతో పనిచేయాలి
● పర్యావరణాన్ని బాధ్యతగా పరిరక్షించాలి ● డీజీపీ సీవీ ఆనంద్ ● మామునూరు బెటాలియన్లో పోలీసు అధికారుల ఘన స్వాగతంమామునూరు: స్పెషల్ పోలీసులు రాష్ట్ర అంతర్గత భద్రతను పరిరక్షిస్తూ అంకితభావం, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని, ఎస్డీఆర్ఎఫ్ సామర్థ్యాలను మరింతగా అభివృద్ధి చేసుకోవాలని డీజీపీ పేర్కొన్నారు. వరంగల్ పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం మామునూరు టీజీ ఎస్పీ నాలుగో బెటాలియన్ను అడిషనల్ డీజీపీ సంజయ్కుమార్ జైన్తో కలిసి డీజీపీ సందర్శించారు. బెటాలియన్ ప్రధాన గేట్ వద్దకు చేరుకున్న ఆయనకు కమాండెంట్ డి.శివప్రసాద్రెడ్డి పుష్పగుచ్ఛం అందించి ఘనంగా సన్మానించారు. అనంతరం పోలీసుల నుంచి డీజీపీ గౌరవందనం స్వీకరించి, విధులు, సంక్షేమం, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులతో ముఖాముఖి బెటాలియన్ ఆడిటోరియంలో జరిగిన అధికారులు, సిబ్బందితో ముఖాముఖి కార్యక్రమంలో డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలందించాలని, బెటాలియన్లో మరిన్ని మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. పోలీసింగ్ను మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎస్డీఆర్ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) సిబ్బంది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ వృత్తి నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞాన, సమన్వయాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. అంతకు ముందు బెటాలియన్లో మొక్కలు నాటారు. తర్వాత ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ పరికరాలను పరిశీలించి, నైపుణ్యాన్ని డీజీపీ అభినందించారు. కార్యక్రమంలో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్లు బాలయ్య, వీరన్న, రాజేందర్, ఆర్ఐలు కార్తీక్, విజయ్, రవి, పురుషోత్తంరెడ్డి, వెంకటేశ్వర్లు, రాజ్కుమార్, కృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆధ్యాత్మికత పరంగా సౌభాగ్యానికి గుర్తు. ఔషధ గుణాల పరంగా ఆరోగ్యకారిణిగా గుర్తింపు. అరచేతిలో పూసే గోరింటతో అందం, ఆరోగ్యం. ఆషాఢంలో వర్ష రుతువు ప్రారంభమవుతుంది. వాతావరణంలోని మార్పులను శరీరం తట్టుకునేందుకు చేతులు, కాళ్లకు మహిళలు గోరింటాకు పెట్టుకుంటున్నారు. ఏళ్
వరంగల్లో వేడుకలు.. వరంగల్ కాశిబు గ్గ తిలక్రోడ్డులో శ్రీజగన్మాత మహిళా పరపతి సంఘం సభ్యులు శనివారం గోరింటాకు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మహిళలు సేకరించిన గోరింటాకుతో ఒక్క చోట చేరి రోలులో వేసి రుబ్బారు. రుబ్బుతున్న సమయంలో లయబద్ధంగా గౌరమ్మను కీర్తిస్తూ పాటలు పాడారు. వాయినాలు ఇచ్చుకున్నారు. తాంబూలాలు, స్వీట్లు పంచుకున్నారు. సంతోషంతో ఒకరికొకరు చేతులు, కాళ్లకు మైదాకు పెట్టుకున్నారు. ఫొటోలు దిగి సందడి చేశారు. ప్రతీ సంవత్సరం ఇలాగే సంతోషంగా గోరింటాకు వేడుకలు జరుపుకుంటామని సంఘం సభ్యులు చెబుతున్నారు. -
ముగిసిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో రెండు రోజుల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు శనివారం ముగిశాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సుమారు 1,800 మంది క్రీడాకారులు హాజరుకాగా, అండర్–06, 08, 10,12 బాలబాలికలు, యూత్ విభాగంలో అండర్–18తోపాటు అండర్–14, 16, 20 మెన్ అండ్ ఉమెన్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. మెత్తం 60 ఈవెంట్లలో జరిగిన పోటీల్లో విజేతలకు పతకాలు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. విజేతలకు పతకాలు, సర్టిఫికెట్ల ప్రదానం -
చోరీ కేసులో దొంగ ఆరెస్ట్
ఖిలా వరంగల్: రైలులో ప్రయాణికురాలి నుంచి బంగారు పుస్తెల తాడు చోరీ చేసిన నిందితుడిని ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ రైల్వేస్టేషన్లోని జీఆర్పీ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్గౌడ్, జీఆర్పీ ఇన్స్పెక్టర్ నరేశ్కుమార్ కేసు వివరాలను వెల్లడించారు. శనివారం ఉదయం 9.30 గంటలకు వరంగల్ ఎల్గూరు రంగంపేట రైల్వేస్టేషన్లో జీఆర్పీ, ఆర్పీఎఫ్ సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్కాగజ్నగర్లోని అంబేడ్కర్కాలనీకి చెందిన దుర్గం రాజు అనుమానాస్పదంగా కనిపించగా అదుపులోకి తీసుకుని విచారించారు. చోరీ చేసిన బంగారు పుస్తెల తాడు అతడి వద్ద ఉన్నట్లు గుర్తించారు. కాకినాడ ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఓ ప్రయాణికురాలి వద్ద నిందితుడు రూ.6 లక్షల విలువైన 44.509 గ్రాముల బంగారు పుస్తెలతాడును చోరీ చేశాడు. పుస్తెల తాడును స్వాధీనం చేసుకుని నిందితుడు దుర్గం రాజును రిమాండ్కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ వడ్డె నరేశ్కుమార్ తెలిపారు. ఆర్పీఎఫ్ ఎస్సై వెంకటేశ్వర్లు, ఏఎస్సై ప్రభాకర్రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాశ్, రమేష్, ఏడుకొండలు, జీఆర్పీ సిబ్బంది పాల్గొన్నారు.● రూ.6 లక్షల విలువైన బంగారు పుస్తెల తాడు స్వాధీనం ● వివరాలు వెల్లడించిన వరంగల్ జీఆర్పీ ఇన్స్పెక్టర్ వడ్డె నరేశ్కుమార్ -
సహజమైన రంగు..
మొక్క నుంచి లభించే సహజ రంగునిచ్చే పదార్థం గోరింట. అలంకరణలో ప్రత్యేకమైంది. భారతీయ సంప్రదాయాల్లో వివాహాలు, పండుగలు, శుభకార్యాల్లో ఉపయోగిస్తారు. ఇప్పటికీ ఆషాఢమాసంలో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా గోరింటాకు పెట్టుకునే సనాతన సంప్రదాయం కొనసాగుతోంది. నా చిన్నతనం నుంచి గోరింటాకు పెట్టుకోవడం అలవాటు. ఈ మాసంలో కొందరు మగవారు కూడా గోరింటాకు పెట్టుకుంటారు. – చందనాల జ్యోతి, తిలక్రోడ్డు, వరంగల్ చిట్కాలు పాటిస్తే మరింత ఎరుపు గోరింటాకు ఎర్రగా పండాలంటే పటిక, చింతపండు, పెరుగు, టీ పొడి ఏదో ఒకటి వేసి ముద్దగా రుద్దుకోవాలి. వివాహ సమయంలో పెళ్లి కుమార్తెలకు మెహందీ పెడుతుంటారు. ఈ సమయంలో ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలుంటాయి. చేతులు ఎర్రగా పండితే మంచి భర్త దొరుకుతాడనేది ఒక నమ్మకమైతే గోరింటాకులో ఉండే ఔషధ గుణాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పెద్దలు చెబుతున్నారు. – చందనాల పద్మ, కాశిబుగ్గ, వరంగల్ గోరింటాకు పెట్టుకోవడమంటే ఇష్టం.. గోరింటాకు పెట్టుకోవడమంటే చిన్నతనం నుంచి ఆసక్తి. గోరింటాకు శుభప్రదమైందిగా భావించి ముఖ్యంగా వివాహ వేడుకల్లో భాగంగా గోరింటాకు పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. అందంతో పాటు ఆరోగ్యానికి గోరింటాకు పెట్టుకుంటే మంచిదని పోటీ పడి మరీ గోరింటాకు పెట్టుకుని ఎర్రగా పండే వరకు వేచి చూస్తాం. – రామగిరి జ్యోతి, వరంగల్ ప్రకృతి ప్రసాదంగా.. తెలుగు సంస్కృతీసంప్రదాయాలను కొనసాగించేందుకు ప్రకృతి ఇచ్చిన సంపద గోరింటాకు. ఆధునిక కాలంలోనూ యువతులు గోరింటాకు ఇష్టపడుతున్నారంటే సంప్రదాయమంటే గౌరవం. ఔషధ గుణాలు ఉండడమే కారణం. రసాయనాలు ఉపయోగించే కోన్స్ వాడడం కంటే ప్రకృతి ప్రసాదించిన గోరింటాకు ఉపయోగించుకోవడం శ్రేష్టం. – సంఘ జీవనజ్యోతి, వరంగల్ -
ఏఐసీసీ చీఫ్ను కలిసిన డాక్టర్ రామకృష్ణ
హన్మకొండ చౌరస్తా: త్వరలో జరగనున్న వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానా నికి పోటీచేసే అవకాశం ఇవ్వాలని కోరుతూ హనుమకొండకు చెందిన డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ శనివారం ఢిల్లీలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను కలిశారు. రామకృష్ణ చారి టబుల్ ట్రస్ట్ చైర్మన్గా, పార్టీలో సీనియర్గా వరంగల్ నియోజకవర్గం, క్షేత్రస్థాయిలో పార్టీ బలో పేతం కోసం చేస్తున్న కృషిని వారికి వివరించారు. అంతేకాకుండా పలు రాష్ట్రాల్లో ఎన్నికల పరిశీలకులుగా పనిచేసిన అనుభవాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన తన తాత, తండ్రి సైతం కాంగ్రెస్ పార్టీగా విధేయుడిగా ఉన్న ట్లు తెలిపారు. దశాబ్దానికి పైగా పార్టీ కోసం శ్ర మిస్తున్న తనకు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అ వకాశం కల్పించాలని కోరారు. ప్రభుత్వంలో భాగమయ్యే కార్పొరేషన్ చైర్మన్ పదవితోనైనా ప్రజలకు మరింత చేరువవుతానని తెలిపారు. పార్టీకి చేసిన సేవలను గుర్తించి తనకు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు 30 లేఖలు సిఫారసు చేశానని రామకృష్ణ వారికి వినతిపత్రం అందజేశారు.మధ్యవర్తుల వలలో పడొద్దు ● సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాలేదు ● ఎంజీఎం అధికారుల స్పష్టీకరణ కాశిబుగ్గ: వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాలేదని ఎంజీఎం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగాల పేరుతో మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన అనంతరమే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. అయితే ఇటీవల 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హా స్పిటల్ వద్ద ఓ వ్యక్తి ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్న ట్లు ఆరోపణలు వచ్చాయి. ఒక్కో పోస్టుకు లక్షలాది రూపాయలు డిమాండ్ చేస్తూ నిరుద్యోగులను మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎంజీఎం ఆస్పత్రిలో ఔట్సోర్సింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నారని కూడా వదంతులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిరుద్యోగులకు భరోసా కల్పించడానికి అధికారులు ప్రకటన జారీ చేసినట్లు తెలుస్తోంది. -
డీజీపీని కలిసిన సీపీ శ్వేత
వరంగల్ క్రైం: ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా శనివారం వరంగల్ సీపీ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న రాష్ట్ర డీజీపీ సీవీ.ఆనంద్కు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత పూల మొక్క అందించారు. ఈసందర్భంగా సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన డీజీపీని జనగామ కలెక్టర్, తెలంగాణ ఎన్పీడీసీఎల్ సీఎండీ, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు మర్యాదపూర్వకంగా కలుసుకొని మొక్కలు అందించారు. హన్మకొండ: హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో రేపు (సోమవారం) నిర్వహించనున్న జిల్లా స్థాయి రైతు మేళా–26ను విజయవంతం చేయాలని హనుమకొండ జిల్లా వ్యవసాయాధికారి వి.