breaking news
Kakinada District Latest News
-
ఆర్భాటంగా వచ్చి.. అందినంతా దోచి..
జగ్గంపేట: ఆర్భాటంగా వస్తాడు.. అందినకాడకు దోచేస్తున్నాడు.. చూడ్డానికి ఆఫీసర్లా జేబులో పెన్ను పెట్టుకుని, అతని కదలికలలో ఎలాంటి అనుమానం రాకుండా కన్నుమూసి తెరిచే లోపే మోటారు సైకిళ్లను దొంగిలిస్తున్నాడు. జగ్గంపేట పరిసర ప్రాంతాల్లో ఇటీవల కాలంలో మోటారు సైకిళ్ల చోరీలు అధికంగా జరుగుతున్నాయి. సుమారు 10 వరకూ మోటారు సైకిళ్లు చోరీకి గురైనట్లు సమాచారం. వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు ఆయా ప్రాంతాలపై నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో సీసీ ఫుటేజీలను సేకరించారు. ఇందులో పైన చెప్పినట్లుగా ప్రవర్తిస్తూ చోరీలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని గుర్తించారు. అతనే ఈ చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతని ఆచూకీ కోసం గాలిస్తున్నా, ఇప్పటి వరకూ చిక్కలేదు. దీంతో జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ గురువారం మోటారు సైకిళ్ల చోరీ నిందితుడి ఫొటోను విడుదల చేశారు. అతని ఆచూకీ తెలిసిన వారు తక్షణం 94407 96529 నంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు. సినీ ఫక్కీలో చోరీలకు పాల్పడుతున్న అతని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు పేర్కొన్నారు. మోటారు సైకిళ్ల చోరీ నిందితుడి చిత్రం విడుదల -
సత్యదేవుని సన్నిధిలో భక్తునికి గుండెపోటు
● ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి ● దివిలి ఉప సర్పంచ్గా గుర్తింపు అన్నవరం: భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా సత్యదేవుని సన్నిధికి వచ్చిన ఓ భక్తుడు గుండెపోటుకు గురై, ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందారు. పెద్దాపురం మండలం దివిలి గ్రామ ఉప సర్పంచ్ అయిన వెన్నా సత్యనారాయణ (పండు) (55) కుటుంబ సభ్యులతో కలసి గురువారం ఉదయం అన్నవరం దేవస్థానానికి వచ్చారు. రూ.300 టికెట్టుతో సత్యదేవుని వ్రతమాచరిస్తున్న ఆయన హఠాత్తుగా ఒక పక్కకు ఒరిగిపోయారు. దేవస్థానం ఆస్పత్రి వైద్యాధికారి హరికృష్ణ వెంటనే వచ్చి పరీక్షించారు. బీపీ నార్మల్గానే ఉన్నప్పటికీ షుగర్ ఎక్కువగా ఉందని గుర్తించి, వెంటనే 108లో దేవస్థానం ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే సత్యనారాయణ మృతి చెందారని డాక్టర్ హరికృష్ణ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. దివిలి గ్రామంలో సత్యనారాయణ స్వీట్ షాపు నిర్వహిస్తున్నారని, స్నేహ ఆర్ట్స్ తరఫున నాటక పరిషత్ల నిర్వహణలో చురుకుగా పాల్గొనేవారని సన్నిహితులు తెలిపారు. -
సిట్ నివేదికతో చంద్రబాబు కుట్ర బట్టబయలు
కాకినాడ రూరల్: తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందనే తప్పుడు ఆరోపణతో ముఖ్యమంత్రి చంద్రబాబు పన్నిన మహా కుట్రను.. సీబీఐ సిట్ బట్టబయలు చేసిందని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు నిరాధారమనే విషయాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం తేల్చిందన్నారు. దీంతో, చంద్రబాబు కుటిల రాజకీయ ఎత్తుగడ మరోసారి ప్రజలకు అర్థమైందన్నారు. తిరుమల వేంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దెబ్బ తీసేలా వ్యవహరించిన చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా కూటమి నేతలను ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలతో నాటి నుంచి నేటి వరకూ టీడీపీ అనుకూల మీడియా సహా స్వామీజీలు కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అసత్య ప్రచారం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశారంటూ అసత్య ఆరోపణలు చేసి, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ మెట్లను కడిగిన పవన్.. ఆనాడు ఫొటో షూట్ చేశారని దుయ్యబట్టారు. కిర్రాక్ ఆర్పీ వంటి పెయిడ్ ఆర్టిస్టులతో లడ్డూ ప్రసాదంపై లేనిపోని రాద్ధాంతం సృష్టించడంపై మండిపడ్డారు. చంద్రబాబు తప్పుడు వ్యాఖ్యలను ఖండిస్తూ అప్పట్లోనే వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారని గుర్తు చేశారు. దీంతో, చంద్రబాబుకు సుప్రీంకోర్టు నాడు మొట్టికాయలు వేసిందన్నారు. సీబీఐ సిట్ దాఖలు చేసిన తుది చార్జిషీట్ ప్రకారం లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు అనుయాయులు చేసిన ప్రచారం అసత్యమని తేలిందన్నారు. వైఎస్ జగన్, టీటీడీ మాజీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్రెడ్డిలపై చేసిన అసత్య ప్రచారాలు, కుట్రలు నేటితో తొలగిపోయాయని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం దేవుళ్లను కూడా వదలని చంద్రబాబులో ఇకనైనా మార్పు రావాలని, చేసిన తప్పునకు ప్రాయశ్చిత్తంగా ప్రజలను క్షమాపణ అడగాలని నాగమణి డిమాండ్ చేశారు. అసలు తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే నేతిలో కల్తీ వ్యవహారానికి తెర తీసింది చంద్రబాబు ప్రభుత్వమేనని ఆరోపించారు. 2019 ఫిబ్రవరి 18న 94 వేల కేజీల నెయ్యిని రూ.291కే కొనుగోలు చేశారని గుర్తు చేశారు. అప్పట్లో హర్ష డైరీగా ఉన్న ఆ సంస్థే ప్రస్తుతం భోలే బాబా డైరీ అన్నారు. సదరు డైరీ సరఫరా చేస్తున్న నెయ్యి నాణ్యత సరిగ్గా లేదని 2022లోనే జగన్ ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ చేసిందని నాగమణి పేర్కొన్నారు. -
దేశంలో రూరల్ వార్
సాక్షి ప్రతినిధి, కాకినాడ: టీడీపీలో కాకినాడ రూరల్ నాయకత్వ పంచాయితీ చివరి దశకు చేరుకుంది. టీడీపీలో జిల్లాలో మరే నియోజకవర్గంలోనూ లేని ఆధిపత్య పోరు ఈ ఒక్క నియోజకవర్గంలోనే చాన్నాళ్లుగా కొనసాగుతోంది. అధికారంలో ఉన్నా లేకున్నా ఆ పార్టీలో తెలుగు తమ్ముళ్లు ‘కడుపులో కత్తులు పెట్టుకుని కౌగలించుకుంటున్న’ వాతావరణం నెలకొంది. రెండున్నరేళ్లకు పైగా ఇక్కడి వర్గపోరుకు అడ్డుకట్ట వేయలేకపోయారు. నియోజకవర్గ ఇన్చార్జి నియమకానికి ఆ పార్టీ నేతలు చేసిన అనేక ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. చివరకు స్వయంగా జోక్యం చేసుకున్నప్పటికీ అధినేత చంద్రబాబు సైతం చేతులెత్తేయక తప్పింది కాదు. అధికారంలోకి వచ్చినప్పటికీ ఇక్కడి తమ్ముళ్లలో వర్గపోరు తగ్గకపోగా ఇటీవల మరింత పెరిగి, తాజాగా రోడ్డున పడింది. చక్రం తిప్పినచోటే అవమానాలు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాగా ఉండగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్తిబాబు దంపతుల ఆధిపత్యం ఉండేది. నాడు టీడీపీ జిల్లా రాజకీయాల్లో తెర వెనుక చక్రం తిప్పిన బొడ్డు భాస్కర రామారావు ఆశీస్సులతో పార్టీలో ఈ దంపతులకు తిరుగుండేది కాదు. కొంత కాలం నియోజకవర్గ ఇన్చార్జిగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి సత్తిబాబు కొనసాగారు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రూరల్ స్థానాన్ని పొత్తులో భాగంగా జనసేన ఎగరేసుకుపోయింది. రూరల్ ఎమ్మెల్యేగా ఆ పార్టీ నేత పంతం నానాజీ గెలుపులో అనంతలక్ష్మి, సత్తిబాబు దంపతులు క్రియాశీలకంగా వ్యవహరించారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పైనే అయ్యింది. పొత్తు ధర్మంలో భాగంగా ఎంత కలసిమెలసి పోదామనుకుంటున్నా అన్నింటా అవమానాలే ఎదురవుతున్నాయని అనంతలక్ష్మి, సత్తిబాబు దంపతులు పార్టీ ముఖ్య నేతల వద్ద మొర పెట్టుకుంటూ వస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నా నియోజకవర్గంలో తమ మాట చెల్లుబాటు కాకపోవడంతో పార్టీ కోసం కష్టపడిన వారికి వీసమెత్తు పని చేయలేని నిస్సహాయతలో ఉన్నామని వీరు చాలా కాలంగా ఆవేదన చెందుతున్నారు. నియోజకవర్గంలో జనసేన ఆధిపత్యంతో ఇక్కడ టీడీపీ దాదాపు ఉనికే కోల్పోయింది. తారస్థాయికి ఆధిపత్య పోరు పార్టీలో చాలా కాలంగా అంటీ ముట్టనట్టుగా ఉంటున్న సత్తిబాబు వర్గం కొన్ని రోజులుగా మళ్లీ క్రియాశీలకంగా ఉంటోంది. ఈ ఆకస్మిక మార్పునకు కారణమేమిటనే అంశంపై జిల్లా టీడీపీ నేతల మధ్య ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మంత్రి లోకేష్ ముఖ్య అనుచరుడిగా రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ టీడీపీ జిల్లా రాజకీయాల్లో తన ముద్ర కోసం ప్రయత్నిస్తున్నారు. తెర వెనుక నుంచి ఆయన అందిస్తున్న తోడ్పాటుతోనే అనంతలక్ష్మి దంపతులు రూరల్ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పదవి కోసం గళం వినిపిస్తున్నారని అంటున్నారు. వారికి సానా వర్గం బాహాటంగానే మద్దతిస్తోంది. ఈ నేపథ్యంలో సానా సతీష్పై టీడీపీ రూరల్ కో కన్వీనర్ కటకంశెట్టి బాబీ గుర్రుగా ఉన్నారు. ఇదే అంశంపై సామర్లకోట మండలం కొప్పవరంలోని ఎంపీ కార్యాలయంలో ఎంపీకి, బాబీకి మధ్య గత వారం సంవాదం చోటు చేసుకుందనే విషయం పార్టీలో గుప్పుమంది. పార్టీ కోసం రూరల్లో ఎప్పటి నుంచో పని చేస్తున్న సొంత సామాజిక వర్గానికి చెందిన తనను కాదని.. వైరి వర్గమైన సత్తిబాబు దంపతులకు మద్దతివ్వడంలో ఔచిత్యమేమిటంటూ కటకంశెట్టి ప్రశ్నించారని సమాచారం. కో కన్వీనర్గా ఉన్నప్పటికీ ఇన్చార్జిగా ఆయనను పరిగణనలోకి తీసుకోకపోవడంపై జరిగిన చర్చ సందర్భంగా.. ‘చినబాబు’ తరఫున అక్కడ పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రతినిధి చిన్నబుచ్చుకునేలా మాట్లాడారంటూ బాబీ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, టీడీపీలో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరుకుంది. రెండేళ్లకు పైగా ఇన్చార్జి పోస్టు ఖాళీ చేతులెత్తేసిన చంద్రబాబు తాజాగా తెర పైకి మాజీ ఎమ్మెల్యే పిల్లి దంపతులు చక్రం తిప్పుతున్న ఎంపీ ‘సానా’ కో కన్వీనర్ కటకంశెట్టికి చుక్కెదురే కర్చీఫ్ వేసిన ఎమ్మెల్సీ పేరాబత్తుల నేడు లోకేష్ సమక్షంలో బలప్రదర్శనకు సిద్ధమవుతున్న వైరి వర్గాలు రంగంలోకి పేరాబత్తుల ఇప్పటికే రెండు వర్గాల మధ్య ఉన్న వివాదం చాలదా అన్నట్టు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి పదవి కోసం తాజాగా ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ పేరు కూడా తెర పైకి వచ్చింది. గతంలో ఆయన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్లో ఐ.పోలవరం జెడ్పీటీసీగా పని చేసేవారు. అటువంటి ఆయనకు అధిష్టానం ఎమ్మెల్సీగా సముచిత స్థానమే కల్పించినప్పటికీ.. రూరల్ ఇన్చార్జి పదవి కోసం కర్చీఫ్ వేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నియోజకవర్గ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తనది కాని నియోజకవర్గ ఇన్చార్జి నియామకంలో తలదూర్చి, వ్యవహారాన్ని మరింత జటిలం చేయడం ఎంతవరకూ సబబని నిలదీస్తున్నారు. ఇటువంటి తరుణంలో శుక్రవారం కాకినాడ వస్తున్న మంత్రి లోకేష్ ఎదుట రూరల్లో ఆధిపత్యం కోసం వైరి వర్గాలన్నీ పోటాపోటీగా బలప్రదర్శనలకు సిద్ధమవుతున్నాయి. కాకినాడ అచ్చంపేట జంక్షన్, సర్పవరం, ఏడీబీ రోడ్డు, కాకినాడ నగరంలో ఎవరికి వారే విస్తృతంగా హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. అభివృద్ధి కార్యక్రమాల అనంతరం ఏడీబీ రోడ్డులో ఏర్పాటు చేసిన పార్టీ సమీక్ష సమావేశంలో రూరల్ ఇన్చార్జి నియామకం విషయాన్ని లోకేష్ ఏ తీరానికి చేరుస్తారో వేచి చూడాల్సిందే. -
తాళ్లరేవుకు ప్రసిద్ధి
తాళ్లరేవు: భారీ తాళ్ల తయారీకి తాళ్లరేవు ప్రసిద్ధి చెందింది. మునుపెన్నడూ లేని విధంగా 60 మంది కార్మికులు వారం రోజుల పాటు శ్రమించి తయారు చేసిన తాడు అందరినీ ఆకట్టుకుంటుంది. దీనిని అనంతపురం జిల్లా కదిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి రథోత్సవంలో వినియోగించనున్నారు. తొలుత కొబ్బరి పీచుతో చిన్నపాటి తాళ్లను తయారు చేసి వాటిని నాలుగు తాళ్లుగా పేనారు. అనంతరం ఆ నాలుగింటినీ కలుపుతూ ప్రత్యేక యంత్రం ద్వారా అత్యంత చాకచక్యంగా 30 అంగుళాల చుట్టుకొలత, 400 అడుగుల పొడవు కలిగిన భారీ తాడును రూపొందించారు. సుమారు రూ.7 లక్షలతో తయారు చేసిన దీని బరువు సుమారు 2 టన్నులు పైనే. రోజుకు 60 మంది కార్మికులు వారం రోజులపాటు అత్యంత భక్తిశ్రద్ధలతో, గోవింద నామస్మరణతో ఈ తాడును తయారు చేసినట్లు తాళ్ల వ్యాపారి సామా సూర్యప్రకాష్ తెలిపారు. కదిరి దేవస్థానానికి తాడు తయారు చేయడం ఇది నాలుగో సారి అని అన్నారు. మార్చి 10న జరిగే స్వామివారి రథోత్సవంలో ఈ తాడును వినియోగిస్తారని తెలిపారు. అదేవిధంగా మంగళగిరి, ద్రాక్షారామ, పుట్టకొండ, ముంగండ తదితర గ్రామాల్లోని ఆలయాలకు తాళ్లు తయారు చేసి ఇస్తుంటామని వివరించారు. తమ పూర్వీకుల నుంచి రథం తాళ్లను తయారు చేస్తున్నట్లు రథం తాళ్ల తయారీలో నిష్ణాతుడైన మందపల్లి గోవిందు తెలిపారు. సూర్యప్రకాష్ నేతృత్వంలో ఎనిమిది మేస్త్రిల పర్యవేక్షణలో అనేక మంది కార్మికులతో ఈ తాడును తయారు చేశామని చెప్పారు. పూర్తయిన తాడును ప్రత్యేక వాహనంలో ఉంచి కదిరి దేవస్థానానికి తరలించారు.ఫ ఆకట్టుకున్న భారీ కొబ్బరి తాడు ఫ 30 అంగుళాల మందం, 400 అడుగుల పొడవు ఫ వారం రోజులు శ్రమించి తయారీ -
స్వామీ ఈ తేరుగ దయ చూసితివా!
సాక్షి, అమలాపురం/ సఖినేటిపల్లి: దేవదేవుడు అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. కల్యాణం అనంతరం తన సోదరి గుర్రాలక్కకు చీరా, సారె పెట్టేందుకు స్వామివారు సతీ సమేతంగా రథంపై తోడ్కొని వెళ్లడం అనవాయితీగా వస్తోంది. కల్యాణ మహోత్సవాల్లో భాగంగా గురువారం ఏకాదశి (భీష్మ ఏకాదశి) పర్వదినాన మాఢవీధుల్లో నిర్వహించిన రథయాత్ర అపూర్వ ఘట్టంగా నిలిచింది. మధ్యాహ్న సమయంలో సంప్రదాయ బద్ధంగా సాగిన ఈ రథోత్సవానికి వేలాది మంది భక్తులు వెల్లువలా తరలి రావడంతో పూరీ జగన్నాథుని రథయాత్రను తలపించింది. అంతకుముందు గురువారం తెల్లవారుజామున స్వామివారి కల్యాణం ముగియడంతో వేలాది మంది భక్తులు సముద్ర తీరంలో పుణ్యస్నానాలు చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. భక్తజన సంద్రంలో సాగిన తేరు అంతర్వేది లక్ష్మీ నరసింస్వామివారి రథోత్సవం భక్తుల గోవిందనామ స్మరణల మధ్య మధ్యాహ్నం 2–05 గంటలకు ప్రారంభమయింది. మంగళ వాయిద్యాలతో, అర్చకుల వేదమంత్రాలతో నూతన వధూవరులైన స్వామి, అమ్మవార్లను ఆలయం నుంచి పల్లకీలో రథం వద్దకు తోడ్కొని వచ్చారు. భక్తవరదుడు అంతర్వేది నరసింహస్వామివారు, అమ్మవార్లు రథంపై కొలువుదీరగా ప్రజా ప్రతినిధులు, అధికారులు, వేలాది మంది భక్తులు రథాన్ని లాగారు. భక్తులు రథానికి అరటి గెలలు, గుమ్మడికాయలు కట్టించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మెరకవీధి నుంచి ప్రారంభమైన రథయాత్ర పల్లపువీధి మీదుగా పదహారు కాళ్ల మండపం వద్దకు చేరుకుంది. మార్గ మధ్యంలో గుర్రాలక్కకు స్వామి తరఫున చీరె, సారె ఆలయ ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్ ఆధ్వర్యంలో స్థానాచార్య వింజమూరి రామ రంగాచార్యులు, వేద పండితుడు చింతా వేంకటశాస్త్రి, అర్చకులు అందజేశారు. పరవళ్లు తొక్కిన ఆధ్యాత్మికత ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి వచ్చిన అసంఖ్యాకమైన భక్తుల గోవింద నామస్మరణలు, నరసింహస్వామికి జై అనే నినాదాల మధ్య ఈ రథయాత్ర నయన మనోహరంగా సాగింది. రథయాత్రను చూసేందుకు... రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. అంతర్వేది వీథులు భక్తులతో కిటకిటలాడాయి. బుధవారం అర్ధరాత్రి కనువిందు చేసిన స్వామివారి కల్యాణం, గురువారం మధ్యాహ్నం గ్రామ వీథులను వైకుంఠ పథాలుగా మార్చిన రథోత్సవం, ఆ రెండు పర్వాలకు నడుమ భీష్మ ఏకాదశి వేకువ జామున సాగర స్నానం, అనంతరం ఆలయంలో స్వామి దర్శనం. ఇన్ని ఘట్టాలతో భక్తజన హృదయాలు ఆనందంతో ఉప్పొంగాయి. ఒకవైపు వశిష్ట తీరంలో నదీ పరవళ్లు.. తీరంలో ఎగిసిపడుతున్న సముద్ర కెరటాలతో సమానంగా అంతర్వేది క్షేత్రంలో ఆధ్యాత్మికత పరవళ్లు తొక్కింది. ఆలయ చైర్మన్, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ రాజా కలిదిండి కుమార రామ గోపాల రాజా బహదూర్, ముఖ్య అతిథిగా రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ కొబ్బరి కాయలు కొట్టి రథయాత్రకు శ్రీకారం చుట్టారు. డీఆర్వో కొత్తా మాధవి, కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్, ఎండోమెంట్స్ డీసీ రమేష్ బాబు, జిల్లా ఎండోమెంట్స్ అధికారి వి.సత్యనారాయణ, ఆలయ ఈవో ఎం.కె.వి.టి.ఎన్.వి. ప్రసాద్, ఉత్సవ సేవా కమిటీ చైర్మన్ దెందుకూరి రాంబాబు రాజు, ఎంపీపీ వీరా మల్లిబాబు పాల్గొన్నారు. దర్శనానికి బారులు తీరిన భక్తులు భీష్మ ఏకాదశి పర్వదినాన సాగర స్నానం చేసేందుకు వచ్చిన భక్తులతో తీరం జనసంద్రమైంది. పుణ్యస్నానాలు ఆచరించిన తరువాత భక్తులు ఆలయం వద్ద క్యూలో బారులుతీరి స్వామి వారిని దర్శించుకున్నారు. తీరంలో తలనీలాలు సమర్పించారు. సముద్ర స్నానాల చేసే ప్రాంతంలో ప్రమాదాల నివారణకు పోలీసులు గట్టి నిఘా పెట్టారు. అంతర్వేది తీర్థం కొనసాగుతోంది. అంతర్వేదిలో నేడు ఉత్సవాల్లో భాగంగా ఆరవరోజు శుక్రవారం ఉదయం మూడు నుంచి ఆరు గంటల వరకు సుప్రభాత సేవ, శ్రీస్వామివారి తిరువారాధన, బాలభోగం, వార్షిక అభిషేకాలు, అనంతరం సాధారణ, ప్రత్యేక దర్శనాలు. సాయంత్రం నాలుగు గంటలకు గజ వాహనంపై, రాత్రి ఎనిమిది గంటలకు పొన్న వాహనంపై శ్రీస్వామి గ్రామోత్సవం అర్చకులు నిర్వహించనున్నారు. సాయంత్రం 5.30 నుంచి ఏడు గంటలకు వరకు శ్రీస్వామివారి సన్నిధిని శుద్ధి చేసేందుకు దర్శనాలను నిలిపివేయనున్నారు. భీష్మ ఏకాదశి రోజు నుంచి ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి తిధి నాడు విరమణ చేసే అర్చకులు స్వామికి అన్న దర్శనం చేయడం సంప్రదాయం. ఇందులో భాగంగా పొలమూరు సత్రం నిర్వాహకులతో అన్నపర్వత మహానివేదన చేస్తారు. రాత్రి ఏడు గంటలకు అన్న పర్వత మహానివేదన అనంతరం స్వామివారి దర్శనాలు మొదలవుతాయి. నేత్రపర్వంగా లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం మధ్యాహ్నం 2.05 గంటలకు ప్రారంభం పోటెత్తిన భక్త జనం సోదరి గుర్రాలక్కకు చీర, సారె సమర్పణ తెల్లవారుజామున సముద్ర స్నానాలు -
సాహిత్యంలో వేటూరికి సాటి లేరు
● సినీ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత కాసర్ల శ్యామ్ ● తునిలో వైభవంగా సుందర రామ్మూర్తి జయంతి వేడుకలు ● శ్యామ్కు వేటూరి పురస్కారంతుని: సహజత్వానికి నిలువెత్తు నిదర్శనం సినీ గేయ రచయిత వేటూరి సుందరరామ్మూర్తి అని, ఆయనకు మరెవ్వరూ సాటి లేరని సినీ గేయ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత కాసర్ల శ్యామ్ కొనియాడారు. వేటూరి సాహితీ పీఠం, శ్రీప్రకాష్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యాన.. తునిలో జాతీయ రహదారి వద్ద ఉన్న చిట్టూరి మెట్రోలో వేటూరి సుందరరామ్మూర్తి 91వ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్ర ఘోష, మేళతాళాల నడుమ కాసర్ల శ్యామ్కు వేటూరి పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా శ్యామ్ మాట్లాడుతూ, కలలు చెదిరినా, కలత చెందినా, ఎలాంటి భావాన్ని పలికించాలన్నా ఆ శక్తి, యుక్తి వేటూరికే సొంతమని అన్నారు. క్లిష్టమైన, సరళమైన పదాలతో ఆడుకోవడం ఆయనకు సర్వసాధారణమని, తెలుగు సాహిత్యం బతికున్నంత కాలం ఆయన ప్రజల గుండెల్లో కొలువై ఉంటారని అన్నారు. వేటూరి సాహిత్యం సహజత్వానికి దగ్గర ఉంటుందని, ఇది మరెవరికీ సాధ్యం కాలేదని చెప్పారు. వేటూరితో పరిచయం లేకపోయినా ఆయన పాటల నుంచి ఎంతో నేర్చుకున్నానన్నారు. అటువంటి మహోన్నత కవి పేరిట పురస్కారం అందుకోవడం జీవితంలో మరువలేనని ఆనంద బాష్పాలతో అన్నారు. నేడు యువ గాయకులకు, గేయ రచయితలకు చాలా అవకాశాలున్నాయన్నారు. సరస్వతీదేవిని కొలిస్తే వచ్చే జ్ఞానం మనల్ని కాపాడటమే కాదని, భూమిని రక్షిస్తుందని చెప్పారు. 2023లో సినీ పరిశ్రమకు వచ్చిన తనకు మహాత్మా సినిమాలోని ‘నీలపురి గాజుల’ పాటతో గుర్తింపు వచ్చిందన్నారు. తన పాటలు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడకపోవడం, వేటూరిని కలవలేకపోవడం తన జీవితంలో తీరని లోటని చెప్పారు. ఎక్కడో పుట్టిన కవికి తునిలో వేడుకలు జరుపుతున్నారంటే సాహిత్యానికి తుని ప్రజలు ఎంతటి గౌరవం ఇస్తున్నారో అర్థమవుతోందని, ఈ స్ఫూర్తిని యువత అందిపుచ్చుకోవాలని శ్యామ్ అన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వేటూరి సాహితీ పీఠం వ్యవస్థాపక కార్యదర్శి కలగా రామజోగేశ్వర శర్మ మాట్లాడుతూ, వేటూరికి తుని, పాయకరావుపేట పట్టణాల్లో ఉన్న అభిమానులను దృష్టిలో పెట్టుకొని సాహితీ పీఠం ఏర్పాటు చేశామని చెప్పారు. ఇప్పటి వరకూ తెలుగు సినీ చరిత్రలో నిష్ణాతులైన 14 మంది రచయితలకు వేటూరి అవార్డు అందజేశామని, 15వసారి కాసర్ల శ్యామ్కు ప్రదానం చేయడం ఆనందంగా ఉందని అన్నారు. వేటూరి పట్ల ఉన్న అభిమానాన్ని చాటి చెప్పే విధంగా 150 పుస్తకాలను భారవికి అందజేశారు. తొలుత వేటూరి చిత్రపటానికి ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో శ్రీప్రకాష్ విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సీహెచ్ విజయ్ ప్రకాష్, సాహితీ పీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు చక్కా తాతబాబు, సినీ మాటల రచయిత ఆకెళ్ల శివప్రసాద్, సినీ నటులు వడ్లమాని శ్రీనివాస్, ఐడీబీఐ జీఎం సూర్యకిరణ్శర్మ, తుని, పాయకరావుపేట పట్టణాలకు చెందిన ప్రముఖులు, అభిమానులు పాల్గొన్నారు. -
కాకినాడ ప్రత్తిపాడులో నడిరోడ్డుపై ఘోరం
సాక్షి, కాకినాడ: ప్రత్తిపాడులోని కత్తిపూడి జాతీయ రహదారిపై ఘోరం చోటు చేసుకుంది. రెండు లారీలు ఢీకొనడంతో మంటలు చెలరేగి ఒకరు సజీవ దహనం అయ్యారు. ఈ ప్రమాదం నుంచి ఇద్దరూ డ్రైవర్లు సురక్షితంగా బయటపడ్డారు. గురువారం వేకువ జామున ఈ ప్రమాదం జరిగింది. అన్నవరం వైపు నుంచి రాజమండ్రి వైపు చేపల ఫీడ్తో వెళ్తున్న లారీని వెనుకనుంచి బలంగా ఢీకొట్టింది మరో కంటైనర్ లారీ. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో రెండు వాహనాల క్యాబిన్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఇరువురు డ్రైవర్లు బయటకు దూకేయగా.. కంటైనర్ లారీలో ఉన్న క్లీనర్ సజీవ దహనం అయ్యాడు. సమాచారం అందుకుని సంఘటన స్థలానికి చేరుకుని ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న అన్నవరం పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
రత్నగిరిపై భక్తుల కిటకిట
అన్నవరం: రత్నగిరి వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం బుధవారం భక్తులతో కిటకిటలాడింది. గురువారం భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారి దర్శనానికి బుధవారం రాత్రి నుంచే భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. సుమారు లక్ష మంది వస్తారన్న అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం, విశ్రాంతి మండపాలు కిటకిటలాడాయి. రాత్రి 8–30 గంటల సమయానికి దేవస్థానానికి సుమారు పది వేల భక్తులు మంది వచ్చారు. చాలా మంది భక్తులకు సత్రాలలో గదులు లభ్యం కాక ఆలయ ప్రాంగణంలోని విశ్రాంతి మండపాలలో, షెడ్లలో విశ్రమించారు. కొంతమంది రామాలయం పక్కన గల విశ్రాంతి షెడ్డులో విశ్రమించారు. తెల్లవారుజాము నుంచీ వ్రతాలు కాగా గురువారం వేకువ జాము నుంచే సత్యదేవుని వ్రతాలు, దర్శనాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాత్రి ఒంటి గంట నుంచి వ్రతాల నిర్వహణ, స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. స్వామివారి వ్రతం టిక్కెట్లు బుధవారం రాత్రి ఎనిమిది గంటల నుంచే విక్రయించడం ప్రారంభించారు. దేవస్థానంలోని అన్ని చోట్ల షామియానాలు, భక్తుల కోసం తాగునీటి ఏర్పాట్లు చేశారు. భీష్మ ఏకాదశి సందర్భంగా స్వామివారి ఆలయం, మహారాజ గోపురాలు, ఆలయ ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలు, పుష్పాలతో అలంకరించారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వేండ్ర త్రినాథరావు దేవస్థానంలో పర్యటిస్తూ ఏర్పాట్లు పర్యవేక్షించారు. సత్యదేవుని దర్శించిన 30 వేల మంది కాగా బుధవారం 30 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. స్వామివారి దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. స్వామివారి వ్రతాలు 1,500 జరిగాయి. అనంతరం భక్తులు గోశాలలో సప్త గోవులకు ప్రదక్షిణ చేశారు. రావిచెట్టుకు ప్రదక్షిణ చేసి జ్యోతులు వెలిగించారు. సుమారు రూ.25 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. నేడు భీష్మ ఏకాదశి సందర్భంగా ముందుగానే భారీగా రాక శోభాయమానంగా రత్నగిరి అలంకరణ సత్రాలు ఖాళీ లేక ఆలయ ప్రాంగణంలోనే విశ్రాంతి -
స్వీట్ హోమ్లో అగ్నిప్రమాదం
కొత్తపేట: మండల పరిధిలోని మందపల్లి వంతెన సమీపంలో బొబ్బట్లు స్వీట్స్ దుకాణం ‘దుర్గా గణేష్ స్వీట్ హోమ్’ శాఖలో అర్ధరాత్రి సమయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బుధవారం తెల్లవారు జామున సుమారు రాత్రి 2 గంటల సమయంలో సంభవించిన ప్రమాదాన్ని ఆ సమీప రహదారిపై ప్రయాణించే వారు గమనించి సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే షాపులోని వస్తువులు, షోకేసులు, సిటింగ్ టేబుళ్లు, కుర్చీలు, ఎన్నో రకాల స్వీట్స్ అగ్నికి ఆహుతై దుకాణం పూర్తిగా దగ్ధమైంది. దుకాణ యజమానులు తెలిపిన వివరాల మేరకు ఈ ప్రమాదంలో సుమారు రూ.6 లక్షలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి ఉండవచ్చని భావిస్తున్నారు. అగ్నిమాపక అధికారి పి.శ్రీనివాస్ సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. దానితో మంటలు పక్కన ఉన్న దుకాణాలకు వ్యాపించకుండా నివారించగలిగారు. -
అన్నదానానికి పెంకుటిల్లు విరాళం
దానం చేసిన భక్తురాలు రామచంద్రపురం రూరల్: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి ఆలయ అన్నదాన ట్రస్ట్కు ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన దాత చిలకమర్రి వైజయంతి తనకు చెందిన 104 చదరపు గజాల పెంకుటిల్లును తన తదనంతరం అన్నదాన ట్రస్ట్కు చెందేలా వీలునామా రాశారు. ఈ మేరకు ఆలయ ఈఓ, దేవదాయ శాఖ సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గాభవానికి బుధవారం ఆ పత్రాలను అందజేశారు. 75 ఏళ్ల వయస్సు కలిగిన తనకు సంతానం లేకపోవడం, భర్త చిలకమర్రి సత్య సారధి ఇప్పటికే మృతి చెందడంతో స్వామివారి సేవకు తన ఇల్లు ఉపయోగపడాలని విల్లు రాసి ఇచ్చినట్టు ఆమె పేర్కొన్నారు. ఈఓ ఆమెకు స్వామివారి జ్ఞాపిక ఇచ్చి అభినందించారు. -
గ్రూప్–2 ఫలితాలలో ‘శ్యామ్’ సంచలనం
బోట్క్లబ్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుధవారం విడుదల చేసిన గ్రూప్–2 ఫలితాల్లో కాకినాడ శ్యామ్ ఇనిస్టిట్యూట్ తమ మొదటి ప్రయత్నంలో సంచలన విజయాలతో విజయకేతనాన్ని ఎగురవేసిందని సంస్థ చైర్మన్ శ్యామ్ తెలిపారు. 89 మంది తమ సంస్థ విద్యార్థులు డిప్యూటీ తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్, ఎకై ్సజ్ సబ్–ఇన్స్పెక్టర్ తదితర అత్యున్నత స్థాయి ఉద్యోగాలు సాధించారన్నారు. 2025 డీఎస్సీ ఫలితాలలో కూడా మొదటి ప్రయత్నంలోనే 712 ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించడం, ఏపీ టెట్–2026 ఫలితాలలో అత్యధిక మార్కులతో 186 మంది క్వాలిఫై కావడం, ఇప్పుడు విడుదలైన గ్రూప్–2 ఫలితాలలో ఇన్ని విజయాలు సాధించడానికి ప్రధాన కారణం తమ సంస్థలో నిబద్ధత, క్రమశిక్షణతో కూడిన శిక్షణ, ప్రామాణికమైన స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్లేనని ఆయన తెలిపారు. ఇంతటి అద్భుతమైన ఫలితాలను సాధించడంలో సహకరించిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు, అధ్యాపక, అధ్యాపకేతర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీపీఎస్సీ గ్రూప్–2, డీఎస్సీ, సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు నూతన బ్యాచ్లు ఫిబ్రవరి 12న ప్రారంభం కానున్నాయని, విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని రాబోయే నోటిఫికేషన్లలో విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు. -
మంచుతో మామిఢీ
● తెగుళ్లపై జాగ్రత్తలు అవసరం ● సస్యరక్షణతో అధిక దిగుబడి రాయవరం/ప్రత్తిపాడు: మామిడి ఇప్పుడిప్పుడే పూత దశకు చేరుకుంటోంది. పూత పిందెగా మారి తేనే రైతులకు లాభం. ప్రస్తుతం కురుస్తున్న మంచు, చలితో తెగుళ్లు విజృంభించే అవకాశం ఉంది. ముఖ్యంగా మంచుకు పూత మాడిపోయే అవకాశం ఉంది. తేనె మంచు పురుగు, ఆకు జల్లెడ గూడు పురుగు, పచ్చ పురుగు, పక్షికన్ను మచ్చ, బూడిద తెగుళ్లు వంటివి ఆశించే అవకాశం ఉంటుంది. తగిన యాజమాన్య పద్ధతులు పాటిస్తే దిగుబడి బాగుంటుందని అధికారులు వివరిస్తున్నారు. తేనె మంచు పురుగు మేంగో హోపర్గా పిలిచే తేనెమంచు తల్లి పురుగులు, పిల్ల పురుగులు గుంపులుగా చేరి లేత ఆకులు, పూతకాడలు, పూలు, లేతపిందెల రసాన్ని పీల్చేస్తాయి. నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు పూత ఎక్కువగా ఉన్న దశలోనే తేనె మంచుపురుగు ఆశిస్తుంది. ఈ పురుగులు విసర్జించిన తేనెలాంటి తియ్యని పదార్థం వల్ల మచ్చతెగులు, పూతకాడలపై, కాయలపై, ఆకులపై నల్లని మసి ఏర్పడుతుంది. ఈ తెగులు నివారణకు తోటలో నాలుగు నుంచి ఐదు అడుగుల ఎత్తులో ఆయిల్ పూసిన పసుపురంగు బోర్డులను ఏర్పాటు చేయాలి. ఎకరానికి నాలుగు నుంచి ఐదు ఏర్పాటు చేయాలి. పువ్వుమొగ్గ దశలో లీటరు నీటికి డైక్లోరోవాస్ (డీడీవీపీ) 0.5 మిల్లీలీటర్ల మందును లేదా మూడు గ్రాముల కార్బరిల్ లీటరు నీటికి కలిపి చెట్టు బెరడు, మూలలు తడిసేలా పిచికారీ చేయాలి. దీనివల్ల మొగ్గ తొలిచే గొంగళి పురుగును కూడా నివారించవచ్చు. పచ్చిపూత దశలో 1.5 మిల్లీ లీటర్ల నుంచి రెండు మిల్లీలీటర్ల మోనో క్రోటోఫాస్ లేదా రెండు మిల్లీలీటర్ల డైమిథోయేట్, లేదా రెండు మిల్లీలీటర్ల మిథైల్ డెమటా లేదా 0.25 మిల్లీ లీటర్ల ఇమిడాక్లోప్రిడ్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఒక చెట్టుకు 10 నుంచి 15 లీటర్ల మందు ద్రావణాన్ని పిచికారీ చేయాలి. పిందె దశ (నల్లపూత)లో లీటరు నీటికి ఒక మిల్లీ లీటరు పాస్పోమిడా లేదా రెండు మిల్లీలీటర్లు మిథైల్ డెమటాన్, రెండు మిల్లీ లీటర్ల డైమిథియేట్ లేదా ఒక గ్రాము అసిఫేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. తామర పురుగులు రెండు మిల్లీమీటర్ల పొడవు, జాలరు వంటి రెక్కలు కలిగి ఉండే తామర పురుగులు పూత, కాయ దశల్లో ఆశిస్తాయి. వీటి నివారణకు పాస్పోమిడా ఒక మిల్లీ లీటరు, పిప్రోనిల్ రెండు మిల్లీ లీటర్లు, ఎసిఫేట్ ఒక గ్రాము మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పైన సూచించిన మందులతో పాటు మూడు మిల్లీ లీటరు వేపనూనె లేదా ఐదు శాతం వేప కషాయం కలిపి పిచికారీ చేస్తే ఫలితాలు బాగుంటాయి. పూతచుట్టు పురుగు ఈ పురుగులు పూత గుత్తుల్ని గూడుగా ఏర్పరుచుకుని పూతను తింటుంటాయి. పూతకాడల్ని తొలుచుకుని తినడంతో పూత ఒడిలిపోయి పూతరాలి పోతుంది. దీని నివారణకు డైక్లోరోవాస్ (డీడీవీపీ) 0.5 మిల్లీ లీటర్లు మందును లేదా మూడు గ్రాములు కార్బరిల్ లీటరు నీటికి కలిపి చెట్టు బెరడు, మూలలు తడిసేలా పిచికారీ చేయాలి. టెంక పురుగు కాయలు గోళీ సైజులో ఉన్నప్పుడు కాయ పైభాగాన్ని గోకి గుడ్లు పెడుతుంది. పిల్ల పురుగులు కాయను తొలుచుకుని పోయి లేత టెంకపప్పును తింటాయి. కాయ ఎదిగే దశలో రంధ్రం మూసుకుపోతుంది. పిల్లపురుగు తల్లిపురుగుగా మారినప్పుడు అది విసర్జించే పదార్థాలను కండలోనికి తీసుకుని రావడం వలన కాయ కుళ్లి నాణ్యత కోల్పోతుంది. దీని నివారణకు లీటరు నీటికి ఒక మిల్లీ లీటర్ల పెంథియాన్, మూడు గ్రాములు కార్బరిల్, రెండు మిల్లీ లీటర్ల మోనోక్రోటోఫాస్ 15 రోజులకు ఒకసారి రెండు సార్లు చొప్పున పిచికారీ చేయాలి. ఆకుమచ్చ, పూతమాడు తెగులు వర్షాలు, పొగమంచు అధికంగా ఉంటే ఆకుమచ్చ, పూతమాడు తెగుళ్లు ఆశిస్తాయి. ఈ తెగులు వేళ్లు మినహా చెట్టంతా ఆశిస్తుంది. ఆకులపై గోధుమరంగు మచ్చలు ఏర్పడి క్రమంగా కలిసి పోయి ఆకులు త్వరగా పండి రాలిపోతాయి. పూత నుంచి మొగ్గ బయటకు వచ్చే సమయంలో మూడు గ్రాముల కోపరాక్సిక్లోరైడ్ లేదా పచ్చిపూతపై ఒక గ్రాము కార్బండిజమ్ లేదా ఒక గ్రాము థయోఫేనేట్మిథైల్, పిందె దశలో 2.5 గ్రాముల మేంకోజబ్ అనే మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. బూడిద తెగులు పొడి, చల్లని, మబ్బు వాతావరణంలో బూడిదతెగులు సోకడానికి అవకాశం ఉంది. లేత ఆకులు, పువ్వు, పువ్వుకాడలు, పిందెలపై తెల్లటి బూజు ఏర్పడుతుంది. దీనివల్ల పూలు, పిందెలు రాలిపోతాయి. దీని నివారణకు ఎక్సాకోనజాల్ రెండు మిల్లీ లీటర్లు, ప్రొపికొనజోల్ ఒక మిల్లీ లీటరు మందును లీటరు నీటికి కలిపి పూతంతా తడిసేలా పిచికారి చేయాలి. డైనోకాప్ లేదా ట్రైడామార్క్ ఒక మిల్లీ లీటరు మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆకు జల్లెడ గూడ పురుగు ఈ పురుగు పూతదశలో పూతను, మొగ్గలను ఆశించి తర్వాత గుత్తులను గూడుగా ఏర్పరుస్తుంది. రసాన్ని పీల్చి నష్టం కలిగిస్తుంది. దీని నివారణకు క్వినాల్ ఫాస్ 25 ఈసీ 2 మిల్లీ లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రత్తిపాడు నియోజకవర్గంలో.. గత ఏడాది 6,605 ఎకరాల్లో మామిడి తోటలు సాగయ్యాయి. నష్టాలను చవిచూసిన రైతులు ఈ ఏడాది వెయ్యి ఎకరాల మేర ఇతర పంటల వైపు మళ్లారు. ప్రస్తుతం కొబ్బరి మామిడి, బంగినపల్లి, రసాలు, పండూరు మామిడి, పాపారావు కోవ, కలెక్టరు, సువర్ణరేఖ, ఇమాటీలు వంటి జాతి రకాలతో పాటు దేశవాళీ రకాల మామిడి తోటలను పెంచుతున్నారు. ప్రత్తిపాడు మండలంలో 1,975 ఎకరాల్లో, శంఖవరంలో 2,305, రౌతులపూడిలో 1,155, ఏలేశ్వరంలో 167 ఎకరాల్లో మామిడి తోటలను పెంచుతున్నారు. జిల్లాలో 30 వేల ఎకరాలలో సాగు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారుగా 30 వేల ఎకరాల్లో మామిడి సాగవుతోంది. ప్రధానంగా బంగినపల్లి, కలెక్టరు, పెద్దరసం, చెరకురసం, కొత్తపల్లి కొబ్బరి, రాయల్ స్పెషల్, సువర్ణరేఖ వంటి రకాలు పండుతున్నాయి. ఏజెన్సీ, మెట్ట ప్రాంతాలతో పాటు కోనసీమ ప్రాంతంలో కూడా మామిడి పంట అధికంగా ఉంది. – పి.అనూష, రామచంద్రపురం డివిజన్ ఉద్యాన శాఖాధికారి ఇంకా పూత రాని తోటల్లో....ఇంకా పూత రాని తోటల్లో 13–0–45 పది గ్రాములు, 3 గ్రాముల సల్ఫర్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే పూత వచ్చే అవకాశం ఉంటుంది. పూత వచ్చిన తోటల్లో పూత నిలబడడానికి, కాయ రాలడాన్ని వివారించేందుకు ఫ్లానోఫిక్స్ 0.2 మిల్లీ లీటర్ల నీటికి కలిపి పిందె దశలో, మళ్లీ పిందె గోళీ సైజులో ఉన్నప్పుడు పిచికారీ చేయాలి. 3 గ్రాముల సూక్ష్మ పోషకాలు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. తోటలో కలుపు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. – కె.దివ్యశ్రీ, ఉద్యానశాఖాధికారి, ప్రత్తిపాడు -
కూటమి పాలనలో మహిళలపై వేధింపులు
● మాజీ హోం మంత్రి తానేటి వనిత దేవరపల్లి: కూటమి పాలనలో రాష్ట్రంలో మహిళలపై వేధింపులు పెరిగాయని, జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్ వ్యవహారమే దీనికి నిదర్శనమని మాజీ హోం మంత్రి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత అన్నారు. నల్లజర్లలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. రైల్వేకోడూరు మహిళను శారీరకంగా, మానసికంగా వేధించిన ఎమ్మెల్యే శ్రీధర్ను జనసేన నుంచి తక్షణం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పాలనలో ఎక్కడ చూసినా మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయన్నారు. ఇన్ని జరుగుతున్నా సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని వాపోయారు. రైల్వే కోడూరుకు చెందిన బాధిత మహిళ ఎన్నో కష్టాలను తట్టుకుని, ఇబ్బందులను ఓర్చుకుని, బెదిరింపులను దాటుకుని.. తనకు జరిగిన అన్యాయాన్ని వీడియో రూపంలో విడుదల చేసిందన్నారు. కానీ ఇంత వరకూ హోంమంత్రి స్పందించకపోవడం దారుణమన్నారు. స్పందించని పవన్ లైంగిక దాడులకు పాల్పడితే తాట తీస్తామని చెబుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పార్టీ ఎమ్మెల్యే శ్రీధర్పై ఇంత వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని తానేటి వనిత ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా వ్యవహరించాల్సిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. ఓ వివాహితను దారుణంగా వేధించి, దౌర్జన్యానికి తెగబడడం బాధాకరమన్నారు. పవన్ కల్యాణ్ వెంటనే ఆయన పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు చేస్తున్న ఇబ్బందికరమైన సంఘటనలను ఖండించి, ఎవరైతే జనసేన నాయకుల వల్ల ఇబ్బంది పడ్డారో వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జగనన్న ప్రభుత్వంలో మహిళలకు అన్ని విధాలా రక్షణ లభించిందన్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలు పడుతున్న ఇబ్బందులపై ఆ పార్టీల నాయకులు స్పందించడం లేదన్నారు. మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్ ఓ ప్రభుత్వ ఉద్యోగి మహిళని వేధించగా ఆమె బయటకు వచ్చి చెప్పిందన్నారు. కానీ సతీష్పై చర్యలు తీసుకోకపోగా, బాధిత మహిళపైనే కేసు పెట్టడం విచిత్రమన్నారు. వాడపల్లిలో సీల్డ్ టెండర్లు కొత్తపేట: వాడపల్లి వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో షామియానా ఏర్పాటు, వివిధ దుకాణాల నిర్వహణకు బుధవారం సీల్డ్ టెండర్లు నిర్వహించారు. దేవదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆలయ ప్రాంగణంలో షామియానాలు ఏర్పాటు చేసే హక్కుకు, అలాగే శ్రీనివాస ప్రాంగణంలో రెండు తాత్కాలిక షాపులకు (మూడేళ్ల కాలపరిమితి), లడ్డూ బాక్సులు సరఫరా చేసే హక్కుకు ఈ టెండర్లు నిర్వహించారు. లడ్డూ బాక్సులకు సంబంధించి ఒకటిని రూ.3.98కి సరఫరా చేయడానికి ముందుకు వచ్చిన విజయవాడకు చెందిన మణికంఠ ఏజెన్సీకి ఖరారు చేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు తమ్మన సాయి ప్రసాద్, శిష్టా సూర్య కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు. నేడు జనార్దనస్వామి కల్యాణం ధవళేశ్వరం: గ్రామంలోని ధవళగిరిపై కొలువైన శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీ జనార్దనస్వామి వారి కల్యాణం గురువారం రాత్రి 8.30 గంటలకు జరగనుంది. అంతకముందు తెల్లవారుజామున 3 గంటలకు విశేష అర్చనలు, ఉదయం 11.45 గంటలకు రథ సంప్రోక్షణ చేస్తారు. స్వామివారి రథోత్సవాన్ని మధ్యాహ్నం 3.45 గంటలకు ప్రారంభించనున్నారు. రథం వీధి నుంచి స్థానిక పోలీస్స్టేషన్ సెంటర్ వరకు ఈ కార్యక్రమం సాగుతుంది. ఫిబ్రవరి 2వ తేది వరకు స్వామివారి కల్యాణోత్సవాలు నిర్వహిస్తారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవస్థానం పాలకమండలి చైర్మన్ దాసరి చిన్న రమణ, ఆలయ కార్యనిర్వాహణాధికారి జోగి వెంకటేశ్వరరావు తెలిపారు. -
రోడ్డు ప్రమాదాలు నివారించాలి
కాకినాడ క్రైం: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని, పూర్తి నివారణకు సంబంధిత ఎస్హెచ్వోలు తగిన రీతిలో అప్రమత్తమవ్వాలని ఎస్పీ బిందుమాధవ్ ఆదేశించారు. బుధవారం కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. జాతీయ రహదారులపై ప్రమాదాల నియంత్రణకు సాంకేతికత సాయం తీసుకోవాలన్నారు. స్టాప్ వాష్ అండ్ గో ద్వారా అర్ధరాత్రి దాటాక, తెల్లవారుజామున చోదకులు ముఖం కడిగేలా చొరవ చూపాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. రాత్రి వేళల్లో ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించాలని సూచించారు. బ్లాక్ స్పాట్ల వద్ద బారికేడ్లు, స్పీడ్ గన్స్ ఏర్పాటు చేసి అతి వేగాన్ని నియంత్రించాలన్నారు. హెల్మెట్ ధరించడం, సీటు బెల్టు వినియోగంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. తరచు గొడవలు, కొట్లాటల్లో పాల్గొనే వ్యక్తులపై రౌడీ షీట్లు తెరవాలని సంబంధిత ఎస్హెచ్వోలను ఆదేశించారు. గుర్తు తెలియని మృతదేహాలను గుర్తించేందుకు స్కల్ సూపర్ ఇంపోజిషన్ విధానాన్ని అనుసరించాలన్నారు. ప్రాపర్టీ రికవరీలు చేపట్టాలన్నారు. జాతరలు, పండగలు, ఉత్సవాల్లో అశ్లీల నృత్యాలు జరగకుండా చూడాలన్నారు. -
● వైభవంగా అంతర్వేది నరసన్న కల్యాణం ● జనసంద్రమైన ఆలయ ప్రాంగణం ● మార్మోగిన జైలక్ష్మీ నరసింహ నామస్మరణ ● నేత్రపర్వంగా వేడుక
సాక్షి, అమలాపురం/ సఖినేటిపల్లి: పరమ పావనమైన వశిష్ఠ, సముద్ర సంగమ ప్రాంతంలో ఆధ్యాత్మికత పరవళ్లు తొక్కింది. ఆది దేవుని కల్యాణంతో శోభాయమానంగా మారింది. గోవింద నామస్మరణలు, జై లక్ష్మీనరసింహస్వామి అంటూ వేలాది గొంతులు స్మరించగా, ఆ ప్రాంతం శ్రవణానందకరంగా మారింది. అంతర్వేది పుణ్యక్షేత్రంలో జగదానందకారకుడు, ఆదిదేవుడు లక్ష్మీ నృసింహుని కల్యాణం బుధవారం అర్ధరాత్రి నయనానందకరంగా సాగింది. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి భక్తులు వెల్లువలా తరలి రావడంతో ఆలయ ప్రాంగణం జనసంద్రాన్ని తలపించింది. నేత్రపర్వం ఆది దేవుడు అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి తిరు కల్యాణ మహోత్సవం నేత్ర పర్వంగా సాగింది. నృసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను వేదిక మీద ఉంచి సుమారు నాలుగు గంటల పాటు నిర్వహించిన వివాహ వేడుకను వేలాది మంది భక్తులు ప్రత్యక్షంగానూ, లక్షల మంది భక్తులు టీవీలలో ప్రసారం ద్వారా తిలకించారు. స్వామివారి కల్యాణం బుధవారం రాత్రి 1.56 (గురువారం తెల్లవారు జామున) గంటలకు రోహిణి నక్షత్రయుక్త వృశ్చిక లగ్న పుష్కరాంశంలో కనుల వైకుంఠంగా సాగింది. నృసింహుని కల్యాణంతో పరమ పవిత్ర వశిష్ఠ తీరం పులకించింది. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, రంగురంగుల పువ్వులతో శోభాయమానంగా తయారు చేసిన కల్యాణ వేదిక, పట్టు వస్త్రాలు, బంగారం, వజ్రాలతో తయారు చేసిన ఆభరణాలను ధరించిన స్వామివారు, అమ్మవార్లు సప్త వర్ణాలతో వెలిగిపోయారు. కల్యాణ మండపం చుట్టూ భారీ పందిళ్లు విద్యుద్దీపకాంతులతో మెరిసిపోయాయి. ఎదురు సన్నాహంతో.. నరసింహస్వామివారి కల్యాణతంతు బుధవారం రాత్రి 10 గంటలకు ఎదురు సన్నాహంతో ప్రారంభమైంది. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన రాజా కలిదిండి కుమార రామ గోపాల రాజా బహదూర్ శ్రీవారి తరఫున, అర్చక స్వాములు అమ్మవారి తరఫున వివాహ కర్తలుగా వ్యవహరించారు. వైఖానస ఆగమానుసారం ఆలయ ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్ ఆధ్వర్యంలో స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, వేదపండితుడు చింతా వెంకటశాస్త్రి పర్యవేక్షణలో అర్చక బృందం సంప్రదాయబద్ధంగా కల్యాణాన్ని నిర్వహించారు. ఆభరణాలతో అలంకరణ ముహూర్తానికి జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని స్వామివారి శిరసుపై ప్రధాన అర్చకుడు కిరణ్, అమ్మవార్లు శ్రీదేవి, భూదేవి శిరసులపై సహాయ అర్చకులు ఉంచారు. ఎప్పటిలాగానే శఠారి, వైరుముడి, సూర్య పతకం, చిన్ని కిరీటం, వెండి కిరీటం, సాదా కిరీటం, కంటె, పచ్చలు, కెంపులు, వజ్రాలతో పొదిగిన కిరీటం, హంస పతకం, నవరత్నాలు పొదిగిన హారం, పగడాల దండ, తొమ్మిది ఈస్ట్ ఇండియా మోహాళీలు, 12 రకాల నానుతాడులు, చిన్ని లక్ష్మీ కాసుల పేర్లతో వారిని అలంకరించారు. వీటితోపాటు అంతర్వేదికరకు చెందిన దివంగత డాక్టర్ పోతురాజు సూర్య వెంకట సత్యనారాయణ సమర్పించిన అభరణాలను సైతం అలంకరించారు. ఆనవాయితీ ప్రకారం టీటీడీ దేవస్థానం శ్రీస్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించింది. రాష్ట్రం నలుమూల నుంచి సుమారు లక్ష మంది భక్తులు తరలివచ్చారు. కల్యాణోత్సానికి వచ్చిన వేలాది మంది భక్తులకు దేవస్థానం నోటిఫైడ్, ప్రైవేట్ సత్రాలు ఆకలి దప్పికలను తీర్చాయి. నేడు రథోత్సవం అంతర్వేదిలో స్వామివారి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా గురువారం మధ్యాహ్నం 2.05 గంటలకు స్వామివారి రథోత్సవం జరగనుంది. నూతన దంపతులుగా శ్రీస్వామి, అమ్మవార్లు రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. రథయాత్రలో సోదరి గుర్రాలక్క అమ్మవారికి చీర, సారెను, శ్రీస్వామి తరఫున అర్చకులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. కల్యాణ వేదికపై లక్ష్మీనరసింహస్వామి, అమ్మవార్లకు పూజలు చేస్తున్న అర్చకులులక్ష్మీనరసింహస్వామివారి కల్యాణం చూసేందుకు తరలివచ్చిన భక్తులువిద్యుద్దీప కాంతులతో మెరిసిపోతున్న ఆలయ ప్రాంగణం అన్నవరం నుంచి పట్టువస్త్రాలు అన్నవరం: లక్ష్మీనరసింహస్వామికి అన్నవరం సత్యదేవుని తరఫున బుధవారం పట్టువస్త్రాలను సమర్పించారు. అన్నవరం దేవస్థానం డిఫ్యూటీ కమిషనర్ బాబూరావు, ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యశర్మ, అర్చకుడు సుధీర్, వేద పండితుడు యనమండ్ర శర్మ తదితరులు అంతర్వేదికి వెళ్లి ఆ దేవస్థానం ఈఓ ఎంకేటీఎన్వీ ప్రసాద్కు వీటిని అందజేశారు. ఏటా దేవస్థానం తరఫున అంతర్వేది నరసన్నకు పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. -
రూ.కోటితో అభివృద్ధి పనులు
● అన్నవరం ఆలయ ట్రస్టుబోర్డు నిర్ణయం ● రూ.40 లక్షల వ్యయంతో రెండో మెట్ల దారి వద్ద ఆర్చి అన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో రూ.కోటి వ్యయంతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టాలని దేవస్థానం పాలకమండలి తీర్మానించింది. దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త, చైర్మన్ ఐవీ రోహిత్ అధ్యక్షతన ఏకసభ్య పాలకమండలి సమావేశం బుధవారం నిర్వహించారు. ఈఓ వేండ్ర త్రినాథరావు, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమైన తీర్మానాలు ● కొండ దిగువన మొదటి ఘాట్ రోడ్ నుంచి రత్నగిరికి నిర్మించిన రెండో మెట్ల దారి ప్రారంభంలో ఆర్చి నిర్మించేందుకు, మెట్లకు ఇరువైపులా పిట్టగోడ, భక్తులు కూర్చునేందుకు వీలుగా ఫ్లాట్ఫారమ్లు నిర్మాణానికి రూ.40 లక్షల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. విశాఖపట్నానికి చెందిన సంతోష్ ఇంజినీరింగ్ వర్క్స్ 27.27 శాతం తక్కువకు టెండర్ దాఖలు చేసింది. ఆ సంస్థకు నిర్మాణ పనులు అప్పగించాలని నిర్ణయం. ● ఈ ఏడాది ఏప్రిల్ 26 నుంచి మే మూడో తేదీ వరకు జరగనున్న సత్యదేవుని వార్షిక దివ్య కల్యాణ మహోత్సవాలకు స్వామివారి ఆలయంతో పాటు వ్రత మండపాలు, ఇతర ఆలయాలు, వార్షిక కల్యాణ మండపానికి రంగులు వేసేందుకు టెండర్లు పిలుస్తారు. ● సత్యగిరిపై గల హరిహరసదన్ సత్రంలో బాత్రూమ్స్లో వాటర్ లీకేజీ ట్రీట్మెంట్, తదితర పనులకు రూ.17 లక్షలతో రూపొందించిన అంచనాలకు. త్వరలో టెండర్లు పిలవాలని ఆదేశం. ● సత్యగిరిపై గల విష్ణుసదన్ సత్రంలో టాయిలెట్స్లో రూ.16.5 లక్షలతో వాటర్ లీకేజీ ట్రీట్మెంట్ పనులు చేయించేందుకు రూపొందించిన అంచనాలకు ఆమోదం. వీటికి కూడా త్వరగా టెండర్లు పిలవాలని నిర్ణయం. ● కొండదిగువన జూనియర్ కళాశాల గేటు పార్కింగ్ గోడ ఎత్తును 12 అడుగుల నుంచి 18 అడుగులకు పెంచేందుకు రూ.నాలుగు లక్షల వ్యయంతో చేపట్టే పనుల అంచనాలకు ఆమోదం. ● రూ.8.5 లక్షలతో వివిధ చోట్ల 22 స్టెయిన్లెస్ స్టీల్ టికెట్ కౌంటర్ టేబుల్స్ తయారీ అంచనాలకు ఆమోదం ● రానున్న వేసవి నేపథ్యంలో దేవస్థానం ఆవరణలో రూ.15 లక్షలతో పలుచోట్ల తాటాకు పందిర్లు, షామియానాలు వేయాలని నిర్ణయం. -
కొత్త శ్రామికలోకం
కాకినాడ క్రైం: జొమాటో, స్విగ్గీ, ర్యాపిడో, బ్లింకిట్... ఇలా పేరేదైనా, సేవ ఏదైనా వినియోగదారులు కోరుకున్న వస్తువు లేదా ఆహారాన్ని చెప్పిన సమయానికి, కోరిన చోటుకు చేర్చే గిగ్ వర్కర్ల వ్యవస్థ జిల్లాలో నానాటికీ విస్తరిస్తోంది. వీరి వల్ల వినియోగదారులకు గతం కంటే క్రయవిక్రయాల ప్రక్రియ సులభతరమైంది. మునుపటి కంటే కొనుగోళ్లు కూడా గణనీయంగా పెరిగాయి. యాప్లో ఆర్డర్ పెట్టడంతో నిమిషాల్లో తమ అవసరాలు తీరుతూండటం, సమయం, ఇంధనం వృథా కాకుండా కోరుకున్న వస్తువులు సకాలంలో ఇళ్లకు చేరుతూండటంతో ఈ సేవలకు విశేష ఆదరణ లభిస్తోంది. గిగ్ వర్కర్ల కృషితో ఈ–కామర్స్ మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా వృద్ధి చెందుతోంది. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపే. ఈ వ్యవస్థను క్షేత్ర స్థాయిలో తమ భుజాలపై మోస్తూ.. అటు కార్పొరేట్ల వ్యాపారానికి తోడ్పడుతూ.. మరోవైపు ప్రభుత్వానికి పన్నుల రూపంలో కోట్ల రూపాయలు ఆర్జించి పెడుతున్న గిగ్ వర్కర్లు ఉద్యోగ భద్రత సహా అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. విద్యాధికులు సైతం.. జిల్లాలో విద్యాధికులు సైతం గిగ్ వర్కర్లుగా పని చేస్తున్నారు. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదివిన ఓ వ్యక్తి ఉద్యోగ ప్రయత్నాలు చేసి విఫలమవడంతో ఓ యాప్లో ఫుడ్ డెలివరీ పార్టనర్గా చేరాడు. గత డీఎస్సీలో ఎంపికవలేకపోయిన ఓ యువతి గిగ్ వర్కర్గా పని చేస్తోంది. కాకినాడలో పోలీస్ పరీక్షలకు సిద్ధమవుతున్న ఓ యువకుడు సైతం రైడర్గా పని చేస్తున్నాడు. మహిళలు, దివ్యాంగులు కూడా సంపాదన కోసం ఈ బాట పడుతున్నారు. గత నవంబర్ గణాంకాల ప్రకారం, జిల్లాలో 7 వేల మంది గిగ్ వర్కర్లు ఉన్నారు. వీరిలో 2,500 నుంచి 3 వేల మంది వరకూ బ్లింకిట్, జొమేటో, స్విగ్గీల కోసం పని చేస్తున్నారు. 1,500 నుంచి 2 వేల మంది వరకూ ఓలా, ర్యాపిడో రైడర్లుగా ఉన్నారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ డెలివరీ పార్టనర్లుగా 1,200 నుంచి 1,500 మంది వరకూ పని చేస్తున్నారు. అర్బన్ కంపెనీ, స్థానిక ఈ–కామర్స్ ప్లాట్ఫాంలు, ఇతర యాప్ల కోసం సుమారు 500 మంది పని చేస్తున్నారు. ఎక్కువ మంది కాకినాడ పట్టణం, పరిసర ప్రాంతాల్లోనే పని చేస్తున్నారు. కూలీల కంటే దయనీయం ఫ యాప్లో పేర్కొన్న లొకేషన్ ప్రకారం కాకినాడ ఆటోనగర్లోని ఓ నిర్మానుష్య మైదాన ప్రాంతంలో ఆపి ఉన్న వ్యాన్లోని వ్యక్తులకు రాత్రి 11.30 గంటల సమయంలో ఫుడ్ డెలివరీ ఇచ్చేందుకు వెళ్లిన ఓ రైడర్పై మద్యం మత్తులో ఉన్న ముగ్గురు ఇటీవల దాడి చేశారు. చేసిన ఆర్డర్కు డబ్బులివ్వకపోగా, డెలివరీ బాయ్ వద్ద ఉన్న రూ.2 వేలు కూడా లాక్కున్నారు. ఫ నిమిషాల వ్యవధిలో కిరాణా డెలివరీ ఇస్తామన్న ఓ యాప్లో పని చేస్తున్న ఓ గిగ్ వర్కర్ త్వరగా డెలివరీ ఇవ్వాలనే ఆత్రంలో ద్విచక్ర వాహనంపై వేగంగా వెళ్తూ బోట్క్లబ్ ఎదుట ప్రమాదానికి గురయ్యాడు. ఆ గాయాలతోనే ఐటెం డెలివరీకి వెళ్లాడు. ఫ ఇటువంటి ఘటనలు తరచుగా ఎన్నో జరుగుతున్నాయి. గిగ్ వర్కర్లది రోజు కూలీల కంటే దయనీ య స్థితి. వీరికి స్థిరమైన ఆదాయం, ఉద్యోగ భద్రత ఉండవు, పీఎఫ్, ఈఎస్ఐ సేవల ఊసే లేదు. విధి నిర్వహణలో సైతం వీరికి ఎటువంటి భద్రత, బీమా వంటివి ఉండవు. ఉన్నా నామమాత్రంగానే సరిపెడతారు. యాప్, ఆల్గారిథం ఆధారంగా రేటింగ్ తగ్గితే పని కోల్పోవడం లేదా ఆదాయం తగ్గిపోవడం వీరికి పరిపాటి. కనీస వేతనాలు అమలు కావు. కేవలం టాస్క్, ప్రాజెక్టు ఆధారిత పారితోషికం అందుకుంటారు. సంస్థలు కూడా వారిని ఉద్యోగులుగా పరిగణించవు. చట్టమున్నా.. గిగ్ వర్కర్ల రక్షణ, ఉద్యోగ భద్రతకు సోషల్ సెక్యూరిటీ కోడ్–2020 పేరుతో ప్రత్యేక చట్టం ఉంది. కోవిడ్ ఉధృతంగా ఉన్న నాటి సమయంలో.. ఆన్లైన్ కార్యకలాపాలపై దేశం ఆధారపడిన వేళ.. వీరి ప్రాధాన్యాన్ని గుర్తించి, అప్పటికప్పుడు ఈ చట్టాన్ని రూపొందించారు. ఆరోగ్య, ప్రమాద బీమా, వృద్ధాప్య భద్రత, పింఛను, వైద్య సహాయం, మాతృత్వ ప్రయోజనాలు ఈ చట్టం పరిధిలో గిగ్ వర్కర్లకు అందాలి. వీటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా అమలు చేయాలి. దీనికిగాను గిగ్ వర్కర్లు ఈ–శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకోవాలి. అయితే, ఈ చట్టంలోని ఏ ఒక్క అంశమూ అమలుకు నోచుకోలేదు. ఈ చట్టంపై గిగ్ వర్కర్లలో అవగాహన కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ బిల్లు ఇప్పటి వరకూ ప్రవేశపెట్టలేకపోయింది. అసంఘటిత కార్మికులకు వర్తించే ఈ–శ్రమ్, ఆరోగ్య బీమా, యూఏఎన్ వంటివి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందే తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదు. గిగ్ వర్కర్లు ఎవరంటే.. స్థిరమైన ఉద్యోగం లేకుండా, తాత్కాలిక, అప్పటి అవసరాలకు అనుగుణంగా పని చేసే కార్మికులను గిగ్ వర్కర్లు అంటారు. జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, ఇన్స్టామార్ట్, ఈ–కామర్స్ డెలివరీ బాయ్స్, ఓలా, ఊబర్ డ్రైవర్లు, ఫ్రీలాన్స్ డిజైనర్లు, రైటర్లు ఈ కోవకు వస్తారు. నిరుద్యోగ సమస్య నానాటికీ తీవ్రమవుతూండటం.. వస్తున్న ఆదాయం చాలకపోవడం లేదా అసలు ఆదాయమే లేకపోవడం వంటి కారణాలతో పలువురు గిగ్ కార్మికులుగా మారుతున్నారు. వీరిలో ఎక్కువ మంది యువతే ఉంటున్నారు. అనుకూలమైన పని వేళలు, రోజువారీ పేమెంట్లు ఉండటంతో చాలీచాలని జీతాలకు పని చేస్తున్న పలువురు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. రోజువారీ జీవనం భారంగా మారుతూండటం, ఉద్యోగాలేవీ లేకపోవడంతో గత్యంతరం లేని స్థితిలో ఇంటిని పోషించుకోవడానికో, భర్తకు చేదోడువాదోడుగానో ఇటీవల యువతులు, మహిళలు కూడా ఈ దారి ఎంచుకుంటున్నారు. నిరుద్యోగులే.. నిరుద్యోగులే గిగ్ వర్కర్లుగా పని చేస్తున్నారు. వీరికి ఎటువంటి భ విష్యత్తూ ఉండదు. అయినప్పటి కీ అవసరాలు ముంచుకు రావ డంతో మరో ఉద్యోగం లేక ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. కష్టాలు చెప్పుకోవడానికి యజమాని కూడా ఉండడు. ప్రమాదాలు జరిగితే చూసిన వారే తప్ప సంస్థలు ఎటువంటి సాయం చేయవు. నామమాత్రపు ఇన్సూరెన్స్లు ఇస్తూ శ్రమ దోచుకుంటున్నాయి. విధి నిర్వహణలో ఎలాగూ గౌరవ మర్యాదలుండవు. కనీ సం ప్రభుత్వమైనా తగిన భద్రత, భరోసా కల్పించాలి. – ఎ.వెంకటేష్, కాకినాడ, ఫుడ్ డెలివరీ పార్టనర్ సంఘటితమైతేనే.. సంఘటితమైతేనే గిగ్ వర్కర్ల సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రత్యక్ష పోరాటాల ద్వారా వారి స్థితి మెరుగుపడుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థలో వారిది కీలక పాత్ర. కనీస వేతనాలు, బీమా సౌకర్యాలు కల్పిస్తేనే ఈ రంగం స్థిరంగా మనుగడ సాగించగలుగుతుంది. గిగ్ వర్కర్ల సంఖ్య నానాటికీ పెరుగుతున్నందున వారి హక్కులు, భద్రతపై స్పష్టమైన విధానాలు అవసరం. ప్రభుత్వం, డిజిటల్ కంపెనీల సంయుక్త బాధ్యతతోనే ఈ కొత్త కార్మిక వర్గానికి భద్రత, భరోసా దక్కుతాయి. డెలివరీకి చెల్లింపు పెంచాలి. వేగం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ–కామర్స్ యాప్లను ఒకే వేదిక పైకి తెచ్చేలా ప్రభుత్వమే కొత్త యాప్ ప్రవేశపెట్టి నిర్వహించాలి. సంఘం జిల్లా ట్రెజరర్ మలకా వెంకట రమణ ఆధ్వర్యంలో గిగ్ వర్కర్లను సంఘటితం చేస్తున్నాం. – పలివెల వీరబాబు, సీఐటీయూ జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యుడు, కాకినాడ ఫ సేవా రంగంలో తాత్కాలిక ఉద్యోగులు ఫ స్థిరమైన ఆదాయం, ఉద్యోగ భద్రత శూన్యం ఫ గిగ్ వర్కర్ల గావుకేక ఫ జిల్లాలో 7 వేల మంది ఫ వీరి సంక్షేమాన్ని పట్టించుకోని ప్రభుత్వం -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ఎటపాక: ఆటో అదుపు తప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అడిషనల్ ఎస్సై రాధాకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం కూనవరం మండల కేంద్రానికి చెందిన మచ్చా నాగేశ్వరరావు(27) వరసకు తన అన్న కూతురు లావణ్యను తన కొత్త బైక్పై ఎక్కించుకుని తెలంగాణలోని వెంకటాపురం నుంచి కూనవరం వస్తున్నాడు. ఈ క్రమంలో కూనవరం నుంచి ఆరుగురు ప్రయాణికులతో పల్లూరుకు చెందిన షేక్రహీమ్ తన ఆటోలో భద్రాచలం వెళుతున్నాడు. ఆ సమయంలో ఎటపాక మండలం బూట్టాయిగూడెం శివాలయం సమీపంలో రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఆటో అదుపు తప్పడంతో జరిగిన ఈ ప్రమాదంలో బైక్ నుజు నుజ్జు కాగా నాగేశ్వరరావుకు తల, సున్నితమైన భాగాలలో బలమైన గాయాలయ్యాయి. లావణ్యకు కాలు విరగగా ఆటోలోని ప్రయాణికులు, డ్రైవర్కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో భద్రాచలం తరలిస్తుండగా మార్గమధ్యలో నాగేశ్వరరావు మరణించాడు. మృతుడి తండ్రి గతంలో మరణించగా తల్లికి ఆసరాగా ఉన్న అవివాహిత కుమారుడు కూడా మరణించటంతో తల్లి చిట్టెమ్మ రోదన అక్కడ ఉన్నవారిని కలచి వేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రత్యక్ష దేవుడి పెళ్లికి వెళ్లొద్దాం రండి!
