breaking news
Kakinada District Latest News
-
భత్యం కరవు
● డీఏల ఊసెత్తని కూటమి సర్కార్ ● తీరని కలగా 12వ పీఆర్సీ ఏర్పాటు ● ఆందోళనలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు రాయవరం: నేను మారిన మనిషిని.. ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బంది కలిగించను. వారి సంక్షేమం కోసం పాటుపడతాను.. ఈ మాటలను ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఆ మాటలను పట్టించుకోకపోవడంతో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో నిరాశ అలముకుంది. ఒకవైపు నిత్యావసరాల ధరలు కళ్లెం లేని గుర్రంలా దౌడు తీస్తుంటే, ఉద్యోగులకు ప్రకటించాల్సిన కరవు భత్యం (డీఏ) విషయంలో ప్రభుత్వం స్పందించడం లేదు. మరోవైపు ఉద్యోగులకు పీఆర్సీ కమిటీ నియామకంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు గడిచినప్పటికీ కనీసం ఒక్క డీఏ కూడా ఇవ్వకపోవడంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని వివిధ శాఖల్లో సుమారు 60 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. 11వ పీఆర్సీ గడువు 2023 జూలైతో ముగిసింది. గత ప్రభుత్వం 12వ పీఆర్సీ చైర్మన్గా మన్మోహన్సింగ్ను నియమించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 12వ పీఆర్సీని రద్దు చేసింది. ఆ స్థానంలో పే రివిజన్ కమిటీ చైర్మన్గా కొత్త వ్యక్తిని నియమించి, పీఆర్సీ ప్రతిపాదనలను తయారు చేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాదిన్నర కావస్తున్నప్పటికీ పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయక పోవడం, ఐ.ఆర్ ప్రకటించక పోవడం, నాలుగు డీఏల్లో కనీసం ఒక్క డీఏ కూడా ప్రకటించక పోవడం పట్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పీఆర్సీ ఏర్పాటు చేయాలని, ఐ.ఆర్ ప్రకటించాలని, తక్షణమే రెండు డీఏలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తులు చేశాయి. అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన రేకెత్తుతుంది. అలాగే గతంలో ప్రకటించిన డీఏలకు సంబంధించి అరియర్స్ కూడా చెల్లించాలి. సగటున ఒక్కో ఉద్యోగికి సుమారు రూ.50 వేలు అనుకున్నా.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు కలిపి 60 వేల మంది వరకూ సుమారు రూ.300 కోట్ల వరకూ డీఏ అరియర్ చెల్లించాలి. డీఏల మాటెత్తని సర్కార్ కేంద్ర ప్రభుత్వం కరవు భత్యం ప్రకటించగానే అందుకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దామాషా పద్ధతిలో ఉద్యోగులకు కరవు భత్యం ప్రకటించాలి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మూడు డీఏలు ప్రకటించి, 2025 జూలై డీఏ ప్రకటించడానికి కేంద్ర క్యాబినెట్ మూడు శాతం చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క డీఏ కూడా ఉద్యోగులకు ప్రకటించలేదు. 2024 జనవరి నుంచి ఇప్పటి వరకూ నాలుగు విడతలు డీఏలను ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం 33.67 శాతం డీఏ చెల్లిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన 2025 జూలై డీఏతో కలిపి 58 శాతం డీఏ చేరుతుంది. ప్రస్తుతం అమలవుతున్న పీఆర్సీ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఒక శాతం డీఏ ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వం 0.91 శాతం డీఏ ఇవ్వాల్సి ఉంది. ఆ ప్రకారంగా 12 శాతానికి 10.92 శాతం డీఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది. అలాగే గతంలో మంజూరు చేసిన డీఏల అరియర్స్ కూడా ఇవ్వాలి. 2024 మే నెలలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి ప్రభుత్వం డీఏల ఊసెత్తడం లేదు. 2024 జనవరి, 2024 జూలై, 2025 జనవరి, 2025 జూలై డీఏలు ఇవ్వాలి. -
మాకు జీవనోపాధి కల్పించాలి
టాటా మ్యాజిక్ ఓనర్స్, డ్రైవర్స్ యూనియన్ నాయకుల వినతి బోట్క్లబ్ (కాకినాడ సిటీ): మహిళలకు ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో తమకు జీవనోపాధి లేకుండా పోయిందని టాటా మ్యాజిక్ ఓనర్స్, డ్రైవర్స్ యూనియన్ నాయకు లు ఆవేదన వ్యక్తం చేశారు. తమ వాహనాలకు డీజిల్ వేయించి రోజుకి రూ.1,250 చెల్లించి మహిళల ఉచిత ప్రయాణంలో భాగస్వాములు చేయాలని కోరుతూ మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో అర్బన్ తహసీల్దార్ జితేంద్రకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా యూనియన్ కాకినాడ జిల్లా అధ్యక్షుడు వాలిశెట్టి శ్రీను మాట్లాడుతూ టాటా మ్యాజిక్ వాహనాలకు మహిళా ప్రయాణికులే ఆధారమన్నారు. వాహనం తిరిగినా, తిరగకపోయినా ఏడుగురు ప్యాసింజర్లు గల వాహనానికి మూడు నెలలకు రూ.5,500, తొమ్మిది మంది ప్యాసింజర్లు ప్రయాణించే వాహనానికి రూ.7,200 ట్యాక్స్ చెల్లిస్తున్నామన్నారు. ఇవికాకుండా ఇన్సూరెన్స్, టోల్ ట్యాక్స్ తప్పదన్నారు. ప్రస్తుతం టాటా మ్యాజిక్ డ్రైవర్స్ పూర్తిగా రోడ్డున పడ్డామన్నారు. ఒడిశా రాష్ట్రంలో మాదిరి టాటా మ్యాజిక్ వాహనాలకు లైఫ్ ట్యాక్స్ ఉండాలన్నారు. టాటా మ్యాజిక్లతో పాటు ఇతర ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ అందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్ రద్దు చేసి ప్రభుత్వమే నిర్వహించాలని, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కోరారు. తుని, కత్తిపూడి, పిఠాపురం, కాకినాడ యూనియన్ నాయకులు రెడ్డి వీరబాబు, పి.సూర్యచక్రం, జి.రాజేష్, వాసంశెట్టి శ్రీనివాస్, పి.మణి, ఎ.సతీష్, బి.సత్యనారాయణమూర్తి, వి.హేమకుమార్ పాల్గొన్నారు. -
అనాలోచిత నిర్ణయం
ప్రభుత్వ అనాలోచిత విధానాలతో ప్రైవేట్ విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఫీజులు, పుస్తకాల పేరుతో ఇప్పటికే రూ.లక్షల్లో దోపిడీ చేస్తున్నాయి. వీటిని అడ్డుకునేవారు లేకుండా చేయడం కోసం అడ్డగోలు జీఓలు విడుదల చేస్తున్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో సమస్యలపై స్పందించేవారు లేకపోతే అధికారులు, ప్రభుత్వం ఎలా చేసినా అడిగేవారు లేకుండా పోతారు. – ఎం.గంగా సూరిబాబు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆంక్షలు ఎత్తేయాలి విద్యారంగంలోని సమస్యలపై ప్రశ్నించే హక్కు రాజ్యాంగం కల్పించింది. అలాంటి హక్కులను కాలరాసేందుకు కూటమి ప్రభుత్వం కుటిల యత్నాలు చేయడం దుర్మార్గం. విద్యను వ్యాపారం చేస్తున్న కళాశాలలపై గళం విప్పితే ఆంక్షలు విధించడం ఈ ప్రభుత్వానికే చెల్లింది. తక్షణం విద్యార్థి సంఘాలపై ఆంక్షలు ఎత్తివేయాలి. – బి.సిద్దూ, పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి విద్యార్థి సంఘాలపై ఆంక్షలు దుర్మార్గం కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. ఇచ్చిన హామీల అమలుకు విద్యార్థి సంఘాలు నిలదీశాయి. ప్రభుత్వ బడుల్లో, కళాశాలల్లో వసతులపై గళం విప్పాయి. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకే విద్యార్థి సంఘాలు ప్రయత్నించాయి. ఆంక్షల పేరుతో విద్యాసంస్థల్లోకి అనుమతులు లేకుండా జీఓలు జారీ చేయడం దుర్మార్గం. – పి.రవితేజ, నిరుద్యోగ జేఎసీ కన్వీనర్ ● -
మరోసారి ఆగిన సర్వే
అన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఘాట్ రోడ్ పక్కనే పంపా రిజర్వాయర్ను ఆనుకుని ఉన్న నిర్మాణాల స్థల వివాదంపై మంగళవారం జిల్లా లాండ్ రికార్డులు, సర్వే శాఖ అధికారులు నిర్వహించిన జాయింట్ సర్వే మధ్యలో నిలిచిపోయింది. వివాద స్థలంలోకి దేవస్థానం ఈఓ, సిబ్బంది వెళ్లడానికి వీలు లేదని జూలై 31న పెద్దాపురం కోర్టు ఇంజక్షన్ ఆర్డర్స్ ఇచ్చిందని ఆ స్థలంలో హోటల్, బోట్షికారు నిర్వహిస్తున్న దాసరి హరగోపాల్ పెద్దాపురం ఆర్డీఓ కే రమణికి తెలపడంతో ఆమె కోర్టు ఆర్డర్స్ ఒరిజినల్ కాపీ తమకు అందజేయాలని ఆదేశించారు. అనంతరం సర్వేను నిలిపివేశారు. ఈ స్థల వివాదంపై జాయింట్ సర్వే చేయడం ఇది ఐదోసారి. అయినా ఫలితం తేలకపోవడం విశేషం. దేవస్థానం, ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల సమక్షంలో జాయింట్ సర్వే కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం పంపా రిజర్వాయర్ స్లూయిజ్ గేట్లు ఎదురుగా గల కొండ వద్ద నుంచి పవర్ హౌస్ వద్దకు వెళ్లే మార్గంలోని హరిణి బోట్ షికార్ నిర్మాణాల వరకు జాయింట్ సర్వే నిర్వహించారు. లాండ్ ప్రొటెక్షన్ సెల్ స్పెషల్గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ డి.భారతి, డిస్ట్రిక్ట్ లాండ్ రికార్డ్స్ అండ్ సర్వే డీఈ కె.శ్రీనివాస్, అన్నవరం దేవస్థానం ఈఓ సుబ్బారావు, ఈఈ రామకృష్ణ, ఏఈఓ శ్రీనివాస్, రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తరఫున ఈఈ శేషగిరిరావు హాజరయ్యారు. సర్వే సగం పూర్తయ్యాక పెద్దాపురం ఆర్డీఓ కే రమణి వచ్చి సర్వేను పరిశీలించారు. అదే సమయంలో లీజుదారుడు దీనిపై ఇంజెక్షన్ ఆర్డర్ ఉందని చెప్పడంతో సర్వే అర్ధాంతరంగా నిలిపివేశారు. -
పోరాటం ఉధృతం
తక్షణం ప్రభుత్వం పీఆర్సీని ఏర్పాటు చేయాలి. అలాగే ఐ.ఆర్ ప్రకటించి, కనీసం రెండు డీఏలను ఇవ్వాలి. ఉద్యోగులు, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్ల విషయంలో పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఈ విషయంలో కలిసొచ్చే సంఘాలతో ఉమ్మడి కార్యాచరణ చేపడతాం. –పి.సురేంద్రకుమార్, కోనసీమ జిల్లా అధ్యక్షుడు, యూటీఎఫ్ అభద్రతా భావం ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం సానుకూల దృక్ఫథంతో వ్యవహరించాలి. పీఆర్సీ ఏర్పాటు, ఐ.ఆర్ ప్రకటన, డీఏల ప్రకటన విషయంలో ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. ఇలాగే కొనసాగితే ఉద్యోగుల్లో అభద్రతా భావం ఏర్పడుతుంది. ఎంతటి పోరాటానికై నా ఎస్టీయూఏసీ, ఫ్యాఫ్టో తరఫున సిద్ధంగా ఉన్నాం. –పోతంశెట్టి దొరబాబు, కోనసీమ జిల్లా అధ్యక్షుడు, ఎస్టీయూ, ప్రధాన కార్యదర్శి ఫ్యాఫ్టో మాట నిలుపుకోవాలి కూటమి నాయకులు ఎన్నికల ముందు ఉద్యోగులు, ఉపాధ్యాయుల విషయంలో ఇచ్చిన హామీలను నిలుపుకోవాలి. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పీఆర్సీ నియమిస్తామని, ఐ.ఆర్ ప్రకటిస్తామని చెప్పిన ప్రభుత్వం ఏడాది గడిచినా ఆ మాట ఎత్తకపోవడం బాధాకరం. దసరా కానుకగా కనీసం రెండు డీఏలను ఇవ్వాలి. పీఆర్సీ కమిటీని నియమించి, జనవరి లోపు 12వ పీఆర్సీ అమలు చేయాలి. –పి.నరేష్బాబు, కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి,ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఉద్యోగుల్లో అసంతృప్తి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయక పోవడం పట్ల ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో అసంతృప్తి బయట పడుతుంది. అది ఉద్యమ రూపం దాల్చక ముందే ప్రభుత్వం స్పందించాలి. కూటమి ప్రభుత్వంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉద్యమ బాట చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. తక్షణం 12వ పీఆర్సీ చైర్మన్ నియమించి, డీఏలు ఇవ్వాలి. –ధీపాటి సురేష్బాబు, కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి, పీఆర్టీయూ -
హక్కులపై ఉక్కు పాదమా?
బాలాజీచెరువు (కాకినాడ): కూటమి ప్రభుత్వ చర్యలు విద్యార్థులు, ఉపాధ్యాయుల స్వేచ్ఛను, ప్రజాస్వామ్య హక్కులను హరించేలా ఉన్నాయి. విద్యార్థి సంఘాలను నియంత్రించి, వారి గొంతును అణచివేయడమే లక్ష్యంగా పెట్టుకుంది కూటమి సర్కారు. రాజ్యాంగం కల్పించిన విద్యార్థుల హక్కుకూ సంకెళ్లు వేస్తూ నిరంకుశ పాలనను కొనసాగిస్తోందని విద్యార్థి సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 1,285 ప్రభుత్వ పాఠశాలలు, 47 జూనియర్ కాలేజీలున్నాయి. గత నెలలో విద్యార్థి సంఘాల నేతలు ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలు, పాఠశాలల్లో వసతుల లేమిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో ప్రభుత్వం విద్యార్థి సంఘాలపై కక్ష పెంచుకుని పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలోకి విద్యార్థి సంఘాల నేతల ప్రవేశానికి అనుమతులు ఇవ్వద్దంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు నిరంకుశత్వానికి నిదర్శనం కళాశాల్లోకి రాకూడదంటూ ఇచ్చిన జీఓపై విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యను వ్యాపారంగా మార్చడం, వసతి గృహాల్లో నాసిరకమైన వసతులు, పలు సమస్యలు, ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లకు అధిక ఫీజు వసూలు, అధిక ధరలకు పుస్తకాలు అమ్మడంపై విద్యార్థి సంఘాలు ప్రశ్నించి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. విద్యా ప్రమాణాలు పాటించని ప్రైవేట్ కళాశాలలపై విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. దీంతో ప్రభుత్వం జూనియర్ కళాశాల్లోకి సైతం విద్యార్థి సంఘాల నేతలకు అనుమతి లేదంటూ మరో జీఓ జారీచేసింది. విద్యార్థి సంఘాలు విద్యారంగంలో సమస్యల పరిష్కారం కోసం, విద్యార్థుల హక్కుల కోసం పోరాడటమే కాకుండా, విద్యార్థుల్లో సామాజిక చైతన్యాన్ని పెంపొందిస్తాయి. నాయకత్వ లక్షణాలను, సామాజిక అవగాహనను, హక్కులు, బాధ్యతలను నేర్పిస్తాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వ చర్యల వెనుక విద్యార్థి సంఘాలను అణచివేయడం ద్వారా ప్రశ్నించి పోరాడే శక్తులను నిలువరించాలని, విద్యార్థుల్లో సామాజిక చైతన్యం లేకుండా చేయాలనే ఉద్దేశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులు ప్రజాస్వామ్య విరుద్ధమైనవని, నిరంకుశత్వ ధోరణికి నిదర్శనమని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. విద్యాసంస్థల్లోకి విద్యార్థి సంఘాల నేతల ప్రవేశంపై నిషేధం కళాశాలల్లోకి సైతం అనుమతి లేదని జీఓ కూటమి పాలనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు -
విద్యారంగ సమస్యలపై ర్యాలీ
1500 మందితో భారీ ర్యాలీ బోట్క్లబ్: విద్యారంగంలోని సమస్యలను పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక బాలాజీ చెరువు సెంటర్ నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు 1500 మందితో భారీ ర్యాలీ నిర్వహించి, ధర్నా చేశారు. ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి.శ్రీకాంత్, ఎం. గంగా సూరిబాబు సంయుక్తంగా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని నిర్వీర్యం చేయడం కోసం చూస్తున్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యావిధానం ద్వారా పేద, మధ్యతరగతి విద్యార్థులకు విద్యా అందని ద్రాక్షగా తయారయిందని విమర్శించారు. నూతన జాతీయ విద్యా విధానం వల్ల విద్య మొత్తం కేంద్రీకరణ, కాషాయీకరణ, ప్రైవేటీకరణ అవుతుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోను పూర్తిగా అమలు చేయనటువంటి నూతన జాతీయ విద్యావిధానాన్ని మన రాష్ట్రం అమలు చేయడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యారంగాన్ని సమూలంగా మార్పులు చేస్తామని, చెప్పి నేడు ఎటువంటి మార్పులు లేకుండా గత ప్రభుత్వం చేసిన విధానాల్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న రూ.6400 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదన్నారు. దీని వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థులు ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో చదువుకున్న వారికి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ప్రభుత్వం వేయక, విద్యార్థులను పరీక్షలు రాయనివ్వకుండా, విద్యార్థులు సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యాసంస్థలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంక్షేమ హాస్టల్లో మెరుగైన వసతులు కల్పిస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం సంక్షేమ హాస్టల్లో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. శాశ్వత భవనాలు లేక అద్దె భవనాల్లో ఉంటూ అరకొర సౌకర్యాలతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారని 2018లో ఇచ్చిన మెనూనే, నేటికీ అమలు చేయాలని చెప్పేటువంటి ఈ ప్రభుత్వం, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచకపోవడం దుర్మార్గమన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలను రూ.3 వేలకు పెంచాలని, విద్యార్థులకు ఇచ్చే కాస్మోటిక్ చార్జీలు ప్రతి నెల ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో గొల్లప్రోలు, ఉప్పాడ, కొత్తపల్లి, ప్రత్తిపాడు, కోటనందూరు మండలాల్లో జూనియర్ కళాశాలలకు భవనాలు లేక విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లాలో సంక్షేమ హాస్టల్కు శాశ్వత భవనాలు లేక అద్దె భవనాల్లో ఉంటూ బిక్కుబిక్కుమంటూ విద్యార్థులు చదువులు కొనసాగుతున్నాయని విమర్శించారు. కాకినాడ నడిబొడ్డున ఉన్న అంబేడ్కర్ హాస్టల్కు గత మూడేళ్ల నుంచి నూతన భవనం నిర్మిస్తున్నామని చెప్పి, నేటికీ భవనం పూర్తయినా ప్రారంభించకుండా జిల్లా అధికారులు ఇతర కార్యక్రమాలకు ఉపయోగించుకుంటున్నారన్నారు. అనంతరం దాదాపు 54 సమస్యలను గుర్తించి వినతి పత్రాన్ని జేసీ రాహుల్ మీనాకు అందజేశారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు సిద్ధూ, సాహిత్, వాసుదేవ్, నాగరాజు, మణికంఠ, ఉదయ్కుమార్, జయరాం, సత్యం, చిన్ని, గోపాలకృష్ణ, రవి, నాని, తదితరులు పాల్గొన్నారు. -
ఇదేం భూగోతం
● ఎకరా కన్వర్షన్కు రూ.3 లక్షలు ఇవ్వాల్సిందే.. ● లేకుంటే నో పర్మిషన్ ● ముఖ్యనేతకు ముడుపుల మూట ● సొంత పార్టీ అయినా ససేమిరా.. ● పేట్రేగిపోతున్న కూటమి నేతలు సాక్షి ప్రతినిధి, కాకినాడ: కూటమి నేతలు చెలరేగిపోతున్నారు. తన, తమ భేదం లేకుండా ఎవరైనా పైసలు ఇవ్వందే పని కాదంటున్నారు. పై నుంచి కింది వరకు నేతలందరిదీ ఒకటే దారి అన్నట్టుగా ఉంది. మట్టి, గ్రావెల్, ఇసుక, లిక్కర్తోనే సరిపెట్టకుండా రియల్టర్లను కూడా విడిచిపెట్టడం లేదు. జిల్లా కేంద్రం కాకినాడ నగరానికి నాలుగుపక్కలా ఉన్న కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జనసేన నేతలు రియల్ దందా మూడు ప్లాట్లు, నాలుగు లే అవుట్లుగా నడుస్తోంది. లే అవుట్ వేయడమే పాపం అన్నట్టు లక్షలు మెక్కేస్తున్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటు పెట్టి సొమ్ములు ఇస్తేనే సై అంటున్నారు. అన్నంత ఇవ్వకుంటే లే అవుట్లను మధ్యలోనే ఆపేస్తున్నారు. ఈ విషయంలో సొంత పార్టీ నేతలను సైతం విడిచిపెట్టడం లేదు. కాకినాడ రూరల్, కరప మండలాల్లో జరుగుతోన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం నియోజకరవర్గ ముఖ్యనేతకు కాసులు కురిపిస్తోంది. చివరకు సొంత వ్యవసాయ భూమిని ప్లాట్లుగా అమ్ముకుందామన్నా కూడా కప్పం కట్టాల్సిందేనని పంతం పట్టిమరీ వసూళ్లకు తెగబడుతున్నారు. ఈ రియల్ దందా అంతా కాకినాడ పరిసర ప్రాంతాల్లో సినిమాటిక్గా జరుగుతోంది. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కౌడా) పరిధిలోకి వచ్చే రూరల్ నియోజకవర్గం లే అవుట్లకు కేరాఫ్గా నిలుస్తోంది. ఈ నియోజకవర్గానికి జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. విద్య, వైద్యం, వ్యాపార అవసరాల కోసం అటు కోనసీమ, ఇటు తూర్పుగోదావరి జిల్లాల్లోని నగరాలు, పల్లెల నుంచి కాకినాడ నగరానికి వలసలు పెరుగుతూ వస్తున్నాయి. ఏటా పెరుగుతూ వస్తున్న నగర జనాభా ప్రస్తుతం నాలుగున్నర లక్షల పైమాటే. వలసలు వచ్చే కుటుంబాలతో పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు కాకినాడ నగరంలో నివాసం పెద్ద సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో కాకినాడ నగరానికి ఆనుకుని ఆరేడు కిలోమీటర్ల వరకు రూరల్ నియోజకవర్గ పరిధిలో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూములు వ్యవసాయేతర భూములుగా మారుతున్నాయి. ఈ భూములను రియల్టర్లు కొనుగోలు చేసి ప్లాట్లుగా విభజించి విక్రయిస్తున్నారు. ఎకరాల్లో భూములు కొనుగోలు చేసి లేఅవుట్లు చేసి గజాల్లో విక్రయిస్తున్నారు. ఈ వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్పు చేసే సమయంలో నియోజకవర్గ ముఖ్యనేత అనుచరులు ఆ భూముల్లో గద్దల్లా వాలిపోతున్నారు. రియల్టర్లతో బేరసారాలకు తెరతీస్తున్నారు. అనుకున్నట్టు గానే పంతం పట్టి కప్పం కట్టించుకుంటున్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటు నిర్ణయించి జనసేన నేతలు ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. అది సొంత పార్టీ అయినా.. కూటమి నేతలైనా నియోజకవర్గ ముఖ్యనేత అనుచరులు మాత్రం విడిచిపెట్టడం లేదు. లే అవుట్ వేస్తే కప్పం కట్టాల్సిందేనంటున్నారు. లేదంటే అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి భూ బదలాయింపు (కన్వర్షన్)కు అనుమతులు ఆపేస్తున్నారు. మండల కేంద్రమైన కరప, పెనుగుదురు, నడకుదురు, కాకినాడ రూరల్ తూరంగి, చీడిగ, కొవ్వాడ, సర్పవరం, తిమ్మాపురం తదితర ప్రాంతాల్లో వేస్తున్న వెంచర్లలో ఎకరాకు రూ.3 లక్షల వంతున బలవంతపు వసూళ్లకు తెగబడుతున్నారు. నియోజకవర్గ ముఖ్యనేత కనుసన్నల్లోనే ఈ రియల్ దందా అంతా సాగుతోంది. అధికారం చేతిలో ఉందనే ధైర్యంతో అతని అనుచరులు బరితెగించి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇటీవల మండల కేంద్రం కరపలో జనసేన నాయకుడు వేసిన లే అవుట్ను కూడా విడిచి పెట్టలేదు. ఒకప్పుడు అన్నవరం దేవస్థానం సభ్యుడిగా పనిచేసిన ఆ నాయకుడు తాను జనసేనకే పనిచేశానని, ఆ భూమి తన సొంతమని ఎంత మొత్తుకున్నా జనసేన నేతలు పెడచెవిన పెట్టారు. 26 ఎకరాల లే అవుట్లో ఎకరాకు రూ.3 లక్షలు వంతున కప్పం కట్టాలని పంతం పట్టారు. ఇందుకు ఆ నాయకుడు ససేమిరా అనడంతో అధికారులపై ఒత్తిడి తీసుకు వచ్చి లేఅవుట్లో మెరకచేసే పనులను ఆపేయించారు. రెండు వారాల పాటు పనులు ఆపేసిన సంబంధిత రియల్టర్ కం జనసేన ఫాలోవర్ చివరకు చేసేదేమీ లేక వారు పంతం పట్టినంతా కప్పం కట్టేసి నిలిచిపోయిన లే అవుట్ పనులు మొదలుపెట్టారు. ఆ ఒక్క లే అవుట్లోనే సుమారు అరకోటి ముడుపు మూటకట్టి నియోజకవర్గ ముఖ్యనేతకు చెల్లించుకున్నారు. ఇదే విషయం ఇటీవల కరప మండలంలో జరిగిన తేదేపా మండల స్థాయి నేతల సమావేశంలో చర్చకు రావడం గమనార్హం. సొంత పార్టీ వారు లే అవుట్లు వేసుకున్నా వదలకుండా జలగల్లా పట్టి పీడించుకు తింటే ఎలా అని తేదేపా సీనియర్ నేతలు నిలదీశారని తెలియవచ్చింది. ఎక్కడైనా లే అవుట్ వేస్తున్నారంటే ముందుగానే ఎకరాకు రూ.3 లక్షలు ఇస్తామనే ఒప్పందం చేసుకుని అడ్వాన్స్ ముడుపు ముట్టజెప్పాల్సిందే. ముఖ్యనేత చేతిలో సొమ్ము పడితేనే లే అవుట్కు అధికారులు అనుమతుల ప్రక్రియ మొదలుపెడతా రు. నియోజకవర్గమంతటా ఇదే దందా నడుస్తోంది. కాకినాడ రూరల్ తూరంగి, చీడిగ, కొవ్వాడ, గంగనాపల్లి, పండూరు, పి.వెంకటాపురం, పెనుమర్తి, తిమ్మాపురం తదితర గ్రామాల్లో సైతం ఇదే తరహా రియల్ దందా నడుస్తోంది. ఎకరాకు వసూలు చేస్తున్న కప్పం రూ.3 లక్షల్లో రెండు వంతులు అంటే రెండు లక్షలు నియోజకవర్గ ముఖ్యనేతకు మిగిలింది స్థానిక నేతలు పంచుకుంటున్నారు. ఈ ముడుపులు చెల్లించలేక రియల్టర్లు బెంబేలెత్తిపోతున్నారు. ప్రభుత్వం వస్తే ఏదో నాలుగు డబ్బులు వెనకేసుకోవచ్చనే ఆశ అడియాశ చేశారని రియల్టర్లుగా మారిన కూటమి నేతలు మండిపడుతున్నారు. తమ ప్రభుత్వం వచ్చిందనే సంతోషం కూడా లేకుండా చేశారంటున్నారు. కనీసం తమకై నా మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్ కూటమి సమావేశం ముందుంచాలని రియల్టర్లు అయిన కూటమి నేతలు సిద్ధపడుతున్నారు. -
హామీలు అమలు చేయాలంటూ ధర్నా
బోట్క్లబ్ (కాకినాడ): రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీలు రజకులకు ఇచ్చిన ఎన్నికల హామీని అమలు చేయాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ వద్ద రజక వృత్తిదారుల సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తరతరాలుగా వెనుకబడి ఉన్న రజక వృత్తిదారులకు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, డిమాండ్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా రజక వృత్తిదారుల సంఘం అధ్యక్షుడు కోనేటి రాజు మాట్లాడుతూ ఎంతో కష్టపడి తమ పిల్లలను చదివించినా సరైన ఉద్యోగ అవకాశాలు లేవన్నారు. అందువల్ల ఆసుపత్రి, రైల్వే, ఆర్టీసీ, పోలీస్ శాఖల్లో రజకులకు కేటాయించిన పోస్టులను వారికే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే వృత్తి ద్వారా 50 ఏళ్లకే అనారోగ్యానికి గురై బాధపడుతున్నామని, ఆ వృత్తిదారులకు పింఛన్ సదుపాయం కల్పించాలన్నారు. పిఠాపురం అగ్రహారంలో ఉన్న దోబీఘాట్లో తరతరాలుగా వృత్తి చేసుకుని జీవనం సాగిస్తున్నామని అది శిథిలస్థితికి చేరిందని తక్షణమే మరమ్మతులకు నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. రజకులకు ఇచ్చిన హామీల్లో 250 యూనిట్లు ఉచిత కరెంటు, రజకులకు శాశ్వత నివాస ధ్రువపత్రాలు, వృత్తిదారులకు రూ.5 లక్షల రుణాల ఇచ్చి దానిపై 90 శాతం సబ్సిడీ ఇవ్వాలని కోనేటి రాజు డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ను కలసి వినతి పత్రాన్ని అందించారు. కార్యక్రమంలో వృత్తిదారులు సీహెచ్ శ్రీనివాస్, కొడమంచిలి అప్పన్న, దుమరసింగు దుర్గ, సామంతకుర్తి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. -
శ్రీపాద శ్రీవల్లభ స్వామికి లక్ష బిల్వార్చన
పిఠాపురం: ప్రముఖ దత్త పుణ్యక్షేత్రమైన శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానంలో శ్రీపాద శ్రీవల్లభ సప్తాహ మహోత్సవాల్లో భాగంగా పిఠాపురంలో ఆరవ రోజు సోమవారం లక్ష బిల్వార్చన పూజ నిర్వహించారు. ఈ సంధర్భంగా స్వామికి ఏకాంత సేవ, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. శ్రీవల్లభ సప్తాహ మహోత్సవాల్లో ప్రతి రోజు ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, హోమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ సౌజన్య తెలిపారు. స్వామివారికి విశేష అలంకారం చేయగా పలువురు భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవల్లభ సప్తాహ మహోత్సవాల సందర్భంగా మరాఠీ భక్తులు పోటెత్తారు. 10 వేల మంది మహారాష్ట్ర భక్తులు ఆలయాన్ని సందర్శిస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
649 మంది ధ్రువపత్రాల పరిశీలన
కాకినాడ క్రైం: తాజా నియామక ప్రక్రియలో పోలీస్ కానిస్టేబుళ్లుగా ఎంపికై న 649 మంది అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన సోమవారం జరిగింది. కాకినాడలోని డీఏఆర్ పోలీస్ మైదానంలో జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రక్రియలో ఏపీఎస్పీ (మెన్), సివిల్ (మెన్, విమెన్) అభ్యర్థులు పాల్గొన్నారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యం వద్దు కరప: పీహెచ్సీల పరిధిలో గ్రామాల్లోని ఆరోగ్య ఉపకేంద్రాల్లో సిబ్బంది నిర్లక్ష్యం వహించకుండా సకాలంలో వైద్యసేవలందించాలని జిల్లా టాస్క్ఫోర్స్ బృందం సూచించింది. మండలంలోని గురజనాపల్లిలో ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం జిల్లా టాస్క్ఫోర్స్ బృందం కె.శ్రీనివాసరావు (స్టాటిస్టికల్ ఆఫీసర్), జి.గిరిగణేష్ (డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్) సందర్శించి, రికార్డులను, ఆర్సీహెచ్, హెచ్ఎమ్ఐఎస్ తదితర పోర్టల్స్ తనిఖీ చేశారు. అనంతరం వారు సిబ్బందితో సమావేశమై గర్భిణులకు, పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న వైద్యసేవలను అడిగి తెలుసుకుని, చేయాల్సిన విధులపై సూచనలిచ్చారు. హైరిస్క్ గర్భిణులను గుర్తించి, వారికి సరైన వైద్యం అందించి, సుఖప్రసవాలు జరిగేటట్టు చూడాలన్నారు. పీహెచ్సీ డాక్టర్ సయ్యద్ ఖతీజా సత్తారి అఫ్రోజ్, సీహెచ్ఓ యేసురత్నం, పీహెచ్ఎన్ సత్యనారాయణమ్మ, హెచ్వీ సీత తదితర సిబ్బంది పాల్గొన్నారు. భక్తులతో రత్నగిరి కిటకిట అన్నవరం: రత్నగిరి సత్యదేవుని ఆలయం సోమవారం వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో కిటకిటలాడింది. దీంతో స్వామివారి ఆలయ ప్రాంగణం, క్యూ లైన్లు, వ్రత మండపాలు భక్తులతో నిండిపోయాయి. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించి పూజలు చేశారని అధికారులు తెలిపారు. స్వామివారి వ్రతాలు 1,500 జరిగాయి. స్వామివారి దర్శనానికి రెండు గంటలు, రూ.200 టిక్కెట్తో అంతరాలయం దర్శనానికి గంట సమయం పట్టింది. సత్యదేవుడిని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు. రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి పూజలు చేశారు. సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో ఐదు వేల మంది భోజనం చేశారు. కాగా ముత్యాల కవచాల అలంకరణలో స్వామి, అమ్మవారు భక్తులకు కనువిందు చేశారు. సత్యదేవుని భక్తుల కోసం రెండు హెలికాఫ్టర్ ఫ్యాన్లు అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి పెద్దాపురానికి చెందిన శ్రీలలితా రైస్ ఇండస్ట్రీ ఎండీ మట్టే సత్యప్రసాద్, సూర్యకమల దంపతులు రూ.నాలుగు లక్షలు విలువ చేసే రెండు హెచ్వీఎల్ఎస్ (హై వాల్యూమ్ లో స్పీడ్) ఫ్యాన్లను అందజేయనున్నారు. ఏడు మీటర్లు వ్యాసం కలిగిన ఈ ఫ్యాన్లను హెలికాప్టర్ ఫ్యాన్లుగా పిలుస్తారు. సోమవారం ఆలయానికి వచ్చిన దాత సత్యప్రసాద్ వారం రోజుల్లో వార్షిక కల్యాణ మండపంలో భక్తుల కోసం ఈ ఫ్యాన్లును అమర్చనున్నట్లు అధికారులకు తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలనకు ఏర్పాట్లు పూర్తి పిఠాపురం: డీఎస్సీ సాధించిన వారి ధ్రువపత్రాల పరిశీలనకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అబ్జర్వర్, ఏపీ విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ మువ్వ రామలింగం తెలిపారు. ఆయన సోమవారం గొల్లప్రోలు మండలం చేబ్రోలులో డీఎస్సీ సాధించిన వారి ధ్రువపత్రాల పరిశీలన కేంద్రాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ కులధ్రువీకరణ పత్రాలను రెవెన్యూ అధికారులు, విద్యార్హత సర్టిఫికెట్లను విద్యాశాఖ అధికారులు పరిశీలిస్తారని చెప్పారు. అభ్యర్థులు ఆన్లైన్లో పొందుపరిచిన జాబితా ప్రకారం ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలించి ఉద్యోగ అర్హత నిర్ణయిస్తామని చెప్పారు. ఆయన వెంట ఆర్జేడి నాగమణి, డీఈవో రమేష్ డీసీఈబీ వెంకట్రావు ఉన్నారు. -
ఆదినాయకా... అందుకో మా పూజ
అయినవిల్లి: ఆదినాయకా.. అందుకో మా పూజ అంటూ వినాయక చవితి ఉత్సవాలకు సర్వం సిద్ధమవుతోంది. ఈ నెల 27వ తేదీ నుంచి జరిగే వేడుకలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రముఖ ఆలయాలు ముస్తాబవుతున్నాయి.. ఇప్పటికే ఉత్సవ మంటపాల ఏర్పాటుకు అన్నీ ఏర్పాట్లూ చకచకా జరిగిపోతున్నాయి. ప్రసిద్ధి చెందిన అయినవిల్లి సిద్ధి వినాయకుని ఆలయం చవితి ఉత్సవాలకు అంగరంగ వైభవంగా సిద్ధమైంది. బుధవారం వినాయక చవితి నుంచి తొమ్మిది రోజుల పాటు విఘ్నేశ్వరుని సన్నిధిలో వేడుకలు నిర్వహించనున్నారు. దీని కోసం ఆలయ అసిస్టెంట్ కమిషనర్, ఈఓ అల్లు వెంకట దుర్గాభవాని ఆధ్వర్యంలో ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. గతేడాది కంటే అధికంగా భక్తులు వస్తారనే అంచనాతో ఆలయ వర్గాలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. చలువ పందిళ్లు, విద్యుత్ దీపాలతో ఆలయ ప్రాంగణం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. వివిధ రంగులతో ఆలయ గోపురాన్ని తీర్చిదిద్దారు. ప్రత్యేక పుష్పాలు, కొబ్బరి, అరటి ఆకులు, కూరగాయలు వంటి వాటితో ఆలయ ప్రాంగణంలో అలంకరిస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అయినవిల్లి ఎప్సై హరికోటి శాస్త్రి చెప్పారు. తొమ్మిది రోజులు.. ప్రత్యేక అభిషేకాలు వినాయక చవితి సందర్భంగా బత్తాయి, దానిమ్మ, యాపిల్, ద్రాక్ష, మామిడి వంటి వివిధ సీజనల్ పండ్ల రసాలతో స్వామివారికి అభిషేకాలు చేయనున్నారు. అనంతరం లక్ష గరిక పూజ, వివిధ పుష్పాలతో ప్రత్యేక అలంకరణ, హారతులు తదితర కార్యక్రమాలు తొమ్మిది రోజుల పాటు ఉంటాయని ఏసీ వెంకట దుర్గాభవాని తెలిపారు. ఈ రోజుల్లో స్వామివారికి ప్రత్యేక అలంకరణలు చేస్తామన్నారు. చవితి రోజున సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆలయ ప్రాంగణం వెలుపల మండపంలో మట్టి గణపతిని ప్రతిష్ఠించి తొమ్మిది రోజుల పాటు వేదపండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రోజూ తెల్లవారు జామున నాలుగు గంటలకు ఆలయం తెరుస్తారు. మేలుకొలుపు సేవ తదితర పూజల ఆనంతరం ఐదు గంటల నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 12 గంటలకు నిత్య గణపతి హోమం, ఒంటి గంటకు స్వామివారికి ప్రత్యేక అలంకరణ, ప్రసాద నివేదన కార్యక్రమాలు ఉంటాయి. మధ్యాహ్నం నాలుగు గంటలకు స్వామివారిని మూషిక వాహనంపై మాఢ వీధుల్లో ఊరేగిస్తారు. సాయంత్రం ఆరు గంటలకు పంచ హారతులు ఇస్తారు. రాత్రి ఎనిమిది గంటల వరకూ ఆలయం తెరిచి ఉంటుందని ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావు తెలిపారు. అన్ని ఏర్పాట్లూ చేశాం.. అయినవిల్లి స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశాం. చవితి సందర్భంగా స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహిస్తాం. నవరాత్రుల్లో ఆలయ ప్రాంగణంలో వివిధ సాంస్కతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. –అల్లు వెంకట దుర్గాభవాని, ఆలయ ఈఓ, అయినవిల్లి రేపటి నుంచి వినాయక చవితి ఉత్సవాలు ఉమ్మడి జిల్లాలో ముస్తాబైన ఆలయాలు, ఉత్సవ మంటపాలు ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 4 వరకూ వేడుకలు -
చెవిలో చెబితే.. కోర్కెలు తీర్చే స్వామి
బిక్కవోలు: చెవిలో చెబితే కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా పేరొందిన బిక్కవోలు శ్రీలక్ష్మీ గణపతి స్వామివారి ఆలయం చవితి వేడుకలకు ముస్తాబైంది. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలను ఆనుకుని ఉన్న ఈ ఆలయం నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. 1,100 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం కావడంతో చవితి ఉత్సవాలకు ఇక్కడ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ శ్రీలక్ష్మీగణపతి స్వామి ఏకశిలా మూర్తిగా దర్శనమిస్తారు. స్వామి విగ్రహం 10 అడుగుల పొడవు 6 అడుగుల వెడల్పున ఉంటుంది. స్వామివారికి తొండం కుడి వైపునకు తిరిగి ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఈ విగ్రహం తూర్పు చాళుక్యుల కాలం నాటిదని పురావస్తు శాఖ అంచనా వేసింది. స్వామివారి చెవిలో తమ కోర్కెలు చెబితే తీరతాయనేది భక్తుల నమ్మకం. వినాయక చవితి సందర్భంగా గణపతి ఆలయంలో బుధవారం ఉదయం నుంచి గణపతి నవరాత్ర మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రతి రోజూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవదాయ శాఖ అధికారులు, కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఆలయం ప్రాంగణాన్ని సుందరంగా అలంకరించారు. మంగళవారం రాత్రి దాటాక బుధవారం తెల్లవారు జామున 1.58 గంటలకు తీర్థపు బిందె సేవతో స్వామివారి చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. బుధవారం ఉదయం 11.04 కలశ స్థాపన చేశారు. ఈ వచ్చే నెల 6న మహాన్నదానంతో ఉత్సవాలు పూర్తవుతాయి. గతేడాది కంటే ఘనంగా.. ఆలయం చుట్టుపక్కల అంతా రేకుల షెడ్డు ఏర్పాటు చేశాం. గత ఏడాది కంటే ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశాం. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా భారీ క్యూలైన్లు నిర్మించాం. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి చవితి రోజు మినహా మిగిలిన రోజుల్లో అన్నదానం ఉంటుంది. –ఎ.భాస్కర్, దేవదాయ శాఖ ఈఓ, బిక్కవోలు గ్రూప్ ఆలయాలు -
మోటారు సైక్లిస్ట్పైకి దూసుకెళ్లిన ఆబోతులు
చికిత్స పొందుతూ మృతి అల్లవరం: రెండు ఆబోతులు పొట్లాడుకుంటూ దారిని పోతున్న వ్యక్తిపైకి దూసుకెళ్లడంతో తీవ్ర గాయాలపాలైన అతను మృతి చెందిన సంఘటన అల్లవరం మండలం గుండెపూడిలో సోమవారం చోటుచేసుకుంది. కుటుంబీకుల వివరాల ప్రకారం... గుండెపూడి పోతులవారిపేట గ్రామానికి చెందిన జంగా రామకృష్ణ (41) గురువారం రాత్రి దేవగుప్తం సెంటర్ నుంచి మోటారు సైకిల్పై పోతులవారిపేట వెళ్తుండగా గుండెపూడిలోని ఆంజనేయస్వామి వారి ఆలయాలకు సమీపంలో రోడ్డుపై రెండు ఆబోతులు హోరాహోరీగా పోట్లాడుకుంటున్నాయి. అదే సమయంలో మోటారు సైకిల్పై వెళ్తున్న రామకృష్ణపైకి రెండు ఆబోతులు దూసుకువచ్చాయి. దీంతో రామకృష్ణ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయి తీవ్ర గాయాల పాలయ్యాడు. సయమానికి ఎవరూ లేకపోవడంతో రామకృష్ణపై ఆబోతులు వీరంగం సృష్టించి మరింత గాయాలు పాల్జేశాయి. కొద్ది సేపటికి రోడ్డుపై పడి ఉన్న రామకృష్ణను స్థానికులు గుర్తించి కాకినాడ జీజీహెచ్కు తరలించారు. తీవ్ర గాయాలైన రామకృష్ణ తలకు శస్త్రచికిత్స చేశారు. అయితే ఆదివారం సాయంత్రం అతను మృతి చెందారు. ఈ ఘటనపై అల్లవరం ఎస్సై సంపత్కుమార్ కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య, బాబు, పాప ఉన్నారు. -
గొడవను అడ్డుకోబోతే గొంతు కోసేశాడు
రాజానగరం: ఇద్దరు వ్యక్తులు గొడవపడి, కొట్లాటకు దిగడంతో వారిని సముదాయించే ప్రయత్నం చేస్తూ, ప్రాణాల మీదకు తెచ్చుకున్న వ్యక్తి ఉదంతమిది. రాజానగరం నడిబొడ్డున జరిగిన ఈ సంఘటనకు సంబంధించి స్థానిక పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక ముత్యాలమ్మ గుడి వద్ద ఆదివారం రాత్రి గ్రామానికి చెందిన గోళ్ల సాయి, అగత్తి సాయి అనే ఇద్దరు గొడవపడి, కొట్టుకున్నారు. గుడి వద్ద వినాయక చవితికి సంబంధించిన డెకరేషన్ పనులు చేస్తున్న నీలం లక్ష్మీప్రసాద్ దీనిని గమనించి, వారిద్దరినీ విడిపించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో గోళ్ల సాయి తన వద్ద ఉన్న చాకుతో అతని గొంతును కోశాడు. దీంతో రక్తపు మడుగులో పడిఉన్న లక్ష్మీప్రసాద్ను చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం తరలించారు. ప్రస్తుతం అతనికి ఆస్పత్రిలో చికిత్స జరుగుతుందని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పై ఎస్.ప్రియకుమార్ తెలిపారు. మేల్ నర్సుపై సస్పెన్షన్ వేటు కాకినాడ క్రైం: ఓ మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటనలో కాకినాడ జీజీహెచ్లో పనిచేస్తున్న మేల్ నర్స్ మోకా సందీప్పై అధికారులు చర్యలు చేపట్టారు. ఆదివారం బాధితురాలి ఫిర్యాదు మేరకు కాకినాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో సందీప్పై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. సోమవారం సందీప్ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. విధులకు మద్యం తాగి రావడం, బాధ్యతాయుతమైన నర్సు విధుల్లో పనిచేస్తూ ఓ మహిళ నగ్న ఫొటోలు ఆమెకు తెలియకుండా తీయడం, వాటిని అడ్డుపెట్టి బ్లాక్మెయిల్ చేయడం, బాధితురాలిని కొట్టి అఘాయిత్యానికి పాల్పడడం, ఆ ఫొటోలను ఆమె కుమారుడికి పంపడం తద్వారా ఆ బాలుడిని ఆత్మహత్యకు పురిగొల్పడం అంశాలు ఎఫ్ఐఆర్లో పొందుపరచడంతో అవే అంశాల ప్రాతిపదికన సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, మద్యం తాగి విధులకు హాజరవుతున్నాడన్న సహ మేల్ నర్సుల ఫిర్యాదుతో అధికారులు విచారణకు సిద్ధమయ్యారు. ఎక్కువ రోజులు సెలవులో ఉంటున్న సందీప్కు అసలు అన్నాళ్లు సెలవు ఎవరు ఇస్తున్నారు, అలాగే సందీప్కు సహాయకారిగా ఉంటూ అతడి సెలవు దరఖాస్తులను అధికారులకు ఎవరు అందిస్తున్నారనే అంశాలపై విచారణ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. -
పీజీఆర్ఎస్కు 631 అర్జీలు
బోట్క్లబ్(కాకినాడ): ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అందిన అర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి సంతృప్తికరమైన పరిష్కారాలు చూపాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జేసీ రాహుల్మీనా, ట్రైనీ కలెక్టర్ మనీషా, డీఆర్వో జె.వెంకటరావు, హౌసింగ్ పీడీ ఎన్వీవీ సత్యనారాయణ, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎ.శ్రీనివాసు, సీపీవో పి.త్రినాఽథ్, జీజీహెచ్ ఎస్డీసీ ఎన్ శ్రీధర్ ఇతర అధికారులతో కలిసి హాజరై జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు, విన్నపాలను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని అధికారులను ఆదేశించారు. బియ్యం కార్డు మంజూరు, కార్డులోని పేర్లు మార్పులు, చేర్పులు, పింఛన్లు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఇళ్ల స్థలాలు, భూమి వివరాలు ఆన్లైన్లో నమోదు, రీ సర్వే, ఆక్రమణల తొలగింపు, డ్రైన్ కాలువల్లో పూడిక తొలగింపు, పారిశుధ్యం, తల్లికి వందనం, ఆన్లైన్ సమస్యలు వంటి అంశాలకు సంబంధించి మొత్తం 631 అర్జీలు అందాయి. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ ప్రతి వారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. పరిష్కరించిన దరఖాస్తులను జిల్లా అధికారి ఆడిటింగ్ చేసి నివేదిక పంపించిన తర్వాత వాటిని రాష్ట్ర స్థాయిలో ఆడిట్కి పంపించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన అర్జీదారులు తమ అర్జీలను మీకోసం.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. అర్జీల ప్రస్తుత స్థితికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి టోల్ఫ్రీ నంబర్ 1100కి నేరుగా కాల్ చేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాల అధిపతులు పాల్గొన్నారు. -
చోరీ కేసును ఛేదించిన పోలీసులు
తుని: చోరీ కేసును తుని పోలీసులు చేధించారు. ఈ మేరకు పట్టణ పోలీస్ స్టేషన్లో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు సోమవారం వివరాలు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యాదవోలు గ్రామానికి చెందిన సతీష్ (అవంతికరెడ్డి) మూడేళ్ల కిందట తుని వచ్చి హిజ్రాలతో కలసి జీవిస్తున్నాడు. ఆడ లక్షణాలు కలిగిన సతీష్ మహిళ వేషధారణలో స్థానిక జాతీయ రహదారిపై ఉంటూ పలువురిని ఆకర్షిస్తూ డబ్బులు సంపాదించేవాడు. పండగలు, జాతర్లలో నృత్యాలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సతీష్కు ఇన్స్టాగామ్లో ప్రశాంత్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. వీరిద్దరూ తుని పట్టణం 10వ వార్డు నిమ్మకాయలవారి వీధిలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. సతీష్ తనను పెళ్లి చేసుకోవాలని ప్రశాంత్ను కోరాడు. ఆపరేషన్ చేయించుకుని పూర్తి హిజ్రాగా మారితేనే పెళ్లి చేసుకుంటానని ప్రశాంత్ చెప్పాడు. దీంతో ఆపరేషన్కు రూ. 5 లక్షలు అవసరమని తెలుసుకున్న సతీష్, ప్రశాంత్లు చోరీకి వ్యూహరచన చేశారు. వారు నివాసం ఉంటున్న ఇంటి పక్కనే నివాసం ఉంటున్న బాలేపల్లి సత్యవతి అనే వృద్ధురాలిని టార్గెట్ చేశారు. ఈ నెల 20న ఆమె తన ఇంటి వెనుక భాగంలో ఉండగా, అప్పటికే అక్కడ మాటు వేసిన సతీష్, ప్రశాంత్లు ఆమె కళ్లలో కారం కొట్టారు. వృద్ధురాలి మెడలో ఉన్న ఐదు గ్రాముల పగడాల బంగారు గొలుసుతో పాటు చేతికున్న నాలుగున్నర తులాల బంగారు గాజులను తీసుకుని పరారయ్యారు. సత్యవతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పట్టణ సీఐ గీతారామకృష్ణ సమగ్ర దర్యాప్తు జరిపి ఆదివారం స్థానిక రైల్వే గెస్ట్హౌస్ వద్ద నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 7 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, రెండు సెల్ఫోన్లు, స్కూటీ స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన సీఐ గీతారామకృష్ణ, ఎస్సైలు విజయ్బాబు, పాపారావు, సిబ్బంది యాదవ్, శివయ్య, నాయుడులను డీఎస్పీ అభినందించారు. -
అక్టోబర్ 7న తెలుగు సాహిత్య సదస్సు
రాజానగరం: పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురంలోని వైఎన్ కళాశాలలో అక్టోబర్ 7న శ్రీతెలుగు సాహిత్యం – భాషా బోధన మనోవికాసంశ్రీ అనే అంశంపై జాతీయ స్థాయి సదస్సు జరుగనుందని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ తెలిపారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్ని సోమవారం విడుదల చేశారు. ప్రాచీన సాహిత్యం, ప్రబంధ సాహిత్యం, దక్షిణాంధ్రయుగ సాహిత్యం, శతక సాహిత్యం, ఆధునిక సాహిత్య ప్రక్రియలు, జానపద, గిరిజన విజ్ఞానం, ప్రాథమిక, ఉన్నత విద్య, మాతృ భాష బోధన అంశాల పై పరిశోధన పత్రాలను సెప్టెంబర్ 25లోపు పంపించాలన్నారు. కార్యక్రమంలో సెమినార్ డైరెక్టర్ డాక్టర్ పిట్టా శాంతి పాల్గొన్నారు. -
ఎందరికో ఉపాధి
ఏటా సీజనల్గా లభ్యమయ్యే మామిడి కాయలను కొనుగోలు చేసి తాండ్ర తయారీకి వినియోగిస్తున్నాం. ఏడాదికి సరిపడేలా జ్యూస్ నిల్వ ఉంచుకుంటున్నాం. ఒక్కో పరిశ్రమలో వంద మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. మగవారికి రూ.800 నుంచి రూ.900 వరకు, ఆడవారికి రూ.600 వరకూ కూలి ఇస్తున్నాం. తాండ్ర ధర ప్రస్తుతం కిలో రూ.80 నుంచి రూ.100 వరకూ ఉంది. తాండ్ర తయారీ ద్వారా కూలీలకు ఉపాధి కల్పిస్తున్నామనే సంతృప్తి ఉంది. – వలవల వెంకటేశ్వరరావు, తాండ్ర తయారీదారుడు, పండూరు -
నీట్లో మెరిసిన ముత్యం
పెద్దాపురం: నీట్ ఫలితాల్లో కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం తిరుపతి గ్రామానికి చెందిన మాసా యామిని సౌమ్యశ్రీ ప్రతిభ చాటింది. రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలలో తొలి ప్రయత్నంలోనే ఆమెకు సీటు దక్కింది. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విశ్వ విద్యాలయం ఆదివారం ప్రకటించిన నీట్ ఫలితాల్లో ఈ మేరకు ఆమె ఉచిత సీటును దక్కించుకుంది. యామిని డాక్టర్ కావాలనే లక్ష్యంతో విద్య కొనసాగించింది. ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ఈడుపుగల్లు ఐఐటీ నీట్ అకాడమీలో ఆమె ఇంటర్తో పాటు ప్రత్యేక శిక్షణ పొందింది. తండ్రి మాసా చంద్రరావు పారా లీగల్ అడ్వయిజర్ కాగా, తల్లి అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తుంది. యామిని తన లక్ష్యాన్ని చేరుకోవడం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. -
రక్తం చిందిన రహదారులు
● వేర్వేరు ఘటనల్లో నలుగురి మృతి ● ఆయా గ్రామాల్లో విషాదం గోపాలపురం / రాజానగరం/ ఉప్పలగుప్తం/ శంఖవరం: రహదారులు రక్తమోడాయి.. అనుకోని ప్రమాదాలు ఆ కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. గోపాలపురం మండలం సాగిపాడు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. కొవ్వూరు మండలం తోగుమ్మి గ్రామానికి చెందిన ముప్పిడి నరేష్ (26) బైక్పై అతని స్నేహితుడు నున్న బాలుతో గోపాలపురం మండలం గుడ్డిగూడెం తన చెల్లి ఇంటికి వచ్చి వేరే పనిపై సాగిపాడు వెళ్లారు. తిరిగి వస్తుండగా సాగిపాడు మలుపు వద్ద గోపాలపురం నుంచి సాగిపాడు వెళుతున్న వ్యాన్ బలంగా ఢీకొంది. దీంతో ముప్పిడి నరేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలైన నున్న బాలును 108 అంబులెన్స్లో రాజమహేంద్రవరంలోని ఓ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై పి.మనోహర్ తెలిపారు. రాజానగరంలో మహిళ.. జాతీయ రహదారిపై రాజానగరం వైఎస్సార్ జంక్షన్ వద్ద శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో రాజమహేంద్రవరానికి చెందిన అనిశెట్టి లత (39) మృతి చెందింది. రాజమహేంద్రవరంలోని షెల్టన్ హోటల్ సమీపంలో నివాసం ఉంటున్న లత రాజానగరంలోని బంధువుల ఇంటికి వచ్చింది. పై జంక్షన్ వద్ద రోడ్డు దాటుతున్న ఆమెను బైకు ఢీకొనడంతో తలకు బలమైన గాయమైంది. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతురాలి భర్త అనిశెట్టి శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రొయ్యల వ్యాన్ ఢీకొని.. రొయ్యల వ్యాన్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఉప్పలగుప్తం ఎస్సై రాజేష్ కథనం ప్రకారం.. వానపల్లిపాలేనికి చెందిన కోలా వీర రాఘవులు (75) ఉప్పలగుప్తం నుంచి వానపల్లిపాలెం సైకిల్పై వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో రొయ్యల వ్యాన్ వానపల్లిపాలెం వైపు వెళ్తూ వీర రాఘవులకు తగిలింది. దీంతో అతను తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించామని ఎస్సై వివరించారు. కత్తిపూడిలో మరొకరు.. కత్తిపూడి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ప్రకాశం జిల్లా మార్కాపురం గ్రామానికి చెందిన మోతే సూరిబాబు (40) లారీ క్లీనర్గా పని చేస్తున్నాడు. తాటిపర్తి నుంచి పాట్నా బొగ్గు లోడు లారీలో క్లీనర్గా వెళ్తుండగా కత్తిపూడి ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద పని నిమిత్తం సూరిబాబు లారీ దిగాడు. పని ముగించుకుని రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అన్నవరం అడిషినల్ ఎస్సై ప్రసాద్ తెలిపారు. -
ఆనంద తాండ్రవం
● ఏడాది పొడవునా తాండ్ర తయారీ ● జిల్లాలో 17 పరిశ్రమల్లో కూలీలకు ఉపాధి ● వివిధ జిల్లాలకు సరకు ఎగుమతి కాకినాడ రూరల్: తాండ్ర తినవయ్యా... ఆనందించవయ్యా అన్నట్లు మామిడి తాండ్రకు కాకినాడ జిల్లా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఏడాది పొడవునా తాండ్రను తయారు చేయడం విశేషం. అందుకే చిన్నారుల నుంచి పెద్దల వరకూ లొట్టలేసుకుని తింటుంటారు. మామిడి కాయలుగా ఉన్నప్పుడు ఆవకాయ, ఊరగాయగా.. పండ్ల రసంతో తాండ్ర రుచిని ఏడాది పొడవునా ఆస్వాదిస్తున్నారు. తియ్యదనాన్ని పంచే తాండ్ర తయారీలో జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి తాండ్రను ఇతర రాష్ట్రాల ప్రజలు లొట్టలేసుకుని తినేలా ప్రాచుర్యం పొందింది. స్థానికంగా పండే మామిడితో పాటు ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకుని తాండ్ర తయారీ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వేసవి ఎండల వేళ పనులు లేని సమయంలో కుటీర పరిశ్రమగా నిలుస్తున్న ఈ తయారీ ఎన్నో వేల కుటుంబాలకు ఉపాధి అందిస్తోంది. జిల్లాలో ముఖ్యంగా కాకినాడ రూరల్ మండలంలో పండూరు, సర్పవరం, తమ్మవరం గ్రామాలు ప్రసిద్ధి చెందాయి. సర్పవరంలో సుమారు ఎనిమిది దశాబ్దాల కిందట ప్రారంభమైన దినదిన ప్రవర్థమానంగా మారింది. కాకినాడ రూరల్తో పాటు చేబ్రోలు, చిన్నయ్యపాలెం, ధర్మవరం, జగ్గంపేట మండలం రాజపూడి, మల్లిసాల తదితర గ్రామాలకూ ఈ వ్యాపారం విస్తరించింది. జిల్లా సుమారు 17 చోట్ల ఏడాది పొడవునా తాండ్ర తయారు చేస్తున్నారు. అత్యధికంగా కాకినాడ రూరల్లో తయారీ ఉంది. వేసవిలో మొదలై ఏడాది పొడవునా కూలీలకు పనులు కల్పిస్తున్నారు. మన ప్రాంతంలో పండే మామిడి కాయలతో పాటు కృష్ణా జిల్లా నూజివీడు, ఖమ్మం, చిత్తూరు, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి లారీల్లో భారీగా దిగుమతి చేసుకుంటున్నారు. ఏటా సీజనల్గా జిల్లాకు 80 వేల టన్నులకు పైబడి మామిడి దిగుమతి అవుతుందని అంచనా. వేసవిలోనే తాండ్ర తయారీతో సరిపెట్టుకోకుండా, ఏడాదికి సరిపడే మామిడి జ్యూస్ను తయారు చేసుకుని నిల్వ ఉంచుకుంటున్నారు. తద్వారా ఏడాది పొడవునా డిమాండ్కు అనుగుణంగా తాండ్ర తయారు చేస్తున్నారు. వేసవిలో ఏటా సుమారు 2 వేల మంది ఉపాధి పొందుతున్నారు. అన్ సీజనల్లో వెయ్యి మందికి ఉపాధి లభిస్తుంది. ఇక్కడ తయారయ్యే తాండ్రను ఒడిశా, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, బీహార్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తున్నారు. ఏటా సుమారు 50 వేల నుంచి 70 వేల టన్నుల వరకూ ఎగుమతి అవుతుందని వ్యాపారులు చెబుతున్నారు. తగ్గిన ధరలతో జోష్ ఈ ఏడాది వేసవిలో మామిడి ధరలు తగ్గాయి. తాండ్ర తయారీలో కలెక్టర్ రకం మామిడిని వినియోగిస్తారు. గత ఏడాది టన్ను ధర రూ.20 వేల వరకూ పలకగా ఈ ఏడాది అఽత్యధికంగా రూ.13 వేలు పలికింది. సీజన్ ముగింపు దశలో ఽమామిడి ధరలు పతనమవ్వడంతో టన్ను కాయలు రూ.6 వేలకు రావడంతో తాండ్ర తయారీదారులు జ్యూస్ నిల్వలు పెంచుకోగలిగారు. అందుకే ఈ ఏడాది వ్యాపారం బాగుందని అంటున్నారు. ఆరోగ్యానికి ఎంతో మేలు సీజనల్గా లభ్యమయ్యే మామిడి పండ్ల రసంతో తయారు చేసే తాండ్ర ఏడాది పొడవునా లభ్యమవుతోంది. దాదాపు 20 గ్రాముల తాండ్రలో 67 కేలరీలు పోషకాలు, 0.3 గ్రాముల ప్రోటీన్లు, 0.1 గ్రాముల కొవ్వు, 17.5 గ్రాముల కార్బో హైడ్రైట్లు ఉంటాయి. ఇందులో ఉన్న విజమిన్– ఏ శరీర ఆరోగ్యంతో పాటు కంటిచూపునకు మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతుంటారు. విటమిన్ – సీ రోగ నిరోధక శక్తిని పెంచేందుకు, వ్యాధుల నుంచి రక్షణకు దోహదపడుతుంది. తాండ్రలో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉండడంతో శరీర కణాలకు మేలు చేయడమే కాకుండా పెద్ద పేగు క్యాన్సర్, గుండె జబ్బులు వంటి ప్రమాదాన్ని తగ్గిస్తాయి. పీజు పదార్థాలు పేగుల కదలికల క్రమబ ద్ధీకరణకు, జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులు తక్కువ తీసుకోవడమే మేలు. అధికంగా తింటే దంత క్షయం, ఊబకాయం సమస్యలు రావొచ్చు. -
బ్యాడ్మింటన్ పోటీల్లో క్రీడాకారుల ప్రతిభ
అమలాపురం రూరల్: కాకినాడలో జరిగిన ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల అండర్– 19 అమరావతి చాంపియన్ షిప్ బ్యాడ్మింటన్ పోటీల్లో కోనసీమ జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో జిల్లా నుంచి బ్యాడ్మింటన్ బాలుర సింగిల్స్ విభాగంలో విన్నర్గా మలికిపురానికి చెందిన నందకిశోర్, రన్నర్గా కృష్ణకార్తీక్, డబుల్స్ బాలుర విభాగంలో విన్నర్గా అమలాపురానికి చెందిన బి.ఆదిత్యరామ్, రన్నర్గా మలికిపురానికి చెందిన వై.గౌతమ్కుమార్, బాలికల డబుల్స్ విభాగంలో రన్నర్గా ఎం.రమ్య, రిత్విక నిలిచారు. డబుల్స్ విభాగంలో విజేతలు ఆదిత్యరామ్, గౌతమ్కుమార్లు తిరుపతిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విజేతలను కాకినాడ డీఎస్ఓ శ్రీనివాస్, జాతీయ అంపైర్ పాయసం శ్రీనివాసరావు, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం సెక్రటరీ బీవీవీఎస్ఎన్ మూర్తి ఆదివారం అభినందించారు. -
తల్లిదండ్రుల చెంతకు బాలుడు
అల్లవరం: బోడసకుర్రు బ్రిడ్జి వద్ద్ద దారి తెలియకుండా ఇబ్బంది పడుతున్న పదేళ్ల బాలుడు మల్లిపూడి చిరును వారి తల్లిదండ్రులకు ఆదివారం సాయంత్రం అప్పగించామని ఎస్సై సంపత్కుమార్ తెలిపారు. ముమ్మిడివరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పక్కన నివాసం ఉంటున్న మల్లిపూడి ఏసులక్ష్మి పాలకొల్లు వెళ్లింది. తల్లి పాలకొల్లు వెళ్లిన తర్వాత చిరు, తల్లి వద్దకు పాలుకొల్లు వెళ్లాలని బయలుదేరి కొమానపల్లి నుంచి బోడసకుర్రు వరకూ తన సైకిల్పై వచ్చాడు. బోడసకుర్రు బ్రిడ్జి వరకూ వచ్చే సరికి దారి తెలియక ఇబ్బంది పడుతున్న బాలుడిని స్థానికులు గుర్తించి తల్లిదండ్రుల వివరాలను సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. దీంతో అల్లవరం పోలీసులు స్పందించి ఆ బాలుడిని పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. బాలుడి నుంచి మరింత సమాచారం సేకరించిన పోలీసులు ముమ్మిడివరంలోని చిరు తల్లిదండ్రులు ఏసులక్ష్మి, సతీష్లకు సమాచారం అందించామని ఎస్సై సంపత్కుమార్ తెలిపారు. తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కు వచ్చిన తర్వాత చిరుని అప్పగించామని అన్నారు. -
ఏలేరులో పెరిగిన నీటి నిల్వలు
ఏలేశ్వరం: ఏలేరు పరివాహక ప్రాంతంలో పడిన వర్షాలకు ప్రాజెక్టులో నీటినిల్వలు పెరిగాయి. ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టులోకి 2.198 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. సీతానగరం మండలం పురుషోత్తపట్నం నుంచి 525 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ఆదివారం నాటికి ప్రస్తుతం ప్రాజెక్టులో 86.56 మీటర్లకు 80.02 మీటర్లు, 24.11 టీఎంసీలకు 13.48 టీఎంసీల నీటినిల్వలు ఉన్నాయి. దీంతో ఆయకట్టుకు 1,000, విశాఖకు 200 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. తిమ్మరాజుచెరువుకు నీటి విడుదల నిలిపివేశారు. నేడు యథావిధిగా పీజీఆర్ఎస్ కాకినాడ సిటీ: ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమం జిల్లా స్థాయిలో సోమవారం కాకినాడ కలెక్టరేట్లో గ్రీవెన్స్ హాలులో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తామని కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు అందరూ విధిగా హాజరుకావాలని ఆయన ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి రాలేని అర్జీదారులు వారి అర్జీలను మీకోసం డాట్ ఏపీ డాట్ జీవోవి డాట్ ఇన్ వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. అర్జీదారులు వారి అర్జీల నమోదు స్థితి, దానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే 1100కి నేరుగా కాల్ చేయవచ్చని కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. తలుపులమ్మకు రూ.4.98 లక్షల ఆదాయం తుని: లోవ తలుపులమ్మతల్లికి రూ.4.98 లక్షల ఆదాయం సమకూరిందని కార్యనిర్వహణాధికారి విశ్వనాథరాజు తెలిపారు. ఆదివారం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ 15 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కులు చెల్లించారన్నారు. ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,67,550, పూజా టికెట్ల ద్వారా రూ.1,71,690, కేశఖండన టికెట్ల ద్వారా రూ.12,820, వాహన పూజల టికెట్లకు రూ.12,140, కాటేజీల ద్వారా రూ.71,186, విరాళాలుగా రూ.62,863 మొత్తం రూ.4,98,249 ఆదాయం సమకూరిందన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేశామని ఈఓ వివరించారు. కన్నబాబుకు మాజీ మంత్రుల పరామర్శ కాకినాడ రూరల్: పితృ వియోగంతో బాధపడుతున్న వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో ఆర్డినేటరు, కాకినాడ రూరల్ నియోజకవర్గ కో ఆర్డినేటరు కురసాల కన్నబాబు, ఆయన సోదరుడు, సినీ దర్శకుడు కళ్యాణ్కృష్ణలను వైద్యనగర్ నివాసంలో ఆదివారం పలువురు నేతలు పరామర్శించారు. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్, సీదిరి అప్పలరాజు, మాజీ ఎమ్మెల్యేలు గొర్ల కిరణ్కుమార్, పొన్నాడ సతీష్, వైఎస్సార్ సీపీ రాజాం, ఆమదాలవలస కో ఆర్డినేటర్లు టి.రాజేష్, చింతాడ రవికుమార్ తదితరులు కన్నబాబును కలిసి ఓదార్చారు. ఆయన తండ్రి సత్యనారాయణ చిత్ర పటానికి నివాళులర్పించి, శ్రద్ధాంజలి ఘటించారు. త్వరగా కోలుకొని దైనందిన కార్యక్రమాల్లో పాల్గొనాలని ఈ సందర్భంగా కన్నబాబుకు పలువురు నేతలు సూచించారు. -
సేవలు నిలిఛీ...