విజయ చంద్ర రైతులకు పిలుపునిచ్చారు. రైతులకు వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నూతన సాగు పద్ధతులు, ప్రభుత్వ వ్యవసాయ పథకాలు, అధిక దిగుబడులు సాధించే విధానాలపై అవగాహన కల్పించేందుకు రైతు మేళా నిర్వహిస్తున్నట్లు శనివారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాసీ్త్రయ పరిష్కారాలు, సాగులో ఎదురవుతున్న సవాళ్లపై నిపుణులతో అవగాహన కల్పించనున్నట్లు తెలిపా రు. రైతు మేళాలో మట్టి పరీక్షలు, సాయిల్ ప్రొఫైలింగ్, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని వివిధ కార్యక్రమాలు, ఎరువులు–విత్తనాల వినియోగం, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై రైతులకు వివరించనున్నట్లు తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన అధికారులు, శాస్త్రవేత్తలు, నిపుణులు పాల్గొని రైతులకు అవసరమైన సూచనలు, సలహాలు అందిస్తారన్నారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధికి అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై రైతులకు సమగ్ర సమాచారం అందించడంతో పాటు, ఆధునిక సాంకేతికతను వ్యవసాయంలో వినియోగించుకునేలా ప్రోత్సహించడ మే రైతు మేళా ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మోడల్, కేజీబీవీ, గురుకులాలు, ప్రైవేట్ పాఠశాలల సైన్స్, గణిత పాఠశాలల ఉపాధ్యాయులకు ఈనెల 11న ఓరియంటేషన్ నిర్వహించనున్నట్లు డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇన్స్పైర్ మనాక్ అవార్డుల ఆన్లైన్ నామినేషన్లు, నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్, బాలశాస్త్రవేత్తల రిజిస్ట్రేషన్, నేషనల్ స్టూడెంట్స్ పర్యావరణ కాంపిటేషన్, ఏక్పేడ్ మాకేనామ్, ఖాన్ అకాడమీ, అటల్ టింకరింగ్ లాబొరేటరీ నిర్వహణ, ఇతర డిజిటల్ అభ్యాస కార్యక్రమాలపై హనుమకొండ సుబేదారిలోని రామన్ హైస్కూల్లో ఓరియంటేషన్ నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఒక పాఠశాల నుంచి సైన్స్ లేదా గణిత ఉపాధ్యాయుడు ఒక్కరు మాత్రమే హాజరుకావాలని, ఉదయం 9:15 గంటలకు రామన్ హైస్కూల్లో ఆయా ఉపాధ్యాయులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. వరంగల్ అడిషనల్ కలెక్టర్ వైవీ గణేశ్ హన్మకొండ: జీవితం ఎంతో విలువైందని, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యకు పాల్ప డొద్దని, కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని వరంగల్ అడిషనల్ కలెక్టర్ వైవీ గణేశ్ పిలుపునిచ్చారు. హనుమకొండలోని క్యాంపు కార్యాలయంలో ఆత్మహత్యల నివారణ కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్లు, కరపత్రాలను శనివారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఫల్యాలను చూసి కుంగిపోకుండా వాటిని అధిగమించి నిలిచి గెలిచినప్పుడే జీవితంలో నిజమైన ఘనత సాధించినట్లవుతుందని చెప్పారు. ఆత్మహత్యల నివారణ కమిటీ, ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ గత 20 ఏళ్లుగా తెలంగాణలో ఆత్మహత్యల నివారణకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఇప్పటివరకు 28 మంది జీవితాలను కాపాడడం గొప్ప విషయమన్నారు. ఆత్మహత్యల నివారణ కమిటీ చైర్మన్, ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ మాట్లాడుతూ ఆత్మహత్యకు ప్రయత్నించే వ్యక్తుల పట్ల సమాజం సానుభూతి, మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో ఆత్మహత్యల నివారణ కమిటీ సభ్యుడు రాంపెల్లి లింగమూర్తి, భారతి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఆడెపు రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. -
రెడ్క్రాస్లో సభ్యత్వం తీసుకోవాలి
కేయూ క్యాంపస్: విద్యార్థులు, ఉద్యోగులు ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ యూనిట్లో స్వచ్ఛందంగా సభ్యత్వం తీసుకోవాలని కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం కోరారు. శనివారం కేయూ ఆడిటోరియంలో రెడ్క్రాస్ సొసైటీ యూనిట్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రెడ్క్రాస్ సొసైటీలో ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, విద్యార్థులు, ఉద్యోగులు కలిసి సుమారు 1000 మంది సభ్యత్వ నమోదు లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. గతంలోనే కేయూ ఎన్ఎస్ఎస్కు ఇండియన్ రెడ్క్రాస్ సేవా సర్టిఫికెట్ లభించిందని గుర్తుచేశారు. ఓఎస్డీ బి.వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ యుద్ధాలు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు, విపత్తుల సమయంలో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ముందుండి సహాయక చర్యలు చేపడుతుందని వివరించారు. అరుదైన రక్తగ్రూపు దాతల వివరాలను డేటాబేస్ రూపంలో సేకరించి అత్యవసర సమయంలో అందుబాటులో ఉండేలా ఈ బ్రాంచ్ పనిచేయాలని సూచించారు. ప్రతి విద్యార్థి లైఫ్ అసోసియేట్గా, ఇతరులు లైఫ్ మెంబర్గా సభ్యత్వం పొందాలని సూచించారు. యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ టి.మనోహర్, కేయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్, రెడ్క్రాస్ సొసైటీ యూనిట్ నోడల్ అధికారి ఈసం నారాయణ, కేయూ అభివృద్ధి అధికారి వాసుదేవరెడ్డి, బీసీ సెల్ డైరెక్టర్ బి.సతీశ్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ రాధిక, అసిస్టెంట్ రిజిస్ట్రార్ వల్లాల పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు. నోడల్ అధికారి ఈసం నారాయణకు సభ్యత్వ దరఖాస్తు, నిర్ణీత రుసుము చెల్లించి అసిస్టెంట్ రిజిస్ట్రార్ డాక్టర్ వల్లాల పృథ్వీరాజ్ తొలి లైఫ్ మెంబర్గా సభ్యత్వం తీసుకున్నారు. కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం -
వరంగల్ కమిషనరేట్ పరిధిలో జోరుగా జూదం
శనివారం శ్రీ 8 శ్రీ ఆగస్టు శ్రీ 2026కమిషనరేట్లో పేకాట కేసులు ఇలా..వరంగల్ క్రైం: ఇళ్లు, అపార్ట్మెంట్లు, హోటళ్లు పేకాట శిబిరాలుగా మారుతున్నాయి. ఒకప్పుడు నగరం చుట్టు పక్కల జోరుగా సాగిన జూదం ఇప్పుడు ట్రైసిటీలో విచ్చలవిడిగా కొనసాగుతోందనే ఆరోపణలున్నాయి. టాస్క్ఫోర్స్ దాడుల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్, పోలీస్స్టేషన్లకు కూత వేటు దూరంలో పేకాడుతూ పట్టుబడిన ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వం నిషేధించిన పేకాట జోరుగా సాగుతుంటే స్థానిక పోలీసులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. ట్రైసిటీ పరిధిలో చీకటి వ్యాపారాలతో పాటు జూదం శిబిరాలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తున్నాయనే వాదనలున్నాయి ఒక్క జూలై నెలలోనే పేకాట శిబిరాలపై టాస్క్ఫోర్స్ అధికారులు జరిపిన దాడుల్లో ఆరు శిబిరాల్లో పేకాట రాయుళ్లు పట్టుబడడం గమనార్హం. ఈనెలలో ఒకే రోజు రెండు శిబిరాల్లో పేకాట రాయుళ్లు పట్టుబడడంతో పాటు పెద్ద మొత్తంలో నగదు పట్టుబడింది. దీన్ని బట్టి కమిషనరేట్ పరిధిలో ఏ స్థాయిలో పేకాడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. విజిబుల్ పోలీసింగ్ ఎక్కడ?‘ట్రైసిటీలోని ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో 24 గంటలు పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు’. ఇది పదే పదే పోలీస్ ఉన్నతాధికారులు చెప్పే మాట. కానీ, చీకటి వ్యాపారాలు, పేకాట శిబిరాలు ఎక్కడా ఆగట్లేదనే ఆరోపణలున్నాయి. ఇలాంటి దందాలపై టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకుంటే తప్ప స్థానిక పోలీసులు ఎన్ఫోర్స్మెంట్పై కన్నెత్తి చూడడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో షిఫ్టుల వారీగా బ్లూకోల్ట్ సిబ్బంది విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తూ ముందస్తుగా ఆయా ఏరియాల్లో ఏం జరుగుతుందో సేకరించి ఉన్నతాధికారులకు సమాచారం అందించాల్సి ఉంటుంది. నిత్యం గస్తీ నిర్వహిస్తున్న బ్లూకోల్ట్ సిబ్బందికి, పెట్రోలింగ్ సిబ్బందికి ఇలాంటి పేకాట శిబిరాలు ఎందుకు కనిపించడం లేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ట్రైసిటీ పరిధి పోలీస్ స్టేషన్లు భూ పంచాయితీలు, సెటిల్మెంట్లకు ప్రాధాన్యం ఇస్తూ పేకాట శిబిరాల్ని విస్మరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.2026 (ఆగస్టు 6 వరకు)20252024 గత నెలలో ఆరు చోట్ల దాడులు పట్టుబడుతున్న బడా బాబులు పోలీస్ స్టేషన్లకు కూత వేటు దూరంలో పేకాట శిబిరాలు -
15 నుంచి స్మార్ట్ రేషన్కార్డుల పంపిణీ
హనుమకొండ ఇన్చార్జ్ కలెక్టర్ ఎన్.రవి హన్మకొండ అర్బన్: జిల్లాలో ఈనెల 15 నుంచి స్మార్ట్ రేషన్కార్డుల పంపిణీ ప్రారంభం కానుందని హనుమకొండ ఇన్చార్జ్ కలెక్టర్ ఎన్.రవి తెలిపారు. కలెక్టరేట్లోని పౌరసరఫరాల శాఖ కార్యాలయానికి చేరుకున్న కార్డులను శుక్రవారం ఆయన పరిశీలించి, పంపిణీ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని 14 మండలాలకు 2,56,838 స్మార్ట్ రేషన్కార్డులు చేరినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ కలెక్టర్ రవి మాట్లాడుతూ ప్రతి రేషన్ షాపు పరిధిలో లబ్ధిదారులకు కార్డులు సులభంగా, పారదర్శకంగా అందేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పంపిణీ ప్రక్రియను సమన్వయం చేసేందుకు ప్రతి మండలానికి నోడల్ అధికారులను నియమించనున్నట్లు తెలిపారు. జిల్లా పౌరసరఫరాల అధికారి మహేందర్, డీటీలు, సిబ్బంది పాల్గొన్నారు. సీఈఓకు పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రతిపాదనలు జిల్లాలో పోలింగ్ కేంద్రాల మార్పు, సర్దుబాటు, ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లను ఒకే పోలింగ్ కేంద్రానికి మార్చేందుకు రూపొందించిన రేషనలైజేషన్ ప్రతిపాదనలను ఈనెల 10న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి సమర్పించనున్నట్లు ఇన్చార్జ్ కలెక్టర్ ఎన్.రవి తెలిపారు. కలెక్టరేట్లో అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పలు కారణాలతో 14 పోలింగ్ కేంద్రాలను సమీపంలోని అనువైన భవనాలకు మార్చేందుకు ప్రతిపాదించారు. 1,200 మందికి పైగా ఓటర్లు ఉన్న రెండు పోలింగ్ కేంద్రాలను సమీప కేంద్రాల్లో సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. -
వరంగల్కు సీఎం రేవంత్రెడ్డి
● 16న ఉమ్మడి వరంగల్లో పర్యటన.. ● ములుగు కలెక్టరేట్ ప్రారంభం.. గట్టమ్మ వద్ద పైలాన్ ఆవిష్కరణ ● పరకాలలో ‘యంగ్ ఇండియా’కు శంకుస్థాపన.. అనంతరం బహిరంగ సభసాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ఈ నెల 16న ఉమ్మడి వరంగల్లో పర్యటించనున్నారు. ములుగు, హనుమకొండ జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పర్యటనలో భాగంగా ములుగు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ‘ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్’ సముదాయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం గట్టమ్మ గుడి వద్ద ఏర్పాటు చేసే పైలాన్ వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులు, కీలక ప్రజాప్రతినిధులకు సీఎంఓ నుంచి శుక్రవారం అధికారిక సమాచారం అందినట్లు తెలిసింది. అక్కడినుంచి పరకాలకు చేరుకోనున్న సీఎం రేవంత్.. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. వంద పడకల సివిల్ ఆస్పత్రి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాలను ప్రారంభిస్తారు. చివరగా పరకాలలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, భవిష్యత్లో చేపట్టనున్న పనులపై సీఎం మాట్లాడే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఏర్పాట్ల పరిశీలన.. పరకాల: ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పరకాలలో చేపడుతున్నట్లు ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించారు. స్థానిక పశువుల సంతలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభాస్థలిని సందర్శించారు. వేదిక, సభా ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. -
చేనేత కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
● పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి హన్మకొండ అర్బన్: చేనేత కార్మికుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. హనుమకొండ కలెక్టరేట్లో చేనేత, జౌళి శాఖ శుక్రవారం నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చేనేత భారతీయ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక అని అన్నారు. చేనేత ఉత్పత్తులకు మార్కెట్ విస్తరణ, ఆధునిక సాంకేతికత, నూతన డిజైన్లు, నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ప్రతిఒక్కరూ చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి నేతన్నలకు అండగా నిలవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. హనుమకొండ జిల్లా చేనేత కార్మికుల సమస్యలను సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. హనుమకొండ ఇన్న్చార్జ్ కలెక్టర్ రవి మాట్లాడుతూ చేనేత రంగానికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందన్నారు. అనంతరం జిల్లాలోని 774 మంది లబ్ధిదారులకు చేనేత భరోసా పథకం కింద మంజూరైన రూ.24 లక్షల చెక్కును ఎమ్మెల్యే, ఇన్న్చార్జ్ కలెక్టర్ పంపిణీ చేశారు. చేనేత కార్మికులను సన్మానించి, వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసపత్రాలు అందజేశారు. చేనేత వస్త్రాల విక్రయ స్టాల్ను సందర్శించిన ఎమ్మెల్యే చేనేత చీరను కొనుగోలు చేశారు. కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ అధికారులు, సంఘాల ప్రతినిధులు, కార్మికులు పాల్గొన్నారు. -