పెదపూడి: దేశంలోనే ఏకై క వైష్ణవ సంప్రదాయ సూర్య దేవాలయంగా ప్రసిద్ధి చెందిన మండలంలోని జి.మామిడాడ సూర్యనారాయణమూర్తి కల్యాణ మహోత్సావానికి అంతా సిద్ధమైంది. స్వామి వారి దివ్య కల్యాణ మహోత్సవాన్ని పరమహంస పరివ్రాజకాచార్య, వేదమార్గ ప్రతిష్ఠాపనాచార్య, ఉభయ వేదాంత ప్రవర్తకాచార్య శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి మంగళ శాసనాలతో భీష్మ ఏకాదశి గురువారం వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకు ఈఓ పాటి సత్యనారాయణ, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ట్రస్ట్బోర్డు చైర్మన్ కొవ్వూరి శ్రీనివాస బాలకృష్ణారెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు సమాయత్తమవుతున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వేలల్లో హాజరయ్యే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. భారీగా బాణసంచా సిద్ధం చేశారు. కల్యాణం రోజున జరిగే కార్యక్రమాలు ఈ నెల 25న రథసప్తమి రోజున ప్రారంభమైన స్వామివారి కల్యాణ మహోత్సవాలు ఫిబ్రవరి 2తో ముగుస్తాయి. స్వామి కల్యాణ మహోత్సవం సందర్భంగా గురువారం ఉదయం 5 గంటలకు నిత్యోపాసన, విశేష హోమం, బలిహరణ, 8 గంటలకు ధ్వజారోహణ, 9 గంటలకు మార్కెట్ సెంటర్లో భారీ అన్న సమారాధన, మధ్యాహ్నం 1.00 గంటకు శ్రీవారి రథోత్సవం నిర్వహిస్తారు. రాత్రి 8 గంటలకు స్వామి కల్యాణం ప్రారంభమవుతుంది. ఆలయ చరిత్ర.. ప్రత్యేకత ఈ ఆలయ నిర్మాణం వెనుక శతాబ్దం చరిత్రతో పాటు కొవ్వూరి వంశీయుల దాతృత్వం దాగి వుంది. ఆలయంలో 1902 జూన్ 18న విగ్రహ ప్రతిష్ఠ శ్రీ వైష్ణవ సంప్రదాయ రీతిలో చేశారు. దేశంలో కోణార్క్, అనంతనాగ్, గయ, రాష్ట్రంలో ఆరసవల్లి సూర్యదేవాలయాలు ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రమే వైష్ణవ సంప్రదాయంలో పూజలు చేస్తారు. నాలుగు అంతస్తులతో శిలా కావ్యాలను ఆలయంలో నిర్మించారు. అహోబల సంస్థానంలో కొవ్యూరి భూమంచిరెడ్డి వంశీయులు దండనాయకులుగా, మహానాయకులుగా ఉండేవారు. మహమ్మదీయుల దండయాత్రలతో ప్రాబల్యం కోల్పోయిన ఈ వంశీయులు ఉభయ గోదావరి జిల్లాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. కొవ్యూరి బసివిరెడ్డి వ్యాపారంలో అభివృద్ధి సాధించి భూములు, సిరి సంపదలు కూడగట్టారు. గృహ, వస్త్ర, అన్నదానాలతో పాటు బావులు తవ్వించారు. వనాలు పెంచారు. దేవాలయాల నిర్మాణాలను చేపట్టారు. ఈయన సేవలను కొనియాడుతూ 1897 బ్రిటిష్ మహారాణి ప్రశంసాపత్రం పంపించారు. ఈయన దాతృత్వానికి కుతుకులూరు, కాకినాడ, గొల్లల మామిడాడ, గండ్రేడు, నిడదవోలు తదితర ప్రాంతాల్లోని బసివిరెడ్డి పేటలే తార్కాణం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాల్లో అనేక బావులు తవ్వించారు. నిత్యాన్నదానం చేస్తున్న సామర్లకోట బసివిరెడ్డి సత్రం ఈయన చలవతోనే నడుస్తోంది. అన్నవరం తర్వాత గొల్లల మామిడాడ సూర్యనారాయణమూర్తి దేవాలయంలోనే ఎక్కువ సంఖ్యలో వివాహాలు జరుగుతాయి. ఉత్సవాలు ఇలా.. 30వ తేదీ ఉదయం, సాయంత్రం నిత్యార్చన, నిత్యహోమాలు, బలిహరణ 31న సాయంత్రం 4 గంటలకు సదస్యం, స్వామివారి గరుడ వాహన తిరువీధి ఉత్సవం 1వ తేదీ ఉదయం 7 గంటలకు పవిత్ర తుల్యభాగనదీ తీరాన స్వామి వారి చక్రస్నానం, ఆలయంలో మహా పూర్ణాహుతి 2వ తేదీ రాత్రి 7 గంటలకు అద్దాల శయన మందిరంలో ఉయ్యాలసేవ, శ్రీపుష్పయాగ మహోత్సవం రేపు జరిగే సూర్యనారాయణమూర్తి కల్యాణానికి అంతా సిద్ధం భారీ ఏర్పాట్లు చేసిన జి.మామిడాడ ఆలయ ఉత్సవ కమిటీ రాష్ట్రం నలుమూలల నుంచి వేలల్లో హాజరుకానున్న భక్తులు -
మైనారిటీలపై పథకం ప్రకారం దాడులు
జగ్గంపేట: చంద్రబాబు ప్రభుత్వంలో మైనారిటీలకు రక్షణ లేకుండా పోయిందని, రాష్ట్రంలో ఓ పథకం ప్రకారం మత విద్వేషాలు రగిలిస్తూ, మైనారిటీలపై దాడులకు పాల్పడుతున్నారని వైఎస్సార్ సీపీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బొల్లవరపు జాన్వెస్లీ ఆరోపించారు. జగ్గంపేటలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మైనారిటీలపై దాడుల్లో ప్రపంచంలోనే భారతదేశం ప్రథమ స్థానంలో ఉందని, దీనికి ప్రధాన కారణం చంద్రబాబు పాలనలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని, పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని విమర్శించారు. న్యాయ వ్యవస్థను సైతం కూటమి నేతలు ధిక్కరించే దారుణ పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇసుక, ల్యాండ్, మైనింగ్ మాఫియాలతో చేతులు కలిపి దోచుకు తింటున్నారని, దీంతో పరిపాలన గాడి తప్పిందని, నియంతృత్వ, కార్పొరేట్ వ్యవస్థ రాజ్యమేలుతోందని అన్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీల రూపంలో సంఘ వ్యతిరేక శక్తులు మైనారిటీలు, క్రైస్తవులపై దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. దీని వెనుక ఓ మంత్రి పాత్ర ప్రముఖంగా కనిపిస్తోందని జాన్వెస్లీ ఆరోపించారు. గతంలో ఆయన శాఖ ద్వారా రాష్ట్రంలో అనుమతులున్న చర్చిలు ఎన్ని, లేనివి ఎన్ననే సమాచారం సేకరించారని, దీనిపై క్రైస్తవులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో తాత్కాలికంగా మౌనం వహించారని చెప్పారు. కానీ, ఒక పథకం ప్రకారం రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో దాడులు జరుగుతున్నాయన్నారు. గొల్లప్రోలు, సత్యసాయి, అనంతపురం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, విశాఖ జిల్లా భీమిలిల్లో చర్చిలు, క్రైస్తవ మత సంఘాలు, ప్రభువును నమ్ముకున్న వారిపై జరిగిన దాడులే దీనికి నిదర్శనమని ఆరోపించారు. ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాలు అమలు చేయలేక, చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టించి, ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో జరిగిన అభివృద్ధిని తాము చేసినట్లు చెప్పుకొంటూ క్రెడిట్ చోరీ చేస్తున్నారని, భోగాపురం ఎయిర్పోర్టు, అదానీ డేటా సెంటర్లే దీనికి ఉదాహరణగా నిలుస్తాయని జాన్వెస్లీ అన్నారు. విలేకర్ల సమావేశంలో క్రిస్టియన్ మైనారిటీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.జాన్వెస్లీ, కార్యదర్శి మోర్తా శ్రావణ్ కుమార్, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల అధ్యక్షులు జడాల జాషువా గిరి, విజయ సారథి, నేతలు గుడాల శాంతిప్రసాద్, ఐ.షాలెమ్. టి.తిమోతి, పలువురు క్రిస్టియన్ సంఘ నేతలు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్వెస్లీ -
రత్నగిరిపై విస్తృత ఏర్పాట్లు
అన్నవరం: భీష్మ ఏకాదశి, మాఘ పౌర్ణమి నాడు సత్యదేవుని దర్శనానికి వేలాదిగా భక్తులు వచ్చే అవకాశమున్నందున రత్నగిరి విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ, దేవస్థానం అధికారుల సమావేశంలో నిర్ణయించారు. ఈ రెండు రోజులతో పాటు మాఘమాసంలో వివిధ పర్వదినాల్లో వచ్చే భక్తుల సౌకార్యర్థం చేపట్టాల్సిన ఏర్పాట్లపై ప్రకాష్ సదన్లోని ట్రస్ట్ బోర్డు సమావేశ హాలులో పెద్దాపురం ఆర్డీఓ శ్రీరమణి అధ్యక్షతన మంగళవారం సమావేశం నిర్వహించారు. అన్నవరం దేవస్థానం తరఫున చేస్తున్న ఏర్పాట్లను ఈఓ వి.త్రినాథరావు వివరించారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, విద్యుత్, ఏపీఎస్ ఆర్టీసీ, అగ్నిమాపక శాఖల అధికారులు కూడా సహకారం అందించాలని కోరారు. ఈ సమావేశంలో దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, ప్రత్తిపాడు సీఐ సూర్య అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఇవీ నిర్ణయాలు.. ● ఈ నెల 29న భీష్మ ఏకాదశి, ఫిబ్రవరి 1న మాఘ పౌర్ణమి, 15వ తేదీన మహాశివరాత్రితో పాటు మాఘ మాసంలో వచ్చే శని, ఆదివారాలు, ఇతర పర్వదినాల్లో సత్యదేవుని సన్నిధికి వేలాదిగా భక్తులు రానున్నారు. వారికి ఎటువంటి ఇబ్బందీ కలగకుండా ఏర్పాట్లు చేయాలి. ● భీష్మ ఏకాదశి, మాఘ పౌర్ణమి పర్వదినాల్లో ముందు రోజు సాయంత్రం నుంచే వేలాదిగా భక్తులు రత్నగిరికి వస్తారు. దీనికి తగినట్లుగా చర్యలు చేపట్టాలి. ● ఈ రెండు రోజుల్లో అర్ధరాత్రి 12.30 గంటల నుంచే సత్యదేవుని వ్రతాల నిర్వహణ ప్రారంభించాలి. వేకువజామున ఒంటి గంట నుంచే స్వామివారి దర్శనానికి అనుమతించాలి. ● క్యూలో భక్తులకు మంచినీరు, చిన్నారులకు పాలు, బిస్కెట్లు అందజేయాలి. స్వచ్ఛంద సేవా కార్యకర్తల సహకారంతో పలుచోట్ల క్యాన్ల ద్వారా మంచినీరు అందించాలి. ● ప్రసాదాల విక్రయాలకు అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయాలి. ప్రసాదాలపై ఎలుకలు పరుగులు పెడుతున్న వీడియోలు ఇటీవల వైరల్ అయినందున అటువంటి వాటికి ఆస్కారం లేకుండా అన్ని కౌంటర్లలో తగు చర్యలు తీసుకోవాలి. ● ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ అవ్వకుండా చర్యలు చేపట్టాలి. భారీ వాహనాలను కొండ దిగువన హైస్కూల్ మైదానంలో నిలుపు చేయాలి. కార్లు, ఇతర చిన్న వాహనాలను మాత్రమే రత్నగిరికి అనుమతించాలి. ఈ కార్లను సత్యగిరిపై హరిహర సదన్ ఆవరణలో, సత్యగిరి రోడ్డు పక్కన పార్కింగ్ ప్రదేశంలో, ప్రకాష్ సదన్ సత్రం వద్ద నిలుపు చేయాలి. ● రత్నగిరి, సత్యగిరి మధ్య భక్తుల కోసం ఉచిత బస్సులు నడపాలి. గతంలో మాదిరిగా టాటా మ్యాజిక్ వాహనాలను కూడా ఇందుకు ఉపయోగించాలి. ● కార్తిక మాసంలో మాదిరిగానే కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేసి, భక్తులను విడతల వారీగా స్వామివారి దర్శనానికి పంపించాలి. ● భీష్మ ఏకాదశి, మాఘ పౌర్ణమి నాడు ఉదయం 8 గంటల నుంచి సర్కులర్ మండపం వద్ద భక్తులకు దధ్యోదనం, పులిహోర పంపిణీ చేయాలి. ● భక్తులందరికీ వసతి గదులు లభించే అవకాశం లేనందున డార్మెట్రీలు, విశ్రాంతి మండపాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలి. మూఢం కారణంగా ప్రస్తుతం వివాహాలు లేనందున సత్యగిరిపై విష్ణుసదన్ హాళ్లలో కూడా భక్తుల వసతికి చర్యలు తీసుకోవాలి. ● దేవస్థానంలో పలుచోట్ల అదనపు టాయిలెట్లు సిద్ధం చేయాలి. ● జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, దేవస్థానం ఉచిత వైద్యశాల సిబ్బంది సహకారంతో దేవస్థానంలో మూడుచోట్ల వైద్య శిబిరాలు నిర్వహించాలి. ● దివ్యాంగుల కోసం వై జంక్షన్ నుంచి పశ్చిమ రాజగోపురం వరకూ బ్యాటరీ కార్లు నడపాలి. ● కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం నుంచి అన్నవరానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలి. ఫ భీష్మ ఏకాదశి, మాఘ పౌర్ణమికి వేలాదిగా భక్తులు వచ్చే అవకాశం ఫ అన్ని చర్యలూ తీసుకోవాలని అధికారుల నిర్ణయం -
ఉత్తమ నాటికగా అసత్యం
● ముగిసిన ఉభయ తెలుగు రాష్ట్రాల నాటిక పోటీలు ● ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా అమ్మ చెక్కిన బొమ్మ సామర్లకోట: పెద్దాపురం మండలం చంద్రమాంపల్లి గ్రామంలో మూడు రోజుల పాటు నిర్వహించిన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల స్థాయి నాటిక పోటీలు ముగిశాయి. ఉత్తమ నాటికగా విశాఖపట్నం, చైతన్య కళా స్రవంతి ప్రదర్శించిన ‘అసత్యం’ ఎంపిక అయింది. ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా గోవాడ క్రియేషన్స్, హైదరాబాద్ వారి ‘అమ్మ చెక్కిన బొమ్మ’ నిలిచింది. తృతీయ ప్రదర్శనగా అభినయ ఆర్ట్సు గుంటూరు వారి ‘ఇది అతని సంతకం’ ఎంపిక అయింది. ‘గేమ్’ నాటిక జ్యూరీ బహుమతిని అందుకుంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు విశ్రాంత చీఫ్ మేనేజరు గోపి కాశీవిశ్వనాథ్, విశ్వకవి విద్యాసంస్థల వారి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఉత్తమ దర్శకునిగా అసత్యం నాటిక దర్శకుడు బాలాజీ నాయక్, ఉత్తమ రచయితగా (అమ్మ చెక్కిన బొమ్మ) జ్యోతిరాజ్ బీసెట్ బహుమతులు అందుకున్నారు. ఉత్తమ నటుడిగా ఇది అతని సంతకం నాటికలో కృష్ణమూర్తి పాత్రధారి రవీంద్రరెడ్డి, ఉత్తమ నటిగా అమ్మ చెక్కిన బొమ్మ నాటికలో అనసూయ పాత్ర ధారి జ్యోతిరాజ్ నిలిచారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా కె.శాంతారావు, బీఎస్ ఆర్ స్వామి, ఘంటా ముత్యాలనాయుడు వ్యవహరించారు. చంద్రమాంపల్లి గ్రామానికి చెందిన కళాభిమానులు స్నేహా ఆర్ట్స్ నాటక పరిషత్తు ఏర్పాటు చేసి ఏడు సంవత్సరాలుగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల స్థాయి నాటిక పోటీలు నిర్వహిస్తున్నారు. పరిషత్తు అధ్యక్షుడు గొందేసి రాజా, గౌరవ సలహాదారు కొత్తెం స్వామినాథన్, గౌరవ అధ్యక్షుడు గోగులపాటి సీతారామస్వామి, కార్యదర్శి యిందన బ్రహ్మానందం, ఉపాధ్యక్షుడు దేవాడ పాపేశ్వరరావు, సహాయ కార్యదర్శి మంతిన సత్తిబాబు, కోశాధికారి మానేపలి రవీంద్ర, కార్యవర్గ సభ్యులు కేదారి నాగేశ్వరరావు, గొందేసి సత్యానందం, వెన్నా సత్యనారాయణ, నూకలమంతి నానాజీ, ప్రజానాట్యమండలి కళాకారులు డి సత్యనారాయణ, మహాపాతిన రాంబాబు, రామిశెట్టి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
ఉత్తమ సేవలకు పురస్కారాలు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లావ్యాప్తంగా ఉత్తమ సేవలందించిన పలువురు అధికారులు, సిబ్బంది, వివిధ సంస్థల ప్రతినిధులకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇన్చార్జి కలెక్టర్ అపూర్వ భరత్ పురస్కారాలు అందించారు. కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన వేడుకల్లో ప్రశంసాపత్రాలు అందజేశారు. జిల్లా వ్యవసాయ అధికారి ఎం.విజయ్ కుమార్, జిల్లా పౌర సరఫరాల అధికారి ఆర్ఎస్ఎఫ్ సత్యనారాయణరాజు, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ ఎం.దేవులా నాయక్, డ్వామా పీడీ అడపా వెంకటలక్ష్మి, జిల్లా మత్స్యశాఖాధికారి వి.కృష్ణారావు, జిల్లా సీపీఓ పి.త్రినాథ్, జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి సీహెచ్ లక్ష్మి, జిల్లా సర్వే శాఖ, ల్యాండ్ రికార్డ్స్ అధికారి కె.శ్రీనివాస్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ వి.లక్ష్మీరమణి, డిప్యూటీ తహసీల్దార్ ఎం.సతీష్కుమార్రెడ్డి, సీనియర్ అసిస్టెంట్లు ఆర్.సుధామాధురి, సీహెచ్ శివరామకుమార్, ఎం.త్రివేణి, టి.లోహిత సాయి శ్రీనివాస్, ఎం.జాకబ్, సీహెచ్డీ నరసింహ, జూనియర్ అసిస్టెంట్లు కె.రాజేష్రెడ్డి, జీఎస్ఎఫ్ శ్రీధర్, కె.సతీష్నాయుడు, వి.సత్యవాణి, కె.లోవతల్లి, జి.వెంకటేష్, పి.అజయ్కుమార్, ఎం.పౌలు, కె.లోకేష్ కుమార్, జీపీ రఘుపతిరావు, జాయింట్ కలెక్టర్ పేషీ సిబ్బంది జీపీ రఘుపతిరావు, ఎండీ జార్జి మొహిద్దీన్, జె.వీరబాబు, పి.రాజేష్, జి.కృష్ణమోహన్, జి.దుర్గాప్రసాద్, కేవీవీఎన్ సత్యనారాయణరావు, రాజ్బహుదూర్ బి.రవికుమార్, టి.సాయి కామేష్, ఆర్డీఓ కార్యాలయం సీసీ సుబ్బారావు, డీఆర్ఓ కార్యాలయం సిబ్బంది ఎస్.గౌతమ్, వి.సతీష్, తహసీల్దార్లు ఎస్ఎల్ఎం కుమారి, పీవీ సీతాపతిరావు, డిప్యూటీ తహసీల్దార్ డి.నాగసౌజన్య, డి.కమలాదేవి, సీనియర్ అసిస్టెంట్ గౌసియా బేగమ్, ఆర్ఐలు వి.వెంకటేశ్వరరావు, కేఎస్వీ సుబ్బారావు, జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయం టైపిస్ట్ కారం భారతి, ఆఫీస్ అసిస్టెంట్ కోరంగి గోపీకృష్ణ, సాహిత్య సాంస్కృతిక సేవలకు గుర్తింపుగా సాహితీ స్రవంతి నగరాధ్యక్షుడు మార్ని జానికిరామ చౌదరి తదితరులకు ఇన్చార్జి కలెక్టర్ ప్రశంసాపత్రాలు అందించారు. -
మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026
జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న ఇన్చార్జి కలెక్టర్ అపూర్వ భరత్. చిత్రంలో ఎస్పీ బిందుమాధవ్ ప్రజల సహకారంతో ప్రగతి గీతికమేరా భారత్ మహాన్: ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శనజయహో భారత్: అలరించిన విద్యార్థినుల విన్యాసంబోట్క్లబ్ (కాకినాడ సిటీ): ప్రజల సహకారంతో జిల్లాను మరింత అభివృద్ధి చేస్తానని ఇన్చార్జి కలెక్టర్ అపూర్వ భరత్ అన్నారు. దేశ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో సోమవారం ఆయన జాతీయ జెండాను ఎగురవేసి, సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశ సమైక్యత, ప్రగతి కోసం ప్రజలందరూ జాతి, కుల, మత, ప్రాంతీయ భేదాలు లేకుండా మంచి పౌరులుగా జీవనం సాగించాలని, విధులు, బాధ్యతలను అంకిత భావంతో పాటించాలని పిలుపునిచ్చారు. దేశ ప్రజలందరికీ రాజ్యాంగం సమాన హక్కులు, అవకాశాలను కల్పించిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా ప్రగతిని ఆయన వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ప్రస్తుత రబీలో ఇప్పటి వరకూ రూ.4,830 కోట్ల పంట రుణాలు, రూ.3,520 కోట్ల టర్మ్ లోన్లను రైతులకు అందించాం. 9,660 మంది కౌలు రైతులకు రూ.160 కోట్ల రుణాలుగా మంజూరు చేశాం. అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం ద్వారా ఈ ఏడాది 1.51 లక్షల రైతు కుటుంబాలకు రూ.202 కోట్ల పెట్టుబడి సాయం జమ చేశాం. రూ.17.64 కోట్ల సబ్సిడీతో 1,800 హెక్టార్లలో బిందు, తుంపర సేద్య పరికరాలు ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం కాగా, ఇప్పటి వరకూ 682 మంది రైతులకు చెందిన 789 హెక్టార్లలో వీటిని ఏర్పాటు చేశాం. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద ఈ ఏడాది ఇప్పటి వరకూ రూ.166 కోట్ల విలువైన 96,807 చికిత్సలను ఉచితంగా అందించాం. ఎస్సీ కార్పొరేషన్, డీఆర్డీఏల సమన్వయంతో పీఎం అజయ్ – ఉన్నతి కార్యక్రమం ద్వారా రూ.2.47 కోట్ల విలువైన 172 ఆదాయ ఉత్పత్తి యూనిట్లను ఎస్సీ డ్వాక్రా మహిళలకు పంపిణీ చేస్తున్నాం. బీసీ, ఈబీసీ, కాపు సామాజిక వర్గాలకు చెందిన 4,920 మంది మహిళల స్వయం ఉపాధికి బీసీ కార్పొరేషన్ ద్వారా 50 ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలు నిర్వహిస్తున్నాం. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ పి.చంద్రమౌళి, జిల్లా ఎస్పీ బిందుమాధవ్, జిల్లా అటవీ అధికారి ఎన్.రామచంద్రరావు, అసిస్టెంట్ కలెక్టర్ మనీషా, ఏఎస్పీ మనీష్ పాటిల్ దేవరాజ్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు, డీఆర్ఓ జె.వెంకటరావు పాల్గొన్నారు. జాతి, కుల, మత, ప్రాంతీయ భేదాలు మరచి జీవించాలి ప్రజలకు ఇన్చార్జి కలెక్టర్ అపూర్వ భరత్ విజ్ఞప్తి ఘనంగా గణతంత్ర వేడుకలు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండా ఆవిష్కరణ గణతంత్రం.. కడురమ్యం గణతంత్ర వేడుకల సందర్భంగా కాకినాడలోని పోలీస్ పరేడ్ మైదానంలో సాయుధ దళాల కవాతు ఆకట్టుకుంది. ఆర్మ్డ్ రిజర్వ్, ట్రాఫిక్ పోలీస్, వుమెన్ కంటింజెంట్, క్విక్ రియాక్షన్ టీం, హోం గార్డు, ఎన్సీసీకి సంబంధించి 18, 3వ ఆంధ్రా బెటాలియన్లు, 6 ఆంధ్ర నావెల్, 9 ఆంధ్ర ఎయిర్ఫోర్స్తో పాటు, రెడ్క్రాస్ దళాలు సంప్రదాయ కవాతు నిర్వహించాయి. ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ ప్రథమ, క్విక్ రియాక్షన్ టీం ద్వితీయ, వుమెన్ కంటింజెంట్లకు తృతీయ బహుమతులు లభించాయి. ఎన్సీసీ నుంచి 3వ ఆంధ్రా బెటాలియన్, ఎయిర్ఫోర్స్, రెడ్క్రాస్ కంటింజెంట్లకు ఇన్చార్జి కలెక్టర్ అపూర్వ భరత్, ఎస్పీ బిందుమాధవ్ అవార్డులు అందజేశారు. శకటాల ప్రదర్శన ఈ వేడుకల్లో అన్నవరం దేవస్థానం, గృహ నిర్మాణం, పాఠశాల విద్య, వైద్య, ఆరోగ్యం, 108, 104, తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, అటవీ శాఖలు తమ పథకాలపై శకటాలను ప్రదర్శించాయి. గృహ నిర్మాణ శాఖ ప్రథమ, పాఠశాల విద్యాశాఖ ద్వితీయ, వైద్య, ఆరోగ్య శాఖ తృతీయ బహుమతలు అందుకున్నాయి. -
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులు దేశభక్తిని ఇనుమడింపజేసేలా ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు సభికులను ఎంతగానో అలరించాయి. కాకినాడ సాలిపేట మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులు ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ‘భరతమాత కన్న బిడ్డలం’ అంటూ సాగిన గీతానికి చేసిన నృత్యం అందరినీ ఆకట్టుకుంది. తుని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థులు ‘మా తుఝే సలాం’ దేశభక్తి గీతానికి నృత్య రూపకం ప్రదర్శించారు. ‘వందనం ఓ భారతావని, జయహో భారత్, వియ్ ఆర్ ఇండియన్స్’ అంటూ ఉమా మనోవికాస కేంద్రానికి చెందిన విభిన్న ప్రతిభావంతులు చేసిన నృత్యం ఆహూతులను మంత్రముగ్ధుల్ని చేసింది. పెద్దాపురం నవోదయ విద్యాలయ విద్యార్థులు ‘భరతమాతా అందుకో వందనం, మన ఇండియా’ గీతాలకు, కాకినాడ ఆనంద భారతి మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులు ‘దేశమంటే మట్టి కాదు.. దేశమంటే మనుషులోయ్’ దేశభక్తి గీతానికి చేసిన నృత్యాలతో అందరినీ ఆకట్టుకున్నారు. సాంస్కృతిక ప్రదర్శనల్లో ఉత్తమంగా కాకినాడ సాలిపేట మున్సిపల్ హైస్కూల్ మొదటి, ఉమా మనోవికాస కేంద్రం ద్వితీయ, కాకినాడ ఆనంద భారతి మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులు తృతీయ బహుమతులు అందుకున్నారు. వివిధ శాఖల స్టాళ్ల ప్రదర్శన ఈ వేడుకల్లో జిల్లా వ్యవసాయ శాఖ, రైతు సాధికార సంస్థ ఆధ్వర్యాన ప్రకృతి వ్యవసాయం, హార్టికల్చర్, సెరికల్చర్, ఏపీఎంఐపీ, మెప్మా, పంచాయతీరాజ్, మహిళా, శిశు సంక్షేమం, మత్స్య, పోలీసు శాఖల ద్వారా అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలపై స్టాల్స్ ఏర్పాటు చేశారు. జిల్లా వ్యవసాయ శాఖ ప్రథమ, మహిళా, శిశు సంక్షేమ శాఖ ద్వితీయ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ శాఖల స్టాల్స్ తృతీయ బహుమతులు అందుకున్నాయి. -
నిర్లక్ష్యపు ‘నీడ’లో..
● ఖగోళ, జ్యోతిష శాస్త్రాల ఆధారంగా రత్నగిరిపై సూర్య గడియారం ● 80 సంవత్సరాల క్రితం నిర్మాణం ● నీడ ఆధారంగా కచ్చితమైన సమయం తెలుసుకునే వీలు ● అరిగిపోయి అస్పష్టంగా మారిన సమయ పట్టిక ● భక్తుల్లో అయోమయం అన్నవరం: సత్యదేవుడు వెలసిన రత్నగిరిపై ఏర్పాటు చేసిన పలభా యంత్రం (సూర్య గడియారం) నిర్లక్ష్యపు నీడలో వెలవెలబోతోంది. ఖగోళ, జ్యోతిష శాస్త్రాల ఆధారంగా సుమారు 80 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ గడియారం ద్వారా సూర్యుని నీడ ఆధారంగా కచ్చితమైన సమయం తెలుసుకోవచ్చు. సత్యదేవుని ఆలయానికి ఈశాన్య భాగాన, స్వామివారి నిత్య కల్యాణ మండపం వద్ద ఈ సన్ డయల్ ఉంది. ఇలా ఏర్పాటైంది సూర్యుడి గమనం ఆధారంగా సమయం తెలుసుకునేలా ఈ సూర్య గడియారాన్ని 1943లో అప్పటి ఆలయ ధర్మకర్త ఇనుగంటి వేంకట రాజగోపాల రామసూర్యప్రకాశరావు కోరిక మేరకు ఖగోళ, జ్యోతిష శాస్త్రాల్లో నిష్ణాతుడైన రాజమహేంద్రవరానికి చెందిన పిడమర్తి కృష్ణమూర్తిశాస్త్రి రూపొందించారు. 12 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు కలిగిన గ్రానైట్ పలక మీద త్రికోణాకారంలో తూర్పు దిక్కుకు అభిముఖంగా మరో చిన్న పలకను నిలువుగా అమర్చారు. సూర్యకాంతి పడి దీని నీడ పెద్ద పలక మీద పడుతుంది. అలా నీడ పడే చోట అర్ధచంద్రాకారంగా గడియారంలో మాదిరిగా అంకెలుంటాయి. ఆ నీడ పడిన అంకెలకు ఆయా నెలలు, తేదీలను అనుసరించి కొంత సమయం కలపడం లేదా తీసివేయడం చేయాలి. తద్వారా కచ్చితమైన సమయం తెలుస్తుంది. ఉదాహరణకు జనవరి 25 మధ్యాహ్నం సూర్య గడియారంపై నీడ 12.25 గంటల మీద పడిందని అనుకుంటే అక్కడి సూచనల ప్రకారం ఆ తేదీకి 10 నిమిషాలు కలపాలి. అంటే అప్పుడు సమయం మధ్యాహ్నం 12.35 గంటలు అయినట్టు. ఇండియన్ స్టాండర్డ్ టైమ్ (ఐఎస్టీ) కూడా కచ్చితంగా అదే సమయాన్ని చూపిస్తుంది. అంత కచ్చితంగా దీనిని రూపొందించారు. ఎప్పుడు ఎంత సమయం కలపాలి, ఎప్పుడు తీసివేయాలనే విషయాలను అక్కడి సూచనల పట్టికలో తెలిపారు. ప్రాభవం కోల్పోతూ.. సత్యదేవుని దర్శనం పూర్తయ్యాక భక్తులు చూసేందుకు రత్నగిరిపై ఉన్న ఏకై క ఆకర్షణ ఈ సూర్య గడియారం. ఎంతో విశిష్టత కలిగిన ఈ సూర్య గడియారం ఆలనా పాలనా చూసేవారే కరువయ్యారు. ఈ గడియారంలో సమయం చూసుకునేందుకు అక్కడి పలకపై వేసిన అంకెలు, సూచనలు, ప్లస్, మైనస్ గుర్తులు అరిగిపోయి స్పష్టంగా కనిపించడం లేదు. దీంతో, ఇది ఓ పట్టాన అర్థం కాక భక్తులు అయోమయానికి గురవుతున్నారు. వీటిని దేవస్థానం అధికారులు మళ్లీ స్పష్టంగా రాయించేందుకు చర్యలు తీసుకోవాలి. అలాగే, గతంలో ఇక్కడ ‘సూర్య గడియారం’ అని రాసి ఉన్న పెద్ద ఫ్లెక్సీ ఉండేది. ప్రస్తుతం చిన్న బోర్డు మాత్రమే మిగిలింది. అక్కడ శాశ్వతంగా రథంపై సూర్య భగవానుడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే సూర్య గడియారానికి మరింత ఆకర్షణ చేకూరుతుంది. అలాగే, సన్ డయల్ గోడలకు రంగులు కూడా వేయించాలి. దీంతోపాటు అక్కడ సమయం ఎలా తెలుసుకోవాలో తెలిపే వివరాలతో ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేయాలి. -
భక్తిశ్రద్ధలతో గిరి ప్రదక్షిణ
గోకవరం: తంటికొండ గ్రామంలో వెంకటగిరి కొండపై వేంచేసియున్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన సోమవారం గిరి ప్రదక్షిణ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దేవస్థానం చైర్మన్ బద్దిరెడ్డి అచ్చన్నదొర, ఈఓ ఉదయబాబు నాయుడు ఆధ్వర్యాన స్వామి వారిని పల్లకిలో ఉంచి, తూర్పు మెట్ల మీదుగా కిందకు గ్రామంలోకి తీసుకువచ్చి, వెంకటగిరి చుట్టూ ప్రదక్షిణ నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం, ఆలయ ప్రాంగణంలో స్వామి వారి నిజ పాదముద్ర వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి విశేష పూజలు, శ్రీలక్ష్మీ నారసింహ సహిత మహా సుదర్శన హోమం, అభిషేకాలు నిర్వహించారు. భీష్మ ఏకాదశి ఏర్పాట్లపై నేడు సమీక్ష అన్నవరం: ఈ నెల 29న భీష్మ ఏకాదశి, ఫిబ్రవరి ఒకటో తేదీన మాఘ పౌర్ణమి, మాఘ మాసంలో ఇతర పర్వదినాల సందర్భంగా సత్యదేవుని ఆలయానికి వేలాదిగా భక్తులు వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించేందుకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రకాష్ సదన్ సత్రంలోని ట్రస్ట్బోర్డు సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశానికి పెద్దాపురం ఆర్డీఓ శ్రీరమణి అధ్యక్షత వహిస్తారు. ముఖ్య అతిథి ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభతో పాటు దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరవుతారు. ఈ సందర్భంగా భక్తుల కోసం దేవస్థానం చేపట్టిన చర్యలు, ప్రభుత్వ శాఖల తరఫున అందించాల్సిన సహాయ సహకారాలపై ఈఓ వి.త్రినాథరావు వివరిస్తారు. రాష్ట్ర క్రైస్తవ మహాసభలు ప్రారంభం నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): చర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ ఇండియా ఆధ్వర్యాన కాకినాడ ఆనంద భారతి గ్రౌండ్లో ఐదు రోజుల పాటు జరగనున్న ఆంధ్ర రాష్ట్ర క్రైస్తవ మహాసభలను చర్చ్ ఆఫ్ గాడ్ స్టేట్ ఓవర్సీస్ బిషప్ రెడ్డి జ్యోతికుమార్ సోమవారం ప్రారంభించారు. రాష్ట్రం నలుమూలల నుంచీ క్రైస్తవ భక్తులు అధిక సంఖ్యలో ఈ మహాసభలకు వచ్చి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తొలి రోజు యువతీ యువకులకు ప్రత్యేకంగా చర్చ్ ఆఫ్ గాడ్ యువజన అధ్యక్షుడు అంకిత్రెడ్డి ఆధ్వర్యాన స్టేట్ మెగా యూత్ ఫెస్ట్ ఘనంగా నిర్వహించారు. దైవ సేవకులు యువతకు ప్రత్యేక వర్తమానం అందించారు. కార్యక్రమంలో శాంతిరెడ్డి, సిస్టర్ శ్రేష్ట కర్మోజీరెడ్డి, పాస్టర్ జేసన్, సిస్టర్ మౌనిక జేసన్, రాష్ట్రవ్యాప్తంగా పలువురు చర్చ్ ఆఫ్ గాడ్ పాస్టర్లు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలను ఆమోదించడం దుర్మార్గం రాయవరం: కార్మికులకు నష్టాన్ని కలిగించే కేంద్ర విధానాలను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించకుండా అసెంబ్లీలో ఆమోదించడం దుర్మార్గమని తూర్పుగోదావరి జిల్లా పంచాయతీ కార్మిక సంఘ నాయకుడు రాగుల రాఘువులు, ఐఎఫ్టీయూ రాష్ట్ర కోశాధికారి గుబ్బల ఆదినారాయణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. చెల్లూరులో సోమవారం వారు విలేకర్లతో మాట్లాడుతూ, కార్మికులకు రక్షణగా ఉన్న 26 చట్టాలను రద్దు చేసి, యాజమాన్యాలకు అనుకూలంగా లేబర్ కోడ్లను మార్చారని, పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని రద్దు చేస్తూ 10 గంటల భారాన్ని కార్మికుల మీద రుద్దుతున్నారని అన్నారు. లేబర్ కోడ్ల రద్దు కోరుతూ ఫిబ్రవరి 12న దేశ వ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్మికులకు వేతనాలు మొదటి వారంలో ఇవ్వాలని, పెండింగ్ ఎరియర్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. -
కల్యాణ వైభోగమే.. ఇలలో..
● ప్రారంభమైన లక్ష్మీనారసింహుని ఉత్సవాలు ● వధూవరులుగా ముస్తాబైన స్వామి, అమ్మవారు ● సూర్య, చంద్రప్రభ వాహనాలపై ఊరేగింపుఅంతర్వేది రథాన్ని మెరక వీధికి తరలిస్తున్న భక్తులుసఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనృసింహ స్వామివారి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుని జన్మదినం రథ సప్తమిని పురస్కరించుకుని అమ్మ, స్వామివార్లను వధూవరులుగా అలంకరించారు. శ్రీవారిని పెళ్లికుమారునిగా, అమ్మవారిని పెళ్లికుమార్తెగా చేసే ముద్రికాలంకరణ కార్యక్రమాన్ని కేశవదాసుపాలేనికి చెందిన బెల్లంకొండ, ఉండపల్లి కుటుంబాల వారు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటలకు ధూపసేవ అనంతరం ప్రధానార్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస్ కిరణ్, స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు తదితరులు వైఖానస ఆగమానుసారం, శ్రీవైష్ణవ సంప్రదాయ ప్రకారం శ్రీవారికి, అమ్మవారికి విశేష పూజలు చేశారు. మామిడాకుల భస్మంతో బుగ్గన చుక్కపెట్టి, ఉంగరం తొడిగి ఈ తంతును రమణీయంగా పూర్తిచేశారు. కొపనాతి విగ్రహానికి పూలమాలలు కల్యాణోత్సవాల ప్రారంభం సందర్భంగా ఆలయ నిర్మాత కొపనాతి కృష్ణమ్మ విగ్రహానికి దేవస్థానం అధికారులు, ప్రజాప్రతినిధులు, అర్చకులు, పల్లిపా లెం అగ్నికుల క్షత్రియులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అర్చకులు, వేదపండితులు, ప్రముఖులు రథం వద్ద కొబ్బరి కాయలు కొట్టి పూజలు చేసి, రథాన్ని ఆలయం వద్ద నుంచి గోవింద నామస్మరణల నడుమ మెరక వీధికి తీసుకువెళ్లారు. ఉత్సవాల తొలి రోజు సాయంత్రం 4.30 గంటలకు సూర్య వాహనంపై, రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహనంపై కొలువుదీరిన స్వామి వారు మాడవీధుల్లో ఊరేగారు. అంతర్వేదిలో నేడు.. అంతర్వేది ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన సోమ వారం హంస, శేష వాహనాలపై స్వామివారి గ్రామోత్సవాలు నిర్వహించనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు ధూపసేవ అనంతరం ధ్వజారోహణ చేస్తారు. ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, 5.30 నుంచి 7 గంటల వరకూ శ్రీస్వామివారి తిరువారాధన, ఆర్జిత అభిషేకం, బాలభోగం, అనంతరం సాధారణ, ప్రత్యేక దర్శనాలు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకూ నారసింహ సుదర్శన హోమం నిర్వహించనున్నారు. -
● సర్పవరం.. జనసాగరం
జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన సర్పవరం భావనారాయణ స్వామి ఆలయంలో మాఘ మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రథసప్తమి పర్వదినం, తొలి ఆదివారం కలసి రావడంతో వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. వేకువజామున ఐదు గంటల నుంచే వచ్చిన భక్తులు స్వామివారి సరస్సులో పుణ్యస్నానాలు ఆచరించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు ఆవు పిడకలను నిచ్చెలిగా వేసి, నిప్పు పెట్టి, పాయసం తయారు చేసి, ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడికి నివేదించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలి వచ్చిన భక్తులు భావనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ఈఓ రాపాక శ్రీనివాసరావు పర్యవేక్షణలో భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఉచిత, ప్రత్యేక దర్శనాలు కల్పించారు. తిరునాళ్ల సందర్భంగా సర్పవరం జంక్షన్ నుంచి మాధవపట్నం వైపు వెళ్లే రోడ్డుపై ఏర్పడిన ట్రాఫిక్ సమస్యను పోలీసులు ఎప్పటికప్పుడు సరి చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ సుమారు 50 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారని ఈఓ తెలిపారు. – కాకినాడ రూరల్ -
చదువుకొనలేం
● ఫీజు రీయింబర్స్మెంట్ చేయని సర్కారు ● జిల్లాలో రూ.84 కోట్ల మేర బకాయిలు ● విద్యార్థులపై కళాశాలల ఒత్తిళ్లు ● ఫీజులు చెల్లిస్తేనే పరీక్షకు అనుమతిస్తామంటూ బెదిరింపులు ● ప్రభుత్వ మొండి వైఖరిపై విద్యార్థుల ఆగ్రహంబాలాజీచెరువు (కాకినాడ సిటీ): విద్యా సంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు గడిచాయి.. కళాశాలల విద్యార్థులు మొదటి సెమిస్టర్ పరీక్షలకు సిద్ధమవుతున్నారు.. ఈ పరిస్థితుల్లో చదువుపై ఫోకస్ చేయాల్సిన వారికి.. ప్రభుత్వం మళ్లీ టెన్షన్ తెచ్చి పెట్టింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించడం లేదు. దీంతో, తమకు రావాల్సిన ఫీజుల కోసం విద్యార్థుల పీకల మీద ఆయా కళాశాలల యాజమాన్యాలు ఒత్తిళ్ల కత్తులు పెడుతున్నాయి. ఫీజు చెల్లించకపోతే పరీక్షలకు అనుమతించబోమంటూ బెదిరిస్తున్నాయి. అటు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం.. ఇటు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు పట్టు బిగిస్తూండటంతో విద్యార్థులు అడకత్తెరలో పోకచెక్కల మాదిరిగా నలిగిపోతున్నారు. సర్కారు వారి బకాయిలు ఇలా.. జిల్లాలో డిగ్రీ, ఇంజినీరింగ్, ఐటీఐ, జీఎన్ఎం, పారామెడికల్, బీఎస్సీ నర్సింగ్, డెంటల్, ఎంబీఏ తదితర కళాశాలలు 86 వరకూ ఉన్నాయి. వీటిల్లో చదువుతున్న దాదాపు 19,500 మంది బీసీ, ఈబీసీ, మైనారిటీ, కాపు, క్రిస్టియన్ సామాజిక వర్గాల విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాల్సి ఉంది. సాధారణంగా ప్రభుత్వం ప్రతి విద్యా సంవత్సరం నాలుగు విడతలుగా ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేస్తూంటుంది. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి అదే ఏడాది మార్చి 2న మొదటి విడతగా అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.21.95 కోట్లు జమ చేసింది. మిగిలిన మూడు విడతలకు కలిపి మొత్తం రూ.40 కోట్ల మేర ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఆ తరువాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. కానీ, నయాపైసా కూడా ఇవ్వలేదు. పైగా దీంతో పాటు 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకూ రూ.44 కోట్ల మేర కూడా బకాయి పెట్టింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న వారిలో అర్హులైన మన రాష్ట్ర విద్యార్థులకు సైతం ఫీజు బకాయిలు చెల్లించేది. అటువంటిది ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం పొరుగు రాష్ట్రాల్లో చదువుతున్న మన విద్యార్థుల్లో ఎస్సీ, ఎస్టీలకు మినహా మిగిలిన బీసీ, కాపు, ఈబీసీ, క్రిస్టియన్, ముస్లిం మైనారిటీ తదితర సామాజిక వర్గాల వారికి కనీసం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం సైతం ఇంతవరకూ ఇవ్వలేదు. గత వైఎస్సార్ సీపీ ఐదేళ్ల పాలనలో జిల్లాలోని విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కింద రూ.500 కోట్లకు పైగా జమ చేశారు. అటువంటిది చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై నోరు మెదపకపోవడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మండిపడుతున్నారు. తమకు బకాయిలు వెంటనే చెల్లించాలంటూ ప్రైవేట్ ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలల అసోషియేషన్లు గత వారం లేఖ రాసినా ప్రభుత్వం ఇప్పటి వరకూ స్పందించలేదు. ఫీజు రీయింబర్స్మెంటును పెంచిన జగన్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టిన సమయంలో కొన్ని పెద్ద కళాశాలల్లో (గ్రేడ్–1) ఇంజినీరింగ్ ఫీజు ఏడాదికి రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకూ ఉండేది. అప్పట్లో బీసీ, ఈబీసీ, మైనారిటీ, కాపు విద్యార్థుల ఇంజినీరింగ్ విద్యకు ఏడాదికి రూ.35 వేలు మాత్రమే ఫీజు రీయింబర్స్మెంటు జరిగేది. మిగిలిన మొత్తాన్ని వారి తల్లిదండ్రులే భరించాల్సి వచ్చేది. పేద, మధ్య తరగతి తల్లిదండ్రులపై ఈ ఆర్థిక భారాన్ని కూడా తొలగించేందుకు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని గణనీయంగా పెంచారు. దీంతో గ్రేడ్–1 కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపశమనం లభించింది. -
రద్దీగా సత్యదేవుని సన్నిధి
అన్నవరం: మాఘ మాసంలో తొలి ఆదివారం, రథసప్తమి పర్వదినం కలసి రావడంతో రత్నగిరికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. దీంతో, ఆలయంలో రద్దీ ఏర్పడింది. ఎక్కువ మంది కార్లు, ఇతర వాహనాల్లో వచ్చారు. దీంతో, దేవస్థానంలోని పార్కింగ్ స్థలాలన్నీ ఆ వాహనాలతో నిండిపోయాయి. ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సుమారు 30 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. రెండు వేల వ్రతాలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. ఆలయ ప్రాకారంలో ఉదయం సత్యదేవుని రథసేవ ఘనంగా నిర్వహించారు. లోవలో భక్తుల సందడితుని: తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో లోవ దేవస్థానం ప్రాంగణంలో ఆదివారం సందడి నెలకొంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ సుమారు 3 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారని ఈవో విశ్వనాథరాజు తెలిపారు. ప్రసాదాల విక్రయం ద్వారా రూ.92,640, పూజా టికెట్లకు రూ.76,750, కేశఖండన టికెట్లు రూ.7,160, వాహన పూజ టికెట్లు రూ.7,320, కాటేజీలు రూ.16,800, విరాళాలు, ఇతరత్రా రూ.25,397 కలిపి మొత్తం రూ.2,26,067 ఆదాయం సమకూరిందని వివరించారు. 4 నుంచి కోకెనడా హాకీ పోటీలు నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కోకెనడా కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యాన ఫిబ్రవరి 4 నుంచి 14వ తేదీ వరకూ కోకెనడా హాకీ గోల్డ్కప్ పోటీలను జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ(డీఎస్ఏ)లో నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో పాల్గొనే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్కు చెందిన జాతీయ స్థాయి క్రీడాకారులు ఇన్చార్జి కలెక్టర్ అపూర్వ భరత్ను ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. 11 రోజుల పాటు జరిగే ఈ పోటీలలో 15 మహిళల, 10 పురుషుల జట్లు పాల్గొంటున్నాయని ఆయనకు నిర్వాహకులు వివరించారు. అపూర్వ భరత్ మాట్లాడుతూ, కేంద్ర సర్వీసుల్లో సేవలందిస్తున్న క్రీడాకారులు కాకినాడలో జరిగే టోర్నీలో పాల్గొనడం శుభపరిణామమని అన్నారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి సతీష్కుమార్, క్లబ్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
వేలాదిగా.. పాండవుల మెట్టకు..
పెద్దాపురం (సామర్లకోట): రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్దాపురం పాండవుల మెట్టపై ఉన్న సూర్యనారాయణమూర్తి ఆలయానికి ఆదివారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. శ్రీ పద్మినీ, ఛాయా, ఉషా, ప్రజ్ఞా దేవీ సమేత సూర్యనారాయణమూర్తి కల్యాణోత్సవాన్ని కన్నులారా తిలకించారు. మెట్టపై పాల పొంగళ్లు నిర్వహించి, ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణస్వామికి నివేదించారు. ఇక్కడ రథసప్తమి నుంచి ఈ నెల 31వ తేదీ వరకూ వివిధ గ్రహ దేవతల కల్యాణోత్సవాలు నిర్వహిస్తున్నారు. సోమవారం చంద్రుడు, 27న అంగారకుడు, 28న బుధుడు, 29న బృహస్పతి (గురుడు), 30న శుక్రుడు, 31న శనీశ్వరుడు, రాహు, కేతు గ్రహ దేవతలకు కల్యాణోత్సవాలు నిర్వహించనున్నారు. చివరి రోజున మహాన్నదానం జరుగుతుందని ఆలయ పాలక మండలి సభ్యుడు రవికిషోర్ తెలిపారు. -
పది రోజుల్లో పార్టీ కమిటీల నియామకం
● కూటమి పాలనలో సర్వత్రా అరాచకం ● పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా తుని: వైఎస్సార్ సీపీ కమిటీల్లో చేరేందుకు నాయకులు, కార్యకర్తలు ఉత్సాహం చూపుతున్నారని మాజీ మంత్రి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అన్నారు. తుని మండలం ఎస్.అన్నవరంలోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ కాకినాడ పార్లమెంటరీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణరాజు, పార్టీ కమిటీల జిల్లా టాస్ఫోర్స్ ఇన్చార్జి బొడ్డేడ ప్రసాద్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు విప్పర్తి వేణుగోపాలరావు (జెడ్పీ చైర్మన్), వాసిరెడ్డి జమీల్, కొప్పన శివ, ఒమ్మి రఘురామ్లతో ఆదివారం సాయంత్రం ఆయన సమావేశమయ్యారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో పార్టీ కమిటీలు, అనుబంధ విభాగాల నియామకాన్ని పది రోజుల్లో పూర్తి చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ, కూటమి పాలనలో అరాచకం రాజ్యమేలుతోందన్నారు. చంద్రబాబు 18 నెలల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని, దోచుకో దాచుకో అనే రీతిలో పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో మోసపూరిత హామీలిచ్చి, అధికారంలోకి వచ్చాక ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని దుయ్యబట్టారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు ఉత్సాహంతో పని చేయడానికి సిద్ధమయ్యాయని రాజా అన్నారు. సూర్యనారాయణరాజు మాట్లాడుతూ, పార్టీ కమిటీల నియామకాన్ని జిల్లాలో వేగంగా పూర్తి చేయాలని సూచించారు. అన్ని సామాజిక వర్గాలకూ కమిటీల్లో ప్రాధాన్యం ఉండేలా చూడాలన్నారు. కూటమి పాలన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యతను కమిటీలు తీసుకోవాలన్నారు. బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ, ప్రజల తరఫున పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి చేస్తున్న పోరాటానికి అన్ని వర్గాల నుంచీ మద్దతు లభిస్తోందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై రానున్న రోజుల్లో రాజీ లేని పోరాటం చేయడానికి శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. విప్పర్తి వేణుగోపాలరావు మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ కమిటీల నియామకం పూర్తి చేసి, పార్టీ రాష్ట్ర కార్యాలయానికి అప్లోడ్ చేయాలని సూచించారు. సమావేశంలో పార్టీకి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. -
ఉద్యమిస్తాం
ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంటు బకాయిలు విడుదల చేసేంత వరకూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం. ఫీజు బకాయిలన్నింటినీ చెల్లిస్తామని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థి సంఘాలకు ఇచ్చిన హామీ నేటి వరకూ నెరవేరలేదు. ఫీజుల విడుదలలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతున్నందున కళాశాలల యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలంటూ విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయి. – జి.చిన్ని, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు చదువులెలా సాగుతాయి? ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంటు చేయకపోతే పేద, మధ్య తరగతి విద్యార్థుల చదువులెలా సాగుతాయి? ఫీజుల చెల్లింపుపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో విద్యారంగం ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. అనేక మంది విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. 2024–25 విద్యా సంవత్సరంతో పాటు 2023–24 బకాయిలను కూడా ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. – బి.సిద్దూ, పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి హామీలు మరిచారు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోపు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలన్నింటినీ విడుదల చేస్తామని యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న రూ.6,400 కోట్లు విడతల వారీగా విడుదల చేస్తున్నామని పత్రికా ప్రకటనలిస్తున్నారు, కానీ, ఇప్పటి వరకూ ఒక్క రూపాయ కూడా విడుదల చేయలేదు. ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని కూటమి నాయకులకు చెందిన అనేక కళాశాలల యాజమాన్యాలు తెగేసి చెబుతున్నాయి. దీంతో పేద విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, ఉపకార వేతనాలు విడుదల చేయాలి. – ఎం.గంగా సూరిబాబు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి -
తొలి తిరుపతికి పోటెత్తిన భక్తులు
● స్వామి దర్శనానికి సుమారు 25 వేల మంది ● రూ.3.47 లక్షల ఆదాయం పెద్దాపురం (సామర్లకోట): మండల పరిధిలో తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన తిరుపతి గ్రామంలో వేంచేసి యున్న శృంగారవల్లభ స్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. మాఘమాసం తొలి శనివారం పురస్కరించుకొని ధ్వజస్తంభంతో పాటు ఆలయ ప్రాంగణాన్ని పూలతో అలంకరించారు. స్వామివారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయం కిటకిటలాడింది. ఈఓ వడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆలయంలో భజనలు, కోలసంబరం నిర్వహించారు. తెల్లవారు జాము నుంచి అనేక మంది కాలినడకన ఆలయానికి చేరుకొని మొక్కులు తీర్చుకున్నారు. సుమారు 25వేల మంది స్వామిని దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.2.14,710, అన్నదాన విరాళాలు రూ.1,02,847, కేశ ఖండన రాబడి రూ.5,680 తులాభారం ద్వారా రూ.500, లడ్డు ప్రసాదం విక్రయం ద్వారా రూ.23,910 ఆదాయం వచ్చిందని చెప్పారు. 4,500 మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారని తెలిపారు. -
స్వామిసేవకు ఒక్కటై..
పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.. ఫ కల్యాణ ఘట్టంలో పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన రాజ కుటుంబాలు కీలక భూమిక పోషిస్తాయి. మొగల్తూరు రాజవంశానికి చెందిన పెళ్లి కుమారుడు లక్ష్మీ నరసింహస్వామి తరఫున నిలబడి కల్యాణంలో పాల్గొంటారు. ప్రస్తుత వారసుడు రాజా కలిదిండి కుమార రామగోపాల రాజా బహుదూర్ చైర్మన్, ఫౌండర్ ఫ్యామిలీ మెంబరుగా కల్యాణంతో స్వామివారి తరఫున నిలబడతారు. వీరి కుటుంబం ఆలయానికి భూములు, అభరణాలు అందించినట్టు శాసనాలలో ఉన్నాయి. ఫ పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం పొలమూరుకు చెందిన కలిదిండి రాజయమ్మ అంతర్వేదిలో వందేళ్ల క్రితం స్థానికంగా సత్రం నిర్మించారు. దీని నిర్వహణ కోసం దానం చేసిన భూముల్లో పండే ధాన్యాన్ని బియ్యంగా మార్చి వాటిని తలంబ్రాలుగా తయారు చేసి అందించడం అనవాయితీగా వస్తోంది. రాజయమ్మ కుటుంబ సభ్యుడైన కలిదిండి సుబ్బారాజు ఆధ్వర్యంలో ప్రస్తుతం తలంబ్రాలు తీసుకువస్తున్నారు. ఫ అంతర్వేది కల్యాణంలో ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు ప్రాధాన్యం ఫ కల్యాణ కర్తలుగా రెండు జిల్లాల వాసులు ఫ ఈ నెల 28వ తేదీన కళ్యాణం ఫ దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆనవాయితీ సాక్షి, అమలాపురం/సఖినేటిపల్లి: అఖండ గోదావరి సప్త నదీపాయలుగా వీడి ప్రవహించే పుణ్యభూమిని ఆనుకుని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు ఏర్పడ్డాయి. పేరుకు వేరైనా ఇక్కడ ఆచార వ్యవహారాలు, వేషభాషలు ఒక్కటే. పలు కార్యక్రమాలలో ఈ రెండు జిల్లాలకు భాగస్వామ్యం తప్పకుండా ఉంటుంది. అటువంటి వాటిలో అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కల్యాణం ముఖ్యమైనది. ఈ ఘట్టంలో ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన పలు కుటుంబాలు కీలకంగా వ్యవహరిస్తాయి. ఉమ్మడి తూర్పులో.. ఫ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో నరసింహస్వామివారి ఆలయం ఉంది. ఇక్కడే స్వామివారి కల్యాణాన్ని ఏటా అంగరంగ వైభవంగా నిర్వహిస్తూంటారు. కల్యాణ ఘట్టంలో స్వామి, అమ్మవార్లకు అలంకరించే పట్టు వస్త్రాలను కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానం నుంచి తీసుకు వస్తారు. ఈ ఆనవాయితీ ఎప్పటి నుంచో కొనసాగుతోంది. ఫ స్వామివారి కల్యాణం జరిగే కోనసీమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కల్యాణానికి ముందు స్వామి, అమ్మవార్లను పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెలను చేసే అరుదైన అవకాశం సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెం గ్రామానికి చెందిన బెల్లంకొండ, ఉండవిల్లి కుటుంబాలకు దక్కింది. అంతర్వేది ఉత్సవాల్లో రథసప్తమి రోజున నిర్వహించే ముద్రికాలంకరణలో స్వామికి పంచెను బెల్లంకొండవారు, అమ్మవారికి చీరను ఉండవిల్లి వారు ఇవ్వడం ఆనవాయితీ. అలాగే చోరసంవాదం ఘట్టంలో కూడా నిర్వహించే పూజా సామగ్రిని ఈ రెండు కుటుంబాల వారూ తీసుకువెళతారు. ఫ స్వామివారి చక్రస్నానం పేరూరు వేద పండితుల ఆధ్వర్యంలో జరుగుతుంది. స్వామివారి చక్ర పెరుమాళ్లు 14వ శతాబ్దంలో సముద్రంలో పడిపోయింది. పేరూరుకు చెందిన నేమాని నరసింహ సోమనాథం అంతర్వేది సముద్రతీరంలో 89 రోజులు తపస్సు చేయగా చక్రం దొరికింది. స్వామివారి కల్యాణ సమయంలో అగ్రతాంబూలం ఇవ్వాలని పండితులు నాటి రాజును కోరారు. దీనితో వారు చక్రస్నానం పేరూరు వేద పండితుల చేతుల మీదుగా నిర్వహిస్తూండడం దశాబ్దాలుగా వస్తోంది. ఫ శృంగవరప్పాడుకు చెందిన రావి, యనుముల కుటుంబాలకు చెందిన వారు రథోత్సవం రోజున స్వామివారి ఉత్సవ మూర్తులను పల్లకీలో ఊరేగింపుగా తీసుకువస్తారు. పల్లకీని ముందు భాగంలో రావి కుటుంబానికి చెందిన వారు, వెనుక భాగంలో యనుముల కుటుంబాల వారూ మోస్తూ స్వామివారి ఉత్సవ మూర్తులను ఆలయం నుంచి రథం వరకు తీసుకువస్తారు. కల్యాణ కర్తలుగా.. ఈ రెండు జిల్లాల వాసులు, కొన్ని కుటుంబాల వారు అంతర్వేది నరసింహస్వామి వారి కల్యాణంలో కర్తలుగా తమవంతు బాధ్యతలు నెరవేరుస్తున్నారు. అనాదిగా వస్తున్న ఈ ఆచారాన్ని దశాబ్దాలుగా నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. ఇటు తూర్పు, అటు పశ్చిమ ఒక్కటై, అంతర్వేది దేవదేవుని కల్యాణం తంతును విజయవంతంగా జరుపుతున్నాయి. కాగా.. స్వామివారి కల్యాణోత్సవం ఈ నెల 28వ తేదీ అర్ధరాత్రి జరుగుతున్న విషయం తెలిసిందే. -
నిర్లక్ష్యం వల్లే ఎలుకల పరుగులు
● సత్యదేవుని ప్రసాదాల కౌంటర్లను పట్టించుకోని వైనం ● అధికారులది చాలాకాలంగా ఇదే తీరు ● ఎట్టకేలకు ఆర్డీవో పరిశీలన అన్నవరం: సత్యదేవుని ప్రసాదం విక్రయించే కౌంటర్లలో కొంతకాలంగా ఎటువంటి తనిఖీలు లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వసతులు ఎలా ఉన్నాయి...ప్రసాదాలు నిల్వ చేయడానికి సరైన ఏర్పాట్లు ఉన్నాయా లేదా అనే విషయమై దృష్టి పెట్టాల్సిన అధికారులు కొంతకాలంగా ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అందుకే జాతీయ రహదారిపై సత్యదేవుని పాత నమూనా ఆలయం వద్ద గోధుమ నూక ప్రసాదం ప్యాకెట్ల మీద ఎలుకలు పరుగులు తీస్తూ ప్రసాదాన్ని తింటున్న వీడియో భక్తులు బయట పెట్టే వరకు అధికారులు గమనించలేకపోయారు. సిబ్బంది నియామకంలో కూడా శ్రద్ధ కరవు ప్రసాదం కౌంటర్లలో సిబ్బంది పలుమార్లు వివాదాలకు కారణమవుతున్నారు. గత ఏడాది సత్యదేవుని తొలిపాంచా వద్ద గల కౌంటర్, కొత్త నమూనా ఆలయం వద్ద గల కౌంటర్లో మద్యం సేవించి భక్తులతో దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలపై ఇద్దరు సిబ్బందిని సస్పెండ్ చేశారు. తాజాగా పాత నమూనా ఆలయం కౌంటర్ వద్ద ప్రసాదాలపై ఎలుకలు పరుగుల వీడియో కారణంగా ఇద్దరు సస్పెండ్ అయ్యారు. ఇంజినీరింగ్ సిబ్బంది తరచూ ప్రసాదం కౌంటర్లలో ఏ విధమైన సమస్యలు ఉన్నాయోనని తనిఖీలు చేయాలి. ప్రసాదం కౌంటర్లలో గల సమస్యలను ఎప్పటికప్పుడు అక్కడ సిబ్బంది అధికారుల దృష్టికి తీసుకురావాలి. కానీ రెండూ జరగడం లేదు. ఇకపై అయినా తనిఖీలు జరిగితే ఇటువంటివి పునరావృతం కావు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రసాదం కౌంటర్లు తనిఖీ చేసిన ఆర్డీఓ రమణి ప్రసాదం కౌంటర్లో ఎలుకల విహారం వీడియో వైరల్ అవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కౌంటర్లను తనిఖీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పెద్దాపురం ఆర్డీఓ శ్రీరమణి శనివారం సాయంత్రం రత్నగిరి మీద గల రెండు కౌంటర్లు, తొలిపావంచా, పాత, కొత్త నమూనా ఆలయాల వద్ద గల కౌంటర్లను తనిఖీ చేశారు. ప్రసాదం నిల్వ ఉంచే ప్లాస్టిక్ బుట్టలపై మూతలు ఉంచాలని ఆదేశించారు. ఆమె వెంట దేవస్థానం డీసీ బాబూరావు, ఈఈ రామకృష్ణ, ప్రసాదం విభాగం సూపరింటెండెంట్ రామకృష్ణ, సీనియర్ అసిస్టెంట్ లక్ష్మీనారాయణ, విశ్రాంతి ఆర్ఐ భాస్కర ప్రసాద్ ఉన్నారు. -
పరిశుభ్రత సామాజిక బాధ్యత
కాకినాడ రూరల్: పరిసరాల పరిశుభ్రత సామాజిక బాధ్యత అని, స్వచ్ఛ కాకినాడ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఇన్చార్జి కలెక్టర్ అపూర్వ భరత్ పేర్కొన్నారు. స్వర్ణ ఆంధ్ర –స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం కాకినాడ రూ రల్ మండలం ఎంపీడీవో కార్యాలయం వద్ద ప్లాస్టిక్, ఇనుము, ఇతర వస్తువులకు బదులుగా నిత్యావసర సరకులు అందించే స్వచ్ఛ రథాన్ని ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి, జెడ్పీ సీఈవో లక్ష్మణరావు తదితరులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. కాకినాడ రూరల్ ఎంపీడీవో కార్యాలయం పక్కన నివాసం ఉంటున్న ఎం.రామకృష్ణ దంపతులు స్వచ్ఛ రథానికి ఇనుము, ఇతర వస్తువులు అందించగా వాటికి బదులుగా రూ.34 విలువైన సబ్బులు, టీ పొడి ప్యాకెట్లు కలెక్టర్ వారికి అందజేశారు. ఆయన మాట్లాడుతూ ‘జీరో గ్యాప్ శానిటేషన్ ఆంధ్ర‘ నినాదంతో ఈ కార్యక్రమాన్ని జిల్లా అంతటా ఈ నెలలో నిర్వహిస్తున్నామన్నారు. జెడ్పీ సీఈవో లక్ష్మణరావు మాట్లాడుతూ శనివారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 24 స్వచ్ఛ రథాలను ప్రారంభించామన్నారు. వీటిలో 17 రకాల నిత్యావసర సరకులు అందుబాటులో ఉంటాయని, ప్రజలు తమ వద్ద నిరుపయోగంగా ఉన్న ఇ వేస్ట్, ప్లాస్టిక్ తదితర వస్తువులకు బదులుగా ఈ నిత్యావసర వస్తువులను తీసుకోవచ్చని తెలిపారు. కాకినాడ రూరల్ ఎంపీడీవో పి.సతీష్, డిప్యూటీ ఎంపీడీవో ఎం.శ్రీరామ్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఎండీ అబ్దుల్ మతిన్, డీఈ డీ. శ్రీనివాసరావు, సీడీపీఓ లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి పాండురంగారావు పాల్గొన్నారు. ఆక్రమణదారులకు నోటీసులు బోట్క్లబ్ (కాకినాడసిటీ): పంచాయతీ, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ కార్పొరేషన్, పబ్లిక్ హెల్త్ పరిధిలోని కాలువలు, చెరువులు, డ్రైనన్ల పై ఉన్న ఆక్రమణలను గుర్తించి, సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేయాలని ఇన్చార్జి కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం వాచ్ డాగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. రెవెన్యూ డివిజన్ స్థాయిలో సమావేశం నిర్వహించి, గుర్తించిన ఆక్రమణలను తొలగించేందుకు నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. ఇందుకు పంచాయితీ, ఇరిగేషన్, సర్వే శాఖల అధికారులు సమష్టిగా పని చేయాలని సూచించారు. డీఆర్వో జె.వెంకటరావు, కాకినాడ, పెద్దాపురం ఆర్డీవోలు ఎస్.మల్లి బాబు, కె.శ్రీరమణి, ఇరిగేషన్ ఈఈ శేషగిరిరావు, డ్రైన్న్ల ఈఈ ఎంవీవీ కిషోర్ పాల్గొన్నారు. -
సా...గుతున్న వరి నాట్లు
రబీ చివర్లో అవస్థలు తప్పవా? ప్రస్తుత సుమారు నెల రోజులు పైబడే రబీ వరినాట్లు ఆలస్యం కావడంతో ఏప్రిల్ నెలాఖరు వరకు పంట కోతలకు వచ్చే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో మార్చి నెలాఖరున కాలువలు మూసివేస్తే శివారు ఆయకట్టుకు నీరు అందే పరిస్థితి ఉండదు. ఏప్రిల్ నెలలో ఎండలు విపరీతంగా కాస్తాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నీరు విడుదల చేసినా శివారు ఆయకట్టుకు నీరు వెళ్లడం కష్టమే అంటున్నారు రైతులు. గత ఏడాది రబీ సీజన్లో కూడా రైతులు మార్చి నెలాఖరులోనే సాగునీరు లేక అనేక అవస్థలు పడ్డారు. ప్రస్తుతం రబీ సాగు మరింత ఆలస్యం కావడంతో ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందోనని ఇప్పటి నుంచే రైతులు ఆందోళన చెందుతున్నారు. ● ఈ ఏడాది మూడో పంట లేనట్టే.. ● ప్రభుత్వ నిర్వాకంతో అన్నదాతకు తప్పని అవస్థలు ● ఖరీఫ్లో ధాన్యం కొనుగోలు ఆలస్యంతోనే రబీ ఆలస్యం ● ప్రారంభంలోనే ఎరువుల కొరత ● ఈ ఏడాది సాగు లక్ష్యం 1.70 లక్షల ఎకరాలు ● ఇప్పటి వరకూ 1.50 లక్షల ఎకరాల్లో నాట్లు ● ఇంకా ఆలస్యమైతే చివరి దశలో ఆయకట్టుకు నీరందడం కష్టమే బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ప్రభుత్వ నిర్వాకంతో ఈ ఏడాది రబీలో రైతులు వరి నాట్లు వేయడం చాలా ఆలస్యం అయిపోయింది. జనవరి నెల ముగుస్తున్నా ఇంకా నాట్లు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లాలో ఈ ఏడాది 1.70 లక్షల ఎకరాల్లో వరి సాగు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 1.50 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి నాట్లు పడ్డాయి. ఇంకా సుమారు 20వేల ఎకరాల్లో వరి నాట్లు వేయాల్సి ఉంది. రైతులు సాధారణంగా రబీలో వెదజల్లు సాగుకు ఎక్కువగా ఇష్టపడతారు. ఈ ఏడాది 70 శాతం మేర వెదజల్లు సాగు చేపట్టారు. అయినప్పటికీ ఇప్పటికే నెలరోజులు ఆలస్యమైనా ఇంకా పూర్తి స్థాయిలో ఆయకట్టులో వరినాట్లు పూర్తికాలేదు. ఖరీఫ్లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సరైన ఏర్పాటు చేయలేదు. దీంతో రోజుల తరబడి కళ్లాల్లోనే ధాన్యం ఉండిపోతోంది. తేమ శాతం బూచిగా చూపి సుమారు 20 రోజుల పైబడే కళ్లాలోనే ధాన్యం ఆరబోయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు ధాన్యం అమ్ముకోవడానికే సమయం సరిపోవడంతో రబీ ఏర్పాట్లు చేసుకోలేదు. అందుకే ఈ ఏడాది రబీ సాగు నెల రోజులు పైబడే ఆలస్యం అయిపోయింది. సాధారణంగా డిసెంబర్ నెలాఖరులోగా రబీ వరి నాట్లు పూర్తి చేసేవారు. మార్చి మొదటి లేదా రెండవ వారంలో కోతలు పూర్తయ్యేవి. మూడో పంట అపరాల సాగు చేపట్టేవారు. రైతులకు అదనపు ఆదాయం వచ్చేది. ఒక ఎకరంలో అపరాలు సాగు చేస్తే రెండు నుంచి మూడు బస్తాలు దిగుబడి వచ్చేది. ప్రస్తుతం క్వింటాల్ అపరాలు రూ. పదివేలు తక్కువ కాకుండా రేటు పలుకుతోంది. దీంతో ఎకరా రైతుకు సుమారు రూ.30 వేలు పైబడి ఆదాయం వచ్చేది. పెట్టుబడి పోను సుమారు రూ.20 వేల వరకు మిగిలేది. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. రబీ సాగే ఏప్రిల్ నెలాఖరు వరకూ ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎరువుల కొరత ప్రభుత్వం నారుమడుల కోసం కాంప్లెక్స్ ఎరువులు, యూరియా అందుబాటులో ఉంచకపోవడంతో వరి నాట్లు వేసేందుకు రైతులు సంకోచించారు. కొంతమంది రైతులు సంప్రదాయ పద్ధతిలో నారు పోసుకుని, వరి నాట్లు వేసుకున్నారు. అయితే వారికి ఎరువులు దొరకకపోవడంతో రబీ సాగు ఆలస్యంగా చేపట్టారు. ప్రభుత్వం గత ఖరీఫ్లో ఎరువులు సక్రమంగా అందించలేని దుస్థితి నేపథ్యంలో ప్రస్తుత రబీలోనూ అదే పరిస్థితి ఎదురవుతుందని రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. రైతులకు కావలసినన్ని ఎరువులు కూడా ఈ ప్రభుత్వం అందించలేని పరిస్థితులు నెలకొంటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేయలేదు ఖరీఫ్లో ధాన్యం కొనుగోలు చేసేందుకు మిల్లర్లు ఆసక్తి చూపకపోవడంతో బయట వ్యక్తులకు ధాన్యం అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వరి కోత యంత్రాలతో కోతలు కోయడం వల్ల తేమ శాతం ఎక్కువగా ఉందని రైస్ మిల్లర్లు ధాన్యం తీసుకోలేదు. ఆరబోసి తేవాలని చెప్పారు. సుమారు 20 రోజులు ధాన్యం ఆరబోసినా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో బయట వ్యక్తులకు విక్రయించాను. పండించిన ధాన్యం అమ్ముకోవడానికి చాలా రోజులు పట్టడంతో రబీ పనులు ఆలస్యం అయ్యాయి. కర్నీడి వీర్రాజు, రైతు, తిమ్మాపురం, కాకినాడ రూరల్ మండలం కౌలు రైతులకు తప్పని ఇబ్బందులు గ్రామాల్లో రైతు సేవా కేంద్రాల్లో కౌలు రైతులకు కావలసిన అన్ని ఎరువులు ఇవ్వడం లేదు. ఎరువులు కావాల్సిన రైతులు ఆధార్ కార్డు, భూములకు సంబంధించిన పాస్ పుస్తకాలు తేవాలని రైతు సేవా కేంద్రం సిబ్బంది సూచిస్తున్నారు. కౌలు రైతులకు పాస్పుస్తకాలు లేకపోవడంతో వారికి ఎరువులు ఇచ్చేందుకు అక్కడ సిబ్బంది ససేమిరా అంటున్నారు. దీంతో కౌలు రైతులు దూరప్రాంతాలకు వెళ్లి ఎక్కువ రేట్లకు ఎరువులు కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్ని గ్రామాల్లో కూటమి నాయకులు వారికి కావాల్సిన వారికి మాత్రమే కూపన్లు ఇచ్చి రైతు సేవా కేంద్రాల్లో ఎరువులు సరఫరా చేస్తున్నారు. దీంతో సాధారణ రైతులతోపాటు, కౌలు రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. గ్రామాల్లో కూటమి నాయకులు తమకు కావాల్సిన వారికి మాత్రమే ఎరువులు సరఫరా చేస్తున్నారని ఇటీవల జరిగిన జిల్లాపరిషత్ సమావేశంలో సైతం జేడ్పీటీసీ సభ్యులు వ్యవసాయశాఖ అధికారులను నిలదీశారు. -
తండోపదండాలు !
● సత్యదేవుని దర్శించిన 25 వేల మంది ● 1,500 వ్రతాల నిర్వహణ ● దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం ● ఘనంగా సత్యదేవుని ప్రాకార సేవ అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానానికి శనివారం భారీగా భక్తులు తరలివచ్చారు. సుమారు 25 వేల మంది భక్తులు దేవస్థానానికి తరలిరావడంతో ఆలయ ప్రాంగణం, వ్రత మండపాలు, విశ్రాంత మండపాలు భక్తులతో నిండిపోయాయి. భక్తులు స్వామి వారి వ్రతాలాచరించి దర్శనం చేసుకున్నారు. సత్యదేవుని దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుడిని దర్శించిన అనంతరం భక్తులు సప్త గోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. స్వామివారి వ్రతాలు 1,500 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం సమకూరింది. సుమారు ఐదువేల మంది సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో భోజనం చేశారు. తిరుచ్చి వాహనంపై ఊరేగింపు శనివారం ఆలయ ప్రాకారంలో తిరుచ్చి వాహనం మీద స్వామి, అమ్మవార్లను ఘనంగా ఊరేగించారు. ఉదయం పది గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను తిరుచ్చి వాహనం మీద ప్రతిష్ఠించి ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ స్వామి, అమ్మవార్లకు అర్చకుడు గంగాధరబట్ల శ్రీనివాస్ పూజలు చేసిన అనంతరం అర్చక స్వాములు కొబ్బరికాయ కొట్టి ప్రాకారసేవ ప్రారంభించారు. వేదపండితుల మంత్రోచ్ఛాటన మధ్య, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో సేవ నిర్వహించారు. సేవ అనంతరం పండితులు స్వామి, అమ్మవార్లకు నీరాజనం ఇచ్చి భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. నేడు రథసప్తమి వేడుకలు రథసప్తమి పర్వదినం సందర్భంగా ఆదివారం ఉదయం ఎనిమిది నుంచి 11 గంటల వరకు రత్నగిరిపై వార్షిక కల్యాణ మండపంలో రుత్విక్కులు సూర్యభగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గోవు పిడకలపై పాయసం వండి సూర్యభగవానుడికి నివేదిస్తారు. అనంతరం భక్తులకు పాయసం ప్రసాదంగా నివేదిస్తారని అధికారులు తెలిపారు. -
రహదారి భద్రతపై సమ్మేళనం
బాలాజీచెరువు: జేఎన్టీయూ కాకినాడలో శనివారం రాష్ట్ర రహదారి భద్రత అడిట్ అంశంపై ప్రత్యేక సాంకేతిక సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనంలో ఆర్అండ్బీ, జాతీయ రహదారుల సంస్థ అఽధికారులు, జేఎన్టీయూకే ప్రొఫెసర్లు పాల్గొని రహదారి రూపకల్పనలో లోపాలు, నిర్మాణ ప్రమాణాలు, ట్రాఫిక్ ఇంజినీరింగ్, బ్లాక్స్పాట్, ప్రమాదాల నివారణకు ఆధునిక సాంకేతికతతో పరిష్కారాలు అనే అంశాలపై చర్చించారు. ముఖ్యంగా రాష్ట్ర, జాతీయ రహదారులపై ప్రమాదాలకు కారణమవుతున్న బ్లాక్స్పాట్లను శాసీ్త్రయంగా గుర్తించి ఇంజినీరింగ్ మార్పులు చేయడం వల్ల ప్రమాదాల తీవ్రతను గణనీయంగా తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ సమ్మేళనంలో జేఎన్టీయూకే వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్, డీటీసీ కే.శ్రీధర్, మాజీ వీసీ జీవీఆర్ ప్రసాదరాజు, డీఎస్పీ శ్రీనివాసరావు ఏంవీఐ హరినాథరెడ్డి, డాక్టర్ పద్మావతి పాల్గొన్నారు. రష్యాలో ఉద్యోగ అవకాశాలు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఏపీ స్కిల్ డెవలప్మెంట్, ఓవర్సీస్ మ్యాన్ పవర్ ఆధ్వర్యంలో ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రష్యాలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఎస్.గోపీకృష్ణ శనివారం ప్రకటనలో తెలిపారు. ఐటీఐ షీట్ మెటల్ వర్క్, ఫిట్టర్, మెషినిస్ట్, వెల్డర్, మెటలర్జ్, మెకానికల్ ఇంజినీరింగ్లో డిప్లమా కలిగిన, 25 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు గలవారు అర్హులన్నారు. ఎంపికై న వారికి రూ.72,586 జీతంతో పాటు రూ.12,098 ఆహార భత్యం ఇస్తారన్నారు. వివరాలకు 99888 53335 నంబర్లో సంప్రదించాలన్నారు. జాతీయ స్థాయి బేస్బాల్ పోటీలకు అలేఖ్య కాజులూరు: జాతీయ స్థాయి బేస్ బాల్ పోటీలకు కాజులూరు మండలం గొల్లపాలెం జెడ్పీ హైస్కూల్కు చెందిన వింత అలేఖ్య ఎంపికై ంది. ఈ మేరకు శనివారం పాఠశాలలో స్కూల్ హెచ్ఎం ఎస్ఎస్బీ సుశీలమణి ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. పీడీ జి.సునీల్కుమార్ మాట్లాడుతూ కడప జిల్లా రైల్వేకోడూరులో నవంబర్ 15 నుంచి 17 వరకూ ఎస్జీఎఫ్ అండర్ – 19 రాష్ట్ర స్థాయి బేస్బాల్ పోటీలు జరిగాయన్నారు. వాటిలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జట్టులోని తమ తొమ్మిదో తరగతి విద్యార్థిని వింత అలేఖ్య చక్కని ప్రతిభ కనపరిచి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ందన్నారు. ఢిల్లీలో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకూ జరిగే జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్ర టీమ్ తరఫున పోటీపడుతుందన్నారు. మహిళ మృతి తాళ్లరేవు: స్థానికంగా ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది.. కోరంగి ఎస్ఐ పి.సత్యనారాయణ, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. తాళ్లరేవు శ్రీరామ్నగర్లో కాలాడి సీత (55), అక్కడి రత్సవారిపేటకు చెందిన ధనకాసులతో కొన్నేళ్లుగా సహజీవనం చేస్తుంది. వారికి ఒక కుమార్తె ఉంది. శుక్రవారం రాత్రి భోజనం అనంతరం ఫిట్స్ రావడంతో కుప్పకూలి మృతిచెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కొన్ని రోజులుగా సీత అనారోగ్యంతో ఉందన్నారు. కాకినాడ రూరల్ సీఐ చైతన్యకృష్ణ సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. ఇలా ఉండగా కుటుంబ సభ్యులు మాత్రం సీత ముఖంపై గాయాలు ఉన్నాయని, ఎవరో హత్య చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. పూర్తిగా విచారణ చేపట్టి బాధ్యులను కఠినంగా శిక్షించాలని సీఐకు మొరపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో క్లూస్ టీంను రప్పించి విచారణ చేపడతామని ఆయన తెలిపారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు నిర్వహించాలని ఎస్ఐ సత్యనారాయణను ఆదేశించారు. అంతర్వేది మహోత్సవాలకు ప్రత్యేక బస్సులు అమలాపురం రూరల్: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవాల సందర్భంగా ఈ నెల 28, 29, ఫిబ్రవరి 2వ తేదీల్లో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణాఅధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. అమలాపు రం, రాజోలు, రావులపాలెం డిపోల నుంచి అంతర్వేదికి 75 ప్రత్యేక సర్వీసులు నడుపుతామని, అలాగే పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, నర్సాపురం డిపోల నుంచి 50 బస్సులు తిరుగుతాయన్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనంగా ప్రత్యేక బస్సులు ఏ ర్పాటు చేస్తామన్నారు. అమలాపురం నుంచి అంతర్వేదికి ప్రతి 15 నిమిషాలకు ప్రత్యేక బస్సు సర్వీసు అందుబాటులో ఉంటుందన్నారు. ఫిబ్రవరి 2వ తేదీన జరిగే చక్ర స్నానం సందర్భంగా ప్రత్యే క బస్సులు నడపడం జరుగుతుందన్నారు. వివరాలకు అమలాపురం డిపో ఎంకై ్వరీ సెల్ నెంబర్ 99592 25550ను సంప్రదించాలన్నారు. -
వాహన విహారం.. ఇదీ పరమార్థం
● నేటి నుంచి అంతర్వేదిలో రోజుకో వాహన సేవ ● అలరించనున్న స్వామివారి ఊరేగింపులు సఖినేటిపల్లి: అంతర్వేది ఆధ్యాత్మికతతో అలరారుతోంది.. లక్ష్మీనృసింహ స్వామివారు కొలువైన దేవస్థానం కల్యాణోత్సవాలకు ముస్తాబైంది.. ఆదివారం నుంచి స్వామివారి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది.. వేడుకలు జరిగే ప్రతి రోజూ స్వామివారు రోజుకో వాహనంపై ఊరేగి, దాని పరమార్థం తెలిపే ఘట్టానికి వేళయ్యింది.. కల్యాణోత్సవాల్లో భాగంగా స్వామివారికి మాఢ వీధుల్లో వివిధ వాహనాలపై గ్రామోత్సవాలను నిర్వహిస్తుంటారు. 14 రకాల వాహనాలపై స్వామివారిని ఊరేగించడం ద్వారా ఆ వాహన సేవ పరమార్థాన్ని చాటుతున్నారు. ఏటా ఈ గ్రామోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్ తెలిపారు. ప్రతి వాహనానికి ఓ పరమార్థం ఉందని పురాణాల ద్వారా అవగతమవుతోందని ఆయన వివరించారు. క్షేత్రంలో ఆదివారం నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకూ నిర్వహించనున్న వాహన సేవలు, వాటి విశిష్టతలు తెలుసుకుందాం రండి.. తొలి రోజు.. ● సూర్య వాహనం: రథసప్తమి సందర్భంగా ఆదివారం సాయంత్రం స్వామివారు సూర్య వాహనంపై ఊరేగుతారు. భక్తులకు కనువిందు చేస్తారు. అజ్ఞానాన్ని పారద్రోలి, జ్ఞానమనే వెలుగును నింపడమే ఈ వాహనోత్సవ ఉద్దేశం. ● చంద్రప్రభ వాహనం: ఆదివారం రాత్రి స్వామివారు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. నిర్మలమైన మనసును, మనోవికాసాన్ని ఇవ్వడమే ఈ వాహనోత్సవ పరమార్థం. రెండో రోజు.. ● హంసవాహనం: సోమవారం సాయంత్రం లక్ష్మీ నరసింహ స్వామివారు హంసవాహనంపై ఆశీనులై ముందుకు సాగుతారు. మనిషిలోని జ్ఞాన అజ్ఞాలను వేరు చేసి, జ్ఞానాన్ని ప్రసాదిస్తానని చాటేందుకే ఈ వాహనంపై స్వామివారు దర్శనమిస్తారు. ● శేషవాహనం: రాత్రి ఆదిశేష వాహనంపై స్వామివా రు ఊరేగుతారు. శేషుడు వాక్పటిమ కలిగినవాడు. సర్వ వాక్కులకు అధినేతైన వాక్ పరబ్రహ్మను తానేనని భక్తులకు తెలియజెప్పేందుకే స్వామి ఆదిశేషుడిపై ఆశీనులై ముందుకు సాగుతారు. మిగతా రోజుల్లో ఇలా.. ● 27న హనుమద్వాహనంపై స్వామివారు ఊరేగుతారు. భక్తులు కూడా హనుమంతుని వలె స్వామిని తలుచుకుని పనులు నిర్విఘ్నంగా పూర్తి చేయవచ్చని చాటి చెప్పడమే ఈ వాహనం పరమార్థం. రాత్రి సింహవాహనంపై ఆశీనులు అవుతారు. మానవుడు, మాధవుడు కలసిన స్వరూపమే లక్ష్మీనృసింహస్వామి. ఆ మాధవ స్వరూపం, సింహం తానేనని స్వామి ఈ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. ● 28న పంచముఖ ఆంజనేయస్వామి వాహనంపై ఊరేగుతారు. బుద్ధి, బలం, కీర్తి, ధైర్యం, నిర్భయత్వం అనే గుణాలను భక్తులకు అందించడమే ఈ వాహన సేవ పరమార్థం. రాత్రి కంచు గరుడ వాహనంపై గ్రామోత్సవం ఉంటుంది. కామ, క్రోథ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను జయించే శక్తిని భక్తులకు అనుగ్రహించేందుకు స్వామి ఈ వాహనంపై వెళతారు. రాత్రి 1–56 గంటలకు స్వామివారి తిరు కల్యాణం జరుగుతుంది. ● 30న గజ వాహనంపై స్వామివారికి వాహనోత్సవం ఉంటుంది. గజం బుద్ధికి సంకేతం. భక్తులు బాగా ఆలోచించి, భక్తి, జ్ఞాన, వైరాగ్యాల వైపు నడిచేందుకు స్వామివారు ఈ వాహనంపై ఊరేగుతారు. రాత్రి పొన్న వాహనంపై ఆశీనులు అవుతారు. సర్వస్వం నీవే అన్న గోపికల ఆత్మనివేదనను స్వీకరించినట్టుగా భక్తుల ఆత్మ నివేదనను స్వీకరించేందుకే ఈ వాహనంపై స్వామి ఊరేగుతారు. ● 31న రాజాధిరాజ వాహనంపై వాహన సేవ అందుకుంటారు. రాజులకే రాజైన లక్ష్మీనరసింహస్వామి భక్తుల కోర్కెలు తీర్చడానికి ఈ వాహనాన్ని అధిరోహించి గ్రామోత్సవానికి వెళతారు. రాత్రి అశ్వవాహనంపై ఆశీనులు అవుతారు. మనిషిలో ఉండే జ్ఞానం అశ్వం మాదిరిగా చురుకుగా ఉండాలని సూచించేందుకు స్వామి ఉత్సవాల్లో ఈ వాహనంపై దర్శనమిస్తారు. ● ఫిబ్రవరి 1న గరుడ పుష్పక వాహనంపై స్వామివారు దర్శనమిస్తారు. నిత్యం తనను సేవించే గరుడ వాహనంపై అధిరోహించి స్వామి గ్రామోత్సవానికి తరలివెళ్తారు. ● ఫిబ్రవరి 2న పుష్పక వాహనంపై స్వామివారికి వాహనోత్సవం ఉంటోంది. తన హృదయమనే పుష్పకంలో ఎంతమంది భక్తులు వచ్చినా చోటు కల్పిస్తానని చాటేందుకు స్వామి పుష్పక వాహనంపై ఊరేగుతారు. సాయంత్రం నుంచి అంతర్వేది చెరువులో తెప్పోత్సవం జరుగుతోంది. ఉత్సవాల షెడ్యూల్ ఇలా.. అంతర్వేది లక్ష్మీనృసింహుని క్షేత్రంలో ఆదివారం నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకూ నిర్వహించనున్న స్వామివారి వార్షిక దివ్య తిరు కల్యాణ మహోత్సవాల షెడ్యూల్ను అధికారులు ప్రకటించారు. 25న రథసప్తమి సందర్భంగా వాహన సేవలతో పాటు ముద్రికాలంకరణ (స్వామివారిని పెండ్లి కుమారుని, అమ్మవారిని పెండ్లి కుమార్తె చేయుట). 26న ఽసాయంత్రం ధూపసేవ, ధ్వజారోహణ ఘట్టం, 29న స్వామివారి రథోత్సవం, 30న రాత్రి అన్నపర్వత మహానివేదన, 31న సాయంత్రం సదస్యం, అనంతరం 16 స్తంభాల మంటపం వద్ద చోర సంవాదం, ఫిబ్రవరి 1న స్వామివారికి చక్రస్నానం, 2న కోనేరులో హంస వాహనంపై స్వామి, అమ్మవార్ల తెప్పోత్సవం జరుగుతాయి. -
వేధింపులు భరించలేక వ్యక్తి ఆత్మహత్య
సామర్లకోట: స్థానిక సాయినగర్లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి ప్రైవేట్ బ్యాంకు అధికారుల వేధింపులు భరించలేక శనివారం తెల్లవారు జామున ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై కేఎస్ఆర్ మూర్తి కథనం ప్రకారం.. సాయినగర్కు చెందిన కరణం ఉమామహేశ్వరరావు (44) ఓ ప్రైవేటు బ్యాంకులో ఇల్లు తనఖా పెట్టి అప్పు తీసుకున్నాడు. ప్రతి నెలా వాయిదాలు ఆలస్యంగా చెల్లిస్తున్నారంటూ బ్యాంకు అధికారులు తరచూ హెచ్చరికలు జారీ చేసేవారు. ఈ నేపథ్యంలో ఆ ఇంటికి బ్యాంకు సిబ్బంది తాళం వేశారు. దీంతో మనస్థాపం చెందిన ఉమామహేశ్వరరావు ఆ ఇంటి పక్కనే ఉన్న ఓ గదిలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. A¯]l$-Ð]l*-¯é-çܵ-§ýl íܦ†ÌZ ˘ మహిళ మృతి తాళ్లరేవు: స్థానికంగా ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది.. కోరంగి ఎస్ఐ పి.సత్యనారాయణ, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. తాళ్లరేవు శ్రీరామ్నగర్లో కాలాడి సీత (55), అక్కడి రత్సవారిపేటకు చెందిన ధనకాసులతో కొన్నేళ్లుగా సహజీవనం చేస్తుంది. వారికి ఒక కుమార్తె ఉంది. శుక్రవారం రాత్రి భోజనం అనంతరం ఫిట్స్ రావడంతో కుప్పకూలి మృతిచెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కొన్ని రోజులుగా సీత అనారోగ్యంతో ఉందన్నారు. కాకినాడ రూరల్ సీఐ చైతన్యకృష్ణ సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. ఇలా ఉండగా కుటుంబ సభ్యులు మాత్రం సీత ముఖంపై గాయాలు ఉన్నాయని, ఎవరో హత్య చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. పూర్తిగా విచారణ చేపట్టి బాధ్యులను కఠినంగా శిక్షించాలని సీఐకు మొరపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో క్లూస్ టీంను రప్పించి విచారణ చేపడతామని ఆయన తెలిపారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు నిర్వహించాలని ఎస్ఐ సత్యనారాయణను ఆదేశించారు. భర్త మృతదేహం వద్ద రోదిస్తున్న భార్య నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసు -
ఆగి ఉన్న లారీని ఢీకొన్న బస్సు
● ఒకరి మృతి ● ముగ్గురికి తీవ్ర గాయాలు తుని రూరల్: తుని మండలం వి.కొత్తూరు వై.జంక్షన్ వద్ద జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న లోడు లారీని ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొనడంతో కో (సహాయ) డ్రైవర్ మృతి చెందగా.. డ్రైవర్, మరో ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఈ సంఘటన జరిగింది. దీనిపై రూరల్ ఎస్సై బి.కృష్ణమాచారి కథనం ప్రకారం.. అర్ధరాత్రి కావడంతో తుని మండలం వి.కొత్తూరు వై.జంక్షన్ వద్ద జాతీయ రహదారి పక్కన కర్రల లోడు లారీని రోడ్డుకు పక్కగా నిలిపారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నం నుంచి విజయవాడకు ప్రయాణికులతో వెళుతున్న ట్రావెల్ బస్సు ఆ లారీని ఢీకొంది. ఈ సంఘటనలో బస్సు డ్రైవర్ పక్కన ఉన్న కో (సహాయ) డ్రైవర్ ఎస్.రమేష్ (50) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిది ఉంగుటూరు మండలం ఆతుకూరు గ్రామంగా గుర్తించారు. డ్రైవర్ గణేష్, ప్రయాణికులు యశ్వంత్ (హైదరాబాద్), ఎం.సత్యమూర్తి (శ్రీకాకుళం) తీవ్రంగా గాయపడి క్యాబిన్లో చిక్కుకుపోయారు. సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్న పట్టణ సీఐ గీతారామకృష్ణ ఆధ్వర్యంలో రూరల్ పోలీసులు క్యాబిన్లో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసి తుని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మిగిలిన ప్రయాణికులను వేర్వేరు బస్సుల్లో తమ గమ్యస్థానాలకు పంపించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కృష్ణమాచారి వివరించారు. అక్కడ తరచూ ప్రమాదాలు ఈ ప్రాంతంలోనే తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నారు. సమీపంలో రూరల్ పోలీస్ స్టేషన్, హోటళ్లు, ఇతర వ్యాపార కేంద్రాలు ఉండడంతో రక్షణ, విశ్రాంతి లభిస్తుందన్న ఆలోచనతో డ్రైవర్లు వాహనాలను నిలిపి తమ అవసరాలను తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే వేగంగా వచ్చే ఇతర వాహనదారులు ఆగి ఉన్న వాహనాలను పూర్తి స్థాయిలో గుర్తించకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎస్పీ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టినా దుర్ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. నాలుగు లైన్లగా జాతీయ రహదారిని ఏర్పాటు చేసినప్పుడు పది కిలో మీటర్లకు ఒకచోట పార్కింగ్ స్థలాన్ని కేటాయించినప్పటికీ ఆ ప్రదేశాల్లో రాత్రి వేళల్లో వాహనాలు నిలపడం లేదు. హైవే పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారని డ్రైవర్లు భయాందోళనలతో ఆయా పార్కింగ్ స్థలాల్లో వాహనాలు నిలపకుండా రక్షణ లభిస్తుందన్న నమ్మకంతో ప్రధాన కూడళ్లలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక్కడ ప్రమాదాల నివారణకు తగిన చర్యలు చేపట్టాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
నేటి నుంచి జి.మామిడాడలో..
పెదపూడి: రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన జి.మామిడాడ సూర్యనారాయణమూర్తి స్వామివారి జయంతి, రథ సప్తమి వేడుకలు ఆదివారం నిర్వహించనున్నారు. దీనికి ఏర్పాట్లను ఆలయ ఉత్సవ కమిటీ, ఈఓ పాటి సత్యనారాయణ, ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, చైర్మన్ కొవ్వూరి శ్రీనివాస బాలకృష్ణారెడ్డి చేశారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి వారి మంగళశాసనాలతో ఆలయంలో ఆదివారం రథ సప్తమితో ప్రారంభమైయ్యే కల్యాణ ఉత్సవాలు ఫిబ్రవరి 2వ వరకూ జరుగుతాయి. 29న స్వామివారి కల్యాణం ఉంటుంది. సూర్య భగవానుడి పుట్టిన రోజైన రథసప్తమి పర్వదినం సందర్భంగా ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. ఆలయ ప్రధాన అర్చకుడు రేజేటి వెంకట నరసింహాచార్యులు ఆధ్వర్యంలో 10 మంది పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. దూర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఇందుకు గారు ఆలయంలో ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 1.30 గంటలకు రథోత్సవం ప్రారంభిస్తారు. సూర్యనారాయణ నామస్మరణతో రథాన్ని ఆలయ కమిటీ, గ్రామస్తులు ముందుకు లాగుతారు. రాత్రి తిరిగి రథోత్సవం ఆలయానికి చేరుకుంటుంది. -
పొదల్లో మగ శిశువు
చింతూరు: మండలంలోని కల్లేరులో పొదల మాటున శుక్రవారం మగ శిశువు కనిపించింది. సీలేరు వంతెన సమీపంలోని పొదల మాటున శిశువు ఏడుపు విన్న స్థానికులు ఐసీడీఎస్ సిబ్బందికి సమాచారమిచ్చారు. దీంతో సీడీపీఓ జయలక్ష్మి సిబ్బందితో కలసి ఆ ప్రాంతానికి చేరుకుని పొదల్లో ఉన్న ఆ శిశువును బయటకు తీసి చికిత్స నిమిత్తం చింతూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న చింతూరు ఏఎస్పీ బొడ్డు హేమంత్, ఎస్ఐ రమేష్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కాగా మూడ్రోజుల క్రితం కూడా మదుగూరు ప్రాంతంలో నవజాత శిశువు లభ్యంకాగా, తాజాగా మరో పసికందు కనిపించడం గమనార్హం. -
దమ్ము ట్రాక్టర్ బోల్తా: డ్రైవర్ దుర్మరణం
కాట్రేనికోన: మండలంలోని వేట్లపాలెంలో దమ్ము ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. వేట్లపాలెంలో ఓ పొలంలో డ్రైవర్ గుత్తుల గోణుగోపాలరావు (42) దమ్ము చేసేందుకు పొలంలో దుక్కి చేస్తున్న సమయంలో ట్రాక్టర్ ముందు చక్రాలు పైకి లేచి ఒక్కసారిగా బోల్తా పడింది. ట్రాక్టర్ కింద విగతజీవిగా పడిఉన్న వేణుగోపాలరావును బయటకు తీసేందుకు రైతులు శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. సరిహద్దు పంట చేనులో దుక్కి చేస్తున్న ట్రాక్టర్ సహాయంతో రైతులు బోల్తా పడిన ట్రాక్టర్ను తొలగించి వేణుగోపాలరావు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడికి అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి ఉంది. ఆలనాపాలన చూసుకునే కొడుకు మృతి చెందడంతో ఆ తల్లి దుఖఃసాగరంలో మునిగిపోయింది. కాట్రేనికోన ఎస్సై అవినాష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అడ్మిషన్ల దందాపై పోరాటం
కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు పీఆర్వోలను నియమించుకుని ఇంటర్ ప్రవేశాల కోసం చేస్తున్న అసత్య ప్రచారాన్ని కట్టడి చేయాలి. పదో తరగతి పరీక్షలు ప్రారంభం కాకుండానే తాయిలాలు ప్రకటిస్తూ అసత్య ప్రచారం చేసేవారిని అడ్డుకోవాలి. అడ్మిషన్ల దందాపై పోరాట కార్యక్రమాలు రూపొందిస్తాం. –బి.సిద్ధూ, రాష్ట్ర సహాయ కార్యదర్శి, పీడీఎస్యూ, రామచంద్రపురం వ్యాపారంగా విద్య ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల పీఆర్వోలు తల్లిదండ్రుల నంబర్లు సేకరించి మాట్లాడి మభ్యపెడుతున్నారు. ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియను ప్రభుత్వం ప్రకటించే వరకూ చేపట్టరాదు. అయితే విద్యను వ్యాపారంగా మార్చేస్తున్నారు. టాలెంట్ టెస్ట్లు, అవగాహన సదస్సుల పేరుతో కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలల అసత్య ప్రచారాన్ని నియంత్రించాలి. – సింహాద్రి కిరణ్కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పీడీఎస్యూ, రాజమహేంద్రవరం -
‘తిరుమల’లో వైభవంగా సరస్వతీ హోమం
రాజమహేంద్రవరం రూరల్: కాతేరులోని తిరుమల విద్యా సంస్థల ఆవరణలో శుక్రవారం నాగాబట్ల కామేశ్వరశర్మ ఆధ్వర్యంలో వింజమూరి సుబ్బారావు బృందంచే సరస్వతీ హోమం ఘనంగా నిర్వహించారు. తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు, సరోజినీదేవి దంపతులు ఈ హోమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. 22 వేల మంది విద్యార్థులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి నున్న తిరుమలరావు మాట్లాడుతూ విద్యార్థులంతా విద్యతో పాటు, మంచి బుద్ధిని కలిగి ఉండాలన్నారు. తమ లక్ష్యాలను నెరవేర్చుకోవడంతో ఎంత శ్రమ ఉన్నప్పటికీ, ఆ భగవంతుని ఆశీస్సులు కూడా అవసరమన్నారు. తమపై తమకు విశ్వాసం పెంపొందించుకోడానికి ఈ హోమం ఎంతో బలాన్ని ఇస్తుందని అన్నారు. కార్యక్రమంలో తిరుమల విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి, విద్యార్థులు, ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు. -
కొత్త కార్యవర్గం ఎన్నిక
బాలాజీచెరువు: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ పింఛనుదారుల సంక్షేమ సంఘం కొత్త కార్యవర్గం ఎన్నికను శుక్రవారం కాకినాడలోని జిల్లా కేంద్రం గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో నిర్వహించారు. సంఘ అధ్యక్షులు ఎం.సంజయశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర ప్రతినిధి కె.త్రిమూర్తులు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. సంఘ గౌరవ అధ్యక్షుడిగా గట్టి రామారావు, అఽధ్యక్షుడిగా సలాది సాయి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా ఎ.రామారావు, కోశాధికారిగా ఆర్.వీరభద్రరావు, మహిళా కార్యదర్శిగా డి.వాణిశ్రీ ఎన్నికయ్యారు. గౌరవ సలహాదారులుగా సీహెచ్ నాగేశ్వరరావు, ఐవీ రామరాజులు కొనసాగనున్నారు. అనంతరం నూతన అధ్యక్షుడు సలాది సాయి సత్యనారాయణను సత్కరించారు. పింఛనుదారుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. -
ఆడుకున్న మృత్యువు
ఘటనకు కారణాలు ఇలా.. ఒక టీచర్తో నడుస్తున్న ఈ పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ మొత్తం 20 విద్యార్థులు ఉండగా, శుక్రవారం 19 మంది హాజరయ్యారు. పాఠశాల ఆవరణలోని పార్కులో పునాది నిర్మించకుండానే నేలపైనే సిమెంట్ బొమ్మలు ఏర్పాటు చేశారు. వాటికి సపోర్టు లేకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గతంలో పలుమార్లు చెప్పినా పట్టించుకోలేదని స్థానికులు అంటున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ప్రమాద స్థలాన్ని కొత్తపేట ఆర్డీఓ శ్రీకర్, తహసీల్దార్ పి.శ్రీపల్లవి, ఎంపీడీఓ మల్లిఖార్జునరావు, సర్పంచ్ దంగేటి అన్నవరం, ఎంపీటీసీ పల్లి మోషే తదితరులు పరిశీలించారు. శ్రీకాకుళంలో ఉన్న ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రమాదంపై ఆరా తీసి, బాలిక కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు. ఫ సిమెంట్ జింక బొమ్మ పడి చిన్నారి మృతి ఫ జి.పెదపూడి పాఠశాల ఆవరణలో ఘటన పి.గన్నవరం: నవ్వుతూ ఆడుకుంటున్న ఆ చిన్నారి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది.. అభం శుభం తెలియని ఆ పసిప్రాయం అనంత లోకాల్లో కలసిపోయింది.. పాఠశాల ఆవరణలో సిమెంట్ ఆట బొమ్మపై ఆడుకుంటూ దిగుతున్న సమయంలో జరిగిన ప్రమాదంలో రెండో తరగతి విద్యార్థిని అశువులు బాసింది.. పి.గన్నవరం మండలం జి.పెదపూడి ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం.. మాచవరం గ్రామానికి చెందిన దివి దుర్గా వరప్రసాద్కు, జి.పెదపూడికి చెందిన సుజాతతో కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు. అయితే దుర్గా వరప్రసాద్, సుజాతలు జీవనోపాధి నిమిత్తం విజయవాడలో ఉంటున్నారు. వారి ఇద్దరి పిల్లలను జి.పెదపూడి గ్రామంలోని వరప్రసాద్ అత్తయ్య అధికారి సత్యవతి ఇంట్లో ఉంచి చదివిస్తున్నారు. జి.పెదపూడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సత్యవతి చాలాకాలం నుంచి మధ్యాహ్న భోజన పథకంలో వంట పనిచేస్తోంది. అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్న చిన్నారులు ఆ ప్రాథమిక పాఠశాలలోనే చదువుకుంటున్నారు. తేజశ్రీ ఐదో తరగతి, జాహ్నవి (7) రెండో తరగతి అభ్యసిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత జాహ్నవి పాఠశాల ఆవరణలోని పార్కులో సిమెంట్ జింక బొమ్మపై ఎక్కి నవ్వుతూ కొంతసేపు ఆడుకుంది. అనంతరం కిందకు దిగుతుండగా జాహ్నవిపై ఆ బొమ్మ పడిపోయింది. సుమారు 70 కిలోల బరువున్న బొమ్మ ఆమె ఛాతిపై పడడంతో అపస్మారక స్థితికి చేరుకుంది. దీంతో పాఠశాల హెచ్ఎంతో పాటు, స్థానికులు ఆ చిన్నారిని అంబులెన్స్లో కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ సంఘటనతో మిగిలిన విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. అప్పుడే భోజనం తినిపించా.. అప్పుడే భోజనం తినిపించా.. సరదాగా నవ్వుతూ ఉంది.. కొద్ది సేపటికే ఇలా జరిగిందంటూ జాహ్నవి మృతితో అమ్మమ్మ సత్యవతి బోరున విలపిస్తోంది. ఈ ఘటనతో జి.పెదపూడి గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. సంక్రాంతి పండగలకు ఇక్కడకు వచ్చిన జాహ్నవి తల్లిదండ్రులు రెండు రోజుల కిందటే తిరిగి విజయవాడకు వెళ్లారు. ఈ ఘటనపై పి.గన్నవరం ఎస్సై బి.శివకృష్ణ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
అలంకారప్రాయంగా..
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆర్బీకేలు కళకళలాడుతూ ఉండేవి. రైతు లకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సాగు కాలమంతా అందుబాటులో ఉండేవి. సాగు విధానాలపై రైతులతో సిబ్బంది సమావేశా లు, అవగాహన సదస్సులు నిర్వహించేవారు. రైతుల కు సంక్షేమ పథకాలతో పాటు పంట నష్టపరిహారం, ఇన్సూరెన్సు అందజేత వంటి అనేక సేవలు అందించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వంలో ఆర్ఎస్కేలు అలంకారప్రాయంగా మారి వెలవెలబోతున్నాయి. – లంక ప్రసాద్, వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఏ సేవా అందడం లేదు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో రైతులకు ఆర్బీకే భరోసాగా నిలిచింది. ఒక ప్రభుత్వం ప్రారంభించిన మంచి పథకాన్ని అధికారంలోకి వచ్చిన మరో ప్రభుత్వం మార్చుకుంటూ, నిర్వీర్యం చేస్తూ పోవడం సరి కాదు. ఆర్బీకేల పేరును చంద్రబాబు ప్రభుత్వం రైతు సేవా కేంద్రాలుగా మార్చినప్పటికీ అక్కడ రైతులకు ఎటువంటి సేవలూ అందించడం లేదు. – వెలమర్తి బులిరాజు, రైతు, వీకే రాయపురం, సామర్లకోట మండలం యథాతథంగా కొనసాగించాలి కూటమి ప్రభుత్వం కొలువుదీరాక ఆర్ఎస్కేల ద్వారా రైతులకు సేవలు సరిగ్గా అందడం లేదు. వీటిపై నిర్లక్ష్యం తగదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజలకు మేలు చేసే పథకాలను మాత్రం యథాతథంగా కొనసాగించాలి. ఆర్ఎస్కేల సేవల విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. – దాసరి చిన్నబాబు, వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి, గోకవరం -
సర్పవరం.. ఆధ్యాత్మిక సౌరభం
● మాఘ ఉత్సవాలకు ముస్తాబు ● భావనారాయణ స్వామి ఆలయంలో పూర్తయిన ఏర్పాట్లు ● రేపటి నుంచి ఆదివారం తిరునాళ్లు ● వేలాదిగా రానున్న భక్తులుకాకినాడ రూరల్: జిల్లాలో పురాతన ప్రసిద్ధి చెందిన సర్పవరంలోని శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి ఆలయం మాఘ ఉత్సవాలకు ముస్తాబైంది. కాకినాడ సమీపాన ఉన్న సర్పవరం గ్రామంలో సాక్షాత్తూ ఆ వైకుంఠ వాసుడైన శ్రీమహావిష్ణువే భావనారాయణ స్వామిగా వెలిశాడని స్థల పురాణం చెబుతోంది. ఈ ఆలయంలో పురాతన కాలం నాటి రాతి కట్టడాలు భక్తులను ఎంతో ఆకట్టుకుంటాయి. వీటిని పురావస్తు శాఖ పర్యవేక్షిస్తుంది. ఆలయానికి ఉత్తర దిశలో ఉన్న అత్యంత ఎత్తయిన రాజగోపురం, నారద గుండం సరస్సు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ క్షేత్రంలోని భావనారాయణ స్వామి వారిని దర్శించుకుంటే 108 నారాయణ క్షేత్రాలను దర్శించుకున్నంత పుణ్యఫలం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ స్వామిని ఆరోగ్య ప్రదాతగా స్వామిని భావించి, మాఘ మాసంలో వచ్చే ఆదివారాల్లో వేలాదిగా భక్తులు ఇక్కడకు వస్తూంటారు. ఆలయంలో ఇప్పటికే మాఘ మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నెల రోజుల పాటు జరిగే ఆధ్యాత్మిక సంబరాలకు ఈ క్షేత్రం ముస్తాబైంది. ఈ మాఘ మాసంలో సూర్యభగవానుడికి ప్రీతికరమైన ఆదివారాలు నాలుగు వస్తున్నాయి. ఈ నెల 25న మొదటి, ఫిబ్రవరి 1న రెండు, 8న మూడు, 15న నాలుగో ఆదివారాలు వస్తున్నాయి. ఆ రోజుల్లో ఈ క్షేత్రంలో ఉత్సవాలు పెద్ద ఎత్తున జరగనున్నాయి. మొదటి ఆదివారం నాడే రథసప్తమి పర్వదినం కావడంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడకు వచ్చే భక్తులు ఆలయ ప్రాంగణంలోని ఖాళీ స్థలంలో ఆవు పిడకలతో నిచ్చలి కుంపటి వేసి, దానిపై పాలు పొంగించుకుని, ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడికి పరమానాన్ని నివేదిస్తారు. సూర్య నమస్కారాలు చేసుకుని, ఆరోగ్యం ప్రసాదించాలంటూ ఆ స్వామిని వేడుకుంటారు. అనంతరం, శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణునితో పాటు మూల భావనారాయణ స్వామిని, పాతాళ భావనారాయణ స్వామి వారిని దర్శించుకుంటారు. సర్పవరం పేరు.. వచ్చిందిలా.. స్థల పురాణం ప్రకారం.. ఒకప్పుడు నారద మహర్షి గర్వంతో శ్రీమన్నారాయణుడి శాపానికి గురై సీ్త్రగా మారిపోయాడు. దీంతో, గర్వభంగమై.. స్వామివారి కారుణ్యంతో.. ఆ రూపాన్ని పోగొట్టుకునేందుకు ఈ ప్రాంతంలో తపస్సు చేశాడు. ఇక్కడి పుష్కరిణిలో స్నా నమాచరించడంతో అతడి పాపం పోయి, పాత రూ పం వచ్చింది. అనంతరం నారదుడికి ప్రత్యక్షమైన శ్రీ మహావిష్ణువు.. ఇక్కడ భావనారాయణ స్వామిగా స్వ యంభువుగా వెలిశారు. స్వామి వారిని దర్శించుకున్న నారదుడు ఇక్కడే రాజ్యలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించాడు. ఐదు వేల సంవత్సరాల క్రితం భావనారాయణ స్వామి వారు గరుడ వాహనంపై కూర్చుని ఇక్కడ వెలిశారని, ఆ స్వామి విగ్రహం ఆలయ కింది భాగంలో ఉండటంతో పాతాళ భావనారాయాణుడిగా భక్తులకు దర్శనమిస్తున్నారని చెబుతారు. అలాగే, ఈ దివ్య క్షేత్రంలో అనంతుడనే సర్పం మూల భావనారాయణ స్వామిని ప్రతిష్ఠించాడని, తద్వారా ఈ గ్రామానికి సర్పపురి.. సర్పవరంగా పేరు వచ్చిందని అంటారు. భక్తులకు ఇబ్బంది లేకుండా.. మాఘ మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. ఆదివారాల్లో ఆలయం వద్ద జరిగే తిరునాళ్లకు వేలాదిగా భక్తులు వస్తారు. స్వామి వారిని దర్శించుకునేందుకు వారికి ఇబ్బంది లేకుండా క్యూలు ఏర్పాటు చేశాం. ఆదివారాల్లో గ్రామస్తులు, భక్తుల సహకారంతో ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్నాం. – రాపాక శ్రీనివాసరావు, భావనారాయణ స్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి -
రైతు సేవకు షాక్
● గతంలో 394 ఆర్ఎస్కేలు ● నేడు 327కు కుదింపు ● జిల్లాలో 67 కేంద్రాలకు మంగళం ● రేషనలైజేషన్ పేరిట సిబ్బంది సర్దుబాటు ● ప్రభుత్వ తీరుపై రైతుల ఆగ్రహం సాక్షి ప్రతినిధి, కాకినాడ: దేశానికే ఆదర్శవంతంగా గుర్తింపు పొందిన రైతు భరోసా కేంద్రాలను (ఆర్బీకే) ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ రైతులకు షాక్ ఇస్తోంది. రైతులకు ఉన్న ఊళ్లోనే అన్ని రకాల సేవలూ అందించాలనే లక్ష్యంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీటిని ఏర్పాటు చేశారు. వీటి ద్వారా విత్తు నుంచి ఎరువులు, పంట విక్రయాల వరకూ రైతులకు తోడుగా నిలవడంతో పాటు సాగుకు సంబంధించి అడుగడుగునా సూచనలు, సలహాలు అందించేవారు. చంద్రబాబు ప్రభుత్వం గద్దెనెక్కాక ఆర్బీకేల పేరును రైతు సేవా కేంద్రాలుగా (ఆర్ఎస్కే) మార్చారు. ఆర్బీకేలకు రైతుల్లో మంచి ఆదరణ లభించడంతో వీటి మనుగడను ఏదో ఒక విధంగా దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీనికి తగినట్టుగానే రేషనలైజేషన్ పేరిట పదుల సంఖ్యలో ఆర్ఎస్కేలను కుదించారు. చాలావాటికి అడ్రస్ లేకుండా చేశారు. అక్కడితో ఆగకుండా ఆ కేంద్రాల్లో సిబ్బందిని కూడా తగ్గించేశారు. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుదించారిలా.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా 394 ఆర్బీకేలను ఉండేవి. రేషనలైజేషన్ పేరుతో ప్రస్తుత ప్రభుత్వం రెండు మూడు ఆర్ఎస్కేలను ఒకటిగా విలీనం చేసింది. ఈవిధంగా జిల్లాలో 67 ఆర్ఎస్కేలకు మంగళం పాడటంతో వాటి సంఖ్య 327కు పడిపోయింది. వీటిలో 305 గ్రామీణ, మరో 22 అర్బన్ కేంద్రాల్లో ఉన్నాయి. వీటిల్లో పని చేస్తున్న విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు (వీఏఏ), విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ల(వీహెచ్ఏ)తో పాటు విలేజ్ సెరికల్చర్ సిబ్బంది రైతులకు సేవలందిస్తున్నారు. వీరిలో కొందరు పదోన్నతులపై వెళ్లగా మరి కొంత మంది ఉద్యోగాలు వదిలి వెళ్లిపోయారు. ప్రస్తుతం సుమారు 330 మంది మాత్రమే ఆర్ఎస్కేలలో సేవలందిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో ఆర్ఎస్కేకు 1,400 హెక్టార్ల వ్యవసాయ భూమిని పరిధిగా నిర్దేశించారు. ఈ పరిధిలో వీఏఏ, వీహెచ్ఏలు పని చేయాల్సి ఉండగా.. ప్రస్తుతం ప్రతి ఆర్ఎస్కేలో వీరిలో ఒక్కరు మాత్రమే పని చేస్తున్నారు. సిబ్బంది కొరత కారణంగా కొన్ని ప్రాంతాల్లో సేవలు సరిగ్గా అందడం లేదని రైతులు వాపోతున్నారు. -
బాలల పరిరక్షణకు పటిష్ట చర్యలు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): బాలలతో భిక్షాటన, బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ అపూర్వ భరత్ అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం జరిగిన మిషన్ వాత్సల్య, జిల్లా స్థాయి బాలల పరిరక్షణ కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. బాలలతో ఎక్కడా భిక్షాటన జరగకుండా చూడాలన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కొందరు ఒక మాఫియాగా ఏర్పడి బాలలతో భిక్షాటన చేయిస్తున్నారన్నారు. భిక్షాటన ముసుగులో మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నారని, అటువంటి వారిపై పోలీసు శాఖ ద్వారా ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. భిక్షాటన చేసే చిన్నారులను గుర్తించి, వైద్య పరీక్షలు చేయించి, పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు టాస్క్ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేసుకుని విధిగా డ్రైవ్లు నిర్వహించాలని అన్నారు. చైల్డ్ హెల్ప్లైన్ టోల్ ఫ్రీ నంబర్ 1098పై విస్తృత ప్రచారం చేయాలని, అన్ని సినిమా హాళ్ల వద్ద దీనిని ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. చైల్డ్ కేర్ హోమ్లోని బాల బాలికలకు అందుతున్న వసతులపై నివేదిక స మర్పించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ వీవీవీఎస్ లక్ష్మణరావు, స్పెషల్ బ్రాంచి డీఎస్పీ సత్యనారాయణ, జి ల్లా క్రీడాభివృద్ధి అధికారి సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఘనంగా చండీహోమం అన్నవరం: రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి శుక్రవారం చండీహోమం ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో ఉదయం 9 గంటలకు పండితులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం హోమం ప్రారంభించి, పూర్ణాహుతి గావించారు. అమ్మవారికి వేదాశీస్సులు, నీరాజన మంత్రపుష్పాదులు సమర్పించి, నివేదనలు చేసి, భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. వేద పండితుడు సూర్యనారాయణ, వనదుర్గమ్మ ఆలయ అర్చకుడు ప్రయాగ రాంబాబు తదితరులు హోమం నిర్వహించారు. 30 మంది భక్తులు రూ.750 టికెట్టుతో ఈ హోమంలో పాల్గొన్నారు. సత్యదేవుని ప్రధానాలయంలో స్వామివారి దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి ప్రధానార్చకుడు ఇంద్రగంటి నరసింహమూర్తి, తొలి పావంచా వద్ద కనకదుర్గ అమ్మవారికి పరిచారకుడు నరసింహమూర్తి ఆధ్వర్యాన పండితులు కుంకుమ పూజలు చేశారు. 26న పీజీఆర్ఎస్ రద్దు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రద్దు చేసినట్లు జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పీజీఆర్ఎస్తో పాటు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాన్ని కూడా రద్దు చేశామని పేర్కొన్నారు. -
వైఎస్సార్ సీపీ కమిటీల్లో పలువురి నియామకం
కాకినాడ రూరల్: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురు నాయకులను పార్టీ వివిధ కమిటీల్లో నియమించారు. పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఈ వివరాలు తెలిపింది. వివిధ పదవుల్లో నియమితులైన వారికి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు అభినందనలు తెలిపారు. బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా కడియాల మహాలక్ష్మి (చినబాబు) (కాకినాడ రూరల్), పార్టీ జిల్లా ఆర్గనైజనల్ కార్యదర్శిగా బొంతు లీలాకృష్ణ (కాకినాడ రూరల్), ఇంటలెక్చువల్ ఫోరమ్ జిల్లా ఉపాధ్యక్షులుగా అల్లు సూర్య సత్యనారాయణ (ప్రత్తిపాడు), బీర డానియేల్ రాయ్ (కాకినాడ రూరల్) నియమితులయ్యారు. సోషల్ మీడియా వింగ్ జిల్లా ఉపాధ్యక్షుడిగా పబ్బినీడి చైతన్య, సోషల్ మీడియా వింగ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా గన్నవరపు రాజేష్, యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా దోని శ్రీనివాస్, దివ్యాంగుల విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా దంతులూరి సాహిత్వర్మ(కాకినాడ రూరల్)లను నియమించారు. ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శులుగా రాచర్ల రమేష్ (ప్రత్తిపాడు), సవరపు చిట్టిబాబు, పంచాయతీరాజ్ విభాగం జిల్లా కార్యదర్శిగా కొల్లా భాస్కర్, వైఎస్సార్ టీయూసీ జిల్లా కార్యదర్శిగా నందిపాటి ఆదినారాయణ (కాకినాడ రూరల్), పబ్లిసిటీ వింగ్ జిల్లా కార్యదర్శిగా పులపకూర వీర్రాజు నియమితులయ్యారు. వరకట్నం తీసుకోవడం, ఇవ్వడం నేరం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): వరకట్నం ఇవ్వడం, డిమాండ్ చేయడం, తీసుకోవడం చట్టరీత్యా నేరమని, వరకట్న వేధింపులు, హింస, మరణాలకు గురి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. జిల్లా సీ్త్ర, శిశు అభివృద్ధి సంస్థ అధికారులతో కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి సలహా మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. వరకట్న వేధింపు బాధిత మహిళలకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు పోలీస్ సంరక్షణ, న్యాయ సహాయాలు సత్వరం అందించాలని సూచించారు. వరకట్న రహిత వివాహాలను ప్రోత్సహించాలన్నారు. వరకట్నానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఓటర్లుగా నమోదు కావాలి బోట్క్లబ్ (కాకినాడ సిటీ): పద్దెనిమిదేళ్ల వయస్సు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ అపూర్వ భరత్ అన్నారు. ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బందితో ఓటరు ప్రతిజ్ఞ నిర్వహించారు. ఓటు హక్కు విలువను ప్రతి ఒక్కరూ తెలుసుకుని, వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ శ్రీలక్ష్మి, కలెక్టరేట్ పరిపాలనాధికారి ఎస్.రామ్మోహనరావు, ఎన్నికల విభాగం డిప్యూటీ తహసీల్దార్ ఎం.జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. -
దిగుబడిన కష్టాలు
ఫ జిల్లాలో మిర్చి తోటలపై ‘నల్లి’ తెగులు ఫ దిగుబడులపై తీవ్ర ప్రభావం ఫ నష్టాల ఊబిలో రైతన్నలు ఫ క్వింటా రూ.21 వేలు దాటినా దిగాలే ఫ ఏటా తగ్గుతున్న సాగు విస్తీర్ణం ఎటపాక: ఎర్ర బంగారమైన మిర్చికి ‘ధర’హారం వచ్చింది.. అంచనాలకు మించి రేటు పెరిగింది.. అయితే, ప్రస్తుతం ఈ సాగులో నల్లి తెగులు దిగుబడులపై ప్రభావం చూపుతోంది.. ఫలితంగా ధర బాగున్నా రైతులకు కష్టమే మిగులుతోంది.. ఐదేళ్ల నుంచి అనేక ఒడుదొడుకులు ఎదుర్కొంటూ మిర్చి తోటలు సాగు చేస్తున్నా ఫలితం లేకుండా పోతుంది. ఎంతో ఆశతో సాగు చేస్తున్న వాణిజ్య పంట మిర్చి ఈ ఏడాదీ కంటనీరు పెట్టించింది. పోలవరం జిల్లాలో ప్రధానంగా చింతూరు, వీఆర్ పురం, కూనవరం, ఎటపాక మండలాలు, పోలవరం ప్రాజెక్టు ముంపు భూములతో సహా సుమారు 6 వేల ఎకరాల్లో మిర్చి సాగు చేస్తున్నారు. అయితే, ఉద్యాన శాఖ లెక్కల ప్రకారం 2,300 ఎకరాల్లో మిర్చి సాగు జరుగుతోంది. ఐదేళ్ల కిందట సుమారు 10 వేల ఎకరాల్లో సాగు చేసేవారు. రాను రాను సగం వరకూ విస్తీర్ణం తగ్గిపోయింది. నల్లి ప్రభావంతో ఈ ఏడాది కూడా మిర్చి దిగుబడులు తగ్గుతున్నాయి. ఎకరా మిర్చి సాగుకు రూ.1.20 లక్షల వరకూ పెట్టుబడి పెట్టారు. అయితే, ప్రస్తుతం ఎర్ర, నల్ల నల్లి తెగుళ్లు మిర్చి తోటలను ఆశించాయి. వీటి ప్రభావం నుంచి పంటను కాపాడుకునేందుకు ఎన్ని పురుగు మందులు పిచికారీ చేసినా ఫలితం లేదని రైతులు అంటున్నారు. ఈ తెగులు కారణంగా మిర్చి పూత, పిందె, ఆకుల్లోని రసాన్ని పీల్చివేయడంతో తోటలు నల్లగా మాడిపోతున్నాయి. ఈ ఏడాది సుమారు నెల రోజులు ఆలస్యంగా నల్లి ప్రభావం కనపడటంతో ముందుగా వచ్చిన పంటే కొందరు రైతులకు చేతికి అందింది. ఎకరాకు 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా, ఈ తెగులు కారణంగా కేవలం పది క్వింటాళ్ల లోపు మాత్రమే దిగుబడి వస్తుందని రైతులు అంటున్నారు. గోదావరికి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వరదల ఉధృతి అధికంగా ఉండడంతో ఈసారి మిర్చి సాగు ఆలస్యమైంది.ఎక్కడెక్కడ.. ఎంతెంత చింతూరు మండలం ఏజీ కోడేరు, ముకునూరు, కల్లేరు, చూటూరు, కూటూరు, ఈడిపల్లి; ఎటపాక మండలం నందిగామ, మురుమూరు, గౌరిదేవిపేట, గన్నవరం, నెల్లిపాక, తోటపల్లి, పిచుకలపాడు, రాయనపేట, గన్నవరం పరిసరాల్లో మిర్చి సాగు అధికంగా ఉంది. వీఆర్ పురం, కూనవరం మండలాల్లో సాగు తక్కువగా చేస్తున్నారు. ఎటపాక మండలంలోనే అధికంగా 60 శాతం సాగు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. నల్లి తెగులు ప్రభావంతో మిర్చి సాగు విస్తీర్ణం ప్రతి ఏడాది తగ్గిపోతుంది. దిగుబడులు తగ్గడంతో పంటలు వేయడానికి రైతులు వెనకాడుతున్నారు. -
నరసన్నా.. తీరు మారేనా!
