కాకినాడ క్రైం: కొద్ది రోజుల క్రితం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ విడుదల ఉద్యోగ ప్రకటనలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఈ మేరకు కాకినాడ డీఎంహెచ్ఓ డాక్టర్ నరసింహనాయక్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్ఐసీ మెరిట్ లిస్టులో అభ్యంతరాలు ఉంటే ఈ నెల 9 నుంచి 11వ తేదీ మధ్య కాకినాడ డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి 5 గంటల మధ్య దరఖాస్తులు సమర్పించాలని కోరారు. ఎన్ఐజీ మెరిట్ జాబితా ఈస్ట్గోదావరి.ఏపీ.జీఓవీ.ఇన్, కాకినాడ.ఏపీ.జీఓవీ.ఇన్, కోనసీమ.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లలో పొందుపరిచినట్లు ఆయన తెలిపారు.