ఫ సచివాలయాల్లో ఆగిన ఆధార్ కేంద్రాలు ఫ డీఏల బదిలీల్లో లోపించిన పారదర్శకత ఫ ఉదాసీనంగా వ్యవహరిస్తున్న పోస్టల్ శాఖ ఫ మీ సేవా కేంద్రాల్లో పడిగాపులు ఆలమూరు: సేవలకు స్వస్తి పలికారు.. మనకెందుకులే అని మంగళం పాడారు.. అన్నింటికీ ఆధార్ తప్పనిసరి అని చెబుతూనే వీటి మంజూరు, మార్పులు, చేర్పులకు ఎక్కడా అవకాశం లేకుండా చేశారు.. గత ప్రభుత్వంలో సచివాలయాల్లో అందించిన ఆధార్ సేవలకు గుడ్ బై చెప్పడం, పోస్టాఫీసుల్లో సరైన సాఫ్ట్వేర్ లేదని ఆపేయడంతో దిక్కుతోచక సేవల కోసం లబ్ధిదారులు అటూ ఇటూ పరుగులు తీసే రోజులు తెచ్చారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థ పురుడు పోసుకుంది. సమస్త సేవలకు కేంద్ర బిందువు అయ్యింది. ఇలా జిల్లాలోని 385 గ్రామాల పరిధిలో 515 సచివాలయాలు ఏర్పడ్డాయి. ఇందులో 467 గ్రామ, 48 వార్డు సచివాలయాలు ఉన్నాయి. గ్రామ సచివాలయాల ద్వారా 5.24 లక్షల కుటుంబాలకు చెందిన 18.33 లక్షల జనాభాకు నిత్యం సేవలు అందించాల్సి ఉంది. గతంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏర్పాటైన 2,578 ఆధార్ కేంద్రాల ద్వారా రోజుకు సుమారు పది వేల మంది వరకూ నామమాత్రం రుసుంతో సేవలు పొందేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అస్తవ్యస్త విధానాలతో సేవలను ఒక్కొక్కటిగా తొలగిస్తూ వస్తోంది. ఉదాహరణకు, ఆలమూరు మండలం పెదపళ్ల గ్రామ సచివాలయంలో గత వైఎస్సార్ సీపీ హయాంలో ఆధార్ కేంద్రం ఏర్పాటైంది. ఇక్కడి డిజిటల్ అసిస్టెంట్కు ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ అందించింది. దీంతో రోజూ సుమారు 50 మంది ఆధార్ సేవలు అందించేవారు. ఇటీవల ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా జరిపిన బదిలీల్లో ఆ డిజిటల్ అసిస్టెంట్ కపిలేశ్వరపురం మండలానికి వెళ్లిపోయారు. ఇలా ఇక్కడ ఆధార్ సేవలు నిలిచిపోయాయి. పెదపళ్ల సచివాలయానికి బదిలీపై వచ్చిన కొత్త డిజిటల్ అసిస్టెంట్కు ఆధార్ సేవల పట్ల అవగాహన లేదు. బదిలీ సమయం, అంతకు ముందుకాని, ఆ తరువాత కాని ఆధార్ సేవలకు సంబంధించి ప్రభుత్వం శిక్షణ ఇవ్వలేదు. దీంతో ఆధార్ కేంద్రానికి వెళితే ప్రభుత్వం ఇంకా ఆధార్ సేవలకు సంబంధించి ఏ విధమైన ఆదేశాలు ఇవ్వలేవని, ఇంకా ఆధార్ బాధ్యతలు అప్పగించ లేదని ఠక్కున సమాధానం వస్తుంది. జిల్లా వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఆధార్ సేవల కోసం శిక్షణ తీసుకున్న డిజిటల్ అసిస్టెంట్లను ఆధార్ కేంద్రం లేని చోటుకు, శిక్షణ తీసుకోని డిజిటల్ అసిస్టెంట్ను ఆధార్ కేంద్రం వద్దకు బదిలీ చేయడం వల్లే ఈ దుస్థితి దాపురించిందనే ఆరోపణ ఉన్నాయి. బదిలీలు జరిగి రెండు నెలలు కావొస్తున్నా ఆధార్ కేంద్రం ఉన్న సచివాలయానికి బదిలీపై వెళ్లిన డిజిటల్ అసిస్టెంట్లకు ఇప్పటి వరకూ శిక్షణ మాత్రం ఇవ్వలేదు. చేసేదిలేక.. ఎదురుచూడలేక గ్రామ స్వరాజ్య స్థాపన కోసం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థ రోజురోజుకు నిర్వీర్యం అవుతుంది. ఇటీవల హేతుబద్ధీకరణ పేరిట రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్రామ సచివాలయ ఉద్యోగుల బదిలీలు ప్రహసనంగా మారింది. బదిలీల్లో పారదర్శకత లేక గ్రామ సచివాలయాల్లో ఆధార్ సేవలు అందకుండా పోయాయి. అత్యవసర సేవల కింద పోస్టాఫీస్ల వద్దకు వెళ్లి చేయించుకుందామన్నా సాఫ్ట్వేర్ మారిందంటూ పోస్టల్ సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. చేసేదేమీ లేక మీ సేవా కేంద్రాలను ఆశ్రయిస్తూ గంటల తరబడి ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడక్కడా కొన్నిచోట్ల స్లాట్ విధానం పేరిట నిర్వాహకులు అడ్డగోలుగా దోచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పోస్టల్... సేవలు డల్ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సబ్ పోస్టాఫీసుల్లో ఆధార్ సేవలను అందించాలి. దానికనుగుణంగా సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో పాటు సాంకేతిక పరికరాలను ప్రభుత్వం సమకూర్చింది. అయితే రెండు నెలల కిందట పోస్టల్కు సంబంధించి సాఫ్ట్వేర్ మారిందంటూ ఇక్కడా ఆధార్ సేవలు నిలిపివేశారు. మండలానికి రెండు లేదా మూడు పోస్టాఫీస్లు ఉన్నా పని భారమో లేక పని ఒత్తిడి వల్లనో తెలియదు కాని జిల్లా వ్యాప్తంగా అనేకచోట్ల పోస్టల్ ఉద్యోగులు ఆధార్ సేవలను అందించేందుకు సుముఖంగా ఉండటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మీ సేవా కేంద్రాల వద్ద రద్దీ పోస్టల్, సచివాలయాల నుంచి ఆధార్ సేవలు పూర్తిగా నిలిచిపోవడంతో మీ సేవా కేంద్రాలే ఆధార్ సేవలను అందిస్తున్నాయి. అయితే మీసేవా కేంద్రాలు మండలాల్లో పరిమితంగా ఉండటంతో ని త్యం రద్దీ ఉంటుంది. కొన్ని కేంద్రాల్లో స్లాట్ విధా నం పేరిట ప్రజల అమాయకత్వాన్ని, అవసరాన్ని ఆసరాగా చేసుకుని అధిక ధరలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు అందించే రుసుం కంటే మూడు లేదా నాలుగు రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారని అంటున్నా రు. దీనిపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేక ఆధార్ సేవలు అత్యంత ఖరీదుగా మారిపోయాయి. -
కార్పొరేటుకు సలామ్
● పుట్టుగొడుగుల్లా కిండర్ గార్డెన్ స్కూళ్లు ● అనుమతులు పదుల్లో.. నిర్వహణ వందల్లో ● ఇదే బాటలో ప్రైమరీ, హైస్కూళ్ల నిర్వహణ ● నోటీసులు జారీకే విద్యాశాఖ పరిమితం ● ఆమ్యామ్యాలతో చర్యలు తీసుకోని అధికారులు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కార్పొరేట్ శక్తులు విద్యను వ్యాపారంగా మార్చేశాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుందామనే రీతిలో వ్యవహరిస్తూ తల్లిదండ్రుల ఆశలను చక్కగా క్యాష్ చేసుకుంటున్నాయి. జిల్లాలో కిండర్ గార్డెన్ స్కూళ్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. రకరకాల పేర్లు పెట్టి ఫీజులను అమాంతంగా పెంచేసి దోచుకుంటున్నారు. అనుమతుల్లేకపోయినా ఇష్టారాజ్యంగా ఈ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నారు. యాజమాన్యాలు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్న చందంగా వాటి నిర్వహణ సాగుతోంది. జిల్లాలో కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు ధనదాహంతో అడ్డదారులు తొక్కుతున్నాయి. అందినకాడికి దండుకోవడమే లక్ష్యంగా వీరు చెలరేగిపోతున్నారు. పర్యవేక్షించాల్సిన విద్యాశాఖ అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో ఇలా.. జిల్లాలో ప్రభుత్వ 1285, ప్రైవేట్ పాఠశాలలు 573 ఉన్నాయి. ఇందులో 3 లక్షల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. వీటిని నర్సరీ నుంచి పదో తరగతి వరకు నిర్వహిస్తున్నారు. మరోవైపు కిండర్ గార్డెన్ పేరుతో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ నిర్వహిస్తున్న స్కూళ్లు ప్రభుత్వ అనుమతిని విధిగా పొందాల్సి ఉంది. అయితే ఎలాంటి పర్మిషన్లను పొందకుండానే జిల్లాలో 200 వరకూ ఉండగా ఒక్క కాకినాడ నగరంలోనే 50 స్కూళ్లను నిర్వహిస్తున్నారు. ఈ స్కూళ్లలో ఫీజులు రూ.వేలల్లో వసూలు చేస్తున్నారు. ఈ ఉదంతంపై ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులకు పేరెంట్స్ అసోసియేషన్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రయోజనం లేదు కార్పొరేట్ యాజమాన్యాల నుంచి మామూళ్లను భారీగా పుచ్చుకొని వారికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నారు. అధిక ఫీజులు, పుస్తకాల పేరిట దోపిడీ జరుగుతున్నా మిన్నకుండిపోతున్నారు. దీనిపై కలెక్టర్ జోక్యం చేసుకోవాలి. అనుమతుల్లేని స్కూళ్లపై చర్యలు చేపట్టాలంటూ విద్యాశాఖాధికారులకు పలుమార్లు వినతిపత్రాలను అందజేసినా ప్రయోజనం లేదు. – ఎం.గంగా సూరిబాబు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనుమతులు పొందాల్సిందే.. నగరంలో అనుమతుల్లేకుండా పాఠశాలలను నడుపుతున్న యాజమాన్యాలకు నోటీసులను జారీ చేస్తున్నాం. నూతన విద్యా పాలసీ ప్రకారం కిండర్ గార్డెన్కు అనుమతులు పొందాల్సిందే. – పిల్లి రమేష్, డీఈఓ, కాకినాడ జిల్లా సమాచారం నిల్.. జిల్లా విద్యాశాఖాఽధికారి కార్యాలయంలో కిండర్ గార్డెన్ స్కూల్ వివరాలు నమాదైన దాఖలాలు ఎక్కడ కనిపించడం లేదు. కార్యాలయ అధికారులు తగిన సమాచారం లేదంటున్నారు. ఏవో మొక్కుబడిగా అనుమతుల కోసం కొన్ని స్కూళ్ల యాజమాన్యాలు మాత్రమే దరఖాస్తు చేసుకున్నాయంటూ జిల్లా విద్యాశాఖ అధికారులు తాజాగా సెలవిస్తున్నారు. అనుమతుల్లేకుండా నిర్వహిస్తున్నా, నేటికీ ఒక్క స్కూల్పై సైతం చర్యలు చేపట్టలేదంటేనే కార్పొరేట్ యాజమాన్యాలతో వారికి ఉన్న బంధం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. వీటితో పాటు పదుల సంఖ్యలో కార్పొరేట్ యాజమాన్యాలు అనుమతుల్లేకుండా ప్రాథమిక, హైస్కూళ్లను నిర్వహిస్తున్నాయి. పట్టని విద్యాశాఖాధికారులు అనుమతుల్లేని పాఠశాలలపై చర్యలు చేపట్టకుండా జిల్లా విద్యాశాఖ అధికారులు మౌనం వహిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మండల స్థాయి, అర్బన్ అధికారులు కనీసం ఏక్కడా తనిఖీ చేపట్టిన సందర్భాలు లేవని బాహాటంగా విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా అనుమతి లేని పాఠశాలలపై కలెక్టర్ ఉక్కు పాదం మోపాలని పలువురు కోరుతున్నారు. -
ఘనంగా సత్యదేవుని రథసేవ
అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి సన్నిఽధిలో ఆదివారం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని ఆలయ ప్రాకారంలో టేకు రథంపై ఘనంగా ఊరేగించారు. ఉదయం పది గంటలకు సత్యదేవుడు, అమ్మవారి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తూర్పురాజగోపురం వద్దకు తీసుకువచ్చి రథంపై ప్రతిష్ఠించారు. అనంతరం అర్చకస్వాములు పూజలు చేసి రథ సేవ ప్రారంభించారు. వేదపండితుల మంత్రోచ్ఛాటన మధ్య, మంగళవాయిద్యాల నడుమ పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రాగా, స్వామి, అమ్మవార్లను మూడుసార్లు ఆలయ ప్రాంగణంలో రథంపై ఊరేగించారు. ఊరేగింపు అనంతరం స్వామి, అమ్మవార్లకు మళ్లీ పూజలు చేసి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. -
సమగ్ర మార్పులతో కొత్త బార్ విధానం
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): రాష్ట్ర ప్రభుత్వం మద్యం నియంత్రణ, వ్యాపార పరిపాలనలో సమగ్ర మార్పులు తీసుకు రావడమే లక్ష్యంగా కొత్త బార్ విధానం తీసుకు వచ్చిందని రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డైరెక్టర్ రాహుల్ దేవ్శర్మ అన్నారు. శనివారం రాజమహేంద్రవరంలోని జిల్లా ఎకై ్సజ్ అధికారి కార్యాలయంలో ఉమ్మడి జిల్లా అధికారులతో కొత్త బార్ పాలసీ, నవోదయం 2.0 పనితీరుపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ దేవ్శర్మ మాట్లాడుతూ ఈ పాలసీ బార్ లైసెన్సుల మంజూరులో ఆన్లైన్ విధానం, ఎంపిక ప్రక్రియలో సమానత్వం పాటిస్తామన్నారు. ఏపీ వ్యాప్తంగా 840 బార్లు ఉండగా, దీనిలో ఇకపై వాటిలో పది శాతం కల్లు గీత కార్మికులకు కేటాయిస్తున్నట్లు తెలిపారు. లైసెన్స్ ఫీజులు 70 నుంచి 50 శాతానికి తగ్గాయని వివరించారు. ఇందులో భాగంగా 50 వేల లోపు జనాభా ఉంటే రూ.35 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షల జనాభాకు రూ.55 లక్షలు, 5 లక్షలపైన జనాభా ఉంటే రూ.75 లక్షల లైసెన్స్ ఫీజు ఉంటుందని అన్నారు. ప్రతి ఏడాది పది శాతం చొప్పున ఫీజులు పెంచుతామన్నారు. గతంలో బార్లు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఉండేవని, ఇక ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు అనుమతి ఉంటుందని అన్నారు. ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. 28న కలెక్టర్ లాటరీ తీసి బార్లు కేటాయిస్తారని, సెప్టెంబర్ 1 నుంచి కొత్త పాలసీ అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రజా ఆరోగ్యం, సమాజ శ్రేయస్సు దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం నవోదయం 2.0 కార్యక్రమం ప్రారంభించిందన్నారు. ఇందులో భాగంగా సారా వ్యాపారం చేసేవారిపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. మూడు కన్నా ఎక్కువ సారా కేసుల్లో ఉన్నవారిపై పీడీ యాక్ట్ విధించేలా కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎకై ్సజ్ అధికారులు తమ తమ కార్యాలయాల్లో వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని, సీనియర్ అధికారులతో రాత్రిపూట గస్తీ చేయాలని ఆదేశించారు. సారా వినియోగంతో అనర్థాలపై ప్రచారం చేయాలన్నారు. తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లాల్లో విస్తృత దాడులు చేపట్టి సారా రహిత జిల్లాలుగా ప్రకటించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ చైతన్య మురళీ, అసిస్టెంట్ కమిషనర్ రేణుక, ఎకై ్సజ్ జిల్లా అధికారులు చింతాడ లావణ్య, ఎస్కేవీడీ ప్రసాద్, ఏఈఎస్లు నాగరాహుల్, రామకృష్ణ, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
కన్నబాబుకు ముఖ్య నేతల పరామర్శ
కాకినాడ రూరల్: పితృ వియోగంతో బాధపడుతున్న మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబును శనివారం పలువురు ముఖ్య నేతలు పరామర్శించారు. కాకినాడ వైద్యనగర్ నివాసంలో కన్నబాబును పరామర్శించి, ఆయన తండ్రి సత్యనారాయణ చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. పరామర్శించిన వారిలో మాజీ డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి, మాజీ ఉప ముఖ్యమంత్రి వీడిక రాజన్నదొర, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పినిపే విశ్వరూప్, మాజీ ఎంపీ బెల్లాని చంద్రశేఖర్, పాడేరు ఎమ్మెల్యే మత్సరాజు విశ్వేశ్వరరాజు, ఎమ్మెల్సీ కంబ రవిబాబు, మాజీ ఎమ్మెల్యేలు బొత్స అప్పలనరసయ్య, బి.అప్పలనాయుడు, కండుబండి శ్రీనివాసరావు, జోగారావు, విశ్వసరాయి కళావతి, పర్వత ప్రసాద్, వైఎస్సార్ సీపీ స్పోక్ పర్సన్ యనమల నాగార్జున యాదవ్, పోతిన మహేష్ తదితరులు ఉన్నారు. అలాగే కన్నబాబు, ఆయన సోదరుడు కళ్యాణ్ కృష్ణను ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన పలువురు నేతలు పరామర్శించారు. -
ఒరిగిన పిల్లర్ సరిచేసేందుకు కాంట్రాక్ట్ ఖరారు
మలికిపురం: కోటిపల్లి– నరసాపురం రైల్వే లైన్లో భాగంగా దిండి– చించినాడ వద్ద వశిష్ట నది మధ్య నిర్మించిన రైల్వే వంతెనలో ఒక పిల్లర్ సుమారు రెండు నెలల కిందట ఒరిగిన సంగతి పాఠకులకు విధితమే. ఈ పిల్లర్ను సరి చేసేందుకు ముంబయి కంపెనీకి కాంట్రాక్టు ఖరారు అయ్యింది. ఈ వారంలోనే పనులు ప్రారంభం కావాల్సి ఉండగా, వరదల వల్ల వాయిదా పడింది. వరద తగ్గిన తరువాత పనులు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. నదిలో ఓ వైపునకు 45 డిగ్రీల మేర ఒరిగిన ఈ వంతెన పిల్లర్ను తిరిగి యథాస్థానంలో ఉంచేందుకు ముంబయి కంపెనీ ఈ కాంట్రాక్టు దక్కించుకుంది. ఇప్పటికే ఈ సంస్థ ప్రతినిధులు, ఇంజినీర్లు ఒరిగిన పిల్లర్ పరిస్థితిని అధ్యయనం చేశారు. దీనిని సరి చేయడానికి దాదాపు రూ. కోటి వరకూ ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనాతో కాంట్రాక్టు ఖరారైనట్లు ఆ వర్గాలు తెలిపారు. ఈ ఖర్చు అంతా కూడా ప్రస్తుత కాంట్రాక్టర్ భరించాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వంతెన నిర్మాణంలో ఆఖరు పిల్లరు ఇది భూ గర్భంలోకి వెళ్లే సమయంలో బురద బ్లో అవుట్ సంభవించి ఒరిగిపోయింది. స్థానిక కాంట్రాక్టు ఇంజినీర్లు అప్రమత్తమై రైల్వే ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. దీంతో వారి సూచనల మేరకు డిజైన్ చేసి పిల్లర్ సరిచేసి యథాస్థానంలో ఉంచే విధంగా ప్రణాళిక రూపకల్పన చేశారు. ఈ మేరకు అనుభవం ఉన్న ముంబయి కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చారు. సుమారు 23 మీటర్ల ఎత్తు గల ఈ పిల్లర్ నదిలో ఒరిగిపోయింది. నదిలో మరో 50 మీటర్ల లోతు వరకూ వెళ్లాల్సి ఉంది. ప్రస్తుతం ఈ 23 మీటర్ల పిల్లర్ నిర్మాణానికి ఇప్పటి వరకూ దాదాపు రూ. 5 కోట్ల ఖర్చు అయ్యింది. రూ.కోటితో పనులకు ముంబయి సంస్థకు అప్పగింత -
రోడ్డు ప్రమాదంలో సర్పంచ్ దుర్మరణం
దేవరపల్లి: గుండుగొలను – కొవ్వూరు ప్రధాన రహదారిలో దేవరపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రామన్నపాలెం పంచాయతీ సర్పంచ్, వైఎస్సార్ సీపీ నాయకుడు కూచిపూడి బుల్లారావు(71) దుర్మరణం పాలయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక పెట్రోల్ బంకులో పెట్రోలు కొట్టించుకోవడానికి బైక్పై వెళ్తున్న సర్పంచ్ కూచిపూడి బుల్లారావును ఎదురుగా వస్తున్న క్వారీ టిప్పర్ లారీ అతి వేగంగా వచ్చి ఢీకొంది. బుల్లారావు తలపై నుంచి లారీ చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోపాలపురం ఏరియా ఆసుపత్రికి తరలించినట్టు ఎస్సై వి.సుబ్రహ్మణ్యం తెలిపారు. సర్పంచ్ బుల్లారావు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్టు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వైకుంఠవాసా.. శ్రీవేంకటేశా..
కొత్తపేట: కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రం శనివారం భక్తులతో పోటెత్తింది. వేకువజాము నుంచే వేలాదిగా భక్తులు వాడపల్లి బాట పట్టారు. పావన గౌతమీ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. తర్వాత స్వామివారిని దర్శించుకుని ముడుపులు, మొక్కుబడులు చెల్లించారు. ఏడు శనివారాల వెంకన్న దర్శనం నోము ఆచరించే భక్తులు మాఢ వీధుల్లో ఏడు ప్రదక్షిణలు చేశారు. వైకుంఠవాసా.. శ్రీవేంకటేశా.. గోవిందా.. గోవిందా.. అంటూ ముందుకు సాగారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు సుప్రభాత సేవతో పూజలు ప్రారంభించి స్వామివారికి వివిధ సేవలు నిర్వహించారు. వివిధ సుగంధ భరిత పుష్పాలతో స్వామివారిని కన్నుల పండువగా అలంకరించారు. దేవస్థానం నిర్వహించిన అన్నసమారాధనలో భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారు. దేవదాయ, ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఇతర అధికారులు, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. వివిధ సేవల ద్వారా ఈ ఒక్కరోజు సాయంత్రం 4 గంటల వరకూ దేవస్థానానికి రూ.55,60,552 ఆదాయం వచ్చిందని ఈఓ చక్రధరరావు తెలిపారు. రావులపాలెం సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఆత్రేయపురం ఎస్ఐ ఎస్.రాము ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ఏపీఎస్ ఆర్టీసీ వివిధ ప్రాంతాల నుంచి వాడపల్లి ఆలయానికి బస్సు సర్వీసులను నడిపింది. -
ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించాలి
జిల్లా గ్రంథాలయ ఉద్యోగుల వినతి సామర్లకోట: రాష్ట్రవ్యాప్తంగా పని చేస్తున్న గ్రంథాలయ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు 010 పద్దు కింద ట్రెజరీల ద్వారా చెల్లించాలని ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల సంఘ గౌరవాధ్యక్షుడు సలాది సాయిసత్యనారాయణ అన్నారు. శనివారం ముఖ్యమంత్రి పెద్దాపురం నియోజకవర్గ పర్యటనను పురస్కరించుకుని ప్రజా వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఫిర్యాదుల స్వీకరణ కేంద్రంలో వినతిపత్రం అందజేసినట్టు ఆయన విలేకర్లకు తెలిపారు. గ్రంథాలయాల ఉద్యోగులకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా చెల్లించడం వల్ల సకాలంలో జీతాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సుమారు 600 మంది ఉద్యోగులకు ప్రయోజనం కలిగేలా 010 పద్దు కింద ట్రెజరీల ద్వారా జీతాలు, పెన్షన్లు అందజేయాలని కోరామన్నారు. కార్యక్రమంలో సంఘ నాయకులు ఎం.శ్రీనివాసరావు, ఈ.వెంకట్రావు పాల్గొన్నారు. ప్రజలకు చేరువగా పంచాయతీరాజ్ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి వెంకటకృష్ణ సామర్లకోట: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను ప్రజలకు మరింత చేరువగా, పారదర్శంగా మార్చడానికి ఉద్యోగులు పని చేయాలని రాష్ట్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి కె.వెంకటకృష్ణ అన్నారు. బాపట్ల, సామర్లకోట, శ్రీకాళహస్తి విస్తరణ శిక్షణ కేంద్రాల్లో పదోన్నతి పొందిన ఎంపీడీఓలకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. స్థానిక విస్తరణ శిక్షణా కేంద్రంలో గత నెల 28 నుంచి ఉమ్మడి జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పదోన్నతి పొందిన ఎంపీడీఓలు శిక్షణ పొందుతున్నారు. ఈ సందర్భంగా వెంకటకృష్ణ మాట్లాడుతూ, శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్ర స్థాయిలో అమలు చేసి, గ్రామాలు, మండలాల పాలనలో మార్పు తేవాలన్నారు. అప్పుడే ప్రజల అభివృద్ధి, ఉద్యోగులకు సంతృఫ్తి కలుగుతుందన్నారు. స్వర్ణ పంచాయతీ, మేరీ పంచాయతీ యాప్ల ద్వారా పంచాయతీ రాబడి, ఖర్చులను ప్రజలు నేరుగా తెలుసుకోవచ్చని తెలిపారు. పంచాయతీ సంస్థలను ప్రజలకు అందుబాటులో ఉంచి, వారి అభివృద్ధి, సంక్షేమానికి సంస్కరణలు తీసుకువస్తున్నట్టు వివరించారు. భవిషత్తులో శిక్షణలు తప్పనిసరి చేస్తూ ఉద్యోగ నియమావళిలో మార్పు తెస్తామని తెలిపారు. స్థానిక ఈటీసీ ప్రిన్సిపాల్ కేఎన్వీ ప్రసాదరావు, వైస్ ప్రిన్సిపాల్ జి.రమణ, ఫ్యాకల్టీలు శేషుబాబు, శర్మ, డి శ్రీనివాసరావు పాల్గొన్నారు. వికాసలో రేపు జాబ్మేళా కాకినాడ సిటీ: వికాస ఆధ్వర్యంలో సోమవారం కాకినాడ కలెక్టరేట్ ఆవరణలో ఉన్న వికాస కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.లచ్చారావు శనివారం తెలిపారు. బజాజ్ క్యాపిటల్లో ఫైనాన్షియల్ అడ్వయిజర్, టెలికాలర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. వెంకీ రెసిడెన్సీలో స్టీవర్డ్, కెప్టెన్, టెక్నీషియన్, ఐసాన్ ఎక్స్పీరియన్సెస్ కంపెనీలో టెలి సేల్స్ రిప్రజెంటేటివ్, డెక్కన్ కెమికల్స్లో ట్రైనీ(మెకానికల్ మెయిన్టెనెన్స్), జూనియర్ ఇంజినీర్, సీనియర్ ఇంజినీర్, కెమిస్ట్, సీనియర్ కెమిస్ట్, ఇసుజు, వియాష్ లైఫ్ సైన్సెస్, ఇంజి, డిక్సాన్, హ్యుండాయ్ మోబీస్ కంపెనీల్లో టెక్నీషియన్, ఫాక్స్కాన్ కంపెనీలో ఆపరేటర్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. ఎస్ఎస్స్సీ, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమో, బీటెక్లో ఉత్తీర్ణులై, 35 ఏళ్లలోపు అభ్యర్థులు అర్హులన్నారు. నెలకు రూ.12 వేల నుంచి రూ.20 వేల వరకు జీతం, ఇన్సెంటివ్స్, భోజనం, వసతి, రవాణా సౌకర్యం ఆయా ఉద్యోగాలను బట్టి ఉంటుందన్నారు. అభ్యర్థులు సోమవారం వికాస కార్యాలయానికి ఉదయం 9 గంటలకు సర్టిఫికెట్ల కాపీలతో హాజరుకావాలన్నారు. -
విద్యాభంగం
● విద్యార్థుల ఫీజుల మాటేమిటి బాకా బాబు..! ● కాలేజీకి వెళ్లేదెలా.. చదువులు సాగేదెలా? ● గుదిబండగా ఫీజు రీయింబర్స్మెంట్ ● అప్పులు చేసి కడుతున్న తల్లిదండ్రులు ● బకాయిలు రూ.వంద కోట్లు పైమాటే.. ● విద్యార్థులు 41,413 మంది ఎదురుచూపులు సాక్షి ప్రతినిధి, కాకినాడ: చంద్రబాబు సర్కార్ విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటోంది. విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకున్నా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా మొండిచేయి చూపిస్తోంది. బకాయిలు రూ.కోట్లలో ఉన్నా చిల్లిగవ్వ కూడా విడుదల చేయకుండా విద్యార్థులను రోడ్డున పడేసింది. ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్ము విడుదల చేయకుండా చంద్రబాబు సర్కార్ విద్యార్థులకు నరకం చూపిస్తోంది. ఫీజుల కోసం కాలేజీ యాజమాన్యాలు పెడుతున్న షరతులతో కాలేజీలకు వెళ్లేదెలా అంటూ విద్యార్థులు కంటతడి పెడుతున్నారు. ఫీజులు చెల్లించాకే కాలేజీలకు రండి అని యాజమాన్యాల ఒత్తిళ్లతో విద్యార్థులు దిక్కులు చూసే పరిస్థితి ఎదురవుతోంది. కాలేజీ యాజమాన్యాలు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ సొమ్ము విడుదల కాకపోవడంతో కాలేజీలు నడపలేకపోతున్నామని మథనపడుతున్నారు. చంద్రబాబు ఒంటెద్దు పోకడలతో పరిస్థితి ఇలానే కొనసాగితే, కాలేజీలు మూతపడే దుస్థితి ఏర్పడుతుందని కాలేజీ యాజమాన్య ప్రతినిధులు మండిపడుతున్నారు. మొత్తం విద్యార్థులకు 2024–25 విద్యా సంవత్సరానికి ఒక్క త్రైమాసికానికి చెల్లించి, మిగిలిన మూడు త్రైమాసికాలు ప్రభుత్వం పెండింగ్లో ఉంచింది. కాగా గత విద్యా సంవత్సరానికి మూడు త్రైమాసికాలు పెండింగ్లో ఉన్నాయి. విద్యార్థులు నేరుగా చెల్లించిన ఫీజులపై సర్వే పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. ఇదంతా లెక్కిస్తే.. దాదాపు రూ.వంద కోట్లు పైమాటే ఉంటుందని అంచనా. విద్యార్థులపై ఒత్తిళ్లు ఫీజు రీయింబర్స్మెంట్పై స్పష్టత కరవవ్వడంతో పేద, మధ్య తరగతి వర్గాలవారు అనేక అవస్థలు పడుతున్నారు. ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయి. ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్థులకు సెమిస్టర్, మిడ్ పరీక్షలు వచ్చిన ప్రతి సందర్భంలోను ఫీజుల కోసం కాలేజీలు ఒత్తిడి చేస్తున్నాయి. మొత్తం ఫీజులు చెల్లించకున్నా, కనీసం సగం ఫీజైనా చెల్లిస్తేనే పరీక్ష రాయిస్తామని కాలేజీలు షరతులు పెడుతున్నాయి. ఇలా ఒకేసారి రూ.50 వేల నుంచి రూ.65 వేలు చెల్లించాలంటే సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు తలకు మించిన భారంగా మారింది. ఓ వైపు కాలేజీల ఒత్తిళ్లతో కొందరైతే అప్పులు చేసి ఫీజులు చెల్లిస్తున్నారు. ఉత్తుత్తి ఉత్తర్వులు ఇంజినీరింగ్, డిగ్రీ కోర్సుల్లో విద్యార్థులకు రూ.12 వేల నుంచి రూ.18 వేల వరకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాల్సి ఉంది. గడచిన ఏడాది కాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తున్నట్టు రెండు పర్యాయాలు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు చూసి ఇంకేముంది సొమ్ములు ఖాతాలకు వచ్చిపడతాయని విద్యార్థుల తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యాలు గంపెడాశతో ఎదురుచూశాయి. తీరా అవన్నీ చంద్రబాబు హామీల మాదిరిగానే ఉత్తుత్తి ఉత్వర్వులుగానే మిగిలిపోయాయని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొమ్ములు మాత్రం విడుదల చేయలేదు. విద్యార్థుల అవస్థలు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కాకపోవడంతో కళాశాల యాజమాన్యాలు పూర్తి బకాయి చెల్లించి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పొందాలని విద్యార్థులకు సూచిస్తున్నాయి. ఫీజు చెల్లించకపోతే సర్టిఫికెట్ ఇచ్చేది లేదని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు షరతులు పెడుతున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి విద్య లేదా డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు పొందిన వారు సొంతంగా ఫీజు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకెళ్లండి అని యాజమాన్యాలు చెబుతుండటంతో విద్యార్థులు నరకం చూస్తున్నారు. కాకినాడలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో బీసీఏ కోర్సు అభ్యసించిన విద్యార్థి కలగల సత్తిబాబు(పేరు మార్చాం)కి ఏడాదికి రూ.18 వేల చొప్పున రెండేళ్ల పాటు చెల్లించగా, ఈ విద్యా సంవత్సరంలో చెల్లించలేదు. ఐసెట్లో అర్హత సాధించి, ఎంసీఏ కోర్స్ చేయడానికి సర్టిఫికెట్లు అవసరం కావడంతో, సొంతంగా ఫీజు చెల్లించి సర్టిఫికెట్ తీసుకున్నాడు. అదేవిధంగా జేఎన్టీయూకే ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్థికి సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం రావడంతో సంబంధిత కంపెనీ సర్టిఫికెట్లు అడగడంతో, ఫీజు మొత్తం చెల్లించి ఉద్యోగంలో చేరాడు. ఇలా విద్య, ఉద్యోగాలకు విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారు. ఓవైపు కూటమి ప్రభుత్వం నిధులు విడుదల చేశాక చెల్లిస్తామని విద్యార్థుల నుంచి అంగీకార పత్రం తీసుకుని సర్టిఫికెట్లు జారీ చేయమని ఆదేశాలిస్తున్నా.. వాటిని యాజమాన్యాలు ఏమాత్రం పాటించడం లేదు. పథకాలు ఇవ్వలేక.. కళ్లబొల్లి మాటలతో ప్రజలను వంచించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం విద్యార్థులకు అందించే సంక్షేమ పథకాల పేర్లు మార్పు చేసింది తప్పితే.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో క్రమం తప్పకుండా అందించిన పథకాలను ఇవ్వలేక చేతులెత్తేసింది. అప్పుడే అధికారంలోకి వచ్చి 14 నెలలు దాటిపోయినా, ఇప్పటికే మూడు త్రైమాసికాలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా విద్యార్థుల భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చింది. ఇలా రూ.కోట్లలోనే ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులు పూర్తిగా నిలిపివేయడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అధికారంలోకి వస్తే అంతకుమించి ఇస్తామని గొప్పలకు పోయిన చంద్రబాబు.. తీరా గద్దెనెక్కాక ఆ విషయాన్ని గాల్లో కలిపేశారని వారు మండిపడుతున్నారు.కాకినాడ జిల్లా 2024–25 ఎ.వై. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ విడుదల చేసిన వివరాలు కులాల వారీగా.. స్టూడెంట్స్ ఆర్టీఎఫ్ మొత్తం స్టూడెంట్స్ ఎంటీఎఫ్ మొత్తం ఆర్టీఎఫ్ పెండింగ్ ఎస్సీ 6,106 6,09,49,165 5,478 1,08,58,800 0 ఎస్టీ 295 59,74,115 174 7,87,900 0 క్రీస్టియన్ మైనార్టీ 100 15,88,127 0 0 14,00,000 ముస్లిం మైనార్టీ 559 76,37,565 0 0 68,00,000 బీసీ 19,557 25,47,49,771 0 0 21,00,00,000 ఈబీసీ 2,372 4,01,40,833 0 0 3,00,00,000 కాపు 12,424 17,33,52,429 0 0 12,00,00,000 మొత్తం 41,413 54,43,92,005 5,652 1,16,46,700 33,82,00,000 (36,82,00,000) నోట్: రీయింబర్స్ ఆఫ్ ట్యూషన్ ఫీజు (ఆర్టీఎఫ్), ఎంటీఎఫ్ (మెయింటెనెన్స్ ఫీజు) ఇది వరకు క్రమం తప్పకుండా వచ్చేది నేను ప్రత్తిపాడు నైపుణ్య డిగ్రీ కళాశాలలో డిగ్రీ సెకండియర్ చదువుతున్నాను. బీఎస్సీ ఫస్టియర్ పూర్తి చేసి రెండో సంవత్సరంలోకి వచ్చాను. నాకు ప్రతి ఏడాది క్రమం తప్పకుండా జమ కావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పటికీ పడలేదు. ఫీజు రీయింబర్స్మెంట్పై ఆధారపడే నేను కళాశాలలో జాయిన్ అయ్యాను. రీయింబర్స్మెంట్ సొమ్ము పడకపోవడంతో ఫీజు అడుగుతున్నారు. ఫీజు చెల్లించకపోయినా యాజమాన్యం దయతో నన్ను కొనసాగిస్తోంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్ము జమ చేయాలి. – ద్విభాస్యం ఝాన్సీ ఉమామహేశ్వరి, ప్రత్తిపాడు ఆఖరి ఏడాది రీయింబర్స్మెంట్ రాలేదు సామాన్య మధ్య తరగతి కుటుంబానికి చెందినవారం. కాకినాడ పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2022–25 మధ్య డిగ్రీ పూర్తి చేశాను. డిగ్రీ ఆఖరి ఏడాదికి ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో సర్టిఫికెట్లు కళాశాలలో ఉండిపోయాయి. ఫీజు పూర్తిగా చెల్లించిన తరువాతే సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ఏపీ పీజీ సెట్లో అర్హత సాధించాను. ఉన్నత విద్య అభ్యసించాలన్నా, ఏదైనా ఉద్యోగానికి దరఖాస్తు చేయాలన్నా డిగ్రీ ప్రొవిజనల్ అడుగుతున్నారు. డబ్బు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకోలేని పరిస్థితి నాది. – మణి శివసంజయ్, కాకినాడ ఇదే నా చదువుకు ఆధారం మాది పెద్దాపురం మండలం మర్లావ గ్రామం. వ్యవసాయంపైనే ఆధారపడిన కుటుంబం మాది. తండ్రి సూర్యప్రకాష్ కష్టపడి నన్ను ఇంజినీరింగ్ చదివిస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్పై ఆధారపడే చదువుకున్నాను. అప్పుడు ఏ ఇబ్బందీ ఎదురుకాలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో విడతల వారీగా విడుదల కావడంతో కాలేజీల నుంచి ఎటువంటి ఒత్తిళ్లు ఎదురవ్వలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఇంతవరకు ఫీజుల సొమ్ము విడుదల చేయకపోవడంతో కాలేజీలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం స్పందించి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి మా లాంటి రైతు కుటుంబాలను ఆదుకోవాలి. – జగటపు శివరామకృష్ణ, మర్లావ, పెద్దాపురం -
సత్యదేవుని సన్నిధి.. వరాల పెన్నిధి
● ఘనంగా స్వామివారి జన్మ నక్షత్ర పూజలు ● యాగశాలలో ఆయుష్య హోమం ● ఆలయాన్ని దర్శించిన 20 వేల మంది ● దేవస్థాన ఆదాయం రూ.25 లక్షలు అన్నవరం: స్వామివారి జన్మనక్షత్రం మఖ సందర్భంగా శనివారం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆయుష్య హోమం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున రెండు గంటలకు ఆలయం తెరిచి, స్వామి, అమ్మవార్లకు అర్చకస్వాములు సుప్రభాతసేవ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల మూలవిరాట్లకు, శివ లింగానికి పండితులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పండ్ల రసాలు తదితర పంచామృతాలతో మహాన్యాశ పూర్వక అభిషేకం నిర్వహించారు. అనంతరం సుగంధ భరిత పుష్పాలతో స్వామి, అమ్మవార్లను అలంకరించి పూజించారు. ఉదయం ఏడు గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. ఘనంగా ఆయుష్య హోమం యాగశాలలో ఉదయం తొమ్మిది నుంచి 11 గంటల వరకు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు అయుష్యహోమం ఘనంగా జరిగింది. 11 గంటలకు పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయ ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం, అర్చకులు సుధీర్, గంగాధరభట్ల శ్రీనివాస్, వేద పండితులు గొల్లపల్లి ఘనపాటి, చిట్టి శివ, ఉపాధ్యాయుల రమేష్, వ్రత పురోహితుడు పాలంకి పట్టాభి తదితరులు కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల ఊరేగింపు శనివారం పర్వదినం సందర్భంగా ఆలయ ప్రాకారంలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని తిరుచ్చి వాహనంపై ఘనంగా ఊరేగించారు. ఉదయం పది గంటలకు సత్యదేవుడు, అమ్మవారి ఉత్సవమూర్తులను తిరుచ్చి వాహనంపై ప్రతిష్ఠించి పండితులు పూజలు చేశారు. అనంతరం అర్చకులు కొబ్బరికాయ కొట్టి ఊరేగింపు ప్రారంభించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య మంగళవాయిద్యాల నడుమ పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరాగా, మూడు సార్లు ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. అనంతరం స్వామి, అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి, భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. తిరిగి స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయానికి చేర్చారు. ఇలాఉండగా శనివారం సుమారు 20 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించారు. స్వామివారి వ్రతాలు వేయి నిర్వహించారు. వివిధ విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం సమకూరింది. నాలుగు వేల మంది భక్తులకు అన్నదాన పథకంలో భోజనం సౌకర్యం కల్పించారు. -
కర్యాట్ టైమ్
మూషికాల బెడదను నివారిస్తాం ఖరీఫ్ సీజన్కు సంబంఽధించి పంట పొలాల్లో ఎలుకల బెడద అధికంగా ఉందని గుర్తించాం. అందులో భాగంగా మూషికాల బెడదను నివారించి రైతులకు స్వాంతన చేకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఎలుకల ఉధృతిని నివారించేందుకు బ్రోమోడయోలిన్ మందును రైతులకు సరఫరా చేయబోతున్నాం. అలాగే ఎలుకల నిర్మూలనకు పూర్వ సంప్రదాయ రీతికి అనుగుణంగా ఎలుకల కన్నాల్లో పొగను నింపి నిర్మూలనపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. – సీహెచ్కేవీ చౌదరి, వ్యవసాయ సహాయ సంచాలకుడు, ఆలమూరు ఆలమూరు: ఎలక చిన్నదే.. సాగులో తెచ్చే నష్టం మాత్రం పెద్దది. అసలే ఖరీఫ్ సాగు ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఆందోళనలో ఉన్న రైతులకు ఈ సమస్య ప్రాణసంకటంగా మారింది. ప్రస్తుతం పిలక దశలో ఉన్న వరి పంటపై మూషికాల దాడి అధికమైంది. ఒకపక్క ప్రకృతి వైపరీత్యాలు, మరోపక్క ప్రతికూల పరిస్థితులు, ఇంకోపక్క ముషికాల బెడద కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రారంభ దశలోనే ఇలా ఉంటే పంట చేతి కొచ్చే సమయానికి మరింత నష్టాన్ని చేకూర్చుతాయని రైతన్నల్లో ఆందోళన నెలకొంది. సమస్య పరిష్కారానికి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఇంకా బ్రోమోడయోలిన్ మందును పంపిణీ చేయకపోవడంతో రైతులను మనోవేదనకు గురిచేస్తుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని 22 మండలాలు, నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 1.64 లక్షల ఎకరాల్లో సుమారు 1.40 లక్షల మంది రైతులు ఖరీఫ్ సాగు చేస్తున్నారు. అందులో సుమారు 70 శాతం మేర వెదజల్లు సాగు చేపట్టగా, మిగిలిన పొలాల్లో సాధారణ పద్ధతిలో వరి నాట్లు వేశారు. ఈ సీజన్లో రైతులు అధిక విస్తీర్ణంలో స్వర్ణ (ఎంటీయూ 1318), తక్కువ విస్తీర్ణంలో ఎంటీయూ 7,029, విత్తనాల కోసం బొండాలు (ఎంటీయూ 3,626), పీఆర్ 126, ఎంటీయూ 1121 రకాన్ని సాగు చేస్తున్నారు. ఇంకా స్పందించక.. ఖరీఫ్, రబీ సీజన్లలో ఎలుకల నివారణకు వ్యవసాయ శాఖ ఏటా బ్రోమోడయోలిన్్ మందును నూకలు, నూనె మిశ్రమంతో కలిపి రైతులకు ఉచితంగా సరఫరా చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాకపోవడంతో పంట పొలాల్లో మూషికాల బెడద ఎక్కువై పంటను కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోంది. పంట పొలాల్లో ఎలుకలు తినేదాని కన్నా దాదాపు పది రెట్లు పంటను పాడుచేసే అవకాశం ఉంది. దీంతో పిలుక దశలోనే ఎలుకలను నిర్మూలిస్తే చిరు పొట్ట దశకు చేరుకునే సరికి వరి పంటకు సంబంధించి నష్ట నివారణకు దోహదపడుతుందని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ శాఖ స్పందించి ఎలుకల నివారణకు బ్రోమోడయోలిన్ మందును త్వరితగతిన పంపిణీ చేయాలనే డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతుంది. ఇదో అదనపు ఖర్చు పంట పొలాలను నాశనం చేస్తున్న ఎలుకలను సంప్రదాయ పద్ధతిలో పట్టించేందుకు అఽధిక ఖర్చు అవుతుంది. చిలుకలు పండ్లను కొరికి పడేసినట్టు ఎలుకలు వరి దుబ్బులను కొరకడంతో పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. వరి పంటను పూర్తి స్థాయిలో రక్షించాలనుకునేందుకు ఖర్చుకు వెనకాడని పరిస్థితి ఉంది. అందులో భాగంగానే బుట్టల సహాయంతో, పొగపెట్టే విధానంతో ఎలుకలను మట్టుబెట్టే చర్యలకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఒక ఎకరం భూమిలో సరాసరి సుమారు 50 ఎలుకలకు పైగా పట్టివేత జరుగుతుండగా, ఒక్కొక్క ఎలుకకు కార్మికులు రూ.50 చొప్పున వసూలు చేస్తున్నారు. దీంతో ఎకరాకు ఎలుకల నివారణకే రూ.మూడు వేల వరకూ ఖర్చు అవుతుందని రైతులు అంటున్నారు. ఎలుకల బెడద ఎక్కువగా ఉండడంతో వాటిని పట్టేవారికి అదే స్థాయిలో డిమాండ్ కూడా ఉంది. సామూహిక నివారణ సాధ్యమేనా! వ్యవసాయ శాఖ ఏటా పంపిణీ చేసే బ్రోమోడయోలిన్ మందు సకాలంలో పంపిణీ చేసి రైతులను ఆదుకోవడం సాధ్యమేనా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సామూహిక ఎలుకల నిర్మూలన చేపట్టడం ద్వారా పంట పొలాల్లో అధిక భాగం ఎలుకలను నిర్మూలించేందుకు అవకాశం ఉన్నందున ఆ మేరకు వ్యవసాయ శాఽఖ చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తమవుతుంది. అయితే బ్రోమోడయోలిన్ మందును ఇంకా పంపిణీ చేయలేదు. ఈ నేపథ్యంలో సామూహిక ఎలుకల నివారణ సాధ్యమేనా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఫ పంటలపై ఎలక్కొట్టుడు ఫ పిలక దశలో పంట ధ్వంసం ఫ నివారణకు అధికారుల చర్యలు శూన్యం ఫ ఆందోళనలో అన్నదాతలు -
ఆర్డీఓకు అస్వస్థత
సామర్లకోట: పెద్దాపురం నియోజకవర్గంలో శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనను పురస్కరించుకొని శుక్రవారం బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న సమయంలో కాకినాడ ఆర్డీఓ ఎస్.మల్లిబాబు అస్వస్థతకు గురయి ఒకసారిగా కుప్పకూలి పోయారు. వెంటనే ఆర్డీఓ సిబ్బంది స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక చికిత్స నిర్వహించారు. మెరుగైన వైద్యం కోసం కాకినాడ ట్రస్టు ఆస్పత్రికి తరలించామని తహసీల్దార్ కొవ్వూరి చంద్రశేఖరరెడ్డి తెలిపారు. బీపీ కారణంగా అస్వస్థతకు గురి అయినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని డాక్టర్లు తెలిపారు. నేడు పెద్దాపురంలో ముఖ్యమంత్రి పర్యటన సామర్లకోట: స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్దాపురంలో పర్యటిస్తున్నట్లు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఆర్ కృష్ణకపర్ధి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు సామర్లకోట–పెద్దాపురం రోడ్డులోని లేఆవుట్లోని ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద హెలికాప్టర్లో దిగుతారు. అక్కడి నుంచి పెద్దాపురంలోని 10వ వార్డు నిర్మాణం చేసిన మేజిక్ డ్రైన్ను, స్వచ్ఛ రథంను సందర్శిస్తారు. శానిటరీ వర్కర్లకు ఇన్సూరెన్సు కిట్లు అందజేస్తారు. స్వచ్ఛ ర్యాలీలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2.40 వరకు సామర్లకోట–పెద్దాపురం రోడ్డులోని లేఆవుట్లో ఏర్పాటు చేసిన ప్రజా వేదిక వద్ద స్టాల్స్ విజిట్ చేసి అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సమీపంలో ఉన్న పూర్ణా కల్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ నాయకుల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం హెలికాప్టర్లో తాడేపల్లి చేరుకొంటారు. నవోదయ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి ప్రత్తిపాడు: పెద్దాపురం, ఎటపాకలలోని పీఎం శ్రీ జవహర్ నవోదయ పాఠశాలలో ఆరవ తరగతిలోకి ఉచిత ప్రవేశాల కోసం దరఖాస్తులను కోరుతున్నట్టు ప్రత్తిపాడు మండల విద్యాశాఖాధికారి వి.రాజబాబు తెలిపారు. పెద్దాపురం నవోదయ విద్యాలయ పరిధిలోని పెద్దాపురం, కాకినాడ అర్బన్, కాకినాడ రూరల్, సామర్లకోట, పెదపూడి, జగ్గంపేట, కాజులూరు, కిర్లంపూడి, కరప, తాళ్ళరేవు, పిఠాపురం, గొల్లప్రోలు, ఉప్పాడ కొత్తపల్లి, గండేపల్లి మండల పరిధిలోని వారు, ఎటపాక నవోదయ విద్యాలయకు తుని, తొండంగి, కోటనందూరు, ప్రత్తిపాడు, శంఖవరం, రౌతులపూడి, ఏలేశ్వరం మండలాలకు చెందిన విద్యార్థులు 2026–27 విద్యా సంవత్సరంలో 6వ తరగతి ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే ప్రక్రియ మొదలైందని చెప్పారు. ఆఖరు తేదీ ఈ నెల 27లోగా దరఖాస్తు చేసుకోవాలని, డిసెంబర్ 13న ప్రవేశ పరీక్ష జరుగుతుందని చెప్పారు. మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ప్రదానోపాధ్యాయులు అర్హత కలిగిన విద్యార్థులను ఈనెల 27 లోగా దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించాలని కోరారు. 25న జాబ్ మేళా బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఈ నెల 25వ తేదీన జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి జి.వసంతలక్ష్మి శుక్రవారం తెలిపారు. ఆశోక్ లేలాండ్ సంస్థ 40, టీమ్లీజ్ సర్వీస్ (బ్యాంక్ సర్వీస్) 220, పేటీఏం 200, సోలార్ సిస్టమ్ 100, క్రెడిట్ యాక్సెస్ 300 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయన్నారు. పదవ తరగతి ఆపైన ఐటీఐ, డిప్లమో, డిగ్రీ ఉత్తీర్ణులైన వారు హాజరుకావవచ్చని, ఇతర వివరాలకు 86398 46568 నంబర్లో సంప్రదించవచ్చన్నారు. టీచర్ల అంతర్ జిల్లాల బదిలీల షెడ్యూల్ విడుదల కంబాలచెరువు (రాజమహేంద్రవరం): టీచర్ల అంతర్ జిల్లా బదిలీలకు (భార్యాభర్తలు, పరస్పర అంగీకారం చేసుకునేవారికి మాత్రమే) ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా విద్యాశాఖాధికారి కంది వాసుదేవరావు శుక్రవారం తెలిపారు. ఈ నెల24 వరకు ఆన్లైన్లో బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చని, దరఖాస్తు ఫారం ప్రింటవుట్లను సంబందిత మండల విద్యాశాఖాధికారికి సమర్పించాలన్నారు. 22 నుంచి 25 వరకు మండల విద్యాశాఖాధికారి ధ్రువీకరిస్తారన్నారు. 28, 29 తేదీలలో పాఠశాల విద్యా డైరెక్టర్ కార్యాలయంలో తుది నిర్ధారణ జరుగుతుందన్నారు. -
మొట్టమొదటి మధ్యవర్తి శ్రీకృష్ణుడే
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఈ లోకంలో మొట్టమొదట మధ్యవర్తి శ్రీకృష్ణడేనని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. స్థానిక సూర్యకళామందిరంలో సరస్వతి గాన సభ ఆధ్వర్యంలో శ్రీసనాతన ధర్మం–శాశ్వత న్యాయంశ్రీ అంశంపై ఐదు రోజులుగా జరుగుతున్న ప్రవచనాలు శుక్రవారంతో ముగిశాయి. మన యోగ్యతను బట్టి మనకు సమాజంలో గౌరవం లభిస్తుందన్నారు. ధర్మరాజు నారదుడితో యథాశక్తి, యథావిధిగా చెప్పిన సనాతన ధర్మాన్ని మనం పాటించాలన్నారు. మన పూర్వీకులు ఈ విధానాన్నే ఆచరించారన్నారు. సత్యానికి కట్టుబడి ఉండడం, ఒడంబడికలకు విలువ ఇవ్వడం, మాటకోసం, సత్యం కోసం కట్టుబడడమే మన సంస్కృతి అన్నారు. గర్భవతి అయిన సీ్త్ర తన సంతానం కాపాడుకోవడానికి తనకిష్టమైన కొన్నింటిని ఎలా వదులుకుంటుందో పరిపాలకులు కూడా అలా ఉండాలన్నారు. అనంతరం సరస్వతీ గానసభ ఆధ్వర్యంలో సామవేదం షణ్ముఖ శర్మను సత్కరించారు. సరస్వతీ గాన సభ గౌరవ అధ్యక్షురాలు పెద్దాడ సూర్యకుమారి, అధ్యక్షుడు పేపకాయల రామకృష్ణ పాల్గొన్నారు. -
కౌమార దశలో ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి
బోట్క్లబ్ (కాకినాడ): బాలికలు కౌమార దశలో ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని ఐసీడీఎస్ పీడీ లక్ష్మి అన్నారు. గాడిమొగ రిలయన్స్ ఇండస్ట్రీ తమ సామాజిక బాధ్యతలో భాగంగా గాడిమొగ, భైరవపాలెం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 200 మంది విద్యార్థినులకు కౌమార దశలో బాలికలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దంటు కళా క్షేత్రంలో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఆరోగ్య రక్షణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. డీవైఈవో ఎస్.వెంకటేశ్వరరావు, సీడీపీవో మాధవి మాట్లాడుతూ, కౌమార దశలో బాలికల ప్రవర్తన, వారిని ఎలా రక్షించుకోవచ్చో తెలిపారు. పడాల చారిటబుల్ ట్రస్టు పవర్పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం బాలికలకు రిలయన్స్ వారు న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రిలయన్స్ ఫైనాన్స్ హెడ్ మదన్ పాల్, సీఎస్సార్ హెడ్ పోతాప్రగడ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
పాదగయ వరలక్ష్మీ వ్రతాల్లో మహిళలకు ఇక్కట్లు