మంత్రి తుమ్మలను కలిసిన కాటన్ అసోసియేషన్ అధ్యక్షుడు
ఖిలా వరంగల్: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మార్కెటింగ్ శాఖ ఉన్నతాఽధికారులను కాటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కక్కిరాల రమేశ్ శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి, ఉన్నతాధికారులకు పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో సత్కరించారు. అనంతరం సమస్యలను వివరించగా.. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని వారు పేర్కొన్నారు. నిరుపేదలకు సంజీవని ఆరోగ్యశ్రీ● ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కేయూ క్యాంపస్: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్య శ్రీ పథకం నిరుపేదలకు సంజీవనిలా పని చేస్తోందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ అన్నారు. శుక్రవారం కేయూలోని ఫార్మసీ కళాశాలలో ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవం నిర్వహించారు. ఈసమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. గుండెజబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు ఉచిత శస్త్రచికిత్సలు చేయించి పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యంను కల్పించాలనే డిమాండ్తో 2004లో ఎమ్మార్పీఎస్ చేసిన ఉద్యమం ఫలితంగానే దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం పథకాన్ని అమలు చేసిందన్నారు. సమావేశంలో ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ జె.కృష్ణవేణి, ఫార్మసీ కళాశాల ప్రొఫెసర్ గాదె సమ్మయ్య, హాస్టళ్ల డైరెక్టర్ పి.శ్రీనివాస్, అంబేడ్కర్ స్టడీస్ సెంటర్ ఇన్చార్జ్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పుల్లా శ్రీనివాస్, డాక్టర్ సంకినేని వెంకట్, బి.తిరుపతి మాదిగ, కుమ్మరి శ్రీనాథ్, నాయకులు పాల్గొన్నారు. కళాశాల విద్యార్థులకు నోట్ బుక్స్ కాళోజీ సెంటర్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అనూహ్యమైన మార్పులు వస్తున్నాయని వరంగల్ డీఐఈఓ శ్రీధర్ సుమన్ తెలిపారు. విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలతోపాటు నోట్ బుక్స్, బ్యాగ్స్, షూ, స్టేషనరీ అందిస్తున్నట్లు వివరించారు. నగరంలోని కృష్ణాకాలనీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థినులకు ఉచితంగా రాతపుస్తకాల (అన్ రూల్డ్ నోట్ బుక్స్) పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని 2,704 మంది విద్యార్థులకు 32,448 నోట్ బుక్స్ పంపిణీ చేసినట్లు వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ హరికృష్ణ, లైబ్రేరియన్ వనమాల, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
నిట్ విద్యార్థులకు ప్రోత్సాహకాలు
కాజీపేట అర్బన్: నిట్ పూర్వ విద్యార్థులు, అల్యూమ్నీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన నిట్ విద్యార్థులకు 2026–27 సంవత్సరానికి గాను రూ.6.21 లక్షల స్కాలర్షిప్లను అందించారు. క్యాంపస్లోని అమీబా హాల్లో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన నిట్వా స్కాలర్షిప్స్ ప్రజెంటేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ హాజరై విద్యార్థులకు అందించి మాట్లాడారు. ఇక్కడ విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు ప్రస్తుతం చదువుకుంటున్న విద్యార్థులకు ప్రతీ ఏడాది మాదిరిగా ఈ ఏడాది కూడా ప్రోత్సాహకాలు అందించడం అభినందనీయమన్నారు. నిట్వా స్కాలర్షిప్స్ 2026–27లో భాగంగా 19 మందికి రూ.25 వేల చొప్పున, ఒక విద్యార్థికి 62 వేలు, ఇద్దరికి రూ.42 వేలు విలువైన ల్యాప్టాప్లు అందించారు. కార్యక్రమంలో నిట్ డీన్లు కిరణ్కుమార్, కిశోర్కుమార్, నిట్వా గ్లోబల్ ప్రెసిడెంట్ అశోక్యాదవ్, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, మురళీకృష్ణ, రామ, నాగశ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. హసన్పర్తి: ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక క్షేత్రమైన హసన్పర్తి మండల కేంద్రంలోని ఎర్రగట్టు గుట్ట గూగుల్ మ్యాప్స్లో మాయమైంది. ఎర్రగట్టుగుట్ట పేరుకు బదులు కౌకొండ గుట్టగా చూపిస్తుండడంతో పర్యాటకులు, భక్తులు అయోమయానికి గురవుతున్నారు. దూర ప్రాంతాల నుంచి గూగుల్ మ్యాప్స్ ఆధారంగా వచ్చే భక్తులు, సందర్శకులు గమ్యస్థానాన్ని గుర్తించడంలో ఇబ్బందులు పడుతున్నారు. దశాబ్దాలుగా ఎర్రగట్టు గుట్టగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతాన్ని వేరే పేరుతో ఆన్లైన్లో చూపిస్తుండడంతో ఈ ప్రాంత చారిత్రక, ఆధ్యాత్మిక గుర్తింపు దెబ్బతింటోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేయూ క్యాంపస్: విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని కేయూ ఓఎస్డీ ప్రొఫెసర్ బి.వెంకట్రాంరెడ్డి సూచించారు. కేయూ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం విద్యార్థినులకు శుక్రవారం ఓరియెంటేషన్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. అధ్యాపకుల మార్గదర్శకత్వం, ఇంటర్నెట్, ఏఐ, ఆన్లైన్ వీడియో లెక్చర్లు, డిజిటల్ లెర్నింగ్ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని కోరారు. నిట్ ప్రొఫెసర్ బి.స్ఫూర్తి మాట్లాడుతూ కళాశాల జీవితం విద్యార్థినుల వ్యక్తిత్వ వికాసానికి అత్యంత కీలకమైన దశ అని అన్నారు. కేయూ మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ కె.భిక్షాలు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కళాశాల కల్పిస్తున్న సదుపాయాలు, అకడమిక్ కార్యక్రమాలు, సహపాఠ్య కార్యక్రమాల గురించి వివరించారు. ఈనెల 11 నుంచి 16 వరకు నూతన విద్యార్థినులకు ఇండక్షన్ ప్రోగ్రాం గురించి కన్వీనర్ ఎస్.సాహితి, సహ కన్వీనర్ టి.వెంకటేశ్, ఇన్చార్జ్ డాక్టర్ శ్రీరామ్జ్యోత్స్న తెలిపారు. విద్యారణ్యపురి: పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని, డీఏలు విడుదల చేయాలని, పీఆర్సీ వెంటనే ప్రకటించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ హనుమకొండ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పెండెం రాజు, జి ఉప్పలయ్య డిమాండ్ చేశారు. హనుమకొండ జిల్లా ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల శిక్షణ తరగతులను హనుమకొండ ప్రభుత్వ డైట్ కళాశాలలో నిర్వహిస్తున్నారు. శిక్షణలో భాగంగా శుక్రవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే ఈనెల 19న జిల్లా కేంద్రాలు, ఈనెల 29న హైదరాబాద్లో ఇందిరాపార్కు వద్ద ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఉపాధ్యాయ సంఘాల నేతలు సీఎస్ఆర్ మల్లిక్, బి.వెంకటేశ్వర్రావు, నరేశ్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
నేత కళాకారులకు అవార్డులు
కాశిబుగ్గ: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుకు ఓరుగల్లుకు చెందిన నేత కళాకారులు గోరంట్ల రాజు, కంచ సమత ఎంపికయ్యారు. ఈనేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్లో జరిగిన చేనేత దినోత్సవ వేడుకలను చేనేత జౌళిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సవ్యసాచి గోష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈసందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పంచాయత్రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క, చేనేత కార్పొరేషన్ చైర్మన్ దూడం వెంకటరమణ, వైస్ చైర్మన్ జక్కని అనిత చేతుల మీదుగా కళాకారులకు అవార్డులు అందజేసినట్లు టీపీసీసీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చిప్ప వెంకటేశ్వర్లు తెలిపారు. అవార్డు కింద రూ.25వేల నగదు, మెమొంటో, ప్రశంస పత్రంతో పాటు సన్మానించినట్లు ఆయన పేర్కొన్నారు. -
మహిళా సాఽధికారతకు ప్రభుత్వం పెద్దపీట
హసన్పర్తి: మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణ మండపంలో 65, 66వ డివిజన్ల మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసి మాట్లాడారు. హసన్పర్తికి మంజూరైన తెలంగాణ పబ్లిక్ స్కూల్కు స్థల పరిశీలన చేస్తున్నట్లు చెప్పారు. అలాగే, క్రీడా మైదానం కోసం రెండెకరాల స్థలం సేకరిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి నిరంతర ప్రక్రియ నియోజకవర్గంలో అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని ఎమ్మెల్యే నాగరాజు పేర్కొన్నారు. గ్రేటర్ ఒకటో డివిజన్లోని పద్మావతినగర్కాలనీ, శ్రీనివాసకాలనీ, ఆనంద్నగర్కాలనీ, దుర్గాకాలనీ, బాలాజీ నగర్లో సుమారు రూ.2.65 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. డివిజన్ అధ్యక్షులు గొర్రె కిరణ్, సునీల్, గడ్డం అరుణ్, చిర్ర రాము, కనపర్తి కిరణ్, పొన్నాల రఘు, దేవరకొండ అనిల్, ఎన్ఎస్యూఐ జిల్లా మాజీ అధ్యక్షుడు వీసం సురేందర్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏరుకొండ శ్రీనివాస్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అశోక్, వెంకటస్వామి, వెంకటేశ్వర్లు, గడ్డం శివరాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు -
మంత్రికి పండుగల నివేదిక అందజేత
హన్మకొండ కల్చరల్: కొన్నేళ్లుగా హిందువుల పండుగల తేదీల్లో గందరగోళం ఏర్పడుతోంది. ఈనేపథ్యంలో తెలంగాణ ధృక్ సిద్ధాంత పంచాంగకర్తలు పండుగల తేదీల నిర్ణయాలను శాస్త్రబద్ధంగా పరిశీలించి తీర్మానించారు. ఈమేరకు శుక్రవారం హైదరాబాద్లో ఽతెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో దేవాదాయధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కలిశారు. ధృక్ సిద్ధాంత పంచాంగకర్తల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు అవసరాల ప్రసాద్శర్మ, సిద్ధాంతి పురోహితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాండ్ర నాగేంద్రశర్మ, ధూపదీప వైవేద్య రాష్ట్ర అర్చక సమాఖ్య అధ్యక్షులు పెరంబదూర్ శ్రీకాంత్ మంత్రికి నివేదికను అందించారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. పండితులు అందించిన నివేదికను దేవాదాయశాఖ, మున్సిపల్ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, పౌర సంబంధాల శాఖ అధికారులతో చర్చించి గ్రామస్థాయి పురోహితులకు, అన్ని కులాల అర్చకులకు ప్రభుత్వం ద్వారా ముందస్తుగా పండుగల వివరాలు అందిస్తామని పేర్కొన్నారు. -
ఉత్సాహంగా రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు
పరుగు పందెంలో పాల్గొన్న బాలలు జంప్ చేస్తున్న బాలుడువరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో తెలంగాణ రాష్ట్రస్థాయి 1వ పిల్లల అథ్లెటిక్స్ పోటీలు, జావెలిన్ డే వేడుకలు శుక్రవారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు జరగనున్న అథ్లెటిక్స్ మీట్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 1,757 మంది అథ్లెట్లు హాజరైనట్లు తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ నిర్వహణ కార్యదర్శి పగడాల వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. అండర్–06, 08, 10, 12 బాలబాలికలు, యూత్ విభాగంలో అండర్–18 తో పాటు అండర్–14, 16, 20 మెన్ అండ్ ఉమెన్ విభాగాల్లో పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదటి రోజు పిల్లల అథ్లెటిక్స్, జావెలిన్ త్రో పోటీలు ముగిసినట్లు తెలిపారు. రెండో రోజు యూత్ విభాగంలోని అండర్–18 బాలబాలికలకు వివిధ కేటగిరీల్లో పోటీలు ఉంటాయని వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. జావెలిన్ త్రో, డిస్కస్ త్రో, షాట్పుట్, హై జంప్, లాంగ్ జంప్, రన్నింగ్ లాంటి మెత్తం 60 ఈవెంట్లలో పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హనుమకొండ జేఎన్ఎస్లో ప్రారంభం వివిధ జిల్లాల నుంచి హాజరైన 1,757 మంది క్రీడాకారులు -