● ఈ నెల 28న అంతర్వేది కల్యాణం ● భారీగా తరలిరానున్న భక్తులు ● అంతంతమాత్రంగా వసతులు ● సౌకర్యాల కల్పనపై మీనమేషాలుసాక్షి, అమలాపురం/సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణ ఘడియలు దగ్గర పడుతున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి వేలాదిగా భక్తులు ఈ కల్యాణ క్రతువుకు తరలి రానున్నారు. కానీ, వారికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. స్వామి వారి భక్తులు, అనాదిగా కొన్ని కుటుంబాలు, కొన్ని కుల సంఘాలు చేస్తున్న సేవా కార్యక్రమాలు తప్ప.. ప్రభుత్వం నుంచి అందుతున్న సేవలు అంతంత మాత్రమే కావడం గమనార్హం. 25న ప్రారంభం అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణోత్సవాలు ఈ నెల 25 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకూ జరగనున్నాయి. వీటిలో ముఖ్యమైన కల్యాణోత్సవాన్ని ఈ నెల 28వ తేదీ రాత్రి నిర్వహిస్తారు. ఆ మర్నాడు రథోత్సవం జరుగుతుంది. ఈ రెండు కార్యక్రమాలనూ తిలకించడానికి భక్తులు భారీగా వస్తారు. మొత్తంగా కల్యాణోత్సవాలకు ఐదారు లక్షల మంది వస్తారన్నది అంచనా కాగా, వారిలో సుమారు 3 లక్షల మంది కల్యాణం, రథోత్సవానికే వస్తారని చెబుతున్నారు. తిరిగి పౌర్ణమి రోజున మరో 2 లక్షల మంది వచ్చే అవకాశముంది. చాలా మంది భక్తులు కల్యాణం రోజు సాయంత్రానికి చేరుకుని కల్యాణోత్సవాన్ని తిలకించడంతో పాటు తెల్లవారుజామున సముద్ర స్నానాలకు వెళ్తారు. అనంతరం స్వామివారి దర్శనం, మధ్యాహ్నం నుంచి రథోత్సవం చూసుకుని సాయంత్రం స్వస్థలాలకు తిరిగి వెళ్తారు. కల్యాణోత్సవం వీక్షించేందుకు వచ్చే వేలాది మంది భక్తులు ఆవిధంగా 24 గంటలకు పైగా అంతర్వేదిలోనే ఉంటారు. పెరిగిన భక్తులు, ఆదాయం దశాబ్ద కాలంగా అంతర్వేది ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటోంది. భక్తులు రెండు మూడు రెట్లు పెరిగారు. కల్యాణోత్సవాలతో పాటు రోజు వారీ భక్తుల సంఖ్య కూడా ఎక్కువైంది. గతంలో ఏడాదికి రూ.80 లక్షలు ఉండే సగటు ఆదాయం ఇప్పుడు రూ.2.50 కోట్ల వరకూ ఉంటోందని అంచనా. అయినప్పటికీ కల్యాణోత్సవాల ఏర్పాట్లలో పాత పంథాను అవలంబిస్తున్నారే తప్ప భక్తుల సౌకర్యాల కల్పనకు పెద్ద ప్రాధాన్యం ఇవ్వడం లేదు.సమీక్షలెందుకు? కల్యాణోత్సవాల ఏర్పాట్లపై ఆలయం వద్ద అమలాపురం ఎంపీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు సమీక్షల మీద సమీక్షలు జరుపుతున్నారు. భద్రత, బస్సులు, పారిశుధ్యం వంటి వాటి మీద సమీక్షలతోనే సరిపోతోంది. భక్తులకు కల్పించాల్సిన ఏర్పాట్ల మీద చర్చ లేకుండా పోతోంది. -
త్వరితగతిన జల్ జీవన్ మిషన్ పనులు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో జల్ జీవన్ మిషన్ కింద చేపట్టిన పనులు వేగంగా పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. జిల్లా వాటర్, శానిటేషన్ మిషన్ కమిటీ సభ్యులతో కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జల్ జీవన్ మిషన్ కింద జిల్లాలో రూ.498.59 కోట్లతో 1,007 పనులు చేపట్టగా, ఇంతవరకు 581 పనులు పూర్తయ్యాన్నారు. పురోగతిలో ఉన్న మిగిలిన 426 పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. 20 మండలాల్లోని 667 నివాస ప్రాంతాల్లో 2,02,084 ఇళ్లు ఉండగా ఇంతవరకూ 1,12,858 కుళాయి కనెక్షన్లు ఇచ్చారని, మిగిలినవి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అన్నారు. జల్ జీవన్, స్వచ్ఛ భారత్ మిషన్ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి వేగంగా పూర్తి చేయాలన్నారు. తాను కూడా త్వరలో క్షేత్ర స్థాయిలో పర్యటించి, పూర్తి చేసిన, పురోగతిలో ఉన్న పనులను పరిశీలిస్తానని చెప్పారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో వాటర్ గ్రిడ్ కింద రూ.1,650 కోట్ల నాబార్డ్ నిధులతో చేపడుతున్న తాగునీటి సరఫరా ప్రాజెక్ట్ పనులపై అధికారులతో సమీక్షించారు. వివిధ ఎస్సీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో చేపట్టిన కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణ పనుల్లో పురోగతి కనబరచాలని అధికారులకు అపూర్వ భరత్ సూచించారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఎండీ అబ్దుల్ మతీన్, జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు, ఇరిగేషన్ ఈఈ శేషగిరిరావు, డ్వామా పీడీ అడపా వెంకటలక్ష్మి పాల్గొన్నారు. వ్రత పురోహితులకు ఎట్టకేలకు పారితోషికం అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో పని చేస్తున్న సుమారు 250 మంది వ్రత పురోహితులకు గత నెల పారితోషికం (జీతాలు) రూ.92 లక్షలను ఎట్టకేలకు గురువారం వారి ఖాతాల్లో జమ చేశారు. అన్నవరం దేవస్థానంలో వ్రత పురోహితుల పారితోషికాల బిల్లు తయారు చేసే ఓ పురోహితుడు చేతివాటం చూపి, రూ.58.39 లక్షలు కాజేసిన విషయం దేవస్థానం అధికారుల తనిఖీలో వెలుగు చూసిన విషయం విదితమే. ఆ మొత్తాన్ని ఆ పురోహితుడు, అతడి కుటుంబ సభ్యులు, ఈ అవకతవకల్లో భాగస్వాములైన ఇతర పురోహితులు దేవస్థానానికి తిరిగి జమ చేశారు. ఈ నేపథ్యంలో వ్రత పురోహితులకు గత నెల పారితోషికం చెల్లింపులో జాప్యం జరిగింది. సంబంధిత బిల్లును దేవస్థానం, ఆడిట్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్న క్రమంలో ఈ నెల 19వ తేదీ వచ్చినా వారికి పారితోషికం జమ కాలేదు. దీనికి తోడు పాలకొల్లులో జరిగిన సామూహిక వ్రతాల్లో భక్తుల నుంచి బలవంతంగా కానుకలు వసూలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ విషయంలో కూడా పురోహితులపై అధికారులు ఆంక్షలు విధించారు. దీంతో, అటు పారితోషికం అందక, ఇటు కానుకలకు బ్రేక్ పడటంతో వ్రత పురోహితుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. దీనిపై ఈ నెల 20న ‘సాక్షి’ ‘ఆకలి కేకలు’ శీర్షికన కథనం ప్రచురించింది. దీనిపై దేవస్థానం అధికారులు స్పందించి, విషయాన్ని ఆడిట్ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లడంతో వారు ఆ బిల్లును పరిశీలించి, ఆమోద ముద్ర వేశారు. అనంతరం, ఆ బిల్లును ఈఓ వి.త్రినాథరావు బుధవారం పరిశీలించి, చెక్కుపై సంతకం చేశారు. ఆ చెక్కును, పురోహితుల పారితోషికం జాబితాను స్టేట్ బ్యాంక్కు గురువారం పంపించారు. వాటిని పరిశీలించిన అనంతరం పురోహితులకు పారితోషికాలు జమ చేసినట్లు బ్యాంక్ మేనేజర్ భరద్వాజ్ ‘సాక్షి’కి తెలిపారు. దేవస్థానాల్లో కొత్త హుండీలుఅన్నవరం: సత్యదేవుని సన్నిధి సహా రాష్ట్రంలోని అన్ని దేవస్థానాల్లో భక్తుల క్యూలలో స్టెయిన్లెస్ స్టీలు హుండీలు ఏర్పాటు చేయాలని దేవదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ గురువారం ఆదేశించారు. ప్రస్తుతం ఆలయాల్లో ఉన్న హుండీల ఎత్తు ఎక్కువగా ఉన్నందున వాటిలో కానుకలు సమర్పించడానికి భక్తులు ఇబ్బంది పడుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు. దీనివలన క్యూలో భక్తులు వేగంగా కదలక దర్శనం ఆలశ్యమవుతోందన్నారు. అందువలన దేవస్థానాల్లో చక్రాలతో కలిపి మూడడుగుల ఎత్తు, 16 అంగుళాల వెడల్పు, అక్కడ ఉన్న స్థలాన్ని బట్టి అవసరమైనంత పొడవుతో స్టెయిన్లెస్ స్టీల్ హుండీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఒక్కో హుండీ బరువు 55 నుంచి 60 కేజీల మధ్యలో ఉండేలా.. రెండంగుళాల మందంతో బాక్స్ తరహాలో హుండీలు తయారు చేయించాలని ఆదేశించారు. క్యూలు సరిగ్గా లేనిచోట 2.9 అడుగుల నుంచి మూడడుగుల వెడల్పున స్టెయిన్లెస్ స్టీల్ క్యూలు కూడా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. స్టెయిన్లెస్ స్టీల్ హుండీలు, క్యూల తయారీకి నిబంధనల ప్రకారం ఈ–ప్రొక్యూర్మెంట్ పద్ధతిలో టెండర్లు పిలవాలని ఆదేశించారు. -
రెండు బైక్ల ఢీ
ఐదుగురికి తీవ్ర గాయాలు ఎటపాక: మండలంలోని చోడవరం వద్ద 30వ నంబర్ జాతీయ రహదారిపై రెండు బైక్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఎస్సై అప్పలరాజు కథనం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా బయ్యారం గ్రామానికి చెందిన గోవుల వీరభద్రు కుటుంబం ఒడిశాలోని బలిమెలలో రాళ్లుకొట్టే పని చేస్తోంది. వీరభద్రు అతడి భార్య శారద, ఇద్దరు కుమారులు అభి, విజయ్లు బలిమెల నుంచి బైక్పై తమ స్వగ్రామం వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎటపాక మండలం గౌరిదేవిపేట పంచాయతీ బాడిశవారిగుంపునకు చెందిన పొడియం కన్నయ్య తన కుమార్తెను భద్రాచలం హాస్టల్లో వదిలి తిరిగి బైక్పై తన గ్రామం వస్తున్నారు. ఈ క్రమంలో చోడవరం సమీపంలో తన వాహనాన్ని అకస్మాత్తుగా కుడి వైపునకు తిప్పటంతో ఎదురుగా వస్తున్న వీరభద్రు వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో వీరభద్రుకు, అతడి ఇద్దరు కుమారులకు కుడి కాళ్లు విరగడంతోపాటు తలకు బలమైన గాయాలయ్యాయి. శారదకు బలమైన గాయం కాగా, కన్నయ్య కాలు విరిగి తలకు గాయమైంది. ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లెక్క తేల్చి.. కొలిక్కి తెచ్చి
● నూరు శాతం సొమ్ము రికవరీ ● రూ.58.39 లక్షలు దారి మళ్లించిన పురోహితుడు ● ఇటీవలే రూ.50.57 లక్షల వసూలు ● తాజాగా రూ.4.82 లక్షలు చెల్లించిన ఆ పురోహితుని భార్య ● మిగిలిన రూ.3 లక్షలు భర్త గ్రాట్యుటీ నుంచి జమ చేయాలని ఈఓకు వినతి అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో ఓ వ్రత పురోహితుడు చేతివాటం చూపి కాజేసిన రూ.58.39 లక్షలను అధికారులు ఎట్టకేలకు పూర్తిగా రికవరీ చేశారు. ఈ చేతివాటం వ్యవహారం గత డిసెంబర్లో వెలుగు చూసింది. అప్పట్లోనే ఆ పురోహితుడు రూ.28.54 లక్షలు జమ చేశాడు. ఆ తరువాత అతడు హఠాత్తుగా మృతి చెందాడు. అయితే, ‘చేతివాటం’పై పూర్తి స్థాయిలో తనిఖీ చేయాలని అన్నవరం దేవస్థానం ఈఓ వి.త్రినాథరావు ఆదేశించారు. ఈ మేరకు చేపట్టిన తనిఖీల్లో ఆ పురోహితుడు మరో 12 మంది పురోహితులకు రూ.22 లక్షలు పంపించినట్లు గుర్తించిన అధికారులు వారందరికీ గత సోమవారం నోటీసులిచ్చారు. వారందరూ ఆ మొత్తాన్ని మంగళవారం జమ చేశారు. దీంతోపాటు ఈపీఎఫ్కు చెల్లించాల్సిన రూ.8.82 లక్షలను ఆ పురోహితుడు ఇద్దరికి పంపించినట్లు అధికారులు గుర్తించి, వారికి కూడా నోటీసులిచ్చారు. దీంతో, వారు కూడా ఆ మొత్తాన్ని చెల్లించారు. ఆ పురోహితుడి నుంచి రూ.1.42 లక్షలు అందుకున్న సోలార్ కాంట్రాక్టర్కు నోటీస్ ఇవ్వడంతో అతడు కూడా ఆ మొత్తాన్ని చెల్లించాడు. ఆ పురోహితుని భార్య ఖాతాకు జమ చేసిన రూ.2,26 లక్షలు, అతడి అత్త అకౌంట్కు జమ చేసిన రూ.10,600 కూడా దేవస్థానానికి జమ చేశారు. తద్వారా గత మంగళవారం నాటికి మొత్తం రూ.50.57 లక్షలు రికవరీ చేయగలిగారు. గ్రాట్యుటీ నుంచి రికవరీకి చర్యలు చేతివాటం చూపిన పురోహితుడు తనకు వాస్తవంగా రావాల్సిన పారితోషికం కన్నా అదనంగా రూ.7.82 లక్షలు తన అకౌంట్కు జమ చేసుకున్నట్లు అధికారుల తనిఖీలో వెల్లడైంది. అతడు మృతి చెందడంతో ఆ మొత్తం తిరిగి చెల్లించాలని అతడి భార్య, కుటుంబ సభ్యులకు మంగళవారం నోటీసు ఇచ్చారు. ఈ మేరకు ఆ పురోహితుడి భార్య గురువారం రూ.4.82 లక్షలు చెల్లించారు. తన భర్తకు రావల్సిన గ్రాట్యుటీ మొత్తం నుంచి మిగిలిన రూ.3 లక్షలు జమ చేసుకోవాలని దేవస్థానం ఈఓ వి.త్రినాథరావుకు ఆమె వినతిపత్రం సమర్పించారు. దీంతో, ఆ మొత్తాన్ని జమ చేస్తూ ఫైలు పెట్టాలని సంబంధిత అధికారులను ఈఓ ఆదేశించారు. ఆ మేరకు అధికారులు ఈఓకు ఫైలు పంపించారు. పురోహితుడు కాజేసిన మొత్తం నూరు శాతం రికవరీ అవడంతో దేవస్థానం అధికారులు, వ్రత పురోహితులు ఊపిరి పీల్చుకున్నారు. ఒక దశలో ఆ పురోహితుడు రూ.కోట్లు స్వాహా చేశాడని, అందులో చాలా మంది పాత్ర ఉందనే ప్రచారం జరిగింది. ఒకరైతే రూ.3 కోట్లు స్వాహా చేశారని, ఇందులో 20 మంది పురోహితుల పాత్ర ఉందని ఆరోపిస్తూ ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఉద్దేశిస్తూ లేఖ రూపంలో మరో పురోహితుడి పేరిట ఫిర్యాదు కూడా చేశారు. అయితే, తాను ఎలాంటి ఫిర్యాదూ చేయలేదని, దానిపై ఉన్న సంతకం, ఫోన్ నంబర్ తనవి కావని ఆ పురోహితుడు వివరణ ఇవ్వడంతో అది ఫేక్ లేఖగా తేలింది. మృతి చెందిన పురోహితుడి కుటుంబ సభ్యులతోను, అదనంగా పారితోషికం జమ అయిన పురోహితులతోను వ్రత పురోహిత సంఘం అధ్యక్షుడు చామర్తి కన్నబాబు, మాజీ అధ్యక్షుడు నాగాభట్ల రవిశర్మ, కర్రి సూర్యనారాయణ (నాని) చర్చించి, ఆ మొత్తం తిరిగి జమ చేసేలా ఒప్పించారు. నేడు కమిషనర్కు నివేదిక పురోహితుడు కాజేసిన రూ.58.39 లక్షలూ రికవరీ చేసినట్టు దేవస్థానం ఈఓ త్రినాథరావు దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్కు శుక్రవారం నివేదిక పంపనున్నట్లు అధికారులు తెలిపారు. పురోహితుడి చేతివాటం వ్యవహారం 2024 జనవరి నుంచి గత ఏడాది నవంబర్ వరకూ దాదాపు రెండేళ్ల పాటు కొనసాగింది. అయినప్పటికీ అటు దేవస్థానం, ఇటు ఆడిట్ అధికారులు ఈ విషయాన్ని పసిగట్టలేకపోవడంపై కమిషనర్ ఏవిధంగా స్పందిస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. -
విఘ్నేశ్వరునికి సప్త నదీ జలాభిషేకం
స్కూల్ బస్సు ఢీకొని ఉపాధ్యాయుడికి గాయాలువిఘ్నేశ్వర స్వామికి జలాభిషేకం చేస్తున్న వేద పండితులుఅయినవిల్లి విఘ్నేశ్వరస్వామి సన్నిధిలో సప్తనదీ జలాల కలశాలతో వేద పండితులుఅయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వర స్వామి ఆలయంలో చదువుల పండుగ పేరుతో మూడు రోజులు పాటు జరిగే ప్రత్యేక క్రతువులకు వేద పండితులు గురువారం అంకురార్పణ చేశారు. ఈ మేరకు ఆలయాన్ని వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. తొలిరోజు స్వామివారికి ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో 12 మంది రుత్విక్కులు సప్తనదీ జలాభిషేకం, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. గంగ, యమున, సరస్వతి, కావేరి, నర్మద, సింధూ, గోదావరి జలాలు ప్రత్యేక కలశాల్లో నింపి పూజలు చేశారు. అనంతరం స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ఈఓ, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు పర్యవేక్షణలో ఈ పూజలు జరిగాయి. శుక్రవారం చదువుల పండుగ పేరుతో శ్రీపంచమి సందర్భంగా సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు చేస్తామని ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావు తెలిపారు. చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహిస్తామన్నారు. అనంతరం స్వామివారి పాదాల చెంత లక్ష కలాలు ఉంచి పూజలు చేస్తామన్నారు. ట్యాంకర్ను లాగేందుకు అష్టకష్టాలులోక్ అదాలత్ను విజయవంతం చేయండిఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): మార్చి 14న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని బీమా సంస్థల ప్రతినిధులు, ఆయా సంస్థల న్యాయవాదులకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత సూచించారు. గురువారం స్థానిక జిల్లా కోర్టు ఆవరణలోని ఏడో జడ్జి చాంబర్లో వివిధ బీమా సంస్థల ప్రతినిధులు, ఆయా సంస్థల న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎన్.శ్రీలక్ష్మి మాట్లాడుతూ మార్చి 14న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్లో అధిక సంఖ్యలో కేసులను పరిష్కరించి బాధితులకు తగిన పరిహారం అందించే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఆయా బీమా సంస్థలకు సంబంధించి పెండింగ్లో ఉన్న కేసుల జాబితాను జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు అందజేయాలని సూచించారు. అలాగే రాజీ పడదగిన అన్ని ఇతర కేసులను గుర్తించి, వాటిని లోక్ అదాలత్ ద్వారా సత్వర పరిష్కారం దిశగా తీసుకెళ్లేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. తొండంగి: మండలంలోని పీబీసీ కాలువకు అనుసంధానంగా పంట కాలువలో స్పిరిట్ ట్యాంకర్ బోల్తా పడిన నేపథ్యంలో కాలువ నుంచి దానిని వెలికి తీసేందుకు అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు. సుమారు 60 టన్నుల వరకూ ఉండే ట్యాంకర్ను తీసేందుకు రెండు రోజులుగా జేసీబీలు వంటివి తీసుకొచ్చినప్పటికీ బయటకు తీసే వీలులేక వెళ్లిపోతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతంలో దుర్వాసన వస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బోల్తా పడిన లారీని వెలికి తీసే పనులు మూడో రోజూ కూడా కొనసాగనున్నాయి. ట్యాంకర్లో ఉన్న స్పిరిట్ను కాలువలో వదిలి ఖాళీ ట్యాంకర్ను బయటకు తీస్తారా, లేక స్పిరిట్ వల్ల పంట కాలువ, పక్కనే ఉన్న పీబీసీ కాలువ నీరు కలుషితంగా కాకుండా ఏవిధమైన చర్యలు తీసుకుంటారో తెలియాల్సి ఉంది. నేడు బస్ సర్వీసుల రద్దురాజవొమ్మంగి: ఏలేశ్వరం డిపో నుంచి పోలవరం, అల్లూరి జిల్లాలకు తిరిగే ఆర్టీసీ బస్ సర్వీసులను పోలీసు అధికారుల ఉత్తర్వుల మేరకు శుక్రవారం నిలిపి వేస్తున్నట్లు ఏలేశ్వరం డిపో మేనేజర్ సత్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. అడ్డతీగల మండలం గొంతువానిపాలెం – రమణయ్యపేట గ్రామాల మధ్య అధ్వానంగా ఉన్న రహదారికి మరమ్మతులు చేయాలంటూ గురువారం ప్రజలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా అడ్డతీగల, రాజవొమ్మంగి, వై.రామవరం, నర్సపట్నం, కొయ్యూరు మండలాలకు బస్సు సర్వీసులను నిలిపివేశారు. కాగా శుక్రవారం కూడా ఆయా ప్రాంతాలకు బస్సు సర్వీసులను నిలిపివేస్తున్నట్లు డిపో మేనేజర్ పేర్కొన్నారు. వివాహిత అదృశ్యంపై కేసు నమోదురంగంపేట: వివాహిత అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎస్.శివప్రసాద్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. రంగంపేట గ్రామానికి చెందిన జుజ్జవరపు వెంకటరమణ పెద్ద కుమార్తె తేజకు, పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామానికి చెందిన సూర్యకు 2025లో వివాహమైంది. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12న తేజ రంగంపేటలో తండ్రి ఇంటికి వచ్చింది. 20వ తేదీ అర్ధరాత్రి నుంచి కనిపించడం లేదు. ఆమె ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు చట్టుపక్కల ప్రాంతాలు, బంధువుల ఇళ్ల వద్ద గాలించినా ప్రయోజనం లేకపోవడంతో ఆమె తండ్రి వెంకటరమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. ఆమె ఆచూకీ తెలిస్తే 94409 04854, 94407 96538 ఫోన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. నల్లజర్ల: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. నల్లజర్లలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా తూర్పుచోడవరానికి చెందిన దాసరి వెంకట సత్యనారాయణ పనిచేస్తున్నారు. ప్రస్తుతం అతను చిన్నాయగూడెంలో నివాసం ఉంటున్నారు. గురువారం విధులు ముగించుకుని బైక్పై ఇంటికి వస్తుండగా అచ్చన్నపాలెం వద్ద ఓ స్కూల్కు చెందిన బస్సు ఢీకొంది. సత్యనారాయణ ఎడమ కాలిపై నుంచి బస్సు ఎక్కడంతో నుజ్జునుజ్జయ్యింది. హైవే అంబులెన్స్లో ఆయనను చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిరాజోలు: రోడ్డు ప్రమాదంలో పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన షేక్ మస్తాన్ (45) మృతి చెందాడు. ఈ నెల 21న రాజోలు మండలం పాలగుమ్మి బైపాస్ రోడ్డులో నగరం వైపు సైకిల్పై వెళ్తున్న షేక్ మస్తాన్ను గుర్తు తెలియని మోటార్ సైకిల్ బలంగా ఢీకొంది. దీంతో తలకు తీవ్ర గాయం కావడంతో 108 అంబులెన్స్లో రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కాకినాడ తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మస్తాన్ గురువారం మృతి చెందాడని ఎస్సై రాజేష్కుమార్ తెలిపారు. ఊరూరా సైకిల్పై తిరుగుతూ గ్యాస్ స్టౌలు రిపేర్ చేస్తూ కుంటుంబాన్ని పోషించుకునే వాడని మస్తాన్ సోదరుడు నన్నాషా తెలిపారు. నన్నాషా ఫిర్యాదు మేరకు రాజోలు పోలీసులు కేసు నమోదు చేశారు. కోలంకలో వ్యక్తి అదృశ్యంకాజులూరు: కోలంకకు చెందిన పినిపే ప్రసాద్ (38) వారం రోజుల నుంచి కనిపించడం లేదు. ఈ మేరకు అతని కుమారుడు సుభాష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వివరాల ప్రకారం.. ప్రసాద్ భార్య కువైట్కు ఉపాధి నిమిత్తం వెళ్లింది. దీంతో అతను రోజూ పొలమూరుపాడులో అత్తవారింటికి వెళ్లి మధ్యాహ్నం, సాయంత్రం భోజనం చేసి తిరిగి కోలంక వస్తుండేవాడు. ఈ నెల 15న సాయంత్రం పొలమూరుపాడులో భోజనం చేసి వెళ్లిన ప్రసాద్ తిరిగి కనిపించ లేదు. బంధువులు, స్నేహితుల ఇంటికి వెళ్లి ఉంటాడని కుటుంబీకులు అనుకున్నారు. వారం గడిచినా రాకపోవడంతో గొల్లపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆచూకీ తెలిసిన వారు సెల్ నంబరు 96189 06535, గొల్లపాలెం పోలీస్ స్టేషన్ నంబర్ 0884 2335233కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.వ్యభిచార గృహంపై పోలీసుల దాడిగోకవరం: గోకవరంలో నిర్వహిస్తున్న ఓ వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేసి ఇద్దరు నిర్వాహకులను, ఇద్దరు విటులను అరెస్టు చేయడంతో పాటు ముగ్గురు బాధిత మహిళలను రక్షించారు. ఎస్సై పవన్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గోకవరం శివారున మురళీనగర్లో ఓ ఇంటిలో ఇద్దరు మహిళలు వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో బుధవారం రాత్రి దాడి చేశామన్నారు. ఈ దాడిలో ఇద్దరు విటులను, ముగ్గురు బాధిత మహిళలను, ఇద్దరు నిర్వాహకురాళ్లను అదుపులోకి తీసుకున్నామన్నారు. గోకవరానికి చెందిన బద్దిరెడ్డి పద్మ తన ఇంట్లో, రంపయర్రంపాలెం గ్రామానికి చెందిన కట్టమూరి లక్ష్మితో కలిసి వివిధ ప్రాంతాల నుంచి యువతులను తీసుకువచ్చి వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు గుర్తించామన్నారు. అక్కడ ఇద్దరు యువతులతో ఉన్న పెద్దాపురం, తాళ్లపూడికి చెందిన ఇద్దరు విటులను అరెస్టు చేసి, మహిళల అక్రమ రవాణా చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. దర్యాప్తులో భాగంగా నిర్వాహకులు, విటులు నలుగురిని రిమాండ్ నిమిత్తం గురువారం రాజమహేంద్రవరం కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారన్నారు. బాధిత మహిళలను కోర్టు అనుమతితో అబ్జర్వేషన్ హోమ్కి తరలించామన్నారు. -
నెహ్రూ యూ టర్న్
● రాజకీయాలకు గుడ్బై చెబుతారని గతంలో చెప్పిన అనుచరులు ● వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని తాజాగా జ్యోతుల వెల్లడి ● మూడున్నరేళ్లకు ముందే జగ్గంపేట ఎమ్మెల్యే ప్రకటన ● పట్టు నిరూపించుకునే వ్యూహమంటున్న విశ్లేషకులు సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాజకీయ రిటైర్మెంట్పై తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ యూ టర్న్ తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను తిరిగి పోటీ చేస్తానంటూ తాజాగా ఆయన చేసిన ప్రకటన ఆ పార్టీలో హాట్ టాపిక్గా మారింది. ఆయన తనయుడు, జ్యోతుల నవీన్ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా రెండోసారి ఫిబ్రవరి 1న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమంపై జగ్గంపేటలో బుధవారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో నెహ్రూ పైవిధంగా ప్రకటించడం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎప్పుడో మూడున్నరేళ్ల తరువాత జరిగే ఎన్నికల కోసం నెహ్రూ ఇంత ముందుగా ప్రకటించడం చూస్తూంటే కచ్చితంగా ఏదో పెద్ద వ్యూహంతోనే ఉన్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. వాస్తవానికి నాలుగున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నందున ఇక పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటిస్తారని ఆయన ఆంతరంగికులు చాలా కాలం నుంచే చెబుతున్నారు. రాజకీయాల నుంచి నెహ్రూ వైదొలగితే ఆ స్థానాన్ని ఆయన వారసుడైన టీడీపీ జిల్లా అధ్యక్షుడు నవీన్ కుమార్ భర్తీ చేస్తారని చెప్పుకొస్తున్నారు. అయితే, పార్టీలో పట్టు నిరూపించుకునే వ్యూహంలో భాగంగానే పొలిటికల్ రిటైర్మెంట్పై నెహ్రూ యూ టర్న్ తీసుకుని ఉండవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ‘సానా’ గొడవలున్నాయి సార్వత్రిక ఎన్నికల నుంచే జ్యోతుల, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ మధ్య వర్గ వైషమ్యాలు మొదలయ్యాయి. ఆ ఎన్నికల్లో కాకినాడ పార్లమెంటు సీటును తన తనయుడు నవీన్కు దక్కించుకునేందుకు నెహ్రూ శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. ఇదే సీటు కోసం చివరి వరకూ గట్టి ప్రయత్నం చేసిన సతీష్.. చినబాబు ఆశీస్సులతో నవీన్కు మోకాలడ్డారని బలమైన ప్రచారం జరిగింది. చివరకు ఈ సీటును జనసేనకు కేటాయించడంతో ఈ వివాదం సద్దు మణిగిందని అప్పట్లో అంతా అనుకున్నారు. కానీ, అది అక్కడితో సమసిపోలేదనే విషయం పార్టీ జిల్లా అధ్యక్ష పగ్గాలకు జరిగిన ఎన్నికల్లో మరోసారి బయటపడింది. నవీన్కు పార్టీ జిల్లా పగ్గాలు రెండోసారి దక్కకుండా సానా వర్గం వ్యూహాలకు పదును పెట్టింది. ఆ వర్గం నుంచి మెట్ట ప్రాంతానికే చెందిన తోట నవీన్ను తెర మీదకు తీసుకు వచ్చారు. దీంతో, జిల్లా టీడీపీలో రెండు వర్గాలు కొనసాగుతున్నాయనే వాస్తవాన్ని చెప్పకనే చెప్పినట్లయింది. జిల్లాలో చినబాబు అనుచరులుగా చలామణీ అవుతున్న పలువురు నేతలు అడ్డు పడినప్పటికీ.. నెహ్రూ తన చాణక్య నీతితో నవీన్ చేతుల నుంచి పార్టీ పగ్గాలు జారిపోకుండా తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. తన కుమారుడికి రెండోసారి జిల్లా పార్టీ పగ్గాలు దక్కించుకోగలిగారు. ఈ ఎన్నిక ముందు వరకూ రాజకీయాలకు గుడ్బై చెప్పాలనుకున్నారని ఆయన అనుచరులు చెబుతూ వచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకూ నెహ్రూ రాజకీయాల్లో కొనసాగుతారని, మరోసారి పోటీ చేస్తారనే చర్చను పార్టీలో వారు లేవనెత్తారు. దీనిని నిజం చేస్తూ రాజకీయాల నుంచి వెనక్కు తగ్గేదే లేదంటూ నెహ్రూ కుండ బద్దలుగొట్టారు. ఈ క్రమంలో కాస్త గొంతు పెంచి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ నేతలకు మింగుడుపడటం లేదు. ‘రాజకీయాల నుంచి వైదొలగాలనే మొదట్లో అనుకున్నాను. అయితే, ఇటీవల కాలంలో జిల్లా రాజకీయాల్లో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు రాజకీయాల నుంచి వైదొలగాలనే ఆలోచనను విరమించుకునేలా చేశాయి. రాజకీయాలంటే కొందరు ఆటలనుకుంటున్నారు. వెంట తిరిగే వారితో బాకా ఊదించుకోవడమనే ఆలోచనతో ఉంటున్నారు. వారికి రాజకీయాలంటే ఏమిటో చూపిస్తాను’ అంటూ నేతలు, కార్యకర్తల సమావేశంలో నెహ్రూ పదునైన వ్యాఖ్యలు చేశారు. తద్వారా భవిష్యత్తులో ప్రత్యర్థి వర్గానికి చుక్కలు చూపిస్తాననే సంకేతాలు ఇచ్చినట్లేనని ఆ పార్టీ నేతలు ప్రైవేటు సంభాషణల్లో అంటున్నారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవి నవీన్కు రెండోసారి దక్కకుండా చేసేందుకు ప్రత్యర్థి వర్గం చేసిన రాజకీయాలే దీనికి కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అసెంబ్లీయా.. పార్లమెంటా! నెహ్రూ మరో అడుగు ముందుకేసి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నవీన్ కుమార్ పోటీ చేస్తారని ప్రకటించారు. దీని అర్థం తాను పోటీ చేయనని చెప్పడం కాదని, జిల్లాలో ఎక్కడో ఒకచోట నుంచి తాను కూడా పోటీ చేస్తానని, 2029లో అసెంబ్లీలో అడుగు పెడతానని అన్నారు. అయితే, ఆయన అసలు లక్ష్యం అసెంబ్లీ కాదని, కాకినాడ లోక్సభ సీటు అని అంటున్నారు. ఆ విషయాన్ని ఇప్పటికిప్పుడు బయట పెట్టకుండా వ్యూహాత్మకంగానే ఆయన ఈ ప్రకటన చేశారని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో దక్కించుకోలేని కాకినాడ లోక్సభ స్థానాన్ని వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారని అంటున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా తన లక్ష్యాన్ని సాధించుకోవడం, అదే సమయంలో ప్రత్యర్థులకు స్థానం లేకుండా చేయడమనే ద్విముఖ వ్యూహాన్ని ఆయన అనుసరిస్తున్నారని చెబుతున్నారు. అయితే, ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి అవకాశం దక్కనీయకుండా గత ఎన్నికల్లో ఎత్తులు వేసి, నెహ్రూను చిత్తు చేసిన ఫార్ములానే వచ్చే ఎన్నికల్లోనూ ఫాలో అవుతామనే ధీమాతో ప్రత్యర్థి వర్గం ఉంది. ఈ పరిస్థితుల్లో జిల్లా టీడీపీలో రెండు వర్గాలు నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. -
కాకినాడకు మరింత పేరు తేవాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో మూడు బంగారు పతకాలు సాధించిన ఆర్టీసీ డ్రైవర్ మందపల్లి శ్రీనివాసరావు కాకినాడకు మరింత పేరు తీసుకు రావాలని జిల్లా ప్రజా రవాణా అధికారి (డీపీటీఓ) ఎం.శ్రీనివాసరావు ఆకాంక్షించారు. పతకాలు సాధించిన శ్రీనివాసరావును ఆర్డీసీ డిపోలో గురువారం అభినందించారు. ఈ నెల 17, 18న హర్యానాలో జరిగిన జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో 3 బంగారు పతకాలే కాకుండా ఇప్పటి వరకూ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో 97 పతకాలు సాధించడం గొప్ప విషయమన్నారు. పతకాలు సాధించిన శ్రీనివాసరావును అసిస్టెంట్ మేనేజర్ మాలిమ్ బాషా, పీఆర్ఓ వెంకటరాజు అభినందించారు. నేడు శ్రీపంచమి పూజలు సామర్లకోట: వసంత పంచమి(శ్రీపంచమి)ని పురస్కరించుకొని స్థానిక పంచారామ క్షేత్రంలోని సరస్వతీ దేవి ఆలయం వద్ద శుక్రవారం విద్యార్థులతో సరస్వతీ పూజలు నిర్వహించనున్నట్లు ఈఓ బళ్ల నీలకంఠం తెలిపారు. గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఉదయం 8.30 గంటలకు విఘ్నేశ్వర పూజతో ప్రారంభించి, అమ్మవారికి పంచామృతాభిషేకాలు, సరస్వతీ హోమం, అనంతరం విద్యార్థులతో పూజా కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. విద్యార్థినీ విద్యార్థులు సరస్వతీ పూజలో పాల్గొని అమ్మవారి కటాక్షం పొందాలని కోరారు. విద్యార్థులకు యార్లగడ్డ వెంకట సుబ్బారావు పేరిట ఆయన కుమారులు పుస్తకాలు, మాజీ ఎంపీపీ కొండపల్లి కృష్ణమూర్తి పెన్నులు, కటకం సృజన్ బిస్కెట్లు, అమ్మవారి ఫొటో, పలువురు దాతలు అమ్మవారి రూపులు, పువ్వులు ఇవ్వడానికి ముందుకొచ్చారని అర్చకుడు సన్నిధిరాజు వెంకన్న తెలిపారు. మిగిలిన ఏర్పాట్లను దేవస్థానం చేస్తుంది. కలెక్టర్కు ఎన్నికల సంఘం అవార్డుబోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఓటర్ల నమోదులో ఉత్తమ విధానాలతో ప్రతిభ చూపిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్కు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి వివేక్ యాదవ్ గురువారం అవార్డు ప్రకటించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈ నెల 25న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించే అవార్డుల ప్రదానోత్సవంలో కలెక్టర్ ఈ అవార్డు అందుకోనున్నారు. 2025 సంవత్సరానికి గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. ఈవీఎంల భద్రతకు చర్యలు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఈవీఎంలు, వీవీ ప్యాట్ల భద్రతకు తగు చర్యలు చేపట్టాలని రెవెన్యూ, ఎన్నికల శాఖల అధికారులను జిల్లా ఇన్చార్జి కలెక్టర్ అపూర్వ భరత్ ఆదేశించారు. కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎంల గోదామును గురువారం ఆయన తనిఖీ చేశారు. అక్కడ చేపడుతున్న భద్రతా చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గోదాము పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెలా ఈవీఎంల గోదామును తనిఖీ చేసి, నివేదిక పంపిస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో కాకినాడ అర్బన్ తహసీల్దార్ వి.జితేంద్ర, కలెక్టరేట్ ఎన్నికల విభాగం డిప్యూటీ తహసీల్దార్ ఎం.జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. -
నిందితులను నడిపిస్తూ కోర్టుకు తీసుకువెళ్లిన పోలీసులు
● కుట్ర పూరితంగానే హత్య ● డీఎస్పీ శ్రీహరిరాజు తుని రూరల్: కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో ఇటీవల జరిగిన హత్య కేసులో నిందితులను తుని రూరల్ సర్కిల్ పోలీసులు నడిరోడ్డుపై నడిపించి కోర్టుకు తీసుకువెళ్లారు. నిందితులను నడిరోడ్డుపై నడిపిస్తూ కోర్టుకు తీసుకువెళ్లడం సరికాదని ఉన్నత న్యాయస్థానాలు పేర్కొన్నా ప్రజలు చూస్తుండగా అటువంటి ఘటన తునిలో పునరావృతమైంది. ఈ నెల 16న జరిగిన ఘటనకు సంబంధించి తుని రూరల్ సర్కిల్ కార్యాలయంలో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు బుధవారం మీడియాతో మాట్లాడారు. రాజకీయ వైరం నేపథ్యంలో రెండు వర్గాల మధ్య కొనసాగుతున్న శత్రుత్వం కారణంగా హత్య జరిగిందన్నారు. అల్లిపూడి గ్రామంలో రెండు రాజకీయ పార్టీల కార్యకర్తల మధ్య చిన్న విషయాలకే తరచూ గొడవలు జరుగుతున్నాయన్నారు. 2019 నుంచి ఒక వర్గం కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడం, బెదిరించడం, దాడులు చేయడం వంటి ఘటనలు జరిగాయని ఫిర్యాదుదారులు పేర్కొన్నారన్నారు. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య తీవ్ర శత్రుత్వం ఏర్పడిందన్నారు. ఈ నెల 16న అదే గ్రామానికి చెందిన అంకంరెడ్డి ఎర్రపాత్రుడు పుట్టినరోజు సందర్భంగా ఒక వర్గం కార్యకర్తలు గ్రామంలో ఊరేగింపు నిర్వహించి, రామాలయం వద్ద జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమానికి వెళుతూ రాత్రి 8.30 గంటల సమయంలో చింతకాయల చినబాబు (విశ్వనాథ్) ఇంటి వద్దకు చేరుకున్నారన్నారు. అప్పటికే నిందితులందరూ కత్తులు, ఇనుప రాడ్లు, కర్రలతో కాపుకాసి ఉన్నారన్నారు. చింతకాయల నారాయణ మహేష్ (యేసుబాబు) మోటార్ సైకిల్పై వెళుతున్న చిటికెల శ్రీరామ్ను లాగి కింద పడేసి దాడి చేయగా ఇతర నిందితులు కర్రలు, రాడ్లతో అతనిని విచక్షణారహితంగా కొట్టారన్నారు. చిటికెల నారాయణమూర్తి కత్తితో శ్రీరామ్ను ముఖంపై తీవ్రంగా గాయపర్చారన్నారు. అనంతరం చింతకాయల చినబాబు (విశ్వనాథ్), చింతకాయల నారాయణ మహేష్ కలసి లాలం బంగారయ్యను కత్తితో పొడిచారన్నారు. తీవ్ర రక్తస్రావమై బంగారయ్య కుప్పకూలిపోయాడన్నారు. మిగిలిన నిందితులు రుత్తల దుర్గాప్రసాద్ తదితరులపై కర్రలు, ఇనుప రాడ్లతో దాడిచేసి చంపేస్తామంటూ బెదిరిస్తూ అక్కడ నుంచి పరారయ్యారన్నారు. క్షతగాత్రులను కోటనందూరు పీహెచ్సీకి అక్కడ నుంచి తుని ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు డీఎస్పీ వివరించారు. చికిత్స పొందుతూ లాలం బంగారయ్య (38) మరణించినట్టు తెలిపారు. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గాయపడిన వారిని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు. హత మార్చాలనే ఉద్దేశంతో కుట్ర పన్నినట్టు సాక్షుల వాంగ్మూలంతో స్పష్టమైందన్నారు. విశ్వసనీయ సమాచారంతో కోటనందూరు మండలం కేఏ మల్లవరం వద్ద 12 మంది నిందితులను మధ్యవర్తుల సమక్షంలో అరెస్టు చేశామన్నారు. వీరి వద్ద నుంచి కత్తులు, ఇనుప రాడ్లు, కర్రలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను రిమాండ్ నిమిత్తం తుని కోర్టులో హాజరుపర్చుతున్నట్టు డీఎస్పీ తెలిపారు. మీడియా సమావేశంలో రూరల్ సీఐ జి.చెన్నకేశవరావు, రూరల్, కోటనందూరు ఎస్సైలు కృష్ణమాచారి, టి.రామకృష్ణ పాల్గొన్నారు. మీడియా సమావేశం అనంతరం రూరల్ సీఐ కార్యాలయం నుంచి పార్కు సెంటర్ మీదుగా కోర్టు వరకు సుమారు కిలోమీటరు మేర నిందితులను నడిపించి తీసుకెళ్లారు. అరెస్టయిన నిందితులు చింతకాయల సన్యాసిరాజా విశ్వనాథ్, చింతకాయల నారాయణ మహేష్, చిటికెల నారాయణమూర్తి, పెదపాత్రుని సతీష్, గొంప వీరబాబు, అంకంరెడ్డి సాయికుమార్, చింతకాయల సత్యనారాయణమూర్తి, రుత్తల సాయి భానుప్రకాష్, కాళ్ల రమేష్, రుత్తల కిషోర్, రుత్తల సాయి కిరణ్, అంకంరెడ్డి నారాయణమూర్తి ఉన్నారు. -
ట్యాంకర్ బోల్తాపై విచారణ జరపాలి
తొండంగి: రసాయన వ్యర్థాల లారీ ట్యాంకర్ పంట కాలువలో బోల్తాపడడానికి ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల బాధ్యతారాహిత్యమే కారణమని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అన్నారు. తొండంగి మండలం ఏ.వి.నగరం పీబీసీ కాలువకు అనుసంధానంగా ఉన్న పంట కాలువలో రసాయన వ్యర్థాల(స్పిరిట్)ను పారబోసేందుకు వచ్చిన భారీ ట్యాంకర్ గట్టు విరగడంతో కాలువలో బుధవారం తెల్లవారు జామున బోల్తాపడింది. విషయం తెలుసుకున్న పరిసర గ్రామాల రైతులు ఉదయం అక్కడకు చేరుకున్నారు. గతంలో ఈ ప్రాంతంలో రెండుసార్లు స్పిరిట్ను కాలువలో వేయడంతో తమ పంటలు దెబ్బతిన్నాయని, ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని నిరసన తెలిపారు. రైతులపై పోలీసులు దౌర్జన్యం చేయడంతో విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా వెంటనే ట్యాంకర్ బోల్తాపడిన ప్రదేశాన్ని పరిశీలించారు. స్థానికంగా తాము పడుతున్న ఇబ్బందులను రాజాకు రైతులు వివరించారు. గతంలో ఇదేవిధంగా స్పిరిట్ను పంటకాలువలో అర్ధరాత్రి సమయాల్లో పారబోయడం వల్ల తమ పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. అనంతరం రాజా మాట్లాడుతూ రైతుల ఫిర్యాదును పెడచెవిన పెట్టడం వల్లే తరచూ స్పిరిట్ను ఈ ప్రాంతంలో వేస్తున్నారన్నారు. లారీ బోల్తాపడటంతో ఈ వ్యవహారం బయట పడిందన్నారు. రైతుల ఫిర్యాదు చేసిన వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుని ఉంటే ప్రస్తుతం ఈ ప్రమాదం జరిగేది కాదన్నారు. తమ పంటలను నష్టపోతున్నామని నిరసన తెలిపిన రైతులను అణచివేయడం దారుణమన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ప్రశ్నించిన వారిని అణచివేస్తున్నారని మండిపడ్డారు. పంటకాలువలో పడిన స్పిరిట్ సుమారు 20 గ్రామాల ప్రజలకు తాగునీరందించే వాటర్ స్టోరేజ్ ట్యాంకులో కలిసే ప్రమాదం ఉందన్నారు. ఈ ప్రాంత వ్యవసాయ పంటలు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. కానీ ప్రభుత్వం ఇదేమీ పెద్ద ప్రమాదం కాదంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయించడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. బోల్తా పడిన ట్యాంకర్ ఏ పరిశ్రమ నుంచి వచ్చిందో సమగ్ర దర్యాప్తు చేసి తేల్చాలని, కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రైతులు, ప్రజల పక్షాన పోరాడతామన్నారు. కాగా బోల్తాపడిన ట్యాంకర్ను బయటకు తీసేపనిని పోలీసులు ప్రారంభించారు. వైఎస్సార్ సీపీ పంచాయతీల విభాగం రాష్ట్ర కార్యదర్శి కొయ్యా మురళి, యువజన విభాగం రారష్ట్ర సంయుక్త కార్యదర్శి మడదా హేమంత్, జిల్లా ప్రచార విభాగం ఉపాధ్యక్షుడు ఆరుమిల్లి ఏసుబాబు, మండల కన్వీనర్ బత్తుల వీరబాబు, బూత్ కమిటీల విభాగం రాష్ట్ర కార్యదర్శి బెక్కం చంద్రగిరి, బీసీ సెల్ నియోజకవర్గ కన్వీనర్ పెండ్యాల రామకృష్ణ, పార్టీ నాయకులు అరిగెల శేషు, సిద్దా శ్రీనివాసరావు, కోడూరి దివాణం పాల్గొన్నారు. రసాయన వ్యర్థాలతో తమ పంటలు దెబ్బతింటున్న వైనాన్ని రాజాకు వివరిస్తున్న రైతులుపంట కాలువలో బోల్తాపడిన భారీ ట్యాంకర్ పంట కాలువలో రసాయన వ్యర్థాలు కలవడంతో నీరు కలుషితం 20 గ్రామాల ప్రజల ఆరోగ్యం, వ్యవసాయం దెబ్బతినే ప్రమాదం కారకులపై చర్యలు తీసుకోవాలి మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు రాజా డిమాండ్ ప్రమాదం లేదనడం హాస్యాస్పదంపంట కాలువలో స్పిరిట్ ట్యాంకర్ బోల్తాపడినప్పటికీ ఎటువంటి ప్రమాదం లేదనడం హాస్యాస్పదంగా ఉందని రాజా అన్నారు. ఘటనా స్థలంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ సూర్యకళతో ఆయన మాట్లాడారు. నీటిలో కలిసిన రసాయనాల వ్యర్థాల వల్ల ప్రమాదం లేదని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రమాదం లేదన్న వారంతా ఈ నీటిని ఒక గ్లాసు సేవించి చెప్పండి చూద్దాం అన్నారు. స్పిరిట్ ఏ రకమైనది, ఏ ప్రాంతంలోని పరిశ్రమ నుంచి వచ్చింది, కారకులెవరు, తరచూ ఈ ప్రాంతంలోనే ఎందుకు వేస్తున్నారు తదితర అంశాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ ఘటనను కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. -
డుమ్మాడమ్మా డుమ్మాడి!
హాజరైన జెడ్పీటీసీ సభ్యులు గుబ్బల తులసీకుమార్, రామకృష్ణ, యాళ్ల సుబ్బారావు తదితరులుసమావేశంలో మాట్లాడుతున్న చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు. చిత్రంలో ప్రభుత్వ విప్ బుచ్చిబాబు, సీఈఓ, డీఆర్వో తదితరులుసాక్షి ప్రతినిధి, కాకినాడ: రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం. ఎన్నికలయ్యాక పార్టీలు, రాజకీయాలతో సంబంధం లేకుండా అభివృద్ధి ప్రధాన అజెండాగా ముందుకు సాగాలి. దశాబ్దాలపాటు రాజకీయాల్లో ఆరితేరిన నేతలు ఒకప్పుడు చెప్పిన మాటలు ఇవి. ఇప్పుడు దేనినైనా రాజకీయ కోణంలోనే చూస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం గద్దె నెక్కాక ఈ ధోరణి మరింత పెరిగింది. మూడు నెలలకు ఒకసారి జరిగే జెడ్పీ సర్వసభ్య సమావేశం, రెండు నెలలకు ఒకసారి జరిగే జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు, ఏడాదికి ఒకసారి జరిగే బడ్జెట్ సమావేశాలు జిల్లా ప్రగతిలో చాలా ముఖ్యమైన భూమిక పోషించేవి. అందునా రాష్ట్ర రాజకీయాల్లో ధురంధరులైన నేతలు ఏలిన తూర్పు జెడ్పీకి మంచి గుర్తింపు ఉండేది. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వస్తుందంటే చాలు వేదికపై ఆసీనులయ్యే జిల్లా ఉన్నతాధికారులు, వేదిక దిగున పలు శాఖల అధికారులు వణికిపోయేవారు. ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి ఎటువంటి ప్రశ్నలు ఎదురవుతాయో, ఎదురయ్యే ప్రశ్నలకు ఎలా సమాధానాలు ఇవ్వాలో ముందు నుంచే కసరత్తు చేసేవారు. ఇప్పటి జిల్లా పరిషత్లో అటువంటి వాతావరణమే కనిపించడం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరు దగ్గర నుంచి సావధానమైన చర్చల వరకు అంతా మొక్కుబడి తంతుగానే ముగిసిపోతున్నాయి. తాజాగా బుధవారం జరిగిన సర్వసభ్య సమావేశంతో కలిపి గడచిన ఏడాదిన్నర కాలంలో జరిగిన ఆరు సర్వసభ్య సమావేశాలలో ఇదే వాతావరణం కనిపించింది. అందుకే ముఖం చాటేస్తున్నారా? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలను అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పూర్తిగా గాలికొదిలేశారు. ఉమ్మడి జిల్లాలో 50 లక్షల పై చిలుకు జనాభా ఏకాభిప్రాయంతో జిల్లా పరిషత్లో వైఎస్సార్ సీపీకి బలమైన పునాదులు వేశారు. 2020–2021లో జిల్లా పరిషత్లో 62 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రంపచోడవరం ఏజెన్సీలో విలీన మండలం ఎటపాక మినహా అన్ని స్థానాల్లోనూ వైఎస్సార్ సీపీ విజయం సాధించింది. అనంతర పరిణామాల్లో ముగ్గురు సభ్యులు టీడీపీ, జనసేనకు ఫిరాయించడం, ఇటీవల ఒక జెడ్పీటీసీ సభ్యుడు మృతిచెందడంతో 58 మంది సభ్యులతో ఇప్పటికీ వైఎస్సార్ సీపీ మెజార్టీతోనే ఉంది. ఉమ్మడి జిల్లాలో అధికారంలోకి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు జెడ్పీలో వైఎస్సార్ సీపీకి మెజార్టీ ఉండటాన్ని జీర్ణించుకోలేక సమావేశాలకు డుమ్మా కొడుతున్నట్టుగా కనిపిస్తోందంటున్నారు. వీటితో పాటు ఉమ్మడి జిల్లాలో ఎరువుల కోసం రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అధ్వానంగా మారిన రహదారులు, అమలుకాని సంక్షేమ పథకాలు, ప్రభుత్వ వైఫల్యాలపై సర్వసభ్య సమావేశాలలో జెడ్పీటీసీ సభ్యులు నిలదీస్తారనే భయం వెంటాడుతుండటంతో ముఖం చాటేస్తున్నారని ఆక్షేపిస్తున్నారు. నిధులూ రాబట్టడం లేదు.. సహజంగా మూడు నెలలకు ఒకసారి జరిగే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం అంటే ఎంతో ముఖ్యమైన అంశాలు చర్చించేందుకు వేదికగా పరిగణించేవారు. 2020–2021లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జెడ్పీ పాలకవర్గం కొలువుదీరిన దగ్గర నుంచి ఏడాదిన్నర క్రితం వరకు సమావేశాలలో ఎన్నో అంశాలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా చర్చలో పాల్గొని ప్రజాప్రయోజనాల కోసం ఎన్నో విలువైన సూచనలు, సలహాలు ఇచ్చిన సందర్భాలు అనేకం. అటువంటిది గడచిన ఏడాదిన్నర కాలంలో జరిగిన ఆరు సర్వసభ్య సమావేశాలకు అధికార పార్టీ నుంచి పట్టుమని పదిమంది ఎమ్మెల్యేలు ఏకకాలంలో హాజరైంది లేదంటున్నారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రమే హాజరవుతున్నారు. ఒకవేళ కొందరు వచ్చినా కారణాంతరాలతో మధ్యలో వెళ్లిపోతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 48 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అన్ని అంశాలపై కూలంకషంగా సమీక్షించే అవకాశం ఒక్క జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలకే ఉంటుంది. అటువంటి అవకాశాన్ని చేజేతులా జారవిడిచి తమకు అన్యాయమే చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకంతో జిల్లా పరిషత్కు ఇసుక సీనరేజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రూపంలో రావాల్సిన కోట్లాది రూపాయల నిధులు కూడా విడుదల కావడం లేదు. జెడ్పీ జనరల్ ఫండ్ కూడా అంతంతమాత్రమే. ఇందుకుతోడు ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరి స్థాయిలో వారు రాబట్టగలిగే నిధుల కోసం సభలో అడుగుతామనే వారు రావడం లేదని సభ్యులు అంటున్నారు. గౌరవ వేతనాలకూ దిక్కు లేదు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు సర్వసభ్య సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరవుతూ ప్రతి అంశంపైన చర్చలో పాల్గొనేవారు. అందుకు పూర్తి విరుద్ధంగా ఇప్పటి మెజార్టీ ఎమ్మెల్యేలు జెడ్పీ సర్వ సమావేశాలను పూర్తిగా గాలికొదిలేస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటువంటి పరిస్థితులకు తోడు జెడ్పీటీసీ సభ్యులకు గద్దెనెక్కిన దగ్గర నుంచి 14 నెలలుగా చంద్రబాబు సర్కార్ గౌరవ వేతనాలు ఇవ్వడం లేదు. సుమారు రూ.50 లక్షలు పెండింగ్లో ఉన్నాయి. చివరకు టీఏ, డీఏలు కూడా విడుదల చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో ఇటు ఎటపాక, అటు రాజోలు, సఖినేటిపల్లి మండలాల నుంచి ఎన్నో వ్యయ ప్రయాసలు ఎదుర్కొని సభ్యులు రాలేకపోతున్నారు. ఈ విషయాలపై జెడ్పీటీసీ సభ్యులు నులుకుర్తి రామకృష్ణ, మట్టా శైలజ, గొల్లపల్లి రత్నం, ఒమ్మి బిందుమాధవి, గన్నవరపు శ్రీనివాసరావు తదితరులు సభలో నిలదీయడం గమనార్హం. ఇదే కారణంతో బుధవారం ఏకకాలంలో సర్వసభ్య సమావేశం, స్థాయీ సంఘాల సమావేశాలు, బడ్జెట్ సమావేశం కూడా ఏర్పాటు చేయక తప్పింది కాదంటున్నారు. ఈ ధోరణి మారాలి, పాలకులలో మార్పు వస్తే తప్ప జెడ్పీ సర్వసభ్య సమావేశాల లక్ష్యం నెరవేరదని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. గైర్హాజరీకే మొగ్గు జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన బుధవారం జరిగిన సర్వసభ్య సమావేశానికి అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కలిపి ముగ్గురంటే ముగ్గురు మాత్రమే హాజరయ్యారు. విభజనకు ముందున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాలకు జెడ్పీలో ప్రాతినిధ్యం ఉంది. హాజరైంది మాత్రం ముగ్గురే కావడం గమనార్హం. ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్ర కేబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తోన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్, మరో మంత్రి కందుల దుర్గేష్కు జెడ్పీ సర్వసభ్య సమావేశంలో పాల్గొనేటంతటి తీరిక, ఓపిక లేకపోవడాన్ని ప్రజలు గర్హిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం గద్దె నెక్కాక జరిగిన ఆరు సర్వసభ్య సమావేశాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలలో ఇద్దరు ముగ్గురు తప్ప మిగిలిన వారు డుమ్మా కొడుతున్నారు. పనులు చేయడానికి నిధుల లేమిపై తాము నిలదీస్తామనే భయంతోనే వారు సమావేశాలకు రావడం లేదని జెడ్పీటీసీ సభ్యులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ విప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు హాజరైన గంటన్నరకే తిరుగుముఖం పట్టారు. పేరాబత్తుల రాజశేఖర్ కూడా వచ్చారు, వెళ్లారు. ఒక్క జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాత్రం నిలిచిపోయిన సత్యసాయి మంచినీటి పథకాన్ని ప్రస్తావించారు. జెడ్పీ సమావేశాలకు ముఖం చాటేస్తోన్న మంత్రులు, ఎమ్మెల్యేలు వైఎస్సార్ సీపీకి మెజార్టీ ఉండడమే కారణం ఆరు సమావేశాలుగా ఇదే తంతు ఘనమైన ‘తూర్పు జెడ్పీ’లో వింత ధోరణి -
భీష్మ ఏకాదశికి రత్నగిరిపై ఏర్పాట్లు
అన్నవరం: ఈ నెల 29వ తేదీన భీష్మ ఏకాదశి పర్వదినం సందర్బంగా సత్యదేవుని దర్శనానికి వేల సంఖ్యలో విచ్చేసే భక్తులకు ఇబ్బంది కలుగకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఏర్పాట్లపై బుధవారం దేవస్థానం పండితులు, అధికారులతో దేవస్థానం ఈఓ వి.త్రినాథరావు సమీక్షించారు. తీసుకున్న నిర్ణయాలు ● 28 తేదీ అర్ధరాత్రి నుంచి సత్యదేవుని వ్రతాల నిర్వహణ, స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు ● క్యూలో భక్తులకు మంచినీరు, చిన్నారులకు పాలు, బిస్కెట్లు అందజేయడం ● ప్రసాదాల విక్రయాలకు అదనపు కౌంటర్ల ఏర్పాటు, ఘాట్రోడ్లో ట్రాఫిక్ జామ్ అవ్వకుండా చర్యలు ● భీష్మ ఏకాదశి ఉదయం ఎనిమిది గంటల నుంచి సర్క్యులర్ మండపం వద్ద భక్తులకు దద్దోజనం, పులిహోర పంపిణీ ● భక్తులందరికీ వసతి గదులు లభించే అవకాశం ఉండదు కనుక విశ్రాంతి మండపాలలో ఏర్పాట్లు ● దేవస్థానంలో పలుచోట్ల అదనపు టాయిలెట్స్ ఏర్పాటు ● రత్నగిరి, సత్యగిరుల మధ్య భక్తుల కోసం ఉచిత బస్సులు ● వార్షిక కల్యాణ మండపం వద్ద పుష్పాలతో రూపొందించిన భీష్ముడు, అర్జునుని కటౌట్ల ఏర్పాటు ● ఈ నెల 25వ తేదీ రథసప్తమి, ఫిబ్రవరి 15న మహాశివరాత్రి సందర్భంగా కూడా విస్తృత ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. -
నాణేల సేకరణలో మరో రికార్డ్
అమలాపురం టౌన్: అమలాపురానికి చెందిన నాణేల సేకరణకర్త పుత్సా కృష్ణ కామేశ్వర్ మరో రికార్డ్ను సొంతం చేసుకుని వరుసగా ఐదో సారి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించారు. వివిధ సందర్భాల్లో విడుదలైన రూ.75 నాణేల సేకరణకు ఆయన పేరు ఆ పుస్తకంలో మరోసారి రికార్డయ్యింది. గత నాలుగేళ్లలో ఈ రికార్డులను అందుకోవడం వరుసగా ఇది ఐదో సారి. తపాలా బిళ్లల సేకరణలో రెండు సార్లు, నాణేల సేకరణలో ఒకసారి, కరెన్సీ నోట్ల సేకరణలో మరోసారి, తాజాగా నాణేల సేకరణలో ఐదోసారి రికార్డులకెక్కారు. భావి తరాలకు మన దేశ చరిత్రను, సంస్కృతిని ఈ నాణేలు, తపాలా బిళ్లలు, కరెన్సీ నోట్ల ద్వారా తెలియజేయడమే తన లక్ష్యమని కృష్ణ కామేశ్వర్ తెలిపారు. -
కల్వర్టులోనికి దూసుకెళ్లిన కారు
ఇద్దరికి తీవ్ర గాయాలు అడ్డతీగల: అడ్డతీగల మండలం గౌరయ్యపేట 516ఇ జాతీయ రహదారి టోల్గేట్ వద్ద బుధవారం కారు అదుపుతప్పి కల్వర్టులోకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో కొయ్యూరు మండలం నడింపాలేనికి చెందిన పందల శివకు చేయి విరిగిపోగా పాలపర్తి సత్యనారాయణ అనే వ్యక్తికి నడుం వద్ద తీవ్రగాయమైంది. అడ్డతీగల నుంచి వారి స్వగ్రామం నడింపాలేనికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుం ది. ఈ ఘటనను గమనించిన స్థానికులు క్షతగాత్రులను బయటకు తీసి ప్రైవేటు వాహనంలో అడ్డతీగల సీహెచ్సీకి చికిత్స కోసం తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యానికి వైద్యులు వారిని రాజమహేమద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆవు అడ్డొచ్చి వరుసగా బస్సులు ఢీ
రాజమహేంద్రవరం రూరల్: దివాన్చెరువు వద్ద మంగళవారం అర్ధరాత్రి ఆవు అడ్డు రావడంతో ఒకదానికి ఒకటి మూడు బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు బస్సులలో విహారయాత్రకు వెళ్లి తిరుగు పయనమైన తెలంగాణ రాష్ట్రానికి చెందిన పాఠశాల విద్యార్థులతో కలిపి 40 మందికి గాయాలయ్యాయి. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో ప్రాధమిక చికిత్స అనంతరం వారు స్వగ్రామాలకు బయలుదేరి వెళ్లారు. వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా దిండి గ్రామానికి చెందిన పీఎంశ్రీ తెలంగాణ మోడల్ స్కూల్, కళాశాలకు చెందిన 9, 10, ఇంటర్ చదువుతున్న 56 మంది బాలికలు, 53 మంది బాలురు, పది మంది ఉపాధ్యాయులు రెండు బస్సులలో ఈ నెల 17వ తేదీన విహారయాత్రకు బయలుదేరారు. అరకు, విశాఖబీచ్ తదితర ప్రాంతాలను సందర్శించి మంగళవారం అన్నవరం సత్యనారాయణస్వామిని దర్శించుకుని తిరుగు పయనమయ్యారు. మంగళవారం అర్థరాత్రి సమయంలో బాలురతో ఉన్న బస్సు దివాన్చెరువుకు వచ్చేసరికి ఆవు అడ్డురావడంతో సడన్బ్రేక్ వేశారు. దీంతో ఆ వెనుకనే విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు వెళ్తున్న బస్సు దానిని కొట్టింది. ఈ బస్సు వెనుకే బాలికలతో వస్తున్న బస్సు ఢీ కొట్టింది. ఈ బస్సులో ప్రయాణిస్తున్న ప్రిన్సిపాల్తో పాటు 37 మంది విద్యార్థినులకు గాయాలు కాగా, బాలుర బస్సు నడుపుతున్న డ్రైవర్తో పాటు ఒక విద్యార్థికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హోంగార్డ్స్ డీఎస్పీ కిరణ్కుమార్, సీఐలు మంగాదేవి, సుమంత్, సిబ్బంది చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. అనంతరం గాయపడిన వారిని మూడు 108 అంబులెన్స్లలో రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి, మిగిలిన విద్యార్థులను దివాన్చెరువులోని బాలవికాస్ మందిరానికి తరలించారు. గాయపడిన విద్యార్థులకు ప్రాధమిక చికిత్స అనంతరం డిశ్చార్జి చేసి పంపించారు. సంఘటన స్థలాన్ని తూర్పు మండల డీఎస్పీ బి.విద్య, బొమ్మూరు పోలీస్స్టేషన్ ఇన్చార్జి ఇన్స్పెక్టర్ శ్రీధర్కుమార్, ఎస్సై మురళీమోహన్ పరిశీలించారు. మూడు బస్సులను ట్రాఫిక్కు అంతరాయం కలుగకుండా పక్కన పెట్టించారు. ఆవు అడ్డురావడంతో సడన్బ్రేకు వేయగా వెనుక నుంచి బస్సు ఢీకొనడంతో తనకు, ఒక విద్యార్థికి గాయాలయ్యాయని బస్సు డ్రైవర్ ఎండి షకీర్ ఫిర్యాదు చేశాడు. ముందు బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో తమ బస్సు ఢీకొందనని, వెనుక మరో బస్సు ఢీకొందని, దీంతో ఆ బస్సులో ఉన్న కొందరు బస్సు అద్దాలు పగులగొట్టడంతో అక్కడ నుంచి వెళ్లిపోయినట్టు బస్సుడ్రైవర్ అంబరీష్ మరో ఫిర్యాదు చేశారు. తమ బస్సు డ్రైవర్ నిబంధనలు పాటించకుండా 50 మీటర్లు డిస్టెన్స్ పాటించకపోవడంతో పాటు నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్లే బాలికలు గాయపడ్డారని స్కూలు ప్రిన్సిపాల్ నారాయణరెడ్డి బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదుచేశారు. మూడు ఫిర్యాదుల మేరకు ఎస్సై మురళీమోహన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దివాన్చెరువులో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం రెండు బస్సులలో ప్రయాణిస్తున్న 40 మంది తెలంగాణ విద్యార్థులకు గాయాలు మూడు ఫిర్యాదులపై కేసులు నమోదు -
కారు అద్దెకు తీసుకుని.. ఆపై అమ్మేసి దౌర్జన్యం
బాధితులను హింసించి, కిడ్నాప్కు యత్నం సాక్షి టాస్క్ఫోర్స్: అవసరం నిమిత్తం కార్లు అద్దెకు తీసుకుని.. ఆనక అమ్మేసి సొమ్ము చేసుకుని.. అదేమని అడిగిన పాపానికి యజమాని బృందాన్ని చావబాది కిడ్నాప్కు యత్నించిన ఓ ఘరానా ముఠా చేసిన అకృత్యం తాజాగా చర్చనీయాంశమైంది. మండలంలోని తోకాడలో జరిగిన ఘటనకు సంబంధించి హైదరాబాద్కు చెందిన ఎత్తరి ఈశ్వర్ రాజానగరం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు వివరాలు ఇలా వున్నాయి. హైదరాబాద్లోని ఆల్విన్ కాలనీలో నివసిస్తున్న ఈశ్వర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ జీవిస్తున్నాడు. అదనపు ఆదాయం కోసం అతని మిత్రులు జీవన్, కుషాల్, జయేంద్రలతో కలిసి సొంతకార్లను అద్దెకు తిప్పుతున్నాడు. ఈ క్రమంలో హరీష్ అనే వ్యక్తికి డిసెంబరు 3న సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకునేలా తన మిత్రుడు జీవన్కు చెందిన మహీంద్ర థార్ కారును అద్దెకు ఇచ్చాడు. ఈ క్రమంలో హరీష్ కొంతకాలంగా అద్దె చెల్లించకపోగా ఆచూకీ తెలియకుండా పోయాడు. ఆ కారుకు అమర్చిన జీపీఎస్ను సైతం డిసెంబర్ 17 నుంచి తొలగించడంతో కారు ఎక్కడుందో తెలియని పరిస్థితి ఈశ్వర్ బృందానికి ఎదురైంది. ఎట్టకేలకు జీపీఎస్ ఆచూకీ తెలియడంతో దానిని అనుసరించి వాహనం రాజానగరం మండలం, తోకాడలో ఉన్నట్టుగా గుర్తించారు. హరీష్ అనపర్తికి చెందిన వ్యక్తికి కారును విక్రయించినట్టు వారు తెలుసుకున్నారు. సోమవారం మిత్రులు జీవన్, కుషాల్, జయేంద్రలు ఆ ప్రాంతానికి వెళ్లి తమ వద్ద ఉన్న మారు తాళంతో కారును స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. ఇంతలో కారును విక్రయించిన వ్యక్తి దానిని కొనుక్కున్న సబ్బెళ్ల మురళీకృష్ణారెడ్డికి ఫోన్చేసి సమాచారం ఇచ్చారు. దీంతో అతడు మరికొందరితో ఈశ్వర్ బృందంపై దౌర్జన్యానికి పాల్పడి కిడ్నాప్కు యత్నించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. పోలీసులు కేసును నీరుగారుస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈశ్వర్ బృందంపై దాడి చేసిన వారు చాలామంది ఉండగా కేవలం ఆరుగురి పైనే కేసు నమోదు చేయడం, పోలీసులు సైతం ముక్తసరి సమాచారం ఇవ్వడంతో వారిపై అధికార పార్టీ నాయకుల ఒత్తిడి ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మాకు న్యాయం చేయండి బతుకుదెరువు కోసం సొంత కార్లను అద్దెకు నడుపుతున్న తమపై ఇలా దౌర్జన్యం చేయడం సరికాదని బాధితులు వాపోతున్నారు. కారును తమకు అప్పగించి, న్యాయం చేయాలని, దౌర్జన్యానికి పాల్పడిన వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఈశ్వర్ బృందం కోరుతోంది. -
మహిళ మెడలో పుస్తెల తాడు అపహరణ
గ్యాస్ స్టౌ మరమ్మతు కోసమని వచ్చి చోరీ కరప: ఇంట్లోని మగవారు బయటకు వెళ్లడాన్ని గమనించిన ఒక దొంగ గ్యాస్ స్టవ్ రిపేర్ కోసమని ఇంట్లోకి వెళ్లి మంచంపై ఉన్న ఒక మహిళ మెడలోని 8 కాసుల పుస్తెలతాడు, నల్లపూసల గొలుసు లాక్కొని పరారైన ఘటన కరపలో చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన ఉప్పలపాటి వెంకటస్వామి, అతని కుమారుడు శ్రీనుతో కలసి కాకినాడకు ఆసుపత్రి పనిమీద వెళ్లారు. ఇదిగమనించిన దొంగలు వారింటికి వెళ్లి ఒకరు బయట ఉండి కాపలా కాయగా మరొకడు ఇంట్లోకి చొరబడ్డాడు. అనారోగ్యంతో మంచంపై పడుకుని ఉన్న వెంకటస్వామి భార్య సత్యవతి అతనిని గమనించి ఎవరని ప్రశ్నించగా వెంకటస్వామిగారు గ్యాస్స్టవ్ రిపేర్ చేయమని పంపారని చెప్పి కొంత సేపు అక్కడ తచ్చాడి అంతలోనే ఆమె మెడలోని బంగారు పుస్తెల తాడు, నల్లపూసల గొలుసు లాక్కొని పరారయ్యాడు. కాకినాడ నుంచి వచ్చిన తండ్రీ, కొడుకులకు సత్యవతి జరిగిన విషయం తెలిపింది. దీంతో బాధితులు పోలీసుస్టేషన్కు వెళ్లి ఫిర్యాదుచేశారు. ఎస్ఐ టి.సునీత సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి జరిగిన దొంగతనం వివరాలు అడిగి తెలుసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. పేలిన ఆర్టీసీ బస్సు టైరు ● మహిళకు తీవ్ర గాయాలు ● ఇద్దరికి స్వల్పగాయాలు ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): రాజమహేంద్రవరం వై జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సు టైరు ఒక్కసారిగా పేలడంతో బస్సులోని ఓ ప్రయాణికురాలికి తీవ్రగాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయలయ్యాయి. రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు బుధవారం ఉదయం కాకినాడ నుంచి రాజమహేంద్రవరం వచ్చింది. స్థానిక వైజంక్షన్కు వచ్చేసరికి బస్సు వెనుక టైరు పేలింది. దీంతో టైరు పైభాగంలో కూర్చున్న పెద్దిళ్లపేటకు చెందిన మంగాలక్ష్మికి ఐరన్రేకు పైకిలేచి ఆమె కాళ్ల వేళ్లకు తగలడంతో పాటు అద్దం చేతిని తీవ్రంగా గాయపరిచింది. అలాగే బస్సు సూపర్వైజర్ విజయలక్ష్మి, ఆనూరు గ్రామానికి వరలక్ష్మికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మంగాలక్ష్మిని అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి సామర్లకోట: స్థానిక పెద్దాపురం ఏడీబీ రోడ్డులో అపర్ణ టైల్స్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న ఒక మహిళ బుధవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఎస్సై వి.మౌనిక కథనం ప్రకారం సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామానికి చెందిన పోతురాజు సుమలత (50) అపర్ణ ప్యాక్టరీలో పని చేస్తూ బుధవారం విధులు ముగించుకుని బంధువు మోటారు సైకిల్పై వెళుతున్న సమయంలో జారి కింద పడిపోయింది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఆమెను ఢీకొని ఆమె పై నుంచి వెళ్లిపోవడంతో శరీరం నుజ్జు నుజ్జు అయింది. లారీ ఆగకుండా వెళ్లి పోవడంతో ఆ ప్రాంత ప్రజలు లారీ నెంబరును గుర్తించి పోలీసులకు తెలిపారు. మృతురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైవే మోబైల్ కానిస్టేబుల్ ఈ ప్రమాదాన్ని గుర్తించి పెద్దాపురం ఎస్సైకు సమాచారం ఇచ్చారు. భార్యను గాయపరచిన కేసులో జైలు ప్రత్తిపాడు: భార్యపై దాడిచేసి గాయపరిచిన భర్తకు ప్రత్తిపాడు జ్యుడీషీయల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి ఎల్ గోపీనాథ్ ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు ఇచ్చారు. సీఐ బి సూర్య అప్పారావు తెలిపిన వివరాల మేరకు మండలంలోని రాచపల్లిలో 2016 మే 22న కోన సూర్యారావు (సూరిబాబు) మద్యం తాగి, తన భార్య రమణమ్మపై కర్రతో దాడి చేశాడు. దీంతో ఆమె తల, నడుముపై తీవ్ర గాయాలయ్యాయి. రమణమ్మ ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై ఎం.నాగదుర్గారావు కేసు నమోదు చేసి, చార్జిషీటు దాఖలు చేశారు. ఎస్సై ఎస్.లక్ష్మీకాంతం సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా, ఏపీపీలు పి.రవీంద్ర మోహన్, కేఎస్ఎస్ లక్ష్మీదేవి ప్రాసిక్యూషన్ నిర్వహించారు. నేరారోపణ రుజువుకావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పునిచ్చినట్టు ప్రత్తిసాడు సీఐ తెలిపారు. -
సెంట్రింగ్ కూలి ఒకరి మృతి
ముగ్గురికి గాయాలు ధవళేశ్వరం: పంప్ హౌస్ రెండో స్లాబ్ వేస్తుండగా సెంట్రింగ్ కూలడంతో ఒకరు మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారు. ఇందులో ఒకరు తీవ్రంగా గాయపడ్డాడు. సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ధవళేశ్వరం సాయిబాబా గుడి పక్కన మురుగునీరు గోదావరిలోకి పంపు చేసేందుకు పంపు హౌస్ను నిర్మిస్తున్నారు. ఇందులో ఇప్పటికే మొదటి శ్లాబ్ పూర్తయ్యింది. రెండో శ్లాబ్కు బుధవారం మధ్యాహ్నం కాంక్రీట్ వేస్తుండగా అది కూలిపోయింది. దీంతో ధవళేశ్వరం సుబ్బాయమ్మపేటకు చెందిన సెంట్రింగ్ మేస్త్రి కేతమళ్ల వెంకటేష్ (50)కు తీవ్ర గాయాలయ్యాయి. వెంకటేష్ను చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వం అసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మరో ముగ్గురు కూలీలు గాయపడ్డారు. వీరిలో సుబ్బాయమ్మపేటకు చెందిన దొడ్డి బాలకిశోర్, వడ్డెర కాలనీకి చెందిన రామాటి రాజు, వల్లెపు సింహాద్రి ఉన్నారు. ఇందులో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని తొలుత రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సీఐ టి.గణేష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన సమయంలో సెంట్రింగ్ కింద తక్కువ మంది కూలీలు ఉండడంతో పెనుప్రమాదం తప్పింది. సుబ్బాయమ్మపేటలో విషాదఛాయలు సంఘటన జరిగిన సమీపంలో మృతుడు కేతమళ్ల వెంకటేష్ నివాసం ఉంటున్నాడు. పనికి వెళ్లిన అతడు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన దొడ్డి బాలకిశోర్ కూడా ఇదే ప్రాంతంలో నివసిస్తున్నాడు. -
జెడ్పీటీసీలకు ప్రొటోకాల్ ఏదీ?