● నిర్వహణలో జనసేన నేతల వైఫల్యం ● సౌకర్యాలు కల్పించని అధికారులు పిఠాపురం: పేరుగొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఉంది పిఠాపురం పాదగయ క్షేత్రంలో శుక్రవారం జనసేన నాయకుల ఆధ్వర్యంలో సాగిన సామూహిక వరలక్ష్మీ వ్రతాల నిర్వహణ. పిఠాపురం పాదగయ క్షేత్రంలో ఆఖరి శ్రావణ శుక్రవారం సందర్భంగా నిర్వహించిన సామూహిక వరలక్ష్మి వ్రతాలు రసాభాసగా ముగిశాయి. వేల మందికి చీరలు సిద్ధం చేసామని జనసేన నేతలు విస్తృత ప్రచారం చేయడంతో శుక్రవారం తెల్లవారుజాము నుంచి భక్తులు పాదగయ క్షేత్రంకు చేరుకుని క్యూ లో వేచి చూశారు. భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమైనట్లు పలువురు భక్తులు ఆరోపించారు. విడతల వారీగా పూజలు నిర్వహించడంతో క్యూ లో గంటల తరబడి నిలబడాల్సి రాగా మంచినీరు కూడా అందక మహిళా భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు ప్రసాదాలు సైతం పూర్తిగా అందక పోవడంతో భక్తులు ఆందోళనకు దిగారు. కేవలం కొంత మందితో పూజలు పూర్తి చేసి మిగిలిన వారికి చీరలు మాత్రమే ఇస్తామని, పూజలు ముగిసిపోయాయని ఆలయ అధికారులు ప్రకటించడంతో క్యూలో వేచి ఉన్న భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మరోపక్క పూజలకు వచ్చిన మహిళలలో కొంతమందికి చీరలు ఇచ్చి ఇక అయిపోయాయని చెప్పిన జనసేన నేతలు చాటుగా చీరలను బయటకు తరలించే ప్రయత్నం చేయడంతో మహిళలు వాటిని అడ్డుకున్నారు. తమకు పూజ చేసుకునే అవకాశం ఇస్తామని చెప్పడంతో ఆశతో వచ్చామని, పూజలు లేకుండా చేయడంతో పాటు చీరలు కూడా ఇవ్వకుండా పట్టుకెళ్లి పోతారా అంటు జనసేన నేతలపై మండిపడ్డారు. దీంతో జనసేన నేతలకు మహిళలకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. పూజల్లో పాల్గొన్న మహిళలకు జనసేన నేతలు అన్య మతస్తులతో చీరలు పంపిణీ చేయడంపై భక్తులు మండిపడ్డారు. కనీసం బొట్టు కూడా పెట్టుకోని మహిళా నేతతో హిందువులకు చీరలు ఎలా పంపిణీ చేయించారంటూ జనసేన నేతల తీరును మహిళలు దుయ్యబట్టారు. -
గాజుల గౌరీదేవిగా సుబ్బాలమ్మ
అమలాపురం టౌన్: అమలాపురంలో కొలువైన సుబ్బాలమ్మ అమ్మవారు శుక్రవారం గాజుల గౌరీదేవిగా దర్శనమిచ్చారు. సుమారు 45 వేల గాజులతో అమ్మవారిని అందంగా అలంకరించారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారాన్ని పురస్కరించుకుని దేవదాయశాఖ ఆధ్వర్యంలో అమ్మవారి సన్నిధిలో దాదాపు 600 మంది మహిళలు సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఆచరించారు. కార్యక్రమాన్ని ఈవో ఆర్.శ్రీనివాసరావు పర్యవేక్షించారు. వ్రతాలు ఆచరించే మహిళలకు వరలక్ష్మి రూపు, పూజా సామగ్రిని దేవస్థానం సమకూర్చింది. దేవస్థానం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన అమ్మవారి గాజుల అలంకరణకు భక్తులు గాజులు సమర్పించారు. దేవస్థానం అభివృద్ధి కమిటీ ప్రతినిధులు పెద్దిరెడ్డి సాయి పుల్లయ్య నాయడు, యర్రంశెట్టి మూర్తి, అరిగెల బాబ్జీ, నిమ్మకాయల నాయుడు తదితరుల ఆధ్వర్యంలో అలంకరణ జరిగింది. దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ అప్పన వీరన్న, ధర్మకర్తలు పాల్గొన్నారు. -
వాడపల్లిలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
● తరలివచ్చిన మహిళలు ● పూజా సామగ్రిని సమకూర్చిన దేవస్థానం కొత్తపేట: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకన్న క్షేత్రంలోని ఉత్తర ప్రాంగణంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతాలను వైభవంగా నిర్వహించారు. సుమారు రెండు వేల మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవదాయ – ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్, అర్చకులు వాడపల్లి రవికిరణ్, ఖండవిల్లి సాయిరామకృష్ణ తదితరులు ఉదయం కల్యాణ మంటపం వేదికపై వరలక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకు పండితుల మంత్రోచ్ఛారణ మధ్య డీసీ అండ్ ఈఓ చక్రధరరావుతో పండితులు పూజ చేయించి వ్రతాన్ని ప్రారంభించారు. పూజలో పాల్గొన్న వారందరికీ వరలక్ష్మీదేవి రూపు, పూజా సామగ్రిని దేవస్థానం సమకూర్చింది. అనంతరం పండితులు విఘ్నేశ్వరపూజ, కలశస్తాపన, కుంకుమ పూజల అనంతరం పురాణ వ్యాఖ్యానం నడుమ వరలక్ష్మీదేవి వ్రతం చేయించారు. -
నిరాశతో వెను తిరిగిన భక్తులు
● చివరి వారం వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించరని తెలియక అవస్థలు ● పంచారామ క్షేత్రం వద్ద పరిస్థితి సామర్లకోట: స్థానిక పంచారామ క్షేత్రమైన బాలాత్రిపుర సుందరి సమేత కుమారరామభీమేశ్వరస్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా చివరి శుక్రవారం రోజున సామూహిక వరలక్ష్మీ వ్రతాలు రద్దు చేసిన విషయం తెలియక ఆలయానికి వచ్చిన అనేకమంది మహిళా భక్తులు వెనుతిరిగి వెళ్లిపోయారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం మినహా మిగిలిన అన్ని శుక్రవారాలలోను 15 ఏళ్లుగా పంచారామ క్షేత్రంలో సామూహిక వ్రతాలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం రెండు, నాల్గవ శుక్రవారాల్లో మాత్రమే పంచారామ క్షేత్రం సామూహిక వ్రతాలు ఏర్పాటు చేశారు. అయితే ఈ విషయం తెలియని అనేకమంది మహిళలు చివరి వారంలోను సామూహిక వ్రతాలు జరుగుతాయని భావించి ఆలయానికి తరలి వచ్చారు. వ్రతాలు నిర్వహించడం లేదని తెలిసి మహిళలు నిరాశతో వెనుతిరిగి వెళ్లి పొయారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆలయంలో ప్రైవేటుగా వ్రతాలను నిర్వహించుకున్నారు. -
క్షమాపణ చెప్పలేదని స్నేహితుడి హత్య
● ఐదుగురు యువకుల ఘాతుకం ● వీడిన కేసు మిస్టరీ ● నిందితులను అరెస్టు చేసిన పోలీసులు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరంలోని కై లాసభూమి సమీపంలో అనుమానాస్పద స్ధితిలో మృతి చెందిన ధవళేశ్వరానికి చెందిన సతీష్ కుమార్ది హత్యగా తేలింది. ఈ ఘోరానికి పాల్పడిన అతడి ఐదుగురు స్నేహితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఒకరి భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సతీష్ కుమార్ క్షమాపణలు చెప్పలేదనే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. వేపాడి సతీష్ కుమార్ (22) రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్లో మూడేళ్లుగా సమోసాలు అమ్ముతు జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 8వ రాత్రి 12 గంటల సమయంలో ఇంట్లో టీవీ ఎక్కువగా సౌండ్ పెట్టుకుని చూస్తుండగా తండ్రి మందలించడంతో అలిగి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. అనంతరం ఈ నెల 15న కై లాస భూమి వెనుక శవమై కనిపించాడు. ఈ మేరకు టూటౌన్ సీఐ శివ గణేష్ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్య జరిగిందిలా.. వేపాడి సతీష్ కుమార్ ఈ నెల 9వ తేదీ తెల్లవారుజామున తోటి స్నేహితులైన ఆల్కాట్ గార్డెన్స్కు చెందిన భాగ్ రాధాకాంత్, భాగ్ గౌతం, దొంగ సౌధిరాజు, బాలాజీ పేటకు చెందిన మోటూరి రవి, భీమవరానికి చెందిన నమ్మి సూర్య తేజతో కలిసి మద్యం తాగడానికి గోదావరి గట్టు దిగువనున్న కై లాస భూమి శ్మశానం లోపలకు వెళ్లాడు. వారిలో భాగ్ రాధాకాంత్ భార్యపై ముందు రోజు రాత్రి వారు కలిసిన సమయంలో సతీష్ కుమార్ చులకనగా మాట్లాడాడు. దీనిపై క్షమాపణ చెప్పాలని సతీష్ కుమార్ను వారందరూ అడిగారు. దానికి అతడు నిరాకరించడంతో పాటు మళ్లీ ఆమైపె అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అప్పటికే పూర్తిగా మద్యం తాగి ఉన్న ఐదుగురూ కోపంతో సతీష్ కుమార్పై దాడి చేశారు. నమ్మి సూర్యతేజ పక్కనే ఉన్న కర్ర తీసుకుని తలపై కొట్టడంతో సతీష్ కుమార్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. భాగ్ రాధాకాంత్ ఆ తర్వాత అతడి పీక మీద కాలు వేసి.. మృతి చెందే వరకు గట్టిగా తొక్కాడు. అనంతరం మృతదేహాన్ని ఈడ్చుకుని వెళ్లి గోడ అవతల పారవేసి, ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసును ఛేదించారు. హత్యకు ఉపయోగించిన కర్ర, మృతుడి టీషర్టును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించారు. -
ఖర్చును కంట్రోల్ చేద్దాం
● టోల్ గేట్ల ఫీజు బాధ తప్పినట్టే ● అమల్లోకి పాస్ విధానం ● రూ.3 వేలతో పొందే అవకాశం ● ఏడాది లేదా 200 ట్రిప్పులకు చెల్లుబాటు ఐ.పోలవరం: జాతీయ రహదారులపై ప్రయాణం చేసేటప్పుడు మనకు వివిధ ప్రాంతాల్లో టోల్గేట్లు కనిపిస్తాయి. అక్కడ టోల్ (చార్జీ) చెల్లించి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. నాలుగు చక్రాలు, ఆపైన పెద్ద వాహనాలన్నీ ఈ టోల్ కట్టాల్సిందే. మనం వెళ్లే దారిలో ఎన్నిచోట్ల టోల్ గేట్లు ఉంటే అక్కడ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఒక్కో ట్రిప్పుకు (టోల్గేటు) ఇరువైపులా కలిపి రూ.90 నుంచి 200 వరకు ఖర్చవుతుంది. కానీ ఇక నుంచి ఆ భారం లేకుండా జాతీయ ఉపరితల రవాణా సంస్థ (ఎన్హెచ్) స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఏడాది పాస్ విధానం తీసువచ్చింది. కార్లు, జీపులు, వ్యాన్లు తదితర వాణిజ్యేతర వాహనాలకు ఇది వర్తిస్తుంది. ఒక్కసారి పాస్ తీసుకుంటే ఏడాది పాటు, లేదా 200 ట్రిప్పులకు అవకాశం ఉంటుంది. ఒక టోల్గేట్ దాటితే ఒక ట్రిప్పుగా పరిగణిస్తారు. ఆ దారిలో నాలుగు గేట్లు దాటి, తిరిగి వెనక్కి వస్తే ఎనిమిది ట్రిప్పులు అయినట్టు లెక్క. దేశవ్యాప్తంగా 1,150 టోల్ గేట్లు గతంలో నగదు రూపంలో టోల్ ఫీజు వసూలు చేయగా, ఆ తరువాత ఫాస్టాగ్ వచ్చింది. దీని వల్ల టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్ చాలా వరకూ తగ్గిపోయింది. దేశ వ్యాప్తంగా సుమారు 1,150 వరకు టోల్ గేట్లు ఉన్నాయని అంచనా. కోనసీమ జిల్లాలో 216 జాతీయ రహదారిపై ముమ్మిడివరం మండలం అయినాపురం వద్ద, 216 ఏ జాతీయ రహదారిపై రావులపాలెం మండలం ఈతకోట వద్ద టోల్గేట్లు ఉన్నాయి. కాకినాడ జిల్లాలో ఎన్హెచ్ 216పై గొల్లప్రోలు వద్ద, ఎన్హెచ్ 16పై కృష్ణవరం వద్ద ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో కొవ్వూరు, నల్లజర్ల వద్ద టోల్గేట్లు కనిపిస్తాయి. పాస్ పొందే విధానం ఇప్పటికే ఫాస్టాగ్ ఉన్న వాహన యజమానులు తమ ఖాతా నుంచి ఫాస్టాగ్ పాస్ పొందవచ్చు. ఆగస్టు 15 నుంచి పెద్ద ఎత్తున వీటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ పాస్ సొంత కార్లు, వాహనాలకు మాత్రమే వర్తిస్తోంది. బస్సులు, టాక్సీలు, లారీలు, రవాణా, వాణిజ్య వాహనాలకు చెల్లదు. ట్రావెల్స్కు వినియోగించే కార్లకు, జీప్లకు, వ్యాన్లకు కూడా వర్తించదు. ఈ ఫాస్టాగ్ ఏడాది పాస్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించే జాతీయ రహదారులు, జాతీయ ఎక్స్ ప్రెస్ రహదారులలోని అన్ని టోల్ ప్లాజాలలో పనిచేస్తుంది. అయితే ఉత్తరాదిన కొన్ని ఎక్స్ప్రెస్ హైవేలపై కూడా ఇది వర్తించదని తాజాగా ఎన్హెచ్ ప్రకటించింది. డిజిటల్ రూపంలోనూ.. ఫాస్టాగ్ ఏడాది పాస్ను డిజిటల్గా తీసుకోవచ్చు. రాజమార్గ్ యాత్ర యాప్ను సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని పొందవచ్చు. లేదా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్ ద్వారా కూడా లభిస్తుంది. దీని కోసం రూ.మూడు వేలు చెల్లించాలి. సంబంధిత వాహనానికి చెల్లుబాటు అయ్యే ఫాస్టాగ్ ఉండాలి. బ్లాక్ లిస్ట్లో ఉండకూడదు. సంబంధిత వాహన రిజిస్ట్రేషన్ నంబర్ వివరాలు నమోదు చేయాలి. రూ.3 వేలు చెల్లించిన తర్వాత, ఏడాది పాస్ సంబంధిత వాహన ప్రస్తుత ఫాస్ట్ ట్యాగ్కు లింక్ అవుతుంది. ఈ పాస్ ఒక ఏడాది కాలం, లేదా 200 ట్రిప్పులకు మాత్రమే పనిచేస్తుంది. ఈ రెండింటిలో దేని గడువు ముందు అయినా ఇక పనిచేయదు. ఈ పాస్ వల్ల టోల్ చార్జీలు బాగా తగ్గుతాయి.ఉపయోగాలు ఇవే కేంద్ర రవాణా, ఉపరితల మంత్రిత్వ శాఖ ఈ ఫాస్టాగ్ ఏడాది పాస్ను ప్రవేశపెట్టింది. జాతీయ రహదారిపై సొంత వాహనాల్లో ప్రయాణించే వారికి దీనివల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణంలో టోల్ గేట్ భారం బాగా తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం నుంచి విజయవాడ, రావులపాలెం మీదుగా సొంత కారులో వెళ్లి వస్తే, ఇప్పుడున్న టోల్ చార్జీలను బట్టి నాలుగు టోల్ గేట్ల వద్ద దాదాపు రూ.565 వరకు చెల్లించాలి. కానీ వార్షిక ఫాస్టాగ్ కొన్నవారికి కేవలం రూ.120 మాత్రమే అవుతుంది. అదే అమలాపురం నుంచి విశాఖపట్నం వరకు కాకినాడ, కత్తిపూడి మీదుగా వెళ్లేవారు రూ.500 వరకూ చార్జి కట్టాలి. ఇక నుంచి అది రూ.120కి తగ్గిపోతుంది. ఏడాది ఫాస్టాగ్ వల్ల సొంత కార్లు, వ్యాన్లు, జీపులు ఉన్న వారికి టోల్ చార్జీల భారం గణనీయంగా తగ్గుతుంది. -
ముగిసిన గిరిజన ప్రాచీన విజ్ఞాన సదస్సు
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ, కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ‘గిరిజన ప్రాచీన విజ్ఞాన పరిరక్షణ – భవిషత్ తరాలకు చేర్చడం’ అనే అంశం పై రెండు రోజులుగా జరుగుతున్న సదస్సు శుక్రవారంతో ముగిసిందని ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సుబ్బారావు తెలిపారు. ఇథోఫియా, ఇరాక్ వంటి దేశాల నుంచి వచ్చిన పరిశోధకులతోపాటు వివిధ అంశాలపై 65 మంది పరిశోధన పత్రాలు సమర్పించారన్నారు. వీటి నుంచి ఉత్తమ పరిశోధనలుగా ఎంపిక చేసిన 40 పరిశోధన పత్రాలతో ఒక పుస్తకాన్ని ముద్రించదలచామన్నారు. పరిశోధన పత్రాలు సమర్పించిన వారికి సర్టిఫికెట్స్ అందజేశారు. కార్యక్రమంలో కన్వీనర్ డాక్టర్ ఆర్ఎస్ వరహాలదొర, కో కన్వీనర్లు డాక్టర్ ఎం. గోపాలకృష్ణ, డాక్టర్ ఎలీషాబాబు, డాక్టర్ కె.రాజామణి, డాక్టర్ వి.రామకష్ణ, డాక్టర్ ఎన్.సుజాత, రాజేశ్వరీదేవి, సమన్వయకర్త డాక్టర్ సాంబశిరావు పాల్గొన్నారు. -
ట్రాక్టర్ తిరగబడి మహిళా కూలీ మృతి
● మరో ఇద్దరికి తీవ్ర గాయాలు ● గుడ్డిగూడెంలో ఘటన గోపాలపురం: ట్రాక్టర్ తిరగబడి మహిళా కూలీ మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యా యి. వివరాల్లోకి వెళితే. గుడ్డిగూడెం గ్రామానికి చెందిన ఎనిమిది మంది మహిళలు శుక్రవారం వరినాట్లకు వెళ్లారు. పని ముగించుకుని ట్రాక్టర్పై వస్తుండగా గుడ్డిగూడెం వద్ద గల కొవ్వాడ కాలువలోకి ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ తిరగబడింది. ఈ ప్రమాదంలో సుగ్గనబోయిన పద్మ (42) అక్కడికక్కడే మృతి చెందగా, సుగ్గనబోయిన తాయారు, కత్తవ నాగలక్ష్మికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం తరలించారు. స్వల్ప గాయాలైన అడ్డ పోశమ్మ, అడబాల వెంకటలక్ష్మి, సిరిగినీడి రామలక్ష్మి, కత్తవ అచ్చమ్మలకు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందజేశారు. సంఘటనా స్థలాన్ని దేవరపల్లి సీఐ కె.నాగేశ్వర్ నాయక్ పరిశీలించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల నుంచి ప్రమాద వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బీసీ సంక్షేమ హాస్టళ్లలో మెరుగైన విద్య
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): బీసీ సంక్షేమ హాస్టళ్లలో మెరుగైన విద్య అందించేందుకు చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు శుక్రవారం రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో తూర్పు, పశ్చి మ గోదావరి జిల్లాల పరిధిలోని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల (హెచ్డబ్ల్యూఓ)తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ సంక్షేమ శాఖ హెచ్డబ్ల్యూవోల పనితీరును మెరుగుపరుచుకునేందుకు నూతన విధానం తీసుకువచ్చిందన్నారు. విధి నిర్వహణలను విభజించి ప్రతి దానికి కొన్ని మార్కులు కేటాయించిందన్నారు. సెప్టెంబర్ 5వ తేదీ నాటికి రాష్ట్రంలోని వసతి గృహాల్లో 244 మంది నాలుగో తరగతి సిబ్బందిని నియమిస్తామన్నారు. బీసీ సంక్షేమ శాఖ సంచా లకులు ఎ.మల్లికార్జున మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లాల్లో సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. సమావేశంలో అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ బీసీ వెల్ఫేర్ డీసీఎస్ రాజు, అధికారులు పాల్గొన్నారు. -
విద్యారంగ సమస్యలపై 25న చలో కలెక్టరేట్
కాకినాడ సిటీ: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీన తలపెట్టిన చలో కలెక్టరేట్ కార్యక్రమ పోస్టర్ను శుక్రవారం స్థానిక పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద సంఘ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి.శ్రీకాంత్, ఎం.గంగాసూరిబాబు మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం విద్యారంగాన్ని కనీసం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూతన జాతీయ విద్యావిధానం పేరు చెప్పి విద్యను మొత్తం ప్రైవేటీకరణ, కేంద్రీకరణ, కషాయీకరణ చేస్తున్నాయని దుయ్యబట్టారు. ప్రభుత్వ విద్యారంగంలోని పెండింగ్లో ఉన్న రూ.64 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 77ను రద్దు చేసి, ప్రైవేట్ కాలేజీలో పీజీ చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని వర్తింపజేయాలని చెప్పారు. హాస్టల్ విద్యార్థులకు మెస్ చార్జీలు రూ.3 వేలకు పెంచి, హాస్టల్కు శాశ్వత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘ నగర అధ్యక్షుడు ఎ.వాసుదేవ్, జిల్లా కమిటీ సభ్యులు చిన్ని, జైశ్రీరామ్, నగర నాయకులు సత్యం, ఆదర్శ్ కార్త్తిక్, తేజ తదితరులు పాల్గొన్నారు. -
వరలక్ష్మీ నమోస్తుతే..
● రత్నగిరిపై ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ● పాల్గొన్న 9,680 మంది మహి ళ లుఅన్నవరం : నిత్యం సత్యదేవుని నామజపంతో మార్మోగే రత్నగిరి శ్రావణమాసం ఐదో శుక్రవారం మాత్రం వేలాదిగా వచ్చిన మహిళల వరలక్ష్మీ నామ జపంతో మార్మోగింది. దేవస్థానంలో ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఘనంగా నిర్వహించారు. నిత్యకల్యాణ మండపంతో బాటు నాలుగు, ఐదో నంబర్ వ్రత మండపాలు, వాయవ్య, నైరుతి వ్రత మండపాలలో ఈ వ్రతాలు నిర్వహించారు. మొత్తం ఎనిమిది బ్యాచ్లలో 9,680 మంది మహిళలు ఈ వ్రతాలు ఆచరించారు. ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకూ రత్నగిరి ఆలయ ప్రాంగణం మహిళలతో కిటకిట లాడింది. ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు జ్యోతి వెలిగించి కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం పండితులు విఘ్నేశ్వరపూజ, కలశస్థాపన, శ్రీసత్యదేవుడు, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిత్య కల్యాణ మండపం వేదిక మీద ప్రతిష్ఠించిన వరలక్ష్మీ అమ్మవారికి ప్రధానార్చకులు కోట సుబ్రహ్మణ్యం పూజలు చేసి హారతి ఇచ్చారు. కల్యాణబ్రహ్మ ఛామర్తి కన్నబాబు మహిళలతో వరలక్ష్మీ వ్రతం చేయించారు. వరలక్ష్మీ వ్రతకథను పాలంకి పట్టాభిరామ్మూర్తి చదివి వినిపించారు. హాజరైన మహిళలకు ఉచితంగా జాకెట్టుముక్క, సత్యదేవుని ప్రసాదం, అమ్మవారి రాగిరూపు, చేతికి కట్టుకునే తోరం అందజేశారు. నిత్యాన్నదాన పథకంలో వీరికి భోజన సౌకర్యం కలుగజేశారు. మహిళలు గంటల తరబడి క్యూ లో నిలబడాల్సి వచ్చింది. దాంతో ముగ్గురు మహిళలు సొమ్మసిల్లి పడిపోగా వారిని వ్రతాల ఆఫీసులోకి తరలించి తోటి మహిళలు సపర్యలు చేశారు. అధికారులు రామాలయం వద్ద గల వార్షిక కల్యాణ మండపంలో కూడా వ్రతాలు నిర్వహించి ఉంటే గంటల తరబడి మహిళలు వేచియుండే అవసరం ఉండేది. -
శాస్త్రోక్తంగా లక్ష రుద్రాక్ష పూజ
ఐ.పోలవరం: నిత్య కల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ల భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామివారికి గురువారం లక్ష రుద్రాక్ష పూజా మహోత్సవం అత్యంత శాస్త్రోక్తంగా జరిగింది. శ్రావణ మాసం మాస శివరాత్రి మహా పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు యనమండ్ర సత్య సీతారామ శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. 15 మంది రుత్విక్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. వారణాసి నుంచి తెచ్చిన రుద్రాక్షలను మేళతాళాలతో గ్రామోత్సవం జరిపి, గోదావరి వద్ద ప్రత్యేక పూజలు, సంప్రోక్షణ చేశారు. 728 మంది భక్తులు గోత్ర నామాలు నమోదు చేసుకున్నారు. ఆలయ సహాయ కమిషనర్, కార్య నిర్వాహణాధికారి వి.సత్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులకు అల్పాహారం, అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. కార్యక్రమం తిలకించేందుకు భారీ ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. భక్తులకు రుద్రాక్షలు ప్రసాదంగా అందజేశారు. -
బాబూయ్ రచ్చ
సాక్షి ప్రతినిధి, కాకినాడ: నమ్మించి దగా చేయడంలో చంద్రబాబు మాస్టర్ డిగ్రీ చేశారు. అది ప్రజలైనా, పార్టీ కోసం పనిచేసే నాయకులైనా, అందరినీ ఒకే గాటన కడతారు. ఎన్నికల్లో సేవలను వినియోగించుకుని గద్దెనెక్కాక కాలదన్నేయడంలో బాబును మించిన నాయకుడు లేడంటారు. అది అక్షరాలా నిజమని కాకినాడ రూరల్ నియోజకవర్గ శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన పిల్లి సత్యనారాయణమూర్తి (సత్తిబాబు) తాజా ఎపిసోడ్తో స్పష్టమైంది. పార్టీ కాకినాడ రూరల్ మండల అధ్యక్ష పదవి కోసం మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి, సత్తిబాబు వర్గం కాలా శ్రీనివాస్ను, వైరి వర్గం నుంచి కో కోఆర్డినేటర్ కటకంశెట్టి ప్రభాకర్(బాబి) వర్గం కాకరపల్లి చలపతిరావును తెరమీదకు తీసుకు రావడంతో బుధవారం పార్టీ పరిశీలకులు నల్లమిల్లి వీర్రెడ్డి, పి.సుధాకర్రెడ్డి సమక్షంలోనే కుమ్ములాడుకున్నాయి. రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నిక చివరకు రసాభాసగా మారి అర్ధాంతరంగా ముగిసింది. గతంలో ఎప్పుడూ లేనిది పార్టీ మండల కమిటీ అధ్యక్షుడి ఎంపిక కోసం కటకంశెట్టి బాబి వర్గం సీల్డ్ కవర్ రాజకీయాన్ని తెరమీదకు తీసుకురావడాన్ని సత్తిబాబు వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. సీనియర్ అయిన తనను, తన భార్యను ఇంతలా అవమానించడాన్ని తట్టుకోలేక మనస్తాపంతో సత్తిబాబు పార్టీ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు గురువారం మీడియా సమావేశంలో ప్రకటించారు. ఇందుకు దారి తీసిన పరిస్థితులపై పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పేరుతో నాలుగు పేజీల లేఖను విడుదల చేశారు. తమకు, అనుచరులకు జరుగుతున్న అవమానాలు తట్టుకోలేక, ఆత్మాభిమానం దెబ్బతిని, పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నా గౌరవం దక్కకపోవడంతో పదవిని విడిచిపెట్టాల్సి వచ్చిందని సత్తిబాబు వెల్లడించారు. సత్తిబాబును బుజ్జగించేందుకు పార్టీ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, తోట నవీన్ వంటి నాయకులు ప్రయత్నించారు. కానీ అప్పటికే కోఆర్డినేటర్ పదవికి సత్తిబాబు రాజీనామా చేసేశారు. ఇక చేసేదేమీ లేక వారు అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్తామని ముక్తాయించారు.వాస్తవానికి సార్వత్రిక ఎన్నికల నుంచి సత్తిబాబు అధిష్టానంపై అసహనంతోనే ఉన్నారు. అయినా సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ రూరల్ సీటును పొత్తు ధర్మానికి కట్టుబడి త్యాగం చేసిన పాపానికి సత్తిబాబుకు అతన్నే నమ్ముకుని టీడీపీ వెన్నంటే నిలిచిన అనుచర వర్గానికి అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నాయి. తమకు జరుగుతున్న అవమానాలు, అన్యాయాలపై గడచిన 14 నెలల కాలంలో అధినేత చంద్రబాబు దగ్గర నుంచి ఆ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని పర్యవేక్షించే నేతల వరకూ అందరి వద్ద నాలుగైదు పర్యాయాలు సాగిలపడినా అవమానాలే తప్ప ఆశాజనకమైన ప్రతి స్పందన కనిపించక పోవడాన్ని సత్తిబాబు వర్గం సీరియస్గా తీసుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో అనుచర వర్గాన్ని పార్టీ కోసం సైనికుల్లా ఎన్నికల ముందు నిలబెట్టినందుకు సరైన గుణపాఠమే చెప్పారని సత్తిబాబు వర్గీయులు మండిపడుతున్నారు.ఒక్క పదవీ దక్కలేదని..ఎన్నికలై అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచిపోయినా తమ నాయకుడికి ఒక్కటంటే ఒక్క పదవి కూడా దక్కలేదని సత్తిబాబు అనుచరులు బాహాటంగానే ఆక్షేపిస్తున్నారు. పేరుకే కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ అయినా ఆ స్థాయిలో అటు పార్టీలోనూ, ఇటు అధికారిక కార్యక్రమాల్లోనూ ప్రాతినిధ్యం దక్కకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో పైనుంచి కింది వరకూ పొమ్మనకుండానే పొగబెడుతున్నారని ఆ వర్గంలో బలంగా నాటుకుపోయింది. లేదంటే పార్టీ కోఆర్డినేటర్గా నియోజకవర్గంలో 25 గ్రామాల్లో బూత్ కమిటీలు అన్నింటినీ పూర్తి చేసి రూరల్ మండల అధ్యక్షుడి నియామకానికి అడ్డుతగలడం ఏంటని సత్తిబాబు సహా ఆ వర్గం మండిపడుతోంది. రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై కూడా సత్తిబాబు పనిలో పనిగా పలు విమర్శలు సంధించారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి గెలిపిస్తే అధికారంలోకి వచ్చాక కనీసం పనుల్లో ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారని సత్తిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొత్తు ధర్మంలో భాగంగా 50 శాతం పదవులు, పనులు తమ పార్టీ నేతలకు దక్కాల్సిందేనని అన్నారు. ఎన్నికల్లో తమ సేవలను వినియోగించుకుని, ఇప్పుడు కూరలో కరివేపాకులా తీసిపడేస్తారా అని సత్తిబాబు వర్గం నిలదీస్తోంది. జరుగుతున్న అవమానాలను చంద్రబాబు సహా జిల్లా ఇన్చార్జి మంత్రి నారాయణ, పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకుల వరకూ తీసుకువెళ్లినా బీసీ సామాజిక వర్గానికి చెందడంతో తొక్కేస్తున్నారనే ఆవేదనతో ఆ వర్గం కుతకుతలాడుతోంది.ఉదయం అక్కడ.. సాయంత్రం ఇక్కడఅవమానాలపై సత్తిబాబు వర్గం ఉదయం ఆరోపణలకు దిగితే సాయంత్రానికి కటకంశెట్టి బాబి అనుచరులు సత్తిబాబుపై ఎదురుదాడికి దిగారు. రూరల్ మండల అధ్యక్ష పదవికి బాబి వర్గం ప్రతిపాదించిన కాకరపల్లి చలపతి సహా కముజు నెహ్రూ, గీశాల శ్రీనివాస్, గుడాల లోవరాజు, వాసంశెట్టి శ్రీనివాస్, తుమ్మల వెంకన్న తదితరులు మీడియా సమావేశంలో సత్తిబాబుపై అనేక ఆరోపణలు సంధించారు. 2024 ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వలేదని చంద్రబాబు, లోకేష్ ఫ్లెక్సీలు తగలబెట్టలేదా అని వారు నిలదీశారు. కార్పొరేషన్ డైరెక్టర్గా పనికి ఆహార పథకంలో బియ్యం స్వాహా చేయడంపై కేసు నమోదు, తరచూ పార్టీపై అలక వహించడం, ఆనక ఇంట్లో కూర్చోవడం సత్తిబాబుకు ఆనవాయితీగా వస్తున్నదేనంటూ వారు తాజా ఎపిసోడ్ను కొట్టిపారేస్తున్నారు. సత్తిబాబుపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేయడంతో టీడీపీలో ఇరువర్గాల మధ్య రాద్ధాంతం రావణకాష్టాన్ని తలపిస్తోంది. ఈ కుమ్ములాటల కుంపటి ఏ తీరానికి చేరుతుందో వేచి చూడాల్సిందే. -
సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీల ధర్నా
కాకినాడ సిటీ: అంగన్వాడీలకు ఇబ్బంది కలిగించే ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని, 5జీ టెక్నాలజీతో ఉన్న కొత్త సెల్ఫోన్లు ఇవ్వాలంటూ గురువారం కాకినాడ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నగరంలోని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జి.బేబీరాణి మాట్లాడుతూ ఎఫ్ఆర్ఎస్ యాప్ వల్ల అంగన్వాడీ వర్కర్లతో పాటు లబ్ధిదారులు, బాలింతలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిని తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి అంగన్వాడీలకు వేతనాలు పెంచలేదన్నారు. 2024లో 42 రోజుల సమ్మె అనంతరం మినిట్స్లో నమోదు చేసినటువంటి అంశాల అమలుకు ఈ ప్రభుత్వం ముందుకు రావట్లేదన్నారు. తక్షణమే పెరిగిన ధరలకనుగుణంగా కనీస వేతనాలు చెల్లించాలని అన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రాకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అర్బన్ తహసీల్దార్ జితేంద్రకు అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నగర కన్వీనర్ మలకా వెంకటరమణ, కో కన్వీనర్ మేడిశెట్టి వెంకటరమణ, అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ కాకినాడ అర్బన్ ప్రాజెక్టు అధ్యక్షురాలు ఎం.విజయ, జి.రమణమ్మ, సరోజని, వసంత, సత్య, వరలక్ష్మి, అపర్ణ, రమాదేవి, రమ, శేషు, శ్రీదేవి, రామలక్ష్మి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
పలుకుపడి ఉంటేనే పూజ
రెండు రోజులుగా వస్తున్నా.. రెండు రోజులుగా ఒక్క పాస్ కోసం ఇక్కడే ఆలయం వద్ద పడిగాపులు కాశాను. అయినా దొరకలేదు. కేవలం పది నిమిషాలు మాత్రమే 50 పాస్లు ఇచ్చి అయిపోయాయని చెబుతున్నారు. నేను కరప నుంచి వచ్చాను. అయినా పాస్ దొరకలేదు. – వీరలక్ష్మి, భక్తురాలు కావాల్సిన వారికే ఇస్తున్నారు ఆలయంలో వారికి కావాల్సిన వారికి మాత్రం దొంగచాటుగా అన్ని పాస్లు ఇస్తున్నారు. కానీ రోజుల తరబడి క్యూలో ఉన్నవారికి మాత్రం ఒక్క పాస్ కూడా ఇవ్వలేదు. పాస్లు అడిగితే సెక్యూరిటీ సిబ్బందితో బయటకు గెంటించి వేస్తున్నారు. – ప్రమీల, భక్తురాలు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): పలుకుబడి ఉంటేనే పూజ అన్నట్లు చేశారు.. ఎంతో భక్తితో నిర్వహించే సామూహిక వరలక్ష్మీ వ్రతాలకూ రాజకీయ రంగు పులిమేశారు.. దీంతో శ్రావణ శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మీ పూజల్లో పాల్గొనేందుకు పాస్ల కోసం వచ్చిన మహిళలు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. గంటల తరబడి వేచి ఉన్నా పాస్లు అయిపోయాయని చెప్పడంతో ఆందోళనకు దిగారు. కాకినాడ బాలాత్రిపుర సుందరీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్నారు. దీనికోసం గురువారం పాస్లు పంపిణీ చేశారు. కేవలం 100 పాస్లు ఇచ్చి మొత్తం అయిపోయాయని చెప్పడంతో ఉదయం నుంచి అక్కడ వేచిఉన్న మహిళలు ఆందోళనకు దిగారు. కేవలం సిఫార్సులు ఉన్నవారికి మాత్రమే ఇక్కడ పాస్లు ఇచ్చి, మిగిలిన వారికి ఇవ్వడం లేదని మహిళలు బహిరంగానే చెప్పారు. టీడీపీ నాయకులు, వారి బంధువులు ఒక్కొక్కరికి 5 నుంచి 10 పాస్లు ఇచ్చారని, తాము మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకూ పడిగాపులు కాసినా ఒక్క పాస్ కూడా ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఆలయంలో శుక్రవారం మహిళలు పూజలు చేసుకునేందుకు సుమారు 2,500 పూజా సామాన్లు కిట్లు సిద్ధం చేశామని, తమకు కూడా పాస్లు ఇవ్వలేదని అక్కడ సేవ చేసే మహిళలు సైతం ఆలయ సిబ్బందితో గొడవకు దిగారు. వేచి ఉంచి.. వెనక్కి పంపించి బాలాత్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో పూజలు చేస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయనేది నమ్మకం. అందుకే ఇక్కడ పూజల కోసం మహిళలు ఎదురు చూస్తుంటారు. రెండు రోజులుగా పాస్ల కోసం భక్తులు ఇక్కడ తిష్టవేసినా ఒక్క పాస్ కూడా భక్తులకు ఇవ్వకుండా పచ్చ నాయకులకు మాత్రం దొడ్డిదారిన పాస్లు ఇచ్చి పంపారు. దేవదాయ శాఖ అధికారులు సైతం ఇక్కడ పాస్లు లేవని, కావాల్సిన వారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కార్యాలయానికి వెళ్లాలని చెప్పడం గమనార్హం. పాస్లన్నీ ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లిపోయాయని, ఈ మాత్రం దానికి ఎందుకు ఇలా పడిగాపులు కాసేలా చేశారని మహిళలు మండిపడ్డారు. బయటకు పంపించేసి.. పాస్ల కోసం మహిళలు ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంధి బాబ్జీ కార్యాలయం, ఈఓ ఉండవల్లి వీర్రాజు కార్యాలయం వద్ద గంటల తరబడి వేచిఉన్నారు. ఎంతసేపటికి పాస్లు ఇవ్వకపోవడంతో వారు ఇక్కడి నుంచి కదిలేదిలేదని భీష్మించుకుని కూర్చోవడమే కాకుండా ఈఓ రావాలి, పాస్లు ఇవ్వాలని నినాదాలు చేశారు. అదే సమయంలో ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీ బయటకు రావడంతో మహిళలు ఆయనను చుట్టుముట్టారు. పాస్లు ఇవ్వకుండానే ఆయన ఆలయం నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో ఆలయ, సెక్యూరిటీ సిబ్బంది పాస్లు అయిపోయాయని, బయటకు వెళ్లిపోవాలంటూ మహిళలను దౌర్జన్యంగా ఆలయ ప్రాంగణం నుంచి బయటకు పంపించేశారు. ఫ సామూహిక వరలక్ష్మీ వ్రతాలకు రాజకీయ రంగు ఫ పచ్చ నేతలకే పాస్లు ఫ ఆలయం వద్ద మహిళల నిరసన -
కన్నబాబుకు పేర్ని నాని పరామర్శ
కాకినాడ రూరల్: పితృ వియోగంతో బాధపడుతున్న మాజీ మంత్రి, వైఎస్సార్ పీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబును మాజీ మంత్రి పేర్ని నాని గురువారం పరామర్శించారు. కన్నబాబు తండ్రి కురసాల సత్యనారాయణ అనారోగ్యంతో మంగళవారం మృతి చెందిన సంగతి విధితమే. కాకినాడ వైద్యనగర్ నివాసంలో సత్యనారాయణ చిత్ర పటానికి పేర్ని నాని నివాళులర్పించి, శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కన్నబాబు, ఆయన సోదరుడు సినీ దర్శకుడు కళ్యాణ్ కృష్ణలను ఓదార్చారు. కన్నబాబును పరామర్శించిన వారిలో అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, మాజీ ఎంపీ మాధవి, పాడేరు మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి భాగ్యలక్ష్మి, విజయనగరం మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి, మాజీ ఎంపీ చిట్టూరి రవీంద్ర, చుండ్రు శ్రీహరి, మాజీ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి, మాజీ ఎమ్మెల్యేలు నాగులపల్లి ధనలక్ష్మి, బండారు సత్యానందరావు, మారిశెట్టి రాఘవయ్య, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, ఒమ్మి రఘురామ్ తదితరులు ఉన్నారు. -
సారా రహితంగా మార్చుదాం
ప్రత్తిపాడు: ఆంధ్రప్రదేశ్ను సారా రహిత రాష్ట్రంగా మార్చడమే ధ్యేయంగా ప్రభుత్వం నవోదయం 2.0 కార్యక్రమాన్ని రూపొందించిందని జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఎం.కృష్ణకుమారి అన్నారు. ప్రత్తిపాడు ఎకై ్సజ్ సర్కిల్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో నవోదయం కార్యక్రమానికి 136 గ్రామాలను ఎంపిక చేశారన్నారు. ఇప్పటికే 129 గ్రామాల్లో సారా వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, ఆర్థిక, దుష్ప్రభావాలను వివరించామన్నారు. సారా అమ్మడం, తయారు చేయడం, రవాణా చేయడం, కలిగి ఉండటం చట్టరీత్యా నేరమన్నారు. జిల్లాలో ప్రత్తిపాడు, తుని ఎకై ్సజ్ సర్కిళ్ల పరిధిలో ఎక్కువగా సారా కేసులు నమోదు అవుతున్నాయన్నారు. సిబ్బంది విషయానికొస్తే 55 శాతం పోస్టులు భర్తీ కావాల్సి ఉందని వివరించారు. సమావేశంలో ఎస్టీఎఫ్ సూపరింటెండెంట్ దేవదత్త, ఎకై ్సజ్ సీఐ పి.శివప్రసాద్ పాల్గొన్నారు. -
వర్రీఫికేషన్
సాక్షి, అమలాపురం: కూటమి ప్రభుత్వ తీరుతో డీఎస్సీ పరీక్ష రాసిన అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు. ఎప్పుడు లేని విధంగా కొత్త విధానానికి తెరతీయడంతో వారిలో ఆందోళన అధికమవుతోంది. డీఎస్సీ స్కోర్ కార్డులను ఈ నెల 14న విడుదల చేశారు. అనంతరం వారం రోజులు గడుస్తున్నప్పటికీ నేటి వరకు మెరిట్ జాబితాను ఇవ్వలేదు. దాని కోసం అభ్యర్థులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే మెరిట్ జాబితా ఇవ్వకుండా సెలెక్షన్ జాబితా ఇస్తారని, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభిస్తారని వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు సోషల్ మీడియాలో వస్తున్న పోస్టింగులతో ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వం స్పందించి వెంటనే ఈ గందరగోళానికి తెరదించాలని, మెరిట్ జాబితా ప్రకటించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఏం జరిగిందంటే.. డీఎస్సీ 2025 అభ్యర్థుల స్కోర్ కార్డులను విద్యాశాఖ వెబ్సైట్లో విడుదల చేసింది. స్కోర్ కార్డుల ఆధారంగా ఎవరికెన్ని మార్కులు వచ్చాయి? తమ మార్కులకు ఉద్యోగం వస్తుందా? రాదా? అంటూ అభ్యర్థులు ఆరా తీసుకుంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వివిధ కేటగిరీల కింద 1,241 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన విషయం పాఠకులకు తెలిసిందే. స్కోర్ కార్డులు ఇచ్చినప్పటికీ మెరిట్ జాబితా ప్రకటిస్తేనే అభ్యర్థులకు ఊరట కలుగుతుంది. అయితే ఇంత వరకు ఆ దిశగా ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రయత్నాలు జరగలేదు. ఇదిలా ఉంటే డీఎస్సీ ద్వారా భర్తీ చేసే పోస్టుల్లో ఎంపికై న అభ్యర్థులకు ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలో నిర్ణయించేందుకు ఖాళీల వివరాలను విద్యాశాఖ సేకరించింది. డీఈవో కార్యాలయాల ఐటీ విభాగం మండల విద్యాశాఖ అధికారుల ద్వారా వాస్తవంగా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, అత్యవసరంగా ఎక్కడ భర్తీ చేయాలనే విషయాలపై సమాచారాన్ని రాబట్టినట్లు సమాచారం. 25 టీమ్ల ఏర్పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డీఎస్సీలో మెరిట్ కనబర్చిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. దీనికోసం తూర్పుగోదావరి జిల్లాలో 25 టీములను నియమించింది. దీనిలో మండల విద్యాశాఖాధికారులు, ఐటీ సిబ్బంది ఉంటారు. సర్టిఫికెట్ల పరిశీలన చేసే విధానంపై టీమ్ సభ్యులకు బుధవారం విజయవాడలో పాఠశాల విద్యాశాఖ వర్క్షాపును నిర్వహించింది. తెరపడేదెన్నడు? డీఎస్సీ 2025 నోటిఫికేషన్ ఈ ఏడాది ఏప్రిల్ 20న విడుదలైంది. దరఖాస్తుకు మే 15 తుది గడువు, అనంతరం 63,004 దరఖాస్తులు వచ్చాయి. జూన్ 6 నుంచి జూలై 2 వరకూ పరీక్షలు జరిగాయి. ప్రైమరీ కీని జూలై 4న, అభ్యంతరాల అనంతరం ఫైనల్ కీని ఆగస్టు ఒకటిన విడుదల చేశారు. ఆగస్టు 14న స్కోర్ కార్డులను అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లో నార్మలైజేషన్ మార్కులతో కలిపి ఇచ్చారు. ఇప్పుడు అభ్యర్థుల దృష్టి అంతా మెరిట్ జాబితాపైనే ఉంది. అభ్యర్థులు తీవ్ర ఉత్కంఠతో మెరిట్ జాబితా ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్నారు. డీఎస్సీ సర్వం గందరగోళం నేటికీ ప్రకటించని మెరిట్ జాబితా గతానికి భిన్నంగా డీఎస్సీ 2025 అయోమయంలో అభ్యర్థులు స్కోర్ కార్డులు ప్రకటించిన అనంతరం మెరిట్ జాబితాను ప్రకటించాల్సి ఉంది ఇంతవరకు మెరిట్ జాబితా ప్రకటన లేదు అయోమయానికి గురవుతున్న అభ్యర్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు సిద్ధమవుతున్న జిల్లా యంత్రాంగం మెరిట్ జాబితా రాకపోవడంతో అభ్యర్థుల ఆందోళన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1,241 ఉపాధ్యాయ పోస్టులు కూటమి తీరుతో డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన మెరిట్ జాబితా కోసం ఎదురు చూపులు ఇప్పటికీ విడుదల చేయని సర్కార్ పైగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు సిద్ధమంటూ వార్తలు -
రేపు సామూహిక ఉచిత వరలక్ష్మీ వ్రతం
అన్నవరం: శ్రావణమాసం ఐదో శుక్రవారం సందర్భంగా సత్యదేవుని సన్నిధిన ‘సామూహిక ఉచిత వరలక్ష్మీ వ్రతం’ నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం ఎనిమిది గంటలకు ఈ వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. నిత్య కల్యాణ మండపంతోపాటు నాలుగు, ఐదో నంబర్ వ్రత మండపాలలో కూడా ఈ వ్రతాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. మూడు మండపాలలో వ్రతాలు నిర్వహించిన తరువాత కూడా మహిళలు ఎక్కువగా ఉంటే ఉదయం పది గంటలకు రెండో బ్యాచ్లో కూడా ఈ వ్రతాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లాలో ప్రభుత్వ రంగ సంస్థల ఉపాధ్యాయులకు సంబంఽధించి 2025 జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి పిల్లి రమేష్ బుధవారం తెలిపారు. కనీసం 10 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా అనుభవం ఉండాలని, అర్హత ఉన్నవారు ఈ నెల 30వ తేదీలోగా జిల్లా విద్యాశాఖాఽధికారి వెబ్సైట్లో దరఖాస్తు చేసి, తమకు అందజేయాలని సూచించారు. పంపా కాలువ గండికి తాత్కాలిక మరమ్మతులు తుని రూరల్: తుని మండలం టి.తిమ్మాపురం సమీపంలో పంపా వరద కాలువకు పడిన గండిని ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణలో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. సోమవారం రాత్రి పంపా కాలువకు గండిపడిన విషయం తెలిసిందే. మంగళవారం నియోజకవర్గ ప్రత్యేక అధికారి కె.శ్రీధర్ గండిని పరిశీలించి విషయాన్ని కలెక్టర్ షణ్మోహన్కు తెలియజేశారు. కలెక్టర్ ఆదేశాలతో బుధవారం జేసీబీ సహాయంతో మట్టితో గండిని పూడ్చివేసినట్టు ఎంపీడీఓ కె.సాయి నవీన్ తెలిపారు. ఇసుక బస్తాలు తరలించేందుకు పరిసర ప్రాంతాలు అనుకూలంగా లేకపోవడంతో తాత్కాలిక మరమ్మతులను మట్టితో పూర్తి చేసినట్టు తెలిపారు. వాతావరణం అనుకూలించిన తర్వాత ఇసుక బస్తాలతో గట్టిను మరింత పటిష్ట పర్చనున్నట్టు తెలిపారు. వాడపల్లి వెంకన్నకు రూ.1.42 కోట్ల ఆదాయం కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామికి హుండీల ద్వారా రూ. 1,42,16,807 ఆదాయం వచ్చింది. దేవదాయ, ధర్మాదాయశాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు బుధవారం ఈ విషయం తెలిపారు. ఆలయంలోని హుండీలను 28 రోజుల అనంతరం దేవదాయశాఖ అధికారుల పర్యవేక్షణలో బుధవారం తెరిచి, ఆదాయాన్ని వసంత మండపంలో లెక్కించారు. ప్రధాన హుండీల ద్వారా రూ.1,19,58,204, అన్నప్రసాదం హుండీల ద్వారా రూ. 22,58,603 వచ్చిందని ఈఓ వివరించారు. అలాగే బంగారం 23 గ్రాములు, వెండి 670 గ్రాములు, విదేశీ కరెన్సీ నోట్లు 46 వచ్చాయన్నారు. ఈ కార్యక్రమ పర్యవేక్షణ అధికారిగా ఏసీ అండ్ జిల్లా దేవదాయశాఖ అధికారి వి.సత్యనారాయణ, దేవదాయశాఖ ఇన్స్పెక్టర్ టీవీఎస్ సార్ ప్రసాద్, జిల్లా దేవదాయశాఖ కార్యాలయ పర్యవేక్షకుడు డి.సతీష్ కుమా ర్, గోపాలపురం గ్రూపు దేవాలయాల ఈవో బి కిరణ్, దేవస్థానం సిబ్బంది అర్చకులు, శ్రీవారి సేవకులు పోలీసులు, కెనరా బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. -
స్వామికి దయ కలిగింది!
అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో శానిటరీ సిబ్బందిపై సత్యనారాయణ స్వామి దయ చూపారు. సిబ్బంది జూన్, జూలై నెలల జీతాలు బుధవారం అందుకున్నారు. 350 మంది శానిటరీ సిబ్బంది బ్యాంకు ఖాతాలకు బుధవారం కనకదుర్గా మేన్పవర్ సంస్థ ద్వారా జీతాలు జమ అవడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. విభాగాల వారీగా ఒక్కొక్కరు నెలకు రూ.10,500 నుంచి రూ.12,500 వరకు రెండు నెలల జీతాలు అందుకున్నారు. ఇందుకోసం రూ.1.18 కోట్ల మొత్తాన్ని దేవస్థానం బుధవారం ఆ కాంట్రాక్టర్ అకౌంట్కు జమ చేసిన ఐదు నిమిషాల్లోనే సిబ్బంది అకౌంట్లకు జీతాలు జమ అయ్యాయి. ఈసారి కూడా సాక్షి చొరవతోనే... గతంలో మాదిరిగానే ఈసారి కూడా సాక్షి చొరవతోనే సిబ్బందికి జీతాలు జమ అవడం విశేషం. సాక్షి దినపత్రికలో ఈ నెల 12వ తేదీన ‘స్వామీ...నీ దయ రాదా...!’ శీర్షికన వార్త ప్రచురితమైన తరువాత మాత్రమే జీతాల చెల్లింపు ప్రక్రియ వేగవంతమైంది. గతంలో మార్చి జీతాలు ఆలస్యమవడంతో అప్పట్లో సాక్షి దినపత్రికలో ఏప్రిల్ 25 వ తేదీన ‘మాకు జీతాలు ఎప్పుడిస్తారు స్వామీ’ అంటూ వార్త ప్రచురించడంతో ఏప్రిల్ 30న కార్మికుల అకౌంట్లో జీతాలు వేశారు. ఏప్రిల్ జీతాలు కూడా ఆలస్యం కావడంతో మే నెల 26న ‘వీరి కష్టం తుడిచేవారేరీ!’ శీర్షికన వార్త ప్రచురించడంతో దేవస్థానం అధికారులు స్పందించి జీతాలు చెల్లించారు. మే నెల జీతాలు కూడా జూన్ రెండో వారంలో చెల్లించారు. రత్నగిరి శానిటరీ సిబ్బందికి జీతాల చెల్లింపు -
ఉగ్ర గోదావరి ఉరకలు
రాజమహేంద్రవరంలో వరద గోదావరి ఉధృతిధవళేశ్వరం: ఉగ్ర గోదావరి ఉరకలేస్తోంది. ఎగువ నుంచి కాటన్ బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఇరిగేషన్ యంత్రాంగం అప్రమత్తమైంది. ధవళేశ్వరం ఫ్లడ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో ఎగువ ప్రాజెక్టుల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో నీటి ఉధృతి వేగంగా పెరుగుతుంది. మరోపక్క గోదావరి ఉపనదులు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి పొంగి పొర్లుతున్నాయి. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద బుధవారం రాత్రి 10.60 అడుగులకు నీటి మట్టం చేరింది. మొత్తం 175 క్రస్ట్గేట్లను పూర్తిగా పైకిలేపి మిగులు జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. 8,28,331 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి వదిలారు. డెల్టా కాలువలకు సంబంధించి 4,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 3,000 క్యూసెక్కులు, మధ్య డెల్టాకు 1,300 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 500 క్యూసెక్కుల నీటిని వదిలారు. నేడు మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి.. కాటన్ బ్యారేజీ వద్ద నీటి ఉధృతి క్రమక్రమంగా పెరుగుతోంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గురువారం ఉదయం ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి నీటి మట్టం చేరే అవకాశం ఉందని ఇరిగేషన్ యంత్రాంగం అంచనా వేస్తోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 10 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలు విడుదల చేస్తూ 11.75 అడుగులకు నీటి మట్టం చేరితే మొదటి ప్రమాద హెచ్చరికను ప్రకటిస్తారు. 13.75 అడుగులకు నీటి మట్టం చేరితే రెండవ ప్రమాద హెచ్చరికను, 17.75 అడుగులకు నీటి మట్టం చేరితే మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయితే లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు పడవల రాకపోకలను నిషేధిస్తారు. ఎగువ ప్రాంతాల్లో ఇలా... ఎగువ ప్రాంతాలకు సంబంధించి భద్రాచలంలో 47.40 అడుగులకు నీటి మట్టం చేరింది. భద్రాచలంలో ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక అమలులో ఉంది. రాత్రి 10 గంటలకు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాళేశ్వరంలో 12.83 మీట ర్లు, పేరూరులో 17.48 మీటర్లు, దుమ్ముగూడెంలో 13.07 మీటర్లు, పోలవరంలో 13.78 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 15.55 మీటర్ల వద్ద నీటిమట్టాలు కొనసాగుతున్నాయి. లంకలను ముంచెత్తిన వరద సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): లంక ప్రాంతాల్లో నివసిస్తున్న వారు వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తారు. వర్షాకాలం మూడు నెలలు వీరికి కష్టకాలం అని చెప్పవచ్చు. చేపలు పట్టుకోవడం, లంకల్లో పశువుల పెంపకం వంటి పనులతో వీరంతా జీవనోపాధి పొందుతారు. వర్షాకాలంలో గోదావరికి వరద నీరు చేరడంతో వీరిని పునరావాస కేంద్రాలకు తరలించడం పరిపాటుగా మారింది. ఏటా వర్షాకాలంలో వీరిని రాజమహేంద్రవరంలోని పునరావాస కేంద్రాలకు తరలిస్తారు. అక్కడే వీరికి మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. వరద ఉధృతి తగ్గిన తరువాత వారంతా తిరిగి లంకల్లోకి వెళ్లతారు. నేడు ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఇరిగేషన్ యంత్రాంగం అప్రమత్తం కాటన్ బ్యారేజీ నుంచి 8.28లక్షల క్యూసెక్కుల మిగులు జలాల విడుదల -
మాల కార్పొరేషన్ చైర్మన్కు ప్రొటోకాల్ పాటించరా?
