breaking news
Kakinada District Latest News
-
ఎంపీడీవో రాజేశ్వరరావు సస్పెన్షన్
తొండంగి: శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండల పరిషత్ ఇన్చార్జి ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తుండగా ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసిన కారణంగా మండల పరిషత్ ఎంపీడీవో బి.రాజేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్దిశాఖ కమిషనర్ వి.ఆర్.కృష్ణ తేజ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2022లో శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండల పరిషత్త్లో ఈవోపీఆర్డీ, ఇన్చార్జి ఎంపీడీవోగా బి.రాజేశ్వరరావు విధులు నిర్వహించారు. రూ.14,84,900 నిధుల దుర్వినియోగం జరిగింది. ఈ ఆరోపణల నేపథ్యంలో అప్పటి జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపి ఆ శాఖ ఉన్నతాధికారులకు నివేదించారు. వ్యక్తిగత ఖర్చుల నిమిత్తం ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేయడంతో క్రిమినల్ మిస్ కాండక్ట్ కింద ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా తుని మండలం ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్న కె.సాయినవీన్కు తొండంగి మండలం ఎంపీడీవో ఇన్చార్జి బాధ్యతలు అప్పగించినట్టు జిల్లా పరిషత్ సీఈఓ నుంచి ఆదేశాలందాయి. వైఎస్సార్ సీపీ రాష్ట్ర మున్సిపల్ విభాగ ప్రధాన కార్యదర్శిగా అయ్యారావు పిఠాపురం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించిన రాష్ట్ర మున్సిపల్ విభాగ కమిటీలో ప్రధాన కార్యదర్శిగా గొల్లప్రోలుకు చెందిన వైఎస్సార్ సీపీ సీనియర్ నేత మొగలి మాణిక్యాలరావు (అయ్యారావు) నియమితులయ్యారు. పార్టీ అధిష్టానం తనపై నమ్మకం ఉంచి పదవి ఇచ్చిందని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ పటిష్టతకు, సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అయ్యారావు తెలిపారు. తనకు పదవి రావడానికి కృషి చేసిన వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి వంగా గీతావిశ్వనాఽథ్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఆరా కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్లో చోటు చేసుకున్న పారామెడికల్ విద్యార్థులపై లైంగిక వేధింపుల ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించింది. శుక్రవారం రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అత్త లూరి విష్ణువర్దన్కు కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ ఫోన్ చేశారు. ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. విచారణపై ఆరా తీసి, నిందితులపై కళాశాల తరఫున చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. -
రత్నగిరి భద్రత పటిష్టతకు తొలి అడుగు
● సీసీ టీవీ దృశ్యాల రికార్డింగ్ బ్యాకప్ 90 రోజులుండేలా చర్యలు ● ఇందుకోసం రూ.70 లక్షలతో ఆన్లైన్ సర్వర్లు, హార్డ్డిస్క్లు ● అన్నవరం దేవస్థానం పాలకవర్గం తీర్మానం అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో భద్రతా చర్యలపై పాలకమండలి దృష్టి సారించింది. శుక్రవారం రత్నగిరిపై చైర్మన్ ఐవీ రోహిత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీసీ టీవీలు రికార్డు చేసిన దృశ్యాలు 90 రోజులపాటు సర్వర్లో ఉండేలా రూ.70లక్షల వ్యయంతో ఆన్లైన్ సర్వర్లు, హార్డ్డిస్క్లు ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. ప్రస్తుతం సీసీటీవీలు రికార్డు చేసిన దశ్యాలు 30 రోజులవి మాత్రమే సర్వర్లో ఉంటాయి. అయితే మిగిలిన ప్రముఖ దేవస్థానాలలో కనీసం 90 రోజులు సీసీటీవీ రికార్డింగ్ బ్యాకప్ సదుపాయం ఉంది. అన్నవరం దేవస్థానంలో 320 సీసీ టీవీ కెమెరాలు ఉన్నాయి. సీసీటీవీ బ్యాకప్ 90 రోజులకు పెంచుకోవాలని దేవదాయశాఖ ఉన్నతాధికారులు, పోలీస్ శాఖ పలుమార్లు దేవస్థానం అధికారులకు సూచించడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో ఈఓ వీర్ల సుబ్బారావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు వీ నూకరత్నం, వీ రామకృష్ణ, ఎలక్ట్రికల్ డీఈ వీ సత్యనారాయణ పాల్గొన్నారు. మొత్తం పది అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. తీర్మానాలు.. ● మొదటి ఘాట్ రోడ్ వద్ద నుంచి న్యూసెంటినరీ సత్రం వరకు నిర్మిస్తున్న రెండో మెట్లదారికి రూ.27 లక్షల వ్యయంతో విద్యుత్ దీపాలు, సౌండ్సిస్టమ్, సీసీ టీవీలు, అండర్ గ్రౌండ్ కేబుల్స్, ప్యానల్ బోర్డుల ఏర్పాటుకు ఆమోదం ● సత్యగిరి, రత్నగిరి ఘాట్రోడ్లలో, కొండ దిగువన ట్రాఫిక్కు అంతరాయం లేకుండా వాహనాల రాకపోకలకు వీలుగా రూ.23 లక్షల వ్యయంతో ప్రీ కాస్ట్ ఆర్సీసీ డివైడర్స్ ఏర్పాటు ఆమోదం ● దేవస్థానంలో సత్యగిరి పవర్హౌస్ నుంచి విష్ణుసదన్ సత్రానికి ప్రస్తుతం విద్యుత్ సరఫరా చేస్తున్న కేబుల్ పాడైనందున దాని స్థానంలో అండర్ గ్రౌండ్ కేబుల్, ప్యానల్ బోర్డును రూ.26 లక్షలతో ఏర్పాటు చేసేందుకు నిర్ణయం ● ప్రధానాలయం, వ్రత మంటపాలు, ఉచిత క్యూ శ్లాబ్ల, విష్ణుసదన్ సత్రం జాయింట్ బీమ్లలో లీకేజీలు అరికట్టేందుకు రూ.18.65 లక్షలతో రస్ట్ప్రూఫ్ ట్రీట్మెంట్ గ్రౌటింగ్ పనులు చేసేందుకు ఆమోదం ● రూ.16 లక్షలతో పంపా రిజర్వాయర్ పవర్ ఆఫీసు వద్ద నిర్మించిన బోర్వెల్స్ వద్దకు సిబ్బంది వెళ్లడానికి ర్యాంప్ నిర్మాణం, రత్నగిరి వై జంక్షన్ వద్ద నూతనంగా సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆమోదం -
కీచకులపై చర్యలు తీసుకోండి
కాకినాడ రూరల్: రంగరాయ మెడికల్ కళాశాల విద్యార్థినులపై వేధింపులకు పాల్పడిన కీచకులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి డిమాండ్ చేశారు. ఆమె శుక్రవారం వీడియో ప్రకటన విడుదల చేశారు. మాట్లాడుతూ రాష్ట్రంలోనే పేరున్న రంగరాయ కళాశాలను కూడా కీచకులు వదలడం లేదని, పారా మెడికల్ విద్యార్థినుల పట్ల ల్యాబ్ అటెండెంట్, టెక్నీషియన్లు ప్రవర్తించిన తీరు అమానుషమని దీన్ని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, దాడులు, హత్యలు, లైంగిక వేధింపులు ఎక్కువ అయ్యాయన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని ఆరోపణలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగరాయ ఘటనపై స్పందించాలని నాగమణి కోరారు. తలుపులమ్మకు సారె సమర్పణతుని: తలుపులమ్మ అమ్మవారి లోవ దేవస్థానానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. ఆషాఢమాసంలో మూడో శుక్రవారం కావడంతో పలు జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారికి చీర, సారె సమర్పించారు. ఇళ్లల్లో స్వయంగా తయారు చేసిన పిండి వంటలతో నింపిన బిందెలను శిరస్సుపై ధరించి వస్తున్న భక్తులకు రాజగోపురం వద్ద ఆలయ ఈఓ విశ్వనాథరాజు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. మహిళలు అమ్మవారికి సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. పండితులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఏర్పాట్లను కార్యనిర్వహణాధికారి విశ్వనాథరాజు పర్యవేక్షించారు. కుట్ర పూరితంగా ఎస్సీవర్గీకరణ అమలు జగ్గంపేట: ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతపై అన్ని రాజకీయ పార్టీలు కుట్ర చేస్తున్నాయని, ప్రధానంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎస్సీ వర్గీకరణ పేరుతో మాల సామాజిక వర్గాన్ని అణచివేయాలని చూస్తున్నారని నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ మాల మహానాడు అండ్ రాక్ నేత డాక్టర్ ఆర్.ఎస్.రత్నాకర్ తెలిపారు. జగ్గంపేటలో శుక్రువారం విలేకరులతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలలో మాలల ఉనికిని దెబ్బతీయడానికి పథకం ప్రకారం నేతలు ప్రయత్నిస్తున్నా వారికి బానిసలుగా, తొత్తులుగా మారిన మాల నాయకులు ఎవరూ నోరు మెదపకపోవడం దారుణమని అన్నారు. సుప్రీంకోర్టు, జడ్జిలు, దేశ సంపద, మంత్రి పదవులు తదితర వాటిలో ఎస్సీ వర్గీకరణ అవసరం లేదా, దాన్ని అమలు చేయరా అని ప్రశ్నించారు. రిజర్వేషన్ పేరుతో ఎస్సీలకు పడేసే ఎంగిలి మెతుకుల్లోనే వర్గీకరణ పేరుతో పంపకాలు పెడతారా అని ప్రశ్నించారు. దీంతో ఎస్సీ వర్గాల మధ్య ఘర్షణలు జరగడానికి పరోక్షంగా ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ ఎస్సీ జనాభా ప్రాతిపదికన చేయలేదని అన్నారు. నేతలు కొప్పుల ప్రేమ్ బాబు, కనికళ్ల నాని, బచ్చల చిన్నా,బొండు రాజు,కూసి కొండబాబు పాల్గొన్నారు. -
సర్కారు వారి బీమా కలాపం!
అప్పులతో సతమతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు అప్పులతో సతమతమవుతున్నారు. ప్రభుత్వం నుంచి ఏ విధమైన ప్రోత్సాహం లేకపోవడంతో రైతులు ప్రయివేటు వ్యాపారస్తులు దగ్గర నుంచి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి సాగు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గత ఏడాది రైతు నేస్తం కింద ఇస్తామన్న రూ. 20 వేలు కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టింది. ప్రస్తుతం రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధమయ్యారు. మే నెలలో రైతు నేస్తం ఇస్తామన్నారు. జూన్ నెల కూడా అయిపోయింది. జులై వచ్చినా ఇంకా రైతు నేస్తం డబ్బు రైతుల ఖాతాల్లో జమ కాలేదు. ప్రస్తుతం రైతులు పెట్టుబడి కోసం అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇటువంటి తరుణంలో బీమా ప్రీమియం కూడా తాము చెల్లించాలని చెప్పడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ప్రీమియం డబ్బు కోసం ఎక్కడ అప్పు చేయాలో అర్థం కాక అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబునాయుడు మాటలు నమ్మి తాము మోసపోయామని గత రబీలో ధాన్యం డబ్బు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూనే తమ పైనే అదనపు భారం మోపడం న్యాయం కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.● కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉచిత పంటల బీమాకు మంగళం ● రైతులపై ప్రీమియం భారం రూ.16 కోట్లు ● ఎకరాకు రూ.760 చొప్పున చెల్లించాలి ● వైఎస్సార్ సీపీ హయాంలో ఐదేళ్లూ ఉచితం ● జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్లో 2.10 లక్షల ఎకరాల్లో వరి సాగు ● ఆందోళన చెందుతున్న అన్నదాతలు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): విత్తు దగ్గర నుంచి కుప్ప నూర్పిడి వరకూ రైతులకు అండగా నిలిచే ఉచిత పంటల బీమా పథకానికి కూటమి ప్రభుత్వం ఎగనామం పెట్టింది. రైతులకు పంట బీమా కావాలంటే ఎకరా వరి పొలానికి రూ.769 రైతులే చెల్లించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది జిల్లాలో 2.10 లక్షల ఎకరాల్లో వరినాట్లు వేస్తున్నారు. ఇప్పటికే చాలామంది రైతులు వరినారు వేసుకొని పంటలు దమ్ము చేసుకొంటున్నారు. ఖరీఫ్ సాగుకు సన్నాహాలు పూర్తి చేసుకున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఉచిత పంటల బీమా పథకం ఊసు తేవడం లేదు. రైతులు సొంతంగా పంట బీమా చేయించుకోవాలని మండల వ్యవసాయశాఖ ఆధికారుల ద్వారా గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. తమకు అన్నీ చేస్తామని చెప్పి తీరా చూస్తే ప్రతీ పథకానికి గండి కొడుతున్నారని రైతులు మండిపడుతున్నారు. తాము అధికారంలోకి వస్తే రైతు నేస్తం పథకం కింద ప్రతీ ఏడాది రూ.20 వేలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి గత సంవత్సరం ఖరీఫ్, రబీలో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి సహాయం చేయకుండా రైతులను మోసం చేసిన కూటమి సర్కార్ ప్రస్తుతం పంట బీమా పథకానికి మోకాలడ్డు వేసింది. దీంతో జిల్లాలో రైతులపై రూ.16 కోట్ల భారం పడనుంది. బీమా భారమంతా రైతులు పైనే.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఉచిత పంట బీమా పథకం అమలు చేసింది. రైతులు ఒక్క రూపాయి కూడా కట్టకుండా పంట బీమా ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లించేది. ప్రతీ ఏడాది కాకినాడ జిల్లాలో రూ.16 కోట్లు పైబడి ప్రభుత్వం చెల్లించేది. వైఎస్సార్ సీపీ ఐదేళ్ల పాలనలో రైతుల నుంచి ప్రీమియం కోసం ఏనాడూ డబ్బు వసూలు చేయలేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాదితోపాటు ఈ ఏడాది కూడా పంటల బీమా పథకం అమలు చేయకుండా రైతులపైనే భారం వేస్తోంది. గ్రామాల్లో ఐదారెకరాలు సాగుచేసే రైతులు సుమారు రూ.4 వేలలో ప్రస్తుతం పంట బీమా చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రీమియం చెల్లించకుంటే దక్కని బీమా రైతులు ప్రీమియం చెల్లించకుంటే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఒక్క రూపాయి కూడా బీమా వర్తించదు. ఖరీఫ్లో వరి సాగు చేసే రైతులకు నవంబర్, డిసెంబర్ నెలలో వచ్చే తుపాన్ల కారణంగా నష్టం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఎకరా వరి పొలానికి రూ.769 ప్రీమియం చెల్లిస్తే ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో ఎకరాకు రూ.6 వేల వరకూ నష్టపరిహారం వచ్చే అవకాశం ఉంటుంది. రైతులు ఎవరైనా ప్రీమియం చెల్లించకుంటే పరిహారం రాదు. గతంలో ప్రభుత్వమే మొత్తం ప్రీమియం చెల్లించడంతో ప్రకృతి వైపరీత్యాలు వస్తే ప్రతీ రైతుకు పంట నష్ట పరిహారం వచ్చేది. ప్రస్తుతం ప్రీమియం చెల్లించేందుకు చాలామంది రైతుల వద్ద డబ్బు లేని పరిస్థితి. రైతులు బ్యాంకుల నుంచి అప్పు తీసుకొంటే ప్రీమియంను మినహాయించి మిగిలిన సొమ్ము ఇస్తారు. దీంతో రుణాలు తీసుకొనే ప్రతీ రైతుకు పంట బీమా వర్తిస్తుంది. జిల్లాలో సుమారు లక్ష మందిలోపు మాత్రమే రైతులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొంటారు. మిగిలినవారు సొంతంగా పంటల బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఉచిత పంటల బీమా పథకం అమలు చేయాలి ఉచిత పంటల బీమా పథకం ఎత్తివేయడంతో రైతులపై ప్రీమియం భారం పడుతోంది. నేను 5 ఎకరా లు సాగు చేస్తున్నాను. దీంతో రూ.3,845 ప్రీమియం చెల్లించాల్సి వస్తోంది. గతంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే ప్రీమియం చెల్లించేది. దీంతో రైతులపై ఎటువంటి భారం ఉండేది కాదు. కూటమి ప్రభుత్వం రైతులను ఇబ్బందులు పెడుతోంది తప్ప, రైతులకు ఏ విధమైన పథకాలు అమలు చేయడం లేదు. – తుమ్మల అచ్చియ్య, రైతు పులిమేరు, పెద్దాపురం మండలం రైతులను ప్రీమియం చెల్లించమనడం దారుణం నాకు ఉన్న భూమితోపాటు అదనంగా మరో 7 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాను. దీంతో పది ఎకరాలకు రూ.7,690 ప్రీమియం చెల్లించాల్సి వస్తోంది. ఇప్పడే డబ్బు లేక విత్తనాలు కొనుగోలుకు బయట అప్పులు తెచ్చాను. మళ్లీ ప్రీమియం కట్టాలంటే చాలా కష్టం. ఇప్పుడు ఏమీ చేయాలో అర్థం కానీ పరిస్థితి. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఐదు సంవత్సరాలూ ప్రభుత్వమే ప్రీమియం చెల్లించింది. ప్రస్తుతం రైతులను ప్రీమియం చెల్లించడమనడం దారుణం. – సుర్ల నాగేశ్వరరావు, రైతు టీజే నగరం, కోటనందూరు మండలం -
పవన్కల్యాణ్... ఇప్పుడేం అంటారు?
● లైంగిక వేధింపుల ఘటనపై మీ సమాధానమేంటి ? ● కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్సార్ సీపీ మహిళా నేత జక్కంపూడి విజయలక్ష్మి కాకినాడ క్రైం: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్కల్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం ఉన్న జిల్లాలోనే పారామెడికల్ విద్యార్థినులపై లైంగిక వేధింపులు జరగడం అమానవీయమని వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కాకి లెక్కలు చూపి మహిళలపై ఘోరాలు జరిగిపోతున్నాయని మొసలి కన్నీరు కార్చిన పవన్ కల్యాణ్ ఇప్పుడేమంటారని నిలదీశారు. ఘటన నేపథ్యంలో శుక్రవారం ఆమె కాకినాడలోని జీజీహెచ్కు వచ్చారు. లైంగిక వేధింపులు చోటు చేసుకున్న ఏడవ నంబరు, అంబానీ ల్యాబ్లను పరిశీలించారు. అనంతరం లెక్చర్ గ్యాలరీ సమీపంలో ఉన్న హెచ్వోడీ రూంలో ఆసుపత్రి అధికారులతో సమావేశమయ్యారు. ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని ల్యాబ్లు, వార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడాన్ని తప్పుబట్టారు. పర్యవేక్షణ లోపం వల్లే ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు ఈ ఘటనపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రి అధికారుల మాటలు పొంతన లేకుండా ఉన్నాయని విమర్శించారు. నిందితులపై నేర చరిత్ర ఉందన్న విషయాన్ని ఉద్దేశ పూర్వకంగానే దాస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం కీచకుల మయమని మండిపడ్డారు. శక్తి యాప్ ద్వారా ఉద్దరించిందేంటని నారా లోకేష్ను నిలదీశారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న వేలకొద్దీ దుర్యోధనులు, లక్షల కొద్దీ దుశ్సాసనులను శక్తి యాప్ ఏం చేయగలదని ప్రశ్నించారు. కీచకుల కొమ్ము కాస్తున్న కూటమి ప్రభుత్వం బెయిలబుల్ కేసులు పెడుతూ మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తోందన్నారు. విజయలక్ష్మి వెంట పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి దీప్తి కుమార్, పార్టీ జిల్లా అధ్యక్షురాలు మహిళా వర్దినీడి సుజాత, కాకినాడ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, సిటీ మహిళా అధ్యక్షురాలు పసుపులేటి వెంకటలక్ష్మి, పార్టీ మహిళా నేత, కాకినాడ మాజీ మేయర్ సరోజ, మహిళా నేత భవానీ ప్రియ ఉన్నారు. -
రక్షణ కల్పించాలని ప్రజల ఆందోళన
మామిడికుదురు: ఓఎన్జీసీ డ్రిల్లింగ్ బావి వద్ద బుధవారం జరిగిన గ్యాస్ కిక్ సంఘటన నేపథ్యంలో స్థానికులు గురువారం ధర్నా చేశారు. తమకు రక్షణ కల్పించాలంటూ ఆందోళన చేపట్టారు. పాశర్లపూడి – పాశర్లపూడిలంక గ్రామాల సరిహద్దులోని డ్రిల్లింగ్ నిర్వహిస్తున్న రిగ్ వద్ద ఈ ధర్నా జరిగింది. ఓఎన్జీసీ కార్యకలాపాలతో అనుక్షణం తాము భయం, భయంగా గడుపుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఎక్కడో కూర్చుని పరిస్థితి అదుపులో ఉందని చెప్పడం ఏంటంటూ నిరసన తెలిపారు. డ్రిల్లింగ్ జరుగుతున్న ప్రాంతానికి వచ్చి ప్రజలకు తగిన వివరణ, భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అక్కడ చేపట్టిన రిఫైర్స్ పనులను అడ్డుకున్నారు. ఈ నిరసనలో మాజీ సర్పంచ్ కొనుకు నాగరాజు, పొన్నమండ రామస్వామి, బిరుదుగంటి నరసింహమూర్తి, మోకా దుర్గారావు, అడబాల దొరబాబు, గోనిపాటి మధుబాబు, తాడి శ్రీనివాసు, రొక్కాల రాజశేఖర్, పొలమూరి గోపాల్, ఉండ్రు చిన్న, నాగిడి వీరవెంకటరమణ, కోలా సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
కష్టాలు కొనసాగేలా..
అధిక ధరకు విక్రయాలు వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు అందించేవారు. ఉన్న ఊళ్లోనే సేవలు అందేవి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎరువులు అందుబాటులో లేకుండా చేసింది. ప్రస్తుతం అన్ని ప్రైవేట్ షాపుల్లో ఎరువులు దొరకడం లేదు. ఉన్న షాపుల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. –పెదపూడి బాపిరాజు, అధ్యక్షుడు, కొత్తపేట నియోజకవర్గ వైఎస్సార్ సీపీ రైతు విభాగం ఎరువుల సరఫరాకు చర్యలు గ్రామాల్లో సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ఎరువులు ఇండెంట్ను గ్రామ వ్యవసాయ సహాయకులు (వీఏఏ) పెట్టాలి. ప్రస్తుతం వీఏఏల బదిలీలు జరుగుతున్నాయి. రెండు, మూడు రోజుల్లో ఆ ప్రక్రియ ముగుస్తుంది. వీఏఏలు చేరిన వెంటనే ఎరువుల ఇండెంట్ పెట్టించి, రైతులకు కావాల్సిన ఎరువుల సరఫరాకు చర్యలు తీసుకుంటాం. ఈ లోపు పలు సొసైటీల ద్వారా సరఫరా చేయిస్తున్నాం. –ఎం.వెంకటరామారావు, ఏడీఏ, కొత్తపేట కొత్తపేట: తొలకరి పలకరించింది.. ఖరీఫ్ సాగుకు ఆహ్వానం పలికింది.. ఎన్నో ఆశలతో ప్రతి రైతు అడుగు పొలాల వైపు పడింది.. వరి నారుమడులు, పొలాల దమ్ము పనుల్లో రైతాంగం నిమగ్నమైంది. ఇలా సాగు ఊపందుకుంటుంటే, ప్రభుత్వం నుంచి సన్నద్ధత కరవైంది. నేటికీ రైతు సేవా కేంద్రాల ద్వారా ఎరువులు మాత్రం అందించడం లేదు. ఎరువులు ఎప్పుడు వస్తాయో తెలియక రైతులు ఆ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ, రైతు ప్రోత్సాహక పథకాలను అందించేవారు. విత్తనాలు, ఎరువులు, పంటల బీమా, తదితర సేవలు సకాలంలో అందించేవారు. ముందుగానే సర్వం సిద్ధం చేసేవారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలకు రైతు సేవా కేంద్రాలు (ఆర్ఎస్కే)గా పేరుపెట్టి వాటి ద్వారా సేవలకు మాత్రం మంగళం పాడింది. ఇవి ప్రస్తుతం అలంకారప్రాయంగా మిగిలాయని రైతులు అంటున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం సుమారు 1,74 లక్షల ఎకరాలు. ఈ సీజన్లో యూరియా, కాంప్లెక్స్, డీఏపీ, ఎంఓపీ, సూపర్ ఎరువులు సుమారు 45,775 మెట్రిక్ టన్నుల అవసరం ఉంది. అయితే ఇంకా రైతు సేవా కేంద్రాలకు ఎరువులు రాలేదు. ఎప్పుడొస్తాయో తెలియడం లేదు. ముందస్తు అంటూ.. నిర్లక్ష్యం చూపుతూ ముందస్తు సాగుకు వెళ్లాలని అధికారులు చెబుతూనే రైతులకు సకాలంలో సేవలు అందించడంలో నిర్లక్ష్యం చూపుతున్నారు. దీనివల్ల సాగు పంట ఆలస్యమవుతుంది. దీనివల్ల పంట చేతికొచ్చే సమయంలో అంటే అక్టోబర్, నవంబర్ మాసాల్లో తుపాన్లు, భారీ వర్షాలకు పంట తడిసిపోయి ఇబ్బందులు పడాల్సి వస్తుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పక్కాగా ముందస్తు సాగుకు చర్యలు తీసుకునేది. ఇందులో భాగంగా ముందుగానే సాగునీరు విడుదల చేసేది. సకాలంలో రాయితీపై విత్తనాలు, రసాయన ఎరువులు అందించేది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని గాలికొదిలేసింది. అన్నదాత సుఖీభవ ద్వారా పెట్టుబడి సాయం ఇవ్వలేదు. గత రబీ ధాన్యం కొనుగోలు చేసి రెండు నెలలు దాటినా నేటికీ ఆ డబ్బులు రైతుల ఖాతాలకు జమ చేయలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఖరీఫ్ ప్రారంభమైనా, రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్కే) ద్వారా ఇంకా రాయితీపై విత్తనాలు, ఎరువులు అందించడం లేదు. ప్రైవేట్ డీలర్ల హవా ప్రస్తుతం నాట్లు వేసే సమయం. యూరియా, డీఏపీ అత్యవసరం. ఆర్ఎస్కేల వద్ద ఎరువులు అందుబాటులో లేవు. ఈ పరిస్థితుల్లో ప్రైవేట్ డీలర్ల వద్ద కూడా దొరకడం లేదు. కొంతమంది వద్దే స్టాక్ ఉంది. తప్పక ఆ షాపులకు వెళితే ఎంఆర్పీ రూ.265 ఉన్న యూరియా బస్తా రూ.320 చెబుతున్నారని రైతులు అంటున్నారు. ఇదేంటని అడిగితే తామే రూ.290కి కొనుగోలు చేశామని, రూ.30 కిరాయి, రూ.5 దిగుమతి చార్జి కలిపి మొత్తం రూ.325 అయ్యిందని అంటున్నారని వాపోతున్నారు. పైగా అవసరం లేకపోయినా యూరియాతో పాటు దానికి అనుసంధానంగా జింకు, సల్ఫర్ వంటి మందులు అంటగడుతున్నారని చెబుతున్నారు. ఫ ఎరువులు అందక అన్నదాతకు తిప్పలు ఫ నిరుపయోగంగా రైతు సేవా కేంద్రాలు ఫ సాగు కాలం మొదలైనా కానరాని సన్నద్ధత -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 23,000 – 23,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 25,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 25,500 గటగట (వెయ్యి) 24,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
రత్నగిరి.. భక్తజన ఝరి
అన్నవరం: స్థానిక సత్యదేవుని సన్నిధిలో వ్యాసపూర్ణిమ (ఆషాఢ పూర్ణిమ) వేడుకలను గురువారం నిర్వహించారు. దర్బారు మండపంలో వ్యాస మహర్షికి పండితులు ప్రత్యేక పూజలు చేశారు. వ్యాస మహర్షి చిత్రపటంతో ఆలయ ప్రాంగణంలో మూడు సార్లు ప్రదక్షిణలు చేశారు. అనంతరం నీరాజనమంత్ర పుష్పాలు సమర్పించి ప్రసాదాలు అందజేశారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు, దేవస్థానం వేదపండితులు పాల్గొన్నారు. ఏఈఓ కృష్ణారావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాగా వ్యాస పూర్ణిమ సందర్భంగా సుమారు 20 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి వ్రతాలు వెయ్యి జరగ్గా, అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. సుమారు నాలుగు వేల మంది భక్తులు నిత్యాన్నదాన పథకంలో స్వామివారి ప్రసాదం స్వీకరించారు. -
ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేందుకు డబ్బు డిమాండ్
రాజోలు: చనిపోయిన ఉద్యోగికి ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి పొందేందుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడానికి లంచం అడిగిన రాజోలు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ కె.రాంబాబును గురువారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ కిశోర్కుమార్ కథనం ప్రకారం.. రాజోలుకు చెందిన గుబ్బల కృష్ణతులసి భర్త బాలకృష్ణ స్థానిక ఫైర్ స్టేషన్లో ఫైర్ ఆఫీసర్గా పని చేస్తూ గుండెపోటుతో మృతి చెందారు. బాలకృష్ణ మృతి చెందడంతో ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి రావాల్సిన లబ్ధిని పొందేందుకు నో ఎర్నింగ్, నో ప్రొపర్టీ తదితర ధ్రువీకరణ పత్రాలకు కృష్ణతులసి దరఖాస్తు చేసుకున్నారు. రెండు నెలలుగా ఆమెకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఆర్ఐ రాంబాబు కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆమెకు నో ఎర్నింగ్, నో ప్రొపర్టీ ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేసేందుకు రూ. 20 వేలు డిమాండ్ చేయడంతో కృష్ణతులసి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. రూ. 20 వేలు ఆర్ఐ రాంబాబు తన కార్యాలయంలో తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ కిశోర్కుమార్, సీఐలు భాస్కరరావు, సతీష్, వాసుకృష్ణ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడు రాంబాబును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ వివరించారు. తన భర్త బాలకృష్ణ చనిపోయిన నాటి నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నానని, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం ఆర్ఐ రాంబాబు రూ. 15 వేలు డిమాండ్ చేస్తే ఆ డబ్బులు ఇచ్చి సర్టిఫికెట్ తీసుకున్నానని బాధితురాలు కృష్ణతులసి చెప్పారు. మళ్లీ నో ఎర్నింగ్, నో ప్రొపర్టీ సర్టిఫికెట్స్ కోసం రూ. 20 వేలు డిమాండ్ చేస్తే విసిగిపోయి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. ఆర్ఐ రాంబాబు నాలుగు నెలల కిందట రామచంద్రపురం నుంచి రాజోలు బదిలీపై వచ్చారు. వచ్చిన నాటి నుంచి ఆయనపై తమకు పలు ఫిర్యాదులు వచ్చాయని ఏసీబీ అధికారులు తెలిపారు. ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ -
కట్టె కాలే వరకూ వైఎస్సార్ సీపీతోనే..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: జక్కంపూడి కుటుంబం కట్టె కాలే వరకూ వైఎస్సార్ సీపీతోనే ఉంటుందని ఆ పార్టీ యువజన విభాగం గోదావరి జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త జక్కంపూడి గణేష్ స్పష్టం చేశారు. తన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో పాటు తన కుటుంబ సభ్యుల వ్యక్తిత్వహననానికి పాల్పడుతూ కొందరు పనిగట్టుకుని సామాజిక మాధ్యమాల్లో చేస్తోన్న ట్రోలింగ్పై గణేష్ తీవ్రంగా స్పందించారు. గురువారం రాత్రి కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ల్యాండ్ మాఫియా, బెట్టింగ్ క్లబ్ల మీద తమపై జనసేన నేతలు చేసిన ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలన్నారు. జనసేన నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఇక్కడితో కట్టిపెట్టాలన్నారు. లేదంటే అందుకు తగిన రీతిలో తమ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. పవన్ కళ్యాణ్పై తన సోదరుడు రాజా అభివృద్ధి విషయంపై చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు అవాకులుచవాకులు మాట్లాడుతున్నారన్నారు. ఇదే పవన్కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో తమ కుటుంబ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడినప్పుడు తామెంత బాధపడ్డామో వారికి తెలియదా అని గణేష్ ప్రశ్నించారు. తన తండ్రి రామ్మోహన్రావుపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్న వారు గత చరిత్ర తెలుసుకుని మాట్లాడాలన్నారు. తన సోదరుడు రాజా జనసేనలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ చేస్తున్న ప్రచారాన్ని గణేష్ ఖండించారు. తమ కుటుంబం రాజశేఖర్రెడ్డితో కలసి ప్రయాణించిందని, ఆయన బిడ్డ జగన్ వెంటే ఉంటుందన్నారు. తమ కుటుంబానికి రాజకీయాలు కొత్త కాదని, రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమేనన్నారు. తమ పార్టీ ఓడిపోయినా తాము మాత్రం ఎక్కడికీ పారిపోలేదన్నారు. గెలిచినప్పుడు ఎలా పని చేశామో... ఓటమి తరువాత అదే విధంగా నియోజకవర్గంలో పని చేస్తున్నామన్నారు. తన తండ్రికి దక్కిన గౌరవమే తన అన్న రాజాకు దక్కుతుందన్నారు. వైఎస్సార్ సీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, తన సోదరుడు మరో మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యాకనే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తామన్నారు. చరిత్ర తెలుసుకుని మాట్లాడండి 1999 ఎన్నికల్లో రాష్ట్రంలోనే కాకుండా గోదావరి జిల్లాల్లో టీడీపీ విజయం సాధిస్తే ఒకే ఒక స్థానం కడియం నుంచి జక్కంపూడి రామ్మోహనరావు మాత్రమే గెలిచిన చరిత్ర తెలుసుకుని రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సహా ఆ పార్టీ నేతలు మాట్లాడాలని గణేష్ హితవుపలికారు. రాజానగరంలో బత్తుల బలరామకృష్ణ, కాకినాడ రూరల్లో పంతం నానాజీ ఇద్దరికీ ఒకటే భయం పట్టుకుందన్నారు. జక్కంపూడి కుటుంబం జనసేనలోకి వచ్చేస్తే వారిని తట్టుకోలేమనే భయం వారిని వెంటాడుతోందన్నారు. జక్కంపూడి కుటుంబం చివరి వరకూ వైఎస్సార్ సీపీతోనే ఉంటుందని గణేష్ పునరుద్ఘాటించారు. తాజాగా రైజ్ అనే సంస్థ రాష్ట్రంలో ఎమ్మెల్యేల పనితీరు, అవినీతి, అక్రమాలపై నిర్వహించిన సర్వేలో మొదటి స్థానంలో పంతం నానాజీ, రెండో స్థానంలో బత్తుల బలరామకృష్ణ ఉన్న విషయం తేటతెల్లమైందన్నారు. ఫ అనవసర ప్రేలాపనలు కట్టిపెట్టండి ఫ యువజన విభాగం ప్రాంతీయ సమన్వయకర్త గణేష్ -
గోదారి ఇబ్బందులు
రాకపోకలకు బ్రేక్ అయినవిల్లి: ముక్తేశ్వరం – కోటిపల్లి రేవులో ఏర్పాటు చేసిన తాత్కాలిక రహదారి వరద ఉధృతికి కొట్టుకుపోయింది. కొట్టుకుపోయిన తాత్కాలిక రహదారిపై ఓ ప్రయాణికుడు బైక్పై వెళ్తుండగా అదుపుతప్పి పడబోతుండగా తోటి ప్రయాణికుడు కాపాడాడు. దీంతో పెనుముప్పు తప్పింది. ఇక్కడ ప్రమాదం పొంచి ఉండటంతో రేవులో పూర్తిగా రాకపోకలను నిలిపేశారు. పి.గన్నవరం: వరద వచ్చేసింది.. నీటి ప్రవాహం ఉధృతమవుతోంది.. లంక వాసులకు కష్టాలు తెచ్చిపెడుతోంది.. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి నదీపాయల్లో వరద ఉధృతి పెరిగింది. ఈ నేపథ్యంలో పి.గన్నవరం మండలం బూరుగులంక రేవు వద్ద నాలుగు లంక గ్రామాల ప్రజల రాకపోకల కోసం గతేడాది వశిష్ట నదీపాయలో తాత్కాలికంగా నిర్మించిన రహదారి గురువారం ఉదయం వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. దీంతో ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఈ గ్రామాల్లో సుమారు 3 వేల మంది నివసిస్తున్నారు. గతంలో 200 మీటర్ల పొడవున మట్టితో నిర్మించిన తాత్కాలిక రహదారి వరద ఉధృతికి కొట్టుకుపోవడంతో రేవులో రెండు ఇంజిన్ పడవలను ఏర్పాటు చేశారు. ఆయా గ్రామాల ప్రజలు, విద్యార్థులు పడవలపై రాకపోకలు ప్రారంభించారు. అలాగే వరద ఉధృతికి ఊడిమూడిలంక వద్ద మట్టి లారీల రాకపోకల కోసం నిర్మించిన రహదారి, యర్రంశెట్టివారిపాలెం వద్ద ఏర్పాటు చేసిన బాటలు కూడా కొట్టుకుపోయాయి. వైవీ పాలెం వద్ద బాటలు కొట్టుకుపోవడం వల్ల పి.గన్నవరం మండలానికి సరిహద్దులో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలానికి చెందిన పెదమల్లంక, ఆనగర్లంక, సిర్రావారిలంక గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆ గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. తాత్కాలిక రహదారులు కొట్టుకుపోవడంతో వరదల సీజన్ తగ్గే వరకూ సుమారు మూడు, నాలుగు నెలల పాటు ఆయా లంక గ్రామాల ప్రజలు బయటకు రావాలంటే పడవలపైనే ప్రయాణించాలి. గతంలో వరద బాధితులను పరామర్శించేందుకు ఇక్కడకు వచ్చిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.49.5 కోట్లతో వశిష్ట నదిపై వంతెన నిర్మాణ పనులను ప్రారంభించిన విషయం విధితమే. ఇప్పటికి 60 శాతం పనులు పూర్తయ్యాయి. వంతెన నిర్మాణం పూర్తయితే నాలుగు గ్రామాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ఫ జి.పెదపూడిలో వరద ఉధృతి ఫ కొట్టుకుపోయిన తాత్కాలిక రహదారి ఫ నాలుగు లంక గ్రామాలకు మార్గం కట్ -
ట్రాన్స్ఫార్మర్ల చోరీ ముఠా అరెస్ట్
దేవరపల్లి: పొలాల్లోని వ్యవసాయ మోటార్ల వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను దొంగిలిస్తున్న అంతర జిల్లా చోరీ ముఠాను దేవరపల్లి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి పలు ట్రాన్స్ఫార్మర్లు, 65 రాగి దిమ్మలను, 116.600 కిలోల రాగి తీగతో పాటు రెండు కార్లు, రెండు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం దేవరపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కొవ్వూరు డీఎస్పీ జి.దేవకుమార్ ఆ వివరాలు వెల్లడించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని వీరవాసరం మండలం రాయకుదురుకు చెందిన కడలి సతీష్, ఏలూరు జిల్లా కృతివెన్ను మండలం లక్ష్మీపురానికి చెందిన వేండ్రపు దుర్గాశ్రీనివాస్, పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం మంచిలికి చెందిన బళ్లా విజయరత్నం, భీమవరం మండలం దెయ్యాలతిప్పకు చెందిన ఏలూరి పోసయ్య ముఠాగా ఏర్పడి రెండు కార్లు సెల్ప్ డ్రైవింగ్ కోసం అద్దెకు తీసుకున్నారు. వీరి వద్ద ఉన్న రెండు బైక్లతో ఉదయం సమయాల్లో రెక్కీ నిర్వహించి, రాత్రి పూట ట్రాన్స్ఫార్మర్లను బద్దలు కొట్టి వాటిలోని రాగి తీగను దొంగిలించేవారు. ఇలా తూర్పు, పశ్చిమగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో 115 ట్రాన్స్ఫార్మర్లను చోరీ చేశారు. అందులోని రాగి తీగను భీమవరం మండలం గొల్లవానితిప్పకు చెందిన పావురాయల కోటేశ్వరరావు, దిరుసుమర్రుకు చెందిన సవరపు భీమారావులు కొనుగోలు చేసి తీగను కరిగించి దిమ్మలుగా తయారు చేసి విక్రయిస్తున్నారు. నిందితులు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 2023లో 49 ట్రాన్స్ఫార్మర్లను దొంగిలించి చేబ్రోలు పోలీస్ స్టేషన్లో అరెస్ట్ కాగా, ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. ఇప్పటి వరకూ వివిధ జిల్లాల్లో 115 ట్రాన్స్ఫార్మర్లను దొంగిలించగా, 67 కేసులు నమోదయ్యాయి. ఇటీవల కాలంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలు ఎక్కువగా జరుగుతుండడంతో జిల్లా ఎస్పీ, రాజమహేంద్రవరం సీసీఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు డీఎస్పీ దేవకుమార్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల సహాయంతో ఆ ముఠాను బుధవారం సాయంత్రం దేవరపల్లి డైమండ్ జంక్షన్ వద్ద దేవరపల్లి ఎస్సై వి.సుబ్రహ్మణ్యం, సిబ్బంది పట్టుకుని అరెస్ట్ చేశారన్నారు. చోరీ సొత్తు విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని చెప్పారు. ఈ ముఠాను పట్టుకోవడానికి సహకరించిన రాజమహేంద్రవరం సీసీఎస్ సిబ్బంది, దేవరపల్లి స్టేషన్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. దేవరపల్లి సీఐ బీఎన్ నాయక్, రాజమహేంద్రవరం సీసీఎస్ సీఐ శ్రీధర్, బాలశౌరీ తదితరులు పాల్గొన్నారు. -
సుగుణారెడ్డికి రెడ్క్రాస్ పురస్కారం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్, రెడ్క్రాస్ జిల్లా వైస్ చైర్మన్ డాక్టర్ సుగుణారెడ్డికి రెడ్క్రాస్ సొసైటీ ఉత్తమ పురస్కారం అందజేసింది. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి రెడ్క్రాస్ వార్షిక సమావేశంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు. కాకినాడ రెడ్క్రాస్ను మూడేళ్లుగా ప్రథమ స్థానంలో నిలుపుతున్న సుగుణారెడ్డికి పురస్కారం రావడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. ఆదిత్య యూనిట్స్ ద్వారా రక్తదాన శిబిరాలు నిర్వహించి, సమాజ సేవలో ముందుంటున్నారని రెడ్క్రాస్ రాష్ట్ర చైర్మన్ వైడీ రామారావు తెలిపారు. అక్కాచెల్లెళ్ల అదృశ్యం రావులపాలెం: ఇద్దరు బాలికల అదృశ్యంపై కేసు నమోదు చేసినట్టు సీఐ ఎం.శేఖర్బాబు తెలిపారు. గోపాపురానికి చెందిన ఇద్దరు బాలికలు అక్కాచెల్లెళ్లు. గురువారం వారి తల్లిదండ్రులు బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఆ అక్కాచెల్లెళ్లు కనిపించలేదు. ఈ మేరకు తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
అదే వేలంకొర్రి!
కౌలు రైతులను ఇబ్బందులు పెట్టకండి శ్రీ సంస్థానంకు చెందిన తొండంగిలోని భూములకు కౌలు వేలం వేయడానికి అధికారులు మూడు నెలల నుంచి వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు. వాయిదాలు వేయడం కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఖరీఫ్ సాగుకాలం దగ్గర పడడంతో ఇప్పటికే చాలామంది రైతులు దుక్కులు దున్నుకుని, నారుమడులకు సిద్ధపడుతున్నారు. దేవదాయశాఖ అధికారులు ఇకనైనా వాయిదా వేయకుండా వేలం నిర్వహించడం కానీ లేకుంటే ప్రస్తుతం ఉన్న రైతులకే కౌలు కొనసాగించడం కానీ చేయాలి. – నాగం గంగబాబు, వైస్ ఎంపీపీ, తొండంగి సాక్షి ప్రతినిధి, కాకినాడ: లక్షల ఆదాయం వస్తుందని తెలిసినా దాన్ని రాబట్టుకోవడంలో దేవదాయశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం విడ్డూరంగా ఉంది. పిఠాపురం మహారాజా దానం చేసిన వందల ఎకరాల భూములకు వేలం నిర్వహించకుండా వాయిదాలు వేస్తూ దేవాదాయానికి గండికొడుతున్నారు. అధికార పార్టీ నేతల మోచేతి నీళ్లు తాగుతూ వారు చెప్పినట్టు తలాడిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వేలం వాయిదాకు వారు చూపుతున్న సాకులు, చెబుతున్న కారణాలు చూసి రైతులు విస్తుపోతున్నారు. మొదట మే 23, తరువాత జూన్ 6 అన్నారు. ఆ తరువాత జూన్ 20కి వాయిదా వేసి అప్పుడు కూడా వేలం నిర్వహించలేదు. తిరిగి ఈ నెల ఎనిమిదిన అన్నారు. ఆ తేదీన కూడా జరపలేదు. మళ్లీ జూలై14 తేదీకి వాయిదా వేశారు. ఒకోసారి ఒకో కుంటిసాకు చెబుతూ వేలాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. కడపలో టీడీపీ మహానాడుకు రైతులు వెళ్లిపోతున్నారని ఒకసారి, యోగా డే అని మరోసారి, తాజాగా మంగళవారం పోలీసు బందోబస్తు లేదని...ఇలా వాయిదాలు వేస్తూ అధికారులు కూటమి నేతల కొమ్ము కాస్తూవస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేవదాయశాఖ కాకినాడ జిల్లా కార్యాలయం నుంచి పిఠాపురం శ్రీ సంస్థానం కార్యనిర్వాహణాధికారి కార్యాలయం వరకు అధికారులు కావాలనే కాలయాపన చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ సంస్థానంకు చెందిన రెండు పంటలు పండే సారవంతమైన 511 ఎకరాలున్నాయి. ఇందులో రైతులు మకాంలు తీసేయగా సాగులో ఉన్న మిగిలిన 478 ఎకరాలకు వేలం వేయకుండా నాలుగోసారి కూడా వాయిదా వేయడం విస్మయానికి గురిచేస్తోంది. దేవదాయశాఖ చరిత్రలో ఇంత నిస్సిగ్గుగా ఇన్ని వందల ఎకరాల భూములకు వేలం వేయకుండా వాయిదాలు వేస్తున్న తీరు విస్తుగొలుపుతోంది. దేవదాయశాఖ పారదర్శకంగా వేలం వేస్తే హక్కులు దక్కించుకుందామని, కౌలుకు సాగు చేసుకుందామని సుమారు రెండు వందల మంది కౌలు రైతులు ఎదురుచూస్తున్నారు. పంపా జలాశయంలో నీటిమట్టం ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. ఒక పక్క ఖరీఫ్ సాగుకు అదను దగ్గర పడుతోంది. వేలం ఎప్పుడు వేస్తారో? భూములు ఎవరికి దక్కుతాయా అని ఎదురుచూస్తూ ప్రస్తుతం ఆ భూముల్లో ఉన్న కౌలు రైతులు దుక్కులు దున్ని ఆకుమడుల కోసం భూములు సిద్ధం చేస్తున్నారు. అసలు భూములకు వేలం వేస్తారా లేదా అని కౌలురైతులు అనుమానపడుతున్నారు. దొడ్డిదారిన దక్కించుకోవాలని... పంపా ఆయకట్టు పరిధిలోకి వచ్చే ఈ భూములను మూడేళ్ల కాలానికి వేలం నిర్వహిస్తుంటారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వేలం నిర్వహించి మూడేళ్ల కాలానికి రైతులకు భూములు కౌలుకు ఇచ్చారు. ఎకరాకు రూ.15వేల నుంచి రూ.18వేల వరకు కౌలు ఖాయమైంది. కౌలు గడువు ముగిసిపోయింది. ఇంతలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. అంతే తుని ప్రాంతానికి చెందిన అధికార పార్టీ నేతలు గద్దల్లా వాలిపోయారు. వేలం వేయకుండా దొడ్డిదారిన ఆ భూములను దక్కించుకోవాలనే కుయుక్తులతో అధికార పార్టీకి చెందిన తుని పెద్దన్న కనుసన్నల్లో తెలుగు తమ్ముళ్లు పెద్ద స్కెచ్ వేశారు. మొదట భూములకు వేలం వేయకుండా అడ్డుకట్ట వేయాలనేది వారి ప్లాన్. అంత వరకు వారు దేవదాయశాఖ అధికారుల తోడ్పాటుతో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు వారంతా భూములు ఎలా దక్కించుకోవాలనే ఎత్తుగడలకు పదును పెడుతున్నారు. శ్రీ సంస్థానం భూముల వేలంపాట మళ్లీ వాయిదా దేవాదాయానికి ‘తమ్ముళ్ల’ తూట్లు ఏటా రూ.70 లక్షల ఆదాయానికి గండి నాలుగోసారి వాయిదా పడిన వైనం చక్రం తిప్పుతున్న తుని పెద్దన్న ఎంతకాలం వాయిదాలు వేస్తారు? వాస్తవానికి ఈ భూముల వేలం ద్వారా ఏటా శ్రీ సంస్థానానికి సుమారు రూ.70 లక్షల ఆదాయం వస్తోంది. అదే గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మాదిరిగా పారదర్శకంగా గనుక వేలం నిర్వహిస్తే మూడేళ్ల కాలానికి రూ.2.15 కోట్ల ఆదాయం వస్తుంది. ఇంతటి ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా దేవదాయశాఖ అధికారులు మాత్రం అధికారపార్టీ నేతలకు కొమ్ము కాస్తూ వాయిదాలతోనే కాలక్షేపం చేస్తున్నారు. నాడు పిఠాపురం రాజా బాటసారులు, పాదగయ, కుక్కుటేశ్వరస్వామి తదితర ఆలయాలకు వచ్చే భక్తుల ఆకలితీర్చాలనే ఆశయంతో 511 ఎకరాలు దానం చేశారు. శ్రీ సంస్థానం సత్రం పిఠాపురంలో ఉన్నప్పటికీ భూములు మాత్రం తుని నియోజకవర్గం తొండంగి మండలంలో ఉన్నాయి. తొండంగి మండలంలో 538, 545, 553, 535, 623, 565, 690 సర్వే నంబర్లలో ఈ భూములున్నాయి. ఇన్ని ఎకరాలకు వేలం వేయకుండా ఎంతకాలం వాయిదాలు వేస్తారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. పవన్ పట్టించుకోవడం లేదేం? ఇదిలా ఉండగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పెద్ద యుద్ధమే చేస్తున్నారని పవన్ అభిమానులు గొప్పగా చెప్పుకొంటున్నారు. అటువంటి పవన్ శ్రీ సంస్థానం భూముల వేలం నిర్వహించకపోవడంపై ఎందుకు దృష్టి పెట్టడంలేదని భక్తులు ప్రశ్నిస్తున్నారు. భూములున్నది తుని నియోజకవర్గంలో అయినా భూములిచ్చింది పిఠాపురం నియోజకవర్గానికి చెందిన పిఠాపురం రాజా అనే విషయాన్ని పవన్ అభిమానులు గుర్తించకుంటే ఎలా అంటున్నారు. చివరకు శ్రీ సంస్థానం కార్యాలయం కూడా పిఠాపురంలో ఉండటాన్ని గుర్తుచేస్తున్నారు. -
కనకదుర్గమ్మకు ఘనంగా చండీ హోమం
అన్నవరం: రత్నగిరి తొలిపావంచా వద్ద కొలువైన కనకదుర్గ అమ్మవారి జన్మనక్షత్రం మూల సందర్భంగా బుధవారం ఘనంగా చండీహోమం నిర్వహించారు. ఉదయం తొమ్మిది గంటలకు కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పండితులు చండీహోమం ప్రారంభించారు. 11 గంటలకు హోమగుండంలో ద్రవ్యాలను సమర్పించి ఘనంగా పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. ప్రసాదాలు భక్తులకు పంపిణీ చేశారు. చండీ హోమం, పూజ కార్యక్రమాలను వేద పండితులు సంతోష్ అవధాని, ఆలయ అర్చకుడు చిట్టెం గోపీ, వ్రత పురోహితులు దేవులపల్లి ప్రకాష్, కూచుమంచి ప్రసాద్ నిర్వహించారు. నలుగురు భక్తులు రూ.750 చొప్పున టిక్కెట్లు కొనుగోలు చేసి హోమంలో పాల్గొన్నారు. ఆర్టీసీలో లైంగిక వేధింపుల ఫిర్యాదుపై విచారణ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కాకినాడ ఆర్టీసీ డిపోలో కండక్టర్లుగా పనిచేస్తున్న మహిళలపై డిపోకు చెందిన ఒక ఉద్యోగి లైంగిక వేధింపులు పాల్పడుతున్నారంటూ ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు విజయవాడ నుంచి ఆర్టీసీ ఉన్నతాధికారులు విచారణ చేసేందుకు బుధవారం వచ్చారు. అయితే ఫిర్యాదు దారు పేరు లేకుండా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆర్టీసీలో పనిచేస్తున్న అందరి మహిళలను ఉన్నతాధికారులు విచారించారు. తాము ఎవరిపైనా ఫిర్యాదు చేయలేదని మహిళా కండక్టర్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కొందరు వ్యక్తులు కావాలని ఆర్టీసీ అధికారులకు తప్పుడు ఫిర్యాదు చేసినట్లు అక్కడ ఉద్యోగులు చెబుతున్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు విచారణ చేపట్టి నివేదిక ఉన్నతాధికారులు సమర్పిస్తామని చెప్పారు. రైల్వే ఉద్యోగుల ధర్నా సామర్లకోట: రైల్వే ఉద్యోగులకు అమలు చేస్తున్న నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రైల్వే ఉద్యోగులు బుధవారం ధర్నా నిర్వహించారు. రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఆధ్వర్యంలో స్థానిక రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజినీరు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. పెన్షన్ ప్రతీ కార్మికుని హక్కు అని, దాని సాధనకు కార్మికులందరూ ఐక్యంగా కలిసి రావాలని యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్ కోరారు. రైల్వే ఉద్యోగుల న్యాయబద్ధమైన కోర్కెలను అమలు చేయాలని నినాదాలు చేశారు. సంఘ చైర్మన్ టి.ఈశ్వరరావు, వర్కింగ్ చెర్మన్ రామకృష్ణ, అసిస్టెంట్ సెక్రటరీ విశ్వప్రసాద్, వైస్ చైర్మన్ గోపాలరెడ్డి, రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ గౌరవ అధ్యక్షుడు కెవీ వెంకటేశ్వరరావు, ఇంజినీరు రామసుబ్బారావు పాల్గొన్నారు. -
లేటరైట్ రవాణా వాహనాల అడ్డగింపు
రౌతులపూడి: గిరిజన ప్రాంతాల్లో సహజ వనరుల దోపిడీ ఆపాలంటూ సబ్ప్లాన్ ఏజెన్సీ వాసులు బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ మేరకు సబ్ప్లాన్ ఏజెన్సీ ప్రాంతంలో యథేచ్ఛగా లేటరైట్ రవాణా చేసే లారీలను జల్దాం, మాతయ్యపేటకు చెందిన పలువురు గిరిజనులు అడ్డుకున్నారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో సహజ వనరులు దోచేస్తున్నారంటూ గగ్గోలు పెట్టిన నాటి ప్రతిపక్ష నాయకులు (నేటి పాలకులు) మూడేళ్ల క్రితం సబ్ప్లాన్ ఏజెన్సీలో పర్యటించి గిరిజన ప్రాంతాలను ఉద్దరిస్తామంటూ చేసిన వాగ్దానాలు ఏమయ్యాయని వారు ప్రశ్నించారు. అధికారరంలోకి వచ్చింది సహజ వనరులు దోపిడీకేనా అని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం బమిడికలొద్దు ప్రాంతంలో లాటరైట్ను వందలాది భారీ వాహనాల్లో భారీగా రవాణా సాగించడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. శబ్ధ,వాయు కాలుష్యాలకు గురై నిత్యం అనారోగ్యాల పాలవుతున్నామని, రహదారులు ఛిద్రమై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు వాపోయారు. రహదారికిరువైపులావున్న వ్యవసాయ భూములు నాశనమవుతన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్థానిక రెవెన్యూ, మండల పరిషత్ కార్యాలయాల్లోను, స్థానిక పోలీస్ స్టేషన్లోను జిల్లా కలెక్టర్కు గతంలో ఫిర్యాదు చేశామని వారు తెలిపారు. సీఎంఓ కార్యాలయానికి, అటవీ, పర్యావరణ పరిరక్షణ శాఖ మంత్రి, డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్కు ఫిర్యాదు చేశామని వారు వివరించారు. స్థానిక గిరిజనులను మభ్యపెట్టి లాటరైటను తరలించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తక్షణమే లాటరైట్ తరలింపును నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లారీలు అడ్డగించడంతో రవాణా చేసేవారికి గిరిజనులకు కొంతసేపు వాగ్వాదం జరిగింది. ఈ విషయంపై లాటరైట్ నిర్వాహకులకు తెలియజేసి తక్షణమే లాటరైట్ రవాణాను నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. గిరిజన నాయకులు గంటిమళ్ల గంగరాజు, రావుల తారక్, ఆమూరి సుధారాణి, ఆమూరి చంద్రారెడ్డి పాల్గొన్నారు. -
నానాటికీ ప్రభంజనం..