● చంద్రబాబు సర్కార్లో వారికి విలువ శూన్యం ● రహదారులు అధ్వానంగా ఉన్నా చర్యలు లేవు ● వాడీవేడిగా జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): మండలంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి జెడ్పీటీసీలకు ప్రోటోకాల్ పాటించడం లేదని సభ్యులు ఎంపీడీఓల వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. జెడ్పీ సీఈవో వీవీవీఎస్ లక్ష్మణరావు పద్దు ప్రవేశపెట్టారు. జెడ్పీటీసీ సభ్యులను ఆహ్వానించరా? చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మండల స్థాయిలో జరిగే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు స్థానిక ఎంపీడీఓలు జెడ్పీటీసీలను ఆహ్వానించడం లేదని సభ్యులు గన్నవరపు శ్రీనివాసరావు, గొల్లపల్లి రత్నం, ఒమ్మి బిందుమాధవి ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రొటోకాల్ పక్కాగా అమలయ్యేదని, ఇప్పుడు తమను గౌరవించడం లేదని వారు ధ్వజమెత్తారు. దీనిపై అధికారులను నిలదీసినా సరైన సమాధానం రావడం లేదన్నారు. దీనిపై జెడ్పీ చైర్పర్సన్ స్పందిస్తూ ప్రొటోకాల్ పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మెట్ట ప్రాంతంలో మూడు నియోజకవర్గాలు, నాలుగు మండలాల ప్రజలకు ఉపయుక్తంగా ఉన్న సత్యసాయి తాగునీటి పథకాన్ని అధికారులు నిర్లక్ష్యం చేశారని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. జెడ్పీటీసీలు మట్టా శైలజ మాట్లాడుతూ తాము జెడ్పీటీసీలుగా ఎన్నికై నాలుగేళ్లు కావస్తున్నా ప్రజలకు ఏ మేలూ చేయలేకపోయామన్నారు. మంజూరైన అభివృద్ధి పనులకు నిధులు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. 45 కోట్ల వరకు పనులు కేటాయించి, 15 కోట్లు పనులను తొలగించినట్టు ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా లేక ఇబ్బందులు గత ఖరీప్లోను, ప్రస్తుత రబీలోను రైతులకు యూరియా అందక ఇబ్బందులు పడుతున్నారని పలువురు సభ్యులు సమావేశంలో మండిపడ్డారు. పి.గన్నవరంలో రైతులకు యూరియా సక్రమంగా అందడం లేదని స్థానిక నాయకులు కూపన్లు ఇచ్చిన వారికి మాత్రమే పంపిణీ చేస్తున్నారని వాపోయారు. పిఠాపురం మండలంలో యూరియా సక్రమంగా అందడం లేదని జెడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు నిలదీశారు. అన్నదాత సుఖీభవ పథకం కూడా అర్హులైన రైతులందరికీ అందడం లేదని పలువురు సభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పంటనష్టం సంభవిస్తే నెలలోపు రైతు ఖాతాల్లో పరిహారాన్ని జమ చేసేవారన్నారు. గత ఖరీప్లో పంట నష్టం సంభవించినా ఎటువంటి పరిహారం ఇంకా అందలేని జేడ్పీ వైస్ చైర్మన్ మెరుగు పద్మలత వ్యవసాయశాఖ అధికారులను నిలదీశారు. తాము పంట నష్టం వివరాలు ప్రభుత్వానికి పంపామని, ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉందని జేడీఏ ఎన్.విజయ్కుమార్ తెలిపారు. రహదారులు అధ్వానం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలు రహదారులపై ప్రయాణం చాలా కష్టంగా ఉందని, అధికారులు ఎప్పుడు అడిగినా రోడ్డు నిర్మిస్తామని చెప్పడం తప్ప పనులు జరగడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే రహదారుల నిర్మాణం ప్రారంభిస్తామని రోడ్లు భవనాలు శాఖ అధికారులు వివరణ ఇచ్చారు. జెడ్పీ బడ్జెట్ ఆమోదం 2025–26 సంవత్సరానికి రూ.43 లక్షల మిగులుతో రూ.1,019 కోట్ల సవరణ బడ్జెట్ను, 2026–27 సంవత్సరానికి రూ.45 లక్షల మిగులుతో రూ.2712.65 కోట్ల అంచనా బడ్జెట్ను ఉమ్మడి తూర్పు గోదావరి జెడ్పీ సర్వ సభ్య సమావేశం ఆమోదించింది. 2025–26 సవరణ బడ్జెట్లో షెడ్యూల్ కులాల సంక్షేమానికి రూ.249 లక్షలు, షెడ్యూల్ తెగల సంక్షేమానికి రూ.99 లక్షలు, సీ్త్ర శిశు సంక్షేమానికి రూ.249 లక్షలు, తాగు నీటి సరఫరాకు రూ.199 లక్షలు, విద్య, ఆరోగ్యం, వ్యవసాయ, పశు సంవర్ధక, సాంఘిక సంక్షేమానికి రూ.165 లక్షలు, అభివృద్ధికి రూ.381 లక్షల నిధులు కేటాయించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిబాబు, డీఆర్వో వెంకట్రావు, ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ భూపతిరాజు ఈశ్వరరాజు, డీసీఎంఎస్ చైర్మన్ పెచ్చటి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. ప్రొటోకాల్ పాటించడం లేదని మండిపడుతున్న మహిళా జెడ్పీటీసీ సభ్యులు సమావేశానికి హాజరైన జెడ్పీటీసీ సభ్యులుజేడ్పీ సమావేశంలో మాట్లాడుతున్న చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు -
అధినేతతో భేటీ
సాక్షి ప్రతినిధి, కాకినాడ: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ పరిస్థితిని వివరించారు. పార్టీ నియామకాలపై చర్చించారు. నేడు జెడ్పీ బడ్జెట్ సమావేశం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజా పరిషత్ బడ్జెట్ సమావేశం కాకినాడలోని జెడ్పీ కార్యాలయంలో బుధవారం జరుగుతుందని సీఈఓ వీవీవీఎస్ లక్ష్మణరావు తెలిపారు. జెడ్పీ కార్యాలయంలోని తన చాంబర్లో మంగళవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. దీనిలో బడ్జెట్తో పాటు 13 శాఖలపై సభ్యులు సమీక్షిస్తారని తెలిపారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సొంత వనరుల ద్వారా రూ.24 కోట్లతో అంచనా బడ్జెట్ రూపొందించామన్నారు. ప్రభుత్వ నిర్దిష్ట గ్రాంట్ల నుంచి రూ.24.31 కోట్లు వస్తాయని అంచనా వేయగా.. వ్యయాలు అదే స్థాయిలో ఉంటాయని వివరించారు. ఇతర గ్రాంట్ల ద్వారా మరో రూ.27 కోట్లు వచ్చే అవకాశముందన్నారు. ఈ సమావేశానికి సంబంధించి ప్రజాప్రతినిధులకు, వివిధ శాఖల అధికారులకు, జెడ్పీటీసీ సభ్యులకు ఇప్పటికే సమాచారం అందించామని లక్ష్మణరావు చెప్పారు. ఉపాధి చట్టంలో మార్పులు దారుణంబోట్క్లబ్ (కాకినాడ సిటీ): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి, జీరాంజీ పథకాన్ని తీసుకురావడాన్ని నిరసిస్తూ ‘ఇంటింటికీ ఉపాధి’ పేరిట ప్రచారోద్యమం నిర్వహిస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు తెలిపారు. ఈ కార్యక్రమం వాల్పోస్టర్ను స్థానిక సుందరయ్య భవన్లో మంగళవారం ఆయన విడుదల చేశారు. జిల్లావ్యాప్తంగా ఈ నెల 14న భోగి మంటల్లో జీరాంజీ చట్టం కాపీలను దహనం చేశామని తెలిపారు. పనిదినాల పెంపు పేరుతో గతంలో ఉన్న చట్టాన్ని మార్చినట్లు చెబుతున్నారని, దీనికి చట్టాన్ని మార్చాల్సిన అవసరమేమిటని ప్రశ్నించారు. తాము 200 రోజుల పనిదినాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నామని, వాస్తవానికి ఇప్పుడు 50 పనిదినాలు కూడా ఉండటం లేదని అన్నారు. కనీస వేతనం రూ.304 ఇవ్వాలని ఉన్నా ప్రస్తుతం కనీసం రూ.220 కూడా రావడం లేదని చెప్పారు. ఇటువంటి లోపాలను మెరుగు పరచాల్సింది పోయి ఏకంగా చట్టాన్నే రద్దు చేశారని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ చేపడుతున్న ప్రచారోద్యమంలో భాగంగా ప్రతి ఇంటికీ కరపత్రాలు పంచుతామన్నారు. వ్యవసాయ కార్మికులు, పేద రైతులు, చేతివృత్తిదారులు వాస్తవాలను గుర్తించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రసాదరావు కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు కేఎస్ శ్రీనివాస్, ఎం.రాజశేఖర్, టేకుమూడి ఈశ్వరరావు, సి.రమణి తదితరులు పాల్గొన్నారు. -
దర్శకుడు ఈవీవీ తండ్రి వెంకట్రావు మృతి
నిడదవోలు రూరల్: కోరుమామిడి గ్రామానికి చెందిన సినీ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తండ్రి ఈదర వెంకట్రావు (90) ఆయన స్వగృహంలో మంగళవారం కన్నుమూశారు. విషయం తెలియగానే ఈవీవీ కుమారులు, సినీ నటులు ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ స్వగ్రామానికి చేరుకుని తాతయ్య భౌతిక కాయానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యుల సమక్షంలో కోరుమామిడిలో అంత్యక్రియలు నిర్వహించారు. వెంకట్రావుకు ఈవీవీ సత్యనారాయణ, గిరి, శ్రీనివాస్ అనే ముగ్గురు కుమారులు, ముళ్లపూడి మంగాయమ్మ అనే కుమార్తె ఉన్నారు. స్టోరేజ్ టెర్మినల్లో మంటలు కాకినాడ రూరల్: కాకినాడ పోర్టు రోడ్డులోని మహతి స్టోరేజ్ టెర్మినల్ వద్ద మంగళవారం మధ్యాహ్నం బ్రాయిలర్ పైపు నుంచి వచ్చిన మంటలు కలకలం రేపాయి. బ్రాయిలర్ వేడికి పైపు నుంచి మంటలు రావడంలో సిబ్బంది అప్రమత్తమయ్యారు. పక్కనే ఉన్న కోరమాండల్, కాకినాడ శాలిపేటలోని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో తక్షణమే కోరమాండల్కు చెందిన రెండు, శాలిపేట నుంచి అగ్నిమాపక కేంద్రం వాహనం ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. మంటలు తక్కువ స్థాయిలో ఉండడంతో వాటిని అదుపు చేశాయి. సమీపంలో స్టోరేజ్ ట్యాంక్లలో కెమికల్స్తో పాటు సమీపంలో కోరమాండల్ ఎరువుల కర్మాగారం, సీపోర్టు ఉండడంతో మంటలతో భయందోళనలు వ్యక్తమయ్యాయి. ఎటువంటి ప్రమాదం జరగలేదని, కేవలం బ్రాయిలర్ పైపు హీట్ వలన మంటలు రావడంతో అదుపు చేశామని శాలిపేట అగ్నిమాపక అధికారి సుబ్బారావు తెలిపారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.10 వేల ఆస్తి నష్టం వాటిల్లిందన్నారు. చలిమంటలో పడి వ్యక్తికి గాయాలు రాజవొమ్మంగి: మండలంలోని లోతట్టు గ్రామమైన జి.శరభవరంలో బోడోజు మంగారావు (65) సోమవారం అర్ధరాత్రి చలి మంటలో పడి తీవ్ర గాయాల పాలయ్యాడు. అలాగే మంటలు పైకి ఎగసి పడటంతో అతడు నివశించే పూరిపాక కూడా కాలిపోయింది. సర్పంచ్ ఆదిరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మంగారావు తన భార్య ముసలమ్మతో పాటు పూరింట్లో జీవిస్తున్నాడు. చలి ఎక్కువగా ఉండటంతో దంపతులు ఇంటి లోపలే మంట వేసుకున్నారు. అయితే భార్య బయటకు వెళ్లిన సమయంలో మంగారావు చలి మంటలో పడిపోయాడు. అతడు వేసుకున్న చొక్కాకు మంట అంటుకోవడంతో వీపు భాగం కాలిపోయింది. ఇరుగుపొరుగువారు అతడిని వెంటనే 108లో జడ్డంగి పీహెచ్సీకు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కాకినాడ జీజీహెచ్కు వైద్యులు రిఫర్ చేశారు. డాక్టర్ పావని, స్టాఫ్ నర్స్ నాగలక్ష్మి, 108 స్టాఫ్ మరిణిరాజు, చిట్టిబాబు చికిత్స అందజేశారు. -
85 శాతం రికవరీ
అన్నవరం: సత్యదేవుని వ్రత విభాగంలో ఓ పురోహితుడు చేతివాటం చూపి రూ.58.39 లక్షలు స్వాహా చేసిన వ్యవహారంలో అధికారులు తాజాగా మరో రూ.22 లక్షలు రికవరీ చేశారు. ఈ వ్యవహారం గత డిసెంబర్లో వెలుగు చూడగా నిలదీయడంతో అప్పట్లోనే ఆ పురోహితుడు రూ.28.54 లక్షలు చెల్లించాడు. అనంతరం, అతడు హఠాత్తుగా మృతి చెందాడు. ఆ పురోహితుడు 2024 జనవరి నుంచి గత ఏడాది నవంబర్ వరకూ వ్రత పురోహితుల పారితోషికం బిల్లును అధికారుల కన్నుగప్పి.. అధిక మొత్తానికి పెంచేవాడు. అలా పెంచిన మొత్తాన్ని తన, కుటుంబ సభ్యుల, ఇతర పురోహితుల అకౌంట్లకు జమ చేసి, కాజేసిన విషయం అధికారుల తనిఖీల్లో వెల్లడైన విషయం తెలిసిందే. అలా 12 మంది పురోహితులకు అదనంగా రూ.22 లక్షలు జమ అయినట్లు గుర్తించిన దేవస్థానం అధికారులు.. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలంటూ వారికి సోమవారం నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయా పురోహితులు తమ ఖాతాల్లో జమ అయిన అదనపు మొత్తాలను మంగళవారం తిరిగి చెల్లించారు. ఈపీఎఫ్కు చెల్లించాల్సిన మొత్తం రూ.8.82 లక్షలను ఆ పురోహితుడు ఇద్దరికి పంపించినట్లు గుర్తించిన అధికారులు వారికి కూడా నోటీసులిచ్చారు. దీంతో, వారు కూడా ఆ మొత్తాన్ని చెల్లించారు. ఈ క్రమంలోనే నోటీసు అందుకున్న సోలార్ కాంట్రాక్టర్ కూడా రూ.1.42 లక్షలు చెల్లించాడు. పురోహితుని భార్య అకౌంట్కు జమ చేసిన రూ.2.23 లక్షలు, అతడి అత్త అకౌంట్కు జమ చేసిన రూ.10,600 కూడా దేవస్థానానికి జమ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈవిధంగా ఇప్పటి వరకూ రూ.50.54 లక్షలు రికవరీ చేయగలిగారు. మిగిలిన సొమ్ము వసూలుకు ముమ్మర యత్నాలు చేతివాటం ప్రదర్శించిన పురోహితుడు తనకు వాస్తవంగా రావాల్సిన పారితోషికం కన్నా అదనంగా రూ.7.85 లక్షలు తన అకౌంట్కు జమ చేసుకున్నట్లు తాజా తనిఖీలో వెల్లడైంది. ఇప్పుడు ఆ మొత్తం మాత్రమే రికవరీ కావాల్సి ఉంది. ఆ పురోహితుడు మృతి చెందడంతో ఆ మొత్తం తిరిగి చెల్లించాలంటూ అతడి భార్య, ఇతర కుటుంబ సభ్యులకు దేవస్థానం అధికారులు నోటీసు ఇచ్చారు. మృతి చెందిన పురోహితుడికి రూ.3.5 లక్షల వరకూ గ్రాట్యుటీ వచ్చే అవకాశం ఉంది. ఆ మొత్తం రికవరీ చేసుకోవాల్సిందిగా దేవస్థానానికి లేఖ ఇవ్వనున్నట్లు సమాచారం. మిగిలిన మొత్తం చెల్లించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మీద ఆ పురోహితుడు దారి మళ్లించిన రూ.58.39 లక్షల్లో దాదాపుగా 85 శాతం రికవరీ చేశామని, మిగిలిన మొత్తాన్ని కూడా రెండు రోజుల్లో తిరిగి రాబడతామని అధికారులు తెలిపారు. వ్రత పురోహిత సంఘం అధ్యక్షుడు కన్నబాబు, మాజీ అధ్యక్షుడు నాగాభట్ల రవిశర్మ, కర్రి సూర్యనారాయణ తదితరులు ఆ పురోహితులతో మాట్లాడి ఈ చెల్లింపులు చేయించినట్టు అధికారులు తెలిపారు. ఫ ‘చేతివాటం’ సొమ్ము రూ.58.39 లక్షలు ఫ సూత్రధారి చెల్లించిన మొత్తం రూ.28.54 లక్షలు ఫ తాజాగా రూ.22 లక్షలు తిరిగి చెల్లించిన పురోహితులు ఫ రికవరీ కావాల్సినది రూ.7.85 లక్షలు -
రైతులను ముంచేసిన చంద్రబాబు సర్కార్
ఫ ఉచిత పంటల బీమానుఎత్తివేయడం దారుణం ఫ ఎన్నికల సమయంలో అనేక హామీలిచ్చి మోసం ఫ వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బాబీ ఫ సమావేశంలో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి, సూర్యప్రకాశ్ అమలాపురం టౌన్: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతులకు ఉచిత పంటల బీమా అమలు చేశారని, ఈ చంద్రబాబు ప్రభుత్వం ఆ బీమాను ఎత్తివేసి రైతులను మోసం చేసిందని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబీ) ధ్వజమెత్తారు. అమలాపురంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డితో కలిసి ఆయన మంగళవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ అనేక హామీలు ఇచ్చారని, జగన్ ఇస్తున్న ఉచిత పంటల బీమాతో పాటు రైతులకు అన్నీ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని వాగ్దానాలు చేశారన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగాన్ని పూర్తిగా విస్మరించారని విమర్శించారు. జగన్ తన ఐదేళ్ల పాలనలో రూ.7,800 కోట్ల మేర రైతులకు ఉచిత పంటల బీమా ద్వారా వెచ్చించారని గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కారు.. ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తివేయడమే కాకుండా కనీసం దాని గురించి రైతులకు అవగాహన కల్పించడంలో విఫలమైందన్నారు. జగన్ పాలనలో 54 లక్షల మంది రైతులకు బీమా ప్రీమియం చెల్లించారని, అదే కూటమి ప్రభుత్వం బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న 18 లక్షల మంది రైతులకు మాత్రమే ప్రీమియం చెల్లించిందన్నారు. వ్యవసాయంలో 80 శాతం ఉన్న కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ఇప్పటికే రూ.1100 కోట్ల మేర రైతులకు ఇన్ఫుట్ సబ్సిడీ బాకీ పడిన విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబుపై అపనమ్మకం జిల్లా పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం రైతుల విషయంలో మోసపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. జగన్ అమలు చేసిన ఉచిత పంటల బీమాను ఎత్తివేయడమే దీనికి ఉదాహరణగా చెప్పవచ్చన్నారు. రైతుల పంటలకు బీమా కల్పించేందుకు ఈ ప్రభుత్వం టెండర్లు పిలిస్తే ఏ ఒక్క బీమా సంస్థ ముందుకు రాలేదంటే చంద్రబాబు పాలనపై వారికున్న అపనమ్మకమే కారణమని స్పష్టం చేశారు. సమావేశంలో రామచంద్రపురం నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ పిల్లి సూర్య ప్రకాశ్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
మోడిఫైడ్ సైలెన్సర్ల తొలగింపు
కాకినాడ క్రైం: ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా మోడిఫైడ్ సైలెన్సర్లను వినియోగిస్తున్న ద్విచక్ర వాహనచోదకులకు కాకినాడ ట్రాఫి క్–2 పోలీసులు ఝల క్ ఇచ్చారు. ట్రాఫిక్ సీఐ దానేటి రామారావు ఆధ్వర్యంలో వరస డ్రైవ్లు నిర్వహించి, ఆ వాహనచోదకులకు భారీ జరిమానాలు విధిస్తున్నారు. అలాగే మెకానిక్ను ఏర్పాటు చేసి, ఆయా వాహనాల నుంచి సైలెన్సర్లు తొలగిస్తున్నారు. దీనిలో భాగంగా మంగళవారం ఒక్కరోజే ట్రాఫిక్–2 పరిధిలో సీఐ రామారావు ఆధ్వర్యంలోని బృందం 162 సైలెన్సర్లను తొలగించింది. వాహన చోదకుల నుంచి సుమారు రూ.2.5 లక్షల జరిమానా వసూలు చేసింది. నందరాడలో పక్షుల ఆవాసాలపై సర్వే రాజానగరం: మండలంలోని నందరాడ పేరు వినగానే అందరికీ సినిమా షూటింగ్లు గుర్తుకు వస్తాయి. ఈ గ్రామంలో సీతారామయ్య గారి మనుమరాలు, సీతారామరాజు వంటి వివిధ చిత్రాలను చిత్రీకరించారు. పక్కా పల్లెటూరు వాతావరణంతో కూడిన ఈ గ్రామం ప్రస్తుతం వివిధ రకాల పక్షులకు ఆవాసంగా కూడా మారింది. ఈ గ్రామాన్ని జిల్లా అటవీశాఖ గణాంక విభాగానికి చెందిన అధికారులు మంగళవారం సందర్శించారు. నియోజకవర్గంలోనే పెద్ద సాగునీటి చెరువుగా ఉన్న ఏవీ ట్యాంకు పరిసరాలలో పక్షుల ఆవాసాలపై సర్వే నిర్వహించారు. ఈ ట్యాంకు చుట్టూ ఉన్న చెట్లపై 40 రకాల జాతులకు చెందిన సుమారు వెయ్యి పక్షులు ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నాయని గుర్తించారు. వీటిలో రెండు, మూడు రకాల విదేశీ పక్షులు కూడా ఉన్నట్టు నిర్ధారించారు. సర్వేలో అటవీశాఖ సిబ్బందితో పాటు రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీ జియాలజీ విభాగం అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రైలు ఢీకొని వ్యక్తి మృతి తుని: స్థానిక జీఆర్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి చెందాడు. ఎస్సై జి.శ్రీనివాసరావు మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి రైల్వేస్టేషన్ చివరిలో పెద్దపల్లి రైల్వే గేటు మధ్యలో సోమవారం రాత్రి సుమారు 60 నుంచి 65 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి పట్టాలు దాటుతున్నాడు. అతడిని విశాఖపట్నం నుంచి చైన్నె వైపు వెళుతున్న ప్రత్యేక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహం నుజ్జునుజ్జు కావడంతో గుర్తు పెట్టలేని విధంగా ఛిద్రమైంది. మృతుడు ఒంటిపై లుంగీ, జర్కిన్ చిరిగిపోయి ఉన్నాయి. మృతదేహాన్ని తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
కష్టపడి పనిచేసిన వారికి అన్యాయం
ఫ రాష్ట్రంలో ఒక్క జిల్లాకై నా రంగా పేరు పెట్టారా! ఫ విలేకరులతో జనసేన నేత కొండలరావు మామిడికుదురు: కష్టపడి పని చేసిన వారికి అన్యాయం జరుగుతోందని జనసేన నేత, పి.గన్నవరం నియోజకవర్గం కాపునాడు అధ్యక్షుడు కొమ్ముల కొండలరావు ఆవేదన వ్యక్తం చేశారు. పాశర్లపూడిలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పలు విషయాలపై ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా కాపు, ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా ఏ ఒక్కరికి రుణాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో జనసేనకు చెందిన కాపు నేతలపై దాడి చేసి.. బాధితులపైనే జనసేన పార్టీకి చెందిన నేత దగ్గరుండి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించడం దారుణమన్నారు. దీన్ని ఏ ఒక్కరూ పట్టించుకోకపోవడం తీవ్ర మనస్తాపానికి గురి చేసిందన్నారు. రాష్ట్రంలో ఒక్క జిల్లాకై నా కాపు నేత వంగవీటి మోహనరంగా పేరు పెట్టారా అని ప్రశ్నించారు. దీనిపై ఏ ఒక్కరూ మాట్లాడకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు ఖర్చు పెట్టే నిధులను సబ్సిడీ రుణాలకు కేటాయించవచ్చు కదా అని ప్రశ్నించారు. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో కాపులకు, బీసీలకు పదవుల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. బీసీ నియోజకవర్గాల్లో ఎస్సీ, ఓసీలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. -
సంఘాల విచ్ఛినాన్ని ప్రోత్సహించరాదు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): సంఘాల విచ్ఛినాన్ని ఏపీ ఎన్జీఓ సంఘం ప్రోత్సహించరాదని ఏపీ జేఏసీ–అమరావతి జిల్లా చైర్మన్ పితాని త్రినాథరావు, ఏపీ ప్రభుత్వ వాహన డ్రైవర్ల కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంసాని శ్రీనివాసరావు హితవు పలికారు. ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఏపీ ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం పెద్దదని, దీని పటిష్టతకు తమ జేఏసీ కృషి చేస్తుందని చెప్పారు. ఆడిట్ పారదర్శకంగా నిర్వహించాలన్నారు. డ్రైవర్ల సంఘం ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఎన్నికై ందని తెలిపారు. అయితే, కాకినాడలో డ్రైవర్ల సంఘం నూతన కార్యవర్గాన్ని దొడ్డిదారిన ప్రకటించారని, ఇది సరికాదని అన్నారు. సంఘాన్ని విచ్ఛిన్నం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. సమావేశంలో సంఘం సీనియర్ ఉపాధ్యక్షుడు జి.అబ్దుల్ హమీద్ సర్దార్, ఏపీ జేఏసీ–అమరావతి ప్రధాన కార్యదర్శి ఎన్వీఎస్ఎస్ఆర్కే దుర్గాప్రసాద్, ఏపీ గెజిటెడ్ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ రవి, ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.పద్మనాభం, ఏపీ జేఏసీ–అమరావతి జిల్లా కోశాధికారి సీవీవీ సత్యనారాయణ, డ్రైవర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సూరిశెట్టి గణపతి, ఏపీ గవర్నమెంట్ డ్రైవర్ల రిటైర్డ్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఉమ్మడి జిల్లా బాస్కెట్ బాల్ జట్ల ఎంపిక
రామచంద్రపురం: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా త్రీ అండ్ త్రీ సీనియర్ బాస్కెట్బాల్ జట్ల ఎంపికల చాంపియన్షిప్ పోటీలను మంగళవారం కృత్తివెంటి పేర్రాజు పంతులు క్రీడా ప్రాంగణంలో నిర్వహించారు. ఈ పోటీల్లో పురుషుల, మహిళల విభాగాల్లో రామచంద్రపురం జట్లు ఎంపికైనట్లు బాస్కెట్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నమని చక్రవర్తి వెల్లడించారు. కాగా.. ఈ నెల 22, 23 తేదీల్లో కృత్తివెంటి పేర్రాజు పంతులు క్రీడా ప్రాంగణంలో జరిగే రాష్ట్ర స్థాయి ఆంధ్రప్రదేశ్ త్రీ అండ్ త్రీ సీనియర్ బాస్కెట్ బాల్ పోటీల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పురుషుల, మహిళల జట్లు పాల్గొంటాయని చక్రవర్తి తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన జట్లను ఎంపిక చేసి, ఢిల్లీలో జరిగే జాతీయ పోటీలకు పంపిస్తామన్నారు. ఎంపికై న క్రీడాకారులకు మున్సిపల్ చైర్ పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి, మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల రిశ్వంత్రాయ్, డాక్టర్ కోట సతీష్, బాస్కెట్బాల్ అసోసియేషన్ సభ్యులు అభినందనలు తెలిపారు. -
పొంచి ఉన్న మంచు ముప్పు
కాకినాడ క్రైం: కొద్ది రోజులుగా జిల్లాను పొగమంచు కమ్ముకుంటోంది. గడచిన వారం రోజులుగా ఇది మరింత ఉధృతమైంది. ఈ వాతావరణాన్ని ప్రకృతి ప్రేమికులు ఆస్వాదిస్తున్నారు. మరోవైపు దట్టంగా కమ్ముకుంటున్న పొగమంచుతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువయ్యే అవకాశాలున్నందున పోలీస్ శాఖలోని రహదారి భద్రతా విభాగం అప్రమత్తమైంది. గత చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రమాదాల నివారణకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు. పొగమంచులో ప్రయాణాలు సాగించేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. గత ఏడాది ఇదే సీజన్లో పొగమంచు కారణంగా జిల్లావ్యాప్తంగా 32 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. మొత్తం 18 మంది మృత్యువాత పడ్డారు. దట్టమైన పొగమంచు కారణంగా ముందున్న వాహనాలు కనిపించక వాటి పైకి దూసుకెళ్లిన సంఘటనలే ఎక్కువ. హెడ్లైట్లు, ఫాగ్ లైట్లు వేయకుండా వాహనాలపై వేగంగా పయనించడమే ఈ ప్రమాదాలకు కారణమని పోలీసులు గుర్తించారు. దీనికితోడు జిల్లాలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్స్పాట్లు సహా పలు ప్రధాన రహదారుల్లో హైమాస్ట్ లైట్లు లేవు. దీంతో, మంచుతెరలతో రోడ్లపై అలముకుంటున్న చీకట్లు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో తగినన్ని లైట్లు ఏర్పాటు చేయాలని హైవే అథారిటీకి జిల్లా పోలీస్ శాఖ అనేకసార్లు లేఖలు రాసినా స్పందన ఉండటం లేదు. ఈ జాగ్రత్తలు మేలు ఫ దట్టమైన పొగమంచులో రోడ్డు, మలుపులు, ముందు వెళ్తున్న వాహనాలు స్పష్టంగా కనిపించవు. ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అందువలన పొగమంచులో ప్రయాణాలు సాగించే వారు తమ వాహనాలను తక్కువ వేగంలో నడపాలి. ఫ లో బీమ్ హెడ్ లైట్లు, ఫాగ్ లైట్లు తప్పనిసరిగా వినియోగించాలి. ఫ ముందు వెళ్తున్న వాహనానికి సురక్షిత దూరం పాటించాలి. ఫ మంచు కురిసి, తేమగా ఉన్న రోడ్డుపై అకస్మాత్తుగా బ్రేకులు వేయడం వల్ల వాహనం అదుపు తప్పే ప్రమాదంతో పాటు, వెనుక వచ్చే వాహనాలు ఢీకొనే ప్రమాదం ఉంటుంది. ఫ మంచులో లేన్ డిసిప్లేన్ తప్పనిసరిగా పాటించాలి. రోడ్లపై గీతలు, సూచికలను అనుసరిస్తూ నిబంధనల ప్రకారం వాహనం నడపాలి. ఫ పొగమంచులో ఓవర్ టేకింగ్ ప్రమాదాలకు కారణమవుతుంది. మలుపులు, బ్రిడ్జిలు, హైవే ఎంట్రీ పాయింట్ల వద్ద తేలికగా హారన్ కొట్టాలి. ఫ విండ్ షీల్డ్, వైపర్లు, లైట్లు తరచుగా శుభ్రపరుచుకోవాలి. వాటి పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. ఫ పొగమంచు తీవ్రంగా ఉన్నప్పుడు ప్రయాణాలు వాయిదా వేయడం అత్యుత్తమం. ఫ ద్విచక్ర వాహనదారులైతే తప్పనిసరిగా హెల్మెట్లు, రిఫ్లెక్టివ్ జాకెట్లు ధరించే వాహనం నడపాలి. ఫ అలసట, మత్తులో ఉండగా పొగమంచులో వాహనం నడపకూడదు. ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు మానవ తప్పిదాలే. అయితే ప్రకృతి అననుకూలత కూడా పలుమార్లు ప్రమాదాలకు కారణమవుతుంది. పొగమంచు వల్ల చోటు చేసుకునే ప్రమాదాలు ఈ కోవకే వస్తాయి. ఈ ప్రమాదాలను నియంత్రించడం, నివారించడం సాధ్యమే. దట్టమైన పొగమంచులో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. ప్రతి కిలోమీటర్కు ఒకటి చొప్పున బారికేడ్లు ఏర్పాటు చేసి, వాహనాల వేగాన్ని తగ్గిస్తున్నాం. తెల్లవారుజామున 3.30 నుంచి 6.30 గంటల వరకూ చోదకులకు ‘స్టాప్, వాష్ అండ్ గో’ కార్యక్రమం నిర్వహిస్తూ.. పొగమంచులో ప్రయాణించవద్దని సూచిస్తున్నాం. పొగమంచు అధికంగా ఉన్నందున ఉదయం 5 నుంచి 7 గంటల మధ్యలో ప్రయాణాలు చేయకపోవడమే మేలు. – బిందుమాధవ్ గరికపాటి, ఎస్పి, కాకినాడ జిల్లా ఫ ఆ సమయంలో రోడ్డు ప్రమాదాలకు ఆస్కారం ఫ ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం ఫ జాగ్రత్తలు తీసుకోవాలంటున్న పోలీసులు -
ప్రయోగం ఫలించేలా!
భాగాల గుర్తింపుతోనే మార్కులు జంతుశాస్త్ర ప్రయోగ పరీక్షలో నాలుగు ప్రశ్నలుంటాయి. ఒకటో ప్రశ్నలో భాగంగా పటం గీసి భా గాలను గుర్తించాలి. పటం అందంగా ఉండాలి. వీటికి ఆరు మార్కులు. రెండో ప్రశ్న గా ఇచ్చిన ఎక్స్పర్మెంట్కు మూల సూత్రం, పట్టిక, ప్రయోగ విధానం, ఫలితం రాయాలి. సూత్రానికి ఒకటి, ప్రయోగ విధానానికి మూడు, ఫలితానికి ఒకటి కలిపి మొత్తం ఐదు మార్కులు ఉంటాయి. మూడో ప్రశ్నలో ‘ఎ’ నుంచి ‘జి’ వరకు ఉప ప్రశ్నలు ఉంటా యి. అకసేరుకాలు, సక సేరుకాలకు సంబంధించిన స్లైడులు, స్పెసిమన్లను గుర్తించడంలో ఒత్తిడికి లోనుకాకూడదు. ఏడు ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు రెండు మార్కు ల వంతున పద్నాలుగు మార్కులు. 4వ ప్రశ్న రికార్డు. దానికి ఐదు మార్కులు ఇస్తారు. ప్రాక్టికల్స్లో 30 మా ర్కులు తెచ్చుకోవడం కష్టమే కానీ అసాధ్యం కాదు. పరీక్షా సమయంలో ఒత్తిడి లేకుండా సున్నితంగా పరిశీలించాలి. పటాలను బాగా ప్రాక్టీస్ చేయాలి. రికార్డు లో పటాలు, దాని సూచికలు బాగుండాలి. శరీర ధర్మశాస్త్ర ప్రయోగాల్లో తప్పనిసరిగా ఉద్దేశం, సూత్రం, ప్రయోగ విధానం, ఫలితం, మూలసూత్రం ఉండాలి. – పాలిక జగదీశ్వరరావు, జంతుశాస్త్ర అధ్యాపకుడు, ప్రభుత్వ జూనియర్ కళాశాల, సామర్లకోట ఫ ఫిబ్రవరి 1 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ ఫ అదే నెల 10వ తేదీ వరకూ నిర్వహణ ఫ ప్రత్యేక శ్రద్ధ చూపితే మార్కులు సులువే ఫ విద్యార్థులకు అధ్యాపకుల సూచనలు రాయవరం: విద్యార్థి దశలో ఇంటర్మీడియెట్ అత్యంత కీలకమైంది. కోరుకున్న కళాశాలలో, కోర్సులో సీటు దక్కించుకోవాలంటే ఇక్కడ సాధించే మార్కులు ఎంతో ముఖ్యం. ప్రధానంగా సైన్స్ విద్యార్థుల మార్కుల్లో ప్రాక్టికల్స్కు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇంటర్మీడియెట్లో ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు అధిక మార్కుల సాధించాలంటే ప్రయోగ పరీక్షలు కీలకంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రాక్టికల్స్లో అధిక మార్కులు సాధించేందుకు విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. అయితే ఏ చిన్న తప్పిదం చేసినా మార్కులు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. విద్యార్థులు ఆసక్తి చూపితే 30కి 30 మార్కులు సాధించవచ్చని సబ్జెక్టు నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రయోగ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఈ క్రమంలో ప్రాక్టికల్స్లో విద్యార్థులకు ఎదురయ్యే ఇబ్బందులు, వాటిని ఎలా అధిగమించాలో ఆయా సబ్జెక్టుల్లో నిపుణులైన అధ్యాపకులు తెలియజేస్తున్నారు. వీటిని ఆచరిస్తే మంచి స్కోర్ చేయవచ్చు. మంచి మార్కులు సాధించొచ్చు భౌతిక శాస్త్రానికి సంబంధించి మూడు గంటల సమయానికి 30 మార్కులు కేటాయిస్తారు. మొత్తంగా 20 ప్రయోగాల్లో ఆరు విభాగాల నుంచి 38 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి బ్యాచ్కు 12 ప్రశ్నలు వంతున ఇస్తారు. ప్రయోగ సూత్రానికి రెండు మార్కులు, ప్రయోగ విధానానికి మూడు మార్కులు, పట్టికలు, పరిశీలనలు, గ్రాఫ్లకు ఎనిమిది మార్కులు, గణనకు నాలుగు, జాగ్రత్తలకు రెండు, ఫలితం, ప్రమాణాలకు రెండు మార్కులు, రికార్డులకు నాలుగు, వైవాకు ఐదు మొత్తంగా 30 మార్కులుంటాయి. గణన అనే శీర్షిక కింద రఫ్గా చేసినదంతా రాయాలి. దానికి నాలుగు మార్కులు వస్తాయి. అన్ని ప్రయోగాలకు జాగ్రత్తలు తప్పనిసరిగా రాయాలి. అన్ని ప్రయోగ విలువలు ఒకే ప్రమాణ పద్ధతిలో ఉండేలా చూసుకోవాలి. ప్రమాణాలు ప్రతి విలువకు ఉన్నాయో లేదో చూసుకోవాలి. పట్టికల్లో ప్రమాణాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని ప్రశ్నలకు ఒకే శీర్షికలు ఉంటాయి. విద్యుత్తు ప్రయోగాలకు సర్క్యూట్ డయాగ్రామ్ (వలయ చిత్రం) తప్పనిసరిగా వేయాలి. – టేకుమూడి రామ్కుమార్, ఫిజిక్స్ అధ్యాపకుడు, ప్రభుత్వ జూనియర్ కళాశాల, కాజులూరు సూటిగా సమాధానాలు చెప్పాలి వృక్షశాస్త్రం ప్రయోగ పరీక్షకు సంబంధించి 30 మార్కుల ప్రశ్న పత్రంలో ఐదు విభాగాలు ఉంటాయి. ఒకటో ప్రశ్నకు వృక్ష వర్గీకరణ శాస్త్రంలో మూడు కుటుంబాల్లో ఒక కుటుంబం వస్తుంది. వర్ణణను క్రమపద్ధతిలో, ప్రణాళికాబద్ధంగా రాయాలి. అడిగిన చిత్రపటాలు, లక్షణాలు, బాగా సాధన చేసి తప్పులు లేకుండా రాయాలి. ఇచ్చిన మొక్కను బట్టి పుష్పచిత్రం, సమీకరణం, కుటుంబం గుర్తింపు తప్పనిసరి. రెండో ప్రశ్న వృక్ష అంతర్నిర్మాణ శాస్త్రం నుంచి వస్తుంది. ఇచ్చిన మెటీరియల్ బట్టి స్లైడ్ తయారీని చాలా శ్రద్ధగా, శుభ్రంగా చేయాలి. కవర్ స్లిప్ను ఫిక్స్ నీట్గా వేసి, శాఫ్రనీను ఎక్కువ కాకుండా చూడాలి. భాగాలు గుర్తించిన విస్తరించిన భాగం పటం గీసి, గుర్తింపు రాయడం ముఖ్యం. మూడో ప్రశ్న వృక్ష శరీర ధర్మశాస్త్రం (లైవ్ ప్రయోగాలు) లాటరీ పద్ధతిలో విద్యార్థికి వచ్చిన ప్రయోగానికి అనుగుణంగా పరికరాల అమరిక చేయాలి. ఉద్దేశం, సూత్రం, పరిశీలన ఫలితం మాత్రమే రాయాలి. ఇవి చాలా సులభమైన ప్రశ్నలు. నాలుగో ప్రశ్నకు ఐదు మార్కులు పొందవచ్చు. స్పాటర్ లేదా స్లైడ్ను గుర్తించి దాని లక్షణాలు రాయాలి. – కట్టా శ్రీనివాస్, బోటనీ లెక్చరర్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ముమ్మిడివరం ఫలితం తప్పనిసరి రసాయనశాస్త్రం ప్రయోగ పరీక్ష 30 మార్కులకు ఉంటుంది. మూడు గంటల సమయం ఇస్తారు. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. మొదటి విభాగంలో ఇచ్చిన లవణం కరంగు భౌతిక స్థితి, జ్వాలా వర్ణ పరీక్ష, వేడి చేయడం తర్వాత ఆనయాన్, కాటయాన్లను గుర్తించడం, వాటి నిర్ధారణ పరీక్షలు ముఖ్యమైనవి. చివరగా ఫలితం తప్పనిసరిగా రాయాలి. ఈ విభాగానికి పది మార్కులుంటాయి. రెండవ విభాగంలో ఘన పరిమాణాత్మక విశ్లేషణకు 8 మార్కులు. అందులో మొదటి పది నిమిషాల్లో ప్రయోగ విధానం రాయాలి. బ్యూరెట్ రీడింగులు, ఎటువంటి కొట్టివేతలు లేకుండా పట్టికలు రాసి, లెక్కింపు విధానం, ఫలితం రాయాలి. మూడో విభాగంలో ఎ నుంచి డి వరకు ప్రశ్నల్లో ఒకటి మాత్రమే చేయాలి. ఈ విభాగానికి ఆరు మార్కులు. ‘ఎ’లో ఇచ్చిన కర్బన పదార్థం నుంచి ప్రమేయ సమూహాన్ని గుర్తించాలి. ‘బి’లో కొల్లాయిడల్ ద్రావణాలను తయారు చేయడం, ‘సి’లో క్రొమోటోగ్రఫీ, ‘డి’ లో కార్బోహైడ్రేట్స్ చర్యలు, ప్రొటీన్ల చర్యలు ఉంటాయి. – పి.రాజు, కెమిస్ట్రీ లెక్చరర్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, రాయవరం ప్రయోగ పరీక్షల షెడ్యూల్ ఇంటర్ ప్రయోగ పరీక్షలు ఫిబ్రవరి ఒకటి నుంచి పదో తేదీ వరకు.. ప్రతి రోజూ ఉదయం 9 – 12, మధ్యాహ్నం 2 – 5 గంటల మధ్య జరగనున్నాయి. ప్రయోగ పరీక్షల్లో ఎంపీసీ విద్యార్థులకు 60 మార్కులు, బైపీసీ విద్యార్థులకు 120 మార్కులు కేటాయిస్తారు. -
ప్రాధాన్యంలో ఆ రెండూ ఒక్కటే!
కపిలేశ్వరపురం: రెండేళ్ల ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రధానంగా మూడు విభాగాలుగా జరుగుతాయి. మొదటిగా నైతిక, మానవ విలువలు, పర్యావరణ విద్య అనే రెండు పరీక్షలు నిర్వహిస్తారు. రెండో విడతగా విద్యార్థి తీసుకున్న గ్రూపు ఆధారంగా ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. చివరిగా వార్షిక థియరీ రాత పరీక్షతో ఇంటర్మీడియెట్ పరీక్షలు ముగుస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా నైతిక, మానవీయ విలువలు పరీక్షతో బుధవారం మొదటి విడత పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 23న పర్యావరణ విద్య పరీక్ష నిర్వహించనున్నారు. వాటి ప్రాధాన్యంపై ఈ కథనం. పరీక్షలు రాసే మొదటి సంవత్సరం విద్యార్థులిలా.. ఉమ్మడి జిల్లాలో మొత్తం 98,137 మంది ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులున్నారు. వారిలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 57,341 మంది బుధవారం నైతిక, మానవీయ విలువలు పరీక్ష రాయనున్నారు. కోనసీమ జిల్లాలో 123 ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు చెందిన 13,113 మంది ఈ పరీక్ష రాయనున్నారు. కాకినాడ జిల్లాలో 19 వేల మంది, తూర్పు గోదావరి జిల్లాలో 22,500 మంది, పోలవరం జిల్లాలో 2,728 మంది ఈ పరీక్షకు హాజరు కానున్నారు. థియరీకి 60 మార్కులు ఇంటర్మీడియెట్ ఒకేషనల్, జనరల్ విభాగాల్లో ఎవరు ఏ గ్రూపు తీసుకున్నా ప్రథమ సంవత్సరంలోని ప్రతి విద్యార్థీ విధిగా నైతిక, మానవీయ విలువలు, పర్యావరణ విద్య పరీక్షలు రాయాల్సి ఉంది. ఈ పరీక్షలకు గైర్హాజరు అయినా, పరీక్ష తప్పినా ఇంటర్మీడియెట్ సర్టిఫికెట్ జారీ కాదు. ఒక్కో సబ్జెక్టులో 40 మార్కులకు ప్రాజెక్టు, 60 మార్కులకు థియరీ రాత పరీక్ష నిర్వహిస్తున్నారు. 40 మార్కుల ప్రాజెక్టులో భాగంగా రికార్డు రాసి ఇవ్వాల్సి ఉంటుంది. థియరీ 60 మార్కుల కోసం నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఒక్కో సమాధానానికి 15 మార్కులు. అధికారుల పర్యవేక్షణ తూర్పు గోదావరి జిల్లా పరీక్షలను జిల్లా ఇంటర్బోర్డు రీజినల్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ (ఆర్ఐఓ) ఐ.శారద పర్యవేక్షిస్తున్నారు. కోనసీమ జిల్లాలో డీఐఈఓ కె.చంద్రశేఖర్బాబు, కాకినాడ జిల్లాలో ఇన్చార్జి డీఐఈఓ కేశవరావు, పోలవరం జిల్లాలో డీఐఈఓ భీమశంకరరావు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఒకేషనల్, జనరల్ ఇంటర్మీడియెట్ కళాశాలల ప్రిన్సిపాళ్లకు సమావేశాలను ఏర్పాటు చేసి సూచనలు ఇచ్చారు. పరీక్షల నిర్వహణ తీరు ఇలా.. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు జారీ చేసిన రిజిస్టర్ నంబర్లతో మాత్రమే పరీక్ష రాయాలి. గత విద్యా సంవత్సరాల్లో పరీక్షకు గైర్హాజరైన, పరీక్ష తప్పిన బ్యాక్లాగ్ విద్యార్థులు సైతం ప్రస్తుతం ఈ పరీక్షలు రాయొచ్చు. వారికి గతంలో జారీ అయిన రిజిస్టర్ నంబర్లతోనే పరీక్ష రాయాలి. పరీక్ష గదిలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. థియరీ పరీక్షల మాదిరిగానే పరీక్ష కేంద్రాలను పర్యవేక్షణ బృందాలు సందర్శిస్తాయి. ప్రశ్న పత్రాలను ఇంటర్మీడియెట్ బోర్డు నిర్దేశిత వెబ్సైట్లో ఉంచుతారు. పరీక్ష రోజు ఉదయం 8 గంటలకు పరీక్ష కేంద్రం సూపరింటెండెంట్ సెల్ నంబర్కు పాస్వర్డ్ పంపుతారు. అలా నిర్దేశించిన ఐడీ, పాస్వర్డ్ల ద్వారా పరీక్ష కేంద్రంలో పేపర్ను డౌన్లోడ్ చేస్తారు. మరో నిర్దేశిత పాస్వర్డ్లు పొందడం ద్వారా పేపర్ ఓపెన్ అవుతుంది. దానిని ప్రింట్ తీసి విద్యార్థులకు అందజేస్తారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పరీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం డీఐఈఓ కార్యాలయ అధికారులు నియమించిన అధ్యాపకులు పరీక్ష కేంద్రానికి వచ్చి, పేపర్లు దిద్దుతారు. విద్యార్థుల మార్కుల జాబితాను, పరీక్ష సమాధాన పత్రాలను ప్యాక్ చేసి, సీలు వేసి డీఐఈఓ కార్యాలయంలో అందజేస్తారు. ఇంతటి ప్రాధాన్యంగల ఈ పరీక్షకు ప్రతి విద్యార్థీ హాజరయ్యేలా కళాశాల యాజమాన్యం, తల్లిదండ్రులు శ్రద్ధ వహించాల్సి ఉంది. నేడు నైతిక, మానవీయ విలువలు పరీక్ష హాజరు కానున్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు గైర్హాజరైనా, పరీక్ష తప్పినా ఫెయిల్! 23న పర్యావరణ విద్యపై... ఉమ్మడి జిల్లాలో ఏర్పాట్లు పూర్తి -
వ్రత పురోహితులకు రెండు రోజుల్లో పారితోషికం
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో పని చేస్తున్న సుమారు 250 మంది వ్రత పురోహితులకు డిసెంబర్ నెల పారితోషికం (జీతాలు) రెండు రోజుల్లో చెల్లించనున్నామని అన్నవరం దేవస్థానం అధికారులు మంగళవారం తెలిపారు. ప్రతి నెల పదో తేదీలోపు పారితోషికాన్ని వ్రత పురోహితుల అకౌంట్లకు జమ చేసేవారు. అయితే, ఓ వ్రత పురోహితుడు చేతివాటం చూపి, రూ.58.39 లక్షలు కాజేయడంతో దేవస్థానం వ్రత విభాగంలో తనిఖీలు చేపట్టారు. దీంతో, పారితోషికం బిల్లు ఈ నెల ఏడో తేదీన ఆడిట్కు పంపించినా అక్కడి నుంచి ఇంతవరకూ క్లియరెన్స్ రాలేదు. ఫలితంగా ఈ నెలలో 19వ తేదీ వచ్చేసినా వారికి పారితోషికం అందలేదు. దీనికి తోడు పాలకొల్లులో ఇటీవల నిర్వహించిన సామూహిక వ్రతాల్లో భక్తుల నుంచి వ్రత పురోహితులు బలవంతంగా కానుకలు వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వ్రతాలాచరించే భక్తుల నుంచి కానుకల స్వీకరణ విషయంలో కూడా అధికారులు ఆంక్షలు విధించారు. దీంతో, ఆ ఆదాయానికి కూడా గండి పడింది. అటు పారితోషికం అందక, ఇటు కానుకలు స్వీకరించే అవకాశం లేకపోవడంతో వ్రత పురోహితుల కుటుంబాలు తీవ్ర ఇబ్బంది పడుతున్నాయి. దీనిపై ‘సాక్షి’ మంగళవారం ప్రచురించిన ‘ఆకలి కేకలు’ కథనానికి దేవస్థానం వ్రత విభాగ అధికారులు స్పందించారు. ఆడిట్ విభాగం అధికారులతో మాట్లాడారు. దీంతో, వారు పారితోషికం బిల్లును పరిశీలించి, పంపించారు. ఆ బిల్లును ఈఓ వి.త్రినాథరావు బుధవారం పరిశీలించి, ఆమోద ముద్ర వేసి, చెక్కుపై సంతకం చేస్తారని అధికారులు తెలిపారు. ఆ చెక్కును స్టేట్ బ్యాంక్కు పంపిస్తామని, బుధవారం సాయంత్రం లేదా గురువారం ఉదయానికి వ్రత పురోహితులకు పారితోషికం జమవుతుందని చెప్పారు. దేవస్థానం అధికారుల వెల్లడి -
‘దేవ, పితృ కార్యాలను వదిలితే భ్రష్టుడవుతాడు’
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘దేవ కార్యాలు చేయడం ఎంత అవసరమో, పితృకార్యాలు చేయడం కూడా అంతే అవసరం, దేవ పితృ కార్యాలను వదిలితే మానవుడు భ్రష్టుడవుతాడని భీష్ముడు ధర్మరాజుతో చెప్పాడ’ని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. స్థానిక హిందూ సమాజంలో వ్యాస భారతంలోని శాంతి, అనుశాసన పర్వాలను ముగించి, అశ్వమేధిక పర్వాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ముందుగా అనుశాసన పర్వంలోని భీష్మ నిర్యాణాన్ని ఆయన వివరించారు. ‘‘పితృయజ్ఞం కూడా నారాయణాత్మకం. పితృ దేవతలను పిండరూపంలో దర్భలపై ఉంచి అర్చించిన వాడు వరాహ స్వామి. దేవతలను, పితరులను, గురువును, అతిథులను, వేదవేత్తలను, తల్లిని, భూమిని అర్చిస్తే శ్రీహరిని అర్చించినట్టేనని ధర్మరాజుకు భీష్ముడు వివరిస్తాడు. పితృకార్యాలు చేయనిదే దేవతల అనుగ్రహం కూడా కలగదు. ధర్మరాజుకు సమస్త ధర్మాలను వివరించాక, కళేబరాన్ని విడిచిపెట్టడానికి శ్రీకృష్ణుని అనుమతిని భీష్ముడు కోరాడు. ‘నీలో కించిత్తు పాపం లేదు, నీవు వసులోకానికి వెళ్తావ’ని కృష్ణపరమాత్మ అను మతి ఇస్తాడు. పాండు సుతులకు భీష్ముడు తుది సందేశాన్ని ఇస్తూ, ‘సత్యం, ధర్మం, ఆత్మ సంయమనం కలిగి ఉండాలి, ధర్మం మీ స్వభావం కావాల’ని చెబుతాడు. భీష్ముడు శరీరం పరిత్యజించాక, గంగాదేవి వచ్చి శోక వివశురాలవుతుంది. ‘ఈ మహావీరుడు చివరకు ఒక శిఖండి చేతిలో మరణించాడ’ని ఆవేదన వ్యక్తం చేస్తుంది. కృష్ణుడు ఆమెను ఓదారుస్తూ, ‘అర్జునుడి చేతిలోనే భీష్ముడు మరణించాడని, ఆయనకు ఉత్తమ లోకాలు కలుగుతాయి’ అంటూ అనునయిస్తాడు’’ అని సామవేదం వివరించారు. అనంతరం, అశ్వమేధిక పర్వ ప్రవచనాన్ని ప్రారంభించారు. ‘‘భీష్ముడి నిర్యాణంతో ధర్మరాజు తిరిగి శోకానికి లోనవుతాడు. వ్యాసుడు మందలింపు ధోరణిలో ‘నీకు మేము చెప్పిన ధర్మాలన్నీ వ్యర్థ ప్రలాపాలయ్యాయి. నీవు ఏకాగ్రతతో ఆ ధర్మాలను ఆకళింపు చేసుకోలేదనిపిస్తోంది, నీవు ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్న భావనలో ఉంటే అశ్వమేధ యాగం చేయి’ అని వ్యాస కృష్ణులు సూచిస్తారు. ‘ఖజానా ఖాళీ అయింది, ఈ యాగాన్ని ఎలా చేయగలనని ధర్మరాజు సందేహం వ్యక్తం చేస్తాడు. హిమవత్పర్వత ప్రాంతంలో మరుత్తుడు అనే రాజు యజ్ఞంలో ఇచ్చిన ధనాన్ని బ్రాహ్మణులు మోయలేక, అక్కడే వదిలేశారని, ఆ ధనంతో యాగం నిర్వహించాలని వ్యాసుడు సూచిస్తాడు. యుధిష్ఠిరుడు శకకర్త. ఆయన పాలనలో ప్రజలు సుఖశాంతులతో వర్థిల్లార’’ని సామవేదం చెప్పారు. -
ట్రావెల్స్ బస్ ఢీకొని యువకుడి మృతి
ప్రత్తిపాడు: స్థానిక జాతీయ రహదారిపై పోలవరం కాలువ వంతెన సమీపాన ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఢీకొనడంతో యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం సాయంత్రం జరిగింది. స్థానిక పోలీసుల కథనం మేరకు జగ్గంపేట మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన తలారి రవి (26) బైక్పై ప్రత్తిపాడు వచ్చి తిరిగి స్వగ్రామం వెళ్తుండగా పోలవరం కాలువ వంతెన సమీపానికి వచ్చే సరికి తుని నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ వెనుక నుంచి ఢీకొనడంతో తలారి రవి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రత్తిపాడు సీహెచ్సీకి తరలించారు. స్థానిక ఎస్సై ఎస్.లక్ష్మీకాంతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఎన్టీఆర్ జలకిరికిరి
● అటకెక్కిన పథకం! ● ఉచిత బోర్లకు మంగళం! ● ఏడాదిన్నరగా పట్టించుకోని సర్కారు సాక్షి ప్రతినిధి, కాకినాడ: విజయవాడలో రూ.1,750 కోట్లతో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని ఘనంగా చెబుతున్న సర్కారు వారు.. ఆయన పేరిట ఆర్భాటంగా ప్రకటించిన పథకాన్ని మాత్రం అటకెక్కించేశారనే విమర్శలు వస్తున్నాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అంతకు ముందెన్నడూ కనీవినీ ఎరుగని అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే మెట్ట రైతులకు సాగునీటి కడగండ్లను కడతేర్చే లక్ష్యంతో వైఎస్సార్ జలకళ పేరిట బృహత్తర పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ప్రభుత్వమే ఉచితంగా బోర్లు వేసి, ఏడాదికి మూడు పంటలు పండించుకునే అవకాశాన్ని గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కల్పించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అన్ని పథకాల మాదిరిగానే ఈ పథకం పేరును కూడా మార్చేసింది. ‘ఎన్టీఆర్ జలసిరి’గా పేరయితే మార్చారు కానీ, ఈ పథకాన్ని పూర్తిగా నీరుగార్చేశారు. ఏడాదిన్నర పాలనలో ఒక్కటంటే ఒక్క బోరు కూడా వేయకపోవడమే దీనికి నిదర్శనమని రైతులు అంటున్నారు. కనీసం ఈ పథకం కింద ఉచిత బోరు కోసం దరఖాస్తు చేసుకుందామనుకున్నా సంబంధిత వెబ్సైట్ ఇప్పటి వరకూ అందుబాటులోకి రాలేదు. దీని విధివిధానాలను సైతం ప్రభుత్వం ప్రకటించలేదు. దీంతో, ఎన్టీఆర్ పేరిట ఆర్భాటంగా తీసుకొచ్చిన ఈ పథకం మనుగడలో ఉందా, లేదా అనే అనుమానాలను రైతులు వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో 926 బోర్లు చిన్న, సన్నకారు రైతులకు అండగా నిలవాలనే సదుద్దేశంతో నవరత్నాల్లో భాగంగా వైఎస్సార్ జలకళ పథకాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2020 సెప్టెంబర్ 28న ప్రారంభించారు. ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో నీటి ఎద్దడి అధికంగా ఉండే భూముల్లో ఉచితంగా బోర్లు వేసి, రైతుల సాగునీటి కష్టాలు తీర్చారు. తద్వారా వర్షం పడితేనే సాగు చేయలేని రైతులు ఏడాదికి మూడు పంటలు పండించగలిగే అవకాశం కల్పించారు. ఈ పథకం కింద వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో జిల్లావ్యాప్తంగా 3,118 దరఖాస్తులు రాగా.. 1,326 ధ్రువీకరణ పొందాయి. వీటిలో 1,306 దరఖాస్తులకు పరిపాలనా ఆమోదం లభించగా.. అత్యధిక అవసరం ఉన్న రైతులకు జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) ఆధ్వర్యాన సుమారు రూ.15 కోట్లు వెచ్చించి 926 బోర్లు వేశారు. కేవలం భూగర్భ జలాల మీదనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్న వారికి తొలుత ప్రాధాన్యం ఇచ్చి, వెంటనే పనులు పూర్తి చేశారు. వేసిన బోర్లలో విద్యుత్ సొంతంగా వేసుకున్న రైతులకు ప్రత్తిపాడు, కాకినాడ, కత్తిపూడి క్లస్టర్ల పరిధిలో 99 మోటార్లు సైతం ఉచితంగా అందజేశారు. మిగిలిన రైతులకు బోర్లు వేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇలా గత ప్రభుత్వ హయాంలో ఈ పథకం మూడెకరాలు.. ఆరు పంటలుగా సాగింది. పేరు మార్పుతో సరి చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చిన నెల రోజుల తర్వాత వైఎస్సార్ జలకళ పేరును ‘ఎన్టీఆర్ జలసిరి’గా మార్చారు. అక్కడితో సరి. ఏడాదిన్నర అవుతున్నా ఈ పథకం కింద ఏ ఒక్క రైతుకూ ఒక్క బోరు కూడా వేయలేదు. ఖరీఫ్ ముగిసి రబీ సీజన్ ప్రారంభమైన తరుణంలో జిల్లాలోని జగ్గంపేట, ప్రత్తిపాడు, శంఖవరం, రౌతులపూడి, గండేపల్లి, పిఠాపురం, గొల్లప్రోలు, పెద్దాపురం తదితర మండలాల్లో సాగునీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉంది. ఈ సమయంలో ఈ పథకం అమలైతే తమకు ఎంతో ఉపయోగపడేదని రైతులు అంటున్నారు. ఈ పథకం అడ్రస్ లేకుండా పోవడంతో ఈ ప్రాంతాల్లోని వేలాది మంది రైతులకు తీరని నష్టమే జరుగుతోంది. ఇప్పటికై నా ఉచిత బోర్ల పథకాన్ని అమలు చేయాలని రైతులు కోరుతున్నారు. వెంటనే అమలు చేయాలి ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు పాతాళంలోకి తొక్కేస్తున్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాల పేర్లను మార్చడం తప్ప అమలు చేయడం లేదు. ముఖ్యంగా రైతులకు సంబంధించిన పథకాలను అమలు చేయకపోవడంతో వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల హామీలను తుంగలో తొక్కి రైతులకు అన్యాయం చేస్తున్నారు. వెంటనే ఎన్టీఆర్ జలసిరి పథకాన్ని అమలు చేసి, రైతులను ఆదుకోవాలి. – తిరుమలశెట్టి నాగేశ్వరరావు, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు, కాకినాడ మార్గదర్శకాలు రావాలి ఎన్టీఆర్ జలసిరి పథకంపై ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రావాల్సి ఉంది. ఇంతవరకూ దరఖాస్తులు తీసుకునే ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఈ పథకంపైఽ అధికారికంగా ఎటువంటి సమాచారమూ లేదు. ఇంతవరకూ ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే అమలుకు ఏర్పాట్లు చేస్తాం. – అడపా వెంకటలక్ష్మి, ప్రాజెక్ట్ డైరెక్టర్, డ్వామా, కాకినాడ -
ఆలయ పునర్నిర్మాణానికి భారీ విరాళాలు
పి.గన్నవరం: ఎల్.గన్నవరంలో కొలువుదీరిన మహాలక్ష్మి అమ్మ వారి ఆలయ పునర్నిర్మాణానికి సోమవారం పలువురు భక్తులు రూ.12.2 లక్షలు విరాళాలు అందించినట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. గ్రామానికి చెందిన అడబాల వారి కుటుంబ సభ్యులు మొత్తం రూ.8,70,135, అన్నాబత్తుల వీరన్న కుటుంబ సభ్యులు రూ.2,12,121, చిట్టాల వెంకన్న రూ.51,116, మహాదశ భాస్కరరావు రూ.25,116, పలువురు రూ.10 వేల చొప్పున విరాళం అందించారు. విరాళం అందించిన భక్తులను ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు. -
ఎయిర్పోర్టుకు ప్రయాణికుల తాకిడి
ఫ తిరుగు ప్రయాణికులతో సందడి ఫ రోజూ 1400 మంది పయనం ఫ రోజుకు 9 సర్వీసులు ఫ ఈనెల 26 వరకు ఢిల్లీ సర్వీసు రద్దు కోరుకొండ: మధురపూడిలోని రాజమహేంద్రవరం విమానాశ్రయానికి ప్రయాణికుల తాకిడి తగిలింది. సంక్రాంతి సెలవుల నిమిత్తం వచ్చిన ప్రయాణికులు తిరుగు పయనమవుతున్న నేపథ్యంలో ఆదివారం నుంచి సందడి నెలకొంది. విమానశ్రాయానికి డిల్లీ, హైదరాబాద్, చైన్నె, బెంగుళూరుకు డైలీ, ముంబాయ్, తిరుపతికి వీక్లీ సేవలందుతున్నాయి. ఇండిగో విమానయాన సంస్థకు చెందిన 9 సర్వీసులు తిరుగుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా ఈనెల 12వ తేదీ నుంచి ప్రయాణికుల రాక మొదలయింది. కాగా సెలవుల అనంతరం ఆదివారం నుంచి తిరిగి వెనక్కి వెళ్లడంతో విమానాశ్రయంలో రద్దీ ఏర్పడంది. ఈ రాకపోకల సందర్భంగా విమానాశ్రయానికి 1,400 మంది చొప్పున రోజూ ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. దీంతో ఈనెల 12వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వారం రోజులు 9 సర్వీసుల్లో 10 వేల మంది ప్రయాణికులు రాకపోకలు కొనసాగించారు. ఢిల్లీ నుంచి నిర్వహిస్తున్న బోయింగ్ విమాన సర్వీసు సేవలు ఈ నెల 26వ తేదీ వరకు 8 రోజుల పాటు నిలిచిపోతున్నట్టు ఎయిర్పోర్టు డైరెక్టర్ శ్రీకాంత్ తెలిపారు. దీంతో విమాన సర్వీసుల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీనిలో భాగంగానే సోమవారం ఢిల్లీ సర్వీసు రద్దయింది. అలాగే సోమవారం సాయంత్రం 6.55 గంటలకు హైదరాబాద్కు 72 మంది ప్రయాణికుల సామర్థ్యంతో మరో విమాన సర్వీసు ప్రారంభమయిందన్నారు. దీంతో హైదరాబాద్కు రెండు ఎయిర్బస్ సర్వీసులు, మూడు ఏటీఆర్ విమాన సర్వీసులు నడుపుతున్నారు. -
ఆకలి కేకలు
● ఇప్పటి వరకూ అందని గత నెల పారితోషికం ● 250 మంది వ్రత పురోహితులకు ఇబ్బందులు ● ‘చేతివాటం’ వివాదంతో ఎడతెగని జాప్యంఅన్నవరం: ఒక పురోహితుడు చేసిన అవకతవకల పుణ్యమా అని అన్నవరం దేవస్థానంలోని వ్రత పురోహితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది. దేవస్థానం వ్రత విభాగంలో పని చేస్తున్న దాదాపు 250 మంది పురోహితులు పని చేస్తున్నారు. వీరికి పారితోషికంగా వ్రతాల ఆదాయంలో 40 శాతం కమీషన్ చెల్లిస్తారు. ఈవిధంగా ప్రతి నెలా సుమారు రూ.90 లక్షల నుంచి రూ.92 లక్షల వరకూ వారికి చెల్లించాల్సి ఉంటుంది. ఈ పారితోషికం మొత్తం పోనూ మిగిలిన దానిలో 40 శాతం వారి సంక్షేమ నిధికి కేటాయిస్తారు. మిగిలిన మొత్తాన్ని ఏడాది చివరిలో ఎరియర్స్ కింద పంపిణీ చేస్తారు. వ్రత పురోహితులు మొత్తం నాలుగు గ్రేడ్లుగా పని చేస్తున్నారు. వీరిలో మూడో గ్రేడ్ పురోహితులకు రూ.25 వేలు, రెండో గ్రేడ్ వారికి రూ.42 వేలు, మొదటి గ్రేడ్ వారికి రూ.45 వేలు, స్పెషల్ గ్రేడ్ పురోహితుల(సూపర్వైజర్)కు రూ.48 వేల చొప్పున ప్రతి నెలా పదో తేదీలోగా పారితోషికం (జీతం) చెల్లిస్తారు. ఈ నెలలో 19వ తేదీ వచ్చేసినప్పటికీ.. గత నెల పారితోషికం ఇంకా తమ బ్యాంకు ఖాతాల్లో జమ కాకపోవడంతో ఆయా పురోహితుల కుటుంబాలు ఆకలి కేకలు పెడుతున్నాయి. ‘చేతివాటం’పై తనిఖీలతో.. పురోహితుల పారితోషికం బిల్లులు, ఇతర చెల్లింపుల్లో ఓ వ్రత పురోహితుడు రూ.58.39 లక్షల మేర అవకతవకలకు పాల్పడిన విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. అధికారుల పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడంతో అతడు 2024 జనవరి నుంచి గత ఏడాది నవంబర్ వరకూ చేతివాటం చూపి, ఈ మొత్తం స్వాహా చేశాడు. ఆ పురోహితుడిని నమ్మిన వ్రత విభాగం సిబ్బంది అతడు రూపొందించిన బిల్లులను సరిగ్గా పరిశీలించకుండానే సంతకాలు చేశారు. మరోవైపు అతడు కొంత మంది పురోహితుల ఖాతాలకు వారికి రావాల్సిన పారితోషికాల కన్నా అధిక మొత్తం జమ చేశాడు. ఈ విషయాన్ని వారు కూడా అధికారుల దృష్టికి తీసుకురాలేదు. ఈ అవకతవకల నేపథ్యంలో గత పదేళ్లుగా వ్రత విభాగంలో జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఇటీవల అధికారులు లోతుగా తనిఖీలు చేశారు. ఆడిట్కు పంపించినా.. దేవస్థానంలో ప్రతి బిల్లును ప్రీ ఆడిట్ కోసం పంపిస్తారు. దేవస్థానం సిబ్బంది అవకవతకలకు పాల్పడితే ఆడిట్లో ఆ తప్పులు పట్టుకుని సరి చేయాల్సిందిగా వెనక్కి పంపిస్తారు. అయితే, గత రెండేళ్లుగా పురోహితుల పారితోషికం బిల్లును ఆడిట్కు పంపించినా.. చేతివాటం చూపిన పురోహితుడిని నమ్మిన ఆడిట్ అధికారులు ఎటువంటి తనిఖీ చేయకుండానే ‘బిల్ వెరిఫైడ్’ అని సంతకాలు చేసేవారు. ఆడిట్ అధికారి నుంచి ఆ బిల్లు తన వద్దకు రావడంతో ఈఓ కూడా సంబంధిత చెక్కుపై సంతకం చేసేవారు. అయితే, ఈ బిల్లులు రూపొందించిన వ్రత పురోహితుడి చేతివాటం బాగోతం ఇటీవల బయట పడటంతో అధికారులు మేల్కొన్నారు. గత నెలకు సంబంధించిన పురోహితుల పారితోషికం బిల్లును అధికారులు ఈ నెల ఏడో తేదీన రూపొందించి ఆడిట్ విభాగానికి పంపించగా.. ఈ నెల 14న దానిపై కొన్ని కొర్రీలు వేశారు. వాటికి అధికారులు సమాధానం రాసి పంపించారు. తరువాత సంక్రాంతి సెలవులు రావడంతో ఆ బిల్లు ఆడిట్ విభాగంలోనే ఉండిపోయింది. ఇప్పుడు ఆ బిల్లును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని ఆడిట్ అధికారులు చెబుతున్నట్లు సమాచారం. వారు పాస్ చేశాక ఈ బిల్లు ఈఓ వద్దకు వెళ్తుంది. ఆయన ఆ బిల్లు చూసి సంతృప్తి చెందిన తరువాతే సంబంధిత చెక్కుపై సంతకం చేస్తారు. అనంతరం ఆ చెక్కు స్టేట్ బ్యాంక్కు పంపిస్తారు. మూడు, నాలుగు రోజుల్లో పురోహితులకు పారితోషికం జమయ్యేలా చూస్తామని అధికారులు చెబుతున్నారు. బ్యాంక్లో పరిశీలించాకే.. గతంలో దేవస్థానం నుంచి ఏ చెక్కు వచ్చినా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అధికారులు నిమిషాల్లో ఆయా అకౌంట్లలో జమ చేసేవారు. అయితే, పురోహితుని చేతివాటం వ్యవహారంతో వారు కూడా కంగు తిన్నారు. పురోహితుల పారితోషికం బిల్లు ఒరిజనల్ కాపీ పరిశీలించకుండా ఆన్లైన్లో వచ్చిన ఎక్సెల్ షీట్లో ఉన్న వారి ఖాతాలకు నగదు జమ చేశారు. ఒరిజనల్ కాపీలోని పురోహితుల పారితోషికాల మొత్తం రూ.90 లక్షలు వస్తే అవకతకవలకు పాల్పడిన పురోహితుడు రూ.92 లక్షలుగా చూపించేవాడు. ఆన్లైన్ కాపీలో మాత్రం రూ.92 లక్షలకు సరిపడా కిట్టించేవాడు. ఆ మేరకు బ్యాంకు అధికారులు పురోహితులకు నగదు జమ చేసేవారు. అంతా ఆన్లైన్లోనే కనుక ఎవ్వరికీ అనుమానం రాలేదు. ఇలా రెండేళ్లు జరిగింది. గతంలో కూడా ఆన్లైన్లో వచ్చిన అకౌంట్ల ప్రకారమే నగదు జమ చేశామని, ఒరిజనల్ కాపీ ఎప్పుడూ పరిశీలించలేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. తమకు వేల సంఖ్యలో ఉద్యోగులున్న సంస్థల నుంచి కూడా ఆన్లైన్ జాబితాలు వస్తాయని, వాటి ప్రకారం జీతాలు జమ చేస్తామని అంటున్నారు. అయితే, వ్రత పురోహితుడి చేతివాటం బాగోతం బయట పడటంతో పురోహితుల పారితోషికం బిల్లును ఒరిజనల్ జాబితాతో సరిచూశాకే వారి ఖాతాలకు జమ చేస్తామని స్పష్టం చేస్తున్నారు. దీని వలన ఒకటి రెండు రోజుల జాప్యం తప్పదని అంటున్నారు. అన్నవరం దేవస్థానం కానుకల విషయంలో కఠిన వైఖరి ఇదిలా ఉండగా వ్రతాల అనంతరం పురోహితులకు భక్తులు కానుకలు ఇవ్వడం సంప్రదాయంగా ఉంది. గతంలో తోచిన కానుకలు ఇవ్వాలని పురోహితులు కోరేవారు. ఇదే అదనుగా పాలకొల్లులో జరిగిన సామూహిక వ్రతాల్లో కొంతమంది పురోహితులు కానుకల కింద రూ.201, రూ.500 అడగడం వివాదాస్పదమైంది. దీంతో, భక్తులను ఏమీ అడగవద్దని పురోహితులను ఈఓ ఆదేశించారు. దీనివలన కూడా వారికి ఇబ్బందులు మొదలయ్యాయి. మొత్తం 250 మందిలో 25 మంది మినహా మిగిలిన పురోహితులందరూ పారితోషికాలు చాలక భక్తులు ఇచ్చే కానుకలతో జీవనం సాగించేవారే. ఇప్పుడు వారందరూ ఇబ్బంది పడుతున్నారు. -
పదోన్నతి కల్పించాలంటూ ధర్నా
అమలాపురం రూరల్: ప్రభుత్వం సచివాలయ ఏఎన్ఎంలకు పదోన్నతులు కల్పించడంపై కోనసీమ జిల్లా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. స్టాఫ్ నర్సుల పోస్టులను ఏఎన్ఎంలకు కేటాయించడంతో తమకు అన్యాయం జరుగుతుందని వారు వాపోయారు. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల పోరాట కమిటీ జిల్లా అధ్యక్షురాలు ఎం.శివకుమారి మాట్లాడుతూ 115 జీవోకు వ్యతిరేకంగా ప్రభుత్వం సచివాలయం ఏఎన్ఎంలకు పదోన్నతులు కల్పిస్తుందన్నారు. తాము శిక్షణ పొంది 14 ఏళ్లుగా సేవలు అందిస్తున్నామన్నారు. స్టాఫ్ నర్సులు మాట్లాడుతూ తమ సేవలు, అర్హతలను గుర్తించాలని న్యాయమైన నియామక ప్రక్రియ, పదోన్నతులు కల్పించాలన్నారు. ఉపాధ్యక్షురాలు అమృతవల్లి, స్టాఫ్ నర్సులు క్రిటికల్ పరిస్థితుల్లో పని చేస్తున్నారన్నారు. వైద్యులు లేకుండా భద్రతా సిబ్బంది లేకుండా, తగిన సౌకర్యాలు లేకుండా, సేవలు చేస్తున్నామన్నారు. అనంతరం కలెక్టర్కు వినితిపత్రం అందించారు. జిల్లా నాయకులు ఎం. ప్రశాంతి, జి.దుర్గమ్మ, పి.సుశీల, ఎం.కల్యాణి కలెక్టర్కు వినతిపత్రం అందించారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 27,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 23,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)16,000 – 17,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
ఎటు చూసినా ఇసుకే..