కాకినాడ సిటీ: జిల్లాకు వచ్చిన మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్కుమార్కు ప్రభుత్వ యంత్రాంగం ప్రొటోకాల్ పాటించని కారణంగా మాల సంఘ నాయకులు సమావేశాన్ని బాయ్కట్ చేశారు. కాకినాడ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ (డీఆర్డీఏ సమావేశపు హాలు)లో మంగళవారం మాల కార్పొరేషన్ చైర్మన్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జిల్లాలో ఉన్న నాయకులకు, ఉద్యమకారులకు సరైన సమాచారం అందించలేదని మాల సంఘ నాయకులు విమర్శించారు. ఒక కార్పొరేషన్ చైర్మన్ వచ్చినప్పుడు పాటించవలసిన ప్రొటోకాల్ను పట్టించుకొనకపోవడం విచిత్రంగా ఉందని ఎస్సీ నాయకులు విమర్శించారు. చైర్మన్ వచ్చినప్పుడు కలెక్టర్గాని, ప్రభుత్వ అధికారులుకానీ ఉండాలి అలా కాకుండా సాధారణమైన వ్యక్తులను చూసినట్లుగా సమావేశాలు నిర్వహించడం సమంజసం కాదన్నారు. కలెక్టర్ సమక్షంలో సమావేశం నిర్వహించాలని అప్పటి వరకు ఎస్సీ నాయకులంతా సమావేశాన్ని బాయ్కట్ చేస్తున్నామంటూ ప్రకటించి నిరసన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వహించిన ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాల సంఘాల నాయకులు మాట్లాడుతూ మాల కార్పొరేషన్ చైర్మన్ను తాము వ్యతిరేకించడం లేదని, కలెక్టర్ ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం దారుణమన్నారు. కనీసం పోలీసులు గానీ, అధికారులు కానీ హాజరు కాకపోవడం అవమానించడమేనని వివరించారు. నాయకులు తోటి చంగల్రావు, సిద్దాంతుల కొండబాబు, ఏనుగుపల్లి కృష్ణ, వుల్లం రవి, బోని సంజయ్కుమార్, మాతా సుబ్రహ్మణ్యం, ఖండవిల్లి లోవరాజు, రాగులు రాఘవులు, బొజ్జ ఐశ్వర్య, పెదపాక గురునాధం, దౌర్ల చిట్టిబాబు పాల్గొన్నారు. సమావేశాన్ని బాయ్కట్ చేసిన నాయకులు -
ఆటో యూనియిన్ కార్మికుల నిరసన
జగ్గంపేట: జగ్గంపేటలో ఆటో యూనియన్ కార్మికులు ఉచిత బస్సు వల్ల తమ ఉపాధి దెబ్బతిందని, నిరసన ర్యాలీ నిర్వహించారు. ఉచిత బస్ ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వం మా కష్టాలను కూడా పట్టించుకుని అన్ని విధాల ఆదుకోవాలని కోరుతూ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు, తహసీల్దార్ జేవీఆర్ రమేష్కు అందజేశారు. జగ్గంపేటలో ఉన్న నాలుగు ఆటో యూనియిన్లకు చెందిన సుమారు 1,000 మంది కార్మికులు ఆటోయూనియన్ జేఏసీ పేరుతో జగ్గంపేటలో ప్రధాన వీధులలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆటోలతో సహా ర్యాలీగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఎమ్మెల్యేకు తమ కష్టాలను ఏకరువు పెట్టారు. తాము అప్పులు చేసి వాహనాలు కొన్నామని, ఉచిత బస్ వల్ల తమ ఆదాయం దారుణంగా పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఆటో కార్మికుడుకి రూ.12,000 జీవనభృతిగా చెల్లించాలని, ఆర్టీఓ ఫిటెనెస్ సర్టిఫికెట్ విషయమై ప్రయివేటీకరణ రద్దు చేయాలని, వాహన మిత్ర పథకం ద్వారా ఏడాదికి రూ.30వేలు చెల్లించాలని, ఆటో కార్మికులు పిల్లలకు విద్యార్హతను బట్టి అందరికీ ఉద్యోగాలు కల్పించాలని తదితర డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రుకు అందజేశారు. ఆటో యూనియన్ నాయకులు ఆర్.వెంకటరమణ, ఆర్.శివశంకర్, మంజేటి సత్యనారాయణ, వి.ప్రసాద్ పాల్గొన్నారు. ఉచిత బస్ మా పొట్ట కొడుతోంది అంటూ ఆవేదన -
ఏలేరుకు వరద నీరు
ఏలేశ్వరం: పరివాహక ప్రాంతంలో పడుతున్న వర్షాలకు ఏలేరుకు వరద నీరు వచ్చి చేరుతోంది. రెండురోజులుగా పడుతున్న వర్షాలకు మంగళవారం ప్రాజెక్టులోకి 5,218 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. మరో రెండురోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలపడంతో మరింతగా వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరనుంది. దీంతో అఽధికారులు అప్రమత్తమయ్యారు. సీతానగరం మండలం పురుషోత్తపట్నం నుంచి 525 క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 86.46 మీటర్లకు 79.25 మీటర్లు, 24.11 టీఎంసీలకు 12.59 టీఎంసీల నీటినిల్వలు ఉన్నాయి. దీంతో విశాఖకు 200, తిమ్మరాజుచెరువుకు 20 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. ఆయకట్టుకు నీటి విడుదల నిలిపివేశారు. పంపా కాలువకు గండి తుని రూరల్: తుని మండలం టి.తిమ్మాపురం, తొండంగి మండలం వలసపాకల (పి.అగ్రహారం) సమీపంలో పంపా వరదనీటి కాలువకు సోమవారం రాత్రి గండిపడింది. ఆ ప్రాంతాన్ని, నీటమునిగిన పంట పొలాలను ఇరిగేషన్ అధికారులతో కలసి తుని నియోజకవర్గ ప్రత్యేక అధికారి ఎన్.శ్రీధర్ మంగళవారం పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. యుద్ధప్రతిపాదికన గండిని పూడ్చేందుకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. రెండువేల ఇసుక బస్తాలతో తాత్కాలికంగా గండిని పూడ్చివేస్తామన్నారు. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలు, పుష్కరనీరు అందుబాటులోకి రావడంతో ఇటీవల రైతులు వరినాట్లు వేస్తున్నారు. టి.తిమ్మాపురం గ్రామానికి చెందిన 30ఎకరాలకు పైగా పంటలు నీటిముంపునకు గురైనట్టు స్థానికులు పేర్కొన్నారు. స్థల వివాదంపై 22న ట్రావెర్స్ సర్వే అన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఘాట్ రోడ్ పక్కనే పంపా రిజర్వాయర్ను ఆనుకుని ఉన్న స్థలంపై దేవస్థానం, ఇరిగేషన్ శాఖల మధ్య నెలకొన్న వివాదానికి తెర దించేందుకు ఈ నెల 22న టావెర్స్ సర్వే నిర్వహించాలని కలెక్టర్ షణ్మోహన్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ స్థలం దేవస్థానానికి చెందుతుందా లేక, ఇరిగేషన్ శాఖకు చెందుతుందా అనే దానిపై 15 సంవత్సరాలుగా ఈ వివాదం కొనసాగుతోంది. ఇప్పటికి నాలుగుసార్లు సర్వే చేశారు. మొదటిసారి సర్వే మధ్యలో నిలిచిపోయింది. రెండోసారి నిర్వహించిన సర్వేలో స్థలం దేవస్థానానిదే అని తేలినా ఇరిగేషన్ అధికారులు అభ్యంతరం చెప్పడంతో కలెక్టర్ మూడోసారి జాయింట్ సర్వేకు ఆదేశించారు. ఏప్రిల్ ఒకటిన పెద్దాపురం ఆర్డీఓ రమణి పర్యవేక్షణలో దేవస్థానం, ఇరిగేషన్ అధికారుల సమక్షంలో సర్వే చేశారు. దానిపై ఇరిగేషన్ అధికారులు అభ్యంతరం తెలపడంతో ట్రావెర్స్ సర్వేకు ఆదేశాలిచ్చారు. ట్రావెర్స్ సర్వేలో వివాద స్థలం ముందు వెనుక గల స్ధలాలను కూడా సర్వే చేస్తారు. సర్వే అధికారులు ఎక్కడికక్కడ సర్వే రాళ్లు పాతి దీనిని నిర్వహిస్తారు. రత్నగిరి కొండ పరిధిలో గల 24 బీ సర్వే నంబర్లో స్థలంలో ట్రావెర్స్ సర్వే చేయనున్నారు. -
పంపా నీళ్లు వృథా
● నాలుగో వంతు సముద్రం పాలు ● గేట్లు బలహీనంతో సమస్య ● 103 అడుగుల గరిష్ట నీటిమట్టం నిర్వహించలేని దుస్థితి అన్నవరం: వర్షాకాలంలో వచ్చే నీటిని నిల్వ చేసి ఏడాది పొడవునా తాగు, సాగు అవసరాల కోసం నిర్మించిన అన్నవరంలోని పంపా రిజర్వాయర్ పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పంపాలోకి వెల్లువలా వర్షపు నీరు తరలివస్తున్నా దానిని నిల్వ ఉంచుకోలేని పరిస్థితి నెలకొంది. రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టం 103 అడుగులు కాగా, వివిధ కారణాల వల్ల 99 అడుగులు నీటిమట్టం వరకు మాత్రమే నిల్వ ఉంచుకోవల్సిన పరిస్థితి. అంటే నాలుగు అడుగుల మేర నీరు వృథాగా వదిలేయాల్సి వస్తోంది. రిజర్వాయర్ గరిష్ట నీటినిల్వ 0.43 టీఎంసీలు కాగా దాదాపు నాలుగో వంతు నీటిని వృథాగా వదిలేస్తున్నారు. పంపా బ్యారేజీకి కొత్త గేట్లు ఏర్పాటు చేయకపోవడం, ఉన్న గేట్లకు కూడా మరమ్మతులు పూర్తి చేయలేకపోవడంతో ఈ నీటిని వదిలేయాల్సి వస్తోందని అధికారులు తెలిపారు. పంపాగర్భంలో నిర్మాణంలో ఉన్న పోలవరం అక్విడెక్ట్ పనుల కారణంగా కూడా పంపా నీటిమట్టం 99 అడుగులకే పరిమితం చేయాల్సి వస్తోందని తెలిపారు. అయితే 12,500 ఎకరాల పంపా ఆయకట్టు పూర్తిగా సాగవ్వాలంటే 1.5 టీఎంసీల నీరు అవసరం. పంపా నీటి నిల్వ పరిమాణం 0.43 టిఎంసీ మాత్రమే. అంటే సుమారు మూడు సార్లు పంపా నిండితే తప్ప సాగవ్వని పరిస్థితి. పంపా నీటిమట్టం 99 అడుగులకే పరిమితం చేస్తే నీటినిల్వ పరిమాణం ఇంకా తగ్గిపోతుంది. దానివలన వర్షాలు తగ్గిన తరువాత ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరు విడుదల జరగదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బలహీనంగా బ్యారేజీ గేట్లు తుని, ప్రత్తిపాడు నియోజకవర్గాలలో 12,500 ఎకరాలకు సాగునీరు, అన్నవరం దేవస్థానం, వివిధ గ్రామాల ప్రజలకు తాగునీరు అందించేందుకు 55 ఏళ్ల క్రితం అన్నవరంలో పంపా రిజర్వాయర్ నిర్మించిన విషయం తెలిసిందే. పంపా బ్యారేజీకి ఏర్పాటు చేసిన ఐదు గేట్లు 20 సంవత్సరాలుగా మరమ్మతులకు గురవడంతో వీటి నిర్వహణ కష్టసాధ్యంగా మారింది. వరదల సమయంలో గేట్లు ఎత్తడం, దించడం సమస్యగా మారింది. ఫలితంగా వేల క్యూసెక్కుల నీరు వృథాగా దిగువకు పోయి, గ్రామాలు, పొలాలు ముంపునకు గురవుతున్నాయి. దీంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పంపా బ్యారేజీకి ఐదు గేట్లు నిర్మించేందుకు 2023 ఆగస్టులో రూ.3.36 కోట్లు మంజూరు చేసింది. 2024 ఎన్నికల కోడ్ రావడంతో ఆ నిధులు విడుదల కాలేదు. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్లో టెండర్లు పిలిచింది. అయితే ఈ టెండర్లు మూడుసార్లు పిలిస్తే తప్ప ఖరారు కాలేదు. చివరగా మే నెలలో ఈ టెండర్లు ఖరారయ్యాయి. ఖరీఫ్లోగా కొత్త గేట్ల ఏర్పాటు సాధ్యంకాదు కనుక పాత గేట్లకు తాత్కాలికంగా మరమ్మతులు చేయడానికి నిర్ణయించారు. నాలుగో నెంబర్ గేటుకు జూలై మొదటి వారంలో మరమ్మతులు చేశారు. అయితే అప్పటికే వర్షాల వల్ల గేట్ల వద్దకు నీరు రావడంతో ఆ పని నిలిపివేశారు. దాంతో సమస్య ఎప్పటి లాగానే ఉంది. దీంతో ఐదు రోజులుగా వేయి క్యూసెక్కుల చొప్పున సముద్రానికి విడుదల చేస్తున్నారు. పోలవరం అక్విడెక్ట్ మునగకుండా ఉండాలన్నా.. పంపా రిజర్వాయర్ ఎగువన నిర్మిస్తున్న పోలవరం అక్విడెక్ట్ మునిగిపోకుండా ఉండాలంటే పంపా నీటి మట్టం 99 అడుగులకు మించకుండా ఉండాలి. అదే విషయాన్ని పోలవరం అధికారులు కలెక్టర్కు తెలియచేయడంతో ఆ మేరకు నీటిమట్టాన్ని నియంత్రిస్తున్నారు. -
రాష్ట్రంలో స్తంభించిన పరిపాలన
రాజమహేంద్రవరం రూరల్: రాష్ట్రంలో పరిపాలన స్తంభించిపోయిందని, ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, మర్డర్లు, మహిళలపై అఘాయిత్యాలు, భూకబ్జాలు పెరిగిపోయాయని రాష్ట్ర శాసనమండలి ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన అక్రమ మద్యం కేసులో అరెస్టయి సెంట్రల్ జైల్లో ఉన్న ఎంపీ మిథున్రెడ్డితో ములాఖత్ అయ్యారు. అనంతరం బొమ్మూరులోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ బొత్స సత్యనారాయణ ముఖ్యనేతలతో కొద్దిసేపు మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఒకపక్క అధిక వర్షాలు వచ్చి రైతులకు కావాల్సిన ఎరువులను అందించలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. కూటమి ప్రభుత్వానికి అవగాహన, కార్యాచరణ, ముందుచూపులేకపోవడం వలన రాష్ట్రంలో ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. సీఎం చంద్రబాబు ఎక్స్పీరియన్స్ అంటూ సొల్లు కబుర్లు చెప్పడమే తప్ప ఆచరణలో లేదని బొత్స విమర్శించారు. కూటమి ప్రభుత్వం మంచిపాలనను ఐదురోజుల నుంచి చూస్తున్నాం వారి శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు ఏవిధంగా ప్రవర్తిస్తున్నారో తెలుస్తోందన్నారు. శాసనమండలి ప్రతిపక్షనేతగా ఉన్న తాను ప్రెస్తో మాట్లాడుతుండగా డ్రోన్ ఎగురవేయడంపై ఆయన మండిపడ్డారు. ఏమైన అడిగితే లా అండ్ ఆర్డర్ సమస్య అంటారన్నారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోకూడదని, చట్టం తన పనిచేసుకునేలా ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలన్నారు. అమరావతి ముంపు సమస్యపై విలేకరుల అడిగిన ప్రశ్నకు పదిరోజుల్లో అంతా తెలుస్తుందని బొత్స బదులిచ్చారు. ఫ్రీ బస్సు ఎవరు అడిగారని ప్రశ్నించారు. ఎన్నికల హామీల్లో గొప్పగా ఇక్కడ బస్సు ఎక్కితే తిరుపతి వెళ్లవచ్చన్నారు. కానీ మోసం చేశారన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, మాజీమంత్రి తానేటి వనిత, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మాజీ ఎంపీలు మార్గాని భరత్రామ్, చింతా అనురాధ, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ సత్తిసూర్యనారాయణరెడ్డి, జి.శ్రీనివాసనాయుడు, తలారి వెంకటరావు, పాముల రాజేశ్వరిదేవి, రౌతు సూర్యప్రకాశరావు, రాజమహేంద్రవరం పార్లమెంటు ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, పార్లమెంటు పరిశీలకులు తిప్పల గురుమూర్తిరెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు దవులూరి దొరబాబు, పిల్లి సూర్యప్రకాశ్, డాక్టర్ పినిపే శ్రీకాంత్, చిన్నమిల్లి వెంకట్రాయుడు, గన్నవరపు శ్రీనివాస్, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, వివిధ నియోజకవర్గాల పార్టీ నేతలు అధికసంఖ్యలో పాల్గొన్నారు. శాసనమండలి ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ రీజనల్ కోఆర్డినేటర్ బొత్స -
వేద పఠనంతో పులకించిన కుమారారామం
సామర్లకోట: స్థానిక పంచారామ క్షేత్రమైన బాలాత్రిపుర సుందరి సమేత చాళుక్య కుమారా రామభీమేశ్వరాలయం మంగళవారం వేద పఠనంతో పులకించింది. బాలాత్రిపుర సుందరి వేదశాస్త్ర పరిషత్తు ఆధ్వర్యంలో 27వ వేదసభను పంచారామ క్షేత్రంలో నిర్వహించారు. సీనియర్ వేద పండితులు శ్రీపాద రాజశేఖరశర్మ అధ్యక్షత వహించారు. పూర్వపు ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాకు చెందిన వేద పండితులు పాల్గొన్నారు. దువ్వూరి సూర్యప్రకాశ చైనులు ఘనపాఠి, తంగిరాల సుబ్రహ్మణ్య సోమయాజులు ఘనపాఠి వేదాల ప్రాధాన్యాన్ని వివరించారు. తరుచూ వేద పారాయణ జరిగే ప్రాంతాలు ప్రగతి సాధిస్తాయని వారు తెలిపారు. సృష్టిలో ప్రతీ జీవికి వేదశాస్త్రం అనేక విధాల క్షేమకారిగా రక్షణ కలిగిస్తుందని వివరించారు. వేదాలను సరళమైన రీతిలో ప్రజలకు చేరువ చేసే విధంగా ప్రభుత్వం ప్రయత్నాలు చేయాలన్నారు. వేదసభలో పాల్గొన్న సుమారు 200 మంది వేద పండితులు హిందూ సంస్కృతి సంప్రదాయాలను వివరిస్తూ చతుర్వేద పారాయణ, వేదస్వస్తి చెప్పారు. వేద పండితులను ఘనంగా సత్కరించారు. ఈఓ బళ్ల నీలకంఠం, ట్రస్టుబోర్డు మాజీ చైర్మన్ కంటే బాబు, పారిశ్రామికవేత్త నలజర్ల కామేశ్వరరావు (పెదబాబు), భక్త సంఘం నాయకులు చుండ్రు గోపాలకృష్ణ, గంజి బూరయ్య, ఆర్వీ సుబ్బరాజు, బిక్కిన రంగనాయకులు, వేదశాస్త్ర పరిషత్తు కన్వీనర్ గ్రంధి సత్యరామకృష్ణ పండితులను సత్కరించారు. వేద పరిషత్తుకు సహకరించిన దాతలను సత్కరించారు. -
ట్యాబ్లతో లబోదిబో
బాలజీచెరువు (కాకినాడ సిటీ): ప్రతి విద్యార్థీ ఉన్నతంగా చదవాలి. ప్రపంచంతో పోటీ పడాలిశ్రీ అన్న లక్ష్యంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే ప్రభుత్వ విద్యకు వెన్నుదన్నుగా నిలిచింది. సాంకేతిక విద్యపై విద్యార్థులు మక్కువ పెంచుకునేలా చర్యలు చేపట్టింది. కోట్ల రూపాయలు వెచ్చించి 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు ఉచితంగా అందజేసింది. వీటి ద్వారా విద్యార్థులు సమోన్నతంగా ఎదిగేలా కృషి చేసింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక వాటిని పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. పనిచేయని ట్యాబ్లతో ఉపాధ్యాయులు, విద్యార్థులు తలలు పట్టుకోవాల్సి వస్తోంది. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని పూర్తిగా తుడిచిపెట్టేందుకు కూటమి ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హుందాగా వ్యవహరించాల్సింది పోయి దిగజారుడు రాజకీయాలకు తెర తీస్తోందంటున్నారు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లను అందజేసింది. 2022–23వ సంవత్సరం నుంచి వరుసగా రెండేళ్ల పాటు ట్యాబ్లు పంపిణీ చేసింది. ఆ ట్యాబ్ల ద్వారా అత్యాధునిక సాంకేతికతతో బోధించేవారు. పిల్లలు కూడా చక్కగా నేర్చుకునేవారు. రోజూ పాఠశాలకు తీసుకువచ్చి తరగతి గదిలో టీచర్లు బోధించే పాఠ్యాంశాలను విని.. తిరిగి సాయంత్రం ఇంటికి వెళ్లేటప్పుడు తమతో పాటు ట్యాబ్లను తీసుకువెళ్లేవారు. పాఠశాలల్లో ట్యాబ్ల వినియోగానికి ఇంటర్నెట్ సదుపాయం కూడా కల్పించారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక వాటిని నిర్వీర్యం చేస్తోంది. కనీస పర్యవేక్షణ, సాఫ్ట్వేర్ అప్డేట్ లేకపోవడంతో అవి మూలన పడాల్సిన దుస్థితి ఏర్పడింది. లీప్ యాప్లో వీడియోలు ఇటీవల కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న లీప్ యాప్లో వీడియోలను రూపొందించి ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. ఆ వీడియో పాఠాలను టీచర్లు తరగతి గదిలో డిజిటల్ ప్యానల్ టీవీ ద్వారా బోధిస్తున్నారు. అయితే ట్యాబ్ల విషయం మరిచిపోయారు. ట్యాబ్లో సాఫ్ట్వేర్ అప్డేట్ చేయకపోవడంతో చాలావరకు అవి పనిచేయడం లేదు. కొన్ని అసలు ఆన్ కావడం లేదు. ఎక్కడైనా టీచర్లు చొరవ తీసుకుని ట్యాబ్ ద్వారా బోధిద్దామని యత్నించినా పనిచేయడం లేదు. ట్యాబ్లను సరఫరా చేసిన సంస్థ టెక్నీషియన్లు పర్యవేక్షణ విభాగాన్ని మూసివేయడం మరింత ఇబ్బందిగా మారింది. డిజిటల్ అసిస్టెంట్లు ప్రతి నెలా పాఠశాలల సందర్శన విద్యార్థులకు అందజేసిన ట్యాబ్లు దుర్వినియోగం కాకుండా పర్యవేక్షణ బాధ్యతలను డీఈఓ, డీవైఈఓ, ఎంఈఓ, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు గత ప్రభుత్వంలో అప్పగించేవారు. డిజిటల్ అసిస్టెం ట్లు ప్రతినెలా కనీసం ఒక్కసారి ప్రతి పాఠశాలనూ సందర్శించి ట్యాబ్లు పనితీరును చెక్ చేసి మరమ్మతు బాధ్యతలు కూడా వారే చూసేవారు. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పాఠశాలను సందర్శించి ప్రతి శుక్రవారం ప్రతి విద్యార్థి, ఉపాధ్యాయుడి ట్యాబ్లకు వైఫై కనెక్ట్ చేసి వినియోగ వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసేవారు. బైజూస్, డిక్షనరీలను అందుబాటులో ఉంచి అప్డేట్ చేయడానికి ఎంఆర్సీ సిబ్బంది, సీఆర్పీలకు, పాఠశాల హెచ్ఎంలు, యాక్టివ్ టీచర్లు, డిజిటల్ అసిస్టెంట్లకు శిక్షణ ఇచ్చేవారు. పాఠశాల స్థాయిలోనే అప్డేట్ చేయించేవారు. అప్డేట్ చేసే క్రమంలో ఏదైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. జిల్లా సమాచారం ఒక్కొక్క ట్యాబ్కు రూ.30 వేల ఖర్చు గత ప్రభుత్వంలో 8వ తరగతి విద్యార్థులకు పంపిణీ సాఫ్ట్వేర్ సమస్యలను పట్టించుకోని కూటమి సర్కారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు స్పందించని అధికారులు సర్కారు బడుల్లో చదువుకునే విద్యార్థులు ప్రపంచస్థాయిలో పోటీపడేలా తీర్చిదిద్దాలని గత ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమాన్ని అందుబాటులోకి తెచ్చింది. పాఠ్యాంశాలను విద్యార్థులు సులభంగా అర్థం చేసుకునేలా బైలింగ్విల్ పద్ధతిలో పుస్తకాలను ముద్రించింది. 2022–23లో జిల్లాలోని విద్యార్థులు, టీచర్లకు కలిపి మొత్తం 23,099 ట్యాబ్లను పంపిణీ చేసింది. దీనికోసం రూ.67.23 కోట్లు ఖర్చు చేయగా 2023–24లో 380 పాఠశాలల్లో దాదాపు రూ.64 కోట్ల ఖర్చుతో 19,982 మందికి ట్యాబ్లను పంపిణీ చేసింది. ఇందుకోసం ఒక్కో ట్యాబ్పై సుమారు రూ.30 వేల దాకా ఖర్చుచేశారు. తమ వద్ద ఉన్న ట్యాబ్లు సాఫ్ట్వేర్ సమస్యలతో మొరాయిస్తున్నాయని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. సమస్యను టీచర్లు సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి స్పందనా లేదు. పర్యవేక్షించాలి ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఇచ్చిన విలువైన ట్యాబ్లు ప్రస్తుతం సాఫ్ట్వేర్ అప్డేట్ సమస్యతో పనిచేయడం లేదు. గత ప్రభుత్వం ఆ ట్యాబ్లను ఇవ్వడంతో ప్రస్తుత కూటమి ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి. విద్యాభివృద్ధి విషయంలో పర్యవేక్షణ లోపం ఉండడం సరైన పద్ధతి కాదు. వెంటనే ట్యాబ్లకు మరమ్మతులు చేయాలి. – ఎం.గంగాసూరిబాబు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి విద్యార్థులకు ఉపయోగం గత ప్రభుత్వం హయాంలో విద్యార్థులకు అందజేసిన ట్యాబ్లు ఎంతో ఉపయోగకరమైనవి. దేశంలో ఎక్కడా విద్యార్థులకు ట్యాబ్లు ఇచ్చిన దాఖలా లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల అభివృద్ధి కోసం గత ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. వారికి అందజేసిన ట్యాబ్లు పనిచేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. – కె.లలిత్కుమార్, స్టేట్ స్టూడెంట్ బెవలప్మెంట్ కన్వీనర్, విద్యార్థి పరిషత్ -
కన్నబాబు ఇంట విషాదం
సాక్షి ప్రతినిధి, కాకినాడ/కాకినాడ రూరల్: వైఎస్సార్ సీపీలో అందరికీ బాబాయ్గా సుపరిచితులైన మాజీ మంత్రి, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు తండ్రి సత్యనారాయణ(76) మృతి చెందడంతో ఆ పార్టీ శ్రేణుల్లో విషాదం అలుముకుంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యనారాయణను తొలుత కాకినాడ,హైదరాబాద్కు అక్కడి నుంచి తిరిగి కాకినాడలో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తూ వచ్చారు. ఆయన చికిత్స పొందుతూ మంగళవారం ట్రస్టు ఆస్పత్రిలో కన్నుమూశారు. భౌతికకాయాన్ని పార్టీ నేతలు, పార్టీ శ్రేణుల సందర్శనార్థం వైద్యనగర్లోని కన్నబాబు ఇంటికి తీసుకువచ్చారు. సత్యనారాయణ భౌతిక కాయాన్ని చూసి కన్నబాబు తల్లి, కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. నిడదవోలు మండలం శెట్టిపేటకు చెందిన సత్యనారాయణ ఏజెన్సీలో స్థిరపడ్డారు. ఆయనకు ఐదుగురు సోదరులు, ఇద్దరు తోబుట్టువులు, భార్య కృష్ణవేణి, కుమారులు కన్నబాబు, సురేష్బాబు, కళ్యాణ్ కృష ఉన్నారు. వీరిలో కన్నబాబు, సురేష్బాబు జర్నలిస్టులు, కళ్యాణ్ కృష్ణ సినీ దర్శకుడు. ప్రముఖుల నివాళి రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ నేతలు, శ్రేణులు తరలివచ్చి కాకినాడ వైద్యనగర్లోని కన్నబాబు స్వగృహం వద్ద సత్యనారాయణ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల విజ్జపు రెడ్డి హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ముందుగా వైద్యనగర్లో నివాసం నుంచి ఊరేగింపుగా అంతిమ యాత్ర నిర్వహించారు. బంధువులు, పార్టీ అభిమానులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. తండ్రి భౌతిక కాయానికి హిందూ సంప్రదాయం ప్రకారం పెద్ద కుమారుడు కన్నబాబు అంత్యక్రియలు నిర్వహించారు. కన్నబాబుకు పరామర్శ కన్నబాబును జెడ్పీ చైర్పర్సన్లు విపర్తి వేణుగోపాలరావు, చిన్ని శ్రీను, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, అనంతబాబు, పేరాబత్తుల రాజశేఖర్, పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి, మాజీ మంత్రులు దాడిశెట్టి రాజా, వెల్లంపల్లి శ్రీనివాస్, గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్, చెల్లుబోయిన వేణు, తోట నరసింహం, మేరుగ నాగార్జున, మాజీ ఎంపీలు వంగా గీత, చింతా అనురాధ, మార్గాని భరత్, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, చిర్ల జగ్గిరెడ్డి, నల్లమిల్లి శేషారెడ్డి, కరణం ధర్మశ్రీ, కంబాల జోగులు, అన్నంరెడ్డి అనుదీప్, పాముల రాజేశ్వరి, తిప్పల నాగిరెడ్డి, జి.శ్రీనివాస్ నాయుడు, తలారి వెంకట్రావు, పిల్లి అనంతలక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీశివకుమారి, పార్టీ కో ఆర్డినేటర్లు దవులూరి దొరబాబు, పిల్లి సూర్య ప్రకాశరావు, గన్నవరపు శ్రీనివాస్, పార్టీ నరసాపురం పార్లమెంటు పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, పార్టీ నేతలు రాగిరెడ్డి చంద్రకళాదీప్తికుమార్, జమ్మలమడక నాగమణి, గుబ్బల తులసీకుమార్, కర్రి పాపారాయుడు, వట్టికూటి రాజశేఖర్, చెల్లుబోయిన శ్రీనివాస్, పిల్లంక శ్రీనివాసరాజు పరామర్శించారు. అంతిమ యాత్రలో పాల్గొన్న కన్నబాబు, చిత్రంలో జక్కంపూడి రాజా తదితరులు కాకినాడ వైద్యనగర్ నివాసంలో తండ్రి భౌతిక కాయం వద్ద కన్నబాబు, కుటుంబ సభ్యులు తండ్రి సత్యనారాయణ కన్నుమూత ప్రముఖుల పరామర్శ అంతిమ యాత్రలో వైఎస్సార్ సీపీ శ్రేణులు -
‘న్యాయ’ పరీక్షలకు సర్వం సిద్ధం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో బుధవారం నుంచి న్యాయ విభాగం నియామక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ వివరాలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మంగళవారం తెలిపారు. ఈ నెల 24వ తేదీ వరకూ జరిగే ఈ పరీక్షలకు 25,173 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. రాష్ట్రంలోని అన్ని జ్యుడీషియల్ జిల్లాల్లో స్టెనో గ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, డ్రైవర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు ఈ పరీక్షలు జరగనున్నాయి. తొలి విభాగంలో ఉదయం 7.30 నుంచి 8.45 మధ్య అభ్యర్థులకు అనుమతి ఉంటుంది. 9 నుంచి 10.30 వరకు పరీక్ష నిర్వహిస్తారు. రెండో విభాగంలో మధ్యాహ్నం 11 గంటల నుంచి 12.15 వరకు లోపలికి అనుమతి, 12.30 నుంచి 2 గంటల వరకూ పరీక్ష జరుగుతుంది. మూడో విభాగానికి సంబంధించి మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 3.45 వరకు లోపలికి అనుమతి, సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. ఫలితాలే ఎంపికకు ప్రామాణికం పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే సెంటర్ గేట్లను మూసివేస్తారు. అభ్యర్థులు హాల్ టిక్కెట్, చెల్లుబాటు అయ్యే ఒరిజినల్ ఫొటో ఐడీ వెంట తీసుకురావాలి. హాల్ టిక్కెట్ డౌన్లోడ్ సమస్యలకు హెల్ప్డెస్క్ ఫోన్ నంబర్ 0863 2372752, ఈ–మెయిల్ హెచ్సీ.ఏపీ.ఎట్దరైటాప్ ఏఎల్జే.గవ్.ఇన్ లో సంప్రదించాలి. పరీక్షల ఫలితాలే అభ్యర్థుల ఎంపికకు ప్రామాణికం. ఎటువంటి ఇంటర్వ్యూలు నిర్వహించరు. స్టేనోగ్రాఫర్, టైపిస్ట్, కాపీయిస్ట్, డ్రైవర్ పోస్టులకు విడిగా నైపుణ్య పరీక్ష ఉంటుంది. పరీక్ష కేంద్రా లకు ఆర్టీసీ బస్టాండ్ల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. కేంద్రంలో సమస్యలపై సిబ్బందిని అందుబాటులో ఉంచారు. అలాగే 0863 2372752 నంబర్కు ఫోన్ చేయవచ్చు. ● కాకినాడ జిల్లాలోని రాయుడుపాలెం వద్ద సాఫ్ట్ టెక్నాలజీస్ కేంద్రం, అచ్యుతాపురం రైల్వే గేట్ దగ్గర నున్న ఆయాన్ డిజిటల్ జోన్లో ఈ నెల 20, 21, 22, 23 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి. ● సూరంపాలెం అదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో 24న నిర్వహిస్తారు. ● రాజమహేంద్రవరంలోని రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో 20, 21. 22, 24 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి. ● అమలాపురం పరిధిలోని అభ్యర్థులకు చెయ్యేరు శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, భట్లపాలెంలోని బీవీసీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో ఈ నెల 22, 23, 24 తేదీల్లో నిర్వహిస్తారు. నేటి నుంచి 24 వరకూ నిర్వహణ ఉమ్మడి జిల్లాలో పూర్తయిన ఏర్పాట్లు -
నకిలీ దస్తావేజులతో స్థలాల రిజిస్ట్రేషన్
రాజమహేంద్రవరం రూరల్: నకిలీ దస్తావేజులు సృష్టించి స్థలాలను విక్రయిస్తున్న ఐదుగురి సభ్యుల ముఠాను అరెస్టు చేసినట్లు రాజమహేంద్రవరం ఈస్ట్జోన్ డీఎస్పీ బి.విద్య తెలిపారు. ఈ మేరకు మంగళవారం బొమ్మూరు పోలీస్స్టేషన్లో కేసు వివరాలు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం కుప్పనపూడికి చెందిన గొల్లపల్లి కాశీ విశాలాక్షి గతంలో రాజమహేంద్రవరంలో డాక్టర్గా పనిచేశారు. ఆ సమయంలో 1997లో తన పెద్ద కుమారుడు వినోద్ పేరున కవలగొయ్యిలో 267 చదరపు గజాలు, దివాన్ చెరువులో 267 చదరపు గజాలు, చిన్న కుమారుడు లక్ష్మణ్ పేరున దివాన్ చెరువులో 267 చదరపు గజాల స్థలాలను కొనుగోలు చేశారు. అయితే విశాలక్షి భర్త వెంకటేశ్వరరావు 2012లో చనిపోవడంతో ఆమె తన స్వగ్రామం కుప్పనపూడికి వెళ్లిపోయారు. ఆమె కుమారులు ఉద్యోగాల రీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. విశాలాక్షి కూడా అమెరికా నుంచి ఇటీవల తన స్వగ్రామానికి వచ్చారు. తన ఆస్తుల కోసం రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పరిశీలించగా, వాటిని వేరొకరు కాజేసినట్టు గుర్తించారు. దీనిపై ఈ ఏడాది జూన్ 14న బొమ్మూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఇన్స్పెక్టర్ పి.కాశీవిశ్వనాథ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముఠాగా ఏర్పడి.. కాకినాడకు చెందిన షేక్ ఫకీర్ మహమ్మద్ ఖాసిం బాషాకు 2013 జనవరిలో రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా పనిచేసే రాజమహేంద్రవరానికి చెందిన మద్దిరెడ్డి లక్ష్మీనారాయణ, మద్దిరెడ్డి నాగేంద్ర ప్రసాద్ (సిటీ బస్సు ప్రసాద్) పరిచయమయ్యారు. ఎక్కువ కాలం ఖాళీగా ఉండి, ఎవ్వరూ పట్టించుకోకుండా ఉన్న స్థలాల దస్తావేజు జిరాక్సులు తెస్తే, వాటికి నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి, అధిక ధరకు విక్రయించుకుందామని చెప్పాడు. దానికి మిగిలిన ఇద్దరూ అంగీకరించారు. ఈ నేపథ్యంలో కాశీ విశాలాక్షి కుమారుల స్థలాలకు నకిలీ దస్తావేజులు తయారు చేసి, రిజిస్ట్రేషన్ చేయించారు. అనంతరం బయటకు వారికి విక్రయించారు. కేసు దర్యాప్తులో భాగంగా ఎస్పీ నరసింహ కిశోర్ ఆదేశాల ప్రకారం ఈస్ట్ జోన్ డీఎస్పీ బి.విద్య ఆధ్వర్యంలో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ మేరకు సోమవారం మద్దిరెడ్డి నాగేంద్ర ప్రసాద్, సబ్బితి భాస్కరరావును ఆదర్శనగర్లో, షేక్ ఫకీర్ మహమ్మద్ ఖాసిం బాషా, యాదగిరి సురేష్, గాలి రాజేంద్ర ప్రసాద్లను ఈస్ట్ రైల్వే గేటు వద్ద బొమ్మూరు ఇన్స్పెక్టర్ పి.కాశీవిశ్వనాథం అరెస్టుచేశారు. ఐదుగురి సభ్యుల ముఠా అరెస్టు కేసు వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీవిద్య -
మేధోమంథన్
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): విద్యార్థుల్లో దాగిన ప్రతిభ, ఆలోచన, ఆవిష్కరణలను వెలికి తీసేందుకు కేంద్ర ప్రభుత్వం విద్యార్థి విజ్ఞాన మంథన్ (వీవీఎం) పేరుతో జాతీయస్థాయిలో ప్రతిభాన్వేషణ పరీక్ష నిర్వహిస్తుంది. దీనిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు, దేశంలోని సీఎస్ఐఆర్, ఐఎస్ఆర్డీఓ, బార్క్, డీఆర్డీఓ తదితర ప్రముఖ జాతీయ ప్రయోగశాలలు, పరిశోధనా సంస్థలను చూసే అవకాశంతో పాటు ఇంటర్న్షిప్, స్కాలర్షిప్లు పొందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వీవీఎం ఈ పరీక్షపై జిల్లాలోని విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో 6వ తరగతి నుంచి 11వ తరగతి (ఇంటర్ ఫ్రథమ సంవత్సరం) వరకూ చదువుతున్న వారందరూ దీనికి అర్హులే. జాతీయ స్థాయిలో.. ఎన్సీఈఆర్టీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం, విజ్ఞాన భారతి సంయుక్తంగా ఈ విద్యార్థి విజ్ఞాన్ మంథన్ (వీవీఎం) పేరిట జాతీయ స్థాయిలో ప్రతిభాన్వేషణ పరీక్ష నిర్వహిస్తున్నాయి. ఆరో తరగతి నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం వరకు చదివే వారందరూ దీనికి అర్హులే. దీనిలో ప్రతిభ కనబర్చిన వారికి దేశంలోని ప్రముఖ పరిశోధన సంస్థల్లో ఇంటర్న్షిప్, స్కాలర్షిప్ పొందే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన దరఖాస్తులు పక్రియ ప్రారంభమైంది. ఆన్లైన్లో అవకాశం విద్యార్థి విజ్ఞాన్ మంథన్ ప్రవేశ పరీక్షలో పాల్గొనేందుకు ఆసక్తి గల విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా, సెప్టెంబరు 30 వరకూ గడువు ఉంటుంది. ఆన్లైన్లో పాఠశాల స్థాయిలో పరీక్ష జరుగుతుంది. 6వ తరగతి నుంచి 11 (ఇంటర్ మొదటి సంవత్సరం) తరగతుల వరకూ విద్యార్థులకు విడివిడిగా ఈ పరీక్ష ఉంటుంది. తెలుగు, హిందీ, ఇంగ్లిషు తదితర భాషల్లో పరీక్ష రాసే అవకాశం కల్పిస్తున్నారు. మాక్ పరీక్షలు ఈ పరీక్షకు సంబంధించి మాక్ పరీక్షలను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నిర్వహిస్తారు. పాఠశాల స్థాయి ప్రధాన పరీక్ష అక్టోబర్ 28 నుంచి 30వ తేదీ వరకూ ఉంటుంది. దీనిలో ఉత్తీర్ణులైన వారికి సెకండ్ లెవెల్ (ద్వితీయ పరీక్ష) పరీక్ష ఆన్లైన్ విధానంలో పరిశీలకుల సమక్షంలో నవంబర్ 19వ తేదీన జరుగుతుంది. జాతీయ స్థాయికి ఎంపిక ఇలా.. రాష్ట్ర స్థాయి విజేతల్లో ప్రతి తరగతి నుంచి మొదటి ఇద్దరు విద్యార్థుల వంతున 12 మందిని జాతీయ స్థాయికి ఎంపిక చేస్తారు. అక్కడ ప్రతిభ చూపిన మొదటి ముగ్గురు విద్యార్థుల వంతున 18 మందిని విజేతలుగా ప్రకటిస్తారు. జాతీయ స్థాయి విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతిగా వరసగా రూ.25 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలు, మెమెంటో, ప్రశంసా పత్రంతో పాటు నెలకు రూ.2 వేల చొప్పున సంవత్సరం పాటు ఉపకార వేతనం అందజేస్తారు. విద్యార్థి విజ్ఞాన్ మంథన్ 2025–26లో జాతీయ, జోనల్ స్థాయి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు డీఆర్డీఓ, ఇస్రో, సీఎస్ఐఆర్, బీఏఆర్సీ మొదలైన ప్రఖ్యాత జాతీయ ప్రయోగ శాలలు, పరిశోధన సంస్థల్లో ఒకటి నుంచి మూడు వారాల పాటు ప్రత్యేక శిక్షణ, ఇంటర్న్ షిప్కు అవకాశం కల్పిస్తారు. ప్రతిభ ఉంటే.. భవిత మీదే విద్యార్థి విజ్ఞాన్ మంథన్ (వీవీఎం) పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం జాతీయ స్థాయిలో నిర్వహణ స్కాలర్షిప్తో పాటు అనేక ప్రయోజనాలు 6వ తరగతి నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు అర్హులు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుతున్న వారికి అవకాశం విస్తృతంగా అవగాహన విజ్ఞాన్ మంథన్ పరీక్షల్లో ప్రతి పాఠశాల నుంచి విద్యార్థులు పాల్గొనేలా ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలి. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైతే ఉపకార వేతనంతో పాటు ప్రఖ్యాత పరిశోధనా సంస్థల్లో ఇంటర్న్షిప్కు అవకాశం ఉంటుంది. విద్యార్థుల్లో సైన్స్పై ఆసక్తిని కలిగించి, నూతన ఆవిష్కరణల వైపు ప్రోత్సహించేందుకు వీవీఎం పరీక్ష ఉపయోగపడుతుంది. ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆసక్తి కలిగినవారు వీవీఎం అధికారిక వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలి. – పిల్లి రమేష్, డీఈవో, కాకినాడ జిల్లా -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 20,000 – 21,500 కొత్తకొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 29,000 గటగట (వెయ్యి) 27,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 28,000 గటగట (వెయ్యి) 26,000 నీటికాయ, పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)18,000 – 19,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,250 కిలో 350 -
డ్రగ్స్ రహిత రాష్ట్ర సాధనే ఈగల్ లక్ష్యం
రాజానగరం: రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దడమే ఈగల్ లక్ష్యమని, దీని కోసం జిల్లాకు ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని ఐజీ ఈగల్ చీఫ్ ఆర్కే రవికృష్ణ తెలిపారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీ, ఎన్టీఆర్ కన్వెన్షన్ హాలులో మంగళవారం నిర్వహించిన యాంటీ ర్యాగింగ్ వీక్, సైబర్ క్రైమ్ అండ్ డ్రగ్స్ అవేర్సెస్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రవికృష్ణ మాట్లాడుతూ ఇప్పటికే సుమారు 40 వేల విద్యాసంస్థలలో ఈగల్ కమిటీలను ఏర్పాటు చేసి, అవగాహన కలిగిస్తున్నామన్నారు. డ్రగ్స్కు దూరంగా ఉండటంతో పాటు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. భయం, దురాశ, వ్యామోహం, అవమానం వంటివి సైబర్ నేరాల పెరుగుదలకు కారణాలన్నారు. సైబర్ నేరాలకు సంబంధించి ఎటువంటి సమాచారం తెలిసినా 1930 టోల్ఫ్రీ నంబరుకు తెలియజేయాలన్నారు. నన్నయ వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ మాట్లాడుతూ ‘నో టు డ్రగ్స్, ఎస్ టు లైఫ్’ అనే నినాదంతో జీవితంలో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. డ్రగ్స్కు అలవాటు పడితే జీవితాలే కాదు కుటుంబాలే నష్టపోతాయని, ర్యాగింగ్కు పాల్పడితే భవిష్యత్తు అంధకారమవుతుందన్నారు. ఈగల్ ఎస్పీ కె.నగేష్ బాబు మాట్లాడుతూ భయం, అభద్రతా భావాలతో మనుషులు జీవించరాదని, ఆనందమైన జీవనాన్ని గడపాలన్నారు. కార్యక్రమంలో సౌత్ జోన్ డీఎస్పీ భవ్యశ్రీ, రిజిస్ట్రార్ ఆచార్య కెవిస్వామి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈగల్ చీఫ్ రవికృష్ణ నన్నయ వర్సిటీలో సదస్సు -
గోపవరంలో ‘తారాజువ్వ’ వివాదం
నిడదవోలు రూరల్: ఇంటిలోకి తారాజువ్వ దూసుకురావడంతో ప్రశ్నించిన వ్యక్తిపై యువకులు దాడికి పాల్పడ్డారు. సమిశ్రగూడెం ఎస్సై ఎల్.బాలా జీ సుందరరావు మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. నిడదవోలు మండలం గోపవరంలో సోమవారం రాత్రి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా కొందరు యువకులు రోడ్డుపై బాణసంచా కాల్చారు. ఆ సమయంలో ఓ తారాజువ్వ లారీ డ్రైవర్ ఖండవల్లి శ్యాంబాబు ఇంటిలోకి దూసుకువెళ్లింది. దీంతో శ్యాంబాబు ఆ యువకులను నిలదీశాడు. ఈ నేపథ్యంలో వేముల నాగేంద్ర, ఆరేపల్లి దిలీప్, వేముల సాయి, ఆరేపల్లి గాంధీతో పాటు మరికొందరు యువకులు.. శ్యాంబాబుపై ఇటుకలతో దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి యువకులను అదుపులోకి తీసుకున్నారు. తలకు తీవ్ర గాయాలైన శ్యాంబాబును నిడదవోలు ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదుపై సమిశ్రగూడెం పోలీసులు పలువురి యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్, నిడదవోలు సీఐ పీవీజీ తిలక్ పరిశీలించారు. నిడదవోలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు శ్యాంబాబును కలిసి దాడి ఘటన విషయాలను అడిగి తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన యువకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం కేసులు నమోదు చేశామన్నారు. గోపవరంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. యువకుల దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలు నిడదవోలు ఆస్పత్రిలో చికిత్స -
రాజ్యాంగాన్ని అవమానించేలా కూటమి పాలన
కాకినాడ సిటీ: అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అవమానించే రీతిలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పాలన కొనసాగిస్తోందంటూ వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం కాకినాడ కలెక్టరేట్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. రాజ్యాంగాన్ని అవమానపరిచే రీతిలో వ్యవహరిస్తూ విద్యార్థుల నుంచి విద్యార్థి సంఘాలను దూరం చేసే కుట్రకు తెరతీస్తోందని విమర్శించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు పూసల అనిల్ మాట్లాడుతూ ప్రపంచ మేధావి, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనకు రాజ్యాంగాన్ని అందించారన్నారు. కానీ కూటమి ప్రభుత్వం సొంతంగా రెడ్బుక్ రాజ్యాంగాన్ని తయారు చేసుకుందన్నారు. విద్యాశాఖామంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో అరాచకం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ తప్పులు ప్రశ్నించే గొంతులపై కత్తి మోపుతున్నారని, అక్రమ కేసులు పెడుతున్నారని, అన్యాయంగా జైల్లో నిర్బంధిస్తున్నారని నినాదాలు చేశారు. హాస్టళ్లు, గురుకుల విద్యాలయాలు, విద్యాసంస్థల్లోకి విద్యార్థి సంఘాల ప్రవేశాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసేంత పరిస్థితికి దిగజారారని ధ్వజమెత్తారు. ఈ నిషేధం ద్వారా సంక్షేమ హాస్టళ్లన్నీ సమస్యల వలయంలో చిక్కి విలవిలలాడుతున్నాయని మంత్రి లోకేష్ ఒప్పుకున్నట్లే అన్నారు. విద్యార్థి సంఘం కాకినాడ సిటీ అధ్యక్షుడు జలగడుగుల పృథ్వీరాజ్ మాట్లాడుతూ ఒక పక్క విద్యాసంస్థల్లో ర్యాగింగ్ కారణంగా అణగారిన వర్గాలకు చెందిన నిరుపేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, మరో పక్క మౌలిక వసతులు లేక సంక్షేమ హాస్టళ్లన్నీ సంక్షోభంలో కూరుకుపోయాయన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నాయకులు గండ్రేటి వినీత్ కుమార్, బోన్లికిత్, మణికంఠ, నూతలపాటి రాజు, గన్నవరపు రాజేష్, కనిపే రవి, కంచుమర్తి నాగేశ్వరరావు, చింటూ, రాజేష్ పాల్గొన్నారు. విద్యార్థులను విద్యార్థి సంఘాలకుదూరం చేసే కుట్ర వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్ నాయకుల ధ్వజం కాకినాడలో విద్యార్థులతో కలసి నిరసన -
ఆ చేతులకు.. మనసుంది
అమ్మ చెప్పిందని.. అమ్మా నాకు జాబ్ వస్తే నీకు ఏం కావాలో చెప్పు అని కొడుకు తల్లిని అడిగాడు. అప్పుడు ఆ తల్లి నాకేం వద్దు, నీ జీతంలో కొంత భాగాన్ని అభాగ్యులు, అనాథల కోసం, వారి వైద్యానికి ఖర్చు చేయమని చెప్పడంతో ఆ మాట నుంచే సాయం పుట్టుకొచ్చింది. తన తల్లికిచ్చిన మాట కోసం కేశవభట్ల చారిటబుల్ ట్రస్టు ద్వారా అనేక వేల మంది నిరాశ్రయులకు కేశవభట్ల శ్రీనివాసరావు సేవలందిస్తున్నారు. వివిధ రూపాల్లో పేదలను ఆదుకుంటున్నారు. సాయం చేస్తున్నాం ఇప్పటికి వరకూ పేదవర్గాల ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, 5 లక్షల మందికి పైగా కంటి వైద్య పరీక్షలు చేయించాం. 76 వేల మందికి ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేశాం. వెయ్యి మందికి కంటి శస్త్రచికిత్సలు చేయించాం. అంతే కాకుండా రైల్వే కార్మికులకు ఉచితంగా బి య్యం ఇచ్చాం. దివ్యాంగులకు 820 ట్రై సైకిళ్లు, వీల్ చైర్లు, కృత్రిమ అవయవాలు అందించాం. ఆ తల్లి మాట కోసం సాయం చేస్తూనే ఉన్నా. – కేశవభట్ల శ్రీనివాసరావు, విశ్రాంత రైల్వే చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఆ చేతులకు మనసుంది.. అభాగ్యులకు ఆపన్నహస్తం అందిస్తోంది. ప్రార్థించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులు మిన్న అనే నానుడిని నిజం చేస్తూ సాటివారి సేవలో తపిస్తోంది. తాము పడిన కష్టం మరొకరికి రాకూడదనే ఉద్దేశంతో ముందుకు సాగుతోంది. ఇలా సేవ చేసే ప్రతి హృదయం మానవత్వం చాటుతోంది. మంగళవారం ప్రపంచ మానవత్వ దినోత్సవం సందర్భంగా సాయం చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తుల గురించి ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఇది. సేవ చేయాలనే తపనతో జిల్లాలో సుమారు 50 వరకూ స్వచ్ఛంద సంస్థలు ఏర్పడ్డాయి. వీటికి ప్రభుత్వ రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. అలాగే మరో 150 వరకూ సంస్థలతో పాటు వ్యక్తులూ అభాగ్యుల సేవల్లో తరిస్తున్నారు. తమకున్న దాంట్లోనే సేవ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. సమాజంలో అభాగ్యులు, అనాథలు, నిరాశ్రయులకు సాయం అందించి సహృదయాన్ని చాటుతున్నారు. సమాజ శ్రేయస్సుకు పాటుపడుతూ మా చేతులకూ మనసుందని నిరూపిస్తున్నారు. అందులో కొన్ని తెలుసుకుందాం రండి.. తపనతో చదువుకుని.. పామర్తి గోపాలరావు మాస్టారుది కృష్ణా జిల్లా గుడివాడ మండలం జమీగొల్లేపల్లి. తండ్రి గీత కార్మికుడు. ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగోక పోవడంతో పదో తరగతి వరకే చదువుకున్నారు. కానీ బాగా చదువుకోవాలనే తపన ఆయనకు ఉండేది. ఈ నేపథ్యంలో తమ బాల్య మిత్రుడు పొట్లూరి రామబ్రహ్మం అందించిన సాయంతో ఆయన పీజీ వరకూ పూర్తి చేశారు. తరువాత రాజమహేంద్రవంలోని వీరేశలింగం పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా చేరి, తదనంతరం కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేసి 2010లో ఉద్యోగ విరమణ పొందారు. అయితే తనలా చదువుకోవాలనే తపన ఉన్న పేద విద్యార్థులకు ఫీజులు కట్టేందుకు ముందుకు ఉండేవారు. తరువాత వాకర్స్ యోగా, లాఫింగ్ క్లబ్ను మిత్రులతో స్థాపించారు. అప్పటి నుంచి నిరంతరంగా పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు, ప్రభుత్వ పింఛన్ అందని పేదలకు ప్రతి నెలా 5న రూ.500 చొప్పున అందిస్తున్నారు. ఎంతో ఆనందంగా ఉంది నేను సహాయం చేసిన కొంత మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదివి మంచి స్థానం పొందడం ఎంతో ఆనందంగా ఉంది. నేను ఏ విధంగా ఈ స్థితికి వచ్చానో గుర్తు పెట్టుకున్నాను. అందుకే ప్రతి నెలా నేను, నా మిత్రు లంతా కలసి పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు, వృద్ధులకు పింఛన్ల రూపంలో రూ.50 వేలకు పైగా సహాయం అందిస్తున్నాం. నగరంలో ఎస్కేవీటీ కళాశాలలో ప్రతి నెలా 5న ఈ సాయం చేస్తున్నాం. – పామర్తి గోపాలరావు, విశ్రాంత ప్రిన్సిపాల్, రాజమహేంద్రవరం ఆఖరి మజిలీ కోసం జంగారెడ్డిగూడేనికి చెందిన ఎస్.రామచంద్రారెడ్డి మి త్రుడి తల్లి చనిపోయినప్పుడు దూరం నుంచి బంధువులు రావడానికి సమయం పట్టింది. ఈ నేపథ్యంలో మృతదేహాన్ని భద్రపరచడానికి ఇబ్బంది ఎదురైంది. దీనిని చూసి రామచంద్రారెడ్డి చలించిపోయాయి. ఇ లాంటి ఘటనల సమయంలో బాధలో ఉన్నవారికి ఏదై నా చేయాలనే ఆలోచన ఆయనకు వచ్చింది. 2004లో జంగారెడ్డిగూడెంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుడిగా ఆయన పనిచేస్తున్న సమయంలో మానవత స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. జంగారెడ్డిగూడెం నుంచి రాజమహేంద్రవరం రోడ్డులో అనేక ప్ర మాదాలు జరిగినప్పుడు సాయం కోసం ఎదురుచూసే క్షతగాత్రులను ఆదుకోవాలనే లక్ష్యంతో అంబులెన్స్లు ఏర్పాటు చేశారు. ఈ సంస్థ జంగారెడ్డిగూడెం కేంద్రంగా ఏర్పడి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సేవలందిస్తుంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 65 శాంతి రథాలు, 20 అంబులెన్స్లు, 375 ప్రీజర్ బాక్సులు, 20 అంబులెన్స్లు, 15 వాటర్ ట్యాంక్లు ఏర్పాటు చేసింది. ఆదుకోవాలనే తలంపుతో... చనిపోయిన వారిని భద్రపరచడానికి మానవత స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రీజర్లు, వారిని అంత్యక్రియలకు తీసుకు వెళ్లడానికి శాంతి రథాలను ఉచితంగా ఏర్పాటు చేస్తున్నాం. బాధలో ఉన్నవారికి సాయం చేయాలనే తలంపుతో వీటిని అందుబాటులోకి తెచ్చాం. ఇవే కాకుండా వికలాంగులకు ట్రై సైకిళ్లు అందించాం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 15 శాంతి రథాలు, ప్రీజర్లను ఉంచాం. – కండెపు వెంకట సూర్యనారాయణ, మానవత స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు, ఉమ్మడి గోదావరి జిల్లా సమాజ శ్రేయస్సుకు పాటుపడుతున్న సంస్థలు అభాగ్యుల కష్టాలు దూరం చేసేందుకు ప్రయత్నం నేడు ప్రపంచ మానవతా దినోత్సవం -
నాట్లు.. పాట్లు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లా అతలాకుతలమైంది. జనజీవనం స్తంభించింది. మూడు రోజులుగా విరామం లేకుండా కురుస్తున్న వర్షంతో జనం ఇళ్ల నుంచి బయటకు రాలేకపోయారు. భారీ వర్షాలతో పిఠాపురం బ్రాంచ్ కెనాల్, సుద్దగడ్డ, ఏలేరు, పంపా, తాండవ జలాశయాల్లోకి వచ్చి చేరిన నీరు మెట్ట ప్రాంతంలో ఆయకట్టు రైతులకు కాస్త ఊరటనిచ్చింది. అయితే డెల్టా ప్రాంతంలో వెదజల్లు సాగుచేపట్టిన పొలాలు ముంపులోకి వెళ్లాయి. ముందు చూపు లేని సర్కారు ముందు చూపు లేని సర్కారు తీరుతో పొలాలు ముంపులో ఉన్నాయి. ఖరీఫ్ నారుమళ్లు ముందుగా వేసుకుని నాట్లు ముందుగానే పూర్తి చేయాలని ప్రభుత్వం పిలుపు నిచ్చింది. దానికి తగినట్టు నీరు విడుదల చేయకపోవడంతో వరి నాట్లు జిల్లాలో ఆలస్యమయ్యాయి. ఫలితంగా మెజార్టీ రైతులు వెదజల్లుకు మొగ్గు చూపారు. పెద్దాపురం, కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లోని డెల్టా ప్రాంతంలో ఇలా వెదజల్లు తో సాగుకు సమాయత్తమైన పంట పొలాలు ప్రస్తుత వర్షాలతో ముంపులో ఉన్నాయి. జిల్లాలో ఖరీఫ్లో సాధారణ సాగు విస్తీర్ణం 2.10 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటికే 70 శాతం అంటే 1.70 లక్షల ఎకరాల్లో నాట్లు పూర్తయ్యాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. జిల్లాలో అత్యధికంగా తొండంగి మండలంలో 55.02 మిల్లీమీటర్లు, అత్యల్పంగా పెదపూడి మండలంలో 22.04 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. కాకినాడ పోర్టులో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక సోమవారం కూడా కొనసాగింది. పొంగి పొర్లుతున్న కాలువలు పిఠాపురం, గొల్లప్రోలు మండలాల్లో ఏలేరు, సుద్దగడ్డ తదితర ప్రధాన పంట కాలువలు పొంగి పొర్లుతుండడంతో పొలాలు నీట మునిగాయి. పిఠాపురం మండలం పి.తిమ్మాపురం, జములపల్లి, రాయవరం, రాపర్తి, గొల్లప్రోలు మండలం లక్ష్మీపురం, చేబ్రోలు, సీతానగరం తదితర గ్రామాల్లో వరితో పాటు పత్తి పంటలు నీట మునిగాయి. ఈ మండలాల్లో వాణిజ్య పంటలు ముంపులో ఉన్నాయని రైతులు దిగులు చెందుతున్నారు. ముఖ్యంగా వెదజల్లే పద్ధతిలో వేసిన వరి పూర్తిగా నీట మునిగి రైతులు ఆవేదన చెందుతున్నా రు. సుద్దగడ్డ కాలువ పొంగి ప్రవహిస్తుండడంతో గొల్లప్రోలు ఈబీసీ కాలనీ, కొత్త కాలనీ, సూరంపేట తదితర నివాస ప్రాంతాలు నీట మునిగాయి. ఏలేరు కాలువకు గత ఏడాది పడిన గండ్లు పూడ్చివేత పనులు వదిలేయడంతో నాట్లు వేసిన పొలాల్లోకి నీరు చేరిందని రైతులు చెబుతున్నారు. పూడిక తీయక.. కాలువల్లోకి నీరు విడుదల చేసే చివరి నిమిషంలో పూడికతీత పనులు మొదలు పెట్టి అన్యాయం చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో నీరు సక్రమంగా పారుదల కాక వరద నీరు పొలాల్లోకి వచ్చేస్తోందన్నారు. ముందుగా పూడిక తీత జరిగితే ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదంటున్నారు. ప్రత్తిపాడు నియోజవర్గంలో సుమారు 24 వేల ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. ఏలేరు పరివాహక ప్రాంతంలో పడుతున్న వర్షాలతో ఏలేరుకు వరద ఉధృతి పెరిగింది. సోమవారం ఏలేరు ప్రాజెక్టులోకి 6,100 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. దీంతో వరద నీరు ప్రాజెక్టులోకి మరింత వస్తుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సీతానగరం మండలం పురుషోత్తపట్నం నుంచి నీటి విడుదల తగ్గించేశారు. కేవలం అక్కడి నుంచి 525 క్యూసెక్కులు మాత్రమే వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 86.46 మీటర్లకు 79.00 మీటర్లు, 24.11 టీఎంసీలకు 12.31 టీఎంసీల నీటినిల్వలు ఉన్నాయి. ఇందులో విశాఖకు 200, తిమ్మరాజుచెరువుకు 20 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నారు. ఈ ప్రాంత ఆయకట్టుకు నీటి విడుదల నిలిపివేశారు. అదనపు జలాల విడుదల పెద్దాపురం నియోజకవర్గంలోని సామర్లకోట మండలం వీకే రాయపురంలో పొలాలు నీట మునిగాయి. గోదావరి కాలువలో ప్రవాహం ఎక్కువగా ఉండడంతో నీటి మట్టం పెరిగింది. దీనిని దృష్టిలో ఉంచుకుని బిక్కవోలు, వేట్లపాలెం గ్రామాల వద్ద గోదావరి నుంచి అదనపు జలాలను విడిచిపెడుతున్నారు. అవి మురుగు కాలువ ద్వారా సముద్రంలో కలవాలి. వేట్లపాలెం వీఆర్ నుంచి వచ్చే అదనపు జలాలు వీకే రాయపురం పొలాల మీదుగా వెళ్లడంతో అవి మునిగిపోయాయి. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే పంట కుళ్లిపోయే ప్రమాదం ఉందని రైతులతో పాటు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. వేట్లపాలెం సర్ ప్లస్ వియర్స్ గేట్లు ఎత్తివేయడం వల్ల తరచూ తమ పంట పొలాలు నీటిలో మునిగిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కురిసిన వర్షాలతో పెద్దాపురం, సామర్లకోట మండలాల్లోని దుంప, నువ్వులు సాగుకు సానుకూలమంటున్నారు. సహాయక చర్యలు గొల్లప్రోలు నగర పంచాయతీ పరిధిలోని సుద్దగడ్డ కాలువకు వరద నీరు పోటెత్తడంతో గొల్లప్రోలు కొత్త కాలనీకి రాకపోకలు నిలిచాయి. ముందు జాగ్రత్త చర్యలుగా కాలనీలో ఉన్న ముగ్గురు గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలను బోట్లపై కాలువ దాటించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
జిల్లాలో 40.2 మి.మీ వర్షపాతం
కాకినాడ సిటీ: జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం 8.30 గంటల వరకు సరాసరి 40.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా తొండంగి మండలంలో 55.2, అత్యల్పంగా పెదపూడి మండలంలో 22.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా శంఖవరంలో 54.2, గొల్లప్రోలు 52.2, పిఠాపురం 51.6 కోటనందూరు 50.2, యు.కొత్తపల్లి 50.2, తుని 49.6, రౌతులపూడి 48.2, కిర్లంపూడి 46.2, ఏలేశ్వరం 45.2, ప్రత్తిపాడు 42.4, కాకినాడ రూరల్ 34.6, సామర్లకోట 34, జగ్గంపేట 32.6, పెద్దాపురం 32.2, కాజులూరు 31.2, తాళ్లరేవు 29.8, కాకినాడ అర్బన్ 29.4, కరప 29.2, గండేపల్లి 23.4, పెదపూడి 22.4 మిల్లీమీటర్లు చొప్పున కురిసింది. ‘తాండవ’లో జలకళ కోటనందూరు: తాండవ జలాశయం నీటితో కళకళలాడుతోంది. రెండు, మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షానికి నీటి నిల్వలు పెరుగుతున్నాయి. జలాశయం గరిష్ట నీటి మట్టం 380 అడుగులు కాగా ప్రస్తుతం 375.5 అడుగులకు నీరు చేరినట్టు డీఈఈ అనురాధ తెలిపారు. నీటిమట్టం 378 అడుగులకు చేరితే ఆ తర్వాత వచ్చే ఇన్ఫ్లోకు అనుగుణంగా సముద్రంలోని నీటిని విడిచిపెడతామన్నారు. భక్తులతో రత్నగిరి కిటకిట అన్నవరం: సత్యదేవుని ఆలయం సోమవారం వేలాదిగా తరలి వచ్చిన నవ దంపతులు, భక్తులతో కిటకిటలాడింది. ఆలయ ప్రాంగణం, క్యూలైన్లు, వ్రత మండపాలు నిండిపోయాయి. ఆదివారం రాత్రి, సోమవారం తెల్లవారుజామున ముహూర్తాలలో రత్నగిరిపై సుమారు 50 వివాహాలు జరిగాయి. ఇతర ప్రాంతాలలో కూడా పెద్ద సంఖ్యలో వివాహాలు జరగడంతో వారంతా తమ బంధువులతో కలిసి సత్యదేవుని ఆలయానికి తరలి వచ్చారు. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించారని, 2,200 వ్రతాలు జరిగాయని ఆలయ అధికారులు తెలిపారు. స్వామివారి దర్శనానికి రెండు గంటలు, రూ.200 టిక్కెట్తో అంతరాలయం దర్శనానికి గంట సమయం పట్టింది. సత్యదేవుడిని దర్శించిన భక్తులు సప్త గోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు. రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి పూజలు చేశారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షలు ఆదాయం వచ్చింది. సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో ఐదు వేల మంది భక్తులకు భోజన సౌకర్యం కల్పించారు. -
ఏకై క సాహిత్య సంపద మనదే
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): వేల గ్రంథాలతో అందుబాటులో వున్న ఏకై క సాహిత్య సంపద మనదని సమన్వయ సరస్వతీ సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. స్థానిక సూర్యకళా మందిరంలో సోమవారం రాత్రి సరస్వతీ గాన సభ ఆధ్వర్యంలో సనాతన ధర్మం – శాశ్వత న్యాయం అనే అంశంపై ఆయన ప్రవచించారు. మన భారత సాంస్కృతిక జీవనంలో ధర్మ ప్రవర్తన, న్యాయ జీవనం ఆచరింపబడుతున్న విషయాలన్నారు. వాటిని కల్పాంతరాలుగా ఆచరిస్తూ వస్తున్న ఏకై క ఆదర్శ దేశం భారతావని అని తెలిపారు. ఈ ధర్మం, న్యాయం ఒకేలా ఆలోచన చేస్తే ఒకే అర్థంలా అనిపించినా, వివరంగా ఆలోచన చేసినప్పుడు అనేక విషయాలు అర్థమవుతాయన్నారు. తప్పుడు చరిత్రలు అందుబాటులో ఉండడం దురదృష్టమని, ఈ విధానం మారి నిజం ప్రజలకు అందాలన్నారు. చాణక్య నీతి, సోమదేవ నీతి వంటి గ్రంథాలను ప్రస్తావించారు. తొలుత సామవేదానికి వేద పండితులు స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సరస్వతీ గాన సభ గౌరవాధ్యక్షురాలు పెద్దాడ సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు. -
విలసలే లేవు.. ఇక పులసలెక్కడివి?
