Kakinada District Latest News
-
తల్లిదండ్రులూ దూరం.. ప్రియుడి ఇంటి వద్ద ఏమైందో ఏమో?
కాకినాడ క్రైం: ఏమైందో ఏమో.. ప్రియుడి ఇంటి వద్ద ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. కంపా లాఫీ (17) అనే బాలిక తల్లిదండ్రులు పీతా నాగదేవి, కంపా బంగారయ్యలు విడిపోయి కుమార్తెను స్థానిక తారకరామ నగర్లో పిన్ని జయవాణి వద్ద వదిలేసి వెళ్లిపోయారు.మూడేళ్ల క్రితం నరసింహ రోడ్డుకు చెందిన తన వయసున్న బాలుడితో లాఫీకి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయం పిన్ని, బాబాయ్లకు తెలియడంతో వారు మందలించారు. మనస్తాపం చెందిన బాలిక ప్రియుడి ఇంటికి వెళ్లిపోయింది. కొద్ది నెలలుగా అక్కడే ఉంటోంది.ఏసీ టెక్నీషియన్గా పనిచేస్తున్న ఆ బాలుడితో పాటు అతని తల్లి లోవలక్ష్మి ఓ టైలరింగ్ షాప్లో, తండ్రి శివకుమార్రాజు దుస్తుల దుకాణంలో పనిచేస్తున్నాడు. వీరితో పాటే లాఫీ నివసిస్తోంది. గురువారం రాత్రి శివకుమార్రాజు ఇంటికి వచ్చి చూసేసరికి అప్పటికి కుమారుడు, భార్య ఇంటికి చేరలేదు. లాఫీ ఇంట్లో ఉండడంతో తలుపు కొట్టాడు. ఎంతకీ తీయకపోవడంతో అనుమానం వచ్చి వంట గది కిటికీ లోంచి చూస్తే ఫ్యాన్కు చీరతో ఉరేసుకుని లాఫీ వేలాడుతోంది.కంగారు పడిన శివకుమార్రాజు స్థానికుల సాయంతో తలుపులు తెరిచి చూసేసరికి బాలిక అచేతనంగా ఉంది. ఆమెను జీజీహెచ్కు తరలించాడు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. లాఫీ మృతికి ఆ బాలుడితో పాటు అతడి తల్లిదండ్రులు, మరో వ్యక్తి కారణమని బాబాయ్, పిన్ని ఆరోపించారు. మృతురాలి బాబాయ్ నూకరాజు ఫిర్యాదుతో కాకినాడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
గోదావరిలో దూకిన వ్యక్తి : కాపాడిన పోలీసులు
ఐ.పోలవరం: మురమళ్లలోని రాఘవేంద్ర వారధిపై నుంచి గోదావరిలోకి దూకిన వ్యక్తిని హైవే పెట్రోలింగ్ పోలీసులు కాపాడారు. ముమ్మిడివరానికి చెందిన దేశంశెట్టి సతీష్కుమార్ గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత రాఘవేంద్ర వారిధి నుంచి గోదావరిలోకి దూకాడు. దీనిపై స్థానికుల నుంచి సమాచారం అందిన వెంటనే ముమ్మిడివరం – పోలీస్ స్టేషన్ పరిధిలోని హైవే నిఘా విభాగంలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, హోంగార్డు రామ్కుమార్లు అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో పడవ నడిపేవారు లేకపోవడంతో, తమ ప్రాణాలకు తెగించి నదిలోకి వెళ్లి సతీష్కుమార్ను కాపాడారు. అనంతరం అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీసులను స్థానికులు అభినందించారు. దేవీపట్నంలో పెద్ద పులి సంచారం దేవీపట్నం: పెద్దపులి దేవీపట్నం వైపునకు తన గమనాన్ని మార్చింది. ఈ నెల 2న గంగంపాలెం వద్ద 14 లేగ దూడలను చంపేసిన పులి అటు నుంచి నేలకోట వైపు పయనించింది. గురువారం సాయంత్రం రామదుర్గం మీదుగా దండంగి, పరగసానిపాడు వైపు సంచరించిన పులి శుక్రవారం ఉదయం దండంగి వాగును దాటింది. తర్వాత చినరమణయ్యపేట వైపునకు వెళ్లింది. పులి మెడకు అమర్చిన ట్రాకర్ ద్వారా పులి గమనాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం ముత్యాలరాయుడుగారి గొంది, దేవీపట్నం మధ్య పులి సంచరిస్తున్నట్లు గుర్తించారు. రాత్రికి గోదావరి నదిని దాటుకుని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయి. వింత దూడ మరణం మలికిపురం: మండలంలోని గుడిమెళ్లంకలో శుక్రవారం జెర్సీ క్రాస్ ఆవుకు పుట్టిన లేగ దూడ, పుట్టిన కొద్ది సేపటికే మృతి చెందింది. ఈ వివరాలను పశు వైద్యాధికారి డి.శివకుమార్ తెలిపారు. గ్రామానికి చెందిన గెడ్డం శ్రీనుకు చెందిన జెర్సీ క్రాస్ ఆవు ఈనడంలో అవస్థలు పడుతుంటే డాక్టర్ శివకుమార్ వైద్య సేవలందించారు. అయితే ఒకే కన్ను, గ్రహణం మొర్రి, నాసిక రంధ్రాలు లేని చనిపోయిన దూడను బయటకు ఆయన తీశారు. ఈ కోవకు చెందిన దూడను వైద్య పరిభాషలో సైక్లోపియా అంటారని చెప్పారు. జన్యులోపం వల్ల, తల, ముఖం అభివృద్ధికి కావాల్సిన క్రోమోజోమ్స్ అచేతన స్థితిలో ఉండడం, ఇన్బ్రీడింగ్, విటమిన్ ఏ, జింక్ లాంటి పౌష్టికాహార లోపంతో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటాయన్నారు. కాగా ఆవు ఆరోగ్యంగానే ఉందని, ఇలాంటి దూడలు 16 వేల ఈతల్లో ఒకసారి మాత్రమే జన్మించే అవకాశం ఉందని శివకుమార్ అన్నారు. వ్యక్తిపై దాడి యానాం: ఇవ్వాల్సిన సొమ్ము అడిగినందుకు ఓ వ్యక్తిపై దాడి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నియోజకవర్గంలోని మెట్టకూరు వంశీకృష్ణా కాలనీకి చెందిన ఈగల మల్లికార్జునరావుపై అదే గ్రామానికి చెందిన కొప్పనాతి వెంకటరమణ ఐరన్ నకల్ (హ్యాండ్ పంచ్)తో దాడి చేశాడు. దీంతో మల్లికార్జునరావు దవడ పళ్లు విరిగిపోయాయి. ఈ ఘటనపై యానాం పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేయగా, నిందితుడు వెంకటరమణపై కేసు నమోదు చేసి యానాం సబ్ కోర్టులో హాజరుపరచగా ఆరు రోజుల రిమాండ్ విధించారు. మల్లికార్జునరావు టైలర్. అతని వద్ద దుస్తులు కుట్టించుకున్న వెంకటరమణ రూ.20 బకాయి ఉన్నాడు. ఆ సొమ్ము గురించి తరచూ మల్లికార్జునరావు అడుగుతున్నాడనే ఆగ్రహంతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. గంజాయి తరలిస్తున్న నిందితుల అరెస్టు మోతుగూడెం: గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు డొంకరాయి ఎస్సై చరణ్నాయక్ తెలిపారు. బొడ్డగండి పంచాయతీ డొంకరాయి గ్రామం వద్ద రెండు కిలోల గంజాయిని, ముగ్గురు నిందితులను, ఒక మోటారు సైకిల్ను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఒడిశా రాష్ట్రం పసుపులంక నుంచి హైదరాబాద్కు గంజాయిని తరలిస్తున్నారని సమాచారంతో వాహనాలు తనిఖీ చేస్తుండగా, వారు పట్టుబడ్డారన్నారు. హైదరాబాద్కు చెందిన బొడ్డు అభిషేక్, చింతపల్లి మండలానికి చెందిన మరో ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. -
మద్యం తరలిస్తున్న ఇద్దరి అరెస్టు
ఐ.పోలవరం: యానాం నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎకై ్సజ్ అధికారులు పట్టుకున్నారు. ఎదుర్లంక ఎకై ్సజ్ చెక్పోస్ట్ వద్ద అక్రమంగా మద్యం తరలిస్తున్న కారును ఎకై ్సజ్ అధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి ఆదేశాల మేరకు నిర్వహించిన తనిఖీల్లో యానాం నుంచి అక్రమంగా తరలిస్తున్న 500 మిల్లీలీటర్ల 54 టిన్ బీర్లను స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం రామవరప్పాడు గ్రామానికి చెందిన దాకరపు లీలాశివరాం, బంటుమిల్లి మండలం ముంజులూరు గ్రామానికి చెందిన గాడే రాజేష్ కుమార్లను అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎదుర్లంక చెక్పోస్ట్ సీఐ చంద్రశేఖర్ తెలిపారు. -
ఏమైందో ఏమో..
కాకినాడ క్రైం: ఏమైందో ఏమో.. ప్రియుడి ఇంటి వద్ద ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. కంపా లాఫీ (17) అనే బాలిక తల్లిదండ్రులు పీతా నాగదేవి, కంపా బంగారయ్యలు విడిపోయి కుమార్తెను స్థానిక తారకరామ నగర్లో పిన్ని జయవాణి వద్ద వదిలేసి వెళ్లిపోయారు. మూడేళ్ల క్రితం నరసింహ రోడ్డుకు చెందిన తన వయసున్న బాలుడితో లాఫీకి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయం పిన్ని, బాబాయ్లకు తెలియడంతో వారు మందలించారు. మనస్తాపం చెందిన బాలిక ప్రియుడి ఇంటికి వెళ్లిపోయింది. కొద్ది నెలలుగా అక్కడే ఉంటోంది. ఏసీ టెక్నీషియన్గా పనిచేస్తున్న ఆ బాలుడితో పాటు అతని తల్లి లోవలక్ష్మి ఓ టైలరింగ్ షాప్లో, తండ్రి శివకుమార్రాజు దుస్తుల దుకాణంలో పనిచేస్తున్నాడు. వీరితో పాటే లాఫీ నివసిస్తోంది. గురువారం రాత్రి శివకుమార్రాజు ఇంటికి వచ్చి చూసేసరికి అప్పటికి కుమారుడు, భార్య ఇంటికి చేరలేదు. లాఫీ ఇంట్లో ఉండడంతో తలుపు కొట్టాడు. ఎంతకీ తీయకపోవడంతో అనుమానం వచ్చి వంట గది కిటికీ లోంచి చూస్తే ఫ్యాన్కు చీరతో ఉరేసుకుని లాఫీ వేలాడుతోంది. కంగారు పడిన శివకుమార్రాజు స్థానికుల సాయంతో తలుపులు తెరిచి చూసేసరికి బాలిక అచేతనంగా ఉంది. ఆమెను జీజీహెచ్కు తరలించాడు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. లాఫీ మృతికి ఆ బాలుడితో పాటు అతడి తల్లిదండ్రులు, మరో వ్యక్తి కారణమని బాబాయ్, పిన్ని ఆరోపించారు. మృతురాలి బాబాయ్ నూకరాజు ఫిర్యాదుతో కాకినాడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికల అదృశ్యం పెరవలి (కొవ్వూరు): తండ్రి మందలించాడని ఇద్దరు కుమార్తెలు అర్ధరాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. నేటికీ ఇంటికి రాకపోవడంతో ఆ తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. కొవ్వూరు టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ విశ్వం కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి ఇద్దరి కుమార్తెలు. వారి వ్యవహార శైలి బాగోలేదని 11న కుమార్తెలను మందలించాడు. మనస్తాపం చెందిన వారు ఆ రోజు రాత్రి ఇంటి బయటకు వెళ్లిపోయారు. ఫ ప్రియుడి ఇంటి వద్ద బాలిక ఆత్మహత్య ఫ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు -
ప్రియుడితో కలసి భర్త హత్య
కాకినాడ రూరల్: మూడు నెలల క్రితం ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా, పోలీసుల విచారణలో అది హత్యగా తేలింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ప్రియుడి సహాయంతో భర్తను ఓ మహిళ కడతేర్చింది. పోలీసుల కథనం ప్రకారం.. సర్పవరం గ్రామానికి చెందిన కారు డ్రైవర్ పుల్ల దుర్గాప్రసాద్ (38) మృతికి సంబంధించి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై పోలీసులు వాట్సాప్ చాట్స్, స్కీన్ షాట్లు, మొబైల్ ఫోన్ డేటా, ఫొటోలు, ఇతర సాంకేతిక ఆధారాలతో విచారణ చేపట్టారు. ఈ విచారణలో దుర్గాప్రసాద్ హత్యకు గురయ్యాడని తేలింది. దుర్గాప్రసాద్కు రమాదేవితో కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. రమాదేవికి బాపట్లకు చెందిన ప్రసాదం గోపిసాయితో ఇన్స్ట్రాగామ్లో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వివాహేతర సంబంధం నడిచింది. వీరి సంబంధానికి భర్త అడ్డువస్తున్నాడని ఆ ఇద్దరూ కలసి హత్యకు కుట్ర పన్నారు. దుర్గాప్రసాద్ను హత్య చేసేందుకు గోపిసాయి నిద్రమాత్రలు తెచ్చి రమాదేవికి ఇచ్చాడు. వాటిని భర్తకు జ్యూస్లో కలిపి మార్చి 13న రాత్రి అందజేయడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. తర్వాత అతడిని దిండుతో ఊపిరాడకుండా చేసి రమాదేవి హత్య చేసింది. అనంతరం గుండెపోటుతో భర్త చనిపోయినట్టు బంధువులను నమ్మించడంతో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. మే 31న మృతుడి కుమార్తెకు గోపిసాయి వాట్సాప్ సందేశాలు పంపి, హత్యకు సంబంధించి వివరాలు, మాత్రల కొనుగోలు బిల్లుల ఫొటోలు పంపడంతో అనుమానం పెంచుకున్న కుటుంబ సభ్యులు ఈ నెల 9న పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడి సోదరుడు పుల్ల సత్యబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, హత్యగా తేలిందని సీఐ రమేష్ తెలిపారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్టు తెలిపారు. మూడు నెలల తర్వాత బయటపడిన ఘటన -
మన్నుకుండిపోయారు!
కూటమిగా ఏర్పడ్డారు.. ఉన్నమట్టుకు దోచేస్తున్నారు.. ప్రకృతి వనరులను కొల్లగొడుతున్నారు.. అనుమతులు లేకుండా మట్టి తవ్వేసి తరలించుకుపోతున్నారు.. ఈ దందా అధికారుల కళ్లెదుటే జరుగుతున్నా, మిన్నకుండిపోతున్నారు.. ఇలా అక్రమార్కులు రూ.లక్షల్లో ఆర్జిస్తూ మాకెవరు అడ్డు అన్నట్టు చెలరేగిపోతున్నారు. ఫ మట్టి దందాను పట్టించుకోని అధికారులు ఫ చెలరేగిపోతున్న మాఫియా ఫ రూ.లక్షల్లో ఆర్జిస్తున్న వైనం తాళ్లపూడి: అక్రమార్కులు కొండలను కరిగించేస్తున్నారు. తాళ్లపూడి మండలంలోని పరిసర గ్రామాలైన పోచవరం, రాగోలపల్లి, తుపాకులగూడేనికి చెందిన రెవెన్యూ పరిధిలోని గోపాలపురం వైపు సగ్గొండ వెళ్లే దారిలో కొండలను తవ్వేస్తున్నారు. కొంతమంది సిండికేట్గా ఏర్పడి పగలు, రాత్రి అనే తేడా లేకుండా మట్టిని తరలించుకుపోతున్నారు. పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నారు. తాళ్లపూడి, గోపాలపురం మండలాల్లో అధికార పార్టీ నేతలు ఈ దందాకు పాల్పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. మట్టి లారీ లోడు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకూ అమ్మకాలు సాగిస్తున్నారు. వందల లారీల్లో గ్రావెల్ బయటకు పోతోంది. ఆయా గ్రామాల్లోని కొండలపై ఉన్న జామాయిల్, భారీ చెట్లను నిర్ధాక్షిణ్యంగా తొలగించి, తవ్వకాలు సాగిస్తున్నారు. రోడ్డు లెవెలింగ్కు అనుమతులు తీసుకుని, ఆ ముసుగులో గ్రావెల్ను లేఅవుట్లకు తరలిస్తున్నారు. ఈ దందాపై ప్రశ్నించిన వారిని మాఫియా బెదిరిస్తుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుపోతున్నారు. దీనిపై మండల బీజేపీ అధ్యక్షుడు ఇండుగుల రామకృష్ణ స్థానిక నాయకులతో కలసి కొవ్వూరులో శుక్రవారం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరికి ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో మైనింగ్ ఏడీ ఫణిభూషన్రెడ్డి ఇతర అధికారులతో కలసి గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. -
అనువణువూ జల్లెడ
తుని రూరల్: కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ చిక్కుళ్ల అగ్రహారంలో ఈ నెల 6న అదృశ్యమైన చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి ఆచూకీ ఏడు రోజులైనా లభించలేదు. శుక్రవారం పెద్దాపురం డీఎస్పీ తిలక్ ఆధ్వర్యంలో పోలీస్, ఎస్డీఆర్ఎఫ్, ఫారెస్ట్, ఏఎన్ఎస్ కూంబింగ్, క్యూఆర్టీ బృందాలతో గాలింపు చర్యలు కొనసాగించారు. హైదరాబాద్ నుంచి తీసుకువచ్చిన జీపీఎస్ ట్రాకర్ను పెంపుడు కుక్కకు అమర్చి బయటకు వదిలారు. దీంతో పరిసర ప్రాంతాల్లో కుక్క ఎనిమిది కిలోమీటర్లు సంచరించినట్టు ట్రాకర్ ద్వారా గుర్తించారు. ఆ ప్రాంతాలను దర్యాప్తు బృందాలు అణువణువూ పరిశీలిస్తున్నారు. అంతకు ముందు కుక్క నిరసంగా ఉండడంతో వెటర్నరీ సిబ్బందితో వైద్య సేవలు అందించారు. అదేవిధంగా చిన్నారి కాళ్లకు ఉన్న వెండి పట్టీలను గుర్తించేందుకు సిల్వర్ మెటల్ డిటెక్టర్ (డివైజ్) నిపుణులతో జ్ఞానేశ్వరి చివరిసారిగా కనిపించిన ప్రాంతంలో తనిఖీలు చేయించారు. ఈ సందర్భంగా డీఎస్పీ తిలక్ మాట్లాడుతూ చిన్నారి ఆచూకీ తెలిసేవరకూ గాలింపు చర్యలు కొనసాగిస్తామన్నారు. చిన్నారి తండ్రి సుంకర గణేష్కు ఉన్న విరోధులు, ఆర్థిక లావాదేవీలు, సెల్ఫోన్ సిగ్నల్స్, గతంలో పనిచేసి మానేసిన కూలీలు, ఇతరేతర కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. టవర్ డంప్, సీడీఆర్లు, సీసీ కెమెరాల సీపీ ఫుటేజీలు, తనిఖీలు ముమ్మరం చేశామన్నారు. అనుమానితులు, గంజాయికి అలవాటుపడిన వ్యక్తులపై దృష్టి సారించామన్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా గాలింపు కొనసాగిస్తున్నట్టు ఆయన తెలిపారు. పురోగతిపై సంబంధిత అధికారులతో డీఎస్పీ సమీక్షించారు. తల్లిదండ్రుల చెంతకు చేరాలి చిక్కుళ్ల అగ్రహారంలో అదృశ్యమైన జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు వద్దకు చేరాలని మాజీ మంత్రి, కాకినాడ జిల్లా వైఎస్సార్ సీసీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆకాంక్షించారు. ఎస్.అన్నవరంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. చిన్నారి ఆయురారోగ్యాలతో తల్లిదండ్రుల వద్దకు రావాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. పాప కోసం అధికారులు గాలిస్తున్నారన్నారు. ఇటువంటి మనోవేదన మరెవరికి రాకూడదని అన్నారు. ఫ చిన్నారి కోసం ముమ్మరంగా గాలింపు ఫ 8 కిలోమీటర్లు సంచరించిన పెంపుడు కుక్క ఫ ఆయా ప్రాంతాల్లో బృందాల తనిఖీలు -
క్రీడాకారులకు క్రమశిక్షణ ముఖ్యం
సామర్లకోట: క్రీడాకారులకు క్రమశిక్షణ ముఖ్యమని రాష్ట్ర టేబుల్ టెన్నిస్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ సీహెచ్ విజయ్ప్రకాష్ అన్నారు. శుక్రవారం పెద్దాపురం శ్రీప్రకాష్ సినర్జీ స్కూల్లో రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్ పోటీలను ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 230 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో బాల బాలికలకు ఈ పోటీలు జరుగుతున్నాయని విజయ్కుమార్ చెప్పారు. క్రీడా కారులకు అన్ని సదుపాయాలను పాఠశాల నుంచి కల్పిస్తున్నామన్నారు. ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీసు (ఐఆర్టీఎస్) అధికారి డాక్టర్ చిలుకా ప్రదీప్కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. క్రీడాకారులు ఎప్పటికప్పుడు వారి ఆట తీరును మెరుగుపరుచుకోవాలన్నారు. టెబుల్ టెన్నీస్పై రోజు రోజుకూ విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతుందని రాష్ట్ర టెబుల్ టెన్నిస్ అసోసియేషన్ కార్యదర్శి పి.విశ్వనాథ్ తదితరులు అన్నారు. -
ఊడిపోయిన స్కూల్ బస్సు అత్యవసర ద్వారం
అమలాపురం టౌన్: వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచిన రోజునే ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు అత్యవసర ద్వారం ఊడిపడిన సంఘటన అమలాపురంలో శుక్రవారం జరిగింది. ఆ వివరాలివీ.. పరిసర గ్రామాల్లోని విద్యార్థులను శ్రీచైతన్య స్కూల్ సిబ్బంది బస్సులో ఎక్కించుకుని పట్టణంలోని స్కూల్కు తీసుకు వస్తున్నారు. ఆ సమయంలో స్థానిక నల్ల వంతెన వద్ద బస్సు అత్యవసర తలుపు ఒక్కసారిగా ఊడి రోడ్డుపై పడింది. బస్సు తక్కువ వేగంతో వెళ్తూండటంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. అదే కనుక బస్సు వేగంగా వెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగి ఉంటే బస్సులోని కొందరు కిందపడి ఉండేవారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలల పునః ప్రారంభానికి ముందే స్కూల్ బస్సుల ఫిట్నెస్ను, భద్రతా ప్రమాణాలను తనిఖీ చేశామని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే, ఆ తనిఖీలు సక్రమంగా జరిగి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని స్థానికులు అంటున్నారు. రవాణా శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టి, జిల్లాలోని అన్ని ప్రైవేట్ విద్యా సంస్థల బస్సులను మరోసారి పూర్తి స్థాయిలో తనిఖీ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న శ్రీచైతన్య స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. రవాణా శాఖ కూడా స్కూల్ బస్సుల ఫిట్నెస్ విషయంలో కాగితాలకు పరిమితమవుతోందే తప్ప స్కూల్ బస్సుల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. బస్సు సీజ్ అత్యవసర తలుపు ఊడిపోయిన శ్రీచైతన్య స్కూల్ బస్సును సీజ్ చేసినట్లు జిల్లా రవాణా అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఘటన జరిగిన వెంటనే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ విచారణ చేసి బస్సును సీజ్ చేశారన్నారు. ఈ బస్సు రాజమహేంద్రవరం అడ్రస్తో రిజిస్టర్ అయ్యిందన్నారు. స్కూల్ బస్సు స్థానిక ఏటీఎస్ సెంటరులో ఈ నెల 4న ఫిట్నెస్ పొందిందని, అయినప్పటికీ బస్సును సీజ్ చేసి, ఫిట్నెస్ను రద్దు చేసి, బస్సు యాజమాన్యానికి సీఎఫ్ఎక్స్ నోటీసు జారీ చేశామని వెల్లడించారు. బస్సు పర్మిట్పై తదుపరి చర్యలకు రాజమహేంద్రవరం డీటీఓను సంప్రదించామన్నారు. మోటారు వెహికల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని శ్రీనివాసరావు తెలిపారు. -
అమ్మో.. హాస్టల్
మామిడికుదురు ప్రభుత్వ బాలుర వసతి గృహంలో సమస్యలు వెక్కిరిస్తున్నాయి. 68 మంది విద్యార్థులకు ఆసరాగా ఉన్న ఇక్కడి గదుల్లోని కిటికీలు, తలుపుల మెస్లు పాడయ్యాయి. ట్యూబ్ లైట్లు కిందకు వేలాడుతున్నాయి. ఐదు బాత్రూమ్లు, ఐదు లెట్రిన్లకు నీటి సరఫరా జరగడం లేదు. మరో 12 బాత్రూమ్లు, మరో 12 లెట్రిన్ల పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఈ సమస్యలపై ఏఎస్ డబ్ల్యూఓ ఎస్.సత్యనారాయణ దృష్టికి ‘సాక్షి’ తీసుకువెళ్లగా సమస్యలను వెంటనే పరిష్కరిస్తామన్నారు. –మామిడికుదురు అసంపూర్తిగా ఉన్న లెట్రిన్, బాత్రూమ్లు బాలుర హాస్టల్లో వేలాడుతున్న ట్యూబ్లైట్ -
పిఠాపురం
వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి వంగా గీత ఆధ్వర్యంలో పిఠాపురం పార్టీ కార్యాలయం నుంచి పాదయాత్రగా భారీ ర్యాలీగా బయలుదేరిన వైఎస్సార్ సీపీ శ్రేణులు రాజుగారికోట నుంచి కోటగుమ్మం సెంటర్, పెద్ద బజారు, చర్చి సెంటర్, రామా టాకీస్ సెంటర్, స్టేట్బ్యాంకు సెంటర్, వన్ వే రోడ్డు, స్టూవర్టుపేట మీదుగా ఉప్పాడ సెంటర్కు చేరుకున్నారు. అక్కడి నుంచి పాదయాత్రగా అంబేడ్కర్ సెంటర్కు చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి నివాళులర్పించి ర్యాలీ నుద్దేశించి వంగా గీత మాట్లాడారు. జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, పార్టీ ఎస్ఈసీ సభ్యులు రావు చిన్నారావు, గండేపల్లి బాబీ, జిల్లా మహిళా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత, రాష్ట్ర నాయకులు మాదిరెడ్డి దొరబాబు, ఉలవల భూషణం, వడిశెట్టి నారాయణరెడ్డి, మొగలి అయ్యారావు, జ్యోతుల భీముడు, కారే శ్రీనివాసరావు, జడ్పీటీసీ ఉలవకాయల నాగ లోవరాజు, గండ్రేటి రామచంద్రమూర్తి నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. -
వలసపాకల పంచాయతీ గ్రేడ్ 5 సెక్రటరీ సస్పెన్షన్
కాకినాడ రూరల్: ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహించారనే కారణంతో మండలంలోని వలసపాకల గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రేడ్ – 5 సెక్రటరీగా పనిచేస్తున్న ఎం.స్నేహలతను సస్పెండ్ చేస్తూ కలెక్టరు హరేంధిర ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యేక ఓటర్ల సమగ్ర సంక్షిప్త నిర్వహణ కార్యక్రమంలో భాగంగా సర్ ప్రక్రియలో సెక్రటరీ స్నేహలత విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని నియోజకవర్గ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, ఆర్డీఓ మల్లిబాబు కలెక్టరుకు నివేదించారు. బీఎల్ఓ విధులు హాజరయ్యేందుకు ఆమె నిరాకరించడంతో చర్యలకు ప్రతిపాదించినట్టు మల్లిబాబు తెలియజేశారు. బీఎల్ఓ విధులకు హాజరు కాకపోవడానికి ఆమె సరైన కారణం చూపకపోవడంతో కలెక్టరు చర్యలు తీసుకున్నట్టు మల్లిబాబు తెలియజేశారు. 17 మైనింగ్ లారీలపై కేసులురౌతులపూడి: కలెక్టరు హరేంధిర ప్రసాద్ ఆదేశాల మేరకు మండల కేంద్రమైన రౌతులపూడి ప్రధాన రహదారిలో మైనింగ్, రవాణా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో నిబంధనలు పాటించని 17 క్వారీ లారీలపై కేసులు నమోదు చేశారు. మైనింగ్శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో నల్లరాయిని తరలించే వాహనాలకు సంబంధించి రికార్డులు సక్రమంగా లేని ఆరు వాహనాలను సీజ్ చేసి స్వాధీన పరచుకున్నారు. అధిక లోడుతో రవాణా సాగిస్తున్న మూడు వాహనాలు, భద్రతా ప్రమాణాలను పాటించని మరో ఎనిమిది వాహనాలపై కేసులు నమోదు చేసి రూ.3,36,000 అపరాధ రుసుం విధించారు. తనిఖీల్లో మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ డి.సోనీప్రియ, అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ గౌరీశంకర్, మైనింగ్ టెక్నికల్ సిబ్బంది సత్యతేజ, రవీంద్ర, కాకినా ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు. ఓఎన్జీసీ సైట్ వద్ద మంటలు ఆందోళన చెందిన కరప గ్రామస్తులు కరప: గ్రామ శివారు పంట పొలాల మధ్య ఉన్న ఓఎన్జీసీ సైట్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం దట్టంగా పొగలు వ్యాపించి, మంటలు చెలరేగడంతో ఏ ప్రమాదం ముంచుకొస్తోందోనని గ్రా మస్తులు ఆందోళన చెందారు. కాకినాడ–రామచంద్రపురం ప్రధాన రహదారికి ఆనుకుని పంటపొలాల మధ్య ఖాళీగా ఓఎన్జీసీ సైట్ ఉంది. అక్కడ పాత టైర్లు, చెత్త, చెదారం వేశారు. ఓఎన్ జీసీ సైట్ సమీపంలోని పంటపొలాల్లో కోసిన వరిగడ్డిని రైతులు తగులపెట్టారు. ఈ మంటలు ఒక్కసారిగా వ్యాప్తిచెంది, ఓఎన్జీసీ సైట్వద్ద ఉన్న పాతటైర్లు, చెత్త అంటుకున్నాయి. దీంతో ఒక్కసారిగా నల్లటి పొగ దట్టంగా అలుపుకుని పై కి లేచింది. అక్కడి చెత్త,చెదారానికి మంటలు ఎగబాగడంతో ఆకాశమంతా నల్లగా కనబడటంతో ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని గ్రామస్తులు ఆందోళన చెందారు. దారిన వెళ్లేవారు ఏమి జరుగుతోందో తెలియక అయోమయానికి గురయ్యా రు. కాకినాడ నుంచి ఫైరింజన్ వచ్చి మంటలను ఆర్పివేయడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రత్నగిరికి భక్తుల రద్దీ అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామి ఆలయానికి శుక్రవారం భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారి సన్నిధికి విచ్చేశారు. క్యూ లు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయాయి. స్వామి దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని వ్రతాలు రెండు వేలు జరిగాయి. -
మోగిన బడిగంట
● మొదలైన చదువుల సందడి ● తొలిరోజు అంతంత మాత్రంగా హాజరు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): వేసవి సెలవుల్లో ఆటపాటలతో మునిగి తేలిన చిన్నారులు ఇక చదువులకు స్వాగతం చెప్పారు. బుద్ధిగా పుస్తకాల బ్యాగు భూజానవేసుకుని బడిబాట పట్టారు. జిల్లావ్యాప్తంగా శుక్రవారం ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్య పాఠశాలలు పున ప్రారంభమయ్యాయి. దీంతో చిన్నారులు ఆటపాటలతో సందడి చేసిన క్రీడామైదానాలు, వీధులు ఒక్కసారిగా బోసిపోయాయి. తొలిరోజు కొంత మంది పిల్లలు మారం చేయగా తల్లిదండ్రులు బుజ్జగిస్తూ పాఠశాలకు తీసుకెళ్లారు. మరికొంతమంది ఉత్సాహంగా వెళ్తూ కనిపించారు. ఉదయం 9 గంటలకు బడిగంట మోగే సరికి బడికి చేరుకున్నారు. తరగతి గదుల్లో కూర్చుని, స్నేహితులను కలుసుకుని సంబరపడ్డారు. దాదాపు 50 రోజల తరువాత విద్యార్థులు పాఠశాలకు రావడంతో ఉపాధ్యాయులు తొలుత కుశల ప్రశ్నలు వేస్తూ సరదాగా గడిపారు. జిల్లాలో 12,85 ప్రభుత్వ, 581 ప్రైవేట్ పాఠశాలలు జిల్లాలో ప్రభుత్వ 1,285, ప్రైవేట్ 581 పాఠశాలలున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో గత విద్యా సంవత్సరంలో దాదాపుగా 1.25 లక్షల మంది విద్యాభ్యాసం చేశారు. తొలిరోజు విద్యార్థుల హాజరు అంతంతమాత్రంగానే ఉంది. జిల్లా విద్యాశాఖ 94.5శాతం హాజరయ్యారని ప్రకటించినా వాస్తవంగా అంతమంది రాలేదు. అందని కిట్లు వేసవి సెలవుల నేపథ్యంలో 50 రోజుల తర్వాత పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటికీ విద్యార్థుల హాజరు తక్కువగా ఉంది. జిల్లా వ్యాప్తంగా బడి బయట పిల్లల గుర్తింపునకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. పాఠశాలలు పునఃప్రారంభించే నాటికి విద్యార్థుల చేతిలో స్కూల్ బ్యాగ్, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, షూస్, రెండు జతల సాక్సులు, యూనిఫామ్, బెల్టులు, డిక్షనరీలతో కూడిన కిట్ను అందజేయాల్సి ఉంది. అయితే గత ప్రభుత్వంలో క్రమం తప్పకుండా పాఠశాలల పునఃప్రారంభం రోజునే విద్యార్థి చేతికి కిట్ అందివ్వగా నేడు ఆ పరిస్థితి లేదు. జిల్లాకు 1,21,268 కిట్లకు ఇండెంట్ పెట్టారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు అందజేయాల్సి ఉంది. ఇప్పటి వరకు బ్యాగ్లు, యూనిఫామ్, ఒకటి కూడా రాలేదు. కేవలం నోట్పుస్తకాలు, డిక్షనరీ, పాఠ్య పుస్తకాలు, వర్క్బుక్స్ మాత్రమే జిల్లాకు చేరాయి. దీంతో పాఠశాలల ప్రారంభం రోజున విద్యార్థులకు కిట్లు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఘూస్ 25,341 ,బెల్టులు 16,878 మాత్రమే వచ్చాయి. -
చంద్రబాబు వెన్నుపోటుపై ప్రజల తిరుగుబాటు
– దాడిశెట్టి రాజా హెచ్చరిక తుని: అధికారం కోసం ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడం, ఆ తర్వాత ప్రజలకు వెన్నుపోటు పొడవటం చంద్రబాబునాయుడుకు వెన్నతో పెట్టిన విద్య అని, వెన్నుపోటుపై ప్రజలు తిరుగుబాటు చేసే సమయం ఆసన్నమైందని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా హెచ్చరించారు. శుక్రవారం తుని పట్టణంలో జరిగిన వైఎస్సార్ సీపీ ర్యాలీ సందర్భంగా రాజా మాట్లాడుతూ చంద్రబాబును నమ్మి ఓటు వేసి అధికారం కల్పించిన మహిళలను నిలువునా మోసం చేశారన్నారు. సూపర్ సిక్స్ అట్టర్ఫ్లాప్ అయ్యిందని, మహిళలు, విద్యార్థులు, రైతులు, విద్య, వైద్య రంగాలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. చంద్రబాబు రెండేళ్ల పాలన వంచనతో కొనసాగిందని, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందనడానికి నిరసన ర్యాలీకి వేల సంఖ్యలో జనం తరలిరావడం సాక్ష్యమన్నారు. డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను వంచించి, స్పోర్ట్స్ కోటా పేరుతో అమ్ముకున్నారని ఆరోపించారు. 2029లో చంద్రబాబును గద్దె దింపి, వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాజా అనడంతో ఒక్కసారిగా ప్రజలు ఔను ఔను అంటూ చప్పట్లు కొట్టారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో కలిసి గ్రామస్థాయిలో హామీల అమలుపై గట్టిగా నిలదీయాలన్నారు. మండుతున్న ఎండను సైతం లెక్కచేయకుండా జనం రోడ్లపైకి వచ్చారంటే కూటమి ప్రభుత్వానికి చరమగీతం పాడటానికి సిద్ధంగా ఉన్నారని అర్థమని అన్నారు. -
శనివారం శ్రీ 13 శ్రీ జూన్ శ్రీ 2026
తుని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో స్థానిక రాజా కళాశాల మైదానం నుంచి ఆంజనేయస్వామి గుడి, బాలాజీ సెంటర్, మెయిన్ రోడ్డు మీదుగా గొల్ల అప్పారావు సెంటర్ వరకు ర్యాలీ సాగింది. రెండేళ్ల కాలంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ప్ల కార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. తుని, తొండంగి, కోటనందూరు మండలాలతో పాటు తుని పట్టణానికి చెందిన సుమారు పదివేల మంది ర్యాలీలో పాల్గొన్నారు. పట్టణంలోని ప్రధాన రహదారులు జనంతో నిండిపోయాయి. వైఎస్సార్ సీపీ తుని, తొండంగి, కోటనందూరు, తుని పట్టణ పార్టీ అధ్యక్షులు డి నాగేశ్వరరావు, బత్తుల వీరబాబు, చింతకాయల చిన్నబాబు, మున్సిపల్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి రేలంగి రమణ గౌడ్, అనుబంధ విభాగాల నాయకులు బోడపాటి సతీష్, బి ఉమారావు, ఎంపీపీ లగుడు శ్రీనివాస్, పోతల రమణ, హేమంత్, నాగేంద్ర నెహ్రూ, నాగం దొరబాబు, సీహెచ్ రాంబాబు రాజు పాల్గొన్నారు. -
చంద్రబాబూ.. మీది కోతల ప్రభుత్వం : కురసాల కన్నబాబు
కాకినాడ రూరల్: పథకాల లబ్ధిదారుల్లో కోత విధించి రెండేళ్లుగా దుర్మార్గపు పాలన అందిస్తున్న చంద్రబాబూ మీది కోతల ప్రభుత్వమని మాజీ మంతి, వైఎస్సార్ సీపీ ఉమ్మడి విజయనగరం, విశాఖపట్నం జిల్లాల రీజనల్ కో ఆర్డినేటరు కురసాల కన్నబాబు విమర్శించారు. కాకినాడ రూరల్లో నిర్వహించిన బైక్ ర్యాలీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ అనే శక్తిని ఓడించేందుకు చంద్రబాబు కూటమి కట్టి అమలు కాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేశారన్నారు. మా నాయకుడు జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాలలో నిరసన ర్యాలీలు చేపడుతున్నామన్నారు. సూపర్ సిక్స్ అని చెప్పి అమలు చేయకుండానే అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని, ఆడబిడ్డ నిధి ప్రతి నెలా రూ.1,500 ఇస్తామని ఇచ్చారా అని నిలదీశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 6 లక్షల పింఛన్లు తగ్గించారని చెప్పారు. 7 లక్షల అన్నదాత సుఖీభవ, 20 లక్షల మంది తల్లికి వందనం లబ్ధిదారులను కూడ తగ్గించారని, అందుకే మీది కోతల ప్రభుత్వమని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. పబ్లిసిటీ, మీడియాతో నెట్టుకువస్తూ దుర్మార్గపు పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ, వలంటీర్లను తీసుకువచ్చి ప్రజల వద్దకు నిజమైన సంక్షేమం తీసుకువస్తే దానిని నీరు గార్చేశారన్నారు. సుపరిపాలన లేదన్నారు. నిలదీస్తే బెదిరిస్తున్నారని, మీ బెదిరింపులకు భయపడమన్నారు. గురువారం రాత్రి నుంచి పోలీసులు తమ పార్టీ నాయకులకు ఫోన్లు చేస్తున్నారని, ఆంక్షలు పెడుతున్నారని అన్నారు. డీఎస్సీ పోస్టులను అమ్ముకోవడం దుర్మార్గమన్నారు. మీ సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్ అని, అయినా తిరుపతిలో విజయోత్సవ సభ పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. కార్పొరేట్లకు ఎకరం 99 పైసలకే భూములు కట్టబెడుతున్నారన్నారు. -
వెను్నపోటుపై తిరుగుబాటు
పిఠాపురం: నమ్మి ఓట్లు వేశాం, అధికారంలోకి వచ్చాక మమ్మల్ని నట్టేట ముంచారు అంటూ చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెన్నుపోటుపై తిరుగుబాటు బావుటా ఎగుర వేశారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మాజీ మంత్రి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో శుక్రవారం వైఎస్సార్ సీపీ శ్రేణులు, ప్రజలు జిల్లాలో భారీ ర్యాలీలు, ప్రదర్శనలతో కదం తొక్కారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా భారీగా తరలివచ్చిన జనం ర్యాలీల్లో పాల్గొన్నారు. దీంతో అన్ని నియోజకవర్గాల కేంద్రాలు జనమయంగా మారాయి. ముఖ్యంగా తమకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేసిందని, తమకు రక్షణ లేకుండా పోయిందంటూ మహిళలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో జిల్లా మారుమోగింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం వివిధ వర్గాలను మోసగించిన తీరును ఎండగట్టారు. పెద్దాపురం వైఎస్సార్ సీపీ పెద్దాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు ఆధ్వర్యంలో పెద్దాపురం అంబేడ్కర్ కమ్యూనిటీ హాల్ నుంచి మెయిన్రోడ్ మీదుగా వేంకటేశ్వరస్వామి ఆలయం వరకు పాదయాత్ర జరిగింది. ఈ పాదయాత్రలో నియోజకవర్గంలో నుంచి అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పార్టీ శ్రేణులు తరలిరావడంతో మెయిన్ రోడ్డు వైఎస్సార్ సీపీ జెండాలు, బెలూన్లతో నిండిపోయింది. కదం తొక్కిన వైఎస్సార్ సీపీ శ్రేణులు, ప్రజలు చంద్రబాబు సర్కారు మోసాలపై ర్యాలీలు, ప్రదర్శనలు భారీగా తరలివచ్చిన వివిధ వర్గాల జనం, మహిళలు -
కాకినాడ రూరల్
కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి, ఉమ్మడి విజయనగరం, విశాఖపట్నం జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. వైద్యనగర్లోని క్యాంపు కార్యాలయం వద్ద ప్రారంభమైన బైక్ ర్యాలీ నాగమల్లితోట జంక్షన్, ఆశ్రమం పబ్లిక్ స్కూల్, బోట్క్లబ్ మీదుగా సర్పవరం జంక్షన్కు చేరుకుంది. అక్కడ రోడ్డుపై కన్నబాబు పార్టీ నాయకులు బైఠాయించి చంద్రబాబు వెన్నుపోటుపై నిరసన వ్యక్తం చేశారు. మ్యానిఫెస్టో ప్రతులను దహనం చేసి చంద్రబాబు మోసాలను తెలియజేశారు. కాకినాడ రూరల్ జెడ్పీటీసీ సభ్యుడు నురుకుర్తి రామకృష్ణ. వైఎస్సార్ సీపీ ఎస్ఈసీ సభ్యులు సత్యనారాయణ, గోపిశెట్టి బాబ్జి, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి, పబ్బినీడి పాపారావు, చింతా ఈశ్వరరావు పాల్గొన్నారు. -
ప్రత్తిపాడు
వైఎస్సార్ సీపీ పిలుపు మేరకు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు ఆధ్వర్యంలో ప్రత్తిపాడులో చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై నిరసన కార్యక్రమం విజయవంతంగా జరిగింది. పత్తిపాడులోని ఫైర్ స్టేషన్ నుంచి ప్రధాన రహదారి మీదుగా అల్లూరి సీతారామరాజు సెంటర్ వరకు పాదయాత్ర నిర్వహించారు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి సుమారు 2,000 మందికి పైగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిబాబు మాట్లాడుతూ చంద్రబాబు రెండేళ్ల పాలనలో ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. కార్యక్రమంలో కాకినాడ పార్టీ పరిశీలకుడు దాట్ల సూర్యనారాయణరాజు, ప్రత్తిపాడు తుని పార్టీ పరిశీలకులు ఒమ్మి రఘురాం, వాసిరెడ్డి జమీలు, జెడ్పీటీసీ సభ్యులు గొల్లు చిన్న దిమానం, బెహరా రాజేశ్వరి, సామంతుల సూర్యకుమార్, సుంకర రాంబాబు, శిడగం వెంకటేశ్వరరావు, రామిశెట్టి నాని, నరాల శీను పాల్గొన్నారు. జగ్గంపేట నియోజకవర్గ కేంద్రంలో వైఎస్సార్ సీపీ సమన్వయ కర్త తోట నరసింహం ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుపై నిరసన ర్యాలీ జరిగింది. జగ్గంపేటలో స్థానిక బాలాజీ నగర్లో ఉన్న వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి సుమారు 1,500 మందితో ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి తోట రామ్జీ ర్యాలీని ముందుండి నడిపించారు. చంద్రబాబు పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ర్యాలీ సుమారు రెండు కిలోమీటర్లు కొనసాగి జగ్గంపేట బస్టాండ్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహం వద్దకు చేరింది. వైఎస్సార్ విగ్రహానికి పార్టీకి చెందిన ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కూటమి వైఫల్యాలపై, వెన్నుపోటు హామీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమన్వయకర్త తోట నరసింహం, ఇతర నాయకులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్నారు. కాకినాడ సిటీ పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, కౌడా మాజీ చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి ఆధ్వర్యంలో స్థానిక డీ కన్వెన్షన్ నుంచి భానుగుడి సెంటర్, మెయిన్రోడ్డు మీదుగా జగన్నాథపురం అన్నమ్మఘాటీ సెంటర్ వరకూ ఈ బైక్ ర్యాలీ నిర్వహించారు. సుమారు 700 మంది కార్యకర్తలు, నాయకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. దాదాపు 200 బైక్లు 10 జీపులతో ఈ ర్యాలీ నిర్వహించారు. అన్నమ్మఘాటీ సెంటర్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్, పార్టీ బీసీ సెల్ నాయకుడు అల్లి రాజుబాబు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాగిరెడ్డి అరుణ్కుమార్, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
● హైలెస్సో.. హైలెస్సా
అలల కెరటాల్లో బతుకు పోరాటానికి ఎదురెళ్లారు.. బోట్లపై పోటాపోటీగా ముందుకు సాగారు.. కొన్ని రోజులుగా నిశ్శబ్దంగా ఉన్న సాగర తలాన్ని బోట్లతో హోరెత్తించారు. చేపల వేట నిషేధం పూర్తి కావడంతో వందల బోట్లు ఒకేసారి కడలి వైపు సాగాయి. ఉప్పాడ, కోనపాపపేట, అమీనాబాద్, మూలపేట సమీపం నుంచి సముద్రమంతా బోట్లతో సందడిగా మారింది. హైలెస్సో హైలెస్సా అంటూ మత్స్యకారులు వలలు లాగుతూ మత్స్య సంపదను చాలా కాలం తర్వాత కళ్లారా చూసి సంబరపడ్డారు. బుధవారం ఉదయం వేటకు ఉపక్రమించిన వారు.. గురువారం జోరుగా వేట సాగించారు. రాత్రి వేళ లైట్లు వేసి మరీ వేట సాగించారు. – పిఠాపురం -
ఆ అడుగులు.. సంక్షేమానికి బాటలు
● నేడు జగన్ పాదయాత్ర ఉమ్మడి జిల్లాలో అడుగిడిన రోజు ● నేటికీ మరపురాని ఆ జ్ఞాపకాలు కపిలేశ్వరపురం: నడుస్తున్న చరిత్రలో లిఖించదగిన అరుదైన ఘటనల్లో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఒకటి. జనం చూపిన మార్గంలో పయనించాలన్న సంకల్పం నుంచి వైఎస్ జగన్ రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 3,648 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయడం ఓ రికార్డు. 2017 నవంబర్ 6న ఇడుపులపాయలో ప్రారంభించిన ఆయన పాదయాత్ర.. 2019 జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకూ సాగి విజయవంతంగా ముగిసింది. అంతటి మహా యాత్ర 2018 జూన్ 12న అప్పటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి రోడ్ కం రైల్వే బ్రిడ్జి మీదుగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోకి అడుగు పెట్టింది. గోదారమ్మ చలువతో యాత్ర విజయవంతమై, ఆగస్టు 14న విశాఖ జిల్లా మీదుగా ముందుకు సాగింది. అడుగడుగునా నీరాజనం పాదయాత్ర 187వ రోజైన 2018 జూన్ 12న రోడ్ కం రైల్వే బ్రిడ్జి మీదుగా రాజమహేంద్రవరం చేరింది. కింద జలగోదారి.. వంతెనపై జనగోదారి అనే రీతిలో అశేష ప్రజానీకం జననేతతో అడుగులో అడుగేయడం చూసి యావత్ రాష్ట్రం పులకించిపోయింది. జనం తాకిడికి బ్రిడ్జి పలుమార్లు ఊగడంతో అప్పట్లో టీడీపీ ప్రభుత్వం గుండెల్లో ప్రకంపనలు కలిగాయంటూ అభిమానులు చమత్కరించారు. దిగువన గోదావరిలో 600 పడవలు ఆకర్షణీయంగా నిలిచాయి. జగన్ పాదయాత్ర అదే నెల 13న కోనసీమలో ప్రవేశించింది. బొబ్బర్లంక – రావులపాలెం రహదారి జనగోదారిలా మారింది. ఈ యాత్ర సాగిన ధవళేశ్వరం, యానాం తదితర వంతెనలు ఆకర్షణీయంగా మారాయి. బొబ్బర్లంక – రావులపాలెం రహదారి వెంబడి కాలువలో నవరత్నాల నావలు ఆకట్టుకున్నాయి. జగన్ హృదయంలో నుంచి జనం వెళ్లేటట్టుగా కాకినాడ రూరల్, తునిల్లో ఏర్పాటు చేసిన ద్వారాలు విశేషంగా ఆకట్టుకుంది. పలు ప్రాంతాల్లో కొబ్బరి మట్టలు, కాయలు, ధాన్యం గుత్తులతో తమ ప్రియ నేతకు జనం ఘన స్వాగతం పలికారు. అమలాపురం, రౌతులపూడి మండలం గిడజాం, ఎస్.అగ్రహారం తదితర ప్రాంతాల్లో పూలతో పలికిన స్వాగతం ఎంతో ఆకట్టుకుంది. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రత్తిపాడు నియోజకవర్గం పారుపాక క్రాస్ వద్ద గిరిజనులు అభిమానంతో ఇచ్చిన కొమ్ము తలపాగాను జగన్ ధరించారు. పాదయాత్ర ఆగస్టు 14న విశాఖ జిల్లాలోకి ప్రవేశించింది. అప్పటి దుష్టపాలనలో చెప్పుకొన్న సమస్యలనేకం అప్పటి చంద్రబాబు ప్రభుత్వ పాలనతో తాము ఎలా సతమతమవుతున్నామో సామాన్య జనం వైఎస్ జగన్కు చెప్పుకొన్నారు. నిలువ నీడ లేకున్నా ఇళ్ల స్థలం ఇవ్వడం లేదని, వైకల్యం కళ్లకు కనిపిస్తున్నా పింఛను ఇచ్చేందుకు కనికరం చూపడం లేదని, తమను ఆదరించడం లేదని వృత్తిదారులు సమస్యలు చెప్పుకొన్నారు. కుటీర పరిశ్రమల నిర్వహణ కష్టమవుతోందని పలు ప్రాంతాల్లో నిర్వాహకులు గోడు వెళ్లబోసుకున్నారు. భరోసాగా నిలిచి.. నాడు జగన్ వేసిన ఆ అడుగులే తదనంతర కాలంలో జన సంక్షేమానికి బాటలు పరిచాయి. నాటి పాదయాత్రలో జనం చేసిన విన్నపాలే 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోగా రూపాంతరం చెందాయి. రెండే రెండు పేజీలతో మొత్తం నవ్యాంధ్రప్రదేశ్ పేద, మధ్య తరగతి ప్రజలకు ఆశాజ్యోతిగా ఈ మేనిఫెస్టో నిలిచింది. నాటి ఎన్నికల్లో ప్రజల దీవెనలతో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మేనిఫెస్టోను పరిపూర్ణంగా అమలు చేసి, దేశానికే ఆదర్శంగా నిలిచింది. ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా విపత్కర పరిస్థితులను సైతం అధిగమించి.. ఖర్చుకు వెనుకాడకుండా పేద, మధ్య తరగతి ప్రజలకు సంక్షేమాన్ని అందించిన ఘనత నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుంది. అంతటి సంకల్ప బలాన్ని ఇచ్చింది ఆయన చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రే. -
వెన్నుపోటుపై నేడు నిరసన ర్యాలీలు
పిఠాపురం: ఎన్నికల్లో అనేక హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిచిన తీరును నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యాన శుక్రవారం జిల్లావ్యాప్తంగా భారీ నిరసన ర్యాలీలు నిర్వహించనున్నారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు, ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ముఖ్య కేంద్రాల్లో ఆయా కో ఆర్డినేటర్ల ఆధ్వర్యాన నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే నిరసన ర్యాలీలకు జనం భారీగా తరలిరానున్నారు. వీటిని విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
మిథ్యారంభం కరిష్యామి!
