breaking news
Hanamkonda District News
-
సీపీని కలిసిన ఏఎస్పీ
వరంగల్ క్రైం: వరంగల్ డివిజన్ నూతన ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టిన శుభం ప్రకాశ్ సోమవారం పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. పేదలకు సత్వరమే న్యాయం అందించేలా కిందిస్థాయి అధికారులపై పర్యవేక్షణ ఉంచాలని ఏఎస్పీకి సూచించారు. పరిశోధన కేంద్రంగా పింగిళి మహిళా కళాశాల కేయూ క్యాంపస్: హనుమకొండలోని ప్రభుత్వపింగిళి మహిళా కళాశాలను రీసెర్చ్సెంటర్గా గుర్తించారు. ఈమేరకు హిస్టరీ విభాగం పరిశోధనకు పర్యవేక్షకులుగా ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ కొలిపాక శ్రీనివాస్, డాక్టర్ ఎల్.ఇందిరను నియమించినట్లు కేయూ సోషల్ సైన్స్ డీన్, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి.మనోహర్ సోమవారం వెల్లడించారు. వీరిని కళాశాల ప్రిన్సిపాల్ లెఫ్టినెంట్ ప్రొఫెసర్ బి.చంద్రమౌళి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుహాసిని, అధ్యాపకులు అభినందించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ డాక్టర్ కోల శంకర్ పాల్గొన్నారు. నేటి నుంచి టికెట్ రిజర్వేషన్కు ఆధార్ తప్పనిసరికాజీపేట రూరల్: భారతీయ రైల్వే జూలై 1 నుంచి ట్రైన్ టికెట్ బుక్ చేసుకునేందుకు ఆధార్కార్డు తప్పనిసరి అని ఉత్తర్వులు జారీ చేసినట్లు సోమవారం రాత్రి స్థానిక రైల్వే అధికారులు తెలిపారు. జూలై 1 నుంచి ఆన్లైన్ టికెట్ విధానంలో, జూలై 15 నుంచి రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో టికెట్ రిజర్వేషన్ చేసుకునే వారు తప్పకుండా ఆధార్ జత చేయాలని పేర్కొన్నారు. వారి ఫోన్ నంబర్ కూడా ఆధార్కు లింక్ అయ్యి ఉండాలని రైల్వే శాఖ ఉత్తర్వులు అమలు చేసినట్లు తెలిపారు. కలెక్టర్ను కలిసిన ప్రభుత్వ ప్రత్యేక పీపీవరంగల్ లీగల్: హనుమకొండ జిల్లా ప్రభుత్వ ప్రత్యేక ప్లీడర్గా నియమితులైన ఎడవల్లి సత్యనారాయణ సోమవారం హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. కార్యక్రమంలో హనుమకొండ జిల్లా పీపీ నర్సింహారావు, ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ కమ్ లేబర్ కోర్టు అదనపు ప్రభుత్వ ప్లీడర్ నూకల వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. నేడు తూమాటి దొణప్ప శతజయంత్యుత్సవాలుహన్మకొండ కల్చరల్: ఆచార్య తూమాటి దొణప్ప శతజయంతి కమిటీ, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం తెలుగు విశ్వవిద్యాలయం తొలి ఉపాధ్యక్షులు దొణప్ప శతజయంత్యుత్సవాలు నిర్వహిస్తున్నట్లు జానపద గిరిజన విజ్ఞానపీఠం పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న తెలిపారు జిల్లా కవులు, సాహితీవేత్తలు పాల్గొనవలసిందిగా కోరారు. -
వినతుల పరిష్కారంలో జాప్యం చేయొద్దు
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో స్వీకరించిన అర్జీల పరిష్కారంలో అధికారులు జాప్యం చెయొద్దని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ నేరుగా పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ప్రజావాణి వినతుల్ని త్వరగా పరిష్కరించుకోవాలని, వచ్చిన వినతులపై తక్షణమే చర్యలు చేపట్టాలని జిల్లాలోని పలువురు తహసీల్దార్లను వీడియో కాన్ఫరెన్స్లో ఆదేశించారు. ప్రజావాణిలో వివిధ శాఖలకు మొత్తం 176 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వైవీ గణేశ్, ఆర్డీఓలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సమస్యలు త్వరగా పరిష్కరించాలి.. వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 130 వినతులు రాగా.. దరఖాస్తులను ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ భూమిని కాపాడాలి వరంగల్లోని 13వ డివిజన్ దేశాయిపేట సీకేఎం కళాశాల గ్రౌండ్ను ఆనుకుని 2 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ భూమిని కాపాడాలి. – జన్ను అనిల్కుమార్, వరంగల్ -
వెల్లువెత్తిన వినతులు
వరంగల్ అర్బన్ : ‘మా సమస్యలు అంటే బల్దియా అధికారులకు, సిబ్బందికి చులకనైంది’అని పలు కాలనీల ప్రజలు సోమవారం గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్ సెల్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యలపై పలుమార్లు ఫిర్యాదులు చేస్తున్నా పరిష్కారం కావడం లేదని, ఈ వినతుల స్వీకరణ ఎందుకు? అంటూ నిరసన వ్యక్తం చేశారు. భారీగా చేరుకున్న ఫిర్యాదుదారులతో బల్దియా కార్యాలయం అంతా కిక్కిరిపోయింది. కమిషనర్ చాహత్ బాజ్పాయ్, వింగ్ అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ప్రతి దరఖాస్తును నిశితంగా పరిశీలించి, ప్రతీ వినతిపై వివరణాత్మక నివేదిక అందించాలని కమిషనర్.. అధికారులకు సూచించారు. జవాబు దారీగా ఉండాలని ఆదేశించారు. గ్రీవెన్స్సెల్కు మొత్తం 109 ఫిర్యాదులు రాగా, అందులో ఇంజనీరింగ్ సెక్షన్కు 26, హెల్త్ – శానిటేషన్ 14, ప్రాపర్టీ టాక్స్(రెవెన్యూ)13, టౌన్ ప్లానింగ్ 49, మంచినీటి సరఫరా 6, హార్టికల్చర్ 1 నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ జోనా, సీఎంహెచ్ఓ డా.రాజారెడ్డి, డీఎఫ్ఓ శంకర్ లింగం, ఇన్చార్జ్ ఎస్ఈ మహేందర్, సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, హెచ్ఓలు రమేష్, లక్ష్మారెడ్డి, డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, ఎంహెచ్ఓ డా.రాజేశ్, హెచ్ఓ రమేశ్ పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని ఇలా.. ● వరంగల్ పాతబీట్ బజార్లో వర్షపునీరు, మురుగు నీటితో పాదచారులు, వ్యాపారులు, కార్మికులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, శాశ్వత పరిష్కారం చూపించాలని వ్యాపారులు కోరారు. ● మడికొండ మా హిల్స్ కాలనీలో ప్రభుత్వ రహదారిని ఆక్రమించి చేపట్టిన పనులు వెంటనే నిలిపేసి, చర్యలు తీసుకోవాలని సుమారు 60 మంది కాలనీవాసులు బల్దియా ఎదుట నిరసన వ్యక్తం చేసి, వినతిపత్రం అందజేశారు. ● రంగశాయిపేట 19–1–146 పాడుబడిన భవనం, సమీపంలోని ఖాళీ స్థలాల్లో చెట్లు, చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తోందని కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. ● వరంగల్ డాక్టర్స్ కాలనీ హనుమాన్ నగర్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణానికి నిధులు మంజూరైనా పట్టించుకోడం లేదని, తాగునీటి పైపులైన్లు ఏర్పాటు చేయాలని కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ● దేశాయిపేట సర్వేనంబర్ 326లో 20 గుంటల స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, చర్యలు తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ● 45వ డివిజన్ కుమ్మరిగూడెం బల్దియా 13వ ఫైనాన్స్ నిధులతో సీసీ రోడ్డు నిర్మించారని, 2 ఫీట్లు పగులగొట్టి పైపులైన్ వేశారని, ఆ స్థలాన్ని సమీప ఇళ్లవాసులు ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారని, చర్యలు తీసుకోవాలన్ని విన్నవించారు. ● రంగశాయిపేటలో ఖాళీ స్థలాల్లో దోమలు వృద్ధి చెందుతున్నాయని, విషజ్వరాల బారిన పడుతున్నామని కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. ● హనుమకొండ అశోక కాలనీలో సెల్ టవర్కు అనుమతులు రద్దు చేయాలని కాలనీ డెవలప్మెంట్ కమిటీ ప్రతినిధులు విన్నవించారు. ● కాజీపేట కడిపికొండ బ్రిడ్జికి ఎదురుగా గల్లీలో డ్రెయినేజీ నీరు రోడ్డుపై పారుతోందని, చర్యలు తీసుకోవాలని కమిషనర్కు విన్నవించారు. ● గోపాలపురం అరుణోదయ కాలనీలో హై టెన్షన్ వైర్ల కింద భవన నిర్మాణం చేపడుతున్నారని, గతేడాది ఓ వ్యక్తి మృతి చెందాడని నిబంధన మేరకు నిర్మాణం చేపట్టడం లేదని, చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. ● రంగశాయిపేట శంభునిపేట జంక్షన్లో సులభ్ కాంప్లెక్స్ నిర్మించాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. ● 31వ డివిజన్ హంటర్ రోడ్డు హిల్స్లో సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మించాలని స్థానికులు వినతి పత్రం అందించారు. ● 2వ డివిజన్ రెడ్డికాలనీలో 33 ఫీట్ల రోడ్డు ఉందని, కొలతలను పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టారాజ్యంగా నిర్మిస్తున్నట్లు, నిబంధనల మేర చేపట్టాలని కాలనీవాసులు విన్నవించారు. ● భీమారం శ్యామల చెరువు మత్తడి 33 ఫీట్ల మేరకు ఉండగా, చాలావరకు కబ్జాకు గురైందని, వర్షం వస్తే ఇళ్లల్లోకి నీళ్లు వస్తున్నాయని, ఆక్రమణలను తొలగించాలని కాలనీవాసులు కోరారు. ● 65వ డివిజన్ ఎల్లాపూర్లోని ప్రభుత్వ స్థలంలో ఓ వ్యక్తి ఇష్టారాజ్యంగా భవనాలను నిర్మిస్తునారని, చర్యలు తీసుకోవాలని స్థానికులు వినతిపత్రం అందజేశారు. ● 48వ డివిజన్ దర్గా కాజీపేటలో రోడ్డును ఆక్రమించి నిర్మించిన కారు షెడ్డును తొలగించాలని కాలనీవాసులు విన్నవించారు. ● న్యూశాయంపేటలో బీజేపీ ఆఫీస్ వెనుక సీసీ రోడ్లు, డ్రెయినేజీలు వీధిలైట్లు ఏర్పాటు చేయాలని స్థానికులు వినతిపత్రం అందించారు. ● హనుమకొండ కాంగ్రెస్ భవన్నుంచి బుద్ధభవన్కు వెళ్లే దారిలో డ్రెయినేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని స్థానికులు కోరారు.కిటకిటలాడిన గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్ సెల్ పరిష్కారం చూపకపోతే ఎందుకు స్వీకరిస్తున్నారని ఆందోళన దరఖాస్తులను స్వీకరించిన కమిషనర్ చాహత్ బాజ్పాయ్, వింగ్ అధికారులు -
వైద్యచికిత్సతోపాటు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్న ‘వంగర’ వైద్యురాలు
మంగళవారం శ్రీ 1 శ్రీ జూలై శ్రీ 2025హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర పీహెచ్సీ నిత్యం గర్భిణులు, మహిళలు, రోగులతో నిండిపోయి ఉంటుంది. ఇక్కడ వైద్యం కోసం వారంతా గంటల తరబడి ఎదురుచూస్తుంటారు. అందుకు కారణం అక్కడి వైద్యురాలు రుబీనా. ఆమె కేవలం చికిత్సలు అందించడమే కాకుండా జబ్బు రావడానికి కారణాలు. ఎలా చేస్తే ఆరోగ్యంగా ఉండగలం అని రోగులకు విడమర్చి చెబుతున్నారు. పేదల కష్టాలను దగ్గర్నుంచి చూశారు. వారి జబ్బులకు కారణం తెలుసుకున్నారు. వారి ఆర్థిక వెనుకబాటుకు అనారోగ్యమే కారణమని గ్రహించారు. ఆరోగ్యం అందరి ప్రాథమిక హక్కు అని చెప్పాలనుకున్నారు. అందుకే ఆమె డాక్టరయ్యారు. అనా రోగ్యంతో వచ్చిన రోగికి వైద్యమందించడమే కాదు.. వారికి అవగాహన కల్పిస్తే మరోసారి అనారోగ్యం బారిన పడరని అవగాహన కల్పించడం మొదలు పెట్టారు.ఇందుకోసం సొంతఖర్చులతో లైబ్రరీ ఏర్పాటుచేశారు. ఫలితంగా ఇప్పుడా ప్రభుత్వ వైద్యురాలి వద్దకు ప్రజలు క్యూ కడుతున్నారు. నేడు (మంగళవారం) నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా పేదల ఆరోగ్య నేస్తం వంగర పీహెచ్సీ వైద్యురాలు సయ్యద్ రుబీనాపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.ప్రజల ఆరోగ్యమే నా కర్తవ్యం ఉద్యోగాన్ని బాధ్యతగా భావిస్తున్నా. తెలంగాణ ఫార్మేషన్ డే రోజు టీబీ మీద, డ్రగ్స్ మీద పరేడ్ గ్రౌండ్లో మేం చేసిన స్కిట్కు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అయితే వ్యాధులపై అవగాహన సాధారణంగా చెప్పకుండా స్కిట్ల ద్వారా, పాటల ద్వారా అవగాహన కల్పిస్తే ప్రజల్లోకి వెళ్తుందని నమ్ముతున్నా. ఇప్పుడు నా పీహెచ్సీ పరిధిలో 27,000 పాపులేషన్ ఉంది. వారు ఆరోగ్యంగా ఉండడమే నా కర్తవ్యం. – రుబీనా, పీహెచ్సీ వైద్యురాలు, వంగర వంగర పీహెచ్సీలో వైద్యఆరోగ్య పుస్తకాలు చదువుతున్న మహిళలు, లైబ్రరీలోని పుస్తకాలునవజాత శిశువుతో డాక్టర్ రుబీనా (ఫైల్)ఆరోగ్య విద్య.. పుస్తక పఠనం వంగర పీహెచ్సీ వైద్యురాలిగా చేరిన తర్వాత ఆస్పత్రికి వచ్చే రోగులకు, గర్భిణులకు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధకనబర్చడం మొదలెట్టారు. సమీప గ్రామాల్లో క్యాంపులు పెట్టి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. టీబీ, షుగర్, బీపీ వంటి వ్యాధులపై వందల సంఖ్యలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్ర భుత్వ పాఠశాలల్లో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య కార్యకర్తల ద్వారా గర్భం దాల్చిన మహిళల్ని కలిసి ప్రైవేట్కు వెళ్లకుండా పీహెచ్సీలో పరీక్షలు చేయించుకునేలా, ప్రసవం చేయించుకునేలా ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కల్పిస్తున్నారు. ఫలితంగా వంగర పీహెచ్సీకి రోజూ దాదాపు 70 నుంచి 100 మంది ఓపీ చూపించుకుంటున్నారు. డాక్టర్ కోసం వేచి ఉన్న సమయంలో పేషెంట్లతో పుస్తకాలు చదివిస్తున్నారు. ఇందుకోసం లై బ్రరీ ఏర్పాటుచేశారు. ఆమె సొంత ఖర్చులతో హెల్త్ గైడ్, హెల్త్ కేర్, ఆరోగ్య వ్యాయామ విద్య, ఆరోగ్య నిధి, ఆ రోగ్య విజ్ఞాన శాస్త్రం, యోగా, వంటిల్లే వైద్యశాల వంటి పుస్తకాలను కొనుగోలు చేసి రోగులతో చదివిస్తున్నారు. ● పలు గ్రామాల్లో సదస్సుల నిర్వహణ.. ● ఆరోగ్యకేంద్రంలో సొంతంగా ఆరోగ్య పుస్తకాలతో లైబ్రరీ ఏర్పాటు ● ఆస్పత్రికి వచ్చే మహిళలు, గర్భిణులతో పుస్తక పఠనం.. నేడు జాతీయ వైద్యుల దినోత్సవంఅనారోగ్యంతో వచ్చినవారికి మందులిచ్చి పంపించడం అందరూ చేస్తుంటారు. కానీ అనారోగ్యానికి కారణాలు. మరోసారి అలా చేయకుండా ఉండేందుకు జాగ్రత్తలు చెబితే ఆ వైద్యుల్ని ఎవరైనా మరిచిపోతారా? అచ్చం రుబీనా అదే పద్ధతి ఫాలో అవుతున్నారు. వచ్చిన వారికి తన పరిధిలో పూర్తి సాయం చేస్తున్నారు. ఒక ఇంట్లోని మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ ఇళ్లంతా బాగుంటుందని ఆమె నమ్ముతారు. అందుకని ముఖ్యంగా మహిళా సంబంధిత అనారోగ్య సమస్యలపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. వారిని ఎడ్యుకేట్ చేస్తూ మందులిస్తున్నారు. కేన్సర్పై అవగాహన సదస్సులో మాట్లాడుతున్న డాక్టర్ రుబీనా– సాక్షి, వరంగల్ డెస్క్అవగాహనే కొండంత అండ.. -
కమర్షియల్ యూజర్ చార్జీలపై నిర్లక్ష్యమెందుకు?
● సీరియస్గా ఫోకస్ పెట్టండి ● అధికారులకు వార్నింగ్ ఇచ్చిన బల్దియా కమిషనర్ వరంగల్ అర్బన్: నగరంలో కమర్షియల్ యూజర్ చార్జీల విధింపులు, వసూళ్లపై ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ.. గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అధికారులకు సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘మామూళ్ల మత్తు’ వార్తకు స్పందించిన కమిషనర్ ఉదయమే బల్దియా వింగ్ అధికారుల వాట్సాప్ గ్రూప్లో వార్త క్లిప్పింగ్ను షేర్ చేశారు. అనంతరం బల్దియా సీఎంహెచ్ఓ రాజారెడ్డి, హెచ్ఓ రాజేశ్తో కమిషనర్ సమావేశమయ్యారు. నగరంలోని వాణిజ్య సంస్థలు, వసూలు చేస్తున్న యూజర్ చార్జీలు, పరిధిలోకి రాని సంస్థలపై వివరణ అడిగారు. ఈసందర్భంగా కమిషనర్ పలు సూచనలిచ్చారు. త్వరితగతిన యూజర్ చార్జీల పరిధిలోకి వచ్చే వాణిజ్య సంస్థలన్నీంటినీ గుర్తించి చార్జీలు వసూలు చేయాలన్నారు. ప్రతి నెలా వసూలు చేయాలని ఆదేశించారు. అదే విధంగా ప్రతీ సంస్థ నుంచి చెత్తను విధిగా వాహనాల్లో సేకరించి తరలించాలని ఆదేశించారు. ఈవిషయంలో ఏమాత్రం జాప్యం చేయవద్దని కమిషనర్ హెచ్చరించారు. -
ప్రతీ పేదోడికి సొంతిల్లు
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హన్మకొండ/హన్మకొండ చౌరస్తా: ప్రతీ పేదోడికి సొంతిల్లు నిర్మించి ఇవ్వడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండలోని అంబేడ్కర్ భవన్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 800 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు హనుమకొండ అడిషనల్ కలెక్టర్ వెంకట్రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ప్రొసీడింగ్స్ అందించారు. ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు కాగా.. ఇప్పటివరకు 2 వేల మందికి ప్రొసీడింగ్స్ అందించామన్నారు. త్వరలో 1,500 మందికి ప్రొసీడింగ్స్ అందించనున్నట్లు చెప్పారు. ఇళ్ల మంజూరు కోసం ఎవరికై నా లంచం ఇస్తే ఇళ్లు రద్దు చేస్తామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రవీందర్, హౌసింగ్ కార్పొషన్ పీడీ సిద్ధార్థ నాయక్, కార్పొరేటర్లు వేముల శ్రీనివాస్, తోట వెంకటేశ్వర్లు, విజయశ్రీ రజాలీ, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ తదితరులు పాల్గొన్నారు. ఆదర్శంగా కేంద్రం కులగణన.. తెలంగాణ రాష్ట్ర సర్కారును ఆదర్శంగా తీసుకుని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కులగణనకు శ్రీకారం చుట్టిందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. హనుమకొండలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 4వ తేదీన హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే గ్రామస్థాయి కార్యకర్తల సమ్మేళనానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వస్తున్నారన్నారు. సభకు గ్రామ, మండల, జిల్లా స్థాయి నుంచి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. పీసీసీ ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శులు దుద్దిళ్ల శ్రీనివాస్, పల్లె శ్రీనివాస్గౌడ్, మోత్కూరి ధర్మారావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, వీసం సురేందర్రెడ్డి, డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
‘పంచాయతీ’కి ముందస్తు ఏర్పాట్లు
హన్మకొండ అర్బన్: ఇటీవల రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ మేరకు జిల్లా స్థాయిలో గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు ముందుకు సాగుతున్నారు. తాజా లెక్కల ప్రకారం జిల్లాలో 210 గ్రామపంచాయతీలు, 12 మండల పరిషత్లు, 1,986 వార్డులు, అంతే సంఖ్యలో పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ లెక్కలను కలెక్టరేట్లోని జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో అధికారులు సరిచేస్తున్నారు. గ్రామస్థాయి నుంచి పంచాయతీ కార్యదర్శులకు ఫోన్లు చేసి అవసరమైన సమాచారం సేకరిస్తున్నారు. మొత్తం ఓటర్లు 3,72,646 జిల్లాలోని గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 3,72,646 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,81,772 మంది పురుషులు, 1,90,872 మంది మహిళలు, ఇతరుల కేటగిరీలో ఇద్దరు ఓటర్లుగా నమోదై ఉన్నారు. గ్రామాల్లో 1,169 పోలింగ్ కేంద్రాల్లో 200కంటే తక్కువ మంది ఓటర్లు ఉన్నారు. 755 పోలింగ్ కేంద్రాల్లో 201నుంచి 400 మంది ఓటర్లు ఉన్నారు. 62 కేంద్రాల్లో 401 నుంచి 650 మంది వరకు ఉన్నారు. మొత్తం 1,986 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. కాగా ఇప్పటికే బ్యాలెట్స్ ప్రింటింగ్, ఇతర స్టేషనరీ సిద్ధంగా ఉంది. జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీరమాకాంతం ఆదేశాలతో కార్యాలయ సిబ్బంది ఎన్నికలకు సంబంధించి ముందస్తు పనులు చేస్తున్నారు. ఈ విషయమై అధికారులను సంప్రదించగా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రానప్పటికీ, ముందస్తుగా పనులు చేస్తున్నట్లు తెలిపారు. -
కొత్త మెనూ.. కడుపునిండా తిను!
కాజీపేట: విద్యార్థుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది. ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేసే ఆలోచనలతో నూతన సంస్కరణల దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా కస్తూ ర్బా గాంధీ బాలికల విద్యాలయాలపై ప్రత్యేక దృష్టి సారించింది. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేసింది. కస్తూర్బా ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నూతన ఆహార పట్టిక అమలు చేయాలని ఆదేశాలను జారీ చేసింది. వారంలో అయిదు సార్లు కోడిగుడ్లు, నెలలో రెండు సార్లు మాంసం, రోజూ నెయ్యి వడ్డించాలని నిర్ణయించారు. నూతన వంటకాల తయారీకి అనుగుణంగా వంట మనుషులకు విద్యాశాఖ అధికారులు తగిన శిక్షణ ఇప్పించారు. పెరిగిన మెస్ చార్జీలు హనుమకొండ జిల్లాలో 9 కేజీబీవీలున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో సరికొత్త రుచులతో వంటకాలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా మెస్చార్జీలను పెంచింది. గతంలో ఒక్కో విద్యార్థికి నెలకు మెస్ ఛార్జీ రూ.1,225 ఉండేది. ప్రస్తుతం రూ.1,740కి పెంచింది. పర్యవేక్షణతో అమలు ప్రభుత్వం ప్రత్యేక చొరవతో నూతన మెనూను రూపొందించింది. దీని అమలుకు కార్యాచరణ అమలుకు ఆదేశాలను జారీ చేసింది. జిల్లా, మండల అధికారులు తరచూ ఆకస్మిక తనిఖీలు చేస్తేనే కొత్త ఆహార పట్టిక అమలకు నోచుకుంటుందని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. కస్తూర్బా ఆశ్రమ పాఠశాలల్లో నాణ్యమైన ఆహారంమెనూ ఇలా.. ఉదయం: అల్పాహారంలో టమాటా కిచిడీ, రాగిజావ, ఇడ్లీ, సాంబర్, పాలు (బూస్ట్), పూరి, పులిహార, బోండా, ఉప్మా, చపాతీ, జీరా రైస్, అరటి పండు ఇవ్వాలి. మధ్యాహ్నం: అన్నంతో పాటు టమాటా పప్పు, నెయ్యి, రసం, పెరుగు, ఉడికించిన గుడ్డు, చికెన్, మటన్ ఇవ్వాలి. సాయంత్రం: ఉడికిన పెసలు, శనగలు, ఎగ్బజ్జీ, బెల్లం పల్లీలు, అల్లం చాయ్, మిల్లెట్ బిస్కెట్లు, పకోడి రాత్రి: అన్నంతో పాటు వివిధ రకాల కూరలు, సాంబర్, మజ్జిగ ఇవ్వాల్సి ఉంటుంది. -
మీసేవ ఆపరేటర్ల సమస్యల పరిష్కారానికి కృషి
● తెలంగాణ మీసేవ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బైరి శంకర్ హన్మకొండ: మీసేవ ఆపరేటర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలంగాణ మీసేవ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బైరి శంకర్ అన్నారు. హనుమకొండ కేఎల్ఎన్రెడ్డి కాలనీలోని రాధ గ్రాండ్ బాంక్వెట్ హాల్లో ఆదివారం జరిగిన తెలంగాణ మీసేవ హనుమకొండ జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసిన తర్వాత తహసీల్దార్ కార్యాలయాల్లో ఎలాంటి దరఖాస్తు చేయకూడదని సూచించారు. అనంతరం తెలంగాణ మీసేవ ఫెడరేషన్ హనుమకొండ జిల్లా కమిటీని ప్రకటించారు. అధ్యక్షుడిగా దేశిని రమేశ్, ప్రధాన కార్యదర్శిగా జక్కు రాజు, కోశాధికారిగా పేరాల సురేందర్, ఉపాధ్యక్షులుగా మాడిశెట్టి శ్యాంప్రసాద్, కొయ్యడ శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులుగా గుగులోత్ సతీశ్, గజ్జెల రమేశ్, సంయుక్త కోశాధికారులుగా నాంపల్లి ఆంజనేయులు, బండి కిరణ్కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా పుల్లూరు సునీల్, చెన్న విద్యాసాగర్, మీడియా ఇన్చార్జ్లుగా వేముల రాజేందర్, గూడూరు అనిల్కుమార్, మహిళా కోఆర్డినేటర్లుగా సామల రమాదేవి, కట్ల మమత, అధికార ప్రతినిధిగా చాట్ల రాజు ఎన్నికయ్యారు. సర్వసభ్య సమావేశానికి హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు బైరి శంకర్ను నూతన కార్యవర్గం సన్మానించింది. -
స్ట్రీట్ వెండర్లకు అండగా నిలుస్తాం..
వరంగల్ అర్బన్: స్ట్రీట్ వెండర్లకు అండగా నిలుస్తామని నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి హామీ ఇచ్చారు. బల్దియా, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) సంయుక్త ఆధ్వర్యాన ఆదివారం భద్రకాళి బండ్లో ఏర్పాటు చేసిన స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్(వీధి ఆహార విక్రయాదారుల వంట కళల ప్రదర్శన, అమ్మకం) కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. మధ్యాహ్నం 3 గంటలకు మొదలై రాత్రి 10 గంటల వరకు జరగాల్సిన కార్యక్రమం వివిధ కారణాలు, వర్షం కారణంగా 6 గంటలకు ప్రారంభమై రాత్రి 8.30 గంటలకు ముగిసింది. ఈసందర్భంగా మేయర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్ట్రీట్ వెండర్స్ గ్రూపులుగా ఏర్పడితే బ్యాంకు రుణాలను ఎలాంటి గ్యారెంటీ లేకుండా అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ప్రభుత్వం పేద వర్గాలను అన్ని రకాలుగా ప్రోత్సహించేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ఈసందర్భంగా 30 స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయగా.. శుచి, శుభ్రత బాగుందని హాజరైన నగర ప్రజలు, అతిథులు అభినందించారు. కార్యక్రమంలో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) చైర్మన్ ఇనగాల వెంకట్రామ్రెడ్డి, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్, మెప్మా స్టేట్ కో–ఆర్డినేటర్ కృష్ణ చైతన్య, బల్దియా అడిషనల్ కమిషనర్ జోనా, డిప్యూటీ కమిషనర్లు ప్రసూనరాణి, రవీందర్, రాజేశ్వర్రావు, సీఎంహెచ్ఓ రాజారెడ్డి, టీఎంసీ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. గ్రూపులకు బ్యాంకు రుణాలు ఇప్పిస్తాం ఫుడ్ ఫెస్టివల్లో మేయర్, ఎమ్మెల్యే -
మామూళ్ల మత్తు
సోమవారం శ్రీ 30 శ్రీ జూన్ శ్రీ 2025టీచర్లకు బదిలీలు, పదోన్నతులు చేపట్టాలివిద్యారణ్యపురి: టీచర్లకు బదిలీలు, పద్నోతుల ప్రక్రియ చేపట్టాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.సోమశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండలోని సంఘం కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు సీహెచ్. రవీందర్రాజు ఆధ్వర్యాన నిర్వహించిన జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుల ఉద్యోగ విరమణతో అనేక పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఏర్పడిందని, భర్తీ చేసేందుకు వెంటనే బదిలీ లు, పదోన్నతులు చేపట్టాలన్నారు. పెండింగ్లో ఉన్న కరువుభత్యం విడుదల చేయాలని, సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెండెం రాజు, ఉపాధ్యక్షులు వి.రాజారామ్, జ్యోతి, కార్యదర్శులు సీఎస్ఆర్.మల్లిక్, కె.సదా నందం, ఎం.ప్రసన్నానంద్, కె.శశిధర్రెడ్డి, ఆడిట్ కమిటీ కన్వీనర్ జి.భాస్కర్రావు, బాధ్యులు ఎ.బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు. నేడు ‘డయల్ యువర్ డీఎం’హన్మకొండ: మెరుగైన సేవలు అందించేందు కు ప్రయాణికుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ఈనెల 30న ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్ర మం నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ హనుమకొండ డిపో మేనేజర్ భూక్యా ధరంసింగ్ తెలిపారు. ఉదయం 11నుంచి 12గంటల వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో జమ్మికుంట, వేలేరు, ఐనవోలు, పర్వతగిరి, సంగెం, ఖిలా వరంగల్, హనుమకొండ, హసన్పర్తి, కమలాపూర్, వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంత ప్రయాణికులు 89777 81103 నంబర్కు ఫోన్ చేసి సమస్యలు వివరించడంతోపాటు, సలహా లు, సూచనలు ఇవ్వాలని ఒక ప్రకటనలో కోరారు. డాక్టర్ వేణుకు అవార్డు గీసుకొండ: గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారానికి చెందిన హైదరాబాద్ ఉస్మానియా జనరల్ ఆస్పత్రి అసోసియేట్ ప్రొఫెసర్ (జనరల్ సర్జన్) డాక్టర్ గాదె వేణు రాష్ట్రీయ సేవా జాతీయ అవార్డు–2025ను అందుకున్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆసియా వేదిక్ ఇంటర్నేషనల్ కల్చర్ అండ్ రీసెర్చ్ స్ఫూర్తి అకాడమీ వారు ఈ అవార్డును ఆయనకు అందించి సన్మానించారు. డాక్టర్ వేణు నిరుపేద కుటుంబంలో పుట్టి ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం చదువుకున్నారు. ఆ తర్వాత ఎంబీబీఎస్, ఎంఎస్ పూర్తి చేశారు. గతంలో ఆయన వరంగల్ ఎంజీఎం, ఆదిలాబాద్, వరంగల్లోని పలు ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్సీల్లో వైద్యసేవలు అందించారు. తన స్వగ్రామంలో ప్రజలకు ఉచిత వైద్యసేవలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. జిల్లాలో మోస్తరు వర్షంహన్మకొండ: హనుమకొండ జిల్లాలో ఆదివారం మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. నెల రోజులుగా వర్షాభావ పరిస్థితుల కారణంగా మెట్ట పంటల మొలకలు వాడిపోతున్న క్రమంలో కురిసిన వర్షం జీవం పోసింది. రాత్రి 10 గంటల వరకు ఆటోమెటిక్ వెదర్ స్టేషన్లో నమోదైన వర్షపాతం వివరాలను ప్రణాళిక శాఖ విడుదల చేసింది. దామెర మండలం పులుకుర్తిలో 38.5 మిల్లీమీ టర్లు, వరంగల్ పైడిపల్లి 34.5, కమలాపూర్ 30.8, శాయంపేట 29.3, వేలేరు 28.3, హసన్పర్తి 25.5, హనుమకొండ పెద్దమ్మగడ్డ 24.3, కాజిపేట మడికొండ 18.8, దామెర 17.3, కాజీపేట 17, నడికూడ 16, పరకాల 10.5, ఐనవోలు 10, హసన్పర్తి నాగారం 9.5, భీమదేవరపల్లి 9.3, ఆత్మకూరులో 8.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ● ప్రతీ ఇంటి నుంచి చెత్త సేకరించి, తరలించినందుకు విస్తీర్ణం ఎస్ఎఫ్టీల ఆధారంగా మూడు స్లాబుల్లో నెలకు రూ.60 నుంచి రూ.1,200 వరకు చెత్త పన్ను విధించి ఆస్తి, నీటి పన్నులో జోడించి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ● వ్యాపార, వాణిజ్య సంస్థల యజమానులు నిత్యం రూ.వేలు, లక్షల్లో ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తుంటారు. భారీగా చెత్త వెలువడే కమర్షి యల్ షాపుల నుంచి ప్రతినెలా యూజర్ చార్జీల సొమ్ము మాత్రం వసూలు చేయట్లేదు. ఇలా.. గత 11 ఏళ్లుగా 5శాతం వరకు మాత్రమే కమర్షియల్ కాంప్లెక్స్ల నుంచి వసూలు చేస్తుండడంతో బల్దియాకు రావాల్సిన సూమారు రూ.10 కోట్లపైచిలుకు ఆదాయానికి గండిపడింది.వరంగల్ అర్బన్: వరంగల్ నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు దూసుకెళ్తోంది. జాతీయ, అంతర్జాయ సంస్థలు వెలిశాయి. నగరంలో షాపులు, హోటళ్లు, సినిమా హాళ్లు, రెస్టారెంట్లు ఉదయమే తెరుచుకుంటాయి. అప్పటికే వీధులు, రహదారుల ను పారిశుద్ధ్య కార్మికులు శుభ్రం చేసి వెళ్లిపోతారు. ఆతర్వాత షాపు యజమానులు వచ్చి దుకాణాలు తెరిచి శుభ్రం చేయగా.. వచ్చిన చెత్తాచెదారాన్ని తిరిగి షాపుల ఎదుట డ్రెయినేజీ, కాల్వలు, రహదా రులపై పడేయడంతో నగరం అపరిశుభ్రంగా మారుతోంది. ఆస్పత్రుల స్థాయి ఆధారంగా, డయాగ్నొస్టిక్ సెంటర్లు, ఫాస్ట్పుడ్ సెంటర్లు, బేకరీ లు, ఫంక్షన్ హాళ్లు, లాడ్జీలు, ప్రైవేట్ విశ్రాంతి భవనాలు, క్లబ్బులు, కూరగాయల, వ్యవసాయ మార్కెట్లకు, కమర్షియల్ కాంప్లెక్స్లు, ప్రైవేట్ హాస్టళ్లు, హోల్సేల్ పండ్ల వ్యాపారులు, పెద్ద హోటళ్లు, మిడిల్ స్థాయి హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, వైన్ షాపులు, ఫంక్షన్ హాళ్లు ప్రతి నెలా వ్యర్థాల సేకరణకుగాను బల్దియాకు నిర్ణీత సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. యూజర్ చార్జీల వసూలేది? ఆయా సంస్థలు, వ్యాపార కేంద్రాల నుంచి చెత్తాచెదారం వ్యర్థాలను తీసుకెళ్లేందుకు వాటి విస్తీర్ణం ఆ ధారంగా యూజర్ చార్జీలు వసూలు చేయాలనే ఆలోచన వరంగల్ బల్దియాకు 2013 సంవత్సరంలో వచ్చింది. ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేసి షాపుల నుంచి చెత్తను తరలించేందుకు యూజ ర్ చార్జీలను వసూలు చేయాలని నిర్ణయించారు. సర్వే చేసి 1,674 సంస్థలను గుర్తించారు. ఆయా సంస్థల నుంచి ఎంత వసూలు చేయాలో ఖరారుచేసి 2014 నుంచి వసూళ్ల ప్రక్రియ ప్రారంభించారు. రెండేళ్ల పాటు 50శాతానికి పైగా వసూలు చేసిన ప్రజారోగ్యం సిబ్బంది తదుపరి క్రమేపీ విస్మరిస్తున్నారు. తొలుత 1,674 వాణిజ్య సంస్థలు ప్రస్తుతం బల్దియా రికార్డుల్లో 427 కుచించుకుపోయాయి. ఈ ఏడాది చార్జీలు రూ.31 లక్షలు నిర్ణయించగా.. ఇప్పటి వరకు రూ.8 లక్షలు వసూలు చేసినట్లు లెక్కలు చెప్పడం అవినీతికి నిదర్శనంగా నిలుస్తోంది. కంపు.. కంపు బల్దియా సిబ్బంది నిర్లక్ష్యం.. అవినీతి కారణంగా కమర్షియల్ కాంప్లెక్స్లలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. నిత్యం షాపుల నుంచి వెలువడే చెత్తనంతా రెండు కాంప్లెక్స్ల నడుమ, కాంప్లెక్స్ చుట్టూ ఖాళీ స్థలాల్లో నింపేస్తున్నారు. మురుగు వాసన వస్తున్నా.. ఈగలు, దోమలు విజృంభిస్తున్నా అటు బల్దియా, ఇటు కాంప్లెక్స్ల యజమానులు, వ్యాపారులు పట్టించుకోవట్లేదు. వ్యాపార సముదాయాల నుంచి వెలువడే చెత్తను రోజూ బల్దియా వాహనాల్లో వేయాలంటే యూజర్ చార్జీలు చెల్లించాలి. ఇది ఇష్టం లేని కొందరు వ్యాపారులు ఖాళీ స్థలాల్లో పడేస్తున్నారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం.. వాణిజ్య సంస్థలను స్పెషల్ డ్రైవ్ నిర్విహించి గుర్తిస్తాం. లోపాలను సరిచేసుకుంటాం. యూజర్ చార్జీలను నిబంధనల మేరకు వసూలు చేస్తాం. – రాజేశ్, బల్దియా సీఎంహెచ్ఓ ● లెక్కలు పక్కా చేస్తున్న సిబ్బందిన్యూస్రీల్‘కమర్షియల్’ నుంచి కాసుల పంట శానిటరీ ఇన్స్పెక్టర్ల సహకారంతో జవాన్ల అక్రమ వసూళ్లు! యూజర్ చార్జీల వసూళ్లలో నిర్లక్ష్యం ఆదాయంపై పట్టించుకోని గ్రేటర్ అధికార, పాలక వర్గాలు నగరంలో ప్రజారోగ్యం పచ్చిమోసం!ఆ సొమ్ము ఎవరి జేబుల్లోకి.. గత పదిన్నరేళ్ల కాలంలో సూమారు రూ.10 కోట్లకుపైగా యూజర్ చార్జీల ద్వారా బల్దియా ఆదాయం సమకూరాలి. కానీ.. ఇంత వరకు ఎంత మంది వద్ద సొమ్ము వసూలు చేశారో, ఎవరు ఎగ్గొట్టారో చిక్కుముడిగా మారింది. వాణిజ్య సంస్థల నుంచి ప్రతీ నెల జవాన్లు యూజర్ చార్జీలను వసూలు చేయాలి. ఆన్లైన్ రశీదు ఇవ్వాలి. బల్దియా వద్ద లెక్కాపత్రం లేదు. వసూలు చేయాల్సిన కొంతమంది జవా న్లు, శానిటరీ ఇన్స్పెక్టర్ల సహకారంతో యూజర్ చార్జీలతో సంబంధం లేకుండా నెలవారీ మా మూళ్లకు పాల్పడుతున్నారు. బార్ అండ్ రెస్టారెంట్లు, బిర్యానీ సెంటర్లు, టిఫిన్ సెంటర్లు, హోటళ్లు, ఆస్పత్రులు, హాస్టల్స్, టిఫిన్ సెంట ర్లు ఇలా ప్రతీ వాణిజ్య సంస్థకు మరీ లెక్కగట్టి చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. వసూలు చేసి బల్దియాకు చెల్లించాల్సిన సొమ్మును 90శాతం మందికిపైగా సిబ్బంది తమజేబుల్లో నే వేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.పై ఫొటో హనుమకొండ చౌరస్తా సిటీ బస్టాప్ సమీపంలోది. రెండు కాంప్లెక్స్ల నడుమ ఒక మీటర్ ఖాళీ స్థలం ఉంది. ఆ స్థలంలో నిత్యం షాపుల నుంచి వెలువడే వ్యర్థాలను పడేస్తున్నారు. గుట్టలుగా చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తోంది. ఈగలు ముసురుకుంటున్నాయి. ఇది ఒక చౌరస్తాలో మాత్రమే కాదు. సిటీలోని చాలా కాంప్లెక్స్లలోని పరిస్థితి.వారు అడగరు.. వీరు ఇవ్వరు! వ్యాపార, వాణిజ్య సంస్థల నిర్వాహకుల నుంచి వ్యర్థాలను తీసుకెళ్లే క్రమంలో ఎంతో కొంత, నెలవారీగా వసూలు చేస్తున్నారు. ఇందుకుగాను యజమానులు, వ్యాపారులు చెల్లించిన సొమ్ముకు రశీదులు అడగడం లేదు. వీరు ఇవ్వడం లేదు. బల్దియా ప్రజారోగ్య శాఖ అధికారులు, కమిషనర్లు యూజర్ చార్జీల వసూళ్లపై కనీసం సమీక్షలు, పురోగతిపై సమావేశాలు ఏర్పాటు చేయట్లేదు. దీంతో బల్దియా రికార్డుల్లో ప్రతి నెలా యూజర్ చార్జీల సొమ్ము భారీగా పేరుకుపోయింది. అనధికారిక వసూళ్లే అందుకు కారణమనే విమర్శలు ఉన్నాయి. పాలకవర్గం పెద్దలు, నూతన కమిషనర్ ఈ సొమ్ము రాబట్టుకుంటారా? లేక వదిలేస్తారా? లేకపోతే శానిటరీ సిబ్బందిపై చర్యలు చేపడతారా? అనేది వేచి చూడాల్సిందే. -
బ్యాంక్ డిపాజిట్లు రూ.219.20 కోట్లు
రామన్నపేట: వరంగల్ అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరంలో 14.24 శాతం వృద్ధితో డిపాజిట్లు రూ.219.20 కోట్లకు చేరాయని బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు వెల్లడించారు. నగరంలోని దేశాయిపేట రోడ్డులోని కేఆర్ గార్డెన్స్లో ఆదివారం బ్యాంక్ 29వ మహాజన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ప్రదీప్రావు మాట్లాడుతూ.. రుణాల మంజారులో 13.20 శాతం వృద్ధితో రూ154.13 కోట్లు కలిపి మొత్తం వ్యాపారం రూ.373.43 కోట్లకు చేరుకున్నట్లు పేర్కొన్నారు. ఈఆర్థిక సంవత్సరంలో స్థూల లాభం రూ.3.03 కోట్లు కాగా అందులో రూ.60.90 లక్షల ఆదాయపు పన్ను చెల్లించగా నికరలాభం రూ.2.22 కోట్లు అర్జించినట్లు వెల్లడించారు. డిపాజిట్ దారులకు రిజర్వ్ బ్యాంకు నిబంధనల మేరకు డీఐసీజీసీ ద్వారా రూ.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నట్లు వివరించారు. ఈఆర్థిక సంవత్సరంలో గోపాల్పూర్, మహబూబాబాద్, జనగాం, వడ్డేపల్లి నూతన శాఖలను ప్రారంభించనట్లు తెలిపారు. సమావేశంలో బ్యాంక్ వైస్ చైర్మన్ తోట జగన్నాథం, డైరెక్టర్లు వేణుగోపాల్ ముందడ, కూరపాటి చంద్రమౌళి, తోట సంపత్కుమార్, మహమ్మద్ గౌసొద్దీన్, ఒడితర పవన్కుమార్, బొమ్మినేని పాపిరెడ్డి, పొన్న హరినాథ్, పోలేపాక రవికుమార్, బండారి భార్గవి, మంద స్వప్న, నామినేట్ డైరెక్టర్లు అప్పరాజు రాజేంద్రకుమార్, పుల్లూరి సుధాకర్, బ్యాంకు ముఖ్య కార్యనిర్వాహణ అధికారి ఎం.సత్యనారాయణరావు, వరంగల్, హనుమకొండ డీసీఓ లు కోదండ రాములు, సంజీవరెడ్డి, ఏఆర్ అన్నమనేని జగన్మోహన్రావు, సేల్స్ ఆఫీసర్ కె.రవీందర్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ప్రదీప్రావు -
సమ్మక్క సాగర్కు జలకళ..