సముద్రంలో విలసలు గోదావరికి వస్తేనే కదా పులసలుగా మారేది. ఇప్పుడు సముద్రం నుంచి గోదావరి వైపు అసలు విలసలే రావడం లేదు. ఒకప్పుడు జూలై వచ్చిందంటే అర్ధరాత్రి వేటకు వెళ్తే తెల్లారేసరికి 10, 15 పులసలతో తిరిగొచ్చే వాళ్లం. ఇప్పుడు ఒకట్రెండు కూడా దొరకడమే గగనమైపోతోంది. గోదావరిలో లభించే పులసల కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారు. ఇప్పుడు పులసల కోసం జనం వస్తున్నా నిరాశతో వెనుదిరిగిపోతున్నారు. గోదావరి, సముద్రం కలిసే నదీ ముఖద్వారం వద్ద యానాం సమీపాన భైరవపాలెం వద్ద చమురు కంపెనీలు గ్యాస్ పైప్లైన్ వేసే సమయంలో తవ్వకాల వల్ల ఇసుక మేటలు వేశాయి. ఈ మేటలు తొలగించడంతో పాటు కేజీ బేసిన్లో డ్రెడ్జింగ్పై నియంత్రణ ఉండాలి. – పాలేపు పోసియ్య, మత్స్యకారుడు, యానాం -
ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
● రూ.9.80 లక్షల విలువైన సొత్తు స్వాధీనం ● పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు అన్నవరం: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అనేక చోరీలకు పాల్పడిన ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను కాకినాడ జిల్లా అన్నవరం పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. అన్నవరం పోలీస్ స్టేషన్లో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు ఆదివారం రాత్రి విలేకరులకు వివరాలు తెలిపారు. అన్నవరం, తుని పోలీస్స్టేషన్ల పరిధిలో ఇటీవల పలు దొంగతనాలు జరగడంతో, ప్రత్తిపాడు సీఐ సూరిఅప్పారావు పర్యవేక్షణలో అన్నవరం ఎస్సై శ్రీహరిబాబు, అడిషనల్ ఎస్సై ప్రసాద్ నేతృత్వంలో ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా కిర్లంపూడికి చెందిన అడపా జోగాఅమర్ గంగాధర్, అల్లూరి జిల్లా రంపచోడవరానికి చెందిన అడపా సూర్యచంద్రపై అనుమానంతో పోలీసులు నిఘా ఉంచారు. ఆదివారం ఉదయం వారిద్దరూ మండపాం సెంటర్లో అనుమానాస్పదంగా తచ్చాడుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో చేసిన నేరాలను వారు అంగీకరించారు. వారిని అరెస్ట్ చేసి, వారిచ్చిన సమాచారంతో రూ.9.80 లక్షల విలువైన 500 గ్రాముల వెండి వస్తువులు, అమ్మవారి గుడిలో అపహరించిన రోల్డ్గోల్డ్ హారం, మూడు బుల్లెట్లు, ఆరు మోటార్ బైకులు, నాలుగు స్కూటీలు, ఎల్ఈడీ టీవీ స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై హైదరాబాద్ పోలీస్స్టేషన్లో రెండు, విశాఖపట్నం జిల్లా అరిలోవ పోలీస్స్టేషన్లో ఒకటి, అన్నవరం పోలీస్స్టేషన్లో ఎనిమిది, తుని రూరల్ పోలీస్స్టేషన్లో మూడు, ప్రత్తిపాడు, తుని టౌన్ పోలీస్స్టేషన్లలో ఒక్కొక్క కేసు నమోదైనట్టు డీఎస్పీ వివరించారు. వీరిని ప్రత్తిపాడు కోర్టుకు తరలించినట్టు చెప్పారు. సమావేశంలో ప్రత్తిపాడు సీఐ సూరిఅప్పారావు, ఎస్సై శ్రీహరిబాబు, అడిషనల్ ఎస్సై ప్రసాద్ పాల్గొన్నారు. -
దూసుకొచ్చిన మృత్యువు
● కోరంగిలో ఇద్దరిని బలిగొన్న అతివేగం ● పాదచారి, ఆటోను ఢీకొన్న కారు ● మరో మహిళకు గాయాలు తాళ్లరేవు: మృత్యు రూపంలో అతివేగంగా దూసుకొచ్చిన కారు ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ఆదివారం కోరంగిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కూలీ పనికి వెళ్లి, ఇంటికి తిరిగి వెళుతున్న పాదచారితో పాటు, చర్చిలో ప్రార్థనలను ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కిన మహిళ దుర్మరణం పాలయ్యారు. కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జాతీయ రహదారి 216లోని కోరంగి పెంతెకోస్తు చర్చి వద్ద ఆగి ఉన్న ఆటోను యానాం నుంచి కాకినాడకు వెళుతున్న కారు వేగంగా వచ్చి.. తొలుత పాదచారిని, తర్వాత ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో కొత్త కోరంగి గ్రామానికి చెందిన నిమ్మితి ఏసు(50) అక్కడికక్కడే మృతి చెందగా, ఆగి ఉన్న ఆటోలో కూర్చున్న పాత కోరంగి గ్రామానికి చెందిన అరుబరుగుల లక్ష్మి(58) కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆటోలో ఉన్న మరో మహిళ దడాల ధనలక్ష్మికి గాయాలు కాగా, స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. చిన్నారులు సురక్షితం : ఇలాఉండగా ఆటోలో ఉన్న మరో నలుగురు చిన్నారులు ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. మృతుడు ఏసు భార్య హైదరాబాద్లో ఉండగా, వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. అలాగే పాత కోరంగి ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన హెల్పర్గా పని చేస్తున్న లక్ష్మి భర్త పదేళ్ల క్రితం మృతి చెందాడు. ఆమె తన ఇద్దరు కుమారుల వద్ద ఉంటోంది. ప్రమాద విషయం తెలుసుకున్న ఎస్సై సత్యనారాయణ తన సిబ్బందితో హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. వివరాలు సేకరించి, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. కాగా సంఘటన సమయంలో ముగ్గురు వ్యక్తులు కారులో ఉన్నట్టు స్థానికులు అంటున్నారు. కారులో కొన్ని మద్యం బాటిళ్లు కూడా ఉన్నాయంటున్నారు. దీంతో వారు మద్యం సేవించి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారులో ఉన్నవారిలో ఇద్దరు పరారు కాగా, ఒకరిని పోలీసులు అదుపులో తీసుకున్నట్టు తెలిసింది. -
లంకల్లో భయం భయం
పి.గన్నవరం: గోదావరి వరద పెరుగుతున్న నేపథ్యంలో పి.గన్నవరం మండలంలోని లంక గ్రా మాల ప్రజలు భయం గుప్పిట్లో ఉన్నారు. వశిష్ట, వైనతేయ నదీపాయలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, అ రిగెలవారిపేట, బూరుగులంక గ్రామాల ప్రజలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో పడవలపై వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. మన జిల్లా సరిహద్దులోని ఆనగర్లంక, సిర్రావారిలంక, పెదమల్లంక, అయోధ్యలంక గ్రా మాల ప్రజలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. -
ఉత్సాహంగా ఉమ్మడి జిల్లా ఆర్చరీ పోటీలు
పిఠాపురం: జిల్లా స్థాయి ఆర్చరీ పోటీలు స్థానిక ఆర్ఆర్బీహెచ్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా స్థాయి ఇండియన్ రౌండ్ ఆర్చరీ బాలబాలికల విభాగంలో ఈ పోటీలు నిర్వహించారు. రాజమహేంద్రవరం, అమలాపురం, రాజోలు, కాకినాడ, తుని, పిఠాపురం నుంచి సుమారు 60 మంది ఇండియన్ రౌండ్ ఆర్చర్లు వివిధ విభాగాల్లో పాల్గొన్నారు. పిఠాపురం క్రీడాకారులు ఓవరాల్ తొలి స్థానంలో నిలవగా, రెండో స్థానంలో కాకినాడ, మూడో స్థానంలో అమలాపురం ఆర్చర్లు గెలుపొందారు. మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పోటీలు ప్రారంభించి, క్రీడాకారులకు పతకాలు అందజేశారు. అనంతరం కాకినాడ జిల్లా బాక్సింగ్ సంఘ అధ్యక్షుడు ఇమిడిశెట్టి నాగేంద్రకుమార్, పలువురు నాయకులు బహుమతీ ప్రదానం చేశారు. న్యాయ నిర్ణేతలుగా పి.కృష్ణ, కె.చిన్నబ్బాయి, ఎం.గణేష్, జె.ప్రసాదరావు వ్యవహరించారు. డీఎస్డీవో బి.శ్రీనివాస్ కుమార్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఆర్చరీ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు గోపాలకృష్ణ, పి.లక్ష్మణరావు, ఏపీ ఒలింపిక్ సంఘ మాజీ ఉపాధ్యక్షుడు కె.పద్మనాభం, జిల్లా ఆర్య వైశ్య సంఘ కన్వీనర్ బోడ సతీష్ పాల్గొన్నారు. -
గోదారంటే అలుసా!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘గోదాట్లో నీరు ఎరుపెక్కిందంటే నా సామిరంగా.. సముద్రం నుంచి పులస లగెత్తుకు రావాల్సిందే. వెంటనే పుస్తెలు అమ్మయినా పులస పులుసు తినాల్సిందే’ అంటుంటారు గోదావరి జిల్లాల వాసులు. ఏడాదికి ఒకసారి మాత్రమే అదికూడా గోదావరికి వరద నీరు వచ్చినప్పుడు మాత్రమే కనిపించే పులసలు ఈసారి మొహం చాటేస్తున్నాయి. గోదావరికి వరదలు వచ్చి ఎర్రనీరు పోటెత్తుతున్నా పులస జాడ లేదు. గత సీజన్లతో పోలిస్తే పులసలు ఎప్పుడూ ఈ స్థాయిలో తగ్గిపోలేదని ఇక్కడ మత్స్యకారులు మదనపడుతున్నారు. వాస్తవానికి జూలై మొదటి వారం నుంచే పులసలు గోదావరిలో సందడి చేస్తాయి. ఆగస్టు మూడోవారం వచ్చేసినా వాటి జాడ ఎక్కడా కనిపించడం లేదు. ఈ నెలాఖరుకై నా రాకుండా పోతాయా అని గోదావరి జిల్లాల జనం ఎదురు చూస్తున్నారు. ముచ్చటగా మూడు ఈ సీజన్లో ఇప్పటివరకూ ముచ్చటగా మూడంటే మూడు పులసలు మాత్రమే మత్స్యకారులకు దొరికాయి. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం పరిసర ప్రాంతాల్లో 20 రోజుల వ్యవధిలో మత్స్యకారుల వలలకు చిక్కాయి. కిలో పులస రూ.20 వేల నుంచి రూ.26 వేల వరకూ.. అది కూడా వేలంలో సొంతం చేసుకుంటున్నారు. కొందరైతే మత్స్యకారులకు రూ.5 వేలు, రూ.10 వేల చొప్పున చెల్లించి అడ్వాన్స్ బుకింగ్ కూడా చేసుకుంటున్నారు. ఒకప్పుడు కేజీ నుంచి మూడున్నర కేజీలు, కొన్ని 4, 5 కేజీలున్న పులసలు కూడా మత్స్యకారుల వలకు చిక్కేవి. నాలుగైదు కేజీలున్న పులసలు ఐదారు వలలో పడ్డాయంటే వారి పంట పండినట్టే. నాలుగైదు కేజీల పులస రూ.10 వేల నుంచి రూ.15 వేలు పలికేది. గోదావరి తీరంలో ఒకప్పుడు యానాం, భైరవపాలెం, కోటిపల్లి, ఎదుర్లంక, రావులపాలెం, సిద్ధాంతం తదితర ప్రాంతాల్లో పులసలు విరివిగా లభించేవి. మత్స్యకారులు అర్ధరాత్రి నుంచి తెల్లారే వరకూ ఈ ప్రాంతాల్లోనే వేటాడేవారు. అటువంటిది ఇక్కడ కూడా పులసలు దొరక్క వారు నిరాశతో ఇళ్లకు తిరిగొచ్చేస్తున్నారు. గతంలో వరదల సీజన్ మొదలయ్యాక ప్రతి నెలా 40 టన్నులకు తక్కువ కాకుండా పులసలు పడేవన్నది మత్స్యశాఖ అంచనా. ప్రస్తుతం ఇందులో 10 శాతం కూడా ఈసారి కనిపించడం లేదని అంటున్నారు. చమురు సంస్థల కార్యకలాపాలతో.. పులసలు పునరుత్పత్తి కోసం బంగాళాఖాతంలో 11 వేల నాటికల్ మైళ్లు ప్రయాణిస్తాయి. సాగర సంగమం వద్ద ఉండే మొగల నుంచి గోదావరి నదిలోకి ఇవి ప్రవేశిస్తాయి. సంతానోత్పత్తి కోసం సముద్రం నుంచి వచ్చే ఇలస (హిల్స–విలస) చేప ఏటికి ఎదురీదుతూ గోదావరిలోకి వచ్చేసరికి పులసగా రూపాంతరం చెందుతుంది. అయితే.. కృష్ణా, గోదావరి (కేజీ) బేసిన్లోని ఆఫ్షోర్లో జరుగుతున్న డ్రెడ్జింగ్తో ధ్వని కాలుష్యం పెరిగిపోయింది. గోదావరి నదీ ముఖద్వారం (సీ మౌత్) వద్ద రిలయన్స్, ఓఎన్జీసీ తదితర చమురు సంస్థలు నిర్వహిస్తున్న డ్రెడ్జింగ్ పనులు పులసల రాకకు ప్రతిబంధకంగా మారాయి. డ్రెడ్జింగ్ వల్ల నీటిలో సంభవించే కంపనాలు, శబ్దాల వల్ల పులసలు గోదావరి నదిలోకి రావడం లేదు. ఏపీ తీరం వైపు రావాల్సిన పులసలు ఒడిశా, బెంగాల్ వైపు వెళ్లిపోతున్నాయి. యానాం సమీపాన గాడిమొగ, భైరవపాలెంతో పాటు అంతర్వేది, కరవాక సమీప ప్రాంతాల్లో పారిశ్రామిక, ఆక్వా వ్యర్థాలు గోదావరి నదిలో కలుస్తున్నాయి. ప్రధానంగా సల్ఫర్, అమ్మోనియా, లెడ్, పాదరసం ఇతర కర్బనాలు నదిలో కలుస్తున్నాయి. ఆక్వా సాగులో వినియోగించే యాంటీబయోటిక్స్, పటిక (ఆలం) వంటివి కలుస్తూండటంతో పులస గోదావరి వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. యానాం మార్కెట్లో పులస వేలం8 -
కలిసొచ్చిన ముహూర్తం
● కడియపులంక పువ్వుల మార్కెట్కు కళ ● ఆకాశాన్నంటిన ధరలు ● బంతి కిలో రూ.150 కడియం: కడియపులంకలోని అంతర్రాష్ట్ర పువ్వుల మార్కెట్కు ముహూర్తం కలిసొచ్చింది. శుభకార్యాలకు ఈ నెలలో ఆదివారంతో ముహూర్తాలు అయిపోవడంతో.. నాలుగు రోజులుగా మార్కెట్లో పువ్వుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని కొనుగోలుదారులు చెబుతున్నారు. ఎప్పుడూ లేనంతగా బంతి పువ్వుల ధర కిలో రూ.150 వరకు పలకడంతో విస్తుపోతున్నారు. శుభకార్యాల సందర్భంగా అలంకరణలకు ఇతర ప్రత్యేక రకాల పువ్వులు లేకపోవడంతో బంతి పువ్వులనే ప్రధానంగా వినియోగిస్తున్నారు. దీంతో వీటి ధరలు పెరిగాయని విశ్లేషిస్తున్నారు. దీనికి తోడు స్థానికంగా పువ్వుల దిగుబడి గణనీయంగా తగ్గింది. జాజులు, లిల్లీలు, మల్లెలు, కనకాంబరం వంటి రకాలు మాత్రమే ఇక్కడ ప్రస్తుతం ఉత్పత్తి అవుతాయని, బంతి, చామంతి వంటి ముఖ్యమైన పువ్వులను కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. గతంలో తగిన ధరల్లేక కాలువల్లో పారబోసిన బంతి పువ్వులకు ఇప్పుడు డిమాండ్ భారీగా పెరగడం, సాగులో అనిశ్చితికి నిదర్శనమంటున్నారు. నాలుగు రోజులుగా.. ఒకవైపు శ్రావణ మాసం, మరోవైపు ముహూర్తాల నేపథ్యంలో గురు, శుక్ర, శని, ఆదివారాల్లో కడియపులంక పువ్వుల మార్కెట్లో ధరలు భారీగా పెరిగాయి. ఆదివారం మధ్యాహ్నం సమయానికే పువ్వులు లేకపోవడంతో మార్కెట్ నిర్మానుష్యంగా మారిపోయింది. కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి దాదాపు పది టన్నులకు పైగా బంతి, చామంతి పువ్వులు ఇక్కడకు వస్తే, గంటల వ్యవధిలోనే అవన్నీ అమ్ముడయ్యాయని వ్యాపారులు తెలిపారు. ఆదివారంతో వివాహాలు, గృహ ప్రవేశాలకు ముహూర్తాలు అయిపోయాయని, తిరిగి సెప్టెంబర్ 23 తర్వాతే ముహూర్తాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. చివరి ముహూర్తాలు కావడంతో పువ్వులకు భారీగా డిమండ్ ఏర్పడిందంటున్నారు. ధరలు ఇలా.. కడియపులంక పువ్వుల మార్కెట్లో ఆదివారం స్థానికంగా లభించే లిల్లీ పువ్వులు కిలో రూ.500, మల్లెలు రూ.1300–రూ.1500, జాజులు రూ.700–రూ.900 పలికాయి. అలాగే కర్నాటక నుంచి వచ్చిన బంతి పువ్వులు రూ.120–రూ.150 వరకు విక్రయించారు. తమిళనాడు చామంతులు (తడి పువ్వులు) కిలో రూ.250–రూ.300, పొడి పువ్వులు రూ.350, వైట్ చామంతి రూ.250, నీలం చామంతి రూ.270, స్టార్ గులాబీలు కిలో రూ.240, కనకాంబరం బారు రూ.220 పలికాయి. -
ఆరుగురు గంజాయి విక్రేతల అరెస్ట్
మూడు కిలోల గంజాయి స్వాధీనం రాజోలు: గంజాయి విక్రయిస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపర్చినట్టు సీఐ నరేష్కుమార్ ఆదివారం తెలిపారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. మలికిపురం మండలం శంకరగుప్తం గ్రామానికి చెందిన చవ్వాకుల నితీష్ అలియాస్ బంటి ఇంట్లో మూడు కిలోల గంజాయిని మలికిపురం ఎస్సై పీవీవీ సురేష్ గుర్తించారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నితీష్తో పాటు, రాజమహేంద్రవరం గాజుల వీధికి చెందిన అమిటి ప్రశాంత్కుమార్, తాడి హరీష్బాబు(పడమటిపాలెం), కోరుకొండ మనోజ్(బట్టేలంక), భూపతి దిషోన్కుమార్(చింతలమోరి), గాడా శ్యాంసన్(కేశనపల్లి)ని అరెస్ట్ చేశారు. వీరిలో చవ్వాకుల నితీష్, అవిటి ప్రశాంత్కుమార్, తాడి హరీష్బాబుపై గతంలో మారేడుమిల్లి పోలీస్స్టేషన్లో గంజాయి కేసు నమోదైంది. కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావు, కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ ఆదేశాల మేరకు రీ–విజిట్ కార్యక్రమంలో భాగంగా గంజాయి కేసుల్లో పాత నిందితులను స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఎస్సై సురేష్కు వచ్చిన సమాచారంతో, గంజాయి విక్రయిస్తున్న నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. వీరి తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాల్లో ఉంటున్నారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడంతో.. చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. ‘ఆపరేషన్ సేవ్ క్యాంపస్’ పేరుతో విద్యాసంస్థల్లో ఈగిల్ క్లబ్బులు ఏర్పాటు చేసి, ‘డ్రగ్స్ వద్దు బ్రో’ నినాదంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు సీఐ నరేష్కుమార్ తెలిపారు. -
ఇటువడి..అటుజడి
● కొనసాగుతున్న వర్షం ● పెరుగుతున్న వరద ● ముంపు బారిన వరి చేలు ● లంకల్లో ప్రజలు బిక్కుబిక్కు సాక్షి, అమలాపురం: గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఒకవైపు గోదావరికి వరద పోటు తగిలింది. మరోవైపు అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా ఒక మోస్తరు వర్షం కురుస్తోంది. వరద.. వర్షంతో ప్రస్తుతానికి ఇబ్బంది లేకున్నా, వీటి ఉధృతి పెరిగితే లంక, కొన్ని మైదాన ప్రాంతాలు ముంపు బారిన పడే ప్రమాదం ఉంది. గోదావరి ఎగువన కురుస్తున్న వర్షాలకు శనివారం ఉదయం నుంచి రాత్రి వరకూ వరద పెరిగింది. ఆదివారం ఉదయం స్వల్పంగా తగ్గిన వరద మధ్యాహ్నం నుంచి క్రమేపీ పెరుగుతోంది. సోమవారం వరకూ వరద పెరుగుతోందని అధికారులు అంచనా వేస్తున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి శనివారం రాత్రి 4,25,594 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేశారు. ఆదివారం ఉదయానికి కొంత మేర తగ్గింది. ఉదయం ఆరు గంటల సమయంలో ఽఇది 4,04,890 క్యూసెక్కులకు తగ్గింది. తిరిగి వరద పెరుగుతూ సాయంత్రం ఆరు గంటలకు 4,84,214 క్యూసెక్కులకు చేరింది. ఎగువన భద్రాచలం వద్ద నీటమట్టం పెరుగుతుండడంతో సోమవారం సాయంత్రానికి ఐదు నుంచి ఆరు లక్షల క్యూసెక్కుల మధ్యలో వరద వచ్చి, తరువాత తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ సమయంలో క్యాచ్మెంట్ ఏరియాలో వర్షం పడితే వరద మరింత పెరుగుతోందని అంటున్నారు. శుక్రవారం ఉదయం ఇన్ఫ్లో కేవలం 2,29,910 క్యూసెక్కులు మాత్రమే ఉండగా, 24 గంటల వ్యవధిలో 1.74 లక్షల క్యూసెక్కుల వరద పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. వరద ప్రభావం నదీపాయల్లో కనిపిస్తోంది. లోతట్టు ప్రాంతాల లంకలను తాకుతూ ప్రవహిస్తోంది. అయితే ప్రతి ఏటా ఆగస్టులో గోదావరిలో నమోదయ్యే సగటు ఇన్ఫ్లోతో పోల్చుకుంటే ఇప్పుడు గోదావరికి వచ్చిన వరద అసలు వరద కాదని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. నీటి విడుదల తగ్గింపు డెల్టా పంట కాలువలకు నీటి విడుదల తగ్గించారు. ఈ ప్రాంతాల్లో వర్షాలు పడుతుండడంతో ప్రస్తుతం తూర్పు డెల్టాకు 2 వేల క్యూసెక్కులు, మధ్య డెల్టాకు 200, పశ్చిమ డెల్టాకు 500 క్యూసెక్కుల చొప్పున మొత్తం 2,700 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఈ నెల 14న వరకూ 4,550 క్యూసెక్కుల వరకూ నీరు వదలగా వర్షాలతో తగ్గించేశారు. మరో రెండు అల్పపీడనాలతో.. జిల్లాలో ఆది, సోమవారాల్లో భారీ వర్షం కురుస్తోందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కూడా తెలిపింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. -
లిపి లేని కంటి భాష.. చిత్రం
● చరిత్రకు సాక్ష్యం చెప్పే ఛాయాచిత్రం ● మానవ జీవితానికి విడదీయని బంధం ● సాంకేతిక పరిజ్ఞానంతో విప్లవాత్మక మార్పులు ● రేపు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం రాయవరం: కన్ను తెరిస్తే జననం.. కన్నుమూస్తే మరణం అన్నాడో మహానుభావుడు. కానీ.. ఈ పరికరం ‘క్లిక్’ అంటే మాత్రం ఆ దృశ్యం కలకాలం సజీవంగా ఉండిపోతుంది. అదే ఫొటోగ్రఫీ. పరిమితులు లేకుండా ప్రపంచంలోని ఏ ప్రాంతం వారికై నా అర్ధమయ్యేది.. పండితుల నుంచి పామరుల వరకు భాషకందని భావాన్ని సులువుగా అర్ధం చేసుకోగలిగే ఏకై క మాధ్యమం ఫొటోగ్రఫీ. అందుకే ఫొటోలు భాషలేని.. భావ దృశ్య కావ్యాలని అంటుంటారు. క్షణకాలంలో కరిగిపోయే జ్ఞాపకాల దొంతరలను కెమెరా కన్నుతో క్లిక్ మనిపించి.. కళ్లముందు సాక్షాత్కరింపజేసేవే ఛాయాచిత్రాలు. బాల్యం.. యవ్వనం.. వృద్ధాప్యం ఇలా గడిచిపోయిన మానవ జీవనయానాన్ని కనులారా వీక్షించే అపురూప అవకాశం కల్పిస్తాయి. ఓ ఛాయా చిత్రం కోటి భావాల్ని పలుకుతుంది. చరిత్రను, సంస్కృతిని చాటిచెబుతాయి. ఫొటోగ్రఫీ అనేది అద్భుత కళ. ఇందులో నేడు విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకటిన్నర శతాబ్దాలకు పైగా ఫొటోగ్రఫీ ప్రక్రియ ఉన్నా, రెండు దశాబ్దాలుగా విప్లవాత్మక పరిణామాలు సంతరించుకున్నాయి. కెమెరా పితామహుడు డాగురేకు పేటెంట్ లభించిన రోజును ఏటా ఆగస్టు 19న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం నిర్వహిస్తున్నారు. పలు రకాల మోడళ్లు ఫొటోగ్రఫీ ఉద్భవించి సుమారు 199 ఏళ్లవుతుంది. ఇటీవల ఫొటోగ్రపీలో అనేక విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఆధునిక, సాంకేతిక విప్లవం ఫొటోగ్రఫీ దశ, దిశను మార్చేసింది. గతంలో ఫొటో తీసుకోవడమంటే గొప్ప అనుభూతి, సుదీర్ఘప్రక్రియ. ఇప్పుడు ప్రతి మనిషి వద్ద ఆండ్రాయిడ్ ఫోన్ రూపంలో కెమెరా ఉంది. ఫొటో తీసుకోవడం ఇప్పుడు సులువుగా మారింది. కెమెరాల్లోనూ రకరకాల ఫీచర్లతో రోజుకో మోడల్ వస్తుంది. అంతరిక్షం.. వైద్య రంగం.. ఇలా ఫొటోగ్రపీ ప్రక్రియ లేనిదే ఏ పనీ జరగని పరిస్థితి నెలకొంది. రోలికార్డ్, రైస్ ల్యాండర్, రోలీ ఫ్లెక్స్, నికాన్, కేనన్ వంటి ఎన్నో కంపెనీల కెమెరాలు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. రూ.వేల నుంచి రూ.లక్షల విలువైన కెమెరాలు ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ప్రజా సమస్యలకు అద్దం పడుతూ.. ఇలాఉండగా ప్రజల సమస్యలను పత్రికల ద్వారా అధికారులు, పాలకుల దృష్టికి తేవడంలో ఫొటోలకు ఎనలేని ప్రాధాన్యం ఉంది. ప్రజా సమస్యలను ఎత్తిచూపడంలో ఫొటోల ఆవశ్యకత ఎనలేనిది. ఇటీవల కాలంలో సెల్ఫోన్ల రాకతో కెమెరాల ప్రాభవం కాస్త తగ్గినా, విలక్షణ ఫొటోలకు మాత్రం స్టూడియోలు, కెమెరాలను ఆశ్రయించక తప్పదు. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా.. ఫొటోగ్రఫీ పదం గ్రాఫోన్ నుంచి పుట్టింది. గ్రాఫోన్ అంటే రాయడం, చిత్రించడం అని అర్ధం. తొలిసారి 1826లో ఫ్రెంచ్ శాస్త్రవేత్త జోసఫ్ నైసిఫర్ నిస్సీ కనిపెట్టిన తొలి కెమెరా పరికరంతో ప్రారంభమైన ఫొటోగ్రఫీ ఇంతింతై వటుడింతై అన్నట్టుగా రీల్ నుంచి డిజిటల్ పరిజ్ఞానానికి మారింది. ఫొటోగ్రఫీలో లెన్సుల ప్రవేశం తర్వాత సుదూర దృశ్యాలనూ నాణ్యత తగ్గకుండా ఫొటో తీసే విధానం అందుబాటులోకి వచ్చింది. సెల్ఫోన్లో బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు అందుబాటులోకి వచ్చాక ఫొటోగ్రఫీ ఎక్కడికో వెళ్లిపోయింది. సామాజిక మాథ్యమాల్లో ఫొటోల పాత్ర కీలకంగా మారింది. ఇటీవల నాలుగు వైపులా రెక్కలతో ఆకాశంలో ఎగిరి.. చిత్రాలు, వీడియోలు తీసే డ్రోన్ కెమెరాల వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ఫొటోగ్రఫీలో డిజిటల్ యుగం నడుస్తోంది. డిజిటల్ యుగంలో డ్రోన్ కెమెరాలు కూడా వాడకం బాగా పెరిగింది. జిల్లాలో 140 ఏళ్ల చరిత్ర ఫొటోగ్రఫీలో జిల్లాకు 140 ఏళ్ల చరిత్ర ఉంది. కాకినాడలో చెక్కా బసవరాజు అండ్ సన్స్ 1885లో హాబీగా ఫొటోగ్రఫీని చెక్కా బసవరాజు ప్రారంభించారు. ప్రస్తుతం నాలుగు తరాలుగా ఫొటోగ్రఫీలో వారి కుటుంబం రాణిస్తోంది. కోనసీమ జిల్లాలో 19 ఫొటోగ్రాఫర్ల సంఘాలుండగా.. 1,400 మంది ఫొటోగ్రాఫర్లు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 4 వేలకు పైగా ఫొటో స్టూడియోలు ఉండగా, భారీ స్థాయిలో కెమెరా, ఫొటో ల్యాబ్స్ 20కి పైగా ఉన్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు ఆరు వేల మందికి పైగా ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రభుత్వ సహకారం అవసరం ఫొటోగ్రాఫర్లకు ప్రభుత్వ సహకారం అవసరం. టెక్నాలజీ అభివృద్ధి చెందడం మంచిదే కానీ, ఫొటోగ్రాఫర్ల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆండ్రాయిడ్ ఫోన్ల ప్రభావం మా వృత్తిపై తీవ్రంగా ఉంది. ఫొటోగ్రాఫర్లను ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. – గెడ్డం సురేష్కుమార్, జిల్లా అధ్యక్షుడు, ఫొటో గ్రాఫర్ల సంఘం, కొత్తపేట, కోనసీమ జిల్లా అప్డేట్ అవ్వాల్సిందే.. ఫొటోగ్రఫీలో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఫొటోగ్రాఫర్లు కూడా అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది. అలా కానివారు వృత్తిలో వెనుకబడుతున్నారు. – సంగుల దొరబాబు, ప్రధాన కార్యదర్శి, ఫొటోగ్రాఫర్ల సంఘం, మండపేట, కోనసీమ జిల్లా పసితనంలోకి జారేలా..ప్రకృతి సౌందర్యాన్ని వర్ణించడానికి అక్షరాలు సరిపోవు. వేయి పదాలతో చెప్పలేని భావాన్ని ఒక్క కెమెరా క్లిక్తో చెప్పవచ్చు. అందరికీ అర్ధమయ్యే భాష.. మధురమైన జ్ఞాపకం ఫొటో. తీరిక వేళల్లో ప్రశాంత సమయంలో చిన్ననాటి ఫొటో ఆల్బమ్ చూసుకుంటూ.. నాటి జ్ఞాపకాల పేజీలను తిరగేస్తుంటే మెల్లగా పసితనంలోకి జారిపోతాం. పొడవాటి చొక్కాలు.. లూజు నిక్కర్లు.. బుట్టబొమ్మల్లాంటి గౌన్లు.. పొడవాటి పావడాలు.. పిలక జడలు.. ఇలా చూసుకుంటూ.. మురిసిపోతుంటే అదో అందమైన అనుభూతి.సర్వసాధారణంగా మారి..గతంలో కెమెరాలు ప్రత్యేకంగా తీసుకుని వెళ్లాల్సి వచ్చేంది. ఇప్పుడు ప్రతి సెల్ఫోన్లో కెమెరా సర్వసాధారణ అంశంగా మారింది. పిండి కొద్దీ రొట్టె అన్నట్టుగా స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. సెల్ఫోన్లలో కెమెరాల సామర్థ్యం గణనీయంగా పెరిగింది. ఫొటోగ్రఫీపై ఆసక్తి ఉన్న వారి కోసం ప్రత్యేకంగా సెల్ఫోన్ సంస్థలు తమ ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. అవి మల్టీపర్పస్గా ఉపయోగపడుతుండడంతో ప్రతి ఒక్కరికీ ఫొటోలు తీయడం అలవాటుగా మారింది. -
పంచారామ క్షేత్రంలో రేపు వేద పరిషత్
సామర్లకోట: ఏటా నిర్వహిస్తున్న వేద పరిషత్ను మంగళవారం పంచారామ క్షేత్రం శ్రీబాలా త్రిపుర సుందరి సమేత కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్నట్లు పరిషత్ కన్వీనర్ గ్రంధి సత్యరామకృష్ణ తెలిపారు. ఆదివారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ పూర్వపు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలోని వేదపండితులచే 27వ వేద సభ నిర్వహించి వేదపండితులను సత్కరించనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా లోక కల్యాణార్థం హిందూ సంస్కృతి, సంప్రదాయానుసారంగా చతుర్వేద పారాయణ, వేద స్వస్తి జరుగుతుందని చెప్పారు. ఏలేరులో పెరిగిన నీటి నిల్వలుఏలేశ్వరం: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఏలేరు ప్రాజెక్టులో ఆదివారం నాటికి స్వల్పంగా నీటి నిల్వలు పెరిగాయి. ఎగువ ప్రాంతంలో వర్షాలు ఎక్కువగా ఉండడంతో నీటిప్రవాహం పెరిగింది. ఎగువ ప్రాంతం నుంచి 646 క్యూసెక్కులు, పురుషోత్తపట్నం నుంచి 1225 క్కూసెక్కుల నీరు చేరడంతో ప్రాజెక్టులో స్వల్పంగా నీటి నిల్వలు పెరిగాయి. ప్రస్తుతం ప్రాజెక్టులో రూ.86.56 మీటర్లకు 78.49 మీటర్లు, 24.11 టీఎంసీలకు 11.77 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. దీంతో ప్రాజెక్టు నుంచి ఆయకట్టు 400, విశాఖకు 200, తిమ్మరాజుచెరువుకు 20 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. లోవకు భక్తుల తాకిడి – రూ.4.33 లక్షల ఆదాయం తుని రూరల్: జోరువానలోను తలుపులమ్మ తల్లిని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో వచ్చిన 13 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్టు డిప్యూటీ కమిషనర్, ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తుండడంతో వంటలు, భోజనాలు చేసేందుకు భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. టార్పాలిన్ను కట్టుకుని వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు. పులిహోర, లడ్డూ ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,43,280, పూజా టికెట్లకు రూ.1,27,400, కేశఖండనశాలకు రూ.12,800, వాహన పూజలకు రూ.4350, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.96,216, విరాళాలు రూ.49,117 వెరసి మొత్తం రూ.4,33,163 ఆదాయం సమకూరినట్టు ఈఓ తెలిపారు. -
కాకినాడలో మిత్రా హార్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్
కాకినాడ రూరల్: అత్యాధునిక ఏఐ క్యాత్, ఏఐ పరికరాలతో 24/7 గుండె, ఇతర అత్యవసర సేవల సౌకర్యాలతో కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్లో మిత్రా హార్ట్ ఇన్స్టిట్యూట్ మల్టీస్పెషాలిటీ హాస్పటల్ జిల్లా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఓబుల్ రెడ్డి హార్ట్ కేర్ సెంటర్కు అనుబంధంగా డాక్టర్ ఓబుల్ రెడ్డి నూతనంగా ఈ ఆస్పత్రిని నెలకొల్పగా, ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి ఆదివారం ప్రారంభోత్సవం చేశారు. ఏఐ క్యాత్ ల్యాబ్ను ప్రముఖ వైద్యుడు డాక్టర్ డి.రాజశేఖర్ ప్రారంభించారు. ప్రపంచ స్థాయి అత్యాధునిక ఏఐ క్యాత్ ల్యాబ్ను ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో తొలిసారిగా తీసుకువచ్చామని వైద్యులు ఓబుల్ రెడ్డి, భార్గవి తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, మాజీ ఎంపీ వంగా గీత, పలువురు వైద్యులు పాల్గొన్నారు. -
తుపాన్ హెచ్చరికతో అప్రమత్తం
● నేడు పీజీఆర్ఎస్ రద్దు ● కలెక్టర్ షణ్మోహన్ కాకినాడ సిటీ: ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో కేంద్రీకృతమైన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నందున జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. ఈ అల్పపీడనం వచ్చే 24 గంటల్లో బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవదని హెచ్చరికలు జారీ చశారు. ప్రజలందరూ తమ ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలన్నారు. జిల్లాలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సోమవారం కాకినాడ కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)ను రద్దు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ కాకినాడ సిటీ/కాకినాడ రూరల్: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడడంతో కాకినాడ పోర్టులో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తీరం వెంబడి ఉన్న మత్స్యకారులు ఐదు రోజుల పాటు వేటకు వెళ్లొద్దని జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో టాంటాంల ద్వారా సమాచారాన్ని తెలియజేస్తున్నారు. అధికారులు మత్స్యకార గ్రామాల్లోనే ఉండాలని కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాలు జారీ చేశారు. సముద్రంలో ఉన్నవారు ఒడ్డుకు చేరాలి జిల్లాలో మత్స్యకారులు చాలా వరకు ఒడ్డుకు చేరుకున్నారని, ఇంకా సముద్రంలో ఉన్నవారిని ఒడ్డుకు చేరుకోవాలని సమాచారం ఇచ్చినట్టు మత్స్యశాఖ అధికారి కృష్ణారావు తెలిపారు. అరకొర పథకాలు మాత్రమే● వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నాగమణి కాకినాడ రూరల్: కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలంటూ గొప్పలు చెప్పుకుంటోందని వాస్తవానికి అరకొర పథకాలు మాత్రమే అమలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి పేర్కొన్నారు. పథకాల పేరుతో చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని, మహిళలకు రాష్ట్రంలో భద్రత లేకుండా పోయిందని ఆదివారం ఆమె మీడియా ద్వారా తెలియజేశారు. ఉచిత బస్సు, దీపం వంటి పథకాలు సంపద సృష్టించి ఇవ్వలేదని విద్యుత్ చార్టీల టారీఫ్లు పెంచి, ప్రజలపై ఆ భారం మోపి రూ.30 వేల కోట్లు వసూలు చేసి వాటితో అరకొరగా అమలు చేస్తున్నారన్నారు. ఉచిత బస్సులు నియోజకవర్గానికి ఒక్కటి కూడా లేదన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్రెడ్డి మహిళలకు పెద్ద పీట వేసి వారి ఆర్థిక పరిపుష్టికి భరోసా కల్పించాన్నారు. పంపాకు తగ్గని వరద ● వచ్చిన నీరు వచ్చినట్టే సముద్రంలోకి విడుదల ● 99 అడుగుల వద్ద నీటిమట్టం అన్నవరం: అన్నవరంలోని ‘పంపా’ రిజర్వాయర్ లోనికి ఆదివారం కూడా భారీగా వరద నీరు వస్తుండడంతో అధికారులు దాదాపు 1,200 క్యూసెక్కుల నీరు సముద్రానికి విడుదల చేశారు. ఫలితంగా నీటిమట్టం 99 అడుగల వద్ద స్థిరంగా ఉంది. పంపా రిజర్వాయర్ గరిష్ట నీటి నిల్వ 0.43 టిఎంసీ కాగా, ప్రస్తుతం 0.29 టీఎంసీ నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. నీటిమట్టం పెరిగితే మరంత నీటిని విడుదల చేస్తామని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. -
పండగ నుంచి దండగ వైపు..
● పేరుకే కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ● అమలుకు నోచుకోని ప్రభుత్వ పథకాలు ● ప్రభుత్వ నిర్లక్ష్యంతో నష్టపోతున్న వైనం ● రుణాల కోసం ఆశగా ఎదురుచూపులుబోట్క్లబ్ (కాకినాడ సిటీ): కూటమి ప్రభుత్వం హయాంలో తమకు తీరని అన్యాయం జరుగుతోందని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయం పండగగా సాగిన తమకు ఈ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం వల్ల తీవ్ర నష్టం జరుగుతోందని వారు అంటున్నారు. గ్రామ స్థాయిలో విత్తనం మొదలు విక్రయం వరకూ ప్రభుత్వ సేవలన్నీ రైతుల చెంతకే వచ్చేవి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వ్యవసాయాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారు. కౌలు రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు. ఖరీఫ్ సీజన్లో కౌలు రైతుల గుర్తింపు విషయంలో జాప్యం చోటుచేసుకోవడం వల్ల వారికి ఎరువులు, విత్తనాలు అందడం లేదు. మరోవైపు బ్యాంకుల నుంచి పెట్టుబడి రుణాలు సైతం అందడం లేదు. దీంతో ఈ ఏడాదికి కౌలు రైతులకు కూటమి ప్రభుత్వం మొండి చూపుతున్నట్టే అనుకోవాలి. ఖరీఫ్ సీజన్లో రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చారు కానీ అవి నిరుపయోగంగా మారాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వాటి ఆధారంగా బ్యాంకుల్లో రుణాలు ఇచ్చేవారు. కూటమి ప్రభుత్వం ఈ సీజన్ ముగిసినా ఒక్క కౌలు రైతుకు కూడా నయా పైసా రుణం ఇచ్చిన దాఖలాలు లేవు. ప్రస్తుతం రబీ సీజన్ మొదలై నెల రోజులు కావస్తున్నా ఇప్పటి వరకూ వారికి ఈ ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయం అందలేదు. దీంతో కౌలు రైతులు బయట వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. గుర్తింపు కార్డుతో సరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో 35 వేల మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు మంజూరు చేశారు. కానీ వారికి ప్రభుత్వం నుంచి ఒక్క పథకం కూడా దక్కలేదు. గత ఏడాది కౌలు రైతులకు పంట నష్ట పరిహారం కానీ, బ్యాంకులో రుణం కానీ ఇవ్వలేదు. దీంతో వారంతా గత ప్రభుత్వంలోనే తమకు ఎంతో మేలు జరిగిందని, ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆనాటి సేవలను గుర్తుచేసుకుంటున్నారు. అప్పుల పాలవుతున్న కౌలు రైతులు ప్రస్తుతం ఎకరా భూమి సాగు చేసుకోవాలంటే యజమానికి రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకూ కౌలు చెల్లించాలి. ఆ మొత్తం చెల్లించిన అనంతరమే కౌలు రైతులు సాగులోకి వెళతారు. విత్తనాల కొనుగోలు మొదలు, పంట దమ్ము, వరినాట్లు వేయడం, ఎరువులు, పురుగు మందులు ఇలా అన్నింటికీ మరో రూ.25 వేలు పైబడి పెట్టుబడి అవసరం ఉంటుంది. ఈ మేరకు ఒక ఎకరం భూమి కౌలు చేయాలంటే రూ. 50 వేలు అవసరం ఉంటుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కౌలు గుర్తింపు కార్డు ఉన్న ప్రతి రైతుకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ ఎటువంటి హామీ లేకుండా పంట రుణాలు ఇచ్చేవారు. ప్రస్తుతం గుర్తింపు కార్డులు ఇచ్చినప్పటి కీ ఎటువంటి రుణాలు ఇవ్వకపోవడంపై వారు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కౌలు రైతులు బయ ట వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పెట్టుకోవడంతో వచ్చిన పంట అంతా కౌలుకు, పెట్టుబడి రుణాలు, వాటికి వడ్డీలకే పోతోందని అంటున్నారు. అదే ప్రభుత్వం నుంచి బ్యాంకుల్లో రుణాలు ఇస్తే తక్కువ వడ్డీ కావడంతో తమకు ఆ మొత్తమైనా మిగిలేదని రైతులు అంటున్నారు.ఆదివారం శ్రీ 17 శ్రీ ఆగస్టు శ్రీ 2025భూములున్నవారంతా సాగుదారులనీ కాదు.. సాగుదారులందరూ భూస్వాములు కావాలనీ లేదు. ఆ ఇరువర్గాల బంధం అనాదిగా ఎంతో బలమైనదీ.. అదే క్రమంలో సున్నితమైనదీ. నమ్మకం ప్రాతిపదికన సాగే ఈ పవిత్ర బంధంలో నిజాయితీగా చెప్పాలంటే కష్టం కచ్చితంగా సాగుదారుదే. పంట దిగుబడి బాగుంటే లాభంలో వాటా తీసుకునే భూస్వామి.. నష్టపోతే మాత్రం కిమ్మనని పరిస్థితి. పైగా కచ్చితంగా కౌలు వసూలుచేస్తుంటారు. ఈ క్రమంలో కౌలు రైతుల కష్టాన్ని గుర్తించిన గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం భూస్వామికి ఏమాత్రం నష్టం కలగని రీతిలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చింది. వారికి సాగుహక్కు గుర్తింపు కార్డులు అందజేసి పెట్టుబడి సాయం.. ప్రకృతి సహకరించక పంట నష్టపోతే పరిహారం.. సాగులో మెళకువలు, విత్తనం నుంచి విక్రయం వరకు ఎన్నో ప్రయోజనాలు చేకూరేలా విధివిధానాలు రూపొందించింది. దీంతో ఆ ప్రభుత్వంలో ఐదేళ్లూ సాగును పండగలా చేసుకున్నారు. ఇంతలోనే ప్రభుత్వం మారింది. గతంలో వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు మళ్లీ గద్దెనెక్కారు. దీంతో మళ్లీ కౌలు రైతులకు పాతకష్టాలు మొదలయ్యాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలనే ఇస్తున్నట్టు కలరింగ్ ఇస్తూ వాటికి వెచ్చించాల్సిన నిధులు మాత్రం పైసా కూడా విదల్చడం లేదు. దీంతో కౌలు రైతులు ఏ పనులూ మొదలుపెట్టలేక.. రుణాల కోసం ప్రైవేటు వ్యక్తుల వద్ద చేతులు చాస్తూ నానా అగచాట్లు పడుతున్నారు.సంవత్సరం కౌలు ఇచ్చిన కార్డులు రుణాలు (రూ.కోట్లలో) 2020-21 36,795 18.73 2021-22 44,580 47.17 2022-23 41,322 46.46 2023-24 56,399 53.80ఎందుకూ ఉపయోగపడడంలేదు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చారు. వారందరికీ రైతులతో సమానంగా ప్రభుత్వ పథకాలు అందించి, పంట రుణాలు అందజేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పైబడినా ఇంత వరకూ తమకు ఇచ్చిందేమీ లేదు. నాయకుల హామీ కోసం ఎదురుచూడటమే కానీ వీసమెత్తు ప్రయోజనం కనబడటంలేదు. గుర్తింపు కార్డులు నాలుక గీసుకోవడానికి కూడా ఉపయోగపడటంలేదు. – మారెళ్ల వెంకటరమణ, కౌలురైతు, యండమూరు, కరప మండలం కౌలు రైతు మాటే లేదు కూటమి ప్రభుత్వం కౌలు రైతులను అసలు పట్టించుకోవడం లేదు. నాలుగేళ్లుగా 4 ఎకరాలు భూమిని కౌలుకు చేస్తున్నాను. ఇప్పటికీ కౌలు కార్డు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. కార్డు అడిగితే నేను కౌలుకు తీసుకున్న భూమి నీటి తీరువా వడ్డీతో చెల్లించాలని అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. – ఇంటి వెంకటరావు, కౌలు రైతు వీకే రాయపురం, సామర్లకోట మండలం కౌలు రైతులకు నాడు ఎంతో ‘భరోసా’ వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కౌలు రైతులకు అన్ని ప్రభుత్వ పథకాలు అమలు చేసేవారు. నిరుపేద కౌలు రైతులైన ఎస్సీ, బీసీలకు వైఎస్సార్ రైతు భరోసా కింద ఐదేళ్ల పాటు వారి ఖాతాల్లో నగదు జమ చేశారు. రైతులకు ఇచ్చినట్టే ప్రతి కౌలు రైతుకు ఏడాదికి రూ.13,500 వారి ఖాతాల్లో జమ చేశారు. వీటితో పాటు పంట నష్ట పరిహారం కూడా వారికి అందించేవారు. ప్రకృతి వైపరీత్యాలకు పంట దెబ్బ తింటే ఆ నష్ట పరిహారం సైతం అందే విధంగా నాటి పాలకులు చర్యలు తీసుకున్నారు. కానీ గత నెలలో కురిసిన వర్షాలకు భారీగా పంట నష్టం జరిగినా కౌలు రైతులకు ఎక్కడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కేవలం భూ సర్వే నెంబర్ల ఆధారంగా ఆయా రైతుల ఖాతాల్లో పంట నష్ట పరిహారం జమ కావడంతో భూ యజమానులు ఆ పరిహారాన్ని కౌలు రైతులకు ఇచ్చేందుకు ససేమిరా అన్నారు. పంట నష్టపోయినా ప్రతి ఎకరాకు రూ.10 వేలు చొప్పున ప్రభుత్వం జమ చేసింది కానీ కౌలు రైతులకు మొండి చెయ్యి చూపింది. దీంతో పంట నష్టపోయి, ఇచ్చిన కౌలు మొత్తం కూడా రాకపోవడంతో వారు తీవ్రంగా నష్టపోయారు. అయినప్పటికీ ఈ కూటమి ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదు. -
తొలి తిరుపతికి తండోపతండాలుగా..