ఆలమూరు: భారతదేశం జన ప్రభంజనం అవుతుంది.. నియంత్రించకుంటే భవిష్యత్ అధోగతిగా మారుతుంది.. చిన్న కుటుంబం– చింతలు లేని కుటుంబం. ఇద్దరు వద్దు.. ఒక్కరు ముద్దు. ఈ నినాదాలకు మళ్లీ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం, ఆవశ్యకత ఏర్పడుతోంది. స్వాతంత్య్రోద్యమ కాలంలో దేశ జనాభా కేవలం 35 కోట్లు కాగా, 80 ఏళ్ల అనంతరం నాలుగు రెట్లకు పైగా చేరుకుందని అంచనా. రోజు రోజుకూ పెరిగిపోతున్న జనాభా వల్ల నానాటికీ కరిగిపోతున్న వనరులతో భవిష్యత్ తరాలకు ప్రమాదకరంగా మారింది. దీనివల్ల ప్రజలకు మౌలిక సదుపాయాలైన ఆహారం, ఉపాధి, వివిధ అవసరాలు తీర్చడం ప్రభుత్వాలకు భారం అవుతోంది. అధిక జనాభాతో అడవులు సైతం అంతరించి పోతుండగా పంట భూములు ఆవాస ప్రాంతాలుగా మారిపోతున్నాయి. దీనివల్ల పర్యావరణంలో సమతుల్యత లోపించి భవిష్యత్లో పుడమికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని సామాజికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. పెరుగుతున్న జనాభాను అరికట్టేందుకు ఐక్యరాజ్య సమితి అధిక జనాభా వల్ల కలిగే అనర్థాలను వివరించేందుకు ఏటా జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహిస్తుంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జాతీయ జనాభా 2011 గణాంకాల ప్రకారం 51,54,296 మంది ఉండగా, ఇందులో 25,69,888 మంది పురుషులు, 25,84,608 మంది సీ్త్రలు ఉన్నారు. అయితే 2025 మార్చి 31 నాటికి ఈ జనాభా సుమారు 55.38 లక్షలుగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. పరిపాలన సౌలభ్యం కోసం ఉమ్మడి జిల్లాను 2022 ఏప్రిల్ 4న అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మూడు జిల్లాలుగా విభజించింది. దీంతో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మూడు నియోజకవర్గాలు ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లాలో విలీనం కాగా, రంపచోడవరం నియోజకవర్గాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాలో విలీనం చేశారు. దీంతో జనాభా గణాంకాల్లో తీవ్రమైన వ్యత్యాసం ఏర్పడింది. జిల్లాలో 2001 జనాభా లెక్కల ప్రకారం 10.98 శాతంగా ఉన్న పెరుగుదల 2011కు వచ్చేసరికి 13.86 శాతంగా ఉంది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకూ జనాభా శాతం మరింత పెరిగి ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీనివల్ల ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన కష్టతరం అవుతుంది. జీవ వైవిధ్యానికి తీవ్ర నష్టం వాటిల్లడంతో పాటు ప్రధాన నగరాలు, పట్టణాల్లో వాయు కాలుష్యం పెరుగుతోంది. పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుంది. అందువల్ల వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. గణనకు షెడ్యూల్ విడుదల జనాభా నియంత్రణకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా కృషి చేస్తే దేశ భవిష్యత్తు బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. 2011లో జరిగిన జనగణన తరువాత పదేళ్ల తరువాత 2021లో జరగాల్సి ఉంది. అయితే ఆ సమయంలో కోవిడ్–19 ప్రభావం అధికంగా ఉండటంతో వాయిదా పడుతూ వస్తుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం గణనలో భాగంగా 2026 ఏప్రిల్ ఒకటి నుంచి తొలుత ఇళ్లు, ఆస్తుల వివరాలు నమోదు చేసుకునేందుకు నిర్ణయం తీసుకుంది. అనంతరం 2027 ఫిబ్రవరి నుంచి జన, కుల గణనలను ఒకేసారి చేపట్టేందుకు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది. ఈ జన, కుల, ఆస్తుల గణనలో ప్రతి ఒక్కరి నుంచి 36 ప్రశ్నలకు సంబంధించి సమాచారాన్ని సేకరించనుంది. ప్రాధాన్యం ఇస్తే మేలు ఉమ్మడి జిల్లాలో అధిక జనాభా నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. జనాభా పెరుగుదలతో కలిగే దుష్ఫరిణామాలను ప్రజలకు వివరించేందుకు ప్రసార మాధ్యమాల్లో ప్రచారం కల్పించాలి. కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసి ప్రోత్సాహకాలను అందజేయాలి. సమాజంలో వీలైనంత మేరకు అధిక వయసు పెళ్లిళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. వివాహం చేసుకున్న ప్రతి జంట స్వచ్ఛంద నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉంది. అధిక జనాభాతో వనరుల లభ్యత కరవు 2027 ఫిబ్రవరి 1 నుంచి జన, కులగణన రేపు ప్రపంచ జనాభా దినోత్సవం జిల్లాల వారీగా జనాభా వివరాలు జిల్లా జనాభా పురుషులు సీ్త్రలు వైశాల్యం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 17,19,013 8,58,632 8,60,381 2,083 కి.మీ కోనసీమ కాకినాడ 20,92,374 10,45,269 10,47,105 3,020 కి.మీ తూర్పుగోదావరి 18,32,332 9,15,325 9,17,007 2,561 కి.మీ -
చివరికి దిగొచ్చి... కొబ్బరి కాయలు వినియోగించి..
ఐ.పోలవరం: మురమళ్లలోని భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామివారి కల్యాణంలో కొబ్బరి కాయలను తిరిగి వినియోగించారు. కొబ్బరి ధరలు పెరగడంతో వాటిని పక్కనబెట్టి అభిషేకాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయమై ‘సాక్షి’ దినపత్రికలో ‘వీరేశ్వరా.. క్షమించవా’ అనే శీర్షికన బుధవారం కథనం ప్రచురితమైంది. దీంతో దేవస్థానం అధికారులు స్పందించి స్వామివారికి నిర్వహించే అభిషేకాల్లో కొబ్బరి కాయలను తిరిగి వినియోగించడం మొదలు పెట్టారు. రూ.వెయ్యి పెట్టి అభిషేకం చేయించుకుంటున్న భక్తుల పేరున వినియోగించాల్సిన రెండు కొబ్బరి కాయలను వాడకపోవడంపై వారు మండిపడుతున్నారు. దీనికి స్పందించిన ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి వి.సత్యనారాయణ కొబ్బరికాయలతో అభిషేకం జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయంలో గతంలో జరిగినట్లే కల్యాణ అభిషేకాలు జరుగుతున్నాయని తెలిపారు. కొబ్బరికాయలు అందుబాటులో లేకపోవడంతో కల్యాణ భక్తులకు అసౌకర్యం కలిగిన విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై ఆలయ సూపరింటెండెంట్ను ఆరా తీయగా కొబ్బరి కాయల పాటదారుడు సకాలంలో కొబ్బరికాయలు సరఫరా చేయకపోవడం వల్ల అసౌకర్యం కలిగిందని, ఇది తన దృష్టికి రాగానే చర్యలు తీసుకున్నానని చెప్పారు. సంబంధిత సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశామని తెలిపారు. -
గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి
గోకవరం: అప్పటి వరకూ విద్యార్థులకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. విధి నిర్వహణలో గుండెపోటుకు గురై తనువు చాలించాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. గోకవరం గ్రామానికి చెందిన బొమ్మగంటి నాగభూషణం (57) తంటికొండ జిల్లా పరిషత్ హైస్కూల్లో లెక్కల ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. బుధవారం పాఠశాలకు వెళ్లిన ఆయన రెండు తరగతుల్లో బోధించారు. ఇంటర్వెల్ సమయంలో ఒక్కసారిగా ఆయన కుప్పకూలిపోగా తోటి ఉపాధ్యాయులు వెంటనే ఆయన్ని 108 వాహనంలో గోకవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన ఇటీవల రంపయర్రంపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ నుంచి బదిలీపై తంటికొండకు వచ్చారు.కుమార్తె వివాహం చేసిన నెలలోనే..ఉపాధ్యాయుడు నాగభూషణంకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు గత నెలలో ఘనంగా వివాహం జరిపించారు. ఇంతలోనే ఈ విషాద ఘటన జరగడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
చంద్రబాబు అంటేనే మోసం..దగా
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా సామర్లకోట: చంద్రబాబు అంటేనే మోసం..దగా అని దీనిని ప్రజలందరూ గుర్తించారని కాకినాడ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అన్నారు. పెద్దాపురం నియోజవర్గ వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. చంద్రబాబు ఽఅధికారం కోసం ఏదైనా చేస్తారన్నారు. నాలుగుసార్లు మోసం చేయడంతో తనను నమ్మరని తెలిసి పవన్కల్యాణ్ను అడ్డు పెట్టుకున్నారన్నారు. గత ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మరో పర్యాయం మోసం చేశారని తెలిపారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేశారని తెలిపారు. రైతులను, మహిళలను, యువతను ప్రభుత్వం మోసం చేసిందన్నారు. దానికి ప్రభుత్వం సిగ్గు పడాలన్నారు. జగన్మోహన్రెడ్డి ఎక్కడ పర్యటన చేసిన ప్రజలు ఉప్పెనలా రావడంతో చంద్రబాబు చూడలేక పోతున్నారని తెలిపారు. చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లే వారిపై కేసులు పెడతామని చెప్పి 1,200 మందిపై కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, వైద్య రంగాలను చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వాస్పత్రులలో మందులు లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన ఇంగ్లిషు మీడియంను రద్దు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. సూపర్ సిక్స్లో రెండు పథకాలు మాత్రమే అరకొరగా అమలు చేస్తున్నారన్నారు. సూపర్ సిక్స్పై పవన్ కల్యాణ్ బాధ్యత తీసుకొవాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని ప్రతీ కార్యకర్తకు తాను అండగా ఉంటానని, అవసరమైతే పోరాటాలకు సిద్ధమని హామీ ఇచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలో ఏక పక్షంగా విజయం సాధించే విధంగా కార్యకర్తలు ఐక్యతతో పని చేయాలన్నారు. దొరబాబును ఎమ్మెల్యేగా చేయడానికి ప్రతీ ఒక్కరూ పని చేయాలని సూచించారు. అర్హతే ప్రామాణికంగా పథకాలు... జగన్మోహన్రెడ్డి ప్రజలకు అర్హతే ప్రమాణికంగా సంక్షేమ పథకాలు అమలు చేశారని, వైఎస్సార్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా అన్నారు. సీఎం స్థానంలో ఉన్నవారికి మేనిఫెస్టోపై బాధ్యత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో తాను మాట్లాడిన దానికి తప్పుడు అర్థాలు తీయడం ఏమిటని ప్రశ్నించారు. తమది ఉడత బెదిరింపులకు భయపడే కుటుంబం కాదని, ప్రజల తరఫున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటామన్నారు. పవన్ కల్యాణ్ కాపు సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకొని ఎదిగి, వారికి ఏమి మేలు చేశారని ప్రశ్నించారు. కాకినాడ జిల్లా పరిశీలకులు దాట్ల సూర్యనారాయణరాజు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబు, లోకేష్లు ఇంటింటికీ సంక్షేమ పథకాలతో కుటుంబానికి ఏడాదికి ఎంత లబ్ధి చేకూరుతుందో వివరిస్తూ బాండ్లు పంపిణీ చేశారని, అధికారంలోనికి వచ్చాకా మొండి చెయ్యి చూపించారని విమర్శించారు. -
దళిత మహిళపై దాడి అమానుషం
అనపర్తి: దుప్పలపూడి గ్రామంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన మహిళ కొమ్ము బుజ్జిపై దాడికి పాల్పడిన టీడీపీ నేత ఎన్.వెంకటరెడ్డి, అతని అనుచరులను 24 గంటల్లో అరెస్టు చేయకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని మాదిగ న్యాయవాదుల సమాఖ్య, ఎమ్మార్పీఎస్ నాయకులు సంయుక్తంగా డిమాండ్ చేశారు. బుధవారం అనపర్తి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బుజ్జిని వారు పరామర్శించారు. నిందితులు ఎంత పలుకుబడి కలిగిన వారైనా భయపడాల్సిన అవసరం లేదని, తాము అండగా ఉంటామని బాధితురాలికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మాదిగ న్యాయవాదుల సమాఖ్య అధ్యక్షుడు కొండేపూడి ఉదయ్కుమార్ మాట్లాడుతూ ఈ నెల 6న దుప్పలపూడి గ్రామానికి చెందిన అధికార పార్టీ నేత ఎన్.వెంకటరెడ్డి (ఎన్వీ) దళిత మహిళ బుజ్జిపై అమానుషంగా దాడి చేయడంతో మాదిగ సంఘాల తరఫున నిజ నిర్ధారణ కమిటీగా తాము ఇక్కడకు వచ్చామని తెలిపారు. తమ పరిశీలనలో ఇది కచ్చితంగా కుల వివక్షతోనే జరిగిన దాడిగా గుర్తించామన్నారు. గతంలో జరిగిన ప్రమాదంలో పోలీసులు కేసు నమోదు చేయడం బుజ్జి మరిది వీరబాబు బెయిల్ పై రావడం వ్యవహారం కోర్టులో నడుస్తుండగా దళితులను, అమాయకులను భయబ్రాంతులకు గురి చేస్తూ వెంకటరెడ్డి తన అధికార మదంతో ఇంటి వద్ద ప్రైవేట్ పంచాయితీ నిర్వహించడమేంటని ఆయన ప్రశ్నించారు. చట్టవిరుద్ధంగా ఇటువంటి పనులను చేస్తున్న వెంకటరెడ్డిని మూడు రోజులు కావొస్తున్నా పోలీసులు అరెస్టు చేయకపోవడం దారుణమన్నారు. 24 గంటల్లో నిందితులను అరెస్టు చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మార్సీఎస్ నాయకులు కొత్తపల్లి ప్రసాద్, ధూళి జయరాజు, ఆకుమర్తి చిన్నా, మానవ హక్కుల సంఘ సభ్యురాలు ఖండవిల్లి లక్ష్మి, ఎమ్మార్పీఎస్ నాయకులు గాలంకి నాగేశ్వరరావు, పల్లేటి శ్రీనువాస్ తదితరులు పాల్గొన్నారు. నిందితుడు ఎన్వీ రెడ్డిని అరెస్టు చేయాలి మాదిగ సంఘాల నాయకుల డిమాండ్ -
ప్రచారం ఇదేండబ్బా
ప్రచారం.. పనిభారం ఈ కార్యక్రమ మార్గదర్శకాల్లోనే నాలుగైదు రోజుల ముందు నుంచే ఏమేమి చేయాలో కార్యకలాపాలను పొందుపర్చారు. పాఠశాలల్లో పాఠా లు చెప్పాల్సిన ఉపాధ్యాయులను తల్లికి వందనం పథకాన్ని ప్రచారం చేసేవారిగా ప్రభుత్వం మార్చేసింది. 17 కమిటీలను వేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయమని ప్రభుత్వం చెప్పడంతో ఉపాధ్యాయులంతా ఇదే పనికి తమ విలువైన సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది. ఇందులో ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో పాటు సచివాలయ, వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులను భాగస్వాములను చేశారు. వీరిని ఒక్కో పాఠశాలకు పర్యవేక్షకులుగా నియమించారు. వారి శాఖల పనిని పక్కన పెట్టి ప్రభుత్వ ఆదేశాలను పాటించే స్థితికి తీసుకొచ్చారు. కపిలేశ్వరపురం: చేసేది తక్కువ... గొప్పలెక్కువ అన్నట్టు కూటమి ప్రభుత్వ తీరు ఉంది. విలువైన ప్రజాధనాన్ని ప్రచారానికే కేటాయిస్తుంది. ఇప్పటి వరకూ యోగా దినోత్సవం పేరుతో సుమారు రూ.300 కోట్లను ఖర్చు చేసింది. అంతర్జాతీయంగా కూటమి ప్రభుత్వానికి ప్రశంసలు దక్కాయంటూ గొప్పలు చెప్పుకొంది. అదే కోవలో నేడు మరో ప్రచారానికి సిద్ధం చేసింది. మెగా పేరెంట్స్, టీచర్స్ డే కార్యక్రమాన్ని మెగా పీటీఎం 2.0 పేరుతో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నిర్వహించేందుకు కార్యాచరణ చేసింది. విద్యా శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ కార్యక్రమం వెనుక కూటమి ప్రభుత్వ ప్రచారం దాగి ఉంది. దీని నిర్వహణకు పరిమితంగా నిధులను కేటాయించి, స్కూల్ కాంపోజిట్ గ్రాంట్ నుంచి ఖర్చు పెట్టుకోమని చెబుతోంది. ప్రైవేట్ సంస్థల్లో ఆ యాజమాన్యం సొంత ఖర్చుతో కార్యక్రమాన్ని పండగలా చేయాలని సూచించింది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు ప్రస్తుతం ఈ కార్యక్రమం తలకు మించిన భారంగా మారుతోంది. నేడు విద్యాసంస్థల్లో కార్యక్రమాలు జిల్లావ్యాప్తంగా ఉన్న 2,150 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతో పాటు, ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పేరెంట్స్ మీటింగ్ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. గత విద్యా సంవత్సరంలో పాఠశాలలో అంతర్గతంగా నిర్వహించిన పరీక్షల ఫలితాల వివరాలతో కూడిన హోలెస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను విద్యార్థులకు అందజేయనున్నారు. వీటితోపాటు మరికొన్ని కార్యక్రమాలు రూపొందించినప్పటికీ ప్రధాన అజెండా కూటమి ప్రభుత్వ ప్రచారమే. తల్లికి వందనం సాయం అందజేశామన్న విషయాన్ని ఫోకస్ చేసే దిశగా కార్యక్రమాన్ని రూపొందించారు. ఇప్పటికే సన్నాహక సమావేశాలు ఈ నెల 4న ఇంటర్మీడియెట్ ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల ప్రిన్సిపాల్స్కు అమలాపురం బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెగా పీటీఎం సన్నాహక సమావేశం నిర్వహించారు. 8న జిల్లా కలెక్టరేట్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు కరస్పాండెంట్స్, ప్రిన్సిపాల్స్కు జిల్లా సన్నాహక సమావేశం జరిపారు. పిల్లలకు పాఠాలు చెప్పే పనిని పర్యవేక్షించాల్సిన విద్యా సంస్థ నిర్వాహకులు, బాధ్యులను కూటమి ప్రభుత్వ ప్రచారాన్ని సమయాన్ని కేటాయించమనడంపై నిరసన వ్యక్తమవుతోంది. ఇది సాధ్యమయ్యేనా? పాఠశాలల్లోనే కాకుండా బహిరంగ ప్రదేశాల్లో విద్యార్థులతో మొక్కలను నాటాలని సూచించారు. ఆ మొక్కలను విద్యార్థి బాధ్యతగా సంరక్షించాలని చెబుతున్నారు. రోజూ పాఠశాలకు వచ్చే విద్యార్థులకు అది సాధ్యం కాదు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంటే మొక్కలు నాటడంతో పాటు సంరక్షణ ప్రత్యేక నిధులను, సిబ్బందితో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. వివాదాలు రాకుండా చూడాలని.. పేరెంట్స్ మీటింగ్ అనగానే తల్లిదండ్రులు తమ పిల్లల చదువుతో పాటు ప్రభుత్వం అందిస్తున్న సాయం వివరాలను తెలుసుకోవాలని అనుకుంటారు. ఇటీవల తల్లికి వందనం లబ్ధిదారుల్లో అనేక మంది అర్హులకు సాయం అందలేదు. వారు అధికారులను ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గమనించిన ప్రభుత్వం పేరెంట్స్ మీటింగ్లో వివాదాలు రాకుండా చూసుకునే బాధ్యత నిర్వాహకులదే అని, ప్రొటోకాల్ వివాదాలు తలెత్తకుండా చూసుకోవాలంటూ సూచించింది. మెగా పీటీఎం 2.0 పేరుతో కార్యక్రమం తల్లికి వందనంపై సొంత బాకా ఉపాధ్యాయులకు పనిభారం పక్కదారి పట్టిన విద్యాబోధన -
బంగారు కుటుంబాలను ప్రతి ఉద్యోగి దత్తత తీసుకోవాలి
పెద్దాపురం/జగ్గంపేట: ప్రతి ప్రభుత్వ ఉద్యోగి బంగారు కుటుంబాలను దత్తత తీసుకుని ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అన్నారు. పెద్దాపురం మండలం వడ్లమూరు గ్రామంలో దొండపాటి చార్లెస్, స్వర్ణలత కుటుంబాన్ని దత్తత తీసుకున్న ఆయన.. మంగళవారం వారి ఇంటికి వెళ్లారు. ఆ కుటుంబ వివరాలు, ఆర్థిక స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ, జగ్గంపేట మండలం కాట్రావులపల్లిలో శాంతా దుర్గమ్మ, ప్రత్తిపాడులో మాదే రమణ కుటుంబాలను కూడా తాను దత్తత తీసుకున్నానని చెప్పారు. అట్టడుగున ఉన్న కుటుంబాలను గుర్తించి సంపన్న కుటుంబాలు సాయం అందిచడమే పీ–4 లక్ష్యమని అన్నారు. అనంతరం వడ్లమూరులో మొక్కలు నాటారు. కాట్రావులపల్లిలో పర్యటించిన కలెక్టర్ షణ్మోహన్ పీ–4 కార్యక్రమంలో స్థానిక ఏగులమ్మ గుడి వద్ద ఉన్న శాంతా దుర్గమ్మ కుటుంబాన్ని కలిశారు. ఆమె భర్త సాంబశివరావు ఏడాది క్రితం మృతి చెందారు. ఎటువంటి ఉపాధీ లేకపోవడంతో ఇద్దరు పిల్లలతో ఆమె ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఆమె కుటుంబాన్ని కలెక్టర్ దత్తత తీసుకున్నారు. ఇంటి స్థలం మంజూరు చేసి, ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహకారం అందిస్తామని చెప్పారు. కుటుంబాన్ని పోషించుకునేందుకు ఎంచుకునే ఉపాధి చెబితే సహకరిస్తామని తెలిపారు. నెల రోజుల సమయం తీసుకుని మండల అధికారులకు తెలపాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో ఆర్డీఓ కె.శ్రీరమణి, జిల్లా ప్రణాళికాధికారి త్రినాథ్, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎ.శ్రీనివాస్, పెద్దాపురం, జగ్గంపేట తహసీల్దార్లు, ఎంపీడీఓలు వెంకటలక్ష్మి, జేవీఆర్ రమేష్, శ్రీలలిత, ఏవీఎస్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మద్యం అనుబంధ నేరాలు నియంత్రించాలి కాకినాడ క్రైం: మద్యం అనుబంధ నేరాలను నియంత్రించాలని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ వై.చైతన్య మురళి అన్నారు. కాకినాడలోని కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కోనసీమ జిల్లా అమలాపురం మండలం పేరూరులో గత నెల 23న లిక్కర్ కేసును చాకచక్యంగా ఛేదించిన ఎస్సై కె.రవితేజ, కానిస్టేబుళ్లు జి.హనుమంతరావు నాయుడు, ఎం.భావనారా యణలను ఘనంగా సత్కరించారు. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిందని, పది మంది ముద్దాయిలను అరెస్టు చేశారని తెలిపారు. ఈ కేసు ద్వారా పాలకొల్లు, పాయకరావుపేట, కావలిల్లో స్ఫూరియస్ లిక్కర్ కేసులను ఛేదించామని చైతన్య మురళి చెప్పారు. -
ఆ క్రెడిట్ కొట్టేద్దామని..
కూటమి ప్రభుత్వ ప్రమేయమే లేదు వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే ప్రసాద్ నిధుల విడుదల, పనుల ప్రారంభోత్సవం జరిగాయి. ఇందులో కూటమి ప్రభుత్వ ప్రమేయమేదీ లేదు. ప్రస్తుతం టెండర్లు మాత్రమే ఈ ప్రభుత్వ హయాంలో జరుగుతున్నాయి. సత్యదేవుని దర్శనానికి ఏటా లక్షలాదిగా భక్తులు, పర్యాటకులు వస్తూంటారు. వారి సౌకర్యార్థం నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కేంద్రం ప్రసాద్ నిధులు రూ.20.06 కోట్లు మంజూరు చేసింది. దీనికి ప్రధాని మోదీకి, కేంద్ర టూరిజం మంత్రి కిషన్రెడ్డికి, ఆ శాఖ అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అప్పటి ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్, దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, అప్పటి ఈఓ ఎంతో సహకరించారు. వాస్తవానికి రూ.92 కోట్లతో నిర్మాణాలు చేపట్టేందుకు అప్పట్లో ప్రతిపాదించాం. ప్రస్తుత ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మిగిలిన నిధులు సాధించి, అప్పుడు ప్రచారం చేసుకోవాలి. – వంగా గీతా విశ్వనాథ్, కాకినాడ మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జి ఫ ‘ప్రసాద్’ను తన ఖాతాలో వేసుకునేందుకు ఎంపీ ప్రయాస ఫ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ పథకం కోసం కృషి ఫ ఈ నిధుల కోసం అవిశ్రాంతంగా పని చేసిన నాటి ఎంపీ వంగా గీత ఫ అప్పటి కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని పలుమార్లు కలసి అభ్యర్థనలు ఫ ఫలితంగా పచ్చజెండా ఊపిన కేంద్రం ఫ అప్పట్లోనే వర్చువల్గా శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ ఫ అయినప్పటికీ ఇదంతా తన కృషి వల్లనేనంటూ తంగెళ్ల ప్రచారం ఫ నవ్వుకుంటున్న జనం అన్నవరం: కష్టపడింది ఎవరైనా.. దానికి మంచి ఫలితం వస్తే చాలు.. ఏమాత్రం జంకూగొంకూ లేకుండా ఆ క్రెడిట్ కొట్టేయడానికి కూటమి పెద్దలు తెగ తాపత్రయపడుతూంటారు. ఆ విషయంలో కూటమిలోని జనసేన పార్టీకి చెందిన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్.. రెండాకులు ఎక్కువే చదివానని నిరూపించుకుంటున్నారనే విమర్శ వస్తోంది. అన్నవరం దేవస్థానంలో ‘ప్రసాద్’ స్కీమును తన ఖాతాలో వేసుకునేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నమే దీనికి కారణమవుతోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పూర్తి చేసిన అనేక నిర్మాణాలకు ప్రారంభోత్సవాలు చేస్తూ.. అవన్నీ తమ ఘనతేనంటూ చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వ పెద్దలు.. తాజాగా అన్నవరం దేవస్థానంలో కేంద్ర ప్రభుత్వ ‘ప్రసాద్’ స్కీము కూడా తమ చలవేనంటూ ఆ క్రెడిట్ కొట్టేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు చూసి జనం నవ్వుకుంటున్నారు. ఏం జరిగిందంటే.. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పిలిగ్రిమేజ్ రీజువెనేషన్ అండ్ స్పిరిచ్యువల్ అగ్మంటేషన్ డ్రైవ్ (ప్రసాద్) స్కీముకు అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం 2016లో ఎంపికై ంది. అయితే, 2019 వరకూ ఉత్తరాది రాష్ట్రాల్లోని వారణాశి, మధుర తదితర పుణ్యక్షేత్రాల అభివృద్ధి పైనే కేంద్రం దృష్టి సారించింది. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. కాకినాడ ఎంపీగా వంగా గీతా విశ్వనాథ్ ఎన్నికయ్యారు. రాష్ట్రాన్ని పర్యాటకంగా కూడా అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో భాగంగా ప్రసాద్ స్కీము ద్వారా ఎక్కువ నిధులు సాధించి, అన్నవరం దేవస్థానంలో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేయాలని అప్పటి ఎంపీ వంగా గీతను నాటి సీఎం జగన్ ఆదేశించారు. అప్పటి నుంచీ ఆమె ఈ స్కీము నిధుల కోసం ఢిల్లీలోని కేంద్ర పర్యాటక శాఖ అధికారులతో పలు దఫాలు చర్చలు జరిపారు. అప్పటి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డిని కలిసి అన్నవరం దేవస్థానానికి అధిక మొత్తంలో నిధులు మంజూరు చేయాలని కోరారు. తొలుత అన్నవరం దేవస్థానానికి రూ.100 కోట్లు మంజూరు చేసేందుకు ప్రతిపాదనలు పంపించాలని కేంద్రం చెప్పింది. ఆవిధంగా ప్రతిపాదించగా అందులో రూ.8 కోట్లు తగ్గించి, రూ.92 కోట్లకు పరిమితం చేసింది. చివరకు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్) వద్దకు వచ్చేసరికి రూ.54 కోట్లకు తగ్గించింది. చివరకు కేంద్రం రూ.20.06 కోట్లు మాత్రమే మంజూరు చేయడం కొంత అసంతృప్తికి కారణమైంది. ఒక దశలో రూ.10 కోట్లు మాత్రమే మంజూరు చేస్తారనే సమాచారం రావడంతో నాటి ఎంపీ గీత.. కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని కలసి, ప్రసాద్ స్కీము నిధులు పెంచాలని కోరారు. ఆమె కృషితో కేంద్రం ఎట్టకేలకు రూ.20.06 కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ.11.09 కోట్లతో రెండంతస్తుల్లో అన్నదాన భవనం, రూ.5.9 కోట్లతో క్యూ కాంప్లెక్స్, రూ.61.78 లక్షలతో టాయిలెట్ బ్లాకులు, రూ.1.08 కోట్లతో వ్యర్థ జలాల శుద్ధి ప్లాంట్, రూ.91.96 లక్షలతో భక్తుల క్యూ కాంప్లెక్స్ ప్రహరీ నిర్మించాలని నిర్ణయించారు. వీటితో పాటు రూ.కోటి వ్యయంతో 2 బ్యాటరీ కార్లు కూడా మంజూరు చేశారు. ఈ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్ నుంచి గత ఏడాది మార్చి 7న వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఆ కార్యక్రమంలో అప్పటి ఎంపీ, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వంగా గీత, పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్, అన్నవరం దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, నాటి ఈఓ, ప్రస్తుత దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ పాల్గొన్నారు. అనంతరం గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రసాద్ పనుల కోసం మూడుసార్లు టెండర్లు పిలిచింది. ఈ టెండర్లు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఇటీవల టూరిజం శాఖ సీఈ ఈశ్వరయ్య తదితరులు ప్రసాద్ స్కీము నిర్మాణాల స్థలాలను పరిశీలించి వెళ్లారు. త్వరలో టెండర్లు ఖరారు చేసి, ఈ నెలాఖరు నుంచి నిర్మాణాలు ప్రారంభిస్తామని చెప్పారు. పనులు ప్రారంభమయ్యే సూచనలతో.. ప్రసాద్ స్కీము పనులు ఈ నెలాఖరున ప్రారంభమయ్యే అవకాశం ఉండటంతో ప్రస్తుత ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ రంగంలోకి దిగారు. ఈ మేరకు మంగళవారం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టారు. ప్రసాద్తో పాటు అనేక విషయాల్లో అన్నవరం దేవస్థానం అభివృద్ధికి తాను కృషి చేస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దీనిపై మాజీ ఎంపీ వంగా గీత అభ్యంతరం వ్యక్తం చేశారు. 2019–24 మధ్య అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో కాకినాడ ఎంపీగా ఉన్న తాను ప్రసాద్ స్కీము కోసం మొక్కవోని పట్టుదలతో కృషి చేసి నిధులు సాధించానని గుర్తు చేశారు. అయితే, ఇదంతా ఆయన గొప్పే అన్నట్టు ప్రస్తుత ఎంపీ తంగెళ్ల ప్రచారం చేసుకోవడం దారుణమని విమర్శించారు. -
ఆర్టీసీలో కారుణ్య నియామకాలు
రాజమహేంద్రవరం సిటీ: ఏపీఎస్ ఆర్టీసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పనిచేస్తూ వివిధ సహజ మరణాలతో పాటు మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల పత్రాలను అందజేసినట్లు డీపీటీఓ వైఎస్ఎన్ మూర్తి తెలిపారు. రాజమహేంద్రవరంలో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో పది మందిని కండక్టర్ గ్రేడ్–2 ఉద్యోగం కోసం ఎంపిక చేసి, నియామక పత్రాలు ఇచ్చామన్నారు. కార్యక్రమంలో కాకినాడ జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసరావు, కోనసీమ జిల్లా ప్రజా రవాణా అధికారి రాఘవ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఈవోలదే సీసీ కెమెరాల నిర్వహణ బాధ్యత
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): అన్ని ఆలయాలలో సీసీ కెమెరాలు పని చేసేలా చూడాలని, అవి పనిచేయకపోతే ఈవోలే పూర్తి బాధ్యత వహించాలని దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్ డీఎల్వీ రమేష్బాబు అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరిలోని దేవదాయశాఖ ఆలయాలు, సత్రాల ఈవోలతో మంగళవారం కాకినాడలోని బాలా త్రిపుర సుందరి ఆలయ కల్యాణ మండపంలో సమావేశం నిర్వహించారు. రమేష్ బాబు మాట్లాడుతూ ఆలయాల్లో దేవుడి వెండి, బంగారం ఆభరణాలకు బీమా చేయించాలన్నారు. ఆలయాలు, సంస్థలకు సంబంధించి భూముల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎక్కడైనా అన్యాక్రాంతమైతే సంబంధిత ఈవోలు వెంటనే నోటీసులు ఇచ్చి, వాటిని స్వాధీనం చేసుకోవాలన్నారు. సమావేశంలో జ్యుయలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ విళ్ల పళ్లంరాజు, దేవదాయశాఖ ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ డిప్యూటీ తహసీల్దార్ దాసరి భారతి, జిల్లా దేవదాయశాఖాదికారులు కె.నాగేశ్వరరావు, ఈవీ సుబ్బారావు పాల్గొన్నారు. -
వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీసు అధికారి
కాకినాడ క్రై: సాధారణ గస్తీలో భాగంగా కాకినాడలో భద్రతను పర్యవేక్షిస్తున్న కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్ సీఐ సునీల్ కుమార్ ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడారు. వివరాల్లోకి వెళితే.. సర్పవరంలోని విశాఖ డైయిరీ సమీపంలో మంగళవారం తెల్లవారుజాము 3.30 గంటల సమయంలో ఒక వ్యక్తి రోడ్డుపై అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఆ సమయంలో వాహనాల రద్దీ లేకపోవడంతో అతడికి ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు. గస్తీలో భాగంగా అటుగా వెళ్లిన సీఐ సునీల్ కుమార్ ఆ వ్యక్తిని చూశారు. వెంటనే మంచినీరు తాగించి, సపర్యలు చేసి కూర్చోబెట్టారు. నీరసంతో పడిపోయానని అతడు చెప్పడంతో పోలీసులు సురక్షిత ప్రాంతానికి చేర్చి, ఓఆర్ఎస్ ద్రావణాలు కొని ఇచ్చారు. కాగా.. రోడ్డుపై పడిఉన్న వ్యక్తి ప్రాణాలను కాపాడిన సునీల్ కుమార్ను ఎస్పీ బిందుమాధవ్, డీఎస్పీ దేవానంద్ పాటిల్ అభినందించారు. -
పశువైద్యాధికారి శ్రీనివాసు మృతి
ఆలమూరు: నాన్ గ్రాడ్యుయేట్ వెటర్నరీ ఏడీ నాన్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా చైర్మన్, పినపళ్ల గ్రామీణ పశు వైద్యాధికారి ఈదల శ్రీనివాసు (61) మంగళవారం మృతి చెందారు. ఆయన కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ రాజమహేంద్రవరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ సమయంలో గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. గుమ్మిలేరు, చింతలూరు, మూలస్థాన అగ్రహారం, జొన్నాడ, పినపళ్ల గ్రామాల్లో ఆయన పశువైద్యాధికారిగా సేవలందించారు. ముగ్గురు అవినీతి అధికారులకు జైలు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఈ ఏడాదిలో ఇప్పటివరకూ ముగ్గురు అవినీతి అధికారులను ఏసీబీ పట్టుకుందని ఆ శాఖ రాజమహేంద్రవరం డీఎస్పీ ఎం.కిశోర్ కుమార్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. మార్చి 24న పిఠాపురంలో రూ.20 వేలు లంచం అడిగిన కేసులో సబ్ ఇన్స్పెక్టర్ ఎల్.గుణశేఖర్, మార్చి 28న కాకినాడ రిజిస్ట్రార్ కె.ఆనందరావు, జూన్ 25న వీఆర్వో పరస శ్రీమన్నారాయణను అరెస్టు చేసి జైలుకి పంపామన్నారు. ఎవరైనా లంచం అడిగితే తనకు 94404 46160, రాజమహేంద్రవరం ఇన్స్పెక్టర్ ఎన్వీ భాస్కర్ 94404 46161, కాకినాడ జిల్లా ఇన్స్పెక్టర్ డి.వాసు 83329 71041, అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఇన్స్పెక్టర్ వై.సతీ ష్ 94404 46163లతో పాటు అవినీతి నిరోధకశాఖ రాజమహేంద్రవరం ల్యాండ్లైన్ నంబర్ 0883 2467833కు సమాచారం ఇవ్వాలన్నారు. ఇసుక లారీ కింద పడి వ్యక్తి మృతి ధవళేశ్వరం: ఇసుక లారీ కింద పడి ధవళేశ్వరం మసీదు వీధి కొండ మెరక ప్రాంతానికి చెందిన పువ్వల లక్ష్మణ్ (39) మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. పువ్వల లక్ష్మణ్ పెయింటర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో పని కోసం రాజమహేంద్రవరానికి మోటారు సైకిల్పై బయలుదేరాడు. ధవళేశ్వరం క్వాయర్ బోర్డు ఎదురుగా ఆటోను తప్పించే ప్రయత్నంలో రోడ్డుపై పడిపోయాడు. అదే సమయంలో వెనుక వచ్చిన ఇసుక లారీ.. లక్ష్మణ్ కుడి కాలి పైనుంచి వెళ్లిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసును ధవళేశ్వరం సీఐ టి.గణేష్ కేసును దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. బంగారు, వెండి ఆభరణాల చోరీ ఆలమూరు: కాంట్రాక్ట్ అధ్యాపకురాలి ఇంట్లో బంగారం వెండి వస్తువులను దొంగలు చోరీ చేశారు. పెదపళ్ల గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇవి. గ్రామానికి చెందిన నరసింహదేవర వెంకటదుర్గ అచ్యుత విశాలక్ష్మి పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంట్రాక్టు లెక్చరర్గా పనిచేస్తున్నారు. ఆమె ఈనెల నాలుగున తన కుటుంబ సభ్యులతో కలసి తిరుపతి వెళ్లారు. అనంతరం ఈ నెల ఏడున తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు పగలగొట్టి ఉన్నాయి. లోపలకు వెళ్లి పరిశీలించగా బీరువాలోని సుమారు రూ.8 లక్షల విలువైన 11 కాసుల బంగారు ఆభరణాలు, అర కిలో వెండి వస్తువులు చోరీకి గురైనట్టు గుర్తించారు. ఆమె ఫిర్యాదు మేరకు ఎస్సై జి.నగేష్ కేసును దర్యాప్తు చేస్తున్నారు. 10 నుంచి బిక్కవోలు – అనపర్తి రైల్వే గేటు మూసివేత సామర్లకోట: స్థానిక రైల్వే స్టేషన్ పరిధిలోని బిక్కవోలు – అనపర్తి మధ్య ఉన్న 415 రైల్వే గేటు (605/9–11) ను ఈ నెల 10 నుంచి 13 వరకూ మూసివేయనున్నట్టు సీనియర్ సెక్షన్ ఇంజినీర్ రామ సుబ్బారావు మంగళవారం ప్రకటనలో తెలిపారు. రైల్వే గేటులోని ప్రధాన ట్రాక్ మరమ్మతుల కోసం ఈ గేటు మీదుగా రాకపోకలు నిలిపివేస్తున్నామన్నారు. ఈ మేరకు అనపర్తి తహసీల్దార్, పోలీసు అధికారి, అనపర్తి, లక్ష్మీనారాయణపురం, కాపవరం పంచాయతీ అధికారులకు, లారీ, ఆటో యూనియన్ అసోసియేషన్లకు సమాచారం ఇచ్చామన్నారు. ఇటుగా రాకపోకలు సాగించే వారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. -
10 నుంచి పొగాకు విత్తనాల విక్రయం
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): రాజమహేంద్రవరంలోని జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్ –నిర్కా) (పూర్వపు సీటీఆర్ఐ)లో 2025–26 సీజన్కు ఈ నెల 10వ తేదీ ఉదయం 10 గంటల నుంచి నాణ్యమైన వర్జినియా పొగాకు విత్తనాలు విక్రయించనున్నారు. వీటిని ఎస్బీఎస్, ఎస్ఎల్ఎస్, ఎన్బీఎస్, ఎన్ఎల్ఎస్ రైతులు సద్వినియోగం చేసుకోవాలని నిర్కా డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ మంగళవారం ప్రకటనలో కోరారు. అలాగే 21వ తేదీ ఉదయం 10 గంటల నుంచి కందుకూరులోని వాణిజ్య వ్యవసాయ పరిశోధనాసంస్థ (పూర్వపు సీటీఆర్ఐ)లో కూడా పొగాకు విత్తనాల విక్రయాలు ప్రారంభమవుతాయన్నారు. జీబీఆర్ఎస్ పాస్బుక్ ఉన్న రైతులకు ప్రతి బ్యారన్కు 500 గ్రాముల చొప్పున కిలో రూ.1,300కు విక్రయిస్తారన్నారు. కావాల్సిన రైతులు బ్యారన్ రిజిస్ట్రేషన్ పాస్బుక్ తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. క్యాష్లెస్ లావాదేవీలు అనగా యూపీఐ (గూగుల్ పే, ఫోన్ పే ), క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా మాత్రమే అనుమతి ఉందన్నారు. పొగాకు బోర్డు ద్వారా రిజిస్టర్ చేయించిన కమర్షియల్ నారుమడులకు సంబంధించిన రైతులకు కిలో విత్తనాలను రూ.2,200కు విక్రయిస్తారన్నారు. -
నూతన సేద్య పద్ధతులతో కోకోలో అధిక దిగుబడి
అంబాజీపేట: కోకో సాగులో నూతన సేద్య పద్ధతులు పాటిస్తే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చని ఉద్యాన పరిశోధన కేంద్రం అధిపతి డాక్టర్ ఎం.ముత్యాల నాయుడు అన్నారు. అంబాజీపేటలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధన కేంద్రంలో డైరెక్టర్ ఆఫ్ క్యాష్వేనట్ అండ్ కోకో డెవలప్మెంట్ ప్రోత్సాహంతో మంగళవారం కోకో సాగుపై శిక్షణ నిర్వహించారు. ముత్యాల నాయుడు మాట్లాడుతూ కోకో తోటల్లో యాజమాన్య పద్ధతులు అవలంబించాలన్నారు. కొమ్మ కత్తిరింపు, పురుగుల నియంత్రణ పద్ధతులపై రైతులకు అవగాహన ఉండాలన్నారు. కొబ్బరి తోటల్లో అంతర పంటగా కోకోను సాగు చేయడం వల్ల అదనపు రాబడి పొందవచ్చన్నారు. డాక్టర్ నామాల శ్రీనివాసరావు మాట్లాడుతూ కోకో కాయ తయారయ్యే సమయంలో తోటలను రైతులు పరిశీలించి ఎలుకల బెడద ఉంటే నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. హార్టికల్చర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎం.తిరుపతిరెడ్డి మాట్లాడుతూ కోకో ప్రొడక్షన్, కోకో వాల్యూ అడిషన్, ప్రోసెసింగ్ విధానాలను వివరించారు. శాస్త్రవేత్తలు బి.నీరజ, ఎ.కిరీటి, వి.అనూష తదితరులు కోకోలో సూక్ష్మపోషకాల యాజమాన్య విధానాలను తెలిపారు. -
రక్కసీ కోత
ప్రస్తుతం మాయాపట్నం వద్ద కడలిలో కలిసిపోయిన జియోట్యూబ్ రక్షణ గోడఉప్పాడ శివారు మాయాపట్నం వద్ద బీచ్ రోడ్డుకు రక్షణగా వేసిన జియో ట్యూబ్ రక్షణ గోడ (ఫైల్) ● కరిగిపోతున్న ఉప్పాడ తీరం ● సముద్రంలో కలసిపోతున్న భూములు ● రక్షణ చర్యలు చేపట్టని ప్రభుత్వం ● నెరవేరని పవన్ కల్యాణ్ హామీ పిఠాపురం: ఉప్పాడ తీరంలో సముద్రం తరచూ ఉగ్రరూపం దాల్చుతుంటుంది. తుపాను రానప్పటికీ, ఉపద్రవాల హెచ్చరికలు లేనప్పటికీ సముద్ర కెరటాలు ఒక్కసారిగా ఉప్పొంగుతుంటాయి. దీంతో తీరం వెంబడి భూమి మీటర్ల మేర కోతకు గురవుతోంది. ఉప్పాడతో పాటు దాని శివారు గ్రామాలు కడలిలో కలిసి పోతుంటాయి. ఇలా సుమారు శతాబ్ద కాలంగా కడలి కబలించేస్తున్నా శాశ్వత రక్షణ చర్యలు మాత్రం కనిపించడం లేదు. ఇక్కడ ఉన్నవి గుడిసెలే కదా అని రూ.లక్షల్లో ఉన్న ప్రతిపాదనలను పట్టించుకోక పోవడం వల్ల వందల ఎకరాల పంట భూములు, పురాతన ఆలయాలు, భవంతులు కడలి గర్భంలో కలిసిపోయాయి. కాకినాడ – విశాఖ మధ్య పారిశ్రామికాభివృద్ధికి మూలస్తంభం లాంటి బీచ్ రోడ్డు నిర్మించిన నాటి నుంచే కడలిపాలవుతూనే ఉంది. ఉప్పాడ రక్షణకు చర్యలు ఉత్తిమాటేనా? కోతకు గురవుతున్న ఉప్పాడ తీర ప్రాంత రక్షణకు రూ.వందల కోట్లతో చర్యలు తీసుకుంటున్నట్లు నియోజకవర్గ ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయం మరిచిపోయారు. గత ఏడాది ఉప్పాడ తీర ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన రక్షణ చర్యలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. దీనితో తీర ప్రాంత రక్షణకు చేపట్టాల్సిన చర్యలపై కలెక్టరేట్లో గత ఏడాది జూలై 24న కలెక్టర్ ఆధ్వర్యంలో డీఎఫ్ఓ భరణి, నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ (ఎన్సీసీఆర్) జాయింట్ సెక్రటరీ రమణ మూర్తి జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉప్పాడ నుంచి కాకినాడ పోర్టు వరకు తీర ప్రాంతం అభివృద్ధి, ఉప్పాడ తీరం కోత, ఇతర ప్రాంతాల్లో సముద్ర కోత నివారణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చలు జరిపారు. ఇవన్నీ జరిగి ఏడాది పూర్తవుతున్నా కనీసం ప్రణాళికలు కూడా తయారు కాలేదు. పెరిగిన కోత గత కొన్ని నెలలుగా ఉప్పాడ తీర ప్రాంతం తీవ్ర కోతకు గురవుతోంది. ప్రకృతి వైపరీత్యాలతో సంబంధం లేకుండా నిత్యం కోత బారిన పడుతోంది. ఇప్పటి వరకు రక్షణగా ఉన్న జియోట్యూబ్ టెక్నాలజీ రక్షణ గోడ పూర్తిగా కడలిలో కలిసి పోగా, పక్కనే ఉన్న పంట పొలాలు సైతం సముద్రంలో మునిగిపోతున్నాయి. ఇలా ఇప్పటి వరకు 1,360 ఎకరాల పంట భూమి కోతకు గురై కడలి గర్భంలో కలిసి పోయింది. ఈ తీర ప్రాంత రక్షణకు రూ.250 కోట్లతో ప్రణాళికలు అన్న మాట కాగితాలకే పరిమితమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్సీసీఆర్ అధ్యయనం ప్రకారం కోస్తా తీరంలో ఉప్పాడ కొత్తపల్లి, సఖినేటిపల్లి మండలాలు ప్రమాద స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. 1956 నుంచి ఇప్పటి వరకు ఒక్క ఉప్పాడ గ్రామంలోనే సుమారు 85 ఎకరాల భూమి సముద్రంలో కలిసిపోయినట్లు గుర్తించారు. కోతకు కారణమేదే! గోదావరి ఇసుక కొట్టుకు రావడం వల్ల కాకినాడ సమీపంలో ఏర్పడిన హోప్ ఐలాండ్ కారణంగానే ఉప్పాడ ప్రాంతం కోతకు గురవుతుందని నిపుణులు తేల్చి చెప్పారు. ఈ ఐలాండ్ సముద్రంలో 40 చదరపు మైళ్ల విస్తీర్ణం గల లోతు లేని అగాధం (కాకినాడ బే) సృష్టించడం వల్ల దీని సమీపంలోని ఉప్పాడకు ముప్పు ఉందని నిర్ధారించారు. ఉత్తరం వైపు నుంచి తెరుచుకుని ఉండే ఈ అగాధం దక్షిణ వైపు నుంచి తీరానికి వెళ్లే అలలను అడ్డుకుంటోంది. దీంతో అలలతో పాటు వెళ్లే పదార్థాలు (లిట్టోకల్ డ్రిప్టు) తీరం చేరడం లేదు. దానివల్ల అలల తాకిడితో హోప్ ఐలాండ్లో ఇసుక దిబ్బలు పెరుగుతుండగా, ఉప్పాడ తీరంలో ఇసుక మేటలు వేయడానికి బదులు తీరంలో మట్టి కోతకు గురవుతుంది. గ్రామాలు కోతకు గురైన భూమి (ఎకరాల్లో) ఉప్పాడ 84.51 రమణక్కపేట 13.01 అమరవిల్లి 133.50 సుబ్బంపేట 141.30 కోనపాపపేట 233.56 మూలపేట 359.78 కొమరగిరి 362.83 మొత్తం 1,360 పొంచిఉన్న ప్రమాదం కాకినాడ – విశాఖ మధ్య పారిశ్రామికాభివృద్ధికి మూలస్తంభమైన ఉప్పాడ తీరం శాశ్వత రక్షణకు చర్యలు చేపట్టలేకపోతే, ప్రత్యామ్నాయం అయినా చూడాలి. ఉప్పాడ కోతకు అడ్డుకట్ట వేస్తానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీ నెరవేరుతుందని ఆశించిన తీర ప్రాంత వాసులకు నిరాశ మిగిలింది. దీంతో గ్రామాలను ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందే అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సముద్ర కోత కారణంగా ఇప్పటి వరకూ సుమారు 32 వేల నివాస గృహాలు కడలిలో కలసిపోయినట్టు లెక్కలు చెబుతున్నాయి. 75 ఏళ్ల క్రితమే.. 1950లోనే ఉప్పాడ తీరానికి సముద్ర కోత వల్ల ముప్పు ఉందని అఽధికారులు గుర్తించారు. రక్షణ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించక తప్పదని ఈ మేరకు సర్వే జరిపిన విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం తేల్చి చెప్పింది. 1971లో కోత తీవ్రతను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం 1992లో పూణేలోని అప్పటి పీడబ్ల్యూఆర్ఎస్ డైరెక్టర్ సీవీ గోలే అధ్యక్షతన ఒక సాంకేతిక సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఆ బృందం సాంకేతిక పరంగా సర్వేలు జరిపి ఉప్పాడ ప్రాంతం కోత.. విశేష స్వభావం కలిగినదిగా తెలిపింది. -
వీరేశ్వరా.. క్షమించవా..