● రోడ్లపై ఇసుక తొలగించాలి రోడ్లపై ఎక్కడపడితే అక్కడ ఇసుక చెల్లాచెదురుగా పడి ఉంటుంది. దీంతో ద్విచక్ర, త్రిచక్ర వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లారీలు అధిక ఇసుకలోడుతో వెళ్లడంతో పాటు, షడన్ బ్రేక్ వేసిన సమయంలో ఇసుక రోడ్డుపై పడుతుంది. దీంతో రోడ్డుపై పడిన ఇసుక వాహనాల రాపిడికి ఎగిరి వాహనదారుల కళ్లల్లోనూ, రోడ్ల పక్కకు చేరి ప్రమాదాలకు కారణమవుతోంది. రోడ్ల పక్కన గుట్టల మాదిరిగా పేరుకుపోతోంది. రోడ్లపై పడిన ఇసుకను అధికారులు తొలగించేలా చూడాలి. – కంఠమణి రమేష్ బాబు, వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు, కొవ్వూరు ● నిర్వాహకులదే బాధ్యత రోడ్లపై పడిన ఇసుక తొలగించే బాధ్యత సంబంధిత నిర్వాహకులదే. స్టాక్ పాయింట్లు పెట్టిన వారిని ఇసుక తొలగించాలని గతంలో ఆదేశాలు కూడా ఇచ్చాం. ర్యాంపుల నుంచి ఇసుకతో వెళ్లే లారీలు టార్పాలిన్లు తప్పనిసరిగా కప్పాలి. అదే విధంగా ఇసుక రోడ్లపై పడకుండా చర్యలు తీసుకోవాలి. అధిక లోడుతో వెళితే రూ.25 వేలు వరకు ఫైన్ వేయడం జరుగుతుంది. ఇసుక లారీలు నడిపే వారు, ర్యాంపు నిర్వాహకులు ఇసుక రోడ్లపై పడకుండా చర్యలు తీసుకోవాలి. లేకుంటే చర్యలు తప్పవు. వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా చూడాలి. – రాణి సుస్మిత, ఆర్డీవో, కొవ్వూరు ఫ ప్రయాణమంటేనే హడల్ ఫ అధికలోడు కారణంగా రోడ్లపై జారిపడుతున్న ఇసుక ఫ యథేచ్ఛగా ఇసుక లారీల రాకపోకలు ఫ ప్రమాదాలతో భయపడుతున్న ప్రజలు ఫ అధికారుల తీరుపై విమర్శలు తాళ్లపూడి: కూటమి ప్రభుత్వంలో ఇసుక ర్యాంపుల్లో ఓ పక్క అక్రమ ఇసుక తవ్వకాలతో ఇసుక మాఫియా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. అక్రమ ఇసుక తవ్వకాలతో పాటు, ఇసుక లారీలతో ట్రాఫిక్ సమస్య, మరోపక్క రోడ్లపై ఎక్కడపడితే అక్కడ జారిపడిన ఇసుకతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. కొవ్వూరు నియోజకవర్గంలో ఇసుక ర్యాంపుల్లో ఉచిత ఇసుక మాటున అక్రమ ఇసుక వ్యాపారం జోరుగా సాగుతుంది. ఇక్కడి నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలకు పెద్ద ఎత్తున పెద్ద లారీల్లో నిత్యం ఇసుక తరలిస్తున్నారు. ఇసుక లారీల కారణంగా రోడ్లపై ప్రయాణం చేయాలంటేనే వాహనదారులు భయపడిపోతున్నారు. పరిమితికి మించి అధిక ఇసుక లోడుతో వెళుతున్న లారీల నుంచి ఇసుక జారిపడుతుంది. ఏటిగట్టు రోడ్డు మలుపుల వద్ద, రోడ్ల పైనా, రోడ్ల పక్కనా ఎక్కడ చూసిన ఇసుక మేటల మాదిరిగా దర్శనమిస్తుంది. దీంతో రహదారిపై వెళ్లే వాహనదారులు జారిపడి ప్రమాదాల బారినపడుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే రోడ్లపై పరిమితికి మించి వేగంగా వెళ్లే ఇసుక లారీలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొవ్వూరు నుంచి ప్రక్కిలంక వరకు గోదావరి ఏటిగట్టు రోడ్డు పై నుంచి నిత్యం అధిక సంఖ్యలో వెళుతున్న ఇసుక లారీలు, ట్రాక్టర్ల నుంచి కిందికి జారిపోయిన ఇసుక ఆర్అండ్బీ రోడ్డుపై పేరుకుపోయి స్పీడ్గా వెళ్లే వాహనాలు అదుపు తప్పుతున్న పరిస్థితి నెలకొంది. నిబంధనల మేరకు ఇసుక లోడ్తో వెళ్లే వాహనాలపై టార్పాలిన్ కప్పాలి. చాలాసార్లు ఏ విధమైన టార్పాలిన్ లేకుండా ఇసుక రవాణా జరుగుతోంది. అధిక లోడ్ కారణంగా కప్పినా కూడా లారీ బ్రేక్ వేస్తే ఇసుక జారిపడుతుంది. నియోజకవర్గంలోని ర్యాంపులు కొవ్వూరు మండలంలో కొవ్వూరు, ఆరికిరేవుల, గామన్ బ్రిడ్జి సమీపంలోని ఆరికిరేవుల1, 2, దొండకుంట, వాడపల్లి, రోడ్కం రైల్వే బ్రిడ్జి వద్ద, తాళ్లపూడి మండలంలో తాళ్లపూడి, ప్రక్కిలంక, వేగేశ్వరపురం, తాడిపూడిలో ర్యాంపులు నడుస్తున్నాయి. వాహనదారుల అవస్థలు కొవ్వూరు మండలంలోని ఇసుక ర్యాంపుల నుంచి, తాళ్లపూడి మండలంలోని ఇసుక ర్యాంపుల నుంచి ఇసుక రవాణా చేసే సమయంలో ఏటిగట్టు రోడ్డుపై ఇసుక జారి పడడంతో వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కొవ్వూరులోని గోదావరిమాత విగ్రహం వద్ద రోడ్డుపై అయితే ఇసుక మేటలా పేరుకుపోయింది. ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల ఆటో సైతం తిరగబడింది. అంతేకాకుండా కొవ్వూరు, ఆరికిరేవుల ర్యాంపు వద్ద ఏటిగట్టుపైనా, చిడిపి నుంచి తాళ్లపూడి టి–గట్టు మలుపు వద్ద, తాళ్లపూడి నుంచి ప్రక్కిలంక చింతచెట్టు వద్ద ఏటిగట్టుపై, ప్రక్కిలంక ఆంజనేయ స్వామి ఆలయం జంక్షన్లో ఇసుక పడి ఉంది. అంతే కాకుండా పలు చోట్ల ఇసుకపడి ఉంది. పరిమితికి మించి లోడు వేయడంతో రోడ్లన్నీ ఇసుక మేటలతో దర్శనమిస్తున్నాయి. వాహనాలు వెళ్లేటప్పుడు దుమ్ము కూడా లేచిపోతుంది. ఉమ్మడి గోదావరి జిల్లాలో దాదాపు అన్ని ప్రాంతాలకు ఇక్కడి నుంచే ఎక్కువగా ఇసుక ఎగుమతి అవుతుంది. దీంతో ప్రయాణం నరకప్రాయంగా మారుతుంది. పరిమితికి మించి లోడు వేసినా, రాత్రీపగలు తేడా లేకుండా ఇసుక అతి వేగంతో లారీలు నడుతున్నా సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇసుక లారీల కారణంగా నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్లపై పడి ఉన్న ఇసుకను తొలగించే నాథుడే లేడు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఇసుక తొలగించే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
కేసీఎం చొరవతో స్వదేశానికి వచ్చాను
అమలాపురం రూరల్: ఉపాధి నిమిత్తం ఖతార్కు వెళ్లి ఇటీవల ఇబ్బంది పడి కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ (కేసీఎం) చొరవతో స్వదేశానికి క్షేమంగా చేరుకున్న ఉప్పలగుప్తం మండలం ఎన్.కొత్తపల్లి చెందిన పి.వెంకటలక్ష్మి జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ను కలసి సోమవారం కృతజ్ఞతలు తెలిపారు. ఖతార్లో ఎదుర్కొన్న ఇబ్బందుల పూర్వాపరాలను ఆమెను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. ఆమె తన బాధ చెప్పుకుంటూ అక్కడ ఎంత బాధ పడిందో వివరించింది. ఖతార్లో తన సోదరి ద్వారా కేసీఎం గురించి తెలుసుకుని తన సోదరుడు కోనసీమ వలసదారుల కేంద్రానికి పంపించి సంప్రదించగా కేసీఎం బృందం సమస్యను తెలుసుకుని భారత రాయబార సంస్థతో సంప్రదింపులు జరిపి క్షేమంగా స్వదేశానికి తీసుకువచ్చారని చెప్పారు. జిల్లా కలెక్టర్ ఈ కేసీఎం ఏర్పాటు చేయడం మాలాంటి ఇతర దేశాల్లో ఇబ్బందులు పడుతున్నటు వంటి అనేక మందికి శ్రీరామరక్షగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో మేనేజర్ గోళ్ళ రమేష్, కె.సత్తిబాబు, సఫియా, దుర్గ పాల్గొన్నారు. -
జాతీయ పురస్కారానికి ఎంపిక
వీఆర్పురం: అంతర్జాతీయ సాహిత్య సేవా సంస్థ శ్రీశ్రీ కళావేదిక మన్యం కవి నూనే రమేష్ను జాతీయ ప్రతిభా పురస్కారానికి ఎంపిక చేసినట్లు తెలిపారు. పోలవరం జిల్లా వంటి ఏజెన్సీలో పుట్టి తెలుగు భాష సంస్కృతి, వైభవం, సాహిత్యం తెలుగు కళల పరిరక్షణ కోసం నిరంతరాయంగా సాహితీ సాంస్కృతిక సామాజికసేవలతో సాహితీ ప్రభంజనం సృష్టిస్తున్న మన్యం కవి నూనె రమేష్ను అంతర్జాతీయ సాహిత్య సేవా సంస్థ శ్రీశ్రీ కళావేదిక తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్, గోదావరి సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్యర్యంలో ప్రాచీన కవుల వారసులతో నిర్వహించే సాహితీ సాంస్కృతిక పట్టాభిషేక మహోత్సవ పురస్కారం ప్రదానం చేస్తారని తెలిపారు. రమేష్ చేస్తున్న అమూల్యమైన కృషికి గౌరవార్థం జాతీయ ప్రతిభా పురస్కారానికి ఎంపిక చేశామని తెలియజేశారు. జనవరి 21న బుధవారం నాడు విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆడిటోరియంలో ఈ పురస్కారన్ని అందిస్తారు. శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ కత్తిమండ ప్రతాప్ తదితరులు తెలిపారు. -
‘డబ్బు వసూళ్లపై విచారణ చేయాలి’
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): సంక్రాంతి కోటి పందేల బరుల వద్ద, గుండాట నిర్వహించిన వారి నుంచి డబ్బులు తీసుకున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని, దీనిపై పూర్తి స్థాయి విచారణ చేయాలని కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చెందిన పలువురు జర్నలిస్టులు కలెక్టరేట్లో సోమవారం జరిగిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఇన్చార్జి కలెక్టర్ అపూర్వ భరత్కు ఫిర్యాదు చేశారు. సంక్రాంతి సందర్భంగా వృత్తి రీత్యా బరుల వద్దకు వెళ్లి ఫొటోలు తీస్తూండగా కొందరు కోడిపందేల నిర్వాహకులు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఆయన అనుచరుడు శ్రీనివాస్కు డబ్బులు ఇచ్చినట్లు తమ చెప్పారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ చేయాలని కోరారు. వృత్తి రీత్యా కోడిపందేల బరులు, గుండాట నిర్వహిస్తున్న సమయంలో ఫొటోలు తీస్తున్న తమను అడ్డుకున్న వ్యక్తులపై కూడా చర్యలు తీసుకోవాలని సీనియర్ జర్నలిస్టు మోహనరావు ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై ఆయనతో పాటు పలువురు సీనియర్ జర్నలిస్టులు కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలు జగ్గంపేట: పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లిలో వైఎస్సార్ సీపీ దళిత కార్యకర్త సాల్మన్ దారుణ హత్య రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలకు నిదర్శనంగా నిలుస్తోందని వైఎస్సార్ సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాన్వెస్లీ మండిపడ్డారు. జగ్గంపేటలోని తన నివాసంలో సోమవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఇన్ని హత్యలు జరుగుతున్నా ప్రజలను రక్షించాల్సిన పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఊరు విడిచి ఎక్కడో ఉంటూ తన భార్యను చూసేందుకు వచ్చిన మంద సాల్మన్ను ఐరన్ రాడ్లతో దారుణంగా కొట్టి హతమార్చారని, దీని వెనుక కూటమి నేతల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచీ దళితులకు రక్షణ లేకుండా పోయిందని, వైఎస్సార్ సీపీకి చెందిన దళిత నేతలు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని అన్నారు. సాల్మన్ హత్యపై వేగంగా దర్యాప్తు చేసి, దీనికి కారకులైన వారిని తక్షణం అరెస్ట్ చేసి వారికి శిక్ష పడేలా చేయాలని జాన్వెస్లీ డిమాండ్ చేశారు. సమావేశంలో క్రిస్టియన్ నేతలు గుడాల శాంతిప్రసాద్, రాజారత్నం, నొక్కు విజయరాజు తదితరులు పాల్గొన్నారు. రేపు జెడ్పీ సమావేశం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం (బడ్జెట్), స్టాండింగ్ కమిటీ సమావేశాలు బుధవారం నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జెడ్పీ సమావేశ మందిరంలో చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరుగుతుందన్నారు. అనంతరం స్థాయి సంఘ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. పీజీఆర్ఎస్కు 268 అర్జీలు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు 268 అర్జీలు సమర్పించారు. వారి నుంచి ఇన్చార్జి కలెక్టర్ అపూర్వ భరత్, వివిధ శాఖల అధికారులు అర్జీలు స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను గడువులోగా పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఇన్చార్జి కలెక్టర్ ఆదేశించారు. ఫిబ్రవరిలో రాష్ట్ర స్థాయి బాడీబిల్డింగ్ పోటీలు నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): రాష్ట్ర స్థాయి బాడీబిల్డింగ్ పోటీలు ఫిబ్రవరి 22న కాకినాడలో నిర్వహించనున్నట్లు ఏపీ బాడీబిల్డింగ్ అసోసియేషన్ కార్యదర్శి ఖాసిం తెలిపారు. స్థానిక ఆనంద భారతి గ్రౌండ్స్లో న్యూ ఆంధ్రా బాడిబిల్డింగ్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం సోమవారం నిర్వహించారు. అసోసియేషన్ చైర్మన్, మాజీ ఒలింపిక్ సంఘ కార్యదర్శి కె.పద్మనాభం తదితరులు రాష్ట్ర స్థాయి పోటీల బ్రోచర్ను ఆవిష్కరించారు. ఖాసిం మాట్లాడుతూ, ఇక నుంచి ప్రతి నెలా ఒక్కో జిల్లాలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడానికి కార్యవర్గం నిర్ణయించిందన్నారు. పద్మనాభాన్ని ఈ సందర్భంగా సత్కరించారు. -
మౌలిక సదుపాయాలు కల్పించాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయల కల్పనకు చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై విద్యా శాఖ, వివిధ సంక్షేమ అధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో కలెక్టరేట్లో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. అన్ని హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు సక్రమంగా నిర్వహించేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. విద్యార్థులకు అవసరమైన రక్షిత మంచినీరు అందుబాటులో ఉంచాలన్నారు. వసతి గృహాల్లో అందుబాటులో ఉన్న వనరులను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు వేడి నీరు అందించాలన్నారు. వార్షిక పరీక్షలకు విద్యార్థులను ఇప్పటి నుంచే ప్రణాళిక ప్రకారం సన్నద్ధం చేయాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలు, మరమ్మతులు, ప్రహరీల నిర్మాణం వంటి అంశాలపై ఈ నెలాఖరుకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో డీఈఓ పి.రమేష్, ఇన్చార్జి బీసీ సంక్షేమ అధికారి జి.శ్రీనివాసరావు, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఈఈ వెంకటపతిరాజు పాల్గొన్నారు. కనకదుర్గమ్మకు బంగారు హారంపి.గన్నవరం: మండలంలోని మొండెపులంక గ్రామంలో కొలువు దీరిన విజయ కనకదుర్గమ్మ వారికి భీమవరానికి చెందిన అయినపర్తి దుర్గాభవాని, ఆమె కుటుంబ సభ్యులు సోమవారం రూ.7 లక్షల విలువైన బంగారు హారం సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారికి హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో కోరుమిల్లి శ్రీను, పార్వతి, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
చెట్టు నుంచి జారిపడి గీత కార్మికుడి మృతి
రాజవొమ్మంగి: మండలంలోని ముర్లవానిపాలెం గ్రామానికి చెందిన సోముల సోమరాజు (45) కల్లు గీత కార్మికుడు తాటి చెట్టు నుంచి జారిపడి తీవ్రగాయాలతో మరణించారు. సోమరాజు ఆదివారం సాయంకాలం రోజు మాదిరిగానే కల్లు సేకరించేందుకు చెట్టు ఎక్కాడు. పట్టుతప్పి కింద పడిపోయిన సోమరాజును గ్రామస్తులు వెంటనే అంబులెన్స్లో రాజవొమ్మంగి పీహెచ్సీకు తరలించారు. కాగా అప్పటికే సోమరాజు మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. మృతుడికి భార్య, ఇద్దరు సంతానం వున్నారు. ఆ నిరుపేద గిరిజన కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరారు. లారీ ఢీకొని ఫార్మా ఉద్యోగి మృతి అన్నవరం: స్థానిక జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం బైక్ మీద ప్రయాణిస్తున్న వ్యక్తిని లారీ ఢీ కొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రత్తిపాడు సీఐ బి.సూర్య అప్పారావు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడలోని జగన్నాథపురానికి చెందిన గుడివాడ కిరణ్ (40) అనకాపల్లిలోని అగనంపూడి వద్ద ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. అతడు సోమవారం సాయంత్రం కాకినాడ నుంచి అనకాపల్లి బైక్ మీద వెడుతుండగా అన్నవరం వచ్చే సరికి డిగ్రీ కళాశాల వద్ద వెనుక నుంచి లారీ బలంగా ఢీ కొట్టడంతో అతను రోడ్డు మీద పడి తలకు బలమైన దెబ్బ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతని మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం ప్రత్తిపాడు సీహెచ్సీకి తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆటో ఢీకొని హోంగార్డు మృతి రాజానగరం: మండలంలోని రామస్వామిపేట వద్ద ఏడీబీ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో హోంగార్డు మృతి చెందాడు. సోమవారం స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తొండంగి మండలం, శృంగవృక్షానికి చెందిన మనం వీరబాబు (47) రంగంపేట పోలీసుస్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి అనపర్తి పోలీసు సర్కిల్ కార్యాలయానికి తపాల్స్ తీసుకువెళ్లి సుమారు 12.30 గంటల సమయంలో తిరిగి వస్తుండగా రామస్వామిపేట వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆటో ఢీ కొనడంతో ప్రమాదానికి గురయ్యాడు. తలకు రోడ్డు మార్జిన్ తగిలి బలమైన గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ మేరకు మృతుని భార్య రామలక్ష్మీదేవి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ వీరయ్యగౌడ్ తెలిపారు. మృతుడికి భార్య, కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పొదల్లో నవజాత శిశువు చింతూరు: మండలంలోని కల్లేరు పంచాయతీ మదుగురు గ్రామం శివారు పొదల్లో ఓ నవజాత శిశువును గుర్తించారు. ఐసీడీఎస్ సీడీపీఓ విజయలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం ఐదు గంటల సమయంలో పొదల్లో నుంచి పసికందు ఏడుపులు వినిపిస్తుండటంతో పొలం నుంచి వస్తున్న పొడియం గంగయ్య, కన్నమ్మ అటుగా వెళ్లి చూసి పసిపాపను గుర్తించారు. పసికందును వారు ఇంటికి తీసుకొచ్చి సమాచారాన్ని ఎంఎల్హెచ్ పీఎస్కు తెలిపారు. పొదల్లో ఉన్న నవజాత శిశువు విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయటంతో సీఐ గోపాలకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. శిశువును వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. -
సార్లంక బాధితులను వెంటనే ఆదుకోవాలి
● 3 సెంట్ల స్థలంలో పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలి ● పూర్తి స్థాయి ఆర్థిక సహకారం అందించాలి ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా డిమాండ్ ● అగ్నిప్రమాద బాధితులకు పరామర్శ రౌతులపూడి: మండలంలోని రాఘవపట్నం శివారు సార్లంక గిరిజన గ్రామంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలని మజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబుతో కలసి ఆయన సార్లంక గ్రామంలో ఆదివారం పర్యటించారు. నిలువ నీడ కోల్పోయి.. తీవ్రమైన చలిలో గజగజా వణికిపోతూ జీవనం సాగి స్తున్న బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఇంటింటికీ తిరిగి ప్రమాదానికి గల కారణాలను, వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ, మారుమూల కుగ్రామంలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. స ర్వం కోల్పోయి, వారం రోజులుగా చెట్లు, టార్పాలిన్ల కింద తల దాచుకుంటున్న బాధిత కుటుంబాలకు ప్రభుత్వం కేవలం రూ.25 వేలు ఇచ్చి చేతులు దులు పుకొందని విమర్శించారు. వెంటనే గ్రామానికి ఆనుకు ని ఎకరం భూమి కొనుగోలు చేసి, ఒక్కో బాధిత కుటుంబానికి 3 సెంట్ల స్థలం ఇచ్చి, పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితులు తేరుకునేంత వరకూ వారి జీవన భృతికి పూర్తి ఆర్థిక సహకారం అందించాలని సూచించారు. ఈ ప్రాంతంలో వేల కోట్ల రూపాయల విలువైన ఖనిజ నిక్షేపాలను మైనింగ్ చేసి, తరలిస్తున్న కంపెనీల సహకారం తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలూ కల్పించాలని డిమాండ్ చేశారు. అన్ని సర్టిఫికెట్లూ తిరిగి అందజేయాలి అగ్ని ప్రమాదంలో గ్రామస్తులకు చెందిన ఆధార్, రేషన్ కార్డులు, కుల, ఆదాయ తదితర ధ్రువీకరణ పత్రాలు, ఆస్తి పత్రాలు, విద్యార్థుల సర్టిఫికెట్లు కాలి బూడిదయ్యాయని రాజా చెప్పారు. వారందరికీ ఆయా సర్టిఫికెట్లు, ఇతర పత్రాలను తిరిగి ప్రభుత్వం అందించాలని, దీనికోసం ప్రత్యేకంగా నోడల్ అధికారిని నియమించాలని డిమాండ్ చేశారు. బాధితులకు భరోసా అగ్నిప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన అందరికీ వైఎస్సా ర్ సీపీ అండగా ఉంటుందని, పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని దాడిశెట్టి రాజా, ముద్రగడ గిరిబా బు భరోసా ఇచ్చారు. 34 బాధిత కుటుంబాలకు రా జా రూ.10 వేల చొప్పున నగదు సాయం అందించా రు. అలాగే, ఎంఎంఆర్ ట్రస్ట్ అధినేత, వైఎస్సార్ సీపీ నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు రూ.5 వేల చొప్పున నగదు, దుస్తులు అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి జమీలు, అంగన్వాడీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అంగూరి లక్ష్మీ శివకుమారి, రౌతులపూడి, తుని, ప్రత్తిపాడు జెడ్పీటీసీ సభ్యులు గొల్లు చినదివాణం, పోతల రమణ, బెహరా రాజేశ్వరి, పార్టీ తొండంగి మండల కన్వీనర్ బత్తుల వీరబాబు, వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి అడపా సోమేష్, సీనియర్ నాయకులు వాసిరెడ్డి భాస్కరబాబు, నాగం దొరబాబు, దళే చిట్టిబాబు, బదిరెడ్డి గోవిందు, గొల్లపల్లి కాశీ విశ్వనాథ్, గౌతు స్వామి, ఎస్టీ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు చెన్నాడ సత్తిబాబు, రాష్ట్ర కార్యదర్శి, చెన్నాడ భీమరాజు, జల్దాం సర్పంచ్ యాదాల లక్షి తదితరులు పాల్గొన్నారు. -
వనదుర్గ అమ్మవారికి ప్రత్యంగిర హోమం
అన్నవరం: రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి పుష్య అమావాస్య సందర్భంగా ఆదివారం ప్రత్యంగిర హోమం నిర్వహించారు. ఉదయం 9 గంటలకు పండితులు ఆలయం ప్రత్యేక పూజలు చేసిన అనంతరం హోమం ప్రారంభించి, ఘనంగా పూర్ణాహుతి గావించారు. అనంతరం, అమ్మవారికి వేదాశీస్సులు సమర్పించి, నివేదనలు చేసి, భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. రూ.750 టికెట్టుతో 50 మంది భక్తులు ఈ హోమంలో పాల్గొన్నారు. ఘనంగా సత్యదేవుని రథసేవఅన్నవరం: రత్నగిరిపై సత్యదేవునికి ఆలయ ప్రాకారంలో ఆదివారం రథసేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం 10 గంటలకు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయం వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. రథంపై వేంచేయించి, అర్చకులు దేవులపల్లి వరప్రసాద్ తదితరులు పూజలు చేశారు. అనంతరం, ఆలయ ప్రాకారంలో రథంపై మూడుసార్లు ఊరేగించారు. సత్యదేవుడు, అమ్మవారు సోమవారం ముత్యాల కవచాల (ముత్తంగిసేవ) అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. లోవ దేవస్థానంలో భక్తుల రద్దీతుని రూరల్: లోవ దేవస్థానంలో ఆదివారం రద్దీ నెలకొంది. వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. క్యూలో 12 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఆలయ కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. ఖరీఫ్ పనులు పూర్తి కావడం, సంక్రాంతి పర్వదినాలు ముగియడంతో భారీ సంఖ్యలో భక్తులు వచ్చారన్నారు. పులిహోర, లడ్డూ ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,34,535, పూజా టికెట్లకు రూ.2,25,100, తలనీలాలకు రూ.6,400, వాహన పూజలకు రూ.7,840, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.62,020, విరాళాలు రూ.23,774 కలిపి మొత్తం రూ.4,59,669 ఆదాయం సమకూరిందని ఈఓ వివరించారు. -
విద్యుత్కు జలసత్వాలు
నిత్య జీవితంలో విద్యుత్ ఎంతో అవసరం. అలాంటి విద్యుత్ అవసరాలకు ఎలాంటి ఇబ్బందీ రాకూడదనే ముంపుచూపుతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2020లో ఆలోచన చేసింది. ఇందులో భాగంగా పొల్లూరు జల విద్యుత్ కేంద్రంలో సామర్థ్యం పెంపునకు చర్యలు తీసుకుంది. ఇక్కడ అదనంగా 5, 6 యూనిట్ల పనులు మొదలుపెట్టింది. దీనికి గాను రూ.536 కోట్లు కేటాయించి, టెండర్ల ప్రక్రియ పూర్తి చేయించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ 80 శాతం పనులు జరిగాయి. కొద్ది రోజుల్లోనే ఈ పనులు పూర్తి కానున్నాయి. తద్వారా రాష్ట్రంలో విద్యుత్ అవసరాలకు ఈ ప్రాజెక్టు మరింత ఆసరా కానుంది. మోతుగూడెం: తెలుగు రాష్ట్రాల్లో జల విద్యుత్ ఉత్పత్తికి పొల్లూరు జల విద్యుత్ కేంద్రం చిరునామాగా నిలిచింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో చేపట్టిన చర్యలతో దీని సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటూ విద్యుత్ విప్లవానికి సిద్ధమవుతోంది. ఇక్కడ ఇప్పటికే నాలుగు యూనిట్లు ఉండగా, 5, 6 యూనిట్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ కేంద్రంలో పాత యూనిట్లు, కొత్త నిర్మాణాలకు మధ్య అనుసంధాన పనులు చేపట్టేందుకు సుమారు 45 రోజుల పాటు విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. ఇటు డొంకరాయి జలవిద్యుత్ కేంద్రం నుంచి ఫోర్బై రిజర్వాయర్ వరకూ సుమారు 16 కిలోమీటర్ల మేర పవర్ కెనాల్ కాంక్రీట్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. పవర్ కెనాల్కు సంబంధించి సైడ్ ప్యానళ్ల ప్లాస్టరింగ్తో పాటు కాంక్రీటింగ్, గ్రౌటింగ్ పనులు సుమారు రూ.1.50 కోట్లతో 20 మంది కాంట్రాక్టర్లు చేస్తున్నారు. పవర్ కెనాల్ పనులు రెండు మూడు రోజుల్లో పూర్తయ్యే అవకాశాలున్నాయి. దీంతో పాటు 5, 6 యూనిట్ల అనుసంధాన పనులు జరుగుతున్నాయి. ఫోర్బై జలాశయం అండర్గ్రౌండ్ టన్నెల్ వద్ద వికెట్ గేట్ల పనులు దాదాపు పూర్తి కానున్నాయి. దీంతో పాటు పవర్ హౌస్ వద్ద ఉన్న సర్జ్ ట్యాంక్లో నూతన గేట్ల నిర్మాణం పూర్తి కావొచ్చింది. వాల్వ్ హౌస్ వద్ద బటర్ఫ్లై వాల్వ్ను కొత్తగా నిర్మించిన పెన్స్టాక్ పైప్లైన్కు అనుసంధానించే కార్యక్రమం పూర్తవుతోంది. దీంతో పాటు పెన్స్టాక్ పైప్లైన్ వాల్వ్ హౌస్ నుంచి పవర్ హౌస్ దిగువన కొత్తగా నిర్మిస్తున్న 5, 6 యూనిట్లకు అనుసంధానం చేసే పనులు కూడా కొలిక్కి వస్తున్నాయి. పవర్ హౌస్ దిగువ భాగాన ట్రయల్ రేస్ సంపులో ఉన్న నీటిని పూర్తిగా తోడి, 5, 6 యూనిట్లకు అండర్ గ్రౌండ్లో డ్రాప్ ట్యూబ్ గేట్లు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో అండర్గ్రౌండ్ డ్రాఫ్ట్ ట్యూబ్ గేట్లు నిర్మించే ప్రాంతంలోని నీరు పవర్ హౌస్లోకి రాకుండా కాంక్రీటుతో పూర్తిగా మూసివేశారు. అయితే, అనుసంధాన పనులు చేస్తూండటంతో ఈ కాంక్రీట్ వాల్ను పగులగొట్టి డ్రాఫ్ట్ ట్యూబ్ గేట్లు అమర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 45 రోజులుగా ఈ అనుసంధాన పనులతో పాటు పొల్లూరు జల విద్యుత్ కేంద్రంలో 115 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఒక యూనిట్లో ఓవర్ హాలింగ్ పనులను అభిరామ కంపెనీకి అప్పగించి సాంకేతికంగా సరి చేస్తున్నారు. దీంతో పాటు డొంకరాయి పవర్హౌస్లో ఉన్న 25 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్ క్యాపిటల్ ఓవర్ హాలింగ్ పనులు రూ.28 లక్షలతో అభిరామ్ కంపెనీ ద్వారా నిర్వహిస్తున్నారు. మరో 45 రోజుల్లో క్యాపిటల్ ఓవర్ హాలింగ్ పనులు పూర్తి చేసుకుని జల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.పెరగనున్న ఉత్పత్తి ఏప్రిల్ నాటికి 5, 6 యూనిట్లలో ఒకటి పూర్తయితే పొల్లూరు జల విద్యుత్ కేంద్రం ద్వారా ఉత్పత్తి పెరగనుంది. ఈ నెల 25 లోపు అనుసంధాన పనులు పూర్తవుతాయి. పొల్లూరు జల విద్యుత్ కేంద్రం పూర్తి స్థాయి సామర్థ్యం 460 మెగావాట్లు. ఒక్కో యూనిట్ నుంచి 115 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. కొత్తగా నిర్మించే 5, 6 యూనిట్లు పూర్తయితే అదనంగా మరో 230 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. ఇలా ఈ కేంద్రం సామర్థ్యం మొత్తం 690 మెగావాట్లకు పెరగనుంది. ఈ యూనిట్ల నిర్మాణం, అనుసంధాన పనులపై ఏపీ జెన్కో హైడల్ డైరెక్టర్ సుజయ్ కుమార్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. వారం రోజుల కిందట ఆయన పొల్లూరు, డొంకరాయి జల విద్యుత్ కేంద్రాలను సందర్శించి పనుల పురోగతిపై సమీక్షించారు. జల విద్యుత్కు చిరునామా ‘పొల్లూరు’ సామర్థ్యం పెంపునకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనే పనులు త్వరలోనే అందుబాటులోకి రానున్న 5, 6 యూనిట్లు తద్వారా రాష్ట్రంలో మెరుగుపడనున్న సరఫరా -
వేగంగా కొత్త యూనిట్ల పనులు
పొల్లూరు జల విద్యుత్ కేంద్రంలో 5, 6 యూనిట్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి చేసేందుకు కష్టపడుతున్నారు. ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై సూచనలు, సలహాలు ఇస్తున్నాం. – సుజయ్ కుమార్, ఏపీ జెన్కో హైడల్ డైరెక్టర్ ఏడాది లోపు పూర్తి చేసేలా.. పొల్లూరు జల విద్యుత్ కేంద్రంలో చేపట్టిన కొత్త యూనిట్ల నిర్మాణ పనులు మొత్తం ఏడాది కాలంలో పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. ఇప్పటికే చాలా వరకూ పనులు తుది దశకు వచ్చాయి. పూర్తి స్థాయి పర్యవేక్షిస్తున్నాం. – సీహెచ్ రాజారావు, చీఫ్ ఇంజినీర్, ఏపీ జెన్కో సీలేరు కాంప్లెక్స్ తుది దశకు అనుసంధాన పనులు కొత్తగా నిర్మిస్తున్న 5, 6 యూనిట్ల అనుసంధాన పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయి. ఏడాది లోపే 5, 6 యూనిట్లను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చి విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటాం. – బి.బాలకృష్ణ, డీఈ, ఏపీ జెన్కో, పొల్లూరు ● -
బస్సుడు కషా్టలు
● సంక్రాంతి తిరుగు ప్రయాణానికి అవస్థలు ● వేలాదిగా ప్రయాణికులు ● చాలీచాలని ఆర్టీసీ బస్సులు ● రైళ్లు ముందుగానే ఫుల్ ● చార్జీలు పెంచేసిన ప్రైవేటు ట్రావెల్స్ ● గగ్గోలు పెడుతున్న జనం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): మూడు రోజుల ముచ్చటైన పండగ.. సంక్రాంతి ముగిసింది. పండగ సెలవులూ అయిపోయాయి. ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం ఎక్కడెక్కడో జీవనం సాగిస్తూ.. సంక్రాంతి పండగకు రెక్కలు కట్టుకుని వాలిపోయిన స్థానికులు.. ఇన్నాళ్లూ సొంతూళ్లలో.. అయినవారి మధ్య సందడి చేశారు. ఆ మధుర జ్ఞాపకాలను మది నిండా నింపుకొని.. పెట్టె, బ్యాగ్ సర్దుకుని ఆయా ప్రాంతాలకు బరువెక్కిన హృదయాలతో.. వీడలేమంటూ.. వీడుకోలంటూ.. తిరుగు ప్రయాణమవుతున్నారు. శనివారమే కొంతమంది బయలుదేరి వెళ్లగా మరికొందరు ఆదివారం ప్రయాణమయ్యారు. దీంతో, జిల్లాలోని ఆర్టీసీ బస్ కాంప్లెక్సులు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. బస్సు రావడమే ఆలస్యం వాటిలో ఎక్కేందుకు ప్రయాణికులు పోటీ పడ్డారు. దీంతో, దాదాపు ఏ బస్సు చూసినా రద్దీగానే కనిపించింది. అంతంత మాత్రంగా ఆర్టీసీ బస్సులు రైళ్లలో రిజర్వేషన్లు ముందుగానే అయిపోయాయి. కాకినాడ, సామర్లకోట తదితర స్టేషన్ల నుంచి హైదరాబాద్, చైన్నె, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లే ప్రతి రైలులోనూ బెర్తులు చాన్నాళ్ల కిందటే నిండిపోయాయి. దీంతో, పండగ ప్రయాణికులు బస్సుల పైనే ఎక్కువగా ఆధారపడ్డారు. వారి డిమాండును దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఆర్భాటంగా ప్రకటించినా.. అవి ఏమూలకూ చాలలేదు. కాకినాడ డిపో నుంచి హైదరాబాద్కు 7 ప్రత్యేక బస్సులు వేసినా వేలాదిగా వచ్చిన ప్రయాణికులకు అవి ఏమాత్రం సరిపోలేదు. పైగా ఆర్టీసీ స్పెషల్ బస్సులకు 50 శాతం చార్జీలు అదనంగా వసూలు చేశారని పలువురు ఆరోపించారు. అయినప్పటికీ, సంక్రాంతి ప్రత్యేక బస్సులకు ముందుగానే రిజర్వేషన్ సదుపాయం కల్పించడంతో అన్ని సీట్లూ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. దీంతో, ముందుగా రిజర్వేషన్ చేయించుకోలేని వారు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు బస్సులు అందుబాటులో లేక ఆర్టీసీ బస్టాండ్లలో గంటల తరబడి పడిగాపులు పడాల్సి వచ్చింది. ఊహించనంతగా ఏర్పడిన రద్దీని తట్టుకునేందుకు ప్రత్యేక సర్వీసులు నడపాలనుకున్నా.. అందుకు తగినన్ని బస్సులు లేకపోవడంతో ఆర్టీసీ అధికారులు తలలు పట్టుకున్నారు. సంక్రాంతి నేపథ్యంలో అనేక పల్లెవెలుగు బస్సులను దూర ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులుగా కేటాయించడంతో.. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు కూడా మరోవైపు అవస్థలు పడ్డారు. ముఖ్యంగా తుని, రాజమహేంద్రవరం, అమలాపురం, జగ్గంపేట వంటి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఆయా బస్టాండ్లలో గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. దీంతో, మహిళలు, పిల్లలు, వృద్ధులు అనేక ఇబ్బందులు పడ్డారు. ప్రైవేటు బస్సు చార్జీలకు రెక్కలు ఆర్టీసీ బస్సులు చాలినన్ని లేకపోవడంతో గత్యంతరం లేక అనేక మంది ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను ఆశ్రయించాల్సి వచ్చింది. ఇదే అదనుగా ట్రావెల్స్ నిర్వాహకులు దోపిడీకి తెర లేపారు. డిమాండ్ను బట్టి అసలు చార్జీకి రెండు మూడు రెట్లు అమాంతంగా టికెట్టు రేట్లు పెంచేశారు. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూర్, చైన్నె వంటి ప్రాంతాలకు వెళ్లే బస్సు చార్జీలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. నలుగురు కుటుంబ సభ్యులు ఆర్టీసీ బస్సులలో హైదరాబాద్ వెళ్లడానికి రూ.5 వేలలోపు సరిపోయేది. ఇదే ప్రయాణానికి ప్రైవేటు బస్సుల నిర్వాహకులు సుమారు రూ.15 వేల వరకూ గుంజారని పలువురు ప్రయాణికులు వాపోయారు. హైదరాబాద్, చైన్నె, బెంగళూరు వంటి నగరాలకు సాధారణ రోజుల్లో ప్రైవేట్ బస్సులకు ఏసీ సిట్టింగ్కు రూ.వెయ్యి నుంచి రూ.1,200.. స్లీపర్కు రూ.1,500 నుంచి రూ.2 వేల వరకూ వసూలు చేస్తారు. బస్సులను బట్టి ఆయా రేట్లు మారుతూంటాయి. అటువంటిది పండగ డిమాండ్ను అవకాశంగా తీసుకుని రూ.2500 నుంచి రూ.3 వేల వరకూ వసూలు చేశారు. డిమాండ్ను బట్టి రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పైగా కూడా గుంజారు. గత్యంతరం లేక పలువురు ప్రయాణికులు అధిక రేట్లకు టికెట్లు కొనుక్కొని ప్రైవేటు బస్సులలోనే వెళ్లాల్సి వచ్చింది. ప్రైవేటు బస్సులలో కూడా ఆన్లైన్ రిజర్వేషన్ సదుపాయం ఉండటంతో ముందుగా బుక్ చేసుకున్న వారికి రూ.3 వేల వరకూ చార్జీ వసూలు చేశారు. అప్పటికప్పుడు వచ్చిన వారి నుంచి రూ.5 వేల వరకూ కూడా గుంజేశారు. ‘మీకు ఇష్టమైతేనే ప్రయాణించండి. డిమాండ్ ఉంది కాబట్టి రేట్లు ఇలానే ఉంటాయి’ అని పలు ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు తెగేసి చెప్పేశారు. ఎక్కడైనా రవాణా అధికారులు తనిఖీ చేస్తే మాత్రం సాధారణ రేటు తీసుకున్నారనే చెప్పాలని.. లేకుంటే దించేస్తామని ప్రయాణికులకు ముందుగానే హెచ్చరించారు. ఆర్టీసీ టికెట్టు దొరకలేదు బెంగళూరు వెళ్లేందుకు టికెట్టు కోసం వారం రోజులుగా ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఆర్టీసీలో ఆన్లైన్లో టికెట్టు దొరకలేదు. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్లో రూ.4 వేలు పెట్టి టిక్కెట్లు కొన్నాను. – పిడకా శేషు ప్రభుత్వం పట్టించుకోలేదు సంక్రాంతి పండగకు హైదరాబాద్ నుంచి కాకినాడ వచ్చాం. తిరిగి వెళ్లేందుకు రైలు టికెట్లు దొరకక ఆర్టీసీ బస్సు కోసం ప్రయత్నించా. సంక్రాంతి రద్దీకి తగినట్టుగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయలేదు. కుటుంబ సభ్యులతో తిరుగు ప్రయాణానికి ఇబ్బందులు పడుతున్నాం. ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ ట్రావెల్స్లో వెళ్లాల్సి వస్తోంది. మా కుటుంబంలో నలుగురికి ఒక్కొక్కరికి రూ.4 వేల చొప్పున టికెట్టు కొన్నాం. మొత్తం రూ.16 వేలు వదిలిపోయాయి. – అనుసూరి రాజకుమారి -
● ఎటూ చూసినా..
పల్లిపాలెం ఫిషింగ్ హార్బర్ కేంద్రంగా సముద్రంపై వేట సాగిస్తున్న మత్స్యకారులకు పంట పండింది. కనుమ రోజు శుక్రవారం సాయంత్రం సముద్రంపై లోతు జలాల్లోకి ఒక సోనా బోటుపై వేటకు వెళ్లిన మత్స్యకారుల వలలకు సుమారు 20 టన్నుల టూనా రకం చేపలు చిక్కాయి. వీటిని శనివారం ఉదయం బోటులో హార్బర్కు తీసుకు వచ్చారు. వీటి విలువ మార్కెట్లో సుమారు రూ.40 లక్షలు వరకూ పలికిందని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు. –సఖినేటిపల్లి ● మంచు కురిసే వేళలో.. మంచు కురిసే వేళలో ప్రకృతి అందాలు వర్ణనాతీతం. అంబాజీపేటలో హిమసోయగం కనువిందు చేసింది. ఎటుచూసినా మంచు దుప్పటి పరుచుకుంది. సూరీడు కూడా మంచు పొరలు చీల్చుకుని వెలుగులు ప్రసరింపజేయడానికి అష్టకష్టాలు పడ్డాడు. పచ్చని పంట పొలాలు, రహదారిపై మంచు పరదా కప్పేసింది. శనివారం ఉదయం 10 గంటలు దాటినా పొగ మంచు తొలగకపోవడంతో వాహనదారులు లైట్లు వేసుకుని పయనించారు. –అంబాజీపేట ● చేయి కలిపి.. ప్రాణం నిలిపి విధి నిర్వహణలోనే కాదు.. అవసరమైతే ప్రాణాలు కాపాడతామని ఆ అధికారులు నిరూపించి అందరి మన్ననలు పొందారు. మొసలపల్లి శివారు జగ్గన్నతోటలో శుక్రవారం జరిగిన ప్రభల తీర్థానికి భారీగా జనం వచ్చారు. అక్కడ రాజమహేంద్రవరానికి చెందిన గొంతి గుణ అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతనికి పి.గన్నవరం సీఐ ఆర్.భీమరాజు, అంబాజీపేట డిప్యూటీ ఎంపీడీఓ కె.శ్రీనివాస్లు ప్రాథమిక వైద్య సేవలు అందించారు. అప్పటికీ ఊపిరి అందకపోవడంతో అర కిలోమీటరు దూరంలో ఉన్న అంబులెన్స్ వద్దకు తీసుకువెళ్లి అమలాపురం ఆసుపత్రికి తరలించారు. –అంబాజీపేట పల్లిపాలెం మార్కెట్లో ఐస్ బాక్సుల్లో భద్రపరుస్తున్న టూనా చేపలు -
తొలి తిరుపతి.. భక్తజనవాహిని
పెద్దాపురం (సామర్లకోట): తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన పెద్దాపురం మండలంలోని తిరుపతి గ్రామంలో శనివారం భక్తజనవాహిని పరవళ్లు తొక్కింది. ఇక్కడ స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభ స్వామి ఆలయానికి వేలాదిగా భక్తులు పోటెత్తారు. సంక్రాంతి సెలవులు కావడంతో బంధువుల ఇళ్లకు వచ్చిన వారు స్వామివారి దర్శనానికి పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆలయం కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే అనేక మంది భక్తులు కాలి నడకన ఆలయానికి చేరుకుని, స్వామిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. సుమారు 30 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా రూ.2.35,510, అన్నదాన విరాళాలు రూ.1,53,367, కేశఖండనకు రూ.2,800, తులాభారం ద్వారా రూ.700, లడ్డూ ప్రసాద విక్రయం ద్వారా రూ.23,655 కలిపి మొత్తం రూ.4,16,032 ఆదాయం సమకూరిందని వివరించారు. సుమారు 10 వేల మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారన్నారు. ధనుర్మాసం ముగింపును పురస్కరించుకుని ధ్వజస్తంభంతో పాటు ఆలయ ప్రాంగణాన్ని పూలతో శోభాయమానంగా అలంకరించారు. స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయంలో భజనలు, కోల సంబరం నిర్వహించారు. అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు పూజాదికాలు నిర్వహించారు. -
నగమోము సింగారం
ఫ ఇమిటేషన్ జ్యుయలరీకి పెరిగిన ఆదరణ ఫ అందుబాటులో వివిధ రకాల ఆభరణాలు ఫ తక్కువ ధరలో లభించడంతో మహిళల ఆసక్తి ఫ శుభకార్యాలు, వేడుకల్లో గిల్టు నగల వినియోగం రాయవరం: రోజు రోజుకూ బంగారం ధర కొండెక్కుతోంది. ప్రస్తుతం పది గ్రాములు రూ. రెండు లక్షలకు చేరువలో ఉంది. బంగారం, వెండి ధరలకు కళ్లెం లేకుంది. అయితే ఏ శుభకార్యమైనా మెడలో బంగారు నగలు ధరించాలని మహిళలకు ఉత్సుకత ఉంటుంది. ప్రస్తుతం సామాన్యులు బంగారం కొనలేని పరిస్థితి నెలకొంది. అందుకే.. అచ్చు బంగారం నగలను పోలిన జ్యుయలరీ ట్రెండ్ నడుస్తోంది. అలంకారం కోసమే కాకుండా పలు శుభ కార్యక్రమాల్లో సైతం ధరించేందుకు బంగారాన్ని మైమరపించేలా ఈ జ్యుయలరీ లభిస్తుండడంతో మహిళలు వీటినే కోరుకుంటున్నారు. చూస్తే నిజంగా బంగారు ఆభరణాలనే విధంగా ఆకట్టుకునే డిజైన్లలో మార్కెట్లో లభిస్తున్నాయి. ఈ నగలకు ఒక గ్రాము బంగారం అద్దడంతో నిజమైన పుత్తడిలా కనిపిస్తుంటుంది. పుత్తడితో పోల్చి చేసే నగలు బంగారం పూత పూసి స్వర్ణకాంతులతో శోభను సంతరించుకుంటున్నాయి. పాలు, నీళ్లకు మధ్య తేడాను హంసలు ఇట్టే కనిపెడతాయనేది నానుడి. అదే తరహాలో బంగారు నగలకు, గిల్టు నగల మధ్య తేడా కేవలం మహిళలకే తెలుస్తుంది. వివిధ రకాల లోహాలతో కూడిన పదునైన ఫినిషింగ్తో ఇమిటేషన్ నగలు దొరుకుతున్నాయి. కొత్త ఫ్యాషన్లు, సరికొత్త నగలను కోరుకునే వారికి బీరువాలో నిజమైన ఆభరణాలు ఉన్నప్పటికీ ముస్తాబు కోసం బంగారాన్ని మరిపించే వివిధ లోహాల జ్యుయలరీని మహిళలు ఎంచుకుంటున్నారు. గతేడాది నుంచి పసిడి పరుగులు పసిడి ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండడం లేదు. 2025 ఆగస్టులో పది గ్రాముల బంగారం ధర రూ.1,02,650 ఉండగా, సెప్టెంబర్లో రూ.1,14,500, అక్టోబర్లో రూ.1.28 లక్షలు, నవంబర్లో రూ.1,29,100, డిసెంబర్లోరూ.1,39,600లు, 2026 జనవరిలో ఏకంగా రూ.1.49 లక్షలకు చేరింది. ఈ ధర ఈ ఏడాది రూ.రెండు లక్షలకు చేరుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బంగారంతో పాటు వెండి ధర కూడా అంతే వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం కిలో వెండి రూ.2.39 లక్షలకు చేరింది. బంగారం, వెండి వాటి రికార్డులను అవే తిరిగి రాస్తున్నాయి. బంగారు పూతతో సరికొత్తగా.. బంగారం, వెండి పూతతో తళుకు తళుకుమంటూ మెరుస్తు న్న నగలను చూసి అ బ్బుర పడాల్సిందే. ఈ మెరుపులు కొన్ని నెల ల పాటు తాత్కాలిక మే అయినప్పటికీ రకరకాల డిజైన్లతో నగలు ఉండ డంతో అన్ని వర్గాల మహిళలు ఎక్కువగా కొను గోలు చేస్తున్నారు. ఆన్లైన్ షాపింగ్, వైబ్సైట్ల ద్వా రా ఇమిటేషన్ నగలను అధికంగా కొంటున్నారు. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మార్కెట్లలో ఈ దుకాణాలు ఏర్పాటయ్యాయి. -
ధగధగ మెరుపులతో..
బంగారు ఆభరణాలతో సమానంగా ఇమిటేషన్ నగలు ధగధగ మెరుస్తున్నాయి. ఈ మధ్య కాలంలో మార్కెట్లో ఇమిటేషన్ జ్యుయలరీ కొత్త డిజైన్లలో వస్తున్నాయి. కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, తుని పట్టణాలతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా కొత్తగా ఇమిటేషన్ నగల దుకాణాలు ప్రారంభించారు. అక్కడ మహిళలకు నచ్చిన కొత్త డిజైన్లు అందుబాటులో ఉంటున్నాయి. వేసుకునే డ్రెస్లు, చీరలను బట్టి మ్యాచింగ్ డిజైన్లు దొరుకుతుండడంతో మహిళలు ఎక్కువగా వీటినే కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో బంగారు నగల షాపులతో పోటీగా వివిధ కంపెనీల పేరుతో ఇమిటేషన్ నగల దుకాణాలు వెలుస్తున్నాయి. బంగారం షాపులే అన్నట్లుగా ఉంటున్న ఈ షాపులు కూడా ఇటీవల కాలంలో రద్దీగా మారుతున్నాయి. ● గుర్తు పట్టలేనంతగా.. ఇమిటేషన్ నగలు బంగారు నగలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంటున్నాయి. బర్త్ డే ఫంక్షన్ నుంచి పెళ్లిళ్ల వరకూ ఈ నగలనే వేసుకుంటున్నాం. బంగారు నగలు ఉన్నప్పటికీ ఇమిటేషన్ నగలకే ప్రాధాన్యం ఇస్తున్నాం. ఇవి వివిధ రకాల కొత్త డిజైన్లలో ఉంటున్నాయి. –బీఎస్ సునీతాలక్ష్మి, ఉపాధ్యాయురాలు, ద్రాక్షారామ ● అందరికీ అందుబాటులో.. పేద, మధ్య తరగతి ప్రజలకు సైతం అందుబాటులో ఇమిటేషన్ నగలు దొరుకుతున్నాయి. ప్రస్తుతం బంగారం ధర రోజు రోజుకూ పెరుగుతున్న తరుణంలో ఇమిటేషన్ నగలకు ప్రాధాన్యం పెరుగుతుంది. పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఈ నగలు ఒక కానుక అని చెప్పవచ్చు. ఎక్కడైనా పోగొట్టుకున్నా పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. –జి.త్రివేణిస్వాతి, గృహిణి, కాకినాడ -
12వ పీఆర్సీ వెంటనే నియమించాలి
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): వెంటనే 12వ పీఆర్సీ నియమించాలని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్.సాయి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక ఎస్టీయూ భవన్లో ఎస్టీయూ ఉమ్మడి జిల్లా ముఖ్య నాయకుల సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ, 11వ పీఆర్సీ కాలపరిమితి ముగిసి 27 నెలలు కావస్తున్నా 12వ పీఆర్సీ నియామకంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఇంకా నాలుగు డీఏలు పెండింగ్లో ఉంచడం సరికాదని, తక్షణం వాటిని విడుదల చేయాలని, 11వ పీఆర్సీ బకాయిలతో పాటు పీఎఫ్ లోన్ బకాయిలు చెల్లించడానికి రోడ్ మ్యాప్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్టీయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి శివప్రసాద్ మాట్లాడుతూ, ఉపాధ్యాయులకు నాన్ టీచింగ్ పనులు తగ్గించాలని కోరారు. విద్యాశక్తి పేరుతో పాఠశాలల పని వేళలు పెంచడం సరికాదన్నారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు వీసీ జాకబ్, ఎస్ఎస్ పళ్లంరాజు, మోర్త శ్రీనివాస్, కాశీ విశ్వనాథ్, ఎస్టీయూ ప్రతినిధులు పాల్గొన్నారు. -
నిత్య కల్యాణ గోవిందా..