కన్నాయిగూడెం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం గ్రామం వద్ద గోదావరిపై నిర్మించిన సమ్మక్క సాగర్ జలకళ సంతరించుకుంది. కొన్ని రోజుల నుంచి బ్యారేజీలో నీరులేక పోవడంతో బోసిపోయిన గోదావరి.. వారం రోజుల నుంచి ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు భారీగా నీరు చేరడంతో గోదావరి నిండుగా ప్రవహిస్తోంది. దీంతో బ్యారేజీలోకి ఎగువ నుంచి 21,500 క్యూసెక్కుల నీరు చేరడంతో అధికారులు బ్యారేజీ వద్ద 59 గేట్లలో మూడు గేట్లు ఎత్తి 27,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. బ్యారేజీ సామర్థ్యం 6.94 టీఎంసీలకు గాను ప్రస్తుతం 3.81టీఎంసీల నీరు ఉంది. బ్యారేజీ నీటి మట్టం 83 మీటర్లకు గాను 79.50 మీటర్ల నీటి మట్టం కొనసాగుతోంది. కాగా, దేవాదుల వద్ద ఉన్న చొక్కారావు ఎత్తిపోతల నుంచి రెండు మోటార్ల ద్వారా 494 క్యూసెక్కుల నీరు ఎత్తిపోస్తున్నట్లు డీఈ శరత్ బాబు తెలిపారు. ఎగువ నుంచి బ్యారేజీలోకి 21,500 క్యూసెక్కుల నీరు చేరిక మూడు గేట్లు ఎత్తి 27,000 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల -
బీసీలపై రాజకీయ పార్టీల చిన్నచూపు
కాజీపేట రూరల్ : బీసీలను అన్ని రాజకీయ పార్టీలు చిన్న చూపు చూస్తున్నాయని, జనాభా దామాషా ప్రకారం బీసీలకు వాటా ఇచ్చే వరకూ అవిశ్రాంత పోరాటం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ అన్నారు. కాజీపేట ఫాతిమానగర్ వైష్ణవిగ్రాండ్ హోటల్లో శనివారం బీసీ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్గౌడ్ అధ్యక్షతన ‘స్థానిక సంస్థల ఎన్నికలు–బీసీల రిజర్వేషన్ల పెంపు’ అనే అంశం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు లేకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. నెల రోజుల్లో రిజర్వేషన్లు నిర్ణయించి ఎన్నికల సంఘానికి నివేదించాలని హైకోర్టు ఆదేశించిన ప్రభుత్వం ఇంకా చర్యలు చేపట్టడం లేదన్నారు. బీజేపీ నాయకులు గల్లీలో ఒక మాట, ఢిల్లీలో మరోమాటతో బీసీలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ బీసీల వ్యతిరేక పార్టీ అని, కాంగ్రెస్, బీజేపీ మాత్రమే రిజర్వేషన్లు తేల్చాలని డిమాండ్ చేశారు. 48 గంటల్లోగా సీఎం రేవంత్రెడ్డి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి రిజర్వేషన్ల అంశంపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని డైవర్ట్ చేయడానికి ఎమ్మెల్సీ కవిత బీసీ నినాదం ఎత్తుకున్నారని ధ్వజమెత్తారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని బీసీ రిజర్వేషన్ల అంశం ఇప్పుడు గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్పించి 42 శాతం బీసీ బిల్లు ఆమోదింపజేయాలని, లేనిపక్షంలో తెలంగాణలో బీజేపీని మట్టి కరిపిస్తామని హెచ్చరించారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాడి మల్లయ్యయాదవ్, బీసీ సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు డాక్టర్ చిర్ర రాజు, తమ్మేలా శోభారాణి, మాదం పద్మజాదేవి, కాసగాని అశోక్గౌడ్, డాక్టర్ సంగాని మల్లేశ్వర్, మేముల మహేందర్, వల్లాల జగన్గౌడ్, పంజాల మధు, తెల్ల కిశోర్, తెల్ల సుగుణ, బూర్గుల ప్రమాద, బాబుయాదవ్ పాల్గొన్నారు. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే ఎన్నికలకు పోవాలి బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ -
సమన్వయంతో సీజనల్ వ్యాధుల నియంత్రణ
హన్మకొండ: జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు సంబంధిత ప్రభుత్వ విభాగాలతో సమన్వయంతో పని చేస్తూ సీజనల్ వ్యాధుల నియంత్రణకు కృషి చేయాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఎస్.సంగీత సత్యనారాయణ సూచించారు. శనివారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులతో సీజనల్ వ్యాధులు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ముందుగా జిల్లాల వారీగా నమోదవుతున్న మలేరియా, డెంగీ, ఇతర వ్యాధుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అ నంతరం ఆమె మాట్లాడుతూ వరంగల్ జిల్లా వైద్యారోగ శాఖాధికారి, సంబంధిత అధికారులు ఎంజీఎంలో నమోదవుతున్న మలేరియా, డెంగీ పాజి టివ్ కేసుల వివరాలను డీఎంహెచ్ఓలకు అందించాలన్నారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల్లో హెచ్ఎంలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి సీజనల్ వ్యా ధులు, ముఖ్యంగా చేతుల శుభ్రత, ఓఆర్ఎస్ ద్రావ ణం తయారీ విధానం, జ్వరాలు, డయేరియాకు సంబంధించిన ప్రమాదకర లక్షణాల గురించి అవగాహన కల్పించాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఈ కార్యక్రమాల గురించి ప్రచారం చేయాలన్నారు. ప్రతీ మంగళవారం ఎంపిక చేసిన ఆరోగ్య కేంద్రాలలో నిర్వహించే ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని మరింత పటిష్టంగా నిర్వహించాలని, ఆశలు, ఏఎన్ఎంలకు అవసరమైన సూచనలు చేయాలన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బాలికల లింగ నిష్పత్తి చాలా తక్కువ ఉందని, ఈ దిశగా డీఎంహెచ్ఓలు బాధ్యతగా తగిన చర్యలు చేపట్టాలని, లింగ నిర్ధారణ పరీక్షలపై నిఘా పెంచాలన్నారు. లింగ వివక్షతపై అవగాహన కల్పించాలన్నారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా ఎక్స్రే పరీక్షలు అవసరం వారికి ఆర్.బి.ఎస్.కె వాహనం ద్వారా అందుబాటులో ఉన్న సెంటర్లకు తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించాలన్నారు. మేనరికపు వివాహాలకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలన్నారు. హనుమకొండ, వరంగల్, ములుగు, జనగామ, మహబూబాబాద్ జిల్లాల డీఎంహెచ్ఓలు ఎ.అప్ప య్య, బి.సాంబశివరావు, గోపాల్ రావు, మల్లికార్జు న్, రవి రాథోడ్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రోగ్రాం అధికారి శ్రీదేవి పాల్గొన్నారు. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఎస్.సంగీత సత్యనారాయణ -
విద్యార్థినులు చదువులో ప్రతిభ కనబర్చాలి
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి ధర్మసాగర్ : గురుకుల పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థినులు చదువులో ప్రతిభ కనబరిచి మంచి మార్కులు సాధించాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హనుమకొండ పట్టణంలోని హంటర్రోడ్డులో గల ధర్మసాగర్ మండల సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదట తరగతి గదులు, తాగునీటి సౌకర్యం, విద్యార్థులకు అందుతున్న భోజన నాణ్యతను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. పాఠశాలలోని సదుపాయాలు, చెత్త, మరుగుదొడ్ల నిర్వహణ, సీజనల్ జ్వరాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల హాజరు శాతం, పదో తరగతి ఫలితాల వివరాలు ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్లాస్ రూంలోకి వెళ్లి విద్యార్థులకు పాఠాలు చెప్పడంతోపాటు వారిని పలు ప్రశ్నలు అడిగారు. గురుకుల సెక్రటరీతో ఫోన్లో మాట్లాడి సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించాలని అన్నారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని అన్నారు. అనంతరం కరుణాపురంలోని మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో ఆహారం, తాగునీరు, కిచెన్, క్లాస్ రూమ్స్, టాయిలెట్స్ను పరిశీలించారు. ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్, హెచ్ఎం, ఉపాధ్యాయ బృందం, అధికారులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. -
పక్కా వంద సీట్లు.. సర్వేలన్నీ మనవైపే
హసన్పర్తి: వచ్చే ఎన్నికల్లో పక్కాగా వంద అసెంబ్లీ స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేస్తామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బీఆర్ఎస్ వర్ధన్నపేట నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నగరంలోని నాని గార్డెన్లో శనివారం జరిగింది. సమావేశానికి మాజీ మంత్రి దయాకర్రావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సర్వేలన్నీ గులాబీ వైపు చూపుతున్నాయని తెలిపారు. గత ఎన్నికల్లో మోసపూరిత హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రైతులకు కనీసం సాగు నీరు అందించకుండా వారి కళ్లల్లో కన్నీళ్లు నిలిపిందన్నారు. నాట్లకి..నాట్లకి రైతుబంధు కేసీఆర్ వేస్తే.. రేవంత్ మాత్రం ఓట్లకు ఓట్లకు రైతు భరోసా వేస్తున్నాడని ధ్వజమెత్తారు. రేవంత్రెడ్డి ఓ అబద్దాల కోరుగా అభివర్ణించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపునకు పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేశ్రెడ్డి, మొట్టు శ్రీనివాస్, కార్పొరేటర్లు ఇండ్ల నాగేశ్వర్రావు, రాధికారెడ్డి, నాయకులు శ్రీధర్, అటికం రవీందర్, చల్లా వెంకటేశ్వర్రెడ్డి, మార్గం భిక్షపతి, అప్పారావు, బండి రజనీకుమార్, తూర్ల కుమారస్వామి, కందుకూరి చంద్రమోహన్, పాడి మల్లారెడ్డి, నద్దునూరి నాగరాజు, జోరుక రమేశ్ పాల్గొన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు -
రైల్వేస్టేషన్లో దొంగ అరెస్ట్
● రూ. 2.86 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం ● వివరాలు వెల్లడించిన వరంగల్ జీఆర్పీ సీఐ సురేందర్ రామన్నపేట : వరంగల్ రైల్వేస్టేషన్లో ఓ దొంగను అదుపులోకి తీసుకుని అతడి నుంచి రూ. 2,86,645 విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ జీఆర్పీ సీఐ సురేందర్ తెలిపారు. జీఆర్పీ సీఐ కథనం ప్రకారం.. శనివారం ఉదయం 9 గంటల సమయంలో నాలుగో ఫ్లాట్ఫామ్ వద్ద చింతల్ వైపున తనిఖీలు చేస్తుండగా మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం బంగ్లా తండాకు చెందిన ఇస్లావత్ సురేశ్ అనుమానాస్పదంగా సంచరిస్తూ కనిపించాడు. దీంతో అతడిని తనిఖీ చేయగా 28.645 గ్రాముల బంగారం చైన్, రెండు పుస్తెలు, 3 జతల చెవి కమ్మలు లభ్యమయ్యాయి. నిందితుడు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లో బంగారం చోరీ చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు. దీంతో అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తునట్లు జీఆర్పీ సీఐ తెలిపారు. కాగా, నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బంది రాము, రియాజుద్దీన్, నాగరాజు, రామకృష్ణ, రమేశ్. మనోజ్కుమార్ను జీఆర్పీ సీఐ అభినందించారు. -
విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలి
● కళాశాల విద్య జాయింట్ డైరెక్టర్ రాజేందర్సింగ్ విద్యారణ్యపురి/న్యూశాయంపేట: విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నతంగా ఎదగాలని కళాశాల విద్య జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజేందర్సింగ్ కోరారు. శనివారం హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాల(అటానమస్), కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ (కేడీసీ), దేశాయిపేటలోని సీకేఎం ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీని సందర్శించారు. ఆయా కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే రోజుల్లో పింగిళి మహిళా కళాశాల ఏప్లస్ గ్రేడ్ సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులను పోటీపరీక్షలకు కూడా సన్నద్ధం చేయాలన్నారు. కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు రీసెర్చ్సెంటర్గా గుర్తింపు రావడంపై అభినందించారు. సీకేఎం కళాశాలలోని గ్రంథాలయం, ప్రయోగశాల, మహిళా హాస్టల్ తదితర వసతులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయా సమావేశంలో ప్రిన్సిపాళ్లు బి.చంద్రమౌళి, జి.శ్రీనివాస్, ఎ.ధర్మారెడ్డి, వైస్ ప్రిన్సిపాళ్లు సుహాసిని, రజనీలత, వరప్రసాదరావు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ సురే్ష్బాబు, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆరుణ, డాక్టర్ శశిధర్రావు, ప్రొఫెసర్ రాజారెడ్డి, టీజీసీజీటీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జె.చిన్న, జిల్లా కార్యదర్శి రవికుమార్, కేయూ సెక్రటరీ జి.సమ్మయ్య, సతీష్కుమార్, అధ్యాపకులు సీతారాములు, మహేందర్ శ్రీనాఽథ్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్వరూప తదితరులు పాల్గొన్నారు. పీఎన్డీటీ చట్టం అమలుపై ప్రత్యేక నిఘాఎంజీఎం: జిల్లాలో లింగ నిర్ధారణ చట్టం (పీఎన్డీటీ) అమలు, ఎంటీపీ చట్టాన్ని కచ్చితంగా అమలు చేసేందుకు ఆయా స్కానింగ్ కేంద్రాలు, ఆస్పత్రులపై ప్రత్యేక నిఘాతో ముందుకు సాగాలని హనుమకొండ వైద్య ఆరోగ్యశాఖ అధికారి అప్పయ్య పేర్కొన్నారు. శనివారం గర్భస్థ పూర్వ, పిండ లింగ నిర్ధారణ చట్టం జిల్లా స్థాయి అడ్వయిజరీ సమావేశాన్ని హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించారు. ఈసందర్భంగా డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ.. జిల్లాలో చట్టం అమలుకు తీసుకున్న చర్యలను, బాలికల, నిష్పత్తి గురించి సభ్యులకు వివరించారు. వైద్య ఆరోగ్యశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, ఇతర విభాగాలు లింగ వివక్షపై అవగాహన కల్పించాలని సూచించారు. ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన వారికి నోటీసులివ్వనున్నట్లు తెలిపారు. నిర్ణీత సమయంలో తప్పులు సరిద్దిదుకోకపోతే జరిమానా విధించినున్నట్లు తెలిపారు. చట్టం ఉల్లంఘిస్తున్న వారి వివరాలు, అబార్షన్లు నిర్వహించే వారి వివరాలు 63000 30940 నంబర్కు వాట్సాప్ చేయాలని, కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో బాలికల నిష్పత్తి తక్కువగా ఉన్న వేలేరు మండలంలో ప్రత్యేక శ్రద్ధ వహించి క్షేత్రస్థాయి సిబ్బందితో తరచూ సమీక్ష నిర్వహించి వివిధ ప్రభుత్వ విభాగాలు, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో జీఎంహెచ్ ప్రొఫెసర్ గైనకాలజిస్ట్ రాజేశ్వరి, పీఓఎంహెచ్ఎన్ మంజుల, సభ్యులు రేవతిదేవి, ఎన్.కవిత, జిల్లా కోర్టు సిబ్బంది నాగరాజు, డెమో అశోక్రెడ్డి, ఎస్ఓ ప్రసన్నకుమార్, హెచ్ఈఓ రాజేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బాలల సంరక్షణకు పనిచేయాలి
● అడిషనల్ డీసీపీ రవి వరంగల్ క్రైం: బాలలను సంరక్షించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని వరంగల్ పోలీస్ కమిషనరేట్ అడ్మిన్ అడిషనల్ డీసీపీ రవి సూచించారు. జులై 1 నుంచి నెలరోజులు నిర్వహించనున్న ఆపరేషన్ ముస్కాన్–11వ విడత కార్యక్రమంపై అదనపు డీసీపీ ఆధ్వర్యంలో శనివారం కమిషనరేట్లో అధికారులు సమన్వయ సమావేశం నిర్వహించారు. హ్యూమన్ ట్రాఫిక్ విభాగంతో పాటు వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల సీ్త్ర శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, చైల్డ్ లైన్ 1098 విద్యాశాఖ, కార్మిక శాఖ చెందిన అధికారులు ఈసమావేశంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా అడిషనల్ డీసీపీ రవి మాట్లాడుతూ.. కమిషనరేట్ పరిధిలో 18 ఏళ్లలోపు పిల్లల్ని ఎవరైనా హింసించినా, భిక్షాటన చేయించినా, పిల్లల్ని బాల కార్మికులుగా మార్చినా అలాంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అదనపు డీసీపీ హెచ్చరించారు. ఈసందర్భంగా ఆపరేషన్ ముస్కాన్పై రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు. హాజరైన అన్ని శాఖల ప్రతినిధులతో ఆపరేషన్ ముస్కాన్ ప్రతిజ్ఞ చేయించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఫైనాన్స్ వ్యాపారి దారుణ హత్య
● కాజీపేట రైల్వే క్వార్టర్స్లో ఘటన ● హత్యకు గల కారణాలపై పోలీసుల ఆరా ● పోలీసులకు లొంగిపోయిన నిందితుడు?కాజీపేట: ఓ ఫైనాన్స్ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి కాజీపేట రైల్వే క్వార్టర్స్లో జరిగింది. మృతుడి భార్య మాధవి, పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జేపీఎన్ రోడ్డుకు చెందిన త్రిపురాధి నవీన్కుమార్ (55) ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. కొంతకాలంగా కాజీపేటలోని చిరువ్యాపారులు, రైల్వే, ఎఫ్సీఐ, ప్రైవేట్ ఉద్యోగులకు వడ్డీలకు డబ్బులు ఇస్తున్నాడు. ఈ క్రమంలో రైల్వే ఈఎల్ఎస్ షెడ్లో పనిచేసే గడ్డం ప్రవీణ్కుమార్కు ఆరు నెలల క్రితం రూ.50 వేలు అప్పుగా ఇచ్చాడు. అప్పు తీసుకున్నప్పటి నుంచి ప్రవీణ్కుమార్ అసలుతోపాటు వడ్డీ కూడా చెల్లించకపోవడంతో మృతుడు కొద్దికాలంగా ప్రవీణ్కుమార్పై ఒత్తిడి పెంచడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు పెరిగాయి. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి నవీన్కుమార్ రైల్వే క్వార్టర్స్కు వెళ్లి నిందితుడు ప్రవీణ్ కుమార్ను నిలదీయడంతో ఇద్దరి మధ్య వాగ్వా దం పెరిగింది. ఆ తర్వాత గొడవ సద్దుమణగడంతో ఇద్దరు కలిసి మద్యం సేవించారు. అయితే డబ్బుల విషయంలో జరిగిన గొడవను మనసులో పెట్టుకున్న ప్రవీణ్కుమార్.. కూరగాయలు కొసే కత్తితో విచక్షణారహితంగా పొడవడంతో నవీన్కుమార్ తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. అనంతరం నిందితుడు నేరుగా కాజీపేట పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం. హత్య కేసులో విభిన్న వాదనలు .. ఫైనాన్స్ వ్యాపారి నవీన్కుమార్ హత్యపై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అప్పులు ఇచ్చిన తర్వాత అధిక మొత్తంలో వడ్డీలు వసూలు చేయడం, చెక్ బౌన్స్ కేసులు నమోదు చేయించడం, ఇళ్లు, స్థలాలు రాయించుకోవడం వంటి పనులు చేస్తుండేవాడనే ఆరోపనలు వినిపిస్తున్నాయి. కాగా, నవీన్కుమార్ను నిందితుడు ప్రవీణ్కుమార్ మధ్యాహ్నమే రైల్వే క్వార్టర్లో చంపి మృతదేహాన్ని బయటపడేయడం కోసం ప్రయత్నించగా ఆటో డ్రైవర్లు ఎవరూ సహకరించకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో పోలీసులకు నిందితుడు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. కాగా, ఫైనాన్స్ వ్యాపారి నవీన్కుమార్ హత్య సమాచారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఘటనా స్థలికి పోలీసు అధికారులు.. కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్ రెడ్డి, ఇన్చార్జ్ సీ ఐ పుల్యాల కిషన్తో పాటు టాస్క్ఫోర్స్, క్రైమ్ సిబ్బంది, క్లూస్ టీం బృందం ఘటనాస్థలిని సందర్శించి ఆధారాలు సేకరించారు. నవీన్కుమార్ హ త్య వెనుక నిందితుడితో పాటు ఇంకా ఎవరైనా ఉ న్నారా? లేక ఒక్కడే హత్య చేసి ఉంటాడా అనే కో ణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కా జీపేట చౌరస్తా నుంచి రైల్వే క్వార్టర్స్కు వెళ్లే రహదారుల్లో ఉన్న సీసీ కెమెరాలను జల్లెడ పడుతు న్నారు. మృతుడి భార్య త్రిపురాధి మాధవి ఫిర్యా దు మేర కు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై నవీన్కుమార్ తెలిపారు. కాగా, తన భర్త ఒంటిపైనుంచి రూ. 6 లక్షల విలువైన బంగా రు ఆభరణాలు నిందితుడు ప్రవీణ్కుమార్ తీసుకున్నాడని మృతుడి భార్య మాధవి ఆరోపించింది. -
పీవీ సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టం
పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి హన్మకొండ చౌరస్తా: రాజనీతిజ్ఞుడు, తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన దివంగత ప్రధాని పీవీ నరసింహారావు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు భారతదేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేశాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ భవన్లో శనివారం పీవీ నరసింహారావు 104వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పీవీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ.. పీవీ ఆలోచనలు, ఆర్థిక సంస్కరణలు భారత్ను అభివృద్ధివైపు తీసుకెళ్లాయన్నారు. అనంతరం జవహర్లాల్ నెహ్రూ స్టేడియం జంక్షన్లోని పీవీ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈవీ శ్రీనివాసరావు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ అజీజ్ఖాన్, కార్పొరేషన్ ఫ్లోర్లీడర్ తోట వెంకటేశ్వర్లు కాంగ్రెస్ నాయకులు బంక సంపత్, నాయిని లక్ష్మారెడ్డి, అంకూస్ పాల్గొన్నారు. -
వరంగల్ ఏసీపీ నందిరాంనాయక్పై వేటు
● డీజీపీ కార్యాలయానికి అటాచ్డ్ ● ఆయన స్థానంలో ఎన్.శుభంప్రకాశ్ నియామకం.. బాధ్యతల స్వీకరణసాక్షి, వరంగల్: వరంగల్ ఏసీపీ నందిరాంనాయక్పై వేటు పడింది. కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళికి వివిధ సందర్భాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఎస్కార్ట్ కల్పించి మెమోలు అందుకున్నారు. కాంగ్రెస్ నేత నవీన్రాజ్కు ఏ పదవి లేకున్నా కూడా పోలీసు భద్రత కల్పించి వివాదాల్లో చిక్కుకున్నారు. మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో కూడా పాల్గొన్న ఆయన వివాదాలకు కేంద్రబిందువుగా మారిన సందర్భాలున్నాయి. కేవలం 15నెలల పాటు పనిచేసిన నందిరాంనాయక్ను డీజీపీ కార్యాలయానికి అటాచ్డ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎక్కడ కూడా పోస్టింగ్ ఇవ్వలేదు. ఆస్థానంలో 2022 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఎన్.శుభంప్రకాశ్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీచేశారు. శుభంప్రకాశ్ 2024లో వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ఆరు నెలలపాటు ట్రెయినీ ఐపీఎస్గా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం కరీంనగర్ రూరల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా పనిచేస్తున్నారు. ఏసీపీగా రానున్న ఆయనకు వరంగల్పై కొంత అవగాహన ఉంది. కాగా, ఆయన సాయంత్రం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ డివిజన్ పోలీసులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. -
కుమారులు దూరమై.. విగ్రహాల్లో కొలువై
కొడకండ్ల: అల్లారుముద్దుగా పెంచుకున్న ఇద్దరు కుమారులు రోడ్డు ప్రమాదంలో దూరమయ్యారు. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని వారి జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటూ ఆ తల్లిదండ్రులు కాలం వెళ్లదీస్తున్నారు. ప్రాణం పోయిన వారి కుమారులకు విగ్రహాల రూపంలో ప్రాణం పోసి కళ్లారా చూస్తున్నారు. కొడకండ్ల మండలం రామవరం గ్రామానికి చెందిన మేటి రాములు–రాజేశ్వరి దంపతులకు ముగ్గురు కుమారులు. వ్యవసాయమే జీవనాధారమైన వారు కుమారులను చిన్నప్పటి నుంచి ప్రైవేట్ పాఠశాలల్లోనే చదివించారు. తల్లిదండ్రుల శ్రమను గుర్తించిన వారు ప్రయోజకులయ్యారు. పెద్దకుమారుడు అరవింద్, రెండో కుమారుడు శ్రవణ్ సాప్ట్వేర్ ఇంజనీర్లుగా హైదరాబాద్లో మూడో కుమారుడు శ్రవణ్ వరంగల్ ఎంజీఎంలో హౌస్ సర్జన్గా పనిచేసేవారు. గత సంవత్సరం మే 19న శివ హైదరాబాద్లోని అన్న శ్రవణ్ వద్దకు వెళ్లాడు. భోజనం తెచ్చుకునేందుకు బయటికి వెళ్లిన ఇద్దరు సోదరులను స్కార్పియో కారు ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. కుమారులను గుర్తు చేసుకుంటూ తమ వ్యవసాయ భూమిలో గదిని నిర్మించి శ్రవణ్, శివ విగ్రహాలను ఏర్పాటు చేయించారు. మే 19న ప్రథమ వర్ధంతి సందర్భంగా తల్లిదండ్రులు ఆవిష్కరించుకున్నారు. -
కుల్లా, నిత్యక్లిన్నా క్రమాలలో శ్రీభద్రకాళి
హన్మకొండ కల్చరల్ : శ్రీభద్రకాళీ దేవాలయంలో జరుగుతున్న శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా మూడోరోజు శనివారం అమ్మవారిని కుల్లాక్రమంలో, నిత్యక్లిన్నా క్రమంలో పూజలు నిర్వహించారు. ప్రధానార్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు ఉదయంనుంచి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం, చతుఃస్థానార్చన నిర్వహించారు. అనంతరం కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరానికి కుల్లాగా పూజలు నిర్వహించి, వారాహి అమ్మవారిగా అలంకరించారు. షోడశీక్రమాన్ని అనుసరించి స్నపనమందిరంలోని భోగభేరాన్ని నిత్యక్లిన్నాగా అలంకరించి పూజలు జరిపారు. ఈఓ శేషుభారతి పర్యవేక్షించారు. -
స్మార్ట్ సిటీ పెండింగ్ పనులు పూర్తి చేయండి
గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ భద్రకాళి బండ్ అభివృద్ధి పనుల పరిశీలన వరంగల్ అర్బన్: స్మార్ట్సిటీ పెండింగ్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ఆదేశించారు. శనివారం భద్రకాళి బండ్పై పూర్తయిన స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులను, పెండింగ్ పనులను ఆమె క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. స్మార్ట్ సిటీలో భాగంగా భద్రకాళి బండ్పై ఏ, బీ, సీ, డీ జోన్ల వారీగా ఇప్పటికే పూర్తి చేసిన పనులను వాటి అంచనా వ్యయాలతో పాటు సమగ్ర వివరాలను కమిషనర్ ఇంజనీరింగ్ స్మార్ట్సిటీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బొంది వాగు నుంచి వచ్చే నాలతోపాటు పోతన జంక్షన్ ప్రాంతం నుంచి వచ్చే 12 మోరీల నాలలను కమిషనర్ పర్యవేక్షించారు. ఆయా జోన్లలో మిగిలిన ఎలక్ట్రికల్, సివిల్ పనులకు సంబంధించి కమిషనర్ పలు సూచనలిచ్చారు. మిగతా చిన్న చిన్న పనులు పూర్తి చేయాలి. స్కీంలో పెట్టుకునేందుకు అవకావం కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఈఈలు శ్రీనివాస్, రవికుమార్, స్మార్ట్ సిటీ ప్రతినిధులు ఆనంద్ ఓలేటి, శ్రీనివాసరాజు, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేడు స్ట్రీట్ వెండర్స్ ఫుడ్ ఫెస్టివల్ వరంగల్ బల్దియా మెప్మా ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం 3 నుంచి రాత్రి 10 గంటల వరకు స్థానిక స్ట్రీట్ వెండర్ల ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. భద్రకాళీ బండ్, హంటర్ రోడ్డు, హనుమకొండలలో ఈ ఫుడ్ ఫెస్టివల్ ఉంటుందని, నగర ప్రజలు పెద్దఎత్తున హాజరు కావాలని కోరారు. -
ఎల్లప్పుడూ కళ్ల ముందే ఉండాలని..
డోర్నకల్: కంటికి రెప్పలా చూసుకునే భర్త, అమ్మా అమ్మా అంటూ రోజుకు వెయ్యిసార్లు పలకరించే కుమారుడు అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో దిక్కు తోచని స్థితికి చేరుకున్న ఓ మహిళ తన భర్త, కుమారుడిని విగ్రహాల రూపంలో చూసుకుంటూ వారి జ్ఞాపకాలను నెమరువేసుకుంటుంది. డోర్నకల్ మండలం దుబ్బతండాకు చెందిన అజ్మీర బాల్యా, భారతి దంపతులకు సాయికుమార్ ఏకై క కుమారుడు. భారతి దుబ్బతండా సర్పంచ్గా పని చేసి భర్త బాల్యా సహకారంతో గ్రామాభివృద్ధిలో తమ వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వహించింది. బాల్యా, భారతి వ్యవసాయం చేస్తుండగా కుమారుడు ఖమ్మంలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. ఈనెల 5న కుమారుడు సాయికుమార్ను కళాశాలకు పంపేందుకు బాల్యా ఖమ్మం బయల్దేరగా ఖమ్మంలో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొని బాల్యా, సాయికుమార్ మృతి చెందారు. వారిని మర్చిపోలేని భారతి.. బాల్యా, సాయికుమార్ విగ్రహాలను గ్రామ ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసింది. జూన్ 15న వారి సంతాప సభలోబాల్యా సాయికుమార్ విగ్రహాలను ఆవిష్కరించారు. -
భర్త జ్ఞాపకాలతో..
మహబూబాబాద్ రూరల్: కట్టుకున్న భర్తను ప్రాణంగా భావించి ఆయన మృతి అనంతరం పాలరాతితో విగ్రహం చేయించి ఓ భార్య ఆయనకు గుడి కట్టించింది. మహబూబాబాద్ మండలం సోమ్లా తండా గ్రామానికి చెందిన బానోత్ కల్యాణి ఎంపీటీసీగా పనిచేసింది. హరిబాబుతో ఆమెకు 1996లో వివాహం కాగా.. 2021లో హరిబాబు అనా రోగ్యంతో మృతిచెందాడు. ఆయనతోపాటే తాను చనిపోదామని కల్యాణి ప్రయత్నించినా బంధువులు ధైర్యం చెప్పడంతో హరిబాబు జ్ఞాపకాలతో జీవిస్తోంది. ఈక్రమంలో రూ.5.30 లక్షలతో పండుగ వాతావరణంలో గతేడాది ఏప్రిల్ 23న గుడి ప్రారంభించింది. ప్రతీ శనివారం ఆయనకు పూజలు చేస్తోంది. -
ఆదివారం శ్రీ 29 శ్రీ జూన్ శ్రీ 2025
ఐనవోలు: మండల కేంద్రానికి చెందిన వడిచర్ల శ్రీనివాస్–అనురాధ దంపతుల కుమారుడు కమల్హాసన్, కూతురు శివాని. శ్రీనివాస్ టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. సమాజ సేవంటే ఇష్టపడే శ్రీనివాస్ ఎంపీటీసీగా పని చేశారు. గతేడాది జనవరి 22న అనారోగ్య కారణాలతో ఆయన మృతి చెందాడు. కమల్ హాసన్ నాన్న నిర్ణయం మేరకు డిగ్రీ తర్వాత లండన్కు వెళ్లారు. తండ్రి చనిపోయిన తర్వాత ఆయన కోరిక మేరకు చెల్లి పెళ్లి జరిపించాడు. ఆపెళ్లిలో అతడి తండ్రి ఫైబర్ విగ్రహాన్ని తయారు చేయించి నాన్నతో తనకున్న ఎమోషన్ను అందరికి చూపించాడు. ఈసారి లండన్ నుంచి ఇండియాకు వచ్చినపుడు ఆ ఫైబర్ విగ్రహాన్ని మండల కేంద్రంలో ఏర్పాటు చేయించనున్నట్లు కమలహాసన్ తెలిపారు.న్యూస్రీల్పెళ్లిలో విగ్రహం ఓ ఎమోషన్ -
ఆషాఢం వేడుకల వేళ..
హన్మకొండ కల్చరల్: ఆషాఢం వేడుకలకు సమయం ఆసన్నమైంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తొలకరి వానలు పలకరించాయి. ఫలితంగా పంటల సాగుతో పాటే గ్రామ దేవతల (బోనాలు)కు పూజలు మొదలు కానున్నాయి. ఆషాఢ మాసం గురువారం ప్రారంభమైంది. ఇదే సమయంలో గ్రామాల్లో అమ్మవారిని కొలిచేందుకు ప్రజలు సన్నద్ధమవుతున్నారు. మహిళలు కలిసికట్టుగా బయలుదేరి మొక్కులు చెల్లించనున్నారు. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొలిఏకాదశి నాడు బీరన్న బోనాలు వైభవంగా నిర్వహిస్తారు. ఆషాఢ మాసంలో ప్రతీరోజు గ్రామ దేవతలను భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. కొందరికి గ్రామదేవతలకు బోనాలు సమర్పించే సంప్రదాయం కూడా ఉంది. ఇలవేల్పులైన అమ్మవార్లకు మొక్కులు చెల్లిస్తారు. ఆలయాల్లో ఉత్సవాలు.. ఆషాఢ మాస శుద్ధ ఏకాదశి రోజున విష్ణువు యోగా నిద్రలోకి వెళ్లిన రోజుగా భావిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇదే సమయంలో పూరి జగన్నాథ రథయాత్ర, గురుపౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా వేడుకగా జరుపుకోనున్నారు. అలాగే, వరంగల్ జిల్లాలో శ్రీభద్రకాళి అమ్మవారికి శాకంబరీ ఉత్సవాలు నిర్వహించడం ప్రత్యేకం. గోరంటాకు మురిపెం.. ఆరోగ్యదాయకం వర్షకాలం ప్రారంభమై బావులు, వాగులు, చెరువుల్లోకి కొత్త నీరొస్తుంది. ఇది చర్మవ్యాధులు వ్యాప్తి చెందే కాలం. వీటి బారి నుంచి ఆరోగ్యాన్ని రక్షించుకునేందుకు గోరింటాకు ఔషధంగా పని చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆషాఢ మాసంలో మహిళలు గో రింటాకును (మెహందీ) అలంకరించుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఆయుర్వేద వైద్య నిపుణులు గోరింటాకు చర్మ వ్యాధుల నుంచి రక్షణ ఇస్తుందని, శరీరంలో వేడి తగ్గిస్తుందని పేర్కొంటున్నారు. వనభోజనాల సందడి.. ఆషాఢ మాసంలో వనభోజనాలు ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. ప్రధానంగా గ్రామాల్లోని వర్షాలు సమృద్ధిగా కురిసి, పాడి పంటలు వెల్లివిరియాలని కోరుకుంటారు. గ్రామదేవతలకు పూజలు నిర్వహించి ప్రకృతి ఒడిలో పచ్చని పంట పొలాల మధ్య చెట్ల కింద సామూహిక వనభోజన సంబురాలు జరుపుకుంటారు. పట్టణ ప్రాంతాల్లో సైతం ఈ సంప్రదాయం కొనసాగుతోంది. భక్తిశ్రద్ధలతో గ్రామ దేవతలకు పూజలు అమ్మవార్లకు మొక్కుల చెల్లింపులకు సిద్ధం తొలిఏకాదశి నాడు బీరన్న బోనాలు ప్రత్యేకం గురువారం ప్రారంభమైన మాసంఆరోగ్యం.. ఆనందం హిందూ సనాతన ధర్మంలో ఆరోగ్యం, ఆనందం కోసం కొన్ని పద్ధతులు అనాదిగా వస్తున్నాయి. ఇందులో కుంకుమ, తిలకం అద్దుకోవడం, విభూదిధారణ, గంధ ధారణ, కాటుక, గోరింటాకు పెట్టుకోవడం లాంటి పద్ధతులు ఉన్నాయి. ఆయుర్వేదం ప్రకారం గోరింటాకు పెట్టుకోవడం వల్ల శరీరంలో ఉన్న వేడి తగ్గి ఆరోగ్యంగా ఉంటామని, అలాగే శరీరం కళకళలాడుతుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేయిస్తంభాల దేవాలయం ప్రధానార్చకుడు గంగు ఉపేంద్ర శర్మ తెలిపారు.గోరింటాకు వేడుకలు హసన్పర్తి: ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని గోరింటాకు వేడుకలను మహిళలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. నగరంలోని 55వ డి విజన్ సత్యసాయి కాలనీలో అతివలు అరచేతిలో గోరింటాకు పెట్టుకుని మురిసిపోయారు. కార్యక్రమంలో తుమ్మ వనమాల, ఎర్రబెల్లి సుజాత, చెరుకు కృష్ణవేణి, చిట్టిరెడ్డి మంగ పూల్లూరి సరోజన, లావణ్య, చింత జ్యోతి, తుమ్మ ప్రియాంక, తుమ్మ పద్మ నిహాసి పాల్గొన్నారు. -
స్నాతకోత్సవానికి సమన్వయంతో పనిచేయాలి
కేయూ క్యాంపస్: జూలై 7న నిర్వహించనున్న కాకతీయ యూనివర్సిటీ 23వ స్నాతకోత్సవం నిర్వహణకు సమన్వయంతో పనిచేయాలని కేయూ వీసీ ఆచార్య ప్రతాప్రెడ్డి ఆయా కమిటీల కన్వీనర్లు, మెంబర్లను కోరారు. ఇప్పటికే స్నాతకోత్సవం నిర్వహణకు ఐదుగురు ప్రొఫెసర్లతో కూడిన స్టీరింగ్ కమిటీ, 10 సబ్ కమిటీలను కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం నియమించారు. అన్ని కమిటీల కన్వీనర్లతో శుక్రవారం క్యాంపస్లోని అకాడమిక్ కమిటీ హాల్లో వీసీ ప్రతాప్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్నాతకోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్వర్మ, హైదరాబాద్లోని ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతారని తెలిపారు. స్నాతకోత్సవం స్టీరింగ్ కమిటీ మెంబర్ కన్వీనర్ ఆచార్య రాజేందర్ మాట్లాడుతూ.. ఇప్పటికే 331 మంది విద్యార్థులు పీహెచ్డీ పట్టాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. 374 మంది విద్యార్థులకు 564 బంగారు పతకాలను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్నాతకోత్సవ నిర్వహణకు సంబంధించిన విషయాలను ఆయన వివరించారు. సమావేశంలో రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం, స్ట్టీరింగ్ కమిటీ చైర్మన్ ఆచార్య మల్లారెడ్డి, యూనివర్సిటీ కాలేజీ ప్రొఫెసర్ మనోహర్, ప్రొఫెసర్ వెంకట్రామ్రెడ్డి, ప్రొఫెసర్ మల్లికార్జున్రెడ్డి, అమరవేణి, ప్రొఫెసర్ నర్సింహారెడ్డి, ప్రొఫెసర్ శ్రీలత, ప్రొఫెసర్ షమిత, ప్రొఫెసర్వై వెంకయ్య, ప్రొఫెసర్ మామిడాల ఇస్తారి, డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కేయూ వీసీ ప్రతాప్రెడ్డి -
బాధ్యతలు స్వీకరించిన ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు
హన్మకొండ: హనుమకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలోని శుక్రవారం టీజీ ఎన్పీడీసీఎల్ డైరక్టర్లు బాధ్యతలు స్వీకరించారు. ఫైనాన్స్ డైరెక్టర్గా వంటెరు తిరుపతి రెడ్డి, ఆపరేషన్స్ డైరెక్టర్గా టి.మదుసూధన్, ప్రాజెక్ట్స్ డైరెక్టర్గా వంగూరు మోహన్ రావు, హెచ్ఆర్డీ అండ్ ఐఆర్ డైరెక్టర్గా సి.ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించగా.. సీఎండీ వారికి శుభాకాంక్షలు తెలిపారు. సమష్టి కృషితో కంపెనీని అభివృద్ధి పథంలో తీసుకెళ్దామని అన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్లు మాట్లాడుతూ.. సీఎండీ వరుణ్ రెడ్డి సారథ్యంలో కంపెనీ అభివృద్ధిలో భాగస్వాములవుతామని, వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన డైరక్టర్లను అసోషియేషన్లు, యూనియన్ల నాయకులు, ఎస్ఈలు, డీఈలు, ఏడీఈలు, ఏఈలు, ఇతర అధికారులు, ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. -
టీజీ ఎన్పీడీసీఎల్లో బదిలీలు
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్లో బదిలీలు, సర్దుబాట్లు జరిగాయి. ఈ మేరకు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఫైనాన్స్ సీజీఎం వంటేరు తిరుపతి రెడ్డి డైరెక్టర్గా నియామకం కావడంతో ఖాళీ అయిన స్థానంలో సీజీఆర్ఎఫ్ వరంగల్ ఫైనాన్స్ మెంబర్గా కొనసాగుతున్న ఆర్.చరణ్దాస్ను పూర్తి స్థాయి అదనపు బాధ్యతలతో నియమించారు. సిరిసిల్ల సెస్కు ఫారిన్ డిప్యుటేషన్పై వెళ్లిన పి.విజేందర్ రెడ్డి అక్కడి నుంచి సెలవుపై వెళ్లి తిరిగి ఎన్పీడీసీఎల్లో విధుల్లో చేరాడు. ప్రస్తుతం ఆయనను మహబూబాబాద్ ఎస్ఈగా నియమించారు. సూపరింటెండెంట్ ఇంజనీర్ బి.సుదర్శన్ను నిర్మల్ నుంచి జగిత్యాలకు బదిలీ చేశారు. ఎస్ఈ వి.గంగాధర్ను మంచిర్యాల నుంచి పెద్దపల్లికి, జీఎం వి.వేణుమాదవ్ను కార్పొరేట్ ఆఫీస్ ప్రాజెక్ట్సు నుంచి జీఎం ప్లానింగ్కు బదిలీ చేశారు. కార్పొరేట్ ఆఫీస్లో ఆపరేషన్ జనరల్ మేనేజర్గా కొనసాగుతున్న ఉత్తమ్.. మంచిర్యాల ఎస్ఈగా, జగిత్యాల ఎస్ఈ సాలియా నిర్మల్ ఎస్ఈగా బదిలీ అయ్యారు. తొర్రూరు డీఈ జి.మదుసూధన్ను మెట్పల్లికి, కార్పొరేటర్ ఆఫీస్ డీఈ జి.ఎల్.మర్రెడ్డిని అదే ఆఫీస్లో ప్రాజెక్టు విభాగానికి, డీఈ మహా బూబాద్ బి.పెద్దిరాజంను వరంగల్ డీపీఈ డీఈగా, పెద్దపల్లి ఎస్ఈ కార్యాలయంలో డీఈ టెక్నికల్ను తొర్రూరు డీఈగా, కార్పొరేట్ ఆఫీ స్లో ప్రాజెక్టు డీఈ డి.నందరాథోడ్ను ప్రాజెక్టు నుంచి ఇంజనీరింగ్ డీఈగా బదిలీ చేశారు. కాపులకనపర్తి ఏడీఈ నరసింహారావును కార్పొరేట్ ఆఫీస్ ప్రాజెక్టు విభాగానికి, ఏడీఈ బి.రవిని ప్రాజెక్టు నుంచి కాపుల కనపర్తికి, ఏడీఈ బి.శ్రీనివాస్ యాదవ్ను భూపాలపల్లి క్వాలిటీ కంట్రోల్ నుంచి కార్పొరేట్ ఆఫీస్కు, ఏడీఈ కె.పవన్ కుమార్ను కార్పొరేట్ ఆఫీస్ నుంచి హెచ్టీ మీటర్స్ వరంగల్ సర్కిల్కు బదిలీ జరిగింది. అకౌంట్స్ జనరల్ మేనేజర్ ఎన్.దేవేందర్కు సీజీఆర్ఎఫ్ వరంగల్ ఫైనాన్స్ మెంబర్గా స్థానం చలనం కలిగింది. రెవెన్యూ జీఎం ఆర్.కృష్ణ మోహన్ను ఫైనాన్స్ జీఎంగా, ఆడిట్ జీఎం ఎస్.సత్యనారాయణను రెవెన్యూ జీఎంగా, ఫైనాన్స్ జీఎం వి.వేణు బాబును ఆడిట్ జీఎంగా బదిలీ చేశారు. కూరగాయల విత్తనాల పంపిణీ మామునూరు: ఖిలావరంగల్ మండలం మా మునూరు కృషి విజ్ఞాన కేంద్రంలో షెడ్యూల్ కులాల ఉప ప్రణాళిక (ఎస్సీఎస్పీ) పథకాల ఆధ్వర్యంలో శుక్రవారం వర్ధన్నపేట మండలం అంబేడ్కర్ నగర్కు చెందిన 35 మంది మహిహిళా రైతులకు కూరగాయల విత్తనాలను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కృషి విజ్ఞానకేంద్రం కోఆర్డినేటర్ రాజన్న హాజరై మాట్లాడారు. చిన్నపాటి వ్యవసాయ పనిముట్లు మహిళలకు కలిగే శ్రమను తగ్గించి పొలాల్లో కలుపు నివారణ పనులు సు లభతరం చేస్తాయని తెలిపారు. కూరగాయల విత్తన కిట్లను ఇంటి ప్రాంగణంలో లేదా కంచె ల వెంట నాటడం ద్వారా ఆహార భద్రత మె రుగు పడి గ్రామీణ మహిళల జీవనోపాధి స్థిరత్వానికి తోడ్పడుతుందని వివరించారు. శాస్త్రవేత్త డాక్టర్ సా యి కిరణ్, డాక్టర్ గణేష్, రైతులు పాల్గొన్నారు. -
ప్రజల గుండెల్లోనే పీవీ..