తిరుపతి–కరీంనగర్ ఎక్స్ప్రెస్ వేళలో మార్పు
● అక్టోబర్ 10 నుంచి అమలు కాజీపేట రూరల్: తిరుపతి నుంచి కరీంనగర్ (12761)కు వయా గూడూరు, విజయవాడ, వరంగల్, పెద్దపల్లి మీదుగా వెళ్లే బై వీక్లీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వేళలో స్వల్ప మార్పులు చేసినట్లు శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి ప్రతి బుధ, శనివారాల్లో రాత్రి 08ః05 గంటలకు బయల్దేరే ఈ ఎక్స్ప్రెస్ రాత్రి 07ః50 గంటలకు బయల్దేరుతుందని దెలిపారు. తిరుపతి నుంచి 15 నిమిషాల ముందే బయల్దేరేలా సమయం మార్చినట్లు తెలిపారు. ఈ మార్పు అక్టోబర్ 10వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని సీపీఆర్వో స్పష్టం చేశారు. శాయంపేట : ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ, పర్యావ రణ పరిరక్షణ ఐక్యవేదిక సభ్యు డు మారెపల్లి సునీల్ ఓ పునుగు పిల్లిని అట వీశాఖ అధికారులకు అప్పగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హనుమకొండ జిల్లా శాయంపేటలో శుక్రవారం రోడ్డుపై పునుగు పిల్లి అపస్మారక స్థితిలో పడి ఉండడంతో పశువైద్యశాలలో ప్రథమ చికిత్స చేయించిన ట్లు తెలిపారు. పునుగు పిల్లికి మెరుగైన వైద్యం కోసం అటవీ శాఖ డిప్యూటీ రేంజర్ కోటేశ్వర్ రావు, వాచర్ అశోక్ జిల్లా పశువైద్యశాలకు తీసుకెళ్లినట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి సునీల్, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. జనగణన హ్యాండ్బుక్కు వివరాలు సేకరించాలి న్యూశాయంపేట: జనగణన –2027 కార్యక్రమంలో భాగంగా జిల్లా జనగణన హ్యాండ్బుక్ తయారీకి అవసరమైన గ్రామ డైరెక్టరీ, పట్టణ డైరెక్టరీ వివరాల సేకరణను నిర్ణీత గడువులోపు పూర్తిచేసి అందజేయాలని రాష్ట్ర జనగణన సంచాలకులు భారతి హోళికేరి సూచించారు. హైదరాబాద్ నుంచి ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. వరంగల్ కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, సీపీఓ చంద్రకళ పాల్గొన్నారు. పీఆర్సీ ప్రకటించాలి కాళోజీ సెంటర్: ఉపాధ్యాయుల పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, పెండింగ్ డీఏలపై జీఓ జారీ చేయాలని, సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని టీపీటీఎఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఊటుకూరి అశోక్ డిమాండ్ చేశారు. యూపీఎస్సీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రంగశాయిపేట ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన నిరసనలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చేంత వరకు ఉపాధ్యాయులు రోజూ పాఠశాలకు నల్ల బ్యాడ్జీలతోనే హాజరవుతారని స్పష్టం చేశారు. టీపీటీఎఫ్ జిల్లా ప్రధా న కార్యదర్శి పి.వీరాచారి, ఉపాధ్యాయులు ప్రవీణ్ కుమార్, టి.సునీల్కుమార్, ఎం.ఉషారాణి, టి.జ్యోతి, పాల్గొన్నారు. -
ఓరుగల్లుకు పోలీస్ బాస్
సాక్షి ప్రతినిధి, వరంగల్ : రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ఉమ్మడి వరంగల్లో మూడు రోజులపాటు పర్యటించనున్నారు. శనివారంనుంచి సోమవారం వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్తోపాటు ఉమ్మడి వరంగల్లోని జిల్లాల పోలీస్ అధికారులతో ఆయన వరుసగా సమీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం. తెలంగాణ పోలీసింగ్లో కొత్త విధానాలకు శ్రీకారం చుడుతున్న ఆయన జిల్లాల వారీగా శాంతిభద్రతలు, నేర నియంత్రణ, పెండింగ్ కేసులు, దర్యాప్తు తీరుతెన్నులు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాలపై చర్చించి తగు సూచనలు చేయనున్నారని తెలిసింది. మొదట ఈ పర్యటన జూలై 30, 31 తేదీల్లో ఉన్నట్లు ప్రకటించినప్పటికీ వర్షాల కారణంగా వాయిదా పడింది. డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీవీ ఆనంద్ మొదటిసారి ఉమ్మడి వరంగల్ జిల్లాలో శనివారం నుంచి పర్యటిస్తున్నారు. మూడు రోజులు.. మూడు దశల్లో సమీక్షలు శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బయల్దేరనున్న డీజీపీ సీవీ ఆనంద్ నేరుగా మామునూరు బెటాలియన్కు చేరుకుంటారని తెలిసింది. అక్కడ వివిధ స్థాయిల అధికారులతో సమీక్ష జరిపిన అనంతరం హనుమకొండ సిటీకి చేరుకుని నక్కలగుట్టలోని హరిత కాకతీయలో రాత్రి బస చేయనున్నట్లు సమాచారం. 9న ఉదయం వరంగల్ కమిషనరేట్ కార్యాలయం సందర్శన అనంతరం సీపీ, అడిషనల్ డీసీపీలు, డీసీపీలు, ఏసీపీలు, ఇతర అధికారులతో సమావేశం అవుతారు. సాయంత్రం వరంగల్ నుంచి బయల్దేరి ములుగు జిల్లాకు వెళ్తారని సమాచారం. సమీక్షలో భాగంగా ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల అధికారులతో సమావేశం కానుండగా, ఆయా జిల్లాల ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొని పోలీసింగ్ పనితీరుపై వివరాలు అందించనున్నారని తెలిసింది. నేటినుంచి మూడు రోజులువరుస సమీక్షలు ఎస్పీలు, పోలీస్ అధికారులతో భేటీ డీజీపీగా తొలిసారి సీవీ ఆనంద్ రాక -
అథ్లెటిక్ ఈవెంట్ కాదు..!
వరంగల్ స్పోర్ట్స్: ఇలా తీగలను దాటడం కూడా అథ్లెటిక్స్ పోటీల్లో ఓ ఈవెంట్ అని అనుకుంటే పొరబడినట్లే. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్ లోపలికి వెళ్లే ప్రధాన గేటు దాటగానే కుడి వైపు సైడ్ట్రాక్కు అడ్డుగా ఇనుప తీగలను కట్టారు. అటు వైపు వెళ్లే అథ్లెట్లు తీగలను దాటేందుకు ఫీట్లు చేయక తప్పలేదు. కొందరు పిల్లలు తీగలను గమనించకపోవడంతో మెడకు తగిలి పడిపోయారు. హనుమకొండలోని జేఎన్ఎస్లో శుక్రవారం రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు జరిగే పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన అథ్లెట్లు వారి తల్లిదండ్రులు, టెక్నికల్ అఫీషియల్స్ ఇనుప తీగలతో ఇబ్బందులు పడ్డారు. -
విచారణపై అనుమానాలు!
హన్మకొండ చౌరస్తా: ‘నవ్విపోతురుగాక నాకేంటి సిగ్గు’ అన్నట్లుగా ఉంది ఐటీఐ అధికారుల తీరు. పిల్లలకు విద్యాబుద్దులు చెప్పాల్సిన ఐటీఐ అధికా రులే దారి తప్పి ప్రవర్తిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చట్టాలను మీరుతూ రాజకీయ సభలో పాల్గొన్నారంటూ ఉద్యోగులపై వచ్చిన ఫిర్యాదుతో నిష్పక్షపాతంగా విచారణ చేయాల్సిన అధికారులు మమ అనిపించి చేతులు దులుపుకున్నారు. విచారణకు ఆదేశించి నెల రోజులు గడుస్తున్నా నిజాలు బయటిపెట్టకుండా సదరు ఉద్యోగులను కాపాడుకునేందుకు ఉత్తుత్తి విచారణ చేపట్టి ఉన్నతాధికారులను సైతం పక్కదోవపట్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయ సభలో పాల్గొనడంపై ఫిర్యాదు.. హైదరాబాద్లోని ఎంప్లాయ్మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్లో ట్రెయినింగ్ ఆఫీసర్గా ఉన్న ఓంకార్ (ప్రస్తుతం మహబూబాబాద్ ఐటీఐ ప్రిన్సిపాల్గా ఉన్నారు.), పెద్దపల్లి ఐటీఐ ట్రైనింగ్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న మల్లికార్జున్ ఫిబ్రవరి 02, 2025లో హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీలో ఓ రాజకీయ పార్టీ నిర్వహించిన బీసీ రాజకీయ యుద్ధభేరి సభలో పాల్గొన్నారంటూ ఫిర్యాదు. విధి నిర్వహణలో కొనసాగుతూనే రాజకీయ సభలో పాల్గొనడంపై ఓ వ్యక్తి ఎంప్లాయ్మెంట్ డైరెక్టర్, గవర్నర్, ముఖ్యమంత్రికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో ఎంప్లాయ్మెంట్ డైరెక్టర్ విచారణకు ఆదేశిస్తూ కమిటీని నియమించారు. డైరెక్టర్ ఆదేశాలతో ఈ ఏడాది జూన్ 25న హైదరాబాద్ ఆర్డీడీ నర్సయ్య, వరంగల్ ఐటీఐ ప్రిన్సిపాల్ చందర్.. మహబూబ్బాద్ ఐటీఐ ప్రిన్సిపాల్ ఓంకార్, పెద్దపల్లి ట్రైనింగ్ ఆఫీసర్ మల్లికార్జున్ను వరంగల్లోని ఐటీఐ ప్రిన్సిపాల్ ఆఫీస్లో విచారించారు. కానీ, అందుకు సంబంధించిన నివేదిక రూపొందించి ఉన్నతాధికారులకు అందించ చర్య లో జాప్యం నెలకొనడంపై విమర్శలు వస్తున్నాయి. ఐటీఐ ప్రిన్సిపాల్, ట్రైనింగ్ ఆఫీసర్పై విచారణ రాజకీయ సభలో పాల్గొన్నారంటూ ఫిర్యాదు అధికారుల తీరుపై విమర్శలుఓంకార్, మల్లికార్జున్ లపై వచ్చిన ఫిర్యాదుపై డైరెక్టర్ ఆదేశాలతో జూన్ 25న విచారణ జరిగింది వాస్తవమే. విచారణ కమిటీ చైర్మన్గా హైదరాబాద్ ఆర్డీడీ నర్సయ్య, సభ్యుడిగా నేను ఉన్నాం. అయితే ఫిర్యాదు ఎదుర్కొంటున్న వారిద్దరు, నేను ఒక్కటే అసోసియేషన్కు చెందిన వారమని తెలిపాను. దీంతో ఆర్డీడీ నర్సయ్య మరో కమిటీ వేసి మరోసారి విచారణ చేయాలని ఎంప్లాయ్మెంట్ డైరెక్టర్కు నివేదించారు. తదుపతి కమిటీ విచారణ చేసే వరకు వేచిచూడాల్సిందే. – చందర్, ప్రిన్సిపాల్ ఐటీఐ వరంగల్విచారణ చేపట్టి నెల రోజులు గడిచినా ఎలాంటి చర్యలు లేకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. విచారణ కమిటీ సభ్యుడిగా ఉన్న వరంగల్ ఐటీఐ ప్రిన్సిపాల్ చందర్.. తెలంగాణ టెక్నికల్ అసోసియేషన్లో బాధ్యుడు కాగా, అభియోగాలను ఎదుర్కొంటున్న ఆ ఇద్దరు అధికారులు సైతం అదే అసోసియేషన్ బాధ్యులని తెలిసింది. సన్నిహితులు అయినందునే విచారణను నీరుగార్చే ప్రయత్నాలు సాగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
డయాబెటిస్.. హైపర్టెన్షన్
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లాలో డయాబెటిస్, హైపర్టెన్షన్ వ్యాధులు కలవరపెడుతున్నాయి. ఒకప్పుడు 50 ఏళ్లు దాటితేనే వచ్చే వ్యాధులుగా భావించిన మధుమేహం (డయాబెటిస్), రక్తపోటు (హైపర్టెన్షన్).. ఇప్పుడు 30 నుంచి 40 ఏళ్ల వయస్సులోనే చాలామందిని చుట్టుముడుతున్నాయి. ఆహారపు అలవాట్లలో మార్పులు, శారీరక శ్రమ తగ్గడం, ఒత్తిడి, ఊబకాయం, నిద్రలేమి, కుటుంబ సంబంధిత కారణాలు అసంక్రమిత వ్యాధులను వేగంగా వ్యాప్తి చేస్తున్నాయి. జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటికే మధుమేహం కేసులు 1,136, రక్తపోటు కేసులు 1,377 పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గ్రామం నుంచి నగరం వరకు సర్వే.. ప్రతిఏటా అసంక్రమిత వ్యాధుల నివారణ పేరుతో గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో వైద్యారోగ్యశాఖ సర్వే నిర్వహిస్తోంది. రక్తపోటు, మధుమేహంతో బాధపడే వారిని గుర్తించి సమీప ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు తగిన వైద్యం అందిస్తున్నారు. రోగులకు నెలకు సరిపడా మందులను ఉచితంగా అందజేస్తున్నారు. ప్రతినెలా ఆరోగ్య కేంద్రాలకు పిలిపించి వ్యాధి తీవ్రతను తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆహార నియమాలు, వ్యాయామాలపై సూచనలు అందిస్తున్నారు. ఈ లక్షణాలు ఉంటే ఆలస్యం చేయొద్దు.. డయాబెటిస్: తరచూ దాహం వేయడం, ఎక్కువగా మూత్రం రావడం, బరువు తగ్గడం, త్వరగా అలసిపోవడం, చూపు మసకబారడం నిర్లక్ష్యం చేస్తే: మధుమేహం నిశ్శబ్దంగా శరీరంలోని కిడ్నీలు, కళ్లు, గుండె, నరాలపై ప్రభావం చూపుతుంది. రక్తపోటు: తలనొప్పి, తల తిరగడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ఛాతిలో బరువుగా అనిపించడం, కొన్నిసార్లు ఎలాంటి లక్షణాలూ ఉండకపోవడం నిర్లక్ష్యం చేస్తే: గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండాల సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోగులకు సరిపడా మందులు ఇస్తున్నాం.. షుగర్, బీపీ రాకముందే జీవనశైలిని మార్చుకోవడం ఉత్తమ ఔషధం. కనీసం సంవత్సరంలో ఒకసారి రక్తంలో చక్కెర, రక్తపోటు పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం ఉచిత వైద్య పరీక్షలు, సరిపడా మందులు ఇస్తోంది. – రాజారెడ్డి, డీఎంహెచ్ఓ, వరంగల్ వరంగల్ జిల్లాలో పెరుగుతున్న మధుమేహం, రక్తపోటు కేసులు ఆరోగ్య నియమాలు పాటించాలంటున్న వైద్యులు -