శృంగార వల్లభుని ఆదాయం రూ.2.38 లక్షలు పెద్దాపురం: తొలి తిరుపతి స్వయంభూ శృంగార వల్ల భుని ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. ఆల య ఈఓ వడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందుల తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. అర్బకులు పెద్దింటి నారాయణాచార్యు లు, పురుషోత్తమాచార్యులు స్వామి వారిని పూలమాలలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ సేవల టిక్కెట్లు, అన్నదానం, కేశ ఖండన ద్వారా స్వామి వారికి రూ.2,38,048 ఆదాయం సమకూరినట్లు ఈఓ తెలిపారు. సుమా రు 15 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా 3,500 మంది భక్తులకు అన్నదానం ఏర్పాటు చేసినట్లు ఈఓ శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు, గ్రామ సర్పంచ్ మొయిళ్ల కృష్ణమూర్తి ఆలయ సిబ్బంది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఉద్యోగులకు అండగా ఏపీజీఈఏఅమలాపురం టౌన్: ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) ఎప్పుడూ అండగా ఉంటుందని జిల్లా శాఖ అధ్యక్షుడు మద్దాల బాపూజీ అన్నారు. అమలాపురంలోని ముక్తేశ్వరం రోడ్డులో తాలూకా శాఖ అధ్యక్షుడు కె.కామేశ్వరరావు అధ్యక్షతన ఏపీజీఈఏ వ్యవస్థాపక దినోత్సవాన్ని శనివారం ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా బాపూజీ మాట్లాడుతూ జిల్లాలోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏపీజీఈఏ చేస్తున్న కృషిని వివరించారు. ప్రభుత్వంచే గుర్తింపు పొందిన సంఘంగా ఏర్పడిన అనతి కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగుల సభ్యత్వం కలిగిన ఏకై క సంఘంగా సేవలు అందిస్తోందన్నారు. అనంతరం నాయకులు కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకొన్నారు. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని, పెండింగ్లో ఉన్న నాలుగు డీఏ బిల్లులు ఇవ్వాలని, ఉద్యోగులకు రూ.25 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని సమావేశం డిమాండ్ చేసింది. సంఘ జిల్లా కోశాధికారి జేఏ రాజ్కుమార్, నాయకులు లక్ష్మణ్కుమార్, సూర్యనారాయణ, రాజు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నేడు గుళ్లపల్లి ఘనపాఠికి రాజాలక్ష్మి పురస్కారం ప్రదానం రాజమహేంద్రవరం రూరల్: రాజమహేంద్రవరం శివారు కొంతమూరులోని దత్తాత్రేయ వేదవిద్య గురుకులం గౌరవాధ్యక్షుడు, ప్రధాన ఆచార్యుడు గుళ్లపల్లి సీతారామచంద్ర ఘనపాఠి మరో ప్రతిష్టాత్మక అవార్డు అందుకోనున్నారు. చైన్నెకి చెందిన రమణయ్య రాజా 1979 నుంచి వివిధ రంగాల్లో నిష్ణాతులకు రాజాలక్ష్మి అవార్డులను అందజేస్తున్నారు. ఈ మేరకు వేదవిద్య ప్రచారానికి గుళ్లపల్లి ఘనపాఠి చేస్తున్న కృషికి గుర్తింపుగా ఆదివారం ఉదయం 11.30 గంటలకు వేదవిద్య గురుకులం ప్రాంగణంలో ఈ అవార్డును అందజేయనున్నారు. సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు. సంస్థ రజతోత్సవ సందర్భంలో ఈ అవార్డును అందుకోవడం దత్తాత్రేయుని ఆశీస్సులుగా భావిస్తున్నానని సీతారామచంద్ర ఘనపాఠి తెలిపారు. గురుకులం కార్యవర్గం తరఫున భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు ఈ వివరాలు తెలిపారు. శ్రీఖండ్ కై లాష్ మహాదేవ్ యాత్ర బిక్కవోలు: మండలంలోని కొంకుదురు చెందిన నలుగురు యువకులు శ్రీఖండ్ కై లాష్ మహాదేవ్ యాత్ర పూర్తి చేసుకుని స్వగ్రామానికి వచ్చారు. పంచ కై లాసాలలో ఒకటిగా భావించే ఈ ప్రదేశం హిమాచల్ ప్రదేశ్లో సముద్ర మట్టానికి 18,570 అడుగుల ఎత్తులో ఉంది. పోతంశెట్టి మదన్రెడ్డి ఆధ్వర్యంలో చిన్నం వెంకటరెడ్డి, మల్లిడి సురేంద్రరెడ్డి, కర్రి ఉమామహేశ్వరరెడ్డి, పడాల వెంకటరెడ్డి ఈ యాత్రను చేసి 72 అడుగుల పర్వత లింగాన్ని దర్శించుకున్నారు. -
విద్యుత్ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించండి
ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు అమలాపురం టౌన్: ఇళ్లకు విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించే విధానాన్ని వ్యతిరేకించాలని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు పిలుపునిచ్చారు. అలా తిరుగుబాటు చేసిన ప్రజలకు వైఎస్సార్ సీపీ అండగా నిలుస్తుందని చెప్పారు. అమలాపురం హైస్కూల్ సెంటర్లోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడారు. స్మార్ట్ మీటర్లతో విద్యుత్ వినియోగదారులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చాక అమాంతంగా పెరిగిన విద్యుత్ బిల్లులకు తోడు స్మార్ట్ మీటర్లతో మరింత భారం పడుతుందన్నారు. వినియోగదారుడి అనుమతి లేకుండా స్మార్ట్ మీటర్లు బిగించకూడదని సంబంధిత కంపెనీలు ప్రభుత్వానికి ఇచ్చిన నిబంధనల్లో స్పష్టంగా ఉందని గుర్తు చేశారు. అయినప్పటికీ ఆ నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి విద్యుత్ శాఖ అధికారులు బలవంతంగా ఆదాని స్మార్ట్ మీటర్లను బిగిస్తున్నారని ఆరోపించారు. తక్కువ వాడే విద్యుత్ వినియోగదారుడికి గతంలో రూ.వందల్లో బిల్లు వస్తే ఈ స్మార్ట్ మీటర్లు బిగించాక రూ.వేలల్లో వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. గతంలో విద్యుత్ బిల్లులు పెంచి కొన్ని పార్టీలు పతనానికి గురయ్యాయని ఎమ్మెల్సీ గుర్తు చేశారు. నేడు అలాంటి పరిస్థితిని కూటమి ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ స్మార్ట్ మోసాలపై త్వరలోనే వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన సమావేశాలు, డోర్ టూ డోర్ కాంపెయిన్ వంటి కార్యక్రమాలు చేపట్టనున్నామని ఎమ్మెల్సీ స్పష్టం చేశారు. ఓటు హక్కును హరించిన ‘కూటమి’ కడప జిల్లా పులివెందల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం పోలీసు తుపాకీలతో ఓటు హరించేలా చేసిందని ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు అన్నారు. ఓటు హక్కును లేకుండా చేయడం అంటే ప్రజాస్వామానికి తూట్లు పొడిచినట్లేనని చెప్పారు. ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్య ద్రోహమేనన్నారు. వైఎస్సార్ సీపీ ఏజెంట్లే లేకుండా, ఓటర్లకు ఓటును వినియోగించుకునే అవకాశమే ఇవ్వకుండా గెలిచిన గెలుపు అసలు గెలుపే కాదని తెలిపారు. కూటమి ప్రభుత్వ తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, ఉమ్మడి జిల్లా పార్టీ లీగల్ సెల్ మాజీ అధ్యక్షుడు కుడుపూడి త్రినాథ్, నాయకులు ముంగర ప్రసాద్, దండుమేను రూపేష్, కుడుపూడి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
పంపాకు భారీగా వరద నీరు
● వంద అడుగులకు చేరిన నీటిమట్టం ● ముందు జాగ్రత్తగా 500 క్యూసెక్కుల విడుదల అన్నవరం: నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో స్థానిక ‘పంపా’ రిజర్వాయర్ నీటిమట్టం శనివారానికి వంద అడుగులకు చేరుకుంది. పంపా గరిష్ట నీటిమట్టం 103 అడుగులు. పంపా క్యాచ్మెంట్ ఏరియా శంఖవరం, రౌతులపూడి మండలాల్లోని ఏజెన్సీ గ్రామాలలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల రిజర్వాయర్లోకి 500 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ముందు జాగ్రత్తగా బ్యారేజీ నాలుగో నెంబర్ గేటు ఎత్తి 500 క్యూసెక్కుల నీరు సముద్రానికి విడుదల చేస్తున్నారు. పంపా ఆయకట్టుకు 80 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సబ్సిడరీ డ్యామ్ ద్వారా 20 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పంపా రిజర్వాయర్ ఘరిష్ట నీటి నిల్వ 0.43 టిఎంసీ కాగా, ప్రస్తుతం 0.30 టిఎంసీ నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. నిల్వ ఉంచే పరిస్థితి లేదు పంపా బ్యారేజీ గేట్లు బలహీనంగా ఉండడంతో రిజర్వాయర్లో నీటిని 99 అడుగులకు మించి నిల్వచేసే పరిస్థితి లేదు. అంతకన్నా ఎక్కువ నీటిని నిల్వచేస్తే గేట్ల నిర్వహణ కష్టంగా ఉంటుందని, ఒకవేళ జరగరానిది జరిగి గేట్లు కొట్టుకుపోతే దిగువన పొలాలు, గ్రామాలు మునిగిపోయే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. నీటిమట్టం పెరిగితే మరింత విడుదల : ఈఈ శేషగిరిరావు పంపా రిజర్వాయర్ పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నాం. 99 అడుగులపైకి వచ్చిన నీటిని సముద్రానికి విడుదల చేస్తాం. ప్రస్తుతం వంద అడుగుల నీటిమట్టం ఉంది. ఆదివారం ఉదయానికి 99 అడుగులకు చేరే అవకాశం ఉంది. తొండంగి, శంఖవరం మండలాల తహసీల్దార్లకు పరిస్థితి వివరించాము. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. -
రత్నగిరిపై కృష్ణాష్టమి వేడుక
సప్తగోకులంలో నల్లనయ్యకు ప్రత్యేక పూజలు అన్నవరం: రత్నగిరి వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఉదయం స్వామివారి సన్నిధిలో గోపూజోత్సవం, రాత్రి ఉట్ల ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం తొమ్మిది గంటలకు రామరాయ కళావేదికపై సత్యదేవుడు అమ్మవారిని ప్రతిష్టించి పూజలు చేసిన అనంతరం గోపూజోత్సవం నిర్వహించారు. అనంతరం గోవులకు బెల్లం, బియ్యం తినిపించారు. తరువాత భక్తులకు తీర్ధప్రసాదాలు పంపిణీ చేశారు. ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవస్థానం వేదపండితులు గొల్లపల్లి ఘనపాఠి, గంగబాబు, యనమండ్ర ఘనపాఠీ, శివ ఘనాపాఠి, ప్రధానార్చకులు కోట సుబ్రహ్మణ్యశర్మ, అర్చకుడు దత్తాత్రేయశర్మ, స్పెషల్గ్రేడ్ వ్రతపురోహితుడు చామర్తి కన్నబాబు తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాత్రి ఏడు గంటలకు సత్యదేవుడు అమ్మవార్లను ఊరేగింపుగా రామాలయం వద్దకు తీసుకువచ్చి ప్రత్యేక పూజల అనంతరం ఉట్లోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీగోకులానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సప్తగోవులకు ప్రదక్షిణ చేసి శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా శ్రీకృష్ణుడికి అర్చకుడు కంచిభట్ల వరదయ్య, పరిచారకుల పూజలు చేశారు. గోకులాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. వరుస సెలవులతో భక్తజన సంద్రం వరుస సెలవులతో రత్నగిరి భక్తులతో పోటెత్తింది. స్వాతంత్య్ర దినోత్సవం, కృష్ణాష్టమి, శని, ఆదివారాలు కలసిరావడంతో రత్నగిరి భక్తజన సంద్రమైంది. శనివారం 50 వేల మంది స్వామివారిని దర్శించారు. దీంతో ఆలయ ప్రాంగణం, క్యూ లైన్లు, వ్రత మండపాలు కిటకిటలాడాయి. స్వామివారి వ్రతాలు నాలుగు వేలు జరిగాయని, స్వామివారి దర్శనానికి రెండు గంటలు, రూ.200 టిక్కెట్తో ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టిందని అధికారులు తెలిపారు. అన్ని విభాగాల ద్వారా రూ.50 లక్షల ఆదాయం వచ్చిందని, నిత్యాన్నదాన పథకంలో ఐదు వేల మంది అన్నప్రసాదాన్ని స్వీకరించినట్టు వారు తెలిపారు. కాగా వర్షం వల్ల స్వామివారి ప్రాకార సేవ గోపురం లోపలే నిర్వహించారు. -
రత్నగిరికి అరబిందో బస్సు
పూజలు చేసి ప్రారంభించిన ఆలయ వర్గాలు అన్నవరం: రత్నగిరి శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి అరబిందో ఫార్మాస్యూటికల్స్ రూ.32 లక్షలు విలువ చేసే బస్సును శుక్రవారం అందచేసింది. డీజిల్తో నడిచే ఈ బస్సులో 44 మంది భక్తులు ప్రయాణించవచ్చునని అధికారులు తెలిపారు. దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు ఈ బస్సుకు లాంఛనంగా పూజలు చేసి ప్రారంభించారు. వన దుర్గమ్మకు చండీహోమం అన్నవరం: రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మకు శుక్రవారం చండీ హోమం ఘనంగా ఘనంగా నిర్వహించారు. అలాగే ప్రధానాలయంలోని సత్యదేవుని దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి, కొండదిగువన తొలి పావంచా వద్ద కొలువైన కనకదుర్గ అమ్మవారికి పండితులు కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం తొమ్మిది గంటలకు పండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన చండీహోమం ప్రారంభించారు. అనంతరం 11 గంటలకు పూర్ణాహుతి నిర్వహించారు. తరువాత అమ్మవార్లకు వేద పండితులు వేదాశీస్సులు, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి ప్రసాదాలు నివేదించారు. అమ్మవారికి నిర్వహించిన హోమంలో 42 మంది భక్తులు పాల్గొన్నారు. సత్యదేవుని ప్రధాన ఆలయంలో దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో, కనకదుర్గ అమ్మవారికి పరిచారకుడు ప్రసాద్ ఆధ్వర్యంలో పండితులు కుంకుమ పూజలు నిర్వహించి నీరాజనమంత్రపుష్పాలు సమర్పించారు. అనంతరం ప్రసాదాలు నివేదించి భక్తులకు పంపిణీ చేశారు. సీ్త్ర శక్తి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలిబోట్క్లబ్ (కాకినాడ సిటీ): సీ్త్ర శక్తి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ షణ్మోహన్ అన్నారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్లో ఆయన ఎంపీలు సానా సతీష్ బాబు, తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పంతం నానాజీలతో కలసి జెండా ఊపి మహిళల ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించారు. జిల్లాలో ఈ పథకానికి 177 బస్సులను కేటాయించినట్టు తెలిపారు. బడుగు వర్గాలపై ‘కూటమి’ కక్ష సాధింపు ముమ్మిడివరం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి బడుగు వర్గాలపై కక్ష సాధింపు చేస్తుందని వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి కాశి రామకృష్ణ ఆరోపించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ 20 ఏళ్ల నుంచి పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులను తొలగించారని, వాటిలో వితంతువులు కూడా ఉన్నారన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క పింఛను కూడా ఇవ్వకుండానే ఉన్నవాటిని తొలగించడం దారుణమన్నారు. విద్యుత్ బిల్లులు, ఇతర కారణాలతో అర్హులకు తల్లికి వందనం ఇవ్వకుండా మోసం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలకు దూరం చేసిందని అన్నారు. -
జిల్లా స్థాయి పురస్కార గ్రహీతలు
జిల్లా వ్యాప్తంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న జిల్లా స్థాయి అధికారులు స్వాతంత్య్ర దినోత్సవ పురస్కారాలు పొందారు. వారిలో ఏ.శ్రీనివాసరావు (ఈడీ బీసీ కార్పొరేషన్), కె.శ్రీరమణి (ఆర్డీవో పెద్దాపురం), ఎస్.మల్లిబాబు (ఆర్డీవో, కాకినాడ), ఎన్వీవీ సత్యనారాయణ (జిల్లా హెడ్ హౌసింగ్), ఎన్.శ్రీధర్ (అడ్మినిస్ట్రేటర్, జీజీహెచ్), డాక్టర్ ఆలి (జిల్లా ఆయుష్ అధికారి), కె.పెద్దిరాజు (జిల్లా హేండ్లూమ్స్, టెక్స్టైల్స్ అధికారి), బి.శ్రీనివాసరావు (జిల్లా క్రీడాభివృద్ధి అధికారి), జి.ప్రసాద్ (ఎస్ఈ, ఏపీ ఈపీడీసీఎల్), గణపతి (జిల్లా పరిశ్రమల అధికారి), సీహెచ్ఎస్వీ ప్రసాద్ (లీడ్ బ్యాంక్ మేనేజర్), వి.రవికుమార్ (జిల్లా పంచాయతీ అధికారి), శ్రీనివాస్(ఎస్ఈ, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్) ఎంవీఎస్ శంకర్రావు (ఈఈ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు), ఎం.శ్రీనివాసరావు (జిల్లా పబ్లిక్ ట్రాన్స్పోర్టు అధికారి), జేఎన్యూ లక్ష్మి (జిల్లా రిజిస్ట్రారు), జి.క్రాంతి (ఎస్ఈ, ఆర్అండ్బీ), పి.రమేష్ (జిల్లా విద్యాశాఖ అధికారి), శేషగిరి (ఈఈ, ఆరవ డివిజన్, పెద్దాపురం), కె.శ్రీనివాస్ (మేనేజర్, డీసీఎంఎస్) ఉన్నారు. జిల్లా రిజిస్ట్రార్ జయలక్ష్మిపరిశ్రమలశాఖ జీఎం సీహెచ్ గణపతిఅసిస్టెంట్ రిజిస్ట్రార్ శ్రీరంగనాయకులులీడ్ బ్యాంక్ మేనేజర్ సీహెచ్ ఎస్వీ ప్రసాద్జీజీహెచ్ అడ్మినిస్ట్రేటర్ శ్రీధర్పంచాయతీరాజ్ ఎస్ఈ శ్రీనివాస్ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు గంటా ప్రసాద్ -
ఆకట్టుకున్న శకటాలు
జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 8 శకటాలు ఆయా విభాగాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రగతిని ప్రతిబింబించాయి. తొలుత దేవదాయశాఖ ఆధ్వర్యంలో అన్నవరం వీర వేంకట సత్యనారాయణ స్వామి ఆలయ శకటాన్ని ప్రదర్శించగా ఆలయ అర్చకులు, వేద పండితులు ఉప ముఖ్యమంత్రికి వేదాశీర్వచనాలు అందజేశారు. అనంతరం వరుసగా సీ్త్ర శక్తి పథకం ప్రజా రవాణా శాఖ, విద్యా శాఖ తల్లికి వందనం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం తదితర శకటాలను ప్రదర్శించారు. వాటిలో జిల్లా విద్యాశాఖ శకటం ప్రథమ బహుమతిని దక్కించుకోగా, జీరో పావర్టీ పీ4 ద్వితీయ, పిఠాపురం ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (పాడా) శకటం తృతీయ బహుమతిని దక్కించుకున్నాయి. -
ఉచిత బస్సు పథకంపై ఆటో కార్మికుల నిరసన
అమలాపురం టౌన్: కూటమి ప్రభుత్వం ప్రారంభించిన స్త్రీ శక్తి పథకాన్ని, మహిళల ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యాలను వ్యతిరేకిస్తూ ఆంధ్ర ఆటోవాలా జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి సత్తిరాజు ఆధ్వర్యంలో అమలాపురంలో పలుచోట్ల శుక్రవారం ఆందోళనలు చేపట్టారు. ఈ పథకంతో ఆటో డ్రైవర్లు జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడతారని సత్తిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. అమలాపురం ఈదరపల్లి వంతెన, ఆర్టీసీ కాంప్లెక్స్, కలశం, హైస్కూల్ సెంటర్ల వద్ద ఆయా ఆటో యూనియన్లు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. జిల్లా అధ్యక్షుడు సత్తిరాజు మాట్లాడుతూ కూటమి పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టో సమయంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నప్పటికీ, ఆటో డ్రైవర్ల జీవన విధానానికి ఏ విధమైన భంగం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను చూపిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. ఇప్పుడు ఆటోడ్రైవర్ల కష్ట నష్టాలను పట్టించుకోకుండా స్త్రీ శక్తి పథకం పేరుతో ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించి తమ బతుకులను గాలికొదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఆటో యూనియన్ రాష్ట్ర నాయకులతో కలసి భవిష్యత్తు ప్రణాళికను రూపొందించి, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతామని సత్తిరాజు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం మాట తప్పిన తీరుపై ఆందోళన చేస్తామని జిల్లా సంఘ ప్రధాన కార్యదర్శి ఊటాల వెంకటేష్ అన్నారు. జిల్లా ఆటో వాలా యూనియన్ వ్యవస్థాపకుడు కె.సత్తిబాబు మాట్లాడుతూ గతంలో రాష్ట్ర కార్మిక మంత్రి ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకున్న 10 డిమాండ్లతో పాటు ఆటో సంక్షేమ బోర్డులు తక్షణమే ఏర్పాటు చేయాలన్నారు. -
శ్రీదేవీ శరణు శరణు
అమలాపురం టౌన్: అమలాపురం శ్రీదేవి మార్కెట్లోని శ్రీదేవి ఆలయంలో గాజుల గౌరీదేవీగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని సుమారు 50 వేల గాజులతో అలంకరించారు. వేలాది మంది మహిళలు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.అలాగే ఆలయాన్ని గాజుల దండలతో ముస్తాబు చేశారు. తెల్లవారు జాము నుంచి రాత్రి వరకూ ఆలయం భక్తులతో పోటెత్తింది. రాత్రి గాజులను భక్తులకు పంచిపెట్టారు. ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ గంగాబత్తుల రాంబాబు, కమిటీ ప్రతినిధులు, మాజీ కౌన్సిలర్లు మామిడిపల్లి రాము, ఆశెట్టి ఆదిబాబు తదితరులు సేవలు అందించారు. -
పారిశుధ్య కార్మికులకు సర్పంచ్ సత్కారం
కాకినాడ రూరల్: గ్రామం పరిశుభ్రంగా ఉంటే గ్రామస్తులు ఆరోగ్యంగా ఉంటారని నమ్మే తిమ్మాపురం పంచాయతీ సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఎప్పటిలాగే గ్రామంలోని పారిశుధ్య కార్మికుల కాళ్లు కడిగి సత్కరించారు. 2002లో మొదటిసారి సర్పంచ్గా ఎన్నికై న నాటి నుంచి ఈ కార్యక్రమాన్ని ఆయన కొనసాగిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం తిమ్మాపురం పంచాయతీ వద్ద జాతీయ జెండా ఎగరవేసి గౌరవ వందనం సమర్పించి అనంతరం కార్మికులకు శాలువా, పూలమాల వేసి సత్కరించారు. వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడైన సత్యనారాయణ చేస్తున్న ఈ కార్యక్రమాన్ని పలువురు అభినందించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రామన్న చౌదరి, సిబ్బంది పాల్గొన్నారు.ప్రజారోగ్యమే లక్ష్యంగా 15 ఏళ్లుగా నిర్వహణ -
స్వాతంత్య్ర దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి
జాతీయ పతాకానికి వందనం చేస్తున్న ఎస్పీ ● కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహణకు సర్వం సిద్ధం ● ముఖ్య అతిథిగా హాజరుకానున్న డిప్యూటీ సీఎం కాకినాడ క్రైం: 79వ స్వాతంత్య్ర దినోత్సవానికి స్థానిక జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాట్లు పూర్తిచేశారు. శుక్రవారం జరగనున్న ఈ వేడుకలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. కలెక్టర్ సగిలి షన్మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో ఉదయం 9 గంటలకు జాతీయ జెండా ఆవిష్కరణ, 9.05 గంటలకు ఉప ముఖ్యమంత్రి గౌరవ వందనం స్వీకరిస్తారు. 9.15 గంటలకు ప్రజలకు ఆయన సందేశం ఇస్తారు. 9.30కి పోలీసు కవాతు నిర్వహిస్తారు. 10 గంటలకు ప్రగతి శకటాల ప్రదర్శన, 11 గంటలకు ప్రశంసాపత్రాలు ప్రదానం చేస్తారు. ఏర్పాట్లలో భాగంగా జిల్లా ఎస్పీ బిందుమాధవ్ కవాతును పరిశీలించారు. -
ప్రాణం తీసిన చెట్టు
● ఉద్యోగానికి వెళుతుండగా కూలిన వృక్షం ● దుళ్ల యువకుడి మృతి కడియం: చెట్టు కూలి మీద పడడంతో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడానికి వెళుతున్న యువకుడు మృతి చెందాడు. పాయకరావుపేట మండలం రాంభద్రపురం – శ్రీరాంపురం మధ్య ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన తొట్టా శ్రీనివాస్ (31) అనకాపల్లి జిల్లా కేశవరం డెక్కన్ కెమికల్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నాడు. రోజూ మాదిరిగానే గురువారం తన క్వార్టర్స్ నుంచి స్నేహితుడితో కలిసి ఫ్యాక్టరీకి వెళుతున్నాడు. రాంభద్రపురం–శ్రీరాంపురం మధ్యకు వచ్చేసరికి ఓ భారీ వృక్షం కూలి వీరు వెళుతున్న మోటారు సైకిల్పై పడింది. దీంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందగా, స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. చెట్టు కింద ఉన్న శ్రీనివాస్ మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టానికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులకు ఒక్కడే సంతానం శ్రీనివాస్కు రెండేళ్ల క్రితమే వివాహమైంది. పెళ్లయిన తర్వాత ఆరు నెలలకు అనకాపల్లి జిల్లా కేశవరంలోని డెక్కన్ ఫ్యాక్టరీలో ఉద్యోగం వచ్చింది. దీంతో తునిలోని బ్యాంక్ కాలనీలో భార్యతో సహా నివాసం ఉంటున్నాడు. శ్రీనివాస్ తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. అతడి హఠాన్మరణంతో వారంతా తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. కాగా.. దుళ్లలో మృతుడి కుటుంబాన్ని పలువురు పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేవస్థానం ఆస్పత్రి వైద్యాధికారిగా హరికృష్ణ అన్నవరం: స్థానిక దేవస్థానం ఆస్పత్రి వైద్యాధికారిగా డాక్టర్ అల్లు హరికృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇప్పటి వరకు తుని అర్బన్ పీహెచ్సీలో పనిచేశారు. అక్కడ రాజీనామా చేసి అన్నవరంలో చేరారు. డాక్టర్ హరికృష్ణ అనస్థీషియాలో ఎండీ కూడా చేశారు. గతంలో దేవస్థానం ఆస్పత్రి వైద్యాధికారిగా పనిచేసిన శ్రీకాంత్ గత నెల 12న రౌతులపూడి ఆస్పత్రి డాక్టర్గా నియమితులవ్వడంతో ఈ పోస్టు అప్పటి నుంచి ఖాళీగా ఉంది. గత నెల 31న స్మార్త ఆగమ పాఠశాల విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలో దేవస్థానం ఆస్పత్రిలో వైద్యాధికారి లేక సకాలంలో వైద్యం లభించలేదు. వారి పరిస్థితి విషమించడంతో తుని ప్రభుత్వాస్పత్రికి పంపాల్సి వచ్చింది. ‘సాక్షి’ చొరవతో.. ఈ సమస్యపై ఆగస్టు ఏడున సాక్షి దినపత్రికలో ‘వైద్యం... పూజ్యం ’ శీర్షికన వార్త ప్రచురితమైంది. దానిపై స్పందించిన కమిషనర్ రామచంద్ర మోహన్ వెంటనే వైద్యుడిని నియమించేందుకు చర్యలు తీసుకోవాలని దేవస్థానం అధికారులను ఆదేశించారు. దీంతో డాక్టర్ హరికృష్ణను నియమించారు. ఆయన గురువారం దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావును మర్యాదపూర్వకంగా కలిశారు. -
కొబ్బరి చెక్క.. సిరులు పక్కా..
● రత్నగిరిపై వేలం పాట ● నెలకు రూ.19.05 లక్షలకు ఖరారు ● సత్యదేవునికి రికార్డు స్థాయిలో ఆదాయం అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానంలో కొబ్బరి ముక్కల వేలం రికార్డు ధరకు ఖరారైంది. గతంలో నెలకు రూ.7.26 లక్షలు ఉన్న వేలం ఈ సారి రూ.19.05 లక్షలు వెళ్లింది. అంటే దాదాపు మూడురెట్లు పెరిగి సత్యదేవునికి సిరులు కురిపించింది. అన్నవరం దేవస్థానం చరిత్రలో ఒక వేలం ఇంత ఎక్కువ మొత్తానికి వెళ్లడం ఇదే ప్రథమం. రెండేళ్ల కాలపరిమితికి గాను గురువారం ఈ వేలం జరిగింది. దేవస్థానంలో వ్రతాలాచరించే భక్తుల నుంచి సేకరించే కొబ్బరి చెక్కలతో పాటు రావిచెట్టు వద్ద, వివిధ ఆలయాల్లో భక్తులు కొట్టే కొబ్బరి చెక్కలను పోగుచేసుకునేందుకు గతంలో విడివిడిగా వేలం నిర్వహించేవారు. అయితే దేవదాయశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఆ రెండింటికీ కలిపి గురువారం ఒకే వేలం జరిపారు. ఈ కార్యక్రమంలో నలుగురు పాటదారులు పాల్గొన్నారు. గతంలో రెండు వేలం పాటల్లో నెలకు రూ.7.26 లక్షలు ఆదాయం వచ్చింది. గురువారం జరిగిన వేలంపాటలో రికార్డు స్థాయిలో రూ.19.05 లక్షలకు వెళ్లింది. దీంతో దేవస్థానానికి తొలి ఏడాది రూ.2.28 కోట్లు, రెండో ఏడాది పది శాతం పెరుగుదలతో సుమారు రూ. 2.51 కోట్లు ఆదాయం రానుంది. అంటే రెండేళ్లకు రూ.4.80 కోట్లు ఆదాయం సమకూరనుంది. అలాగే బుకింగ్ ఆఫీసు ఎదురుగా గల షాపింగ్ కాంప్లెక్స్లోని మూడో నంబర్ షాపులో కొబ్బరి కాయలు, అరటిపండ్లు విక్రయించేందుకు గాను గతంలో నెలకు రూ.2.33 లక్షలు ఉండగా ఇప్పుడు ఆ వేలం పాట నెలకు రూ.3.78 లక్షలకు వెళ్లింది. ప్రకాష్ సదన్ సత్రం వెనుక మినీ క్యాంటీన్ వేలం నెలకు రూ.2.82 లక్షలకు వేలం ఖరారైంది. దేవస్థానం ఈఈ నూకరత్నం, ఏఈఓ ఎల్ శ్రీనివాస్, సీ సెక్షన్ సూపరింటెండెంట్ వెంకట రమణ తదితరులు వేలం నిర్వహించారు. -
రత్నగిరి కిటకిట
● స్వామివారిని దర్శించిన 40 వేల మంది భక్తులు ● 2,500 వ్రతాల నిర్వహణ అన్నవరం: రత్నగిరి సత్యదేవుని ఆలయం గురువారం వేలాదిగా తరలివచ్చిన భక్తులతో కిటకిట లాడింది. రత్నగిరిపై బుధవారం రాత్రి, గురువారం తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. వివాహాలు చేసుకున్న నవ దంపతులు వారి బంధువులు సత్యదేవుని వ్రతాలు ఆచరించి స్వామివారిని దర్శించారు. పెళ్లిబృందాలు తమ వాహనాలను ఘాట్రోడ్డుకు ఇరువైపులా నిలిపివేయడంతో ఉదయం పది గంటల వరకు ఘాట్రోడ్లలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. సత్యదేవుడిని దర్శించిన అనంతరం భక్తులు శ్రీగోకులంలో సప్త గోవులకు ప్రదక్షిణ చేసి శ్రీకృష్ణుడిని దర్శించారు. తరువాత రావిచెట్టుకు ప్రదక్షిణ చేసి జ్యోతులు వెలిగించారు. కాగా, గురువారం స్వామివారి వ్రతాలు 2,500 నిర్వహించారు. సుమారు 40 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించారు. సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో ఐదు వేల మంది అన్న ప్రసాదం స్వీకరించారు. నిజరూప దర్శనంతో పులకించిన భక్తులు కాగా, గురువారం సందర్భంగా సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి, శంకరుల నిజరూప దర్శనంతో భక్తులు పులకించారు. ప్రతి సోమవారం ముత్యాల కవచాలతో, గురువారం ఏ విధమైన అలంకరణ లేకుండా నిజరూప దర్శనంతో అలంకరిస్తున్న విషయం తెలిసిందే. నేడు బీఎస్ఎన్ఎల్ మేళాలు, రోడ్షోలు ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం పలు ప్రాంతాలలో మేళాలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నామని బీఎస్ఎన్ఎల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పలివెల రాజు ఓ ప్రకటనలో తెలిపారు. కేవలం ఒక్క రూపాయికే ఒక సిమ్ కార్డ్ అందిస్తున్నామని, దానితో 30 రోజుల పాటు రోజుకు 2 జీబీ డేటా, అపరిమిత కాల్స్ బిఎస్ఎన్ఎల్ అందిస్తుందన్నారు. అందరూ ఈ ఆఫర్ను వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఆక్వా చెరువుల్లో నమూనాల సేకరణ రామచంద్రపురం రూరల్: ఆక్వా సాగులో ప్రభలుతున్న వ్యాధుల పర్యవేక్షణ, నివారణకు నేషనల్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ ఫర్ ఆక్వాటిక్ యానిమల్ డిసీజ్–ఫేజ్ 2 ప్రాజెక్టులో భాగంగా ఆక్వా రైతులకు సహాయ సహకారాలు అందించనున్నట్లు ఫిషరీస్ అసిస్టెంట్ డైరెక్టర్ కె.శ్రావణి తెలిపారు. తాటిపల్లి, చోడవరం గ్రామాల్లోని ఆక్వా చెరువుల నుంచి వ్యాధి నిర్ధారణకు గురువారం నమూనాలు సేకరించారు. ఆ శాఖ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్.అంజలి ఆదేశాల మేరకు ఎన్ఎస్పీఏఏడీ బృందం సభ్యులు శివరామకృష్ణ, డి.వంశీ, వి.కృష్ణకిశోర్ పాల్గొన్నారు. 17న అరటి మార్కెట్కు సెలవు అంబాజీపేట: స్థానిక మార్కెట్ యార్డులో నిర్వహిస్తున్న అరటి మార్కెట్ ఈ నెల 17వ తేదీన సెలవు ప్రకటించినట్టు మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఐ.రమేష్ తెలిపారు. ఇటీవల నూతనంగా నియమితులైన మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమణ స్వీకారం సందర్భంగా అరటి మార్కెట్ సెలవు ఇచ్చినట్టు తెలిపారు. రైతులు సహకరించాలని కార్యదర్శి కోరారు. -
18 నుంచి జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులకు శిక్షణ
సామర్లకోట: స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో ఈ నెల 18 నుంచి మండల పరిషత్తు, జిల్లా పరిషత్తులలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని ఆ కేంద్రం ప్రిన్సిపాల్ కేఎన్వీ ప్రసాదరావు తెలిపా రు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చే శారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతిపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలోని 240 మందికి బ్యాచ్ల వారీగా శిక్షణ ఉంటుందన్నారు. 18 నుంచి ప్రారంభమయ్యే బ్యాచ్కు 60 మంది హాజరవుతారని, ఆయా కార్యాలయాల్లో కొత్తగా నియమితులైన వారికి ఈ శిక్షణ ఉంటుందన్నారు. వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో వారి విధులు, బాధ్యతలు, ఫైళ్ల నిర్వహణ, ప్రభుత్వ పథకాలు వంటి అంశాలను నిపుణులు వివరిస్తారన్నారు. జాతీయ హాకీ పోటీలకు ఉప్పాడ క్రీడాకారులు కొత్తపల్లి: పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్లో జరిగే 15వ హాకీ ఇండియా జూనియర్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనే మన రాష్ట్ర జట్టుకు ఉప్పాడకు చెందిన ఇద్దరు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని స్థానిక జిల్లా పరిషత్ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు, హాకీ కోచ్ రవిరాజ్ గురువారం తెలిపారు. ధర్మవరంలో ఏప్రిల్లో జరిగిన రాష్ట్ర జూనియర్ హాకీ చాంపియన్ షిప్ పోటీల్లో ఉప్పాడకు చెందిన చొక్కా డేవిడ్, మేరుగు హెబెల్ ప్రతిభ కనబరిచి, చాంపియన్ షిప్కు సాధించడంలో కీలకపాత్ర పోషించారన్నారు. ఈ క్రీడాకారులు స్కూల్ గేమ్ అండర్– 19 జాతీయ పోటీల్లో కూడా పాల్గొన్నారన్నారు. కాగా.. జాతీయ జూనియర్ హాకీ పోటీలు శుక్రవారం నుంచి జలంధర్లో ప్రారంభమవుతాయని, శనివారం జరిగే పోటీల్లో ఈ క్రీడాకారులు పాల్గొంటారన్నారు. -
వేడుకల వేళ విషాదం
తాళ్లరేవు: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దుస్తులు కొనుగోలు చేసేందుకు నాలుగేళ్ల కుమారుడితో కలిసి వెళ్లిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కాజులూరు మండలం శీల్లంక గ్రామానికి చెందిన జల్లి బాలకృష్ణ (33) అలియాస్ బాలాజీ కోరంగి పోలీస్ స్టేషన్ సమీపంలో నూడుల్స్ వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. జెండా పండగ కోసం తన కుమారుడు చాణక్యకు కొత్త దుస్తులు కొనేందుకు గురువారం ఆ బాలుడిని తీసుకుని యానాం బయలుదేరాడు. వారిని యానాం బైపాస్లో మంగళ ఎంటర్ప్రైజెస్ వద్ద మినీ వ్యాన్ వేగంగా ఢీకొని వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో బాలాజీ అక్కడికక్కడే మృతి చెందగా, చాణక్యకు స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన బాలుడిని యానాం ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. ప్రమాదాన్ని పసిగట్టిన బాలాజీ తన కుమారుడిని గుండెలకు హత్తుకుని పట్టుకోవడంతో ఆ బాలుడు ప్రమాదం నుంచి బయటపడినట్లు స్థానికులు చెబుతున్నారు. బాలాజీ మృతదేహం వద్ద అతడి సోదరుడు ప్రకాష్ బోరున రోదించారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. ఆమె ప్రస్తుతం గర్భిణి. కాగా.. పోలీసులు సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించి ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించి, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతిసే ర్యాగింగ్ రాజానగరం: విద్యార్థి దశలో జూనియర్లను ర్యాగింగ్ చేయడం ఆనందమని సీనియర్లు భావిస్తారని.. కానీ అది ఆ విద్యార్థి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న యాంటీ ర్యాగింగ్ వీక్ కార్యక్రమంలో భాగంగా గురువారం జరిగిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తన జీవితంలో కూడా ర్యాగింగ్కు భయపడిన సంఘటనలు ఉన్నాయంటూ గుర్తు చేసుకున్నారు. ఎవరూ ర్యాగింగ్కు పాల్పడవద్దని, పాల్పడితే చట్టాల నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. ప్రతి తల్లి, తండ్రి తమ పిల్లలను ర్యాగింగ్కు దూరంగా ఉంచాలని చూస్తారని, అందుకోసమే ర్యాగింగ్ ఛాయలు లేని కళాశాలలు, యూనివర్సిటీలను ఎంపిక చేసుకుంటున్నారన్నారు. ర్యాగింగ్ వలన జీవితాలు నాశనం అవడమే కాకుండా కన్నవారికి, చదువుకునే సంస్థలకు కూడా చెడ్డ పేరు వస్తుందన్నారు. వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ మాట్లాడుతూ ‘నన్నయ’ వర్సిటీ అంటేనే సత్ప్రవర్తనకు కేరాఫ్ అనే ఖ్యాతిని పొందేలా మీ నడవడిక ఉండాలని విద్యార్థులకు హితవు పలికారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి, అధ్యాపకులు పాల్గొన్నారు. ● కొత్త దుస్తులు కొనుగోలు చేసేందుకు వెళుతుండగా ప్రమాదం ● తండ్రి మృతి, కుమారుడికి గాయాలు -
స్మార్ట్కార్డులేవి?
● లైసెన్స్, ఆర్సీ బుక్లకు ఆన్లైన్లో డబ్బు వసూలు ● స్మార్ట్కార్డుకు రూ.235 వసూలు చేస్తున్న ఆర్టీఏ ● సుమారు 50 వేల మందికి అందని వైనం బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాహనదారులను స్మార్ట్గా దోచుకుంటున్నాయి. వాహన్ సారథి పోర్టల్ ద్వారా అన్లైన్లో ఆర్సీ, లైసెన్స్లు జారీచేసేందుకు స్మార్ట్కార్డుల పేరిట డబ్బు ఏడాదిగా వసూలు చేస్తున్నా కార్డుల జారీ ప్రక్రియ ఇప్పటికీ ప్రారంభం కాలేదు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత వాహన యాజమానులకు, డ్రైవింగ్ లైసెన్స్దారులకు స్మార్ట్కార్డులు అందజేస్తామని ప్రకటించింది. ఏడాది దాటినా స్మార్ట్కార్డుల ఊసేలేదు. వాహనదారులు దరఖాస్తు చేసుకున్న క్రమంలో ఆర్సీ, డీఎల్కు సంబంధించి స్మార్ట్కార్డుల పేరిట ఆర్టీఏ అధికారులు ఆన్లైన్లో రూ.235 చొప్పున వసూలు చేస్తున్నారు. కార్డు ఫీజు రూ.200, పోస్టల్ చార్జీలు రూ.32, ఇతరత్రా రూ.3 కలిపి వసూలు చేస్తున్నారు. అయితే స్మార్ట్ కార్డుల తయారీకి కూటమి ప్రభుత్వం టెండర్లు పిలవలేదు. 50 వేల కార్డులు అవసరం కాకినాడ జిల్లా పరిధిలో కాకినాడ కార్యాలయంతో పాటు పెద్దాపురం, కత్తిపూడి ప్రాంతాలలో యూనిట్ కార్యాలయాలు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి రోజూ దాదాపు 50 నుంచి 70 వరకూ డ్రైవింగ్ లైసెన్స్లు అభ్యర్థులకు టెస్టింగ్ నిర్వహించి జారీ చేస్తారు. కార్డులు వచ్చే వరకూ అన్లైన్లో ప్రింట్ తీసుకుని వాడుకోమని అధికారులు సూచిస్తున్నారు. డిజిటల్ యుగంలోనూ ఇప్పటికీ కాగితాలపై రవాణాశాఖను నడిపించడం విస్మయాన్ని కలిగిస్తుంది. స్మార్ట్కార్డులు అందిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం అసమర్థతను అది వెల్లడిస్తోంది. ప్రింటింగ్ నిలిచింది ప్రస్తుతానికి కార్డుల ప్రింటింగ్ నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా కార్డుల సరఫరా జరగడం లేదు. ప్రభుత్వం నుంచి కార్డులు వచ్చిన వెంటనే వరుస క్రమంలో ప్రింట్ చేసి వాహనదారుల చిరునామాకు పంపిస్తాం. కార్డు వచ్చేవరకూ ఆన్లైన్లో ప్రింట్ తీసుకుని వాడుకోవచ్చు. –కె.శ్రీధర్. జిల్లా రవాణాశాఖాధికారి, కాకినాడ గత ప్రభుత్వంలో 60 వేల కార్డుల పంపిణీ గత ప్రభుత్వంలో 2022 సెప్టెంబర్ నుంచి పెండింగ్లో ఉన్న దాదాపు 60వేల కార్డులు ప్రింటింగ్ చేసి వరుస క్రమంలో పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. విడతల వారీగా 10వేల కార్డుల చొప్పున జిల్లాకు రావడంతో ప్రింటింగ్ ప్రారంభించి స్పీడ్ పోస్టు ద్వారా వారి చిరునామాకు పంపించారు. -
తూచ్.. ఉచితం కొన్నింటికే!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి ఎప్పటిలాగే చంద్రబాబు కోతలపై కోతలు పెట్టారు. అన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణమని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. తీరా గద్దె నెక్కాక మాట మార్చి ఇప్పుడు ఉచిత ప్రయాణాన్ని కొన్ని బస్సులకే పరిమితం చేశారని మహిళలు నిప్పులు చెరుగుతున్నారు. ఆల్ ఫ్రీ బాబు తమను మరోసారి దగా చేశారని మండిపడుతున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికై నా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అని చెప్పి ఇంత మోసం చేస్తారా అని నిలదీస్తున్నారు. ఆర్టీసీలో తొమ్మిది రకాల బస్సు సర్వీసులుండగా ఐదు రకాలకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మహిళలు ఆక్షేపిస్తున్నారు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులలో మాత్రమే ఉచిత ప్రయాణానికి అనుమతిస్తున్నారు. అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, నాన్స్టాఫ్, స్టార్ లైనర్, సప్తగిరి, ఏసీ బస్సులలో ఉచిత ప్రయాణానికి అనుమతించడం లేదు. అంతర్రాష్ట్ర సర్వీసులు, స్పెషల్ బస్సుల్లో సైతం ఉచితం పనిచేయదని చెప్తున్నారు. ఉచితంగా ప్రయాణించాలనుకునే మహిళలు రాష్ట్రానికి చెందిన వారై ఇక్కడి ధ్రువీకరణ పత్రాలు ఉండాలనేది నిబంధన. రాష్ట్రంలోనే నివసిస్తున్నట్లు ధ్రువీకరణ కూడా చూపించాలి. ఆగస్టు 15 శుక్రవారం నుంచి పరిమిత సంఖ్యలో అనుమతించిన బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేసేందుకు ఆర్టీసీ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. నాన్స్టాప్లకు అవకాశం లేదు పూర్వపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నుంచి అటు అమలాపురం, ఇటు రాజమహేంద్రవరానికి అత్యంత రద్దీగా నడిచే నాన్స్టాప్ బస్సులలో ఉచిత ప్రయాణానికి అవకాశం లేకుండా చేశారు. సహజంగా ఉమ్మడి జిల్లాలో ఈ రెండు రూట్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. జిల్లా కేంద్రాలుగా ఉన్న కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల మధ్య రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఈ రెండు కేంద్రాల్లో ప్రాముఖ్యం కలిగి, పేద రోగులకు అత్యవసర వైద్యం అందించే ప్రభుత్వ పెద్ద ఆస్పత్రులు రెండు ఉన్నాయి. నిత్యం వందలాది మంది మహిళలు రాజమహేంద్రవరం వస్త్ర వ్యాపారానికి వెళ్తుంటారు. అటువంటి రూట్లో నాన్స్టాప్కు అవకాశం ఇవ్వకపోవడాన్ని మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీలో ఎక్కువగా ఎక్స్ప్రెస్ బస్సులనే నాన్స్టాప్ సర్వీసులుగా నడుపుతున్నారు. అయినప్పటికీ వీటిల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించరు. బస్సులు లేక ఆటోలే ప్రత్యామ్నాయం ఆదాయం లేకపోతే నడపటం కష్టమనే సాకులతో కాకినాడ జిల్లాలో మూడు డిపోల పరిధిలో 90 గ్రామాలకు ఆర్టీసీ బస్సులు వెళ్లడం లేదు. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాల ప్రయాణికులకు ఆటోలే ప్రత్యామ్నాయం అవుతున్నాయి. కాకినాడ, ఏలేశ్వరం, తుని డిపోల పరిధిలో ఇప్పుడున్న ఆర్టీసీ బస్సులే సరిపోవడం లేదు. ఇక ఉచిత ప్రయాణం కచ్చితంగా అమలు చేస్తే కాకినాడ జిల్లాలోని మూడు డిపోల పరిధిలో అదనంగా 100 బస్సులు అవసరం అవుతాయని ఆర్టీసీ అధికారులే లెక్కలు వేశారు. ఉన్న పల్లె వెలుగు సర్వీసులను ఉచిత పథకానికి వినియోగిస్తే జిల్లాలోని ఏ గ్రామీణ ప్రాంతానికీ బస్సులు నడిచే పరిస్థితులు ఉండవని పలువురు అభిప్రాయపడుతున్నారు. పోస్టులు భర్తీ చేయాలి జిల్లాలోని ఏలేశ్వరం, తుని, కాకినాడ ఆర్టీసీ డిపోల్లో మొత్తం 194 బస్సులున్నాయి. ఇందులో 177 బస్సులకు ఉచిత ప్రయాణానికి అనుమతించినట్టు ఆర్టీసీ ప్రజా రవాణా అధికారి శ్రీనివాసరావు తెలియచేశారు. గ్రామీణ జనాభా అధికంగా ఉన్న జిల్లాలో ఆర్టీసీ సేవలు ఇప్పటికే అరకొరగా ఉన్నాయి. జిల్లాలో డ్రైవర్, కండక్టర్ పోస్టులు సైతం ఖాళీగా ఉన్నా ప్రభుత్వం భర్తీ చేయకుండా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎలా అమలుచేస్తారని ఆర్టీసీ కార్మికులు ప్రశ్నిస్తున్నారు. అదనంగా వంద బస్సులు అవసరం జిల్లాలో 12 లక్షల మంది మహిళలు ఉన్నారని అంచనా. సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రతి మహిళకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకారం చూసుకుంటే అన్ని లక్షల మందికి బస్సులు ఏర్పాటుచేయాలి. కానీ అన్ని బస్సులు ఆర్టీసీ యాజమాన్యానికి లేవు. ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసినా ఉచిత బస్సు ప్రయాణం అమలుచేయాలంటే జిల్లాలో మూడు డిపోల పరిధిలో అదనంగా వంద బస్సులు అవసరమవుతాయని ఆర్టీసీ అధికారులు అంచనా వేశారు. జిల్లాలో మూడు డిపోల పరిధిలో 34,407 కిలోమీటర్లను కలుపుతూ సర్వీసులు తిరుగుతుంటాయి. నిత్యం 80 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఇందులో మహిళా ప్రయాణికులు 35 వేల మంది ఉన్నారని అంచనా. ఇంత మంది మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలంటే ఇప్పుడున్న బస్సులతో పాటు సిబ్బంది సంఖ్యను మరింత పెంచాలంటున్నారు. 100 మంది డ్రైవర్లు, 100 మంది కండక్టర్లు అవసరమవుతారని చెబుతున్నారు. ఉన్న బస్సులతోనే సరిపెట్టుకోమంటే ఉచిత బస్సు ప్రయాణం ఎలా ముందుకు తీసుకువెళతామని ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ప్రశ్నిస్తున్నారు. డిమాండ్కు తగ్గట్టుగా సర్వీసులు లేకపోవడం వల్ల తమపైన, ఉన్న సర్వీసులపైనా అధిక భారం పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్తున్న పల్లెవెలుగు సర్వీసులను ఉచిత బస్సుల కోసం ప్రధాన ప్రాంతాల్లో నిర్వహిస్తే పల్లెల్లో బస్సు సర్వీసు పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో కొత్త బస్సుల ఊసేలేదు. త్వరలో 25 ఎలక్ట్రికల్ బస్సులు జిల్లాకు వస్తున్నాయని మాత్రం చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి డిపోకు కొత్త బస్సులను అందజేస్తామని కూటమి నేతలు చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. కాకినాడ సిటీలో ఎలక్ట్రికల్ బస్సుల మాట ఏమైందని ప్రశ్నిస్తున్నారు. కొత్తగా ఒక్క బస్సు కూడా ఏర్పాటు చేయకుండా ఉన్న బస్సులతోనే సరిపెట్టుకోమంటే ఎలా అని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. ఉచిత ప్రయాణానికి గుర్తింపు కార్డు తప్పనిసరి చేశారు. అందుకు కండక్టర్కు సరైన ధ్రువపత్రం తప్పనిసరిగా చూపించాలి. ఆధార్, ఓటర్ ఐడీ, రేషన్ కార్డ్, పాస్పోర్టు, స్థానికతను ధ్రువీకరించే ఏదో ఒక గుర్తింపు కార్డు చూపడం తప్పనిసరి. పొరపాటున వాటిలో ఏదేని ఒరిజినల్ ధ్రువపత్రాన్ని జారవిడుచుకుంటే మళ్లీ దరఖాస్తు చేసుకుని అది వచ్చేవరకు తమ ఉచిత ప్రయాణానికి ఆటంకమేనని మహిళలు చర్చించుకుంటున్నారు. ఈ బస్సు మీకు ఆగదు.......నేటి నుంచే ఉచిత ప్రయాణం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సీ్త్రశక్తి ఉచిత బస్సు ప్రయాణానికి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ప్రయాణ సమయంలో గుర్తింపు కార్డు తప్పనిసరిగా చూపించాలి. నాన్స్టాప్, ఇతర రాష్ట్రాలకు వెళ్లే పర్యాటక, లగ్జరీ, సూపర్ లగ్జరీ, సప్తగిరి, అల్ట్రా డీలక్స్, స్టార్ లైనర్, ఏసీ బస్సులు ఈ పథకానికి వర్తించవు. – శ్రీనివాసరావు, జిల్లా ప్రజారవాణాధికారి 9 సర్వీసులలో మూడింటికే పరిమితం జిల్లాలోని మూడు డిపోలలో కేవలం 177 బస్సులలోనే ప్రయాణానికి అనుమతి డిమాండ్కు సర్వీసులకు పొంతన లేని వైనం ఆ 90 రూట్ల మాటేవిటంటున్న గ్రామీణులు నిత్యం ప్రయాణించే 80 వేల మందిలో 35 వేల మంది మహిళలే మౌలిక వసతులు విస్మరించి మొక్కుబడి వాగ్దానాల అమలుకు యత్నం -
ముగ్గురు బైక్ దొంగల అరెస్టు
● 34 వాహనాల స్వాధీనం ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ రమేష్ బాబు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మోటారు సైకిళ్లను దొంగిలిస్తున్న ముగ్గురిని త్రీటౌన్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు బైక్ దొంగలను చాకచక్యంగా పట్టుకున్నారు. ఆ వివరాలను త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సెంట్రల్ జోన్ డీఎస్పీ కె.రమేష్ బాబు వివరించారు. మోటారు సైకిళ్ల దొంగతనాలు ఎక్కువైన నేపథ్యంలో త్రీటౌన్ సీఐ వి.అప్పారావు నేతృత్వంలో దొంగలపై నిఘా పెట్టారు. దీనిలో భాగంగా కాతేరు గామన్ బ్రిడ్జి వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో ఉండ్రాజవరం మండలం సత్యవాడలోని రామాలయం వీధికి చెందిన కుప్పాల రంగారావు, పసలపూడికి చెందిన గోపిరెడ్డి యోహాన్, అరుంధతిపేటకు చెందిన సిర్రా బంగారుబాబు రాజమహేంద్రవరం వైపు నుంచి వెంకటనగరం వైపు వెళుతున్నారు. ఆ ముగ్గురిని పోలీసులు ఆపి వాహనాల రికార్డులను అడిగారు. వారి వద్ద ఎటువంటి రికార్డులు లేకపోవడంతో అను మానం వచ్చి విచారణ చేశారు. దీంతో వారు అపహరించిన మోటారు సైకిళ్ల వివరాలను తెలిపారు. వీరిపై త్రీటౌన్ పోలీస్ స్టేషన్తో పాటు భీమవరం, గుడివాడ, ఏలూరు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. నిందితుల నుంచి 34 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. బైక్ దొంగలను పట్టుకున్న సీఐ వి.అప్పారావు, ఎస్సై అప్పలరాజు, హెడ్ కానిస్టేబుల్ వి.కృష్ణ, ఎన్.వెంకట రామయ్య, కె.సురేష్, చంద్రశేఖర్, విజయ్కుమార్, మహేష్ పవన్లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. -
సమాచార హక్కు చట్టంపై ర్యాలీ
అమలాపురం టౌన్: సమాచార హక్కు మన ప్రాథమిక హక్కు అనే నినాదంతో జిల్లాలోని సహకార శాఖ ఉద్యోగులు అమలాపురంలో గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా సహకార అధికారి ఎ.రాధాకృష్ణారావు, సహకార అసిస్టెంట్ రిజిస్ట్రార్లు బీఎల్వీపీ నూకరాజు, టి.బుజ్జయ్య, సత్యప్రసాద్ ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. కూచిమంచి అగ్రహారంలోని జిల్లా సహకారి అధికారి (డీసీవో) కార్యాలయం వద్ద ర్యాలీని డీసీవో రాధాకృష్ణారావు జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా డీసీవో కార్యాలయ అధికారులు, సిబ్బంది, 166 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సీఈవోలు, ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీవో రాధాకృష్ణారావు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టంపై ప్రతి పౌరుడు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ చట్టం ద్వారా ప్రభుత్వ కార్యాలయాలు జవాబుదారీతనంతో పనిచేస్తాయని గుర్తు చేశారు. కాగా.. జిల్లా సహకార కార్యాలయం నుంచి మొదలైన ర్యాలీ.. బ్యాంక్ స్ట్రీట్ మీదుగా గడియారం స్తంభం సెంటర్ వరకూ జరిగింది. -
వేణుగోపాలం.. త్రివర్ణశోభితం..!