ఐ.పోలవరం: మురమళ్ల భఽధ్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి కొబ్బరి కాయలతో అభిషేకం పూర్తిస్థాయిలో జరగడం లేదు. అధికారుల నిరక్ష్యంతో కొబ్బరికాయలు పక్కదారి పడుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఆలయంలో ప్రతి రోజూ రాత్రి జరిగే కల్యాణాలకు సంబంధించి ఉదయం అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ అభిషేకానికి సంబంధించి ఒక టిక్కెట్టుకు రెండు కొబ్బరి కాయలు కేటాయిస్తారు. పండితులు వీటితో భక్తుల గోత్రనామాలతో స్వామికి, వినాయకునికి అభిషేకాలు చేస్తారు. ప్రతి నిత్యం సుమారు 116 కల్యాణాలు ఇక్కడ జరుగుతాయి. అంటే రోజుకు 232 కొబ్బరికాయలు కొట్టాలి. కానీ ఆలయంలో 15 రోజులకు సంబంధించి కేవలం ఒక్క రోజు మాత్రమే స్వామికి అభిషేకాల కొబ్బరి కాయలు కొట్టారు. మిగిలిన రోజులు స్వామికి ఎగనామం పెట్టేశారు. అభిషేకాలకు సంబంధించిన కొబ్బరి కాయలు ఎక్కడకు వెళ్లాయో తెలియదు. భక్తుల ఆవేదన స్వామివారి కల్యాణానికి రుసుము రూ.1,000 తీసుకుంటారు. భక్తుల నమ్మకాన్ని కొందరు అవినీతి పరులు సొమ్ము చేసుకొంటున్నారు. స్వామివారి అభిషేకానికి ఉపయోగించాల్సిన కొబ్బరి కాయలను పక్కదారి పట్టించి, వారి మనోభావాలను దెబ్బతీస్తున్నారు. అనాదిగా వస్తున్న ఆచార, సంప్రదాయాలను, పూజాది కార్యక్రమాలు తుంగలోకి తొక్కేస్తున్నారు. కొబ్బరి ధర హెచ్చును సాగుగా చూపుతూ కొబ్బరి నీళ్ల అభిషేకానికి స్వస్తి పలికేశారు. దీనిపై ఆగ్రహించిన కొందరు భక్తులు నేరుగా ఆలయ సహాయ కమిషనర్ వి.సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపొయింది. కొబ్బరి కాయల పాటదారునికి షోకాజ్ నోటీసులు ఇస్తామని ఆయన తప్పించుకొనే ప్రయత్నం చేశారు. అయితే అభిషేకాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే ప్రయత్నం కూడా చేయలేదు. దీంతో ఆలయ అధికారుల తీరుపై భక్తులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఆలయంలో ఎంతో పవిత్రంగా భావించే అన్నప్రసాదాలకు రుచి, శుచి కరువైయ్యిందనే భక్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై సహాయ కమిషనర్ వి.సత్యనారాయణను వివరణ కోరగా కొబ్బరి కాయలు ఇవ్వడం లేదని తన దృష్టికి వచ్చిందని, సంబంధిత పాటదారునికి నోటీసులు అందజేసి యథావిధిగా అభిషేకాలు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. అభిషేకానికి ఉపయోగించే కొబ్బరి కాయలు పక్కదారి మురమళ్ల ఆలయంలో ఘటన అధికారుల నిర్లక్ష్యంపై భక్తుల ఆగ్రహం -
ఎస్బీఐ ఏటీఎం దగ్ధం
● పక్కనే ఉన్న బైక్లు, కారు సైతం అగ్నికి ఆహుతి ● విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం యానాం: పట్టణంలోని స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏటీఎం కాలిపోయిన ఘటనలో సుమారు రూ.15 లక్షల ఆస్తినష్టం సంభవించింది. వివరాల్లోకి వెళితే.. కొత్త బస్టాండ్ సమీపంలోని పోలీస్ కార్వర్ట్స్ వెనుక ఉన్న కంచర్ల కాంప్లెక్స్లో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో మంగళవారం తెల్లవారుజామున మంటలు వ్యాపించాయి. అవి ఆ పక్కనే ఉన్న మల్లిపూడి శ్రీనివాసరావుకు చెందిన మోటార్ మెకానిక్ షాపునకు విస్తరించాయి. దీంతో అక్కడే రిపేర్కు వచ్చిన నాలుగు బైక్లు, ఒక కారు కాలిపోయాయి. పోలీస్ క్వార్టర్ ఆవరణలో ఇంటి వాకిలి తుడుస్తున్న ఓ మహిళ ఆ మంటలను చూసి అగ్నిమాపక దళ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో ఇన్చార్జి ఫైర్ ఆఫీసర్ జగడం మీరా సాహెబ్ ఆధ్వర్యంలో సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రమాద స్థలాన్ని సీఐ అడలరసన్, ఎస్హెచ్ఒ–2 కట్టా సుబ్బరాజు, ఏఎస్సై పంపన మూర్తి, ఎస్బీఐ అధికార్లు పరిశీలించారు. ఏటీఎంలో నగదు ఎంత ఉందనేది ఇంకా తెలియలేదు. మెకానిక్ షాపు యజమాని మాట్లాడుతూ అగ్నిప్రమాదంలో సుమారు రూ.15 లక్షల విలువైన బైక్లు, కారు కాలిపోయాయన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. -
కూటమి సర్కారు.. కూకటి వేళ్లతో కదిలేలా..
వైఎస్సార్ సీపీ పిఠాపురం సోషల్ మీడియా గ్రూపులు హ్యాక్!పిఠాపురం: తమ సోషల్ మీడియా గ్రూపులను కూటమి నాయకులు హ్యాక్ చేశారని పిఠాపురం వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపించారు. గొల్లప్రోలులో జరిగిన పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి వచ్చిన జనాదరణను సహించలేక కూటమి నాయకులు.. తమ సోషల్ మీడియా గ్రూపులకు ఏపీకే ఫైల్స్ పంపించారని తెలిపారు. తమ సోషల్ మీడియా ప్రతినిధులు అప్రమత్తమై గ్రూపులను పునరుద్ధరిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను అణగదొక్కే కుట్రగా అనుమానం వ్యక్తం చేశారు. ● గొల్లప్రోలులో కదం తొక్కిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ● బాబు మోసంపై విరుచుకుపడ్డ నేతలు ● పార్టీ విస్తృత స్థాయి సమావేశం సూపర్ సక్సెస్ పిఠాపురం: కూటమి ప్రభుత్వం కూకటి వేళ్లతో కదిలేలా వైఎస్సార్ సీపీ కార్యకర్తలు వేలాదిగా కదం తొక్కారు. సీఎం చంద్రబాబు మోసంపై విరుచుకుపడ్డారు. ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ’ కార్యక్రమానికి శ్రేణులను సమాయత్తం చేసే లక్ష్యంతో.. వైఎస్సార్ సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జి వంగా గీతా విశ్వనాథ్ అధ్యక్షతన గొల్లప్రోలులో సోమవారం నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశం సూపర్ సక్సెస్ అయ్యింది. నేతల ప్రసంగాలు స్థానిక నాయకులు, కార్యకర్తల్లో ఉత్తేజం నింపాయి. అబద్ధాల్లో బాబును మించిన కొడుకు ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ఏ తండ్రి అయినా కొడుకు తన కంటే ప్రయోజకుడు కావాలని కోరుకుంటారని, కానీ, అబద్ధాలు ఆడటంలో చంద్రబాబు కొడుకు మాత్రం తండ్రిని మించిన తనయుడిలా ఉన్నాడని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 100 అబద్ధాలు ఆడితే, ఆయన కుమారుడు లోకేష్ 200 అబద్ధాలు ఆడుతూ తండ్రిని మించిపోయారని అన్నారు. ఏప్రిల్, మే నెలల్లో అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని మంత్రి లోకేష్ శాసన మండలి సాక్షిగా చెప్పారని, జూన్ వెళ్లి జూలై వచ్చినా ఇంకా అమలు కాలేదని బొత్స దుయ్యబట్టారు. ఇలాంటి అబద్ధాలు ఆడేవారిని మోసగాళ్లు, దగాకోరులు అనాలా, వద్దా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలపై అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట మార్చి ప్రజల్ని మోసం చేశారని దుయ్యబట్టారు. జరిగిన మోసాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే తాటా తీస్తానని చంద్రబాబు.. మక్కెలు విరగ్గొడతానని పవన్ కల్యాణ్ అంటున్నారన్నారు. వాళ్లు తాట తీసి, మక్కెలు విరగ్గొడితే కొట్టించుకోడానికి వైఎస్సార్ సీపీ నేతలు కార్యకర్తలేమైనా చేతకానివారా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పథకాలు ఇస్తామని మోసం చేసిన చంద్రబాబు, పవన్ మోసగాళ్లు కాదా? అబద్ధపు వాగ్దానాలు చేసిన వీరిద్దరూ అబద్ధపుకోరులు కాదా?’ అని బొత్స ప్రశ్నించారు. దమ్ముంటే ఈ ఇద్దరు నాయకులూ గ్రామాలకు వెళ్లి, తాము ఇచ్చిన హామీలపై ప్రజలతో మాట్లాడాలని, ఎవరు ఎవరి తాట తీస్తారో, ఎవరి మక్కెలు ఎవరు విరగ్గొడతారో అప్పుడు తెలుస్తుందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఈవిధంగా బెదిరించడం భావ్యమేనా అని ప్రశ్నించారు. చేసే సత్తా లేనప్పుడు వాగ్దానాలు ఎందుకిచ్చారని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే అడిగే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, అడిగిన వారిని అణగదొక్కుదామంటే ఇంకా పైకి లేచి మరింత తిరగబడతారని హెచ్చరించారు. చంద్రబాబు, పవన కల్యాణ్ కలసి పలు హామీలిచ్చి అమలు చేస్తామంటూ ప్రజలకు బాండు రాసిచ్చారన్నారు. ఇప్పుడు ఆ బాండ్లను ప్రజలకు చూపించి, వారిద్దరూ చేసిన మోసాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడానికే బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. ప్రతి కార్యకర్తా ప్రతి గ్రామంలోనూ ఇద్దరు నేతల మోసాలను వివరించి, ప్రజలను చైతన్యపరచాలని బొత్స పిలుపునిచ్చారు. మేనిఫెస్టోను కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేసేంత వరకూ రాష్ట్రంలో 40 శాతం ఓట్ షేర్ కలిగిన బలమైన ప్రతిపక్షంగా ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటామని, పోరాడుతూనే ఉంటామని చెప్పారు. దీనిని అధికార పక్షం విస్మరిస్తే మెడలు వంచి మరీ గుర్తు చేసే బాధ్యత వైఎస్సార్ సీపీపై ఉందన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ప్రతి నాయకుడు, కార్యకర్త కూటమి మేనిఫెస్టో అమలు చేసేంత వరకూ ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేస్తూ పోరాడాలని బొత్స అన్నారు. విచ్చలవిడిగా గంజాయి, మద్యం పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయి, గ్రామాల్లో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు దర్శనమిస్తున్నాయని, మద్యం ఏరులై పారుతోందని అన్నారు. కొన్ని పత్రికల్లో మాత్రం ‘గంజాయి రహిత రాష్ట్రంగా మారింది‘ అంటూ రాయడం హాస్యాస్పదంగా ఉందని దుయ్యబట్టారు. గంజాయి వ్యాపారంలో ఆరితేరింది వాళ్ల నాయకులేనని, ఎకరానికి ఇంత అని కమీషన్లు తీసుకుని, గంజాయితో పాటు విచ్చలవిడిగా మద్యం సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. పేపర్లలో రాయించుకోవడంపై పెట్టిన దృష్టి గంజాయి నిర్మూలనపై పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సూచించారు. ఎన్నికల్లో కూటమి పార్టీలు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం అన్ని హామీలూ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు కలసి వచ్చి ప్రమాణం చేసి హామీలు అమలు చేస్తామన్నారు కాబట్టే ప్రజలు నమ్మి కూటమికి ఓట్లు వేశారన్నారు. చివరికి మోసపోయామంటూ అన్ని వర్గాల ప్రజలూ ప్రభుత్వంపై తిరగబడే రోజులు వచ్చేశాయని చెప్పారు. ఎన్నో ప్రలోభాలు, ఆశలు పెట్టి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వైఎస్సార్ సీపీ కేడర్ను లాక్కునే ప్రయత్నం చేసినా ఏ ఒక్కరూ కూటమి పార్టీల వైపు చూడలేదని, అధినేత వైఎస్ జగన్, వంగా గీతలపై ఉన్న నమ్మకమే దీనికి కారణమని అన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీనీ కూటమి ప్రభుత్వం నెరవేర్చేంత వరకూ పోరాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాజా అన్నారు. ఆదర్శంగా తీసుకోవాల్సింది వారిని.. వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ, వంగవీటి మోహనరంగా, ముద్రగడ పద్మనాభం, బొత్స సత్యనారాయణ, వంగా గీతా విశ్వనాథ్ వంటి కాపు నేతలు ప్రజల కోసం పని చేసిన వారని అన్నారు. యువత ఇలాంటి నేతలను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. ఒక సినీ హీరోను ఆదర్శంగా తీసుకుని, ఆయన వెనుక తిరుగుతున్న వారు ఒకసారి దీనిపై ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. పవన్ కల్యాణ్ తాను ముఖ్యమంత్రి కావడం కోసం పని చేస్తున్నారా.. లేక మామ కు వెన్నుపోటు పొడిచిన, రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పడానికి కారకులైన వ్యక్తిని సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా చూసేందుకు పని చేస్తున్నారా అనేది ఆయన వెనుక ఉన్న వారు ఆలోచించుకోవాలని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, వైఎస్సార్ సీపీ శ్రేణులే లక్ష్యంగా దాడులు చేస్తున్నారని చెప్పారు. ఇవన్నీ పవన్ కల్యాణ్కు కనిపిస్తున్నాయా అని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో గాజువాక ప్రజలు ఎడమ కాలితో, భీమవరం ప్రజలు కుడి కాలితో తంతే 2024 ఎన్నికల్లో పిఠాపురం వచ్చి పడిన పవన్ కల్యాణ్ను పిఠాపురం ప్రజలు పెద్ద మనసుతో శాసన సభకు పంపించారన్నారు. డిప్యూటీ సీఎంగా ఉన్న ఆయన రాష్ట్రానికి, జిల్లాకు లేదా పిఠాపురం ప్రాంతానికి గడచిన ఏడాది కాలంలో ఏం చేశారని చూస్తే గుండుసున్నా కనిపిస్తుందన్నారు. వేలాది మంది మహిళలు అదృశ్యమవుతున్నారంటూ ఎన్నికల ముందు వైఎస్సార్ సీపీపై, వలంటీర్ వ్యవస్థపై బురద జల్లిన పవన్.. అధికారం చేపట్టిన ఈ ఏడాది కాలంలో ఎంతమందిని వెనక్కి తీసుకొచ్చారో చెప్పగలరా అని రాజా ప్రశ్నించారు. వంగా గీతా విశ్వనాథ్ మాట్లాడుతూ, నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు పార్టీకి కట్టుబడి, ప్రలోభాలకూ లొంగకుండా బలమైన కేడర్గా ఉన్నారని కొనియాడారు. మాజీ మంత్రి తోట నరసింహం మాట్లాడుతూ, పిఠాపురంలో జనసేన విజయం తర్వాత వైఎస్సార్ సీపీ ఖాళీ అంటూ తప్పుడు ప్రచారం చేశారని, కానీ, వంగా గీత సారథ్యంలో పార్టీ చాలా బలంగా ఉందనడానికి ఈ సమావేశానికి పోటెత్తిన జనమే నిదర్శనమని అన్నారు. సమావేశంలో పార్టీ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు దాట్ల సూర్యనారాయణరాజు, ప్రత్తిపాడు, పెద్దాపురం నియోజకవర్గాల ఇన్చార్జిలు ముద్రగడ గిరిబాబు, దవులూరి దొరబాబు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట రాంజీ, మాజీ ఎంపీ గిరిజాల స్వామి నాయుడు, నేతలు కర్రి పాపారాయుడు, యనమల కృష్ణుడు, మాకినీడి శేషుకుమారి తదితరులు పాల్గొన్నారు. -
గరళకంఠునికి దశ సహస్ర ఘటాభిషేకం
పిఠాపురం: గొల్లప్రోలు మండలం దుర్గాడలో ప్రసిద్ధిగాంచిన ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో 49 సంవత్సరాలుగా సంప్రదాయంగా వస్తున్న సహస్ర ఘటాభిషేకం సోమవారం వైభవంగా జరిగింది. ఆలయ సేవా కమిటీ సభ్యులు, అర్చకులు చెరుకూరి వీరబాబు, దత్తు సోదరులు, పండిత బృందం ఆదిత్యశర్మ, షణ్ముఖశర్మ, కారుణ్యశర్మ, కార్తీక్శర్మ, దిలీప్శర్మ తదితరులు స్వామివారికి మహన్యాస పూర్వకంగా 11 రుద్రాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం గర్భాలయానికి చెక్కలు అడ్డం పెట్టి భక్తులు 10 వేల బిందెలతో తెచ్చిన జలాలతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. శివలింగంపై ఉన్న గంగాదేవి మూర్తి మునిగేంత వరకూ ఈ అభిషేకం చేశారు. దశ సహస్ర ఘటాభిషేకం వలన వర్షాలు సకాలంలో సమృద్ధిగా కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని భక్తులు నమ్ముతారు. గ్రామంలోని మహిళలతో పాటు ఇతర గ్రామాల నుంచి వచ్చిన భక్తులు కూడా గ్రామంలోని చెరువు నుంచి బిందెలతో నీళ్లు తెచ్చి స్వామి వారికి సమర్పించారు. ఉదయం 9 గంటల నుంచి మహిళా భక్తులు బారులు తీరి అభిషేకంలో పాల్గొన్నారు. అనంతరం అర్చకులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, విశేష అలంకరణ చేశారు. పలువురు భక్తులు స్వామి వారిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. -
బీడు భూములు బంగారమయ్యాయి
వైఎస్ సీఎం కాకముందు మా ప్రాంతంలోని పొలాలకు ఒక్క పంటకు కూడా పూర్తిగా నీరందక బీడు వారేవి. వైఎస్ సీఎం అయిన తరువాత జలయజ్ఞంలో భాగంగా ఏజెన్సీలో నిర్మించిన ముసురుమిల్లి ప్రాజెక్టు వలన మా ప్రాంతానికి సమృద్ధిగా నీరందుతోంది. ఈ నీటిపై ఆధారపడి నేను 23 ఎకరాలు సాగు చేస్తున్నాను. వైఎస్ చలవతో ప్రస్తుతం రెండు పంటలకు నీరందుతోంది. – కమ్మిల వీరబాబు, రైతు, గాదెలపాలెం, గోకవరం మండలం పంటలు పండుతున్నాయ్ గతంలో బోరు నీటితో పంట సాగు చేసుకునేవాళ్లం. దిగుబడి తక్కువగా ఉండేది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత పుష్కర ఎత్తిపోతల పథకం ప్రారంభించారు. అప్పటి నుంచీ పంటలు బాగా పండుతున్నాయి. ఎత్తిపోతల పథకం రాక ముందు బోర్లు ఉన్నప్పటికీ నీరు అంతంత మాత్రంగానే వచ్చేది. పుష్కర పథకం వచ్చిన తరువాత ఇప్పుడు బోర్ల నుంచి కూడా నీరు కూడా బాగా వస్తోంది. పంటలు పుష్కలంగా పండుతున్నాయి. – ఒబిన్ని రామదాసు, తాళ్లూరు, గండేపల్లి మండలం నాకు ఎనిమిదెకరాల పంట భూమి ఉంది తాండవ ప్రాజెక్టు నుంచి కోటనందూరు మండలానికి నీరు వదిలేవారు. మట్టి కాలువలు కావడంతో పొలాలకు నీరందాలంటే 10 నుంచి 15 రోజులు పట్టేది. రాజశేఖరరెడ్డి హయాంలో మట్టి కాలువలను రూ.55 కోట్లతో సీసీ కాలువలుగా అభివృద్ధి చేశారు. దీంతో పంటలకు నీరు త్వరగా, సమృద్ధిగా అందుతోంది. దిగుబడి బాగుంటోంది. రైతులందరూ వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన అభివృద్ధితో చల్లగా ఉన్నారు. – అంకంరెడ్డి శ్రీను, అల్లిపూడి, కోటనందూరు మండలం దార్శనికుడు మహానేత రాజన్న దార్శనికుడు. నేడు తుని పట్టణ ప్రజల దాహం తీరుతోందంటే అందుకు కారణం మహానేత వైఎస్ చలవే. నాడు ఆయన ముందుచూపుతో మంచినీటి ట్యాంకులు నిర్మించబట్టే ఈ రోజు మండు వేస విలోనూ దాహం కేకలు లేకుండా పోయాయి. తాండవ ఆధునీకరణ రాజశేఖరరెడ్డి హయాంలో మరో మణిహారంగా నిలిచిపోయింది. భవిష్యత్ తరాలు కూడా తాండవ ప్రగతిని గుర్తుంచుకోవడం ఖాయ మని చెప్పొచ్చు. అంతలా తాండవ ఆధునీకరణకు శ్రీకారం చుట్టారు. – దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు -
రైలు ఢీకొని వ్యక్తి మృతి
తుని: రైలు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక జీఆర్పీ ఎస్సై జీ శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జీ మాడుగుల మండలం, కుమ్మరికిమ్ముడుపల్లికి చెందిన బోనంగి నూకరాజు(50) తుని రైల్వే స్టేషన్లో రెండో నంబర్ ఫ్లాట్పారం నుంచి ఒకటో నంబరు ఫ్లాట్ఫారానికి వెళ్లడానికి పట్టాలు దాటుతుండగా విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్లే రైలు ఢీకొట్టింది. దీంతో నూకరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం శవాన్ని బంధువులకు అప్పగించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. చికిత్స పొందుతూ వివాహిత... కరప: ఇంట్లో వంట చేస్తుండగా విషసర్పం కాటువేయగా, కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ వివాహిత మృతి చెందింది. కరప మండలం గురజనాపల్లి గ్రామానికి చెందిన బోనంగి లోవతల్లి(31) ఈనెల 3వ తేదీన ఉదయం 11 గంటల సమయంలో ఇంట్లో వంట చేస్తుండగా ఒక విషసర్పం కాటువేసింది. వెంటనే ఆమెను చికిత్సకోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆమె చికిత్సపొందుతూ సోమవారం మృతిచెందింది. మృతురాలు లోవతల్లి భర్త ప్రసాద్కు మధ్య గొడవలు జరిగి ఏడాది కాలంగా గురజనాపల్లిలో తల్లితో పాటు ఉంటోంది. ఆమెకు 8 ఏళ్ల క్రితం వివాహం కాగా 2 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. ఆమె సోదరి రాచకొండ శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరప ఎస్ఐ టి.సునీత కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అరుణాచల క్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ
● అట్టహాసంగా 63 మంది నాయనార్ల విగ్రహ ప్రతిష్ఠ ● హాజరైన ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు, రాజకీయ నేతలు ప్రత్తిపాడు రూరల్: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం రాచపల్లిలో ఆంధ్రా అరుణాచలంగా ప్రసిద్ధి చెందిన అపిత కుచాంబ సమేత అరుణాచలేశ్వరస్వామి వారి దేవస్థానంలో సోమవారం ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. అరుణాచల మాధవి ఆధ్వర్యంలో నిర్వహించిన 63 మంది నాయనార్ల ప్రతిష్ఠ మహోత్సవాన్ని తిరువణ్ణామలై అరుళ్లిగు అరుణాచలేశ్వరస్వామి వారి దేవస్థానం అర్చకులు డాక్టర్ టి.అరుణాచల కార్తికేయ శివాచార్య వైభవంగా నిర్వహించారు. వీటితోపాటు దక్షిణామూర్తి విగ్రహాన్ని జెట్టి శివకుమార్ దంపతులు, లక్ష్మీ హయగ్రీవుడు విగ్రహాన్ని శ్రీహరి రాజబాబు దంపతులు, సూర్యభగవానుడు విగ్రహాన్ని దంతులూరి సుభద్రరామరాజు దంపతులు, కాలబైరవుడు విగ్రహాన్ని గిరిధరరెడ్డి దంపతులు, గంగామాత విగ్రహాన్ని బలభద్రుడి సత్యనారాయణ దంపతుల ఆర్థిక సహాయంతో ప్రతిష్ఠించారు. అనంతరం కుంభాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. శుక్రవారం నుంచి సోమవారం వరకు నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా విగ్రహా ప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శివనామ స్మరణతో ఆలయ ప్రాంగాణం మార్మోగింది. రాచపల్లి వెళ్లే ప్రధాన రహదారి భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తి మార్గమే శరణ్యం భక్తిమార్గమే అందరికీ శరణ్యమని తద్వారా ముక్తికి మార్గం లభిస్తుందని ధర్మపురి ఉత్తర పీఠాధిపతి సుక్కా స్వామిజీ అన్నారు. అరుణాచలక్షేత్రంలో 63 మంది నాయనార్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సాన్ని పురస్కరించుకుని ఆధ్యాత్మిక వేత్త అరుణాచల మాధవి అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. తమిళనాడులో 5–10 శతాబ్దాల మధ్య కాలంలో నివసించిన గొప్ప శివ భక్తులే ఈ నాయనార్లని చెప్పారు. వీరు భక్తి మార్గం ద్వారా మోక్షసిద్ధి పొందినట్లు తెలిపారు. నాయనార్లలో రాజుల నుంచి మానవుల వరకు ఉన్నారని తెలిపారు. భగవంతుడిని చేరడానికి నిష్కలమషమైన భక్తి తప్ప ఇంకేదీ అవసరం లేదన్నారు. సభలో సమన్వయ సరస్వతి, వాగ్దేవి వరపుత్ర బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ, కృష్ణాజిల్లా, పెదపులిపాక విజయ రాజేశ్వరి దేవస్థానం పీఠాధిపతి వాసుదేవానందగిరి స్వామీజీ, శ్రీరమణాసేవాశ్రమం వ్యవస్థాపకులు స్వామి రామానందతో పాటు పలువు రు ఆథ్యాత్మిక వేత్తలు ప్రసంగించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పోకల వంశీ నాగేంద్రమాధవ్, జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, మాజీ అధ్యక్షుడు చిలుకూరి రాంకుమార్, ఎమ్మెల్యేలు వరుపుల సత్యప్రభ, జ్యోతుల నెహ్రు, నిమ్మకాయల చినరాజప్ప, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో అన్నదానం నిర్వహించారు. ప్రత్తిపాడు ఎస్సై లక్ష్మి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. -
బంధాన్ని కాదని.. అనుబంధాన్ని తెంచుకుని..
● రైలు ప్రమాదంలో గాయపడ్డ వృద్ధుడు ● తండ్రిని వద్దంటున్న కుమారుడు.. తనకు భర్త లేడంటున్న భార్య తణుకు అర్బన్: వివాహ బంధాన్ని భార్య వద్దంటోంది. కన్నతండ్రితో అనుబంధాన్ని కుమారుడు తెంచుకుంటున్నాడు. ఏడేళ్ల క్రితం తెగిపోయిన రక్తసంబంధం నేడు ఎదురైనా తమకు వద్దంటే వద్దని ఆ కుటుంబం తెగేసి చెబుతోంది. దీంతో ప్రమాదవశాత్తూ గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధుడు అల్లాడుతున్నాడు. వివరాలిలా ఉన్నాయి.. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంకు చెందిన కలగర సుబ్బారావు ఏడేళ్ల కిత్రం ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. ఆదివారం కాల్దారి స్టేషన్లో రైలు నుంచి జారిపడగా రైల్వే పోలీసులు తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. వృద్ధుడిని ఆరా తీయగా కుటుంబ సభ్యుల వివరాలు తెలిపారు. రైల్వే కానిస్టేబుల్ బాల విషయాన్ని వృద్ధుడి కుమారుడు సుధీన్రాజుకు ఫోన్ ద్వారా తెలియజేయగా తనకు నాన్న అవసరం లేదని తెగేసి చెప్పాడు. అయినా కానిస్టేబుల్ బాల ప్రకాశరావుపాలెంలోని ఇంటికి వెళ్లి వృద్ధుడి భార్యతో విషయం చెప్పగా తన భర్త ఎప్పుడో చనిపోయాడని, అతడి మరణ ధ్రువీకరణ పత్రం తీసుకుని వితంతు పింఛను కూడా పొందుతున్నట్టు సమాధానం ఇవ్వడంతో రైల్వే పోలీసులు ఆశ్చర్యపోయారు. కేసు నమోదు చేసినా ఇబ్బంది లేదు సుధీన్రాజును ఎట్టకేలకు రైల్వే పోలీసులు తణుకు ఆస్పత్రికి తీసుకురాగా సోమవారం ఆర్ఎంఓ డాక్టర్ ఏవీఆర్ఎస్ తాతారావు కౌన్సెలింగ్ ఇచ్చారు. తమకు సుబ్బారావు అవసరం లేదని, అవసరమైతే అలా రాసిస్తామని సుధీన్రాజు సమాధానమిచ్చాడు. దీంతో సీఐ ఎన్.కొండయ్య ఆస్పత్రి వద్దకు వచ్చి కన్న తండ్రిపై నిర్లక్ష్యం వహిస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించగా.. కేసు నమోదు చేసుకోమని సుధీన్రాజు తెగేసి చెప్పాడు. దీంతో చేసేదిలేక ఆస్పత్రి వైద్యులు సుబ్బారావుకు చికిత్స అందిస్తున్నారు. -
ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపులో అవకతవకలు
● స్పోర్ట్సు అథారిటీ వైస్ చైర్మన్కు ఫిర్యాదు ● ఫెన్సింగ్ క్రీడాకారుడు గౌతమ్రాజ్ సామర్లకోట: సాఫ్ట్బాల్, ఫెన్సింగ్ స్పోర్ట్సు కోటా ద్వారా ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపులో అవకతవకలు జరుగుతున్నాయని స్థానిక ప్రముఖ ఫెన్సింగ్ క్రీడాకారుడు ఎం గౌతమ్రాజ్ ఆరోపించారు. ఈ మేరకు సోమవారం విజయవాడలో స్పోర్ట్సు అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైస్చైర్మన్కు వినతి పత్రం అందజేశానన్నారు. సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ నీట్ పరీక్ష రాసే అభ్యర్థి పేరుపై మరోకరు టోర్నమెంట్లో పాల్గొంటున్నారన్నారు. దాంతో స్పోర్ట్సులో కనీస పరిజ్ఞానం లేనివారు స్పోర్ట్సు కోటాలో ఎంబీబీఎస్ సీట్లు సంపాదిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడల్లో ప్రాతినిధ్యం వహించని వారికి నకిలీ ధ్రువపత్రాలను జారీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. సాఫ్ట్బాల్ ఆటకే పరిమితం కాకుండా ఫెన్సింగ్ ఆటలోనూ ఇదే విధంగా జరుగుతోందన్నారు. ఫెన్సింగ్ ఆటను ముసుగు ధరించి ఆడటం వలన ఎవరు ఆడుతున్నారో తెలియడం లేదన్నారు. దీనిని ఆసరాగా తీసుకొని దందా జరుగుతోందని చెప్పారు. విద్యార్ధులను క్రీడలలో ప్రాత్సహించవలసిన ఫెన్సింగ్ అసోసియేషన్ క్రీడాస్ఫూర్తిని అణగదొక్కుతోందన్నారు. దొడ్డిదారిలో ఎంబీబీఎస్ సీట్లు సాధిస్తున్న వారిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని గౌతమ్రాజ్ కోరారు. -
ఈ దొంగకు హీరో మోటారు సైకిళ్లు ఇష్టం!
తుని: విలాసాలకు అలవాటు పడిన పాత నేరస్తుడు ఒకే కంపెనీ మోటారు సైకిళ్లను దొంగలించడం అలవాటుగా చేసుకుని చివరికి పోలీసుల చేతికి చిక్కాడు. 16 హీరో మోటారు సైకిళ్లను వేర్వేరు ప్రాంతాల్లో చోరీ చేశాడు. జిల్లా ఎస్పీ బింధుమాదవ్ ఆదేశాల మేరకు పెద్దాపురం డీఎస్పీ పర్యవేక్షణలో తుని పోలీసులు పెట్టిన నిఘాకు దొంగ చిక్కాడు. తుని పట్టణ పోలీస్స్టేషన్లో సీఐ గీతా రామకృష్ణ కేసుకు సంబంధించిన వివరాలను తెలియపరిచారు. అల్లూరి మన్యం జిల్లా రాజవొమ్మంగి మండలం జె.వనకరాయి గ్రామానికి చెందిన గూడవల్లి అప్పారావు ప్రసాద్ తుని అర్ అండ్ బీ గెస్ట్ హౌస్ సెంటర్లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పట్టుకున్నారు. పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి విచారించగా పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. నిందితుడుపై గతంలో కేసులు ఉన్నాయి. తుని టౌన్, అన్నవరం, సామర్లకోట, పెద్దాపురం, రాజమండ్రి ప్రకాష్నగర్ పోలీస్స్టేషన్ల పరిధిలో 16 మోటారు సైకిళ్లను చోరీ చేశారు. వీటి విలువ రూ.6 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఒకే కంపెనీకి చెందిన మోటారు సైకిళ్లను చోరీ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించగా రిమాండ్ విధించారు. కేసును ఛేదించిన తుని పట్టణ ఎస్సై జె.విజయ్బాబు, కానిస్టేబుల్స్ నాయుడు, కిరణ్, పెద్దాపురం ఇన్స్పెక్టర్ ఆర్.అంకబాబు, ఏఎస్సై శ్రీహరి, హెచ్సీ నారాయణమూర్తి, రాధాకృష్ణలను జిల్లా ఎస్పీ బిందుమాదవ్ అభినందించారు. నిందితుడి అరెస్ట్, 16 బైక్ల రికవరీ వీటి విలువ రూ.6 లక్షలు -
డ్రైవింగ్కు లైసెన్స్ ముఖ్యం
● చదువు కోసం పోతూ చావు కొని తెచ్చుకోవద్దు ● కళాశాలకు బైక్పై ప్రయాణం ప్రమాదకరం ● ఆకతాయి పనులతో అనర్థం ● సురక్షిత ప్రయాణంతో మంచి భవిష్యత్తు కపిలేశ్వరపురం: నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై సుమారు నెలకావొస్తోంది. ఫలితాల వెల్లడి, టీసీ, స్టడీ సర్టిఫికెట్లు తీసుకోవడం, పై చదువులకు కళాశాలను ఎంచుకోవడం, అడ్మిషన్ తీసుకోవడం తదితర ప్రక్రియలతో జూన్ నెల బిజీ బిజీగా సాగింది. ఇక నుంచి పాఠ్యాంశాల బోధన, అంతర్గత స్థాయి పరీక్షల నిర్వహణ తదితర వాటితో విద్యార్థులు చదువుల్లో తలమునకలు అవుతారు. కళాశాలకు వెళ్లడం ఎంత అవసరమో ఆ ప్రయాణం సురక్షితంగా సాగేలా జాగ్రత్తలు తీసుకోవడమూ అంతే అవసరం. సురక్షిత ప్రయాణం ఆవశ్యకతపై ఈ కథనం... పిల్లలకు వాహనాలిస్తే తండ్రిపై క్రిమినల్ కేసు సురక్షిత ప్రయాణానికి ట్రాఫిక్, వెహికల్ డ్రైవింగ్ రూల్స్ రూపొందించారు. సినిమాలో హీరో తరహాలో వాహనాన్ని నడపాలన్న తపన వెనుక ప్రాణహాని పొంచి ఉందని గ్రహించాలి. పదో తరగతి , ఇంటర్మీడియెట్ విద్యార్థులకు వారి వయసు రీత్యా వాహనాన్ని నడిపే అర్హత ఉండదు. 18 ఏళ్లు నిండినవారు లైసెన్స్ లేకుండా ప్రయాణాలు చేయడం సరికాదు. అలా చేస్తే రూ.5వేల నుంచి రూ.10వేల వరకూ జరిమానా విధిస్తారు. పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలి. అతిక్రమించి ఇచ్చినట్టయితే తండ్రిపై కేసు నమోదు చేస్తారు. నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలి. హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చు. వాహనాలను నడిపేటప్పుడు నిర్లక్ష్యాన్ని విడనాడాలి. టూ వీలర్పై ముగ్గురు ప్రయాణం చేయడమంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే. సెల్ఫోన్లో మాట్లాడుతూ వాహనాన్ని నడపడం నేరం. గతంలో ప్రమాదాలకు గురైన విద్యార్థులిలా... ● 2024 ఫిబ్రవరి 15న మండపేట మెహర్బాబా ఆశ్రమం సమీపంలో లారీ ఢీకొని పట్టణంలోని ప్రైవేటు కళాశాలలోని సెకండ్ ఇంటర్ విద్యార్థి పడాల మధుసాయి మణికంఠ అక్కడికక్కడే మృతి చెందాడు. ● 2023 ఫిబ్రవరి 26న అయినవిల్లి మండలం నేదునూరు పెదపాలెం శివారు టి.సావరం వద్ద ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో అమలాపురంలోని కళాశాలకు ప్రాక్టికల్ పరీక్షకు హాజరయ్యేందుకు బైక్పై వెళ్తున్న నందెపు రాజేష్ (17), అల్లపల్లి నాగేంద్ర (17) మృతిచెందారు. ● 2023 జూన్ 3న అమలాపురం మండలం నడిపూడికి చెందిన పదో తరగతి విద్యార్థి పెనుమల ప్రశాంతి (06) నడిపూడిలో మట్టి ట్రాక్టర్ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందింది. ● 2023 మే 19న అమలాపురం మహిపాల వీధికి చెందిన ఆరో తరగతి విద్యార్థిని గంగా లక్ష్మీ జాహ్నవి (11) గాంధీనగర్ వద్ద మట్టి ట్రాక్టర్ ఢీకొని అదే రోజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ● 2023 డిసెంబర్ 3న మండపేట పట్టణంలోని మారేడుబాక వంతెన వద్ద కారు ఢీకొని మారేడుబాక గ్రామానికి చెందిన ఆరో తరగతి విద్యార్థి మాడెం ప్రవీణ్ (11) మృతిచెందాడు. ఆకతాయి పనులు సైతం అనర్థాలను తెస్తాయి విద్యార్థులు నదిలో స్నానాలకు దిగడం, జనావాసాల్లో రాళ్లు, కర్రలు విసరడం, వాహనాలను వంకరటింకరగా నడపడం వంటి ఆకతాయి పనులకు పాల్పడటం అనర్థం తెచ్చే ప్రమాదం ఉంది. 2023 మే 21న ఆలమూరు మండలం జొన్నాడ వద్ద గోదావరి నదిలో స్నానానికి దిగిన అయినవల్లి మండలం పెద్దిపాలెంనకు చెందిన ఇంటర్ విద్యార్థి మోటూరి త్రిలోక్(17), కొత్తపేట సాయిబాబా మందిర సమీప నివాసితుడైన నర్సరీ కూలి గెడ్డం కరుణకుమార్ (22) మృతిచెందారు. వారి స్నేహితుడు కోరుమిల్లికి చెందిన అయినవిల్లి భవానీశంకర్ పుట్టినరోజును జరుపుకున్న తర్వాత వారు నదిలో స్నానానికి వెళ్లారు. నిబంధనల పర్యవేక్షణకు సహకరించాలి రహదారులపై వెహికల్ డ్రైవింగ్ రూల్స్ పాటించడంపై అధికారులు తనిఖీలు చేస్తుంటారు. వారికి విద్యార్థులు విధిగా సహకరించాలి. లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడపాలన్న ఆలోచన విడనాడాలి. వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో పోలీసుల కళ్లు గప్పి ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లిపోవాలన్న ఆలోచన సరికాదు. విద్యార్థులను ఆటోలో తరలించేవారు 10 కిలోమీటర్ల లోపు ఉన్న విద్యాసంస్థలకు మాత్రమే తీసుకెళ్ళాలి. ఆటో నడిపే కార్మికుని పక్కన ప్రయాణికులు కూర్చోకూడదు. ఆటోకు రెండు వైపులా రక్షణ కవచం ఉండాలి. డ్రైవర్కు లైసెన్స్, వాహనానికి పర్మిట్ తప్పనిసరి. -
రత్నగిరిపై కొనసాగుతున్న భక్తుల అసంతృప్తి
అన్నవరం: సత్యదేవుని సన్నిధికి వస్తున్న భక్తుల్లో ఇంకా అసంతృప్తి కొనసాగుతున్నట్లు గత నెలలో ప్రభుత్వ సర్వేలో వెల్లడైంది. అయితే, మే నెలలో దాదాపు 35 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేయగా ఈసారి అది 25 శాతానికి పరిమితమైంది. మే 26 నుంచి జూన్ 25వ తేదీ వరకూ రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవస్థానాల్లో భక్తులకు అందుతున్న సేవలపై ప్రభుత్వం సర్వే నిర్వహించింది. అన్నవరం దేవస్థానానికి వచ్చేసరికి సత్యదేవుని దర్శనం విషయంలో మే నెలలో 68 శాతం మంది మాత్రమే సంతృప్తి వ్యక్తం చేయగా జూన్ నెలలో అది 73 శాతానికి పెరిగింది. మౌలిక వసతుల కల్పనలో మే నెలలో 61 శాతం మంది, జూన్లో 66 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. స్వామివారి గోధుమ నూక ప్రసాదం నాణ్యతపై మే నెలలో 78 శాతం మంది సంతృప్తి చెందగా జూన్లో అది 77 శాతంగా నమోదైంది. పారిశుధ్య నిర్వహణకు సంబంధించి మే నెలలో 64 శాతం, జూన్లో 70 శాతం మంది సంతృప్తి చెందారు. ప్రత్యేకాధికారి నిర్ణయాలు అమలు చేయాలి భక్తుల అసంతృప్తి తగ్గించడానికి దేవస్థానం ప్రత్యేకాధికారిగా దేవదాయ శాఖ రాజమహేంద్రవరం రీజినల్ జాయింట్ కమిషనర్ వి.త్రినాథరావును నియమించిన సంగతి తెలిసిందే. ఆయన గత నెల 24న అన్నవరం దేవస్థానానికి వచ్చి, ఈఓ వీర్ల సుబ్బారావుతో కలసి టాయిలెట్ల నిర్వహణను పరిశీలించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా వీటిని నిర్వహించాలని ఆదేశించారు. అలాగే, పాత మెయిన్ గెస్ట్ హౌస్ వెనుక శిథిలావస్థకు చేరిన టాయిలెట్లను కూల్చివేయాలని ఆదేశించారు. ఈ నిర్ణయాలు ఇంకా అమలు కాలేదు. మొత్తం మీద మే నెల కన్నా జూన్లో భక్తుల అసంతృప్తి శాతం 10 శాతం తగ్గిందని, ముందుముందు ఇంకా తగ్గేలా కృషి చేస్తామని దేవస్థానం అధికారులు చెబుతున్నారు. పీజీఆర్ఎస్కు 627 అర్జీలు కాకినాడ సిటీ: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ప్రజలు వివిధ సమస్యలపై 627 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ట్రైనీ కలెక్టర్ మనీషా, డీఆర్ఓ జె.వెంకటరావు తదితరులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆయా శాఖల్లో నమోదైన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, నాణ్యమైన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. -
అంతర్ జిల్లాల ఈత పోటీలకు ఎంపిక
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): జిల్లా అమెచ్యూర్ ఆక్వాటిక్ సంఘం ఆధ్వర్యాన కాకినాడ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్ఏ) ప్రాంగణంలో అంతర్ జిల్లాల ఈత పోటీలకు ఆదివారం జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. దీనిని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (డీఎస్డీఓ) బి.శ్రీనివాస్ కుమార్, జాతీయ మారథాన్ స్విమ్మర్ గోలి శ్యామల ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. సబ్ జూనియర్స్, జూనియర్స్ కేటగిరీల్లో ఈ ఎంపికలు జరిగాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా 150 మంది ఈ ఎంపికల్లో పాల్గొన్నారు. వీరిలో ప్రతిభ చూపిన 30 మందిని అంతర్ జిల్లాల ఈత పోటీలకు ఎంపిక చేశారు. వీరు ఈ నెల 19, 20 తేదీల్లో విశాఖలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. కార్యక్రమంలో స్విమ్మింగ్ సంఘం కార్యదర్శి ఐ.రాజు, గౌరవ సలహాదారు శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎంపికల్లో డీఎస్ఏ స్విమ్మింగ్ కోచ్ అప్పలనాయుడు, ఎం.అజయ్కుమార్, వీరభద్రయ్య, ఎస్.రాజేష్, జి.మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
కడలిలోకి 2.18 లక్షల క్యూసెక్కులు
ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి నీటి ఉధృతి ఆదివారం స్వల్పంగా పెరిగింది. బ్యారేజీ నుంచి 2,18,257 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. బ్యారేజీలోని మొత్తం 175 గేట్లకు గాను 172 గేట్లను పైకి లేపి మిగులు జలాలు విడిచిపెడుతున్నారు. ఖరీఫ్ సాగుకు సంబంధించి డెల్టా కాలువలకు 12,450 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఇందులో తూర్పు డెల్టాకు 4,200, మధ్య డెల్టాకు 2,450, పశ్చిమ డెల్టాకు 5,800 క్యూసెక్కుల చొప్పున విడుదల చేశారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.10 అడుగులుగా నమోదైంది. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో నీటి ఉధృతి పెరిగిందని, సోమవారం నాటికి తగ్గుముఖం పడుతుందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. 12 వరకూ రేబిస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ రాజమహేంద్రవరం రూరల్: ప్రపంచ జునోసిస్ డే సందర్భంగా రేబీస్ వ్యాధి నివారణకు ఈ నెల 12వ తేదీ వరకూ నిర్వహించే ముందస్తు వ్యాక్సినేషన్ డ్రైవ్ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ కె.వెంకటేశ్వరరావు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జంతువుల నుంచి, ప్రధానంగా కుక్కల నుంచి వ్యాపించే ప్రాణాంతక వ్యాధి రేబిస్ అని అన్నారు. ఇది నరాల వ్యవస్థను దెబ్బ తీసి మరణానికి దారి తీయవచ్చన్నారు. దీనిని యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ద్వారా పూర్తిగా నివారించవచ్చన్నారు. అందుకే, జంతువులతో క్రమం తప్పకుండా మసలే వ్యక్తు లు, పశు వైద్యులు, పారిశుధ్య కార్మికులు ముందస్తుగా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ఈ డ్రైవ్లో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, సీహెచ్సీ, పీహెచ్సీ, యూపీహెచ్సీలలో ఈ నెల 12వ తేదీ వరకూ యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎపిడెమాలజిస్ట్ డాక్టర్ సుధీర్బాబు పాల్గొన్నారు. -
లోవకు పోటెత్తిన భక్తులు
● భక్త జనసంద్రమైన దేవస్థానం ● తలుపులమ్మ తల్లిని దర్శించిన 33 వేల మంది ● తొలి ఏకాదశి సందర్భంగా అమ్మవారికి లక్ష తులసి పూజతుని: ఆషాఢ మాసం ఆదివారం, తొలి ఏకాదశి పర్వ దినం కావడంతో లోవ దేవస్థానానికి వేలాదిగా భక్తు లు పోటెత్తారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ 33 వేల మంది తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకున్నట్టు ఆలయ ఈఓ విశ్వనాథరాజు తెలిపారు. తొలి ఏకాదశి సందర్భంగా అమ్మవారి మూలవిరాట్కు పండితులు లక్ష తులసి పూజ నిర్వహించారు. పంచలోహ విగ్రహం వద్ద నిర్వహించిన ఈ పూజను భక్తులు తిలకించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ప్రసాదాల విక్రయం ద్వారా రూ.3,12,930, పూజా టికెట్లకు రూ.3,07,630, కేశఖండన టికెట్లకు రూ.22,440, వాహన పూజ టికెట్లకు రూ.6,560, కాటేజీలకు రూ.86,722, విరాళాలు రూ.1,19,911 కలిపి దేవస్థానానికి మొత్తం రూ.8,50,543 ఆదాయం వచ్చిందని ఈఓ విశ్వనాథరాజు వివరించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు పర్యవేక్షణలో తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు, ఎస్సై కృష్ణమాచారి డ్రోన్తో ఏర్పాట్లను పరిశీలించారు. ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు తీసుకున్నారు. ఈ నెల 13న తలుపులమ్మ అమ్మవారికి 3 టన్నుల కూరగాయలతో శాకంబరి అలంకరణ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. -
కలల తీరం చేరాలిలా..