వాడపల్లి క్షేత్రం భక్తజన సంద్రం కొత్తపేట: నిత్యకల్యాణ.. గోవిందా.. నీరజ నాభ గోవిందా.. అంటూ వాడపల్లి వెంకన్నను స్మరిస్తూ భక్తులు తన్మయులయ్యారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రం శనివారం అశేష భక్తజనంతో కిక్కిరిసింది. సంక్రాంతి సెలవుల కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి భక్తులు ఈ క్షేత్రానికి తరలివచ్చారు. కోరిన కోర్కెలు తీరిన అనేక మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు కాలినడకన చేరుకున్నారు. ప్రధానార్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు ఉదయం సుప్రభాత సేవ నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా సుగంధభరిత పుష్పాలతో అలంకరించారు. శ్రీ వేంకటేశ్వర సహిత ఐశ్వర్యలక్ష్మీ హోమం నిర్వహించారు. ఏడు శనివారాల నోము ఆచరిస్తున్న భక్తులు మాడ వీధుల్లో ఇసుక వేస్తే రాలని రీతిలో కిక్కిరిసి, అడుగులో అడుగు వేస్తూ ఏడు ప్రదక్షిణలు పూర్తి చేశారు. వేలాది మంది భక్తులతో క్యూలు నిండిపోయాయి. దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలోని అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామిని భక్తులు దర్శించుకున్నారు. ఉచిత వైద్య శిబిరాల్లో పలువురు భక్తులకు వైద్య సేవలు అందించారు. ఉచిత వాహనాల్లో వృద్ధులు, దివ్యాంగులను, గర్భిణులను తమ వాహనాల నుంచి ఆలయం వరకు, దర్శనానంతరం తిరిగి వాహనాల వద్దకు చేరవేశారు. ఏర్పాట్లను దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తదితరులు పర్యవేక్షించారు. బాలబాలాజీకి రూ.8.16 లక్షల ఆదాయం మామిడికుదురు: అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామికి శనివారం రికార్డు స్థాయి ఆదాయం వచ్చింది. సంక్రాంతి పండగ నేపథ్యంలో భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. పవిత్ర వైనతేయ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు శ్రీదేవి, భూదేవి సమేతుడైన బాలబాలాజీ స్వామిని దర్శించుకున్నారు. ముడుపులు, మొక్కులు చెల్లించారు. స్వామివారికి వివిధ సేవల ద్వారా రూ.8,16,073 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. 24 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని, 8,500 మంది స్వామి వారి అన్నప్రసాదం స్వీకరించారని చెప్పారు. నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.90,397 విరాళాలు వచ్చాయన్నారు. మండపేటకు చెందిన మాకే ఏసుదాసు, కుటుంబ సభ్యులు అన్నప్రసాద ట్రస్టుకు రూ.50,049 విరాళం అందించారు. ‘సీ్త్రలు ఇకపై రహస్యాలను కాపాడలేరు’ ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘కర్ణుడి జన్మ రహస్యాన్ని తల్లి కుంతీదేవి గోప్యంగా ఉంచడం వల్ల, నేను అన్నను చంపుకొని తీవ్ర శోకానికి గురయ్యాను. ఇకపై సర్వలోకాల్లో సీ్త్రలు రహస్యాలను కాపాడజాలరు’ అంటూ ధర్మరాజు శపించాడని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. వ్యాస భారత ప్రవచనంలో భాగంగా స్థానిక హిందూ సమాజంలో శనివారం ఆయన శాంతి పర్వంలోని పలు అంశాలను వివరించారు. ‘‘రాజ్యపాలనకు విముఖత చూపిన ధర్మరాజు మహర్షుల, సోదరుల అభ్యర్థన మేరకు పట్టాభిషిక్తుడవుతాడు. పవిత్ర జలాలు నిండిన శంఖంతో ధర్మరాజును కృష్ణపరమాత్మ అభిషేకిస్తాడు. అందరూ ధృతరాష్ట్రుని ఆజ్ఞను పాటించాలని, పూర్వం ఆయన ఎటువంటి గౌరవం పొందేవాడో, అదే గౌరవం కొనసాగాలని, ఆయనే కురురాజ్యానికి నాథుడని ధర్మరాజు ప్రకటిస్తాడు. ఆయన వ్యక్తిత్వం అంతటి ఉన్నతమైనది. భారతాన్ని మూడు భాగాలుగా చూడాలి. ఆది, సభా, వన, విరాట, ఉద్యోగ పర్వాలకు ఆది పంచకమని పేరు. భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, సీ్త్ర పర్వాలకు యుద్ధ షట్కమని పేరు. ఇక శాంతి, అనుశాసన, అశ్వమేఽధిక, ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణ పర్వాలకు శాంతి సప్తకమని పేరు ఉంది’’ అని సామవేదం వివరించారు. యుద్ధపర్వాలకు కౌరవపక్ష నాయకుల పేర్లు మాత్రమే ఉండటానికి గల కారణాలను వివరించారు. పాండవ పక్షాన యుద్ధం ఆది నుంచి అంతం వరకు దృష్టద్యుమ్నుడే సర్వసైన్యాధ్యక్షుడని, కౌరవుల పక్షాన వారు మారుతూ వచ్చారని చెప్పారు. మనిషికి సాధారణంగా స్వప్న, సుషుప్తి, నిద్రావస్థలు మాత్రమే తెలుసునని, వీటిని మించిన తురీయావస్థ గొప్ప యోగులకే సాధ్యమని సామవేదం అన్నారు. -
అన్ని దారులూ అన్నవరానికే..
● సంక్రాంతి సెలవులు ముగుస్తూండటంతో తరలివస్తున్న భక్తులు ● సత్యదేవుని దర్శించిన 40 వేల మంది ● రూ.40 లక్షల ఆదాయంఅన్నవరం: వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో అన్నవరం పుణ్యక్షేత్రం కిటకిటలాడింది. సంక్రాంతి పండగకు స్వస్థలాలకు వచ్చిన ప్రజలు సెలవులు ముగుస్తూండటంతో సత్యదేవుని దర్శనానికి పెద్ద సంఖ్యలో వస్తున్నారు. వీరికి ఇతర భక్తులు కూడా తోడవడంతో శనివారం ఇతర భక్తులు కూడా వేలాదిగా స్వామివారి సన్నిధికి తరలి రావడంతో ఆలయంలో తీవ్ర రద్దీ ఏర్పడింది. పార్కింగ్ ప్రదేశాలన్నీ భక్తుల వాహనాలతో నిండిపోయాయి. దేవస్థానం ఘాట్ రోడ్డు, అన్నవరం మెయిన్ రోడ్డులో పలుమార్లు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. సుమారు 40 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. ఉచిత దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట పట్టింది. సత్యదేవుని వ్రతాలు 2 వేలు జరిగాయి. వ్రతాలాచరించే భక్తులతో మండపాలన్నీ నిండిపోయాయి. దీంతో, మిగిలిన భక్తులు వ్రతాలాచరించేందుకు ఎండలోనే నిలుచోవలసి వచ్చింది. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.35 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. నిత్యాన్నదాన పథకంలో 8 వేల మంది సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. భక్తుల అసంతృప్తి తీవ్రమైన రద్దీ నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి అంతరాలయ దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఆ టికెట్టు తీసుకున్న వారికి ఉచిత దర్శనం భక్తులతో పాటే దర్శనానికి అనుమతించారు. దీనిపై అంతరాలయ దర్శనం టికెట్టు తీసుకున్న భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నప్పుడు తరచుగా అంతరాలయ దర్శనం టికెట్లు విక్రయించడం లేదు. దీనివలన దేవస్థానానికి రావాల్సిన ఆదాయానికి గండి పడుతోంది. గతంలో రూ.300 టికెట్టుతో గర్భాలయం చుట్టూ ప్రదక్షిణ దర్శనం ఉండేది. దీనిని రూ.200 టికెట్టుతో అంతరాలయ దర్శనంగా మార్చారు. ఫలితంగా కొంత ఆదాయం తగ్గింది. ఇప్పుడు ఆ టికెట్ల విక్రయం కూడా నిలిపివేస్తూండటంతో దేవస్థానం ఆదాయం కోల్పోతోందనే విమర్శ వినిపిస్తోంది. ఘనంగా ప్రాకార సేవ సత్యదేవుడు, అమ్మవారికి తిరుచ్చి వాహనంపై ఆలయ ప్రాంగణంలో ప్రాకార సేవ ఘనంగా నిర్వహించారు. ధనుర్మాసోత్సవాలను పురస్కరించుకుని గత నెల 16 నుంచి ఈ నెల 16వ తేదీ వరకూ అన్నవరం గ్రామ వీధుల్లో స్వామి, అమ్మవారిని ఊరేగించడంతో గత నాలుగు శనివారాలూ ప్రాకార సేవ నిర్వహించలేదు. ధనుర్మాసోత్సవాలు ముగియడంతో శనివారం దీనిని పునఃప్రారంభించారు. వచ్చే ధనుర్మాసం వరకూ ప్రతి శనివారం ఈ సేవ కొనసాగుతుంది. నేడు కూడా రద్దీ రత్నగిరిపై ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగనుంది. ఆలయ ప్రాంగణంలో నేటి ఉదయం పది గంటలకు స్వామివారి రథ సేవ జరుగుతుంది. అలాగే, ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ వనదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యంగిర హోమం నిర్వహిస్తారు.సత్యదేవుని దర్శనానికి క్యూలో నిల్చున్న భక్తులు -
ప్రాణం నిలబెట్టు.. ప్రోత్సాహకం పట్టు
ఫ జీరో అవర్లో సేవలు అందిస్తే రూ.5 వేలు, జ్ఞాపిక ఫ గుడ్ సమ్మరిటన్ పేరుతో కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం బాలాజీచెరువు (కాకినాడ): ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. రోజుకు ఇద్దరు, లేక ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం, అలాగే గాయపడుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి.. ఈ ప్రమాదాలతో బాధిత కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. జీరో అవర్లో సరైన వైద్య సేవలు అందకపోవడంతోనే మరణాలు ఎక్కువ సంభవిస్తున్నాయి. దీనిని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ప్రాణ నష్టాన్ని నివారించేందుకు ప్రాణదాతలకు ప్రోత్సాహకాలను ప్రకటించింది. ప్రమాదం జరిగినప్పుడు వెంటనే స్పందించి కాపాడే వారిని సత్కరించి జ్ఞాపికతో పాటు రూ.5 వేలు ఇవ్వనుంది. దేశ వ్యాప్తంగా గుడ్ సమ్మరిటన్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం రూపొందించిది. దీనిపై ప్రజల్లో చైతన్యం నింపేందుకు వైద్య శాలలు, ముఖ్య కూడళ్లు, జాతీయ రహదారులు వంటి ప్రాంతాల్లో డాక్టర్లు, ఏంవీఐలు కరపత్రాలు పంపిణీతో పాటు వాల్ పోస్టర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఎటువంటి సమస్య రాకుండా.. చాలా మంది ప్రమాదాలు జరిగినప్పుడు 104, 108 వంటి అత్యవసర నంబర్లకు సమాచారం ఇవ్వాలనే ఆలోచన వచ్చినా, పోలీసులతో తలనొప్పి ఎందుకని మిన్నకుండిపోతున్నారు. ఇటువంటి వాటికి చెక్ పెట్టడానికి సమాచారం ఇచ్చిన వారికి పోలీసులతో ఎటువంటి సమస్య తలెత్తకుండా నిబంధనలు మార్చారు. అలాగే ప్రమాదం జరిగిన వెంటనే క్షత్రగాత్రులకు జీరో అవర్లో సేవలు అందించిన వారికి కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ రూ.5 వేల నగదు ప్రోత్సాహకంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఎక్కువ మంది ప్రాణాలు కాపాడిన వారికి జాతీయ స్థాయిలో పురస్కారం అందజేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ కార్యక్రమం నిమిత్తం జిల్లాకు కొంత నగదు ముందుగానే ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుంది. నిబంధనల్లో మార్పు రోడ్డు ప్రమాదంలో సహాయం చేసిన వారి వివరాలు తప్పని సరిగా ఇవ్వాలనే నిబంధనలు మార్పు చేశారు. వారికి ఇష్టమైతేనే వివరాలు ఇవ్వవచ్చు. రోడ్డు ప్రమాదాల్లో మరణాల నివారణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన గుడ్ సమ్మరిటన్ కార్యక్రమంపై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నాం. జాతీయ రహదారి అధికంగా విస్తరించిన ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పోలీస్, వైద్య శాఖల సమన్వయంతో అవగాహన కల్పిస్తున్నాం. –కె.శ్రీధర్, కాకినాడ జిల్లా రవాణాశాఖ అధికారి -
అదిగదిగో అన్నప్రసాద భవనం
అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని నిత్యాన్నదాన భవనానికి ఎట్టకేలకు బోర్డు ఏర్పాటు చేశారు. ‘సత్యదేవుని నిత్య అన్నప్రసాద భవనము’ అనే పేరు అందరికీ కనిపించే విధంగా ఆ భవనం మీద బోర్డు ఏర్పాటు చేయడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. సత్యదేవుని దర్శించిన భక్తులు స్వామివారి అన్నప్రసాద భవనంలో భోజనం చేయాలని భావిస్తారు. అయితే, అన్నప్రసాద భవనంపై అటువంటి బోర్డు ఇప్పటి వరకూ లేకపోవడంతో కొత్తగా వచ్చేవారు తికమకపడేవారు. పైగా, ఈ భవనం ఎక్కడుందో తెలిపే సైన్ బోర్డులు దేవస్థానంలో ఎక్కడా ఉండేవి కావు. దీంతో, భక్తులు దేవస్థానం సిబ్బందిని, అక్కడి వ్యాపారులను అడిగి అన్నప్రసాద భవనం గురించి తెలుసుకోవలసి వచ్చేది. అలాగే, స్వామివారిని దర్శించి, పశ్చిమ రాజగోపురం వెలుపలకు వచ్చిన భక్తులకు ఎదురుగా అన్నప్రసాద భవనం ఉన్నా దానిపై బోర్డు లేక అందరినీ అడగాల్సి వచ్చేది. ఈ సమస్యపై ‘దారి చూపండి స్వామీ!’ శీర్షికన గత మంగళవారం ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనిపై దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాథరావు స్పందించి, వెంటనే బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఈ భవనంపై శనివారం బోర్డు ఏర్పాటు చేశారు. అధికారుల్లో కదలిక తెచ్చిన ‘సాక్షి’ కథనం -
సాల్మన్ది ప్రభుత్వ హత్యే
● దళితులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు ● దళిత నేతల నిరసన సాక్షి ప్రతినిధి, కాకినాడ: వైఎస్సార్ సీపీకి మద్దతుగా నిలుస్తున్నారనే ఏకై క కారణంతో దళితులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని పలువురు దళిత నేతలు మండిపడ్డారు. గడచిన ఏడాదిన్నర కాలంలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు మితిమీరి జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా పిన్నెల్లిలో వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడైన సాల్మన్ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు శెట్టిబత్తుల కుమార్రాజా ఆరోపించారు. సాల్మన్ హత్యకు నిరసనగా ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు కాకినాడ అంబేడ్కర్ సర్కిల్లో వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యాన శనివారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా కుమార్రాజా మాట్లాడుతూ, దళితులపై జరుగుతున్న దాడులు, హత్యలకు చంద్రబాబు ప్రభుత్వం భవిష్యత్తులో మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తామంటే మూడేళ్ల తరువాత వచ్చే తమ ప్రభుత్వంలో సరైన గుణపాఠం చెప్తామని అన్నారు. సాల్మన్ హత్యకు బాధ్యులైన నిందితులపై చట్ట ప్రకారం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హత్యలు పునరావృతమైతే జరిగే పరిణామాలకు చంద్రబాబే బాధ్యత వహించాలని ఆయనన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా వింగ్ అధ్యక్షులు కృష్ణప్రియ, ప్రధాన కార్యదర్శి జాన్ ప్రభాకర్, వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ నియోజకవర్గాల అధ్యక్షులు బల్ల సూరిబాబు, గుడాల వెంకటరత్నం, బంగారు కృష్ణ, లంక కృపానందం, బూల అబ్బులు, రూపా శ్రీను, జేబీఎం పార్టీ నాయకుడు ఏనుగుపల్లి కృష్ణ, రోకళ్ల సత్య, ముస్లిం మైనారిటీ విభాగం అధ్యక్షుడు ఖలీద్బ్బీన్ వలీ తదితరులు పాల్గొన్నారు. -
పండగల్లో.. ఫుల్ కిక్కు
● పూటుగా తాగిన లిక్కర్ ప్రియులు ● భారీగా విక్రయాలు ● డిసెంబరు 31న అమ్మకాలు రూ.20 కోట్లు ● సంక్రాంతికి రూ.21.09 కోట్లకు పెరుగుదల ● కోడిపందేల బరుల వద్ద మద్యం ఏరులు సాక్షి ప్రతినిధి, కాకినాడ: సంక్రాంతి పండగ వచ్చిందంటే.. ముత్యాల ముగ్గులు.. కొత్త దుస్తులు.. పిండి వంటలు.. భోగి మంటలు.. వెల్లివిరిసే సంస్కృతీ సంప్రదాయాలే అందరికీ గుర్తుకొస్తాయి. కానీ, ఈసారి విచ్చలవిడిగా సాగిన కోడిపందేలు, జూద క్రీడల పుణ్యమా అని మందుబాబులు మాత్రం పూటుగా తాగి ‘ఫుల్ కిక్కు’తో పండగ చేసుకున్నారు. సంక్రాంతి పండగ మూడు రోజులూ జిల్లావ్యాప్తంగా మద్యం ఏరులై పారింది. పెరిగిన మద్యం అమ్మకాలే దీనికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. మద్యం షాపుల కిటకిట సంక్రాంతి, కనుమ పండగలను పురస్కరించుకుని గురు, శుక్రవారాల్లో డిస్టిస్టలరీలకు సెలవులు వచ్చాయి. ఈ నేపథ్యంలో పండగ మూడు రోజులూ వచ్చే మందుబాబులను దృష్టిలో ఉంచుకుని.. లిక్కర్ వ్యాపారులు ఈ నెల 12, 13 తేదీల్లోనే డిస్టిలరీల నుంచి మద్యం కొనుగోలు చేసేశారు. దీంతో, పట్టణం, పల్లె అనే తేడా లేకుండా జిల్లా అంతటా మద్యం దుకాణాలు మందుబాబులతో కిటకిటలాడాయి. జిల్లాలో అధికారిక మద్యం దుకాణాల కంటే బెల్ట్ షాపులే మూడు రెట్లు అధికంగా ఉన్నాయి. వీటిల్లో 24/7 మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. భోగి, సంక్రాంతి, కనుమతో పాటు ముక్కనుమ రోజయిన శనివారం కూడా లిక్కర్ షాపులు మందుబాబులతో హడావుడిగా కనిపించాయి. దాదాపు అన్ని మద్యం దుకాణాల్లోనూ సమయంతో సంబంధం లేకుండా మద్యం విక్రయాలు విచ్చలవిడిగా నిర్వహించారు. పూటుగా మద్యం తాగిన యువకులు కన్నూమిన్నూ గానకుండా రోడ్లపై హల్చల్ చేశారు. పలు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు కూడా జరిగాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నూతన సంవత్సర అమ్మకాలకు మించి.. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కూడా మూడు రోజుల ముందు నుంచే లిక్కర్ షాపులు మందుబాబులతో కిక్కిరిసిపోయాయి. డిసెంబర్ 29, 30, 31 తేదీల్లో మందుబాబులు రూ.20 కోట్లు విలువైన మద్యాన్ని తాగేశారు. అంటే రోజుకు రూ.6 కోట్లు పైబడి మద్యం అమ్మకాలు జరిగాయన్నమాట. జిల్లాలో ప్రధాన నగరమైన కాకినాడతో పాటు పెద్దాపురం, సామర్లకోట, తుని, పిఠాపురం పట్టణాల్లో మద్యపాన ప్రియులు లిక్కర్ షాపులకు మంచి ఊపునిచ్చారు. వీటితో పాటు తుని రూరల్, కాకినాడ రూరల్, తాళ్లరేవు, పెదపూడి, జగ్గంపేట, ప్రత్తిపాడు, గోకవరం, గండేపల్లి, ఏలేశ్వరం, శంఖవరం, ప్రత్తిపాడు రూరల్ తదితర మండలాల్లో సైతం బ్రాండెడ్ మద్యం లీటర్లకు లీటర్లు ఖాళీ చేశారు. చేతిలో సొమ్ము లేకపోయినా అప్పులు చేసి మరీ ఫుల్లుగా లాగించేశారు. మద్యం దుకాణాలు లీజుకు తీసుకున్న తరువాత ఈ స్థాయిలో అమ్మకాలు జరిగింది అదే తొలిసారని, ఇది రికార్డని లిక్కర్ షాపుల యాజమాన్యాలు ఖుషీ అయ్యాయి. అయితే, సంక్రాంతి వేళ నూతన సంవత్సర వేడుకల అమ్మకాలకు మించి మద్యం వ్యాపారం జరిగింది. భోగి పండగకు ముందు రెండు రోజులతో కలిపి మూడు రోజుల్లో సామర్లకోట డిస్టిలరీ నుంచి జిల్లాలోని దుకాణాలకు సుమారు రూ.21.09 కోట్ల విలువైన మద్యం సరఫరా జరిగింది. అంటే గత డిసెంబర్ 31 కంటే రూ.కోటి పైగా మద్యం అమ్మకాలు జరిగాయన్నమాట. సిండికేట్కు లాభాల మత్తు జిల్లాలో సంక్రాంతి కోడిపందేలు, గుండాట, ఇతర జూద క్రీడలు మద్యం అమ్మకాలు ఇబ్బడిముబ్బడిగా పెరగడానికి కలసి వచ్చాయి. ఈ బరులు నిర్వహించిన ప్రాంతాలకు సమీపాన ఇన్స్టెంట్ బెల్ట్షాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. కాకినాడ రూరల్, కరప, తుని, తొండంగి, జగ్గంపేట, గండేపల్లి, సామర్లకోట, పెద్దాపురం తదితర మండలాల్లో ఈ పరిస్థితి కనిపించింది. అధికార పార్టీ నియోజకవర్గ నేతల కనుసన్నల్లోనే కోడిపందేలు నిర్వహించిన నేపథ్యంలో నిర్వాహకులు ఏమాత్రం జంకు లేకుండా మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా సాగించి, సొమ్ము చేసుకున్నారు. మందుబాబుల నడ్డి విరిచేలా చంద్రబాబు ప్రభుత్వం బాటిల్పై రూ.10 పెంచి అమ్ముకునేందుకు అనుమతించింది. దీనిని ఆసరాగా చేసుకుని లిక్కర్ వ్యాపారులు బాటిల్పై అవకాశాన్ని బట్టి రూ.20, రూ.30 కూడా పెంచేసి, సొమ్ము చేసుకున్నారు. మొత్తంమీద ఈ వ్యవహారమంతా కూటమి దన్నుతో సాగుతున్న మద్యం సిండికేట్ను లాభాల మత్తులో ముంచింది. మూడు రోజుల్లో మద్యం అమ్మకాలు (రూ.కోట్లు) తేదీ బీరు కేసులు మద్యం కేసులు అమ్మకాలు 12.01.2026 4,201 9,651 7.95 13.01.2026 4,306 9,204 8.01 14.01.2026 2,001 6,908 6.03 మొత్తం 10,508 25,763 21.09 -
అంతర్జాతీయ స్థాయిలో మెరిసిన విరవాడ దర్శకుడు
పిఠాపురం: విరవాడ గ్రామానికి చెందిన దర్శకుడు ఎంవీ సతీష్ కుమార్ అంతర్జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు సాధించారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో సంస్కృత భారతి ఆధ్వర్యాన ఇటీవల 7వ అంతర్జాతీయ సంస్కృత లఘు చలనచిత్రోత్సవం–2026 జరిగింది. ఇందులో ఆయన దర్శకత్వంలో సంపూర్ణంగా సంస్కృత భాషలో రూపొందించిన ‘అస్తేయం’ షార్ట్ ఫిల్మ్కు ద్వితీయ స్థానం లభించింది. ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అస్సాం, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలతో పాటు అమెరికా నుంచి కూడా పలువురు పాల్గొన్నారు. మొత్తం 90 ఎంట్రీలు రాగా, అందులో 20 రీల్స్ విభాగానికి చెందినవి. సతీష్ కుమార్ రూపొందించిన ‘అస్తేయం’ సంస్కృత భాషను సులభంగా ప్రజలకు చేరువ చేసేదిగా గుర్తింపు పొందింది. ఈ చిత్రంలో నటించిన కె.లలితకు ఉత్తమ నటి అవార్డు లభించడం మరో విశేషం. ఏకదంత సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి మేడూరి విష్ణువర్ధన్రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. రచన సహకారం ఆచార్య సీహెచ్ సద్గుణ అందించారు. గతంలో కూడా అనేక అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్లో అవార్డులు అందుకున్న సతీష్ కుమార్ హైదరాబాద్లో తెలుగు చిత్ర పరిశ్రమలో పని చేస్తున్నారు. ఖర్జూరం, మిక్చర్ పొట్లం వంటి చిత్రాలతో పాటు మొత్తం నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించారు. అలాగే ఏకదంత – ద స్కూల్ ఆఫ్ యా న్షెంట్ స్టడీస్కు ఫౌండర్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. -
అవకతవకలు.. అరకోటి పైనే..
● పురోహితుని చేతివాటంపై పూర్తయిన అధికారుల తనిఖీ ● ఈఓకు నివేదిక ● మొత్తం రూ.58.39 లక్షల మేర స్వాహా అయినట్లు గుర్తింపు ● ఇప్పటికే రూ.28.54 లక్షల రికవరీ ● మిగిలిన సొమ్ముపై సంబంధిత వ్యక్తులకు నోటీసులుఅన్నవరం: సత్యదేవుని సన్నిధిలో వ్రత పురోహితుల పారితోషికం బిల్లును అధిక మొత్తానికి పెంచి, ఓ పురోహితుడు చేతివాటానికి పాల్పడిన ఘటనపై పది రోజులుగా జరుగుతున్న తనిఖీ ముగిసింది. మొత్తం రూ.58.39 లక్షల మేర ఆ పురోహితుడు దారి మళ్లించినట్టు వెల్లడైంది. ఇందులో ఈపీఎఫ్కు చెల్లించాల్సిన మొత్తంతో పాటు, పురోహితులు వివిధ కారణాలతో తీసుకున్న అడ్వాన్సులు, ప్రొఫెషనల్ ట్యాక్స్ కింద జమ చేయాల్సినది కూడా ఉందని తేలింది. ఆ మేరకు ఈఓ వి.త్రినాథరావుకు దేవస్థానం అధికారులు శుక్రవారం నివేదిక సమర్పించారు. దారి మళ్లిన రూ.58.39 లక్షల్లో ఆ వ్రత పురోహితుడి నుంచి ఇప్పటికే రూ.28.54 లక్షలు రికవరీ చేశారు. అనంతరం, అతడు హఠాత్తుగా మృతి చెందాడు. ఆ తరువాత గత పదేళ్ల రికార్డులను అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆ పురోహితుడు 2024 జనవరి నుంచి గత ఏడాది డిసెంబర్ వరకూ ఇదేవిధంగా చేతివాటం చూపినట్లు వెల్లడైంది. ఈ మేరకు మరో రూ.29.85 లక్షలు ఇంకా రికవరీ చేయాల్సి ఉంది. చేతివాటం ఇలా.. చేతివాటం చూపిన పురోహితుడు అన్నవరం దేవస్థానంలో వ్రత విధులు కాకుండా.. వ్రత పురోహితుల పారితోషికం (జీతాలు) బిల్లులు చేయడం, వివిధ కటింగ్లు పోనూ ఎవరెవరికి ఎంత వస్తుందో లెక్కించడం వంటి పనులను చాలా కాలంగా నిర్వహించేవాడు. అతడిని నమ్మిన సిబ్బంది అతడు తయారు చేసిన బిల్లులపై సరైన పరిశీలన లేకుండానే సంతకాలు చేసేవారు. వాటి ఆధారంగా సంబంధిత చెక్కులపై ఈఓ సంతకాలు చేసేవారు. దీనిపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఆ పురోహితుడు బిల్లు మొత్తం పెంచి, అవకతవకలకు పాల్పడినట్లు ఆలస్యంగా గ్రహించారు. దీంతో, అతడు పదేళ్లుగా తయారు చేసిన బిల్లులపై తనిఖీలు చేయాలని ఈఓ త్రినాథరావు ఆదేశించారు. ఈ మేరకు అధికారులు పది రోజులుగా సంబంధిత బిల్లులను పరిశీలించగా.. రూ.58.39 లక్షల మేర అవతకవకలకు పాల్పడినట్టు తేలింది. ఇందులో ఎక్కువ మొత్తం తన ఖాతాకు, తన భార్య, అత్త, బావమరిది ఖాతాలకే మళ్లించాడు. ఇందులో రూ.28.54 లక్షలు గత డిసెంబర్లో రికవరీ చేయగా.. మిగిలిన రూ.29.85 లక్షల్లో రూ.8 లక్షలు తన ఖాతాకు, రూ.2.5 లక్షలు తన భార్య ఖాతాకు, తన ఇంటికి సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్కు రూ.1.40 లక్షలు జమ చేశాడు. 12 మంది ఖాతాలకు రూ.17.95 లక్షలు మిగిలిన రూ.17.95 లక్షలను 12 మంది పురోహితుల ఖాతాలకు జమ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ 12 మందిలో తన బావమరిదికి రూ.4 లక్షలు, మరో పురోహితునికి రూ.5 లక్షలు, ఒకరికి రూ.1.90 లక్షలు, మరొకరికి రూ.90 వేలు పంపించినట్లు తేలింది. మిగిలిన ఎనిమిది మందిలో ఒక్కొక్కరికి రూ.30 వేల నుంచి రూ.60 వేల వరకూ పంపించాడు. తన బావమరిదికి, ఇంకో పురోహితునికి ప్రతి నెలా పంపించగా, మిగిలిన వారికి ఒకటి రెండుసార్లు మాత్రమే ఆవిధంగా జమ చేసినట్లు విచారణలో తేలింది. అయితే, అతడు తమకు సొమ్ము పంపించిన మాట వాస్తవమేనని, ఆ తరువాత అతడి ఖాతాకు జమ చేయాలని చెప్తే అలాగే చేశామని ఆ పురోహితులందరూ చెబుతున్నట్లు సమాచారం. దేవస్థానానికి తిరిగి ఆ మొత్తం చెల్లించేలా ఆ పురోహితులతో వ్రత పురోహిత సంఘం నాయకులు, గతంలో అధ్యక్షులుగా పని చేసిన వారు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. అలాగే, ఆ పురోహితుడు, అతడి భార్య, ఇతర కుటుంబ సభ్యుల ఖాతాల్లో పడిన మొత్తం కూడా తిరిగి చెల్లించేలా ఒప్పిస్తున్నట్లు తెలిసింది. వారు తిరిగి చెల్లించాల్సిందే పురోహితుడు చేతివాటం ప్రదర్శించి, 12 మంది వ్రత పురోహితుల ఖాతాలకు మళ్లించిన మొత్తాన్ని వారి నుంచి రికవరీ చేస్తాం. దీనిపై వారికి నోటీసులిస్తాం. వారు తమ ఖాతాలకు ఎక్కువ మొత్తం జమ అయినప్పుడు ఆ విషయాన్ని దేవస్థానం అధికారుల దృష్టికి తీసుకురావాల్సింది. అలా చేయనందున ఈ తప్పులో వారు కూడా భాగస్తులైనట్లు భావించాల్సి వస్తోంది. అలాగే, ఆ పురోహితుడు, అతడి భార్య ఖాతాలకు జమ అయిన మొత్తాన్ని కూడా అతడు జీవించి లేనందున వారి కుటుంబ సభ్యులే చెల్లించాల్సి ఉంటుంది. సంబంధిత సోలార్ కాంట్రాక్టర్కు కూడా నోటీసు ఇస్తాం. సిబ్బందికి ఇప్పటికే షోకాజ్ నోటీసులిచ్చాం. వారు ఇచ్చే సమాధానాన్ని అనుసరించి వారిపై కూడా తదుపరి చర్యలు తీసుకుంటాం. – వి.త్రినాథరావు, ఈఓ, అన్నవరం దేవస్థానం -
సీమకు సుప్రభాతం..
● ఏకాదశ రుద్రులతో శోభిల్లిన కోనసీమ ● అంబరాన్నంటిన సంబరాలు ● జగ్గన్నతోటలో ఆధ్యాత్మిక పారవశ్యం సాక్షి, అమలాపురం/అంబాజీపేట/కొత్తపేట: ప్రకృతి రమణీయతతో ఉట్టిపడే కోనసీమ సంక్రాంతి పండగ వేళ మరింత శోభాయమానమై అలరారుతుంది. వీధుల్లో రంగవల్లులు.. కూడళ్లలో భోగిమంటలు.. సంప్రదాయ దుస్తులలో ముస్తాబయ్యే పల్లెవాసులు.. ఒకటేమిటి.. ఆ సందడే వేరుగా ఉంటుంది. రైతుల వద్ద.. జనం వద్ద సొమ్ము లేక పండగ ఈసారి కళ తప్పినా ప్రభల తీర్థాలతో కాస్తా సందడి వచ్చింది. చారిత్రక.. ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్న జగ్గన్నతోట ప్రభల తీర్థం శుక్రవారం వైభవంగా జరిగింది. ఆకుపచ్చని వరిచేల మీదుగా.. నిలువెత్తు కొబ్బరి తోటల మధ్య నుంచి.. పంట కాలువల గలగలల మధ్య అందమైన రంగురంగుల ప్రభలు.. ఈ తీర్థాలకు తరలివచ్చాయి. కొత్తపేట తీర్థంతో గురువారం ఆరంభమైన ప్రభల ఉత్సవాలు శనివారం ముక్కనుమ వరకూ సాగనున్నాయి. కొలువుదీరిన ఏకాదశ రుద్రులు అంబాజీపేట మండలం మొసలపల్లి శివారున చారిత్రక ప్రసిద్ధి చెందిన జగ్గన్నతోట ప్రభల తీర్థానికి భక్తులు పోటెత్తారు. ఏకాదశ రుద్రుల ప్రభలు పంట పొలాలు, కాలువలు దాటుకు వచ్చి భక్తులను పరవశింపజేశాయి. ప్రభలపై వచ్చిన ఈశ్వరుని ప్రతిరూపాలను చూసి భక్తులు తన్మయులయ్యారు. మొక్కులు తీర్చుకున్నారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాలు, ఇతర దేశాలకు ఉపాధి కోసం వెళ్లినవారు ఈ తీర్థానికి కుటుంబ సమేతంగా వచ్చారు. భక్తుల ఓంకార నాదాలు.. ప్రభలకు వేలాడదీసిన జేగంటల శబ్దాలు.. ప్రభలు మోసేవారి అశ్శరభ శరభ నినాదాలతో ఆ ప్రాంతం ఆధ్యాత్మికతను సంతరించుకుంది. వ్యాఘ్రేశ్వరునికి గౌరవ వందనం జగన్నతోట ప్రభల ఊరేగింపు సంప్రదాయ పద్ధతిలో సాగింది. వ్యాఘ్రేశ్వరం నుంచి వ్యాఘ్రేశ్వర స్వామి ప్రభ వచ్చినప్పుడు మిగిలిన ప్రభలను గౌరవ సూచకంగా ఒకసారి పైకి లేపారు. గంగలకుర్రు అగ్రహారం ఉమా పార్వతీ సమేత వీరేశ్వరస్వామి, గంగలకుర్రు చెన్నకేశవ మల్లేశ్వరస్వామి ప్రభలు అప్పర్ కౌశిక దాటుకుని రావడాన్ని భక్తులు భక్తి పారవశ్యంతో వీక్షించారు. కొన్ని కుటుంబాల వారు గూడు ఎడ్లబండ్లపై తీర్థానికి రావడం పలువురిని ఆకట్టుకుంది. అంబరాన్నంటిన కొత్తపేట ఉత్సవం కొత్తపేట ప్రభల ఉత్సవం అంబరాన్ని తాకింది. మకర సంక్రాంతి సందర్భంగా గురువారం జరిగిన ఈ ఉత్సవానికి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచీ లక్షలాదిగా భక్తులు తరలిరావడంతో ఆ గ్రామం జనసంద్రమైంది. రోడ్లు, పురవీధులు జనంతో కిక్కిరిసిపోయాయి. పాత రామాలయం, కొత్త రామాలయం, బోడిపాలెం వీధుల నుంచి ప్రారంభమైన ప్రధాన ప్రభల ఊరేగింపు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ జరిగింది. తిరుగు ఊరేగింపులో భాగంగా పాత, కొత్త రామాలయం వీధుల వారు అర్ధరాత్రి 2 గంటల నుంచి శుక్రవారం ఉదయం 5.30 గంటల వరకూ పోటాపోటీగా నిర్వహించిన బాణసంచా కాల్పులతో ఆకాశం రంగురంగుల వెలుగులతో మెరిసిపోయింది. మామిడికుదురు మండలం కొర్లగుంటలో జరిగిన తీర్థంలో 12 ప్రభలు కొలువుదీరాయి. కాట్రేనికోన మండలం చెయ్యేరు, రావులపాలెం మండలం దేవరపల్లి, పి.గన్నవరం మండలం మానేపల్లి, నాగుల్లంక, పప్పులవారిపాలెం, ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి, ఎన్.కొత్తపల్లి, వాడపర్రు, సన్నవిల్లి, అమలాపురం మండలం సాకుర్రు గరువు, బండారులంక, అమలాపురం పట్టణంలో గనికమ్మగుడి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, మలికిపురం మండలం కేశనపల్లి, తూర్పుపాలెం, రాజోలు పొదలాడ, ముమ్మిడివరం మండలం పల్లిపాలెం, క్రాప చింతలపూడి, ఐ.పోలవరం శివారు పెదమడి, ఐ.పోలవరం మండలం గుత్తెనదీవి, కపిలేశ్వరపురం మండలాల్లో ప్రభల తీర్థాలు అంగరంగ వైభవంగా సాగాయి.55 అడుగుల ఎత్తయిన ప్రభ అంబాజీపేట మండలం వాకలగరువు సరిహద్దులో జరిగిన ప్రభల తీర్థంలో వాకలగరువుకు చెందిన ఉమా సర్వేశ్వరస్వామి వారి ప్రభ, తొండవరం ఉమా తొండేశ్వరస్వామి వార్ల ప్రభలు 55 అడుగుల ఎత్తున నిర్మించారు. కోనసీమలో జరిగే ప్రభల తీర్థాల్లో అతి ఎత్తయిన ప్రభలుగా ఇవి గుర్తింపు పొందాయి.జగన్నతోటలో భక్తులకు ఆపసోపాలు జగన్నతోట ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండగగా గుర్తించిన ప్రభుత్వం.. నయాపైసా కూడా నిధులు విద ల్చలేదు. నిర్వాహకులే చందాలు వేసుకుని తీర్థం ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులకు సదుపాయాల కల్పనలో ప్రభుత్వ యంత్రాంగం చేతులెత్తేసింది. వేల మంది భక్తులు వస్తే పదుల సంఖ్యలోనే తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణలో పోలీస్ సిబ్బంది ముఖం చాటేశారు. మొసలపల్లి వంతెన వద్ద వీఐపీలకు కార్ పార్కింగ్ ఇవ్వడంతో అటువైపు తీర్థానికి వచ్చిన భక్తులు ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. ఒక దశలో ఇక్కడ తోపులాట చోటు చేసుకుంది. రాష్ట్ర పండగ పేరుతో ప్రజాప్రతినిధులకు, ఉన్నతాధికారుల ప్రొటోకాల్ కల్పనకే అధికారులు పరిమితమయ్యారు. -
అంతా మా ఇష్టం
● హైకోర్టు ఆదేశాలు బేఖాతరు ● అధికారుల హెచ్చరికలూ డోంట్ కేర్ ● యథేచ్ఛగా సంక్రాంతి కోడిపందేలు ● జోరుగా జూద క్రీడలు ● పండగ రోజుల్లో చేతులు మారిన రూ.కోట్లు ● ‘అధికార’ అండతో నిర్వాహకుల బరితెగింపు ● జాడ లేని పోలీసులు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): అధికారం అండ ఉంది.. ఏం చేసినా అడిగేదెవడు? అంతా మా ఇష్టం.. అన్నట్టుగా బరితెగించేశారు కోడిపందేల నిర్వాహకులు. హైకోర్టు ఆదేశాలు బేఖాతరు.. అధికారుల హెచ్చరికలంటే డోంట్ కేర్.. అనే రీతిలో వ్యవహరించారు. ఫలితంగా సంప్రదాయం ముసుగులో సంక్రాంతి పండగ మూడు రోజులూ కోడిపందేలు.. వాటికి అనుబంధంగా గుండాటలు, ఇతర జూద క్రీడలు జిల్లావ్యాప్తంగా జోరుగా జరిగాయి. కోట్లాది రూపాయల మేర నగదు చేతులు మారింది. కోడిపందేలను నిషేధిస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చిందని, వీటిని ఎక్కడా ఏ రూపంలోనూ నిర్వహించడానికి వీల్లేదని పండగకు నాలుగు రోజుల ముందు నుంచే అధికారులు హడావుడి చేశారు. ఈ ఆదేశాలను ఎవరైనా ధిక్కరిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సాక్షాత్తూ జిల్లా ఇన్చార్జి కలెక్టర్, ఎస్పీ, వివిధ స్థాయిల్లోని పోలీసు అధికారులు హెచ్చరించారు. దీనిపై అవగాహన కల్పించేందుకు అక్కడక్కడ ఫ్లెక్సీలు సైతం ఏర్పాటు చేశారు. కరపత్రాలు పంచారు. గ్రామాల్లో టాంటాం వేయించారు. అయినప్పటికీ పండగకు ముందు కొన్నిచోట్ల ఏర్పాటు చేస్తున్న బరులను దున్నేసి, ఫ్లెక్సీలు, టెంట్లు పీకేసి హడావుడి చేశారు. ఇంతా చేసిన వారు.. తీరా పండగ రోజుల్లో మాత్రం పత్తా లేకుండా పోయారు. భారీ ఏర్పాట్లతో పందేలు, జూద క్రీడలు బహిరంగంగానే నిర్వహిస్తున్నా అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. బరుల వద్ద వందలాది మంది గుమిగూడినా.. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరినా.. కానిస్టేబుల్ కాదు కదా కనీసం హోం గార్డ్ కూడా అటువైపు కనీసం తొంగి చూడలేదు. ఫలితంగా జిల్లావ్యాప్తంగా అనేకచోట్ల అధికార పార్టీ నేతల అండతో కోడిపందేల బరులు విచ్చలవిడిగా వెలిశాయి. కోళ్ల కాళ్లకు కత్తులు కట్టి దర్జాగా పందేలు నిర్వహించారు. పోటాపోటీగా పలు ప్రాంతాల్లో టీడీపీ, జనసేన నేతలు పోటాపోటీగా బరులు ఏర్పాటు చేశారు. కొన్ని బరుల వద్ద గుండాట నిర్వహణకు పాట పెట్టి, రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకూ వసూలు చేశారు. కొన్ని గ్రామాల్లో ఇరు పార్టీల నేతల మధ్య సఖ్యత కుదరకపోవడంతో వేర్వేరుగా బరులు ఏర్పాటు చేశారు. అక్కడ మద్యం విక్రయించుకునేందుకు వచ్చిన బెల్ట్ షాపుల యజమానుల వద్ద నాయకులు భారీగా డబ్బులు గుంజారు. ప్రైవేటు సైన్యాల ఏర్పాటు జిల్లావ్యాప్తంగా భోగి రోజు ఉదయం ప్రారంభమైన కోడిపందేలు, జూద క్రీడలు.. సంక్రాంతి, కనుమ పండగ రోజైన శుక్రవారం రాత్రి వరకూ యథేచ్ఛగా సాగాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కోడిపందేల బరులకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన పందెంరాయుళ్లు వేలాదిగా కార్లపై వచ్చారు. దీనినిబట్టి బరులు ఏ స్థాయిలో ఏర్పాటు చేశారో అర్థం చేసుకోవచ్చు. భారీ స్థాయిలో ఏర్పాటు చేసి బరులకు కొన్నిచోట్ల నిర్వాహకులు రెండు కిలోమీటర్ల మేర ప్రైవేట్ సైన్యాన్ని సైతం ఏర్పాటు చేశారు. ఎవరూ సెల్ఫోన్లతో వెళ్లకుండా ఆంక్షలు పెట్టారు. కోడిపందేలు పేకాట, గుండాటలను ఏ ఒక్కరూ సెల్ఫోన్లలో చిత్రీకరించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పిఠాపురం మండలం కందరాడ గ్రామంలో ఓ జనసేన నాయకుడి ఆధ్వర్యాన సినీ సెట్టింగ్ మాదిరిగా ఏర్పాట్లు చేసి మరీ కోడిపందేలు, గుండాట నిర్వహించారు. ఖరీదైన బహుమతులు కొన్నిచోట్ల కోడిపందాల విజేతలకు ఖరీదైన బహుమతులు సైతం అందజేశారంటే పందేలు ఏ స్థాయిలో జరిగాయో చెప్పనవసరం లేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో కోడిపందేల విజేతలకు రెండు కార్లు, ఒక బైక్ బహుమతిగా అందించారు. కొన్నిచోట్ల నిర్వహించిన పందేల్లో ఎక్కువగా గెలిచిన వారికి కార్లు, బైకులు బహుమతిగా ఇచ్చారు. పందేల్లో పాల్గొన్న అందరికీ అక్కడే ఉచితంగా మాంసాహారంతో భోజనాలు సైతం ఏర్పాటు చేశారు. పెద్దాపురం నియోజకవర్గం పులిమేరు గ్రామంలో ఏర్పాటు చేసిన బరుల వద్ద బుల్లితెర నటులతో యాంకరింగ్ చేయించి, పందెంరాయుళ్లను ఉత్సాహపరిచారు. కిర్లంపూడి ప్రధాన రహదారి పక్కనే పందేలు ఏర్పాటు చేశారు. గోరింట గ్రామంలో సుమారు రూ.25 లక్షలతో భారీ ఎత్తున సెట్టింగ్లు వేసి మరీ కోడిపందేలు, గుండాట నిర్వహించారు. సంక్రాంతి పండగ వేళ గ్రామాల్లో ముగ్గులు, గాలిపటాల పోటీలు, కబడ్డీ వంటి సంప్రదాయ క్రీడలు నిర్వహిస్తామని జిల్లా యంత్రాంగం ప్రకటించింది. కానీ, ఎక్కడా అటువంటి సంబరాలు కానరాకపోవడం కొసమెరుపు. -
స్నేహబంధం.. ఎంతో మధురం
అనపర్తి: కాలం ఎంత దూరం తీసుకెళ్లినా, బాల్య స్మృతులు మాత్రం ఎప్పటికీ మధురం. దానికి ప్రతీకగా అనపర్తి శ్రీరామా జెడ్పీ ఉన్నత పాఠశాలలో 1978–79 విద్యా సంవత్సరానికి చెందిన 10వ తరగతి విద్యార్థులు, ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా సంక్రాంతి పండగను పురస్కరించుకుని ఒకే వేదికపై కలుసుకున్నారు. శుక్రవారం అనపర్తిలోని టీజీఆర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ రీయూనియన్ గడిచిన రోజులను మళ్లీ గుర్తుచేసిన ఓ అపురూప క్షణంగా నిలిచింది. తరగతి గదుల్లో మొదలైన స్నేహాలు, కాలంతో మరింత లోతుగా మారి చిరునవ్వులు, ఉద్వేగాల అంచుల్లో నిలిచిన జ్ఞాపకాలుగా మారాయి. ఈ భావోద్వేగ సమావేశంలో పూర్వ విద్యార్థులు తమ గురువుల అంకితభావాన్ని స్మరించుకుంటూ, విద్య ఇచ్చిన విలువలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ దశరథ రామారెడ్డి తేతలి, వ్యాపారవేత్తలు టి.సుధాకర్ గంగిరెడ్డి, తాడి రామచంద్రారెడ్డి, సత్తి వెంకట్రెడ్డి, హోతా శర్మ తదితరులు పాల్గొని తమ అనుబంధాన్ని మరింత బలపరిచారు. ఈ రీయూనియన్ ఒక కార్యక్రమం మాత్రమే కాదు జీవితాంతం మోసుకెళ్లే స్నేహానికి, జ్ఞాపకాలకు ఒక మధురమైన ఘట్టమని తమలోని భావోద్వేగాన్ని వ్యక్తపరిచారు. -
చొల్లంగి తీర్థం.. చూసొద్దాం
కరప: సాగర తీరంలో ఆధ్యాత్మికత పరవళ్లు తొక్కుతోంది. పురాణ ప్రసిద్ధి గాంచిన చొల్లంగి అమావాస్య తీర్థం ఆదివారం కరప మండలం ఉప్పలంక శివారు మొండి వద్ద జరగనుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో ఈ తీర్థానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇక్కడకు వేలాది మంది భక్తులు వచ్చి సముద్ర స్నానాలు చేయడం అనాదిగా వస్తోంది. దీనికోసం దేవదాయ, పోలీసు శాఖలతో పాటు, ఉప్పలంక గ్రామ పంచాయతీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఏటా మాఘమాసం ప్రారంభమయ్యే ముందు అమావాస్య రోజున తీర్థం జరుగుతుంది. తుల్యభాగ నదీ పాయ సముద్ర తీరంలో కలిసే ప్రాంతమే సాగర సంగమం అంటారు. చంద్రుడు శాప విమోచనం పొందడానికి తన భార్య రోహిణితో కలసి ఈ సాగర సంగమం వద్ద శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేయడంతో శివుడు ప్రత్యక్షమై మోక్షం కలిగించినట్టు పురాణ గాథలు చెబుతున్నాయి. చొల్లంగి వద్ద సుమారు నాలుగు వేల సంవత్సరాల క్రితమే రాజరాజేశ్వరీదేవి సమేత సోమేశ్వరస్వామి ఆలయం నిర్మించినట్టు ప్రసిద్ధి. మొండి వద్ద సముద్ర తీరాన 110 ఏళ్ల కిందట మల్లాడి సత్యలింగం నాయకర్ సంగమేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించినట్టు ఈ ప్రాంత ప్రజలు అంటున్నారు. ఈ ఆలయంలో బాలాత్రిపుర సుందరీ సమేత సంగమేశ్వరస్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ ఆలయానికి పక్కనే సీతారాముల ఆలయం, ఆంజనేయస్వామి, కాలభైరవస్వామి వార్ల ఆలయాలు ఉన్నాయి. తర్వాత పక్కనే ఉన్న చొల్లంగిలో చంద్రుడు ప్రతిష్ఠించిన రాజరాజేశ్వరీ సమేత సోమేశ్వర స్వామివారి శివలింగాన్ని భక్తులు దర్శించుకుంటారు. సంక్రాంతి తర్వాత వచ్చే పుష్య అమావాస్య రోజున సముద్ర స్నానం చేస్తే మోక్షం కలుగుతుందని భక్తుల విశ్వాసం. కాకినాడ జిల్లా నుంచే కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి సముద్ర స్నానమాచరించి సంగమేశ్వరస్వామి, భైరవస్వామి, సోమేశ్వర స్వామివార్లను దర్శించుకుంటారు. సప్త సాగర యాత్ర చొల్లంగి అమావాస్య మరుసటి రోజు నుంచి సప్త సాగర యాత్ర ప్రారంభమవుతుంది. చొల్లంగి, కోరంగి, తీర్థాల మొండి, రామేశ్వరం, బ్రహ్మసమేథ్యం, నాసంగితిప్ప, అంతర్వేదిలలో సముద్ర స్నానం చేస్తే సప్త సాగర యాత్ర పూర్తవుతుంది. సప్త సాగర యాత్ర తర్వాత అంతర్వేదిలోని లక్ష్మీ నరసింహస్వామి తీర్థం జరుగుతుంది. చంద్రునికి శివుడు ప్రత్యక్షమైనప్పుడు నందీశ్వరునికి కూడా వరమివ్వడం వల్లనే చొల్లంగి అమావాస్య రోజున అప్పన్నెద్దులను తీసుకొచ్చి సముద్రస్నానం చేయించడం జరుగుతుందని వేదపండితులు చెబుతుంటారు. గ్రామాల్లోని వీరభద్రుడి గద్దెల నుంచి ప్రభలను తీసుకొచ్చి చొల్లంగి తీర్థం రోజున సముద్ర స్నానం చేసి, సంగమేశ్వరస్వామి, భైరవస్వామి, సోమేశ్వరస్వామివార్లను దర్శించుకుంటారు. కాకినాడ రూరల్ సీఐ చైతన్యకృష్ణ ఆధ్వర్యాన కరప ఎస్సై టి.సునీత పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ మళ్లింపు చొల్లంగి తీర్థం రోజున కాకినాడ ఎంఎస్ఎన్ చారిటీస్ నుంచి మొండి వద్ద స్నానాల రేవు వరకూ ఉండే భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని ఉన్నతాధికారుల సూచన మేరకు ట్రాఫిక్ను ఒకరోజు (శనివారం అర్ధరాత్రి నుంచి) మళ్లిస్తున్నట్టు కరప ఎస్సై సునీత తెలిపారు. యానాం వైపు నుంచి తాళ్లరేవు మీదుగా వచ్చే వాహనాలు పటవల వద్ద నుంచి జి.వేమవరం, గొర్రిపూడి, పెనుగుదురు గ్రామాల మీదుగా కాకినాడకు చేరుకుంటాయన్నారు. కాకినాడ నుంచి తాళ్లరేవు, యానాం వైపు వెళ్లే వాహనాలు కాకినాడ, తూరంగి, నడకుదురు, గురజనాపల్లి గ్రామాల మీదుగా యానాం రోడ్డుకు చేరుకుని వెళ్తాయన్నారు. స్నానాల రేవు వద్ద, ఆలయం వద్ద భక్తులకు అసౌకర్యం కలగకుండా దేవదాయ, పోలీసు శాఖల అధికారులతో కలసి అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఉప్పలంక సర్పంచ్ బొమ్మిడి నయోమి, గ్రామ కార్యదర్శి ఎం.భవాని తెలిపారు. స్నానాల రేవు వద్ద గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచినట్టు, దర్శనాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నట్టు ఎంఎస్ఎన్ చారిటీస్ సీహెచ్ సురేష్నాయుడు తెలిపారు. మొండి వద్ద చొల్లంగి తీర్థం రోజున ప్రత్యేక వైద్య శిబిరం, ఆలయం వద్ద సమాచార కేంద్రం నిర్వహిస్తున్నట్టు కరప ఎంపీడీఓ జె.శ్రీనివాస్ తెలిపారు. ఫ రేపు ఉత్సవాల నిర్వహణ ఫ భారీగా తరలిరానున్న భక్తులు ఫ ఏర్పాట్లు చేసిన దేవదాయ, పోలీసు శాఖలు -
కాలభైరవుని కొలుద్దామా..
కాట్రేనికోన: పల్లం పంచాయతీ బ్రహ్మసమేథ్యం వద్ద సముద్ర తీరంలో కాలభైరవస్వామి ఆలయం ప్రసిద్ధి గాంచింది.. సంతానం లేని వారికి పండంటి బిడ్డను ప్రసాదించే మూర్తిగా ఈ స్వామి పేరొందారు.. ఆదివారం చొల్లంగి అమావాస్య సందర్భంగా స్వామివారి తీర్థ మహోత్సవాలకు సర్వం సిద్ధమైంది. శనివారం రాత్రి నుంచే స్వామివారి ఆలయానికి భక్తుల రాక మొదలవుతుంది. అగ్నికుల క్షత్రియుల ఆరాధ్య దైవం కాలభైరవుడిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. మడ అడవులు.. ఇసుక తిన్నెలు.. వివిధ పక్షులు.. రాత్రి వేళ నక్షత్రాల సాక్షిగా ఆ స్వామివారి దర్శనానికి పయనం చక్కని అనుభూతిని మిగుల్చుతుంది. ఆలయం వద్ద కమిటీ ఏర్పాటు చేస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తాయి. భక్తులు శనివారం రాత్రికి ఆలయానికి చేరుకుని ఆదివారం వేకువ జామునే సముద్ర స్నానం చేస్తూ సముద్ర గర్భం నుంచి ఉదయిస్తున్న సూర్యభగవానుడిని దర్శించుకోవచ్చు. బ్రహ్మసమేథ్యం వద్ద సముద్ర తీరంలో సంతాన మూర్తిగా వెలసిన కాలభైరవుడు స్వయం భువుడు. సుమారు 250 ఏళ్లకు పూర్వం సముద్రంలో చేపల వేటకు వెళ్లిన పూర్వికులకు కాలభైరవుడు, పార్వతీ సమేత బ్రహ్మేశ్వరుడు (బ్రహ్మ సూత్రం) ప్రతిమలు వలలో చిక్కుకున్నాయి. స్వయం భువులుగా వెలసిన విగ్రహాలను ప్రతిష్ఠించి ఆలయాలు నిర్మించి ఏటా చొల్లంగి అమావాస్య రోజున చొల్లంగి తీర్థ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. అయితే గత రెండేళ్ల క్రితం నూతన ఆలయాన్ని నిర్మించారు. ఆదివారం చొల్లంగి తీర్థం రావడంతో భక్తులు ముందు రోజు శనివారం సాయంత్రానికి ఆలయానికి చేరుకుంటారు. పల్లం, నీళ్లరేవు, చిర్రయానం, కొత్తపాలెం, మొల్లేటిమొగ తదితర గ్రామాల ప్రజలు వస్తుంటారు. స్వామికి ఇష్టమైన క్షీరాన్నం నైవేద్యంగా పెడతారు. స్వామి పాదముద్రలు ప్రత్యేకం తుపాను ప్రభావంతో తాడి చెట్టు ఎత్తున సముద్రం ఎగసి వస్తున్నప్పుడు స్వామి సముద్రానికి ఎదురుగా శిలపై కూర్చుని దంత ధావనం చేసుకున్నాడని, సముద్రం వెనుదిరిగి వెళ్లిపోయిందని పురాణ ప్రసిద్ధి. దీనికి గుర్తుగా ఆలయం ఎదుట స్వామివారి పాద ముద్రలు ఉన్న శిల భూమిలో దిగి ఉంటుంది. సంతాన ప్రదాతగా.. పిల్లలు లేని దంపతులకు పండంటి బిడ్డను ప్రసాదించే సంతాన మూర్తిగా కాలభైరవుడు ప్రసిద్ధి చెందారు. సంతానం లేని మహిళలు చొల్లంగి అమావాస్య రోజున రాత్రి వేళ సముద్ర స్నానం ఆచరించి తడి వస్త్రాలతో స్వామివారి పాదముద్రలపై పడతారు. తర్వాత మహిళలు నిద్రలోకి జారుకుంటారు. మహిళలకు నిద్రలో స్వామి నిదర్శనం ఇస్తారని ఆలయ అర్చకులు చెబుతుంటారు. సంతానం కలిగిన మహిళలు బిడ్డలతో పాటు స్వామిని దర్శించుకుని అరటి గెలను, కొబ్బరి మొక్కను మొక్కులుగా చెల్లిస్తారు. నూతన ఆలయం.. శోభాయమానం అత్యంత పురాతన కాలభైరవస్వామి ఆలయం జీర్ణ దశకు చేరుకోవడంతో పల్లం గ్రామ ప్రజలు ఆర్థిక సాయంతో అత్యంత అద్భుతంగా నూతన ఆలయాన్ని నిర్మించారు. కేశనకుర్రు గ్రామానికి చెందిన దివంగత గాదిరాజు వెంకట కృష్ణంరాజు జ్ఞాపకార్థం సత్యధనశ్రీ హేచరీస్ అధినేత గాదిరాజు చినసుబ్బరాజు, వెంకటలక్ష్మి దంపతుల ఆర్థిక సహాయంతో కాలభైరవ స్వామి, బ్రహ్మేశ్వరస్వామి, కనకదుర్గమ్మ, గంగమ్మ ఆలయాలకు పూర్తిగా గ్రానైట్ వేయించారు. మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్కుమార్ పర్యవేక్షణలో ఆలయం నిర్మాణం చేపట్టి ప్రహరీ, సముద్రం వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. ఇలా చేరుకోవచ్చు.. ఆలయానికి అమలాపురం నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంటుంది. అమలాపురం –పల్లం, అమలాపురం–కాట్రేనికోన, చిర్రయానం మీదుగా నీళ్లరేవుకు బస్సు సౌకర్యం ఉంటుంది. సొంత వాహనాలపై తీర్థానికి వచ్చే భక్తులు అమలాపురం నుంచి అనాతవరం–ఉప్పలగుప్తం–ఎన్ కొత్తపల్లి, గచ్చకాయలపోర–చిర్రయానం మీదుగా చొల్లంగి తీర్థానికి చేరుకోవచ్చు. బ్రహ్మసమేథ్యంలో రేపు తీర్థం -
● చాతుర్యానిదే పైచేయి..!
బాల్ గుండాటచక్రం గుండాట ఐ.పోలవరం: పాచికలాట సహజంగా అందరూ ఆడేదే. భారత కాలంలో పాచికలాటంటే ధర్మరాజుకు చాలా ఇష్టం. దానిని ఆసరా చేసుకుని అతని మేనమామ తన మాయా పాచికలతో అతని సర్వస్వాన్ని గెలిచి కురుక్షేత్ర యుద్ధానికి కారణమయ్యాడు. నాడు ఆ ఒక్క మాయా ద్యూతానికే కురువంశం నాశనమైంది. వర్తమానానికి వస్తే అటువంటి మాయా ద్యూతాలెన్నో. ప్రత్యేకించి సంక్రాంతి మూడు రోజుల్లో కోడి పందేలు, గుండాట, బాల్ గుండాట, చక్రం గుండాట వంటి జూదాలలో రూ.వందల నుంచి రూ.లక్షల వరకు పోగొట్టుకునే వారెందరో. వీటిలో కోడి పందేలది అగ్రస్థానం కాగా, ఆ తరువాత గుండాట. వీటితో పాటు మురమళ్ల, ఎస్.యానాం వంటి భారీ బరులు వద్ద జూదగాళ్లను ఆకర్షించేందుకు బాల్ గుండాట, చక్రం గుండాటలను కూడా నిర్వహించారు. వీటిలో డబ్బు పెట్టి ఎందరో రూ.లక్షలు పోగొట్టుకున్నారు. -
● కనులవిందుగా..
