breaking news
Hanamkonda District News
-
నేటి నుంచి విద్యావైజ్ఞానిక ప్రదర్శనలు : డీఈఓ గిరిరాజ్
విద్యారణ్యపురి: జిల్లా స్థాయి బాలబాలికల విద్యావైజ్ఞానిక ప్రదర్శనలు ఈనెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ గిరిరాజ్ గౌడ్ తెలిపారు. బుధవారం డీఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వికసిత్ భారత్, ఆత్మనిర్భర భారత్ కోసం శాస్త్ర సాంకేతిక, గణితం, ఇంజనీరింగ్ ప్రధాన ఇతివృత్తంగా ఈ ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. హనుమకొండ విద్యానగర్లోని సెయింట్ పీటర్స్ ఎడ్యూ స్కూల్లో ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా, విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను డీఈఓ ఆవిష్కరించారు. విలేకరుల సమావేశంలో జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాస స్వామి, సమగ్ర శిక్ష కో– ఆర్డినేటర్లు బద్దం సుదర్శన్రెడ్డి, బి.మహేశ్, బండారు మన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
కమిషనరేట్ పరిధిలో ఎన్నికలు విజయవంతం
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మూడు విడతలుగా జరిగిన పంచాయితీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ వెల్లడించారు. ఈనెల 11వ తేదీ నుంచి 17 వరకు మూడు విడతల్లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన అభ్యర్థులు, ప్రజలు, పోలీస్ అధికారులు, సిబ్బంది, ప్రభుత్వ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు డీసీపీ స్థాయి నుంచి హోంగార్డు స్థాయి వరకు మొత్తం 2 వేలకు పైగా పోలీసులు విధులు నిర్వహించారని తెలిపారు. కమిషనరేట్ పరిధిలో మొత్తం ఏడు చెక్పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించామని, గ్రామాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించడం ద్వారా రూ. 6.74 లక్షలు, 128 కేసుల్లో రూ.12.42 లక్షల విలువైన మద్యం సీసాలు, 49 కేసుల్లో రూ.1.27 లక్షల విలువైన 343 లీటర్ల గుడుంబా, రూ.1.23 లక్షల విలువైన గంజాయిని పోలీసులు వివిధ ప్రాంతాల్లో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల సందర్భంగా లైసెన్స్ కలిగిన 156 తుపాకులు స్వాధీనం చేసుకుని గత ఎన్నికల్లో గొడవలకు పాల్పడిన వ్యక్తులు, రౌడీషీటర్లు, అనుమానాస్పద వ్యక్తులకు సంబంధించి 432 కేసుల్లో మొత్తం 2,638 మందిని బైండోవర్ చేసినట్లు సీపీ తెలిపారు. పోలింగ్ కేంద్రాల పరిశీలన పోలీస్ కమిషనరేట్ పరిధిలో బుధవారం నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను సీపీ సన్ ప్రీతిసింగ్ సందర్శించారు. పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లు ఎన్నికల తీరుతెన్నులను అధికారులతో కలిసి సమీక్షించారు. పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ -
కల్పలత సూపర్ బజార్పై సమగ్ర దర్యాప్తు
హన్మకొండ: కల్పలత కో–ఆపరేటివ్ స్టోర్స్ (కల్పలత సూపర్ బజార్)పై సమగ్ర దర్యాప్తునకు హనుమకొండ జిల్లా సహకార అధికారి బి.సంజీవరెడ్డి ఆదేశాలు జారీ జేశారు. ఈమేరకు ఆర్సీ నంబర్ 2518/2025–బి, తేదీ 17–12–2025తో ప్రొసీడింగ్ జారీ చేశారు. కల్పలత కో–ఆపరేటివ్ స్టోర్స్లో అక్రమాలు, అవకతవకలు జరిగాయని వచ్చిన ఫిర్యాదు మేరకు ప్రాథమిక విచారణ జరుపగా ఆర్థిక అవకతవకలు, అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. దీంతో తెలంగాణ స్టేట్ కో–ఆపరేటివ్ సొసైటీస్ చట్టం సెక్షన్ 51 ప్రకారం సమగ్ర దర్యాప్తుకు జిల్లా సహకార అధికారి ఆదేశాలు జారీ చేశారు. పరకాల సర్కిల్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎన్.శ్రీనివాస్ రావును విచారణ అధికారిగా నియమించారు. 30 రోజుల్లో నివేదిక సమర్పించాలని సూచించారు. హన్మకొండ అర్బన్: ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాల భర్తీకి ఈనెల 20న (శనివారం) జాబ్ మేళా నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా ఉపాధి కల్పన అధికారి యం.మల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు. కాజీపేటలోని హెచ్ఆర్హెచ్, వరంగల్లోని కార్స్ ఫిన్టెక్, వెస్ట్ సైడ్, విజయ ఫర్టిలైజర్స్, హైదరాబాద్లోని నికోమాక్, హెట్రో ప్రొడక్షన్, గ్రోవెల్ ఫీడ్స్ కంపెనీల్లో టెలీకాలర్స్, రిటైల్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, హెల్పర్, ప్రొడక్షన్, మార్కెటింగ్ శాఖలోని 70 ఉద్యోగాల భర్తీకి ఈ జాబ్మేళా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 78933 94393 నంబర్లో సంప్రదించాలని సూచించారు. కాజీపేట అర్బన్: స్మార్ట్ ఇండియా హ్యాకథాన్–25 పోటీల్లో నిట్ వరంగల్ విద్యార్థులు ప్రథమ బహుమతి సాధించి సత్తాచాటారు. నిట్ వరంగల్ క్యాంపస్లోని డైరెక్టర్ కార్యాలయంలో నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ హ్యాకథాన్–25లో ప్రథమ స్థానంలో నిలిచిన ది సిక్స్త్ సెన్స్ టీంను అభినందించి మాట్లాడారు. జైపూర్లోని మణిపాల్ యూనివర్సిటీలో ఈనెల 8 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించిన స్మార్ట్ ఇండియా హ్యాకథాన్–25లో నిట్ వరంగల్కు చెందిన బీటెక్ విద్యార్థులు వత్సల్ సైనీ, కలాష్ జైన్, ముదిత్ శర్మ, రోమ సునీల్ధర్, రాజ్శేఖర్సింగ్, దృవ్ కర్నాకర్లు ది సిక్స్త్ సెన్స్ టీంగా పాల్గొన్నారు. 36 గంటల పాటు కోడింగ్ మారథాన్ పోటీల్లో నిట్ విద్యార్థులు గ్రాండ్ఫైనల్కు చేరుకుని ప్రథమ స్థానం సాధించడం అభినందనీయమన్నారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ ఇంటర్ కాలేజీయెట్ అథ్లెటిక్ మీట్–2025(పర్ మెన్, అండ్ ఉమెన్) ఈనెల 19, 20 తేదీల్లో నిర్వహించనున్నట్లు స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ ఆచార్య వై.వెంకయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్.కుమారస్వామి బుధవారం తెలిపారు. కేయూ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలోని డిగ్రీ, పీజీ కళాశాలల క్రీడాకారులు పాల్గొననున్నట్లు తెలిపారు. -
మూడో విడత ప్రశాంతం
సాక్షి, వరంగల్/హన్మకొండ అర్బన్: వరంగల్, హనుమకొండ జిల్లాల్లో మూడు విడతల్లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. హనుమకొండ జిల్లాలో మూడో విడతలో 86.44 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దామెర, నడికూడ, శాయంపేట మండలాల్లో మొత్తం 1,11,341 మంది ఓటర్లు ఉండగా.. 96,239 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒంటి గంట వరకు పోలింగ్ ముగిసిన తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుంచి లెక్కింపు చేపట్టిన అధికారులు ఫలితాలు వెల్లడించారు. పోలింగ్, ఫలితాల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. విజయోత్సవాలకు అనుమతి అనుమతి లేకపోయినా గెలిచిన అభ్యర్థుల ఆనందో త్సాహాలు అడ్డుకునే పరిస్థితి కనిపించలేదు. వరంగల్ జిల్లాలో తొలి, రెండు దశలను మించి పెరిగిన ఓటింగ్ శాతం వరంగల్ జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. చెన్నారావుపేట, ఖానాపురం, నర్సంపేట, నెక్కొండ మండలాల్లోని 946 పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. నాలుగు మండలాల్లో 60,987 మంది పురుషులకు 53,959 మంది, 63,561 మంది మహిళలకు 55,908 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే పురుషులు 88.47 శాతం వినియోగించుకుంటే మహిళలు కాస్త తక్కువగా 87.95 శాతం ఓటేశారు. మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నా కూడా ఓటు హక్కు వినియోగంలో పురుషులే ముందున్నారు. 1,24,555 మంది ఓటర్లకు 1,09,870 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొన్నిచోట్ల మధ్యాహ్నం ఒంటిగంటలోపు క్యూలో నిలుచున్న ఓటర్లకు అవకాశం ఇవ్వగా.. మధ్యాహ్నం 2 నుంచి 2.30 గంటల వరకు కొనసాగింది. కొన్నిచోట్ల ఓటరు స్లిప్పులు లేక ఇబ్బందులు పడడం, ఒకటి రెండు చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకోగా పోలీసులు ఇరువర్గాలను చెదరగొ ట్టారు.ఇవి మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఊపిరి పీల్చుకున్న అధికార యంత్రాంగం హనుమకొండ జిల్లాలో 86.44 శాతం, వరంగల్జిల్లాలో 88.21 శాతం నమోదు సంబురాల్లో మునిగిన విజేతలు -
చిన్నారుల్లో సృజనాత్మకత పెంపొందించాలి
మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: పిల్లల్లో సృజనాత్మకత కలిగించేలా ప్రణాళికలు రూపొందించాలని మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని మేయర్ చాంబర్లో మేయర్, కమిషనర్, డబ్ల్యూఆర్ఐ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. నర్చరింగ్ నైబర్ హుడ్ ఛాలెంజ్లో భాగంగా నగరంలో 0–5 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లల మానసిక వికాసం పక్వతపై దృష్టి సారించాలని డబ్ల్యూఆర్ఐ ప్రతినిధులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన కార్యక్రమాల ఫొటోలు వీడియోలను మేయర్, కమిషనర్ ఎదుట ప్రదర్శించి వివరించారు. బల్దియా అధికారులను ప్రధాన భాగస్వామ్యం చేస్తూ రెండు వర్క్షాప్లు నిర్వహించి అవగాహన కలిగించాలని కోరారు. సమావేశంలో ఎస్ఈ సత్యనారాయణ, ఈఈ రవికుమార్, డీఈ కార్తీక్రెడ్డి, డబ్ల్యూఆర్ఐ ప్రతినిధులు సోహానీ గుప్తా, ఎలెన్ వీఎల్ఎఫ్ ఫౌండేషన్ ప్రతినిధి అమీర్ తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవానికి సిద్ధం చేయండిబల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అనిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) కేంద్రంలో నూతన యూనిట్ (షెడ్డు) ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. బుధవారం హసన్పర్తి భీమారం సమీపంలో ఎస్ఆర్ఎస్పీ వద్ద బల్దియా నిర్మించిన ఏబీసీ కేంద్రంతో పాటు, హనుమకొండ పరిధిలో ఇటీవల నిర్మించిన సీసీ రోడ్లకు బిల్లుల చెల్లింపుల కోసం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం హనుమకొండ పరిధి 56వ డివిజన్ పరిమళ కాలనీ, 60వ డివిజన్ టీచర్స్ కాలనీ ఫేజ్–2తో పాటు 61వ డివిజన్ ప్రశాంత్నగర్ డాక్టర్ కాలనీ, 49వ డివిజన్ జూలై వాడ ప్రాంతాల్లో నిర్మించిన సీసీ రోడ్లను కొలతలు వేసి పరిశీలించి నిర్మాణ తీరుపై సంతప్తి వ్యక్తం చేశారు. ఈ తనిఖీల్లో ఈఈ రవికుమార్, డీఈలు సారంగం, రవికిరణ్, వర్క్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. -
హస్తం గెలిచి.. కారు నిలిచి
మూడో దశ ఎన్నికల్లో హనుమకొండ జిల్లాలో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారుల విజయంసాక్షి, ప్రతినిధి, వరంగల్: హనుమకొండ జిల్లాలో బుధవారం జరిగిన మూడో దశ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు మెజార్టీ స్థానాల్లో గెలిస్తే...బీఆర్ఎస్ పార్టీ కూడా తామేమీ తక్కువకాదంటూ గట్టి పోటీనిచ్చింది. ఆత్మకూరు, నడికూడ, దామెర, శాయంపేట మండలాల్లోని 68 పంచాయితీల్లో 37 మంది కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే...22 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు విజయఢంకా మోగించారు. బీజేపీ పార్టీ నాలుగు, స్వతంత్రులు ఐదు స్థానాల్లో నెగ్గారు. ఈ ఐదుగురు స్వతంత్రుల్లో శాయంపేట, పత్తిపాక, తెహరపూర్ పంచాయితీల్లో ముగ్గురు కాంగ్రెస్ రెబల్స్ ఉన్నారు. పరకాల నియోజకవర్గంలోనే ఈ నాలుగు మండలాలు ఉండడంతో ఎమ్మెల్యే రేవూరికి కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు గెలవడం కాస్త సంతృప్తినిచ్చినా, బీఆర్ఎస్ కూడా ప్రభావం చూపడం హస్తం పార్టీ శ్రేణులను కలవరపరుస్తోంది. వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరగనుండడంతో అప్పటివరకు ఎక్కడా బలహీనంగా ఉన్నామో, అందుకు గల కారణాలు విశ్లేషించుకొని ముందుకెళ్లాలన్న చర్చ కార్యకర్తల్లో జరుగుతోంది. పట్టు నిలుపుకున్న డీసీసీ అధ్యక్షుడు ఆత్మకూరు: హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి స్వగ్రామం ఆత్మకూరులో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి పర్వతగిరి మహేశ్వరి గెలుపొందారు. మహేశ్వరి గెలుపు కోసం వెంకట్రామ్రెడ్డి ప్రచారం నిర్వహించారు. తన మద్దతుదారు గెలవడంతో వెంకట్రామ్రెడ్డి అభినందనలు తెలిపారు. మహేశ్వరి గెలుపు సొంత గ్రామంలో డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న తనకు తొలి విజయమని ఆయన పేర్కొన్నారు. వరంగల్లో హస్తం హవా సాక్షి, వరంగల్: పంచాయతీ మూడో విడత పోరులో కాంగ్రెస్ మద్దతుదారులు మెజారిటీ స్థానాల్లో గెలుపొందారు. చెన్నారావుపేట, ఖానాపురం, నర్సంపేట, నెక్కొండ మండలాల్లో బుధవారం జరిగిన ఎన్నికల్లో 109 పంచాయతీల్లో 72 మంది కాంగ్రెస్ మద్దతుదారులు గెలిస్తే.. 33 మంది బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించారు. బీజేపీ ఖాతా కూడా తెరవలేకపోయింది. నలుగురు స్వతంత్ర అభ్యర్థులు విజయబావుటా ఎగురవేశారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సొంత మండలం చెన్నారావుపేట మండలంలో 30 పంచాయతీలకు 22 స్థానాలు కాంగ్రెస్ దక్కించుకుంది. ఏడు స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్ 6 మేజర్, పెద్ద పంచాయతీల్లో పాగా వేయడం కాస్త ప్రతికూలమనే చర్చ జరుగుతోంది. చెన్నారావుపేట, పాపాయిపేట, జల్లీ, లింగగిరి, తిమ్మరాయినిపహాడ్ మేజర్, ఎక్కువ ఓటర్లున్న గ్రామ పంచాయతీలను బీఆర్ఎస్ కై వసం చేసుకుంది. ముఖ్యంగా చెన్నారావుపేట మేజర్ గ్రామ పంచాయతీలో 11 వార్డులు కాంగ్రెస్ గెలుచుకున్నా.. సర్పంచ్ మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి గెలవడం పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. అయితే దొంతి సొంతూరు అమీనాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి ధారా రజిత విజయం సాధించడం కాస్త ఊరటనిచ్చినట్లయ్యింది. ఖానాపురం మేజర్ గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ గెలవగా, నర్సంపేట, నెక్కొండ మండలాల్లోని పెద్ద పంచాయతీల్లో హస్తం పైచేయి సాధించింది. మూడో విడత ఫలితాలు..హనుమకొండ జిల్లాలో.. మండలం పంచాయతీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇతరులుఆత్మకూరు 16 10 4 1 1 నడికూడ 14 08 06 0 0 దామెర 14 04 08 02 0 శాయంపేట 24 15 04 01 04 మొత్తం 68 37 22 4 5 వరంగల్ జిల్లాలో..చెన్నారావుపేట 30 22 7 0 01 ఖానాపూర్ 21 12 09 0 0 నర్సంపేట 19 11 06 0 02 నెక్కొండ 39 27 11 0 01 మొత్తం 109 72 33 0 04 దామెర మండలంలో బీఆర్ఎస్ జోరు, నడికూడలోనూ ప్రభావం శాయంపేట: 24 పంచాయితీల్లో 15 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు వరంగల్ 66 స్థానాల్లో కాంగ్రెస్, 34చోట్ల బీఆర్ఎస్ విజయం -
వీకర్స్ కాలనీకి రోడ్డు వేయండి
వరంగల్: వరంగల్ ఓసిటీ ఇండోర్ స్టేడియం ఎదుట ఉన్న వీకర్స్ కాలనీకి వెంటనే సీసీ రోడ్డు వేయాలని మంత్రి కొండా సురేఖ కలెక్టర్ డాక్టర్ సత్యశారదను ఆదేశించినట్లు కాలనీ ప్రతినిధులు తెలిపారు. మంగళవారం మంత్రి క్యాంపు ఆఫీస్లో జరిగిన గ్రీవెన్స్లో కాలనీ వాసులు కలసి వినతి పత్రం అందించారు. తమ కాలనీలోకి వెళ్లే ప్రధాన రోడ్డును స్థానిక కార్పొరేటర్ 2010లో సొసైటీ సభ్యులతో కుమ్మకై ్క పాట్లుగా చేసి అమ్ముకున్నారని మంత్రికి వివరించారు. ఆ రహదారిని మూసేయడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన మంత్రి కలెక్టర్కు ఫోన్ చేసి రహదారిపై విచారణ జరిపించి అట్టి స్థలాన్ని స్వాధీనం చేసుకుని కాలనీవాసుల కోసం రోడ్డు నిర్మించాలని ఆదేశించారు. జంక్షన్ను అభివృద్ధి చేయాలి.. కాశిబుగ్గ అంబేడ్కర్ విగ్రహం చుట్టూ గ్రీనరీ ఏర్పాటు చేయాలని, ఈ రహదారిని అంబేడ్కర్ మార్గ్గా వాడుకలోకి తీసుకురావాలని తెలంగాణ అంబేడ్కర్ సంఘం వ్యవస్థాపకులు జన్ను భాస్కర్, సలహాదారులు ఖల్నాయక్, ప్రధాన కార్యదర్శి వస్కుల విజయ్ మంత్రికి వినతి పత్రం ఇచ్చారు. కలెక్టర్కు మంత్రి సురేఖ ఆదేశాలు గ్రీవెన్స్కు ఫిర్యాదుల వెల్లువ -
కల్పలత కో–ఆపరేటివ్ సొసైటీలో కుంభకోణం
రామన్నపేట: హనుమకొండ జిల్లా ది కో–ఆపరేటివ్ స్టోర్స్ లిమిటెడ్ కల్పలత సూపర్ బజార్ కార్యాలయాన్ని మంగళవారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి తనిఖీ చేశారు. కార్యాలయంలో సిబ్బంది లేకపోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రిజిస్టర్లో ఏడుగురు సిబ్బంది ఉన్నప్పటికీ కేవలం ముగ్గురు మాత్రమే హాజరుకావడం, అందులో ఇద్దరు మాత్రమే విధుల్లో ఉండడంపై ధ్వజమెత్తారు. రిజిస్టర్, జమ, ఖర్చులు, తదితర రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించారు. కలెక్టర్ దృష్టికి.. గత పాలకుల సమయంలో సభ్యత్వ నమోదులో ఆర్థికపరమైన అవకతవకలు జరిగాయని ఎమ్మెల్యే నాయిని గుర్తించారు. సభ్యత్వ నమోదుకు చెల్లించిన రుసుము మొత్తాన్ని పక్కదారి పట్టించి వాటికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకుండా చేశారని తెలుసుకున్నారు. పాలకమండలి సభ్యులు తమ స్వప్రయోజనాలకు ఉపయోగించిన డీజిల్, పెట్రోల్ గడిచిన 3 ఏళ్లుగా చెల్లించలేదని, కో–ఆపరేటివ్ ఆధీనంలో నడుస్తున్న పెట్రోల్ బంక్లో 10 మంది సిబ్బంది పేరుతో నెలకు రూ.10 వేల చొప్పున జీతాలు తీసుకుంటున్నారని, వారి వివరాలు రిజిస్టర్లో ఉన్నప్పటికీ వారి సంతకాలు లేవని తనిఖీల్లో గుర్తించారు. ఈ విషయాన్ని కలెక్టర్కు ఫోన్ చేసి కార్యాలయంలో రిజిస్టర్లను వెంటనే జప్తు చేయాలని ఫిర్యాదు చేశారు. దీంతో రెవెన్యూ అధికారులు ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చాలా రోజులుగా కల్ప లత సూపర్ బజార్లో జరుగుతున్న అవకతవకలు తన దృష్టికి వస్తున్నాయన్నారు. ఇక్కడ జరిగిన కుంభకోణంపై వెంటనే విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరినట్లు తెలిపారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి లేని బస్సుల పేరిట బిల్లులు, లేని ఉద్యోగులను సృష్టించి జీతాలు వసూలు రికార్డులు స్వాధీనం చేసుకుని విచారించిన అధికారులు -
తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించాలి
వరంగల్ అర్బన్: ఇంటింటా తడి, పొడి చెత్త వేరు చేసేలా కాలనీల్లో అవగాహన కల్పించాలని బల్ది యా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. మంగళవారం వరంగల్లోని 25, 26వ డివిజన్లలో కమి షనర్ క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య విధానాలు తనిఖీ చేశారు. ఈసందర్భంగా రెండు కాలనీల్లో పర్యటించి స్వచ్ఛ ఆటోల పనితీరును, 26వ డివిజన్ లక్ష్మీపురంలోని కమేలాను పరిశీలించారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో కొనసాగుతున్న పనులు పరిశీలించారు. ఎంహెచ్ఓ రాజేశ్, ఏసీపీ ఖలీల్, శానిటరీ సూపర్వైజర్ భాస్కర్, ఏఈ హబీబ్, టీఎంసీ రమేశ్, కమ్యూనిటీ ఆర్గనైజర్ అలీ పాల్గొన్నారు. -
నేడే తుది సం‘గ్రామం’
సాక్షి, వరంగల్/హన్మకొండ అర్బన్: వరంగల్, హనుమకొండ జిల్లాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే రెండు విడతలుగా పూర్తికాగా, బుధవారం మూడో విడతలో హనుమకొండ జిల్లాలో ఆత్మకూరు, దామెర, నడికూడ, శాయంపేట మండలాలు, వరంగల్ జిల్లాలో ఖానాపురం, చెన్నారావుపేట, నర్సంపేట, నెక్కొండ మండలాల్లో పోలింగ్ జరగనుంది. ఈ మేరకు ఆయా జిల్లాల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయా మండలకేంద్రాల్లో మంగళవారం ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలనుంచి సిబ్బంది పోలింగ్ సామగ్రిని తీసుకుని వారికి కేటాయించిన గ్రామాలకు తరలివెళ్లారు. పోలింగ్ బూత్లను సిద్ధం చేసుకున్నారు. బుధవరం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ కొనసాగనుంది. తదనంతరం లెక్కింపు, విజేతలను ప్రకటిస్తారు. హనుమకొండ జిల్లాలో.. 68 గ్రామ పంచాయతీల్లో ఒక గ్రామ పంచాయతీ, 634 వార్డులకు 71 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 67 గ్రామ పంచాయతీలు, 563 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. సర్పంచ్ స్థానాలకు 230 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 1,424 మంది బరిలో ఉన్నారు. 666 పోలింగ్ కేంద్రాలు, 897 అదనపు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పురుషులు 54,293, మహిళలు 57,528, ఇతరులు ఒకరు మొత్తంగా 1,11,822 ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్తో పాటు జిల్లా ఎన్నికల పరిశీలకుడు శివకుమార్నాయుడు, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ పోలింగ్ సామగ్రి పంపిణీ, పోలింగ్ కేంద్రాలను సందర్శించి సిబ్బందికి సూచనలు చేశారు. వరంగల్ జిల్లాలో... జిల్లాలో మొత్తం 102 పంచాయతీలకు 312 మంది, 890 వార్డుల కోసం 1,974 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. చెన్నారావుపేట మండలం చెరువుకొమ్ముతండాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య గొడవలు, దాడులు జరగడంతో అప్రమత్తమైన పోలీసులు ఎక్కడ గొడవలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 1,28,756 మంది ఓటర్లు ఉండగా అందులో 63,059 మంది పురుషులు, 65,690 మంది మహిళలు, ఏడుగురు ఇతరులు ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరిగే నాలుగు మండలాలు నర్సంపేట నియోజకవర్గంలోనే ఉండడంతో ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటాపోటీ వాతావరణం ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సొంతూరు చెన్నారావుపేట మండలం అమీనాబాద్ పంచాయతీ ఫలితం కూడా జనాల్లో ఆసక్తిని రేపుతోంది. -
గ్రామాలను అభివృద్ధి చేయాలి : ఎర్రబెల్లి
హన్మకొండ: నూతన సర్పంచ్లు నిబద్ధతతో పనిచేసి గ్రామాలను అభివృద్ధి చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు. మంగళవారం హనుమకొండ రాంనగర్లోని స్వగృహంలో పర్వతగిరి, వర్ధన్నపేట, ఐనవోలు, హసన్పర్తి మండలాల్లో బీఆర్ఎస్ మద్దతుతో విజయం సాధించిన నూతన సర్పంచ్లను ఎర్రబెల్లి దయాకర్రావు శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సహకరించకపోయినా సర్పంచ్లు ధైర్యంగా ఉండండి.. మీ వెనుక పార్టీ, కేసీఆర్, తాను ఉన్నాను.. ప్రజల పక్షాన కొట్లాడి నిధులు సాధించుకుందామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా తట్టుకుని బీఆర్ఎస్ మద్దతుదారులు విజయం సాధించారని తెలిపారు. మేజర్ గ్రామాలన్నీ బీఆర్ఎస్ వైపే ఉన్నాయని ఈ ఎన్నికలు నిరూపించాయన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ముందంజలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, నూతన సర్పంచ్లు పాల్గొన్నారు. -
విలీన గ్రామాలపై దృష్టి సారించండి
సమీక్షలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి, వరంగల్ అర్బన్: విలీన గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి, అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయ కౌన్సిల్ హాల్లో మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్పాయ్, అధికారులతో కలిసి 15, 16, 17 డివిజన్లలో చేపట్టిన అభివృద్ధి పనులపై మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే సమీక్షించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ.. డ్రెయినేజీలు, సీసీ రోడ్ల నిర్మాణానికి ముందు ఎన్పీడీసీఎల్ అధికారులతో సమన్వయం కావాలని సూచించారు. విద్యుత్ స్తంభాల తొలగింపు, నూతన స్తంభాల ఏర్పాటుపై దృష్టి సారించాలన్నారు. టౌన్ప్లానింగ్ అధికారులు జంక్షన్ల విస్తరణకు చొరవ తీసుకోవాలన్నారు. డివిజన్లలోని రామకృష్ణాపురం, ఏకశిల జంక్షన్లను అభివృద్ధి చేయాలని, గొర్రెకుంటలో అంబేడ్కర్ జంక్షన్కు చెందిన ఆక్రమణలపై స్థానికులతో చర్చించి, భూసేకరణ చేపట్టాలని ఆదేశించారు. ఎస్ఈ సత్యనారాయణ, ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, వెటర్నరీ డాక్టర్ గోపాల్రావు, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, ఈఈలు సంతోష్బాబు, మాధవీలత, డీఈ సతీశ్, టీఎంసీ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బుధవారం మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం దామెర, ఆత్మకూరు, శాయంపేట మండల కేంద్రాల్లో పోలింగ్ సామగ్రి పంపిణీని పరిశీలించారు. పోలీసు బందోబస్తు ఏర్పాట్లను సీపీ సమీక్షించారు. అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. 1,991 మంది పోలీస్ సిబ్బంది.. ఎన్నికల నిర్వహణకు 1,991 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు సీపీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. ముగ్గురు డీసీపీలు, ఐదుగురు అదనపు డీసీపీలు, 16 మంది ఏసీపీలు, 29 మంది ఇన్న్స్పెక్టర్లు, 131 మంది ఎస్సైలు, 339 మంది ఏఎస్సైలు/హెడ్ కానిస్టేబుళ్లు, 1,218 మంది కానిస్టేబుళ్లు, 258 హోంగార్డులతోపాటు డిస్ట్రిక్ట్ గార్డ్స్, బాంబ్ డిస్పోజబుల్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని వివరించారు. మొబైల్ పార్టీలు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తాయని సీపీ వెల్లడించారు. రేపు ఉదయం వరకు నిషేధాజ్ఞలు.. రాష్ట్ర ఎన్నికల అధికారి ఉత్తర్వుల మేరకు పోలింగ్ కేంద్రాల వద్ద గురువారం ఉదయం 10 గంటల వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని సీపీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడడం నిషేధించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట అదనపు డీసీపీ బాల స్వామి, ఏఎస్పీ శుభం, ఏసీపీలు సతీశ్బాబు, సత్యనారాయణ, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు ఉన్నారు. -
‘చలి’ంచరా?
బుధవారం శ్రీ 17 శ్రీ డిసెంబర్ శ్రీ 202 ‘నిరాశ్రయులకు జీవించే హక్కు ఉంది. వారికి అన్నపానీయాలతోపాటు కనీస మౌలిక వసతులు కల్పించాలి’ అని 2010లో సుప్రీం కోర్టు ఆదేశించింది. బల్దియాలు బాధ్యత తీసుకుని నిరాశ్రయులకు నీరు, ఆహారం, మరుగుదొడ్డి, పారిశుద్ధ్యం వంటి వసతులు కల్పించాలని సూచించింది. గ్రేటర్ వరంగల్ మహానగరంలో బల్దియా, మెప్మా అధికారులు, సిబ్బంది ప్రతీ ఏటా నిరాశ్రయులపై సర్వే నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ వందలాది మంది రోడ్ల వెంట, ఫుట్పాత్లపై నిద్రిస్తూ కనిపిస్తూనే ఉన్నారు. వారిపాలిట చలి యమపాశంలా మారింది. పడిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఫుట్పాత్లపై కాలం వెళ్లదీస్తున్న వారంతా చలి తీవ్రతకు అల్లాడిపోతున్నారు. ఎంజీఎం: జిల్లాలో లెప్రసీ కేసులు గుర్తించడానికి, ప్రజలకు లెప్రసీపై అవగాహన కల్పించడానికి రేపటి (గురువారం) నుంచి 31వ తేదీ వరకు లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ నిర్వహించనున్నట్లు హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య తెలిపారు. మంగళవారం హనుమకొండ కలెక్టరేట్లోని డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి క్యాంపెయిన్ నిర్వహణకు సంబంధించి జిల్లాలోని వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బందితో ఆయన జూమ్ మీటింగ్ నిర్వహించారు. పీహెచ్సీల వారీగా హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, టీబీ, ఎన్సీడీ, మాతా శిశు సంక్షేమం కార్యక్రమాలు సమీక్షించారు. ఈసందర్భంగా డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ.. క్యాంపెయిన్లో భాగంగా.. ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు వ్యాధి లక్షణాలు ఉన్న వారిని పరీక్షించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్ఓ మదన్మోహన్రావు, ప్రోగ్రాం అధికారులు మహేందర్, హిమబిందు, ప్రభుదాస్, శ్రీనివాస్, రుబీనా, జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్రెడ్డి ,హెల్త్ ఎడ్యుకేషన్ అధికారి శ్రీనివాస్, డీపీఎంఓలు సతీశ్రెడ్డి, రవీందర్ పాల్గొన్నారు. కాజీపేట అర్బన్: నిట్ సెమినార్హాల్ కాంప్లెక్స్లో స్పార్క్ (స్కీం ఫర్ ప్రమోషన్ ఆఫ్ అకడమిక్ అండ్ రీసెర్చ్ కొలాబరేషన్) సౌజన్యంతో సస్టేనబుల్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ అనే అంశంపై 6 రోజుల ఇంటర్నేషనల్ వర్క్షాప్ మంగళవారం ప్రారంభమైంది. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ జ్యోతి ప్రజ్వలన చేసి ఇంటర్నేషనల్ వర్క్షాప్ను ప్రారంభించి మాట్లాడారు. నిట్ వరంగల్, ఐఐటీ ఖరగ్పూర్, ఎంసీ గిల్ యూనివర్సిటీ కెనడా సంయుక్తంగా వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ, ప్రొఫెసర్ శిరీష్ హరి సోనావానే, ఐఐటీ ఖరగ్పూర్ ప్రొఫెసర్ ఎంఎం గంగేశ్వర్, ఎంసీ గిల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ విజయరాఘవన్, డీన్ కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ అర్బన్/కాజీపేట: విధి వక్రించి వీధిలో కాలం వెళ్లదీస్తున్నవారు కొందరు. యాచక వృత్తిలో జీవితాన్ని మోస్తున్నవారు ఇంకొందరు. దిక్కుమొక్కులేక ఫుట్పాత్లపై నిద్రించేవారు మరికొందరు. వీరంతా చలి విసురుతున్న పంజాకు విలవిల్లాడుతున్నారు. వీరికి ఆశ్రయం కల్పించాల్సిన బల్దియా అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నామమాత్రంగా హోం లెస్ సెంటర్లు ఎక్కడో దూర ప్రాంతంలో ఏర్పాటు చేసి చేతులు దులుపుకుందని ఆరోపణలున్నాయి. కాగా, గ్రేటర్ మహా నగరంలో ఇలాంటి వారు వరంగల్లో 92 మంది, హనుమకొండ, కాజీపేటలో 38 మంది జీవిస్తున్నట్లు బల్దియా, మెప్మా అధికారులు, సిబ్బంది చెబుతున్నారు. హోంలెస్.. యూస్లెస్! నగరంలో యాచకులు 586 మంది ఉన్నట్లు అధికారుల అంచనా. వీరికి భీమారంలోని పలివేల్పులలో 50 మంది చొప్పున ఆశ్రయం కల్పించి స్మైల్ ఎన్జీఓ ఆధ్వర్యంలో వైద్యం, ఆరోగ్యం, ఉపాధిపై అవగాహన కల్పిస్తున్నారు. అదేవిధంగా వరంగల్, కాజీపేట, హనుమకొండలో 130 మంది నిరాశ్రయులు ఉన్నట్లు అధికారుల అంచనా. వీరికి బల్దియా ఆధ్వర్యంలో పలివేల్పుల, వరంగల్ నగరంలోని ప్రతాప్నగర్లో హోం లెస్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ కేవలం రాత్రి పూట నిద్రించేలా, ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేలా బల్దియా ఏర్పాట్లు చేసింది. 2 సెంటర్లు నామమాత్రమే మహా నగర పాలక సంస్థలోని పలివేల్పుల, వరంగల్ రైల్వే స్టేషన్, నెహ్రూ పార్కుకు ఎస్ఎన్ఎం క్లబ్ పక్కన హోంలెస్ సెంటర్లు నిర్మించారు. రెండేళ్లలోనే క్లబ్ పక్కన ఉన్న సెంటర్ను కూల్చేసి, గాంధీనగర్లోని అంబేడ్కర్ సెంటర్లో ఆశ్రయం కల్పించారు. ఈ రెండు నైట్ షెల్టర్లు అందుబాటులో లేకపోవడం, సౌకర్యాలు నామామత్రమే కావడంతో నిరాశ్రయులు అక్కడికి వెళ్లేందుకు వ్యయప్రయాసాలతో కూడి ఉండడంతో ఆసక్తి చూపడం లేదు. ఈ సెంటర్ల నిర్వహణను ఆరేళ్ల కిందట ఎన్జీఓలకు అప్పగించారు. వరంగల్లోని సెంటర్ డాన్ బాస్కో, హనుమకొండ, కాజీపేటకు సంబంధించి పలివేల్పుల సెంటర్ను లార్డ్ ఎన్జీఓలు ఐదేళ్ల పాటు ఈ సంస్థలకు నామమత్రపు సొమ్ముతో నిర్వహణ బాధ్యలు చేపట్టారు. ఏడాది క్రితం వీరి కాంట్రాక్టు గడువు ముగిసింది. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు వీరే ఈ సెంటర్లను నిర్వహించాలి. కానీ వీరు పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. కొద్ది నెలల నుంచి కేంద్ర ప్రభుత్వం యాచక వృత్తిని నిర్మూలన కోసం ప్రత్యేక ఎన్జీఓలను నియమించింది. అందులో భాగంగా ప్రస్తుతం స్మైల్ ఎన్జీఓ యాచకుల జీవితాలు మార్చడానికి కృషి చేస్తోంది. యాచకులను గుర్తించి కేంద్రానికి తరలించి ముడు నెలల పాటు విద్య, వైద్యం, జీవనోపాధిపై కౌన్సెలింగ్ ఇచ్చి, ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తోంది. గోదామాధవ ఆధ్యాత్మిక ప్రచార కేంద్రంలో తులసిమాల చూపిస్తున్న ఆరుట్ల శ్రీనివాసాచార్యస్వామికాజీపేట, వరంగల్ రైల్వే స్టేషన్ల సమీపంలో, హనుమకొండ బస్ స్టేషన్ సమీపంలో ఫుట్పాత్లపై పదుల సంఖ్యలో నిరాశ్రయులు, యాచకులు చలిలో విలవిల్లాడుతున్నారు. కనీసం కప్పుకోవడానికి సైతం చద్దర్లు లేక అలమటిస్తున్నారు. వారిలో చిన్నపిల్లలు సైతం ఉన్నారు. పోలీసులు రైల్వే స్టేషన్లలో, బస్ స్టేషన్లలో తమ ను నిద్రపోనివ్వడం లేదని, పోకిరీలు తమను ఆటపట్టిస్తున్నారని..బల్దియా అధికారులు స్పందించి తమకు ఆశ్రయం కల్పించాలని వారంతా కోరుతున్నారు. కాగా, హోంలెస్ సెంటర్ల నిర్వహణపై మెప్మా టీఎంసీ రమేశ్ను ‘సాక్షి’ వివరణ కోరగా.. ఆయా కేంద్రాల్లో నిరాశ్రయులు రాత్రివేళల్లో ఉంటున్నారని, తెల్లవారుజామున వెళ్లిపోతున్నారని తెలిపారు. గ్రేటర్లో చలిపంజాకు నిరాశ్రయుల విలవిల నైట్ షెల్టర్లపై అంతులేని నిర్లక్ష్యం దూర ప్రాంతాల్లో ఉండడంతో నిరుపయోగం హనుమకొండ జిల్లాలో ఆత్మకూరు, దామెర, నడికూడ, శాయంపేట మండలాల్లో.. వరంగల్ జిల్లాలో ఖానాపురం, చెన్నారావుపేట, నర్సంపేట, నెక్కొండ మండలాల్లో పోలింగ్ ఏర్పాట్లు పరిశీలించిన సీపీ, జిల్లా ఎన్నికల పరిశీలకులు, కలెక్టర్లు -
ఇక.. ఇక్కట్లు ఉండవు
హన్మకొండ : సమ్మక్క, సారలమ్మ జాతర జరిగే మే డారం, పరిసరా ప్రాంతాల్లో నిరంతరాయంగా వి ద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నా యి. దాదాపు రూ.15 కోట్ల అంచనా వ్యయంతో ప నులు చేపట్టారు. 2026 జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు జరగనున్న మహాజాతరకు వారం రో జుల ముందు నుంచే భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఈలోపు విద్యుత్ సరఫరా పనులు యు ద్ధ ప్రాతిపదిక జరుగుతున్నాయి. ప్రస్తుతమున్న మే డారం 33/11 కేవీ, సమ్మక్క 33 /11 కేవి సబ్ సబ్ స్టేషన్ల నుంచి విద్యుత్ సరఫరా జరిగేలా లైన్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ రెండు సబ్ స్టేషన్లపై భారం పడకుండా నార్లాపూర్ వద్ద కొత్తగా 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మిస్తున్నారు. దీంతో పాటు గట్టమ్మ దేవాలయం వద్ద విద్యుత్ సమస్య తలెత్తకుండా ఇక్కడ కూడా కొత్తగా 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మిస్తున్నారు. జాతర నాటికి ఈ రెండు సబ్ స్టేషన్లు వినియోగంలోకి రానున్నా యి. వీటి నిర్మాణంతో అంతకు ముందున్న సబ్ స్టేషన్లపై భారం తగ్గి బ్రేక్డౌన్లు, అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా జరగనుంది. కవర్ కండక్టర్తో విద్యుత్ లైన్.. 11 కేవీ విద్యుత్ లైన్కు కొక్కెలు వేయడం, చెట్ల కొమ్మలు తాకడం, ఇతరత్రా కారణాలతో గతంలో విద్యుత్ సరఫరాకు తరచూ అంతరాయాలు కలిగే ది. ఈ సారి ఈ సమస్యను అధిగమించేందుకు 25 కిలో మీటర్ల పొడవునా కవర్ కండక్టర్ ద్వారా 11 కేవీ విద్యుత్ లైన్ నిర్మిస్తున్నారు. 15 కిలో మీటర్లు 33 కేవీ విద్యుత్ లైన్ కవర్ కండక్టర్తో వేస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ లైన్లు తెగిపడితే ప్రమాదం జరిగే అవకాశముండడంతో లైన్లు తెగి కింద పడకుండా ఫోర్ వైర్ స్పేషర్స్ ఏర్పాటు చేస్తున్నారు. పెట్రోలింగ్ టీమ్లు ఏర్పాటు.. జాతరలో విద్యుత్ సరఫరాలో సమస్య తలెత్తకుండా 50 స్థానాల్లో 50 బృందాలను ఏర్పాటు చేయనున్నారు. వీరు నిరంతరాయంగా అందుబాటులో ఉంటారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తిన వెంటనే పరిష్కరిస్తారు. అదే విధంగా 33 కేవీ లైన్లలో పస్రా నుంచి మేడారం, తాడ్వాయి నుంచి స మక్క సబ్స్టేషన్ వరకు పెట్రోలింగ్ టీమ్లను ని యమించనున్నారు. సబ్ స్టేషన్లలో సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే సరిదిద్దేందుకు ఎమ్మార్టీ టీ మ్ను సిద్ధం చేస్తున్నారు. ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్ల పర్యవేక్షణలో జాతర సాగనుంది. విద్యుత్ సబ్ స్టేషన్లపై భారం పడకుండా మేడారం, సమ్మక్క సబ్ స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచారు. అదే విధంగా 132 కేవీ సబ్ స్టేషన్ నుంచి వచ్చే ఫీడర్లో ఏదైనా అవాంతరం ఎదురైతే విద్యుత్ అంతరాయం లేకుండా ఉండేందుకు ప్ర త్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం పస్రా 132/33 కేవీ సబ్ స్టేషన్ నుంచి మేడారం, సమ్మక్క 33/11 కేవీ సబ్ స్టేషన్కు విద్యుత్ సరఫరా జరుగుతోంది. ఇక్కడ సమస్య ఉత్పన్నమైతే ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరాను కమలాపూర్ 132/33, ములుగు 132/33 కేవీ సబ్ స్టేషన్ నుంచి తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా విద్యుత్ సరఫరాలో వైఫల్యాలకు తావు లేకుండా 259 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నారు. జంపన్న వాగు వద్ద భక్తుల రక్షణ, ప్రమాదం జరగకుండా విద్యుత్ లైన్ల ఎత్తు పెంచేందుకు 180 మీటర్ల పొడవున 6 టవర్లు నిర్మిస్తున్నారు. ఈ టవర్ల ద్వారా 33 కేవీ, 11 కేవీ విద్యుత్ లైన్ వేస్తున్నారు. గతంలో విద్యుత్ లైన్ను వాహనాలు క్రాస్ చేసే సమయంలో లైన్లకు నష్టం వాటిల్లడంతోపాటు ప్రమాదకారంగా మారేవి. ఈ సమస్యను అధిగమించేందుకు టవర్లు నిర్మిస్తున్నారు. వేగంగా ఏర్పాట్లు.. రెండు సబ్స్టేషన్ల ద్వారా సరఫరా సబ్ స్టేషన్ల సామర్థ్యం పెంపు నార్లాపూర్, గట్టమ్మ దేవాలయం వద్ద నూతన సబ్ స్టేషన్ల నిర్మాణం 259 విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల్ల ఏర్పాటు అంతరాయాలు లేకుండా కవర్ కండక్టర్తో 11 కేవీ విద్యుత్లైన్ జంపన్న వాగు వద్ద ఆరు టవర్ల నిర్మాణంమేడారం జాతర విద్యుత్ సరఫరా పనులు వేగంగా జరుగుతున్నాయి. లక్షలాది మంది భక్తులు వచ్చే జాతరలో ఎలాంటి అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా చేసేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. జాతర విజయవంతంలో విద్యుత్ శాఖది కీలక పాత్ర. ప్రతీ పనిని నాణ్యతతో చేస్తున్నాం. విద్యుత్ సరఫరాలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులుండవు. కర్నాటి వరుణ్ రెడ్డి, సీఎండీ, టీజీ ఎన్పీడీసీఎల్ -
మారిన ఎన్నికల స్వ‘రూపం’..
భూపాలపల్లి అర్బన్: దేశానికి పల్లెలే పట్టుగొమ్మలు. అలాంటి పల్లెలు అభివృద్ధి చెంది పచ్చగా ఉన్నప్పుడే గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుంది. అయితే నోటుస్వామ్యం వర్ధిల్లుతున్న నేటి రోజుల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. డబ్బులు, మద్యమే ఇప్పటి ఎన్నికలను శాసిస్తూ పల్లెల్లో అశాంతికి కారణమవుతున్నాయి. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు కులసంఘాలను కూడగడుతూ.. యువజన సంఘాలకు గాలం వేస్తూ.. మహిళా సంఘాలను మచ్చిక చేసుకుంటున్నారు. పార్టీ రహితంగా సాగాల్సిన గ్రామపంచాయతీ ఎన్నికలకు పార్టీల రంగులద్ది అభ్యర్థులు చేస్తున్న ప్రచారం అంతా ఇంతా కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకు ఎంతో విలువ ఉంది. అలాంటి ఓటును అమ్ముకునే, కొనుగోలు చేసే సంస్కృతి రోజురోజుకూ పెరుగుతోంది. ఇది నాటితరం సర్పంచులకు మనోవేదన కలిగిస్తోంది. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు మొదటి, రెండు విడతలు పూర్తికాగా బుధవారం మూడో విడత జరగనుంది. ఈ నేపథ్యంలో నేటి ఎన్నికల తీరుపై నాటితరం సర్పంచుల మనోగతంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.గతంలో ఓటర్లు నమ్మకంగా ఉండేవారు. మాట మీద ఓటు వేసేవారు. గ్రామాభివృద్ధి జరిగేది. ఇప్పుడు రాజకీయాలు చూస్తే బాధ కలుగుతోంది. ఎన్నికల్లో ఖర్చుపెట్టడం, తిరిగి సంపాదించుకోవడమే లక్ష్యమవుతోంది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఎన్నికల ప్రచార ఆర్భాటాలు.. గెలుపు కోసం అభ్యర్థులు పడే పాట్లు చూస్తే ఇబ్బందిగా ఉంది. ఓటర్ల తీరులోనూ మార్పు రావాలి. నేను 1988–1993 మధ్య చిట్యాల సర్పంచ్గా పని చేశా. – బుర్ర నర్సయ్య, మాజీ సర్పంచ్, చిట్యాల మాది భూపాలపల్లి మండలం గొల్లబుద్దారం. 2001లో గ్రామ సర్పంచ్గా పనిచేశా. అప్పట్లో ప్రజలు మాట మీద ఉండే వారు. మేం ఏదైనా చెబితే గౌరవించే వారు. సర్పంచ్గా గుర్తింపు, గౌరవం ఉండేది. మా ఊరి అభివృద్ధికి అనేక పనులు చేశా. ఇప్పుడు డబ్బుల ప్రభావం ఎక్కువైంది. విలువలు పతనమయ్యాయి. నాటి గౌరవం, మర్యాద నేటి తరంలో కనిపించడం లేదు. రాజకీయం అర్థం మారిపోయింది. ఇప్పటి ఎన్నికల తీరు చూస్తే బాధగా ఉంది. డబ్బులు తీసుకుని ఓటు వేస్తే ఏదైనా పనిపడితే.. అడిగే హక్కు ఉంటుందా? అనే అనుమానం కలుగుతోంది. – లావుడ్య దాసునాయక్, మాజీ సర్పంచ్, గొల్లబుద్దారం ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలిపెట్టు నాటితరం సర్పంచుల మనోగతం -
నిన్న ఎన్నికల పోరులో.. నేడు జీవన పోరాటంలో
బయ్యారం: ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ బయ్యారం ఉప సర్పంచ్గా ఎన్నికై న ఎనుగుల ఉమ. నిన్నటి వరకు క్షణం తీరిక లేకుండా ఎన్నికల పోరులో పాల్గొన్న ఆమె.. ఎన్నికల ప్రక్రియ పూర్తికాగా నేడు జీవన పోరాటంలో నిమగ్నమైంది. బయ్యారం ఆరో వార్డు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన ఉమ సోమవారం ఉప సర్పంచ్గా ఎన్నికై ంది. ఎన్నిక తర్వాత మంగళవారం తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో ఆరబెడుతోంది. ఈ దృశ్యాన్ని ‘సాక్షి’ క్లిక్మనిపించింది.సర్పంచ్ బరిలో తోటికోడళ్లు కొడకండ్ల : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కొడకండ్ల సర్పంచ్ పదవికి తోటికోడళ్లు పోటీ పడుతున్నారు. కొడకండ్ల జనరల్ మహిళకు రిజర్వ్ అయ్యింది. దీంతో సీనియర్ నాయకుడు మసురం వెంకటనారాయణ సతీమణి రాధాలక్ష్మి బీఆర్ఎస్ అభ్యర్థిగా, మసురం లక్ష్మీనర్సింహాస్వామి సతీమణి మమత స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలించారు. కాగా, కొడకండ్ల సర్పంచ్ పదవికి ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. -
సరదా విషాదమైంది..
ఖిలా వరంగల్ : సరదా విషాదమైంది. సవారీ చే సేందుకు కట్టేసిన గుర్రం వద్దకు వెళ్లిన బాలుడిని గుర్రం తన్నింది. దీంతో బాలుడికి తీవ్రగా గాయాలు కావడంతో కుటుంబీకులు హైదరాబాద్ నిలో ఫర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆది వారం తెల్లవారుజామున మృతి చెందాడు. దీంతో గుర్రం యజమాని నిర్లక్ష్యంతోనే బాలుడు మృతి చెందాడని సోమవారం సాయంత్రం ఖిలా వరంగల్ ఏకశి చిల్డ్రన్పార్క్ గేట్ ఎదుట నిర్వహించారు. గుర్రం యజమాని, పార్కు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మిల్స్కాలనీ పో లీసులు ఘటనాస్థలికి చేరుకుని గుర్రం యజమాని పై కేసు నమోదు చేయడంతోపాటు బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో మృతుడి బంధువుల ధర్నా విరమించా రు. మృతుడి బంధువుల క థనం ప్రకారం.. వరంగల్ శివనగర్ ఏసీరెడ్డినగర్కు చెందిన ఆటో డ్రైవర్ మిర్యాల కృష్ణ కు మారుడు గౌతం(12) ఈనెల 10వ తేదీన ఉదయం బాబాయి రాజేందర్తో కలిసి ఏకశిల చిల్డ్రన్ పా ర్కుకు వెళ్లాడు. పార్కులో సవారీ చేసేందుకు సోదరుడు మహేశ్తో కలిసి గుర్రం వద్దకు వెళ్లాడు. అంతలోనే గుర్రం వెనుక నుంచి తన్నడంతో గౌతంకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గౌతంను రాజేందర్ హుటాహుటిన ఎంజీఎం త రలించారు. అనంతరం హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు విలపించారు. కాగా, శివనగర్లో బాలుడి అంత్యక్రియలు నిర్వహించగా కార్పొరేటర్ ప్రవీణ్, పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు తరలొచ్చి గౌతం మృతదేహం వద్ద నివాళులర్పించారు. సవారీ కోసం గుర్రం వద్దకు వెళ్లిన బాలుడు వెనుక నుంచి తన్నగా తీవ్రగాయాలు.. చికిత్స పొందుతూ మృతి ఏకశిల పార్కు ఎదుట బంధువుల ధర్నా -
నయా ట్రెండ్!
