breaking news
Hanamkonda District News
-
టీజీ ఎన్పీడీసీఎల్ ఉత్తమ డివిజన్గా హనుమకొండ టౌన్
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో ఉత్తమ డివిజన్గా హనుమకొండ టౌన్ ప్రథమ స్థానంలో నిలిచింది. విద్యుత్ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ముందుకుసాగుతోంది. మరో వైపు వినియోగదారులకు మరింత విస్తృతమైన సేవలు అందించేందుకు అధికారులు, ఉద్యోగులను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో ప్రతీనెల ఉత్తమ అధికారులను ఎంపిక చేస్తోంది. ప్రతీనెల టీజీ ఎన్పీడీసీఎల్ సెక్షన్ నుంచి సర్కిల్ వరకు బెస్ట్ పర్ఫార్మెనెన్స్ కనబరిచిన వాటిని యాజమాన్యం ఎంపిక చేస్తుంది. నవంబర్ మాసంలో ఉత్తమ సర్కిల్, డివిజన్, సబ్ డివిజన్, సెక్షన్ల జాబితాను యాజమాన్యం విడుదల చేసింది. ఎన్పీడీసీఎల్ పరిధిలోని మొత్తం 16 సర్కిళ్లలో హనుమకొండ సర్కిల్లోని హనుమకొండ టౌన్ డివిజన్ 67.39 పాయింట్లతో ఉత్తమ డివిజన్లలో మొదటి స్థానంలో నిలిచింది. ఇదే డివిజన్ పరిధిలో నయీంనగర్ సబ్ డివిజన్ 74.99 పాయింట్లతో మొదటి స్థానంలో, హనుమకొండ సబ్ డివిజన్ 67.88 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. అర్బన్ సెక్షన్ల విభాగంలో ఇదే డివిజన్లోని నక్కలగుట్ట సెక్షన్ 77.52 పాయింట్లతో ద్వితీయ, గోపాల్పూర్ 76.19 పాయింట్లతో తృతీయ, యాదవ నగర్ 75.01 పాయింట్లతో ఐదవ స్థానంలో నిలిచాయి. రూరల్ విభాగంలో మడికొండ సెక్షన్ 63.47 పాయింట్లతో తృతీయ స్థానంలో నిలిచింది. కాగా సర్కిల్ విభాగంలో హనుమకొండ సర్కిల్ 54.31 పాయింట్లతో నాలుగవ స్థానంలో నిలిచింది. ఇందులో పెద్దపల్లి సర్కిల్ 58.12 పాయింట్లతో మొదటి, జగిత్యాల 55.90 పాయింట్లతో ద్వితీయ, కరీంనగర్ 55.84 పాయింట్లతో తృతీయ, మంచిర్యాల 50.65 పాయింట్లతో అయిదవ స్థానంలో నిలిచాయి. ఉత్తమ సబ్ డివిజన్లుగా మొదటి,రెండో స్థానంలో నయీంనగర్, హనుమకొండ రూరల్ విభాగంలో మూడవ స్థానంలో మడికొండ సెక్షన్ అర్బన్ విభాగంలో రెండు, మూడు స్థానాల్లో నక్కలగుట్ట, గోపాల్పూర్ -
పోలీస్ కమిషనరేట్లో నూతన సంవత్సర వేడుకలు
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో గురువారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయ ఆవరణలో కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అధికారులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం పోలీస్ అధికారులు సిబ్బంది, పలు ప్రభుత్వ శాఖల అధికారులు, పాఠశాలల విద్యార్థులు, మీడియా ప్రతినిధులు పోలీస్ కమిషనర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛాలు, మొక్కలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఈ ఏడాది ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని, లక్ష్యాలను పూర్తిచేయాలని సూచించారు. అలాగే, పోలీస్ అధికారులు, సిబ్బంది సుఖసంతోషాలతో ఉండాలని, తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని కోరారు. వేడుకల్లో డీసీపీలు రాజమహేంద్ర నాయక్, దార కవిత, ఏఎస్పీ శుభం, ట్రెయినీ ఐపీఎస్ మనీషానెహ్ర, అదనపు డీసీపీలు రవి, ప్రభాకర్, బాలస్వామి, సురేశ్కుమార్, శ్రీనివాస్, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఎస్సైలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి
న్యూశాయంపేట: 2026 సంవత్సరంలో సరికొత్త ప్రణాళికలతో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు జిల్లా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. గురువారం నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా కలెక్టరేట్లో కలెక్టర్ సత్యశారద కేక్ కట్ చేశారు. ఈసందర్భంగా వివిధ శాఖల అధికారులు, వివిధ ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు, టవల్స్ బెడ్ షీట్స్, బ్లాంకెట్స్, బుక్స్ పెన్నులు, వాటర్ బాటిల్స్, పూల బొకేలు అందజేస్తూ కలెక్టర్ సత్య శారదకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగులందరూ నూతన ఉత్సాహంతో పనిచేసి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం టీజీఓ, టీఎన్జీఓ, ట్రస్సా యూనియన్ల క్యాలెండర్, డైరీని కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ, ఇన్చార్జ్ డీఆర్డీఓ రాంరెడ్డి, డీఆర్ఓ విజయలక్ష్మి, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, టీఎన్జీఓ ప్రెసిడెంట్ బోనాల కిషన్, ఆర్డీఓ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఫణి కుమార్, కలెక్టరేట్ రెవెన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్, ట్రెసా బాధ్యులు వేడుకల్లో పాల్గొన్నారు. టెట్ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి..జిల్లాలో ఈనెల 3 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించే టెట్కు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. టెట్ నిర్వహణపై గురువారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నర్సంపేట సమీపంలోని బిట్స్ కళాశాల, వరంగల్ నగరంలో గోపాలస్వామి గుడి సమీపంలోని ఎన్ఎస్ గ్లోబల్ టెక్నాలజీ కేంద్రాల్లో ఉదయం 9 నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. 1,400 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. సమావేశంలో డీఆర్డీఓ విజయలక్ష్మి, డీఈఓ రంగయ్యనాయుడు, డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి.. ఖిలా వరంగల్: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమష్టిగా కృషి చేద్దామని కలెక్టర్ సత్యశారద పిలుపునిచ్చారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా గురువారం కలెక్టరేట్లో వరంగల్ రవాణాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రోడ్డు భద్రతా మాసోత్సవాల ఫ్లెక్సీ, పోస్టర్లు, కరపత్రాలను ఆర్టీఓ శోభన్బాబుతో కలిసి ఆమె ఆవిష్కరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జనవరి 1 నుంచి 31 వరకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపా రు. కార్యక్రమంలో ట్రాఫిక్ అదనపు డీసీపీ ప్రభాకర్, జిల్లా రవాణాశాఖ అధికారి శోభన్ బాబు, ఇంజనీర్ రాజేందర్, ఆరోగ్య శాఖ అధికారి సాంబశివరావు, ఆర్టీసీ డిపో మేనేజర్లు పాల్గొన్నారు. వరంగల్ కలెక్టర్ సత్య శారద -
అడవికి కొత్త అందాలు..
ఎస్ఎస్ తాడ్వాయి: ములుగు జిల్లా తాడ్వాయి, ఏటూరునాగారం అభయారణ్యంలో ఎకో టూరిజం ఆధ్వర్యంలో పర్యాటకులను ఆకర్షించేలా అడవికి సరికొత్త అందాలు తీర్చిదిద్దారు. తాడ్వాయి – ఏటూరునాగారం అటవీ మార్గంలో పర్యాటకులకు స్వాగతం పలుకుతూ ఆర్చ్తోపాటు రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేసి కర్రలతో అలంకరించారు. అదే విధంగా తాడ్వాయి – పస్రా మార్గంలో దుర్గం గుట్టను పర్యాటకులు సందర్శించి ఆహ్లాదం పొందేలా ఏర్పాట్లు చేశారు. తాగునీటి వసతి, గుట్టపై నుంచి అడవులను తిలకించేందుకు మంచెలు నిర్మించారు. వీటితోపాటు తాడ్వాయి హట్స్లో అచ్చం అడవి జంతువుల మాదిరి బొమ్మలను ఏర్పాటు చేశారు. తద్వారా మేడారం జాతర సందర్భంగా వచ్చే భక్తులు ఈ అటవీ అందాలను వీక్షించే అవకాశం కల్పించారు. మేడారం జంక్షన్లకు నూతన కళ.. ఎస్ఎస్తాడ్వాయి : మేడారంలో పలు జంక్షన్లను బొమ్మలు, శిల్పాలతో అలంకరిస్తున్నారు. ఊర ట్టం స్తూపం వద్ద, హరిత హోటల్ క్రాస్, ఐలాండ్ ప్రదేశం, బస్టాండ్ ప్రదేశాల్లో జంక్షన్లు నిర్మిస్తున్నారు. ఇవి భక్తులకు ఆకర్షణీయంగా కనిపించేలా ప్రత్యేక శిల్పాలు, జంతువుల బొమ్మలతో పాటు ఆదివాసీ సంస్కృతి ప్రతిబింబించే బొ మ్మలు ఏర్పాటు చేస్తున్నారు. అమ్మవార్ల గద్దెల పునర్నిర్మాణంలో భాగంగా జంక్షన్లు నిర్మిస్తున్నా రు. ఆదివాసీ సంప్రదాయాలు, జీవన విధానం ప్రతిబింబించేలా బొమ్మల రూపకల్పనతోపా టు లైటింగ్, మొక్కలతో జంక్షన్లు తీర్చిదిద్దితున్నారు. కాగా,జంక్షన్ల అలంకరణతో భక్తులు ఆధ్యాత్మిక అనుభూతితోపాటు సాంస్కృతిక వైభవం గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అటవీ జంతువుల బొమ్మల ఏర్పాటు -
మరిన్ని విజయాలు సాధించాలి
హన్మకొండ: అధికారులు, ఉద్యోగుల సమష్టి కృషితో టీజీ ఎన్పీడీసీఎల్ 2026లో మరిన్ని విజయాలు సాధించాలని ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఆకాంక్షించారు. గురువారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో సీఎండీ వరుణ్ రెడ్డిని కంపెనీ డైరెక్టర్లు, సీఈలు, సీజీఎంలు, జీఎంలు, అధికారులు, సంఘాలు, అసోసియేషన్లు నాయకులు న్యూఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ వరదల సమయంలో సిబ్బంది తెగింపు అనిర్వచనీయమన్నారు. వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడానికి పాటుపడాలని సూచించారు. కార్యక్రమంలో వి.మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బోనాల కిషన్, సి.ఈ లు టి.సదర్ లాల్, కె.తిరుమల్ రావు, కె.రాజు చౌహాన్, అశోక్, వెంకటరమణ, అన్నపూర్ణ, సురేందర్, కె.మాధవరావు, ఎన్. శ్రవణ్ కుమార్, సీజీఎంలు చరణ్ దాస్, కిషన్, కంపెనీ సెక్రటరీ కె.వెంకటేశం, జాయింట్ సెక్రటరీ శ్రీకృష్ణ, రమేశ్, తదితరులు పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి -
నిరంతర విద్యుత్కు ఇంటర్ లింకింగ్ వ్యవస్థ దోహదం
భవిష్యత్లో వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరాకు ఇంటర్ లింకింగ్ వ్యవస్థ ఎంతో దోహదపడుతుంది. ఒక సబ్ స్టేషన్లో ఏదైనా లోపం తలెత్తినా, ప్రకృతి వైపరీత్యాలు, ఇతరత్రా మెయింటెనెన్స్ సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయే పరిస్థితులు ఏర్పడినప్పుడు ఇంటర్ లింకింగ్ వ్యవస్థ ద్వారా ప్రత్యామ్నాయంగా విద్యుత్ సరఫరా చేస్తాం. తద్వారా వినియోగదారులకు అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా జరుగుతుంది. కర్నాటి వరుణ్ రెడ్డి , సీఎండీ , టీజీ ఎన్పీడీసీఎల్ -
క్యాథ్లాబ్లో సాంకేతిక లోపం
ఎంజీఎం: వరంగల్ కాకతీయ వైద్య కళాశాల ప్రాంగణంలో ఉన్న సూపర్స్పెషాలిటీ ఆస్పత్రి వైద్య సేవలు రోగులకు అందని ద్రాక్షగానే మారుతున్నాయి. గ్యాస్ట్రో, న్యూరో సర్జరీ, న్యూరోఫిజీషియన్ విభాగాలు ఉన్న ఈ ఆస్పత్రిలో కనీసం రోగ నిర్ధారణ పరీక్షలు కూడా చేయడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. సాంకేతిక లోపంతో క్యాథ్లాబ్ సేవలు కూడా రెండు రోజులుగా నిలిచిపోయాయి. ఆస్పత్రిలో కార్డియాక్ ఓపీ ఉండే రోజులు కాకుండా.. మిగతా రోజుల్లో అవసరమున్న హృద్రోగులకు క్యాథ్లాబ్లో అంజియోగ్రామ్, స్టంట్ చికిత్సలు అందించేవారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో రిజిస్ట్రేషన్ చేసుకున్న 30 మందిని గురువారం రాత్రి ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి సహకారంతో నిమ్స్కు తరలించారు. రూ.45 లక్షల మరమ్మతు నిధుల పెండింగ్.. సూపర్స్పెషాలిటీ ఆస్పత్రిలోని క్యాథ్లాబ్ పరికరాన్ని మరమ్మతులు చేయించేందుకు ఏఏంసీ (సంవత్సర కాలం నిర్వహణ)ని ప్రభుత్వం సంవత్సరానికి రూ.30 లక్షలకు ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు క్యాథ్లాబ్ సర్వీస్ చేసే సదరు కంపెనీకి 6 నెలలకోమారు బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. 18 నెలలుగా కంపెనీకి రూ.45 లక్షల బిల్లులు చెల్లించకపోవడంతో ప్రస్తుతం పరికరం ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. పరికరాన్ని మరమ్మతు చేయకపోవడంతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భవనం ఓపీ సేవలకు మాత్రమే పరిమితమైంది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి క్యాథ్లాబ్ పరికరాన్ని త్వరగా మరమ్మతు చేయాలని రోగులు కోరుతున్నారు. సూపర్స్పెషాలిటీ ఆస్పత్రిలో నిలిచిన అంజియోగ్రామ్ పరీక్షలు ఆరోగ్యశ్రీలో రిజిస్ట్రేషన్ చేసిన రోగులను నిమ్స్కు తరలింపు 18 నెలలుగా ఏఎంసీ నిధులు చెల్లించని ప్రభుత్వం -
ఓరుగల్లు సంప్రదాయాన్ని కాపాడుకోవాలి
హన్మకొండ అర్బన్: కళల కాణాచిగా నిలిచిన ఓరుగల్లు సంప్రదాయాన్ని కాపాడుకోవాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి పిలుపునిచ్చారు. కళలను కాపాడుకోవాలని, సాహిత్య–సాంస్కృతిక కార్యక్రమాలను ప్రజలు ఆదరించాలని పిలుపునిచ్చారు. అజో విభో కందాళం–సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థల సంయుక్త నిర్వహణలో 33వ సాహితీ సాంస్కృతిక సదస్సులు, కథానాటిక పోటీలను గురువారం హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రం ఆడిటోరియంలో ఆయన ప్రారంభించి మాట్లాడారు. పోటీ నాటికల పరిచయాన్ని గోపగాని విజయ్ నిర్వహించారు. బీవీకే క్రియేషన్స్, కాకినాడ వారి ‘కన్నీటి విలువెంత’ నాటికను డి.వినయ్ దర్శకత్వంలో ప్రదర్శించారు. నటరాజ డ్రమెటిక్ అసోసియేషన్, పెందుర్తి వారి ‘నీళ్లు నీళ్లు’ నాటికను శేఖర్ భీశెట్టి దర్శకత్వంలో ప్రదర్శించారు. నేరెళ్ల వేణుమాధవ్ స్మృత్యర్థం జీబీఎస్ రాజు మిమిక్రీ ప్రదర్శన ప్రేక్షకులను అలరించింది. కృష్ణ తెలుగు థియేటర్స్, విజయవాడ వారి ‘మరో పుత్తడి బొమ్మ’ నాటిక ప్రదర్శనతో కార్యక్రమం ఆద్యంతం రక్తికట్టింది. డీఎస్ఎన్ మూర్తి, ఏవీ నరసింహారావు, వేముల శ్రీనివాస్, వనం లక్ష్మీకాంతారావు, గిరిజ మనోహర్బాబు, అప్పాజోష్యుల సత్యనారాయణ, సహృదయ బాధ్యులు, అజో విభో కందాళం కార్యవర్గ సభ్యులు కుందావఝల కృష్ణమూర్తి, ఎం.రాధాకృష్ణ, ఎన్వీ ఎన్ చారి, లక్ష్మణరావు, మల్యాల మనోహర్రావు, నేలకొండ భాస్కరరావు, ఏవీ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి కాళోజీ కళాక్షేత్రంలో 33వ సాహితీ సాంస్కృతిక సదస్సు ప్రారంభం -
ఉద్యోగుల అత్యుత్తమ సేవలతోనే ఉత్తమ డివిజన్గా ఎంపిక...
క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారుల అత్యుత్తమ సేవలతోనే టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలోని 16 సర్కిళ్లలో ఉత్తమ డివిజన్లలో హనుమకొండ టౌన్ మొదటి స్థానంలో నిలిచింది. విద్యుత్ వినియోగదారులకు అంతరాయాలు లేని మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాం. వినియోగదారులకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నాం. సరఫరా మెరుగుకు అవసరమైన సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. డివిజన్లో అగ్రస్థానంలో నిలిపిన డివిజన్లోని ఉద్యోగులు, అధికారులకు అభినందనలు. – టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబరెడ్డి ● -
ఇక.. ఇక్కట్లకు చెక్
హన్మకొండ : విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా టీజీ ఎన్పీడీసీఎల్ ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోంది. నూతన సాంకేతికను అందిపుచ్చుకుంటూ మెరుగైన, నాణ్యమైన, అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా అందించమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో విద్యుత్ సబ్ స్టేషన్లు, 33 కేవీ, 11 కేవీ విద్యుత్ లైన్ల అనుసంధానం చేస్తోంది. నిరంతర విద్యుత్ సరఫరాలో ఆటంకాలు లేకుండా ఉండేందుకు ఇంటర్ లింకింగ్ ప్రక్రియ చేపట్టింది. దీని ద్వారా విద్యుత్ వ్యవస్థ బలోపేతం కానుంది. ఇందులో భాగంగా ఒక సబ్ స్టేషన్ నుంచి మరో సబ్ స్టేషన్ మధ్య విద్యుత్ లైన్లు అనుసంధానం చేస్తున్నారు. అదే విధంగా 33 కేవీ, 11 కేవీ విద్యుత్ ఫీడర్ల మధ్య అనుసంధానం చేస్తున్నారు. దీంతో ప్రధాన లైన్లో సమస్య ఉత్పన్నమైతే వెంటనే ప్రత్యామ్నాయ లైన్ ద్వారా సాధ్యమైనంత త్వరగా విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తారు. 16 సర్కిళ్ల పరిధిలో 269 ఇంటర్ లింకింగ్ పనులు.. టీజీ ఎన్పీడీసీఎల్ వ్యాప్తంగా 16 సర్కిళ్ల పరిధిలో 269 ఇంటర్ లింకింగ్ పనులు చేపట్టాలని ప్రణాళిక రూపొందించుకుని ముందుకెళ్తున్నారు. ఇందులో ఇప్పటి వరకు 164 పనులు పూర్తయ్యాయి. మిగతా 105 పనులు వేగంగా సాగుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 57 ఇంటర్ లింకింగ్ పనుల లక్ష్యం విధించుకోగా ఇప్పటి వరకు 27 పూర్తయ్యాయి. ఇంకా 30 పనులు జరుగుతున్నాయి. హనుమకొండ సర్కిల్లో మొత్తం 6 ఇంటర్ లింకింగ్ పనులకు ఒకటి మాత్రమే పూర్తి కాగా 5 పురోగతిలో ఉన్నాయి. వరంగల్ సర్కిల్లో మొత్తం 15 ఇంటర్ లింకింగ్ పనులకు గాను 9 పూర్తికాగా 6 పనులు కొనసాగుతున్నాయి. జనగామలో 13 ఇంటర్ లింకింగ్ పనులకు 10 పూర్తయ్యాయి. మూడు పనులు సాగుతున్నాయి. భూపాలపల్లి సర్కిల్లో 15 ఇంటర్ లింకింగ్ పనులకు గాను 3 పూర్తి కాగా మరో 12 పనులు పురోగతిలో ఉన్నాయి. మహబూబాబాద్ సర్కిల్లో 8 ఇంటర్ లింకింగ్ పనులకు 4 పూర్తికాగా, మరో 4 పనులు పురోగతిలో ఉన్నాయి.ఇంటర్ లింకింగ్తో విద్యుత్ అంతరాయాలకు బ్రేక్.. ప్రకృతి వైఫరీత్యాలు, నిర్వహణ సమయంలోనూ నిరంతర సరఫరా ఒక సబ్ స్టేషన్లో సరఫరా నిలిచిపోతే మరో సబ్స్టేషన్ నుంచి విద్యుత్.. 33 కేవీ, 11 కేవీ విద్యుత్ లైన్లలో వేగంగా కొనసాగుతున్న పనులు -
సత్ప్రవర్తనతో జీవిస్తే రౌడీషీట్ తొలగిస్తాం
● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం: సత్ప్రవర్తనతో జీవిస్తే రౌడీ షీట్ నుంచి పేరు తొలగిస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ తెలిపారు. న్యూ ఇయర్ సందర్భంగా గురువారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ‘పరివర్తన’ ప్రత్యేక కార్యక్రమం ద్వారా కమిషనరేట్ పరిధిలోని రౌడీ షీటర్లతోపాటు అనుమానుతులపై ఉన్న షీట్లను తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వు పత్రాలను అందజేశారు.సత్ప్రవర్తన తో జీవిస్తున్నారని ఉన్నతాధికారులు గుర్తించిన 19 మందిలో 5 గురు రౌడీ షీటర్లు, 12 మంది అనుమానితులు, ఒకరు కేడీ, ఒకరు డీసీని రౌడీ షీట్ల నుంచి పేర్లను తొలగిస్తూ సీపీ ఉత్తర్వులు అందజేశారు. ప్ర స్తుతం ఎలాంటి జీవితం గడుపుతున్నారని రౌడీ షీ టర్లను తెలుసుకున్నారు. చట్టవ్యతిరేక చర్యలకు పా ల్పడడంతో మీపై రౌడీ షీట్లను ఓపెన్ చేశామని, ప్ర స్తుతం మీ ప్రవర్తన బాగుందని విచారించిన అనంతరం షీట్లను తొలగించామని, భవిష్యత్లో ఇలాగే జీవించాలన్నారు. వెస్ట్జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్, అదనపు డీసీపీ రవి, ఏసీపీ డేవిడ్రాజు, ఇ న్స్పెక్టర్లు శ్రీనివాస్, సంజీవ్ పాల్గొన్నారు. ముగిసిన క్రికెట్ లీగ్ మ్యాచ్లు కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని క్రీడామైదానంలో నిర్వహిస్తున్న ఈస్ట్జోన్ గోల్డ్ కప్ క్రికెట్ పోటీల లీగ్మ్యాచ్లు ముగిశాయి. గురువారం వరంగల్, సూర్యాపేట జట్లు తలపడగా వరంగల్ సాధించింది. ఈ క్రికెట్ పోటీలకు ముఖ్యఅతిథిగా హనుమకొండ రోహిణి ఆస్పత్రి సూపరింటెండెంట్ సుధాకర్రెడ్డి, డైరెక్టర్ రామ్రెడ్డి పాల్గొని ప్రారంభించారు. కాగా, నేడు సెమిఫైనల్ మ్యాచ్లలో హనుమకొండ, కొత్తగూడె– భద్రాద్రి, పెద్దపల్లి –ఖమ్మం జట్లు తలపడనున్నాయి. ఆరెండు జట్లలో గెలిచిన జట్లు ఈనెల 3న ఫైనల్లో తలపడుతాయని నిర్వాహకులు తెలిపారు. ఫైనాన్స్ అకౌంట్ ఆఫీసర్ మధుసూదన్పై ఫిర్యాదు ● డీటీఎఫ్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ లింగారెడ్డి విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లా విద్యాశాఖ సమగ్రశిక్షలో డిప్యుటేషన్పై, జయశంకర్ భూపాలపల్లి డీఈఓ ఆఫీస్లో ఫైనాన్స్ అకౌంట్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్న మధుసూదన్ అవకతవకలకు పాల్పడుతున్నారని హైదరాబాద్లో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్నికోలస్కు ఇటీవల ఫిర్యాదు చేసినట్లు హనుమకొండకు చెందిన డెమొక్రటిక్ టీచర్స్ఫెడరేషన్ ( డీటీఎఫ్) రాష్ట్ర జనరల్ సెక్రటరీ టి. లింగారెడ్డి గురువారం తెలిపారు. విచారణ జరిపించి ఆ అధికారిని ఈ రెండు జిల్లాల బాధ్యతల నుంచి తొలగించి అతడి మాతృశాఖకు పంపాలని డైరెక్టర్ను కోరామన్నారు. విచారణ జరిపించి క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవాలని డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే కోచ్ఫ్యాక్టరీలో అయోధ్యపురం భూ నిర్వాసితులు, ఉమ్మడి జిల్లా నిరుద్యోగులకు 65 శాతం ఉద్యోగావకాశాలు కల్పించి న్యాయం చేయాలని దక్షిణ మధ్య రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ కాజీపేట బ్రాంచ్ నాయకులు డిమాండ్ చేశారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు కల్పించాలని తెలంగాణ రైల్వే జేఏసీ, రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఉమ్మడి పోరాటానికి గురువారం కాజీపేట రైల్వే పెన్షనర్స్ కార్యాలయంలో వారు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పెన్షనర్స్ సంఘం అధ్యక్షుడు కందుల సంగమయ్య మాట్లాడుతూ కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం కావాలని 1979 నుంచి 1983 వరకు పోరాటం చేసిన దివంగత బి.ఆర్.భగవాన్దాస్, దివంగత మడత కాళిదాస్ కళ నెరవేరబోతున్న నేపథ్యంలో ఈ ప్రాంత నిరుద్యోగులకు కోచ్ఫ్యాక్టరీలో ఉద్యోగా వకాశాలు ఇస్తేనే వారికి నిజమైన నివాళుల ర్పించినట్లు అన్నారు. ఈ ప్రాంత నిరుద్యోగులు, రైల్వే కా ర్మిక పిల్లలు, యాక్ట్ అంప్రెంటీస్ చేసిన వారికి ప్ర త్యేక జీఓ తీసుకొచ్చి న్యాయం చేయాలన్నారు. పెన్షనర్స్ సంఘం కోశాధికారి కె.ఐలయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ యాదయ్య, వైస్ ప్రెసిడెంట్లు రాములు, వెంకటేశ్వ ర్లు, పాల్గొన్నారు. -
నగరాభివృద్ధికి సమష్టిగా పనిచేయాలి
నూతన సంవత్సర వేడుకల్లో కమిషనర్ చాహత్బాజ్పాయ్ వరంగల్ అర్బన్: నూతన సంవత్సరంలో నగరాభివృద్ధికి సమష్టిగా పనిచేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ సూచించారు. హనుమకొండలోని కమిషనర్ క్యాంపు కార్యాలయంలో గురువారం నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కమిషనర్ కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. పుష్పగుచ్ఛాలు స్వీకరించేందుకు ఆమె నిరాకరించారు. పేద విద్యార్థుల కోసం దుస్తులు, నోట్బుక్స్, పెన్నులను అధికారులు, సిబ్బంది, కాంట్రాక్టర్లు అందించారు. కార్యక్రమంలో ఎస్ఈ సత్యనారాయణ, ఇన్చార్జ్ సిటీప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నారాణి, సమ్మయ్య, ఈఈలు రవికుమార్, సంతోష్, ఎంహెచ్ఓ రాజేశ్, డీపీఆర్వో అయూబ్, ‘కుడా’ సీపీఓ అజిత్రెడ్డి, జేఏసీ అధ్యక్షుడు రమేశ్ పాల్గొన్నారు. మేయర్ను కలిసిన కమిషనర్ నగర మేయర్ గుండు సుధారాణిని ఆమె చాంబర్లో కమిషనర్ చాహత్ బాజ్పాయ్ కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా మేయర్ను అధికారులు, ఉద్యోగులు కలిసి పుష్పగుచ్ఛం అందించారు. -
సమగ్రశిక్షలో అధికారి ఇష్టారాజ్యం!
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లా విద్యాశాఖ సమగ్రశిక్షలో ఓ అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. తన బాధ్యతల పరిధి దాటి జిల్లా విద్యాశాఖ కార్యాలయ వ్యవహారాల్లోనూ దూరిపోతున్నారని, తాను చెప్పినట్లు వింటేనే బిల్లులు పాస్ అవుతాయని, లేదంటే కొర్రీలు పెట్టడంతో ‘మధుసూదనా’ఇది మీకు తగునా.. అంటూ బాధితులు నిట్టూరుస్తున్నారు. సదరు అధికారి ముడుపులు తీసుకోవడంలోనూ చాలా ‘తెలివి’గా వ్యవహరిస్తారన్న టాక్ వినిపిస్తోంది. తను ఎక్కడా ఇరక్కుండా సంబంధిత సిబ్బందిచేత చేయించి వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. రాత్రి 10 గంటల వరకు సిబ్బంది కార్యాలయంలోనే ఉంచుతూ, తాను బిల్లులు పరిశీలించేవరకు పక్కన నిలబడాల్సి ఉండాలని హుకుం జారీ చేయడం ఈయన ప్రత్యేకత. అంతేగాకుండా తనకు అనుకూలంగా కేజీబీవీలకు సంబంధించిన ఒకరిద్దరి సిబ్బందిని మార్చుకొని వారితో ఇతర కేజీబీవీల ఎస్ఓలు, అకౌంటెంట్లను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చివరికి ఈయన వేధింపులు భరించలేక పలువురు బాధితులు డీఈఓకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. డీఈఓకు డీటీఎఫ్ బాధ్యుల ఫిర్యాదు.. హనుమకొండ జిల్లా విద్యాశాఖలోని సమగ్రశిక్షణలో ఫైనాన్స్ అండ్ అకౌంట్ ఆఫీసర్గా పారిన్ డిప్యుటేషన్పై బాధ్యతలు నిర్వర్తిస్తున్న మధుసూదన్పై పలు ఆరోపణలు చేస్తూ డిసెంబర్ 23న జిల్లా విద్యాశాఖాధికారి ఎల్వీ గిరిరాజ్గౌడ్కు డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు జి.ఉప్పలయ్య, ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసులు ఫిర్యాదు చేశారు. మధుసూదన్ తీరుతో కేజీబీవీల్లో పనిచేస్తున్న స్పెషల్ ఆఫీసర్లు, అకౌంటెంట్ ఉద్యోగినులు తీవ్ర భయం, మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారని డీఈఓ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. నెలవారీగా డైట్ చార్జీలు, ఇతరత్రా బిల్లులు తీసుకొస్తే, వాటిని తాను చెప్పినట్లుగా మార్చాలని ఒత్తిడిచేసి ముడుపులువచ్చేలా పాస్ చేస్తున్నారని ఆరోపణలున్నాయి. ఫర్నిచర్, క్రీడా సామగ్రి, ల్యాబ్ మెటీరియల్స్, స్టేషనరీ, లైబ్రరీ పుస్తకాలు తదితర ఽవాటివి నిజమైన ధర తెలుసుకోవాల్సిన అవసరం లేదని బెదిరించి ఇష్టం వచ్చిన ధర కోట్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ఆ అధికారిపై విచారణ కమిటీవేసిన డీఈఓ ఫైనాన్స్ అండ్ అకౌంట్ ఆఫీసర్ మధుసూదన్పై వచ్చిన వరుస ఫిర్యాదుల నేపథ్యంలో డీఈఓ ఇటీవల విచారణ కమిటీని నియమించారు. సదరు కమిటీ జిల్లాలోని 9 కేజీబీవీల ఎస్ఓలు, అకౌంటెంట్ ఉద్యోగినులను వేర్వేరుగా పిలిపించి విచారణ జరిపారు. తాము ఫైనాన్స్ అకౌంటింగ్ ఆఫీసర్ నుంచి ఎలాంటి ఇబ్బందులకు గురయ్యామో తెలియజేశారని, లిఖితపూర్వకంగా రాసి ఇచ్చినట్లు సమాచారం. మరికొందరు కమిటీ ముందు కన్నీటిపర్యంతమైనట్లు తెలిసింది. కాగా, అధికారి మధుసూదన్ని విచారణకు రావాలని కమిటీ సమాచారం ఇచ్చినా హాజరుకాలేదని తెలుస్తోంది. ఆయనపై రెండు మూడు రోజుల్లో విచారణ కమిటీ డీఈఓకు నివేదిక సమర్పించే అవకాశం ఉంది. నాపై విచారణ జరపాలంటే కమిటీలో గెజిటెడ్ ఆఫీసర్లు ఉండాలి సమగ్రశిక్షలో నేను గెజిటెడ్ ఆఫీసర్ని. నాపై విచారణ జరపాలంటే కమిటీలో గెజిటెడ్ ఆఫీసర్లు అయి ఉండాలి. అదేవిధంగా సమగ్రశిక్షకు సంబంధించిన ఆడిటర్ కూడా ఉండాలి. కానీ కమిటీలో వీరు లేరు. అందుకే హాజరుకాలేదు. ఇదే విషయమై డీఈఓకు లిఖితపూర్వకంగా తెలియజేశా. నేను సమగ్రశిక్షలో, కేజీబీవీల్లో ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదు. నాపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం. – జిల్లా సమగ్రశిక్ష ఫైనాన్స్ అకౌంటెంట్ ఆఫీసర్ మధుసూదన్ సమగ్రశిక్షలో ఫైనాన్స్ అండ్ అకౌంట్ ఆఫీసర్ తీరుపై సిబ్బంది ఆవేదన ఆయన ఎప్పుడు రమ్మంటే సిబ్బంది అప్పుడే కార్యాలయానికి రావాలి రాత్రివేళ ఆఫీస్లో బిల్లులు పరిశీలించడం ఈయన ప్రత్యేకత డీటీఎఫ్ బాధ్యులు, బాధితులు డీఈఓకు వరుస ఫిర్యాదులు విచారణ కమిటీ వేసిన డీఈఓ.. మూడు రోజులపాటు కొనసాగిన విచారణ హనుమకొండ జిల్లా విద్యాశాఖ పరిధిలో 45 ప్రీప్రైమరీ స్కూళ్లు ఉన్నాయి. వాటికి అవసరమైన వస్తువుల కొనుగోలుకు రూ.52.50లక్షల నిధులు మంజూరయ్యాయి. విద్యాశాఖలో సమగ్రశిక్ష కోఆర్డినేటర్ పర్యవేక్షణలోనే టెండర్ పిలిచి వర్క్ఆర్డర్ ఇవ్వాల్సి ఉండగా, ఫైనాన్స్ అండ్ అకౌంట్ ఆఫీసర్.. ఆ కోఆర్డినేటర్కు తెలియజేయకుండానే గత ఇన్చార్జ్ డీఈఓకు చెప్పి వర్క్ ఆర్డర్స్ను టెండర్దారులకు అప్పగించడంలో కీలకపాత్ర పోషించినట్లు తెలిసింది. కాగా, వర్క్ ఆర్డర్స్ తన ప్రమేయం లేకుండానే ఇచ్చారని సమగ్రశిక్ష కోఆర్డినేటర్ ఇటీవల వచ్చిన డీఈఓ దృష్టికి తీసుకెళ్లారని సమాచారం. సమగ్రశిక్షలో నలుగురు కోఆర్డినేటర్లు ఉండగా, వీరికి రావాల్సిన టీఏ,డీఏ బిల్లులు కూడా చెల్లించడం లేదని వారే చెబుతుండడం గమనార్హం. ఓ కోఆర్డినేటర్ ఇటీవల బిల్లు పెట్టుకోగా కొర్రీపెట్టి నిలిపివేసినట్లు చెబుతున్నారు. -
ఉద్యోగులు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, ఉన్న దాంట్లో సంతృప్తిగా బతకడం నేర్చుకోవాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా గురువారం అవినీతి వ్యతిరేక సంస్థ జ్వాల, లోక్సత్తా సంయుక్తంగా కలెక్టరేట్ ఆవరణలో ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి వ్యతిరేక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్పై కలెక్టర్ స్నేహ శబరీష్ తొలి సంతకం చేసి అవినీతికి పాల్పడనంటూ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అవినీతికి వ్యతిరేకంగా కఠినంగా వ్యవహరిస్తున్నామని, అన్ని కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. జ్వాల సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, లోక్సత్తా ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు సుంకరి ప్రశాంత్ మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో ప్రతిపనికి లంచం చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతిపరులకు శిక్షపడేలా పౌరులను చైతన్యం చేస్తామని, నిజాయితీ గల ఉత్తమ అధికారులను ప్రతి ఏటా సన్మానిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రవి, ఎల్బీ కళాశాల ఎన్సీసీ ఆఫీసర్ కెప్టెన్ ముండ్రాతి సదానందం, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ శ్రీనివాస్, లోక్ సత్తా – జ్వాల సభ్యులు బుర్రి కృష్ణమూర్తి, పొట్లపల్లి వీరభద్రరావు, కామిడి సతీశ్రెడ్డి, బుద్దె సురేశ్, శశిధర్రెడ్డి, ఎన్సీసీ కేడెట్లు, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు పాల్గొన్నారు. -
నూతన సంవత్సర వేడుకల్లో ఫుల్ జోష్
● ఉమ్మడి వరంగల్ జిల్లాలో రూ.48.73 కోట్ల మద్యం అమ్మకాలు ● ఆబ్కారీశాఖకు కాసుల పంట.. రికార్డు బ్రేక్ చేసిన మద్యం ప్రియులుకాజీపేట అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆబ్కారీశాఖ కాసుల పంట పండింది. 2025 డిసెంబర్ 31కి వీడ్కోలు పలికి.. 2026 జనవరి 1కి మందుబాబులు స్వాగతం పలికి రికార్డు స్థాయిలో మద్యం తాగారు. అర్ధరాత్రి వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉ న్నాయి. సంతోషంతో మందు కొడుతూ నూ తన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. హనుమకొండ జిల్లాలో రూ.16.40 కోట్ల మద్యం, ఉమ్మడి జిల్లాలో రూ.48.73 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ఇళ్లు, ఫంక్షన్హాళ్లు, రిసార్టుల్లో.. నూతన సంవత్సర వేడుకలను ఓరుగల్లు వాసులు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. న్యూ ఇయర్ కేక్లకు ఎంత క్రేజ్ ఉందో అంతకు మించి మద్యానికి ఉండడం కనిపించింది. ఇళ్లు, ఫంక్షన్హాళ్లు, రిసార్టుల్లో ఎంజాయ్ చేశారు. ఇందుకోసం ఎకై ్సజ్ శాఖ నుంచి ఈవెంట్ పర్మిషన్ తీసుకున్నారు. ఈవెంట్స్కు రూ.9 వేల నుంచి రూ.50 వేల వరకు రుసుము చెల్లించడంతో ఎక్సైజ్ శాఖకు మరింత ఆదాయం సమకూరింది. ఉమ్మడి జిల్లాలో 295 వైన్స్, 134 బార్లు.. ఉమ్మడి జిల్లాలోని వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, జనగామ, ములుగు జిల్లాల్లో డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు మందుబాబులు చీర్స్ కొడుతూ రూ.48.73 కోట్ల విలువైన మద్యం తాగారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 295 వైన్స్, 134 బార్లు ఉన్నాయి. కాగా, 2024లో రూ.39.50 కోట్లు, 2025లో రికార్డు బ్రేక్ చేస్తూ రూ. 48.73 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి.హనుమకొండ జిల్లాలో మద్యం విక్రయాల వివరాలు.. సంవత్సరం విక్రయాలు 2023 రూ.6 కోట్లు 2024 రూ.14.7 కోట్లు 2025 రూ.16.40 కోట్లు -
అడుగడుగునా డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు
● వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 433 కేసులు ● పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ముందస్తు చర్యలతో సత్ఫలితాలువరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు డిసెంబర్ 31 రాత్రి డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు చేశారు. బుధవారం సాయత్రం నుంచే ప్రధాన కూడళ్ల దగ్గర గస్తీ నిర్వహించారు. రాత్రి 9 గంటల తర్వాత వరంగల్ నగరంలో అడుగడుగునా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేసి మద్యం సేవించి వాహనాలు నడిపిన 433 మందిపై కేసులు నమోదు చేశారు. 13 చెకింగ్ పాయింట్ల ఏర్పాటు వరంగల్లోని మూడు ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల పరిధిలో 13 చెకింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ పరీక్షల్లో 216 కేసులు నమోదయ్యాయి. వీటితోపాటు ఈస్ట్జోన్ పరిధిలో 68 కేసులు, వెస్ట్జోన్ పరిధిలో 96 కేసులు, సెంట్రల్ జోన్ పరిధిలో 53 కేసులు.. మొత్తం కమిషనరేట్ పరిధిలో 433 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. మద్యం సేవించి వాహనాలు నడిపి.. ప్రమాదాల బారినపడకుండా సీపీ సన్ప్రీత్సింగ్ తీసుకున్న ముందస్తు చర్యలు సత్ఫలితాలిచ్చాయి. దీంతో ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. ట్రాఫిక్ పోలీసులు లా అండ్ ఆర్డర్ పోలీసులు బందోబస్తు విధులతోపాటు ముమ్మరంగా డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. వరంగల్ ట్రాఫిక్ పోలీసులు ఎంజీఎం, బూడిదగడ్డ, పోచమ్మమైదాన్, తెలంగాణ జంక్షన్, హనుమకొండ ట్రాఫిక్ పోలీసులు సీపీఓ జంక్షన్, అశోకా జంక్షన్, బస్టాండ్, ములుగురోడ్డు, కాజీపేట ట్రాఫిక్ పోలీసులు కడిపికొండ, కాజీపేట, అదాలత్ లో డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు చేశారు. -
అధ్యయనం అత్యవసరం
‘గ్రంథాలయాల్లో మిడిల్ ఏజ్, ఓల్డేజ్ పీపుల్స్ మాత్రమే కనిపిస్తున్నారు. మరి యువతరం ఎక్కడుంది అని పరిశీలిస్తే.. నిద్ర మత్తులో, సెల్ఫోన్లలో, టీవీల ఎదుట మునిగిపోయింది’ అని ఓ మాజీ ఐపీఎస్ అధికారి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యువత ఫోన్లను, సామాజిక మాధ్యమాలను కాస్త దూరం పెట్టి గ్రంథాలయాల వైపు చూడాలి. పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుంటే ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో ఉన్నవారంతా పుస్తకాలు చదివిన వారే. ‘తల దించి నన్ను చూడు. తల ఎత్తుకునేలా నేను చేస్తా’ అంటుంది పుస్తకం. -
రైల్వేశాఖ వరాలు
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే డ్రైవర్ల కార్యాలయం (క్రూ లాబీ) కేంద్రంగా పని చేస్తున్న రన్నింగ్ స్టాఫ్ లోకో పైలెట్లు, అసిస్టెంట్ లోకో పైలెట్లపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు న్యూ ఇయర్ కానుకగా వరాలు కురింపించారు. కాజీపేట రైల్వే డ్రైవర్ల కార్యాలయానికి కొత్తగా 130 మంది లోకో పైలెట్లు, అసిస్టెంట్ లోకో పైలెట్ల పోస్టుల సంఖ్యను పెంచుతూ మంజూరు చేసినట్లు బుధవారం రైల్వే అధికారులు, రైల్వే నాయకులు తెలిపారు. 16 మందికి గూడ్స్ లోకో పైలెట్ల నుంచి ప్యాసింజర్ లోకో పైలెట్లుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. వీరిలో ఏడుగురికి ప్యాసింజర్ లోకో పైలెట్గా పదోన్నతి కల్పిస్తూ 9 మందిని సికింద్రాబాద్ నుంచి ప్యాసింజర్ లోకో పైలెట్గా కాజీపేటకు బదిలీ చేసినట్లు తెలిపారు. కాజీపేట రైల్వే డ్రైవర్ల కార్యాలయం నుంచి పదోన్నతులు కల్పించాలని, పెండింగ్ లోకో పైలెట్ల పోస్టుల ఇండెంట్ మంజూరు చేయాలని 3 ఏళ్ల నుంచి దక్షిణ మధ్య రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్చించి వినతి పత్రాలు అందజేసినట్లు రైల్వే నాయకులు తెలిపారు. గతంలో కాజీపేట నుంచి విజయవాడకు తరలించిన క్రూ లింక్లను లోకో పైలెట్లు, అసిస్టెంట్ లోకో పైలెట్లను తిరిగి కాజీపేటకు తీసుకురావాలని అనేక సార్లు డీఆర్ఎం, జీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఆశించినట్లుగా లోకో పైలెట్లు, అసిస్టెంట్ లోకో పైలెట్ల పోస్టుల కేటాయింపు జరగలేదని రైల్వే నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాజీపేట రైల్వే క్రూ లాబీలో ఉన్న ఖాళీ పోస్టులను మంజూరు చేయాలని అనేకసార్లు రైల్వే సికింద్రాబాద్ అధికారులను కలిసి వినతి పత్రాలు ఇచ్చాం. కాజీపేటలో డ్యూటీ చేసే వారికి కాజీపేటలోనే పదోన్నతి కల్పించాలి. బదిలీల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలి. ఖాళీలను భర్తీ చేయాలి. – పాక రాజ్కుమార్, కాజీపేట రైల్వే సంఘ్ లోకో రన్నింగ్ బ్రాంచ్ చైర్మన్ 130 మంది లోకో పైలెట్లు, అసిస్టెంట్ లోకో పైలెట్ల పోస్టులు మంజూరు 16 మందికి పదోన్నతులు 3 ఏళ్ల ఎదురు చూపులకు దక్కిన బదిలీల ఫలితం ఆనందంలో రైల్వే లోకో పైలెట్ల స్టాఫ్ -
కుటుంబ సభ్యులతో గడపండి
వరంగల్ క్రైం: ఉద్యోగ విరమణ అనంతరం పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యుల కోసం సమయం కేటాయించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో సుధీర్ఘకాలంగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులను మంగళవారం ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందించారు. ఉద్యోగ విరమణ పొందిన వారిలో ఇన్స్పెక్టర్ ఎన్.వెంకటేశ్వర్లు, ఎస్సైలు జె.విల్సన్, పి.ప్రకాశ్రెడ్డి, ఆర్ఎస్సై కె.ప్రభాకర్, ఏఆర్ఎస్సైలు అబ్దుల్ రఫీక్, యం.రవి ఉన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీలు రవి, సురేశ్కుమార్, శ్రీనివాస్, ఏసీపీ, సురేంద్ర, ఆర్ఐ సతీశ్, ఆర్ఎస్సై శ్రవణ్కుమార్తో పాటు, ఇతర పోలీస్ సిబ్బంది, ఉద్యోగ విరమణ సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు సన్మానం -
క్రమశిక్షణ అవశ్యం
సచిన్ టెండూల్క ర్, వినోద్ కాంబ్లీ బాల్య స్నేహితులు. ఒకేసారి కెరీర్ ప్రారంభించారు. కానీ సచిన్ క్రికెట్ ప్రపంచంలో ఆరాధ్యుడయ్యాడు. వినోద్ కాంబ్లీ అపరిచితుడుగా మారిపోయాడు. సచిన్ విజయానికి కారణం క్రమశిక్షణ. మంచి వ్యక్తిత్వం. నిజాయితీ, క్రమశిక్షణ, కష్టపడే తత్వం ఎప్పటికై నా ఉన్నత శిఖరాలకు చేరుస్తాయని నేటి యువత గ్రహించాలి. వ్యాయామం మన ఆరోగ్యానికి, దేహదారుఢ్యానికి ఎంతో దోహదం చేస్తుంది. ఇన్నిరోజులు బద్ధకంగా ఉన్నా కొత్త సంవత్సరంలోనైనా వ్యాయామం చేయాలన్న నిర్ణయం తీసుకుని అమలు చేయాలి. -
‘సాస్కి’ ప్రతిపాదిత ప్రాజెక్టులపై సమీక్ష
వరంగల్ అర్బన్ : స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెంట్ టు స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ (సాస్కి) ప్రతిపాదిత ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ హౌసింగ్ ఎఫైర్స్ మంత్రిత్వ శాఖ అడిషనల్ సెక్రటరీ సారా సమీక్షించారు. బుధవారం ఢిల్లీనుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, హనుమకొండలోని కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) కార్యాలయంనుంచి కమిషనర్ చాహత్ బాజ్పాయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాస్కికి ప్రతిపాదనలైన ఫైనాన్సియల్, అర్బన్ గవర్నెన్స్, అర్బన్ ల్యాండ్ రిఫారమ్స్ తదితర 6 ప్రాజెక్ట్ల మీద సుదీర్ఘ చర్చ జరిగింది. నగరంలో చేపట్టనున్న ఆయా ప్రాజెక్టులకు సంబంధించి అదనపు సెక్రటరీ లేవనెత్తిన అంశాలకు కమిషనర్ వివరణ ఇచ్చారు. కార్యక్రమంలో డీటీసీపీ దేవేందర్ రెడ్డి, ‘కుడా’ సీపీఓ అజిత్ రెడ్డి, ఈఈ భీమ్రావు తదితరులు పాల్గొన్నారు. తాగునీటి సరఫరా భేష్‘తాగు నీటి సరఫరా భేష్. 2025 స్ఫూర్తితో నూతన సంవత్సరంలో మరింత సమర్థవంతంగా నీటిని సరఫరా చేయాలి’ అని మేయర్ గుండు సుధారాణి అన్నారు. బుధవారం వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయంలో కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి డివిజన్ల వారీగా అభివృద్ధి పనులపై సమీక్షించారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం చేయొద్దని, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. సమావేశంలో ఎస్ఈ సత్యనారాయణ, ఈఈలు రవికుమార్, సంతోశ్బాబు, డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. వివరాలు తెలుసుకున్న కేంద్ర అడిషనల్ డైరెక్టర్ సందేహాలు నివృత్తి చేసిన కమిషనర్ చాహత్ బాజ్పాయ్ -
ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు
పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి హన్మకొండ చౌరస్తా: నియోజకవర్గ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి బుధవారం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2025వ సంవత్సరం జిల్లావ్యాప్తంగా అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు కీలకంగా నిలిచిందని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించడంతోపాటు మౌలిక వసతుల కల్పనలో ముందున్నామని తెలిపారు. 2026 కొత్త సంవత్సరం ప్రతీ కుటుంబానికి ఆరోగ్యం, సంతోషం, అభివృద్ధి తీసుకురావాలని ఆకాంక్షించారు. హనుమకొండ కలెక్టర్.. హన్మకొండ అర్బన్ : హనుమకొండ జిల్లా ప్రజలకు కలెక్టర్ స్నేహ శబరీష్ బుధవారం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. జిల్లాను అభివృద్ధి పథంలో నిలిపేందుకు, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తోడ్పాటు అందిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు నూతన సంవత్సరంలోనూ సహకరించాలని కోరారు. మేయర్ శుభాకాంక్షలు వరంగల్ అర్బన్ : వరంగల్ మహా నగర ప్రజలకు మేయర్ గుండు సుధారాణి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026 సంవత్సరంలో ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని, ప్రజల జీవితాల్లో మరింత వెలుగులు నిండాలని, అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మేయర్ ఆకాంక్షించారు. హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్గా (రెవెన్యూ) ఎన్.రవిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రవి ఇంతకాలం భూపాలపల్లి డీఆర్ఓగా పని చేస్తున్నారు. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేశారు. కీసర, నల్లగొండ ప్రాంతాల్లో ఆర్డీఓగా పని చేశారు. హనుమకొండ రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి ఇటీవల ఏసీబీకి పట్టుబడడంతో పోస్టు ఖాళీ అయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. భూపాలపల్లి డీఆర్ఓగా ఉన్న రవిని హనుమకొండకు బదిలీ చేయడంతో ఖాళీ అయిన ఆ స్థానాన్ని ప్రస్తుతం హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న పోరిక హరికృష్ణకు కేటాయించారు. కాజీపేట అర్బన్ : మడికొండ పోలీస్స్టేషన్ను బుధవారం సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత తనిఖీ చేశారు. పీఎస్లో మూడేళ్ల నేరాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. రోడ్డు ప్రమాదాలు, దొంగతనాల నియంత్రణకు చేపడుతున్న చర్యలపై ఆరా తీశారు. మహిళలు, పిల్లలు, వృద్ధుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, పోలీస్ ఇమేజ్ పెంచేందుకు కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో కాజీపేట ఏసీపీ ప్రశాంత్రెడ్డి, మడికొండ ఇన్స్పెక్టర్ పి.కిషన్, ఎస్సైలు రాజబాబు, రాజ్కుమార్, రామ్మోహన్ పాల్గొన్నారు. వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉత్తమ సేవలందించిన పోలీసు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పతకాలను ప్రకటించింది. టాస్క్ఫోర్స్ ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న మధుసూదన్, ట్రాన్స్కో విభాగంలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సుధాకర్కు మహోన్నత సేవా పతకం, క్రైమ్ ఏసీపీ సదయ్య, ఏఎస్సై వేణుగోపాల్రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ రమేశ్బాబుకు ఉత్తమ సేవా పతకం, ఎస్సై కనక చంద్రం, ఏస్సైలు జయదేవ్, పాపయ్య, చేరాలు, అర్జున్, హెడ్ కానిస్టేబుళ్లు అమీర్ పాషా, నర్సింగరావు, శ్యామ్ సుందర్రెడ్డి, స్వర్ణలత సేవా పతకానికి ఎంపికయ్యారు. ఈసందర్భంగా వారికి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అభినందనలు తెలిపారు. -
స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగాలి
వరంగల్ క్రైం: నూతన సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి. ప్రతిఒక్కరూ స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగాలి. కొత్త ఆలోచనలు గొప్పగా ఉండాలి. గడిచిన ఏడాదిలో ఏమైనా తప్పులు చేస్తే వాటిని అధిగమించటానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి. సమయం విలువ కచ్చితంగా గుర్తించి ముందుకు సాగితే తప్ప విజయం వరించదు. విద్యార్థులు, యువతీయువకులు పెట్టుకున్న టార్గెట్ను చేరుకోవడానికి నిరంతరం శ్రమను నమ్ముకోవాలి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. – దార కవిత, సెంట్రల్ జోన్ డీసీపీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసాక్షి, వరంగల్: కొత్త ఏడాదిలో జిల్లాలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం. మామునూరు విమానాశ్రయానికి భూసేకరణ దాదాపు పూర్తి కావొచ్చింది. సంక్రాంతి నాటికి ఏఏఐకి భూముల అప్పగింత పూర్తవుతుంది. కలెక్టరేట్ నిర్మాణ పనులు సాధ్యమైనంత తొందరగా పూర్తయ్యేలా చూసి ప్రభుత్వ విభాగాలను అక్కడికి తరలిస్తాం. ముఖ్యంగా 24 అంతస్తులతో కూడిన వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు పూర్తయ్యేలా చూసి రోగులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా చూస్తాం. జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. – సత్యశారద, కలెక్టర్, వరంగల్ -
యువతి ప్రేమను తిరస్కరించిందని..
● మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య పర్వతగిరి: యువతి ప్రేమను తిరస్కరించిందని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్యాయత్నం చేసి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్సై బోగం ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం బూర్గుమళ్ల గ్రామ శివారు కొత్తతండాకు చెందిన రామావత్ రాకేశ్ (19) కొద్ది రోజులుగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో ఆమె రాకేశ్ ప్రేమను తిరస్కరించింది. మూడు రోజుల క్రితం మనస్తాపానికి గురై పురుగుల మందు తాగాడు. స్థానికులు వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. కాగా, రాకేశ్ తల్లి ఇటీవల విద్యుత్ షాక్తో మృతి చెందింది. రాకేశ్ మృతితో తండాలో విషాదం నెలకొంది. -
సంక్షేమం, విద్యపై ప్రత్యేక శ్రద్ధ
● ఎస్సీ, గిరిజన సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ మంత్రి లక్ష్మణ్కుమార్భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వం గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీ సుకుంటుందని ఎస్సీ, గిరిజన సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కా ర్యాలయంలో బుధవారం భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, పోలీస్, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులు, ఆర్సీఓలు, జిల్లా కోఆర్డినేటర్లు, ఎస్సీ కార్పొరేట్ ఈడీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వసతి గృహాల్లోని విద్యార్థులను తమ పిల్లల్లాగా చూసుకోవాలని, ఎలాంటి నిర్లక్ష్యం జరిగినా చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని శాఖల సమన్వయంతో.. జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు రాహుల్శర్మ, స్నేహశబరీష్, సత్యశారద మాట్లాడుతూ మండల ప్రత్యేక అధికారులు, పోలీస్ తదితర శాఖల సమన్వయంతో వసతి గృహాల్లో నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో భూపాలపల్లి ఎస్పీ సంకీర్త్, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, ఎస్సీ అభివృద్ధి శాఖ అదనపు డైరెక్టర్ శ్రీధర్, ఎస్సీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ హన్మంత్నాయక్, గిరిజన సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ పోశం, మంత్రి ఓఎస్డీ విజయ్ కుమార్, పీఆర్వో అమృత్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
కలర్స్ లేక కళావిహీనం..
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క తల్లి కొలు వుదీరిన చిలకలగుట్టకు ప్రత్యేక ఉంది. జాతర సమయంలో అమ్మవారిని చిలకలగుట్టపై నుంచి డోలువాయిద్యాలతో పూజారులు అంగరంగవైభంగా మేడారంలోని గద్దైపెకి తీసుకొస్తారు. ప్రభు త్వ గౌరవ వందనాలతో సమ్మక్క తల్లికి స్వాగతం పలుకుతారు. ఇంత గొప్ప ప్రాచుర్యం కలిగిన చిలకల గుట్ట ప్రహరీపై ఏర్పాటు చేసిన ఆదివాసీ చి త్రాలకు నేటి వరకూ రంగులు(కలర్స్) వేయలేదు. ఫలితంగా ఆ చిత్రాలు కళావిహీనంగా కనిపిస్తున్నాయి. ఈసారి ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయ చిత్రాలకు రంగులు వేస్తారా? లేదా అనే సందేహాలు పూజారుల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రహరీపై రంగులు వెలసిన ఆదివాసీ చిత్రాలు చిలకలగుట్ట ప్రహరీపై గత జాతరలో ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా గిరి జన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఆదివాసీ చిత్రాలు ఏర్పాటు చేసి రంగులు వేశారు. రెండేళ్ల కాలంలో చిత్రాలు రంగులు వెలసిపోయి కళావిహీనంగా దర్శనమిస్తున్నాయి. జాతర అభివృద్ధి పనులకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. ఆది వాసీ చిత్రాలకు రంగులు వేసేందుకు నిర్లక్ష్యం ఎందుకుని పలువురు భక్తులు ప్రశ్నిస్తున్నారు. గిరిజన సంక్షేమశాఖ ఆధీనంలో జాతర మేడారం జాతర గిరిజన సంక్షేమశాఖ ఆధీనంలో నే జరుగుతుంది. కానీ ఆ శాఖ అధికారులు మా త్రం జాతరపై పట్టింపులేనట్లు వ్యవహరిస్తున్నార నే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆదివాసీ సంస్కృతికి పెద్దపీట వేయాల్సిన అధికారులు జాతర నిర్వహణపై శ్రద్ధ చూపడం లేదని ఆదివాసీ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఇప్పటికై నా చిత్రాలకు రంగులు వేయాలని కోరుతున్నారు. చిలకలగుట్ట ప్రహరీపై వెలిసిపోయి కనిపిస్తున్న ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల చిత్రాలు జాతర సమీపిస్తున్నా రంగుల ఊసేలేదు.. పట్టించుకోని గిరిజన సంక్షేమ శాఖ -
డీజే ప్రోగ్రాంలో పాల్గొని తిరిగొస్తూ.. మృత్యుఒడికి
లింగాలఘణపురం: డీజే ప్రోగ్రాంలో పాల్గొని తిరిగొస్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృత్యుఒడికి చేరాడు. కారు.. ఆగి ఉన్న డీసీఎంను ఢీకొన్న ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం జనగామ – సూర్యాపేట జాతీయ రహదారిపై వడిచర్ల వద్ద చోటు చేసుకుంది. ఎస్సై శ్రావణ్కుమార్ కథనం ప్రకారం.. ఏపీలోని విజయవాడకు చెందిన సయ్యపురాజు విష్ణువర్ధన్ (32), కారు డ్రైవర్ లవరాజ్, గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన రాంప్రసాద్, హైదరాబాద్లోని హబ్సిగూడకు చెందిన శరత్కుమార్ డీజే ప్రోగ్రాం నిమిత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం వెళ్లారు. కార్యక్రమం పూర్తయిన అనంతరం కారులో విజయవాడ బయలుదేరారు. మార్గమధ్యలో వడిచర్ల కల్వర్టు వద్ద ఆగి ఉన్న డీసీఎంను ఎదురుగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో విష్ణువర్ధన్ అక్కడికక్కడే మృతి చెందగా మిగతా ముగ్గురికి గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడు విష్ణువర్ధన్కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై బాధిత కుటుంబాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. ఆగి ఉన్న డీసీఎంను ఢీకొన్న కారు.. యువకుడి దుర్మరణం ముగ్గురికి గాయాలు.. వడిచర్ల వద్ద ఘటన మృతుడు ఏపీలోని విజయవాడ వాసి -
విద్యుత్ స్తంభాల తయారీ నాణ్యతలో రాజీలేదు
● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి హన్మకొండ : వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడానికి స్తంభాల నాణ్యత అత్యంత కీలకమని, ఈ క్రమంలో స్తంభాల తయారీ నాణ్యతలో రాజీపడేది లేదని టీజీఎన్పీడీసీఎల్ చైర్మన్, మే నేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం వరంగల్ పున్నేలు రోడ్ లోని స్వర్ణ, ఉజ్వల స్తంభాల తయారీ కేంద్రంతోపాటు యాదా ద్రి భువనగిరి జిల్లా గూడూరులోని మంచుకొండ స్తంభాల తయారీ కేంద్రాన్ని సందర్శించారు. క్షేత్రస్థాయిలో తయారీ ప్రక్రియ, నాణ్యతను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వైఫరీత్యాలు, భారీ ఈదురు గాలులు వీచిన సమయంలో విద్యుత్ స్తంభాలు విరిగిపోకుండా తయారీ దశలోనే అత్యున్నత ప్రమాణాలు పా టించాలన్నారు. తయారీదారులు ఎలాంటి లోపాలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎన్పీడీసీఎల్ చీఫ్ ఇంజనీర్ కె.తిరుమల్, ఎస్ఈ (సివిల్) వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. ఓటాయి ప్రాంతంలో పులి సంచారం ● తోడు కోసం జిల్లాలు దాటి తిరుగుతున్న టైగర్ కొత్తగూడ: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ రేంజ్ పరిధిలోని ఓటాయి బీట్ అటవీ ప్రాంతంలో అధికారులు బుధవారం పులి ఆనవాళ్లు గుర్తించారు. ఇటీవల ములుగు జిల్లా పరిధిలో సంచరించిన పులి.. అక్కడ నుంచి తోడు కోసం వెతుకుతూ ఓటాయి బీట్ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్, జనవరి మాసాల్లో పులి ఎదకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో పులి అడవి మొత్తం తిరగడం సహజమని అధికారులు పేర్కొంటున్నారు. కాగా, పులి.. ఓటాయి అటవీ ప్రాంతంలో ఆరు నెలల క్రితం జంగవానిగూడెం గ్రామానికి చెందిన రైతుకు చెందిన దుక్కిటెద్దును చంపింది. మళ్లీ రేణ్యతండా సమీప అటవీ ప్రాంతంలోని వాగులో పులి పాదముద్రలు గుర్తించి న పశువుల కాపరులు.. అటవీ శాఖ అధికా రులకు సమాచారం అందించగా వారు వెళ్లి పాదముద్రలు సేకరించారు. వీటి ఆధారంగా ఆడపులి అయి ఉండొచ్చనే అంచనాకు వ చ్చినట్లు సమాచారం. కాగా, సమీప గ్రామా ల రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. -
పర్యాటకుల స్వర్గధామం ములుగు..
ఎస్ఎస్ తాడ్వాయి : ములుగు జిల్లా పర్యాటకుల స్వర్గధామమని, ప్రకృతి అందాలతోపాటు చారిత్రాత్మక నేపథ్యం కలిగిన పర్యాటక ప్రదేశాలు ఎన్నో నెలవై ఉన్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) తెలిపారు. ఈ మేరకు బుధవారం తాడ్వాయి మండల కేంద్రంలో ఎకో టూరిజం ఏటూరునాగారం వైల్డ్ లైఫ్లోని తాడ్వాయి వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ రేంజ్, తాడ్వాయి హట్స్, రెండు సఫారీ వాహనాలను కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క.. అధికారులతో కలిసి సఫారీ వాహనంలో తాడ్వాయి వైల్డ్ లైఫ్ రేంజ్లో పర్యటించారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశాల మేరకు తాడ్వాయి హట్స్ను ఆధునికీకరించి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. తాడ్వాయి మండల కేంద్రంలో జాతీయ రహదారికి పక్కన 6 హట్స్, 18 కిలోమీటర్ల మేర సఫారీ చేయడానికి 2 వాహనాలను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్కు సుమారు 250 కిలోమీటర్లు, హనుమకొండకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ములుగు జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను చూడడానికి పర్యాటకులు విచ్చేయాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, ఏటూరునాగారం వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ ఎఫ్డీఓ రమేశ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క -
అయ్యో.. అమ్మ!
● వృద్ధురాలిపై నుంచి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ● అక్కడికక్కడే దుర్మరణం..పరకాల బస్టాండ్లో ఘటన పరకాల: పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్టాండ్లోకి వెళ్తున్న బస్సు వృద్ధురాలిపై నుంచి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణం కోల్పోయింది. స్థానికుల కథనం ప్రకారం.. ములుగు జిల్లా పల్సాబ్పల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు తోట రాధమ్మ(70) తన మనవరాలు ప్రసవించడంతో బంధువులతో కలిసి చెన్నాపూర్ బయలుదేరింది. పరకాల బస్టాండ్కు చేరుకుని భూపాలపల్లి వైపు వెళ్లే బస్సు ఎక్కడానికి ముందు బయట పండ్లు తీసుకునేందుకు వెళ్తోంది. ఈ సమయంలో వరంగల్– 2 డిపో బస్సు బస్టాండ్లోకి వెళ్లే క్రమంలో వృద్ధురాలిపై నుంచి దూసుకెళ్లగా అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో ఒక్కసారిగా స్థానికులు కేకలు వేస్తూ విగతజీవిగా మారిన వృద్ధురాలిని చూసి కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆర్టీసీ బస్సుతో పాటు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. -
డెడ్లైన్ టెన్షన్..
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణం పనుల డెడ్లైన్ సమీపిస్తుడడంతో అధికారుల్లో టెన్షన్ నెలకొంది. డిసెంబర్ 31 లేదా జనవరి 5వ తేదీ కల్లా పనులన్నీ పూర్తి చేయాలని మంత్రులు పొంగులేటి శ్రీనివా స్రెడ్డి, సీతక్క డెడ్లైన్ విఽధించిన విషయం తెలిసిందే. అలాగే, గద్దెల ప్రాంగణ పనులపై మంత్రి సీతక్క ప్రత్యేక దృష్టిసారించారు. ఇందులో భాగంగా ఈ వారంలో నాలుగు దఫాలుగా పనులను పరిశీలించి డెడ్లైన్ లోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. దీంతో ఏఈ నుంచి మొదలు.. కలెక్టర్ వరకు నిరంతరం క్షేత్రస్థాయిలో పరిశీలించి పనుల్లో వేగం పెంచుతున్నారు. ఈ క్రమంలో గద్దెల పునర్నిర్మాణ పనుల్లో కొన్ని పూర్తికాగా మరిన్ని డెడ్లైన్ నాటికి పూర్తయ్యేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నారు. సాలహారం పనుల పూర్తిపై అనుమానాలు గద్దెల ప్రాంగణం చుట్టూ సాలహారం రాతి నిర్మాణ పనులు పూర్తి స్థాయిలో డెడ్లైన్ నాటికి పూర్తయ్యేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క వైపే ఈ పనులు పూర్తి కాగా మరో వైపు పిల్లర్ల స్థాయిలోనే ఉంది. ప్రహరీ నిర్మాణంతోపాటు 8 ఆర్చ్ల నిర్మాణం కోసం భారీ స్తంభాలను నిలిపారు. కానీ వాటిపై భీమ్లు నిలపడంతోపాటు ఆదివాసీ సంస్కృతి చిత్రాలు కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. ఐరన్ గేట్లను కూడా అమర్చాల్సి ఉంది. ఈ పనులేవీ నేటి వరకు కాలేదు. గద్దెల ప్రాంగణంలో గ్రానైట్ అమర్చే పనులు పూర్తయ్యాయి. అయితే రాళ్ల మధ్యలో సిమెంట్ పూతల పనులు ఇంకా పూర్తి కాలేదు. అమ్మవార్ల గద్దెల విసర్తణ పనుల్లో భాగంగా గద్దెల చుట్టూ కేవలం రాతి పిల్లర్లను ఏర్పాటు చేశారు. పైన రాతి పిల్లర్లను నిలపడంతోపాటు గద్దెల చుట్టూ రాతి స్టోన్స్ డిజైన్ల ఏర్పాటు పనులు కూడా నేటి వరకూ కాలేదు. దీనిపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మీడియా పాయింట్ మంచెల పనులూ అంతే.. జాతరలో కవరేజ్ కోసం మీడియా పాయింట్ మంచెల నిర్మాణ పనులు ఇంకా స్లాబ్ స్థాయిలోనే జరుగుతున్నాయి. జాతరలో మీడియా కవరేజ్ కీలకం. గద్దెల పునర్నిర్మాణంలో భాగంగా మీడియా కవరేజ్, అధికారుల పర్యవేక్షణ కోసం సాలహారానికి అవతల వైపు రెండు, ఇవతల వైపు రెండు చొప్పున మీడియా పాయింట్ మంచెలు నిర్మిస్తున్నారు. ఈ పనులు ఒక మంచె రెండో స్లాబ్ వేయగా, మిగతా మూడు మంచెల నిర్మాణం పనులు మొదటి స్లాబ్ దిశలోనే కొనసాగుతున్నాయి. జాతరకు ముందుగా మంచెల నిర్మాణ పనులు పూర్తికావడం అనుమానంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జాతర గడువు సమీపిస్తున్న తరుణంలో చివరి నిమిషంలో తొందరపాటుతో పనులు జరిగే అవకాశాలు ఉన్నాయని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాతరకు మిగిలింది 27 రోజులే. మేడారం జాతరకు ఇంకా 27 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. దీంతో భక్తుల తాకిడి మొదలైంది. ఆదివారం, బుధ, గురువారాల్లో వేల సంఖ్యలో భక్తులు తరలొస్తున్నారు. సంక్రాంతి సెలవుల సందర్భంగా అమ్మవార్ల దర్శనానికి భక్తుల సంఖ్య లక్షల్లో పెరగనుంది. ప్రస్తుతం గద్దెల ప్రాంగణంలో గ్రానైట్ మధ్యలో జీపీ సిమెంట్ పూయడంతో భక్తుల రద్దీ కారణంగా దెబ్బతినే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక దృష్టి నిరంతరం మేడారం పనులను పర్యవేక్షిస్తున్న అధికారులు మహాజాతర నాటికి పూర్తయ్యేనా? -
రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి
వరంగల్ చౌరస్తా : వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆకాంక్షించారు. ముక్కోటి (వైకుంఠ ) ఏకాదశి సందర్భంగా మంగళవారం వరంగల్ బట్టల బజార్లోని ఆలయంలో వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఉత్తర ద్వారా దర్శనం చేసుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ దైవారాధనతో మానసిక ప్రశాంత కలుగుతుందన్నారు. స్థానిక కార్పొరేటర్ గందె కల్పన, నవీన్ కుమార్ ప్రత్యేక కార్యక్రమాల్లో పొల్గొన్నారు. ఉదయం 5 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమైంది. కిలోమీటర్ వరకు భక్తులు క్యూలో బారులుదీరి స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. కాగా, దేవాలయం ప్రధాన రహదారిలో ఉండడంతో వాహనదారులు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ -
100 రోజులు.. 41.28 టీఎంసీలు
సాక్షిప్రతినిధి, వరంగల్ : యాసంగి పంటలకు ఈనెల 31 (బుధవారం) నుంచి ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందనుంది. ఈ మేరకు నీటిపారుదలశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి వరంగల్లో 9,48,114 ఎకరాల ఆయకట్టుకుగాను ఈ యాసంగిలో 5,29,726 ఎకరాలకు నీరివ్వాలని ఈ నెల 3న జరిగిన రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (స్కివం) సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు 41.28 టీఎంసీల నీరు అవసరం ఉండగా.. వారబందీ (వారం రోజులు విడుదల, వారం రోజులు నిలుపుదల) పద్ధతిన స్థిరీకరించిన ఆయకట్టుకు నీటిని విడుదల చేయనున్నారు. వారం రోజులనుంచే హనుమకొండ, జనగామ, ములుగు, నర్సంపేట తదితర డివిజన్లలో అధికారులు నీటి విడుదల, నిర్వహణపై సమావేశాలు నిర్వహించారు. కొన్నిచోట్ల ఈ సమావేశాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అతిథులుగా పాల్గొని పలు సూచనలు చేశారు. నేటి ఉదయం 11 గంటలకు.. ఉమ్మడి వరంగల్లో నీటి లభ్యత ఉన్న జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల, ఎస్సారెస్పీ కాకతీయ కాలువ (దిగువ మానేరు), ఎస్సారెస్పీ స్టేజ్ – 2 ప్రాజెక్టులతో పాటు పాకాల, రామప్ప చెరువులు, లక్నవరం, మల్లూరువాగు, పాలెంవాగు ప్రాజెక్టుల నుంచి ఈ స్థిరీకరించిన ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ నుంచి కాకతీయ కాల్వల ద్వారా ఉమ్మడి వరంగల్లోని ఎస్సారెస్పీ ఆయకట్టుకు విడుదల చేయనున్నారు. ‘స్కివం’ షెడ్యూల్ ప్రకారం నేటి నుంచి నీటి విడుదలఈ నెల 3న హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (స్కివం) మీటింగ్లో తీసుకున్న నిర్ణయాల ప్రకారం యాసంగి ఆయకట్టు సాగునీరు విడుదల చేస్తాం. ఎల్ఎండీ నుంచి బుధవారం ఉదయం 11 గంటలకు జోన్–1, జోన్–2లలో స్థిరీకరించిన ఆయకట్టుకు వారబందీ పద్ధతిన నీటి సరఫరా జరుగుతుంది. సాగునీరు వృథా కాకుండా పొదుపుగా వాడుకొని సహకరించాలని రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. – పి.రమేశ్, ఎస్ఈ, ఇరిగేషన్ సర్కిల్–2, కరీంనగర్ నేటినుంచి యాసంగి పంటలకు సాగునీరు ఎల్ఎండీ నుంచి సరఫరాకు ఇరిగేషన్ శాఖ సన్నద్ధం వారబందీ పద్ధతి అమలు -
కామన్ మెస్లో అధిక బిల్లులు..
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని కా మన్ మెస్లో బిల్లులు అధికంగా వచ్చాయని మంగళవారం మధ్యాహ్నం విద్యార్థులు భోజనం తినకుండా ఆందోళన చేపట్టారు. ఒక్కో విద్యార్థికి జూలై బిల్లు రూ. 2,178, ఆగస్టులో రూ. 2,435 చొప్పున వేశారు. ఈ బిల్లులను ఈనెల 29న హాస్టళ్ల డైరెక్టర్ రాజ్కుమార్ ప్రదర్శించారు. ఆగస్టులో 8 నుంచి 20వ తేదీ వరకు సెలవుల సందర్భంగా మెస్ నడపలేదని, 18 రోజులకే ఒక్కో విద్యార్థికి రూ. 2,435 బిల్లు రావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. నెల మొత్తం ఒక్కో విద్యార్థికి రూ. రూ.2వేల వరకు రావాల్సిండగా 18 రోజులకే ఎక్కువ బిల్లు రావడం ఏమిటని, అక్రమాలు జరిగాయని అనుమానం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న హాస్టళ్లడైరెక్టర్ రాజ్కుమార్ ఘటనాస్థలికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. జనవరి 3న రిజిస్ట్రార్ రామచంద్రం వద్ద ఈ బిల్లుల విషయంపై సమావేశం నిర్వహించి చర్చించి నిర్ణయం తీసుకుందామని తెలుపగా మధ్యాహ్నం 3 గంటలకు ఆందోళన విరమించి విద్యార్థులు భోజనం తిన్నారు. కాగా, కామన్ మెస్ వద్ద విద్యార్థులతో జనవరి 3న సమావేశం నిర్వహించనున్నట్లు హాస్టళ్ల డైరెక్టర్ ఎల్ిపీ రాజ్కుమార్ మంగళవారం సర్క్యూలర్ జారీచేశారు. మెస్ బిల్లులు, మెస్లో మాల్ప్రాక్టీసెస్, టెండర్ నోటిఫికేషన్లపై చర్చించనున్నామని ఆయన పేర్కొన్నారు. అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థుల ఆందోళన రిజిస్ట్రార్తో సమావేశం ఏర్పాటుచేస్తామన్న డైరెక్టర్ -
గ్రాంట్ ఇన్ ఎయిడ్తో వేతనాలివ్వాలి
కాళేశ్వరం: రాష్ట్రంలోని అర్చక, ఉద్యోగులందరికీ గ్రాంట్ ఇన్ ఎయిడ్ ప్రకారం దేవాలయాల నుంచి వేతనాలు ఇవ్వాలని రాష్ట్ర అర్చక, ఉద్యోగ జేఏసీ అద్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ, రాష్ట్ర కన్వీనర్ డీవీఆర్ శర్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం వసతి గృహంలో విలేకరులతో మాట్లాడారు. అర్చక, ఉద్యోగుల సమస్యలపై జనవరి 2న వరంగల్లో సమావేశం నిర్వహిస్తున్నామని, దీనికి ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో తరలి రావాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో తమ సమస్యలు 40శాతం పూర్తయ్యాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తమ సమస్యల పరిష్కార దిశగా రెండు దఫాలుగా సీఎం రేవంత్రెడ్డిని కలిశామన్నారు. ఆయన దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్తామన్నారు. 121 జీఓను రద్దు చేసి 577 జీఓను పూర్తి స్థాయిలో అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. దేవస్థానం సీనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్, ఉప ప్రధాన అర్చకులు ఫణీంద్రశర్మ, శరత్చంద్రతోపాటు అర్చక, ఉద్యోగులు పాల్గొన్నారు. అర్చక, ఉద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గంగు ఉపేంద్ర శర్మ -
సమష్టి కృషితోనే బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన
వరంగల్ క్రైం: ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల సమష్టి కృషితోనే బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సాధ్యమని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. ఆపరేషన్ స్మైల్ –12లో భాగంగా మంగళవారం కమిషనరేట్ పరిధిలోని వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల అధికారులు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు పారిశ్రామిక ప్రాంతాలు, షాపుల్లో, ప్రమాదకర ప్రాంతాల్లో కార్మిక శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీస్ యూనిట్.. స్వచ్ఛంద సంస్థల సహకారంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. ఆపరేషన్ స్మైల్ ముస్కాన్ ద్వారా 339 బాలలను కాపాడి 26 ఎఫ్ఐఆర్లు, 160 ఐఆర్లు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీస్ యూనిట్ ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్, కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ వినోద, ఎన్సీఎల్పీ డైరెక్టర్ అశోక్ కుమార్, బాలల సంక్షేమ స మితి చైర్మన్లు ఉప్పలయ్య, వసుధ, సభ్యుడు పరికి సుధాకర్, జిల్లా బాలల పరిరక్షణ అధికారులు ఎస్. ప్రవీణ్ కుమార్, ఎల్. రవికాంత్, ఉమా, చైల్డ్ హె ల్ప్ లైన్ కోఆర్డినేటర్లు ఎస్. భాస్కర్, కల్పన, రవికుమార్, ఎస్సై సుధాకర్, తదితరులు పాల్గొన్నారు. అధికారుల పనితీరుపై పర్యవేక్షణ ఉండాలి.. స్టేషన్ అధికారులు, సిబ్బంది పనితీరును పోలీస్ ఉన్నతాధికారులు నిరంతం పర్యవేక్షించాలని సీపీ సన్ప్రీత్సింగ్ తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం సెంట్రల్ జోన్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వరంగల్, హనుమకొండ, కాజీపేట డివిజన్ల సంబంధించిన పలు రికార్డులతోపాటు, గ్రీవెన్స్ ఫిర్యాదులు, రౌడీషీటర్ల వివరాలతో కూడిన ఫైళ్లను పరిశీలించి డీసీపీ దార కవితకు పలు సూచనలు చేశారు. ఈ తనిఖీల్లో వరంగల్ ఏఎస్పీ శుభం, కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి, ట్రైనీ ఐపీఎస్ మనీషా నెహ్రా పాల్గొన్నారు. వరంగల్ సీపీ సన్ప్రీత్ సింగ్ -
మెనూ ప్రకారం భోజనం అందించాలి
● వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద మామునూరు: విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. వరంగల్ 43వ డివిజన్ మామునూరులోని జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలను మంగళవారం రాత్రి కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, వంట గది, స్టోర్ రూమ్, భోజనం నాణ్యతను పరిశీలించి మాట్లాడారు. విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత స్థానాలను అధిరోహించాలని సూచించారు. సీనియర్ జర్నలిస్ట్ శ్రీనాథ్ అందజేసిన 40 దుప్పట్లను కలెక్టర్ విద్యార్థులకు పంపిణీ చేశారు. జిల్లా సంక్షేమాధికారి పుష్పలత, వర్ధన్నపేట మండల స్పెషల్ ఆఫీసర్ రమేశ్, డీసీఓ సరిత, అధికారులు పాల్గొన్నారు. యాసంగికి సరిపడా యూరియా నిల్వలు న్యూశాయంపేట: వరంగల్ జిల్లాలో యాసంగి సీజన్కు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. మౌలిక వసతులపై దృష్టి పెట్టండి.. జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులపై దృష్టి పెట్టాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. జిల్లా పరిషత్ సమావేశపు హాలులో మంగళవారం మండల స్పెషల్ ఆఫీసర్లతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం, సదుపాయాలను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పెట్టెలు, స్టోర్ రూమ్, కిచెన్షెడ్, తరగతి గదులను చెక్లిస్ట్ ప్రకారం పరిశీలించి నివేదికలు సమర్పించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, ఇళ్లకు అవసరమైన ఇసుకను జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల ఇసుక రీచ్ నుంచి సరఫరా చేయాలని కోరారు. -
అధ్యాపకుల పదోన్నతులకు ఆమోదం..