డిజైన్ వస్త్రాల ఉత్పత్తితో ఆదాయం
కాశిబుగ్గ: చేనేత కార్మికులు కాలానుగుణంగా మార్కెటింగ్ పెంచుకోవడానికి, ఆర్థికాభివృద్ధికి నూతన డిజైన్ల వస్త్రాలను ఉత్పత్తి చేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా వరంగల్ కొత్తవాడలో చేనేత వాక్ను శుక్రవారం ప్రారంభించారు. అనంతరం పద్మశాలి ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. చేనేత కళ అంతరించిపోకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. లేటెస్ట్ డిజైన్లతో కూడిన ఉత్పత్తులను చేస్తే మార్కెట్లో డిమాండ్ పెరుగుతుందని చెప్పారు. కొత్తవాడ దర్రీస్కు ప్రపంచస్థాయిలో ఎంతో గుర్తింపు ఉందని వివరించారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ చేనేత కార్మికులు మార్కెట్కు తగిన ఉత్పత్తులు చేసి, చేనేత సంఘాలు పరిపుష్ఠి అయ్యేలా కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఏడీ వై.శ్రీకాంత్రెడ్డి, ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ నర్సింహమూర్తి, డెవలప్మెంట్ ఆఫీసర్ సుధీర్, సమాఖ్య అధ్యక్షుడు పంతగాని శ్రీనివాస్, డీఎస్ మూర్తి, ఝెలుగం కొమురయ్య, ఝెలుగం రవిరాజ్, విజయ్కుమార్, గుండేటి నరేంద్రకుమార్, యెలుగం సాంబయ్య, రాంనర్సయ్య పాల్గొన్నారు. ఈవీఎంల స్ట్రాంగ్ రూం పరిశీలన ఖిలా వరంగల్: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లోని ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూంను అదనపు కలెక్టర్ సంధ్యారాణి, తహసీల్దార్ శ్రీకాంత్, ఎన్నికల సూపరింటెండెంట్ రజినీతో కలిసి వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద శుక్రవారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా స్ట్రాంట్ రూమ్ వద్ద భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. ఈవీఎంల భద్రత విషయంలో ఎన్నికల సంఘం నిబంధనలను కచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు. ‘సుకన్య సమృద్ధి’ ఉపయోగకరం బాలికల భవిష్యత్ విద్య, ఉన్నత చదువులు, వివాహ అవసరాలకు సుకన్య సమృద్ధి యోజన పథకం ఎంతో ఉపయోగకరమని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా వరంగల్ ప్రాజెక్టు లక్ష్మీనగర్ సెక్టార్ విద్యానగర్ ఎస్సీ కాలనీ అంగన్వాడీ కేంద్రాన్ని వరంగల్ జిల్లా సంక్షేమ శాఖ అధికారి బి.రాజమణి, సీడీపీఓ విద్యతో కలిసి ఆమె శుక్రవారం సందర్శించారు. గర్భిణులకు పండ్ల బుట్టల ను కలెక్టర్ అందజేశారు. అనంతరం గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు ఆటపాటలతో కూడిన విద్యను అందించాలని అంగన్వాడీ టీచర్లకు సూచించారు. వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
టెక్నాలజీతో విద్యుత్ సరఫరాను బలోపేతం చేయాలి
హన్మకొండ: విద్యుత్ సరఫరా వ్యవస్థ మరింత బలోపేతం అయ్యేందుకు ఆధునిక సాంకేతిక పరి జ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాలని ఇంధన శా ఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్ట ల్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో హనుమకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాల యం నుంచి సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి, డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లు, చీఫ్ జనరల్ మేనేజర్లు పాల్గొన్నా రు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ముందుగా వరుణ్ రె డ్డి పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఎన్పీడీసీఎ ల్ పరిధిలో చేపట్టనున్న కార్యక్రమాలు, అమలవుతున్న కార్యక్రమాలపై వివరించారు. ఇందులో 33/ 11 కెవీ సబ్స్టేషన్లలో సోలార్, బ్యాటరీ ఎనర్జీ స్టోరే జ్ సిస్టమ్ ఏర్పాటు, రియాక్టివ్ పవర్ కాంపెన్సేషన్ కోసం 2 ఎంవీఏఆర్ కెపాసిటర్ బ్యాంకుల ఏర్పాటు గురించి వివరించారు. రోజు రోజుకు వి ద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో పీక్ అవర్స్లో విద్యుత్ అవసరాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు 33/11 కేవీ సబ్స్టేషన్ల వద్ద సోలార్, బ్యాటరీ స్టోరేజ్ ఏర్పాటు చేసే ప్రతిపాదనను వివరించారు. ఛార్జింగ్ సమయంలో ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ నష్టాలను తగ్గించడంతో పాటు అదనపు గ్రిడ్ లోడింగ్ను నివారించవచ్చని చెప్పారు. 33 కేవీ ఫీడర్లపై రియాక్టివ్ కరెంట్ను తగ్గించడం లక్ష్యంగా 347 సబ్స్టేషన్లలో 2 ఎంవీఏఆర్ కెపాసిటర్ బ్యాంకులు పెట్టామన్నారు. 2 ఎంవీఏఆర్ కెపాసిటర్ బ్యాంకు కరెంట్ను తగ్గించి పవర్ ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యాన్ని పెంచుతుందన్నారు. డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, సీఈలు కె.తిరుమల్ రావు, అశోక్, మాధవ రావు, కె.వెంకటరమణ, అన్నపూర్ణ, సురేందర్, నాగ ప్రసాద్, గౌతమ్ రెడ్డి, సీజీఎంలు చరణ్ దాస్, కిషన్, వేణు బాబు, జీఎం ప్రభావతి, డీఈలు కె.అనిల్ కుమార్, భాస్కర్ పాల్గొన్నారు. ఇంధన శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ -
కాకతీయుల వారసత్వ సంపద అద్భుతం
రిటైర్డ్ ఐఏఎస్ కేకే ఛాత్రత్ కాజీపేట అర్బన్: కాకతీయుల వారసత్వ సంపద అద్భుతమని 1967 బ్యాచ్ ఒడిశా రిటైర్డ్ ఐఏఎస్ కె.కె.ఛత్రత్ అన్నారు. కాజీపేట మండలం మడికొండలోని దక్షిణకాశీగా పేరుగాంచిన మెట్టురామలింగేశ్వరస్వామి ఆలయాన్ని రిటైర్డ్ ఐఏఎస్ ఛత్రత్ గురువారం సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. మెట్టుగుట్టపై ఉన్న దొంతులమ్మ గుండాలను, జీడి గుండంలోని భీముడి పాదముద్రలను పరిశీలించి వివరాలను అర్చకులను అడిగి తెలుసుకున్నారు. పురావస్తు కళాఖండాలను దర్శించుకోవాలనే కాంక్షతో ఓరుగల్లుకు విచ్చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ సత్యనారాయణ, రఘుచందర్, అర్చకులు రాగిచేడు అభిలాష్ శర్మ, పరాశరం విష్ణువర్ధనాచార్యులు, పారుపల్లి సత్యనారాయణశర్మ పాల్గొన్నారు. -
పనులు వేగిరం చేయండి
శుక్రవారం శ్రీ 7 శ్రీ ఆగస్టు శ్రీ 2026జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలో నిర్మాణంలో ఉన్న పరిపాలన భవన నిర్మాణ పనుల పురోగతిని గురువారం కమిషనర్ టి.వెంకన్న తనిఖీ చేశారు. పనులు వేగవంతం చేసి, గడువులోగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారుల కు పలు సూచనలిచ్చారు. మ్యూజియం ప్రాంగణంలోని శిల్పాలను పురావస్తు శాఖ ద్వారా సురక్షితంగా తగిన ప్రదేశానికి తరలించేలా చర్యలు తీసుకో వాలని సూచించారు. ఆయన వెంట సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజ్కుమార్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రోజా, ఇంజనీరింగ్ అధికారులున్నారు. జయశంకర్ను స్ఫూర్తిగా తీసుకోవాలి.. గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించారు. కమిషనర్ టి.వెంకన్న పాల్గొని జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన వెంట అదనపు కమిషనర్ ఈసంపల్లి జోనా, ఎస్ఈ రాజ్కుమార్, సిటీప్లానర్ రవీందర్ రాడేకర్, సీహెచ్ఓ లక్ష్మారెడ్డి, ఉప కమిషనర్లు బిర్రు శ్రీనివాస్, ప్రసన్నరాణి, సమ్మయ్య, కార్యదర్శి అనిల్ బాబు, ఎంహెచ్ఓ రాజేశ్, అకౌంట్స్ అధికారి శివలింగం, సూపరింటెండెంట్ బాకం సంతోశ్ తదితరులు పాల్గొన్నారు. -
అమృత్ భారత్ పనుల తనిఖీ
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్లో కొనసాగుతున్న అమృత్ భారత్ స్టేషన్ రీ డెవలప్మెంట్ పనులను గురువారం సికింద్రాబాద్ డివిజన్ అడిషనల్ రైల్వే మేనేజర్ (ఐ) ముత్యాలనాయుడు తనిఖీ చేశారు. ఆయన సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక స్పిక్లో కాజీపేట జంక్షన్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏడీఆర్ఎం ముత్యాల నాయుడు కాజీపేట జంక్షన్ లోపల, స్టేషన్ బయట జరుగుతున్న అమృత్ భారత్ పనులు క్షణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం స్పిక్లో సికింద్రాబాద్కు తరలివెళ్లారు. ఆయన వెంట సికింద్రాబాద్ డీఈఎన్ సెంట్రల్ ప్రంజల్ కేశర్వాణి, కాజీపేట రైల్వే స్టేషన్ మేనేజర్ అగ్గి రవీందర్, కమర్షియల్ ఇన్స్పెక్టర్ రాజ్గోపాల్, రైల్వే ఐఓడబ్ల్యూ శ్రీనివాస్, సూపర్వైజర్లు పాల్గొన్నారు. హన్మకొండ అర్బన్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలందించడంలో ఫార్మసీ అధికారులు, నర్సింగ్ అధికారులు సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించాలని హనుమకొండ డీఎంహెచ్ఓ ఎ.అప్పయ్య సూచించారు. గురువారం కలెక్టరేట్లో ఫార్మసీ అధికారులు, నర్సింగ్ అధికారులతో ఆయన వేర్వేరుగా సమీక్షించారు. ఈసందర్భంగా డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ.. ఫార్మసీ అధికారులు ఈ–ఔషధి పోర్టల్లో మందుల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయడంతో పాటు అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా 24 గంటలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే మాత్రమే రిఫర్ చేయాలని సూచించారు. సమావేశాల్లో అదనపు డీఎంహెచ్ఓ డాక్టర్ టి. మదన్మోహన్ రావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రదీప్రెడ్డి, మాతా–శిశు సంక్షేమ కార్యక్రమ అధికారి రజిత, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి శ్రీకృష్ణారావు, ఎన్సీడీ కార్యక్రమ అధికారి డాక్టర్ మురళి, డెమో అశోక్ రెడ్డి పాల్గొన్నారు. కాజీపేట: ఈఏడాది ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో మిగిలిన సీట్లలో చేరేందుకు రెండో విడత దరఖాస్తుల స్వీకరణ గడువు ఈ నెల 15 వరకు పెంచినట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ పొన్నాల వేణు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానికల్ ట్రేడ్లలో (ఏటీసీ కోర్సులు) అడ్వాన్స్డ్ సీఎస్సీ మెషినింగ్ టెక్నీషియన్, ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్, మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్, ఇండస్ట్రియల్ రోబొటిక్స్ డిజిటల్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్లో శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. iti.telangana.gov.in వెబ్సైట్లో రూ.100 రుసుంతో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మొదటి విడత దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్లు మాత్రమే మార్చుకోవాలని ప్రిన్సిపాల్ సూచించారు. కాజీపేట అర్బన్: ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి ప్రాణాలు కాపాడడం అభినందనీయమని వరంగల్ పొలీస్ కమిషనర్ శ్వేత.. మడికొండ పీఎస్ కానిస్టేబుళ్లు సంపత్, గోవర్ధన్ను గురువారం అభినందించారు. కాజీపేట మండలం అమ్మవారిపేటలోని సాయినాథ్ వెంచర్ ప్రాంతంలో రెండు రోజుల క్రితం కరీమాబాద్కు చెందిన మెరుగు పవన్ ఆర్థిక ఇబ్బందులతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన మడికొండ కానిస్టేబుళ్లు పవన్ను రక్షించి చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి ప్రాణాలను కాపాడినందుకు కానిస్టేబుళ్లు గోవర్ధన్, సంపత్ను సీపీ శ్వేతరెడ్డి నగదు పురస్కారం అందించి సత్కరించారు. కార్యక్రమంలో డీసీపీ దార కవిత, మడికొండ ఇన్స్పెక్టర్ పుల్యాల కిషన్, ఎస్సైలు రాజబాబు, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఎంజీఎంలో రోగులకు నాసిరకం భోజనం