● సర్పంచ్ అభ్యర్థుల ప్రమోషనల్ కాల్స్ ● తనకు ఓటు వేయాలని అభ్యర్థన కాళేశ్వరం: హలో..హలో.. నేను మీ సర్పంచ్ అభ్యర్థిని అంటూ ఫలాన గుర్తుకు ఓటు వేయాలని ఫోన్లో అభ్యర్థిస్తున్నారు. కాటారం సబ్డివిజన్ పరిధిలో మూడో విడత ఎన్నికలకు ఈనెల 17న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో సర్పంచ్ అభ్యర్థులు నయా ట్రెండ్ను ఫాలో అవుతున్నారు. కాటారం, మహాముత్తారం, మహదేవపూర్, మల్హర్ మండలాల్లో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికలకే పరిమితమైన ప్రమోషనల్ కాల్స్తో సెల్ఫోన్లు రింగ్..రింగ్..రింగ్మంటూ మోగుతున్నాయి. అభ్యర్థులు వాయిస్తో ప్రమోషనల్ కాల్స్ పల్లెల్లో సందడి చేస్తూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. కాగా, సోమవారం సాయంత్రం 5గంటల వరకు ప్రచారానికి తెర పడడంతో కొత్తట్రెండ్తో ప్రచారం మొదలైందని చర్చించుకుంటున్నారు. ఏదీఏమైనా అభ్యర్థుల కొత్త ట్రెండ్ పల్లెల్లో సాధారణ ఎన్నికలను తలపిస్తోంది. -
అప్పట్లో డబ్బుల ప్రభావం లేదు
మాది కొత్తపల్లిగోరి గ్రామం. నేను 1995–2001 సంవత్సరాల మధ్య సర్పంచ్గా పని చేశా. అనంతరం 2001–2006 వరకు మా భార్య కాటం స్వరూప సర్పంచ్గా పని చేశారు. అప్పడు కేవలం ఎన్నికల ఖర్చు రూ.14వేలు మాత్రమే వచ్చింది. ఆ రోజుల్లో ఎన్నికల్లో పోటీ చేసే వారికి పెద్దగా ఖర్చులు ఉండేవి కావు. డబ్బుల ప్రభావం అంతగా లేదు. ఇప్పుడు డబ్బు లేనిదే ఎన్నికల్లో నిలబడే పరిస్థితి లేదు. ఎవరికి ఏ పని ఉన్నా నేను వెంట ఉండి చేయించేవాడిని. ఒక్క పైసా ఆశించేవాడిని కాదు. ప్రజలకు సేవ సేవ చేయడమే. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తి భిన్నమైంది. – కాటం సదయ్య, కొత్తపల్లిగోరి -
నాడు భార్య.. నేడు భర్త
● సర్పంచ్లుగా దంపతులు ఎన్నిక బచ్చన్నపేట: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం చిన్నరామన్చర్ల గ్రామ సర్పంచ్గా బీఆర్ఎస్ అభ్యర్థి ఎం.డి ఆజామ్ గెలుపొందారు. 2019లో ఆయన భార్య ఖలీల్బేగమ్ కూడా బీఆర్ఎస్ నుంచి సర్పంచ్గా గెలుపొందింది. ఇప్పుడు అదే గ్రామం జనరల్ అన్రిజర్వ్ అయ్యింది. దీంతో ఆజామ్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పిన్నింటి కావ్యశ్రీపై గెలుపొందారు. రెండు సార్లు సర్పంచ్గా ఆదరించిన గ్రామస్తులకు ఆ కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. -
ఆర్ట్స్, సైన్స్ కళాశాల ఎంఓయూ
కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ విభాగం ఆధ్వర్యంలో కోల్కత్తా కేంద్రంగా పని చేస్తున్న అనుదీప్ ఆర్గనైజేషన్తో ఒక సంవత్సర కాలానికి ఎంఓయూ కుదుర్చుకుంది. ఈమేరకు సోమవారం ఆకళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.జ్యోతి, ప్లేస్మెంట్ సెల్ ఆఫీసర్ డాక్టర్ ఎల్.జితేందర్ కలిసి అనుదీప్ కొల్కతా ఆర్గనైజేషన్ మేనేజర్ అండ్ ట్రైనర్ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ శ్వేతతో అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఈమేరకు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్, అధ్యాపకురాలు డాక్టర్ అలేటి సరిత పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: నోయిడాలోని ఇంజనీరింగ్ ఆఫ్ ఇన్నోవేటివ్ ఇంజనీర్స్ ఇండియా, కాకతీయ యూనివర్సిటీ మధ్య నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమ ఆధారిత శిక్షణను బలోపేతం చేసేందుకుగాను అవగాహన ఒప్పందం (ఎంఓయూ)ను కేయూలో సోమవారం కుదుర్చుకున్నారు. కేయూ వీసీ ఆచార్య ప్రతాప్రెడ్డి సమక్షంలో ఇరు సంస్థల మధ్య ప్రతినిధులు సంతకాలు చేసి ఎంఓయూ పత్రాలు మార్చుకున్నారు. కేయూ తరఫున రిజిస్ట్రార్ రామచంద్రం, నోయిడా ఇంజనీర్స్ ఇండియా ప్రతినిధి పటేల్రోహన్ ఆండే పాల్గొని ఒప్పందంపై సంతకాలు చేశారు. -
నేటినుంచి ధనుర్మాసోత్సవాలు..
హన్మకొండ కల్చరల్: ధనుర్మాసోత్సవాలు నేటి (మంగళవారం) నుంచి జనవరి 14వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందుకోసం పలు వైష్ణవ దేవాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వరంగల్లోని బాలా వెంకటేశ్వరాలయం, హనుమకొండ గోపాల్పూర్ సదాశివ కాలనీలోని గోదామాధవ ఆధ్యాత్మిక ప్రచారకేంద్రంలో ధనుర్మాసోత్సవాలు జరగనున్నాయి. గోదామాధవ కేంద్రం ఆచా ర్యుడు డాక్టర్ ఆరుట్ల శ్రీనివాసాచార్యస్వామి ఆధ్వర్యంలో మంగళవారం ఉద యం నుంచి స్వామివారికి అభిషేకం, అలంకరణ, ఆపదుద్ధారక పారాయణం, ప్ర త్యేక పూజలు నిర్వహిస్తారు. అదేవిధంగా ఎకై ్సజ్కాలనీలోని వేంకటేశ్వరస్వామి దేవాలయం, అదాలత్ వెనుకగల ఎస్వీ కాలనీలోని శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి దేవాలయం తదితర వైష్ణవ దేవాలయాలలో భక్తులకు ఏర్పాట్లు చేశారు. వైష్ణవ దేవాలయాలలో ప్రత్యేక ఏర్పాట్లు -
ప్రిన్సిపాల్ సమ్మయ్యకు షోకాజ్ నోటీస్
● ఆర్డీఓ, తహసీల్దార్ల వద్ద విద్యార్థుల లేఖలు ● కలెక్టర్కు చేరిన ‘చిట్టి చేతులు.. వెట్టి చాకిరీ’ నివేదిక ● చర్యలకు రంగం సిద్ధం.. వరంగల్ క్రైం: ఒగ్లాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల (పరకాల)లో విద్యార్థులతో బలవంతంగా అంట్లు తోమించి.. టిఫిన్లు చేయించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఈ ఘటనపై రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జోనల్ అధికారి అలివేలు క్షేత్ర స్థాయిలో పర్యటించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. అనంతరం ‘చిట్టి చేతులు.. వెట్టి చాకిరీ’ కథనానికి సంబంధించిన అంశాలపై సోషల్ వెల్ఫేర్ సెక్రటరీకి ని వేదిక సమర్పించారు. సెక్రటరీ ఆదేశాల మేరకు డీ సీఓ ఉమామహేశ్వరి సోమవారం సదరు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సమ్మయ్యకు, ఆ పాఠశాలలో పనిచేస్తున్న క్యాటరింగ్ కాంట్రాక్టర్కు షోక్జ్ నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో రాతపూర్వక వివరణ ఇవ్వలని పేర్కొన్నారు. విద్యార్థులు ఫిర్యాదులో పెట్టెలో వేసిన ఫిర్యాదు లేఖలను పరకాల ఆర్డీఓ, దామెర తహసీల్దార్లు స్వాధీనం చేసుకున్న ట్లు సమాచారం. వారు పాఠశాలలో విద్యార్థులతో వెట్టి చాకీరి చేయించిన ఘటనతోపాటు పాఠశాలలో నెలకొన్న సమస్యలు, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాళ్లపై విద్యార్థులు లేవనెత్తిన అవినీతి విషయాలపై హనుమకొండ కలెక్టర్కు నివేదిక అందజేసినట్లు తె లిసింది. ఈనెల 12న ‘చిట్టి చేతులు..వెట్టి చాకిరీ’, 13న ‘వెట్టి చాకిరీపై కదిలిన యంత్రాంగం’ అనే శీర్షి కలతో సాక్షిలో కథనాలు ప్రచురితమయ్యాయి. వీ టిపై స్పందించిన అధికారులు చర్యలకు ఆదేశించా రు. ఇదిలా ఉండగా భద్రాద్రి కొత్తగూడెం జోనల్ అధికారి తన నివేదికలో క్రమ శిక్షణ చర్యలకు సిఫా ర్సు చేసినట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాళ్లపై చర్యలు తీసుకుని క్యా టరింగ్ కాంట్రాక్టర్ లైసెన్స్ను బ్లాక్ లిస్ట్లో పెట్టనున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ప్రిన్సిపాల్ సమ్మ య్య కొంత మంది విద్యార్థులను తనకు వ్యతిరేకంగా చెప్పుతే టీసీలు ఇస్తానంటూ బెదిరించిన విషయానికి సంబంధించిన ఆడియో కూడా వైరలైంది. ఇప్పటికై నా అధికా రులు గతి తప్పిన గు రుకులాన్ని గా డిలో పెట్టాలని త ల్లిదండ్రులు వేడుకుంటున్నారు. -
ఓటమెరుగని నాయకులు..
● ఆ దంపతులు ఐదుసార్లు సర్పంచ్గా గెలుపు దంతాలపల్లి : ప్రస్తుత పరిస్థితుల్లో ఒకసారి సర్పంచ్గా పని చేసి మరోసారి గెలువడం కష్టమే. అలాంటిది ఏకంగా ఐదుసార్లు సర్పంచ్గా గెలుపొంది ప్రజల మన్ననలు పొంది ప్రజానాయకులుగా పేరొందారు కొమ్మినేని రవీందర్, మంజుల దంపతులు. మండలంలోని దాట్లకు చెందిన ఆ దంపతులు 25 సంవత్సరాలుగా ప్రజాప్రతినిధులుగా వారి కుటుంబం నుంచే కొనసాగుతున్నారు. ఉమ్మడి నర్సింహులపేట మండలంలోని దాట్ల గ్రామానికి మూడుసార్లు సర్పంచ్గా ఎన్నిక కాగా రెండు పర్యాయాలు రవీందర్, ఒక పర్యాయం మంజుల ఎన్నికయ్యారు. దంతాలపల్లి మండలం ఏర్పడిన అనంతరం దాట్ల సర్పంచ్గా రవీందర్ గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో 260 ఓట్లపైచిలుకు ఆధిక్యంతో స్వతంత్ర అభ్యర్థిగా మంజుల గెలుపొందారు. ఇలా వరుసగా ఐదుసార్లు సర్పంచ్గా ఎన్నికై ఓటమెరగని నాయకులుగా పేరు తెచ్చుకున్నారు. ఆ కుటుంబం నుంచి నాలుగో సర్పంచ్.. బచ్చన్నపేట : మండలంలోని తమ్మడపల్లి సర్పంచ్గా గెలుపొందిన బేజాడి సిద్ధులు తన కుటుంబం నుంచి నాలుగో సర్పంచ్. 1995లో తన తండ్రి రాములు, 2006లో తన భార్య సునీత, 2013లో సిద్ధులు, ప్రస్తుతం సిద్ధులే గెలుపొంది ఆ కుటుంబంలో నాలుగో సర్పంచ్ అయ్యారు. నాటి నుంచి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నందుకు గ్రామస్తులు తమ కుటుంబం పట్ల ఆదరణ, అభిమానం చూపుతున్నారని సిద్ధులు తెలిపారు. భర్త ఉప సర్పంచ్.. భార్య వార్డు సభ్యురాలు కమలాపూర్: కమలాపూర్ మండలం పంగిడిపల్లిలో భార్యాభర్తలు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. గ్రా మానికి చెందిన ఆసాల శ్రీ కాంత్ బీఆర్ఎస్ తరఫున 4 వ వార్డు నుంచి, ఆయన భా ర్య మౌనిక 9వ వార్డు నుంచి వార్డు సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నెల 11న జరిగిన మొదటి విడత జీపీ ఎన్నికల అనంతరం శ్రీకాంత్ ఉపసర్పంచ్గా ఎన్నికయ్యారు. ఆసాల శ్రీకాంత్, మౌనిక -
గెలిచిన తిరుగుబాటు సర్పంచ్లను తిరిగి ఆహ్వానిస్తున్న అధికార పార్టీ
సాక్షిప్రతినిధి, వరంగల్ : గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు రెబల్స్ బెడద తప్పలేదు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దతు ఆశించిన పలువురు.. చివరికి వరకు ఫలితం కనిపించకపోవడంతో చేసేది లేక తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీలోకి దిగారు. రెబల్స్ ధాటికి పలుచోట్ల అధికార పార్టీ అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టగా.. పలుచోట్ల రెబల్స్ విజయం సాధించారు. ఉమ్మడి వరంగల్లో ఆదివారం జరిగిన రెండో విడతలో 563 పంచాయతీల్లో 41 మంది రెబల్స్గా గెలిస్తే.. హనుమకొండ జిల్లాలో ఆరు ఏకగ్రీవంకాగా, 67 స్థానాలకు ఏడు చోట్ల తిరుగుబాటు అభ్యర్థులు గెలుపొందారు. హనుమకొండ జిల్లాలో గెలిచిన వారిని ఇప్పుడు సొంతగూటికి రమ్మని నేతలు ఆహ్వానిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. వేలేరు, హసన్పర్తిలో షాక్.. అభ్యర్థుల ఎంపికలో ఏమరుపాటు అధికార కాంగ్రెస్కు షాక్ తగిలేలా చేసింది. ఆదివారం జరిగిన పోలింగ్ సందర్భంగా హనుమకొండ జిల్లాలో ముగ్గురు స్వంతంత్రులు గెలుపొందగా, ఏడుగురు కాంగ్రెస్ రెబల్స్ విజయఢంకా మోగించారు. సుమారు 4,800 ఓటర్లున్న వేలేరు గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను ఓడించి భారీ షాక్ ఇచ్చారు. ఇక్కడ మూడు ముక్కలాట ఆడారు. కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులుగా విజయపురి మల్లికార్జున్ గెలుపు కోసం స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రచారం చేశారు. మరో అభ్యర్థి సద్దాం హుస్సేన్ కోసం రాష్ట్ర సహకార అయిల్ సీడ్స్, గ్రోయర్ ఫెడరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉన్న బిల్ల యాదగిరి 9 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం సంచలనగా మారింది. ● హసన్పర్తి మండలంలోని నాలుగు చోట్ల రెబల్స్ గెలిచి కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు, కాంగ్రెస్ నేతలకు షాక్ ఇచ్చారు. ● హసన్పర్తి మండలం మల్లారెడ్డి పల్లెలో మేడిపల్లి సునీతకు అధికార పార్టీ మద్దతు తెలుపగా రెబల్ అభ్యర్థి గాజుల కృష్ణవేణి గెలుపొందారు. ● హరిశ్చంద్రనాయక్ తండాలో భూక్య రాజు రెబల్ అభ్యర్థి నునావత్ దేవందర్ చేతిలో ఓడిపోగా, బైరాన్పల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి కల్లెబోయిన కుమారస్వామి రెబల్ అభ్యర్థి కల్లెబోయిన సురేందర్ చేతిలో ఓటమి చెందారు. ● సూదనపల్లిలో కాంగ్రెస్ మద్దతుదారు తిక్క మాధవి రెబల్ అభ్యర్థి ఆకారపు లచ్చమ్మ చేతిలో రెండోట్ల తేడాతో అపజయం పాలయ్యారు. ● ధర్మసాగర్ మండలం రాపాకపల్లిలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి కందుకూరు సుధాకర్ రెబల్ అభ్యర్థి కందుకూరి జయందర్ చేతిలో ఓడిపోయారు. ● ఐనవోలు మండలం ఒంటిమామిడి, లింగమోరి గూడెంలలో ఇదే జరిగింది. ఇప్పుడు రెబల్స్ అందరినీ పార్టీలో చేరాలని నేతలు ఆహ్వానిస్తుండగా.. పార్టీ పరంగా మద్దతు తెలిపి బరిలోకి దింపిన నాయకులు రెబల్స్ను అదుపు చేయకపోవడం వల్ల ఓటమి చెందాల్సి వచ్చిందని ఓడిపోయిన అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘కారు’ ఇంకా కలబడితే.. ఇంకా ‘చేయి’జారేవి... పొరుగు జిల్లా జనగామ ఫలితాల ప్రభావం హనుమకొండ జిల్లాలోనూ పడినట్లు ఫలితాలను బట్టి అవగతమవుతోంది. మిగతా మండలాల్లోనూ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం గట్టిగా కృషి చేస్తే మరిన్ని స్థానాలు దక్కేవన్న చర్చ జరుగుతోంది. రెండో విడతలో మొత్తంగా 73 గ్రామ పంచాయతీల్లో 39 కాంగ్రెస్, 22 బీఆర్ఎస్, రెండు బీజేపీ మద్దతుదారులు, 10 చోట్ల రెబల్స్, ఇండిపెండెట్లు గెలిచారు. వేలేరు మండలంలో 12 పంచాయతీలకు రెండు ఏకగ్రీవం కాగా.. ఆ ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ మండలంలో ఒక రెబల్ మినహాయిస్తే ఐదు కాంగ్రెస్కు, ఆరు బీఆర్ఎస్కు సూచిస్తున్నాయి. అదే విధంగా పరకాలలో 10 సర్పంచ్లకు ఆరు కాంగ్రెస్ గెలుచుకోగా, నాలుగు బీఆర్ఎస్, ఇద్దరు ఇండిపెండెట్లు గెలిచారు. ఐనవోలులో 17 పంచాయతీలకు 9 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్, ఒక బీజేపీ, ఇద్దరు ఇండిపెండెట్లు గెలిచారు. ఇక్కడ గట్టి కృషి జరిగినా ఫలితాలు ‘కారు’ పెరిగేవంటున్నారు. ధర్మసాగర్లో 19 పంచాయతీలకు 13 కాంగ్రెస్, ఐదు బీఆర్ఎస్, ఒకచోట కాంగ్రెస్ రెబల్ గెలుపొందగా.. ఇక్కడ మూడు చోట్ల సమీప మెజార్టీతో బీఆర్ఎస్ మద్దతుదారులు ఓటమి చెందారన్న చర్చ జరుగుతోంది. ‘రెండో’ పోరులో పలుచోట్ల సత్తా చాటిన అభ్యర్థులు కాంగ్రెస్ బలపర్చిన వారికి తప్పని బెడద చివరి వరకు మద్దతు ఆశించి.. రెబల్స్గా బరిలోకి దిగిన ఆశావహులు వేలేరులో ‘కడియం’, ‘జంగా’కు షాక్... -
యాచకులు లేని నగరంగా తీర్చిదిద్దాలి..
మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ను యాచకులు లేని నగరంగా తీర్చిదిద్దాలని, గుర్తించిన యాచకులను స్మైల్ కేంద్రంలో చేర్పించాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. సోమవారం హనుమకొండ భీమారంలో జీడబ్ల్యూఎంసీ, హెల్త్ కేర్ సొసైటీ ఎన్జీఓ సంయుక్తంగా నిర్వహిస్తున్న స్మైల్ కేంద్రాన్ని మేయర్ పరిశీలించారు. కేంద్రంలో యాచకులకు అందుతున్న వసతులు, వైద్య సేవలు, భోజనం తదితర అంశాలపై ఆరా తీశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నగరంలో బిచ్చగాళ్లు, బాల కార్మికులు, వృద్ధులను సర్వే చేసి, కనీసం మూడు నెలల పాటు స్మైల్ హోంలో ఆశ్రయం కల్పించి, తదుపరి వారికి స్థిరమైన జీవనోపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమం విజయవంతమయ్యేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, ఎంహెచ్ఓ రాజేశ్, మెప్మా టీఎంసీ రమేశ్, వెంకట్ పాల్గొన్నారు. గడువులోగా పనులు పూర్తి చేయాలి:బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ నిర్దేశిత గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం హనుమకొండలోని కుడా కార్యాలయంలో బల్దియా ఇంజనీరింగ్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. అసంపూర్తిగా ఉన్న స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులు ఈ నెలాఖరులోగా డెడ్లైన్ ఉందని గుర్తు చేశారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, బయోమైనింగ్ పనులపై సీరియస్గా దృష్టి కేంద్రీకరించాలన్నారు. స్వీపింగ్ మిషన్ల పనితీరు బాగాలేదని, ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఇంజినీర్లను కోరారు. సమావేశంలో ఎస్ఈ సత్యనారాయణ, ఈఈలు మహేందర్, రవికుమార్, సంతోశ్బాబు, మాధవీలత, ఏఈలు నరేశ్, సంతోశ్కుమార్ స్మార్ట్ సిటీ ప్రతినిధి ఆనంద్ ఓలేటి పాల్గొన్నారు. -
అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదుల వెల్లువ
వరంగల్ అర్బన్: అనధికారిక భవన నిర్మాణాలు, అక్రమ కట్టడాలపై గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్ సెల్కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సోమవారం కౌన్సిల్ హాల్లో జరిగిన కార్యక్రమంలో కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఫిర్యాదులు స్వీకరించారు. దరఖాస్తుదారులతో కార్యాలయ ఆవరణంతా కిటకిటలాడింది. గ్రీవెన్స్ సెల్కు మొత్తం 117 ఫిర్యాదులు అందగా.. టౌన్ ప్లానింగ్ విభాగానికి 63 వచ్చాయి. నగరంలో ఎంత పెద్ద మొత్తంలో అనధికారిక నిర్మాణాలు జరుగుతున్నాయో ఈ ఫిర్యాదుల సంఖ్యను చూస్తే అర్థమవుతోంది. మౌలిక వసతుల కల్పన కోసం 41, పన్నుల విభాగానికి 4, ప్రజారోగ్య సెక్ష న్కు 3, నీటి సరఫరాకు 5, ఉద్యాన వన విభాగానికి 1 చొప్పున ఫిర్యాదులు అందినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, డీఎఫ్ఓ శంకర్ లింగం, ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్న రాణి, బిర్రు శ్రీనివాస్, టీఓ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని.. ● వరంగల్ దేశాయిపేట చార్లెస్ కాలనీ రోడ్డు–1లో డ్రెయినేజీ నిర్మాణాన్ని చేపట్టాలని ఆర్గనైజర్స్ కోరారు. ● వరంగల్ 25వ డివిజన్ ఎల్లంబజార్ రిషి స్కూల్ లైన్లో రోడ్డు పూర్తిగా దెబ్బతిందని, కొత్తగా నిర్మించాలని కాలనీవాసులు విన్నవించారు. ● మట్టెవాడ 13–3–52 వద్ద తాగునీటి పైపులైన్ నెల రోజులుగా లీకేజీగా మారి నీరు వృథాగా పోతోందని, రోడ్డు దెబ్బతింటుందని స్థానికులు ఫిర్యాదు చేశారు. ● 19వ డివిజన్ గాంధీనగర్లో విద్యుత్ స్తంభాలు, వీధిదీపాలు ఏర్పాటు చేయాలని రామా యాదగరి విజ్ఞప్తి చేశారు. ● 2028లో లక్ష్మీటౌన్ షిప్ నుంచి ఆరేపల్లి వరకు రూ.4 కోట్లతో రోడ్డు విస్తరణ, అభివృద్ధి చేపట్టారని, కానీ, కొన్నేళ్లకు రోడ్డు దెబ్బతిందని మరమ్మతులు చేపట్టాలని ఇట్యాల సురేశ్కుమార్ కోరారు. ● వరంగల్ చింతల్లో నల్లాలు, డ్రెయినేజీలు లేవని, రోడ్లు నిర్మించాలని మహ్మద్ అంకూస్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ● వరంగల్ 28వ డివిజన్ విశ్వకర్మ, చకిలం ఉపేందర్ వీధిలో సీసీ రోడ్డు నిర్మించాలని స్థానిక కార్పొరేటర్ గందె కల్పన అర్జీ పెట్టుకున్నారు. ● 62వ డివిజన్ విష్ణుపురి రెహ్మత్ నగర్ మరుగుదొడ్ల నుంచి మల వ్యర్థాలను నేరుగా డ్రెయినేజీలకు పంపిస్తుండడంతో దుర్వాసన వస్తోందని మాట్ల రాజశేఖర్ ఫిర్యాదు చేశారు. ● హంటర్ రోడ్డులోని వేదవతి నిలయం అపార్ట్మెంట్కు సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మించాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు. ● ఆర్టీసీ కాలనీలో సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మించాలని రాంచందర్ పేర్కొన్నారు. ● 59వ డివిజన్ ఇందిరా నగర్ కాలనీలో 4 చోట్ల కల్వర్టులు, కేఎల్ఎన్ రెడ్డి నగర్లో డ్రెయినేజీ నిర్మించాలని గుగ్గిళ్ల వసంత విన్నవించారు. ● 52వ డివిజన్ శంకర్నగర్ కాలనీ రోడ్డు నంబరు 6లో సీసీ రోడ్డు నిర్మించాలని, ఇళ్లకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వాలని కాలనీవాసులు కోరారు. ● 11వ డివిజన్ కాపువాడలో ‘మిషన్’ పైపులైన్లు పునరుద్ధరించాలని బక్కి రాజ్కుమార్ కోరారు. ● 41వ డివిజన్ ఖిలా వరంగల్ శివారు శంభునిపేట విశ్వనాథ కాలనీ సర్వే నంబర్ 1135/ఏ స్థలంలో అక్రమంగా 1,210 గజాల స్థలాన్ని ఓ వ్యక్తి కబ్జా చేసి పర్మిషన్ లేకుండా నిర్మిస్తున్నారని చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ నాయకులు నమిండ్ల శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. కనీస వసతులు కల్పించాలని విన్నపాలు బల్దియా గ్రీవెన్స్కు 117 దరఖాస్తులు స్వీకరించిన కమిషనర్ చాహత్ -
వేసవిలో డిమాండ్ ఎదుర్కోవాలి..
హన్మకొండ: వచ్చే వేసవిలో డిమాండ్ను ఎదుర్కొనేందుకు అధికారులు సన్నద్ధం కావాలని టీజీ ఎన్పీడీసీఎల్ ఆపరేషన్ డైరెక్టర్ టి.మధుసూదన్ సూచించారు. సోమవారం హనుమకొండ పెద్దమ్మగడ్డలోని ట్రాన్స్కో జోనల్ కార్యాలయంలో టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ డీఈలు, ఏడీఈలు, ఏఈలతో సమీక్ష నిర్వహించారు. ఇందులో ఆపరేషన్ చీఫ్ ఇంజనీర్ రాజు చౌహాన్తో కలిసి డైరెక్టర్ టి.మధుసూదన్ సెక్షన్, సబ్ డివిజన్, డివిజన్ వారీగా ప్రగతిని సమీక్షించారు. ఈసందర్భంగా డైరెక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ.. వేసవిలో విద్యుత్ అవసరాలు పెరుగుతాయని, దీంతో డిమాండ్ పెరుగుతుందన్నారు. ఈమేరకు విద్యుత్ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల వైఫల్యాలు తగ్గించిన ఏఈలను అభినందించారు. సమావేశంలో హనుమకొండ ఎస్ఈ పి.మధుసూదన్ రావు, డీఈలు ఐరెడ్డి విజేందర్రెడ్డి, జి.సాంబరెడ్డి, ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: ముఖ గుర్తింపు హాజరుతో సమయపాలన అలవడుతుందని కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం పరిపాలనాభవనంలో ఉద్యోగులకు ముఖ గుర్తింపు హాజరు ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రతీ ఉద్యోగి తమ కార్యాలయం, విభాగానికి హాజరును విధిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ముఖ గుర్తింపు హాజరు విధానం, వ్యవస్థ సీసీటీవీ పర్యవేక్షణలోనూ కొనసాగనుందన్నారు. కార్యక్రమంలో కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం, యూనివర్సిటీ నెట్వర్కింగ్ సెల్ డైరెక్టర్ డి.రమేశ్, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి బి.రమ పాల్గొన్నారు. హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయాన్ని సోమవారం మధ్యాహ్నం మోగ్లీ సినిమా కథానాయకుడు రోషన్ కనకాల, హీరోయిన్ సాక్షి మడోల్కర్, చిత్రం యూనిట్ సభ్యులు సందర్శించారు. ఈసందర్భంగా వారు మోగ్లీ సినిమా పెద్ద హిట్ సాధించాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ స్నపన మందిరంలో అర్చకులు వారికి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందించారు. కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు క్రాంతికుమార్, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, గాదె శ్రవణ్కుమార్రెడ్డి, మయూరి, స్రవంతి, అనంతుల శ్రీనివాస్, సిబ్బంది కృష్ణ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ క్రైం: రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా వారం రోజులుగా ట్రై సిటీ పరిధిలో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 437 కేసులు నమోదైనట్లు వరంగల్ పోలీస్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. పట్టుబడిన వారిని కోర్టులో హాజరుపర్చగా.. రూ.1,58,200 జరిమానా విధించడంతో పాటు 24 మందికి జైలు శిక్ష విధించినట్లు పేర్కొన్నారు. వరంగల్ ట్రాఫిక్ పరిధిలో నమోదైన 158 కేసుల్లో 14 మంది జైలు శిక్ష విధించగా, రూ.72,900 జరిమానా, కాజీపేట పరిధిలో 142 కేసుల్లో 9 మందికి జైలు శిక్ష, మిగతా కేసుల్లో రూ.79,500 జరిమానా, హనుమకొండ ట్రాఫిక్ పరిధిలో 137 కేసులకు రూ.5,800 జరిమానాతో పాటు ఒక్కరి జైలు శిక్ష విధించినట్లు సీపీ వెల్లడించారు. వాహనదారులు మద్యం సేవించి వాహనం నడపడం ద్వారా మీకు, మీ కుటుంబానికి క్షేమకరం సీపీ సూచించారు. పోలింగ్ కేంద్రం పరిసరాల్లో నిషేధాజ్ఞలు ఈ నెల 17న కమిషనరేట్ పరిధి వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో జరిగే మూడో విడత ఎన్నికల్లో శాంతి భద్రత పరిరక్షణలో భాగంగా పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో బీఎన్ఎస్, ఎస్ఆర్పీసీ 163 ( 144 సెక్షన్) అమలు చేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ మేరకు ప్రజలు ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుంపులుగా చేరడం నిషేధమని పేర్కొన్నారు. ఈనిషేధాజ్ఞలు 17 తేదీ రాత్రి 8 గంటల వరకు అమలులో ఉంటాయని, ఎవరైనా ఈ ఉత్తర్వులు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. -
మంగళవారం శ్రీ 16 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
వరంగల్ అర్బన్: గ్రేటర్ మహా నగర అభివృద్ధి పనుల్లో పర్సంటేజీల పర్వం కొనసాగుతున్నట్లు ఆ రోపణలు వెల్లువెత్తుతున్నాయి. అగ్రిమెంట్ మొదలుకొని పనులు ప్రారంభించి, వివిధ స్థాయిలో ఇంజినీరింగ్, ఇతర విభాగాల్లో పర్సంటేజీల రూపంలో 13 శాతం సొమ్ము ముట్టజెప్పాల్సి వస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో ఇంజనీర్లు, అధికారులు జీతాలు, రవాణా సదుపాయాలు పొందుతున్నప్పటికీ పర్సంటేజీల కోసం చేతులు చాస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతా మామూళ్ల వ్యవహారమే! జీడబ్ల్యూఎంసీ పరిధిలో ఏటా రూ.వందల కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరుగుతుంటాయి. ఆయా పనులకు సంబంధించి అంచనాల తయారీ, టెండర్ల కేటాయింపు, కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుల బాధ్యతను ఇంజినీరింగ్ విభాగం చూస్తుంటుంది. ఇందుకోసం డ్రాయింగ్ సెక్షన్ అగ్రిమెంట్ సిబ్బంది నుంచి ఎస్ఈ స్థాయి వరకు పని చేస్తుంటారు. ఆయా అభివృద్ధి పనుల్లో కింది స్థౠయి నుంచి పై స్థాయిలో ఉన్న అధికారులందరికీ పర్సంటేజీలు అందుతాయనేది బహిరంగ రహస్యంగా మారింది. పర్యవేక్షకులే పక్కదారి పడితే? కాంట్రాక్టర్లు లాభాపేక్షతో పనులు చేస్తుంటారు. ఇంజినీర్లు పనులు దగ్గర ఉండి శాసీ్త్రయత, నాణ్యతను పరిశీలించాలి. నిబంధనల మేరకు పనులు చేపట్టకపోతే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి. నోటీసులు అందించి బ్లాక్ లిస్టులో పెట్టాలి. కానీ ప్రజాధనానికి సంరక్షకులుగా ఉండాల్సిన కొందరు ఇంజనీర్లు కాసుల కోసం నిబంధనల్ని పక్కన పెట్టి చేతులు చాస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో రోడ్లు, డ్రెయినేజీలు, కల్వర్టులు నిర్మించిన కొద్ది నెలలకే పగుళ్లు చూపుతున్నాయి. బిల్లులు రావట్లేదని కాంట్రాక్టర్ల గగ్గోలు.. ప్రతీ పనికి కమీషన్ల భారం పెరిగిపోతోందని, బిల్లులు మాత్రం సకాలంలో చెల్లించడం లేదని కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. బడా కాంట్రాక్టర్లకు మినహా మధ్య, సాధారణ కాంట్రాక్టర్లకు టెండర్లు గిట్టుబాటు అవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టెండర్ అగ్రిమెంట్ బిల్లు రికార్డు, చివరి చెక్కు చేతికందే వరకు ఏఈకి 3శాతం, డీఈకి 2శాతం, ఈఈకి 1 శాతం, ఎస్ఈకి 1శాతం, డీబీ, సెక్షన్, 1.5 శాతం, క్వాలిటీ కంట్రోల్, అడిట్, అకౌంటింగ్ విబాగంలో, కార్పొరేటర్ వరకు మొత్తంగా 13 వరకు కమీషన్ల రూపంలో చెల్లిస్తున్నట్లు కాంట్రాక్టర్లు వాపోతున్నారు. చర్యలు తీసుకుంటాం.. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించా ల్సిందే. థర్డ్ పార్టీ క్వాలిటీ నిపుణులు పరిశీలిస్తుంటారు. ఏమైనా తేడాలోస్తే బిల్లుల్లో కోత పెడతాం. – సత్యనారాయణ, ఎస్ఈఅభివృద్ధి పనుల్లో అవినీతి జలగలు! ఇసుకకు బదులు స్టోన్ క్రషర్ వాడకం నాసిరకం కంకర, సిమెంట్.. మేసీ్త్రలే క్వాలిటీ ఇన్స్పెక్టర్లు మూణ్నాళ్లకే నాణ్యతా ప్రమాణాలకు మంగళం ఏజెంట్ల ద్వారా ఇంజనీర్ల వసూళ్లు కాంట్రాక్టర్ల నుంచి ప్రజాప్రతినిధులకు వాటాలు -
పరీక్షల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు
కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణకు పటిష్ట చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా స్థాయి సమన్వయ కమిటీ చైర్మన్, కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. త్వరలో జిల్లాలో నిర్వహించనున్న జేఈఈ (మెయిన్న్స్)–2026 పరీక్షల నిర్వహణపై సోమవారం కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. జనవరి 21 నుంచి 30 వరకు (మొదటి సెషన్), ఏప్రిల్ 2 నుంచి 9 వరకు (రెండో సెషన్) జరిగే జేఈఈ (మెయిన్)– 2026 పరీక్షల కోసం జిల్లాలోని 4 పరీక్ష కేంద్రాల ఆడిట్ నిర్వహణకు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి నివేదికను సమర్పించాలన్నారు. కమిటీ సభ్యులు డీసీపీ రవి, ఏసీపీ నర్సింహారావులు ఎన్టీఏ ద్వారా నామినేట్ చేయబడిన జిల్లా నోడల్ అధికారి, జవహర్ నవోదయ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ కె.శ్రీమతి, డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్, ఈడీఎం శ్రీధర్, కలెక్టరేట్ ఏఓ గౌరీశంకర్ సమన్వయంతో జిల్లాకు సంబంధించి ఎన్టీఏ అందించిన జాబితా ప్రకారం పరీక్ష కేంద్రాలను సందర్శించి సమగ్ర ఆడిట్ నిర్వహించాలన్నారు. ఆడిట్ పూర్తయిన అనంతరం ఫీడ్బ్యాక్ ఫారమ్ సమర్పించాలన్నారు. -
ముగిసిన తుది విడత ప్రచారం
సాక్షిప్రతినిధి, వరంగల్ : గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు అఖరి అంకానికి చేరుకుంది. హనుమకొండ జిల్లాలోని ఆత్మకూరు, శాయంపేట, నడికూడ, దామెర మండలాల్లో మూడో విడతలో 67 పంచాయతీలకు ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. ఆఖరి విడత ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ముగిసింది. ఈలోగా అత్యధిక ఓట్లను సంపాదించుకునేందుకు మద్యం డబ్బులతోపాటు గిఫ్ట్లను పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే పనిలో అభ్యర్థులు పడ్డారు. ఒక్కో గ్రామంలో ఓటుకు రూ.500 నుంచి రూ.1,000లు పంపిణీ చేస్తుండగా, ఆన్రిజర్వుడు, మేజర్ పంచాయతీల్లో రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు పంపిణీ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. మూడో దశలో మొత్తం 68 పంచాయతీలు, 634 వార్డులకు గాను ఒక గ్రామ పంచాయతీ, 71 వార్డులకు సభ్యులు ఏకగ్రీవం అయ్యారు. దీంతో 67 జీపీలు, 563 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ బరిలో 230 మంది, వార్డుల్లో 1,424 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇందుకోసం మొత్తం 626 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు వెల్లడించారు. ఆత్మకూరు, శాయంపేట, నడికూడ, దామెర మండలాల్లో జరిగే ఈ పోలింగ్లో 626 మంది ప్రిసైడింగ్ అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొననున్నారు. వరంగల్జిల్లాలో నాలుగు మండలాల్లో.. వరంగల్: వరంగల్ జిల్లాలో మూడో దశ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 5గంటలకు ముగిసింది. టీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ విడత పూర్తిగా నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని చెన్నారావుపేట, ఖానాపూరం, నర్సంపేట, నెక్కొండ మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 109 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుండగా, ఇందులో ఏడుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా 102 సర్పంచ్ స్థానాల కోసం 307 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. అలాగే, 946 వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించి 137 మంది ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, మిగిలిన 809 స్థానాల కోసం 1,895 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పల్లెల్లో పంపకాల జోరు హనుమకొండ జిల్లాలో 67 జీపీలు, 563 వార్డులకు.. వరంగల్ జిల్లాలో 102 సర్పంచ్, 809 వార్డులకు ఎన్నికలు ఏర్పాట్లు సిద్ధం చేసిన అధికారులు -
రెండు ఓట్లతో లచ్చమ్మ గెలుపు
హసన్పర్తి: హసన్పర్తి మండలం సూదన్పల్లిలో ఫ్యామిలీ పోరు జోరుగా సాగింది. గ్రామానికి చెందిన ఆకారపు లచ్చమ్మ (కాంగ్రెస్ రెబల్), ఆమె కూతురు శైలజ(కాంగ్రెస్ రెబల్) పోటీలో ఉన్నారు. వీరితో పాటు శైలజ బావ కోడలైన తిక్క మాధవి (కాంగ్రెస్), మాధవి అత్త అయిన జయమ్మ (స్వతంత్ర) అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఫ్యామిలీ పోరులో తిక్క మాధవికి 292 ఓట్లు రాగా, అకారపు లచ్చమ్మకు 294 ఓట్లు వచ్చాయి. రెండు ఓట్ల తేడాతో మనవరాలిపై అమ్మమ్మ (లచ్చమ్మ) సర్పంచ్గా ఎన్నికై ంది. కాగా, జయమ్మకు ఏడు, శైలజకు 74 ఓట్లు వచ్చాయి. మాజీ సర్పంచ్ భర్తపై మాజీ ఉప సర్పంచ్ గెలుపు మడిపల్లిలో మాజీ సర్పంచ్ చిర్ర సుమలత భర్త చిర్ర విజయ్కుమార్పై మాజీ ఉప సర్పంచ్ బుర్ర రంజిత్కుమార్ 21 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. లెక్కింపు సందర్భంగా విజయ్కుమార్కు 910కు పోలవ్వగా, రంజిత్కుమార్కు 930 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్ ఓటు రంజిత్కు నమోదైంది. -
పల్లెవించిన ఓటరు చైతన్యం
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో రెండో విడత పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయ్యింది. మొత్తం 87.25% పోలింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు. రెండో విడతలో భాగంగా ధర్మసాగర్ హసన్పర్తి, ఐనవోలు, వేలేరు, పరకాల మండలాల్లోని 1,25,735 ఓటర్లు ఉండగా.. 1,09,703 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో 87.25గా పోలింగ్ శాతం నమోదైంది. ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు.. రెండో విడత పోలింగ్కు జిల్లాలోని ధర్మసాగర్, హసన్పర్తి, ఐనవోలు, వేలేరు, పరకాల మండలాల్లోని గ్రామ పంచాయతీలకు ఓటర్లు ఉదయం నుంచే పోటెత్తారు. ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా పోలింగ్ ప్రారంభానికి ముందే కేంద్రాల వద్ద బారులుదీరారు. ఓటు వేసేందుకు ఓపికతో క్యూ లైన్లో నిలబడ్డారు. ఒంటిగంట వరకు పోలింగ్ ప్రక్రియ సాగింది. అనంతరం భోజన విరామం తర్వాత వార్డు సభ్యులు, సర్పంచ్ ఓట్ల లెక్కింపును అధికారులు ప్రారంభించారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. రెండో విడత పోలింగ్లో కూడా మహిళల పోలింగ్ శాతం తక్కువగానే నమోదైంది. మొత్తం ఓటర్లు 1,25,735మంది ఉండగా, పురుషులు 54,274, మహిళలు 55,429 ఓటు హక్కు వినియోగించుకున్నారు. థర్డ్ జెండర్ కేటగిరీలో ఇద్దరు ఓటు హక్కు వినియోగించుకోలేదు. పోలింగ్ శాతం చూస్తే మాత్రం పురుషుల కంటే మహిళా ఓట్లు రెండు శాతం తక్కువగా పోలింగ్కు హాజరయ్యారు. తొలి విడత జిల్లాలో 83.95 పోలింగ్ శాతం నమోదవ్వగా రెండో విడతలో 87.25 శాతంగా పోలింగ్ నమోదైంది. దీంతో మొదటి విడత కంటే రెండో విడతలో సుమారు మూడు శాతం ఎక్కువ పోలింగ్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. పర్యవేక్షించిన కలెక్టర్ హనుమకొండ జిల్లాలోని ఐదు మండలాల్లో జరుగుతున్న పోలింగ్ను కలెక్టర్ స్నేహ శబరీష్ పర్యవేక్షించారు. హసన్పర్తి, ధర్మసాగర్, వేలేరు, ఐనవోలు మండలాలను స్వయంగా సందర్శించి పోలింగ్ పరిశీలించి స్థానిక అధికారులకు సూచనలిచ్చారు. వరంగల్ జిల్లాలో పోటెత్తిన ఓటర్లు.. సాక్షి, వరంగల్: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరిగిన నల్లబెల్లి, దుగ్గొండి, గీసుకొండ, సంగెం మండలాల్లోని 1,008 పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. 1,36,191 మంది ఓటర్లకు 1,20,001 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆదివారం సెలవు దినం కలిసి రావడంతో నగరాలు, పట్టణాల్లో స్థిరపడిన వలస ఓటర్లు పల్లెలకు భారీగా తరలివచ్చారు. తొలి విడత నమోదైన 86.52 శాతం కంటే ఈసారి 88.11 శాతం నమోదైంది. ఉదయం ఏడు నుంచి మొదలైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాగింది. గీసుకొండ మండలం గీసుకొండ, గంగదేవిపల్లి, దుగ్గొండి మండలం వెంకటాపూర్, దేశాయిపల్లి, నల్లబెల్లి మండలం నల్లబెల్లి ఉన్నత పాఠశాల, నందిగామ, సంగెం మండలం సంగెం ఉన్నత పాఠశాల, మొండ్రాయిలో హరిత పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల ఓటరు స్లిప్పులు లేక ఇబ్బందులు ఎదురవడం మినహా అంతా ప్రశాంతంగానే సాగింది. మహిళా ఓటర్లు ఎక్కువ.. వినియోగించుకున్నది ఎక్కువ పురుషులే.. ఈ నాలుగు మండలాల్లో 66,427 మంది పురుషులుంటే 58,688 మంది, 69,722 మంది మహిళలుంటే 61,311 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే పురుషులు 88.30 శాతం వినియోగించుకుంటే మహిళలు కాస్త తక్కువగా 87.94 శాతం ఓటేశారు. అంటే మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నా కూడా ఓటు హక్కు వినియోగంలో పురుషులే ముందున్నారు. రెండో విడతలో హనుమకొండ జిల్లాలో 87.25 శాతం పోలింగ్ మొదటి విడత కన్నా 3.3 శాతం అధికం -
నేడు గ్రేటర్ గ్రీవెన్స్
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ సెల్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ సెల్ ఎంతోగానో ఉపకరిస్తుందని, నగర ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. సౌత్జోన్ వర్సిటీ టోర్నమెంట్కు కేయూ జట్టుకేయూ క్యాంపస్: చైన్నెలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఈనెల 15 నుంచి 19వ తేదీ వరకు సౌత్జోన్ ఇంటర్ వర్సిటీ వాలీబాల్ టోర్నమెంట్కు కాకతీయ యూనివర్సిటీ వాలీబాల్ ఉమెన్స్ జట్టు పాల్గొననున్నట్లు కేయూ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ వై.వెంకయ్య ఆదివారం తెలిపారు. ఈజట్టులో ఎం.శ్యామల, ఎ.నందిని, పి.ఉమ, యు.మాధురి, షేక్ ఆఽశాబేగం, జి.ఐశ్వర్య, బి.అక్షిత, ఎం.మౌనిక, జె.సుప్రజ, వి.వెన్నెల, బి.ఆశ, ఎస్.శ్రీలత, జె.పావని, జి.వెన్నెల ఉన్నట్లు వెంకయ్య తెలిపారు. వరంగల్ కిట్స్ ఫిజికల్ డైరెక్టర్ కె.వీరస్వామి కోచ్గా, కొత్తగూడెం (టీజీటీడబ్ల్యూఆర్డీసీ ఉమెన్) ఫిజికల్ డైరెక్టర్ డి.శ్వేత మేనేజర్గా వ్యవహరించనున్నట్లు వెంకయ్య తెలిపారు. వరంగల్ అర్బన్: సూరత్లోని ప్రఖ్యాత లక్ష్మీపతి టెక్స్టైల్స్ ఇండస్ట్రీనీ ఆదివారం గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి సందర్శించారు. ఇండస్ట్రీ నిర్వహణను పరిశీలించారు. గుజరాత్లోని సూరత్లో జరుగుతున్న ఆల్ ఇండియా 116వ మేయర్ల సదస్సుకు ఆమె హాజరయ్యారు. ఈసందర్భంగా మేయర్లతో కలిసి 40 ఎంఎల్డీ టెర్షిషియరీ (తృతీయ) శుద్ధి కర్మాగారాన్ని సందర్శించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ.. అమృత్ 2.0 కార్యక్రమంలో భాగంగా వచ్చే నిధులతో నగరంలో 15 ఎంఎల్డీ సామర్థ్యంతో టెర్షిషియరీ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సూరత్ లో నిర్వహించే ప్లాంట్ నుంచి వచ్చే వాటర్ను అమ్మడం ద్వారా ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారని, నగరంలోనూ అదే తరహా విధానాలు అవలంబించనున్నట్లు పేర్కొన్నారు. తడి వ్యర్థాలను కంపోస్ట్గా మార్చడంపై పౌరులకు అవగాహన కల్పించడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్కు షాక్కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగంలో పార్ట్టైం అధ్యాపకుడిగా పని చేస్తూ కొన్నేళ్ల క్రితం పోస్ట్ డాక్టరల్ ఫెల్లో షిప్ (పీడీఎఫ్) పొందిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శంకరయ్యకు ఎదురు దెబ్బ తగిలింది. పార్ట్టైం అధ్యాపకుడిగా పని చేస్తూ పోస్ట్ డాక్టరల్ ఫెల్లోషిప్ పొందడం నిబంధనలకు విరుద్ధమని పోస్ట్ డాక్టరల్ను తిరిగి రీఫండ్ చేయాలని కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం ఈ నెల 10న ఆదేశాలు జారీ చేశారు. పోస్ట్ డాక్టరల్ ఫెల్లోషిప్గా పొందిన రూ. 6,89,400 కేయూ యూజీసీకి నెలరోజుల్లో రీఫండ్ చేయాలని ఆదేశాలు జారీచేశారు. శంకరయ్య ప్రస్తుతం హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో తెలుగు విభాగంలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షుల నియామకం కాజీపేట: అఖిల భారతీయ బ్రాహ్మణ సేవా సంఘం (చాణక్య దళ్)ను పటిష్టంగా తీర్చిదిద్దడంలో భాగంగా రాష్ట్రంలోని పలు జిల్లాలకు నూతనంగా జిల్లా అధ్యక్షులను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు అయినవోలు మల్లిఖార్జున శాస్త్రి తెలిపారు. కాజీపేటలో ఆదివారం సంఘం సభ్యులతో కలిసి జిల్లా అధ్యక్షులను ప్రకటించారు. చిలుకపాటి వెంకటశివకుమార్ (హనుమకొండ), గూడా వెంకటరమణ శర్మ (వరంగల్ అర్బన్), కాంచనపల్లి సిద్ధేశ్వర శర్మ (వరంగల్), యల్లంబట్ల కరుణాకర శర్మ (జనగామ), కొట్లావజ్జుల రామమూర్తి శర్మ (మహబూబాబాద్), విరాళ చంద్రశేఖర్ శర్మ (సిద్దిపేట), చిన్నోజుల లక్ష్మీరాజం శర్మ (రాజన్న సిరిసిల్ల), జి.శ్రావణ్ కుమార శర్మ (జయశంకర్ భూపాలపల్లి)ను నియమించారు. ఈ మేరకు నూతన అధ్యక్షులకు నియామక పత్రాలు అందించి అభినందించారు. -
ఎంజీఎంలో సిబ్బంది కొరత వాస్తవమే
ఎంజీఎం: ‘ఎంజీఎంలో పరికరాలు, సిబ్బంది కొరతను గుర్తించాం. ఔషధాల బడ్జెట్ విడుదల జరిగేలా చర్యలు తీసుకుంటా’ అని వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ) నరేంద్రకుమార్ అన్నారు. ఎంజీఎం రోగిని ఎలుకలు కొరిన ఘటన నేపథ్యంలో ఆదివారం ఆయన ఆస్పత్రిని పరిశీలించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రిలోని ఆర్ఐసీయూ, క్యాజువాలిటీ, ఎంఎంసీ, ఐఎంసీ, ఎస్ఎన్సీయూ విభాగాలు పరిశీలించినట్లు తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న క్యాజవాలిటీ రోగుల రద్దీకి సరిపడేలా లేదని గుర్తించినట్లు పేర్కొన్నారు. అత్యవసర విభాగాల్లో పరికరాలు, సిబ్బంది కొరత ఉందని, రోగులకు మరిన్ని మెరుగైన సేవలందించేందుకు ఔషధాల బడ్జెట్ ఎప్పటికప్పుడు విడుదలయ్యేలా కృషి చేస్తామన్నారు. ఎంజీఎం ఆస్పత్రి క్యాజువాలిటీ అడ్మిట్ అయిన రోగులను ఎందుకు రెఫరల్ చేస్తున్నారనే విషయాలపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని ఎంజీఎం పరిపాలనాధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఆర్ఎంఓలకు ప్రత్యేక నంబర్లు కేటాయించి రోగులకు వైద్యులు అందుబాటులో ఉండేలా చూడనున్నామన్నారు. ఎంజీఎం ఆస్పత్రికి సూపర్స్పెషాలిటీ వైద్యుల నియామకం జరిగేలా చర్యలు తీసుకుంటామని, ఆస్పత్రిలో నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో అందుతున్న సేవలను ప్రత్యేకంగా పరిశీలించినట్లు తెలిపారు. వైద్యుల హాజరు శాతం మెరుగపర్చేలా చర్యలు చేపడతామని, ఆర్ఎంఓల నియామకం చేపడతామన్నారు. ఎంజీఎంలో అందుతున్న వైద్య సేవలపై రోగులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో డీఎంఈ వెంట ఎంజీఎం సూపరింటెండెంట్ హరీశ్చంద్రారెడ్డి, ఆర్ఎంఓ అశ్విన్ తదితరులు పాల్గొన్నారు.● ఆర్ఎంఓల నియామకం చేపడతాం ● రెఫరల్ వైద్య సేవలపై ఆడిట్ చేపడతాం.. ● వైద్య విద్య సంచాలకుడు నరేంద్రకుమార్ -
వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రెండో విడతలోనూ ‘పై చేయి’..
సాక్షిప్రతినిధి, వరంగల్ : హనుమకొండ జిల్లాలో ఆదివారం జరిగిన గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ పై చేయి సాధించింది. ఓటర్లు అత్యధికంగా తమ ఓటుహక్కును వినియోగించుకుని చైతన్యం కనబరిచారు. జిల్లా పరిధి ఐదు మండలాల్లోని 73 గ్రామ పంచాయతీలకు ఆరు ఏకగ్రీవం కాగా.. అందరూ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే. ఆదివారం పోలింగ్ జరిగిన 67 గ్రామ పంచాయతీల్లో 33 చోట్ల కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. 22 పంచాయతీల్లో బీఆర్ఎస్ బలపరచిన అభ్యర్థులు గెలుపొందగా, రెండు చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. నలుగురు కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థులు కలుపుకుని మొత్తం 10 మంది స్వతంత్రులు సర్పంచ్లుగా గెలుపొందారు. మండలాల వారీగా ఫలితాలు ఇలా... వేలేరులో బీఆర్ఎస్ మొదటి స్థానంలో నిలిచింది. మొత్తం 12 స్థానాలకు ఆరు చోట్ల బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు గెలవగా, రెండు ఏకగ్రీవం కలుపుకుని ఐదు పంచాయతీల్లో కాంగ్రెస్ పాగా వేసింది. ఒకచోట స్వతంత్రులు గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. హసన్పర్తి మండలంలో 15 పంచాయతీలకు రెండు ఏకగ్రీవం కలిపి ఆరు కాంగ్రెస్, రెండు బీఆర్ఎస్, ఒకటి బీజేపీ మద్దతుదారులు గెలుచుకోగా నాలుగు పంచాయతీలలో కాంగ్రెస్ రెబల్స్, రెండు చోట్ల ఇండిపెండెంట్లు విజయం సాధించారు. ఐనవోలు 17 పంచాయతీలకు 9 కాంగ్రెస్, ఐదు బీఆర్ఎస్, ఒకటి బీజేపీ మద్దతుదారులు, ఒకచోట ఇండిపెండెంట్ గెలిచా రు. పరకాలలో 10 పంచాయతీలకు ఆరు కాంగ్రెస్, నాలుగు బీఆర్ఎస్, ధర్మసాగర్లో 19 గ్రామ పంచాయతీలకు రెండు ఏకగ్రీవం కలిపి 13 చోట్ల కాంగ్రెస్, ఐదుచోట్ల బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. ఒకరు ఇండిపెండెంట్ గెలిచారు. రెండో విడతలోనూ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అనూహ్య విజయం సాధించగా.. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబురాల్లో మునిగారు. హసన్పర్తిలో అధికార పార్టీని దెబ్బతీసిన రెబల్స్ రెండో స్థానంలో నిలిచిన ‘కారు’ సంబురాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంతర్మథనంలో బీఆర్ఎస్, బీజేపీలు -
నవోదయ ప్రవేశ పరీక్ష ప్రశాంతం
ఖిలా వరంగల్: మామునూరు జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశం కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతగా ముగిసింది. 28 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. మొత్తం 5,648 మంది విద్యార్థులకు 4,383 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 89 శాతం విద్యార్థులు హాజరుకాగా 1,265 మంది గైర్హాజరయ్యారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంట వరకు నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని పర్యవేక్షకురాలు, నవోదయ ప్రిన్సిపాల్ డాక్టర్ పూర్ణిమ తెలిపారు. 80 సీట్లకు 4,383 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు చెప్పారు. ఉన్నతాధికారులు, పోలీసు బలగాలు ఉదయం నుంచే ఆయా పరీక్ష కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశాయి. విద్యార్థులను గంటముందే పరీక్ష హాళ్లలోకి అనుమతించారు. పరీక్ష ప్రశాంతంగా నిర్వహించినందుకు అధికారులు, పోలీసులు, పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులకు ప్రిన్సిపాల్ పూర్ణిమ కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 28 కేంద్రాల్లో ఎంట్రెన్స్ మొత్తం 5,648 మందికి 4,383 మంది హాజరు -
108 సిబ్బంది ఉత్తమ సేవలందించాలి
హన్మకొండ అర్బన్: అత్యవసర సేవలందించే ఉద్యోగులు ఎప్పటికప్పుడు అధునాతన పద్ధతులు పాటిస్తూ విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, మెరుగైన సేవలందించడానికి సిద్ధంగా ఉండాలని డీఎంహెచ్ఓ అప్పయ్య అన్నారు. 108 ఉద్యోగుల శిక్షణను కలెక్టరేట్లోని టీజీఓస్ భవనంలో కొనసాతుగుతుండగా శనివారం డీఎంహెచ్ఓ అప్పయ్య పాల్గొని సిబ్బందికి పలు సూచనలిచ్చారు. జీవీకే ఈఎంఆర్ఐ ఈఎంఎల్సీ నిర్వాహకుడు ప్రమోద్ 108 ఉద్యోగులకు శిక్షణ ఇచ్చారు. జిల్లాలో ఈఎంటీ క్రాంతికుమార్, సుధామల్ల సుధా బెస్ట్ కేసు విషయంలో స్టార్ అవార్డును డాక్టర్ అల్లం అప్పయ్య చేతుల మీదుగా అందుకున్నారు. 108 ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి నసీరుద్దీన్, పాటి శివకుమార్, మేనేజర్ మహేశ్గౌడ్, శిక్షకులు ప్రమోద్కుమార్, హనుమకొండ జిల్లా మేనేజర్లు మండ శ్రీనివాస్, గుర్రపు భరత్ కుమార్, రాజ్కుమార్, రాజునాయక్, పైలెట్లు, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు హాజరయ్యారు. హెచ్పీవీ వ్యాక్సిన్తో క్యాన్సర్ను అరికట్టవచ్చు ఎంజీఎం: ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా 14 ఏళ్ల బాలికలకు హెచ్పీవీ వాక్సిన్ ఇవ్వడం ద్వారా వారిని గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ బారిన పడకుండా కాపాడవచ్చని డీఎంహెచ్ఓ అప్పయ్య సూచించారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్లో పీహెచ్సీ, యూపీహెచ్సీ వైద్యాధికారులకు హెచ్పీవీ వ్యాక్సినేషన్పై శిక్షణ నిర్వహించారు. డీఐఓ మహేందర్, శిక్షణాధికారి భార్గవ్ హెచ్పీవీ సంబంధిత కేన్సర్లపై వ్యాక్సిన్ ఇచ్చే రక్షణ చర్యలను వివరించారు. ప్రోగ్రాం అధికారులు ప్రభుదాస్, రుబీనా, భార్గవ్, వైద్యాధికారులు అశోక్రెడ్డి, శిరీష, ప్రవీణ్, సునీల్, జయంతి, విప్లవ్, జ్యోతి, మురళి పాల్గొన్నారు. ఉద్యోగులకు పునశ్చరణ తరగతులు హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య -
నేడే రెండో విడత పోలింగ్
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో ఆదివారం జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్కు అధికార యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. ఐదు మండలాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్, తదుపరి ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటుంది. రెండో విడతలో ధర్మసాగర్, హసన్పర్తి, ఐనవోలు, వేలేరు, పరకాల మండలాల్లో పోలింగ్ జరగనుంది. శనివారం ఆయా మండలకేంద్రాల్లోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి సిబ్బంది కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఈ 5 మండలాల్లో మొత్తం 1,28,315 మంది ఓట ర్లు ఉన్నారు. అధికారుల నియామకం.. 5 మండలాల్లో జీపీలు 73, వార్డులు 694 ఉన్నాయి. ఇందులో 5 ఏకగ్రీవమయ్యాయి. ఒక సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైంది. ప్రస్తుతం 677 జీపీల్లో ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ స్థానానికి 248 మంది, వార్డుస్థానాలకు 1,442 మంది పోటీలో ఉన్నారు. 120 వార్డులు ఏకగ్రీవం కాగా 574 చోట్ల పోలింగ్ జరగనుంది. హసన్పర్తిలో సిబ్బందికి సూచనలిస్తున్న కలెక్టర్ స్నేహ శబరీశ్ -
పోస్టల్ ప్రొడక్ట్స్, స్టాంప్స్పై ఇంటర్న్షిప్
నిట్ వరంగల్ విద్యార్థులు పోస్టల్ ప్రాడక్ట్స్, స్టాంప్స్పై ఇంటర్న్షిప్ చేస్తే ప్రోత్సాహం కల్పిస్తాం. విద్యార్థులు పోస్టల్ సేవల్ని వినియోగించుకునేందుకు జెన్ జెడ్ పోస్టోఫీస్ను నిట్ వరంగల్ క్యాంపస్లో ఏర్పాటు చేశాం. విద్యార్థులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాం. నిట్ వరంగల్ విద్యార్థులతో పాటు అధ్యాపకులకు, సిబ్బందికి ఆధునిక టెక్నాలజీతో సేవలందిస్తాం. సెక్యూరిటీ సిబ్బంది, నాన్ టీచింగ్ స్టాఫ్కు పోస్టల్ ప్రమాద బీమాపై అవగాహన కల్పించి ప్రీమియం చెల్లించేలా ఆసక్తి కనబర్చాం. – వి.హనుమంతు, సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీస్, హనుమకొండ కార్పొరేట్ ఆఫీస్ను తలపిస్తోంది.. మా క్యాంపస్లో ఏర్పాటు చేసిన మా జెనరేషన్కు తగ్గట్టు జెన్ జెడ్ పోస్టాఫీస్ కార్పొరేటర్ స్థాయి ఆఫీస్ను తలపిస్తోంది. ఫ్రీ వైఫై సేవలు ఆస్వాదిస్తున్నాం. కాఫీ లాంజ్లో కూర్చున్న ఫీలింగ్ కలుగుతోంది. ఇతర ఇంజనీరింగ్ కళాశాలల్లోని మా ఫ్రెండ్స్ నిట్లోని జెన్జెడ్ పోస్టాఫీస్ను వీక్షించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. పోస్టాఫీస్లో అందించే సేవలు సద్వినియోగించుకుంటాం. – చిన్న వెంకటరమణ, ఈసీఈ బీటెక్ ఫైనలియర్● -
ఆధునిక టెక్నాలజీతో నేటితరానికి సేవలందించేందుకు మరో అడుగు ముందుకేసింది కేంద్ర సమాచారశాఖ. ఈనెల 10వ తేదీన తెలంగాణలోనే తొలి జెన్ జెడ్ పోస్టాఫీస్ను నిట్ వరంగల్ క్యాంపస్లో అట్టహాసంగా ప్రారంభించింది. తరాల వారధిగా నిలుస్తూ.. రూపాంతరం చెందుతూ వస్తున్న పోస్టల
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా నాటి నుంచి నేటి వరకు అందుబాటులో ఉన్న పోస్టల్ స్టాంప్స్తో ప్రీ మాటిక్ స్టాంప్స్ పేరిట కాకతీయ కళాతోరణం స్టాంప్స్ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. చేర్యాల పెయింటింగ్స్, పోచంపల్లి చీరలు, సంక్రాంతి పండుగ, తాడు బొంగరం ఆట, జాతీయ సమైక్యతను ప్రతిబింబించే స్టాంపులతో ఏర్పాటు చేసిన కాకతీయ కళాతోరణం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. స్టాంపులతో కాకతీయ కళాతోరణం● ఇటీవల ప్రారంభమైన ఆధునిక తపాలా సేవలు ● పురాతన పోస్టల్ స్టాంపులతో కాకతీయ కళాతోరణం ● గోడల చుట్టూ వివిధ స్టాంపుల నమూనాలతో ముస్తాబు ● సాఫ్ట్వేర్ హబ్ టచ్, ఫ్రీ వైఫై, రౌండ్ టేబుల్ సిట్టింగ్ -
సాఫ్ట్వేర్ హబ్ను తలపించేలా
నిట్ వరంగల్ క్యాంపస్లో ఉత్తరం ప్రయాణాన్ని వ్యక్తపరుస్తూ జర్నీ ఆఫ్ లెటర్ పేరిట సాఫ్ట్వేర్ హబ్ను తలపించేలా జెన్ జెడ్ పోస్టాఫీస్ నిలుస్తోంది. విద్యార్థులకు ఆధునిక టెక్నాలజీని అందిస్తూనే ప్రత్యేకను చాటుకునేందుకు నేటి తరం పోస్టల్ సేవల్ని అందుకునేందుకు చెల్లింపులు క్యూఆర్ కోడ్ ద్వారా, ఉచిత వైఫై సౌకర్యం, లైబ్రరీని తలపించేందుకు ముగ్గురు సిట్టింగ్ చేసేలా కాఫీ టేబుల్ మాదిరిగా టేబుల్ను ఏర్పాటు చేశారు. రెండు తెలుగు పేపర్లు, రెండు ఇంగ్లిష్ మ్యాగజైన్లు, ఒక హిందీ మ్యాగజైన్ అందుబాటులో ఉంచారు. ఈ పోస్టాఫీస్ మీటింగ్ స్పాట్ను తలపిస్తోంది. -
క్రీస్తు దీవెనలు ఉండాలి
కాజీపేట రూరల్: సర్వమానవాళి రక్షకుడు ఏసుక్రీస్తు దీవెనలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఓరుగల్లు పీఠం పాలనాధికారి రెవరెండ్ ఫాదర్ దుగ్గింపుడి విజయపాల్ అన్నారు. కాజీపేట ఫాతిమా కేథడ్రల్ చర్చిలో శనివారం ఏసు క్రీస్తు జయంతి 2025, జూబ్లీ వేడుకలు కనులపండువగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాలనాధికారి ఫాదర్ విజయపాల్ మాట్లాడుతూ.. రోమ్ పరిశుద్ధ పోప్ ఫ్రాన్సిస్ ఈ సంవత్సరాన్ని జూబిలీ సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో.. సంవత్సరం పీఠస్థాయిలో, విచారణ, గ్రామ స్థాయిలో ఈ ఉత్సవాలు నిర్వహించాలని ప్రకటించినట్లు తెలిపారు. ఈ జూబ్లీ వేడుకల్లో విశ్వాసులు ఏసుక్రీస్తు జన్మ రహస్యాన్ని ధ్యానిస్తూ జూబిలీ అంతరార్థాన్ని తెలుసుకోవాలన్నారు. ఫాదర్ విజయపాల్ పూజ బలిని సమర్పించి జూబిలీ సందేశాన్ని అందించి ప్రజల కోసం ప్రార్థించారు. కార్యక్రమంలో ఓరుగల్లు దైవాంకితులు, విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లా స్థాయి స్సైన్స్ ఫేర్, విద్యాసంవత్సరానికి మంజూరైన ఇన్స్పైర్ మనక్ అవార్డు ప్రదర్శనలు ఈనెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్వీ.గిరిరాజ్గౌడ్, జిల్లా సైన్స్ అఽధికారి శ్రీనివాసస్వామి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇన్స్పై ర్కు సంబంధించి మంజూరైన ప్రతీ విద్యార్థి ప్రదర్శనలు ఏర్పాటు చేసేలా ప్రధానోపాధ్యాయుడు బాధ్యత వహించాలని పేర్కొన్నారు. హనుమకొండ విద్యానగర్లోని సెయింట్ పీటర్స్ ఎడ్యూ స్కూల్లో ఈవైజానిక ప్రదర్శనల ఏర్పాటు ఉంటుందని తెలిపారు. బాల వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనేందుకు ప్రకటించిన ఏడు ఇతివృత్తాల్లో ఏవైనా రెండింటికి సంబంధించిన జూనియర్ విభాగం నుంచి ఇద్దరు, సీనియర్ విభాగం నుంచి ఇద్దరు విద్యార్థుల చొప్పున పాఠశాల నుంచి నలుగురు విద్యార్థులతో 4 ప్రదర్శనలకు అవకాశం ఉంది. కాగా, 15న సన్నాహక సమావేశాన్ని అదే స్కూల్లో నిర్వహించబోతున్నట్లు డీఈఓ తెలిపారు. ఆయా కమిటీల కన్వీనర్లు, కోకన్వీనర్లు హాజరుకావాలని సూచించారు. వరంగల్ క్రైం: పోలీస్ అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. కమిషనరేట్లో సివిల్ ఎస్సైలుగా పదోన్నతి పొందిన సుదర్శన్రెడ్డి, రవీంద్రచారి, యాదగిరి, కృష్ణమూర్తి, అజీదుద్దీన్, ఉప్పలయ్య, సారంగపాణి, రాజేశ్వరి సీపీని శుక్రవారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ.. అప్పగించిన పనులు సమర్థవంతంగా పూర్తి చేయాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని సూచించారు.. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ ఎంటీఎం, ఎంఎస్డబ్లూ, ఎంహెచ్ఆర్ఎం తదితర కోర్సుల (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) మూడవ సెమిస్టర్ పరీక్షలు జనవరి 3వ తేదీనుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 3న మొదటి పేపర్, 5న రెండో పేపర్, 7న మూడవ పేపర్, 9న నాల్గవ పేపర్, 12న ఐదవ పేపర్, 16న ఆరవ పేపర్ పరీక్షలు ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహించనున్నట్లు వివరించారు. వెబ్కాస్టింగ్ ఏర్పాట్ల పరిశీలనన్యూశాయంపేట: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నల్లబెల్లి, దుగ్గొండి, సంగెం, గీసుగొండ మండలాల్లోని 74 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియను వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించేందుకు అవసరమైన ఏర్పాట్లను కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సిద్ధం చేశారు. వెబ్కాస్టింగ్ ఏర్పాట్లను సాధారణ ఎన్నికల పరిశీలకురాలు బాలమాయాదేవితో కలిసి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సత్యశారద శనివారం పరిశీలించారు. -
వరంగల్ జిల్లాలో..
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లాలో రెండో విడతలో దుగ్గొండి, గీసుకొండ, నల్లబెల్లి, సంగెం మండలాల్లో ఆదివారం పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి 1,008 పోలింగ్ కేంద్రాలకు పటిష్ట భద్రత మధ్య బ్యాలెట్ బాక్సులు శనివారం సాయంత్రం తీసుకెళ్లారు. దుగ్గొండి మండలంలో 282, గీసుకొండ మండలంలో 188, నల్లబెల్లి మండలంలో 252, సంగెం మండలంలో 286 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1,39,100 మంది ఓట్లు ఉండగా, 85 శాతంపైనే పోలింగ్ నమోదవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కలెక్టర్ సత్యశారద ఆదివారం గీసుకొండ, సంగెం, నల్లబెల్లి, దుగ్గొండి మండల కేంద్రాల్లోని పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాలను సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోటాపోటీ.. జిల్లాలో మొత్తం గ్రామ పంచాయతీలు 117 ఉండగా, ఒక పంచాయతీకి నామినేషన్లు దాఖలు కాలేదు. ఐదు ఏకగ్రీవంకాగా, 111 పంచాయతీల్లో పోలింగ్ జరగనుంది. ఇందులో 354 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. వార్డులు 1,008 ఉండగా, 978 ఏకగ్రీవమయ్యాయి. 906 వార్డులకుగాను 2,203మంది పోటీ పడుతున్నారు. సంగెం : ఎన్నికల సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్న సిబ్బంది -
గుడులు కట్టిస్తాం.. బడులు బాగు చేస్తాం
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్లో రోజులు గడిచినా కొద్ది గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం పీక్కు చేరుతోంది. ‘మీరేం అడిగితే అది చేస్తాం. అభివృద్ధికి పాటుపడతాం. గుడులు కడతాం, బడులు బాగు చేస్తాం’ అంటూ అలవి కాని హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు సర్పంచ్ అభ్యర్థులు. రెండో విడత ప్రచారానికి శుక్రవారం తెరపడగా.. శనివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 15న (సోమవారం) సాయంత్రం 5 గంటలకు మూడో విడత ప్రచారం ముగియనున్న నేపథ్యంలో ప్రచారం కొత్తపుంతలు తొక్కుతోంది. వ్యూహాలతో ముందుకు వెళ్తూ.. మొదటి విడతలో ఉమ్మడి జిల్లాలో 555 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 53 ఏకగ్రీవమయ్యాయి. 502 చోట్ల ఈనెల 11న పోలింగ్ నిర్వహించారు. 333 జీపీలను కాంగ్రెస్ మద్దతుదారులు కై వసం చేసుకోగా, బీఆర్ఎస్ 148, బీజేపీ 17, సీపీఐ 1, ఇతర్లు 56 చోట్ల గెలుపొందారు. ఈ ఫలితాలపై పోస్టుమార్టం నిర్వహించిన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు.. రెండు, మూడు విడతల్లో మరింత మెరుగైన ఫలితాల కోసం వ్యూహాలు రూపొందిస్తున్నారు. కొంచెం ఎఫర్ట్ పెడితే మరిన్ని స్థానాలు పెరిగేవని కాంగ్రెస్ నేతలు చెప్పుకొస్తుండగా, మరింత వ్యూహాత్మకంగా ముందుకు సాగుతామని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. బీజేపీ సైతం తమ మద్దతుదారులను గెలిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామంటున్నారు. రెండో విడతలో ఉమ్మడి జిల్లాలో మొత్తం 564 పంచాయతీలకు 57 ఏకగ్రీవం కాగా, 507 గ్రామాల్లో ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి జోరుగా ప్రలోభాలు.. పంపకాలు రెండో విడత అభ్యర్థుల గెలుపు కోసం అన్ని పార్టీల నాయకులు శనివారం రాత్రి నుంచే విచ్చలవిడిగా ధనప్రవాహానికి శ్రీకారం చుట్టారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు గ్రామ పంచాయతీలను బట్టి ఓటుకు రూ.500ల నుంచి రూ.2,500ల వరకు పంపిణీ చేశారన్న ప్రచారం ఉంది. ఒక ఇంట్లో నలుగురు ఓటర్లుంటే ఫుల్బాటిల్.. కిలో చికెన్ చొప్పున చాలా గ్రామాల్లో సరఫరా చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ సాగిందనే ఆరోపణలూ ఉన్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థుల పాట్లు డబ్బు, మద్యం కానుకల ఎర గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల నేతలు రెండో విడతలో ఉమ్మడి జిల్లాలో 564లో 57 ఏకగ్రీవం 507 పంచాయతీలకు హోరాహోరీపరకాల మండలానికి చెందిన ఓ మేజర్ గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్గా పోటీ చేస్తున్న అభ్యర్థి ఒకరు ఓ సామాజిక వర్గానికి చెందిన ప్రజల డిమాండ్ నెరవేర్చేందుకు అడిగిందే తడవుగా గుడి కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఇది తెలిసిన మరో అభ్యర్థి సైతం ఆ సామాజిక వర్గం ఓటర్ల వద్దకు వెళ్లి తన సంసిద్ధతను వ్యక్తం చేయడం వివాదాస్పదమైంది. ఇద్దరూ తేల్చుకునేలోపే రెండో విడత ప్రచారం ముగిసింది. -
సినిమాకు వెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల
● 25 తులాల బంగారు ఆభరణాలు చోరీ హసన్పర్తి: సినిమాకు వెళ్లొచ్చేసరికి దుండగులు ఆ ఇంటిని గుల్ల చేశారు. తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన కేయూ పీఎస్ పరిధిలోని వెంకటేశ్వరకాలనీ–5లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కాలనీకి చెందిన ఆకాశ్ శ్రీకార్ ఓ ప్రైవేట్ ఫైనాన్స్లో పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి కుటుంబీకులతో కలిసి సినిమాకు వెళ్లాడు. తిరిగి ఇంటికొచ్చే సరికి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. అనుమానంతో లోపలికి వెళ్లి చూడగా.. బీరువాలో ఉన్న సుమారు 25 తులాల బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. బాఽధితుడు వెంటనే కేయూ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో హనుమకొండ ఏసీపీ నర్సింహారావు, ఇన్స్పెక్టర్ రవికుమార్ ఘటనాస్థలిని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం జాగిలాలతో గాలించారు. క్లూస్ టీం వేలిముద్రలు సేకరించింది. -
చెత్త శాంపిళ్లను సమర్థంగా సేకరించాలి
బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ వరంగల్ అర్బన్: నగరవ్యాప్తంగా పలు డివిజన్ల నుంచి ఏరకమైన తడి, పొడి చెత్త సేకరణ జరుగుతుందని క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి, నివేదిక సమర్పించాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ సూచించారు. శుక్రవారం వరంగల్ పరిధి పోతన నగర్, బల్దియా ఆవరణలోని బయో మిథనైజేషన్ ప్లాంట్తో పాటు ఎన్ఐయూఏ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ ఎఫ్సైర్స్) వారు సేకరిస్తున్న చెత్త శాంపిళ్ల తీరును కమిషనర్ పరిశీలించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏ రకమైన చెత్త వస్తుందో ఎన్ఐయూఏ ప్రతినిధులు చేస్తున్న అధ్యయనానికి సిబ్బంది సహకరించాలని కోరారు. కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్లు గోల్కొండ శ్రీను, నరేందర్. శానిటరీ ఇన్స్పెక్టర్లు మధు, రాజు పాల్గొన్నారు. -
సేవల వినియోగంపై చైతన్యపర్చాలి
ఎంజీఎం: ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలు వినియోగించుకునేలా చైతన్యపర్చాలని హనుమకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాది ఎం.కవిత అన్నారు. శుక్రవారం లష్కర్ సింగారం పట్టణ ఆరోగ్య కేంద్రంలో లీగల్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో న్యాయవాది కవిత మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది అందిస్తున్న సేవలను ప్రజలు వినియోగించుకుని వైద్య పరంగా ప్రజలు ఖర్చు తగ్గించుకునేలా అవగాహన కలిగించడంలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితోపాటు పారా లీగల్ వలంటీర్లు కూడా కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వపరంగా అందిస్తున్న ఆరోగ్య కుటుంబ సంక్షేమ సేవలు, ఉచితంగా అందించే డయాగ్నస్టిక్ సేవలు, మందులు, వైద్య సలహాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఒత్తిడిని అధిగమించడం అలాగే మంచి ఆహారపు అలవాట్ల ద్వారా జీవనశైలి వ్యాధులు నియంత్రించవచ్చన్నారు. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే సందర్భంగా హనుమకొండ డీఎల్ఎస్ఏ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సంయుక్తంగా ఈకార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి హైదర్, జిల్లా మాస్ మీడియా అధికారి వి.అశోక్రెడ్డి, హెల్త్ సూపర్వైజర్లు ఈ.బాబు, మరియా థామస్, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఏఎన్ఎంలు, ఆశాలు పాల్గొన్నారు. -
ఘనంగా ఐఎంఏ ప్రమాణ స్వీకారం
ఎంజీఎం: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 2025–26 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. వరంగల్ నగరంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్, యాక్షన్ కమిటీ చైర్మన్ రవీందర్రెడ్డితో పాటు నూతన కార్యవర్గ సభ్యులు జ్యోతి ప్రజ్వళన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా నూతన అధ్యక్షుడు డాక్టర్ మన్మోహన్రాజు, ప్రస్తుత అధ్యక్షుడు డాక్టర్ నాగర్జునరెడ్డి నుంచి అధ్యక్ష మెడల్ను స్వీకరించారు. అనంతరం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై న శిరీష్కుమార్, ఉపాధ్యక్షులు రాజిరెడ్డి, రంజిత్కుమార్, కూరపాటి రాధిక, జాయింట్ సెక్రటరీలు షఫీ, ప్రసన్నకుమార్, దిడ్డి స్వప్నలత, ఆర్థిక కార్యదర్శి వేములపల్లి నరేశ్తో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సెంట్రల్ కౌన్సిల్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈకార్యక్రమానికి విశిష్ట అతిథులుగా డాక్టర్ కాళీ ప్రసాద్, శేషుమాధవ్, కస్తూరి ప్రమీల, డీఎంహెచ్ఓ అప్పయ్య, డాక్టర్ సుధీర్, విజయ్చందర్రెడ్డి, బందెల మోహన్రావు హాజరయ్యారు. -
ప్రజాస్వామ్య పరిరక్షణ అందరి బాధ్యత
విద్యారణ్యపురి: ప్రజాస్వామ్య పరిరక్షణ అందరి బాధ్యత అని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం.కోదండరాం అన్నారు. హనుమకొండ ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో ‘ఇండియా 2047 రియలైజింగ్ ది విజన్ ఆఫ్ ఎ డెవలప్డ్ ఈక్విటబుల్ అండ్ సస్టెయినబుల్ రిపబ్లిక్’ అంశంపై నిర్వహిస్తున్న జాతీయ సదస్సు శుక్రవారం ముగిసింది. ముగింపు సభకు ముఖ్య అతిథిగా హాజరైన కోదండరాం మాట్లాడుతూ.. ఇలాంటి జాతీయ సదస్సుల్లో చర్చల ద్వారా పలు అంశాలపై అవగాహన పెంపొందుతుందన్నారు. ఈసదస్సులో విశిష్ట అతిథిగా ఆంధ్రప్రదేశ్ సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ కన్వీనర్, ఆల్ఇండియా ఫోరం ఫర్ రైట్ ఎడ్యుకేషన్ మెంబర్ ప్రిసిడియం డి రమేష్ పట్నాయక్ హాజరై మాట్లాడారు. పబ్లిక్ పాలసీ ఎక్స్పర్ట్ అండ్ కన్సల్టెంట్ ఎట్ది ఫెస్టిసైడ్ ఆక్షన్ నెట్వర్క్స్ ఇండియా ప్రొఫెసర్ దొంతి నర్సింహారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ బి.చంద్రమౌళి, సదస్సు కన్వీనర్ డాక్టర్ సామ్యూల్ ప్రవీణ్కుమార్, నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వాగేషన్, ప్రఖ్యాత ట్రాన్స్జెండర్ రచన మందరబోయిన, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి.సుహాసిని, అధ్యాపకులు సురేశ్బాబు, ఎం.అరుణ, సుజాత, మధు, కె.శ్రీనివాస్, రామకృష్ణారెడ్డి, పద్మ, సారంగపాణి, యుగేందర్ తదితరులు పాల్గొన్నారు. 46 మంది పరిశోధన పత్రాలు సమర్పించారు. పాల్గొన్న ప్రతినిధులకు సర్టిఫికెట్లు అందజేశారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ముగిసిన జాతీయ సదస్సు -
సకాలంలో పరిహారం అందించాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో అత్యాచార కేసుల్లో బాధితులకు సకాలంలో పరిహారం అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అత్యాచార కేసుల్లో బాధితులకు పరిహారం చెల్లింపుపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అత్యాచార బాధితులకు పరిహారం చెల్లింపులో ఆలస్యం జరగకుండా చూడాలన్నారు. ప్రతీ రెండు నెలలకోసారి కమిటీ సమావేశమవ్వాలని, అందులో చర్చించే అంశాలను ముందస్తుగా తెలియజేయాలన్నారు. అదేవిధంగా అధికారులు అత్యాచార ఘటనలు జరగకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సమావేశంలో డీడబ్ల్యూఓ జయంతి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ నిర్మల, గిరిజన సంక్షేమ శాఖ అధికారి ప్రేమకళ, బీసీ సంక్షేమ శాఖ అధికారి నరసింహస్వామి, సీఎంఓ సుదర్శన్ రెడ్డి, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ సంజీవరావు, ఇన్చార్జ్ డీసీపీఓ ఎస్.ప్రవీణ్ కుమార్, ఈఓ సింధురాణి, డీవీ యాక్ట్ కౌన్సిలర్ పావని, భరోసా ఎస్సై శ్రీలత, పీఎంహెచ్ఎన్ డాక్టర్ రూబీన, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, తదితరులున్నారు. -
డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్ల ఏర్పాటు
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాల్లోని ఐదు మండలాల్లో ఈనెల 14న రెండో విడత ఎన్నికల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. రెండో విడతలో ఎన్నికలు నిర్వహించే ధర్మసాగర్, హసన్పర్తి, ఐనవోలు, వేలేరు, పరకాల మండలాల ఎంపీడీఓలు, ఇతర అధికారులు ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షించారు. ధర్మసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, హసన్పర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో, ఐనవోలు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో, వేలేరు, పరకాల మండల కేంద్రాలలోని ఎంపీడీఓ కార్యాలయాల్లో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో టెంట్లు, కౌంటర్లు, ఫర్నిచర్, తాగునీరు, భోజన వసతి, తదితర ఏర్పాట్లు కల్పించారు. శనివారం ఉదయం నుంచి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఎన్నికల సామగ్రితో సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లేలా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. -
‘కోచ్’.. చకచకా...
శరవేగంగా కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులుకాజీపేట రూరల్: కాజీపేట మండలం అయోధ్యపురంలో రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ (ఆర్ఎంయూ–కోచ్ ఫ్యాక్టరీ) నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 200 మల్టిపుల్ కోచ్ల సామర్థ్యం గల యూనిట్ను రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, పవర్ మెక్ ప్రాజెక్ట్ లిమిటెడ్ అత్యాధునిక టెక్నాలజీ సిస్టంతో రాత్రి, పగలు నిర్మిస్తున్నాయి. 160 ఎకరాల్లో రూ.586 కోట్లతో 2023లో ప్రారంభించిన ఆర్ఎంయూ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్లో మల్టీపర్పస్ కోచ్ల తయారీ, వందేభారత్ కోచ్లను తయారు చేయనున్నారు. ఇప్పటి వరకు రైల్వే జీఎం, ఎంపీ, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు ఈ ప్రాజెక్ట్ను తనిఖీ చేసి పనులు పరిశీలించారు. త్వరగా ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయాలని అధికాలను ఆదేశించారు. ఆర్ఎంయూ ప్రధాన షెడ్లలో యంత్రాల ఫిట్టింగ్ జరుగుతోంది. ఇప్పటికే 80 శాతం నిర్మాణ పనులు పూర్తయినట్లు రైల్వే అధికారులు తెలిపారు. 2026 మార్చి లేదా ఏప్రిల్ నెలలో కోచ్ల ఉత్పత్తి ప్రారంభించేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 10 వేల మందికి ఉపాధి లభించనుంది. చిన్న పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. ట్రాక్ పనులు, ఆర్యూబీ నిర్మాణం ఆర్ఎంయూలో తయారైన ఇంజన్లు బయటకు వెళ్లేందుకు రైల్వే ట్రాక్ నిర్మిస్తున్నారు. ఈ ట్రాక్ 15 రోజుల్లో పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అయోధ్యపురం గ్రామ ప్రజల కోసం, రైల్వే గేట్లో నుంచి వివిధ గ్రామాలకు రాకపోకలు సాగించే ప్రజల సౌకర్యార్థం రోడ్ అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వారం రోజుల్లో ఆర్యుబీని అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. భూములిచ్చాం.. ఉద్యోగాలివ్వాలి: నిర్వాసితులు ‘జీవనోపాధికి ఆధారమైన భూములను రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఇచ్చాం. ఫ్యాక్టరీలో మాకు ఉద్యోగాలు కల్పించాలని ఇప్పటి వరకు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్రెడ్డి, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాగరాజు, రైల్వే అధికారులు, జిల్లా అధికారులను కలిసి కోరాం. ఇప్పటికై నా మా గోడును ఆలకించి ఉద్యోగాలు కల్పించి ఆదుకోవాలి’ అని 114 మంది అయోధ్యపురం భూనిర్వాసితుల కుటుంబాలు కోరుతున్నాయి. రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రధాన షెడ్లలో కొనసాగుతున్న యంత్రాల ఫిట్టింగ్ షెడ్డునుంచి బయటకు కనెక్టివిటీ ట్రాక్ సిద్ధం రాకపోకలకు ఆర్యూబీ నిర్మాణం వచ్చే ఏప్రిల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు ఆర్ఎంయూ ప్రాజెక్ట్లో నిర్మించేవి ఇవే..మెయిన్షాప్, పేయింట్ షాప్, స్టోర్ వార్డు, టెస్ట్ షాప్, క్యాంటీన్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఎలక్ట్రిక్ సబ్స్టేషన్, సెక్యూరిటీ పోస్ట్, రెస్ట్ హౌజ్, సేవగ్ ట్రీట్మెంట్ ప్లాంట్, పంప్హౌజ్, టాయిలెట్ బ్లాక్, ప్యాకెజ్ సబ్స్టేషన్, శౌవర్ టెస్ట్, రోడ్ వే బ్రిడ్జి, పంప్ హౌజ్, జీఎల్ఆర్, పిట్ ట్రావెర్సర్, వ్యాగన్ వే బ్రిడ్జి, గార్డు పోస్టు, ట్రాక్ గేట్, ఆర్యూబీ, పార్కింగ్, 2,000 కేఎల్ కెపాసిటీ పాండ్, స్కార్ప్ బిన్స్, టర్న్బ్రిడ్జి, బౌండ్రివాల్, బాలెస్ట్ట్రాక్, రోడ్, పాత్వే, డ్రెయినేజీలు నిర్మిస్తున్నారు. -
అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని
హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయాన్ని శుక్రవారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, భూపాలపల్లి జిల్లా ఎలక్షన్ అబ్జర్వర్, టీజీఎంఎస్ఐడీసీ, ఏండీ ఫణింద్రరెడ్డి ఐఏఎస్ సందర్శించారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు భద్రకాళి శేషు, పార్నంది నరసింహమూర్తి వారిని ఆలయ మర్యాదలతో స్వాగతించారు. వారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ధర్మకర్తలు ఓరుగంటి పూర్ణచందర్, పాలడుగుల అంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా అమ్మవారిని దర్శించుకున్న భారతీయ హిందూ పరిషత్ అంతర్రాష్ట్రీయ సంస్థ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కోల శివరామకృష్ణ మాట్లాడుతూ.. భారతదేశాన్ని హిందూ దేశంగా, గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈమేరకు దేవాలయ ప్రాంగణంలో ఐదు కోట్ల సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంప శ్రవణ్కుమార్, సభ్యులు వరుణ్కుమార్, దిడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జేఎన్ఎస్లో శుక్రవారం 11వ సబ్ జూనియర్స్ అండర్–14 బాలబాలికల జిల్లా స్థాయి టెన్నికాయిట్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి. కాంగ్రెస్ యువజన నాయకుడు విష్ణురెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఎంపికలు ప్రారంభించారు. ఉజ్వల భవిష్యత్కు క్రీడలు దోహదపడతాయన్నారు. ఇందులో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు మేడ్చల్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని అసోసియేషన్ వరంగల్ జిల్లా సెక్రటరీ గోకారపు శ్యామ్కుమార్ తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర, ఉమ్మడి జిల్లా కోశాధికారులు రాజ్కుమార్, మహ్మద్ జాహూర్, పీఈటీ, పీడీలు నర్సయ్య, శ్రీధర్, శ్రీనివాస్, నిర్మల, సీనియర్ క్రీడాకారులు సీతారాం, శ్రీనివాస్ పాల్గొన్నారు.వరంగల్ క్రైం: ఈనెల 21వ తేదీన జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్ను కక్షిదారులు వినియోగించుకోవాలని, రాజీమార్గం ద్వారా వారి కేసులు పరిష్కరించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం లోక్ అదాలత్కు సంబంధించి వరంగల్ కమిషనరేట్ పోలీసులు రూపొందించిన వాల్ పోస్టర్లను సీపీ సన్ప్రీత్ సింగ్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఈ జాతీయ మెగా లోక్ అదాలత్లో రాజీ పడదగిన క్రిమినల్, సివిల్, ఆస్తి, కుటుంబ, వైవాహిక, బ్యాంకు రికవరీ, విద్యుత్, చెక్ బౌన్స్, తదితర కేసులు పరిష్కరించుకోవచ్చని సూచించారు. చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బులను వృథా చేసుకోవద్దన్నారు. ఎవరైనా కేసుల్లో రాజీ కావాలనుకున్నవారు పోలీస్ అధికారులను సంప్రదించాలని, లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమం వరంగల్ ఏఎస్పీ శుభం, ఏసీపీ డేవిడ్ రాజు, ఇన్న్స్పెక్టర్లు రమేశ్, కరుణాకర్ పాల్గొన్నారు. ఖిలా వరంగల్: ఖిలా వరంగల్ కోటను ప్రపంచ పర్యాటకులను ఆకర్శించే స్థాయిలో అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వర్చువల్ రియాల్టీని అందుబాటులో తీసుకుని రావడానికి మంత్రి కొండా సురేఖ కసరత్తు చేశారు. ఆమె ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం ఖిలా వరంగల్ మధ్యకోటలోని శిల్పాల ప్రాంగణాన్ని హైదరాబాద్కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి రంజిత్ నాయక్, డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్, వరంగల్ డీఆర్ఓ విజయలక్ష్మి, తహసీల్దార్ ఇక్బాల్, డీటీఓ శివాజీ సందర్శించారు. ఆనాటి కట్టాడాలు, నిర్మాణాల్ని వారు పరిశీలించారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి పనులపై కసరత్తు చేశారు. చేయాల్సిన అభివృద్ధి పనులపై ప్రత్యేక నివేదిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు బైరబోయిన ఉమ, వేల్పుగొండ సువర్ణ, టార్చ్ కార్యదర్శి అరవింద్ ఆర్య, గైడ్ రవియాదవ్, కాంగ్రెస్ నేతలు బోగి సురేశ్, బైరబోయిన దామోదర్ తదితరులు పాల్గొన్నారు. -
గైర్హాజరైన వారికి నోటీసులు జారీ చేయాలి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: మొదటి విడతలో ఎన్నికల విధులకు గైర్హాజరైన సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీచేయాలని జిల్లా పంచాయతీ అధికారి కల్పనను వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నోడల్ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికలు పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాల్సిన అవసరాన్ని అధికారులకు గుర్తుచేశారు. అధికారులు పోలింగ్ రోజున ఎలాంటి లోపాలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెెక్టర్ జి.సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, నోడల్ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర వాలీబాల్ జట్టు కోచ్గా జీవన్గౌడ్ వరంగల్ స్పోర్ట్స్: రాజస్తాన్ రాష్ట్రం ఝాంజహు జిల్లాలోని పీలానీలో ఈనెల 16వ తేదీ నుంచి జరగనున్న 49వ జూనియర్ జాతీయస్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొనే తెలంగాణ బాలుర జట్టు కోచ్గా హనుమకొండ డీఎస్ఏ కోచ్ బత్తిని జీవన్గౌడ్ నియమితులయ్యాడు. ఈ మేరకు తెలంగాణ వాలీబాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు గజ్జెల రమేష్బాబు, ఎన్వీ హన్మంతరెడ్డి శుక్రవారం నియామక ఉత్తర్వులను జారీ చేశారు. హనుమకొండ జిల్లా పంథిని గ్రామానికి చెందిన జీవన్గౌడ్ జిల్లా క్రీడా ప్రాథికార సంస్థ వాలీబాల్ కోచ్గా జేఎన్ స్టేడియంలో విధులు నిర్వహిస్తున్నాడు. జాతీయస్థాయిలో తెలంగాణ నుంచి ప్రా తినిధ్యం వహిస్తున్న రాష్ట్ర జట్టుకు కోచ్గా ఎంపికై న జీవన్గౌడ్ను డీవైఎస్ఓ గుగులోత్ అశోక్కుమార్, వాలీబాల్ అసోసియేషన్ బాధ్యులు, క్రీడాకారులు అభినందించారు. 15నుంచి ఎఫ్ఆర్ఎస్ హాజరుకేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిపాలనాభవనంలో ఉద్యోగులకు ముఖ గుర్తింపు (ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్) హాజరును ఈనెల 15నుంచి అమలుచేయనున్నట్లు శుక్రవారం రిజిస్ట్రార్ వి.రామచంద్రం తెలిపారు. వీసీ కె.ప్రతాప్రెడ్డి సమక్షంలో ఈ కొత్త హాజరు విధానాన్ని ప్రారంభించనున్న ట్లు పేర్కొన్నా. మొదటి విడతగా యూనివర్సిటీ క్యాంపస్ కాలేజీ, దూరవిద్యాకేంద్రం, ఫార్మసీ కాలేజి, కో–ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాల, పరీక్షల విభాగం, హా స్టళ్ల కార్యాలయాల్లో ఈ ముఖగుర్తింపు హాజ రును తప్పనిసరి చేయనున్నట్లు వివరించారు. ‘ఓపెన్’ అడ్మిషన్లకు అవకాశం విద్యారణ్యపురి: ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్లో ఈ విద్యాసంవత్సరం 2025–26లో ప్రవేశాలకుగాను తత్కాల్ స్కీంలో భాగంగా మరోసారి అవకాశం కల్పించారు. అపరాధ రుసుంతో ఈనెల 15, 16, 17 తేదీల్లో దరఖాస్తులు చేసుకోవచ్చని హనుమకొండ డీఈఓ ఎల్వి గిరిరాజ్గౌడ్, ఓపెన్ స్కూల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ ఎ.సదానందం ఒక ప్రకటనలో తెలిపారు. టాస్ వెబ్సైట్ హెచ్టీటీఎస్//డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.తెలంగాణస్కూల్.ఓఆర్జీ లేదా మీసేవా , టీజీఆన్లైన్ సెంటర్లలో దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న తర్వాత సంబంధిత డాక్యూమెంట్లు అక్రిడిటెడ్ విద్యాసంస్థలో హైస్కూల్స్, కాలేజీల్లో సంబంధిత దరఖాస్తుతోపాటు సమర్పించాలన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. -
కాజీపేట టు పెంబర్తి..
విద్యారణ్యపురి : మూడేళ్లక్రితం మహబూబాబాద్, ములుగు జిల్లా కేంద్రాల్లో మహాత్మాజ్యోతిబా పూలే బీసీ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలు ఏర్పాటుచేశారు. వివిధ డిగ్రీకోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం కల్పించగా అప్పట్లో అడ్మిషన్లు ఆశించిన స్థాయిలో కాలేదు. దీంతో ఆ తర్వాత మహబూబాబాద్, ములుగులోని ఆ రెండు బీసీ మహిళా డిగ్రీ కళాశాలలను అదే పేర్లతోనే కాజీపేటలోని మహాత్మాజ్యోతిబా పూలే బీసీ ఐదేళ్ల ‘లా’కోర్సు నడుస్తున్న భవనంలోనికి షిఫ్టింగ్ చేశారు. రెండేళ్ల నుంచి ఆ భవనంలోనే అరకొర సౌకర్యాలతోనే ఆయా డిగ్రీ కళాశాలలను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఐదు కోర్సుల్లోనే అడ్మిషన్లు అయ్యాయి. బీఏ, బీకాం సీఏ, ఎంపీసీఎస్, ఎంఎస్డీఎస్, బీఎస్సీ బీజెడ్సీ కోర్సుల్లో సుమారు 230 మంది వరకు విద్యార్థినులు చదువుతున్నారు. ఫస్టియర్, సెకండియర్ కోర్సులు కొనసాగుతుండగా వచ్చే సంవత్సరం ఫైనలియర్ విద్యార్థినులు కూడా ఉంటారు. పది మంది రెగ్యులర్ లెక్చరర్లు ఉండగా ఆరుగురు గెస్ట్ ఫ్యాకల్టీ విద్యాబోధన చేస్తున్నారు. స్పెషల్ ఆఫీసర్గా విశ్రాంత అధ్యాపకుడు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ‘లా’విద్యార్థినుల ఆందోళన ఒకే భవనంలో ఐదేళ్ల ‘లా’కోర్సులో మూడు సంవత్సరాలకు సంబంధించిన విద్యార్థినులు చదువుతున్నారు. ఈభవనంలోనే డిగ్రీ కళాశాల విద్యార్థినులు కూడా ఉండడంతో తమకు కూడా సదుపాయాలు సరిపోవడం లేదని ‘లా’విద్యార్థినులు ఇటీవల ఆందోళనకు దిగారు. డిగ్రీ కళాశాలల వేరే చోట నిర్వహించుకోవాలని ఆందోళన చేపట్టారు. డిగ్రీ కళాశాలను పెంబర్తికి షిఫ్టింగ్ చేయాలని ఆదేశాలు ‘లా’కళాశాల భవనంలోనే కొనసాగుతున్న బీసీ మహిళా డిగ్రీ కళాశాలల (మహబూబాబాద్, ములుగు)ల్లోని విద్యార్థినులను జనగామ జిల్లా పెంబర్తిలో ఇప్పటికే నిర్వహిస్తున్న మహాత్మాజ్యోతిబాపూలే బీసీ మహిళా డిగ్రీ గురుకుల కళాశాలకు షిష్టింగ్ చేయాలని (ఈనెల 20వతేదీవరకు) బీసీ గురుకులాల వెల్ఫేర్ రాష్ట్ర కార్యదర్శి సైదులు ఇటీవల ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు ఇందుకు సంబంఽధించిన ఉత్తర్వులు ఉమ్మడి వరంగల్ బీసీ గురుకులాల ఆర్సీఓకు, మహబూబాబాద్, ము లుగు డిగ్రీ కళాశాలల కలిపి నిర్వహిస్తున్న డిగ్రీ కళా శాల స్పెషల్ ఆఫీసర్కు అందాయి. దీంతో కొన్నినెలలుగా ఈ కళాశాలకు వివిధ చోట్ల అద్దెభవనం చూశారు.కానీ అనువైన భవనం లభించడం లేదంటున్నారు. ఇప్పుడు కళాశాలలోని విద్యార్థినులను పెంబర్తి కళాశాలకు తరలించాలని యోచిస్తున్నారు. ససేమిరా అంటున్న విద్యార్థినుల తల్లిదండ్రులు ఈ కళాశాల మహబూబాబాద్, ములుగు జిల్లాలకు సంబంధించినది కావడంతో ఆయా జిల్లాల్లోని గ్రామీణ ప్రాంత విద్యార్థినులు కూడా కాజీపేటలోని ఈ కాలేజీలో చదువుకుంటున్నారు. తాము పట్టణ ప్రాంతంలో ఉందని ప్రవేశాలు పొందామని, ఇప్పుడు మళ్లీ తమను పెంబర్తి మహిళా గురుకుల కళాశాలకు తరలిస్తే దూరం అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము వెళ్లబోమని స్పెషల్ ఆఫీసర్ ,అధ్యాపకులతోనూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈవిషయం తల్లిదండ్రులకు తెలియడంతో ఇటీవల కొందరు కాజీపేటకు వచ్చి ఇక్కడి నుంచి తరలించొద్దని స్పెషల్ ఆఫీసర్కు విన్నవించుకున్నారు. పలువురు తల్లిదండ్రులు బీసీ గురుకులాల ఉమ్మడి వరంగల్ ఆర్సీఓతోనూ మాట్లాడారని సమాచారం. ఎంజేపీటీబీసీడబ్ల్యూ ఆర్డీసీ రాష్ట్ర సెక్రటరీ ఆదేశాల మేరకు పెంబర్తిలోని బీసీ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలకు తరలించాలనే యోచనలో ఉన్నారు.బీసీ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల షిఫ్టింగ్కు ఆదేశాలు వ్యతిరేకిస్తున్న విద్యార్థినులు, తల్లిదండ్రులు మహబూబాబాద్, ములుగు జిల్లాలకు కలిపి కాజీపేటలో ఏర్పాటు మరోసారి తరలింపునకు ఆదేశాలు జారీ -
లక్ష్యంతో చదివితే ఉన్నతస్థితికి..