బృందావనం అందరిదీ.. గోవిందుడు అందరి వాడేలే.. అని సినీకవి పింగళి నాగేంద్రరావు ప్రజలలో భక్తిపారవశ్యం నింపగా.. స్వాతంత్య్ర సమరాంగణాన త్రివర్ణ జాతీయ పతాకానికి రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య అదే ప్రజలలో జాతీయ భావాన్ని చైతన్యపరిచారు. యద్భావం తద్భవతి అని వేణుగోపాలునిలో భరతమాతను.. బృందావనిని భారతావనిగా భావించి ముచ్చట తీర్చుకున్నారు ఆ భక్తులు. జెండా పండగ పంద్రాగస్టును పురస్కరించుకుని పిఠాపురం రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాల స్వామి వారి సన్నిధిలో ఆలయ అర్చకుడు విజయ జనార్దనాచార్యులు స్వామివారిని గురువారం మువ్వన్నెల పుష్పాలు, కాగితాలు, జాతీయ జెండాలతో అలంకరించి వారి దేశ భక్తిని చాటుకున్నారు. -
అధిక భారం
విద్యార్థులు ప్రశ్నలకు సమాధానాలను రాసేందుకు అసెస్మెంట్ బుక్లెట్లను వినియోగిస్తున్నారు. ఇది ఉపాధ్యాయులకు భారంగా ఉంది. బోధనకు కూడా సమయం సరిపోవడం లేదు. పూర్వపు పద్ధతిలోనే పేపరుపై జవాబులు రాసే విధానాన్ని అమలు చేయాలి. – పి.సురేంద్రకుమార్, జిల్లా అధ్యక్షుడు, యూటీఎఫ్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పనిభారం పెంచేందుకే.. ఉపాధ్యాయులకు పనిభారం పెంచేందుకే అన్నట్లుగా అసెస్మెంట్ బుక్లెట్లు ఉన్నాయి. పరీక్షా పత్రాలు కూడా విద్యార్థుల స్థాయికి మించి ఉన్నాయి. ఏ మాత్రం ఆమోదయోగ్యం కాని అసెస్మెంట్ బుక్లెట్ల విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్తాం. – పోతంశెట్టి దొరబాబు, జిల్లా అధ్యక్షుడు, ఎస్టీయూ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఉపాధ్యాయులకే పరీక్ష పరీక్షల విధానంలో కొత్తగా తీసుకుని వచ్చిన మూల్యాంకన విధానం ఉపాధ్యాయులకే పరీక్షలా ఉంది. ఉపాధ్యాయులపై తీవ్రమైన పనిభారం పడుతుంది. ఒక విధంగా చెప్పాలంటే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలే మేలు అన్నట్లుగా ఉంది. దీన్ని మా సంఘం తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. – పి.నరేష్బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆపస్ ఉపాధ్యాయ సంఘం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
పోరాటాల కల్పవల్లి కొత్తపల్లి
పిఠాపురం: స్వాతంత్య్రం వచ్చెనెని సభలే చేసి.. సంబరపడగానే సరిపోదోయీ.. సాధించిన దానికి సంతృప్తిని పొంది.. అదే విజయమనుకుంటే పొరపాటోయీ.. అని దేశ శృంఖలాలు విడివడిన తొలినాళ్లలోనే ఎందరో అభ్యుదయ కవులు ఇటువంటి ఎన్నో దేశభక్తి గేయాలకు పదాలు కూర్చారు. ఎందరో మహానుభావుల త్యాగాలతో సాధించుకున్న స్వరాజ్యాన్ని ప్రతి భారతీయుడు నరనరానా జీర్ణించుకోవాలి. చేసే ప్రతి పనిలో జాతీయభావాన్ని నింపుకొని జాతి ఔన్నత్యానికి కృషి చేయాలి. అప్పుడే స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలకు విలువ. రేపు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. స్ఫూర్తి రగిలించిన ‘చల్లా’ ఆస్తులున్నా ఆనందంగా జీవించే స్వాతంత్య్రం లేనప్పుడు అవి అనుభవించే అర్హత మనకు లేదంటూ దేశం కోసం తృణప్రాయంగా త్యాగం చేసిన చిరస్మరణీయులలో కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు చల్లా నారాయణమూర్తి ఒకరు. ఈయన 1911–2003 మధ్య కాలంలో జీవించిన ఆయన ఆంగ్లేయుల పాలనను తీవ్రంగా వ్యతిరేకించారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా భారత ప్రభుత్వం నుంచి తామ్రపత్రాన్ని స్వీకరించారు. అలహాబాద్లో కాంగ్రెస్ సేవాదళ్ సహాయ కార్యదర్శిగా కూడా ఆయన పని చేశారు. స్వాతంత్య్రోద్యమానికి హిందీ భాష అవసరం కావడంతో జవహర్లాల్ నెహ్రూ సతీమణి కమలా నెహ్రూ వద్ద ఆ భాషను నేర్చుకున్నారు. అంతే కాకుండా గోండా జైలులో లాల్బహుదూర్శాస్త్రితో కలిసి 6 నెలలు కఠిన కారాగార శిక్ష అనుభవించారు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో, 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని శిక్షలు అనుభవించారు. జవహర్లాల్ నెహ్రూ, కేడీ మాలవ్య, ఉమాశంకర్ దీక్షిత్, టంగుటూరి ప్రకాశంపంతులు, పొట్టి శ్రీరాములు, మల్లిపూడి పళ్లంరాజు మొదలైన వారితో సత్సంబంధాలు ఉండేవి. మహాత్మగాంధీ వంటి జాతీయ నాయకులతో కలిసి పది రోజుల పాటు తీహార్ జైలులో గడిపారు. మద్దూరి అన్నపూర్ణయ్యతో కలిసి విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యంలో పాల్గొన్నారు. పీయూసీ వరకు చదివిన ఆయన వివిధ భాషల్లో మంచి ప్రావీణ్యం పొందారు. తాటిపర్తి గ్రామానికి ఆయన తొలి సర్పంచ్గా పని చేసి గ్రాామాన్ని విద్యుత్ వెలుగులతో నింపారు. గొల్లప్రోలు కో ఆపరేటివ్ సొసైటీకి అద్యక్షుడుగా పని చేశారు. అస్పృశ్యత నిర్మూలనకు కృషి కుల మతాలకు అతీతంగా ఆయన వ్యవహరించేవారు. నిమ్న కులాలను ఎంతో ఆదరించి, విద్యాబుద్ధులు నేర్పేవారు. ఆయన వద్ద విద్యనభ్యసించిన ఎందరో నేడు ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. ఆస్తంతా అర్పించి.. అవస్థలు నారాయణమూర్తి పెద్ద భూస్వామిగా పేరొందారు. స్వాతంత్య్ర పోరాటంలో తనకు ఉన్న 150 ఎకరాల భూమిని నగదు, ఆభరణాలను అర్పించారు. తన కుటుంబ పోషణను కూడా లెక్క చేయకుండా కేవలం స్వాతంత్య్ర సమరం కోసం మొత్తం సమర్పించారు. ఆయనకు ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వీరంతా చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుంటూ పట్టణాల్లో జీవిస్తున్నారు. 2003లో ఆయన కన్నుమూసేనాటికి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పిల్లల పెళ్లిళ్లు చేయలేని స్థితి ఏర్పడింది. క్విట్ఇండియా ఉద్యమంలో పాల్గొన్న స్వాతంత్య్ర సమర యోధులకు క్రాంతి మైదాన్ పేరిట అప్పటి కలెక్టర్ సతీష్ చంద్ర, మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోన్రావు తదితరులు ఆయనను సత్కరించారు. తాటిపర్తిలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన జీవిత చరిత్రను ప్రస్తుత జనాలకు తెలిసేలా శిలాఫలకం ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ తొలి సమావేశంలో ఆయన జైలు జీవితం అనుభవించినట్లుగా తొలి తీర్మానం చేశారు. ఆదరిస్తామన్నా తిరస్కరించి.. ఆయన చివరి రోజుల్లో ప్రభుత్వ ఆదరణ అవకాశాన్ని సైతం ఆయన సున్నితంగా తిరస్కరించారు. తాను ఏదో సంపాదించుకోవాలని పోరాటం చేయలేదని ఉన్నదాని కంటే స్వాతంత్య్రం వచ్చిందన్న సంతృప్తే నాకు కోట్ల ఆస్తితో సమానమని పేర్కొన్నారు. దీంతో ఆయనను సన్మానించి అధికారులు వెనుదిరిగారు. మన తెలుగునేల ఎందరో మహానుభావులకు పుట్టినిల్లు. చరిత్రకారులకు జన్మస్థలమైన కొత్తపల్లి అలనాటి వైభవాన్ని నేటికీ చాటిచెబుతోంది. ఎక్కడ చూసినా చరిత్ర ఆనవాళ్లు దర్శనమిస్తుంటాయి. స్వాతంత్య్ర ఉద్యమం తొలినాళ్లలో అప్పటి పిఠాపురం తాలూకాలో కొత్తపల్లి ఫిర్కాకు ప్రత్యేక స్థానం వుంది. ఎందరో చరిత్రకారులు, స్వాతంత్య్ర సమరయోధులు, రాజవంశీయుల పుట్టినిల్లు కొత్తపల్లి. పిఠాపురం తాలూకాలో ఐదు వేల జనాభాతో అతిపెద్ద గ్రామంగా విరాజిల్లింది. దివ్య క్షేత్రంగాను, కళా కేంద్రంగాను, సంస్కృతీ సంప్రదాయాలకు నిలయంగా, సాహితీ మందిరంగా రాజకీయ చైతన్యానికి ఆలవాలంగా చరిత్ర పుటలకెక్కింది. రావు అచ్చియ్యరావు, పుత్సల సత్యనారాయణ, రావు వెంకట జగ్గారావు, అల్లిక సన్యాసయ్య, జ్యోతుల కాశీస్వామి, జ్యోతుల శేషయ్య, చిట్టాడ చిన్న ముత్యాలు వంటి ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు కొత్తపల్లిలో జన్మించి దేశ అభ్యుదయానికి తమ వంతు కృషి చేశారు. నాటి కొత్తపల్లి రాజకీయ కారణాలతో వాకతిప్ప, కుతుకుడుమిల్లి, కొత్తపల్లిగా విడిపోయింది. కాకతీయుల ఘనతను చాటి చెప్పిన రావు వారి వంశం ఈ గ్రామంలోనే అధిక శాతం నివసించారు.. నివసిస్తున్నారు. ఆయుర్వేద వైద్యానికి, వస్త్ర పరిశ్రమలకు నిలయమై, స్వాతంత్య్ర సమరం, ఉప్పు సత్యగ్రహం, విదేశీ వస్త్ర బహిష్కరణ, ఖద్దరు ప్రచారం, హరిజనోద్ధరణ కార్యక్రమాలకు కొత్తపల్లి వేదికై ంది. బులుసు సాంబమూర్తి సారధ్యంలో కొత్తపల్లిలో ప్రధమ రాజకీయ మహాసభ ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆధ్వర్యంలో నిర్వహించిన రాజకీయ మహాసభ కొత్తపల్లి చరిత్రలో కలికితురాయి. ఆ సమయంలోనే స్థానికులు విదేశీ వస్త్రాలను గుట్టలుగా పోసి తగులబెట్టారు. దీంతో వారిపై అక్రమ కేసులు బనాయించినా పిఠాపురం తాలూకా పరిధిలో సాక్ష్యం చెప్పేవారు లేక ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. కాకినాడలో జరిగిన కాంగ్రెస్ మహా సభకు నాయకులు కొత్తపల్లి నుంచే భారీ సన్నాహాలు చేశారు. మహాత్మ గాంధీ, పండిట్ నెహ్రూ, జయప్రకాష్ నారాయణ, టంగుటూరి ప్రకాశం పంతులు వంటి ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు ఎందరో ఇక్కడ సందేశాలిచ్చి ప్రజలను చైతన్యపరిచారు. సద్గ్రంథాలు, సన్మిత్రులవలే సహృదయ శాసనాలు కావిస్తాయని నమ్మిన అప్పటి స్వాతంత్య్ర సమర యోధులు రావు అచ్చియ్యరావు తన స్వగ్రామం కొత్తపల్లిలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. టౌన్ హాల్గా పిలిచే ఆ గ్రంథాలయంలో రాజకీయ, సామాజిక, స్వాతంత్య్ర సంగ్రామం గ్రంథాలను ఏర్పాటు చేశారు. దీనిని విజ్ఞాన మందిరంగాను, కళా కేంద్రంగా రూపొందించారు. సభలు, సమావేశాలు, విద్యాగోష్టులు, నిర్వహించడంతో ఈ గ్రంథాలయానికి ఎంతో ప్రాచీనత సంతరించుకుంది. స్వాతంత్య్ర సమరయోధుల వైద్య సేవల కోసం సుమారు 118 ఏళ్ల చరిత్ర గలిగిన కొత్తపల్లిలోని శ్రీలక్ష్మి గణపతి ఆయుర్వేద నిలయం ఎంతగానో తోడ్పడేది. విదేశీ వస్త్ర బహిష్కరణకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కొత్తపల్లిలో ఖద్దరు తయారీ కేంద్రాలను నెలకొల్పారు. అదే నేడు కొత్తపల్లికి ఘన కీర్తిని తెచ్చిపెట్టింది. ఉప్పు సత్యాగ్రహం సమయంలో అప్పట్లో ఉప్పువాడగా పేరొందిన ప్రస్తుతం ఉప్పాడను పలువురు స్వాతంత్య్ర సమరయోధులు సందర్శించి నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. స్వాతంత్య్ర ఉద్యమ దివిటీలెన్నెన్నో.. పల్లెపల్లెలో రగిలిన పోరాట స్ఫూర్తి మహనీయుల త్యాగాలు.. చరితలతో నిండిన నేల త్రివర్ణ పతాక రెపరెపల వేళ.. త్యాగధనుల సంస్మరణలివి -
సీతారామ సత్రం పరిశీలన
అన్నవరం: రత్నగిరిపై శిథిలావస్థకు చేరిన శ్రీ సీతారామ సత్రాన్ని జేఎన్టీయూ ప్రొఫెసర్లు బుధవారం పరిశీలించారు. గతంలో ఈ సత్రాన్ని కూల్చివేయాలని వారు సూచించడం, కాదు.. మరమ్మతులు చేస్తే సరిపోతుందని దేవదాయ సలహాదారు సిఫార్సు చేయడం.. దీనిపై వివాదం నెలకొన్న విషయం పాఠకులకు తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ 26న ‘సాక్షి’లో ‘సత్యదేవ చూడవయ్యా’ శీర్షికన ప్రచురితమైన కథనంపై కలెక్టర్ షణ్మోహన్, దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఈ సత్రాన్ని జేఎన్టీయూకే బృందం మళ్లీ పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వారి నివేదిక ఆధారంగా కొత్త సత్రాన్ని నిర్మించనున్నారు. ఈ మేరకు వర్సిటీ ప్రొఫెసర్లు వి.రవీంద్ర, జి.ఏసురత్నంతో కూడిన బృందం సత్రాన్ని పరిశీలించి అనంతరం దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు, ఈఈ వి.రామకృష్ణతో చర్చించి వారం రోజుల్లో నివేదిక ఇవ్వనున్నట్టు తెలిపారు. టెండర్ ఖరారై మూడు నెలలైనా.. రూ.11.40 కోట్ల వ్యయంతో తొలి దశలో నాలుగు అంతస్తులలో 105 గదులతో సత్రం నిర్మాణానికి టెండర్లు పిలవగా దాదాపు 16 శాతం లెస్కు టెండర్లు ఖరారయ్యాయి. ఇది జరిగి మూడు నెలలైనా సత్రం ఎక్కడ నిర్మించాలన్న స్పష్టత లేక పనులు ప్రారంభం కాలేదు. దరఖాస్తుల ఆహ్వానం నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): పాఠశాల విద్యాశాఖ జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా క్రీడల్లో ప్రతిభ కనపరచిన పాఠశాలల నుంచి స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డులకు దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి పి.రమేష్ బుధవారం తెలిపారు. జిల్లా నుంచి 5 పాఠశాలలకు ఈ అవార్డులు అందిస్తామన్నారు. 2025 సంవత్సరంలో నిర్వహించిన ఎస్జీఎఫ్ఐ క్రీడల్లో రాష్ట్ర, జాతీయస్థాయిలో పాల్గొన్న క్రీడాకారుల సర్టిఫికెట్ల జెరాక్స్ కాపీలపై పాఠశాల హెచ్ఎం, పీడీ సంతంకం చేసి ఈ నెల 18వ తేదీ లోపు కాకినాడలోని ఎస్జీఎఫ్ఐ కార్యాలయంలో కార్యదర్శి ఎల్.జార్జికి అందజేయాలని కోరారు. అక్షరాంధ్రపై శిక్షణ బోట్క్లబ్ (కాకినాడసిటీ): జిల్లా వయోజన విద్య శాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్లో అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఒకరోజు శిక్షణ తరగతి నిర్వహించారు. జిల్లా వయోజన విద్య శాఖ ఉపసంచాలకుడు పసుపులేటి పోశయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జెడ్పీ సీఈవో లక్ష్మణరావు, డ్వామా పీడీ అడపా వెంకటలక్ష్మి తదితరులు హాజరై నూరు శాతం అక్షరాస్యత సాధనకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. -
వనామీపై సునామీ
ధరపై తీవ్ర ప్రభావం రొయ్యల లభ్యత తక్కువగా ఉన్న సమయంలో వాటి కౌంట్లకు మంచి ధర రావడం సాధారణం. ఈసారి కూడా మంచి ధర వచ్చింది. పది రోజుల క్రితం రొయ్యల ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. వంద కౌంట్ (కిలోకు వంద రొయ్యలు) ధర రూ.265 వరకు ఉండగా, 90 కౌంట్ రూ.275గా, 80 కౌంట్ రూ.295గా, 70 కౌంట్ రూ.325గా, 60 కౌంట్ రూ.345గా, 50 కౌంట్ రూ.375గా, 40 కౌంట్ రూ.395గా, 40 కౌంట్ రూ.440 వరకూ ఉండేది. ఈ సమయంలో ట్రంప్ రెండోసారి భారతీయ దిగుమతులపై 25 సుంకాలు విధించిన విషయం తెలిసిందే. దీనిని తర్వాత 50 శాతానికి పెంచారు. ప్రస్తుతం 25 శాతం సుంకాలు అమలులో ఉన్నాయి. సుంకాల ప్రకటన తర్వాత వనామి రొయ్యల ధరలను కొనుగోలుదారులు మరోసారి తగ్గించేశారు. కౌంట్కు వచ్చి రూ.30 నుంచి రూ.50 వరకూ కోత పెట్టడం గమనార్హం. వంద కౌంట్ ధర రూ.235 వరకు తగ్గగా, 90 కౌంట్ రూ.245, 80 కౌంట్ రూ.265, 70 కౌంట్ రూ.285, 60 కౌంట్ రూ.305, 50 కౌంట్ రూ.325, 40 కౌంట్ రూ.345, 30 కౌంట్ రూ.390కి పడిపోయాయి. సాక్షి, అమలాపురం: ఓవైపు కొలుగోలుదారులు సిండికేటుగా మారి ధర పెరిగినప్పుడల్లా ఏదో కారణంతో తగ్గించేస్తున్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల దాడితో ఆక్వా రైతులు విలవిల్లాడుతున్నారు. ఏడాది కాలంగా వనామీ రొయ్యలకు అంతర్జాతీయ మార్కెట్లో ధర పెరిగిన ప్రతిసారీ ఏదోక ఉపద్రవం రావడం.. ధర పతనం కావడం పరిపాటిగా మారింది. ఎటువంటి ఇబ్బందులు లేకున్నా.. స్థానిక కొనుగోలుదారులు ధర తగ్గించి ఆక్వా రైతుల నడ్డివిరుస్తున్నారు. తాజాగా ట్రంప్ టారిఫ్ ప్రకటనతో మరోసారి వనామీ ధరలు తగ్గడం రైతుల్లో కొత్త ఆందోళనకు తెర తీసింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో తీర ప్రాంత మండలాల్లో వనామీ రొయ్యల సాగు అధికంగా సాగుతోంది. కాకినాడ జిల్లాలో సుమారు 8 వేల ఎకరాల్లో ఈసాగు ఉండగా, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో దాదాపు 15 వేల ఎకరాల్లో జరుగుతున్నట్టు అంచనా. ఆయా జిల్లాల్లో మొత్తం 23 వేల ఎకరాల్లో సాగవుతున్నట్టు ఆక్వా వర్గాలు చెబుతున్నాయి. మొదటి పంట పూర్తయి, రెండో పంటకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం కోనసీమ జిల్లావ్యాప్తంగా 20 శాతం మాత్రమే చెరువుల్లో వనామీ రొయ్యలున్నాయి. సందు దొరికితే.. అంతర్జాతీయంగా ఏ చిన్న సంఘటన జరిగినా దానిని బూచిగా చూపించి రొయ్యల ధరలు తగ్గించడం కొనుగోలుదారులకు పరిపాటిగా మారింది. వీరంతా సిండికేట్గా ఉండడంతో ఒకే మాటపై ధరలు తగ్గించేస్తున్నారు. ఈ ఏడాది మార్చి నెలలో వనామీ రొయ్యలకు మంచి ధర పలికింది. మార్కెట్కు రొయ్యలు పెద్ద సంఖ్యలో వస్తూండడంతో కౌంట్కు రూ.20 చొప్పున ధర తగ్గించారు. ● ఏప్రిల్ తొలి వారంలో ట్రంప్ టారిఫ్ ప్రకటించగానే, దానిని అడ్డుపెట్టుకుని ధరలు భారీగా తగ్గించారు. కౌంట్కు రూ.60 వరకు ధర క్షీణించింది. తర్వాత సుంకాల విధింపు మూడు నెలల పాటు వాయిదా వేస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. కానీ కౌంట్కు రూ.15 మాత్రమే ధర పెంచడం గమనార్హం. ● గత నెల నుంచి చెరువులు ఖాళీ అయి మార్కెట్కు రొయ్యల రాక తగ్గింది. దీంతో ధరలు మరోసారి పెరిగాయి. ఇదే సమయంలో ట్రంప్ సుంకాల ప్రకటన రైతులను కుదేలు చేసింది. వనామి ధరలు మరోసారి పతనమయ్యాయి. ● జిల్లా నుంచి ఎగుమతి అయ్యే వనామీ, సముద్రంలో దొరికే టైగర్, ఇతర రొయ్యలు 70 శాతానికి పైగా అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. గతంలో యన్టీ డంపింగ్ టాక్స్ 4.5 శాతం, డీవీడీ ట్యాక్స్ 5 శాతం చొప్పున మొత్తం 9.5 శాతం మాత్రమే టాక్స్ ఉండేది. దీనిపై అదనంగా 25 శాతం టాక్స్ను ట్రంప్ ప్రభుత్వం అమలు చేస్తోంది. అంటే మొత్తం 34.9 శాతం టాక్స్ భారం పడుతోంది. ● వాస్తవంగా ట్రంప్ టారిఫ్ ప్రభావం మొదట పడేది అమెరికాలోని వినియోగదారులపైనే. ఇదే వంకతో కొనుగోలుదారులు ఇక్కడ రొయ్యల కొనుగోలు నిలిపివేశారు. ఇప్పుడు కేవలం 25 శాతం సుంకం ఉండగా, ఈ నెల 25వ తేదీ నుంచి 50 శాతం వసూలు చేయనున్నారు. దీంతో వనామీ ధరలు మరింత పతనం కానున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ● ఆగస్టు నెలాఖరు నుంచి రెండో పంటకు రైతులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సమయంలో వారిపై సుంకాల పిడుగు పడింది. దీంతో రైతులు సాగు విషయంలో పునరాలోచనలో పడ్డారు. 50 శాతం టారీఫ్ వల్ల ధరలు మరింత తగ్గితే.. సాగుకు తాత్కాలిక విరామం ఇచ్చేందుకూ వెనుకాడేది లేదంటున్నారు. గత జనవరి నుంచి ఇప్పటి వరకు కౌంట్ ధరలు ఇలా..కౌంట్ ఫిబ్రవరి మార్చి తొలిసారి సుంకాలు పది రోజుల రెండోసారి సుంకాలు రకం తొలి వారంలో తొలి వారంలో ప్రకటించాక... క్రితం మార్కెట్ ప్రకటించాక 30 470 465 425 440 390 40 415 390 340 400 345 50 375 365 320 375 325 60 345 335 300 345 305 70 320 300 295 325 325 80 285 270 255 295 265 90 265 250 235 275 245 100 255 240 225 265 235 సిండి‘కాటు’ నుంచి సుంకాల ‘వేటు’ వరకు మరోసారి రొయ్యకు కష్టకాలం రెండుసార్లు అమెరికా సుంకాల దాడి విదేశాలకు వెళ్లేది 50 కౌంట్ లోపు మాత్రమే.. టారిఫ్ పేరిట మొత్తం కౌంట్ల ధర కుదింపు ప్రస్తుతం సాగు 20 శాతమే.. ఉమ్మడి తూర్పున 23 వేల ఎకరాల్లో ఆక్వా సాగు -
‘పంపా’ పరవళ్లు
అన్నవరం: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అన్నవరంలోని ‘పంపా’ రిజర్వాయర్కు భారీగా వాననీరు వచ్చి చేరుతోంది. ఫలితంగా నీటిమట్టం బుధవారం సాయంత్రానికి 94 అడుగులకు చేరింది. పంపా క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల రిజర్వాయర్లోకి 400 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో రిజర్వాయర్ నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. గురువారం ఉదయానికి పంపా నీటిమట్టం 95 అడుగులకు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పంపా ఆయకట్టుకు 60 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సబ్సిడరీ డ్యామ్ ద్వారా పది క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పంపా రిజర్వాయర్ గరిష్ట నీటి నిల్వ 0.43 టీఎంసీ కాగా, ప్రస్తుతం 0.24 టీఎంసీ నిల్వ ఉందని అధికారులు తెలిపారు. గత నెల 26న పంపా నీటిని ఆయకట్టుకు విడుదల చేసిన విషయం తెలిసిందే. అప్పుడు నీటిమట్టం 94 అడుగులు ఉంది. అయితే అప్పటి నుంచి వర్షాలు లేకపోవడం, రిజర్వాయర్ నీటిని ఆయకట్టుకు విడుదల చేయడంతో నీటిమట్టం రోజు రోజుకీ తగ్గుతూ వచ్చింది. మంగళవారం పంపా నీటిమట్టం 92 అడుగులకు పడిపోయింది. మంగళవారం నుంచి పంపా క్యాచ్మెంట్ ఏరియాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో నీటిమట్టం మళ్లీ 94 అడుగులకు చేరింది. 94 అడుగులకు చేరిన నీటిమట్టం -
మహాత్ముడు నడయాడిన గాంధీ చౌక్!
సామర్లకోట: స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా మహాత్మ గాంధీ సామర్లకోటలో పర్యటించడంతో ఆ ప్రాంతానికి గాంధీచౌక్గా నామకరణం చేశారు. క్విట్ ఇండియా ఉద్యమంపై ప్రజలను చైతన్యపరచడానికి ఆయన రైలులో సామర్లకోట వచ్చారు. ఇంజిన్లో బొగ్గు నింపడానికి గంట సమయం అవసరం కావడంతో రైలును నిలిపివేశారు. రైలులో గాంధీజీ ఉన్నారని తెలుసుకున్న స్థానికులు వెళ్లి ఆయనను కలుసుకున్నారు. ఐక్యతతో శాంతియుతం ఉద్యమాలు చేయాలని ఆయన వారికి పిలుపు నిచ్చారని. ఇతరులకు సాయం చేయాలని గాంధీజీ చెప్పిన మాటలను స్థానికులు మేకా వీర్రాజు, చుండ్రు గొల్లబ్బాయి, యార్లగడ్డ గోవిందులు సాక్షికి తెలిపారు. గాంధీజీ మరణం తరువాత పేదలకు అంబలి పోయడం ప్రారంభించామని చెప్పారు. రైలులో గాంధీ దిగిన ప్రాంతానికి గాంధీచౌక్గా నామకరణం చేసినట్టు తెలిపారు. గాంధీజీ మరణాంతరం ఆ ప్రాంతంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించగా కాకినాడ మున్సిపాలిటీ అభ్యంతరం తెలిపారని, అయితే అప్పట్లో ప్రముఖ సామాజికవేత్త, దివంగత సమయం వీర్రాజు పోత్సాహంతో గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించి వందో జయంతి వరకు స్థానికులకు అంబలి పోసినట్టు గాంధీ యువజన సంఘం నాయకులు తెలిపారు. రైల్వే పట్టాల సమీపంలో ఏర్పాటు చేసిన తాటాకు పాక నేటికీ ఉంది. పాక సమీపంలోనే ఉండే గాంధీ విగ్రహాన్ని సెంటర్లో ఏర్పాటు చేశారు. ఇటీవల పాత విగ్రహం స్థానంలో నూతన కాంస్య విగ్రహం ఏర్పాటు చేశారు. -
జిల్లాలో భారీ వర్షాలు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో బుధవారం కురిసిన వర్షాలకు పల్లపు ప్రాంతాలు నీట మునిగాయి. కాకినాడలో మెయిన్రోడ్డు, టూటౌన్ నూకాలమ్మ గుడి వీధి, సినిమారోడ్డు, ఎల్బీనగర్, కొత్తపేట మార్కెట్ వంటి పలు ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. జిల్లాలో పలు మండలాల్లో వరి పంట నీట మునిగింది. సామర్లకోట, కాకినాడ రూరల్, కరప, కొత్తపల్లి, పిఠాపురం మండలాల్లో అధికంగా వర్షాలు కురవడంతో నాట్లు పూర్తిగా మునిగిపోయాయి. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. శిథిల భవనాలకు ప్రజలు దూరంగా ఉండాలని ఆయన తెలిపారు. జిల్లాలో వర్షాల వల్ల ఎటువంటి ఇబ్బంది ఏర్పడినా టోల్ ఫ్రీ నెంబర్, కంట్రోల్ రూమ్లో ఉన్న 0884 2356801 నంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. అలాగే ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లోనూ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. పలుచోట్ల నీట మునిగిన పంటలు కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు -
సంపద తయారీ కేంద్రాలపై దృష్టి సారించాలి ˘
సామర్లకోట: గ్రామాల్లోని సంపద తయారీ కేంద్రాలపై ఎంపీడీఓలు దృష్టి సారించాలని జిల్లా పరిషత్తు సీఈఓ వీవీఎస్ లక్ష్మణరావు, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్ అన్నారు. జిల్లాలోని 20 మంది ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలకు జి.మేడపాడు గ్రామంలో మంగళవారం నిర్వహించిన ఒక రోజు శిక్షణలో వారు మాట్లాడారు. ప్రతి ఇంటి నుంచీ తడి, పొడిచెత్త సేకరించి, వర్మి కంపోస్టు యూనిట్లకు తరలించాలన్నారు. తడి చెత్త నుంచి వర్మి కంపోస్టు తయారు చేసి, దాని వినియోగంపై రైతులకు అవగాహన కల్పించడం ద్వారా పంచాయతీలకు ఆదాయం వస్తుందని చెప్పారు. కార్యక్రమంలో పెద్దాపురం డీఎల్డీఓలు వాసుదేవరావు, శ్యామల, డీఎల్పీఓలు అన్నామణి, బాలమణి, సామర్లకోట ఎంపీడీఓ కె.హిమమహేశ్వరి, సర్పంచ్ పటాని దేవి తదితరులు పాల్గొన్నారు. బాస్కెట్బాల్ పోటీల్లో విజేతలుగా హైదరాబాద్ జట్లు సామర్లకోట: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నిర్వహించిన పెద్దాపురం శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాలలో నాలుగు రోజులుగా నిర్వహించిన బాస్కెట్బాల్ పోటీలు మంగళవారంతో ముగిశాయి. రెండు రాష్ట్రాల నుంచి 140 జట్లు పోటీల్లో పాల్గొనగా 1,500 మంది క్రీడాకారులు హాజరైనట్టు శ్రీప్రకాష్ సినర్జీ పాఠశాలల డైరెక్టర్ సీహెచ్ విజయప్రకాష్ తెలిపారు. అండర్–14, అండర్–17, అండర్–19 విభాగాల్లో హైదరాబాద్కు చెందిన జట్లు విన్నర్స్, రన్నర్స్గా నిలిచారు. విజేతలకు డీసీసీబీ చైర్మన్ తుమ్మలబాబు బహుమతులు అందజేశారు. ఆర్గనైజింగ్ కార్యదర్శి డి.చక్రవర్తి, విజయప్రకాష్ మాట్లాడారు. -
ముగిసిన జాతీయ జూనియర్ మహిళా హాకీ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా క్రీడామైదానంలో జరుగుతున్న 15వ ఇండియన్ ఆయిల్ జాతీయ జూనియర్ మహిళల హాకీ పోటీల విజేతగా జార్ఖండ్ జట్టు నిలిచింది. మంగళవారం నిర్వహించిన ఫైనల్స్లో జార్ఖండ్, హర్యానా జట్లు పోటీ పడగా 2–1 స్కోర్తో జార్ఖండ్ జట్టు విజయం సాధించి చాంపియన్ షిప్ను కై వసం చేసుకుంది. రన్నర్స్గా హర్యానా జట్టు నిలిచింది. మూడో స్థానానికి నిర్వహించిన మ్యాచ్లో ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ పోటీపడగా ఉత్తరప్రదేశ్ 2–0 స్కోర్తో విజయం సాధించి తృతీయ స్థానంలో నిలిచింది. క్రీడామైదానంలో సాయంత్రం నిర్వహించిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో కలెక్టర్ షణ్మోహన్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, ఎస్పీ బిందుమాధవ్ అతిథులుగా విచ్చేసి బహుమతులు అందజేశారు. ఈ నెల 1 నుంచి 12 వరకు నిర్వహించిన పోటీల్లో 29 రాష్ట్రాల నుంచి 600 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారుల నుంచి 30 మందిని ప్రపంచ పోటీలకు ప్రాబబుల్స్గా ఎంపిక చేశారు. డీఎస్డీఓ బి.శ్రీనివాస్ కుమార్, హాకీ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ నిరంజన్, కార్యదర్శి హర్షవర్ధన్, కోశాధికారి థామస్ పీటర్, భవానీ శంకర్, టోర్ని కో–ఆర్డినేటర్ వి.రవిరాజు, సీపోర్టు సీఈఓ మురళీధర్ పాల్గొన్నారు. విన్నర్స్ జార్ఖండ్ రన్నర్స్ హర్యానా మూడోస్థానం ఉత్తరప్రదేశ్ -
పిఠాపురంలో.. చోర సైనికులు?
జనసేన కార్యకర్తలు ఎత్తుకుపోయిన లారీలుసాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘తప్పు చేసిన వాడిని తరిమితరిమి కొడతా.. బట్టలూడదీసి రోడ్డు మీద నడిపిస్తా.. తోలు తీస్తా.. తాట తీస్తా..’ అంటూ గత సార్వత్రిక ఎన్నికల ముందు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గర్జించారు. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు. అంతే ఏడాది తిరిగేసరికి పిఠాపురంలో సీన్ రివర్స్ అయిపోయింది. చిన్న తప్పు జరిగినా ఉపేక్షించనని కుండబద్దలు కొట్టిన పవన్ ఇలాకాలోనే జనసేన శ్రేణులు దొంగతనాలకు కూడా వెనుకాడటం లేదు. అధికారం అండతో చెలరేగిపోతున్నారు. అటువంటి దొంగలను.. పవన్ వెంట తిరిగే ఆ పార్టీ ముఖ్య నేతలు వెనకేసుకు తిరుగుతూండటం చూసి పిఠాపురం ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. లారీల చోరీలు పిఠాపురం కుంతీ మాధవస్వామి గుడి వద్ద దగ్గు అప్పారావు నిలిపి ఉంచిన వంట నూనెల లారీని ఈ నెల 5న గుర్తు తెలియని దుండగులు ఎత్తుకుపోయారు. ఈ లారీ కోసం పోలీసులు తీగ లాగితే జనసేన డొంక మొత్తం కదిలింది. పోలీసు విచారణలో వంట నూనెల లారీయే కాకుండా ఆకుల ప్రసాద్కు చెందిన నూకల లోడుతో ఉన్న మరో లారీ కూడా మాయమైందని తేలింది. ఆగంతకులు ఎత్తుకుపోయింది ఒక లారీ అనుకుని పోలీసులు విచారణ మొదలు పెడితే రెండో లారీ విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ రెండు లారీల్లో సరకు విలువ రూ.కోటి పైమాటేనని పోలీసులు ప్రాథమికంగా లెక్క తేల్చారు. ఎత్తుకుపోయింది జనసేన కార్యకర్తలే.. ఈ లారీలు ఎత్తుకుపోయింది అంతర్రాష్ట్ర దొంగలనుకునుకున్న పోలీసులు తొలుత ఆ దిశగా విచారణ ప్రారంభించారు. వాహనాలకున్న జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా ఆరు రోజుల పాటు కూపీ లాగి, చివరకు ఆ రెండు లారీలనూ పట్టుకున్నారు. తీరా, ఈ రెండు లారీలూ ఎత్తుకుపోయింది ఎనిమిది మంది జనసేన క్రియాశీలక కార్యకర్తలేనని తెలిసి నివ్వెరపోవడం పోలీసుల వంతు అయ్యింది. లారీలు ఎత్తుకుపోయిన దొంగల ముఠాలో ఉన్న పిఠాపురం పట్టణంలోని బొజ్జావారితోట, కోటగుమ్మం, లయన్స్ క్లబ్ ప్రాంతాలకు చెందిన బెల్లంకొండ రవితేజ, నాగిరెడ్డి నాగ సతీష్, గంజి సురేష్, కాకినాడ రూరల్ మండలం పండూరుకు చెందిన నందిపాటి వీర సుబ్రహ్మణ్యాలను అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. నేతల ఒత్తిళ్లు పోలీసులకు పట్టుబడ్డ ఎనిమిది మందీ జనసేన ముఖ్య నేతలు వెంటేసుకుని తిరుగుతున్న క్రియాశీలక కార్యకర్తలేనని తేలడంతో ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. జనసేనలో లారీలు ఎత్తుకుపోయే దొంగల ముఠా గుట్టు రట్టవడం జిల్లావ్యాప్తంగా ఆ పార్టీలో హాట్ టాపిక్గా మారింది. ఈ కేసులో పిఠాపురం పోలీసుల పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్న చందంగా తయారైంది. నిందితులను తప్పించేందుకు ఆ పార్టీలో కాకినాడ, పిఠాపురానికి చెందిన ఇద్దరు ముఖ్య నేతలు పోలీసులపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే ఇద్దరిని ముందే తప్పించేశారనే విమర్శలు వస్తున్నాయి. పరారీలో ఉన్న ఇద్దరినీ తప్పించాలని లేదంటే ప్రత్యామ్నాయమైనా ఆలోచించాలంటూ తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తెస్తూండటంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారని చెబుతున్నారు. వారికి నేర చరిత్ర లారీల చోరీల్లో పట్టుబడిన బెల్లంకొండ రవితేజ, నాగిరెడ్డి నాగ సతీష్, గంజి సురేష్లకు నేర చరిత్ర ఉందని అరెస్టు సందర్భంగా పిఠాపురం సీఐ శ్రీనివాస్ మీడియాకు చెప్పారు. ఈ ముగ్గురూ జనసేన పిఠాపురం ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాస్తో సన్నిహితంగా ఉంటూ ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేవారని పిఠాపురం కోడై కూస్తోంది. అక్కడి జనసేన నాయకులతో కూడా వీరు సత్సంబంధాలు కలిగి ఉన్నారనే చెబుతున్నారు. అలాగే, పార్లమెంటు నాయకుడు, పవన్ కల్యాణ్ అన్న, ఎమ్మెల్సీ నాగబాబు వెంట కూడా ఉంటారు. నాలుగో నిందితుడైన నందిపాటి వీర సుబ్రహ్మణ్యం కూడా జనసేన పార్టీలో చురుకుగా ఉండటం గమనార్హం. నేర చరిత్ర ఉన్న విషయం తెలిసినా ఇంత కాలం వారిని పార్టీ కార్యక్రమాల్లో ఎలా ప్రోత్సహించారని ఆ పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతలు ప్రశ్నిస్తున్నారు. పార్టీ ముఖ్య నేతల అండదండలు చూసుకునే వారు ఈ తరహా ‘ఘనకార్యాలకు’ బరి తెగించారని పార్టీలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. పవన్ ఏమంటారో.. జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ చెప్పే మాటలకు.. ఆ పార్టీ నేతలు, కార్యకర్తల తీరుకు అసలు పొంతనే కుదరడం లేదు. గత ఏడాది గొల్లప్రోలులో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ, ‘శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది, అవసరమైతే నేనే హోం మంత్రి అయి చక్కదిద్దాల్సి ఉంటుంది’ అని ఆవేశంగా చెప్పుకొచ్చారు. జనవరి 10న సంక్రాంతి సంబరాల సందర్భంగా జరిగిన సభలో ‘పిఠాపురంలో గంజాయి, రౌడీయిజం, దొంగతనాలు పెరిగిపోతున్నాయని స్థానికుల ద్వారా తెలిసింది. వీటిని నియంత్రించకుంటే చర్యలు తీవ్రంగా ఉంటాయి’ అంటూ పోలీసులకు పవన్ ఏకంగా వార్నింగ్ కూడా ఇచ్చేశారు. ఇప్పుడు తన వెన్నంటి తిరిగే జిల్లా ముఖ్య నేతల కనుసన్నల్లో ఉండే అనుచరులు లారీలు ఎత్తుకుపోయే దొంగల ముఠాగా పోలీసు దర్యాప్తులో వెల్లడి కావడంపై పవన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ·˘ ´ùÎçÜ$Ë$ ¡VýS ÌêW™ól.. కదిలిన జనసేన డొంక ·˘ ÌêÈÌS ^øÈÌZ ç³r$tºyìl¯]l BÆý‡$VýS$Æý‡$ ·˘ ç³Æ>ÈÌZ E¯]l² Ð]l$Æø C§ýlªÇ° తప్పించాలంటూ ఒత్తిళ్లు ·˘ A…§ýlÆý‡* B ´ëÈt క్రియాశీలక కార్యకర్తలే.. ·˘ MîSÌSMýS ¯ól™èlÌSMýS$ çܰ²íßæ™èl$Ìôæ.. ·˘ °…¨™èl$ÌZÏ ముగ్గురు నేరచరితులేనన్న సీఐ ·˘ MýSÌSMýSÌS… Æó‡ç³#™èl$¯]l² దొంగల ముఠా బాగోతం -
కొన ఊపిరికి కొత్త ఊపిరి
కపిలేశ్వరపురం: ఆలోచన అయినా ఆచరణ అయినా బొందిలో ప్రాణం ఉన్నంత వరకే. మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులు తీసుకొన్న సామాజిక అవగాహనతో కూడిన నిర్ణయాలు మరణించిన వ్యక్తిని మరెన్నో తరాలు జీవించేలా చేస్తాయి. అలాంటి కోవలోకి వచ్చే అవయవదానం సామాజిక చైతన్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎంతోమంది తమ అవయవాలను దానం చేసి ఎంతోమందికి ప్రాణం పోశారు. నేడు ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా ఈ కథనం... పెరిగిన అవసరం భారతదేశంలో అవయవాలు సకాలంలో అందుబాటులో లేక రోజుకు 20 మంది చొప్పున చనిపోతున్నారని అంచనా ఉంది. ప్రతి పది నిమిషాలకు ఒకరు అవయవ మార్పిడి చేయించుకోవాల్సిన పరిస్థితి దేశంలో ఉంది. అవయవాలు అవసరమైన వారిలో పది శాతం మందికి కూడా అవి లభ్యం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అవయవదానం ప్రాధాన్యం పెరిగింది. సాహితీవేత్తలు, కమ్యూనిస్టు పార్టీ నాయకులు, సామాజిక కార్యకర్తలు మరణానంతరం తమ దేహాలను దానం చేస్తూ అంగీకార పత్రాలను రాసిన చరిత్ర ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకి ఉంది. చేయడం ఇలా.. : దాతలు జీవిస్తూనే వారి అవయవాలలో కొంత భాగాన్ని దానం చేస్తూ ఇతరులకు ఊపిరి పోస్తున్నారు. రక్తాన్ని, 50 శాతం కాలేయాన్ని, రెండింటిలో ఒక కిడ్నీని ఇతరులకు దానం చేయడం ఈ కోవలోనివే. మరొక పద్ధతిలో వారు చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యుల నిర్ణయంతో అవయవాలు దానం చేస్తున్నారు. బ్రెయిన్ డెత్ అయిన వ్యక్తుల్లో మొత్తం రెండు కిడ్నీలను, గుండెను, కాలేయాన్ని, ఊపిరితిత్తులను, ప్యాంక్రియాసిస్ గ్రంధిని వాటి పనితీరు సామర్థ్యాన్ని బట్టి ఇతరులకు దానం చేస్తున్నారు. తన దేహాన్ని మరణానంతరం వైద్య కళాశాల విద్యార్థుల పరిశోధన కోసం కళాశాలకు అప్పగించాలంటూ కొందరు ముందస్తు ఒప్పంద పత్రాన్ని రాస్తున్నారు. సహజ మరణం పొందిన వారి నుంచి కార్నియా, చర్మం, ఎముక, గుండె కవాటాలు, రక్తనాళాలు దానం చేసే వీలు ఉంది. చిరంజీవులయ్యారు మండపేట మండలం అర్తమూరు గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు కాకర శ్రీనివాసరావు ఈ ఏడాది జూలై 12న గుండెపోటుతో మృతిచెందగా ఆయన నేత్రాలను అనపర్తి రాధాకృష్ణ ఐ బ్యాంక్కు దానం చేశారు. తాళ్ళరేవు మండలం పి.మల్లవరం గ్రామానికి చెందిన ధూలిపూడి సీతారాం అనే మహిళ ఈ ఏడాది జులై 1న గుండెపోటుతో మరణించగా నేత్రదానం చేశారు. తాళ్లరేవు మండలం వూడా హిమావతి ఈ ఏడాది జనవరి 26న గుండెపోటుతో మరణించడంతో రెండు నేత్రాలను కాకినాడ బాదం ఐ బ్యాంక్కు దానం చేశారు. ద్రాక్షారామ పద్మ స్టూడియో అధినేత కె.వీర్రాజు ఈ ఏడాది మే 28న మృతి చెందగా కాకినాడ రెడ్ క్రాస్ ఐ బ్యాంకుకు రెండు కార్నియాలను దానం చేశారు. కరప మండలం పెనుగుదురు గ్రామానికి చెందిన పలపకూర వెంకట్రావు ఏడాది ఏప్రిల్ 26న గుండెపోటుతో మరణించగా కాకినాడ రెడ్ క్రాస్ ఐ బ్యాంకుకు రెండు కార్నియాలను దానం చేశారు. కె.గంగవరం గ్రామానికి చెందిన చింత చిన్నారి ఈ ఏడాది ఫిబ్రవరి 27న మృతి చెందగా రెండు నేత్రాలను కాకినాడ బాదం బాలకృష్ణ ఐ బ్యాంకుకు దానం చేశారు. ధన్య చరితులు.. పుణ్యమూర్తులు వారి త్యాగం చైతన్యానికి ప్రతీక కన్ను మూస్తూ.. మరొకరికి జన్మనిస్తున్న దాతలు నేడు ప్రపంచ అవయవదాన దినోత్సవం బ్రెయిన్ డెత్ కావడంతో... మండపేట మండలం ద్వారపూడి గ్రామానికి చెందిన యువకుడు నున్న శివన్నారాయణ (శివ) ఈ ఏడాది మే 25న రాజమహేంద్రవరం – ద్వారపూడి రహదారిలో ప్రమాదానికి గురికావడంతో బ్రెయిన్ డెత్ అయ్యింది. కుటుంబ సభ్యుల నిర్ణయంతో కాకినాడ ట్రస్ట్ ఆసుపత్రిలో అతని అవయవాలను దానం చేయడం ద్వారా ముగ్గురికి జీవితాన్ని ప్రసాదించాడు. లివరు, ఒక కిడ్నీని ట్రస్ట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి, మరో కిడ్నీని విశాఖపట్నం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి అమర్చారు. రెండు నేత్రాలలోని కార్నియాలను కాకినాడ బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్కు దానం చేశారు. నాన్న స్ఫూర్తితో దేహదానం చేశాం నాన్న మానవ సమాజం పట్ల అవగాహనతో జీవించారు. నా చిన్ననాటి నుంచీ అనేక విషయాలు బోధించారు. ఆయనతో పాటు అమ్మకు అవగాహన కల్పించి ఆమె దేహాన్ని కూడా దానం చేసేందుకు చైతన్య పర్చారు. ఆ స్ఫూర్తితో నేను, నా జీవిత భాగస్వామి కల్యాణి కూడా దేహదానం చేసేందుకు పత్రం రాశాం. – మేకా గౌరవ్, పిఠాపురం, కాకినాడ జిల్లావైద్య విద్యార్థుల పరిశోధన లక్ష్యంగా.. కపిలేశ్వరపురం మండలం అంగరకు చెందిన సీపీఎం సీనియర్ నాయకుడు, ఆలయ శిల్పి పెద్దింశెట్టి సూర్యనారాయణమూర్తి (91) 2021 డిసెంబర్ 8న వృద్ధాప్యంతో మృతి చెందారు. ఆయన జీవించి ఉండగానే 2009 నవంబర్ 22న కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలకు దేహదాన ఒప్పంద పత్రాన్ని రాసి ఇచ్చారు. కుటుంబ సభ్యులు ఆ మేరకు సూర్య నారాయణమూర్తి దేహాన్ని కళాశాలకు అప్పగించారు. పిఠాపురానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త, వజ్రాయుధం పుస్తక రచయిత ఆవంత్స సోమసుందర్ 2016 ఆగస్టు 12న వృద్ధాప్యంతో మృతి చెందగా ఆయన కుటుంబ సభ్యులు కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలకు దేహాన్ని అప్పగించారు. పిఠాపురం పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త మేకా సత్యనారాయణ శాస్త్రి (బాంబు) తానూ, తన భార్య అనూరాధ ఇద్దరూ తమ దేహాలను వైద్య కళాశాలకు రాసి ఇచ్చారు. కాగా 2022 ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డే రోజున సత్యనారాయణశాస్త్రి గుండెపోటుతో మరణించగా కుటుంబ సభ్యులు రాజానగరం జీఎస్ఎల్ కళాశాలకు దేహాన్ని అప్పగించారు. ఆ స్ఫూర్తితో అదేరోజు సత్యనారాయణ శాస్త్రి కుమారు డు గౌరవ్, కోడలు కల్యాణిలు తమ దేహాలను దానం చేసేందుకు ఒప్పంద పత్రాలను రాసి ఇచ్చారు. -
అలవాటుగా మారింది
చిన్నప్పటి నుంచి ఎడమ చేతితో రాయడం అలవాటైంది. ఏ పని చేయాలన్నా ఎడమ చేతితో చేయడం ఈజీగా అనిపిస్తోంది. బలమైన పనులన్నింటికీ ఎడమ చేతినే ఉపయోగిస్తాను. ఓ పని ప్రారంభిస్తే పూర్తయ్యే వరకు ఎడమ చేతితోనే చేస్తాను. – చింతలపూడి మంగాదేవి, పార్ట్టైమ్ ఇన్స్ట్రక్టర్, జీహెచ్ఎస్, అనాతవరం చిన్నప్పటి నుంచి అలవాటు ఎడమ చేతితో రాయడం, పనులు చేయడం చిన్నప్పటి నుంచి అలవాటు. ఇంట్లో పనులన్నీ ఎక్కువగా ఎడమ చేతితో చేయడం జరుగుతుంది. నాకు ఇద్దరు అబ్బాయిలు. వారికి ఈ అలవాటు రాలేదు. – సప్పా శాంతి, గృహిణి, కొంకుదురు మా అమ్మ నుంచి వచ్చింది ఎడమ చేతిరాత మా అమ్మకి ఉంది. మా అమ్మ నుంచి నాకు, అలాగే నా కూతురికి ఎడమ చేతి అలావాటు వచ్చింది. సూల్క్లో నేను డ్రాయింగ్ వేసేవాడిని. బహుమతులూ వచ్చాయి. ఇప్పడు పెయింట్ వేయడానికి ఉపయోగపడుతోంది. – కుక్కుల శివకృష్ణ, పెయింటర్, పందలపాక -
రూ.1.50 లక్షలవెండి కిరీటం సమర్పణ
అంబాజీపేట: గంగలకుర్రు అగ్రహారంలో ఉన్న పార్వతీ వీరేశ్వర స్వామివారికి దాతలు వెండి కిరీటం, ఆభరణాలను సోమవారం సమర్పించారు. గంగలకుర్రుకు చెందిన తనికెళ్ల సోమసూర్య సుబ్రహ్మణ్య విశ్వేశ్వరరావు కుమారులు వెంకటసత్య సూర్యనాగభూషణం, లక్ష్మీసూర్యపద్మ దంపతులు, తనికెళ్ల రామలక్ష్మి నరసింహమూర్తి, పద్మావతి దంపతులు, మనవలు దుర్గావిశ్వనాథం, మనవరాలు ఉమాభాను రూ.1.50 లక్షలతో తయారు చేయించిన వెండి కిరీటం, ఆభరణాలను పార్వతీ వీరేశ్వరస్వామి వారికి సమర్పించారు. అంతకుముందు వెండి వస్తువులను ఆలయ ప్రధానార్చకులు చంద్రమౌ ళీ సూర్యకామేష్ ప్రత్యేక పూజలు, సంప్రోక్షణ నిర్వహించి, స్వామివార్లకు అలంకరించారు. -
స్వామీ... నీ దయ రాదా!
● సత్యదేవుని సన్నిధిన శానిటరీ సిబ్బంది ఆకలి కేకలు ● అందని జూన్, జూలై జీతాలు ● నెలకు రూ.59 లక్షల చొప్పున 350 మంది సిబ్బందికి బకాయి అన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో పారిశుధ్య కార్మికులకు జీతాల చెల్లింపు సమస్య ఇంకా కొలిక్కి రాలేదు. జూన్, జూలై నెలల జీతాలు ఇంకా అందకపోవడంతో 350 మంది ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా ఎక్కువ మొత్తాలలో జీతాలు తీసుకునే వేతన జీవులకే ఒక నెల జీతం ఆలస్యం అయితే ఇబ్బంది పడతారు. ఈ ఎంఐలు, అద్దెలు, వివిధ చెల్లింపులు ఆలస్యం అవుతాయి. అటువంటిది చిన్నపాటి జీతం రెండు నెలలు నుంచి రాకపోతే వారి పరిస్థితి ఏమిటో ఊహించొచ్చు. ఐదు నెలలుగా ఇదే తంతు ఐదు నెలలుగా జీతాలు ఆలస్యం అవుతున్నాయి. పాత కాంట్రాక్ట్ సంస్థ కేఎల్టీఎస్ కాలపరిమితి ముగిసిన తరువాత మార్చి నెల నుంచి శానిటరీ కాంట్రాక్ట్ విజయవాడకు చెందిన కనకదుర్గా మేన్పవర్ సంస్థకు అప్పగించారు. మార్చి జీతాలు ఆలస్యమవడంతో అప్పట్లో సాక్షి దినపత్రికలో ఏప్రిల్ 25వ తేదీన ‘మాకు జీతాలు ఎప్పుడిస్తారు స్వామీ...? అంటూ వార్త ప్రచురితమవడంతో ఏప్రిల్ 30న అకౌంట్లో జీతాలు వేశారు. ఏప్రిల్ జీతాలు కూడా పడకపోవడంతో సాక్షి దినపత్రికలో మే నెల 26న ‘వీరి కష్టం తుడిచే వారేరీ!’ శీర్షికన కథనం ప్రచురించడంతో అధికారులు స్పందించి జీతాలు చెల్లించారు. మే నెల జీతాలు కూడా జూన్ రెండో వారంలో చెల్లించారు. జూలై నెలలో ఫేక్ పీఎఫ్ చలానాలు ఇచ్చారంటూ వివాదం రావడంతో ఆ చలానాలు వెరిఫై చేయడం, పీఎఫ్ కార్యాలయ సిబ్బంది తనిఖీలు, కాంట్రాక్టర్పై కేసులు, ఇద్దరి ఉద్యోగుల సస్పెన్షన్ వంటి పరిణామాలతో జూన్, జూలై జీతాలు ఇంకా చెల్లించలేదు. సెక్యూరిటీ కాంట్రాక్టర్తో జీతాలిప్పించే ప్రయత్నం విఫలం ఫేక్ పీఎఫ్ చలానాల ఆరోపణలతో కనకదుర్గ సంస్ధను పక్కన పెట్టి సెక్యూరిటీ కాంట్రాక్ట్ సంస్ధ ‘మాక్స్’ ద్వారా శానిటరీ సిబ్బందికి జీతాలిప్పించేందుకు కమిషనర్ కార్యాలయానికి ఫైలు పంపారు. దీనిపై కమిషనర్ అభ్యంతరం తెలిపారు. దీంతో మళ్లీ కనకదుర్గా సంస్థ ద్వారా జూన్, జూలై నెలలకు జీతాలిచ్చేందుకు వీలుగా ఆ సంస్థతో రెండు నెలల పీఎఫ్ కట్టించారు. రూ.30 లక్షల పీఎఫ్ సొమ్ము చెల్లించి ఆ రశీదులు దేవస్థానానికి ఆ సంస్థ ప్రతినిధులు జమ చేశారు. ఇది జరిగి వారం అయినా ఇంకా శానిటరీ సిబ్బంది అకౌంట్లలో జీతాలు పడలేదు. నెరవేరని కమిషనర్ హామీ ఈ నెల ఒకటో తేదీన అన్నవరం దేవస్థానానికి వచ్చిన దేవదాయశాఖ కమిషనర్ కే రామచంద్రమోహన్ను శానిటీరి సిబ్బంది కలిసి తమ జీతాలు చెల్లింపుపై వినతి పత్రం సమర్పించారు. రెండు, మూడు రోజుల్లో జీతాలు చెల్లించే ఏర్పాటు చేయిస్తానని కమిషనర్ హామీ ఇచ్చారు. నెలకు రూ.59 లక్షల చొప్పున 350 మంది సిబ్బందికి రెండు నెలల జీతాలు చెల్లించాల్సి ఉంది. అయినా 11వ తేదీ వచ్చినా జీతాలు చేతికి అందడం కాదు కదా ఇంకా జీతాల బిల్లు సిద్ధం కాలేదని తెలిసింది. మరో వారం పడుతుందా? జీతాలు బిల్లు తయారైతే అది ఆడిట్కు వెళ్లి అక్కడ ఏ కొర్రీలు పడకుండా మళ్లీ దేవస్థానానికి వచ్చి ఆ తరువాత బిల్లు పాస్ అవ్వాలి. ఆ బిల్లుపై చెక్కు తయారు చేస్తే దానిపై ఈఓ సంతకం చేసి సంబంధిత మొత్తాన్ని ఆన్లైన్లో కాంట్రాక్టర్కు ట్రాన్స్ఫర్ చేస్తే ఆ కాంట్రాక్టర్ 350 మంది సిబ్బంది అకౌంట్లలో జమ చేయాలి. ఇదంతా జరగడానికి కనీసం వారం నుంచి పది రోజుల సమయం పడుతుంది. అంటే ఆగస్టు 20 తేదీ తరువాతనే పారిశుధ్య కార్మికులకు జీతాలు అందే అవకాశం ఉందని అర్థమవుతోంది. -
లెఫ్ట్ అయినా రైటే..