ఎల్కతుర్తి: అభివృద్ధి లేమి.. అప్పుల ఊబిలో కూనరిల్లుతున్న తరుణంలో అన్నీ తానై ఆర్థిక సంస్కణలు చేపట్టి దేశాన్ని ప్రగతిబాట పట్టించా రు.. నాటి ప్రధాని పీవీ నర్సింహారావు. హనుమకొండ జిల్లా భీమదేవపల్లి మండలంలోని వంగర అనే ఒక చిన్న గ్రామం నుంచి ప్రధాన మంత్రి స్థాయికి ఎదిగిన గొప్ప మేధావి పీవీ నర్సింహారావు. పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో వంగర గ్రామం ఓ వెలుగు వెలిగింది. ఆ సమయంలోనే గ్రామంలో పలు అభివృద్ధి పనులు జరిగాయి. నేడు దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు 104వ జయంతి. భీమదేవరపల్లి మండలం వంగరలో 1921 జూన్ 28న పీవీ జన్మించారు. రాష్ట్ర, కేంద్ర మంత్రి పదవులతోపాటు ముఖ్యమంతి, ప్రధాన మంత్రిగా పదవులకు వన్నెతెచ్చారు. పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో వంగరలో ముమ్మరంగా అభివృద్ధి పనులు చేపట్టారు. పోలీస్స్టేషన్ మంజూరైంది. రక్షిత తాగునీటి బావి, పీవీ మోడల్ కాలనీ, బాలికల గురుకుల పాఠశాల, 24 గంటలు పనిచేసే ఆస్పత్రి, సబ్స్టేషన్ మంజూరయ్యాయి. ఓ వైపు దేశం, మరో వైపు కాంగ్రెస్ పార్టీ దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో పీపీ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశాన్ని తలెత్తుకునేలా చేయడంతోపాటు భారత ఖ్యాతిని దేశ విదేశాల్లో ఇనుమడింపజేసిన ఘనత పీవీదే. కాగా, 2004 డిసెంబర్ 23న పీపీ తుదిశ్వాస విడిచారు. పీవీ మరణానంతరం అయనను సొంతపార్టీ పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. పీవీ నర్సింహారావు ఇంటిని మ్యూజియంగా మారుస్తామని హామీ ఇచ్చిన గత ప్రభుత్వం నెరవేర్చలేకపోయింది. పీవీ సొంతగ్రామంలో విగ్రహం ఏర్పాటు చేయకపోవడంతో చివరకు గ్రామస్తులే చందాలు వసూలు చేసుకొని విగ్రహాన్ని ప్రతిష్ఠించడం గమనార్హం. కళ తప్పిన వంగర గ్రామం నేడు పీవీ నర్సింహారావు జయంతి వంగరలో తుదిదశకు చేరుకున్న పీవీ విజ్ఞాన కేంద్రం పనులుతుది దశలో పీవీ విజ్ఞాన కేంద్రం పనులు వంగర గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని రెండేళ్ల క్రితమే ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా అప్పటి సీఎం కేసీఆర్ రూ.11 కోట్లు మంజూరు చేసి పనులను ప్రారంభించారు. పీవీ విజ్ఞాన వేదిక పార్కు నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. పీవీ విజ్ఞాన వేదికలో ప్రవేశ ద్వారం, ఫుడ్కోర్టు, ఫొటో గ్యాలరీ, పీవీ జీవిత విశేషాలకు సంబంధించిన చిత్రాలు ఉండేలా రూపకల్పన చేశారు. దీంతోపాటు ధ్యాన మందిరం, సైన్స్ మ్యూజియం, అంపీ థియేటర్, వాటర్ ఫౌంటేషన్, చారిత్రక శిల్పాలు, పార్క్కు ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు ప్రారంభించారు. పీవీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రారంభించాలని గత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, అప్పటి నాయకులు పట్టించుకోకపోవడంతో పనులు నత్తనడకన కొనసాగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మంత్రి పొన్నం ప్రభాకర్.. పీవీ విజ్ఞాన కేంద్రం నిర్మాణం పనులను వేగవంతం చేశారు. దీంతో నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి.నెరవేరని హామీలు.. హనుమకొండ– సిద్ధిపేట రహదారిలో వంగర క్రాస్ నుంచి గ్రామంలోకి వెళ్లే దారిలో స్వాగత తోరణం, పీవీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతోపాటు నాలుగు లైన్ల రహదారి నిర్మించి, సెంట్రల్ లైటింగ్ తీర్చిదిద్ధేందుకు అప్పటి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కానీ, నేటికీ పూర్తి కాలేదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వీటిపై దృష్టి సారించి వంగరలో అభివృద్ధి పనుల వేగం పెంచాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
వారాహి అవతారంలో పద్మాక్షీదేవి
హన్మకొండ అర్బన్: ఆషాఢమాసం శాకంబరీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు (శుక్రవారం) నగరంలోని పద్మాక్షి కాలనీలోని శ్రీ హనుమద్గిరి పద్మాక్షిదేవి వారాహి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు నాగిళ్ల షణ్ముఖ పద్మనాభ అవధాని, నాగిళ్ల శంకర్శర్మ ఉదయం అమ్మవారికి పూర్ణాభిషేకం నిర్వహించి వారాహి మాతగా అలంకరించారు. మంత్రపుష్పం నామ సంకీర్తన నిర్వహించారు. జూలై 10వ తేదీ వరకు నిర్వహించే శాకంబరీ ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పద్మాక్షి దేవిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ట్రస్ట్ సభ్యులు సదానందం, రాజ్కుమార్, భక్తులు పాల్గొన్నారు. -
హక్కుల పరిరక్షణలో ఓంకార్ పాత్ర ఎనలేనిది
● మోదీ పాలన దేశానికే ప్రమాదకరం ● రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలువరంగల్ చౌరస్తా: పౌర హక్కులు.. రాజ్యాంగ పరిరక్షణ కోసం మాజీ ఎమ్మెల్యే ఓంకార్ చేసిన ఉద్యమాలు, త్యాగాలు ఎనలేనివని పలువురు వక్తలు తెలిపారు. వరంగల్ అండర్ బ్రిడ్జికి సమీపంలోని ఎంసీపీఐ(యూ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మద్దికాయల ఓంకార్ శతజయంతి వార్షికోత్సవాల్లో భాగంగా పౌర హక్కుల పరిరక్షణలో ఆయన పాత్ర అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పెదారపు రమేష్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి సీపీఐ జిల్లా కార్యదర్శి మేకల రవి, సీపీఎం జిల్లా నాయకురాలు నలిగంటి రత్నమాల, న్యూ డెమోక్రసీ గ్రేటర్ కార్యదర్శి రాచర్ల బాలరాజు, నాయకులు నున్నా అప్పరావు, లిబరేషన్ జిల్లా కార్యదర్శి అక్కనపెల్లి యాదగిరి, రైతు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్, ప్రజా సంఘాల నాయకులు సోమ రామమూర్తి, కేడల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, ఈడీ, సీబీఐ లాంటి సంస్థలను ఉపయోగించి ప్రతిపక్ష పార్టీ నాయకులను అక్రమంగా జైలులో పెడుతుందని ఆరోపించారు. బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారన్నాని అన్నారు. అడవిలోని ఆదివాసీలను కాల్చి చంపుతూ.. అటవీ సంపద కార్పొరేట్ పెట్టుబడిదారులకు దోచిపెట్టేందుకు అనేక కుట్రలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో నాయకులు నర్ర ప్రతాప్, కుసుంబ బాబురావు, జగదీశ్వర్, నలిగంటి చంద్రమౌళి, రాజన్న, అనిత, ఇస్మాయిల్ పాల్గొన్నారు. -
కపాలినీ, భగమాలినీ క్రమాలలో భద్రకాళి
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో జరుగుతున్న శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం అమ్మవారికి కపాలినీ, భగమాలినీ క్రమాలలో పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు ఉదయం 4 గంటల నుంచి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం, క్షీరాన్న నివేదన, చతుఃస్థానార్చన తదితర పూజలు నిర్వహించారు. దశ మహావిద్యల్లోని కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరాన్ని కపాలినిగా, షోఢశీక్రమాన్ని అనుసరించి భోగబేరాన్ని భగమాలినిగా అలంకరించి నవరాత్ర విశేష పూజలు జరిపారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి పూజలు జరుపుకున్నారు. సినీ నటులు కొణిదెల నాగబాబు సతీమణి పద్మజ అమ్మవారిని దర్శించుకున్నారు. పూజల్లో ఆలయ చైర్మన్ డాక్టర్ శివసుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు పాల్గొన్నారు. ఆలయ ఈఓ శేషుభారతి పర్యవేక్షించారు. -
పెద్దపల్లి రైల్వే వంతెన ఘటనతో రైళ్లకు అంతరాయం
కాజీపేట రూరల్: పెద్దపల్లి రైల్వే వంతెన (ఆర్వోబీ) ఘటనతో శుక్రవారం పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనతో కాజీపేట జంక్షన్ మీదుగా సికింద్రాబాద్–బల్లార్షా రూట్లో ప్రయాణించే పలు రైళ్లకు గంటల తరబడి ఆలస్యం తలెత్తింది. బల్లార్షా–సికింద్రాబాద్ వెళ్లే భాగ్యనగర్, సికింద్రాబాద్– సిర్పూర్ కాగజ్నగర్ వెళ్లే ఇంటర్సిటీ, సికింద్రాబాద్– దానాపూర్ వెళ్లే ధానాపూర్ ఎక్స్ప్రెస్ నిర్ణీత సమయం కన్నా గంటల తరబడి ఆలస్యంగా చేరుకున్నాయి. దానాపూర్ను ఘన్పూర్ స్టేషన్లో నిలిపివేయడంతో కాజీపేటకు గంట ఆలస్యంగా చేరుకుంది. అదేవిధంగా న్యూడిల్లీ– హైదరాబాద్ వెళ్లే తెలంగాణ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 3 గంటలు, కాగజ్నగర్– సికింద్రాబాద్ వెళ్లే ఇంటర్సిటీ 2 గంటలు, కాగజ్నగర్– సికింద్రాబాద్ వెళ్లే కాగజ్నగర్ ఎక్స్ప్రెస్ 2:30 గంటలు రీ షెడ్యూల్ చేసినట్లు, భద్రాలచంరోడ్–సిర్పూర్ కాగజ్నగర్ వెళ్లే సింగరేణి ప్యాసింజర్ను వరంగల్ వరకే అప్ అండ్ డౌన్ రూట్లో నడిపించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైళ్ల ఆలస్యం, రీ షెడ్యూల్తో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కాజీపేట రైల్వే స్టేషన్ మేనేజర్ అగ్గి రవీందర్, కాజీపేట రైల్వే చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ జనరల్ విజయ్కుమార్, కాజీపేట రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ అరుణ్ ప్రయాణికులకు రైళ్ల రాకపోకలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించారు. ఉప్పల్లో ఐదు గంటలు నిలిచిన ఇంటర్సిటీ.. కమలాపూర్: హైదరాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్నగర్ వెళ్తున్న ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఉప్పల్ రైల్వే స్టేషన్లో శుక్రవారం సుమారు ఐదు గంటలపాటు నిలిచిపోయింది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్నగర్ వెళ్తున్న ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలు ఉప్పల్కు సుమారు 8–30 గంటలకు చేరుకుందని తెలిపారు. గంట, రెండు, మూడు, నాలుగు గంటలు గడిచినా రైలు ముందుకు కదలకపోవడంతో రైల్వే అధికారులను అడిగితే పెద్దపల్లి వద్ద ఆర్వోబీ పనులు జరుగుతున్నాయని, ఈ క్రమంలో గడ్డర్లు అమరుస్తున్న క్రమంలో ఓ గడ్డర్కు సంబంధించిన వస్తువు కిందకు జారిందని, దీంతో ఎలాంటి ప్రమాదం జరుగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఎక్కడి రైళ్లను అక్కడే నిలిపి వేశారని చెప్పినట్లు తెలిపారు. చివరికి మధ్యాహ్నం 1–30 ప్రాంతంలో ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలు ముందుకు కదిలింది. తెలంగాణ రీ షెడ్యూల్, సింగరేణి వరంగల్ వరకే ఇబ్బంది పడ్డ ప్రయాణికులు -
పట్టు పరిశ్రమకు ప్రభుత్వ ప్రోత్సాహం
హన్మకొండ: పట్టు పరిశ్రమల స్థాపనకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తోంది. ఈక్రమంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే వారికి రాయితీని అందిస్తోంది. హనుమకొండ జిల్లాలో 202 ఎకరాల్లో మల్బరీ సాగు చేస్తున్నారు. 2025–2026 ఆర్థిక సంవత్సరంలో అదనంగా 175 ఎకరాల్లో మల్బరీ సాగు చేయాలని, 3,19,900 పట్టు గుడ్ల ద్వారా 2,30,328 పట్టు కాయల ద్వారా 38,388 కిలోల పట్టుదారాన్ని ఉత్పత్తి చేయాలని ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు 81 ఎకరాలను మల్బరీ తోట పెంపకానికి గుర్తించారు. జిల్లాలో 8 మండలాల్లో 51 గ్రామాల్లో 97 మంది పట్టు పరిశ్రమ నిర్వహిస్తున్నారు. రాయితీ వివరాలు.. పట్టు పరిశ్రమను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం రాయితీని అందిస్తోంది. మల్బరీ తోటల పెంపకానికి రెండు ఎకరాలకు రూ.60 వేలు సహాయాన్ని రాయితీ రూపేణా అందిస్తోంది. పట్టు పురుగుల పెంపకానికి గది నిర్మాణానికి రూ.2.25 లక్షలు, స్టాండ్స్, ఇతర పరికరాలకు రూ.37,500, రోగ నిరోధక చర్యలు, క్రిమి సంహారక మందుల కోసం రూ.2,500, నీటి పారుదల కోసం రూ.50 వేలు రాయితీగా ప్రభుత్వం అందిస్తోంది. అదే విధంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మల్బరీ తోట నాటుట, నిర్వహణకు రూ.41,500, షెడ్డు నిర్మాణానికి 1,03,040 చెల్లిస్తోంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు మల్బరీ తోట పెంపకం, నిర్వహణకు రూ.78 వేలు, షెడ్ నిర్మాణానికి రూ.2,92,500, రేరింగ్ పరికరాలకు రూ.26,610, రేరింగ్ స్టాండ్స్కు 24,140, రోగ నిరోధక చర్యలు, క్రిమి సంహారాలకు రూ.3,250, నీటి పారుదల సదుపాయానికి రూ.65వేలు రాయితీగా చెల్లిస్తోంది. రాయితీ అందిస్తున్న కేంద్రం హనుమకొండ జిల్లాలో 202 ఎకరాల్లో మల్బరీ సాగు ఈ ఏడాది అదనంగా 175 ఎకరాల్లో సాగు లక్ష్యం -
వన మహోత్సవానికి సన్నద్ధం కావాలి
ఉద్యాన విభాగాధికారులతో మేయర్ సమీక్ష వరంగల్ అర్బన్: నగర పరిధిలో నిర్వహించే వన మహోత్సవంలో విస్తృతంగా మొక్కలు నాటేందుకు సన్నద్ధం కావాలని మేయర్ సుధారాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని మేయర్ చాంబర్లో ఉద్యాన వన విభాగాధికారులతో వన మహోత్సవంపై సమీక్షించారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. బల్దియా పరిధిలో 12 రకాల మొక్కలు, చామంతి గులాబీ పండ్ల మొక్కలు, హోం స్టేడ్ మొక్కల్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అందుకు కావాల్సిన టెండర్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 100 రోజుల కార్యక్రమాల అమలులో భాగంగా నియోజకవర్గాల్లో పార్కులను గుర్తించాలన్నారు. బల్దియా పరిధిలోని నియోజకవర్గానికి రెండు ప్రాంతాల్లో విస్తృతంగా మొక్కలు నాటేందుకు గుర్తించాలన్నారు. అదేవిధంగా నాగమయ్య కుంట ప్రాంతాన్ని ఫెన్సింగ్ చేసి వివిధ రకాల మొక్కలతో అలంకారంగా తీర్చిదిద్దాలన్నారు. సమావేశంలో ఉద్యానవన అధికారులు రమేశ్, లక్ష్మారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
మహిళా డెయిరీ ఏర్పాటుకు సత్వర చర్యలు
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి హన్మకొండ అర్బన్: పరకాల మహిళా డెయిరీ ఏర్పాటుకు కావాల్సిన చర్యలు సత్వరమే చేపట్టాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అధికారులకు సూచించారు. హనుమకొండ కలెక్టరేట్లో శుక్రవారం డెయిరీ ఏర్పాటుకు సంబంధించిన వివిధ అంశాలపై హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు స్నేహ శబరీష్, డాక్టర్ సత్య శారద, అధికారులతో ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి సమీక్షించారు. ఈసందర్భంగా పరకాల మహిళా డెయిరీ భవన నిర్మాణం, పాల సేకరణ, డెయిరీ ద్వారా పాల సరఫరా, మౌలిక వసతుల కల్పనకు తీసుకోవాల్సిన చర్యలు గురించి ఎమ్మెల్యే, కలెక్టర్లు, ఆయా శాఖల అధికారులతో చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ.. మిల్క్ సెంటర్ల ఏర్పాటు, రవాణా, సొసైటీ ఏర్పాటు, మార్కెటింగ్, చెల్లింపులు, తదితర అంశాలపై అధికారులు ప్రణాళిక రూపొందించాలన్నారు. సమావేశంలో హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల డీఆర్డీఓలు మేన శ్రీను, కౌసల్య దేవి, సహకార అధికారులు సంజీవరెడ్డి, లీడ్ బ్యాంకు డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీనివాస్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఆర్గనైజ్డ్ క్రైమ్స్పై దృష్టి పెట్టండి
వరంగల్ క్రైం: ఆర్గనైజ్డ్ క్రైమ్స్కు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలవద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ టాస్క్ఫోర్స్ అధికారులను ఆదేశించారు. సీపీ శుక్రవారం టాస్క్ఫోర్స్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈసందర్భంగా టాస్క్ ఫోర్స్లో పని చేస్తున్న అధికారులు, సిబ్బందిని విధులు, బాధ్యతలపై ఆరా తీశారు. చట్ట వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడే వ్యక్తుల వివరాలు సేకరించేందుకు బలమైన ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నమ్మకం కలిగేలా పనిచేయాలని సూచించారు. ఈసందర్భంగా టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ సీపీకి పూలమొక్క అందించి స్వాగతం పలికారు. -
పరిశీలిస్తూ.. ప్రశ్నిస్తూ
ఎంజీఎం : నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎన్ఎంసీ) మెడికల్ కాలేజీల్లో వసతులపై జారీ చేసిన షోకాజ్ నోటీసుల నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పర్యవేక్షణ కమిటీ శుక్రవారం నగరంలోని కేఎంసీ, ఎంజీఎం, సీకేఎం, జీఎంహెచ్ ఆస్పత్రులను తనిఖీ చేసింది. పర్యవేక్షణ కమిటీ చైర్మన్, రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సంగీత సత్యనారాయణ.. హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు స్నేహ శబరీష్, సత్యశారదతో కలిసి ముందుగా కాకతీయ మెడికల్ కళాశాల(కేఎంసీ)ను సందర్శించారు. బోధన సిబ్బంది, పరికరాల లేమిపై ఆయా విభాగాఽధిపతులతో సమీక్షించారు. కేఎంసీలో హెమటాలజీ విభాగాన్ని, వైద్యవిద్యార్థుల వసతి గృహాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి.. ప్రిన్సిపాల్ రాంకుమార్రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెడికల్ కళాశాలను, ప్రస్తుతం ఉన్న వైద్య అధ్యాపకుల పోస్టుల ఖాళీలు, మౌలిక వసతులపై ప్రభుత్వానికి నివేదించేందుకు పలు అంశాలపై చర్చించారు. పీఎంఎస్ఎస్వై ఆస్పత్రి పరిశీలన.. కేఎంసీ ప్రాంగణంలోని పీఎంఎస్ఎస్వై ఆస్పత్రిని కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డయాలసిస్ యూనిట్తోపాటు ఆపరేషన్ థియేటర్, యూ రాలజీ విభాగాన్ని తనిఖీ చేశారు. పలు అంశాలపై ఆయా విభాగాల వైద్యులతో మాట్లాడి సమస్యలు వివరిస్తున్న క్రమంలో వసతుల లేమిపై ప్రభుత్వానికి రాత పూర్వకంగా నివేదించాలని ఆదేశించా రు. పరికరాల మరమ్మతులో అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు. చిన్న చిన్న సమస్యలతో రోగులకు సేవలు నిలిపేయకుండా చూడాలన్నా రు. అనంతరం కేయూ జంక్షన్లోని క్షయ ఆస్పత్రిని సందర్శించి రోగులు, ఓపీ సేవల గురించి ఆరా తీశారు. మెడికల్ వ్యర్థాలను ఎక్కడికి తరలిస్తున్నారన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఎంజీఎంలో ఫార్మసీ సూపర్వైజర్పై చర్యలకు ఆదేశాలు ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం మౌలిక వసతుల కల్పనలో భాగంగా ఎంజీఎం ఆస్పత్రిని సాయంత్రం కమిషనర్ డాక్టర్ సంగీతసత్యనారాయణ సందర్శించారు. మొదట ఓపీ విభాగాన్ని పరిశీలించి కౌంటర్లు పెంచాలని ఆదేశించారు. ఫార్మసీ విభా గంలో ఈ–ఔషధి నమోదులో వివరాలు చెప్పడంలో విఫలమైన ఫార్మసీ సూపర్వైజర్ను సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం రోగులకు అందించే భోజనశాల, పిల్లల విభాగా న్ని పరిశీలించి ఆరోగ్య మహిళ పథకం ద్వారా అందుతున్న సేవలపై ఆరా తీశారు. అదేవిధంగా సీకేఎం ఆస్పత్రిని సందర్శించి ఆయా వార్డులు, ఓపీ సేవలు, రెఫరల్స్, ఫాలోఅప్ వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంజీఎం సూపరింటెండెంట్ కిశోర్, హనుమకొండ, వరంగల్ డీఎంహెచ్ఓలు అప్పయ్య, సాంబశివరావు, ఆర్ఈహెచ్ సూపరింటెండెంట్ భరత్, సీకేఎం ఆస్పత్రి వైద్యులు పాల్గొన్నారు. హాజరుశాతంపై చర్యలు తప్పవు.. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం వైద్యుల హాజరుశాతాన్ని ఫేస్ బ యోమెట్రిక్తో చేపట్టాలని కమిషనర్.. వైద్య ఆరోగ్యశాఖాధికారులకు స్పష్టం చేశారు. దీనిపై ఎంజీఎం సూపరింటెండెంట్ స్పందించి అలాంటి హా జరుశాతం ఎంజీఎంలో మొదలు కాలేదని సాంకేతిక కారణాలు చెప్పగా, బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరి అని ఆదేశించారు. భవిష్యత్లో వైద్యు ల హాజరుశాతంపై బయోమెట్రిక్ ఆధారంగా చర్యలు ఉంటాయని ఆమె స్పష్టం చేశారు. ఎన్ఎంసీ షోకాజ్ నోటీసులతో ఆస్పత్రులను సందర్శించిన పర్యవేక్షణ కమిటీ కేఎంసీ, ఎంజీఎం, సీకేఎం, జీఎంహెచ్ ఆస్పత్రుల తనిఖీ సమస్యలను రాతపూర్వకంగా ప్రభుత్వానికి పంపించండి.. పర్యవేక్షణ కమిటీ ౖచైర్మన్ డాక్టర్ సంగీత సత్యనారాయణ ఎంజీఎంలో ఫార్మసీ సూపర్వైజర్ సస్పెన్షన్కు ఆదేశాలు -
వివస్త్రను చేసి.. జననాంగంలో జీడిపోసి..
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో ఐదు రోజుల క్రితం ఓ అమానవీయ ఘటన జరిగింది. ఓ వివాహితను వివస్త్ర చేసి జననాంగంలో జీడిపోసి విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడికి వివాహేతర సంబంధం కారణం కాగా, బాధిత మహిళ ఆచూకీ ఇప్పటివరకు బంధువులకు లభించలేదని సమాచారం. ఈఘటనకు సంబంధించి ‘సాక్షి’కి అందిన ఎక్స్క్లూజివ్ సమాచారం మేరకు.. తాటికాయల గ్రామానికి చెందిన ఓ యువతిని పదేళ్ల క్రితం ములుగు మండలం బోలోనిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. వీరికి ముగ్గురు పిల్లలు. అతడికి సమీప బంధువైన ఓ వివాహితతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ మహిళతో కలిసి సుమారు పది రోజుల క్రితం ఎటో వెళ్లిపోయారు. దీంతో సదరు వ్యక్తి భార్య తనకు జరిగిన అన్యాయాన్ని స్వగ్రామమైన తాటికాయలకు వచ్చి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు కోపంతో రగిలిపోయి లేచిపోయిన ఆ ఇద్దరిని వెతికి ఐదు రోజుల క్రితం తాటికాయల గ్రామానికి తీసుకొచ్చి విచక్షణారహితంగా దాడి చేశారు. ఇద్దరికి గుండు గీయించారు. ఆ మహిళను ఓ మంచానికి కట్టేసి వివస్త్రను చేసి.. జననాంగంపై జీడీ (పూర్వకాలంలో నొప్పి తగ్గించేందుకు వాడేవారు, అదేవిధంగా శరీరంలోని సున్నిత అవయవాలపై పోస్తే పుండ్లు అవుతాయి) పోశారు. ‘తప్పు చేశాను.. క్షమించండి’ అని బాధిత మహిళ వేడుకున్నా.. పలువురు ఇష్టారీతిన దాడి చేశారు. యోనిలోంచి తీవ్ర రక్తస్రావమవుతున్నా వదల్లేదు. తర్వాత ఆఇద్దరిని ఏం చేశారో ఆచూకీ తెలియలేదు. ఈ అమానవీయ ఘటన జరిగి ఐదు రోజులు గడుస్తున్నా పోలీసులకు సమాచారం అందలేదని తెలిసింది. అసలు ఆ ఇద్దరు ప్రాణాలతో ఉన్నారో, లేదో తెలియని పరిస్థితి. వివాహితపై దాడి వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కారణంతోనే.. ఘటన జరిగి ఐదు రోజులు తాటికాయల గ్రామంలో అమానవీయం -
రహదారుల భద్రతపై తనిఖీలు
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్ : రహదారుల భద్రతా చర్యల్లో భాగంగా జిల్లాలో ప్రతీ 15 రోజులకు ఒకసారి ఆర్అండ్బీ, పోలీస్, జాతీయ రహదారులు, జీడబ్ల్యూఎంసీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్.. ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో రహదారుల భద్రత చర్యలపై అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ, రాష్ట్ర రహదారుల్లో రద్దీ, ప్రమాదకర ప్రాంతాలు, క్రిటికల్ జంక్షన్లను గుర్తించి సంబంధింత శాఖల అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కటాక్షపూర్ వద్ద నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు రేడియంతో కూడిన సైన్ బోర్డులు, ట్యాంకర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి ఆ జాబితాను అందజేయాలన్నారు. ప్రమాదాల నివారణకు మూతలు లేని, నిర్మాణ పనులు జరుగుతున్న చోట్ల, మ్యాన్హోల్స్ వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, ఆర్అండ్బీ ఈఈ సురేశ్ బాబు, నేషనల్ హైవేస్ ఈఈ మనోహర్, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రమేశ్రాథోడ్, నారాయణ, అడిషనల్ ఏసీపీ ప్రభాకర్రావు, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. -
టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల
హనుమకొండ జిల్లాలో 89.95%, వరంగల్ జిల్లాలో 60.73% ఉత్తీర్ణత విద్యారణ్యపురి: ఈనెల 3 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించిన టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల్ని శుక్రవారం విడుదల చేశారు. హనుమకొండ జిల్లాలో 463 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. వారిలో 416 మంది 89.85 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు డీఈఓ డి.వాసంతి తెలిపారు. బాలురు 277 మందికి 249 మంది, బాలికలకు 186 మందికి 167 మంది ఉతీర్ణులైనట్లు పేర్కొన్నారు. వరంగల్ జిల్లాలో 60.73 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు డీఈఓ మామిడి జ్ఞానేశ్వర్ తెలిపారు. వర్సిటీ అధికారుల నిర్లక్ష్యంపై లోకాయుక్తలో ఫిర్యాదుఎంజీఎం: వరంగల్లోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం, ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీలకు మేలు చేయాలనే ఒప్పందం, నష్టపోయిన అర్హులైన 400 మెడికల్ విద్యార్థులకు న్యాయం జరగాలని, అవినీతి అధికారులపై విచారణ చేపట్టాలని కోరుతూ వినియోగదారుల మండలి రాష్ట్ర కమిటీ లోకాయుక్తలో ఫిర్యాదు చేసింది. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు డీమ్డ్ యూనివర్సిటీలుగా మారడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు తప్పనిసరి. అయితే తెలంగాణ ప్రభుత్వ అనుమతి లేకున్నా.. 400 ఎంబీబీఎస్ సీట్లు ఉన్న రెండు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు డీమ్డ్ యూనివర్సిటీలుగా మారడం, ఈక్రమంలో గతేడాది అర్హులైన 400 మెడికల్ సీట్లు రాష్ట్ర ప్రభుత్వ పరిధి నుంచి దాటిపోవడంపై జరిగిన అవినీతిపై విచారణ కోసం లోకాయుక్తలో ఫిర్యాదు దాఖలు చేసినట్లు వినియోగదారుల మండలి ప్రతినిధులు సాంబరాజు చక్రపాణి, మొగిలిచర్ల సుదర్శన్ తెలిపారు. మధ్యవర్తిత్వ ప్రత్యేక గవర్నమెంట్ ప్లీడర్గా వాణివరంగల్ లీగల్: హనుమకొండ జిల్లా కోర్టులో మధ్యవర్తిత్వ కేసుల ప్రత్యేక గవర్నమెంట్ ప్లీడర్ (స్పెషల్ జీపీ)గా న్యాయవాది పోలసాని వాణిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ శాసన – న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి ఉత్తర్వులు జారీ చేశారు. నియామకం మూడేళ్ల వరకు వర్తిస్తుందని, నెలకు రూ.60 వేల గౌరవ వేతనం చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సంగెం మండలం గవిచర్ల గ్రామానికి చెందిన పోలసాని వాణి 18 సంవత్సరాల నుంచి న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఆమె జీవిత భాగస్వామి శ్రీనివాసరెడ్డి కూడా న్యాయవాదే. ఈసందర్భంగా వాణి మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ‘పద్మ’ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానంవరంగల్ స్పోర్ట్స్: గణతంత్ర (జనవరి 26) దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఏటా అందించే పద్మ అవార్డుల కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హనుమకొండ డీవైఎస్ఓ గుగులోతు అశోక్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారు, అందుకు సంబంధించిన పత్రికల్లో ప్రచురితమైన ఫొటోలు, నాలుగు సెట్లను రూపొందించి జూలై 25లోగా హనుమకొండలోని ప్రభుత్వ కాకతీయ డిగ్రీ కళాశాల ఎదురుగా ఉన్న యువజన, క్రీడల కార్యాలయంలో అందజేయాలని కోరారు. అంతేకాకుండా www:https://padmaawards.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. నిర్ణీత గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులను తిరస్కరించనున్నట్లు పేర్కొన్నారు. బాలల సంరక్షణే లక్ష్యంకాజీపేట అర్బన్: బాలల రక్షణే లక్ష్యంగా బాలల సంరక్షణ కేంద్రాలు పని చేయాలని అడిషనల్ కలెక్టర్ వెంకట్రెడ్డి తెలిపారు. హనుమకొండలోని ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హనుమకొండలోని ప్రభుత్వ బాలసదనం, ఫాతిమానగర్లోని డివైన్ మెర్సీ, స్పందన మానసిక దివ్యాంగుల కేంద్రాలను శుక్రవారం అడిషనల్ కలెక్టర్ వెంకట్రెడ్డి ఇన్స్పెక్షన్ కమిటీ సభ్యులతో కలిసి తనిఖీ చేశారు. నిబంధనలకు అనుగుణంగా ప్రమాణాలు పాటించాలని, భవనాలకు ఫిట్నెస్ కలిగి ఉండాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సంస్థల నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ చైర్పర్సన్ అన్నమనేని అనిల్చందర్రావు, సభ్యుడు సందసాని రాజేంద్రప్రసాద్, ఇన్చార్జ్ డీసీపీఓ ప్రవీణ్కుమార్, ప్రొటెక్షన్ ఆఫీసర్ మౌనిక తదితరులు పాల్గొన్నారు. -
ఇంకా పునాదుల్లో నే!
సాక్షి, వరంగల్: ప్రయాణికులకు సకల సౌకర్యాలు, ఆధునిక హంగులతో చేపట్టిన వరంగల్ బస్టాండ్ నిర్మాణ పనులు నిదానంగా సాగుతున్నాయి. 25 ఏళ్ల క్రితం నాటి ఆర్సీసీ ఫ్రేమ్డ్ స్ట్రక్చర్తో నిర్మించిన వరంగల్ పాత బస్టాండ్ను కూల్చివేసి.. ఆ స్థానంలో నాలుగు నెలల క్రితం మొదలు పెట్టిన నిర్మాణ పనులు ఇంకా ఫుటింగ్ దశలోనే ఉన్నాయి. భారీ ఎత్తున కాంక్రీట్ వినియోగించి, రాఫ్ట్ ఫౌండేషన్ పద్ధతిలో పునాదులు తవ్వి నిర్మిస్తున్నారు. మట్టిని చదును చేసి పునాది కోసం కాంక్రీట్ వేయడానికి ముందు బ్లైండింగ్ కాంక్రీట్ పొర వేస్తున్నారు. కాంక్రీట్ వేసిన తర్వాత, రాడ్లు అమర్చి కావాల్సిన మందంతో స్లాబ్ నిర్మించనున్నారు. ఇలా రెండు సెల్లార్లు, గ్రౌండ్ ఫ్లోర్లు నిర్మించేందుకు రెండేళ్లకుపైగా సమయం తీసుకునే అవకాశం ఉంది. సాధ్యమైనంత తొందరగా కాంట్రాక్ట్ కాలపరిమితి 18 నెలల్లోనే పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) అధికారులు పేర్కొంటున్నారు. ఎప్పటికప్పుడు సంబంధిత కాంట్రాక్టర్తో మాట్లాడుతూ పనులను వేగవంతం చేస్తామంటున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో పనులు ఆలస్యమయ్యేలా కనిపిస్తున్నాయి. నీటి ఊటతో ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు ఫుటింగ్ పనుల్లో వేగిరం పెంచారు. ఇవన్నీ పరిశీలిస్తే బస్టాండ్ నిర్మాణానికి చాలా సమయం పట్టే అవకాశం ఉందని ప్రయాణికులు అంటున్నారు. మరో రూ.50 కోట్లు అవసరం.. అన్ని జిల్లాలు, రాష్ట్రాల బస్సులతోపాటు సిటీ బస్సులు ప్రయాణికులను ఎక్కించుకునేలా గ్రౌండ్ ఫ్లోర్లో 32 ప్లాట్ఫాంలు నిర్మించనున్నారు. మరో ఐదు అంతస్తుల్లో వ్యాపార, వినోదం తదితర వసతులు ఉండేలా కాంప్లెక్స్లు అందుబాటులోకి తేనున్నారు. సెల్లార్లో పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. అలాగే, వరంగల్ రైల్వే స్టేషన్, నియోకు అనుసంధానంగా వరంగల్ బస్టాండ్ ఉండేలా.. అండర్ వాక్ లేదంటే స్కైవాక్ నిర్మించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే రెండు సెల్లార్లు, గ్రౌండ్ఫ్లోర్ కోసం కేటాయించిన రూ.75 కోట్లతోపాటు మరో రూ.50 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతమున్న నిధులతో రెండు సెల్లార్లు, గ్రౌండ్ ఫ్లోర్ పనులు పూర్తి చేసి బస్సు సర్వీసులు నడిచేలా చూడనున్నారు. ఇది ఏడాదిన్నరలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామంటున్నారు. ఆతర్వాత వచ్చే నిధులతోనే పైఅంతస్తులు నిర్మించే అవకాశముందని తెలుస్తోంది. ఇలా పూర్తిస్థాయిలో వరంగల్ బస్టాండ్ అందుబాటులోకి రావాలంటే మూడేళ్లకుపైగా సమయం తీసుకునే అవకాశముంది. ‘ఈ బస్టాండ్ నిర్మాణ పనులు పునాది దశల్లో ఆలస్యం అవుతాయి. రెండు సెల్లార్లు, గ్రౌండ్ఫ్లోర్ వరకు నిర్మాణ పనులు నిర్ణీత కాలపరిమితి 18 నెలల్లో పూర్తయ్యేలా చూస్తాం. ఇప్పటికే నాలుగు నెలలు అయ్యింది. కాంట్రాక్టర్కు మార్గదర్శనం చేస్తూ సాధ్యమైనంత తొందరగా ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చేలా చూస్తాం’ అని ‘కుడా’ అధికారి ఒకరు తెలిపారు. ప్రయాణికులకు తిప్పలే.. వరంగల్ బస్టాండ్ నిర్మాణ పనులు జరుగుతుండడంతో ప్రయాణికుల సౌకర్యార్థం సమీపంలో తాత్కాలిక బస్టాండ్ను ఏర్పాటు చేసి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వర్షం పడితే అక్కడ కూడా నీరు నిలిచే అవకాశం ఉంది. దీంతో ఈ వర్షాకాలంలో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పేలా లేవు. భారీ వర్షం కురిస్తే తడుస్తారు. ఇలా కాలం ఏదైనా వరంగల్ ఆధునిక బస్టాండ్ అందుబాటులోకి వచ్చేంత వరకు ప్రయాణికులతోపాటు ఆర్టీసీ సిబ్బందికి కూడా ఇబ్బందులు తప్పేలా లేవు. నిదానంగా వరంగల్ బస్టాండ్ నిర్మాణ పనులు రాఫ్ట్ ఫౌండేషన్ పద్ధతిలో నిర్మాణం గుంతల్లో నీటిఊట రాకుండా ఫుటింగ్ వర్క్ 18 నెలల్లో పూర్తిచేస్తామంటున్న ‘కుడా’ అధికారులు అప్పటివరకు తాత్కాలిక బస్టాండ్లోనే సేవలు -
గడ్డం కేశవమూర్తికి ఎన్టీఆర్ అవార్డు
హన్మకొండ అర్బన్ : సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రచయిత గడ్డం కేశవమూర్తికి విజయవాడకు చెందిన ఎక్స్ రే సాహిత్య సాంస్కతిక సేవా సంస్థ దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని పద్మశ్రీ ఎన్టీ రామారావు స్మారక అవార్డు ప్రకటించింది. ప్రముఖ సినీ నటు డు డాక్టర్ రాజేంద్రప్రసాద్తోపాటు గడ్డం కేశవమూర్తికి ఈ అవార్డును ప్రదానం చేసింది. ఈ మేర కు గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణా భివృద్ధి శాఖల మంత్రి ధనసరి సీతక్క చేతుల మీదుగా కేశవమూర్తి ఈ అవార్డును అందుకున్నారు. కేశవమూర్తికి అవార్డు లభించడం పట్ల వివిధ జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. కన్సల్టెన్సీల కార్మిక దోపిడీ అరికట్టాలిహన్మకొండ: ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల కన్సల్టెన్సీల కార్మిక దోపిడీని అరికట్టాలని టీజీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న డిమాండ్ చేశారు. జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులకు డ్రైవర్లను సరఫరా చేస్తున్న శ్రీ బాలాజీ కన్సల్టెన్సీ , సిస్కాన్ సంస్థలు డ్రైవర్ల జీతాల నుంచి పీఎఫ్ డబ్బులు కోత విధించి 5 నెలలుగా ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో జమ చేయకుండా సొంతానికి వాడుకోవడం అన్యాయమని గురువారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 5 నెలల నుంచి జేబీఎం బస్సులపై పని చేస్తున్న కార్మికుల జీతాల నుంచి పీఎఫ్ పేరుతో నెలకు రూ.3 వేల చొప్పున వసూలు చేసి ఖాతాలో జమ చేయకపోవడాన్ని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. పీఎఫ్ సొమ్ము దుర్వినియోగంపై జేబీఎం, ఆర్టీసీ యాజమాన్యం వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకుని ఆ సొమ్మును పీఎఫ్ ఖాతా లో జమ చేయించాలని డిమాండ్ చేశారు. కేయూ పీజీ కోర్సుల రెండో సెమిస్టర్ పరీక్షలుకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో పీజీ కోర్సుల రెండో సెమిస్టర్ పరీక్షలు జూలై 25నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి సౌజన్య గురువారం తెలిపారు. ఈ మేరకు గురువారం టైం టేబుల్ విడుదల చేశారు. పీజీ కోర్సుల ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ జర్నలిజం మాస్ కమ్యూనికేషన్, ఎంఎల్ఐఎస్సీ, ఎంటీఎం, ఎంఎస్డబ్ల్యూ, ఎంహెచ్ఆర్ఎం కోర్సుల రెండో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నారు. జూలై 25, 28, 30, అగస్టు 1, 4, 6వ తేదీల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు సౌజన్య తెలిపారు. -
అసిస్టెంట్ లైన్మెన్కు విద్యుత్ షాక్
● రాంగ్ ఎల్సీతో ప్రమాదం..హసన్పర్తి: ఇటీవల పర్వతగిరి లో విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిపై విధులు నిర్వర్తిస్తున్న బాలాజీ ప్రమాదానికి గురైన ఘటన మరుక ముందే హసన్పర్తి మండలం జయగిరి సబ్స్టేషన్ పరిధిలోని అన్నాసాగరంలో మరో ఘటన గురువారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అసిస్టెంట్ లైన్మెన్గా విధులు నిర్వర్తిస్తున్న చంద్రమూర్తి ప్రమాదానికి గురయ్యాడు. విద్యుత్ స్తంభం ఎక్కి ఏబి స్విచ్ మరమ్మతు చేస్తున్న క్రమంలో విద్యుత్ ప్రమాదానికి గురై పోల్పైనే వేలాడాడు. ఈ ఘటనలో చంద్రమూర్తికి తీవ్ర గాయాలయ్యా యి. క్షతగాత్రుడిని ఎంజీఎం తరలించారు. పరిస్థితి వి షమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించినట్లు స్థానికులు తెలిపారు. రాంగ్ ఎల్సీతో ప్రమాదం.. అన్నాసాగరం పరిధిలోని ఎస్ఎస్ 36 100 కేవీఏ వద్ద సాంకేతిక సమస్య ఉత్పన్నమైంది.దీంతో అసిస్టెంట్ లైన్మెన్ చంద్రమూర్తి ఎల్సీ తీసుకున్నాడు. స్తంభం ఎక్కి మరమ్మతు చేయడానికి యత్నిస్తున్న క్రమంలో విద్యుత్ ప్రమాదానికి గురయ్యాడు. రాంగ్ ఎల్సీ ఇవ్వడంతో ఈ ప్రమాదం జరిగినట్లు విద్యుత్ఽశాఖ అధికారులు చెబుతున్నారు. సబ్స్టేషన్కు వెళ్లకుండానే ఎల్సీ.. ఇదిలా ఉండగా, ఎక్కడైనా విద్యుత్ సమస్య ఏర్పడినప్పుడు సంబంధిత సబ్స్టేషన్కు వెళ్లి ఎల్సీ తీసుకోవాలి. కొంతమంది లైన్మెన్లు మాత్రం ఫోన్ ద్వా రా అక్కడ ఉన్న ఆపరేటర్కు సమాచారమిచ్చి ఎల్సీ తీసుకున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కాగా, విద్యుత్ ప్రమాదంపై విచారణ చేపడుతున్నట్లు ఏఈ అశోక్కుమార్ తెలిపారు. -
కంప్యూటర్ నాలెడ్జ్
● అప్పుడే కొలువు సాధ్యం..లేనిపక్షంలో కలే.. ● చదువుతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలంటున్న నిపుణులుఖిలా వరంగల్ : ఇంజనీరింగ్.. ఒకప్పుడు డిమాండ్ ఉన్న కోర్సు.. ఈ చదువు పూర్తయిందంటే ఉద్యోగం వచ్చినట్లే. జీవితంలో ఇక స్థిరపడినట్లే. మరిప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. కోర్సు పూర్తయినా ఉద్యోగం వస్తుందనే నమ్మకం లేదు. దీనికి ప్రధాన కారణం కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోవడమే. ఇంజనీరింగ్ విద్యతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాల్సిందే. అప్పుడే కొలువు దక్కుతుంది. లేనిపక్షంలో ఉద్యోగం కలగానే మిగులుతుంది. చదువుకు.. చేసే పనికి ఉండని పొంతన.. ఇంజనీరింగ్ కోర్సు పూర్తయిన తర్వాత యువత ఏదో ఒక చిన్న ఉద్యోగంలో చేరుతున్నారు. ఇక్కడ తన చదువుకు.. చేసే పనికి పొంతనే ఉండడం లేదు. ఎందుకంటే.. ఇంజనీరింగ్ పూర్తయిన తర్వా త ఏం చేయాలనే అంశంపై అవగాహన ఉండడం లేదు. ఫలితంగా కొంత మంది హైదరాబాద్, బెంగళూరు, చైన్నె, ఇతర ప్రాంతాల్లో ఏదో ఒక చిన్న ఉద్యోగం చేస్తూ కాలం గడుపుతున్నారు. యువత ఇక నుంచి అలా చేయొద్దు. ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత ఈ కోర్సులు చేస్తే ఉద్యోగాలు మీ సొంతమవుతాయి. దీనిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఉద్యోగ వేటలో ఇంజనీరింగ్ విద్యార్థులు.. ఇంజనీరింగ్ చదివితే ఉద్యోగం వస్తుందనుకున్న కొంతమంది విద్యార్థులు నిరుత్సాహం చెందక తప్పడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏటా సుమారు 3వేలకుపైగా విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసుకుని బయటకు వస్తున్నారు. 30 నుంచి 40 శాతంలోపే వారికి క్యాంపస్ ఇంటర్వ్యూ లు ద్వారా ఉద్యోగాలు లభిస్తున్నాయి. మిగతా వారు ఇంజనీరింగ్ పట్టాలతో ఉద్యోగాల వేట ప్రారంభిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం కంప్యూటర్ నాలెడ్జ్, ఉద్యోగానికి సంబంధించిన కంప్యూటర్ కోర్సు నేర్చుకోకపోవడమే. ఫలితంగా యువత ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధంలేని ఉద్యోగాల్లో స్థిరపడుతోంది. ఉద్యోగం సులభంగా సాధించాలంటే ఇంజనీరింగ్ చదువుకు కంప్యూటర్ కోర్సు యాడ్ చేయాల్సిందే. అప్పుడే అతిసులభంగా సాఫ్ట్వేర్ ఉద్యోగంలో స్థిరపడొచ్చు. ఇందులో కొన్ని కోర్సులు ఇలా ఉన్నాయి. సీఎస్ఈ గ్రూప్ .. ఇంజనీరింగ్లో సీఎస్ఈ (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్) గ్రూప్ పూర్తి చేసిన విద్యార్థులు 6 నెలల నుంచి సంవత్సర వరకు ఉండే కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవాలి. ఆ కోర్సులు బిగ్డేటా ఎనటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లె ర్ని, సైబర్ సెక్యూరిటీ వంటి మూడు కోర్సుల నే ర్చుకోవాలి. ఇంజనీరింగ్లో మార్కులశాతంతోపా టు కంప్యూటర్ కోర్సు ఉంటేనే ఉద్యోగం వస్తుంది. ఈఈఈ గ్రూప్ .. ఈఈఈ (ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్) గ్రూప్ పూర్తి చేసిన విద్యార్థులు సాఫ్ట్వేర్ ఉద్యోగానికి కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్ కోర్సుతో పాటు పవర్ టెక్నాలజీ సోలార్ కోర్సు చేయాలి. ఈ కోర్సులు 3 నెలల నుంచి 6నెలల వరకు ఉంటాయి. సివిల్ గ్రూప్.. సివిల్ గ్రూప్ చదివిన విద్యార్థులు స్టక్చరల్ ఇంజనీరింగ్ రివిట్ ఆర్కిటెక్చర్, రివిట్ స్ట్రక్చర్, ఆటో క్యాడ్ కోర్సులు నేర్చుకోవాలి. వీటి ద్వారా ప్రాజెక్టుల ఏర్పాటుకు ఇంజనీర్గా ఉద్యోగంలో చేరడానికి అవకాశాలు ఉంటాయి. ఈసీఈ గ్రూప్.. ఈసీఈ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్) గ్రూప్ చేసిన వారికి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లభిస్తాయి. అయితే విద్యార్థులు కంప్యూటర్ కోర్సులు చేయాలి. ఆండ్రాయిడ్ స్టిస్టమ్, ఈఎల్ఎస్ఐ డిజైన్స్ కోర్సులతో పాటు బిగ్ డేటా ఎనటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్ని, సైబర్ సెక్యూరిటీ కోర్సులు చేయాలి. ఈ కోర్సులు 6 నెలలు ఉంటాయి. దీంతో పాటు ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్(ఐఓటీ) కోర్సు చేస్తే మరింత ఉపయోగం. మెకానికల్ గ్రూప్ .. మెకానికల్ గ్రూప్ విద్యార్థులు రోబోటిక్స్ ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్, ఆటోకేడ్, కెటియా కోర్సులు పూర్తి చేయాలి. ఇవి మూడు నుంచి ఆరు నెలలు కోర్సులుగా ఉంటాయి. ఈకోర్సులు పూర్తి చేస్తేనే ఇంటర్వ్యూల్లో ప్రాధాన్యం ఉంటుంది. ఈకోర్సులు హైదరాబాద్, బెంగళూరులోనే.. చదువు పూర్తయిన విద్యార్థులు వెంటనే ఇంజనీరింగ్కు సంబంధించిన కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవాలి. ఆ కోర్సులు హైదరాబాద్, బెంగళూరు, చైన్నె వంటి నగరాల్లోనే నేర్చుకోవాలి. ఎందుకంటే అక్కడ కంప్యూటర్ కోర్సులు నేర్పేవారు అనుభవం కలిగి ఉంటారు. వారి సూచనలు ఉద్యోగం సాధించడానికి ఉపయోపడతాయి. విజయానికి ముఖ్య పాయింట్లు విద్యార్థులు ఇంజనీరింగ్లో 90 శాతం మార్కులు సాధించినా ఇంటర్వ్యూలలో వెనుకబడుతున్నారు. ప్రధానంగా సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, టెక్నికల్ స్కిల్స్, హ్యూమన్ రిలేషన్స్ వంటివి పూర్తిగా కలిగి ఉంటే ఇంటర్వ్యూల్లో ఎంపికవుతారు. కళాశాలలో క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైయినింగ్కు తప్పని సరిగా వెళ్లాలి. ప్రస్తుతం అన్ని కళాశాలలో అధ్యాపకులు శిక్షణ ఇస్తున్నారు. ఎలా మాట్లాడాలి అనే అంశంపై తర్ఫీదు ఇస్తున్నారు. -
రౌడీషీటర్ దారుణ హత్య