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఎంచుకున్న లక్ష్యం గొప్పదే కావచ్చు.. కానీ, ఆ లక్ష్యాన్ని చేరుకునే దారిపై కూడా అవగాహన ఉండాలి. ఆ ప్రయాణంలో సానుకూల అంశాలు.. అవరోధాల వంటి వాటిని ముందే తెలుసుకుంటే.. అడుగు ముందుకు ఎలా వేయాలో అర్థమవుతుంది. ఇంటర్మీడియెట్ పూర్తి చేసి.. ఏపీ ఈఏపీ సెట్లో మంచి ర్యాంకులు సాధించి.. ఇంజినీరింగ్ చదివి బంగారు భవిష్యత్తును అందుకోవాలనుకునే విద్యార్థులకు.. ఆ మార్గంలో తొలి అడుగు వేసే తరుణం వచ్చేసింది. ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కౌన్సెలింగ్ షెడ్యూల్ను రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ విడుదల చేసింది. గత ఏడాది ఇంజినీరింగ్ కోర్సులకు అడ్మిషన్ షెడ్యూల్ను జూలై 1న ప్రారంభించగా ఈ ఏడాది వారం రోజులు ఆలస్యంగా విడుదల చేశారు. కౌన్సెలింగ్ సోమవారం ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ నెల 23 నుంచి కళాశాలల్లో చేరాలి. దీంతో, ఇంజినీరింగ్ కళాశాలల్లో అడ్మిషన్లకు హడావుడి మొదలైంది. ఇప్పటికే ఏ కోర్సు చదవాలి, ఏ కళాశాలలో చేరాలి తదితర అంశాలను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు క్షుణ్ణంగా పరిశీలించుకున్నారు. కౌన్సెలింగ్లో తాము ఎంచుకున్న కళాశాలకు ఆప్షన్ ఇవ్వడంపై దాదాపు తుది నిర్ణయానికి వచ్చారు. వెబ్ ఆప్షన్ల సమయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని విద్యానిపుణులు సూచిస్తున్నారు. అందుబాటులోకి కొత్త కోర్సులు ఇంజినీరింగ్లో ఈసీఈ, మెకానికల్, ఈఈఈ, సీఎస్ఈ, సివిల్ వంటి సంప్రదాయ కోర్సులతో పాటు కొత్తవి కూడా అందుబాటులోకి వచ్చాయి. సీఎస్ఈలో ఏఐ, మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, వీఎల్ఎస్ఐ డిజైన్, అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఏరోస్పేస్, అగ్రికల్చరల్, మైరెన్, మైనింగ్, స్కిల్ అండ్ టెక్స్టైల్ వంటి కొత్త బ్రాంచ్లు వచ్చాయి. ఆన్లైన్ కౌన్సెలింగ్ ఇలా.. ఆన్లైన్ కౌన్సెలింగ్కు హాజరయ్యే విద్యార్థులు cets.apsche.ap.gov.in&25 వెబ్సైట్లో అడ్మిషన్పై క్లిక్ చేయాలి. అనంతరం హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీతో రిజిస్ట్రేషన్ ఫామ్లోకి ప్రవేశించాలి. అక్కడ అడిగిన సమాచారం పూర్తిగా నింపి. సబ్మిట్ కొట్టాలి. పదో తరగతి, ఇంటర్మీడియెట్ మార్కుల జాబితాలు, 6 నుంచి ఇంటర్ వరకూ స్టడీ, టీసీతో పాటు కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు, ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, రేషన్ కార్డులను అప్లోడ్ చేయాలి. ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణ పత్రం ఉన్న వారికి గత ప్రభుత్వం 2022 నుంచి 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తోంది. అర్హత ఉన్న ప్రతి విద్యార్థీ దీనిని వినియోగించుకోవాలి. నేటి నుంచి ఈఏపీ సెట్ వెబ్ కౌన్సెలింగ్ కాకినాడలో 2 హెల్ప్లైన్ కేంద్రాలు జాగ్రత్తలు తీసుకోవాలంటున్న విద్యావేత్తలుఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో.. మొత్తం ఇంజినీరింగ్ కళాశాలలు 34 ప్రభుత్వ 2వీటిల్లో సీట్లు 750 ప్రైవేటు 32 వీటిల్లో సీట్లు 16,500 మొత్తం సీట్లు 17,250ఏపీ ఈఏపీ సెట్లో అర్హత సాధించిన విద్యార్థులు కాకినాడ 6,343 కోనసీమ 2,868 తూర్పు గోదావరి 6,011 మొత్తం 15,222 ఆన్లైన్ కౌన్సెలింగ్ షెడ్యూల్ సోమవారం నుంచి 16వ తేదీ వరకూ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు. సోమవారం నుంచి 17వ తేదీ వరకూ ఆన్లైన్ సర్టిఫికెట్ల పరిశీలన. ఈ నెల 13 నుంచి 18 వరకూ వెబ్ ఆప్షన్ల నమోదు. 19న వెబ్ ఆప్షన్ల మార్పునకు అవకాశం. ఈ నెల 22న సీట్ల కేటాయింపు. ఈ నెల 23 నుంచి 26వ తేదీ వరకూ కళాశాలలో అడ్మిషన్లు. ఆగస్టు 4 నుంచి తరగతులు ప్రారంభం. హెల్ప్లైన్ కేంద్రాలు : జేఎన్టీయూ–కాకినాడ ఇంజిజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ బ్లాక్, ఆంధ్రా పాలిటెక్నిక్ కళాశాల (జగన్నాథపురం)స్వయంగా చూసుకోవడం మేలు వెబ్ కౌన్సెలింగ్ సందర్భంగా రిజిస్టేషన్ దగ్గర నుంచి ఆన్లైన్ ఫీజు చెల్లింపు, కళాశాల, కోర్సు ఎంపిక వంటివి ఎంపిక చేసుకునే సమయంలో ఎవరికి వారే స్వయంగా దగ్గరుండి చూసుకోవాలి. ఎవరైనా స్నేహితుల ద్వారానో మరొకరితోనే ఆన్లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియ చేయిస్తే అనేక తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రైవేటు కళాశాలల సిబ్బంది విద్యార్థి అభీష్టం మేరకు కళాశాల ఆప్షన్, కోర్సు వారే ఎంపిక చేస్తున్నారు. అయినప్పటికీ విద్యార్థి అన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలి. మొదటి కౌన్సెలింగ్ దశ చాలా కీలకం. కాబట్టి విద్యార్థులు తమ ర్యాంకును బట్టి మంచి కళాశాలను ఎంపిక చేసుకుని అడ్మిషన్ పొందాలి. వెబ్ కౌన్సెలింగ్ విద్యార్థి స్వీయ పర్యవేక్షణలో జరుగుతుంది కాబట్టి అతనే పూర్తి బాధ్యుడు అవుతాడు. – ఎన్.రామకృష్ణయ్య, సీఎస్ఈ ప్రొఫెసర్, జేఎన్టీయూకే ఇంజినీరింగ్ కళాశాల ఆసక్తి ఉన్న బ్రాంచ్నే ఎంచుకోవాలి విద్యార్థులు కళాశాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ఆసక్తి ఉన్న బ్రాంచ్నే ఎంచుకుని, అందులో ప్రతిభ చూపాలి. ముఖ్యంగా ఒకే కోర్సుకు డిమాండ్ అనే భావన నుంచి బయట పడి, ఏ కోర్సుకు పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయి.. భవిష్యత్తులో వాటికి ఉన్న డిమాండ్ తదితర అంశాలపై విద్యావేత్తల అభిప్రాయాలు తెలుసుకుకోవాలి. అందుకు తగిన బ్రాంచ్ ఎంచుకోవాలి. ఒకే కోర్సులో అందరూ చేరడం ఏమాత్రం సరి కాదు. ఇటీవల సాఫ్ట్వేర్కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. తద్వారా సీఎస్ఈ కోర్సు ఒక్కటే ప్రాధాన్యమున్నది కాదనేది గుర్తించాలి. అభివృద్ధి అనేది కేవలం ఒక్క రంగంతోనే సాధ్యపడదు. ఆన్లైన్ కౌన్సెలింగ్కు కావలసిన అన్ని పత్రాలూ సరి చూసుకోవాలి. – డాక్టర్ ఎ.గోపాలకృష్ణ, మెకానికల్ ప్రొఫెసర్, జేఎన్టీయూకే ఇంజినీరింగ్ కళాశాల -
మరిడమ్మ సన్నిధి.. భక్తుల పెన్నిధి
పెద్దాపురం: ఆషాఢ మాస మహోత్సవాల్లో భాగంగా పెద్దాపురం మరిడమ్మ అమ్మవారిని ఆదివారం వేలాదిగా భక్తులు దర్శించుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారి దర్శనానికి భారీగా బారులు తీరారు. సుమారు 50 వేల మంది అమ్మవారిని దర్శించుకున్నారని అధికారులు అంచనా వేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యమూ కలగకుండా ఆలయ ట్రస్టీ చింతపల్లి శ్రీహర్ష, అసిస్టెంట్ కమిషనర్ విజయలక్ష్మి ఆధ్వర్యాన ఏర్పాట్లు చేశారు. డీఎస్పీ శ్రీహరిరాజు ఆదేశాల మేరకు సీఐ విజయ్ శంకర్ పర్యవేక్షణలో ఎస్సై మౌనిక, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పెద్దాపురం బ్రాహ్మణ సేవా సంఘం, సామర్లకోట లయన్స్ క్లబ్ ఆధ్వర్యాన భక్తులకు పులిహోర ప్రసాదం పంపిణీ చేశారు.ముగిసిన హాకీ ప్రత్యేక శిక్షణ శిబిరంనాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): జిల్లా కలెక్టర్ అనుమతితో కాకినాడ డీఎస్ఏ హాకీ మైదానంలో గత పది రోజులుగా జరుగుతున్న ఇన్కమ్ట్యాక్స్ డిపార్డ్మెంట్ ప్రత్యేక హాకీ శిక్షణ శిబిరం ఆదివారం ముగిసింది. త్వరలో జరగనున్న మురుగప్ప గోల్డ్ టోర్నమెంట్లో పాల్గొనే ఇన్కమ్ట్యాక్స్ డిపార్ట్మెంట్ జట్టుకు శిక్షణ ఇచ్చేందుకు ఆలిండియా చీఫ్ కోచ్ రవిచంద్ర, సీనియర్ కోచ్ అజయ్శర్మ ఆధ్వర్యాన ఈ శిబిరం నిర్వహించారు. శిక్షణ ముగింపు సందర్భంగా హాకీ సంఘ ప్రతినిధి వి.రవిరాజు ముఖ్య శిక్షకులను సత్కరించారు. మే నెలలో నిర్వహించిన హాకీ వేసవి శిక్షణ శిబిరంలో శిక్షణ అందించిన కోచ్లు సూరిబాబు, అజయ్కుమార్, గంగాధర్, డీఎస్ఏ హాకీ కోచ్ నాగేంద్ర కుమార్లకు రవిచంద్ర క్రీడా దుస్తులు, బూట్లు ఇచ్చి సత్కరించారు. ఆలిండియా టీములో కాకినాడకు చెందిన కిరణ్తేజకు స్థానం దక్కడం జిల్లాకు గర్వకారణమని రవిరాజు తెలిపారు.జేఎన్టీయూకే ఇన్చార్జి రిజిస్ట్రార్గా శ్రీనివాసరావుబాలాజీచెరువు (కాకినాడ సిటీ): జేఎన్టీయూకే ఇన్చార్జి రిజిస్ట్రార్గా ప్రొఫెసర్ ఆర్.శ్రీనివాసరావు, రెక్టార్గా ప్రొఫెసర్ వీవీ సుబ్బారావు నియమితులయ్యారు. ఈ మేరకు వైస్ చాన్సలర్ సీఎస్ఆర్కే ప్రసాద్ ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పటి వరకూ రిజిస్ట్రార్గా పని చేసిన రవీంద్రనాథ్ను, రెక్టార్ కేవీ రమణను రిలీవ్ చేయాలని సూచించారు. ఆర్.శ్రీనివాసరావు గతంలో కొద్ది నెలల పాటు జేఎన్టీయూకే ఇన్చార్జి రిజిస్ట్రార్తో పాటు కృష్ణా యూనివర్సిటీకి ఇన్చార్జి వీసీగా 7 నెలల పాటు పని చేశారు. శ్రీనివాసరావు, సుబ్బారావులను పలువురు టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది అభినందించారు.ఇంద్ర బస్సు ప్రయాణంలో రాయితీరాజమహేంద్రవరం సిటీ: ఆషాఢ మాసం సందర్భంగా రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు సూపర్ లగ్జరీ ధరకే ఇంద్ర ఏసీ బస్సులో ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ కె.మాధవ్ ఆదివారం తెలిపారు. ఇంద్ర ఏసీ బస్సు చార్జీలో 15 శాతం రాయితీ కల్పించామన్నారు. ప్రస్తుతం హైదరాబాద్కు ఇంద్ర ఏసీ బస్సు టికెట్టు రూ.1,060 ఉండగా రాయితీపై రూ.920కే అందిస్తున్నామని తెలిపారు. -
ఈ వారంలోనే ‘ప్రసాద్’ టెండర్ల ఖరారు
● నెలాఖరు నుంచి పనులు ప్రారంభమయ్యేలా చర్యలు ● టూరిజం శాఖ ఈఈ ఈశ్వరయ్య రత్నగిరిపై పరిశీలనఅన్నవరం: కేంద్ర ప్రభుత్వ పిలిగ్రిమేజ్ రీజువినేషన్ అండ్ స్పిరిచ్యువల్ అగ్నంటేషన్ డ్రైవ్ (ప్రసాద్) స్కీము టెండర్లను ఈ వారంలో ఖరారు చేస్తామని పర్యాటక శాఖ ఈఈ ఈశ్వరయ్య తెలిపారు. దేవస్థానంలో ప్రసాద్ స్కీము నిర్మాణాలు చేపట్టే ప్రదేశాలను పర్యాటక శాఖ అధికారులతో కలసి ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ పథకం కింద రూ.18.98 కోట్లతో చేపట్టే వివిధ పనులకు గత మే నెలలో టెండర్లు పిలిచామని, తమ శాఖ ఉన్నతాధికారులు సెలవులో ఉన్నందువల్లనే వీటి ఖరారు వాయిదా పడింది తప్ప మరే ఇతర కారణమూ లేదని వివరించారు. ప్రసాద్ స్కీము పనులు ఈ నెలాఖరున ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రూ.11.09 కోట్లతో రెండంతస్తుల అన్నదాన భవనం నిర్మించే పాత టీటీడీ భవనం స్థలం, ప్రస్తుత అన్నదాన భవనం పక్కనే రూ.9 కోట్లతో నిర్మించనున్న క్యూ కాంప్లెక్స్ స్థలం, ప్రకాష్ సదన్ భవనం వెనుకన ప్రస్తుతం పార్కింగ్కు వాడుతున్న ప్రదేశంలో అటు సత్యగిరి, ఇటు రత్నగిరికి దగ్గరగా రూ.61.78 లక్షలతో నిర్మించనున్న టాయిలెట్స్ బ్లాక్ల స్థలం, రూ.1.08 కోట్లతో ఏర్పాటు చేయనున్న వ్యర్థ జలాల శుద్ధి ప్లాంట్, రూ.91.96 లక్షలతో చేపట్టనున్న భక్తుల క్యూ కాంప్లెక్స్ ప్రహరీ నిర్మాణ స్థలాలను పరిశీలించారు. వీటితో పాటు ప్రసాద్ నిధులతో దేవస్థానానికి రూ.కోటి వ్యయంతో రెండు బ్యాటరీ కార్లు కూడా మంజూరు చేశారు. వీటిని సత్రాల నుంచి స్వామివారి ఆలయం, వ్రత మండపాల మధ్య భక్తులను తరలించేందుకు ఉపయోగిస్తారు. ప్రసాద్ నిర్మాణ స్థలాల పరిశీలన అనంతరం దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావుతో పర్యాటక శాఖ ఈఈ ఈశ్వరయ్య సమావేశమయ్యారు. ఆయన వెంట టూరిజం శాఖ డీఈ సత్యనారాయణ తదితరులున్నారు. మూడోసారి టెండర్లు ప్రసాద్ స్కీము నిర్మాణాలకు గత ఏడాది అక్టోబర్లో తొలిసారి టెండర్లు పిలిచి రద్దు చేశారు. రెండోసారి గత జనవరిలో రూ.18.98 కోట్ల అంచనా వ్యయంతో ఒకే ప్యాకేజీగా టెండర్లు పిలిచారు. దీనిని 16 శాతం తక్కువకు విశాఖపట్నానికి చెందిన అనంతరాములు అండ్ కో దక్కించుకుంది. అయితే సింహాచలం దేవస్థానంలో చందనోత్సవం సందర్భంగా నిర్మించిన గోడ ఏప్రిల్ 30న కూలిపోయి ఏడుగురు మృతి చెందారు. ఆ గోడ నిర్మించిన కాంట్రాక్టర్, ఇక్కడ ప్రసాద్ కాంట్రాక్టర్ ఒక్కరే కావడంతో ఆయనను ప్రభుత్వం బ్లాక్లిస్ట్లో పెట్టింది. దీంతో, ప్రసాద్ నిర్మాణాలకు మే 15న తిరిగి మూడోసారి షార్ట్ టెండర్లు పిలిచారు. టెండర్ల దాఖలుకు ఆఖరు తేదీ మే నెల 24 కాగా, అప్పటి నుంచీ టెండర్లు ఖరారు చేయలేదు. కూటమి ప్రభుత్వంలోని పెద్దలకు అనుకూలమైన కాంట్రాక్టర్కు టెండర్ దక్కే అవకాశం లేకపోవడమే దీనికి కారణమన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. -
రత్నగిరి.. భక్తఝరి
అన్నవరం: తొలి ఏకాదశి పర్వదినం, ఆదివారం సెలవు దినం కలసి రావడంతో రత్నగిరి భక్తజన సంద్రమే అయ్యింది. గత మూడు నెలల్లో ఏ రోజూ కూడా రాని స్థాయిలో భక్తులు సత్యదేవుని దర్శనానికి తరలివచ్చారు. వేలాదిగా వచ్చిన భక్తులతో సత్యదేవుని ఆలయం కిటకిటలాడింది. ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలన్నీ భక్తులతో నిండిపోయాయి. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సత్యదేవుని దర్శనానికి శనివారం రాత్రి నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు రత్నగిరికి చేరుకున్నారు. రాత్రికే సుమారు 30 వేల మంది రాగా, ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ భక్తజన ప్రవాహం కొనసాగుతూనే ఉంది. రద్దీని తట్టుకునేందుకు గాను అంతరాలయ దర్శనం నిలిపివేశారు. సత్యదేవుని ఉచిత దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట పట్టింది. సుమారు 75 వేల మంది స్వామివారిని దర్శించి, పూజలు చేశారు. సత్యదేవుని దర్శించిన అనంతరం భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేశారు. రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి, ప్రదక్షిణ చేశారు. ఐదు వేల వ్రతాలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.60 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 6 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు.ఘనంగా రథసేవరత్నగిరిపై ఆలయ ప్రాకారంలో ఉదయం సత్యదేవుని రథసేవ నిర్వహించారు. ఉదయం 10 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువచ్చి రథంపై వేంచేయించారు. స్వామి, అమ్మవార్లకు అర్చకులు ప్రయాగ రాంబాబు తదితరులు పూజలు చేశారు. అనంతరం ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు కొబ్బరికాయ కొట్టి రథ సేవను ప్రారంభించారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల ఘోష నడుమ ఆలయ ప్రాకారంలో నిర్వహించిన ఈ సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం పండితులు స్వామి, అమ్మవార్లకు నీరాజనం ఇచ్చి, భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.ప్రసాదం అమ్మకాలు అదుర్స్ఆషాఢ మాసం రెండో ఆదివారం నాడు సత్యదేవుని గోధుమ నూక ప్రసాదం ప్యాకెట్లను రికార్డు స్థాయిలో విక్రయించారు. తుని సమీపంలోని తలుపులమ్మ లోవ దేవస్థానానికి వెళ్లిన భక్తులు తిరుగు ప్రయాణంలో అన్నవరంలో ఆగి సత్యదేవుని ప్రసాదం కొనుగోలు చేసేందుకు పోటీ పడ్డారు. దీంతో కొండ దిగువన తొలి పావంచా వద్ద, పాత, కొత్త నమూనా ఆలయాల వద్ద రద్దీ ఏర్పడింది. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా సత్యదేవుని ఆలయానికి వేలాదిగా వచ్చిన భక్తులు కూడా సత్యదేవుని ప్రసాదాలు భారీగా కొనుగోలు చేశారు. దీంతో, రత్నగిరిపై కూడా స్వామివారి ప్రసాదాలకు డిమాండ్ ఏర్పడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ సుమారు 1.20 లక్షల ప్రసాదం ప్యాకెట్లు విక్రయించగా దేవస్థానానికి రూ.24 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. -
భక్తులతో శోభిల్లిన వాడపల్లి
ఒక్కరోజు ఆదాయం రూ.60.42 లక్షలు కొత్తపేట: కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రం శనివారం భక్తజనంతో కిక్కిరిసిపోయింది. శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రానికి ఏడు శనివారాల వ్రతంతో పాటు సాధారణ దర్శనాలకు వచ్చిన భక్తుల హరినామ స్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. దేవదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్, అర్చకులు, వేదపండితులు సుప్రభాత సేవతో స్వామి వారిని మేల్కొలిపి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, హోమాలు నిర్వహించారు. ఆలయ ఆవరణలోని క్షేత్ర పాలకుడు అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర స్వామిని భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వివిధ మార్గాల ద్వారా ఆలయానికి రూ.60,41,722 ఆదాయం సమకూరిందని ఈఓ తెలిపారు. ధర్మపథంలో భాగంగా నృత్య కళాకారుల బృందం వేంకటేశ్వర వైభవం, తదితర కూచిపూడి, సంప్రదాయ నృత్య ప్రదర్శనలు చేశారు. -
అమ్మోనియా లీకేజీపై మాక్ డ్రిల్
కాకినాడ రూరల్: రూరల్ మండలం వాకలపూడి గ్రామ పరిధిలోని కోరమాండల్ ఇంటర్నేషనల్ ఎరువుల కర్మాగారంలో నిల్వ ఉన్న అమ్మోనియా లీక్ అయితే తీసుకోవలసిన చర్యలుపై శనివారం మాక్ డ్రిల్ నిర్వహించారు. పరిశ్రమలశాఖ అధికారుల పర్యవేక్షణలో సంస్థ యూనిట్ హెడ్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణరావు, ఇన్స్పెక్టర్ రాంబాబు సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. -
ఢిల్లీ ఎయిమ్స్లో జాన్వికి సీటు
చాగల్లు: గ్రామానికి చెందిన గారపాటి జాన్వి పద్మజ చౌదరి ఢిల్లీలోని ఏఐఐఎంఎస్ (ఎయిమ్స్)లో సీటు సాధించింది. ఎయిమ్స్ పీజీ ప్రవేశ పరీక్షల్లో ఆమె ఆలిండియా 163వ ర్యాంకు సాధించి ఈ ఘనత సాధించింది. ఆమె వైజాగ్ ఆంధ్ర మెడికల్ కళాశాల (కేజీహెచ్)లో ఎంబీబీఎస్ చేసిన ఆమె ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే అత్యుత్తమ ప్రతిభ చూపింది. సాధారణ రైతు కుటుంబంలో జన్మించి తల్లిదండ్రులు గారపాటి శ్రీనివాసరావు, నాగలక్ష్మి దంపంపతుల ప్రోత్సాహంతో ఈ సీటు సాధించడంపై బంధువులు, శ్రేయోభిలాషులు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నారు. -
కూటమిలో మట్టి పంచాయితీ!
మర్లావ, ఆర్బీ పట్టణాల్లో జనసేన x టీడీపీ పెద్దాపురం: గ్రామాల్లో కూటమి నేతల మధ్య ఆధిపత్యపోరు మొదలైంది. మండలంలోని మర్లావ గ్రామంలో టీడీపీకి చెందిన గ్రామ సర్పంచ్ తోట రామకృష్ణ జేసీబీతో ఏలేరు కాలువ మట్టిని తరలించుకుపోవడాన్ని జనసేన నాయకులు గవరసాని దివాకర్ వర్గీయులు వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాతో పాటు, బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. అలాగే మండలంలోని దివిలి ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న కార్యక్రమాలు టీడీపీ తమకు చెప్పకుండానే చేస్తున్నారని నీటి సంఘం ఉపాధ్యక్షుడు జనసేన నాయకుడు జట్లా విజయ్బాబు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అదే విధంగా మండలంలోని ఆర్బీ పట్నంలో చెరువు మట్టి తవ్వకాల విషయంలోనూ జనసేన, టీడీపీ వర్గీయుల మధ్య పోరు సాగుతోంది. అధికారులు ఇరువర్గాలకు చెప్పలేక మౌనం దాల్చడంతో ఆధిపత్యపోరులో కూటమి నేతలు చెలరేగిపోతున్నారు. -
రాజీ మార్గం రాజ మార్గం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజీమార్గమే రాజమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల జాతీయ లోక్ అదాలత్ శనివారం రాజమహేంద్రవరం జిల్లా కోర్టు ఆవరణలోని నిర్వహించారు. దీనికి హాజరైన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి 85 వేలకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయని, వీటిలో 60,642 కేసులు రాజీ చేసుకోదగినవని పేర్కొన్నారు. వీటిలో తాము 9,272 సివిల్ క్రిమినల్ కేసులు, 2,136 ప్రీ లిటిగేషన్ కేసు లు, మొత్తం 11,415 రాజీ చేసుకోదగిన కేసులుగా ఈ బెంచ్ రిఫర్ చేయడం జరిగినద న్నారు. కక్షిదారులు వెంటనే లాభం పొందాలనే ఉద్దేశంతో కేసులను రాజీమార్గంలో పరిష్కరిస్తున్నామన్నారు. గత ఏడాదిలో చేపట్టిన నాలుగు లోక్ అదాలత్లలో రూ.167 వందల కోట్లు కక్షి దారులకు నష్టపరిహారంగా అందజేసినట్టు తెలిపారు. తాజాగా పీడీజే కోర్టులోని 01/2025 కేసుకు బాధితుల కుటుంబానికి రూ.1.15 కోట్లు, 379/2023 కేసులో రూ.80 లక్షలు, 135/2025 కేసులో రూ.38.5 లక్షల చెక్కులను అంద చేశామన్నారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి, రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శోభనాద్రి శాస్త్రి, పలువురు జడ్జిలు పాల్గొన్నారు. మొత్తం బెంచీలు 47 కాగా 6179 కేసులకు అవార్డులు ఇచ్చారు. రాత్రి 9.30 గంటల వరకు 473 సివిల్ కేసులు, 5514 క్రిమినల్ కేసులు, 192 పీఎల్సీ కేసులకు తీర్పులు ఇచ్చారు. ఇంకా కేసుల సంఖ్యను లెక్కిస్తున్నారు. -
ప్రేమ.. ప్రాణాంతకం కావచ్చు!
జిల్లాలో జంతువులు వివరాలు ఇలా... పెంపుడు కుక్కలు 11,159 ఆవులు 70,846 గేదెలు 1,67,106 గొర్రెలు 1,67,052 మేకలు 72,076 పందులు 1,207 పౌల్ట్రీ 1,77,86,778 ● మూగజీవాల పెంపకంపై అవగాహన అవసరం ● వాటిపై ప్రేమ మాటున పొంచి ఉన్న వ్యాధుల ముప్పు ● అశ్రద్ధ చేయవద్దంటున్న వైద్యులు ● నేడు ప్రపంచ జునోసిస్ డే రాజమహేంద్రవరం రూరల్/బిక్కవోలు: సమాజంలో జంతు ప్రేమ రోజురోజుకూ పెరుగుతోంది. అదే సమయంలో వాటి వల్ల వచ్చే వ్యాధులపై వాటిని పెంచుకునేవారికి లేదనేది వాస్తవం. వైద్య పరిశోధన ప్రకారం జంతువల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు సుమారు 190 రకాల వ్యాధులు సోకే అవకాశం ఉంది. ఇలా సోకే వ్యాధులను జునోసిస్ అంటారు. జూనిటిక్ వ్యాధులను వైరస్ బాక్టీరియల్, పారసైటిక్ వ్యాధులుగా విభజించారు. వైరస్ వలన సంక్రమించే వ్యాధులలో రేబిస్, మెదడువాపు వ్యాధి, బర్డ్ఫ్లూ వంటివి ముఖ్యమైనవి. బాక్టీరియా వలన సంక్రమించే వ్యాధుల్లో బ్రూసెల్లా, సాల్మోనెల్లా, లెప్టోసైరోసిస్ మొదలైనవి ఉన్నాయి. కుక్కకాటుతో రేబీస్, పందుల వల్ల మెదడువాపు, పశువులు, గొర్రెల నుంచి టీబీ వ్యాధులు సంక్రమిస్తాయని, వీటన్నింటిలో రేబిస్ ప్రమాదకరమైనదని వైద్యులు పేర్కొంటున్నారు. జునోసిస్ ఎలా వచ్చిందంటే... పిచ్చికుక్క కాటుకు గురైన వ్యక్తికి లూయీపాశ్చర్ అనే శాస్త్రవేత్త 1885 జూలై 6న మొట్టమొదటిసారిగా యాంటీ రేబిస్ టీకా ఇచ్చారు. ఇది విజయవంతమై అత్యంత ప్రాచుర్యం పొందింది. ఆ రోజుకు గుర్తుగా ఏటా ప్రపంచ జునోసిస్ డే నిర్వహిస్తున్నారు. వ్యాక్సినేషన్ ఎంతో అవసరం పెంపుడు జంతువులకు వ్యాక్సినేషన్పై చాలా మందికి అవగాహన ఉండదు. కొందరు ఖర్చుతో కూడినదని, సమయం లేక అశ్రద్ధ చేస్తుంటారు. దీని వల్ల అవి కరిచిన, రక్కిన సందర్భాలలో ఏదైనా ఆరోగ్య సమస్య రావచ్చు. అందువల్ల వాటికి వ్యాక్సినేషన్ చేయించడం ఎంతో అవసరమని గుర్తించాలి. జాగ్రత్తలివీ ● పెంపుడు జంతువులకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్లు సకాలంలో వేయించాలి. ● టీకాల షెడ్యూల్ను తప్పనిసరిగా పాటించాలి. ● పెంపుడు జంతువులను, వాటి ఆహారాన్ని లేదా వ్యర్థాలను తాకిన తర్వాత చేతులను శుభ్రంగా కడగాలి. లిట్టర్ బాక్సులు, పంజరాలను తరచుగా శుభ్రం చేయాలి. ● బయట తిరిగే జంతువులకు క్రమం తప్పకుండా క్రిములను తొలగించాలి. ● పెంపుడు జంతువులు అడవి జంతువులతో కలవకుండా చూడటంతో పాటు, సరైన రక్షణ లేకుండా గాయపడిన అడవి జంతువులను రక్షించడానికి ప్రయత్నించకూడదు. ● జంతువుల అనారోగ్య లక్షణాలను గమనించాలి. ప్రవర్తన, ఆకలి, లేదా ఏవైనా మార్పులను గమనించడం, ఏదైనా ఆసాధారణమైనది గమనిసై వెంటనే పశువైద్యుడిని సంప్రదించాలి. పాడి రైతులకు ఇలా.. ● బలమైన జీవభద్రతా చర్యలను అమలు చేయాలి. ● పశువుల దగ్గరకు అవసరమైన వ్యక్తులను మాత్రమే అనుమతించాలి. ● జంతు సమూహాల మధ్య కదిలేటప్పడు పాద రక్షలు, రక్షిత దుస్తులను ఉపయోగించాలి. ● పశుశాలలు, పాలు పిండే ప్రదేశాలు, పరికరాలను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. ● క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. ● అనారోగ్యంతో ఉన్న జంతువులను వెంటనే మంద నుంచి వేరు చేయాలి. కోళ్ల రైతులకు జాగ్రత్తలివీ ● ఒకే వయస్సు ఉన్న పక్షులను కలిపి పెంచాలి. ● గుంపుల మధ్య పూర్తిగా శుభ్రపరిచి, ఆ ప్రాంతంలో క్రిమి సంహార మందులు చల్లాలి. ● అడవి పక్షులతో సంపర్కాన్ని నివారించడానికి వలలు లేదా మూసిన గూళ్లను ఉపయోగించాలి. ● ఆహారం తీసుకోవడంలో లేదా గుడ్ల ఉత్పత్తిలో తగ్గుదల వంటి ఆనారోగ్య లక్షణాలను గమనించడంతో పాటు, అసాధారణ మరణాలు లేదా లక్షణాలను వెంటనే పశువైద్య అధికారులకు తెలియజేయాలి. అవగాహన పెంచుకోవాలి ● జూనోటిక్ వ్యాధుల సమాచారాన్ని ఎప్పటి కప్పడు తెలుసుకోవాలి. ● జంతు ఆరోగ్యం, జూనోసిస్పై వర్క్షాప్లు లేదా సెమినార్లకు హాజరుకావాలి. ● అనుమానిత జూనోటిక్ వ్యాధులను గుర్తిస్తే పశువైద్యులు, అధికారులకు తెలియజేయాలి. వైద్యుల సలహాలు తప్పనిసరి జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే రోగాలను జునాటిక్ డిసీజెస్ అంటారు. ఎబోలా, బర్డ్ఫ్లూ, రేబిస్, మెదడువాపు వంటివి ఈ రకమైనవే. ఇవి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే వైద్యుల సలహాలు తప్పనిసరి. ఇంట్లో కుక్కలను పెంచేవారు చర్మ సమస్యలు వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. సరైన వ్యాక్సిన్ వేయించకుండా పెంపుడు జంతువులు, కుక్కలతో సన్నిహితంగా ఉండొద్దు. ఆదివారం రాజమ హేంద్రవరం ఏరియా పశువైద్యశాలలు, అనపర్తి, బి క్కవోలు, పెదపూడి, రంగంపేట మండలాల్లోని పశువైద్యశాలల్లో టీకాలు వేస్తున్నాం. జునోసిస్ వ్యాధులపై వైద్యాధికారులు అవగాహన కల్పిస్తారు. అలాగే పెంపుడు జంతువులకు, వాటితో దగ్గరగా మెలిగే యజ మానులకు, పశుసంవర్ధకశాఖ సిబ్బందికి, మున్సిపల్ వర్కర్లుకు, జంతువధశాఖ సిబ్బందికి, జంతు ప్రేమికులకు ఉచితంగా యాంటీ రాబీస్ టీకాలు వేస్తాం. –టి.శ్రీనివాసరావు, జిల్లా పశువైద్యాధికారి, తూర్పుగోదావరి ముందస్తు నివారణ మేలు జునోసిస్ వ్యాధులు ప్రబలకుండా ముందుస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల మనుషులకు, అటు జంతువులకు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రాణాంతక జోనోసిస్ వ్యాధులపై సరైన అవగాహన ఉంటే చాలా వరకు వీటిని ఆరికట్టవచ్చు. జునోసిస్ వ్యాధుల సంక్రమణ, నివారణపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. – డాక్టర్ శ్రీనివాస్, పశుసంవర్థక శాఖ ఏడీ, అనపర్తి ప్రేమ ఒక మత్తు. అది మనుషుల మీదయినా.. మూగ జీవాల మీదయినా. వీటి ప్రేమ అన్కండీషనల్. చిన్న బిస్కెట్ ముక్క పెడితే చాలు.. ఏళ్ల తరబడి ప్రేమ కురిపిస్తూనే ఉంటుంది. ఆ ప్రేమకి పడిపోని మనిషుండడు. అవి ఏ స్థితిలో ఉన్నా దానిని ముద్దుచేస్తూ.. దాని నోటిలో చేతులు పెడుతూ.. దగ్గరకు తీసుకుని గాఢాలింగనాలు చేసుకుంటూ ప్రేమ వ్యక్తపరుస్తుంటారు. ఇది కొన్నిసార్లు ప్రమాదకరం కావొచ్చు. పాముకు పాలు పోసి పెంచినా దాని సహజ లక్షణం కాటు వేయడం. అలాగే కుక్కలు.. పిల్లులు.. కోతులు.. కుందేళ్ల వంటి మూగ జీవులను ఎంత ప్రేమగా పెంచినా స్వాభావికంగా చర్మం.. విసర్జకాలు.. వెంట్రుకలు.. చొంగ తదితరాలు ఎప్పటికీ ప్రమాద హేతువులే. వీటి నుంచి వచ్చే ఉపద్రవాలను గుర్తెరిగి తగినంత జాగ్రత్తలు తీసుకుంటూ వాటిని పెంచుకోవడం ఎంతైనా అవసరం. అలాగే వాటికి సంక్రమించే పలు రకాల వ్యాధులు మానవులకు హానికరం కాకుండా చూసుకుంటూ వాటి ఆరోగ్య పరిరక్షణకు సకాలంలో చర్యలు తీసుకుంటూనే వాటిని పెంచుకునేవారికి ఆ దుష్ప్రభావాలు సోకకుండా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మూగజీవాలు.. వాటి వల్ల వచ్చే వ్యాధులపై సరైన అవగాహన కల్పించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన జునోసిస్ డే సందర్భంగా ప్రత్యేక కథనం. -
హత్య కేసు నిందితులకు రిమాండ్
సామర్లకోట: మండలం పి.వేమవరం గ్రామానికి చెందిన నొక్కు కిరణ్ కార్తిక్ (19) హత్య కేసు నిందితులు నూతలకట్టు కృష్ణప్రసాద్, దూల్లపల్లి వినోద్లను శనివారం కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్టు సీఐ ఎ.కృష్ణభగవాన్ విలేకర్లకు తెలిపారు. చెల్లితో మాట్లాడుతున్నాడని ఆమె అన్న కృష్ణప్రసాద్ తన స్నేహితుడు వినోద్తో కలసి కార్తిక్ను హత్య చేసిన విషయం తెలిసిందే. బ్రహ్మానందపురం జగనన్న లేఅవుట్లోకి కార్తిక్ను తీసుకువెళ్లి గొంతు నులిమి హత్యచేసినట్టు నిందితులు అంగీకరించారని, వీఆర్వో నాగేశ్వరరావు సమక్షంలో వివరాలు సేకరించి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్టు సీఐ తెలిపారు. కార్తిక్ తండ్రి నొక్కు వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదు చేసిన మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చామని, కృష్ణప్రసాద్ను ఎ1గా నమోదు చేశామని సీఐ తెలిపారు. -
పనస.. ‘ఫల’ప్రదం
పనస సాగుకూ కోనసీమ పెట్టింది పేరు. మార్చి నుంచి జూలై వరకూ పనస సీజన్. ఒక్కో చెట్టుకు 50 నుంచి 100కు పైగా కాయలు వస్తాయి. జిల్లావ్యాప్తంగా కొబ్బరిలో అంతర పంటగా సుమారు 100 ఎకరాల్లో సాగవుతుందని అంచనా. అంబాజీపేట కేంద్రంగా ఏటా రూ.కోటి విలువైన పనస కాయలు ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతుంటాయి. ఏ దిల్ ‘మ్యాంగో’మోర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం గూడపల్లిలో పండే బంగినపల్లి కాయకు యమ క్రేజ్ ఉంది. ఈ సీజన్లో ఇక్కడ పండే బంగినపల్లికి ఉమ్మడి రాష్ట్రాలతో పాటు చైన్నె, బెంగళూరులో కూడా డిమాండ్ ఉంది. గూడపల్లితో పాటు చుట్టుపక్కల సుమారు 2 వేల ఎకరాల్లో మామిడి సాగవుతోంది. -
పడకేసిన పర్యాటకం
అద్దరిపేట సాగర తీరంలో ఆకట్టుకునే పంప్హౌస్నీలి సంద్రం.. ప్రకృతి అందం : కాకినాడ బీచ్● అవకాశాలు అపారం ● పట్టించుకోని ప్రభుత్వం ● కడలిలో కలసిన బీచ్ల అభివృద్ధి ● ఆలయ పర్యాటకంపైనా చిన్నచూపు పిఠాపురం: ఎగసిపడే అలలతో.. సహజ సౌందర్యానికి నిలయమైన నీలి సంద్రం.. మెత్తని ఇసుక తిన్నెలు.. మనసును పరవశింపజేసే ప్రకృతి అందాలు.. మన సాగర తీరానికే సొంతం. ఇక్కడ తీసిన ఎన్నో సినిమాలు సూపర్డూపర్ హిట్ అయ్యాయి. సెలవు రోజులు వచ్చాయంటే చాలు.. వేలాదిగా పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు మన జిల్లాలోని సాగర తీరానికి పోటెత్తుతూంటారు. ఆవిధంగా పర్యాటకాభివృద్ధికి ఇక్కడ ఎన్నో అవకాశాలున్నాయి. ఇటువంటి జిల్లాలో పర్యాటకం కొన్నాళ్లుగా పడకేసింది. ఎన్నో పర్యాటక ఆకర్షణలు ● కాకినాడ నుంచి తుని సమీపంలోని అద్దరిపేట వరకూ ఉన్న సాగరతీరం ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. కాకినాడ వద్ద బీచ్ పార్కు, ఉప్పాడ బీచ్ రోడ్డు ప్రాంతం, అద్దరిపేట వద్ద సాగర తీరం, పంపు హౌస్లు పర్యాటక ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. కార్తిక మాసాల్లో ఈ ప్రాంతాలు పిక్నిక్ స్పాట్లుగా కూడా వెలుగొందుతున్నాయి. ● ప్రధానంగా కాకినాడ కేంద్రంగా వాకలపూడి బీచ్ పార్కు, లైట్ హౌస్, కుంభాభిషేకం రేవు, కాకినాడ పోర్టు, ఫిషింగ్ హార్బర్, శిల్పారామం, ఆ పక్కనే గెస్ట్ హౌస్, కాకినాడ శివారు జగన్నాథపురంలో ఫ్రెంచ్, డచ్, బ్రిటిష్ వారు నిర్మించిన చర్చిలు పర్యాటకంగా పేరొందాయి. వీటికి పర్యాటకుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. ● కాకినాడ సమీపంలోని హోప్ ఐలాండ్ సముద్రం మధ్యలో సహజంగా ఏర్పడిన ద్వీపం. ప్రస్తుతం ఇది మంచి పిక్నిక్ స్పాట్గా మారింది. ఇక్కడకు వెళ్లేందుకు కాకినాడ హార్బర్, కోరంగి మడ అడవుల నుంచి రవాణా సౌకర్యాలున్నాయి. ● తాళ్లరేవు మండలంలోని మడ అడవులు పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడి లొకేషన్లు పర్యాటకులనే కాదు.. సినీ ప్రముఖులను సైతం ఆకర్షిస్తున్నాయి. కడలి కెరటాలు, పచ్చని చెట్లు, ఇసుక తిన్నెలు, మధ్యలో కాలువల వంటి ప్రకృతి అందాలు ఎక్కడో సముద్రం మధ్య ఉన్న దీవులను తలపిస్తూంటాయి. ● ప్రత్తిపాడు మండలంలోని ఎరకంపాలెం శంఖవ రం మండలం ఆంధ్రా శబరిమలై తదితర ప్రాంతాలు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తూంటాయి. ● వేల సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన ఆలయాలు, దర్శనీయ ప్రదేశాలు, కొడవలి బౌద్ధ స్థూపాలు, చారిత్రక ప్రాంతాలు జిల్లాలో కొలువై ఉన్నాయి. ● తలుపులమ్మ లోవ, అన్నవరం సత్యదేవుడు, సా మర్లకోట భీమేశ్వరస్వామి, పిఠాపురం పాదగయ, పెద్దాపురం మండలం తొలి తిరుపతిలో వెలసిన శృంగార వల్లభ స్వామి, కాకినాడ బాలాత్రిపుర సుందరి అమ్మవారు తదితర ఆలయాలకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తూంటారు. ● దేశవిదేశాల నుంచి జిల్లాకు ఏటా దాదాపు 25 లక్షల మంది పర్యాటకులు వస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో.. జిల్లావ్యాప్తంగా ఎక్కడెక్కడ బీచ్లు అభివృద్ధి చేయవచ్చో అధ్యయనం చేయాలని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆ మేరకు ఫిషరీస్ యూనివర్సిటీ, పర్యాటక, మత్స్యశాఖల ప్రతినిధులతో బృందాన్ని నియమించింది. ఇప్పటికే కాకినాడలో బీచ్ ఉండగా.. జిల్లాలోని మరో 21 ప్రాంతాల్లో పర్యాటకులను ఆకర్షించేలా బీచ్లను ప్రత్యేంగా అభివృద్ధి చేయవచ్చని ఆ బృందం గుర్తించింది. ఈ 22 బీచ్ల అభివృద్ధికి గత ప్రభుత్వం ప్రతిపాదించింది. దేశంలో 10 బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పొందిన బీచ్లు ఉండగా.. మన రాష్ట్రంలో విశాఖ రుషికొండ బీచ్ ఆ జాబితాలో స్థానం సాధించింది. అటువంటి బ్లూ ఫ్లాగ్ బీచ్ను కోస్టల్ జోన్ రెగ్యులేషన్ నోటిఫికేషన్ ప్రకారం కాకినాడలో ఏర్పాటు చేసేందుకు గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. బ్లూ ఫ్లాగ్ బీచ్లకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు రాగానే పనులు చేపట్టేందుకు రంగం సిద్ధం చేశారు కూడా. పర్యావరణం, స్నానపు నీటి నాణ్యత, పర్యావరణ నిర్వహణ, సందర్శకుల భద్రత తదితర 33 ప్రమాణాలకు అనుగుణంగా ఉండే బీచ్లకు అంతర్జాతీయ సంస్థ ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్లు ఇస్తుంది. ఆవిధమైన గుర్తింపు లభిస్తే కాకినాడ సాగరతీరం మరో గోవాను తలపించేలా అభివృద్ధి చెందుతుందని పర్యాటకులు ఆశించారు. దీనివలన స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు సేవలు, పర్యాటక రంగం ద్వారా ప్రభుత్వానికి దండిగా ఆదాయం లభిస్తుందని భావించారు. ఈలోగా గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం రావడంతో బీచ్ల అభివృద్ధి కడలిలో కలిసిపోయింది. జిల్లాలో ఇప్పటికే ఉన్న పర్యాటక ప్రాంతాలను మరింతగా అభివృద్ధి చేయడంతో పాటు కొత్త ప్రాంతాలను సైతం తీర్చిదిద్ది, మరిన్ని సౌకర్యాలు కల్పించాల్సిన ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదు. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. అభివృద్ధికి గత ప్రభుత్వం ప్రతిపాదించిన బీచ్లు సాగర సంబరాల బీచ్ (బ్లూ ఫ్లాగ్), ఎన్టీఆర్, నేవల్ ఎన్క్లేవ్, నేమాం బీచ్, హోప్ ఐలాండ్, దానవాయిపేట బీచ్, గడ్డిపేట, అద్దరిపేట, పంపాదిపేట, యర్రయ్యపేట, అన్నయ్యపేట, ఎల్లయ్యపేట, నర్సిపేట, తలపంటిపేట, కె.చోడిపల్లిపేట, కోనపాపపేట, కుంభాభిషేకం, పెరుమాళ్లపురం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్, ఉప్పాడ బీచ్, కోరంగి మడ అడవులు, యానాం బీచ్లు. -
శృంగార వల్లభుని ఆలయానికి పోటెత్తిన భక్తులు
పెద్దాపురం: తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 15 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి, పూలమాలలతో విశేషంగా అలంకరించారు. వివిధ సేవల టికెట్లు, అన్నదానం, కేశఖండన ద్వారా ఆలయానికి 3,84,962 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు. 3,500 మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం చేశామన్నారు. వెబ్ ఎక్విప్మెంట్ రూము ప్రారంభం కాకినాడ క్రైం: జిల్లా పోలీసు కార్యాలయంలో సాంకేతిక పరికరాలు కలిగి ఉండే వెబ్ ఎక్విప్మెంట్ రూమును ఎస్పీ బిందుమాధవ్ శనివారం ప్రారంభించారు. పోలీసులకు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించేందుకు ఇది ఎంతగానో తోడ్పడుతుందన్నారు. అనంతరం కార్యాలయ పరిసరాల్లో కొబ్బరి మొక్కలు నాటారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఏఆర్ శ్రీనివాసరావు, ఏఆర్ ఆర్ఐ (అడ్మిన్) నరసింహమూర్తి, పోలీసు అధికారులు పాల్గొన్నారు. తలుపులమ్మకు జన్మనక్షత్ర పూజలు తుని: ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా లోవ దేవస్థానంలో వేంచేసిన తలుపులమ్మ తల్లికి శనివారం జన్మనక్షత్ర పూజలు నిర్వహించారు. ఉదయం అమ్మవారి మూలవిరాట్ వద్ద పండితులు మేలుకొలుపు, నిత్యార్చన, పంచామృతాభిషేకం, విశేష పూజలు చేశారు. అనంతరం మహా మంటపంలోని అమ్మవారి విగ్రహానికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. పూజా కార్యక్రమాలను తిలకించిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆదివారం నిర్వహించే తొలి ఏకాదశ పూజలకు ఈఓ పర్యవేక్షణలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పండితులు తెలిపారు. మెగా పీటీఎం సమర్థంగా నిర్వహించాలి కాకినాడ సిటీ: ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలు, జూనియర్ కళాశాలల్లో ఈ నెల 10న మెగా పేరెంట్, టీచర్ మీటింగ్ (పీటీఎం) 2.0 సమర్థంగా నిర్వహించాలని ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, విద్యా శాఖ అధికారులను కలెక్టర్ షణ్మోహన్ సగిలి శనివారం ఒక ప్రకటనలో ఆదేశించారు. జిల్లాలోని 1,260 ప్రభుత్వ, 596 ప్రైవేట్, 20 ఎయిడెడ్ కలిపి 1,876 పాఠశాలల్లో చదువుతున్న 2,78,932 మంది.. 131 ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లోని 45,344 మంది విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో పీటీఎం నిర్వహించనున్నామని వివరించారు. వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల్లో పలువురికి చోటు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాకు చెందిన పలువురికి వైఎస్సార్ సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల్లో చోటు కల్పించారు. రాష్ట్ర మహిళా విభాగం జోనల్ అధ్యక్షురాలిగా మాకినీడి శేషుకుమారి, మహిళా విభాగం అధికార ప్రతినిధిగా పోలసపల్లి సరోజ చెరియన్, రాష్ట్ర పంచాయతీ విభాగం జాయింట్ సెక్రటరీగా సుంకర వీర వెంకట వీరభద్రరావును నియమించారు. -
అభినందన సీమ
ఉద్యాన పంటలు భేష్ ● అరుదైన ఎర్ర చక్కెరకేళీ సాగులో అగ్రస్థానం ● ‘పాన్’కు పెట్టింది పేరు సీమ తమలపాకు ● కేరళను మించిన ‘వక్క’ ● ఘనా దేశానికి దీటుగా కోకో నాణ్యత ● గూడపల్లి మామిడికి యమ క్రేజ్ఆశ్చర్య‘పోక’ తప్పదు కోనసీమలోని అంబాజీపేట, పి.గన్నవరం, అయినవిల్లి, కొత్తపేటతోపాటు మండపేట మండలం ద్వారపూడి ప్రాంతంలో సుమారు 386 ఎకరాల్లో పోక (వక్క) సాగు జరుగుతోంది. కొబ్బరి తోటల్లో అంతర పంటగా, తోటల చుట్టూ గట్ల మీద ఈ పంట సాగవుతోంది. ఇక్కడి నుంచి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశాకు పోక ఎగుమతి అవుతోంది. పోక విస్తృతంగా పండే కేరళను మించి ఇక్కడ వక్క సాగవుతుందంటే ఆశ్చర్యపోక తప్పదు. ఎర్ర చెక్కల (పూజా సుపారీ) తయారీ ఇక్కడి ప్రత్యేకత. ‘కోకో’ల్లలుగా గింజల దిగుబడి ఆఫ్రికా దేశాల్లో ఒకటైన ఘనాలో పండే కోకో గింజలు మాత్రమే నాణ్యమైనవని నిన్న మొన్నటి వరకూ పేరుండేది. కోనసీమలో పండే కోకో గింజలు ఇప్పుడు ఆ పేరును తుడిచిపెట్టేశాయి. జిల్లాలోని 3,800 ఎకరాల్లో కొబ్బరిలో అంతర పంటగా కోకో సాగవుతోంది. ఏటా సగటున 1,140 టన్నుల గింజలు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రస్తుత మార్కెట్ రేటును బట్టి ఏటా రూ.54.20 కోట్ల విలువైన కోకో గింజల దిగుబడి వస్తోందని అంచనా. గుండెలు ‘గెల’చిన ఎర్ర చక్కెరకేళీ ఎర్ర చక్కెరకేళీ రుచిలో రారాజు. తమిళ వాసులు అమితంగా ఇష్టపడతారు. టైప్–2 మధుమేహ బాధితులూ నిర్భయంగా తింటారు. కోనసీమతో పాటు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సుమారు 2 వేల ఎకరాల్లో ఈ పంట సాగవుతోంది. గెల ధర ఏడాదిలో సగటున రూ.350 వరకూ ఉంటోంది. రావులపాలెం నుంచి రోజుకు సగటున రెండు లారీల ఎర్ర చక్కెరకేళీ ఎగుమతి అవుతోంది. -
రత్నగిరిపై భక్తజనవాహిని
● సత్యదేవుని దర్శించిన 25 వేల మంది ● 1,500 వ్రతాల నిర్వహణ ● దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం అన్నవరం: రత్నగిరి వాసుడు సత్యదేవుని ఆలయానికి శనివారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచే భక్తుల రాక ప్రారంభమైంది. ఆలయ ప్రాంగణం, వ్రత మండపాలు, క్యూలైన్లన్నీ కిక్కిరిసిపోయాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుడిని దర్శించిన అనంతరం భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. స్వామివారిని 25 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. సత్యదేవుని వ్రతాలు 1,500 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. స్వామి, అమ్మవార్లకు ఉదయం 10 గంటలకు ఆలయ ప్రాకారంలో తిరుచ్చి వాహన సేవ ఘనంగా నిర్వహించారు. దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. నేడు తొలి ఏకాదశి తొలి ఏకాదశి (ఆషాఢ శుద్ధ ఏకాదశి) పర్వదినం సందర్భంగా సత్యదేవుని ఆలయానికి ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. దీంతో, తీవ్ర రద్దీ నెలకొనే అవకాశం ఉంది. ఈ సందర్భంగా సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి ఉదయం 7 గంటలకు స్వర్ణ పుష్పాలతో, 9 గంటలకు కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించనున్నారు. సత్యదేవుడు, అమ్మవారిని ఉదయం 10 గంటల నుంచి ఆలయ ప్రాకారంలో టేకు రథంపై ఊరేగిస్తారు. ‘లోవ’ భక్తుల కోసం లక్ష ప్రసాదం ప్యాకెట్లు ఆషాఢ మాసం రెండో ఆదివారాన్ని పురస్కరించుకుని తలుపులమ్మ లోవ దేవస్థానానికి వెళ్లి, తిరిగి వచ్చే భ క్తుల కోసం సత్యదేవుని గోధుమ నూక ప్రసాదం ప్యా కెట్లు సుమారు లక్ష సిద్ధం చేస్తున్నామని అధికారులు తెలిపారు. గత నెల 29న తొలి ఆదివారం 75 వేల ప్ర సాదం ప్యాకెట్లు విక్రయించగా, రూ.15 లక్షల ఆదా యం సమకూరింది. ఈసారి లోవ భక్తులు మరింత ఎ క్కువగా ప్రసాదం ప్యాకెట్లు కొనుగోలు చేస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. అన్నవరంలో రత్నగిరి తొలి పావంచా వద్ద, జాతీయ రహదారిపై పాత, కొత్త నమూనా ఆలయాల వద్ద ఉన్న కౌంటర్లలో ప్రసాదాల విక్రయాలకు అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశారు. వర్షంతో ఇబ్బందులు ఒకవైపు వర్షానికి తడవడంతో పాటు నమూనా ఆలయం ముందు నేలంతా బురదతో నిండిపోవడంతో నిలుచోవడానికి కూడా వీలు లేక సత్యదేవుని పాత నమూనా ఆలయం వద్ద ప్రసాదం కొనుగోలుకు వచ్చిన భక్తులు ఇబ్బంది పడ్డారు. ఇక్కడ భక్తుల రక్షణకు షెడ్డు నిర్మించాలని, ఆలయం ముందు మట్టి లేదా కంకర వేయించాలని కోరుతున్నారు. -
మాటకు కట్టుబడిన ఘనత జగన్దే..