● ఎడమ చేతి వాటం జాబితాలో ఎందరో ప్రముఖులు ● కళ, క్రీడ, సంగీత, రాజకీయ రంగాల్లో అద్భుత రాణింపు ● రేపు లెఫ్ట్ హ్యాండర్స్ డే రాయవరం/బిక్కవోలు: కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్.. అన్నాడో సినీ కవి. కుడి ఎడమైతే గ్రహపాటు కాదోయ్ అంటున్నారు లెఫ్ట్ హ్యాండర్స్. మానవ శరీరంలో గుండె ఎడమ వైపు ఉంటుంది. ఎడమ చేతితో రాసేవారు తమ హదయ స్పందనను కచ్చితంగా అక్షర బద్ధం చేయగలరని ప్రముఖ విద్యా, మనో వైజ్ఞానిక శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్ వ్యాఖ్యానించారు. ఆయన అభిప్రాయం ప్రకారం.. ప్రపంచంలో ఉన్నత పదవులు అలంకరించిన వారిలో సగానికి పైగా ఎడమ చేతి వాటం వారే. బుధవారం ప్రపంచ లెఫ్ట్ హ్యాండర్స్ డే సందర్భంగా ఈ ప్రత్యేక కథనం. భిన్నమైన శైలి సాధారణంగా ఏ పనైనా కుడి చేత్తో చేయడం అలవాటు. ప్రపంచంలో 87 శాతం మంది కుడి చేత్తో పనులు చేస్తుంటే, 12 శాతం మంది ఎడమ చేత్తో చేస్తారని సర్వేల్లో వెల్లడైంది. మిగిలిన ఒక శాతం మంది రెండు చేతులను వినియోగించడంలో సామర్థ్యాన్ని కనబరుస్తారు. దేశంలో 5.20 శాతం మంది మాత్రమే ఎడమ చేతి వాటం కలిగి ఉన్నారు. కుడిచేతి వాటం వారి కన్నా, ఎడమ చేతి వాటం వారు ప్రత్యేక స్థానాల్లో ఉంటారని, వారి మేధోశక్తి, ఆలోచనలు, తెలివితేటలు భిన్నంగా ఉంటాయని నిపుణుల అంచనా. ప్రస్తుతం ప్రపంచంలో గుర్తింపు పొందిన మేధావుల్లో చాలా మంది ఎడమ చేతి వాటం వారు కావడం విశేషం. ప్రతిభ, సృజనాత్మకత, ఏ రంగంలోనైనా రాణించే శక్తి సామర్థ్యాలు ఎడమ చేతి వాటం వారిలోనే ఎక్కువని నాడీ శాస్త్రం కూడా చెబుతుందంటారు. జిల్లా జనాభాలో సుమారు 3.01 లక్షల మంది ఎడమ చేతి వాటం వారున్నట్టు ఓ అంచనా. ప్రముఖుల్లో కొందరు ప్రముఖ తత్వవేత్త అరిస్టాటిల్, చంద్రుడిపై మొట్టమొదట కాలుమోపిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్, మోనాలిసా సృష్టికర్త లియోనార్డ్ డావెన్సీ, అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, బిల్క్లింటన్, ప్రధాని నరేంద్రమోదీ, పారిశ్రామికవేత్త రతన్టాటా, మాజీ క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, యువరాజ్సింగ్, సినీ నటుల్లో అమితాబ్ బచ్చన్, సావిత్రి ఇలా ఎడమచేతి వాటమున్న ప్రముఖులే. అలాగే పలువురు కళా, క్రీడా, సంగీత రంగాల్లో రాణిస్తూ లెఫ్ట్.. బట్ వియ్ ఆల్వేస్ రైట్ అనిపించుకుంటున్నారు. ఇబ్బందులూ తప్పవు! ఎడమ చేతి వాడకంపై లాభనష్టాలు, ఇబ్బందులపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎడమచేతి వాటం ఉన్న వారెంతో అదృష్టవంతులని కొందరంటుంటారు. అటువంటి వారు ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తులుగా ఎదిగారని చెబుతారు. శుభకార్యాల్లో ఎడమ చేతి వినియోగాన్ని మన సంప్రదాయాలు అంగీకరించవు. ఇటువంటి సందర్భాల్లో ఆ అలవాటు ఉన్నవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూజలు, శుభకార్యాలు, డబ్బు చేతులు మారేటప్పుడు కుడి చేతినే ఉపయోగిస్తారు. పాఠశాలల్లో విద్యార్థుల కుర్చీలకు కుడిచేతివైపు రాయడానికి వీలుగా అట్టలు అమరుస్తారు. డ్రైవర్లకు కుడిచేతి వాటానికి అనుకూలంగా హారన్ వంటివి ఉంటాయి. జన్యు ప్రభావం కూడా.. పుట్టినప్పటి నుంచే కుడి, ఎడమ చేతి వాటాలను సహజసిద్ధంగా కలిగి ఉంటారని సైన్స్ చెబుతోంది. మనిషికి మెదడు కుడి, ఎడమ రెండు అర్ధ భాగాలుగా ఉంటుంది. కుడి వైపు శరీర భాగాన్ని మెదడు ఎడమ వైపు భాగం నియంత్రిస్తుందని, మెదడు కుడి అర్ధ భాగం బలంగా ఉన్న వారిలో ఎడమ చేతి వాటం వస్తుందని నిపుణులు చెబుతున్నారు. చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు ఎడమ చేతి వాటం గమనిస్తే.. దానిని మాన్పించేందుకు యత్నిస్తుంటారు. జన్యుపరమైన మార్పులు ఉన్నప్పుడు అలా మాన్పించడం సాధ్యం కాదంటున్నారు. -
వాడపల్లి ఆలయానికి బ్యాటరీ కార్లు
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ రెండు బ్యాటరీ కార్లు అందజేసింది. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి క్షేత్రానికి వేలాదిగా భక్తులు తరలివస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగుల సౌకర్యార్థం మెర్లపాలెం గ్రామానికి చెందిన జేఎస్ఎన్ రాజు కన్స్ట్రక్షన్ కంపెనీ వారు రూ.12 లక్షలు విలువైన రెండు కార్లను అందజేసినట్టు దేవదాయ, ధర్మాదాయ శాఖ డీసీ, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. ఈ కార్లను ఈ నెల 15న ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభిస్తారని చెప్పారు. -
రంగస్థలంపై సానా పంతం!
పొరుగువారు హాజరు.. ఇరుగు వారే రాలేదు! జనసేన ఎమ్మెల్యే నానాజీతో పాటు టీడీపీ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కూడా ఈ కార్యక్రమానికి దూరంగానే ఉన్నారు. వాస్తవానికి సిటీ ఎమ్మెల్యే వనమాడి సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి సతీష్తో ఉప్పు, నిప్పుగా ఉంటున్నారు. ఎన్నికల ముందు నుంచి ఏ పార్టీలో చేరకుండా స్వచ్ఛంద సంస్థ పేరుతో కాకినాడ సిటీలో కార్యక్రమాలు చేస్తూ, తన వర్గీయులతో టచ్లో ఉంటున్నారనే సమాచారం తెలియడంతో కొండబాబుకు సతీష్ పొడ గిట్టలేదు. సిటీ నియోజకవర్గ పరిధిలో లేకున్నప్పటికీ ఆర్ఎంసీ గ్రౌండ్ సిటీ, రూరల్ రెండు నియోజకవర్గాలకే పరిమితం కాదనేది వాస్తవం. పొరుగున ఉన్న పిఠాపురం నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్వర్మ హాజరవ్వడం, ఇరుగు,పొరుగున ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు నానాజీ, కొండబాబు పునఃప్రారంభోత్సవానికి హాజరుకాకపోవడంపై కూటమిలో విస్తృతమైన చర్చ నడుస్తోంది. ఎంత మంది వద్దన్నా లెక్క చేయకుండా రంగరాయ వైద్య కళాశాల గ్రౌండ్లో వాకర్స్కు బలవంతంగా అనుమతివ్వడమే పెద్ద తప్పు. అటువంటి గ్రౌండ్పై ఆధిపత్యం కోసం నిస్సిగ్గుగా ఇప్పుడు కూటమి నేతలు కుమ్ములాడుకోవడంపై మేధావి వర్గం విస్మయం వ్యక్తం చేస్తోంది. ఆర్ఎంసీ క్రీడాప్రాంగణం ఆర్ఎంసీ క్రీడాప్రాంగణం ముఖద్వారం● రంగరాయ వైద్య కళాశాల గ్రౌండ్పై పెత్తనం వెనుక దూరాలోచన ● ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు ● గ్రౌండ్లో వాకర్స్కు అనుమతిపై పలువురి ఆక్షేపణ ● ఇద్దరు ఎమ్మెల్యేల గైర్హాజరుపై చర్చ సాక్షి ప్రతినిధి, కాకినాడ: రంగరాయ వైద్య కళాశాల గ్రౌండ్లో కూటమి నేతలు రాజకీయ కుస్తీలకు సై అంటున్నారు. ఆరు దశాబ్దాల పైబడి చరిత్ర కలిగిన రంగరాయ వైద్యకళాశాలకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. అందుకే దేశంలోని పలు రాష్ట్రాల విద్యార్థులు ఆర్ఎంసీలో సీటు వచ్చిందంటే చాలా సంబర పడతారు. ఎంబీబీఎస్, పీజీ, పారా మెడికల్ కోర్సులు కలిపి సుమారు 2,000 మంది విద్యార్థులకు సరస్వతి నిలయంగా ఆర్ఎంసీ విరాజిల్లుతోంది. ఇంతటి ప్రాముఖ్యం కలిగిన ఆర్ఎంసీని కూటమి నేతలు రాజకీయ వేదికగా మార్చేశారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఆధిపత్యం కోసం ఆర్ఎంసీని పావుగా వాడుకుంటున్నారని మెడికోలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఎంసీలో విద్యార్థుల కోసం ఉన్న 14 ఎకరాల విశాలమైన ఆటస్థలంలో బయటి వ్యక్తులను వాకింగ్ ట్రాక్ కోసం అనుమతించడంపై కూటమి నేతల మధ్య వార్ నడుస్తోంది. వాకర్స్కు మళ్లీ అనుమతిపై వ్యతిరేకత ఆర్ఎంసీలోని అన్ని విభాగాలకు చెందిన వైద్య విద్యార్థుల కోసం ఏర్పాటైన ఈ గ్రౌండ్లో బయట వ్యక్తులు చొరబడి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చేశారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఆ గ్రౌండ్లో ఆటలాడుకునే వైద్య విద్యార్థినులకు రౌడీమూకల నుంచి వేధింపులు ఎక్కువవ్వడంతో మెడికోలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బయట వారిని అనుమతించవద్దని విద్యార్థుల డిమాండ్పై కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ అనుచరులను వెంటేసుకుని గ్రౌండ్కు వెళ్లి నానా రాద్ధాంతం చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఎమ్మెల్యే నానాజీ ఆర్ఎంసీ స్సోర్ట్స్ ఇన్చార్జి, ఫోరెన్సిక్ హెచ్ఓడీ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై చేయిచేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనమైంది. అప్పట్లో కూటమి పెద్దలు జోక్యం చేసుకుని జిల్లా అధికారుల ద్వారా ఒత్తిడి తీసుకువచ్చి నానాజీతో డాక్టర్ ఉమామహేశ్వరరావుకు క్షమాపణ చెప్పడంతో సమస్యను సర్దుబాటు చేయడం తెలిసిందే. ఇంత రాద్ధాంతం జరిగినా రెండురోజుల క్రితం ఆర్ఎంసీ గ్రౌండ్స్లో వాకర్స్ను కొన్ని షరతులకు లోబడి తిరిగి అనుమతించడాన్ని దాదాపు అన్ని వర్గాలు ఆక్షేపిస్తున్నాయి. అదీ కూడా అధికారాన్ని ఉపయోగించి ఉన్నత స్థాయి నుంచి జిల్లా యంత్రాంగం, ఆర్ఎంసీ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి మరీ అనుకున్నది సాధించుకున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే మధ్య వైరుధ్యాలు? గ్రౌండ్స్లో వాకర్స్ను అనుమతించే వరకు పట్టువదలని విక్రమార్కులు మాదిరి కలిసి పనిచేసిన జనసేన ఎమ్మెల్యే నానాజీ, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్బాబు మధ్య వైరుధ్యాలు పొడచూపాయని కూటమి నేతల మధ్య చర్చ నడుస్తోంది. గ్రౌండ్లో వాకర్స్కు అనుమతి సాధించడం వెనుక కృషి, క్రెడిట్ తమ నేతదంటే తమ నేతదంటూ పంతం, సతీష్ వర్గాలు ప్రచారం చేసుకుంటున్నాయి. గ్రౌండ్లో వాకర్స్ను అనుమతించక పోవడంపై ఫ్రొఫెసర్ ఉమామహేశ్వరరావుపై దాడికి పాల్పడిన ఉదంతంతో రాష్ట్ర స్థాయిలో తమ నాయకుడు అప్రతిష్టపాలయ్యారని నానాజీ వర్గీయులు పేర్కొంటున్నారు. తమ నాయకుడు పట్టుబట్టి సాధిస్తే మధ్యలో వచ్చి ఆ క్రెడిట్ను ఎంపీ సతీష్బాబు ఎగరేసుకుపోయారని నానాజీ వర్గం మండిపడుతోంది. ఆర్ఎంసీ గ్రౌండ్స్పై ఆధిపత్యం కోసం అంతలా సతీష్బాబు తాపత్రయపడటం వెనుక దూరదృష్టి లేకపోలేదంటున్నారు. ఐపీఎల్ మ్యాచ్లను క్రికెట్ అభిమానులు తిలకించేందుకు ఫ్యాన్పార్క్లు ఇప్పటి వరకు మెట్రోపాలిటిన్ సిటీల్లో మాత్రమే అనుమతించే వారు. అటువంటిది కాకినాడ సిటీలో తొలిసారి సతీష్ తీసుకురావడం ముందస్తు వ్యూహంలో భాగమేనంటున్నారు. అందునా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా (ఈ నెల 16న జరగనున్న ఎన్నికలకు సతీష్బాబు ఒక్కరే నామినేషన్ వేశారు) ఏకగ్రీవం కానున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ (బోర్డు ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఆఫ్ ఇండియా) నుంచి దండిగా నిధులు వచ్చే అవకాశం ఉంది. అలాగే జిల్లా క్రికెట్ అసోసియేషన్కు వార్షిక నిర్వహణ నిధులు రెట్టింపు చేయడం వంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇవన్నీ ఉండబట్టే ఆర్ఎంసీ గ్రౌండ్స్పై ఆధిపత్య పోరులో సతీష్బాబు ముందున్నారని నానాజీ వర్గీయులు అభిప్రాయపడుతున్నారు. ‘వ్రతం చెడినా ఫలం దక్కకే’ వాకర్స్ను అనుమతించే కార్యక్రమ పునఃప్రారంభోత్సవానికి తమ నేత డుమ్మా కొట్టారని ఆ వర్గం పేర్కొంటోంది. -
జీజీహెచ్లో మత కార్యకలాపాలపై నిషేధం
అధికారులు, సిబ్బందికి సర్క్యులర్ జారీ కాకినాడ క్రైం: జీజీహెచ్లో ఎప్పటికప్పుడు తీవ్ర వివాదాలకు కారణమవుతున్న మత కార్యకలాపాలపై నిషేధాన్ని విధిస్తూ కలెక్టర్ షణ్మోహన్ సూచనలతో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం ఆర్సీ.నం.18/ఏవో/2025తో సర్క్యులర్ జారీ చేశారు. అంతకుముందు హెడ్ నర్సులు, ఆసుపత్రి అధికారులతో సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో అంతర్గత సమావేశం నిర్వహించారు. రాజ్యాంగ సూత్రాలకు లోబడి లౌకికవాదం అనుసరించాల్సిన ఆసుపత్రి, ఆవరణలో, తటస్థత, సమగ్రత తప్పనిసరి అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వార్డులు, కార్యాలయాలతో పాటు ఆసుపత్రి సంబంధిత ఇతర ప్రాంతాలలో మతపరమైన కార్యకలాపాలు అంటే పూజలు, ప్రార్థనలు, ఉత్సవాలు, సమావేశాలు, ఊరేగింపులు, ప్రచారాలు, బోధనలు నిర్వహించడం, ప్రోత్సహించడం, వాటిలో పాల్గొనడం పూర్తిగా నిషేధం. మత సంబంధిత పుస్తకాలు, కరపత్రాలు, బ్యానర్లు, చిత్రాలు, వాల్ పోస్టర్లు చూపడం, పంచడం చేయకూడదు. ఈ ఆదేశాలు ఆసుపత్రి సిబ్బంది, అధికారులు, మెడికల్, పారామెడికల్, అడ్మినిస్ట్రేటివ్, సహాయక, అనుబంధ విభాగాలలో పనిచేస్తున్న వారితోపాటు ఆసుపత్రిలోకి ప్రవేశించే ఇతరులకూ వర్తిస్తాయి. ఈ ఉత్తర్వులు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఎయిడ్స్ నియంత్రణ పోస్టర్ ఆవిష్కరణ కాకినాడ సిటీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు జిల్లాలో డిస్ట్రిక్ట్ ఇంటిగ్రేటెడ్ స్టాటజీ ఫర్ హెచ్ఐవీ, ఎయిడ్స్ అనుసంధానంతో ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్ ప్రోగ్రామ్స్ పోస్టర్ను కలెక్టర్ షణ్మోహన్ సగిలి సోమవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. హైరిస్క్ మండలాల్లోని గ్రామాల్లో హెచ్ఐవీ, ఎయిడ్స్ వ్యాప్తి నివారణ, ఉన్న అపోహలు తొలగించినందుకు అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తామని కలెక్టర్ వివరించారు. హెచ్ఐవి జీవిస్తున్న వారికి మందులు ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా అందిస్తున్నామన్నారు. యువతలో హెచ్ఐవి ఎయిడ్స్పై పూర్తి అవగాహన కలిగించేందుకు జిల్లాలో ఉన్న కాలేజీల్లో, హైస్కూళ్లలో రెడ్ రిబ్బన్ క్లబ్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ 1097 టోల్ఫ్రీని ఏర్పాటు చేసినట్లు వివరించారు. జేసీ రాహుల్ మీనా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి జె.నరసింహనాయక్, జిల్లా లెప్రసీ ఎయిడ్స్ అండ్ టీబీ అధికారి ఐ ప్రభాకరరావు, జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ పి బాలాజీ పాల్గొన్నారు. పీజీఆర్ఎస్కు 441 అర్జీలు కాకినాడ సిటీ: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో అందిన అర్జీలకు సంతృప్తికరమైన పరిష్కారాలు చూపాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్ సోమవారం కాకినా కలెక్టరేట్లోని వివేకానంద హాలులో నిర్వహించారు. కలెక్టర్ షణ్మోహన్, జేసీ రాహుల్ మీనా, ట్రైనీ కలెక్టర్ మానీషా, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకటరావు, హౌసింగ్ పీడీ ఎన్వీవీ సత్యనారాయణ, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎ శ్రీనివాసు, సీపీవో పి త్రినాథ్లతో కలిసి హాజరై ప్రజల నుంచిఅర్జీలు స్వీకరించారు. ఈ అర్జీలపై విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని అధికారులను ఆదేశించారు. బియ్యం కార్డు మంజూరు, కార్డులోని పేర్ల మార్పులు చేర్పులు, పింఛన్లు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, ఇళ్ల స్థలాలు, భూమి వివరాలు ఆన్లైన్లో నమోదు, రీ సర్వే, ఆక్రమణల తొలగింపు, డ్రైన్, కాలువల్లో పూడిక తొలగింపు, పారిశుధ్యం, తల్లికి వందనం ఆన్లైన్ సమస్యలు వంటి అంశాలకు చెందిన మొత్తం 441 అర్జీలు అందాయి. పారదర్శకంగా ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ జిల్లా క్రీడామైదానంలో జరుగుతున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ పారదర్శకంగా జరుగుతుందని విశాఖ ఆర్మీ విభాగం సోమవారం ఒక ప్రకటలో తెలిపింది. విశాఖ ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ర్యాలీలో అభ్యర్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారని తెలిపారు. ఈనెల 5 న ప్రారంభమైన ఈ ర్యాలీ 21 వరకు కొనసాగుతుందన్నారు. అగ్రివీర్ విభాగాల్లో స్టోర్ కీపర్, టెక్నికల్ క్లర్క్, జనరల్ డ్యూటీ, ట్రేడ్స్ మెన్ విభాగాలకు ఈ రిక్రూట్మెంట్ర్యాలీ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కలెక్టర్, లోకల్ ఆర్మీ అధికారుల పర్యవేక్షణలో మెరిట్ ఉన్న అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. -
ఫైనల్స్ దశలో జాతీయ హాకీ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 15వ జాతీయ జూనియర్ మహిళల హాకీ పోటీలు ఆదివారం కాకినాడ డీఎస్ఏలో సెమీఫైనల్స్ పూర్తి చేసుకుని ఫైనల్స్కు చేరుకున్నాయి. సెమీఫైనల్స్లో రెండు మ్యాచ్లు నిర్వహించారు. ఆదివారం నిర్వహించిన మ్యాచ్లను హాకీ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ నిరంజన్రెడ్డి ప్రారంభించారు. మొదటి సెమీఫైనల్స్లో హర్యానా, ఛత్తీస్గఢ్ పోటీపడగా హర్యానా 3–0 స్కోర్తో విజయం సాధించి ఫైనల్స్కు చేరుకుంది. రెండో సెమీఫైనల్స్ జార్ఖండ్, ఉత్తర్ప్రదేశ్ మధ్య జరుగగా జార్ఖండ్ 3–0 స్కోర్తో గెలుపొంది ఫైనల్స్కు చేరింది. మూడోస్థానానికి మంగళవారం ఛత్తీస్గఢ్, ఉత్తర్ప్రదేశ్ జట్లు పోటీ పడనున్నాయి. ఫైనల్స్ హర్యానా, జార్ఖండ్ జట్ల మధ్య నిర్వహించనున్నారు. క్రీడాకారులకు సోమవారం విశ్రాంతిరోజు. డీఎస్డీఓ బి.శ్రీనివాస్కుమార్, హాకీ సంఘ కార్యదర్శి హర్షవర్దన్, కోశాధికారి పి.థామస్, భవానీశంకర్, వి.రవిరాజు పోటీలను పర్యవేక్షించారు. -
స్నానానికి వెళ్లి అనంతలోకాలకు..
రాజమహేంద్రవరం రూరల్: స్నేహితులతో కలిసి గోదావరి స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తూ మునిగి మృత్యువాత పడడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బొమ్మూరు రాఘవేంద్రనగర్ కాలనీకి చెందిన ఊట వంశీకృష్ణ(18) శనివారం సాయంత్రం స్నేహితులతో కలిసి పుష్కరాలరేవులో గోదావరి స్నానానికి వెళ్లాడు. స్నేహితులతో కలిసి స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తూ మురళీకృష్ణ మునిగిపోయాడు. రాత్రంతా గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం 10.00 గంటల సమయంలో కుమారి టాకీస్ సమీపంలో దోభీఘాట్ వద్ద మురళీకృష్ణ మృతదేహం లభించింది. టుటౌన్ పోలీస్స్టేషన్ ఎస్సై అశ్వక్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. ఉన్నత చదువులు చదువుతాడని... మురళీకృష్ణ తండ్రి శ్రీను ఎస్వీజీ మార్కెట్లో జట్టుకూలీగా పనిచేస్తుంటాడు. తనలాగా తన కొడుకు ఉండకూడదని మురళీకృష్ణను స్థానికంగా ఉన్న ప్రైవేటు జూనియర్ కాలేజీలో జాయిన్చేసి చదివిస్తున్నాడు. ప్రస్తుతం సెకండియర్ చదువుతున్నాడు. బాగా చదువుకుని ఉన్నతస్థాయికి వెళతావనుకుంటే మా అందరిని వదిలేసి వెళ్లిపోయావేంటి వంశీ అంటూ శ్రీను దంపతులు రోదిస్తున్న తీరు చూపరులకు కంటతడి పెట్టించింది. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
అన్నదమ్ముల మధ్య విభేదాలతో మనస్తాపం నిడదవోలు: పెరవలి మండలం ఉసులుమర్రు గ్రామానికి చెందిన తానేటి శ్రీనివాస్ (42) ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. అన్నదమ్ముల మధ్య ఏర్పడ్డ చిన్నపాటి విభేదాలతో మనస్తాపం చెందిన శ్రీనివాస్ ఈనెల 8న పురుగు మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాధితుడిని వెంటనే కుటుంబ సభ్యులు తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న శ్రీనివాస్కు భార్య భాగ్యలక్ష్మితో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెరవలి ఎస్సై ఎం. వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సెమీస్ దశలో సీబీఎస్సీ బ్యాడ్మింటన్ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ సురేష్నగర్లో శ్రీప్రకాష్ స్కూల్లో జరుగుతున్న రాష్ట్రస్థాయి సీబీఎస్సీ క్లస్టర్ బ్యాడ్మింటన్ పోటీలు రెండో రోజు ఆదివారం క్వార్టర్స్ దశ పూర్తి చేసుకుని సెమీస్ దశకు చేరుకున్నాయి. అండర్–14, 17, 19 విభాగాల్లో క్రీడాకారులు ప్రత్యర్ధులతో తలపడ్డారు. జిల్లా బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలకు పరిశీలకునిగా గణేష్, జాతీయస్థాయి రిఫరీలుగా శ్రీనివాస్, భద్రంల పర్యవేక్షణలో పోటీలు జరుగుతున్నాయి. ప్రిన్సిపాల్ శ్రీదేవి, డైరెక్టర్ విజయ్ ప్రకాష్ ఆదివారం మ్యాచ్లను ప్రారంభించారు. సెమీస్కు చేరిన జట్ల వివరాలు అండర్–14 బాలుర విభాగంలో.. సిల్వర్ హోక్స్ స్కూల్ (హైదరాబాద్), ఇండస్ యూనివర్సల్ స్కూల్ (హైదరాబాద్), సీఆర్రెడ్డి పబ్లిక్ స్కూల్(ఏలూరు), మౌంట్లిటిరా జి.స్కూల్ (మణికొండ) అండర్–17 బాలుర విభాగంలో .. గాడియమ్ స్కూల్ (హైదరాబాద్), పల్లవి మోడల్ స్కూల్ (సికింద్రాబాద్), ఎస్టిజోసెఫ్ ఇంగ్లిష్ స్కూల్(కర్నూల్), డీపీఎస్ (ఆనందపురం, వైజాగ్) అండర్–19 బాలుర విభాగంలో.. నీలకంత విద్య పీట్ (తెలంగాణ), సిల్వర్ హోక్స్ స్కూల్ (హైదరాబాద్), వికాస్ ద కాన్సెప్ట్ స్కూల్(హైదరాబాద్), హ్యాపీ వాలీ స్కూల్ (విజయవాడ) -
చెట్టుపై నుంచి పడి దింపు కార్మికుడి మృతి
కొత్తపేట: కొబ్బరి కాయల దింపు కోసం చెట్టు ఎక్కిన కార్మికుడు ప్రమాదవశాత్తూ కింద పడి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆత్రేయపురం మండలం వసంతవాడ గ్రామానికి చెందిన కారింకి వీరవెంకట సత్యనారాయణ (పండు) (42) కొబ్బరి దింపు కార్మికుడు. ఆదివారం మధ్యాహ్నం గ్రామంలో కొబ్బరి దింపు కోసం చెట్టు ఎక్కి కింద పడి మృతి చెందాడు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం కోసం కొత్తపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాము తెలిపారు. గ్రామంలో విషాద ఛాయలు దింపు కార్మికుడు పండు మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పండుకు భార్య, కుమారుడు ఉన్నారు. ఆ కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్రంగా రోదించారు. అందరితో కలసిమెలసి ఉంటూ, సహచర దింపు కార్మికులకు అండగా ఉండే పండు మృతి చెందాడని తెలిసి పలువురు గ్రామస్తులు, దింపు కార్మికులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కేవలం కొబ్బరి దింపులు తీసుకుంటూ జీవనం సాగించే అతని మృతితో ఆ కుటుంబం జీవనాధారం కోల్పోయింది. ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు. అమ్మమ్మ చెంతకు చేరిన బాలిక సామర్లకోట: వరుసగా మూడురోజుల పాటు సెలవులు రావడంతో ఆయా ప్రాంతాలకు తిరిగి వెళ్లడానికి రైల్వే స్టేషన్, బస్సు కాంప్లెక్స్లు ఆదివారం ప్రయాణికులతో నిండి పోయాయి. ఈ తరుణంలో ఆదివారం జోన్నాదుల వెంకటసాయమ్మ తన మనువరాలు జ్యోత్స్నతో కలిసి చీరాలకు వెళ్లడానికి రైల్వే స్టేషన్కు వచ్చింది. టిక్కెట్టు తీసుకొవడానికి కౌంటర్ వద్దకు వెళ్లిన సమయంలో జనంతో కలిసి జ్యోత్స్న ఒకటవ నెంబరు ప్లాటుఫారంపైకి వచ్చింది. అక్కడ అమ్మమ్మ కనిపించక పోవడంతో ఏడుస్తూ ఉండటాన్ని స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సూపరింటెండెంట్ అనంత లక్ష్మీ గమనించారు. రైల్వే స్టేషన్లోని మైక్ ద్వారా ప్రకటించారు. అప్పటికే టిక్కెటు తీసుకున్న వెంకటసాయమ్మ మనవరాలి కొసం కౌంటర్ వద్ద వెతుకుతూ ఉంది. ఈ తరుణంలో మైక్ ద్వారా సమాచారం రావడంతో ఊపిరి పీల్చుకుని స్టేషన్ సూపరింటెండెంట్ కార్యాలయానికి వెళ్లింది. అచ్చట స్టేషన్ మేనేజరు ఎం రమేష్ కౌన్సెలింగ్ చేసి బాలికను ఆర్పీఎఫ్ సిబ్బంది సమక్షంలో వెంకటసాయమ్మకు అప్పగించారు. -
పరిశోధనలకు ప్రోత్సాహం ప్రయాస్
ప్రధాన తేదీలు దరఖాస్తు చేసేందుకు గడువు: ఆగస్టు 17 దరఖాస్తుల స్క్రీనింగ్: సెప్టెంబర్ 15 జ్యూరీ ఎంపిక గడువు: సెప్టెంబర్ 30 ఫలితాల ప్రకటన: అక్టోబర్ 15 ఎంపికై న ప్రాజెక్టుల ప్రారంభం: అక్టోబర్ 16 ప్రాజెక్టు ముగింపు తేదీ: అక్టోబర్ 16, 2026. రిపోర్టు సబ్మిషన్: అక్టోబర్ 20, 2026. ● దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం ● శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించడమే లక్ష్యం రాయవరం: విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించడానికి, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇన్స్ఫైర్ మనాక్, జాతీయ సైన్స్ దినోత్సవం వంటి కార్యక్రమాలను అమలు చేస్తోంది. సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారాలను కనుగొనేందుకు విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మక ఆలోచనలకు పదును పెట్టేందుకు ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంటోంది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ)– ప్రమోషన్ ఆఫ్ రీసెర్చ్ యాటిట్యూడ్ అమాంగ్ యంగ్ అండ్ యాస్పైరింగ్ స్టూడెంట్స్ (ప్రయాస్) పథకాన్ని ఎప్పటి నుంచో అమలు చేస్తోంది. అందులో పరిశోధన ప్రాజెక్టు ప్రతిపాదనలను ఆహ్వానించేందుకు దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించింది. అర్హతలు – నిబంధనలు ● ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న 9, 10 తరగతులు, ఇంటర్మీడియెట్ ఫస్టియర్ చదువుతున్న అన్ని యాజమాన్యాల పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు దరఖాస్తు చేసుకునే అవకాశముంది. ఒక పాఠశాల నుంచి ఒకరు లేదా ఇద్దరు విద్యార్థులు పాల్గొనవచ్చు. పాఠశాలల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదా గణితం బోధించే పీజీటీ/టీజీటీ ఉపాధ్యాయుడు, ఏదైనా ఒక ఉన్నత విద్యా సంస్థ, పరిశోధన సంస్థ నిపుణుడితో కలిసి పరిశోధన ప్రాజెక్టును సమర్పించాలి. ● ఒక పాఠశాల నుంచి ఒక దరఖాస్తును మాత్రమే పరిశీలిస్తారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వీలుంది. పూర్తి సమాచారాన్ని ఎన్సీఈఆర్టీ అధికారిక వెబ్సైట్లో పరిశీలించవచ్చు. ● విద్యార్థులకు సైన్స్ ఉపాధ్యాయుడు గైడ్ టీచర్గా వ్యవహరిస్తారు. ఉన్నత విద్యాసంస్థల సైన్స్ సబ్జెక్ట్ నిపుణుల నుంచి సాంకేతిక సహకారం, మార్గదర్శకత్వాన్ని విద్యార్థులు పొందవచ్చు. మంచి ప్రాజెక్టులను ఎంపిక చేసుకోవాలి ప్రతి పాఠశాల నుంచి విద్యార్థులు ప్రాజెక్టుల రూపకల్పనలో భాగస్వాములు అయ్యే విధంగా సైన్స్ ఉపాధ్యాయులు మార్గదర్శకత్వం చేయాలి. జాతీయ స్థాయిలో ప్రాజెక్టులు ఎంపికవ్వాలంటే సమస్యను ప్రతిబింబించడంతో పాటుగా, మంచి పరిష్కారాన్ని చూపించాలి. ప్రతి ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులను ప్రోత్సహించేందుకు కృషి చేయాలి. – డాక్టర్ షేక్ సలీం బాషా, జిల్లా విద్యాశాఖాధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎంపికై న వారికి రూ.50వేల నగదు విద్యార్థులు స్థానికంగా ఉన్న ఒక సమస్యను గుర్తించి, దానిని అధ్యయనం చేయాలి. సమస్య పరిష్కారానికి మార్గాలను అన్వేషించాలి. శాసీ్త్రయ పరిశోధన చేసి, సమస్య పరిష్కారానికి మార్గాలు చూపిస్తూ రిపోర్టును సమర్పించాలి. ప్రాజెక్టును ఏడాది లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎన్సీఈఆర్టీ ఎంపిక చేసిన పరిశోధనకు కేంద్ర ప్రభుత్వం రూ.50వేలు మంజూరు చేస్తోంది. మంజూరైన నిధులను పరిశోధనకు, ప్రాజెక్టు రూపకల్పనకు వినియోగించుకోవచ్చు. పరిశోధన సామగ్రి, ప్రయాణ ఖర్చులకు ఈ నిధులను ఉపయోగించుకోవచ్చు. ఈ నిధుల నుంచి విద్యార్థులకు రూ.10 వేలు, పాఠశాల ఉపాధ్యాయులు, ఉన్నత విద్యాసంస్థ సబ్జెక్టు ఎక్స్పర్ట్కి రూ.20 వేల వంతున అందజేస్తారు. -
మూడు హత్యలకు నిరసనగా శాంతి ర్యాలీ
● నిందితుడికి ఉరి శిక్ష వేయాలని డిమాండ్ ● సీబీఎం సెంటర్లో మానవహారం సామర్లకోట: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల వెనుక భాగంలో ఉన్న సీతారామ కాలనీలో నివాసం ఉంటున్న ఒక వివాహిత, ఇద్దరు బాలికలను దారుణంగా హత్య చేసినందుకు నిరసనగా ఆదివారం సాయంత్రం శాంతి ర్యాలీ నిర్వహించారు. దళిత సంఘాల నాయకులు, మానవహక్కుల సంఘ నాయకుల మద్దతుతో స్థానిక సీబీఎం సెంటర్ నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 2వ తేదీ అర్ధరాత్రి సీతారామ కాలనీలో నివాసం ఉంటున్న ములపర్తి మాధురి (30) కుమార్తెలు పుష్పకుమారి (8), జెస్సీలోన(6)లను హత్య చేసిన విషయం విదితమే. 3వ తేదీ ఉదయం ఇంటికి వచ్చిన మాధురి భర్త ధనుప్రసాద్ హత్య జరిగిన విషయాన్ని గమనించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఎస్పీ ఆదేశాలలో పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుడు స్థానిక కోటపేటకు చెందిన తలే సురేష్ను ఈ నెల 7వ తేదీన అరెస్టు చేసి కోర్టుకు తరలించగా రిమాండ్ విధించిన విషయం విదితమే. ఇటువంటి మానవమృగాలకు బుద్ధి వచ్చే విధంగా ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ స్థానిక సీబీఎం సెంటర్లో పిల్లలు, పెద్దలు, మహిళలతో కలిసి మానవ హారం నిర్వహించారు. దళిత సంఘ నాయకులు పిట్టా జానికిరామారావు, లింగం శివప్రసాద్, జిల్లా మానవహక్కుల సంఘ అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండ మాట్లాడుతూ సురేష్ తరఫున ఏ న్యాయవాది వాదించకుండా చూడాలన్నారు. మానసికంగా కృంగి పొయిన ములపర్తి మాధురి భర్త ధనుప్రసాద్కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మాఽఽధురి తల్లి ఫిర్యాదును కాకుండా భర్త ఫిర్యాదును పరిగణనలోకి తీసుకొని కోర్టు శిక్ష పడే విధంగా చూడాలన్నారు. సుమారు 30 నిమిషాల పాటు సీబీఎం సెంటర్లో మానవ హారం నిర్వహించడంతో నాలుగు రోడ్ల కూడలిలో ట్రాఫిక్ స్తంభించింది. అక్కడి నుంచి పోలీసు స్టేషన్ మీదుగా సంతమార్కెట్, పాత తహసీల్దార్ కార్యాలయం, బ్రౌన్పేట సెంటర్ నుంచి తిరిగి సీబీఎం సెంటర్ వరకు శాంతి ర్యాలీ చేరింది. సీఐ ఎ కృష్ణభగవాన్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. దళిత సంఘ నాయకులు జుత్తుక అప్పారావు, పాలిక చంటి బాబు బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొన్నారు. -
హోరాహోరీగా అంతర్రాష్ట్ర ఖోఖో పోటీలు
నేడు ముగింపు, బహుమతుల ప్రదానం తుని రూరల్: అంతర్రాష్ట్ర ఖోఖో పోటీలు హోరా హోరీగా జరుగుతున్నాయి. శ్రీప్రకాష్ విద్యా సంస్థలలో ఇవి నిర్వహిస్తున్నారు. ఆదివారం రెండవ రోజూ సీబీఎస్ఈ క్లస్టర్ –7 అంతర్రాష్ట్ర బాలురు, బాలికల అండర్ 14, 17, 19 విభాగాల్లో పోటీలు జరిగాయి. ఈ పోటీలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 180 జట్లకు చెందిన రెండు వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. అండర్–19 బాలికల విభాగంలో ప్రథమ స్థానాన్ని సిస్టర్స్ నివేదిత స్కూల్ (హైదరాబాద్), ద్వితీయ స్థానాన్ని వెరిటాస్ సైనిక్ స్కూల్ (తిరుపతి), తృతీయస్థానాన్ని సీఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్ (ఏలూరు) కై వసం చేసుకున్నట్టు సీబీఎస్ఈ పరిశీలకుడు సీహెచ్ఎంఎల్.శ్రీనివాసు తెలిపారు. అండర్–14, 17 విభాగాల్లో జట్లు తమ సత్తా చాటి క్వార్టర్ ఫైనల్స్ వైపు దూసుకువెళుతున్నాయన్నారు. వీటి ఫలితాలు సోమవారం వస్తాయని, విజేతలకు అదేరోజు బహుమతుల ప్రదానం జరుగుందన్నారు. శ్రీప్రకాష్ విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సీహెచ్ విజయప్రకాష్, సీనియర్ ప్రిన్సిపాల్ ఎంవీవీఎస్ మూర్తి, వైస్ ప్రిన్సిపాల్ అపర్ణ, ఆంధ్ర, తెలంగాణాల నుంచి విద్యార్థులు, కోచ్లు, మేనేజర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఉత్కంఠగా అండర్–17 చెస్ పోటీలు
అమలాపురం టౌన్: జిల్లా స్థాయి అండర్ –17 చెస్ పోటీలు జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక విద్యానిధి విద్యా సంస్థల్లో ఆదివారం ఉత్కంఠ భరితంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా ఈ పోటీలకు దాదాపు 60 మంది క్రీడాకారులు వచ్చి తమ ప్రతిభకు పదను పెట్టారు. పోటీల్లో బాలురు నుంచి ముగ్గురిని, బాలికల నుంచి ముగ్గురిని రాష్ట్ర పోటీలకు ఎంపిక చేసినట్లు రాష్ట్ర చెస్ అసోసియేషన్ కార్యదర్శి కవురు జగదీష్ చెప్పారు. బాలుర విభాగంంలో గిరిమణి శేఖర్ (ప్రథమ), బండారు నానిబాబు (ద్వితీయ), తాడి సాయి వెంకటేష్ (తృతీయ), బాలికల విభాగంలో పనిశెట్ట ధరణి (ప్రథమ), బొడ్డు సాన్వి (ద్వితీయ), పసుపులేటి రేష్మ (తృతీయ) గెలిచారని తెలిపారు. వీరు ఈ నెల 16,17 తేదీల్లో కాకినాడ జేఎన్టీయూలో నిర్వహించే రాష్ట్ర స్థాయి చెస్ పోటీల్లో జిల్లా తరఫున ఆడతారని జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి తాడి వెంకట సురేష్ తెలిపారు. విజేతలకు విద్యానిది విద్యా సంస్థల చైర్మన్ ఆకుల బాపన్నాయుడు షీల్డ్లు అందజేశారు. -
గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘ కార్యవర్గం ఎన్నిక
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక శనివారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించారు. సంఘ అధ్యక్షుడిగా జీవీఆర్ఎస్హెచ్కే వర్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా ఎస్.రాజు, గౌరవ అధ్యక్షుడిగా సలాది సాయి సత్యనారాయణ, అసోసియేట్ అధ్యక్షుడిగా రేపాక వెంకటరాము, ఉపాధ్యక్షుడిగా కె.కిశోర్, సంయుక్త కార్యదర్శిగా ములంపాక శ్రీనివాసరావు, కోశాధికారిగా జీవీవీఎన్ త్రినాథ్, ఉపాధ్యక్షుడిగా తనికెళ్ల శ్రీనివాస్, మహిళా ప్రతినిధిగా కె.సునీత, రాష్ట్ర ప్రతినిధిగా డొక్కా రాజు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.రాంబాబు, ప్రధాన కార్యదర్శి నాదెండ్ల బాబి, ఆలీ, రంగారావు, పి.వేంకటేశ్వరరావు, పి.రామకృష్ణ, చార్లెస్, గ్రంథాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. -
దోపిడీ కేసు గుట్టు రట్టు
● సెల్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు ● ఐదుగురి అరెస్టు, చోరీ సొత్తు స్వాధీనం పిఠాపురం: గత నెల 28న గొల్లప్రోలు మండలం చెందుర్తి రహదారిలో జరిగిన దారి దోపిడీ కేసును గొల్లప్రోలు పోలీసులు ఛేదించారు. సీఐ శ్రీనివాస్ శనివారం గొల్లప్రోలు పోలీసు స్టేషన్లో తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజమహేంద్రవరం నల్లమందు వీధికి చెందిన సమీర్ ప్రజాపత్ అక్కడి భవానీ సిల్వర్స్లో గుమస్తాగా పనిచేస్తూ చుట్టుపక్కల ప్రాంతాల్లోని దుకాణాలకు బంగారం, వెండి వస్తువులను రవాణా చేస్తుంటాడు. విధి నిర్వహణలో భాగంగా ఆయన గత నెల 28న పెద్దాపురం, పిఠాపురం, గొల్లప్రోలులోని నగల దుకాణాల నుంచి బంగారం, వెండి, డబ్బులు తీసుకుని మోటార్ సైకిల్పై చెందుర్తి వెళ్తుండగా రాత్రి సుమారు 8 గంటల సమయంలో చెందుర్తి రోడ్డులో కల్వర్ట్ దగ్గర నలుగురు వ్యక్తులు 2 మోటార్ సైకిళ్లపై వచ్చి బ్లేడుతో బెదిరించి 51 గ్రాముల బంగారం, 12.5 కిలోల వెండి, రూ.60 వేల నగదు దోచుకుని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తుచేసిన పోలీసులు ఘటనాస్థలంలో సిగ్నల్స్ ఆధారంగా పెద్దాపురానికి చెందిన బంగారు నగల వర్తకుడు రౌతు గోవిందుపై నిఘా పెట్టారు. శనివారం పిఠాపురం మండలం జల్లూరు గ్రామ శివారులో అతనితో పాటు గనిరెడ్డి సాయి ప్రసాద్, కోన సాయిబాబు, బొమ్మను విజయ్ ఆనంద్, కుక్కల శివ మణికంఠ దోపిడీ చేసిన సొత్తును పంచుకుంటున్న సమయంలో గొల్లప్రోలు ఎస్సై రామకృష్ణ తన సిబ్బందితో దాడి చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా దోపిడీ చేసినట్టు అంగీకరించారు. వారి నుంచి దోచుకున్న సొత్తుతో పాటు వారు వినియోగించిన రెండు మోటారు సైకిళ్లు, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచారు. కాగా గోవిందు పెద్దాపురంలో బంగారు వెండి వ్యాపారం చేస్తుంటాడు. బాధితుడైన సమీర్ అతడితో కూడా లావాదేవీలు చేస్తుంటాడు. ఈ క్రమంలో సమీర్ వద్ద అధికమొత్తంలో బంగారం, వెండి ఉంటాయని, వాటిని కొట్టేయాలన్న దుర్బుద్ధితో అతడిపై తన మనుషులతో రెక్కీ నిర్వహించి పథకం ప్రకారం ఈ దోపిడీకి పాల్పడ్డాడని సీఐ తెలిపారు. దోపిడీ చేసిన వెండి, బంగారాన్ని కరిగించి దిమ్మలుగా మార్చి ఆనవాళ్లు లేకుండా చేశారని సీఐ తెలిపారు. -
రక్షా బంధనం వేళ.. వీడిన పాశాలు..
● శుభకార్యానికి వెళ్లివస్తూ ఒకరు.. చెల్లెలికి రాఖీ కట్టి వస్తూ మరొకరు.. ● ఎదురెదురుగా వాహనాలు ఢీకొని ఘటన ● కుమారుడి మృతి వార్త విని గుండెపోటుతో తండ్రి మృతి గోపాలపురం: మండలం వెంకటాయపాలెంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడడం.. వారిలో ఒకరి మరణ వార్త విని అతడి తండ్రి గుండెపోటుకు గురై చనిపోవడంతో ఇటు గోపాలపురం మండలం వాదాలకుంట, తాళ్లపూడి మండల పెద్దేవం గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. గోపాలపురం మండలం వాదాలకుంట గ్రామానికి చెందిన మరపట్ల సువర్ణరాజు (56) తాళ్లపూడి మండలం చిడిపిలో బంధువుల ఇంటిలో శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తున్నాడు. అలాగే తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామానికి చెందిన గుండేపల్లి మణిశంకర్ (30) దేవరపల్లి మండలం యాదవోలులో ఉన్న చెల్లి వద్దకు వెళ్లి రాఖీ కట్టించుకు తిరిగి వస్తున్నాడు. వారిద్దరు గోపాలపురం మండలం వెంకటాయపాలెం మలుపు వద్ద పరస్పరం ఢీకొనడంతో మణిశంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కొన ఊపిరితో ఉన్న సువర్ణరాజును గోపాలపురం సీహెచ్సీకి తరలించగా అక్కడ నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం రాజమహేంద్రవరం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. సువర్ణరాజు వెళ్లిన శుభకార్యానికి భార్య, కుమారుడు, కుమార్తె మిగిలిన బంధువులు వెళ్లారు. తిరిగి సువర్ణరాజు ఒక్కడే మోటార్ సైకిల్ వస్తూ ప్రమాదానికి గురయ్యాడు. వెనుక వస్తున్న భార్య కుమారుడు, కుమార్తె, బంధువులు సువర్ణరాజును ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. -
ఉత్సాహంగా అంతర్రాష్ట్ర ఖోఖో పోటీలు
● 3 రోజుల పాటు నిర్వహణ ● తలపడుతున్న 180 జట్లు తుని రూరల్: శ్రీప్రకాష్ విద్యా సంస్థల ఆవరణలో మూడు రోజులపాటు జరిగే ఆంధ్ర, తెలంగాణ అంతర్రాష్ట్ర ఖోఖో పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యా యి. శనివారం ప్రారంభమైన ఈ పోటీల్లో అండర్ 14, 17, 19 విభాగాల్లో 180 జట్లకు చెందిన రెండు వేల మంది బాలురు, బాలికలు పాల్గొంటున్నట్టు శ్రీప్రకాష్ విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సీహెచ్ విజయప్రకాష్ తెలిపారు. మొదటి రోజు జరిగిన మ్యాచ్లలో 24 జట్లు పాల్గొనగా 12 జట్లు విజేతలుగా నిలిచాయని ఆయన తెలిపారు. సీనియర్ ప్రిన్సిపాల్ ఎంవీవీఎస్.మూర్తి, వైస్ ప్రిన్సిపాల్ అపర్ణ, ఖోఖో ఫెడరేషన్ కార్యదర్శి సీహెచ్ఎల్ఎం శ్రీనివాస్ పాల్గొన్నారు. మొదట రోజు విజేత జట్లు: అండర్–19 బాలికల విభాగంలో హైదరాబాద్కు చెందిన సిస్టర్స్ నివేదిత స్కూల్, ఏలూరుకు చెందిన సీఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్ ఏలూరు, తిరుపతికి చెందిన వరిటాస్ సైనిక్ స్కూల్ జట్లు విజేతగా నిలిచాయి. అండర్–17 బాలికల విభాగంలో నాచారానికి చెందిన సుప్రభాత హైస్కూల్, బొమ్మార్సిపేటకు చెందిన శాంతినికేత్ విద్యాలయం, హైదరాబాద్కు చెందిన భారతీయ విద్యాభవన్ జట్లు గెలుపొందాయి. అండర్–19 బాలుర విభాగంలో తిరుపతికి చెందిన ఎకార్డ్ స్కూల్, అండర్–17 బాలురు విభాగంలో బొమ్మార్సిపేటకు చెందిన శాంతినికేతన్ విద్యాలయం, సిద్ధార్థ బోడుప్పల్కు చెందిన పబ్లిక్ స్కూల్ జట్లు గెలిపొందాయి. అండర్–14 విభాగంలో నర్సింగపాలేనికి చెందిన హీల్ స్కూల్, విజయవాడకు చెందిన శ్రీస్వామి నారాయణ్ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఫార్ూట్యన్ బటర్ఫ్లై స్కూల్ జట్లు గెలుపొందినట్టు నిర్వాహకులు తెలిపారు. -
శ్యామ్తో నిరుద్యోగుల కల సాకారం
బోట్క్లబ్ (కాకినాడసిటీ): నిరుద్యోగుల కలలను శ్యామ్ ఇనిస్టిట్యూట్ నిజం చేస్తోందని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఇటీవల విడుదలైన ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన శ్యామ్ ఇనిస్టిట్యూట్ అధినేత గుంటూరు శ్యామ్ను, డైరెక్టర్ శైలజను, రాష్ట్ర స్థాయి టాపర్స్ నానాజీ, రమ్యమాధిరి, ఎం.అచ్యుతరావు, ఎస్ భవానీలను విశాఖపట్నంలో ఆమె నివాసంలో శనివారం సత్కరించారు. పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ ఇస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దడంలో శ్యామ్ ఇనిస్టిట్యూట్ కీలక పాత్ర పోషిస్తోందని హోం మంత్రి అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన 6014 పోస్టుల్లో 4673 పైగా పోస్టులు శ్యామ్ ఇనిస్టిట్యూట్ విద్యార్థులే కై వసం చేసుకోవడం, రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకుతో పాటు అన్ని జిల్లాలోను జిల్లా స్థాయి మొదటి ర్యాంకులు సాధించడం గొప్ప విషయమన్నారు. -
ఒక్క రూమ్ ప్లీజ్
అన్నవరం: వివాహ సందడితో రత్నగిరి రద్దీగా మారింది. సత్యదేవుని సన్నిధిన శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. రత్నగిరిపై ఆదివారం, ఈ నెల 17న పెద్ద సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. రత్నగిరిపై దాదాపు 600 వసతి గదులుండగా వీటిలో 70 శాతం ఈ ముహూర్తాలకు రిజర్వ్ అయిపోయాయి. వాటికి సంబంధించిన చార్టులు కూడా సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో మిగిలిన సత్రం గదుల కోసం కూడా వీఐపీల నుంచి పెద్ద ఎత్తున సిఫారసులు వస్తూండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఒక్క రూమ్ ప్లీజ్ అంటూ పెళ్లి బృందాలు, భక్తులు వెంట పడుతూండటంతో దిక్కు తోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ఇతర భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వస్తూండటంతో వారికి వసతి గదులు కేటాయించే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ వరకూ వసతి గదుల కేటాయింపునకు ముగ్గురు సూపరింటెండెంట్లతో దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు ఒక కమిటీ ఏర్పాటు చేశారు. వారు వీఐపీల సిఫారసులు, రిజర్వేషన్, ఖాళీలు, ఇతర వివరాలు పరిశీలించి గదులు కేటాయిస్తారు. శ్రావణం.. పెళ్లిళ్ల సంరంభం శుభప్రదమైన శ్రావణ మాసం ప్రారంభమైనప్పటి నుంచీ ప్రతి రోజూ కొంగుముడి వేసుకున్న కొత్త దంపతులు సత్యదేవుని సన్నిధికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ శ్రావణంలో సత్యదేవుని సన్నిధిలో ఇప్పటికే 200కు పైగా వివాహాలు జరిగాయి. గత నెల 25వ తేదీన శ్రావణ మాసం ప్రారంభం కాగా 26 నుంచి వివాహాలు మొదలయ్యాయి. ఇప్పటి వరకూ ఒక్కో ముహూర్తంలో 40 నుంచి 50 వివాహాలు జరిగాయి. శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజామున రత్నగిరిపై 100 వివాహాలు జరగనున్నాయి. ఈ నెల 17వ తేదీ వరకూ రత్నగిరిపై అధిక సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. ప్రధానంగా 10, 11, 13, 14, 15, 17 తేదీల్లో రత్నగిరిపై సత్రం గదుల్లో దాదాపు 70 శాతం, వివాహ మండపాలన్నింటినీ పెళ్లి బృందాలు గత నెలలోనే రిజర్వ్ చేసుకున్నాయి. ఆ ముహూర్తాల్లో ఆలస్యంగా వివాహాలు నిర్ణయించుకున్న పెళ్లి బృందాల వారు గదులు, వివాహ మండపాలు లభ్యం కాక ఇబ్బంది పడుతున్నారు. మొత్తం మీద ఈ వివాహాలన్నీ ఏ వివాదాలూ లేకుండా సజావుగా జరిగితే అదే పదివేలనుకునే పరిస్థితి దేవస్థానంలో నెలకొంది. వెల్లువలా భక్తులు శ్రావణ పౌర్ణమి పర్వదినం, రెండో శనివారం సెల వు కావడంతో రత్నగిరికి భక్తులు వెల్లువెత్తారు. సుమారు 50 వేల మంది సత్యదేవుని దర్శించుకున్నారు. భక్తులు, నవదంపతులతో వ్రత మండపాలు కిక్కిరిసిపోయాయి. రూ.2 వేల వ్రత మండపాలు చాలకపోవడంతో భక్తులు క్యూలో వేచి ఉండాల్సి వచ్చింది. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం వచ్చింది. నిత్యాన్నదాన పథకంలో 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. ఆలయ ప్రాకారంలో సత్యదేవుడు, అమ్మవారికి తిరుచ్చి వాహనంపై ఘనంగా ప్రాకార సేవ నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ ప్రాకారంలో స్వామి, అమ్మవారిని ఆదివారం ఉదయం 10 గంటల నుంచి టేకు రథంపై ఊరేగిస్తారు. రూ.2,500 టికెట్టుతో ఈ సేవలో భక్తులు పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు. రత్నగిరిపై జోరుగా పెళ్లిళ్ల సందడి 70 శాతం సత్రాల గదులన్నీ వివాహ బృందాలకు రిజర్వ్ మిగిలిన రూముల కోసం వీఐపీల సిఫారసులు తలలు పట్టుకుంటున్న అధికారులు -
శ్రుతి తప్పిన రుతురాగం
మందకొడిగా ఖరీఫ్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఖరీఫ్ నత్తనడకన సాగుతోంది. తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో మొత్తం 5,97,847 ఎకరాల్లో ఖరీఫ్ సాగు జరగాల్సి ఉండగా ఇప్పటి వరకూ 4,56,067 ఎకరాల్లో మాత్రమే నాట్లు పడటంగమనార్హం. అంటే మొత్తం సాగులో 76 శాతం మాత్రమే నాట్లు పడ్డాయి. కోనసీమ జిల్లాలో 1,63,999 ఎకరాలకు గాను 1,23,117 ఎకరాల్లో (70 శాతం), తూర్పు గోదావరి జిల్లాలో 1,99,867 ఎకరాలకు గాను 1,74,638 ఎకరాల్లో (87 శాతం), కాకినాడ జిల్లాలో 2,33,981 ఎకరాలకు గాను 1,58,312 ఎకరాల్లో (67 శాతం) మాత్రమే నాట్లు వేశారు. కాకినాడ జిల్లాలో ఏలేరు, పంపా, పిఠాపురం బ్రాంచ్ కెనాల్(పీబీసీ)తో పాటు పలు ప్రాంతాల్లో ఖరీఫ్ మందకొడిగా సాగుతోంది.●● ఉమ్మడి ‘తూర్పు’పై నైరుతి శీతకన్ను ● 48 మండలాల్లో లోటు వర్షపాతం ● ఖరీఫ్కు అడుగడుగునా అవాంతరం ● 5.97 లక్షల ఎకరాల ఆయకట్టులో 4.56 లక్షల ఎకరాల్లోనే సాగు ● గోదారి నీటి రాక సైతం అరకొర ● గత ఏడాది ఈ సమయానికి 1,895 టీఎంసీల ఇన్ఫ్లో ● ఈ ఏడాది వచ్చింది 937.420 టీఎంసీలేసాక్షి, అమలాపురం: నైరుతి రుతుపవనాలు రాకుండానే.. మే నెలలో.. మండు వేసవిలో జోరుగా వర్షాలు కురిశాయి. ఆలస్యంగా వచ్చిన రుతుపవనాలతో భారీ వర్షాలు కురుస్తాయని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అన్నదాతలు, ప్రజలు ఆశించారు. కానీ అడపాదడపా తప్ప వాన జాడ లేదు. గోదావరికి జూలై నెలలో అరుదుగా వరద వస్తుంది. ఇలా వచ్చిన ఏడాది.. ఆ తరువాత ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వరదలు రావడం పరిపాటి. గత ఏడాది లాగే ఈసారి కూడా జూలైలో గోదావరికి రెండుసార్లు వరద పోటు తగిలినా పెద్దగా ఇన్ఫ్లో లేకుండా పోయింది. పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడంతో గోదావరిలో నీటి ఉరవడి తగ్గిపోయింది. ఇక రైతుల ఆశల పంట ఖరీఫ్ మూడడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కు అన్నట్టుగా ఉంది. గోదావరి డెల్టాలోనే నీరందడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోచ్చు. నైరుతి రుతు పవనాలు ముఖం చాటేశాయి. అప్పుడప్పుడు తప్ప ఉమ్మడి జిల్లాలో వర్షం జాడే దాదాపు లేకుండా పోయింది. జూన్, జూలై నెలలతో పాటు ఆగస్టు నెలలో ఇప్పటి వరకూ లోటు వర్షపాతం నమోదైంది. వారంలో ఒక రోజు ఒక మోస్తరు వర్షం కురిస్తే మిగిలిన ఆరు రోజులూ వేసవిని తలపించేలా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉష్ణోగ్రతల ధాటికి సామాన్యులు విలవిలలాడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికీ 32 నుంచి 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అరకొరగానే గోదావరి నీరు.. ఈ ఏడాది గోదావరి ఇన్ఫ్లో కూడా అంతంత మాత్రమే ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఇన్ఫ్లో సగం కూడా లేదు. గత ఏడాది ఆగస్టు 9వ తేదీ నాటికి ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో 1,895.571 టీఎంసీలుగా నమోదైంది. ఆ సమయానికి డెల్టాలోని మూడు ప్రధాన కాలువలకు 47.465 టీఎంసీలు నీరు విడుదల చేయగా సముద్రంలోకి 1,848.106 టీఎంసీల మిగులు జలాలను విడిచిపెట్టారు. అదే రోజు మూడు డెల్టా కాలువలకు 7,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా, సముద్రంలోకి 7,33,886 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. కానీ, ఈ సంవత్సరం ఇప్పటి వరకూ ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 937.420 టీఎంసీల ఇన్ఫ్లో మాత్రమే నమోదైంది. దీనిలో 61.33 టీఎంసీలు పంట కాలువలకు విడుదల చేయగా 876.087 టీఎంసీలు సముద్రంలోకి విడిచిపెట్టారు. ప్రస్తుతం పంట కాలువలకు 14,700 క్యూసెక్కుల నీటిని వదులుతూండగా 1,18,480 క్యూసెక్కులు మాత్రమే సముద్రంలోకి వదులుతున్నారు. గత ఏడాది జులై నెలలో భారీ వరద చోటు చేసుకోగా తిరిగి ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనూ గోదావరికి పెద్ద వరదలు వచ్చాయి. ఇన్ఫ్లో ఆశాజనకంగా ఉండటంతో గత ఏడాది రబీకి ఢోకా లేకుండా పోయింది. కానీ, ఈ ఏడాది జూలై నెలలో గోదావరికి రెండుసార్లు మాత్రమే స్వల్పంగా వరద వచ్చింది. పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే రబీకి నీటి ఎద్దడి తప్పదనే ఆందోళన రైతుల్లో నెలకొంది. -
మానవ విధ్వంసం వల్లే ..
వర్షాలను ఆకర్షించే ఎన్నో వనరులు ఆక్వా చెరువుల వల్ల ప్రభావితమవుతున్నాయి. నైరుతి నుంచి వాయవ్యంగా రావాల్సిన మేఘాలు ఇటీవల కాలంలో ఆగ్నేయంగా పయనిస్తున్నాయి. దీనివల్ల ఒక ప్రాంతంలో భారీ వర్షం కురవడం, ఆ పక్కనే ఉన్న ప్రాంతంలో వర్షం కురకపోవడం జరుగుతోంది. రోహిణీ కార్తెలో వర్షాలు పడటం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గాయి. దీనివల్ల భారీ వర్షాలు కురిసే మేఘాలు ఏర్పడటం లేదు. ఈ కారణంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాలు కురవాలంటే సముద్ర ఉష్ణోగ్రతల్లో సమతుల్యత ఉండాలి. మానవ విధ్వంసం వల్ల ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. దీనివల్ల కూడా రుతుపవనాలకు అనుకూల వాతావరణం ఏర్పడటం లేదు. – డాక్టర్ పి.కృష్ణకిశోర్, కోనసీమ సాగర, పర్యావరణ పరిశోధకుడు, అమలాపురం