● ఆర్థిక లావాదేవీలే కారణం.. ● పోలీసుల అదుపులో నిందితులు ● నిందితుల్లో ఓ మాజీ పోలీస్ కానిస్టేబుల్.. వరంగల్ క్రైం : నగరంలోని వడ్డేపల్లికి చెందిన రౌడీషీటర్ మహ్మద్ సాధిక్ హుస్సేన్(48) దారుణ హ త్యకు గురయ్యాడు. ఈ ఘటన బుధవారం రాత్రి సుబేదారి పీఎస్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ ఎం.రంజిత్కుమార్ కథనం ప్రకారం.. మహ్మద్ సాధిక్ హుస్సేన్ తన పెద్దనాన్న కొడుకు ఖాదర్ హుస్సేన్కు రూ. 3 లక్షలు అప్పు ఇచ్చాడు. ఇందులో రూ. లక్ష ఇచ్చిన అనంతరం ఖాదర్ హుస్సేన్ మృతి చెందాడు. దీంతో సాధిక్ హుస్సేన్ తన మిగతా డబ్బులు తిరిగి ఇవ్వాలని ఇటీవల ఖాదర్ హు స్సేన్ కుమారులు మహ్మద్ సోహెల్, మహ్మద్ బషీర్ను అడిగాడు. దీంతో బుధవారం రాత్రి సాధిక్ హుస్సేన్ ఇంటికెళ్లిన మహ్మద్ సోహెల్, మహ్మద్ బషీర్.. మాట్లాడాలని సాధిక్ హుస్సేన్ను శ్మశాన వాటిక దగ్గరకు తీసుకొచ్చి మరో నిందితుడు అక్రమ్తో కలిసి హత్య చేశారు. సా ధిక్ హుస్సేన్ను హత్య చేస్తే డబ్బులు అడిగే వారు ఎవరూ ఉండరనే కారణంతో ఇంటి నుంచి తీసుకొచ్చి బండరాయితో మోది హత్య చేశారు. నిందితుల్లో అక్రమ్ గతంలో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తించి ఓ హత్యకేసులో నిందితుడిగా ఉండడంతో సర్వీస్ నుంచి తొలగించినట్లు ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు.మృతుడి చెల్లి తస్లీమా బేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. పోలీసుల అదుపులో నిందితులు? రౌడీషీటర్ మహ్మద్ సాధిక్ హుస్సేన్ హత్య కేసులో నిందితులుగా ఉన్న మహ్మద్ సోహెల్, మహ్మద్ బషీర్, మహ్మద్ అక్రమ్ పోలీసులు అదుపులో ఉన్నట్లు తెలిసింది. సాధిక్ హుస్సేన్ హత్య విషయం తెలిసి న వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న సుబేదారి ఇన్స్పెక్టర్ రంజిత్కుమార్ ఎదుట నిందితులు నేరుగా వచ్చి నేరం అంగీకరించి లొంగిపోయినట్లు తెలిసింది. పోలీసులు మాత్రం ధ్రువీకరించలేదు. -
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
ఖిలా వరంగల్: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బీవీ నిర్మలా గీతాంబ సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం మామునూరు జవహర్ నవోదయ విద్యాలయంలో జరిగిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. యువత మత్తు పదార్థాలకు అలవాటుపడితే అనేక సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. దేశ భవిష్యత్ను కుంగదీసే మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు కృషిచేయాలని పేర్కొన్నారు. మత్తు పదార్థాల వినియోగం సరదగా మొదలై వ్యసనంలా మారి చివరకు జీవితాన్ని నాశనం చేస్తాయని వివరించారు. మద్యం, డ్రగ్స్ మత్తులో తీవ్రమైన నేరాలకు పాల్ప డుతారని, మత్తు పదార్థాలు సేవించడం హానికరమని, చట్టరీత్యా నేరమని జడ్జి పేర్కొన్నారు. సదస్సులో మామునూరు ఏసీపీ వెంకటేశ్, ఇన్స్పెక్టర్ ర మేశ్, లీగల్ కౌన్సిల్ పి.శ్రీనివాస్రావు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వలుస సుధీర్, ప్రిన్సిపాల్ బి.పూర్ణిమ, కృష్ణవేణి, సిల్వర్ క్రౌన్ హైస్కూల్ నుంచి 600 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బీవీ నిర్మలాగీతాంబ -
మత్తు పదార్థాల నిర్మూలన ప్రతీ ఒక్కరి బాధ్యత
కేయూ క్యాంపస్ : మత్తు పదార్థాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యతని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె.ప్రతాప్ రెడ్డి అన్నారు. కేయూ ఎన్ఎస్ఎస్, హనుమకొండ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సంయుక్తంగా ‘అంతర్జాతీయ డ్రగ్ వ్యతిరేక దినోత్సవం’ సందర్భంగా గురువారం కేయూలోని సెనేట్ హాల్లో జాతీయ సేవా పథకం ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఈసం నారాయణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వీసీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేయూ డ్రగ్ ఫ్రీ యూనివర్సిటీ అని, క్షణికానందం కోసం యువత తప్పటడుగు వేయొద్దన్నారు. మత్తు పదార్థాలతో వ్యక్తిగతంగానే కాకుండా కుటుంబ, దేశంపై ప్రభావం ఉంటుందన్నారు. హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ డాక్టర్ కె.పట్టాభి రామారావు మాట్లాడుతూ భావిభారత యువత మత్తు పదార్థాలపై యుద్ధం చేయాలన్నారు. అవగాహనతో శారీకక, మానసిక ఆరోగ్యం పొందొచ్చని, తద్వారా ఏదైనా సాధించొచ్చన్నారు. రిజిస్ట్రార్ రామచంద్రం మాట్లాడుతూ డ్రగ్స్కు జీవితాన్ని బానిస చేసుకోవద్దని, తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను కనిపెడుతూ ఉండాలన్నారు. వరంగల్ నార్కోటిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ దేశాభివృద్ధికి మాదక ద్రవ్యాల వినియోగం గొడ్డలిపెట్టు అన్నారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ‘యాంటీ డ్రగ్స్’, ‘సే నో టు డ్రగ్స్’ పోస్టర్లను ఆవిష్కరించారు. క్యాంపస్లో ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో హనుమకొండ డీఎల్ఎస్ఏ కార్యదర్శి క్షమా దేశ్పాండే, పాలకమండలి సభ్యురాలు కె.అనితారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కేయూ వీసీ ప్రతాప్రెడ్డి -
అలరించిన ‘రుక్మిణీ కల్యాణం’
హన్మకొండ అర్బన్: శ్రీ వేణుగోపాలస్వామి కళానాట్యమండలి దశమ వార్షికోత్సవం సందర్భంగా గురువారం హనుమకొండ కాళోజి కళాక్షేత్రంలో ప్రదర్శించిన రుక్మిణీ కల్యాణం పౌరాణిక పద్య నాటకం ఆహుతులను అలరించింది. స్టేషన్ఘన్పూర్ నాటక సమాజాల సమాఖ్య అధ్యక్షుడు అక్కెనపల్లి రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాటక సమాజాల సమాఖ్య అధ్యక్షుడు ఆకుల సదానందం జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. కాళోజీ కళాక్షేత్రంలో మొట్టమొదటి పౌరాణిక పద్య నాటకం ప్రదర్శించే అవకాశం దక్కడం ఎంతో అదృష్టమన్నారు. నాటకం రూపొందించిన రవీందర్, కళాకారులను అభినందించారు. -
కేయూ డిగ్రీ సెమిస్టర్ల పరీక్షల ఫలితాలు విడుదల
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో ఏప్రిల్, మేలో నిర్వహించిన డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బి ఒకేషనల్, బీఏ ఎల్ ఐదవ, ఆరవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను గు రువారం క్యాంపస్లో వీసీ కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం, పరీక్షల విభాగం అధికారులతో కలిసి విడుదల చేశారు. ఆయా కోర్సుల్లో ఐదవ సెమిస్టర్ పరీక్షల ఫలితాల్లో మొత్తం 13,963 మంది విద్యార్థులకుగాను 7,059 మంది (50.56శాతం) ఉత్తీర్ణులయ్యారని పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ తెలిపారు. ఆరవ సెమిస్టర్ పరీక్షలకు 37,999మంది విద్యార్థులు హాజరుకాగా, 19,060 (50.16శాతం) మంది ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు. ఆయా పరీక్షల ఫలితాలను కేయూ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. కార్యక్రమంలో అదనపు పరీక్షల నియంత్రణాధికారులు తిరుమలాదేవి, వెంకటయ్య, సౌజన్య, పద్మజ, ఆసిం ఆక్బాల్, నాగరాజు, కేయూ అభివృద్ధి అధికారి వాసుదేవరెడ్డి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్లు , తదితరులు పాల్గొన్నారు. రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకోవచ్చు.. ఆయా డిగ్రీ కోర్సుల సెమిస్టర్ల విద్యార్థులకు రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 15 రోజుల సమయం ఉంటుంది. ఆన్లైన్లోనే సంబంధిత వెబ్సైట్ద్వారా దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. వివరాలు కూడా అందులోనే ఉంటాయి. త్వరలో 2,4 సెమిస్టర్ల వాల్యుయేషన్ ప్రక్రియ.. డిగ్రీ కోర్సుల రెండు, నాలుగు, ఐదవ, ఆరవ సెమిస్టర్ల పరీక్షలు ఒకేసారి జరిగినా తొలుత ఫైనలియర్ విద్యార్థులకు సంబంధించిన ఆరవ సెమిస్టర్ పరీక్షలు, బ్యాక్లాగ్ ఐదవ సెమిస్టర్ పరీక్షల జవాబుపత్రాలు మూల్యాంకనం చేయించారు. తద్వారా ఆయా విద్యార్థులు వివిధ ఉన్నత విద్య కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం ఉంటుంది. వాస్తవంగా ఈసారి ప్రైవేట్ యాజమాన్యాలకు రీయింబర్స్మెంట్ విడుదల కాకపోవడంతో పరీక్షల ఫీజులు చెల్లించడంలో జాప్యం చేసిన విషయం తెలిసిందే. దీంతో పరీక్షలు ఆలస్యంగా జరిగాయి. 2, 4 సెమిస్టర్ల పరీక్షల జవాబుపత్రాలకు సంబంధించిన మూల్యాంకనం త్వరలోనే నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఈ ఫలితాలు వచ్చేసరికి కొంతసమయం పట్టే అవకాశం ఉంది. డిగ్రీ కోర్సుల ఒకటి, మూడో సెమిస్టర్కు సంబంధించిన బ్యాక్ లాగ్ సబ్జెక్ట్ల పరీక్షలు ఇటీవలే ముగిశాయి. ఐదవ సెమిస్టర్లో 50.56 శాతం.. ఆరవ సెమిస్టర్లో 50.16శాతం ఉత్తీర్ణత -
ఎఫ్ఎస్టీపీ పనులు పూర్తి చేయాలి
మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: మూడో దశలో నిర్మాణంలో ఉన్న మానవ వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రం (ఎఫ్ఎస్టీపీ) పనులను యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. నగర పరిధి 44వ డివిజన్ అమ్మవారిపేటలో బల్దియా నిర్మిస్తున్న 150 కేఎల్డీ ఎఫ్ఎస్టీపీ పనులను మేయర్.. కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి గురువారం క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఇప్పటివరకు పూర్తిచేసిన, పురోగతిలో ఉన్న పనులను, ప్లాన్ఆఫ్యాక్షన్ ప్లాన్ పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్లాంట్ను నెలలోగా పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించాలని సూచించారు. మిగిలి ఉన్న సివిల్ పనులపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. అనంతరం 40 కేఎల్డీ సామర్థ్యంతో పనిచేస్తున్న ప్లాంట్ను సందర్శించిన మేయర్ కమిషనర్లు ఆపరేషన్–మెయింటెనెన్స్ ఏ విధంగా కొనసాగుతుందో పరిశీలించారు. రెగ్యులర్గా సెప్టిక్ ట్యాంకులు వస్తున్నాయా? అని తెలుసుకొని రిజిస్టర్లను పరిశీలించారు. జియోట్యూబ్ టెక్నాలజీ ద్వారా వ్యర్థాలను ఎరువుగా మార్చే పద్ధతి నిలిచిపోయినందున తిరిగి పునరుద్ధరించాలని కమిషనర్.. ప్లాంట్ నిర్వాహకులను ఆదేశించారు. తనిఖీల్లో సీఎంహెచ్ఓ రాజారెడ్డి, ఇన్చార్జ్ ఎస్ఈ మహేందర్, డీఈ సారంగం, ఏఈ సంతోష్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్ యాదవ్, సైట్ ఇంజనీర్ ప్రణీత్ తదితరులు ఉన్నారు. టైలరింగ్ శిక్షణ కేంద్రాలను సిద్ధం చేయండి టెక్స్టైల్ పార్కును దృష్టిలో పెట్టుకొని గ్రేటర్ వరంగల్ పరిధిలో మహిళలకు టైలరింగ్లో శిక్షణ కోసం నాలుగు కేంద్రాలను సిద్ధం చేయాలని మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ సూచించారు. గురువారం సాయంత్రం మేయర్ చాంబర్లో మెప్మా విభాగానికి చెందిన అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు. మెప్మా కార్యకలాపాలు, వాటి పురోగతిని అడిగి తెలుసుకున్నారు. గ్రేటర్ పరిధిలోని 4 నియోజకవర్గాల్లో ఒకటి చొప్పున ఈ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జాక్ మిషన్స్ ఏర్పాటు చేయాలని, ఒక్కో కేంద్రానికి రూ.25 లక్షల నిధులు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. కామన్ ఇంట్రెస్ట్ గ్రూపులు (స్ట్రీట్ వెండర్స్) సంఘాలు ఏర్పాటు చేయాలన్నారు. పీఎం విశ్వకర్మ పథకం, అమృత్ 2.0 చెరువు గట్టు వద్ద మొక్కలు నాటడం, బ్యాంక్ లీంకేజీ తదితర అంశాలపై చర్చించారు. -
వారాహి రుద్రుడిగా శ్రీరుద్రేశ్వరస్వామి
హన్మకొండ కల్చరల్ : వేయిస్తంభాల దేవాలయంలో ఆషాఢ మాసం శుద్ధ పాడ్యమి తిథిని పురస్కరించుకుని గురువారం శ్రీరుద్రేశ్వరస్వామి వారిని వారాహి రుద్రుడిగా అలంకరించి పూజలు నిర్వహించారు. ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు మణికంఠశర్మ, అర్చకులు ప్రణవ్, సందీప్శర్మలు ఉదయం నుంచి సుప్రభాతసేవ, ఉత్తిష్ట గణపతికి అభిషేక, అర్చన, శ్రీరుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం, అర్చన జరిపారు. ‘విద్యుత్ ప్రమాదాలపై జాగ్రత్త వహించాలి’హన్మకొండ: వినియోగదారులు, ముఖ్యంగా రైతులు విద్యుత్ ప్రమాదాల పట్ల అత్యంత జాగ్రత్త వహించాలని టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్, హనుమకొండ సర్కిళ్ల ఎస్ఈలు కె.గౌతం రెడ్డి, మధుసూదన్రావు గురువారం ఒక ప్రకటనలో సూచించారు. పశువులను మేతకు తీసుకెళ్లినప్పుడు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు దగ్గరికి వెళ్లకుండా యజమానులు, కాపరి జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు. వైర్లు ప్రమాదకరంగా ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే విద్యుత్ అధికారులు, సిబ్బందికి తెలియజేయాలని, టోల్ ఫ్రీ నంబర్ 1912కు ఫోన్ చేయాలని సూచించారు. ఇళ్లలో విద్యుత్ సరఫరా కాని ప్లాస్టిక్ దండాల(దుస్తులు ఆరేసుకునేవి)ను ఉపయోగించాలని కోరారు. స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాలకు మరో అవకాశంవరంగల్ స్పోర్ట్స్: హైదరాబాద్లోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్లో గల క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు సాట్ మరో అవకాశం కల్పించినట్లు హనుమకొండ డీవైఎస్ఓ అశోక్కుమార్ గురువారం తెలిపారు. ఈనెల 28వ తేదీన ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 2016, సెప్టెంబర్ 01 నుంచి 2017, ఆగస్టు 31 మధ్యలో జన్మించిన వారు అర్హులుగా పేర్కొన్నారు. లేబర్ కోర్టు ఏజీపీగా రమణారెడ్డివరంగల్ లీగల్: హనుమకొండ జిల్లా లేబర్ కోర్టు అదనపు ప్రభుత్వ న్యాయవాదిగా నూకల వెంకటరమణారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఐనవోలు మండలం పంఽథినికి చెందిన రమణారెడ్డి 1993లో న్యాయశాస్త్ర పట్టభద్రుడై సీనియర్ న్యాయవాది శివరావు వద్ద జూనియర్గా పనిచేశారు. 2006లో ఉమ్మడి జిల్లా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. జిల్లాలో పారిశ్రామిక, కార్మిక వివాదాల్లో ప్రభుత్వ పక్షాన రమణారెడ్డి వాదిస్తారు. ఈస్థానంలో ఆయన మూడేళ్లు కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పోలీసుల అదుపులో అధికార పార్టీ కార్పొరేటర్? నకిలీ నోట్ల చలామణీ కేసులో.. వరంగల్ క్రైం: నకిలీ నోట్ల చలామణీలో పశ్చిమ నియోజకవర్గానికి చెందిన ఓ అధికార పార్టీ కార్పొరేటర్ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. గతంలోనే సదరు కా ర్పొరేటర్పై కేసులు నమోదైనట్లు తెలిసింది. వారం రోజులనుంచి స్థానికంగా లేడని, దీంతో ఎవరికీ అందుబాటులోకి రావడం లేదని ప్రచారం జరుగుతోంది. ఒకటి, రెండు రోజుల్లో ఆ కార్పొరేటర్ను పోలీసులు అధికారికంగా అరెస్టు చేసినట్లు ప్రకటించే అవకాశం ఉంది. -
భూసేకరణ పనులు వేగవంతం చేయాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్హన్మకొండ అర్బన్: జిల్లాలో భూసేకరణ, చెల్లింపులకు సంబంధించిన పనులు వేగంవంతం చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్.. రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్లో జిల్లాలోని జాతీయ రహదారులు, గౌరవెల్లి ప్రాజెక్ట్ పరిధిలో చేపట్టిన భూ సేకరణ, సంబంధిత రైతులకు పరిహారం చెల్లింపులు, వాటి పురోగతిపై సమీక్షించారు. జాతీయ రహదారి నిర్మాణానికి చేపట్టిన భూ సేకరణ ప్రక్రియ, ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న పరిహారం, రైతులకు ఎంత చెల్లించారన్న వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భూభారతి దరఖాస్తులపై సమీక్షించారు. రెవెన్యూ సదస్సుల ద్వారా ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు, ఆన్లైన్ చేసినవి, ఎన్నింటికి నోటీసులు ఇచ్చారనే అంశాలను ఆర్డీఓలు, తహసీల్దార్లను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, రెవెన్యూ అధికారి వైవీ గణేష్, పరకాల ఆర్డీఓ డాక్టర్ నారాయణ, హైవే, గౌరవెల్లి ప్రాజెక్ట్ అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. విద్యార్థుల నమోదు పెరగాలి అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, గురుకులాల్లో విద్యార్థుల నమోదు పెరగాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, గురుకులాల్లో విద్యార్థుల నమోదుపై పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ గురుకులాల అధికారులు, ఎంఈఓలతో సమీక్షించారు. పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల నమోదు సమాచారాన్ని డీఈఓ వాసంతి, ఇంటర్ విద్యాశాఖ సూపరింటెండెంట్ చంద్రమౌళి వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ మూడేళ్లు దాటిన చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేరే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచాలని, పిల్ల లకు వైద్యపరీక్షలు నిర్వహించాలని, యూనిఫామ్స్ అందించాలన్నారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ మహేష్, సీఎంఓ సుదర్శన్ రెడ్డి, ఏఎస్సీ రఘు చంద్రరావు, ఎంఈఓలు, సంక్షేమ అధికారులు, సీడీపీఓలు పాల్గొన్నారు. -
రౌడీ షీటర్ దారుణ హత్య
మరికొన్ని హత్యలు ఇలా.. కమిషనరేట్ పరిధిలో కలకలం రేపుతున్న వరుస హత్యలు ● వివాహేతర సంబంధం.. భూ పంచాయితీలే ప్రధాన కారణం ● మౌనం వీడని పోలీసులు.. పోలీసింగ్పై అనుమానాలు..● జనవరి 22న సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాహిత కోసం ఇద్దరు ఆటోడ్రైవర్ల మధ్య జరిగిన గొడవ హత్యకు దారి తీసింది. సుబేదారిలోని డీమార్ట్ ఎదురుగా ఏనుగు వెంకటేశ్వర్లు అనే నిందితుడు మాచర్ల రాజ్కుమార్ను నడిరోడ్డుపై జనం చూస్తుండగా హత్య చేశాడు. ● ఫిబ్రవరి 20న రాత్రి 10.30 గంటల సమయంలో మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్ పరిధి భట్టుపల్లి దగ్గర డాక్టర్ సుమంత్రెడ్డిని ఆయన భార్య ఫ్లోరా తన ప్రియుడు సామ్యూల్, మరో నిందితుడు ఏఆర్ కానిస్టేబుల్ రాజ్కుమార్తో హత్య చేయించింది. ● ఏప్రిల్ 12న నల్లబెల్లి మండలం మూడు చింతలపల్లిలో బానోతు కొమ్మాలు హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధమే కారణంగా పోలీసులు నిర్ధారించారు. ● ఏప్రిల్ 18న హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఆస్పత్రి వద్ద చిద్దం సాయి ప్రకాశ్ను కిడ్నాప్ చేసి 18న హత్య చేశారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతో క్రిష్ణవేణి అనే మహిళ తన బావ కొడుకును తన ప్రియుడు కానిస్టేబుల్ బాషబోయిన శ్రీనివాస్, మరో నలుగురు కలిసి హత్య చేశారు. సాక్షి ప్రతినిధి, వరంగల్ /వరంగల్ క్రైం: బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో మహ్మద్ సాదిక్ హుస్సేన్ తను ఇచ్చిన అప్పు డబ్బులు ఇవ్వమన్నందుకుగాను సోహేల్, బసీర్, అక్రమ్ అనే నిందితులు అతడి తలపై బండతో మోది హత్య చేశారు. ఈనెల 11న కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెగడపల్లిలో తనకు రావాల్సిన భూమిని ఇవ్వనివ్వడం లేదని చల్లా భూపాల్రెడ్డి తన పినతల్లి అయిన సరోజనను గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఈనెల 7న గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధి లోని స్తంభంపల్లిలో జల్సాలకు అలవాటు పడిన రేకలపల్లి ప్రణయ్ తన మేనత్త స్వరూపను బంగారం, డబ్బుల కోసం హత్య చేశాడు.వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుసగా జరుగుతున్న హత్యలు కలకలం రేపుతున్నాయి. ఒకే నెలలో మూడు హత్యలు జరగడంతో నగరవాసులు భయబ్రాంతులకు గురవుతున్నారు. అందులోనూ హనుమకొండ సబ్ డివిజన్లో ఒక్కనెలలోనే రెండు హత్యలు జరగడం, అది నగరంలో రోడ్డు మీద కిరాతకంగా చంపుతుండడంతో పోలీసింగ్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా బుధవారం రాత్రి జనం తిరుగుతున్న సమయంలో సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మహ్మద్ సాదిక్ హుస్సేన్ హత్య మరోసారి సంచలనం కలిగించింది. రాత్రి 10 గంటల తరువాత నిర్వహించాల్సిన పెట్రోలింగ్ ఏమైంది? బ్లూకోల్ట్ సిబ్బంది ఎక్కడ? విజిబుల్ పోలీసింగ్ ఎక్కడ నిర్వహిస్తున్నారన్న అనేక ప్రశ్నలు తలెత్తుతున్నా పోలీసులు మౌనం వీడడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది కమిషనరేట్ పరిధిలో ఆరు నెలల్లో 18 హత్యలు, 32 హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. వివాహేతర సంబంధాలు.. ఆస్తి పంచాయితీలు? ఇటీవల జరుగుతున్న హత్యలకు వివాహేతర సంబంధాలు, భూ, ఆస్తి పంచాయితీలో ప్రధాన కారణా లు అవుతున్నాయి. అప్పుగా ఇచ్చిన డ బ్బులను అడిగినందు కు సాదిక్ హుస్సేన్ హత్య కు గురికాగా, పినతల్లి తనకు రావాల్సిన భూమిని రాకుండా చేస్తుందని కేయూ పీఎస్ పరిదిలో సరోజన అనే మహిళా హత్యకు గురైంది. జల్సాలకు అలవాటు పడ్డ మరో యువకుడు ఈఎంఐలను కట్టడం కోసం సొంత మేనత్తను హత్య చేసిన సంఘటన గీసుగొండ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. సులువుగా డబ్బులు సంపాదించడం.. చిన్ని చిన్న గొడవలు చివరికి హత్యల వరకు దారితీస్తున్న ఘటనలు ఇటీవల కమిషనరేట్ పరిధిలో ఎక్కువగా జరుగుతున్నాయి. హత్య కేసుల్లో పోలీసులు? పోలీస్ శాఖ క్రమశిక్షణకు మారుపేరు. కానీ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ యేడాది జ రిగిన మూడు హత్య కేసుల్లో నిందితులు పోలీస్లు కావడం గమనార్హం. ఇది పోలీస్ శాఖకు మాయని మచ్చగా మారింది. సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి జరిగిన హత్య కేసులో నిందితుడు అక్రమ్ పోలీస్ కానిస్టేబుల్. అతను గతంలో ఓ హత్య కేసులో నిందితుడిగా ఉండటంతో అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. అయినప్పటికి పద్ధతి మార్చుకోలేదు. రాష్ట్రంలో సంచలనం కలిగించిన డాక్టర్ సుమంత్రెడ్డి హత్య కేసుల్లో ఉన్న నిందితుడు ఎం.రాజ్కుమార్ ఏఆర్ కానిస్టేబుల్. హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏప్రిల్ 18న జరిగిన చిద్దెం సాయి ప్రకాశ్ హత్య కేసు నిందితుడు బాషబోయిన శ్రీనివాస్ కూడా కానిస్టేబుల్. ఆరు నెలల్లో 18 హత్యలు.. 32 హత్యాయత్నాలు ఆర్థిక లావాదేవీలే కారణం ఇంట్లో నుంచి తీసుకొచ్చి తలపై బండరాయితో మోది ఘాతుకం నిందితుల్లో పోలీస్ కానిస్టేబుల్ – వరంగల్ క్రైం – వివరాలు 8లోu -
ఎట్టకేలకు ఎఫ్ఐఆర్
సాక్షి, వరంగల్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దత్తతలో నకిలీ సర్టిఫికెట్ల దందా’పై ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదైంది. తక్కువ వయస్సున్న పిల్ల లను దత్తత పొందడానికి ఎక్కువ వయస్సున్న దంపతులను తక్కువ వయస్సుగా చూపించేందుకు సమర్పించిన డేట్ ఆఫ్ బర్త్, మెడికల్ సర్టిఫికెట్లు నకిలీవని వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని సుబేదారి పోలీస్ స్టేషన్లో జిల్లా సంక్షేమ విభాగాధికారి రాజమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 9 మందిపై కేసు నమోదైంది. వీరిలో నర్సయ్య, రుక్మ, లస్మయ్య, చిన్న కేతమ్మ, మహిపాల్, సంధ్యారాణి, సుమతి, ప్రేమలత, అరుణ ఉన్నారు. అసలు వీరికి సలహాలు ఇవ్వడంతోపాటు నకిలీ బర్త్ సర్టిఫికెట్ల సమర్పణలో కీలకంగా వ్యవహరించిన బాలరక్షా భవన్లోని సిబ్బందిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె సదరు పిటిషన్లో కోరగా.. వారి పేర్లు వెల్లడించకపోవడంతో విచారణ క్రమంలో వారిపై ఎఫ్ఐఆర్ నమోదుచేసే దిశగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ కూడా ఈ కేసును సీరియస్గా తీసుకున్నారు. ఈ నకిలీ సర్టిఫికెట్ల రాకెట్ మూలాల్లోకి వెళ్లి అసలు సూత్రధారి, పాత్రధారి ఎవరనే వివరాలను తెలుసుకునే దిశగా విచారణ జరుగుతోంది. ఇప్పటికే వీరిపై 420 (మోసం), 468 (మోసం చేసే ఉద్దేశంతో ఫోర్జరీ), 471 రెడ్ విత్ 34 ఐపీసీ (నకిలీ పత్రాన్ని ఒరిజినల్గా చూపించి మోసం చేయడం, ఒకే రకమైన నేరం కొంతమంది కలిసి చేయడం) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఏప్రిల్లోనే దందా బయటకు వచ్చినా.. దత్తత కోరే దంపతులు నిరక్షరాస్యులైతే వయస్సు ధ్రువీకరణ పత్రం ప్రభుత్వామోదిత వైద్యుడి వద్ద ఒసిఫిఏకేషన్ పరీక్ష నివేదిక ఆధారంగా తీసుకోవచ్చు. లేకుంటే పాన్కార్డులో ఉన్న పుట్టిన తేదీ ఉంటే సరిపోతుంది. అయితే, దంపతుల ఎక్కువ వయస్సు కారణంగా తక్కువ వయస్సు ఉన్న పిల్ల లు వచ్చే అవకాశం లేదని కొందరు బాలరక్షా భవన్ అధికారులే ‘మామూలు’గా మాట్లాడి కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో కుమ్మకై ్క సదరు సర్టిపికెట్లను తీసుకొచ్చారు. వాటినే ఒరిజినల్ సర్టిఫికెట్లుగా చూపిస్తూ సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (కారా) వెబ్సైట్లో అప్లోడ్ చేసిన విషయం జిల్లా రెవెన్యూ అధికారి, డీడబ్ల్యూఓ విచారణలో తేలింది. అయినా కూడా పోలీసులకు డీడబ్ల్యూఒ ఇచ్చిన ఫిర్యాదులో బాలరక్షాభవన్ సిబ్బంది పేర్లు వెల్లడించకపోవడం వెనుక ఉన్న మతలబు ఏంటి, కావాలనే వారి పేర్లు ఇవ్వలేదా అన్న చర్చ కలెక్టరేట్ వర్గాల్లో నడుస్తోంది. ఎందుకంటే ఏప్రిల్ నెలలోనే ఓ జంటకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్ల దందా బయటకు వచ్చినా చర్యలు తీసుకోకుండా, విధుల్లో డీడబ్ల్యూఓ నిర్లక్ష్యంగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ దందాలో ఎవరి ప్రమేయముందో తెలుసుకొని వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉండగా.. ఆ విభాగంలోని మరికొందరి పనితీరు బాగాలేదంటూ ఫిబ్రవరిలో కావాల్సిన రెన్యువల్ను బుధవారం నిలిపివేయడం వివాదాస్పదమవుతోంది. దీనిపై మహిళా, శిశు సంక్షేమ విభాగం ఉన్నతాధికారులు కూడా వాకబు చేస్తున్నట్లు తెలిసింది.‘దత్తతలో నకిలీ సర్టిఫికెట్ల దందా’పై కేసు నమోదు 9 మందిపై 420, 468, 471 రెడ్విత్ 34 ఐపీసీ సెక్షన్లు బాలరక్షాభవన్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు పేర్లు పిటిషన్లో పేర్కొనకపోవడంతో అనుమానాలు ఏప్రిల్లోనే నకిలీ సర్టిఫికెట్లని తెలిసినా పట్టించుకోని డీడబ్ల్యూఓ -
మత్తుకు బానిస కావొద్దు..
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్హసన్పర్తి: యువత మత్తుకు బానిస కావొద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్స దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం హనుమకొండ పోలీస్ సబ్ డివిజన్ ఆధ్వర్యంలో భీమారంలోని ఎస్వీఎస్ కళాశాలలో విద్యార్థులు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి సీపీ సన్ప్రీత్సింగ్, వరంగల్ కలెక్టర్ సత్యశారద, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సమావేశంలో సీపీ మాట్లాడారు. డ్రగ్స్ వినియోగంతో జీవితాలు అంధకారమవుతాయన్నారు. డ్రగ్స్ విక్రయించిన, ఖరీదు చేసిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వరంగల్ కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. వరంగల్ను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈసందర్భంగా మాదక ద్రవ్యాలను తరిమికొడుదామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ సలీయా, హనుమకొండ ఏసీపీ నర్సింహారావు, కాజీపేట ఏసీపీ ప్రశాంత్రెడ్డి, ఎస్వీఎస్ కళాశాల సెక్రటరీ ఎర్రబెల్లి అనూప్, ఇన్స్పెక్టర్లు రవికుమార్, శివకుమార్, రంజిత్కుమార్, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్, ప్రొఫెసర్ రవికుమార్, అనిత, ఎస్సై రవీందర్, శ్రీకాంత్, పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. -
నేటినుంచి శాకంబరీ ఉత్సవాలు
హన్మకొండ కల్చరల్: వరంగల్లోని శ్రీభద్రకాళి అమ్మవారి శాకంబరీ నవరాత్రి మహోత్సవాలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 26 నుంచి జూలై 10 తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈనేపథ్యంలో నవరాత్రోత్సవాలను విజయవంతం చేయాలని భద్రకాళి ఆలయ ఈఓ, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శేషుభారతి అన్నారు. ఈమేరకు ఆలయంలోని అన్నదాన సత్రం ఆవరణలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో శేషుభారతి, ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు, ధర్మకర్తల మండలి చైర్మన్ డాక్టర్ బండారు శివసుబ్రహ్మణ్యం ఉత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం శేషుభారతి మాట్లాడుతూ 15రోజుల పాటు శాకంబరీ ఉత్సవాలు జరగనున్నాయన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గురువారం సహస్ర కలశాభిషేకంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని భక్తులు అధికసంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు మాట్లాడుతూ.. రోజూ ఉదయం, సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని, జూలై 10వతేదీ గురువారం ఉదయం 4గంటలకే మహాశాకంబరీ అలంకరణ, పూజలు జరుగుతాయన్నారు. మండలి చైర్మన్ శివసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్ల లతో ఉత్సవాల్లో పాల్గొనాలన్నారు. ఆలయ ధర్మకర్త తొనుపూనూరి వీరన్న మాట్లాడుతూ 11 సంవత్సరాల తర్వాత దేవాలయంలో ధర్మకర్తల మండలి ఏర్పాటు అయ్యిందని, ఆలయ ధర్మకర్తల తరఫున భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. కార్యక్రమంలో దేవాలయ సూపరింటెండెంట్ అద్దంకి విజయ్కుమార్, సిబ్బంది హరినాథ్, అలుగు కృష్ణ, నాగులు, చింతశ్యాంసుందర్ పాల్గొన్నారు. కనీస సౌకర్యాలు కల్పించాలి.. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే శాకంబరీ ఉత్సవాల్లో గతంలో భక్తులకు కనీససౌకర్యాలు కల్పించలేదని విలేకరులు ఈఓ శేషుభారతిని ప్రశ్నించారు. దేవాలయంలో శానిటేషన్, టాయిలెట్ల ఏర్పాటు చేయాలని, క్యూలైన్లో భక్తులకు మినరల్ వాటర్, ప్రసాదాలు అందజేయాలని, ఆలయ ఆవరణ శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. దీనికి ఈఓ స్పందిస్తూ భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేస్తానని సమాధానమిచ్చారు. జూలై 10వ తేదీ వరకు నిర్వహణ మహోత్సవాలను విజయవంతం చేయాలి భద్రకాళి దేవాలయ ఈఓ శేషుభారతి ఉత్సవాల కరపత్రం ఆవిష్కరణ -
విస్తృతంగా మొక్కలు నాటాలి
● కమిషనర్ చాహత్ బాజ్పాయ్వరంగల్ అర్బన్: వన మహోత్సవంలో భాగంగా గ్రేటర్ పరిధిలో విస్తృతంగా మొక్కలు నాటాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు. హనుమకొండలో మొక్కలు నాటే కొన్ని ప్రాంతాలను బుధవారం ఉదయం జాగింగ్ చేస్తూ ఆమె పరిశీలించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. శాయంపేట టెంపుల్ ట్రీ విల్లాస్, కేఆర్ఆర్ టౌన్ షిప్లోని ప్లాట్లో పార్క్ అభివృద్ధి పనులు, మియావాకీ ప్లాంటేషన్, న్యూశాయంపేట ప్రభుత్వ పాఠశాల నుంచి తెలంగాణ జంక్షన్ వరకు పరిశీలించారు. అక్కడే అభివృద్ధి పనులు చేపట్టాలని, ప్రశాంత్నగర్లోని ఎస్వీ స్కూల్ ఆఫ్ బధిరుల పాఠశాలలో ఓపెన్ ప్లాంటేషన్ నిర్వహించాలని సూచించారు. కమిషనర్ వెంట ఇన్చార్జ్ సిటీప్లానర్ రవీందర్రాడేకర్, హార్టికల్చర్ అధికారులు రమేశ్, లక్ష్మారెడ్డి, ఏసీపీ రజిత, ఈఈ రవికుమార్, డీఈలు రాజ్కుమార్, సారంగం, ఏఈలు రాగి శ్రీకాంత్, మేనక శానిటరీ ఇన్స్పెక్టర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు. పన్నెండు మోరీల ట్రాఫిక్ జంక్షన్ను అభివృద్ధి చేయాలి వరంగల్ హంటర్ రోడ్డు–పోతన– బీట్ బజార్ జంక్షన్లో పన్నెండు మోరీలుగా విస్తరించి, అభివృద్ధి పనులు చేపట్టాలని నగర మేయర్ గుండు సుధారాణి సూచించారు. బుధవారం సాయంత్రం మేయర్, కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. స్మార్ట్సిటీ పనులకు డిసెంబర్ గడువు వరంగల్ స్మార్ట్ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం చివరి గడువును డిసెంబరు నెలాఖరుగా ఖరారు చేసింది. పదేళ్లుగా కొనసాగుతున్న పనులకు గతంలో కేటాయించిన నిధులతోనే పెండింగ్ పనులు పూర్తి చేయాలని కేంద్ర స్మార్ట్సిటీ జాయింట్ డైరెక్టర్ రూప మిశ్రా ప్రకటించారు. బుధవారం న్యూ ఢిల్లీ నుంచి రూప మిశ్రా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. బల్దియా ప్రధాన కార్యాలయంలో కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు. వందరోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేయాలి వందరోజుల యాక్షన్ ప్లాన్ను సమర్థవంతంగా అమలు చేయాలని సీడీఎంఏ శ్రీదేవి అన్నారు. బుధవారం హైదరాబాద్నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బల్దియానుంచి కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రవేశాలకు ఎంపికలు షురూ
వరంగల్ స్పోర్ట్స్: జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో బుధవారం హైదరాబాద్లోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్లోని స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రవేశాలకు బుధవారం ఎంపికలు నిర్వహించారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన సెలక్షన్స్ను డీవైఎస్ఓ గుగులోతు అశోక్కుమార్ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు రోజుల పాటు జరగనున్న ఎంపికలకు మొదటి రోజు 16 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. ఇందులో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను హకీంపేటలో నిర్వహించే రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ స్కూల్స్ ఎంపికలకు పంపించనున్నట్లు తెలిపారు. ఈఎంపిక ప్రక్రియలో డీఎస్ఏ కోచ్లు శ్రీమన్నారాయణ, మహ్మద్ అఫ్జల్, బొడ్డు విష్ణువర్ధన్, బత్తిని జీవన్గౌడ్, ఓనపాకల శంకర్, కూరపాటి రమేశ్, రాజారపు రమేశ్, దేవిక, రాజు, పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, ఖోఖో సంఘం జిల్లా కార్యదర్శి శ్యామ్ప్రసాద్, పీడీలు ప్రేమ్ప్రసాద్రావు, కిషన్నాయక్ పాల్గొన్నారు. హార్టికల్చర్ ఆఫీసర్ల బాధ్యతల స్వీకరణహనుమకొండ జిల్లాకు అనసూయ, వరంగల్కు ఆర్.శ్రీనివాసరావు హన్మకొండ: హనుమకొండ, వరంగల్ జిల్లాల ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారుల్లో మార్పులు జరిగాయి. వరంగల్ జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారిగా ఆర్.శ్రీనివాస్, హనుమకొండ జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారిగా జి.అనసూయ బాధ్యతలు స్వీకరించారు. హనుమకొండ జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారి ఎం.వెంకటేశం రెండు నెలల క్రితం నాగర్ కర్నూల్ బదిలీ అయ్యారు. దీంతో వరంగల్ జిల్లా అధికారిగా పని చేస్తున్న సంగీత లక్ష్మి రెండు జిల్లాల బాధ్యతలు చేపట్టారు. ఆమె నెల రోజుల క్రితం హైదరాబాద్లోని ఉద్యాన శాఖ కమిషనరేట్కు బదిలీ అయ్యారు. దీంతో వరంగల్ రీజియన్ పట్టు పరిశ్రమ జాయింట్ డైరెక్టర్గా పని చేస్తున్న జి.అనసూయను హనుమకొండ, వరంగల్ జిల్లాల ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా.. కరీంనగర్ జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారిగా పని చేస్తున్న ఆర్.శ్రీనివాసరావును డిప్యుటేషన్పై వరంగల్ జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారిగా నియమిస్తూ, సెరికల్చర్ జాయింట్ డైరెక్టర్ జి.అనసూయను హనుమకొండ జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖాధికారిగా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఈ నెల 23న ఉద్యాన శాఖ డైరెక్టర్ ఎస్.యాస్మీన్ బాషా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వారు హనుమకొండ, సుబేదారిలోని జిల్లా సమీకృత కార్యాలయం భవన సముదాయంలోని ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ కార్యాలయంలో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ‘మత్తు’ నియంత్రణకు పటిష్ట చర్యలుహన్మకొండ అర్బన్: జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు హనుమకొండ జిల్లా రెవెన్యూ అధికారి వైవీ గణేశ్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డీఆర్ఓ గణేశ్, డీసీపీ షేక్ సలీమా మాట్లాడుతూ.. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విక్రయించే, వినియోగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సినిమా హాళ్లలో మత్తు పదార్థాల నియంత్రణకు స్లైడ్స్ వేసేలా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. మత్తు పదార్థాల నియంత్రణలో భాగంగా నిరంతరం అవగాహన సదస్సు, కార్యక్రమాలు నిర్వహిస్తూ విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. క్రీడలు, ఇతర రంగాల్లోని సెలబ్రిటీలు గంజాయి, ఇతర మత్తు పదార్థాల ద్వారా కలిగే అనర్థాలపై ప్రచారం చేయాలన్నారు. అనంతరం మత్తుపదార్థాల నియంత్రణపై అవగాహన కలిగేలా రూపొందించిన వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో ఎకై ్సజ్ అధికారులు, ఆర్డీఓ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగాధిపతి రాజీనామా!
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ హెచ్ఆర్ఎం విభాగాధిపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రొఫెసర్ పి.శ్రీనివాస్రావు ఆపదవికి రాజీనామా చేశారు. ఈమేరకు బుధవారం కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం రాజీనామా పత్రం అందినట్లు ధ్రువీకరించారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో పీహెచ్డీ, పోస్ట్ డాక్టరల్ ఫెల్లోషిప్ పూర్తి చేసిన అభ్యర్థులు నలుగురున్నారు. ఈనెల 23న ముగ్గురు అభ్యర్థులు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో వర్క్లోడ్కు అనుగుణంగా పేపర్వైజ్గా విద్యాబోధనకు తమకు క్లాస్వర్క్కు అవకాశం కల్పించి అధ్యాపకులుగా నియమించాలని ఆవిభాగాధిపతి ప్రొఫెసర్ శ్రీనివాస్రావు దృష్టికి తీసుకెళ్లారు. మిగతా విభాగాల్లో వర్క్లోడ్ చూపించి ఆయా విభాగాల అధిపతులు పేపర్వైజ్గా విద్యాబోధనకు అధ్యాపకులుగా నియమించారని, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో కూడా ఆ మాదిరిగానే వర్క్లోడ్ చూపించి తమకు అవకాశం కల్పించాలని విభాగాధిపతి శ్రీనివాస్రావును వారు కోరి వినతిపత్రం సమర్పించారు. కాగా.. వినతిపత్రాన్ని శ్రీనివాస్రావు పక్కకు వేసిరేసినట్లు.. దీంతో అభ్యర్థులు ఎందుకు విసేరేశారని ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో అభ్యర్థులకు, శ్రీనివాస్రావుకు వాగ్వాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. అనంతరం అదే రోజు మనస్తాపంతో శ్రీనివాస్రావు విభాగాధిపతి పదవికి రాజీనామా చేస్తూ లేఖను రిజిస్ట్రార్కు పంపారు. ఇదిలా ఉంటే బుధవారం కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.రాంచంద్రం ఆవిభాగానికి వెళ్లి మీరే విభాగాధిపతిగా కొనసాగాలని కోరినట్లు సమాచారం. అయినప్పటికీ తాను కొనసాగనని, తనను రిలీవ్ చేయాలని శ్రీనివాస్రావు రిజిస్ట్రార్ను కోరినట్లు సమాచారం. అయితే ఈవిషయంపై ‘సాక్షి’ రిజిస్ట్రార్ రామచంద్రంను వివరణ కోరగా.. నలుగురు పోస్ట్డాక్టరల్ పూర్తి చేసిన అభ్యర్థుల వర్క్లోడ్ తెప్పించుకుని పరిశీలిస్తానని అభ్యర్థులకు తెలియజేసినట్లు తెలిపారు. అయితే శ్రీనివాస్రావు రాజీనామాను ఆమోదించవద్దని, ఆయననే విభాగాధిపతిగానే కొనసాగించాలని తనకు వినతిపత్రం కూడా ఆయా అభ్యర్థులు అందజేసినట్లు తెలిపారు. శ్రీనివాస్రావు రాజీనామాను ఆమోదించలేదని ఈనెల 26న వీసీ ఆచార్య కె ప్రతాప్రెడ్డి యూనివర్సిటీకి రానున్నారని.. ఈవిషయంపై నిర్ణయం తీసుకుంటారని వివరణ ఇచ్చారు. వర్క్లోడ్ విషయంపై తలెత్తిన వివాదం పోస్ట్ డాక్టరల్ పూర్తి చేసిన అభ్యర్థులతో వివాదం శ్రీనివాస్రావే కొనసాగాలని కోరిన రిజిస్ట్రార్ నేడు వీసీ దృష్టికి వివాదం -
రైల్వే సమస్యల పరిష్కారానికి కృషి
కాజీపేట రూరల్: కాజీపేటలో రైల్వే సంబంధిత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఏడీఆర్ఎం గోపాలకృష్ణన్ అన్నారు. సికింద్రాబాద్లో మజ్దూర్ యూనియన్తో బుధవారం జరిగిన 164వ రివ్యూ రైల్వే ఏడీఆర్ఎం పీఎన్ఎం సమావేశంలో పాల్గొంనేందుకు కాజీపేట నుంచి యూనియన్ నాయకులు బుధవారం తరలివెళ్లారు. రైల్వే సంబంధిత, కార్మి కులు, ఉద్యోగులు, అధికారుల సమస్యలు ప్రస్తావించగా, పరిష్కారానికి ఏడీఆర్ఎం హామీ ఇచ్చిన ట్లు యూనియన్ సికింద్రాబాద్ డివిజన్ సెక్రటరీ పి.రవీందర్ తెలిపారు. కాజీపేట రైల్వే ఎలక్ట్రిక్ లోకో షెడ్ వద్ద కార్మికుల కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, కాజీపేట రైల్వే రెఫరల్ ఆస్పత్రిగా శరత్ ఐ ఆస్పత్రి, ఎలక్ట్రిక్ లోకో షెడ్లో అడిషనల్ ఉమెన్ రూమ్స్, కాజీపేట రైల్వే ఎలక్ట్రిక్ లోకో షెడ్లో క్యాంటీన్ విస్తరణ, హసన్పర్తి – బిజిగిరి షరీఫ్ మధ్య అడిషనల్ పాయింట్స్ మెన్ల ఏర్పాటుకు గోపాలకృష్ణన్ అంగీకరించినట్లు పేర్కొన్నారు. -
మత్తు పదార్థాలను నివారించాలి
న్యూశాయంపేట: మత్తు పదార్థాలను నివారించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్లో డీసీపీ అంకిత్కుమార్తో కలిసి బుధవారం జిల్లాస్థాయి నార్కోటిక్ సమన్వయ సమావేశం నిర్వహించారు. మాదక ద్రవ్యాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ, నషా ముక్త్ భారత్లో భాగంగా చేపడుతున్న చర్యలపై సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మత్తు పదార్థాలతో జీవితం ఎలా నాశనం అవుతుందో వీడియో ప్రదర్శనల ద్వారా పాఠశాల, కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే 33 ప్రాంతాల్లో మరమ్మతులు చేపట్టాలని ఆర్అండ్బీ ఈఈకి కలెక్టర్ సూచించారు. ఈసందర్భంగా పోస్టర్లు, కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ట్రాఫిక్ డీసీపీ ప్రభాకర్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఆర్అండ్బీ ఈఈ రమేశ్, అధికారులు పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్లో ఉత్తమ ర్యాంకు సాధించాలి.. స్వచ్ఛ భారత్లో ఉత్తమ ర్యాంకు సాధించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ నిర్వహించిన జిల్లాస్థాయి శిక్షణకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సమస్య లేదని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 35 వేల తెల్ల రేషన్కార్డుల సర్వే 15 రోజుల్లో పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా పరిషత్ సీఈఓ రాంరెడ్డి, డీఎంహెచ్ఓ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం.. బెస్ట్ అవైలబుల్ స్కీం పెండింగ్ బిల్లులు త్వరగా చెల్లించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్లో జిల్లాలోని బీఏఎస్ స్కూళ్ల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. యాజమాన్యాలు సహకరించి వెంటనే విద్యార్థులను స్కూళ్లకు అనుమంతించాలని కలెక్టర్ కోరారు. 9 అంశాలను పరిశీలించాలి.. పంచాయతీ అభివృద్ధి సూచిక 2.0లోని 9 అంశాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి పూరిస్తే వాటి ఆధారంగా ర్యాంకు కేటాయిస్తారని కలెక్టర్ సత్యశారద అధికారులకు తెలిపారు. కలెక్టరేట్లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. వరంగల్ కలెక్టర్ సత్యశారద -
మార్పు వచ్చింది..