● ఆయన అభివృద్ధి కంటికి కనిపిస్తోంది ● చంద్రబాబువి కల్లబొల్లి మాటలే.. ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా తుని: ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి, దానిని వంద శాతం అమలు చేసిన ఘనత వైఎస్సార్ సీపీ అధినేత, గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి కంటికి కనిపిస్తోందని, చంద్రబాబు పాలనలో మోసం, దగా మాత్రమే ఉన్న విషయాన్ని ఏడాది పాలనలోనే ప్రజలు గమనించారని చెప్పారు. వైఎస్సార్ సీపీ తుని నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం దాడిశెట్టి రాజా ఆధ్వర్యాన స్థానిక సాయి వేదికలో శనివారం జరిగింది. పార్టీ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు డీవీ సూర్యనారాయణరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజా మీడియాతో మాట్లాడుతూ, ధనికులు, ఉద్యోగులు చెల్లించే ఆదాయ పన్ను 20 శాతం ఉంటే పేద, మధ్య తరగతి ప్రజలు 80 శాతం కడుతున్నారని అన్నారు. మార్కెట్లో కొనే ప్రతి వస్తువుపై జీఎస్టీ పేరిట ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. గత ప్రభుత్వం హయాంలో ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ), నాన్ డీబీటీ విధానంలో ప్రజలకు నేరుగా పథకాలు అందిస్తే.. రాష్ట్రం శ్రీలంక అయిపోతుందంటూ చంద్రబాబు, లోకేష్ విష ప్రచారం చేశారని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో తండ్రీకొడుకులిద్దరూ ఇంటింటికీ సంక్షేమ పథకాలు, కుటుంబానికి ఏడాదికి ఎంత లబ్ధి చేకూరుతుందో వివరిస్తూ బాండ్లు పంపిణీ చేశారని, అధికారంలోకి వచ్చాక మొండిచేయి చూపించారని ధ్వజమెత్తారు. సూపర్ సిక్స్లో రెండు పథకాలు మాత్రమే ప్రజలకు ఇచ్చారని, మిగిలిన వాటి జోలికి వెళ్లలేదని అన్నారు. తమ మాటలను ప్రజలు నమ్మరనే ఉద్దేశంతో పవన్ కల్యాణ్తో చెప్పించారని, అందువలన పథకాల అమలు బాధ్యతను ఆయన తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పర్యటనలకు వెళ్లినప్పుడు ఇల్లు కట్టుకున్నావా అని అక్కడ ఓ మహిళను ప్రశ్నించి, లేదని చెబితే తాను రూ.3.30 లక్షలిస్తాను కట్టుకోమంటున్నారని, దీనినిబట్టి నెలకు ఒకటి చొప్పున ఏడాదికి 12 ఇళ్లు మాత్రమే చంద్రబాబు కడతారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. జగన్మోహన్రెడ్డి హయాంలో 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చి, తొలి విడతలో 18 లక్షల ఇళ్లు పూర్తి చేశారని గుర్తు చేశారు. విద్య, వైద్య రంగాలను చంద్రబాబు నిర్వీర్యం చేశారని, దమ్ముంటే జగన్ ప్రవేశపెట్టిన ఇంగ్లిషు మీడియాన్ని రద్దు చేయాలని రాజా సవాల్ చేశారు. నియోజకవర్గంలోని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, సానుభూతిపరులకు ప్రభుత్వ పథకాలు ఇవ్వొద్దంటూ అధికారులకు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు హుకుం జారీ చేసినట్టు మీడియాలో వార్తలు వచ్చాయని, దమ్ముంటే ఆపాలని సవాల్ విసిరారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజలు కట్టిన పన్నులతోనే సంక్షేమ పథకాలిస్తారని, అటువంటప్పుడు ‘పచ్చ’పాతం ఎందుకని ప్రశ్నించారు. ఏడాది పాలనలో సంక్షేమ పథకాలు అందనందువలన ప్రజలు ఎంత నష్టపోయారో ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించాలని వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు రాజా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ మేరుగ పద్మలత, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత, నేతలు యనమల కృష్ణుడు, లాలం బాబ్జీ పాల్గొన్నారు.కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న దాడిశెట్టి రాజా -
పీపీపీ విధానంతో ఎంబీబీఎస్కు దూరం
కాకినాడ రూరల్: వైద్య కళాశాలల్లో పీపీపీ విధానం అంటూ చంద్రబాబు ప్రభుత్వం కొత్త పాట పాడడంతో కొన్ని వందల మంది మెరిట్ విద్యార్థులు ఎంబీబీఎస్ విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పూసల అనిల్ పేర్కొన్నారు. కాకినాడ వైద్యనగర్లోని నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటరు కురసాల కన్నబాబు క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. మెడికల్ కళాశాలలను 100 శాతం ప్రభుత్వపరంగా కొనసాగిస్తామని హామీ ఇచ్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇప్పడు దానిని విస్మరించి ప్రైవేట్ విద్యా సంస్థలకు దోచి పెట్టేందుకు పీపీపీ విధానం తీసుకువస్తున్నారని విమర్శించారు. ఫలితంగా వైద్య కళాశాలలు పూర్తిగా కార్పొరేట్ శక్తుల పరమై రాష్ట్రంలో పేద మెరిట్ విద్యార్థులకు ఎంబీబీఎస్ కలగా మారుతుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం అంటూ ప్రభుత్వ సంస్థలను తమ వారికి కారు చౌకగా అమ్మేందుకు అధికార పార్టీ చేస్తున్న కుట్ర అన్నారు. ఈ కుట్రలో ప్రజా ప్రతినిధులు, మంత్రులు భాగస్వాములని, 50 ఎకరాల భూమిని కేవలం రూ.5వేలకు 66 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. రాష్ట్రంలో పలు వైద్య కళాశాలల్లో 750 మెడికల్ సీట్లు అందుబాటులో ఉండగా వాటిని రద్దు చేయమని నేషనల్ మెడికల్ కమిషన్కు కూటమి ప్రభుత్వం లేఖ రాసిందన్నారు. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా తమకు మెడికల్ సీట్లు కేటాయించాలని కోరుతుందని, కానీ ఏపీలో మాత్రం సీట్లను రద్దు చేయాలని కోరడం సిగ్గు చేటు అన్నారు. పేద విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేసే కుతంత్రాలకు తక్షణం స్వస్తి పలకాలని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం డిమాండ్ చేస్తోందన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి ఉంగరాల సంతోష్, రాష్ట్ర కార్యదర్శి కరణం భాను నాయుడు, సూరిబాబు పాల్గొన్నారు. -
సీఎం చంద్రబాబుపై పోలీసులకు ఫిర్యాదు
అన్నవరం: పల్నాడు జిల్లా రెంటపాడులో పరామర్శకు వెడుతున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనలో సత్తెనపల్లి వద్ద ప్రమాదవశాత్తూ కారు కింద పడి మృతిచెందిన సింగయ్యను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుక్కపిల్లతో పోల్చడం దారుణమని స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు మండిపడ్డారు. దళితుడిని అవమానించిన చంద్రబాబుపై వెంటనే కేసు నమోదు చేయాలని కోరుతూ పార్టీ జిల్లా శాఖ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, గ్రామ సర్పంచ్ శెట్టిబత్తుల కుమారరాజా, ప్రత్తిపాడు నియోజకవర్గ పబ్లిసిటీ సెల్ అధ్యక్షుడు సరమర్ల మధుబాబు ఆధ్వర్వంలో పార్టీ నాయకులు అన్నవరం పోలీసుస్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. జగన్ కాన్వాయ్లో కారు సింగయ్యను ఢీకొట్టలేదని వేరే కారు ఢీ కొట్టిందని మొదట ప్రకటించిన జిల్లా ఎస్పీ నాలుగు రోజుల తరువాత ఢీ కొట్టిందని చెప్పడం వెనుక కుట్ర దాగుందన్నారు. తన భర్త మృతి వెనుక కుట్ర ఉందని సింగయ్య భార్య లూర్తు మేరీ పేర్కొన్నారని తెలిపారు. దీనిని కప్పిపుచ్చడానికి సింగయ్యను కుక్కపిల్లలా పక్కన పడేశారని సీఎం అనడం దళితులను అవమానించడమే అన్నారు. దీనిపై కేసు నమోదు చేయాలని వారు హెచ్సీ ప్రభాకరావుకు ఫిర్యాదు అందజేశారు. ఆశిన శ్రీనివాస్, ఎస్.రాము పాల్గొన్నారు. -
బాబు మోసాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలి
– వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు రాజా సాక్షి ప్రతినిధి, కాకినాడ: చంద్రబాబు ఏడాది కాలంగా చేసిన మోసాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైఎస్సార్ సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పిలుపునిచ్చారు. బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా కాకినాడ సిటీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి రాజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ శుక్రవారం జరిగిన సమావేశంలో రాజా మాట్లాడుతూ పార్టీ నేతలు సమస్యలపై ప్రజలకు అండగా నిలవాలన్నారు. అధికార పార్టీ వేధింపులకు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఎవరూ బెదిరిపోరన్నారు. ప్రజలు ఎప్పుడూ వైఎస్సార్ సీపీ వెన్నంటే ఉన్నారన్నారు. అక్రమంగా కూటమి ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా వెనుకాడేదే లేదన్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ప్రజల పక్షాన వారి సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించారన్నారు. కోవిడ్ సమయంలోనూ సంక్షేమానికి ఎక్కడా లోటులేకుండా దేశంలో ముందుకు తీసుకువెళ్లిన ఏకై క ముఖ్యమంత్రి జగన్ అన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు కలిసికట్టుగా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఇటీవల నియమితులైన పార్టీ జిల్లా, అనుబంధ కమిటీల ప్రతినిధులను రాజా, ద్వారంపూడి సత్కరించారు. రాజాను ద్వారంపూడి ఆధ్వర్యంలో పార్టీ సిటీ నేతలు సత్కరించారు. పార్టీ అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీిప్తి, పార్టీ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, బీసీ సెల్ అధ్యక్షుడు అల్లి రాజబాబు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాగిరెడ్డి అరుణ్కుమార్(బన్నీ), పార్టీ ప్రచార కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు వర్థినీడి సుజాత, సిటీ యువజన విభాగం అధ్యక్షుడు రోకళ్ల సత్యనారాయణ, మహిళా అధ్యక్షురాలు పసుపులేటి వెంకటలక్ష్మి పాల్గొన్నారు. -
అట్టహాసంగా పట్టాల పండగ
●● ఘనంగా జేఎన్టీయూకే 11వ స్నాతకోత్సవం ● కులపతి హోదాలో హాజరైన గవర్నర్ అబ్దుల్ నజీర్ ● బంగారు పతకాలు, పట్టాల ప్రదానం బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కాకినాడ జేఎన్టీయూకేలో శుక్రవారం 11వ స్నాతకోత్సవం వర్సిటీ ఆవరణలో అట్టహాసంగా జరిగింది. అతిరథ మహారథుల మధ్య అత్యంత వైభవంగా కనుల పండువగా నిర్వహించారు. 16 సంవత్సరాల చరిత్ర కలిగిన జేఎన్టీయూ కాకినాడ ప్రాంగణం ఇందుకు వేదికగా నిలిచింది. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ వర్సిటీ చాన్సలర్ హోదాలో హాజరయ్యారు. దీంతో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య పరిమిత సంఖ్యలో ఆహూతులతో కార్యక్రమం నిర్వహించారు. 2023 మే 31న 9వ స్నాతకోత్సవం, 2024 జనవరి 30వ తేదీ వర్సిటీ 10వ స్నాతకోత్సవానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరుకాగా మళ్లీ ఇప్పుడు వరుసగా మూడవ సారి కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. బంగారు పతకాలు, పీహెచ్డీలు పొందేవారు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనడంతో ఆడిటోరియం కొత్త శోభను సంతరించుకుంది. వీసీ డాక్టర్ సీఎస్ఆర్కే ప్రసాద్ కళాశాల పూర్వ విద్యార్థి కోట సుబ్రహ్మణ్యంకు(సుబుకోటా)కు గౌరవ డాక్టరేట్ను గవర్నర్ చేతుల మీదుగా అందజేశారు. గంటా ఐదు నిమిషాల పాటు జరిగిన కార్యక్రమంలో పటిష్ట బందోబస్తు మధ్య 40మంది విద్యార్థులకు బంగారు పతకాలు, ఎండోమెంట్స్ అవార్డ్స్ అందజేశారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సెల్ఫీలతో సందడి చేశారు. పరిమితంగా అనుమతి ఆడిటోరియంలోకి పరిమిత సంఖ్యలో అనుమతించగా బయట ప్రత్యేకంగా ఎల్సీడీలు ఏర్పాటు చేసి లైవ్ ద్వారా వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. తొలుత పతకాలు, పట్టాల గ్రహీతలతో వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గవర్నర్ అనుమతితో కార్యక్రమం ప్రారంభించారు. షెడ్యూల్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరవుతారని సమాచారం ఇవ్వగా ఆయన వేడుకలకు హాజరుకాలేదు. ముఖ్యఅతిథి శ్రీ కోట సుబ్రహ్మణ్యం (సుబు కోట)మాట్లాడుతూ సాంకేతిక రంగాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అగుమెంటెడ్ రియాల్టీల ప్రాముఖ్యతను తెలియజేయడంతో పాటు స్టార్టప్ల కోసం ఏర్పాటయ్యే ఇంక్యుబేషనన్ సెల్స్ విశిష్టతను తెలిపారు. రేపటి యూనికార్న్లుగా మారేందుకు సొంత స్టార్టప్లను ప్రారంభించాలనుకునే జేఎన్టీయూకే విద్యార్థులను ఆయన అభినందించారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని చేపడుతున్న పరిశోధనల ద్వారా నూతన ఆవిష్కరణలు, ఐటీ, బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ రంగాలలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఉప కులపతి ప్రొఫెసర్ సి.ఎస్.ఆర్.కె.ప్రసాద్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలను ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వంతో తీర్చిదిద్దాలని, మార్పులు చేయడంలో ధైర్యం, ధృడ నిశ్చయం, పెద్ద కలలు కనే సాహసం, సాంకేతిక కార్యకలాపాలలో లోతైన పరివర్తనకు ధైర్యం అవసరమని పట్టభద్రులకు సూచించారు. పరిశోధన కోసం నూతన కోణాలను అవలంబించాలని, సమాజ శ్రేయస్సు కోసం పరిశోధనా ప్రాజెక్ట్లను చేపట్టాలని కోరారు. పరిశ్రమ, విశ్వవిద్యాలయాలకు అనుసంధానంగా పాఠ్యాంశాలు, కోర్సు రూపకల్పనలు, పరిశ్రమలలో పరిశోధనలను జాతీయ విద్యా విధానం ప్రోత్సహిస్తుందన్నారు. పరిశోధక విద్యార్థులు, గ్రాడ్యుయేట్లు జాతీయ క్వాంటమ్ మిషన్లో పాల్గొని సమాజ ప్రయోజనం కోసం అధునాతన విప్లవాత్మక సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావాలన్నారు. అమృత్ కాల్కు సంబంధించి స్పష్టమైన విజన్ను రూపొందించడానికి, వికసిత్ భారత్ ద్వారా 2047 నాటికి దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపేందుకు అందరం కలిసి పనిచేద్దామన్నారు. అధిక కొవ్వు గల పదార్థాలను తీసుకోరాదని, పొగ తాగడం, మద్యం, డ్రగ్స్కు దూరంగా ఉండాలన్నారు. మనం ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యకరంగా ఉంటుందని, దీనికి ప్రతీ ఒక్కరూ యోగా సాధన చేయాలని సూచించారు. అనంతరం ఉప కులపతి ప్రొ.సి.ఎస్.ఆర్.కె.ప్రసాద్ గవర్నర్ అబ్దుల్ నజీర్ను శాలువాతో సత్కరించి మెమెంటోను బహూకరించారు. ఈ స్నాతకోత్సవంలో 99 మంది రీసెర్చ్ స్కాలర్స్కు పీహెచ్డీ అవార్డులు అందజేశారు. కలెక్టర్ శ్రీ ఎస్.షణ్మోహన్, ఎమ్మెల్సీ శ్రీమతి కర్రి పద్మశ్రీ, రెక్టార్ కేవీ రమణ, రిజిస్ట్రార్ రవీంద్రనాఽథ్, నల్లమిల్లి శేషారెడ్డి, మాజీ వీసీలు డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు, కొప్పిరెడ్డి పద్మరాజు, శ్రీనివాసకుమార్, కే.మురళీకృష్ణ, శ్రీనివాసరావు, పాలక మండలి సభ్యులు, డైరెక్టర్లు పాల్గొన్నారు. -
జర్నలిస్టులకు పెన్షన్ అమలు చేయాలి
కాకినాడ సిటీ: దేశంలోని 14 రాష్ట్రాల్లో జర్నలిస్టులకు పెన్షన్ విధానం అమలవుతున్నా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవ్వడం లేదని ఏపీడబ్ల్యూజెఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు డిమాండ్ చేశారు. శుక్రవారం కాకినాడ యూటీఎఫ్ హోంలో ఫెడరేషన్ కాకినాడ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. పలు సమస్యలపై సమాచార శాఖ మంత్రిని కలిసి సుదీర్ఘంగా చర్చించామని, దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. సచివాలయంలో జర్నలిస్టు సంఘాల అన్నింటితో ఒక సమావేశం ఏర్పాటు చేసి విధి విధానాలు రూపొందిస్తామన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై ప్రస్తుత ప్రభుత్వం ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టించే ప్రయత్నంపై కసరత్తు చేస్తోందని మంత్రి వివరించినట్లు ఆంజనేయులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వాతాడ నవీన్రాజ్, ముమ్మిడి లక్ష్మణ్, ఫెడరేషన్ మాజీ అధ్యక్షులు అల్లుమల్లు ఏలియా తదితరులు పాల్గొన్నారు. -
మన్యం వీరునికి ఘన నివాళులు
కాకినాడ సిటీ: స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు చూపిన ధైర్య సాహసాలు వెలకట్టలేనివని, ఆయన అందించిన స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తుందని కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు. శుక్రవారం అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా జిల్లా గిరిజన సంక్షేమం, సీతారామరాజు స్మారక కళావేదిక ఆధ్వర్యంలో కాకినాడ నాగమల్లితోట జంక్షన్ వద్ద అల్లూరి సీతారామరాజు విగ్రహానికి కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా,ఎంపీ సానా సతీష్బాబు, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖరం ఇతర జిల్లా అధికారులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన ప్రాంత ప్రజలలో స్వాతంత్య్ర కాంక్షను రగిలించడంలో అల్లూరి కీలక పాత్ర పోషించారన్నారు. గిరిజన ప్రజలకు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి ఆయన ధైర్య సాహసాలు స్ఫూర్తిగా నిలుస్తాయని కలెక్టర్ తెలిపారు. డీటీడబ్ల్యూవో ఎన్ నాగమల్లేశ్వరరావు, సెట్రాజ్ సీఈవో మల్లికార్జునరావు పాల్గొన్నారు. 6న స్విమ్మింగ్ క్రీడాకారుల ఎంపికలు నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): జిల్లా స్విమ్మింగ్ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 6న స్విమ్మింగ్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు సంఘ కార్యదర్శి ఐ.రాజు శుక్రవారం తెలిపారు. స్థానిక జిల్లా క్రీడామైదానంలోని స్విమ్మింగ్ పూల్లో ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. సబ్ జూనియర్స్, జూనియర్స్ విభాగంలో బాలురు, బాలికల ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 19, 20 తేదీలలో విశాఖలో జరిగే అంతర్ జిల్లా స్విమ్మింగ్ పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ప‘రేషాన్’సామర్లకోట: రేషన్ షాపుల ద్వారా బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభం కావడంతో లబ్ధిదారుల కష్టాలు మొదలయ్యాయి. స్థానిక 13వ వార్డులోని ప్రజలకు ఒక కిలోమీటరు దూరంలో ఉన్న రేషన్ షాపు నుంచి సరకులు తెచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై శుక్రవారం 13వ వార్డు బలుసులపేటకు చెందిన వృద్ధురాలు ముసలమ్మ నెత్తిపై బియ్యం మూట పెట్టుకొని మోయలేక అవస్థ పడింది. ముసలమ్మ మాట్లాడుతూ గతంలో ఇంటి వద్దకే వాహనం రావడంతో శ్రమ ఉండేది కాదని చెప్పింది. చంద్రబాబు వచ్చి కష్టాలు తెచ్చాడని ఆవేదన వ్యక్తం చేసింది. తల్లికి వందనం కోసం పోస్టల్ ఖాతాలు తెరవాలి కాకినాడ సిటీ: ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు తల్లికి వందనం డబ్బు జమ చేసేందుకు వీలుగా పోస్టాఫీసులో రూ.200తో కొత్త ఖాతాను తెరిచి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పోర్టల్లో ఆధార్ అనుసంధానం చేసుకోవాలని సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకులు ఎంఎస్ శోభారాణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు పోస్టల్ డిపార్టుమెంట్ ద్వారా మేళా నిర్వహిస్తారన్నారు. మేళా తేదీ ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్ ద్వారా తెలియజేస్తామన్నారు. మేళాకు విద్యార్థులందరూ ఆధార్కార్డుతో పాటు ఆధార్కు అనుసంధానం చేయబడిన ఫోన్ను కూడా తీసుకు వెళ్లాలని వివరించారు. -
ఆగస్టు 1 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
కాకినాడ సిటీ: జిల్లా స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో ఆగస్టు 1 నుంచి 20వ తేదీ వరకూ జరిగే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ చేయాలని కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆర్మీ రిక్రూట్మెంట్ డైరెక్టర్ కల్నల్ ఆర్కే సింగ్ మాట్లాడుతూ, విశాఖపట్నం ఆర్మీ రిక్రూట్మెంట్ విభాగం ఆధ్వర్యాన అగ్నిపథ్ స్కీమ్ కింద ఈ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. శ్రీకాకుళం నుంచి కృష్ణా వరకూ ఉన్న 13 జిల్లాలతో పాటు యానాంకు చెందిన దాదాపు 22 వేల మంది అభ్యర్థులు ఈ రిక్రూట్మెంట్కు దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. వీరితో పాటు 145 మంది రిక్రూటింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొంటారన్నారు. రిక్రూట్మెంట్ నిర్వహణకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని జిల్లా యంత్రాంగాన్ని కోరారు. ఈ మేరకు ఆయా శాఖల ద్వారా చేపట్టాల్సిన పనులపై కలెక్టర్ షణ్మోహన్ దిశానిర్దేశం చేశారు. ప్రతి రోజూ సుమారు 800 మంది అభ్యర్థులు పాల్గొంటారన్నారు. వీరికి ఆహారం అందించేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని, ఆసక్తి ఉన్నవారు పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ దేవులా నాయక్ను 77020 03535 నంబర్లో సంప్రదించాలని కోరారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, డీఆర్ఓ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. 9వ తేదీకి ఉచిత ప్రవేశాలు పూర్తి కావాలి కాకినాడ సిటీ: ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు కేటాయించిన 25 శాతం ఉచిత ప్రవేశాలను ఈ నెల 9వ తేదీ నాటికి కచ్చితంగా పూర్తి చేయాల్సిందేనని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి స్పష్టం చేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో కలెక్టరేట్లో గురువారం ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రైవేటు పాఠశాలలు ఏదో ఒక కారణం చెప్పి తమ పిల్లలకు ఉచిత ప్రవేశాలు నిరాకరిస్తున్నాయంటూ తల్లిదండ్రుల నుంచి మూడు వారాలుగా గ్రీవెన్స్ సెల్కు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయని వివరించారు. ఉచిత ప్రవేశాలు కల్పించని పాఠశాలలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పేద విద్యార్థులు తల్లికి వందనం పథకం ప్రయోజనాలు కోల్పోకుండా ఈ నెల 9వ తేదీ లోగానే అర్హులైన అందరికీ ఉచిత ప్రవేశాలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎవరికై నా ఉచిత ప్రవేశం నిరాకరిస్తే అందుకు స్పష్టమైన కారణాలతో సంబంధిత ఎంఈఓకు వివరణ సమర్పించాలన్నారు. పాఠశాలలు తెలిపిన అభ్యంతరాలు, కారణాలను పునఃపరిశీలించి, తిరస్కరించిన విద్యార్థుల్లో అర్హులను ఎంఈఓలు మళ్లీ ఆయా పాఠశాలలకు కేటాయిస్తారని వివరించారు. ఈ నెల 10న జిల్లావ్యాప్తంగా పేరెంట్, టీచర్ సమావేశాలు జరుగుతాయని కలెక్టర్ తెలిపారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. సమావేశంలో డీఈఓ పి.రమేష్, సమగ్రశిక్షా అభియాన్ ఏపీసీ వేణుగోపాల్, ఎంఈఓలు, ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులు పాల్గొన్నారు. -
రైల్వే స్టేషన్ను పరిశీలించిన ఎస్పీ
సామర్లకోట: రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ వందేభారత్ రైలులో విజయవాడ నుంచి సామర్లకోట వచ్చి, కాకినాడ వెళ్తారనే సమాచారం మేరకు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ గురువారం స్థానిక రైల్వే స్టేషన్ను సందర్శించారు. ప్లాట్ఫాం, అక్కడి నుంచి బయటకు వచ్చే మార్గాన్ని పరిశీలించారు. ప్రధాన మార్గంలో అభివృద్ధి పనులు జరుగుతూ ఉండటంతో పార్సిల్ కార్యాలయం సమీపాన ఉన్న మార్గం నుంచి గవర్నర్ కాన్వాయ్ వచ్చే విధంగా ఏర్పాట్లను పరిశీలించారు. ఆ మార్గంలోని వాహనాలను పూర్తిగా తొలగించాలని స్టేషన్ మేనేజర్ ఎం.రమేష్కు సూచించారు. గవర్నర్ వస్తారనే సమాచారం నేపథ్యంలో స్టేషన్ ఆవరణను శుభ్రం చేయించడంపై రమేష్తో కలసి మున్సిపల్ కమిషనర్ ఎ.శ్రీవిద్య పరిశీలన జరిపారు. కార్యక్రమంలో డీఎస్పీ డి.శ్రీహరిరాజు, సీఐ ఎ.కృష్ణభగవాన్, ట్రాఫిక్ ఎస్పై అడపా గరగారావు, టికెట్ ఇన్స్పెక్టర్ చైతన్య తదితరులు పాల్గొన్నారు. నేడు మరిడమ్మ ఆలయం మూసివేత పెద్దాపురం: మరిడమ్మ అమ్మవారి ఆలయాన్ని శుక్రవారం మూసివేస్తున్నట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కె.విజయలక్ష్మి గురువారం విలేకర్లక తెలిపారు. ఆషాఢ మాస ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి అమ్మవారికి కుంభం వేస్తారన్నారు. అందువలన ఆలయ తలుపులు మూసివేయడంతో శుక్రవారం అమ్మవారి దర్శనం ఉండదన్నారు. శనివారం వేకువజామున ఆలయం తెరచి, ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు దర్శనాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఉద్యానవనశాఖ అధికారిగా మల్లికార్జునరావు రాజమహేంద్రవరం రూరల్: జిల్లా ఉద్యానవనశాఖ అధికారిగా నేతల మల్లికార్జునరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ పనిచేసిన బి.సుజాత కుమారి గత నెల 30 ఉద్యోగ విమరణ చేశారు. దీంతో కాకినాడ జిల్లా నుంచి మల్లికార్జునరావు ఇక్కడకు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టర్ పి.ప్రశాంతిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. జిల్లాలోని హార్టికల్చర్ రంగంలో అంతర పంటల సాగు విస్తీర్ణం పెంచడంపై దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా సూక్ష్మ నీటిపారుదలశాఖ అధికారి ఎ.దుర్గేష్, విశ్రాంత డీహెచ్వో బి.సుజాత కుమారి, కొవ్వూరు మండల హార్టికల్చర్ అధికారి డి.సుధీర్ కుమార్ పాల్గొన్నారు. సమర్థంగా నేరాల కట్టడి ● పోలీసు అధికారులు, సిబ్బంది సహకారం భేష్ ● ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలి ● నేర సమీక్షలో ఎస్పీ నరసింహ కిశోర్ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పోలీసు అధికారులు, సిబ్బంది సహకారంతో జిల్లాలో నేరాలను సమర్థంగా అరికట్టగలుగుతున్నామని ఎస్పీ నరసింహ కిశోర్ అన్నారు. స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో గురువారం అర్థ సంవత్సర నేర సమీక్ష నిర్వహించారు. 2025లో ఇప్పటి వరకూ జరిగిన సంఘటనలు, చేపట్టిన వివిధ కార్యక్రమాలు, పోలీసులు ఛేదించిన కేసులు, సాధించిన విజయాలను చర్చించారు. కేసుల దర్యాప్తులో ఎదురవుతున్న సవాళ్లు, వాటిని అధిగమించే మార్గాలను గుర్తించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలతో పోలీసులు స్నేహపూర్వకంగా మెలగాలన్నారు. మహిళలు, పిల్లలపై జరిగే నేరాలపై తక్షణమే స్పందించాలని, బాధితులకు అండగా నిలవాలన్నారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, కట్టడి చేయాలన్నారు. ఈ సమీక్షలో గుర్తించిన లోపాలను సరిదిద్దుకొని, రాబోయే ఆరు నెలలకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీలు ఎంబీఎన్ మురళీకృష్ణ, ఎల్.అర్జున్, ఎస్బీ డీఎస్పీ బి.రామకృష్ణ, ఎస్బీ ఇన్స్పెక్టర్ ఏ.శ్రీనివాసరావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పరిహారం ఇస్తేనే పచ్చజెండా
● భారత్ మాల రోడ్డుకు తీసుకున్న భూమికి డబ్బులివ్వాలి ● తర్వాతే నిర్మాణం మొదలుపెట్టాలి ● టెండర్ ప్రకటనతో అన్నవరం రైతుల ఆందోళనఅన్నవరం: తమ భూములకు పరిహారం చెల్లించకుండానే భారత్ మాల రోడ్డు నిర్మాణానికి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) టెండర్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై అన్నవరం రైతులు ఆందోళన చెందుతున్నారు. భారత్ మాల పరియోజన మొదటి దశలో కాకినాడ వాకలపూడి లైట్హౌస్ నుంచి అన్నవరం వరకూ 40.621 కిలోమీటర్ల పొడవున జాతీయ రహదారి (ఎన్హెచ్–516ఎఫ్) నిర్మించాలని అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం 2020లో నిర్ణయించింది. సాగర తీరం వెంబడి పారిశ్రామికాభివృద్ధికి ఈ రోడ్డు ఉపయోగపడుతుందని భావించింది. ఈ మేరకు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) అధికారులు 2021లో ఒకసారి టెండర్ నోటిఫికేషన్ ఇచ్చి, వివిధ కారణాలతో రద్దు చేశారు. తాజాగా మూడు రోజుల క్రితం రీ టెండర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ రోడ్డు నిర్మాణానికి రూ.1,040 కోట్లతో అంచనా రూపొందించారు. ఈ రోడ్డు అన్నవరం వద్ద సత్యదేవుని నమూనా ఆలయం సమీపాన 16వ నంబర్ జాతీయ రహదారిని కలుస్తుంది. అక్కడ కత్తిపూడి హైవే సర్కిల్ మాదిరిగా అతి పెద్ద సర్క్యులర్ ఫ్లై ఓవర్ నిర్మించనున్నారు. ఆ సర్కిల్ నుంచి రత్నగిరిపై సత్యదేవుని ఆలయం కనిపిస్తుంది. అందువలన అక్కడ ప్రయాణికులు ఆగేందుకు వీలుగా రోడ్డు నిర్మించనున్నారు. 2021 నుంచే వివాదం ఈ రహదారి నిర్మాణానికి తమ వద్ద నుంచి రూ.కోట్ల విలువైన భూములను తీసుకున్న ఎన్హెచ్ఏఐ అధికారులు తమకు పరిహారం చెల్లించకుండానే టెండర్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై అన్నవరం రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఈ రహదారికి సంబంధించిన భూసేకరణ వివాదం 2021 నుంచే కొనసాగుతోంది. వాకలపూడి లైట్హౌస్ నుంచి కాకినాడ రూరల్, యు.కొత్తపల్లి, తొండంగి మండలాల మీదుగా అన్నవరం వరకూ 516ఎఫ్ హైవే నిర్మాణం సాగుతుంది. దీని కోసం 2021లో అన్నవరం, ఆరెంపూడి గ్రామాల పరిధిలో 40 ఎకరాలు సేకరించారు. ఇందులో 20 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా, మిగిలిన 20 ఎకరాలు చిన్న, సన్నకారు రైతులకు చెందినది. ఈ భూములు సత్యదేవుని పాత నమూనా ఆలయానికి సమీపాన 16వ నంబర్ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్నాయి. తమ భూములను 516ఎఫ్ హైవే కోసం సేకరించడంపై అప్పట్లోనే రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తమకున్న భూమే తక్కువని, అది కూడా భూసేకరణలో పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అన్నవరంలో హైవేని ఆనుకుని ఎకరం భూమి విలువ మార్కెట్ రేటు ప్రకారం రూ.4 కోట్లు పైనే ఉంది. ఆరెంపూడి గ్రామంలో సర్వే నంబర్లు 177, 105, 108లో ఉన్న 20 మంది రైతులకు చెందిన పదెకరాలకు సంబంధించి ఎకరానికి రూ.కోటి చొప్పున ఇప్పటికే పరిహారం చెల్లించారు. అయితే, ఒకేచోట భూమి ఉన్నప్పటికీ రికార్డుల్లో గ్రామం పేరు, సర్వే నంబర్లు మారడంతో అన్నవరం రైతులకు మాత్రం పరిహారం చెల్లించలేదు. ఈవిధంగా సర్వే నంబర్ 91–1లోని సుమారు 20 రైతులకు చెందిన మరో పదెకరాలకు ఇంకా పరిహారం చెల్లించాల్సి ఉంది. ఈ విషయం తేలకుండానే రోడ్డు నిర్మాణానికి టెండర్ ప్రకటన విడుదల చేయడంతో ఆ రైతులు ఆందోళన చెందుతున్నారు. పరిహారం ఇచ్చాకే నిర్మించాలి భారత్ మాల రోడ్డుకు నా 2.5 ఎకరాల భూమి సేకరించారు. మా కుటుంబ సభ్యులది రెండెకరాలు తీసుకున్నారు. వాళ్ల భూమి ఆరెంపూడి గ్రామ పరిధిలో ఉండటంతో ఎకరానికి రూ.కోటి చొప్పున చెల్లించారు. నా భూమి అన్నవరం గ్రామ పరిధిలో ఉండటంతో పరిహారం ఇవ్వలేదు. రికార్డుల్లో సర్వే నంబర్లు, గ్రామాలు మారాయని, అందువలన ఎన్హెచ్ఏఐ అధికారులు కొర్రీ వేశారని చెబుతున్నారు. దీనిపై కలెక్టర్ షణ్మోహన్ను కలిసి వినతిపత్రం కూడా ఇచ్చాం. నాతోపాటు మరో 20 మంది చిన్నకారు రైతులకు కూడా పరిహారం ఇచ్చాకే రోడ్డు నిర్మించాలి. – బండారు ముత్యాలరావు, రైతు అధికారులకు కలెక్టర్ ఆదేశం భారత్ మాల రోడ్డు నిర్మాణ భూసేకరణ సమయంలో నేను శంఖవరం మండల ఆర్ఐగా ఉన్నాను. చిన్న సాంకేతిక సమస్య కారణంగా అన్నవరం రైతులకు పరిహారం ఆలస్యమైంది. ఇటీవల ఆ రైతులతో పాటు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ను కలసి సమస్య వివరించాను. ఆ రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని కలెక్టర్ ఎన్హెచ్ఏఐ అధికారులను ఆదేశించారు. – బైరావజ్జుల ప్రసాద్, విశ్రాంత ఆర్ఐ, శంఖవరం మండలం -
ధనదైన్యాలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కూటమి సర్కారు నిర్లక్ష్య వైఖరి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్నపూర్ణగా ఖ్యాతినొందిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రైతులు పీకల్లోతు దైన్యంలో కూరుకుపోయారు. రబీ ధాన్యం డబ్బుల చెల్లింపులో ప్రభుత్వం చేస్తున్న తీరని జాప్యం అన్నదాతలకు శాపంగా మారింది. ఒకటీ రెండూ రోజులు కాదు.. ఒకరో ఇద్దరో రైతులూ కారు.. వందా రెండు వందల రూపాయలు అంతకంటే కాదు.. ఏకంగా రెండు నెలలుగా వేలాది మంది రైతులకు ప్రభుత్వం అధికారిక లెక్కల ప్రకారం రూ.399 కోట్ల మేర ధాన్యం బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇదే సమయంలో ఖరీఫ్ పంటకాలం ప్రారంభమైపోయింది. ఈ నెల 15లోగా నారుమళ్లు పూర్తి చేయాలని ప్రభుత్వం చెబుతోంది. కానీ, ధాన్యం డబ్బులు ఇవ్వడం లేదు. మరోవైపు గత వైఎస్ జగన్ ప్రభుత్వం మాదిరిగా రైతు భరోసా కింద పెట్టుబడి సాయం కూడా అందించడం లేదు. పైగా ఈ పథకం పేరును అన్నదాతా సుఖీభవగా మార్చి రూ.20 వేలు ఇస్తామని గత ఎన్నికల్లో గొప్పగా చెప్పారు. కానీ, ఇప్పటి వరకూ నయాపైసా కూడా ఇవ్వలేదు. దీంతో, సాగు పెట్టుబడి కోసం రైతులు నానా అగచాట్లూ పడుతున్నారు. ప్రభుత్వమే నెలల తరబడి ధాన్యం సొమ్ము తొక్కిపెడితే ఖరీఫ్ సాగు ఏవిధంగా చేయగలమంటూ శాపనార్థాలు పెడుతున్నారు. గొప్ప చెప్పి.. చిప్ప చూపి.. ముఖ్యమంత్రి చంద్రబాబు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు కూటమి నేతలందరూ ధాన్యం అమ్మిన 24 లేదా 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తామమని గొప్పగా చెప్పారు. మంత్రి నాదెండ్ల అయితే ధాన్యం కొనుగోళ్లు జరిగిన సమయంలో ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తూ ధాన్యం సొమ్ముపై రైతులకు ఆశలు కల్పించారు. కొనుగోళ్లు ప్రారంభమైన తొలి పక్షంలో మాత్రం ప్రచారార్భాటం కోసం రైతుల ఖాతాల్లో సొమ్ము వేశారు. మే మొదటి వారం నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి మాత్రం డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వం రైతులకు చుక్కలు చూపిస్తోంది. దీంతో, కడుపు మండిన అన్నదాతలు ధాన్యం సొమ్ము కోసం ఆయా జిల్లాల కలెక్టరేట్ల వద్ద పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. అంతే కాకుండా, తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు, నిడదవోలు రూరల్, ఉండ్రాజవరం, కొవ్వూరు, రాజమహేంద్రవరం రూరల్; కాకినాడ జిల్లా పెద్దాపురం; కోనసీమ జిల్లా అమలాపురం తదితర ప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహించారు. రైతులు తక్కువలో తక్కువ ఎకరాకు 50 బస్తాల (75 కేజీలు) దిగుబడి సాధించారు. ఈ మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించారు. ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం ప్రతి రైతుకు ఎకరానికి రూ.86 వేలు పైగా రావాలి. ఈవిధంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేలాది మంది రైతులకు ప్రభుత్వం రూ.399 కోట్ల మేర ధాన్యం డబ్బులు చెల్లించాల్సి ఉంది. ఇది ఓవైపు ఖరీఫ్ ఖరీఫ్ సాగు ప్రారంభమైపోయినా ధాన్యం బకాయిల చెల్లింపుపై ప్రభుత్వ పెద్దల నుంచి ఉలుకూపలుకూ లేదు. కాకినాడలో బుధవారం జరిగిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు సైతం ప్రభుత్వ నిర్లక్ష్యంపై మూకుమ్మడిగా ధ్వజమెత్తారు. అప్పు పుట్టక.. కూటమి సర్కారు గద్దెనెక్కినప్పటి నుంచి దాదాపు అన్ని వర్గాల వద్ద డబ్బుల్లేని దుస్థితి నెలకొంది. ఏటా పంట పెట్టుబడిలు సమయంలో సొమ్ము సర్దుబాటు చేసే కమీషన్ ఏజెంట్లు కూడా ఈసారి చేతులెత్తేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులకు అప్పు పుట్టడం లేదు. ఖరీఫ్కు సమాయత్తమయ్యే తరుణంలో రైతులు ఇన్ని కష్టాలు ఎదుర్కొంటున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని రైతు నేతలు మండిపడుతున్నారు. జిల్లాల వారీగా రబీ ధాన్యం బకాయిలు కాకినాడ రూ.80 కోట్లు కోనసీమ రూ.189 కోట్లు తూర్పు గోదావరి రూ.130 కోట్లు మొత్తం రూ.399 కోట్లు నెలలు గడుస్తున్నా ధాన్యం డబ్బులు ఇవ్వని సర్కారు ఉమ్మడి జిల్లాలో మొత్తం బకాయి రూ.399 కోట్లు ఖరీఫ్ పెట్టుబడికి రైతుల అగచాట్లు ధాన్యం సొమ్ము ఇస్తారా.. ఇవ్వరా అని ప్రశ్న ధాన్యం అమ్మి 6 వారాలైనా.. రబీలో ఆరెకరాలు సాగు చేశాను. ధాన్యం 75 కిలోల బస్తాకు ప్రభుత్వ కనీస మద్దతు ధర రూ.1,725 కంటే వ్యాపారులు తక్కువకు అడుగుతున్నారని రైతు సేవా కేంద్రం (ఆర్ఎస్కే) ద్వారా ప్రభుత్వానికి విక్రయించాను. మే నెలలో 70 కిలోల ధాన్యం బస్తాలు 260 తూచాను. మద్దతు ధర ప్రకారం రూ.4,18,600 రావాలి. మా బ్యాంక్ అకౌంట్లకు ధాన్యం డబ్బులు 24 గంటల్లో జమవుతాయంటే అమ్మాను. ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా రాలేదు. ఆర్ఎస్కే, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాను. తొలకరి సీజన్ ప్రారంభమైపోయింది. విత్తనాలకు, నారుమడి దమ్ముకు చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. ఒకవైపు చేసిన అప్పులకు వడ్డీ పెరిగిపోతోంది. కూటమి ప్రభుత్వం ప్రకటించిన అన్నదాతా సుఖీభవ పథకం అమలు కాక, ధాన్యం లెక్క (డబ్బులు) అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఒకవైపు కుటుంబ ఖర్చులు, మరోవైపు తొలకరి పెట్టుబడులకు కొత్తగా అప్పులు చేయాల్సి వస్తోంది. వెంటనే ధాన్యం డబ్బులు ఇవ్వాలి. – వెలుగుబంట్ల రవినాయుడు, రైతు, కూరాడ, కరప మండలం దారుణం ధాన్యం విక్రయించిన 40 రోజులు గడచినా ఇప్పటి వరకూ నయాపైసా కూడా చేతికి రాలేదు. గత ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడి సహాయంగా రూ.20 వేలు ఇస్తామని చెప్పింది. ఏడాది గడచినా ఇప్పటి వరకూ ఇవ్వలేదు. ఇటు ధాన్యం డబ్బులు, అటు పెట్టుబడి సాయం ఇవ్వపోతే రైతులు ఖరీఫ్ పంటలు ఎలా పండించగలరు? పరిస్థితి ఇలాగే కొనసాగితే వ్యవసాయం చేయడం కష్టంగా మారుతుంది. ఒకవైపు అతివృష్టి, అనావృష్టితో రైతులు ఇబ్బందులకు గురవుతూ ఉంటే ధాన్యం అమ్మిన సొమ్ము కూడా ఇవ్వకపోవడం దారుణంగా ఉంది. – వెలమర్తి బుల్లిరాజు, రైతు, వీకే రాయపురం, సామర్లకోట మండలం -
కాకినాడలో జాతీయ జూనియర్ మహిళా హాకీ పోటీలు
కాకినాడ సిటీ: వచ్చే నెల 1 నుంచి 12వ తేదీ వరకూ కాకినాడలో జరగనున్న జాతీయ జూనియర్ మహిళా హాకీ చాంపియన్షిప్ పోటీల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. ఈ పోటీల నిర్వహణపై కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా క్రీడా మైదానంలో ఆస్ట్రోటర్ఫ్ హాకీ ఫీల్డ్లో ఈ పోటీలు జరుగుతాయన్నారు. దీనికి 29 రాష్ట్రాల నుంచి సుమారు 500 మంది క్రీడాకారులు, 200 మంది సహాయక సిబ్బంది హాజరవుతారని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా వసతి, భోజన ఏర్పాట్లు చేయాలన్నారు. ఆయా శాఖలు చేపట్టాల్సిన పనులపై దిశానిర్దేశం చేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, డీఆర్ఓ జె.వెంకటరావు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాస కుమార్, ఆర్డీఓ ఎస్.మల్లిబాబు, హాకీ ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ జి.హర్షవర్ధన్, జాయింట్ సెక్రటరీ బి.రవిరాజు, సెట్రాజ్ సీఈఓ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. రేషన్ షాపులకు చేరని బియ్యం అయినవిల్లి: ప్రతి నెలా ఒకటో తేదీనే రేషన్ బియ్యం లబ్ధిదారులకు చేరేవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత నెల రేషన్ బియ్యం వ్యాన్ల ద్వారా రేషన్ బియ్యం ఇవ్వడం నిలిపేసి పాత విధానంలో డీలర్ల ద్వారా లబ్ధిదారులకు రేషన్ బియ్యం ఇవ్వడం ప్రారంభించారు. ఈ నెల మూడోవ తేదీ దాటినా అయినవిల్లి మండలంలోని చాలా వరకూ షాపులకు రేషన్ బియ్యం దిగుమతి కాలేదు. దీంతో రేషన్షాపు యజమానులు చేసేది లేక లబ్ధిదారులను వెనుకకు తిరిగి పంపిస్తున్నారు. దీంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనే ఒకటో తేదీనే రేషన్ బియ్యం ఇంటికి వచ్చేవని, కూటమి ప్రభుత్వం విధానం మార్చడంతో ఇబ్బంది పడుతున్నామని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ షాపులకు వెళ్లి అక్కడ తలుపులకు తాళాలు దర్శనమిస్తున్నాయి. దీంతో పలువురు రెవెన్యూ అధికారులకు పరిస్థితి వివరించారు. మండలంలోని 41 రేషన్ షాపులు ఉండగా 30 శాతం షాపులకు మాత్రమే రేషన్ బియ్యం సరఫరా చేసినట్లు చెబుతున్నారు. గోడౌన్లో బియ్య సరఫరా లేకపోవడంతో ఆలస్యం అయిన మాటా వాస్తవమేనని, స్టాకు రాగానే మిగిలిన 70శాతం షాపులకు బియ్యం సరఫరా చేస్తామన్నారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గాల పరిశీలకుల నియామకంరావులపాలెం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏడుగురు పరిశీలకులను నియమించినట్టు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి గురువారం తెలిపారు. రావులపాలెం మండలం గోపాలపురంలోని జగ్గిరెడ్డి స్వగృహంలో గురువారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో నూతనంగా నియమితులైన పరిశీలకుతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ ఉన్న క్యూఆర్ కోడ్ ప్రతాలను వారికి అందజేశారు. వాటితో చంద్రబాబు ఇచ్చిన మోసపు హామీలను ప్రజలకు వివరించాలన్నారు. అనంతరం ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక పరిశీలకులను నియమించి వారి విధివిధానాలను క్లుప్తంగా వివరించారు. మండపేట నియోజకవర్గానికి పరిశీలకులుగా కటకంశెట్టి ఆదిత్య, రామచంద్రపురం – కుడిపూడి శ్రీనివాసరావు, ముమ్మిడివరం – మాత మురళి, అమలాపురం – పేరి శ్రీనివాస కామేశ్వరరావు, పి.గన్నవరం – పెన్మత్స చిన్న భద్రరాజు, రాజోలు– వంటెద్దు వెంకన్ననాయుడు, కొత్తపేట – సిరిపురపు శ్రీనివాసరావును నియమించినట్టు తెలిపారు. ధనిక, పేద తారతమ్యం తగ్గాలి అమలాపురం రూరల్: ప్రైవేట్, పీపుల్స్, ప్రభుత్వ భాగస్వామ్యం ద్వారా ధనిక, పేదల మధ్య తారతమ్యం తగ్గించేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్. కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. -
డ్రెయిన్లో పడి యువకుడి మృతి
కాజులూరు: మోటార్ బైక్ అదుపు తప్పడంతో స్థానిక టేకి డ్రెయిన్లో పడి దాకమూరి నాగరాజు (22) మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం కోలంక గ్రామానికి చెందిన దాకమూరి నాగరాజు హైదరాబాద్లో ర్యాపిడో సర్వీసులో పనిచేస్తున్నాడు. ఇటీవల గ్రామంలో అమ్మవారి జాతరకు వచ్చాడు. సోమవారం రాత్రి కోలంక నుంచి ద్రాక్షారామ వెళుతుండగా, ఉప్పుమిల్లి శివారు గొప్పిరేవు వద్ద మోటార్ బైక్ అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో నాగరాజు శిథిలమైన రెయిలింగ్ నుంచి టేకి డ్రెయిన్లో పడిపోయాడు. మృతదేహం కొట్టుకుపోయి, తాళ్లరేవులో లభ్యమైంది. కాగా, నాగరాజుకు వివాహం కాలేదు. తల్లిదండ్రులు ఉన్నారు. కోలంకలో మృతుని ఇంటి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్టు గొల్లపాలెం పోలీసులు తెలిపారు. ఎస్సై మోహన్కుమార్ దర్యాప్తు చేస్తున్నారు. -
అన్నదాత ఇంట.. సిరుల పంట