● పసందైన వంటకంబు అతిథి మర్యాదలకు గోదారోళ్లకు పేరుంది. దీనిని నిలబెట్టేలా పెరవలిలో కొత్త అల్లుడికి 220 రకాల పిండి వంటలతో విందు ఏర్పాటు చేయటం ఆకట్టుకుంది. పెరవలికి చెందిన ఆగర్తి వెంకట కృష్ణారావు, స్వరూపారాణి దంపతుల కుమార్తె భాగ్యశ్రీ లక్ష్మికి హైదరాబాద్కు చెందిన బొడ్డు భార్గవ్సాయితో ఐదు నెలల కిందట పెళ్లి జరిగింది. పండగకు అత్తింటికి వచ్చిర భార్గవ్సాయికి మకర సంక్రాంతి రోజున ఇలా వడ్డించారు. తానెప్పుడూ ఇన్ని వంటలు చూడలేదని, పేర్లు కూడా వినలేదని ఆయన ఆఽశ్చర్యంగా చెప్పారు. – పెరవలి ● పొట్టిగిత్త బండి.. అదిరిందండి సంక్రాంతి అంటేనే రైతు పండగ. తొలకరి పంట చేతికి అందిన తర్వాత రైతులు చేసుకునే పెద్ద పండగ ఇదే. కనుమ పండగ సందర్భంగా కొమరగిరిపట్నంలో రైతు మెట్ల చినకాపు పొట్టి గిత్తల బండికి పూజ నిర్వహించి శుక్రవారం ఊరేగించారు. ప్రస్తుతం కాడెద్దులు మచ్చుకై నా లేని తరుణంలో పొట్టిగిత్తలతో ఊరేగింపు నిర్వహించడం ఆశ్చర్యపరిచింది. సంస్కృతీ సంప్రదాయాలను మరిచిపోతున్న తరుణంలో ఇలాంటి దృశ్యాలే మళ్లీ జీవం పోస్తాయి. – అల్లవరంప్రత్తిపాడు రూరల్ మండలం రాచపల్లి అపిత కుచాంబ సమేత అరుణాచలేశ్వర స్వామివారి క్షేత్రంలో బసవేశ్వరునికి విశేష అలంకరణ ఆకట్టుకుంది. సంక్రాంతి పండగల నేపథ్యంలో వివిధ రకాల పిండి వంటలతో స్వామివారిని అలంకరించారు. పరిసర గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చి, అలంకరణ తిలకించి మంత్రముగ్ధులయ్యారు. – ప్రత్తిపాడు రూరల్ -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి సజీవ దహనం
వై.రామవరం: బైక్, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. వై.రామవరం ఎస్సై ఎస్.పృథ్వీ యాదవ్ కథనం ప్రకారం.. వై.రామవరం గ్రామ శివారులో గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనలో పి.యర్రగొండ గ్రామానికి చెందిన నైని బాబూరావు (40) అక్కడికక్కడే మృతి చెందాడు. ఏలేశ్వరం నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు, వై.రామవరం నుంచి పి.యర్రగొండ గ్రామానికి బైక్పై వెళ్తున్న బాబూరావులు ఎదురెదురుగా వెళ్తూ స్థానిక శివారులోని విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో బలంగా ఢీకొన్నారు. బాబూరావు బైక్తో పాటు బస్సు కిందకు వెళ్లిపోగా, బస్సు ఆయిల్ ట్యాంకు పగిలి బైక్తోపాటు అతను సజీవ దహనం అయ్యాడు. ఎస్ఐ పృథ్వీ యాదవ్ ఆధ్వర్యంలో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్థానిక సీహెచ్సీకి తరలించారు. ఆర్టీసీ బస్సును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. గోదావరిలో పడి యువకుడి మృతి తాళ్లపూడి: కొవ్వూరు వద్ద గోదావరిలో పడి ఓ యువకుడు శుక్రవారం మృతి చెందాడు. కొవ్వూరు పట్టణ సీఐ పి.విశ్వం కథనం ప్రకారం.. పెనకనమెట్టకు చెందిన వేములూరి దినేష్ (17) కొవ్వూరులోని దొండకుంట రేవు వద్ద గోదావరిలోకి స్నానానికి దిగాడు. మధ్యాహ్నం తన మామయ్య, మరో ఐదుగురు బంధువులు, కుటుంబ సభ్యులతో కలసి గోదావరిని, గామన్ బ్రిడ్జిని చూడటానికి వచ్చారు. ఈ నేపథ్యంలో వారంతా గోదావరిలో స్నానానికి దిగారు. ఇంతలో దినేష్కు ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తూ గోదావరిలో మునిగి గల్లంతయ్యాడు. అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు, పోలీసులు గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టగా అతని మృతదేహం లభ్యమైంది. లింకులు క్లిక్ చేయకండి.. పోలీస్ హెచ్చరిక పి.గన్నవరం: నాకు రూ.5 వేలు వచ్చాయి.. మొదట్లో నకిలీ అనుకున్నాను.. మీరు ప్రయత్నించి చూడండి.. మరో పది మందికి పార్వర్డ్ చేయండి అంటూ వాట్సాప్ గ్రూపుల్లో వస్తున్న లింకులను క్లిక్ చేయవద్దని పి.గన్నవరం ఎస్సై బి.శివకృష్ణ హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు రకరకాలుగా ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు. వాట్సాప్, పేస్బుక్, ఇన్స్ర్ట్రాగామ్ల నుంచి వచ్చే లింకులను ఓపెన్ చేయవద్దన్నారు. ఆ లింకులు ఓపెన్ చేస్తే మీ అకౌంట్లు హ్యాక్ అవుతాయన్నారు. బ్యాంకు అకౌంట్లలో నగదు కాజేస్తారన్నారు. ఇటువంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. -
జగన్ పాలనే మెరుగు
● చంద్రబాబు ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న యువత ● మళ్లీ జగన్ వస్తేనే ప్రజల వద్దకు పాలన వస్తుందని ఆశాభావం గోకవరం: ఎన్నో హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం కంటే గత వైఎస్సార్ సీపీ పాలనే ఎంతో మెరుగ్గా ఉందని పలువురు ఎన్ఆర్ఐలు, ఇతర రాష్ట్రాల్లో పని చేస్తున్న వారు అభిప్రాయపడుతున్నారు. తంటికొండ గ్రామానికి చెందిన బద్దిరెడ్డి ధర్మరాజు ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నారు. అలాగే, బద్దిరెడ్డి కార్తీక్ హైదరాబాద్, దాసరి దొరబాబు, బద్దిరెడ్డి రాజారాం వివిధ రాష్ట్రాల్లో పని చేస్తున్నారు. వీరందరూ సంక్రాంతి పండగకు స్వగ్రామానికి వచ్చారు. వీరు గ్రామంలో పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ రాష్ట్రంలో పరిపాలనపై చర్చించుకున్నారు. ‘సాక్షి’ పలకరించగా రాష్ట్రంలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వ పని తీరుపై గుర్తించిన పలు విషయాలను వారు పంచుకున్నారు. బద్దిరెడ్డి కార్తిక్ మాట్లాడుతూ వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా ప్రజల వద్దకు పాలన అందించే దిశగా గ్రామ సచివాలయాలు, విలేజ్ హెల్త్ క్లినిక్లు, రైతు భరోసా కేంద్రాలు నిర్మించారన్నారు. గతంలో రేషన్ తీసుకోవడానికి పనులు మానుకుని గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సి వచ్చేదని, ఆ కష్టాలు తీరేలా ఇంటి వద్దకే రేషన్ సరఫరా చేశారని గుర్తు చేసుకున్నారు. బద్దిరెడ్డి ధర్మరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్య, వైద్యానికి జగన్ విశేషంగా కృషి చేశారని కొనియాడారు. నాడు – నేడు పథకంలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్దిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వాస్పత్రి భవనాలను ఆధునీకరించి నాణ్యమైన వైద్య సేవలందించారన్నారు. ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాలల ఉండాలనే లక్ష్యంతో నూతన వైద్య కళాశాలల నిర్మాణం చేపట్టారని అన్నారు. కానీ ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఈ పథకాల అమలులో వెనుకబడిందని అభిప్రాయపడ్డారు. వలంటీర్లలను తొలగించి సచివాలయ వ్యవస్థను నీరుగార్చారన్నారు. ఇంటింటికీ రేషన్ రద్దు చేయడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో చేపట్టిన వైద్య కళాశాలలను పూర్తి చేయకుండా ప్రైవేటీకరించేందుకు చూస్తున్నారని ఆరోపించారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు పేరుతో ప్రయాణికులందరినీ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. మళ్లీ జగన్ ముఖ్యమంత్రి అయితే ప్రభుత్వ పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. -
ప్రభల తీర్థం.. కన్నుల వైభవం
● కోనసీమ ప్రభలకు ఎంతో గుర్తింపు ● ఇతర రాష్ట్రాల నుంచీ భక్తుల రాక సాక్షి, అమలాపురం/అంబాజీపేట/ కొత్తపేట: జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడ జరిగే ఉత్సవాలను తిలకించడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు తరలివచ్చారు. ముఖ్యంగా కోనసీమలో జరిగే ప్రభల ఉత్సవాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సంక్రాంతి, కనుమ, ముక్కనుమ రోజున జిల్లా వ్యాప్తంగా సుమారు 40 వరకు ప్రభల తీర్థాలు జరుగుతాయి. వాటిలో కొత్తపేట, జగ్గన్నతోటలో జరిగే ప్రభల ఉత్సవాలు ముఖ్యమైనవి. వీటితో పాటు చిరుతపూడి (అవిడి డ్యామ్ సెంటర్), మామిడికుదురు మండలం కొర్లగుంట, కాట్రేనికోన మండలం చెయ్యేరులలో అతి పెద్ద ప్రభల తీర్థాలు నిర్వహిస్తారు. జగ్గన్నతోటలో.. అంబాజీపేట మండలం మొసలపల్లి – ఇరుసుమండ గ్రామాల మధ్య గల ఏకాదశ రుద్రుల ప్రభల తీర్థాలు జరుగుతాయి. వ్యాఘ్రేశ్వరం – వ్యాఘ్రేశ్వరుడు, కె.పెదపూడి – మేనకేశ్వరుడు, ఇరుసుమండ – ఆనంద రామేశ్వరుడు, వక్కలంక – విశ్వేశ్వరుడు, నేదునూరు – చెన్నమల్లేశ్వరస్వామి. ముక్కామల – రాఘవేశ్వరుడు, మొసలపల్లి – భోగేశ్వరుడు, పాలగుమ్మి – చెన్న మల్లేశ్వరుడు, గంగలకుర్రు అగ్రహారం – వీరేశ్వరుడు, గంగలకుర్రు – చెన్నమల్లేశ్వరుడు, పుల్లేటికుర్రు – అభినవ వ్యాఘ్రేశ్వరుడు ప్రభలు ప్రసిద్ధి చెందాయి. సంక్రాంతి నాడే.. కొత్తపేట ప్రభల తీర్థం మకర సంక్రాంతి రోజునే నిర్వహించడం ఆనవాయితీ. ఆయా వీధులకు చెందిన 11 ప్రభలు వివిధ దేవతా మూర్తులను అలంకరించుకుంటాయి. ఈ సందర్భంగా బాణసంచా కాల్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సాయంత్రం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో, రాత్రి బస్టాండ్ వద్ద బాణాసంచా కాల్పులు నిర్వహిస్తారు. పాత రామాలయం వీధి పరిధిలోని బోడిపాలెం వీధి వారు కొన్నేళ్లుగా మూడో వీధిగా అరంగేట్రం చేసి, సాయంత్రం పైరెండు వీధులతో పాటు బాణసంచా కాల్చుతున్నారు. 55 అడుగుల ఎత్తులో.. అంబాజీపేట మండలం వాకలగరువు రావిచెట్టు సెంటర్లో జరిగే తీర్థానికి అరుదైన గుర్తింపు ఉంది. జిల్లాలో జరిగే ప్రభల తీర్థాలలోని ప్రభలన్నింటికన్నా ఇక్కడ అతి పెద్ద ప్రభలను ఉంచుతారు. తొండవరం ఉమా తొండేశ్వరస్వామి, వాకలగరువు ఉమా సర్వేశ్వరస్వామితో పాటు గున్నేపల్లి ప్రభలు కొలువు తీరుతాయి. వాకలగరువు, తొండవరం ప్రభలు ఎత్తుగా నిర్మించడంలో ఒకదానికొకటి పోటీ పడుతూ ఉంటాయి. ఈ రెండు ప్రభలను 55 అడుగుల ఎత్తుతో నిర్మిస్తారు. బరువు టన్నుకు పైబడే.. తాటి, వెదురు, పోక చెట్లను ఉపయోగించి భారీ ప్రభలను తయారు చేస్తుంటారు. రంగు రంగు కంకర్లు, నూలు వస్త్రాలతో వీటిని అందంగా ముస్తాబు చేస్తారు. వీటికి వరి కంకులు, కూరగాయలతో పాటు నెమలి పింఛాలను అలంకరిస్తారు. సుమారు 10 అడుగుల నుంచి 20 అడుగుల వెడల్పు, 20 అడుగుల నుంచి 55 అడుగుల ఎత్తు వరకు ఉండే ఈ ప్రభలు కనీసం టన్ను బరువు ఉంటాయి. గుర్తింపు సరే.. నిధులు ఎక్కడ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం దీనిని రాష్ట్ర పండగా గుర్తించింది. తాము వచ్చాకా ప్రభల తీర్థానికి గుర్తింపు వచ్చిందన్నట్టుగా ప్రచారం చేసుకుంటోంది. అయితే ఈ గుర్తింపు వల్ల ఈ తీర్థానికి ఒనగూరే ప్రయోజనం ఏమిటనేది మాత్రం చెప్పడం లేదు. అధికారులు మాత్రం ఈ గుర్తింపు వల్ల కేవలం పరిపాలనా సౌకర్యాలు మాత్రమే కలుగుతాయని చెబుతున్నారు. నిధుల మంజూరు విషయంలో మాత్రం ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. జగన్ ప్రభుత్వంలోనే అసలైన గుర్తింపు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో జగ్గన్నతోట ప్రభల తీర్థానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. 2023లో ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పెరేడ్లో దీనిని రాష్ట్ర శకటంగా గుర్తించి ప్రదర్శనకు ఉంచారు. తీర్థం ఉట్టిపడేలా ఈ శకటం మీద పదకొండు ప్రభలను సంప్రదాయ బద్ధంగా తయారు చేసి ఏర్పాటు చేశారు. నాటి రిపబ్లిక్డే పెరేడ్తో ఇది జాతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విషయాన్ని కోనసీమ వాసులు ఇప్పుడు గుర్తుకు చేసుకుంటున్నారు. -
బరితెగించి.. జూదమాడి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కోర్టు ఆర్డరన్నారు.. బరులు దున్నేశామని, ఎక్కడైనా కోడిపందేలు, గుండాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటనలు ఊదరగొట్టేశారు. చిన్న బరులు.. నోరూ వాయిలేని చిన్నోళ్ల బరులు ట్రాక్టర్లతో దున్నించేసి జబ్బలు చరిచేసుకున్నారు. ఇదంతా చూసినవాళ్లు ఈ ఏడాది జిల్లాలో ఎక్కడా కోడి పందేలు ఉండవేమో.. అబ్బో మన పోలీసు యంత్రాంగం ఆహా.. ఓహో అనుకున్నారు. కానీ బడా బాబులు ఏర్పాటు చేసిన.. ప్రజా ప్రతినిధులు అండగా నిలచిన.. డబ్బూ, పలుకుబడి ఉన్నవాళ్లు నిర్వహించే బరులు ఎక్కడున్నాయో.. ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో తెలిసినా కనీసం కాలు మోపే సాహసం చేయలేక చివరాఖరికి భారీ స్థాయిలో కోడి పందేలు నిర్వహిస్తున్నా ఆ వైపు వెళ్లే ప్రయత్నం కనీసం చేయలేక సాగిలబడిపోయారు. చివరి నిమిషం వచ్చేసరికి ప్రతి గ్రామంలోనూ ఎవరి స్థాయిలో వారు బరులు ఏర్పాటు చేసి కోడి పందేలు నిర్వహించారు. కూటమి నాయకుల ఆధ్వర్యంలో పాటలు పెట్టి మరి కోడిపందాలు గుండాట నిర్వహించారు. ప్రతి గ్రామంలోనూ రూ.లక్షలు చేతులు మారాయి. కోడిపందేల బరుల వద్ద మద్యం విక్రయాలు యథేచ్ఛగా సాగిపోయాయి. ప్రతి బాటిల్ వద్ద రూ.50 నుంచి రూ.100 అదనంగా వసూలు చేశారు. ఇంత జరుగుతున్నా పోలీస్ శాఖ జాడ ఎక్కడా కనిపించలేదు. జిల్లా అధికారులు కేవలం ప్రకటనకు మాత్రమే పరిమితం అయ్యారు. ప్రధాన రహదారుల పక్కనే కోడిపందేలు నిర్వహించారు. ప్రత్యేక టెంట్లు వేసి గుండాట నిర్వహించినా పోలీసు శాఖ ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో కూటమి నేతలు బరితెగించి కోడిపందేలు గుండాట ఇష్టానుసారంగా నిర్వహించారు. కళ్లు మూసుకున్న ఎకై ్సజ్శాఖ ప్రతి గ్రామం, నగరంలోనూ కోడిపందేల బరుల వద్ద మద్యం విక్రయాలు భారీగా సాగాయి. బీరుతో పాటు లిక్కరు కూడా విక్రయించారు. ఒక్కొక్క బీరు ఎమ్మార్పీ కంటే వంద రూపాయలు అదనంగా వసూలు చేశారు. ఇక లిక్కరు కూడా క్వార్టర్ బాటిల్ వద్ద 50 నుంచి 100 వరకు అక్రమంగా వసూలు చేశారు. ఇంత జరుగుతున్నా ఎకై ్సజ్ శాఖ అధికారులు కనిచూపు మేరలో కానరాలేదు. మామూళ్ల మత్తులో.. పోలీసు అధికారులు బరుల వద్దక వచ్చినా కోడిపందేలు, గుండాట నిర్వహించకుండా చర్యలు తీసుకోవడం మానేసి డబ్బులు దండుకుని వెళ్లిపోయినట్టు కొందరు ఆరోపించారు. మేము స్టేషన్కు మామూళ్లు ముందుగానే చెల్లించామని వచ్చిన ప్రతి పోలీసుకు డబ్బులు ఇవ్వలేమని అక్కడ కూటమి నాయకులు పోలీసులకు తెగేసి చెప్పారు. వచ్చినందుకు ఎంతోకొంత ఇవ్వాలని పోలీసులు కాళ్లా వేళ్లాపడి మరీ మామూళ్లు గుంజుకున్నారని వారు వాపోయారు. కోడిపందేల బరుల వద్ద మందుబాబులు కోడి కత్తులతో హల్చల్ చేశారు. దీంతో కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని కొవ్వూరు హైవేలో నిర్వహించిన బరిలో కోడికత్తులతో దాడి చేసుకోవడంతో ఒక వ్యక్తి చేతికి తీవ్రగాయమైంది. దీంతో అతని బంధువులు అతనిని ఆసుపత్రికి తరలించారు. టీడీపీ, జనసేన నేతల గొడవ.. కాకినాడ సిటీ నియోజకవర్గంలో స్థానిక 8వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ చీకోటి అప్పలకొండ ఆధ్వర్యంలో సర్వహంగులతో కోటి పందేలు, గుండాట నిర్వహించారు. కోడిపందేలు చూసేవారికి సైతం కుర్చీలు ఏర్పాటు చేశారు. తమకు డబ్బులు ఇవ్వలేదని జనసేన నాయకులు, టీడీపీ నాయకులతో గొడవకు దిగారు. మేమే పార్టీ పెద్దలకు డబ్బులు ఇచ్చామని, జనసేన నాయకులందరికీ డబ్బులు ఇవ్వలేమని టీడీపీ నాయకులు చెప్పడంతో వారు అక్కడ కొంతసేపు గలాటా సృష్టించారు. నగరంలో మూడు ప్రాంతాల్లో గుండాట, కోడి పందేలు రోడ్డు పక్కనే నిర్వహించారు. సుమారు 30 లక్షలు వరకూ చేతులు మారాయి. పెద్దాపురంలో జోరుగా.. పెద్దాపురం నియోజకవర్గ పరిధిలో కోడిపందేలు జోరుగా సాగాయి. పోలీసులు కోడిపందాలకు అనుమతి లేదని హెచ్చరికలు జారీ చేస్తూ టెంట్లను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. కాగా నియోజకవర్గంలో గుడివాడ, గోరింట, పులిమేరు, ఆర్బీ కొత్తూరు ఆర్బీ పట్నం కాండ్రకోట కట్టమూరు సామర్లకోట మండల పరిధిలో జి.మేడపాడు, బీబీ దేవం, ఉండూరు అచ్చంపేట పనసపాడు గ్రామాల్లో జోరుగా కోడిపందాలు జరిగాయి. మొదటి రోజున రూ.రెండు కోట్ల వరకు కోడిపందాలు జరిగినట్లు అంచనా. రూ.కోటికి పైగా చేతులు మారి.. ప్రత్తిపాడు మండలం ప్రత్తిపాడు, రాచపల్లి, ఒమ్మంగి, ధర్మవరం, ఏలేశ్వరం మండలం ఏలేశ్వరం, భద్రవరం, శంఖవరం మండలం శంఖవరం కత్తిపూడి రౌతులపూడి మండలం రౌతులపూడి ములగపూడి తదితర గ్రామాల్లో కోడిపందేలు నిర్వహిస్తున్నారు. సుమారు రూ.కోటి పైగా చేతులు మారినట్లు తెల్సింది. ఉదయం నుంచే పందేలు.. నియోజకవర్గంలో జోరుగా కోడిపందేలు నిర్వహించారు. కాకినాడ రూరల్ తిమ్మాపురం, సర్పవరం, వాకలపూడి, వలసపాకల, గొడారిగుంట, చీడిగ, కరప మండలం, కరప, నడకుదురు, పెనుగుదురు, వేళంగి తదితర ప్రాంతాల్లో జోరుగా కోడిపందేలు జరిగాయి. ఉదయం నుంచే బరుల వద్ద పందాలు నిర్వహించడంతో ఎక్కువగా జనం వచ్చారు. సుమారు రూ.కోటి వరకు చేతులు మారినట్టు తెలుస్తోంది. పండగ ముసుగులో జూదాలు.. మెట్ట ప్రాంతమైన జగ్గంపేట నియోజకవర్గంలో సంక్రాంతి పండగ ముసుగులో కోడి పందేలు, గుండాటలు భారీ ఎత్తున నిర్వహించారు. జగ్గంపేటలో మల్లిసాల, రాజపూడి, గోవిందపురం, కాట్రావులపల్లి, మామిడాడ, నరేంద్రపట్నం, జగ్గంపేట గ్రామాల్లో కోడిపందేలు, గుండాలు నిర్వహించారు. కిర్లంపూడి మండలంలో కిర్లంపూడి, వేలంక, తామరాడ, గోనాడ, వీరవరం, కష్ణవరం గ్రామాల్లో కోడిపందేలు, గుండాటలు జోరుగా సాగాయి. అలాగే గోకవరం మండలంలో గోకవరం, కొత్తపల్లి, మల్లవరం, కామరాజుపేట, కృష్ణునిపాలెం, వెదురుపాక, రంపయర్రంపాలెం, తిరుమలాయపాలెం, తంటికొండ గ్రామాల్లో కోడిపందేలు, గుండాటలు జోరుగా జరుగుతున్నాయి. గండేపల్లి మండలంలో గండేపల్లి, మల్లేపల్లి, యల్లమిల్లి, నీలాద్రిరావుపేట, ఎస్టి రాజాపురం, ఉప్పలపాడు, సింగరంపాలెం, కె.గోపాలపురం గ్రామాల్లో కోడిపందేలు, గుండాలు నిర్వహిస్తున్నారు. ఆయా గ్రామాల్లో స్థానిక టిడిపి నాయకుల ఆధ్వర్యంలో ఈ జూదాలు నిర్వహించారు. ఒక్కరోజు సుమారు 3 కోట్లు పైగా జూదాలు జరిగినట్టు సమాచారం కూటమి కట్టి 32 బరులు.. పిఠాపురం, పిఠాపురం రూరల్, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాల్లో జనసేన, టీడీపీ నాయకులు 32 బరులు ఏర్పాటు చేశారు. కోడిపందేలు, గుండాటలు జోరుగా జరుగుతున్నాయి. రోజుకి నియోజకవర్గ పరిధిలో రూ.3 కోట్లు వరకు చేతులు మారినట్టు అంచనా. నియోజకవర్గంలో 28 బరులలో టీడీపీ, జనసేన నాయకులు కలిసి ఏర్పాటు చేసుకోగా, నాలుగు బరులను జనసేన, టీడీపీ నాయకులు వేర్వేరుగా నిర్వహించారు. తుని నియోజకవర్గంలో భారీగా.. తుని మండలం తేటగుంట, ఎస్.అన్నవరం హంసవరం, కుమ్మరి లోవ, వి కొత్తూరు, రాజుపేట, ఎస్.సురవరం, డి.పోలవరం గ్రామాలలో కోడిపందేలు జరిగాయి. కోటనందూరు మండలం కాకరపల్లిలో భారీగా కోడిపందేలు నిర్వహించారు. కాకినాడ అనకాపల్లి జిల్లాలకు చెందిన జూదర్లు ఈ పందేల్లో పాల్గొన్నారు. తొండంగి మండలంలో వేమవరం, సీతారాంపురం, పెరుమాళ్లపురం, రావికంపాడు ఎ.కొత్తపల్లి, పైడికొండ, శృంగవృక్షం వాకదారిపేట తాటి ఆకులపాలెం, బెండపూడి గ్రామాల్లో కోడిపందేలు జోరుగా సాగాయి. సుమారు రెండు కోట్లు చేతులు మారినట్టు తెలిసింది. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కోడిపందేల బరి వద్ద గుండాటాడుతున్న జూదగాళ్లుకాకినాడ రూరల్లో కోడికత్తులతో చేసిన దాడిలో గాయపడిన యువకుడు కూటమి నేతల ఆధ్వర్యంలో కోడిపందేలు, గుండాట ప్రకటనలకే పరిమితమైన అధికార యంత్రాంగం చేతులు మారిన రూ.కోట్లు కాకినాడలో పంపకాల కోసం ఘర్షణలు బరుల వద్ద యథేచ్ఛగా మద్యం విక్రయాలు -
పీపీపీ విధానాన్ని అడ్డుకుంటాం
తుని రూరల్: ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, అనుబంధ 500 పడకల ఆస్పత్రులను పీపీపీ విధానంలో ప్రైవేటీకరించే విధానాన్ని అడ్డుకుంటామని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు. బుధవారం ఎస్.అన్నవరంలోని పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన భోగిమంటలో ఆ జీఓ ప్రతులను నాయకులు, కార్యకర్తలతో కలసి ఆయన దగ్ధం చేశారు. కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబునాయుడికి మంచి బుద్ధి ప్రసాదించాలని సూర్యభగవానుడిని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో జిల్లాకు ఒకటి చొప్పున వైద్య కళాశాల, బోధనాస్పత్రుల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారన్నారు. ఇందులో ఏడు వైద్య కళాశాలలు పూర్తికాగా మిగిలిన పది కళాశాలలు వివిధ దశలలో నిర్మాణంలో ఉన్నాయన్నారు. జగన్ చిత్తశుద్ధితో ఏర్పాటు చేసిన ఈ కళాశాలలు, ఆస్పత్రులను చంద్రబాబు ప్రభుత్వం తన అనుచరులకు ఎకరా రూ.వంద చొప్పు 66 ఏళ్లకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు. రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందించాలన్న వైఎస్సార్ సీపీ లక్ష్యాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. వైద్య కళాశాలలు, బోధనాసుపత్రులు రాష్ట్ర ప్రజల సంపద అని, వాటిని ఎవరూ విక్రయించలేరన్నారు. ప్రజల ఆస్తులకు చంద్రబాబు కస్టోడియన్ మాత్రమే అన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 99 పైసలకే ఇచ్చేస్తాననడం సరికాదన్నారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ కంపెనీలు, ఊరు పేరు లేని కంపెనీలకు రూ.వేలాది కోట్ల విలువైన ఆస్తులు ధారాదత్తం చేయడం మంచిదికాదన్నారు. గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్రెడ్డి రూ.3.33 లక్షల కోట్లు అప్పు చేస్తే 19 నెలల్లో కూటమి ప్రభుత్వం రూ.3.02 లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు. సంపద సృస్టిస్తామని అధికారంలోకి వచ్చి కేంద్రం సహకారంతో విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం పునరాలోచించి గ్రాంట్లు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నారు. మీ బలంతో కేంద్ర ప్రభుత్వం నిలబడిందని, అందువల్ల గ్రాంట్లు తీసుకురావాలన్నారు. రాజ్యాంగం రచించిన డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ విగ్రహాన్ని తక్కువ డబ్బుతో జగన్మోహన్రెడ్డి పూర్తి చేసి రాష్ట్ర ఆస్తిగా అప్పగించారన్నారు. ఆ విగ్రహానికి 19 నెలలుగా సరైన నిర్వహణ చేయడం చేతకాలేదన్నారు. ఎన్టీ రామారావు అంటే మాకు గౌరవమే. దురదృష్టవాశాత్తు రెండు సార్లు వెన్నుపోటుకు గురయ్యారు. ఒక పార్టీకి సంబంధించిన మనిషి, ఆ పార్టీ నిధులతో 600 కాదు 1600 అడుగుల విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని, రూ.1750 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసి విగ్రహం ఏర్పాటు చేయడంపై సరికాదన్నారు. మీ పార్టీ దగ్గర రూ.వేలాది కోట్లు ఉన్నాయి. ఆ డబ్బు ఖర్చు చేసి మీ నాయకుడిని గౌరవించుకోవాలన్నారు.ఈ డబ్బుతో నాలుగైదు వైద్య కళాశాలలు పూర్తవుతాయన్నారు. వైఎస్సార్ సీపీ, అనుబంధ విభాగాల నాయకులు నాగం దొరబాబు, రేలంగి రమణ గౌడ్, రాయి మేరీ అవినాష్, అన్నంరెడ్డి వీర్రాఘవులు, అంగుళూరి సుశీల, చింతల సునీత, పట్టణ, తుని, తొండంగి మండలాల పార్టీ అధ్యక్షులు అన్నవరం శ్రీను, దుంగల నాగేశ్వరరావు, బత్తుల వీరబాబు, పోతల రమణ, చింతల వెంకటరమణ పాల్గొన్నారు. ప్రజల ఆస్తులకు సీఎం కస్టోడియన్ మాత్రమే మాజీ మంత్రి దాడిశెట్టి రాజా భోగి మంటలో జీఓ ప్రతుల దగ్ధం వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు నిరసన -
కల్యాణం.. కడు వైభోగం
వాడపల్లి క్షేత్రంలో గోదాదేవి కల్యాణం నిర్వహిస్తున్న పండితులు స్వామి, అమ్మవార్లకు కల్యాణ వస్త్రాలు తీసుకు వస్తున్న చైర్మన్ రాజు, ఈఓ చక్రధరరావు దంపతులు కొత్తపేట: వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రంలో గోదాదేవి కల్యాణం చూసిన కనులదే భాగ్యం అన్నట్లు సాగింది. దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో ఆలయ చైర్మన్ ముదునూరి వెంకట్రాజు ఆధ్వర్యంలో గోదారంగనాథ స్వామివారి కల్యాణ వేడుకలు నిర్వహించారు. సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని క్షేత్రాన్ని ప్రత్యేక పుష్పాలతో అలంకరించారు. భోగి పండగ సందర్భంగా మంట వేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం అర్చకులు, వేద పండితులు గోదాదేవిని పెండ్లి కుమార్తెగా, రంగనాథ స్వామిని పెండ్లి కుమారుడిగా అలంకరించి భక్తజనం నడుమ ఆ క్షేత్రంలోని కల్యాణ వేదిక పైకి తోడ్కొని వచ్చారు. స్వామివారికి ఎమ్మెల్యే సత్యానందరావు, చైర్మన్ వెంకట్రాజు, డీసీ అండ్ ఈఓ చక్రధరరావు దంపతులు కల్యాణ పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం కల్యాణ క్రతువును వేదపండితులు కన్నుల పండువగా నిర్వహించారు. ధనుర్మాస వ్రతంలో భాగంగా అమ్మవారు అనుగ్రహించిన తిరుప్పావైని అనుసంధానించి, చివరిగా కల్యాణంతో ముగించి గోదారంగనాథుల కృపకు పాత్రులు కావడం అత్యంత అవశ్యమని పండితులు చెప్పారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని వేడుకలు తిలకించారు. సుమారు రెండు వేల మంది అవివాహితులు యువతీ, యువకులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదం స్వీకరించారు. -
రాజకీయ ఫ్లెక్సీల ఏర్పాటుపై గరం గరం
● జగ్గన్నతోటలో ఎన్నడూ లేని సంస్కృతి ● ఫ్లెక్సీలు తొలగించకుంటే తీర్థానికి వచ్చేది లేదన్న గ్రామస్తులు అంబాజీపేట: కనుమ రోజున మొసలపల్లి శివారు జగ్గన్నతోటలో నిర్వహించే ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై వివాదం రగులుతోంది. బుధవారం గంగలకుర్రులో గంగలకుర్రు అగ్రహారం, గంగలకుర్రులకు చెందిన గ్రామస్తులు సమావేశం నిర్వహించారు. జనసేన పార్టీకి సంబంధించి ఫ్లెక్సీని ఏర్పాటు చేసి జగ్గన్నతోటను రాజకీయ తీర్థంగా మార్చారని సమావేశం ఆరోపించింది. మునుపెన్నడూ లేనివిధంగా జగ్గన్నతోట ప్రభల తీర్థానికి రాజకీయ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నూతన సంస్కృతికి తెర తీశారని ప్రభల కమిటీ సభ్యులు ఆరోపించారు. ఫ్లెక్సీలు తొలగించకుంటే రెండు గ్రామాల నుంచి వచ్చే ప్రభలు కౌశిక గట్టుపైనే ఉండి, తీర్థంలోకి వచ్చేది లేదన్నారు. అనంతరం ప్రభలు జరిగే జగ్గన్నతోట ప్రాంతాన్ని గ్రామస్తులు, భక్తులు పరిశీలించారు. ఈ విషయమై పి.గన్నవరం సీఐ ఆర్.భీమరాజుకు ఫిర్యాదు చేశారు. 470 ఏళ్ల చరిత్ర కలిగిన జగ్గనతోట ప్రభల తీర్థంలో ఇప్పటి వరకూ ఎటువంటి రాజకీయ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయలేదని, జనసేన పార్టీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి భక్తుల మనోభావాలకు భంగం కలిగించవద్దన్నారు. శివకేశవ యూత్ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రభల తీర్థ విశిష్టతను తెలుపుతూ 2020లో ప్రధాని మోదీకి లేఖ రాశారని, దానికి బదులుగా ఏకాదశ రుద్రులపై సందేశం పంపారన్నారు. 2023లో 74వ గణతంత్ర వేడుకల్లో ఏకాదశ రుద్రుల ప్రభలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శకటంగా ప్రదర్శించినప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్లతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయలేదని గంగలకుర్రు అగ్రహారానికి చెందిన ఎంఎం శెట్టి వివరించారు. సీఐ మాట్లాడుతూ రాష్ట్ర పండగగా ప్రకటించిన నేపథ్యంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఫ్లెక్సీని నిబంధనల మేరకు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. తీర్థంలో కాకుండా బయట ఏర్పాటు చేసుకుంటే ఎటువంటి అభ్యంతరం లేదని, పార్టీ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం అభ్యంతరకరమని తక్షణమే తొలగించాలని సీఐకు వారు వివరించారు. ఎమ్మెల్యే ఫ్లెక్సీలను తొలగించడం కుదరదని, చట్టవిరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు. ఇదిలా ఉండగా జగ్గన్నతోట ప్రభల తీర్థంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో గ్రామాల్లో ఘర్షణలు, కవ్వింపు చర్యలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఆయా గ్రామాల ప్రభల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. -
శివమణికంఠకు జాతీయ స్థాయి గుర్తింపు
కోటనందూరు: ఢిల్లీలోని భారత్ మండపంలో ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకూ నిర్వహించిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ –2026లో కోటనందూరు మండలం కేఈ చిన్నయ్యపాలేనికి చెందిన కొరుప్రోలు శివమణికంఠ పాల్గొన్నారు. పాఠశాల స్థాయి నుంచే ప్రయోగిక విద్యను అందిస్తూ ప్రయోగశాల జ్ఞానాన్ని నేరుగా పొలాలకు తీసుకెళ్లే విధానాన్ని ఆయన ప్రతిపాదించారు. శివమణికంఠ తన అభిప్రాయాన్ని ప్రధాని నరేంద్రమోదీ ముందు ప్రత్యక్షంగా పంచుకున్నారు. టాప్– 5 ప్రతిపాదనల్లో శివమణికంఠ ప్రతిపాదన ఉండడంతో ఆయనకు జాతీయ గుర్తింపు లభించింది. విద్య, పరిశోధనకు వ్యవసాయాన్ని అనుసంధానించే తన తన వినూత్న ఆలోచనలు దేశ వ్యవసాయ అభివృద్ధికి దిశానిద్దేశం చేస్తాయని నిపుణులు అన్నారు. విజయనగరం ట్రైబుల్ వెల్ఫేర్ సెంట్రల్ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతున్న శివమణికంఠను స్థానిక పెద్దలు, అధ్యాపకులు అభినందించారు. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య చింతూరు: స్థానిక శబరినది ఒడ్డున చెట్టుకు ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ రమేష్ కథనం ప్రకారం.. శబరినది ఒడ్డున ఓ వ్యక్తి మృతదేహం చెట్టుకు వేలాడుతూ ఉండడాన్ని ప్రజలు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ మృతదేహాన్ని కిందకు దింపి పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడు కాకినాడ జిల్లా ఏలేశ్వరం గ్రామానికి చెందిన చెందక వెంకటేష్(27)గా గుర్తించామని, సెల్ఫోన్లోని నంబర్ల ఆధారంగా బంధువులకు సమాచారం ఇచ్చినట్లు ఆయన వివరించారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రపంచంలోనే శక్తివంతం ఏకాదశ రుద్రులు అంబాజీపేట: విజయనగర సామ్రాజ్యంలో నిర్మించిన ఎన్నో ప్రాచీన దేవాలయాలు నేడు జీర్ణ దశకు చేరుకోవడంతో వాటి పునర్నిర్మాణం కోసం ప్రపంచంలోనే ఎంతో శక్తివంతమైన ఏకాదశ రుద్రుల ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చినట్లు హంపీలోని పంపా క్షేత్ర పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ గోవిందానంద సరస్వతి స్వామీజీ అన్నారు. కె.పెదపూడిలో ప్రముఖ సిద్ధాంతి రాపాక శేషాచలం స్వగృహంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ కోనసీమలో ఎంతో శక్తివంతమైన ఏకాదశ రుద్రుల దేవాలయాలతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లో అన్నవరం, అంతర్వేది లాంటి ఎన్నో మహిమాన్విత దేవాలయాలు ఉన్నాయన్నారు. విజయనగర సామ్రాజ్యంలో హంపిలో నిర్మించిన పలు దేవాలయాలు జీర్ణోద్ధారణ చేసే ముందు కోనసీమలో ఉన్న ఏకాదశ రుద్రుల దర్శించుకోవడం శ్రేయస్కరమని స్వామీజీ చెప్పారు. ఏకాదశ రుద్రుల పేర్లు వేరైనా వారి అంశ ఒక్కటేనని అన్నారు. ఏకాదశ రుద్రులు ఈ నాటివారు కారని వేదాలలోనే ఉందన్నారు. అయోధ్యలో రామ జన్మభూమి ఉన్నట్లు హంపిలో హనుమ జన్మభూమి నిర్మిస్తామన్నారు. రాబోయే 2027లో గోదావరి నదికి పుష్కరాలు వస్తున్నాయని, ప్రభుత్వం భక్తులకు సకల ఏర్పాట్లు చేయాలని సూచించారు. అంతకు ముందు ఏకాదశ రుద్రుల దేవాలయాలను స్వామీజీ దర్శించుకున్నారు. -
వైఎస్సార్ సీపీ శ్రేణులను రెచ్చగొట్టొద్దు
ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల నల్లజర్ల/జంగారెడ్డిగూడెం: ‘వైఎస్సార్ సీపీ శ్రేణులను రెచ్చగొట్టవద్దని ముందే చెప్పాం. అయినా కూటమి నాయకులు, కార్యకర్తలు వినడం లేదు. అధికారం ఉందని రెచ్చిపోతున్నారు. ప్రజలు మీకిచ్చిన పదవీకాలంలో మరో రెండు సంక్రాంతులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ తర్వాత జరిగేది మీరే చూస్తారు...’ అని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి ఆర్.శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం తూర్పు చోడవరంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై తలెత్తిన వివాదం నేపథ్యంలో పోలీసుల వేధింపులకు గురైన యువకులను బుధవారం శ్యామల పరామర్శించారు. వైఎస్సార్ సీపీ కుటుంబంలో ఇక్కడ కొందరు తమ్ముళ్లకు అన్యాయం జరిగిందని, ఒక అక్కగా వారిని కలవాలని వచ్చానని శ్యామల చెప్పారు. అనంతరం పడమర చోడవరంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ చిన్న ఫ్లెక్సీ వివాదాన్ని సాకుగా చూపి వైఎస్సార్ సీపీ కార్యకర్తలను పోలీసులు గొడ్డును బాదినట్లు బాదుకుంటూ రోడ్డుపై నడిపించడం దుర్మార్గమన్నారు. ఇప్పటి వరకూ తమ పార్టీ శ్రేణుల మంచితనమే చూశారని, ఇక నుంచి రెచ్చిపోయే ప్రతి కూటమి నాయకుడు, కార్యకర్తకు తమ తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. అదేవిధంగా శ్యామల ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం కూడా వచ్చి వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను కలిశారు. -
● లక్షణంగా సందడి
● జై.. పలికారుఓడలరేవు బీచ్లో పతంగులను ఎగుర వేస్తున్న పర్యాటకులు మన సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి క్షేత్రంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భోగి మంట వేశారు. లక్షకు పైగా పిడకలతో తయారు చేసిన దండను గ్రామంలో ఊరేగించి అనంతరం ఆ దండను భోగి మంటలో వేసి సందడి చేశారు. – మామిడికుదురు పందేలకు సై అన్నారు.. బరుల వద్ద ఎక్కడ చూసినా క్యూ కట్టారు.. ఐ.పోలవరం మండలం మురమళ్ల వద్ద కోడిపందేలు పెద్దఎత్తున జరిగాయి. రూ.కోట్లలో సాగుతున్న ఈ పందేలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచే కాకుండా తెలంగాణ, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు భారీగా వచ్చారు. ఆ బరి వద్ద కార్ల పార్కింగ్కు స్థలం సరిపోలేదు మరి. – ఐ.పోలవరం అల్లవరం మండలం ఓడలరేవు సముద్ర తీరం చైన్నెలోని మేరీనా బీచ్ను తలపించింది. తారాడి ధర్మారావు ఆధ్వర్యంలో భోగి పండగ సందర్భంగా కై ట్ ఫెస్టివల్ నిర్వహించారు. దూరప్రాంతాల నుంచి వేలాది మంది పర్యాటకులు వచ్చి పిల్లాపాపలతో గాలి పటాలను ఎగురవేశారు. కై ట్ ఫెస్టివల్కు వచ్చిన పర్యాటకులకు ఉచితంగా పతంగులను అందించారు. – అల్లవరం -
సంస్కృతికి జైకొట్టి.. భక్తి మార్గాన్ని నిలబెట్టి
అన్నవరం: మన సంస్కృతికి అద్దం పడుతూ.. భక్తి మార్గానికి జై కొడుతూ ‘భోగి’భాగ్యాలు ప్రసాదించాలంటూ పలు ఆలయాల్లో ప్రత్యేక వేడుకలు జరిగాయి.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు కొత్త ఏర్పడిన పోలవరం జిల్లాలోని పలు దేవస్థానాల్లో భోగి సంబరాలు అట్టహాసంగా నిర్వహించారు. ఆయా కార్యక్రమాలతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు సంక్రాంతి పండగ ప్రతీక అని, ఇవి మనుషుల అనుబంధాలను పెంచుతాయని తుని తపోవనం ఆశ్రమం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామీజీ అన్నారు. భోగి పండగ సందర్భంగా బుధవారం అన్నవరం రత్నగిరిపై రామాలయం ఆవరణలో సంక్రాంతి వేడుకలను స్వామీజీ ప్రారంభించారు. పాడి పంటలు, పశువులతో పెనవేసుకున్న మన సంస్కృతిని గుర్తుచేసే అపురూపమైన పండగ భోగి అని స్వామీజీ తెలిపారు. రామాలయం వద్ద ఏర్పాటు చేసిన భోగి మంటను పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రజ్వలన చేశారు. అనంతరం రామాలయం ఆవరణలో తెలుగు సంస్కృతిని ప్రతిబంబిస్తూ ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ను దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాధరావుతో కలసి తిలకించారు. స్వామివారి వార్షిక కల్యాణ మండపంలో ప్రతిష్ఠించిన సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను దర్శించుకున్నారు. స్వామీజీ ప్రసంగిస్తూ అచ్చ తెలుగు సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ ఏటా దేవస్థానంలో సంక్రాంతి వేడుకలు ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. పల్లె వాతావరణం ప్రతిబింబించేలా.. సత్యదేవుడు కొలువైన రత్నగిరిపై రామాలయం వద్ద భోగి వేడుకలను పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా నిర్వహించారు. ఇక్కడ గ్రామీణ వాతావరణ అలంకరణ ఆకట్టుకుంది. ఒకవైపు పొంగలి వంట, ఇంకో వైపు భోగి మంట, పాడి ఆవులు, తెలుగు పౌరుషానికి ప్రతిరూపంగా నిలిచే కోడి పుంజులు, ఎడ్ల బండి, భోగిపళ్లు, బొమ్మల కొలువు, తాడిచెట్టు, కొబ్బరి చెట్టు, ఈతచెట్టు, కుమ్మరి సారి తదితరాలు అందరినీ అలరించాయి. అలాగే జానపద కళారూపాల ప్రదర్శన కనువిందు చేసింది. సంప్రదాయ జానపద కళారూపాలైన గంగిరెద్దుల వాళ్లు, కొమ్మదాసు, హరిదాసులు, కళాకారుల కోలాట నృత్యాలు రంజింపజేశాయి. దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ మంజులాదేవి, ఆసుపత్రి ఫార్మసీ సూపర్వైజర్ వల్లూరి మాధవి తదితరులు మట్టి కుండలపై పొంగలి, పాయసం వండి భక్తులకు పంచిపెట్టారు. వీటికి తోడు స్వామివారి వార్షిక కల్యాణ వేదికపై సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించి భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించే అవకాశం కల్పించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి ఉత్సవమూర్తుల విగ్రహాలు, ధాన్యపురాశి మీద గణపతి విగ్రహం అందరినీ అకట్టుకున్నాయి. దేవస్థానం వేద పండితులు గొల్లపల్లి గణపతి ఘనపాఠి గంగాధరభట్ల గంగబాబు, యనమండ్ర శర్మ, ప్రధానార్చకులు ఇంద్రగంటి నర్శింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యం, ఉప ప్రధానార్చకులు ఇంద్రగంటి వెంకటేశ్వర్లు, పవన్, సుధీర్, శర్మ తదితరులు పూజలు చేశారు. ‘భోగి’భాగ్యాలు నింపేలా వేడుకలు రత్నగిరిపై వేడుకలు ప్రారంభించిన సచ్చిదానంద సరస్వతి స్వామీజీ ఉమ్మడి జిల్లాలోని పలు దేవస్థానాల్లో సంబరాలు -
అతలాకోతలం
● ప్రమాదకరంగా అంతర్వేది సాగర సంగమం ● గోదావరి వైపు పెరిగిన కోత ● లైట్ హౌస్ వద్ద మలుపు అత్యంత ప్రమాదంసఖినేటిపల్లి: సముద్రం అంటే అందరికీ ఎంతో ఇష్టం. ఆ తీరంలో సరదాగా గడపటానికి పిల్లలతో పాటు పెద్దలు కూడా ఇష్టపడతారు. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లడానికి ప్రయత్నిస్తారు. కానీ అదే సమయంలో తీరంలో ప్రమాదం పొంచి ఉంటుంది. ముఖ్యంగా అంతర్వేది సాగర సంగమం మృత్యుకుహరాన్ని తలపిస్తోంది. ఇక్కడ సముద్ర కెరటాల ప్రభావం కంటే శాంతంగా ఉండే గోదావరి లోతు మరింత ప్రమాదంగా మారింది. ఇటీవల ఈ మలుపును గుర్తించలేని ఓ యువకుడు తన వాహనంతో గోదావరిలో దిగబడి మృత్యువాత పడిన విషయం తెలిసిందే. అమావాస్య, పౌర్ణమి, ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో ఆటుపోట్లుకు అటు సాగరం, ఇటు గోదావరి గర్భంలో వస్తున్న మార్పులకు సంగమం వద్ద లోతు అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. కెరటాల ఉధృతి రాజోలు దీవిలోని ఇతర సముద్ర తీర ప్రాంతాలకు భిన్నంగా అంతర్వేది వద్ద తీరం ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఇతర ప్రాంతాల్లో ప్రకృతి వైపరీత్యాల సమయంలో మాత్రమే సముద్రం అలజడిగా ఉంటుంది. కానీ అంతర్వేది వద్ద మాత్రం ప్రకృతి వైపరీత్యాలతో పాటు, అమావాస్య, పౌర్ణమి ఘడియలకు ఉధృతంగా కనిపిస్తుంది. ఈ కెరటాల ఉధృతికి సంగమం వద్ద గోదావరిపై కూడా తీవ్ర ప్రభావం చూపడంతో కోత పెరుగుతోంది. పొంచిఉన్న ప్రమాదం అంతర్వేది సాగర సంగమం వద్ద భౌగోళికంగా ఏర్పడిన మలుపులో సముద్రం వైపు కెరటాల లోతు కంటే ప్రశాంతంగా ఉండే గోదావరి లోతు అత్యంత ప్రమాదకరంగా ఉంది. సంగమం వద్ద సముద్ర కెరటాల్లోకి ప్రమాదవశాత్తూ వెళ్లినా వెనక్కి రావచ్చు గానీ, గోదావరి ఒడ్డున ఒక్క అడుగువేస్తే చాలు ఇక ప్రాణాలు గాలిలో కలిసి పోయే ప్రమాదం పొంచి ఉందని మత్య్సకారులు తెలిపారు. ఇక్కడ అప్రమత్తంగా లేకపోతే అమాంతంగా సుమారు 8 అడుగుల లోతులోకి కూరుకుపోతామన్నారు. సముద్రంలో కంటే వశిష్ట గోదావరి అంచులో భారీగా చోటుచేసుకుంటున్న కోత ఎంతో ప్రమాదకరమని చెబుతున్నారు. టెట్రాపోడ్స్ ఏర్పాటు చేయాలి సాగర సంగమం వద్ద తీర రక్షణ వలయంగా టెట్రాపోడ్స్ (నాలుగు కాళ్లు ఉన్నట్టుగా కనిపించే ప్రత్యేక దిమ్మలు) ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రధానంగా సముద్ర తీర ప్రాంతాల్లో రక్షణకు, కోత నివారణకు వీటిని ఏర్పాటు చేస్తుంటారు. తీరంలో అలల శక్తిని విచ్ఛిన్నం చేసి, అలల తీవ్రతను ఇవి తగ్గిస్తాయి. అలాగే అలలు నేరుగా తీరాన్ని తాకకుండా చేసి, తీర రక్షణ గోడలుగా పనిచేస్తాయి. వీటి ప్రత్యేక ఆకారం వల్ల ఒకదానిపై ఒకటి బలంగా నిలబడి చలనం చెందకుండా ఉంటాయి. తుపానులు, భారీ అలలు వచ్చినప్పుడు కూడా స్థిరంగా నిలబడతాయి. పోర్టులు, హార్బర్లు, లైట్హౌస్లు, తీర ప్రాంతాల రక్షణకు ఉపయోగపడతాయి. సాధారణంగా వీటిని కాంక్రీట్తో తయారు చేస్తారు. దీర్ఘకాలంగా మన్నికగా కూడా ఉంటాయి.పెరిగిన నీటి వడి లైట్హౌస్ వద్ద తీరం ఒంపు తిరిగి ఉండడంతో నీటి ప్రవాహ వడి మరింత పెరిగింది. దీనివల్ల ఒడ్డున ఉన్న ఇసుక అనూహ్యంగా కొట్టుకుపోతోంది. గట్టున ఎంత లోతు ఉంటుందో అంతుచిక్కడం లేదు. దీని వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. – పోతాబత్తుల భాస్కరరావు, ఎంపీటీసీ, పల్లిపాలెం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి సాగర సంగమం వద్ద పొంచి ఉన్న ప్రమాదంపై భక్తులు, పర్యాటకులకు తెలిసేలా హెచ్చరిక బోర్డులను లైట్ హౌస్ వద్ద ఏర్పాటు చేయాలి. చీకటి పడే సమయంలో కూడా డేంజర్ సిగ్నల్స్ ఉండేలా చూడాలి. ఇటీవల జరిగిన ప్రమాదంలో ఒకరిని రక్షించగలిగాం. మరొకరు కారుతో పాటు 8 అడుగుల లోతులోకి వెళ్లిపోయి చనిపోయారు. – మహేష్, అంతర్వేదిపాలెం వైవిధ్యానికి కారణాలివే.. అంతర్వేది వద్ద తీరం వైవిధ్యంగా ఉండటానికి పలు కారణాలను విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతి రోజూ పోటు సమయంలో సముద్రం నీరు గోదావరి వైపునకు పోటెత్తడం, దానికి ఎగువ ప్రాంతాల నుంచి చిట్టచివరనున్న అంతర్వేదికి చేరే గోదావరి నీటి ప్రవాహం తోడవ్వడంతో ఆ సమయంలో నీటి మట్టం రెట్టింపు అవుతోంది. సముద్ర గర్భంలో అప్పటికప్పుడు వచ్చే మార్పులకు సముద్రం నీరు బిగపెట్టడం(సంగమం వద్ద గోదావరి నీరు సముద్రంలోకి రానీయకుండా), ఆ సమయంలో గోదావరి ప్రవాహం దిశ మళ్లి అంచులో కోత పెరుగుతోంది. విపత్తుల సమయాల్లో, భౌగోళికంగా వచ్చే మార్పులకు సంగమానికి పశ్చిమ వైపు బియ్యపుతిప్ప గ్రామం వద్ద ఇసుక దిబ్బలు వేస్తున్నాయి. దీంతో కెరటాల ఉధృతికి సంగమానికి రెండో వైపు ఉన్న అంతర్వేది తీరానికి ఉధృతి ఎక్కువవుతోంది. అంతర్వేది లైట్హౌస్ వద్ద తీరం ఎక్కువ నిడివి మలుపు తిరిగి ఉండడం, సంగమానికి పశ్చిమ వైపు కంటే తూర్పువైపు ఉన్న అంతర్వేది వద్ద నీటి ప్రవాహ వేగం తీవ్ర స్థాయిలో ఉండడంతో ఒడ్డు కోత కూడా అదే రీతిలో అధికంగా ఉంటోంది. పశ్చిమం వైపున దిబ్బలు సాగర సంగమానికి పశ్చిమం వైపున ఉన్న బియ్యపుతిప్ప వద్ద సముద్రం ఇసుక దిబ్బలు వేస్తోంది. ఆ కారణంగా తూర్పువైపున నీటి ప్రవాహ వేగం పెరుగుతోంది. సముద్రం పోటు నీటికి, గోదావరి ప్రవాహం తోడవ్వడంతో తీరం వెంబడి కోత తీవ్ర రూపం దాల్చుతోంది. – కొల్లాటి నరసింహస్వామి, మాజీ సర్పంచ్, పల్లిపాలెం -
ఫ బొప్పాయి.. గొప్పోయి..
పది తలలు అనగానే మనకు లంకాధిపతి రావణాసురుడు గుర్తుకువస్తాడు. అయితే కాజులూరు మండలం మొగలిపాలెంలో ఒక బొప్పాయి చెట్టు ఆయనకు పోటీగా పది తలలు వేసింది. చింతా వీర వెంకట సత్యనారాయణరెడ్డి పెరటిలో ఉన్న చెట్టును అందరూ వింతగా చూస్తున్నారు. ఈ చెట్టు మొదట్లో ఒక్క తలతోనే మొలచిందని క్రమేపి పది తలలు వచ్చాయని ఆయన చెబుతున్నారు. ఇంటిలోని చెత్త, సేంద్రియ ఎరువులను వినియోగించుకుని, పెద్ద పెద్ద కాయలు కాస్తోందన్నారు. – కాజులూరు -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 27,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 23,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)16,000 – 17,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 600 -
అధిక చార్జీలు వసూలు చేస్తే చర్యలు
బాలాజీచెరువు: సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ కారణంగా ప్రైవేట్ బస్సులు అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా రవాణాశాఖ అధికారి కె.శ్రీధర్ హెచ్చరించారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ ఐదు రోజులుగా మానిటరింగ్ టీమ్ ద్వారా అన్ని ఆన్లైన్ బుకింగ్ ప్లాట్ఫాంలను పరిశీలిస్తున్నామన్నారు. ఆర్టీసీ నిర్దేశించిన చార్జీలపై గరిష్టంగా 50 శాతం మాత్రమే అదనంగా వసూలు చేయాలని స్పష్టం చేస్తూ, దానికంటే ఎక్కువ ధరకు టికెట్లు విక్రయిస్తే సంబంధిత బస్సు యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రయాణికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర వ్యాప్తంగా హెల్ప్లైన్ నెంబర్ 92816 07001ను ఏర్పాటు చేశామన్నారు. అలాగే మోటారు వాహన తనిఖీ అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. అధిక చార్జీలు వసూలు చేసిన ఐదు బస్సులపై కేసులు నమోదు చేసి రూ. 50 వేల జరిమానా విధించామన్నారు. అలాగే పన్ను, పర్మిట్ వంటి ఇతర నిబంధనలను ఉల్లంఘించిన 27 బస్సులపై కేసులు నమోదు చేసి రూ.లక్ష జరిమానా విధించినట్లు తెలిపారు. ఈ ప్రత్యేక తనిఖీలు, పర్యవేక్షణ ప్రక్రియ జనవరి 18 వరకు కొనసాగుతాయని, పండగ అనంతరం తిరుగు ప్రయాణాల సమయంలో కూడా ఇదే విధమైన కట్టుదిట్టమైన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. -
ఇన్స్పేస్ శిక్షణ పొందిన ‘నన్నయ’ అధ్యాపకురాలు
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ఫిజిక్స్ విభాగాధిపతి డాక్టర్ శీలం రాజ్యలక్ష్మి భారత అంతరిక్ష శాఖకు చెందిన ఇన్ స్పేస్ (ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ అఽథారైజేషన్ సెంటర్) ఆధ్వర్యంలో ఆరు రోజుల శిక్షణను పూర్తి చేశారు. ఈ విషయాన్ని వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ మంగళవారం విలేకరులకు తెలిపారు. బెంగళూరులోని దేవనపల్లిలో ఈ నెల 4 నుంచి 9 వరకు ఈ శిక్షణ కార్యక్రమం జరిగింది. డాక్టర్ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ లాంచ్ వెహికల్ డిజైన్, మిషన్ ప్లానింగ్, అవియానిక్స్ అభివృద్ధి, గైడెన్స్ – నావిగేషన్ – కంట్రోల్, టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ వ్యవస్థలపై విస్త్రతంగా అవగాహన కల్పించారన్నారు. ఆమెను వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ తదితరులు అభినందించారు. -
తల్లిదండ్రుల చెంతకు బాలుడు
సామర్లకోట: తప్పిపోయిన మూడేళ్ల బాలుడిని ట్రాఫిక్ పోలీసులు అతడి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. వివరాల్లోకి వెళితే.. కొప్పిశెట్టి జానకిరామ్, దేవి దంపతులు తమ కుమార్తె, కుమారుడితో కలిసి మంగళవారం సాయంత్రం సామర్లకోట రైల్వే స్టేషన్లో దిగారు. వారందరూ సామర్లకోట నుంచి కరప మండలం విజయరాయుడుపాలేనికి వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో ఆటోను మాట్లాడుతున్న సమయంలో వారి మూడేళ్ల కుమారుడు తుస్యంత్ ఆద్య అదృశ్యమయ్యాడు. దీంతో రైల్వే స్టేషన్ ఆవరణలో వెతకడం ప్రారంభించారు. ఎంతకీ కనిపించక పోవడంతో అవుట్ పోస్టు పోలీసు స్టేషన్కు వచ్చి ట్రాఫిక్ ఎస్సై అడపా గరగారావుకు ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే స్టేషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించగా బాలుడు జయలక్ష్మి థియేటర్ రోడ్డులో ఏడుస్తూ ఉన్నట్లు గమనించారు. వెంటనే తమ సిబ్బంది పంపించి, బాలుడిని అవుట్ పోస్టు పోలీసు స్టేషన్కు తీసుకు వచ్చారు. వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి బాలుడిని క్షేమంగా వారికి అప్పగించారు. -
ఆర్టీసీ కండక్టర్పై ఆటో కార్మికుల దాడి
నిడదవోలు: పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద మంగళవారం రాత్రి కండక్టర్పై ఆటో కార్మికులు దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. నిడదవోలు ఆర్టీసీ డిపో నుంచి రాత్రి 7 గంటలకు రాజమహేంద్రవరం వెళుతున్న బస్సుకు అడ్డంగా రోడ్డుపై ఓ ఆటో నిలిపివేశారు. బస్సు వెళ్లడానికి మార్గం లేకపోవడంతో డ్రైవర్ ఎ.రబ్బానీ హారన్ కొడుతున్నా ఆ ఆటోను పక్కకు తీయలేదు. దీంతో కండక్టర్ సుధీర్ కుమార్ కిందకి దిగి ఆటో తీయాలని చెప్పడంతో ఆటోడ్రైవర్తో వాగ్వాదం జరిగింది. అనంతరం కండక్టర్ తిరిగి బస్సులోకి వచ్చి టికెట్లు కొడుతున్న సమయంలో ఉల్లి నాగు తన అనుచరులతో కలిసి బస్సులో ఉన్న కండక్టర్ను దుర్భాషలాడుతూ దాడి చేశాడు. గాయాలపాలైన కండక్టర్ను బస్సు డ్రైవర్ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ప్రస్తుతం కండక్టర్ సుధీర్కుమార్కు చికిత్స పొందుతున్నారు. -
ముగిసిన డ్రాగన్ పడవ పోటీలు
కొత్తపేట: కోనసీమ సంక్రాంతి సంబరాలు పేరిట ఆత్రేయపురం మండలం లొల్ల లాకుల వద్ద ప్రధాన పంట కాలువలో జరిగిన సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ – 2026 పడవ పోటీలు మంగళవారం ముగిశాయి. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ఏపీ పర్యాటక శాఖ పర్యవేక్షణలో గౌతమి – వశిష్ట నదుల మధ్య సెంట్రల్ డెల్టా ప్రధాన పంట కాలువలో మూడు రోజుల పాటు జరిగిన ఈ డ్రాగన్ బోటు పోటీలు, ఈత పోటీలు, అదే ప్రాంతంలో రంగవల్లులు, గాలిపటాల పోటీలు ఉత్కంఠ భరితంగా సాగాయి. మూడో రోజు పోటీలను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్, రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ఫ్, ఎన్నారై సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొంపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. బహుమతుల ప్రదానం పోటీల ముగింపు సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అధ్యక్షతన జరిగిన సభలో కేంద్ర ఉక్కు గనుల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఎంపీ గంటి హరీష్ మాధుర్ ముఖ్య అతిథులుగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు, దాట్ల బుచ్చిబాబు, ఎస్పీ రాహుల్ మీనా, ఆర్డీఓ పి.శ్రీకర్, రాష్ట్ర టీడీపీ నాయకుడు ఆకుల రామకృష్ణ, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు పాలూరి సత్యానందం, వాడపల్లి దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు పాల్గొన్నారు.డ్రాగన్ బోటు విజేతలు డ్రాగన్ బోట్ ఫైనల్ 1000 మీటర్ల పోటీలో ఆరు టీమ్లు తలపడగా, బండారు (ఏలూరు), పల్నాడు, కోనసీమ అతి స్వల్ప తేడాలో గమ్యానికి చేరుకున్నాయి. 500 మీటర్ల విభాగంలో యర్రకాలువ, కర్నూలు, పల్నాడు టీమ్లు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. వెయ్యి మీటర్ల విజేతలకు వరుసగా రూ.2 లక్షలు, రూ.లక్ష, రూ.50 వేలు, అలాగే 500 మీటర్ల విజేతలకు రూ.70 వేలు, రూ.50 వేలు, రూ.30 వేలతో పాటు ట్రోఫీ, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. పతంగుల పోటీల్లో.. సీనియర్స్ పతంగుల పోటీల్లో ఆర్.చంటి (ఉచ్చిలి) ప్రథమ, టి.జస్వత్ ద్వితీయ స్థానం, బి.ప్రసాద్ (ఆత్రేయపురం) తృతీయ స్థానాల్లో నిలిచారు. జూనియర్స్ విభాగంలో డి.ఈశ్వర్ పవన్ (రాజమహేంద్రవరం), ఎం.పవన్ లోహిత్ (అంకంపాలెం), పి.కృష్ణ చైతన్య (కాకినాడ) తొలి మూడు స్థానాలు సాధించారు. రెండు విభాగాల విజేతలకు రూ.6 వేలు, రూ.4 వేలు, రూ.3 వేల చొప్పున అందజేశారు. -
లారీ ఢీకొని వ్యక్తి..
గండేపల్లి: లారీ ఢీకొన్న ఘటనలో రోడ్డు దాటుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై యూవీ శివ నాగబాబు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మల్లేపల్లి నీలకుండీలతోటకు చెందిన శీలం శివరామకృష్ణ (60) మంగళవారం స్థానిక సంతమార్కెట్ వద్ద సైకిల్పై రోడ్డు దాటుతున్నాడు. అతడిని విశాఖపట్నం వైపు నుంచి విజయవాడ వైపు వెళుతున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో శివరామకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. అతడు స్థానికంగా ఉన్న ఓ హోటల్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. పిచ్చికుక్క దాడిదేవరపల్లి: దేవరపల్లిలోని థియేటర్ సెంటర్లో మంగళవారం ఓ పిచ్చికుక్క పలువురిపై దాడి చేసి గాయపరిచింది. దీని దాడిలో కె.నాగేశ్వరరావు, పిట్లా విజయ, జ్యేష్ఠ చేతన్, ఆలేటి రవికుమార్, బంగారు మహేష్, పాసం నాగమణి తీవ్రంగా గాయపడ్డారు. వారికి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు. ఈ పీహెచ్సీ పరిధిలో డిసెంబర్లో 98 మంది కుక్క కాటుకు గురి కాగా, ఈ నెలలో ఇప్పటి వరకు 53 మంది కుక్కుకాటుకు గురయ్యారు. -
రత్నగిరిపై భక్తుల రద్దీ
అన్నవరం: సంక్రాంతి సెలవులు కావడంతో రత్నగిరిపై సత్యదేవుని ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ప్రధానంగా తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు మంగళవారం స్వామి సన్నిధికి వచ్చి, పూజలు చేశారు. వీరికి ఇతర భక్తులు కూడా తోడవడంతో ఆలయంలో రద్దీ ఏర్పడింది. అధిక శాతం భక్తులు కార్లు, ఇతర వాహనాల్లో వచ్చారు. దీంతో, దేవస్థానంలోని పార్కింగ్ స్థలాలన్నీ వారి వాహనాలతో నిండిపోయాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. స్వామివారిని 25 వేల మంది దర్శించుకున్నారు. వ్రతాలు 1,500 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. నేడు సత్యదేవుని గ్రామోత్సవం ధనుర్మాసోత్సవాల సందర్భంగా సత్యదేవుడు, అమ్మవారి ఉత్సవమూర్తులను గత నెల 16 నుంచి ప్రతి రోజూ ఉదయం ఏడు గంటల నుంచి 10 గంటల వరకూ అన్నవరంలో పల్లకీలో ఊరేగిస్తున్నారు. ఇందులో భాగంగా ఏటా భోగి పండగ నాడు అన్నవరం రైల్వే స్టేషన్ రోడ్డు, ఇండియన్ బ్యాంక్ పక్క నుంచి వరదయ్య వీధి, వెలంపేటల్లో ఈ ఊరేగింపు నిర్వహించే ఆనవాయితీ ఉంది. ఈ మేరకు ఆ ప్రాంతాల్లో బుధవారం స్వామి, అమ్మవార్ల గ్రామోత్సవం నిర్వహించనున్నారు. -
రాజకీయ ప్రచారానికి కార్మికుల సొమ్ము వాడతారా?
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నిధుల్లో రూ.20 కోట్లు ప్రభుత్వ ప్రచారానికి వాడాలని కార్మిక శాఖ చేసిన నిర్ణయంపై భవన నిర్మాణ కార్మికులు భగ్గుమన్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంఘం (సీఐటీయూ) జిల్లా కమిటీ ఆధ్వర్యాన కలెక్టరేట్ వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నిట్ల శ్రీను, రొంగల ఈశ్వరరావు మాట్లాడుతూ, చంద్రబాబు సర్కార్ రాజకీయ ప్రచారానికి కార్మికులు దాచుకున్న సంక్షేమ బోర్డు నిధులు రూ.20 కోట్లు వాడాలని నిర్ణయించడం సిగ్గుచేటన్నారు. ఈ నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ మేరకు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను వెంటనే పునరుద్ధరించాలని, లేని పక్షంలో కూటమి బలపరచిన పంచాయతీ అభ్యర్థులను ఓడించి, బుద్ధి చెప్తామని హెచ్చరించారు. విగ్రహాల కోసం వేల కోట్లు ఖర్చు చేసే బదులు, ఏడేళ్లుగా ప్రమాదాలు, అనారోగ్యంతో మరణించిన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు పరిహారాలు చెల్లిస్తే వారికి ఊరట లభిస్తుందని హితవు పలికారు. ఖజానాపై ఒక్క రూపాయి భారం లేకుండా సంక్షేమ బోర్డు నిర్వహించే అవకాశం ఉన్నా, అమలు చేయడానికి కూటమి ప్రభుత్వానికి వచ్చిన అడ్డంకి ఏమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్కుమార్, సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఓరుగంటి నందీశ్వరుడు, జిల్లా గౌరవాధ్యక్షుడు గడిగట్ల సత్తిబాబీ, సలహాదారు కరణం విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. -
సత్యదేవుని సన్నిధిలో నేడు సంక్రాంతి వేడుకలు
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించనున్నారు. దీనికోసం రత్నగిరిపై రామాలయం ముందున్న ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఇక్కడ పండితుల వేదమంత్రోచ్చారణల నడుమ తుని తపోవనం స్వామీజీ సచ్చిదానంద సరస్వతి బుధవారం ఉదయం ఆరు గంటలకు భోగి మంట వెలిగించనున్నారు. అనంతరం, భక్తులనుద్దేశించి సంక్రాంతి విశిష్టతపై స్వామీజీ అనుగ్రహ భాషణం చేస్తారు. తెలుగు సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా భోగి మంట, జానపద కళారూపాల ప్రదర్శనలకు రత్నగిరిపై ఏర్పాట్లు చేశారు. గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించేలా తాటాకులతో వేసిన గుడిసె, కొబ్బరి, ఈత, తాటి చెట్లు, తామర, కలువ పూలతో కూడిన కొలను, ధాన్యపు రాశి, నుయ్యి, రచ్చబండ, కోడిపుంజులు, ఎడ్లబండి, పొట్టేలు, ఆవు దూడ వంటి కళారూపాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు గంగిరెద్దుల వాళ్లు, బుడబుక్కల సాయిబు, జంగమ దేవర, కొమ్మదాసరి తదితరులు కూడా సందడి చేయనున్నారు. సత్యదేవుని వార్షిక కల్యాణ వేదిక మీద సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను భక్తులు దర్శించేందుకు వీలుగా ఏర్పాటు చేస్తున్నారు. స్వామివారి ఆలయం, రాజగోపురాలను ప్రత్యేకంగా విద్యుద్దీపాలు, పుష్పమాలికలతో అలంకరిస్తున్నారు. భోగి పండ్లు వేసేందుకు గాను ఉదయం 9 గంటలకు చిన్నారులను సంక్రాంతి వేడుకల వద్దకు తీసుకుని రావాలని అధికారులు కోరారు. దేవస్థానం ఈఓ వి.త్రినాథరావు సంక్రాంతి వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు. భోగి మంటకు చేసిన ఏర్పాట్లు సంక్రాంతి సంబరాలకు రత్నగిరిపై సిద్ధమైన ప్రాంగణంఫ భోగి మంట వెలిగించనున్న తపోవనం స్వామీజీ ఫ సర్వాంగసుందరంగా ఆలయ ప్రాంగణం ముస్తాబు