సాక్షి, మహబూబాబాద్: జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం.. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పనితీరు, విద్యార్థుల సామర్థ్యాలు మొదలైన ఆరు అంశాలపై నిర్వహించిన ఫెర్మార్మింగ్ గ్రేడ్ ఇండెక్స్(ఎఫ్జీఐ) నివేదిక మెరుగ్గా ఉంది. గత రెండు సంవత్సరాల కంటే.. గడిచిన విద్యాసంవత్సరంలో ఫలితాలు మెరుగ్గా ఉన్నట్లు స్పష్టం చేసింది. ఆరు అంశాల్లో 74 సూచికలకు 600 మార్కులు కేటాయించారు. ప్రతీ పాఠశాల నుంచి యూడైస్లో పొందుపర్చిన అంశాలను పరిశీలించి, సేకరించిన వివరాల ప్రకారం.. జాతీయ స్థాయిలో జిల్లాల వారీగా మార్కులు కేటాయించారు. ఆరు అంశాలుగా పరిశీలన ప్రభుత్వ పాఠశాల పనితీరుకు అద్దం పట్టే ప్రధాన అంశాలను పరిశీలించారు. ఇందులో ఆరు అంశాల్లో 74 సూచికలను పేర్కొని మార్కులు వేశారు. మొదటి అంశంగా.. అభ్యసన ఫలితాలు, సామర్థ్యాలు, సంబంధాలు, ఉపాధ్యాయుల లక్ష్యాలు, నైపుణ్యాలు, రెండో అంశం.. బోధన నిర్వహణ, పిల్లల ప్రతిస్పందన, మూడో అంశం.. మౌలిక సదుపాయాల కల్పన, సౌకర్యాలను పరిశీలించారు. అలాగే పాఠశాలల భద్రత, పిల్లల రక్షణ, డిజిటల్ లెర్నింగ్, నిధుల వినియోగం, హాజరు పర్యవేక్షణ, పాఠశాలల్లో నాయకత్వ లక్షణాలు మొదలైన విషయాలను పరిశీలించారు. మొదటి రెండు అంశాల్లో గతం కంటే మెరుగైన మార్కులు సాధించగా.. మౌలిక వసతుల కల్పన, డిజిటల్ లెర్నింగ్లో 2022–23 విద్యా సంవత్సరం కంటే 2023–24 విద్యా సంవత్సరంలో వెనుకబడినట్లు తేలింది. అయితే గత విద్యా సంవత్సరం 2024–25లో మాత్రం అన్ని అంశాల్లో మెరుగుపడ్డామని, ఇందుకు ఈ ఏడాది పదో తరగతిలో సాధించిన ఫలితాలే నిదర్శనమని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. గతం కన్నా మెరుగు.. ఆరు అంశాల్లో 2022–23 విద్యా సంవత్సరం కంటే 2023–24 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల పనితీరు మెరుగుపడినట్లు స్పష్టమవుతోంది. ప్రధానంగా అభ్యసన ఫలితాలు, సమన్వయం, ఉపాధ్యాయుల పనితీరుపై మొత్తం 24 సూచికలకు 290 మార్కులు కేటాయించగా 2022–23 సంవత్సరంలో హనుమకొండ జిల్లా 109 మార్కులు సాధించింది. అత్యల్పంగా మహబూబాబాద్ జిల్లాకు 79 మార్కులు వచ్చాయి. అయితే 2023–24లో హనుమకొండ జిల్లాకు 122 మార్కులు రాగా.. మహబూబాబాద్కు 95 మార్కులొచ్చాయి. అలాగే మౌలిక సదుపాయాల కల్పనపై 12 సూచికల్లో 51 మార్కులకు 2022–23లో మహబూబాబాద్, హనుమకొండ జిల్లాలకు 29 మార్కుల చొప్పున వచ్చాయి. అదే మరుసటి సంవత్సరం హనుమకొండకు 29 మార్కులు రాగా.. మహబూబాబాద్ జిల్లాకు 27 మార్కులు వచ్చాయి. పాఠశాలల్లో పిల్లల భద్రతపై 31 మార్కులకు జనగామ, హనుమకొండ, ములుగు జిల్లాలకు 10 మార్కులకు పైగా రాగా మిగిలిన జిల్లాల్లో తక్కువగా వచ్చాయి.ప్రభుత్వ పాఠశాలలపై ఆరు అంశాలతో పీజీఐ సర్వే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2022–23 కన్నా 2023–24లో మెరుగైన ఫలితాలు శుభ సూచికం అంటున్న విద్యావేత్తలు జిల్లాల వారీగా ఆరు అంశాల్లో సాధించిన మార్కుల వివరాలు జిల్లా మొత్తం 2022–23 2023–24 మార్కులు వరంగల్ 600 226 245హనుమకొండ 600 250 275మహబూబాబాద్ 600 210 229జనగామ 600 235 271జేఎస్ భూపాలపల్లి 600 220 253ములుగు 600 214 231 -
దళారుల దందా
రేషన్ కార్డులు మంజూరు చేయిస్తామని చేతివాటంహన్మకొండ అర్బన్: పేదల అవసరాన్ని ఆసరాగా చేసుకుని దళారులు అందిన కాడికి దండుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుమారు పదేళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డులకు అనుమతి ఇవ్వడంతో అర్హులంతా మీ సేవలో దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఒక్కో మండలానికి రోజూ వందల సంఖ్యలో దరఖాస్తులు వస్తుండడంతో అధికారులు విచారణ చేయడంలో కొంత జాప్యం జరుగుతోంది. దీన్ని ఆసరాగా చేసుకుని దళారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. దీనికి తోడు సందట్లో సడేమియా అన్నట్లు కొందరు అవినీతికి అలవాటు పడిన మీ సేవ కేంద్రాల నిర్వాహకులు దరఖాస్తు చేయడంతో పాటు కార్డు కూడా ఇప్పిస్తామంటూ ఆఫర్లు ప్రకటించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో నెత్తీనోరు బాదుకోవడం పేదల వంతవుతోంది. రెవెన్యూ ఉద్యోగులపైనే ఫిర్యాదులు.. జిల్లా కేంద్రంలో రేషన్ కార్డులతో పాటు ఇతర కులం, నివాసం, ఆదాయం వంటి పత్రాల కోసం నిత్యం రెవెన్యూ కార్యాలయాల్లో మీ సేవ కేంద్రాల వద్ద దళారులు తిష్ట వేసుకుంటున్నారు. తాము చెప్పిన పని చేయకపోతే రెవెన్యూ ఉద్యోగులపైనే ఏకంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్న ఘటనలు అధికారులను విస్మయానికి గురిచేస్తున్నాయి. తాజాగా హనుమకొండ మండల కార్యాలయంలో పనిచేసే డాటా ఎంట్రీ ఆపరేటర్పై ఏకంగా ఒక దళారి కలెక్టర్కే ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. అప్పటికే అతడి పరిస్థితి గమనించిన అధికారులు సదరు వ్యక్తి తీరుపై విస్మయానికి గురయ్యారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఇలాంటివి హనుమకొండ, హసన్పర్తి, కాజీపేట మండల కార్యాలయాల్లో నిత్యకృత్యం. ఇక కొన్ని మీసేవ కేంద్రాల్లో పనిచేసే వారైతే రూ.5 వేలు ఇస్తే రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయడంతో పాటు అప్రూవల్ చేయించి ఇస్తామంటూ ఆఫర్లు ఇస్తున్నారు. ఈవిషయం అధికారుల దృష్టికి వచ్చినా చర్యలు తీసుకోకుండా వదిలేయడం ఆరోపణలకు ఆస్కారం ఇస్తోంది. కార్డు రాదనే భయంతో.. పదేళ్ల తర్వాత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుకు అవకాశం ఇచ్చింది. అయితే ఇప్పుడు రాకపోతే ఇంకా ఎన్నేళ్లు ఎదురు చూడాల్సి వస్తుందోనన్న ఆందోళన పేదల్లో నెలకొంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అడిగినంత ఇచ్చి పని చేయించుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. ఈసారి ఫుడ్ సెక్యురిటీ కార్డు ఒకటి పకడ్బందీగా జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేట్ వ్యక్తులతో కాకుండా కేవలం రెవెన్యూ సిబ్బందితో మాత్రమే విచారణ చేయిస్తోంది. వీరిలో కూడా కొందరు దరఖాస్తుదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈవిషయంపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. ఒకవైపు ఉప ఎన్నికలు వస్తాయని ప్రచారం జరుగుతుండడంతో మళ్లీ కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోతుందని పేదలు ఆందోళన చెందుతున్నారు. ఈవిషయంలో అధికారులు స్పందించి దళారుల బెడద నివారించి కొత్త కార్డులు పారదర్శకంగా జారీ చేయాలని కోరుతున్నారు. సమస్య ఉంటే నేరుగా ఆఫీసుకు రండి.. కార్యాలయానికి రేషన్ కార్డుల దరఖాస్తులతో వస్తున్న వ్యక్తులే పదేపదే రావడం గమనిస్తున్నాం. వీరి విషయంలో ప్రత్యేకంగా నిఘా పెట్టి వాటిని సమగ్రంగా విచారణ చేస్తున్నాం. ఈవిషయంలో దళారులను అరికట్టేందుకు పోలీసు వారికి ఫిర్యాదు చేసేందుకు చూస్తున్నాం. పేద ప్రజలు రేషన్ కార్డుల కోసం దళారులను ఆశ్రయించవద్దు ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దు. అన్ని ధ్రువపత్రాలు ఉంటే అధికారులు ఇంటికి వచ్చి విచారణ చేస్తారు. లేదంటే కార్యాలయానికి వస్తే నేరుగా అధికారులను కలవండి. రేషన్ కార్డు పేరుతో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే నేరుగా కార్యాలయంలో ఫిర్యాదు చేయండి. – రంజిత్కుమార్, హనుమకొండ ఇన్చార్జ్ తహసీల్దార్ హనుమకొండ జిల్లాలో మొత్తం రేషన్ కార్డులు: 2,28,097(జనవరి 2025 వరకు) కొత్తగా అప్రూవల్ అయినవి: 3,419(జనవరి నుంచి జూన్ 1 వరకు) రెవెన్యూ సిబ్బందిపైనే ఫిర్యాదులు మధ్యవర్తులుగా కొందరు మీసేవ కేంద్రాల నిర్వాహకులు రూ.5 వేలు ఇస్తే రేషన్ కార్డు అంటూ ఆఫర్లు -
23 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: వన మహోత్సవం సందర్భంగా జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో 23 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. మంగళవారం ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ రాష్ట్ర ప్రభుత్వ వివిధ ప్రాధాన్యతా కార్యక్రమాలపై కలెక్టర్లతో వీసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టరేట్ నుంచి హాజరైన హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. వానాకాలం సీజన్లో ఎరువుల డిమాండ్కు అనుగుణంగా 6 వేల మెట్రిక్ టన్నులు అవసరం ఉందన్నారు. జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగుకు 4 వేల ఎకరాలు, ప్లాంటేషన్కు 1,300 ఎకరాలు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. సమావేశంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీఆర్డీఓ మేన శ్రీను, హనుమకొండ ఆర్డీఓ రమేశ్రాథోడ్, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్సింగ్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
చౌరస్తా విస్తరణలో జాప్యం
కాజీపేట: కాజీపేట చౌరస్తా విస్తరణలో జాప్యం కారణంగా వాహనదారులకు అవస్థలు తప్పట్లేదు. నాలుగు వైపుల నుంచి వచ్చే వాహనాల్ని నియంత్రించేందుకు సిగ్నలింగ్ వ్యవస్థ ఉన్నప్పటికీ ట్రాఫిక్ సిబ్బంది ఉంటే తప్ప.. వాహనదారులు సాఫీగా వెళ్లే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానం చేస్తూ రేడియల్ రోడ్డు నిర్మించాక ఈమార్గంలో ప్రయాణించే వాహనాలు అధికమయ్యాయి. ఉమ్మడి జిల్లాకు చెందిన వారు వరంగల్ మీదుగా ఉన్న జాతీయ రహదారులను చేరుకునేందుకు సైతం ఈరోడ్డును ఎక్కువగా వినియోగిస్తున్నారు. కాజీపేట చౌరస్తా సమీపంలో షాపులు, రోడ్లపై నిలిపిన వాహనాల కారణంగా ఆప్రాంతంలో నిత్యం వాహనాలు బారులుదీరుతున్నాయి. చౌరస్తా ఇరుకుగా ఉండడం.. ఓ వైపు స్తంభాలు, దుకాణాల ర్యాంపులు, మెట్లు, ముందుకు జరిపేసిన షెడ్లు.. నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన చిరువ్యాపారుల బండ్ల వల్ల నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. క్షేత్రస్థాయిలో పరిశీలన పూర్తి మున్సిపల్, ‘కుడా’ అధికారులు వరంగల్ నగరంలో చౌరస్తాల విస్తరణ, సుందరీకరణ చేపట్టాలని 2022లో నిర్ణయించారు. ఆజాబితాలో కాజీపేట చౌరస్తా సైతం ఉంది. అదే ఏడాది సర్వే చేయడంతో పాటు టౌన్ ప్లానింగ్, ట్రాఫిక్ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ట్రాఫిక్ రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు టౌన్ ప్లానింగ్ అధికారులకు సమస్య తీవ్రతను వివరించారు. పనులు మంజూరయ్యేలోపు తాత్కాలిక చర్యలు చేపట్టాలని కోరారు. చౌరస్తాను జీరో సర్కిల్ ఆకారంలో నిర్మించాలని, విస్తరణకు అడ్డంకిగా ఉన్న భవనాలు, రైల్వే స్టేడియం, త్రిబుల్ ఎస్ కాంప్లెక్స్, పోలీస్స్టేషన్ ప్రహరీని తొలగించాల్సి ఉంటుందని అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఇది గడిచి మూడేళ్లవుతున్నా.. పనులు మాత్రం నత్తనడకనే సాగుతున్నాయి. చౌరస్తా విస్తరణకు అడ్డంకిగా ఉన్న భవనాల తొలగింపు విషయం అధికారులు, ప్రజాప్రతినిధులకు తలనొప్పిగా మారింది. నిధులు మంజూరైనా.. ఎట్టకేలకు ఈఏడాది చౌరస్తా అభివృద్ధి, సుందరీకరణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. చౌరస్తాలో క్రాస్ డివైడర్ కట్టి వివిధ ఆకారాల్లో ఉన్న బొమ్మలను ఏర్పాటు చేసి లాంఛనంగా ప్రారంభించి అధికారులు చేతులు దులుపుకున్నారు. ముసుగులు వేసి వదిలేశారు. అసలే ఇరుకుగా ఉన్న చౌరస్తా కావడంతో పాటు ఇరువైపులా ఉన్న దుకాణాల వద్దకు నిత్యం వచ్చే వారి వాహనాలతో ట్రాఫిక్ స్తంభిస్తోంది. చౌరస్తా సమీపంలోని బహుళ అంతస్తుల భవనాల యజమానులు సెట్బ్యాక్తో నిర్మాణాలు చేపట్టకపోవడంతో ట్రాఫిక్ సమస్య మరింత జఠిలమవుతోంది. వేలాది వాహనాలు.. కాజీపేట పట్టణ చౌరస్తా మీదుగా నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. పలు జిల్లాలను అనుసంధానం చేసే రహదారి ఇదొక్కటే కావడం గమనార్హం. ట్రాఫిక్ సిగ్నల్స్ పడినప్పుడు వాహనదారులు ఎదుర్కొనే ఇబ్బందులు వర్ణనాతీతం. అధికారులు ఇప్పటికై నా స్పందించి చౌరస్తాను విస్తరించాలని స్థానికులు కోరుతున్నారు. విస్తరిస్తేనే సమస్యకు పరిష్కారం ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా కాజీపేట చౌరస్తా విస్తరణ పనులను అధికారులు పూర్తి చేయాలి. చౌరస్తా ప్రాంతంలో రహదారులు ఇరుకుగా ఉండడంతో వచ్చిపోయే వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. – పిల్లల సుధాకర్, వ్యాపారి ప్రజలు సహకరించాలి.. రహదారి విస్తరణకు వందశాతం ప్రయత్నాలు మొదలు పెట్టాం. నిధులకు ఇబ్బంది లేదు. చౌరస్తాకు అటూఇటుగా ఉన్న భవనాల తొలగింపు సమస్యే ప్రధాన అడ్డంకిగా మారింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాజకీయ పార్టీలకు అతీతంగా పట్టణ ప్రజలు సహకరిస్తే పనులు ప్రారంభమవుతాయి. – నాయిని రాజేందర్రెడ్డి, పశ్చిమ ఎమ్మెల్యే కాజీపేటలో నిత్యం ట్రాఫిక్ చిక్కులు ఇబ్బందులు పడుతున్న వాహనదారులు పట్టించుకోని అధికారులు -
నేత పని, జీవన విధానంపై డాక్యుమెంటరీ
రామన్నపేట: వరంగల్ కొత్తవాడలోని చేనేత కార్మికుల గృహాలు, వారి పని ప్రక్రియను ఐఐసీడీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్ట్రాఫ్ట్ అండ్ డిజైన్) బృందం మంగళవారం పరిశీలించింది. పాత తరం నైపుణ్యాల్ని కాపాడేందుకు తెలంగాణ క్రాఫ్ట్ కౌన్సిల్ సహకారంతో ఐఐసీడీ ఉమ్మడి జిల్లాలోని వృత్తులకు సంబంధించిన అన్ని ఉత్పత్తులను డాక్యుమెంట్ చేయడానికి పూనుకున్నట్లు ప్రతినిదులు తెలిపారు. ఏళ్లు గడిచే కొద్ది పాతతరం కళాకారులు, నేత కార్మికులు వివిధ కారణాల వల్ల తమ నైపుణ్యాన్ని తదుపరి తరానికి అందించలేకపోతున్నారని, ఈ సవాల్ను ఎదుర్కొనేందుకు తెలంగాణ క్రాఫ్ట్ కౌన్సిల్ ఈడాక్యుమెంటేషన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈబృందానికి టీపీసీసీ నేత, చేనేత విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్ప వెంకటేశ్వర్లు నేత కార్మికుల జీవన విధానాన్ని, వారి పనితీరును వివరించారు. కార్యక్రమంలో జిల్లా రూరల్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు భవాని, అశోక్, డాలియా తదితరులు పాల్గొన్నారు. -
యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్
హన్మకొండ: మాదక ద్రవ్యాల వినియోగంతో యువత భవిష్యత్ నిర్వీర్యం అవుతోందని జిల్లా రెవెన్యూ అధికారి వైవీ.గణేశ్ అన్నారు. మంగళవారం హనుమకొండ అంబేడ్కర్ భవన్లో మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా రెవెన్యూ అధికారి వై.వి.గణేశ్ మాట్లాడుతూ.. పాఠశాలలు, కళాశాలల సమీప షాపుల్లో చాక్లెట్లు, బిస్కెట్ల రూపంలో మాదక ద్రవ్యాలు అమ్ముతున్నట్లు.. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు.. పిల్లల్ని అప్రమత్తం చేయాలని సూచించారు. హనుమకొండ ఏసీపీ నరసింహారావు మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల రవాణాపై పోలీస్ వ్యవస్థ అప్రమత్తంగా ఉందన్నారు. ఈసందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు. సదస్సులో టీజీనాబ్ ఏసీపీ సైదులు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కె.ప్రహసిత్, జిల్లా సంక్షేమ అధికారి జయంతి, కేర్అండ్క్యూర్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఆచార్య రవికుమార్, ప్రొహిబిషన్–ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ మాట్లాడారు. జిల్లా సంక్షేమ అధికారి అధ్యక్షతన జరిగిన ఈసదస్సులో నర్సింగ్ ఆఫీసర్ అరుణకుమారి, ఇన్చార్జ్ డీసీపీఓ ఎస్.ప్రవీణ్కుమార్, ఎఫ్ఆర్ఓ రవి కృష్ణ, సఖి అడ్మిన్ పి.హైమావతి, జిల్లా మహిళా శక్తి కో–ఆర్డినేటర్ డి.కళ్యాణి, చైల్డ్ హెల్ప్ లైన్ కో–ఆర్డినేటర్ భాస్కర్ పాల్గొన్నారు. హనుమకొండ రెవెన్యూ అధికారి వైవీ.గణేశ్ విద్యార్థులకు అవగాహన -
డీపీఆర్ త్వరగా సిద్ధం చేయండి
మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ ఏర్పాటుకు అవసరమయ్యే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్(డీపీఆర్)ను త్వరగా సిద్ధం చేయాలని గ్రేటర్ మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. మంగళవారం సాయంత్రం బల్దియా ప్రధాన కార్యాలయంలోని మేయర్ చాంబర్లో, కమిషనర్ చాహత్ బాజ్ పాయ్తో కలిసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను తిలకించారు. 66 డివిజన్లకు సంబంధించిన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల పురోగతిని సమీక్షించారు. ఈసందర్భంగా బిల్డ్ కాన్ కన్సల్టెన్సీ ప్రతినిధి అగర్వాల్ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటు, జోన్ల వారీగా విభజన, ఎస్టీపీల ఏర్పాటుకు భూ కేటాయింపు, తదితర అంశాలపై వివరించారు. సమావేశంలో ఇన్చార్జ్ ఎస్ఈ మహేందర్, ఇన్చార్జ్ సీపీ రవీందర్ రాడేకర్, ఈఈలు, డీఈలు, టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు. డ్రెయినేజీ పనులు పూర్తి చేయాలి.. వరంగల్ చౌరస్తా: వరంగల్ రామన్నపేట 28వ డివిజన్లో మేయర్ సుధారాణి అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య నిర్వహణ తీరును మంగళవారం పర్యవేక్షించారు. పాత థియేటర్ వద్ద డ్రెయినేజీ నిర్మాణం అసంపూర్తిగా ఉండడం, కాల్వలో చెత్త పేరుకుపోవడంతో మేయర్ ఇంజనీర్లను, ప్రజారోగ్య విభాగాధికారులను మందలించారు. డ్రెయినేజీల్లో పూడికతీత పనులు పూర్తి చేయాలని సూచించారు. ఆమె వెంట సీఎంహెచ్ఓ రాజేశ్, ఇంజనీర్లు ఉన్నారు. -
ఎంజీఎంలో సెక్యూరిటీ గార్డు, స్వీపర్పై దాడి
ఎంజీఎం : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని అత్యవసర విభాగంలోని సెక్యూరిటీ సిబ్బంది, స్వీపర్పై మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి దాడి చేశాడు. ఈఘటనపై అటు కాంట్రాక్ట్ యాజమాన్యం, ఇటు ఆస్పత్రి అధికారులు కనీసం పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో చికిత్స కోసం వచ్చిన ఓ యువకుడు అత్యవసర విభాగంలో రక్తం మరకలు తుడుస్తున్న ఓ స్వీపర్పై అసభ్య పదజాలంతో దూషించడంతో అడ్డొచ్చిన సెక్యూరిటీ గార్డుపై దాడి చేశాడు. ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉండడంతో అక్కడున్న ఓ వార్డు బాయ్ వచ్చి సదరు వ్యక్తిని సముదాయించి పంపించేశాడు. సదరు యువకుడు మళ్లీ తిరిగి వచ్చి విధుల్లో ఉన్న పీఆర్ఓకు ఫోన్ చేయించి సెక్యూరిటీ సిబ్బందిని మరోసారి దుర్భాషలాడాడు. ఈఘటనలో అక్కడికి చేరుకున్న పీఆర్ఓ ‘అతను ఓ వీఐపీ.. అతడితో పెట్టుకుంటే మీ ఉద్యోగాలు పోతాయ్’ అని సెక్యూరిటీ గార్డు, స్వీపర్లపై రుసరుసలాడాడు. బెదిరించి దాడి చేసిన సదరు యువకుడికి దగ్గరుండి చికిత్స అందించి పంపించారు. కాగా, ఈఘటనతో ఖంగుతిన్న సెక్యూరిటీ గార్డులు మంగళవారం ఉదయం తమ కార్యాలయం వద్ద కొద్దిసేపు నిరసన వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వచ్చి వివరాలు సేకరించి వెళ్లిపోయారు. ఈ ఘటనపై సెక్యూరిటీ, శానిటేషన్ కాంట్రాక్టర్.. ఎంజీఎం పరిపాలనాధికారులకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేయలేదు. దీంతో తాము ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఎంజీఎం పరిపాలనాధికారులు చెప్పడం కొసమెరుపు. మద్యం మత్తులో ఓ వ్యక్తి హల్చల్ పోలీసులకు ఫిర్యాదు చేయని ఎంజీఎం అధికారులు ఎవరు ఆ వీఐపీ?మద్యం మత్తులో వచ్చి సెక్యూరిటీ గార్డుపై దాడి చేసి పీఆర్ఓకు ఫోన్ చేయించి చికిత్స పొందిన ఆ వీఐపీ ఎవరు అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. దాడికి గురైన మహేశ్ అనే సెక్యూరిటీ గార్డు ఎంజీఎంలో వైద్యుల వద్ద చికిత్స పొందాడు. ఇంత జరిగినా ఆ వీఐపీ రోగిపై చర్యలు తీసుకునేందుకు సెక్యూరిటీ కాంట్రాక్టర్ ఫిర్యాదు చేయకపోవడం, ఎంజీఎం పరిపాలనాధికారులు రాతపూర్వకంగా ఫిర్యాదు అందలేదని దాటవేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మున్ముందు ఏదైనా పెద్ద ఘటన జరిగితే తమ పరిస్థితి ఏంటని సెక్యూరిటీ సిబ్బంది, స్వీపర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
నేడు డీసీసీబీ మహాజన సభ
హన్మకొండ : వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) మహాజన సభ నేడు (మంగళవారం) నిర్వహిస్తున్నట్లు ఆ బ్యాంక్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వజీర్ సుల్తాన్ తెలిపా రు. ఉదయం 11గంటలకు హనుమకొండ నక్కలగుట్టలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో చైర్మన్ మార్నేని రవీందర్ రావు అధ్యక్షతన ఈ సభ జరుగుతుందని ఆయన ఒక ప్రకటనలో వివరించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రుణాల పంపిణీ, వ్యవసాయ, విద్య రుణాల జారీ, వసూళ్లు వివిధ పథకాలపై చర్చించనున్నట్లు ఆయన వివరించారు. పూర్వ వరంగల్ జిల్లా పరిధిలోని పీఏసీఎస్ చైర్మన్లు, వ్యవసాయ శాఖ, ఉద్యానశాఖ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొనాలని కోరారు. విద్యావేత్తలు రాజకీయాల్లోకి రావాలి ● ఆల్ ఇండియా ఓబీసీ జేఏసీ చైర్మన్ నరేందర్ కేయూ క్యాంపస్ : విద్యావేత్తలు రాజకీయాల్లోకి రావాలని అప్పుడే దేశంలో విలువల పాలన నిర్మితమవుతుందని ఆల్ ఇండియా ఓబీసీ జేఏసీ చైర్మన్ సాయిని నరేందర్ పేర్కొన్నారు. హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సైన్స్ కాలేజీలో డాక్టర్ చింతం ప్రవీణ్కుమార్ తెలుగు విభాగం అధిపతిగా సోమవారం బాధ్యతలు స్వీకరించగా, సన్మానించారు. ఓబీసీ జాక్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు తాడిశెట్టి క్రాంతికుమార్, బీసీ ఉద్యోగ సంఘాల బాధ్యులు బుసగొండ ఓంకార్, చాపర్తికుమార్, వల్లాల జగన్గౌడ్, రాసమల్ల శ్రీనివాస్, నారాయణగిరి రాజు, నలుబాల రవికుమార్, సుధాకర్ పాల్గొన్నారు. కాజీపేట మీదుగా 8 ప్రత్యేక రైళ్లు ● నేటినుంచి ప్రారంభం కాజీపేట రూరల్ : ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా కాజీపేట జంక్షన్ మీదుగా దక్షిణ మధ్య రైల్వే, బిలాస్పూర్ రైల్వే అధికారులు కాచిగూడ–బిలాస్పూర్ మధ్య 8 ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ సోమవారం తెలిపారు. ప్రత్యేక రైళ్ల వివరాలు.. జూన్ 23 నుంచి జూలై 7వ తేదీ వరకు బిలాస్పూర్లో ప్రతి సోమవారం బయలుదేరే బిలాస్పూర్–కాచిగూడ (08263) వెళ్లే ఎక్స్ప్రెస్ మంగళవారం కాజీపేటకు చేరుకొని వెళ్తుంది. అదేవిధంగా జూన్ 24వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు కాచిగూడ–బిలాస్పూర్ (08264) వెళ్లే ఎక్స్ప్రెస్ ప్రతి మంగళవారం కాజీపేట జంక్షన్కు చేరుకొని వెళ్తుంది. 3 ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లతో ప్రయాణించే ఈ రైళ్ల సర్వీస్లకు బిలాస్పూర్, రాయ్పూర్, దుర్గ్, రాజ్నందగాం, డోంగ్ర, గోండియా, వడ్సా, చాంద ఫోర్ట్, బలర్షా, సిర్పూర్ కాగజ్నగర్, మంచిర్యాల, రామగుండం, కాజీపేట, చర్లపల్లి, మల్కాజ్గిరి స్టేషన్లలో హాల్టింగ్ కల్పించినట్లు సీపీఆర్వో తెలిపారు. -
యూరియా సరిపోయెనా..?
● ఉమ్మడి జిల్లాకు చేరిన 1,315 మెట్రిక్ టన్నుల యూరియా ● రేపు మరో 45,210 బస్తాల రాక ఖిలా వరంగల్: వానాకాలం వచ్చేసింది. అన్నదాతలు ముమ్మరంగా సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. మరో వైపు డిమాండ్కు అనుగుణంగా ఎరువుల సరఫరా లేకపోవడంతో రైతుల్లో భయాందోళన మొదలైంది. మున్ముందు ఇదే పరిస్థితి ఉంటే ఇంకెన్ని ఇబ్బందులు ఎదురవుతాయోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎరువుల సరఫరా తగినంత లేకపోవడంతో బ్లాక్ మార్కెట్లో రేట్లు పెంచేసి సోమ్ము చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో సుమారు 3,08,320 ఎకరాల్లో పత్తి, వరి, మొక్కజొన్న, కంది, మిర్చి, పసుపు, ఇతర పంటలు సాగు చేస్తున్నారు. పంట చేతికొచ్చెవరకు సుమారు 6 వేలపైగా బ్యాగుల యూరియా అవసరం. కానీ ఈ ఏడాది రైతులకు అవసరమైనంత మేర దొరకడం కష్టంగా కనిపిస్తుంది. నెలవారీ కోటాలో కేంద్రం కోత విధిస్తుండడంతో భవిష్యత్లో యూరియా సరఫరా ఆశాజనకంగా ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. డీఏపీ, 20:20 ఇతర ఎరువుల కొరత ఉండకపోవచ్చని సమాచారం. యూరియా, ఇతర ఎరువుల సరఫరా నిల్వలపై వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారిస్తున్నప్పటికీ నిల్వల వివరాలు చేప్పేందుకు వెనకాడుతున్నారు. అవసరం మేరకు సరఫరా లేకపోవడంతోనే ప్రస్తుతం వివరాలు బహిర్గతం చేయడంలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నేడు రైతులతో సీఎం ముఖాముఖి సీఎం రేవంత్రెడ్డి నేడు (మంగళవారం) రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వానాకాలం –2025కు సంబంధించి పెట్టుబడి సాయాన్ని రైతు భరోసా పథకం ద్వారా విజయవంతంగా రైతుల ఖాతాల్లో జమ చేసిన సందర్భంగా రైతు వేదికల్లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం ముఖాముఖి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 33 రైతు వేదికల్లో పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రత్యేక, నోడల్ ఆఫీసర్గా నియమించబడిన జిల్లా, మండల స్థాయి అధికారులు, రైతు వేదికల వద్దకు ప్రజా ప్రతినిధులు, రైతులను ఆహ్వానించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 1,52,975 మంది రైతుల ఖాతాల్లో రూ.153.47కోట్లు రైతు భరోసా ద్వారా జమచేసినట్లు తెలిపారు. -
తెరుచుకోని ప్రభుత్వ గిరిజన పాఠశాల
గార్ల : ఇద్దరు ఉపాధ్యాయులు సోమవారం విధులకు హాజరు కాకపోవడంతో ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాల తాళం తెరుచుకోలేదు. అసలే ఈ పాఠశాల తెరిచిన నాటి నుంచి ఒక్క విద్యార్థి సైతం చేరలేదు. గార్ల మండలంలోని చిన్నకిష్టాపురం పంచాయతీ సర్వన్తండా పాఠశాలలో ఉపాధ్యాయులే విధులకు డుమ్మా కొడుతుంటే, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించకుండా ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారు. ఇదే పాఠశాలలో ఆవరణలో కొనసాగుతున్న అంగన్వాడీ టీచర్ను వివరణ కోరగా ఇద్దరు ఉపాధ్యాయులు పాఠశాలకు రాలేదని తెలిపారు. ఇప్పటికై నా సంబంధిత ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు స్పందించి ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలపై పర్యవేక్షణ పెంచాల్సిన అవసరం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై హెచ్ఎం సీహెచ్ జోగయ్యను ‘సాక్షి’ వివరణ కోరగా సర్వన్తండా జీపీఎస్ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు సోమవారం విధులకు హాజరు కాలేదని వివరించారు. విధులకు ఉపాధ్యాయుల గైర్హాజరు -
నత్తనడకన ఇళ్ల నిర్మాణం
హన్మకొండ: నిరాశ్రయులైన, దారిద్య్రరేఖకు దిగువ న ఉన్న కుటుంబాలకు పక్కా శాశ్వత గృహాలను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల కా ర్యక్రమాన్ని చేపట్టింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించనుంది. అ యితే లబ్ధిదారుల ఎంపికలో ఆలస్యం, వెరిఫికేషన్ కు సమయం తీసుకోవడం, ప్రొసీడింగ్స్ జారీలో జాప్యం తదితర కారణాలతో హనుమకొండ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ప్రొసీడింగ్స్ జారీ వరకు ప్రతీ స్టేజీలో ప్రక్రియ ఆలస్యం కావడంతో ముగ్గులు పోసే విషయంలో వెనుకబడిపోయింది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ రెండు నెలల ముందు పూర్తి కావాల్సి ఉండగా.. జాప్యం కావడంతో ఇళ్ల నిర్మాణం నత్తనడక న సాగుతోంది. దీనికి తోడు లబ్ధిదారుల ఆర్థిక స్థో మత, మెటీరియల్ లభ్యత, ముహూర్తాలు లేకపోవడం వంటివి ప్రతిబంధకాలుగా మారాయి. దీంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఊపందుకోలేదు. వరంగల్ జిల్లాలో.. వరంగల్ జిల్లాకు 11,004 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించగా.. 7,734 ఇళ్లకు పరిపాలనా మంజూరు ఇచ్చారు. ఇప్పటి వరకు 2,251 ఇళ్లకు ముగ్గు పోశారు. ఇంకా 8,753 ఇళ్లకు ముగ్గు పోయాల్సి ఉంది. హనుమకొండ జిల్లాకు 9,942 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం కేటాయించింది. జిల్లా అధికార యంత్రాంగం 6,358 ఇళ్లకు పరిపాలనా మంజూరు ఇచ్చింది. 5,767 ఇళ్ల ప్రొసీడింగ్స్ లబ్ధిదారులకు అందించారు. ఇందులో 3,164 ఇళ్లకు ముగ్గు పోశారు. ముగ్గు పోసుకున్న లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టారు. మంచి రోజులు లేవని.. ప్రస్తుతం ముహూర్తాలు లేకపోవడం, ఆషాఢ మాసం రావడంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ ఊపందుకోవడానికి మరో నెల రోజులకుపైగా సమయం పట్టనుంది. ఇంటి నిర్మాణం 400 నుంచి 600 చదరపు అడుగులకు మించకుండా ఉండాలనే నిబంధన లబ్ధిదారులను కొంత ఇబ్బందికి గురిచేస్తోంది. ఇందులో ఒక హాల్, కిచెన్, బెడ్రూం, వాష్రూం తప్పనిసరిగా ఉండాలి. దీనికి మించిన వైశాల్యంలో ఇళ్లు నిర్మించుకుంటే బిల్లు పొందడానికి అనర్హులవుతారు. ప్రభుత్వం ఇచ్చే సాయానికి తాము కొంత జోడించి విశాలంగా ఇల్లు కట్టుకోవాలనే ఆసక్తి కలిగిన లబ్ధిదారులకు ప్రభుత్వ నిబంధనలు అడ్డంకిగా మారాయి. ఒకరిని చూసి మరొకరు ఇంటి విస్తీర్ణం పెంచి ఆర్థిక సపోర్టు లభించక మధ్యలోనే నిర్మాణాన్ని వదిలేస్తే ప్రభుత్వానికి ఎక్కడ మచ్చ వస్తుందో అన్న సందేహంతో సర్కారు ఈ నిబంధనను పెట్టినట్లు తెలుస్తోంది. ఆషాఢం పూర్తయి, శ్రావణం వచ్చిన తర్వాత మంచి ముహూర్తాలు వచ్చే వరకు ఇళ్ల నిర్మాణాలకు ముగ్గులు పోసే ప్రక్రియ నిలిచిపోనుంది. హనుమకొండ జిల్లాకు ఇందిరమ్మ గృహాలు 9,942 కేటాయింపు పరిపాలనా మంజూరు ఇచ్చినవి 6,358 ముగ్గులు పోసినవి 3,194 వరంగల్ జిల్లాకు కేటాయించిన ఇళ్లు 11,004 పరిపాలనా మంజూరు ఇచ్చినవి 7,734 కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ ప్రకటించని లబ్ధిదారుల జాబితా ముహూర్తాలు లేక ఆగిన ఇళ్ల నిర్మాణాల ప్రారంభంఎంపిక.. కత్తిమీద సాము వరంగల్ జిల్లాలో ఇంకా 7,734 మంది, హనుమకొండ జిల్లాలో ఇంకా 3,584 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక కత్తిమీద సాముగా మారడంతో ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వం ఇందిరమ్మ కమిటీలు వేసి లబ్ధిదారులను ఎంపిక చేసింది. మొదటి ప్రాధాన్యంగా ఇంటి స్థలాలున్న పేదలకు మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇళ్ల స్థలాలుండి సొంతిళ్లు లేని వారిని గుర్తించారు. ఈజాబితాను ఇందిరమ్మ కమిటీ అధికారులకు అందజేసిన తర్వాత జిల్లా అధికార యంత్రాంగం వెరిఫికేషన్ అధికారులను నియమించి లబ్ధిదారుల ఎంపిక, స్థల పరిశీలన చేసి తుది జాబితాను రూపొందించారు. ఈప్రక్రియ పూర్తి కావడానికి చాలా సమయం తీసుకుంది. దీనికి తోడు ప్రొసీడింగ్స్ జారీ చేయడంతో పాటు వాటిని గ్రామాల్లో లబ్ధిదారులకు అందించేందుకు ఎమ్మెల్యేలు సమయం తీసుకోవడంతో ఆలస్యంగా నిర్మాణాలు మొదలయ్యాయి. -
ఉమ్మడి జిల్లాస్థాయి బాల్ బ్యాడ్మింటన్ విజేత కానిపర్తి
కమలాపూర్ : ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి బాల్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని కానిపర్తి జట్టు నిలిచింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం దౌలత్నగర్లో నిర్వహించిన ఆరు జిల్లాల స్థాయి ఆహ్వానిత బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మొత్తం 12 జట్లు పాల్గొనగా కానిపర్తి, భూపాలపల్లి జట్లు ఫైనల్కు చేరాయి. ఆదివారం జరిగిన ఫైనల్లో భూపాలపల్లి జట్టుపై కానిపర్తి జట్టు గెలిచి టోర్నీని కై వసం చేసుకుంది. విజేతగా నిలిచిన జట్టుకు నిర్వాహకులు ట్రోఫీతో పాటు నగదు బహుమతి అందజేశారు. కానిపర్తి జట్టుకు కోచ్గా కన్నెబోయిన కిరణ్యాదవ్, కెప్టెన్గా దాసరి రమేష్ వ్యవహరించారు. -
రుద్రేశ్వరుడికి ప్రత్యేక పూజలు
హన్మకొండ కల్చరల్: శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో జ్యేష్టమాసం బహుళ త్రయోదశి సోమవారం మాసశివరాత్రిని పురస్కరించుకుని ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యాన ప్రత్యేక పూజలు, శివకల్యాణం నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి నిత్య పూజల అనంతరం ఆలయ నాట్యమండపంలో శ్రీరుద్రేశ్వరీదేవి, శ్రీరుద్రేశ్వరస్వామివారి ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించి కల్యాణోత్సవం నిర్వహించారు. ఏర్పాట్లను ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు. కానిస్టేబుల్కు అభినందనవరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆర్ముడ్ రిజర్వ్ విభాగంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న సాయిరాం గత వారం క్లాషిల్లా ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన అతి పెద్ద పరుగు పోటీలో పాల్గొని సిల్వర్ మెడల్ సాధించారు. ఈసందర్భంగా సోమవారం పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్సింగ్.. ఆయనను అభినందించి రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలు సాధించాలని, క్రీడల్లో రాణించే పోలీసుకు ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు. అదనపు డీసీపీ సురేశ్ కుమార్, అడ్మిన్ ఆర్ఐ స్పర్జన్రాజ్ పాల్గొన్నారు. మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలికాజీపేట రూరల్/మడికొండ: మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా అన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై కాజీపేట దర్గా ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మడికొండ శివారులోని సాంఘిక సంక్షేమ (వర్ధన్నపేట) బాలుర పాఠశాల, కళాశాలలో సోమవారం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. మత్తుపదార్థాలతో జరిగే అనర్థాలపై దర్గా పాఠశాల విద్యార్థులు నాటిక ప్రదర్శించగా.. డీసీపీ వారిని అభినందించి రూ.1,000 నగదు పురస్కారం అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో కాజీపేట ఏసీపీ ప్రశాంత్రెడ్డి, మడికొండ ఇన్స్పెక్టర్ కిషన్, హెడ్ కానిస్టేబుళ్లు జయరాజ్, రాంచందర్, కాజీపేట సీఐ సుధాకర్రెడ్డి, ఎస్సై లవన్కుమార్, స్కూల్ హెచ్ఎం ఎన్.ఎన్.ఎం.స్వామి, సెక్రటరీ కటుకూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రైతు భరోసా రూ.148.74 కోట్లు జమహన్మకొండ: రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా అన్నదాతలకు మద్దతుగా నిలుస్తోందని హనుమకొండ జిల్లా వ్యవసా య అధికారి రవీందర్ సింగ్ తెలిపారు. ఈమేరకు వానాకాలం పంటల సాగుకు సోమవారం జిల్లాలో 14 మండలాలు, 163 గ్రామాలకు చెందిన 1,41,364 మంది రైతుల ఖాతాల్లో రూ.148.74 కోట్లు ప్రభుత్వం జమ చేసిందని ఆయన ఒక ప్రకటనలో వివరించారు. వరంగల్ రీజియన్కు ప్రాధాన్యంహన్మకొండ: ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీలో వరంగల్ రీజియన్కు ప్రాధాన్యం దక్కింది. ఖమ్మంలో ఈనెల 21, 22 తేదీల్లో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర మహాసభలు జరిగాయి. సోమవారం రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు. వరంగల్ రీజియన్కు చెందిన సీహెచ్.రాంచందర్(భూపాలపల్లి ఏడీసీ) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బి.ఉపేంద్రచారి (వరంగల్–1 డిపో కండక్టర్) రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఎస్ఈగా శివలింగంవరంగల్ అర్బన్ : వరంగల్ మహా నగరపాలక సంస్థ(జీబ్ల్యూఎంసీ) ఇన్చార్జ్ ఎస్ఈగా బి.మహేందర్ను నియమిస్తూ కమిషనర్ చాహత్ వాజ్ పాయ్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఇన్చార్జ్ ఈనెలఖారుతో ఉద్యోగ విరమణ పొందనున్నారు. ఈ నేపథ్యంలో పరిపాలనలో భాగంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. -
అనాథ చిన్నారులను చదివిస్తాం..
విద్యారణ్యపురి : తల్లిదండ్రుల మృతితో అనాథలైన చిన్నారులను న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) హనుమకొండ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి క్షమాదేశ్ పాండే, డీఎల్ఎస్ఏ వరంగల్ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సాయికుమార్ సోమవారం హనుమకొండలోని వివేకానందనగర్లోని సాయిట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాయిస్పందన హైస్కూల్లో చేర్పించారు. వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం పోతరాజుపల్లికి చెందిన ఓని రమేశ్, అతడి భార్య తిరుపతమ్మ ఆరునెలల క్రితం మరణించారు. వీరికి కుమారులు గౌతమ్, గర్విక్ ఉన్నారు. కాగా రమేశ్ అన్న విజయ్ ప్రస్తుతం హనుమకొండలోని భవానినగర్లో ఉంటున్నాడు. తమ్ముడి పిల్లల ఆలనాపాలనకు తాము గార్డియన్గా ఉన్నామని అయితే వీరిని చదివించే స్థోమత తమకు లేదని వీరికి హాస్టల్ వసతితో పాటుగా విద్యను అందించే సదుపాయం కల్పించాలని ఇటీవల విజయ్ హనుమకొండ జిల్లా న్యాయసేవాధికారి సంస్థకు వినతి పత్రం అందజేశారు. దీంతో స్పందించిన డీఎల్ఎస్ఏ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి హనుమకొండ కార్యదర్శి క్షమాదేశ్పాండే, వరంగల్ డీఎల్ఎస్ఏ సెక్రటరీ సాయికుమార్ చైల్డ్వెల్ఫేర్ కమిటీ సహకారంతో సోమవారం ఇద్దరు చిన్నారులను వివేకానందనగర్లోని సాయిస్పందన హైస్కూల్లో చేర్పించారు. గౌతమ్ను 5వ తరగతిలో, గర్విక్ను ఒకటోతరగతిలో చేర్పించారు. పాఠశాలలో చేర్పించిన సీనియర్ సివిల్ జడ్జిలు -
ట్రాక్టర్ బోల్తా.. అన్నదాత దుర్మరణం
● లక్ష్మారెడ్డిపల్లెలో ఘటన గణపురం : సొంత వ్యవసాయ భూమిలో కల్టివేటర్తో దున్నుతుండగా ట్రాక్టర్ బోల్తాపడి రైతు ఓద్దుల రాంరెడ్డి (46) అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషాద ఘటన సోమవారం గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లెలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు రాంరెడ్డి తన భూమిలో సొంత ట్రాక్టర్తో దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు రాంరెడ్డిని బయటకు తీసే ప్రయత్నం చేసిన సాధ్యపడలేదు. వెంటనే క్రేన్ సహాయంతో ట్రాక్టర్ను పక్కకు జరిపి రాంరెడ్డి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడికి భార్య జ్యోతి, కుమారుడు, కూతురు ఉన్నారు. జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు. అందరితో కలిసిమెలిసి ఉండే రాంరెడ్డి మృతితో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. బైక్ అదుపుతప్పి ఆర్ఎంపీ మృతి ఎల్కతుర్తి : బంధువుల వేడుకకు వెళ్లి వస్తుండగా బైక్ అదుపుతప్పి ఓ ఆర్ఎంపీ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సోమవారం భీమదేవపల్లి మండలం గట్లనర్సింగాపూర్ శివారులో జరిగింది. ఎస్సై సాయిబాబు కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం జగన్నాథపూర్ గ్రామానికి చెందిన ఆర్ఎంపీ చిర్ర సుదర్శన్ (60) ఆదివారం హుస్నాబాద్లో జరిగిన బంధువుల ఫంక్షన్కు ద్విచక్ర వాహనంపై వెళ్లి అర్ధరాత్రి 1గంటకు తిరిగి వస్తున్నాడు. ఈక్రమంలో బైక్ అదుపుతప్పి కిందపడి పోయాడు. దీంతో అతడి తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కుమారుడు విజయ్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. రైలు నుంచిపడి వ్యక్తి.. ఖిలా వరంగల్ : ప్రమాదవశాత్తు రైలు నుంచి జారీ పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం సాయంత్రం నెక్కొండ–ఎలుగూరు రైల్వే స్టేషన్ మధ్య గేటుపల్లి తండా సమీపంలో చోటుచేసుకుంది. జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ ఎస్.రవీందర్రెడ్డి కథనం ప్రకారం.. నెక్కొండ– ఎలుగూరు రైల్వే గేటు మధ్య గేటుపల్లి తండా సమీపంలో రైలు నుంచి ప్రమాదవశాత్తు 55 ఏళ్ల వయసు గల వ్యక్తి సోమవారం పడి దుర్మరణం చెందాడు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతుడు బూడిద కలర్ కాటన్ ప్యాంట్, గులాబీ కలర్ ఫుల్ షర్ట్, తెల్ల బనియన్, బ్రౌన్ కలర్ డ్రాయర్ ధరించి ఉన్నాడని, తెల్లని వెంట్రుకలు, గడ్డం మీసాలు కలిగి ఉన్నాడు. మృతుడు 5.6 ఎత్తు, ఎరుపు రంగు గుండ్రని ముఖం, గుర్తు పట్టుటకు పొట్ట, ఛాతిపై పుట్టుమచ్చలు కలవు. రైల్వే అధికారుల ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించి భద్రపరిచారు. ఎవరైనా గుర్తిస్తే 98497 49220 సమాచారం అందజేయాలని జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ రవీందర్ రెడ్డి తెలిపారు. -
వన మహోత్సవానికి సిద్ధం చేయండి
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో నిర్వహించే వన మహోత్సవం కార్యక్రమంలో విస్తృతంగా మొక్కలు నాటేందుకు సంబంధిత శాఖల అధికారులు మొక్కలు సిద్ధం చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో వన మహోత్సవ మొక్కలను సిద్ధం చేయడంపై కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. జిల్లాలో వనమహోత్సవంలో భాగంగా ఈ సంవత్సరం 23 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. నిర్దేశిత లక్ష్యం మేరకు మొక్కలు నాటేందుకు గుంతలను తీసి సిద్ధంగా ఉంచాలని, వాటి సంరక్షణకు చేయాల్సిన ఏర్పాట్లను సంబంధిత శాఖల అధికారులు సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీఆర్డీఓ మేన శ్రీను, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కాజీపేట డిప్యూటీ కమిషనర్ రవీందర్, ఎంపీడీఓలు, ఎంపీఓలు పాల్గొన్నారు. ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 2025–26 విద్యా సంవత్సరం ప్రవేశానికి నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షకు నిరుద్యోగ, అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. ఈమేరకు సోమవారం కలెక్టరేట్లో దరఖాస్తుల కరపత్రాన్ని అధికారులతో కలెక్టర్ స్నేహ శబరీష్ ఆవిష్కరించారు. అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై, వార్షిక ఆదాయం రూ.3 లక్షలు మించకుండా ఉన్న వారు http://trrtudycirc e.co.in వెబ్ సైట్ ద్వారా జూలై 7 వరకు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవా లని కోరారు. జూలై 13న ఎంపిక పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా అర్హులైన అభ్యర్థులకు ప్రవేశం కల్పించి ఎస్సీ స్టడీ సర్కిల్ హైదరాబాద్లో సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షకు 10 నెలల పాటు ఉచిత వసతి భోజనంతో కూడిన శిక్షణ ఇవ్వనున్నట్లు తెలి పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, డీఆర్ఓ వై.వి.గణేశ్, ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, నారాయణ, డీఆర్డీఓ మేన శ్రీనివాస్, షెడ్యుల్డ్ కులా ల అభివృద్ధి సంస్థ అధికారి నిర్మల, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులతో సమీక్ష -
ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు
హన్మకొండ : విద్యుత్ ఉద్యోగుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ కార్యాలయంలో నిర్మించిన విద్యుత్ ఉద్యోగ అమరుల స్మృతి చిహ్నాన్ని సీఎండీ వరుణ్ రెడ్డి ఆవిష్కరించారు. సీ ఎండీతో పాటు డైరెక్టర్లు, అధికారులు, ఉద్యోగులు పూలమాల వేసి విద్యుత్ అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎండీ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యుత్ ప్రమాదకరమైనదని తెలిసి నిర్లక్ష్యంగా ఉంటూ ప్రాణాల మీదికి తెచ్చుకోవడం బా ధాకరమన్నారు. ఎల్సీ యాప్ను విధిగా వాడాలన్నారు. విద్యుత్ ఉద్యోగులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విధినిర్వహణలో విద్యుత్ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పుతున్న వారి జ్ఞాపకార్థం 16 సర్కిళ్లలో స్మృతి చిహ్నాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఈ క్రమంలో ముందుగా హనుమకొండ సర్కిల్లో నిర్మించామని తెలిపారు. ప్రతి ఏటా విద్యుత్ ఉద్యోగుల సంస్మరణ దినాన్ని నిర్వహించనున్నట్లు, మృతిచెందిన ఉద్యోగులకు అందాల్సిన ప్రయోజనాలన్ని 45 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్ ప్రమాదాలు జరుగకుండా క్షేత్రస్థాయి వరకు ఉద్యోగులచే ప్రతిజ్ఞ చేయించాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ డైరెక్టర్లు బి.అశోక్ కుమార్, టి.సదర్ లాల్, టి.మధుసూదన్, వి.తిరుపతి రెడ్డి, సీఈలు కె.తిరుమల్ రావు, రాజు చౌహన్, రవీంద్రనాధ్, హనుమకొండ ఎస్ఈ పి.మధుసూదన్ రావు, వరంగల్ ఎస్ఈ కె.గౌతమ్ రెడ్డి, డీఈలు ఎ.విజేందర్ రెడ్డి, జి.సాంబరెడ్డి, సామ్య నాయక్, దర్శన్ కుమార్, భిక్షపతి, ఆనందం, హర్జి, ఎస్ఏఓ నవీన్ కుమార్, ట్రేడ్ యూనియన్ నాయకులు ఇనుగాల శ్రీధర్, కె.వి.జాన్సన్, మన్నె శశి కుమార్, అజ్మీరా శ్రీరామ్ నాయక్, బి.దానయ్య, కుమార స్వామి పాల్గొన్నారు. సమస్యలపై సీఎండీ సానుకూల స్పందన విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై టీజీఎన్పీడీసీఎల్ చైర్మన్, ఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి సానుకూలంగా స్పందించారని తెలంగాణ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలువాల స్వామి, ఎన్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షుడు బొల్లి వెంకటరాజు, కార్యదర్శి ఎ.ఆంజనేయులు తెలిపారు. సోమవారం హనుమకొండలోని ప్రధాన కార్యాలయంలో వారు సీఎండీని కలిసి వినతిపత్రాన్ని అందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. తమ సమస్యలు విన్న సీఎండీ సానుకూలంగా స్పందించారని తెలిపారు. వచ్చే నెలలో విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిజన్ల బదిలీలు ఉంటాయని చెప్పారన్నారు. టీయూఈఈయూ నాయకులు శ్రీనివాస్, సుదర్శన్ వర్మ, సంతోష్, కర్నాల అనిల్ కుమార్, మధుసూదనరావు పాల్గొన్నారు. ఎల్సీ యాప్ను విధిగా వాడాలి టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి -
దరఖాస్తులు పెండింగ్ ఎందుకున్నాయి?
హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టరేట్లో వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ స్నేహ శబరీష్ సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజలు ఇచ్చిన వినతులను స్వీకరించిన ఆమె మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పారు. గ్రీవెన్స్ జరుగుతున్న క్రమంలో కొద్దిసేపు ఆపి అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత వారం వరకు శాఖల వారీగా ఎన్ని దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయో పరిశీలించి ఒక్కో అధికారిని వివరాలు అడిగారు. పెద్ద మొత్తంలో పెండింగ్లో ఉన్న శాఖల వారిని పిలిచి ‘మీ శాఖకు వచ్చిన దరఖాస్తులు ఎన్నో తెలుసా? ఎందుకు పెండింగ్లో ఉన్నాయి.. మీరేం చేస్తున్నారు?’ అని ప్రశ్నించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు త్వరగా పరిష్కరించాలని, ఇకపై పెండింగ్లో ఉంచితే సహించేది లేదని హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. ప్రజావాణిలో వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్.. సమస్యలపై సంబంధిత అధికారులను పిలిచి అడిగారు. కొన్ని మండలాలకు సంబంధించి తహసీల్దార్లు, ఎంపీడీఓలతో మాట్లాడాల్సిన అవసరం రావడంతో వెబ్ కాన్ఫరెన్స్లోకి తీసుకుని పలు సూచనలు చేశారు. వినతులు పరిశీలించి విచారణ చేపట్టి నాలుగు రోజుల్లోగా పరిష్కారం చూపాలని, పరిష్కారం కాకపోతే ఆ విషయం దరఖాస్తుదారుడికి తెలియజేయాలన్నారు. అలాగే సమస్య ఏ స్థాయిలో పరిష్కార దిశలో ఉంది? అనే విషయం ఆన్లైన్లో కనిపించేలా అప్డేట్ చేయాలని, ఏ అధికారి వద్ద ఫిర్యాదు ఆగిందో ఆ అధికారి పేరు తెలిసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. అధికారులను ప్రశ్నించిన హనుమకొండ కలెక్టర్ గ్రీవెన్స్లో వెబ్ కెమెరాలు చూస్తూ.. అర్జీలను పరిశీలించిన స్నేహ శబరీష్దారి చూపండి.. దరఖాస్తులకు ప్రాధాన్యం ఇవ్వండి వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: వ్యవసాయ పనులు చేసుకోవడానికి వెళ్లే దారిని కొంతమంది భూస్వాములు ఆక్రమించుకున్నారు. నక్షాలో ఎడ్లబండ్లు వెళ్లేందుకు దారి ఉంది. ఆ దారిని కొంత మంది వ్యక్తులు ఆక్రమించుకుని పొలాలకు చదును చేశారు.. వారిపై చర్యలు తీసుకుని పొలాలకు దారి చూపండి అంటూ.. రాయపర్తి మండల కేంద్రానికి చెందిన సుమారు 30 మంది రైతులు వరంగల్ కలెక్టర్ సత్యశారదను వేడుకున్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో వినతి పత్రాన్ని అందజేశారు. గ్రీవెన్స్లో కలెక్టర్తోపాటు అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రామ్రెడ్డి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, ఆర్డీఓలు సత్యపాల్రెడ్డి, ఉమారాణి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈకార్యక్రమంలో జిల్లా అధికారులు నీరజ, విశ్వప్రసాద్, జ్ఞానేశ్వర్, అనసూయ, పుష్పలత, తహసీల్దార్లు ఇక్బాల్, నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
నిట్లో జీయాన్ వర్క్షాప్ షురూ
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్లోని సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జీయాన్ (గ్లోబల్ ఇన్షియేటివ్ ఆఫ్ అకడమిక్ నెట్వర్క్) ఐదు రోజుల వర్క్షాప్ సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ‘రిపేర్ అండ్ రీమాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ పార్ట్స్ యూసింగ్ డైరెక్ట్ ఎనర్జీ డీపొజిషన్, అడిటివ్ మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ సస్టేనబుల్ ట్రాన్స్పోర్ట్ ఎట్ నిట్’ అంశాలపై ఏర్పాటు చేసిన ఐదు రోజుల వర్క్షాప్నకు ముఖ్య అతిథులుగా యూఎస్ఏలోని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరీడా ప్రొఫెసర్ నవీన్ఏలూరు, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ ఆస్టీన్ ప్రొఫెసర్ డేవిడ్ బోరెల్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వర్క్షాప్ ప్రారంభించి సావనీర్ను విడుదల చేశారు. కార్యక్రమంలో జీయాన్ కో–ఆర్డినేటర్, ప్రొఫెసర్ శ్రీనివాసరావు, సివిల్, మెకానికల్ హెడ్స్ రవికుమార్, శంకర్, రఘురాం, ఏపీ, తెలంగాణ, కర్నాటక, పాండిచ్చేరి వివిధ విద్యా సంస్థల నుంచి 60 మంది పీజీ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. -
శ్యాంప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళి
హన్మకొండ: శ్యాంప్రసాద్ ముఖర్జీకి బీజేపీ నాయకులు ఘనంగా నివా ళులర్పించారు. ఆయన వర్థంతిని పురస్కరించుకొని హనుమకొండ దీన్దయాళ్నగర్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం బలిదాన్ దివస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖర్జీ చిత్రపటానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మార్తినేని ధర్మారావు, నాయకులు పూలమాలలు వేసి నివాళు లర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడు తూ.. దేశం కోసం పదవులను తృణప్రాయంగా త్యజించిన జాతీయవాది, అఖండ భారత్ కోసం ప్రాణాలు వదిలిన భరతమాత ముద్దుబిడ్డ, జన సంఘ్ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు. ‘ఏక్ దేశ్ మే దో నిశాన్, దో విధాన్, దో ప్రధాన్ నహి చలేంగే, నహీ చలేంగే’ అంటూ జమ్మూ కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు కోసం పోరాడుతూ.. అసువులు బాసిన త్యాగశీలి అని పేర్కొన్నారు. కార్యక్రమం తర్వాత నాయకులు పార్టీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. బీజేపీ నాయకులు దొంతి దేవేందర్రెడ్డి, రావు అమరేందర్రెడ్డి, చాడ శ్రీనివాస్రెడ్డి, గుజ్జ సత్యనారా యణరావు, మాలోతు నాను నాయక్, ఆకుల శ్రీకాంత్ పటేల్, నర్మెట్ట శ్రీనివాస్ రావు గౌడ్, రత్నలక్ష్మి, సండ్ర మధు, చల్ల జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వీసీని కలిసిన కేయూ ఎన్జీఓ నూతన కార్యవర్గం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ ఎన్జీఓ ఎంప్లాయీస్ అసోసియేషన్కు ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో విజయం సాధించిన ఆ అసోసియేషన్ నూతన కార్యవర్గం అధ్యక్షుడు బి.నవీన్కుమార్, జనరల్ సెక్రటరీ వల్లాల తిరుపతి, ఇతర బాధ్యులు సోమవారం మర్యాదపూర్వకంగా వీసీ ఆచార్య కె.ప్రతాప్రెడ్డిని కలిశారు. ఈసందర్భంగా ఎన్జీఓ కేడర్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వీసీ దృష్టికి తీసుకెళ్లారు. వీసీని కలిసిన వారిలో ఎన్జీఓ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మహ్మద్ యూనస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎ.సతీశ్బాబు, రిక్రియేషన్ సెక్రటరీ తోట ప్రభాకర్, కోశాధికారి తాటి దామోదర్, మహిళా సెక్రటరీ బి.కృష్ణవేణి ఉన్నారు. -
ప్రజా ఫిర్యాదులపై శ్రద్ధ పెట్టండి
● నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు ● బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ వరంగల్ అర్బన్ : ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులు శ్రద్ధ వహించాలి.. నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ హెచ్చరించారు. సోమవారం గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో కమిషనర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 133 అర్జీలు రాగా.. అందులో టౌన్ ప్లానింగ్ 68, ఇంజనీరింగ్ 41, హెల్త్–శానిటేషన్ 12, ప్రాపర్టీ టాక్స్(రెవెన్యూ)9, మంచినీటి సరఫరా 3 ఉన్నాయి. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన వినతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పెండింగ్లో ఉండకుండా చూడాలని ఆయా విభాగాల అధికారులకు సూచించారు. సిటిజన్ చార్టర్ ప్రకారం సకాలంలో సమస్యలు పరిష్కరించాలని చెప్పారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో ప్రస్తుతం కొనసాగుతున్న, చేపట్టబోయే అభివృద్ధి పనులను నాణ్యతగా జరిగేలా ఇంజనీరింగ్ అధికారులు నిత్యం పర్యవేక్షించాలని ఆదేశించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం నిబంధనల మేరకు అంతర్గత రోడ్లు నిర్మించాలని, రోడ్ల నిర్మాణానికి ముందు తప్పకుండా మురుగు కాల్వలు నిర్మాణం చేపట్టాలని పేర్కొన్నారు. బల్దియా ఆధ్వర్యాన నిర్వహించే ఉద్యానవనాల్లో పచ్చదనం, లైటింగ్, ఆట వస్తువుల నిర్వహణ సక్రమంగా ఉండాలని, అవసరం మేరకు మరమ్మతులు చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ జోనా, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, డీఎఫ్ఓ శంకర్లింగం, ఇన్చార్జ్ ఎస్ఈ మహేందర్, సిటీ ప్లానర్ రవీందర్, రాడేకర్, హెచ్ఓలు రమేశ్, లక్ష్మారెడ్డి, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, రాజేశ్వర్, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, టీఓ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఓపెన్ స్కూల్.. ఓ వరం
విద్యారణ్యపురి : ఆర్థిక పరిస్థితులు, కుటుంబ కారణాల వల్ల పాఠశాల స్థాయిలోనే కొందరు చదువును మధ్యలో మానేస్తున్నారు. మరికొందరు పదోతరగతి పూర్తయ్యాక ఇంటర్ చదువును కొనసాగించలేక పోతున్నారు. చదువుకోవాల్సిన వయస్సులోనే ఆడపిల్లలకు పెళ్లిలు చేయడంతో చదువుకోనే అవకాశం లేదు. ఇలాంటి వారికి తెలంగాణ రాష్ట్ర ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ద్వారా మళ్లీ చదివేందుకు అవకాశం కల్పిస్తోంది. ఇది ఓ రకంగా చదువును మధ్యలో మానేసిన వారికి వరం లాంటిదంటే అతిశయోక్తి కాదు. సార్వత్రిక విద్యను దూరవిద్య విధానంలో అందిస్తోంది. ఓపెన్ స్కూల్ విధానంలో టెన్త్, ఇంటర్లో ప్రవేశాలకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో హనుమకొండ, వరంగల్, ములుగు, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొత్తంగా 117 అధ్యయన కేంద్రాలు (ప్రభుత్వ, జిల్లా పరిషత్ హైస్కూల్స్, ప్రభుత్వ జూనియర్ కాలేజీలు)ఉన్నాయి. 2008–09 విద్యా సంవత్సరం నుంచి ఓపెన్ స్కూల్ విధానంలో పదోతరగతిలో ప్రవేశాలు కల్పిస్తున్నారు. 2010–11 నుంచి ఇంటర్లో ప్రవేశాలు అందుబాటులోకి వచ్చాయి. ఆగస్టు12వరకు అడ్మిషన్లు.. గతంలో ప్రతి ఏటా జూలై–ఆగస్టులో ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్లో ప్రవేశాలు కల్పించే ప్రక్రియ ప్రా రంభమయ్యేది. ఈసారి అలా కాకుండా రెగ్యులర్ విధానం వల్లే ఈ విద్యాసంవత్సరం 2025–26లో ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్లో ప్రవేశాల ప్రక్రియ ను అధికారులు ప్రారంభించి ఆగస్టు 12వ తేదీవరకు అడ్మిషన్లు కల్పిస్తారు. ఆన్లైన్లో సంబంధిత వెబ్సైట్ ద్వారా మీసేవా సెంటర్లలోనే ఫీజు చెల్లించి అధ్యయన కేంద్రాల్లో అడ్మిషన్లు పొందవచ్చు. అక్షరాస్యత శాతం పెంచేందుకు.. ఓపెన్ స్కూల్ విధానంలో టెన్త్, ఇంటర్లో అడ్మిషన్ల ప్రక్రియకు అర్హులైన అభ్యాసకులు దరఖాస్తు చేసుకుంటారు. రాష్ట్రంలో అక్షరాస్యతను పెంచేందుకు ఉల్లాస్ (అండర్ స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ) ప్రాజెక్టు ద్వారా ఓపెన్ స్కూల్లో ప్రవేశాలకు అర్హులైన వారిని కూడా సంబంధిత అధికారులు గుర్తిస్తున్నారు. ఉల్లాస్ ప్రాజెక్టు ఆఫీసర్, డీడీలను, సెర్ప్, మెప్మా, సెల్ప్ హెల్ప్ గ్రూప్స్, వీఓ, సీఆర్పీలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు, ఎంఈఓలు, ఏఐ కోఆర్డినేటర్ల సహాయంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో టెన్త్, ఇంటర్మీడియట్ చదివేందుకు అర్హులైన వారిని గుర్తిస్తున్నారు. టాస్లో అడ్మిషన్లు కల్పించేందుకు సర్వే ప్రక్రియ సైతం మొదలెట్టారు. అలా ఇప్పటి వరకు టెన్త్కు 1,581మందిని, ఇంటర్లో 1,952 మందిని గుర్తించారు. అడ్మిషన్లు పొందిన వారు ఎంపిక చేసుకున్న అధ్యయన కేంద్రాల్లో తరగతులకు హాజరు కావాల్సింటుంది. పాఠ్యపుస్తకాలు అందజేస్తారు. అలాగే ప్రతి రెండో శనివారం, ఆదివారం తరగతులు నిర్వహిస్తారు. ఉమ్మడి జిల్లాకు అడ్మిషన్ల టార్గెట్ 11,616 ఈ విద్యాసంవత్సరంలో ఓపెన్ స్కూల్ విధానంలో టెన్త్, ఇంటర్లో ప్రవేశాలకు 11,616 మంది అడ్మిషన్లను నిర్దేశించారు. గతేడాది టెన్త్, ఇంటర్లో 6,849 మంది అడ్మిషన్లు పొందారు. అందులో టెన్త్లో 2,401మంది, ఇంటర్లో 4,448 మంది ఉన్నారు. చదువు మానేసిన వారికి సువర్ణావకాశం ఈసారి ముందస్తుగానే టెన్త్, ఇంటర్లో ప్రవేశాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 117 అధ్యయన కేంద్రాలుదరఖాస్తులు ఇలా.. ఓపెన్ స్కూల్ టెన్త్లో ప్రవేశాలకు ఎలాంటి విద్యార్హత అవసరం లేదు. కనీస వయస్సు 15ఏళ్లు నిండి ఉండాలి. ఆపై వయస్సుగలవారు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చును. గరిష్ట వయోపరిమితి లేదు. తెలుగు, ఉర్దూ, ఆంగ్లం, హిందీ మీడియంలో ఏదైనా ఒక మాధ్యమాన్ని ఎంపిక చేసుకోవచ్చు. తహసీల్దార్ లేదా మున్సిపల్ నుంచి జారీ చేసిన బర్త్ సర్టిఫికెట్ ఉంటే సరిపోతుంది. పాఠశాల స్థాయిలో చదువు మానేస్తే ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (టీసీ), ఆధార్ కార్డుతో ప్రవేశం పొందవచ్చు. ఇంటర్లో ప్రవేశాలకు తప్పనిసరిగా పదో తరగతి పాస్ కావాల్సి ఉంటుంది. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఆగస్టు 12వతేదీ వరకు అడ్మిషన్లు పొందాలి. పదోతరగతిలో ప్రవేశాలకు ఫీజు ఓసీ అభ్యాసకులకు రూ.1,550, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రూ.1,150 చెల్లించాలి. ఇంటర్లో అడ్మిషన్లకు ఓసీలకు రూ.1,800, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యాసకులు రూ.1,500లు చెల్లించాల్సి ఉంటుంది. టీజీ ఆన్లైన్లో మీసేవా కేంద్రాల ద్వారా లేదా ఏపీ ఆన్లైన్ ద్వారా ఫీజులు చెల్లించి తమకు సమీపంలోని ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రాల్లో దరఖాస్తులు సమర్పించి అడ్మిషన్లు తీసుకోవాలి.రెగ్యులర్ విద్యతో సమానం.. ఓపెన్ స్కూల్లో టెన్త్, ఇంటర్ను పూర్తి చేసిన వారికి రెగ్యులర్ చదువుతో సమానమైన గుర్తింపు ఉంటుంది. ఆగస్టు 12వరకు అడ్మిషన్లు కొనసాగుతాయి. ఓపెన్ స్కూల్ టెన్త్ పూర్తి చేసిన వారు ఆపై విద్యకు, ఇంటర్ పూర్తిచేసిన వారు ఉన్నత విద్యకు కూడా అర్హులే. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ తెలంగాణ ఓపెన్ స్కూల్. ఓఆర్జీ వెబ్సైట్లో కూడా పూర్తి వివరాలు లభిస్తాయి. ఉల్లాస్ ప్రాజెక్టు ద్వారా అర్హులైన వారిని గుర్తిస్తున్నాం. వారిని కూడా అడ్మిసన్లకు ప్రోత్సహించే ప్రక్రియ చేపట్టాం. ఆసక్తి గల వారికి ఇది ఒక అవకాశంగా భావించాలి – అనగోని సదానందం, ఓపెన్ స్కూల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ -
నిబంధనల మేరకే ఎంటీపీ కిట్ వినియోగించాలి
ఎంజీఎం: గైనకాలజిస్టుల పర్యవేక్షణలో, చట్టంలో సూచించిన గైడ్లైన్స్ ప్రకారమే ఎంటీపీ కిట్ విని యోగించాలని డీఎంహెచ్ఓ అప్పయ్య సూచించా రు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్లోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ గైనకాలజిస్ట్ అసోసియేషన్, ఔషధ నియంత్రణ విభాగం, ఆర్ఎంపీ అసోసియేషన్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ బాధ్యులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ.. మెడికల్ షాపుల యజమానులు డాక్టర్ ప్రిస్క్రిప్షన్లు లేకుండా అమ్మకూడదని, అలాగే ఎవరికి అమ్ముతున్నారో వారి వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. ఇప్పటికే ఈ విషయంలో డ్రగ్ ఇన్స్పెక్టర్కు సర్క్యూలర్ జారీ చేసినట్లు తెలి పారు. డీఎంహెచ్ఓ ద్వారా అనుమతి పొందిన హాస్పిటల్స్ మాత్రమే ఎంటీపీ నిర్వహించాలని ఆదేశించారు. సొంతంగా ఎంటీపీ కిట్ వినియోగం వల్ల వచ్చే అనర్థాల గురించి క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా అవగాహన కలిగించనున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి గౌత మ్ చౌహన్, గైనకాలజిస్టుల సంఘం అధ్యక్షురాలు డాక్టర్ శ్రీలక్ష్మి, ఐఎంఏ ఉపాధ్యక్షుడు నరేశ్కుమార్, మాతా శిశు సంక్షేమం ప్రోగ్రాం అధికారి మంజుల, ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల అసోసియేట్ ప్రొఫెసర్ ప్రసన్నలక్ష్మి, కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్,జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్రెడ్డి, స్టాటిస్టికల్ అధికారి ప్రసన్నకుమార్, ఔషధ నియంత్రణ విభాగం సూపరింటెండెంట్ సత్యనారాయణ, ఆర్ఎంపీ అసోసియేషన్ కార్యదర్శి రమేశ్, మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి టి.సుమలత, రాజేశ్వర్రెడ్డి సుప్రియ పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ అప్పయ్య -
క్లైమాక్స్కు ‘దత్తత దందా’
సాక్షి, వరంగల్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దత్తతలో నకిలీ సర్టిఫికెట్ల దందా’ విచారణ క్లైమాక్స్కు చేరుకుంది. ఇటు పోలీసులు, అటు అధికారులు వేర్వేరుగా చేసిన విచారణ నివేదికల ఆధారంగా కలెక్టర్ సత్యశారద ఆదేశాలకు అనుగుణంగా బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశముంది. ఇప్పటికే గతంలో నకిలీ విద్యార్హత సర్టిఫికెట్లతో జిల్లా సంక్షేమ విభాగంలోని వీహబ్లో ఉద్యోగం పొంది ఏడాదికిపైగా విధులు నిర్వర్తించిన సిక్కుల సుజాతపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లుగానే దత్తత వ్యవహారంలో నకిలీ బర్త్ సర్టిఫికెట్లతో సంబంధమున్న సిబ్బందిపై కూడా చట్టపరమైన చర్యలకు అవకాశముంది. ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు అధికారే, కొన్ని నెలల క్రితం ఓ దత్తత విషయంలో నిబంధనలు అతిక్రమించి మెమో అందుకున్నా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ ‘మంత్రి’ దగ్గరికి వెళ్లి జిల్లా పాలనాధికారిపై ఒత్తిడి తెచ్చి ఉద్యోగం పోకుండా చూసుకున్నారనే ప్రచారం ఉంది. ఈసారి కూడా నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం తన మెడకు చుట్టుకుంటుందనే ఉద్దేశంతో మరోమారు సదరు మంత్రితోపాటు ఓ ఎమ్మెల్యే నుంచి కలెక్టర్పై ఒత్తిడి తెచ్చి ఈ విచారణను నీరుగార్చేలా చేశారనే టాక్ ఉంది. ఈ కేసు విషయంలో కలెక్టర్ సత్యశారద పారదర్శక విచారణ నివేదిక తెప్పించుకుంటున్నా.. ఆలోపే బ్రేక్ వేయాలనుకుంటుండడం గమనార్హం. నకిలీ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారంలో కలెక్టర్ ఏ నిర్ణయం తీసుకుంటున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ దందాలో 8 మందిని పోలీసులు విచారించారు. అసలే పాఠశాల లేని, అది కూడా నర్సంపేట కేంద్రంగా నకిలీ సర్టిఫికెట్లు రూపొందించడంతో విస్మయం చెందారు. డాటా ఎంట్రీ ఆపరేటర్ ఈమెయిల్ ఇవ్వడంపై అనుమానాలు.. నకిలీ సర్టిఫికెట్ల దందాపై రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ విభాగం డైరెక్టరేట్ కార్యాలయం నుంచి విచారణ చేసి వెంటనే నివేదిక సమర్పించాలని వచ్చిన సంబంధిత విభాగాధికారులు పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కారా నిబంధనల ప్రకారం దత్తత కోరుకునే దంపతుల దరఖాస్తు సమయంలో వారి ఈమెయిల్ ఐడీ ఇవ్వాలి. లేదంటే ఆఫీస్ మెయిల్ ఐడీ కూడా ఇవ్వొచ్చు. అయితే వీరు మాత్రం పాప రావడానికి ఎంత వరుసలో ఉన్నాం, ఇంకెంత మంది ముందున్నారు, పాప రెఫరల్ వచ్చే సమాచారం కోసం సదరు అధికారితోపాటు అప్పుడు ఈ విభాగంలో పనిచేసే ఓ డాటా ఎంట్రీ ఆపరేటర్ వ్యక్తిగత ‘ఈ–మెయిల్స్’ ఇవ్వడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. కారా నుంచి వచ్చే సమాచారం తమ మెయిల్కు రాగానే మీకు పాప మరో వారం రోజల్లో వస్తుంది, మాకేం చేస్తారనే మాటమంతీ జరిగి ఉండొచ్చని విచారణ చేసిన పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. అలాగే, విచారణ జరుగుతుండగానే బాలరక్షా భవన్లో పనిచేస్తున్న నర్సంపేటకు చెందిన ఓ వ్యక్తి ఉద్యోగానికి రాజీనామా చేశారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు అతడి పాత్రపై కూడా ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఎందుకంటే ఏడు నకిలీ సర్టిఫికెట్లు నర్సంపేట నుంచి రావడంతో పోలీసులకు మరిన్ని అనుమానాలు బలపడేలా చేసింది. గతంలోనే చైల్డ్ హెల్ప్లైన్లో నకిలీ అనుభవ సర్టిఫికెట్ ఇచ్చి అర్హత జాబితాలో ఎక్కడో మూలకు ఉన్నా కూడా అక్కడి అధికారుల అండదండలతో ఉద్యోగం పొందారన్న ఆరోపణలున్నాయి. త్వరలో కలెక్టర్కు నివేదిక.. దత్తత దందాపై జిల్లా రెవెన్యూ అధికారి నివేదిక మేరకు కలెక్టర్ చర్యలు తీసుకుంటారు. ఈ నివేదిక ఒకట్రెండు రోజుల్లో కలెక్టర్ వద్దకు చేరుతుంది. అలాగే, బాలరక్షాభవన్లో చైల్డ్ హెల్ప్లైన్ విభాగంలో పనిచేసే ఓ ఉద్యోగి రాజీనామా అంశాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాకే తదుపరి నిర్ణయం ఉంటుంది. – రాజమణి, వరంగల్ జిల్లా సంక్షేమ విభాగాధికారి 8 మందిని విచారించిన వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు అసలు లేని పాఠశాల నుంచి నకిలీ బర్త్ సర్టిఫికెట్లపై విస్మయం ఓవైపు విచారణ.. మరోవైపు ఓ ఉద్యోగి రాజీనామాతో అనుమానాలు -
సోమవారం శ్రీ 23 శ్రీ జూన్ శ్రీ 2025
– 8లోuసాక్షిప్రతినిధి, వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ)లో ఇంజనీరింగ్ విభా గం కొందరు అధికారులు, కాంట్రాక్టర్లకు కల్పతరువుగా మారింది. సాధారణంగా ప్రభుత్వ ఖజానాకు మేలు జరిగేలా పోటీ పద్ధతిన తక్కువ కోట్ చేసి టెండర్లు వేసేలా చూడాల్సిన అధికారులు, కాంట్రాక్టర్లను సిండికేట్ చేసి ఎక్సెస్ కోట్ చేసి టెండర్లు వేయిస్తున్నారు. ఈ–ప్రొక్యూర్మెంట్ టెండర్లలోనూ చక్రం తిప్పుతూ తమకు అనుకూలమైన వారికి పనులు దక్కేలా చూస్తున్నారు. సిండికేట్గా మారిన కాంట్రాక్టర్లు పనులు పంచుకుని ప్లాన్ ప్రకారం టెండర్లు వేస్తుండగా.. కీలక ప్రజాప్రతినిధి, కొందరు కార్పొరేటర్ల సిఫారసుల మేరకు ఆ పనులు దక్కేలా అధికారులు పావులు కదుపుతున్నారు. తప్పిదారి ఇతరులెవరైనా టెండర్లు వేస్తే.. టెండర్లు తెరిచింది మొదలు అగ్రిమెంట్ వరకు చుక్కలు చూపిస్తూ తప్పుకునేలా చేస్తున్నారు. ఇదే పద్ధతిన ఆరు నెలల్లో సుమారు రూ.210 కోట్లకు పైగా విలువ చేసే పనుల టెండర్ల ఖరారు జరిగిందని ఇటీవల విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ డీజీ కార్యాలయానికి ఫిర్యాదులు వెళ్లడం చర్చనీయాంశం అవుతోంది. పనుల వివరాలపై అంతా గోప్యం.. జీడబ్ల్యూఎంసీ పరిధిలో వివిధ గ్రాంట్ల కింద అభివృద్ధి పనులకు ఈ–ప్రొక్యూర్మెంట్ టెండర్లు పిలుస్తున్నారు. ఆరు నెలల వ్యవధిలో సుమారు రూ.210 కోట్ల విలువైన పనులకు టెండర్లు ఖరారైనట్లు బల్దియాకు చెందిన ఓ అధికారి తెలిపారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు సుమారు రూ.68 కోట్ల విలువైన 75 పనులకు టెండర్లు పిలిచారు. ఏప్రిల్ 5 నుంచి 12 వరకు రూ.28 కోట్లతో 32 పనులకు టెండర్లు జరిగాయి. మే 27 నుంచి ఈనెల 11 వరకు సుమారు రూ.12.15 కోట్ల విలువైన 12 పనులకు బల్దియా ఇంజనీరింగ్ విభాగం టెండర్లు నిర్వహించింది. ఇంకా ఆ ప్రక్రియ కొనసాగుతుండగా.. ఈ–ప్రొక్యూర్మెంట్ టెండర్లే అయినప్పటికీ కమీషన్లకు కక్కుర్తిపడి కొందరు అధికారులు కాంట్రాక్టర్లకు సాంకేతికంగా సహకరిస్తున్నారన్న ఫిర్యాదులున్నాయి. కాగా ఈ–ప్రొక్యూర్మెంట్ టెండర్ ఖరారు, పనులు పొందిన కాంట్రాక్టర్, తిరస్కరణకు గురైన కాంట్రాక్టర్ల వివరాలు, పనుల నిర్వహణ, బిల్లుల చెల్లింపులకు సంబంధించిన సమాచారం విషయంలో గోప్యతను పాటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇవే అంశాలను విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్కు చేసిన ఫిర్యాదులో పేర్కొనడం బల్దియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. న్యూస్రీల్ప్రతీ పనికి ఓ రేటు.. భారీగా కమీషన్కొందరు ఇంజనీర్లు ప్రతీ పనికి ఓ రేటును నిర్ణయిస్తుండగా.. ఆ మేరకు కొందరు కాంట్రాక్టర్లు చెల్లించి ఏ పనులైనా టెండర్ల ద్వారా దక్కించుకుంటున్నారన్న ఫిర్యాదులున్నాయి. ఇది రెండు రకాలుగా సాగుతుండగా.. మిగిలిన కాంట్రాక్టర్లందరినీ పక్కనపెట్టి మంచి ధరకు కాంట్రాక్టును అప్పగిస్తే సదరు ఇంజనీర్కు 10–20 శాతం, అందరితో పోటీపడి టెండరు దక్కించుకుంటే వేర్వేరు స్థాయిల్లోని ఇంజనీర్లు, ఆడిట్ అధికారులకు వేర్వేరు శాతాల్లో కమీషన్లు ముట్టజెప్పుతున్నారట. సహాయ ఇంజనీరుకు 3–4, డిప్యూటీ ఈఈకి 2–3, ఈఈకి 1–3, హెచ్డీకి 0.5, డీఓ(డ్రాఫ్టింగ్ ఆఫీసర్) 0.5, ఆడిట్లో 2, చెక్ సెక్షన్లో 2–4, ఎగ్జామినర్కు 1–2 శాతం కమీషన్ ఇవ్వాల్సి ఉంటుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. వీరంతా కలిసి కొంత మొత్తాన్ని ప్రతినెలా ఉన్నతాధికారులకు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందని అంటున్నారు. కాగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో వివిధ విభాగాల్లో కొందరు ఏళ్ల తరబడిగా తిష్టవేసి అక్రమాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న తీరుపై ఇదివరకే ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం. ఏది ఏమైనా ఉన్నతాధికారులు ఏ మేరకు స్పందిస్తారనేది వేచి చూడాల్సిందే. ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్ల కుమ్మక్కు..! ఈ–ప్రొక్యూర్మెంట్ టెండర్లలో ‘సిండికేట్’ అభివృద్ధి పనులకు రాజకీయ రంగు అనుకున్నోళ్లకే పనులు వచ్చేలా సిఫారసులు జీడబ్ల్యూఎంసీ వ్యవహారంపై ‘విజిలెన్స్’కు ఫిర్యాదులు -
ఉత్సాహంగా ఒలింపిక్ డే రన్
వరంగల్ స్పోర్ట్స్: అంతర్జాతీయ ఒలింపిక్ డే ను పురస్కరించుకొని వరంగల్ ఒలింపిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఆదివారం నిర్వహించిన రన్లో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. హనుమకొండ నక్కలగుట్టలోని కాళోజీ విగ్రహం వద్ద అసోసియేషన్ జిల్లా చైర్మన్ జంగా రాఘవరెడ్డి జెండా ఊపి రన్ను ప్రారంభించారు. ఒలింపిక్ టార్చ్తో కాళోజీ విగ్రహం నుంచి అంబేడ్కర్ విగ్రహం మీదుగా జవహర్లాల్ నెహ్రూ స్టేడియానికి చేరుకున్నారు. ఈసందర్భంగా నిర్వహించిన ముగింపు స మావేశంలో జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ తల్లి దండ్రులు తమ పిల్లలకు ఆస్తులకు బదులు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేందుకు క్రీడల్లో భాగస్వాములను చేయాలని సూచించారు. విద్యార్థి దశ నుంచి క్రీడలపై ఆసక్తి పెంచాలని, దురదృష్టవశాత్తు అత్యధిక శాతం పాఠశాలలు, కళాశాలలకు కనీస మైదానాలు లేకపోవడం శోచనీయమన్నారు. మైదానాలున్న విద్యాసంస్థలకు మాత్రమే అనుమతిస్తూ వ్యాయామ ఉపాధ్యాయులను తప్పనిసరి నియమించుకునేలా ఆదేశాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరనున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం క్రీడా రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని, స్వతహాగా క్రీడాకారుడైన సీఎం నేతృత్వంలో క్రీడలకు పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో హనుమకొండ జిల్లా క్రీడలు, యువజన అధికారి గుగులోత్ అశోక్కుమార్, వరంగల్ ఒలింపిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎండీ.అజీజ్ ఖాన్, మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, వివిధ క్రీడా సంఘాల బాధ్యులు బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి, శ్యామల పవన్కుమార్, డాక్టర్ పి.రమేశ్రెడ్డి, తోట శ్యాంప్రసాద్, మహ్మద్ కరీం, రామప్ప అకాడమీ చైర్మన్ చంద్రమోహన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
భద్రకాళి అమ్మవారికి రూ.కోటితో రథం
హన్మకొండ కల్చరల్ : కంచి కామాక్షి అమ్మవారి రథం మాదిరిగా శ్రీభద్రకాళి అమ్మవారికి రూ.కోటి వ్యయంతో రథం తయారు చేయించడానికి ఆలయ ధర్మకర్తల మండలి తీర్మానించింది. ఈనెల 26 నుంచి ప్రారంభమయ్యే శాకంబరీ ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించేందుకు ఆదివారం దేవాలయ కార్యాలయంలో వ్యవస్థాపక ధర్మకర్త డాక్టర్ బండారు శివసుబ్రహ్మణ్యం అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. ఆలయ ఈఓ శేషుభారతి, ధర్మకర్తలు, ఆలయ ప్రధానార్చకులు శేషు పాల్గొన్నారు. అమ్మవారి గుడి చుట్టూ మాడవీధుల నిర్మాణం జరుగుతున్నందున ఇకపై అమ్మవారికి నిర్వహించే వాహన, రథసేవలు మాడవీధుల గుండానే చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ఆగమశాస్త్రం ప్రకారం టేకు కర్రతో రథం తయారు చేయించడానికి మండలి తీర్మానించారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అనుమతికి కృషి చేయాలని మంత్రి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డిని ధర్మకర్తల మండలి సభ్యులు కోరారు. నిత్యం ఉదయం, సాయంత్రం, రాత్రి మహాపూజ అనంతరం భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేయాలని, ఇందుకు శాశ్వత నిధిని బ్యాంకులో ఏర్పాటు చేయడానికి దాతలు విరాళం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో అర్చకులు భద్రకాళి శేషు, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, గదె శ్రవణ్కుమార్ రెడ్డి, ఓరుగంటి పూర్ణచందర్, తొగరు క్రాంతి, బింగి సతీష్, మోతుకూరి మయూరి, గండ్ల స్రవంతి, నార్ల సుగుణ, పాలడుగుల అంజనేయులు, జారతి వెంకటేశ్వర్లు, అనంతుల శ్రీనివాస్రావు, పార్నంది నరసింహమూర్తి పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్తల మండలి తీర్మానం 26 నుంచి శాకంబరీ ఉత్సవాలపై సమావేశం -
మేడం.. ఏదో ఒకటి తేల్చండి..!
సాక్షిప్రతినిధి, వరంగల్: మంత్రి కొండా సురేఖ దంపతులు వర్సెస్ ఎమ్మెల్యేల వివాదం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరా జన్ పేషీకి చేరింది. ఇటీవల మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీ వ్యాఖ్యలను.. వారి వ్యతిరేక వర్గం ప్రజాప్రతినిధులు మీనాక్షి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్.నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి తదితరుల బృందం ఆదివారం హైదరాబాద్లో నటరాజన్ను కలిశారు. ‘మంత్రి కొండా సురేఖ దంపతుల వ్యాఖ్యలు పార్టీని, నాయకులను ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. వారి వైఖరి, వ్యాఖ్యలతో ప్రజల్లో పలుచబడి పోతున్నాం.. ఇక భరించలేం.. మేడం.. మీరు ఏదో ఒకటి తేల్చండి.. పార్టీ ప్రయోజ నాలను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకోండి’ అని లిఖితపూర్వకంగా ఫిర్యా దు చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై బహిరంగంగా కామెంట్లు చేయడం, సీనియర్లని చూడకుండా పరుషపదజాలాన్ని వాడటం పార్టీ ఇమేజ్ను దిగజార్చేలా ఉందని వివరించారు. ఫిర్యాదులను స్వీకరించిన మీనాక్షి నటరాజన్.. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటామని, అన్ని కోణాల్లో పార్టీ పరంగా విచారించేందుకు త్వరలోనే కమిటీ వేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానని కూడా చెప్పినట్లు సమాచారం. అక్కడి నుంచి వరంగల్ కాంగ్రెస్ నాయకులు పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవిని కలిసి కొండా దంపతులపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గత ఐదారు రోజులుగా వరంగల్లో జరుగుతున్న కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలు, కొండా దంపతుల వ్యాఖ్యలు, వైఖరిని ఆయనకు వివరించినట్లు తెలిసింది. సానుకూలంగా స్పందించిన మల్లు రవి పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో వారు వెనుదిరిగినట్లు సమాచారం. కాగా కొండా దంపతులపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఇద్దరు లేదా ఐదుగురు సీనియర్లతో నేడో, రేపో కమిటీ వేసి విచారణ చేపట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఆ ఇద్దరి వ్యాఖ్యలతో ప్రజల్లో పలుచబడుతున్నాం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్తో కొండా సురేఖ వ్యతిరేక ప్రజాప్రతినిధులు హైదరాబాద్లో మీనాక్షి, మల్లు రవిని కలిసిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు కమిటీ వేసి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ.. నేడో, రేపో అధికారిక ప్రకటన.. -
ఉపాధ్యాయుల సర్దుబాటు నిబంధనలు సడలించాలి
● టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సోమశేఖర్ విద్యారణ్యపురి: టీచర్ల సర్దుబాటు నిబంధనలను సడలించడంతోపాటు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించి పీఆర్సీని ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్యూటీఎఫ్) రాష్ట్ర కార్యదర్శి సోమశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండలోని యూనియన్ వరంగల్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాథమిక పాఠశాలల్లో ప్రతీ తరగతికి ఒక టీచర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు, పూర్వప్రాథమిక తరగతులు ప్రారంభించి ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలిగించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని, అసంబద్ధంగా ఉన్న గురుకులాల పనివేళలను సవరించాలని పే ర్కొన్నారు. సమావేశంలో యూనియన్ బాధ్యులు తాటికాయల కుమార్, సుజనప్రసాద్రావు, ఎస్ఏ.రవూఫ్, పాక శ్రీనివాస్, నామోజు శ్రీనివాస్, విజయ్, కె.రమేశ్, గుండు కరుణాకర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నేడు గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్వరంగల్ అర్బన్ : వరంగల్ మహా నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అదనపు కమిషనర్ జోనా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రాతపూర్వకంగా దరఖాస్తులు స్వీకరిస్తామని, నగరవాసులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పచ్చని ప్రకృతిని రక్షించాలి● జిల్లా సంక్షేమ అధికారి జయంతి కేయూ క్యాంపస్ : పచ్చని ప్రకృతిని రక్షించాలని జిల్లా సంక్షేమ అఽధికారి జయంతి అన్నా రు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్విని యోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంవారోత్సవాల్లో భాగంగా ఆదివారం హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్కాలేజీ మైదానంలో మొక్కలు నాటిన అనంతరం ఆమె మాట్లాడారు. యువత మాదక ద్రవ్యాలకు, వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. టీజీ ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ డ్రగ్స్ విషయంలో యువతలో సరైన అవగాహన పెరగాలని చెప్పారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్, ఎకై ్సజ్ సీఐ తిరుపతి, ఎన్సీసీ లెఫ్ట్నెంట్ స్వామి, అధ్యాపకురాలు నహేదా, నర్సింగ్ ఆఫీసర్ అరుణకుమారి, డీసీపీఓ ఇన్చార్జ్ ప్రవీణ్, ఎఫ్ఆర్ఓ రవికృష్ణ, ఉమెన్ హబ్ కోఆర్డినేటర్ కల్యాణి, సఖీ అడ్మిన్ హైమావతి, నషా ముక్త్ భారత్ అభియాన్ కోఆర్డినేటర్ తేజస్విని తదితరులు పాల్గొన్నారు. ఫోన్ ట్యాపింగ్ బాధ్యులను శిక్షించాలిహన్మకొండ: ఫోన్ ట్యాపింగ్ బాధ్యులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ డిమాండ్ చేశారు. హనుమకొండ బాలసముద్రంలోని స్వగృహంలో ఆదివారం జరిగిన తెలంగాణ ఉద్యమకారుల వేదిక నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ప్రజలు భారీగా మద్దతు పలికి అధికారం ఇస్తే గత పాలకులు ప్రజాస్వామ్యాన్ని కూలదోశారని ఆరోపించారు. తన సామాజిక వర్గానికి చెందిన అధికారులను ఉపయోగించుకొని, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని దుయ్యబట్టారు. రాజరిక వంశ పారంపర్య పాలనను చిరకాలం కొనసాగించడానికి, ప్రతిపక్ష పార్టీలను బలహీనపరచడం కోసం వేలాది మంది ఫోన్లను బీఆర్ఎస్ పాలకులు ట్యాప్ చేసి దుర్మార్గానికి ఒడిగట్టారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ చేసి అక్రమంగా ఎన్నికై న ప్రజాస్వామ్య ద్రోహులు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఫోరం ఫర్ బెటర్ వరంగల్ అధ్యక్షుడు పుల్లూరు సుధాకర్, ప్రముఖ సామాజిక వేత్త బొమ్మినేని పాపిరెడ్డి, రాచకొండ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ మహాసభను జయప్రదం చేయాలి
హన్మకొండ: ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం మహాసభను జయప్రదం చేయాలని ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం వరంగల్ రీజియన్ అధ్యక్షుడు గొలనుకొండ వేణు, కార్యదర్శి మాదారపు సాంబయ్య పిలుపునిచ్చారు. ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర మహాసభ వాల్పోస్టర్లను హనుమకొండలోని వరంగల్ –1, వరంగల్ –2 డిపోల వద్ద సంఘం నాయకులు ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈనెల 24న బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర మహాసభ జరుగనుందని చెప్పారు. వరంగల్ రీజియన్లోని ఆర్టీసీ బీసీ ఉద్యోగులందరూ తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రీజియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బండారి శ్రీనివాస్, వరంగల్ –1 డిపో అధ్యక్షుడు దుంపేటి యాదగిరి, సెక్రటరీ పోతరాజు రమేష్, వరంగల్ –2 డిపో అధ్యక్షుడు కిరణ్, కార్యదర్శి శ్రీధర్ ఆర్టీసీ బీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. -
డయేరియా మరణాలను అరికట్టాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: డయేరియా మరణాలను అరికట్టాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో స్టాప్ డయేరియా క్యాంపెయిన్ ఫోర్స్ సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డయేరియా నివారణకు గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. వర్షాకాలంలో తాగునీరు కలుషితమయ్యే అవకాశం ఉన్నందున గ్రామాల్లో క్లోరినేషన్ చేయాలని, సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ సాంబశివరావు, డిప్యూటీ డీఎంహెచ్ఓలు ప్రకాశ్, కొంరయ్య, ప్రోగ్రాం అధికారులు ఆచార్య, అర్చన, విజయ్కుమార్, ఎంహెచ్ఓ రాజేశ్, వర్ధన్నపేట మున్సిపల్ కమిషనర్ సుధీర్, డీడబ్ల్యూఓ రాజమణి, సుజన్తేజ, భవాని, అనిల్కుమార్ పాల్గొన్నారు. రైతులకు అవగాహన కల్పించాలి ముందస్తుగా వరి నార్లు పోసుకునేందుకు రైతులకు అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ, వ్యవసాయ శాఖ అనుబంధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వరి, పత్తి కొనుగోళ్లలో ఈ టోకెన్ సిస్టం అమలుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, పత్తి, మిరప పంటల దిగుబడి, మార్కెటింగ్లో నాణ్యత పెంచేందుకు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. -
ఆదివారం శ్రీ 22 శ్రీ జూన్ శ్రీ 2025
ఏటూరునాగారం అభయారణ్యంలోని కొండేటివాగుమేడారం–తాడ్వాయి మధ్యలో ఇటీవల కనిపించిన అడవి దున్న (ఫైల్) ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, తాడ్వాయి అభయారణ్యాన్ని పర్యాటకులు చుట్టి వచ్చేందుకు అటవీశాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్ఎస్ తాడ్వాయి వైల్డ్ లైఫ్ శాఖ ఆధ్వర్యంలో జంగిల్ సఫారీకి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. పర్యాటకులు సఫారీలో అడవులను వీక్షించేందుకు సైతం రోడ్ల నిర్మాణ పనులు చేస్తున్నారు. త్వరలోనే జంగిల్ సఫారీ పర్యాటకులకు అందుబాటులోకి రానుంది. 17 కిలోమీటర్లు దారి.. అడవులను జంగిల్ సఫారీ ద్వారా సందర్శించేందుకు ఎస్ఎస్తాడ్వాయి హట్స్ సమీపం నుంచి కాటాపూర్ బీటీ రోడ్డు నుంచి అడవిలో 17 కిలోమీటర్ల వరకు దారి ఏర్పాటు చేశారు. దారి మధ్యలో సిమెంట్ కాజ్వేలు కూడా నిర్మించారు. అడవిలో పెద్దగుట్ట వరకు దారి ఏర్పాటు చేశారు. ఈదారి మార్గాన జంగిల్ సఫారీలో పర్యాటకులు పెద్దగుట్ట చుట్టి వచ్చేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రకృతిని ఆస్వాదించేలా.. హైదరాబాద్ పట్టణ ప్రాంతాల నుంచి బొగత, లక్నవరం, రామప్ప పర్యాటక ప్రాంతాల సందర్శనకు వచ్చే పర్యాటకులు దట్టమైన అడవుల్లోని ప్రకృతికి ఫిదా అవుతారు. గతంలో ఎస్ఎస్ తాడ్వాయి హట్స్లో బస చేసిన పర్యాటకులు ట్రెక్కింగ్, జంగిల్ సఫారీ ద్వారా అడవులను చుట్టుముట్టి వచ్చేవారు. సుమారు ఐదేళ్ల క్రితం జంగిల్ సఫారీ మూలనపడింది. దీంతో అప్పటినుంచి పర్యాటకులు ఎస్ఎస్ తాడ్వాయిలోని అడవుల సందర్శన నిలిచిపోయింది. పెరుగుతున్న పర్యాటకుల తాకిడి రోజురోజుకూ పలు ప్రాంతాల నుంచి పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు పర్యాటకుల తాకిడి పెరుగుతుండడంతో అటవీశాఖ అధికారులు మళ్లీ జంగిల్ సఫారీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అడవి మార్గాల్లో రోడ్లను ఏర్పాటు చేస్తున్నారు. రోడ్ల నిర్మాణ పనులు కూడా పూర్తి దశకు చేరుకున్నాయి. త్వరలోనే జంగిల్ సఫారీ వాహనాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. తాడ్వాయి మండల పరిధిలోని దామెరవాయి అటవీ ప్రాంతంలోని ఆదిమానవుల సమాధులను పర్యాటకులు, యూనివర్సిటీ విద్యార్థులు సందర్శిస్తున్నారు. అడవుల సందర్శనతో పాటు సమాధులను వీక్షించేందుకు జంగిల్ సఫారీ వాహనం ఏర్పాటు చేస్తే బాగుంటుందని స్థానికులు, పర్యాటకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాడ్వా యి నుంచి మేడారం మీదుగా ఊరట్టం ఏటూరునాగారం మండలంలోని కొండాయి వెళ్లే దారిలో మూడు కిలోమీటర్ల దూరంలో కొండేటి వాగు వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా ఉంది. ఈ పాయింట్ వరకు జంగిల్ సఫారీ ఏర్పాటు చేస్తే మేడారానికి వచ్చే భక్తులతో పర్యాటకుల సంఖ్య పెరగనుంది.రెండు నెలల్లో అందుబాటులోకి.. ఎస్ఎస్తాడ్వాయిలోని జంగిల్ సఫారీ 60 రోజుల్లో పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొస్తాం. తాడ్వాయి హట్స్ నుంచి 17 కిలోమీటర్లు పెద్దగుట్ట వరకు రోడ్డు నిర్మాణం పూర్తయింది. ఇంకా అన్ని హంగులతో అడవులను సందర్శించేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. – రమేశ్, ఎఫ్డీఓ, ఏటూరునాగారంజంగిల్ సఫారీ కోసం అడవిలో వేసిన రోడ్డున్యూస్రీల్తాడ్వాయి, ఏటూరునాగారం అభయారణ్యంలో త్వరలో ‘జంగిల్ సఫారీ’ అడవుల్లో 17కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణంబోన్ల నడుమ జంతువుల్ని.. డెన్ మధ్యన పులిని.. గూళ్లలో పిచ్చుకల్ని.. నిలువ నీటి తొట్లలో తాంబేళ్లను.. ఆక్వేరియంలో చేపల్ని జూ పార్క్లో చూసి మురిసిపోతాం. అలాంటిది.. దట్టమైన అడవిలో పచ్చందాల నడుమ సఫారీలో ప్రయాణిస్తూ.. వేటాడే పులిని.. చెవులకింపైన పక్షుల కిలకిలారావాల్ని.. చెంగుచెంగున పరుగెట్టే లేడికూనల్ని చూస్తూ సెల్ఫోన్లలో బంధిస్తూ పర్యాటకులు మైమరచిపోయేలా.. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యాటకానికి మరింత శోభ తెచ్చేలా ఎస్ఎస్ తాడ్వాయి వైల్డ్లైఫ్ అటవీశాఖ ఏర్పాట్లు చేస్తోంది. తాడ్వాయి, ఏటూరునాగారం అభయారణ్యంలో హాయిగా విహరించేందుకు సాగుతున్న ‘జంగిల్ సఫారీ’ ఏర్పాట్లపై ఈవారం ‘సాక్షి’ ప్రత్యేకం. –ఎస్ఎస్తాడ్వాయి ఏర్పాట్లు చేస్తున్న అటవీశాఖ అధికారులు ఉమ్మడి జిల్లా పర్యాటకానికి మరింత శోభ -
వాగ్దానాలు నెరవేర్చాలి..
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఖిలా వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలి.. నిరుపేదలకు డబుల్బెడ్రూం ఇళ్లు కట్టించి ఇవ్వకుంటే సర్కారు మెడలు వంచుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. శనివా రం వరంగల్ ఉర్సుగుట్ట వద్ద పార్టీ జిల్లా కార్యాలయంలో కార్యదర్శి సీహెచ్.రంగయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ఇరాన్–ఇజ్రాయిల్ యుద్ధంపై మాట్లాడుతూ.. అమెరికా అండతో ఇజ్రాయిల్ పాలస్తీనాను దురాక్రమణ చేయడానికి ప్రయత్నిస్తున్నదని అన్నారు. ఈ చర్య ను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నద ని చెప్పారు. సమావేశంలో నాయకులు జి.నాగయ్య, బాబు, రత్నమాల, ఈసంపెల్లి బాబు, భూక్య సమ్మయ్య, కుమారస్వామి, సాంబయ్య, శ్రీధర్, మధుకర్, ప్రశాంత్, వలదాసు దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ తనిఖీ వరంగల్ అర్బన్: హనుమకొండ బాలసముద్రంలోని క్వాలిటీ కంట్రో ల్ ల్యాబ్ను గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ శనివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశా రు. అనంతరం 31వ డివిజన్ గాయత్రి కాలనీలో నిర్మిస్తున్న రోడ్లను పరిశీలించారు. వరంగల్ కాశిబుగ్గ సర్కిల్ను తనిఖీ చేశారు. ఆయా విభాగాల ఫైళ్లను పరిశీలించి, ఉద్యోగులు, అధికారుల పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నా రు. పెండింగ్ ఫైళ్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. -
పథకాలు పటిష్టంగా అమలు చేయాలి
హన్మకొండ అర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అమలుకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని దిశ కమిటీ చైర్పర్సన్, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశ) సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలు రైతులకు అందేలా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని, క్యాన్సర్ స్క్రీనింగ్, పీఎంఆర్ఎఫ్ ప్రయోజనాల అమలుపై దృష్టి సారించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు. ‘బేటీ బచావో బేటీ పడావో’పై మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని, బాల్యవివాహాలు నివారించేలా గ్రామాల్ని తీర్చిదిద్దాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు సూచించారు. ఐసీడీఎస్ ద్వారా బరువు తక్కువగా ఉన్న పిల్లలకు పోషకాహారం అందించాలన్నారు. దిశ కమిటీ సమావేశానికి సంబంధించి వచ్చే విడతలో రైల్వే, దేవాదాయ, పర్యాటక, యూనివర్సిటీ అధికారులు కూడా పాల్గొనాలని ఎంపీ సూచించారు. అన్ని శాఖలు తమ తమ పథకాల అమలు వివరాలతో హాజరుకావాలన్నారు. అనంతరం స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించాలని, పల్లె, బస్తీ దవాఖానల నిర్మాణంలో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. డంపింగ్ యార్డు సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయం చూడాలన్నారు. శాసన మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్ మాట్లాడుతూ.. అంగన్వాడీ, వైద్యారోగ్యశాఖ సమన్వయంతో మంచి ఫలితాలు సాధించాలని, ఆశ వర్కర్ల ఖాళీల భర్తీకి జిల్లా స్థాయిలో చర్యలు తీసుకోవాలన్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ గ్రేటర్ అభివృద్ధి వివరాలు వెల్లడించారు. కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు సమగ్ర సమాచారంతో ఉండాలన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, కమిటీ సభ్యులు బండ రామలీల, డీఆర్డీఓ పీడీ శ్రీను, డీఎంహెచ్ఓ అప్పయ్య ఇతర శాఖల అధిపతులు పాల్గొన్నారు. జిల్లాను అగ్రభాగంలో నిలపాలి ‘దిశ’ సమావేశంలో ఎంపీ కడియం కావ్య -
ఉద్రిక్తత.. ఉత్కంఠ
హనుమకొండలో శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఉద్రిక్తత, ఉత్కంఠ వాతావరణం నెలకొంది. గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిని హనుమకొండ సుబేదారి పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి తరువాత శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసి నేరుగా వరంగల్కు తీసుకొచ్చారు. మాజీ ప్రజాప్రతినిధులు, విద్యార్థి నాయకుల ఆందోళన, పరామర్శలతో సుబేదారి పోలీస్స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాత్రి ఆయనకు బెయిల్రావడంతో కార్యకర్తలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. – వరంగల్ క్రైం/కాజీపేట రూరల్ ఉదయం నుంచి రాత్రివరకు సాగిన ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి ఎపిసోడ్ శంషాబాద్లో అరెస్ట్ చేసి హనుమకొండ సుబేదారి పోలీస్స్టేషన్కు.. బీఆర్ఎస్, విద్యార్థి నేతల ఆందోళన.. సీఎం దిష్టిబొమ్మ దహనం బెయిల్ రావడంతో కార్యకర్తల ఆనందోత్సాహం – 8లోu -
పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలి
● బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ తిరునహరి శేషుహన్మకొండ : ఎలాంటి షరతులు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ తిరునహరి శేషు డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ సాధనకు, కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు వద్ద బీసీ జేఏసీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో తిరునహరి శేషు మాట్లాడుతూ..ఫీజు రీయింబర్స్మెంట్పై ఆంక్షలు పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ విద్యార్థులకు అన్యాయం చేస్తే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తామని హామీ ఇచ్చి అమలు చేయకుండా మోసం చేస్తోందని దుయ్యబట్టారు. బీసీ నాయకులు నూతనకంటి ఆనందం, పాలడుగు సురేందర్ మాట్లాడుతూ పూలే విదేశీ విద్యా జ్యోతి పథకం ద్వారా విదేశాలకు వెళ్లే బీసీ విద్యార్థుల సంఖ్యను 300 నుంచి 800కి పెంచే ప్రతిపాదన ఫైల్ వెంటనే సంతకం చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు డాక్టర్ ఎర్ర బొజ్జు రమేష్, చిన్నాల యశ్వంత్ యాదవ్, బండి డేనియల్, నేదునూరి రాజమౌళి, బుట్టి శ్యామ్ యాదవ్, దారా జనార్దన్, ఆకారపు మోహన్, కేడల ప్రసాద్, తాడిశెట్టి క్రాంతి, హైమావతి, బేబీ పాల్గొన్నారు. -
ఉద్రిక్తత..ఉత్కంఠ
కౌశిక్రెడ్డికి ఎంజీఎంలో వైద్యపరీక్షలు ఎంజీఎం : గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు శనివారం వైద్యపరీక్షల నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తీసుకు వచ్చారు. మట్టెవాడ ఇన్స్పెక్టర్ గోపి, సుబేదారి పోలీసుల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు మధ్య ఎమ్మెల్యేకు వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంజీఎం అత్యవసర విభాగానికి బీఆర్ఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో చేరుకుని సీఎం రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కౌశిక్రెడ్డిని నేరుగా కోర్టుకు తరలించారు.● ఉదయం నుంచి రాత్రివరకు సాగిన ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి ఎపిసోడ్ ● శంషాబాద్లో అరెస్ట్టు చేసి హనుమకొండ సుబేదారి పోలీస్స్టేషన్కు.. ● బీఆర్ఎస్ నేతల ఆందోళన.. రోడ్డుపై బైఠాయింపు ● సీఎం దిష్టిబొమ్మ దహనం.. విద్యార్థి నేతల అరెస్టువరంగల్ క్రైం/కాజీపేట రూరల్: హనుమకొండలో శనివారం ఉదయం నుంచి రాత్రివరకు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని హనుమకొండ సుబేదారి పోలీసులు శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసి నేరుగా వరంగల్కు తీసుకు వచ్చారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో సుబేదారి పోలీస్ స్టేషన్కు చేరుకుని ఆందోళన చేశారు. అక్రమ అరెస్టులను నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాయకులను నిలువరించేందుకు పోలీసులు రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లను అడ్డు పెట్టి మోహరించారు. కేసు నమోదు ఇలా.. కమలాపురం మండలంలోని గుండేడు గ్రామానికి చెందిన గ్రానైట్ వ్యాపారి కట్ట మనోజ్రెడ్డిని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫోన్లో బెదిరించి రూ.50లక్షలు డిమాండ్ చేసినట్లు, తన భర్తకు ప్రాణపాయం ఉన్నట్లు గత ఏప్రిల్ 21న కట్ట ఉమాదేవి సుబేదారి పీఎస్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేయగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా ముందుస్తు అరెస్టులు చేయవద్దని కోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలో హైకోర్టు ఆ ఉత్తర్వులను ఇటీవల రద్దు చేయడంతో పోలీసులు పథకం ప్రకారం శుక్రవారం రాత్రి శంషాబాద్ ఎయిర్ఫోర్ట్లో అరెస్టు చేసి సుబేదారి పోలీస్ స్టేషన్కు తీసుకు వచ్చారు. రోడ్డుపై బీఆర్ఎస్ నాయకుల బైఠాయింపు.. పాడి కౌశిక్రెడ్డి అరెస్టు విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, శంకర్ నాయక్, నేతలు రాకేష్ రెడ్డి, సత్యనారాయణరావు పలువురు సుబేదారి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. కౌశిక్ రెడ్డిని కలవకుండా అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. అనంతరం నేతలు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ను కలిసి పరిస్థితిని వివరించారు. సీఎం దిష్టిబొమ్మ దహనం.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్టు చేయిస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు, విద్యార్థి నేతలు సుబేదారి పోలీస్ స్టేషన్ సమీపంలో రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసే క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం విద్యార్థి సంఘం నేతలు బొల్లికొండ వీరేందర్, రామ్మూర్తి, శరత్, రాజేష్ నాయక్, మహముద్ చోటు, సదంత్, శ్రవణ్ కుమార్, సాయికుమార్, రాజేష్, రాజ్కుమార్ను అరెస్టు చేసి కాజీపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. కాజీపేట జంక్షన్లో 144 సెక్షన్ విధింపు కాజీపేట రైల్వే కోర్టుకు కౌశిక్రెడ్డిని తరలించే నేపథ్యంలో పోలీసులు రైల్వే కోర్టు బయట చుట్టూ పక్కల ఎవరు రాకుండా 144 సెక్షన్ విధించారు. కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్రెడ్డి పర్యవేక్షణలో సీఐ సుధాకర్రెడ్డి, పోలీసులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను, మీడియాను కోర్టు ప్రాంగణంలోకి రాకుండా కట్టడి చేశారు. మధ్యాహ్నం 3:10 గంటలకు కౌశిక్రెడ్డిని పోలీసులు రైల్వే కోర్టుకు తరలించారు. విషయం తెలిసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎంపీ బి.వినోద్కుమార్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ కోర్టుకు వచ్చారు. అనంతరం రాత్రి 8 గంటల తర్వాత రిమాండ్ను కొట్టివేసి బెయిల్ మంజూరు కావడంతో ఆనందంగా వ్యక్తం చేశారు రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అరెస్ట్.. బీఆర్ఎస్ సీనియర్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి హన్మకొండ: రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్టు చేశారని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నందుకే ఈ అరెస్ట్ అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చేదాక ఈ ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటామన్నారు. -
కేయూ ఎన్జీఓ అధ్యక్షుడిగా నవీన్కుమార్
కేయూ క్యాంపస్ : కేయూ ఎన్జీఓ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బి.నవీన్కుమార్ ఎన్నికయ్యారు. ఎన్జీఓ ఎంప్లాయీస్ అసోసియేషన్, క్లాస్ఫోర్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఓటింగ్ శుక్రవారం జరుగగా ఓట్ల లెక్కింపు శనివారం యూనివర్సిటీలో నిర్వహించారు. అనంతరం ఫలితాలను రిటర్నింగ్ అధికారి ప్రొఫెసర్ కె.రాజేందర్ ప్రకటించారు. ఎన్జీఓ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బి.నవీన్కుమార్, ఉపాధ్యక్షుడిగా మహ్మద్ యూనస్, జనరల్ సెక్రటరీగా వల్లాల తిరుపతి, జాయింట్ సెక్రటరీ (ఆర్గనైజింగ్)గా ఎ.సతీష్బాబు, జాయింట్ సెక్రటరీ(రిక్రియేషన్)గా టి.ప్రభాకర్, జాయింట్ సెక్రటరీ (మహిళా)గా బి.కృష్ణవేణి, ట్రెజరర్గా టి.దామోదర్ విజయం సాధించారు. అలాగే.. క్లాస్ఫోర్త్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పి.గుమ్మయ్య, ఉపాధ్యక్షుడిగా పి.అంకుష్, జనరల్ సెక్రటరీగా బొక్క మొగిలి, జాయింట్ సెక్రటరీగా ఆర్గనైజింగ్ మహ్మద్వలీ పాషా, జాయింట్ సెక్రట రీ(మహిళా)గా జి.మల్లికాంబ, జాయింట్ సెక్రటరీ (రిక్రియేషన్)గా ఎన్.ఐలయ్య, ట్రెజరర్గా టి.తిరుమల్ శ్రీనివాస్సింగ్ ఎన్నికయ్యారని రాజేందర్ తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ పంజాల శ్రీధర్, సహాయ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. సూపరింటెండెంట్ కె.శ్రీనివాస్ పాల్గొన్నారు. క్లాస్ఫోర్త్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గుమ్మయ్య -
ప్రణాళికతో చదివితే ‘సివిల్స్’ సాధ్యం
విద్యారణ్యపురి : ప్రణాళికతో చదివితే సివిల్స్ పరీక్షల్లో విజయం సాధ్యమని హైదరాబాద్లోని ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్, (యూపీఎస్సీ ర్యాంకర్–2014) డాక్టర్ జి.వివేకానంద సూచించారు. శనివారం హనుమకొండలోని హరిత కాకతీయలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులకు సివిల్స్ ఎలా క్లియర్ చేయాలి అనే అంశంపై నిర్వహించిన ఉచిత అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. సివిల్ సర్వీస్ పరీక్ష సిద్ధం, లక్ష్య నిర్ధారణ, విజయానికి అవసరమైన మానసిక సంసిద్ధత వంటి అంశాలను వివరించారు. సివిల్ సర్వీసెస్ క్లియర్ చేయాలంటే రోజుకు 15 గంటలు చదవాల్సిన అవసరం లేదని, ఆరు నుంచి 8గంటలు చాలని తెలిపారు. ఐఐటీలు, పెద్ద యూనివర్సిటీల్లో చదివిన వారే యూపీఎస్సీ పరీక్షల్లో విజయం సాధిస్తారనేది అపోహ మాత్రమేనని సాధారణ కళాశాలల్లో డిగ్రీ కోర్సులు, ఇంజనీరింగ్ కోర్సులు చదివినవారు కూడా సరైన ప్రిపరేషన్తో సివిల్లో విజయం సాధించవచ్చన్నారు. వరంగల్ నుంచి పలువురు సివిల్స్లో విజయం సాధించగా వారి వివరాలను కూడా ఉదహరించారు.ప్రస్తుతం ఆన్లైన్లో సివిల్స్ ప్రిపరేషన్కు విస్తృతంగా సమాచారం ఉందని ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్ కోచింగ్ తీసుకుంటే సివిల్లో విజయం సాధించవచ్చని పేర్కొన్నారు. ఇంటర్ విత్ ఐఏఎస్, డిగ్రీ విత్ ఐఏఎస్గా కోచింగ్లు కూడా ఇస్తున్నారన్నారు. ఆర్క్ రిఫ్లెక్షన్ ఐఏఎస్ అకాడమి అడ్మినిస్ట్రేషన్ హెడ్ బి. అవినాష్, వివిధ సంస్థల గ్రూప్ డైరెక్టర్లు గిరిప్రకాశ్, గణేష్ మాట్లాడారు. ఈ సదస్సులో వివిధ డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు, పేరెంట్స్ పాల్గొన్నారు. వారు అడిగిన సందేహాలను డైరెక్టర్ వివేకానంద నివృత్తి చేశారు. ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ వివేకానంద -
ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల నమోదు పెరగాలి
● కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య పెంచడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, వివిధ సంక్షేమ గురుకుల కళాశాలల్లో విద్యార్థుల నమోదు, రవాణా సదుపాయం, గురుకుల కళాశాలల్లో వసతుల కల్పనపై సంబంధిత శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో కాలేజీలు, గురుకులాల్లో విద్యార్థుల సంఖ్య, సదుపాయాలు తదితర అంశాలపై అధికారులు సమగ్ర సమాచారం ఇవ్వాలని చెప్పారు. సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోపాల్, ఎస్సీ, ట్రైబల్, బీసీ వెల్ఫేర్ డీడీలు నిర్మల, ప్రేమ కళ, లక్ష్మణ్, ఆర్టీసీ ఆర్ఎం ధరమ్సింగ్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. విహారయాత్రకు ఆర్టీసీ టూర్ ప్యాకేజీ హనుమకొండ జిల్లా కేంద్రం నుంచి వివిధ ప్రాంతాల విహార యాత్రకు వెళ్లెందుకు ఈనెల 27న ప్రత్యేక టూర్ ప్యాకేజీ కింద సూపర్ లగ్జరీ, డిలక్స్, ఎక్స్ప్రెస్ బస్సులు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ స్నేహ షబరీష్ తెలిపారు. పూర్తి సమాచారానికి 8977781103, 9493882464, 9573090136 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఇందుకు సంబంధించిన ధరలు, రూట్ల వివరాలతో కూడిన ప్రచార పోస్టర్ను శనివారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో హనుమకొండ డిపో మేనేజర్ బి.ధరమ్సింగ్, సిబ్బంది పాల్గొన్నారు. 24న డీసీసీబీ మహాజన సభహన్మకొండ : వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) మహాజన సభ ఈనెల 24న నిర్వహించనున్నట్లు ఆ బ్యాంక్ ముఖ్య కార్యనిర్వహణాధికారి మహ్మద్ వజీర్ సుల్తాన్ తెలిపారు. హనుమకొండ నక్కలగుట్టలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఉదయం 11గంటలకు మహాజన సభ జరుగుతుందని ఆయన ఒక ప్రకటనలో వివరించారు. స్కూటీ @ 233 చలాన్లువరంగల్ క్రైం: ఓ స్కూటీ(ఆక్టివా)పై ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 233 చలాన్లు ఉన్నాయి. సదరు వాహన యజమానిని హనుమకొండ జిల్లా కాజీపేట ట్రాఫిక్ పోలీసులు శనివారం పట్టుకున్నారు. కాజీపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకన్న కాజీపేట చౌరస్తాలో వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో హనుమకొండకు చెందిన అస్లాం స్కూటీకి సంబంధించిన వివరాలను పరిశీలించి ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అతడి బండి నంబర్పై ఏకంగా 233 పెండింగ్ చలాన్ల రూపంలో రూ.45,350 జరిమానా ఉండడంతో ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపారు. జరి మానా మొత్తం చెల్లించి వాహనం తీసుకెళ్లాలని సూచించారు. -
కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ రంగారావు కన్నుమూత
● వచన కవిత్వంలో అగ్రగణ్యుడు మాదిరాజు రంగారావు కేయూ క్యాంపస్ : ఖమ్మం జిల్లాకు చెందిన కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ మాదిరాజు రంగారావు (90) అనారోగ్య కారణాలతో హైదరాబాద్లో శనివారం కన్నుమూశారు. ఆయన భార్య కొంతకాలం క్రితం మరణించగా ఆయనకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తెలుగు సాహిత్యంలో పండితుడు, శాసీ్త్రయ సాహిత్యం, భారతీయ, ఆధునిక కవిత్వం, నవల విమర్శ ససంస్కృత సాహిత్య అధ్యయనాలతో సంబంధం కలిగి ఉన్నారు. పదవి విరమణ తర్వాత కూడా వచన కవిత్వంలో 2024 వరకు ప్రతి ఏడాది ఒక పుస్తకం రచించారు కూడా. మాదిరాజు రంగారావు ఆధునిక తెలుగు సాహిత్యంలో అగ్రశ్రేణి సాహిత్య రచయితలలో ఒకరు. కేయూ తెలుగు విభాగంలో 1968 నుంచి 1995వరకు, ఉస్మానియా యూనివర్సిటీలో 1964 నుంచి 1968 వరకు తెలుగు సాహిత్యాన్ని బోధించారు. స్వేచ్ఛ కవిత్వంపై 46 పుస్తకాలు, పరిశోధన, సాహిత్య విమర్శలపై 14 పుస్తకాలు రచించారు. సుమారు 30 ఏళ్ల పాటు తెలుగు విభాగంలో ఆచార్యుడిగా పనిచేశారు. రంగారావు ఎప్పుడు తెల్లటి దుస్తుల్లో ఉన్నట్లే ఆయన కవితా సంపుటాలు కూడా తెల్లపురంగు కవర్ పేజీలపై ఎరుపు రంగు శీర్షికలతో ఉండేవి. మాదిరాజు రంగారావు మరణంపై సహృదయ సాహితీ సంస్థ అధ్యక్షుడు గిరిజా మనోహరబాబు, ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్వీఎన్ చారి, కాళోజీ ఫౌండేషన్ మిత్ర మండలి సభ్యులు, ఫౌండేషన్ అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి, కార్యదర్శి వీఆర్ విద్యార్థి సంతాపం ప్రకటించారు. -
డిసెంబర్ నాటికి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ..
● రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్ ● రైల్వే మోడల్ రన్నింగ్ రూం ప్రారంభంకాజీపేట రూరల్ : కాజీపేట మండలం అయోధ్యపురం–మడికొండ శివారులో నిర్మిస్తున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ పేర్కొన్నారు. శనివారం ప్రత్యేక రైల్లో కాజీపేటకు చేరుకున్న జీఎంకు స్టేషన్ మేనేజర్ రవీందర్ పూలబొకేతో స్వాగతం పలికారు. అనంతరం కాజీ పేట జంక్షన్లో రూ.7.50 కోట్ల వ్యయంతో నిర్మించిన రైల్వే లోకో పైలెట్లు, ట్రైయిన్ మేనేజర్ల విశ్రాంతి, రైల్వే రన్నింగ్ రూంను జీఎం పూజలు చేసి ప్రారంభించారు. అనంతరం జీఎం అరుణ్కుమార్ జైన్ విలేకరులతో మాట్లాడుతూ.. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ డిసెంబర్ నాటికి పూర్తి కానుందని, అదేవిధంగా రైల్వే అమృత్ భారత్ పనులు కూడా చివరినాటికి పూర్తి చేయనున్నట్లు తెలిపారు. రైల్వే రూట్ రిలే ఇంటర్ లాకింగ్ సిస్టం కార్యాలయంలో తనిఖీ చేశారు. కార్యక్రమంలో రైల్వే డీఆర్ఎం భర్తీష్ కుమార్ జైన్, పీసీఓఎం కె.పద్మజా, సీనియర్ డీఎం సురేష్ రెడ్డి, సీనియర్ డీసీఎం శిఫాలి, సీని యర్ డీఎస్టీఈ ప్రీతి అగర్వాల్, డీఈఎన్ సెంట్రల్ ప్రంజల్, ఇతర శాఖల అధికారులు, కాజీపేట డీజి ల్ షెడ్ సీనియర్ డీఎంఈ వెంకట కుమార్, ఎలక్ట్రిక్ షెడ్ సీనియర్ డీఈఈ ప్రశాంత్ కృష్ణసాయి, కాడూ రి సుబ్బారావు, జొన్నలగడ్డ శేషగిరి రావు, గోపాలం శ్రీనివాస్రావు, రైల్వే అధికారులు పాల్గొన్నారు. వరంగల్లో కోచింగ్ లాబీకి నాయకుల వినతి రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్, డీఆర్ఎం భర్తీష్కుమార్ జైన్, పీసీఓఎంలను రైల్వే మజ్దూర్ యూనియన్ లోకో రన్నింగ్ బ్రాంచీ సెక్రటరీ పి.సాయికుమార్ ఆధ్వర్యంలో నాయకులు కలిసి వరంగల్లో కోచింగ్ సిస్టం లాబీని ప్రారంభించాలని కోరారు. కాజీపేట జంక్షన్కు పూర్వ వైభవం తీసుకురావాలని వినతి పత్రాలు సమర్పించారు. బ్రాంచీ చైర్మన్ సంగ రమేష్, ట్రెజరర్ డి.రఘు, అసిస్టెంట్ చైర్మన్ ఎ.కుమార్, సభ్యులు పాల్గొన్నారు. -
దోచుకుతిన్న ప్రతీ రూపాయి కక్కిస్తాం
● ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి హన్మకొండ చౌరస్తా: పదేళ్లు అధికారంలో ఉండి బీఆర్ఎస్ నాయకులు దోచుకుతిన్న ప్రతీ రూపాయిని కక్కిస్తామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. డబ్బులు ఇవ్వకుంటే చంపుతానని బెరించిన కేసులో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిని అరెస్టు చేస్తే ఆందోళనలు చేయడంపై రాజేందర్రెడ్డి మండిపడ్డారు. హనుమకొండలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కరు రూ.వెయ్యి కోట్లకు తగ్గకుండా ప్రజల సొమ్ము దోచుకుతిన్నారని, మాకు ప్రజాస్వామ్యం, చట్టాలపై గౌరవం, నమ్మకం ఉంది కాబట్టే చట్టపరంగా అవినీతి సొమ్మును ప్రభుత్వం రాబడుతుందని చెప్పారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి జై తెలంగాణ నినాదం ఎత్తడం సిగ్గుచేటన్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ కొందరు ప్రజల్లో తొందరగా పేరు తెచ్చుకోవాలని, హీరోగా చెలామణి కావడానికి ప్రయత్నిస్తున్నారని, అందుకు ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. డబ్బులు ఇవ్వకుంటే చంపుతానని క్రషర్ యజమాని మనోజ్రెడ్డిని బెదిరించినట్లు పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు. సమావేశంలో వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు, మాజీ ఎంపీ పసునూరి దయాకర్, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్, కార్పొరేటర్లు వేముల శ్రీనివాస్, విజయశ్రీరజాలి, జక్కుల రవీందర్ పాల్గొన్నారు. -
పోలీస్శాఖలో కోవర్టులున్నారు..
రామన్నపేట: పోలీసు శాఖలోనే కోవర్టులు ఉన్నారని, అది పోలీసు కమిషనర్ గుర్తించాలని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి సూచించారు. గురువారం ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ పోచమ్మమైదాన్ జంక్షన్లో భారీ కేక్ కట్ చేశారు. ఈసందర్భంగా మురళి మాట్లాడుతూ.. బీసీ నాయకుడిని అయినందుకే తనపై కక్ష కట్టి అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కొండా మురళి ఉన్నంత వరకు తూర్పులో రెండో నాయకుడు ఉండరని, కార్యకర్తలకు, నాయకులకు ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానన్నారు. ‘ఆపరేషన్ కగార్’ను నిలిపేయాలని ఆందోళనలు చేస్తామంటే పోలీసులు అడ్డుకున్నారని పేర్కొన్నారు. బీసీ కులాల్లో తనకు రెండు కులాలకు చెందిన పద్మశాలీ, కాపు కులస్తుల మద్దతు పూర్తిస్థాయిలో ఉంటుందన్నారు. అర్హులైన పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గోపాల నవీన్రాజు, మీసాల ప్రకాశ్, జారతి రమేశ్, కొత్తపల్లి శ్రీనివాస్, సకినాల రజనీకాంత్, బస్వరాజు కుమారస్వామి, పోశాల పద్మ, తదితరులు పాల్గొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ గుర్తించాలి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి -
ముగిసిన బడిబాట
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో ఈనెల 6నుంచి ప్రారంభమైన బడిబాట గురువారం ముగిసింది. చివరిరోజు వివిధ పాఠశాలల్లో విద్యార్థులకు క్రీడలు నిర్వహించారు. నడికూడ పాఠశాలలో క్రీడాపోటీలను జెడ్పీ సీఈఓ విద్యాలత ప్రారంభించారు. దామెర మండలం ఊరుగొండ ఉన్నతపాఠశాలలో క్రీడలను కమ్యూనిటీ మొబిలైజింగ్ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్రెడ్డి, హనుమకొండ సుబేదారి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో క్రీడలను ఎంఈఓ నెహ్రూ ప్రారంభించారు. బడిబాట ముగిసేనాటికి హనుమకొండ జిల్లాలో 1 నుంచి 10వ తరగతి వరకు 3,228 మంది విద్యార్థులు నూతనంగా నమోదయ్యారు. అందులో ఒకటోతరగతిలో 1,133 మంది ప్రవేశాలు పొందారని డీఈఓ డి.వాసంతి, కమ్యూనిటీ మొబిలైజింగ్ అధికారి బద్దం సుదర్శన్రెడ్డి తెలిపారు. వరంగల్ జిల్లాలో బడిబాట ద్వారా ఈనెల 18వ తేదీ వరకు 4,108మంది విద్యార్థులు నమోదైనట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. -
గడువులోగా పనులు పూర్తి చేయాలి
● బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్వరంగల్ అర్బన్/ఖిలా వరంగల్: వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయంలోని స్విమ్మింగ్ పూల్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ఆదేశించారు. గురువారం క్షేత్రస్థాయిలో ఆమె పనులు పరిశీలించారు. నాణ్యతతో పనులు చేయాలని సూచించారు. ప్లానిటోరియాన్ని కమిషనర్ పరిశీలించారు. శివనగర్లోని మెట్ల బావిని, చింతగట్టు వద్ద పద్మశాలి కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనుల్ని పర్యవేక్షించారు. ఆమె వెంట ఇన్చార్జ్ ఎస్ఈ శ్రీనివాస్, ఈఈ రవికుమార్, డీఈ రాజ్కుమార్, ఏఈలు శ్రీకాంత్, మోజామిల్, హబీబ్, నరేశ్ తదితరులున్నారు. -
డ్రెయినేజీ పనుల్లో నాణ్యత డొల్ల!
వరంగల్ అర్బన్: గ్రేటర్లో అభివృద్ధి పనుల పేరుతో కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు కుమ్మకై ్క ప్రజాధనాన్ని దోచుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నా యి.. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణ పనులు జరుగుతున్నా.. కనీసం క్షేత్రస్థాయిలో వర్క్ ఇన్స్పెక్టర్, క్వాలిటీ కంట్రోల్ సిబ్బంది కూడా అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. ప్రజల ప్రయోజనాల కంటే తమకు కావాల్సిన కాంట్రాక్టర్ల స్వలాభం, నాలుగు కాసులు వెనుకేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందుకు మచ్చుకు ఒక్క ఉదాహరణే వరంగల్ దేశాయిపేట ప్రతాపరుద్ర ఫిల్టర్ బెడ్ నుంచి కొత్తవాడ బైపాస్ రోడ్డులోని డ్రెయినేజీ నిర్మాణం. నాణ్యతకు తిలోదకాలు బల్దియా నిధులు రూ.50లక్షలతో 500 మీటర్ల డ్రెయినేజీ నిర్మాణానికి టెండర్లు పిలించారు. ఓ కాంట్రాక్టర్ టెండర్ దక్కించుకుని ఒప్పందాలు పూర్తి చేసుకున్న చాలా నెలల తర్వాత పనులు మొదలు పెట్టారు. పనుల్లో నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. ఒకవైపు కడుతుండగానే మరో వైపు పగుళ్లు, రంధ్రాలు పడుతున్నాయి. అంతా క్రషర్ మెటీరియలే.. ప్రభుత్వ నిబంధనల మేరకు గోదావరి ఇసుక, నాణ్యమైన కంకర, సిమెంట్తో డ్రెయినేజీలు, సీసీ రోడ్లు నిర్మించాలి. కానీ, సదరు కాంట్రాక్టర్ ఇసుకకు బదులుగా క్రషర్లో వెలువడే రోబో ఇసుక, కంకర చూర, నాణ్యత లేని కంకర ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. డ్రెయినేజీ ఒకవైపు కడుతుండగానే మరోవైపు రంధ్రాలు పడి నీళ్ల ఊటలు వస్తున్నాయి. నెలలు గడవకముందే ఈ నిర్మాణం పూర్తిగా ఛిద్రమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కమిషనర్ కళ్లెం వేసేనా? బల్దియాకు తాజాగా కొత్త కమిషనర్ చాహత్ బాజ్పాయ్ విధుల్లో చేరారు. నగరంలో దారి తప్పిన అభివృద్ధి పనుల నాణ్యతను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తా.. దేశాయిపేట ఫిల్టర్బెడ్ నుంచి 80 ఫీట్ల రోడ్డు వరకు జరుగుతున్న డ్రెయినేజీ పనుల నాణ్యతా ప్రమాణాలను పర్యవేక్షిస్తా. నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటాం. క్వాలిటీ కంట్రోల్ సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. – రంగనాథ్, బల్దియా డీఈ కమిషనర్ గారూ.. క్వాలిటీ పరిశీలించండి 500 మీటర్ల పనులకు రూ.50 లక్షలు కేటాయింపు ఇసుకకు బదులు క్రషర్ రోబో చూర నాసిరకం కంకర, సిమెంట్ దారి తప్పిన గ్రేటర్ అభివృద్ధి పనులు కాంట్రాక్టర్లకు ఇతోధికంగా సహకరిస్తున్న ఇంజనీర్లు -
బనకచర్లతో ఎడారవ్వనున్న ఉమ్మడి జిల్లా
హన్మకొండ: గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుతో ఉమ్మడి వరంగల్ జిల్లా ఏడారిగా మారుతుందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. గురువారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గోదావరి, కృష్ణా జలాల గురించి తెలియని రేవంత్రెడ్డి తెలంగాణ నీటి వనరులను ఎలా కాపాడతారని ప్రశ్నించారు. చిన్న పగుళ్ల సాకు చూపి కాళేశ్వరం కూలిపోయిందన్నారని. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగానే రైతుల పొలాలను ఎండగొట్టిందని విమర్శించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా తాగు, సాగునీటి అవసరాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించుకున్న, అభివృద్ధి చేసుకున్న పాకాల, గణపురం, లక్నవరం రిజర్వాయర్లపై ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయడాన్ని పడుతున్నామన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు అన్యాయం జరుగుతున్నా మంత్రులు సీతక్క, సురేఖ, ఎమ్మెల్యేలు కనీసం నోరు మెదపడం లేదని తూర్పారబట్టారు. రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు నాయుడు నీటి దోపిడీకి గోదావరి బనకచర్ల కడుతుంటే రేవంత్ రెడ్డి ఎలా అడ్డుకుంటాడని ప్రశ్నించారు. సమావేశంలో రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్లు, నాయకులు ఉడతల సారంగపాణి, జోరిక రమేశ్, తాళ్లపెళ్లి జనార్దన్ గౌడ్, నార్లగిరి రమేశ్, పులి రజనీకాంత్, బండి రజనీ కుమార్, శోభన్ కుమార్, నయీముద్దీన్, సల్వాజీ రవీందర్ రావు, జానకి రాములు, అఫ్జల్, రామ్మూర్తి, మూటిక రాజు, రాజ్ కుమార్, శరత్ చంద్ర, వీరస్వామి, రాకేశ్, శ్రవణ్ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి -
అన్నకు తమ్ముడి శఠగోపం
వరంగల్ చౌరస్తా : అన్నకు తమ్ముడు శఠగోపం పెట్టాడు. నమ్మి క్యాష్ కౌంటర్పై కూర్చోబెట్టినందుకు రూ.1.37 కోట్లు స్వాహా చేశాడు. మోసం చేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీనిపై చాంబర్ ప్రతినిధులు, పోలీసులు స్పందించి తనకు న్యాయం చేయాలని బాధితుడు (అన్న) చల్లా సాంబలింగం విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు గురువారం వరంగల్ వ్యవసాయ మార్కెట్ సమీపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను, తన తమ్ముడు సంపత్ కలిసి ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో 2016 నుంచి కేశవ ట్రేడర్స్ పేరుతో మిర్చి వ్యాపారం ప్రారంభించినట్లు తెలిపారు. ఈ క్రమంలో తాను బయట విషయాలు చూసుకుంటుండగా తన తమ్ముడు సంపత్ క్యాష్ కౌంటర్ పై కూర్చుని ఆర్థిక లావాదేవీలు చూసేవాడన్నారు. ఈ క్రమంలో రూ.1.37 కోట్లు మోసం చేశారని పేర్కొన్నారు. తనకు రావాల్సిన డబ్బులు అడిగితే ఇవ్వనని.. పైగా డబ్బులు అడిగితే చంపుతానని బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తాను చాంబర్ ఆఫ్ కామర్స్ జాయింట్ సెక్రటరీ చక్రపాణి వద్దకు వెళ్లగా అతడు పంచాయితీ నిర్వహించి తనకు రావాల్సిన డబ్బును చెల్లించాలని తన తమ్ముడికి చెప్పారన్నారు. అయితే తన తమ్ముడు చెల్లించకపోవడంతో మూడు నెలల క్రితం ఏనుమాముల పీఎస్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయినా చాంబర్ ప్రతినిధులు, పోలీసులు పట్టించుకోవడం లేదని, ఇప్పటికై నా స్పందించి తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరాడు. వ్యాపారంలో రూ.1. 37 కోట్లు ముంచిన తమ్ముడు న్యాయం చేయాలని బాధితుడి వేడుకోలు -
కలహాల కాంగ్రెస్...
సాక్షిప్రతినిధి, వరంగల్ : కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు మరోసారి భగ్గుమన్నాయి. నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు వ్యాఖ్యలతో బట్టబయలయ్యాయి. రాహుల్గాంధీ జన్మదినం సందర్భంగా గురువారం వరంగల్ పోచమ్మమైదాన్లో జరిగిన కార్యక్రమంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. పరోక్షంగా ఆయన పార్టీ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డిపై నోరు పారేసుకోవడం పార్టీవర్గాల్లో కలకలం రేపింది. కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో స్తబ్ధత కనిపిస్తున్నా.. కొండా మురళి వ్యాఖ్యలతో ఒక్కసారిగా రచ్చమొదలైంది. ఈ వ్యాఖ్యలపై కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డి గాని స్పందించకపోగా, వారి అనుచరులు సైతం మౌనం వహించారు. పార్టీలో తీవ్ర సంచలనంగా మారిన కొండా మురళీధర్రావు వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం సీనియర్ నాయకుల ద్వారా ఆరా తీసినట్లు సమాచారం. మాజీ టీడీపీ నేతలే లక్ష్యంగా... ఓరుగల్లు కాంగ్రెస్ నేతల మధ్య కొంతకాలంగా అంతర్గత కలహాలు సాగుతున్నాయి. ప్రధానంగా మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మధ్య గతంలోనూ పరస్పర ఆరోపణలకు సంబంధించిన ఆడియో రికార్డు సోషల్ మీడియాలో వైరలైంది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కొందరు ఎమ్మెల్యేలు కొండా సురేఖకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిశారన్న ప్రచారం జరిగింది. ఇందులో ప్రధానంగా గతంలో టీడీపీలో పనిచేసి.. ప్రస్తుతం కాంగ్రెస్లో కొనసాగుతున్న కొందరు ఎమ్మెల్యేలు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని కూడా కొండా సురేఖ దంపతులు చాలాసార్లు తమ అనుచరులతో వ్యాఖ్యానించారు. ఇదే క్రమంలో కొండా మురళీధర్రావు గురువారం పోచమ్మమైదాన్ సభలో కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డిపై ఘాటైన వ్యాఖ్యలు చేయడం కలకలంగా మారింది. ‘కనుబొమ్మలు లేని నాయకుడు టీడీపీని భ్రష్టు పట్టించి.. చంద్రబాబును ఓడించి కేసీఆర్కు వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్లో నాటి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ తిష్టవేశాడన్న’ కొండా మురళీధర్రావు... ‘75 ఏళ్ల దరిద్రుడు, ముసలోడు ఎన్నికలకు ముందు మా వద్దకు వచ్చి మా కాళ్లు పట్టుకొని ఈసారి సీటు నాకు వదిలిపెట్టమని ప్రాధేయపడితే మా మద్దతుతో పరకాల ఎమ్మెల్యే అయ్యాడు’ అని ఇద్దరిపై ఘాటైన ఆరోపణలు చేయడం రాజకీయవర్గాల్లో దుమారం రేపుతోంది. గురువారం ఉదంతంపై అధిష్టానం ఆరా... వరంగల్ కాంగ్రెస్లో దుమారం రేపిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం ఆరా తీస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీలో ఇటీవలి పరిణామాలపై ఓ వైపు ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ద్వారా నివేదికలు ఇప్పటికే తెప్పించుకున్న ప్రభుత్వ పెద్దలు.. పార్టీ సీనియర్ల ద్వారా ‘వరంగల్లో అసలేం జరుగుతోంది’ని ఆరా తీసినట్లు అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం. గురువారం రాత్రి కూడా ఉమ్మడి వరంగల్కు చెందిన నలుగురు సీనియర్ నాయకులతో టీపీసీసీ పెద్దలు మాట్లాడినట్లు తెలిసింది. అలాగే, గ్రేటర్ వరంగల్ పరిధిలోని ఇద్దరు ఎమ్మెల్యేలతో కూడా రాష్ట్ర పార్టీ బాధ్యులు ఒకరు మాట్లాడినట్లు సమాచారం. త్వరలోనే ఉమ్మడి వరంగల్కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలను హైదరాబాద్కు పిలిచి మాట్లాడే అవకాశం ఉందని కూడా పార్టీవర్గాల ద్వారా తెలిసింది. కొండా మురళీధర్రావు వ్యాఖ్యలతో బట్టబయలు తారస్థాయికి చేరిన కాంగ్రెస్ గ్రూపువార్ సొంత పార్టీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసిన మాజీ ఎమ్మెల్సీ కొండా ఎమ్మెల్యేలు రేవూరి, కడియంపై సీరియస్ వ్యాఖ్యలు ఓరుగల్లు కాంగ్రెస్లో మళ్లీ రాజకీయ దుమారం తాజా పరిస్థితులపై కాంగ్రెస్ అధిష్టానం ఆరా? -
సీసీఐ కొనుగోళ్ల విధానం కొనసాగించాలి
వరంగల్ చౌరస్తా : ప్రస్తుతం రాష్ట్రంలో సీసీఐ ద్వారా కొనుగోలు జరుపుతున్న విధానంతోనే పత్తి రైతులకు మేలు చేకూరుతుందని వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, కాంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్ రెడ్డి అన్నారు. ఢిల్లీలోని నీతి ఆయోగ్ భవన్లో గురువారం ‘బహిరంగ మార్కెట్లో పత్తికి మార్కెట్ ధర, కనీస మద్దతు కంటే తక్కువ ధరలు పలుకుతున్న వ్యత్యాసాలు’ అనే అంశంపై జరిగిన సదస్సుకు వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, కాటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు మనీష్ మల్పానీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రైస్ డెఫిసిట్ పేమెంట్ స్కీం 2025–26 కాటన్ సీజన్లో తెలంగాణలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టి స్కీం అమలులో ఎదురయ్యే సమస్యలపై రవీందర్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో పత్తి కొనుగోళ్లకు అవసరమైన సదుపాయాలు, రెగ్యులేటెడ్ మార్కెట్లలో పత్తి నాణ్యత, బహిరంగ మార్కెట్లోని ధరలను నిర్ధారించడానికి ఎలాంటి ప్రత్యేక వ్యవస్థలు లేవన్నారు. అందుకే ప్రస్తుతం రాష్ట్రంలో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు జరుపుతున్న విధానమే రైతులకు మేలు చేకూరుతుందన్నారు. పత్తి కొనుగోళ్లలో కనీస మద్దతు కంటే తక్కువ ధర పలికితే ఆ వ్యత్యాసపు ధరను నేరుగా రైతులకు చెల్లించడానికి కేంద్రం ప్రభుత్వం ప్రైస్ డెఫిసిట్ పేమెంట్ స్కీంను పైలట్ ప్రాజెక్టు కింద వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లు ప్రకటించినట్లు రవీందర్రెడ్డి పేర్కొన్నారు. సమావేశంలో కేంద్ర మంత్రిత్వ శాఖ ఫైనాన్స్ డైరెక్టర్ పవన్ కుమార్, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ జాయింట్ సెక్రటరీ లలిత్ కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. వరంగల్ చాంబర్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి -
నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం
వేలేరు: స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ సమగ్రాభి వృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. వేలేరు మండలంలోని పైలట్ గ్రామం శాలపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్ని పరిశీలించి లబ్ధిదారుల సమస్యలు తెలుసుకున్నారు. సాంకేతిక సమస్యలతో కొన్ని ఇళ్లకు బిల్లులు రాలేదని లబ్ధిదారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా.. బిల్లులు వచ్చేలా చూడాలని హౌసింగ్ అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. సబ్స్టేషన్ నిర్మాణం త్వరగా పూర్తి చేయండి పీచర శివారులో రూ.23.76 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 132/33 కేవీ సబ్ స్టేషన్ పనులను సంబంధిత శాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరిశీలించి ఆగస్టు 15 వరకు పనులు పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఇక్కడే మరో 220/132 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి త్వరలోనే మంజూరు తీసుకొస్తాన్నారు. ఆగస్టులో 132/33 కేవీ సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం, 220/132 కేవీ సబ్ స్టేషన్కు డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో శంకుస్థాపన చేయిస్తానన్నారు. సీసీ రోడ్డు పనులు ప్రారంభం పీచరలో రూ.50 లక్షల ఈజీఎస్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జూలై నెల చివరి నాటికి మ ల్లన్న గండి నుంచి కన్నారం వరకు పైప్లైన్ నిర్మాణ పనులు పూర్తి చేసి గ్రామంలోని ప్రతీ చెరువును గోదావరి జలాలతో నింపుతానన్నారు. గ్రామంలో త్వరలోనే మరో 25 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తానని హమీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్ధార్ హెచ్.కోమి, ఎంపీడీఓ లక్ష్మీప్రసన్న, విద్యుత్ శాఖ డీఈ సంపత్రావు, ఏడీఈ రాజేశ్వర్ రావు, హౌసింగ్ డీఈ సిద్ధార్థ నాయక్, ఏఈ సుష్మ, కుమారస్వామి, పార్టీ మండల అధ్యక్షుడు కత్తి సంపత్, నాయకులు బిల్లా యాదగిరి, మల్లికార్జున్, సద్దాం హుస్సేన్, రాంగోపాల్రెడ్డి, సమ్మయ్య, రాజిరెడ్డి, రవీందర్, సంపత్, రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి అభివృద్ధి పనులు ప్రారంభం -
దూరవిద్య కోర్సుల అడ్మిషన్లకు నోటిఫికేషన్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్య కేంద్రంలో డిగ్రీ, పీజీ డిప్లొమా సర్టిఫికెట్, ఓరియెంటేషన్ కోర్సుల్లో ఈ విద్యాసంవత్సరం 2025–2026లో ప్రవేశాలకుగాను నోటిఫికేషన్ విడుదల చేశారు. గురువారం ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్లను వీసీ కె.ప్రతాప్రెడ్డి విడుదల చేశారు. ఆన్లైన్, ఆఫ్లైన్లోనూ అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చునని దూరవిద్యకేంద్రం డైరెక్టర్ బి.సురేశ్లాల్ తెలిపారు. ఈ నెల 20వ తేదీనుంచి జూలై 31వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని పేర్కొన్నారు. కోర్సులు, ఫీజుల వివరాలు సంబంధిత వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పద్మజ, దూరవిద్యకేంద్రం సైన్స్కోర్సుల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ముంజం, డాక్టర్ వి.జగన్, డాక్టర్ కొట్టే భాస్కర్ పాల్గొన్నారు. అన్నను చంపిన ఘటనలో ఐదుగురిపై కేసు నమోదు కురవి: అన్నను చంపిన ఘటనలో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు సీరోలు ఎస్సై నగేశ్ గురువారం తెలిపారు. సీరోలు గ్రామానికి చెందిన వల్లపు లింగన్న తన భూమిని సమానంగా పంచి ఇవ్వలేదనే కారణంతో అతడి రెండో భార్య కుమారులు నరేశ్, మహేశ్, నరేశ్ భార్య సౌందర్య, లింగన్న రెండో భార్య నర్సమ్మ, నున్న వీరన్న (నరేశ్ బావమరిది) కలిసి లింగన్న మొదటి భార్య కుమారుడు కృష్ణను ఈ 18న కత్తితో నరికి చంపారు. ఈ ఘటనలో మృతుడి తండ్రి లింగన్న ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నగేశ్ తెలిపారు. చెక్ బౌన్స్ కేసులో ఆరునెలలు జైలు వరంగల్ లీగల్ : అప్పుగా తీసుకున్న రూ.4 లక్షలు చెల్లించని కారణంగా బాధితుడు కోర్టును ఆశ్రయించడంతో నిందితురాలికి ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తూ హనుమకొండ మొదటి మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి సీహెచ్. శ్రావణస్వాతి గురువారం తీర్పు వెలువరించారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయి. హనుమకొండ బ్రాహ్మణవాడకు చెందిన సుంకరి నరేందర్.. కాజీపేట సిద్దార్థనగర్కు చెందిన యాట భాగ్యలక్ష్మికి 2024, జూన్ 15వ తేదీన రూ.4 లక్షల అప్పు ఇచ్చాడు. ఈ మేరకు భాగ్యలక్ష్మి.. నరేందర్కు ప్రామిసరీ నోటు రాసి ఇచ్చింది. రెండు నెలల్లో మొత్తం తిరిగి ఇస్తానని చెప్పింది. అయితే వివిధ కారణాలతో ఇవ్వకుండా సెప్టెంబర్లో హనుమకొండలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకు సంబంధించిన రూ.4లక్షల చెక్కు ఇచ్చింది. సదరు డబ్బులు డ్రా చేసే నిమిత్తం నరేందర్ 2024, అక్టోబర్ 10వ తేదీన చెక్కును బ్యాంకులో వేయగా అకౌంట్లో సరిపోను డబ్బులు లేవని అధికారులు చెక్కు చెల్లదని తిరిగి ఇచ్చారు. దీనిపై బాధితుడు తన న్యాయవాది బైరి మల్లేశం ద్వారా కోర్టును ఆశ్రయించాడు. విచారించిన కోర్టు.. చెల్లని చెక్కు ఇచ్చిన ఘటనలో నేరం రుజువుకావడంతో నిందితురాలు భాగ్యలక్ష్మికి ఆరు నెలల జైలు శిక్ష, అప్పుగా తీసుకున్న మొత్తం రూ.4 లక్షలకు వడ్డీ, జరిమానా కింద రూ.3 లక్షలు మొత్తం రూ.7 లక్షలు చెల్లించాలని తీర్పు వెలువరించింది. -
‘జంపన్న’ సుందరీకరణ ..
ఎస్ఎస్తాడ్వాయి: ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం మహాజాతర సమయంలో కోట్లాది మంది పుణ్యస్నానాలు ఆచరించే జంపన్న వాగును సుందరీకరించనన్నారు. భక్తులకు మరింత ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కు రూ. 5 కోట్లు మంజూరు చేసినట్లు తెలిసింది. ఈ నిధులతో వాగును అభివృద్ధి చేయనున్నారు. మంత్రి సీతక్క చొరవ మేరకు జంపన్న వాగుపై రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులు చేపట్టడానికి ప్రభుత్వం ఈ నిధులు మంజూరు చేసినట్లు సమాచారం. జంపన్న వాగు ఒడ్డున పార్కులు, బెంచీల ఏర్పాటు.. జంపన్న వాగుపై రెండు వైపులా స్నాన ఘట్టాలు నిర్మించారు. జాతర సమయంలో భక్తులు స్నాన ఘట్టాలపై అమర్చిన బ్యాటరీ ఆఫ్ ట్యాబ్స్ ద్వారా స్నానాలు ఆచరిస్తారు. అయితే వాగుపై స్నాన ఘట్టాలు తప్ప కొత్తదనం ఏమీ కనిపించదు. ఈ నేపథ్యంలో ఈసారి మహాజాతర నాటికి స్నాన ఘట్టాల వద్ద భక్తులకు ఆహ్లాదకర వాతావరణం అందించేందకు పార్కులు, కూర్చునేందుకు బెంచీలు ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా ఒకటి రెండు కాటేజీలను కూడా నిర్మించనున్నారు. జాతర సమయంలో భక్తులు ఎండ, వర్షం నుంచి ఉపశమనం పొందేందుకు జంపన్న వాగు ఒడ్డున షెడ్లు కూడా నిర్మించే అవకాశం ఉంది. ఫలితంగా సుందరీకరణతో ఈసారి జాతరకు వచ్చే భక్తులకు జంపన్న వాగు ఆకర్షణీయంగా కనిపించనుంది. మంత్రి సీతక్క చొరవతో.. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క మేడారంలో భక్తుల సౌకర్యార్థం శాశ్వత అభివృద్ధి పనులపై దృష్టిసారించారు. ఇందులో భాగంగా జంపన్న వాగు భక్తులకు ఆకర్షణీయంగా కనిపించాలనే సంకల్పంతో సుందరీకరణ పనులకు నిధుల మంజూరుకు కృషి చేసినట్లు తెలుస్తోంది. జంపన్నవాగులో ఫౌంటెన్ కూడా ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గత మహాజాతరలోనే సమ్మక్క– సారలమ్మ చిహ్నాలుగా వాటర్ ఫౌంటెన్ ఏర్పాటు చేయాలనే ఆలోచన చేశారు. అయితే ఆ ఆలోచన కార్యరూపం దాల్చ లేదు. ఈ నేపథ్యంలో ఈసారి మహాజాతర వరకు రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈవిషయంపై టూరిజం కార్పొరేషన్ ఏఈ విజయకుమార్ను వివరణ అడగగా జంపన్నవాగులో రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు తనకు సమాచారం తెలియదన్నారు. నేటి(శుక్రవారం) మధ్యాహ్నం కల్లా వివరాలు తెలుస్తాయన్నారు. వాగు అభివృద్ధి పనులకు నిధులు రూ. 5 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఆహ్లాదకరంగా మారనున్న స్నానఘట్టాలు -
అడవి నుంచి.. పుడమి తల్లి ఒడికి
టేకుమట్ల: గాజర్ల రవి.. పెత్తందార్లు, దొరల అరాచకాల నుంచి పీడిత ప్రజల విముక్తి కోసం మూడు దశాబ్దాలకు పైగా మావోయిస్టు సానుభూతిపరుడిగా, విద్యార్థి యూనియన్ నాయకుడిగా ఉద్యమంలోకి అడుగు పెట్టి దళ కమాండర్ బాధ్యతలు చేపట్టాడు. నాయకత్వ లక్షణాలు పునికి పుచ్చుకుని అన తి కాలంలోనే నార్త్ తెలంగాణ డివిజన్ కమిటీకి ఎన్నికై కేంద్ర కమిటీ సభ్యుడిగా, స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా కీలక బాధ్యతలు తీసుకుని ఉద్యమంలో నూతన ఒరవడికి నాంది పలికాడు. ఎన్నో కీలక ఆపరేషన్లు విజయవంతంగా చేపట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయడమే కాకుండా క్యాడర్ను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన గాజర్ల రవి 1992లో అడవి బాట పట్టాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో నేలకొరిగాడు. ఉద్యమాలే ఊపిరిగా.. కుటుంబ సభ్యుల కన్నా ఉద్యమాలే ఊపిరిగా, ప్ర జా శ్రేయస్సే ధ్యేయంగా మూడు దశాబ్దాలుగా అడ వి తల్లి ఒడిలో కాలం గడిపాడు. తల్లిదండ్రులను సైతం కాదని అడవి తల్లి చెంతకు చేరిన గాజర్ల రవి ఉద్యమ ప్రస్థానం బుధవారంతో ముగియడంతో శుక్రవారం పుడమి తల్లి ఒడికి చేరనున్నాడనని నా టి ఉద్యమకారులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరవుతున్నారు. రవి జ్ఞాపకార్థం వెలిశాలతోపాటు, పలు గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చివరి చూపు కోసం ఎదురుచూపు.. ఎన్కౌంటర్లో మావోయిస్టు నేత గాజర్ల రవి అలియాస్ గణేశ్ మృతి చెందాడనే సమాచారం సోషల్మీడియాలో దావానంలా వ్యాపించడంతో వెలిశాల ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రెండు రోజులుగా గాజర్ల రవి చివరి చూపు కోసం జిల్లా వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. గురువారం రాత్రి రంపచోడవరంలో పోస్టుమార్టం నిర్వహించారు. దీంతో సోదరులు గాజర్ల సమ్మయ్య, అశోక్.. రవి పార్థివదేహాన్ని స్వగ్రామం వెలిశాలకు తీసుకురానున్నారు. కాగా, బుధవారం నుంచే వెలిశాలలో పోలీసులు రెక్కీ నిర్వహిస్తున్నారు.నేడు మావోయిస్టు నేత గాజర్ల రవి అంత్యక్రియలు స్వగ్రామం వెలిశాలలో ఆయన జ్ఞాపకార్థం వెలిసిన ఫ్లెక్సీలు చివరి చూపు కోసం గ్రామస్తుల ఎదురుచూపుచర్చల సమయంలో చివరిగా చూశా.. 2004లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు మావోయిస్టులను చర్చలకు పిలువగా వరంగల్లో ఏర్పాటు చేసిన సమావేశానికి రవ(రవి)న్న చర్చల ప్రతినిధిగా వస్తున్నాడని తెలిసి వెళ్లా. ఎంతో మంది ప్రజలు హాజరైన కార్యక్రమంలో దూరం నుంచి చూశా. ఇప్పుడు విగత జీవిగా చూస్తామని అనుకోలేదు. –అచ్చె లచ్చన్న, మాజీ సర్పంచ్, రామకిష్టాపూర్(వి) -
ఆర్ట్స్ కాలేజీ డిగ్రీ సెమిస్టర్ల పరీక్షల ఫలితాలు విడుదల
కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ (అటానమస్)లో బీఏ, బీకాం, బీఎస్సీ 2,4,6 సెమిస్టర్ల పరీక్షల ఫలితాలను గురువారం కేయూ వీసీ ప్రతాప్రెడ్డి ఆ కళాశాలలో విడుదల చేశారు. రెండో సెమిస్టర్ పరీక్షలకు 1,236మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 620 మంది (50.16శాతం) ఉత్తీర్ణత సాధించారు. నాలుగో సెమిస్టర్ పరీక్షలకు 927మంది విద్యార్థులు హాజరుకాగా 540 మంది ఉత్తీర్ణత( 58.25శాతం) సాధించారు. అలాగే, ఆరో సెమిస్టర్ పరీక్షలకు 742 మంది విద్యార్థులు హాజరుకాగా 582 మంది (78.44శాతం) ఉత్తీర్ణత సాధించారని ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి తెలిపారు. కార్యక్రమంలో కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం, పరీ క్షల నియంత్రణాధికారి కె. రాజేందర్, ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి, వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్, ఆ కళాశాల పరీక్షల నియంత్రణాధికారి సుధీర్, గిరిప్రసాద్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు. -
పసుపు రైతుల ఆందోళన
వరంగల్ చౌరస్తా : తెలంగాణ రాష్ట్రంలోని ఇతర మార్కెట్లలో పసుపు క్వింటాల్కు ధర రూ. 12,500 పలుకుతుండగా, వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో రూ. 10వేల చొప్పన వ్యాపారులు కొనుగోలు చేస్తుండడంతో గురువారం రైతులు ఆందోళన చేపట్టారు. ధర పెంచే వరకూ అమ్మబోమని తేల్చిచెప్పారు. దీంతో కాంటాలు నిలిచాయి. వ్యాపారులు తమను దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ అధికారులు చొరవ చూపించినా రైతులు అంగీకరించలేదు. చివరకు మార్కెట్ కార్యదర్శి గుగులోత్ రెడ్డి జోక్యం చేసుకుని వ్యాపారులతో చర్చలు జరపగా, క్వాలిటీ పసుపునకే ఎక్కువ ధర చెల్లిస్తామని, లేనిపక్షంలో చెల్లించమని పేర్కొన్నారు. అనంతరం కార్యదర్శి రైతులతో మాట్లాడి సరైన ధరలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో కాంటాలు ప్రారంభమయ్యాయి. ధర వ్యత్యాసంతో వ్యాపారులపై అన్నదాతల అసహనం సర్దిచెప్పిన మార్కెట్ అధికారులు మధ్యాహ్నం తర్వాత ప్రారంభమైన కాంటాలు -
కలెక్టరేట్లో వివిధ శాఖల పరిశీలన
హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టరేట్లోని వివిధ శాఖల కార్యాలయాలను కలెక్టర్ స్నేహ శబరీష్ గురువారం సందర్శించారు. రెవెన్యూ, ఇతర విభాగాలను స్వయంగా సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఈసందర్భంగా కలెక్టరేట్లోని మహిళా క్యాంటీన్కు వెళ్లి అక్కడ న్యూస్ పేపర్లపై ఆహార పదార్థాలు ఉంచడం చూసి ఇలా.. ఉంచితే వాటి రంగు ఆహారపదార్థాలకు అంటుతుందని, ఆరోగ్యానికి హానికరమన్నారు. క్యాంటీన్లో అన్ని రకాల తినుబండారాలు, స్నాక్స్ నాణ్యంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఆదాయం ఎంత వస్తుంది? ఖర్చులు ఏంటి అనే విషయాల్ని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీఆర్ఓ వైవీ గణేశ్, ఏఓ గౌరీ శంకర్, తదితరులు ఉన్నారు. -
శిథిలావస్థలో భవనాలు.. సమస్యల నడుమ చదువులు
సాక్షిప్రతినిధి, వరంగల్/నెట్వర్క్ : సర్కారు బడి సమస్యల్లో కొట్టుమిట్టాడుతోంది. ఓ వైపు ప్రైవేట్తో పోటీ పడలేక.. మరోవైపు మౌలిక వసతుల లేమితో సతమతమవుతోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. బడిబాట, ఉపాధ్యాయుల ప్రచారాన్ని నమ్మి పాఠశాలల్లో చేరిన విద్యార్థులకు పూర్తి స్థాయిలో విద్య అందడం లేదు. చాలా పాఠశాలల్లో మౌలిక వసతులు కరువయ్యాయి. పారిశుధ్యం లోపించింది. కొన్ని పాఠశాలల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. మరికొన్ని విద్యార్థుల్లేక మూతబడ్డాయి. ఇంకొన్ని చోట్ల విద్యార్థులున్నప్పటికీ చదువు చెప్పే వారు లేరు. పలు చోట్ల మధ్యాహ్న భోజనం అస్తవ్యస్తంగా మారింది. ఇలా.. గ్రేటర్ పరిధిలోని ప్రతీ పాఠశాలను ఏదో ఒక సమస్య వేధిస్తున్నట్లు గురువారం ‘సాక్షి’ విజిట్లో తెలిసింది. ప్రధానంగా టాయ్లెట్స్ సమస్య.. పాఠశాలలు పునఃప్రారంభమై వారంరోజులైంది. హనుమకొండ జిల్లాలో విద్యార్థుల హాజరు 50నుంచి 60శాతం వరకే ఉంటోంది. ఇంకా అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రధానంగా టాయ్లెట్స్ సమస్య విద్యార్థులను వేధిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో మన ఊరు మనబడి ద్వారా చేపట్టిన పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. హనుమకొండ జిల్లాలో 492 ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలుండగా అందులో 19 స్కూళ్లలో అసలు టాయ్లెట్సే లేవు. మరికొన్నిచోట్ల సరిపడా లేవు. 154 పాఠశాలల్లో కిచన్ షెడ్లు లేవు. దీంతో మధ్యాహ్నం వంటకు ఇబ్బందులు తప్పడంలేదు. జిల్లాలో 41 పాఠశాలల్లో అసలే విద్యార్థులు లేరు. ● కాజీపేట అర్బన్: కాజీపేట మండలం అయోధ్యపురంలోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు 32 మంది విద్యార్థులు ఉన్నారు. ఇద్దరు టీచర్లు ఉండగా.. బోధనకు కేవలం రెండు తరగతి గదులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఒక గది శిథిలావస్థకు చేరుకుంది. ● విద్యారణ్యపురి: హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ ప్రాథమిక ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో 347మంది విద్యార్థులున్నారు. ఇంకా అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతున్నందున విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పాఠశాలలో హెచ్ఎంతో పాటు మరో ఏడుగురు ఎస్జీటీలు ఉన్నారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో మరో ఐదుగురిని వర్క్ అడ్జెస్ట్మెంట్ కింద గతేడాదిలో కేటాయించారు. 2 నుంచి 5వ తరగతి వరకు రెండు సెక్షన్ల చొప్పున ఉన్నాయి. దీంతో మరో ఇద్దరు ఉపాధ్యాయుల అవసరం ఉందని భావిస్తున్నారు. అలాగే హనుమకొండలోని సుబేదారి యూపీఎస్ ఉర్దూ మీడియం పాఠశాలలో అసంపూర్తి మరుగుదొడ్లు దర్శనమిస్తున్నాయి. గతంలో మన ఊరు–మనబడి కింద పనులు చేపట్టి వదిలేశారు. కొద్దిరోజుల క్రితం అమ్మ ఆదర్శ పథకం కింద మళ్లీ అవే పనులను చేపట్టారని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు.. లోపల బేసిన్స్ వేశారు. చుట్టూ టైల్స్ వేయాల్సింది. అదేవిధంగా కిచెన్ షెడ్డు లేదు. పాఠశాలలో 1నుంచి 7వ తరగతి వరకు 50మంది వరకు విద్యార్థులున్నారు. హెచ్ఎం, నలుగురు టీచర్లు పనిచేస్తున్నారు. టీచర్లుంటే విద్యార్థుల్లేరు.. విద్యార్థులుంటే టీచర్లు లేరు పలుచోట్ల మూతబడిన పాఠశాలలు అధ్వానంగా మూత్రశాలలు పాఠశాల ఆవరణలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం హసన్పర్తి: ఇది చింతగట్టు క్యాంప్లోని ప్రాథమిక పాఠశాల. గతేడాది ఈ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులుండగా.. ఇద్దరు ఉపాధ్యాయులు విధులు నిర్వహించారు. ఈఏడాది ఆవిద్యార్థులు మరో పాఠశాలలో చేరారు. దీంతో పాఠశాల మూత పడింది. 1980లో ఎస్సారెస్పీ ప్రాజెక్టు సందర్భంగా ఇక్కడ ప్రాథమిక పాఠశాల ఏర్పాటు కాగా.. అప్పుడు ప్రైవేట్ పాఠశాలలు లేకపోవడంతో చింతగట్టు క్యాంప్లో విధులు నిర్వహించిన ఉద్యోగులంతా తమ పిల్లలతో పాఠశాల కిటకిటలాడింది. ఇక్కడి ఉద్యోగుల బదిలీ అనంతరం విద్యార్థుల సంఖ్య పూర్తిగా తగ్గింది. విద్యార్థులు లేక ఉపాధ్యాయులు డిప్యుటేషన్పై ఇతర పాఠశాలకు వెళ్లారు.రోడ్డు దాటాలంటే భయం హన్మకొండ చౌరస్తా: హనుమకొండ 4వ డివిజన్ పరిధిలోని పెద్దమ్మగడ్డలోని పాలెం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు భయంభయంగా రోడ్డు దాటుతున్నారు. పెద్దమ్మగడ్డ, కేయూ బైపాస్ రోడ్డు ఇరుకుగా ఉండడం, వాహనాలతో రద్దీగా ప్రమాదకరంగా ఉంటుంది. ప్రతీ రోజు విద్యార్థులను ఉపాధ్యాయులే దగ్గరుండి ఇలా రోడ్డు దాటిస్తుంటారు. -
పసుపు రైతుల ఆందోళన
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం పసుపు రైతులు ఆందోళన చేశారు. ధర పెంచేవరకూ పసుపు అమ్మమని తేల్చిచెప్పారు. ● విద్యారణ్యపురి: హనుమకొండ సుబేదారి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 196 మంది విద్యార్థులున్నారు. గురువారం సాక్షి విజిట్ చేయగా 110 మంది హాజరయ్యారు. తరగతి గదులు సరిపడా ఉన్నాయి. కానీ, మరుగుదొడ్లు పూర్తిస్థాయిలో లేవు. గతంలో మన ఊరు మన బడి కింద రూ.4లక్షల వ్యయంతో బాలురకు, బాలికలకు వేర్వేరుగా రెండు యూనిట్ల టాయ్లెట్ల నిర్మించారు. కానీ, నిధులు విడుదల చేయకపోవడంతో అసంపూర్తిగానే వదిలివేశారు. పాఠశాల ఆవరణ లోతుగా ఉండడంతో వర్షం వస్తే నీళ్లు నిలిచిపోతున్నాయి. మొరం పోయాల్సిన అవసరం ఉంది. ఈ పాఠశాలలో హెచ్ఎంతోపాటు ఆరుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. -
ఆపరేషన్లలో దిట్ట..