డైట్ కాంట్రాక్టర్ను తొలగించాలి: సీపీఎం కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న భోజనం నాసిరకంగా ఉందని, వెంటనే డైట్ కాంట్రాక్టర్ను తొలగించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. గురువారం పార్టీ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆస్పత్రి సమస్యలపై క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించారు. ఈసందర్భంగా వారు చికిత్స పొందుతున్న రోగులు, వారి అటెండెంట్లతో మాట్లాడి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. భోజనం నాసిరకంగా ఉందని, అన్నం సరిగ్గా ఉడక్కపోవడం, తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు రోగులు వారి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై నాయకులు.. సంబంధిత కాంట్రాక్టర్ను ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని వారు పేర్కొన్నారు. డయాలసిస్ రోగులకు అవసరమైన కిట్లు, మందులివ్వకుండా, బయట కొనాలని వైద్యులు చెబుతున్నట్లు సీపీఎం నాయకులకు రోగులు విన్నవించారు. దీనివల్ల ప్రతీవారం రోగులపై అదనపు ఖర్చు కావడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం నాయకుడు సింగారపు బాబు తెలిపారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు అరుణ్కుమార్, ఎండీ.మహబూబ్ పాషా, ఎన్.చంద్రమౌళి, సింగారం చుక్కయ్య, రాజమణి, అనిల్, శివ పాల్గొన్నారు. -
హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమిస్తాం
కాశిబుగ్గ: సమాన పని–సమాన స్టైఫండ్ నినాదంతో హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని తెలంగాణ ఆయుష్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు తెలిపారు. ఆయుష్ జేఏసీ ఆధ్వర్యంలో వరంగల్ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో నిర్వహిస్తున్న ఆయుష్ హౌస్ సర్జన్ల సమ్మె గురువారం మూడో రోజుకు చేరుకుంది. ముందుగా.. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సమ్మెకు సంఘీభావం అలోపతిక్ డాక్టర్లతో సమానంగా ఉపకార వేతనాలివ్వాలని ఆయుష్ హౌస్ సర్జన్లు చేస్తున్న నిరవధిక సమ్మెకు అనంతలక్ష్మి పూర్వ వైద్య విద్యార్థులు డాక్టర్ హరిరమాదేవి, డాక్టర్ రాజేశ్వరి సంపూర్ణ మద్దతు తెలిపారు. వైద్య విద్యార్థుల నిరసన శిబిరాన్ని సందర్శించి వారితో మాట్లాడారు. సమ్మెలో పాల్గొంటే క్రమశిక్షణాచర్యలు హౌస్సర్జన్ల సమ్మెకు సంఘీభావం తెలిపితే క్రమశిక్షణాచర్యలు తీసుకుంటామని ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అనసూయ ఉత్తర్వులు జారీ చేశారు. సమ్మెలో యూజీ విద్యార్థులు పాల్గొనరాదని, ఒకవేళ పాల్గొంటే వారి తల్లిదండ్రులకు సమాచారం అందిస్తానన్నారు. దీనిపై హౌస్సర్జన్లు మాట్లాడుతూ.. డిమాండ్లను పరిష్కరించే సమయంలో ఆంక్షలు విధిస్తూ, సమస్యను జఠిలం చేస్తున్నారన్నారు. ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలన్నారు. తెలంగాణ ఆయుష్ జాయింట్ యాక్షన్ కమిటీ -
రీ సర్వే వేగవంతం చేయాలి
హన్మకొండ అర్బన్ : జిల్లాలో కొనసాగుతున్న భూముల రీ సర్వేను వేగంగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఎన్.రవి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో భూములు, కొలతల శాఖ అధికారులు, సర్వేయర్లు, లైసెన్స్డ్ సర్వేయర్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. జిల్లాలో రీ సర్వే పనులు వేగంగా సాగుతున్నాయని, సర్వేయర్ల పనితీరు సంతృప్తికరంగా ఉందని అభినందించారు. సమావేశంలో భూములు కొలతల శాఖ ఏడీ నూర్ సింగ్, డీఐలు సారంగపాణి, రాజనర్సయ్య, సర్వేయర్లు, లైసెన్స్డ్ సర్వేయర్లు పాల్గొన్నారు. భూభారతి పోర్టల్పై అవగాహన ఉండాలి.. భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి పోర్టల్ మాడ్యూళ్లపై జూనియర్ అసిస్టెంట్లు పూర్తి అవగాహన కలిగి ఉండాలని హనుమకొండ ఇన్చార్జ్ కలెక్టర్ ఎన్.రవి అన్నారు. హనుమకొండ కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన భూభారతి పోర్టల్ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కలెక్టరేట్ ఏఓ నాగరాజు, రెవెన్యూ అధికారులు, జిల్లాలోని 14 మండలాలకు చెందిన జూనియర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహించాలి ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా, రెవెన్యూ డివిజన్, మండల స్థాయిల్లో సమర్థవంతంగా నిర్వహించాలని హనుమకొండ ఇన్చార్జ్ కలెక్టర్ ఎన్.రవి అధికారులను ఆదేశించారు. ఎంపీడీఓ కార్యాలయాల్లో మండల స్థాయి ప్రజావాణి నిర్వహించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. మండల స్థాయి ప్రజావాణి ఏర్పాటు, నిర్వహణకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. -
హెపటైటిస్ నియంత్రణకు కృషి చేయాలి
సమీక్షలో వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: జిల్లాలో వైరల్ హెపటైటిస్ నియంత్రణకు కృషిచేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. జాతీయ వైరల్ హెపటైటిస్ నియంత్ర (ఎన్వీహెచ్సీపీ) అమలులో భాగంగా కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్లో గురువారం జిల్లాస్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హైరిస్క్ గ్రూపులకు హెపటైటిస్–బీ వ్యాక్సినేషన్ పూర్తిస్థాయిలో నిర్వహించాలని సూచించారు. వ్యాప్తిని నివారించేందుకు తాగునీటి వనరుల క్లోరినేషన్ను సమర్థవంతంగా చేపట్టాలని, వ్యాధిపై విస్తృతస్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించాలని పేర్కొన్నారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ బి.రాజారెడ్డి, నర్సంపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దామోదరబాయి, జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఉష, వర్ధన్నపేట డీసీహెచ్ఎస్ డాక్టర్ రామ్మూర్తి, ఈఈ ఆర్డబ్ల్యూఎస్ నిర్మల, అధికారులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం ప్రభుత్వ, ఎయిడెట్, ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులు పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం ఈ–పాస్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్(డీబీటీ) విధానంలో పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్లు అందించేందుకు మార్గదర్శకాలు జారీచేసిందని పేర్కొన్నారు. విద్యార్థులు విద్యార్థి తప్పనిసరిగా మీసేవ కేంద్రంలో ఆధార్ బయోమెట్రిక్ ధ్రువీకరణ పూర్తి చేసిన అనంతరం పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం హనుమకొండలోని బీసీ సంక్షేమాభివృద్ధి కార్యాలయంలో సంప్రదించాలన్నారు. -
ఏసీల మరమ్మతుకు చర్యలు
కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో బర్న్స్ వార్డును సూపరింటెండెంట్ డాక్టర్ రామ్కుమార్రెడ్డి గురువారం సందర్శించారు. సాక్షిలో ‘నా శరీరం కాలి మండుతోంది.. చల్లదనం కావాలి’ శీర్షికన గురువారం ప్రచురితమైన కథనానికి ఆస్పత్రి సూపరింటెండెంట్ రాంకుమార్రెడ్డితో పాటు ఆర్ఎంఓ–2 డాక్టర్ మధుకర్ యాదవ్ స్పందించారు. బర్న్స్ వార్డులో చికిత్స పొందుతున్న యువకుడి ఆరోగ్య స్థితిని పరిశీలించారు. ఏసీలు పనిచేయకపోవడం వల్ల పేషెంట్ ఇబ్బందులు పడుతున్నాడని కుటుంబ సభ్యులు వారి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై శుక్రవారం సంబంధిత వైద్యులతో మాట్లాడి ఏసీల మరమ్మతుపై చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ హామీ ఇచ్చారు. -
గోడ కూలి వృద్ధురాలి మృతి
● పున్నేలులో ఘటన ఐనవోలు: ప్రమాదవశాత్తు ప్రహరీ (గోడ) కూలి ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై అశోక్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గుడికందుల లక్ష్మీకాంతం(60) రజక వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. కులవృత్తిలో భాగంగా అదే గ్రామంలో గండి సదానందం ఇటీవల మృతి చెందగా వారి ఇంట్లో ఐదోరోజు కార్యక్రమానికి గురువారం కూలీకి పని వెళ్లింది. సదానందం ఇంటి ఎదుట పని చేస్తుండగా పక్కన ఉండే కత్తి కృష్ణమూర్తి ఇంటి ప్రహరీ కూలి లక్ష్మీకాంతంపై పడడంతో అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి కోడలు సంధ్యారాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్.. మృతురాలికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబీలను పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే వెంట సర్పంచ్ షేక్ ఉస్మాన్ అలీ, మాజీ సర్పంచ్ కత్తి దేవేందర్ ఉన్నారు. రిటైర్డ్ రైల్వే ఉద్యోగి ఆత్మహత్య రఘునాథపల్లి: మద్యానికి బానిసైన రిటైర్డ్ రైల్వే ఉ ద్యోగి క్షణికావేశంలో గడ్డి మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తె లిపిన వివరాల ప్రకారం.. రఘునాథపల్లి గ్రామానికి చెందిన గట్టుపల్లి యాదగిరి (70) రైల్వేశాఖలో ఉద్యోగ విరమణ చేసిన అనంతరం సరైన ఉపాధి లేక మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో భార్య కనకలక్ష్మితో తరచూ మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని గొడవపడేవాడు. ఈ నెల 5న మరోసారి భార్యతో డబ్బుల విషయంలో వాగ్వాదానికి దిగాడు. అనంతరం క్షణికావేశానికి గురై గడ్డి మందు తాగాడు. కుటుంబీకులు గమనించి వెంటనే 108లో జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి కుమారుడు యాకస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దూదిమెట్ల నరేశ్ తెలిపారు. -
‘మన’ స్ఫూర్తి.. ఘన ‘కీర్తి’
● ఎంఐటీలో ప్రతిష్టాత్మక హంఫ్రీ ఫెలోషిప్నకు జనగామ జిల్లాకు చెందిన ఐఏఎస్ ఎంపికజనగామ : జనగామ జిల్లా తరిగొప్పుల వాసి, ఐఏఎస్ అధికారి జల్లి కీర్తి అమెరికాలోని ప్రపంచ ప్రఖ్యాత మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో నిర్వహించే ప్రతిష్టాత్మక హ్యూబర్ట్ హెచ్.హంఫ్రీ ఫెలోషిప్ కార్యక్రమానికి ఎంపికయ్యారు. అసోం, మేఘాలయ కేడర్కు చెందిన 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా ఆమె ప్రస్తుతం అసోంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2026 ఆగస్టు నుంచి 10 నెలల పాటు సాగే ఈ ఫెలోషిప్లో కీర్తి జల్లి ‘టెక్నాలజీ పాలసీ అండ్ మేనేజ్మెంట్’ అనే అంశంపై ఉన్నత స్థాయి అధ్యయనం, పరిశోధన, విధానపరమైన శిక్షణ పొందనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాపాలన రంగంలోని మధ్యస్థాయి నాయకులను తీర్చిదిద్దే అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది. కర్మశ్రీ అవార్డుతో సన్మానం.. కీర్తి జల్లి హైదరాబాద్లో విద్యాభ్యాసం చేసి సివిల్ సర్వీస్ సాధించారు. రైతు కుటుంబంలో జన్మించిన ఆమె తండ్రి తెలంగాణ హైకోర్టులో సీనియర్ అడ్వకేట్గా, తల్లి గృహిణిగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె అసోంలో పంచాయతీ, గ్రామీణాభివృద్ధి కమిషనర్తోపాటు స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. కోవిడ్–19 నియంత్రణ, వరద సహాయక చర్యల్లో చూపిన నాయకత్వానికి అసోం ప్రభుత్వం ఆమెను కర్మశ్రీ అవార్డుతో సన్మానించింది. ప్రభుత్వ సేవల్లో సాంకేతికత వినియోగం, డిజిటల్ పబ్లిక్ ఇన్్ఫ్రాస్ట్రక్చర్, డేటా ఆధారిత పరిపాలనపై ఈ ఫెలోషిప్లో కీర్తి ప్రత్యేక అధ్యయనం చేయనున్నారు. ఎంఐటీ వంటి ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థలో అధ్యయనం చేసే అవకాశాన్ని దక్కించుకోవడం తెలంగాణకు గర్వకారణమని పలువురు న్యాయవాదులు, ప్రజాప్రతినిధులు అభినందించారు. -
నాగులమ్మకు నీడ
● సమ్మక్క గద్దె పక్కన జువ్వి చెట్టు ఏర్పాటుఎస్ఎస్తాడ్వాయి: మేడారంలోని సమ్మక్క గద్దె పక్కన నాగులమ్మకు నీడనిచ్చేలా జువ్వి చెట్టును ఏర్పాటు చేశారు. 2014లో సమ్మక్క గద్దె పక్కన ఉన్న జువ్వి వృక్షం వంద ఏళ్లకు పైగా వయసు ఉండి పూర్తిగా ఎండిపోవడంతో తొలగించారు. పలుమార్లు జువ్వి మొక్కలు నాటినా పెరగకుండా పోయాయి. దీంతో జువ్వి మొక్క నాటినా ఇప్పట్లో పెరగదనే ఆలోచన మేరకు దేవాదాయశాఖ అధికారులు ఎండోమెంటల్ కార్యాలయ ఆవరణలో ఉన్న జూవ్వి వృక్షాన్ని ట్రీ ట్రాన్స్ ప్లాంటేషన్ ద్వారా సమ్మక్క గద్దె పక్కన ఏర్పాటు చేశారు. ఈ చెట్టు సంరక్షణను ‘వటా ఫాండేషన్ ది బిగ్ ట్రీ క్వెస్ట్’ అనే సంస్థకు అప్పగించినట్లు దేవాదాయశాఖ అధికారులు తెలిపారు. కాగా, సమ్మక్క గద్దె పక్కన ఉన్న జువ్వి వృక్షంపై జాతర సమయంలో నాగు పాము కనిపించేదని భక్తుల విశ్వాసం. -