కేయూ క్యాంపస్: విద్యార్థులు పట్టుదల, లక్ష్యంతో చదివితే ఉన్నత స్థితికి చేరుకోవచ్చని కాకతీయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ప్రతాప్రెడ్డి అన్నారు. శుక్రవారం కాకతీయ యూనివర్సిటీలోని యూనివర్సిటీ కాలేజీ పరిధిలోని అన్ని విభాగాల్లో ఈ విద్యాఏడాది పీజీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు కేయూలోని ఆడిటోరియంలో ఇండక్షన్ ప్రోగ్రాం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వీసీ ప్రతాప్రెడ్డి పాల్గొని మాట్లాడారు. కాకతీయ స్వర్ణోత్సవ విద్యార్థిగా గర్వపడాలన్నారు. యూనివర్సిటీలో విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పిస్తామన్నారు. పరిపక్వత చెందిన పీజీ విద్యార్థులుగా నాలెడ్జ్ అటిట్యూడ్ స్కిల్స్, లీడర్షిప్, వ్యక్తిత్వంపై దృష్టి సారించాలన్నారు. కాకతీయ యూనివర్సిటీని డ్రగ్స్ రహిత, ఆల్కాహాల్ రహిత క్యాంపస్గా మార్చుకుందామన్నారు. త్వరలో ఎఫ్ఆర్ఎస్ హాజరును కూడా ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ కలిగిన కేయూలోని కే హబ్ను రూసానిధులతో వినియోగంలోనికి తీసుకురానున్నట్లు చెప్పారు. టీ హబ్తో ఎంఓయూతో కూడా ముందుకెళ్లబోతున్నామన్నారు. ఆంగ్ల భాషపై పట్టు సాధించాలన్నారు. ఏసీపీ జితేందర్రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ర్యాగింగ్కు దూరంగా ఉండాలన్నారు. ర్యాంగింగ్కు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు. నార్కోటిక్స్ డిప్యూ టీ కమిషనర్ రమేష్కుమార్ మాట్లాడుతూ.. మా దక ద్రవ్యాలకు బానిసలు కావొద్దన్నారు. మాదక ద్రవ్యాలు వాడిని విక్రయించినా నేరమేనన్నారు. ప్రముఖ న్యాయవాది మాతంగి రమేష్బాబు మాట్లాడుతూ లీగల్ అవేర్నెస్ ఆన్ సెక్సువల్ హరాస్మెంట్ అండ్ స్టూడెంట్ రైట్స్ అనే అంశంపై మాట్లాడారు. ప్రతి కళాశాలలో ఇంటర్నల్ కంప్లెయింట్ సెల్ ఉండాలన్నారు. సమావేశంలో కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్, కేయూ పాలకమండలి సభ్యులు సురేష్లాల్, డాక్టర్ చిర్ర రాజు, డాక్టర్ రమ, సైన్స్ డీన్ ఆచార్య హనుమంతు, స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ మామిడాల ఇస్తారి, కేయూ యూజీసీ కోఆర్డినేటర్ మల్లికార్జున్రెడ్డి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఈసం నారాయణ, ఆచార్య వెంకయ్య, డాక్టర్ సుజాత, డాక్టర్ రాధికారాణి, దీపాజ్యోతి, డాక్టర్ మేఘనరావు, మమత, డాక్టర్ శంకర్, హాస్టల్ డైరెక్టర్ రాజ్కుమార్ పాల్గొన్నారు. ఆంగ్ల భాషపై పట్టుసాధిస్తే ఉపాధి అవకాశాలు కేయూ వీసీ ప్రతాప్రెడ్డి -
జాతర పనులు త్వరగా పూర్తి చేయాలి
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం జాతర పనులన్నీ త్వరగా పూర్తి చేయాలని రెవెన్యూ, హౌసింగ్, పౌరసంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం, మేడారంలో రోడ్ల విస్తర్ణ పనులతోపాటు భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న పనులన్నీ ఈనెల 30 వరకు పూర్తి చేయాలని ఇది లాస్ట్ డెడ్లైన్ అని మంత్రి శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన మంత్రి సీతక్కతో కలిసి అమ్మవార్ల గద్దెల ప్రాంగణం అభివృద్ధి పనులు, సమ్మక్క సారలమ్మ గద్దెల పునరుద్దరణ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల రాతి నిర్మాణాలు, గద్దెల ప్రాంగణంలో ఫ్లోరింగ్ పనులు, రాతి స్తంభాల స్థాపన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం రోడ్ల నిర్మాణం, జంపన్న వాగు వద్ద ఏర్పాట్లు, వాగులో ఇసుక లెవలింగ్ పనులను పరిశీలించారు. అనంతరం జాతర అభివృద్ధి పనులపై ఆయాశాఖల అధికారులతో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించి జాతర పనుల పురోగతి వివరాలపై ఆరా తీశారు. గద్దెల ప్రాంగణం సాలహారం, గద్దెల విస్తర్ణ, ఆర్చీ ద్వారా స్థంబాల స్థాపన పనుల్లో నెమ్మదిగా సాగుతున్నాయని పూజారులు మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఈసందర్భంగా పొంగులెటి మాట్లాడుతూ.. గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం పనులతోపాటు, జాతర అభివృద్ధి పనులన్నీ ఈనెల 30 వరకు పూర్తి చేయాలని అధికారులను అదేశించారు. పనులు త్వరగా పూర్తి చేసేందుకు కార్మికుల సంఖ్యను పెంచడంతోపాటు అదనంగా మరో రెండు క్రేన్లను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. క్యూలైన్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, గుత్తేదారులను ఆదేశించారు. అంతకుముందు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్శన్ రేగ కల్యాణి. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు పాల్గొన్నారు. పనులను పరిశీలించిన మంత్రులు పొంగులేటి, సీతక్క ఈనెల 30 లాస్ట్ డెడ్లైన్ అధికారులతో సమీక్ష సమావేశం -
వెట్టి చాకిరీపై.. కదిలిన యంత్రాంగం
వరంగల్ క్రైం: విద్యార్థులతో బలవంతంగా అంట్లు తోమించి.. టిఫిన్లు తయారు చేయించిన ఓగ్లాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వ్యవహారంపై శుక్రవారం సాక్షిలో ‘చిట్టి చేతులు.. వెట్టి చాకిరీ’ పేరిట కథనం ప్రచురితమైంది. దీంతో రాష్ట్ర, జిల్లా అధికారులు కదిలారు. సాక్షి కథనంపై స్పందించిన పరకాల కోర్టు న్యాయమూర్తి జి.సాయి శరత్ పాఠశాలను సందర్శించడంతో వెట్టి చాకిరీ వ్యవహారం ఒక్కసారిగా వెడెక్కింది. దామెర తహసీల్దార్, జ్యోతి వరలక్ష్మి, డీసీఓ ఉమామహేశ్వరి, భద్రాది కొత్తగూడెం జోనల్ అధికారి అలివేలు, దామెర ఎస్సై అశోక్ కుమార్, ఎంఈఓ రాజేష్ ఉదయం పాఠశాలను సందర్శించారు. ముందుగా టిఫిన్ చేసిన విద్యార్థులను వేర్వేరుగా ప్రశ్నించారు. విచారణలో విద్యార్థులు తమతో బలవంతంగా పనులు చేయించినట్లు అధికారులకు చెప్పినట్లు సమాచారం. పాఠశాలలో పనిచేస్తున్న సంబంధిత కాంట్రాక్టర్ తన దగ్గర వంట మనుషులు లేకపోవడంతో విద్యార్థులను పనిలో పెట్టుకున్నట్లు అధికారులకు చెప్పినట్లు తెలిసింది. చిట్టి వెట్టి చాకిరి కథనంపై స్పందించిన న్యాయమూర్తి సాయి శరత్ ఈఅంశాన్ని సుమోటాగా తీసుకుని పాఠశాల లో విచారణ చేపట్టి నివేదికను జిల్లా ప్రధాన న్యామూర్తికి అందజేసినట్లు తెలిసింది. సమస్యల స్వాగతం.. పాఠశాలలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉండడంతో అధికారులు ప్రిన్సిపాల్పై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్లు తెలిసింది. పాఠశాలలో చోటుచేసుకున్న ఘట నపై లోతుగా విచారణ చేసినట్లు తెలిసింది. భద్రా ది కొత్తగూడెం జోనల్ అధికారి అలివెలు, విద్యార్థులు, ఉపాధ్యాయులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి వివరాలు సేకరించారు. విద్యార్థులు టిఫిన్ వండటం, విద్యార్థులను కులం పేరుతో దూషించిన ఘటనలపై సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శికి నివేదిక సమర్పిస్తామని, ఆ తర్వాత శాఖాపరమైన చర్యలు ఉంటాయని జోనల్ అధికారి అలివేలు తెలిపారు. ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలి: విద్యార్థి సంఘాలు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్న ప్రిన్సిపాల్ సమ్మయ్య ను సస్పెండ్ చేయాలని కోరుతూ టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కన్నం సునిల్, టీజీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడ రంజిత్ కుమార్, విద్యార్థి సంఘాల జేఏసీ కోఆర్డినేటర్ అనిల్ భద్రాది కొత్తగూడెం జోనల్ అధికారికి వినతి పత్రం అందజేశారు. విద్యార్థులతో మాట్లాడిన పరకాల జడ్జి ప్రిన్సిపాల్ సస్పెన్షన్కు విద్యార్థి సంఘాల డిమాండ్ ‘సాక్షి’ కథనంతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు -
14న షైన్ స్కాలర్ షిప్ టెస్ట్
హన్మకొండ : హనుమకొండ బాలసముద్రంలోని షైన్ జూనియర్ కళాశాలలో ఈనెల 14న షైన్ స్కాలర్ షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు షైన్ విద్యాసంస్థల చైర్మన్ మూగల కుమార్యాదవ్ తెలిపారు. శుక్రవారం కళాశాలలో స్కాలర్షిప్ టెస్ట్ బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ టెస్ట్లో 96 నుంచి 100 శాతం మా ర్కులు సాధించిన విద్యార్థులకు ఇంటర్ ప్రవేశంలో పూర్తి రాయితీ అందించనున్నట్లు తెలిపారు. 91 నుంచి 95 మార్కులు సాధించిన విద్యార్థులకు 75 శాతం, 86 నుంచి 90 మార్కులు సాధించినవారికి 50 శాతం, 81 నుంచి 85 మార్కులు సాధించిన విద్యార్థులకు 25 శాతం ట్యూషన్ ఫీజు రాయితీ మొదటి ఐదుగురు విద్యార్థులకు అందించనున్నట్లు వివరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో షైన్ విద్యాసంస్థల డైరెక్టర్లు మూగల రమ, ఏ.కవిత, మూగల రమేష్, ప్రిన్సిపాల్స్ పి.శ్రీనివాస్, ప్రశాంత్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో నిట్ అసోసియేట్ ప్రొఫెసర్ మృతి
ధర్మసాగర్ : అనుమానాస్పద స్థితిలో నిట్ ప్రొఫెసర్ మృతి చెందిన ఘటన మండల కేంద్రంలోని రిజర్వాయర్ వద్ద చోటుచేసుకుంది. పోలీసులు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. వెంకట సుబ్బారెడ్డి(43) వరంగల్ ఎన్ఐటీలో కంప్యూటర్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తూ ఎన్ఐటీ క్యాంపస్లో నివాసం ఉంటున్నాడు. కొన్ని రోజులుగా మానసిక రుగ్మతతో బాధపడుతూ మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అతని మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో శుక్రవారం అనుమానాస్పద స్థితిలో రిజర్వాయర్లో పడి మృతి చెందాడు. ప్రమాదవశాత్తు మృతిచెందాడా.. లేదా.. ఆత్మహత్యకు పాల్పడ్డాడా.. తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. సుబ్బారెడ్డికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ శ్రీధర్ రావు తెలిపారు. మహిళా న్యాయవాదిపై హత్యాయత్నం కాజీపేట: కాజీపేట మండలం దర్గాకాజీపేటలో మహిళా న్యాయవాది యామినిపై ప్రవీన్ కుమార్ అనే యువకుడు హత్యాయత్నం చేసినట్లు సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. బాధితురాలి తండ్రి వీరస్వామి గురువారం రాత్రి ఫిర్యాదు చేసిన మేరకు.. సీఐ తెలిపిన వివరాలి ఉన్నాయి.. న్యాయవాదిగా పనిచేసే యామినికి ఓ కేసు విషయంలో ప్రవీన్కుమార్తో వివాదం తలెత్తింది. దీంతో ఆగ్రహించిన ప్రవీన్కుమార్ చేతిలో ఉ న్న కత్తెరతో దాడిచేయగా స్వల్పంగా గాయపడింది. వెంటనే బాధితురా లిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతుంది. వీరస్వామి ఫిర్యాదు మేరకు నిందితుడిపై హత్యాయత్నం చేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. హనుమకొండ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొత్త రవి బాధితురాలిని ఆస్పత్రిలో పరామర్శించినట్లు సమాచారం. -
ఎమ్మెల్సీ వర్గంలోకి నల్గొండ రమేష్
వరంగల్: వరంగల్ తూర్పు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా కొండా దంపతులకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న నల్గొండ రమేష్ మరో వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య వర్గంలోకి చేరినట్లు శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. తూర్పులో కొండా దంపతులు పార్టీ వ్యవహరాలతోపాటు ఇతర విషయాలు చక్కదిద్దే బాధ్యతలను ఒక నాయకుడికి అప్పగించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ నాయకుడికి రమేష్కు పొసగక పోవడంతో ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు వచ్చినట్లు తెలిసింది. ఈక్రమంలోనే రమేష్కు చెందిన నాయకుడిని పోలీసు కేసులు పెట్టించి కొట్టించడం వల్ల ఆయన తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్కు వెళ్లి తన వర్గం వారికి ఏమైనా చేసేందుకు ప్రయత్నిస్తే అధికార వ్యవహరాలు చేస్తున్న నాయకుడి సూచనలతో అధికారులు వ్యతిరేకం కావడమే కాకుండా కేసులు నమోదు అవుతున్నాయని ఆయన ఎమ్మెల్సీ వర్గం నాయకుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతుంటే ఆ వర్గంలో ఎందుకు ఉండడం తమ వర్గంలోకి రావాలని సూచించడంతో పార్టీ కార్యక్రమాల్లో కొండ వర్గీయులతో కాకుండా ఎమ్మెల్సీ వర్గంతో పాల్గొంటున్నారు. దీనికి తోడుగా ఎమ్మెల్సీకి అత్యంత దగ్గరగా ఉన్న అయూబ్ డీసీసీ అధ్యక్షుడు కావడంతో మరింత ధైర్యంతో నల్గొండ రమేష్ ఎమ్మెల్సీ సారయ్య వర్గంలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. అందువల్ల శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్సీ సారయ్య తన వర్గంతో కలసి నల్గొండ రమేష్ ఇంటికి వెళ్లారు. ఈసందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో పార్టీ వాళ్లపై కేసులు పెట్టించే సంస్కృతి నెలకొందన్నారు. అందువల్ల ఎమ్మెల్సీ సారయ్యతో తన రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తానని తెలిపారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ గుండేటి నరేంద్రకుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోరంటల రాజు, మాజీ నాయకులు తత్తర లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. సదరు నాయకుడి చర్యలతో తూర్పులోని మరిమంది నాయకులు సారయ్య వర్గంలోకి మారే అవకాశాలున్నట్లు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. -
‘నమస్తే’ను వినియోగించుకోవాలి
వరంగల్ అర్బన్: డీ స్లడ్జింగ్ ఆపరేటర్లు,సెప్టిక్ ట్యాంక్ వర్కర్లు ‘నమస్తే (నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైడ్జ్ శానిటేషన్ ఏకో సిస్టిమ్)ను సద్వియోగం చేసుకోవాలని గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి సూచించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో బుధవారం ‘నమస్తే’ కార్యక్రమంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మేయర్ మాట్లాడుతూ.. మల వ్యర్థాలు నిర్వహించే సిబ్బందికి ఈకార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రతీ మూడు నెలలకోసారి సెప్టిక్ ట్యాంకుల డీ–స్లడ్జింగ్ తప్పనిసరిగా చేపట్టేలా షెడ్యూల్ రూపొందిస్తున్నట్లు చెప్పారు. సెప్టిక్ ట్యాంక్ ఆపరేటర్లు టోల్ ఫ్రీ నంబర్ 11420పై ప్రజల్లో చైతన్యం కలిగించాలని కోరారు. కార్యక్రమంలో సీఎంహెచ్ఓ రాజారెడ్డి, ఎంహెచ్ఓ రాజేశ్, ఆస్కీ ప్రతినిధి డాక్టర్ రాజ్మోహన్, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ప్లాంట్ ఏర్పాటు వేగం చేయండిగ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బయో మిథనైజేషన్ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి చర్యలు వేగంగా కొనసాగుతున్నట్లు మేయర్ గుండు సుధారాణి తెలిపారు. గురువారం హనుమకొండలోని మున్సిపల్ అతిథి గృహంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ (ఎన్యూఏ) ప్రతినిధులు, పి.డబ్ల్యూసి నిపుణులు, అధికారులతో కలిసి మేయర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. కార్యక్రమంలో ఏఎస్యూఐ కన్సల్టెంట్ రాహుల్, సీఎంహెచ్ఓ రాజిరెడ్డి, ఎంహెచ్ఓ రాజేశ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. మేయర్ గుండు సుధారాణి సెప్టిక్ ట్యాంక్ వర్కర్ల అవగాహన సదస్సు -
పార్ట్ టైం లెక్చరర్ల నియామకానికి ఓకే..
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని వివిధ విభాగాల్లో, యూనివర్సిటీ కాలేజీల్లో విద్యాబోధనకు పార్ట్టైం లెక్చరర్ల నియామకానికి త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఈమేరకు గురువారం సాయంత్రం కేయూ స్టాండింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. విద్యార్హతలతోపాటు ఇంటర్వ్యూల ద్వారా రోస్టర్ ద్వారా పార్ట్టైం లెక్చరర్లను నియమించనున్నారు. ఏవిభాగంలోని ఆవిభాగం అధిపతి, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్, డీన్, ఇద్దరు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో ఇంటర్వ్యూలు నిర్వహించాలని నిర్ణయించారు. ఏదైనా కోర్సులో సబ్జెక్టులో గోల్డ్మెడల్కు ఎవరైనా తమపేరును పెట్టాలనుకుంటే ఇక నుంచి రూ.5 లక్షలు యూనివర్సిటీకి చెల్లించాల్సి ఉంటుంది 2025–26 వరకు ఆయా కోర్సుల్లో డిటెన్షన్ను ఎత్తి వేయాలని స్టాండింగ్ కమిటీలో నిర్ణయించారు. కేయూ పరిధి ఏ పీజీ కోర్సులోనైనా ఈవిద్యాసంవత్సరంలో ప్రథమ సంవత్సరంలో 15లోపు విద్యార్థులు ప్రవేశాల సంఖ్య ఉంటే.. వేరేచోటకు షిఫ్ట్ చేయాలని స్టాండింగ్ కమిటీలో నిర్ణయించారు. కేయూ స్టూడెంట్స్ అఫైర్స్ డీన్, యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ల పదవులకు స్టాండింగ్ కమిటీలో అప్రూవల్ లభించింది. సుమారు 4:30 గంటలపాటు నిర్వహించిన ఈ కమిటీ సమావేశంలో వివిధ కోర్సుల సిలబస్లపై చర్చించారు. 35 అంశాలకుపైగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం, వివిధ విభాగాల అధిపతులు, డీన్లు, ప్రిన్సిపాళ్లు, స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ పాల్గొన్నారు. రూ.5 లక్షలిస్తే వారిపేరుపై గోల్డ్ మెడల్ ఫార్మసీ, బీటెక్ కోర్సుల్లో డిటెన్షన్ ఎత్తివేత! కేయూ స్టాండింగ్ కమిటీలో నిర్ణయం -
లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి
వరంగల్ లీగల్: రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థల ఆదేశాల మేరకు ఈనెల 21న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు వీబీ నిర్మలాగీతాంబ, డాక్టర్ కె.పట్టాభిరామారావు సూచించారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసదన్ భవన్లో వరంగల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. లోక్ అదాలత్లో రాజీ పడదగు కేసులను పరిష్కరించుటకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇన్సూరెన్న్స్, బ్యాంకు, చిట్ఫండ్ అధికారులు తమ కేసులను పరిష్కరించుకోవాలని, కోర్టుల్లో లేని కేసులను ప్రీ–లిటిగేషన్ ద్వారా న్యాయసేవాధికార సంస్థలో పరిష్కరించుకోవాలని కోరారు. సలహాలు, సూచనల కోసం న్యాయసేవాధికార సంస్థను నేరుగా సంప్రదించాలని సూచించారు. అధిక కేసుల పరిష్కారానికి ఈనెల 4 నుంచే ప్రీలోక్ అదాలత్ను వరంగల్ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభించామని తెలిపారు. కక్షిదారుల కేసులను ఇరుపక్షాల అంగీకారంతో రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవడానికి సులభతరం అవుతుందని వివరించారు. వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయసేవాధికార సంస్థల కార్యదర్శులు ఎ.ప్రదీప్, జి.రామలింగం పాల్గొన్నారు. వరంగల్ జిల్లాలో 8, హనుమకొండ జిల్లాలో 12 బెంచ్లు లోక్ అదాలత్ కోసం వరంగల్ జిల్లా కోర్టులో 7, నర్సంపేట కోర్టులో 1 బెంచ్లు ఏర్పాటు చేసినట్లు జడ్జిలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గుర్తించిన 692 రాజీపడదగిన వివిధ రకాల పెండింగ్ కేసుల్లోని కక్షిదారులకు నోటీసులు జారీ చేశామని పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా కోర్టులో 10, పరకాల కోర్టులో 2 బెంచ్లు ఏర్పాటు చేసినట్లు, అలాగే జిల్లా వ్యాప్తంగా గుర్తించిన 743 పెండింగ్ కేసుల్లోని కక్షిదారులకు నోటీసులు జారీ చేసినట్లు వివరించారు.వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు నిర్మలాగీతాంబ, పట్టాభిరామారావు -
రెండో విడతకు పటిష్ట ఏర్పాట్లు
హన్మకొండ అర్బన్: జిల్లాలో రెండో విడత జీపీ ఎన్నికలు జరగనున్న ధర్మసాగర్, హసన్పర్తి, ఐనవోలు, వేలేరు, పరకాల మండలాల్లో పటిష్ట ఏర్పాట్లు చేయాలని హనుమకొండ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి స్నేహ శబరీష్ ఆయా మండలాల ఎంపీడీఓలను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి ఆయా మండలాల ఎంపీడీఓలు, నోడల్ అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల వారీగా సర్పంచ్, వార్డు స్థానాల బ్యాలెట్ పేపర్లను సరిగ్గా ఉన్నాయా లేదా? అని ఎంపీడీఓలు, ప్రత్యేకాధికారులు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని సూచించారు. మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసే డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రాల (డీఆర్సీ)లో గ్రామపంచాయతీలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల వారీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. డీఆర్సీలలో పోలింగ్ సిబ్బందికి సరిపోయేలా టేబుల్స్, కుర్చీలు, టెంట్లు వేయించాలన్నారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల వివరాలు తెలిసేలా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. డీఆర్సీతో పాటు, పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బందికి నాణ్యమైన భోజనం అందించాలని తెలిపారు. ఈసందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్, డీఆర్డీఓ మేన శ్రీను పోలింగ్ నిర్వహణ, కౌంటింగ్ ఏర్పాట్లపై ఎంపీడీఓలకు పలు సూచనలిచ్చారు. సమావేశంలో ఎంపీడీఓలు అనిల్ కుమార్, సుమనవాణి, నర్మద, లక్ష్మీ ప్రసన్న, ఇతర అధికారులు పాల్గొన్నారు. హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ -
పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్
కమలాపూర్: మండలంలోని శంభునిపల్లి ప్రాథమిక పాఠశాల, ఉప్పల్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలల్లోని పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ స్నేహ శబరీష్ గురువారం పరిశీలించారు. కౌంటింగ్కు సంబంధించిన ఏర్పాట్లు పరిశీలించి, పోలింగ్ కేంద్రాల వారీగా త్వరగా పూర్తి చేసేలా అధికారులకు పలు సూచనలిచ్చారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పోలింగ్ నిర్వహణతో పాటు కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ గుండె బాబు, తహసీల్దార్ సురేశ్కుమార్, స్పెషల్ ఆఫీసర్ నరసింహస్వామి ఇతర అధికారులు పాల్గొన్నారు.రాయపర్తి87.34%పర్వతగిరి86.59%వర్ధన్నపేట85.65%కమలాపూర్72.75%ఎల్కతుర్తి86.17%భీమదేవరపల్లి82.61%సాక్షి, వరంగల్/హన్మకొండ అర్బన్: హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో మొదటి విడత పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్, లెక్కింపు, ఫలితాల వెల్లడి కార్యక్రమాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగియడంతో ఆయా జిల్లాల యంత్రాంగాలు ఊపిరి పీల్చుకున్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాల్లో ఉదయం నుంచి ఉత్సాహంగా ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం ఒంటిగంటకు ముగిసింది. పోలింగ్ ముగిసే సమయానికి కేంద్రాల్లో ఉన్న ఓటర్లకి అధికారులు స్లిప్పులు ఇచ్చి నంబర్లు వేసి పోలింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు బారులుదీరి ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలోని మూడు మండలాల్లో ఓట ర్లు 1,28,651 ఉండగా 1,08,003 ఓట్లు పోలయ్యాయి. , వీరి లో పురుషులు 62,653మందికిగాను 53,026మంది, మహిళలు 65,997 మందికిగాను 54,976మంది ఓటు హక్కు విని యోగించుకోగా, మొత్తం 83.95శాతం పోలింగ్ నమోదైంది. ఉత్సాహంగా ఓటేసిన గ్రామాలు వరంగల్ జిల్లాలో ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లాలోని 731 పొలింగ్ స్టేషన్లలో ఓట్ల జాతర సాగింది. జిల్లాలోని 80 గ్రామ పంచాయతీలు, 585 వార్డు స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో 1,10,487 మంది ఓటర్లకు గానూ 95,939 మంది ఓటేశారు. ఈ లెక్కన 86.83 శాతం పోలింగ్ నమోదైంది. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు చేశారు. మహిళలే ఎక్కువున్నా ఓటేసింది ఎక్కువగా పురుషులే జిల్లాలోని ఈ మూడు మండలాల్లో 54,519 మంది పురుష ఓటర్లు, 55,967 మంది మహిళ ఓటర్లు, ఇతరులు ఒకరు ఉన్నారు. అయితే వీరిలో 47,593 మంది పురుషులు, 48,345 మంది మహిళలు, ఇతరులు ఒకరు ఓటేశారు. అయితే పురుషుల కన్నా మహిళ ఓటర్లు ఎక్కువగా ఉన్న ఎక్కువగా 87.30 శాతం మంది పురుషులు ఓటేయగా, 86.38 శాతం మహిళలు ఓటేశారు. రెండో స్థానంలో బీఆర్ఎస్, 56 మంది ఇతరుల విజయం స్వతంత్రులతో కాంగ్రెస్, బీఆర్ఎస్ల మంతనాలుతొలి విడతఓటింగ్ జరిగిందిలా..హనుమకొండ జిల్లా.. మండలం ఓటర్లు ఓటేసినవారు భీమదేవరపల్లి 40,897 33,783 ఎల్కతుర్తి 31,915 27,621 కమలాపూర్ 55,839 46,599 వరంగల్ జిల్లాలో.. వర్ధన్నపేట 28,358 24,290 పర్వతగిరి 38,631 33,449 రాయపర్తి 43,498 38,200 మరిన్ని ఎన్నికల వార్తలు : 10లో.. -
డీఈఓగా గిరిరాజ్గౌడ్ బాధ్యతల స్వీకరణ
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లా ఫుల్ అడిషనల్ చార్జ్ (ఎఫ్ఏసీ ) డీఈఓగా ఎల్వీ గిరిరాజ్గౌడ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. డీఈఓ కార్యాలయంలో సమగ్ర శిక్ష కో–ఆర్డినేటర్లు బి.మహేశ్, బద్దం సుదర్శన్రెడ్డి, బండారు మన్మోహన్, సునీత, రఘుచందర్, ఓపెన్ స్కూల్ కో–ఆర్డినేటర్ ఎ.సదానందం, ఫైనాన్స్ అకౌంటింగ్ ఆఫీసర్ మధుసూదన్, డీఈఓ కార్యాలయ ఉద్యోగులు పుష్పగుచ్ఛాలు అందించి సన్మానించారు. ఈసందర్భంగా గిరిరాజ్ మాట్లాడుతూ.. నిబంధనలకు అనుగుణంగా బాధ్యతలు నిర్వర్తిస్తానని, కలిసికట్టుగా పని చేద్దామని ఉద్యోగులకు సూచించారు. డీఈఓకు సన్మానం గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, జనరల్ సెక్రటరీ నెహ్రూనాయక్, ట్రెజరర్ సంధ్యారాణి, పీఆర్టీయూ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, జనరల్ సెక్రటరీ ఫలితశ్రీహరి ఇతర బాధ్యులు డీఈఓను కలిసి సన్మానించి పూలమొక్క అందించారు. హన్మకొండ కల్చరల్: తొలి వేద పాఠశాలను ఏర్పాటు చేసి, వేలాది మంది వేద పండితులను అందించిన విశ్వనాథ శాస్త్రి కృషితోనే వేద శాస్త్రాలు పరివ్యాప్తమయ్యాయని తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ అన్నారు. వరంగల్ శంభునిపేటలోని నాగేశ్వరస్వామి దేవస్థానం కల్యాణ మండపంలో తెలంగాణ వైతాళికులు, జ్ఞాననిధి, ఆయుర్వేద ఆచార్యులు శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి జయంతోత్సవం వైభవంగా నిర్వహించారు. శృంగేరి శారదాపీఠం దర్శనం పత్రిక సంపాదకులు మరుమాముల వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు జ్యోతిప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. విశ్వనాథ శాస్త్రి పాదుకలకు శోభాయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో వేదపండితులు పాల్గొన్నారు. ఎంజీఎం: అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న హనుమకొండలోని మైత్రి శ్రీ ఫెర్టిలిటీ సెంటర్లో గురువారం డ్రగ్ అధికారులు దాడి చేశారు. విక్రయానికి సిద్ధంగా ఉన్న రూ.5.82 లక్షల విలువైన డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ను స్వాధీనం చేసుకున్నట్లు డ్రగ్ కంట్రోల్ అఽధికారులు తెలిపారు. డ్రగ్స్ నిబంధనలకు విరుద్ధంగా అమ్మకానికి ఉంచిన ఈ నిల్వలను డీసీఏ అధికారులు గుర్తించారు. ఈప్రాంగణంలో వంధ్యత్వానికి చికిత్స చేయడానికి ఉపయోగించే స్టెరాయిడ్లు, హర్మోన్ల కోసం ఉపయోగించే ఔషధాలు, మొత్తం 35 రకాల మందులను గుర్తించినట్లు తెలిపారు. ఈదాడిలో వరంగల్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జి.రాజ్యలక్ష్మి, హనుమకొండ డ్రగ్ ఇన్స్పెక్టర్ కిరణ్కుమార్, జనగామ డ్రగ్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎంజీఎం: సీకేఎం ఆస్పత్రిలో పాలన రోజురోజుకూ ఆస్తవ్యస్తంగా మారుతోంది. ఆస్పత్రి సూపరింటెండెంట్ పాలనపై పరిపాలనాధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించకపోవడంతో సమస్యలు పేరుకుపోతున్నాయి. వరంగల్ సీకేఎం ఆస్పత్రికి ఉమ్మడి వరంగల్ జిల్లాల నుంచే కాకుండా.. ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రాంతాల నుంచి ప్రజలు వస్తూ ప్రసవ చికిత్సలు పొందుతుంటారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్యసేవలతో పాటు పారిశుద్ధ్యం, భోజన సౌకర్యాలు కల్పించాలి. ఈక్రమంలో సెక్యూరిటీ, శానిటేషన్ టెండర్ ప్రక్రియ రాష్ట్ర పరిధిలో ఉండగా, రోగులకు భోజనం అందించే డైట్ టెండర్ జిల్లా పరిధిలో ఉంటుంది. వరంగల్ కలెక్టర్ సత్యశారద స్వయంగా డైట్ను పరిశీలించిన సమయంలో టెండర్ను రెన్యూవల్ చేయకుండా నూతన టెండర్ పిలవాలని ఆదేశించారు. ఏప్రిల్లో డైట్ టెండర్ పిలిచారు. ఇందులో భాగంగా పలువురు కాంట్రాక్టర్లు టెండర్లో పాల్గొని ఈఎండీలు సైతం చెల్లించారు. ప్రస్తుతం కొనసాగుతున్న కాంట్రాక్టర్ టెండర్ ప్రక్రియలో ఉన్న చిన్నపాటి తప్పిదాలతో కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు టెండర్ ప్రక్రియను పూర్తి చేయలేకపోయారు. ఈ టెండర్ ప్రక్రియలో పాల్గొన్న కాంట్రాక్టర్లకు 8 నెలలుగా ఈఎండీలు చెల్లించకపోవడంతో పాటు కోర్టులో సమస్యను పరిష్కరించడంలో పరిపాలనాధికారులు విలఫమవుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
ఎన్నికలకు భారీ బందోబస్తు
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు అధికారులు కమిషనరేట్ పరిధిలో 6 చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. వాహనాలు తనిఖీ చేస్తూ డబ్బు, మద్యం అక్రమంగా రవాణా చేయకుండా అడ్డుకట్ట వేస్తున్నారు. గురువారం మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను స్థానిక పోలీసులతోపాటు ఏసీపీ స్థాయి అధికారులు సందర్శించి పరిస్థితులను తెలుసుకున్నారు. 272 సమస్యాత్మక కేంద్రాల్లో భద్రత వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 272 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పోలీస్ ఉన్నతాధికారులు గుర్తించి భద్రతను పటిష్టం చేశారు. కమిషనరేట్లో మొత్తం 807 పోలింగ్ స్టేషన్లు, 887 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మొదటి విడత 269 పోలింగ్ స్టేషన్లు, 282 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. విధుల్లో 2,028 మంది సిబ్బంది.. ఎన్నికల నిర్వహణ కోసం పోలీసు ఉనతాధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముగ్గురు డీసీపీలు, ఐదుగురు అదనపు డీసీపీలు, 13 మంది ఏసీపీలు, 122 మంది ఇన్స్పెక్టర్లు, 412 మంది ఎస్సైలు, 1,154 ఏఎస్సై, హెడ్కానిస్టేబుళ్లు, 285 హోంగార్డులు, డిస్ట్రిక్ట్ గార్డ్స్, బాంబ్ డిస్పోజల్ సిబ్బందితో కలిపి మొత్తం 2,028 మంది సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొననున్నారు. తుపాకుల డిపాజిట్ కమిషనరేట్ పరిధిలో లైసెన్స్ కలిగిన తుపాకులను ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇప్పటికే లైసెన్స్ హోల్డర్లు డిపాజిట్ చేశారు. బ్యాంకు సిబ్బంది తుపాకులు మినహాయించి 181 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా 36 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశారు. భద్రత కట్టుదిట్టం.. కమిషనరేట్ పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేశాం. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నాం. అనుమానిత వ్యక్తులను బైండోవర్ చేశాం. చెక్పోస్టులను ఏర్పాటు చేసి భద్రత కట్టుదిట్టం చేశాం. ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే డయల్ 100కు సమాచారం ఇవ్వాలి. ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి. – సన్ప్రీత్సింగ్, పోలీస్ కమిషనర్ కమిషనరేట్ పరిధిలో 887 పోలింగ్ కేంద్రాలు 6 చెక్పోస్టులు ఏర్పాటు.. 36 ఫ్లయింగ్ స్క్వాడ్స్ 181 తుపాకులు స్వాధీనం -
టెట్ నుంచి మినహాయించాలి
టీపీయూఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాత్ సురేశ్ విద్యారణ్యపురి: ఇన్సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాత్ సురేశ్ డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం హనుమకొండ, వరంగల్ జిల్లాల సర్వసభ్య సమావేశం హనుమకొండలోని సామజగన్మోహన్ స్మారక భవన్లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సురేశ్ మాట్లాడుతూ.. టెట్ మినహాయింపుపై ఇప్పటికే కేంద్ర విద్యాశాఖ, ఎన్సీటీఈ చైర్మన్, కేంద్రంలోని విద్యాశాఖ ఉన్నతాఽధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వరంగల్ టీపీయూఎస్ అధ్యక్షుడు బత్తిని వెంకటరమణగౌడ్, టీపీయూఎస్ రాష్ట్ర నాయకులు చిదురాల సుధాకర్, పిన్నింటి బాలాజీరావు, దాస్యం రామానుజస్వామి, ఆముదాల దాత మహర్షి, రెండు జిల్లాల్లోని వివిధ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు టీపీయూఎస్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రెండు జిల్లాల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర ఎన్నికల అఽధికారిగా అయిల్నేని నరేందర్రావు, కె.వెంకటకృష్ణ పాల్గొన్నారు. నూతన కమిటీ ఎన్నిక తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఉప్పుల సతీశ్, ప్రధాన కార్యదర్శిగా ఎ.శేఖర్ ఎన్నికయ్యారు. హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా బత్తిని వీరస్వామి, ప్రధాన కార్యదర్శిగా ప్రతాప్గిరి శ్రీనివాస్ ఎన్నికయ్యారు. వీరిచే ఎన్నికల అధికారులు ప్రమాణం స్వీకారం చేయించారు. -
నేడు తొలి సంగ్రామం
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో మొదటి విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాల పరిధిలో మొత్తం 69 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 5 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 64 గ్రామపంచాయతీల్లో నేడు (గురువారం) పోలింగ్ జరగనుంది. మొత్తం 658 వార్డుస్థానాల్లో 150 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగి లిన 505 వార్డు స్థానాలకు ఓటింగ్ జరగనుంది. 1.30 లక్షల ఓటర్లు తొలి విడత ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు 1,30,734 ఓటర్లు సిద్ధంగా ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 63,681 మంది కాగా, మహిళలు 67,052 మంది. ఒకరు ఇతరుల కేటగిరీకి చెందిన ఓటరు ఉన్నారు. పటిష్ట ఏర్పాట్లు ఎన్నికల ప్రక్రియను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఈ ఎన్నికల కోసం మొత్తం 1,931 మంది సిబ్బందిని నియమించారు. ఇందులో 789 మంది పోలింగ్ ఆఫీసర్లు కాగా, 1,142 మంది అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లు ఉన్నారు. పోలింగ్ సిబ్బందితో పాటు, ఎన్నికల పర్యవేక్షణ కోసం 65 మంది స్టేజ్–2 రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించారు. ప్రతీ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి, భద్రత, బ్యాలెట్ పేపర్లు, ఓటింగ్ సామగ్రి వంటి ఏర్పాట్లన్నీ పక్కాగా ఉన్నాయని అధికారులు ధ్రువీకరించారు. ఓటర్లు ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాలకు వచ్చి, తమ ఓటు హక్కును మధ్యాహ్నం ఒంటి గంటవరకు వినియోగించుకోవాల్సి ఉంటుంది. అనంతరం భోజన విరామం గంట.. తర్వాత బ్యాలెట్స్ లెక్కిస్తారు. బందోబస్తుకు సంబంధించి బలగాలు ఇప్పటికే క్షేత్రస్థాయికి తరలాయి. పోలింగ్ జరిగే గ్రామాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాలకు సంబంధించిన పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అతిక్రమించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఓటు హక్కుపై అవగాహన కల్పించామని, ప్రలోభాలకు లోనవ్వకుండా ప్రజలు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరంగల్ జిల్లాలో..సాక్షి, వరంగల్: జిల్లాలోని పర్వతగిరి, వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లో 80 సర్పంచ్ స్థానాలు, 585 వార్డులకు మొదటి విడత పోలింగ్ జరగనుంది. వర్ధన్నపేట మండల పరిషత్ కార్యాలయం, రాయపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పర్వతగిరి తెలంగాణ మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి ఎన్నికల సామగ్రిని ఆయా ప్రాంతాల్లోని పోలింగ్ బూత్లకు బుధవారం సాయంత్రం పీఓ, ఓపీఓలతో కూడిన బృందం పోలీసుల బందోబస్తుతో తరలించింది. మూడు మండలాల్లో 91 పంచాయతీలకు 11 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 80 స్థానాలకు 305 మంది సర్పంచ్ అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 800 వార్డులకు 215 ఏకగ్రీవం కాగా.. మిగిలిన 585 వార్డులకు 1,427 మంది పోటీలో ఉన్నారు. వరంగల్ కలెక్టర్ సత్యశారద.. పర్వతగిరి, వర్ధన్నపేట పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాలను సందర్శించి అధికారులు, సిబ్బందికి సూచనలిచ్చారు. హనుమకొండ జిల్లాలోని మూడు మండలాల్లో పోలింగ్కు సర్వం సిద్ధం ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ఓటు వేయనున్న 1.30 లక్షల ఓటర్లు -
భద్రకాళి బండ్ పనులు పూర్తి చేయండి
వరంగల్ అర్బన్: స్మార్ట్సిటీ కల్వర్టు పనులు ఈనెలాఖరులోగా పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం బల్దియా పరిధి పద్మాక్షి రోడ్డు శాయంపేట ప్రాంతంలో చేపట్టిన కల్వర్టు పనులను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్మార్ట్సిటీ పథకంలో భాగంగా చేపట్టిన ఈ పనులు 31వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. 39, 40 డివిజన్లలో తడి, పొడి చెత్త సేకరణపై తనిఖీ చేసి, స్థానికులను వివరాలు అడిగారు. కార్యక్రమంలో ఈఈ రవికుమార్, డీఈలు రాజ్కుమార్, రాగి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. పనులు పూర్తి చేయండి: మేయర్ సుధారాణి భద్రకాళి బండ్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు పూర్తి చేయాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. బుధవారం భద్రకాళి బండ్పై తుది దశకు చేరుకున్న పనులను కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో ఎస్ఈ సత్యనారాయణ ఈఈలు రవికుమార్, మాధవీలత, ఏఈ సంతోశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. చెత్త తరలింపులో జాప్యం వద్దు.. సెకండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ నుంచి చెత్త తరలింపులో జాప్యం లేకుండా చూడాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. బుధవారం పోతననగర్లోని సెకండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ను మేయర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమె వెంట సీఎంహెచ్ఓ రాజారెడ్డి, ఎంహెచ్ఓ రాజేశ్ శానిటరీ సూపర్వైజర్ శ్రీను ఉన్నారు. కమిషనర్ చాహత్ బాజ్పాయ్ మేయర్తో గుండు సుధారాణితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన -
మరో మెగా రైల్వే ప్రాజెక్ట్
● ఒక రైలు ఇంజన్ సుమారు రూ.3 కోట్లు విలువ ఉంటుంది. దాని జీవిత కాలం సుమారు 16ఏళ్లు, ఆరు నెలలకోసారి ఇంజన్ పీఓహెచ్కు వెళ్తుంది. ● ఒక వ్యాగన్ సుమారు రూ.60 లక్షలు, జీవిత కాలం 35ఏళ్లు, వ్యాగన్ల రకాల దృష్ట్యా 4 లేదా 6 ఏళ్లకు ఒకసారి పీఓహెచ్కు వెళ్తుంది. ● ఆర్వోహెచ్ అంటే–రొటీన్ ఓవర్హాలింగ్. వ్యా గన్ 18 నెలలకోసారి ఆర్వోహెచ్కు వెళ్తుంది. ● పీఓహెచ్ అంటే పీరియాడికల్ ఓవర్హాలింగ్. ● సిక్లైన్ అంటే వ్యాగన్ల రిపేర్ ● యార్డు ఎగ్జామినేషనల్ లైన్ అంటే–గూడ్స్ వ్యాగన్ల ఫార్మేషన్ చెకింగ్ పాయింట్. ● రామగుండం, బెల్లంపల్లి, సనత్నగర్లో ఆర్వోహెచ్ డిపోలు ఉన్నాయి. దక్షిణ మధ్య రైల్వే జోన్లో వ్యాగన్ల రిపేర్ కోసం రాయన్పాడ్ వర్క్షాప్, తిరుపతి సీఆర్ఎస్ వర్క్షాప్, కర్ణాటక యద్గిరి వర్క్షాప్లు అందుబాటులో ఉన్నాయి. కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్ సమీపంలో నష్కల్–ఘన్పూర్ మధ్య రైల్వేశాఖ రూ.908 కోట్లతో 300 ఎకరాల్లో మెగా రైల్వే వ్యాగన్ వర్క్షాప్ (మెగా ఫ్రైట్ పీఓహెచ్ వ్యాగన్ వర్క్షాప్, డిపో) నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు బుధవారం రైల్వే అధికారులు తెలిపారు. కాజీపేటకు మూడేళ్ల క్రితం రైల్వే వ్యాగన్ పీఓహెచ్ షెడ్ మంజూరైంది. అనివార్య కారణాల వల్ల నిర్మాణ ప్రతిపాదనలు ముందుకు సాగలేదు. ఇప్పటికే కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణం స్పీడ్గా జరుగుతుండగా, 2026 మార్చి లేదా ఏప్రిల్లో ప్రా రంభించేందుకు రైల్వేశాఖ సిద్ధమవుతోంది. రైల్వే దినాదినాభివృద్ధిలో భాగంగా రైళ్ల రద్దీ, గూడ్స్ వ్యా గన్లు, ప్యాసింజర్స్ ట్రాఫిక్ను అధిగమించేందుకు, రవాణా, పాలనా సౌలభ్యం, ఎకానమీ, టైంను దృష్టిలో ఉంచుకుని అన్నీ ఒకేచోట ఉండేలా భావించిన రైల్వేశాఖ మెగా రైల్వే వ్యాగన్ వర్క్షాప్ డిపో ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు అధికారులు ప్రకటించారు. వ్యాగన్ ఆర్వోహెచ్, వ్యాగన్ పీఓ హెచ్, సిక్లైన్, యార్డు ఎగ్జామినేషన్ లైన్లను కలిపి ఒకే చోట ఉండేలా ఈ మెగా ప్రాజెక్ట్ను నిర్మిస్తోంది. కాజీపేట ఎలక్ట్రిక్ లోకోషెడ్, డీజిల్ లోకోషెడ్ను భవిష్యత్లో అక్కడికే తరలించి అన్ని ఒకేచోట ఉండేలా అధికారులు డిజైన్ చేస్తున్నారు. ఉత్తర, దక్షిణ దేశ ప్రాంతాలకు గేట్ వేగా ఉంటున్న కాజీపేట జంక్షన్ను మరింత అభివృద్ధి చేసే దిశలో భాగంగా ఈ మెగా పీఓహెచ్ షెడ్ నిర్మాణం ఉండనుంది. ఆ రెండు చోట్ల అనుకున్నా.. ఒక దశలో మహబూబాబాద్, డోర్నకల్–కొత్తగూడెం మధ్య పోచారంలో ఈ మెగా రైల్వే ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ వచ్చింది. రైల్వేశాఖ మాత్రం అన్నింటికీ అనువుగా ఉండేలా, ట్రాక్ కనెక్ట్టివిటీ, అధికారుల పర్యవేక్షణ, రోడ్డు రవాణా, ఆపరేటింగ్ మూవ్మెంట్ను దృష్టిలో ఉంచుకుని 90 శాతం వరకు నష్కల్–ఘన్పూర్ మధ్య ప్రాజెక్ట్ నిర్మాణానికి ఫైనల్ చేసినట్లు చెబుతున్నారు. ప్రతి పాదనలు, సర్వేచేసిన నివేదికను రైల్వే బోర్డుకు పంపించనున్నట్లు తెలుస్తోంది. రైల్వే బోర్డు అన్నింటినీ పరిశీలించి ఆమోదం తెలిపి టెండర్ ప్రక్రియకు గ్రీన్సిగ్నల్ ఇస్తే ప్రాజెక్ట్ పనులు ప్రారంభమవుతాయని రైల్వే అధికారులు తెలుపుతున్నారు. కాగా, రైల్వే బోర్డునుంచి ఆమోదం ఆలస్యమైతే ప్రాజెక్ట్కు మంజూరైన రూ.908 కోట్లు వృథా అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. కాజీపేట–ఘన్పూర్ మధ్య నిర్మాణానికి రైల్వేశాఖ శ్రీకారం ఆర్వోహెచ్, పీఓహెచ్, సిక్లైన్, యార్డు ఎగ్జామినేషన్ లైన్లను కలిపి ఒకేచోట రైల్వే మెగా వ్యాగన్ వర్క్షాప్ డిపోనకు డిజైన్ రూ.908 కోట్లు.. 300 ఎకరాల్లో నిర్మాణానికి ప్రతిపాదనలు భూమి సర్వే చేసిన అధికారులు.. మహబూబాబాద్, డోర్నకల్లో సెక్షన్లోనూ డిమాండ్ చివరికి నష్కల్–ఘన్పూర్ మధ్య ఫైనల్ -
యాక్షన్ ప్లాన్ రెడీ
సాక్షిప్రతినిధి, వరంగల్: యాసంగి పంటలకు సాగునీటి విడుదలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఉమ్మడి వరంగల్లో 9,48,114 ఎకరాలకు 5,29,726 ఎకరాలకు నీటిని విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది. 15 రోజులు ఆన్.. 15 రోజులు ఆఫ్ పద్ధతిన యాసంగి పంటలకు సాగునీరు అందించేందుకు కార్యాచరణ రూపొందించారు. ఈనెల 24 నుంచి వరంగల్, ములుగు ఇరిగేషన్ సర్కిళ్ల పరిధిలోని 5,29,726 ఎకరాల తడి, మెట్ట భూములకు 41.28 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్లు కూడా రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (స్కివం) ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈమేరకు యాసంగిలో సాగు చేస్తున్న పంటలకు సాగునీరు అందేలా అధికారులు కార్యాచరణతో ముందుకు సాగాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ఎక్కడెక్కడ ఎలా? ఇరిగేషన్ వరంగల్ చీఫ్ ఇంజినీర్ పరిధిలో మొత్తం 7,92,894 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ యాసంగిలో 4,35,172 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఇందులో 2,68,598 ఎకరాల తడి, 1,66,574 ఎకరాల మెట్ట భూములు ఉన్నాయి. జేసీఆర్ దేవాదుల ఎత్తిపోతల ద్వారా 1,95,095 ఎకరాలకు 11.30 టీఎంసీలు, ఎస్సారెస్పీ కాకతీయ కాల్వ (ఎల్ఎండీ దిగువ) ద్వారా 1,57,038 ఎకరాలకు 12.88 టీఎంసీలు, ఎస్సారెస్పీ స్టేజ్–2 కింద 83,039 ఎకరాలకు 6.82 టీఎంసీలు సరఫరా చేయనున్నారు. నీటి లభ్యతను బట్టి యాసంగి పంటలకు సాగునీరు అందేలా నీటిపారుదలశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈమేరకు రైతులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. అత్యధికంగా ఆరుతడి పంటలపై మొగ్గు చూపాలని సూచిస్తున్నారు. ములుగు ఇరిగేషన్ సర్కిల్లో ఇలా.. ములుగు ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ కార్యాలయం పరిధిలో మొత్తం 1,55,220 ఎకరాల ఆయకట్టు ఉంది. 94,554 ఎకరాలకు ఈ యాసంగిలో సాగునీరు అందించనున్నారు. ఇందులో తడి 34,958 ఎకరాలు కాగా, మెట్ట 59,596 ఎకరాలు. ఇందుకోసం 10.28 టీఎంసీల నీరు సిద్ధంగా ఉన్నట్లు నీటిపారుదలశాఖ ప్రతిపాదనల్లో పేర్కొంది. ఇదిలా ఉంటే ఎస్సారెస్పీ కాకతీయ కెనాల్ (ఎల్ఎండీ దిగువన) కింద 1,03,883 ఎకరాలకు 58,901 ఎకరాలకు ఆరు టీఎంసీలు సరఫరా చేయనున్నారు. పాకాల చెరువు కింద 18,193 ఎకరాలకు మొత్తంగా, రామప్ప లేక్ కింద 5,180 ఎకరాలకు 1,600 ఎకరాలకు అదనంగా కలిపి 6,780 ఎకరాలకు ఈ యాసంగిలో సాగునీరు అందించనున్నట్లు ‘స్కివం’ కమిటీ పేర్కొంది. అలాగే లక్నవరం చెరువు కింద 8,794 ఎకరాలకు 4,550, మల్లూరు వాగు కింద 7,500 ఎకరాలకు 1,500, పాలెంవాగు ప్రాజెక్టు కింద 7,500 ఎకరాలకు 1,500 ఎకరాలకే ఈసారి సాగునీటిని అందించనున్నట్లు ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రకటించారు. ఆన్అండ్ఆఫ్ పద్ధతే.. ఉమ్మడి వరంగల్లో ఎస్సారెస్పీ స్టేజ్–1, స్టేజ్–2, దేవాదుల, రామప్ప, పాకాల, లక్నవరం సరస్సులు, చిన్ననీటి వనరుల ద్వారా స్థిరీకరించిన ఆయకట్టు కింద 9,48,114 ఎకరాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులు, నీటి లభ్యతను బట్టి 5,29,726 ఎకరాలకు ఆన్ అండ్ ఆఫ్ (వారబందీ) పద్ధతిన సరఫరా చేయనున్నారు. అయితే, గత యాసంగిలో 6,46,664 ఎకరాలకు నీరిచ్చిన అధికారులు ఈసారి 5,29,726 ఎకరాలే ప్రతిపాదించారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి 1,16,938 ఎకరాలు తగ్గింది. కాగా, 15 రోజులు విడుదల చేసి 15 రోజులు ఆఫ్ చేసే పద్ధతిలో ఈ నెల 24 నుంచి ఆయకట్టుకు నీటి విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఎల్ఎండీ, దేవాదుల, రామప్ప, లక్నవరం, మల్లూరు వాగు, పాలెం వాగుల పరిధి ఆయకట్టు రైతులు సాగుకు సన్నద్ధమయ్యారు. ఈ నెల 24 నుంచి ఉమ్మడి వరంగల్లో యాసంగి పంటలకు సాగు నీరు 5.30 లక్షల ఎకరాలు.. 41.28 టీఎంసీలు! యాసంగి యాక్షన్ ప్లాన్ రెడీ చేసిన ఇరిగేషన్ శాఖ వరంగల్, ములుగు సర్కిళ్లలో ఆయకట్టుకు సాగునీరు 15 రోజులకోసారి ఆన్అండ్ఆఫ్గత యాసంగిలో 6,46,664 ఎకరాలకు సాగు నీరు ప్రస్తుతం 5,29,726 ఎకరాలకు అందించేలా ప్రణాళిక గతేడాదితో పోలిస్తే తగ్గిన 1,16,938 ఎకరాలు వరంగల్ ములుగు ఇరిగేషన్ సర్కిళ్ల పరిధి మెట్ట భూములకు 41.28 టీఎంసీలు -
ఎఫ్ఏసీ డీఈఓగా గిరిరాజ్గౌడ్
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లా ఫుల్ అడిషనల్ చార్జ్ (ఎఫ్ఏసీ) విద్యాశాఖ అధికారిగా ఎల్వి.గిరిరాజ్గౌడ్ నియమితులయ్యారు. ఈమేరకు తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గిరిరాజ్గౌడ్ సూర్యాపేట డీఈఓ కార్యాలయంలో ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా, రాష్ట్ర విద్యాశాఖ డీఈఓ నియామకంలో జాప్యం చేస్తోందని కలెక్టర్ స్నేహ శబరీష్ బుధవారం అదనపు కలెక్టర్ రెవెన్యూ అండ్ డీఆర్ఓ (ఎఫ్ఏసీ) వైవీ.గణేశ్కు ఇన్చార్జ్ డీఈఓగా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంఈఓలు, ఉపాధ్యాయ సంఘాలకు సమాచారం అందింది. సామాజిక మాధ్యమాల్లోనూ వచ్చింది. ఆ తర్వాత కొంతసేపటికే ఎఫ్ఏసీ డీఈఓగా గిరిరాజ్గౌడ్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎంజీఎం: జిల్లాలోని వైద్యాధికారులు ప్రతీ వారం అన్ని ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరును సమీక్షించాలని హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో ప్రోగ్రాం అధికారులు, నగరంలోని యూపీహెచ్సీ, పీహెచ్సీల వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా అప్పయ్య మాట్లాడుతూ.. ముక్త్ భారత్ అభియాన్, మాతా శిశు సంక్షేమం, ఎన్సీడీ, ఇమ్యూనైజేషన్ కార్యక్రమాల లక్ష్యాలను, సాధించిన ప్రగతిని ఏఎన్ఎంల వారీగా సమీక్షించారు. సమావేశంలో అడిషనల్ డీఎంహెచ్ఓ టి.మదన్మోహన్రావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రదీప్రెడ్డి, ప్రోగ్రాం అధికారులు ప్రభుదాస్, జ్ఞానేశ్వర్, శ్రీనివాస్, రుబీనా, తదితరులు పాల్గొన్నారు. విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లా కేంద్రంలోని డీజీటీబీఎస్ఓలో మేనేజర్గా పని చేస్తున్న జె.పద్మావతిని సూపరింటెండెంట్ (టెంపరరీ)గా అదనపు బాధ్యతలు నిర్వర్తించేందుకు డిప్యూట్ చేస్తూ బుధవారం వరంగల్ పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. డీఈఓ కార్యాలయంలో సూపరింటెండెంట్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జీఎస్ ప్రసాద్రావు ఆరునెలలపాటు సెలవుపై వెళ్లారు. దీంతో ఆయన స్థానంలో బాధ్యతలు నిర్వర్తించేందుకు టెంపరరీగా పద్మావతికి బాధ్యతలు అప్పగించారు. శ్రీవాణి డీఈఓ ఆఫీస్కు.. హనుమకొండలోని ప్రభుత్వ హైస్కూల్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న శ్రీవాణిని టెంపరరీగా హనుమకొండలోని డీఈఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ విధులను నిర్వర్తించేందుకు డిప్యూట్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆమెను సీనియర్ అసిస్టెంట్ విధు ల నుంచి రిలీవ్ చేయాలని సంబంధిత ప్రభు త్వ హైస్కూల్ హెడ్మాస్టర్ను ఆదేశించారు. వరంగల్ లీగల్: మానవ హక్కుల పరిరక్షణ మనందరి బాధ్యత అని హనుమకొండ జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి బి.అపర్ణాదేవి అన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం జిల్లా కోర్టులో మానవ హక్కులపై అవగాహన సదస్సును న్యాయమూర్తి బి.అపర్ణదేవి ప్రారంభించారు. వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థలు, హ్యూమన్ రైట్స్ అడ్వకేసి అడ్వైసరీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ సదస్సులో ఆమె మాట్లాడుతూ.. సమాజంలోని ప్రతీ మనిషికి హక్కులు, స్వేచ్ఛ, న్యాయం చేరేలా కృషి చేయాలని కోరారు. న్యాయవ్యవస్థలో పనిచేసే ప్రతి ఒక్కరూ మానవ హక్కుల పరిరక్షకులేనని తెలిపారు. కార్యక్రమంలో న్యాయమూర్తి క్షమాదేశ్ పాండే, వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయమూర్తులు, వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు వలుస సుధీర్, బార్ కౌన్సిల్ మెంబర్ భైరపాక జయాకర్, హ్యూమన్ రైట్స్ అడ్వకేసి అడ్వైజరీ సత్య, కొంగర అనిల్కుమార్, ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు. -
ఎవ్రీడే 90 ఎంఎల్..!