● కేయూ పాలకమండలి సమావేశంలో నిర్ణయం కేయూ క్యాంపస్ : హైదరాబాద్లోని సచివాలయంలో మంగళవారం కాకతీయ యూనివర్సిటీ పాలకమండలి సమావేశం నిర్వహించారు. మొత్తం 11 అంశాలపై చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా కొంతకాలం క్రితం కేరీర్ అడ్వాన్స్మెంట్ స్కీం కింద (క్యాస్)అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అసోసియేట్ ప్రొఫెసర్లుగా, అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా పదోన్నతులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇందులో ఎక్కువశాతం మంది అధ్యాపకుల పదోన్నతుల ప్రక్రియకు ఆమోదం లభించగా రెండు విభాగాలకు చెందిన నలుగురికి మాత్రం ఆమోదం లభించలేదని సమాచారం. ఫార్మసీ కాలేజీలో ముగ్గురు రిటైర్డ్ ప్రొఫెసర్ల ఎండోమెంట్ లెక్చర్లు ఏర్పాటుకు కూడా చర్చించి ఆమోదించారు. ఓ మాజీ వీసీ, రిజిస్ట్రార్పై తమ హయాంలో జరిగిన నియామకాల విషయంలో కొంతకాలం క్రితం విజిలెన్స్ విచారణ జరిగింది. ఆ మాజీ వీసీ, మాజీ రిజిస్ట్రార్పై చర్యలు తీసుకునే విషయంపై కూడా పాలకమండలి సమావేశంలో చర్చించినట్లు సమాచారం. వీరిపై చర్యల కోసం గవర్నర్కు, ప్రభుత్వానికి ప్రతిపాదించాలని నిర్ణయించినట్లు సమాచారం. సూపరింటెండ్ల నుంచి అసిస్టెంట్ రిజిస్ట్రార్లుగా నియామకాలకు ఉస్మానియా యూనివర్సిటీలో అనుసరిస్తున్న నిబంధనలకు అనుగుణంగానే కే యూలో కూడా ఏఆర్ల నియామకాలు చేపట్టాలని నిర్ణయించారు.దీంతో ఇక సూపరింటెండెట్లకు రాత పరీక్షలోని మెరిట్ అభ్యర్థులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారాతోనే నియామకాలు చేపట్టబోతున్నారు. సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ యోగితారాణా, ఉన్నత విద్యాకమిషనర్ శ్రీదేవసేన, కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి , రిజిస్ట్రార్ వి. రామచంద్రం, పాలకమండలి సభ్యులు పుల్లూరు సుధాకర్, బి. రమ, సుదర్శన్, చిర్రరాజు, సుకుమారి, బాలుచౌహాన్ పాల్గొన్నారు. విచారణ కమిటీ నియామకం..తనను వేధిస్తున్నారని కాకతీయ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ విభాగంలోని పార్ట్టైం అధ్యాపకుడు డాక్టర్ పి.రమేశ్.. ఆవిభాగంలోని పలువురిపై ఆరోపణలు చేస్తూ జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. విచారణ జరిపేందుకు ఆరుగురు ప్రొఫెసర్లతోకూడిన విచారణ కమిటీని నియమిస్తూ కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం ఈనెల 29న ఉత్తర్వులు జారీ చేశారు. ఈవిచారణ కమిటీ చైర్మన్గా కేయూ పాలకమండలి సభ్యుడు ప్రొఫెసర్ బి.సురేశ్లాల్ వ్యవహరిస్తున్నారు. ఈవిచారణ కమిటీ పదిరోజుల్లో (వర్కింగ్ డేస్) విచారణ జరిపి నివేదికను తనకు సమర్పించాలని రిజిస్ట్రార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
1న వరంగల్ మార్కెట్కు సెలవు
వరంగల్: ఆంగ్ల నూతన సంవత్సరం ఆరంభం రోజు గురువారం (జనవరి 1, 2026)న గుమస్తా, దడవాయి, హమాలీ, వ్యాపారులు, చాంబర్ ఆఫ్ కామర్స్ – ఇండస్ట్రీస్ కోరిక మేరకు వరంగల్ వ్యవసాయ మార్కెట్కు సెలవు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఆర్.మల్లేశం మంగళవారం ప్రకటనలో తెలి పారు. సెలవు నేపథ్యంలో మార్కెట్లో ఎలాంటి క్రయ, విక్రయాలు జరగవని తెలిపారు. శుక్రవారం మార్కెట్ పునఃప్రారంభమవుతుందన్నారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలని కోరారు. యార్డు బంద్ ఉన్నా 1వ తేదీన (గురువారం) జిన్నింగ్ మిల్లుల్లోని సీసీఐ కేంద్రాల్లో పత్తిని కొనుగోలు చేస్తారని మల్లేశం తెలిపారు. పేకాట శిబిరంపై పోలీసుల దాడి.. ● తొమ్మిది మంది అరెస్ట్.. రూ.1,86,020 స్వాధీనం ● మూడు కార్లు, తొమ్మిది సెల్ఫోన్లు సీజ్హసన్పర్తి: గోపాలపురంలో నిర్వహిస్తున్న ఓ పేకాట శిబిరంపై టాస్క్ఫోర్స్, కేయూసీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. గోపాలపురంలోని చింతల రాజు ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు సోమవారం అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్, కేయూ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పేకాడుతున్న గోపాలపురానికి చెందిన చింతల రాజు, పిట్టల రామ్మోహన్, పిట్టల ప్రవీణ్, సీతంపేటకు చెందిన డి. వీరస్వామి, హనుమకొండ భవానీనగర్కు చెందిన గొట్టిముక్కుల రవికుమార్, హుస్నాబాద్కు చెందిన కారెపు శ్రీనివాస్, దేవన్నపేటకు చెందిన సూరం మల్లికార్జున్, హనుమకొండ నక్కలగుట్టకు చెందిన కందారపు చంద్రమౌళి, భీమారానికి చెందిన లాలెల్లా శివప్రసాద్ను అరెస్ట్ చేసి వారిని వద్ద నుంచి రూ.1,86,020 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ మధుసూదన్ తె లిపారు. అలాగే, మూడు కార్లు, తొమ్మిది సెల్ఫోన్లు సీజ్ చేసినట్లు ఏసీపీ వివరించారు. ఈ దాడిలో ఇన్స్పెక్టర్ బాబులాల్,ఎస్సై చందర్, వీరస్వామి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బావిలో పడి వ్యక్తి మృతి ఖిలా వరంగల్: చేద బావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం ఆలస్యం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ ఎస్ఆర్ఆర్తోటకు చెందిన వీరసారపు గణేశ్కుమార్(40) ఎలక్ట్రీషియన్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 28వ తేదీన మద్యం సేవించి ఇంటికి చేరుకున్నాడు. అనంతరం సాయంత్రం 6గంటల సమయంలో బయటకెళ్లి ఇంటికి రాలేదు. మంగళవారం ఎస్ఆర్ఆర్తోటలోని చేదబావిలో అతడి చెల్లికి చనిపోయి కనిపించాడు. వెంటనే మిల్స్కాలనీ పోలీసులకు సమాచారం అందజేయగా వారు హుటాహుటినా ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతికి గల వివరాలు సేకరించి మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఎవరిపై ఎలాంటి అనుమానాలు లేవని, ప్రమాదవశాత్తు కాలు జారి చేదబావిలో పడి మృతి చెంది ఉంటాడని మృతుడి భార్య సృజన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ బొల్లం రమేశ్ తెలిపారు. విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం ● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి హన్మకొండ : విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్రెడ్డి తెలిపారు. మంగళవారం హనుమకొండలోని టీజీఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో జనగామ సర్కిల్ రఘునాథపల్లి సబ్ డివిజన్ నర్మెట సెక్షన్లో పనిచేస్తూ మృతి చెందిన అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ బానోత్ రాజు సతీమణి నీలకు న్యూ ఇండియా ఎస్యూరెన్స్ కంపెనీకి చెందిన బీమా రూ.25 లక్షల చెక్కును అందజేశారు. సందర్భంగా నీలకు ఉద్యోగం కల్పించాలని సీఎండీని కోరగా సానుకూలంగా స్పందించారని విద్యుత్ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్లు వి.మోహన్రావు, వి .తిరుపతిరెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, సీఈలు, ఎస్ఈలు, తదితరులు పాల్గొన్నారు. -
సేవతో మార్పు తెస్తున్న రెడ్క్రాస్
● హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ ● కలెక్టరేట్లో రెడ్క్రాస్ సర్వసభ్య సమావేశంహన్మకొండ అర్బన్: సేవాభావంతో ప్రజల జీవితాల్లో ప్రత్యక్ష మార్పు తీసుకొస్తున్న సంస్థగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పనిచేస్తోందని హనుమకొండ కలెక్టర్, రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షురాలు స్నేహ శబరీష్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ స్నేహ శబరీష్ అధ్యక్షతన రెడ్క్రాస్ సొసైటీ హనుమకొండ జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముందుగా రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు జీన్ హెన్రీ డ్యూనాంట్, రక్తదాన ఉద్యమ పితామహుడు కార్ల్ ల్యాండ్స్టైనర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ విజయచందర్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా 2022–23 నుంచి 2024–25 వరకు అమలైన కార్యక్రమాలు, ఆడిటెడ్ అకౌంట్లు, అలాగే 2025–26 సంవత్సరానికి సంబంధించిన ఆదాయ, వ్యయ అంచనాలను సభ్యులకు వివరించారు. వార్షిక నివేదికలు, బడ్జెట్కు సమావేశం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. జిల్లాలో రెడ్ క్రాస్ కార్యక్రమాలకు నిరంతరం సహకరిస్తున్న కలెక్టర్కు పాలకవర్గం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ ప్యాట్రన్లను కలెక్టర్, పాలకవర్గ సభ్యులు శాలువాలతో సన్మానించారు. సమావేశంలో రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ పెద్ది వెంకట్ నారాయణగౌడ్, కోశాధికారి బొమ్మినేని పాపిరెడ్డి, రాష్ట్ర పాలకవర్గ సభ్యులు ఈవీ.శ్రీనివాసరావు, జి ల్లా పాలకవర్గ సభ్యులు పుల్లూరు వేణుగోపాల్, డాక్టర్ మాగంటి శేషుమాధవ్, పొట్లపల్లి శ్రీనివాస్ రావు, కె.సుధాకర్రెడ్డి, సీహెచ్ సంధ్యారాణి, చెన్నమనేని జయశ్రీ, బిళ్ల రమణారెడ్డి, బాశెట్టి హరిప్రసాద్, రెడ్క్రాస్ వైస్ ప్రెసిడెంట్, జిల్లా అదనపు కలెక్టర్ వై.వి గణేశ్, డీటీఓ శ్రీనివాస్కుమార్, టీజీఓ నాయకుడు జగన్మోహన్రావు, ప్రవీణ్కుమార్, టీఎ న్జీఓ నాయకులు రాజేందర్, సోమన్న పాల్గొన్నారు. -
‘వెల్నెస్’తో విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం
● హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహించే స్టూడెంట్ వెల్ నెస్ కార్యక్రమంతో విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం మెరుగుపర్చాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో స్టూడెంట్ వెల్నెస్ కార్యక్రమ నిర్వహణపై వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతీ పాఠశాల, కళాశాల నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు, అధ్యాపకులకు స్టూడెంట్ వెల్ నెస్ కార్యక్రమంలో భాగంగా.. విద్యార్థుల్లో వ్యక్తిత్వ (మానసిక) వికాసాన్ని పెంపొందించే అంశాలను తెలియజేసేందుకు ఓరిఝెంటేషన్ ప్రోగ్రాంను బుధవారం కలెక్టరేట్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో వికాసాన్ని పెంపొందించేందుకు అధికారులు ప్రశ్నావళిని రూపొందించాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్ఓ అప్పయ్య, డీఐఈఓ గోపాల్, విద్యా శాఖ సీఎంఓ సుదర్శన్రెడ్డి, డీడబ్ల్యూఓ జయంతి, మైనార్టీ వెల్ఫేర్ అధికారి గౌస్ హైదర్, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి ప్రేమకళ, జిల్లా బాలల పరిరక్షణ అధికారి ప్రవీణ్కుమార్, ఎంజేపీఎస్ డీసీఓ ప్రసాద్, వివిధ పాఠశాల, కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు -
నేడు ‘డయల్ యువర్ డీఎం’
హన్మకొండ: ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ వరంగల్–1 డిపో మేనేజర్ పుప్పాల అర్పిత తెలిపారు. ఈనెల 31న ఉదయం 11 నుంచి 12 గంటల వరకు హనుమకొండలోని వరంగల్–1 డిపో నుంచి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆమె ఒక ప్రకటనలో వివరించారు. హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట, పాలకుర్తి, తరిగొప్పుల రూట్ ప్రయాణికులు 99592 26047 నంబర్కు ఫోన్ చేసి సలహాలు, సూచనలు అందించాలని కోరారు. హన్మకొండ: 2026–27వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రతిపాదనలను జిల్లా స్థాయి టెక్నికల్ కమిటీ రూపొందించింది. మంగళవారం హనుమకొండ నక్కలగుట్టలోని వరంగల్ డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో జిల్లా వ్యవసాయాధికారి బి.రవీందర్సింగ్ అధ్యక్షతన జిల్లా స్థాయి టెక్నికల్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఇందులో నాబార్డ్ డీడీఎం ఎల్.చంద్రశేఖర్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారులు, జిల్లా మత్య్స శాఖ, పశు సంవర్థక శాఖ, మార్కెటింగ్ శాఖ, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్, శాస్త్రవేత్తలు, రీజినల్ బ్యాంక్ అధికారులు, ప్రగతిశీల రైతులు పాల్గొని వ్యవసాయంలో జరుగుతున్న ఖర్చులు, రైతుల అవసరాలు, పంటల వారీగా అయ్యే వ్యయాన్ని లెక్కించి, చర్చించి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈప్రతిపాదనలు రాష్ట్ర స్థాయి టెక్నికల్ కమిటీకి పంపనున్నట్లు వరంగల్ డీసీసీబీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఎండీ వజీర్ సుల్తాన్ తెలిపారు. రాష్ట్ర స్థాయి టెక్నికల్ కమిటీ ఆమోదం పొందిన తర్వాత ఖరారైన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ మేరకు బ్యాంకులు పంటల వారీగా రుణాలు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. సమావేశంలో డీసీసీబీ జీఎం ఉషశ్రీ, డీజీఎం అశోక్, ఏజీఎం మధు, బ్రాంచ్ మేనేజర్లు పాల్గొన్నారు. కాజీపేట రూరల్: సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో అనకాపల్లి–వికారాబాద్ మధ్య కాజీపేట జంక్షన్, వరంగల్ మీదుగా ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు మంగళవారం దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ ఎ.శ్రీధర్ తెలిపారు. జనవరి 18న 21:45 గంటలకు అనకాపల్లిలో అనకాపల్లి–వికారాబాద్ (07416) ఎక్స్ప్రెస్ మరుసటి రోజు వరంగల్, కాజీపేటకు చేరుకుంటుంది. ఈ ఎక్స్ప్రెస్కు ఎలమంచిలి, తుని, అన్నవరం, సామల్కోట, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, కైకలూరు, గుడివాడ, రాయన్పాడ్, ఖమ్మం, వరంగల్, కాజీపేట, సికింద్రాబాద్, బేగంపేట్, లింగంపల్లిలో హాల్టింగ్ కల్పించారు. 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్ అండ్ జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లతో ప్రయాణించే ఈ రైలుకు రిజర్వేషన్ టికెట్ బుకింగ్ ప్రారంభించారు. -
షెల్టర్ హోమ్ పనులు పూర్తి చేయండి
కమిషనర్ చాహత్ బాజ్పాయ్ వరంగల్ అర్బన్: హనుమకొండ ప్రసూతి ఆస్పత్రి ఆవరణలోని షెల్టర్ హోమ్ లెస్ (పట్టణ నిరాశ్రయుల కేంద్రం) పనులు త్వరగా పూర్తి చేయాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. మంగళవారం ఆస్పత్రి ఆవరణలోని వనాన్ని కమిషనర్ ఇంజనీర్లు, మెప్మా అధికారులతో కలిసి పరిశీలించారు. పెట్ పార్కును సమర్థంగా నిర్వహించాలి.. హనుమకొండ బాలసముద్రంలోని పెట్ పార్కును కమిషనర్ చాహత్ బాజ్పాయ్ పరిశీలించారు. పార్కులో పేరుకుపోయిన వ్యర్థాలపై అసహనం వ్యక్తం చేశారు. ఆమె వెంట డిప్యూటీ కమిషనర్లు సమ్మయ్య, బిర్రు శ్రీనివాస్, ఆర్ఐ కృష్ణారావు, ఈఈ రవికుమార్, టీఎంసీ రమేశ్, వార్డు ఆఫీసర్ నవ్య తదితరులు పాల్గొన్నారు. -
రారమ్మంటున్న కార్యక్రమాలు..
సాక్షి, వరంగల్/వరంగల్ క్రైం : నగర ప్రజలు 2025 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ.. 2026కు స్వాగతం పలుకనున్నారు. కీలకమైన ‘డిసెంబర్ థర్టీ ఫస్ట్’ వేడుకలు జరుపుకునేందుకు వరంగల్, హనుమకొండ, కాజీపేట వాసులు సిద్ధమవుతున్నారు. ఈ రోజు ఆనంద డోలికల్లో మునిగితేలాలని ఊవ్విళ్లూరుతారు. ఇందులో భాగంగా నగరంలోని కన్వెన్షన్ హాల్స్, హోటళ్లు, రిసార్టులు, వివిధ పాఠశాలల్లోని ఓపెన్ గ్రౌండ్లు, భద్రకాళి బండ్ నయా జోష్కు సిద్ధమయ్యాయి. మిరుమిట్లు గొలిపే ఈవెంట్లు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. మ్యూజిక్ బ్యాండ్లతో ప్రముఖ సింగర్లు, డీజేలతో పార్టీలను హీటెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సరికొత్త ప్యాకేజీలు, ప్రత్యేక రాయితీలతో పార్టీలు నిర్వహించేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు. ఇలా డిసెంబర్ థర్టీ ఫస్ట్ జోష్లో వరంగల్ తేలిపోనుంది. సంతోషాలతో వేడుకలు నిర్వహించుకుందాం..సీపీ సన్ప్రీత్ సింగ్ సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ ఒక ప్రకటనలో సూచించారు. డిసెంబర్ 31 రాత్రి నిర్వహించుకునే వేడుకల సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహిస్తారని ఆయన తెలిపారు. వేడుకలను అర్ధరాత్రి 12.30 గంటల్లోపు ముగించుకోవాలని, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని, ఎలాంటి అశ్లీల నృత్యాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. వేడుకలు నిర్వహించే ప్రదేశాల్లో సీసీ కెమెరాలు, సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలని, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా, పరిసర ప్రాంతాల్లోని ఇళ్ల వారికి ఇబ్బందులు కలుగకుండా చూడాలని సూచించారు. మత్తు పదార్థాలు వినియోగిస్తే చర్యలు తప్పవని, మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు చిక్కితే జరిమానాతోపాటు జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే విధంగా బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకలు నిర్వహిస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లు ప్రజల దృష్టికి వస్తే డయల్ 100కు సమాచారం అందించాలని సీపీ కోరారు. విభిన్న థీమ్స్తో వేడుకలు నిర్వహించేలా ఈవెంట్ నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. రూ.149 మొదలుకొని.. ఆపై ధరలతో విభిన్న ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నారు. వెబ్సైట్లలోనూ టికెట్లను విక్రయిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్.. ఇలా వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తుండడంతో ప్రజలు కూడా ఆసక్తి చూపుతున్నారు. అధికంగా అన్ లిమిటెడ్ ఫుడ్, లిక్కర్ అందిస్తున్న ప్యాకేజీలకు డిమాండ్ ఉంది. వరంగల్లోని గ్రీన్వుడ్ హైస్కూల్ డే స్కాలర్ ప్రాంగణంలో రాక్ మ్యూజిక్ స్టార్ రోల్ రైడా రాత్రి 8 నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమం ఉండనుంది. భద్రకాళి ట్యాంక్ బండ్ వద్ద బిగ్బాస్ ఫేమ్ ఫోక్ సింగర్ రాంరాథోడ్ లైవ్ పార్టీకి నిర్వాహకులు అంతా సిద్ధం చేశారు. హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రం.. లైవ్ మ్యూజిక్, క్యాంప్ ఫైర్, బబుల్ థీమ్, ఫుడ్ స్టాల్స్తో థర్టీ ఫస్ట్ వేడుకలకు సిద్ధమవుతోంది. డీ కన్వెన్షన్ సెంటర్లోనూ ఫుడ్తోపాటు ఆల్కహాల్ అందించేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. వరంగల్ బిగ్గెస్ట్ హిప్ హాప్ అండ్ ఫోక్ నైట్ మ్యూజిక్ సెలబ్రేషన్ కూడా జరగనుంది. ఇలా ఆయా ఈవెంట్లలో లైవ్ మ్యూజిక్, డ్యాన్స్ పర్ఫార్మెన్స్, ప్రీమియం సౌండ్ అండ్ లైటింగ్, వీఐపీ జోన్లు, టేబుల్ సర్వీస్ వంటివి ఉండడంతో ఈవెంట్లకు పైసా వసూలు కానుంది. పిల్లలు, కుటుంబ సభ్యులు, దంపతులు, పార్టీ లవర్స్.. ఇలా అందరికీ అవకాశం ఉండడంతో థర్టీ ఫస్ట్ వేడుకల్లో జోష్ ఉండనుంది. -
అమ్మానాన్నా.. మిమ్మల్నీ అమెరికా తీసుకెళ్తాం
మంగళవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్ శ్రీ 2025గార్ల: ‘మా కోసం ఎంతో కష్టపడ్డారు. ఎన్నో త్యాగాలు చేశారు. మా కలలకు రెక్కలు తొడిగి అమెరికా పంపించారు. అమ్మా నాన్న.. మిమ్మల్ని త్వరలో ఇక్కడికి(అమెరికా) తీసుకొస్తాం. ఇక్కడ చూడదగిన ప్రదేశాలను తిప్పి చూపిస్తాం. మీక్కావాల్సినవన్నీ కొనిపెడతాం’ అని ఫోన్లో ఆ బిడ్డలు అంటే తల్లిదండ్రులు మురిసిపోయారు. చుట్టు పక్కల వాళ్లకు చెప్పి సంబురపడ్డారు. కానీ, ఆ సంబురం ఎక్కువ రోజులు నిలవలేదు. విదేశాలకు తీసుకెళ్తామని చెప్పిన ఆ ఆడబిడ్డలు విగతజీవులుగా ఇంటికి తిరిగి వస్తుండడంతో వారి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. స్వగ్రామాల్లో విషాదం.. చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్నారు. ఉన్నత చదువుల కోసమని అమెరికా పయనమయ్యారు. బాగా స్థిరపడ్డాక ఉన్న ఊరి కోసం, కన్నవారి కోసం ఏదైనా చేయాలనుకున్నారు. అంతలోనే వారిని రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. బాల్య స్నేహితులైన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూరుకు చెందిన కడియాల భావన(24), గార్లకు చెందిన పుల్లఖండం మేఘనరాణి (24) అమెరికాలోని ఒహాయో రాష్ట్రం డేటాన్ నగరంలో ఉంటూ ఇటీవల ఎంఎస్ పట్టా పొందారు. ఉద్యోగాల వేటలో మునిగిపోయిన వారిరువురు.. ఆదివారం ఆహ్లాదం కోసం రెండు కార్లలో 8 మంది స్నేహితులతో కలిసి కాలిఫోర్నియా సమీపంలోని అలబామ హిల్స్ చూసేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కారు లోయలో పడిపోవడంతో భావన, మేఘన రా ణి అక్కడికక్కడే మృతిచెందారు. మీ అమ్మాయిలు మృతిచెందారని సోమవారం తెల్లవారుజామున అమెరికా నుంచి ఫోన్ రావడంతో మృతుల తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. గార్ల, ముల్కనూరు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, మృతదేహాలు ఇండియాకు రావాలంటే వారం లేదా పది రోజులు పట్టే అవకాశం ఉందని మృతుల బంధువులు పేర్కొంటున్నారు. మహబూబాబాద్ మాజీ ఎంపీ మాలోతు కవిత.. గార్ల, ముల్కనూరు గ్రామాల్లోని మృతుల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులను ఓదార్చారు.కూతుళ్ల మాటలతో ఉప్పొంగిన తల్లిదండ్రులు.. కానీ, వక్రించిన విధి.. కూలిన తల్లిదండ్రుల ఆశల సౌధాలు రోడ్డు ప్రమాదంలో విగతజీవులైన కూతుళ్లు గార్ల, ముల్కనూరులో విషాదఛాయలు -
ఆగుతూ.. సాగుతూ
సాక్షిప్రతినిధి, వరంగల్ : రాష్ట్రంలో గ్రేటర్ వరంగల్ది ప్రత్యేక స్థానం. హైదరాబాద్ తర్వాత అంతే వేగంగా అభివృద్ధి చెందాల్సిన మహానగరమిది. ఈ జిల్లాలో గడిచిన ఏడాదికాలంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు వచ్చాయి.. వస్తున్నాయి. వచ్చినవాటిలో కొన్ని ఆగగా, మరికొన్ని పనులు సాగుతున్నాయి. మరింత ముందడుగు పడి.. పనుల్లో వేగం, పారదర్శకత పెరిగితే 2026లో ఓరుగల్లు తెలంగాణ సిగలో మెరవనుంది. ‘గ్రేటర్’లో పనుల సందడి హనుమకొండ, వరంగల్, కాజీపేట ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ఈ ఏడాది ఒకేసారి రూ.4,962.47 కోట్లు కేటాయించింది. ఇందులో అండర్గ్రౌండ్ డ్రెయినేజీ (రూ. 4,170 కోట్లు), మామునూరు ఎయిర్పోర్ట్ భూసేకరణ (రూ. 205 కోట్లు) వంటివి ఉన్నాయి. పద్మాక్షిగుట్ట, ఎన్జీఓస్ కాలనీల్లో లైటింగ్, గ్రీనరీ, డ్రెయినేజీ పనులు ఉన్నాయి, ముఖ్యంగా గ్రీనరీ, ల్యాండ్స్కేపింగ్ పనులు జరుగుతున్నాయి. భద్రకాళి ఆలయ అభివృద్ధికి దశల వారీగా సుమారు రూ.40 కోట్ల వరకు కేటాయించారు. భద్రకాళి ఆలయానికి కొత్తశోభ వచ్చేలా మధురై తరహాలో మాఢవీధుల నిర్మాణం పనులకు డిజైన్ చేశారు. డీపీఆర్ దశలో యూజీడీ వరంగల్ నగరంలో భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థ (యూజీడీ) ఏర్పాటు కీలక ప్రాజెక్ట్. ప్రభుత్వం ఇప్పటికే రూ.4,170 కోట్ల నిధులను కేటాయించగా, పనులకు సంబంధించి డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) రూపొందించే పనిలో అధికారులు ఉన్నారు. యూజీడీ పూర్తయితే నగరంలో మెరుగైన పారిశుద్ధ్యం, వరద నియంత్రణ, జీవన ప్రమాణాల మెరుగుదలకు దోహదపడుతుంది. దీనికి సంబంధించి పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని అధికారులు చెబుతుండగా.. వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని ప్రజాప్రతినిధులు అంటున్నారు. ఊసే లేని మెట్రో రైలు... 2025లో ఓరుగల్లు మెట్రోరైలు ఊసే రాలేదు. కాజీపేట నుంచి వరంగల్ వరకు 15 కిలోమీటర్ల మేర నిర్మించే ఇందులో సగం నేలపై సగం ఆకాశ మార్గంలో నడిచేలా ప్రణాళిక సిద్ధం చేశారు. హైదరాబాద్ తరహాలో వరంగల్ మహానగరంలో మెట్రో నియోరైలు తీసుక రావడానికి వివరణాత్మక ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)కూడా 2020లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చేరింది. ఏటా బడ్జెట్ సమయంలో తెరమీదకు వచ్చే ఈ ప్రాజెక్టు పేరు ఈ ఏడాది అసలే లేదు. ఔటర్ రింగ్రోడ్డు త్వరలోనే.... వరంగల్ నగరం చుట్టూ 69 కిలోమీటర్ల మేర ఔటర్ రింగు రోడ్డును ప్రతిపాదించారు. 29 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ రాంపూర్ నుంచి దామెర వరకు నిర్మించింది. మరో 40 కిలోమీటర్ల మేర రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సి ఉంది. దీనికి రూ. 669 కోట్లను మంజూరు చేశారు. ఔటర్ రింగు రోడ్డు పనులకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ 2017 అక్టోబర్లో శంకుస్థాపన చేశారు. టెక్స్టైల్ పార్కు స్థలంలోనే ఈ శిలాఫలకం కూడా వేశారు. ఆ తర్వాత చాలాకాలం పనులు నిలిచిపోగా, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఈ పనులపై మళ్లీ దృష్టి సారించింది. ఐటీలో అనుకున్నంత లేని ఊపు.. 2016లో ఐటీ పార్కును మడికొండ (రాంపూర్)లో ఏర్పాటు చేసింది. దీంతో పలువురు నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా వచ్చాయి. సయాంట్, జెన్ప్యాక్ట్, క్వాడ్రంట్ రిసోర్సెస్తో పాటు సాఫ్ట్పాత్ వంటి సంస్థలు ఓరుగల్లులో తమ బ్రాంచ్లను నిర్వహిస్తున్నాయి. ప్రముఖ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ సంస్థ సిఫీతో పాటు మరో రెండు.. ఏడాది క్రితం ఎంఓయూ కుదుర్చుకున్నా.. గతంలో తెరిచిన సంస్థలు తప్ప కొత్తగా వచ్చింది లేదు. హనుమకొండ జిల్లాలో అభివృద్ధి పనులు.. హనుమకొండ జిల్లాలో రైల్వే లైన్ విస్తరణ, స్మార్ట్ సిటీ పనులు జరుగుతున్నాయి. అనేక కొత్త ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. ● ముఖ్యంగా హసన్పర్తి–వరంగల్ మధ్య 3వ రైల్వే లైన్ నిర్మాణం, వరంగల్ ట్రై సిటీ అభివృద్ధికి ప్రభుత్వం భారీ నిధులు కేటాయించింది. దీంతో పనులు వేగంగా సాగుతున్నాయి. ● కాజీపేట మండలం అయోధ్యపురంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ● కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ఆధ్వర్యంలో భూముల వేలం, రియల్ ఎస్టేట్ ప్లాట్ల అమ్మకం, జంక్షన్లు, స్వాగత తోరణాల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ● భీమదేవరపల్లి మండలం వంగరలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పనులు వేగంగా నడుస్తున్నాయి. ● దామెర మండలం ఊరుగొండ మీదుగా హనుమకొండ జిల్లాలో ఎన్హెచ్ 163ఎలో 4–లేన్ యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ఫీల్డ్ హైవే ప్రాజెక్ట్ పనులు సాగుతున్నాయి.మడికొండలోని ఐటీ హబ్ఇంటర్నల్ రింగ్ రోడ్డుకొనసాగుతున్న వరంగల్ నూతన బస్టాండ్ పనులుఏడాదికాలంలో తడబడుతూ.. పరిగెడుతూ.. ‘గ్రేటర్’ అభివృద్ధికి ప్రత్యేక నిధులు.. ‘స్మార్ట్సిటీ’, ‘అమృత్’తో పనులు సుందరనగరం కోసం పరుగులు.. ‘కుడా’, జీడబ్ల్యూఎంసీ నిధులు డీపీఆర్ దశలో యూజీడీ.. ‘ఔటర్’ పూర్తయితే మహర్దశ పారదర్శకత, పనుల్లో వేగం పెరిగితే 2026లో మరింత పురోగతి -
ఇంకా ఆలస్యమే..
సాక్షి, వరంగల్: వరంగల్ సెంట్రల్ జైలు స్థానంలోని 56 ఎకరాల్లో 16.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 24 అంతస్తుల భవనంలో 34 విభాగాల స్పెషాలిటీ మెడికల్ సర్వీసులతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఈ ఏడాది అందుబాటులోకి వస్తుందనుకున్నా డిజైన్ల మార్పు, అంచనాల పెంపుతో ఆలస్యమైంది. ఇది పూర్తయితే ఎంజీఎంలోని 1,500 పడకల ఆస్పత్రి ఇక్కడకు తరలడం ద్వారా అక్కడ మరో 500 పడకలతో వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. మామునూరు ఎయిర్పోర్ట్ భూసేకరణ మామునూరు విమానాశ్రయానికి 223 ఎకరాల భూసేకరణ కోసం ఈ ఏడాది జూలై 25న రూ.205 కోట్లు, అక్టోబర్ 17న మరో రూ.90 కోట్ల మంజూరుకు పాలనాపరమైన అనుమతులు ఇవ్వడంతో అధికారులు భూసేకరణను వేగవంతం చేశారు. విమానాశ్రయ పునరుద్ధరణకు అవసరమైన నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లిలోని 253 ఎకరాల భూసేకరణ తుది దశకు చేరుకుంది. నింపాది పనులతో తప్పనితిప్పలు వరంగల్ పాత ఆజంజాహీ మిల్లు మైదానంలో 16.7 ఎకరాల విస్తీర్ణంలో రూ.80 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వరంగల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ పనులు తుది దశకు చేరుకున్నాయి. ● మూడెకరాల్లో ఐదంతస్తుల ప్రణాళికతో ‘కుడా’ పర్యవేక్షణలో సరికొత్త హంగులతో నిర్మితమవుతున్న వరంగల్ మోడ్రన్ బస్టాండ్ పనుల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది. ● అమృత్ భారత్ పథకం కింద రూ.25.41 కోట్ల నిధులతో వరంగల్ రైల్వే స్టేషన్ను కార్పొరేట్ సదుపాయాలతో కాకతీయుల కళావైభవం ఉట్టిపడేలా అధికారులు తీర్చిదిద్దారు. నిర్మాణంలో ఉన్న మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి -
అర్జీలు త్వరగా పరిష్కరించండి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: ప్రజా వాణిలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలు త్వరగా పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. అర్జీలు పెండింగ్లో లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో మొత్తం 167 అర్జీలను స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, నారాయణ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
గడువులోగా పనులు పూర్తి చేయండి
గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ వరంగల్ అర్బన్: వరంగల్ ఆర్టీసీ బస్ స్టేషన్ పాత స్థలంలో అధునాతన బహుళ అంతస్తు నిర్మాణ పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్, ‘కుడా’ వైఎస్ చైర్మన్ చాహత్బాజ్పాయ్ ఆదేశించారు. సోమవారం పాత బస్ స్టేషన్ను క్షేత్రస్థాయిలో కమిషనర్ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం కాకతీయ మ్యూజికల్ గార్డెన్ అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. స్మైల్ కేంద్రం నిర్వాహకులకు నోటీసు బల్దియా ఆధ్వర్యంలో హనుమకొండ భీమారం ప్రాంతంలో హెల్త్ కేర్ సొసైటీ ఎన్జీఓ ద్వారా నిర్వహిస్తున్న స్మైల్ కేంద్రాన్ని సోమవారం కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో హెల్త్ కేర్ సొసైటీ నిర్వాహకులకు నోటీసు జారీ చేయాలని ఉప కమిషనర్ సమ్మయ్యను ఆదేశించారు. అనంతరం కమిషనర్ పలివేల్పులలోని లార్డ్స్ వృద్ధాశ్రమాన్ని సందర్శించి వారికి అందుతున్న వసతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
యూకే చట్టసభకు నాగరాజు ఎన్నిక గర్వకారణం
హన్మకొండ : హనుమకొండకు చెందిన ఉదయ్ నాగరాజు యూనైటెడ్ కింగ్డమ్ హౌజ్ ఆఫ్ లార్డ్స్ చట్ట సభకు శాశ్వత సభ్యుడిగా ఎంపిక కావడం రాష్ట్రానికి, జిల్లాకు గర్వకారణమని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. సోమవారం హనుమకొండ సుబేదారిలోని వరంగల్ క్లబ్లో ఉదయ్ నాగరాజును జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, మాజీ ఎమ్మెల్యే ఒడితెల సతీశ్కుమార్, ప్రముఖులు సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత సంతతి వారు విదేశీ చట్టసభల్లో పాతినిథ్యం వహించడం వల్ల అంతర్జాతీయ సంబంధాలు మెరుగుపర్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. సన్మాన గ్రహీత ఉదయ నాగరాజు మాట్లాడుతూ తాను హనుమకొండ నక్కలగుట్ట ప్రాంతంలో నివాసం ఉంటూ వరంగల్ పబ్లిక్ స్కూల్, సెయింట్ పీటర్స్ పాఠశాలల్లో చదువుకున్నానని గుర్తు చేశారు. ఉపాధ్యాయుల నాణ్యమైన బోధనలు విద్యాపరంగా తనను మంచి విద్యార్థిగా ఎదగడానికి దోహదపడ్డాయన్నారు. ప్రముఖ న్యాయవాదులు వద్దిరాజు వెంకటేశ్వరరావు, వద్దిరాజు గణేశ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎఫ్ఎల్డీఐ జాతీయ అధ్యక్షుడు పీవీ రావు, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ, ఐటీడీఏ మాజీ పీఓ చక్రధర్రావు, రిటైర్డ్ జడ్జి కల్వల దేవీప్రసాద్, ప్రముఖులు సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్, ప్రొఫెసర్ సీతారామారావు, వెంకట్రెడ్డి, మనోహర్రావు, డాక్టర్ శ్రీకాంత్, పింగిళి శరత్, డాక్టర్ శిరీశ్, అజిత్రెడ్డి పాల్గొన్నారు. జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ -
విషాద యాత్ర
స్టేషన్ఘన్పూర్/జఫర్గఢ్ : విహారయాత్ర మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్, జఫర్గఢ్ మండలం ఉప్పుగల్లు గ్రామాల్లో తీరని శోకం మిగిల్చింది. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అంజనాపురం, మిట్టపల్లి గ్రామాల మధ్య సోమవారం తెల్లవారుజామున లారీ, కారు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు జిల్లా వాసులు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ఉండగా జఫర్గఢ్ మండలం ఉప్పుగల్లుకు చెందిన చెందిన చిల్లర బాలకృష్ణ (30), రొయ్యల అనిల్ (31) అక్కడికక్కడే మృతిచెందగా, స్టేషన్ఘన్పూర్కు చెందిన గట్టు రాకేశ్, కొలిపాక క్రాంతి, ఉప్పుగల్లుకు చెందిన అజయ్ తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో ఖమ్మం ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాకేశ్ మృతిచెందగా కొలిపాక క్రాంతికి రెండు కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. స్నేహితులంతా కలిసి దైవదర్శనానికి.. జఫర్గఢ్ మండలం ఉప్పుగల్లుకు చెందిన చిల్లర బాలకృష్ణ స్టేషన్ఘన్పూర్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో సొంతంగా ల్యాబ్ నిర్వహిస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మరో స్నేహితుడు రొయ్యల అనిల్ తన భార్య, కుమారుడితో కలిసి హైదరాబాద్లో నివాసముంటూ హోటల్ మేనేజ్మెంట్ రంగంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంద అజయ్ గ్రామంలోనే ఉంటూ వ్యవసాయం చేస్తున్నాడు. ఈ ముగ్గురు కలిసి స్టేషన్ఘన్పూర్కు చెందిన గట్టు రాకేశ్, క్రాంతి మరికొంత మంది స్నేహితులతో కలసి ఈనెల 24న విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. దీంతో యాత్రకు వెళ్లేందుకు హైదరాబాద్లో ఉంటున్న రొయ్యల అనిల్ తన భార్య, కుమారుడితో కలిసి ఉప్పుగల్లుకు వచ్చి వారిని ఇంటి వద్ద వదిలేసి స్నేహితులతో కలిసి అదే రోజున బయలుదేరారు. మూడు కార్లలో సుమారు 15 మంది యువకులు ముందుగా ఒడిశాలోని పూరిజగన్నాథస్వామిని దర్శించుకునేందుకు వెళ్లారు. అక్కడ స్వామివారిని దర్శించుకున్న అనంతరం సింహాచలం, అరకు, వైజాగ్ తదితర ప్రదేశాలను సందర్శించారు. యాత్ర అనంతరం తిరుగు ప్రయాణంలో ఖమ్మం జిల్లా తల్లాడ సమీపం వద్దకు చేరుకోగానే ఎదురుగా వేగంగా వస్తున్న లారీని కారు ఢీకొంది. దైవదర్శనానికి వెళ్లి ముగ్గురు జనగామ జిల్లా వాసుల మృతి ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో ఘటన స్టేషన్ఘన్పూర్, జఫర్గఢ్ మండలాల్లో విషాదంఘన్పూర్కు చెందిన గట్టు కరుణాకర్, పద్మ దంపతులకు ఒక కుమారుడు రాకేశ్, కూతురు సంతానం. కరుణాకర్ టైర్ల పంక్చర్ షాపు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, పదేళ్ల క్రితం కరుణాకర్ తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యాడు. దీంతో స్థానిక దాతల సహకారంతో ఖరీదైన వైద్యంతో ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ఏడేళ్ల క్రితం కరుణాకర్ భార్య పద్మ అనా రోగ్యంతో మృతిచెందింది. ప్రస్తుతం కరుణాకర్ కుమారుడు రాకేశ్ జఫర్గడ్ మండలం ఉప్పుగల్లు ఆయిల్ మిల్లులో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. యువకుడి వివాహం చేసేందుకు సంబంధాలు చూస్తున్నారు. అదేవిధంగా జనవరి 3న అతడి పుట్టినరోజు ఉంది. ఈ క్రమంలో పూరి జగన్నాథ్ యాత్రకు స్నేహితులతో వెళ్లి మృతిచెందడంతో బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. స్టేషన్ఘన్పూర్కు చెందిన కొలిపాక ఐలయ్య, లలిత దంపతుల కుమారుడు క్రాంతి స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. అతడికి వివాహం జరిగి ఆరునెలలే అవుతోంది. రోడ్డు ప్రమాదంలో క్రాంతి రెండు కాళ్లు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
మౌలిక వసతులు కల్పించండి
వరంగల్ అర్బన్: నగరంలోని పలు కాలనీల నుంచి స్థానిక సమస్యలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మౌలిక వసతులు కల్పించాలని కాలనీ కమిటీలు విన్నవిస్తున్నాయి. ప్రభుత్వ స్థలాలు, రోడ్లు, డ్రెయినేజీలు కబ్జాకు గురవుతున్నాయని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి ఫిర్యాదుల పరిష్కారంలో పురోగతి కనిపించాలని లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. సోమవారం నిర్వహించిన గ్రేటర్ గ్రీవెన్స్లో మొత్తం 106 ఫిర్యాదులు వచ్చాయి. అందులో టౌన్ ప్లానింగ్ సెక్షన్కు 56, ఇంజనీరింగ్ విభాగానికి 21, రెవెన్యూ 13, హెల్త్ శానిటేషన్ 9, నీటి సరఫరా 7 దరఖాస్తులు అందినట్లు బల్దియా అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, సీఎంహెచ్ఓ రాజారెడ్డి, డీఎఫ్ఓ శంకర్ లింగం, ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్న రాణి, బిర్రు శ్రీనివాస్, టీఓ కృష్ణరావు, ఎంహెచ్ఓ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని.. ● కొత్తవాడ డివిజన్ 23 ముదిరాజ్ కులానికి చెందిన శ్మశాన వాటిక భూమి సర్వే నంబర్ 442 విస్తీర్ణం 10 గుంటల స్థలాన్ని ఆక్రమించి ఇళ్లు నిర్మిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు బయ్యస్వామి విన్నవించారు. ● వరంగల్ చింతల్ సర్వే నంబరు 367లో దళిత కమ్యూనిటీ హాల్ నిర్మించాలని దళిత డెవలప్మెంట్ సొసైటీ ప్రతినిధులు విన్నవించారు. ● వరంగల్ విశ్వనాథ కాలనీలో అక్రమంగా నిర్మించిన కట్టడాన్ని కూల్చేయాలని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు నమిండ్ల స్వామి మాదిగ విజ్ఞప్తి చేశారు. ● 3వ డివిజన్ ఆరేపల్లిలో 50–2–42 రహదారిపై ప్రహరీ తొలగించాలని స్థానికులు కోరారు. ● 27వ డివిజన్లోని ఎల్వీఆర్ నగర్లో, 58వ డివిజన్ సంఘమిత్ర కాలనీ, పోస్టల్ కాలనీల్లో కోతులు, కుక్కల బెడద బెడద నుంచి కాలనీవాసులను కాపాడాలని వేర్వేరుగా కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. ● 3వ డివిజన్ పైడిపల్లి గణేశ్ కాలనీలో సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మించాలని కాలనీవాసులు దరఖాస్తు అందజేశారు. ● పైడిపల్లిలోని కాంత కాలనీ, కేఎల్ లక్ష్మీ కాలనీలో తాగునీటి పైపులైన్లు వేసి, నల్లా కనెక్షన్లు ఇవ్వాలని కాలనీవాసులు దరఖాస్తును కమిషనర్కు అందించారు. ● 30వ డివిజన్ న్యూ శాయంపేట నుంచి రైల్వే గేట్ మీదుగా భట్టుపల్లి రోడ్డును విస్తరించి, అభివృద్ధి పనులు చేపట్టాలని స్థానికులు కోరారు. ● హనుమకొండ హంటర్ రోడ్డు దుర్గాదేవి, పెరుక కాలనీలో సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మించాలని అభివృద్ధి కమిటీ ప్రతినిధులు వివరించారు. ● హనుమకొండ యాదవనగర్ శ్రీ లక్ష్మీకాలనీలో డ్రెయినేజీ నిర్మించాలని అసోసియేషన్ ప్రతినిధులు వినతి పత్రం సమర్పించారు. ● 4వ డివిజన్ కృష్ణా కాలనీలో సీసీ రోడ్డు, డ్రెయినేజీలు నిర్మించాలని కాలనీవాసులు పేర్కొన్నారు. ● హంటర్ రోడ్డులోని సర్వే నంబరు 108లో వెయ్యి గజాల పార్కు స్థలాన్ని కబ్జా చేసి, ప్రైవేట్ స్కూల్ నిర్మించారని, బల్దియా స్వాధీనం చేసుకోవాలని ఫిర్యాదు చేశారు. ● ఎర్రగట్టు గుట్ట జంక్షన్ వద్ద బస్ షెల్టర్లు నిర్మించాలని అభివృద్ధి కమిటీ ప్రతినిధులు కోరారు. ● భీమారం నుంచి కోమటిపల్లి వరకు ఉన్న 60 ఫీట్ల రోడ్డు కబ్జాకు గురవుతుందని, విస్తరించి, అభివృద్ధి చేయాలని మధురానగర్ కాలనీవాసులు కోరారు. ● 56వ డివిజన్ గోపాలపురం చెరువు ఎఫ్టీఎల్ జోన్లో సబ్ స్టేషన్ పక్కన ఉన్న శ్మశాన వాటికను తొలగించాలని కమిషనర్కు వినతిపత్రాన్ని అందజేశారు. నగరంలోని ఆక్రమణలు కూల్చేయండి బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ గ్రేటర్ గ్రీవెన్స్ సెల్కు 106 ఫిర్యాదులు -
పీఆర్సీని వెంటనే అమలు చేయాలి
జనగామ రూరల్: అన్ని రకాల పెండింగ్ బిల్లులను మంజూరు చేసి వెంటనే పీఆర్సీని అమలు చేయాలని, లేని పక్షంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్ చేశారు. పట్టణంలో రెండు రోజులపాటు నిర్వంచిన రాష్ట్ర విద్యా సదస్సు సోమవారం ముగిసింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో ఎన్జీఓల జోక్యం నిరోధించాలని, శిక్షణల పేరిట బోధన సమయాన్ని హరించడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్ మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖలో కొనసాగుతున్న ట్రైనింగ్లు, (ఉన్నతి, ఎఫ్ఎల్ఎస్, లక్ష్య, ఎఫ్ఆర్ఎస్) ఇతర కార్యక్రమాల పేరుతో విద్యా బోధనలకు ఆటంకంగా ఉన్న విధానాలపై సమీక్షించాలని డిమాండ్ చేశారు. కేజీబీవీ, మోడల్ స్కూల్ గురుకులాల సమస్యలను పరిష్కరించాలన్నారు. కాగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పరిష్కరించాల్సిన విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యలపై 25 తీర్మానాలను ప్రవేశపెట్టారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.జంగయ్య, చావ దుర్గాభవాని, కోశాధికారి టి.లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కె.సోమశేఖర్, ఎం.రాజశేఖర్రెడ్డి, డి.సత్యానంద్, జి.నాగమణి, కె.రంజిత్ కుమార్, ఎస్.మల్లారెడ్డి, జి.శ్రీధర్, ఆడిట్ కమిటీ కన్వీనర్ జె. యాకయ్య, జనగామ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి.చంద్రశేఖర్రావు, మడూరు వెంకటేష్, జిల్లా నాయకులు ఆకుల శ్రీనివాసరావు, కృష్ణ, మంగుజయప్రకాశ్, హేమలత, శ్రీనివాస్, కృష్ణమూర్తి, కందుల శ్రీనివాస్ పాల్గొన్నారు. జాప్యం జరిగితే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి ముగిసిన రాష్ట్ర విద్యాసదస్సు -