గాజర్ల రవి 1985–1986లో వరంగల్లో ఐటీఐ చదువుతున్న క్రమంలోనే ఉద్యమాలకు ఆకర్షితుడై స్టూడెంట్ యూనియన్లో పనిచేశాడు. తన అన్న సారయ్య అప్పటికే క్రియాశీలకంగా నక్సల్స్ ఉద్యమంలో పనిచేస్తుండటంతో ఆ ప్రభావం రవిపై పడింది. దీంతో 1992లో ఉద్యమంలోకి వెళ్లిపోయాడు. పోలీసులపై దాడులు చేయడంలో దిట్టగా గాజర్ల రవి పేరొందాడు. ఆయన ఆపరేషన్ నిర్వహిస్తే ఫెయిల్ కాదన్న అభిప్రాయం ఉంది. ● 1994లో ప్రస్తుత జయశంకర్ జిల్లా పలిమెల మండలం లెంకలగడ్డలో ల్యాండ్మైన్ పేల్చి నలుగురు పోలీసులను చంపిన వారిలో రవి కీలకంగా వ్యవహరించాడు. ● 2001లో ఏటూరునాగారం పోలీస్స్టేషన్పై దాడి ఘటనలో ఉన్నాడు. ఇవే కాక పోలీసులు, గ్రేహౌండ్స్ బలగాలపై జరిపిన అనేక దాడుల్లో రవి కీలకంగా వ్యవహరించాడు. ● 2004లో మావోలతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చల్లో రవి కూడా ప్రతినిధిగా వ్యవహరించాడు. -
మంత్రి పొంగులేటి, సీఎస్ను కలిసిన కలెక్టర్
హన్మకొండ అర్బన్: రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్ బుధవారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు. అలాగే, సచివాలయంలోని సీఎస్ చాంబర్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావును కూడా మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. కేయూ హాస్టళ్ల డైరెక్టర్గా రాజ్కుమార్ కొనసాగింపుకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ హాస్టళ్ల డైరెక్టర్గా గణితశాస్త్ర విభాగం ప్రొఫెసర్ ఎల్పీ రాజ్కుమార్ను మరో సంవత్సరంపాటు కొనసాగిస్తూ రిజిస్ట్రార్ రామచంద్రం బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. రాజ్కుమార్ పదవీకాలం ముగియడతో మళ్లీ ఆయననే కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్రెడ్డి తన చాంబర్లో రిజిస్ట్రార్ రామచంద్రంతో కలిసి రాజ్కుమార్కు ఉత్తర్వులు అందజేశారు. నేటి నుంచి యథావిధిగా పలు రైళ్లు కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్ మీదుగా ప్రయాణించే పలు రైళ్లను ఇటీవల రద్దు చేయగా.. ఆ రైళ్లు గురువారం నుంచి యథావిధిగా నడుస్తున్నట్లు రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. కాజీపేట సబ్డివిజన్ పరిధిలోని బెల్లంపల్లి–రెచ్ని రోడ్డులో చేపట్టిన రైల్వే బ్లాక్ కారణంగా పలు రైళ్లను కొన్ని రోజులు రద్దు చేశారు. ఈ నెల 19వ తేదీ నుంచి యశ్వంత్పూర్–గోరఖ్పూర్ (22534) వెళ్లే ఎక్స్ప్రెస్, పాట్నా–చర్లపల్లి (03253) వెళ్లే ఎక్స్ప్రెస్, చర్లపల్లి–పాట్నా (07255) వెళ్లే ఎక్స్ప్రెస్లను యథావిఽధిగా నడుపనున్నట్లు కాజీపేట రైల్వే అధికారులు తెలిపారు. -
విద్యతోనే సమాజంలో గౌరవం
వరంగల్ కలెక్టర్ సత్యశారద ఖిలా వరంగల్: తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలని, విద్యతోనే సమాజంలో గౌరవ, మర్యాదలు ఉంటాయని కలెక్టర్ సత్యశారద సూచించారు. బుధవారం ఖిలావరంగల్ మండల పరిధిలోని కరీమాబాద్, మధ్యకోట బాలికల ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను డీఈఓతో కలిసి కలెక్టర్ సందర్శించారు. కరీమాబాద్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడంతోపాటు వారి చదువు సామర్థ్యాలు, పాఠశాల్లో రిజిస్టర్లు, తరగతి గదులు, మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు. కార్పొరేటర్లు బైరబోయిన ఉమ, మరుపల్లి రవి, ఎంఈఓ ప్రసాద్, హెచ్ఎం మాధవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బాలకార్మికులను గుర్తించి బడికి పంపాలి న్యూశాయంపేట: ఇటుక బట్టీలు, బీడీ, చిన్నతరహా పరిశ్రమలు, దుకాణాలను తనిఖీ చేసి బాలకార్మికులను గుర్తించి బడికి పంపేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, జిల్లా టాస్క్ఫోర్స్ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. కార్మిక శాఖ ఉప కమిషనర్ నారాయణస్వామి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, డీఈఓ జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు. యోగా దినోత్సవానికి ఏర్పాట్లు చేయండి ఈనెల 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈనెల 21, 24 తేదీల్లో వరంగల్ ఓసిటీ స్టేడియంలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్కు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా యోగా, జిల్లాస్థాయి స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్కు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. -
ఆట మొదలైంది..!
వరంగల్ అర్బన్: జీడబ్ల్యూఎంసీని గాడిలో పెట్టేందుకు కొత్త కమిషనర్ చాహత్ బాజ్పాయ్ సీరియస్గా దృష్టి సారించారు. బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల తర్వాత కదనరంగంలోకి దిగారు. తెల్ల వారు జామునుంచి పొద్దుపోయే వరకు ప్రజాక్షేత్రంలో ఉంటూనే.. మరోవైపు వివిధ విభాగాల అధికారులు, సిబ్బందితో సమీక్షలు, సమావేశాలు, ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. కమిషనర్ ఆకస్మిక తనిఖీలు, సందర్శనలతో నిద్ర, మాముళ్ల మత్తులో మునిగి తేలిన కొంతమంది అధికారులు, సిబ్బంది గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. గడువులోగా అభివృద్ధి పనులు పూర్తిచేయాలి అభివృద్ధి పనులను గడువులోగా పూర్తిచేయాలని కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులతో అభివృద్ధి పనుల పురోగతిపై ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా 66 డివిజన్లలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇన్చార్జ్ ఎస్ఈ శ్రీనివాస్, ఈఈలు రవికుమార్, సంతోష్బాబు, మధులత, స్మార్ట్ సిటీ పీఎంసీ ఆనంద్ ఓలేటి, తదితరులు పాల్గొన్నారు. నగరంలో తనిఖీలు.. నగరంలోని పలు ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించారు. హసన్పర్తి సమీపంలోని జంతువుల శస్త్రచికిత్స కేంద్రం వివరాలు, తిరుమల జంక్షన్ ప్రాంతంలో నాలా స్మార్ట్సిటీ పనుల పురోగతిని తెలుసుకున్నారు. బాలసముద్రంలో గ్రేటర్ నిర్వహిస్తున్న రెండు నర్సరీలు, గోకుల్నగర్లో రోడ్డు డ్రైన్, రాజాజీనగర్లో రిటైనింగ్ వాల్ పనులు, పైడిపల్లి, మడికొండలో రోడ్లను తనిఖీ చేశారు. రాంపూర్ డంపింగ్ యార్డును సందర్శించి బయోమైనింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం 45, 46 డివిజన్లలోని కడిపికొండ, రామన్నపేట ప్రాంతాలను ఆమె సందర్శించారు. వంద రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొని కమిషనర్ మాట్లాడారు. సీఎంహెచ్ఓ రాజారెడ్డి, వెటర్నరీ డాక్టర్ గోపాల్రావు, ఈఈ సంతోష్బాబు, ఏఈ రామన్న, శానిటరీ ఇన్స్పెక్టర్లు వెంకన్న, రవీందర్ పాల్గొన్నారు. కదనరంగంలోకి జీడబ్ల్యూఎంసీ కమిషనర్చాహత్ బాజ్పాయ్ తనిఖీలతో హాల్చల్.. అధికారులు, ఉద్యోగుల గుండెల్లో రైళ్లు -
ట్రై సిటీలో పెరుగుతున్న డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు
ఐదు నెలల్లో 254 మందికి జైలు కేసులు 8,482.. జరిమానా రూ.85,83,769 మైనర్ డ్రైవింగ్ కేసుల్లో జైలుకు 91మంది కోర్టు కానిస్టేబుళ్ల హవారోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం మద్యం మత్తు అని గుర్తించిన వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు ట్రై సిటీ(హనుమకొండ, కాజీపేట, వరంగల్) పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు ముమ్మరం చేశారు. సాయంత్రం 6 గంటల దాటితే ప్రధాన రోడ్లపై పోలీసులు ఎటువైపు నుంచి వచ్చి పరీక్షలు చేస్తారో తెలియని పరిస్థితి. ట్రైసిటీలోని మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో జనవరి నుంచి మే వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 8,482 నమోదు కాగా 85,83,769 రూపాయల వరకు జరిమానాలు చెల్లించారు. దీనిని బట్టి మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై పోలీసులు ఏ మేరకు కొరడా ఝుళిపిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. –వరంగల్ క్రైంజరిమానాలు.. జైలు జీవితమే..జనవరి నుంచి ఏప్రిల్ 30 వరకు హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడ్డ వాహనదారులకు రూ.28,96,960 జరిమానా విధించారు. ఇక కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.30,27,909, వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.26,58,900 జరిమానా విధించారు. దీంతోపాటు అధికంగా మద్యం సేవించిన 260మంది జైలుకు వెళ్లారు. మైనర్ల డ్రైవింగ్పై పోలీసుల ప్రత్యేక దృష్టిమైనర్లకు వాహనాలు అప్పగించవద్దని పోలీస్ అధికారులు తల్లిదండ్రులకు పదే పదే చెప్పిన ఎవరూ వినడం లేదు. వరంగల్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన సన్ప్రీత్ సింగ్ మైనర్ల డ్రైవింగ్పై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు పోలీసులకు పట్టుబడిన మైనర్ డ్రైవింగ్ కేసుల్లో 91 మంది జైలుకు వెళ్లారు. కోర్టు కానిస్టేబుళ్ల హవా..సందట్లో సడేమియాలాగా.. డ్రంకెన్ డ్రైవ్ కేసులు కొంతమంది పోలీస్ అధికారులకు కాసుల వర్షం కురిస్తున్నాయి. మద్యం తాగి పోలీసులకు దొరికిన విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని అనుకునే వారు పోలీసుల డిమాండ్లకు తలొగ్గుతున్నట్లు తెలుస్తోంది. ఇక కోర్టుకెళ్తే అక్కడి కోర్టు కానిస్టేబుళ్లు మరో దందాకు తెరలేపుతున్నారు. వాహనాల కాగితాలు లేవు.. రీడింగ్ ఎక్కువ వచ్చింది..అంటూ భయపెట్టి డిమాండ్ చేసి మరీ వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ట్రాఫిక్లో కోర్టు కానిస్టేబుళ్ల పోస్టుకు చాలా డిమాండ్ ఉండడంతో అదే పోస్టులో ఉండటానికి అధికారులు మారినప్పుడల్లా వారి ప్రయత్నాలు చాలా ఖరీదుగా ఉంటాయన్న ప్రచారం ఉంది. ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో.. నగరంలోని ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో సాయంత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. ప్రధాన ట్రాఫిక్ కూడళ్లతోపాటు వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లకు సమీపంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో వాహనాదారులు అక్కడ అమ్ముడు ఎందుకు...?; ఇక్కడ పరీక్షలు ఎందుకు చేస్తున్నారు అని అసహనం వ్యక్తం చేసిన ఘటనలు ఉన్నాయి. మోతాదుకు మించి మద్యం సేవించి పట్టుబడిన వాహనదారులకు మాత్రం జైలు జీవితం తప్పడం లేదు. మొత్తం కేసులు2,620జనవరిఫిబ్రవరిమార్చిఏప్రిల్మే2,7882,774జైలుకు..జనవరి నుంచి మే వరకు ట్రైసిటీలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో డ్రంకెన్ డ్రైవ్ కేసులు ఇలా.. -
మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం
వీ–హబ్ అసోసియేట్ డైరెక్టర్ ఊహ సజ్జ హన్మకొండ అర్బన్: జిల్లాలో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు వీ–హబ్ అసోసియేట్ డైరెక్టర్ ఊహ సజ్జ తెలిపారు. హనుమకొండ కలెక్టరేట్లో ఎస్హెచ్జీలు, మహిళా పారిశ్రామివేత్తలకు ‘ఎంఎస్ఎంఈ ర్యాంప్ ఉమెన్ యాక్సెలరేషన్ పథకం’పై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పథకం ద్వారా ఎంపికై న మహిళా పారిశ్రామివేత్తలు తమ వ్యాపారాలను అభివృద్ధిని చేసుకొని ఆదా యాన్ని పెంచుకునే అవకాశం లభిస్తుందని సూచించారు. ఇందులో భాగంగా టెక్స్టైల్, ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్, హస్తకళల రంగాల్లోని వ్యాపారులకు వ్యాపార నైపుణ్యాలపై శిక్షణ, ప్రొడక్ట్ డెవలప్మెంట్, సరఫరా, బ్రాండింగ్, మార్కెటింగ్ యా క్సెస్, క్రెడిట్ లింకేజీ మద్దతు అందుతుందని తెలిపారు. అనంతరం ఔత్సాహిక మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సదస్సులో డీఆర్డీఓ శ్రీనివాస్, ఇండస్ట్రీస్ జీఎం నవీన్కుమార్ పాల్గొన్నారు. -
వైద్యకళా శాలలకు
బుధవారం శ్రీ 18 శ్రీ జూన్ శ్రీ 2025– 8లోuమార్గదర్శకాలు పాటించని మెడికల్ కాలేజీలు ● కనీస వసతులు కరువు ● కొత్త మెడికల్ కాలేజీలతోపాటు కేఎంసీకీ షోకాజ్ ● 50నుంచి 70శాతం ఖాళీలతో నడుస్తున్న వైనం ● ఒక్క కేఎంసీలోనే ఖాళీగా 130 వైద్యపోస్టులు ● ప్రశ్నార్థకంగా కాలేజీల నిర్వహణ న్యూస్రీల్ -
నగర ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
వరంగల్ అర్బన్: అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ నగరవాసులకు మెరుగైన సేవలు అందించాలని మేయర్ గుండు సుధారాణి సూచించారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులు, సిబ్బందితో కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి మేయర్ సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు తమతమ విభాగాల పనితీరును వివరించారు. పారిశుద్ధ్య నిర్వహణ, వాహనాల మరమ్మతులు పక్కాగా చేపట్టాలని మేయర్, కమిషనర్లు ఆదేశించారు. వర్షాల సమయంలో నగరంలోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురి కాకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలన్నారు. సాధారణ, 15వ ఫైనాన్స్, స్టేట్ ఫైనాన్స్ తదితర నిధులతో చేపట్టిన, కొనసాగుతున్న పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. భవన నిర్మాణాలు, లే అవుట్ల అనుమతులు, ఎల్ఆర్ఎస్ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. హార్టికల్చర్ విభాగం ద్వారా నర్సరీల నిర్వహణ, అమృత్ 2.0, వన మహోత్సవం తదితర అంశాలపై సమీక్షించారు. అనంతరం 37 మంది సఫాయి మిత్ర కార్మికులకు, సెప్టిక్ ట్యాంక్ ఆపరేటర్లకు పీపీఈ కిట్లను అందజేశారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ జోనా, ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, ఇన్చార్జ్ ఎస్ఈ శ్రీనివాస్, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అనంతరం బాలసముద్రంలోని వెహికిల్ షెడ్డును తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్పాయ్ -
సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి
ఎంజీఎం : సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలని హనుమకొండ జిల్లా వైద్యాధికారి అప్పయ్య వైద్యాధికారులు, సిబ్బందికి సూచించారు. మంగళవారం హనుమకొండ కలెక్టరేట్లోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో హనుమకొండ పరిధిలోని పట్టణ ఆరోగ్య కేంద్రాలు, కడిపికొండ పీహెచ్సీకి చెందిన డాక్టర్లు, సూపర్వైజర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ.. స్టాప్ డయేరియా క్యాంపెయిన్లో భాగంగా 15 రోజులపాటు పిల్లలు అతిసార వ్యాధి బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, జింక్ ట్యాబెట్లు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. డెంగీ, మలేరియా కేసులు రాకుండా సంబంధిత విభాగాలతో సమన్వయం చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ పాజిటివ్ వచ్చిన ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో తప్పకుండా డ్రై డే పాటించేలా ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. టీబీ చికిత్స పొందుతున్న కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించాలని, వారి పోషణకు సంబంధించిన అవగాహన, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ విజయకుమార్, అదనపు డీఎంహెచ్ఓ, ఇన్చార్జ్ మలేరియా అధికారి డాక్టర్ మదన్మోహన్రావు, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి మహేందర్, జిల్లా టీబీ నియంత్రణ అధికారి హిమబిందు, ప్రోగ్రాం అధికారి ఇక్తాదర్ అహ్మద్, ఎన్సీడీ, మాతా శిశు సంక్షేమ రక్ష ప్రోగ్రాం అధికారి మంజుల, వైద్యాధికారులు పాల్గొన్నారు.హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య -
మారని ‘తూర్పు’ పోలీసుల తీరు
మరోసారి వివాదంలో వరంగల్ ఖాకీలుసాక్షి, వరంగల్ : వరంగల్ డివిజన్ పోలీసుల తీరు మారడం లేదు.. తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. తమ స్టేషన్ పరిధితోపాటు హద్దులు దాటి మరీ వరంగల్ తూర్పులోని ముఖ్య నేతకు బందోబస్తుగా వెళ్లడం దుమారం రేపుతోంది. గతంలో స్టేషన్ ఘన్పూర్లోని ఆలయానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళికి ఎస్కార్ట్గా వ్యవహరించిన మిల్స్ కాలనీ సీఐ మల్లయ్యను ఐజీ కార్యాలయానికి అటాచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ తరహాలోనే ఇటీవల వరంగల్ తూర్పులో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన కొండా మురళికి పోలీసుస్టేషన్లో తమ విధులు వదిలి బందోబస్తుగా వెళ్లిన వరంగల్ డివిజన్లోని ఏసీపీ, సీఐ, ఎస్సైల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడాన్ని సీరియస్గా తీసుకున్న వరంగల్ సీపీ సన్ప్రీత్సింగ్ వివరణ ఇవ్వాలంటూ మూడు రోజులక్రితం మెమో జారీచేయడం ఖాకీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మీపై ఎందుకు చర్య తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని, లేకపోతే కఠిన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు. ఈ అంశంపై ఆయా పోలీసు అధికారులు సీపీకి వివరణ ఇచ్చారు. వారిచ్చిన వివరణ ఆధారంగానే తదుపరి చర్యలుంటాయని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలోనూ మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో ఏసీపీ పాల్గొనడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. -
ఫొటో క్యాప్చర్ జరుగుతోందా?
హసన్పర్తి : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఫొటో క్యాప్చర్ జరుగుతోందా అని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్.. అధికారులను ప్రశ్నించారు. పెంబర్తిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను మంగళవారం కలెక్టర్ స్వయంగా పరిశీలించి, లబ్ధిదారులతో ముచ్చటించారు. పనులు ఏవిధంగా జరుగుతున్నాయని అడిగారు. రోజువారీగా మేసీ్త్రకి కూలి ఇచ్చి ఇళ్లు నిర్మించుకుంటున్నట్లు లబ్ధిదారులు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం దశల వారీగా ఫొటోలు తీయాలని సూచించారు. ఆ మేరకు బిల్లులు కూడా చెల్లింపులు జరుగుతాయని, పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. గృహ నిర్మాణశాఖ పీడీ రవీందర్ నాయక్, డీఈఈ సిద్దార్థ నాయక్, నాయబ్ తహసీల్దార్ రహీం, ఎంపీడీఓ కర్ణాకర్, మాజీ సర్పంచ్ పూల, యూత్ కాంగ్రెస్ నాయకుడు చరణ్, కారోబార్ సదానందం పాల్గొన్నారు. భూభారతితో సమస్యల పరిష్కారం: కలెక్టర్ భూభారతితో భూ సమస్యలు పరిష్కారమవుతాయని కలెక్టర్ స్నేహ శబరీష్ పేర్కొన్నారు. రెవెన్యూ సదస్సుల్లో భాగంగా సూదన్పల్లిలో నిర్వహించిన సభలో ఆమె పాల్గొన్నారు. స్థానిక రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. తెల్లకాగితంపై భూములు కొనుగోలు చేశామని, ఇప్పటివరకు పట్టాదారుగా పేర్లు నమోదు కాలేదని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఏదైనా సమస్య ఉంటే లిఖితపూర్వకంగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన -
మొక్కుబడిగా బడిబాట..!
విద్యారణ్యపురి : ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సదుపాయాలు కల్పిస్తూ.. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యాబోధన చేస్తున్నా తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు. ఇటీవల నిర్వహించిన బడిబాటలో పాఠశాలల్లో నమోదైన విద్యార్థుల సంఖ్యే ఇందుకు ఉదాహరణ. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ఈనెల19వ తేదీతో (గురువారం) ముగియనుంది. ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సదుపాయాలతోపాటు వివిధ అంశాలతో ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేసి ప్రచారం చేశారు. బడిబాటలో భాగంగా ర్యాలీలు, ఇంటింటికి వెళ్లి బడిఈడు పిల్లలను గుర్తించడం వారి పేర్లు నమోదు చేసుకోవటం వంటివి చేసి పాఠశాలల్లో చేర్పించాలనే ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు ప్రభ్వుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు కొనసాగుతున్నాయి. బడిబాట ముగింపు దశకు వచ్చినా అనుకున్న మేర విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం లేదనేది స్పష్టమవుతోంది. అసలు విద్యార్థులు లేని పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు ఎక్కువగా ఉన్న చోటికి సర్దుబాటు తప్పదని భావిస్తున్నారు. గురుకుల పాఠశాలల ప్రభావం.. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు కోసం బడిబాట నిర్వహించినా గురుకులాల్లోనే ఎక్కువగా విద్యార్థులు చేరుతున్నారనేది స్పష్టమవుతోంది. తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమ, బీసీ, మైనార్టీ గురుకులాలతో పాటు నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు కూడా అందుబాటులో ఉండటంతో అందులో చేర్పిస్తున్నారు. మరికొందరు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల వైపు వెళ్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేసేందుకు ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రీ ప్రైమ రీ తరగతులు ప్రారంభించారు. హనుమకొండలో 16, వరంగల్లో 13 పాఠశాలల్లో ప్రారంభించి అడ్మిషన్లు కల్పిస్తున్నారు. ఏ మేరకు ప్రవేశాలు పొందుతారనేది వేచి చూడాల్సిందే. హనుమకొండ జిల్లాలో 4,131 మంది ప్రవేశాలు హనుమకొండ జిల్లాలో 2025–26 విద్యాసంవత్సరానికి ఈనెల 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. బడిబాట కార్యక్రమం కూడా ముగియ వచ్చినా.. ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ తరగతుల్లో కలిపి మొత్తంగా 4,131మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఇందులో ఒకటో తరగతిలోనే 2,074మంది ప్రవేశం పొందారు. హనుమకొండ జిల్లాలో 492 ప్రైమరీ, జెడ్పీ ఉన్నత పాఠశాలలు ఉండగా అందులో 41 ప్రభుత్వ పాఠశాలల్లో అసలు విద్యార్థులే లేరు. బడిబాట కార్యక్రమం ద్వారా కనీసం పది మంది విద్యార్థులు చేరితే ఆయా పాఠశాలలను తెరిపిస్తామని డీఈఓ అవకాశం కల్పించారు. దీంతో ఏడు పాఠశాలల్లోనే కొద్దిమంది విద్యార్థులు ప్రవేశాలు పొందగా వాటిని తెరిచారు. విద్యార్థుల నమోదు లక్ష్యం నెరవేరేనా! ప్రభుత్వ స్కూళ్లపై గురుకులాల ప్రభావం హనుమకొండ జిల్లాలో 4,131 మంది.. వరంగల్లో 3,896 మంది విద్యార్థుల నమోదు వరంగల్ జిల్లాలో 3,896 మంది విద్యార్థులు వరంగల్ జిల్లావ్యాప్తంగా మంగళవారం వరకు 3,896 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. బడిబాటలో భాగంగా ఉపాధ్యాయులు విస్తృతంగా ప్రచారం నిర్వహించిన అనుకున్న మేర విద్యార్థుల నమోదు ప్రక్రియ కావడం లేదనేది స్పష్టమవుతోంది. జిల్లాలో ప్రైమరీ, జెడ్పీ ఉన్నత పాఠశాలలు 568 ఉండగా అందులో అసలు విద్యార్థులే లేని పాఠశాలలు 135 ఉన్నాయి. ఇప్పటి వరకు కేవలం నాలు గు పాఠశాలలే తెరుచుకున్నాయి. అసలే విద్యార్థులు లేని పాఠశాలల టీచర్లను విద్యార్థులు ఎక్కువగా ఉన్న పాఠశాలలకు సర్దుబాటు చేయనున్నారు. -
భూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: నేషనల్ గ్రీన్ఫీల్డ్ హైవే ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న భూనిర్వాసితులకు పెండింగ్లో ఉన్న నష్టపరిహారాన్ని చెల్లించేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద.. అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇన్నర్ రింగ్ రోడ్డు, నేషనల్ గ్రీన్ఫీల్డ్ హైవే, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు, ఆర్ఓబీ తదితర అభివృద్ధి పనులపై అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని, ఇన్నర్ రింగ్రోడ్డు పనులను ప్రాధాన్యతతో కొనసాగించాలన్నారు. టెక్స్టైల్ పార్కులో వరద ముంపు నివారణకు రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని సాంకేతికంగా మార్చేందుకు ప్రతిపాదనలు పంపించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. నిర్వాసితులకు ఉపాధి కల్పించాలి భూ నిర్వాసితులకు ఉపాధి కల్పించడానికి ఉపాధి శాఖ, జీఎం ఇండస్ట్రీయల్, డీఆర్డీఓ సమన్వయంతో పనిచేసి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు వరంగల్ కలెక్టర్ సూచించారు. సమీక్షలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సత్యపాల్రెడ్డి, ఉమారాణి, జోనల్ మేనేజర్ స్వామి, ఇరిగేషన్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, గీసుకొండ, సంగెం, నెక్కొండ, పర్వతగిరి తహసీల్దార్లు, నేషనల్ హైవే ప్రాజెక్టు మేనేజర్ పాల్గొన్నారు. -
ఈసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
రామన్నపేట : వరంగల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో టీజీఈసెట్–2025 కౌన్సెలింగ్ ప్రక్రియ మంగళవారం ప్రారంభమైనట్లు ప్రిన్సిపాల్, క్యాంప్ ఆఫీసర్ బైరి ప్రభాకర్ తెలిపారు. మొదటిరోజు 362 మంది విద్యార్థులు హెల్ప్లైన్ సెంటర్ వద్ద పేర్లు నమోదు చేసుకున్నారని వివరించారు. అధికారుల పర్యవేక్షణలో ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమైన సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ క్రమబద్ధంగా కొనసాగిందని తెలిపారు. రైతు భరోసా రూ.84.01 కోట్లు జమహన్మకొండ: వానాకాలం పెట్టుబడి సాయం రైతు భరోసా హనుమకొండ జిల్లాలో మంగళవారం 1,17,028 మంది రైతుల ఖాతాల్లో రూ.84.01 కోట్లు జమ అయ్యాయని జిల్లా వ్యవసాయాధికారి రవీందర్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. వారం రోజులపాటు ఈ ప్రక్రియ కొనసాగనుందని పేర్కొన్నారు. వరంగల్ జిల్లాలో.. న్యూశాయంపేట: వరంగల్ జిల్లాలోని రైతులకు మంగళవారం వరకు రైతుభరోసా నిధులు రూ.94కోట్ల వరకు నేరుగా వారి ఖాతాల్లో జమ చేసినట్లు కలెక్టర్ సత్యశారద తెలిపారు. ఇప్పటివరకు 1,29,542 మంది రైతులకు పెట్టుబడి సాయం జమైనట్లు పేర్కొన్నారు. వేదపాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులుహన్మకొండ కల్చరల్ : వరంగల్ శ్రీభద్రకాళి వేదపాఠశాలలో ప్రవేశానికి ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని అసిస్టెంట్ కమిషనర్, దేవాలయం ఈఓ శేషుభారతి మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. వేదపాఠశాలలో ప్రవేశానికి విద్యార్థులకు మాతృభాషలో చదవడం, రాయడం వచ్చి, 8నుంచి 12సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉపనయన సంస్కారం, ఉపాకర్మోత్సర్జనము పూర్తయినవారు అర్హులని పేర్కొన్నారు. అలాగే సంధ్యావందనం, అగ్నికార్యం, బ్రహ్మయజ్ఞం కంఠస్థమయి ఉండి స్వయంగా అనుష్టానం చేసుకోగల వారు, 10 సంస్కృత శబ్ధములు (7 విభక్తులు) కంఠస్థం అయిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. వరంగల్లోని శ్రీభద్రకాళి దేవస్థానంలోని వేదపాఠశాల కార్యాలయంలో నేటినుంచి దరఖాస్తులు ఇవ్వనున్నట్లు తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను 25వ తేదీవరకు అందజేయాలని కోరారు. పోలీస్ కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించొద్దువరంగల్ క్రైం: పోలీస్ కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించవద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ సూచించారు. హనుమకొండ, సుబేదారి, ఏనుమాముల పోలీస్స్టేషన్లతోపాటు సీసీఎస్, టాస్క్ఫోర్స్, యాంటీడ్రగ్స్ విభాగాల్లో బాధ్యతలు స్వీకరించిన ఇన్స్పెక్టర్లు శివకుమార్, రంజిత్, రాఘవేందర్, సత్యనారాయణరెడ్డి, సతీష్లు మంగళవారం సీపీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. అప్పగించిన పనులను సమర్థవంతంగా నిర్వర్తించాలని సీపీ వారికి సూచించారు. సహితా విద్యా దినోత్సవంవిద్యారణ్యపురి : బడిబాటలో భాగంగా మంగళవారం సహిత విద్యాదినోత్సవాన్ని నిర్వహించగా హనుమకొండ మండల కేంద్రంలోని భవిత కేంద్రాన్ని జిల్లా విద్యాశాఖాధికారి డి.వాసంతి సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. భవిత కేంద్రంలో విద్యార్థులకు కల్పి స్తున్న సదుపాయాలను వివరించారు. భవిత కేంద్రానికి సరఫరా చేసిన రూ.2లక్షల విలువచేసే సామగ్రిని డీఈఓ పరిశీలించారు. జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ కో ఆర్డినేటర్ బద్దం సుదర్శన్ రెడ్డి, ఎంఈఓ నెహ్రూ ఉన్నారు. -
ఎన్ఎంసీ గండం!
సాక్షిప్రతినిధి, వరంగల్/ఎంజీఎం: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన ఆనంతరం అప్పటి ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కళాశాల స్థాపనే లక్ష్యంగా ముందుకు సాగింది. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అప్పటికే ఉన్న కాకతీయ మెడికల్ కళాశాలకు అదనంగా జనగామ, నర్సంపేట, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్లలో మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ లక్ష్యం బాగానే ఉన్నా.. ఓ మెడికల్ కళాశాలకు ఏర్పాటు చేయడానికి ఎంతమంది సిబ్బంది ఉండాలి...? ఆ కళాశాలకు అనుబంధంగా ఉన్న ఆస్పత్రుల్లో పడకల సంఖ్య ఎంత...? దానికి అనుగుణంగా ఎలాంటి పరికరాలు ఉండాలి...? అన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆ మేరకు నియామకాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేయలేదు. వైద్యవిద్యార్థుల బోధనకు కావాల్సిన హాస్టల్ వసతులు? వైద్యానికి అవసరమైన పరికరాలు, బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు చేసి ఇవన్నీ సవ్యంగా ఉన్నప్పుడే మెడికల్ కళాశాల స్థాపనకు ప్రభుత్వం ముందడుగు వేయాలి. కానీ, అలాంటి విషయాలను ఏ మాత్రం పట్టించుకోకుండా అరకొర వసతులతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున మెడికల్ కళాశాలను నెలకొల్పి కొనసాగుతున్న క్రమంలో వసతుల కొరతను గుర్తించిన నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) సీరియస్ అయ్యింది. కేఎంసీతోపాటు ఉమ్మడి జిల్లాలోని భూపాలపల్లి, ములుగు, నర్సంపేట, మహబూబాబాద్, జనగామ కళాశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు ప్రస్తుతం ప్రభుత్వానికి, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులకు పెద్ద తలనొప్పిగా మారాయి. కేఎంసీలో లోపాలపై సీరియస్.. వైద్య కళాశాలల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)లో ఖాళీలు, లోపాలపై సీరియస్ అయ్యింది. ఎప్పుడో స్థాపించిన కాలేజీలోనూ నిబంధనల మేరకు వసతులు లేకపోవడం చూసి ఆశ్చర్యానికి గురైన ఎన్ఎంసీ.. నోటీసులు జారీ చేసింది. యూజీఎంఎస్ఆర్–2023 నిబంధనల ప్రకారం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కాలేజీల్లో మౌలిక వసతులు, అధ్యాపకులు, విద్యార్థుల ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ హాజరు, విద్యార్థులకు సరిపడా రోగులు, ప్రాక్టికల్స్కు కావాల్సిన మృతదేహాలు, ఇతర పరికరాలు, డిజిటల్ రికార్డింగ్, సీసీటీవీల ఏర్పాటు వంటి వాటిపైనా అసంతృప్తి వ్యక్తం చేసింది. ముఖ్యంగా విద్యార్థుల హాజరు, మౌలిక సదుపాయాల కల్పన, క్లినికల్ ట్రెయినింగ్ వంటి అంశాల్లో తీవ్ర ఉల్లంఘనలు ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరానికి కళాశాలలను కొనసాగించడమో.. రద్దు చేయడమో నిర్ధారించేందుకు విచారణకు హాజరు కావాలని ఆదేశించి, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కలకలం రేపుతోంది. నేడు తేలనున్న భవితవ్యం..ప్రభుత్వ వైద్య కళాశాల భవితవ్యం నేడు (బుధవారం)తేలనుంది. గుర్తించిన లోపాలు, షోకాజ్ నోటీసులపై సంజాయిషీ ఇవ్వాలని, ఇందుకోసం బుధవారం ఢిల్లీకి రావాలని ఆరోగ్యశాఖ కార్యదర్శి, డీఎంఈలను ఆదేశించింది. ఆ లోపాలను సరిచేస్తామని అన్ని కళాశాలలనుంచి హామీ పత్రాలు ఇవ్వనున్నారు. కానీ, వాటికి కూడా సంతృప్తి చెందక సీట్లు తగ్గిస్తారా? జరిమానాలు విధిస్తారా..? మందలించి వదిలేస్తారా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా ఢిల్లీలో పూర్తి వివరాలు సమర్పించేందుకు అన్ని జిల్లాల, మెడికల్ కళాశాలల డీన్లు/ప్రిన్సిపాళ్లు, మెడికల్ సూపరింటెండెంట్లతో డీఎంఈ సోమ, మంగళవారాల్లో సమావేశమై కళాశాలల సమగ్ర సమాచారం సేకరించారు. 130కి పైగా కీలక పోస్టులు ఖాళీ1955వ సంవత్సరంలో 50 సీట్లతో ప్రారంభమైన కాకతీయ మెడికల్ కళాశాల ప్రస్తుతం 250 ఎంబీబీఎస్, 100కుపైగా పీజీ సీట్లు, ఐదు సూపర్ స్పెషాలిటీ సీట్లతో కొనసాగుతోంది. కళాశాలలో వైద్యవిద్య బోధించేందుకు 22 విభాగాల బోధన సిబ్బందితో మరో 10 విభాగాల బోధనేతర సిబ్బంది పనిచేయాలి. మొత్తం ఈ విభాగంలో 250మంది వైద్యులు విధులు నిర్వర్తిస్తూ విద్యార్థులకు బోధన చేయాలి. ఇందులో ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి వైద్యులు ఉంటారు. ప్రస్తుతం కేఎంసీ అనుబంధంగా కొనసాగుతున్న ఎంజీఎం, సీకేఎం, ఆర్ఈహెచ్, జీఎంహెచ్ టీబీ ఆస్పత్రులు ఉన్నాయి. కేఎంసీలో ప్రొఫెసర్ స్థాయిలో 10కిపైగా, అసోసియేట్ స్థాయిలో 35కు పైగా, అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయిలో సుమారు 90కిపైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వైద్యవర్గాలు బహిరంగంగానే పేర్కొంటున్నారు. కొన్నేళ్లుగా కొనసాగుతున్న కేఎంసీ పరిస్థితి ఈ విధంగా ఉంటే రెండు, మూడేళ్ల క్రితం ఏర్పడిన నూతన కళాశాల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థమవుతుంది. -
పిట్టగూళ్లు, వరి కంకుల పంపిణీ
నయీంనగర్: మహర్షి గోశాల, ఎస్ఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో ఆదర్శ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రేటర్ వరంగల్ 53వ డివిజన్ ఆదర్శ కాలనీలో సోమవారం పిట్టగూళ్లు, వరికంకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాలనీ కమిటీ ప్రధాన కార్యదర్శి పరికిపండ్ల వేణు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో పిచ్చుకల పాత్ర గొప్పదని అన్నారు. నేటి ఆధునిక సమాజం కాంక్రీట్ జంగిల్గా మారడంతో పక్షులు తమ గూళ్లు కట్టుకోడానికి సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు. పిచ్చుక జాతి అంతరించిపోయే ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ఈ క్రమంలో వాటి సంరక్షణకు గూళ్ల పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో కాలనీ కమిటీ అధ్యక్షుడు తూడి విద్యాసాగర్ రెడ్డి, నర్సింహస్వామి, రమణయ్య, మంజుల, వనజ, తేరాల యుగంధర్, యాదగిరి, గోశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
పైకప్పు లేని మ్యాన్హోల్ కనిపించట్లేదా?
వరంగల్ అర్బన్: ‘పై కప్పు లేని మ్యాన్హోల్ కనిపింట్లేదా? ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు’ అని మేయర్ గుండు సుధారాణి శానిటేషన్ సిబ్బందిని మందలించారు. వరంగల్ ఎస్వీఎన్ రోడ్డు వెంకటేశ్వర ఆలయం వద్ద చిన్నపాటి వర్షానికే మోకాళ్ల లోతు నీళ్లు స్తంభించి వాహనదారులు, పాదచారులకు ఎదురవుతున్న ఇబ్బందులపై అందిన ఫిర్యాదుతో మేయర్ తనిఖీ చేశారు. పైకప్పులేని మ్యాన్ హోల్, పూడిక తీయని డ్రెయినేజీలను ఆమె పరిశీలించారు. పనితీరు మార్చుకోవాలని శానిటేషన్ సిబ్బందికి సూచించారు. ప్రతీ రోజు డ్రెయినేజీలోని పూడిక తీయాలని, ఏమైనా సమస్య ఉంటే ఇంజనీర్లతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. కమర్షియల్ దుకాణాదారులు డ్రెయినేజీల్లో, ఆరు బయట చెత్త వేస్తే జరిమానాలు విధించాలన్నారు. ఈతనిఖీల్లో ఎంహెచ్ఓ రాజేశ్, శానిటరీ సూపర్వైజర్ భాస్కర్ తదితరులు ఉన్నారు. శానిటేషన్ సిబ్బందిని మందలించిన మేయర్ సుధారాణి -
కాళోజీ యూనివర్సిటీ డిప్యూటీ రిజిస్ట్రార్గా కేశవ్
ఎంజీఎం : కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ డిప్యూటీ రిజిస్ట్రార్గా డాక్టర్ కేశవ్ నియమితులయ్యారు. నీట్ కౌన్సెలింగ్, అడ్మిషన్ల ప్రక్రియ కోసం ఐదుగురు అధికారులను డిప్యుటేషన్పై ఆరోగ్య విశ్వవిద్యాలయానికి కేటాయించారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మెదక్ ప్రభుత్వ వైద్య కళాశాల మైక్రోబయాలజీ ప్రొఫెసర్ డాక్టర్ జ్యోతి, నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాల ఆర్థో విభాగం అసో సియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కేశవ్, వరంగల్ ప్రభుత్వ ఆయుర్వేదిక్ కళాశాల ప్రొఫెసర్ డి.నాగలక్ష్మి, హైదరాబాద్ ఆర్హెచ్ఎఫ్ డబ్ల్యూటీసీ కార్యాలయ పర్యవేక్షకుడు ఎండి. ఫయాజ్, మహబూబాబాద్ ప్రభుత్వ న ర్సింగ్ కళాశాల పరిపాలన అధికారి బి.శ్రీనివాస్ను డిప్యుటేషన్పై కాళోజీ నారాయ ణరావు హెల్త్ యూనివర్సిటీకి కేటాయించారు. ఏడాది కాలం పాటు హెల్త్ యూనివర్సిటీలో విధులు నిర్వర్తించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
నిందితులను కఠినంగా శిక్షించాలి
ఖిలా వరంగల్: తన భూమిని కబ్జా చేశారంటూ వరంగల్ కరీమాబాద్కు చెందిన పోలెపాక కుమారస్వామి(55) మనస్తాపంతో ఈనెల 9వ తేదీన శరీరంపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో హైదరాబాద్లో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతి చెందగా.. సోమవారం సాయంత్రం వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై ఆర్టీఏ జంక్షన్ వద్ద కుమారస్వామి మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువులు ధర్నా నిర్వహించారు. కబ్జాకు పాల్పడిన బండి కుమారస్వామి, పులి రంజిత్ రెడ్డి, తాళ్ల మల్లేశంను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ విషయం తెలిసిన మామునూరు, మిల్స్కాలనీ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు. -
నేడు కేయూ పాలకమండలి సమావేశం
● అభివృద్ధి పనుల నిధుల కేటాయింపులకు ప్రతిపాదనలు కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పాలకమండలి సమావేశం నేడు (మంగళవారం) హైదరాబాద్లోని సచివాలయంలో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. తొలుత ఉదయం 10:30 గంటలకు ఫైనాన్స్ కమిటీ సమావేశం ఉంటుంది. కేయూ ప్రహరీకి రూ.20కోట్లు, పద్మాక్షి మహిళా హాస్టల్ డైనింగ్ హాల్ నిర్మాణానికి రూ.3.5కోట్ల నిధులతో చేపట్టేందుకు ప్రతిపాదించనున్నారు. అలాగే యూనివర్సిటీలోని వివిధ సెమినార్ హాల్స్ మరమ్మతులకు, కేయూ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల నిర్వహణకు, వచ్చే నెల 7వ తేదీన నిర్వహించనున్న కేయూ 23వ స్నాతకోత్సవ నిధుల వ్యయానికి కూడా ఫైనాన్స్ కమిటీ ఆమోదానికి ప్రతిపాదించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3గంటలకు కేయూ పాలకమండలి సమావేశం ఎజెండాలో పేర్కొన్న వివిధ అంశాలతోపాటు అభివృద్ధికి వెచ్చించే నిధులపై కూడా చర్చించి ఎన్ని ఆమోదం ఇస్తారో తెలియనుంది. వరంగల్ పశ్చిమ నియోజక వర్గానికి మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కు కేయూలోని భూమిని కేటాయించే విషయంపై కూడా పాలకమండలిలో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. సమావేశంలో వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా, ఉన్నత విద్యా కమిషనర్ శ్రీదేవ సేన, పాలక మండలి సభ్యులు, ఫైనాన్స్ సెక్రటరీ పాల్గొననున్నారు. -
పేదల ఆత్మగౌరవ ప్రతీక సొంతిల్లు
వరంగల్ చౌరస్తా : పేదల ఆత్మగౌరవ ప్రతిక సొంతిళ్లని, వారి కల సాకారం చేయడానికి ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తోందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ తూర్పు నియోజక వర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా అందులో వెరిఫికేషన్ పూర్తయిన 1,659 ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సోమవారం వరంగల్ ఓసిటీ లోని మంత్రి క్యాంపు కార్యాలయ ఆవరణలో మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. మిగతా లబ్ధిదారులకు త్వరలో అందచేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూంలకు బదులు ఇళ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తామని మాయ మాటలు చెప్పి పేదలకు అన్యాయం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీ నిరుపేద రూ. 5 లక్షలతో ఇల్లు నిర్మించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేరుస్తామని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పుష్కరాలకు ఆంధ్రప్రదేశ్కు నిధులు అధికంగా విడుదల చేసి, తెలంగాణపై వివక్ష చూపించారని విమర్శించారు. అనంతరం మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ సత్య శారద, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు మాట్లాడారు. కార్యక్రమంలో బల్దియా కమిషనర్ చాహత్ బాజ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డిప్యూటీ కమిషనర్ ప్రసునారాణి, నోడల్ అధికారి రామ్రెడ్డి, హౌసింగ్ పీడీ గణపతి, ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు. కాగా, ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీకి లబ్ధిదారులు పెద్ద ఎత్తున హాజరు కావడంతో క్యాంపు ఆఫీస్ కిక్కిరిసింది. సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో దేశాయిపేటకు చెందిన ఓ వ్యక్తి ఫిట్స్తో కింద పడిపోగా సల్ప గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. తొలి విడతలో 1,659 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