ఆలమూరు: వ్యవసాయంలో అధిక పెట్టుబడిని, కూలీల కొరతను ఎదుర్కొనేందుకు రైతులు అనేక అధునాతన పద్ధతులను అవలంబిస్తున్నారు. దీంతో వరి సాగులో ఏటా అనేక మార్పులు సంభవిస్తూ, వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతుంది. అత్యాధునిక, పురాతన సంప్రదాయాలతో వ్యవసాయం చేపట్టడం ద్వారా రైతులు పెట్టుబడిని నియంత్రించుకుని అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఈ ఏడాది రబీ సీజన్లో దిగుబడి ఆశాజనకంగా ఉన్నా, సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు కొంత నిరుత్సాహంగా ఉన్నారు. ఈ సీజన్లో ధాన్యం సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయకపోయినా, అన్నదాత సుఖీభవ అమలు చేయకపోయినా రైతులు మాత్రం ఖరీఫ్ సీజన్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే పెరిగిన ఎరువుల ధరలు, కూలీల కొరత వల్ల పెట్టుబడిని తగ్గించుకునేందుకు ఈసారి అధికంగా రైతులు వినూత్న రీతిలో వెదజల్లు సాగు చేపట్టారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో 1.64 లక్షల ఎకరాల్లో 1.06 లక్షల మంది రైతులు వ రిసాగు చేపట్టారు. స్వర్ణ (7029)కు ప్రత్యామ్నాయంగా ఎంటీయూ (1318), ఎంటీయూ (1121) రకాలు వినియోగించాలని వ్యవసాయ శాఖ సూచించింది. ఈ కొత్త వంగడాల వల్ల నారుమడులు సరైన రీతిలో యాజమాన్య పద్ధతులు పాటిస్తే, చీడపీడలు నివారించి నష్ట నివారణను అరికట్టవచ్చునని అధికారులు చెబుతున్నారు. స్వర్ణ (7029)కే రైతుల మొగ్గు రైతులు మాత్రం ఏళ్ల తరబడి సంప్రదాయబద్ధంగా వస్తున్న స్వర్ణ (7029) రకానికి మాత్రమే ప్రాధాన్యమిస్తున్నారు. ఈ సీజన్లో 70 శాతం మేర స్వర్ణ రకం సాగు చేస్తుండగా, మిగతా ఇతర రకాలను సాగు చేస్తున్నారు. ఈ ఖరీఫ్ సాగుకు 35 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని అంచనా వేయగా, రైతుల నుంచి సుమారు మూడు వేల క్వింటాళ్ల సేకరణ ఇప్పటికే జరిగింది. ప్రస్తుతం వివిధ గ్రామాల్లో దాదాపు వెయ్యి క్వింటాళ్ల విత్తనాలు ఆర్ఎస్కేలకు సరఫరా చేసేందుకు వ్యవసాయ శాఖ సమాయత్తమవుతోంది. ఈ సీజన్లో సుమారు 80 శాతం మేర వెదజల్లు సాగును ఎంచుకోగా, మిగిలిన రైతులు వరినాట్ల పద్ధతిని అవలంబిస్తున్నారు. సాగునీటి ఎద్దడి దృష్ట్యా వ్యవసాయ శాఖ ఈ నెల 15 నాటికి నాట్లు పూర్తి చేయాలని సూచించడంతో, రైతులు పనులను వేగవంతం చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు కూడా వెదజల్లు వల్ల లాభాలపై అవగాహన కల్పించడంతో రైతులు ఈ విధానంపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ ఏడాది విత్తనాలు రైతులకు సమృద్ధిగా అందుబాటులో ఉండటంతో, సమయానికి ముందే రైతులు సాగు చేపట్టారు. డ్రమ్ సీడర్ వినియోగంతో చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నా, రైతులకు అంతగా అవగాహన లేకపోవడంతో ఆ దిశగా చర్యలు చేపట్టలేదని అంటున్నారు. కలుపు యాజమాన్య పద్ధతి పంట తొలి దశలో నీరు నిలగట్టక ఆరుతడిగా సాగు చేయడం వల్ల కలుపు సమస్య అధికంగా ఉంటుంది. అందువల్ల ఈ పద్ధతిలో కలుపు మందును తప్పనిసరిగా వాడాలి. ఎకరాకు 35 గ్రాముల ఆక్సాడయార్జిల్ లేదా ప్రెటిలాక్లోర్ మందును ఎకరాకు 400 మి.లీ లేదా పైరజో సల్ఫ్యురాన్ ఇథైల్ 100 గ్రాముల మందును 20 కిలోల పొడి ఇసుకలో కలపాలి. ఈ మందును వెదజల్లు విధానంలో విత్తిన 3–5 రోజుల్లో పొలంలో పలచగా, నీరు పెట్టి కలుపు మందును పిచికారీ చేయాలి. తర్వాత పొలంలో నీరు తీసి వేయడం ద్వారా కలుపును నివారించవచ్చు. రెండో దశ నుంచి పొలంలో ఏర్పడిన కలుపును మొక్కల మధ్ద తొక్కడం ద్వారా ఎరువుగా మలచుకోవచ్చు. నీటి యాజమాన్యం విత్తనం వేసినప్పటి నుంచి పొట్ట దశ వచ్చే వరకూ పొలంలో నీరు నిల్వ ఉండకుండా కేవలం బురదగా మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఎక్కువైన నీటిని బయటకు పోవడానికి వీలుగా కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల వరి కంకి వేర్లు ఆరోగ్యంగా పెరిగి, ఎక్కువ పిలకలకు అవకాశం ఉంటుంది. పైరు పొట్ట దశ నుంచి పంట కోసే పది రోజుల ముందు రెండు సెం.మీ. నీరు నిల్వ ఉండేలా చూడాలి. డ్రమ్ సీడర్ పద్ధతిలో.. దమ్ము చేసిన అనంతరం చదును చేసిన భూమిలో పలచటి నీటి పొర ఉండేలా చూసుకుని, మండి కట్టిన విత్తనాన్ని చల్లాలి. డ్రమ్ సీడర్ పరికరానికి నాలుగు ప్లాస్టిక్ డ్రమ్ములుంటాయి. ప్రతి డ్రమ్ముకు 20 సె.మీ. దూరంలో రెండు చివర్ల వరుసకు 18 రంధ్రాలుంటాయి. ఈ డ్రమ్ములో మొలకెత్తిన విత్తనాలను నింపి మూతను బిగించాలి. గింజలు నింపి, డ్రమ్ సీడర్ను లాగితే ఎనిమిది వరుసల్లో 20 సెం.మీ. దూరంలో గింజలు పడతాయి. దీంతో వరుసల్లో కుదురు కుదురుకు మధ్య దూరం 5–8 సెం.మీ. దూరం ఉంటుంది. ప్రతి 16 వరుసలకు అడుగు వెడల్పులో కాలిబాటలు వేసుకోవాలి. తాడు లాగి డ్రమ్ వాడితే వరుసలు బాగా వచ్చి, విత్తు సక్రమంగా ఉంటుంది. ఖరీఫ్ సీజన్లో వెదజల్లుపై రైతుల ఆసక్తి పెట్టుబడి ఆదా.. అధిక దిగుబడి డ్రమ్ సీడర్ పద్ధతితో మరింత మేలు కనీస జాగ్రత్తలు కీలకం వెదజల్లు సాగు విధానంలో కనీస జాగ్రత్తలు పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయని జిల్లా వ్యవసాయాధికారి బోసుబాబు చెబుతున్నారు. వెదజల్లు విధానంలో విత్తనాలను 24 గంటల పాటు నానబెట్టాలి. మరుసటి రోజు ఆ విత్తనాలను గోనె సంచె కప్పి నిల్వ ఉంచాలి. విత్తనం ముక్కు పగిలి తెల్లగా మోసు వచ్చే క్రమంలో పొలంలో విత్తనాలను వెదజల్లాలి. విత్తనాలకు మొక్కలు వచ్చే వరకూ పొలంలో నీరు లేకుండా కాలువలు ఏర్పాటు చేసి, నీటిని బయటకు పంపాలి. వారం తర్వాత ఒకసారి పంటకు నీరును అందజేసి, మరుసటి రోజు తొలగించాలి. దమ్ము చేసే సమయంలో పొలంలో ఎగుడుదిగుడులు లేకుండా నేలను సమాంతరంగా ఉండేలా చూడాలి. ఎకరానికి 16 నుంచి 20 కిలోల విత్తనాలను నాటాలి. వరినాట్లు నాటే 15 రోజుల ముందు ఒకసారి దమ్ము చేయాలి. నాలుగు రోజుల ముందుగా చదును చేయాలి. ప్రతి రెండు మీటర్లకు 20 సెం.మీ. కాలువలను ఏర్పాటు చేయాలి. కలుపు నివారణకు బింతియోకార్బ్ లేదా అనిలోఫాస్ 1.25 లీటర్ల మందును 27 కిలోల ఇసుకలో కలిపి చల్లితే కలుపును నివారించవచ్చు. వెదజల్లుతో ప్రయోజనాలు తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసి, కూలీల కొరతను అధిగమించవచ్చు. సాగునీటి ఎద్దడిని అధిగమించవచ్చు. పంట పది రోజుల ముందే కోతకు వస్తుంది. భూమి సారవంతమవుతుంది. మొక్కలో సాంద్రత పెరిగి, పది శాతం మేర అధిక దిగుబడికి అవకాశం ఉంది. సాధారణ పద్ధతిలో వరి సాగుకు ఎకరం పొలంలో నారుమడికి 30 కేజీల విత్తనాలు అవసరం. వెదజల్లులో కేవలం 12 నుంచి 18 కేజీలు చాలు. కలుపు మొక్కలను సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా ఎరువుగా మలుచుకోవచ్చు. నారుమడులు పోసి ఊడ్చేందుకు పట్టే ఎక్కువ సమయాన్ని, వెదజల్లు సాగుతో అరికట్టవచ్చు. పెట్టుబడి పరంగా రూ.మూడు వేల వరకూ ఆదా అవుతుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో పంట కాలం కోల్పోకుండా, నీరు అందుబాటులో ఉన్నప్పుడే సాగుకు అవకాశం ఉంటుంది. -
మోటారు సైకిళ్ల దొంగ అరెస్టు
ఏడు బైక్లు స్వాధీనం కాకినాడ రూరల్: వివిధ ప్రాంతాల్లో మోటార్ సైకిళ్లను దొంగిలించిన కేసులో కాకినాడ అర్బన్ కామేశ్వరినగర్ రామకృష్ణారావుపేటకు చెందిన యువకుడు కడియాల ప్రేమ్కుమార్ అలియాస్ దుర్గాప్రసాద్ అలియాస్ జిజ్జును సర్పవరం పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఎస్సై పి.శ్రీనివాస్కుమార్ వివరాల మేరకు, నిందితుడు జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోటారు సైకిళ్ల చోరీలకు పాల్పడ్డాడు. అతడిపై నిఘా ఉంచి, అరెస్టు చేశారు. సుమారు రూ.3.5 లక్షల విలువైన ఏడు మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడంలో కృషి చేసిన ఎస్సై శ్రీనివాస్కుమార్తో పాటు, ఏఎస్సైలు శ్రీనివాస్, నాగేశ్వరరావు, హెచ్సీలు సత్తిబాబు, రాజు, ప్రసాద్, పీసీలు అనిల్, కిశోర్ను సీఐ పెద్దిరాజు అభినందించారు. -
రైతు సమస్యలపై సమర శంఖం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: నెల దాటినా ధాన్యం సొమ్ము ఇవ్వరు...అదను దాటిపోతున్నా మెట్టలో ఖరీఫ్కు సాగునీరు ఇవ్వరు...ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇవ్వదు...కానీ రైతులపై భారం మోపుతూ సర్చార్జీలతో కలిపి నీటి తీరువా వసూలు చేస్తామంటారు...మెట్ట ప్రాంతంలో ఖరీఫ్ సాగుకు నీరు విడుదలపై స్పష్టత ఇవ్వరు...కోనసీమలో మేజర్ డ్రైన్లు పట్టించుకోకుండా ఖరీఫ్ ఎలా ముందుకు సాగేది...అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వేదికగా ప్రజాప్రతినిధులు ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. కాకినాడ జెడ్పీ సమావేశ మందిరంలో చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన బుధవారం జరిగిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రధానంగా రైతుల సమస్యలపై సభ్యులు మూకుమ్మడిగా నిలదీసి కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కోట్లాది రూపాయల ధాన్యం సొమ్ము జమ చేయకుండా తాత్సారం చేస్తున్న ప్రభుత్వ తీరును రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు తప్పుపట్టారు. జెడ్పీటీసీ సభ్యులు కూడా ప్రభుత్వ తీరును మూకుమ్మడిగా నిలదీశారు. ధాన్యం సొమ్ము కోట్లలో బకాయిలున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదు, 24 గంటల్లో జమచేస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పి రైతులను నట్టేట ముంచేసిందని మండిపడ్డారు.ఽఖరీఫ్ పెట్టుబడుల కోసం రైతులు నానా పాట్లు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలో వైఎస్సార్ సీపీ నుంచి కూటమికి ఫిరాయించిన జెడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు కల్పించుకుని ప్రభుత్వంతో చర్చించి పరిష్కారానికి కృషి చేద్దామనడంతో వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు ఒక్కసారిగా అనుబాబుపై విరుచుకుపడ్డారు. పార్టీ ఫిరాయించిన మీకు రైతుల కోసం మాట్లాడే అర్హత లేదంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి రైతులంటే లెక్కలేదంటూ సభ్యులు నినాదాలు చేస్తూ వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. నీటి తీరువా వసూలుపై ఆగ్రహం కొద్దిసేపు సమావేశం బయట నిరసన వ్యక్తం చేసిన అనంతరం తిరిగి సభకు వచ్చారు. ఖరీఫ్ సాగుకు సమాయత్తమయ్యే తరుణంలో ప్రభుత్వం ఇస్తామన్న పెట్టుబడి ఇవ్వకపోగా నీటితీరువా వసూలు చేయడం అన్యాయమంటూ గొల్లప్రోలు, ప్రత్తిపాడు జెడ్పీటీసీ సభ్యులు ఉలవకాయల లోవరాజు, బెహరా రాజరాజేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖరీఫ్లో పెట్టుబడులు లేక రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే అన్యాయంగా సర్చార్జీలతో కలిపి నీటితీరువా ఎలా వసూలు చేస్తారని సభ్యులు ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి కల్పించుకుని సర్చార్జీలు వసూలు చేసే ఆలోచన లేదన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నీటితీరువా కచ్చితంగా వసూలు చేయడం తప్పదన్నారు. రైతులకు సంబంధించి ప్రాధాన్యం కలిగిన ఈ అంశంపై కూటమి ప్రజాప్రతినిధులు పెదవి విప్పకుండా మిన్నకుండి పోవడం ఏమిటని పలువురు సభ్యులు విస్మయం వ్యక్తం చేశారు. ప్రజాధనం వృథా : ఎమ్మెల్సీ తోట పీడీఎస్ బియ్యాన్ని చేరువలో ఉన్న ఆలమూరు, రామచంద్రపురంలోని గోడౌన్లలో కాకుండా ద్వారపూడిలోని ప్రైవేట్ గోడౌన్లో నిల్వచేయడం ద్వారా ప్రజాధనం వృథా అవుతోందని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సభ దృష్టికి తెచ్చారు. ఇరిగేషన్ అధికారులు ఖరీఫ్ సాగునీటి ప్రణాళికను వివరిస్తూ గోదావరి మూడు డెల్టాల పరిధిలో 10.13 లక్షల ఎకరాలకు జూన్ ఒకటిన నీరు విడుదల చేశామన్నారు. గోదావరి డెల్టాలకు విడుదల చేసినట్లే, మెట్ట ప్రాంతంలోని ఏలేరు, భూపతిపాలెం, ముసురుమిల్లి ప్రాజెక్టులు, పుష్కర, పురుషోత్తపట్నం లిఫ్ట్ ల కింద ఉన్న 2 లక్షల ఎకరాల ఆయకట్టు కూడా జూన్ 1 నుంచి ఎందుకు నీరు విడుదల చేయలేదని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నిలదీశారు. ఇరిగేషన్ అధికారుల మధ్య సమన్వయం లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాలువలలో మానవ విసర్జితాలను వదులుతున్నా ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారయణరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్–1 నాటికి పురుషోత్తపట్నం వద్ద కనీస నీటి మట్టం స్థాయి 14 అడుగులకు దిగువకు ఉన్నందున ఎత్తిపోతల ద్వారా మెట్ట ప్రాంతానికి నీటి విడుదల సాధ్య పడలేదని కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ వివరణ ఇచ్చారు. ప్రస్తుతం 14.5 అడుగుల స్థాయికి జలాలు ఉన్నందున పుష్కర ద్వారా గురువారం నుంచి నీటి సరఫరా జరుగుతుందని, మిగిలిన మెట్ట ప్రాంత ప్రాజెక్టుల ద్వారా జూలై 15 నుంచి నీరు విడుదల చేస్తామన్నారు. పారిశ్రామిక కాలుష్యాలతో తుల్యభాగ నీరు విషతుల్యమవుతోందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. తుల్యభాగ కాలుష్యంపై కాలుష్య నియంత్రణ మండలి పరిశీలించి చర్యలు తీసుకుంటుందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు. కోనసీమలో కూనవరం డ్రైన్ వెంబడి చల్లపల్లి –చింతలపూడి లాకుల వరకూ ఉప్పునీరు వెనుకకు తన్నుకు రావడంతో వందలాది ఎకరాల్లో సేద్యం దెబ్బతింటోందని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ సభ దృష్టికి తెచ్చారు. దీనిపై కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ కల్పించుకుని పరిశీలించి చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సాగునీటి కాలువలు, డ్రైన్ల ఆధునీకరణ, డ్రైనేజీ బోర్డు ఏర్పాటుకు చైర్పర్సన్ వేణుగోపాలరావు ప్రతిపాదించిన తీర్మానాన్ని సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఒకే ఆధార్ నంబర్తో మూడు కరెంటు మీటర్లు ఉండటంతో తల్లికి వందనం మంజూరు కాకపోవడం తగదని, గ్రామ పంచాయతీలకు 2023 నుంచి స్టాంపు డ్యూటీ జమ చేయాలని, ధాన్యం సొమ్ము సత్వరం చెల్లించాలని, గ్రామాల్లో పారిశుధ్య పరిరక్షణతో సీజనల్ వ్యాధులను నివారించాలని, మండలాల్లో చేసిన పనులకు చెల్లింపులు చేపట్టాలని జెడ్పీటీసీలు విజ్ఞప్తి చేశారు. రంపచోడవరం మన్యం ప్రాంతంలో రహదారులు అధ్వానంగా మారాయని, అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ఎమ్మెల్సీ అనంతబాబు సభ దృష్టికి తీసుకువచ్చారు. ఉమ్మడి తూర్పుగోదావరిలో సాగునీరు, డ్రైనేజీ వ్యవస్థల ఆధునీకరణకు, డ్రైనేజీ బోర్డు పునరుద్ధరణకు ప్రభుతాన్ని కోరుతూ సర్వసభ్య సమావేశం తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. తొలుత రాజోలు ఎంపీపీ అధ్యక్షుడు కేతా శ్రీనివాసరావు ఆకస్మిక మృతికి సమావేశం రెండు నిమిషాలు మౌనం పాటించింది. కాకినాడ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ మనీషా, జెడ్పీ సీఈఓ వీవీవీఎస్ లక్ష్మణరావు పాల్గొన్నారు. ధాన్యం సొమ్ము ఎప్పుడిస్తారు మెట్టకు సాగునీరు మాటేమిటి? జెడ్పీ సమావేశంలో గళమెత్తిన సభ్యులు -
అనధికార మద్యం అపాయకరం
జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి లావణ్య రాజమహేంద్రవరం రూరల్: లైసెన్స్ పొందిన రిటైల్ దుకాణాల నుంచి మాత్రమే మద్యం కొనుగోలు చేయాలని జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి చింతాడ లావణ్య ఓ ప్రకటనలో తెలిపారు. అనధికార (లైసెన్స్ లేని) వ్యక్తుల నుంచి మద్యం కొనుగోలు చేయడం చాలా అపాయకరమన్నారు. అటువంటి మద్యం నకిలీది కావచ్చన్నారు. వివాహాలు, పార్టీలు లేదా ఇతర సామూహిక వేడుకల సందర్భాల్లో మద్యాన్ని తగ్గింపు ధరలకు సరఫరా చేస్తామంటూ మోసం చేసే అవకాశం ఉందన్నారు. వారు సరఫరా చేసే నకిలీ మద్యం ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించవచ్చని హెచ్చరించారు. కొన్ని సందర్భాల్లో మరణానికి కూడా దారితీయవచ్చన్నారు. అటువంటి అనుమానిత వ్యక్తుల వివరాలను వెంటనే ఎకై ్సజ్ శాఖకు తెలియజేయాలన్నారు. ట్రోల్ ఫ్రీ నంబరు 14405కి కానీ, జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి 96767 14547 నంబర్కు కానీ తెలపాలని కోరారు. -
తలుపులమ్మకు భీమేశ్వరస్వామి ఆలయం నుంచి చీర–సారె
తుని రూరల్: లోవ దేవస్థానంలో కొలువై ఉన్న తలుపులమ్మ అమ్మవారికి ఆషాడ మాసోత్సవాలను పురస్కరించుకుని ద్రాక్షారామ శ్రీమాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి దేవస్థానం నుంచి ఆలయ సహాయ కమిషనర్ ఎ.దుర్గాభవానీ చీర–సారె సమర్పించారు. బుధవారం లోవ దేవస్థానానికి చీర–సారెతో వచ్చిన భీమేశ్వరస్వామి దేవస్థానం బృందానికి వేద పండితులు, ప్రధాన అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారికి చీర సారె సమర్పించిన సహాయ కమిషనర్ దుర్గాభవానీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు వేదాశీర్వచనం చేసి అమ్మవారి శేష వస్త్రాన్ని, ప్రసాదాలను బహూకరించారు. బిల్లుల చెల్లింపులకు నిధులివ్వండి కాంట్రాక్టర్ల వినతి కాకినాడ సిటీ: జిల్లా పరిషత్ గ్రాంట్లతో చేసిన పనుల బిల్లులు తక్షణమే చెల్లించాలని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం డివిజన్ కాంట్రాక్టర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కాకినాడలో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరైన జెడ్పీ వైస్ చైర్మన్ అనుబాబు, కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్కుమార్కు వినతిపత్రాలు అందజేశారు. మూడేళ్లుగా జిల్లా పరిషత్ నుంచి వచ్చిన గ్రాంట్లతో అన్ని పనులు పూర్తి చేసినా బిల్లులు విడుదల చేయలేదన్నారు. పెండింగ్ బిల్లులు సత్వరమే మంజూరు చేయాలని కాంట్రాక్టర్లు కోరారు. -
భారత్మాలకు గ్రీన్ సిగ్నల్
పిఠాపురం: ‘నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం’ అన్న సినీ గేయంలా నీలి సముద్రం అంచునే ప్రయాణం హాయి గొలపనుంది. నీలి సముద్రంలో పడవ ప్రయాణంతో పాటు పక్కనే భారత్మాల జాతీయ రహదారిపై వాహనాల ప్రయాణం చూడముచ్చట గొలపనుంది. కేంద్ర జాతీయ రహదారుల విభాగం భారత్మాల రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకుంది. పచ్చని చెట్లు, తెల్లని ఇసుక తిన్నెలు పక్కనే సముద్రం దానిని ఆనుకుని సన్నటి రోడ్డుతో ఇప్పటి వరకు ఉన్న తీర ప్రాంతం రానున్న రోజుల్లో పరిశ్రమలు, జాతీయ రహదారులతో పారిశ్రామిక వాడగా మారనుంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రూ.వేల కోట్ల నిధులు వెచ్చించి కాకినాడ నుంచి విశాఖ వరకు భారత్మాల పేరుతో పారిశ్రామిక వాడలను నౌకాశ్రయాలు, జాతీయ రహదారులతో అనుసంధానం చేసే ప్రక్రియకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రంగం సిద్ధం చేశాయి. భారత్మాల ప్రాజెక్టుతో తీర ప్రాంతం పారిశ్రామిక తీరంగా మారబోతోంది. అన్నవరం నుంచి కాకినాడ రూరల్ మండలం లైట్హౌస్ వరకు నాలుగులైన్ల రోడ్డు నిర్మాణానికి రంగం సిద్ధమవుతుండడంతో జిల్లాలో సాగరతీరం పారిశ్రామిక మణిహారంగా మారబోతోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కాకినాడ సాగరతీరంలో పారిశ్రామికీకరణకు చర్యలు తీసుకున్నారు. ఆయన సూచనల మేరకు అప్పటి కాకినాడ ఎంపీ వంగా గీతావిశ్వనాథ్ భారతమాల ప్రాజెక్టుకు ఆమోద ముద్ర వేయించారు. అప్పట్లోనే ఈ రోడ్డుకు భూసేకరణ కూడా పూర్తి చేశారు. 40.621 కిలోమీటర్ల మేర రోడ్డు ఇప్పటి వరకు సాధారణ రోడ్డు సౌకర్యం మాత్రమే ఉన్న కాకినాడ తుని తీర ప్రాంతానికి జాతీయ రహదారిని అనుసంధానం చేయనున్నారు. దీనికోసం కాకినాడ రూరల్ మండలంలో వాకలపూడి లైట్హౌస్ నుంచి తిమ్మాపురం, నేమాం, కొత్తపల్లి మండలంలో కొమరగిరి, కొత్తపల్లి, కుతుకుడుమిల్లి, ఉప్పాడ, అమీనాబాద, యండపల్లి, అమరవిల్లి, మూలపేట, రమణక్కపేట, పొన్నాడ, తొండంగి మండలంలో కోన ఫారెస్ట్ ఏరియాలో ఏవీనగరం, తొండంగి, శృంగవృక్షం, పీఈ చిన్నయిపాలెం, ఏ కొత్తపల్లి, బెండపూడి, శంఖవరం మండలం అన్నవరం వరకు రోడ్డు నిర్మాణం కానుంది. ఈ నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి 180 ఎకరాల భూమిని సేకరించారు. 45 మీటర్ల వెడల్పుతో రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. భూసేకరణ పూర్తి కావడంతో రోడ్డు నిర్మాణానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. అన్నవరం నుంచి కాకినాడ వరకు 40.621 కిలోమీటర్ల మేర నాలుగులైన్ల రోడ్డు నిర్మాణం కానుంది. నిధులు మంజూరు భారత్మాల ఎన్హెచ్ 16 ఎఫ్ భారత్మాల పరియోజన ఫేజ్ 1లో భాగంగా రోడ్డు నిర్మాణానికి కేంద్రం తొలి విడతగా రూ.1,040 కోట్లు మంజూరు చేసింది. రోడ్డు నిర్మాణ పనులకు టెండర్లను ఆహ్వానించింది. గత నెల 27న టెండర్లకు ఆహ్వానం పలుకుతూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఆగస్టు 14వ తేదీ వరకు టెండర్లకు గడువు విధించారు. ఆగస్టు 18న బిడ్లు తెరవనున్నారు. రోడ్డు నిర్మాణానికి రెండేళ్ల గడువు విఽధించారు. రెండేళ్ల పది రోజుల్లో రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు. రోడ్డు నిర్మాణం పూర్తి అయితే విశాఖపట్నం పోర్టు కాకినాడ పోర్టుకు అనుసంధానం కానుంది. రవాణా వ్యవస్థ పటిష్టం అవడంతో పాటు మత్స్య సంపద రవాణాకు మార్గం సుగమం అవుతుంది. రెండు పోర్టులు అనుసంధానం తీర ప్రాంతంలో ఉన్న విశాఖపట్నం, కాకినాడ పోర్టులను అనుసంధానం చేయడంలో ఈ రోడ్డు కీలక పాత్ర వహిస్తుంది. ఇప్పటికే కాకినాడ జిల్లాలో పెరుమాళ్లపురంలో నిర్మాణమవుతున్న పోర్టు, ఉప్పాడ తీరంలో నిర్మాణం అవుతున్న మేజర్ హార్బర్లకు ఈ రహదారి కీలకంగా మారనుంది. ఇప్పటి వరకు ఈ తీర ప్రాంతంలో ఏ సరకు రవాణా జరగాలన్నా అటు ఏడీబీ రోడ్డు, ఇటు కాకినాడ– తుని బీచ్ రోడ్డు మాత్రమే ఉపయోగపడేవి. బీచ్ రోడ్డులో భారీ వాహనాలు వెళ్లే అవకాశం లేక ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో భారత్మాల నిర్మాణం ఇక్కడ పారిశ్రాక రంగానికి ఒక మైలు రాయిగా నిలవనుంది. వైఎస్సార్ సీపీ హయాంలోనే పారిశ్రామికాభివృద్ధి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేశారు. ముఖ్యంగా తీర ప్రాంతంలో పారిశ్రామికీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. దానిలో భాగంగా మన తీర ప్రాంతంలో ఉప్పాడ మేజర్ హార్భర్, పెరుమాళ్లపురం పోర్టు, కాకినాడ సీపోర్టు నిర్మాణాలకు చర్యలు తీసుకున్నారు. వీటన్నింటికి రవాణా సౌకర్యం కోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి భారత్మాల పరి యోజన కింద అన్నవరం నుంచి కాకినాడకు భారత్మాల నాలు లైన్ల రోడ్డు మంజూరుకు కృషి చేశాం. అప్పట్లో దానిని మంజూరు చేయించి భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి, రోడ్డు నిర్మాణానికి బాటలు వేశాం. ప్రస్తుతం రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు కావడం శుభపరిణామం. ఇదంతా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పారిశ్రామికీకరణకు తీసుకున్న చర్యల ఫలితమనే చెప్పవచ్చు. – వంగా గీతావిశ్వనాఽథ్, మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జి అన్నవరం నుంచి కాకినాడ వరకు నాలుగు లేన్ల గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం తొలి విడతగా రూ.1,040 కోట్లు మంజూరు, టెండర్లకు ఆహ్వానం రెండేళ్లలో రోడ్డు నిర్మాణం పూర్తికి చర్యలు రూపురేఖలు మారనున్న సాగర తీరం ఫలించిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వ కృషి -
పేపర్మిల్లో గ్యాస్ లీకేజీ కలకలం
సాక్షి, రాజమహేంద్రవరం: రాజమండ్రి ఆంధ్రపేపర్ మిల్లులో గ్యాస్ లీకేజీ కలకలం సృష్టించింది. పేపర్ మిల్లు నార్త్ గేటు వద్ద ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్ అవుతుండటంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందారు. గత నెల 29వ తేదీన బరోడా నుంచి రాజమండ్రి పేపర్ మిల్కు 26 టన్నుల హైడ్రోజన్ పెరాకై ్సడ్ లోడులో ఓ ట్యాంకర్ వచ్చింది. ట్యాంకర్లోని గ్యాస్ను వెంటనే దిగుమతి చేసుకోకపోవడంతో, ట్యాంకర్ అలాగే ఉండిపోయింది. నాలుగు రోజులుగా పేపర్ మిల్ నార్త్ గేటు వద్ద ట్యాంకర్ నిలిపేశారు. బుధవారం ఉదయం నుంచి గ్యాస్ లీక్ కావడంతో ఎలాంటి ప్రమా దం జరుగుతుందోనని స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారమివ్వడంతో వెంటనే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. నాలుగు ఫైరింజిన్లతో గ్యాస్ లీకేజీని అరికట్టే చర్యలు చేపట్టారు. ఘటన స్థలానికి పక్కనే పెట్రోల్ బంక్, పేపర్ మిల్ టింబర్ డిపో ఉండడంతో స్థానికులు భీతిల్లారు. సంఘటన స్థలాన్ని ఆర్డీవో ఆర్.కృష్ణనాయక్, ఫ్యాక్టరీస్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ కె.కృష్ణమూర్తి, జిల్లా పరిశ్రమల అధికారి వాణిధర్ రామన్ పర్యవేక్షించారు. వ్యూహాత్మకంగా నియంత్రణ కంబాలచెరువు(రాజమహేంద్రవరం): ఉదయం 9.15 నిమిషాలు.. రాజమహేంద్రవరం ఫైర్ ఆఫీసుకు ఫోన్ వచ్చింది. పేపర్ మిల్కు వచ్చిన తన లారీ ట్యాంకర్ నుంచి హైడ్రోజన్ పెరాకై ్సడ్ లీక్ అవుతుందని చెప్పాడు. క్షణం ఆలస్యం చేయకుండా ఆర్యాపురం ఫైర్ ఆఫీసు నుంచి ఫైరింజిన్ బయలుదేరింది. ట్యాంకర్ నుంచి లీకవుతున్న హైడ్రోజన్ పెరాకై ్సడ్ అధిక మొత్తంలో వ్యాపిస్తే, దానిని పీల్చిన వారి ఊపిరితిత్తులు పాడైపోతాయి. శరీరంపై పడితే పెద్ద బొబ్బలు ఏర్పడుతాయి. అప్రమత్తమైన అగ్ని మాపక బృందాలు జిల్లా ఫైర్ ఆఫీసర్ మార్టిన్ లూథర్కింగ్ నేతృత్వంలో సంఘటన స్థలంలో నియంత్రణ చర్యలు చేపట్టాయి. రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్ వద్దనున్న ఫైర్ ఆఫీసు నుంచి మరో రెండు, కొవ్వూరు నుంచి ఒక ఫైరింజిన్ సంఘటన స్థలానికి చేరుకున్నాయి. రెస్క్యూ టెండర్ వాహనాన్నీ రప్పించారు. హైడ్రోజన్ పెరాకై ్సడ్ లీకేజీతో ప్రజలకు ఏం కాకుండా పోలీసుల సహకారంతో పేపర్ మిల్ ప్రాంతంలో పూర్తిగా రాకపోకలు నిషేధించారు. ట్యాంకర్లోని హైడ్రోజన్ పెరాకై ్సడ్ను పూర్తిగా నిర్వీర్యం చేసేలా అగ్నిమాపక అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అగ్నిమాపక సిబ్బంది ప్రత్యేక కెమికల్ సూట్లు, సెపరేట్ డ్రెస్ను ధరించారు. ట్యాంకర్లో ఉష్ణోగ్రతను తగ్గించేందుకు కూలింగ్ వాటర్, వాయువులను చిమ్మారు. ఆపరేషన్ ప్రారంభించిన ఉదయం 9.30కు 47 డిగ్రీలున్న ఉష్ణోగ్రతను, మధ్యాహ్నం 12 గంటలకు 26 డిగ్రీలకు తగ్గించగలిగారు. లీకవుతున్న హైడ్రోజన్ పెరాకై ్సడ్పై నీటిని చల్లి, భూమిలోకి ఇంకిపోయేలా చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ట్యాంకర్ నుంచి హైడ్రోజన్ పెరాకై ్సడ్ పరిసర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు చేపట్టిన ఫైరాఫీసర్ శ్రీనివాస్, అగ్నిమాపక సిబ్బందిని అందరూ అభినందించారు. 4 గంటలు శ్రమించి నియంత్రించిన అగ్నిమాపక యంత్రాంగం భీతిల్లిన పరిసర ప్రాంతాల ప్రజలు -
కారు ఢీకొని వ్యాపారి మృతి
ఏలేశ్వరం: అతివేగంగా ప్రయాణిస్తున్న కారు ఢీకొనడంతో ఓ వ్యాపారి మృతి చెందిన సంఘటన ఇది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు, పట్టణానికి చెందిన గూడపాటి నాగసత్య చంద్రశేఖర్(44) పాత ఆంధ్రా బ్యాంక్ ఎదురుగా చెప్పుల షాపు నిర్వహిస్తున్నాడు. షాపు వద్దే అతడి ఇల్లు కూడా ఉంది. షాపు వెనుక భాగంలో భవనాన్ని నిర్మిస్తున్నాడు. ఈ క్రమంలో నల్లరాయి చిప్స్ లారీ వస్తుందని సమాచారం రావడంతో, మంగళవారం అర్థరాత్రి దాటాక రెండు గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఆ సమయంలో వర్షం కురుస్తోంది. గొడుగు వేసుకుని.. షాపు ఎదురుగా రోడ్డు దాటుతుండగా, యర్రవరం రోడ్డులో ఏలేశ్వరం వైపు అతివేగంగా వచ్చిన కారు అతడిని ఢీకొంది. ఈ ప్రమాదంలో చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. సమీపంలోని షాపులో ఉన్న సీసీ కెమెరాలో ప్రమాద సంఘటన రికార్డు అయినట్టు పోలీసులు గుర్తించారు. మృతుడికి భార్య దివ్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రత్తిపాడు ఆస్పత్రిలో పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నవ్వుతూ ఉండే వ్యక్తి ఎప్పుడూ నవ్వుతూ చలాకీగా ఉండే చంద్రశేఖర్.. రోడ్డు ప్రమాదంలో మృతిచెందడాన్ని అతడి బంధువులు, స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. అతడి మృతితో భార్యాపిల్లలు, తల్లిదండ్రులు తీవ్రంగా విలపిస్తున్నారు. వీరిని ఓదార్చడం బంధువులకు కష్టంగా మారింది. -
మధ్యాహ్న భోజనం అమలులో అలసత్వం వద్దు
రికార్డుల నిర్వహణపై రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుల అసంతృప్తి కరప: ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకం అమలులో అలసత్వం వహించవద్దని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు జక్కంపూడి కృష్ణకిరణ్, ఈ.లక్ష్మీరెడ్డి నిర్వాహకులకు హెచ్చరికలు జారీచేశారు. కోడిగుడ్లు ఎక్కువ నిల్వ ఉండటం, విద్యార్ధులకు దొడ్డుబియ్యంతో భోజనం పెట్టడం, రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడంపై కమిషన్ సభ్యులు అసంతృప్తి వ్యక్తంచేశారు. బుధవారం వారు మండల అధికారులతో కలసి కరప మండలంలో అంగన్వాడీ కేంద్రాలను, హైస్కూలు, రేషన్ షాపులను, ఎంఎల్సీ పాయింట్ను తనిఖీ చేశారు. కొరిపల్లిలో అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. 3వ, 4వ ఫేజ్లో వచ్చిన 140 కోడిగుడ్లు ఎక్కువ ఉండటాన్ని గుర్తించారు. అంగన్వాడీ టీచర్కు షోకాజ్ నోటీసు జారీచేయాలని సీడీపీఓ వై.లక్ష్మిని ఆదేశించారు. కూరాడ జెడ్పీ హైస్కూల్లో దొడ్డు బియ్యంతో మధ్యాహ్న భోజనం పెట్టటం ఏమిటని హెచ్ఎం ప్రశ్నించారు. షోకాజ్ నోటీసు జారీచేయాలని ఎంఈఓ కె.బుల్లికృష్ణవేణిని ఆదేశించారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 18,000 – 18,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 27,500 గటగట (వెయ్యి) 25,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 24,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 17,000 – 17,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 18,000 – 18,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
రెండు పొక్లెయిన్లు సీజ్
పి.గన్నవరం: మండలంలోని మానేపల్లిలంకలో అనుమతులు లేకుండా మట్టి, ఇసుక అక్రమ తవ్వకాలకు వినియోగిస్తున్న రెండు పొక్లెయిన్లను కొత్తపేట ఆర్డీఓ పి.శ్రీకర్ మంగళవారం సీజ్ చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో మట్టి, ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్న నేపథ్యంలో పి.గన్నవరం మండలంలోని యర్రంశెట్టివారిపాలెం, పెదకందాలపాలెం, మానేపల్లిలంకలో ర్యాంపులను తహసీల్దార్ పి.శ్రీపల్లవితో కలిసి ఆర్డీఓ పరిశీలించారు. మానేపల్లిలంకలో ఉన్న పొక్లెయిన్లను సీజ్ చేసి మైన్స్ అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అక్టోబర్ 15 వరకూ జిల్లాలో ఎక్కడా మట్టి, ఇసుక తవ్వకాలు జరపరాదని కలెక్టర్ ఆదేశించారన్నారు. అక్రమ తవ్వకాలు సాగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ర్యాంపుల్లోకి లారీలు, ట్రాక్టర్లు వెళ్లకుండా బాటలను కట్ చేయించాలని తహసీల్దార్ను ఆదేశించారు. ఆయా ర్యాంపుల్లో ఎంత మేరకు అక్రమ తవ్వకాలు జరిపారో డ్రోన్ల ద్వారా సర్వే చేయించి, సంబంధిత వ్యక్తులకు డిమాండ్ నోటీసులు పంపిస్తామని ఆర్డీఓ చెప్పారు. -
లారీని ఢీకొన్న గూడ్స్ ఆటో
జొన్నాడకు చెందిన డ్రైవర్ మృతి కిర్లంపూడి: ఆగి ఉన్న లారీని గూడ్స్ ఆటో ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందిన ఘటన మంగళవారం తెల్లవారుజామున కృష్ణవరం టోల్గేట్ వద్ద చోటుచేసుకుంది. కిర్లంపూడి ఎస్సై జి.సతీష్ తెలిపిన వివరాల మేరకు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ గ్రామానికి చెందిన సూరిశెట్టి శ్రీధర్(43) గూడ్స్ఆటోలో విశాఖపట్నానికి పువ్వుల లోడుతో కిరాయికి వెళ్లాడు. అక్కడి నుంచి న్యూస్ పేపర్ల లోడును వేసుకుని రాజమండ్రికి తిరిగొస్తుండగా, మంగళవారం తెల్లవారుజామున కృష్ణవరం టోల్గేట్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. ఈ ఘటనలో శ్రీధర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. హైవే అంబులెన్స్లో అతడిని ప్రత్తిపాడు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా, మార్గం మధ్యలోనే మరణించాడు. అతడి సోదరుడు సూరిశెట్టి గంగాజలం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. గ్రామంలో తీవ్ర విషాదం ఆలమూరు: రోడ్డు ప్రమాదంలో సూరిశెట్టి శ్రీధర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. నల్లజర్ల మండలం పోతవరం గ్రామానికి చెందిన శ్రీధర్ 12 ఏళ్లుగా జొన్నాడలో నివసిస్తున్నారు. అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. యజమాని శాశ్వతంగా దూరం కావడంతో ఆ కుటుంబం జీవనాధారం కోల్పోయింది. ఇక తమకు దిక్కెవరంటూ మృతదేహం వద్ద కుటుంబీకులు రోదించిన తీరు చూపరులను కలచివేసింది. బంధువులు విషాదంలో మునిగిపోయారు. -
ప్రైవేట్ ఏజెన్సీల విధానాన్ని రద్దు చేయాలి
కలెక్టరేట్ వద్ద రవాణా జేఏసీ ధర్నా అమలాపురం రూరల్: రవాణా శాఖాధికారులను పక్కనపెట్టి, వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ ప్రైవేట్ ఏజెన్సీలు ఇచ్చే విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా రవాణా జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. అంతకుముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రవాణా జేఏసీ జిల్లా కో–ఆర్డినేటర్, ఆంధ్రా ఆటోవాలా జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి సత్తిరాజు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించి, కలెక్టర్ మహేష్కుమార్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సత్తిరాజు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల మోటారు వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ చేయడానికి జిల్లా రవాణా అధికారులను విస్మరించి, ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వడం వల్ల వాహన యాజమానులు ఆర్థికంగా ఇబ్బందులు పడతారన్నారు. యాంత్రీకరణ విధానం నిలిపి, పాత విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. రవాణా జేఏసీ అనుబంధ సంఘాల జిల్లా స్థాయి సదస్సు ఈ నెల 4న అమలాపురంలో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 9న సార్వత్రిక సమ్మెలో పాల్గొంటామని తెలిపారు. రవాణా జేఏసీ జిల్లా కన్వీనర్ రాగుర్తి వెంకటేశ్వరరావు, నాయకులు పోలిశెట్టి సీతారాంబాబు, బొంతు బాలరాజు, యాళ్ల వెంకటేశ్వరరావు, ఎల్లమెల్లి పెద్దా తదితరులు పాల్గొన్నారు. -
14 నుంచి ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులకు శిక్షణ
సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లాలోని ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులకు ఈ నెల 14 నుంచి మూడు రోజుల పాటు స్థానిక విస్తరణ శిక్షణా కేంద్రంలో శిక్షణ ఉంటుందని శిక్షణా కేంద్రం సీనియర్ ఫ్యాకల్టీ ఎ.రవిశంకర్ తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలోని ఎంపీటీసీ సభ్యులకు సామర్లకోట ఈటీసీలోనే శిక్షణ ఇవ్వాలని తొలుత నిర్ణయించారని, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈటీసీ సిబ్బంది ఆయా జిల్లాలకు వెళ్లి శిక్షణ ఇవ్వాలని ఉత్తర్వులు వచ్చాయన్నారు. దాంతో ఉమ్మడి జిల్లాల్లోని ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులకు మంగళవారం శిక్షణ ప్రారంభించినట్టు వివరించారు. కోర్సు డైరెక్టర్గా కేఆర్ నిహారిక, ఫ్యాకల్టీలు వి.జగన్నాథం, ఖాజా మొహీద్దీన్ శిక్షణ ఇస్తారన్నారు. రెండో తేదీ నుంచి శ్రీకాకుళం జిల్లా మహిళా ప్రాంగణంలో, ఎనిమిదో తేదీ నుంచి విశాఖపట్నంలోని జెడ్పీ మీటింగ్ హాల్లో, పశ్చిమ గోదావరి జిల్లాలోని జెడ్పీ మీటింగ్ హాల్లో శిక్షణ ఉంటుందన్నారు. నెల రోజులు సెక్షన్–30 అమలు అమలాపురం టౌన్: అమలాపురం పోలీస్ సబ్ డివిజన్లో నెల రోజుల పాటు సెక్షన్–30 అమలులో ఉంటుందని డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ మంగళవారం ఇక్కడ వెల్లడించారు. అమలాపురం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని అమలాపురం పట్టణం, అమలాపురం రూరల్, అల్లవరం, ఉప్పలగుప్తం, ముమ్మిడివరం, కాట్రేనికోన, ఐ.పోలవరం పోలీస్ స్టేషన్ల పరిధిల్లో ఈ నెల 31 వరకూ ఈ సెక్షన్ వర్తిస్తుందని చెప్పారు. ఈ నేప థ్యంలో ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు వంటివి నిర్వహించరాదని స్పష్టం చేశారు. అలాంటి కార్యకలాపాలు జరపడానికి ముందుగా తన అనుమతి పొందాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా తీసుకుంటున్న ఈ చర్యలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
కనకాయలంక కాజ్ వే వద్ద వంతెన నిర్మాణం
రూ.22.83 కోట్లకు పరిపాలనా ఆమోదం పి.గన్నవరం: కొద్దిపాటి వరదకే కాజ్ వే నీటమునిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్న పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కనకాయలంక గ్రామ ప్రజలకు వరద కష్టాలు తీరనున్నాయి. మండలంలోని చాకలిపాలెం గ్రామానికి ఆనుకుని ఉన్న కనకాయలంక కాజ్ వే వద్ద హై లెవెల్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం రూ.22.83 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలనా ఆమోదం ఇచ్చినట్టు గోదావరి హెడ్ వర్క్స్ డివిజన్ (ధవళేశ్వరం) ఈఈ గంగుమళ్ల శ్రీనివాస్ తెలిపారు. కనకాయలంక, చాకలిపాలెం (వశిష్ట ఎడమ ఏటిగట్టు) గ్రామాలను కలుపుతూ వశిష్ట నదిపై వంతెన నిర్మాణానికి అనుమతి లభించిందన్నారు. రూ.24 కోట్లతో వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపగా, రూ.22.83 కోట్లు మంజూరైనట్టు తెలిపారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. కనకాయలంక గ్రామంలో సుమారు మూడు వేల మంది నివసిస్తున్నారు. వారి జీవన విధానం తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలంతో ముడిపడి ఉంది. నిత్యం కాజ్ వే దాటి పి.గన్నవరం మండలానికి వస్తుంటారు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 5.5 లక్షల క్యూసెక్కుల వరద నీరు విడుదల చేస్తే కనకాయలంక కాజ్ వే మునిగిపోతోంది. దీంతో ప్రమాదకర పరిస్థితుల్లో కాజ్ వే దాటి వస్తుంటారు. వరద నీరు మరీ ఎక్కువైతే పడవలపై ప్రయాణిస్తారు. ఇక్కడ వంతెన నిర్మాణం పూర్తయితే కనకాయలంక గ్రామాల ప్రజల వరద కష్టాలు తీరతాయి. పెదలంక వద్ద వంతెన అలాగే వరద సమయాల్లో ప్రజల రాకపోకల కోసం వశిష్ట ఎడమ ఏటిగట్టు నుంచి యలమంచిలి మండలం పెదలంకకు రూ.80.8 లక్షలతో సింగిల్ లైన్ రోడ్డు వంతెనకు కూడా పరిపాలనా ఆమోదం లభించినట్టు ఈఈ జి.శ్రీనివాస్ తెలిపారు. టెండర్లు పూర్తయిన తర్వాత ఈ వంతెన పనులు ప్రారంభమవుతాయని ఈఈ గంగుమళ్ల శ్రీనివాస్ వివరించారు. -
700 లీటర్ల డీజిల్ పట్టివేత
తాళ్లరేవు: కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నుంచి ఆంధ్రా ప్రాంతానికి ట్రాక్టర్లో అక్రమంగా తరలిస్తున్న 700 లీటర్ల డీజిల్ను పట్టుకున్నట్టు కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ తెలిపారు. మంగళవారం రాత్రి కోరంగి పోలీస్ స్టేషన్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో డీజిల్ను అక్రమంగా తరలిస్తున్న పాలకొల్లుకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. ట్రాక్టర్తో పాటు, 700 లీటర్ల డీజిల్ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. వారిపై కేసు నమోదు చేశామని ఎస్సై చెప్పారు. ఐదుగురు జూదరుల అరెస్టు జగ్గంపేట: జగ్గంపేట శివారు గుర్రంపాలెం రోడ్డులో పోలవరం కాలువ వద్ద పేకాట శిబిరంపై జగ్గంపేట పోలీసులు మంగళవారం దాడి చేశారు. ఐదుగురిని అరెస్టు చేసినట్లు సీఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు.ఈ దాడిలో రూ.50 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఎస్సై రఘునాథరావు, సిబ్బంది దాడులు నిర్వహించినట్టు తెలిపారు. -
టెండర్ ఖరారు రేపే..
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం సహా, రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవస్థానాలకు శానిటరీ మెటీరియల్, క్లీనింగ్, హౌస్ కీపింగ్ తదితర పారిశుధ్య పనులు నిర్వహించేందుకు సెంట్రలైజ్డ్ ఈ–ప్రొక్యూర్ రీ టెండర్ గురువారం ఖరారు కానుంది. దీని ప్రైస్ బిడ్ను విజయవాడలోని దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో గురువారం తెరవనున్నారు. సోమవారం టెక్నికల్ బిడ్ ఓపెన్ చేయగా, విజయవాడకు చెందిన చైతన్యజ్యోతి శానిటరీ ఏజెన్సీస్, తిరుపతికి చెందిన పద్మావతి హౌస్ కీపింగ్, ఫెసిలిటీ సంస్థ క్వాలిఫై అయ్యాయి. దీంతో ఆ రెండు సంస్థల ప్రైస్ బిడ్ గురువారం ఓపెన్ చేసి, లోయెస్ట్ కొటేషన్ దాఖలు చేసిన వారికి టెండర్ ఖరారు చేస్తారని అధికారులు తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వంలో ‘పద్మావతి’కి టెండర్ కాగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014–19 మధ్య రాష్ట్రంలో అన్నవరం దేవస్థానం సహా, పలు దేవస్థానాల్లో శానిటరీ టెండర్ను పద్మావతి సంస్థ దక్కించుకుంది. మొదట రెండేళ్ల కాల పరిమితికి టెండర్ దక్కించుకున్న ఈ సంస్థకు, తర్వాత అప్పటి టీడీపీ ప్రభుత్వం మరో రెండేళ్లు కాంట్రాక్ట్ పొడిగించింది. ఇప్పుడు మరలా అదే సంస్థ టెక్నికల్ బిడ్లో క్వాలిఫై కావడంతో, మరలా ఆ సంస్థకే టెండర్ దక్కే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పద్మావతి సంస్థ యజమాని భాస్కరనాయుడు టీడీపీ పెద్దలకు సన్నిహితుడు కావడమే కారణంగా చెబుతున్నారు. ప్రముఖ దేవస్థానాల్లో రీ టెండర్ గత ఏప్రిల్ నెలలో పిలిచిన టెండర్ నోటిఫికేషన్పై టెండర్దారులు అనేక సందేహాలను వ్యక్తం చేయడంతో, రాష్ట్ర ప్రభుత్వం దానిని రద్దు చేసింది. కొన్ని మార్పులతో కొత్త నోటిఫికేషన్ను జూన్ 12న విడుదల చేసింది. టెండర్దారులు తమ కొటేషన్లు దాఖలు చేయడానికి ఆఖరు తేదీ జూన్ 26గా నిర్ణయించారు. మొత్తం 23 మంది టెండర్ కోసం పోటీ పడినా, వివిధ కారణాలతో 21 మంది తప్పుకొన్నారు. చివరకు చైతన్యజ్యోతి, పద్మావతి సంస్థలు ప్రైస్ బిడ్కు ఎంపికయ్యాయి. ఏడు దేవస్థానాల్లో శానిటరీ నిర్వహణ టెండర్ దక్కించుకున్న సంస్థ రెండేళ్ల కాల పరిమితిలో అన్నవరం, సింహాచలం, శ్రీశైలం, ద్వారకాతిరుమల, విజయవాడ దుర్గ గుడి, కాణిపాకం, శ్రీకాళహస్తి దేవస్థానాల్లో పారిశుధ్య పనులు, వివిధ సత్రాల్లో హౌస్ కీపింగ్, రహదార్లు, టాయిలెట్స్ క్లీనింగ్, ఫెసిలిటీ మేనేజ్మెంట్, ఏసీలు, ఇతర విద్యుత్ ఉపకరణాల నిర్వహణ తదితర పనులు నిర్వహించాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో విడివిడిగా.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో దేవస్థానాల వారీగా శానిటరీ టెండర్లు ఖరారు చేశారు. కూటమి ప్రభుత్వం అన్ని ప్రముఖ దేవస్థానాలకు ఒకే శానిటరీ టెండర్ పిలవాలని పది నెలలు జాప్యం చేసింది. ఒకే యూనిట్గా టెండర్లు నిర్వహించాలని గతేడాది ఆగస్టు 27న కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్ట్ ముగిసి ఆరు నెలలైనా.. అన్నవరం దేవస్థానంలో శానిటరీ విధులు నిర్వహిస్తున్న హైదరాబాద్కు చెందిన కేఎల్టీఎస్ సంస్థ కాంట్రాక్ట్ గతేడాది నవంబర్తో ముగిసింది. ఆ కాంట్రాక్ట్ ముగియడానికి ఒక నెల ముందుగానే గత అక్టోబర్లో టెండర్ విడుదల కావాల్సి ఉంది. టెండర్లు ఆలస్యం కావడంతో, దేవస్థానం కోరిక మేరకు ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు వరకు ఆ సంస్థ సిబ్బంది విధులు నిర్వహించారు. మార్చి ఒకటి నుంచి తాము విధులు నిర్వహించలేమని దేవస్థానానికి లేఖ సమర్పించారు. దీంతో టెండర్ పిలవకుండానే గుంటూరుకు చెందిన కనకదుర్గా శానిటరీ సర్వీసెస్ సంస్థకు తాత్కాలికంగా పనులు అప్పగించారు. పెరగనున్న కాంట్రాక్ట్..? గత నవంబర్తో ముగిసిన కేఎల్టీసీ సంస్థ శానిటరీ టెండర్ నెలకు రూ.49 లక్షలు. దేవస్థానం కనకదుర్గా ఏజెన్సీకి నెలకు రూ.59 లక్షలు జీతాలుగా చెల్లిస్తున్నారు. రూ.12 లక్షలు మెటీరియల్కు ఖర్చు చేస్తున్నారు. మొత్తం నెలకు రూ.71 లక్షలు ఖర్చు చేస్తున్నారు. తాజాగా అన్ని దేవస్థానాలకు కలిపి సెంట్రలైజ్డ్ టెండర్లో అత్యాధునిక మెషినరీలు ఉపయోగించాలనే షరతు విధించారు. శానిటరీ సిబ్బందికి లేబర్ యాక్ట్ ప్రకారం జీతాల చెల్లింపుతో పాటు, వారాంతపు సెలవుల్లో సిబ్బంది రిలీవర్స్గా కొంతమందిని నియమించనున్నారు. ఏసీలు, విద్యుత్ ఉపకరణాల నిర్వహణ కూడా కలిపారు. ఫలితంగా దేవస్థానంలో నెలకు శానిటరీ కాంట్రాక్ట్ రూ.80 లక్షలకు పైమాటే అంటున్నారు. ప్రముఖ దేవాలయాలకు గత ఏప్రిల్లో నోటిఫికేషన్ దానిని రద్దు చేసి మళ్లీ జూన్ 12న రీటెండర్ కొత్త షరతుల ప్రకారం రూ.80 లక్షలకు పెరిగే అవకాశం -
ఇదేం తీరువా బాబూ!