మున్సిపల్ ఓటరు జాబితా నోటిఫికేషన్ జారీ
జనగామ: మున్సిపాలిటీల్లో ఓటరు జాబితా సవరణ, విడుదల నోటిఫికేషన్ విడుదల చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్ని కల కమిషనర్ రాణి కుముదిని, ఎన్నికల పట్టికల తయారీకి సంబంధించి దశలవారీ షెడ్యూల్ను ప్రకటించారు. ఉమ్మడి జిల్లా పరిధిలో భూపాలపల్లి, పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట, జనగామ, తొర్రూరు, మరిపెడ, మహబూబాబాద్, డోర్నకల్ మున్సిపాలిటీలు పాతవి ఉండగా వీటికితోడు కొత్తగా కేసముద్రం, ములుగు, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీలుగా ఏర్పాటయ్యాయి. వీటిలో ఎన్నికలు జరగనున్నాయి. నేడు(మంగళవారం) 30వ తేదీన మున్సిపాలిటీల్లో పోలింగ్ స్టేషన్ డేటాను సమీకరించడం, 31న పోలింగ్స్టేషన్ వారీగా వార్డుల డేటా పునర్వ్యవస్థీకరణ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ వార్డుల వారీగా పోలింగ్స్టేషన్ జాబితాల తయారీ, జనవరి 1వ తేదీన డ్రాఫ్ట్ ఓటరు జాబితాల ప్రచురణ, అభ్యంతరాల స్వీకరణ, 5వ తేదీన రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం, 6వ తేదీన ఎన్నికల అధికారుల సమావేశం, 10వ తేదీన తుది ఓటరు జాబితాల విడుదల చేయాల్సి ఉంటుంది. తాజా నోటిఫికేషన్తో రాష్ట్రలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు అడుగుపడిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. జనవరి 10న వార్డుల వారీగా ఓటరు జాబితా విడుదల నేటినుంచి ఓటరు జాబితాల సమీకరణ -
వృద్ధ తల్లిదండ్రులను పట్టించుకోకపోతే చర్యలు
న్యూశాయంపేట: వృద్ధ తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకోకపోతే సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ సత్యశారద స్పష్టం చేశారు. వరంగల్ కలెక్టరేట్ సమావేశ హాల్లో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం దరఖాస్తులు 151 వచ్చాయి. వాటిలో రెవెన్యూశాఖకు సంబంధించినవి 82, జీడబ్ల్యూఎంసీకి 30, ఇతర శాఖలకు సంబంధించినవి 39 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్ఓ విజయలక్ష్మి, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అనురాధ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక రీచ్లు న్యూశాయంపేట: ఇందిరమ్మ ఇళ్లకు అవసరమైన ఇసుకను జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల, టేకుమట్ల ఇసుక రీచ్ల నుంచి సరఫరా చేసేందుకు టీజీఎండీసీ కేటాయించిందని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. కలెక్టర్ అధ్యక్షతన సాండ్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ సమావేశం కలెక్టరేట్లో సోమవారం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ఇసుక సరఫరా అంశంపై అధికారులతో ఆమె చర్చించారు. సమావేశంలో వరంగల్, నర్సంపేట ఆర్డీవోలు సుమ, ఉమారాణి, ఇన్చార్జ్ పీడీ, హౌసింగ్ అధికారి శ్రీవాణి, మైనింగ్ ఏడీ రవికుమార్, తహసీల్దార్లు విజయ్సాగర్, శ్రీనివాస్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. యూరియాపై కలెక్టర్ సమీక్ష ఖిలా వరంగల్: కలెక్టరేట్ కార్యాలయంలో వ్యవసాయ అధికారులతో కలిసి యూరియాపై కలెక్టర్ డాక్టర్ సత్యశారద సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో డీలర్ల షాపుల్లో 434 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని పేర్కొన్నారు. అలాగే, రాష్ట్రంలో ప్రస్తుతం 1,65,000 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులకు అవసరమైన యూరియా సరఫరా చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఏఓ అనురాధ, వ్యవసాయ అధికారులు విజ్ఞాన్, రవీందర్, ఏఈఓ చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణిలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
నేడు కేయూ పాలకమండలి సమావేశం
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పాలకమండలి సమావేశం మంగళవారం హైదరాబాద్లోని సచివాలయంలో నిర్వహించనున్నారు. 11 అంశాలను పాలకమండలి సమావేశంలో చర్చించనున్నారని సమాచారం. ప్రధానంగా కొంతకాలం క్రితం యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లుగా 46 మంది అధ్యాపకులకు ఇంట ర్వ్యూలు నిర్వహించి పదోన్నతులు కల్పించారు. ఈ పదోన్నతులకు సంబంధించి పాలకమండలి చర్చించి ఆమోదించనున్నారు. యూనివర్సిటీలో ఆరు అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు వెకెన్సీలుగా ఉన్నా యి. అయితే సూపరింటెండెంట్లకు అసిస్టెంట్ రిజిస్ట్రార్లుగా పదోన్నతి కల్పించేందుకు రాత పరీక్ష నిర్వహించాలా లేక సీనియారిటీ ప్రాతిపదికన పదోన్నతులు కల్పించాలా అనే అంశం పాలకమండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. సూపరింటెండెంట్లకు రాతపరీక్ష నిర్వహించి ప్రతిభ ఆధారంగా అసిస్టెంట్ రిజిస్ట్రార్లుగా పదోన్నతులు కల్పించాలని యూనివర్సిటీ అధికారులు యోచించగా దానిని సూపరింటెండెంట్లు వ్యతిరేకిస్తున్నారు. దీంతో పాలకమండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. కేయూలో రెగ్యులర్ అధ్యాపకుల నియామకానికి 49 అసిస్టెంట్ ప్రొఫెసర్ల వెకెన్సీలు చూపుతున్నారని సమాచారం.అయితే అందులో వివిధ విభాగాల్లోని వెకెన్సీల భర్తీ విషయంలో రోస్టర్ ఫిక్స్ చేసే అంశంపై కూడా పాలకమండలిలో చర్చించనున్నారని తెలి సింది. కేయూ ఫార్మసీ కాలేజీలో ముగ్గురు రిటైర్డ్ ప్రొఫెసర్లకు సంబంధించి మూడు ఎండోమెంట్ల లెక్చర్ల ఏర్పాటునకు ఇటీవలే పలవురు యూనివర్సిటీకి ఒక్కొక్కరికి రూ. 3 లక్షల చొప్పున డబ్బులు చెల్లించారు. ఎండోమెంట్ లెక్చర్ల ఏర్పాటుకు కూడా పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. పరీక్షల విభాగంలోని కాన్ఫిడెన్షియల్ అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ పాలకమండలి సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా, ఉన్నత విద్యా కమిషనర్ శ్రీదేవసేన, కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి. రామచంద్రం, పాలకమండలి సభ్యులు పాల్గొనబోతున్నారు. అధ్యాపకుల పదోన్నతులకు ఆమోదం లభించే అవకాశం! -
కుష్ఠు వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి
● వరంగల్ జిల్లా కుష్ఠు నివారణ ప్రోగ్రాం అధికారి డాక్టర్ మోహన్సింగ్ వరంగల్: ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి సహకరించి కుష్ఠు వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని వరంగల్ జిల్లా కుష్ఠు నివారణ ప్రోగ్రాం అధికారి డాక్టర్ మోహన్సింగ్ అన్నారు. కాశిబుగ్గ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఆరోగ్య కేంద్రాలను సోమవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ జిల్లాను కుష్ఠు రహిత జిల్లాగా చేయడానికి ప్రతీ ఇంటికి వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు, ఆరోగ్య పర్యవేక్షకులు రోజు ఉదయం 6నుంచి 9 గంటల వరకు వెళ్లి ఇంట్లో ఎవరికై న అనుమానిత మచ్చలు ఉంటే వాటిని పరీక్షించాలన్నారు. పరీక్షల ద్వారా నిర్ధారణ చేసి వారికి కావాల్సిన మందులు పంపిణీ చేయాలని సూచించారు. కుష్ఠు వ్యాధి సాధారణంగా అన్ని వ్యాధుల వలే వచ్చే వ్యాధి అని, దీన్ని నిర్లక్ష్యం చేయకుండా తగిన చికిత్సలు తీసుకుంటే నయమవుతుందని చెప్పారు. కార్యక్రమంలో కాశిబుగ్గ పట్టణ ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్ కిరణ్, డిప్యూటీ డెమో అనిల్ కుమార్, ఆరోగ్య కార్యకర్త శైలజ, ఆశ కార్యకర్తలు కమల, స్వరూప పాల్గొన్నారు. భారీ అండాశయ కణతి తొలగింపుఎంజీఎం: వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన గర్భిణి పెంతల సింధు ప్రసవం కోసం నగరంలోని సీకేఎం ఆస్పత్రిలో చేరింది. సోమవారం ఆమె ఆడశిశువుకు జన్మనిచ్చింది. మహిళ కడుపులో భారీ అండాశయ కణతి (3.5 కేజీలు) ఉండడంతో శస్త్ర చికిత్స నిర్వహించి విజయవంతంగా తొలగించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ లక్ష్మీదేవి తెలిపారు. ఈ శస్త్ర చికిత్సలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మీ, పీజీలు, నర్సింగ్ స్టాఫ్ సౌజన్య, అనస్తీషియా విభాగం వైద్యులు డాక్టర్ బేబీరాణి, రమేశ్, సైఫ్, దీపిక, రహీమున్నిస్సా పాల్గొన్నారు. పేరిణి కళాకారులకు నృత్య కౌముది పురస్కారంహన్మకొండ కల్చరల్: వరంగల్కు చెందిన కళాకృష్ణ నృత్య అకాడమీలో పేరిణి నృత్యంలో ఇన్స్ట్రక్టర్గా శిక్షణ పొందుతున్న యువ పేరిణి కళాకారులు బండారి వైష్ణవి, తొడెన్గా సంతోశ్ పేరిణి నృత్యంలో తెలంగాణ నుంచి నృత్యకౌముది పురస్కారం అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాషా సాంస్కృతికశాఖ, ఆంధ్ర రాష్ట్ర సృజనాత్మకత, సాంస్కృతిక సమితి సౌజన్యంతో అభినయ నృత్య భారతి ఏలూరు వారి ఆధ్వర్యంలో 30వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయస్థాయి నృత్యపోటీలు నిర్వహించారు. అకాడమీ నిర్వాహకులు, పేరిణి నృత్యగురువు గజ్జెల రంజిత్ పర్యవేక్షణలో కళాకారులు నృత్యాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా సంతోశ్, వైష్ణవికి నిర్వాహకులు పురస్కారం ప్రదానం చేశారు. -
కాజీపేట మీదుగా సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
కాజీపేట రూరల్ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాజీపేట, వరంగల్ మీదుగా సంక్రాంతికి ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు సోమవారం తెలిపారు. ప్రత్యేక రైళ్ల వివరాలు.. జనవరి 8వ తేదీన కాకినాడ టౌన్–వికారాబాద్ (07460) వీక్లి ఎక్స్ప్రెస్ కాజీపేట, వరంగల్కు చేరుకుని వెళ్తుంది. ఈ రైలుకు సామర్లకోట, అనపర్తి, రాజమండ్రి, ఏలూరు, రాయన్పాడ్, ఖమ్మం, వరంగల్, కాజీపేట, సికింద్రాబాద్, లింగంపల్లిలో హాల్టింగ్ కల్పించారు. జనవరి 9, 11వ తేదీల్లో వికారాబాద్–పార్వతీపురం (07461) వీక్లి ఎక్స్ప్రెస్, జనవరి 10వ తేదీన పార్వతీపురం–వికారాబాద్ (07462) వీక్లి ఎక్స్ప్రెస్లు కాజీపేట, వరంగల్ మీదుగా ప్రయాణిస్తాయి. ఈ రైళ్లకు లింగంపల్లి, బేగంపేట, సికింద్రాబాద్, చర్లపల్లి, కాజీపేట, వరంగల్, ఖమ్మం, రాయన్పాడు, ఏలూరు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవాసల, విజయనగరం, బొబ్బిలి స్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు. జనవరి 8వ తేదీన సికింద్రాబాద్–పార్వతీపురం (07464) వీక్లి ఎక్స్ప్రెస్, జనవరి 9వ తేదీన పార్వతీపురం–సికింద్రాబాద్ (07465) వీక్లి ఎక్స్ప్రెస్ కాజీపేటకు చేరుకుని వెళ్తుంది. ఈ రైలుకు చర్లపల్లి, కాజీపేట, వరంగల్, ఖమ్మం, రాయన్పాడ్, ఏలూరు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవాసల, విజయనగరం, బొబ్బిలిలో హాల్టింగ్ కల్పించారు. ఈ ప్రత్యేక రైళ్లకు సోమవారం నుంచి రిజర్వేషన్ టికెట్ బుకింగ్ సౌకర్యం కల్పించినట్లు అధికారులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం ● భట్టుపల్లి రోడ్డులో ఘటన ఖిలా వరంగల్: రాంగ్ రూట్లో ప్రయాణిస్తున్న ఓ బైక్.. ఎదురుగా వస్తున్న మరో బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటన సోమవారం వరంగల్ మిల్స్కాలనీ పీఎస్ పరిధిలోని ఉర్సుగుట్ట భట్టుపల్లి రోడ్డుపై జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం భట్టుపల్లికి చెందిన ప్రవీణ్యాదవ్ (25) హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం స్వగ్రామం వచ్చాడు. సోమవారం ఉదయం బైక్పై వరంగల్ వెళ్లి పని పూర్తయిన అనంతరం సాయంత్రం భట్టుపల్లికి బయలుదేరాడు. మార్గమధ్యలో రెడీమిక్స్ ప్లాంట్ వద్ద కరీమాబాద్కు చెందిన గొట్టె కుమారస్వామి బైక్పై రాంగ్రూట్లో వచ్చి ప్రవీణ్యాదవ్ను ఢీకొనగా అతడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సమాచారం అందుకున్న మిల్స్కాలనీ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతుడి తండ్రి బాషబోయిన ఐలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ బొల్లం రమేశ్ తెలిపారు. ఫార్మసీ విద్యార్ధులకు ఉజ్వల భవిష్యత్● యూఎస్ఏ ఎఫ్డీఏ డిప్యూటీ డైరెక్టర్ రమణకుమారి కేయూ క్యాంపస్: ఫార్మసీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని యూఎస్ఏ ఎఫ్డీఏ డిప్యూటీ డైరెక్టర్ రమణకుమారి అన్నారు.సోమవారం హనుమకొండలోని కేర్ ఫార్మసీ కళాశాలలో నిర్వహించిన జాతీయ సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. ఫార్మసీలో నూతన ఔషధాల ఆవిష్కరణలకు పరిశోధనలు చేయాలని సూచించారు. సదస్సులో కాకతీయ యూనివర్సిటీ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ జె.కృష్ణవేణి, డీన్ గాదె సమ్మయ్య, డాక్టర్ రాజేందర్, డాక్టర్ డి.సుధీర్కుమార్, డాక్టర్ మంజుల పాల్గొన్నారు. అనంతరం రమణకుమారిని సన్మానించారు. చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి ● కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం కేయూ క్యాంపస్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకోవాలని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వి.రామచంద్రం కోరారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈస్ట్జోన్ గోల్డ్కప్– 2025 క్రికెట్ పోటీలు కాకతీయ యూనివర్సిటీలోని క్రీదామైదానంలో మూడవ రోజు సోమవారం కొనసాగాయి. హనుమకొండ వర్సెస్ మహబూబాబాద్ జట్ల మధ్య పోటీలను ప్రారంభించి మాట్లాడారు. జనవరి 1వ తేదీ వరకు పోటీలు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. -
విద్యారంగం అభివృద్ధికి కృషి
జనగామ రూరల్: విద్యారంగం అభివృద్ధికి కృషిచేస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని మాంగళ్య ఫంక్షన్హాల్లో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సు ఆదివారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా ఆమె హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విద్యార్థులు, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తున్నారని తెలిపారు. ఉపాధ్యాయుల పీఆర్సీ, టీఏ, డీఏలు పెండింగ్లో ఉన్న మాట వాస్తవమేనని పేర్కొన్నారు. ఉద్యోగుల డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్తానని, కారుణ్య నియామకాల సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. గురుకుల పాఠశాలలకు సంబంధించిన వేళలను సవరించాలని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. విద్యారంగం అభివృద్ధిలో ఉపాధ్యాయుల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని, పేదలకు నాణ్యమైన విద్యనందించడంలో ఉపాధ్యాయ వృత్తి గొప్పదన్నారు. ‘పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ప్రసంగం చూశాం.. అంబేడ్కర్ అంటే ఏమొస్తది.. దేవుడిని తలుచుకుంటే స్వర్గానికి వెళ్తారు.. చనిపోయిన తర్వాత స్వర్గం ఉంటదా నరకం ఉంటదా మనకు తెలియదు.. కానీ, బతికున్నప్పుడు రాజ్యాంగాన్ని కాపాడుకుని జ్ఞానాన్ని నేర్చుకుంటే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు’ అని పేర్కొన్నారు. జనగామ ఎమెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ టీఎస్ యూటీఎఫ్ నాయకత్వంతో తనకు రెండు దశాబ్దాల అనుబంధం ఉందని పేర్కొన్నారు. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి అధక్షతన జరిగిన సదస్సులో మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ప్రొఫెసర్ నాగేశ్వర్, రాష్ట్ర నాయకులు మోత్కూరు నరహరి, రాష్ట్ర కార్యదర్శి రంజిత్ కుమార్, జాక్ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ శ్రీనివాస్రావు, పాలకుర్తి కృష్ణమూర్తి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చంద్రశేఖర్రావు, ఆకుల శ్రీనివాస్రావు, జాక్ జిల్లా చైర్మన్ ఖాజాషరీఫ్, జిల్లా అద్యక్షుడు కోర్రె లీయస్, నిర్వాహకులు మడూరి వెంకటేశ్, విద్యావేత్తలు, 33 జిల్లాల నుంచి 500 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. మొదట జనగామ చౌరస్తా నుంచి మాంగళ్య ఫంక్షన్హాల్ (సయ్యద్ జియావుద్దీన్ ప్రాంగణం), రావెళ్ల రాఘవయ్య వేదిక వరకు రెండు కిలోమీటర్ల మేర రెండు వేల మందితో ర్యాలీ చేపట్టారు. ప్రమాదంలో ఉపాధి హామీ చట్టం.. ఉపాధి హామీ పథకం అమలులో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో కోట్లాది కుటుంబాలు సంక్షోభంలోకి కూరుకుపోయే అవకాశముందని మంత్రి సీతక్క ఆందోళన వ్యక్తం చేశారు. గత యూపీఏ ప్రభుత్వంలో ఉపాధి హామీ చట్టం పేదల హక్కులను రక్షించే స్పష్టమైన వ్యవస్థగా రూపుదిద్దుకుందన్నారు. ఈరోజు అది ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చిందని, చట్టాన్ని కాపాడుకోవడం అంటే పేదల హక్కులను కాపాడుకోవడమేనన్నారు. దీనిపై మేధావులు ప్రజలకు అవగాహన కల్పించా ల్సిన అవసరం ఉందన్నారు. టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సులో మంత్రి ిసీతక్క -
ఏటీఎంలలో చోరీ.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
వరంగల్ క్రైం: ఏటీఎంలలో డబ్బులు బయటకు రాకుండా ఇనుప రేకు అడ్డం పెట్టి చోరీలకు పాల్ప డుతున్న రాజస్తాన్కు చెందిన ఏడుగురు సభ్యులు అంతర్ ర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసినట్లు వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ కవిత తెలిపారు. వీరి నుంచి రూ.5.10 లక్షల నగదు, రెండు కార్లు, ఏడు సెల్ఫోన్లు, నేరానికి వినియోగించే ఐరన్ ప్లేట్లు, డూప్లికేట్ తాళం చెవులను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ మేరకు ఆదివారం కమిషనరేట్ కార్యాలయంలో నిందితుల అరెస్టు వివరాలను ఆమె వెల్లడించారు. రాజస్తాన్లోని అల్వార్ జిల్లా మాల్కిడా తాలుకాలోని ఖారెడా గ్రామానికి చెందిన ఆరిఫ్ఖాన్, బీజ్వాడ నారోక గ్రామానికి చెందిన సర్ఫరాజ్, మోరేడా గ్రామానికి చెందిన ఎం.ఆష్మహ్మద్, షాపుస్ఖాన, షారూఖాన, అస్లాంఖాన, మహావకార్డ్ గ్రామానికి చెందిన షారుక్ఖాన్ నిందితులు. వీరు జల్సాల కోసం సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నారని తెలిపారు. ఇందుకోసం ఓ పరిచయస్తుడి ద్వారా ఎస్బీఐ ఏటీఎంలలో ఏర్పాటు చేసే మిషన్లకు సంబంధించి.. పెర్టో కంపెనీకి చెందిన ఏటీఎం మిషన్లలోని లోపాలను ఈ ముఠా సభ్యులు అధ్యయనం చేశారు. ఏటీఎంలు తెరిచేందుకు వీలుగా నకిలీ తాళం చెవులను తయారు చేసుకున్నారని తెలిపారు. గత నవంబర్ నుంచి ఇప్పటి వరకు 7 ఏటీఎంలలో వీరు చోరీలకు పాల్పడి రూ.12.10 లక్షలను చోరీ చేసినట్లు తెలిపారు. ఇందులో సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు, కాజీపేట, హనుమకొండ, మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒకటి చొప్పున చోరీకి పాల్పడ్డారని పేర్కొన్నారు. నగదు పోయిందని ఖాతాదారులు సంబంధిత బ్యాంకుల్లో ఫిర్యాదు చేశారు. బ్యాంకు వారు థర్డ్ పార్టీ అయిన ఏటీఎం సెక్యూరిటీ, మెయింటెనెన్స్ చేసే సంస్థ అయిన ఎఫ్ఎస్ఎస్ (ఫైనాన్సియల్ సాఫ్ట్వేర్ సెక్యూరిటీస్) లిమిటెడ్కు సమాచారం ఇచ్చారు. వారు ఈ చోరీలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రైం అదనపు డీసీపీ బాలస్వామి, క్రైం, కాజీపేట ఏసీపీలు సదయ్య, ప్రశాంత్రెడ్డి అధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నిందితులు ఆదివారం ఉదయం కాజీపేట చౌరస్తాలోని పెర్టో కంపెనీకి చెందిన ఏటీఎంలలో తిరిగి చోరీ చేసేందుకు కార్లలో వచ్చారు. ఏటీఎం తలుపు తెరిచి దానికి స్టిక్కర్ అతికించిన ఐరన్ ప్లేట్ బిగిస్తుండగా.. పోలీసులు వస్తున్న విషయాన్ని గమనించి పారిపోయేందుకు ప్రయత్నించగా వెంబడించి పట్టుకున్నట్లు తెలిపారు. అనంతరం నిందితులను విచారించగా చేసిన చోరీలను అంగీకరించారు. నిందితులను పట్టుకోవడం ప్రతిభ కనబరిచిన పోలీసు ఉన్నతాధికారులతోపాటు సీసీఎస్ ఇన్న్స్పెక్టర్ రాఘవేందర్, కాజీపేట్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి, ఏఏఓ సల్మాన్పాషా, కాజీపేట ఎస్సైలు నవీన్కుమార్, లవణ్ కుమార్, సీసీఎస్ ఎస్సై శ్రీనివాస్ రాజు, హెడ్ కానిస్టేబుళ్లు మహేశ్వర్, శ్రీనివాస్, కానిస్టేబుళ్లు విష్ణు, కుమారస్వామి, శ్రీధర్, హన్మంతు, వినోద్ను వరంగల్ పోలీస్ కమిషనర్ అభినందించి రివార్డులు అందజేశారు. నగదు, రెండుకార్లు, ఐరన్ ప్లేట్లు, డూప్లికేట్ తాళాలు స్వాధీనం వివరాలు వెల్లడించిన వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ కవిత -
మల్లన్న ఆలయంలో నిలువు దోపిడీ
ఐనవోలు: ప్రఖ్యాత ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో భక్తులను ఒగ్గు పూజారులు నిలువు దోపిడీకి గురి చేస్తున్నారని భక్తుడు ఆరోపిస్తూ ఆలయ కార్యనిర్వహణ అధికారికి ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన రాంకుమార్రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయానికి మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చాడు. ముందుగా ఆలయం లోపల పట్నం వేయడానికి కౌంటర్ వద్ద రూ.300 టికెట్ కొనుక్కొని ఆలయం లోపల పట్నాలు వేసే ప్రదేశానికి వెళ్లాడు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఒగ్గు పూజారులు సామూహికంగా పట్నాలు వేయిస్తున్నారు. ఈ క్రమంలో రాజేశ్ అనే ఒగ్గు పూజారి రాంకుమార్రెడ్డి వద్దకు వెళ్లి టికెట్ తీసుకుని రూ.700 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డబ్బు ఎందుకు ఇవ్వాలని ఒగ్గు పూజారిని భక్తుడు ప్రశ్నించడంతో పట్నం, పూజ మధ్యలోనే ఆపివేసి వెళ్లిపోయాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భక్తుడు ఆగ్రహానికి గురై అధికారులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం ఆలయ సిబ్బంది మరో ఒగ్గు పూజారితో భక్తుడి పట్నం మొక్కులను పూర్తిచేయించారు. ఈ విషయంపై ఈఓ కందుల సుధాకర్ను వివరణ కోరగా ఇటీవల ఒగ్గు పూజారులు, కల్యాణకట్ట సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి భక్తుల వద్ద నుంచి కానుకలు ఆశించవద్దని స్పష్టం చేసినట్లు తెలిపారు. ఆదివారం భక్తుడితో అనుచితంగా ప్రవర్తించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఒగ్గు పూజారిని 15 రోజులు ఆలయానికి రాకుండా ఆదేశాలు ఇచ్చానన్నారు. రెండు రోజుల్లో ఆలయ చైర్మన్తో కలిసి మరో సమావేశం ఏర్పాటు చేసి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటానని తెలిపారు. డబ్బులు ఇవ్వలేదని పూజ మధ్యలోనే వెళ్లిపోయిన ఒగ్గు పూజారి 15 రోజులు విధులకు రావొద్దని ఒగ్గు పూజారికి ఈఓ ఆదేశాలు -
చారిత్రక ద్వీపంలో చిట్టడవి!
ఖిలా వరంగల్ : ఖిలా వరంగల్.. చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాంతాలకు నెలవు. అరుదైన కట్టడాలకు వేదిక. ఎన్నో ప్రకృతి రమణీయ సుందర దృశ్యాలకు చిరునామాగా ఉంటూ ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఇక్కడి ఏకశిల చిల్డ్రన్స్ పార్కు ఎత్తైన భారీ వృక్షాలు, తీరొక్క పంట్ల తోటలతో చిట్టడవిగా రూపుదిద్దుకుంది. ఈ చిట్టడివి అందాలను వీక్షించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలొస్తున్నారు. ఆదివారం వస్తే చాలు.. నగరం నుంచి చాలా మంది యువత ఇక్కడికి వస్తున్నారు. అద్భుత పూల వనాలు, పండ్లతోటలు, ఎత్తైన వృక్షాలు, ఆహ్లాదకర వాతావరణాన్ని తనివితీరా ఆస్వాదిస్తున్నారు. అంతేకాదు ఈ ప్రాంతం షూటింగ్ స్పాట్గా మారింది. ఆ పక్కనే రంగుల పూల వనం.. మరో పక్క పక్షుల కిలకిల రాగాలు.. అలా నడుచుకుంటూ మరింత ముందుకెళ్తే సముద్రాన్ని తలపించేలా చెరువు కనిపిస్తుంది. ఈ వేసవికి విహార యాత్రలకు సుదూర ప్రాంతాలకు పరుగులు పట్టాల్సిన పని లేదు. మన చెంతనే ఉన్న ఈ అటవీ ద్వీపంలోనే ఎంజాయ్ చేయొచ్చు.. అందాలను ఆస్వాదిద్దాం.. చారిత్రక ఖిలా వరంగల్ మధ్య కోట ప్రకృతి సౌందర్యంతో ద్వీపంలా ఉంటుంది. కోట చుట్టూ రెండు నీటి కోటలు, అనేక వంపులతో కూడిన మట్టి, రాతికోట నిర్మాణ శైలి అద్భుతంగా కనిపిస్తుంది. ఇంతకాలం ఏకశిల వాటర్ పాల్స్, చిల్డ్రన్స్ పార్క్, బోట్ షికారు, గుండు చెరువు కట్టపై ఏర్పాటు చేసిన పార్కు మాత్రమే చూశాం. ఇప్పుడు సుమారు 33 ఎకరాల విస్తీర్ణంలో ఎత్తైన వృక్షాలతో సహజ సిద్ధ అడవి రూపుదిద్దుకుంది. నాలుగేళ్ల క్రితం సుమారు 8 ఎకరాల విస్తీర్ణంలో నాటిన మియావాకి మొక్కలు నేడు దట్టమైన అడవిగా తయారైంది. ఈ మార్గానికి ఇరువైపులా 20 ఫీట్ల ఎత్తుతో దట్టంగా వృక్షాలు ఉన్నాయి. ఒక్కసారి ఇందులోకి వెళ్లిన వారు దారి తెలియక ఇబ్బంది పడాల్సిందే. ఇందులో పర్యాటకులు సేదదీరేలా అవకాశాలు ఉన్నాయి. పార్కు నిర్వాహకుడు మరో 18 ఎకరాల్లో బ్లాక్ ప్లాంటేషన్ ఏర్పాటు చేశారు. దీనిలో అన్ని రకాల పండ్ల మొక్కలు నాటారు. ఏకశిల గుట్ట పక్కన గుండు చెరువు కట్టపై 25 ఏళ్ల క్రితం ‘కుడా’ఆధ్వర్యంలో ఏకశిల వాటర్ పాల్స్, చిల్డ్రన్స్ పార్కును ఏర్పాటు చేయగా.. చెరువు చుట్టూ బాండ్ ఏర్పాటు చేశారు. విశాల స్థలంలో పర్యాటకులు టెబుల్ మీద కూర్చుని చల్లని గాలి ఆస్వాదిస్తూ .. చెరువు అందాలు వీక్షిస్తూ పచ్చిన చెట్ల నీడన ప్రకృతి అందాలను చూడొచ్చు. అంతేకాదు పార్కులో చెట్లు, పూల వనం, రోజ్ గార్డెన్, పాత్వేలు, సీసీ రోడ్లు, నిర్మాణాలు అన్నీ ఉన్నాయి. దీంతో వేసవిలో పర్యాటకులు పచ్చని చెట్ల నీడన ఎంజాయ్ చేస్తున్నారు. కోటకు ఇలా చేరుకోవచ్చు.. చారిత్రక ప్రదేశానికి సులభంగా చేరుకోవచ్చు. రై ల్వేస్టేషన్, బస్సు స్టేషన్కు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మధ్యకోట పర్యాటక ప్రాంతానికి రూ. 20 చార్జి చెల్లించి ప్రైవేట్ వాహనాల్లో చేరుకోవచ్చు. నేరుగా స్వయంభూ శంభులింగేశ్వరుడిని దర్శనం చేసుకోవచ్చు. ఆ తర్వాత కాకతీయుల శిల్పకళా సంపద వీక్షించొచ్చు. అనంతరం చిల్డ్రన్ పార్కులో సేదదీరుతూ ప్రకృతి అందాలు చూడొచ్చు. ఎత్తైన భారీ వృక్షాలు, తీరొక్క పండ్ల తోటలు చెట్లపై సేదదీరుతున్న అనేక రకాల పక్షులు ఏకశిల చిల్డ్రన్స్ పార్కులో రూపుదిద్దుకున్న పచ్చని ప్రాంతం -
అదనపు కట్నం కోసం నా భర్త వేధిస్తున్నాడు
●పోలీసులు న్యాయం చేయండి ● వీడియో ద్వారా బాధితురాలి వేడుకోలు.. ఐనవోలు: నా భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు.. దీనిపై పోలీసులు స్పందించి న్యాయం చేయాలని బాధితురాలు వేడుకుంది. ఈ వీడియో ఆదివారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాధితురాలు వీడియోలో చెబుతున్న వివరాల ప్రకారం.. మండలంలోని కక్కిరాలపల్లికి చెందిన రాపోలు కేతమ్మ, వెంకటయ్య దంపతుల కుమార్తె, బాధితురాలు సుమలతకు ఏడేళ్ల క్రితం ఒగులాపురం గ్రామానికి చెందిన బోసు సాంబరాజుతో వివాహమైంది. మద్యానికి బానిసైన సాంబరాజు.. భార్య సుమలతను కొట్టడంతోపాటు ఆమె బంగారు ఆభరణాలను అమ్ముకుని జల్సాలకు పాల్పడ్డాడు. అంతేకాకుండా అదనపు కట్నం తీసుకురావాలని వేధించడంతో సుమలత కొన్ని రోజుల క్రితం తన తల్లిగారి ఇంటికి చేరుకుంది. అనంతరం ఐనవోలు పోలీసులను ఆశ్రయించగా వారు పట్టించుకోలేదు. జఫర్గఢ్ పోలీసు స్టేషన్కు వెళ్లిన ఫలితం కనిపించలేదు. ఈ క్రమంలో దమ్మన్నపేటలో ఇరువురి పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకోవడానికి వెళ్లగా సుమలత, ఆమె తల్లిదండ్రులపై సాంబరాజు దాడి చేయించాడు. ఈ ఘటనపై సుమలత వర్ధన్నపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్సై.. సాంబరాజును పిలిచి మాట్లాడినా ఫలితం కనిపించలేదు. ఈ ఘటనపై ఇప్పటికై నా ఐనవోలు, వర్ధన్నపేట పోలీసులు స్పందించి న్యాయం చేయాలని ఆమె కోరింది. ఈ అంశంపై ఐనవోలు ఎస్సై శ్రీనివాస్ను వివరణ కోరగా ఐదు రోజుల క్రితం సుమలత ఫిర్యాదు చేసిందన్నారు. 498 కేసు నమోదు చేస్తానని చెబితే నిరాకరించిందన్నారు. దీంతో పెద్ద మనుషుల సమక్షంలో భార్య, భర్తలు మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలని సూచించినట్లు తెలిపారు. -
సాఫ్ట్బాల్ పోటీల్లో వరంగల్ జట్టుకు మూడో స్థానం
మందమర్రి రూరల్: మంచిర్యాల జిల్లా మందమర్రి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ మైదానంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో మహబూబ్నగర్ విజేతగా నిలిచింది. ఫైనల్ లో 3–2 స్కోర్ తేడాతో మహబూబ్నగర్ గెలుపొందగా నిజామాబాద్ జట్టు రెండో స్థానం దక్కించుకుంది. వరంగల్, ఆదిలాబాద్ జట్లు తలపడగా 9–8స్కోర్ తేడాతో వరంగల్ జట్టు గెలిచి మూడో స్థానంలో నిలిచింది. గెలిచిన జట్లకు ఒలింపిక్ జిల్లా కార్యదర్శి రఘునాథ్రెడ్డి, ఎస్జీఎఫ్ కార్యదర్శి బాబురావు, డీఐఈఓ అంజయ్య బహుమతులు, మెడల్స్ ప్రదానం చేశారు. అనంతరం రాష్ట్రస్థాయి జట్టును ఎంపిక చేశారు. న్యూశాయంపేట: వరంగల్ జిల్లాలో యూరియా యాప్ను సమర్థవంతంగా అమలు చేయాలని ఆ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ఆదివారం కలెక్టరేట్ నుంచి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. యాప్ నిర్వహణలో వ్యవసాయ శాఖ, ఎరువుల డీలర్ల పాత్రను వివరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్మార్ట్ ఫోన్ ఉన్న రైతులు ముందుగా గూగుల్ ప్లే స్టోర్లో ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ అని టైప్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. సొంత భూమిలో సాగు చేస్తున్న రైతులు, కౌలు రైతులు, తదితర రైతులు తమ సెల్ఫోన్, ఆధార్ నంబర్ ద్వారా లాగిన్ అయి యాసంగి 2025–26లో సాగు చేయనున్న పంట వివరాలు నమోదు చేయాలి. పంట వివరాలు నమోదు చేసిన అనంతరం జిల్లాలోని ఎరువుల డీలర్ల వద్ద జాబితా, వారి వద్ద అందుబాటులో ఉన్న యూరియా బస్తాల వివరాలు యాప్లో కనిపిస్తాయి. సాగుకు అవసరమైన యూరియాను దఫాల వారీగా బుక్ చేసుకునే అవకాశం ఉందన్నారు. యూరియా బుకింగ్ అనంతరం రైతుకు ఒక బుకింగ్ ఐడీ నంబర్ వస్తుందని, ఆ ఐడీ నంబర్తో పాటు ఆధార్, పట్టాదారు పాస్బుక్ తీసుకుని సమీప డీలర్ వద్ద యూరియా పొందవచ్చన్నారు. అయితే యూరియా స్లాట్ బుకింగ్కు సంబంధించి బుకింగ్ ఐడీ కేవలం 24 గంటలు మాత్రమే చెల్లుబాటు అవుతుందన్నారు. యాప్ ద్వారా యూరియా స్లాట్ బుకింగ్ సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూడాలన్నారు. అన్ని స్థాయిల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, ఏడీఏలు, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు. జవనరి ఫస్ట్.. కార్యాలయం షిఫ్ట్● కాజీపేట ఏసీపీ కార్యాలయం తరలింపు ● అద్దె భవనం నుంచి సర్కారు భవనంలోకి...హసన్పర్తి: కాజీపేట ఏసీపీ కార్యాలయం తరలింపునకు సిద్ధమైంది. ప్రస్తుతం హంటర్రోడ్డులో నిర్వహిస్తున్న ఈకార్యాలయాన్ని సర్కార్ భవనంలోకి తరలించే కార్యక్రమం చేపట్టారు. హసన్పర్తి పోలీస్స్టేషన్పై ఉన్న గదిలోకి ఈ భవనం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు ఇప్పటికే అద్దె భవనాల కిరాయిలు ఫిబ్రవరి నుంచి నిలిపేయాలని సర్కార్ ట్రెజరీలను ఆదేశించింది. ఈ నేపథ్యంతో సర్కార్ కార్యాలయాలను సొంత భవనాల్లోకి మార్చడానికి జిల్లా యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. ఏసీపీ కార్యాలయాన్ని సొంత భవనంలోకి షిప్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం కాజీపేట ఏసీపీ కార్యాలయం పరిధిలో కాజీపేట, ఽహసన్పర్తి, మడికొండ, ధర్మసాగర్, వేలేరు, భీమదేవరపల్లి, వంగర, ఎల్కతుర్తి, కమలాపూర్ పోలీస్స్టేషన్లు ఉన్నాయి. 30 ఏళ్లుగా అద్దె భవనంలోనే ఈకా ర్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. కమిషనరేట్ కంటే ముందు వరంగల్ రూరల్ డీఎస్పీ కార్యాలయంగా కొనసాగింది. కమిషనరేట్ ఏర్పాటు తర్వాత వరంగల్ రూరల్ డీఎస్పీ కార్యాలయాన్ని కాజీపేట కమిషనరేట్గా మార్చారు. జనవరి ఫస్ట్ నుంచి ఏసీపీ కార్యాలయ కార్యకలాపాలు పూర్తిగా హసన్పర్తి నుంచి కొనసాగనున్నాయి. తాత్కాలికంగా ఏసీపీ కార్యాలయం కొనసాగుతోందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటీకే పోలీస్స్టేషన్పై అంతస్తులోని భవనాన్ని ముస్తాబు చేస్తున్నారు. -
సౌత్జోన్ పోటీలకు కేయూ జట్టు
కేయూ క్యాంపస్: బెంగళూరులోని క్రిస్ట్ యూనివర్సిటీలో ఈనెల 29 నుంచి జనవరి 2 వరకు జరగనున్న సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ బాస్కెట్బాల్ టోర్నమెంట్లో కాకతీయ యూనివర్సిటీ బా స్కెట్బాల్ ఉమెన్ జట్టు పాల్గొంటుందని స్పోర్ట్స్బో ర్డు సెక్రటరీ వై.వెంకయ్య ఆదివారం తెలిపారు. జ ట్టులో డి.హర్షిత, జి.శ్రీవాణి, పి. సృజన, ఎం.సంజన, ఇ.అనన్య తేజ, సి.హెచ్ తులసి, బి.రాధిక, బి. అఖిల, బి.వాణి, డి.పూజిత, కె.రచన, జి.అనిత ఉ న్నారన్నారు. జట్టుకు బొల్లికుంటలోని వాగ్దేవి ఫి జికల్ ఎడ్యుకేషన్ పీడీ యాసిన్ కోచ్ కమ్ మేనేజర్గా వ్యవహరించనున్నారని వెంకయ్య తెలిపారు. -
తల్లులకు తనివితీరా మొక్కులు..
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క, సారమ్మకు భక్తులు తనివితీరా మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా తరలొచ్చి అమ్మవార్లకు మొక్కులు అప్పగించారు. మొదటి జంపన్నవాగు స్నానఘట్టాల షవర్ల కింద స్నానాలు ఆచరించారు. జంపన్నవాగు వద్ద కల్యాణ కట్టలో భక్తులు, చిన్నారులు పుట్టు వెంట్రుకలు సమర్పించుకున్నారు. అనంతరం సమ్మక్క, సారలమ్మకు పసుపు, కుంకుమ, ఎత్తు బంగార, చీరసారె, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆరోగ్యం, సంతాన భాగ్యం కలగాలని వనదేవతలను మనసారా వేడుకున్నారు. మేడారం ఈఓ వీరస్వామి భక్తుల రద్దీని పర్యవేక్షించారు. చోరీలు జరగకుండా భక్తులను అనౌన్స్మెంట్ ద్వారా అప్రమత్తం చేశారు. అమ్మవార్ల గద్దెలకు తాళాలు.. భక్తుల రద్దీ పెరగడంతో పోలీసులు సమ్మక్క, సారలమ్మ గద్దెలకు తాళాలు వేశారు. దీంతో భక్తులు అమ్మవార్ల గద్దెలను బయట నుంచే దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపైకి వెళ్లి పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో మేడారం పరిసరాలన్నీ భక్తులతో నిండిపోయాయి. సుమారు 50 వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. 200 మంది పోలీసులు బందోబసు..్త అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు వేల సంఖ్యలో తరలిరావడంతో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. భక్తుల రద్దీ నియంత్రణ, భద్రత ఏర్పాట్ల కోసం 200 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. గద్దెల ప్రాంగణం పునరుద్ధరణ పనులు కొనసాగుతున్న తరుణంలో భక్తులు అమ్మవార్లను ప్రశాంతంగా దర్శించుకునేలా చర్యలు తీసుకున్నారు. భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని ఎస్పీ ముందస్తుగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ పర్యవేక్షణలో ఓఎస్డీ శివం ఉపాధ్యాయ, అదనపు ఎస్పీ సదానందం, ఏఎస్పీ మనన్బట్, డీఎస్పీ రవీందర్, సీఐలు, ఎస్సైల బందోబస్తులో పాల్గొన్నారు.తల్లులకు మొక్కులు చెల్లిస్తున్న భక్తులు మేడారానికి వేలాదిగా తరలొచ్చిన భక్తులు జనసందడిగా మారిన గద్దెల ప్రాంగణం -
జూలై వరకు లోటు వర్షపాతం..
ఉమ్మడి వరంగల్లో జూలై మాసాంతం నాటికి 52 మండలాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. 23 మండలాల్లోనే సాధారణ వర్షం కురిసింది. ఉమ్మడి జిల్లాలో 75 మండలాలకు ఒక్క వర్ధన్నపేట మండలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 398.5 మిల్లీమీటర్లకు 662.10 మిల్లీమీటర్లు (66 శాతం) అధికంగా కురిసింది. 25 మండలాల్లో సాధారణం కంటే 2 శాతం నుంచి 59 శాతం అధిక వర్షం కురవగా, 48 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ములుగు, జేఎస్ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో వాగులు పొంగిపొర్లినా ఆ జిల్లాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. దీంతో రైతులు చాలా ఆందోళనకు గురయ్యారు. -
రైతులకు చేరువైన సాంకేతికత, పథకాలు
రైతులు సాంకేతికతను, మార్కెట్ పోకడలను అందిపుచ్చుకునేలా ప్రభుత్వం పలు పథకాలను అందుబాటులోకి తెచ్చింది. నేల ఆరోగ్యం, సమీకృత వ్యవసాయం, సూక్ష్మ నీటిపారుదల, సేంద్రియ వ్యవసాయం, ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్, ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ వంటి పథకాల ద్వారా వ్యవసాయాన్ని ప్రోత్సహించింది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వరంగల్ రీజినల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ (ఆర్ఎఆర్ఎస్) కొత్త వరి వంగడాలను (ఉదాహరణకు, వరంగల్–1119 వంటివి) విడుదల చేసింది. ఇవి స్థానిక వాతావరణానికి అనుకూలంగా ఉండి, అధిక దిగుబడినిచ్చే సన్న, దొడ్డు గింజ రకాలను రైతులకు అందుబాటులో ఉంచారు. హార్టికల్చర్ ద్వారా హైబ్రిడ్ కూరగాయల విత్తన సబ్సిడీలు, పర్మనెంట్ పాండల్స్, మల్చింగ్ వంటి ప్రోత్సాహకాలు ఇచ్చారు. -
ముగిసిన ఉచిత కృత్రిమ కాళ్ల పంపిణీ శిబిరం
రామన్నపేట: వరంగల్ కొత్తవాడలోని పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ ప్రాంగణంలో హైదరాబాద్ భగవాన్ మహావీర్ ట్రస్ట్ సహకారంతో నిర్వహించిన ఉచిత కృత్రిమ కాళ్ల పంపిణీ ఆదివారం ముగిసిందని ఆలయ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రోజుల్లో (శని, ఆదివారం) శిబిరం ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన 200 మందికి పైగా దివ్యాంగులకు ఉచిత కృత్రిమ కాళ్లు, వీల్ చైర్లు, ట్రై సైకిళ్లు పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కొలతలు తీసుకోవడం నుంచి నిపుణులచే కృత్రిమ కాళ్లు అమర్చడం వరకు అన్ని ప్రక్రియలను సక్రమంగా నిర్వహించి లబ్ధిదారులకు అందించినట్లు వివరించారు. భవిష్యత్లో ఇలాంటి సేవా కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నట్లు వెల్లడించారు. ఈ శిబిరం విజయవంతానికి సహకరించిన జిల్లా పరిపాలన అధికారులు, మున్సిపల్ యంత్రాంగం, వైద్య నిపుణులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, వలంటీర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఫౌండేషన్ సీఈఓ రమేశ్బాబు, అదనపు సీఈఓ రాజేంద్రకుమార్, డిప్యూటీ సీఈఓ నాగార్జున, పరికిపండ్ల సుమంత్, వినయ్, వేణు, సుభాష్, సంపత్, సాగర్, నిఖిల్, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.ఆలయ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి -
మిమిక్రీ కళను చాటిన నేరెళ్ల
హన్మకొండ కల్చరల్: మిమిక్రీ అనే ఒక కళ ఉందని చాటి చెప్పిన మహానుభావుడు నేరెళ్ల వేణుమాధవ్ అని సినీ, మిమిక్రీ కళాకారుడు ఫన్స్టార్ శివారెడ్డి అన్నారు. వేణుమాధవ్ రాసిన మిమిక్రీ కళ వ్యాకరణం పుస్తకంతో ఎంతోమంది ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ, నేరెళ్ల వేణుమాధవ్ కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ధ్వన్యనుకరణ పద్మశ్రీ డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ 94వ జయంతిని ఆదివారం హనుమకొండ పబ్లిక్ గార్డెన్లో నిర్వహించారు. వేణుమాధవ్ కళాప్రాంగణంలో స్మారక ప్రతిభా పురస్కార ప్రదానం, మిమిక్రీ కళాకారుల స్వరార్చన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. వేణుమాధవ్ కల్చరల్ ట్రస్ట్ కార్యదర్శి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో శివారెడ్డి, కవి, గాయకుడు వరంగల్ శ్రీనివాస్, జబర్దస్త్ ఫేమ్, సినీనటుడు రాకింగ్ రాకేశ్, నేరెళ్ల వేణుమాధవ్ ట్రస్ట్ నిర్వాహకురాలు నేరెళ్ల శోభావతి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వరంగల్కు చెందిన కవి, కథారచయిత, నవలాకారుడు రామా చంద్రమౌళిని శాలువా, జ్ఞాపికతో సన్మానించి పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ స్మారక ప్రతిభా పురస్కారాన్ని అందజేశారు. అనంతరం అంపశయ్య నవీన్ మాట్లాడుతూ నేరెళ్ల వేణుమాధవ్ ప్రతిభా పురస్కారం ప్రతిష్టాత్మకమైందని పేర్కొన్నారు. వేణుమాధవ్ శిష్యుల మిమిక్రీ ప్రదర్శన ఆహుతులను అలరించింది. కార్యక్రమంలో కవి పొట్లపల్లి శ్రీనివాసరావు, నేరెళ్ల శ్రీనాఽథ్, నేరెళ్ల రాధాకృష్ణ, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.సినీ, మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి -
నేడు సాక్షి ఫోన్ ఇన్..