● ముగిసిన వేసవి సెలవులు ● నేడు మోగనున్న బడి గంట ● ప్రారంభం కానున్న నూతన విద్యా సంవత్సరం ● కానరాని సందడిబాలాజీచెరువు (కాకినాడ సిటీ): వేసవి సెలవులను ఎంజాయ్ చేసిన విద్యార్థులు శుక్రవారం నుంచి బడిబాట పట్టనున్నారు. గత ప్రభుత్వ హయాంలో వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునఃప్రారంభాన్ని పండగ వాతావరణంలో నిర్వహించేవారు. స్వాగత తోరణాలు కట్టి ఎంతో సందడి చేసేవారు. ఈ ఏడాది అటువంటి వాతావరణం ఎక్కడా కనిపించడం లేదు. ప్రైవేటు పాఠశాలలు సకల సౌకర్యాలతో విద్యార్థులకు స్వాగతం పలుకుతుండగా.. కూటమి ప్రభుత్వం పుణ్యమా అని సర్కారీ బడులు సౌకర్యాల లేమితోనే ఆహ్వానిస్తున్నాయి. దీంతో, ప్రభుత్వ విద్య మిథ్యగా మారుతుందనే విమర్శలు ఉపాధ్యాయుల నుంచే వస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం శుక్రవారం నుంచి 2026–27 విద్యా సంవత్సరానికి బడి గంటలు మోగనున్నాయి. ఈ ఏడాది 229 పనిదినాలు కాగా, 87 రోజులు సెలవులుగా పేర్కొంటూ.. పరీక్షల షెడ్యూల్ను సైతం పేర్కొంటూ విద్యా శాఖ గురువారం క్యాలెండర్ విడుదల చేసింది. అడ్మిషన్లు పెరిగేనా! జిల్లావ్యాప్తంగా 21 మండలాల్లో ప్రభుత్వ, మండల/జెడ్పీ, మున్సిపల్, ఎయిడెడ్ యాజమాన్యాల పరిధిలో 1,285 పాఠశాలలున్నాయి. వీటితో పాటు 573 ప్రైవేటు పాఠశాలు కూడా ఉన్నాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో సర్కారీ పాఠశాలలు విద్యార్థులతో కిక్కిరిసిపోయేవి. ప్రభుత్వ విద్యా రంగంపై నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. నాడు – నేడు పథకం కింద పాఠశాలలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దారు. డిజిటల్ బోధన, ఆంగ్ల మాధ్యమం వంటి అపూర్వ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అమ్మ ఒడి, విద్యా కానుక, గోరుముద్ద వంటి వినూత్న పథకాలను పక్కాగా అమలు చేశారు. వీటన్నింటి ఫలితంగా నాడు పెద్ద సంఖ్యలో విద్యార్థులు బడి బాట పట్టేవారు. దీంతో, అడ్మిషన్ల సమయంలో పలు ప్రభుత్వ పాఠశాలల వద్ద అంతకు మునుపెన్నడూ చూడని విధంగా హౌస్ఫుల్ బోర్డులు కూడా పెట్టేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. చంద్రబాబు సర్కారు ప్రభుత్వ విద్యారంగాన్ని చిన్నచూపు చూస్తూండటంతో అడ్మిషన్లు కూడా తగ్గుతున్న పరిస్థితి. విద్యార్థులను ఆకర్షించేందుకు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు కార్పొరేట్కు దీటుగా కరపత్రాలు, ఫ్లెక్సీలతో ప్రచారం చేశారు. అయితే, ఎంత మేర అడ్మిషన్లు వస్తాయనేది వారం రోజులు గడిస్తేనే కానీ చెప్పలేని పరిస్థితి నెలకొంది. అరకొరగా విద్యార్థి మిత్ర కిట్లు ఏటా పాఠశాలలు పునఃప్రారంభించిన రోజునే గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం.. స్కూల్ బ్యాగ్, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, షూస్, రెండు జతల సాక్సులు, యూనిఫామ్, బెల్టులు, డిక్షనరీలతో కూడిన విద్యా కానుక కిట్ను విద్యార్థుల చేతికి క్రమం తప్పకుండా అందించేది. నేడు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆ పరిస్థితి కానరావడం లేదు. విద్యా కానుక పథకం పేరును సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రగా కూటమి ప్రభుత్వం మార్చింది. పేరైతే ఘనంగా పెట్టారు కానీ.. ఆ మహనీయుని ఖ్యాతికి వన్నె తెచ్చే రీతిలో మాత్రం వ్యవహరించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. జిల్లా అధికారులు 1,21,268 విద్యార్థి మిత్ర కిట్లకు ఇండెంట్ పెట్టారు. ఇప్పటి వరకూ బ్యాగ్లు, యూనిఫామ్ ఒక్కటి కూడా జిల్లాకు చేరలేదు. కేవలం నోట్ పుస్తకాలు, డిక్షనరీ, పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్ మాత్రమే వచ్చాయి. షూస్ 25,341, బెల్టులు 16,878 మాత్రమే వచ్చాయి. ఫలితంగా పాఠశాలల ప్రారంభం రోజున విద్యార్థులకు పూర్తి స్థాయిలో కిట్లు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. పూర్తి కాని ‘మన బడి’ పనులు ‘మన బడి – మన భవిష్యత్తు’ రెండో దశ పనులు.. పాఠశాలలు పునఃప్రారంభించే నాటికే పూర్తి కావాల్సి ఉండగా.. ఇప్పటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. ఈ పథకం రెండో దశ కింద పాఠశాలల్లో నిరంతర నీటి సరఫరాతో కూడిన టాయిలెట్ల నిర్మాణం, తరగతి గదుల్లో ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు, తాగునీటి సరఫరా, విద్యార్థులను ఆకట్టుకునేలా పాఠశాలల ప్రహరీలపై పెయింటింగ్స్, భవనాల మరమ్మతులు, గ్రీన్ చాక్బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉంది. రెండో దశలో 881 పాఠశాలలను రూ.334 కోట్లతో అభివృద్ధి చేయాల్సి ఉండగా, చాలాచోట్ల ఈ పనులు నిలిచిపోయాయి. తల్లికి వందనంపై స్పష్టత ఏదీ? గత ప్రభుత్వం అమ్మ ఒడి పథకం కింద ఏటా క్రమం తప్పకుండా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఏటా రూ.15 వేలు జమ చేసేది. ఈ పథకం పేరును చంద్రబాబు ప్రభుత్వం తల్లికి వందనంగా మార్చింది. పాఠశాలల పునఃప్రారంభం రోజునే ఈ పథకం కింద తల్లుల ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ చేస్తామని చెప్పినా దీనిపై నేటికీ స్పష్టత లేదు. అడ్మిషన్లకు డ్రైవ్ వేసవి సెలవుల తర్వాత పాఠశాలల పునఃప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి చేశాం. మొదటి రోజు నుంచే మధ్యాహ్న భోజనం అందించనున్నాం. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమష్టి కృషితో విద్యార్థుల అడ్మిషన్లు పెంచేందుకు కృషి చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. – పిల్లి రమేష్, జిల్లా విద్యాశాఖాధికారి, కాకినాడ -
ట్యాంకర్ ఢీకొని వివాహిత మృతి
ప్రత్తిపాడు: పదహారో నంబర్ జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వివాహిత మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. కరప మండలం నడకుదురు గ్రామానికి చెందిన బొడ్డు వెంకట రామకృష్ణ, భార్య పద్మావతి (51) బైక్పై ప్రత్తిపాడు మండలం ఏలూరు గ్రామంలో పొలం పనులు చూసుకుని తిరిగి వెళ్తున్నారు. స్థానిక సంతోషిమాత గుడి వద్ద జాతీయ రహదారి దాటుతుండగా, వారి బైక్ను వెనుక నుంచి వస్తున్న పాల డెయిరీకి చెందిన ట్యాంకర్ ఢీకొంది. పద్మావతి కింద పడిపోగా, ఆమె తలపై నుంచి ట్యాంకర్ దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో పద్మావతి అక్కడికక్కడే మృతి చెందింది. వెంకట రామకృష్ణకు స్వల్ప గాయాలయ్యాయి. అతడిని హైవే అంబులెన్స్లో స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. ప్రత్తిపాడు ఎస్సై ఎస్.లక్ష్మీకాంతం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఆదాయానికి మించి ఆస్తులు కలిగి.. ఏసీబీ దాడిలో పట్టుబడిన కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్ చోడపురెడ్డి శివరామ్ కుమార్ను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ గురువారం సస్పెండ్ చేశారు. శివరామ్ కుమార్తో పాటు ఆయన బంధువుల ఇళ్లు, ఆస్తులు, కార్యాలయంపై ఏసీబీ అధికారులు ఈ నెల 5న ఏకకాలంలో దాడులు చేశారు. సుమారు రూ.10 కోట్ల ఆస్తులున్నట్లు గుర్తించారు. శివరామ్ కుమార్ను అరెస్టు చేసి, రాజమహేంద్రవరం ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. ఆయనకు కోర్టు రిమాండు విధించింది. ఈ నేపథ్యంలో శివరామ్ కుమార్ను కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఐజీ తనిఖీలు కాకినాడ క్రైం: స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ గురువారం తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ బిందుమాధవ్ ఆధ్వర్యాన పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించి, రికార్డులు పరిశీలించారు. నేర నియంత్రణ, మహిళలు, బాలికల భద్రత, పెండింగ్ కేసుల దర్యాప్తు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, రోడ్డు భద్రత, మత్తు పదార్థాల అక్రమ రవాణా, నివారణపై పలు సూచనలు చేశారు. జిల్లా పోలీసు శాఖ కార్యకలాపాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. -
ఉద్యోగులు పోరాటాలకు సిద్ధం కావాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): తమ సమస్యలను చంద్రబాబు ప్రభుత్వం పరిష్కరించనందున ఉద్యోగులందరూ పోరాటానికి సిద్ధంగా ఉండాలని ఏపీ జేఏసీ అమరావతి.. జిల్లా యూనిట్ చైర్మన్ పితాని త్రినాథ్ అన్నారు. స్థానిక రెవెన్యూ భవన్లో జిల్లా యూనిట్ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా త్రినాథ్ మాట్లాడుతూ, అధికారంలోకి రాగానే మధ్యంతర భృతి (ఐఆర్) ఇస్తామన్న చంద్రబాబు ప్రభుత్వం దీనిపై ఇప్పటి వరకూ స్పందించలేదని అన్నారు. పన్నెండో పీఆర్సీ ఇవ్వకపోవడంతో ఉద్యోగులు రూ.లక్ష మేర ఆర్థిక ప్రయోజనాలు కోల్పోయారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడటానికి రాష్ట్ర కార్యవర్గం ప్రకటించే ఎలాంటి కార్యాచరణకై నా అందరూ కట్టుబడి ఉండాలని కోరారు. ప్రధాన కార్యదర్శి దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ, ప్రస్తుతం విపరీతంగా పెరుగుతున్న మార్కెట్ ధరలకు అనుగుణంగా ఉద్యోగుల పే రివిజన్ వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. రెండు మూడు నెలల జీతాన్ని పన్నుల రూపంలో ఉద్యోగులు కోల్పోతున్నప్పటికీ సరెండర్ లీవ్లు కూడా చెల్లించడం లేదని, ఈ బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. ఏపీ జేఏసీ అమరావతి కోరిన విధంగా ప్రతి ఉద్యోగి పేస్లిప్లో వారికి రావాల్సిన పీఆర్సీ, డీఏ బకాయిలు చూపించాలని అన్నారు. రాష్ట్ర కో చైర్మన్ పీఎస్ఎస్ఎన్ శాస్త్రి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగితో పాటు సమానంగా చైల్ట్కేర్ లీవ్ కూడా రెండు సంవత్సరాలకు పెంచాలని కోరారు. -
పిల్ల కొంచెం.. ప్రతిభ ఘనం
23 నెలల చిన్నారికి నోబుల్ వరల్డ్ రికార్డ్ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): పిట్ట కొంచెం.. కూత ఘనం అన్నట్టుగా.. ఆ చిన్నారి పిల్ల కొంచెం.. ప్రతిభ ఘనమని నిరూపించుకుంది. నగరంలోని రామకృష్ణారావుపేట కొత్తూరు వీధికి చెందిన షేక్ ఖాజా మొహిదీన్ దంపతుల కుమార్తె 23 నెలల షేక్ ఆమైరా ఖాదరి నవాజ్ అద్భుత ప్రతిభతో నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకొంది. చిన్న వయస్సులోనే పండ్లు, కూరగాయలు, ఇంగ్లిషు అక్షరాలు, వాటి ఫోనెటిక్ పదాలు, 1 నుంచి 10 అంకెలు, శరీర భాగాలు, ఆకారాలు, పక్షులు, వ్యతిరేక పదాలు, బొమ్మలు, రుతువులు, గృహోపకరణాలను గుర్తించి చెబుతోంది. వివిధ రైమ్స్ కూడా చక్కగా వల్లె వేస్తూ ‘వన్ ఇన్ ఎ మిలియన్’గా గుర్తింపు పొందింది. ఆ చిన్నారి ప్రతిభ గురించి తెలుసుకున్న కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆమెను, తల్లిదండ్రులను గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్కు పిలిపించారు. వరల్డ్ రికార్డు సర్టిఫికెట్లు పరిశీలించి, 23 నెలల వయస్సులోనే ఖాదరి నవాజ్ ప్రపంచ రికార్డు సాధించడం గొప్ప విషయమని ప్రశంసించారు. ఆమె అసాధారణ ప్రతిభ పట్ల కలెక్టర్తో పాటు పలువురు ప్రముఖులు సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేశారు. ఖాదరి నవాజ్ తల్లి మహమ్మద్ బషీర్ మహమ్మద్ గృహిణి కాగా, తండ్రి సయ్యక్ ఖాజా మొహిద్దీన్ చైన్నెలో వైర్లెస్ సిస్టమ్ ఇంజినీర్గా పని చేస్తున్నారు. -
పేదలకు ఇళ్ల స్థలాలివ్వరా?
మీరు మాత్రం రెండు స్థలాలు తీసుకుంటారా? బోట్క్లబ్ (కాకినాడ సిటీ): టీడీపీ జిల్లా కార్యాలయానికి కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ సమీపాన 1.45 ఎకరాల భూమిని ప్రభుత్వం లీజుకు కేటాయించడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తాటిపాక మధు గురువారం ఒక ప్రకటనలో ఖండించారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఇళ్లు లేని పేదలకు పట్టణంలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్ల చొప్పున స్థలాలిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రకటించారని గుర్తు చేశారు. రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకూ ఎవ్వరికీ ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వలేదని, అటువంటిది టీడీపీ జిల్లా కార్యాలయానికి ప్రభుత్వ స్థలం కేటాయించడం దారుణమని మండిపడ్డారు. ఓవైపు టీడీపీ జిల్లా కార్యాలయం లీజులో ఉండగా మళ్లీ ప్రభుత్వ భూమి తీసుకోవడం అన్యాయమని ధ్వజమెత్తారు. దీనిపై రాష్ట్ర పార్టీ నాయకత్వంతో చర్చించి, టీడీపీ కార్యాలయం భూమి పూజను అడ్డుకుంటామని మధు హెచ్చరించారు. పొరపాట్లు లేకుండా భూ రికార్డుల పోర్టింగ్ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఎటువంటి పొరపాట్లూ లేకుండా భూ రికార్డుల పోర్టింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని జేసీ అపూర్వ భరత్ అన్నారు. ప్రత్తిపాడు మండలం పి.జగన్నాథపురం, తొండంగి మండలం కృష్ణాపురం గ్రామాల్లో జరుగుతున్న పోర్టింగ్ ప్రక్రియకు సంబంధించిన భూ రికార్డులను ఆయన కలెక్టరేట్లో గురువారం క్షుణ్ణంగా పరిశీలించారు. ఆయా గ్రామాలకు సంబంధించిన 22ఏ జాబితాలు, ఫ్రీ హోల్డ్ భూములు, ఇతర భూ సమాచార వివరాలను వీఆర్ఓలు, ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ సమక్షంలో నిశితంగా పరిశీలించి, నమోదైన వివరాల కచ్చితత్వాన్ని ధ్రువీకరించారు. జాయింట్ ఎల్పీఎంలు 2 శాతానికి మించకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. పూర్తి పారదర్శకత, కచ్చితత్వంతో భూ రికార్డుల నవీకరణను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు జేసీ దిశానిర్దేశం చేశారు. విలువలతో కూడిన విద్య అందించాలిబోట్క్లబ్ (కాకినాడ సిటీ): విలువలతో కూడిన విద్య అందించాలని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త, రాష్ట్ర నైతిక విలువల సలహాదారు చాగంటి కోటేశ్వరరావు అన్నారు. స్థానిక మధురా నగర్లో ఇస్కాన్ – బెంగళూరు ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన బాసిల్ వుడ్ స్కూల్ను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రస్తుతం చదువుకు సంపాదనే లక్ష్యంగా ఉందని, విలువలకు ప్రాధాన్యం ఉండటం లేదని అన్నారు. ఇస్కాన్ సంస్థ నిర్వాహకుడు ప్రభుదాస్ మాట్లాడుతూ, బాసిల్ వుడ్ స్కూల్ మొదటి శాఖ బెంగళూరులో ఉందని, ఇప్పుడు కాకినాడలో ప్రారంభించామని చెప్పారు. ఈ స్కూల్లో విద్యార్థులకు ఆడుతూ పాడుతూ చదువు చెప్పడమే కాకుండా, భాగవతం, భగవద్గీత వంటి గ్రంథాలపై అవగాహన పెంపొందిస్తామని తెలిపారు. చదువు పూర్తయిన తర్వాత జీవితంలో ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా మనోధైర్యంతో ఎదుర్కొనేలా విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను నేర్పిస్తామని అన్నారు. లింగ నిర్ధారణ ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్ కాకినాడ క్రైం: గర్భస్థ శిశు లింగ నిర్థారణ పరీక్షలపై ఫిర్యాదులకు ఉచిత టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి వచ్చిందని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి నరసింహ నాయక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. లింగ నిర్థారణ చేసినా, చేయాలని కోరడం పీసీపీఎన్డీటీ చట్టం ప్రకారం తీవ్ర నేరమని స్పష్టం చేశారు. అటువంటి ఉదంతాలు గుర్తిస్తే 1800 233 2447 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. -
కడలిన మత్స్యకారులు
పిఠాపురం: సుదీర్ఘ వేట విరామం తరువాత గంగపుత్రులు బోట్లకు లంగరు తీసి కడలి ఒడిలోకి బుధవారం పయనమయ్యారు. వాస్తవానికి ఈ నెల 14వ తేదీ నుంచి చేపల వేట పునఃప్రారంభం కావాల్సి ఉంది. కానీ, నాలుగు చేపలు వెనకేసుకోవాలనే గంపెడాశతో మత్స్యకారులు నాలుగు రోజులు ముందుగానే తమ జీవన పోరాటాన్ని పునఃప్రారంభించారు. రెండు రోజులుగా తమ బోట్లు, వలలను సిద్దం చేసుకున్న మత్స్యకారులు బుధవారం తెల్లవారుజాము నుంచి తమ ఇష్ట దైవాలకు పూజలు, ప్రార్థనలు చేసుకుని సముద్రంపై వేటకు బయలుదేరారు. ఇటు ఐస్ ఫ్యాక్టరీలు, ఆయిల్ అమ్మకాలు కూడా ప్రారంభమయ్యాయి. మరోవైపు నిత్యం చేపల రవాణా చేసే వందలాది వాహనాలు సాగర తీరానికి ఇప్పటికే చేరుకున్నాయి. దీంతో, గత 55 రోజులుగా నిశ్శబ్దంగా ఉన్న సాగరతీరం మళ్లీ పూర్వ కళను సంతరించుకుంది. ఈ ఏడాది డీజిల్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో తమపై మోయలేనంత ఆర్థిక భారం పడిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలలపై సయ్యాటలాడుతూ.. బోట్లపై వేటకు పయనమవుతున్న గంగపుత్రులుఉప్పాడ వద్ద లంగరు తీసి వేటకు బయలుదేరుతున్న బోట్లు -
రేపటి నుంచి రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు
సామర్లకోట: పెద్దాపురం రామారావుపేటలోని శ్రీప్రకాష్ సినర్జీ స్కూల్లో శుక్రవారం నుంచి ఆదివారం వరకూ రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ ర్యాకింగ్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఆ పాఠశాల డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ సీహెచ్ విజయ ప్రకాష్ బుధవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీలకు రాష్ట్ర అసోసియేషన్లో నమోదైన క్రీడాకారులు మాత్రమే అర్హులన్నారు. కాకినాడ టెబుల్ టెన్నిస్ అసోసియేషన్ పర్యవేక్షణలో.. బాల, బాలికల విభాగాల్లో అండర్–11, 13, 15, 17, 19 కేటగిరీల్లో పోటీలు జరుగుతాయని వివరించారు. మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం తుని రూరల్: హంసవరంలోని ఏపీ మోడల్ స్కూల్లో 2026–27 విద్యా సంవత్సరానికి గాను వివిధ తరగతుల్లో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్రిన్సిపాల్ కె.ధర్మకుమార్ బుధవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. 6, 7, 8, 9, ఇంటర్ ఫస్టియర్లో ప్రవేశాలకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 20వ తేదీ లోగా ఆన్లైలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆరు నుంచి తొమ్మిది తరగతుల్లో ప్రవేశాలకు ఈ నెల 24న పాఠశాల స్థాయిలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. 25న ఎంపికలు, 26న సర్టిఫికెట్ల పరిశీలన, అడ్మిషన్లు కల్పిస్తామని, వివరాలకు పాఠశాల పని వేళల్లో సంప్రదించాలని ధర్మకుమార్ సూచించారు. ఎదురెదురుగా ఢీకొన్న మోటార్ సైకిళ్లు ఒకరి మృతి గండేపల్లి: ఎదురెదురుగా వస్తున్న మోటార్ సైకిళ్లు ఢీకొని ఒకరు మృతి చెందారు. ఎస్సై యూవీ శివనాగబాబు కథనం ప్రకారం.. గండేపల్లికి చెందిన కట్టుమోతు శ్రీను (52) బుధవారం మోటార్ సైకిల్పై సింగరంపాలెం వైపు వెళ్తున్నాడు. గ్రామంలోని దుర్గమ్మ ఆలయం ఎదురుగా వచ్చేసరికి అదే మార్గంలో ఎదురుగా వస్తున్న మరో మోటార్ సైకిల్ బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీను అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. రత్నగిరిపై భక్తుల రద్దీ -
ధాన్యం డబ్బులెప్పుడిస్తారు?
జగ్గంపేట: ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే రైతులకు డబ్బులు జమ చేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటూండగా.. క్షేత్ర స్థాయిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ధాన్యాన్ని మిల్లులకు పంపించి 15 రోజులవుతున్నా ఇప్పటి వరకూ సంబంధిత సొమ్ము ఇవ్వలేదని ఆగ్రహిస్తూ కాట్రావులపల్లి వద్ద రైతులు బుధవారం రాస్తారోకో చేయడమే దీనికి ఉదాహరణగా నిలుస్తోంది. రైతుల కథనం ప్రకారం.. కాట్రావులపల్లి, రామవరం గ్రామాలకు చెందిన అన్నదాతలు గత నెల 19కి ముందు సుమారు 10 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని రైస్ మిల్లులకు పంపించారు. తామంతా వేరే పనుల్లో బిజీగా ఉన్నామని.. మిల్లులకు ధాన్యం తరలించాలని, మిగిలిన ప్రొక్యూర్మెంట్ పని తాము పూర్తి చేస్తామని రైతు సేవా కేంద్రం సిబ్బంది, వ్యవసాయ అధికారులు ఆ సమయంలో చెప్పారు. ఆ మేరకు తాము మిల్లులకు ధాన్యం తరలించామని, ఆ డబ్బుల కోసం అధికారులను అడిగితే, తమ ధాన్యం ప్రొక్యూర్మెంట్ జరగలేదని, సివిల్ సప్లయిస్ టార్గెట్ అయిపోయిందని ఇప్పుడు చెబుతున్నారని రైతులు మండిపడ్డారు. మిల్లులకు పంపిన ధాన్యానికి ఎవరు డబ్బులిస్తారని ప్రశ్నించారు. రైతుల ఆందోళనతో కాట్రావులపల్లి – పెద్దాపురం రోడ్డులో ట్రాఫిక్ స్తంభించిపోయింది. జగ్గంపేట ఎస్సై రఘునాథరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తహసీల్దార్ జేవీఆర్ రమేష్, మండల వ్యవసాయ అధికారి (ఎంఏఓ) ఎస్.నరసింహం తదితరులు రైతులతో చర్చించారు. ఈ రైతులు రైతు సేవా కేంద్రాలతో సంబంధం లేకుండా మధ్యవర్తుల ద్వారా మిల్లులకు ధాన్యం తరలించారని ఎంఏఓ నరసింహం తెలిపారు. సీఎంఆర్ రైస్ జిల్లా టార్గెట్ పూర్తవడంతో సివిల్ సప్లయిస్ అధికారులు ఆ ధాన్యం సేకరించలేదని చెప్పారు. ఈ రైతుల సమస్యను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళతామని అన్నారు. ఫ కాట్రావులపల్లి వద్ద రైతుల ఆందోళన ఫ అధికారులు సంబంధం లేదంటున్నారని ఆగ్రహం -
వాయు బీభత్సం.. వరుణ తాండవం
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో మధ్యాహ్నం వరకూ సూర్య దేవుడు ప్రతాపం చూపగా.. సాయంత్రం వాయు దేవుడు, వరుణ దేవుడు కలసి బీభత్సం సృష్టించారు. బలమైన ఈదురు గాలులతో బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. పెనుగాలులు మంగళవారమే బీభత్సం సృష్టించగా.. రత్నగిరి నుంచి దిగువకు వచ్చే ఘాట్ రోడ్డులో పలుచోట్ల చెట్లు విరిగి రోడ్డు మీద కూలాయి. అన్నదానం భవనం, శ్రీ సీతారామ సత్రం, సత్యగిరి మీద కూడా పెద్ద సంఖ్యలో చెట్లు కూలిపోయాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చెట్ల కొమ్మలు విరిగి పడటంతో విద్యుత్ తీగలు తెగిపోయి, సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కూలిపోయిన చెట్లను దేవస్థానం ఈఈ వి.రామకృష్ణ ఆధ్వర్యాన సిబ్బంది యుద్ధప్రాతిపదికన తొలగించారు. ప్రధానంగా ఘాట్ రోడ్ల మీద పడిన చెట్లను నరికి వాహనాల రాకపోకలకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నారు. విద్యుత్ స్తంభాలు, తీగల మీద పడిన చెట్లను తొలగించే కార్యక్రమం కూడా చేపట్టారు. రాత్రి 8 గంటల సమయానికి చాలా ప్రాంతాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని రామకృష్ణ తెలిపారు. ఈదురు గాలుల తాకిడికి అన్నవరం గ్రామంలోని కొత్తపేట సహా పలుచోట్ల చెట్లు విరిగిపడి, విద్యుత్ తీగలు తెగిపోయాయి. దీంతో, గ్రామంలో కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పాయకరావుపేట సబ్ స్టేషన్ నుంచి అన్నవరం సబ్ స్టేషన్కు ఉన్న 33 కేవీ లైన్ మీద చెట్ల కొమ్మలు విరిగి పడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఈపీడీసీఎల్ ఏఈ పి.ప్రసాద్ తెలిపారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను సిబ్బంది చేపట్టారు. తొండంగిలో.. తొండంగి: మండలంలోని పలు గ్రామాల్లో సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో ఈదుర గాలులు వీచి, కుండపోత వర్షం కురిసింది. తొండంగి – శృంగవృక్షం, ఎ.కొత్తపల్లి – కొమ్మనాపల్లి సీతారాంపురం రహదారులతో పాటు పెరుమాళ్లపురం బీచ్ రోడ్డులో భారీ వృక్షాలు కూలిపోయాయి. దీంతో, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మెట్ట గ్రామాల్లోని అరటి తోటల్లో చెట్లు నేలకూలడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోయారు. పెరుమాళ్లపురం పంచాయతీ అవల్దార్పాడులో పిడుగు పడి కొబ్బరి చెట్టు కాలిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ శబ్దాలతో ఉరుములు, మెరుపులు రావడంతో ప్రజలు భయాందోళనకు లోనయ్యారు. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగి, వైర్లు తెగిపోవడంతో ఎ.కొత్తపల్లి, కొమ్మనాపల్లి, రావికంపాడు, సీతారాంపురం, బెండపూడి, కోన తీర ప్రాంత గ్రామాలు అంధకారంలో చిక్కుకున్నాయి. విద్యుత్ శాఖ సిబ్బంది సరఫరాను పునరుద్ధరించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. కుండపోత వర్షానికి పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. రావికంపాడులో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ప్రధాన రహదారి పంట కాలువను తలపించింది. పంచాయతీ అధికారులు ప్రధాన డ్రైనేజీలో పూడిక తీయకపోవడంతో మురుగు నీరు, వాన నీరు కలసి ఇళ్లల్లోకి వస్తున్నాయని స్థానిక బీసీ కాలనీ, ఓసీ కాలనీ వాసులు వాపోయారు. తొండంగిలో ఈదురు గాలులకు దెబ్బ తిన్న అరటి తోటచెట్లు విరగడంతో నిలిచిపోయిన వాహనాల రాకపోకలురత్నగిరి ఘాట్ రోడ్డులో విరిగిపడిన చెట్టుఫ రత్నగిరిపై పెనుగాలులు, భారీ వర్షం ఫ ఽఘాట్ రోడ్డులో విరిగిన చెట్లు ఫ తెగిన విద్యుత్ తీగలు -
పిడుగుపాటుకు ఆవుల కాపరి మృతి
కోటనందూరు: పిడుగుపాటుకు ఓ ఆవుల కాపరి మృతి చెందాడు. మండలంలోని పాత కొట్టాం గ్రామానికి చెందిన యడ్ల జానీ ప్రసాద్ (40) రెండు ఆవులను మేపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజూ మాదిరిగానే బుధవారం సాయంత్రం ఆవులను మేపేందుకు వ్యవసాయ మకాం దగ్గర్లోని పంట పొలాలకు వెళ్లాడు. ఆ సమయంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో పిడుగు పడటంతో చెవి నుంచి రక్తస్రావమై పొలంలోనే కుప్పకూలిపోయాడు. స్థానికులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే జానీప్రసాద్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చెవి నుంచి రక్తస్రావం కావడం, ఫోన్ పాడైపోవడంతో.. ఫోన్ మాట్లాడుతూంటుండగా పిడుగుపాటుకు గురైననట్లు కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు జానీ ప్రసాద్ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ పెద్ద మృతితో వారు కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా కొత్త కొట్టాం గ్రామంలో లగుడు బాపన్న దొరకు చెందిన గెదే పిడుగుపాటుతో మృతి చెందింది. -
తాగునీరు కలుషితమవుతున్నా పట్టించుకోరా?
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): గ్రామాల్లో తాగునీరు కలుషితమవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోందని పలువురు జెడ్పీటీసీ సభ్యులు నిలదీశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజాపరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. తొలుత చైర్మన్ ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పథకాలపై సమీక్షించారు. ఆర్థిక, ప్రణాళిక, గ్రామీణాభివృద్ధి, రహదారులు, విద్య, వైద్యం, గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్యం, జాతీయ ఉపాధి హామీ పథకం, హౌసింగ్, విద్యుత్ తదితర శాఖల్లో వివిధ పనుల పురోగతి, కొత్త ప్రతిపాదనలపై సంబంధిత అధికారులతో చర్చించారు. గొల్లప్రోలు, ప్రతిపాడు, జగ్గంపేట గ్రామాల్లో సరఫరా చేస్తున్న తాగునీరు మట్టి వాసన వస్తోందని, రంగు మారుతోందని, అయినప్పటికీ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పలువురు సభ్యులు నిలదీశారు. రావులపాలెం, యు.కొత్తపల్లి గ్రామాల్లో అక్రమ మైనింగ్ జరుగుతోందని, నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ లోతుకు మట్టి తవ్వేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జెడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు మాట్లాడుతూ, ధాన్యానికి గిట్టుబాటు ధర రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, దీనిపై పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ వీవీవీఎస్ లక్ష్మణరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
అట్టర్ఫ్లాప్ సినిమాకు విజయోత్సవంలా..
కాకినాడ రూరల్: ఎన్నికల ముందు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ హామీలిచ్చారని, అవేవీ అమలు చేయకుండానే.. అట్టర్ఫ్లాప్ సినిమాకు విజయోత్సవం అన్నట్టుగా.. చంద్రబాబు సర్కారు సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అన్నట్టుగా ప్రచారం చేసుకుంటోందని వైఎస్సార్ సీపీ రూరల్, ఉత్తరాంధ్ర జిల్లాల కో ఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. స్థానిక బోట్క్లబ్ ఎదురుగా కృషి భవన్లో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కాకినాడ రూరల్ నియోజకవర్గ స్థాయి సదస్సు మంగళవారం సాయంత్రం నిర్వహించారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు నిర్వహించిన ఈ సదస్సులో కన్నబాబు మాట్లాడుతూ, చంద్రబాబు మోసాలను ప్రజలకు తెలియజేసేందుకే జగన్ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చారని అన్నారు. అన్ని వర్గాలకూ చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఆడబిడ్డ నిధి అమలు చేయలేదని, మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదని చెప్పారు. కొత్తగా పెన్షన్ ఇవ్వాలంటే భర్త చనిపోవాలని, ఇదీ చంద్రబాబు స్కీమ్ అని దుయ్యబట్టారు. మొదటి సంతకాన్ని ఎవరైనా దైవంగా భావిస్తారన్నారు. జగన్ 6,500 ఉద్యోగాల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే చంద్రబాబు 16 వేల ఉద్యోగాలిస్తామంటూ పరీక్షకు రాని వారికి కూడా ఇచ్చారని విమర్శించారు. ‘స్పోర్ట్స్ కోటాలో బ్రిడ్జి గేమ్ ఉందంట. బ్రిడ్జి అంటే పేకాట అంట’ అని ఎద్దేవా చేశారు. జగన్ హయాంలో సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించేవారని, చంద్రబాబు ప్రభుత్వం అలా ఎందుకు చేయలేకపోతోందని నిలదీశారు. దమ్ముంటే జాబితాలు పెట్టి మాట్లాడాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ కంపెనీలకు ఎకరా 99 పైసలకు ఇవ్వడం తప్ప ఈ ప్రభుత్వం ఇంకేమీ చేయలేదని దుయ్యబట్టారు. ఎవరైనా విమర్శిస్తే వారిపై కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. స్టీల్ప్లాంట్ మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలి విశాఖ స్టీల్ప్లాంట్లో ప్రమాదం చాలా దురదృష్టకరమని, మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలన్నది వైఎస్సార్ సీపీ డిమాండ్ అని కన్నబాబు స్పష్టం చేశారు. డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి, స్టీల్ప్లాంట్ కార్మికుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారని, ఎనిమిది మంది మరణించపోగా మరో ఏడుగురు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని అన్నారు. అక్కడి పరిస్థితిని తాము ప్రత్యక్షంగా పరిశీలించామని, అంతటా హృదయ విదారక వాతావరణం నెలకొందని చెప్పారు. ‘మాకంటే ముందు ముఖ్యమైన మంత్రిగా ఉన్న లోకేష్ వెళ్లారు. కార్మిక సంఘాల నేతలనుద్దేశించి మీకేం సంబంధం? మీ ఇంట్లో వారు చనిపోయారా? అని అడిగారు. దీనిని అహం అనాలా?’ అని ప్రశ్నించారు. మీడియాతో మాట్లాడుతూండగా.. కార్మిక సంఘాలు రూ.కోటి పరిహారం డిమాండ్ చేయడంతో ఇచ్చేస్తారన్నట్టు చెబుతున్నారన్నారు. అదే ఎల్జీ పాలిమర్స్ ప్రమాదానికి చలించిపోయిన తమ నేత జగన్ అప్పట్లో ఒక్కో మృతుని కుటుంబానికి రూ.కోటి చొప్పున పరిహారం అందజేశారని కన్నబాబు గుర్తు చేశారు. వెంటిలేటర్ మీద ఉన్నవారికి రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.3 లక్షల చొప్పున ఇచ్చారన్నారు. విష వాయువులు పీల్చిన 15 వేల మందికి సైతం పరిహారం అందజేశారని, అప్పట్లో ఇన్చార్జి మంత్రిగా ఉన్న తాను, ప్రిన్సిపాల్ సెక్రటరీ, మరి కొంత మంది మంత్రులం సహాయక చర్యల్లో పాల్గొన్నామని చెప్పారు. నాడు రూ.కోటి పరిహారంపై దేశమంతా ఉలిక్కిపడి చూసిందని, తరువాత ఫార్మా కంపెనీలో ప్రమాదంలోనూ రూ.కోటి పరిహారం ఇప్పించారని చెప్పారు. అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకోండి తండ్రి సంపాదించిన అధికారం, డబ్బు, సీటు శాశ్వతమనుకుంటున్నారని, ఇవేవీ పని చేయవని, చేసిన పనులే శాశ్వతమని కన్నబాబు హితవు పలికారు. కోటి సంతకాల ఉద్యమంతోనే 17 మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఆగిందని, స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను జగన్ ఆపారని అన్నారు. చంద్రబాబు రూ.3.70 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఏం చేశారో తెలీదని చెప్పారు. ప్రభుత్వ మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కన్నబాబు అన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు నురుకుర్తి రామకృష్ణ, యాళ్ల సుబ్బారావు, కరప ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి, పార్టీ ఎస్ఈసీ సభ్యులు బెజవాడ సత్యనారాయణ, గోపుశెట్టి బాబ్జీ, చింతా ఈశ్వరరావు, కరీం బాషా, మాజీ మేయర్ సరోజ, మాకినీడి శేషుకుమారి, పంతం ఇందిర, పబ్బినీడి పాపారావు తదితరులు పాల్గొన్నారు. కాగా, పిఠాపురంలో మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ వంగా గీత ఆధ్వర్యాన, పెద్దాపురంలో అక్కడి కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు ఆధ్వర్యాన ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమాలు జరిగాయి. సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ హరేంధిర ప్రసాద్ఫ కూటమి సర్కారు తీరుపై విమర్శలు ఫ ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ సదస్సులో కన్నబాబు ఎద్దేవా బోట్క్లబ్ (కాకినాడ సిటీ): హరిత వాతావరణ నిధి (జీసీఎఫ్) లక్ష్యాలకు అనుగుణంగా జిల్లాలో మడ అడవుల విస్తరణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లా అటవీ అధికారి ఎన్.రామచంద్రరావు, రెవెన్యూ, మత్స్య, డీఆర్డీఏ తదితర శాఖల అధికారులతో కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి సమన్వయ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ ఏడాది కొత్తగా మరో 115 హెక్టార్లలో మడ అడవుల పెంపకం చేపట్టాలని, దీంతో పాటు గతంలో 180.58 హెక్టార్లలో పునరుద్ధరించిన అడవుల సంరక్షణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆదేశించారు. తీరప్రాంత పర్యావరణ పరిరక్షణతో పాటు మత్స్యకారులు, వెనుకబడిన వర్గాలు, మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు. కోరింగ వన్యప్రాణి అభయారణ్యం, పరిసర తీర ప్రాంత గ్రామాల్లో చేపడుతున్న వివిధ వాతావరణ అనుకూల అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. ఈ ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి సాధించిన ఫలితాలను అధికారులు వివరించారు. జిల్లాలో మడ అడవుల పునరుద్ధరణ, జీవనోపాధి రంగాల్లో గణనీయమైన ప్రగతి నమోదైందని రామచంద్రరావు తెలిపారు. సమావేశంలో డీఆర్ఓ టి.తిప్పేనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
వీఆర్ఓలపై పని ఒత్తిడి తగ్గించాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): అధికారుల వేధింపులు ఆపాలని, వీఆర్ఓలపై పని ఒత్తిడి తగ్గించాలని ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు సంఘం అన్ని మండలాల సంఘ అధ్యక్షులు, కార్యదర్శులు మంగళవారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అధికారుల నిరంకుశ వేధింపుల కారణంగా కర్నూలు జిల్లాలో వీఆర్ఓగా పని చేస్తున్న మహ్మద్ హుస్సేన్ ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. ఒకే సమయంలో వేర్వేరు పనులు అప్పగించడంతో, అధిక పని ఒత్తిడి తట్టుకోలేకపోయారన్నారు. వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకుని తీవ్ర ఇబ్బంది పడుతున్నా పట్టించుకోకుండా అదనపు డ్యూటీలు వేసి, హుస్సేన్ను క్షోభకు గురి చేశారని, అందువల్లనే ఆయన ఉరి వేసుకుని బలవన్మరణం చెందారని చెప్పారు. హుస్సేన్ కుటుంబానికి సంఘీభావం తెలిపారు. ఆయన కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చి, ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సమయ పాలనతో విధులు నిర్వహించేలా అధికారులు సహకరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అనిశెట్టి రామకృష్ణ, జేఏసీ వైస్ చైర్మన్ అల్లాడి మల్లేష్, కాకినాడ డివిజన్ కార్యదర్శి మేడిశెట్టి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కీలక రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో పారిశ్రామికాభివృద్ధి, కొత్త పెట్టుబడుల ఆకర్షణ, ప్రభుత్వం – పరిశ్రమల మధ్య సమన్వయాన్ని పెంచే లక్ష్యంతో భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) విశాఖపట్నం విభాగం, జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల సంయుక్త ఆధ్వర్యాన నగరంలో మంగళవారం జరిగిన పారిశ్రామిక సదస్సులో ఆయన మాట్లాడారు. సుదీర్ఘ తీర ప్రాంతం, మూడు ప్రధాన ఓడరేవులతో కూడిన బలమైన రవాణా వ్యవస్థ, 22 ఇండస్ట్రియల్ పార్కులు, ప్రత్యేక ఆర్థిక మండలి జిల్లాలో ఉన్నాయన్నారు. సముద్ర ఉత్పత్తులు, ఆహార ప్రాసెసింగ్, రసాయన పరిశ్రమలకు జిల్లా ఎంతో అనుకూలమని కలెక్టర్ అన్నారు. సమావేశంలో సీఐఐ ఆంధ్రప్రదేశ్ వైస్ చైర్మన్, శ్రావణ్ షిప్పింగ్ సర్వీసెస్ ఎండీ జి.సాంబశివరావు, సీఐఐ విశాఖపట్నం ఎండీ జి.కృష్ణమోహన్, వైస్ చైర్మన్ నీలేష్ అగర్వాల్, ఓజిలి తదితరులు పాల్గొన్నారు. బొండాలు రకం ధాన్యం కొనుగోలుకు సిద్ధం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): బాయిల్డ్ రకం ధాన్యం (బొండాలు) కొనుగోలుకు తాము సిద్ధమని రైస్ మిల్లర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వల్లూరి సూర్యప్రకాశరావు తెలిపారు. కాకినాడలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చేలోగా తాము రైతుల నుంచి ఈ రకం సేకరిస్తామన్నారు. 75 కేజీల బస్తాకు 48 గంటల్లోగా రూ.1,817 చెల్లిస్తామన్నారు. మిల్లర్లే వాహనాలు సమకూర్చితే ఒక్కో బస్తాకు రూ.40 చొప్పున తగ్గిస్తున్నామని చెప్పారు. ధాన్యం విక్రయించే రైతులు 94941 54576, 94415 63243 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఆంధ్రా టెన్నిస్ బాల్ ప్రీమియర్ లీగ్కు ఎంపిక పిఠాపురం రూరల్: ఆంధ్రా టెన్నిస్ బాల్ ప్రీమియర్ లీగ్కు పిఠాపురం క్రీడాకారుడు పాలూరి వీరు ఎంపికయ్యాడు. విశాఖపట్నంలో ఇటీవల జరిగిన క్రీడాకారుల వేలంలో వీరును రూ.79 వేలకు కడప కింగ్స్ ఫ్రాంచైజీ దక్కించుకుంది. టెన్నిస్ బాల్, క్రికెట్లో ఉన్న ట్రాక్ రికార్డు, ఆల్ రౌండర్ నైపుణ్యాలు కారణంగానే వీరుకు ఈ వేలంలో అత్యధిక ధర పలికినట్లు తెలుస్తోంది. వీరును స్థానిక క్రీడాకారులు, అసోషియేషన్ ప్రతినిధులు అభినందించారు. -
కొండపై తిష్ట వేసిన పులి
దేవీపట్నం/సీతానగరం: రంపచోడవరం మండలం నుంచి పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలైన గంగంపాలెం, దండంగి చేరిన పులి.. రెండు రోజులుగా నేలకోట వద్ద రామవరపును ఆనుకుని ఉన్న కొండపైనే తిష్ట వేసింది. కొండ నుంచి దక్షిణం వైపునకు దిగితే తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం పులి సంచరిస్తున్న ప్రాంతం పాపికొండల నేషనల్ పార్కు పరిధిలో ఉంది. ఇక్కడ దానికి మత్తు మందు ఇచ్చి బంధించే అనువైన పరిస్థితులు లేవు. ఒక వేళ సీతానగరం మండలం వైపు వెళితే మత్తు మందు ఇవ్వడం సులభతరమవుతుంది. పోలవరం, తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దులో పులి ఉండడంతో ఇరు జిల్లాలకు చెందిన అటవీ అధికారులు ఇరుపక్కలా మోహరించారు. దాని మెడకు అమర్చిన రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాకర్ ద్వారా గమనాన్ని పరిశీలిస్తున్నారు. కాగా.. రెండు రోజుల క్రితం రామదుర్గం కొండపై అడవి పందిని వేటాడి దాని కళేబరంతో పులి ఆడుకుంటున్న చిత్రం డ్రోన్ వీడియోల ద్వారా లభ్యమైంది. గుర్తు తెలియని వ్యక్తి మృతికపిలేశ్వరపురం (మండపేట): మండపేట మండలం ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయ సమీపంలో మంగళవారం రైల్వే పట్టాలు వద్ద గుర్తు తెలియని సుమారు 40 ఏళ్ల వ్యక్తి మృతదేహం లభ్యమైంది. రైల్వే సీఐ వైవీ రమణ తెలిపిన కథనం ప్రకారం... సుమారు మూడు రోజుల క్రితం రైలు ఢీకొని కానీ , మరే ఇతర కారణంగానైనా వ్యక్తి చనిపోయి ఉండవచ్చన్నారు. 5.4 అడుగులు ఎత్తు, ఒంటిపై బ్లాక్ అండ్ వైట్ ఫుల్ హ్యాండ్స్ షర్ట్, బూడిద రంగు నిక్కరు ఉన్నాయన్నారు. వివరాలు తెలిసినవారు 94948 19898కు సమాచారం ఇవ్వాలని కోరారు. -
వడదెబ్బకు గుర్తు తెలియని ఇద్దరి మృతి
ట్రాక్టర్ ఢీకొని గేదెల కాపరి మృతి ఆత్రేయపురం: గేదెలు మేపేందుకు సైకిల్పై వెళుతున్న వ్యక్తి మార్గం మధ్యలో ట్రాక్టర్ ఢీకొనడంతో మృతి చెందాడు. వివరాలు ఇవీ.. అంకంపాలెం గ్రామానికి చెందిన యడ్ల పెద్ద పల్లయ్య (59) గేదెలు మేపుకోవడానికి మంగళవారం సైకిల్పై వెళుతున్నాడు. అంకంపాలెం లంక ఎడమ గట్టు నుంచి కిందకు దిగుతున్న అతడిని, ఎదురుగా అతి వేగంతో వచ్చిన ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో పల్లయ్య తలకు బలమైన గాయం కావడంతో వైద్యం కోసం కొత్తపేట ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుడి భార్య నాగమణి ఫిర్యాదు మేరకు ఆత్రేయపురం ఎస్సై ఎస్.రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యానాం: యానాంలోని వేర్వేరు ప్రాంతాల్లో మంగళవారం వడదెబ్బకు గురై గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బైపాస్ సర్వీస్ రోడ్డులోని బళ్ల కాంప్లెక్స్ వద్ద సుమారు 70 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. అలాగే యూకేవీ నగర్ కమ్యూనిటీ హాలు వద్ద సుమారు 45 ఏళ్ల మరో వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. వీరిద్దరూ మద్యం తాగడంతో పాటు వడదెబ్బకు గురై మృతి చెందినట్టు భావిస్తున్నారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసి, మృతదేహాలను యానాం ప్రభుత్వ మార్చురీకి తరలించినట్లు ఏఎస్సైలు బడుగు దుర్గారావు, గంజా సత్యనారాయణ తెలిపారు. వారి వివరాలు తెలిసినవారు యానాం పోలీస్స్టేషన్ను సంప్రదించాలని కోరారు.ముమ్మిడివరంలో రూ.7 లక్షల చోరీ ముమ్మిడివరం: స్థానిక బస్టాండ్ రోడ్డులోని ఒక ఇంట్లో దొంగలు పడి రూ.7 లక్షలు అపహరించుకుపోయారు. వివరాల్లోకి వెళితే.. ముమ్మిడివరానికి చెందిన టీడీపీ నాయకుడు జాగు సత్తిబాబు, కుటుంబ సభ్యులు మంగళవారం మధ్యాహ్నం సమీపంలోని సాయిబాబా ఆలయానికి భోజనాలకు వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో దొంగల పడి నగదును అపహరించారు. బాధితుడు సత్తిబాబు ఫిర్యాదు మేరకు ముమ్మిడివరం ఇన్చార్జి ఎస్సై ఎంవీవీ రవీంద్రబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు కొత్తపేట: నిబంధనలు పాటించకుండా మట్టిని తోలే ట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా రవాణా అధికారి (డీటీఓ) దేవిశెట్టి శ్రీనివాసరావు హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ప్రకటన విడుదల చేశారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో రహదారులపై మట్టి ట్రాక్టర్లు అతి వేగంగా, నిబంధనలకు విరుద్ధంగా రవాణా సాగించడంపై గత నెల 26న ‘సాక్షి’లో ‘ట్రాక్టర్ల జోరు.. ప్రజలు బేజారు’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దానిపై రవాణా శాఖ అధికారులు స్పందించి, తనిఖీలు చేపట్టారు. దీనిలో భాగంగా సోమ, మంగళవారాల్లో కొత్తపేట మండలం పలివెల – గంటి – ఈతకోట రోడ్డులో తనిఖీలు జరిపి, 8 ట్రాక్టర్లపై కేసులు నమోదు చేసి, రూ.28,600 అపరాధ రుసుము విధించామని డీటీఓ శ్రీనివాసరావు తెలిపారు. అధిక వేగం, మైనర్ డ్రైవింగ్, మట్టిపై టార్పాలిన్ కప్పకపోవడం, డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్నెస్ లేకపోవడం, రోడ్డు పన్ను ఎగవేత వంటి అంశాలపై దృష్టి సారిస్తున్నామని, ఈ తనిఖీలు కొనసాగుతాయని డీటీఓ తెలిపారు. -
ప్రకటనలకే పరిమితం
ఈ ఏడాది మే 15వ తేదీకే పంట కాలువలకు సాగునీరు వదులుతామని, ఖరీఫ్ ముందస్తు సాగుకు సిద్ధం కావాలని వ్యవసాయ అధికారులు హడావుడి చేశారు. నిజమే అనుకుని విత్తనాలు సిద్ధం చేసుకున్నాం. కాలువలు తవ్వుతున్నారంటూ రెండు వారాలు ఆలస్యంగా మే 31న సాగునీరు వదిలారు. కరప మండలంలోని పొలాలన్నీ కాలువలకు శివారున, సముద్ర తీరానికి దగ్గరలో ఉంటాయి. వదిలిన నీరు కాస్తా పొలాలకు వచ్చేసరికి మరో 10 రోజులు ఆలస్యమైంది. మడిలోకి నీరు మళ్లించి, దమ్ము చేసి, విత్తనాలు జల్లుకుని, నారుమడి పెంచడానికే నెల రోజులు పట్టేస్తుంది. వ్యవసాయ అధికారులు జూలై నెలాఖరుకల్లా వరి నాట్లు పూర్తి చేయమంటున్నారు. కానీ, నారు పెంచి, నాట్లు వేయడానికి ఆగస్టు నెలకు కానీ అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ముందస్తు సాగు ప్రకటనలకే పరిమితమైంది. ఆచరణలో కనబడటం లేదు. – నున్న వెంకటేశ్వరరావు, రైతు, విజయరాయుడుపాలెం, కరప మండలం -
అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్
ఫ రూ.12.10 లక్షల విలువైన సొత్తు స్వాధీనం ఫ విలేకరులకు వెల్లడించిన డీఎస్పీ దేవకుమార్ పెరవలి (కొవ్వూరు): అంతర్ జిల్లా దొంగల ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకుని, వారి నుంచి రూ.12.10 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులతో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు. ఆ ముఠాలోని ఐదుగురు సభ్యులను అరెస్టు చేశారు. ఈ విషయాన్ని కొవ్వూరు డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ జి.దేవకుమార్ మంగళవారం విలేకరులకు తెలిపారు. ఆ ప్రకారం.. ఉండ్రాజవరం మండలం పాలంగిలోని జగతా వెంకటేశ్వరరావు ఇంట్లో మే 21న జరిగిన చోరీ కేసులో వీరిని పోలీసులు అరెస్టు చేశారు. వీరందరూ అంతర్ జిల్లా నేరస్తులు, వీరిపై పలు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. రెక్కీ నిర్వహించి తాళాలు వేసిన ఇళ్లను గుర్తించడం, అనంతరం వాటిలో చోరీ చేయడం వీరి అలవాటు. కడప, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కాకినాడ, కోససీమ జిల్లాల్లో పలు కేసుల్లో ఈ ఐదుగురు నిందితులుగా ఉన్నారు. కాగా.. చోరీల ఘటన నేపథ్యంలో పోలీసులు ముమ్మర దర్యా ప్తు చేపట్టారు. అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో వాహనాల తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన నిందితులను పట్టుకున్నారు. వీరిలో ప్రధాన నిందితుడు కిరణ్పై అనేక కేసులు ఉన్నాయి. కాగా.. కేసును చేధించిన నిడదవోలు సీఐ తిలక్, ఎస్సై రవికుమార్, క్రైమ్ ఎసై రవీంద్రను ఎస్పీ అభినందించారని, వీరికి రివార్డులు ప్రకటించారని డీఎస్పీ తెలిపారు. -
పెట్రో ధరలు తగ్గించాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): అత్యంత దారుణంగా పెంచిన పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని వామపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ మేరకు వామపక్షాల నాయకులు స్థానిక ఇంద్రపాలెం లాకుల వద్ద మంగళవారం రాస్తారోకో, అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి జె.వెంకటేశ్వర్లు, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు సీహెచ్ నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలను ఇప్పటి వరకూ నాలుగుసార్లు పెంచిందని, గ్యాస్ ధరలు రెండుసార్లు పెంచిందని గుర్తు చేశారు. కమర్షియల్ వంట గ్యాస్ ధర ఏకంగా రూ.3,250కి చేరడంతో చిరు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని, సామాన్యులకు ఆహార కొరత ఏర్పడిందని చెప్పారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ సాగిస్తున్న యుద్ధం వల్ల ధరలు పెరిగాయనే వాదనలో వాస్తవం లేదన్నారు. కేజీ బేసిన్లో ఉత్పత్తి అవుతున్న చమురు, సహజ వాయువులను రిలయన్స్ కంపెనీ మహారాష్ట్ర, గుజరాత్లకు తరలించుకుపోతూ, ఇతర దేశాలకు కూడా అమ్ముకుంటోందని చెప్పారు. ఏ రాష్ట్రంలోనైనా జరుగుతున్న చమురు, సహజ వాయువు ఉత్పత్తిలో ఆ రాష్ట్రానికి సగం వాటా ఇవ్వాలంటూ 12వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన విషయం చంద్రబాబు, పవన్ కల్యాణ్లకు తెలియదా అని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్న టీడీపీ, జనసేన నేతలు రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేయాలని డిమాండ్ చేశారు. చమురు, గ్యాస్ ధరలు తగ్గించేంత వరకూ ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. -
వెక్కిరిస్తున్న పొలాలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ముందస్తు సాగు అంటూ ప్రభుత్వం చేస్తున్న హడావుడి మాటలతో సరి అన్నట్టుగా ఉంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి పది రోజుల కిందటే హడావుడిగా అమాత్యులు నీటిని విడుదల చేశారు. కానీ, కాలువల్లో పూడికలు తొలగించకపోవడంతో ఆ జలాలు ఇప్పటికీ పంట భూములకు చేరలేదు. ఫలితంగా ఎక్కడ చూసినా తడారిన పొలాలే కనిపిస్తూ.. సర్కారు పనితనాన్ని వెక్కిరిస్తున్నాయి. అధికారులు ముందస్తు సాగు చేయాలంటున్నా.. చుక్క నీటి కోసం ఎదురు చూపులు తప్పక.. ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా తయారైంది జిల్లాలోని ఖరీఫ్ రైతుల పరిస్థితి. కాగితాల పైనే ప్రణాళిక ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో జిల్లావ్యాప్తంగా 2.25 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలన్నది వ్యవసాయ శాఖ లక్ష్యం. పంట కాలం ముగిసే సమయానికి ప్రకృతి విపత్తులు వచ్చే ప్రమాదముంటుందని ఓవైపు.. అలాగే, ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం కూడా ఉంటుందని మరోవైపు చెబుతూ.. ముందస్తు సాగు చేయాలంటూ రైతులపై అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. ఈ నెలాఖరుకల్లా నారు పోసుకుని, జూలై మాసాంతానికి వరి నాట్లు పూర్తి చేయాలని మండల, గ్రామ స్థాయిల్లో లక్ష్యాలు పెట్టారు. ఈ ప్రణాళికంతా కాగితాలపై సజావుగానే సాగింది. మరోవైపు ఇటీవల జరిగిన సమావేశంలో సైతం నీటి పారుదల, వ్యవసాయ శాఖల అధికారులు ఖరీఫ్ ముందస్తు సాగు ఆవశ్యకతను గట్టిగా చెప్పారు. ఈ దిశగా ప్రజాప్రతినిధులు రైతులను చైతన్యపరచాలని కోరారు. ముందస్తు సాగు పేరుతో ధవళేశ్వరం బ్యారేజీ నుంచి గత నెల 31నే గోదావరి డెల్టాకు నీటిని విడుదల చేశారు. అక్కడితో తమ పనైపోయినట్టు.. మిగిలిన విషయాలను గాలికొదిలేశారు. ముందస్తు సాగుకు రైతులు సైతం సిద్ధమేనని అంటున్నా.. వివిధ కారణాలతో ఇప్పటి వరకూ పొలాలకు చుక్క నీరు కూడా అందని పరిస్థితి నెలకొంది. సాగునీరు అందక జిల్లాలో ఇప్పటి వరకూ ఒక్క రైతు కూడా ఖరీఫ్ సాగుకు కనీస సన్నాహాలు కూడా చేసిన దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. 10 రోజులు గడచినా.. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి పంట కాలువలకు నీరు విడుదల చేసి అప్పుడే 10 రోజులైంది. ప్రారంభంలో 500 క్యూసెక్కుల నీటిని వదలగా.. దానిని క్రమంగా, 1,200, 2,700 వరకూ పెంచారు. సోమ, మంగళవారాల్లో 3,600 క్యూసెక్కుల వరకూ విడుదల చేశారు. పెద్ద మొత్తంలో నీటిని వదులుతున్నప్పటికీ పంట భూములకు ఆ నీరు చేరడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత గడచిన రెండేళ్లుగా క్లోజర్ పనులు సక్రమంగా చేపట్టకపోవడమే దీనికి కారణమని రైతులు ఆక్షేపిస్తున్నారు. ప్రభుత్వ నిర్వాకంతో పంట కాలువల్లో గుర్రపు డెక్క విస్తారంగా పెరిగిపోయింది. ఎక్కడ చూసినా పూడికలే కనిపిస్తున్నాయి. ఇవి నీటి ప్రవాహానికి ఆటంకంగా మారాయి. ఫలితంగా పొలాలకు నీరు అందడం లేదు. సామర్లకోట, పెద్దాపురం, కరప, తాళ్లరేవు, కాకినాడ రూరల్, గొల్లప్రోలు, యు.కొత్తపల్లి, పిఠాపురం రూరల్ తదితర మండలాల్లోని వేలాది మంది రైతులు గోదావరి కాలువ పైనే ఆధారపడి సాగు చేస్తారు. వారందరూ సాగునీటి కోసం ఈ పది రోజులుగా నిరీక్షిస్తూనే ఉన్నారు. ఈవేళ వస్తుంది, రేపు వస్తుందంటూ క్షేత్ర స్థాయిలో నీటి పారుదల, వ్యవసాయ అధికారులు వారిని బుజ్జగిస్తూ వస్తున్నారు. అయితే, నారుమళ్లు తయారవడానికి కనీసం 20 రోజులు పైనే పడుతుంది. ఇప్పటి వరకూ సాగునీరు ఇవ్వకపోతే ముందస్తు సాగు ఏవిధంగా సాధ్యమని, నారు ఎప్పుడు పోసుకోవాలి, దమ్ములెప్పుడు చేయాలి, నాట్లు ఎప్పుడు వేయాలో చెప్పాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రబీలో ప్రభుత్వం సమయానుకూలంగా ధాన్యం కొనుగోలు చేయకపోవడం వారికి శాపంగా మారింది. పంట చేతికందిన దశలో అకాల వర్షాలు వారికి ఊహించని నష్టాన్ని తెచ్చిపెట్టాయి. అయినప్పటికీ ప్రభుత్వం నయాపైసా పరిహారం కూడా ఇవ్వలేదు. కనీసం ఖరీఫ్ ముందస్తు సాగుకు వెళ్లాలనుకున్నా సాగునీరు అందించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ముందస్తు సాగు విధానాన్ని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూపొందించి, పక్కాగా అమలు చేసింది. ఈ విధానం వలన మిగిలిన ప్రాంతాల రైతులు కన్నా జిల్లాలోని రైతులకు ఎక్కువ మేలు జరుగుతుంది. కానీ, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం ముందస్తు సాగును ప్రహసనంగా మార్చేసి తమను ఇబ్బంది పెడుతోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు వద్ద పుష్కర కాలువ దుస్థితిసామర్లకోట వద్ద గోదావరి కాలువలో పేరుకుపోయిన తూటుకాడ, గుర్రపు డెక్క ఫ ‘ముందస్తు’ హడావుడి.. మాటలకే సరి! ఫ గత నెల 31న నీటి విడుదల ఫ ఇప్పటి వరకూ పంట భూములకు అందని నీరు ఫ చుక్క నీటి కోసం రైతుకు తప్పని ఎదురు చూపులు ఫ ముందుకు ‘సాగే’దెలాగని కలవరం -
కాపు కాయక..
ధర ఉన్నా.. ప్రస్తుత మార్కెట్లో బంగినపల్లి రకం మామిడి ధర టన్ను రూ.30 వేల పైబడి ఉంది. రాజోలు దీవి నుంచి ప్రతి ఏడాది సుమారు వెయ్యి టన్నుల బంగినపల్లి రకం ఎగుమతి అవుతుంది. అయితే ఈసారి 10 టన్నులు కూడా దిగుబడి అనుమానమేనని రైతులు చెబుతున్నారు. వీటిలో మంగు సోకిన కాయలు ఎగుమతికి పనికి రావు. దీంతో ఆ రకం కాయల విక్రయాలు ఇక్కడే జరుగుతాయి. మంగు సోకని క్వాలిటీ రకాన్ని మాత్రమే ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. ఫ రైతులను ఆదుకోని మామిడి ఫ నిరుత్సాహపర్చిన బంగినపల్లి దిగుబడి ఫ ధర ఉన్నా దిగుబడి శూన్యం ఫ రైతులకు, తోటల లీజుదారులకు భారీ నష్టం మలికిపురం: వేసవి కాలం అనగానే అందరికీ ఠక్కున మామిడి పండ్లు గుర్తుకువస్తాయి. పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ వీటిని చాలా ఇష్టంగా తింటారు. మామిడి తోటల్లో, రోడ్డు పక్కనే దుకాణాల్లో, మార్కెట్లలో, వీధుల్లో బండ్లపై వీటి విక్రయాలు జోరుగా సాగుతాయి. ఇక మామి డి పండ్లలో రారాజుగా పిలుచుకునే, మామిడి ప్రియులకు ఎంతో ఇష్టమైన బంగినపల్లికి ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ ఏడాది ఈ రకం కాపు పూర్తిగా నిరాశ పరిచింది. మార్కెట్లో ధర బాగున్నా దిగుబడి లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. గూడపల్లి ప్రసిద్ధి బంగినపల్లి మామిడి పండ్లకు గూడపల్లి ప్రసిద్ధి. ఇక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎగుమతులు జరుగుతాయి. గూడపల్లితో పాటు గుబ్బలపాలెం, పల్లిపాలెం, కేశనపల్లి, తూర్పుపాలెం, కరవాక, గొల్లపాలెం, పడమటిపాలెం, శంకరగుప్తం, చింతలమోరి, కేశవదాసుపాలెం, బట్టేలంక, ఇరుసుమండ, అడవిపాలెం, లక్కవరం, కత్తిమండ, మోరిపోడు, వీవీ మెరక తదితర గ్రామాలు మామిడి తోటలకు ఎంతో ప్రసిద్ధి చెందాయి. అయితే వాతావరణం అనుకూలించక ఈ ఏడాది కూడా దిగుబడి దారుణంగా పడిపోయింది. దీనికి తోడు మంచు తీవ్రత అధికంగా ఉండడం వల్ల పూత రాలిపోవడం, తెగుళ్లు సోకడం వంటి కారణాలతో ఈ ఏడాది బంగినపల్లి దిగుబడి లేదు. ఇతర రకాలు కూడా.. బంగినపల్లితో పాటు ఇతర రకాలు కూడా ఈ ఏడాది ఆశించనంత దిగుబడి ఇవ్వలేదు. మామిడిలో కలెక్టర్, నీలం తదితర రకాలు జూలై నెలలో కోతకు వస్తాయి. అవి కాక దేశవాళీ రకాలైన రసాలు, చిన్న రసాలు కాయల కొంతమేర కాసినా అవి రైతులకు అంతగా లాభాలు ఇవ్వలేవు. మామిడి తోటలపై ముందే పెట్టుబడి పెట్టిన వందల మంది లీజు దారులు ఈ ఏడాది తీవ్రంగా నష్టాలు చవి చూశారు. రాజోలు దీవిలో ముంపు సమస్యతో పాటు వాతావరణంలో మార్పులు సంభవించడంతో ఈ ఏడాది బంగినపల్లితో పాటు ఇతర మామిడి తోటల కాపు గణనీయంగా తగ్గిపోయిందని, ఉప్పునీటి ప్రభావంతో మామిడి తోటలు దెబ్బతింటున్నాయని రైతులు చెబుతున్నారు. దీనికి తోడు మంచు, ఓఎన్జీసీ వంటి సంస్థల గ్యాస్ బర్నింగ్ వల్ల బూడిద.. కాయల పూతలపై పడి ఈ పరిస్థితి ఏర్పడిందని ఆవేదన చెందుతున్నారు. భారీగా నష్టపోయాను ఈ ఏడాది మామిడి వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. రైతులకు పెద్ద మొత్తంలో లీజు చెల్లించి, తోటలకు పెట్టుబడి పెట్టి, దిగుబడి కోసం ఎదురు చూశాం. కానీ దిగుబడి మాత్రం దారుణంగా పడి పోయింది. ధర ఉన్నప్పటికీ కాయలు లేవు. భారీగా నష్టాలు చవి చూస్తున్నాం. – సూరిబాబు, మామిడి పండ్ల వ్యాపారి -
పెనుగాలి బీభత్సం
అన్నవరం: బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షం అన్నవరంలో మంగళవారం బీభత్సం సృష్టించింది. సాయంత్రం 3.30 నుంచి 4.30 గంటల వరకూ వీచిన పెనుగాలులు, కురిసిన వర్షం కారణంగా పలుచోట్ల చెట్లు కూలి, విద్యుత్ వైర్ల మీద పడటంతో స్తంభాలు విరిగిపోయాయి. విశాఖపట్నం – రాజమహేంద్రవరం జాతీయ రహదారిపై సత్యదేవుని కొత్త నమూనా ఆలయం వద్ద టాయిలెట్ల మీద రేకులు పక్కనే ఉన్న పొలాల్లోకి ఎగిరిపోయాయి. వాటి తలుపులు సైతం ఊడిపోయాయి. అక్కడే నిర్మాణంలో ఉన్న భవనం పిల్లర్లు వంగిపోయాయి. కొంతవరకూ నిర్మించిన గోడలు కూలిపోయాయి. నిర్మాణంలో ఉన్న నమూనా ఆలయం పక్కనే ఉన్న ఓ రియల్ ఎస్టేట్ లే అవుట్లోని షెడ్డు మీద రేకులు కూడా ఎగిరిపోయాయి. ఈదురు గాలుల తాకిడికి స్థానిక కొత్తపేట సమీపాన తీగల మీద చెట్లు విరిగి పడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పాయకరావుపేట సబ్ స్టేషన్ నుంచి అన్నవరం సబ్ స్టేషన్కు విద్యుత్ సరఫరా అయ్యే 33 కేవీ లైన్ మీద కూడా చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయని ఈపీడీసీఎల్ ఏఈ పి.ప్రసాద్ తెలిపారు. తీగలపై పడిన చెట్ల కొమ్మలను తొలగించి, విద్యుత్ స్తంభాలను నిలబెట్టి, సరఫరాను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కాగా, ఏలేశ్వరం, ప్రత్తిపాడు తదితర ప్రాంతాల్లో కూడా పెనుగాలులతో వర్షం కురిసింది. పిఠాపురంలో బలమైన గాలులు వీచాయి. -
ఇరిగేషన్ కాలువను కబ్జా చేసిన జనసేన నాయకుడు
పిఠాపురం రూరల్: మండలంలోని ఎఫ్కే పాలేనికి చెందిన జనసేన నాయకుడు పిల్లా శివ పీడబ్ల్యూడీ కాలువను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టాడని స్థానిక రైతులు మంగళవారం ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాధు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఎఫ్కే పాలెం జంక్షన్ వద్ద జనసేన నాయకుడు పిల్లా శివ పీడబ్లూడీ కాలువను ఆక్రమించి వాణిజ్య షాపులు నిర్మించాడు. షాపులకు వెళ్లటానికి దారి కోసం ఎదురుగా ఉన్న సాగునీరు, ముంపునీరు పోయే కాలువల్లో ఒక దాన్ని పూర్తిగా ఆక్రమించి మట్టితో పూడ్చివేశాడు. రెండో కాలువను ఆక్రమించి చిన్న సైజు తూరలు వేస్తుండగా రైతులందరూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారందరినీ భయభ్రాంతులకు గురి చేసి, కాలువను పూడ్చి వేశాడు. దీని వల్ల పంట పొలాలకు నీరు చేరకపోవడంతో పాటు వర్షం కురిస్తే ముంపు నీరు బయటకు వెళ్లని పరిస్థితి నెలకొంది. వైఎస్సార్ సీపీ కార్యకర్తపై టీడీపీ వర్గీయుల దాడిసామర్లకోట: మండల పరిధిలోని హుస్సేన్పురం గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త కోట సత్తిబాబుపై అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. వివరాల్లోకి వెళితే.. సత్తిబాబు మంగళవారం సాయంత్రం హుస్సేన్పురం నుంచి ప్లైఓవర్ బ్రిడ్జి మీదుగా వస్తున్నాడు. అతడిపై టీడీపీకి చెందిన ఐదుగురు వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో సత్తిబాబు తలకు బలమైన గాయమైంది. అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు వారిని విడదీసి, పోలీసు స్టేషన్కు తరలించారు. విషయం తెలిసిన వెంటనే వైఎస్సార్ సీపీ మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు ఇరుసుమళ్ల సాయి, పార్టీ టౌన్ అధ్యక్షుడు పాగా సురేష్ కుమార్, నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ వారా సుధాకర్, బూత్ కమిటీ అధ్యక్షుడు మాగాపు గోపి, గ్రామ మాజీ ఉప సర్పంచ్ యవర్న శేఖర్.. పోలీసు స్టేషన్కు చేరుకుని, క్షతగాత్రుడికి స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సత్తిబాబుపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వైఎస్సార్ సీపీ నాయకులు డిమాండ్ చేశారు. కాగా.. వైఎస్సార్ సీపీకి చెందిన వ్యక్తి తమను గాయపర్చాడని టీడీపీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరువర్గాలకు చెందిన ఫిర్యాదులు స్వీకరించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడలో కారు దగ్ధం కాకినాడ క్రైం: స్థానిక ఆనంద్ థియేటర్ సమీపంలో మంగళవారం ఓ కారులో మంటలు చెలరేగాయి. 2022 మోడల్కు చెందిన ఈ కారుకు పిఠాపురానికి చెందిన మాడుగుల బాబూరావు యజమాని కాగా, గరగ అనిల్ కుమార్ అనే వ్యక్తి దాన్ని నడుపుతున్నాడు. గతంలో ఏసీ, రేడియేటర్లు రిపేరు చేయిస్తే అవి పనిచేయకపోవడంతో మరో మారు చూపించేందుకు కారును తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో కారు ఒక్కసారిగా ఆగిపోవడంతో వారిద్దరూ బయటకు వచ్చి బ్యానెట్ను పరిశీలించే లోపే అగ్నికీలలు వ్యాపించి, కారు కాలిపోయింది. సమాచారం అందుకున్న సాలిపేట ఏడీఎఫ్వో ఉద్దండురావు సుబ్బారావు ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. -
రూ.50 లక్షల విలువైన గోల్డెన్ బేంబూ పంట దగ్ధం
కడియం: మాధవరాయుడుపాలెం పంచాయతీ పరిధిలోని చైతన్యనగర్ సమీపంలో రూ.50 లక్షల విలువైన గోల్డెన్ బేంబూ పంట కాలిపోయింది. బుర్రిలంక గ్రామానికి చెందిన ఈశ్వరా ఫాండ్ అండ్ నర్సరీ అధినేత తాడాల విష్ణుచక్రవర్తి భార్య రాజరాజేశ్వరికి చెందిన 4.99 ఎకరాల్లో ఈ పంటను సాగు చేస్తున్నారు. అయితే సోమవారం సంభవించిన అగ్ని ప్రమాదంలో మొత్తం పంట ఆగ్నికి ఆహుతైందని చక్రవర్తి వివరించారు. స్థానికులు అప్రమత్తమై రాజమహేంద్రవరం అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో వారితో పాటు, స్థానిక పేపరు మిల్లుకు చెందిన ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపు చేశాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు. -
సత్యదేవుని సన్నిధికి భక్తుల పాదయాత్ర
అన్నవరం: జంగారెడ్డిగూడేనికి చెందిన శ్రీరామ ఆధ్మాత్మిక సేవా సమితి సభ్యులు పాదయాత్ర చేస్తూ మంగళవారం సాయంత్రం రత్నగిరిపై సత్యదేవుని సన్నిధికి చేరుకున్నారు. ఈ బృందంలోని 300 మంది భక్తులు గత శుక్రవారం జంగారెడ్డిగూడెంలో బయలుదేరారు. ఐదు రోజుల పాటు పాదయాత్ర చేసి రత్నగిరికి చేరుకున్నట్లు ఆ బృందానికి నాయకత్వం వహించిన రామారావు తెలిపారు. ఈ విధంగా కాలినడకన అన్నవరం చేరడం ఇది 25వ సారి అన్నారు. కాగా.. ఆ భక్తులను అన్నవరం దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు అభినందించారు. వారికి ప్రత్యేక దర్శనంతో బాటు స్వామి వారి నిత్యాన్నదాన పథకంలో భోజన సౌకర్యం కల్పించారు. -
నిందితుడిపై పీడీ యాక్ట్
సీతానగరం: బొబ్బిల్లంకకు చెందిన సోడదాసి సీతారామరాజు (పండు) (32)పై పీడీ యాక్ట్ అమలు చేస్తున్నామని కోరు కొండ సీఐ ఎస్వీవీఎస్ మూర్తి అన్నారు. ఈ మేరకు మంగళవారం సీతానగరం పోలీస్ స్టేషన్లో ఎస్సై బి.వినయ్ ప్రతాప్తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. సీఐ మూర్తి మాట్లాడుతూ సీతారామరాజుపై ఐదు క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, బొబ్బిల్లంక జంట హత్యల కేసులో ఇతడు ప్రధాన నిందితుడన్నారు. గతంలో మర్డర్, గంజాయి, పోక్సో, కొట్లాట కేసులతో పాటు ప్రభుత్వ ఉద్యోగిపై దాడి కేసులు ఉన్నాయన్నారు. జంట హత్య కేసులో అరెస్ట్ చేయబడి, న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్కు పంపించామన్నారు. కేసు విచారణలో భాగంగా నిందితుడి ప్రవర్తన.. ప్రజల్లో భయాందోళనలు సృష్టించడంతో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. వాటిని పరిగణనలోకి తీసుకుని పీడీ యాక్ట్ అమలు ప్రతిపాదనలు పంపించగా, కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ పీడీ నిర్బంధ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. -
● పడుతూ.. లేస్తూ..
అడ్డతీగల – ఏలేశ్వరం ప్రధాన రోడ్డులో అధ్వానంగా మారింది. దీనిలోని గోతుల్లో వర్షం కురిసినప్పుడు నీరు చేరడంతో రాకపోకలకు వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ 11 కిలోమీటర్ల రోడ్డుకు రూ.22 కోట్లు మంజూరై, మూడేళ్లు గడుస్తున్నా పూర్తిస్థాయిలో పనులు నిర్వహించడంలో ఆర్అండ్బీ అధికారులు చేతులెత్తేస్తున్నారు. గత జనవరిలో అనేక ప్రజా ఉద్యమాల నడుమ తిరిగి పనులు ప్రారంభించినా కొద్ది మేర సీసీ రోడ్డు, మరి కొద్ది ప్రాంతంలో బీటీ రోడ్డు వేసి మిన్నకున్నారు. అదేమేటంటే సంబంధిత కాంట్రాక్టర్కు పార్టు బిల్లు కూడా ప్రభుత్వం నుంచి రాలేదని, దీంతో పనులు ఆపేసివెళ్లిపోయాడని చెబుతున్నారు. – అడ్డతీగల ● సరదాగా కాసేపు విపరీతంగా కాస్తున్న ఎండలకు ప్రజలతో పాటు శునకాలూ బెంబేలెత్తిపోతున్నాయి. చల్లదనం కోసం పరితపించిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మలికిపురం మండలం కేశనపల్లి బీచ్లో మంగళవారం ఇసుకలో ఇలా సేదతీరాయి. ఇసుకలో పడుకుని కాసేపు కునుకు తీశాయి. సముద్రపు గాలిని ఆస్వాదించాయి. – మలికిపురం -
నేలకోట ఆవలో పులి సంచారం
● అటవీ శాఖ అధికారుల అప్రమత్తం ● మత్తు మందు ఇచ్చి పట్టుకునేందుకు యత్నాలు దేవీపట్నం: మండలంలో పులి కోసం వేట కొనసాగుతోంది. రామదుర్గం కొండపై ఆదివారం తిష్ట వేసిన పులి రాత్రికి నేలకోట, పురుషొత్తపట్నం రహదారిని దాటుకుని నేలకోట రామవరపు ఆవ వద్ద కొండపైకి చేరింది. ఈ కొండకు ఉత్తరాన ఆవ, దక్షిణాన సీతానగరం మండలం పెద కొండేపూడి, చీపురుపల్లి తదితర గ్రామాలు ఉన్నాయి. కొండకు కొద్దిపాటి దూరంలో సీతానగరం చిట్టిబాబా ఆశ్రమానికి చెందిన గోశాల ఉండడం, ఇది వరకు ఆ గోశాల వరకూ పులి సంచరించిన ప్రాంతం కావడంతో కొండకు ఇరువైపులా అటవీ అధికారులు మోహరించారు. పోలవరం డీఎఫ్ఓ రామచంద్రరావు నేతృత్వంలో రెస్క్యూ బృందాలు పులికి మత్తు మందు ఇచ్చి పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. కొండలపై ఉన్నంత వరకూ పులి మెడకు అమర్చిన ట్రాకర్, డ్రోన్ కెమెరాలతో పులి గమనాన్ని పరిశీలిస్తున్న అధికారులు పులికి మత్తు మందు ఇచ్చే అనువైన పరిస్థితుల కోసం ఎదురు చూస్తున్నారు. మైదాన ప్రాంతమైన సీతానగరం మండలం వైపు పులి పయనిస్తే పులికి మత్తు మందు ఇవ్వడం సులభతరం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా సీతానగరం మండలంలో సరిహద్దు గ్రామాలు, దేవీపట్నం మండలంలోని నేలకోట, గండికోట, అంగుళూరు తదితర గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. సీతానగరం మండల పరిధిలో పులి సంచారం సీతానగరం: మండల పరిధిలోని పురుషోత్తపట్నం పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సోమవారం ఉదయం జీపీఎస్ ట్రాకింగ్తో పులి దేవిపట్నం మండలం నేలకోట, సీతానగరం మండల పరిధిలోగల రామదుర్గం కొండ, రామరపు ఆవ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు అటవీ శాఖాధికారులు గుర్తించారు. ఆదివారం రాత్రి దేవీపట్నం మండల పరిధిలో 14 పశువులను చంపి, సోమవారం సీతానగరం మండల పరిధిలోని కొండలు, పరిసర ప్రాంతాల్లోకి ప్రవేశించింది. దీనితో నాగంపల్లి, చీపురుపల్లి, అచ్చయ్యపాలెం, చినకొండేపూడి, పెందకొడేపూడి గ్రామాల ప్రజలతోపాటు మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ ఎ శ్రీనివాస్ సూచించారు. -
పింఛన్ కోసం ఏడాదిగా తిరుగుతున్నా..
నడవలేని స్థితిలో ఉన్నాను. పింఛన్ కోసం ఏడాదిగా మనిషి సహాయంతో తిరుగుతున్నాను. ఎక్కడికై నా వెళితే వీర్చైర్లో వెళ్లాల్సి వస్తోంది. స్థానికంగా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఎన్నో ఇబ్బందులు పడి కలెక్టరేట్కు వచ్చినా ఎవరూ స్పందించడం లేదు. – షేక్ కాశీంబీబీ, గొల్లప్రోలు నా భూమికి పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదు ఏళ్లతరబడి నా అధీనంలో ఉన్న భూమి నేనే సాగు చేసుకొంటున్నాను. వేరే వ్యక్తుల వద్ద భూమి కొనుగోలు చేశాను. నాకు పాస్పుస్తకాలు ఇవ్వడం లేదు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. రెవెన్యూ అధికారులు వేరే వ్యక్తుల వద్ద డబ్బు తీసుకొని నా సర్వే నంబర్లో వేరే వ్యక్తి పేరు నమోదు చేశారు. నాలుగు నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాను. – బస్వా శ్రీనివాస్, చిత్రాడ, పిఠాపురం మండలం. రెవెన్యూ రికార్డులు మార్పు చేశారు నా పేరు మీద ఉన్న భూమికి వేరే వ్యక్తికి ఆన్లైన్ నమోదు చేశారు. ఆ భూమి పూర్వార్జితం. స్థానిక రెవెన్యూ అధికారులు చుట్టూ ఏడాదిగా తిరుగుతున్నా. చాలాసార్లు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశాను. కానీ సమస్య పరిష్కారం కావడం లేదు. – అంబుజాలపు మంగ, సీతంపేట, శంఖవరం మండలం -
మట్టి లారీల అడ్డగింపు
ప్రాణాలతో చెలగాట ఆడుతున్నారని ఇసుకపల్లి గ్రామస్తుల ఆందోళనకొత్తపల్లి: అధిక లోడుతో, మితిమీరిన వేగంతో మట్టి లారీలు రాత్రీ పగలు తేడా లేకుండా తిరుగుతున్నాయని, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని ఇసుకపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి లారీలను అడ్డుకుని ఆందోళన నిర్వహించారు. పిఠాపురం వైపు నుంచి ఇసుకపల్లి మీదుగా వెళుతుండడంతో గ్రామంలో ఉన్న వారికి కంటిమీద కునుకు లేకుండా పోతోందన్నారు. అధిక లోడుతో వెళ్లడం వల్ల రోడ్డుపై గోతులు ఏర్పడుతున్నాయని, అధికలోడుతో పాటు లారీల వేగానికి రోడ్డు పక్కన ఉన్న ఇళ్లు, ప్రహరీ బీటలు వారుతున్నాయని చెప్పారు. లారీల నుంచి మట్టిపడి రోడ్లపై దుమ్ము రేగుతోంది. ఇళ్లలోంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్ధితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మట్టి మాఫియా వ్యాపారులు రెచ్చిపోతున్నారు. మమ్మల్ని ఆపేది ఎవడురా అంటూ ఇష్టం వచ్చినట్లుగా మట్టిలోడుతో ప్రజలను భయపెడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రెండు రోజుల క్రితం లారీ టైరు ఊడిపోయి రామాలయాన్ని ఢీకొట్టింది. దీంతో రామాయంలో పడుకున్న భభక్తులు భీతావహులయ్యారు. లారీలు అతివేగంగా రోడ్లపై తిరగడం వలన గత 15రోజులుగా పిల్లలను బయటకు పంపాలంటే భయపడే పరిస్ధితి ఏర్పడుతోందన్నారు. అధికారులు మామూళ్ల మత్తులో పడి పట్టించుకోవడంలేదని ఆరోపించారు. గ్రామం మీదుగా ఒక్క లారీని కూడా తిరగనివ్వబోమని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. -
మెగా కాదు..దగా డీఎస్సీ
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహించామని చెప్పుకొని నిరుద్యోగ యువతను దగా చేసిందని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు శెట్టిబత్తుల కుమార్ రాజా అన్నారు. పార్టీ పిలుపు మేరకు మెగా డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ సోమవా రం ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో స్థానిక ఇంద్రపాలెం బ్రిడ్జి సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్ హరేంధిరప్రసాద్కు వినతిపత్రం సమర్పించారు. కుమార్ రాజా మాట్లాడుతూ నిరుద్యోగ యువత భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైన ఈ పరీక్షలో అన్ని అవకతవకలు జరిగాయన్నారు. అధికార దుర్వినియో గం జరిగిందన్న నిరుద్యోగులు అనుమానం వ్య క్తం చేస్తున్నారన్నారు. పరీక్షల నిర్వహణ, స్పోర్ట్స్ కోటాలో ఎంపిక, సర్టిఫికెట్ల పరిశీలన అంశాల్లో అనేక సందేహాలు ఉన్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీ బీ సీ మైనార్టీ పేద నిరుద్యోగ అభ్యర్థులకు డీఎస్పీలో అన్యాయం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో డీఎ స్సీ లీకేజీపై పూర్తిస్థాయిలో సీబీఐ విచారణ చే యించాలన్నారు. ప్రశ్నాపత్రం తయారీ నుంచి పరీక్ష నిర్వహణ వరకు మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేయాలన్నారు. అక్రమాలకు పాల్పడిన అధికారులు, రాజకీయ ఒత్తిడికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలన్నారు. డీఎస్సీ సక్రమంగా నిర్వహించలేని విద్యాశాఖమంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మాజీ డిప్యూటీ మేయర్ మీసాల ఉదయ్కుమార్, ఎస్సీ సెల్ నాయకులు పాల్గొన్నారు. -
కనీస వేతనం చెల్లించాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, స్కూలు ఆయాలు, నైట్ వాచ్మెన్లకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని సంఘ జిల్లా కన్వీనర్ చంద్రమళ్ల పద్మ డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథక కార్మికులు, స్కూలు ఆయాలు, స్కూల్ నైట్ వాచ్మన్లు కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కన్వీనర్ చంద్రమళ్ల పద్మ, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దువ్వ శేషబాబ్జీ మాట్లాడుతూ స్కూల్లో నైట్ వాచ్మన్గా పని చేసే కార్మికులకు ఇచ్చే రూ.ఆరువేల జీతం 6 నెలలుగా బకాయి పెడితే వారు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. స్కూలు ఆయాలకు ఇచ్చే రూ.6 వేలు జీతంతోనే చీపుర్లు, ఫినాయిల్ ఇతర సామగ్రి కొనుగోలు చేయాలనడం దారుణమన్నారు. స్మార్ట్ కిచెన్ల పేరుతో కార్మికుల ఉపాధికి చంద్రబాబు ప్రభుత్వం ఎసరు పెడుతోందని విమర్శించారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్కుమార్, మునికాంత, లక్ష్మీ, కాదా కుమారి, వెంకటరమణ, రవణమ్మ, వెంకటలక్ష్మీ, లోవరాజు, వీర్రాజు పాల్గొన్నారు. -
వార్డుల విభజనకు హైకోర్టు బ్రేక్
పిఠాపురం: ప్రభుత్వం హడావుడిగా చేపట్టిన మున్సిపల్ వార్డుల విభజనకు బ్రేక్ పడింది. వార్డుల విభజనను తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు తాత్కాలికంగా నిలిపివేయాలని రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో వివిధ మున్సిపాలిటీల్లో చేపట్టిన వార్డుల విభజన ఆగిపోయింది. జీఓ ఎంఎస్ నంబరు 64, ఎంఏ అండ్ యూడీ సీ డిపార్టుమెంట్ 24 మార్చి 2026వ తేదీన ప్రస్తుతం ఉన్న వార్డుల్లో పునర్విభజన చేపట్టాలని మున్సిపాలిటీలకు పురపాలక శాఖ కమిషనర్ ఏప్రిల్ 1వ తేదీ 2026న ఆదేశాలు జారీ చేశారు. దీంతో అన్ని మున్సిపాలిటీల్లోను అధికారులు విభజన ప్రక్రియ పూర్తి చేసి 17 మే 2026న ముసాయిదా ప్రకటనను విడుదల చేసి ఆయా మున్సిపాలిటీల నోటీసు బోర్డుల్లో ప్రకటించి ప్రజల నుంచి సూచనలు, సలహాలను కోరారు. ప్రజలు తమ అభ్యంతరాలను సలహాలను 18 మే 2026 నుంచి 24 మే 2026 లోపల తెలియజేయాలని కోరారు. ఈ ప్రక్రియ పూర్తయితే మున్సిపల్ ఆర్డీ, కలెక్టర్ల పరిధిలో వాటిని పరిష్కరించి తుది నోటిఫికేషన్ విడుదల చేయడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే ఈ విభజన హేతు బద్ధంగా లేదని అన్ని వర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్త మయ్యింది. అయినప్పటికి వార్డుల విభజనను కొనసాగించడానికి అధికారులు సిద్ధం కావడంతో పిఠాపురం మున్సిపల్ మాజీ కౌన్సిలర్ తలిశెట్టి వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. మున్సిపాలిటీలో జరిగిన వార్డుల విభజన సక్రమంగా లేదని, ఒకపక్క 2027 జన గణన జరుగుతుండగా వార్డుల విభజన ఎలా చేస్తారని వెంటనే వార్డుల విభజన ప్రక్రియను నిలుపుదల చేయాలని హైకోర్టుకు విన్నవించారు. రాష్ట్రంలో 11 మున్సిపాలిటీల నుంచి ఇలాంటి పిటీషన్లు రావడంతో వాటిని విచారించిన హైకోర్టు జనగణన జరుగుతుండగా ఎలా విభజన చేస్తారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు వార్డుల విభజనను నిలుపుదల చేయాలని ఈ రిట్ పిటీషన్పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో వార్డుల విభజనకు బ్రేక్ పడింది. ఈ మధ్యంతర ఉత్తర్వులు అన్ని మున్సిపాలిటీలకు వర్తిస్తాయని న్యాయ నిపుణులు అంటున్నారు. హేతుబద్ధంగా లేకే హైకోర్టును ఆశ్రయించాం చాలా అసంబద్ధంగా వార్డులు విభజించారు. సంబంధం లేని ప్రాంతాలను వార్డులుగా విభజించారు. ఒక్కో వార్డు రెండు మూడు కిలోమీటర్లు ఉండేలా విభజించారు. గతంలో ఎక్కడా ఎప్పుడూ లేని విధంగా భిన్నంగా ఉంది. ఒక పక్క జనాభా లెక్కలు జరుగుతుంటే అది తేలకుండా వార్డుల విభజన ఎలా చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఏవార్డులోకి ఎంత జనాభా వస్తుందనేది లెక్కలు తేలితేనే కదా తెలిసేది. ఎప్పుడో పాత జనాభా లెక్కల ప్రకారం వార్డులు విభజిస్తే ఎలా కుదురుతుంది. కొత్త జనాభా లెక్కలు వచ్చాక విభజన చేస్తే సమగ్రంగా ఉంటుంది. దీనిపై వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు అందరం కలిసి అభ్యంతరాలను తెలుపుతూ మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేశాం. అయినప్పటికీ న్యాయం జరుగుతుందని మాకు నమ్మకం లేకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. – తలిశెట్టి వెంకటేశ్వరరావు, మాజీ కౌన్సిలర్, పిఠాపురం. జన గణన అవ్వకుండా ఎలా? హైకోర్టును ఆశ్రయించిన మాజీ కౌన్సిలర్లు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన ఉన్నత న్యాయస్థానం -
యోగాతో మానసిక దృఢత్వం
అన్నవరం: రోజూ యోగా చేయడం ద్వారా శారీరక ఆరోగ్యంతో బాటు మానసిక దృఢత్వం అలవడుతుందని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో సోమవారం దేవదాయ, ధర్మాదాయశాఖ, పర్యాటక, ఆయుష్ విభాగాలు సంయుక్తంగా నిర్వహించిన ‘ యోగాంధ్ర ’కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేవస్థానం సిబ్బంది, భక్తులతో కలిసి ఆయన ఉదయం ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల ఏడో తేదీ నుంచి 21వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా జరుగనున్న యోగాంధ్ర కార్యక్రమంలో సుమారు రెండు లక్షల మంది పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, పెద్దాపురం ఆర్డీఓ రాధాకృష్ణమూర్తి, పాల్గొన్నారు. సుమారు 500 మంది యోగాసనాలు వేశారు. అంతకుముందు కలెక్టర్కు రత్నగిరిపై దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధర్రావు స్వాగతం పలికారు. పకడ్బందీగా ‘సర్’బీఎల్ఓలకు కాకినాడ ఆర్డీవో మల్లిబాబు ఆదేశాలు కాకినాడ లీగల్: స్వచ్ఛమైన, పారదర్శకమైన ఓటరు జాబితాల రూపకల్పన లక్ష్యంగా కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కాకినాడ ఆర్డీవో కం ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ రూరల్ (ఈఆర్వో) ఎస్.మల్లిబాబు, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కం అర్బన్ ఈఆర్వో కేటీ సుధాకర్ బూత్ లెవల్ అధికారుల (బీఎల్ఓలు)ను ఆదేశించారు. కాకినాడ డివిజన్ పరిధిలో చేపట్టనున్న ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై సోమవారం కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బూల్ లెవెల్ అధికారులకు (బీఎల్ఓలు) అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మల్లిబాబు మాట్లాడుతూ, జూలై 1, 2026ను అర్హత తేదీగా పరిగణించి ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియ నిర్వహణపై బీఎల్ఓలకు సమగ్ర శిక్షణ అందించడంతో పాటు, జూన్ 15 నుంచి జూలై 14 వరకుఇంటింటి సర్వే నిర్వహించాలని సూ చించారు. జూలై 21న ముసాయిదా ఓటరు జా బితాలను ప్రచురించనున్నట్లు తెలిపారు. అనంతరం జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు క్లెయిములు, అభ్యంతరాలు స్వీకరిస్తామని పేర్కొన్నా రు. వాటి పరిశీలన, అభ్యంతరాల పరిష్కార ప్ర క్రియను జూలై 21 నుంచి సెప్టెంబర్ 18 వరకు నిర్వహించి, సెప్టెంబర్ 22న తుది ఓటరు జాబి తాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అదనపు కమిషనర్, ఈఆర్వో కె.టి. సుధాకర్, అర్బన్ తహసీల్దార్, ఏఈఆర్వో జితేంద్ర, డిటి గోవిందరాజులతో పాటు ఎన్నికల శాఖ అధికారులు, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్ నియోజకవర్గాలకు చెందిన బీఎల్ఓలు పాల్గొన్నారు. -
రెండేళ్ల బాబు పాలనలో విధ్వంసం
● అన్ని వర్గాలకూ వెన్నుపోటు పొడిచారు ● బాబు వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లండి ● ‘సర్’ కార్యక్రమంపై అప్రమత్తంగా ఉండాలి ● మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా తుని: రెండేళ్ల చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. సోమవారం సాయంత్రం తుని పట్టణం మర్చంట్ అసోసియేషన్ భవనంలో పట్టణ శాఖ పార్టీ అధ్యక్షుడు అన్నవరం శ్రీను, మున్సిపల్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి రేలంగి రమణాగౌడ్ అధ్యక్షతన చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు సభ జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న దాడిశెట్టి రాజా మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలపై నిప్పులు చెరిగారు. విద్య, వైద్య, సచివాలయ వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు రెండేళ్ల పాలనలో రాష్ట్రంలో జరిగిన విధ్వంసం ఫొటో గ్యాలరీ పెట్టామని, అందరూ చూసి నిజాలు గ్రహించాలన్నారు. ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో అర్హులకు ఉద్యోగాలు దక్కలేదన్నారు. చివరకు పరీక్ష రాసిన అభ్యర్థులకు వచ్చిన మార్కులను తెలుసుకునే అవకాశం ఇవ్వలేదన్నారు. బాధితులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని భరోసా కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జననేత జగన్మోహన్రెడ్డి మహిళలకు ఆర్థిక చేయూత ఇచ్చారని, తద్వారా మార్కెట్లో ఆ సొమ్ము చలామణీ అయ్యి కొనుగోలు శక్తి పెరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం హయాంలో తెచ్చిన అప్పులు ప్రజలకు కాకుండా బినామీలకు దోచిపెట్టారని విమర్శించారు. ప్రతి మహిళకు జగన్మోహన్రెడ్డి హయాంలో రూ.లక్ష వరకు లబ్ధి చేకూరడంతో పిల్లలను ఉన్నత చదువులు చదివించుకున్నారన్నారు. ఇప్పుడు ప్రజల చేతిలో చిల్లిగవ్వ లేదని, కూటమి ప్రభుత్వం వల్ల ఎంత నష్టపోయారో తెలుసుకున్నారని, ప్రజల్లో తిరుగబాటు ప్రారంభమవుతుందన్నారు. చంద్రబాబు పాలనలో జరిగిన వైఫల్యాలను నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ నెల 15 నుంచి చేపట్టనున్న సర్ కార్యక్రమం విషయంలో అప్రమత్తంగా ఉండాలని, లేకపోతే ఓట్లు తొలగించే కుట్రలు చేస్తారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మహిళల ఓట్లు తొలగించడానికి చంద్రబాబు కుట్ర చేస్తున్నాడన్నారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో డెత్ సర్టిఫికెట్ కావాలంటే రూ.12 వేలు చెల్లించి రోజుల పాటు తిరగాల్సి వస్తోందన్నారు. తమ ప్రభుత్వం ఉన్నప్పుడు రూ.24 చెల్లిస్తే బాధితుడు ఇంటికి నేరుగా అందించిన విషయాన్ని గుర్తు చేశారు. పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు చింతల సునీత, అనుబంధ విభాగాల నాయకులు బోడపాటి సతీష్, సిద్ధా శ్రీను, పోతల రమణ, బుచ్చిరాజు, రమేష్, సత్య జగదీష్, మోహన్, విద్యార్థులు, మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
పసి ప్రాణం తీయకు!
● పసిప్రాణానికి మధుమేహ గండం ● పిల్లల్లో విస్తరిస్తున్న వ్యాధి లక్షణాలు ● పసి దేహాలకు నిత్యం ఇన్సులిన్ తూట్లు ● తాజాగా బాలిక మృతితో అప్రమత్తం ● జిల్లాలో 20 వేల మందికి పైనే వైద్యం కాకినాడ క్రైం: పసి ప్రాయాన్ని మధుమేహం కబళిస్తోంది. వంశపారంపర్యంగా కొందరికి, ఆహారంలో అలవికాని పదార్థాల దుష్ప్రభావాలు శరీర వ్యవస్థల్ని నాశనం చేస్తున్నాయి. మనిషి శరీరానికి అవసరమనన గ్లూకోజ్ను కణాల్లోకి పంపడానికి అవసరమయ్యే ఇన్సులిన్ సరిపడా లేకపోవడమే మధుమేహం (డయాబెటిస్). ఈ పరిస్థితి నేడు ఎందరో చిన్నారుల్లో కనిపిస్తోంది. చిన్నపిల్లల్లో వస్తే... చిన్న పిల్లల్లో వచ్చే మధుమేహాన్ని టైప్–1 డయాబెటిస్ అంటారు. పెద్ద వారిలో కనిపించేది టైప్–2. పిల్లల శరీరంలో ఇన్సులిన్ తయారు చేసే పాంక్రియాస్ కణాలు దెబ్బతినడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. పిల్లల్లో టైప్–2 డయాబెటిస్ కూడా గుర్తిస్తారు. ఊబకాయం, జంక్ఫుడ్స్, వారసత్వ కారణాలు ఈ పరిస్థితికి దోహదపడతాయి. టైప్–1 డయాబెటిస్కు ఇన్సులిన్ ఇంజక్షన్ తప్ప ప్రత్యామ్నాయం లేదు. డయాబెటిస్ వల్ల తీవ్ర దాహం, అలసట, నీరసం, తరచూ మూత్ర విసర్జనకు వెళ్లడం, బరువు తగ్గిపోవడం, కంటి చూపు మందగించడం వంటి ఎన్నో దుష్ప్రభావాలు దీనివల్ల ఎదురవుతుంటాయి. తల్లిదండ్రులకు ప్రత్యక్ష నరకం.. పిల్లల్లో డయాబెటిస్ తల్లిదండ్రులకు ప్రత్యక్ష నరకమే. రెండేళ్ల వయసు పిల్లల్లోనూ టైప్–1 డయాబెటిస్ ఉంటుంది. ఇటువంటి పిల్లలకి ప్రతి రోజు తల్లిదండ్రులే తమ చేతితో సూది పొడిచి కన్నబిడ్డ సూది నొప్పికి తల్లడిల్లిపోతే కన్నీళ్లు పెట్టుకుంటారు. మధుమేహంతో బాలిక మృతి.. తొండంగి మండలం, రావికంపాడు గ్రామానికి చెందిన మేడిశెట్టి కామేశ్వరి అనే 16 ఏళ్ల బాలిక మధుమేహం ముదిరి స్థానిక జీజీహెచ్లో ప్రాణాలు విడిచింది. సుగర్ స్థాయిలు పెరిగి సెప్సిస్ షాక్కు గురైంది. దేహంలో ఇన్ఫెక్షన్ లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ (ఎల్ఆర్టిఐ)కు కారణమైంది. ఇది బాలిక మృతికి దారితీసింది. జీజీహెచ్, ఇతర ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ లక్షణాలతో 20 వేలకు పైగా చిన్నారులు చికిత్స పొందుతున్నట్టు అధికారులు చెప్తున్నారు. పిల్లలకు చికిత్స చేసేందుకు ప్రభుత్వాస్పత్రుల్లో ఎటువంటి ప్రత్యేక సదుపాయాలు లేకపోవడం శోచనీయం. కేసులు గణనీయంగా పెరిగాయి పిల్లల్లో మధుమేహం ప్రమాదకరంగా పరిణమిస్తోంది. ఈ కేసులు గణనీయంగా పెరిగాయి. కోవిడ్ తర్వాత ఈ పరిస్థితి ఎదురైంది. శరీరాన్ని హాని కారకాల నుంచి రక్షించే రోగనిరోధక వ్యవస్థ తన సొంత కణాలు, కణజాలాలు, అవయవాలపై దాడి చేసే ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఇది. దీనికి నియంత్రణ ఒకటే మార్గం. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే డయాబెటిక్ కీటో ఎసిడోసిస్ (డీకెఏ) స్థితికి చేరి ప్రాణాంతకం కావచ్చు. – డాక్టర్ దుర్గాప్రసాద్ భీమాల, ఎండోక్రైనాలజిస్టు, డయాబెటాలజిస్టు, కాకినాడ జాగ్రత్తలు ఇవే.. పిల్లలకు సమతుల ఆహారం ఇవ్వాలి. రోజూ తాజా పండ్లు, కూరగాయాలు, పప్పులు, సంపూర్ణ ధాన్యాలు తినే అలవాటు చేయాలి. చక్కెర ఎక్కువగా ఉంటే శీతల పానీయాలు, ప్యాకేజ్డ్ జ్యూస్లు, స్వీట్లు, జంక్ ఫుడ్ పూర్తిగా మానేయాలి. రోజులో కనీసం ఒక గంట శారీరక వ్యాయామం, ఆటలు ఆడేలా చూడాలి. టీవీ, మొబైల్స్ చూస్తూ, వీడియోగేమ్స్ ఆడుతూ ఆహారం తినే అలవాటు మాన్పించాలి. పిల్లలు వయసుకు తగ్గ బరువు మాత్రమే ఉండేలా చూసుకోవాలి. సరిపడ నిద్ర పోవాలి. కుటుంబంలో ఎవరికై నా డయాబెటిస్ ఉంటే అటువంటి పిల్లల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపాలి. -
తలుపులమ్మ తల్లి ఆదాయం రూ.9.42 లక్షలు
తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన భక్తజనంతో లోవ దేవస్థానం ప్రాంగణం కిక్కిరిపోయింది. ఆదివారం వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చిన 30 వేల మంది అమ్మవారిని దర్శించుకున్నట్టు కార్యనిర్వహణ అధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాలు విక్రయం ద్వారా రూ.2,65,276, పూజా టికెట్లకు రూ.5,17,080, కేశఖండనశాలకు రూ.29,640, వాహన పూజలకు రూ.7,550, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.10,309, విరాళాలు రూ.19,545 వెరసి రూ.9,42,400 ఆదాయం సమకూరినట్టు ఈఓ తెలిపారు. శ్రీవారి సేవకులు, సిబ్బందితో కలసి భక్తులకు సౌకర్యాలు కల్పించామన్నారు. ప్రజారోగ్యానికి పెద్దపీట రాజమహేంద్రవరం సిటీ: అధికారంలో ఉన్నపుడు ప్రజల ఆరోగ్యానికి, వైద్యానికీ ఎలా ప్రాధాన్యం ఇచ్చామో, ప్రతిపక్షంలోనూ అలానే ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు. ఆదివారం ఆయన ఆధ్వర్యంలో నగరంలో ఆనంద్ నగర్ బెట్టి కాన్వెంట్ రోడ్డులో వాసన్ ఐ కేర్ హాస్పిటల్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. నగరంలో 45, 46 డివిజన్లలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించామన్నారు. అవసరమైనవారికి మందులు, ఐ డ్రాప్స్ ఉచితంగా అందజేసినట్టు తెలిపారు. కంటి అద్దాలు అవసరమైన వారికి వారం రోజుల్లో అందజేయనున్నట్టు తెలిపారు. క్యాటరాక్ట్, రెటీనా శస్త్రచికిత్సలు అవసరమైన వారు మార్గాని భరత్ ఫౌండేషన్తో పాటు ఇతర స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో చేయిస్తామన్నారు. వైద్య శిబిరాలతో పాటు జాబ్ మేళా కూడా నిరంతరం చేపడతామన్నారు. ఇప్పటికే రెండు విడతల జాబ్ మేళా చేశామని, మరో 20రోజుల్లో మూడవ విడత జాబ్ మేళా చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఇవే కాకుండా గర్భిణులకు ప్రొటీన్ కిట్లు, ఐరన్ సిరప్ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ మాజీ చైర్ పర్సన్ మేడపాటి షర్మిలా రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసంశెట్టి గంగాధర్, వైఎస్సార్ సీపీ 46వ డివిజన్ ఇన్చార్జి కె.మురళీకృష్ణ, 45వ డివిజన్ నాయకులు పాల్గొన్నారు. -
హిందు ధర్మాన్ని హేళన చేశారు
పిఠాపురం: స్థానిక కుంతీమాధవస్వామి కోనేరులో పుట్టిన రోజు వేడుకలు నిర్వహించి కోనేరు ప్రతిష్టను దిగజార్చడంతో పాటు హిందు ధర్మాన్ని హేళన చేశారని, వారి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆదిపరాశక్తి పీఠాధిపతి నిత్య విద్యానంద భారతి స్వామిజీ అన్నారు. ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అత్యంత ప్రాచీన చరిత్ర గల పంచ మాధవ క్షేత్రాలలో ఒకటైన పిఠాపురం కుంతీ మాధవస్వామి కోనేరులో ఇటీవల అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన సంధర్భంగా జనసేన నేతలు దేవుడి సమక్షంలోనే పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ ధర్మంలోనే ఉంటు అదే ధర్మాన్ని పాటింకపోగా అవహేళన చేశారని ఆయన మండిపడ్డారు. హిందు ధర్మంలో పుట్టిన రోజు వేడుకలు చేసుకోవాలంటే పది మందికి వస్త్రాలు, అన్నదానం, కల్యాణాలు వంటివి చేయాలి తప్ప ఇలా కేక్లు కట్ చేయడం కొవ్వొత్తులు ఆర్పడం వంటివి హిందూ ధర్మానికి వ్యతిరేకమన్నారు. ఒక పక్క దేవుడికి పూజలు చేస్తు వేద మంత్రాలు వినిపిస్తుండగా వాటిని పట్టించుకోకుండా కేక్లు పంచుకుంటు కేకలు వేస్తు వికృత చేష్టలు చేయడం భగవంతుడి పూజను అవమానించడంతో పాటు భక్తుల మనోభావాలను మంటగలపడమే అన్నారు. ఇందుకు బాధ్యులైన వారు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంపై దేవదాయ ధర్మాదాయ శాఖాధికారులు వెంటనే స్పందించి వేద పండితులతో కోనేరులో సంప్రోక్షణ నిర్వహించాలని లేని పక్షంలో తగిన విధంగా స్పందించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. కోనేరు ప్రతిష్టను దిగజార్చిన నేతలు క్షమాపణలు చెప్పాలి ఆదిపరాశక్తి పీఠాధిపతి నిత్యవిద్యానంద బారతి స్వామిజీ -
● సమస్య పెచ్చుమీరింది!
వి.కొత్తూరులో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల బాలికల పాఠశాల, కళాశాల విద్యాలయంలో విద్యార్థినుల భోజనశాల ప్రమాదకరంగా మారింది. 2002లో నిర్మించిన ఈ భవనం పూర్తిగా శిథిలమైంది. ఐదు నుంచి ఇంటర్ వరకూ ఉన్న సుమారు 540 మందికి ఇక్కడే భోజనాలు వడ్డిస్తుంటారు. ఒక భాగం పూర్తిగా పాడవగా, రెండో భాగంలో విద్యార్థులు విడతల వారీగా భోజనాలు చేస్తున్నారు. ఇటీవల కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఈ విద్యాలయాన్ని సందర్శించి, శిథిలావస్థలో ఉన్న భాగాన్ని పూర్తిగా మూసివేయాలని ఆదేశించారు. వి.కొత్తూరు -
గిట్టుబాటుకు పోటు!
● కోలుకోని వర్జీనియా పొగాకు మార్కెట్ ● వేలం కేంద్రాలకు చేరుకోని బేళ్లు ● గిట్టుబాటు లేక నలిగిపోతున్న రైతులు దేవరపల్లి: పొగాకు కొనుగోళ్లు ప్రారంభించి రెండు నెలలు దాటినా గిట్టుబాటు ధర లేక రైతులు దిగాలు పడ్డారు. అంతర్జాతీయ సంక్షోభంతో కొనుగోళ్లు మందగించినట్టు అధికారులు చెప్తున్నారు. వేలానికి తీసుకువచ్చిన బేళ్లను నాణ్యత లేదని కొనుగోలుదారులు తిరస్కరిస్తున్నారని, కనీసం 50 శాతం కూడా అమ్ముడవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కనీసం పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు సైతం రాకపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నాడు. తప్పేది లేక వారంతా బయట దళారుల వద్దే వారు చెప్పిన ధరకే పొగాకు విక్రయించి వదిలించుకుంటున్నారు. రంగు మారుతున్న పొగాకు గ్రేడింగ్ పూర్తిచేసి, బేళ్లు కట్టిన పొగాకు ఇటీవలి ఎండల తీవ్రతకు రంగు మారిపోతోంది. రంగు మారితే కొనుకోళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మొదటి నాలుగు రెలుపుల పొగాకు వేలం కేంద్రాల్లో కొనుగోలు చేయనిపరిస్థితి ఏర్పడింది. రూ. 71.39 కోట్ల విక్రయాలు టుబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో శనివారం నాటికి రూ.71.39 కోట్ల విలువైన 27.57 లక్షల కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. కొనుగోళ్లు ప్రారంభించి 73 రోజులు కాగా, 46 రోజులు వేలం జరిగింది. 2025–26 పంట కాలానికి 12,938 మంది రైతులు, 30,145 హెక్టార్లలో సుమారు 85 మిలియన్ల కిలోల పొగాకు ఉత్పత్తి చేశారు. బోర్డు నిర్దేశించిన పరిమాణం కంటే అదనంగా సుమారు 35 మిలియన్ల కిలోల పంట ఉత్పత్తి జరిగినట్టు గణాంకాలు చెపుతున్నాయి. నిలకడగా పొగాకు ధర మార్కెట్లో పొగాకు ధర నిలకడగా సాగుతుంది. కిలో గరిష్ఠ ధర రూ.260, కనిష్ఠ ధర రూ.180, సగటు ధర రూ.258.95కి విక్రయిస్తున్నారు. రెండు నెలలుగా ఇదే పరిస్థితి ఉంది. ఈ ధర ఎంత మాత్రం గిట్టుబాటు కాదని రైతులు అంటున్నారు. సగటు ధర కిలో రూ.320 ఇవ్వాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. పొగాకు గరిష్ట ధర రూ.265 కాగా, కొనుగోళ్లు, సగటు ధరలు ఇలా ఉన్నాయి.. వేలం కేంద్రం కొనుగోలు సగటు ధర (కిలోల్లో) దేవరపలి 387674 256.70 జంగారెడ్డిగూడెం–1 723158 259.64 జంగారెడ్డిగూడెం–2 539732 260.23 కొయ్యలగూడెం 532183 258.37 గోపాలపురం 574468 258.93పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం పొగాకు వ్యాపారులు సిండికేట్గా మారి రైతులను ఇబ్బంది పెడుతున్నారని, ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. వేలం కేంద్రాలకు వస్తున్న ట్రేడర్లు మొక్కుబడిగా కొనుగోలు చేసి చేతులు దులుపుకుంటున్నారని పలువురు రైతులు విమర్శిస్తున్నారు. తక్కువ బేళ్లు వేలానికి వస్తున్నాయి వేలం కేంద్రానికి తక్కువ బేళ్లు వస్తున్నాయి. మొదటి రెలుపుల ఆకులు కొనుగోలుకు ట్రేడర్లు ఆసక్తి చూపడంలేదు. కర్ణాటకలో వేలం జరుగుతున్నందున ట్రేడర్లు ఇక్కడకు రాలేదు. ఎగుమతి ఆర్డర్లు కూడా రావలసి ఉంది. – పి.హేమస్మిత, వేలం కేంద్రం నిర్వహణాధికారిణి, దేవరపల్లి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి పొగాకు మార్కెట్ సంక్షోభంలో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం కలు గజేసుకుని ప్రత్యామ్నాయ ఏర్పా ట్లు చేయాలి. ప్రభుత్వమే మార్క్ ఫెడ్ ద్వారా గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి ఆదుకోవాలి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్ రూ. 500 కోట్లు కేటాయించి మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి ఆదుకున్నారు. రైతులకు అండగా వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుంది. – వల్లభనేని సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు -
వందిమాగధులకూ వంగి వంగి..!
● కొరత వేళ సత్యదేవుని సంప్రదాయ కండువాల దుర్వినియోగం ● ఎమ్మెల్యే సత్యప్రభతో పాటు ప్రొటోకాల్ కానివారికీ సత్కారం ● ఈ సారి ఎవరిని బాధ్యులను చేయనున్నారో! అన్నవరం: అయితే అతివృష్టి లేదా అనావృష్టి.. ఈ సామెత అన్నవరం దేవస్థానం అధికారులకు సరిగ్గా సరిపోతుందేమో! పై చిత్రం చూడండి.. మధ్యలో ఉన్నవారు ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ. సత్యదేవుని దర్శనానికి వచ్చిన ఆమెకు దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ప్రొటోకాల్ ప్రకారం ఘనంగా స్వాగతం పలికి స్వామివారి కండువా వేసి ప్రసాదాలు ఇచ్చి గౌరవించారు. అంత వరకు బాగానే ఉంది. కానీ ఆమెతో వచ్చిన ఒకరిద్దరు పదవుల్లో ఉన్నవారిని మినహాయిస్తే మిగిలిన టీడీపీ శ్రేణులకు సైతం స్వామివారి కండువాలు వేయడం కచ్చితంగా అభ్యంతరకరమే. పాలక పార్టీపై కొంత మర్యాద ఉండవచ్చు కానీ.. మరీ ఇంత దుర్వినియోగం అయ్యేంత అవసరమా అని భక్తులు చర్చించుకుంటున్నారు. రెండు రోజుల క్రితమే స్వామివారి సంప్రదాయ కండువాలు ఇవ్వడం లేదన్న విషయం వివాదాస్పదమైన తరువాత కూడా ఇలా కండువాల సంతర్పణ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. 15 రోజులుగా సత్యదేవుని నామం, శంఖుచక్రాలు ముద్రించిన కండువాలు లేకపోవడంతో సాధారణ కండువాలను స్వామివారి కల్యాణం, రూ.1,500, రూ.2 వేల వ్రతాల చేయించుకుంటున్న భక్తులకు ఇవ్వడంతో వారు అసంతృప్తి చేశారు. ఈ విషయమై ‘సాక్షి’ దినపత్రికలో ‘నీ నామమెంతో రుచిరా!’ శీర్షికన ఈ నెల నాలుగో తేదీన కథనం ప్రచురించడం, దీనిపై స్పందించిన అధికారులు కండువాల టెండరుదారును బాధ్యుడిని చేస్తూ ప్రకటన చేయడం, సంప్రదాయ కండువాలు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవడం తెలిసిందే. అంతటితో ఆగక కండువాల సరఫరా సక్రమంగా జరగకపోవడానికి బాధ్యులుగా గుర్తించి సంబంధిత సూపరింటెండెంట్, గుమాస్తాలను వేరే సెక్షన్లకు బదిలీ చేసిన ఈఓ నల్లం సూర్యచక్రధర్రావు అనంతరం వారిపై సస్పెన్షన్ వేటు కూడా వేశారు. ఇంత తతంగం జరిగాక కూడా కనీస నిల్వగా ఉన్న స్వామివారి కండువాలను అత్యంత పొదుపుగా వినియోగించాల్సి ఉండగా ఇష్టమొచ్చినట్టు సంతర్పణలా వినియోగించడం శోచనీయం. స్వామివారి దర్శనానికి వచ్చే వీఐపీల తగురీతిన సత్కరించడంలో తప్పులేదు. కానీ వారి వందిమాగధులకు కూడా వేసేసి సదరు వీఐపీ మెప్పు పొందాలనుకున్నపుడే తంటంతా. ఈ విధానానికి అధికారులు స్వస్తి పలకాల్సి ఉంది. తాజా సంప్రదాయ కండువాల దుర్వినియోగానికి ఎవరిని బాధ్యుల్ని చేస్తారో.. అలా వేయాలని నిర్ణయం తీసుకున్నదెవరో సత్యదేవునికే ఎరుక. -
మాతృ భాష పరిరక్షణ అందరి బాధ్యత
జీజీయూలో తెలుగు మహాసభ ప్రారంభం రాజానగరం: మాతృ భాషను కాపాడుకోవడం అందరి బాధ్యత అని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జీజీయూ) చాన్సలర్ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు) అన్నారు. వెలుగుబంద సమీపంలోని జీజీయూలో చైతన్య సారస్వత్ పరిషత్, శ్రీశ్రీ కళా వేదిక ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగే ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలు శనివారం ప్రారంభమయ్యాయి. చైతన్యరాజు మాట్లాడుతూ పిల్లలు తమ తల్లిదండ్రులను అనుసరిస్తారని, అందుకే మాతృ భాష పరిరక్షణలో తల్లిదండ్రులే ముందుండాలన్నా రు. తెలుగు భాష ఔన్నత్యాన్ని పిల్లలకు అర్థమయ్యే విధంగా వివరించడంతో పాటు ప్రతి ఇంటా మాతృభాషలోనే మాట్లాడుకోవాలన్నారు. ఈ ఉద్దేశంతోనే మూడేళ్లుగా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నామన్నారు. అంతేకాదు జీజీయూ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ విద్యతో పాటు తెలుగును ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టామన్నారు. శ్రీశ్రీ కళావేదిక సీఈఓ కత్తిమండ ప్రతాప్ మాట్లాడుతూ ప్రాచీన కవులు, కళాకారుల సాహిత్యాన్ని యువతరానికి అందించడం సాహిత్య సంస్థల బాధ్యతన్నా రు. ఇదేవిధంగా తెలుగు సాహిత్య మహాసభలను శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో జూలైలో కాకినాడ, ఆగస్టులో హైదరాబాద్ – రవీంద్రభారతి, సెప్టెంబర్లో మలేషియాలో నిర్వహించనున్నామన్నారు. అనంతరం తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే విధంగా కళాకారులు ప్రదర్శించిన కళారూపాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఏపీ రక్షణ దళం కమాండెంట్ కొండా నరసింహరావు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎం.శ్రీనివాసరావు, ప్రముఖ సాహితీవేత్త యర్రాప్రగడ రామకృష్ణ, శ్రీశ్రీ కళావేదిక జాతీ య అధ్యక్షుడు జి.ఈశ్వర భూషణం పాల్గొన్నారు. -
వ్యక్తిపై కత్తితో దాడి
గోకవరం: ఓ వ్యక్తిపై దగ్గర బంధువే కత్తితో దాడి చేశాడు. ఎస్సై పవన్కుమార్ కథనం ప్రకారం.. గోపాలపురం గ్రామానికి చెందిన దోర సతీష్ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శనివారం మధ్యాహ్నం గ్రామ శివారున ఉన్న మామిడితోటలో సతీష్ మామిడికాయలు తీస్తున్నాడు. వెనుక నుంచి వచ్చిన అదే గ్రామానికి చెందిన గూడవల్లి వెంకన్న కత్తితో సతీష్ తలపై దాడి చేశారు. ఈ విషయం గుర్తించిన స్థానికులు వెంటనే అతన్ని ప్రైవేటు వాహనంలో గోకవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం రాజమహేంద్రవరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలియవచ్చింది. దాడికి పాల్పడిన వ్యక్తి, క్షతగాత్రుడు ఇద్దరూ బంధువులు. దాడికి గల కారణాలపై ఆరా తీస్తున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పవన్కుమార్ వివరించారు. -
స్టాంపులు అయిపోయాయి
కాకినాడ లీగల్: జిల్లాలోని 9 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను నోటరీ, కోర్టు ఫీ, రెవెన్యూ స్టాంపుల కొరత వేధిస్తోంది. వీటిల్లో 7 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నోటరీ స్టాంపులు అందుబాటులో లేవు. జిల్లావ్యాప్తంగా కాకినాడ, సర్పవరం, తుని, పిఠాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట, సామర్లకోట, పెద్దాపురం, తాళ్లరేవు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయలున్నాయి. కాకినాడ, సర్పవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నోటరీ, కోర్టు ఫీ, రెవెన్యూ స్టాంపులకు కొన్ని నెలలుగా కొరత ఏర్పడింది. దీంతో, కక్షిదారులు, న్యాయవాదులు అవస్థలు పడుతున్నారు. నోటరీ, కోర్టులో దాఖలు చేసే వివిధ పత్రాలు, రిజిస్ట్రేషన్ల వంటి ఏ లావాదేవీలు జరపాలన్నా ఆయా స్టాంపులు ఎంతో అవసరం. కొన్నాళ్లుగా అవి లభ్యం కాకపోవడం అందరికీ ఇబ్బందికరంగా మారింది. నోటరీ స్టాంపులు సర్పవరం, పిఠాపురం, తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, సామర్లకోట, పెద్దాపురం, తాళ్లరేవు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సుమారు ఆరు నెలలుగా నోటరీ స్టాంపుల కొరత ఉంది. కాకినాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సుమారు 6 నెలలగా నోటరీ స్టాంపులు లేవు. దీనిపై ఉద్యోగులను అడగ్గా వెంటనే 20 వేల నోటరీ స్టాంపులు తెచ్చారు. అవి వచ్చి రెండు మూడు రోజులైనప్పటికీ వాటి అమ్మకాలు మాత్రం జరపడం లేదు. నోటరీ స్టాంపు ధర రూ.5. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల్లో మార్పులు, చేర్పులకు, లీగల్ హెయిర్ సర్టిఫికెట్లు, ఈడబ్ల్యూ సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ పత్రం, బ్యాంక్ అగ్రిమెంట్లు.. ఇలా ప్రతి దానికీ నోటరీ తప్పనిసరి. అటువంటి స్టాంపులు అందుబాటులో లేకపోవడంతో నోటరీ న్యాయవాదులు ఇబ్బందులు పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర ప్రాంతాల నుంచి తీసుకు వచ్చి నోటరీ చేస్తున్నారు. కోర్లు ఫీ స్టాంపులు కోర్టుల్లో ఏ పత్రాలు దాఖలు చేయాలన్నా, ఏ పత్రాలు పొందాలన్నా అటు కక్షిదారులకు, ఇటు న్యాయవాదులకు కోర్టు ఫీ స్టాంపులు తప్పనిసరి. రూ.1, రూ.2, రూ.5, రూ.10 డినామినేషన్ కోర్టు ఫీ స్టాంపులు రెండు నెలలుగా లభించకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. రెవెన్యూ స్టాంపులు అద్దె చెల్లింపులు, ప్రామిసరీ నోట్లు, బ్యాంకు లావాదేవీల వంటి వాటిల్లో నగదు లావాదేవీలు జరిగినప్పుడు ఆయా రసీదులపై రెవెన్యూ స్టాంపులు అంటిస్తూంటారు. దీని ధర ఒక రూపాయి. కాకినాడ, సర్పవరంతో పాటు పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ స్టాంపులకు ఏడాది నుంచి కొరత ఉంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదు. నాసిక్ నుంచి రావాలి నోటరీ, కోర్టు ఫీ, రెవెన్యూ స్టాంపులు, నాన్ జ్యుడీషియల్, ఇతర స్టాంపులు నాసిక్లోని ముద్రణాలయంలో ముద్రిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ఇండెంట్ను బట్టి అక్కడి నుంచే ఈ స్టాంపులు వస్తాయి. అయితే, చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత స్టాంపుల లభ్యతపై సకాలంలో స్పందించడం లేదు. దీంతో, తరచూ స్టాంపుల కొరత సమస్య తలెత్తుతోంది. ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలైనా రిజిస్ట్రేషన్ శాఖ నుంచి ఆదాయం తీసుకోవడమే తప్ప.. ఆ శాఖకు కావలసిన స్టాంపులు, వసతుల గురించి పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం అవసరమైన స్టాంపులకు వెంటనే ఇండెంట్ పెట్టి, త్వరితగతిన వచ్చే ఏర్పాట్లు చేయాలని న్యాయవాదులు, కక్షిదారులు కోరుతున్నారు.ఫ అందుబాటులో లేని నోటరీ, కోర్టు ఫీ, రెవెన్యూ స్టాంపులు ఫ లావాదేవీలకు ఇబ్బందులు ఫ కక్షిదారులు, న్యాయవాదులకు అవస్థలు -
ఇతర ప్రాంతాల నుంచి తెస్తున్నాం
నోటరీ స్టాంపులు అందుబాటులో లేక అనేక ఇబ్బందులు పడుతున్నాం. విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న ప్రస్తుత తరుణంలో విద్యార్థులకు అనేక పత్రాలపై నోటరీ తప్పనిసరి. సరిగ్గా ఇదే సమయంలో నోటరీ స్టాంపులు లభించడం లేదు. దీంతో, అనేక ఇబ్బందులు పడుతూ ఇతర ప్రాంతాల నుంచి స్టాంపులు తీసుకు వస్తున్నాం. – జి.వెంకట దుర్గాప్రసాద్, న్యాయవాది, కాకినాడ స్టాంపులు లేక అవస్థలు కోర్టులో దాఖలు చేసే వివిధ పిటిషన్లు, వివాహ రిజిస్ట్రేషన్లు, సమాచార హక్కు చట్టం దరఖాస్తులు, ఇతర అంశాలకు కోర్టు ఫీ స్టాంపులు ఎంతో అవసరం. కానీ, అవి అందుబాటులో లేక ఎంతో ఇబ్బంది పడుతున్నాం. జిల్లా అధికారులు ఇతర ప్రాంతాల నుంచి కోర్టు ఫీ స్టాంపులను కాకినాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తీసుకువచ్చి సమస్య పరిష్కరించాలి. – వీరాబత్తుల రాజు, న్యాయవాది, కాకినాడ నగదు చెల్లింపులకు ఇబ్బంది రెవెన్యూ స్టాంపులు అందుబాటులో లేకపోవడంతో నగదు లావాదేవీలు జరిగినప్పుడు ఇబ్బందులు పడుతున్నాం. అన్ని నగదు వ్యవహారాలపై రెవెన్యూ స్టాంపులు తప్పనిసరి. అధికారులు స్పందించి, సమస్య పరిష్కరించాలి. – ఎన్.శివరామకృష్ణ, కాకినాడ -
ఇక కిక్నిక్ స్పాట్లేనా!
ఉప్పాడ సాగర తీరం ● త్వరలో బీచ్లలో మద్యం విక్రయాలు ● బీచ్ షాక్స్ పేరిట చంద్రబాబు సర్కారు పచ్చజెండా ● పర్యాటకులను ఆకర్షించే ముసుగులో మత్తులో ముంచే యత్నం! ● ఇదే అదనుగా అసాంఘిక శక్తులు చెలరేగే ప్రమాదం ● ఇకపై ఫ్యామిలీతో బీచ్కు వెళ్లాలంటే ఇబ్బందే!పిఠాపురం: కనుచూపు మేరంతా అపార నీలి జలరాశి.. మనసుకు ఆహ్లాదాన్నిచ్చేలా ఉప్పొంగుతూ ఎగసిపడే కెరటాల హోరు.. మెత్తని ఇసుక తిన్నెలతో కూడిన సాగర తీర అందాలు సందర్శకులను ఎంతో పరవశింపజేస్తాయి. ఈ ప్రాంతాలు పిక్నిక్లకు సైతం నెలవు. చంద్రబాబు సర్కారు పుణ్యమా అని.. ఇటువంటి పిక్నిక్ స్పాట్లు.. ఇకపై ‘కిక్’నిక్ స్పాట్లుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. పర్యాటకాభివృద్ధి ముసుగులో.. రాష్ట్రంలోని పలు బీచ్లలో.. గోవా తరహాలో మినీ బార్లు, లిక్కర్ షాపులు (బీచ్ షాక్స్) ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ‘పచ్చ’జెండా ఊపింది. తొలుత పైలట్ ప్రాజెక్టుగా విశాఖపట్నం, సూర్యలంక బీచ్లలో వీటిని ఏర్పాటు చేస్తారు. రెండో దశలో కాకినాడ, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో బీచ్ షాక్స్ ఏర్పాటుకు ఎకై ్సజ్ శాఖ ఇప్పటికే ప్రతిపాదనలు రూపొందించింది. త్వరలోనే వీటికి అనుమతులు ఇవ్వనున్నట్లు సమాచారం. అదే కనుక జరిగితే సాగర తీరంలో ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి వచ్చే సాధారణ పర్యాటకులకు, పిల్లాపాపలతో, కుటుంబ సభ్యులతో కలసి ఆహ్లాదంగా గడపడానికి వచ్చే వారికి ఇక నుంచి ఇబ్బందులు మొదలు కానున్నాయి. సరదాగా గడుపుదామని బీచ్కు వస్తే.. మందుబాబుల చిందులతో చికాకులు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంతే కాదు.. అందాల సాగర తీరం అసాంఘిక శక్తులకు నిలయంగా మారుతుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. అభివృద్ధిని కడలిలో కలిపేసి.. జిల్లావ్యాప్తంగా కాకినాడలో మాత్రమే బీచ్ ఉండగా మరో 21 బీచ్ల అభివృద్ధికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అప్పట్లో దేశంలో 10 బ్లూ ఫ్లాగ్ బీచ్లుండగా.. వాటిలో విశాఖ రుషికొండ బీచ్ ఒకటి. అలాంటి బ్లూ ఫ్లాగ్ బీచ్ను కాకినాడలో ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు సేవలు, పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతాయని భావించారు. ఈలోగా ఎన్నికలు రావడం.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బీచ్ల అభివృద్ధి కడలిలో కలిసిపోయింది. కాకినాడ వద్ద బీచ్ పార్కు, బీచ్ రోడ్డు, అద్దరిపేట సాగరతీరం, పంపు హౌస్లు పిక్నిక్ స్పాట్లుగా వెలుగొందుతున్నాయి. అలాగే, కాకినాడ సమీపాన సముద్రం మధ్యలో సహజసిద్ధంగా ఏర్పడిన హోప్ ఐలాండ్ కూడా మంచి పిక్నిక్ స్పాట్గా ఉంది. ఇక్కడకు వెళ్లేందుకు కాకినాడ హార్బర్, కోరంగి మడ అడవుల నుంచి సౌకర్యాలున్నాయి. అలాగే, తాళ్లరేవు మండలంలోని కోరంగి మడ అడవుల అందాలు కూడా పర్యాటకులను కట్టిపడేస్తూంటాయి. వీటితో పాటు మరిన్ని ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసే అవకాశాలున్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదు. జిల్లాలో పర్యాటక రంగానికి, బీచ్ల అభివృద్ధికి రెండేళ్లుగా ఒక్క పైసా కూడా విదల్చని సర్కారు.. కేవలం ఆదాయమే లక్ష్యంగా.. బీచ్లను మందుబాబులకు నిలయాలుగా మార్చేందుకు చేస్తున్న యత్నాలపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పూటుగా మద్యం తాగి.. ఆ మత్తులో మందుబాబులు గొడవలకు, అసాంఘిక కార్యకలాపాలకు దిగితే.. మహిళలు, పిల్లల భద్రతకు ముప్పు ఏర్పడుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది.ప్రకృతిని వికృతంగా మారుస్తారా? సముద్రం ఒడ్డున మద్యం అమ్మకాలను ప్రోత్సహించడం బాధాకరం. ఇప్పుడు విశాఖపట్నం అంటున్నారు. రేపు కాకినాడకు తీసుకువస్తారు. ఇప్పటికే తీర ప్రాంతాల్లో మందుబాబుల ఆగడాలు పెరుగుతున్నాయి. ఇక బార్లు తెరిస్తే ఈ ప్రాంతాలు అసాంఘిక శక్తులకు నిలయాలుగా మారే ప్రమాదముంటుంది. దీనివలన బీచ్కు వచ్చే సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఇబ్బంది ఏర్పడుతుంది. శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశముంటుంది. ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పూనుకోవడం ఆందోళన కలిగిస్తోంది. – ఎన్.సూర్యనారాయణ, మద్యం, మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచార కమిటీ కన్వీనర్, పిఠాపురం -
సనాతన ధర్మాన్ని మంటగలిపారు
● కుంతీమాధవ స్వామి కోనేరులో బర్త్డే వేడుకలా? ● జనసేన నాయకులపై విశ్వ హైందవ పరిషత్ ఆగ్రహం ● సంప్రోక్షణ చేయాలని డిమాండ్ పిఠాపురం: కుంతీమాధవ స్వామి పవిత్ర కోనేటిలో పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన జనసేన నాయకులు సనాతన ధర్మాన్ని మంటగలిపారని, తీవ్ర అపచారానికి ఒడిగట్టారని విశ్వ హైందవ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు డి.వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశా రు. స్వామి వారి కోనేటి అభివృద్ధి పనులకు భూమి పూజ చేయడానికి వచ్చిన జనసేన నాయకులు.. హిందూ సంప్రదాయానికి విరుద్ధంగా శుక్రవారం కేక్ కటింగ్ వంటి అపచారాలకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండించారు. కుంతీమాధవ స్వామి వారి కోనేటి వద్ద పరిషత్ నాయకులు శనివారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సనాతన ధర్మానికి విలువనిస్తున్నట్టు ఒకవైపు చెప్పుకొంటూంటే.. ఆ పార్టీ నాయకులే సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం దారుణమని మండిపడ్డారు. దేవాలయ ఆచార సంప్రదాయాలు, హిందూ ధార్మిక విధానాల ప్రకారం దేవస్థానం ప్రాంగణంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అనుచితమని అన్నారు. ఒకవైపు దేవు ని పూజలు నిర్వహిస్తూ, వేద మంత్రాలు పఠిస్తూండగా.. మరోవైపు సనాతన ధర్మానికి విరుద్ధంగా కోడిగుడ్లతో తయారు చేసిన కేక్ కట్ చేయడం, దీపాలు వెలించాల్సిన పవిత్రమైన చోట కొవ్వొత్తులు వెలిగించడం వంటి చర్యలు అత్యంత హేయమైనవిగా భావిస్తున్నామన్నారు. అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా ఉన్న వ్యక్తి, సనాత ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత గల నాయకులే ఇలాంటి చర్యలకు పాల్ప డటం దారుణమన్నారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, ఆలయ కోనేటి వద్ద సంప్రోక్షణ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన మార్గదర్శకాలు రూపొందించి, అమలు చేయాలని వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. నేడు సంప్రోక్షణ స్వామి కోనేటిలో ఆదివారం ఉదయం 6 గంటలకు సంప్రోక్షణ నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ ధనలక్ష్మి తెలిపారు. జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా ఈ సంప్రోక్షణ నిర్వహిస్తున్నామన్నారు. ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. -
శివరామ్కు 14 రోజుల రిమాండు
కాకినాడ క్రైం: జిల్లాలోని కాజులూరు తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా ఉంటూ.. కాకినాడ కలెక్టరేట్లో డెప్యూటేషన్పై సీనియర్ అసిస్టెంట్గా కొనసాగుతూ.. ఏసీబీకి పట్టుబడిన చోడెపురెడ్డి శివరామ్ కుమార్కు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండు విధించింది. అతడి నివాసం, కార్యాలయంతో పాటు బంధువుల ఇళ్లపై ఏసీబీ అధికారులు పక్కా సమాచారంతో శుక్రవారం దాడులు చేసిన విషయం తెలిసిందే. తండ్రి వీరభద్రరావు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తూ మరణించారు. దీంతో, శివరామ్ 23 సంవత్సరాల వయస్సులో రెవెన్యూ విభాగంలో కారుణ్య నియామకం పొందారు. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, మండల అధికారి స్థాయికి చేరుకున్నారు. ప్రస్తుతం 36 ఏళ్ల వయస్సు ఉన్న ఆయన అక్రమ సంపాదన మొత్తం 11 ఏళ్ల సర్వీసులో సుమారు రూ.10 కోట్లుగా ఏసీబీ అధికారులు లెక్క తేల్చారు. అయితే, దీని మార్కెట్ విలువ రూ.20 కోట్లు పైమాటేనని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో శివరామ్ను ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్టు చేసి, శనివారం ఉదయం రాజమహేంద్రవరంలోని ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. సుమారు 36 గంటల పాటు నాలుగుచోట్ల చేసిన తనిఖీల్లో ఏసీబీ అదనపు ఎస్పీ కిషోర్ కుమార్, ఇన్స్పెక్టర్లు ఎన్వీ భాస్కర్, బి.వాసుకృష్ణ, వై.సతీష్తో పాటు ఏలూరు నుంచి అదనపు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
యనమలకు మరోసారీ
● రాజ్యసభకు సానా కొనసాగింపు ● చినబాబు కోటరీకే పెద్దపీటసాక్షి ప్రతినిధి, కాకినాడ: ఆవిర్భావం నుంచీ టీడీపీ విధివిధానాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సీనియర్ నేత యనమల రామకృష్ణుడుకు చంద్రబాబు మరోసారి హ్యాండిచ్చారు. తుని నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై న యనమల ఆర్థిక మంత్రి, అసెంబ్లీ స్పీకర్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ వంటి అనేక కీలక పదవులు అధిష్టించారు. టీడీపీలో చంద్రబాబు తరువాత నంబర్–2 స్థానంలో ఉన్నట్టు చెప్పుకొనేవారు. అటువంటిది రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ హవా మొదలైన తరువాత వరుస ఓటములతో యనమల చాలా కాలం క్రితమే ప్రత్యక్ష ఎన్నికలకు గుడ్బై చెప్పేశారు. ఢిల్లీలో పెద్దల సభలో అడుగు పెట్టడం ఇప్పటి వరకూ ఆయనకు రాజకీయంగా తీరని కల. ఒక్కసారైనా రాజ్యసభ సభ్యుడు కావాలని ఆశ పడ్డారు. దీని కోసం చాన్నాళ్లుగా ఆయన చేయని ప్రయత్నమంటూ లేదు. తాజా రాజ్యసభ ఎన్నికల్లో సైతం ఆయన ఆశలు పెట్టుకోగా భంగపాటే ఎదురైంది. మన రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న నాలుగు స్థానాల్లో టీడీపీకి మూడు, జనసేనకు ఒకటి కేటాయించారు. ఈ నాలుగింటిలో ఒక స్థానం నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడకు చెందిన సానా సతీష్బాబును మరోసారి కొనసాగించాలని నిర్ణయించారు. దీంతో, టీడీపీలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న యనమల రాజకీయ భవిష్యత్తుకు ఇక మంగళం పాడేసినట్టేనని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సీనియర్లకు పొగ ఒకప్పుడు టీడీపీలో సీనియర్లకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. అటువంటిది ప్రస్తుతం పొమ్మనకుండానే సీనియర్లకు పొగ పెడుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల నుంచి ఆ పార్టీలో చినబాబు టీమ్దే పై చేయిగా ఉంటోంది. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు కాకినాడ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన సానా సతీష్బాబు.. సతీష్ ఫౌండేషన్ పేరిట అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. కాకినాడలో ఏపీ ఈపీడీసీఎల్ ఇంజినీర్గా తెలిసిన ఆయన.. టీడీపీలో అనతి కాలంలోనే చినబాబు లోకేష్ కోర్ టీమ్లో అత్యంత కీలకమైన వ్యక్తిగా ముద్ర పడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఫండింగ్, రాష్ట్ర స్థాయి ప్రచార కార్యక్రమాలతో చినబాబుకు అత్యంత సన్నిహితుడయ్యారు. ఈ నేపథ్యంలో కాకినాడ నుంచి ఎంపీగా బరిలోకి దిగేందుకు ప్రయత్నించారు. అయితే, పొత్తులో భాగంగా ఈ సీటును జనసేనకు కేటాయించారు. అనంతరం, చినబాబు ఆశీస్సులతో సతీష్ అనూహ్యంగా రాజ్యసభ సభ్యుడయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయనను మరోసారి కొనసాగించాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. పెద్దల సభ అయిన రాజ్యసభకు రాజకీయాల్లో ఆరితేరిన ఉద్దండులకు మాత్రమే ఒకప్పుడు అవకాశం దక్కేది. వయస్సు, అనుభవం, పార్టీ అధిష్టానంపై వీరవిధేయత, బీసీ సామాజికవర్గం వంటి సానుకూల అంశాలున్నప్పటికీ.. తాజా రాజ్యసభ సీట్ల భర్తీలో యనమల పేరును కనీసంగా కూడా పరిగణనలోకి తీసుకోలేదు. దీనినిబట్టి పార్టీలో ఇకపై సీనియర్లకు చోటు లేదు, దక్కదనే సంకేతాలు పంపుతున్నట్టేనని ఆయన వర్గీయులు మండిపడుతున్నారు. యనమల వంటి సీనియర్నే పూర్తిగా పక్కన పెట్టేసి, నిన్న కాక మొన్న వచ్చిన వారికి అగ్రాసనం వేశారంటే.. ఇక తమ స్థానం ప్రశ్నార్థకమేనని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని టీడీపీ సీనియర్ నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. బలహీన వర్గాలు తన గుండెల్లో ఉన్నారని పదేపదే ఘనంగా చెప్పుకొనే చంద్రబాబు ప్రకటనలు వట్టి మాటలుగానే తేలిపోయాయని టీడీపీలోని బీసీ నేతలు అంటున్నారు. ఒక్కటవుతున్న శత్రువులు! రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేందుకు రాజ్యసభ సభ్యత్వంపై టీడీపీలో తాజా జరుగుతున్న రచ్చే నిదర్శనంగా కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లా టీడీపీలో సీనియర్లయిన యనమల, టీటీడీ సభ్యుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ రాజకీయాల్లో ఒకప్పుడు ఉప్పు, నిప్పులా ఉండేవారు. అటువంటి ఈ ఇద్దరినీ సానా సతీష్ రాజ్యసభ సభ్యత్వం కొనసాగింపు ఆలోచన ఏకం చేసిందనే చర్చ ఆ పార్టీలో నడుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ లోక్సభ సీటును తన తనయుడు నవీన్కు దక్కించుకునేందుకు జ్యోతుల నెహ్రూ తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే, వాటికి చెక్ పెట్టేలా సతీష్ వర్గం ప్రయత్నించిందని టీడీపీ నేతలు అప్పట్లో బాహాటంగానే చెప్పుకున్నారు. అప్పటి నుంచీ జిల్లా పార్టీలో జ్యోతుల, సానా వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. మంత్రి లోకేష్ కాకినాడ పర్యటనలో ఇరు వర్గాలూ బలప్రదర్శనకు దిగాయి. వచ్చే ఎన్నికల్లో తన తనయుడు నవీన్ జగ్గంపేట నుంచి, తాను జిల్లాలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేస్తామని కొన్నాళ్ల కిందట నెహ్రూ చేసిన ప్రకటన ఆ పార్టీలో కలకలం రేపింది. ఇప్పుడు రాజ్యసభ సీటు విషయంలో యనమలను పక్కన పెట్టిన నేపథ్యంలో నెహ్రూ, యనమల వర్గాలు చేతులు కలుపుతున్నాయనే చర్చ జరుగుతోంది. -
పేదల స్థలాలను పరిశ్రమలకివ్వడం తగదు
తుని రూరల్: పెద్దాపురం రామేశ్వరం మెట్ట వద్ద పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను ప్రభుత్వం జిందాల్ పరిశ్రమకు కేటాయించడాన్ని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తీవ్రంగా వ్యతిరేకించారు. ఎస్.అన్నవరంలోని పార్టీ కార్యాలయంలో ఆయనను వైఎస్సార్ సీపీ పెద్దాపురం కో ఆర్డినేటర్ దవులూరి దొరబా బు తదితరులు శనివారం కలిశారు. రామేశ్వరం మెట్ట స్థలాల సమస్యను వివరించారు. రాజా మాట్లాడుతూ, అవసరమైతే లబ్ధిదారులతో కలసి జిల్లా కేంద్రంలో పోరాటాన్ని ఉధృతం చేద్దామని చెప్పారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకూ పోరాడాల్సిందేనని దొరబాబుకు సూచించారు. పేదల ఇళ్ల స్థలాల పరిరక్షణ కోసం జరిగే ఎటువంటి కార్యక్రమానికైనా అండగా నిలుస్తానని చెప్పారు. ముగిసిన వేసవి విజ్ఞాన శిక్షణ శిబిరం బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యాన 45 రోజులుగా జరిగిన వేసవి విజ్ఞాన శిక్షణ శిబిరం శనివారం ముగిసింది. ముఖ్య అతిథిగా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు భూపతిరాజు ఈశ్వరరాజువర్మ (సాయిబాబు రాజు), కార్యదర్శి కేజేఎస్ఎల్ కుమారి చేతుల మీదుగా విద్యార్థులకు మెమెంటోలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా వయోజన విద్య ఉప సంచాలకులు పసుపులేటి పాసయ్య, ఉప గ్రంథాలయ ఇన్చార్జి అధికారి కె.కిషోర్ తదితరులు పాల్గొన్నారు.భక్తజన సంద్రమైన రత్నగిరి అన్నవరం: వేలాదిగా భక్తులు తరలిరావడంతో రత్నగిరి శనివారం భక్తజన సంద్రంగా మారింది. సుమారు 40 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. దీంతో, క్యూలు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం కిటకిటలాడాయి. మొత్తం 2,200 వ్రతాలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. సుమారు 6 వేల మంది సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. ఆగస్టులో కృత్రిమ చేతుల అమరిక శిబిరాలు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యాన రోటరీ సహకారంతో ఆగస్టు 2న గుంటూరు, అదే నెల 10న విజయనగరంలో కృత్రిమ చేతుల అమరిక శిబిరాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ను రెడ్క్రాస్ రాష్ట్ర చైర్మన్ వైడీ రామారావుతో కలసి కలెక్టర్ హరేంధిర ప్రసాద్ కలెక్టరేట్లో శనివారం ఆవిష్కరించారు. చేతులు కోల్పోయిన అర్హులైన దివ్యాంగులకు ఈ శిబిరాల్లో రూ.30 వేల విలువైన ఎల్ఎన్–4 హ్యాండ్ సాంకేతికతతో రూపొందించిన కృత్రిమ చేతులను పూర్తి ఉచితంగా అమరుస్తారని తెలిపారు. రిజిస్ట్రేషన్, ఇతర వివరాలకు కాకినాడ రెడ్క్రాస్ కార్యాలయంలో లేదా 89857 70583 నంబరులో సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో రోటరీ జిల్లా గవర్నర్ వై.కల్యాణ్ చక్రవర్తి కూడా పాల్గొన్నారు. విస్తారంగా వర్షం తుని రూరల్: మండలంలో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఈదురు గాలులతో కురిసిన వర్షం ప్రజలకు ఊరటనిచ్చింది. ఎస్.అన్నవరం, గెడ్లబీడు, జగన్నాతగిరి, తాళ్లూరు, రేఖవానిపాలెం తదితర గ్రామాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో ప్రజలు సేద తీరారు. -
పుణ్యక్షేత్రాల్లో పట్నా హైకోర్టు న్యాయమూర్తి
అన్నవరం/సామర్లకోట: బిహార్ రాజధాని పట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలసి శుక్రవారం అన్నవరం, సామర్లకోట ఆలయాలను సందర్శించారు. అన్నవరంలో సత్యదేవుని దర్శించి, పూజలు చేశారు. పండితులు వేదాశీస్సులు, స్వామివారి ప్రసాదాలను ఏఈఓ ఎల్.శ్రీనివాసరావు అందజేశారు. సామర్లకోటలోని పంచారామ క్షేత్రమైన శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయాన్ని కూడా జస్టిస్ అభిషేక్రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించి, పూజలు చేశారు. కాలభైరవ స్వామి, ధ్వజస్తంభం, పెద్ద నంది, ఉపాలయాలు, మూలవిరాట్టును, అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ పండితులు ఆశీర్వచనాలు.. స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను ఈఓ బళ్ల నీలకంఠం అందజేశారు. -
రత్నగిరి.. అగ్నిఝరి
మార్తాండుని ప్రచండ తాండవంతో రత్నగిరి శుక్రవారం అగ్ని‘ఝరి’ని తలపించింది. 40 డిగ్రీల సెల్సియస్కు పైబడిన ఎండ వేడిని తట్టుకోలేక సత్యదేవుని దర్శనానికి వేలాదిగా వచ్చిన భక్తులు అల్లాడి పోయారు. ఎండ వేడికి పెనంలా మారిన నేలపై నడవలేక చిన్నారులు, మహిళలతో పాటు పలువురు భక్తులు నీడ కోసం పరుగులు తీశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఆలయ ప్రాంగణంలోని చలువ పందిళ్లు, విశ్రాంతి మండపాలు, చెట్ల నీడన సేద తీరారు. సూర్య ప్రతాపం ప్రభావంతో సత్యదేవుని మెట్ల దారి, టోల్గేట్, పశ్చిమ రాజగోపురం ఎదురుగా ఉన్న ప్రాంగణం, ఘాట్ రోడ్లు దాదాపు నిర్మాన్యుషంగా దర్శనమిచ్చాయి. శని, ఆదివారాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశముందని, ఎండ కూడా 40 డిగ్రీలకు పైబడే అవకాశం ఉందని. ఎండ బారిన పడకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. – అన్నవరం విశ్రాంతి షెడ్డు వద్ద దేవస్థానం బస్సుల కోసం భక్తుల ఎదురుచూపులు కొండ దిగువనా అదే పరిస్థితి: దేవస్ధానం టోల్ గేటు కానరాని జనసంచారం -
పోతులూరులో కలుషిత నీటి కలకలం
ప్రత్తిపాడు రూరల్: మండలంలోని పోతులూరులో తాగునీరు కలుషితం కావడం తీవ్ర కలకలం రేపింది. గ్రామంలోని రక్షిత మంచినీటి పథకం ద్వారా గురువారం సరఫరా అయిన నీటి నుంచి పురుగు మందుల వాసన, నీరు రంగు మారి నురగలు రావడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఎంపీడీఓ ఎంవీఆర్ కుమార్బాబుకు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు పోతులూరులోని రక్షిత మంచినీటి పథకాన్ని పరిశీలించారు. తాగునీటి సరఫరాను తక్షణం నిలిపివేశారు. నీరు కలుషితమవడానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. నీటి నమూనాలు సేకరించి, ల్యాబ్కు తరలించారు. కలుషితమైన ఈ నీటిని ఎవ్వరూ తాగవద్దని, ఇతర అవసరాలకు వినియోగించవద్దని అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు గ్రామంలో దండోరా వేయించారు. ప్రజలు తాత్కాలికంగా ప్రత్యామ్నాయ నీటి వనరులను వినియోగించుకోవాలని సూచించారు. ల్యాబ్లో నీటి పరీక్షల ఫలితాల అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. వాటర్ ట్యాంకును బ్లీచింగ్తో రెండుసార్లు శుభ్రం చేసి, నీటిలో బ్లీచింగ్ వేసి, నాలుగు గంటల పాటు ఉంచి, శుక్రవారం సాయంత్రం తాగునీటిని సరఫరా చేసినట్లు ఎంపీడీఓ తెలిపారు. -
సస్పెండ్ చేసిన కండువా
అన్నవరం: ‘మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా’ అంటూ ఇంద్ర సినిమాలో చిరంజీవి చెప్పిన డైలాగ్ చాలా పాపులర్. ఇప్పుడు రత్నగిరిపై ఇటువంటి పరిస్థితే కనిపిస్తోంది. ఆ ఏవుందిలే.. మామూలు కండువాయే కదా అని అధికారులు, సిబ్బంది పట్టించుకోలేదు. ఇప్పుడా కండువాయే వారిపై సస్పెన్షన్ వేటు వేయించింది. ఈ సంఘటన వివరాలివీ.. రత్నగిరిపై సత్యదేవుని నిత్య కల్యాణం, రూ.2 వేలు, రూ.1,500 టిక్కెట్లతో వ్రతాలాచరించే భక్తులకు చాలా సంవత్సరాలుగా అంచు మీద జరీతో స్వామివారి నామం ముద్రించిన కండువాలను అందించేవారు. అయితే, కండువాల సరఫరా టెండర్ దక్కించుకున్న కొత్త టెండర్దారు రెండు వారాలుగా స్వామివారి నామం ఉన్న కండువాలు సరఫరా చేయడం లేదు. దీంతో, దేవస్థానం అధికారులు రోజుకో డిజైన్, రంగు కలిగిన కండువాలు ఇవ్వడంపై భక్తుల నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. దీనిపై ‘నీ నామమెంతో రుచిరా!’ శీర్షికన ‘సాక్షి’ గురువారం కథనం ప్రచురించింది. ఈ కథనానికి అన్నవరం దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు స్పందించారు. వెంటనే సత్యదేవుని నామం ముద్రించిన కండువాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని దేవస్థానం అధికారులను ఆదేశించారు. ఆ మేరకు టెండర్దారుపై అధికారులు ఒత్తిడి తేవడంతో గురువారం 900 కండువాలు పంపించాడు. వీటిని గురు, శుక్రవారాల్లో భక్తులకు అందజేశారు. అయితే, ఈ విషయంలో బాధ్యతారహితంగా వ్యవహరించారన్న అభియోగంపై సెంట్రల్ స్టోర్స్ విభాగం సూపరింటెండెంట్ తాడి గుర్రాజును ఆ విభాగం నుంచి గోశాల, గార్డెన్కు బదిలీ చేశారు. అలాగే, జూనియర్ అసిస్టెంట్ కె.రమణబాబును సత్యగిరి సత్రాల శానిటరీ సూపర్వైజర్గా బదిలీ చేశారు. తాజాగా వారిద్దరినీ సస్పెండ్ చేస్తూ ఈఓ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారంలో వారం రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు.·˘ Æý‡™èl²WÇOò³ çÜ*ç³Ç…sñæ…yðl…sŒæ, గుమాస్తాలపై వేటు ·˘ ÐéÆý‡… ÆøkÌZÏ సంజాయిషీ ఇవ్వాలని ఆదేశం -
‘సర్’ పటిష్టంగా నిర్వహించాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను జిల్లాలో పటిష్టంగా నిర్వహించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. జిల్లాలో సర్ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఈ నెల 14వ తేదీ వరకూ ఓటరు నమోదు అధికారులు, బూత్ స్థాయి అధికారులకు నిర్వహణ సన్నద్ధత, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్ వివేకానంద సమావేశ మందిరంలో ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలకు శుక్రవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. సమగ్ర శిక్షణ అనంతరం, ఈ నెల 15 నుంచి జూలై 14వ తేదీ వరకూ ప్రతి ఇంటినీ సందర్శించి ఓటర్ల ఎన్యూమరేషన్ చేపట్టాలని సూచించారు. సర్ ప్రక్రియ గురించి వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయడం, అనర్హులను, డూప్లికేట్ ఎంట్రీలను, చనిపోయిన, వేరొక ప్రాంతానికి తరలిపోయిన వారిని తొలగించడం లక్ష్యంగా ‘సర్’ను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్ఓ డి.తిప్పేనాయక్ కూడా పాల్గొన్నారు. నేటి నుంచి తెలుగు సాహితీ మహాసభలు రాజానగరం: వెలుగుబంద సమీపంలోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ(జీజీయూ)లో రెండు రోజుల పాటు జరిగే ఏడో ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలు శనివారం ప్రారంభం కానున్నాయి. సాహిత్య, సాంస్కృతిక విభాగాలు, రంగస్థల ప్రదర్శనలు, జానపద కళారూపాలు, ప్రాచీన కవుల వారసుల ప్రత్యేక ప్రదర్శనలు వీటిలో ముఖ్య ఆకర్షణలుగా ఉంటాయని నిర్వాహకులు కేవీవీ సత్యనారాయణరాజు, కత్తిమండ ప్రతాప్ తెలిపారు. డిప్యూటీ స్పీకర్ను బర్తరఫ్ చేయాలి నిడదవోలు: రాష్ట్రంలోని 1.10 కోట్ల మంది దళితులు, దళిత క్రైస్తవులను ఇబ్బంది పెడుతున్న శాసన సభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజును ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని జై భీమ్రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు. దళిత సంఘాలు, దళిత క్రైస్తవ ప్రతినిధులతో నిడదవోలులో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, రఘురామ కృష్ణరాజుకు అల్టిమేటం ఇవ్వడానికి, ప్రభుత్వ పెద్దలకు గుణపాఠం చెప్పడానికి ఈ నెల 28న ఏలూరులో లక్ష మంది దళితులు, దళిత క్రైస్తవులతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్రం నలుమూలల నుంచి, దళితులు, దళిత క్రైస్తవులు తరలివచ్చి ఈ సభను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగ పదవిలో ఉంటూ రాష్ట్రంలోని 113 చర్చిలను, చర్చిలపై మైకులను తొలగించాలంటూ రఘురామ కృష్ణరాజు ఏ అధికారంతో డీజీపీకి లేఖ రాశారో చెప్పాలని ప్రశ్నించారు. తాను ఏ మతానికి, సంప్రదాయానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. దళితులు, దళిత క్రైస్తవుల ఓట్లు వద్దని చెబుతున్న రఘురామ కృష్ణరాజు.. వారు కడుతున్న పన్నును జీతంగా ఎలా తీసుకుంటారని శ్రావణ్ కుమార్ ప్రశ్నించారు. ఇప్పటి వరకూ తీసుకున్న జీతాన్ని రఘురామ ప్రభుత్వానికి జమ చేసి, రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సొరంగ మార్గంలో ప్రయాణం ప్రమాదకరం దేవీపట్నం: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా గొందూరు నుంచి ఎడమ కాలువ, నావిగేషన్ కెనాల్కు నీరందించేందుకు కొండను తవ్వి నిర్మించిన సొరంగ మార్గంలో ప్రయాణించడం ప్రమాదకరమని దేవీపట్నం ఎస్సై షరీఫ్ తెలిపారు. ఇటీవల గండిపోశమ్మ ఆలయానికి వచ్చేందుకు పురుషోత్తపట్నం వైపు నుంచి ఉన్న రహదారిని ప్రాజెక్టు అధికారులు మూసివేశారు. అయితే, ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా చేసుకుని రీల్స్ చేసేందుకు కొంతమంది పురుషోత్తపట్నం, నేలకోట వైపు నుంచి సొరంగ మార్గంలో గొందూరు చేరుకుంటున్నారన్నారు. ఈ మేరకు సొరంగ మార్గంలో ప్రయాణించడం ప్రమాదకరమని తెలిపే ఫ్లెక్సీలు పెట్టి, పహారా ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా ఈ మార్గంలో ప్రయాణిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
అబ్బో.. సేనా..తన ధర్మమే!
పిఠాపురం: దేశంలోని పంచ మాధవ క్షేత్రాల్లో ఒకటైన పిఠాపురం కుంతీమాధవ స్వామి సాక్షిగా జనసేన నేతలు తీవ్ర అపచారానికి ఒడిగట్టారు. కుంతీమాధవస్వామి వారి కోనేరు అభివృద్ధి పనులకు జనసేన నేతలు శుక్రవారం సాయంత్రం భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు కుంతీమాధవ స్వామి వారికి గ్రామోత్సవం నిర్వహించారు. స్వామి వారిని మేళతాళాలతో ఊరేగింపుగా కోనేరు వద్దకు తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జనసేన నేతలు స్వామి వారి ఊరేగింపును వదిలేసి, జనసేన నేత, కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ మేళం రామకృష్ణ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. స్వామి వారి ఉత్సవ విగ్రహాలు అక్కడ ఉండగానే.. పవిత్రమైన కోనేటి ప్రాంగణంలో కేకులు కట్ చేసి, కొవ్వొత్తులు వెలిగించి సంబరాలు చేసుకున్నారు. ఈ పుట్టిన రోజు వేడుకలను జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు దగ్గరుండి మరీ నిర్వహించడం గమనార్హం. సనాతన ధర్మం అంటూ నిత్యం ప్రసంగాలు దంచే జనసేన అధినేత పవన్ కల్యాణ్ నియోజకవర్గంలో.. అదే పార్టీకి చెందిన నాయకులు ఆ సనాతన ధర్మాన్ని కోనేటిలో కలిపేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ కుంతీమాధవ స్వామి ఊరేగింపులో అపచారం ఫ పవిత్ర కోనేరులో జనసేన నేత పుట్టిన రోజు వేడుకలు ఫ దేవుని ఊరేగింపు వదిలేసి.. కేక్ కట్ చేసి, కొవ్వొత్తులు వెలిగించి సంబరాలు -
అన్ని వర్గాలకూ వెన్నుపోటు
● రెండేళ్ల పాలనలో చంద్రబాబు చేసింది శూన్యం ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా తుని: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన రెండేళ్లలో రాష్ట్రంలో మహిళలు, వ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు తదితర అన్ని వర్గాలూ వెన్నుపోటుకు గురయ్యాయని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అన్నారు. ఎస్.అన్నవరంలో గురువారం జరిగిన ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కంటే రెట్టింపు సంక్షేమం, అభివృద్ధి చేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. నేడు గ్రామం, పట్టణం అనే తేడా లేకుండా విధ్వంసకర పాలన కనబడుతోందని చెప్పారు. ఎంతో కష్టపడి డీఎస్సీ పరీక్షలు రాసి ర్యాంకులు సాధించినా ఉద్యోగం ఇవ్వని విషయం సాక్ష్యాధారాలతో బయటపడిందని అన్నారు. అయినప్పటికీ ఆ విషయాన్ని డైవర్ట్ చేసేలా కూటమి మంత్రులు, నాయకులు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలుగు ప్రజల మధ్య పవన్ చిచ్చు రాష్ట్రం విడిపోయి పన్నెండేళ్లవుతున్నా ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి ఉంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విద్వేషాలు సృష్టించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని రాజా విమర్శించారు. తెలంగాణలో కోట్ల మంది వ్యాపారులు, ఉద్యోగులు జీవనోపాధి పొందుతున్నారన్నారు. సమయం, సందర్భం లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడటం ధర్మమేనా అని ప్రశ్నించారు. రాష్ట్రం కోసం ఎంతోమంది ప్రాణాలను త్యాగం చేసిన సందర్భంగా సభ పెట్టుకుంటే.. అదే రోజు తెలంగాణలో సభ పెట్టడానికి యత్నించిన పవన్ కల్యాణ్.. అక్కడి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ‘ఒక రోజు ముందో, తర్వాతో పెట్టుకుంటే ఇబ్బందులుండేవి కావు కదా? అన్నదమ్ముల్లా కలిసి ఉన్న తెలుగు రాష్ట్రాల్లో మీరెందుకు చిచ్చు పెడుతున్నారు?’ అని ప్రశ్నించారు. ‘ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మంచివాళ్లని మీరే చెబుతున్నారు కదా! ఇక మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. ‘తెలంగాణలో పోటీ చేస్తానంటున్నారు. చేయండి. మిమ్మల్నెవరు అడ్డుకున్నారు? గతంలో పోటీ చేసి ఏం సాధించారు? మీ వ్యక్తిగత అజెండా కోసం రెండు రాష్ట్రాల ఐక్యతను దెబ్బ తీయవద్దు’ అని పవన్కు రాజా హితవు పలికారు. -
పద్మజ మూర్తి దంపతులకు జాతీయ అవార్డు
కొత్తపల్లి: స్ధానిక జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న యాళ్ల పద్మజను, మూలపేట జిల్లా పరిషత్ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నల్లం అచ్యుత రామచంద్రమూర్తి దంపతులు గురువారం ఛత్తీస్గఢ్ రాష్ట్రం చంపారన్లో నిర్వహించిన కార్యక్రమంలో బిర్సా ముండా జాతీయ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. ఉపాధ్యాయులు ఆయా సబ్జెక్టుల్లో చేసిన విశేషమైన కృషికి ఈ అవార్డు ఇచ్చారు. అవార్డు గ్రహీతలను పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శాస్త్రి, శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు అభినందించారు. రేషన్ బియ్యం పట్టివేత ● కేసు నమోదు ● విలువ రూ.6 లక్షలు దేవరపల్లి: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం యర్రవరం గ్రామానికి అక్రమంగా రవాణా చేస్తున్న 14,470 కిలోల రేషన్ బియ్యాన్ని గురువారం దేవరపల్లి వద్ద గ్రీన్ఫీల్డ్ హైవేపై అధికారులు పట్టుకున్నారు. వివరాలను సివిల్ సప్లయిస్ డిప్యూటీ తహసీల్దార్ ఎ.సత్యనారాయణ తెలిపారు. జంగారెడ్డిగూడెం నుంచి 14,470 కిలోల రేషన్ బియ్యం(326 బస్తాలు) లారీలో యర్రవరం పౌల్ట్రీకి తరలిస్తున్నట్టు సమాచారం రావడంతో సివిల్ సప్లయ్ జిల్లా సహాయ అధికారి నాగాంజనేయులు ఆధ్వర్యంలో దేవరపల్లి వద్ద గ్రీన్ఫీల్డ్ హైవే సమీపంలో పట్టుకున్నట్టు సత్యనారాయణ తెలిపారు. బియ్యంతో సహా లారీని సీజ్ చేసి, 6(ఎ), 7(1) కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. పట్టుబడిన బియ్యం విలువ సుమారు రూ. 6 లక్షలు ఉంటుందన్నారు. తిరుమలాయపాలెంలో.. గోకవరం: మండలంలోని తిరుమలాయపాలెం గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 49 బస్తాల రేషన్ బియ్యాన్ని గురువారం ఎంఎస్ఓ శాంతిప్రియ స్వాధీనం చేసుకున్నారు. తమకు అందిన సమాచారం మేరకు గ్రామంలోని కంటే దుర్గకు చెందిన రేషన్షాపును తనిఖీ చేసి ఈ బియ్యాన్ని గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ సుమారు రూ.లక్ష ఉంటుందని, షాపుపై 6ఏ కేసు నమోదు చేశామని ఎంఎస్ఓ తెలిపారు. గో మాంసం స్వాధీనంగొల్లప్రోలు (పిఠాపురం రూరల్): వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 100 కేజీల గోమాంసాన్ని గొల్లప్రోలు టోల్గేట్ సమీపంలో గురువారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహన డ్రైవర్తో పాటు సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మాంసాన్ని రెవెన్యూ అధికారుల సమక్షంలో నిర్వీర్యం చేశామన్నారు. 673 జీవోతో ప్రగతికి చేటు బోట్క్లబ్ (కాకినాడ): స్థానిక సంస్థలకు చెందిన ముఖ్యకూడళ్లలోని ఖరీదైన ఖాళీ స్థలాలు, మైదానాలు, పార్కులు, మార్కెట్లు, దుకాణ సముదాయాలు, కమ్యూనిటీ హాళ్లను పీపీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరించే 673 జీవో విధానం ప్రగతికి చేటు తెస్తుందని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్ల రమణరాజు అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ప్రకటన విడుదల చేశారు. మున్సిపల్ ఖాళీ స్థలాల్లో గుడ్ విల్ యాక్షన్ విధానంలో జనతా దుకాణాల సముదాయాల నిర్మాణం చేపడితే ప్రజాహిత ప్రగతి పథంగా ఉంటుందన్నారు. పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ ప్రణాళిక వలన స్థానిక ఆస్తులు లీజుల ప్రక్రియ ఉచ్చులో కార్పోరేట్ దోపిడీకి గురవ్వక తప్పదన్నారు. ఆ జీవో వల్ల పారిశుధ్య పనులు, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, పార్కుల అజమాయిషీ, 14 రకాల పౌర సౌకర్యాల సేవలు మరింత భారంగా మారతాయన్నారు. -
శుక్రవారం శ్రీ 5 శ్రీ జూన్ శ్రీ 2026
చంద్రబాబుకు గుణపాఠం తప్పదుప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి, ఏలేశ్వరం, ప్రత్తిపాడు, శంఖవరం మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించి, మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. రౌతులపూడిలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి జమీలు ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఏలేశ్వరం పట్టణం బాలాజీ చౌక్ వద్ద, ఏలేశ్వరం రూరల్ సి.రాయవరం, శంఖవరం మండలం కత్తిపూడి, ప్రత్తిపాడుల్లో కూడా పార్టీ శ్రేణులు కూటమి మేనిఫెస్టో ప్రతులను దహనం చేసి, నిరసన తెలిపాయి. ఆయా కార్యక్రమాల్లో గొల్లు చినదివాణం, బెహరా రాజేశ్వరి, సామంతుల సూర్యకుమారి, సుంకర రాంబాబు తదితరులు పాల్గొన్నారు. నిరంకుశ పాలన నశించాలి వైఎస్సార్ సీపీ పెద్దాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు ఆధ్వర్యాన పెద్దాపురం, సామర్లకోటల్లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీ పత్రాలు, ఆ హామీలపై పచ్చ పత్రికల్లో ఇచ్చిన ప్రకటనలు, బాండ్ల ప్రతులను దహనం చేశారు. పెద్దాపురం దర్గా సెంటర్లో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నెక్కంటి సాయిప్రసాద్ ఆధ్వర్యాన జరిగిన నిరసన ప్రదర్శన, ధర్నాలో దొరబాబు పాల్గొన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సామర్లకోట గడియారం స్తంభం సెంటర్ నుంచి రైల్వే స్టేషన్, బస్సు కాంప్లెక్స్ వరకూ మండుటెండలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ‘ఇదేమి రాజ్యం? ఇదేమి రాజ్యం? దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, కూటమి ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి, ప్రభుత్వ నిరంకుశ పాలన నశించాలి, సీఎం డౌన్డౌన్’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. రైల్వే స్టేషన్, బస్సు కాంప్లెక్స్ కూడలిలో జన సందోహం నడుమ చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు, చంద్రబాబు, పవన్ కల్యాణ్ సంతకాలతో ఉన్న బాండ్లు, ఎల్లో మీడియాలో ఇచ్చిన ప్రకటనల ప్రతులను దహనం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారు వీరబాబు, అధికార ప్రతినిధి ఇనకొండ విష్ణుచక్రం, మహిళా ఉపాధ్యక్షురాలు ఏలేటి అనంతలక్ష్మీ చౌదరి, కార్యదర్శులు ఊబా జాన్మోజెస్, గోపు మురళి తదితరులు పాల్గొన్నారు. 8 -
సిలబస్ భారం
సిలబస్ భారం వల్ల విద్యార్థులకు సమగ్ర అవగాహన కలగడం లేదు. ఉపాధ్యాయుల బోధనలో కూడా నాణ్యత లోపిస్తుంది. పరీక్షలకు సిద్ధమయ్యే సమయంలో సిలబస్ మొత్తాన్ని రివిజన్ చేయడం విద్యార్థులకు కష్టంగా ఉంటోంది. సాంఘిక శాస్త్ర సిలబస్ను హేతుబద్ధీకరించాలి. – కేఎస్వీ కృష్ణారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ ఫోరం, రావులపాలెం పని భారం సాంఘిక శాస్త్రంలో సిలబస్ ఎక్కువగా ఉంది. ఈ ఏడాది మారిన నూతన పాఠ్య పుస్తకాలలో మరింత పెరిగింది. ఇది ఉపాధ్యాయుల పనిభారాన్ని విపరీతంగా పెంచుతోంది. విద్యార్థులకు కూడా ఇబ్బందికరమే. కాబట్టి సిలబస్ను తగ్గించాలి. – కుడుపూడి మురళీధర్, సోషల్ టీచర్, పుల్లేటికుర్రు జెడ్పీ ఉన్నత పాఠశాల పాఠాలు ఎక్కువ పదో తరగతిలో సైన్స్కు 13 పాఠాలు ఉండగా, సాంఘిక శాస్త్రంలో 22 పాఠాలు ఉండటం, అలాగే ఆరు నుంచి 9 తరగతుల్లోనూ అధిక పాఠ్య భారం కొనసాగడం ఆందోళనకరం. సమాజం, రాజ్యాంగం, చరిత్ర, పౌర బాధ్యతలపై విద్యార్థులకు అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో సిలబస్ రూపొందించాలి. – కేవీ శేఖర్, ప్రధాన సంపాదకులు, రాష్ట్ర ఎస్టీయూ ఉపాధ్యాయవాణి, రావులపాలెం -
వెన్నుదున్ను
ఆలమూరు: వ్యవసాయం లాభసాటిగా ఉండడంతో పాటు భూసారం పెరగాలంటే రైతులు కొన్ని పద్ధతులు పాటించాలి. ముఖ్యంగా రబీ, ఖరీఫ్లకు మధ్య వేసవిలో చేపట్టే దుక్కులతో భూసారం పెరుగుతుంది. ఇవి రైతులకు సాగులో వెన్నుదన్నుగా నిలిచి సాగులో పెట్టుబడి తగ్గించుకోవడానికి దోహదపడతాయి. నేడు ఆధునిక యంత్ర పరికరాలు అందుబాటులోకి రావడంతో ట్రాక్టర్ల సాయంతో చాలా వేగంగా పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో సుమారు 4.69 లక్షల ఎకరాల్లో వరి సాగు జరగనుంది. యాజమాన్య పద్ధతులు ఫ భూసార పరీక్షలు చేయించుకోవడం, భూమిని శుభ్రం చేసుకోవడం, లోతు దుక్కులు వంటి ముందస్తు చర్యలు చేపట్టడం ద్వారా ఖరీఫ్లో మంచి దిగుబడులు అందుకునే వీలుంటుంది. ఫ ఎండాకాలంలో భూములు ఖాళీగా ఉన్న సమయంలో లోతు దుక్కు చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ముందుగానే ప్రారంభం కాబోతోంది. ఫ వేసవి దుక్కులు మెట్ట, చాగల్నాడు ప్రాంతాల రైతులకు ఎంతో ఉపపయోకరంగా ఉంటాయి. ప్రస్తుతం మైదాన ప్రాంతాల్లోనూ దుక్కులు చేపడుతున్నారు. ప్రయోజనాలు ఇవే.. ఫ వేసవి లోతు దుక్కులు చేపట్టడం వల్ల భూమి సారవంతమవుతుంది. భూమి కింద పొరల్లోని మట్టి పైకి రావడం, పై పొరల్లో మట్టి వెళ్లడం వల్ల ఎండ వేడికి అందులోని క్రిమికీటకాలు నశిస్తాయి. ఫ నేల గుల్లబారి నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. వర్షం నీరు వృథా కాకుండా సద్వినియోగం చేసుకునే వీలుంటుంది. ఫ పొలాల్లో లోతుగా దున్నడం వల్ల భూమిలో నీరు ఇంకి పోయి, తేమ శాతం పెరిగి సేంద్రియ పదార్థాలు త్వరితగతిన కుళ్లిపోయి పోషకాలుగా మారతాయి. ఫ భూమిని అడుగు లోతు వరకూ దున్నితే విత్తనం వేగంగా మొలకెత్తి, వేళ్లు సులభంగా భూమిలో దిగి మొక్కకు సారం పెరుగుతుంది. ఫ దుక్కుల వల్ల కింద నుంచి పైకి వచ్చే పురుగులను పక్షులు తినడం ద్వారా తెగుళ్ల బెడద తప్పుతుంది. ఫ పొలాల్లో మట్టి గడ్డలు తొలగిపోయి సారవంతమైన నేల ఏర్పడుతుంది. తద్వారా నాణ్యమైన పంట పండించేందుకు దోహదపడుతుంది. భూసారం పెరుగుతుంది వ్యవసాయశాఖ సూచనలకు అనుగుణంగా పంట పొలాల్లో దుక్కు దున్నడం ద్వారా భూసారం పెరుగుతుంది. దీని వల్ల తెగుళ్లను నివారించుకోవడం ద్వారా పెట్టుబడిని ఆదా చేసుకోవచ్చు, అధిక దిగుబడులకు ఆస్కారం కలుగుతుంది. రైతులందరూ క్రమం తప్పకుండా దుక్కుకు ప్రాధాన్యమివ్వాలి. – సీహెచ్కేవీ చౌదరి, వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు, ఆలమూరు డివిజన్ నిబంధనలు తప్పనిసరి ఖరీఫ్ పంటకు తెగుళ్ల బెడదను నివారించి, అధిక దిగుబడులు సాధించాలంటే వ్యవసాయశాఖ సూచనలతో పాటు కొన్ని నిబంధనలను కచ్చితంగా పాటించాలి. సాధారణ కల్టివేటర్ (ట్రాక్టర్కు వాడే మామూలు నాగలి)కు బదులు లోతు దుక్కు దున్నడానికి రెక్క నాగలి, బల్లెపు నాగలి, గునపపు నాగలి వాడాలి. దీని వల్ల నేల 30 నుంచి 75 సెంటీమీటర్ల లోతుకు దిగి ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. వాలుకు అడ్డంగా దుక్కి చేయడం వల్ల భూమి కోతకు గురి కాకుండా తేమ ఎక్కువగా పెరుగుతుంది. ప్రస్తుతం పొలాలు ఖాళీగా ఉండటం వల్ల కలుపు మొక్కలు విపరీతంగా పెరిగిపోతాయి. వాటి వల్ల వచ్చే పంటకు కలుపు బెడద ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వేసవి దుక్కులు చేసుకుంటే ఉపయోగం కలుగుతుంది. ఫ దుక్కి దున్నితే లాభాల పంటే ఫ వేసవి దుక్కులతో ఎంతో ప్రయోజనం ఫ ప్రాధాన్యత ఇస్తున్న రైతులు -
దివ్య క్షేత్రం.. వైద్యం పూజ్యం
● రత్నగిరిపై భక్తులకు అందని అత్యవసర వైద్యం ● గుండెపోటుతో ఆరు నెలల్లో ఇద్దరి మృతి ● అలంకారప్రాయంగా కార్పొరేట్ ఆసుపత్రి సేవా కేంద్రంఅన్నవరం: అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్య సేవలు అందించే అవకాశం రత్నగిరిపై లేకపోవడం భక్తులకు ప్రాణసంకటంగా మారుతోంది. కొండపై అందుబాటులో ఆస్పత్రి, అంబులెన్సు వంటి సదుపాయాలు లేవు. దీంతో, ఊహించని విధంగా అస్వస్థతకు గురైన కొంత మంది భక్తులు చికిత్సలో జాప్యం జరిగి ప్రాణాలు కోల్పోతూండటం.. వారి కుటుంబ సభ్యులకు తీరని విషాదాన్ని మిగులుస్తోంది. ముఖ్యంగా 50 సంవత్సరాల వయస్సు నిండిన భక్తులు ఉపవాసంతో, ఎంతో భక్తితో సత్యదేవుని వ్రతాలు ఆచరించి, స్వామివారిని దర్శించుకుని, ఆలయం వెలుపలకు రాగానే డీహైడ్రేషన్తో తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. ప్రస్తుత వేసవిలో ఈ ఇబ్బంది మరింతగా ఉంటోంది. గుండెపోటు, షుగర్, బీపీ తదితర వ్యాధులున్న వారు అస్వస్థతకు గురైతే తక్షణ వైద్యం అందించే అవకాశం దేవస్థానంలో లేదు. కొండ దిగువన ఉన్న దేవస్థానం వైద్యశాలకు తరలించినా, అక్కడ సరైన వైద్యం అందడం లేదు. కొంతమందిని తుని ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్నారు. కానీ, ఆయా ఆసుపత్రులకు తరలించే లోపే అత్యవసర చికిత్స అందక భక్తులు మార్గం మధ్యలోనే మృతి చెందుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గడచిన ఆరు నెలల వ్యవధిలో ఈవిధంగా ఇద్దరు భక్తులు గుండెపోటుతో ఆలయం వెలుపల మృతి చెందారు. గత నవంబర్లో పెద్దాపురం మండలం దివిలికి చెందిన వెన్నా సత్యనారాయణ, గత మంగళవారం అన్నవరం సమీపంలోని బెండపూడికి చెందిన మద్దుకూరి బుచ్చిబాబు గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఇద్దరికీ కూడా తక్షణ వైద్య సహాయం అందకపోవడం గమనార్హం. వైద్య శాలలో అరకొర సేవలు అన్నవరం దేవస్థానం కొండ దిగువన గత 60 ఏళ్లుగా ఉచిత వైద్యశాలను నిర్వహిస్తోంది. వైద్యపరంగా అన్నవరం గ్రామానికి ఒకప్పుడు ఇదే పెద్ద దిక్కు. తగినంత మంది సిబ్బంది ఉన్నప్పటికీ కాలక్రమేణా భక్తులకు తగిన వైద్య సహాయం అందడం లేదనే విమర్శలు వస్తున్నాయి. సిబ్బంది సకాలంలో వస్తున్నా వైద్యాధికారి మాత్రం ఆలస్యంగా విధులకు హాజరవుతూండటంతో అరకొర వైద్యమే అందుతోందని భక్తులు ఆరోపిస్తున్నారు. వైద్యాధికారి కోసం ఎదురు చూసి వెళ్లిపోవాల్సి వస్తోందని వాపోతున్నారు. దేవస్థానంలో కనీస వైద్య సదుపాయం అందే పరిస్థితి లేదు. ఓ కార్పొరేట్ ఆసుపత్రి సిబ్బంది రత్నగిరి రామాలయం ఎదురుగా ఓ కేంద్రం ఏర్పాటు చేసినప్పటికీ అక్కడ కనీసం తలనొప్పి మాత్రలు కూడా ఉండటం లేదనే విమర్శ ఉంది. ఈ చర్యలు మేలు ● భక్తులు ఉపవాసంతో కాకుండా టీ, కాఫీ, పాల వంటి ద్రవ పదార్థాలు తీసుకోవచ్చని, అలాగే, బీపీ, షుగర్ బాధితులు తగిన మందులు వేసుకుని, వ్రతాలు, దర్శనం చేసుకోవచ్చని మైకులో ప్రచారం చేయాలి. ● కార్తిక మాసం, స్వామివారి కల్యాణోత్సవాల్లో మాత్రమే ఏర్పాటు చేస్తున్న వైద్య శిబిరాలను నిత్యం కొనసాగించాలి. పీహెచ్సీ, దేవస్థానం ఆసుపత్రి సిబ్బంది రత్నగిరిపై పగలు, రాత్రి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ● బీపీ, షుగర్ హెచ్చుతగ్గులను నియంత్రించే మందులు, గుండెనొప్పి వస్తే తక్షణం పని చేసే మందులను రత్నగిరిపై అందుబాటులో ఉంచాలి. ● డీహైడ్రేషన్కు గురవకుండా భక్తులకు తగిన వైద్య సహాయం అందించాలి. ● రత్నగిరిపై ఉన్న కార్పొరేట్ ఆసుపత్రి కేంద్రంలో అనుభవజ్ఞులైన సిబ్బందితో పాటు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలి. ● రత్నగిరికి ప్రత్యేకంగా అంబులెన్సు ఉండేలా చర్యలు తీసుకోవాలి. భక్తులు గుండెపోటుకు గురైతే అంబులెన్స్ సిబ్బంది సీపీఆర్ చేసి సకాలంలో ఆసుపత్రికి తరలించే ఏర్పాటు చేయాలి. -
విద్యార్థుల స్థాయికి మించి..
సోషల్ స్టడీస్లో సిలబస్ విద్యార్థుల స్థాయికి మించి ఉంది. పాఠాల సంఖ్య కూడా మిగతా సబ్జెక్టులతో పోల్చిస్తే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాటిని తగ్గించే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేయాలి. విద్యార్థులపై సిలబస్ భారం మోపడం సరైన పద్ధతికాదు. – ఎస్.జ్యోతిబసు, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, రావులపాలెం ఇబ్బందికరం ఆరు నుంచి పది తరగతులకు సోషల్ సిలబస్ బోధన, అభ్యసన అటు ఉపాధ్యాయులకు ఇటు విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉంది. దీని నుంచి తప్పనిసరిగా కొన్ని పాఠ్యాంశాలను తొలగించాలి. సోషల్లో ఉండే నాలుగు అంశాలకు సంబంధించి ప్రతి రెండు అంశాలకు ఒక ఉపాధ్యాయుడిని నియమించాలి. – దీపాటి సురేష్ బాబు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
వెన్నుపోటు చంద్రబాబు నైజం
పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ దగ్గర నుంచి రాష్ట్రంలోని సాధారణ ప్రజల వరకూ వెన్నుపోటు పొడవడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు అలవాటు. నిత్యం ప్రజలను మోసం చేస్తూ అధికారాన్ని అనుభవిస్తున్నారు. అబద్ధపు హామీలిచ్చి, ప్రజలను వంచించి, అధికారాన్ని చేజిక్కించుకుని, జీవితం సాగిస్తున్న ఇలాంటి ముఖ్యమంత్రిని గతంలో ఎన్నడూ చూడలేదు. – వాసిరెడ్డి జమీలు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, రౌతులపూడి నిరుద్యోగ భృతి పేరుతో మోసం యువతకు 20 లక్షల ఉద్యోగాలిస్తామని, అప్పటి వరకూ ప్రతి నెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చారు. దీంతో కూటమికి ఓట్లు వేశాం. అయితే, రెండేళ్లు గడచినా ఇప్పటి వరకూ ఉద్యోగాల్లేవు సరికదా.. నిరుద్యోగ భృతిపై ఆలోచించిన దాఖలాలే లేవు. రెండేళ్లకు రూ.72 వేల నిరుద్యోగ భృతి రావాల్సి ఉంది. – ఉప్పెటి ప్రసాద్, నిరుద్యోగి, పెద్దాపురం -
కోకోకు ప్రమాణాల రూపకల్పన అవసరం
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): రాష్ట్రంలో కోకో సాగు నాణ్యతను మెరుగుపరచి అంతర్జాతీయ మార్కెట్లలో పోటీతత్వాన్ని పెంపొందించేందుకు భారతీయ కోకో బీన్స్కు ప్రమాణాల రూపకల్పన అవసరమని ఏపీ రాష్ట్ర ఫుడ్ ప్రోసెసింగ్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రధాన కార్యదర్శి చిరంజీవి చౌదరి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ (ఏపీఎఫ్పీఎస్) ఆధ్వర్యంలో గురువారం రాజమహేంద్రవరంలోని ఐసీఏఆర్–ఎన్ఐఆర్సీఏ(నిర్కా)లో నిర్వహించిన ‘ఎస్టాబ్లిషింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియన్ కోకో బీన్స్ అంశంపై ఒకరోజు అవగాహన వర్క్షాప్ నిర్వహించారు. చిరంజీవి చౌదరి మాట్లాడుతూ, కోకో పంటకు ఆంధ్రప్రదేశ్.. దేశంలోనే ప్రధాన ఉత్పత్తి కేంద్రంగా ఎదుగుతోందన్నారు. రైతులు నాణ్యత ప్రమాణాలను పాటిస్తే అధిక ధరలు పొందే అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఏపీఎఫ్పీఎస్ సీఈఓ గెడ్డం శేఖర్ బాబు మాట్లాడుతూ, కోకో రైతులను ప్రాసెసింగ్ పరిశ్రమలతో అనుసంధానం చేయడం, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ప్రోత్సాహం అందించడం సంస్థ ప్రధాన లక్ష్యమన్నారు. కోకోశాల (చైన్నె) వ్యవస్థాపకుడు, కన్సల్టెంట్ నితిన్ చోర్డియా సాంకేతిక సెషన్లో మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో కోకో బీన్స్కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో గ్రేడింగ్, నిల్వ విధానాల్లో పాటించాల్సిన శాసీ్త్రయ పద్ధతులను వివరించారు. చాక్లెట్, కోకో పౌడర్, కోకో బటర్ తదితర విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ అవకాశాలపై రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించారు. వక్తలు మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 38,671 హెక్టార్లలో కోకో సాగు జరుగుతోందని, ఏలూరు, పశ్చిమగోదావరి, కోనసీమ జిల్లాలు కోకో ఉత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తున్నాయని వెల్లడించారు. కోకో సాగు, ప్రాసెసింగ్పై మార్గదర్శకాలకు 79950 87041 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ను సంప్రదించాలన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఏపీఎఫ్పీఎస్ ఈడీ ఏ దుర్గేష్, ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ యు.సుధ, ఐదు జిల్లాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులు, కోకో ప్రాసెసింగ్ యూనిట్ల ప్రతినిధులు పాల్గొన్నారు. ఏపీ ఫుడ్ ప్రోసెసింగ్, పరిశ్రమలు, వాణిజ్యశాఖ ప్రధాన కార్యదర్శి చిరంజీవిచౌదరి -
చోరీ కేసులో రూ.58 లక్షల సొత్తు స్వాధీనం
అనపర్తి: చోరీ కేసులో సుమారు రూ.58 లక్షల విలువైన వెండి, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు రాజమహేంద్రవరం ఈస్ట్జోన్ డీఎస్పీ బి విద్య తెలిపారు. అనపర్తి పోలీస్స్టేషన్లో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ మార్చి 31న అనపర్తి మండలం లక్ష్మీనరసాపురం గ్రామంలో జరిగిన చోరీపై కేసు నమోదు చేసిన పోలీసులు రాజమహేంద్రవరం క్రైం బృందంతో కలసి దర్యాప్తు చేశారన్నారు. పోలవరం జిల్లా అడ్డతీగల మండలం గొంటువానిపాలెంకు చెందిన శిరపనశెట్టి సన్యాసిరావు అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో మండలంలోని కొప్పవరం వంతెన వద్ద అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడన్నారు. అనపర్తిలోనే కాకుండా ఆలమూరులోను, రావులపాలెంలో రెండు చోట్ల, నర్శీపట్నం, కోరుకొండలలోను చోరీలకు పాల్పడినట్టు ఆమె తెలిపారు. మొత్తం ఆరు చోరీలలోను సుమారు రూ.58 లక్షల విలువైన 385 గ్రాముల బంగారు వస్తువులు, 110 గ్రాముల వెండి వస్తువులు, రూ.5వేల నగదు స్వాధీనం చేసినట్టు డీఎస్పీ విద్య తెలిపారు. రాజమహేంద్రవరం క్రైమ్బ్రాంచ్ డీఎస్పీ సుభాష్ ఆధ్వర్యంలో కేసును త్వరితగతిన చేధించడంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచిన రాజమహేంద్రవరం క్రైమ్బ్రాంచ్ హెచ్సీ ప్రసాద్ రమణ సురేష్, విజయ్ అనపర్తికి చెందిన తమ్మారావు, రాజేష్, క్రైమ్ బ్రాంచ్ సీఐలు రాంబాబు, బాలాచారి, అనపర్తి సీఐ వీఎల్వీకే సుమంత్, ఎస్సై ఎల్ శ్రీనునాయక్లను డీఎస్పీ విద్య అభినందించారు. -
ఇన్చార్జి డీపీటీఓగా మనోహర్
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా ఇన్చార్జి ప్రజా రవాణా అధికారి(డీపీటీఓ)గా కాకినాడ ఆర్టీసీ డిపో మేనేజర్ ఎంయూవీ మనోహర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ ఇక్కడ డీపీటీఓగా పని చేసిన శ్రీనివాసరావు విజయవాడ బదిలీ కావడంతో మనోహర్కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం, మనోహర్ను పలువురు ఆర్టీసీ అధికారులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సకాలంలో ఇంజినీరింగ్ పనులుబోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలోని వివిధ ఇంజినీరింగ్ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి, సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. ఆయా పనుల పురోగతిపై కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్అండ్బీ, ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్, పంచాయతీరాజ్, ఏపీఎంఎస్ఐడీసీ, ఏపీఈడబ్ల్యూఐడీసీ వంటి ముఖ్య ఇంజినీరింగ్ శాఖల పరిధిలో జరుగుతున్న పనుల స్థితిగతులపై ఆయా అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిబంధనల ప్రకారం మంజూరైన అన్ని పనుల గ్రౌండింగ్ తక్షణమే పూర్తి చేయాలన్నారు. ఇరిగేషన్ కాలువలకు నీరు వదలడానికి ముందే పూడికతీత, షట్టర్లు, స్లూయిజ్ల మరమ్మతులు తదితర పనులన్నింటినీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. గురుకుల పాఠశాల మరమ్మతులు, సామాజిక భవనాలు, పీఎంశ్రీ పాఠశాలల్లో లైబ్రరీలు, ల్యాబ్లు, కంప్యూటర్ ల్యాబ్ల నిర్మాణాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, రంగరాయ వైద్య కళాశాల పీజీ బాలికల వసతి గృహం, పిఠాపురం ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనులను వేగవంతం చేసి, అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సీఎంఆర్ డెలివరీని వేగవంతం చేయాలి బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలోని మిల్లర్లు కస్టమ్ మిల్డ్ రైస్ (సీఎంఆర్) డెలివరీ వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ఆదేశించారు. రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు, సభ్యులతో కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రబీలో 2.29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి, సీఎంఆర్ నిమిత్తం జిల్లాలోని మిల్లులకు ఇచ్చామన్నారు. అయితే, మిల్లింగ్ చేసిన బియ్యం సకాలంలో ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా నుంచి ఏపీ పౌర సరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ 15 వేల మెట్రిక్ టన్నుల ముడి బియ్యం, 85 వేల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. వీటిని మిల్లర్లు ఇస్తే సకాలంలో కేంద్ర పరిధిలోని పుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సరఫరా చేయగలమని చెప్పారు. గడువు లోగా మిల్లర్లు సీఎంఆర్ బియ్యం సరఫరా చేయకపోతే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జేసీ హెచ్చరించారు. సమావేశంలో పౌర సరఫరాల సంస్థ మేనేజర్ దేవుల నాయక్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వల్లూరి సూర్యప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు. రఘురామ కృష్ణరాజును బర్తరఫ్ చేయాలి సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): గత ఎన్నికల తరువాత రాష్ట్రంలో ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయని, 164 సీట్లతో ఒక ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించిన రాష్ట్ర ప్రజలకు నిరాశే ఎదురైందని జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ అన్నారు. రాజమహేంద్రవరం ప్రెస్క్లబ్లో గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండేళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం ఎంత మేలు చేసిందో, ఎంత చెడు చేసిందో ప్రజలు విశ్లేషించుకుంటున్నారని చెప్పారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి.. దళిత క్రైస్తవుల హక్కులను హరించేలా వ్యవహరిస్తున్న శాసన సభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజును ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దళిత క్రైస్తవుల హక్కుల సాధన, సామాజిక న్యాయం కోసం ఈ నెల 28న ఏలూరులో నిర్వహిస్తున్న దళిత క్రైస్తవ సమర శంఖారావం బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. -
దగా చేయడమే చంద్రబాబు నైజం
అధికారం కోసం ఎన్ని హామీలైనా ఇచ్చి.. ఆనక దగా చేసే నైజం చంద్రబాబు సొంతమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. తుని పట్టణంతో పాటు రూరల్ మండల ప్రజలు, వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు ఎస్.అన్నవరంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. దాడిశెట్టి రాజా నాయకత్వాన కూటమి ఎన్నికల మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు పాలనపై రాజా నిప్పులు చెరిగారు. సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను నిలువునా ముంచేశారని దుయ్యబట్టారు. హామీలు అమలు చేయకుండా మోసం చేసిన చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మండల కేంద్రమైన కోటనందూరు బస్టాండ్ సెంటర్లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరో మండల కేంద్రమైన తొండంగి సెంటర్లో జరిగిన నిరసన కార్యక్రమాన్ని రాజా ముందుండి నడిపించారు. సూపర్ సిక్స్ కరపత్రాలను మంటల్లో వేసి దహనం చేసి, టీడీపీకి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి రేలంగి రమణగౌడ్, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
ఎట్టకేలకు సత్యదేవుని నామంతో కండువాలు
అన్నవరం: సత్యదేవుని సన్నిధికి.. ఆ స్వామి నామం ముద్రించిన కండువాలు ఎట్టకేలకు వచ్చాయి. దేవస్థానంలో చాలా ఏళ్ల నుంచి స్వామివారి కల్యాణం, రూ.2 వేలు, రూ.1,500 టిక్కెట్తో వ్రతాలాచరించే భక్తులకు.. అంచు మీద జరీతో ‘శ్రీ సత్యదేవాయ నమః’ అనే నామం ముద్రించిన కండువాలు అందజేసేవారు. అయితే, కండువాల సరఫరా టెండర్ దక్కించుకున్న కొత్త టెండర్దారు రెండు వారాలుగా స్వామివారి నామం ఉన్న కండువాలు సరఫరా చేయడం లేదు. దీంతో, దేవస్థానం అధికారులు స్వామివారి నామం లేకుండా రోజుకో డిజైన్, రంగు కండువాలను ఇస్తూండటంతో భక్తులు అసంతృప్తి చెందుతున్నారు. దీనిపై ‘నీ నామమెంతో రుచిరా!’ ‘సాక్షి’ గురువారం ప్రచురించిన కథనం దేవస్థానంలో తీవ్ర సంచలనం రేకెత్తించింది. దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు వెంటనే స్పందించారు. తక్షణం స్వామివారి నామంతో కూడిన కండువాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని దేవస్థానం అధికారులను ఆదేశించారు. ఆ మేరకు టెండర్దారుపై అధికారులు ఒత్తిడి తీసుకుని రావడంతో అంచుపై సత్యదేవుని నామం, శంఖచక్రాలు ముద్రించిన 900 కండువాలు రత్నగిరికి గురువారం చేరాయి. వీటిని ఆయా భక్తులకు అందజేశారు. దీనిపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇవి శుక్రవారం వరకూ సరిపోతాయని, శనివారం నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ కనీసం 2 వేల కండువాలు పంపించాలని టెండర్దారును అధికారులు ఆదేశించారు. -
చంద్రబాబు ఎన్నికల హామీలు అమలు చేయాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ముఖ్యమంత్రి చంద్రబాబు 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వైఎస్సార్ సీపీ ఎంప్లాయిస్, పెన్షనర్స్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి రామారావు డిమాండ్ చేశారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నప్పటికీ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో పురోగతి కనిపించడం లేదన్నారు. పెండింగ్ డీఏలు, పీఆర్సీ, సీపీఎస్ సమస్యల పరిష్కారం, వైద్య భద్రత, పెన్షనర్ల సంక్షేమం వంటి అంశాలపై హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక అమలుకు కార్యాచరణ ప్రకటించలేదన్నారు. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ పనిచేయడం లేదని, రాష్ట్రంలోని కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులు క్యాష్లెస్ సేవలు అందించడం లేదని చెప్పారు. పీఆర్సీని ఏర్పాటు చేయాలన్నారు. ఆర్టీసీని దశలవారీగా ప్రైవేటీకరించే ప్రయత్నాలను విరమించుకోవాలని సూచించారు. ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు. ఎంప్లాయిస్ పెన్షనర్స్ విభాగం కాకినాడ అర్బన్ అధ్యక్షుడు మహిపాల్, పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి తుమ్మల నూకరాజు పాల్గొన్నారు. -
పాఠాలు : 89పేజీలు : 2553తరగతులు : 5టీచర్ : ఒకరు
కొత్తపేట: రాష్ట్రంలో ఆరు నుంచి పదో తరగతి వరకూ సాంఘిక శాస్త్ర సిలబస్ మిగిలిన సబ్జెక్టులతో పోల్చితే అత్యధికంగా ఉంటోంది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ ఫోరం ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లింది. పాఠ్యాంశాలపై పునఃసమీక్ష జరిపి, సిలబస్ భారం తగ్గించాలని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఎం.వెంకట కృష్ణారెడ్డికి, విద్యాశాఖ ఉన్నతాధికారులకు వినతిపత్రాలు సమర్పించింది. ప్రస్తుత పాఠ్యాంశాల నిర్మాణాన్ని పరిశీలిస్తే, ఒకే సబ్జెక్టులో చరిత్ర, భూగోళ శాస్త్రం, పౌర శాస్త్రం, ఆర్థిక శాస్త్రం వంటి విభిన్న అంశాలను బోధించాల్సి వస్తోంది. దీనివల్ల విద్యార్థులపై అధిక విద్యాభారం పడటమే కాకుండా, బోధనా నాణ్యతపై కూడా ప్రభావం పడుతోంది. దీంతో సిలబస్ తగ్గించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. పాఠాలు అధికం ఇటీవల సిలబస్ మార్పుల నేపథ్యంలో గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం వంటి సబ్జెక్టుల్లో పాఠాలను గణనీయంగా తగ్గించారు. కానీ సాంఘిక శాస్త్రంలో మాత్రం ఇప్పటికీ అత్యధిక పాఠాలు కొనసాగుతున్నాయి. ఉదాహరణకు పదో తరగతి సైన్స్ సబ్జెక్టులో బయాలజీ 5, ఫిజిక్స్ 4, కెమిస్ట్రీ 4.. కలిపి మొత్తం 13 పాఠాలున్నాయి. వీటిని వేర్వేరు ఉపాధ్యాయులు బోధించే అవకాశం కూడా ఉంటుంది. అదే పదో తరగతి సాంఘిక శాస్త్రంలో 22 పాఠాలు ఉన్నాయి. వీటిని ఒక్కరే బోధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది కేవలం పదో తరగతికి మాత్రమే పరిమితం కాదు, మిగిలిన తరగతులకూ వర్తిస్తోంది. వీటి బోధనకు ఉపాధ్యాయులు, చదవటానికి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.ఫ ఉపాధ్యాయుల ఆవేదన ఫ సిలబస్ తగ్గించాలని డిమాండ్ ఫ విద్యార్థులకూ కష్టమని వివరణ ఫ పునఃసమీక్ష చేయాలని వినతి -
MìSMŠS »êMìSÞ…-VŠæÌZ ˘ షణ్ముఖనాయుడుకు రజతం
రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరుకు చెందిన యువకుడు పుప్పాల చేతన్షణ్ముఖనాయుడు ఒడిశాలో గత నెల 30వ తేదీ నుంచి ఈ నెల మూడవ తేదీ వరకు జరిగిన జూనియర్ నేషనల్ కిక్బాక్సింగ్ చాంపియన్ షిప్లో అండర్–17 విభాగంలో ద్వితీయస్థానం సాధించి రజత పతకం సాధించాడు. ఈ మేరకు ఏపీ స్టేట్ కిక్బాక్సింగ్ ప్రెసిడెంట్ జి.ఆనందబాలు ఓ ప్రకటనలో తెలిపారు. రజత పతకం సాధించిన షణ్ముఖనాయుడుని జిల్లా కిక్బాక్సింగ్ చైర్మన్, వైఎస్సార్ సీపీ రాష్ట్రకార్యదర్శి గొందేశి శ్రీనివాసులరెడ్డి, ప్రెసిడెంట్ ఎం.గణేష్, సెక్రటరీ ఎన్.గిరివెంకటరమణ, కోశాధికారి ఎం.భవానిశంకర్, సంయుక్త కార్యదర్శి అపర్ణనాగప్రియ అభినందించారు. -
మంటలతో బెంబేలు
కరప: కారు అడుగు భాగంలో చుట్టుకున్న ఎండుగడ్డితో మంటలు రేగి, కారు పూర్తిగా కాలిపోయింది. వివరాల్లోకి వెళితే.. కాకినాడకు చెందిన ఓ పాస్టర్ తన కారులో మరో ముగ్గురితో కలిసి రావులపాలెంలో జరిగే క్రైస్తవ సమావేశానికి బయలుదేరారు. మార్గం మధ్యలో కారు అడుగుభాగాన ఎండుగడ్డి చుట్టుకుంది. ఆ విషయాన్ని పాస్టర్ గమనించలేదు. కరప మండలం పెద కొత్తూరు గ్రామం వద్దకు వచ్చేసరికి వెనుక వస్తున్న మోటార్ సైక్లిస్ట్ వారిని ఆపాడు. కారు నుంచి మంటలు వస్తున్నాయని చెప్పి, అప్రమత్తం చేశాడు. కారు బ్రేక్ పనిచేయకపోవడంతో హ్యాండ్ బ్రేక్ వేసి పాస్టర్తో పాటు అందులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురూ బయటకు వచ్చేశారు. అనంతరం మంటలు కారు టైర్లు, సీట్లకు వ్యాపించారు. వాటిని చూసి సమీపంలోని గృహాల వారు బయటకు పరుగులు తీశారు. పెద కొత్తూరు గ్రామస్తులతో పాటు వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు చింతా ఈశ్వరరావు స్పందించి కాకినాడలోని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పివేశారు. -
పెట్రో మంటలపై 9న రాస్తారోకో
ఉమ్మడి జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్లకు ఉద్యోగోన్నతిబోట్క్లబ్ (కాకినాడ సిటీ): పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా 9వ తేదీన రాస్తారోకోలు నిర్వహించనున్నట్టు వామపక్ష నాయకులు తెలిపారు. స్థానిక న్యూ డెమాక్రసీ కార్యాలయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి జె.వెంకటేశ్వర్లు అధ్యక్షతన వామపక్షాల సమావేశం జరిగింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం ఇప్పటి వరకు నాలుగు సార్లు పెట్రో ధరలు పెరిగాయన్నారు. కమర్షియల్ గ్యాస్ ధర మరీ దారుణంగా రూ.వెయ్యికి పైగా పెంచారని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన నాటి నుంచి కార్పొరేట్లకు దేశ సంపదను దోచిపెడుతూ సామాన్య, మధ్య తరగతి కుటుంబాలపై భారాలు వేస్తున్నారన్నారు. ఈ నెల మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాలు నిర్వహించి, 9వ తేదీన రాస్తారోకోలు నిర్వహించనున్నట్టు నాయకులు తెలిపారు. సీపీఎం నగర కమిటీ సభ్యుడు కె.సత్తిరాజు మాట్లాడుతూ మోడీ అధికారం చేపట్టిన 12 ఏళ్లలో దేశంలో నిరుద్యోగం పెరుగుతూనే ఉందన్నారు. ఏడో తేదీ సాయంత్రం కాకినాడ మసీదు సెంటర్, బాలాజీ చెరువు సెంటర్లలో ప్రచారం నిర్వహించి, 9 వ తేదీ ఉదయం సామర్లకోట రోడ్డు–ఇంద్రపాలెం లాకుల వద్ద రాస్తారోకో చేస్తామన్నారు. సమావేశంలో సీపీఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు, న్యూ డెమోక్రసీ నాయకులు గరగ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. రెండు ఇసుక లారీల సీజ్ రావులపాలెం: జిల్లాలో జరుగుతున్న ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలపై బుధవారం తనిఖీలు చేసి గోపాలపురం హైవేపై రెండు ఇసుక లారీలను సీజ్ చేసి వాటికి రూ. 50 వేలు అపరాధ రుసుం విధించినట్టు గనుల శాఖ ఏడి అశోక్ కుమార్ తెలిపారు. అయితే ఈ తనిఖీలు నామమాత్రమేనా అన్నట్టుగా ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో జరుగుతున్న అక్రమ ఇసుక, మట్టి తవ్వకాలపై బుధవారం ‘సాక్షి’లో ‘అనదికార దందా’ పేరుతో కథనం ప్రచురితం అయిన విషయం తెలిసిందే. అయితే బుధవారం గోపాలపురం హైవేపై గనుల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. అయితే వందలాది లారీలు నిత్యం హైవే మీద తిరుగుతున్నా వారికి మాత్రం గోపాలపురం వద్ద రెండు లారీలే కనిపించడం పలు విమర్శలకు తావిస్తోంది. దీనిపై గనుల శాఖ ఏడీని సాక్షి వివరణ కోరగా తమకు వచ్చిన సమాచారంతో వెళ్లి నిఘా పెట్టగా రెండు లారీలను సీజ్ చేశామన్నారు. బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పనిచేస్తున్న 32 మంది డిప్యూటీ తహసీల్దార్లకు తహసీల్దార్లుగా ఉద్యోగోన్నతి కల్పిస్తూ సీసీఎల్ స్పెషల్ సీఎస్ జయలక్ష్మి బుధవారం ఆదేశాలు జారీ చేశారు. కాకినాడ జిల్లాలో 14 మందికి, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా 6, తూర్పుగోదావరి జిల్లాలో 7, పోలవరం జిల్లాలో ఐదుగురు డిప్యూటీ తహసీల్దార్లు తహసీల్దార్లుగా ఉద్యోగోన్నతి పొందారు. మెరిట్, సీనియారిటీ ప్రాతిపదికన ఈ ఉద్యోగోన్నతులు కల్పించినట్లు ఆమె పేర్కొన్నారు. సర్ అంటే ఏమిటి? సర్ అంటేనే ఏమిటో నాకు తెలీదు. నేను 30 ఏళ్లుగా ఓటు వేస్తున్నాను. మళ్లీ నా ఓటు నిరూపించుకోవడమేమిటి? అసలు సవరణ చేయడం ఏమిటో కూడా నాకు తెలియదు. ఎవరు వస్తారో, ఎప్పుడు వస్తారో తెలీదు. వారు వచ్చిన సమయానికి మేం ఇంటి వద్ద ఉండాలి కదా! ముందుగా ఏం చేయాలో తెలియజేస్తే అన్నీ సిద్ధం చేసుకుంటాం. – పేపకాయల ప్రసాద్, పిఠాపురం అవగాహన కల్పించాలి సర్ కార్యక్రమం జరుగుతుందని తెలుసు తప్ప అదేమిటి.. మన ఓటు రద్దవకుండా ఎలా చూసుకోవాలనే విషయాలు చాలా మందికి తెలీదు. ఇప్పటి వరకూ నాకే తెలీదు. ఏయే అర్హతలు నిరూపించుకోవాలి.. ఏ ఆధారాలు చూపించాలో ముందుగానే చెప్పాలి. లేకపోతే బీఎల్ఓ వచ్చాక ఆధారాలు తెమ్మంటే చాలామంది తేలేకపోవచ్చు. అప్పుడు అర్హత ఉన్నా ఓటు హక్కు కోల్పోవలసి వస్తుంది. దీనిపై ఓటర్లకు పూర్తి అవగాహన కల్పించాలి. – కొండేపూడి శంకరరావు, మన ఊరు – మన బాధ్యత స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు, పిఠాపురం పిఠాపురం: ఎన్నికల సంఘం ఈ నెల 15 నుంచి చేపడుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – సర్) కార్యక్రమంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఓవైపు రాజకీయ పార్టీలు తమ వారి ఓట్లు పోకుండా జాగ్రత్తలు తీసుకుంటూండగా.. ఈ ప్రక్రియపై సామాన్య ఓటర్లలో అవగాహన లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే సర్ అంటే ఏమిటో తెలియని వారు కోకొల్లలుగా కనిపిస్తున్నారు. సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో అధికారులు సరిపెట్టేస్తూండంతో.. అవగాహన లేక ఎక్కువ మంది తమ ఓటు హక్కు కోల్పోయే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సర్ కార్యక్రమం ఇలా.. అధికారుల లెక్కల ప్రకారం.. జిల్లావ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 1,640 పోలింగ్ బూత్ల పరిధిలో 16.50 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ నెల 5 నుంచి 14వ తేదీ వరకూ బూత్ లెవెల్ అధికారుల(బీఎల్ఓ)కు సర్ కార్యక్రమంపై శిక్షణ ఇవ్వనున్నారు. అనంతరం వీరు ఈ నెల 15 నుంచి జూలై 14వ తేదీ వరకూ ఇంటింటా సర్వే నిర్వహిస్తారు. సర్కు అవసరమైన ఎన్యూమరేషన్ ఫామ్లు, ఇతర సామగ్రిని ఇప్పటికే సిద్ధం చేశారు. బీఎల్ఓలు తమకు కేటాయించిన పోలింగ్ బూత్ల పరిధిలోని ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ ఫామ్ అందజేస్తారు. అందులోని వివరాలను ఓటర్లు పూర్తి చేసి, తిరిగి బీఎల్ఓలకు అందజేయాలి. దీని ఆధారంగానే ఓటు ఉండాలా, తొలగించాలా అనే నిర్ణయం తీసుకుంటారు. 2002 నాటి ఓటర్ల జాబితాను, ప్రస్తుత ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ చేయడం ద్వారా నకిలీ ఓట్లు, చనిపోయిన వారివి, ఒకరికి ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉన్నా ఆధారాలు చూపించని తొలగిస్తారు. అనంతరం, జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురిస్తారు. జూలై 21 నుంచి ఆగస్టు 20వ తేదీ వరకూ అభ్యంతరాలు స్వీకరిస్తారు. వచ్చిన అభ్యంతరాలను సెప్టెంబర్ 18లోగా పరిష్కరించి, అదే నెల 22న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తారు. మ్యాపింగ్ ఇలా.. ‘సర్’ నిబంధనల ప్రకారం బీఎల్ఓ లింక్ ద్వారా 2025 ఓటర్ల జాబితాల్లో ఉన్న వారందరినీ 2002 ఓటర్ల జాబితాతో ఫ్యామిలీ ట్రీ మ్యాపింగ్ చేస్తారు. ఏ ఒక్క ఓటరుకు లింక్ కాకపోయినా, తగిన ఆధారాలు ఇవ్వకపోయినా వారి ఓటు పోతుంది. సాధారణంగా ఇటువంటి ఓటర్లు 43 ఏళ్లు పైబడే ఉంటారు. 18 నుంచి 43 ఏళ్ల వయస్సు ఓటర్లను వారి తల్లిదండ్రులు లేదా గార్డియన్తో లింక్ చేస్తారు. పెళ్లై అత్త వారింటికి వచ్చిన కోడళ్లు వేరే ఊరి నుంచి వచ్చి ఉంటారు కాబట్టి తమ వాళ్ల ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. మ్యాపింగ్లో లింక్ కాని వారు ఎన్యూమరేషన్ ఫామ్ నింపి ఇవ్వాలి. గడువులోగా దానిని నింపి, ఆధారాలివ్వకపోతే ఓటు తొలగిస్తారు. ఈ ప్రక్రియ నిరక్షరాస్యులకే కాదు.. చదువుకున్న వారికి సైతం గందరగోళంగా మారే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నో సంవత్సరాల నుంచి తమకు ఓటు హక్కు ఉందని.. ఇప్పటికే చాలాసార్లు ఓటు వేశామని భావిస్తున్న చాలా మంది ఇప్పుడు తమ హక్కును మళ్లీ ఎందుకు నిరూపించుకోవాలని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం సర్ ప్రక్రియపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం కనిపిస్తోంది. ఫ 15 నుంచి ఎస్ఐఆర్ ఫ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం ఫ ఓటర్లలో అవగాహన అంతంతమాత్రం ఇబ్బంది ఉండదు ప్రతి బీఎల్ఓ తమకు కేటాయించిన బూత్ పరిధిలోని అన్ని ఇళ్లకూ వెళ్లి ఎన్యూమరేషన్ ఫామ్ అందజేసి, వివరాలు తెలియజేస్తారు. కాబట్టి ఎటువంటి అవగాహనా లోపమూ ఉండదు. అర్హుల ఓట్లన్నీ ఉండేలా చూస్తారు. రాజకీయ పార్టీల ఏజెంట్లు కూడా సరి చూసుకుంటారు కాబట్టి సక్రమంగా ఉన్న ప్రతి ఓటూ ఉంటుంది. సామాన్యులకు ఏ ఇబ్బందీ లేకుండా బీఎల్ఓలు చూస్తారు. – గోపాలకృష్ణ, తహసీల్దార్, పిఠాపురం -
‘పీఎం కేర్’తో ఉజ్వల భవిత
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల భవితకు ప్రభుత్వంతో పాటు జిల్లా అధికార యంత్రాంగం అండగా నిలుస్తుందని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ భరోసా ఇచ్చారు. కలెక్టరేట్ వివేకానంద హాలులో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘మిషన్ వాత్సల్య’ జిల్లా బాలల సంరక్షణ విభాగం ద్వారా ‘పీఎం కేర్స్’ లబ్ధిదారుల ముఖాముఖి బుధవారం నిర్వహించారు. ఐసీడీఎస్ పీడీ సీహెచ్ లక్ష్మి, చిన్నారులతో ఆయన ముచ్చటించారు. చిన్నారుల చదువు, ఆరోగ్యం, సంరక్షకుల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ రకాల ఆర్థిక, విద్యా ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు. తద్వారా తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో మొత్తం 24 మంది పిల్లలు లబ్ధిపొందుతున్నారని, వీరి సంరక్షణను జిల్లా బాలల సంరక్షణ విభాగం పర్యవేక్షిస్తోందన్నారు. ఈ పథకం కింద వారికి రూ.10 లక్షల ఆర్థిక సాయంతో పాటు, రూ.5 లక్షల విలువైన ఆయుష్మాన్ భారత్ ఉచిత ఆరోగ్య బీమా అందుతుందని కలెక్టర్ తెలిపారు. ఐసీడీఎస్ పీడీ లక్ష్మి మాట్లాడుతూ ఈ పథకం కింద చిన్నారులకు 18 ఏళ్ల నుంచి నెలవారీ స్టైపెండ్, 23 ఏళ్లకు రూ.10 లక్షల కార్పస్ ఫండ్తో పాటు ఉచిత కేంద్రీయ విద్యాలయాల ప్రవేశాలు, ఉన్నత విద్యా రుణాలు, వైద్య సహాయం అందుతాయన్నారు. వేసవిలో 24.42 లక్షల ఉపాధి పని దినాలు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ప్రస్తుత వేసవి కాలంలో జిల్లాలో ఉపాధి కూలీలకు 24.42 లక్షల పనిదినాలు కల్పించినట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) పీడీ మధుసూదన్ తెలిపారు. కలెక్టరేట్లోని ఆయన కార్యాలయంలో బుధవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో 37.12 లక్షల పనిదినాల లక్ష్యం కాగా ఇప్పటి వరకూ 24.42 లక్షల పనిదినాలు పూర్తి చేశామని, ఈ నెలాఖరు నాటికి మిగిలిన 12 లక్షల పనిదినాలు కల్పించనున్నట్టు తెలిపారు. జిల్లాలో 92 వేల మంది ఉపాధి కూలీలకు రూ.52 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. మెటీరియల్ కాంపోనెంట్ కింద మరో రూ.39 కోట్లు విడుదల కావాల్సి ఉందన్నారు. పల్లె పండుగ 1, 2 ల్లో ప్రవేశపెట్టిన పనులు దాదాపు పూర్తయినట్లు చెప్పారు. మూడో విడత పనులకు కార్యచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో 12 మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. దీనిలో ఫీల్డ్ అసిస్టెంట్లు, టీఏలు, ఏపీవోలు ఉన్నారన్నారు. జూలై ఒకటో తేదీ నుంచి జిల్లాలో ‘వీబీజీ రామ్జీ’ అమలు కానున్నట్లు చెప్పారు. పాత పెన్షన్ విధానం అమలుచేయాలి ఏపీ విద్యుత్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి గణపతి కాకినాడ రూరల్: రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి వీఎస్ఆర్కే గణపతి డిమాండ్ చేశారు. కాకినాడ శశికాంత్ నగర్లో స్థానిక నాయకులతో బుధవారం ఆయన భేటీ అయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి వేతన సవరణ సంప్రదింపుల కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని, ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన మూడు వాయిదాల కరువు భత్యాన్ని తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఐదేళ్ల సర్వీసు దాటిన ఎనర్జీ అసిస్టెంట్లను జేఎల్ఎంలుగా చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులను పర్మెనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో ప్రమాదానికి గురైన, మృతి చెందిన ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలకు రూ.30 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ చట్ట సవరణ 2025 బిల్లును తక్షణం ఉపసంహరించుకోవాలని గణపతి కోరారు. వడదెబ్బకు ఉపాధి కూలీ మృతి ప్రత్తిపాడు: వడదెబ్బకు ఉపాధి కూలీ మృతి చెందిన సంఘటన లంపకలోవ గ్రామంలో బుధవారం ఉదయం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన లింగంపల్లి చక్రధరరావు (55) ఉపాధి కార్మికులతో పాటు ఆ గ్రామంలోని కోమటి చెరువు పూడిక తీత పనులకు వెళ్లాడు. పని ప్రదేశంలో వడదెబ్బ తగిలి కుప్పకూలిపోయాడు. తోటి వేతనదారులు సపర్యలు చేసి, స్థానిక ఆర్ఎంపీ వద్దకు తరలిస్తుండగా మృతి చెందాడని పంచాయతీ కార్యదర్శి బి.వీరబాబు తెలిపారు. చక్రధరరావుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
మండల కేంద్రాల్లో నేడు వైఎస్సార్ సీపీ నిరసన
తుని: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండేళ్ల వెన్నుపోటు పాలనకు నిరసనగా గురువారం మండల కేంద్రాల్లో సూపర్ సిక్స్ ప్రతులను దగ్ధం చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా బుధవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. తుని నియోజకవర్గానికి సంబంధించి కోటనందూరు, తొండంగి మండల కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారని, తుని మండలం, పట్టణానికి సంబంధించి తుని మండలం ఎస్.అన్నవరం పార్టీ కార్యాలయం వద్ద ఆ ప్రతులను దగ్ధం చేయనున్నట్టు తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి -
పెళ్లి రోజు నాడే తిరిగిరాని లోకాలకు..
అన్నవరం: వివాహ వార్షికోత్సవం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలసి సత్యదేవుని సన్నిధికి వచ్చిన ఓ భక్తుడు.. ఆలయం నుంచి వెలుపలకు వచ్చిన కొద్దిసేపటికే గుండెపోటుకు గురయ్యాడు. ఆసుపత్రికి తరలిస్తూండగా మార్గం మధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. అత్యంత విషాదకరమైన ఈ సంఘటన మంగళవారం ఉదయం జరిగింది. దేవస్థానం వర్గాల సమాచారం ప్రకారం.. అన్నవరం సమీపంలోని బెండపూడికి చెందిన మద్దుకూరి బుచ్చిబాబు (55) పెళ్లి రోజు మంగళవారం. ఆ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలసి రత్నగిరికి ఆయన వచ్చారు. సత్యదేవుని వ్రతమాచరించి, స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం, పశ్చిమ రాజగోపురం వెలుపలి ప్రాంగణంలోకి రాగానే గుండెపోటు రావడంతో కింద పడిపోయారు. భార్య, కుమార్తె భయాందోళనతో గట్టిగా కేకలు వేయడంతో ఓ భక్తుడొకరు వచ్చి ఆయన ఛాతీపై గట్టిగా నొక్కుతూ సీపీఆర్ చేశారు. పరిస్థితిని గమనించిన దేవస్థానం సెక్యూరిటీ అధికారి ఆకుల ప్రసాదరావు 108కు ఫోన్ చేశారు. నిమిషాల వ్యవఽధిలోనే కొండ దిగువ నుంచి వచ్చిన అంబులెన్సులో బుచ్చిబాబును కొండ దిగువ దేవస్థానం ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్య సిబ్బంది.. ఆయన మార్గం మధ్యలోనే మృతి చెందినట్టు తెలిపారు. బుచ్చిబాబుకు భార్య, కుమార్తె ఉన్నారు. ఆయన మృతదేహాన్ని బెండపూడిలోని నివాసానికి తరలించారు. రత్నగిరిపై భక్తుల రద్దీ అన్నవరం: రత్నగిరికి మంగళవారం సుమారు 40 వేల మంది భక్తులు తరలివచ్చారు. దీంతో, ఆలయంలో రద్దీ ఏర్పడింది. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. వ్రతాలు 2 వేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 5 వేల మంది సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సాధారణంగా స్వామి సన్నిధికి మంగళవారం భక్తులు తక్కువగా వస్తారు. కానీ, విద్యా సంస్థలకు త్వరలో వేసవి సెలవులు ముగియనుండటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సాధారణ భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు. జోసా కౌన్సెలింగ్పై అవగాహన రాజమహేంద్రవరం రూరల్: కాతేరులోని తిరుమల విద్యాసంస్థల ప్రాంగణంలో మంగళవారం జరిగిన జోసా/సి–శాబ్ కౌన్సెలింగ్ 2026 అవేర్నెస్ ప్రోగ్రామ్కు సుమారు 4000 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారని చైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం ప్రకటించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలలో తమ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారన్నారు. ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ, బీఐటీఎస్ లాంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో తమ రాజమహేంద్రవరం క్యాంపస్ నుంచి 780 మంది విద్యార్థులు అడ్మిషన్లు సాధించగలరన్నారు. జోసా కౌన్సెలింగ్లో ఆప్షన్లు ఎలా పెట్టుకోవాలి, ఏ బ్రాంచ్లలో సీట్లు వస్తాయో విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి, తాడేపల్లిగూడెం ఎన్ఐటీ డీన్ డాక్టర్ వీరేష్ కుమార్ పాల్గొన్నారు.ఫ సత్యదేవుని సన్నిధిలో భక్తుడికి గుండెపోటు ఫ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి -
రైతులకు కుచ్చుటోపీ!
పొలంలో వంటావార్పు చేపట్టిన రైతులుమోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ నిరసన తెలుపుతున్న రైతులుపిఠాపురం రూరల్: కౌలు, తనఖా పేరుతో బత్తిన పద్మరాజు అనే వ్యక్తి తమను మోసం చేశాడని మండలంలోని మల్లాం, జల్లూరు గ్రామాలకు చెందిన కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పద్మరాజుకు చెందిన పదెకరాల పొలంలో సుమారు 50 మంది రైతులు మంగళవారం వంటావార్పు నిర్వహించి, నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మల్లాం గ్రామానికి చెందిన పద్మరాజు ఒకే భూమిని పలువురి వద్ద తనఖా పెట్టి.. ఒక్కొక్కరి వద్ద రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ వసూలు చేశాడని ఆరోపించారు. తిరిగి అదే భూమిని వేరొకరికి కౌలుకు ఇచ్చాడని, ఇలా సుమారు రూ.2.50 కోట్లకు పైగా వసూలు చేసి, కాకినాడ రూరల్ ప్రాంతానికి పరారయ్యాడని తెలిపారు. డబ్బులివ్వాలని ఎన్నిసార్లు అడిగినా ఇవ్వడం లేదని, పైగా తమ పైనే బెదిరింపులకు దిగాడని చెప్పారు. దీనిపై నాలుగేళ్లుగా సీఐ నుంచి కలెక్టర్ స్థాయి అధికారి వరకూ ఆశ్రయించినా.. సివిల్ వివాదమంటూ ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, కుటుంబ అవసరాలకు దాచుకున్న డబ్బును పెట్టుబడిగా పెట్టామని, ఇదిగో అదిగో అంటూ ఏళ్ల తరబడి తమను ముప్పుతిప్పలు పెడుతున్నాడని, ఈ మోసం కారణంగా తాము తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ డబ్బులు తిరిగి ఇవ్వకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని, మోసం చేసిన వ్యక్తిపై తగు చర్యలు తీసుకుని, తమ డబ్బు ఇప్పించాలని అధికారులను వేడుకుంటున్నామని అన్నారు. ఫ ఒకే భూమి పలువురికి కౌలుకు.. ఫ మోసపోయిన రైతులు ఫ పొలంలోనే వంటావార్పు -
రెండేళ్ల పాలన.. వెన్నుపోటుకే సరి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్రంలో చంద్రబాబు రెండేళ్ల పాలన ప్రజలకు వెన్నుపోటు పొడవడంతోనే సరిపోయిందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కి, డైవర్షన్ పాలిటిక్స్తో నిలువునా మోసం చేస్తున్న సీఎం చంద్రబాబుపై సమరశంఖం పూరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అడుగడుగునా ప్రజలను వంచించేందుకు కుట్రలు, కుతంత్రాలే అజెండాగా సాగుతున్న కూటమి రెండేళ్ల వెన్నుపోటు పాలనపై ముందున్నదంతా ఇక పోరుబాటేనని ప్రకటించారు. ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పోస్టర్, బుక్లెట్లను పార్టీ జిల్లా నేతలతో కలసి కాకినాడలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, ప్రశ్నించినా, సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత భావాలను వ్యక్తం చేసినా.. పోలీసులను అడ్డం పెట్టుకుని రెడ్బుక్ రాజ్యాంగంతో వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు వెన్నుపోటుకు నిరసనగా.. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఈ నెల 4 నుంచి 12వ తేదీ వరకూ దశలవారీ ఆందోళనలు చేపడుతున్నామని చెప్పారు. ఈ నెల 4న మండల కేంద్రాల్లో టీడీపీ మేనిఫెస్టోను దహనం చేస్తామన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై యువత, రైతులు, మేధావులు, బాధితులు, మహిళలతో ఈ నెల 8న నియోజకవర్గ కేంద్రాల్లో ఇండోర్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 12న నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు చేపడుతున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనకు జనం విసుగెత్తిపోయారన్నారు. వివిధ సమస్యలపై వైఎస్సార్ సీపీ ఇస్తున్న పిలుపునకు స్పందించి, ఊహించిన దానికంటే రెట్టింపు జనాలు తరలి వస్తూండటమే దీనికి నిదర్శనమని చెప్పారు. 2019–24 మధ్య వైఎస్సార్ సీపీ అందించిన జనరంజక పాలనను కాదని.. అధికారం కోసం కూటమి కట్టి వచ్చిన పార్టీలకు పట్టం కట్టి చాలా తప్పు చేశామనే అభిప్రాయంలో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారని అన్నారు. హామీల అమలులో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు వైఎస్సార్ సీపీ శ్రేణులు శక్తివంచన లేకుండా కృషి చేయాలని రాజా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జగ్గంపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్ తోట నరసింహం, ప్రత్తిపాడు కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు, పార్టీ జిల్లా బూత్ కమిటీల పర్యవేక్షకుడు ఒమ్మి రఘురామ్, యువజన విభాగం గోదావరి జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ తోట శ్రీరాంజీ, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీప్తి కుమార్, పార్టీ కాకినాడ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాగిరెడ్డి అరుణ్ కుమార్ (బన్నీ), బీసీ సెల్ అధ్యక్షుడు అల్లి రాజబాబు, లక్ష్మీప్రియ తదితరులు పాల్గొన్నారు.బుధవారం శ్రీ 3 శ్రీ జూన్ శ్రీ 2026ఫ సమరశంఖం పూరించేందుకు ప్రజలు సిద్ధం ఫ 4న మండల కేంద్రాల్లో టీడీపీ మేనిఫెస్టో దహనం ఫ 8న నియోజకవర్గ కేంద్రాల్లో సమావేశాలు ఫ 12న నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు ఫ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఫ ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పోస్టర్ ఆవిష్కరణ -
పొమ్మన లేక కొరివి
పేదలు నివాసం ఉండటానికి వీలు లేకుండా చేయడానికే మా స్థలాల్లో చెత్త నుంచి విద్యుదుత్పత్తి చేసే పరిశ్రమకు అనుమతి ఇచ్చారు. 2,300 మంది ఒకేచోట ఇళ్లు నిర్మించుకుంటే అదో ఊరుగా మారుతుంది. దాంతో జగన్కు పేరు వస్తుందనే అక్కసుతోనే ఈ పని చేశారు. న్యాయం కోసం పోరాటం చేస్తాం. – లయిశెట్టి అమ్మోజీ, మర్లావ, పెద్దాపురం మండలం పరిశ్రమను తొలగించాలి మా స్థలాల వద్ద ఏర్పాటు చేస్తున్న చెత్తతో విద్యుత్తు ఉత్పత్తి పరిశ్రమను వెంటనే తొలగించాలి. ఇళ్ల నిర్మాణానికి రుణాలివ్వాలి. – సీత, బి.తాటిపర్తి, పెద్దాపురం మండలం -
ఉష్ణ తాపం.. వరుణ రాగం
బోట్క్లబ్ (కాకినాడ సిటీ)/కరప: ఉదయమంతా ఉక్కపోత, వేడిగాలులతో ఇబ్బంది పడుతున్న ప్రజలు.. మంగళవారం మధ్యాహ్నం కురిసిన వాన జల్లులతో సేద తీరారు. కాకినాడ నగరంతో పాటు కరప మండల ప్రజలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకూ తీవ్రమైన ఎండ, వేడి గాలులతో ఆపసోపాలు పడ్డారు. ఈ తరుణంలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆకాశంలో కారుమబ్బులు కమ్ముకున్నాయి. దీంతో, కరపలో పగలే చీకటిగా మారింది. ఉన్నట్టుండి చల్లని గాలులతో ఉరుములతో కూడిన వర్షం కురవడంతో ప్రజలు ఉపశమనం పొందారు. చిన్నారులు బయటకు వచ్చి, కేరింతలు కొట్టారు. అయితే, వర్షం కారణంగా కాకినాడలోని పలు ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయి ఇబ్బందులు పడ్డారు. ఈదురు గాలుల కారణంగా పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగి పడటంతో పాటు లోతట్టు ప్రాంతాల్లో వాన నీరు పెద్ద ఎత్తున ప్రవహించడంతో ప్రయాణికుల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. -
డాక్టర్ అనిరుధ్కు 8 బంగారు పతకాలు
కాకినాడ క్రైం: వైద్య విద్యలో కాకినాడ కీర్తిపతాక రాష్ట్ర స్థాయిలో రెపరెపలాడింది. రంగరాయ వైద్య కళాశాల(ఆర్ఎంసీ)లో 2024లో వైద్య విద్య పూర్తి చేసిన నగరానికి చెందిన వైద్య విద్యార్థి డాక్టర్ అత్తలూరి సాయి అనిరుధ్ ఏకంగా 8 బంగారు పతకాలు సాధించి, యూనివర్సిటీ టాపర్గా నిలిచారు. ఒకే విద్యార్థి ఇన్ని బంగారు పతకాలు సాధించడం ఆర్ఎంసీయే కాదు.. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం జరిగిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, వైస్ చాన్సలర్ చంద్రశేఖర్లు అనిరుధ్కు ఈ పతకాలను ప్రదానం చేశారు. రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడు అత్తలూరి విష్ణువర్ధన్, కాకినాడకు చెందిన ప్రసూతి వైద్యురాలు ఏఎల్ సత్యవతి దంపతుల కుమారుడైన అనిరుధ్ తల్లిదండ్రుల సమక్షంలో ఈ విశిష్ట గౌరవాన్ని అందుకున్నారు. నీట్లో మంచి ర్యాంకు సాధించిన ఆయన.. మణిపూర్లో తన తండ్రి పీజీ చదివిన ప్రతిష్టాత్మక కస్తూర్బా వైద్య కళాశాలలో ఎండీలో పీజీ సీటు సాధించి, ప్రస్తుతం ఫస్టియర్ చదువుతున్నారు. -
నా ఆస్తి ఇవ్వకుండా వేధిస్తున్నారు
● జనసేన నాయకుడిపై కోడలి ఆరోపణ ● కుమార్తెతో కలిసి పాడా కార్యాలయం ఎదుట నిరసన పిఠాపురం రూరల్ : తనకు రావాల్సిన ఆస్తి అడుగుతుంటే తన మామ, జనసేన నాయకుడు అయిన గరగ సత్యానందం వేధింపులకు గురి చేస్తున్నారని పిఠాపురం మండలం గోకివాడకు చెందిన గరగ కృష్ణ స్వాతి ఆరోపించారు. తనకు న్యాయం కావాలని, తన కుమార్తెతో కలిసి పిఠాపురం పాడా కార్యాలయం ఎదుట సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ చట్టబద్ధంగా తనకు రావలసిన ఆస్తి హక్కులను కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భర్త గరగ జగన్నాథ్ 2021లో కోవిడ్తో మరణించారని, భర్త మరణానంతరం తనను మానసికంగా, ఆర్థికంగా మామ సత్యానందం వేధిస్తున్నారని ఆరోపించారు. ఆయన పిఠాపురం జనసేన నాయకుడు కావడంతో జనసేన కార్యాలయంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. కుమార్తెను పోషించడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కృష్ణ స్వాతి తెలిపారు. భర్త చనిపోయిన సమయంలో తన వద్ద నుంచి తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్నారని, మామగారే కదా అని నమ్మి సంతకం పెట్టానని, ఆస్తి కోసం ఇంత మోసం చేస్తారని కలలో కూడా ఊహించలేదని కంటతడి పెట్టారు. స్థానిక జనసేన నాయకులు తనకు అండగా నిలవకుండా మామ సత్యానందానికే మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. మంగళగిరి, చేబ్రోలులోని పార్టీ కార్యాలయాల్లో ఫిర్యాదు చేశానని, హైదరాబాద్లో పవన్ నివాసానికి రెండుసార్లు వెళ్లానని అయినా తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు, తన చిన్న కుమార్తెకు రక్షణ కల్పించి జీవన భరోసా ఇవ్వాలని కోరుకుంటున్నానని తెలిపారు. వినతి పత్రం ఇస్తామంటే 8 గంటలు నిర్బంధించారు – ఎస్ఎఫ్ఐ నాయకుల ఆవేదన తుని రూరల్: విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడికి వినతి పత్రం ఇస్తామంటే తుని రూరల్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించారని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఈ మేరకు జిల్లా ఎస్ఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులు, సహాయ కార్యదర్శి సీహెచ్ లోవరాజు, ఎం.గంగాసూరిబాబు, పి.సత్యం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎంను కలసి వినతి పత్రం అందించేందుకు పోలీసులను అనుమతి కోరామన్నారు. అందుకు అంగీకరించని పెద్దాపురం డీఏస్పీ ఆధ్వర్యంలో ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తుని రూరల్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం దుర్మార్గమని, రాజ్యాంగ విరుద్దమన్నారు. అధికారులు, ప్రభుత్వం స్పందించి జిల్లాలో ఉన్న సంక్షేమ హాస్టళ్లకు పక్కా భవనాలు నిర్మించాలని, కోటనందూరు, తొండంగి, రౌతులపూడి, ప్రత్తిపాడు, యు.కొత్తపల్లి, పెదపూడి మండలాల్లో జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆదికవి నన్నయ్య పీజీ సెంటర్ను కాకినాడలో మినీ యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేసి అన్ని కోర్సులు ఏర్పాటు చేయాలన్నారు. తుని, పిఠాపురం, జగ్గంపేట నియోజకవర్గాలలో పీజీ కళాశాలలు ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాలలు, కళాశాలల సమయాలకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులు నడపాలన్నారు. డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్థులకు సంవత్సరం మొత్తానికి బస్పాసులు జారీ చేయాలన్నారు. -
లో వోల్టేజీ సమస్య పై ప్రకంపనలు
అన్నవరం: వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో విద్యుత్ సమస్యపై సాక్షి దినపత్రికలో ఆదివారం ‘రత్నగిరి పై కరెంటు కష్టాలు’ శీర్షికన ప్రచురితమైన వార్త ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిపై రాష్ట్ర విద్యుత్ శాఖ తూర్పు డివిజన్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) సీఎండీ ఫృథ్వీతేజ్ స్పందించి, కాకినాడ జిల్లా విద్యుత్ శాఖ అధికారులను వివరణ ఇవ్వాలని ఆదేశించారు. విద్యుత్ శాఖ నాణ్యమైన విద్యుత్నే దేవస్థానానికి సరఫరా చేస్తోందని దేవస్థానం కేబుల్స్లోనే సమస్య ఉండ వచ్చునని సీఎండీకి విద్యుత్ శాఖ కాకినాడ జిల్లా సూపరింటెండెంట్ ఇంజినీర్ జీ ప్రసాద్ వివరణ ఇచ్చారు. విద్యుత్ సమస్యను దేవస్థానం అధికారులే పరిష్కరించుకోవాలని దేవస్థానం సబ్స్టేషన్ కు నిర్ధేశించిన 11 కేవీ విద్యుత్ నిరంతరాయంగా సరఫరా చేస్తున్నామని తెలిపారు. దీంతో దేవస్థానంలో విద్యుత్ లో వోల్టేజీ సమస్యకు కారణమెవరు అనే దానిపై గందరగోళం ఏర్పడింది. విద్యుత్ విజిలెన్స్ అధికారుల తనిఖీలు దేవస్థానంలో లో ఓల్టేజీ సమస్య పై అటు దేవస్థానం, ఇటు విద్యుత్ శాఖ అఽధికారులు భిన్న వాదనలు వినిపిస్తుండడంతో వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు దేవస్థానంలో విద్యుత్ సరఫరాపై తనిఖీలు చేయాలని విద్యుత్ విజిలెన్స్ అధికారులను ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఫృద్వీరాజ్ ఆదేశించారు. దీంతో సోమవారం విజిలెన్స్ అధికారులు రత్నగిరి సబ్స్టేషన్లో విద్యుత్ సరఫరాపై తనిఖీలు నిర్వహించారు. లో వోల్టేజీ సమస్య పై దేవస్థానం, విద్యుత్ శాఖ అధికారులు రత్నగిరి సబ్ స్టేషన్లో ఉమ్మడిగా మంగళవారం తనిఖీలు నిర్వహించనున్నారు. -
ప్రమాణాలు పాతాళంలో..
● టెన్త్లో 3,942 మంది ఫెయిల్ ● సైన్స్, మ్యాథ్స్, సోషల్లోనే ఎక్కువ మంది వెనుకబాటు ● అమ్మ భాషలోనూ అపజయమే బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పదో తరగతి ఫలితాలను విశ్లేషిస్తే మన విద్యా వ్యవస్థలోని డొల్లతనం బయట పడక మానదు. ప్రత్యేక తరగతులు, వంద రోజుల ప్రణాళిక అంటూ ఎంత హడావుడి చేసినా ఎక్కువ మంది విద్యార్థులు మ్యాథ్స్, సైన్స్లో ఫెయిలయ్యారు. చివరకు అమ్మ భాష అయిన తెలుగులో సైతం తక్కువ మార్కులే పొందారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో తెలుసుకోవచ్చు. చదవలేని, రాయలేని స్థితిలో చాలా మంది విద్యార్థులున్నట్లు ఫలితాలను బట్టి తెలుస్తోంది. ఫెయిలైన విద్యార్థుల సంఖ్యను పరిశీలిస్తే ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విద్యా ప్రమాణాలు పతనమవుతున్నట్లు స్పష్టమవుతోంది. కారణమేమిటో! గత నెలలో విడుదలైన పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో జిల్లావ్యాప్తంగా 3,942 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేకపోయారు. వీరిలో ప్రైవేటు విద్యా సంస్థలకు చెందిన వారు 458 మాత్రమే ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అంతమంది విద్యార్థులు ఎందుకు వెనుకబడ్డారనే అంశం విద్యా శాఖలో చర్చనీయాంశంగా మారింది. సరైన పర్యవేక్షణ లేకపోవడమా లేక బోధనా పద్ధతుల్లో లోపమా అనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఎక్కువ మంది విద్యార్థులు సైన్స్, గణితం, సోషల్, తెలుగు సబ్జెక్టుల్లో ఫెయిలయ్యారు. గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో ప్రాథమిక అవగాహన లేకపోవడమే విద్యార్థులు ఫెయిలవడానికి ప్రధాన కారణమని, బట్టీ పట్టే పద్ధతికి అలవాటు పడటంతో అప్లికేషన్ మెథడ్ ప్రశ్నలకు సమాధానాలు రాయలేకపోయారని విద్యావేత్తలు చెబుతున్నారు. చివరకు అమ్మ భాషలో సైతం ఎక్కువ మంది ఉత్తీర్ణులు కాలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అక్షర దోషాలు లేకుండా తెలుగులో రాయలేకపోవడం, వాక్య నిర్మాణం సరిగ్గా లేకపోవడంతో భాషా సబ్జెక్టుల్లో మార్కులు తగ్గుతున్నాయని అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల కంటే మెరుగైన సౌకర్యాలు, ట్యూషన్ సెంటర్లు ఉండే పట్టణ ప్రాంతాల్లోనే విద్యా ప్రమాణాలు అధ్వానంగా ఉన్నాయనే విషయాన్ని కూడా గుర్తించారు. స్మార్ట్ ఫోన్లు, సామాజిక మాధ్యమాలు అందుబాటులో ఉండటం, తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం వంటి కారణాలతో పట్టణ ప్రాంత విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని చెబుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వ విధానాలతో ప్రభుత్వ విద్యా రంగం తిరోగమనంలో పయనిస్తోందని విద్యావేత్తలు ఆరోపిస్తున్నారు. ఇంత మంది విద్యార్థులు ఫెయిలవడానికి మూలకారణాలను ఇప్పుడైనా సరిగ్గా గుర్తించి, సరి చేయకుంటే ప్రభుత్వ విద్యా రంగం మరింత అధోగతి పాలయ్యే ప్రమాదముంటుందని హెచ్చరిస్తున్నారు. పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు (ఫైల్) -
తాగునీటి ఇబ్బంది లేకుండా చర్యలు
గొల్లప్రోలులో పర్యటించిన పబ్లిక్ హెల్త్ అధికారులు పిఠాపురం: పిఠాపురం నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని పబ్లిక్ హెల్త్ ఎస్ఈ రత్నాకర్ రెడ్డి, ఈఈ శేషగిరిరావు తెలిపారు. ‘సాక్షి’లో ‘పవన్ ఇలాకాలో పానీ పాట్లు’ శీర్షికన సోమవారం వెలువడిన వార్తకు అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా అధికారులు గొల్లప్రోలులో ఏలేరు పంప్ హౌస్ దగ్గర నీటి నిల్వలను పరిశీలించారు. తాగునీటి ఎద్దడి ఏఏ ప్రాంతాల్లో ఉంది, దానికి తీసుకోవాల్సిన చర్యలపై స్థానికులతో అధికారులు మాట్లాడి వివరాలు సేకరించారు. ఏలేరు నుంచి నీటిని తీసుకురావడానికి అవసరమైన చర్యలపై కలెక్టర్తో చర్చిస్తామని తెలిపారు. మున్సిపల్ ఏఈ ఆలీషా పబ్లిక్ హెల్త్ ఏఈ రామ్మోహన్ తదితరులు ఉన్నారు. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో శ్రీప్రకాష్ విద్యార్థి ప్రతిభ తుని: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో శ్రీ ప్రకాష్ జూనియర్ కళాశాల విద్యార్థి జె.మోనిష్ కుమార్ ఓబీసీ కేటగిరిలో 167 ర్యాంకు, జనరల్ కేటగిరిలో 974 ర్యాంకు సాధించాడని ప్రిన్సిపాల్ వివిఎస్ఎస్.భానుమూర్తి సోమవారం తెలిపారు. శ్రీప్రకాష్లో స్కూల్ లెవెల్ నుంచి ఇస్తున్న పొసైటీ ఫర్ ప్రమోటింగ్ ఎకడమిక్ ఎక్స్లెన్స్ ఇన్ స్కూల్ (స్పేసెస్), శ్రీప్రకాష్ అచీవర్స్ అకాడమీ(స్పా) ఇంటిగ్రేటేడ్ ప్రోగ్రాం ద్వారా తమ విద్యార్థులు విజయాలు సాధిస్తున్నారన్నారు. ప్రతిభ చూపిన విద్యార్థిని విద్యాసంస్థల అధినేత సీహెచ్వీకె. నరసింహరావు, సంయుక్త కార్యదర్శి విజయ్ప్రకాష్, ఉపాధ్యాయులు అభినందించారు. -
తప్పుడు పనిపై నిప్పులు
● మెగా డీఎస్సీనా...దగా డీఎస్సీనా? ● బాబు సర్కార్పై నిరసన గళం ● కదం తొక్కిన వైఎస్సార్ సీపీ శ్రేణులు ● భారీ ప్రదర్శన, కలెక్టరేట్ వద్ద ధర్నా ● తొలుగ కలెక్టరేట్లోకి అనుమతించని పోలీసులు ● పట్టుబట్టి లోపలికి వెళ్లిన పార్టీ నేతలు సాక్షి ప్రతినిధి, కాకినాడ/బాలాజీచెరువు: మెగా డీఎస్సీని దగా డీఎస్సీ చేసిన చంద్రబాబు సర్కార్పై వైఎస్సార్ సీపీ శ్రేణులు నిప్పులు చెరిగాయి. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో భారీ ఎత్తున పార్టీ నేతలు, పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి జిల్లా పరిషత్ సెంటర్ మీదుగా పార్టీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్లెక్స్లు, బ్యానర్లతో ఆర్డీఓ కార్యాలయం, కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేశారు. దారి పొడవునా మెగా డీఎస్సీ కాదు, దగా డీఎస్సీ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ప్రదర్శనగా వచ్చిన పార్టీ నేతలు కలెక్టరేట్ గేటు బయట రోడ్డుపై బైఠాయించారు. కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద ధర్నాకు పోలీసులు నిలువరించినా పార్టీ నేతలు మూకుమ్మడిగా నిరసనను కొనసాగించారు. మెగా డీఎస్సీ–2025 నిర్వహణలో చోటు చేసుకున్న అవకతవకలు, అంతులేని అక్రమాలు, స్కాంలు, డీఎస్సీ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం చేసిన అన్యాయంపై నిరసన వ్యక్తం చేశారు. అభ్యర్థులకు చివరి వరకు మద్దతుగా నిలుస్తామని ప్రకటించారు. ప్రభుత్వంలో పెద్దలు డీఎస్సీని అడ్డంపెట్టుకుని వ్యాపారం చేశారని నినదించారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దోపిడీ రాజ్యం అంటూ నినాదాలు మిన్నంటాయి. ఈ కుంభకోణంపై వాస్తవాలు ప్రజల ముందుంచాలంటే సీబీఐ లేదా హైకోర్టు సిటింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు రావాలని పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం వైఎస్సార్ సీపీ నేతలు జిల్లా అధికారులకు విజ్ఞాపన అందచేసేందుకు కలెక్టరేట్ గేట్ వద్ద వెళ్లే సరికి పోలీసులు అడ్డుకుని ప్రధాన గేటు వేసేశారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్, మహిళా రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీప్తికుమార్, రాష్ట్ర యువజన విభాగం జాయింట్ సెక్రటరీ మల్లా కిషోర్ తదితరులు ఆధ్వర్యంలో గేటును తోసుకుంటూ కలెక్టరేట్ లోపలికి వెళ్లారు. అనంతరం కలెక్టరేట్లో అధికారులకు విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ఉద్యోగాలు అమ్మేశారు ఈ సందర్బంగా చంద్రకళాదీప్తికుమార్ మాట్లాడుతూ కూటమి నాయకులు నోట్ల కట్టలకు ఆశపడి అనర్హులకు ఉద్యోగాలు అమ్మేశారని ధ్వజమెత్తారు. హోంమంత్రి అనిత యువత కోసం ఉద్యోగాలు ఎదురుచూస్తున్నాయంటూ వాస్తవ విరుద్ధంగా మాట్లాడటం అన్యాయమన్నారు. ఉద్యోగాలు తామే ఇస్తామని గొప్పలు చెప్పడం కాదు, డీఎస్సీలో అర్హులైన అభ్యర్థులకు చిత్తశుద్ధితో న్యాయంచేస్తే అదే పదివేలన్నారు. సమాజ భవిష్యత్కు దిక్సూచిలా నిలిచే ఉపాధ్యాయులను తయారుచేసే డీఎస్సీలో చోటు చేసుకుంటోన్న అక్రమాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. టాలెంట్ ఉన్న అభ్యర్థులకు అన్యాయం చేస్తే ఆ ఉసురు ప్రభుత్వానికి తగలకుండా పోదన్నారు. భవిష్యత్లో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే సామర్థ్యం డీఎస్సీలో అక్రమ మార్గంలో వచ్చే ఉపాధ్యాయులకు ఉంటుందా అని రాగిరెడ్డి ప్రశ్నించారు. మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోననే విషయాన్ని సమాజంలో మేధావి వర్గం ఆలోచించాలన్నారు. విద్య విషయంలో భవిష్యత్ తరాలకు చంద్రబాబు ప్రభుత్వం ఏమి చెప్పాలనుకుంటోందని ఆమె నిలదీశారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పెద్దలకు అన్నీ తెలుసున్నా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో మీకు మేమున్నాం అని నీతులు చెప్పిన ప్రభుత్వం కోసం కూటమి కట్టిన నేతలు డీఎస్సీలో జరుగుతున్న అవకతవకలను నిలదీస్తుంటే బూతుల్లా వినపడుతున్నాయా అని ప్రశ్నించారు. ‘నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలి’– డీఎస్సీ అవకతవకలను వెంటనే సరిదిద్దాలి’ అంటూ భారీ ఎత్తున నినాదాలు చేసి కలెక్టరేట్లో మెమోరాండం అందించారు. ఆందోళన కార్యక్రమంలో ప్రచార సెల్ రాష్ట్ర కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు అల్లి రాజబాబు, పసుపులేటి చంద్రశేఖర్, కంపర బాబీ, పెద్దాపురం, ప్రత్తిపాడు, పిఠాపురం నియోజకవర్గాల పార్టీ యువజన విభాగం అధ్యక్షులు వీరంరెడ్డి నాని, సకురు గుర్రాజు, దాసం వెంకటేష్, యాసలపు పవన్, యువజన విభాగం సెక్రటరీ లక్ష్మీకాంత్, నేతలు హేమంత్, ఉలవల భూషణం, వాసిరెడ్డి చిన్ని, చిన్నారెడ్డి, బొమ్మరిల్లు రమేష్, గుత్తుల శ్రీనివాస్, పెదిరెడ్ల కృష్ణ, కురందాసు సతీష్, గుత్తు గుర్రాజు, మాగాపు గోపి, గరగ సురేష్ పాల్గొన్నారు. కలెక్టరేట్ మెయిన్ గేటు వద్ద ధర్నా చేస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్ ఎదుట ధర్నాలో పార్టీ అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్ తదితరులుకోర్టు ఉత్తర్వులు లెక్క చేయడం లేదు డీఎస్సీ కుంభకోణంపై రాష్ట్ర వ్యాప్తంగా గళమెత్తిన వైఎస్సార్ సీపీకి వ్యతిరేకంగా టీడీపీ సమావేశాలు నిర్వహిస్తోంది. వైఎస్సార్ సీపీకి మద్దతు పలికి డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్లు వస్తుంటే.. చంద్రబాబు ప్రభుత్వం తప్పును ఒప్పుకోకపోగా తిరిగి ఆసత్య ఆరోపణలు చేస్తోంది. కోర్టు ఉత్తర్వులను సైతం లెక్కచేయకుండా పాలన చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. – కురపాటి రమేష్, యువజన విభాగం నేత, వైఎస్సార్ సీీపీ డీఎస్సీలో అవకతవకలపై నిగ్గు తేల్చాలి డీఎస్సీలో జరిగిన అవకతవకలపై చంద్రబాబు ప్రభుత్వం నిగ్గు తేల్చాలి. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ప్రజల దృష్టి మళ్లించడానికి టీచర్లతో రాజకీయ సభ నిర్వహించి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. తప్పు జరగలేదని విద్యాశాఖ కమిషనర్ పాత్రికేయలు సమావేశం నిర్వహించి వివరణ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉంది. శాప్ చైర్మన్, టీడీపీ ఎమ్మెల్సీలు అంతా సక్రమమంగానే జరిగిందని ఉపన్యాసాలు ఇస్తున్నారు. – రావూరి వెంకటేశ్వరరావు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, ప్రచార సెల్. ఆధారాలున్నా అడ్డంగా బకాయింపు మెగా డీఎస్సీ–25లో అవకతవకలకు పాల్పడి ఉక్కిరిబిక్కిరి అవుతున్న చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా కథలు చెబుతోంది. కుంభకోణంపై ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన పక్కా ఆధారాలను చూపిస్తున్నా సరైన సమాధానం ఇవ్వడం లేదు. విద్యాశాఖ ఏర్పాటు చేసిన గ్రీవెన్స్లో సరైన సమాధానం లభించడం లేదు. శాప్కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పాటు ఆర్టీఐ ద్వారా సమాచారం కొరితే ఉద్దేశ పూర్వకంగా జాప్యం చేస్తూ పిటషనర్లను బెదిరిస్తున్నారు. – అల్లి రాజబాబు, మాజీ చైర్మన్, స్మార్ట్సిటీ కార్పొరేషన్, కాకినాడ -
సంపద కాదు.. అప్పులు సృష్టించారు
● సూపర్ సిక్స్ హామీలు, సంక్షేమం అందించడంలో విఫలం ● హత్యా రాజకీయాలు, కక్ష సాధింపుతో డైవర్షన్ పాలిటిక్స్ ● చంద్రబాబుపై మాజీ మంత్రి దాడిశెట్టి రాజా విమర్శలు తొండంగి: సంపద సృష్టిస్తానంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రానికి భారీగా అప్పులు మాత్రమే సృష్టిస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–సర్) కార్యక్రమంపై మండలంలోని పైడికొండ, అద్దరిపేట, వేమవరం, పి.అగ్రహారం గ్రామాల్లో బూత్ లెవెల్ ఏజెంట్ల(బీఎల్ఏ)తో ఆదివారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ, ఇష్టానుసారం అప్పులు చేస్తూ ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్నారని ధ్వజమెత్తారు. గత వైఎస్సార్ సీపీ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్లలో రూ.3.32 లక్షల కోట్లు మాత్రమే అప్పులు చేసి, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల కంటే ఎక్కువగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంతో పాటు ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారని గుర్తు చేశారు. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే రూ.3.60 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి, సంపదకు బదులు అప్పులు సృష్టించారని దుయ్యబట్టారు. సూపర్ సిక్స్ హామీలు, సంక్షేమ పథకాల అమలులో విఫలమయ్యారన్నారు. వీటికి సమాధానం చెప్పలేక హత్యా రాజకీయాలు, ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యల వంటి వాటిటో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలు రావడంతో ద్రవ్యోల్పణం పెరిగిందని, కానీ, ఇంటింటికీ సంక్షేమం అందించినట్టు చంద్రబాబు సొంత మీడియా ద్వారా కొండంత ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. జూన్ 12న నిర్వహిస్తున్న శ్రీవెన్నుపోటుకు రెండేళ్లుశ్రీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఓట్లు తొలగించే కుట్రకు అవకాశం కూటమి పాలనపై ప్రజలు రెండేళ్లకే విసుగు చెందారని, స్థానిక సంస్థలతో పాటు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని రాజా అన్నారు. ప్రజల విశ్వాసం పొందని నేపథ్యంలో సర్ ప్రక్రియను అవకాశంగా తీసుకుని వైఎస్సార్ సీపీ అనుకూల ఓట్లను తొలగించేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేసే అవకాశం ఉందని అన్నారు. అందువలన సర్ కార్యక్రమం సందర్భంగా బూత్ లెవెల్ అధికారులతో పాటు బీఎల్ఏలు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి, అర్హులైన ప్రజల ఓట్లు తొలగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తమ దృష్టికి తీసుకుని వస్తే ఎన్నికల కమిషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్తామని రాజా చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మడదా హేమంత్, పార్టీ తొండంగి మండల కన్వీనర్ బత్తుల వీరబాబు, రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి పెండ్యాల బాబీ, పార్టీ మండల ఉపాధ్యక్షుడు మేడిశెట్టి దారబాబు, వేమవరం మాజీ సర్పంచ్ మారేటి కృష్ణ, అద్దరిపేట మాజీ సర్పంచ్ కోడా వర్మ, రైతు విభాగం మండల అధ్యక్షుడు గోసుల సత్యనారాయణ, నియోజకవర్గ కల్చరల్ వింగ్ అధ్యక్షుడు మురాలశెట్టి సత్యనారాయణ, ఆర్టీఐ వింగ్ మండల అధ్యక్షుడు వీసం రామకృష్ణ, పలువురు నాయకులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీలో చేరిన టీడీపీ నేతలు కూటమి పాలనపై విసుగుతో పైడికొండ పంచాయతీ ఆనూరు గ్రామానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు రాజా సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఊటకోటి వరహాలు, ఊటకోటి రాజేష్ తదితరులకు రాజా పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో కష్టపడి పని చేసిన వారికి గుర్తింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ బత్తుల వీరబాబు, ఉపాధ్యక్షుడు మేడిశెట్టి దారబాబు, నాయకులు కాశిందేవుల శ్రీనివాస్, జక్కా వరహాలు తదితరులు పాల్గొన్నారు. -
అలా.. హామీల జెల్ల
● ఉమ్మడి జిల్లాకు పలు సందర్భాల్లో చంద్రబాబు వాగ్దానాలు ● నేటికీ అతీగతీ లేని వైనం ● నేడు చామవరంలో సీఎం పర్యటన సాక్షి ప్రతినిధి, కాకినాడ: గత సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగాను, ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన తరువాత చంద్రబాబు నాయుడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పలుమార్లు పర్యటించారు. ఆ సందర్భంగా ఎడాపెడా అనేక హామీలు ఇచ్చారు. అవేవీ ఆచరణకు నోచుకున్న దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. కాకినాడ జిల్లా తుని మండలం చామవరం గ్రామంలో సోమవారం ఆయన పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి వస్తున్నారంటే జనం గంపెడాశతో ఎదురు చూస్తూంటారు. ఆయన చెప్పిన మాటలు, ఇచ్చిన వాగ్దానాలు ఇక్కడి నుంచి వెళ్లిన నెలకో, రెండు నెలలకో కార్యరూపం దాలుస్తాయని ఆశిస్తారు. కానీ, గతంలో పలు సందర్భాల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకూ అమలుకు నోచలేదు. సీఎం పర్యటన సందర్భంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఇలా తమకు జెల్ల కొట్టడం మాని, ఈసారైనా ఇచ్చిన హామీల అమలుపై చంద్రబాబు స్పష్టత ఇవ్వాలని ఉమ్మడి జిల్లా వాసులు కోరుకుంటున్నారు. కాకినాడ జిల్లాకు జెల్ల గతంలో కాకినాడ జిల్లా పెద్దాపురంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఆ సందర్భంగా అక్కడి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని (సీహెచ్సీ) 100 పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేస్తామని హామీ ఇచ్చారు. దీనిపై ఒక్క ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కాకినాడ తీరంలో పారిశ్రామికీకరణను పరుగులు పెట్టిస్తామని చెప్పారు. కానీ, ఒక్క పరిశ్రమ కూడా ఇప్పటి వరకూ పట్టాలెక్కిన దాఖలాల్లేవు. కాకినాడ ఎస్ఈజెడ్లో పరిశ్రమలు తెస్తానన్న హామీ కూడా గాల్లో కలిసిపోయింది. కోనసీమ.. ఒట్టి మాటలేనమ్మా..! సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్లు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం వచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కోనసీమను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని, కొబ్బరి అనుబంధ పరిశ్రమలు తెస్తామని ఘనంగా ప్రకటించారు. అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లవుతున్నా ఇటు పర్యాటక అభివృద్ధీ లేదు.. అటు కొత్తగా కొబ్బరి అనుబంధ పరిశ్రమల ఊసూ లేదు. పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగానే ఉండటంతో ‘సీమ’ ప్రజలు పెదవి విరుస్తున్నారు. సీఎం అయిన తరువాత చంద్రబాబు గత ఏడాది మే 31న కాట్రేనికోన మండలం చెయ్యేరులో జరిగిన పీ4 కార్యక్రమానికి వచ్చారు. ఆ సందర్భంగా చెయ్యేరు చెరువు అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఉపాధి హామీ నిధులు రూ.3 కోట్లతో చేపట్టిన పనులు ఏడాదవుతున్నా ఇప్పటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. స్వయంగా సీఎం చెప్పిన పనులకే దిక్కూమొక్కూ లేకుండా పోతే ఎలాగని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ‘తూర్పు’ తిరిగి దండమే.. గత ఏడాది ఏప్రిల్ 18న, ఈ ఏడాది చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో పర్యటించారు. ఆయా సందర్భాల్లో నిడదవోలులో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి హామీ ఇచ్చారు. నిడదవోలు పట్టణం పాటు ఆ మండలంలోని 23, చాగల్లు మండలంలోని 10 గ్రామాల ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉండే ఈ ఆసుపత్రి నిర్మాణంపై ఇప్పటికీ ఎటువంటి స్పష్టతా లేదు. ఎర్ర కాలువపై కంసాలపల్లి – మాధవరం వంతెన, టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు. చంద్రబాబు హామీ ఎప్పుడు అమలవుతుందా అని 1,152 మంది టిడ్కో లబ్ధిదారులు ఇప్పటికీ ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నారు. వంతెన నిర్మాణం ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంతో నిడదవోలు మండలం కంసాలపల్లి, తాడేపల్లిగూడెం మండలం మాధవరం తదితర గ్రామాల రైతులు నిరాశ చెందుతున్నారు. అలాగే, గత ఏడాది జూలై 1న తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించారు. ఆ సందర్భంగా 5 ఎత్తిపోతల పథకాల మోటార్లు, పంపుల మరమ్మత్తులకు నిధుల మంజూరు, కొవ్వూరు డిగ్రీ కాలేజీకి భవనాలు, మౌలిక వసతుల కల్పన, కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల నుంచి 100 పడకలకు అప్గ్రేడ్ చేయడం వంటి హామీలిచ్చారు. అలాగే, చెంతనే గోదావరి ప్రవహిస్తున్నా కొవ్వూరు నియోజకవర్గ ప్రజలకు ఆ నది నీరు గుక్కెడు కూడా అందని సమస్యపై సానుకూలంగా స్పందించారు. కానీ, ఇవేవీ నేటికీ ఆచరణకు నోచుకోలేదు. గతంలో ఇచ్చిన హామీలేమయ్యాయని జనం అడుగుతున్నారు సార్!ఇంకా.. సార్వత్రిక ఎన్నికల సమయంలో 2024 జనవరి 10న కాకినాడ జిల్లా తుని మండలం చామవరం గ్రామంలో చంద్రబాబు పర్యటించారు. ఆ సందర్భంగా అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై లేనిపోని నిందలు మోపారు. మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని, రూ.50 బాటిల్ను రూ.200కు అమ్ముతున్నారని ఆరోపించారు. కానీ, ఆయన గద్దెనెక్కిన రెండేళ్లుగా బీరు, బ్రాందీ, విస్కీ ఇలా ఏ బ్రాండ్ మద్యమైనా ప్రతి బాటిల్పై మద్యం మాఫియా రూ.10 నుంచి రూ.20 వరకూ అదనంగా దోచుకుంటున్నా కనీస స్పందన కూడా లేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తామని, అప్పటి వరకూ ప్రతి నెలా రూ.3 వేల భృతి చెల్లిస్తామని ఉమ్మడి జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు పదేపదే హామీ ఇచ్చారు. కానీ, ఆయన గద్దెనెక్కిన తరువాత ఆ హామీ కాస్తా గాల్లో కలసిపోయిందని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఉద్యోగాలు, అటు భృతి ఎంతమందికి ఇచ్చారో చెప్పాలని నిలదీస్తున్నారు. తాజా పర్యటన సందర్భంగా గత హామీలపై చంద్రబాబు ఏం చెప్తారో.. కొత్తగా ఏ మాటల గారడీతో మభ్యపెడతారోనని అంటున్నారు. -
మండుటెండలో.. నిండైన భక్తితో..
తుని రూరల్: ఓవైపు ఎండ మండిపోతున్నా గుండెల నిండా నింపుకొన్న భక్తితో తలుపులమ్మ అమ్మవారి దర్శనానికి ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన 26 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని దేవస్థానం ఈఓ పి.విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,73,895, పూజా టికెట్లకు రూ.4,66,290, తలనీలాలకు రూ.20 వేలు, వాహన పూజలకు రూ.6,390, పొంగలి షెడ్లు, కాటేజీలు, వసతి గదుల అద్దెలు రూ.88,965, విరాళాలు రూ.17,335 కలిపి మొత్తం రూ.7,72,875 ఆదాయం సమకూరిందని వివరించారు. ఆలయ పునర్నిర్మాణ పనుల తర్వాత క్యూ లైన్లపై పూర్తి స్థాయిలో షెడ్లు నిర్మించలేదు. దీంతో, పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు ఆలయం చుట్టూ మండుటెండలో నిలబడలేక విలవిలలాడిపోయారు. చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. షెడ్లు వేయకపోతే వేసవిలోనే కాకుండా వర్షాకాలంలో సైతం ఇబ్బందులు తప్పవని, వెంటనే వీటిని నిర్మించాలని భక్తులు కోరారు. నేడు సీఎం పర్యటన తుని రూరల్: పింఛన్ల పంపిణీ, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుని మండలం చామవరంలో సోమవారం పర్యటించనున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవిల్లిలోని తన నివాసం నుంచి ఉదయం 10 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 10.50 గంటలకు చామవరం చేరుకుంటారు. ప్రజావేదిక సమావేశం, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొంటారు. పింఛన్దార్లతో 10 నిమిషాలు మాట్లాడుతారు. తరువాత స్థానిక నాయకులతో సమావేశమై, 4.25 గంటలకు హెలికాప్టర్లో ఉండవిల్లికి బయలుదేరుతారు. నేటి పీజీఆర్ఎస్ రద్దు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కలెక్టరేట్లో ప్రతి వారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను ఈ సోమవారం రద్దు చేశారు. తుని మండలం చామవరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తుని పర్యటిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘రంగరాయ’ ప్రిన్సిపాల్గా బాధ్యతల స్వీకరణ కాకినాడ క్రైం: స్థానిక రంగరాయ వైద్య కళాశాల (ఆర్ఎంసీ) ప్రిన్సిపాల్గా డాక్టర్ ప్రయాగ ఉషాకిరణ్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఆర్ఎంసీ ఫార్మకాలజీ విభాగాధిపతిగా సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయనకు తాజాగా వైద్య విద్య అదనపు సంచాలకుడిగా (ఏడీఎంఈ) ఉద్యోగోన్నతి లభించింది. ఈ మేరకు ఆయనను కళాశాల ప్రిన్సిపాల్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సత్యదేవుని ఆలయం.. భక్తజన సంద్రంఅన్నవరం: సత్యదేవుని ఆలయం ఆదివారం భక్తజన సంద్రమే అయ్యింది. వందలాది వాహనాల్లో భక్తులు ఉదయం నుంచీ రావడంతో రత్నగిరి, సత్యగిరి పార్కింగ్ స్థలాలు నిండిపోయాయి. ఘాట్ రోడ్డుకు ఇరువైపులా సైతం వాహనాలను నిలిపివేయడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. సుమారు 50 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 3 వేల వ్రతాలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో 6 వేల మంది సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సూర్య భగవానుడు 40 డిగ్రీల సెల్సియస్కు పైబడిన ఉష్ణోగ్రతతో చెలరేగిపోవడంతో భక్తులు అల్లాడిపోయారు. చెట్ల నీడన, విశ్రాంతి మండపాల్లోను సేద తీరారు. ఆలయం చుట్టూ గ్రీన్ షేడ్ ఏర్పాటు చేసినప్పటికీ ఉష్ణోగ్రత 30 డిగ్రీలకు పైబడితే వేడి దిగిపోయి, భక్తులు ఆపసోపాలు పడుతున్నారు. ఆలయం చుట్టూ షెడ్డు నిర్మిస్తే ఉపశమనంగా ఉంటుందని, అధికారులు దీనిపై దృష్టి పెట్టాలని భక్తులు కోరుతున్నారు. -
దేవస్థానమే పరిష్కరించుకోవాలి
● రత్నగిరి విద్యుత్ సమస్యపై వివరణ కోరిన ఈపీడీసీఎల్ సీఎండీ ● నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామన్న ఎస్ఈ ● కేబుల్స్ సరి చూసుకోవాలని దేవస్థానానికి సూచన అన్నవరం: ‘రత్నగిరిపై కరెంటు కష్టాలు’ శీర్షికన ‘సాక్షి’ ఆదివారం ప్రచురించిన కథనానికి ఏపీ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) సీఎండీ పృథ్వీతేజ్ స్పందించారు. ఈ సమస్యపై జిల్లా విద్యుత్ శాఖ అధికారులతో ఆయన ఆదివారం సమీక్షించారు. లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు నాణ్యమైన విద్యుత్నే సరఫరా చేస్తున్నామని, దేవస్థానం కేబుల్స్లోనే సమస్య ఉండవచ్చునంటూ సీఎండీకి వివరణ ఇచ్చినట్టు ఈపీడీసీఎల్ ఎస్ఈ జి.ప్రసాద్ ‘సాక్షి’కి తెలిపారు. దేవస్థానం సబ్ స్టేషన్కు నిర్దేశించిన 11 కేవీ విద్యుత్ నిరంతరాయంగా సరఫరా చేస్తున్నామని, లో ఓల్టేజీ లేదని అన్నారు. అందువలన రత్నగిరిపై విద్యుత్ సమస్యను దేవస్థానమే పరిష్కరించుకోవాలని సీఎండీకి వివరించామని తెలిపారు. దేవస్థానం సబ్ స్టేషన్కు హంసవరంలోని సబ్ స్టేషన్ నుంచి నేరుగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పారు. కావాలంటే తమ వద్ద రికార్డు అయిన విద్యుత్ సరఫరా డేటాను దేవస్థానానికి అందజేస్తామని తెలిపారు. సబ్ స్టేషన్ మీటర్లో కూడా 11 కేవీ విద్యుత్ వస్తోందని తెలిపారు. అక్కడి నుంచి దేవస్థానంలోని వ్రత మండపాలకు, లిఫ్టుకు లో ఓల్టేజీ సరఫరా కావడానికి దేవస్థానం కేబుల్స్లో లోపం కారణమై ఉండవచ్చని సీఎండీకి చెప్పామన్నారు. దేవస్థానం అధికారులు ఇప్పటికై నా తమ కేబుల్స్ సరి చూసుకోవాలని ప్రసాద్ సూచించారు. కొనసాగిన లో ఓల్టేజీ సమస్య సత్యదేవుని ఆలయంలో రూ.2 వేల వ్రత మండపాల్లో లో ఓల్టేజీ కారణంగా ఆదివారం కూడా ఏసీలు పని చేయలేదు. దీంతో, ఆ వ్రతాలాచరించిన భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సెంట్రల్ ఏసీ పని చేయకపోతే కనీసం తాత్కాలికంగా స్ల్పిట్ ఏసీలైనా బిగించాలని కోరుతున్నారు. -
పవన్ ఇలాకాలో పానీపాట్లు
● పిఠాపురం నియోజకవర్గంలో తాగునీటికి కటకట ● గొంతెండుతున్న పలు కాలనీల ప్రజలు క్యూ కట్టిన మంచినీటి డ్రమ్ములు ఈ చిత్రంలో ఉన్న ట్యాంకులు, డ్రమ్ములను చూశారా! ఇవి ఏదో నిల్వ చేసుకోడానికి ప్రజలు తమ ఇళ్ల ముందు ఏర్పాటు చేసుకున్నవని అనుకుంటే పొరపాటే. గొల్లప్రోలు నగర పంచాయతీలో తీవ్ర మంచినీటి ఎద్దడి ఏర్పడింది. ఎప్పుడు వస్తుందో తెలియని మున్సిపల్ ట్యాంకర్ కోసం పడిగాపులు పడలేక పట్టణంలోని కొత్త కాలనీ వాసులు.. ఇళ్లపై పెట్టుకునే వాటర్ ట్యాంకులను, డ్రమ్ములను ఇలా తమ ఇళ్ల ముందు పెట్టుకున్నారు. మున్సిపల్ ట్యాంకర్ వచ్చి ఆయా ట్యాంకులు, డ్రమ్ముల్లో నీరు నింపితే.. వాటిని స్థానికులు బిందెలతో తమ ఇళ్లకు మోసుకుంటున్నారు. పవన్ ఇలాకాలో తీవ్రమైన మంచినీటి సమస్యకు ఈ చిత్రం నిదర్శనం. పిఠాపురం: పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్టుగా ఉంది పిఠాపురం నియోజకవర్గ పరిస్థితి. పేరుకు ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం. రూ.వందల కోట్లతో అభివృద్ధి చేశామని ఇక్కడి జనసేన నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ, నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలు గుక్కెడు మంచినీళ్లు దొరకక నరకం చవి చూస్తున్నారు. రోజూ డబ్బులు పెట్టి తాగునీరు కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్ప డిందని వాపోతున్నారు. పిఠాపురం మండలం కుమారపురం; కొత్తపల్లి మండలం ఉప్పాడ, సుబ్బంపేట; గొల్లప్రోలు మండలం కొడవలి, చెందుర్తి, గొల్లప్రోలు నగర పంచాయతీ 20వ వార్డు ఈబీసీ కాలనీ, జగనన్న కాలనీల వాసులు తాగునీటికి అల్లాడుతున్నారు. పలు ప్రాంతాల్లోని కుళాయిల నుంచి వారం రోజులుగా నీరు రావడం లేదు. ట్యాంకర్ పంపించాలని అధికారులకు విన్నవించుకున్నా ఫలితం శూన్యం. గొల్లప్రోలు ఈబీసీ కాలనీ జనాభా సుమారు 2,500. ఈ ప్రాంతంలో ఇంతమంది జీవిస్తున్నా తాగునీరు సక్రమంగా అందించకపోతే ఎలాగని అక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గొల్లప్రోలు జగనన్న కాలనీలో ఇళ్లపై ఉండాల్సిన నీటి ట్యాంకులతో పాటు డ్రమ్ములను ఇళ్ల ముందు పెట్టుకుని, వాటర్ ట్యాంకు రాక కోసం ఇంటిల్లిపాదీ పడిగాపులు పడాల్సి వస్తోంది. అలాగే, 13 వేల జనాభా ఉన్న ఉప్పాడ గ్రామంలో నీటి ఎద్దడి తీవ్రమవడంతో స్థానికులు ఇటీవల ఖాళీ బిందెలతో ఆందోళనకు దిగారు. ఆయా ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు నిర్మించిన ఓవర్హెడ్ ట్యాంకులు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 4 గంటల మధ్యన కుళాయిల నుంచి నీరు వదులుతున్నారని, అది కూడా మురికిగా వస్తోందని, ఏ రోజు ఎప్పుడు వస్తుందో తెలియడం లేదని కాలనీ వాసులు ఆవేదన చెందుతున్నారు. అసలే వేసవి కాలం కావడం.. ఓవైపు కరెంట్ కోతలు, మరోవైపు తాగునీటి సమస్యతో నియోజకవర్గ ప్రజలు నానా అవస్థలూ పడుతున్నారు. గొల్లప్రోలు ఈబీసీ కాలనీలో ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతున్న మహిళలు కొత్తపల్లి మండలం ఉప్పాడలో ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించిన మహిళలువారం రోజులుగా ఇబ్బందులు కుళాయిల నుంచి నీరు అస్సలు రావడం లేదు. మా కాలనీకి మంచినీటి ట్యాంకర్ కూడా రావడం లేదు. వారం రోజులుగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నాంం. అధికారులకు విన్నవించినా ఫలితం లేదు. కనీసం తాగునీరైనా ఇప్పించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. – కట్టోజు కృష్ణకుమారి, ఈబీసీ కాలనీ, గొల్లప్రోలు రాత్రి వేళ ఇస్తున్నారు మా కాలనీలో కొద్ది రోజులుగా కుళాయిలు రావడం లేదు. ట్యాంకర్తో కూడా నీరు ఇవ్వడం లేదు. అప్పుడప్పుడు కుళాయిల నుంచి రాత్రి వేళల్లో నీరు ఇస్తున్నారు. అవి కూడా మురికిగా వస్తున్నాయి. పగటి పూట మంచినీరు ఇవ్వాలి. తాగునీరు లేక చిన్న పిల్లలతో ఇబ్బందులు పడుతున్నా. – టి.కామాక్షి, ఈబీసీ కాలనీ, గొల్లప్రోలు ఎదురుచూపులే.. కూలి పనులు చేసుకుని జీవిస్తున్నాం. కుళాయి లేకపోతే మంచినీటి ట్యాంకర్ ఎప్పుడు వస్తాయోనని ఎదురు చూడాల్సిన పరిస్థితి. పనికి సమయానికి వెళ్లాలి. నీటి కోసం ఎదురు చూస్తూంటే పనులకు ఎప్పుడు వెళ్లాలో అధికారులే చెప్పాలి. అర్ధరాత్రి కుళాయిలు ఇస్తున్నారు కానీ, అవి మా వరకూ చేరడం లేదు. – మలిరెడ్డి అమ్ములు, ఈబీసీ కాలనీ, గొల్లప్రోలు -
రత్నగిరికి పోటెత్తిన భక్తులు
అన్నవరం: సత్యదేవుని ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. సుమారు 40 వేల మంది భక్తులు రావడంతో క్యూలు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం భక్తులతో రద్దీగా మారాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. 2,200 వ్రతాలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. సుమారు 5 వేల మంది సత్యదేవుని అన్న ప్రసాదం స్వీకరించారు. పవన్ వైఖరి ప్రచారార్భాటమే.. రాజమహేంద్రవరం సిటీ: పేపర్ మిల్లు రసాయన వ్యర్థాల నుంచి గోదావరి జలాలను, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడతానన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వైఖరి ఒట్టి ప్రచారార్భాటమేనని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ విమర్శించారు. రాజమహేంద్రవరంలోని ఆ పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ, గోదావరిని ప్రక్షాళన చేస్తానన్న పవన్ కల్యాణ్.. రాజమహేంద్రవరం దాటిన వెంటనే మాట మార్చారన్నారు. 262 పంచాయతీలను మురుగు రహితంగా తీర్చిదిద్దాలనడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదన్నారు. పేపర్ మిల్లు తెరచి ఉండగా కాలుష్య రహిత పుష్కరాలు సాధ్యమేనా అనే విషయం పవన్కు అర్థం కాలేదన్నారు. ఈ మాత్రం దానికి మంత్రి, కలెక్టర్లపై విరుచుకుపడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. రాజమహేంద్రవరంలో ఒకలా.. అమరావతిలో మరోలా మాట్లాడటానికి కారణమేమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పవన్ మాటలు వింటూంటే పేపర్ మిల్లు యాజమాన్యం ఆయనను రహస్యంగా కలిసిందా అనే అనుమానం కలుగుతోందన్నారు. గోదావరి జల, వాయు కాలుష్యాలు పవన్ శాఖ పరిధిలోనివేనని, కానీ, పర్యాటక మంత్రి దుర్గేష్పై చిర్రుబుర్రులాడటం ఆయనకే చెల్లిందని విమర్శించారు. గోదావరి జల, వాయు కాలుష్యం ప్రక్షాళనకయ్యే మొత్తం ఖర్చును పేపర్ మిల్లు యాజమాన్యమే భరించాలని, ఈ మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గోదావరి డెల్టాకు నేటి నుంచి సాగునీరు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఖరీఫ్ సాగు నిమిత్తం ధవళేశ్వరం బ్యారేజీ నుంచి గోదావరి కాలువలకు ఆదివారం నుంచి నీరు విడుదల చేయాలని జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం నిర్ణయించింది. కాలువల మరమ్మతుల పరిస్థితిని బట్టి దశల వారీగా నీరు విడుదల చేయనున్నారు. జాయింట్ కలెక్టర్ మేఘ స్వరూప్ అధ్యక్షతన కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్ల మరమ్మతులు, పరిరక్షణ చర్యలకు సుమారు రూ.148 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. ఇరిగేషన్ ఎస్ఈ జి.శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఖరీఫ్లో సాగునీటి కొరత తలెత్తే పరిస్థితి ఉండదని చెప్పారు. అక్టోబర్ 31వ తేదీ వరకూ సాగు, తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. -
కమ్మని చిలుకదుద్దు పండ్లు
రాజవొమ్మంగి: చిట్టడవుల్లో సహజ సిద్ధంగా కనిపించే అనేక రకాల పండ్లలో చిలుకదుద్దు ప్రధానమైంది. ఇవి ఎరుపు రంగులో చెర్రీ పండ్ల మాదిరిగా ఉంటాయి. తీయగా.. కొంత వగరుగా ఉండే ఈ పండ్లు అంటే గిరిజన చిన్నారులకు ఎంతో ఇష్టం. అడవి పనులకు వెళ్లేవారు తమ పిల్లల కోసం వీటిని సేకరించి ఇంటికి తీసుకొస్తారు. సాధారణంగా రక్షిత అటవీ ప్రాంతంలో వేసవి మొదలు తొలకరి ప్రవేశించే వరకూ లభించే రకరకాల పండ్లలో చిలకదుద్దు ఒకటి. ప్రకృతి సిద్ధంగా అడవిలో లభించే రకరకాల పండ్ల జాతి చెట్లు రానురాను అంతరించిపోతున్నాయన్న ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతోంది. పిల్లలకే కాదు, ఎన్నో అరుదైన పక్షుల ఆహార కొరతను తీర్చే ఈ పండ్ల చెట్లను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. -
రత్నగిరిపై కరెంటు కష్టాలు
● సబ్ స్టేషన్ ఉన్నా తప్పని ఇబ్బంది ● లో ఓల్టేజీతో పని చేయని ఏసీలు, లిఫ్టు ● కాలిపోతున్న మోటార్లు ● భక్తులకు ఇక్కట్లు అన్నవరం: సత్యదేవుని భక్తులకు విద్యుత్ కష్టాలు తప్పడం లేదు. దేవస్థానంలో విద్యుత్ సబ్ స్టేషన్ ఉన్నప్పటికీ లో ఓల్టేజీ సమస్యతో ఒక్కోసారి సత్రాల్లో ఫ్యాన్లు తిరగడం లేదు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఏసీలు సైతం పని చేయడం లేదు. దేవస్థానం ఏటా రూ.1.30 కోట్ల మేర విద్యుత్ బిల్లు చెల్లిస్తోంది. గతంలో ఈ బిల్లు రూ.3 కోట్ల వరకూ ఉండేది. అయితే, సోలార్ పవర్ ప్లాంటు ఏర్పాటు చేశాక సగానికి పైగా బిల్లు భారం తగ్గినా.. భక్తులకు మాత్రం విద్యుత్ కష్టాలు పెరిగాయనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇవీ సమస్యలు ● ఓవైపు వేసవి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్కు పైబడి నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రూ.2 వేల వ్రతాలు చేయించుకుంటున్న భక్తులు.. ఆ మండపాల్లో ఏసీలు పని చేయకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్రతం టికెట్టు రూ.1,500, ఏసీ ఖర్చు రూ.500 అని చెప్పి వసూలు చేస్తున్నా ఏసీలు పని చేయకపోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ● వృద్ధులు, దివ్యాంగుల కోసం సత్యదేవుని ప్రధానాలయం వెనుక లిఫ్టు ఏర్పాటు చేశారు. లో ఓల్టేజీ కారణంగా ఆ లిఫ్టు ప్రస్తుతం సరిగ్గా పని చేయడం లేదు. తరచుగా మధ్యలో ఆగిపోతూండటంతో భక్తులు భయాందోళనలు చెందుతున్నారు. శనివారం రెండుసార్లు ఇలాగే జరిగింది. విద్యుత్ సరఫరాను ఆపి, మళ్లీ ఆన్ చేయడంతో లిఫ్టు పని చేసింది. ● పంపా నది ఒడ్డున ఉన్న బోర్ల నుంచి నిత్యం రత్నగిరిపై ఉన్న వాటర్ ట్యాంకులకు నీటిని పంపింగ్ చేస్తూంటారు. ఈ మోటార్లు లో ఓల్టేజీ కారణంగా కాలిపోతున్నాయి. ఈ వేసవి మొదలయ్యాక ఇప్పటి వరకూ ఆరు మోటార్లు ఈవిధంగా కాలిపోయాయి. దీంతో రత్నగిరిపై నీటి సమస్య ఉత్పన్నమవుతోంది. వ్యవసాయ అవసరాలకు మళ్లింపు గతంలో కూడా దేవస్థానంలో లో ఓల్టేజీ సమస్య తలెత్తింది. అప్పట్లో రత్నగిరిపై సబ్ స్టేషన్ నిర్మిస్తే ఈ సమస్య తీరుతుందని విద్యుత్ శాఖ అధికారులు చెప్పారు. ఆ మేరకు దేవస్థానం స్థలం ఇవ్వడంతో మూడేళ్ల క్రితం తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మించింది. దాని పైన విద్యుత్ శాఖ అధికారులు అతిథి గృహం కూడా నిర్మించుకున్నారు. సబ్ స్టేషన్ ఏర్పాటుతో దేవస్థానానికి విద్యుత్ సమస్య ఉండదని అందరూ భావించారు. కానీ, సమస్య యథాతథంగా కొనసాగుతోంది. ఈ సబ్ స్టేషన్లో నాలుగు ఫీడర్లున్నాయి. వీటిలో రెండు ఫీడర్ల నుంచి మాత్రమే దేవస్థానానికి విద్యుత్ సరఫరా చేస్తున్నారు. మిగిలిన రెండు ఫీడర్ల నుంచి పగలంతా వ్యవసాయ విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దేవస్థానం అవసరాలకు విద్యుత్ చాలడం లేదని దేవస్థానం అధికారులు అభిప్రాయపడుతున్నారు. అలాగే, రత్నగిరిపై ఉన్న 33/11 కేవీ సబ్ స్టేషన్కు ప్రస్తుతం అన్నవరంలోని సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా చేస్తున్నారు. దీంతో, తమకు అవసరమైనప్పుడు వారు రత్నగిరికి సరఫరా కావాల్సిన విద్యుత్ను వాడుకుంటున్నారు. అలా కాకుండా రత్నగిరికి నేరుగా విద్యుత్ సరఫరా చేస్తే ఈ సమస్య పరిష్కారమవుతుందని దేవస్థానం అధికారులు చెబుతున్నారు. పగటి పూట దేవస్థానానికి సుమారు 400 ఓల్టుల సామర్థ్యంతో విద్యుత్ సరఫరా జరగాలి. కానీ, 370 ఓల్టులు మాత్రమే వస్తోందని అధికారులు అంటున్నారు. అందువల్లనే రత్నగిరిపై పగటి వేళ విద్యుత్ సమస్య ఉత్పన్నమవుతోందని, రాత్రి వేళ ఇబ్బంది ఉండటం లేదని చెబుతున్నారు. ఈపీడీసీఎల్ ఎస్ఈకి లేఖ దేవస్థానంలో లో ఓల్టేజీ సమస్యపై ఏపీ ఈపీడీసీఎల్ ఎస్ఈకి లేఖ రాశాం. సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కరించాలని కోరాం. దేవస్థానం విద్యుత్ అధికారులు కూడా దీనిపై నేరుగా ఎస్ఈని కలిసి ఫిర్యాదు చేయాలని ఆదేశించాను. – నల్లం సూర్యచక్రధరరావు, ఈఓ, అన్నవరం దేవస్థానం -
ఊ.. అంటారా.. ఊహూ అంటారా?
● చంద్రబాబును కలవనున్న ఎయిర్పోర్టు బాధిత రైతులు ● ఆయన స్పందనపై సర్వత్రా ఆసక్తితొండంగి: అన్నవరం పుణ్యక్షేత్రానికి కూతవేటు దూరంలో ప్రతిపాదించిన ఎయిర్పోర్టును ఇక్కడి నుంచి మరోచోటుకు తరలించాలని బాధిత గ్రామాలైన అన్నవరం, బెండపూడి, పీఈ చిన్నాయపాలెం రైతులు కోరుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం తుని మండలం హంసవరం రానున్న సీఎం చంద్రబాబును వారు కలవనున్నారు. మూడు గ్రామాల్లో రెండు పంటలు పండే దాదాపు 1,200 ఎకరాల భూములు సేకరించి, ఎయిర్పోర్టు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ మూడు గ్రామాల రైతులు సాగరమాల, రైల్వే లైన్, పుష్కర, పోలవరం కాలువలతో పాటు జాతీయ రహదారి బైపాస్కు భూములిచ్చి నష్టపోయారు. ఇప్పుడు మళ్లీ ఎయిర్పోర్టు నిర్మాణం పేరిట తమ భూములు లాక్కొనే ప్రయత్నాలను నిరసిస్తూ బాధిత రైతులు ఉద్యమబాట పట్టారు. వాస్తవానికి ఇక్కడ ఎయిర్పోర్టు ప్రతిపాదన లేదంటూ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్తో పాటు ఈ ప్రాంత కూటమి నాయకులు గత ఏడాది ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఈ ఏడాది ఈ ప్రతిపాదన మళ్లీ తెర పైకి రావడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఈ భూముల విలువ ప్రస్తుతం రూ.కోట్లలో ఉంది. ఈ నేపథ్యంలో రైతులందరూ తొండంగి మండలానికి చెందిన కూటమి పార్టీ నేతకు ఎకరాకు రూ.లక్ష చొప్పున ‘తాంబూలం’ చెల్లించుకుని మరీ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా తమ భూములను కమర్షియల్ కన్వర్షన్లు చేసుకున్నారు. బెండపూడి, పీఈ చిన్నాయపాలెం ప్రాంతాల్లో భారీగా లే అవుట్లు కూడా ఏర్పాటయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మళ్లీ ఎయిర్పోర్టు ప్రతిపాదన రావడంతో వారు కలవరపడుతున్నారు. ఎయిర్పోర్టు ఏర్పాటును వ్యతిరేకిస్తూ బాధిత రైతులు కలెక్టర్, స్థానిక తహసీల్దార్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులకు ఇప్పటికే వినతిపత్రాలు సమర్పించారు. ఇటీవల రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ జగ్గంపేట రానున్నారని తెలియడంతో ఆయనను కలిసేందుకు సన్నద్ధమయ్యారు. అయితే, ఆయన పర్యటన రద్దయ్యింది. కాగా, సోమవారం హంసవరం రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి తమ గోడు వినిపించుకోవాలని బాధిత రైతులు నిర్ణయించారు. సీఎం రైతుల మొర ఆలకించి ఊ.. అంటారా.. లేక ఉఉ.. అంటారా అనేది వేచి చూడాల్సిందే. అధికారుల్లో సందిగ్ధత! ఎయిర్పోర్టు ప్రతిపాదిత భూములకు పోలవరం, పుష్కర కాలువలతో పాటు దక్షిణాన రైల్వే లైను, తూర్పున సాగరమాల ప్రాజెక్టు రహదారి, ఉత్తరాన జాతీయ రహదారి సరిహద్దులుగా ఉన్నాయి. దీంతో పాటు అన్నవరం పుణ్యక్షేత్రం నో ఫ్లై జోన్లో ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎయిర్పోర్టు ఏర్పాటుకు ప్రతికూల అంశాలే ఎక్కువగా ఉన్నాయనే ఆలోచనలో అధికార యంత్రాంగం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది తేలాల్సి ఉంది. -
పల్లెవించని పాలన
● పంచాయతీ ఎన్నికలు జరపని సర్కారు ● ప్రత్యేకాధికారుల పాలనతో ఇబ్బందులు ● సమస్యలతో గ్రామీణులు సతమతం సాక్షి ప్రతినిధి, కాకినాడ: రెండేళ్ల చంద్రబాబు సర్కారు పాలనపై దాదాపు అన్ని వర్గాల్లోనూ తీవ్ర అసంతృప్తి పెల్లుబుకుతోంది. దీంతో, పాలక వర్గాల పదవీ కాలం ముగిసి 2 నెలలు దాటిపోయినా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సాహసం చేయలేకపోతోంది. పల్లెల్లో ప్రత్యేకాధికారుల పాలన తీసుకు వచ్చింది. మండల కేంద్రాల్లో వివిధ శాఖల్లో పని చేస్తున్న ఒక్కో అధికారికి రెండు మూడు గ్రామ పంచాయతీలు సైతం అప్పగించారు. ఇప్పటికే శాఖా పరమైన పనులతో సతమతమవుతున్న వారికి.. అద నంగా అప్పజెప్పిన పల్లె పాలనపై దృష్టి సారించే వీలు చిక్కడం లేదు. ఫలితంగా ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయి, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తప్పని ప్రదక్షిణలు పాలక వర్గాలు లేకపోవడంతో గ్రామ పంచాయతీల్లో ఏ చిన్న పనికై నా గ్రామ కార్యదర్శికే బాధ్యత ఉంటోంది. అయితే, గ్రామ సర్పంచ్లకుండే చెక్పవర్, సీఎంఎఫ్ఎస్ లాగిన్ను ప్రభుత్వం ప్రత్యేకాధికారులకు అప్పగించింది. ఫలితంగా కార్యదర్శులు చిన్నచిన్న పనులకు బిల్లులు, చెక్కులు తీసుకుని మండల కేంద్రా ల్లో ఉంటున్న ప్రత్యేకాధికారుల వద్దకు వెళ్లాల్సి వస్తోంది. వారు అందుబాటులో లేకపోతే కాళ్లరిగేలా ప్రదక్షిణలు తప్పడం లేదు. పంచాయతీలో నిధులున్నా ప్ర త్యేకాధికారులు సకాలంలో ఆమోదం తెలియజేయకపోవడంతో ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తోందని కార్యదర్శులు వాపోతున్నారు. ఏదైనా పనిపై వెళ్తే రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. చివరకు రూ.100 ఖర్చు చేయాలన్నా ప్రత్యేకాధికారి వద్దకు వెళ్లాల్సి వస్తోంది. ఆర్థిక పరిపుష్టి కలిగిన గ్రేడ్–1 (మేజర్) గ్రామ పంచాయతీలు సొంత నిధులతో నెట్టుకొస్తున్నాయి. గ్రేడ్–2, గ్రేడ్–3 కేటగిరీల్లోని చిన్న పంచాయతీల్లో కనీసం డ్రైన్లు, మంచినీటి ట్యాంకులు, పైపులైన్ల మరమ్మతులు, వీధి దీపాల ఏర్పాటు వంటి పనులు కూడా చేయలేకపోతున్నామని కార్యదర్శులు ఆవేదన చెందుతున్నారు. స్థానికులు పదేపదే తమ దృష్టికి వివిధ సమస్యలు తెస్తున్నా ఏమీ చేయలేక వారు చేతులెత్తేస్తున్నారు. మరోవైపు ప్రతి చిన్న సమస్యకు మండల కేంద్రాలకు వెళ్లడం భారంగా మారిందని స్థానికులు మండిపడుతున్నారు. కొన్ని సమస్యలివిగో.. ● ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలంలోని పలు గ్రామాల్లో తాగునీటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పైపులైన్లు దెబ్బ తిన్నా పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడు. అమీనాబాద్, నాగులాపల్లి తదితర గ్రామాల ప్రజలు తాగునీటి సమస్యతో సతమతమవుతున్నారు. ● ఇదే మండలం యండపల్లిలో విద్యుత్ లో ఓల్టేజీ సమస్యకు పరిష్కారమే లభించడం లేదు. దీనిని నిరసిస్తూ అక్కడి ప్రజలు కొత్తపల్లి సబ్ స్టేషన్ను ముట్టడించారు. ● కరప మండలం సిరిపురంలో ఇటీవల మంచినీటి మోటార్ కాలిపోయింది. పంచాయతీలో నిధులు లేకపోవడంతో స్థానికంగా యువకులు చందాలు వేసుకుని మరమ్మతులు చేయించాల్సి వచ్చింది. ● జగ్గంపేట, గండేపల్లి, పిఠాపురం, కరప తదితర మండలాల్లోని పలు గ్రామాల్లో పారిశుధ్య కార్మికులకు మూడు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. దీంతో, పారిశుధ్య పరిస్థితులు దిగజారాయి. కార్యదర్శుల పైనే భారం పాలక వర్గాలున్నప్పుడు పంచాయతీ నిధులు, రాబడి మాటెలా ఉన్నా ప్రజా వ్యతిరేకతకు భయపడి సర్పంచులు, వార్డు సభ్యులు సొంత నిధులు వెచ్చించే వారు. తరువాత వచ్చే బిల్లులు డ్రా చేసుకుని సర్దుబాటు చేసుకునే వారు. ఇప్పుడు పాలక వర్గాలు లేకపోవడంతో పాలన భారమంతా కార్యదర్శుల పైనే పడింది. మూడు నెలల వేతన బకాయిలు చెల్లించకపోతే పని చేయబోమని పారిశుధ్య కార్మికులు చెప్తే.. ఒక్కొక్కరికి రూ.వెయ్యి, రూ.2 వేలు చేతిలో పెట్టి ప్రస్తుతానికి సరిపెట్టుకోండంటూ వారు బుజ్జగిస్తున్న పరిస్థితి. మంచినీటి పైపులైన్ల మరమ్మతులు, బ్లీచింగ్, ఫినాయిల్ తదితర అవసరాలకు సొంత సొమ్ము ఖర్చు చేయాల్సి వస్తోంది. చిన్న పంచాయతీలకు స్వల్ప ఖర్చులతో బయట పడుతున్నారు. కానీ, గ్రేడ్–1 పంచాయతీలకు ప్రతి నెలా రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకూ ఖర్చవుతోంది. కొన్ని సందర్భాల్లో వడ్డీకి అప్పులు తెచ్చి మరీ ఖర్చు పెట్టాల్సి వస్తోందని కార్యదర్శులు వాపోతున్నారు. రెండు నెలలుగా జీతం సొమ్ము ఇంటికి తీసుకెళ్లిన పరిస్థితి లేకుండా పోయిందని కరప మండలంలో పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ పంచాయతీ కార్యదర్శి ఆవేదన వ్యక్తం చేశారు.జిల్లాలో గ్రామ పంచాయతీలు గ్రేడ్–1 76 గ్రేడ్–2 70 గ్రేడ్–3 80 గ్రేడ్–4 39 గ్రేడ్–4 (అడిషనల్) 30 గ్రేడ్–5 (500 జనాభా మినహా) 89 500 కంటే తక్కువ జనాభా 1 మొత్తం 385 ఒరిగిందేమీ లేదు ప్రత్యేకాధికారులతో గ్రామాలకు ఒరిగిందేమీ లేదు. వారు గ్రామాల్లో అడపాదడపా కనిపిస్తున్నారు. ప్రజల కనీస సమస్యలు కూడా గుర్తించడం లేదు. గ్రామ కార్యదర్శులు వీధులను శుభ్రం చేయించడం, డ్రైన్లలో చెత్త తీయించడంతో సరిపెట్టేస్తున్నారు. ఏదైనా సమస్య చెప్తే నిధుల్లేవు, కొత్త పాలకవర్గం రావాలని అంటున్నారు. గ్రామాల్లో పాలన పడకేసింది. – చింతా బుజ్జి, పెదకొత్తూరు, కరప మండలం తాగునీటి సమస్యకు పరిష్కారమే లేదు కుళాయిల నుంచి తాగునీరు సక్రమంగా రావడం లేదు. వారంలో రెండు మూడు రోజులు వస్తే గొప్ప అన్నట్టుగా ఉంది. ఒకవేళ వచ్చినా అది మురికి నీటితో కలుషితమై వస్తోంది. గత్యంతరం లేక ప్రైవేటు వాటర్ ప్లాంట్ల నుంచే నీరు తెచ్చుకుంటున్నాం. ఈ సమస్యపై గ్రామ, మండల అధికారులకు మొర పెట్టుకున్నా ఫలితం లేదు. ప్రత్యేకాధికారుల పాలన అంటే ఇదా? – ఆలపు సుధారాణి, ఎండపల్లి, ఉప్పాడ కొత్తపల్లి మండలం -
ఇళ్ల స్థలాలు కబ్జా చేస్తే ఉద్యమం
● వైఎస్సార్ సీపీ నేత దవులూరి దొరబాబు ● రామేశం మెట్టపై పేదలకిచ్చిన స్థలాల పరిశీలన సామర్లకోట: వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదలకిచ్చిన ఇళ్ల స్థలాలను కబ్జా చేస్తే ప్రజా ఉద్యమం చేస్తామని వైఎస్సార్ సీపీ పెద్దాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు హెచ్చరించారు. పెద్దాపురం మండలంలోని 12 గ్రామాలకు చెందిన 2,300 మంది పేదలకు అప్పట్లో రామేశం మెట్ట వద్ద ఇళ్ల స్థలాలిచ్చారు. ఆ స్థలాలను ఆక్రమిస్తూ కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారనే సమాచారం మేరకు.. లబ్ధిదారులతో కలిసి దొరబాబు శనివారం ఆ భూములను పరిశీలించారు. అక్కడికి సమీపంలోనే చెత్తతో విద్యుదుత్పత్తి చేసే జిందాల్ కంపెనీ నిర్మాణం జరుగుతూడటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పేదలకిచ్చిన స్థలాల్లో ఏవిధంగా పరిశ్రమ నిర్మిస్తారని ఆ కంపెనీ అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వ అనుమతి మేరకే పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నామని వారు చెప్పారు. ఈ భూములను పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇచ్చారని, దానిలో టీడీపీ, జనసేన, వైఎస్సార్ సీపీకి చెందిన లబ్ధిదారులున్నారని దొరబాబు తెలిపారు. గతంలో డిప్యూటీ సీఎంగా, నేడు ఎమ్మెల్యేగా ఉన్న నిమ్మకాయల చినరాజప్ప ఒక్క సెంటు భూమి కూడా పేదలకు ఇప్పించకపోగా.. పేదలకు రిజిస్ట్రేషన్ చేసిన భూములను పరిశ్రమకు కేటాయించడం దారుణమని మండిపడ్డారు. పరిశ్రమకు కేటాయించిన భూములతో పాటు పేదల ఇళ్ల స్థలాల్లోని రాళ్లను సైతం తొలగించారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ చెత్త వేయడంతో ఏవిధంగా ఇళ్లు నిర్మించుకుని జీవించగలమని ప్రశ్నించారు. ఈ సందర్భంగా దొరబాబు విలేకర్లతో మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో 2,300 మంది లబ్ధిదారులకు ఒకటిన్నర సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేసి, పట్టాలు ఇచ్చామని చెప్పారు. ప్రతి లబ్ధిదారు స్థలం విలువ రూ.10 లక్షలుంటుందన్నారు. పరిశ్రమ నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, అయితే పేదల స్థలాలే కావలసి వచ్చాయా అని ప్రశ్నించారు. కాలుష్య పరిశ్రమతో ఆ ప్రాంతంలో పేదలు ఇళ్లు నిర్మించుకుని, జీవించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ పట్టాలు పొందిన ప్రతి ఒక్కరికీ మరోచోట అనువైన స్థలాలు ఇచ్చేంత వరకూ తాము ప్రజా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. అనంతరం, దొరబాబు లబ్ధిదారులతో కలసి రామేశం మెట్ట నుంచి పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. ఆర్డీఓ లేకపోవడంతో పరిపాలనాధికారి కేవీ మాధవరావుకు సమస్య వివరించి, వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి నెక్కంటి సాయిప్రసాద్, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు గోపు మురళి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఇనకొండ విష్ణుచక్రం, జిల్లా ప్రధాన కార్యదర్శి బండారు వీరబాబు, జిల్లా సహాయ కార్యదర్శి నరాలశెట్టి త్రినాథ్, సీనియర్ నాయకులు గోలి రామారావు, ఆకుల వీరబాబు, పల్లా గంగారావు, పరిమి శ్రీనివాస్, బోనాసు గుర్రాజు, ఆనూరి స్వామి, కనపర్తి సీమదొర, పాగా సురేష్ కుమార్, ఇరుసుమళ్ల సాయి తదితరులు పాల్గొన్నారు. పేదల స్థలాలే దొరికాయా? జగన్మోహన్రెడ్డి ఇచ్చిన సెంటున్నర స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి ఇటీవల కుటుంబ సభ్యులతో కలసి వెళ్తే.. అక్కడ చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే పరిశ్రమ నిర్మాణం జరుగుతోంది. మా స్థలాల్లోకి వెళ్లడానికి కూడా సెక్యూరిటీ సిబ్బంది అనుమతించలేదు. ఈ దారుణాన్ని అడ్డుకోవాలి. పరిశ్రమ నిర్మాణానికి పేదల స్థలాలే దొరికాయా? – దువ్వాడ మణి, బి.తాటిపర్తి, పెద్దాపురం మండలం ఇళ్ల స్థలాల్లో చెత్త వేశారు పేదలకిచ్చిన ఇళ్ల స్థలాల్లో చెత్త వేశారు. అక్కడ భరించలేని చెడు వాసన వస్తోంది. పరిశ్రమ సమీపంలో ఇళ్లు కట్టుకుని జీవించలేని పరిస్థితి. జగన్బాబు మాకు రిజిస్ట్రేషన్ చేసి మరీ స్థలాలు ఇచ్చారు. సొంతిల్లు లేని మాకు ఇంటి స్థలం వచ్చిందనే ఆనందం కూడా లేకుండా చేస్తున్నారు. న్యాయం చేయాలి. – గుర్లింకల కుమారి, సిరివాడ, పెద్దాపురం మండలం -
దొంగల భయంతో యువకుల గస్తీ
తుని రూరల్: ఎస్.అన్నవరం శివారు శేషాద్రి నగర్ కాలనీలో ఇటీవల తరచూ దొంగతనాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఉప్పలపాటి సూర్యనారాయణరాజు, పంపనబోయిన రాజబాబు (చంటి) ఆధ్వర్యంలో 15 మంది యువకులు బృందాలుగా ఏర్పడి రాత్రి వేళల్లో కర్రలతో వీధుల్లో తిరుగుతూ కాపలా కాస్తున్నారు. 15 రోజుల నుంచి ఇదే విధంగా కాపలా ఉంటున్నట్టు కనకాల వీరభద్రరావు, తేనే లోవరాజు, నడిమింటి ఎల్లంనాయుడు, దుంగ దారబాబు, పోలిశెట్టి చందు తదితరులు తెలిపారు. కొందరు దైవదర్శనాలకు, శుభకార్యాలకు రెండు, మూడు రోజులు ఇంటికి తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళుతున్నారని, తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించి దొంగలు చోరీలకు పాల్పడుతున్నారన్నారు. -
చెరువులో పడి యువకుడి మృతి
కొత్తపల్లి: మోటారు సైకిల్పై వస్తూ ప్రమాదవశాత్తూ చెరువులో పడి యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పిఠాపురం – పాత ఇసుకపల్లి రహదారిలో శనివారం ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పిఠాపురానికి చెందిన ముగ్గురు యువకులు మైటారు సైకిల్పై అన్నవరం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కోనపాపపేట, మూలపేట, పాత ఇసుకపల్లి మీదుగా పిఠాపురం వస్తుండగా ప్రమాదవశాత్తు పాత ఇసుకపల్లి శివారు ఉన్న చెరువులో పడ్డారు. ఈ ప్రమాదంలో సాఖా సాయిరాం (16) మృతి చెందగా, గాయపడిన ఇద్దరు యువకులను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎస్సై వెంకటేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఏపీ పీజీ సెట్లో శ్రీప్రకాష్ విద్యార్థుల ప్రతిభ
తుని: ఏపీ పీజీ సెట్లో శ్రీ ప్రకాష్ విద్యా ర్థులు ఉత్తమ ప్రతిభ చూపా రని ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.రామకృష్ణారెడ్డి శనివారం తెలిపారు. రాష్ట్ర స్థాయిలో కెమిస్ట్రీ విభా గంలో ఈ.వాసు 8, ఎన్.నాగేశ్వరి 45, పి.మైథిలి 99, లైఫ్ సైన్స్లో కె.స్నేహ 48, ఫిజిక్స్లో వై.దీప్తి 69, జువాలజీలో వై.పావని 94, ఎస్.లోకేశ్వరి 98వ ర్యాంకులు సాధించారన్నారు. కళాశాలలో డిగ్రీతో పాటు పోటీ పరీక్షలకు ఇస్తున్న శిక్షణ ద్వారా ఈ విజయాన్ని సాధించారని రామకృష్ణారెడ్డి కొనియాడారు. ప్రతిభ చూపిన విద్యార్థులను విద్యాసంస్థల అధినేత సీహెచ్వీకే నరసింహారావు, సంయుక్త కార్యదర్శి విజయ్ప్రకాష్ అభినందించారు. -
వెలి ఘటనపై తహసీల్దార్ విచారణ
తాళ్లరేవు: కోరంగి పంచాయతీ పాత కోరంగికి సంబంధించిన వెలి ఘటనపై శనివారం తహసీల్దార్ పితాని త్రినాథరావు విచారణ నిర్వహించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ఈ విచారణకు ఒకే సామాజిక వర్గానికి చెందిన గ్రామ పెద్దలతో పాటు బాధిత కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాధితుడు టేకుమూడి త్రిమూర్తులు మాట్లాడుతూ గ్రామపెద్దలు తమ కుటుంబానికి రూ.లక్ష జరిమానా విధించి, వెలివేశారని తెలిపాడు. గత మూడేళ్లుగా తమ కుటుంబాన్ని శుభ కార్యక్రమాలకు పిలవడం లేదని వాపోయాడు. తన కుమార్తె వివాహాన్ని కూడా చెడగొట్టారని, తాను పండించిన ధాన్యాన్ని కూడా కొనకుండా చేసి నష్టపరిచారన్నాడు. తప్పు కట్టాలని, లేకుంటే ఊరి నుంచి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారని వాపోయాడు. దీనిపై గతంలో కోరంగి పోలీసులకు ఫిర్యాదు చేయగా శాంతి కమిటీ వేసి సమస్యను పరిష్కరించారని, అయితే గ్రామ పెద్దల తీరులో మార్పు రాలేదన్నాడు. దీంతో గత ఏడాది అక్టోబర్లో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు ఫిర్యాదు చేసినట్టు తెలిపాడు. కాగా.. సమస్యను గ్రామంలో తేల్చుకుంటామని, రెండు రోజులు సమయం ఇవ్వాల్సిందిగా తహసీల్దార్ను గ్రామ పెద్దలు కోరారు. ఈ నేపథ్యంలో విచారణను వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేశారు. సమస్య పరిష్కారం కాకుంటే చట్టం తన పని తాను చేసుకుని పోతుందని తహసీల్దార్ హెచ్చరించారు. సమావేశంలో శెట్టిబలిజ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ టేకుమూడి లక్ష్మణరావు, ఎంపీడీఓ కె.సత్యనారాయణ, కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ, ప్రజా సంఘాల నాయకుడు టేకుమూడి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
అతి వేగంతో అదుపు తప్పిన కారు
ఫ కంటైనర్ను ఢీకొన్న వైనం ఫ ముగ్గురికి తీవ్ర గాయాలు దేవరపల్లి: అతి వేగంతో వెళుతున్న కారు అదుపు తప్పి, డివైడర్ను దాటి ఓ కంటైనర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గు రికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. గుండుగొలను – కొవ్వూరు 16వ నంబర్ జాతీయ రహదారిపై యర్నగూడెం వద్ద శనివారం అతి వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పి డివైడర్ను దాటి రాజమహేంద్రవరం వైపు వెళుతున్న కంటైనర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్తో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. కోనసీమ జిల్లా వాడపల్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ఏలూరు వైపు వెళుతున్న కారు అదుపు తప్పింది. ఆ సమయంలో కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. కాగా.. కారు ఢీకొనడంతో కంటైనర్ అదుపు తప్పి ఫ్లై ఓవర్ వంతెన గోడను ఢీకొని ఆగింది. దీంతో మిగిలిన వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. కాగా.. క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉందని ఎస్సై పి.మనోహర్ తెలిపారు. -
లారీ ఢీకొని మహిళ మృతి
ఫ మరొకరికి తీవ్ర గాయాలు ఫ శృంగవరంలో ఘటన రౌతులపూడి: మండలంలోని రౌతులపూడి – కత్తిపూడి ఆర్అండ్బీ రహదారిలో శృంగవరం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. శృంగవరానికి చెందిన యలమంచిలి అమ్మాజీ, యలమంచిలి చక్రవేణి గుడికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కడానికి గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహం సమీపంలో రోడ్డుపైకి వెళ్లారు. అదే సమయంలో కత్తిపూడి వైపు నల్ల కంకరరాయి లోడుతో వెళుతున్న లారీ రోడ్డుపై ఉన్న వీరిని ఢీకొంది. తీవ్ర గాయాలైన ఇద్దరినీ అంబులెన్స్లో కాకినాడ తరలిస్తుండగా మార్గం మధ్యలో అమ్మాజీ (52) మృతి చెందింది. చక్రవేణి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సమాచారం తెలిసిన వెంటనే ఎస్సై వెంకటేశ్వరరావు వెళ్లి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
3 నెలలు.. 300 శాతం లాభాలు
● నమ్మించిన సైబరాసురుడు ● మోసపోయిన దంపతులు సామర్లకోట: మూడు నెలల్లో ఏకంగా 300 శాతం లాభాలు వస్తాయంటూ ఓ సైబరాసురుడు విసిరిన ఆన్లైన్ వలలో పెద్దాపురానికి చెందిన దంపతులు చిక్కుకున్నారు. సీఐ వైఆర్కే శ్రీనివాస్ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే కేవలం 3 నెలల్లోనే 300 శాతం లాభాలు వస్తాయంటూ.. ఆనంద్ లాఠీ షేర్ అండ్ స్టాక్బ్రోకర్ లిమిటెడ్ మేనేజర్ పేరుతో ఓ సైబర్ నేరగాడు.. పెద్దాపురం పట్టణంలోని వర్జుల వారి వీధికి చెందిన సూరే వేణు దంపతులకు వల విసిరాడు. ఆ మాటలు నమ్మి వేణు దంపతులు అతడి వాట్సాప్ గ్రూపులో చేరారు. తమ యూజర్ ఐడీ ద్వారా విడతల వారీగా ఏకంగా రూ.85 లక్షలు ఆ సైబర్ నేరగాడికి డిపాజిట్ చేశారు. అనంతరం, ఆ మొత్తాన్ని డ్రా చేసుకునేందుకు వీలు లేకుండా అతడు అకౌంట్ బ్లాక్ చేశాడు. ఆ తరువాత అతడి నుంచి స్పందన లేకపోవడంతో తాము మోసపోయామని వేణు దంపతులు గ్రహించి, పెద్దాపురం పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ శ్రీనివాస్ తెలిపారు. సైబర్ నేరాలపై తరచూ అవగాహన కల్పిస్తున్నా ప్రజలు మోసగాళ్ల వలలో చిక్కుకుంటున్నారని, అపరిచితుల నుంచి వచ్చే వాట్సాప్ ఆఫర్లను నమ్మవద్దని ఆయన హెచ్చరించారు.దాడి చేసిన వారిని అరెస్టు చేయాలిబోట్క్లబ్ (కాకినాడ సిటీ): జీజీహెచ్ మహిళా సెక్యూరిటీ గార్డులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ ఆధ్వర్యాన కలెక్టరేట్ వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ, జీజీహెచ్లో మహిళా సెక్యూరిటీ గార్డులపై మార్చి 6న జరిగిన దాడిపై కలెక్టర్ స్పందించాలని, ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని, ఇలాంటి దాడులు మళ్లీ జరగకుండా ఎఫ్ఐఆర్లో నిందితుల పేర్లు చేర్చి, తక్షణం అరెస్టు చేయాలని అన్నారు. ధర్నా అనంతరం డీఆర్ఓ తిప్పేనాయక్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎన్.అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు భజనకే మహానాడుకాకినాడ రూరల్: టీడీపీ మహానాడు చంద్రబాబు నాయుడి భజన కోసమే ఏర్పాటు చేసినట్టుగా ఉందని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపా ధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి విమర్శించారు. గైగోలుపాడులోని తన నివాసంలో శుక్రవారం ఆమె మీ డియాతో మాట్లాడారు. ఆత్మస్తుతి, జగన్పై విమ ర్శలు తప్ప.. ప్రజలకు ఏం మేలు చేస్తారనే ప్రస్తావనే మహానాడులో లేకుండా పోయిందని, ఇది దగానాడు అని దుయ్యబట్టారు. ఆద్యంతం చంద్రబాబు, లోకేష్, దేవాన్ష్ భజనకే ప్రాధాన్యం ఇచ్చారన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ ఫలాలను ఎందుకు నిలిపివేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా రిజర్వేషన్ల పట్ల ఎంతో చిత్తశుద్ధితో వ్యవహరించారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. చంద్రబాబుకు ఏ మాత్రం చిత్తశు ద్ధి ఉన్నా రాజ్యసభ సభ్యుల ఎంపిక, క్యాబినెట్లో మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫింఛన్ల లబ్ధిదారులను 6 లక్షలకు పైగా ఎందుకు తొలగించారో, 50 ఏళ్లు దాటిన బీసీ వర్గాల ప్రజలకు పింఛన్లు ఇస్తామనే హామీని ఎందుకు విస్మరించారో చెప్పాలని నాగమణి నిలదీశారు. మెగా డీఎస్సీ పేరిట అర్హులైన యువతకు చేసిన అన్యాయంపై నోరు మెదపకపోవడంపై ఆమె మండిపడ్డారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలపై చూపుతున్న నిర్లక్ష్యంపై మహానాడులో చర్చ జరగలేదని, కూటమి వంచనపై పెదవి విప్పకుండా, జగన్పై మాత్రం విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకొంటున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీని గొడ్డలి పార్టీ అంటూ తప్పుడు మాటలు మాట్లాడటం తప్ప, రెండేళ్ల పాలనలో సాధించిందేమీ లేదని అన్నారు. ఎన్టీఆర్ నుంచి టీడీపీని లాక్కున్న తీరును ప్రజలు ఇంకా మరచిపోలేదన్నారు. ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ అని నమ్మించి సూపర్ మోసం చేశారని ఆరోపించారు. ఎన్టీఆర్కు భారతతర్న ఇవ్వకుండా అడ్డుపడిన చంద్రబాబు.. ఇప్పుడు దీనిపై తీర్మానం ప్రవేశపెట్టడం హాస్యాస్పదమని అన్నారు. డిజిటల్ మహానాడులు అట్టర్ఫ్లాప్ అయ్యాయని, క్లస్టర్ల వారీగా సభా ప్రాంగణాలు వెలవెలబోయాయని నాగమణి పేర్కొన్నారు. -
● వడగళ్ల సందళ్లు
కొన్ని రోజులుగా సూర్యుడి సెగభగలతో అల్లాడుతున్న ప్రజలు శుక్రవారం ఉదయం కురిసిన వడగళ్ల వానతో ఉపశమనం పొందారు. సామర్లకోట పట్టణంతో పాటు కరప గ్రామంలో ఉదయం ఆకాశాన దట్టమైన మబ్బులు కమ్ముకుని ఈదురు గాలులు, ఉరుములతో ఒక్కసారిగా వర్షం కురిసింది. వాతావరణం చల్లబడటంతో ప్రజలు సేద తీరుతున్నారు. అదే సమయంలో రేకుల షెడ్లు, పెంకుటిళ్లపై రాళ్లు పడుతున్న శబ్దాలు రావడంతో ఏం జరిగిందోనని పలువురు బయటకు వచ్చారు. వర్షంతో పాటు వడగళ్లు పడుతూండటంతో పలువురు ముఖ్యంగా చిన్న పిల్లలు వాటిని సేకరిస్తూ.. ఆ చల్లదనాన్ని ఆస్వాదిస్తూ ఆనందంగా గడిపారు. వడగళ్లు చిన్న సైజు ముత్యాల్లా పడుతూండటంతో పలువురు ఆసక్తిగా తిలకించారు. కరపలో చాలా ఎక్కువగా వడగళ్లు పడ్డాయి. ఇన్ని వడగళ్లు ఎప్పుడూ చూడలేదంటూ ప్రజలు వాటిని ఏరుకుంటూ కనిపించారు. – సామర్లకోట/కరప -
అనే నేను
వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి ప్రతినిధి, కాకినాడ: ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకుని.. అధికారంలోకి వచ్చిన తరువాత వారి బతుకుల్ని ఏవిధంగా బాగు చేయాలో తెలుసుకునేందుకు.. 3,648 కిలోమీటర్ల మేర ప్రజాసంకల్ప యాత్ర చేసి.. వారి ఆశలు, ఆకాంక్షలకు ప్రతీకగా.. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇదే రోజున.. అంటే 2019 మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తన తండ్రి, మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో సంక్షేమాన్ని, అభివృద్ధిని సమాంతరంగా పరుగులు పెట్టించారు. కోవిడ్ వంటి మహావిపత్తు ముంచుకొచ్చినా.. తన ఐదేళ్ల పాలనలో ఇచ్చిన మాటకు కట్టుబడి పేదల సంక్షేమానికి ఎక్కడా లోటు లేకుండా చూశారు. కారణాలేవైనా.. గత ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో.. అప్పటి వరకు జగన్ అందించిన సంక్షేమ పాలనకు దూరమయ్యామనే ఆవేదన రెండేళ్లుగా జనానికి తప్పడం లేదు. ఇచ్చిన హామీలు అమలు చేయని చంద్రబాబు ప్రభుత్వంపై విసిగి వేసారుతున్న ప్రజలు మళ్లీ వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావాలని, ‘జగన్ అనే నేను’ మాటను మరోసారి వినాలని బలంగా ఆకాంక్షిస్తున్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కొత్త పుంతలు తొక్కిందనడం అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. సంక్షేమ సిరులు ● అప్పటి వరకూ రూ.2 వేలుగా ఉన్న సామాజిక భద్రతా పింఛన్ను ఇచ్చిన మాట మేరకు రూ.2.250కి పెంచుతూ నాడు జగన్ తొలి సంతకం చేశారు. ఆ తరువాత ఏటా రూ.250 చొప్పున పెంచుతూ చివరి సంవత్సరానికి పింఛను మొత్తాన్ని రూ.3 వేలు చేశారు. 2019 మే 30 నాటికి ఉమ్మడి జిల్లాలో 5,81,827 మంది వివిధ రకాల సామాజిక పింఛన్లు పొందుతున్నారు. జగన్ పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు మంజూరు చేయడంతో ఉమ్మడి జిల్లాలో మరింత మందికి లబ్ధి చేకూరింది. ● 2019కి ముందు టీడీపీ పాలనలో రేషన్ కార్డు కోసం అర్హులైన వారు నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. జగన్ పాలనలో అరగంటలోనే రేషన్ కార్డు మంజూరు చేసి అందించడం ఓ సెన్సేషన్. ● ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పరిపుష్టం చేసి, ఈ పథకం పరిమితిని తొలుత రూ.5 లక్షలకు, ఆపై ఏకంగా రూ.25 లక్షలకు పెంచడం ద్వారా పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించారు. అంతేకాదు.. ఏకంగా 3,200కు పైగా ప్రొసీజర్లను ఈ పథకం పరిధిలోకి తీసుకొచ్చారు. ● వైఎస్సార్ కంటి వెలుగు పథకం ద్వారా పాఠశాల విద్యార్థులకు, అవ్వాతాతలకు కంటి పరీక్షలు, కళ్లజోళ్లు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు ఉచితంగా అందించారు. ● వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద వేట నిషేధ భృతిని రూ.10 వేలకు పెంచే కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా నుంచే ఆయన శ్రీకారం చుట్టారు. ● జగనన్న అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద ఉమ్మడి జిల్లాలోని లక్షలాది మంది విద్యార్థుల తల్లులకు ఏటా క్రమం తప్పకుండా ఆర్థిక సాయం అందించారు. జగనన్న విద్యా కానుక, గోరుముద్ద వంటి వినూత్న పథకాలు అమలు చేశారు. ప్రభుత్వ బడుల్లో ట్యాబులు, డిజిటల్ విద్యా బోధన, ఆంగ్ల మాధ్యమం వంటి వాటికి శ్రీకారం చుట్టారు. ● వైఎస్సార్ ఆసరా, చేయూత, డ్వాక్రా మహిళల రుణమాఫీ (ఆసరా), 45–60 ఏళ్ల లోపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళల స్వయం ఉపాధికి ఏటా ఆర్థిక సాయం అందించారు. ఓసీ మహిళలకు కూడా దీనిని వర్తింపజేశారు. ● వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద అన్నదాతలకు ఏటా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం క్రమం తప్పకుండా అందించారు. అంతేకాదు.. ప్రకృతి విపత్తులు సంభవించి, పంట నష్టం వాటిల్లితే సీజన్ దాటకుండానే పరిహారం అందించడం ఓ రికార్డు. ● పేదల సొంతింటి కలను నిజం చేసేలా అక్కచెల్లెమ్మల పేరిట వేలాది మందికి ఇళ్ల స్థలాలు అందించడమే కాదు.. ఇళ్ల నిర్మాణానికి సైతం సాయం అందించారు. జగనన్న కాలనీల పేరిట ఏకంగా ఊళ్లే నిర్మించారు. ప్రజల వద్దకే పాలన ఉమ్మడి జిల్లాలో 2019 నాటికి 779 క్లస్టర్ల పరిధిలో 1,072 గ్రామ పంచాయతీలుండేవి. కానీ, 539 క్లస్టర్లకు మాత్రమే కార్యదర్శులుండేవారు. 230 క్లస్టర్ల పరిధిలో కార్యదర్శుల కొరత ఉండటంతో ఆ ప్రభావం ప్రభుత్వ సేవలపై పడి ప్రజలు తీవ్ర అవస్థలు పడేవారు. జగన్ అధికారంలోకి వచ్చాక పరిపాలనను ప్రజల చెంతకే చేర్చేలా గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థకు 2019 అక్టోబర్ 2న కాకినాడ జిల్లా కరపలో శ్రీకారం చుట్టారు. ప్రతి సచివాలయంలోను దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలకు ప్రతినిధులుగా 11 మంది ఉద్యోగులను నియమించి, దేశ విదేశాలకు సైతం ఆదర్శంగా నిలిచే విప్లవాత్మకమైన పరిపాలనా సంస్కరణలకు నాంది పలికారు. అంతే కాదు.. ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వలంటీర్ను ప్రజల ఆమోదంతో నియమించి, సచివాలయ వ్యస్థకు అనుసంధానం చేశారు. దీంతో, ప్రజలకు 500కు పైగా ప్రభుత్వ సేవలు వారి ముంగిటనే ఎటువంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సులభంగా అందేవి. పాలనా వికేంద్రీకరణలో భాగంగా ఇచ్చిన మాటకు కట్టుబడి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాను కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమగా పునర్వ్యవస్థీకరించారు. కరపలో పైలాన్ ఆవిష్కరించి, సచివాలయ వ్యవస్థను ప్రారంభిస్తున్న అప్పటి సీఎం వైఎస్ జగన్ (ఫైల్)శనివారం శ్రీ 30 శ్రీ మే శ్రీ 2026‘వైఎస్ జగన్మోహన్రెడ్డి అనే నేను’ అంటూ సరిగ్గా ఇదే రోజు జననేత జగన్ చేసిన ప్రమాణం.. నవ్యాంధ్ర ప్రదేశ్ చరిత్రలో నవశకాన్ని లిఖించింది. ఆ శుభదినాన రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. రాష్ట్ర చరిత్రలోనే మునుపెన్నడూ చూడని రీతిలో సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించారు. పరిపాలనను కొత్త పుంతలు తొక్కించారు. ప్రజల ముంగిటకు చేర్చి, దేశానికే ఆదర్శంగా నిలిపారు. అవ్వాతాతలకు బిడ్డలా.. అక్కచెల్లెమ్మలకు సోదరుడిలా.. పిల్లలకు మేనమామలా.. కనీవినీ ఎరుగని సంక్షేమ పథకాలతో భరోసానిచ్చారు. ఇంటివద్దకే పింఛన్లు, రేషన్ సరకులు.. అమ్మ ఒడి.. విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన.. రైతు భరోసా వంటి వినూత్న పథకాలతో పేదలకు చేయూతనిచ్చారు. ఆరోగ్యశ్రీ, కంటివెలుగు వంటి పథకాలతో ప్రజల ఆరోగ్యానికి అండగా నిలిచారు. తమ జీవితాలను మలుపు తిప్పిన ఆ రోజును ప్రజలు ఇప్పటికీ గుర్తు పెట్టుకుంటున్నారు.అభివృద్ధి మెరుపులు ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దే లక్ష్యంతో మన బడి నాడు–నేడు పథకానికి జగన్ శ్రీకారం చుట్టారు. మొదటి విడత ఆధునీకరించిన పాఠశాలలను ఉమ్మడి జిల్లాలో పి.గన్నవరం మండలం పోతవరం జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు అంకితం చేసి, రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. పేదల పిల్లలు సైతం డాక్టర్లు కావాలనే ఆకాంక్షతో రాజమహేంద్రవరం, అమలాపురాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టారు. రాజమహేంద్రవరం కళాశాలలో ఇప్పటికే బోధన ప్రారంభమైంది. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తోంది. పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా నల్లజర్ల మండలంలో రూ.250 కోట్లతో ఆయిల్పామ్ ప్రాసెసింగ్ యూనిట్కు శ్రీకారం చుట్టారు. తద్వారా 25 వేల హెక్టార్లలో ఆయిల్పామ్ సాగు చేసే రైతులకు లబ్ధి చేకూరడంతో పాటు 1,500 మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డిలో రూ.270 కోట్లతో అస్సాగో బయో–ఇథనాల్ ప్లాంట్ నిర్మాణానికి 2022 నవంబర్లో జగన్ భూమిపూజ చేశారు. తొండంగి మండలంలో కాకినాడ గేట్వే పోర్టు నిర్మాణం జరగడానికి నాడు జగన్ దార్శనికతే కారణమని చెప్పాలి. మత్స్యకారుల కోసం సుమారు రూ.230 కోట్లతో ఉప్పాడలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి జగన్ శ్రీకారం చుట్టారు. నేడు.. సరికొత్త పరిపాలనకు శ్రీకారం చుట్టిన రోజు నేడు.. అవధి లేని సంక్షేమానికి నాంది పడిన రోజు నేడు.. అభివృద్ధికి కొత్త అర్థం చెప్పిన రోజు నేడు.. సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు -
దగా డీఎస్సీని రద్దు చేయాలి
● మెగా డీఎస్సీ–2025 అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి ● వైఎస్సార్ సీపీ విద్యార్థి, యువజన నాయకుల డిమాండ్ ● కాకినాడలో నిరసన బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ప్రభుత్వం నిరుద్యోగులను అన్ని విధాలా మోసం చేసిందని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నాయకులు మండిపడ్డారు. మెగా డీఎస్సీ–2025 నిర్వహణలో అక్రమాలకు వ్యతిరేకంగా స్థానిక ఇంద్రపాలెం బ్రిడ్జి అంబేడ్కర్ విగ్రహం వద్ద శుక్రవారం ఆందోళన నిర్వహించారు. జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యాన ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిరుద్యోగులకు అన్యాయం చేసిన దగా డీఎస్సీని వెంటనే రద్దు చేయాలని, డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వం అవినీతికి పాల్పడిందన్నారు. నిరుద్యోగులతో ఆటలు ఆడుతూ, దగా చేసిన ఈ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత లేదని అన్నారు. తాము అధికారంలోకి వస్తే ఏటా డీఎస్సీ ఉంటుందని ప్రగల్భాలు పలికి.. రెండేళ్లకు ఒక్కసారి మాత్రమే నిర్వహించారన్నారు. ఇది కూడా పూర్తి అవినీతి మయంగా తయారైందన్నారు. ఉద్యోగాలకు కల్పించకుంటే నిరుద్యోగులకు భృతి ఇస్తామని ఎన్నికల్లో గొప్పగా చెప్పి.. ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం నిరుద్యోగులను అన్ని విధాలా మోసం చేసిందన్నారు. తొలుత అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి, యువజన విభాగాల నాయకులు నీలి ఆనంద్, పూసల అనిల్, ఉయ్యూరి నాని, గంగవరపు రాజేష్, మామిడాల గౌతమ్తేజ, కరణం భానునాయుడు, డి.శివకుమార్, జె.పృథ్వీరాజ్, నల్లమిల్లి పవన్ తదితరులు పాల్గొన్నారు. -
శభాష్ లక్ష్మణా..
● నిజాయతీకి నిలువుటద్దంలా నిలిచిన యువకుడు ● రూ.20 లక్షల బంగారు ఆభరణాలు పోగొట్టుకున్న మహిళ ● భద్రంగా అందజేసిన యువకుడు కపిలేశ్వరపురం (మండపేట): మాయమైపోతున్నాడమ్మా.. మనిషన్నవాడూ.. అనుకుంటున్న ప్రస్తుత కాలంలో ఓ యువకుడు నిజాయతీకి నిలువుటద్దంలా నిలిచి.. పది మందితో శభాష్ అనిపించుకున్నారు. మండపేట రూరల్ సీఐ పి.దొరరాజు, బాధితుల కథనం ప్రకారం.. ఈ నెల 24వ తేదీ సాయంత్రం మండలంలోని ఏడిద గ్రామానికి చెందిన పేరిచర్ల శ్రీలేఖ తన కుటుంబ సభ్యులతో కలసి ఆటోలో ఓ శుభకార్యానికి బయల్దేరారు. ఈ క్రమంలో రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలున్న బ్యాగ్ను పోగొట్టుకున్నారు. ఆ బ్యాగ్ ఏడిద గ్రామ శివారు దేవుడు కాలనీ సమీపాన అదే గ్రామానికి చెందిన యువకుడు నామాల లక్ష్మణరావుకు దొరికింది. అదే మహద్భాగ్యమనుకుని ఆ ఆభరణాలను పట్టుకుపోవాలనే దుర్బుద్ధికి అతడు లోనవలేదు. ఆ ఆభరణాల పట్ల ఎలాంటి వ్యామోహాన్నీ పెంచుకోకుండా.. పోగొట్టుకున్న వారికే తిరిగి అందజేయాలని తపన పడ్డాడు. బ్యాగ్లో ఉన్న ఆధార్ కార్డులోని అడ్రస్కు సమాచారం అందించారు. సీఐ దొరరాజు, ఎస్సై వి.కిశోర్ సమక్షంలో బాధితురాలు శ్రీలేఖకు ఆ ఆభరణాల బ్యాగ్ను అప్పగించారు. నిజాయతీగా వ్యవహరించిన లక్ష్మణరావును పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు, ప్రజలు అభినందించారు. -
అందుకే జాప్యం
దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా సామర్లకోటకు అమృత భారత్ స్టేషన్ నిధులు రూ.25 కోట్ల వరకూ మంజూరయ్యాయి. ప్రాధాన్య క్రమంలో కొన్ని రైల్వే స్టేషన్లలో పనులు నిర్వహిస్తున్నారు. దీంతో, ఇక్కడి పనుల్లో కొంత వరకు జాప్యం జరుగుతోంది. రెండు, మూడు విడతల్లో నిధులు వస్తాయి. ఎస్కలేటర్ నిర్మించే చోట మూడు బోగీలకు చెందిన డిస్ప్లే బోర్డులు తొలగించారు. దీంతో, రైళ్లు వచ్చే సమయంలో బోగీల వివరాలను మైకులో ప్రకటిస్తున్నాం. ఎస్కలేటర్ పనులు జరుగుతున్న ప్రదేశంలోని బోగీల సమాచారంపై ప్రత్యేకంగా ప్రచారం చేయిస్తాం. పార్కింగ్ స్టాండ్ నిర్వాహకుడు షెడ్ల కోసం దరఖాస్తు చేస్తే డీఆర్ఎంకు పంపుతాం. – ఎం.రమేష్, మేనేజర్, సామర్లకోట రైల్వే స్టేషన్ -
ఊళ్లలోనే టైఘర్
● వెనుకే అధికారుల పరుగు ● ఐదు నెలలుగా ఇదే తంతు ● ఇప్పటి వరకూ 20 మూగజీవాలపై పంజా రాజవొమ్మంగి: ఐదు నెలలుగా అదే పరుగు... ఎక్కడా అలుపు లేదు.. వెనక్కి తగ్గిందీ లేదు.. జనావాసాలు, ఆపై అటవీ ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తూనే ఉంది. పట్టుకుంటామంటూ, దీని వెనుక అధికారులు పరుగులు తీస్తూనే ఉన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోకి పెద్ద పులి సుమారు ఐదు నెలల కిందట ప్రవేశించింది. అప్పటి నుంచి అధికారులను ముప్పుతిప్పలు పెడుతోంది. బుధవారం ఒక్క రోజే ఏడు మూగజీవాలను పొట్టనబెట్టుకుంది. ఈ ఏడాది జనవరి 31న తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం చినకొండేపూడిలోకి ఈ పులి ప్రవేశించింది. అక్కడి నుంచి దివాన్చెరువు, రాజానగరం మండలం జి.ఎర్రంపాలెం, ఆ తరువాత అనపర్తి మండలం పీరా రామచంద్రపురంలో తిరిగింది. ఫిబ్రవరి 6న తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం కూర్మాపురంలో అటవీ అధికారులకు చిక్కింది. దానిని అక్కడి నుంచి విశాఖపట్నం జూ పార్క్కు తరలించారు. కొన్నాళ్ల తర్వాత మెడలో రేడియో కాలర్ అమర్చి దానిని పాపికొండలు అడవుల్లో తిరిగి వదిలిపెట్టారు. మళ్లీ పులి తన పయనం మొదలుపెట్టింది. ఫిబ్రవరి మూడో వారంలో రంపచోడవరం, రాజవొమ్మంగి, ఏలేశ్వరం, అడ్డతీగల ప్రాంతాల మీదుగా కాకినాడ జిల్లా ప్రత్తిపాడు, శంఖవరంలో ప్రవేశించింది. తిరిగి వెనుకకు మళ్లి, దేవీపట్నం మండలంలో గోదావరి ఈదుకుంటూ అవతలి ఏలూరు జిల్లా పోలవరం మండలంలో సంచరించింది. అంతలోనే తిరిగి తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ అటవీ ప్రాంతానికి చేరింది. దేవీపట్నం మండలం ఇందుకూరుపేట, కొత్తవీధి, బూరుడుబంద గ్రామాల సమీపంలోని దట్టమైన అడవులకు చేరింది. ఆ తరువాత ఫోక్స్పేటలో పులి జాడను అటవీ అధికారులు కనుగొన్నారు. దాడి చేస్తూ.. ముందుకు సాగుతూ గత 15 రోజులుగా ఈ పులి రాజవొమ్మంగి అడవుల్లోనే తిరుగుతోంది. బుధవారం ఒక్కరోజే చికిలింత, గర్రంగి గ్రామాల్లో 9 మూగజీవాలపై పంజా విసిరింది. ఇప్పటి వరకూ 20 పశువులను హతమార్చింది. అధికారుల చర్యలు విఫలం ఇంత జరుగుతున్నా పులిని పట్టుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారంటూ గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పులి భయంతో అడవి, పొలం పనులకు వెళ్లలేక పోతున్నామని వాపోతున్నారు. తొలకరి వర్షాలు కురుస్తుండడంతో రెండు, మూడు రోజుల్లో ఖరీఫ్ పనులు మొదలు పెట్టాలని, పులి తమ చుట్టూ తిరుగుతుంటే పనులు ఎలా చక్కబెట్టుకోవాలని గురువారం ఆయా గ్రామాల్లో పర్యటించిన రంపచోడవరం డీఎఫ్ఓ శివకుమార్ను గిరిజనులు ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ పులి రాజవొమ్మంగి మండలం ఉర్లాకులపాడు అటవీ ప్రాంతంలో ఉందని, తడోబా, నాగార్జున టైగర్ రెస్క్యూ టీములు వస్తాయని, త్వరలోనే దీనిని బంధిస్తామని ఆయన చెప్పారు. -
నేలకొరిగిన భారీ వృక్షాలు, విద్యుత్తు స్తంభాలు
పెదపూడి: మండలంలో చింతపల్లి – జి.మామిడాడ గ్రామాల మధ్య ఆర్అండ్బీ రోడ్డులో గురువారం ఉదయం వీచిన ఈదురు గాలులకు సుమారు 50 భారీ వృక్షాలు, 20 విద్యుత్తు స్తంభాలు నేల కూలాయి. దీంతో, ఉదయం 10 గంటల నుంచి ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. గాలుల తాకిడికి రాజుపాలెం, గండ్రేడు గ్రామాల్లో రెండు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బ తిన్నాయి. ఫలితంగా రాజుపాలెం, పైన, వేండ్ర గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుని, సాయంత్రానికి సరఫరాను పునరుద్ధరించారు. డిప్యూటీ ఎంపీడీఓ మేడపాటి సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యాన గ్రామ పంచాయతీ, ఇతర అధికారులు, స్థానికుల సహాయంతో రోడ్డుపై విరిగి పడిన భారీ వృక్షాలను తొలగించారు. -
కె–ట్యాక్స్ పేరిట టీడీపీ నేతల దోపిడీ
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కాకినాడలో కె–ట్యాక్స్ పేరిట టీడీపీ నేతలు దోచుకుంటున్నారని వైఎస్సార్ సీపీ మాజీ కార్పొరేటర్ ఎంజీకే కిషోర్ ఆరోపించారు. వైఎస్సార్ సీపీ సిటీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. చిన్న క్రీడా మైదానం చదును చేయడానికి సంబంధించి రూ.93 లక్షలకు టెండర్ మంజూరు కాగా ఇందులో రూ.50 లక్షల గోల్మాల్ జరిగిందని ఆరోపించారు. ఈ సొమ్ము, కె–ట్యాక్స్ సొమ్మంతా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు)కు వెళ్తోందని ఆరోపించారు. ఈ విధంగా నెలకు రూ.1.14 కోట్ల అవినీతి సొమ్ము చేరుతోందన్నారు. నగరంలోని మద్యం షాపుల ద్వారా ప్రతి బాటిల్పై రూ.10 అదనంగా వసూలు చేస్తున్నారని, ఆశీలు పాట ద్వారా కె–ట్యాక్స్, రేషన్ బియ్యం కొనుగోలు, జూదం నంబర్ గేమ్లు ఆడించడం, సరకు రవాణా బార్జీకి ఉచితంగా చేసే రెన్యువల్కు రూ.లక్ష వసూలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్నాథపురంలోని ఎంఎస్ఎన్ చారిటీస్ క్రీడా స్థలాన్ని తమ హయాంలో ఉచితంగా చదును చేశామని చెప్పారు. పాత ఇంటికి సంబంధించి మట్టితో అక్కడ ప్లాస్టిక్ కవర్లు వచ్చాయన్నారు. అంతే కానీ ఆ మట్టి చెత్తాచెదారాలకు సంబంధించింది కాదని స్పష్టం చేశారు. దీనిపై తమ స్థానిక నాయకులు అప్పటి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా తన సొంత నిధులతో అభివృద్ధి చేస్తానని చెప్పారని, ఈలోగా ఎన్నికలు రావడంతో అది చేయలేకపోయామని తెలిపారు. ఉచితంగా చదును చేయాల్సిన క్రీడా మైదానానికి టెండర్ పిలిపించి, రూ.93 లక్షలు మంజూరు చేశారని, అందులో రూ.50 లక్షలు చేతులు మారాయని కిషోర్ ఆరోపించారు. జగన్నాథపురం చిన్న మార్కెట్లో తాను కొన్ని దుకాణాలు తీసుకున్నానని, వాటిని తన అనుచరులకిచ్చి వ్యాపారం సాగిస్తున్నామని అంటూ తనపై అక్కడి స్థానిక నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. అక్కడ ఐదు దుకాణాలను వివిధ కారణాలతో చనిపోయిన వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులకిచ్చి ఆదుకున్నామని కిషోర్ చెప్పారు. తన పైన, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పైన ఆధారాలు లేని ఆరోపణలు చేసి, అభాసు పాలు కావద్దని స్థానిక టీడీపీ నాయకులకు హితవు పలికారు. విలేకర్ల సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు చక్క చక్రవర్తి, వాసిరెడ్డి చిన్ని, పృథ్వి పాల్గొన్నారు. -
వెనుకస్తేనా!
పిఠాపురం: ఎప్పటిలాగే వ్యవసాయ శాఖ ముందస్తు సాగు పల్లవి అందుకుంది. ఖరీఫ్ సాగు ముందుగా చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఆ మేకు రైతులకు అవగాహన కల్పిస్తోంది. ఏటా ఖరీఫ్ చివరన నవంబర్, డిసెంబర్ నెలల్లో వస్తున్న అధిక వర్షాలు, తుపానుల ప్రభావంతో రైతులు పెద్ద ఎత్తున పంటలు నష్టపోతున్నారు. ఈ గండం నుంచి గట్టెక్కాలంటే ముందస్తు సాగు చేపట్టాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. అయితే, క్షేత్ర స్థాయిలో రైతులకు ఎక్కడికక్కడే సమస్యలు ఎదురొస్తున్నాయి. ప్రధానంగా సాగునీటి కాలువల ఆధునీకరణ, నిర్వహణ పనులను ప్రభుత్వం గాలికొదిలేసింది. జిల్లాలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టు అయిన ఏలేరు అభివృద్ధికి నిధులు కేటాయించలేదు. మరోవైపు పెట్రో ధరల పెంపుతో రైతులపై అదనపు భారం పడనుంది. ఇటువంటి పరిస్థితుల్లో ముందస్తు సాగు సాధ్యం కాదని, ‘వెనుక’స్తు సాగు తప్పదని రైతులు అంటున్నారు. ఈ రకాలు వద్దు రానున్న ఖరీఫ్లో జిల్లావ్యాప్తంగా రైతులు 2.36 లక్షల ఎకరాల్లో వరి, ఇతర పంటలు సాగు చేయనున్నారు. సుమారు 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. సాగు ఆరంభానికి ముందే పీఆర్–126, ఎస్ఎల్–10, ఎంటీయూ–1153, ఎంటీయూ–1156 రకాల ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు వ్యవసాయ అధికారులు ప్రచారం చేస్తున్నారు. ఖరీఫ్లో వర్షాలను తట్టుకుని, అధిక దిగుబడులిచ్చే రకాలు మాత్రమే సాగు చేయాలని రైతులకు సూచిస్తున్నారు. అమూల్య, అంకుర్, ఎంటీయూ–7029, సాధన, ఓం సాయి, ఆర్జీఎల్–2537 సోనాం, సంపద సువర్ణ, రేవతి, బీపీటీ–5204 రకాల విత్తనాలు వేయాలని చెబుతున్నారు. పంటకు పెట్రో మంట పెరిగిన కూలి రేట్లు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల వంటి వాటి ధరలతో ఇప్పటికే రైతులకు సాగు భారమవుతోంది. పుండుపై కారం చల్లినట్లు ఇటీవల పెట్రోలు, డీజిల్ ధరలను పెంచడం వారిపై మరింత భారాన్ని మోపనుంది. కొన్నేళ్లుగా సాగులో యంత్రాల వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో దుక్కి దున్నడం, దమ్ము, నాట్లు, కోతలు, ధాన్యం ఇంటికి చేర్చడం వరకూ అన్నింటికీ ఎక్కువ మంది రైతులు యంత్రాల పైనే ఆధారపడుతున్నారు. పెట్రో ధరల పెంపుతో ఈ యంత్రాల అద్దె భారీగా పెరిగి, సాగుకు అదనపు పెట్టుబడి అవుతుందని రైతులు వాపోతున్నారు. గతంలో ఎకరాకు రూ.40 వేల వరకూ పెట్టుబడి కాగా, ఇప్పుడు రూ.50 వేల వరకూ ఖర్చవుతుందని చెబుతున్నారు. ఎరువు.. బరువు ఇటీవల ప్రభుత్వం ఎరువుల ధరలను సైతం భారీగా పెంచింది. కాంప్లెక్స్ ఎరువుల బస్తాపై రూ.300 పెంచింది. దీంతో, ఒక్కో బస్తా కాంప్లెక్స్ ఎరువుకు రూ.2 వేలు పైనే ఖర్చవనుంది. ఓవైపు పెట్టుబడి విపరీతంగా పెరుగుతూండగా.. క్వింటాల్ ధాన్యానికి కేవలం రూ.70 మాత్రమే మద్దతు ధరను పెంచి ప్రభుత్వం చేతులు దులుపుకొందనే విమర్శలు రైతుల నుంచి వస్తున్నాయి. ఇటువంటి సమస్యల నడుమ ముందస్తు సాగు ఏవిధంగా చేపట్టగలమని వ్యవసాయ అధికారులను రైతులు ప్రశ్నిస్తున్నారు.అస్తవ్యస్తంగా పంట కాలువలు కాలువల ఆధునీకరణ పనులు సక్రమంగా జరగలేదు. దీంతో, సాగునీరు సకాలంలో అందే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ముందస్తు సాగు ఏవిధంగా సాధ్యం? ఎండలున్న సమయంలో కాలువ పనులు చేయడం లేదు. వర్షాలు కురిశాక చేయడం వల్ల ఆ పనులు సక్రమంగా జరగక సాగు నీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. – వి.గోవిందరాజులు, రైతు, భోగాపురం, పిఠాపురం మండలం పెరగనున్న పెట్టుబడులు గతం కంటే ఈ ఏడాది వ్యవసాయ పెట్టుబడులు బాగా పెరిగే అవకాశాలున్నాయి. ముఖ్యంగా పెట్రో ధరల పెంపు వల్ల మరింత భారం పడుతుంది. రైతుకు ప్రభుత్వం ఎటువంటి సహకారమూ ఇవ్వడం లేదు. అన్నీ ప్రకటనలే తప్ప క్షేత్ర స్థాయిలో రైతును ఆదుకునే ప్రయత్నాలు చేయడం లేదు. ముందస్తు సాగు అని ప్రకటించడం కాదు.. దానికి తగ్గ సహకారం కూడా ఉండాలి. – పి.ప్రసాద్, రైతు, తాటిపర్తి, గొల్లప్రోలు మండలం ఆగస్టు 15 లోగా నాట్లు పూర్తి చేయాలి ఖరీఫ్ సాగుకు వ్యవసాయ శాఖ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసింది. రైతులు ఆగస్టు 15వ తేదీ లోగా నాట్లు పూర్తి చేయాలి. జూన్ ఒకటో తేదీన పిఠాపురం బ్రాంచి కెనాల్ నుంచి, జూలై 1న ఏలేరు నుంచి సాగు నీరు విడుదల చేయాలని నిర్ణయించారు. ఆలోగా రైతులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. విత్తనాలు సిద్ధం చేస్తున్నాం. – పి.స్వాతి, వ్యవసాయ శాఖ ఏడీ, పిఠాపురం ముందస్తు సాగుకు వ్యవసాయ శాఖ ప్రణాళికలు అన్నదాతకు ఎదురొస్తున్న సమస్యలు అధ్వానంగా పంట కాలువలు పెట్రో ధరల పెంపుతో రైతులపై అదనపు భారం -
పెద్దాపురం ఆర్డీఓగా కృష్ణమూర్తి
సామర్లకోట: పెద్దాపురం ఆర్డీఓగా పి.కృష్ణమూర్తి గురువారం బాధ్యతలు స్వీకరించారు. సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలోని సూర్యశ్రీ ఫైర్ వర్క్స్లో గత ఫిబ్రవరి 28వ తేదిన జరిగిన భారీ విస్ఫోటంలో 28 మంది మృతి చెందిన విషయం విదితమే. అప్పట్లో సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు నాయుడు రెవెన్యూ, పోలీసు, కార్మిక, అగ్నిమాపక శాఖల అధికారులను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా అప్పటి వరకు పెద్దాపురం ఆర్డీఓగా ఉన్న కె.శ్రీరమణిని సస్పెండ్ చేశారు. ఇన్చార్జి ఆర్డీఓగా ఎన్.శ్రీధర్ను నియమించారు. ఇన్చార్జిల పాలనతో ఇబ్బందులు ఏర్పడుతూండటంతో.. కోనసీమ జిల్లాలో కోనేరు రంగారావు కమిటీ (కేఆర్ఆర్సీ) స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా పని చేస్తున్న కృష్ణమూర్తిని పూర్తి స్థాయి ఆర్డీఓగా నియమిస్తూ ఈ నెల 25న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు. కాగా, ఆయా శాఖల్లో సస్పెండ్ అయిన వారి సస్పెన్షన్ను ప్రభుత్వం ఇటీవల ఎత్తివేసింది. విద్యార్థినికి అబార్షన్పై డీఎంహెచ్ఓ విచారణ అమలాపురం టౌన్: స్థానిక నల్ల వంతెన ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఇంటర్ విద్యార్థినికి అబార్షన్ చేసిన ఘటనపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) ఎం.దుర్గారావుదొర, అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ భరతలక్ష్మి విచారణ చేపట్టారు. ఆ ఆస్పత్రికి వెళ్లి విద్యార్థినికి అబార్షన్ చేసిన విధానం, కేస్ షీటు తదితర అంశాలను పరిశీలించారు. అబార్షన్కు వాడిన మందులు, కేస్షీటులో పేర్కొన్న మందులకు పొంతన లేదని గుర్తించారు. విచారణ అంశాలను కలెక్టర్ మహేష్కుమార్కు వివరించారు. ఈ నేపథ్యంలో ఆర్డీఓ జి.మమ్మీ, డీఎంహెచ్ఓ దుర్గారావుదొర, ఐసీడీఎస్ పీఓ కె.నాగమణి తదితర అధికారులతో కలెక్టర్ ఓ కమిటీని నియమించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేయాలని ఆదేశించారు. విచారణ నివేదికను కలెక్టర్కు రెండు రోజుల్లో అందజేస్తామని డీఎంహెచ్ఓ డాక్టర్ దుర్గారావుదొర తెలిపారు. మూతపడిన ఆస్పత్రి ఈ ఘటనతో విద్యార్ధినికి అబార్షన్ చేసిన ఆస్పత్రిని తాత్కాలికంగా మూసివేయాలని డీఎంహెచ్ఓ ఆస్పత్రి వైద్యురాలు శిరీషను ఆదేశించారు. ఆస్పత్రిలో అబార్షన్ అయి, చికిత్స పొందుతున్న విద్యార్థినికి మాత్రమే వైద్యం అందించాలని సూచించారు. కొత్తగా పేషెంట్లను పరీక్షించడం గాని, చేర్చుకోవడం గాని వద్దని ఆదేశించారు. ఈ ఘటనపై నిందితులపై కేసులు నమోదు కాలేదు. విచారణ కమిటీ నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటారని తెలిసింది. ఆస్పత్రి వద్ద మోటారు సైకిళ్లు వదిలేసి విద్యార్థిని ప్రియుడు, అతని స్నేహితులు పరారయ్యారు. ఇక్కడి ప్రైవేటు ఆస్పత్రి నిర్వహణను ప్రభుత్వ వైద్యాధికారిణి పర్యవేక్షిస్తున్న తీరును విచారణ కమిటీ తప్పు పడుతోంది. -
పేపర్ మిల్లు లాకౌట్ ఎత్తివేత!
● విధులకు హాజరు కావాలంటూ కార్మికులకు ఫోన్లు ● ఆ 70 మందికి నో అంటున్న యాజమాన్యం! కడియం: మాధవరాయుడుపాలెం పంచాయతీ పరిధిలోని ఆంధ్రా పేపర్ మిల్లు లాకౌట్ ఎత్తివేసినట్లు తెలుస్తోంది. యాజమాన్యం మొండి వైఖరి కారణంగా పర్మినెంట్, కాంట్రాక్టు కార్మికులు సమ్మెకు దిగిన విషయం విదితమే. ఆఖరి దశ చర్చల్లో పర్మినెంట్ కార్మికులు 11 మంది, కాంట్రాక్టు కార్మికులు 59 మంది మినహా మిగి లిన వారందరూ విధులకు హాజరు కావచ్చంటూ యాజమాన్యం తరఫున కొద్ది రోజులుగా అనధికారిక రాయబారాలు కొనసాగిస్తున్నారు. అయితే, రాజమహేంద్రవరంలో గురువారం 11 మంది పర్మినెంట్ కార్మికులపై విచారణ జరిగింది. ఈలోపునే మిల్లులోని డిపార్ట్మెంట్ హెడ్స్ నుంచి లాకౌట్ ఎత్తివేసినట్లు పర్మినెంట్ కార్మికులకు ఫోన్ల ద్వారా సమాచారం ఇస్తున్నారు. శుక్రవారం నుంచి విధులకు రావాలని చెబుతున్నారని అంటున్నారు. ఇదిలా ఉండగా నిష్కారణంగా లాకౌట్ ప్రకటించి, ఇప్పుడు ఎత్తివేస్తున్నట్లు కూడా చెబుతూండటంపై కార్మి క వర్గాల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. యాజమాన్యం ఇష్టారీతిన వ్యవహరిస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలూ లేకపోవడాన్ని కార్మికులు విమర్శిస్తున్నారు. యాజమాన్యం తీరు ఎప్పుడూ ఇలా ఏకపక్షంగానే ఉంటోందని, ప్రభుత్వ యంత్రాంగం దీనిపై సమగ్రంగా దృష్టి పెట్టి, తమ హక్కులు కాపాడాలని వారు కోరుతున్నారు. అయితే, 11 మంది పర్మినెంట్, 59 మంది కాంట్రాక్టు కార్మికులను కూడా అనుమతిస్తేనే విధులకు హాజరు కావాలని కార్మికులు నిర్ణయించినట్లు సమాచారం. యాజమాన్యం పిలుపునకు కార్మికులు ఎంతవరకూ స్పందిస్తారో వేచి చూడాలి. -
కూతంత జోరందుకోవాలి
సామర్లకోట: జిల్లాలోనే కీలకమైన రైల్వే జంక్షన్ సామర్లకోట. చైన్నె – కోల్కతా మార్గంలో ఉన్న ఈ స్టేషన్ మీదుగా గూడ్సు రైళ్లతో కలిపి నిత్యం 160 నుంచి 180 వరకూ రైళ్లు రాకపోకలు సాగిస్తూంటాయి. ప్రయాణికులకు సంబంధించి ప్రతి రోజూ దాదాపు 90 రైళ్లు ఇక్కడ ఆగుతాయి. కాకినాడ, పెద్దాపురం, కిర్లంపూడి, ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట, ఏలేశ్వరంతో పాటు తూర్పు గోదావరి జిల్లా రంగంపేట, అనపర్తి, బిక్కవోలు తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 17 వేల మంది నిత్యం సామర్లకోట రైల్వే స్టేషన్ పైనే ఆధారపడతారు. ఎక్కువ మంది విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, చైన్నె, బెంగళూరు, ఢిల్లీ తదితర నగరాలకు ఇక్కడి నుంచే రాకపోకలు సాగిస్తారు. ఆన్లైన్ టికెట్లతో బుకింగ్ కౌంటర్ ఆదాయం తగ్గిపోయినప్పటికీ.. ప్రయాణికుల నుంచి ప్రతి రోజూ సుమారు రూ.5 లక్షల ఆదాయం వస్తుంది. నెలకు రూ.1.50 కోట్లు, ఏటా దాదాపు రూ.18 కోట్ల మేర ఆదాయం లభిస్తుంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ పథకం కింద ఎంపిక చేసింది. గతంలో వైఎస్సార్ సీీపీకి చెందిన వంగా గీత కాకినాడ ఎంపీగా ఉన్న సమయంలో ఈ పథకం కింద రూ.25 కోట్లు మంజూరు చేసింది. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఈ పనులను ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్లాట్ఫామ్ల అభివృద్ధి, షెడ్ల నిర్మాణం, నూతన కార్యాలయ, విశ్రాంతి భవనాలు, ప్రయాణికుల సౌకర్యాలతో పాటు మూడు ప్లాట్ఫామ్లను కలుపుతూ రెండో ఫుట్ ఓవర్ బ్రిడ్జి(కాలి బాట వంతెన)తో పాటు ఎస్కలేటర్ నిర్మాణ పనులు చేపట్టారు. అయితే, కొన్నాళ్లుగా ఈ పనులు ఎక్కడిక్కడే నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలోనే హంసపాదు ఒకటో నంబర్ ప్లాట్ఫామ్ నుంచి 2, 3 ప్లాట్ఫామ్లను కలుపుతూ ఎస్కలేటర్ నిర్మాణాన్ని ప్రారంభించి ఆరు నెలలైంది. ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా ఈ పనులు ప్రారంభ దశలోనే నిలిచిపోయాయి. కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు రాకపోవడంతో ఈ పనులను నిలిపివేసినట్లు సమాచారం. ఎస్కలేటర్ పనుల కోసమం 1, 3 నంబర్ ప్లాట్ఫామ్లపై రిజర్వేషన్ బోగీలను సూచించే డిస్ప్లే బోర్డులను తొలగించారు. దీంతో, ఏ బోగీ ఎక్కడ వస్తుందో తెలియక రిజర్వేషన్ ప్రయాణికులు ప్లాట్ఫామ్లపై పరుగులు తీస్తున్న దుస్థితి నెలకొంది. చివరకు ఏదో ఒక బోగీ ఎక్కి, తమ సీట్లకు చేరుకోవాల్సి వస్తోంది. విశాఖపట్నం వైపు వెళ్తే వారు ఒకటో నంబర్ ప్లాట్ఫామ్ పైన, విజయవాడ వైపు వెళ్లే వారు మూడో నంబర్ ప్లాట్ఫామ్లపై వేచి ఉంటారు. అయితే, ప్లాట్ఫామ్ల చివరి వరకూ అభివృద్ధి పనులకు సంబంధించిన రేకులు పడేయడంతో ప్రయాణికులు ఒకరి వెనుక ఒకరు నడిచి వెళ్లాల్సిన పరిస్థితి. రైలు కోసం ఏ మాత్రం అజాగ్రత్తగా పరుగు తీసినా ప్రమాదాలు జరిగే అవకాశం పొంచి ఉంటోంది. ఆరుబయటే వాహనాల పార్కింగ్ రైల్వే స్టేషన్ ఆవరణలో ద్విచక్ర వాహనాలు, కార్లు పార్కింగ్ చేసుకోవడానికి ఓపెన్ ఆక్షన్ ద్వారా లీజుకు ఇస్తారు. ద్విచక్ర వాహనం పార్కింగ్కు గంటకు రూ.10 చెల్లించాలి. గంట దాటితే అదనపు చార్జీ వసూలు చేస్తున్నారు. అయితే, పార్కింగ్ ప్రదేశంలో షెడ్లు లేకపోవడంతో ద్విచక్ర వాహనాలు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్నాయి. పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నప్పటికీ కనీస సదుపాయాలు కల్పించకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరుగులు తీయాల్సి వస్తోంది రిజర్వేషన్ బోగీలు ఎక్కడున్నాయో తెలియక ప్లాటఫామ్పై పరుగులు తీయాల్సి వస్తోంది. ఆరు నెలలుగా ఇదే పరిస్థితి. బోగీల సమాచారాన్ని మైకులో ప్రకటిస్టున్నా అర్థం కావడం లేదు. అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసి, ప్రయాణికుల ఇబ్బందులను తొలగించాలి. ద్విచక్ర వాహనాలకు షెడ్లు లేకపోవడం దారుణం. ఎండలకు పెట్రోలు ఆవిరైపోతోంది. – కాళ్ల లక్ష్మీనారాయణ, మాజీ మున్సిపల్ కౌన్సిలర్, సామర్లకోట -
ఉష్ణోగ్రతలతో పెరిగిన విద్యుత్ వినియోగం
● అంతరాయాల నివారణకు కంట్రోల్ రూమ్లు ● విద్యుత్ పంపిణీ సంస్థ ఎస్ఈ ప్రసాద్ సాక్షి, పాడేరు: కొద్దిరోజులుగా ఎల్నినో ప్రభావం, వాతావరణ మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరగడంతో విద్యుత్ వినియోగం భారీగా పెరిగిందని అల్లూరి సర్కిల్ విద్యుత్ పంపిణీ సంస్థ సూపరింటెండెంట్ ఇంజినీర్ జీఎన్ ప్రసాద్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అకాల గాలులు, పిడుగులతో కూడిన వర్షాలతో అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో తరచూ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోందన్నారు. తమ సర్కిల్ పరిధిలోని ఈ రెండు జిల్లాల వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడమే కాకుండా, ఎలాంటి అంతరాయాలు లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా సిబ్బంది పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే పాడేరులోని సర్కిల్ కార్యాలయంలో అసిస్టెంట్ ఇంజినీర్ (టెక్నికల్) ఆధ్వర్యంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు. విద్యుత్ సరఫరాలో లోపాలున్నా, ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా వినియోగదారులు వెంటనే కంట్రోల్ రూమ్ నంబరును సంప్రదించాలని ఎస్ఈ కోరారు. సెంట్రలైజ్డ్ టోల్ఫ్రీ నంబర్ 1912, సర్కిల్ స్థాయి కంట్రోల్ రూమ్ నంబర్లు పాడేరు డివిజన్ 9440812491 (ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్), పోలవరం జిల్లా పరిధిలో 73825 85554, 94906 10027 (ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్) 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయని ఆయన వెల్లడించారు. -
ఊరగాయాలే..
● చుక్కల్లో మామిడి ధర ● ఆవకాయ రుచికి దూరం ● భారీగా పెరిగిన ముడిసరకు ● నిల్వ పచ్చళ్ల తయారీపై ప్రభావం ఆలమూరు: ఘుమఘుమల సమ్మేళనం ఆవకాయ గొప్పదనం.. మామిడి కాయలు, గుంటూరు కారం, ఉప్పు, ఆవ పిండి, మెంతులు, పప్పు నూనె కలిపి తయారు చేసే ఆవకాయకు అమృతపు రుచి వస్తోంది.. వేసవిలో ప్రతి ఇంటా ఈ తయారీ మొదలవుతుంది. తెలుగువారి నోట ఆవకాయ ముద్ద పడందే తృప్తి ఉండదు. దేశాలు దాటినా ఆవకాయ వాసన మాత్రం తెలుగువారిని తనవైపు లాక్కుంటుంది. ఆహా ఏమి రుచి.. తినరా మైమరచి అన్నట్లు తెలుగువారి సంస్కృతిలో ఒదిగిపోయిన ఈ పచ్చడికి ప్రత్యేక స్థానం ఉంది. వేడివేడి అన్నంలో ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి కలుపుకొని తింటే ఆ అనుభూతి వేరు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసుల ప్రతి ఒక్కరి మదిలో ఈ రుచి పెనవేసుకుంది. నోరూరించే ఈ ఊరగాయలను తయారు చేసుకోవడం పెను భారమైంది. వంద మామిడి కాయలు కొనుగోలు చేస్తే సుమారు ఐదు కుంచాల ముక్కలు అవుతాయి. ఒక్కో కుంచం పచ్చడికి రూ.నాలుగు వేల వరకూ ఖర్చు అవుతుంది. వందకాయల ఆవకాయ పచ్చడి పెడితే దాదాపు రూ.20 వేల వరకూ ఖర్చు పెట్టాల్సిందే. ప్రస్తుతం అన్నిచోట్ల పచ్చళ్ల సీజన్ ఊపందుకుంది. ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఎండుమిర్చి, మెంతులు, ఆవాలు, వెల్లుల్లి, వేరుశెనగ, గానుగ నూనె ధరలు ఆకాశాన్నంటాయి. దీనికి తోడు, పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో దిగుమతులు నిలిచిపోవడంతో ముడిసరకు కొరత అధికమైంది. ఈ ప్రభావం పచ్చళ్ల తయారీపై పడింది. తగ్గిన వ్యాపారం ఆలమూరు మండలం మడికి జాతీయ రహదారి పక్కన ఉన్న అంతర్రాష్ట్ర కూరగాయల మార్కెట్లో, రాజమహేంద్రవరం, రావులపాలెం, కాకినాడ, తుని, మండపేటలోని తదితర హోల్సేల్ మార్కెట్లో పచ్చడికి ఉపయోగించే మామిడికాయల ఽవ్యాపారం ఈ ఏడాది తగ్గిపోయింది. ఆ మార్కెట్లకు ప్రతి రోజూ నూజివీడు, కత్తిపూడి, జగ్గంపేట తదితర చాగల్నాడు, మెట్ట ప్రాంతాల నుంచి పచ్చళ్ల తయారీకి వినియోగించే మామిడి రకాలు గతంలో వందల టన్నుల్లో రాగా, ప్రస్తుతం పదుల సంఖ్యలోకి పడిపోయింది. గ్రామీణ ప్రాంత వ్యాపారులు అక్కడ నుంచి కొనుగోలు చేసుకున్న మామిడికాయలను పరిసర ప్రాంతాల్లోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు వ్యాపారులు తీసుకువెళ్లి విక్రయిస్తుంటారు. మామిడికాయ రకాన్ని బట్టి ధర నిర్ణయించ బడుతుంది. ఎంతో ఇష్టంగా.. ఆవకాయ, మాగాయ, ఉల్లి ఆవకాయ తదితర పచ్చళ్లు అంటే అందరూ ఇష్టపడతారు. తొలి ఏడాది అత్తవారింటికి కోడలు తప్పనిసరిగా పచ్చళ్లు కావడి పంపించడం ఆనవాయితీగా వస్తుంది. పచ్చళ్ల కావళ్లు స్థోమతను బట్టి ఉంటుంది. పెరిగిన ధరల ప్రభావం పెళ్లింట కూడా పడింది. పెళ్లిళ్లలో ఇటీవల తరచూ ఆవకాయ అన్నం, ఆవకాయ ఫ్రైడ్రైస్, ఆవకాయ పులిహోర, ఆవకాయ బిర్యానీ వంటి వంటకాలు చేయడం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. తెలుగింటి లోగిళ్లలో ఏ శుభకార్యం జరిగినా ఆవకాయను వడ్డించకుండా ఉండలేని పరిస్థితి ఉంది. ఈ ఆవకాయ తెలుగువారి కీర్తిని దశదిశలా చాటుతోంది. పచ్చళ్ల తయారీలో ఉపయోగించే ముడిసరకుల ధరలు ఇలా సరకులు గత ఏడాది ఈ ఏడాది కిలో ధర కిలో ధర అవకాయ కారం 400 650 మాగాయ కారం 310 550 గానుగ నూనె 380 450 వేరుశెనగ నూనె 180 270 ఆవాలు 150 220 మెంతులు 120 170 వెల్లుల్లి 200 250 ఉప్పు 12 20 పరిమితంగానే తయారీ పెరిగిన మామిడికాయ, ముడి సరకుల ధరతో ఊరగాయ పెట్టడం పెనుభారంగా మారింది. దీనివల్ల పరిమితంగానే ఆవకాయ, మాగాయి పచ్చళ్లు పెట్టుకున్నాం. వచ్చే ఏడాది వరకూ ఈ పచ్చళ్లు సరిపోవు. మార్కెట్ ముడి సరకుల ధరలు ఎప్పుడూ ఇంతలా పెరగలేదు. –పి.శివకల్యాణి, నార్కెడిమిల్లి, ఆత్రేయపురం మండలం -
నేడు, రేపు డీఎస్ఏలో ఐపీఎల్ ప్రత్యక్ష ప్రసారం
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో గురు, శుక్రవారాల్లో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ను ఎల్ఈడీ స్క్రీన్స్పై ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు బీసీసీఐ క్రికెట్ ఆపరేషన్స్ అధికారి అనంత దత్త గురువారం తెలిపారు. స్థానిక కృషీభవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐపీఎల్ను మరింత మంది అభిమానులకు చేరువ చేయాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాల్లో ఫ్యాన్ పార్స్క్ను నిర్వహిస్తున్నామన్నారు. కాకినాడలో కుటుంబ సభ్యులతో కలసి వచ్చి మ్యాచ్లను ఆస్వాదించేలా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు తలాటం హరీష్ మాట్లాడుతూ క్రికెట్ అభిమానులకు ఫ్యాన్ పార్కు ఒక పెద్ద పండుగ లాంటిదన్నారు. స్టేడియానికి వెళ్లలేని అభిమానులకు తమ నగరంలోనే పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసి స్టేడియంలో ఉన్న అనుభూతిని కల్పిస్తుందన్నారు. సంగీత కార్యక్రమాలు, ఫుడ్ స్టాల్స్, చిల్ట్రన్స్ గేమ్స్ జోన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అదనపు కట్నం వేధింపులపై ఫిర్యాదు ద్వారకాతిరుమల: అదనపు కట్నం కోసం భార్యను చిత్రహింసలకు గురిచేసి, పిల్లలతో సహా ఆమెను ఇంటి నుంచి బయటకు గెంటేసిన భర్త, అత్తమామలపై గురువారం కేసు నమోదు చేసినట్టు ఎస్సై టి.సుధీర్ తెలిపారు. ఆ వివరాల్లోకి వెళ్తే. మండలంలోని దేవినేనివారిగూడేనికి చెందిన కావేరికి, కృష్ణా జిల్లా బాపులపాడు మండలం, రేమెల్ల గ్రామానికి చెందిన కొనకాల ఉమామహేశ్వరరావుతో సుమారు ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. వివాహ సమయంలో కావేరి తల్లిదండ్రులు వరకట్నంగా రూ. 5 లక్షలు, 30 సెంట్ల భూమి, బంగారు ఆభరణాలను ఇచ్చారు. మద్యానికి అలవాటుపడిన భర్త తనను చిత్రహింసలు పెట్టడంతో పాటు, అదనపు కట్నం కోసం అతని తల్లిదండ్రులు కొనకాల సావిత్రి, దుర్గారావులు వేధిస్తున్నారని కావేరి పేర్కొంది. గతేడాది జూన్ 8న తనను కొట్టి, పిల్లలతో పాటు ఇంటి నుంచి బయటకు గెంటేసినట్టు కావేరి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై టి.సుధీర్ తెలిపారు. -
పట్టపగలే సంచోరిస్తూ..
● అదును చూసి దొంగతనాలు ● నిందితుడిని పట్టుకున్న సర్పవరం పోలీసులు కాకినాడ రూరల్: పట్టపగలే దొరలా వస్తాడు.. అదును చూసి దోచుకుపోతాడు.. ఇలా కొన్నేళ్లుగా పట్టపగలే చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చుక్కలు చూపించాడు. చివరికి కటకటాల పాలయ్యాడు. దీనికి సంబంధించిన వివరాలను గురువారం సర్పవరం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్ వెల్లడించారు. సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో 2024, 2025, 2026లో ఆరు పగటి పూట చోరీ కేసులు నమోదయ్యాయి. ఇందులో నిందితుడు కాకినాడ అర్బన్ రేచర్లపేట బర్మాకాలనీకి చెందిన ములపర్తి దుర్గాప్రసాద్ (నాని) అనే ప్రసాద్ను సర్పవరం పోలీసులు ఆర్టీఓ కార్యాలయం రోడ్డులోని కోటయ్య కన్వెన్షన్ హాలు వద్ద గురువారం మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.32 లక్షల విలువైన 225 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు దొంగతనానికి ఉపయోగించిన బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి నిందితుడు దొంగతనాలకు పాల్పడుతున్నాడన్నారు. మూడేళ్లుగా దొంగతనాలకు పాల్పడతుండగా పోలీసులకు మాత్రం చిక్కడం ఇదే మొదటి సారి అన్నారు. ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తాళాలు బయటకు కనపడేలా వేయరాదని, ఇళ్లకు ఇన్నర్ లాకింగ్ సిస్టమ్ పెట్టుకోవాలన్నారు. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (ఎల్హెచ్ఎంఎస్) అనే పోలీస్ అప్లికేషన్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు యాప్లో రిక్వెస్ట్ పెట్టడం ద్వారా ఉచిత పోలీసు సర్వీస్ను ఉపయోగించుకుని, నేరాలు జరగకుండా చూసుకోవాలని అన్నారు. సర్పవరం సీఐ సీహెచ్ ప్రకాష్, ఎస్సై ఏసుబాబు, క్రైం ఎస్సై వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
గోదావరిలో దూకి యువకుడి ఆత్మహత్య
పెరవలి (కొవ్వూరు): ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కొవ్వూరు రూరల్ ఎస్సై శ్రీహరి కథనం ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు గ్రామానికి చెందిన మణికంఠ (26) రెండు రోజుల క్రితం ఇంట్లో తల్లిదండ్రులకు తమ ప్రేమ గురించి తెలిపాడు. ఆ అమ్మాయితో వివాహం చేయాలని తెలపడంతో వారు నిరాకరించారు. దీంతో జీవితంపై విరక్తి చెంది మోటార్ సైకిల్పై కొవ్వూరు మండలం మద్దూరు వద్ద గోదావరి బ్యారేజీ వద్దకు వచ్చి, అక్కడి నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువకుడు గోదావరిలో దూకిన సమయంలో బ్యారేజీ తలుపులపై పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గురువారం మృతదేహం పైకి తేలడంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీహరి తెలిపారు. మద్యం మానుకోమన్నందుకు కుమారుడి ఆత్మహత్య తుని: మద్యం అలవాటు మానుకోవాలని తండ్రి చెప్పిన మాటలకు మనస్తాపం చెందిన కొడుకు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. తుని జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ శ్యామ్ త్రినాథరావు కథనం ప్రకారం. తొండంగి మండలం శృంగవృక్షం గ్రామానికి చెందిన పులుగు పెద్దిరాజుకు ఇద్దరు కుమారులు, కుమార్తె. పెద్ద కుమారుడు హైదరాబాద్లో పెట్రోల్ బంకులో పని చేస్తున్నాడు. చిన్న కుమారుడు పులుగు అనిల్కుమార్ (25) లారీ డ్రైవర్. వీరు ఉంటున్న పాత ఇంటిని పడగొట్టి కొత్త ఇంటి నిర్మాణం చేపట్టారు. ఇందులో భాగంగా మద్యం అలవాటు ఉన్న అనిల్కుమార్ను తండ్రి పెద్దిరాజు మద్యం తాగడం మానేసి ఇంటి నిర్మాణానికి సహకరించాలని చెప్పాడు. దీంతో అనిల్కుమార్ బుధవారం రాత్రి మోటారు సైకిల్పై ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయి రావికంపాడు – అన్నవరం మధ్యలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. అన్నవరం రైల్వే స్టేషన్ మాస్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నామని హెచ్సీ త్రినాథరావు తెలిపారు. బావిలో పడిన అప్పన్నెద్దు బయటకు తీసిన స్థానికులు తాళ్లరేవు: కోరంగి పంచాయతీ సీతారామపురం ప్రధాన రహదారిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చెంతన ప్రమాదవశాత్తూ అప్పన్నెద్దు బావిలో పడింది. ఇరుకుగా ఉన్న బావిలో పడడంతో సుమారు రెండు గంటలకుపైగా అప్పన్నెద్దు నరకయాతన అనుభవించింది. అటుగా వెళుతున్న ఓ వ్యక్తి చూసి గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. హుటాహుటిన స్థానికులు, యువకులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని చాలాసేపు తాళ్లతో బయటకు లాగేందుకు ప్రయత్నించారు. ఎంతకీ రాకపోవడంతో స్థానిక కాంట్రాక్టరు మంథా కృష్ణమూర్తి (నాని) జేసీబీని తీసుకువచ్చి బావికి సమాంతరంగా తవ్వారు. తరువాత బావి వరను పగులగొట్టి అప్పనెద్దును జాగ్రత్తగా బయటకు లాగారు. మానవత్వంతో అప్పన్నెద్దును బయటకు తీసి కాపాడిన వారందరికీ గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. -
వరుణరాగం
కొత్తపల్లిలో కురుస్తున్న భారీ వర్షంఎడారిలో దిక్కు తోచక తిరుగుతున్న వారికి ఒయాసిస్సు కనిపించినట్టు.. కొన్నాళ్లుగా చండప్రచండంగా ఎండలు మండిపోతున్న వేళ.. ఉన్నట్టుండి ‘వరుణ’ రాగం వినిపించింది. తొండంగి తదితర ప్రాంతాల్లో మంగళవారం రాత్రి వర్షం కురిసిన విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపా అన్నట్టు కాకినాడ, కొత్తపల్లి తదితర ప్రాంతాల్లో బుధవారం ఉదయం ఆకాశాన దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. ఉరుములు, మెరుపులతో ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. సుమారు గంట పాటు కురిసిన ఈ వర్షం ప్రజలకు సూర్యప్ర‘తాపం’ నుంచి రోజంతా ఉపశమనాన్నిచ్చింది. వానకు ఈదురు గాలులు కూడా తోడవడంతో అక్కడక్కడ చెట్లు నేల కూలాయి. విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి. కాకినాడలో ఆర్టీఓ కార్యాలయం వద్ద రోడ్డుపై చెట్టు కూలిపోవడంతో వలసపాకల వైపు వెళ్లే వాహనాలు కొద్దిసేపు ఒకే మార్గంలో రాకపోకలు సాగించాల్సి వచ్చింది. దీంతో, ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈదురు గాలులు, భారీ వర్షం కారణంగా కొత్తపల్లి మండలం కొమరగిరి శివారు నాగపేటలో తాటిచెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడ్డాయి. దీంతో, మూడు విద్యుత్ స్తంభాలు, సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ నేలకొరిగాయి. దీంతో, విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈపీడీసీఎల్ అధికారులు, సిబ్బంది చెట్లను తొలగించి, విద్యుత్ స్తంభాలు వేసి, సరఫరాను పునరుద్ధరించారు. – కాకినాడ రూరల్/కొత్తపల్లి -
అక్రమార్జనకు అడ్డదారి
ఫ శివశివాసాక్షి ప్రతినిధి, కాకినాడ: దేవుడి గుడి నిర్మిస్తామంటూ చందాలు వసూలు చేయడం చూస్తూంటాం. ఆలయ నిర్మాణం పూర్తయిపోయాక ఇక చందాల వసూలు ఆపేస్తారు. కానీ, తెలుగు తమ్ముళ్ల రూటే సెపరేటు. ఆలయ నిర్మాణం పేరుతో అక్రమ వసూళ్లకు తెర తీశారు. ఆ నిర్మాణం పూర్తయిపోయినా ఇప్పటికీ దేవుడి పేరుతో వసూళ్ల దందా సాగిస్తూనే ఉన్నారు. ఈ దోపిడీ ఎక్కడో కుగ్రామంలో జరుగుతోందనుకుంటే ‘తప్పు’లో కాలేసినట్టే. కోల్కతా – చైన్నె 16వ నంబర్ జాతీయ రహదారిపై కృష్ణవరం టోల్గేటు సాక్షిగా అక్రమార్జనకు తెగబడుతున్నారు. టీడీపీ ముఖ్య నేతల కనుసన్నల్లోనే ఈ అక్రమ వసూళ్లు సాగుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం గద్దెనెక్కినప్పటి నుంచి కృష్ణవరం టోల్గేటుకు ప్రత్యామ్నాయంగా తెలుగు తమ్ముళ్లు అనధికార టోల్గేటు వంటిది పెట్టి.. ముక్కుపిండి మరీ వసూళ్లు చేస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏడాదిన్నర కాలంగా దేవుడి గుడి ముసుగేసుకుని కోట్లు కొల్లగొడుతున్నారు. బహిరంగంగానే ఈ దోపిడీ సాగుతున్నా అడిగే నాథుడే లేకుండా పోయాడు. కేంద్ర ప్రభుత్వం నుంచి టెండర్ ప్రక్రియలో టోల్గేటును దక్కించుకున్న నిర్వాహకులు కూడా టీడీపీ నేతలకు అడ్డు చెప్పలేక చేతులెత్తేశారు. ఏం జరుగుతోందంటే.. కిర్లంపూడి మండలం కృష్ణవరం వద్ద జాతీయ రహదారిపై ఎప్పట్నుంచో అధికారికంగా టోల్గేటు ఉంది. రాజమార్గమైన ఈ టోల్గేటు మీదుగా వెళ్తే పోలీసు, రవాణా, రెవెన్యూ అధికారుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో.. ఇసుక, మట్టి, గ్రావెల్ టిప్పర్లు, లారీలు ఇక్కడ అడ్డదారిలో వెళ్తున్నాయి. బూరుగుపూడి శివారున పోలవరం కాలువ గట్టు, కృష్ణవరం మీదుగా దోపిడీదారులు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆ గ్రామంలోని చిన్నచిన్న వీధుల్లో సుమారు 60 నుంచి 65 టన్నుల ఇసుక, మట్టి లోడు టిప్పర్లు, లారీలు తిరుగుతున్నాయి. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఇసుక, మట్టి టిప్పర్లు యథేచ్ఛగా తిరుతూండటంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. వాటి ధాటికి ఇళ్ల గోడలు కూడా బీటలు వారుతున్నాయని, ఎవరికి మొర పెట్టుకున్నా ఫలితం ఉండటం లేదని ఆవేదన చెందుతున్నారు. మరోవైపు టన్నులకొద్దీ బరువైన లారీలు తిరుగుతూండటంతో గ్రామంలోని సీసీ రోడ్లు ధ్వంసమైపోతున్నాయి. కృష్ణవరం ‘తమ్ముడి’ దందా సరిగ్గా ఇక్కడే టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. కృష్ణవరం టోల్గేటుకు సమాంతరంగా ఇసుక, మట్టి అక్రమ రవాణాదారులు రాకపోకలు సాగిస్తున్న అడ్డదారిలో గ్రామ శివారును అనధికారికంగా మరో టోల్గేటు వంటిది తెరిచారు. శివాలయం కడుతున్నామనే పేరుతో ఇక్కడ అనధికారికంగా రోజువారీ వసూళ్లకు తెగబడుతున్నారు. జగ్గంపేట నియోజకవర్గంలోని టీడీపీ ముఖ్య నేతకు కృష్ణవరంలో ఉన్న ముఖ్య అనుచరుడు, అతని అనుయాయులే ఈ దందాకు పాల్పడుతున్నారు. అఽధికారిక టోల్గేటుకు ఆదాయం రాకుండా చేసి, దొడ్డి దారిన డైలీ రూ.లక్షలు దోచుకుంటున్నారు. అక్కడ ఒక పాక ఏర్పాటు చేసి, ఇసుక, గ్రావెల్ టిప్పర్లు, ఇతర వాహనాల నుంచి దౌర్జన్యంగా డబ్బులు గుంజుతున్నారు. ఇర్రిపాక, సోమవరం, కృష్ణవరం ఏలేరు కాలువ నుంచి నిత్యం ఇసుక, మట్టి లోడుతో ఈ మార్గంలో రాజమహేంద్రవరం వైపు 150 వరకూ టిప్పర్లు, లారీలు వెళ్తూంటాయి. ఈ మార్గంలో వెళ్తే ఆ వాహనాలకు అధికారుల అనుమతులు, అదనపు లోడుతో వెళ్తే అడ్డుకుంటారనే భయం ఉండదు. పైగా, ఈ మార్గానికి పచ్చ నేతల అండదండలు కూడా ఉండటంతో గుట్టు చప్పుడు కాకుండా దొడ్డిదారిలో మట్టి, ఇసుక పెద్ద ఎత్తున తరలించుకుపోతున్నారు. ఇదే అదునుగా టీడీపీ నేతలు ఈ మార్గంలో భారీ వాహనం నుంచి రూ.1,000కి తక్కువ కాకుండా అక్రమంగా వసూలు చేస్తున్నారు. ఈవిధంగా నెలకు రూ.అర కోటి పైగా వసూలు చేస్తున్నారన్నది అంచనా. ఇలా అక్రమంగా వస్తున్న సొమ్మును సంబంధిత ‘కృష్ణవరం తమ్ముడు’ నెలకోసారి లెక్క తేల్చి ముఖ్య నేతలకు తలా రూ.10 లక్షల చొప్పున దేవుడి హుండీలో మాదిరిగా ముడుపు మూటగట్టి ముట్టజెబుతున్నారని ఆ గ్రామం కోడై కూస్తోంది. దౌర్జన్యం అడ్డదారిలో వాహనాల రాకపోకలను అడ్డుకునేందుకు బూరుగుపూడి సమీపాన అధికారిక టోల్ప్లాజా నిర్వాహకులు గతంలో బ్యారియర్లు ఏర్పాటు చేశారు. అయితే, అక్రమార్జనకు అలవాటు పడిన తెలుగు తమ్ముళ్లు ఈ బ్యారియర్లను రాత్రి పూట పొక్లెయిన్లతో రెండు మూడు పర్యాయాలు దౌర్జన్యంగా తొలగించేశారు. దీంతో, చేసేది లేక టోల్ప్లాజా నిర్వాహకులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు.కొసమెరుపు ఈ దందాలో బిగ్ ట్విస్ట్ అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. కృష్ణవరం ఏలేరు నది ఒడ్డున శ్రీ విజయేశ్వరి సమేత విశ్వనాథస్వామి, గ్రామ దేవత శ్రీమంట్లమ్మ అమ్మ ఆలయాల పేరు చెప్పి తెలుగు తమ్ముళ్లు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. కానీ, ఆ ఆలయాల నిర్మాణాలు ఎప్పుడో 2018లోనే పూర్తి కావడం, అక్కడకు భక్తులు నిత్యం వచ్చి దర్శించుకుంటూ, పూజలు కూడా చేస్తూండటం కొసమెరుపు. అయినప్పటికీ, ఆ ఆలయాల నిర్మాణం పేరుతో ఏడాదిన్నర కాలంగా తెలుగు తమ్ముళ్లు అడ్డూ అదుపూ లేకుండా దోపిడీకి పాల్పడుతూండటం.. కళ్ల ముందే ఇదంతా జరుగుతున్నా అధికారులు మిన్నకుండిపోవడం విచిత్రం. ఫ దేవుడి పేరిట నిలువు దోపిడీ ఫ తమ్ముళ్ల దందా ఫ కృష్ణవరంలో నకిలీ టోల్గేటు ఫ నిర్మాణం పూర్తయిన ఆలయాల పేరిట వసూళ్లు ఫ నెలకు అరకోటి వసూళ్లు ఫ ఏడాదిన్నరగా యథేచ్ఛగా దందా -
పథకాల అమలుకు నిరంతర పర్యవేక్షణ
● ఆర్జేడీ నాగమణి ● డీవైఈఓ, ఎంఈఓలకు ఒకరోజు శిక్షణ రాజమహేంద్రవరం రూరల్: పాఠశాలల్లో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, నాణ్యమైన బోధనా పద్ధతులు మెరుగు పరచడానికి నిరంతర పర్యవేక్షణ అవసరమని జోన్–2 ప్రాంతీయ విద్యా సంచాలకురాలు జి.నాగమణి పేర్కొన్నారు. పాఠశాలల పర్యవేక్షణపై జోన్–2 పరిధిలోని డీవైఈవోలు, ఎంఈవోలకు బుధవారం స్థానిక ఫ్యూచర్ కిడ్స్ పాఠశాలలో ఒకరోజు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్సనలైజ్డ్ అడాప్ట్ లెర్నింగ్ (పాల్ ) ఎలా నిర్వహించాలి.. విద్యార్థుల సామర్ాధ్యలను ఎలా బలోపేతం చేయాలన్న అంశాలపై శిక్షణ ఇచ్చారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పటిష్ట అమలుకు నిరంతర పర్యవేక్షణ అవసరమని సూచించారు. రాష్ట్ర పాల్ సమన్వయకర్త కిశోర్ బాబు, సీమాట్ సీనియర్ లెక్చరర్ ఎస్.ప్రసాద్, సమగ్ర శిక్ష సీనియర్ ఫ్యాకల్టీ మాధవీలత ఈ శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో డీఈఓ కంది వాసుదేవరావు, జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ ఎస్.సుభాషిణి, తూర్పుగోదావరి జిల్లా అకాడమిక్ మోనిటరింగ్ ఆఫీసర్ లక్ష్మణ్ కుమార్, సుమారు 200 మంది ఎంఈవోలు, డీవైఈఓలు, మానిటరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
● వెనుక చూపేదీ?
ప్రయాణమేదైనా లక్ష్యం వెనకున్నవారి శ్రేయస్సు కోసమే. ఆ ప్రయాణమే ప్రమాదకరంగా ఉంటే.. ఆ లక్ష్యానికి అర్ధం లేదు. ఇదిగో ఈ చిత్రాలే అందుకు నిదర్శనం. ఎన్నో కుటుంబాలు వారి రాకకోసమో.. క్షేమంగా చేరారన్న సమాచారం కోసమో వారిళ్లలో ఎదురు చూస్తుంటారు. అనుకోని ఘటనలో జరగరానిది జరిగితే వారిపై ఆధారపడి ఉన్నవారి జీవితాలు తలకిందులేగా..! ఎవరి జీవితాలను వారు తేలిగ్గా తీసుకుని ఇలా ప్రయాణాలు చేస్తుంటే అధికారులు సదస్సులు, అవగాహనలు పెట్టి ఏం లాభం? మండల పరిధిలో నిత్యం రద్దీగా ఉండే హైవేలో నిత్యం చిన్నో పెద్దో ప్రమాదాలు మామూలే. వాహన చోదకులకు కాదు.. ప్రయాణికులకు ‘వెనుక’ చూపు ఎంతో అవసరం. – గండేపల్లి -
శబరిలో మునిగి మహిళ మృతి
చింతూరు: మతి స్థిమితం లేని మహిళ స్థానిక శబరినదిలో మునిగి మృతిచెందిన సంఘటన మండలం చట్టిలో చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన లాడె కుమారి (55) మతి స్థిమితం లేకపోవడంతో పాటు క్షయవ్యాధితో బాధపడుతోంది. బుధవారం ఉదయం చింతూరు, వీఆర్ పురం ప్రధాన రహదారిలోని ఎయిర్టెల్ టవర్ వద్ద శబరినదిలో ఆమె మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్నానానికి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు నదిలో పడి మృతి చెంది ఉండవచ్చని, కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సంతోష్కుమార్ తెలిపారు. రైలు ఢీకొని వ్యక్తి.. నిడదవోలు: స్థానిక రైల్వే ఓవర్ బ్రిడ్జి సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద బుధవారం సుమారు 40 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి రైలు ఢీకొని మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. రైల్వే ట్రాక్ వెంబడి నడచి వస్తుండగా రాజమహేంద్రవరం నుంచి విజయవాడవైపు వెళ్తున్న రైలు ఢీకొని అతడు మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు 5.5 అడుగుల ఎత్తు, చామన ఛాయలో ఉన్నాడు. నలుపు రంగు జీన్స్ ప్యాంటు, తెలుపు, నలుపు రంగుల చొక్కా ధరించి ఉన్నాడు. తాడేపల్లిగూడెం రైల్వే హెస్సీ డి.వెంకటేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పాముకాటుకు గురై..రాజానగరం: మండలంలోని తూర్పుగానుగూడేనికి చెందిన సిద్దాబత్తుల ధనలక్ష్మి (60) పాము కాటుకు గురై మృతి చెందింది. ఉపాధి కూలీ పనులు చేస్తూ జీవించే ఆమె మంగళవారం రాత్రి ఇంటి వద్ద బాత్రూంలో స్నానం చేసి ఇంట్లోకి వెళ్తున్న సమయంలో పాము కాటు వేసింది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు వచ్చిన 108 వాహనంలో ఆమెను రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తూర్పు గానుగూడెం క్రైస్తవ సంఘ ప్రతినిధి జి.సుందరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ధనలక్ష్మికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పోక్సో కేసు నమోదు దేవరపల్లి: నల్లజర్ల పోలీస్ స్టేషన్లో ఓ యువకుడిపై బుధవారం పోక్సో కేసు నమోదైంది. తన కుమార్తైపె అత్యాచారం చేసిన కొక్కిరిపాటి కిరణ్ కుమార్పై ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ రవికుమార్ తెలిపారు. బాలుడి అక్రమ రవాణాకు చెక్ ● కిడ్నాప్నకు గురైన పశ్చిమబెంగాల్ బాలుడు ● రక్షించి తండ్రికి అప్పగించిన అధికారులు కాకినాడ క్రైం: పశ్చిమ బెంగాల్లో అక్రమ రవాణాకు గురైన 16 ఏళ్ల బాలుడ్ని జిల్లా బాలల పరిరక్షణ విభాగం (డీసీపీయూ) సిబ్బంది, తుని రైల్వే పోలీసులు రక్షించారు. వివరాల్లోకి వెళితే, ఓ గుర్తు తెలియని యువకుడు బాలుడికి మాయమాటలు చెప్పి ఈ నెల 24న పశ్చిమబెంగాల్లో రైలు ఎక్కించాడు. రైలు రాష్ట్రం సరిహద్దులు దాటే సరికి బాలుడికి భయం మొదలైంది. 25న ఆంధ్రప్రదేశ్లో తుని రైల్వేస్టేషన్కి చేరేసరికి రైలులో సాధారణ తనిఖీలు చేస్తున్న జీఆర్పీ సిబ్బంది బాలుడి అనుమానాస్పద ప్రవర్తనను గుర్తించి వివరాలు ఆరా తీశారు. ఈ లోగా బాలుడిని తీసుకువచ్చిన యువకుడు పరారయ్యాడు. బాలుడి విషయాన్ని జిల్లా బాలల పరిరక్షణ అధికారి చదలవాడ వెంకట్రావుకు తెలియజేశారు. ఆయన జిల్లా పీడీ చెరుకూరి లక్ష్మి ఆదేశాల మేరకు, బాలుడి చిరునామాను గుర్తించి తండ్రి హరిద్దీన్ను పిలిపించి అప్పగించారు. -
బాలురే డ్రైవర్లు!
● మట్టి మాఫియా మాయాజాలం ● పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం పి.మల్లవరం పంచాయతీ రాంజీనగర్ రహదారిలో మట్టి ట్రాక్టర్ నడుపుతున్న బాలుడుపి.మల్లవరంలో జేసీబీని ఆపరేట్ చేస్తూ ట్రాక్టర్లో మట్టిని వేస్తున్న బాలుడుతాళ్లరేవు: మండలంలో మట్టి మాఫియా ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. పగలు, రాత్రి తేడా లేకుండా మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. నిత్యం వందలాది ట్రాక్టర్లు.. మట్టిని తరలిస్తూ బిజీగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో డ్రైవర్లు దొరక్క బాలురతో ట్రాక్టర్లను నడిపించేస్తున్నారు. ప్రజలను భయకంపితులను చేస్తున్నారు. ట్రాక్టర్లతోపాటు భారీ వాహనాలైన జేసీబీలను కూడా పట్టుమని పదేళ్లయినా నిండని పిల్లలతో డ్రైవింగ్ చేయించడం చర్చనీయాంశంగా మారింది. బుధవారం పి.మల్లవరం పంచాయతీ పెదపేటలో మట్టిని ట్రాక్టర్లతో తరలించారు. ఆ మట్టిని తవ్వి ట్రాక్టర్లలో నింపే జేసీబీ డ్రైవర్ ఒక బాలుడు కావడం గమనార్హం. 14 ఏళ్ల లోపు ఉండే ఆ బాలుడు ప్రమాదకర రీతిలో జేసీబీని ఆపరేట్ చేయడాన్ని ‘సాక్షి’ కెమెరా క్లిక్మనిపించింది. సాధారణంగా 18 ఏళ్లు దాటితేనే తప్ప టూవీలర్ లైసెన్స్ మంజూరు చేయరు. అలాంటిది 14 ఏళ్ల లోపు బాలుడు జేబీసీని ఆపరేట్ చేయడం గమనార్హం. మట్టి ట్రాక్టర్లను కూడా లైసెన్స్లేని బాలురు నడుపుతున్నారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, పోలీసులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. -
తలుపులమ్మ తల్లికి రూ.54.44 లక్షల ఆదాయం
తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారికి హుండీల ద్వారా రూ.54,44,339 ఆదాయం సమకూరిందని లోవ దేవస్థానం ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. దేవదాయ శాఖ జిల్లా అధికారి వి.వెంకటేశ్వరరావు, గ్రేడ్–1 ఈఓ ఎం.మురళీ వీరభద్రరావు పర్యవేక్షణలో దేవస్థానంలోని హుండీలను బుధవారం తెరచి నగదు లెక్కించారు. మొత్తం 58 రోజులకు నాణేల రూపంలో రూ.3,46,308, నోట్ల రూపంలో రూ.50,98,031 ఆదాయం లభించిందని ఈఓ విశ్వనాథరాజు వివరించారు. హ్యాండ్బాల్ పోటీలకు జిల్లా జట్టు నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): విజయనగరం జిల్లాలో గురు, శుక్రవారాల్లో జరిగే రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టు బుధవారం పయనమైంది. జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంవీవీ దుర్గాప్రసాద్ ఈ విషయం తెలిపారు. జట్టులో పవన్ గణేష్, సోమరాజు, ఎంఎస్ రాజు, పాల్జోన్స్, హేమంత్సాయి, వెంకట గణేష్, కుర్షద్, భవిక్, కె.నరూన్, చరణ్తేజ, వీరేంద్ర, ప్రజ్వల్, నిశాంత్రెడ్డి, చైతన్య, సూర్యకుమార్ ఉన్నారని వివరించారు. రెండు వర్కింగ్ వుమెన్ హాస్టళ్ల మంజూరు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కేంద్ర ప్రభుత్వం జిల్లాకు రెండు వర్కింగ్ వుమెన్ హాస్టళ్లను మంజూరు చేసింది. ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ బుధవారం ఈ విషయం తెలిపారు. ఉద్యోగం, ఉన్నత చదువుల కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే మహిళల కోసం కాకినాడ, పిఠాపురం ప్రాంతాల్లో ‘సఖి నివాస్’ పథకంలో భాగంగా వీటిని కేంద్రం ఏర్పాటు చేస్తోందని వివరించారు. ఒక్కోచోట 30 మంది మహిళలకు వసతి కల్పిస్తారన్నారు. నీట్ పేపర్ లీకేజీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే గోకవరం: నీట్ పేపర్ లీకేజీకి కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని, సంబంధిత మంత్రిని వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరంజనేయులు డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజీపై సంఘం ఆధ్వర్యాన శివరామపట్నంలో బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కర్నాకుల మాట్లాడుతూ, గతంలో కూడా అనేకసార్లు పేపర్ లీకవడంతో వందలాది మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా అనిపించడం లేదని విమర్శించారు. ఈ ఏడాది కూడా నీట్ పేపర్ లీకవడంతో రేయింబవళ్లు కష్టపడి చదివిన సుమారు 15 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం కలచివేసిందన్నారు. నీట్ పరీక్షల నిర్వహణను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని కర్నాకుల డిమాండ్ చేశారు. కేసుల సత్వర పరిష్కారానికి చర్యలుకంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఉచిత న్యాయ సహాయ కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని 9వ అదనపు జిల్లా జడ్జి జి. షణ్ముఖరావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యార్లగడ్డ శ్రీలక్ష్మిక్ష పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో బుధవారం మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. దీనికి హాజరై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్యానల్ న్యాయవాదులు, డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులతో సమీక్ష నిర్వహించారు. వివిధ కేసులలో ఉచిత న్యాయ సహాయం అందించేందుకు నియమితులైన న్యాయవాదులతో ఆయా కేసుల పురోగతిని సమీక్షించారు. పెండింగ్లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.