ఫ రూ.12 కోట్ల నీటితీరువా వసూలుకు సర్కారు సన్నాహాలు ఫ కొత్తగా రూ.35 సర్వీసు ట్యాక్స్ ఫ చిల్లిగవ్వ సాయం చేయకపోగా ఈ వసూళ్లేమిటని రైతుల అసహనం సాక్షి ప్రతినిధి, కాకినాడ: గత ఖరీఫ్, తరువాత రబీ సీజన్లు రెండూ వెళ్లిపోయాయి. మళ్లీ ఖరీఫ్ వచ్చేసింది. అయినప్పటికీ పెట్టుబడి సాయంగా రూ.20 వేలు ఇస్తామన్న చంద్రబాబు మాట ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. దీంతో, సాగు పెట్టుబడి కోసం రైతులు నానా అగచాట్లూ పడుతున్నారు. సరిగ్గా ఇదే తరుణంలో పులి మీద పుట్రలా నీటితీరువా వసూళ్లకు కూటమి సర్కారు సన్నాహాలు చేస్తోంది. పిడుగులాంటి ఈ వార్త రైతులను తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తోంది. సిద్ధమవుతున్న రెవెన్యూ యంత్రాంగం జిల్లాలోని కాకినాడ, పెద్దాపురం రెవెన్యూ డివిజన్ల పరిధిలో రెండు ఫసలీల(1433, 1434)కు (ఫసలీ – పంట కాలం) పాత బకాయిలతో కలిపి నీటితీరువా రూ.12 కోట్ల పైమాటే. ఈ మొత్తాన్ని రైతుల నుంచి వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒక్క పెద్దాపురం రెవెన్యూ డివిజన్లోనే 11 మండలాల్లో 1.79 లక్షల పై చిలుకు ఖాతాల్లో నీటితీరువా వసూలు చేయాలని స్పష్టం చేసింది. ఈ ఏడాది మే నెల నాటికి 1434 ఫసలీలో రైతుల నుంచి నీటితీరువా బకాయి రూ.7.36 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాకినాడ డివిజన్లోని 10 మండలాల్లోని 143 గ్రామాల పరిధిలో 1,07,720 ఖాతాలున్నాయి. వీటి ద్వారా రూ.4.80 కోట్ల బకాయిలున్నాయని లెక్కలు తేల్చారు. ఈ రకంగా జిల్లావ్యాప్తంగా 2,86,771 ఖాతాల నుంచి నీటితీరువా బకాయిలు వసూలు చేసేందుకు రెవెన్యూ యంత్రాంగం సిద్ధమవుతోంది. సర్వీస్ ట్యాక్స్ బాదుడు ఈ మేరకు ఆర్డీఓలకు, మండలాల తహసీల్దార్లకు, అక్కడి నుంచి వీఆర్ఓలకు ఆదేశాలు జారీ అయ్యాయి. రెండు పంటలు పండే వ్యవసాయ భూములైతే ఎకరానికి మొదటి పంటకు రూ.200, రెండో పంటకు రూ.150 కలిపి మొత్తం రూ.350 నీటితీరువా వసూలు చేయనున్నారు. అదే ఆక్వా చెరువులైతే ఏడాదికి ఒకే పంట తీస్తారనే లెక్కలతో నీటితీరువా ఎకరానికి రూ.500గా పేర్కొన్నారు. నీటితీరువా వసూలుతోనే ఆగిపోకుండా కూటమి సర్కార్ రైతులపై సర్వీసు ట్యాక్స్ రూపంలో కూడా బాదేస్తోంది. నీటితీరువా కోసం జరిపే ప్రతి లావాదేవీకి అదనంగా రూ.35 సర్వీసు ట్యాక్స్ వసూలు చేయాలని ఆదేశించింది. దీనిని రైతుసంఘాల ప్రతినిధులు ఆక్షేపిస్తున్నారు. మునుపెన్నడూ ఇటువంటి సర్వీసు ట్యాక్స్ తాము చూడలేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. నీటితీరువా, సర్వీ సు ట్యాక్స్ చూడటానికి తక్కువగానే ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ, గడచిన నాలుగేళ్లకు కలిపితే రైతులపై పెనుభారం పడుతుందని అంటున్నారు. పైగా, రైతు సాగు చేసే ప్రతి ఎకరానికి ఇది పెరుగుతూ పోతుంది. వీఆర్ఓలకు భారం ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందనే సామెత చందంగా వీఆర్ఓల పరిస్థితి తయారైంది. నీటితీరువా వసూలు ప్రక్రియ వారికి ఆర్థికంగా భారం కానుంది. భూముల రీసర్వే అయిన గ్రామాల్లో నీటితీరువా వసూలు రెవెన్యూ యంత్రాంగానికి గుదిబండగా మారనుంది. రీసర్వే కాక ముందు 1433 ఫసలీలో అప్పటి వరకూ ఉన్న నీటితీరువా బకాయిలకు ఒక డిమాండ్ నోటీసు, రీసర్వే తరువాత వచ్చిన 1434 ఫసలీలో ఉన్న బకాయిలకు మరో డిమాండ్ నోటీసు జారీ చేయాలి. అంటే ఒక రైతుకు సంబంధించిన బకాయిల వసూలుకు వీఆర్ఓ రెండు డిమాండ్ నోటీసులు జారీ చేయాల్సి ఉంటుంది. దీనికయ్యే ఖర్చుల విషయంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలూ లేవు. ఈ నేపథ్యంలో గ్రామంలోని రైతులందరికీ రెండేసి నోటీసులు జారీ చేయాలంటే ఆర్థికంగా కుదేలైపోతామని వీఆర్ఓలు అంటున్నారు. కరప మండలంలోని ఒక మేజర్ గ్రామ పంచాయతీ వీఆర్ఓకు డిమాండ్ నోటీసులు జారీ చేసేసరికి రూ.18 వేల మేర చేతిచమురు వదిలిందని రెవెన్యూ వర్గాలు తెలిపాయి. ఈ ఖర్చులు ఎవరు భరిస్తారని వీఆర్ఓలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయం చేయకుండా నీటితీరువా వసూలా? వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతోంది. రైతులు పెట్టుబడిలు కోసం నానా ఇబ్బందులూ పడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి రైతుకూ రూ.20 వేల పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పింది. కానీ, అధికారంలోకి వచ్చి ఏడాదైపోతున్నా ఆ మాట నిలబెట్టుకోలేదు. ఇప్పుడు చూస్తే నీటితీరువాను బకాయిలతో సహా ఇప్పటికిప్పుడు ఒకేసారి వసూలు చేయడం సహేతుకం కాదు. చాలా ఏళ్లుగా నీటితీరువా వసూలు చేయడం లేదు. రైతులు కూడా ఈ విషయం పూర్తిగా మరచిపోయారు. అలాగే, రూ.35 సర్వీసు ట్యాక్స్ వసూలు నిర్ణయం కూడా వెనక్కు తీసుకోవాలి. – రావుల ప్రసాద్, రైతు సంఘ ప్రతినిధి, కూరాడ, కరప మండలం అన్నదాతపై భారం మోపేలా.. గత ప్రభుత్వ విధానానికి భిన్నంగా చంద్రబాబు ప్రభుత్వం రైతులను నానా ఇక్కట్లకూ గురి చేస్తోంది. గద్దెనెక్కగానే రైతులకు చేస్తానన్న సాయం చేయకపోగా వారిపై భారం మోపేలా నిర్ణయం తీసుకుంది. వ్యవసాయం దండగన్న చంద్రబాబు అందుకు తగ్గట్టుగానే రైతుల నెత్తిన అకస్మాత్తుగా నీటితీరువా గుదిబండ వేశారు. ఆయన గద్దెనెక్కాక రెండో వ్యవసాయ సీజన్ ప్రారంభమైనా రైతుకు ఇస్తామన్న పెట్టుబడి సాయం చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు. పైగా ఇప్పుడు నీటితీరువా వసూలు చేయాలని రెవెన్యూ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై రైతులు మండిపడుతున్నారు. ఇంత కాలం అసలు నీటితీరువా అంటూ ఒకటి ఉందనే విషయాన్నే వారు మరచిపోయారు. అటువంటిది బకాయిలతో కలిపి నీటితీరువా వసూలు చేసేందుకు రెవెన్యూ యంత్రాంగం సమాయత్తం కావడం రైతులను కలవరపాటుకు గురి చేస్తోంది. మండలాల వారీగా 1434 ఫసలీలో నీటితీరువా డిమాండ్, వసూలు వివరాలు (రూ.లు) పెద్దాపురం రెవెన్యూ డివిజన్ మండలం డిమాండ్ వసూలు బ్యాలెన్స్గండేపల్లి 10,47,383 ––– 10,47,383 జగ్గంపేట 27,99,974 ––– 27,99,974 కిర్లంపూడి 2,43,71,714 ––– 2,43,71,714 కోటనందూరు 93,36,189 12,81,971 80,54,218 పెద్దాపురం 1,13,36,038 5,39,959 1,07,96,079 ప్రత్తిపాడు 50,23,200 ––– 50,23,200 రౌతులపూడి 13,99,873 ––– 13,99,873 శంఖవరం 5,15,997 ––– 5,15,997 తొండంగి 1,04,34,976 4,93,142 99,41,834 తుని 26,04,969 ––– 26,04,969 ఏలేశ్వరం 70,82,381 ––– 70,82,381 మొత్తం 7,59,52,694 23,15,072 7,36,37,622 కాకినాడ రెవెన్యూ డివిజన్ పెదపూడి 99,31,430.94 4,08,077.00 95,23,353.87 కాజులూరు 82,41,762.46 2,73,796.00 79,67,966.46 పిఠాపురం 79,94,757.17 5,51,368.00 74,43,352.60 కరప 73,66,201.82 1,29,681.00 72,36,520.79 సామర్లకోట 59,89,496.35 2,17,637.00 57,71,853.53 గొల్లప్రోలు 33,94,159.40 41,203.00 33,52,954.44 కొత్తపల్లి 35,04,440.89 1,58,863.00 33,45,577.86 కాకినాడ రూరల్ 17,13,798.04 1,11,853.00 16,01,943.62 తాళ్లరేవు 16,32,013.18 77,327.00 15,54,686.13 కాకినాడ అర్బన్ 2,81,906.40 8,175.00 2,73,730.99 మొత్తం 5,00,49,966.65 19,77,980.00 4,80,71,940.03 జగన్ సర్కారులో ఆ ఊసే లేదు రైతు పక్షపాతి అయిన గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అసలు నీటితీరువా అనేదే లేకుండా చేశారు. తద్వారా రైతుల నెత్తిన పాలు పోశారు. వాస్తవానికి నీటి తీరువాను గతంలో క్షేత్ర స్థాయిలో రెవెన్యూ అధికారులు వ్యక్తిగతంగా వసూలు చేసేవారు. ఈ ప్రక్రియ లోపభూయిష్టంగా ఉండటంతో ఆన్లైన్ చేద్దామని నాటి జగన్ ప్రభుత్వం భావించింది. రాష్ట్రవ్యాప్తంగా నీటితీరువా డిమాండ్ రూ.350 కోట్లు మించి లేదు. అటువంటప్పుడు అదేమీ పెద్ద విషయం కాదనే ఉద్దేశంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నీటితీరువా వసూలుపై పెద్దగా దృష్టి పెట్టలేదు. తద్వారా రైతులకు మేలు చేసింది. దీంతో, సుమారు నాలుగేళ్లుగా వారికి రూపాయి కూడా నీటితీరువా చెల్లించాల్సిన అవసరం రాలేదు. -
మూడేళ్లు దాటుతున్నా..
జాతీయ రహదారి 216ఏలో ఆలమూరు మండలం జొన్నాడ వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు నత్తను తలపిస్తున్నాయి. 2022 సెప్టెంబర్ 22న పనులు మొదలు కాగా, ఇంకా పూర్తి కాలేదు. దీంతో పాటు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరాన్ని ఆనుకుని మోరంపూడి వద్ద ఫ్లెఓవర్ కూడా జొన్నాడతో పాటు ప్రారంభించారు. ఇప్పటికే మోరంపూడి ఫ్లై ఓవర్ వినియోగంలోకి రాగా, జొన్నాడ మాత్రం బాలారిష్టాలు దాటడం లేదు. పిల్లర్ల నిర్మాణం పూర్తి కాగా, వాటిపై గెడ్డర్లు, శ్లాబ్ వేయాల్సి ఉంది. అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులు మొదలు కాలేదు. అప్రోచ్ నిర్మాణం కోసమని పి.గన్నవరంలో ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇస్తే, అక్రమార్కులు తవ్వకాలు చేసి కాసులు దండుకున్నారు. నిర్మాణ పనుల వల్ల జొన్నాడ సెంటర్లో నిత్యం ట్రాఫిక్ స్తంభించి, ఇటు రాజమహేంద్రవరం, రావులపాలెం, కాకినాడ వెళ్లే ప్రయాణికులు నరకం అనుభవిస్తున్నారు. -
పోలవరంపై సీఎం పచ్చి అబద్ధాలు
ఫ డయాఫ్రం వాల్ నాశనానికి చంద్రబాబే కారణం ఫ జగన్ హయాంలో గేట్లు సహా అత్యధిక శాతం పనులు పూర్తి ఫ వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు తాళ్లపూడి (కొవ్వూరు): పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మండిపడ్డారు. తాళ్లపూడి మండలం మలకపల్లిలో మంగళవారం జరిగిన పర్యటన సందర్భంగా సీఎం చేసిన ప్రసంగంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టులో కుడి, ఎడమ కాలువలను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దాదాపు పూర్తి చేశారని గుర్తు చేశారు. అనంతరం 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో కేవలం ఒక గేటు పెట్టి, ప్రాజెక్టును చూడటానికి జనాన్ని బస్సుల్లో తరలించి, వందల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం వృథా చేశారని అన్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఈ ప్రాజెక్టుకు అన్ని గేట్లూ పెట్టారని, ప్రాజెక్టు నిర్మాణం చాలా వరకూ పూర్తి చేశారని చెప్పారు. దీనిని కావాలనే విస్మరించి, జగన్ హయాంలో కేవలం 4 శాతం పనులే జరిగాయని చంద్రబాబు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ ఏడాదిలో 6 శాతం పనులు పూర్తి చేశామంటున్నారని, అదే సమయంలో ప్రాజెక్టు 82 శాతం పూర్తయ్యిందంటున్నారని, అటువంటప్పుడు ఇదంతా ఎవరి హయాంలో జరిగినట్లని వెంకట్రావు ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్ నాశనమవడానికి చంద్రబాబే కారణమని ఆరోపించారు. పోలవరం సందర్శనకు రూ.500 కోట్ల ప్రజాధనం వృథా చేశారన్నారు. చంద్రబాబుకు డబ్బులు, క్రెడిట్ దక్కించుకోవడం తప్ప పోలవరం ప్రాజెక్టుపై చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభంలో శీనయ్య కమిటీ రెండు డయాఫ్రం వాల్స్ కట్టాలని సూచించినప్పటికీ చంద్రబాబు ఒక్కటి మాత్రమే నిర్మించారని విమర్శించారు. అది కూడా ఒకచోట 52 మీటర్లు, మరోచోట 92 మీటర్ల మేర ఇష్టారాజ్యంగా నిర్మించారని చెప్పారు. డయాఫ్రం వాల్ పునాది కచ్చితంగా హార్డ్ రాక్ వరకూ వెళ్లాలని అధికారులు సూచించినా చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. అందువల్లనే నేడు ఈ దుస్థితి నెలకొందని, చేసిన తప్పు ఒప్పుకొని లెంపలేసుకోవాల్సింది పోయి, ఆ తప్పును జగన్పై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. పింఛన్ల పంపిణీకి రూ.కోట్లు దుర్వినియోగం గత ప్రభుత్వంలో ప్రతి నెలా వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేస్తే.. నేడు ప్రతి నెలా చంద్రబాబు తన ప్రచారం కోసం కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోపక్క సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండానే అమలు చేశానని చెప్పడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో కొత్త పథకాలు ప్రారంభించడానికి మాత్రమే నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సభలు పెట్టేవారని, కానీ నేడు ప్రతి దానినీ చంద్రబాబు ప్రచారార్భాటానికి వాడుకుంటున్నారని విమర్శించారు. రాజకీయాల్లో రౌడీలు ఉన్నారంటున్నారని, ఆయన పార్టీలో ఎంత మంది రౌడీలున్నారని ప్రశ్నించారు. పైగా ఇసుక, మద్యం, మట్టి, మైనింగ్ మాఫియాలుగా మారి ప్రజాధనాన్ని దోచుకుంటున్నది అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు కాదా అని ప్రశ్నించారు. ప్రతిపక్షంపై దాడులు చేసి కేసులు పెడుతున్నది ఈ ప్రభుత్వం కాదా అని వెంకట్రావు నిలదీశారు.పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.13,683 కోట్లు ఖర్చు చేసి 72 శాతం పైగా పూర్తి చేశామని 2024 జూన్లో చెప్పారు. పోలవరం అంచనా రూ.55,549 కోట్లు అయినప్పుడు రూ.13,683 కోట్లు అంటే 24 శాతం ఖర్చు చేసి 72 శాతం పూర్తి చేశానని ఎలా అన్నారు? అబద్ధాలు చెప్పడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. జనాన్ని నమ్మించడానికే ఈ కట్టు కథలు చెబుతున్నారు. -
పట్టాభిరామ్ మనవారే..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ప్రముఖ ఇంద్రజాలికుడు, వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్ ఆకస్మిక మరణంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విషాదఛాయలు అలముకున్నాయి. పట్టాభిరామ్కు ఈ జిల్లాతో విడదీయరాని అనుబంధమే ఉంది. ఉమ్మడి జిల్లాలోని కె.గంగవరం మండలం దంగేరులో ఆయన పూర్వీకులు నివాసం ఉండేవారు. అక్కడ నుంచి ద్రాక్షారామ సమీపంలోని దొడ్డంపేటలో తల్లిదండ్రులతో కలిసి నివాసముండగా పట్టాభిరామ్ రామచంద్రపురంలో ప్రాథమిక, మాధ్యమిక విద్యను అభ్యసించారు. ఉన్నత చదువుల కోసం కాకినాడ వచ్చి అక్కడి పీఆర్ కళాశాలలో ఉన్నత విద్య అభ్యసించారు. కాలి వైకల్యంతో ఉన్న ఆయన ఆ లోపం కనపడకుండా ఉండేందుకు.. తండ్రి రావు సాహెబ్ భావరాజు సత్యనారాయణ సూచన మేరకు ప్రముఖ ఇంద్రజాలికుడు ఎంబీ రావ్ వద్ద ఇంద్రజాలంలో శిక్షణ పొందారు. అక్కడ నుంచి ఆయన వెనుదిరిగి చూడలేదు. కాకినాడ నుంచి హైదరాబాద్లో భారత ఆహార సంస్థ ఉద్యోగిగా ఉంటూ అనేక ఇంద్రజాల ప్రదర్శనలు ఇస్తూ జిల్లా పేరు ప్రతిష్టలను రాష్ట్రవ్యాప్తం చేశారు. ఇంద్రజాలంతో పాటు వ్యక్తిత్వ వికాసంపై అనేక పుస్తకాలు రాశారు. ఇంద్రజాలం అంటే ఒక వినోదం మాత్రమే కాదని, మూఢనమ్మకాలపై పరోక్షంగా ఒక యుద్ధాన్ని చేశారు. 1949లో జన్మించిన పట్టాభిరామ్ 75 ఏళ్ల వయసులో ఖైరతాబాద్లో మృతి చెందడంతో ఈ ప్రాంత వాసులు ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. -
దేవస్థానం పునర్నిర్మాణానికి రూ.లక్ష విరాళం
అమలాపురం టౌన్: పురాతన దేవస్థానమైన అమలాపురం భూపయ్య అగ్రహారంలోని సీతారామచంద్రమూర్తి స్వామి దేవస్థానం పునర్నిర్మాణానికి పట్టణానికి చెందిన జీవీఎంఎం సేవా ట్రస్ట్ చైర్మన్ గుళ్లపల్లి సత్యనారాయణ రూ.1,01,116 విరాళాన్ని అందజేశారు. దేవస్థానం వద్ద దాత గుళ్లపల్లి సత్యనారాయణ పునర్నిర్మాణ కమిటీ ప్రతినిధులకు ఈ విరాళాన్ని మంగళవారం అందించారు. తన తల్లిదండ్రులు దివంగత గుళ్లపల్లి వెంకట్రామయ్య, మహాలక్ష్మమ్మ, తన భార్య దివంగత కామేశ్వరి సంస్మరణార్థం విరాళం అందజేసినట్టు సత్యనారాయణ తెలిపారు. కమిటీ ప్రతినిధులు జిల్లెళ్ల గోపాల్, విస్సాప్రగడ చాన్న, మండలీక నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
శృంగార వల్లభునికి రూ.31.66 లక్షల ఆదాయం
పెద్దాపురం: తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభ స్వామి వారికి అన్నదానం, హుండీల ద్వారా రూ.31,66,081 ఆదాయం సమకూరింది. జిల్లా దేవదాయ శాఖ అధికారి కె.నాగేశ్వరరావు, డివిజనల్ ఇన్స్పెక్టర్ వి.ఫణీంద్ర కుమార్, సర్పంచ్ మొయిళ్ల కృష్ణమూర్తి సమక్షంలో ఆలయంలోని హుండీలను మంగళవారం తెరచి, ఆదాయం లెక్కించారు. మొత్తం 104 రోజులకు గాను ఆలయ హుండీల ద్వారా రూ.23,89,935, అన్నదానం హుండీ ద్వారా రూ.7,76,146 మేర ఆదాయం సమకూరిందని ఆలయ కార్యనిర్వహణాధికారి వడ్డి శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు తదితరులు పాల్గొన్నారు. అరుణాచలానికి 8న ప్రత్యేక బస్సులు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): గురు పౌర్ణమి సందర్భంగా ఈ నెల 8న జిల్లాలోని మూడు డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం.శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాకినాడ, ఏలేశ్వరం, తుని డిపోల నుంచి ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఈ బస్సులు బయలుదేరుతాయన్నారు. కాణిపాకం, శ్రీపురం దర్శనానంతరం అరుణాచలం చేరుతాయని తెలిపారు. తిరుగు ప్రయాణంలో శ్రీకాళహస్తి దర్శనానంతరం ఈ నెల 11న ఆయా డిపోలకు చేరుతాయని వివరించారు. పూరీ జగన్నాథ రథయాత్రకు వెళ్లేందుకు కూడా స్పెషల్ బస్సులు సిద్ధం చేశామని శ్రీనివాసరావు తెలిపారు. ఆర్అండ్బీ ప్రాజెక్ట్స్ ఈఈగా సీతయ్య బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా రోడ్లు, భవనాల (ఆర్అండ్బీ) శాఖ ప్రాజెక్టు ఈఈగా ఎన్.సీతయ్య మంగళవారం కాకినాడలో బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఈఈగా పని చేస్తున్న మల్లికార్జున రిటైరయ్యారు. ఆయన స్థానంలో కొయ్యలగూడెం డీఈగా ఉన్న సీతయ్యకు ఈఈగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయనను పీఆర్ ఇంజినీర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అన్యం రాంబాబు తదితరులు అభినందించారు. కుమార సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకాలు బిక్కవోలు: స్థానిక శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయంలో స్వామివారికి పెద్ద సంఖ్యలో భక్తులు మంగళవారం అభిషేకాలు నిర్వహించారు. స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం, షష్ఠి కలసి రావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు. అభిషేకాల అనంతరం స్వామివారికి అర్చకులు ప్రత్యేక అలంకరణ చేశారు. దేవదాయ శాఖ ఆధ్వర్యాన అన్నసమారధన నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందీ కలగకుండా ఈఓ రామలింగ భాస్కర్ ఆధ్వర్యాన సిబ్బంది ఏర్పాట్లు చేశారు. -
జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో తరగతుల వారీగా విద్యార్థులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: తుని మండలం హంసవరం గ్రామానికి చెందిన కె.వెంకటేశ్వరరావు (పేరు మార్చాం) కాకినాడలోని ఓ ప్రైవేటు కంపెనీలో గుమస్తాగా పని చేస్తున్నాడు. కాకినాడ రూరల్ వాకలపూడిలో చిన్న పెంకుటింట్లో నివాసం. భార్యాభర్తలిద్దరూ పనిలోకి వెళ్తే తప్ప కుటుంబం గడవదు. వారికి నాలుగేళ్ల కుమారుడున్నాడు. ఇరుగుపొరుగు కుటుంబాల వారు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చదివిస్తున్నారు. అది చూసిన వెంకటేశ్వరరావు దంపతులు కూడా తమ కుమారుడిని ఏదో ఒక ప్రైవేటు ప్లే స్కూల్లో జాయిన్ చేద్దామని ఆశ పడ్డారు. రెండు మూడు స్కూళ్లకు వెళ్లారు. అన్ని రకాల ఫీజులూ కలిపి రూ.25 వేలు పైనే చెప్పారు. అదే ఎల్కేజీ రూ.45 వేలు, యూకేజీ రూ.65 వేలు చెప్పడంతో వారు కంగు తిన్నారు. ఏటా అన్ని వేల రూపాయల ఫీజులతో వేగలేమంటూ మరో మాట మాట్లాడకుండా ఇంటికి తిరిగి వచ్చేశారు. ఒక్క వెంకటేశ్వరరావు కుటుంబమే కాదు.. జిల్లాలో ఏ తల్లిదండ్రులను కదిపినా ఠారెత్తిస్తున్న ఫీజులతో గుండెలు పీచుపీచుమంటున్నాయనే అంటున్నారు. కూటమి సర్కారు ఏలుబడిలో విద్యా వ్యవస్థలో కార్పొరేట్ పెత్తనం పెరిగిపోవడంతో ఫీజులపై నియంత్రణ లేకుండా పోయింది. దీంతో, పిల్లల చదువులు సామాన్య, మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి కుటుంబాలకు భారంగా మారాయి. కానరాని తనిఖీలు ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల వసూళ్లపై ప్రభుత్వ పరంగా ఎటువంటి తనిఖీలూ జరగడం లేదు. దీనిపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో ఎంఈఓ పర్యవేక్షణలో ఆయా పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేసేవారు. అటువంటిది ఇప్పుడు విద్యాశాఖ అధికారులు ప్రైవేటు పాఠశాలలపై కన్నెత్తి కూడా చూడటం లేదు. పాఠశాలల్లో చదువుతో పాటు ఆటలు ఆడించడం విద్యార్థుల మానసిక, శారీరక వికాసానికి దోహదపడుతుంది. దీనికోసం వ్యాయామోపాధ్యాయులతో పాటు ఆటస్థలం కూడా పాఠశాలల్లో ఉండాలి. కానీ, ప్రైవేటు పాఠశాలల్లో అటువంటి పరిస్థితి కనిపించడం లేదు. పైగా, నాలుగైదు అంతస్తులతో ఉన్న భవనాల్లో కూడా ప్రైవేటు పాఠశాలల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వ హయాంలో.. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజులపై నియంత్రణ ఉండేది. అధికారులు తరచూ ఆకస్మిక తనిఖీలు కూడా చేసేవారు. దీంతో, ప్రైవేటు స్కూళ్ల ఫీజుల్లో కొంత నియంత్రణ కనిపించేందని చెబుతున్నారు. అప్పట్లో ప్లే స్కూల్ నుంచి టెన్త్ వరకూ ఫీజు రూ.12 వేలు మాత్రమే ఉండేది. పట్టణ ప్రాంతాల్లో అదనంగా రూ.వెయ్యి వసూలు చేసేవారు. కార్పొరేషన్లలోని పాఠశాలల్లో రూ.18 వేల వరకూ అనుమతించేవారు. అటువంటిది నేడు దీనికి పూర్తి భిన్నంగా ప్లే స్కూల్ నుంచే విద్యార్థుల తల్లిదండ్రులపై ఫీ‘జులుం’ సాగిస్తున్నారు. ఫీజులు నియంత్రించాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. వారి ఆశలే.. వీరికి కాసులు సాధారణంగా ఏ తల్లిదండ్రులైనా తమకంటే తమ పిల్లలు మరింత ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటారు. సర్కారీ పాఠశాలలు, కళాశాలలను ప్రభుత్వమే చిన్నచూపు చూస్తున్న ప్రస్తుత తరుణంలో.. అనేక మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందనే నమ్మకంతో ప్రైవేటు విద్యా సంస్థల వైపు చూస్తున్నారు. వేలకు వేలు అప్పులు చేసి మరీ తమ పిల్లలను ఆయా విద్యా సంస్థల్లో చేర్పిస్తున్నారు. ఇదే అదనుగా పలు ప్రైవేటు విద్యా సంస్థలు రకరకాల పేర్లతో వసూళ్లకు పాల్పడుతున్నాయి. ● ప్రభుత్వం రూపొందించిన పాఠ్య పుస్తకాలనే ప్రైవేటు పాఠశాలల్లో కూడా ఉపయోగించాలి. కానీ, పలు యాజమాన్యాలు సొంత కంటెంట్తో తయారు చేసిన పుస్తకాలనే విక్రయిస్తున్నా విద్యా శాఖ చూసీ చూడనట్లు వదిలేస్తోందనే విమర్శలున్నాయి. ● యూనిఫామ్ దగ్గర నుంచి పుస్తకాలు, ట్యూషన్ ఫీజులు, డొనేషన్లు ఇలా ప్రైవేటు యాజమాన్యాలు అడిగినంతా రెండో మాట లేకుండా సమర్పించుకోవాల్సిందే. ● కొన్ని విద్యా సంస్థలు తాము చెప్పిన షాపులోనే యూనిఫాం, బెల్టులు, బూట్లు, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ వంటివన్నీ కొనాలని షరతులు పెడుతున్నాయి. దీనిని కాదంటే ఏమవుతోందోననే బెంగ తల్లిదండ్రులను వేధింస్తోంది. భారం మోయలేక.. ఏటా అడ్డగోలుగా ఫీజులు పెంచేస్తూంటంతో ఆ భా రం మోయలేని పలువురు తల్లిదండ్రులు పదో తరగతి వచ్చేసరికి తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్ల నుంచి మా న్పించేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం విడుదల చేసిన లెక్కలు చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. జిల్లాలోని ప్రైవేటు స్కూళ్లలో రెండో తరగతిలో 13,261 మంది విద్యార్థులుంటే పదో తరగతి వచ్చేసరికి ఆ సంఖ్య 8,590కి పడిపోయింది. దీనినిబట్టి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్లే స్కూల్కే రూ.25 వేలు పైగా వసూలు రకరకాల పేర్లతో భారీగా వసూళ్లు పుస్తకాల నుంచి సాక్స్ వరకూ అంతా వ్యాపారమే.. దోపిడీపై నోరెత్తని ప్రభుత్వం ‘ప్రైవేటు’ దెబ్బకు తల్లిదండ్రుల గుండె గుభేల్ఫీజులు నియంత్రించాలి జిల్లావ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. అటువంటి వాటిపై చర్యలు తీసుకోవాలి. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలో పాఠ్య పుస్తకాలు, స్టేషనరీ అమ్మకాలు నిర్వహించకూడదని విద్యా హక్కు చట్టం చెబుతోంది. కానీ, ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలు దీనిని పట్టించుకోవడం లేదు. అధిక మొత్తంలో పాఠ్య పుస్తకాలు, స్టేషనరీ అమ్ముతున్నాయి. అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి. – ఎం.గంగా సూరిబాబు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, కాకినాడ కఠిన చర్యలు అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యా సంస్థలపై విద్యార్థుల తల్లితండ్రులు ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తప్పవు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ప్రైవేటు పాఠశాలలను నిర్వహించాలి. ఫీజులు కూడా ప్రభుత్వ మార్గదర్శకాల మేరకే వసూలు చేయాలి. దీనిపై విద్యా శాఖ నిఘా పెట్టింది. ఆయా పాఠశాలలను సందర్శించడం ద్వారా అధిక ఫీజులు వసూలు చేయకుండా చర్యలు తీసుకుంటాం. – పిల్లి రమేష్, జిల్లా విద్యాశాఖాధికారి, కాకినాడ ఫీజుల మోత మోగుతోందిలా.. ప్రైవేటు పాఠశాలల్లో ఒకటి నుంచి మూడో త రగతి వరకూ మొదటి టర్మ్ ఫీజు రూ.49,000, రెండో టర్మ్ రూ.46,900, లైబ్రరీ ఫీజు రూ.3,000 చొప్పున వసూలు చేస్తున్నారు. నాలుగు నుంచి ఆరో తరగతి వరకూ మొదటి టర్మ్ ఫీజు రూ.51 వేలు, రెండో టర్మ్ ఫీజు రూ.49,900, లైబ్రరీ ఫీజు రూ.4,000. ఏడు నుంచి పదో తరగతి వరకూ మొదటి టర్మ్ ఫీజు రూ.53,000, రెండో టర్మ్ రూ.50,900, లైబ్రరీ ఫీజు రూ.4,000. ఇవి కాకుండా బస్సు, ఆటో వంటి వాటికి రవాణా ఫీజుగా రూ.33,000, అడ్మిషన్ ీఫీజు రూ.15,000 వసూలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం బస్సు ఫీజు కిలో మీటరుకు రూ.1.30 వసూలు చేయాలి. కానీ, ప్రైవేటు విద్యా సంస్థలు ఏటా దూరాన్ని బట్టి రూ.15 వేల నుంచి రూ.30 వేలు పైగా వసూలు చేస్తున్నాయి. అలాగే, మొదటి 30 రోజుల్లో ఆలస్యంగా వస్తే రూ.50, తరువాత నుంచి సమయానికి హాజరు కాకుంటే రోజుకు రూ.100 చొప్పున చెల్లించాలి. ప్రతి విద్యా సంవత్సరానికి 10 నుంచి 15 శాతం మేర ఫీజులు పెంచుతున్నారు. గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఫీజుల భారం 20 శాతం పెరిగిందని చెబుతున్నారు. ఇది చాలదన్నట్టు యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ ఖర్చు అదనం. తరగతి విద్యార్థులు 1 11,757 2 13,261 3 13,717 4 13,142 5 12,761 తరగతి విద్యార్థులు 6 10,755 7 9,590 8 8,746 9 8,818 10 8,590 మొత్తం 1,11,137 -
పెండింగ్ బిల్లులు, వేతనాలు వెంటనే చెల్లించాలి
మధ్యాహ్న భోజన పథకం కార్మికుల ధర్నాకాకినాడ సిటీ: పెండింగ్ బిల్లులు, వేతనాలు వెంటనే విడుదల చేయాలని, స్కూల్ ఆయాలకు ఆరు నెలల వేతన బకాయిలు తక్షణం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యాన మధ్యాహ్న భోజన పథకం కార్మికులు కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షురాలు జి.బేబీరాణి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దువ్వా శేషుబాబ్జీ, చంద్రమళ్ల పద్మ మాట్లాడుతూ, కాకినాడ రూరల్ ప్రాంతంలో గుడి, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ పేరుతో ప్రతి నెలా మామూళ్లు చెల్లించాలంటూ మధ్యాహ్న భోజన కార్మికులను ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో శానిటేషన్ పని చేసే ఆయాలకు ప్రభుత్వం జనవరి నుంచి వేతనాలు చెల్లించడం లేదన్నారు. ఇచ్చే అరకొర వేతనం కూడా నెలల తరబడి బకాయి పెడితే కుటుంబాలను ఎలా పోషించుకుంటారని ప్రశ్నించారు. మెనూ చార్జీ ప్రతి విద్యార్థికి రూ.20 చెల్లించనిదే వండి పెట్టడం అసాధ్యంగా మారిందన్నారు. వంట గ్యాస్ను ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిరుద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తోందని, అక్రమ తొలగింపులు రాజకీయ వేధింపులు అధికమయ్యాయని, తక్షణం వీటిని ఉపసంహరించుకోకపోతే తీవ్ర స్థాయి ఆందోళనలకు సిద్ధపడతామని హెచ్చరించారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, స్కూలు ఆయాలకు పీఎఫ్, ఈఎస్ఐ, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్కుమార్, మిడ్డే మీల్ సంఘం జిల్లా కార్యదర్శి కరకు సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం బకాయిలు చెల్లించాలి
కాకినాడ సిటీ: దాళ్వా పంటలో సీఎంఆర్ ద్వారా అమ్మిన ధాన్యం బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏపీ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యాన కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం మే నెల నుంచి రూ.110 కోట్లు బకాయి పెట్టడంతో జిల్లాలోని రైతులు అనేక అవస్థలు పడుతున్నారని ఆందోళనకారులు వివరించారు. ఒక్క తాళ్లరేవు మండలంలోనే 300 మంది రైతులకు రూ.5 కోట్లు, కాజులూరు మండలంలో 400 మందికి రూ.6 కోట్లు పైగా చెల్లించాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఖరీఫ్ మొదలైందని, ఇటు పెట్టుబడికి డబ్బులు లేక, అటు పాత బకాయిలు తీర్చలేక నానా ఇక్కట్లూ పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం ఇస్తానన్న రూ.20 వేలు కూడా వేయలేదన్నారు. వెంటనే ధాన్యం బకాయిలు, పెట్టుబడి సాయం డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నూతన కౌలు చట్టం తీసుకురావాలని, కాజులూరు, ఇంజరం వంతెనలు తక్షణం నిర్మించాలని కోరారు. ఈ సంఘం జిల్లా నాయకులు వల్లు రాజబాబు, టేకుమూడి ఈశ్వరరావు, దువ్వా శేషుబాబ్జీ, ఎం.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.పీజీఆర్ఎస్కు 556 అర్జీలు కాకినాడ సిటీ: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా వచ్చిన ప్రజలు వివిధ సమస్యలపై 556 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ షణ్మోహన్ సగిలి, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, డీఆర్ఓ వెంకటరావు, ట్రైనీ కలెక్టర్ మనీషా, హౌసింగ్ పీడీ ఎన్వీవీ సత్యనారాయణ, జెడ్పీ సీఈఓ వీవీఎస్ లక్ష్మణరావు తదితరులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులు సత్వరమే సమగ్రంగా, సంతృప్తికరంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పరిష్కరించిన దరఖాస్తులను జిల్లా అధికారి ఆడిట్ చేయాలన్నారు. అనంతరం రాష్ట్ర స్థాయిలో ఆడిట్ జరుగుతుందని, ఆ సందర్భంగా గుర్తించిన లోపాలపై సంబంధిత జిల్లా అధికారులకు మెమోలు జారీ చేస్తారని కలెక్టర్ తెలిపారు. సత్యదేవునికి ఘనంగా జన్మనక్షత్ర పూజలు అన్నవరం: జన్మ నక్షత్రం మఖను పురస్కరించుకుని సత్యదేవునితో పాటు అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు సోమవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆయుష్య హోమం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున రెండు గంటలకు స్వామివారి ఆలయం తెరచి అర్చకులు సుప్రభాత సేవ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల మూలవిరాట్టులకు, శివలింగానికి మహన్యాస పూర్వక పంచామృతాభిషేకం నిర్వహించి, సుగంధభరిత పుష్పాలతో పూజించారు. ఉదయం ఆరు గంటల నుంచి దర్శనానికి భక్తులను అనుమతించారు. యాగశాలలో ఉదయం 9 గంటల నుంచి సత్యదేవుడు, అమ్మవారికి ఆయుష్య హోమం ఘనంగా నిర్వహించారు. స్వామివారిని సుమారు 20 వేల మంది భక్తులు దర్శించారు. వెయ్యి వ్రతాలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.20 లక్షల ఆదాయం సమకూరింది. సత్యదేవుడు, అమ్మవారు, శంకరులను ముత్యాల కవచాల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవల ధరలు ప్రదర్శించాలి రాజమహేంద్రవరం రూరల్: ప్రైవేటు ఆసుపత్రుల్లో అందించే వైద్య సేవల ధరలను 15 రోజుల్లోగా ప్రదర్శించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె.వెంకటేశ్వరరావు ఆదేశించారు. రిసెప్షన్ కౌంటర్లో స్థానిక భాష, ఇంగ్లిషులో ఈ ధరల పట్టికను స్పష్టంగా ప్రదర్శించాలని పేర్కొన్నారు. ఏటా జూన్ ఒకటో తేదీ నాటికి ధరల జాబితాను రిజిస్ట్రేషన్ అధికారికి పంపించాలన్నారు. -
ఆంధ్రా అరుణాచలంలో.. ఆధ్యాత్మిక శోభ
● 7న 63 మంది నాయనార్ల విగ్రహాల ప్రతిష్ఠ ● ఇతర దేవతా విగ్రహాలు కూడా.. ● తరలిరానున్న ప్రముఖులు నాయనార్లు ఎవరంటే.. తమిళనాడులో 5 – 10 శతాబ్దాల మధ్య నివసించిన గొప్ప శివ భక్తులే ఈ నాయనార్లు. 13వ శతాబ్దంలో రచించిన తమిళ ప్రబంధం పెరియ పురాణం ప్రకారం వీరు మొత్తం 63 మంది. వీరు భక్తి ద్వారా మోక్షసిద్ధి పొందినట్లు ఈ పురాణం ద్వారా తెలుస్తోంది. నాయనార్లలో రాజుల నుంచి సాధారణ మానవుల వరకూ అన్ని స్థాయిల వారూ ఉన్నారు. భగవంతుడిని చేరడానికి నిష్కల్మషమైన భక్తి తప్ప ఇంకేదీ అవసరం లేదని వీరి కథలు నిరూపిస్తాయి. ప్రత్తిపాడు రూరల్: తమిళనాడులోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరుణాచలాన్ని తలపించేలా.. ప్రత్తిపాడు మండలం రాచపల్లిలోని శ్రీ రమణ సేవాశ్రమం సరికొత్త ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటోంది. ఈ ఆధ్యాత్మిక కేంద్రం మూడు దశాబ్దాలుగా అనేక మందిని భగవాన్ రమణ మహర్షి బోధించిన మార్గంలో పయనింపజేస్తూ.. సంఘహిత కార్యక్రమాలు చేపడుతూ.. ఇటు భక్తుల, అటు ప్రజల ఆదరణను చూరగొంటోంది. రాచపల్లికి చెందిన కవల బ్రహ్మచారులు రమణానంద, లక్ష్మణానందలు ఆధ్యాత్మిక సాధనలో రమణ మహర్షి బోధనల పట్ల ఆర్షితులయ్యారు. వీటి ద్వారా సమాజాభివృద్ధికి దోహదపడాలనే కాంక్షతో 1990 ఆగస్టు 15న 16వ నంబరు జాతీయ రహదారిని ఆనుకొని రాచపల్లి సమీపాన ప్రజల విరాళాలతో నాలుగెకరాల స్థలాన్ని సమకూర్చి ఈ ఆశ్రమం ఏర్పాటు చేశారు. ఇక్కడ రమణ మహర్షి ప్రధానాలయం, ధ్యాన మందిరం ఈ ఆశ్రమాన్ని ఆనుకొని 2019 మార్చి 6న శ్రీ అపీతకుచాంబ సమేత అరుణాచలేశ్వరస్వామి ఆలయాన్ని, దక్షిణామూర్తి, గణపతి, కుమారస్వామి ఉపాలయాలను నిర్మించారు. క్రమంగా ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఆంధ్రా అరుణాచలంగా తీర్చిదిద్దారు. తొలుత స్థానికులు మాత్రమే ఈ క్షేత్ర దర్శనానికి వచ్చేవారు. అనతి కాలంలోనే పరిసర మండలాలు, జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల వారు సైతం ఈ క్షేత్ర దర్శనానికి వస్తున్నారు. ఈ సుప్రసిద్ధ ఆలయంలోని మండపంలో ఈ నెల 7న మహా శివభక్తులైన 63 నాయనార్ల విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. వీరితో పాటు ఉపాలయంలో దక్షిణామూర్తి, లక్ష్మీ హయగ్రీవుడు, సూర్య భగవానుడు, కాలభైరవుడు, గంగా మాత విగ్రహాలను కూడా ప్రతిష్ఠించనున్నారు. ప్రతిష్ఠామహోత్సవాలు ఇలా.. నాయనార్ల విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి పలువురు ప్రముఖులు తరలి రానున్నారు. తిరువణ్ణామలై అరుళ్లిగు అరుణాచలేశ్వరస్వామి వారి దేవస్థానం అర్చకుడు టి.అరుణాచల కార్తికేయ శివాచార్య ఆధ్వర్యాన నాయనార్ల విగ్రహాల ప్రతిష్ఠ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 4న గోపూజ, గణపతి హోమం, లక్ష్మీ హోమం, నవగ్రహ హోమం నిర్వహిస్తారు. 5న తీర్ధ సంగ్రహణం, అగ్నిసంగ్రహణం, దిశాహోమం, శాంతిహోమం, మూర్తి హోమం అనంతరం రక్షోఘ్నం, గ్రామ శాంతి, ప్రవేశ బలి, 6న స్వామి అనుజ్ఞ, అంకురార్పణ, యాగశాల నిర్మాణం, అశ్వపూజ జరుగుతాయి. 7న నాయనార్ల విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. అనంతరం కుంభాభిషేకం నిర్వహిస్తారు. ఈ వేడుకకు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ, కృష్ణా జిల్లా పెదపులిపాక విజయ రాజేశ్వరి దేవస్థానం పీఠాధిపతి వాసుదేవానందగిరి స్వామీజీతో పాటు పలువురు ఆధ్యాత్మికవేత్తలు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు, భారీ సంఖ్యలో భక్తులు హాజరు కానున్నారు. విజయవంతం చేయాలి ఆంధ్రా అరుణాచల క్షేత్రంలో ఈ నెల 7న నాయనార్ల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభోపేతంగా జరుగుతుంది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. వారికి, ప్రముఖులకు ఎటువంటి అసౌకర్యాలూ కలగకుండా విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని భక్తులు విజయవతం చేయాలి. – స్వామి రామానంద, శ్రీరమణ సేవాశ్రమం పీఠాధిపతి, రాచపల్లి -
రికార్డు స్థాయిలో..
ఫ సత్యదేవుని ప్రసాదాలకు క్యూ కట్టిన లోవ భక్తులు ఫ సుమారు 75 వేల ప్రసాదం ప్యాకెట్ల కొనుగోలు ఫ అన్నవరం దేవస్థానానికి రూ.15 లక్షల ఆదాయం అన్నవరం: ఊహించినట్టుగానే ఆషాఢ మాసం తొలి ఆదివారం సత్యదేవుని గోధుమ నూక ప్రసాదాల విక్రయాలు రికార్డు స్ధాయిలో జరిగాయి. ఆషాఢ మాసంలో ప్రతి ఆదివారం ఉదయం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి తలుపులమ్మ లోవ దేవస్థానానికి వేలాదిగా భక్తులు వెళ్తూంటారు. వారు తిరుగు ప్రయాణంలో అన్నవరంలో ఆగి సత్యదేవుని ప్రసాదం కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా అదే పునరావృతమైంది. 80 వేల ప్యాకెట్లు సిద్ధం లోవ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్నవరం దేవస్థానం అధికారులు 80 వేల సత్యదేవుని ప్రసాదం ప్యాకెట్లు సిద్ధం చేశారు. రత్నగిరిపై ప్రసాదం కౌంటర్లలో 25 వేలు, తొలి పావంచా వద్ద కౌంటర్లలో 20 వేలు, పాత నమూనా ఆలయం వద్ద 25 వేలు, కొత్త నమూనా ఆలయం వద్ద 5 వేల ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. 150 గ్రాముల ప్రసాదం ప్యాకెట్ను రూ.20 చొప్పున సుమారు 75 వేల ప్యాకెట్లు విక్రయించారు. భక్తులు భారీగా బారులు తీరి మరీ ప్రసాదాలు కొనుగోలు చేశారు. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకూ రద్దీ కొనసాగింది. లోవ భక్తుల తాకిడిని తట్టుకునేందుకు గాను తొలి పావంచా వద్ద అదనంగా మరో రెండు, జాతీయ రహదారిపై రెండు నమూనా ఆలయాల వద్ద కూడా మూడు కౌంటర్ల చొప్పున ప్రసాదం విక్రయ కౌంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రచారం లేక.. జాతీయ రహదారిపై రాజమహేంద్రవరం వైపు వెళ్లే మార్గంలో ఉన్న సత్యదేవుని నూతన నమూనా ఆలయం వద్ద కూడా ఏడాది కాలంగా ప్రసాదాలు విక్రయిస్తున్నారు. అయితే, దీనిపై తగినంత ప్రచారం లేకపోవడంతో లోవ భక్తుల వాహనాలు ఇక్కడ పెద్దగా ఆగడం లేదు. విశాఖపట్నం వైపు మార్గంలోని పాత నమూనా ఆలయం వద్దనే భక్తులు తమ వాహనాలను నిలిపి, రోడ్డు దాటుకుని వచ్చి, ప్రసాదాలు కొనుగోలు చేస్తున్నారు. ఈవిధంగా రోడ్డు దాటుతున్నప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతోనే గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాజమహేంద్రవరం వైపు మార్గంలో కూడా సత్యదేవుని నమూనా ఆలయం, ప్రసాదాల కౌంటర్ నిర్మించింది. వాహనాల పార్కింగ్కు స్థలం కేటాయించి, టాయిలెట్లు కూడా నిర్మించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఇక్కడ ఎటువంటి అభివృద్ధీ చేయలేదు. వాటర్ బాటిల్స్, శీతల పానీయాలు, స్నాక్స్ విక్రయించే షాపులు, హోటళ్లు లేకపోవడంతో ఇక్కడ భక్తులు పెద్దగా ఆగడం లేదు. ఎక్కువ మంది పాత నమూనా ఆలయం వద్దనే ఆగుతున్నారు. అక్కడ రోడ్డుకు ఇరువైపులా సుమారు 50 షాపులు, హోటల్స్ ఉండడంతో లోవ భక్తులు తిరుగు ప్రయాణంలో అక్కడి నమూనా ఆలయం వద్దనే ప్రసాదాలు కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ ఆదివారం సుమారు 25 వేల ప్రసాదం ప్యాకెట్లు విక్రయించగా కొత్త నమూనా ఆలయం వద్ద 5 వేల ప్యాకెట్లు మాత్రమే విక్రయించారు. నూతన నమూనా ఆలయం వద్ద అధికారులు తగిన వసతులు కల్పించాలని పలువురు సూచిస్తున్నారు. -
ఫ మనసారె దీవించమ్మా..
‘చల్లని తల్లీ.. మా కల్పవల్లీ.. మమ్మల్ని మనసారా దీవించమ్మా’ అంటు వందలాది మంది భక్తులు పాదయాత్రగా భారీ సారె తీసుకుని వచ్చి.. అమ్మవార్లకు సమర్పించారు. పిఠాపురం పాదగయ క్షేత్రంలో కొలువుదీరిన శ్రీ రాజరాజేశ్వరీదేవి, అష్టాదశ శక్తి పీఠాల్లో పదో పీఠం దేవత అయిన శ్రీ పురుహూతికా అమ్మవార్లకు మండలంలోని విరవ గ్రామానికి చెందిన శ్రీ పద్మావతీ శ్రీవారి సేవా సంఘం సభ్యులు ఏటా ఆషాఢ మాసంలో సారె సమర్పిస్తూంటారు. దీనిలో భాగంగా వారు తమ ఇళ్లల్లో స్వయంగా వండిన పిండివంటలు, స్వీట్లతో పాటు పండ్లు, పువ్వులు, ఇతర పదార్థాలతో సారె సిద్ధం చేశారు. పాదగయ దేవస్థానం ఈఓ కాట్న జగన్మోహన్ శ్రీనివాస్ దంపతులు ఈ సారెను ఆదివారం ముత్తయిదువల తలకు ఎత్తగా.. వారు అమ్మవారి నామ స్మరణ చేసుకుంటూ విరవాడ, ఎఫ్కే పాలెం, కందరాడ, కుమారపురం మీదుగా పాదగయ క్షేత్రానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆ సారెకు ప్రత్యేక పూజలు చేసి, అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. – పిఠాపురం -
కార్పొరేట్ల కోసమే ‘ఏపీ విజన్–2047’
కాకినాడ సిటీ: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన విజన్–2047 డాక్యుమెంట్ కార్పొరేట్ల ప్రయోజనం కోసమే తయారు చేశారని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ డాక్టర్ వి.గంగారావు అన్నారు. శ్రీవిజన్–2047.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిశ్రీ అనే అంశంపై రఘుపతి వెంకటరత్నం నాయుడు స్టడీ సర్కిల్ ఆధ్వర్యాన కాకినాడ యూటీఎఫ్ హోమ్లో శనివారం రాత్రి నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వ్యవసాయంలో కార్పొరేట్ పద్ధతి ప్రవేశపెట్టాలని, ఏపీ విజన్ డాక్యుమెంట్లో ఉందన్నారు. దీనివల్ల చిన్న, సన్నకారు రైతులు మరింత దెబ్బతినే ప్రమాదం ఉంటుందన్నారు. పారిశ్రామిక రంగంలో ప్రభుత్వ పెట్టుబడులకు అవకాశం ఉండదని, ప్రైవేటు రంగంలో కూడా చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహం లేదని చెప్పారు. కార్పొరేట్ తరహా అభివృద్ధి అంటే సంపద ఒకేచోట పోగు పడుతుందని అన్నారు. దీనివలన సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయని చెప్పారు. చంద్రబాబు నాయుడు 1999లో కూడా విజన్–2020 డాక్యుమెంట్ విడుదల చేశారని గుర్తు చేశారు. అది ప్రపంచ బ్యాంకు కనుసన్నల్లో మెకన్సీ కంపెనీ తయారు చేసిందన్నారు. తాజా డాక్యుమెంట్ను కూడా అధికారులు తయారు చేయలేదని విమర్శించారు. ప్రజా ఉద్యమం ద్వారా పాలకుల విధానాలను మార్చాలని, అప్పుడే రాష్ట్ర అభివృద్ధి సమగ్రంగా జరుగుతుందని గంగారావు చెప్పారు. విశ్రాంత చీఫ్ ప్లానింగ్ అధికారి వి.మహిపాల్ మాట్లాడుతూ, ఏదైనా విజన్ డాక్యుమెంట్ విడుదల చేసే ముందు క్షేత్ర స్థాయిలో అధ్యయనం జరగాలని, అనంతరం వివిధ వేదికలపై చర్చలు జరగాలని, ప్రాధాన్యాలు నిర్ణయించుకుని, అందుకు తగిన విధంగా బడ్జెట్ కేటాయింపులు జరగాలని వివరించారు. ప్రస్తుత డాక్యుమెంట్ ప్రజారోగ్యం గురించి ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సత్తిరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ ఉద్యమ సీనియర్ నేత అయితాబత్తుల రామేశ్వరరావు, యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షుడు వీవీ రమణ, స్టడీ సర్కిల్ కన్వీనర్ ఎన్.గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు. రత్నగిరిపై భక్తుల సందడి అన్నవరం: రత్నగిరిపై ఆదివారం భక్తులు సందడి చేశారు. సుమారు 20 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. వ్రతాలు 1,500 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. నిత్యాన్నదాన పథకంలో 4 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. వర్షం కారణంగా సత్యదేవుడు, అమ్మవారికి ఆలయం లోపలి ప్రాకారంలో పల్లకీ సేవ నిర్వహించారు. -
బాలుడిని మింగిన మృత్యు కుహరం
● ఇంటి నిర్మాణం కోసం తీసిన గోతిలో పడిన వైనం ● మరో బాలుడి పరిస్థితి విషమం శంఖవరం: స్థానిక అంబేడ్కర్ కాలనీలో ఇంటి నిర్మాణం కోసం తీసిన గోతిలో పడి ఓ బాలుడు శనివారం మృతి చెందగా మరో బాలుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. గ్రామానికి చెందిన భూర్తి మహి (7), పులి ప్రణయ్ జోష్ (7) పాఠశాలకు వెళ్లి ఇంటికి వస్తుండగా ఎస్సీ పేటలోని అంబేడ్కర్ కాలనీలో ఇంటి నిర్మాణంలో ఉన్న గోతిలో పడిపోయారు. గోతిలో నీరు ఉండడంతో ఊపిరి ఆడక ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిద్దరినీ స్థానికులు గుర్తించి రౌతులపూడి సీహెచ్సీకి తరలించగా మహి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రణయ జోష్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం నిమిత్తం కాకినాడ జీజీహెచ్కు తరలించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా విలపించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. భూర్తి సత్తిబాబు దంపతులకు ముగ్గురు కుమారులు సంతానం కాగా మహేష్ మూడో కొడుకని అన్నవరం పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నారు. -
చదువు కంటే చూసి గ్రహించడంలోనే..