గీసుకొండ: గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచార పర్వం ఆసక్తి కలిగిస్తోంది. ఓటర్లకు మద్యం పంపిణీ చేసేందుకు అభ్యర్థులు ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. పోలింగ్ జరిగే రెండు, మూడు రోజుల ముందు నుంచి గ్రామాల్లో తమకు అనుకూలమైన వారికి, వ్యతిరేకులకు మద్యం తాగిస్తున్నారు. తమ గెలుపు కోసం రోజూ ప్రచారం చేసే బ్యాచ్తో పాటు.. తమకు తప్పకుండా ఓటు వేస్తారనే నమ్మకం ఉన్నవారికి, తమకు ఓటు వేయరేమో అనే అనుమానంతో ఉన్న వారికి ప్రతీ రోజు 90 ఎంఎల్ మద్యం డోర్ డెలివరీ చేస్తున్నారు. దీంతో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని వైన్ షాపుల నిర్వాహకులు 90 ఎంఎల్ మద్యం బాటిళ్లను ఎక్కువ స్టాక్ చేసుకుంటున్నారు. ఇలా ప్రతీ రోజూ 90 ఎంఎల్ మద్యం అభ్యర్థులు ఇంటికే పంపిస్తుండడంతో కొందరు ఓటర్లు ఆనంద పడుతున్నారు. వాళ్ల దావత్కు పోయివస్తా.. ఓటు మాత్రం నీకే సంగెం: గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటర్ల విచిత్రాలు సర్పంచ్ అభ్యర్థులను ఖంగుతినిపిస్తున్నాయి. పోటీలో ఉన్న అభ్యర్థులు దావత్లు ఏర్పాటు చేసి ఓటర్లను ఆహ్వానిస్తున్నారు. దీంతో ఓటర్లు ఎవరి మాట కాదనలేక పిలిచిన ప్రతీ అభ్యర్థి దావత్కు, విందులకు వెళ్తున్నారు. అలా వెళ్తున్నప్పుడు ఎవరైనా అభ్యర్థి తారసపడి గా దావత్కు ఎందుకు పోయినవే అడితే పిలిస్తే పోకపోతే బాగుండదని వెళ్లిన గాని ఓటు మాత్రం నీకే వేస్తా అంటూ మభ్యపెట్టుతున్నారు. ఇంకాకొందరైతే ముందుగానే అభ్యర్థితో గా అభ్యర్థి దావత్కు పిలిచిండు పోయి వస్తా ఏమి అనుకోవద్దు అంటూ వెళ్లొస్తున్నారు. అంతేగాక అక్కడ గా మందు బ్రాండ్ పెట్టారని, ఇక్కడ ఈ మందు బ్రాండ్ పెట్టుతున్నారని విమర్శలు సైతం చేస్తూ దావత్లు ఇచ్చిన వారినే మాటలు అంటున్న పరిస్థితి గ్రామాల్లో కొనసాగుతుందని పలువురు అభ్యర్థులు వాపోతున్నారు.● ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు డోర్ డెలివరీ -
పన్ను వసూళ్లపై నిర్లక్ష్యం వద్దు
● మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: పన్ను బకాయిల వసూళ్ల లక్ష్యాలు చేరుకోవాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని మేయర్ గుండు సుధారాణి రెవెన్యూ అధికారులు, సిబ్బందిని హెచ్చరించారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో పన్ను వసూళ్లపై రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లతో కమిషనర్ చాహత్ పాల్గొని సమీక్షించారు. ఈసందర్భంగా మేయర్ వార్డు అధికారులు బిల్ కలెక్టర్ల వారీగా ఇప్పటి వరకు వసూలు చేసిన పన్ను వసూళ్ల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. డిసెంబర్ 31లోగా సూచించిన పన్ను వసూళ్లను చేరుకోవాలని ఆర్ఐలు, ఆర్ఓలు నిరంతరం క్షేత్రస్థాయిలో పన్ను వసూళ్లను పరిశీలించాలని పన్ను వసూళ్లకు సమాంతరంగా నీటి పన్ను వసూళ్ల చేయాలని బడా బకాయిదారులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, చాలా వరకు నగరవాసులు నల్లా పన్నులు చెల్లించడం లేదని ఆస్తి పన్నులతో పాటుగా నల్లా పన్నులు చెల్లించి కార్పొరేషన్కు సహకరించాలని ఈసందర్భంగా మేయర్ నగర ప్రజలు కోరారు. సమావేశంలో అదనపు కమిషనర్ చంద్రశేఖర్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ ప్రసన్నరాణి, ఆర్ఓలు శ్రీనివాస్, షహజాదీ బేగం, ఆర్ఐలు తదితరులు పాల్గొన్నారు. -
ప్రచారం కాదు.. పరీక్ష!
● ఓటు కావాలంటే బురదలో దిగాల్సిందే ● ఉదయం, సాయంత్రం పొలంబాట ● సర్పంచ్ అభ్యర్థుల వినూత్న ప్రచారంజనగామ: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈసారి ప్ర చారం ఊళ్లలో కాదు.. పొలాల్లో దూసుకుపోతోంది. ఓటు అడగాలంటే బురదలో అడుగేయాలన్న ని బంధనలను అభ్యర్థులు అక్షరాలా అనుసరిస్తున్నా రు. రైతు తెల్లవారుజామున పొలాల్లోకి దిగితే, నేతలు వెంటపడి మట్టిలో మునిగిపోతున్నారు. ఉమ్మ డి వరంగల్ జిల్లాలో జీపీ ఎన్నికల్లో అభ్యర్థులు ఓ టు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. వానాకా లం వరి కోతలు, పత్తి సేకరణ, అమ్మకాలు చివరి దశకు చేరుకోగా.. మరోవైపు యాసంగి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సూర్యోదయానికి ముందే రైతులు పనిముట్లు భుజాన వేసుకుని వ్యవసాయ బావుల వద్దకు వెళ్తున్నారు. సాయంత్రం వరకూ మట్టితో మమేకమైపోతున్నారు. దీంతో అభ్యర్థులకు మెజార్టీ ఓటర్లు దొరకడం లేదు. ఎన్నికల ప్రచారం సమయంలో గంట నుంచి రెండు గంటలపాటు పొలం గట్లకు కేటాయిస్తున్నారు. ఓటరు ఇంట్లో లేడా.. పొలంలో ఉన్నాడా.. అయితే మన ప్రచారం కూడా అక్కడికే అనే ఫార్ములాతో అభ్యర్థులు కొత్త పంథాను ఎంచుకున్నారు. ఉదయం పది గంటల వరకు గ్రామాల్లో తిరిగి, ఆ తర్వాత పొలం బాట పడుతున్నారు. బురదలో మునిగిన పొలం అంచుల్లో అభ్యర్థుల ప్రచార హడావుడి కనిపిస్తోంది. చాలా గ్రామాల్లో కొంతమంది అభ్యర్థులు రైతులతోపాటు బురదలోకి దిగుతూ.. గట్లను చదును చేయడం, నీటి కాల్వలు వదలడం వంటి పనులు చేస్తున్నారు. అన్నయ్య.. తాతా.. ఇదే మా గుర్తు, ఇదే మా మాట అంటూ చేతిలో బ్యాలెట్ పత్రం నమూనా పట్టుకుని బురదలో నిల్చున్న దృశ్యాలు ఈ ఎన్నికల్లో సాధారణం అయ్యాయి. రాజకీయాలు ఈసారి నిజంగానే మట్టిలో పుట్టి, మట్టిలోనే పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. గ్రామాల్లో ప్రచారం ఉత్సాహంగా సాగుతున్నా అసలు హడావుడి పొలాల్లోనే కనిపిస్తోంది. రైతు పనుల్లో మునిగిపోయిన వేళ అభ్యర్థులు సైతం అతడి వెంటే నడుస్తున్నాడు. పొలంలో పనిచేస్తే ఓటు అన్నట్లు ఈసారి సర్పంచ్ అభ్యర్థుల ప్రచార శైలి రోజుకో కొత్త మలుపు తిరుతోంది. -
సృజనాత్మకత పెంచేందుకు ‘నోబెల్ ప్రైజ్ డే’
● కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం కేయూ క్యాంపస్: విద్యార్థుల్లో సృజనాత్మకత, పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించేందుకు నోబెల్ ప్రైజ్డే ఉత్సవాలు దోహదం చేస్తాయని కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం అన్నారు. కాకతీయ యూనివర్సిటీ స్వర్ణోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం మైక్రోబయాలజీ విభాగంలో యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య టి.మనోహర్, స్టూడెంట్స్ ఆఫైర్స్ డీన్ మామిడాల ఇస్తారి, ఆ విభాగం అధిపతి డాక్టర్ సుజాతలో కలిసి రిజిస్ట్రార్ వి.రామచంద్రం, నోబెల్ ప్రైజ్డే ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులు ప్రదర్శించిన పోస్టర్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వివిధ విభాగాల కోఆర్డినేటర్లు డాక్టర్ బి.వెంకటగోపీనాఽథ్, సంగీత, చంద్రశేఖర్, రంగారెడ్డి, ప్రియాంక, కవిత, మహేందర్, రాజేందర్, సాధు రాజేశ్ పాల్గొన్నారు. విద్యార్థుల పోస్టర్ ప్రజంటేషన్.. లైఫ్ సైన్సెస్ విభాగాలకు చెందిన బాటనీ, జువాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఫార్మసీ విభాగాల్లో 212 మంది విద్యార్థులు, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎకనామిక్స్, ఇంగ్లిష్ విభాగాల్లో 123 మంది విద్యార్థులు పోస్టర్ ప్రజంటేషన్ పోటీల్లో పాల్గొన్నారు. ఆయా విభాగాల అధిపతులు ప్రొఫెసర్ కృష్ణవేణి, శాస్త్రి, సుజాత, మధుకర్, లక్ష్మారెడ్డి, పొఫెసర్ వై.వెంకయ్య, ప్రొఫెసర్ సురేశ్లాల్, డాక్టర్ మేఘనారావు పాల్గొన్నారు. ఈనెల 10న పోస్టర్ ప్రజంటేషన్, వక్తృత్వపోటీల విజేతలకు సెనేట్హాల్లో బహుమతులు ప్రదానం చేయనున్నట్లు స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ ఆచార్య మామిడాల ఇస్తారి తెలిపారు. -
రెండు వాడల మధ్య పోటీ!
హసన్పర్తి: మండలంలోని గంటూరుపల్లి గ్రామపంచాయతీలో అవతలి వాడ, ఇవతలి వాడల మధ్య పోటీ ఉంది. ఆయా వాడల్లో ఓట్లు మాత్రం పార్టీలకతీతంగా వేయడం ఆనవాయితీగా వస్తోంది. గంటూరుపల్లిలో మొత్తం 702 ఓట్లు ఉన్నాయి. ఇవతలి వాడలో 398 ఓట్లు, అవతలి వాడలో 304 ఓట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ గ్రామంలో ఇవతలి వాడ నుంచి మాజీ సర్పంచ్ చల్లా రాకేశ్రెడ్డి, అవతలి వాడ నుంచి మాజీ సర్పంచ్ సుంకరి రమాదేవి, కందుల ప్రశాంత్రెడ్డి పోటీ చేస్తున్నారు. రెండు వాడల నుంచి ఇద్దరు చొప్పున బరిలో ఉండడంతో ఆయా ప్రాంతాలకు చెందిన ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు. రాకేశ్రెడ్డి అధికార పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్నారు. సుంకరి రమాదేవి, కుమారస్వామి అధికార పార్టీ నుంచి రెబల్స్ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. ప్రశాంత్రెడ్డి బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేస్తున్నారు.కాగా, గతంలో జరిగిన ప్రతీ ఎన్నికల్లో ఈవతలి వాడ, అవతలి వాడల నుంచి ఒక్కొక్కరే పోటీలో ఉండే వారు. అయితే ఈసారి మాత్రం ఇద్దరి చొప్పున బరిలో నిలిచారు. రెండు వాడల నుంచి ఇద్దరు చొప్పున బరిలో ఉండడంతో ఆయా ప్రాంతాలకు చెందిన ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు. -
ఎన్నికలకు నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
● ఎన్నికల జిల్లా పరిశీలకులు శివకుమార్ నాయుడు హన్మకొండ అర్బన్: ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని గ్రామ పంచాయతీ ఎన్నికల హనుమకొండ జిల్లా సాధారణ పరిశీలకులు శివకుమార్ నాయుడు అఽధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం మొదటి విడత ఎన్నికలు జరిగే మండలాల్లో మూడో ర్యాండమైజేషన్ పూర్తి చేసిన అనంతరం కలెక్టర్ స్నేహ శబరీష్తో కలిసి అయన అధికారుతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా ఎన్నికల పరిశీ లకులు శివకుమార్ నాయుడు మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. పోలింగ్ రోజున ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని, కౌంటింగ్ జాగ్రత్తగా నిర్వహించాలన్నారు. అనంతరం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. ఈనెల 11న మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించే భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాల్లో పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. పోలింగ్ రోజున ఈ మూడు మండలాలకు సెలవు దినంగా ప్రకటించినట్లు పేర్కొన్నారు. జిల్లా ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ వై.వి గణేశ్, డీపీఓ లక్ష్మీ రమాకాంత్, డీఆర్డీఓ మేన శ్రీను, జెడ్పీ సీఈఓ రవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. నాకా బందీలో 173 వాహనాలు సీజ్ వరంగల్ క్రైం : జీపీ ఎన్నికల సందర్భంగా వరంగల్ పోలీసు కమిషనరేట్ వ్యాప్తంగా 57 ముఖ్యమైన ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం 6 నుంచి 9గంటల వరకు నిర్వహించిన నాకా బందీ తనిఖీల్లో ఎలాంటి ప్రతాలు లేని 173 వాహనాలు సీజ్ చేసినట్లు కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. అలాగే, ఈ తనిఖీల్లో అక్రమ మద్యం సంబంధించి మొత్తం 7 కేసులు నమోదు చేసి రూ.1.18 లక్షల మద్యంతోపాటు మూడు లీటర్ల గుడుంబా, రూ.1.50 లక్షల నగదు, అనుమతులు లేకుండా వాహనంలో రవాణా చేస్తున్న రూ. 49వేల విలువైన బాణాసంచా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే, ఐదు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు వివరించారు. భట్టుపల్లిలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో మిస్సింగ్ కేసులో కనిపించకుండా పోయిన ఓ వ్యక్తిని గుర్తించినట్లు సీపీ వెల్లడించారు. -
భద్రకాళి ఆలయంలో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
● భక్తులకు నకిలీ టికెట్లు విక్రయించినందుకు చర్యలు హన్మకొండ కల్చరల్: వరంగల్ భద్రకాళి దేవాలయంలో నకిలీ పూజా, సేవా టికెట్ల జారీ వెనుక ఇద్దరు ఉద్యోగుల పాత్ర ఉందని విచారణలో తేలింది. వారిపై సస్పెన్షన్ వేటు వేస్తూ వరంగల్ దేవాదాయశా ఖ అసిస్టెంట్ కమిషనర్, దేవాలయ ఈఓ రాముల సునీత నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ఉద యం 11 గంటలకు ఆలయ కార్యాలయంలో ఈఓ అధ్యక్షతన అర్చకులు, సిబ్బంది, ధర్మకర్తల అత్యవసర సమావేశం నిర్వహించారు. దేవస్థానం బుకింగ్ కౌంటర్లో విధులు నిర్వహిస్తున్న ఎస్.నరేందర్, పి.శరత్ కుమార్ నకిలీ టికెట్లు విక్రయించినట్లు గుర్తించారు. దీంతో వారిపై సస్పెన్షన్ వే టు వేశారు. ఈ ఘటనపై రాష్ట్ర దేవా దాయశాఖ మంత్రి కొండా సురేఖ స్పందిస్తూ పూజా, సేవా టికెట్ల విషయంలో అవకతవకలు జరిగిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంగళవా రం ప్రకటించారు. కాగా, ఆలయ ప్రాంగణంలోని చెప్పు ల స్టాండ్ వద్ద, వాహన పూజలు జరిగే స్థలంలో భక్తుల వద్ద డ బ్బులు వసూలు చేయరాదని, ఎవరైనా డిమాండ్ చేస్తే ఈ ఓ కు ఫిర్యాదు చేయాలని ఫోన్ నంబర్తో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. -
350 ప్రత్యేక సైలెన్సర్ల ధ్వంసం
కాజీపేట : కాజీపేట చౌరస్తాలో మంగళవారం 360 ద్విచక్ర వాహనాల ప్రత్యేక సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీసులు ధ్వంసం చేశారు. భీకర శబ్దంతో నగరంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ పట్టుబడిన బుల్లెట్ వాహనాల సైలెన్సర్లను అడిషనల్ డీసీపీ రాయల ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు రోలర్తో ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దాలు వచ్చే సైలెన్సర్లను బిగిస్తే జరిమానాలతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, సీఐలు వెంకన్న, సుజాత, సీతారాంరెడ్డి, ఎస్సైలు సంపత్, కనకచంద్రం, తదితరులు పాల్గొన్నారు. -
అండర్–16 అంతర్ జిల్లాల విజేత వరంగల్
వరంగల్ స్పోర్ట్స్: వరంగల్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 5న ప్రారంభమైన అండర్–16 అంతర్ జిల్లాల స్థాయి క్రికెట్ పోటీలు మంగళవారం ముగిశాయి. కరుణాపురం సమీపంలోని వంగాలపల్లి, మొగిలిచర్లలోని క్రీడా మైదానాల్లో ఐదు రోజుల పాటు హనుమకొండ, వరంగల్, ములుగు, భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్ జిల్లాలకు లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో ఎంపిక పోటీలు నిర్వహించారు. వంగాలపల్లి మైదానంలో వరంగల్, ములుగు జట్ల మధ్య హోరాహోరీగా సాగిన ఫైనల్లో వరంగల్ విజయం సాధించి ఇంట్రాడిస్ట్రిక్ట్ చాంపియన్గా నిలిచింది. ఐదు జిల్లా జట్లలో బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన 20 మందితో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాబబుల్ జట్టును ఎంపిక చేసినట్లు వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపారు. ఎంపికై న జట్టు ఈ నెలలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే పోటీల్లో పాల్గొంటుందని తెలిపారు. కార్యక్రమంలో సెలక్షన్ కమిటీ జిల్లా చైర్మన్ పుల్లూరి శ్రీనివాస్గౌడ్, క్రికెట్ సంఘం జిల్లా అధ్యక్షుడు అచ్చా వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు రఘురామ్, నిజాముద్దీన్, తోట రాము, సంయుక్త కార్యదర్శి ఉపేందర్, కార్యవర్గ సభ్యులు అభినవ్వినయ్, ఆవాల వేణుగోపాల్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
పోలింగ్ ఇలా.. విద్యార్థులు భళా..
ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాథపురం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థులతో నిర్వహించిన మాక్పోలింగ్ ఆకట్టుకుంది. సర్పంచ్ ఎన్నికల్లో పోలింగ్ బూత్వద్ద విద్యార్థులు క్రమశిక్షణగా క్యూలో నిల్చోవడం, వారితో ఓటు వేయించడం.. ఓటేశాక బ్యాలెట్ మడతబెట్టి బాక్సులో ఎలా వేయాలో.. ఇలా ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా వివరించారు. –వాజేడునీ ఓటు నాకే..సాధారణంగా ఎన్నికల్లో తాము గెలవడానికి అభ్యర్థులు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పిస్తుంటారు. జనగామ జిల్లా చౌడారం గ్రామంలో స్వతంత్ర అభ్యర్థి కర్ల పద్మ భార్గవరాంరెడ్డి, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థి ముక్క ఉమ మంగళవారం ప్రచారంలో ఎదురుపడ్డారు. ఒకరికి ఒకరు ఓటు వేయాలని చేతులు కలుపుతూ అభ్యర్థించడం చూసిన కార్యకర్తలు, గ్రామస్తులు ముసిముసిగా నవ్వుకున్నారు. – జనగామ రూరల్చికెన్ రెడీ ..మొదటి విడత జీపీ ఎన్నికల ప్రచార పర్వం మంగళవారం సాయంత్రం ముగిసింది. కొందరు అభ్యర్థులు ఓ టర్లను ప్రసన్నం చేసుకునేందుకు జోరుగా మద్యం, మాంసం పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా మానుకోట జిల్లా కేంద్రంలో ఓ చికెన్ సెంటర్లో మాంసం ప్యాకింగ్ చేయిస్తున్న దృశ్యం ‘సాక్షి’ కెమెరాకు చిక్కింది. –‘సాక్షి’ ఫొటోగ్రాఫర్ మహబూబాబాద్ -
భక్తులకు మెరుగైన సేవలు అందించాలి
● ఆర్టీసీ వరంగల్ ఆర్ఎం డి.విజయభాను హన్మకొండ: మేడారం భక్తులకు మెరుగైన సేవలు అందించాలని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి. విజయభాను సూచించారు. మంగళవారం హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్ రీజియన్ కార్యాలయంలో రీజియన్లోని అన్ని డిపోల మెకానికల్ సూ పర్ వైజర్లు, సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్లు, సేఫ్టీ వార్డెన్లు, స్టోర్ సూపర్ వైజర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడారం జాతర–2026కు జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1 వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపారు. జాతరకు సంబంధించిన పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. జాతర సమయంలో బస్సులు మరమ్మతులకు గురికాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. జాతర విధుల్లో పాల్గొనే డ్రైవర్ల ఆరోగ్య పరిస్థితిపై సేఫ్టీ వార్డెన్లు అవగాహన కలిగి ఉండాలన్నారు. అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులందరూ ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని కోరారు. ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి ఉచిత ప్రయాణ పథకం వర్తిస్తుందన్నారు. ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎంలు పి.మహేశ్, కేశరాజు భాను కిరణ్, అకౌంట్స్ మేనేజర్ ఎ.రవీందర్ పాల్గొన్నారు. సీపీని కలిసిన ఆర్టీసీ ఆర్ఎం.. వరంగల్ పోలీసు కమిషనర్ సన్ప్రీత్ సింగ్ను టీజీ ఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను కలిశారు. మంగళవారం హనుమకొండలోని పోలీసు హెడ్క్వార్టర్స్లో సీపీని మర్యాద పూర్వకంగా కలిసి మేడారం జాతరకు ఆర్టీసీ చేస్తున్న ఏర్పాట్లు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను వివరించారు. పోలీసు శాఖ ద్వారా సహకారం అందించాలని కోరుతూ లేఖ అందించారు. హనుమకొండ డీఎం ధరమ్ సింగ్ పాల్గొన్నారు. -
ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు
వరంగల్ క్రైం: కమిషనరేట్ పరిధిలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించేలా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అధికారులను ఆదేశించారు. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని సీపీ పోలీస్ అధికారులతో మంగళవారం వీడియో సమావేశాన్ని నిర్వహించారు. తొలి విడత ఎన్నికలు జరిగే పరిధి పోలీస్ అధికారులతో మాట్లాడి తీసుకుంటున్న బందోబస్తు ఏర్పాట్లు అడిగి తెలుసుకున్నారు. అధికారులకు పలు సూచనలిచ్చారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. ఎన్నికలు విజయవంతంగా నిర్వహించడానికి ప్రతీ పోలీస్ సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎన్నికల వేళ పోలీసులు గ్రామాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తూ పోలింగ్ కేంద్రాలు, ఇతర ప్రాంతాల్లో గుంపులుగా లేకుండా జాగ్రత్త పడాలన్నారు. ఏదైనా సమస్య తలెత్తితే సమాచారమివ్వాలని, అదనపు బలగాల్ని పంపించనున్నట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపు సమయంలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని, లెక్కింపు పూర్తయ్యి సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు ఎన్నికయ్యే వరకు బందోబస్తు నిర్వహించాలన్నారు. సమావేశంలో డీసీపీలు అంకిత్కుమార్, కవిత, రాజమహేంద్ర నాయక్తో పాటు అదనపు డీసీపీలు, ఏసీపీలు పాల్గొన్నారు. సీపీ సన్ప్రీత్ సింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ -
ఫాగింగ్.. ఫ్రాడింగ్!
దోమల నియంత్రణ పేరిట ఏటా రూ.7 కోట్లు ఖర్చు‘దోమలతో బతకలేకపోతున్నాం. చలికాలం కూడా ఫ్యాన్ కిందే ఉండాల్సి వస్తోంది. రోజూ సాయంత్రం ఇంట్లో వేపాకుతో పొగ వేస్తున్నాం. లేకపోతే దోమలు నిద్రపోనివ్వవు’ అని దర్గా కాజీపేటకు చెందిన మహమ్మద్ జరీనా ఆవేదన వ్యక్తం చేసింది...ఇది ఒక్క జరీనా పరిస్థితే కాదు. నగరంలోని ప్రతీ కుటుంబం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. రోజురోజుకూ దోమలు వృద్ధి చెందుతుండడంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. పాలకులు మాత్రం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వరంగల్ అర్బన్: దోమల నియంత్రణ పేరిట కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగమవుతున్నాయనే ఆరోపణలున్నాయి. నిఘా పెట్టి చర్యలు తీసుకోవాల్సిన అర్బన్ మలేరియా అధికారి, పర్యవేక్షకులు ఎక్కడికక్కడ అక్రమాలకు పాల్ప డుతూ అందినకాడికి దండుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. మహా నగరంలో ప్రజారోగ్య పరిరక్షణ ఉందా లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో మురుగునీటి పారుదల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఖాళీ ప్రదేశాల్లో నీరు నిల్వతో దోమల వృద్ధి అధికమైంది. దోమ కాటుతో జ్వరపీడితుల సంఖ్య పెరుగుతోంది. ఆస్పత్రుల్లో చికిత్స కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఫాగింగ్తో ప్రయోజనమెంత? దోమల నివారణకు నగర వ్యాప్తంగా ప్రతీ రోజు 66 డివిజన్లలో 8 పెద్ద ఫాగింగ్ యంత్రాలు, 34 హ్యాండ్ యంత్రాల ద్వారా నిత్యం ఫాగింగ్ జరగాలి. ఇందుకోసం పెద్ద యంత్రాలకు 16 మంది, చిన్న యంత్రాలకు 34 మంది సిబ్బంది పని చేస్తున్నారు. ఈ పెద్ద పొగ మిషన్లకు రోజుకు 50 లీటర్లు, హ్యాండ్ యంత్రాలకు 5 లీటర్లతో పాటు పెట్రోల్ లీటరు చొప్పున కూపన్లు పంపిణీ చేస్తుంటారు. ఇలా ఇంధనం పేరిట ఒక్కో యంత్రానికి రోజుకు పెద్ద మిషన్కు రూ.49 వేలు, చిన్న యంత్రాలకు రూ.20,500, చొప్పున సుమారు రూ.70 వేలు వెచ్చిస్తున్నారు. ఏడాదంతా ఇంధనం పేరిట మొత్తం రూ.2.10 కోట్లు కాగా, ఎంఎల్, కిరోసిన్, కెమికల్స్ కోసం రూ.1.50 కోట్లు. వీరి వేతనాలు రూ.కోటి చొప్పున చెల్లిస్తున్నారు. ఇలా రూ.4.60 కోట్లు, దోమల నియంత్రణ కోసం క్షేత్రస్థాయి కార్మికులకు రూ.1.98 కోట్లు, ఇతరుల వేతనాలతో కలిపి మొత్తం వీటి పర్యవేక్షణ సిబ్బంది జీతభత్యాలు కలిపి ఏడాదికి దోమల నియంత్రణ కోసం రూ.7 కోట్లు వెచ్చిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో దోమల బెడద అరికట్టడానికి అధికారులు తీసుకుంటున్న చర్యలు తగిన ఫలితాలివ్వడం లేదు. ఈవ్యవహారంపై విజిలెన్స్ అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని నగరవాసులు కోరుతున్నారు. కానరాని కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు దోమలు వృద్ధి చెందకుండా నిత్యం అన్ని డివిజన్లలో పర్యటించాలి. నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో చెరువులు, నాలాల్లో, డ్రెయినేజీల్లో మందు స్ప్రే చేయాలి. ఓవర్ హెడ్ ట్యాంకులు, సంపులు, బావుల్లో రసాయనాలు వేయాలి. 90 మంది కార్మికులు తిరుగుతున్న దాఖలాలు నామామాత్రమే. ఉదయం 5గంటలకు ఫేస్ హాజరు వేసి మధ్యాహ్నం 1 గంట వరకు విధులు నిర్వర్తించాల్సి ఉండగా, హాజరు వేసుకుని, క్షేత్ర స్థాయిలోకి వెళ్లి అప్పుడప్పుడు నోట్ బుక్కుల్లో కాలనీవాసుల నుంచి సంతకాలు తీసుకుని ఇళ్లల్లోకి జారుకుంటున్నా రు. డివిజన్ల వారీగా కార్మికులు చేస్తున్న పనులు భూతద్దంలో వెతికినా కనిపించట్లేదని నగరవాసులు పేర్కొంటున్నారు. చర్యలు తీసుకుంటాం.. డీజిల్, పెట్రోల్ కూపన్లు రోజు వారీగా ఫాగింగ్ యంత్రాలకు సరిపడా జారీ చేస్తున్నాం. తక్కువ ఇంధనం పోస్తున్నారనే విషయం నా దృష్టికి రా లేదు. ఏమైనా లోపాలుంటే చర్యలు తీసుకుంటా. – రాజారెడ్డి, అర్బన్ మలేరియా ఇన్చార్జ్ బయాలజిస్ట్8 పెద్ద ఫాగింగ్ యంత్రాలకు రోజు 50 లీటర్ల డీజిల్, 1 లీటరు పెట్రోల్ కూపన్లు ఇవ్వాలి. కానీ, కూపన్లు జారీ చేసిన పెట్రోల్ బంక్లో 25 లీటర్ల డీజిల్ మాత్రం పోస్తున్నారు. అందుకు గాను ప్రతీ ఫాగింగ్ డ్రైవర్కు వారానికి రూ.3 వేలు చెల్లిస్తున్నారు. ఇక హ్యాండ్ ఫాగింగ్ యంత్రానికి 5 లీటర్ల డీజిల్, లీటరు పెట్రోల్ పోస్తారు. అందుకు ప్రతీ కార్మికుడు ఫాగింగ్ చేసినా, చేయకపోయినా నెలకు హెల్త్ ఇన్స్పెక్టర్లకు రూ. 5 వేల చొప్పున చెల్లించాలి. ఈ వ్యవహారంలో కార్మికుడి నుంచి విభాగం ఉన్నతాధికారి వరకు నెలనెలా దండుకున్నట్లు ఆరోపణలున్నాయి. అధికారులు ఈవిషయంపై దృష్టిసారిస్తే మరి కొన్ని నిజాలు వెలుగు చూసే అవకాశం ఉంది. డీజిల్, పెట్రోల్ రూపంలో ప్రజాధనం పక్కదారి! మందుల కొనుగోళ్లలో మాయ వృద్ధి చెందుతున్న దోమలు.. రోగాలబారిన పడుతున్న ప్రజలు -
పార్లమెంట్ ముట్టడికి తరలిరావాలి
నయీంనగర్: జనరల్ స్థానాల్లో పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థులను పార్టీలకతీతంగా గెలిపించాలని బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్గౌడ్ బీసీలకు పిలుపునిచ్చారు. హనుమకొండలోని ప్రెస్క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ నెల 15, 16 తేదీల్లో చేపట్టనున్న పార్లమెంట్ ముట్టడి వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం వేణుగోపాల్గౌడ్ మాట్లాడుతూ పార్లమెంట్ ముట్టడికి బీసీలందరూ వేలాదిగా తరలిరావాలని, 16న జరిగే అఖిలపక్ష సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు దొడ్డపల్లి రఘుపతి, చిర్ర రాజు, శోభారాణి, సుగుణ, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: కాకినాడలోని జేఎన్టీయూలో ఈనెల 10 నుంచి 14 వరకు నిర్వహించనున్న సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్టోర్నమెంట్కు కాకతీయ యూనివర్సిటీ పురుషుల జట్టును ఎంపిక చేసినట్లు స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ ఆచార్య వై.వెంకయ్య మంగళవారం తెలిపారు. జట్టులో ఆర్.వెంకటేశ్వర్రావు, కె.ఉదయ్కిరణ్, జె.సాయికిరణ్, బి.శివకుమా ర్, సి.వసంత్రావు, ఎ.సంజీవ్కుమార్, టి.రాంచరణ్ అంజి, భీంరావు, కె.సాయికుమార్, పి.ఆదినారాయణ, పి.ప్రమోద్, బి.రోషన్, టి.జస్వంత్, ఎం.లక్ష్మణస్వామి ఉన్నారని పేర్కొన్నారు. బొల్లికుంటలోని వాగ్దేవి ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ రామాంజనేయులు జట్టుకు కోచ్ కమ్ మేనేజర్గా వ్యవహరిస్తున్నారని వెంకయ్య తెలిపారు. ఎంజీఎం: కాళోజీ హెల్త్ వర్సిటీ ప్రాంగణంలోని పార్కింగ్ ప్రదేశంలో మంగళవారం ఉదయం కొండచిలువ కలకలం సృష్టించింది. ఉదయం 10 గంటల సమయంలో కార్యాలయ సిబ్బంది వాహనాలు పార్కింగ్ చేస్తున్న సమయంలో కొండచిలువ కనిపించింది. దానిని పట్టుకునేందుకు సిబ్బంది యత్నించారు. కానీ, నిర్మాణంలో ఉన్న సూపర్స్పెషాలిటీ ఆస్పత్రిలోకి కొండచిలువ వెళ్లిపోయినట్లు సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు. కాళోజీ సెంటర్: కరీమాబాద్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు పోగు అశోక్ 14వ జాతీయస్థాయి సదస్సుకు ఎంపికయ్యారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) ఆధ్వర్యంలో ప్రతీ సంవత్సరం జాతీయ స్థాయిలో విద్యాసదస్సు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ‘ఎన్హ్యాన్సింగ్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ స్కిల్స్ ఇన్ సెకండరీ స్కూల్ స్టూడెంట్స్’ అనే అంశంపై ఉపాధ్యాయుడు అశోక్ సమర్పించిన పరిశోధన పత్రం జాతీయ సదస్సుకు ఎంపికై ంది. ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు రాజస్తాన్ అజ్మీర్లోని రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్లో జరగనున్న జాతీయ సదస్సులో ఆయన పాల్గొననున్నారు. జాతీయస్థాయి సదస్సుకు ఎంపికై న అశోక్ను ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ రమేశ్, ప్రొఫెసర్ సురేష్, డీఈఓ రంగయ్యనాయుడు, సుజన్తేజ, ఉపాధ్యాయులు అభినందించారు. -
హీటెక్కిన ‘పంచాయతీ’!
సాక్షిప్రతినిధి, వరంగల్: పల్లెల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల సంరంభం తారస్థాయికి చేరింది. మొదటి విడత ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రం తెరపడగా.. అభ్యర్థులకు ఒక్కరోజే సమయం మిగిలింది. దీంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు వారు పడరాని పాట్లు పడుతున్నారు. మంగళవారం రాత్రి నుంచే మద్యం, కానుకలు, నగదుతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలోపడ్డారు. రెండో విడత ప్రచారానికి శుక్రవారం తెరపడనుంది. మూడో విడత గ్రామ పంచాయతీలకు నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియగా.. బరిలో ఉన్న అభ్యర్థులకు అధికారులు గుర్తులు కేటాయించారు. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రజాప్రతినిధులు, నాయకులు తమ మద్దతుదారుల గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. మరో వారం హడావుడి ఉమ్మడి వరంగల్లో ములుగు జిల్లాలోని మంగపేట మండలం మినహా.. 1,683 గ్రామ పంచాయతీలు, 14,776 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొదటి విడత ఎన్నికలు గురువారం జరగనుండగా.. రెండో విడత 14, మూడో విడత ఎన్నికలు 17న నిర్వహించనున్నారు. కాగా, మొదటి విడత ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగియగా.. గురువారం ఉమ్మడి జిల్లాలోని 555 పంచాయతీలకు ఏకగ్రీవాలను మినహాయించి 512 జీపీలకు ఎన్నికలు జరగనున్నాయి. 4,901 వార్డులకు కూడా ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు ప్రకటించారు. బుధవారం ఉదయం నుంచి పోలింగ్ అధికారులు, సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు చేరుకుని పోలింగ్ సామగ్రితో కేంద్రాలకు తరలేలా ఏర్పాట్లు చేశారు. కాగా, హనుమకొండ జిల్లాలో మొదటి విడత భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపుర్ మండలాల్లోని 69 జీపీలు, 658 వార్డులకు ఎన్నికల ఏర్పాట్లు జరిగాయి. ఇందులో ఐదు గ్రామ పంచాయతీ సర్పంచ్లు, నాలుగు గ్రామాల వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యారు. అవి మినహాయించి మిగతా చోట్ల ఎన్నికలు నిర్వహించనున్నారు. రసవత్తరంగా రెండు, మూడు విడతలు.. మొదటి విడత ప్రచారం ముగియడంతో ప్రధాన పార్టీలు రెండు, మూడు విడతలపై దృష్టి సారించాయి. అధికార కాంగ్రెస్ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలు పల్లెల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, బీజేపీ నుంచి జిల్లా అధ్యక్షులు, నేతలు ఆయా పార్టీల అభ్యర్థుల కోసం శ్రమిస్తున్నారు. అవసరాన్ని బట్టి ఒక్కో ప్రాంతంలో ఒక్కోతీరుగా సీపీఐ, సీపీఎం, ఇతర పార్టీల మద్దతు తీసుకుంటున్నాయి. మొదటి విడత ప్రచారానికి తెర.. ప్రలోభాలకు ఎర పోలింగ్ సామగ్రితో నేడు పల్లెలకు అధికారులు రెండో విడతకు శుక్రవారం సాయంత్రం వరకే ప్రచారం మూడో విడత ముగిసిన ‘ఉపసంహరణ’.. గుర్తుల కేటాయింపుతో ప్రచార హోరు -
కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టరేట్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మంగళవారం కలెక్టర్ స్నేహ శబరీష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్లో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. విగ్రహావిష్కరణ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ గీతంతో కలెక్టరేట్ ప్రాంగణం మార్మోగింది. అనంతరం కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. కలెక్టరేట్ను సందర్శించే ప్రజలు, అధికారులకు ఈ విగ్రహం ప్రేరణగా నిలుస్తుందన్నారు. తెలంగాణ గౌరవం, సంప్రదాయాలు, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా విగ్రహం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, డీఆర్డీఓ మేన శ్రీను, ఆర్అండ్బీ ఈఈ సురేశ్బాబు, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, డీటీఓ శ్రీనివాస్కుమార్, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రేవంత్ పాలనలో అంతా విధ్వంసమే
హన్మకొండ: సీఎం రేవంత్రెడ్డి పాలనలో అంతా విధ్వంసమేనని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ విమర్శించారు. విజయ్ దివస్ను పురస్కరించుకుని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక అంబేడ్కర్ విగ్రహం నుంచి బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ముందుగా అంబేడ్కర్ విగ్రహానికి మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రేవంత్ చేసిన గొప్పపని వేయి ఇళ్లు కూల్చడమేనని ఎద్దేవా చేశారు. రేవంత్రెడ్డి పైశాచికత్వం నుంచి పుట్టుకొచ్చింది నేటి తెలంగాణ తల్లి అని అన్నారు. కేసీఆర్ ఉద్యమాన్ని అవమానిస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ ఒక్కసారి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ రాసిన పుస్తకం చదవాలని హితవు పలికారు. మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ దుర్మార్గపు పాలన నుంచి బయటపడేందుకు ప్రజలు కార్యోణ్ముకులు కావాలని పిలుపునిచ్చారు. నాయకులు తాళ్లపల్లి జనార్దన్గౌడ్, పులి రజనీకాంత్, బొంగు అశోక్ యాదవ్, చెన్నం మధు, ఇమ్మడి లోహిత, నయీముద్దీన్, సోదా కిరణ్, లక్ష్మీనారాయణ, జానకి రాములు, వెంకన్న రమేశ్ పాల్గొన్నారు. విజయ్ దివస్లో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ -
రూ.21 కోట్ల సైబర్ దోపిడీ
బుధవారం శ్రీ 10 శ్రీ డిసెంబర్ శ్రీ 2025సాక్షి, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు ఏకంగా రూ. 21,74,51,300 కొల్లగొట్టారు. 68 కేసుల్లోనే ఇంత భారీగా నగదు దోచుకోవడం సంచలనంగా మారింది. 2024లో 772 కేసుల్లో రూ.24,70,43,738 సొత్తు సైబర్ నేరగాళ్ల చేతికిపోతే, ఈసారి 69 కేసుల్లో రూ.21,74,51,300 నగదు పోయిందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అంటే కేసుల సంఖ్య భారీగా తగ్గినా, తక్కువ మంది బాధితులే ఎక్కువ మొత్తంలో నగదు పోగొట్టుకోవడం విస్తుగొల్పుతోంది. ముఖ్యంగా ఈ మోసపోయిన వారిలో ఉన్నత విద్యావంతులు, వైద్యులు, న్యాయవాదులు, ఉద్యోగులు ఉండడం గమనార్హం. ముఖ్యమైన కేసులిలా.. మోనార్క్ నెట్వర్క్ క్యాపిటల్ పేరుతో ఇన్స్టాగ్రా మ్లో యాడ్ రావడంతో చూసిన నగరానికి చెందిన ఇద్దరు వైద్యులు క్లిక్ చేయడంతో ఆటోమేటిక్గా వీరి ఫోన్ నంబర్లు సైబర్ నేరగాళ్లు నిర్వహిస్తున్న వాట్సాప్ గ్రూప్ల్లో యాడ్ చేశారు. వారు ప్రొఫెషనల్ అడ్వయిజర్లుగా చెప్పుకుంటూ రోజువారీగా ఐదు నుంచి 20 శాతం లాభాలొస్తాయంటూ నమ్మబలికారు. ఇలా ఆ మాటలు నమ్మి వారు చెప్పిన విధంగా నకిలీ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ యాప్ మోనార్క్ ఫిన్ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఇందులో 41 ఏళ్ల ఓ వైద్యుడు 27 ట్రాన్సక్షన్ల ద్వారా రూ.1.4 కోట్లు బదిలీ చేశారు. మరో వైద్యుడు 13 ట్రాన్సక్షన్ల ద్వారా రూ.కోటి ఇన్వెస్ట్ చేశారు. ఈ డబ్బులు డ్రా చేసేందుకు ట్యాక్స్ కట్టాలని, టీం డిపాజిట్ కింద రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. ఇవీ చెల్లించాక కూడా విత్డ్రా ఆప్షన్ డిసబుల్ చేసి మరో రూ.20 లక్షలు డిమాండ్ చేయడంతో మోసమని సైబర్ క్రైం పోలీసులను ఈ నెల 3న సంప్రదించారు. నగరానికి చెందిన ఓ న్యాయవాదికి వరుసగా వివిధ శాఖల అధికారులమని కాల్స్ చేసి ‘మీపై నగ్న వీడియోలు సర్క్యులేట్ నుంచి మానవ అక్రమ రవాణా వరకు వివిధ కేసులు పెండింగ్లో ఉన్నాయని, నకిలీ ఎఫ్ఐఆర్, తప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలు చూపించి అరెస్ట్ చేస్తామంటూ భయభ్రాంతులకు గురిచేశారు. చివరగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారిగా మళ్లీ ఫోన్కాల్ చేసి డిజిటల్ అరెస్ట్ అంటూ.. ఈ కేసులు క్లియర్ చేసేందుకు సెక్యూరిటీ అమౌంట్ ఇవ్వమనడంతో అప్పటికే భయపడిన న్యాయవాది రూ.42 లక్షలు నేరగాళ్లు ఇచ్చిన బ్యాంక్ ఖాతాకు బదిలీ చేశారు. మరుసటిరోజు కాల్ చేసి రూ.32 లక్షలు ఇవ్వాలనడంతో మోసమని సైబర్ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఏడాది ఇప్పటివరకు నమోదైన 68 కేసుల్లో బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ (వ్యాపార, పెట్టుబడి మోసాలు) 43 కేసులున్నాయంటే మనిషి ఆశను సైబర్ నేరగాళ్లు ఎలా ‘క్యాష్’ చేసుకుంటున్నారో తెలుస్తోంది. తక్కువ, డబ్బులతో పెట్టుబడి.. ఒక్కరోజులోనే రెండింతలు అంటూ వివిధ ప్రముఖ కంపెనీల పేర్లతో సోషల్ మీడియా వేదికగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లు చేస్తున్నారు. ఆరంభంలో రూ.100 పెడితే రూ.200 రావడంతో ఇది నిజమని అనేక మంది రూ.వేలు, రూ.లక్షలు వరకు పెట్టుబడి పెట్టాక అసలు మోసం అర్థం అవుతోంది. లాభాలు దేవుడెరుగు కానీ, పెట్టిన డబ్బులు కూడా పోవడంతో అది మోసమని గుర్తించిన బాధితులు సైబర్ క్రైం పోలీసులను సంప్రదిస్తున్నారు. జనవరి నుంచి సైబర్ మోసాలు, సొత్తు (రూ.లలో) ఇలా.. జనవరి నుంచి ఇప్పటివరకు నయా నేరగాళ్ల పంజా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 68 కేసులు వీటిలో అత్యధికంగా బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ 43 ఆ తర్వాత స్థానంలో డిజిటల్ అరెస్ట్తో బాధితులకు టోకరా 1930 ద్వారా 24 గంటల్లో ఫిర్యాదు చేస్తేనే రికవరీకి చాన్స్ -
11, 14, 17 తేదీల్లో స్థానిక సెలవు
వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: జిల్లాలో ఈనెల 11, 14, 17వ తేదీల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫై చేసిన ప్రాంతాల్లో స్థానిక సెలవులు ప్రకటిస్తున్నట్లు వరంగల్ కలెక్టర్ సత్యశారద తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయా తేదీల్లో స్థానిక సెలవుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్ జరిగే ప్రదేశాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణ సెలవు, ప్రైవేట్ ఉద్యోగులకు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవుగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. అందుబాటులో యాసంగి విత్తనాలు వరంగల్ జిల్లాలో యాసంగి సీజన్కు సంబంధించి అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. సోమవారం పంటల సరళి, విత్తనాలు, ఎరువుల లభ్యత, అమ్మకాలపై కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయశాఖాధికారి అనురాధ, జిల్లా సహకార అధికారి నీరజ, మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి జీపీ ఎన్నికల పోలింగ్ సిబ్బంది కేటాయింపులో మొదటి, రెండో విడతకు ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు బాలమాయదేవి, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సత్యశారదల సమక్షంలో సోమవారం నిర్వహించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన, డీఈఓ రంగయ్యనాయుడు, ఆర్డబ్ల్యూఎస్ అధికారి నిర్మల పాల్గొన్నారు. సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకం వరంగల్: ఎన్నికల నిర్వహణలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకమని గ్రామపంచాయతీ ఎన్నికల జిల్లా పరిశీలకురాలు బాలమాయదేవి, కలెక్టర్ సత్యశారద అన్నారు. జీపీ ఎన్నికల్లో భాగంగా సోమవారం వరంగల్ డీఆర్డీఓ కార్యాలయంలో సూక్ష్మ పరిశీలకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మూడు దశల్లో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమ విధులను నిర్వర్తించి నివేదికలను సకాలంలో అందజేయాలన్నారు. ఈవీఎం గోదాంల పరిశీలన వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని జిల్లా వేర్ హౌస్ గోదాంలో భద్రపర్చిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఈవీఎంల) వరంగల్ కలెక్టర్ సత్యశారద, అదనవు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి సోమవారం తనిఖీ చేశారు. వివరాలు నమోదు చేయాలి ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) ఆన్లైన్ పోర్టల్లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారుల వివరాలను నిర్దేశిత గడువులోగా నమోదు చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం వరంగల్లోని పైడిపల్లి, దేశాయిపేట, తిమ్మాపూర్, దూపకుంట ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలను బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్, సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. -
అస్తవ్యస్త ప్రణాళిక
అనాలోచిత నిర్ణయాలు.. అడ్డగోలు నిర్మాణాలువరంగల్ అర్బన్ : ప్లానింగ్, శాసీ్త్రయత బొమ్మాబొరుసు లాంటివి. ఈ రెండు లేకుండా ఇష్టారాజ్యంగా రూ.కోట్లు వెచ్చించి భారీ భవనాలు నిర్మించడం గ్రేటర్ వరంగల్కే చెల్లుబాటు అవుతోంది. ఇంజనీర్లు, ప్రణాళిక అధికారులు భవిష్యత్ తరాల అభివృద్ధికి పాటుపడాల్సి ఉండగా.. అనాలోచిత నిర్ణయాలతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ప్రతి పైసా సద్వినియోగం అయ్యేలా అన్నిస్థాయిల్లో అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. ఏం చేయాలన్నా ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలి. అయితే బల్దియా అధికారులు ఎప్పుడు ఏది నిర్మిస్తారో? ఏది ఎందుకు కూలగొడతారో తెలియదు. అనాలోచిత నిర్ణయాలతో అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టడంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారీ భవన నిర్మాణానికి కసరత్తు.. బల్దియా ప్రధాన కార్యాలయానికి సమీపంలోని మెప్మా ఆఫీస్ పక్కన రూ.32 కోట్ల నిధులతో ఐదు అంతస్తుల్లో భారీ భవనాన్ని నిర్మించేందుకు కసరత్తు వేగవంతమైంది. ఈ భవనం పక్కనే కాకతీయ మ్యూజికల్ గార్డెన్, ఇండోర్ స్టేడియం, ప్లానిటోరియం, స్విమ్మింగ్పూల్ నిర్మాణం చేపట్టారు. అయితే, ఆయా నిర్మాణాలను ముందు చూపులేకుండా ఇష్టారాజ్యంగా చేపట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 50 నుంచి 60 రకాల అవసరాలకు ఉపయోగపడే విధంగా పరిపాలన విభాగాలు, కమిషనర్, వింగ్ అధికారులు, సిబ్బందికి చాంబర్లు, మేయర్, డిప్యూటీ కమిషనర్తోపాటు దాదాపు 200 మంది సిట్టింగ్ సామర్థ్యంతో కౌన్సిల్ హాల్, ప్రతిపక్ష సభ్యుల చాంబర్లు, వాహనాల పార్కింగ్ డిజైన్ చేశారు. బల్దియాలో పెద్ద పనులు చేసే బడా కాంట్రాక్టర్కు ఇప్పటికే టెండర్ ఖరారైంది. త్వరలో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా భారీ భవనానికి శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. గ్రేటర్ పరిపాలన భవన నిర్మాణంపై విమర్శలు వృథాకానున్న రూ.32 కోట్ల ప్రజాధనం పాలక, అధికార వర్గాలు ఆలోచిస్తేనే ఫలితం -
సాధారణ ప్రసవాలపై గర్భిణులకు వివరించాలి
ఎంజీఎం: గర్భిణులకు సాధారణ ప్రసవాలతో కలిగే లాభాలు, సీజేరియన్లతో తల్లీబిడ్డకు కలిగే నష్టాల గురించి కౌన్సెలింగ్ నిర్వహించాలని హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య వైద్యులకు సూచించారు. సోమవారం నగరంలోని దేవిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో సీ సెక్షన్ ఆడిట్ నిర్వహించారు. నవంబర్లో మొత్తం 39 ప్రసవాలు జరగగా.. 38 సీ సెక్షన్, 1 నార్మల్ ప్రసవాలు చేసినట్లు గుర్తించి ఎందుకు అన్ని సిజేరియన్ ఆపరేషన్లు చేశారని వైద్యులను ప్రశ్నించారు. అనంతరం డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. తప్పనిసరి పరిస్థితులు, సూచించిన కారణాల్లో మాత్రమే సిజేరియన్ నిర్వహించాలన్నారు. ఆయన వెంట మాతా శిశు సంక్షేమం ప్రోగ్రాం అధికారి డాక్టర్ రుబీనా, స్టాటిస్టికల్ అధికారి ప్రసన్నకుమార్, హెచ్ఈఓ రాజేశ్వర్ రెడ్డి, సందీప్ పాల్గొన్నారు. వరంగల్ లీగల్: హనుమకొండ జిల్లా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్గా సి.రామును నియమిస్తూ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సాంబశివారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సోమవారం రాము బాధ్యతలు స్వీకరించారు. తదుపరి నియామకాలు జరిగే వరకు ఉమ్మడి జిల్లాకు రాము అదనపు ఇన్చార్జ్గా కొనసాగుతారని తెలిపా రు. సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంతోషి.. అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్గా కొనసాగుతారని నియామక ఆదేశాల్లో పేర్కొన్నారు. భూ కబ్జాపై సమగ్ర నివేదిక కోరిన కలెక్టర్ హన్మకొండ అర్బన్: నగరంలోని వడ్డేపల్లి ప్రభుత్వ భూమి కబ్జా వ్యవహారంపై సమగ్ర వివరాలతో ‘పెద్దలా.. గద్దలా’ శీర్షికతో సోమవారం సాక్షిలో ప్రచురితమైన కథనం జిల్లాలో సంచలనం రేపింది. దీనిపై స్పందించిన హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్.. ఆ భూమిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీంతో రంగంలో దిగిన హనుమకొండ తహసీల్దార్ రవీందర్ రెడ్డి సంబంధిత వ్యక్తులను భూమికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని చెప్పినట్లు తెలిపారు. ఆవివరాలతోపాటు రెవెన్యూ రికార్డులు పరిశీలించి క్షేత్రస్థాయి వాస్తవాలను కలెక్టర్ నివేదిస్తానని ఆయన పేర్కొన్నారు. కాగా, అక్కడ రెవెన్యూ రికార్డుల ప్రకారం మూడు గుంటల ప్రభుత్వ భూమి ఉందన్నారు. ఈ విషయంలో అక్కడ బోర్డు ఏర్పాటు చేయగా కొందరు తొలగించారన్నారు. ఈ విషయంలో విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సీపీ సన్ప్రీత్సింగ్ ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రంనుంచి రాత్రి వరకు ఆకస్మిక తనిఖీలు జరిగాయి. పలుచోట్ల సీపీ తనిఖీల్లో పాల్గొన్నారు. పోలీస్ అధికారులు వాహనాలతోపాటు ఇళ్లలోనూ సోదాలు చేశా రు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారమివ్వాలని కమిషనర్ కోరారు. -
పోలింగ్ నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఈనెల 11న భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాల్లో పటిష్ట ఏర్పాట్లు చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్ నుంచి ఆయా మండలాల్లో ఎన్నికల ఏర్పాట్లపై ఎంపీడీఓలతో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షించారు. కార్యక్రమంలో డీపీఓ లక్ష్మీరమాకాంత్, డీఆర్డీఓ మేన శ్రీను, జెడ్పీ సీఈఓ రవి, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాల ప్రత్యేకాధికారులు అనసూయ, శ్రీనివాసులు, నరసింహస్వామి, ఎంపీడీఓలు వీరేశం, విజయ్కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. మానసిక వికాసాన్ని పెంపొందించేందుకు కృషి జిల్లాలో ప్రభుత్వ, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో మానసిక వికాసాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ‘స్టూడెంట్ వెల్ నెస్’ కార్యక్రమంపై వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఇందులో డీఎంహెచ్ఓ అప్ప య్య, డీడబ్ల్యూఓ జయంతి, డీఐఈఓ గోపాల్, డీటీడీఓ ప్రేమకళ, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ నిర్మల, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి గౌస్ హైదర్, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్కుమార్ తదితరులున్నారు. పోస్టర్ ఆవిష్కరణ అవినీతి నిరోధక విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన అవినీతి వ్యతిరేక వారోత్సవాల పోస్టర్ను కలెక్టర్ స్నేహ శబరీష్ సోమవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో వరంగల్ ఏసీబీ డీఎస్పీ పి.సాంబయ్య, ఇన్స్పెక్టర్ రాజు పాల్గొన్నారు. హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ -
ఎంజీఎంలో గందరగోళం!