మార్కెట్ చరిత్రలో మక్కలకు రికార్డు ధర
● రూ.2,629 పలికిన పంట కేసముద్రం: కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో క్వింటా మక్కలకు మార్కెట్ చరిత్రలోనే రికార్డు ధర పలికింది. మక్కల సీజన్ ప్రారంభంలో క్వింటాకు ధర రూ.1,500 నుంచి 1,900 వరకు మాత్రమే పలికింది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా మద్దతు ధర రూ.2,400కు మించి పలుకుతూ వస్తుంది. కాగా, గురువారం మార్కెట్కు 55 బస్తాల మక్కలు అమ్మకానికి రాగా, గరిష్ట ధర రూ.2,629, కనిష్ట ధర రూ.2,400 పలికినట్లు అధికారులు తెలిపారు. కేసముద్రం మార్కెట్ చరిత్రలోనే మొదటిసారి మక్కలకు రూ.2,629 పలికినట్లు తెలిపారు. మార్కెట్కు వరుస సెలవులు ఖిలా వరంగల్: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్కు ఈనెల 8,9,10 తేదీల్లో వరుస సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ చైర్పర్సన్ ఎర్ర ప్రియాంక గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 8, 9 వారాంతపు సెలవు, 10 (సోమవారం) బోనాల పండుగకు ప్రభుత్వం సెలవు ప్రకటించిందన్నారు. దీంతో మా ర్కెట్కు వరుసగా మూడురోజులు సెలవు ఉంటుందన్నారు. తిరిగి 11న పునః ప్రారంభమవుతుందన్నారు. రైతులు దీనిని గమనించాలని కోరారు. సెలవుల్లో మార్కెట్కు సరుకులు తీసుకొచ్చి ఇబ్బందులకు గురికావొద్దన్నారు. బావిలో పడి రైతు మృతి ● కొత్తపేటలో ఘటన బయ్యారం: వ్యవసాయ బావిలో పడి ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన గురువారం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేటలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చింత సైదులు (50) ఉదయం తన వ్యవసాయ బావికి విద్యుత్ మోటారు, పైపులు బిగించేందుకు పొలం వద్దకు వెళ్లాడు. బావి వద్ద మోటారు బిగించి పైపులు సరిచేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడిపోయాడు. ఈత రాకపోవడంతో నీట మునిగి చనిపోయాడు. మృతుడి అల్లుడు సాంబశివరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై టి. ప్రశాంత్బాబు తెలిపారు గుండెపోటుతో ఆర్టీసీ ఉద్యోగి.. తొర్రూరు: విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ ఉద్యోగి గుండె పోటుతో మృతి చెందాడు. ఈ ఘటన గురువారం తొర్రూరు పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. తొర్రూరుకు చెందిన రెడ్డబోయిన వెంకటనారాయణ(55) స్థానిక ఆర్టీసీ డిపోలో ఎస్డీఐ(స్పెషల్ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్)గా పని చేస్తున్నాడు. రోజుమాదిరిగానే విధుల్లో ఉన్న వెంకటనారాయణకు చాతిలో నొప్పిగా అనిపించడంతో సహచరులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. వారు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య ఉపేంద్ర, కుమారుడు మణిదీప్, కుమార్తె మానస ఉన్నారు. -
శిశువుకు ముర్రుపాలు పట్టించాలి
కాశిబుగ్గ: జన్మించిన మొదటి గంటలోపు వచ్చే ముర్రుపాలను తప్పనిసరిగా శిశువుకు పట్టించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా వరంగల్ సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో గురువారం తల్లిపాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముర్రుపాలు పుట్టిన శిశువులో సహజ నిరోధక శక్తిని పెంపొందిస్తాయని, వీటిలో అవసరమైన పోషకాలు ఉంటాయని తెలిపారు. తల్లిపాలు తాగిన పిల్లలకు డయేరియా, నిమోనియా, కామెర్లు తదితర వ్యాధులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని వివరించారు. అలాగే, మెదడు ఎదుగుదలకు, తల్లీబిడ్డల మధ్య అనుబంధం బలపడేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. శిశువుకు మొదటి ఆరునెలల పాటు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, తర్వాత తల్లిపాలతో పాటు వయస్సుకు తగిన ఆహారాన్ని అందించాలని ఆమె సూచించారు. అవసరానికి మించి తల్లిపాలు ఉత్పత్తి అయ్యే తల్లులు పాలను మిల్క్ బ్యాంకుకు దానం చేయాలని, ఈపాలు అవసరమైన శిశువులకు అందించి వారి ప్రాణాలు కాపాడవచ్చని వివరించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ బి.రాజారెడ్డి, సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీదేవి, జిల్లా సంక్షేమ అధకారి రాజమణి, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ప్రకాశ్, డాక్టర్ రాజమౌళి, డాక్టర్ సాజిదా, డాక్టర్ ఇక్తదార్ అహ్మద్, డాక్టర్ అరుణ్జోషి, ఆర్ఎంఓలు డాక్టర్ సృజన్, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. గురుకులాల్లో విద్యార్థులకు వసతులు కల్పించాలి న్యూశాయంపేట: ప్రభుత్వ గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా, మండలస్థాయి ప్రత్యేక అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాటాల్డారు. జిల్లాలోని 74 ప్రభుత్వ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఎలాంటి లోటు లేకుండా చూడాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్ఓ విజయలక్ష్మి, డీబీసీడీఓ పుష్పలత అధికారులు పాల్గొన్నారు. పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లపై సమీక్ష ఖిలా వరంగల్ ఖుష్మహల్ వేదికగా ఈనెల 15న నిర్వహించే పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లపై కలెక్టర్ డాక్టర్ సత్యశారద కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. వేడుకల నిర్వహణ, వేదిక ఏర్పాట్లు పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, ట్రాఫిక్, భద్రత, వైద్య సదుపాయాలు, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అన్నిశాఖలు సమన్వయంతో పనిచేసి వేడుకలను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, డీఆర్ఓ విజయలక్ష్మి, జె డ్పీ సీఈఓ రాంరెడ్డి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి, అధికారులు పాల్గొన్నారు. -
‘సూపర్’ నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలి
● వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద కాశిబుగ్గ: వరంగల్ సూపర్ స్పెషాలిటీ నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, ఎలాంటి లోపాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. నగరంలో నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పురోగతిపై 24 అంతస్తుల ఆస్పత్రి ఆవరణలోని కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి భవన నిర్మాణం, మౌలిక వసతులు, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్య పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు గడువులోగా పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంఽధిత శాఖ అధికారులను ఆదేశించారు. పనులు పూర్తయితే జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. సమీక్షలో ఆర్అండ్బీ ఎస్ఈ రమేశ్బాబు, విద్యుత్ ఎస్ఈ ఆనందం, డీఎంహెచ్ఓ రాజారెడ్డి, ఇంజనీర్ శ్రవణ్, తహసీల్దార్ శ్రీకాంత్, ఇఇ దేవిక చౌహాన్ పాల్గొన్నారు. -
భావజాల వ్యాప్తితో ఉద్యమం బలోపేతం
హన్మకొండ: తెలంగాణకు జరుగుతున్న న ష్టం, అన్యాయాన్ని భావజాల వ్యాప్తితో ప్ర జల్లోకి చేరవేయడం ద్వారా రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం బలోపేతమైందని, భావజాల వ్యాప్తికి తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఎనలేని కృషి చేశారని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. గురువారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ చిత్ర పటానికి సీఎండీ వరుణ్ రెడ్డి, డైరెక్టర్లు, అధికారులు పూలమాల వేసి నివాళులర్పించారు. డైరెక్టర్లు వి.మోహన్ రావు, మధుసూదన్, సి.ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. చెక్కు అందజేతవిద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి టీజీ ఎన్పీడీసీఎల్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. హనుమకొండ టౌన్ డివిజన్ కాజీపేట సెక్షన్లో లైన్మెన్గా విధులు నిర్వహస్తూ ఊకంటి ప్రకాశ్ విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కాగా, ఆయన భార్య సంధ్యకు యూనియన్ బ్యాంకు బీమా ద్వారా క్లెయిమ్ రూ.1.05 కోట్లు మంజూరు చేయగా గురువారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎండీ వరుణ్ రెడ్డి చెక్కు అందించారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి -
28 కేజీల గంజాయి పట్టివేత
నర్సంపేట రూరల్ : ఒడిశా నుంచి హైదరాబాద్ తరలిస్తున్న 28 కేజీల గంజాయిని పట్టుకుని ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు నర్సంపేట ఏసీపీ రవీందర్రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం నర్సంపేటలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్ల డించారు. ఈనెల 05వ తేదీన ఒడిశాకు చెందిన బోలెరో వాహనంలో భద్రాచలం, మహబూబాబాద్, నర్సంపేట మీదుగా హైదరాబాద్కు గంజాయి తరలిస్తున్నారనే సమాచారం మేరకు ఎస్సై గూడ అరుణ్, సిబ్బంది నర్సంపేట పట్టణంలోని మహబూబాబాద్ బైపాస్ సమీపంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఇందులో ముగ్గురు వ్యక్తులు వాహనాన్ని నిలిపి పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురులో ఒకరు పరారు కాగా ఇద్దరిని అదుపులోకి తీసుకుని వాహనాన్ని తనిఖీ చేశారు. ఇందులో వాహనం కింది భాగంలో సుమారు రూ. 14లక్షల విలువైన 28 కేజీల గంజాయి లభ్యమైంది. దీంతో వెంటనే గంజాయితోపాటు వాహనాన్ని సీజ్ చేసి నర్సంపేట తహసీల్దార్ రవిచంద్ర ఆధ్వర్యంలో పంచానామా నిర్వహించి, కేసు నమోదుచేసి కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. అరెస్ట్ చేసిన వారిలో ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లాకు చెందిన అమృత బైద్యాయ్, పుజూర్ రాయ్ ఉన్నారు. కాగా, గంజాయిని పట్టుకున్న ఎస్సై అరుణ్, సిబ్బందిని ఏసీపీ అభినందించారు. ఇద్దరి అరెస్ట్, రిమాండ్ వివరాలు వెల్లడించిన పోలీసులు -
లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు
జనగామ: జిల్లాలో లింగ నిర్ధారణకు పాల్పడే స్కానింగ్ కేంద్రాలపై నిరంతర తనిఖీలు నిర్వహించి, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి పోలీస్శాఖ అధికారులను ఆదేశించారు. మహిళా భద్రత, సంక్షేమం, సాధికారతకు సంబంధించిన ప్రతీ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంతో పరిగణించి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ సందీప్కుమార్ ఝా, పోలీస్, రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళలు, బాలికలపై వేధింపులు, గృహహింస, లైంగిక దాడులు, సైబర్ నేరాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధిత మహిళలకు చట్టపరమైన రక్షణ, కౌన్సెలింగ్, వైద్య సేవలు, పునరావాసం వంటి సేవలను ఒకే వేదికపై అందించేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అనంతరం పలువురు బాధిత మహిళల సమస్యలను స్వయంగా విని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో మహిళా కమిషన్ సెక్రటరీ ప ద్మజారమణ, రెవెన్యూ అదనపు కలెక్టర్, డీడబ్ల్యూఓ బెన్షాలోమ్, ఏసీపీలు భీంశర్మ, నర్సయ్య, అదనపు డీసీపీ బాలస్వామి, వెంకటరమణ, జిల్లా న్యాయ సేవల సంస్థ, ‘షీ’ టీమ్స్, భరోసా కేంద్రం, సఖి కేంద్రం, పోలీస్శాఖ అధికారులు పాల్గొన్నారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయలక్ష్మి స్కానింగ్ కేంద్రాలపై నిరంతర తనిఖీలకు పోలీసులకు ఆదేశం -
ఆపన్నహస్తం అందించరూ!
