వెండి ఆభరణాల దొంగ అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

వెండి ఆభరణాల దొంగ అరెస్ట్‌

Feb 3 2026 7:07 AM | Updated on Feb 3 2026 7:07 AM

వెండి ఆభరణాల దొంగ అరెస్ట్‌

వెండి ఆభరణాల దొంగ అరెస్ట్‌

రామన్నపేట : ఇంతేజార్‌గంజ్‌ పీపీఎస్‌ పరిధిలో ఈ నెల 29న వెండి ఆభరణాలను అపహరించిన దొంగను పట్టుకున్నట్లు వరంగల్‌ ఏసీపీ శుభం ప్రకాశ్‌ తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన పంకజ్‌యాదవ్‌ తన అనుచరులు విమల్‌యాదవ్‌, ముఖేష్‌ సోనీకు ఐదు కిలోల వెండి ఆభరణాలు అప్పగించి వరంగల్‌లో విక్రయించి రావాలని సూచించారు. దీంతో ఈ నెల 29వ తేదీన విమల్‌, సోనీ ఆభరణాలతో హనుమకొండకు చేరుకుని ఆటోలో వరంగల్‌ వైపునకు ప్రయాణిస్తున్నారు. ఈ సమయంలో వెండి ఆభరణాల విషయం గురించి మాట్లాడుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన డ్రైవర్‌.. విమల్‌యాదవ్‌, ముఖేష్‌ సోనీ ఆటో దిగిన వెంటనే వెండి ఆభరణాలు ఉన్న బ్యాగుతో పరారయ్యాడు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఆటోను గుర్తించి అపహరించిన వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకుని కాశిబుగ్గ చెందిన ఆటో డ్రైవర్‌ మెరుగు వెంకట్‌ను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement