ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరించుకోవాలి
హన్మకొండ: విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని విద్యుత్ ఉద్యోగ సంఘాల నాయకులు డి మాండ్ చేశారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా.. తెలంగాణ పవ ర్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈసందర్భంగా టీఎస్ఈఈయూ–327 ఎన్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షుడు పి.మహేందర్ రెడ్డి, తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంఘం–1104 కార్యదర్శి రమణ, తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంద్రసేనారెడ్డి, విద్యుత్ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎన్పీడీసీఎల్ సెక్రటరీ అజ్మీరాశ్రీరాం నాయక్, బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఎన్పీడీసీఎల్ కంపెనీ సెక్రటరీ నీలారపు రాజేందర్ మా ట్లాడుతూ విద్యుత్ సంస్థలను ప్రయివేటీకరించడం వల్ల వినియోగదారులపై భారం పెరుగుతుందన్నారు. ఉద్యోగావకాశాలు పోతాయన్నారు. కేంద్రం ఈ అంశంపై వెనక్కి తగ్గకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్నా రు. ఎన్పీడీసీఎల్ చీఫ్ ఇంజనీర్లు రాజు చౌహాన్, సదర్లాల్, ఆయా సంఘాల నాయకులు సామ్యానాయక్, సుబ్రహ్మణ్యేశ్వర్రావు, మల్లి కార్జున్, సదానందం, ఓదెలు, బుచ్చయ్య గౌడ్, జశ్వంత్ కుమార్, పాల్గొన్నారు.