ఎంజీఎం: చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో వృద్ధులు, మహిళలు, చిన్నారులు, సాధారణ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ఎంజీఎం సూపరింటెండెంట్ హరిశ్చంద్రారెడ్డితో నేడు (సోమవారం) ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. నగర ప్రజలు తమ సందేహాలను వైద్యాధికారికి తెలిపి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఫోన్లో సంప్రదించవచ్చు. తేదీ: 29–12–2025, సోమవారం సమయం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు.. ఫోన్ చేయాల్సిన నంబర్ 97044 58273 -
నేడు గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్
వరంగల్ అర్బన్: వరంగల్ మహా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాతపూర్వకంగా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న గ్రీవెన్స్ను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు హనుమకొండ కలెక్టరేట్లో.. హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. వరంగల్ కలెక్టరేట్లో.. న్యూశాయంపేట: ప్రజల సమస్యల పరిష్కారానికి నేడు(సోమవారం) ఉదయం 10.30 గంటలకు వరంగల్ కలెక్టరేట్లో ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రామన్నపేట: కరీంనగర్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టేడియంలో ఈనెల 27, 28 తేదీల్లో జరిగిన తెలంగాణ మాస్టర్స్ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో వరంగల్ నగరానికి చెందిన బలభక్తుల శ్రీహరి మూడు విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించారు. ఈ సందర్భంగా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర శాశ్వత ప్రెసిడెంట్ మర్రి లక్ష్మణ్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ దేవేందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రభు కుమార్గౌడ్, ట్రెజరర్ లక్ష్మి, కరీంనగర్ జిల్లా మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ లక్ష్మణ్ తదితరులు శ్రీహరిని ప్రత్యేకంగా అభినందించారు. బలభక్తుల శ్రీహరి ప్రస్తుతం బాలసముద్రంలోని ఎల్ఐసీ డివిజనల్ ఆఫీస్లో హయ్యర్ గ్రేడ్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎల్ఐసీ జోనల్, ఆలిండియా పోటీలలో కూడా శ్రీహరి అనేక పతకాలు సాధించారు. ఐనవోలు: ప్రముఖ శైవక్షేత్రమైన ఐనవోలు శ్రీమల్లికార్జునస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. సంక్రాంతి తర్వాత ఆదివారాల్లో వారాంతపు జాతరలకు మల్లన్న భక్తులు ఎక్కువగా హాజరయ్యేవారు. కానీ, మేడారం జాతర జనవరిలోనే ఉండడంతో వివిధ జిల్లాల నుంచి భక్తులు ఆలయానికి చేరుకున్నారు. పట్నాలు, బోనాలు, వడిబియ్యం, సారె సమర్పణ, కోడెను కట్టి మొక్కులు చెల్లించారు. భక్తుల రద్దీని బట్టి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
చట్టసభల్లో ప్రస్తావించాలి
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ (రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్)లో యువతకు ఉద్యోగాలివ్వాలని శని, ఆదివారం ఎంపీ, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇచ్చినట్లు రైల్వే జేఏసీ కన్వీనర్ దేవుళ్లపల్లి రాఘవేందర్, చైర్మన్ కొండ్ర నర్సింగరావు తెలిపారు. ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, నాయిని రాజేందర్రెడ్డి, దొంతి మాధవరెడ్డిని కలిసి ఉమ్మడి జిల్లాకు 65 శాతం ఉద్యోగావకాశాలు కల్పించాలని, రైల్వే యాక్ట్ అప్రెంటీస్ పూర్తి చేసిన పిల్లలకు, తెలంగాణ నిరుద్యోగులకు 35 శాతం ఉద్యోగాలు కల్పించాలని కోరారు. ఉద్యోగాల కల్పనపై శనివారం రాజకీయ పార్టీలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించినట్లు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ఈ అంశాలను ప్రస్తావించాలని కోరారు. ముఖ్యమంత్రితో రైల్వే మంత్రికి ఉత్తరం రాయించేలా ఎమ్మెల్యేలు తోడ్పడాలని కోరారు. వినతి పత్రాలు ఇచ్చిన వారిలో కార్పొరేటర్లు జక్కుల రవీందర్యాదవ్, విజయశ్రీ రజాలి, జలగం రంజిత్రావు, సంపత్రెడ్డి, సీపీఎం జిల్లా నాయకులు ఎం.చుక్కయ్య, సీపీఐ నాయకులు మద్దెల మల్లేశం, వెంకటరాజ్యం, వివిధ పార్టీల నాయకులు, అయోధ్యపురం భూనిర్వాసితులు, నిరుద్యోగులు తదితరులు పాల్గొన్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలి ఎంపీ, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇచ్చిన రైల్వే జేఏసీ బృందం -
ఫార్మసీ పూర్వ అధ్యాపకుల సేవలు మరువలేనివి
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ఫార్మసీ పూర్వ అధ్యాపకుల సేవలు మరువలేనివని వీసీ ఆచార్య కె.ప్రతాప్రెడ్డి కొనియాడారు. నాడు నిధుల లేమి ఉన్నప్పటికీ ఉన్న వనరులను వినియోగించుకొని పరిశోధనలు జరిగాయని పేర్కొన్నారు. నాటి విద్యార్థులు దేశవిదేశాల్లోని ఫార్మసీ రంగంలో స్థిరపడి యూనివర్సిటీ కీర్తి ప్రతిష్టను పెంచారని పేర్కొన్నారు. హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించిన యూనివర్సిటీ ఫార్మసీ కాలేజీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. కాకతీయ యూనివర్సిటీ కూడా గోల్డెన్ జూబ్లీ సంవత్సరంలోకి అడుగిడిందని పేర్కొన్నారు. ప్రముఖ ఫార్మసీ సంస్థ అరబిందో లిమిటెడ్ ఫార్మసీ విద్యార్థులకు ప్రాంగణ నియామకాలు, ఇంటర్న్షిప్లు, ఇండస్ట్రియల్ విజిట్కు అవకాశం ఇచ్చినందుకు అభినందనలు తెలిపారు. ఫార్మసీ పూర్వ విద్యార్థులు నాలుగు ఎండో మెంట్లెక్చర్ల ఏర్పాటుకు ముందుకు వచ్చారని పేర్కొన్నారు. పబ్లిక్ హెల్త్ కేంద్రంగా ఫార్మసిస్ట్ ఉండాలి.. కాకతీయ యూనివర్సిటీ ఫార్మసీ కళాశాల తమకు జీవితాన్ని నేర్పిందని, అభ్యాసనలో క్రమశిక్షణ అవసరమని కేయూ ఫార్మసీ పూర్వ విద్యార్థి, అమెరికా సంయుక్త రాష్ట్రాల ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ డైరెక్టర్ రమణకుమారి అన్నారు. రోగి దృక్పథంతో ఆలోచించాలని, పబ్లిక్ హెల్త్ కేంద్రంగా ఫార్మసిస్టు ఉండాలని, డ్రగ్ తయారీలో క్రిటికల్గా అంచనా వేయాలని సూచించారు. మెడికేషన్లో నూతన పోకడలు మెడికేషన్లో నూతన పోకడలు వచ్చాయని, డ్రగ్ లోపాలపై చట్టపరమైన చర్యలు ఉంటాయని అమెరికాలోని టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీలో పార్మసీ డీన్ డాక్టర్ మన్సూర్ఖాన్ అన్నారు. గొప్ప డ్రగ్స్ యూనివర్సిటీ ల్యాబ్ల్లో తయారైనవేనని పేర్కొన్నారు. యూనివర్సిటీ ఇండస్ట్రీ కొలాబరేషన్ విశ్వవిద్యాలయ అభివృద్ధిలో ఉపయోగపడుతుందన్నారు. గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల ముగింపు సమావేశాల కన్వీనర్, ప్రవాస భారతీయుడు డాక్టర్ సాంబారెడ్డి మాట్లాడుతూ ప్రపంచాన్ని మార్చే శక్తి ఫార్మసీకి ఉందన్నారు. పూర్వవిద్యార్థులు తోట రాజు, జె.రాజమౌళి మాట్లాడుతూ సమాజహితంగా సైన్స్ ఉండాలని, మార్కెటింగ్పై పట్టుపెంచుకుని ఉత్పాదనపై దృష్టి సారించాలన్నారు. విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. అనంతరం ఆయనను సన్మానించారు. జేఎన్టీయూ ప్రొఫెసర్ సునీతారెడ్డి, కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ జె.కృష్ణవేణి, డీన్ గాదె సమ్మయ్య, ఆచార్యులు వై.నర్సింహారెడ్డి, వి.కిషన్, వి.మల్లారెడ్డి, స్వరూపారాణి, నాగరాజు, షాయోదా, పూర్వ విద్యార్థులు డాక్టర్ సూర్యకుమార్, చక్రవర్తి, హరీశ్చంద్ర పాల్గొన్నారు. కేయూను సందర్శించిన పూర్వ విద్యార్థులు గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు ముగిసిన అనంతరం ఆదివారం సాయంత్రం కేయూను ఫార్మసీ పూర్వవిద్యార్థులు సందర్శించారు. వీసీ ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రంతో కలిసి తేనేటి విందులో పాల్గొన్నారు. కాకతీయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ప్రతాప్రెడ్డి ముగిసిన ఫార్మసీ కాలేజీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు -
సాగు హుషారు.. ‘మోంథా’తో బేజారు!
సోమవారం శ్రీ 29 శ్రీ డిసెంబర్ శ్రీ 2025ఎకరాకు 25 క్వింటాళ్లకుపైగా వరి దిగుబడి వస్తుందని ఆశించినా.. 12 నుంచి 18 క్వింటాళ్ల మధ్యే రావడం తీవ్రంగా నిరాశ పర్చింది. వానాకాలం సీజన్లో 10,39,815 మెట్రిక్ టన్నులు ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు 1,360 ఐకేపీ, పీఏసీఎస్, సివిల్సప్లయీస్ కేంద్రాలను పౌరసరఫరాల శాఖ ఏర్పాటు చేసింది. అయితే ఈ నెల 24 నాటికి ఉమ్మడి జిల్లాలో 1,43,357 మంది రైతుల నుంచి రూ.1548.19 కోట్ల విలువైన ధాన్యం సేకరించినట్లు అధికారులు ప్రకటించారు. ఽమొత్తంగా ధాన్యం సేకరణ లక్ష్యం 62.36 శాతమే అయ్యింది. తేమ పేరిట కనీస మద్దతు ధరలో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే, ఎకరానికి పత్తి దిగుబడి 10–15 క్వింటాళ్లు వస్తుందని భావించగా ఎకరానికి 6–7 క్వింటాళ్లు కూడా రాలేదు. దీనికి తోడు తేమ నిబంధనలు 8–12 శాతంగా పెట్టి కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.8,110గా నిర్ణయించారు. కనిష్టంగా రూ.3,969, గరిష్టంగా రూ.7,289 చెల్లించినట్లు రైతులు వాపోయారు. -
నియంత్రణలో నేరాలు!
● గతేడాదితో పోలిస్తే గణనీయంగా తగ్గుముఖం ● కమిషనరేట్ పోలీసుల పనితీరు సంతృప్తికరం ● 2026లో మరిన్ని నూతన విధానాలతో ముందుకు ● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ వెల్లడిసాక్షిప్రతినిధి, వరంగల్ : ‘2024తో పోలిస్తే పలు నేరాల సంఖ్య తగ్గింది. ఈ నివేదిక కేవలం గణాంక రికార్డు కాదు. శాంతిభద్రతల రక్షణకు భాగస్వామ్యంతో సాధించిన ఫలితాల సంకలనం’ అని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయడంతో నేరాలు నియంత్రణలో ఉన్నాయని తెలిపారు. కమిషనరేట్ పరిధి వివిధ స్థాయిల పోలీసు అధికారుల పనితీరు సంతృప్తికరంగా ఉందని, మరిన్ని విధానాలతో 2026లోనూ ‘వరంగల్ కమిషనరేట్ పోలీస్.. ది బెటర్ పోలీస్’గా నిలవాలని ఆకాంక్షించారు. శనివారం హనుమకొండ భీమారంలోని శుభం కల్యాణ వేదికలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ వార్షిక నివేదిక –25 సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నివేదికలోని వివరాలు వెల్లడిస్తూ గతేడాదితో పోలిస్తే 0.53 శాతం స్వల్పంగా నేరాల సంఖ్య పెరిగిందని గతేడాది 14,412 కేసులు నమోదు కాగా, 2025లో 14,456 కేసులు నమోదయ్యాయని వివరించారు. 2026లో సమన్వయంతో పనిచేస్తూ, నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు సీపీ స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీసీపీలు రాజమహేంద్రనాయక్, దార కవిత, ఏఎస్పీ చేతన్, అదనపు డీసీపీ రవి, ప్రభాకర్, శ్రీనివాస్లతో పాటు, ఏసీపీలు మూల జితెందర్ రెడ్డి, సదయ్య, పింగిళి ప్రశాంత్ రెడ్డి, జాన్ నర్సింహులు, వాసాల సతీష్, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు పాల్గొన్నారు. -
దివ్యాంగులకు ధైర్యం కల్పించాలి
రామన్నపేట: దివ్యాంగుల్లో ధైర్యం నింపడం మన అందరి బాధ్యత అని రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ కొత్తవాడలోని పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ ప్రాంగణంలో ఐఏఎస్ పరికిపండ్ల నరహరి స్థాపించిన ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. భగవాన్ మహావీర్ ట్రస్ట్, హైదాబాద్ వారి సహకారంతో శనివారం దివ్యాంగులకు ఉచిత కృత్రిమ కాళ్ల పంపిణీ శిబిరం నిర్వహించారు. మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. దివ్యాంగులకు కృత్రిమ కాళ్లు అందించడమంటే వారు తిరిగి నడిచే ధైర్యం కల్పించడమేనని పేర్కొన్నారు. అనంతరం ఆలయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఐఏఎస్ పరికిపండ్ల నరహరి మాట్లాడుతూ.. దివ్యాంగులు ఇతరుల దయపై ఆధారపడే వ్యక్తులు కారని, వారికి సరైన అవకాశాలు అందితే గౌరవంగా, స్వావలంబనతో జీవించగలరన్నారు. గ్రేటర్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్ కలెక్టర్ సత్యశారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ పాల్గొని శిబిరాన్ని సందర్శించి లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు. శిబిరంలో ఉమ్మడి వరంగల్తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన 150 మందికిపైగా దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ కాళ్లు, అవసరాన్ని బట్టి వీల్ చైర్లు, ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ శిబిరంలో వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణి, మహావీర్ ట్రస్ట్ బాధ్యులు ఇంద్రజన్, ఆలయ ఫౌండేషన్ సీఈఓ రమేశ్బాబు, అడిషనల్ సీఈఓ రాజేంద్రకుమార్, కీర్తి నాగార్జున, వరంగల్ ఇన్చార్జ్ పరికిపండ్ల వేణు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్, బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్రావు, నాయకులు కుసుమ సతీశ్, వన్నాల వెంకటరమణ, చిప్ప వెంకటేశ్వర్లు, గాజుల సంపత్, బొజ్జపల్లి సుభాశ్, లింగమూర్తి, ఎలగం చిన్న కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖ ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృత్రిమ కాళ్ల పంపిణీ -
రేపటి నుంచి సైన్స్ కార్నివాల్
విద్యారణ్యపురి: హైస్కూల్ స్థాయి విద్యార్థులకు ఈ నెల 29, 30 తేదీల్లో సైన్స్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు హడుప్సా జిల్లా అధ్యక్షుడు టి.బుచ్చి బాబు, జనరల్ సెక్రటరీ ఎం.సంతోశ్రెడ్డి తెలిపారు. హనుమకొండ డిస్ట్రిక్ట్ అన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ (హడుప్సా) ఆధ్వర్యంలో సైన్స్ కార్నివాల్–25 పేరిట నిర్వహించనున్న ఈ సైన్స్ఫెయిర్కు సంబంధించిన పోస్టర్ను శనివారం హనుమకొండ డీఈఓ కార్యాలయంలో డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ ఆవిష్కరించారు. కడిపికొండలోని విశ్వశాంతి హైస్కూల్లో ‘వాటర్ కన్సర్వేషన్ అండ్ మేనేజ్మెంట్, గ్రీన్ ఎనర్జీ అండ్ ఎ నర్జీ కన్సర్వేషన్, వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ అల్టర్నేటివ్స్ టు ప్లాస్టిక్, రిక్రేషన్ మేథమెటికల్ మోడలింగ్, సస్టెయినబుల్ అగ్రికల్చర్’ అనే అంశాలపై ఎగ్జిబిట్స్ విద్యార్థులు ప్రదర్శించనున్నారు. పోస్టర్ ఆవిష్కరణలో హడుప్సా అధ్యక్షుడు బుచ్చిబాబు, అకడమిక్ కన్వీనర్ వీసీ రామారావు, ట్రెజరర్ డి.శంకర్, బాధ్యులు బి.వెంకటరెడ్డి, ఎం.సంపత్రెడ్డి, వై.వెంకటేశ్వర్రావు, కె.వాసుదేవరెడ్డి పాల్గొన్నారు. -
రేపు సాక్షి ఫోన్ ఇన్..
ఎంజీఎం: చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో వృద్ధులు, మహిళలు, చిన్నారులు, సాధారణ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ఎంజీఎం సూపరింటెండెంట్ హరిశ్చంద్రారెడ్డితో రేపు (సోమవారం) ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. నగర ప్రజలు తమ సందేహాలను వైద్యాధికారికి తెలిపి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఫోన్లో సంప్రదించవచ్చు. తేదీ: 29–12–2025, సోమవారం సమయం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు.. ఫోన్ చేయాల్సిన నంబర్ 97044 58273 -
ప్రతిభను వెలికితీసేందుకు క్రికెట్ పోటీలు
● టీసీఏ రాష్ట్ర జనరల్ సెక్రటరీ గురువారెడ్డి ● కేయూలో ఈస్ట్ జోన్ గోల్డ్కప్ క్రికెట్ టోర్నమెంట్ షురూకేయూ క్యాంపస్: గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కృషి చేస్తోందని తెలంగాణ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ధరం గురువారెడ్డి అన్నారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఈస్ట్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ను శనివారం కాకతీయ యూనివర్సిటీలోని క్రీడా మైదానంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఆ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ పి.విజయచందర్రెడ్డి, రాష్ట్ర బాధ్యులు గుజ్జుల ప్రేమేందర్రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. గ్రామీణ యువత కోసం తెలంగాణ గోల్డ్కప్ క్రికెట్–2025 (ఈస్ట్జోన్) క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలోని 8 జిల్లాల హనుమకొండ, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, వరంగల్, పెద్దపల్లి, సూర్యాపేట, భద్రాద్రి జిల్లాలకు సంబంధించిన జట్లు ఈటోర్నమెంట్లో పాల్గొంటున్నాయి. 20 ఓవర్ల మ్యాచ్గా లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ హనుమకొండ జిల్లా జనరల్ సెక్రటరీ తాళ్లపెల్లి జయపాల్, జాయింట్ సెక్రటరీ మహమ్మద్ అలీముద్దీన్, వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ చిలువేరు రాజ్కుమార్, బాధ్యులు సామిఅక్మల్, దాసరి శ్రీనివాస్, విష్ణుదాస్, శశాంక్, మరింగంటి నవరాసన్ తదితరులు పాల్గొన్నారు. తొలిరోజు మ్యాచ్లు ఇలా.. హనుమకొండ, ఖమ్మం జిల్లా క్రికెట్ జట్లు మధ్య తొలి మ్యాచ్ నిర్వహించారు. ఇందులో ఖమ్మం జిల్లా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 177 పరుగులకు ఆల్ఔట్ కాగా, తదుపరి బ్యాటింగ్ చేసిన హనుమకొండ జట్టు 102 పరుగులకు ఆల్ఔట్ అయ్యింది. ఖమ్మం జట్టు విజయం సాధించింది. అనంతరం మహబూబాబాద్, ములుగు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో మహబూబాద్ జిల్లా జట్టు విజయం సాధించింది. జనవరి 1వ తేదీ వరకు ఈక్రికెట్ పోటీలు కొనసాగుతాయి. -
ఇన్నర్ రింగ్రోడ్డు పనులు వేగవంతం చేయాలి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: ఇన్నర్ రింగ్రోడ్డు పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. రింగ్ రోడ్డు పనుల పురోగతిపై బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి కలెక్టరేట్లో శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నగరాభివృద్ధిలో భాగంగా ఖిలా వరంగల్, ఏనుమాముల, గొర్రెకుంట ప్రాంతాల మీదుగా నిర్మాణంలో ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్డు పనులు వేగంగా పూర్తి చేసేందుకు భూ నిర్వాసితులకు పరిహారం వెంటనే చెల్లించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇన్నర్ రింగ్రోడ్డు పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు సమగ్ర నగరాభివృద్ధికి జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో ఆర్డీఓ సుమ, ‘కుడా’ పీఓ అజిత్రెడ్డి, కలెక్టరేట్ ఏఓ విశ్వప్రసాద్, ఖిలావరంగల్ తహసీల్దార్ మహ్మద్ ఇక్బాల్ పాల్గొన్నారు. మద్ది మేడారం జాతరపై కలెక్టర్ సమీక్ష నల్లబెల్లి మండలంలోని మద్ది మేడారంలో జనవరి 28 నుంచి జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతర విజయవంతానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్లో జాతర నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై పలు శాఖల అధికారులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జాతరలోపు పనులు పూర్తయ్యేలా ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, ఆర్డీఓ ఉమారాణి, డీఎంహెచ్ఓ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం కాజీపేట: రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లో జిల్లా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక జీఓ జారీ చేయాలని కార్పొరేటర్ విజయశ్రీ రజాలీ అన్నారు. కాజీపేట రైల్వే కమ్యూనిటీ హాల్లో శనివారం తెలంగాణ రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రైల్వే పరిశ్రమలో స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు అసెంబ్లీ సమావేశాల్లో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించేలా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సహకరించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈమేరకు జిల్లాలోని ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇవ్వాలని సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ వెంకట నారాయణ మాట్లాడుతూ.. భవిష్యత్ పోరాటంలో యువతను భాగస్వాములను చేయాలన్నారు. జేఏసీ కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్ మాట్లాడుతూ.. ఒక మంచి లక్ష్యంతో సాగుతున్న ఉద్యమానికి అందరూ మనస్ఫూర్తిగా సహకరించడానికి ముందుకు రావాలని కోరారు. జేఏసీ చైర్మన్ కోండ్ర నర్సింగరావు అధ్యక్షతన నిర్వహించిన ఈసమావేశంలో కార్పొరేటర్ సంకు నర్సింగరావు, మాజీ కార్పొరేటర్ ఎండీ అబూ బక్కర్, నార్లగిరి రమేశ్, కాటపురం రాజు, బి.రంజిత్కుమార్, సందెల విజయ్, పి.శివకుమార సుంచు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాల్సిందే..
కాజీపేట: భూనిర్వాసితులతోపాటు స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే నినాదం క్రమేణా ఊపందుకుంటోంది. కాజీపేట మండలం అయోధ్యపురం గ్రామ శివారులో శరవేగంగా సాగుతున్న రైల్వే మ్యాన్ఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేపట్టనున్నారు. నియామకాల్లో జిల్లా నిరుద్యోగ యువతకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలనే నినాదం మొదలైంది. దాదాపు 40 ఏళ్లు పోరాట ఫలితంగా రెల్వే కోచ్ అండ్ వ్యాగన్ పరిశ్రమ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ పరిశ్రమ ఏర్పాటుకు రైతులు 128 ఎకరాలకు పైగా భూములను ౖఅతి తక్కువ పరిహారంతో రెల్వే శాఖకు అప్పగించారు. భూనిర్వాసితులకు ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్యం ఉంటుందని భూసేకరణ సమయంలో అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత ఎక్కడా కూడా ఆ ఊసే లేకపోవడంతో తెలంగాణ రైల్వే జేఏసీ సహకారంతో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో భూనిర్వాసితులు, జిల్లా నిరుద్యోగులు, రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు ఏకమవుతున్నారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించాలనే డిమాండ్తో రౌండ్టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. వరంగల్వాసుల చిరకాల వాంఛను హైదరాబాద్ నుంచి ఢిల్లీస్థాయిలో వినిపించడానికి సమాయత్తమవుతున్నారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు, సంబంధిత మంత్రులను కలిసి వినతిపత్రాలు అందించాలని తీర్మానించారు. ఉద్యోగాలు ఇవ్వాలి.. తాత, ముత్తాతల కాలం నుంచి దున్నుకుని బతుకుతున్న భూములను ఈ ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తాగ్యం చేశాం. భూములు కోల్పోయిన కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలి. లేనిపక్షంలో పోరాటాలను ఉదృతం చేయాల్సి ఉంటుంది. – గాదె యాదగిరి, బాధితుడు, అయోధ్యపురం ప్రత్యేక జీఓ తీసుకురావాలి.. గతంలో ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పంజాబ్ రాష్ట్రంలోని కపూర్తాలలో ఏర్పాటు చేశారు. ఆ సమయంలో భూనిర్వాసితులకు 38 శాతం, జిల్లాస్థాయిలో నిరుద్యోగ యువతకు 44 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఇక్కడ అదేస్థాయిలో ప్రత్యేక జీఓతో ఉద్యోగాలు ఇవ్వాలి. – దేవులపల్లి రాఘవేందర్, తెలంగాణ రైల్వే జేఏసీ కన్వీనర్ ఉద్యోగాలు ఇవ్వకుంటే పోరాటాలకు విలువ లేనట్టే.. పోరాటాల ఫలితంగా ఏర్పడిన రైల్వే మ్యాన్ఫాక్చరింగ్ యూనిట్లో స్థానిక యువత, భూనిర్వాసితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. లేనిపక్షంలో ఎన్నో ఏళ్లు చేసిన పోరాటాలకు విలువ లేనట్లే. కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం గతంలో అనుసరించిన విధానం ద్వారా ప్రత్యేక జీఓ జారీ చేసి ఉద్యోగాలు ఇవ్వాలి. – కోండ్ర నర్సింగరావు, తెలంగాణ రైల్వే జేఏసీ చైర్మన్ రైల్వే మ్యాన్ఫ్యాక్చరింగ్ యూనిట్లో స్థానికులు, భూనిర్వాసితులకు ఉద్యోగవకాశాలు కల్పించాలి రాజకీయ, ప్రజాసంఘాల నాయకుల డిమాండ్ రైల్వే జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో పోరుబాటు -
ఆగుతూ.. సాగుతూ!
వరంగల్: ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు వరంగల్ మహానగరపాలక సంస్థ పరిధిలో వివిధ పథకాల కింద చేపట్టిన అభివృద్ధి పనులు ఆగుతూ.. సాగుతున్నాయి. నిధులు విడుదలై టెండర్లు నిర్వహించినా పనులు గ్రౌండింగ్ చేయడంలో తీవ్ర జాప్యమవుతోంది. అధికారులు పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్ నాణ్యతగా పనులు చేపట్టడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. సుమారు రూ.46 కోట్లతో వరంగల్ వెంకట్రామ జంక్షన్ నుంచి పోచమ్మమైదాన్ మీదుగా ఎంజీఎం జంక్షన్ వరకు ఐదేళ్ల క్రితం చేపట్టిన స్మార్ట్ రోడ్డు పనులు పాలకవర్గం గడువు పూర్తికావొస్తున్నా పూర్తి కాలేదు. ఈరహదారికి ఇరువైపులా ఫుట్పాత్లు నిర్మించేందుకు భవనాల ఎదుట అధికారులు ఆక్రమణలు తొలగించారు. నేటికి ఫుట్పాత్లు పూర్తి చేయకపోవడంతో పలు షాపుల యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. నాలుగేళ్ల క్రితం డీమార్ట్ ఎదుట ప్రారంభించిన పనులు పూర్తికాలేదు. స్మార్ట్రోడ్డులో భాగంగా రహదారిపై బీటీ లేయర్లు అసంపూర్తిగా వేశారు. అవి స్పీడ్బ్రేకర్లుగా మారడంతో దిచక్రవాహనదారులకు పాట్లు తప్పడం లేదు. ఇబ్బందులకు గురవుతున్నారు. అధికార పార్టీ నాయకుల అండతో భవనాల యజమానులు అడ్డుకోవడంతో రహదారి విస్తరణ పనులు జాప్యమవుతున్నాయి. స్మార్ట్ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులకు గ్రేటర్ వరంగల్ మేయర్, కమిషనర్ ఆదేశాలు జారీ చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తిచేయించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజాప్రతినిధులే అడ్డు.. ● కాంట్రాక్టర్లు, ఇంజనీర్లకు సహకరించాల్సిన ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులకు అడ్డుగా మారుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గోపాలస్వామిగుడి జంక్షన్ సమీపంలోని రోడ్డు విస్తరణకు అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి అడ్డుపడడం, భవన యజమాని కోర్టుకు వెళ్లడంతో అక్కడ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఈ రహదారికి ఇరువైపులా అండర్గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం కోసం వేసిన పైపులతో జలమయంగా మారుతోంది. ● పోలీస్ కమిషనరేట్ జంక్షన్ నుంచి ములుగు రోడ్డు వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులకు సైతం పశ్చిమ నియోజకవర్గానికి చెందిన అప్పటి ప్రజాప్రతినిఽధి అడ్డుపడినట్లు తెలుస్తోంది. దీంతో రోడ్డు పనులు అసంపూర్తిగా మారాయి. డ్రెయినేజీతోపాటు వెడల్పు జరిగితే ఈ రోడ్డుపై వాహనాలు వెళ్లేందుకు సులువుగా ఉండేది. ప్రస్తుత అధికార పార్టీకి చెందిన నాయకుడు సైతం రోడ్డు వెడల్పునకు జంకుతున్నట్లు సమాచారం. ● కాజీపేట డీజిల్ కాలనీ నుంచి వరంగల్ ములుగురోడ్డు వరకు చేపట్టిన స్మార్ట్సిటీ రోడ్డు పనులు పూర్తి కాలేదు. పోలీస్ హెడ్క్వార్టర్స్ నుంచి ములుగురోడ్డు వరకు రహదారి వెంట ఉన్న వ్యాపారులే ఇందుకు కారణమని, ప్రజాప్రతినిధులు సహరించకపోవడంతో పనులు పెండింగ్ పడినట్లు సమాచారం. ● వెంకట్రామ జంక్షన్ నుంచి ములుగురోడ్డు జంక్షన్ వరకు చేపట్టిన స్మార్ట్ రోడ్డు పనులు నత్తనడకన సాగుతున్నాయి. అదేవిధంగా కాశిబుగ్గ, పోచమ్మమైదాన్, వరంగల్ చౌరస్తాలో చేపట్టిన జంక్షన్ అభివృద్ధి పనులపై అధికారులు దృష్టి సారించడం లేదు. ● పోచమ్మమైదాన్ నుంచి రైల్వేస్టేషన్ వరకు నిర్మించిన సీసీ రోడ్డులో నాణ్యత లేకపోవడంతో అక్కడక్కడ పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ స్మార్ట్రోడ్డులో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ, అప్పటి తూర్పు ప్రజాప్రతినిధి వ్యాపారుల కోసం డివైడర్ స్థానంలో సిమెంట్ కాంక్రీట్ పోయించడంతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయలేదు. అభివృద్ధి పనుల్లో కానరాని నాణ్యతాప్రమాణాలు నిధులు విడుదలైనా గ్రౌండింగ్లో జాప్యం పట్టించుకోని గ్రేటర్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు -
మేడారం, వేములవాడకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
హన్మకొండ: జాతర, పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించనున్నట్లు ఆర్టీసీ వరంగల్–1 డిపో మేనేజర్ పుప్పాల అర్పిత తెలిపారు. మేడారం జాతర, వేములవాడకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ బస్సుల్లో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. కనీసం 30 మంది ప్రయాణికులు ఉండాలన్నారు. 2026 జనవరి నుంచి ఈ ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు డీఎం పేర్కొన్నారు. ప్రయాణికులు, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. కేయూ క్యాంపస్: చైన్నెలోని వెల్స్ యూనివర్సిటీలోఈనెల 27, 28, 29 తేదీల్లో నిర్వహించనున్న 108వ ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ సదస్సుకు యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఎకనామిక్స్ విభాగం ఇన్చార్జ్ డాక్టర్ శ్రీధర్కుమార్లోథ్ హాజరుకానున్నారు. సదస్సులో ‘రోల్ ఆఫ్ ట్రైబల్ ఉమెన్ ఇన్ అగ్రికల్చ ర్ యాక్టివిటీస్ ఆన్ ఎంపిరికల్ ఇన్వెస్టిగేషన్’ అంశంపై శ్రీధర్కుమార్లోథ్ పరిశోధన పత్రాన్ని సమర్పించనున్నారు. కేయూ క్యాంపస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతిలో ఉన్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఈనెల 28 నుంచి 30 వరకు 50వ అఖిల భారత సోషియాలజీ సదస్సు నిర్వహించనున్నారు. కాకతీయ యూనివర్సిటీ సోషియాలజీ విభాగం ప్రొఫెసర్ కుంట అయిలయ్య సదస్సుకు హాజరుకానున్నారు. ‘మొబిలిటీస్ అండ్ ఇన్ క్వాలిటీస్ షిఫ్టింగ్ కాంటెక్ట్స్ చేంజింగ్ పారాడిగ్మ్స్’ అంశంపై నిర్వహించనున్న ఒక సెషన్కు ఆయన చైర్మన్గా వ్యవహరిస్తారు. అలాగే ‘ఎ స్టడీ ఆన్ది రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ టీచర్స్ ఇన్ రిలేషన్ ఇన్ సోషల్ చేంజ్ అంశంపై పరిశోధన పత్రాన్ని సమర్పించనున్నారు. ఖిలా వరంగల్: చారిత్రక ప్రసిద్ధి చెందిన కాకతీయుల రాజధాని ఖిలావరంగల్ కోటను శుక్రవారం స్విట్జర్లాండ్ దేశస్తులు సందర్శించారు. ఈసందర్భంగా వారు కాకతీయుల కీర్తితోరణాల నడుమ ఉన్న అద్భుత శిల్ప సంపదను వీక్షించారు. ఆతర్వాత ఖుష్మహల్, రాతి, మట్టికోట అందాలు, ఏకశిలగుట్ట, శృంగారపు బావిని తిలకించారు. కాకతీయుల చరిత్ర, విశిష్టతను పర్యాటక శాఖ గైడ్ రవియాదవ్ వివరించారు. కోటను సందర్శించడం తాము అదృష్టంగా భావిస్తున్నామని విదేశీయులు పేర్కొన్నారు. వారి వెంట కేంద్ర పురావస్తుశాఖ కోఆర్డినేటర్ శ్రీకాంత్, సౌండ్ అండ్ లైటింగ్ షో ఇన్చార్జ్ గట్టికొప్పుల అజయ్ ఉన్నారు. -
ధరణి నవల ఆవిష్కరణ
హన్మకొండ కల్చరల్: చెలిమి సాహిత్య సాంస్కృతిక వేదిక వరంగల్ శాఖ, కాలేజీ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెట్టు రవీందర్ రాసిన ‘ధరణి’ నవల పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. హనుమకొండ నక్కలగుట్టలోని కాలేజీ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ భవనంలో చెలిమి వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్టు రవీందర్ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యఅతిథిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్, విశిష్ట అతిథులుగా ప్రముఖ కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి, రిటైర్డ్ తహసీల్దార్, మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుప్పాల బాలరాజు, ఆర్సీటీఏటీ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ విద్యాసాగర్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు పులి సారంగపాణి హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్తో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రచయిత ఈ నవలలో కళ్లకు కట్టినట్లుగా రాశారని ప్రశంసించారు. సాహితీవేత్తలు నాగిళ్ల రామశాస్త్రి, వీఆర్ విద్యార్థి, రామిరెడ్డి పాల్గొన్నారు. -
స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి
కాజీపేట: స్థానిక యువతకు రైల్వే మ్యాన్ఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం వారు కాజీపేట చౌరస్తాలో భూనిర్వాసితులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి ఓరుగంటి సాంబయ్య మాట్లాడుతూ స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల్లో ప్రాధాన్యం ఇవ్వకుంటే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నాయకులు మల్లేశం, వీరన్న, భిక్షపతి, ప్రదీప్ పాల్గొన్నారు. నేడు కాజీపేటలో రౌండ్టేబుల్ సమావేశం కాజీపేట రైల్వే కమ్యూనిటీహాల్లో శనివారం ఉదయం 10 గంటలకు రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. పట్టణంలోని ఆరు డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు, ఆయా పార్టీల డివిజన్ల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, ప్రజాసంఘాల నాయకులు హాజరవుతున్నారు. ఉద్యోగాల కల్పనపై సమావేశంలో చర్చించనున్నట్లు జేఏసీ చైర్మన్ కోండ్ర నర్సింగరావు తెలిపారు. -
యువత చూపు.. ఎర్రజెండా వైపు
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు ఖిలా వరంగల్: పెట్టుబడి దారి వ్యవస్థకు కాలం చెల్లిందని, కమ్యూనిజమే ప్రత్యామ్నాయంగా ఎర్రజెండా వైపు ప్రపంచ యువత చూస్తోందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ శత వార్షికోత్సవాల ముగింపులో భాగంగా శుక్రవారం వరంగల్ నగరంలో సీపీఐ జిల్లా కార్యదర్శి షేక్ భాష్మియా ఆధ్వర్యంలో వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి చౌరస్తా వరకు ఎర్రజెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో సీపీఐ అనేక త్యాగాలు చేసిందని, ఎంతో మంది అమరవీరులను అందించిన చరిత్ర సీపీఐ దేనని చెప్పారు. అంతకుముందు బాష్మియాతో కలిసి జెండా ఆవిష్కరించి, కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్, మేకల రవి, దండు లక్ష్మణ్, పనాస ప్రసాద్, గన్నారపు రమేష్, బద్రి, రమేష్, చంద్రకళ, రవీందర్, చెన్నకేశవులు పాల్గొన్నారు. హనుమకొండలో..న్యూశాయంపేట: సీపీఐ వంద సంవత్సరాల ఆవిర్భావ వేడుకలు హనుమకొండ బాలసముద్రంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య, నాయకులు కర్రె భిక్షపతి, ఆదరి శ్రీనివాస్, తోట భిక్షపతి, ఎల్లేష్, రాములు, లక్ష్మణ్, రాజమౌళి పాల్గొన్నారు. -
శనివారం శ్రీ 27 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
వరుస సెలవులు రావడంతో నగరంలోని ప్రముఖ చారిత్రక దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. గురు, శుక్రవారాలు వేలాది మంది భక్తులు శ్రీభద్రకాళి, వేయిస్తంభాల దేవాలయాలను సందర్శించారు. అమ్మవారు, స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా ములుగు జిల్లా ఎస్ఎస్తాడ్వాయి మండలంలోని మేడారానికి వేలాదిమంది భ క్తులు తరలివెళ్లారు. జంపన్నవాగులోని బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ కింద స్నానాలు చేసి సమ్మక్క–సారలమ్మను దర్శించుకున్నారు. – హన్మకొండ కల్చరల్/ఎస్ఎస్తాడ్వాయి -
వారసత్వ సంపదను కాపాడుకోవాలి
హైకోర్టు అడ్వకేట్ జనరల్ సుదర్శన్రెడ్డి హన్మకొండ కల్చరల్: కాకతీయుల శిల్పకళ, వారసత్వ సంపదను కాపాడుకోవాలని హైకోర్టు అడ్వకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం చారిత్రక శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయాన్ని సుదర్శన్రెడ్డి కుటుంబ సమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, ఈఓ అనిల్కుమార్ వారిని ఆలయమర్యాదలతో స్వాగతించారు. సుదర్శన్రెడ్డి దంపతులు శ్రీరుద్రేశ్వరస్వామి వారికి లఘున్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. సూర్య, విష్ణు దేవాలయాల చరిత్ర, నాట్యమండపం, స్తంభాల్లో వెంటుక్ర పట్టేంత రంధ్రాలు, తలకిందుల చాప, మనిషి, అష్ట దిక్పాలకులు, కల్యామండపం విశిష్టతను వారికి వివరించారు. కార్యక్రమంలో అర్చకులు గంగు మణికంఠశర్మ, సందీప్శర్మ, సిబ్బంది మధుకర్, రజిత, రామకృష్ణ పాల్గొన్నారు. -
రిపబ్లిక్డే పరేడ్కు ఎన్సీసీ కేడెట్ల ఎంపిక
విద్యారణ్యపురి: న్యూఢిల్లీలో జనవరి 26న జరగనున్న ఆర్డీ (రిపబ్లిక్ డే) పరేడ్కు హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలకు చెందిన ముగ్గురు ఎన్సీసీ కేడెట్స్ ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ బి.చంద్రమౌళి తెలిపారు. జి.వెంకటలక్ష్మి (బీఎస్సీ ఎంపీసీసీఎస్ ఫైనల్ ఇయర్), బి.త్రిష (బీఎస్సీ బీజెడ్సీ ఫైనల్ ఇయర్), ఎ.భార్గవి (బీఎస్సీ ఎంపీసీఎస్ ద్వితీయ సంవత్సరం) ఉన్నారు. రిపబ్లిక్డే పరేడ్కు ఎంపికై న వీరు శుక్రవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. విద్యార్థినులను ప్రిన్సిపాల్ చంద్రమౌళి, ఎన్సీసీ ఆఫీసర్ సువర్ణ, వైస్ ప్రిన్సిపాల్ జి.సుహాసిని, అధ్యాపకులు అభినందించారు. క్రమశిక్షణ, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు పెంపొందించే ఎన్సీసీ విద్యార్థినుల్లో స్ఫూర్తి నింపుతుందని పేర్కొన్నారు. -
సర్కిల్.. క్రిటికల్!