దుగ్గొండి: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం ముద్దునూరు గ్రామంలో శివరామాంజనేయస్వామి దేవాలయంలో అర్చకుడిగా కొనసాగుతున్న గాదెపాక రాములు ఆపన్నహస్తం ఎదురు చూస్తున్నారు. వా రం రోజుల క్రితం రాములుకు గుండెపోటు రావడంతో భక్తులు చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్కు తరలించారు. వైద్యులు ఆయనకు రెండు స్టంట్లు వేసి ప్రాణం కాపాడారు. అయితే క నీస ఖర్చులకు లేక ఆందోళన చెందుతున్నారు. ఆర్థిక సాయం అందజేయాలని వేడుకుంటున్నా రు. కాగా, దయార్థ హృదయులు స్పందించి రా ములుకు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని ఏబీఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బొట్ల నరేశ్ కోరారు. దాతలు.. రాములు బంధువు (దేవేందర్) 9951262401 నంబర్కు ఫోన్పే ద్వారా పంపాలని అభ్యర్థించారు. కాగా, రాములు హనుమాన్ ఉపాసకుడిగా రాష్ట్ర వ్యాప్తంగా 1,116 హనుమాన్ ఆలయాల్లో విగ్రహాలకు చందనం వేసే కార్యక్రమం చేపట్టి ప్రజల్లో భక్తిభావం పెంపునకు కృషి చేశారని గ్రామస్తులు తెలిపారు. గుండెపోటుతో నిమ్స్లో చేరిన హనుమాన్ ఉపాసకుడు రాములు ఆర్థిక సాయం అందించాలని వేడుకోలు -
ఇలా.. 24 అంతస్తులు
కాశిబుగ్గ: హైదరాబాద్ తర్వాత రెండో రాజధానిగా పేర్కొంటున్న వరంగల్ మహానగరంలో సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ (24 అంతస్తులు) రూపు దిద్దుకుంటోంది. ఆ ధునిక హంగులు, అధునాతన సౌకర్యాలతో రోగులకు సేవలు అందించాలనే లక్ష్యంతో ని ర్మిస్తున్న ఈ పెద్దాస్పత్రి ఈ ఏడాది చివరి నా టికి ప్రారంభోత్సవం చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు మాత్రం ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో మాత్రం కచ్చితంగా చెప్పడం లేదు. 12 ఎకరాలు.. 2,018 పడకలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వరంగల్లో చేపట్టిన 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవన నిర్మాణ పనులు చివరి దశ కు చేరుకున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల కు పెద్ద దిక్కువగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రిలో సమీపంలోనే జీ+23 అంతస్తులతో నిర్మిస్తున్నారు. 2,018 పడకలతో దాదాపు 12 ఎకరా ల్లో చేపట్టారు. తెలంగాణలోని అతిపెద్ద సూ పర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రోగులు ఇక మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు వెళ్లకుండానే ఇక్కడ అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఒక్కో అంతస్తులో పలు వైద్య విభాగాల ఏర్పాటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో పలు ప్రత్యేకతలు ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు హైదరాబాద్కు వెళ్లకుండానే ఓరుగల్లులోనే మెరుగైన వైద్యం24 అంతస్తుల్లో ఉండే విభాగాలు.. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల ప్రజలకు కూడా ఉపయోగపడే విధంగా వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనివల్ల హైదరాబాద్లోని ఆస్పత్రుల మీద ఒత్తిడి తగ్గే అవకాశం లేకపోలేదు. అయితే, 24 అంతస్తుల్లో ఏఏ విభాగాలు ఉంటాయో వైద్యాఽధికారులు సూచనప్రాయంగా నిర్ణయించిన వివరాలు. ఒకటో అంతస్తు : ఓపీ, క్యాజువాలిటీ, అత్యవసర వైద్యసేవలు రెండో అంతస్తు : పూర్తిగా అధునాతన ఐసీయూ సేవలు మూడు, నాలుగు అంతస్తులు : పలు విభాగాలకు సంబంధించిన ఆపరేషన్ థియేటర్లు 6 నుంచి 12 అంతస్తులు : పలు డిపార్ట్మెంట్ల వార్డులు 13వ అంతస్తు : ల్యాబ్లు, బ్లడ్ బ్యాంకు ఏర్పాటు 14, 15 అంతస్తులు : మెయింటెనెన్స్, టీచింగ్ 16, 17, 18 అంతస్తులు : ఫ్యాకల్టీ టీచింగ్, డెమో క్లాసులు 19, 20, 21 అంతస్తులు : రెసిడెంట్ డాక్టర్లు (పీజీలు) 22, 23 అంతస్తులు : ఆడిటోరియం, ఏబీసీ బ్లాకులు ఏర్పాటు కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రో, ఆంకాలజీ–క్యాన్సర్ పిడియాట్రిక్స్, గైనకాలజీ, ఆర్థోపెడిక్, ప్లాస్టిక్ సర్జరీ కిడ్నీ, లివర్ ట్రాన్స్ప్లాంట్ అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ సెంటర్స్, ఐసీయూ, ఆపరేషన్లు థియేటర్లు వైద్య విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచితంగా వైద్యసేవలు ఫిజియోథెరపి, ఆర్గాన్ ట్రిట్మెంట్, వృద్ధుల కోసం ప్రత్యేక చికిత్స హిమోఫిలిటీ (రక్త సంబంధ వ్యాధులు) సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్, కీమోథెరపి, సర్జరీలు న్యూక్లియర్ థెరపి, డయాలసిస్ సెంటర్ కార్డియో థోరాసిక్, ఓపెన్ హార్ట్ సర్జరీలుసూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఇతర ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. వైద్యులు త్వరితగతిన వచ్చి వైద్యసేవలు అందించేందుకు ప్రత్యేకంగా రోడ్డు సదుపాయం కల్పించారు. కాకతీయ మెడికల్ కాలేజీ, పీఎంఎస్ఎస్వై సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి వైద్యులు నేరుగా వాహనాల్లో వచ్చే విధంగా రోడ్డు నిర్మాణం చేపట్టారు. కేఎంసీకి వెళ్లడానికి అడ్డుగా ఉన్న గోడను కూలగొట్టి పనులు చేపట్టారు. హాస్పిటల్కు వచ్చే రోగులు బస్సుల్లో ప్రయాణించే అవకాశం ఉండడంతో పలు సర్వీసులను సూపర్ స్పెషాలిటీ ఆవరణలోకి వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. -
కార్యకర్తలే పార్టీకి బలం
డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి హన్మకొండ చౌరస్తా: క్షేత్రస్థాయిలో ఉండే కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి అన్నారు. బూత్, గ్రామ, మండల స్థాయి కమిటీల నియామక ప్రక్రియపై మండల అధ్యక్షులు, ఇన్చార్జ్లతో జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని బూత్, గ్రామ, మండల కమిటీల ఏర్పాటు ప్రక్రియను ఈనెల 15వ తేదీలోపు తప్పకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ వర్గాలకు కూడా కమిటీలలో పూర్తి స్థాయి భాగస్వామ్యం కల్పించి, అన్ని వర్గాల కలయికతో కమిటీలను సమతుల్యంగా రూపొందించాలన్నారు. సమావేశంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ, వరంగల్ పార్లమెంట్ ఇన్చార్జ్ పల్లె శ్రీనివాస్ గౌడ్, టీపీసీసీ అధికార ప్రతినిధి, వర్ధన్నపేట ఇన్చార్జ్ కూచన రవళి హాజరయ్యారు. హుస్నాబాద్, స్టేషన్ ఘన్పూర్, వర్ధన్నపేట, పరకాల, హుజూరాబాద్, భూపాలపల్లి నియోజకవర్గాల పరిధిలోని వివిధ మండలాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కాశిబుగ్గ: ఎంజీఎంలో సీనియర్ ఫార్మసీ ఆఫీసర్లుగా విధులు నిర్వహిస్తున్న కె.ఉమాదేవి, కె.సత్యం చీఫ్ ఫార్మసీ ఆఫీసర్లుగా పదోన్నతి పొందారు. ఈ మేరకు వారు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ గవర్నమెంట్ ఫార్మసీ అసోసియేషన్ సెంట్రల్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు బత్తిని సుదర్శన్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కందగట్ల శరత్బాబు ఆధ్వర్యంలో ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ రాంకుమార్రెడ్డిని వారు మర్యాపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ అశ్విని, ఫార్మసీ ఆఫీసర్లు మరియమ్మ, సునీత, వెంకటరమణ పాల్గొన్నారు. -
డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం
కాశిబుగ్గ: తమ న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం ఆగదని తెలంగాణ ఆయుష్ జాయింట్ యాక్షన్ కమిటీ కార్యదర్శి డాక్టర్ రోహిత్ బస్రే స్పష్టం చేశారు. స్టైఫండ్ పెంపుకోసం వరంగల్ అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలలో తెలంగాణ ఆయుష్ జేఏసీ చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయుష్ హౌస్సర్జన్లకు సమాన పనికి సమానవేతనం అందే వరకు సమ్మె కొనసాగుతుందన్నారు. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అవరసమైతే సమస్యల పరిష్కారం కోసం ఆత్మార్పణ ఘోష చేయడానికి వెనుకాడనని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి స్టైఫండ్ను పెంచడంతో పాటు పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని, న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. నిరవధిక సమ్మె గురించి ప్రభుత్వానికి తెలపాలని కోరుతూ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అనసూయ, వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ ధర్మారాజుకు హౌస్సర్జన్లు వినతిపత్రం సమర్పించారు. అలాగే, స్టైఫండ్ పెంపు విషయంపై వారు వివరించారు. విశ్వ ఆయుర్వేద పరిషత్, ఎన్ఎంఏ సభ్యుల మద్దతు.. ఆయుష్ హౌస్సర్జన్లకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు విశ్వ ఆయుర్వేద పరిషత్ మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కిషన్, నేషనల్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు డాక్టర్ చిలువేరు రవీందర్, డాక్టర్ మోహన్రావు, కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యుడు డాక్టర్ సాంబమూర్తి తెలిపారు. అదేవిధంగా అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల అండర్ గ్రాడ్యుయేట్స్ విద్యార్థులు కూడా మద్దతు ప్రకటించారు. తెలంగాణ ఆయుష్ జేఏసీ కార్యదర్శి డాక్టర్ రోహిత్ బస్రే -
నిట్లో సైబర్ జాగుర్తా దివస్
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్, వరంగల్ పోలీస్ కమిషనరేట్ సౌజన్యంతో సైబర్ జాగుర్తా దివస్, సురక్షా కా తిరంగా – మంత్ ఎండ్ చాంపియన్ కార్యక్రమాన్ని నిట్ డైరెక్టర్ బిద్యాదర్ సుబుదీ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేశారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సైబర్ నేరగాళ్లు భయం, ఆశ, అత్యవసర భావోద్వేగాలను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారని, ఈ క్రమంలో సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. సైబర్ మోసానికి గురైనట్లు గ్రహిస్తే టోల్ఫ్రీ నంబర్ 1930కు సమాచారం ఇవ్వాలని సూచించారు. నిట్ వరంగల్ విద్యార్థులు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సైబర్ భద్రత పరిశోధనలను చేపట్టడం అభినందనీయమని ప్రశంసించారు. సైబర్ నేరాలను నివారించేందుకు త్వరలో నిట్లో సైబర్ సెక్యూరిటీ హకథాన్ నిర్వహించనున్నట్లు నిట్ డైరెక్టర్ బిద్యాదర్ సుబుదీ తెలిపారు. కార్యక్రమంలో నిట్ రిజిస్ట్రార్ సునీల్ మెహతా, డీసీపీ దార కవిత, నిట్ ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. -
గురువారం శ్రీ 6 శ్రీ ఆగస్టు శ్రీ 2026
వరంగల్ అర్బన్: క్షేత్రస్థాయిలో పర్యటన, సమీక్ష అనే రెండు కోణాల్లో పనితీరు ఉంటుంది.. బల్దియా అధికారులు, సిబ్బంది నుంచి మహానగర ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయా లేదా అని నిరంతరం పరిశీలిస్తా.. పారిశుద్ధ్యం, పచ్చదనంపై ప్రత్యేకంగా ఫోకస్ పెడతా.. బల్దియా కార్యాలయంలో పెండింగ్ ఫైళ్లు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని విభాగాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నట్లు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ టి.వెంకన్న తెలిపారు. కమిషనర్గా బాధ్యతలు స్వీకరించి నెల గడుస్తున్న సందర్భంగా ‘సాక్షి’తో ఆయన బుధవారం ముచ్చటించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. శక్తివంచన లేకుండా పనిచేస్తా.. నేను ఉమ్మడి వరంగల్ జిల్లా వాసినే. నాకు వరంగల్ మహానగరంపై ప్రత్యేక అభిమానం, అవగాహన ఉంది. చారిత్రక, పర్యాటక నగరంలో పనిచేయడం మంచి అవకాశం. నగరంలో దీర్ఘకాలిక పనులను దశల వారీగా పూర్తిచేసి ప్రజలు అసౌకర్యానికి గురికాకుండా చూస్తా. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతా. పారిశుద్ధ్య వ్యవస్థను గాడిలో పెడతా.. క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య పనితీరును మెరుగుపర్చేందుకు రోజూ తెల్లవారుజామున తనిఖీలు చేస్తున్నా. సిబ్బంది, అధికారులను అప్రమత్తం చేస్తున్నా. ఇంటింటా తడి, పొడి చెత్త సేకరించి రీసైక్లింగ్ చేయిస్తున్నా. రోడ్లపై చెత్త పేరుకుపోకుండా కృషి చేస్తున్నా. కారులోనే కాదు.. అవసరమైతే ద్విచక్రవాహనంపై కూడా పర్యటిస్తా.● చారిత్రక, పర్యాటక నగరంలో పనిచేయడం మంచి అవకాశం ● ‘సాక్షి’తో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ వెంకన్నక్షేత్ర పర్యటన, సమీక్షలతో ప్రజా సమస్యలకు పరిష్కారం15 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు మహానగరంలో ఈ ఏడాది 15లక్షలకు పైచిలుకు మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. విద్యుత్ తీగల కింద కాకుండా రోడ్లకు రెండు వైపులా సంరక్షణగా ఉండేవిధంగా, కెనాల్, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు నాటి పెంచేందుకు కృషిచేస్తాం. నగరంలో పచ్చదనం, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తా.