ఎంజీఎం: ఎంజీఎం ఆస్పత్రి పాలన రోజురోజుకూ అధ్వాన్న స్థితికి చేరుకుంటోంది. పూర్తి స్థాయి పరిపాలనాధికారుల అధికారుల లేమితో, సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్థాయి వైద్యులను ఆర్ఎంఓలుగా నియమించుకుని కీలక బాధ్యతలు అప్పగించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆస్పత్రిలో రోగులకు అందించాల్సిన ఔషధాలు, రక్త పరీక్షలు, రోగులకు అందించాల్సిన పారిశుద్ధ్యం వంటి టెండర్ ప్రక్రియను ఎప్పటికప్పుడు పూర్తి చేయడంలో సూపరింటెండెంట్ స్థాయి అధికారికి ఆర్ఎంఓ–1, ఆర్ఎంఓ–2 వంటి అధికారుల సహాయం తప్పనిసరి. రోగులకు మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందడం, వారికి సంబంధించి ఎంఓయూలను పరిశీలిస్తూ నిబంధనలు ఎలా పాటిస్తున్నారు అనే అంశాలు పరిశీలిస్తూ బిల్లుల చెల్లింపుల్లో కీలకంగా వ్యవహరిస్తూ రోగులకు మెరుగైన సేవలందించాల్సి ఉంటుంది. కానీ, ప్రస్తుతం ఎంజీఎంలో ఇలాంటి ప్రక్రియ సరిగ్గా జరగకపోవడంతో రెండేళ్లుగా ఆయా సేవలు అధ్వాన్న స్థితికి చేరుకున్నాయి. 20 నెలలు గడుస్తున్నా పూర్తికాలే.. ఆస్పత్రిలో చికిత్స పొందే వేలాది మంది రోగులకు సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి పూర్తిస్థాయిలో మందులు సరఫరా కాని క్రమంలో ఆస్పత్రిలో సర్జికల్, మెడికల్ విభాగాల్లో టెండర్ ప్రక్రియ ద్వారా ఎంపిక చేసిన ఏజెన్సీల ద్వారా రోగులకు ఔషధాలు సరఫరా చేస్తారు. గత 20 నెలల క్రితం టెండర్ సమయం ముగిసింది. ఈప్రక్రియను పూర్తి చేయడంలో పరిపాలనాధికారులు పూర్తిస్థాయిలో విఫలమవడంతో రోగులకు పూర్తిస్థాయిలో ఔషధాలు అందకపోవడంతో పాటు, కొన్ని రక్తపరీక్షలకు సైతం ప్రైవేట్కు పరుగులు తీయక తప్పట్లేదు. స్టేషనరీ విభాగం పరిస్థితి అంతేనా? ఎంజీఎంలో రోగులకు చికిత్సలందించడంలో ఔషధాలతో పాటు స్టేషనరీ విభాగం సైతం కీలకం. ఈ విభాగం ద్వారా రోగులకు కేస్షీట్లు, ఓపీ స్లిప్లు, వార్డులకు సంబంధించిన ఎలక్ట్రిక్ సామగ్రి, ఫర్నిచర్, పెన్నులు, బుక్లు వంటి ఇతరత్రా సామగ్రి కొంటుంటారు. స్టేషనరీ విభాగ టెండర్ను పూర్తిచేయడంలో పరిపాలనాధికారులు వైఫల్యం చెందారు. ముగిసిన ఐహెచ్ఎంఎస్ టెండర్ మరో కీలక విభాగం పారిశుద్ధ్య సేవలు. ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా టెండర్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఆస్పత్రిలో కొనసాగుతున్న ఏజెన్సీ సమయం మూడు నెలల క్రితమే ముగిసింది. వెంటనే టెండర్ ప్రక్రియ ప్రారంభించాలని పలు కార్మిక సంఘాలు సూపరింటెండెంట్కు వినతి పత్రాలు సైతం అందించాయి. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఏజెన్సీ నిర్వాహకులు ఎంఓయూలో పేర్కొన్నట్లుగా కూడా వేతనాలు చెల్లించట్లేదని ఎన్ని సార్లు పరిపాలనాధికారులకు మొరపెట్టుకున్నా.. పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ఏజెన్సీ పర్యవేక్షించే ఆర్ఎంఓ స్థాయి అధికారులు రోగులకు సేవలందించే పేషెంట్ కేర్, పారిశుద్ధ్య సేవలు పట్టించుకోకపోవడం వల్ల ప్రస్తుతం కొనసాగుతున్న కార్మికులకు పని ఒత్తిడి సైతం పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి కాని సర్జికల్, మెడికల్ టెండర్లు అధ్వానస్థితిలో పేషెంట్ కేర్ సేవలు పట్టించుకోని పాలనాధికారులు -
శాంతితోనే అభివృద్ధి సాధ్యం
హన్మకొండ: శాంతితోనే అభివృద్ధి పరుగులు పెడుతుందని పూర్వ వరంగల్ జిల్లా కలెక్టర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం హనుమకొండ నక్కలగుట్టలోని హోటల్ హరిత కాకతీయలో ‘ఎగిరే శాంతి కపోతం’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభాకర్రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ శాంతి దిశగా ఆలోచించాలన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్, పూర్వ ఉపకులపతి ప్రొఫెసర్ మహమ్మద్ ఇక్బాల్అలీ, కేయూ పాలక మండలి సభ్యుడు సురేశ్లాల్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్, గంటా రామిరెడ్డి మాట్లాడారు. మహమ్మద్ సిరాజుద్దీన్ పుట్టిన రోజును పురస్కరించుకుని విశ్రాంత ఆచార్యులు గూడ నరసింహమూర్తి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో నిర్వహణ కమిటీ సభ్యులు కొక్కండ విజయ్బాబు, విప్పనపల్లి రవికుమార్, డాక్టర్ పొడిశెట్టి విష్ణువర్ధన్, డాక్టర్ వెలుదండి రవికుమార్, పగడాల సరళ, సాగంటి మంజుల, శ్రీపాద సుధాకర్ రావు, నల్ల లక్ష్మీనారా యణ, బీటవరం శ్రీమన్నారాయణ పాల్గొన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డి ‘ఎగిరే శాంతి కపోతం’ పుస్తకావిష్కరణ -
తేలిన లెక్క
వరంగల్: వరంగల్ జిల్లాలోని 317 పంచాయతీల్లో మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. రెండు విడతల్లో ఇప్పటి వరకు 16 మంది సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొదటి విడత ఎన్నికలు జరిగే 91 పంచాయతీల్లో 11 మంది సర్పంచ్లు ఏకగ్రీవం కావడంతో 80 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు 214 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 800 వార్డుల్లో 214 మంది ఏకగ్రీవం కావడంతో 585 వార్డులకు 1,533 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈనెల 11న మొదటి విడత పోలింగ్ నిర్వహించనున్నారు. రెండో విడత ఎన్నికలు జరిగే 117 పంచాయతీల్లో ఐదుగురు సర్పంచ్లు ఏకగ్రీవం కావడం, సంగెం మండలంలోని ఒక పంచాయతీలో సర్పంచ్ స్థానానికి నామినేషన్ పడకపోవడంతో మిగిలిన 111 సర్పంచ్ స్థానాలకు 360 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే 1,008 వార్డుల్లో 97 వార్డులు ఏకగ్రీవం కావడం మరో ఐదు వార్డుల్లో నామినేషన్లు పడకపోవడంతో మిగిలిన 906 వార్డుల్లో 2,142 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈనెల 14వ తేదీన రెండో విడత పోలింగ్ నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. మూడో విడత నామినేషన్ల పరిశీలన పూర్తి కాగా ఈ నెల 9వ తేదీన ఉపసంహరణ అనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల లెక్క తేలనుంది. ఇప్పటికే మూడు విడత ఎన్నికలకు పోలింగ్ అధికారులు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేశారు. హనుమకొండ జిల్లాలో 11 జీపీలు.. హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో మొదటి విడత 69 గ్రామపంచాయతీలు, 658 వార్డులకు, రెండో విడతలో 73 గ్రామ పంచాయతీలు, 694 వార్డుల్లో నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. ఈ క్రమంలో మొదటి విడత భీమదేవరపల్లి మండలంలోని వీర్లగడ్డ తండా, ఎల్కతుర్తి మండలంలోని గుంటూరుపల్లి, శాంతినగర్, కమలాపూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామపంచాయతీలు వార్డు సభ్యులతో సహా ఏకగ్రీవమయ్యాయి. ఈ లెక్కన 69 గ్రామ పంచాయతీలకు నాలుగు పూర్తిస్థాయిలో ఏకగ్రీవమయ్యాయి. అదేవిధంగా భీమదేవరపల్లి మండలంలోని గాంధీనగర్ సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైంది. ఇందుకు సంబంధించిన వివరాలు జిల్లాస్థాయిలో అధికారులు శుక్రవారం వెల్లడించారు. రెండో విడత ధర్మసాగర్ మండలంలోని కేశవనగర్, నర్సింగరావుపల్లి, హసన్పర్తి మండలం కొత్తపల్లి, వేలేరు మండలం బండతండా, చింతల్తండా పూర్తి కార్యవర్గాలు ఏకగ్రీవమయ్యాయి. హసన్పర్తి మండలంలోని అర్వపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ స్థానం మాత్రమే ఏకగ్రీవమైది. ఈ వివరాలు అధికారులు ప్రకటించారు. ఇక తుది విడత ఎన్నికలు జరిగే మండలాల్లో ఏకగ్రీవాలు తేలాల్సి ఉంది. జిల్లాలో మొత్తం రెండు విడతల్లో ఇప్పటి వరకు 11 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. వరంగల్ జిల్లాలో రెండు విడతల్లో 16 ఏకగ్రీవాలు జోరుగా సాగుతున్న ప్రచారం -
సోమవారం శ్రీ 8 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
కబ్జా చేసిన ప్రభుత్వ భూమిలో చేపట్టిన నిర్మాణ ం (ఇన్సెట్లో) అధికారులు ఏర్పాటు చేసిన బోర్డు (ఫైల్)రూ.కోట్ల విలువైన ఈ ప్రభుత్వ స్థలం కబ్జా వెనుక అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన పెద్ద తలకాయలు ఉన్నట్లు గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి. ఇలా ఉండగా.. రెవెన్యూ, సర్వే శాఖల్లోని కొందరు ఉన్నతాధికారులు కబ్జాదారులకు సహకరిస్తామని హామీ ఇచ్చి మరీ పోస్టులు పొందారని ఆరోపణలు ఉన్నాయి. గతంలో పనిచేసిన తహసీల్దార్లు, ఆర్ఐలు, వీఆర్వోలు ఈ భూమి ప్రభుత్వానిదని బోర్డులు పెట్టి, అప్పటి నిర్మాణాలను తొలగించారు. దశాబ్దాలుగా కాపాడుతూ వచ్చారు. అయితే కాసులకు కక్కుర్తిపడిన కొందరు అధికారులు తప్పుడు పత్రాలు సృష్టించడానికి రాజకీయ నాయకులకు సహకారం అందించారని, దాని ద్వారానే ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతం అవుతోందని స్థానికులు అంటున్నారు. హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లా కేంద్రం నడిబొడ్డున రూ.3 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. కలెక్టరేట్కు కూతవేటు దూరంలోని ప్రస్తుత రిజిస్ట్రేషన్ కార్యాలయం పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కొందరు ఆక్రమించారు. దీని వెనుక అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొంతమంది అగ్రనేతలు ఉన్నారని, వారి ఒత్తిడితోనే అధికారులు ముందుకు రావట్లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించకపోతే తర్వాత ఆ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం కష్టమని స్థానికులు పేర్కొంటున్నారు. ఇంతకాలం కాపాడినా.. హనుమకొండ మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన సర్వే నంబర్ 690లో 33 గుంటల భూమి ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇందులో చెరువు కట్ట, ప్రధాన రోడ్డు, అంతర్గత రోడ్లు పోగా కొంత ప్రభుత్వ భూమి మిగిలి ఉంది. ఈ స్థలాన్ని గతంలో కొందరు తప్పుడు పత్రాలతో కబ్జా చేశారని ఆరోపణలు ఉన్నాయి. అదికూడా మినహాయించినా అక్కడ ఇంకా మూడు గుంటల ప్రభుత్వ భూమి ఉందని సర్వే డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. దీని ఆధారంగా కొన్ని రోజుల క్రితం రెవెన్యూ అధికారులు ఆ భూమి ప్రభుత్వానిదే అంటూ బోర్డు కూడా ఏర్పాటు చేశారు. అయితే కబ్జా కోరులు రెవెన్యూ అధికారులు బోర్డు పెట్టిన రోజు రాత్రి ఆ బోర్డును తొలగించి, స్థలాన్ని చదును చేసి కబ్జా చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం తెలిసినా రెవెన్యూ అధికారులు కనీసం పోలీసు కేసు నమోదు చేయకపోవడం విమర్శలకు దారితీసింది. సమీప సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్.. గతంలో బతుకమ్మ ఆడడంతో ఈ స్థలాన్ని బతుకమ్మ బండ అని పిలిచేవారు. బతుకమ్మ ఆడినట్లు ఫొటోలు, ఆధారాలు కూడా గ్రామస్తుల వద్ద ఉన్నాయి. కొంతకాలం తర్వాత పరిస్థితి అనుకూలించకపోవడంతో అక్కడ బతుకమ్మ ఆడడం ఆపేశారు. ఆ తర్వాత క్రమంగా కబ్జాదారుల కన్ను ఈ భూమిపై పడింది. క్రమక్రమంగా పరిస్థితులు తమకు అనుకూలంగా మలుచుకుంటూ, తమకు కావాల్సిన అధికారులను తీసుకొచ్చి రహస్యంగా పనులు చక్కబెట్టుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. పక్క సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్లు చేయించుకుని ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని విమర్శలు వచ్చినా అధికారులు చర్యలు తీసుకోలేదు. నిర్మాణాలను అడ్డుకున్న గ్రామస్తులు కొద్దిరోజుల క్రితం రాత్రికి రాత్రి ఇక్కడ నిర్మాణాలు జరుగుతుండగా అడ్డుకునేందుకు గ్రామస్తులు ప్రయత్నించారు. అంతకుముందు స్థానిక ఎమ్మెల్యేలను కలిసి సమస్య వివరించారు. ఊరంతా ఏకమై నిర్మాణదారులపై తిరగబడ్డారు. అయితే, అప్పట్లో నిర్మాణాలను ఆపిన కబ్జాదారులు తర్వాత క్రమంగా పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుని నిర్మాణాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అంతా అన్యాక్రాంతం అయినా.. చివరకు మూడు గుంటలు ప్రభుత్వ భూమి ఉందని నిర్ధారించిన అధికారులు ఆభూమిని కాపాడే చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు ఊతమిస్తోంది. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ప్రభుత్వ భూమిని కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు.నిర్మాణాలు కనిపించకుండా అడ్డుగా పెట్టిన రేకులుఅక్కడ మూడు గంటల ప్రభుత్వ స్థలం ఉంది. సర్వేయర్ రిపోర్టు ద్వారా ఈ విషయం వెల్లడైంది. కొద్ది రోజుల క్రితం ప్రభుత్వ స్థలమని ఏర్పాటు చేసిన బోర్డును కొందరు తొలగించారు. ఈ విషయం మా దృష్టికి రాగానే ఉన్నతాధికారులకు తెలియజేశాం. వారి ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. – దశరథ రాంరెడ్డి, హనుమకొండ రెవెన్యూ ఇన్స్పెక్టర్ హనుమకొండ నడిబొడ్డున ఆక్రమించి యథేచ్ఛగా నిర్మాణాలు కొంతమంది అధికార, ప్రతిపక్ష పార్టీల అగ్రనాయకుల దందా పట్టించుకోని రెవెన్యూ అధికారులు.. స్థలం స్వాధీనం చేసుకోవాలని స్థానికుల డిమాండ్ -
ఐలోని మల్లన్నకు వర్ణలేపనం
ఐనవోలు: బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఐనవోలు మల్లికార్జునస్వామివారి మూల విరాట్, అమ్మవార్లకు సుధావళి వర్ణలేపనం (రంగులు అద్దడం) చేయనున్నారు. ఈ మేరకు ఈనెల 10 నుంచి 15 వరకు ఆలయంలో ఆర్జిత సేవలు నిలిపివేయనున్నారు. గర్భాలయం మూసి ఉంచి అంతరాలయంలో రంగులు అద్దనున్నారు. భక్తులకు స్వామివారి ఉత్సవమూర్తుల దర్శనం మాత్రం అర్ధ మండపంలో ఉంటుంది. ఈ నెల 16న ఉదయం 4 గంటలకు నిర్వహించే దృష్టికుంభం కార్యక్రమంతో స్వామి, అమ్మవార్ల దర్శనం, ఆర్జిత సేవలు పునరుద్ధరించనున్నట్లు ఆలయ ఈఓ కందుల సుధాకర్, ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, దేవాలయ ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్ తెలిపారు. దర్శనాల నిమిత్తం ఆలయానికి వచ్చే భక్తులు గమనించి సహకరించాలని ఈఓ విజ్ఞప్తి చేశారు. ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకు ఆలయం మూసివేత 16న దృష్టికుంభంతో దర్శనాల పునరుద్ధరణ -
పైసలిస్తేనే పనులు!
ప్రైవేట్ స్కూళ్ల నుంచి వసూళ్లు.. ● ప్రైవేట్ స్కూళ్ల రెన్యువల్, కొత్త స్కూళ్ల అనుమతికి భారీగా వసూళ్లు ● తాజాగా ఏసీబీకి చిక్కిన హనుమకొండ ఇన్చార్జ్ డీఈఓ, ఇద్దరు ఉద్యోగులువిద్యారణ్యపురి: ఉమ్మడి జిల్లా విద్యాశాఖలో అవినీతి భూతం రాజ్యమేలుతోంది. ఏ పని కావాలన్నా పైసలు ముట్టజెప్పాల్సిందే. అవినీతి ఆరోపణల నేపథ్యంలో గతంలో డీఈఓలుగా పనిచేసిన పలువురిని విద్యాశాఖ బదిలీ చేయడంతోపాటు బాధ్యతల నుంచి తప్పించింది. ఒకరిద్దరు మాత్రం వారికివారే తప్పుకున్నారు. హనుమకొండ డీఈఓగా పనిచేసిన వాసంతిపై పలు ఆరోపణలు వచ్చాయి. ఫిర్యాదుల నేపథ్యంలో ఆమెను డీఈఓ బాధ్యతల నుంచి తప్పించగా సెలవుపై వెళ్లారు. అదనపు కలెక్టర్ వెంకటరెడ్డికి ఎఫ్ఏసీ డీఈఓగా బాధ్యతలు అప్పగించారు. రెగ్యులర్ డీఈఓలు లేక.. విద్యాశాఖ డీలా ఉమ్మడి వరంగల్ జిల్లాలో విద్యాశాఖ గాడి తప్పింది. రెగ్యులర్ డీఈఓలు లేక డీలా పడింది. ములుగు జిల్లాలో కొంతకాలం క్రితం అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) ఇన్చార్జ్ డీఈఓగా పనిచేస్తూ ఏసీబీకి పట్టుబడ్డాడు. వరంగల్ జిల్లాలో ఏడీ అధికారికే డీఈఓ బాధ్యతలు అప్పగించగా.. అవినీతి ఆరోపణలు రావడంతో అధికారులు వేరే జిల్లాకు బదిలీ చేశారు. హనుమకొండ జిల్లాలో గత డీఈఓను విధులనుంచి తప్పించి అదనపు కలెక్టర్కు బాధ్యతలు అప్పగించినా అదే పరిస్థితి దాపురించింది. డీఈఓ కార్యాలయానికి అప్పుడప్పుడు మాత్రమే వచ్చివెళ్లేవారు. ఎక్కువ ఫైళ్లను కలెక్టరేట్లోని తన చాంబర్కు సిబ్బంది తీసుకెళ్తే సంతకాలు చేసేవారు. దీంతో డీఈఓ కార్యాలయంలో పర్యవేక్షణ కొరవడింది. పలు సెక్షన్లలోని సిబ్బంది ఇష్టారాజ్యంగా విధులు నిర్వర్తిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. గతంలో టీసీ బుక్స్ ఇస్తే సెక్షన్లో ఉండే సిబ్బంది ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాల నుంచి వసూలు చేసేవారు. దీంతో ఫిర్యాదు రాగా, అక్కడ సెక్షన్లో పనిచేసే ఉద్యోగిని తప్పించి టీసీ బుక్స్ ఇచ్చే బాధ్యతలు అప్పటి డీఈఓ అబ్దుల్హై హయాంలో డీసీఈబీకి అప్పగించారు. అప్పటి నుంచి డబ్బులు వసూలు చేయకుండా నిబంధనల ప్రకారమే టీసీ బుక్స్ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలకు ఇస్తున్నారు. అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి బాధ్యతలు స్వీకరించాక టీసీ బుక్స్ మళ్లీ డీఈఓ కార్యాలయంలో సంబంధిత సెక్షన్కే అప్పగించాలని ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు. టీసీ బుక్స్కు కూడా డబ్బులు వసులు చేసేందుకే సెక్షన్ సిబ్బంది చక్రం తిప్పి డీఈఓతో ఉత్తర్వులు జారీ చేయించారనే ఆరోపణలు వస్తున్నాయి.హనుమకొండ జిల్లాలో 200కుపైగా ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఒకటి నుంచి ఐదో తరగతి పాఠశాలలు డీఈఓ పరిధిలో, 6 నుంచి 10వ తరగతివరకు పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ పరిధిలో అనుమతులు రెన్యువల్ చేస్తారు. అయితే, హైస్కూళ్లు ప్రతీ 10 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి. గతంలో ఒక స్కూల్లో ఒకటి నుంచి 5 తరగతుల వరకు డీఈఓ అనుమతి, రెన్యువల్ చేస్తే సంబంధిత సెక్షన్లో రూ.30 వేల వరకు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు డీఈఓ రెన్యువల్, అనుమతి ఇచ్చాక.. 6 నుంచి 10వ తరగతి వరకు అనుమతికి పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీకి కూడా రెకమండ్ చేయాలి. ఒక కాపీని ఆర్జేడీ కార్యాలయానికి పంపుతారు. గత డీఈఓ హయాంలో కార్యాలయ సెక్షన్లో రూ.60 వేల వరకు వసూలు చేశారని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల అసోసియేషన్ బాధ్యులు పేర్కొన్నారు. కొత్తగా ప్రైవేట్ పాఠశాలల అనుమతికి రూ.లక్షకుపైగానే సెక్షన్ సిబ్బంది వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నా యి. రెన్యువల్ ఫీజుగా ప్రభుత్వానికి చలానా రూపంలో చెల్లించేది రూ.5వేలు మాత్రమే. డీఈఓ కార్యాలయ సెక్షన్లో మాత్రం రూ.60 వేలు ఇవ్వాల్సి రావడంతో యాజమాన్యాలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. నూతన పాఠశాలల అనుమతికి ప్రభుత్వానికి చలాన్ రూ పంలో రూ.10 వేలు మాత్రమే చెల్లించాలి. హనుమకొండ కొత్తూరు జెండాలోని క్రియేటివ్ మోడల్ హైస్కూల్ 10 సంవత్సరాల రెన్యువల్కు డీఈఓ కార్యాలయంలో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ గౌస్, జూనియర్ అసిస్టెంట్ మనోజ్ రూ.లక్ష డిమాండ్ చేశారు. శుక్రవారం రూ.60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు వీరు పట్టుబడ్డారు. వీరితోపాటు ఇన్చార్జ్ డీఈఓ ఎ.వెంకటరెడ్డిని కూడా ఏసీబీ అదుపులోకి తీసుకుంది. ఎఫ్ఏసీ డీఈఓగా బాధ్యతలు స్వీకరించిన 35 రోజులకే వెంకటరెడ్డి అవినీతి నిరోధక శాఖకు పట్టుబడడం కలకలం రేపింది. -
ఎన్నికలకు సిద్ధం కావాలి
న్యూశాయంపేట: వరంగల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడతలో జరిగే సర్పంచులు, వార్డు సభ్యుల ఎన్నికలకు అన్ని విధాలా సిద్ధం కావాలని వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి ఈనెల 11వ తేదీన జిల్లాలోని వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి మండలాల్లో జరిగే సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ తదితర ఏర్పాట్లపై సమీక్షించి పలు సూచనలు చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ బాక్సులు, బస్సులు, పోలీసు బందోబస్తు, ఓటర్ స్లిప్పుల పంపిణీ ఈనెల 8వ తేదీలోగా పూర్తి కావాలన్నారు. ప్రతీ మండలానికి రెండు హరిత పోలింగ్ కేంద్రాలు ఉండేటట్లు చూడాలని అధికారులకు సూచించారు. ఎన్నికల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎలాంటి సమస్య ఉన్నా.. ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన, మండల ప్రత్యేకాధికారులు, నోడల్ అధికారులు, జోనల్ అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యశారద -
ఆదివారం శ్రీ 7 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
● రోడ్డు ప్రమాదాల్లో 377 మంది మృతిచెందితే అత్యధికంగా 128 మంది బైకర్లు ఉన్నారు. ఇందులో దాదాపు 90 మంది వరకు 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారుంటే, మైనర్లు కూడా 12 మంది ఉన్నారు. మిగిలిన 26 మంది 45ఏళ్లపైబడిన వారు. ● ఆ తర్వాత అత్యధికంగా రోడ్లు, డివైడర్లు క్రాస్ చేస్తూ.. రోడ్లపై నడుచుకుంటూ వెళ్తున్న 85 మంది పాదచారులు వివిధ ప్రమాదాల్లో మృతిచెందారు. వీరిలో 26 నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉన్న మహిళలే ఎక్కువ శాతం మంది ఉన్నారు. ● కార్లు, జీపులు, వ్యాన్లు వాహనాల్లోని 42 మంది, లారీల్లోని 32 మంది, సైకిల్స్ నడుపుతున్న పది మంది, ఆటోరిక్షాల్లోని ఏడుగురు, బస్సుల్లోని ఐదుగురు, ఈ–ఆటోరిక్షాలోని నలుగురు మృతి చెందారు. 64 మంది ఇతర వాహనాలకు చెందిన వారున్నారు.సాక్షి, వరంగల్: వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఆ మూడు గంటల్లోనే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడం, మృతుల సంఖ్య ఎక్కువగా ఉంటుండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది గంటల మధ్యలో 271 ప్రమాదాలు జరిగి 84 మంది మృతిచెందగా... మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఆరు గంటల మధ్యలో 270 ఘటనలు జరిగి 65 మంది చనిపోయారు. ఆ సమయాల్లో డ్రైవింగ్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలనే సంకేతాలను ఈ గణాంకాలు చెబుతున్నాయి. సాయంత్రం సమయంలోనే వాహనాలు ఎక్కువగా రోడ్డు మీదకు రావడం, గమ్యస్థానాలకు తొందరగా చేరుకోవాలనుకునే క్రమంలో అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్తో తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. తమకు ఏం సంబంధం లేని ఎదుటివారి ప్రాణాలను బలిగొంటున్నారు. ఇలా ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు అంటే పది నెలల కాలంలో 1,250 రోడ్డు ప్రమాదాలు జరిగితే 377 మంది మృతి చెందగా, 1,253 మంది క్షతగాత్రులయ్యారని ట్రాఫిక్ పోలీసు గణాంకాలు చెబుతున్నాయి. అందరూ అప్రమత్తంగా ఉండడంతోపాటు ట్రాఫిక్ నియమాలను పాటిస్తే సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుతారని పోలీసులు అంటున్నారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 9 వరకు271 84 240 వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జనవరి నుంచి అక్టోబర్ వరకు 1,250 రోడ్డు ప్రమాదాలు మృతులు 377, క్షతగాత్రులు 1,253 అప్రమత్తతోపాటు ట్రాఫిక్ నియమాలు పాటిస్తేనే సురక్షితంగా గమ్యస్థానాలకు -
‘వనితవనం’లో మహిళా శక్తి భవనం
మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్ : మహిళా శక్తి భవన నిర్మాణానికి చర్యలు చేపట్టాలని నగర మేయర్ గుండు సుధారాణి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో మేయర్ క్షేత్రస్థాయిలో మహిళా శక్తి భవన నిర్మాణానికి స్థల పరిశీలన చేసి సమర్థవంతంగా పనులు చేపట్టేందుకు అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలోని వనితవనం ప్రాంతంలో మహిళా శక్తి భవన నిర్మాణానికి స్థల పరిశీలన చేశామని, అక్కడే లోటస్ పాండ్ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇదే ప్రాంతంలో ప్రవహిస్తున్న నాలాను మేయర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. కార్యక్రమంలో ఎస్ఈ సత్యనారాయణ, సీహెచ్ఓ రమేశ్, ఏంహెచ్ఓ డాక్టర్ రాజేష్, హెచ్ఓ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. వ్యర్థాల ఎనర్జీ ప్లాంట్ పరిశీలనగోవాలో వ్యర్థాల నిర్వహణకు అనుసరిస్తున్న సాంకేతిక విధానాలను బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ శనివారం ప్రత్యక్షంగా పరిశీలించారు. నిర్వహణ తీరును అక్కడి సాంకేతిక నిపుణులను అడిగి తెలుసుకున్నారు. ఘన వ్యర్థాల నిర్వహణలో అత్యాధునిక పద్ధతులు శక్తి ఉత్పాదిత సాంకేతికత పర్యావరణ పరిరక్షణ సంబంధిత చర్యలను కమిషనర్ పరిశీలించారు. యంత్రాల సామర్థ్యం, డిజిటల్ మానిటరింగ్ తదితర అంశాలను అధికారులకు అడిగి తెలుసుకున్నారు. -
ఇద్దరు సర్పంచ్లు ఏకగ్రీవం
హసన్పర్తి: హసన్పర్తి మండలంలో ఇద్దరు సర్పంచ్లు ఏకగ్రీవమయ్యారు. అలాగే, అర్వపల్లి సర్పంచ్ ఏకగ్రీవం కాగా, కొత్తపల్లి సర్పంచ్తో పాటు పాలకవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొత్తపల్లిలో ఉపసర్పంచ్ ఎన్నిక కూడా జరిగింది. కొత్తపల్లి జీపీ పాలకవర్గం ఏకగ్రీవం కొత్తపల్లి సర్పంచ్ దండి సాంబయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపసర్పంచ్గా చిరంజీవి, వార్డు సభ్యులుగా వేముల మానస, పుట్ట నర్మద, అన్న బాలయ్య, అన్న తిరుపతి, పుట్ల నీల ఎన్నికయ్యారు. అర్వపల్లి సర్పంచ్గా ప్రభాకర్ అర్వపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా అంబాల ప్రభాకర్ ఏకగ్రీవమయ్యారు. అన్ని వార్డు సభ్యులకు పోటీ అనివార్యమైంది. ఫలించిన సీనియర్ల చర్చలు ఏకగ్రీవానికి కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వెంకట్రామ్ నర్సంహారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ఉదయ్కుమార్ రెడ్డి, మాజీ సర్పంచ్ మదన్గౌడ్, పీఏసీఎస్ డైరెక్టర్ ఎల్లేష్ రాజకీయ పార్టీలతో చర్చలు జరిపారు. బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో నామినేషన్ దాఖలు చేసిన దండి సాంబయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ వేసిన అభ్యర్థులు పోటీ నుంచి విరమించుకున్నారు. గంటూరుపల్లి కాంగ్రెస్ బలర్చిన అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ గంటూరుపల్లి కాంగ్రెస్పార్టీ మద్దతుతో నామినేషన్ వేసిన చాణిక్యరెడ్డి పోటీ నుంచి ఉపసంహరించుకున్నారు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న రాకేష్రెడ్డిని కాంగ్రెస్లోకి చేర్చుకుని మద్దతు ప్రకటించారు. 1వ వార్డు స్థానంలో లోకనబోయిన దేవిక, 2వ వార్డు కడిపికొండ పల్లవి, 4వ వార్డు సుంకరి రాంరెడ్డి, 5వ వార్డు కొండ సోమయ్య, 6వ వార్డు గంట రమణారెడ్డి, 7వ వార్డు పోరెడ్డి, వాణి, 8వ వార్డు మడపల్లి రాజు ఏకగ్రీవమయ్యారు. 3వ వార్డుల్లో గన్నోజు రవీందర్, పురుషోత్తం మధ్య పోటీ అనివార్యమైంది. సీతంపేటలోని 3వ వార్డులో గిన్నారపు స్వప్న, 4వ వార్డులో గిన్నారపు సంధ్య ఏకగ్రీవమయ్యారు. -
స్థానిక ఎన్నికలు సజావుగా నిర్వహించాలి
వరంగల్ క్రైం : స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా.. ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ అధికారులను ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా పోలీస్ కమిషనర్ శనివారం కాజీపేట ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. కార్యాలయ సిబ్బంది అధికారులు సీపీకి పూలమొక్కను అందజేసి స్వాగతం పలకగా, సాయుధ పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం కార్యాలయ పరిసరాలు, స్పెషల్ గ్రేవ్, ఎస్సీ, ఎస్టీ పెండింగ్ కేసులతో పాటు పలు రికార్డులను పరిశీలించారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎన్నికల నిబంధనలను అతిక్రమించే వారిపై అలసత్వం వహించొద్దని సీపీ పోలీసు అధికారులకు సూచించారు. సెంట్రల్ జోన్ డీసీపీ కవిత, కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు పుల్యాల కిషన్, సుధాకర్ రెడ్డి, చేరాలు, శ్రీధర్ రావు, రమేష్ పాల్గొన్నారు. కాజీపేట : కాజీపేటలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలో (ఐటీఐ) ఈ నెల 12న జాతీయ మెగా అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్ రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మెకానిక్, ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్లతో పాటు అన్ని ట్రేడ్ల అభ్యర్థులు మేళాకు హాజరు కావాలని కోరారు. బయోడేటా, అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ కాపీ, పదో తరగతి, ఐటీఐ మెమో, ఎన్టీసీ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం, రెండు పాస్పోర్టు సైజ్ ఫొటోలు వెంట తెచ్చుకోవాలని సూచించారు. www.apprenticeshipindia. gov.in వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని టీచింగ్, నాన్టీచింగ్ ఉద్యోగుల ముఖగుర్తింపు (ఎఫ్ఆర్ఎస్) హాజరును త్వరలోనే అమలు చేయబోతున్నారు. దీంతో ఉద్యోగుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను శనివారం యూనివర్సిటీలోని పరిపాలన భవనంలో ప్రారంభించగా, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం పర్యవేక్షించారు. విశ్వవిద్యాలయం పరిధిలోని వివిధ కార్యాలయాలు, విద్యావిభాగాలు ఆఫీసుల్లో ఈ ప్రక్రియను కొనసాగిస్తామని రిజిస్ట్రార్ రామచంద్రం తెలిపారు. ఈనెల 8న కూడా వివిధ విభాగాల ఉద్యోగులకు నమోదు ప్రక్రియ కొనసాగనుందని వివరించారు. కాజీపేట అర్బన్ : భీమదేవరపల్లిలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న కపిల్ ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్గా అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడగా జిల్లా రిజిస్ట్రార్ ప్రవీన్కుమార్ శనివారం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్గా అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడడంతో షోకాజ్ నోటీ సు అందజేసి కొడకండ్లకు బదిలీ చేశారు. హసన్పర్తి: హసన్పర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సీతంపేట ఉపకేంద్రాన్ని శనివారం హనుమకొండ డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపకేంద్రంలో నిర్వహిస్తున్న వ్యాధినిరోధక టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు. వ్యాక్సిన్ రికార్డులను సరిచూశారు. గర్భిణుల నమోదును అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు. -
పోలింగ్ కేంద్రాల్లో వసతులు కల్పించాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, ప్రశాంతంగా వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 11న నిర్వహించనున్న మొదటి విడత ఎన్నికలను పురస్కరించుకుని పోలింగ్ కేంద్రాల్లో వసతులు కల్పించాలని సూచించారు. తాగునీరు, విద్యుత్, శానిటేషన్, ర్యాంపులు, లైట్లు, టెంట్ల వంటి సౌకర్యాలపై సమీక్షించి లోపాలు ఉంటే వెంటనే సరిచేయాలని సూచించారు. అదేవిధంగా పోలింగ్ సిబ్బంది నియామకం, సామగ్రి పంపిణీ, రవాణా భద్రతా చర్యల కోసం విభాగాల వారీగా తగిన ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ, ఇన్చార్డ్ డీఆర్డీఓ రాంరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. ఎన్నికలయ్యే వరకూ కోడ్ అమలు ఎన్నికలు పూర్తయ్యే వరకు కోడ్ అమలులో ఉంటుందని వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 11, 14, 17 తేదీల్లో గ్రామపంచాయతీ, వార్డు స్థానాలకు ఎన్నికలకు జరుగుతాయని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, నాయకులు, ప్రజలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలు పూర్తిగా పాటించాలని కోరారు. -
పొత్తు.. గమ్మత్తు
వాజేడు: రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మ ధ్య రాజకీయ వైరం ఉంది. అయితే వాజేడు మండలం పేరూరులో మాత్రం ఆయా పార్టీల నాయకులు కలిసిపోయారు. ఇక్కడ సర్పంచ్గా పోటీ చేస్తు న్న మహిళకు కాంగ్రెస్లోని ఒక వర్గంతోపాటు బీ ఆర్ఎస్ మద్దతు ఇవ్వడం విశేషం. ఇప్పటికే పేరూ రు సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ మద్దతుతో గొడ్డె వరలక్ష్మి నామినేషన్ దాఖాలు చేశారు. అయితే నా మినేషన్లకు చివరి రోజైన శుక్రవారం అనూహ్యంగా పేరూరు మాజీ సర్పంచ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దివంగత గొడ్డె నాగేశ్వరరావు భార్య సరోజని నామినేషన్ దాఖలు చేశారు. ఈమెకు కాంగ్రెస్లోని ఒక వర్గంతోపాటు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. దీంతో సరోజన రెండు పార్టీల కార్యకర్తలతో వెళ్లి నామినేషన్ దాఖలు చేయడం కొసమెరుపు. ● ఒకే అభ్యర్థికి కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతు -
పల్లె పరిపుష్టికి బాట..