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్లోని పలు డివిజన్ల ప్రజలు సేవల కోసం వ్యయప్రయాసలకు గురవుతున్నారు. పరిపాలన వికేంద్రీకరణకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నా అమలు కావడం లేదు. అందుబాటులో లేని సర్కిల్ కార్యాలయాలతో ఇక్కట్లకు గురవుతున్నారు. సుపరిపాలన కోసం గత ప్రభుత్వం 2017 అక్టోబర్ 13న 267 జీఓ విడుదల చేసింది. కాశిబుగ్గ, కాజీపేట రెండుగా ఉన్న సర్కిల్ కార్యాలయాలను విభజించాలని రాష్ట్ర పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీచేశారు. 8 ఏళ్లు గడిచినా అడుగు ముందుకుపడకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులు, సిబ్బంది కొరతే కారణం.. గ్రేటర్లో ప్రస్తుతం ఉన్న 2 సర్కిళ్లతోపాటు మరో 4 సర్కిళ్ల ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యేందుకు పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించారు. కానీ, బల్దియా పాలకవర్గం, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవడం లేదు. సరిపడా సిబ్బంది లేకపోవడంతో సర్కిళ్లను ఏర్పాటు చేయలేకపోతున్నామని పేర్కొంటున్నారు. దూరభారం భరించలేకపోతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బల్దియాకు అధికారులు, సిబ్బంది కొరత ఉన్న దృష్ట్యా ప్రస్తుతం ఉన్న 2 సర్కిళ్లతోపాటు మరో 2 సర్కిల్ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని సామాజికవేత్తలు పేర్కొంటున్నారు. ముఖ్యంగా అండర్ రైల్వేగేట్ ప్రాంతంలోని రంగశాయిపేటలో లేదా ఉర్సు సీఆర్సీ సెంటర్, హనుమకొండ నయీంనగర్లో లేదా నక్కలగుట్టలో సర్కిల్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తే సేవలు మరింత అందుబాటులో ఉంటాయనే డిమాండ్ ఉంది. డివిజన్ల పునర్విభజనతోపాటు అదనపు సర్కిల్ కార్యాలయాల ఏర్పాటు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.దూరభారం.. సకాలంలో సేవలందక నగరవాసుల ఇక్కట్లు 8 ఏళ్లుగా కాగితాలకే సర్కిల్ కార్యాలయాలు వ్యయప్రయాసలకు గురవుతున్న డివిజన్ల ప్రజలు పట్టించుకోని గ్రేటర్ పాలకవర్గం, ఉన్నతాధికారులు జనన, మరణ, నూతన భవన నిర్మాణ ధ్రు వీకరణ పత్రాలు, కొత్త ఇంటి నంబర్లు, ఆ స్తుల విభజన, పేరు మార్పిడి, నల్లా కనెక్ష న్లు, ట్రేడ్ లైసెన్స్, మార్టిగేజ్ రిలీజ్, ఇతర అ భివృద్ధి పనులు, స్థానిక సమస్యలు పరి ష్కారం కావాలంటే బల్దియా సర్కిల్ కార్యాలయాలను ప్రజలు ఆశ్రయించాల్సిందే. కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్కిల్ కార్యాలయాలకు రాకపోకలు సాగించేందుకు ఇబ్బంది పడుతున్నారు. 2013 మార్చి 19న 42 విలీన గ్రామాలను కార్పొరేషన్లో విలీనం చేస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 110 కిలోమీటర్లు ఉన్న నగరం 407.8 కిలోమీటర్లకు చేరింది. జనాభా 9 లక్షలకు చేరడంతో 53 డివిజన్లు 58కి చేరాయి. 2014లో కాశిబుగ్గ, కాజీపేట సర్కిల్ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. 2020–21 సంవత్సరంలో 58 డివిజన్లను డీలిమిటేషన్లో 66కు పెంచారు. ప్రస్తుతం నగర జనాభా 13 లక్షలకు చేరింది. అంతేకాకుండా ఇప్పుడు ఉన్న 66 డివి జన్లను 88 డివిజన్లుగా డీలిమిటేషన్ చేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. -
గ్రేటర్ వరంగల్
(హనుమకొండ – వరంగల్)శుక్రవారం శ్రీ 26 శ్రీ డిసెంబర్ శ్రీ 20257నగరంలో అంబరాన్నంటిన వేడుకలు ● చర్చిల్లో క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనలు నగరంలో క్రిస్మస్ వేడుకలు గురువారం అంబరాన్నంటాయి. వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లోని చర్చిలకు ఉదయమే క్రైస్తవులు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. సెల్ఫీలు దిగి సందడి చేశారు. మతపెద్దలు క్రీస్తు జననం గురించి తెలిపి, క్రీస్తు సందేశం ఇచ్చారు. వరంగల్ క్రిస్టియన్ కాలనీలోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో మంత్రి కొండా సురేఖ, మేయర్ గుండు సుధారాణి, హనుమకొండలోని సీబీసీలో జరిగిన వేడుకల్లో రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య పాల్గొన్నారు. క్రిస్మస్ సందర్భంగా నిర్వాహకులు చర్చిలను అందంగా అలంకరించారు. – సాక్షి, స్టాఫ్ఫొటోగ్రాఫర్లు, హన్మకొండ, వరంగల్ప్రార్థనల అనంతరం హనుమకొండ సీబీసీ నుంచి బయటికి వస్తున్న క్రైస్తవులు (ఇన్సెట్లో) ప్రసంగిస్తున్న ఫాదర్ నిరంజన్బాబువరంగల్ జాన్పాకలోని మన్న చర్చిలో ప్రార్థనలు చేస్తున్న క్రైస్తవులు, వరంగల్ క్రిస్టియన్ కాలనీలోని సీబీసీలో మాట్లాడుతున్న మంత్రి కొండా సురేఖ, హనుమకొండ సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో ప్రార్థనలు చేస్తున్న క్రైస్తవులు -
ధాన్యం సేకరణ 62.36 శాతమే!
సాక్షిప్రతినిధి, వరంగల్ : వానాకాలం సేద్యం రైతులకు అచ్చి రాలేదు. పరిస్థితులు అనుకూలించి అధిక దిగుబడి వస్తుందని భావించిన రైతులకు నిరాశే మిగిలింది. పంట వేసింది మొదలు చేతికందే వరకు వరుస వర్షాలు కురవడం, పైరుకు తెగుళ్లు సోకడంతో ఈ సీజన్లో ఉత్పత్తి తగ్గిపోయింది. ఎకరాకు 25 క్వింటాళ్లకుపైగా దిగుబడి వస్తుందని ఆశించినా.. 12 నుంచి 18 క్వింటాళ్ల మధ్యే రావడం తీవ్ర నిరాశపరుస్తున్నది. ఫలితంగా కొనుగోలు కేంద్రాలకు అంచనాల మేరకు ధాన్యం రాలేదు. కేంద్రాలు మూసివేసే దశకు చేరినా.. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ఽఈ నెల 24వ తేదీ నాటికి ధాన్యం సేకరణ 62.36 శాతానికే చేరింది. 10.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం కాగా.. ఇప్పటికీ 6.48 లక్షల మెట్రిక్టన్నులే సేకరించారు. ధాన్యం సేకరణ అంచనాలు తారుమారు.. వానాకాలంలో సీజన్లో ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా 15.83 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో 8,78,376 ఎకరాల్లో వరి వేస్తారని భావించగా, ఎనిమిది లక్షల ఎకరాల వరకు సాగైనట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు 10,39,815 మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు 1,360 ఐకేపీ, పీఏసీఎస్, సివిల్ సప్లయీస్ కేంద్రాలను పౌరసరఫరాలశాఖ ప్రతిపాదించింది. కొనుగోలు సీజన్ ప్రారంభం కాగానే ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల్లో 1,360 కేంద్రాలను తెరిచారు. కొనుగోళ్లు మందకొడిగా మొదలైనా ఆ తర్వాత పుంజుకుంటాయని భావించారు. కానీ, ఈ నెల 24వ తేదీ నాటికి ఉమ్మడి జిల్లాలో 1,43,357 మంది రైతుల నుంచి రూ.1548.19 కోట్ల విలువైన ధాన్యం సేకరించినట్లు అధికారులు ప్రకటించారు. ఽమొత్తంగా ధాన్యం సేకరణ లక్ష్యం 62.36 శాతమే అయ్యింది. అత్యధికంగా జనగామ జిల్లాలో 85.59 శాతం సేకరణ జరగ్గా, అత్యల్పంగా జేఎస్ భూపాలపల్లి జిల్లాలో 40.42 శాతంగా ఉంది. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల సరసన నిలిచే ఉమ్మడి వరంగల్లో ఈసారి ధాన్యం దిగుబడి, సేకరణ గణనీయంగా పడిపోవడం చర్చనీయాంశంగా మారింది. అకాలవర్షాలు, తెగుళ్ల ప్రభావం.. వానాకాలం ధాన్యం దిగుబడి తగ్గడానికి ప్రధాన కారణాలు అకాల వర్షాలు, అతి భారీ వర్షాలు, వరదలు, పంటలకు సోకిన తెగుళ్లు (కాటుక), యూరియా కొరతగా రైతులు చెబుతున్నారు. వీటి వల్ల వరి పంట నీట మునగడం, మొలకెత్తడం, గింజ రాలిపోవడం వంటి సమస్యలతో దిగుబడి గణనీయంగా తగ్గిందని, రైతులు నష్టపోయారని అధికారులు సైతం అంటున్నారు. ఇదే సమయంలో పైరుకు ‘కాటుక’ వంటి తెగుళ్లు సోకడం వల్ల మొత్తంగా ఉత్పత్తి 40 శాతం వరకు తగ్గిందని, ఇందుకు కొన్ని ప్రాంతాల్లో నుంచి వచ్చిన నివేదికలే ఉదాహరణగా చెబుతున్నారు. ఉమ్మడి జిల్లా రైతులకు అచ్చిరాని వానాకాలం సాగు 10.40 లక్షల టన్నుల సేకరణ లక్ష్యం.. 1,360 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఇప్పటివరకు వచ్చింది 6.48 లక్షల మెట్రిక్ టన్నులే రైతులను ముంచిన అకాలవర్షం.. మొదలైన యాసంగి సీజన్ -
మల్లన్న ఆలయంలో జాతర ఏర్పాట్ల పరిశీలన
ఐనవోలు: ప్రముఖ శైవక్షేత్రమైన ఐనవోలు శ్రీమల్లికార్జునస్వామి ఆలయంలో సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరిగే జాతర ఏర్పాట్లను గురువారం ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్గౌడ్, వివిధ శాఖల అధికారులు పరిశీలించారు. పార్కింగ్ స్థలాలు, క్యూలైన్లు, స్నానఘట్టాలు, తాగునీరు, లైటింగ్, సీసీ కెమెరాలు, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం చైర్మన్ కార్యాలయంలో సమావేశమై జాతరలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని శాఖల అధికారులు సహకరించాలని చైర్మన్ కమ్మగోని ప్రభాకర్గౌడ్, ఆలయ ఈఓ కందుల సుధాకర్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నర్మద, మామునూరు ఏసీపీ వెంకటేశ్, ఆర్డబ్ల్యూఎస్ ఇంట్రా ఏఈ రవి కుమార్, విద్యుత్ శాఖ ఏఈ సురేశ్కుమార్, పర్వతగిరి సీఐ రాజగోపాల్, ఎస్హెచ్ఓ పస్తం శ్రీనివాస్, ధర్మకర్తలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
రేవంత్రెడ్డి అధికారం మూడేళ్లే
హన్మకొండ: సీఎం రేవంత్రెడ్డి భాషను ప్రజలు ఈసడించుకుంటున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం కేసీఆర్ను ఆధికారంలోకి రానివ్వనని మాట్లాడుతున్న రేవంత్రెడ్డి అధి కారంలో ఉండేది మూడేళ్లేనని హితవు పలి కారు. ఆయన బజారు బాష మాట్లాడుతున్నారని తూర్పారబట్టారు. రేవంత్రెడ్డి పరాన్నజీవి అయితే, కేసీఆర్ స్వయం ప్రకాశమైన నాయకుడన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామనే అజెండా ద్వేషమే తప్ప అభివృద్ధి కాదని రుజువైందని దుయ్యబట్టారు. యూరి యా కోసం రైతుల పడిగాపులు కాస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్యూచర్ సిటీ, హిల్ట్ పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేయడం తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలపై ధ్యాసే లేదని ధ్వజమెత్తారు. తెలంగాణకు నంబర్ వన్ ద్రోహి..రాష్ట్రంలో జరుగుతున్న అనేక అరాచకాలను ప్రశ్ని స్తున్న హరీశ్రావు, కేటీఆర్పై కూడా దిగజారుడు భాషే మాట్లాడుతున్నాడన్నారు. తెలంగాణకు నంబర్వన్ ద్రోహి రేవంత్రెడ్డి అని అన్నారు. జెడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు, నాయకులు చింతం సదానందం, చెన్నం మధు, జోరిక రమేష్, పులి రజినీకాంత్, శోభన్, నయీముద్దీన్, రామ్మూర్తి, బుద్దె వెంకన్న, వినీల్రావు, మూటిక రాజుయాదవ్, గండ్రకోట రాకేశ్యాదవ్, చాగంటి రమేశ్, సంపతి రఘు, దేవమ్మ, జేకే, మునుకుంట్ల వెంకటేశ్ పాల్గొన్నారు. ఆయన భాషను ఈసడించుకుంటున్న ప్రజలు శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి -
జెట్స్పీడ్లో ‘మామునూరు’
తుది అంకంలో 223 ఎకరాల భూసేకరణసాక్షి, వరంగల్: మామునూరు ఎయిర్పోర్ట్ భూ సేకరణ పనులు జెట్స్పీడ్లో కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) వద్ద 696.14 ఎకరాలు ఉండగా.. విమానాశ్రయ పునరుద్ధరణకు అవసరమైన నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లిలోని మరో 253 ఎకరాల భూసేకరణ చివరిదశకు చేరుకుంది. ఈ 253 ఎకరాల్లో 30 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండగా, 223 ఎకరాలు ప్రైవేట్ వ్యక్తుల పట్టా భూములున్నాయి. ఇందులో ఇప్పటివరకు 180 ఎకరాల వ్యవసాయ భూమి, 13 ఎకరాల వ్యవసాయేతర భూమికి సంబంధించిన వారి ఖాతాల్లో రూ.220 కోట్లు జమచేశారు. మరో రూ.40 కోట్లు చెల్లింపునకు సిద్ధంగా ఉంచారు. కోర్టు వివాదాల్లో ఉన్న భూమి 15 ఎకరాలు ఉండగా ఈ మేరకు ఆ డబ్బులను జిల్లా కోర్టులో డిపాజిట్ చేశారు. అలాగే సాదాబైనామాకు సంబంధించి ఐదు ఎకరాలు ఉండడంతో ఆ భూమి ఎక్కడినుంచి వచ్చింది, ఎవరి నుంచి కొనుగోలు చేశారు, రెవెన్యూ రికార్డుల్లో ఎలా ఉందనే వివరాలను పరిశీలిస్తూనే క్షేత్రస్థాయిలోకి వెళ్లి సర్వే చేసి క్లియర్ చేస్తున్నారు. మరో 10 ఎకరాల భూమి ఉన్న రైతుల నుంచి పట్టా పాస్బుక్లు, అలాగే 12 మంది ఇళ్లు ఉన్నవారి వివరాలు సేకరించి.. క్షేత్రస్థాయిలో పరిశీలించి క్లియర్ చేస్తున్నారు. ఇలా ఇప్పటివరకు 330 మంది భూనిర్వాసితులు ఉంటే 260 మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. మరో 40 మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు బిల్లులు రెడీ అయ్యాయని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అవార్డు పాసైన రోజుల వ్యవధిలోనే ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు దశలవారీగా భూమిని రిజిస్ట్రేషన్ చేసి బదిలీ చేసే ప్రక్రియ మొదలైంది. ఇలా ఇప్పటివరకు సేకరించిన 213 ఎకరాలను కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తోంది. అధికారుల సమన్వయంతో.. ఎయిర్పోర్టుకు సంబంధించి వివిధ విభాగాల అ ధికారులు సమన్వయంతో ముందుకు సాగుతున్నా రు. కొందరికి పట్టాపాస్ పుస్తకాలు లేకపోవడం, సర్వే నంబర్ల మిస్ మ్యాచ్, కొన్ని భూములపై మా ర్ట్గేజ్ లోన్లు, సాదాబైనామా భూముల ద్వారా కాస్త ఆలస్యమైనా.. భూసేకరణ ప్రక్రియ తుది దశకు చేరుకుందని రెవెన్యూ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇంకోవైపు భూమి సరిహద్దుల స్థిరీకరణకు ఇప్పటికే ఏఏఐ బిడ్లు పిలిచిన సంగతి తెలిసిందే. సాధ్యమైనంత తొందరగా ఏఏఐకు ఆయా కన్సల్టెన్సీ సంస్థలు ఇచ్చే మార్కింగ్ నివేదికతో ఆ తర్వాత నిర్మాణ పనులకు టెండర్లు పిలవనున్నారు. మరో రెండేళ్లలో మామునూరులో విమానాశ్రయ సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా అధికారులు ముందుకెళ్తున్నారు. ఇప్పటికే రూ.220 కోట్లు రైతుల ఖాతాల్లో జమ మరో రూ.40 కోట్లు చెల్లింపునకు సిద్ధం -
వినియోగదారుల చట్టంపై అవగాహన ఉండాలి
● వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణి రామన్నపేట: వినియోగదారుల చైతన్యంతో మోసాలకు అడ్డుకట్ట వేయవచ్చని వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ ఏవీవీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి, కాలేజ్ కన్జ్యూమర్ క్లబ్స్ కోఆర్డినేటర్ కోడిమాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బుధవారం వినియోగదారుల హక్కులు, పరిరక్షణపై చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని హైస్కూల్, కళాశాల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు అదనపు కలెక్టర్ సంధ్యారాణి బహుమతులు అందించారు. అనంతరం కోడిమాల శ్రీనివాసరావు రూపొందించిన వాల్ పోస్టర్ను అధికారులతో కలిసి ఆవిష్కరించారు. డీసీఎస్ఓ కృష్ణయ్య, క్యాట్కో రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ లాల్ చౌరాసియా, వరంగల్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్, ఇండస్ట్రియల్ మేనేజర్ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. వినియోగదారుల్లో చైతన్యం రావాలి న్యూశాయంపేట: వినియోగదారుల్లో చైతన్యం రావాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. కలెక్టనూటఖలెలో బుధవారం వినియోగదారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వినియోగదారులకు సత్వరం న్యాయం అందించేందుకు ప్రభుత్వం పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టిందన్నారు. ఈ సందర్భంగా వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి కిష్టయ్య, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా ధ్వజస్తంభాల పునఃప్రతిష్ఠ వేడుక
ఎస్ఎస్తాడ్వాయి : మేడారం అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై ధ్వజ స్తంభాల పునః ప్రతిష్ఠాపన వేడుక వైభవంగా జరిగింది. బుధవారం ఉదయం 7 నుంచి మొదలైన పూజ కార్యక్రమాలు మధ్యాహ్నం 2 గంటల వరకు సాగాయి. పగిడిద్దరాజు, గోవిందరాజు పూజారులు సమ్మక్క, సారలమ్మ పూజారులతో కలిసి గద్దెలపై ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించారు. పూజల అనంతరం అమ్మవార్లకు పూజారులు యాటలను నైవేద్యంగా సమర్పించారు. మార్మోగిన గద్దెల ప్రాంగణం.. ధ్వజ స్తంభాలను నూతన గద్దెలపైకి తీసుకొసున్న క్రమంలో ఆదివాసీల డోలు వాయిద్యాల చప్పులతో గద్దెల ప్రాంగణం మార్మోగింది. శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు పూజారులతోపాటు వారి కుటుంబీలు వందల సంఖ్యలో హాజరయ్యారు. భక్తుల దర్శనాలు నిలిపేయడంతో ప్రశాంత వాతావరణంలో పునః ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించారు. నూతన గద్దెలను దర్శించుకున్న మంత్రి సీతక్క గోవిందరాజు, పగిడిద్దరాజు నూతన గద్దెలను మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర్ టీఎస్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, మేడారం ఈఓ వీరస్వామి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, మేడారం సర్పంచ్ భారతి, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పూజారులు దర్శించుకున్నారు. పూనుగొండ్ల, కొండాయి నుంచి వచ్చిన పూజారుల కుటుంబీలు, బంధువులు గద్దెలను దర్శించుకుని పూజలు చేశారు. పూర్వీకుల సిద్ధాంతాన్ని ఆచరిస్తున్నాం.. ఆదివాసీ సంప్రదాయ పద్ధతిలో పగిడిద్దరాజు, గోవిందరాజుల ఽగద్దెలపై ధ్వజ స్తంభాల పునః ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా జరిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. బుధవారం గద్దెల పునఃప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను వరుస క్రమంలో పూజారుల అనుమతితోనే ప్రతిష్ఠాపన చేస్తున్నామని, పూర్వీకుల ఆదేశాలతో పాటు ప్రకృతి సిద్ధాంతాన్ని ఆచరిస్తున్నామని తెలిపారు. నేడు మొదటి ఘట్టం ప్రారంభమైందని, అన్ని కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తామని తెలిపారు. పూర్వకాలంలో గిరిజనులకు పసుపుతో ఎంతో అనుబంధం ఉందన్నారు. శాసీ్త్రయంగా పసుపుతో పలు వ్యాధులను నయం చేసుకునే అవకాశం ఉందని, దీనిని వినియోగంతో పూర్వంలో గిరిజనులు ఎలాంటి వ్యాధుల బారిన పడలేదన్నారు. సమ్మక్క తల్లి గోత్రం బండాన్నీ అని కోయ భాషలో బండారి అని కూడా పిలుస్తారని మంత్రి తెలిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొనసాగిన పూజలు తరలొచ్చిన పూజారుల కుటుంబీకులు, ఆడపడుచులు -
బకాయిలు చెల్లించాలి
● రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ హన్మకొండ: రిటైర్డ్ ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ల ధర్మేంద్ర, పెన్షనర్స్ జేఏసీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు జి.నర్సింహా రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిల సాధన కమిటీ, తెలంగాణ ప్రభుత్వ పెన్షన్దారుల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు వద్ద ఒక్కరోజు దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో వారు మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బకాయిలు 20 నెలలైనా చెల్లించకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 35 మంది బకాయిలు రాక బాధతో ఆరోగ్యం క్షీణించి చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. బీ జేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్రెడ్డి, మాజీ అధ్యక్షురాలు రా వు పద్మ, వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్, ఆయా ఉద్యోగ, ఉపాధ్యా య సంఘాల బాధ్యులు దీక్షకు సంఘీభా వం తెలిపారు. ఈదీక్షలో ఆయా సంఘాల బాధ్యులు ఈ.రాంమనోహర్, కడారి భోగేశ్వర్, టి.పురుషోత్తం, కె.సుధీర్బాబు, టి.వీరయ్య, దేవదాసు, సాంబయ్య, సమ్మారెడ్డి, మహబూబ్ అలీ, ఇంద్రసేనారెడ్డి, విశ్వనాథం, రవీందర్, రఘువీర్, రాజిరెడ్డి, సమ్మయ్య పాల్గొన్నారు. -
తిమ్మరాయినిపహాడ్లో జిల్లాలోనే అతిపెద్ద చర్చి ..
నర్సంపేట: వరంగల్ జిల్లాలో పెద్ద చర్చిగా పిలువబడుతున్న తిమ్మరాయినిపహాడ్లోని పునీత రాయప్ప దేవాలయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. 1924లో కమ్మ కులస్తులు ఈ గ్రామాన్ని స్థాపించారు. 1930లో ఫాదర్ పజలీనా కాజీపేట నుంచి వస్తూ స్వరూపాలు, పటాలు అందిస్తూ దైవ కార్యాలు నిర్వహించేవారు. చిన్న పూరి గుడిసెలో మొదట క్రిస్మస్ వేడుకలు నిర్వహించేవారు. 1956లో నూతన చర్చి పనులు ప్రారంభించి 1967లో పూర్తి చేశారు. యూఎస్ఏలో స్థిరపడిన నేను క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి స్వగ్రామం చేరుకున్నా. నాన్నతో ఈ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉంది. బెల్లంకొండ విజయరాజు, తిమ్మరాయినిపహాడ్ ప్రార్థనలకు ఏర్పాట్లు పూర్తి ప్రార్థనలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గ్రామంలో 90 శాతం మంది ప్రజలు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. క్రిస్మస్ సందర్భంగా చర్చిని విద్యుత్ దీపాలతో అలంకరించాం. రాత్రి నుంచి ప్రార్థనలు జరుగుతున్నాయి. -
86 ఏళ్లుగా ప్రభు సేవలో..
డోర్నకల్: డోర్నకల్లో ప్రసిద్ధిగాంచిన ఎఫిఫనీ చర్చి 86 ఏళ్లుగా ప్రభు సేవలో తరిస్తోంది. నాటి మద్రాస్ బిషప్ వైట్ హెడ్ ఆధ్వర్యంలో 1915 జనవరి 24న చర్చి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ నిర్మాణం 1939లో పూ ర్తికాగా డోర్నకల్ బిషప్ అజరయ్య నేతృత్వంలో అదే సంవత్సరం ఎఫిఫనీ పండుగ రోజున ప్రారంభించి ఎఫిఫనీ చర్చిగా నామకరణం చేశారు. ద్రవిడ, క్రైస్తవ, హిందూ, ముస్లిం మతాల ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ చర్చిని నిర్మించారు. చర్చి ముఖ శిఖ రాలు మసీదు గుమ్మటాలను పోలి ఉండగా వాటిపై రెండు పద్మాలు, రెండు శిలువలు ఉంటాయి. ఆలయం లోపల ఏసుక్రీస్తు 12 మంది శిష్యుల పేరుతో 12 స్తంభాలను నిర్మించారు. స్తంభాలకు ఇరువైపులా ఉమ్మెత్త పుష్పాలు, అరటి మొగ్గలు నిర్మించారు. దీంతో అద్భుత శిల్ప సౌందర్యంతో నిర్మించిన ఈ చర్చిని సందర్శించేందుకు ప్రతీ సంవత్సరం దేశ, విదేశాల నుంచి అనేకమంది డోర్నకల్కు వస్తున్నారు. కాగా, ఎఫిఫనీతోపాటు డోర్నకల్ పరిధిలోని పలు చర్చిల్లో బుధవారం అర్ధరాత్రి నుంచి క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. -
‘అంపశయ్య నవీన్’ ఓరుగల్లుకు సాహిత్య సంపద
● కేయూ విశ్రాంతాచార్యుడు అయిలయ్య హన్మకొండ కల్చరల్ : అంపశయ్య నవీన్ ఓరుగల్లుకు సాహిత్య సంపదలాంటి వారని కేయూ విశ్రాంతాచార్యుడు బన్న అయిలయ్య అన్నారు. బుధవారం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ 85వ జన్మదిన వేడుక నిర్వహించారు. అదే విధంగా ప్రధమ నవల పురస్కార ప్రదానోత్సవం జరిగింది. ఈ మేరకు మిత్రమండలి, వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ, నేరేళ్ల వేణుమాధవ్ కల్చరల్ ట్రస్ట్ సౌజన్యంతో బుధవారం హనుమకొండ ఎకై ్సజ్ కాలనీలోని నవీన్ రెసిడెన్సీలో జరిగిన సమావేశానికి బన్న అయిలయ్య అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా బ్యాంక్ రిటైర్డ్ ఆఫీసర్ దర్భశయనం శ్రీనివాసాచార్య, బన్న అయిలయ్య పాల్గొని నవీన్ రచించిన భిన్న ధృవాలు, బుచ్చిబాబు జీవితం– సాహిత్యం పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం ‘అమ్మడైరీ’ నవలకు గాను రచయిత్రి వసంతశ్రీ, ‘పడిలేచిన కెరటం’ నవలకు గాను రచయిత జీవీ శ్రీనివాస్కు ఉత్తమ ప్రథమ, ద్వితీయ నవలాపురస్కారాలను అందజేశారు. సాహితీవేత్త అశోక్కుమార్, దొంగరి శశికిరణ్ నవీన్ నవలలను పరిచయం చేశారు. ప్రముఖ విమర్శకుడు గన్నమరాజు గిరిజామనోహర్బాబు, సాహితీవేత్తలు వకుళవాసు, వీఆర్ విద్యార్థి, నాగిళ్ల రామశాస్త్రి, నెల్లుట్ల రమాదేవి, ఘంటా రామారెడ్డి, పందిళ్ల అశోక్కుమార్, డి. రాజేశ్వరరావు, దొంగరి స్వప్న, దొంగరి శశికిరణ్, సతీశ్, పాల్గొన్నారు. -
విద్యుత్ వెలుగుల్లో ‘సీబీసీ’ జిగేల్ ..
ఖిలా వరంగల్: వరంగల్ క్రిస్టియన్ కాలనీలో 137 సంవత్సరాల చరిత్ర గల సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. చర్చి ఫాదర్లు రెవరెండ్ పుల్ల జగ్జీవన్ బాబ్జీ, ఎం. ఆత్యుష్, కార్తీక్ అబ్రహ్మ సంయూక్త ఆధ్వర్యంలో బుధవారం రాత్రి 9 గంటల నుంచి క్రైస్తవులు అర్ధరా త్రిని స్వాగతించారు. 12 గంటలకు కేక్ కేట్ చేసి పరస్పరం శు భాకాంక్షలు తెలుపుకున్నారు. కాగా, సీబీసీ విద్యుత్ దీపాల వె లుగులో జిగేల్మంటోంది. వేడుకలకు లక్ష మంది భక్తులు తరలొచ్చిన నేపథ్యంలో అందుకు తగ్గట్లు చర్చి నిర్వాహకులు ఏ ర్పాట్లు చేశారు. చర్చి ఎదుట ప్రత్యేక దుకాణాలు, రంగుల రా ట్నాలు ఏర్పాటు చేయడంతో జాతరను తలపిస్తోంది. కార్యక్రమంలో చర్చి కమిటీ ప్రెసిడెంట్ పోలెపాక మనోహర్, ఉపాధ్యక్షుడు పోలెపాక రత్న బాబు, కార్యదర్శి మేగల భరత్, కోశాధికారి బషికే విజయ్కుమార్, పోలేపాక కిరణ్ కుమార్, బైరపా క సామేల్ రాజ్, గుండేటి శ్యామ్, మడిపెల్లి ప్రాన్సిస్ జాశ్వా , లిమ్యూల్, తదితరులు పాల్గొన్నారు. -
చరిత్రకు సజీవ సాక్ష్యం.. ఉండ్రుపుర చర్చి
జనగామ: జనగామలోని ఉండ్రుపుర సెంటనరీ బాపిస్టు చర్చి చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలు స్తోంది. లోకరక్షకుడి సేవలో 125 ఏళ్లుగా సేవలందిస్తోంది. 1901లో స్థాపితమైన చర్చి.. అనేక సేవా కార్యక్రమాలతో జిల్లాలో తల్లి సంఘం చర్చిగా నామకరణం పొందింది. రష్యా చెందిన దంపతులు అన్న ఉన్రు(భార్య), హెర్ని ఉన్రు (భర్త) అనేక దేశాలు పర్యటిస్తూ జనగామకు చేరుకున్నారు. 1901 నుంచి వారి సేవలను కొనసాగిస్తూ ప్రెస్టన్ ఇన్స్టిట్యూట్ నుంచి చర్చి సేవలు, ప్రార్థనలు కొనసాగాయి. ఆ తర్వాత ఆర్టీసీ బస్టాండ్ ఎదుట(ప్రస్తుతం)కు మార్చారు. రష్యాకు చెందిన ఉన్రు దంపతులకు 8 మంది సంతా నం కలగగా చదువు ఇక్కడే పూర్తి చేశారు. తదనంతరం వారు రష్యా, అమెరికాకు వెళ్లి పోయారు. కాలక్రమేనా 1912లో భర్త హెర్ని ఉన్రు మృతి చెందగా, భార్య అన్న ఉన్రు 1921లో రష్యాలో మృతి చెందారు. ఉన్రు పెద్ద కూతురు తండ్రితోనే జనగామలో ఉంటూ సేవా కార్యక్రమాల్లో పాల్గొనే వారు. ఆమె కూడా చనిపోవడంతో ప్రెస్టన్లోని తండ్రి సమాధి పక్కనే ఖననం చేశారు. 2002లో నూతన చర్చి ప్రారంభం.. 2000లో నూతన భవన నిర్మాణం కోసం భూమి పూజ చేసి 2002లో చర్చిని ప్రారంభించారు. 2005లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీ దుగా ఉండ్రుపుర సెంటనరీ బాపిస్టు చర్చిలో విద్యుత్ వెలుగులు ప్రారంభించారు. ఇప్పటి వరకు అనేక మంది పాస్టర్లు కరుణామయుడి సన్నిధిలో సేవలందించారు. -
స.హ.. కహా?
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్లో సమాచార హక్కు చట్టం దరఖాస్తుల పరిష్కారం అథమ స్థాయిలో ఉంది. పౌరులు అడిగిన సమాచారాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని దశాబ్దాల క్రితం అమల్లోకి తెచ్చింది. నిబంధన ప్రకారం దరఖాస్తు చేసిన పౌరులకు నిర్దేఽశిత కాలంలో అడిగిన సమాచారాన్ని అందించాలి. కానీ, గ్రేటర్ వరంగల్లో సమాచార హక్కు చట్టం దరఖాస్తులు ఏళ్ల తరబడి మూలుగుతున్నాయి. సమాచారం కోసం దరఖాస్తుదారులు బల్దియా కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నిబంధనలు ఇవీ.. సమాచార హక్కు చట్టం ప్రకారం కోరిన సమాచారాన్ని 30 రోజుల్లో దరఖాస్తుదారుడికి అందించాలి. లేకపోతే సంబంధిత అధికారి అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. సమాచారం ఇవ్వడంలో జాప్యం వంద రోజులు దాటితే సంబంధిత అధికారి రూ.25 వేల వరకు అపరాధ రుసుం చెల్లించాలి. దరఖాస్తు ఏ విభాగానికి చెందినదో ఆ విభాగ అధికారి ఇందుకు బాధ్యత వహించాల్సి ఉండగా.. మహా నగర పాలక సంస్థలో కొన్ని దరఖాస్తులకు తూతూమంత్రంగా సమాచారం అందిస్తూ, మరి కొ న్నింటికి సమాచారం లేదని రాత పూర్వకంగా అందిస్తుండడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల అలసత్వం.. బల్దియాలో పౌరులు సమాచారం కావాలని దరఖాస్తు చేస్తే నెలలు గడిచినా అడిగిన సమాచారం అందడం లేదు. ప్రశ్నలు అడిగే తీరులో లోపాలు పట్టుకుని సమాచారాన్ని తిరస్కరిస్తున్నారు. సూటిగా, స్పష్టంగా ఇవ్వకుండా తెలుగులో దరఖాస్తు చేస్తే ఇంగ్లిష్లో సమాచారం ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. తెలుగు మాత్రమే తెలిసిన వారికి ఇంగ్లిష్ సమాచారం ఎలా అర్థమవుతుందనేది అధికారులకే తెలియాలి. అప్పిలేట్ అథారిటీకి ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. అప్పీళ్లపై సహేతుకంగా విచారణలు నిర్వహించి, చర్యలు తీసుకునే విధానం తగ్గిపోయింది. దీంతో దరఖాస్తుదారులు చేసేదేం లేక మళ్లీ దరఖాస్తులు పెడుతున్నా కోరిన సమాచారం రావడం లేదంటూ ఫిర్యాదుదారులు ఆందోళన చెందుతున్నారు. గ్రేటర్ పరిధి ప్రధాన కార్యాలయంలో, కాశిబుగ్గ, కాజీపేట ఏ సర్కిల్లో సమాచార హక్కు చట్టానికి దరఖాస్తు చేసినా నిర్లక్ష్యమే కనిపిస్తోంది. గ్రేటర్ పరిధిలో సమాచార హక్కు చట్టం ద్వారా 320 పైచిలుకు దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయంటే అధికారుల నిర్లక్ష్యం ఎలా ఉందో తెలుస్తోంది. సమాచార హక్కు చట్టం నిర్వీర్యం అమలులో ‘గ్రేటర్’ అధికారుల నిర్లిప్తత కాళ్లరిగేలా అర్జీదారుల ప్రదక్షిణలు సమావేశాలు, సమీక్షలు కరువు గ్రేటర్ వరంగల్లో అధ్వాన పరిస్థితి కొరవడిన జవాబుదారీతనం సమాచార హక్కు చట్టం అమలులో వరంగల్ నగర పాలక సంస్థ అధికారులు ఆది నుంచి అలసత్వం వహిస్తున్నారు. విభాగాల వారీగా ఎన్ని దరఖాస్తులు అందాయి? నిర్ణీత గడువులోగా ఎన్నింటికి సమాచారం అందించారు? ఎన్ని పెండింగ్లో ఉన్నాయి? అనే అంశాలపై సమీక్షలు జరగడం లేదు. దీంతో సమాచార హక్కు చట్టం దరఖాస్తులు పెద్ద ఎత్తున పెండింగ్లో పడిపోతున్నాయి. వాస్తవానికి వారానికోసారి సమీక్షలు నిర్వహించాలి. సకాలంలో సమాచారం అందించని అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. -
రెండు విభాగాల్లో గోల్డ్ మెడల్ ఏర్పాటు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని లైబ్రరీ సైన్స్లో దివంగత బండారి చంద్రశేఖర్, దివంగత బండారి రమణిరత్నం పేర గోల్డ్మెడల్, స్వాతంత్య్ర సమర యోధులు, జనధర్మ, వరంగల్వాణి పత్రికల వ్యవస్థాపకులు దివంగత ఎంఎస్ ఆచార్య, దివంగత రంగనాయకమ్మ స్మారకార్థం జర్నలిజం విభాగంలో మరో గోల్డ్మెడల్ ఏర్పాటు చేశారు. గోల్డ్మెడల్కింద ఆయా విభాగాల్లో రూ.3లక్షల చొప్పున జమ చేశారు. అధిక మార్కులు పొందిన విద్యార్థికి ఆ నగదు (గోల్డ్మెడల్) అందజేయనున్నారు. ఆయా ఉత్తర్వులను వీసీ కె.ప్రతాప్రెడ్డి బుధవారం జారీ చేశారు. విభాగాల అధిపతులు డాక్టర్ బి.రాధికారాణి, ఎం.రాజగోపాలచారి బి.వెంకట్రామ్రెడ్డి, డాక్టర్ సంగని మల్లేశ్వర్, తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం విద్యారణ్యపురి: హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆకళాశాల ప్రిన్సిపాల్ గుర్రం శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మైక్రోబయాలజీలో రెండు, కంప్యూటర్ సైన్స్లో రెండు, తెలుగు సబ్జెక్టులో ఒక వేకన్సీ ఉన్నట్లు తెలిపారు. అర్హులు ఈనెల27 సాయంత్రం వరకు కేడీసీలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పీజీతోపాటు పీహెచ్డీ, నెట్ లేదా సెట్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. మౌఖిక పరీక్షలు ఈనెల 29న నిర్వహించనున్నట్లు తెలిపారు. మిగతా వివరాలకు పీజీ కోర్సుల కో–ఆర్డినేటర్ డాక్టర్ వాసం శ్రీనివాస్ 98850 59533లో సంప్రదించాలని ఆయన కోరారు. శిల్ప కళా సౌందర్యం అద్భుతం ఖిలా వరంగల్: కాకతీయుల కట్టడాలు, ఆనాటి నిర్మాణ శైలి, శిల్ప కళా సౌందర్యం మహాద్భుతంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా జడ్జి నసీమా అన్నారు. బుధవారం వరంగల్ నగరంలోని ఖిలా వరంగల్ మధ్యకోటను జడ్జి నసీమా తన కుటుంబంతో కలిసి సందర్శించారు. శిల్పాల ప్రాంగణంలోని శిల్ప కళా సంపదను వీక్షించారు. కాకతీయుల విశిష్టతను కోట గైడ్ రవియాదవ్.. జడ్జి కుటుంబానికి వివరించారు. జడ్జి వెంట ఎస్సై శ్రావణ, టీజీ టీడీసీ కోట ఇన్చార్జ్ అజయ్, కేంద్ర పురావస్తుశాఖ సిబ్బంది ఉన్నారు. కేయూ క్యాంపస్: చైన్నెలోని అమీట్ యూనివర్సిటీలో ఈనెల 25నుంచి 28వ తేదీ వరకు జరగనున్న సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ టేబుల్ టెన్నిస్ పురుషుల టోర్నమెంటుకు కేయూ పురుషుల జట్టును ఎంపిక చేసినట్లు బుధవారం స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ వై.వెంకయ్య తెలిపారు. జట్టులో కె.శ్రీసాయివర్ధన్, ఎన్.యశ్వంత్ రెడ్డి, బి.చింతేశ్వర్రెడ్డి, ఎస్.ప్రేమ్దినకర్, కె.దీపక్బాబు ఉన్నట్లు పేర్కొన్నారు. నరేశ్ కోచ్కమ్ మేనేజర్గా వ్యవహస్తారని తెలిపారు. టెన్నిస్ మెన్, ఉమెన్ జట్ల ఎంపిక..బెంగళూరులోని జైన్ యూనివర్సిటీలో ఈనెల 25నుంచి 28 వరకు జరగనున్న సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ టెన్నిస్ టోర్నమెంటుకు కాకతీయ యూనివర్సిటీ మెన్ అండ్ ఉమెన్ జట్లను ఎంపిక చేసినట్లు వెంకయ్య తెలిపారు. టెన్నిస్ పురుషుల జట్టులో బి.మనోజ్కుమార్, కె.విశాల్ ఆదిత్య, ఎన్.గౌతమ్, ఎం.రామకృష్ణ, కె.శ్రావణ్ ఉన్నారు. ఉమెన్స్ జట్టులో డి.ప్రదీప్త, టి.సింధు, హెచ్.సంయుక్త, డి.అఖిల ఉన్నారు. ఎస్.మహేశ్ కోచ్ కమ్ మేనేజర్గా వ్యవహరించనున్నారు. -
బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలి
న్యూశాయంపేట: లింకేజీ రుణాల మంజూరుకు బ్యాంకులు చిత్తశుద్ధితో పనిచేయాలని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ అన్నారు. కలెక్టరేట్లో బుధవారం బ్యాంకర్లతో జరిగిన డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ మీటింగ్ (డీసీసీ సమావేశం)లో ఆయన మాట్లాడారు. బ్యాంకులు సామాజిక బాధ్యతగా అర్హులకు రుణాలివ్వాలని సూచించారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలను బ్యాంకర్లు విజయవంతం చేయాలని కోరారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.9,274 కోట్లు లక్ష్యంగా ఎంచుకోగా.. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 7,169 కోట్ల రుణాలు ఇచ్చి 77.30 శాతం లక్ష్యాన్ని సాధించినట్లు ఎల్డీఎం హవేలీ రాజు వివరించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, యూనియన్ బ్యాంకు ఆర్హెచ్ కమలాకర్, ఆర్బీఐ ఏజీఎం రహమాన్, నాబార్డ్ ఏజీఎం రవి ఉన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలి నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయ్భాస్కర్ ఖిలా వరంగల్: మహిళలు వ్యాపారరంగాల్లో ఆర్థికంగా ఎదగాలని తెలంగాణ రాష్ట్ర నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ బి.ఉదయ్ భాస్కర్ సూచించారు. మహిళా స్వయం సహాయ సంఘం సభ్యులకు నైపుణ్యత, సూక్ష్మ వ్యాపారాల ప్రోత్సాహం(ఎం–సువిధ)పై వరంగల్ శంభునిపేటలోని ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో బుధవారం శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. నాబార్డ్ వరంగల్ అభివృద్ధి మేనేజర్ శ్రీ చైతన్య రవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డీజీఎం బొల్లా శ్రీనివాస్, ఏజీఎం చంద్రశేఖర్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా పరిశ్రమల అధికారి నరసింహమూర్తి, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, కార్పొరేటర్ పోశాల పద్మ, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు. డిజిటల్ బ్యాంకింగ్ సేవల విస్తరణకాజీపేట అర్బన్: గ్రామీణ స్థాయిలో డిజిటల్ బ్యాంకింగ్ సేవలను విస్తరించడంతో పాటు పాడి రైతులకు నగదు లావాదేవీలను సులభతరం చేయడానికి మైక్రో ఏటీఎంలు ఉపయోగపడతాయని నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయ్భాస్కర్ అన్నారు. హనుమకొండలోని వరంగల్ డీసీసీబీ కార్యాలయంలో బుధవారం డీసీసీబీ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నాబార్డ్ సీజీఎం ఉదయ్భాస్కర్, డీసీసీబీ సీఈఓ వజీర్ సుల్తాన్, నాబార్డ్ డీడీఎంలు చంద్రశేఖర్, రవి, జీఎం ఉష శ్రీ, డీజీఎం అశోక్ ఉన్నారు.శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ -
‘పది’పై ప్రత్యేక దృష్టి సారించండి
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో టెన్త్ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రణాళికతో ముందుకెళ్లేలా పర్యవేక్షించాలని డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ ఎంఈఓలను ఆదేశించారు. బుధవారం డీఈఓ కార్యాలయంలోని డీసీఈబీ భవనంలో హనుమకొండ జిల్లాలోని అన్ని మండలాల ఎంఈఓలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. టెన్త్ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని, జిల్లాలోని పాఠశాలలను తనిఖీ చేయాలని, పాఠశాలల్లో పరిశుభ్రత ఉండేలా చూడాలన్నారు. పాఠశాలల్లో 5వ తరగతినుంచి 10వ తరగతివరకు పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్ కోసం అర్హులైన విద్యార్థులతో ఇ–పాస్ ద్వారా దరఖాస్తులు చేయించాలని ఆదేశించారు. సమావేశంలో డీసీఈబీ కార్యదర్శి డాక్టర్ బి.రాంధన్, సాంఘిక సంక్షేమ జిల్లా సహాయగణాంక అధికారి జి.రాహుల్, ఎంఈఓలు జి.నెహ్రూనాయక్, బి.మనోజ్కుమార్, ఎ.శ్రీనివాస్, ఎస్.విజయ్కుమార్, ఎం.చంద్రమౌళి, పి.ఆనందం, ఎల్. రాజేశ్కుమార్, కె.శ్రీధర్, భిక్షపతి పాల్గొన్నారు. డీఈఓ గిరిరాజ్గౌడ్ ఎంఈఓలతో సమీక్ష -
తడి, పొడి చెత్తను వేరు చేయాలి
బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ వరంగల్ అర్బన్: డీఆర్సీసీ నిర్వాహకులు పొడి చెత్తను స్వీకరించాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. శానిటేషన్ తనిఖీల్లో భాగంగా కమిషనర్ బుధవారం హనుమకొండ పరిధి 57, 59 డివిజన్లలో ప్రత్యక్షంగా శానిటేషన్ తీరును పరిశీలించారు. స్వచ్ఛ ఆటోలన్నీ భవానీనగర్ వాట ర్ ట్యాంక్ వద్దకు తీసుకొచ్చి తడి, పొడి చెత్తను వేరు చేయాలని, ప్రతీ గృహం నుంచి సేకరించాలని కోరారు. డీఆర్సీసీ కేంద్రం ఇక్కడే ఉన్నందున పొడి చెత్తను డీఆర్సీసీ నిర్వాహకులు స్వీకరించాలని కమిషనర్ అన్నారు. కార్యక్రమంలో సీఎంహెచ్ఓ రాజారెడ్డి, శానిటరీ సూపర్వైజర్ నరేందర్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్రమ్ శ్రీను, ఆస్కి ప్రతినిధి రాజ్మోహన్, వావ్ ప్రతినిధి పవన్ పాల్గొన్నారు. -
మేడారం భక్తులకు ఏర్పాట్లు చేయాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: ములుగు జిల్లా మేడారం జాతరకు వెళ్లే సమక్క–సారలమ్మ భక్తులకు ఏర్పాట్లు చేయాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. బుధవారం జాతర ఏర్పాట్లపై కలెక్టరేట్లో అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముందస్తు ప్రణాళికతో సమర్థవంతంగా ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం భక్తుల కోసం తాత్కాలిక ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటును క్షేత్రస్థాయిలో అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. సమీక్షలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా ఆర్అండ్బీ అధికారి రాజేందర్, డీఎంహెచ్ఓ సాంబశివరావు, ఈఈ సునీత, అధికారులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించాలి.. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను (బ్లాక్స్పాట్లు) గుర్తించి నివారించేందుకు సమగ్ర చర్యలు తీసుకోవాలన్నారు. వరంగల్–ఖమ్మం హైవే, ఇతర ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు కలెక్టర్కు వివరించారు. ఆర్అండ్బీ ఈఈ రాజేందర్, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి శోభన్బాబు, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి ఇజ్జగిరి, ఎన్హెచ్ అధికారులు, అధికారులు పాల్గొన్నారు. -
క్లెయిమ్ చేయని ఆస్తులు పొందొచ్చు
హన్మకొండ అర్బన్: క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తులను హక్కుదారులు తమ బ్యాంకులు లేదా సంబంధిత సంస్థలను సంప్రదించి నిధులు తిరిగి పొందొచ్చని హనుమకొండ జిల్లా ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ వైవీ గణేశ్ సూచించారు. కలెక్టరేట్లో ‘మీ డబ్బు–మీ హక్కు’ అంశంపై బుధవారం ప్రత్యేక శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన గణేశ్ మాట్లాడుతూ.. క్లెయిమ్ చేయని డిపాజిట్లు, షేర్లు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్లు, బీమా ఆదాయాలు, తది తర ఆస్తులు తిరిగి పొందొచ్చని సూచించారు. ఎస్ బీఐ రీజినల్ మేనేజర్ షేక్ అ బ్దుల్ రహీం, ఆర్బీఐ ఏజీఎం ఎం.జెడ్. రెహమాన్, ఎస్బీఐ ఎస్ఎల్బీసీ మేనేజర్ కాళీప్రకాశ్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ జన్ను మహేందర్ పాల్గొన్నారు. హక్కులపై అవగాహన కల్పించాలి.. వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించాలని హనుమకొండ జిల్లా ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ వై.వి గణేశ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా గణేశ్ మాట్లాడుతూ.. వినియోగదారులు ఎక్కువగా తూకాలతో నష్టపోతున్నారని, దీని నివారణకు తూనికలు కొలతల శాఖ అధికారులు క్రమంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. వినియోగదారుల ఫోరం విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. సమావేశంలో డీసీఎస్ఓ వాజీద్ అలీ, తూనికలు కొలతల శాఖ అధికారి వెంకటేశ్, రాష్ట్ర వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు రతన్ సింగ్ ఠాగూర్, కార్యదర్శి సూరజ్, ఓరుగల్లు వినియోగదారుల ఫోరం సభ్యులు దండు యుగేందర్, బండ వివేకానంద, శోభ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ వైవీ గణేశ్ ‘మీ డబ్బు – మీ హక్కు’ అంశంపై శిబిరం -
పీఆర్సీని ప్రకటించాలి
విద్యారణ్యపురి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు వెంటనే పీఆర్సీని ప్రకటించాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి డిమాండ్ చేశారు. బుధవారం హనుమకొండలోని టీఎస్యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఆ సంఘం జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ము ఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికై న ఆరునెలలలోపు మేనిఫెస్టోలో పెట్టినట్లుగా పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు పట్టించుకోకపోవడం శోఛనీయమన్నారు. ఐదు డీఏలు విడుదల చేయకుండా జాప్యం చేస్తోందని విమర్శించారు. ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 23ను సవరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఫ్యామిలీ వెల్ఫేర్ ఫండ్ చైర్మన్ రాజశేఖర్రెడ్డి, టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సోమశేఖర్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు సీహెచ్.రవీందర్రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి పెండెం రాజు, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు డి.కిరణ్కుమార్, ఆల్ పెన్షనర్ల అసోసియేషన్ రాష్ట్ర బాధ్యులు సీతారాం, జిల్లా కార్యదర్శులు సీహెచ్.లింగారావు, మోజెస్, చంద్రయ్య, ప్రసన్నానంద్, కె.సదానందం, జిల్లా ఉపాధ్యక్షుడు ఎ.రాజారాం, ఎస్.జ్యోతి, గురుకుల బాధ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. టెట్ నుంచి టీచర్లను మినహాయించాలి టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రవి -
నేల ఆరోగ్యంతోనే రైతులు బాగు
● ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ ఉమారెడ్డి హన్మకొండ: నేల ఆరోగ్యంతోనే రైతులు బాగుంటారని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకుడు ఆర్.ఉమారెడ్డి అన్నారు. మంగళవారం వరంగల్ పైడిపల్లిలోని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో జాతీ య రైతు దినోత్సవం నిర్వహించారు. దేశ మాజీ ప్రధాని చరణ్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు. ఈ క్రమంలో రైతులు భూసారాన్ని పరిరక్షించుకోవాలన్నారు. అలాగే, వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రైతుల శ్రేయస్సు కోసం చేస్తున్న వివిధ కార్యక్రమాల గురించి పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరిచారు. కార్యక్రమంలో మధ్య తెలంగాణ మండలంలోని రైతు విజ్ఞాన కేంద్రాలైన వరంగల్, జోగిపేట, తోర్నాల కోఆర్డినేటర్లు డాక్టర్ ఎ.విజయభాస్కర్, డాక్టర్ కె.రాహుల్, డాక్టర్ పల్లవి, శాస్త్రవేత్తలు, రైతులు, వ్యవసాయ విద్యార్థులు పాల్గొన్నారు. -
బస్సు ఎక్కేందుకు రోడ్డు దాటుతుండగా..