జనగామ: ప్రధానమంత్రి నుంచి ముఖ్యమంత్రి వరకు.. రాష్ట్రపతి నుంచి గవర్నర్ వరకు.. వివిధ కార్యక్రమాల నిమి త్తం పల్లెకు ఏ ప్రజాప్రతినిధి, ఏ అధికారి వచ్చినా సభకు అధ్యక్షత వహించేది గ్రామ సర్పంచే. దేశ అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషిస్తున్న గ్రామాల నుంచి వచ్చే ఆర్థిక వనరులే అత్యంత ప్రధానం. అందుకే గ్రామ ప్రజాస్వామ్యానికి బాటలు వేసిన పంచాయతీరాజ్ వ్యవస్థ దేశ అభివృద్ధికి పునాదిగా నిలిచింది. బల్వంత్రాయ్ మెహతా కమిటీ సూచనల మేరకు పండిట్ జవహర్లాల్ నెహ్రూ 1959లో గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏర్పాటుకు నాంది పలికారు. రాజస్థాన్లో మొదట అమలైన ఈ వ్యవస్థ.. వెంటనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు విస్తరించింది. పల్లె పాలనను బలపర్చేందుకు పంచాయతీల నుంచి మూడు శాఖలను వేరుచేసి గ్రామీణాభివృద్ధి, శానిటేషన్, వసతి వంటి 15 కీలక శాఖలను జీపీల పరిధిలోకి చేర్చారు. సర్పంచ్ ఆధ్వర్యంలోని ఈ వ్యవస్థ గ్రామాలకు స్వయం పాలన అందించే ప్రజాస్వామ్య వేదికగా నిలుస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంలో 65 ఏళ్లు దాటి.. 66వ సంవత్సరంలోకి అడుగిడిన పంచాయతీ శాఖ ప్రయాణంపై పల్లె పాలన గుర్తు చేస్తూ ‘సాక్షి’ ప్రత్యేక కథనం. పంచాయతీరాజ్ గొడుగు కింద 29 శాఖలు గ్రామ పంచాయతీ పరిధిలో 15 శాఖలు పనిచేస్తున్నాయి. పంచాయతీరాజ్ శాఖ కింద రెవెన్యూ మినహా మొత్తం 29 శాఖలు ఉండగా, 15 శాఖలు మాత్రమే ఈ శాఖ పరిధిలోకి వస్తాయి. నేటికీ వందశాతం బదలాయింపు జరగలేదు. ప్రధానంగా విద్యుత్, వైద్యం, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ, విద్య, తాగునీరు, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, వ్యవసాయం, పశువైద్యం, పౌరసరఫరాలు, రోడ్ల భవనాలు, మత్స్యశాఖ, గృహనిర్మాణం, ఇరిగేషన్ శాఖలు గత కొంతకాలం వరకు కొనసాగాయి. పంచాయతీల్లో సేవలందించేది ఎవరు? పంచాయతీల్లో గ్రామపాలన కొనసాగించడానికి వీరంతా చాలా ముఖ్యం. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శి, కారోబార్ సేవలు క్షేత్రస్థాయిలో ఉంటాయి. గ్రామ పంచాయతీ పాలన , గ్రామీణాభివృద్ధి, ఈజీఎస్, గ్రామీణ గృహ నిర్మాణ శాఖలు, శానిటేషన్, స్వచ్ఛ భారత్ మిషన్, తాగునీరు, గ్రామీణాభివృద్ధి, రహదారులు, సామాజిక భద్రత, పెన్షన్ విభాగం, గ్రామ స్థాయి ప్రాథమిక పాఠశాలలు, అంగన్వాడీ, ఆరోగ్య శాఖ సబ్ సెంటర్లు, వ్యవసాయ అనుబంధ శాఖ, పశుసంవర్థక శాఖ, మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు, అంగన్వాడీ ఆయాలు.. వీరంతా నిత్యం గ్రామస్థాయిలో సేవలు అందిస్తారు. వీరంతా పంచాయతీ పాలనకు జవాబుదారీగా ఉంటారు. పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం.. పంచాయతీ వ్యవస్థ గతంతో పోలిస్తే నిర్వీర్యం దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం పంచాయతీరాజ్ వ్యవస్థలో జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ, మండల పరిషత్(మూడు అంచెలు) మాత్రమే పరిగణనలోకి ఉండగా వీటికి అదనంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులు ఉత్సవ విగ్రహాలుగా మారాయి. 1959లో పంచాయతీల ఆవిర్భావంలో రెవెన్యూ మినహా అన్ని శాఖలు ఒకే గొడుగు కిందకు ఉండడంతో సర్పంచ్లదే పై చేయిగా ఉండేది. సర్వాధికారాలు సర్పంచ్లకే ఉండడంతో వివిధ శాఖల అధికారులకు ఇబ్బందులు తలెత్తేవి. దీంతో స్వయం ప్రతిపత్తి హోదా కావాలని వ్యవసాయం, విద్యుత్, విద్యాశాఖ అధికారులు పట్టుబడ్డారు. దీంతో మూడు శాఖలతో పాటు ఆయా ప్రభుత్వ రంగ సంస్థలు ఇందులో నుంచి విడిపోవడంతో ప్రత్యేక శాఖలుగా ఆవిర్భవించాయి. దీంతో పంచాయతీరాజ్ వ్యవస్థలో సర్పంచ్ల పాత్ర నామమాత్రంగా మారిపోయింది. కాళేశ్వరం: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో జరుగుతున్నాయి. ఈసారి రాష్ట్ర ఎన్నికల సంఘం బ్యాలెట్ పేపర్లో కూడా ‘నోటా’ ఓటును వినియోగించుకునేలా ఓటర్లకు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో భూపాలపల్లి జిల్లాలో నిరక్ష్యరాస్యుడైన మామ, అక్షరాస్యుడైన తన అల్లుడితో ‘నోటా’ వినియోగంపై జరిగిన సరదా సంభాషణ ‘సాక్షి’ పాఠకులకు అందిస్తుంది. అల్లుడు: మామ నమస్తే మనఊళ్లో సర్పంచ్ ఎలక్షన్లు ఎలా జరుగుతానయే. మామ: ఏమి అల్లుడా బాగేన. పట్నం (హైదరాబాద్ ) నుంచి ఎప్పుడచ్చినవ్. ఏమి ఎలచ్చన్లు రా. ధూంధాం నడస్తనయ్. కని నాకు నచ్చనోళ్లు సర్పంచ్కు నలుగురు ఏసిండ్రు. మనోళ్లే లేరు. అల్లుడు: ఏ మామ నీకు తెల్వదానే. ఎందుకు బాధ పడుతవ్. ఈసారి బ్యాలెట్ పేపర్లో కూడా నోటాకు రాష్ట్ర ఎనికల సంఘం అవకాశం కల్పించింది. మామ: గీ నోటా ఓటు ఏంది అల్లుడా.. అల్లుడు: నోటా అంటే (నన్ ఆఫ్ ది ఎబో) పైవి ఏవి కావు అని అర్థం. నీకు నచ్చని వారు పోటీలో ఉంటే నోటాకు నీ ఓటు వేయొచ్చు. నీ ఓటు వినియోగించుకున్నట్లు కూడా అవుతుంది. మామ: నోటాకే ఓట్లు బాగా పడితే ఎట్లా రా? అల్లుడు: నోటాకు ఓట్లు ఎక్కువ పడితే రెండో అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారట. మామ: గిదెప్పటి నుంచి అమలవుతోంది. అల్లుడు: పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ (పీయూసీఎల్) వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంతో 2013లో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈవీఎంలలో నోటా అవకాశం కల్పించారు. కానీ ఈసారి బ్యాలెట్ పేపర్లో ఇవ్వడంతో పల్లెల్లో కూడా వినియోగిస్తారు. మామ: సరే అల్లుడా..మాఊళ్ల అందరికీ నోటా ఓటు గురించి సెప్పుతా. ఇగ ఉంటా. ఓట్లయినంక కలుద్దాం. గెలిచినోళ్లం గురించి మాట్లాడుకుందాం.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం సెక్షన్(45) ప్రకారం జీవో 138 పీఆర్ ప్రకారం తాగునీరు, సరఫరా, పారిశుద్ధ్యం, లైటింగ్, అంటువ్యాధుల నివారణ.. వంటి సేవలు అందిస్తున్నారు. అలాగే వంతెనలు, కల్వర్టులు, రహదారుల పునరుద్ధరణ తదితర మరమ్మతుల నిర్వహణతో పాటు పబ్లిక్ స్థలాల్లో విద్యుత్ సరఫరా అందించాలి. డ్రైనేజీ, వర్షపునీరు నివాస ప్రాంతాలకు రాకుండా చూడాల్సిన బాధ్యత పంచాయతీలపై ఉంటుంది. శానిటేషన్ నిర్వహణలో పంచాయతీల పర్యవేక్షణ చాలా కీలకం. ప్రధాన కూడళ్లలో కుండీల ఏర్పాటు, తడి, పొడి చెత్త వేరుచేయడంతో పాటు సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాలి. శ్మశాన వాటికలు, జంతు కబేళాలు, సామూహిక మరుగుదొడ్లు, డంపింగ్ యార్డుల నిర్వహణ, పరిశుభ్రత బాధ్యత కీలకం. వీటితోపాటు స్థానిక వనరులను సద్వినియోగం చేసుకుని దీర్ఘకాలికంగా ప్రజావసరాలను చేపట్టాల్సి ఉంటుంది. జనన, మరణాల ధ్రువీకరణ నమోదు, వరదనీరు, తాగునీటి పరిరక్షణ తదితర అంశాలను పంచాయతీలే పర్యవేక్షించాలి. పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 46 ప్రకారం గ్రంథాలయాల నిర్వహణ, దివ్యాంగులు, నిరాదరణకు గురై దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రోత్సాహం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 66 ఏళ్ల పీఆర్ ప్రయాణంలో అభివృద్ధిలో దూసుకుపోతున్న గ్రామాలు పల్లె పాలనకు మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పునాది.. -
చిల్లర నాణేలతో డిపాజిట్
● వినూత్న రీతిలో నామినేషన్ కురవి: రూపాయి.. రూపాయి కూడబెట్టిన చిల్లర నాణేలతో ఫీజు చెల్లించి నామినేషన్ దాఖలు చేశారో ఓ మహిళా వార్డు అభ్యర్థి. మండలంలోని తాట్యతండాకు చెందిన బోడ వీరన్న భార్య సునీత అదే జీపీలో 8వ వార్డు మహిళకు రిజర్వ్ కావడంతో ఏ పార్టీ మద్దతు లేకుండా పోటీకి దిగారు. నామినేషన్కు సంబంధించిన ఫీజు రూ.250 చెల్లించాల్సి ఉంది. దీనికి ఆమె అప్పుడప్పుడు కవర్లో దాచుకున్న రూపాయి నాణేలను తీసుకుని భర్తతో కలిసి కొత్తూరు(జీ) గ్రామ పంచాయతీలోని నామినేషన్ కేంద్రంలో అధికారులకు చెల్లించి నామినేషన్ వేసింది. అధికారులు ఆ చిల్లర నాణేలు లెక్కించుకుని నామినేషన్ పత్రాలు స్వీకరించారు. -
సర్పంచ్ వేతనం @ రూ.6,500
భూపాలపల్లి అర్బన్ : గ్రామ సర్పంచ్గా పోటీ చేయడానికి, గెలువడానికి ఆశావహులు పెద్దసంఖ్యలో ఉత్సాహపడుతుంటారు. పదవిని దక్కించుకోవడానికి రూ.లక్షల్లో ఖర్చు చేస్తుంటారు. వారి ఉత్సాహం, గెలుపొందడానికి వారు పె డుతున్న ఖర్చు చూసి ప్రజలు సర్పంచ్కు ఎంత వేతనమొస్తుందో, ఆ పదవి ద్వారా ఎంత ఆదాయం ఉంటుందో, అందుకే అంతగా ఖర్చు చేస్తున్నారని అనుకుంటుంటారు. రూ.లక్షలు ఖర్చు పెట్టి ఒక్కొక్కరిని బతిమిలాడి సర్పంచ్గా గెలిస్తే వారికి నెలకు వచ్చే వేతనం రూ.6,500 మాత్రమే. అది కూడా నెలనెలా రాదు. ఎప్పుడో ప్రభుత్వం గ్రాంట్ విడుదల చేసినప్పుడే తీసుకోవాలి. ఇదిలా ఉండగా 1992కు ముందు సర్పంచ్కు వేత నం లేదు. ఆ తర్వాత చిన్న జీపీలకు సర్పంచ్కు రూ.600, మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్కు రూ.వెయ్యి మాత్ర మే ఇచ్చేవారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ 2015, ఏప్రిల్ 1 నుంచి సర్పంచ్ వే తనం రూ.5 వేలు చేశారు. ఆ తర్వాత 2021లో రూ.6,500 పెంచారు. కాగా, 2018 తర్వాత నుంచి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసినా ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంచడంతో చిల్లిగవ్వ ఆదాయం రాకపోగా పనులు చేయడానికి తెచ్చిన అప్పులకు వడ్డీలు మీదపడుతున్నాయని పలువురు వాపోతున్నారు. మరీ ఇంత తక్కువ వేతనం, పనులు చేసినా పైసలు రాకున్నా అంత పోటీ ఎందుకు? అంత ఖర్చు చేస్తారంటే సర్పంచ్ ఆ గ్రామానికి ప్రథమ పౌరుడు. ఆ హోదా, దర్పం, దర్జా దక్కించుకోవడం కోసం ఉన్న ఆస్తి అమ్మి అయినా, అప్పు చేసైనా విజయం సాధించాలని ఖర్చు చేస్తున్నారు. అభ్యర్థులూ.. ఆలోచించండి గెలిచేందుకు రూ.లక్షల్లో ఖర్చు అభివృద్ధి పనులు చేస్తే బిల్లుల కోసం ఏళ్లుగా ఎదురుచూపులే.. -
భారీ రాతి పిల్లర్ ఏర్పాటు
ఎస్ఎస్తాడ్వాయి : మేడారం సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణంలో భాగంగా గద్దెల చుట్టూ రాతి పిల్లర్లతోపాటు సాలహారం నిర్మిస్తున్నారు. గద్దెల చుట్టూ ఎనిమిది ఆర్చ్ ద్వారాలు నిర్మిస్తున్నారు. శుక్రవారం ఆర్చ్ ద్వారం భారీ రాతి పిల్లర్ను పునాది(పీడిస్టల్) లో భారీ క్రేన్ల సాయంతో నిలబెట్టారు. పిల్లర్ పై చెక్కిన ఆదివాసీల గొట్టుగొత్రాల, వంశ వృక్షం చిత్రాలను భక్తులు ఆసక్తిగా తిలకించారు. కాగా, పిల్లర్ను నిలబెట్టంత వరకు పస్రా సీఐ దయాకర్.. భక్తులను సమీపంలోకి రాకుండా చూశారు. విద్యుదాఘాతంతో యువకుడి మృతి రాయపర్తి: విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరులో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో ఛత్తీస్గఢ్కు చెందిన రాంసింగ్(22), సీతారాం, తుళ్లు బోరు వేస్తున్నారు. ఈ క్రమంలో ఇంటిపై ఉన్న 11కేవీ విద్యుత్లైన్ తాకడంతో షాక్కు గురై రాంసింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు. సీతారాం, తుళ్లు అనే వ్యక్తులకు తీవ్రగాయాలు కావడంతో గ్రామస్తులు 108లో ఆస్పత్రికి తరలించారు. ఎస్సై రాజేందర్ ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. కాగా, మృతుడి కుటుంబీకుల నుంచి ఫిర్యాదు అందలేదని ఎస్సై తెలిపారు. -
బొట్టు పెట్టి.. ఓటు అడిగి..
వీఓఏకు రాజీనామా చేసి సర్పంచ్ బరిలో..సంగెం: వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన పెంతల సువర్ణ వీఓఏ ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ బరిలో నిలిచింది. ఈ గ్రామం బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో గ్రామస్తులు, మహిళలంతా కలిసి ‘సువర్ణ నీవు సర్పంచ్గా బరిలో నిలిచి గ్రామాభివృద్ధికి పాటుపడాలి’ అని కోరుకున్నారని, అందుకే సర్పంచ్గా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. వీఓఏగా ఉంటూ మహిళలకు సేవలందించానని, సర్పంచ్గా గెలిపి మరిన్ని సేవలందిస్తానని సువర్ణ తెలిపారు.నాడు భర్త.. నేడు భార్య ● గతంలో నీలికుర్తి సర్పంచ్గా భర్త మనోహర్ ఎన్నిక ● ఈ ఎన్నికల్లో భార్య పార్వతికి అవకాశం..నామినేషన్ దాఖలు మరిపెడ రూరల్: మరిపెడ మండలం నీలికుర్తి జీపీ పరిధి రేఖ్యతండాకు చెందిన బానోత్ మనోహర్ గతంలో ఉమ్మడి నీలికుర్తి గ్రామ సర్పంచ్గా ఎన్నికయ్యాడు. ప్రస్తుతం రేఖ్యతండా నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు అయ్యింది. దీంతో సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు కేటాయించగా మనోహర్ భార్య పార్వతి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. కాగా, పార్వతి గెలుపొందితే దంపతులు ఇద్దరూ సర్పంచ్ పదవి చేపట్టిన వారిగా అరుదైన గౌరవం దక్కనుంది.దాట్ల..ఆ దంపతులదే.. ● 20 ఏళ్లుగా గ్రామపాలన వారిదే.. దంతాలపల్లి : 20 ఏళ్లుగా ఆ కుటుంబం గ్రామపాలన సాగిస్తోంది. భర్త ఇప్పటికే మూడు పర్యాయాలు సర్పంచ్గా కొనసాగగా భార్య ఒకసారి.. మొత్తం నాలుగు పర్యాయాలు గెలుపొందారు. ప్రస్తుతం గ్రామం జనరల్ ఉమెన్గా రిజర్వ్ కావడంతో ఐదోసారి ఆ కుటుంబం బరిలో నిలిచింది. మండలంలోని దాట్లకు చెందిన కొమ్మినేని రవీందర్ 2001, 2005లో సర్పంచ్గా గెలుపొందాడు. 2010లో తన భార్య మంజుల సర్పంచ్గా గెలుపొందింది. 2019లో రవీందర్ మళ్లీ సర్పంచ్గా గెలుపొంది ప్రస్తుతం తాజా మాజీగా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో గ్రామంలో ఐదోసారి జనరల్ ఉమెన్కు రిజర్వ్ కావడంతో మరోసారి మంజుల బరిలో నిలిచింది. కాళ్లు మొక్కి.. ఓటు అభ్యర్థించి..మహబూబాబాద్ మండలం దామ్యాతండా గ్రామపంచాయతీలో వృద్ధురాలి కాళ్లు మొక్కి ఓటు అభ్యర్థిస్తున్న సీపీఐ బలపరిచిన అభ్యర్థి బానోత్ లింగ్యా నాయక్ ప్రచార పదనిసలు.. -
బాల్య వివాహాలు చట్ట విరుద్ధం
వరంగల్ జిల్లా సంక్షేమ అధికారి రాజమణి వరంగల్ చౌరస్తా: బాల్య వివాహాలు చట్ట విరుద్ధమని, ఆ వివాహాల నిర్మూలనలో పురోహితుల పాత్ర కీలకమని వరంగల్ జిల్లా సంక్షేమ అధికారి బి.రాజమణి అన్నారు. వరంగల్ గోవిందరాజుల ఆలయంలో బాల్యవివాహాల నిర్మూలన కోసం షేర్ స్వచ్ఛంద సంస్థ, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సమన్వయంతో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాజమణి హాజరై మాట్లాడుతూ 18 సంవత్సరాల్లోపు బాలికలు, 21 సంవత్సరాల్లోపు బాలురకు వివాహాలు చేస్తే బాల్య వివాహ నిరోధక చట్టం–2006 ప్రకారం చర్యలుంటాయని హెచ్చరించారు. 27వ డివిజన్ కార్పొరేటర్ అనిల్కుమార్ మాట్లాడుతూ బాల్యవివాహాల నిర్మూలన కోసం అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్పర్సన్ వసుధ, షేర్ స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ శిరీష, ఆలయ చైర్మన్ మరిపల్లి సంజీవరావు, ఆలయ ప్రధాన అర్చకుడు వరయోగుల శ్రీనివాసాచార్యులు తదితరులు పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో ఇన్చార్జ్ డీఈఓ
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్, ఇన్చార్జ్ డీఈఓ వెంకట్రెడ్డి శుక్రవారం ఏసీబీకి చిక్కారు. పాఠశాల అనుమతుల పునరుద్ధరణ కోసం రూ.లక్ష లంచం డిమాండ్ చేసి, అందులో రూ.60 వేలు తీసుకున్న అదనపు కలెక్టర్, ఇన్చార్జ్ డీఈఓ వెంకట్రెడ్డితోపాటు విద్యాశాఖ సిబ్బంది గౌస్, మనోజ్ను ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. హనుమకొండ కొత్తూరు జెండా ప్రాంతంలో ఉన్న క్రియేటివ్ మోడల్ హైస్కూల్ పదేళ్ల పునరుద్ధరణ అనుమతుల కోసం యాజమాన్యం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంది. ఎంతకీ అనుమతులు రాకపోవడంతో స్కూల్ యజమానులు.. డీఈఓ కార్యాలయ సెక్షన్ అసిస్టెంట్లు గౌస్, మనోజ్ను సంప్రదించారు. ఫైల్ ఆమోదానికి రూ.లక్ష ఇవ్వాలని, ఇస్తే డీఈఓ ఆమోదిస్తారని గౌస్, మనోజ్ వారికి తెలిపారు. అంతమొత్తం ఇవ్వలేమని నేరుగా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్, ఇన్చార్జ్ డీఈఓ వెంకట్రెడ్డిని కలిశారు. సిబ్బందికి చెబుతాననని, వారిని కలవమని ఆయన చెప్పారు. ఈసారి వారు రూ.75 వేలు ఇవ్వాలని చెప్పారు. మరోమారు వెంకట్రెడ్డిని కలిసి అంతమొత్తం ఇవ్వలేమని చెప్పడంతో కొంత తగ్గించి ఇవ్వమని తాను చెబుతానని భరోసా ఇచ్చారు. చివరగా శుక్రవారం రూ.60 వేలు మనోజ్కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సాయంత్రం 5:30 నుంచి రాత్రి 8 గంటల వరకు దాడులు సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభమైన దాడులు దాదాపు రాత్రి 8 గంటల వరకు కొనసాగాయి. అనంతరం ఏసీబీ డీఎస్పీ సాంబయ్య మీడియాకు వివరాలను వెల్లడించారు. ముగ్గురిని శనివారం కోర్టుకు హాజరుపరచనున్నట్లు తెలిపారు. కలెక్టరేట్లో తొలిదాడి హనుమకొండ కలెక్టరేట్ కొత్త భవనం ప్రారంభించి నాలుగేళ్లు పూర్తవుతున్న తరుణంలో, ఈ భవనంలో ఏసీబీ దాడులు జరగడం ఇదే తొలిసారి. ఉద్యోగులు విధులు ముగించుకొని బయటకు వెళ్లే సమయం కావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎదురుగా ఉన్న కలెక్టర్ చాంబర్లోనే దాడులు జరుగుతున్న సమయంలో కలెక్టర్ స్నేహ శబరీష్ సమావేశాలు ముగించుకొని తన చాంబర్లోనే ఉన్నారు. ఏసీబీ చర్యలు కొనసాగుతుండగా గంటకుపైగా అదే భవనంలో కలెక్టర్ ఉన్నారు. అనంతరం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. గతంలో కూడా.. ఈ కేసులో పట్టుబడిన అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, గతంలో ఉమ్మడి జిల్లాలో జనగామ ఆర్డీఓగా, ఆపై నల్లగొండ జిల్లాలో పనిచేశారు. నల్లగొండలో చేసిన కాలంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు, జనగామలో భూసేకరణ విషయంలో ఆరోపణలు, విచారణలు జరిగాయని ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. అసలు గురి తప్పిందా..? ప్రస్తుతం ఇన్చార్జ్ డీఈఓగా ఉన్న అదనపు కలెక్టర్ ఏసీబీకి పట్టుబడిన విషయంలో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. గతంలో విద్యాశాఖలో పనిచేసిన ఉన్నతాధికారులు అక్రమాలకు పాల్పడ్డారని, తీవ్ర ఆరోపణలతో వారిని రాష్ట్ర అధికారులు తప్పించారని ప్రచారం సాగుతోంది. అక్కడికి ఇన్చార్జ్గా వచ్చిన వెంకట్రెడ్డి ఏసీబీకి బుక్కయ్యారని అంటున్నారు. లేదంటే గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులు చిక్కేవారని చర్చ సాగుతోంది. బదిలీ కోసం ప్రయత్నిస్తూ.. ఏసీబీకి పట్టుబడ్డ జిల్లా అదనపు కలెక్టర్, ఇన్చార్జ్ డీఈఓ వెంకట్రెడ్డి జిల్లా నుంచి బదిలీ కోసం ఇటీవల తీవ్రంగా ప్రయత్నించినట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో బదిలీ ఉత్తర్వులు వస్తాయని ఆయన ఎదురుచూస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ఇన్చార్జ్గా బాధ్యతలు తీసుకున్న విద్యాశాఖ వ్యవహారంలో ఆయన ఏసీబీకి పట్టుబడ్డారు. ఆయన బదిలీ దరఖాస్తు చేసిన నేపథ్యంలో జిల్లాకు అదనపు కలెక్టర్గా వచ్చేందుకు గతంలో ఉమ్మడి జిల్లా సమయంలో వరంగల్(ప్రస్తుతం హనుమకొండ) ఆర్డీఓగా పనిచేసిన అధికారి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల జిల్లాకు వచ్చి ఒకరిద్దరు రాజకీయ నేతలను ప్రసన్నం చేసుకునే పని పూర్తి చేసుకున్నట్లు సమాచారం. హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డితో పాటు ఇద్దరు ఉద్యోగుల అరెస్ట్ పాఠశాల అనుమతుల పునరుద్ధరణకు రూ.60 వేల లంచం కలెక్టరేట్ భవనంలో డబ్బులు తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టివేత డీఈఓ ఆఫీస్ నుంచి కలెక్టరేట్కు మారిన సీన్... మొదట డబ్బులు గౌస్కు ఇచ్చేందుకు బాధితులు డీఈఓ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ గౌస్లేడు.. మనోజ్ ఒక్కడే ఉన్నాడు. డబ్బులు తెచ్చామని చెప్పడంతో కలెక్టరేట్లో ఉన్న అదనపు కలెక్టర్తో ఫైనల్ ఫిగర్ నిర్ధారించుకునేందుకు మనోజ్ కూడా కలెక్టరేట్కు వచ్చాడు. సార్తో మాట్లాడిన తరువాత ఐడీఓసీ వెనుక సీసీ కెమెరాలు లేని ప్రాంతానికి తీసుకెళ్లి వారి నుంచి రూ.60వేలు తీసుకున్నాడు. ఈ క్రమంలో అక్కడే కాపు కాస్తున్న ఏసీబీ అధికారులు మనోజ్ను అదుపులోకి తీసుకుని అదనపు కలెక్టర్చాంబర్కు తీసుకుచ్చారు. విచారణ అనంతరం వెంకట్రెడ్డి, మనోజ్, గౌస్లను అదుపులోకి తీసుకున్నారు. -
ఎన్నికల్లో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకం
హనుమకొండ జిల్లా ఎన్నికల పరిశీలకుడు శివకుమార్నాయుడు హన్మకొండ అర్బన్: ఎన్నికల్లో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకమని గ్రామపంచాయతీ ఎన్నికల హనుమకొండ జిల్లా పరిశీలకుడు శివకుమార్నాయుడు అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం కలెక్టరేట్లో మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ పరిశీలకులు ఎలక్షన్ కమిషన్కు కన్నులాంటి వారని, వీరి ద్వారానే ఎలక్షన్ కమిషన్ ఎన్నికల ప్రక్రియ చూస్తుందని తెలిపారు. జిల్లాలో మొత్తం 58 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించి, 70 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించినట్లు పేర్కొన్నారు. మూడు దశల్లో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వీరు విధులు నిర్వర్తించి నివేదికలు అందించాలని సూచించారు. జిల్లా అదనపు ఎన్నికల అధికారి, జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీపీఓ లక్ష్మీ రమాకాంత్, జెడ్పీ సీఈఓ రవి, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ మహేందర్, మాస్టర్ ట్రైనర్స్ సుధాకర్రెడ్డి, రవి, శ్రీనివాస్ స్వామి పాల్గొన్నారు. ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్..గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల నిర్వహణకు సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియను హనుమకొండ జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు శివకుమార్నాయుడు, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ సమక్షంలో శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించారు. భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాల వారీగా ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు స్థానాల ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. జిల్లాలో మొదటి విడత 69 గ్రామ సర్పంచ్, 658 వార్డు స్థానాల ఎన్నికల నిర్వహణ కోసం 20 శాతం రిజర్వ్ స్టాఫ్ కలుపుకుని మొత్తం 761 ప్రిసైడింగ్ అధికారులు, 1149 ఓపీఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించినట్లు అధికారులు తెలిపారు. -
శనివారం శ్రీ 6 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
నర్సంపేటలో జరిగిన ప్రజా పాలన–ప్రజా విజయోత్సవ సభలో సీఎం రేవంత్రెడ్డి, పక్కన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖ, ధనసరి సీతక్క, ఎంపీ బలరాంనాయక్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, కడియం శ్రీహరి, నాయిని, రేవూరి, రాంచంద్రునాయక్, గండ్ర సత్యనారాయణరావు, ఎమ్మెల్సీ సారయ్యఅభివాదం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డినర్సంపేట సీఎం సభ సక్సెస్.. కార్యకర్తల్లో జోష్ ● భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులుహెలిపాడ్ వద్ద రేవంత్రెడ్డికి ఘనస్వాగతం ● పంచాయతీ ఎన్నికలపై దిశానిర్దేశం ● పోలీసుల భారీ బందోబస్తుసాక్షి, వరంగల్/నర్సంపేట/నర్సంపేట రూరల్ : నర్సంపేటలో కాంగ్రెస్ శ్రేణులు కదంతొక్కాయి. పట్టణంలో శుక్రవారం జరిగిన ప్రజాపాలన–ప్రజావిజయోత్సవ సభ సక్సెస్ కావడంతో కార్యకర్తల్లో జోష్ నెలకొంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి సీఎం అయిన తర్వాత తొలిసారి నర్సంపేట వచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం 3.32 గంటలకు చేరుకున్న సీఎంకు ఉమ్మడి జిల్లా నేతలు ఘనస్వాగతం పలికారు. అక్కడినుంచి ప్రజాపాలన–విజయోత్సవ సభా వేదిక వద్దకు భారీ కాన్వాయ్తో బయలుదేరారు. సీఎం రేవంత్రెడ్డి రోడ్డు పొడువునా ప్రజలకు అభివాదం తెలుపుతూ సభాస్థలికి చేరుకున్నారు. ముందుగా సభా వేదిక వద్ద సుమారు రూ.600 కోట్లతో అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య మంత్రి రేవంత్ ప్రసంగించారు. పంచాయతీ ఎన్నికల్లో యువత, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సభకు నర్సంపేట డివిజన్లోని ఆరు మండలాల నుంచే కాకుండా ఉమ్మడి జిల్లా నుంచి పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ప్రజల రాకతో సభా ప్రాంగణమంతా జనంతో నిండిపోయింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా వరంగల్ సీపీ సన్ప్రీత్సింగ్ నేతృత్వంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. సభలో మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్, ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, పింగిలి శ్రీపాల్రెడ్డి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ రియాజ్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు, డాక్టర్ మురళీనాయక్, రేవూరి ప్రకాశ్రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. సీఎం రేవంత్రెడ్డి హెలికాప్టర్ రాజుపేట గ్రామ శివారులోని హెలిపాడ్ వద్ద దిగింది. హెలికాప్టర్ దిగి బయటకు వచ్చిన సీఎంకు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ధనసరి అనసూయ( సీతక్క), కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితోపాటు మరి కొందరు ఎమ్మెల్యేలు పుష్పగుచ్ఛాలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. శాలువాలతో సన్మానించారు. ఔటర్ రింగ్ రోడ్డు, యూజీడీ తీసుకొస్తున్నాం కొత్త ఏడాది మేడారం జాతరకు మళ్లీ వస్తా నర్సంపేట సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి -
కొలతలు పక్కాగా నమోదు చేయాలి
బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ వరంగల్ అర్బన్: భవన నిర్మాణాల అసెస్మెంట్ల కొలతలు పక్కాగా నమోదు చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. గురువారం హంటర్ రోడ్డు ప్రాంతంలో న్యూశాయంపేట జంక్షన్ విల్లాస్ రోడ్, భద్రకాళి బండ్ వైపు వెళ్లే ప్రాంతాల్లో నమోదు చేసిన అసెస్మెంట్ల కొలతలను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సమర్థవంతంగా లెక్కించాలని సూచించారు. ఈసందర్భంగా బల్దియా రెవెన్యూ ఇన్స్పెక్టర్లు నమోదు చేసిన కొలతలను కమిషనర్ పునఃపరిశీలించి నిర్ధారణ చేసి నమోదు తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. నూతనంగా నిర్మించిన భవనాలకు పర్మిషన్ డాక్యుమెంట్లను, అనధికారిక నిర్మాణాలను పరిశీలించి అందుకు అనుగుణంగా వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఈ తనిఖీల్లో డిప్యూటీ కమిషనర్ రవీందర్ ఆర్ఐ రజనీ, వార్డు ఆఫీసర్ శిరీష బిల్ కలెక్టర్ రాజేశ్, తదితరులు పాల్గొన్నారు. -
అధ్యాపకులు సమర్థవంతంగా పని చేయాలి
కేయూ క్యాంపస్: యూనివర్సిటీలో అకడమిక్ ప్రమాణాల్ని అభివృద్ధి చేసేలా అధ్యాపకులు మరింత సమర్థవంతంగా పని చేయాలని కేయూ వీసీ ప్రతాప్రెడ్డి కోరారు. గురువారం సాయంత్రం వర్సిటీలోని క్యాంపస్ కాలేజీ ఆధ్వర్యంలో నిర్వహించే వార్షిక ఇండక్షన్ ప్రోగ్రాం ఎక్సోప్లోర్ ఎంగేజ్ ఎక్సెల్ పోస్టర్లను అకడమిక్ కమిటీ హాల్లో కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం, అన్ని విభాగాల అధిపతులతో కలిసి విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈవిద్యాసంవత్సరంలో వర్సిటీ కాలేజీలో వివిధ పీజీ కోర్సుల్లో 1,150 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారని విద్యార్థులకు తరగతులు సక్రమంగా నిర్వహించాలన్నారు. విశ్వవిద్యాలయం ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్, మెరుగైన స్థానాన్ని లక్ష్యంగా పెట్టుకుని కృషి చేయాలన్నారు. 2028లో న్యాక్ గ్రేడింగ్ దృష్ట్యా ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలన్నారు. విధుల్లో అనుచితంగా వ్యవహరించే వారిపై చర్యలకు వెనుకాడబోమని వీసీ ప్రతాప్రెడ్డి స్పష్టం చేశారు. ప్రతీ నెల విభాగాల వారీగా పురోగతిని పోర్టల్స్లో అప్లోడ్ చేసి రిపోర్ట్ చేయాలన్నారు. విద్యార్థులు కూడా సక్రమంగా తరగతులకు హాజరయ్యేలా విభాగాల అధిపతులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 12న ఉదయం 10 గంటలకు యూనివర్సిటీ ఆడిటోరియంలో పీజీ కోర్సుల మొదటి సంవత్సరం విద్యార్థులకు ఇండక్షన్ ప్రోగ్రాంను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కేయూ వీసీ ప్రతాప్రెడ్డి విభాగాధిపతులతో సమావేశం -
నిబంధనలు పకడ్బందీగా అమలు చేయండి
హన్మకొండ అర్బన్: జిల్లాల్లోని గ్రామ పంచాయతీ ఎన్నికలు సమర్థవంతంగా, పకడ్బందీగా నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లను ఆదేశించారు. గురువారం లా అండ్ ఆర్డర్ అదనపు డీజీపీ మహేశ్ భగవత్తో కలిసి ఆమె కలెక్టర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా రాణి కుముదిని మాట్లాడుతూ.. వార్డు సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నికై న గ్రామాల్లో ఉప సర్పంచ్ నియామకం నిబంధనల ప్రకారం జరిగేలా చూడాలన్నారు. ఏకగ్రీవంగా ఎంపికై న గ్రామ సర్పంచ్ స్థానాలకు ఫారం–10 ప్రకారం ఫలితాల ప్రకటన చేపట్టాలన్నారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత సంబంధిత గ్రామాల్లో స్టేజ్–2 రిటర్నింగ్ అధికారుల నియామకం పూర్తి చేయాలన్నారు. అలాగే టి–పోల్లో పెండింగ్ లేకుండా తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. సమావేశంలో హనుమకొండ కలెక్టర్ శబరీష్, సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీపీఓ అధికారి లక్ష్మీరమాకాంత్, డీఆర్డీఓ పీడీ శ్రీను, జెడ్పీ సీఈఓ రవి, అధికారులు పాల్గొన్నారు. వరంగల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన, నోడల్ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణి కుముదిని -
వరాలు కురిపిస్తారా?
సాక్షిప్రతినిధి, వరంగల్ : ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సుమారు 35 రోజుల తర్వాత మళ్లీ ఓరుగల్లులో పర్యటిస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటకు శుక్రవారం తొలిసారి వస్తున్న ఆయన... ‘ప్రజాపాలన – ప్రజావిజయోత్సవాల’ సందర్భంగా పలు అభివృద్ధి పథకాలకు ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కావొస్తున్నా.. తరుణంలో నర్సంపేట సభలో ప్రసంగించనున్న ముఖ్యమంత్రి గతంలో ప్రకటించిన పథకాలు, నిధులపై స్పష్టత ఇస్తారని భావిస్తున్నారు. గ్రేటర్ వరంగల్తోపాటు ఉమ్మడి వరంగల్పై ఏం వరాలు కురిపిస్తారనే చర్చ జరుగుతోంది. అలాగే ‘మొంథా’ తుపాన్ నష్టం సందర్భంగా ఇళ్లు కూలిపోయిన వారికి ఒక్కొక్కరికి రూ.15 వేలు చెల్లించిన ప్రభుత్వం.. పంటల నష్టంపై నివేదికలు పంపిన చాలామందికి పరిహారం అందలేదు. వీటిపైన సీఎం ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు. డీపీఆర్ స్థాయిలోనే ‘గ్రేటర్’ పనులు.. ఉమ్మడి వరంగల్కు కావాలి నిధులు ముఖ్యమంత్రి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వరంగల్పై పలు హామీలు కురిపించారు. హైదరాబాద్తో పోటీ పడేలా అభివృద్ధి పనులు చేపడతామని పేర్కొన్నారు. ఈ మేరకు సుమారు దశల వారీగా రూ.6,500 కోట్ల వరకు నిధులు మంజూరు చేశారు. ఇందులో మామునూరు ఎయిర్పోర్టుకు రూ.150 కోట్ల వరకు నిధులు విడుదలై భూసేకరణ జరుగుతోంది. భద్రకాళి చెరువు పూడిక, మాఢ వీధులు నిర్మాణం తదితర పనులు నడుస్తున్నాయి. వరంగల్ నగరంలో సుమారు నాలుగు వేల కోట్ల విలువైన అండర్గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణ ప్రతిపాదనలు డీపీఆర్ల దశలో ఉన్నాయి. ఔటర్ రింగ్రోడ్డు, ఇన్నర్ రింగ్రోడ్డుతోపాటు పలు అభివృద్ధి పథకాలకు నిధులు మంజూరైనా ఆ పనులు సాగడం లేదు. స్మార్ట్సిటీ పనులకు తోడు రాష్ట్రం వాటా కింద నిధులు మరిన్ని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు రావాల్సి ఉంది. అలాగే ఉమ్మడి వరంగల్లో మేడారం అభివృద్ధి, గిరిజన యూనివర్సిటీలకు మరిన్ని నిధులు అవసరం ఉందని ఇటీవల ప్రజాప్రతినిధులు సీఎంను కోరారు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కూడా ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. ఆ మూడు పథకాలపై స్పష్టత... కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇటీవల వరంగల్లో పర్యటించారు. కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూ నిట్ (ఆర్ఎంయూ), కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, మామునూరు ఎయిర్పోర్ట్ పనులను ఆయ న ప్రత్యేకంగా పరిశీలించి సమీక్షించారు. ఈ సందర్భంగా 7 మెగా టెక్స్టైల్ పార్కుల్లో ఒకటైన కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు పనులపై కేంద్రం మొత్తం రూ.200 కోట్లతో చేపట్టగా రూ.1,700 కోట్ల పెట్టుబడులు వస్తాయని, 12,500 మందికి ఉపాధి కలుగుతుందన్నారు. వరంగల్ మామునూ రు ఎయిర్ పోర్టు విషయంలో 696 ఎకరాల భూమి ఎయిర్ పోర్టు అధికారుల వద్ద ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం సుమారు 243 ఎకరాల భూమి సేకరించి ఎయిర్ పోర్టు అథారిటీకి అందజేస్తే త్వరగా నిర్మా ణం ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందన్నారు. కాజీపేటలోని రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని కేంద్రం భావిస్తుందన్నారు. ఈ మూడు పథకాల విషయంలో పలుమార్లు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు జరిగాయి. తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించి స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుందని పార్టీవర్గాల సమాచారం. ఉమ్మడి జిల్లా నేతలతో భేటీ కానున్న సీఎం? ప్రజాపాలన – ప్రజా విజయోత్సవ సభ’లో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం సభలో మాట్లాడనున్న ఆయన ఉమ్మడి వరంగల్పై నిధుల జల్లు కురిపిస్తారన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. అంతకు ముందు గ్రామ పంచాయతీ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉందని పార్టీకి చెందిన ముఖ్య నేత ఒకరు చెప్పారు. ఉమ్మడి జిల్లాలో తాజా పరిస్థితి ఏంటి? పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఏం జరుగుతోంది? అని మాట్లాడనున్నారు. మెజార్టీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గెలిచేలా రేవంత్రెడ్డి మరోసారి మార్గదర్శనం చేయనున్నారని తెలిసింది. నేడు నర్సంపేటకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. గత పర్యటనలో రూ.6,500 కోట్లు మంజూరు చేసిన సీఎం.. మందకొడిగా పనులు.. ఇటీవల జిల్లాకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. మామునూరు, కేఎంటీపీ, ఆర్ఎంయూలపై వ్యాఖ్యలు ఈ మూడు ప్రాజెక్టులలో రాష్ట్రం పాత్రపై సీఎం స్పష్టత ఇచ్చే అవకాశం ఉమ్మడి వరంగల్ అభివృద్ధికి మరిన్ని నిధులపై ఆశలు సాక్షి, వరంగల్/నర్సంపేట/నర్సంపేట రూరల్: నర్సంపేట నియోజకవర్గానికి తొలిసారి వస్తున్న సీఎం రేవంత్రెడ్డి పర్యటనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఈ సభకు జనసమీకరణ చేయనున్నారు. ప్రజాపాలన–ప్రజా విజయోత్సవ సభలో భాగ ంగా నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి రూ.1,023 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మంత్రులు సీతక్క, కొండా సురేఖతో పాటు ఎమ్మెల్యేలు, నాయకులు హాజరుకానున్నారు. సభా ఏర్పాట్లను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్, కలెక్టర్ డాక్టర్ సత్యశారద, ఆర్డీఓ ఉమారాణి, ఏసీపీ రవీందర్ పరిశీలించారు. హెలిపాడ్, సభా ప్రాంగణాన్ని బాంబ్ స్క్వాడ్ బృందాలు, జాగీలాలు తనిఖీ చేశాయి. సీఎం పర్యటన షెడ్యూల్ ఇలా.. సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం 1.15 గంటలకు హైదరాబాద్ బేగంపేటనుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు. 2 గంటలకు నర్సంపేటలోని బంజారాభవన్లో ఏర్పాటుచేసిన హెలి పాడ్లో దిగుతారు. మధ్యాహ్నం 2.15 నుంచి 3.55 వరకు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి బహిరంగసభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్లో తిరిగి హైదరాబాద్కు వెళ్తారు. -
మందగించిందా..!?
‘గ్రేటర్’లో సీసీ రోడ్లు వేసిన ఏడాదిలోపే తవ్వకాలువరంగల్ అర్బన్ : ప్రజల సొమ్మంటే గ్రేటర్ వరంగల్లో లెక్క లేకుండా పోతోంది. వివిధ పన్నుల రూపేణా మహానగర ప్రజలు చెల్లిస్తున్న ప్రజాధనం అశాసీ్త్రయమైన నిర్ణయాలతో దుర్వినియోగమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఉదాహరణ నగరం నడిబొడ్డున వరంగల్ కాశిబుగ్గ వివేకానంద కాలేజీనుంచి కూరగాయల మార్కెట్ వరకు వెళ్లే రోడ్డు పనులే. ఈ రోడ్డును ఏడాది కిందట రూ.40 లక్షలతో నిర్మించారు. పైప్లైన్ లీకేజీతో తాగునీరు వృథాగా పోతుండడంతో రోడ్డు దెబ్బతింది. దీంతో తాజాగా రోడ్డు తవ్వకాలు చేసి, ౖపైప్లైన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడే కాదు. అన్ని డివిజన్లలో ఇదే తరహాలో ఇంజనీర్లు పనులు చేపడుతుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇష్టారాజ్యంగా తవ్వకాలతో రోడ్లు ధ్వంసం ఏదైనా సీసీరోడ్డు, డ్రెయినేజీ నిర్మించే ముందు ఆయా కాలనీల్లో తాగునీటి పైప్లైన్లు నాణ్యత, లీకేజీలను పరిగణనలోకి తీసుకోవాలి. లీకేజీలు ఉంటే ముందుగా సరిచేయాలి. కానీ, బల్దియా ఇంజనీర్లు ఆవేమీ పట్టించుకోవట్లేదు. వివిధ కాలనీల్లో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించగానే కార్పొరేటర్ల ఒత్తిళ్లతో ముందు చూపులేకుండా గ్రేటర్ ఇంజనీర్లు రోడ్డు పనులు చేపడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి పనులు చేపట్టడం తదుపరి పైప్లెన్లు, కేబుళ్ల పేరుతో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తూ రూపురేఖలను మార్చేస్తున్నారు. దీంతో ఏర్పడిన గుంతలతో వాహనాల రాకపోకలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. వాహనాదారులు నడుములు హూనమవుతున్నాయి. ప్రమాదాల బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నారు. ఈ సమస్యలను బల్దియా ఇంజనీర్లు, కార్పొరేటర్లు ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకింత నిర్లక్ష్యం? ఆయా డివిజన్లలో ఎక్కడెక్కడ అభివృద్ధి పనులు చేపడతారనే విషయం రెండు విభాగాల ఇంజనీర్లకు తెలిసి ఉండాలి. ఆ పనులను పక్కా ప్రణాళికతో చేపట్టాలి. ముందుగా ఆ ప్రాంతంలో తాగునీటి లీకేజీలు, నాణ్యతా ప్రమాణాలు గుర్తించాలి. ఒకవేళ లీకేజీలు తరచూ ఉత్పన్నమైతే ముందుగా పైప్లైన్ వేయాలి. తదుపరి సీసీ రోడ్డు, ఆ తర్వాత డ్రెయినేజీని నిబంధనలకు మేరకు నిర్మించాలి. కానీ, రూల్స్ను ఇంజనీర్లు అతిక్రమిస్తూ ప్రజాధనం నేలపాలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. కమీషన్ల కోసం ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నారనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇంజనీర్లు, పాలకవర్గ సభ్యులు మాత్రం లీకేజీల వల్ల తాగునీటి సమస్య ఎదురవుతుండడంతో రోడ్లతవ్వకాలు చేసి కొత్త పైప్లైన్లు నిర్మిస్తున్నారని పేర్కొంటున్నారు. తాగునీటి పైప్లైన్ల లీకేజీలు సరిచేసేందుకేనని సమర్థన కమీషన్ల కోసమే అన్న అనుమానాలు వృథా అవుతున్న ప్రజాధనం కార్పొరేటర్ల ఒత్తిడే కారణమంటున్న ఇంజనీర్లు -
బుజ్జగింపులు.. నజరానాలు
హసన్పర్తి: ఎన్నికల నామినేషన్ ఉపసంహరించడానికి ఆయా పార్టీల నుంచి పోటీ చేస్తున్న వారు ప్రయత్నాలు ప్రారంభించారు. రెండో దశ నామినేషన్ల ఘట్టం శుక్రవారం ముగియనుంది. ఆయా గామాల్లో సర్పంచ్ పదవి కోసం అధికార పార్టీకి చెందిన పోటీదారుల నుంచి తీవ్ర పోటీ నెలకొంది. సర్పంచ్ పదవి కోసం అధికార పార్టీలోనే పోటీ ఎక్కువైంది. వీరిని బుజ్జగించడానికి మండలానికి చెందిన సీనియర్ నాయకులు రంగంలోకి దిగారు. ఇదిలా ఉండగా.. నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఆయా పార్టీల నాయకులు ఇరువురు పోటీదారులతో మంతనాలు సాగిస్తున్నారు. నామినేషన్ ఉపసంహరిచుకుంటే నజరానాలు కూడా ప్రకటిస్తున్నారు. మద్దతు కోసం ఒత్తిడి కష్టకాలంలో పార్టీని కాపాడిన తమకు మద్దతివ్వాలని ఆయా గ్రామాల్లో సీనియర్ల నుంచి డిమాండ్ వ్యక్తమవుతోంది. పదేళ్ల పాటు బీఆర్ఎస్ నాయకుల వేధింపులు భరించిన తమకే పార్టీ మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. మరో వైపు పార్టీలో చేరిన వారు సైతం తమకు మద్దతు పలికాలని కోరుతున్నారు. మద్దతు ఇవ్వకుంటే మరో పార్టీలోకి జంప్ చేస్తామని అభ్యర్థులను హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బైరాన్పల్లి, సీతంపేట, అన్నాసాగరం, మల్లారెడ్డిపల్లిల్లో అధికార ప్రతిపక్షాల నుంచి నామినేషన్ దాఖలు చేసిన వారి నుంచి డిమాండ్ వ్యక్తమవుతోంది. రెండు రోజుల క్రితం బైరాన్పల్లిలో సర్పంచ్ పదవి ఆశిస్తూ నామినేషన్ దాఖలు చేసిన అధికార పార్టీకి చెందిన పోటీదారుల నుంచి ఒకరిని ఉపసంహరించుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. గంటూరుపల్లిలో ఏకంగా సర్పంచ్ పదవి కోసం వేలం వేయగా బెడిసి కొట్టింది. చివరికి ఆరుగురు నామినేషన్ వేశారు. సూదన్పల్లిలో తల్లి, కూతురు, కొడళ్లు సర్పంచ్ పదవి కోసం నామినేషన్లు వేశారు. చివరికి వీరు పోటీల్లో ఉంటారా? ఒకరికే మద్దతు ప్రకటిస్తూ మిగతా ఇద్దరు నామినేషన్లు ఉపసంహరించుకుంటారా? అనే చర్చ జరుగుతోంది. వేటుకు రంగం సిద్ధం.. పార్టీ ఆదేశాలు ధిక్కరించి బరిలో ఉండే వారిపై వేటుకు ఆయా పార్టీలు రంగం సిద్ధం చేసినట్లు తె లిసింది. పోటీదారులు కూడా అఽధిష్టానం వద్ద మొరపెట్టుకున్నట్లు సమాచారం. ఒకే పార్టీ పేరు చెబుతూ.. ఓట్లు అడిగినట్లయితే ఓటర్లు గందరగోళపడే అవకాశం ఉన్నట్లు పార్టీ భావిస్తోంది. ఏకగ్రీవం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు మద్దతివ్వకుంటే పార్టీ మారుతామని బెదిరింపు -
ప్రజాసేవ కోసం ఉద్యోగానికి రాజీనామా..
మరిపెడ రూరల్: ప్రజా సేవ చేయలనే దృఢ సంకల్పంతో ఓ మహిళ తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసింది. మరిపెడ మండలం గాలివారిగూడెం గ్రామ సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు కేటాయించారు. విషయం తెలియగానే గ్రామానికి చెందిన రాములమ్మ అంగన్ వాడీ టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. బుధవారం తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అంగన్వాడీ టీచర్ ఉద్యోగానికి మరో 8 ఏళ్లు సర్వీస్ ఉన్నట్లు ఆమె తెలిపారు. కాగా, ప్రజాసేవ కోసం ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆమెను గ్రామస్తులు అభినందించారు. గాలివారిగూడెం సర్పంచ్ అభ్యర్థిగా రాములమ్మ నామినేషన్ దాఖలు -
‘గుర్తు’కు మొదటి అక్షరమే ఆధారం
హన్మకొండ అర్బన్ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులుగా పోటీచేసే వారికి అధికారులు ఈ విధంగా గుర్తులు కేటాయిస్తారు. నామినేషన్న్పత్రాల పేరులోని మొదటి అక్షరం ఆధారంగానే అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. ఉదాహరణకు ‘అ’ అనే పేరుతో నామినేషన్ వేసిన అభ్యర్థికి అంతకు తర్వాత వచ్చే అక్షరం కంటే ముందు గుర్తును కేటాయిస్తారు. అంటే పేరుకు ముందు ఉండే అక్షరం మేరకు గుర్తుల కేటాయింపు ఉంటుంది.శబరిమల రైళ్ల పొడిగింపుకాజీపేట రూరల్: అయ్యప్ప మాలధారుల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన శబరిమల ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు బుధవారం దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ తెలిపారు. 2026 జనవరి 3వ తేదీన సి ర్పూర్కాగజ్నగర్–కొల్లం (07117) ఎక్స్ప్రెస్, 20 26 జనవరి 5వ తేదీన కొల్లం–చర్లపల్లి (07118) ఎ క్స్ప్రెస్ వరంగల్ మీదుగా ప్రయాణించనున్నాయి. 2026 జనవరి 3వ తేదీన వరంగల్, కాజీపేట మీ దుగా కొల్లం–చర్లపల్లి (17125) రైలును పొడిగించి నడిపిస్తున్నారు. ఈ రైలుకు కాయన్కుళం, చెంగనూర్, తిరువల, కొట్టాయం, ఎర్నాకులం, అలువా, త్రి శూరు, పాలక్కడ్, పొదనూర్, తిరుపూర్, ఈరోడ్, సేలం, జోలెర్పెట్టయ్, కట్పడి, చిత్తూరు, పాకల్, తిరుపతి, రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, విజయవాడ, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, కేసముద్రం, వరంగల్, కాజీపే ట, జనగామ, భువనగిరిలో హాల్టింగ్ కల్పించారు. మామపై కత్తితో అల్లుడి దాడి రామన్నపేట : మామపై కత్తితో అల్లుడి దాడికి పా ల్పడ్డాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి వరంగల్ రామన్నపేటలో చోటుచేసుకుంది. మట్టెవాడ పోలీ సుల కథనం ప్రకారం.. రామన్నపేటకు చెందిన శ్రీకన్యతో హనుమకొండ నయీంనగర్కు చెందిన వాకిటి అనిల్కు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహం జరిగిన రెండు మూడు సంవత్సరాల వరకు అనిల్ బాగానే ఉన్నాడు. అనంతరం మద్యానికి బానిసై భార్యను శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. దీంతో శ్రీకన్య తన తండ్రి గున్నాల ప్రభాకర్ వద్దకు వచ్చింది. గొడవల అనంతరం రెండేళ్ల నుంచి అనిల్, శ్రీకన్య దంపతులు రామన్నపేటలో ప్రభాకర్ ఇంటికి సమీపంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఈక్రమంలో మంగళవారం శ్రీకన్యపై అనిల్ దాడికి యత్నించగా సమీపంలో ఉన్న తన తండ్రి ఇంటికి వెళ్లింది. అక్కడికి చేరుకున్న అనిల్.. తన అత్తామామ ప్రభాకర్, అనితతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం ప్రభాకర్పై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటనలో అనిత వెనుకకు నెట్టె క్రమంలో అనిల్కు కూడా గాయాలయ్యాయి. ప్ర భాకర్ మరో కూతురు లావణ్య ఫిర్యాదు మేరకు అనిల్పై కేసు న మోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ కరుణాకర్ తెలిపారు. -
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
● టీఎస్ఈఈయూ–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్హన్మకొండ: విద్యుత్ ఎమ్మార్టీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ అన్నారు. హనుమకొండ వడ్డేపల్లి రోడ్డులోని టీఎస్ఈఈయూ–327 కార్యాలయం (పల్లా రవీందర్రెడ్డి భవన్)లో ఆ యూనియన్ ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి ఎమ్మార్టీ విద్యుత్ ఉద్యోగుల సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో ఇనుగాల శ్రీధర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఎమ్మార్టీ ఉద్యోగులకు పదోన్నతి చానల్ పెంచేందుకు చేసిన కృషి ఫలించిందన్నారు. జూనియర్ లైన్మెన్లకు అసిస్టెంట్ లైన్మెన్లుగా పదోన్నతి లభించే అవకాశం వచ్చిందన్నారు. ఈ మేరకు ఎన్పీడీసీఎల్ యాజమాన్యం ఎమ్మార్టీ విభాగంలో కొత్తగా అసిస్టెంట్ లైన్మెన్ పోస్టులు మంజూరు చేసిందని పేర్కొన్నారు. అనంతరం తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్–327 ఎమ్మార్టీ విభాగం ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పి.సారంగపాణి, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆ ర్.శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా ఎస్.శోభారాణి, యు.రవీందర్, ఎం.శ్రీదేవి, కార్యదర్శిగా కె.రాజు, సంయుక్త కార్యదర్శులు గా ఆర్.ప్రణయిత, ఎన్.వనజ, డి.సుజాత, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా పి.అంబేడ్కర్, ఆర్.హరి, ఎస్.కమలాకర్, జా కీర్, కోశాధికారిగా జె.విద్యాసాగర్ ఎన్నికయ్యారు. టీఎస్ఈఈయూ టీజీ ఎన్పీడీసీఎల్ శాఖ అధ్యక్షుడు పి.మహేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దొనికల సదయ్య, కార్యదర్శి చిట్ల ఓదెలు, ఎమ్మార్టీ ఉద్యోగులు పాల్గొన్నారు. -
దివ్యాంగులకు ప్రత్యేక హక్కులు
రామన్నపేట: దివ్యాంగులకు అందరితో సమానమైన హక్కులతోపాటు కొన్ని ప్రత్యేక హక్కులు ఉంటాయని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ పేర్కొన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆటోనగర్లోని లూయిస్ ఆదర్శ బ్లైండ్ స్కూల్లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకులకు ముఖ్య అతిథిగా హాజరైన న్యాయమూర్తి మాట్లాడుతూ ఎలాంటి వైకల్యం కలిగి ఉన్న వారికై నా ఉన్నత చదువుల్లో 5 శాతం, ప్రభుత్వ ఉద్యోగాల్లో 4 శాతం, ప్రభుత్వేతర ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించడం జరిగిందన్నారు. దివ్యాంగులకు న్యాయసేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయవాదిని సమకూర్చి వారి కేసులు వాదించే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం అంధ విద్యార్థులకు బ్రెయిలీ లిపీ పేపర్లను, బిస్కెట్లను అందించారు. కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి సాయికుమార్, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ శ్రీనివాసరావు, కల్యాణి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ -
అమీనాబాద్ నుంచి అసెంబ్లీ వరకు..