● కారు ఢీకొని వ్యక్తి మృతి ● వంగాలపల్లిలో ఘటన చిల్పూరు: బస్సు ఎక్కేందుకు రోడ్డు దాటుతున్న సమయంలో కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం మండలంలోని వంగాలపల్లి గ్రామ బస్ స్టేజీ సమీపంలోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఎస్సై నవీన్కుమార్ కథనం ప్రకారం.. ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాల గ్రామానికి చెందిన బొమ్మిరెడ్డి కృష్ణారెడ్డి (54) ఆటోలో చిల్పూరు మండలం చిన్నపెండ్యాలలోని ఎస్బీఐకి వస్తూ కరుణాపురంలో దిగాడు. అక్కడ బస్సు ఎక్కేందుకు రోడ్డు దాటుతుండగా స్టేషన్ఘన్పూర్ నుంచి హనుకొండకు వెళ్తున్న కారు ఢీకొంది. ఈ ఘటనలో కృష్ణారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య విజయ ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్ కదిరె సాయివివేకానందరెడ్డిపై కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. -
టార్గెట్ జనవరి 5..
ఎస్ఎస్తాడ్వాయి : మేడారం సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణ పనులన్నీ డిసెంబర్ 31 కల్లా పూర్తి చేయాలని, అటు ఇటు అయితే జనవరి 5 కల్లా పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి.. అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం మేడారంలోని హరితహోట్లో మంత్రి సీతక్క, సీఎం ముఖ్య సలహాదారు వేం నరేందర్రెడ్డి, ఎంపీ బలరాంనాయక్, కలెక్టర్ దివాకర్ టీఎస్, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా పనుల పురోగతి వివరాలను అధికారులు మంత్రులకు వివరించారు. ప్రాకారం పనులపై సుదీర్ఘ సమీక్ష అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో జరుగుతున్న ప్రాకారం రాతి నిర్మాణ పనులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సుమారు అరగంటకుపైగా సమీక్షించారు. ప్రాకారం చుట్టూ రాతి స్తంభాల ఏర్పాటుతోపాటు వాటిపై డిజైన్ ఏర్పాట్ల పనులు, గోవిందరా జు, పగిడిద్దరాజు గద్దెల పునరుద్ధరణతోపాటు అమ్మవార్ల గద్దెల విస్తరణలో భాగంగా రాతి నిర్మాణ పనులన్నీ డిసెంబర్ 31 వర కు పూర్తి చేయాలని ఆదేశించారు. జనవరి 5వ తేదీ లోపు ఎప్పుడైనా ఎవరికీ తెలియకుండా విజిట్ చేస్తానని, పనుల్లో లోపాలు ఉంటే సహించేది లేదన్నారు. జనవరి 6వతేదీన సీఎం రేవంత్రెడ్డి వచ్చే చాన్స్ ఉందని, ఆలోగా పనులన్నీ పూర్తి చేయాలన్నారు. స్వస్తిక్ గుర్తు ఆదివాసీల సంప్రదాయమే.. స్వస్తిక్ గుర్తును ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయం ప్రకారం ఏర్పాటు చేస్తున్నామని, దీనిపై ఎవరూ రాద్ధాంతం చేయొద్దని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క కోరారు. ప్రకృతి దైవాలుగా భావించి సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గొట్టు, గోత్రాల ప్రకారం పనులు చేస్తున్నారన్నారు. కాగా, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల పునఃప్రతిష్ఠ పూజ కార్యక్రమాల సందర్భంగా నేడు (బుధవారం) అమ్మవార్ల దర్శనాలు నిలిపివేసినట్లు పూజారులు ప్రకటించారని, భక్తులు సహకరించాలన్నారు. క్షేత్రస్థాయిలో పనుల పరిశీలన జాతర పనులను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ధనసరి సీతక్క క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అంతకుముందు మంత్రులు శ్రీనివాస్రెడ్డి, సీతక్క, సీఎం ముఖ్య సలహాదారు నరేందర్రెడ్డి, ఎంపీ బలరాంనాయక్ అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవీచందర్ ఉన్నారు.మేడారం గద్దెల ప్రాంగణంలో పునరుద్ధరించిన గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై నేడు (బుధవారం) ధ్వజ స్తంభాల పునఃప్రతిష్ఠ పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈమేరకు మంగళవారం గోవిందరాజు, పగిడిద్దరాజు పూజారులు పూజ కార్యక్రమాలను సిద్ధం చేశారు. పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు పూజారులు, కొండాయి నుంచి గోవిందరాజు పూజారులు వారి గుడిల వద్ద పూజాకార్యక్రమాలు నిర్వహించుకుని మంగళవారం రాత్రి మేడారానికి చేరుకున్నారు. బుధవారం ఉదయం 9 గంటల సమయంలో గోవిందరాజు, పగిడిద్దరాజు ధ్వజ స్తంభాల ను నిలపనున్నట్లు పూజారులు తెలిపారు. ఆ లోపు అభివృద్ధి పనులు పూర్తి చేయాలి అధికారులకు మంత్రి పొంగులేటి డెడ్లైన్ క్షేత్ర స్థాయిలో పనులు పరిశీలించిన మంత్రులు -
బైక్ను ఢీకొన్న ఇసుక లారీ..
● యువకుడి దుర్మరణం ● దేవన్నపేటలో విషాదం హసన్పర్తి: ఇసుక లారీ.. బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన వడ్డేపల్లి–ఉనికిచర్ల మార్గమధ్యలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హసన్పర్తి మండలం దేవన్నపేటకు చెందిన మాజీ సర్పంచ్ పంజాల నాగలక్ష్మి కుమారుడు చరితకుమార్(27) స్థానికంగా వ్యాపారం చేస్తూ తల్లిదండ్రులకు చేడోడువాడుగా ఉంటున్నాడు. మంగళవారం ఉదయం జాతీయ రహదారి మీదుగా బైక్పై నిరూప్నగర్ తండా వైపునకు బయలుదేరాడు. సుబ్బయ్యపల్లి పెట్రోల్ పంప్ సమీపంలోకి రాగా, వడ్డేపల్లి నుంచి ఉనికిచర్ల వైపునకు వెళ్తున్న ఇసుక లారీ డివైడర్ల పైనుంచి దూసుకొచ్చి బైక్ను ఢీకొంటూ రోడ్డు కిందికి వెళ్లింది. ఈ ప్రమాదంలో చరితకుమార్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సమాచారం అందుకున్న మృతుడి తల్లిదండ్రులు నాగలక్ష్మి, భూపాల్తోపాటు బంధువులు ఘటనా స్థలికి తరలొచ్చి బోరున విలపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతుడి తండ్రి భూపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవి తెలిపారు. చరితకుమార్ మృతితో దేవన్నపేటలో విషా దం అలుముకుంది. కాగా, సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఘటనాస్థలిని సందర్శించి మృతుడి తల్లిదండ్రులను ఓదార్చారు. ఐపీఎల్ సెలక్టర్గా సాయినాథ్రెడ్డి మహబూబాబాద్ అర్బన్ : మానుకోట జిల్లా కేంద్రానికి చెందిన సంకేపల్లి శ్రీనివాస్రెడ్డి, కీర్తన దంపతుల కుమారుడు సాయినాథ్రెడ్డి ఇండియన్ ప్రీమియర్లీగ్ (ఐపీఎల్) క్రికెట్ టోర్నమెంట్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సూపర్ సెలక్టర్గా ఎంపికయ్యారు. ఇటీవల ఐపీఎల్ టెక్నికల్ వింగ్కు దేశ వ్యాప్తంగా ఎంపికలు నిర్వహించారు. ఇందులో సాయినాథ్ రెడ్డి సెలక్టర్గా ఎంపికయ్యారు. దీంతో యూ ఏఈలోని అబుదాబిలో జరిగిన ఐపీఎల్ వేలంలో కోచ్ సంగక్కర, డైరెక్టర్ ఆఫ్ స్రాటజీ జైల్స్తోపాటు సాయినాథ్రెడ్డి.. రాజస్తాన్ రాయల్స్ జట్టుకు క్రీడాకారులను ఎంపిక చేశారు. కాగా, సాయినాథ్రెడ్డి బెంగళూరులో డేటా సైంటిస్ట్ ఉద్యోగం చేస్తున్నారని తల్లిదండ్రులు తెలిపారు. బీసీ మహిళలకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ హన్మకొండ: ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ (ఓబీసీ) ఆధ్వర్యంలో బీసీ మహిళలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగావకాశాలు పొందేందుకు నైపుణ్య శిక్షణలో భాగంగా డ్రైవింగ్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆ సంస్థ చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్, ప్రధాన కార్యదర్శి గడ్డ భాస్కర్ తెలిపారు. మంగళవారం హనుమకొండ రాంనగర్లోని ఓబీసీ కార్యాలయంలో ఫ్రీ ఉమెన్ ట్రైనింగ్ ఫర్ బీసీ ఉమెన్ కార్ పైలట్ బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓబీసీ సంస్థ వివిధ సామాజిక సేవా కార్యక్రమాలతోపాటు బీసీ బాలికల వసతి గృహంలో ఆరోగ్య శిబిరాలు నిర్వహించామన్నారు. ఇదే క్రమంలో మహిళలకు డ్రైవింగ్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. -
సూపర్స్పెషాలిటీ ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స
ఎంజీఎం : పుట్టుకతోనే తీవ్ర వినికిడి లోపం ఉన్న వరంగల్కు చెందిన 16 నెలల చిన్నారికి ఆరోగ్య శ్రీ పథకం ద్వారా కేఎంసీలోని పీఎంఎస్ఎస్వై సూపర్స్పెషాలిటీ ఆస్పత్రిలో ‘కోక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ’ విజయవంతంగా పూర్తి చేసినట్లు ఎంజీఎం సూపరింటెండెంట్ హరీశ్ చంద్రారెడ్డి మంగళవారం తెలిపారు. అత్యంత సంక్లిష్టమైన, ఖరీదైన ఆపరేషన్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పూర్తి ఉచితంగా చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ను హైదరాబాద్లోని కోఠి ప్రభుత్వ ఈఎన్టీ హాస్పిటల్ సూపరింటెండెంట్, సీనియర్ కోక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ ఆనంద్ ఆధ్వర్యంలో సీనియర్ ఈఎన్టీ సర్జన్, తెలంగాణ రాష్ట్ర కోక్లియర్ ఇంప్లాంట్ నోడల్ ఆఫీసర్ మనీష్ గుప్తా చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా హరీశ్ చంద్రారెడ్డి మాట్లాడుతూ పుట్టిన వెంటనే పిల్లలకు వినికిడి పరీక్షలు చేయించుకోవాలన్నారు. వినికిడి లోపం ఉన్నట్లు గుర్తిస్తే కోక్లియర్ ఇంప్లాంట్ ద్వారా సరి చేయొచ్చన్నారు. తద్వారా మూగ, చెవిటి కాకుండా నిరోధించి సామాన్య జీవితం అందించొచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఎంజీఎం ఈఎన్టీ హెచ్ఓడీ సంపత్, ప్రొఫెసర్ విజయ్, కోఠి ఈఎన్టీ వైద్యురాలు వీణ, ఎంజీఎం అనస్థీషియా విభాగం ప్రొఫెసర్ చిలక మురళి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు పద్మావతి, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కీచక అధ్యాపకుడు..!
పరకాల: డిగ్రీ కాలేజీలో విద్యార్థినులపై ఓ అధ్యాపకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా పరకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. బాధిత విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం.. పరకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తున్న మోరె అశోక్ చాలాకాలంగా విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ విషయంపై గతంలో ప్రిన్సిపల్ డాక్టర్ సంతోష్కుమార్కు విద్యార్థినులు ఫిర్యాదు చేయగా అతన్ని మందలించి వదిలేశారు. అయినప్పటికీ ఆ కీచక అధ్యాపకుడు ప్రవర్తనలో మార్పు రాలేదు. మళ్లీ విద్యార్థినులకు వీడియోకాల్స్ చేయడం, ఫోన్లో చాటింగ్ చేయడంతో పాటు లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. ఆ కీచకుడి వేధింపులపై బాధిత విద్యార్థినులు ఈ నెల 18న ప్రిన్సిపల్కు మరోసారి ఫిర్యాదు చేయగానే ఆయన లైంగిక వేధింపుల నిరోధక కమిటీకి విచారణకు ఆదేశించారు. అప్పటికి సెలవుల్లో ఉన్న అధ్యాపకుడు అశోక్ ఈ నెల 22లోపు ఆ కమిటీకి సంజాయిషీ ఇవ్వాల్సి ఉండగా హాజరు కాలేదు. బాధిత విద్యార్థినులు, కుటుంబ సభ్యుల ఆందోళన సెలవుల్లో ఉన్న అధ్యాపకుడు మోరె అశోక్ మంగళవారం కళాశాలకు వచ్చిన విషయం తెలుసుకున్న పలువురు విద్యార్థినుల తల్లిదండ్రులు కాలేజీకి చేరుకొని ఆందోళన నిర్వహించారు. అతనిపై దాడికి ప్రయత్నించగా తప్పించుకొని పారిపోయాడు. ఇలాంటి విషయాలపై తాను క్షమించే ప్రసక్తే లేదంటూ ప్రిన్సిపల్ సంతోష్కుమార్ వారికి నచ్చజెప్పారు. ఈ విషయమై ప్రిన్సిపల్ బి.సంతోష్కుమార్ మాట్లాడుతూ విద్యార్థినుల పట్ల లైంగిక వేఽధింపులకు పాల్పడిన అధ్యాపకుడు మోరె అశోక్పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే లైంగిక వేధింపుల నిరోధక కమిటీకి సంజాయిషి ఇవ్వాలని కోరామని, అయినా పట్టించుకోకపోవడంతో ఉన్నత విద్యాశాఖ బోర్డు కమిషనర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వారి ఆదేశాల మేరకు సదరు అధ్యాపకుడిపై చర్యలు తీసుకుంటామన్నారు. సౌత్ జోన్ టోర్నమెంట్కు కేయూ జట్టు కేయూ క్యాంపస్ : చైన్నెలోని సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ బాస్కెట్ బాల్ టోర్నమెంట్ ఈనెల 24 నుంచి 28 వరకు జరుగబోతుందని, ఈ టోర్నమెంటులో కాకతీయ యూనివర్సిటీ పురుషుల జట్టు పాల్గొననున్నట్లు కేయూ స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ ప్రొఫెసర్ ఆచార్య వై.వెంకయ్య మంగళవారం తెలిపారు. జట్టులో కె.యశ్వంత్, కె. సుధాకర్, విగ్నేష్, ఆర్. నరేందర్ జి. దినేష్కుమార్, టి.మయూర్రాజ్, ఎస్. తారాకేష్ యాదవ్, ఎం.శ్రీహరి, బి. ఈశ్వర్ కె భరత్రాజ్, సిహెచ్జయ చంద్ర, పి.అవినాష్ ఉన్నారని తెలిపారు. జట్టుకు హనుమకొండ గీతాంజలి డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ఇర్ఫాన్ మహ్మద్ కోచ్గాను, యూనివర్సిటీ పీజీ కాలేజి ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ పి.భాస్కర్ మేనేజర్గా వ్యవహరిస్తున్నారని తెలిపారు. మెన్స్ హాకీ టీమ్ ఎంపికలు కేయూ మైదానంలో మంగళవారం ఇంటర్ కాలేజీయేట్ యూనివర్సిటీ హాకీ మెన్స్ టీమ్ ఎంపికలు నిర్వహించినట్లు కేయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ వై.వెంకయ్య తెలిపారు. ఈ ఎంపికలకు వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల నుంచి 40 మంది హాకీ క్రీడాకారులు పాల్గొన్నట్లు తెలిపారు. ఇందులో ఎంపికై న క్రీడాకారులు చెన్నయ్ సత్యభామ యూని వర్సిటీలో జరగబోయే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సెలక్టర్స్ కె.సునీల్రెడ్డి, కె.శ్రీనివాస్, ఎస్డీ యాసిన్, కె.రాకేష్ పాల్గొన్నారు. ● పరకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకుడి లైంగిక వేధింపులు -
మైసమ్మ ఆలయం కూల్చివేత.. నిరసనలు
వరంగల్: నగరంలోని 3వ డివిజన్ పైడిపల్లిలో మై సమ్మ ఆలయాన్ని అధికారులు తొలగించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామంలో ఉన్న మైసమ్మ విగ్రహం వద్ద ఆలయం నిర్మాణం చేపట్టారు. ఇది ‘కుడా’ వెంచర్కు అడ్డుగా ఉందని, రహదారి పక్క నే ఉండడం వల్ల కొంత మంది అధికారులకు ఫిర్యా దు చేసినట్లు తెలిసింది. ఈమేరకు నిర్మాణంలో ఉన్న మైసమ్మ ఆలయాన్ని మంగళవారం రాత్రి భారీ పోలీసు బందోబస్తు మధ్య తొలగించారు. కూ ల్చివేతను అడ్డుకునేందుకు ఆలయ నిర్మాణ దాత బొల్లం రవి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో ఎంజీఎం తరలించారు. హిందూ ఆలయం కూల్చి వేశారన్న విషయం తెలియడంతోనే బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి వరంగల్, ఏటూరునాగారం జాతీయ రహదారిపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ నేతృత్వంలో బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కేవలం హిందూ ఆలయాలనే లక్ష్యం చేసుకున్నారని, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, అర్ధరాత్రి వేళల్లో కూల్చివేతలు చేపట్టడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. కూల్చివేసిన ఆలయాన్ని వెంటనే పునర్నిర్మించాలని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని గంట రవికుమార్ డి మాండ్ చేశారు. ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. నిర్మాణ దాత రవి ఆత్మహత్యాయత్నం -
ప్రపంచం దృష్టి భారత్ వైపు..
కేయూ క్యాంపస్: దేశ పునర్మిర్మాణంలో యువతను భాగస్వామ్యం చేస్తూ ఈ దేశాన్ని విశ్వ గురువుగా నిలబెట్టే ప్రయత్నంలో ఏబీవీపీ నిమగ్నమైందని, ప్రపంచం దృష్టి భారత్ వైపు చూస్తోందని అఖిలభారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) జాతీయ సంఘటన కార్యదర్శి బాలకృష్ణ అన్నారు. రెండురోజుల నుంచి ఏబీవీపీ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీలోని ఆడిటోరియంలో కొనసాగిన రాష్ట్రంలోని యూనివర్సిటీల విద్యార్థుల సమ్మేళనం మంగళవారం సాయంత్రం ముగిసింది. ఈ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కొన్ని విద్యార్థి సంఘాలు విద్యార్థులను తప్పుదోవ పట్టించే యత్నం చేస్తుంటే ఈ దేశం కోసం, మట్టికోసం చివరి శ్వాస వరకు ఏబీవీపీ విద్యార్థులు పోరాడుతున్నారన్నారు. సమాజంలో అందరిని కలుపుకుని దేశం కోసం పనిచేసేది ఏబీవీపీ కార్యకర్తలేనన్నారు. ఏబీవీపీ ప్రాంత ప్రముఖ్ మాసాడిబాబురావు, రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు, యూనివర్సిటీస్ హాస్టళ్ల కన్వీనర్ జీవన్, కేయూ ఇన్చార్జ్ నిమ్మల రాజేశ్, అధ్యక్షుడు ఉబ్బటి హరికృష్ణ ,కార్యదర్శి జ్ఞానేశ్వర్, తదితరులు పాల్గొన్నారు. ఏబీవీపీ జాతీయసహ సంఘటన కార్యదర్శి బాలకృష్ణ -
క్రీడలతో మానసికోల్లాసం
స్టేషన్ఘన్పూర్: క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని స్టేషన్ఘన్పూర్ మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ అన్నారు. ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధి శివునిపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం ఉమ్మడి జిల్లాస్థాయి పాలిటెక్నిక్ కళాశాలల క్రీడాపోటీలు ప్రారంభమయ్యాయి. మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ, నిట్ వరంగల్ పీడీ రవికుమార్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. అనంతరం కమిషనర్ రాధాకృష్ణ మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులు స్ఫూర్తితో వ్యవహరించాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ పోచయ్య మాట్లాడుతూ వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, టేబుల్ టెన్నిస్, చెస్, బాల్బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, తదితర పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 14 పాలిటెక్నిక్ కళాశాలలు ఉండగా 12 కళాశాలల నుంచి దాదాపు 500 మంది క్రీడాకారులు హాజరయ్యారని, పోటీలు రెండు రోజులు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో వరంగల్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్, పీడీలు, పీఈటీలు, అధ్యాపకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ స్టేషన్ఘన్పూర్లో ఉమ్మడి జిల్లా స్థాయి పాలిటెక్నిక్ క్రీడలు ప్రారంభం -
క్రీస్తు బోధనలు మానవాళికి మార్గదర్శకం
క్రిస్మస్ వేడుకల్లో మంత్రి కొండా సురేఖ వరంగల్: యేసుక్రీస్తు బోధనలు సర్వమానవాళికి మార్గదర్శకమని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వరంగల్ ఓసిటీలోని మంత్రి క్యాంపు కార్యాలయ ఆవరణలో మంగళవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాస్టర్లతో కలిసి మంత్రి క్రిస్మస్ కేక్ కట్ చేశారు. పాస్టర్లకు తన సొంత ఖర్చుతో దుస్తులు పంపిణీ చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే క్రిస్మస్ వేడుకలు ప్రేమ, దయ, కరుణకు చిహ్నంగా నిలుస్తాయని అన్నారు. వరంగల్ నగరంలోని చర్చిలకు రంగులు వేసేందుకు సీఎం నిధులు కేటాయించడం హర్షణీయమని మేయర్ సుధారాణి అన్నారు. మంత్రి ఆదేశం మేరకు నగరంలోని చర్చిలు ఉన్న ప్రాంతాల్లో కార్పొరేషన్ తరఫున శానిటేషన్, లైటింగ్కు రూ.10 లక్షలు వెచ్చించినట్లు తెలిపారు. క్రిస్మస్ వేడుకల సందర్భంగా స్టేజీపై ఎలాంటి పదవులు లేని కాంగ్రెస్ నాయకులు ఆసీనులు కావడంపై పలువురు చర్చించుకున్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, అదనవు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సుమ, కార్పొరేటర్లు భోగి సువర్ణ, కావేటి కవిత, అనిల్కుమార్, పద్మ, రవి, సురేష్, ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఒరిగిన విద్యుత్ స్తంభం..
హన్మకొండ: వరద తాకిడికి రోడ్డు కోతకు గురికావడంతో 11 కేవీ విద్యుత్ స్తంభం పక్కకు ఒరిగి ప్రమాదకరంగా మారింది. దీంతో సమీపంలో ఉన్న డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్కు విద్యుత్ సరఫరా నిలిపివేసిన టీజీ ఎన్పీడీసీఎల్ అధికారులు ప్రతామ్నాయ విద్యుత్ సరఫరా చేస్తున్నారు. అక్టోబర్ 29న కురిసిన భారీ వర్షానికి హనుమకొండలో వరద పోటెత్తింది. క్రమంలో ఇంజనీర్స్ కాలనీ సమీపంలోని ఓ ప్రైవేట్ స్కూల్ ఎదుట నాలాను ఆనుకుని ఉన్న రోడ్డు పూర్తిగా కోతకు గురై 11 కేవీ విద్యుత్ స్తంభం పట్టుకోల్పోయి ఒక వైపు ఒరిగింది. విద్యుత్ లైన్ మరో ఇనుప స్తంభానికి తాకి ప్రమాదకరంగా మారగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఒరిగిన స్తంభం సమీపంలోనే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ఉంది. దీంతో ఈ ట్రాన్స్ఫార్మర్కు విద్యుత్ సరఫరా నిలిపివేసి అధికారులు ప్రత్యామ్నాయం ద్వారా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. విద్యుత్ స్తంభం ఒరిగి పోయి, విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ నిరుపయోగంగా ఉన్నా ఎన్పీడీసీఎల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. విద్యుత్ స్తంభాన్ని తిరిగి నాటి విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ను తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని విద్యానగర్ వాసులు కోరుతున్నారు. -
మేడారం.. ముమ్మరం
మేడారంలో గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణం, పలు అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. గద్దెల చుట్టూ ప్రాకారం చుట్టు రాతి స్తంభాల ఏర్పాటుతోపాటు వాటిపై డిజైన్లు, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల పునరుద్ధరణతోపాటు అమ్మవార్ల గద్దెల విస్తరణలో భాగంగా రాతి నిర్మాణ పనులు ఒక రూపునకు వచ్చాయి. గద్దెల ప్రాంగణంలో గ్రానైట్ రాయి పరుస్తున్నారు. అదేవిధంగా జంపన్నవాగు వద్ద స్నానఘట్టాలు, జల్లు స్నానాల పనులు చురుగ్గా సాగుతున్నాయి. – ఎస్ఎస్తాడ్వాయి ఆలోగా మేడారం జాతర పనులు పూర్తి కావాలి మంత్రులు పొంగులేటి, సీతక్క ఆదేశం గద్దెల విస్తరణ, ప్రాంగణ పనుల పరిశీలన -
కేఎంసీ ఆభివృద్ధికి కృషి
కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ రమేశ్రెడ్డి ఎంజీఎం: కాకతీయ వైద్య కళాశాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్చాన్స్లర్ డాక్టర్ రమేశ్రెడ్డి అన్నారు. కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన అవార్డులు, ప్రశంసపత్రాల ప్రదానోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రథమ, ద్వితీయ సంవత్సర ఎంబీబీఎస్ టాపర్లు, పీజీ యూనివర్సిటీ టాపర్లకు అవార్డులు, ప్రశంసపత్రాలు అందజేశారు. అలాగే, ఏఎంబీఐ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికై న ప్రొఫెసర్ డాక్టర్ పుల్లయ్యను శాలువాతో సన్మానించారు. అనంతరం వీసీ రమేశ్రెడ్డి మాట్లాడుతూ కేఎంసీ (1979 బ్యాచ్) పూర్వ విద్యార్థిగా చదివిన తాను ఇప్పుడు ముఖ్య అతిథిగా రావడం ఆనందంగా ఉందని తెలిపారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సూచనల మేరకు ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో గుణాత్మకమైన మార్పులు తీసుకొచ్చేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. అనంతరం వీసీని కళాశాల బృందం ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో కళాశాల విభాగాధిపతులు, అధ్యాపకులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. -
రెండేళ్లు.. 11 ప్రమాదాలు
హసన్పర్తి: వడ్డేపల్లి–ఉనికిచర్ల రోడ్డును రెండేళ్ల క్రితం డబుల్గా విస్తరించారు. ఈ మార్గంలోని సుబ్బయ్యపల్లి పెట్రోల్ పంపు మలుపు ప్రమాదకరంగా మారింది. రెండేళ్లలో ఇక్కడ 11 ప్రమాదాలు జరిగి పలువురు మృతిచెందారు. అనేక మంది గాయపడ్డారు. మంగళవారం జరిగిన ప్రమాదం దిగ్భ్రాంతికి గురిచేసింది. పెట్రోల్ బంకు సమీపంలో ఇసుక లారీ ఢీకొని దేవన్నపేట గ్రామానికి చెందిన చరత్కుమార్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అంతకుముందు ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లో పనిచేస్తున్న ధర్మసాగర్ మండలానికి చెందిన ఓ యువకుడు, ధర్మసాగర్లో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శి మహేశ్, ముప్పారానికి చెందిన మాచర్ల రాజు, శాయంపేటకు చెందిన రాజు, ఉనికిచర్లకు చెందిన సందెల రమేశ్ రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు. రోడ్డు ప్రమాదాలపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ జరిగిన ప్రమాదాల్లో మృతిచెందిన వారందరూ 40 ఏళ్ల లోపు వారేనని వారు తెలిపారు. మలుపు వద్ద ఏదైనా అదృశ్య శక్తి ఉందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇసుకలారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి సుబ్బయ్యపల్లి పెట్రోల్బంకు మలుపు వద్ద ప్రమాదాలు జరుగకుండా హెచ్చరిక బోర్డులు, సూచికలు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. -
సాధారణ నిధులు.. డ్రెయినేజీ పాలు
వరంగల్: వరంగల్ మహానగర పాలక సంస్థలోని సాధారణ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. డివిజన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులే ఇందుకు సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. సాధారణ నిధులు కార్పొరేషన్ పరిధిలో అత్యవసరమైన పనులు, సంస్థ ఆస్తుల పరిరక్షణ కోసం వెచ్చించాలి. కానీ, ఈ నిధులు ప్రజాప్రతినిధులకు ఫలహారంగా మారాయి. ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలో ప్రతి డివిజన్కు రూ.50లక్షల చొప్పున సాధారణ నిధులు కేటాయించి కార్పొరేటర్లకు అప్పగించారు. ఇకేముంది వారి ఇష్టారాజ్యంగా మారింది. అవసరమైన చోట కాకుండా వారికి ఇష్టమున్న చోట, ఎక్కువ కమీషన్ ఇచ్చిన వారికి పనులు ప్రతిపాదిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. 19వ డివిజన్ వివేకానందకాలనీ రోడ్డు నంబర్ –2లోని ఎడమ వైపు ఉన్న వీధిలో రెండేళ్ల క్రితం నిర్మించిన పక్కా డ్రెయినేజీని మంగళవారం తవ్వారు. రెండు రోజుల క్రితం కొత్త డ్రెయినేజీ నిర్మించేందుకు గ్రేటర్ అధికారులు ఇక్కడికి వచ్చారు. డ్రెయినేజీ లేని ప్రాంతంలో నిర్మించాలని స్థానికులు కోరినా పట్టించుకోకుండా వరద నీరు ఎక్కువ వెళ్లేందుకు అంటూ పనులు ప్రారంభించారు. పక్కనే డ్రెయినేజీ లేని చోట నిర్మిస్తే ఇబ్బందులు తప్పేవని ప్రజలు పేర్కొంటున్నారు. ఈ విషయమై అధికారులను ఫోన్లో సంప్రదించగా స్పందించలేదు. -
‘పుర’ పీఠాలపై ప్రధాన పార్టీల గురి..
మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వంలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు మున్సిపాలిటీలపై గురి పెడుతున్నాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మినహా వరంగల్ ఉమ్మడి జిల్లాలో జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి, పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్తో పాటు ములుగు, స్టేషన్ఘన్పూర్, కేసముద్రం మున్సిపాలిటీలకు ఈసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. గత ఎన్నికల సమయంలో 9 మున్సిపాలిటీల్లో 2,50,687 మంది ఓటర్లు ఉండగా, 1,23,802 పురుషులు, 1,26,885 మహిళా ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈసారి ఓటర్ల సవరణలో భాగంగా పెరిగే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పడిన మూడు మున్సిపాలిటీల్లోని 54 వార్డుల్లో 35 వేల వరకు ఓటర్లున్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే నాటికి మున్సిపాలిటీల ఓటర్లపై పట్టు సాధించేందుకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. -
బుధవారం శ్రీ 24 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
హన్మకొండ చౌరస్తా: భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతిని మంగళవారం హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం జంక్షన్లో నిర్వహించారు. పీవీ కాంస్య విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనేక ఆర్థిక సంస్కరణలు చేపట్టి భారతదేశ పురోగతిలో కీలకపాత్ర పోషించిన మహోన్నత వ్యక్తి పీవీ అని కొనియాడారు. మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్, వేయిస్తంభాల ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్రశర్మ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈవీ శ్రీనివాసరావు ఉన్నారు. -
త్వరలో మున్సిపల్
ఫిబ్రవరిలో ఎన్నికలు?.. ‘అధికార’ నేతలకు సంకేతాలుసాక్షిప్రతినిధి, వరంగల్ : మున్సిపాలిటీల ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత మున్సిపాలిటీలపై సర్కారు గురి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయమై అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు సంకేతాలు కూడా వచ్చినట్లు చెబుతున్నారు. మొదట ‘పంచాయతీ’ల తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని అందరూ భావించారు. లేదంటే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు అవకాశం ఉంటుందను కున్నారు. ఇదే సమయంలో గ్రామ పంచాయతీల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ప్రభుత్వం సహకార సంఘాల పాలకవర్గాలను రద్దు చేసింది. దీంతో పీఏసీఎస్ల ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందన్న చర్చ జరుగుతున్న సమయంలో సోమవారం హైదరాబాద్ పోలీసు కమాండ్ కంట్రోల్లో మంత్రులతో భేటీ అయిన సీఎం రేవంత్రెడ్డి మున్సిపల్ ఎన్నికలను తెరమీదకు తెచ్చారన్న చర్చతో అందరి దృష్టి ఆ ఎన్నికల వైపు మళ్లింది. ఉమ్మడి జిల్లాలో 12 మున్సిపాలిటీలు.. 2020 జనవరి 7న తొమ్మిది మున్సిపాలిటీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో భూపాలపల్లి, పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట, జనగామ, తొర్రూరు, మరిపెడ, మహబూబాబాద్, డోర్నకల్ మున్సిపాలిటీలకు జనవరి 22న ఎన్నికలు జరగ్గా.. 25 ఓట్ల లెక్కింపు జరిగింది. 26న మున్సిపాలిటీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. 9 మున్సిపాలిటీల పాలకవర్గాలకు ఈ ఏడాది జనవరి 25న గడువు ముగిసింది. కొద్దిమాసాలు పొడిగిస్తారని పాలకవర్గాలు ఆశించినప్పటికీ ప్రభుత్వం ప్రత్యేక అధికారులను అదే రోజు నియమించింది. దీంతో ఎన్నికల నిర్వహణ అనివార్యంగా మారింది. ఇటీవలే గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తికాగా.. మున్సిపాలిటీలకు కూడా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు మంత్రులతో సమాలోచనలు చేసిన ముఖ్యమంత్రి.. రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు ఆ పార్టీ ముఖ్యనేత ఒకరు చెప్పారు. ఇందుకు సంబంధించి మున్సిపల్ ఓటర్ల ముసాయిదా, సవరణ ప్రక్రియపై త్వరలోనే మార్గదర్శకాలు వెలువడే అవకాశం ఉందని తెలిసింది. ఇదే జరిగితే ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే ఉన్న 9 మున్సిపాలిటీలకు తోడు కొత్తగా ఏర్పాటైన కేసముద్రం, ములుగు, స్టేషన్ఘన్పూర్కు కూడా ఎన్నికలు జరగనున్నాయి. జనవరి చివరి వారంలో షెడ్యూల్కు అవకాశం మంత్రులతో సీఎం రేవంత్ సమాలోచనల్లో చర్చ ప్రధాన పార్టీల్లో మొదలైన సమీకరణలు 9 మున్సిపాలిటీలకు ఇప్పటికే ముగిసిన కాలపరిమితి కొనసాగుతున్న స్పెషల్ ఆఫీసర్ల పాలన ఈసారి కొత్తగా మరో మూడు మున్సిపాలిటీలుఉమ్మడి వరంగల్లో మున్సిపాలిటీలు, జనాభా, వార్డులు.. మున్సిపాలిటీ జనాభా వార్డులు (2011 ప్రకారం) పరకాల 24,444 22 నర్సంపేట 37070 24 వర్ధన్నపేట 13,732 12 మహబూబాబాద్ 68,935 36 డోర్నకల్ 14,425 15 మరిపెడ 17,685 15 తొర్రూరు 19,100 16 భూపాలపల్లి 59,458 30 జనగామ 52,712 30కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, జనాభా, వార్డులు మున్సిపాలిటీ జనాభా వార్డులుములుగు 16,535 20 స్టేషన్ఘన్పూర్ 23,485 18 కేసముద్రం 18,480 16 -
కేయూ పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు వాయిదా
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో జనవరి 3 నుంచి నిర్వహించాల్సిన పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ మంగళవారం తెలిపారు. యూజీసీ నెట్, సెట్, టెట్ పరీక్షలు ఉన్నందున ఈ పరీక్షలు వాయిదావేశామని ఆయన పేర్కొన్నారు. సవరించిన పరీక్షల షెడ్యూల్ తర్వాత ప్రకటిస్తామని తెలిపారు. వరంగల్ లీగల్: నాంపల్లి సీబీఐ కోర్టుకు బదిలీపై వెళ్తున్న హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పట్టాభి రామారావుకు న్యాయవాదులు మంగళవారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు పులి సత్యనారాయణ అధ్యక్షతన ఏర్పాటు వీడ్కోల సభలో జస్టిస్ పట్టాభి రామారావు మాట్లాడుతూ తాను 8 నెలలపాటు హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా చేసిన సేవలు సంతృప్తి కలిగించాయని అన్నారు. అదనంగా ఐదు కొత్త కోర్టులు, నూతన భవనంపై మరో అంతస్తు నిర్మాణానికి తన సారథ్యంలో హైకోర్టు అనుమతి ఇచ్చిందని తెలిపారు. మంచి అనుభూతులతో బదిలీ అవుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. సమావేశంలో వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నిర్మలాగీతాంబ, హన్మకొండ జిల్లా ఇన్చార్జ్ జడ్జి అపర్ణాదేవి, న్యాయమూర్తులు, వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వలస సుధీర్, బార్ నాయకులు కొత్త రవి, అంబేడ్కర్, వెంకటేశ్, సాంబశివరావు, న్యాయవాదులు పాల్గొన్నారు. హసన్పర్తి: అంబులెన్స్లో ఓ మహిళ మంగళవారం ప్రసవించింది. వివరాలిలా ఉన్నాయి. హసన్పర్తి మండలం ఎర్రగట్టుగుట్ట ప్రాంతానికి చెందిన ఝాన్సీకి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ సిబ్బంది సకాలంలో అక్కడికి చేరుకుని ప్రథమ చికిత్స చేసే క్రమంలోనే ఝాన్సీకి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో సిబ్బంది స్వాతి, పైలట్ తిరుపతి అంబులెన్స్లోనే సాధారణ ప్రసవం చేశారు. ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డను హనుమకొండలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా అంబులెన్స్ సిబ్బందికి ఝాన్సీ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ లీగల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఇటీవల జరిగిన ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఐఎల్పీఏ) రాష్ట్ర కమిటీలో వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయవాదులకు చోటు దక్కింది. ఐఎల్పీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా హనుమకొండ బార్కు చెందిన సాయిని నరేందర్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా సీనియర్ న్యాయవాది చిల్లా రాజేంద్రప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వరంగల్ బార్కు చెందిన సీనియర్ న్యాయవాది తీగల జీవన్గౌడ్ను ఎన్నుకున్నారు. అలాగే, రాష్ట్ర కమిటీ కార్యనిర్వాహక సభ్యులుగా జన్ను పద్మ, ఎగ్గడి సుందర్రామ్, పల్లె ప్రశాంత్, నర్సంపేట బార్కు చెందిన పండగ శ్రీనివాస్ను ఎన్నుకున్నారు. రాష్ట్ర కమిటీకి ఎన్నికై న నాయకులకు హనుమకొండ, వరంగల్ బార్ అసోసియేషన్ల అధ్యక్షులు పులి సత్యనారాయణ, వలస సుధీర్, ఐఎల్పీఏ వరంగల్, హనుమకొండ జిల్లాల కన్వీనర్లు విలాసాగరం సురేందర్గౌడ్, ముచ్చు రాజేందర్, బార్ కన్వీనర్లు పెండ్యాల అనిల్కుమార్, పూసపల్లి శ్రీనివాస్, న్యాయవాదులు అంబరీషరావు, కె.నిర్మలాజ్యోతి, లడే రమేశ్, సిరిమల్ల అరుణ, శశిరేఖ తదితరులు అభినందనలు తెలిపారు. వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో ట్రైనీలకు మంగళవారం పరీక్షలు నిర్వహించారు. పలు కోర్సుల్లో శిక్షణ పొందిన 86 మందికి 85 మంది హాజరైనట్లు యువజన సర్వీసుల శాఖ సూపరింటెండెంట్ వై.విజయశ్రీ తెలిపారు. హైదరాబాద్ సెట్విన్ అధికారి మాధవి పర్యవేక్షించారు. -
డిపాజిట్ సొమ్ము తీసుకెళ్లాలి
వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణి న్యూశాయంపేట: బ్యాంకు ఖాతాల్లో క్లెయిమ్ కాని డిపాజిట్ సొమ్మును నిబంధనల మేరకు తీసుకెళ్లాలని వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి కోరారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ హాల్లో జాతీయ ప్రాంతీయ బ్యాంకుల్లో పదేళ్లకు పైబడి అన్క్లెయిమ్ డిపాజిట్లను వారి వారసులకు అప్పగించేందుకు యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మీ డబ్బు– మీ హక్కు కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా జీఎం ముత్యాల గణన్ సుప్రభాత్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ అధికారి గంట కమలాకర్ పాల్గొని మాట్లాడుతూ బ్యాంకులో ఉన్న డిపాజిట్ సొమ్మును సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించి వెంటనే క్లెయిమ్ చేసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 50 మంది నామినీలకు వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన బ్యాంకుల అంగీకార పత్రాల మొత్తాన్ని సమర్పించారు. కార్యక్రమంలో టీఅండ్బీ ఆర్ఎం చైతన్యకుమార్, నాబార్డ్ డీఎం రవి, ఎస్ఎల్బీసీ రిప్రజెంటేటివ్ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
పెన్షన్ వాలిడేషన్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి
హన్మకొండ: పెన్షన్ వాలిడేషన్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉప సంహరించుకోవాలని ఆల్ ఇండియా పెన్సనర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆర్.ఎస్.శర్మ, సెక్రటరీ జనరల్ డి.సుధాకర్ డిమాండ్ చేశారు. సోమవారం హనుమకొండ సర్క్యూట్ హౌజ్ రోడ్లోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో పెన్షనర్స్ దినోత్సవాన్ని జరుపుకున్నారు. నూతన మీటింగ్ హాల్ను ప్రారంభించారు. 2026 డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిలుగా పాల్గొని మాట్లాడుతూ 1982లో వై.వి.చంద్రచూడు ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం డీ.ఎస్.నకార వేసిన కేసులో ఇచ్చిన తీర్పు ప్రకారం ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు పొందుతున్న ప్రయోజనాలన్నీ 2026 జనవరి ఒకటి నుంచి వర్తించకుండా దుర్మార్గమైన పెన్షనర్స్ వాలిడేషన్ చట్టాన్ని రూపొందించారన్నారు. మార్చి 2024 నుంచి నవంబర్ 2025 వరకు రిటైర్డ్ అయిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ న్యాయంగా రావాల్సిన అన్ని బెన్ఫిట్లను చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా పెన్షనర్స్ ఫెడరేషన్ పూర్వ జాతీయ చైర్మన్ ఎస్.ఎస్.దూబే, పూర్వ సెక్రెటరీ జనరల్ జి.పూర్ణచందర్, రాష్ట్ర అధ్యక్షుడు ఎ.రాజేంద్ర బాబు, ప్రధాన కార్యదర్శి ఎంవీ నర్సింగారావు, పెన్షనర్స్ అసోసియేషన్ల నాయకులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా పెన్షనర్ల ఫెడరేషన్ చైర్మన్ ఆర్.ఎస్.శర్మ -
ఒక్కటే జీపీ.. ప్రమాణస్వీకారాలు వేర్వేరు చోట
● బోటిమీది తండా జీపీలో విచిత్ర పరిస్థితి ఖానాపురం : మండల వ్యాప్తంగా అన్ని గ్రామపంచాయతీల్లో సర్పంచ్లతో పాటు పాలకవర్గాలు ప్రమాణ స్వీకారాలు చేశాయి. కానీ మండలంలోని బోటిమీదితండాలో మాత్రం విచిత్ర ప్రమాణ స్వీకారం చేశారు. మొదట ఎంపీడీఓ అద్వైత సమక్షంలో సర్పంచ్ భానుప్రసాద్, నలుగురు వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇదే జీపీలో కొనసాగుతున్న గొల్లగూడెంతండా చెందిన మరో ముగ్గురు వార్డు సభ్యులు మాత్రం బోటిమీది తండా జీపీలో కాకుండా గొల్లగూడెంతండాలోనే పాత జీపీ కార్యాలయం వద్ద కార్యదర్శి సమక్షంలో ఉపసర్పంచ్తో పాటు ముగ్గురు వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఈ జీపీ పాలకవర్గ ప్రమాణస్వీకార ప్రక్రియ విచిత్రంగా ఉందని పలువురు గ్రామస్తులు ఆశ్చర్య వ్యక్తం చేశారు. -
‘అక్షయ పాత్ర’ సేవలు అనిర్వచనీయం
వరంగల్: పేద విద్యార్థుల ఆకలి తీరుస్తున్న అక్షయ పాత్ర సేవలు అనిర్వచనీయమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సోమవారం వరంగల్ ఎనుమాముల మార్కెట్ ఆవరణలోని ఇస్కాన్ అక్షయ పాత్ర ఆధ్వర్యంలో హెచ్డీబీ సహకారంతో ఏర్పాటు చేసిన వంటశాలలోని అధునాతన యంత్రాలను ప్రారంభించి మాట్లాడారు. ఆధ్యాత్మిక, సామాజిక సేవ సంస్థగా కృష్ణ చైతన్యాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి ఏర్పడిన సంస్థ ఇస్కాన్ అన్నారు. అనేక విద్యా సంస్థలను సంస్థ నడుపుతూ హరే కృష్ణ సంకీర్తన ఉచిత ప్రసాద వితరణకు ఎంతో ప్రసిద్ధి చెందిందన్నారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ ఇస్కాన్కు అనుబంధంగా పని చేస్తున్నదన్నారు. ఆకలితో ఏ బిడ్డ చదువుకు దూరం కావొద్దనే లక్ష్యంతో బెంగుళూరు కేంద్రంగా అక్షయపాత్రను ప్రారంభించారని తెలిపారు. వరంగల్ నగరంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా నాణ్యమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మధ్యాహ్న భోజన పథకాన్ని నడుపుతున్న అతిపెద్ద సంస్థ ఇదేనన్నారు. దేశంలో 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న 22 వేల ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు ప్రతీరోజు 20 లక్షల పైచిలుకు విద్యార్థులకు ఆహారం అందిస్తున్నారన్నారు. మేయర్ గుండు సుధారాణి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు, వరంగల్ కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, కార్పొరేటర్ తూర్పాటి సులోచన సారయ్య, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ -
హైదరాబాద్ నిఫ్ట్లో అడ్మిషన్లు
నయీంనగర్: భారత ప్రభుత్వ జౌళిశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) హైదరాబాద్లో 2026 విద్యా సంవత్సరానికి ప్రవేశాలను ఆహ్వానిస్తోందని సెంటర్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ డా.శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం హనుమకొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటుచేసిన సమావేశంలో అడ్మిషన్ల పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిఫ్ట్లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డాక్టోరల్ స్థాయిల్లో కోర్సులున్నట్లు తెలిపారు. ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులు నేడు (మంగళవారం) హనుమకొండ హరిత కాకతీయ హోటల్లో ఉదయం10 నుంచి సాయంత్రం 4గంటల వరకు జరిగే అవగాహన కార్యక్రమంలో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో రామకృష్ణ, శరవణన్ పాల్గొన్నారు. -
పాట తెచ్చిన ‘పంచాయితీ’
● ప్రమాణ స్వీకారంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ● ఇరువర్గాలు కుర్చీలతో గొడవ నర్సంపేట రూరల్ : ప్రమాణ స్వీకారోత్సవంలో డీజే పాట పెద్ద పంచాయితీకి దారి తీసింది. బీఆర్ఎస్, కాంగ్రెస్లు ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. ఈ ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. చెన్నారావుపేట జీపీ కార్యాలయ ఆవరణలో పాలకవర్గం ప్రమాణస్వీకారం సందర్భంగా డీజే సౌండ్స్ ఏర్పాటు చేశారు. అయితే ప్రమాణస్వీకారోత్సవంలో బీఆర్ఎస్కు సంబంఽధించిన పాట వస్తుండగా కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం చెప్పారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటామాట పెరిగింది. దీంతో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా మారి ఒకరిపై ఒకరు కుర్చీలతో దాడులు చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ యూత్ లీడర్ వనపర్తి శోభన్కు, బీఆర్ఎస్ పార్టీ మూడో వార్డుకు చెందిన మూడు రమేశ్కు గాయాలయ్యాయి. ఘటనా స్థలికి ఎస్సై రాజేశ్రెడ్డి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. తొలుత కాంగ్రెస్, అనంతరం బీఆర్ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సాయంత్రం కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. -
సకుటుంబ సపరివారంగా..
● తల్లి సర్పంచ్.. తనయుడు ఉప సర్పంచ్.. ● భార్య సర్పంచ్.. భర్త ఉప సర్పంచ్గా ప్రమాణస్వీకారం సంగెం: వరంగల్ జిల్లా సంగెం మండలంలోని 33 గ్రామపంచాయతీల్లో నూతన పాలకవర్గాలు సోమవారం అట్టహాసంగా ప్రమాణస్వీకారం చేశాయి. ఇందులో తల్లి సర్పంచ్గా తనయుడు ఉప సర్పంచ్గా, భార్య సర్పంచ్గా భర్త ఉప సర్పంచ్గా, నాడు భర్త సర్పంచ్గా, నేడు భర్త సర్పంచ్గా బాధ్యతలు స్వీకరించారు. ● తీగరాజుపల్లి మాజీ సర్పంచ్గా కర్జుగుత్త రమ కొనసాగగా సోమవారం భర్త గోపాల్ సర్పంచ్గా ప్రమాణస్వీకారం చేశారు. మండలంలోని మొండ్రాయిలో తల్లి గూడ స్వరూప సర్పంచ్గా తనయుడు విజయ్కుమార్ ఉపసర్పంచ్గా ప్రమాణస్వీకారం చేశారు. పెద్దతండాలో భార్య గుగులోత్ వినోద సర్పంచ్గా, భర్త రవీందర్నాయక్ ఉపసర్పంచ్గా ప్రమాణస్వీకారం చేశారు. కాగా, అరకొర వసతుల మధ్య నూతన పాలకవర్గాలు ప్రమాణ స్వీకారం నిర్వహించారు. మండలంలోని ఎల్గూర్రంగంపేటలో జీపీ భవనం లేకపోవడంతో మత్స్యపారి శ్రామిక సంఘం కమ్యూనిటీహాల్లో, ముమ్మడివరంలో ప్రభుత్వ పాఠశాల భవనంలో, గొల్లపల్లిలో అద్దె భవనంలో నూతన పాలక వర్గాలు ప్రమాణస్వీకారం చేశాయి. సంగెం మండలం మొండ్రాయిలో సర్పంచ్గా తల్లి స్వరూప, ఉపసర్పంచ్గా తనయుడు విజయ్కుమార్, వార్డు సభ్యులతో ప్రమాణస్వీకారం చేయిస్తున్న అధికారులు -
తహసీల్దార్ కార్యాలయ భవనానికి తాళం
● అద్దె రూ.6లక్షలు బకాయి చెల్లించకపోవడంతో యజమాని తాళం ఖిలా వరంగల్: వరంగల్ ఫోర్ట్ రోడ్డులోని మండల తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు నుంచి ప్రైవేట్ అద్దె భవనంలోనే కొనసాగుతోంది. రెండేళ్లుగా అద్దె చెల్లించేదు. సుమారు రూ.6లక్షల పైగా అద్దె బకాయి ఉండడంతో యజమాని సమ్మయ్య సోమవారం తాళం వేశారు. దీంతో అధికారులు, సిబ్బంది బయటనే ఉండిపోయారు. పలు రకాల పనులపై వచ్చిన ప్రజలు నిరీక్షిస్తూ కనిపించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ ఇక్బాల్, డిప్యూటీ తహసీల్దార్ రమేష్ హుటాహుటిన కార్యాలయానికి చేరుకున్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద దృష్టికి తీసుకెళ్లి అద్దె చెల్లిస్తామని యజమానిని ఒప్పించడంతో తాళం తీశారు. కాగా, అద్దె ఇవ్వాలని పలుమార్లు కలెక్టర్ గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేసినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో చేసేదిలేక భవనానికి తాళం వేసినట్లు సమ్మయ్య తెలిపారు. భవన నిర్మాణానికి బ్యాంకు రుణం తీసుకున్నానని, అద్దె రాకపోవడంతో ఈఎంఐ కట్టలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని వాపోయారు. -
కాలేజీలో ఫ్యాకల్టీని వెంటనే మార్చాలి
● టీటీడబ్ల్యూఆర్సీఈ విద్యార్థినుల డిమాండ్ వరంగల్: ఐఐటీ, నీట్ లాంటి ఉన్నత చదువుకు గిరి జన విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రా రంభించిన తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియ ల్ కాలేజీ ఆఫ్ ఎక్సలెన్సీ(టీటీడబ్ల్యూఆర్సీఈ)కాలేజీల్లో వెంటనే ఫ్యాకల్టీ మార్చాలని పలువురు విద్యార్థినులు డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం వరంగల్ 3వ డివిజన్ పరిధి హనుమకొండ పెద్దమ్మగడ్డలోని టీటీడబ్ల్యూఆర్సీఈ కాలేజీ విద్యార్థినులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సరైన ఫ్యాకల్టీ లేకపోవడంతో తాము ఉన్నత విద్యావకాశాలు కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ప్రస్తుత ఫ్యాకల్టీ బోధన తమకు ఏమాత్రం అర్థం కావడం లేదన్నారు. తమ ఇబ్బందులను ప్రిన్సిపాల్, ఆర్సీఓల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అందుకే విసుగెత్తి తాము ఆందోళన చేపట్టామన్నారు. ఆందోళనపై సమాచారం అందుకున్న ఆర్సీఓ డీఎస్.వెంకన్న, ప్రిన్సిపాల్తో పాటు పలువురు అధ్యాపకులు వచ్చి విద్యార్థినులకు సర్ది చెప్పడంతో వారు కాలేజీలోకి వెళ్లారు. ఈవిషయంపై ఆర్సీఓ డీఎస్.వెంకన్నను వివరణ కోరగా గతేడాది వరకు కాంట్రాక్ట్ లెక్చరర్లు ఉన్నారని, ఇప్పుడు టీఎస్పీఎస్సీ నుంచి వచ్చిన అధ్యాపకులు బోధిస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు అధ్యాపకులను సమన్వయం చేస్తామని తెలిపారు. అంతర్జాతీయ అవార్డుకు ఎంపిక కాళోజీ సెంటర్: అంతర్జాతీయ అవార్డుకు ప్రముఖ జ్యోతిష్య పండితుడు, వాస్తు విద్వాంసులు చేవూరి రమేశ్కుమార్ ఎంపికయ్యారు. హనుమకొండ పరిమళకాలనీకి చెందిన రమే శ్ 26 సంవత్సరాలుగా జ్యోతి ష్య పండితుడిగా సేవలు అందిస్తున్నారు. ఈ మేర కు ఆయన సేవలను గుర్తించిన గ్లోబల్, ఈగల్ యూనివర్సిటీ యునిఎర్త్ హ్యుమానిటీ పీస్ ఫౌండేషన్ సంయుక్తంగా యూనివర్సల్ ఎక్సలెన్సీ అవా ర్డుకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈనెల 27న మధ్యప్రదేశ్లో జరగనున్న సదస్సులో ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు కేతన్, భూపేశ్, గైడ్ రమణారావుతో పాటు ప్రముఖుల చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నట్లు ఆయన తెలిపారు. -
యువత అవకాశాలు అందిపుచ్చుకోవాలి
కేయూ క్యాంపస్: సముద్రాంతర్భాగం నుంచి ఆకాశం వరకు అనేక అవకాశాలున్నాయని, విద్యార్థులు, యువత అందిపుచ్చుకోవాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి కోరారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో సోమవారం కేయూ ఆడిటోరియంలో రెండురోజులపాటు జరిగే రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల విద్యార్థుల సమ్మేళనం ప్రారంభ సభలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచంలోనే అత్యధిక యువత కలిగిన దేశం ఇండియా అన్నారు. ప్రపంచ అవసరాల దృష్ట్యా మన విద్యావ్యవస్థ ఉండాలన్నారు. ప్రస్తుతం 80లక్షల మంది విద్యార్థులకు లక్షమంది అధ్యాపకులు ఉన్నారన్నారు. పదేళ్లుగా యూనివర్సిటీల్లో నియామకాలు లేవనే విషయం వాస్తవమని, ప్రతీ విద్యార్థి, సంస్థలు కూడా నవీకరణ చెందాలన్నారు. రాబోయే కాలంలో దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో సుమారు 20 లక్షల కోట్ల ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయని, వాటిని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రపంచ గతిని మార్చేశక్తి భారతీయ యువతపై ఉందన్నారు. విప్లవాత్మక మార్పులను గమనిస్తూ తీర్చిదిద్దుకోవాలి.. దేశంలో విద్యావ్యవస్థలో వస్తున్న విప్లవాత్మక మార్పులను గమనిస్తూ విద్యార్థులు తమ భవిష్యత్ను తీర్చిదిద్దుకోవాలని కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డి కోరారు. యూనివర్సిటీలు సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సంస్థలతోపాటు ఇండస్ట్రీయల్ కంపెనీలతో ఎంఓయూలతో ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తాయన్నారు. జాతీయ విద్యావిధానం విద్యార్థులకు వరం.. విద్యారంగాన్ని ప్రక్షాళన చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో చేపట్టిన దీర్ఘకాలిక పోరాటాల ఫలితమే జాతీయ విద్యావిధానమని, ఇది నేడు దేశంలోని విద్యార్థులకు వరమని ఏబీవీపీ క్షేత్ర సంఘటన మంత్రి చిరిగే శివకుమార్ అన్నారు. ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు జానారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు, యూనివర్సిటీల హాస్టళ్ల కన్వీనర్ జీవన్, సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ నీతుసింగ్, కేయూ అధ్యక్షుడు హరికృష్ణ, ఏబీవీపీ తెలంగాణ ప్రాంత ప్రముఖ్ మాసాడిబాబురావు మాట్లాడారు. కేయూ ఇన్చార్జ్ నిమ్మల రాజేశ్, కార్యదర్శి జ్ఞానేశ్వర్, విద్యార్థులు పాల్గొన్నారు. బాలకిష్టారెడ్డి దృష్టికి వర్సిటీల్లోని సమస్యలు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి దృష్టికి వివిధ యూనివర్సిటీల విద్యార్థులు పలు సమస్యలు తీసుకెళ్లారు. హైదరాబాద్లోని కోఠి మహిళా యూనివర్సిటీలో అనేక సమస్యలున్నాయని, పరిష్కరించాలని ఆ యూనివర్సిటీ నేత సుమ, అలాగే, ప్రతీ యూనివర్సిటీలోనూ స్కిల్డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఓయూ విద్యార్థి రాజు, పాలమూరు, తెలంగాణ యూనివర్సిటీలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఆయా యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను బాలకిష్టారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయా సమస్యలు పరిష్కరించేలా తమవంతు కృషిచేస్తున్నామని బాలకిష్టారెడ్డి ఈసందర్భంగా తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి కేయూలో వర్సిటీల విద్యార్థుల సమ్మేళనం -
రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ పనులు వేగంగా పూర్తి
● టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డిహన్మకొండ: విద్యుత్ సబ్స్టేషన్ల రియల్ టైమ్ ఫీడర్ మానిటరింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 17 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలు, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 15లోపు హెచ్టీ సర్వీసులకు ఆటోమెటిక్ మీటర్ రీడింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ఇకపై కొత్తగా విడుదల చేసే సర్వీసులు కూడా ఆటో మేటిక్ మీటర్ రీడింగ్ ద్వారా పర్యవేక్షణలోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ డివిజన్లో హై–లాస్ ఫీడర్లను గుర్తించి వాటిని పరిశీలన చేసి పెట్రోలింగ్ నిర్వహించి నష్టాలకు కారణాలను విశ్లేషించి తగ్గించాలని సూచించారు. వచ్చే వేసవి అవసరాలను దృష్టిలో ఉంచుకుని పట్టణాల్లో లోడ్ పెరుగుదల అంచనాల మేరకు ఇప్పటి నుంచే సామర్థ్యం పెంపు, అప్గ్రేడేషన్ పనులు మొదలుపెట్టాలని ఆదేశించారు. సమావేశంలో డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ఈలు టి.సదర్ లాల్, కె.రాజు చౌహాన్, అశోక్, వెంకటరమణ, అన్నపూర్ణ, సురేందర్, సీజీఎంలు చరణ్ దాస్, కిషన్, జీఎంలు వేణు బాబు, కృష్ణమోహన్, వెంకట కృష్ణ, శ్రీనివాస్, వాసుదేవ్, నాగ ప్రసాద్, శ్రీకాంత్, సామ్య నాయక్, కళాధర్ పాల్గొన్నారు. -
.. అనే నేను
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ నెల 11,14, 17వ తేదీల్లో మూడు విడతలుగా నిర్వహించిన జీపీ ఎన్నికల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధులు సోమవారం ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో కొలువుదీరారు. మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామపెద్దలు, అనుచరగణంతో పంచాయతీ కార్యదర్శుల సమక్షంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ప్రమాణస్వీకారం చేసి పదవి బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే పలు చోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని 29 పంచాయతీల్లో అతిచిన్న వయసున్న సర్పంచ్గా వర్సా దీప రికార్డులోకెక్కాకారు. నామాలపాడు సర్పంచ్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థినిగా బరిలో దిగిన 24 సంవత్సరాల దీప ఎన్నికల్లో విజయం సాధించి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. తనపై నమ్మకంతో గ్రామస్తులు గెలిపించారని, గ్రామాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ● నెల్లికుదురు: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం నల్లగుట్ట తండా జీపీ సర్పంచ్గా 22 ఏళ్ల జి. హేమలత సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. గ్రామాభివృద్ధికి కృషి చేస్తానన్నారు.75 ఏళ్ల వయసులో సర్పంచ్లుగా.. జనగామ రూరల్: మండలంలోని ఎర్రగొల్లపహాడ్కు చెందిన చిర్ర సత్యనారాయణ రెడ్డికి 75 ఏళ్ల వయసులో సర్పంచ్గా అవకాశం లభించింది. 50 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఆయన ఇటీవల జరిగిన జీపీ ఎన్నికల్లో గెలుపొంది సర్పంచ్గా సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. అలాగే, గ్రామానికి చెందిన గుండెల్లి కల్పన రెండో సారి ఉప సర్పంచ్గా ప్రమాణస్వీకారం చేశారు. ● భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మండలం బావు సింగ్పల్లికి చెందిన పొనగంటి ముత్తమ్మ సర్పంచ్గా రెండో విడతలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 75 సంవత్సరాల వయసులో సోమవారం గ్రామ సర్పంచ్గా ప్రమాణస్వీకారం చేశారు. -
ప్రహరీ కూల్చివేత
వరంగల్ చౌరస్తా: వరంగల్ తూర్పులో ఓ అధికార పార్టీ నాయకుడు, విల్లా అసోసియేషన్ ప్రతినిధులు తమ పంతం నెగ్గించుకున్నారు. నిబంధనలకు తూ ట్లు పొడుస్తూ సోమవారం అత్యంత ప్రమాదకరమైన ఇంధన డిపో వైపు ప్రహరీ కూల్చేసి, గేట్ ఏ ర్పాటు చేశారు. ఆజంజాహీ మిల్లు మూతపడడంతో ఆస్థలంలోని 32.69 ఎకరాలను రాంకీ విల్లా ఇన్ ఫ్రా కొనుగోలు చేసి 239 విల్లాలను నిర్మించి విక్రయించారు. ఒప్పందంలో భాగంగా కొంత భాగాన్ని హౌజింగ్ బోర్డుకు కేటాయించారు. ఆ స్థలంలో జీ ప్లస్2 పద్ధతిలో భవనాలను 102 ప్లాట్లుగా హౌజింగ్ బోర్డు నిర్మించింది. వాటి అమ్మకానికి నోటిఫికేషన్ను తాజాగా జారీ చేసింది. నిబంధనలు తూచ్.. రాంకీ విల్లాస్లో ప్లాట్లను సంపన్నులు కొనుగోలు చేసి నివాసం ఉంటున్నారు. హౌజింగ్ బోర్డు నిర్మించి.. జీ–ప్లస్–2 భవనాలకు రాంకీ ప్రధాన రహదారి నుంచి రాకపోకలు సాగేలా రోడు నిర్మించారు. సంపన్నులు నివాసం ఉండే కాలనీలోకి హౌజింగ్ బోర్డు రహదారి నిర్మించడంపై ఓ అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుడు, విల్లాస్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి మాజీ ఎమ్మెల్సీని కలిసి విన్నవించగా.. రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మించగా, అదే రోజు హౌజింగ్ బోర్డు రాష్ట్ర ఉన్నతాధికారి ఆదేశంతో కూల్చేశారు. తాజాగా హౌసింగ్ బోర్డు జీ ప్లస్–2 ప్లాట్స్ను అల్పాదాయ వర్గాలకు లక్కీ డ్రా ద్వారా కేటాయిస్తామని నోటిఫికేషన్ జారీ చేశారు. విష యం తెలుసుకున్న నాయకుడు మరోమారు జిల్లా కు చెందిన మంత్రి దృష్టికి తీసుకెళ్లి ఇంధన డిపో వైపు ప్రహరీ కూల్చి భారీ గేట్ ఏర్పాటు చేశారు. ఇక హౌసింగ్ బోర్డు ప్లాట్స్ నివాసితులు అటువైపుగా రాకపోకలు సాగించాల్సి ఉంటుందని కాలనీవాసులకు ధీమా కల్పించారు. వీరు త్వరలో రాంకీ విల్లాస్ వైపు నడిచేందుకు వీలు లేకుండా ప్రహరీ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై హౌసింగ్ బోర్డు అధికారులను వివరణ కోరితే తమకు సమాచారం లేదని దాటవేయడం గమనార్హం. ఇంధన డిపో వైపు గేట్ ఏర్పాటు ఇదెక్కడి దౌర్జన్యం అంటున్న రాజకీయ పార్టీల నేతలు -
రాజకీయాలకతీతంగా అభివృద్ధి
హన్మకొండ అర్బన్ : రాజకీయాలకు అతీతంగా నగరంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు కృషి చేస్తున్నట్లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. సోమవారం నగరంలోని 7వ డివిజన్లో రూ.కోటితో సైడ్ డ్రెయినేజీ, కల్వర్టు నిర్మాణం, పబ్లిక్ గార్డెన్లో చిన్న పిల్లలకు ఆట వసతుల కల్పనకు మేయర్ గుండు సుధారాణితో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా కాకాజీ కాలనీలో డ్రెయినేజీ వ్యవస్థను పరిశీలించారు. వర్షాకాలంలో ప్రధానంగా డ్రెయిన్ ద్వారా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అనంతరం ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి నగరాభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. నియోజకవర్గ పరిధిలో గతంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు ఉన్న ఒక్కో వార్డుకు కనీసం రూ.50 లక్షలు పెట్టిన దాఖలాలు లేవని, నేడు ప్రతీవార్డుకు రూ.5కోట్ల పై మేర నిధులు కేటాయించి, పనులు పూర్తి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, యూత్ నాయకులు తోట పవన్, మాజీ కార్పొరేటర్ శేఖర్, సోమ నాగేశ్వర్ రావు, బిన్నీ లక్ష్మణ్, వాకర్ అసోసియేషన్ బాధ్యులు గాంధీ, తదితరులు పాల్గొన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి -
తప్పుడు కేసుల కలకలం!
వరంగల్ ఏసీపీగా పనిచేసిన నందిరాం నాయక్పై డీజీపీ వేటుసాక్షి,వరంగల్/రామన్నపేట: వరంగల్ కమిషనరేట్ పరిధిలో తప్పుడు కేసులతో పలువురు అధికారులపై వేటు పడడం కలకలం సృష్టించింది. వరంగల్ ఏసీపీగా పనిచేసిన సమయంలో తప్పుడు కేసుల నమోదులో ప్రమేయముందని తేలిన నందిరాం నాయక్ను రాష్ట్ర డీజీపీ శివధర్రెడ్డి సస్పెండ్ చేయడం పోలీస్శాఖ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆయనతోపాటు ప్రస్తుత వరంగల్ సీసీఎస్ సీఐ గోపీ, ఎస్ఐ విఠల్ కూడా మట్టెవాడ ఠాణాలో పనిచేసిన సమయంలో ఈ తప్పుడు కేసులు నమోదు చేసినట్లుగా ఫిర్యాదు రావడంతో విచారణ జరిపిన ఉన్నతాధికారులు నిజమని తేలడంతో మూడు రోజుల క్రితమే సస్పెండ్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు వెంకటేశ్వర్లుకు చెందిన భూవివాదాల కేసులో తప్పుడు కేసు నమోదుచేసినట్టుగా విచారణాధికారులకు స్పష్టమైన సాక్ష్యాలు దొరకడంతో ఈ ముగ్గురు అధికారులపై వేటుపడిందని పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదేవిధంగా కార్పొరేటర్ గుండేటి నరేందర్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు విషయంలోనూ వరంగల్ సబ్ డివిజన్లోని పోలీసులు అత్యుత్సాహం చూపడం అప్పట్లో రాజకీయ రగడ జరిగింది తెలిసిందే. వరంగల్ సబ్ డివిజన్లో అకారణంగా కొందరిని టార్గెట్గా చేసుకుంటూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారని, వీటిపై పునర్విచారణ చేయాలంటూ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య డీజీపీని కొద్దికాలం క్రితం కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఏసీపీ నందిరాం నాయక్ ఉన్న సమయంలో కొందరు పోలీసులపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. పరిధి దాటి వ్యవహరించారంటూ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఏసీపీ నందిరాం నాయక్ను డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేశారు. ఇతర అధికారులను వరంగల్ పోలీస్ కమిషనరేట్కు అటాచ్ చేసి అనంతరం వేర్వేరు ప్రాంతాల్లో పొస్టింగ్లు ఇచ్చారు. ఇదే సమయంలో తనకు జరిగిన అన్యాయంపై వెంకటేశ్ పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో అవి తప్పుడు కేసులని విచారణలో తేలింది. దీంతో అందుకు బాధ్యులైన అధికారులపై వేటు వేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ఇప్పటికే గతంలో సదరు ఏసీపీతో చనువుగా ఉన్న కొందరు అధికారుల్లో అలజడి మొదలైంది. ● వరంగల్ వాసి వెంకటేశ్వర్లు తనకున్న తిమ్మాపూర్లోని 28 ఎకరాల 24 గుంటల భూమిని రూ.1.50కోట్ల వరకు విక్రయిస్తానని చెప్పి, రూ.కోటి అడ్వాన్స్గా తీసుకొని, మిగిలిన డబ్బులు రిజిస్ట్రేషన్ సమయంలో ఇవ్వాలంటూ చెప్పాడని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన వి.మల్లేశ్ 2024లో మట్టెవాడ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. విక్రేత రిజిస్ట్రేషన్ చేయకుండా కావాలని మోసం చేసి, కొంతభూమి ఇతరులకు అమ్మి వారి ద్వారా తనకు లీగల్ నోటీసులు పంపించాడు. అదేవిధంగా భూముల ధరలు రెట్టింపైనా, ఇప్పుడు రూ.రెండు కోట్లు ఇవ్వాలంటూ చెయ్యి చేసుకున్నాడని, ఇవ్వకుండా ఏ సాక్ష్యం లేకుండా చంపుతానని బెదిరించాడని మల్లేశ్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. ● మా బంధువులు శేఖర్, శ్రీనివాస్ తన వద్ద భూమిని కొనుగోలు చేశారని, చింతల్లో తనకున్న 2,178 చదరపు గజాలు అమ్ముతున్నానని కొనాలంటూ సంప్రదించాడని, ఇది నిజమని నమ్మి గజానికి రూ.3,800 చొప్పున ఐదేళ్ల క్రితం అడ్వాన్స్గా రూ.10లక్షలు తీసుకొని వెంకటేశ్వర్లు మోసం చేశాడని వరంగల్ ఎల్బీనగర్కు చెందిన రవి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొన్ని రోజుల తర్వాత అతడికి ఏ భూమి లేదని తెలుసుకొని వెళ్లి నిలదీస్తే మరొక ప్రాంతంలో భూమి ఇస్తానన్నాడు. 2024 సెప్టెంబర్లో ఎంజీఎం మూడో గేట్ వద్దకు తన స్నేహితుడు జుపాక అనిల్తో కలిసి వచ్చి మిగిలిన నగదు ఇవ్వాలంటూ బెదిరించాడు. ఇలా రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంకటేశ్వర్లుపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ రెండు కేసుల్లోనూ వెంకటేశ్వర్లుపై కావాలనే కేసులు నమోదు చేసినట్లు గా పోలీసు విచారణలో తేలడంతో సదరు పోలీసు అధికారులపై డీజీపీ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. సీఐ గోపీ, ఎస్ఐ విఠల్ను కూడా సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు మట్టెవాడ స్టేషన్లో పనిచేసిన సమయంలో ఈ తప్పిదాలు తాజా చర్యలతో వరంగల్ సబ్ డివిజన్లో కొందరు అధికారుల ఉలికిపాటు -
వర్సిటీల సిలబస్ మార్చాలి
కేయూ క్యాంపస్: వర్సిటీలు పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా సిలబస్ మార్చాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ వి.బాలకిష్టారెడ్డి అన్నారు. సోమవారం కేయూలో నిర్వహించిన రెగ్యులర్ అధ్యాపకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సాధారణ విరామాలకు అనుగుణంగా సిలబస్లో మార్పులు చేయాలన్నారు. మల్టీ డిసిప్లిన్ అప్రోచ్ ఉండాలని, జాబ్ మార్కెట్కు తగినట్లుగా ఉండాలన్నారు. సీఎం రేవంత్రెడ్డి అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయస్సును 60 నుంచి 65 వరకు పెంచారన్నారు. అధ్యాపకుల నియామక ప్రక్రియ కూడా చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఫార్మసీలో బల్క్ డ్రగ్ మాన్యుఫ్యాక్చర్ యూనిట్స్తో ఎంఓయూ ఉందని, విద్యాభివృద్ధికి అధ్యాపకులు ప్రధాన భూమికగా వ్యవహరించాలన్నారు. అనంతరం రిజిస్ట్రార్ వి.రామచంద్రం మాట్లాడారు. అకుట్ అధ్యక్షుడు బి.వెంకట్రామ్రెడ్డి, ఫార్మసీ డీన్ గాదె సమ్మయ్య, కేయూ పాలక మండలి సభ్యులు బి.సురేశ్లాల్ పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. నిధులు కేటాయించాలని అకుట్ బాధ్యులు వినతిపత్రం అందించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి -
అంచనాలు సిద్ధం చేయండి
వరంగల్ అర్బన్: యూఐడీఎఫ్ (పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి) ద్వారా గ్రేటర్ వరంగల్లో సమర్థ నీటి సరఫరా కోసం అంచనాలు సిద్ధం చేయాలని మేయర్ గుండు సుధారాణి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం బల్దియా కార్యాలయంలో గ్రేటర్, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లతో ఆమె సమావేశమయ్యారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ప్రాజెక్ట్లో భాగంగా నగరంలో అదనపు పైప్లైన్లు, రిజర్వాయర్ల ఏర్పాటుతో పాటు స్కాడా సిస్టమ్ ఏర్పాటు చేయాలన్నారు. దీంతో పాటు ప్రతీ జోన్లో 24/7 నీటి సరఫరా జరిగేలా చర్యలు చేపట్టడానికి రూ.550 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నట్లు జరుగుతుందని పేర్కొన్నారు. గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలన్నారు. సమావేశంలో బల్దియా ఎస్ఈ సత్యనారాయణ, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ శ్రీనివాస్, ఈఈలు రవికుమార్, సంతోశ్బాబు, పబ్లిక్ హెల్త్ డీఈ మొజామిల్, డీబీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ అర్బన్ : కలెక్టరేట్లో ‘మీ డబ్బు – మీ హక్కు’ అనే అంశంపై ఈ నెల 24న శిబిరం నిర్వహించనున్నట్లు హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఆర్థిక శాఖ పరిధి ఆర్థిక సేవల విభాగం ఆధ్వర్యంలో అనుబంధంగా ఈ క్యాంపెయిన్ చేపట్టినట్లు తెలిపారు. ఈ నెల 31వ తేదీ వరకు ఈ క్యాంపెయిన్ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బ్యాంకు ఖాతాదారులు, బీమా, డివిడెండ్, మ్యూచువల్ ఫండ్, పీఎఫ్ ఖాతా, బాండ్ ఖాతా తదితర వాటికి సంబంధించి ఏళ్లుగా అన్ క్లెయిమ్డ్ (దావా చేయని) మొత్తాలు ఉన్నవారు వాటిని క్లెయిమ్ చేసుకునేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు. క్లెయిమ్ చేయని ఆస్తుల వివరాలు ఉద్గమ్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని, బ్యాంకు శాఖ, బీమా సంస్థ, మ్యూచువల్ ఫండ్ సంస్థ, స్టాక్ బ్రోకర్ లేదా ఆర్థిక సంస్థ ద్వారా స్టాక్ బ్రోకర్లో డివిడెండ్ పొందని వివరాలను కూడా తెలుసుకోవచ్చని తెలిపారు. ఈఅవకాశాన్ని అందరూ సద్విని యోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ట్రాన్స్జెండర్స్కు 100%సబ్సిడీతో పునరావాస పథకం కాజీపేట అర్బన్ : హనుమకొండ జిల్లాలోని ట్రాన్స్జెండర్లకు వందశాతం సబ్సిడీతో ఆర్థిక పునరావాస పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమాధికారి జయంతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన ఐదుగురు ట్రాన్స్జెండర్లకు ఒక్కొకరికి రూ.75వేల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు తెలిపారు. అర్హులైన ట్రాన్స్జెండర్లు ఈనెల 31వ తేదీలోపు హనుమకొండ కలెక్టరేట్లోని సీ్త్ర,శిశు సంక్షేమాధికారి కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని కోరారు. న్యూశాయంపేట : జిల్లాలోని అల్ప సంఖ్యాక వర్గాలు (ముస్లింలు, క్రైస్తవులు, బౌద్దులు, సిక్కులు, జైనులు, పార్శీలు) విదేశాల్లో పై చదువుల నిమిత్తం సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని హనుమకొండ జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి గౌస్హైదర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత గల విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులను వచ్చేనెల 19లోగా సమర్పించాలని కోరారు. పూర్తి వివరాలకు హనుమకొండ కలెక్టరేట్లోని జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి కార్యాలయ వేళలో సంప్రదించాలని సూచించారు. -
రామసక్కని నేలకు రామ్సర్
పచ్చందాలకు నిలయం పాకాల. ఇక్కడి జల సంపద మంత్రముగ్ధుల్ని చేస్తుంది. సహజంగా వినిపించే ప్రకృతి సంగీతం మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. బోటింగ్ రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రపంచంలోనే మంచినీటి సరస్సుగా పేరుగాంచిన ఈ ప్రాంతానికి మరికొద్ది రోజుల్లో అంతర్జాతీయ స్థాయి (రామ్సర్ సైట్గా) గుర్తింపు లభించనుంది. ఆ దిశగా సర్వేలు కొనసాగుతున్నాయి. – ఖానాపురంపాకాలలో ఏర్పాటుకు కసరత్తు నాలుగు దఫాలుగా పక్షులపై సర్వే మొదటి విడత పూర్తి గుర్తింపు లభిస్తే.. అంతర్జాతీయంగా ప్రతిష్ట ప్రత్యేక ప్రణాళికతో అభివృద్ధికి అడుగులు -
బాధితులు చట్టపరమైన సాయం పొందాలి
డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ జడ్జి నిర్మలాగీతాంబ కేయూ క్యాంపస్: లైంగిక వేధింపులకు గురైన బాధితులు భయపడకుండా చట్టపరమైన సాయం పొందాలని వరంగల్ డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ జడ్జి నిర్మలాగీతాంబ అన్నారు. కేయూ పరిపాలన భవనంలో యాంటీ సెక్సువల్ హరాస్మెంట్పై శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. రంగోళి పోటీలు, షార్ట్ఫిలిం పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం, టీషీం సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.సుజాత, కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ వి.శోభ తదితరులు పాల్గొన్నారు. వయోవృద్ధుల సంక్షేమానికి న్యాయసేవలు న్యూశాయంపేట: వయోవృద్ధుల సంక్షేమం కోసం సత్వర ఉచిత న్యాయసేవలు అందిస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలాగీతాంబ తెలిపారు. వరంగల్ ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో వృద్ధుల సంక్షేమం కోసం శనివారం ఏర్పాటు చేసిన న్యాయసేవల శిబిరాన్ని ప్రధాన న్యాయమూర్తి నిర్మలాగీతాంబ, వరంగల్ కలెక్టర్ సత్యశారద శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.సాయికుమార్, ఆర్డీఓ సుమ, డీఏఓ ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ: ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన వారి త్యాగాలు గుర్తించి, వారి సంక్షేమం కోసం తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో తెలంగాణ ఉద్యమకారుల సమావేశం నిర్వహించారు. జనవరి 4న సూర్యాపేటలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వేలాదిగా ఉద్యమకారులు తరలిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ కూరపాటి వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. న్యూశాయంపేట: ప్రభుత్వ భూముల వేలం నిలిపేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి టి.శ్రీనివాస్రావు డిమాండ్ చేశారు. హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం సీపీఐ, సీపీఎం హనుమకొండ జిల్లాల కమిటీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇందులో వామపక్ష పార్టీల, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర చైర్మన్ రిటైర్డ్ ప్రొఫెసర్ కూరపాటి వెంకట్నారాయణ, వామపక్ష నేతలు కె.భిక్షపతి, చుక్కయ్య, ఎన్.హంసారెడ్డి, అప్పారావు, రాజేందర్, శ్రీనివాస్, టి.భిక్షపతి, ఎల్లేశ్, రాజమౌళి, వెంకటరాజం, స్టాలిన్, చక్రపాణి, ఉప్పలయ్య, తిరుపతి, సంపత్, భానునాయక్ తదితరులు పాల్గొన్నారు. కాళోజీ సెంటర్: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణ అభివృద్ధి సంస్థ (సెర్ప్, డీఆర్డీఏ)లో పనిచేస్తున్న వరంగల్ జిల్లా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని డీఆర్డీఏ కార్యాలయంలో శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కందారి సారయ్య, కార్యదర్శిగా గుగులోతు వెంకన్న, ఉపాధ్యక్షులుగా గోలి కొమురయ్య, గుండేటి కుమారస్వామి, శారద, కోశాధికారిగా వనమ్మ, సహాయ కార్యదర్శులుగా రాజయ్య, సంపత్, యాకూబ్, కార్యవర్గ సభ్యుడిగా మెట్టు దాసు, సలహాదారులుగా అనిల్, రమేశ్, కందిక సుధాకర్ను ఎన్నుకున్నారు.