నర్సంపేట : నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి.. అమీనాబాద్ నుంచి అసెంబ్లీ వరకు రాజకీయంగా అంచలంచెలుగా ఎదిగారు. పుట్టి పెరిగిన గ్రామానికి సర్పంచ్గా ఎన్నికై గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. అలాగే, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం అమీనాబాద్ గ్రామంలో జన్మించిన మాధవరెడ్డి.. చదువుకునే రోజుల్లోనే విద్యార్థి సంఘం నాయకుడిగా కొనసాగారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత 1981లో అమీనాబాద్ సర్పంచ్గా గెలుపొంది ప్రజాసేవలో కొనసాగారు. కాంగ్రెస్ పార్టీలో నిజాయితీ, నిబద్ధత గల నాయకుడిగా కొనసాగుతూ 1995లో డీసీసీబీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకుడిగా కొనసాగుతూ డీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు. అయినా 2014లో నమ్ముకున్న పార్టీ నుంచి నర్సంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఫాం లభించలేదు. దీంతో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుపొంది రాష్ట్ర స్థాయిలో సంచలనం సృష్టించాడు. పార్టీ ఆదరించకున్నా ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత అధికార పార్టీ (బీఆర్ఎస్)లో చేరలేదు. తిరిగి కాంగ్రెస్లోనే చేరి నిజాయితీ గల నాయకుడిగా పార్టీలో ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు. గత ఎన్నికలో ఎమ్మెల్యేగా రెండో సారి గెలుపొంది నర్సంపేట అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారు. సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేగా అంచలంచెలుగా ఎదిగిన ‘దొంతి’ -
ఆ వృద్ధుడు.. పట్టు వదలని విక్రమార్కుడు
మరిపెడ రూరల్: ఏడు పదుల వయస్సులో కూడా ఓ వృద్ధుడు పట్టు వదలని విక్రమార్కుడిలా సర్పంచ్ పదవికి సై అంటున్నాడు. తాను చనిపోయే సమయంలోపు ఒక్కసారైనా సర్పంచ్ కావాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడువుగా బుధవారం నామినేషన్ దాఖలు చేశాడు. తన నిర్ణయాన్ని గ్రామస్తులు కూడా అంగీకరించారు. ఆయనే మండలంలోని ధరావత్ తండాకు చెందిన ధరావత్ తేజానాయక్. తాను చనిపోయే సమయంలోపు ఒక్కసారైనా సర్పంచ్గా కావాలనే తన కోరికను గ్రామస్తులకు తెలుపగా వారు అంగీకరించారు. అదేవిధంగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి రెండున్నర గుంటల స్థలం, భవనానికి దారి, ఖర్చులకు రూ.2 లక్షలు నగదును తాయిలాలుగా ప్రకటించాడు. ఇంకేముంది గ్రామస్తులంతా ఏకగ్రీవానికి మద్దతు తెలపడానికి సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. ఏడు పదుల వయస్సులో కూడా సర్పంచ్ పదవికి నామినేషన్ ఏకగ్రీవం వైపుగా అడుగులు -
మేడారంలో వేగంగా విద్యుత్ పనులు
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం మహాజాతరలో భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న విద్యుత్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి తెలిపారు. బుధవారం మేడారంలో ములుగు సర్కిల్ పరిధిలోని అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం 8 కిలోమీటర్ల మేర కవర్డ్ కండక్టర్ పనులు పూర్తి కా గా, భక్తుల రద్దీ పెరిగే సందర్భంలో విద్యుత్ లోపాలు లేకుండా ఉండేందుకు 70 కొత్త ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా 25 కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్ పనులు పూర్తయినట్లు వెల్లడించారు. మిగతా పనులను ఈ నెల 20వ తేదీలోపు పూర్తి చేయాలని సంబంధిత అధి కారులను ఆదేశించారు. అదనంగా మేడారంలోని సమ్మక్క సబ్స్టేషన్లో 5 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫా ర్మర్ ఏర్పాటు చేస్తున్నామని, విద్యుత్ అంతరాయం లేకుండా జంపన్న వాగు వద్ద 6 టవర్ల నిర్మాణం చేపట్టగా, అందులో 4 టవర్లు ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు. అనంతరం నిర్మాణంలో ఉన్న 33/11 కేవీ నార్లాపూర్ సబ్స్టేషన్ను పరిశీలించి పనుల పురోగతిని సమీక్షించారు. ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని ఏజెన్సీలను ఆదేశించారు. పస్రా సెక్షన్ ఆఫీస్లో నిర్మిస్తున్న కంట్రోల్ రూం, డ్యూటీ రూం పనులను పర్యవేక్షించారు. ములుగు ఎస్ఈ ఆనందం, డీఈఈలు సదానందం, పురుషోత్తం , ఏడీఈలు రాజేశ్, వేణుగోపాల్, సందీప్ పాటిల్, ఈఈ (సివిల్) వెంకట్రామ్ పాల్గొన్నారు. విద్యుత్ బిల్లుల చెల్లింపు మరింత సులువు.. హన్మకొండ: విద్యుత్ బిల్లుల చెల్లింపు మరింత సులవని, అధునాతన సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగదారుల ముంగిటకు తీసుకొచ్చామని టీజీఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. హనుమకొండ నక్కలగుట్టలోని విద్యుత్ బిల్లుల చెల్లింపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆన్లైన్ పేమెంట్ సిస్టం (కియోస్క్)ను బుధవారం లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. విద్యుత్ సేవలను పూర్తిగా డిజిటల్ వైపునకు మళ్లిస్తున్నామన్నారు. వినియోగదారులు మరింత వేగంగా తమ బిల్లులను చెల్లించుకునేలా రూపొందించిన ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ (కియోస్క్)ను యూనియన్ బ్యాంకు సహకారంతో పైలెట్ ప్రాజెక్ట్ కింద చేపట్టామని తెలిపారు. త్వరలో మరిన్ని ఈఆర్వో కేంద్రాల్లో ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో ఫైనాన్స్ డైరెక్టర్ వి.తిరుపతి రెడ్డి, చీఫ్ జనరల్ మేనేజర్ ఆర్.చరణ్ దాస్, చీఫ్ ఇంజనీర్ శ్రవణ్ కుమార్, జనరల్ మేనేజర్లు శ్రీనివాస్, వెంకట కృష్ణ, హనుమకొండ ఎస్ఈ పి.మధుసూదన్ రావు, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ నవీన్ కుమార్, డీఈలు విజయేందర్ రెడ్డి, జి. సాంబరెడ్డి, యూనియన్ బ్యాంకు ఏజీఎంలు వై.శ్రీకాంత్ కుమార్, మహేశ్, చీఫ్ మేనేజర్ పి.వి.చైత్యన్య రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి అధికారులతో జాతరలో విద్యుత్ పనుల పురోగతిపై సమీక్ష -
తుపాను సాయం అందించండి
హన్మకొండ చౌరస్తా: మోంథా తుపాను కారణంగా వరంగల్ నగరానికి తీవ్ర భారీ నష్టం వాటిల్లిందని, తక్షణమే సాయం అందించాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య బుధవారం లోక్సభలో జీరో అవర్లో గళమెత్తారు. మోంంథా తుపాను కారణంగా వరంగల్ నగరంలో 200 మీల్లీ లీటర్ల భారీ వర్ష కురిసిందని, తద్వారా నగరంలో 45 కాలనీలు నీట మునిగాయని వివరించారు. కొన్ని చోట్ల రహదారులు నదులుగా మారాయని, ఓ గర్భిణినీ ట్రాక్టర్లో తరలించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. నగరంలో అమృత్, స్మార్ట్సిటీ పథకాల ద్వారా చేపట్టిన డ్రైనేజీ పనులు 66 శాతం మాత్రమే పూర్తికావడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఇది పూర్తిగా ప్రణాళిక వైఫల్యమే అని పార్లమెంట్లో తెలిపారు. అమృత్ 2.0 ద్వారా ప్రత్యేక నిధులు మార్చి 2026లో విడుదల చేయాలని, జీడబ్ల్యూఎంసీ, మౌలిక వసతులపై ఉన్నత స్థాయి ఆడిట్కు ఆదేశించాలని, రహదారుల పునఃనిర్మాణానికి రూ.100 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ఎంపీ కేంద్రాన్ని కోరారు. హెరిటేజ్, స్మార్ట్సిటీ అయిన వరంగల్ ఏటా వర్షాలతో నష్టపోకుండా కేంద్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కార దిశగా మౌలిక వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. లోక్సభలో వరంగల్ ఎంపీ డాక్టర్ కావ్య -
మార్కెట్ హమాలీలకు ఇన్సూరెన్స్ కల్పించాలి
వరంగల్: Ð]lÅÐ]l-ÝëĶæ$ Ð]l*Æð‡PsŒæ çßæÐ]l*-ÎÌSMýS$ VýS$Ç¢…ç³# M>Æý‡$z-ÌS-™ø´ër$ C¯]l*ÞÆð‡¯ŒæÞె¯ŒSÞ ÝûMýS-Æý‡Å… MýS͵…^éÌS° Ð]lÅÐ]l-ÝëĶæ$ Ð]l*Æð‡PsŒæ çßæÐ]l*ΠĶæÊ°Ä¶æ$¯ŒS Æ>çÙ‰ A«§ýlÅ-„ýS$yýl$ VýS$…ò³ÍÏ Ð]l¬±ÔèæÓ-Æý‡$yýl$ A¯é²Æý‡$. º$«§ýl-ÐéÆý‡… H¯]l$-Ð]l*-Ð]l¬ÌS Ð]lÅÐ]l-ÝëĶæ$ Ð]l*Æð‡PsŒæ çßæÐ]l*ΠĶæÊ°Ä¶æ$¯ŒS A«§ýlÅ-„ýS$yýl$ çßæïœgŒæ B«§ýlÓ-Æý‡Å…ÌZ °Æý‡-çܯ]l ^ólç³-sêtÆý‡$. D çÜ…§ýl-Æý‡Â…V> Ð]l¬±ÔèæÓ-Æý‡$yýl$ Ð]l*sêÏ-yýl$™èl* Ð]lÅÐ]l-ÝëĶæ$ Ð]l*Æð‡P-sŒæ-ÌZ §é§éç³# 6ÐólÌS Ð]l$…¨ çßæÐ]l*Î, §ýlyýl$-Ð鯇$$, ïÜÓç³-ÆŠæ, ^ér, GyýlÏ-º…yýlÏ M>ÇÃMýS$-Ë$ ç³°^ól-çÜ$¢-¯é²-Æý‡-¯é²Æý‡$. AÆý‡$á-OÌñæ¯]l çßæÐ]l*-ÎÌSMýS$ OÌñæòܯŒSÞ-Ë$ CÐéÓ-ÌS° Mö¯ól²-â¶æ$Ï-V> yìlÐ]l*…yŠæ ^ólíܯ]l ÐéÆý‡…-™é Ð]lĶæ$çÜ$ Oò³ºyìl ç³°^ól-Ķæ$-Ìôæ° íܦ†MìS ^ólÆý‡$-MýS$-¯é²-Æý‡-¯é²Æý‡$. ÐéÇ Ý릯]l…-ÌZ Ð]l_a¯]l Mö™èl¢ çßæÐ]l*Î M>ÇÃMýS$-ÌSMýS$ OÌñæòܯŒSÞ-Ë$, VýS$Ç¢…ç³# M>Æý‡$z, C¯]l*Þ-Æð‡¯ŒSÞ ÝûMýS-Æý‡Å… MýS͵…^éÌS-¯é²Æý‡$. ™ðlÌS…V>׿ Æ>çÙ‰ çßæÐ]l*Î, §ýlyýl-Ð鯇$$, ^ér, ïÜÓç³ÆŠ‡Þ Ð]lÆý‡PÆŠ‡Þ ĶæÊ°Ä¶æ$¯ŒS Æ>çÙ‰ E´ë-«§ýlÅ-„ýS$-Ë$ §éÐðl$Æý‡ MýS–çÙ~, í³rtÌS Ððl…MýS¯]l², VýS…«§ýl… ¿êçÜP-ÆŠæ, ÔóæQÆŠæ, }°Ðé‹Ü, MýS$Ð]l*-ÆŠæ, Æ>…»êº$, Æ>k, f¯éÆý‡ª¯Œl, Æ>k, MýSÐ]l$-ÌêMýS-ÆŠæ, Ð]l$¯øçßæ-ÆŠæ, §éçÜ$, çܨ, çÙ…Ô¶æ$ ™èl¨™èl-Æý‡$-Ë$ ´ëÌŸY-¯é²Æý‡$. రాష్ట్ర అధ్యక్షుడు గుంపెల్లి మునీశ్వరుడు -
ఖర్చుకు పైసలెట్లా?
సంగెం: గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల కోలాహలం మొదలైంది. నామినేషన్లు, పరిశీలన పర్వం ముగియడంతో అభ్యర్థులు ప్రచారంపై దృష్టి సారిస్తున్నారు. పార్టీ రహిత ఎన్నికలు జరుగుతున్నా ఆయా పార్టీల నేతలు తమ నాయకులు, అనుచరులను బరిలో దింపారు. అయితే పోటీలో ఉన్న అభ్యర్థులకు పైసల రంది పట్టుకుంది. తమ గెలుపు కోసం ఎంత ఖర్చయినా పెట్టడానికి ముందుకొస్తున్న అభ్యర్థులు తమ ఆస్తులను తనఖా పెట్టడానికి, కొందరు అమ్మడానికి సిద్ధపడుతున్నారు. రూ.10 నుంచి రూ.30 లక్షలకు పైగా ఖర్చు.. చిన్న పంచాయతీల్లో పోటీ చేసే అభ్యర్థులు రూ. 10 లక్షలు, మేజర్ గ్రామపంచాయతీల పరిధిలో పోటీ చేసే అభ్యర్థులు రూ. 20 లక్షల నుంచి 30 లక్షల వరకు ఖర్చు చేసేందుకై నా వెనుకాడడం లేదు. జనరల్, బీసీలకు రిజర్వ్ అయిన గ్రామాల్లో పోటాపోటీగా ఖర్చు చేసేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. గ్రామాల్లో సర్పంచ్ కీలకం కావడం.. నిధులన్నీ సర్పంచ్ ఆధ్వర్యంలోనే ఖర్చుచేయనుండడంతో పోటీకి సై అంటున్నారు. ఒక వేళ ఓడిపోతే సెంటిమెంట్తో వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనైనా పదవి దక్కుతుందనే ఆశాభావంతో ముందుకు సాగుతున్నారు. గెలిచినా.. ఓడినా కష్టాలే.. డబ్బులు భారీగా ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచిన వారికి మొదట పదవి ఆనందపరిచినా, వెంటనే అప్పులు తీర్చడం మొదటి ప్రాధాన్యతగా మారనుంది. ఓడిపోయిన వారి పరిస్థితి మరింత దారుణంగా ఉండనుంది. అప్పులు చెల్లించలేక కుంటుంబం మొత్తం ఆర్థిక ఇబ్బందులతో ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఇలా ఎన్నికల్లో యథేచ్ఛగా డబ్బులు ఖర్చు చేసి గెలిచినా, ఓడినా ఇరువురు అభ్యర్థులు సైతం కష్టాలు తప్పకపోవచ్చనే చర్చ జరుగుతోంది. పోటీ చేసిన అభ్యర్థులు సంయమనం పాటించి డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కునే కంటే నిజాయితీగా ప్రచారం చేసి నిస్వార్థంతో సేవ చేస్తామని ఓట్లు పొందితే బాగుంటుదని యువత అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ఓటర్లు కూడా ఎన్నికల సమయంలో వచ్చే మద్యం, డబ్బులకు ఆశపడి ఓటును అమ్ముకుంటే ఐదేళ్లు కష్టాలు తప్పవని ఆలోచించాలి. అందుకే డబ్బులు తీసుకోకుండా నిజాయితీగా గ్రామాభివృద్ధికి సేవ చేసేవారికి ఓట్లు వేసి ఎన్నుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. డబ్బుల సర్దుబాటుకు ఇబ్బందులు ఆస్తుల తనఖాకు సిద్ధమవుతున్న పోటీదారులు -
‘గుర్తింపు’ లేక ఇబ్బందులు
వరంగల్: వ్యవసాయ మార్కెట్ కమిటీల్లోని ఉద్యోగులకు, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్కు, పింఛన్దారులకు ఐడీ (ఎంప్లాయ్కోడ్)లు లేక రెండు నెలలుగా వేతనాలు, పెన్షన్లు రావట్లేదు. కాగా, ఇప్పటి వరకు ప్రతీ నెల చెక్కులను ఫైనాన్స్శాఖకు పంపిస్తే నిధులు విడుదలయ్యేవి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నిబంధనలు మార్చడంతో ఉద్యోగులు, పింఛన్దారులకు అవస్థలు తప్పడం లేదు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా బినామీ పేర్లతో పలు డిపార్ట్మెంట్లలో వేతనాలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. 010 పద్దు కింద ఉన్న ఉద్యోగులకు, పింఛన్దారులకు వేతనాలు, పింఛన్లు చెల్లించేందుకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రతీ ఉద్యోగి నుంచి గుర్తింపు పత్రాలు సేకరించింది. ఈపద్దు కింద ఉన్న ఉద్యోగులకు వేతనాలు, పింఛన్దారులకు ఐడీ (గుర్తింపు నంబర్) ఉంటుంది. బిల్లులు ఎలా? మార్కెట్ కమిటీల పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు, ఫించన్దారులకు ఐడీలు లేని కారణంగా బిల్లులు చేయలేని పరిస్థితుల్లో మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఈవిషయంపై మార్కెటింగ్శాఖ ఉన్నతాధికారులు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు సమస్య వివరించడంతో మార్కెట్ కమిటీల్లోని ఉద్యోగులకు మాత్రమే యూనిక్ ఐడీలను ఇచ్చింది. వీటిని హైదరాబాద్లో అప్లోడ్ చేసినట్లు తెలిసింది. అందుకని ఉద్యోగులకు మాత్రమే నెట్ అమౌంట్ రూపంలో కేటాయింపులు జరిగినట్లు సమాచారం. కాగా, వెంటనే ఐడీలు ఇచ్చి వేతనాలు, పింఛన్లను మంజూరు చేయాలని ఉద్యోగులు, ఔట్సోర్సింగ్ ఎంప్లాయ్స్, ఫించన్దారులు విజ్ఞప్తి చేస్తున్నారు ఐడీలు లేని మార్కెట్ ఉద్యోగులు, పింఛన్దారులు రెండు నెలలుగా పింఛన్లు, వేతనాల నిలిపివేత -
తడి, పొడి చెత్తను వేరు చేయాలి
నగర మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: నగర స్వచ్ఛత కోసం తడి, పొడి చెత్తను వేర్వేరు బుట్టల్లో వేసి అందించాలని మేయర్ గుండు సుధారాణి విజ్ఞప్తి చేశారు. బుధవారం వరంగల్ అండర్ రైల్వే గేట్ ప్రాంతంలోని 38వ డివిజన్ ఖిలా వరంగల్, 42వ డివిజన్ రంగశాయిపేటలో ఇంటింటా తడి, పొడి చెత్త వేరుపై మేయర్, కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం మేయర్ సుధారాణి మాట్లాడుతూ నగర వ్యాప్తంగా 66 డివిజన్లలో ప్రతి డివిజన్కు ముగ్గురు వలంటీర్ల చొప్పున, ప్రతి స్వచ్ఛ ఆటోకు ఒకరిని నియమించి తడి, పొడి చెత్తను వేరు చేసి అందించేలా సూచిస్తున్నట్లు తెలిపారు. కార్పొరేటర్లు గుండు చందన పూర్ణచందర్ , బైరబోయిన ఉమాదామోదర్ యాదవ్, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, హెచ్ఓ లక్ష్మారెడ్డి, టీఎంసీ రమేశ్, శానిటరీ సూపర్ వైజర్ గోల్కొండ శ్రీను, ఆస్కీ ప్రతినిధులు డాక్టర్ రాజ్మోహన్, అవినాష్ పాల్గొన్నారు. -
పూర్తికాలే!
గురువారం శ్రీ 4 శ్రీ డిసెంబర్ శ్రీ 2025పుష్కరం దాటినాపిల్లర్లకే పరిమితమైన వరంగల్ కళాభవనంవాహనాల పార్కింగ్ స్టాండ్గా మారిన కళాభవనం ప్రాంగణ స్థలం వరంగల్: కళాకారులను ప్రోత్సహించేందుకు వరంగల్లో నిర్మించతలపెట్టిన కళాభవనం పిల్లర్లకే పరిమితమైంది. పుష్కర కాలం పూర్తయినా పనులు పూర్తికావడం లేదని కళాకారులు ఆందోళన చెందుతున్నారు. కాకతీయుల రాజధాని వరంగల్లో కళాభవనం (మినీ రవీంద్రభారతి) నిర్మించాలని కోరుతూ కళాకారులు గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు సమర్పించారు. వీరి అభ్యర్థన మేరకు బహుళ సాంస్కృతిక కళాభవనం నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. కాగా, వరంగల్ పోచమ్మమైదాన్ సమీపంలో మల్టీపర్సస్ కల్చరల్ కాంప్లెక్స్ పేరిట నిర్మాణానికి రెండుసార్లు శంకుస్థాపన చేశారు. అప్పటి మంత్రిగా ఉన్న బస్వరాజు సారయ్య ముచ్చటగా మూడోసారి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. 24–05–2013లో రూ.నాలుగు కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఏడాదిలో నిర్మించాలన్న నిబంధనలతో టెండర్లు నిర్వహించగా హైదరాబాద్కు చెందిన శ్రీకో ప్రాజెక్టు నిర్మాణ సంస్థ పనులు దక్కించుకుంది. మొదటి విడత పర్యాటకశాఖ మంజూరు చేసిన కోటి రూపాయలతో పనులు ప్రారంభమయ్యాయి. బెస్మెంట్, పిల్లర్లు, జనరేటర్ రూం నిర్మించిన కాంట్రాక్టర్కు రూ.69.88 లక్షలు చెల్లించారు. నిధులు విడుదలైతేనే మిగిలిన పనులు చేస్తామని కాంట్రాక్టర్ భీష్మించుకున్నాడు. 12 ఏళ్ల క్రితం ప్రారంభమైన కళాభవనం బేస్మెంట్తో అగిపోయింది. నిర్మాణం కోసం తీసుకొచ్చిన సిమెంట్ గడ్డ కట్టగా, ఇనుము తుప్పు పట్టిపోయింది. స్థలం టాక్సీ స్టాండ్ అడ్డాగా మారింది. తూర్పు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు కన్నెత్తి చూడకపోవడంతో అసంపూర్తి పిల్లర్లు ఆకాశాన్ని చూస్తున్నాయి. హనుమకొండలో రూ.12 కోట్లతో చేపట్టిన కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ వ్యయం పెరిగింది. వరంగల్ పశ్చిమ ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సుమారు రూ.100 కోట్ల నిధులు మంజూ రు చేయించి పూర్తి చేశారు. కేవలం రూ.నాలుగు కోట్ల వ్యయంతో చేపట్టిన కళాభవనానికి నిధులు తేవడంలో తూర్పు ప్రజాప్రతినిధులు విఫలమయ్యారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కలగానే హరిత హోటల్.. కళాభవనం కోసం కేటాయించిన స్థలంలో హరిత హోటల్ నిర్మించాలని మాజీ ఎమ్మెల్యే నరేందర్ సూచనల మేరకు అప్పటి పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్థలాన్ని పరిశీలించారు. డిజైన్లో మార్పులు చేసి కళాభవన్ నిర్మిస్తామని ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేని వరంగల్ నగర ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కళాభవనంపై దృష్టి సారించాలి.. ఆర్ట్స్ కాలేజీ, నేరెళ్ల వేణుమాధవ్ ఆడిటోరియం, పోతన ఆడిటోరియం, కాశోజీ కళారక్షేతం హనుమకొండ జిల్లా పరిధిలోనే ఉన్నాయి. వరంగల్ జిల్లా కేంద్రంలో ఆడిటోరియాలు లేవు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ భవన నిర్మాణం ప్రారంభమైనందున గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య సైతం కాంగ్రెస్లో ఉన్నందన కళాభవనం (ఆడిటోరియం) నిర్మాణంపై దృష్టి పెట్టాలని నగరవాసులు, కళాకారులు కోరుతున్నారు. నిధులు లేక పనులు ఆపేసిన కాంట్రాక్టర్ పార్కింగ్ స్టాండ్గా మారిన స్థలం పట్టించుకోని తూర్పు ప్రజాప్రతినిధులు కళాభవనం పూర్తిచేయాలి.. నృత్యంలో శిక్షణ తీసుకున్నప్పటికి పోటీల్లో పాల్గొనేందుకు ప్రాక్టీస్ చేసేందుకు వరంగల్లో కళాభవనం లేక ఇబ్బందులు పడుతున్నాం. నేరుగా పోటీలకు వెళ్లడం వల్ల అనుకున్న ఫలితాలు రావడం లేదు. స్థానిక కళాకారుల కోసం కళాభవనం వెంటనే పూర్తి చేయాలి. – ఇప్పకాయల శ్రుతిక, భరతనాట్యం కళాకారిణి, లేబర్ కాలనీ, వరంగల్ ఇబ్బందులు పడుతున్నాం... వరంగల్లో ప్రత్యేకంగా కళావేదిక లేక పోవడంతో దూరం వెళ్లి ప్రదర్శనలు ఇవ్వాల్సి వస్తోంది. శిక్షణ అకాడమీలు ఒకే సమయంలో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తే ఆడిటోరియం అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నాం. ఆడిటోరియం ఉంటే కళాకారులు దుస్తులు మార్చుకునేందుకు, అలంకరణ చేసుకునేందుకు ఇబ్బంది ఉండదు. –గజ్జెల రంజిత్, పేరిణి అధ్యాపకుడు, వరంగల్ -
ఘనంగా వ్యవసాయ విద్యా దినోత్సవం
హన్మకొండ/వరంగల్: వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలోని వ్యవసాయ కళాశాలలో ఘనంగా వ్యవసాయ విద్యా దినోత్సవాన్ని బుధవారం ఘనంగా జరుపుకున్నారు. వరంగల్, హనుమకొండ, కాజీపేటలోని పాఠశాలల విద్యార్థులు వ్యవసాయ కళాశాలను సందర్శించారు. 396 మంది విద్యార్థులు, 16 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వ్యవసాయ రంగంలో సాధిస్తున్న ప్రగతి, పరిశోధనలను వివరించారు. అనంతరం విద్యార్థులు కళాశాలలోని సేద్య విభాగం, మృత్తిక శాస్త్రం, ఇంజనీరింగ్, పంటల సంరక్షణ ప్రయోగశాల, వృక్ష ప్రజనన విభాగాలు, ఉద్యాన ప్రయోగశాలలను సందర్శించారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన వివిధ అంశాలు తెలుసుకున్నారు. విత్తనరకాలు, విత్తే పద్ధతులు, మట్టి పరీక్ష విధానం, నేల రకాలు, నేలలో పోషకాలు, వివిధ పనిముట్లు, వాటి వినియోగం, ఉద్యాన పంటలు, వాటి యాజమాన్యం, పంటల్లో వచ్చే తెగుళ్లు, పురుగుల యాజమాన్యంపై కళాళాలలో వ్యవసాయ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు పాఠశాల విద్యార్థులకు వివరించారు. కళాశాలలో వానపాముల ఎరువు తయారీవిధానం, వ్యవసాయంలో వాటి వినియోగాన్ని తెలుసుకున్నారు. క్షేత్ర సందర్శన చేసిన విద్యార్థినీవిద్యార్థులకు ‘భారతదేశంలో వ్యవసాయరంగం పాత్ర’ అంశంపై క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల డీన్ డాక్టర్ వి.రవీంద్ర నాయక్, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. -
గురుకుల పాఠశాల నిర్వహణపై ఆగ్రహం
వరంగల్: ఆరెపల్లిలోని పాకాల కొత్తగూడకు చెందిన మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలికల గురుకుల పాఠశాల నిర్వహణపై కలెక్టర్ సత్యశారద ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్, డిప్యూటీ వార్డెన్లకు మెమోలు జారీ చేయాలని డీబీసీడీఓ పుష్పలతను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ సత్యశారద గురుకల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా స్టోర్ రూం, కిచెన్, డైనింగ్ హాల్ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. స్టోర్స్ అపరిశుభ్రంగా ఉండడం, మెనూ ప్రకారం భోజనం ఉండకపోవడంతో డిప్యూటీ వార్డెన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యానికి తావివ్వకుండా, మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పలు సబ్జెక్టుల్లో విద్యార్థుల పరిజ్ఞానాన్ని పరీక్షించారు. విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలున్నాయా అని అడిగారు. ఏమైనా సమస్యలుంటే ఫిర్యాదు బాక్స్లో వేయాలని సూచించారు. ప్రిన్సిపాల్, డిప్యూటీ వార్డెన్లకు మెమోలు జారీ చేయాలి వరంగల్ కలెక్టర్ సత్యశారద ఆదేశం -
వేయిస్తంభాల ఆలయ ఆదాయం రూ.12,04,168
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల దేవాలయంలో బుధవారం ఉదయం హుండీ లెక్కింపు నిర్వహించారు. 50 రోజుల హుండీ ఆదాయం రూ.4,57,768, పూజా టికెట్ల ద్వారా రూ. 7,46,400.. మొత్తం ఆదాయం రూ.12,04,168 వచ్చిందని ఈఓ ధరణికోట అనిల్కుమార్ తెలిపారు. పర్యవేక్షకుడిగా దేవాదాయశాఖ పరిశీలకుడు ప్రసాద్ వ్యవహరించారు. దేవాలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, అర్చకుడు మణికంఠ శర్మ అవధాని, సిబ్బంది మధుకర్, లింగబత్తుల రామకృష్ణ, రజిత, రాజరాజేశ్వర సేవాసమితి మహిళా సభ్యులు పాల్గొన్నారు. హన్మకొండ చౌరస్తా: హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి (జీఎంహెచ్) ఆర్ఎంఓగా డాక్టర్ అన్నెపాక మంజులను నియమిస్తూ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ ఉత్తర్వులు జారీ చేసింది. హనుమకొండ జిల్లా దామెర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్న మంజుల డిప్యూటీ సివిల్ సర్జన్గా పదోన్నతిపై జీఎంహెచ్ ఆర్ఎంఓగా బాధ్యతలు స్వీకరించారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఆమె ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో మెడికల్ ఆఫీసర్గా పనిచేశారు. ఖిలా వరంగల్: ఫిర్యాదుదారులతో గౌరవంగా మెదులుతూ, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ సూచించారు. ఈ మేరకు బుధవారం వరంగల్ మిల్స్కాలనీ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన సన్నిహిత సెంటర్ (హాల్)ను సెంట్రల్ జోన్ డీసీపీ ధారా కవిత, ఏఎస్పీ శుభం ప్రకాశ్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీస్స్టేషన్కు వివిధ పనులపై వచ్చే ప్రజలు, ఫిర్యాదుదారుల సమస్యలను తెలుసుకుని పరిష్కారం చూపాలని ఆయన ఆదేశించారు. సైబర్నేరాలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలని, రౌడీషీటర్లు, ఆకతాయిలు ఆగడాలను అరికట్టి ప్రజలకు రక్షణగా నిలవాలని సూచించారు. అనంతరం పోలీస్స్టేషన్ సీపీ సందర్శించారు. సిబ్బంది వివరాలు, పెండింగ్ కేసులను ప్రజలకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. పెండింగ్ కేసులను త్వరగా ఛేదించాలని ఆదేశించారు. అంతకు ముందుగా పోలీస్ సిబ్బంది ఆయనను స్వాగతిస్తూ గౌరవ వందనం సమర్పించారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ బొల్లం రమేశ్, ఎసైలు సుమన్, శ్రావణ్కుమార్ పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని క్యాంపస్ నెట్వర్కింగ్ను ఆధునికీకరించేందుకు బీఎస్ఎన్ఎల్కు వర్క్ ఆర్డర్ జారీచేసినట్లు కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం బుధవారం తెలిపారు. కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి సమక్షంలో వర్క్ ఆర్డర్పై విధివిధానాలపై సమీక్షించారు. రూసా నిధులతో విశ్వవిద్యాలయం కే హాబ్ స్టార్టప్స్, అంకుర సంస్థలను ప్రోత్సహించడం, మౌలిక వసతులు, క్యాంపస్లో ఇంటర్నెట్ సదుపాయాన్ని మెరుగుపరుస్తారు. రూసా అనుమతి పొందిన, మంజూరైన ప్రాజెక్టులు, అలాగే, ఇంజనీరింగ్ కళాశాలల్లో కొనాగుతున్న రీసెర్చ్ ప్రాజెక్టులకు అవసరమైన నెట్వర్క్ విస్తరించడం లక్ష్యంగా ఈవర్క్ ఆర్డర్ను బీఎస్ఎన్ఎల్కు జారీ చేసినట్లు రామచంద్రం తెలిపారు. క్యాంపస్ నెట్వర్కింగ్ వ్యవస్థను అభివృద్ధి చేసి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు బీఎస్ఎన్ఎల్ సహకారంతో రూ.1.29 కోట్లు యూనివర్సిటీ వెచ్చించనున్నట్లు రిజిస్ట్రార్ రామచంద్రం తెలిపారు. బీఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ అరవింద్కుమార్, డిప్యూటీ జనరల్ మేనేజర్ వి.కిషన్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సురేశ్, డివిజనల్ ఇంజనీర్ రజనీకరెడ్డి, రూసా నోడల్ అధికారి ఆర్.మల్లికార్జున్రెడ్డి, కేయూ అభివృద్ధి అధికారి వాసుదేవరెడ్డి, కంప్యూటర్ సైన్స్ విభాగం అధిపతి బి.రమ పాల్గొన్నారు. -
పాఠశాల సందర్శన
కాళోజీ సెంటర్: వరంగల్ నగరం ఎల్బీ నగర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మాసూమ్అలీని పూర్వ విద్యార్థి కేంద్ర మాజీ సమాచార శాఖ కమిషనర్ మాడభూషి శ్రీధర్ సందర్శంచారు. 55 సంవత్సరాల క్రితం ఈ పాఠశాల విద్యార్థి అని తన గత స్మృతులను గుర్తు చేసుకున్నారు. పదో తరగతి విద్యార్థులతో ముచ్చటించారు. తాము చదువుకునే రోజుల్లో కూర్చునేందుకు బల్లలు లేవని.. పాఠశాలకు డెస్క్ బెంచీలు అందజేసిన వన్నా ఖన్నాను అభినందించారు. హెచ్ఎం, ఉపాధ్యాయులతో చర్చించి పాఠశాలకు కావాల్సిన సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. పేద విద్యార్థులకు పూర్వవిద్యార్థులతో కలిసి స్కాలర్షిప్లు అందజేస్తానని తెలిపారు. తనకు తెలిసిన ఫౌండేషన్ సహాయ సహకారంతో పాఠశాల అభివృద్ధికి కృషిచేస్తానని వివరించారు. కార్యక్రమంలో హెచ్ఎం డాక్టర్ బీవీఎం స్వామి, ఉపాధ్యాయులు జయబాలరెడ్డి, కనకయ్య, భిక్షపతి, ఠయ్యాల శ్రీధరాచార్యులు, దేవేందర్, మోహన్, భాష్కర్, తదితరులు పాల్గొన్నారు. -
గర్భిణులకు జాగ్రత్తలు వివరించాలి
హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య ఎంజీఎం: వ్యాధినిరోధక టీకాల కేంద్రాల్లో గర్భిణులు, పిల్లలకు టీకాలు ఇప్పించడంతోపాటు వారు తీసుకోవాల్సిన పోషకాహారం, పాటించాల్సిన జాగ్రత్తల గురించి వివరించాలని హనుమకొండ జిల్లా వైద్యారోగ్యాధికారి డాక్టర్ అప్పయ్య వైద్య సిబ్బందికి సూచించారు. బుధవారం ఆయన నగరంలోని లష్కర్సింగారం పీహెచ్సీ పరిఽధిలోని గాంధీనగర్ అంగన్వాడీ కేంద్రం, గోపాలపూర్ వార్డు ఆఫీస్, గణేశ్నగర్ అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్న వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ కోసం ఉన్న లిస్టు, అందుల్లో ఎంత మందికి వ్యాక్సిన్ వాశారు, సమాచారం అందించేందుకు ఫోన్ మెసేజెస్, ఏఈఎఫ్ఐ కిట్లు, కోల్డ్ చైన్ మెయింటెనెన్స్ చేస్తున్నారా అనే వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గర్భిణిగా నమోదైనప్పటి నుంచి అన్ని జాగ్రత్తలు వివరించడంతోపాటు ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవం జరిగేలా కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా సిబ్బంది తమకు కొత్త హబ్ కట్టర్లు, వ్యర్థాల నియంత్రణకు రెడ్, బ్లాక్ బ్యాగులను అందజేయాలని డీఎంహెచ్ఓను కోరారు. త్వరలోనే అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. గోపాల్పూర్లో ప్రైవేట్ క్లినిక్ తనిఖీ గోపాల్పూర్లోని మహీ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ను స్థానిక వైద్యాధికారి హైదర్తో కలిసి డీఎంహెచ్ఓ అప్పయ్య తనిఖీ చేశారు. ఆస్పత్రి అనుమతి పత్రాలను పరిశీలించారు. అలాగే, కంట్రోల్ అథారిటీ జారీ చేసిన ఆదేశాల మేరకు మెడికల్ షాపుల్లో ఎంటీపీ కిట్లను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకూడదని, వివరాలను రిజిస్టర్లో తప్పక నమోదు చేయాలని ఆదేశించారు. -
దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ: దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు. హనుమకొండలోని అంబేడ్కర్ భవన్లో జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. కలెక్టర్ స్నేహ శబరీష్ జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. దివ్యాంగుల సౌకర్యార్థం అంబేడ్కర్ భవన్, కలెక్టరేట్లో ర్యాంపు సౌకర్యం ఏర్పాటు చేసేందుకు తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వేడుకల్లో భాగంగా దివ్యాంగ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వివిధ క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన దివ్యాంగులకు కలెక్టర్ స్నేహ శబరీష్ ప్రశంసపత్రాలు, జ్ఞాపికలు అందించారు. జిల్లా సంక్షేమ అధికారి జె.జయంతి అధ్యక్షతన జరిగిన వేడుకల్లో డీఆర్డీఓ మేన శ్రీను, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ ఇసంపల్లి జోనా, డీఎంహెచ్ఓ అప్పయ్య, కేయూ పాలకమండలి సభ్యురాలు డాక్టర్ కె.అనితారెడ్డి, విద్య ఫౌండేషన్ చైర్మన్ బిల్లా మహేందర్, దివ్యాంగ సంఘం ప్రతినిధులు రాజు, శ్రీనివాస్, సీడీపీఓ విశ్వజ, ఎఫ్ఆర్ఓ రవి కృష్ణ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఇన్చార్జ్ అధికారి ఎస్.ప్రవీణ్ కుమార్, చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ భాస్కర్, పోషణ్ అభియాన్ కోఆర్డినేటర్ సుమలత పాల్గొన్నారు. మిల్లర్లు తరుగు తీయొద్దు.. హన్మకొండ అర్బన్: రైతులు విక్రయించిన ధాన్యంలో రైస్ మిల్లర్లు తరుగు తీయొద్దని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. కలెక్టరేట్లో సీఎంఆర్, ధాన్యంలో తరుగు తీస్తున్నారని రైతుల ఫిర్యాదు మేరకు పౌరసరఫరాలు శాఖ అధికారులు, రైస్ మిల్లర్లతో కలెక్టర్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తరుగు పేరుతో రైతులను మిల్లర్లు ఇబ్బంది పెట్టొద్దన్నారు. అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వాజీద్ అలీ, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ మేనేజర్ మహేందర్, జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, పౌరసరఫరాల శాఖ అధికారులు, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు. -
శబరిమలకు ప్రత్యేక రైళ్లు
కాజీపేట రూరల్ : అయ్యప్ప మాలధారుల సౌకర్యార్థం శబరిమలకు వెళ్లేందుకు కాజీపేట, వరంగల్ మీదుగా ఆరు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ మంగళవారం తెలిపారు. రైళ్ల వివరాలు.. డిసెంబర్ 13వ తేదీన సిర్పూర్కాగజ్నగర్–కొల్లం జంక్షన్ (07117) ట్రైన్ వరంగల్కు చేరుకుని వెళ్తుంది. డిసెంబర్ 20వ తేదీల్లో చర్లపల్లి–కొల్లం జంక్షన్ (07121) ట్రైన్ వరంగల్కు చేరుకుని వెళ్తుంది. డిసెంబర్ 24వ తేదీన హజూర్ సాహిబ్ నాందేడ్ –కొల్లం జంక్షన్ (07123) ట్రైన్ వరంగల్కు చేరుకుని వెళ్తుంది. డిసెంబర్ 15వ తేదీన కొల్లం జంక్షన్–చర్లపల్లి (07118) ట్రైన్ వరంగల్, కాజీపేటకు చురుకుని వెళ్తుంది. డిసెంబర్ 22వ తేదీన కొల్లం జంక్షన్–చర్లపల్లి (07122) ట్రైన్ వరంగల్, కాజీపేటకు చేరుకుని వెళ్తుంది. డిసెంబర్ 26వ తేదీన కొల్లంజంక్షన్–చర్లపల్లి (07124) ట్రైన్ వరంగల్, కాజీపేటకు చేరుకుని వెళ్తుంది. కాళేశ్వరం మాస్టర్ ప్లాన్కు డ్రోన్తో సర్వే కాళేశ్వరం: వచ్చే ఏడాది జూలై చివరన జరగనున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని గోదావరినది పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు చెందిన క్షేత్ర కన్సల్టెన్సీ ఆర్కిటెక్చర్ల ఆధ్వర్యంలో మంగళవారం కాళేశ్వరం మాస్టర్ ప్లాన్పై డ్రోన్ కెమెరాతో సర్వే చేపట్టారు. వివిధ రహదారులు, పురాతన ఆలయాలు, వీఐపీ, మెయిన్ఘాట్ల నుంచి అంతర్రాష్ట్ర వంతెన వరకు సర్వే చేపట్టారు. ముఖ్యంగా మరుగునపడిన ఆలయాలన్నింటినీ పునరుద్ధరణ చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్లు తె లిసింది. దీంతో కాళేశ్వరం అభివృద్ధికి నిధులు మంజూరై పాలన అనుమతులు రావడమే ఆలస్యమని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆత్మవిశ్వాసం చాటిన యాసిడ్ బాధితురాలు● వైద్యసిబ్బంది, పోలీసుల సహకారంతో పరీక్షకు హాజరు ఎంజీఎం : కాజీపేట మండలం కడిపికొండ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం సాయంత్రం యాసిడ్ దాడిలో గాయాలపాలై ఎంజీఎంలో చికిత్స పొందుతున్న నర్సింగ్ విద్యార్థిని సునంద తన ఆత్మవిశ్వాసాన్ని చాటుకుంది. సదరు నర్సింగ్ విద్యార్థిని వైద్యసిబ్బంది, పోలీసులు సహకారంతో మంగళవారం నిర్వహించిన నర్సింగ్ పరీక్షకు హాజరైంది. పరీక్షకు హాజరయ్యేందుకు ఎంజీఎం సూపరింటెండెంట్ అనుమతి కోరడంతోపాటు పోలీసులను సంప్రదించింది. ఈ క్రమంలో పోలీసులు, వైద్యసిబ్బంది పర్యవేక్షణలో పరీక్షలకు హాజరయ్యేందుకు అనుమతిచ్చారు. కేఎంసీలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రానికి వైద్యసిబ్బంది పర్యవేక్షణలో ప్రత్యేక అంబులెన్స్లో తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విచారణ వేగవంతం.. కాజీపేట అర్బన్: నర్సింగ్ విద్యార్థిని సునందపై యాసిడ్ దాడికి పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు విచారణ వేగవంతం చేసినట్లు మడికొండ ఇన్స్పెక్టర్ పుల్యాల కిషన్ తెలిపారు. ఘటన చోటు చేసుకున్న ప్రాంతంతోపాటు కాజీపేట, కడిపికొండ ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు వివరించారు. -
రక్తదానం మానవత్వానికి ప్రతీక
వరంగల్ లీగల్: రక్తదానం సేవా కార్యక్రమం మాత్రమే కాదని, అది మానవత్వానికి ప్రతీక అని వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు నిర్మలా గీతాంబ, పట్టాభిరామారావు అన్నారు. వరంగల్ డీఎల్ఎస్ఏ, బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా మంగళవారం జిల్లా కోర్టులోని డీఎల్ఎస్ఏ హాల్లో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని న్యాయమూర్తులు ప్రారంభించారు. అనంతరం రక్తదానం చేసిన దాతలకు పండ్లు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సాయికుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వలుస సుధీర్, ఉపాధ్యక్షుడు మైదం జయపాల్, ప్రధాన కార్యదర్శి రమాకాంత్, సంయుక్త కార్యదర్శి శ్రీధర్, మహిళా సంయుక్త కార్యదర్శి శశిరేఖ, కోశాధికారి సిరిమల్ల అరుణ, కార్యవర్గ సభ్యులు సురేశ్, కళకోట్ల నిర్మల జ్యోతి, రాజు, రవి, అరుణ, ఇతర న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. -
40ఏళ్లు ఒక్కరే సర్పంచ్!
సాక్షి, మహబూబాబాద్ : ఒకసారి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన నాయకుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఐదేళ్లు పూర్తిగా పనిచేస్తారో లేదో తెలియని పరిస్థితి. కానీ, ఏకంగా నాలుగు దశాబ్దాలపాటు తిరుగులేని స ర్పంచ్గా రికార్డు సృష్టించారు మహబూబాబాద్ జి ల్లా నర్సింహులపేట గ్రామ మాజీ సర్పంచ్ నాయి ని మనోహర్ రెడ్డి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1952లో జరిగిన ఎన్నికల్లో గ్రామ తొలి సర్పంచ్గా చెక్కల చంద్రారెడ్డి గెలిచారు. ఆయన మూడేళ్లు పని చేసిన తర్వాత 1955లో నాయిని మనోహర్ రెడ్డి సర్పంచ్గా నియమితులయ్యారు. అప్పటినుంచి వ రుసగా గెలుస్తూ.. 1995 వ రకు ఆయనే సర్పంచ్గా పనిచేశారు. పోటీ చేసిన ప్రతీసారి మనోహర్ రెడ్డి గెలుపొందారు. చివరకు వయస్సు మీద పడడంతో పోటీనుంచి తప్పుకుని మరో నాయకుడికి సర్పంచ్గా అవకాశం కల్పించారు ఆ గ్రామస్తులు. సౌమ్యుడిగా పేరున్న మనోహర్ రెడ్డి ఎన్నికల సమయంలో తప్ప.. మిగిలిన సమయంలో అన్ని వర్గాలతో మమేకమే ఉండటం.. గ్రామంలో ఎలాంటి గొడవలకు తావులేకుండా చూడడం ఆయన ప్రత్యేకత. అందుకోసమే ఇప్పటికీ ఆ గ్రామంనుంచి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టేందుకు గ్రామస్తులు ఇష్టపడరని.. అది ఆయన గ్రామస్తులకు నేర్పించిన మంచితనంగా గ్రామస్తులు చెప్పుకుంటారు. పోటీచేసిన ప్రతీసారి గెలుపే విరమణ తర్వాతనే మరో సర్పంచ్ రికార్డు సృష్టించిన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట సర్పంచ్ నాయిని మనోహర్రెడ్డి -
ఏకగ్రీవం నుంచి పోటీ దిశగా ఆశాలపల్లి గ్రామం
సంగెం: వరంగల్ జిల్లా సంగెం మండలం ఆశాలపల్లి సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం నుంచి పోటీ దిశగా వెళ్లింది. గతంలో గ్రామంలో అందరికి తెలిసి ఉన్న ఎకై క ఎస్సీ మహిళ కొంగర మల్లమ్మనే జాక్పాట్ సర్పంచ్ అవుతారనే ఊహాగానాలకు మంగళవారం తెరపడింది. గ్రామానికి చెందిన రాయపురం కార్తీక్ కొంతకాలం క్రితం ఖిలావరంగల్ మండలం నక్కలపల్లికి చెందిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రొడ్డ నవ్యశ్రీని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇంటర్ వరకు చదువుకున్న నవ్యశ్రీని అనూహ్యంగా బీఆర్ఎస్, బీజేపీలు సంయుక్తంగా తెరపైకి తీసుకుని వచ్చి మంగళవారం నామినేషన్ దాఖలు చేయడంతో సర్పంచ్ పదవికి పోటీ అనివార్యమైంది. దీంతో ప్రేమలో గెలిచి పెళ్లి చేసుకున్న నవ్యశ్రీ సర్పంచ్ ఎన్నికల్లో నెగ్గి గ్రామ ప్రఽథమ పౌరురాలిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుందో లేక అధికార పార్టీ మద్దతు పొందిన కొంగర మల్లమ్మ సర్పంచ్గా అదృష్టాన్ని పొందుతుందో వేచిచూడాల్సిందే. కొంగర మల్లమ్మకు పోటీగా నామినేషన్ వేసిన ప్రేమ వివాహం చేసుకున్న యువతి -
ఏకగ్రీవానికి వేలం!
● జోరుగా నామినేషన్లు హసన్పర్తి : హసన్పర్తి మండలం గుంటూరుపల్లి సర్పంచ్ పదవి ఏకగ్రీవానికి గ్రామస్తులు మంగళవారం సమావేశమయ్యాయి.ఈ సందర్భంగా ఎన్నికకు వేలం వేశారు. ఇందులో వచ్చిన డబ్బులను గ్రామాభివృద్ధికి ఖర్చుచేయాలని నిర్ణయించారు. సర్పంచ్ పదవికి ఐదుగురు అభ్యర్థులు ముందుకొచ్చారు. రూ.10 లక్షల నుంచి రూ.16.50లక్షల వరకు వేలం పాడారు. అయితే చివరికి ఓ అభ్యర్థి తాను పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో నామినేషన్ల దాఖలు సంఖ్య ఐదు నుంచి ఆరుకు చేరుకుంది. బైరాన్పల్లిలో కుదరని సయోధ్య.. బైరాన్పల్లి సర్పంచ్ పదవి ఏకగ్రీవానికి నిర్ణయించుకున్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఇద్దరు అభ్యర్థులు తమ నామినేషన్లు పూరించారు. అయితే ఇద్దరి మధ్య సయోధ్య కుదరలేదు. దీంతో అదనంగా మరో మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక్కడ ఏకగ్రీవానికి స్థానికులు యత్నిస్తున్నట్లు తెలిసింది. జోరుగా నామినేషన్లు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా గ్రామాల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ముఖ్యంగా అధికార పార్టీ మద్దతు కోరుతూ పెద్ద ఎత్తున అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. సర్పంచ్కే కాకుండా వార్డు సభ్యుల స్థానాలకు కూడా భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి.