పాఠ్యాంశాల అధ్యయనం కంటే క్షేత్రస్థాయిలో అధ్యయనంతో విద్యార్థులకు ఆ అంశంపై చక్కటి అవగాహన ఏర్పడుతుంది. చదువు పూర్తయ్యి ఉద్యోగంలో చేరే సరికే వారికి ప్రాక్టికల్స్లో అనుభవం తగినంత ఉండి వృత్తికి న్యాయం చేయగలమనే నమ్మకం ఏర్పడుతుంది. – కె.గంగమణి, విద్యార్థిని సాగు విధానాలు తెలుస్తున్నాయి క్షేత్రస్థాయిలో రైతులు వివరించే పద్ధతులు బాగా అర్ధమవుతున్నాయి. చూసి నేర్చుకోవడంలో చాలా విషయాలు తెలిశాయి. వ్యవసాయ సిబ్బంది సైతం పలు విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు. చూసిన ప్రతి అంశాన్ని రాసుకుని అవగాహన పెంచుకుంటున్నాం. ఈవిధానం చాలా బాగుంది. – పి.ఝాన్సీ, విద్యార్థిని క్షేత్ర స్థాయి బోధనతో సత్ఫలితాలు విద్యార్థులకు క్షేత్రస్థాయి బోధన వల్ల మంచి ఫలితాలు వస్తాయి. రానున్న రోజుల్లో ప్రకృతి సాగుపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్న ధ్యేయంతో పొలంబాట పట్టించాం. వరి సాగులో విత్తనం నుంచి ఉత్పత్తి వరక అన్ని ప్రక్రియలపైనా అవగాహన కల్పిస్తున్నాం. సేంద్రియ ఎరువుల తయారీ, పాడి పరిశ్రమ విశిష్టత వివరిస్తున్నాము. విద్యార్థులు కూడా ఈ పద్ధతిలో నేర్చుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. – బి.నాగేశ్వరరావు, జిల్లా మేనేజర్, రిలయన్స్ ఫౌండేషన్ ప్రకృతి సాగుపై ప్రత్యేక శిక్షణ రానున్న రోజుల్లో ప్రకృతి వ్యవసాయం విస్తరించనుంది. అందుకే కాబోయే వ్యవసాయ ఉద్యోగులకు ఈ సాగుపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. జిల్లాలో పలు చోట్ల విద్యార్థులు ఈ సాగుపై శిక్షణ పొందుతున్నారు. ప్రకృతి సాగు వల్ల కలిగే ప్రయోజనాలను ప్రత్యక్షంగా వివరిస్తూ విద్యతో పాటు వ్యవసాయ విజ్ఞానాన్ని పెంపొందిస్తున్నాం. – ఎలియాజర్, డీపీఎం, ప్రకృతి వ్యవసాయ శాఖ జిల్లా అధికారి, కాకినాడ జిల్లా -
పరిశోధనలతో దేశ సమస్యలకు చెక్
● నీతి అయోగ్ సభ్యుడు సారస్వత్ ● వికసిత్ భారత్పై జీజీయూలో సదస్సు రాజానగరం: దేశం ఎదుర్కొంటున్న పలు సమస్యలకు మన శాస్త్ర వేత్తలు తమ శాస్త్ర పరిశోధనలతో పరిష్కారం చూపాలని నీతి అయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ అన్నారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ సహకారంతో స్థానిక గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జిజియు)లో రెండు రోజులపాటు జరిగే జాతీయ సదస్సును శనివారం ఆయన ప్రారంభించారు. సదస్సులో శ్రీవికసిత్ భారత్ – 2047 కోసం పరిశోధనలు, నవీకరణలను ఉపయోగించడంశ్రీ అనే అంశంపై ఆయన మాట్లాడుతూ వికసిత్ భారత్పై పలు రకాల అభిప్రాయాలు ఉన్నాయని, కానీ వికసిత్ భారత్ అంటే.. శ్రీఅభివృద్ధి చెందిన దేశం కోసం రూపొందించిన రోడ్డు మ్యాప్శ్రీ అని పేర్కొన్నారు. దేశంలో నెలకొన్న పోషకాహార లోపం, మాతా–శిశు మరణాలు వంటి పలు సమస్యలకు సైన్స్ ఆధారిత పరిష్కారాలు అవసరమన్నారు. వీటి సాధనకు పరిశోధనలు అవసరమని, వాటి ద్వారా ఆర్థిక వ్యవస్థ ఉత్తేజితమవుతుందని, తద్వారా గ్లోబల్ లీడర్గా మార్పు చెందవచ్చన్నారు. సెమీ కండక్టర్లు, కృత్రిమ మేథ మొదలైన అంశాలలో పరిశోధన ద్వారా స్వయం సమృద్ధి సాధించి ఆత్మ నిర్భర భారత్గా మారవచ్చన్నారు. మన దేశ జీడీపీలో 62 శాతం సేవా రంగాల నుంచి వస్తుంటే కేవలం 14 శాతం మాత్రమే తయారీ రంగం నుంచి వస్తోందని, ఇది ఒక ప్రధాన సమస్యగా ఉందన్నారు. విలువల జోడింపే నూతన ఆవిష్కరణ లక్ష్యమని సారస్వత్ పేర్కొన్నారు. ప్రస్తుతం విద్యార్థుల దృష్టి అంతా కంప్యూటర్ సైన్స్ పైనే ఉందని, ఇదే పరిిస్థితి కొనసాగితే దేశంలో రైల్వేలు, థర్మల్ విద్యుత్ కేంద్రాల వంటి వాటికి మావన వనరుల కొరత ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 2047 నాటికి 100 గిగా వాట్ల అణుశక్తి అవసరమని, అందుకనే న్యూక్లియర్ సైన్స్ చదివితే మంచి అవకాశాలు ఉంటాయని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ చాన్సెలర్ కేవీవీ సత్యనారాయణరాజు, ప్రొ ఛాన్సలర్ కె.శశికిరణ్వర్మ, వీసీ డాక్టర్ యు.చంద్రశేఖర్, ప్రొ వీసీ డాక్టర్ కేవీబీ రాజు, రిజిస్ట్రార్ డాక్టర్ పీఎంఎంఎస్ శర్మ, తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ కార్యకర్త దౌర్జన్యం నుంచి రక్షించండి
అమలాపురం రూరల్: ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండల పరిధిలో కొత్తపాలేనికి చెందిన టీడీపీ కార్యకర్త కాలాడి అచ్చిబాబు, అతని కుటుంబ సభ్యులు మొల్లేటిమొగ గ్రామంలో తమపై దాడి చేసి తాటాకు ఇంటిని కూల్చేసి డబ్బు, బంగారం దోచుకున్నారని బాధితులు కాలాడి రామలక్ష్మి, సూరిబాబు దంపతులు వాపోయారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరగలేదని పేర్కొంటూ ఎస్పీ కృష్ణారావు, కలెక్టర్ మహేష్కుమార్కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నకళ్లను శనివారం స్థానిక విలేకరులకు వారు అందజేశారు. గత నెల 26న తన భర్త చేపల చెరువు పట్టుబడికి వెళ్లిన సమయంలో అచ్చిబాబు అతని కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు 30 మంది వచ్చి తమపై దాడిచేసి ఇంటి కూల్చేసి తమను చంపుతామని బెదిరించారని పేర్కొన్నారు. తమ పాకను కూల్చిన స్థలంలో రేకుల షెడ్ నిర్మించారని, కుమార్తె పెళ్లి కోసం బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి తెచ్చిన రూ.6.5 లక్షలు, ఐదు కాసులు బంగారాన్ని దోచుకున్నారని రామలక్ష్మి తెలిపారు. కాట్రేనికోన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని వారు పేర్కొన్నారు. మొల్లేటిమోగలో 30 ఏళ్లుగా ఉంటున్నామని, తమ కుటుంబాన్ని రోడ్డున పడేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిలువ నీడ లేక సామాన్లు రోడ్డుపై ఉన్నాయని, కొన్ని సామాన్లు కాలువలో పడేశారని, తానూ, తమ కుమార్తెలు బట్టలు మార్చుకునే స్థలం లేకుండా చేశారని రామలక్ష్మి అవేదన వ్యక్తం చేశారు. గుడిసె కూల్చి నిరాశ్రయులను చేశారు బంగారం, రూ.6.5 లక్షలు దోచేశారు కలెక్టర్, ఎస్పీలకు బాధితుల ఫిర్యాదు -
నకిలీ ఆదాయపన్ను అధికారుల అరెస్టు
● నాలుగేళ్ల క్రితం బియ్యం వ్యాపారిని బెదిరించి దోచుకోవడంతో కేసు ● పోలీసుల అదుపులో నలుగురు ● పరారీలో ఇద్దరు రాజోలు: సుమారు ఏడేళ్ల క్రితం ఆదాయ పన్ను అధికారులమని బెదిరించి విలువైన పత్రాలతో పాటు నగదుతో పరారైన నలుగురిని రాజోలు పోలీసులు అరెస్ట్ చేసి శనివారం కోర్టులో హాజరుపర్చారు. సీఐ నరేష్కుమార్ తెలిపిన వివరాల మేరకు 2018 సంవత్సరంలో కూనవరంలోని శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్లుల వద్దకు ఆరుగురు వ్యక్తులు కారులో వచ్చి ఆదాయ పన్ను అధికారులమని యజమానిని బెదిరించి భూమి దస్తావేజులు, ప్రామిసరీనోట్లు, బ్యాంక్ చెక్ బుక్స్, ఆధార్ కార్డులు, నగదు తీసుకుని వెళ్లిపోయారు. రైస్ మిల్లు యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటిలో కేసు నమోదు చేశారు. అయితే నిందితులైన మలికిపురం మండలం కేశనపల్లి గ్రామానికి చెందిన యడ్ల అరవింద్, గూడపల్లిపల్లిపాలేనికి చెందిన సోమాని సందీప్, గూడపల్లికి చెందిన మొల్లేటి మణికంఠ, పి.గన్నవరం మండలం పోతవరానికి చెందిన నేలపూడి మురళీశ్రీధర్ పోలీసుల కళ్లుకప్పి తప్పించుకుని తిరుగుతున్నారు. ఆరుగురికి నలుగురిని అరెస్ట్ చేశామని, ఇద్దరు పరారీలో ఉన్నారని సీఐ తెలిపారు. 2020 సంవత్సరంలో వీరిని తెలంగాణ గచ్చిబౌలి పోలీస్లు ఇలాంటి కేసులోనే అరెస్టు చేయగా బెయిల్పై విడుదలయ్యారని సీఐ వివరించారు. -
అగ్నిప్రమాదంలో రూ.10 లక్షల ఆస్తి నష్టం
అంబాజీపేట: మండలంలోని పుల్లేటికుర్రులో శనివారం తెల్లవారుజామున ఓ సిటీ కేబుల్ కార్యాలయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అందులోని సామగ్రి కాలి బూడిదయ్యాయి. రూ.10 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. స్థానిక వీఆర్వో కొత్తపల్లి కృష్ణమూర్తి డాబా ఇంటిలో కింద ఫ్లోర్లో నిర్వహిస్తున్న కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో విలువైన యంత్ర పరికరాలు, సెట్టాప్ బాక్స్లు అగ్నికి ఆహుతయ్యాయి. అమలాపురం అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఘటనా స్థలాన్ని సర్పంచ్ జల్లి బాలరాజు, పంచాయతీ కార్యదర్శి లక్ష్మీపతి పరిశీలించారు. అగ్నిప్రమాదంలో కాలిపోయిన యంత్ర పరికరాలు -
అంతర్ జిల్లా దొంగల అరెస్టు
● 5 జిల్లాల్లో 19 కేసులు నమోదు ● రూ.65 లక్షల విలువైన బంగారంగా స్వాధీనం కాకినాడ క్రైం: రాత్రి వేళల్లో ఇళ్లు కొల్లగొడుతున్న ముగ్గురు అంతర్ జిల్లా దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ బిందుమాధవ్ శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. కడియం మండలం మాధవరాయుడుపాలేనికి చెందిన 42 ఏళ్ల బొగడ శ్రీను, అనపర్తి మండలం కుతుకులూరుకు చెందిన 23 ఏళ్ల పాసి శేఖర్, 24 ఏళ్ల పోతంశెట్టి సూర్యభాస్కరరెడ్డి కొన్నాళ్లుగా రాత్రి వేళల్లో ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. కాకినాడ పరిసర ప్రాంతాలతో పాటు ఐదు జిల్లాల్లో వారు చోరీలు చేశారు. ఏఎస్పీ మనీష్ పాటిల్ దేవరాజ్ పర్యవేక్షణలో సర్కిల్ సీఐ చైతన్యకృష్ణ ఆధ్వర్యంలో దర్యాప్తు బృందాలు వరుస చోరీలపై నిఘా పెట్టాయి. ఈ క్రమంలో విశ్వసనీయ సమాచారంతో నిందితులు ముగ్గురినీ కాకినాడ రూరల్ పరిధిలో శుక్రవారం పట్టుకున్నాయి. వీరి నుంచి రూ.65 లక్షల విలువైన 582 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు 12.5 కిలోల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. దురలవాట్లు, తక్కువ సమయంలో శ్రమ లేకుండా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో వీరు దొంగతనాలు చేస్తున్నారన్నారు. దర్యాప్తు బృందంతో పాటు కరప ఎస్ఐ సునీత, గొల్లపాలెం ఎస్ఐ మోహన్కుమార్, నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించారన్నారు. వారిని కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. సమావేశంలో ఏఎస్పీ ఎంజేవీ భాస్కరరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
క్షేత్రస్థాయిలో ప్రకృతి పాఠం
● విద్యార్థులకు బోధిస్తున్న అధ్యాపకులు ● రైతుల ద్వారా సాగుపై అవగాహన ● ఉద్యోగంలో చేరడంతోనే విధులకు అంకితమయ్యేలా శిక్షణ ● ఈ విధానంతో ఎంతో ప్రయోజనం అంటున్న అధికారులు పిఠాపురం: కలిసొచ్చే కాలంలో నడిచొచ్చే కొడుకు అన్న సామెత ఈ విద్యార్థులకు అతికినట్టు సరిపోతుంది. వ్యవసాయ పాఠాలు నేరుస్తున్న వారంతా నేరుగా పొలంబాట పట్టి సాగు పద్ధతులను అక్కడి రైతుల ద్వారా నేర్చుకుంటున్నారు. విద్య పూర్తయ్యి ఉద్యోగంలో చేరే నాటికి మళ్లీ అప్రెంటిస్, శిక్షణలు అనేవి అవసరం లేకుండా విధి నిర్వహణకు వారు సంసిద్ధంగా ఉంటారు. తరగతిలో కంటే క్షేత్రస్థాయిలో అభ్యసిస్తేనే ఈ శాస్త్రం అలవడుతుందని అధ్యాపకులు ఆ విద్యార్థులను పొలంబాట పట్టించారు. ప్రయోగాత్మకంగా సాగు పద్ధతులు వివరిస్తున్నారు. విత్తనం నుంచి ఉత్పత్తి వరకు అన్ని ప్రక్రియలపైనా వారికి బోధిస్తున్నారు. ఇలా సాగు విధానాలు నేర్చుకుంటున్నది కాకినాడ ఐడియల్ కళాశాల బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులు. ఒక్కో ఊరికి కొంత మంది చొప్పున పంపించి అక్కడి విధానాలను నేరుగా పొలాల్లోనే నేర్పుతున్నారు. ప్రస్తుతం గొల్లప్రోలు మండలం దుర్గాడలో గో గాయత్రి ప్రకృతి వ్యవసాయ వనరుల తయారీ శిక్షణ కేంద్రంలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. రైతులతో సమావేశాలు నిర్వహించి నేరుగా వారితోనే మాట్లాడి సాగు పద్ధతులు తెలుసుకుంటున్నారు. ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక పాఠాలు విద్యార్థులకు ఎక్కువగా ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. దీనిలో భాగంగా విద్యార్థులను బ్యాచ్లుగా వివిధ గ్రామాలకు పంపి ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో క్షేత్రస్థాయిలో సాగు పద్ధతులు నేర్పుతున్నారు. నిత్యం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వారికి సాగు విధానాలు నేర్పుతున్నారు. -
ఉత్తరం..దక్షిణ ఉంటేనే..
● బదిలీల సిఫార్సుకోరుకున్న చోటు ఇష్టారాజ్యంగా ఇంజినీరింగ్ అసిస్టెంట్ల బదిలీలు ఇంజినీరింగ్ అసిస్టెంట్ల బదిలీల కౌన్సెలింగ్ కూడా ఇష్టారాజ్యంగా జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 1,271 ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ఉండగా.. ఐదేళ్లు పూర్తయి బదిలీకి అర్హత పొందిన వారు 1,113. వీటిలో 904 రిక్వెస్ట్లు ఉన్నాయి. వీరి బదిలీలు అంతర్ జిల్లాల ప్రాతిపదికన జరుగుతున్నా కౌన్సెలింగ్ మాత్రం ఆయా జిల్లాల పంచాయతీరాజ్ అధికారుల సమక్షంలో జరుగుతున్నాయి. ఇక్కడ కూడా కూటమి నేతల సిఫారసు లేఖలకే ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రంపచోడవరం ఏజెన్సీకి చెందిన ఇద్దరు గిరిజన ఇంజినీరింగ్ అసిస్టెంట్లు సొంత ప్రాంతాలైన ఏజెన్సీకి బదిలీ కోరుకున్నారు. అసలు ఏజెన్సీకి వెళ్లడానికే ఎవరూ ఇష్టపడని పరిస్థితులున్నా.. వీరికి అవకాశం ఇవ్వకుండా సిఫారసు లేఖ తప్పనిసరి అని చెప్పారు. దీంతో, వారి పరిస్థితి డోలాయమానంలో పడింది. అడ్డగోలుగా జరుగుతున్న బదిలీల కౌన్సెలింగ్పై జిల్లా అధికారులు దృష్టి పెట్టాలని సచివాలయ ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.సాక్షి ప్రతినిధి, కాకినాడ: సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో మెరిట్కు పాతరేస్తున్నారు. కూటమి నేతల సిఫారసు లేఖలకే పెద్దపీట వేస్తున్నారు. ఎవరైనా కోరుకున్న చోటు దక్కించుకోవాలనుకుంటే అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకోవాల్సిందే. వారు ఒక్కో సీటుకు ఒక్కో రేటు నిర్ణయించి ఎడాపెడా లేఖలు ఇచ్చేస్తున్నారు. కౌన్సెలింగ్ పారదర్శకంగా నిర్వహించాల్సిన అధికారులు నేతల సిఫారసులు ఆధారంగా బదిలీలకు తెర తీయడంతో సచివాలయ ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. ఇటీవల వ్యవసాయ శాఖలో జరిగిన బదిలీని కూటమి నేతల సిఫారసుతో నిలుపు చేయించుకున్న ఓ అధికారి కనుసన్నల్లోనే ఈ బాగోతం సాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాను కూడా స్వయంగా కూటమి నేతలనే ఆశ్రయించడంతో వారు చెప్పినట్టు చేయాల్సిన దుస్థితిలోకి ఆయన జారిపోయారు. బదిలీకి అర్హులు 616 మంది గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న విలేజ్ అగ్రికల్చరల్, ఇంజినీరింగ్ తదితర అసిస్టెంట్ల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమై, ఆదివారం వరకూ జరగనుంది. కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలకు సంబంధించిన విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ల బదిలీలకు కాకినాడలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చైర్మన్గా ఉన్న కమిటీ కౌన్సెలింగ్ నిర్వహిస్తోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 684 మంది విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్లు ఉన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వీరిలో ఐదేళ్లు పూర్తి చేసిన 616 మంది బదిలీలకు అర్హులుగా గుర్తించారు. ఈ మేరకు శుక్రవారం 1 నుంచి 205 వరకూ సీరియల్ నంబర్లు ఉన్న వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. శనివారం 206 నుంచి 410 నంబర్ వరకూ, ఆదివారం 411 నుంచి 616 నంబర్ వరకూ బదిలీలు చేపట్టాలి. ఈ మూడు జిల్లాల్లోని దాదాపు మూడు వంతుల నియోజకవర్గాల్లో కూటమి ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలున్న వారికే బదిలీల్లో అవకాశం కల్పిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాప్రతినిధుల జాబితా ప్రకారమే.. ఏజెన్సీలో సర్వీసు, దివ్యాంగులు, భార్యాభర్తల వంటి అంశాలకు బదిలీల కౌన్సెలింగ్లో ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ, ఈ నిబంధనలను బుట్టదాఖలు చేసి, నేతల సిఫారసు లేఖలున్న వారికి మాత్రమే కోరుకున్న చోటు కట్టబెట్టేందుకు సిద్ధమవుతున్నారని సచివాలయ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల నుంచి ప్రజాప్రతినిధులు పంపించిన సిఫారసు లేఖల్లో పేర్కొన్న జాబితాను అనుసరించే బదిలీలు చేస్తున్నారని మండిపడుతున్నారు. కొందరు ప్రజాప్రతినిధులు ఏ సచివాలయంలో ఏ పోస్టుకు ఎవరిని బదిలీ చేయాలో ముందుగానే జాబితా రూపొందించి, సిఫారసు లేఖలు జత చేసి మరీ పంపించారని విశ్వసనీయంగా తెలిసింది. ఆ జాబితా ప్రామాణికంగానే బదిలీలు చేస్తున్నారని కౌన్సెలింగ్లో పాల్గొని బయటకు వస్తున్న అసిస్టెంట్లు ఆరోపిస్తున్నారు. మెరిట్ జాబితాలో ఉన్నవారు 1, 2, 3 స్థానాలకు ఆప్షన్లు పెట్టుకున్నప్పటికీ వాటిని హోల్డ్లో పెడుతున్నట్లు చెబుతున్నారు. మెరిట్ జాబితా టాప్–10లో ఉన్న వారికి కూడా ప్రాధాన్యం ఇవ్వకుండా పక్కనబెడుతుండటంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు విలేజ్ అసిస్టెంట్లు సిద్ధపడుతున్నారు. సొమ్ములిస్తేనే సిఫారసు లేఖలు కోరుకున్న సచివాలయానికి బదిలీ కావలంటే మొదట గ్రామ టీడీపీ కమిటీ సభ్యుల ఆశీస్సులుండాలి. వారు గ్రీన్సిగ్నల్ ఇవ్వాలంటే చేయి తడపాల్సిందే. ఈవిధంగా ఆయా నియోజకవర్గాల్లో ఒక్కో ప్రాంతానికి ఒక్కో రేటు నిర్ణయించి, కూటమి నేతలు వసూళ్ల పర్వానికి తెర తీశారు. ఈవిధంగా వీలునుబట్టి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకూ ముడుపులు గుంజారని సచివాలయ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కోనసీమ జిల్లా రాజోలు, అమలాపురం, మండపేట, కొత్తపేట, ముమ్మిడివరం; కాకినాడ జిల్లా తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, కాకినాడ రూరల్; తూర్పు గోదావరి జిల్లా రాజానగరం, రాజమహేంద్రవరం రూరల్ తదితర నియోజకవర్గాల్లో కూటమి నేతలు వసూళ్ల పర్వాన్ని అడ్డగోలుగా కొనసాగించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ.35 వేల జీతంతో పని చేసే చిరుద్యోగులని కూడా చూడకుండా ముక్కుపిండి మరీ వసూలు చేశారని అంటున్నారు. కూటమి ఏలుబడిలో బది‘లీలలు’ మెరిట్కు పాతర సిఫారసు లేఖకు రేటు ఫిక్స్ చేసిన ప్రజాప్రతినిధులు ఆ తరువాతే కావాల్సిన చోటుకు బదిలీ కౌన్సెలింగ్లో అధికారులు లేఖలు అడుగుతున్నారని సచివాలయ అసిస్టెంట్ల ఆరోపణ ఇవిగో ఉదాహరణలు కోనసీమ జిల్లా రాజోలు దీవికి చెందిన మెరిట్ ఉన్న ఒక అసిస్టెంట్ శుక్రవారం నాటి కౌన్సెలింగ్లో తాను కోరుకున్న మండలం కోసం అభ్యర్థించగా.. అక్కడి ప్రజాప్రతినిధి లేఖ ఉందా అని కౌన్సెలింగ్లోనే నేరుగా అడగడంతో అవాక్కయ్యారని సమాచారం. వాస్తవానికి రాజోలు సబ్ డివిజన్లో 9, పి.గన్నవరం సబ్ డివిజన్లో 20 పోస్టులు ఉన్నాయి. మెరిట్లో ముందు వరుసలో ఉన్నా సిఫారసు లేఖ అవసరమేమిటని ప్రశ్నించిన పాపానికి ఆ పోస్టును హోల్డ్లో పెట్టేశారు. పైగా, అతడిని ఏజెన్సీ వెళ్లాల్సి ఉంటుందని, అందుకు సిద్ధమేనా అని అడిగారంటున్నారు. రాజోలు నియోజకవర్గం నుంచి స్పౌజ్ కోటాలో భార్యాభర్తలు స్థానికంగా ఏదైనా మండలంలో అవకాశం ఇవ్వాలని ఆప్షన్ పెట్టుకున్నారు. వారిలో భర్తకు స్థానికంగా అవకాశం కల్పించి, భార్యను మాత్రం దూరంగా వేరే మండలానికి ఖాయం చేశారని తెలియవచ్చింది. 80 శాతం దివ్యాంగుడైన ఒక అసిస్టెంట్ను కూడా సిఫారసు లేఖ లేకుండా ఏమీ చేయలేమని చెప్పారంటే కౌన్సెలింగ్ ఎంత పారదర్శకంగా జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. చిన్న పిల్లలున్నారు.. స్థానికంగా అవకాశం కల్పించాలని, పిల్లలకు స్కూళ్లలో ఫీజులు చెల్లించేశామని రాజోలు ప్రాంతంలో ఆప్షన్ పెట్టుకున్న వారికి ఎక్కడో దూరంగా ఉన్న ఐ.పోలవరం మండలం వెళ్లాల్సిందిగా సూచించారని తెలియవచ్చింది. రంపచోడవరం ఏజెన్సీలో మూడేళ్లు దాటి పని చేస్తున్న ఒక అగ్రికల్చరల్ అసిస్టెంట్కు కాకినాడ జిల్లా శంఖవరం లేదా రౌతులపూడి మండలాల్లో ఆప్షన్ ఇచ్చారు. అయితే అక్కడకు నేతలు వేరే వారికి సిఫారసు చేయడంతో ఈయనను హోల్డ్లో పెట్టారని అంటున్నారు. ఏజెన్సీలో అంత కాలం పని చేసినా సిఫారసు లేఖ లేదనే కాారణంతో అవకాశం కల్పించకుంటే ఇక కౌన్సెలింగ్కు అర్థమేముంటుందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. తొండంగి మండలంలో ఆప్షన్ పెట్టుకున్న మరో అసిస్టెంట్ను కూడా నేతల సిఫారసు లేఖ లేదనే కారణంతో పక్కన పెట్టినట్లు చెబుతున్నారు. కాకినాడకు చెందిన ఒక మహిళా అగ్రికల్చరల్ అసిస్టెంట్ దగ్గర్లో ఉన్న కాకినాడ రూరల్ లేదా కరప మండలాలకు ఆప్షన్ పెట్టుకున్నారు. కాకినాడ రూరల్ నుంచి సిఫారసు లేఖ లేదనే కారణంతో తుని నియోజకవర్గానికి పంపించేశారు. -
తొలి తిరుపతికి పోటెత్తిన భక్తులు
పెద్దాపురం: మండలంలోని తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభ స్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. సుమారు 11 వేల మంది స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారిని అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు విశేషంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ సేవల టికెట్లు, కేశఖండన, అన్నదాన విరాళాల రూపంలో స్వామివారికి రూ.2,50,681 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ వివరించారు. సుమారు 3,500 మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం ఏర్పాటు చేశామన్నారు. రత్నగిరి కిటకిట అన్నవరం: వేలాదిగా తరలివచ్చిన భక్తులతో రత్నగిరి శనివారం కిటకిటలాడింది. సాధారణంగా ఆషాఢ మాసంలో సత్యదేవుని ఆలయానికి భక్తుల రాక తక్కువగా ఉంటుంది. అటువంటిది శనివారం భారీ సంఖ్యలో తరలి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలన్నీ కిక్కిరిసిపోయాయి. స్వామివారిని సుమారు 40 వేల మంది దర్శించుకున్నారు. రెండు వేల వ్రతాలు జరిగాయి. ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారని అధికారులు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ఉదయం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను తిరుచ్చి వాహనంపై ఘనంగా ఊరేగించారు. ఆదివారం ఉదయం 10 గంటలకు స్వామి, అమ్మవార్లను టేకు రథంపై ఆలయ ప్రాకారంలో ఊరేగించనున్నారు. భక్తులు రూ.2,500 టికెట్టుతో ఈ సేవలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు. గస్తీకి 22 ద్విచక్ర వాహనాలుకాకినాడ క్రైం: గస్తీ అవసరాల కోసం జిల్లా పోలీస్ శాఖకు 22 ద్విచక్ర వాహనాలు మంజూరయ్యాయి. వీటిలో 20 అపాచీ వాహనాలు, 2 బుల్లెట్లు ఉన్నాయి. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో ఎస్పీ బిందుమాధవ్ శనివారం ఈ వాహనాలను ప్రారంభించారు. ఈ వాహనాల్లో ఇన్బిల్డ్ కెమెరాలుంటాయని, రాత్రి వేళల్లో గస్తీకి, ఇరుకు వీధుల్లో శాంతిభద్రతల పర్యవేక్షణకు, సమస్య చోటు చేసుకున్న ప్రాంతాలకు ట్రాఫిక్ అవాంతరాలను ఛేదించి చేరుకునేందుకు ఈ వాహనాలు ఉపయోగపడతాయని ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ భాస్కరరావు, ఏఆర్ డీఎస్పీ శ్రీహరిబాబు, రిజర్వుడ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
కొబ్బరి @ రూ.22 వేలు
● చరిత్రలో తొలిసారి రికార్డు ధర ● ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 1.8 లక్షల ఎకరాల్లో సాగు ● ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో గణనీయంగా తగ్గిన దిగుబడి ● ఉత్తరాదికి దిక్కయిన ఆంధ్రా కొబ్బరి సాక్షి, అమలాపురం: జాతీయ మార్కెట్లో ఆంధ్రా కొబ్బరి రికార్డుల మీద రికార్డు సృష్టిస్తోంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కొబ్బరి కాయ దిగుబడి తగ్గడం ఆంధ్రా రైతులకు వరంగా మారింది. కొబ్బరి చరిత్రలో తొలిసారి అంబాజీపేట మార్కెట్లో వెయ్యి కొబ్బరి కాయల ధర రూ.22 వేలు పలికింది. లంక గ్రామాల్లో కొబ్బరి కాయ రూ.23 వేల వరకూ ధర పలుకుతోందని రైతులు చెబుతున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 1.8 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతోంది. ఒక్క కోనసీమ జిల్లాలోనే 1.10 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు ఉంది. గత ఏడాది నుంచి పచ్చికాయ, ముక్కుడు కాయ (నిల్వ కాయ) వెయ్యి కాయల ధర రూ.10 వేలకు ఎప్పుడూ తగ్గలేదు. గత మే నెలలో ఒకానొక సమయంలో రూ.12 వేల వరకూ ఉండగా తరువాత నెమ్మదిగా పెరుగుతూ వస్తోంది. మే చివరి వారంలో రూ.16 వేలకు చేరింది. ఈ నెల మొదటి వారంలో కొబ్బరి కాయ ధర రూ.17,500 నుంచి రూ.18,500 వరకూ పెరిగింది. రెండు రోజుల క్రితం రూ.20 వేల వరకు పెరగగా, శనివారం మార్కెట్లో ఏకంగా రూ.22 వేలు పలికింది. మరో వారం రోజుల్లో ధర మరింత పెరగవచ్చని రైతులు, వ్యాపారులు అంచనా వేస్తున్నారు. కొబ్బరి పండే దక్షిణాది రాష్ట్రాల్లో దిగుబడి గణనీయంగా తగ్గగా కేరళలో దిగుబడి మరింత పతనమైంది. ఇక్కడ చెట్టుకు సగటు దిగుబడి 50 కాయలు కాగా ఇప్పుడు 15 కాయలకు పడిపోవడంతో ఉత్తరాది అవసరాలు మొత్తాన్ని రాష్ట్రంలో కొబ్బరి తీర్చాల్సి వస్తోంది. దీనికితోడు గత ఏడాది కాలంగా దిగుబడిగా వచ్చిన కొబ్బరి ఇటు రైతుల వద్ద కానీ, వ్యాపారుల వద్ద కానీ నిల్వ ఉండటం లేదు. ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతుల వద్ద నుంచి, వ్యాపారుల వద్ద నుంచి వారం రోజుల వ్యవధిలోనే ఎగుమతి అవుతోంది. ఇది కూడా ధర పెరుగుదలకు కారణమవుతోంది. రాష్ట్రం నుంచి ఉత్తరాదిలోని గుజరాత్, హర్యానా, మహారాష్ట్రతో పాటు బిహార్, ఉత్తర ప్రదేశ్లకు పచ్చికాయ అధికంగా ఎగుమతి అవుతోంది. ఇంత ధర పెరిగినా రైతులు ఆచితూచి విక్రయిస్తున్నారు. పెరిగిన ధర ఉభయ గోదావరి జిల్లాల్లోని కొబ్బరి రైతుల్లో జోష్ నింపింది. -
విద్యా సంస్థల్లో ఈగిల్ క్లబ్బులు
● వచ్చే నెల 15 నాటికి ఏర్పాటు చేయాలి ● అధికారులకు కలెక్టర్ ఆదేశంకాకినాడ సిటీ: మాదక ద్రవ్యాలను అరికట్టే చర్యల్లో భాగంగా వచ్చే నెల 15వ తేదీ నాటికి జిల్లాలోని అన్ని విద్యా సంస్థల్లో ఈగిల్ క్లబ్బులు ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. రహదారి భద్రతపై కలెక్టరేట్లో సోమవారం జరిగిన సమావేశంలో జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్తో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా రవాణా అధికారి కె.శ్రీధర్ మాట్లాడుతూ, ఈ ఏడాది మే నెల వరకూ జిల్లాలో 368 రోడ్డు ప్రమాదాలు జరిగాయని, 163 మంది మృతి చెందారని, 408 మంది గాయపడ్డారని వివరించారు. అత్యధికంగా 145 ప్రమాదాలు జాతీయ రహదారులపై, 67 ప్రమాదాలు రాష్ట్ర రహదారులపై జరిగాయన్నారు. కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ, మోటారు వాహనాల చట్టం–1988 కింద రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి వారం రోజుల పాటు రూ.1.50 లక్షల వరకూ ఉచిత చికిత్స అందించేందుకు రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ స్కీమును జిల్లాలో పటిష్టంగా అమలు చేయా లని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఏడాది నుంచి రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగిన ప్రాంతాల స మాచారం ఆధారంగా రహదారులపై బ్లాక్ స్పాట్లను గుర్తించాలని ఎస్పీ బిందుమాధవ్ కోరారు. 1,444 కిలోల గంజాయి స్వాధీనం అనంతరం జరిగిన నార్కో కో ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఎస్పీ బిందుమాధవ్ మాట్లాడుతూ, జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు 22 గంజాయి నేరాలు నమోదయ్యాయని, 85 మందిని అరెస్టు చేసి 1,444 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు అందించేందుకు 1972, 14405 టోల్ఫ్రీ, 9494933233 వాట్సాప్ నంబర్లపై విస్తృత ప్రచారం చేయాలని కోరారు. జిల్లాలోని విద్యా సంస్థల్లో ఇప్పటి వరకూ 217 ఈగల్ క్లబ్బులు ఏర్పాటు చేసి, 420 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. డ్రగ్స్ ప్రమాదంపై సుమారు 30 వేల మంది విద్యార్థులను అవగాహన కల్పించామన్నారు. సారా నిర్మూలన కార్యక్రమం నవోదయం 2.0 కింద జిల్లాలో 560 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని అసిస్టెంట్ ఎకై ్సజ్ కమిషనర్ కె.జయమౌనిక తెలిపారు. ఈ సందర్భంగా డ్రగ్స్, సారా దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన పోస్టర్లను కలెక్టర్, ఎస్పీ ఆవిష్కరించారు. పారిశ్రామికవేత్తలకు సింగిల్విండోలో అనుమతులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి అందిన దరఖా స్తులకు సింగిల్విండో విధానంలో త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం జరిగిన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశంలో ఆయన మాట్లాడారు. గత మూడు నెల ల కాలంలో వివిధ పరిశ్రమల స్థాపనకు అనుమతులు కోరుతూ మొత్తం 556 దరఖాస్తులు అందగా, సింగిల్ డెస్క్ విధానంలో ఆయా శాఖల ద్వారా 492 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేశామని చెప్పారు. ఉత్పాదన, సేవా రంగాల్లోని 14 యూనిట్లకు సుమారు రూ.40 లక్షలు విలువైన రాయితీల జారీకి కమిటీ ఆమోదించిందన్నారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
వంచనపై.. జనం బాట
● హామీలు అమలు చేయని కూటమి సర్కారుపై ప్రజల్లోకి వైఎస్సార్ సీపీ ● ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ పేరిట ప్రచారం ● చంద్రబాబు, పవన్ మోసాలను ఎండగట్టాలని నేతల పిలుపు ● ఐదు వారాల పాటు చైతన్య కార్యక్రమాలు ● త్వరలో పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశాలు సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఎన్నికల వేళ అలవి కాని హామీలిచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను పచ్చి దగా చేస్తున్న కూటమి సర్కారు తీరును ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని వైఎస్సార్ సీపీ నిర్ణయించింది. చంద్రబాబు అండ్ కో ఎడాపెడా ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వలన ఏడాది కాలంలో ఏమేరకు నష్టపోయారో ప్రజలకు వివరించనుంది. ఈ మేరకు ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ అనే సరికొత్త కార్యక్రమం చేపట్టేందుకు వైఎస్సార్ సీపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. కూటమి సర్కారు చేసిన మోసాలను ప్రజలకు వివరించేందుకు, వారిని చైతన్యపరిచేందుకు ఐదు వారాల పాటు ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అధ్యక్షతన కాకినాడ సూర్య కళా మందిరంలో శుక్రవారం నిర్వహించిన పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య నేతలు శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా నలుమూలల నుంచీ పార్టీ జిల్లా, మండల, గ్రామ స్థాయి నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి ఉత్సాహంగా తరలివచ్చారు. తొలుత మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి, నివాళులర్పించి, జ్యోతి ప్రజ్వలనతో సమావేశాన్ని ప్రారంభించారు. చంద్రబాబు మోసాలను ఎండగట్టాలి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైఎస్సార్ సీపీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్, శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, మండల, గ్రామ స్థాయిల్లో చంద్రబాబు మోసాలను ఎండగట్టాలని సూచించారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడాన్ని ఎత్తిచూపుతూ ఆయన మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ ప్రజల మద్దతు కూడగట్టాల్సిన ఆవశ్యకతను వివరించారు. చంద్రబాబు ఇచ్చిన హామీల చిట్టా, జూన్ 24 నుంచి అమలు చేస్తామని చెప్పి గద్దెనెక్కాక మొదటి ఏడాది హామీలు అమలు చేయకుండా ఎగ్గొట్టేయడాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని చెప్పారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలను తు.చ. తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మనందరి పైనా ఉందనే విషయాన్ని ప్రజల ముందుంచాలని అన్నారు. బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ, 50 ఏళ్లు నిండిన ఎస్సీ, బీసీలకు పెన్షన్ వంటి అంశాలతో పాటు ప్రజల దృష్టిని మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న తీరును వివరించాలని నేతలు పిలుపునిచ్చారు. అధినేత వైఎస్ జగన్ ఆలోచనలకనుగుణంగా పార్టీ రూపొందించిన క్యూఆర్ కోడ్ను ఈ సందర్భంగా ప్రదర్శించారు. ప్రతి కార్యకర్తా తన మొబైల్తో ఈ కోడ్ను స్కాన్ చేస్తే టీడీపీ ప్రజాగళం పేరుతో కూటమి మేనిఫెస్టో వస్తుందని, అందులో చంద్రబాబు హామీలు, చేసిన మోసాలు ఉంటాయని వివరించారు. ఈ ప్రచార కార్యక్రమాలను సమన్వయంతో నిర్వహించేందుకు వీలుగా తొలుత పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించాలని బొత్స సూచించారు. అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని, తామంతా అండగా ఉంటామని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. సంక్షేమ పథకాలను సంతృప్తకర స్థాయిలో అమలు చేసిన వైఎస్ జగన్ పేరు నేతల ప్రసంగాల్లో ప్రస్తావనకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ జై జగన్ నినాదాలతో సమావేశ ప్రాంగణం మార్మోగిపోయింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ అనంత బాబు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, జెడ్పీ వైస్ చైర్పర్సన్ మేరుగు పద్మలత, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, జ్యోతుల చంటిబాబు, పార్టీ జగ్గంపేట, పెద్దాపురం కో ఆర్డినేటర్లు తోట నరసింహం, దవులూరు దొరబాబు, నర్సాపురం పార్లమెంటరీ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీ ప్రసన్న, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సుంకర విద్యా సాగర్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాగిరెడ్డి అరుణ్ కుమార్ (బన్నీ), మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శులు రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, జిల్లా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత, పార్టీ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, మహిళా అధ్యక్షురాలు పసుపులేటి వెంకటలక్ష్మి, బెహరా రాజరాజేశ్వరి, పార్టీ నేతలు వాసిరెడ్డి జమీలు, తోట రాంజీ, ఉలవకాయల లోవరాజు, యనమల కృష్ణుడు, గుల్లా ఏడుకొండలు, గండేపల్లి బాబీ, అల్లి రాజబాబు, అనసూరి ప్రసాద్, రావూరి వెంకటేశ్వరరావు, శెట్టిబత్తుల కుమార్రాజా, ఒమ్మి రఘురామ్, నాగం గంగబాబు, రోకళ్ళ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఆమోదిస్తే బాక్స్ బద్దలే..
● పిఠాపురం మున్సిపాలిటీలో టెండర్ల బాగోతం ● రూ.3 కోట్లతో వివిధ పనులకు అనుమతి ● కూటమి నేతలకు కలిసొచ్చేలా వ్యూహం ● నిబంధనలకు విరుద్ధంగా జిల్లా అధికారి ఆదేశాలు ● వ్యతిరేకిస్తున్న పాలకవర్గం పిఠాపురం: ప్రజలు ఎన్నుకున్న పాలకవర్గాన్ని పక్కన పెట్టేసి, కూటమి నేతలకు కలిసొచ్చేలా జిల్లా అధికారి ఒకరు ఇచ్చిన ఆదేశాలు పిఠాపురం మున్సిపాలిటీలో రచ్చ రేపుతున్నాయి. ఏకంగా రూ.3 కోట్ల విలువైన పనులను నామినేషన్ పద్ధతిపై కూటమి నేతలకు కట్టబెట్టేందుకు జరుగుతున్న ఈ ప్రయత్నాలను పాలకవర్గం అడ్డుకుంటోంది. వివరాలివీ.. పట్టణంలో తాగునీటి సరఫరా, డ్రైన్లు, రోడ్లు, పార్కుల అభివృద్ధికి ఏపీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ ముఖ్య కార్యదర్శి రూ.3 కోట్లతో అనుమతులు మంజూరు చేశారు. రోడ్ల అభివృద్ధికి రూ.1.48 కోట్లు, డ్రైన్ల నిర్మాణానికి రూ.1.51 కోట్లు కేటాయించారు. ఈ నిధులు తరువాత సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. ఈ పనులకు కౌన్సిల్ గత నెలలో ఆమోదం కూడా తెలిపింది. నిబంధనల ఉల్లంఘన ఇలా.. ప్రస్తుతం ఉన్న ఇంజినీరింగ్ నిబంధనల ప్రకారం రూ.లక్షకు మించి ఏ పని చేపట్టాలన్నా ఈ–ప్రొక్యూర్మెంట్ పద్ధతిలో ఆన్లైన్లో టెండర్లు పిలవాలి. దీనివలన రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టర్లు పోటీ పడి, తక్కువ రేటుకే పనులు చేసే అవకాశం ఉంటుంది. ఫలితంగా ప్రజాధనం మిగిలే అవకాశం ఉంటుంది. కానీ, ఏం ఒత్తిళ్లు వచ్చాయో ఏమో కానీ, మున్సిపల్ పాలకవర్గాన్ని అధికారులు పూర్తిగా పక్కన పెట్టి, కూటమి నేతలకు అనుకూలంగా ఉండేలా ఆఫ్లైన్ టెండర్ల విధానాన్ని తెర పైకి తెచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. (కాంట్రాక్టర్లు తమ కొటేషన్లను మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బాక్సులో వేయడం వలన దీనిని బాక్స్ టెండర్లు అని పిలుస్తున్నారు.) ఇందులో భాగంగా ఈ పనులను రూ.5 లక్షల్లోపు ఉండేలా విడగొట్టారు. రోడ్ల పనులు 8, డ్రైన్ పనులు 31 పనులకు బాక్సు టెండర్లు పిలవడానికి ఏర్పాట్లు చేశారు. ఈ పనులను కూటమి నేతలకు కట్టబెట్టేందుకే అధికారులు నిబంధనలు తుంగలో తొక్కారంటూ మున్సిపల్ పాలకవర్గ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. ఉన్నతాధికారుల హెచ్చరిక జిల్లా అధికారి లిఖితపూర్వకంగా ఆదేశించారని పేర్కొంటూ బాక్సు టెండర్ల స్వీకరణకు అనుమతించాలని పిఠాపురం మున్సిపాలిటీ అధికారులు ఆ శాఖ ఉన్నతాధికారులను అభ్యర్థించారు. అయితే, దీనికి ఉన్నతాధికారులు నిరాకరించారని తెలిసింది. టెండర్లలో నిబంధనలు పాటించకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించిన వారు.. ఈ–ప్రొక్యూర్మెంటు విధానంలోనే టెండర్లు పిలవాలని ఆదేశించినట్లు తెలిసింది. అయినప్పటికీ, జిల్లా అధికారి ఆదేశాల మేరకు బాక్సు టెండర్ల ద్వారానే పనులు కేటాయించేందుకు మున్సిపల్ అధికారులు చేస్తున్న ప్రయత్నాలపై పాలక వర్గ సభ్యులు ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రజలు ఎన్నుకున్న పాలక వర్గాన్ని కాదని, కూటమి నేతలకు అనుకూలంగా ఇచ్చిన ఆదేశాలపై పోరాడాలని వారు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అటు మున్సిపల్ ఉన్నతాధికారులు, పాలకవర్గ సభ్యులు బాక్సు టెండర్లను వ్యతిరేకించడం.. ఇటు జిల్లా అధికారి ఆదేశాల నేపథ్యంలో ఏం చేయాలో పాలుపోక పిఠాపురం మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ వివాదం నేపథ్యంలో తాము ఏ పనీ చేయలేమంటూ ఇంజినీరింగ్ విభాగం అధికారులు సెలవుపై వెళ్లేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. -
కూటమి బాండ్లను ప్రజలకు చూపిస్తాం
కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసింది. హామీల గురించి అడిగితే తాట తీస్తామంటున్నారు. చంద్రబాబు హామీలపై ప్రశ్నించే బాధ్యతను 40 శాతం ఓటుతో ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ తీసుకుంది. నాలుక మందంతో కార్యక్రమాలు చేస్తే ప్రజల తరఫున ఉద్యమిస్తాం. చంద్రబాబు, పవన్ మేనిఫెస్టో, బాండ్లను ప్రజలకు చూపిస్తాం. అధికారంలోకి వచ్చి ఏడాదైంది.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఏం చేశారని అడుగుదాం. టక్కుటమార విద్యలతో ప్రజల్ని మోసం చేస్తే కుదరదు. తాట తీస్తాం.. తోకలు కట్ చేస్తాం అంటున్నారు. మీ పార్టీలో ఉన్న వాళ్లకు తోకలున్నాయేమో.. మాకు లేవు. అక్రమ కేసులు పెట్టి, చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే వైఎస్సార్ సీపీ పనైపోతుందని కూటమి ప్రభుత్వం అనుకుంటోంది. ఇది ప్రజాస్వామ్యమని గుర్తుపెట్టుకోండి. – బొత్స సత్యనారాయణ, శాసన మండలి ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ అందమైన అబద్ధాలే.. బాబు హామీలు వైఎస్ జగన్ను ఓడించడం తన వల్ల కాదని చంద్రబాబు కూటమి కట్టారు. అందమైన అబద్ధాలను హామీలుగా ఇ చ్చారు. ఎన్నికల్లో ఆయన అబద్ధమే గెలిచింది. ప్రజలు, ప్రతిపక్షం నోరెత్తకుండా బెదిరింపు ధోరణితో కూటమి ప్రభుత్వం పాలన చేస్తోంది. అందుకే ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ’ పేరుతో వైఎస్సార్ సీపీ ప్రజల్లోకి వెళ్తోంది. క్యూఆర్ కోడ్ను ఫోన్లో స్కాన్ చేస్తే టీడీపీ ప్రజాగళం పేరుతో మేనిఫెస్టో వస్తుంది. సూపర్ సిక్స్ ఉమ్మడి మేనిఫెస్టో వస్తుంది. తొలిసారిగా రైతులకు పెట్టుబడి సాయం అందించిన నేత వైఎస్ జగన్. దీనిని చంద్రబాబు కాపీ కొట్టారు. షణ్ముఖ వ్యూహం పేరుతో పవన్ కల్యాణ్, కూటమి నేతలు మరికొన్ని హామీలిచ్చారు. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, బీసీలకు పెన్షన్ ఇస్తానంటూ నోటికొచ్చిన హామీలు చంద్రబాబు ఇచ్చారు. సూపర్ సిక్స్ పథకాలే అమలు చేయడం లేదు. వివక్ష, వేధింపులే ఏకై క అజెండాగా కూటమి పాలన సాగుతోంది. – కురసాల కన్నబాబు, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి -
వచ్చే నెల 4న జేఎన్టీయూకే స్నాతకోత్సవం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జేఎన్టీయూ–కాకినాడ 11వ స్నాతకోత్సవం వచ్చే నెల ఇన నిర్వహిస్తున్నట్లు వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ సీఎస్ఆర్కే ప్రసాద్ శుక్రవారం తెలిపారు. ముఖ్య అతిథిగా వర్సిటీ చాన్సలర్ హోదాలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరవుతారని, ముఖ్య అతిథి బోస్టన్ గ్రూప్ చైర్మన్ కోట సుబ్రమ్మణ్యానికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తామని వివరించారు. స్నాతకోత్సవంలో భాగంగా 2023–24కు సంబంధించి బీటెక్ 41,258, బీ–ఫార్మసీ 2,081, ఎంటెక్ 1,659, ఎంబీఏ 3,797, ఎంసీఏ 1,115, ఫార్మా–డి 274, బీఆర్క్ 83, పీహెడ్డీ 100, బంగారు పతకాలు 40 ప్రకటించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్తో పాటు మాజీ వీసీలు, ఉన్నతాధికారులు పాల్గొంటారన్నారు. 30న జాబ్మేళా బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 30న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి జి.శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కృష్ణ ప్రభాస్ పేపర్ మార్ట్, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్, ఎస్బీఐ గ్రూప్లలో 135 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరుగుతున్నాయన్నారు. పదో తరగతి లేదా ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణులైన వారు హాజరు కావచ్చన్నారు. వివరాలకు 86398 46568 నంబరులో సంప్రదించాలని సూచించారు. ఘనంగా చండీహోమం అన్నవరం: రత్నగిరి వనదేవతగా పూజలందుకుంటున్న వనదుర్గ అమ్మవారికి శుక్రవారం చండీహోమం ఘనంగా నిర్వహించారు. ఉదయం 9 గంటలకు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పండితులు హోమం ప్రారంభించి, 11 గంటలకు పూర్ణాహుతి నిర్వహించారు. అమ్మవార్లకు వేదాశీస్సులు, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి, ప్రసాదాలు నివేదించి, భక్తులకు పంపిణీ చేశారు. వేద పండితుడు ఉపాధ్యాయుల రమేష్, వనదుర్గ ఆలయ అర్చకుడు కోట వంశీ, పరిచారకులు బాలు, వేణు, వ్రత పురోహితులు దేవులపల్లి ప్రకాష్, కూచుమంచి ప్రసాద్ తదితరులు హోమం నిర్వహించారు. ఈ హోమంలో 20 మంది భక్తులు రూ.750 టికెట్టుతో పాల్గొన్నారు. కాగా, సత్యదేవుని ప్రధానాలయంలో అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి ప్రధానార్చకుడు ఇంద్రగంటి నరసింహమూర్తి, రత్నగిరి దిగువన తొలి పావంచా వద్ద కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారికి అర్చకుడు చిట్టెం హరగోపాల్ ఆధ్వర్యాన పండితులు కుంకుమ పూజలు నిర్వహించారు. గెస్ట్ ఫ్యాకల్టీ నియామకానికి 4న ఇంటర్వ్యూలు కాకినాడ సిటీ: స్థానిక జగన్నాథపురంలోని అన్నవరం సత్యవతీదేవీ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకాలకు వ చ్చే నెల 4వ తేదీ ఉదయం 10 గంటలకు ఇంట ర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ వి.అనంతలక్ష్మి తెలిపారు. కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అ ప్లికేషన్స్, కామర్స్, బోటనీ, జువాలజీ, ఆక్వా కల్చర్, మైక్రో బయాలజీ, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, సంస్కృతం, లైబ్రరీ సైన్స్ సబ్జెక్టులు బోధించడానికి అతిథి అధ్యాపకులను నియమిస్తున్నామని వి వరించారు. కనీసం 55 శాతం మార్కులతో పో స్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు అర్హులన్నా రు. నెట్, పీహెచ్డీ పూర్తి చేసి, డిగ్రీ కళాశాలలో తత్సంబంధిత సబ్జెక్టులో బోధనానుభవం కలిగిన మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఎస్కేవీటీ కళాశాలలో.. సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): స్థానిక ఎస్కేవీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల్లో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపాల్ బీవీ తిరుపాణ్యం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ బయోడేటాను వచ్చే నెల 3వ తేదీలోగా అందజేయ్యాలన్నారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టుల్లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు జూలై 4వ తేదీ ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూలు జరుగుతాయని వివరించారు. -
అదనపు మందుల కౌంటర్ల ఏర్పాటు
● ల్యాబ్ రిపోర్టులు త్వరితగతిన అందేలా చర్యలు ● జీజీహెచ్లో పర్యటించిన సూపరింటెండెంట్కాకినాడ క్రైం: ‘పెద్దాసుపత్రికి సుస్తీ’ శీర్షికన ఈ నెల 25న ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి కాకినాడ జీజీహెచ్ అధికారులు స్పందించారు. సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి శుక్రవారం ఆసుపత్రిలో పర్యటించారు. మందుల పంపిణీ పేద రోగులకు ప్రహసనంగా మారిందన్న విషయం తెలుసుకున్న ఆమె.. ప్రస్తుతం ఉన్న 8 కౌంటర్లకు అదనంగా మరో 8 కౌంటర్లు ఏర్పాటు చేశారు. దీంతో మందులు పంపిణీ చేసే కౌంటర్ల సంఖ్య 16కి పెరిగింది. అలాగే, వైద్య పరీక్షల నివేదికలు సకాలంలో అందించేందుకు పాథాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ విభాగాధిపతులతో చర్చించారు. అనంతరం జీజీహెచ్లో హిమోఫీలియా, తలసేమియా, సికిల్సెల్ బాధితులకు ఐదు పడకల ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. వారి సేవలకు పీడియాట్రీషియన్, ఫిజీషియన్తో పాటు ఒక స్టాఫ్ నర్సును నియమించారు. వివిధ వార్డుల్లో పర్యటించిన డాక్టర్ లావణ్య కుమారి వైద్య సేవల నాణ్యతను రోగులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసన్, అడ్మినిస్ట్రేటర్ శ్రీధర్, డీసీఎస్ ఆర్ఎంవో మెహర్ కుమార్ పాల్గొన్నారు. -
జిల్లాను సారా రహితం చేయాలి
కాకినాడ సిటీ: జిల్లాను సారా రహితంగా తీర్చిదిద్దేందుకు నవోదయం 2.0 కార్యక్రమ నిర్వహణకు అధికారులు కృషి చేయాలని ప్రొహిబిషన్, ఎకై ్సజ్ శాఖ రాష్ట్ర కమిషనర్ నిశాంత్ కుమార్, డైరెక్టర్ రాహుల్దేవ్ శర్మ ఆదేశించారు. ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారులతో కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో సారా నిర్మూలనకు అధికారులు, సిబ్బంది ఇప్పటి వరకూ చేసిన కృషిపై సమీక్షించారు. సారా ముద్దాయిలను బైండోవర్ చేయాలని, సారా తయారీకి బెల్లం సరఫరా చేసే వ్యాపారులపై గట్టి నిఘా ఉంచాలని, వారిని కూడా బైండోవర్ చేయాలని ఆదేశించారు. సారా నిర్మూలనపై గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలని అన్నారు. పలు కేసులలో ముద్దాయిల ప్రవర్తన పరిశీలించి, ఇంకా సారా వ్యాపారం చేస్తూంటే పీడీ యాక్ట్ పెట్టాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ ఏనుగుల చైతన్య మురళి, అసిస్టెంట్ కమిషనర్ వి.రేణుక, జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి ఎం.కృష్ణకుమారి, ఏఈఎస్ కె.మౌనిక, జిల్లాలోని ఎకై ్సజ్ సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
పవన్.. షణ్ముఖ వ్యూహం అమలు చేయాలి
ఎన్నికల ముందు ఇచ్చిన షణ్ముఖ వ్యూహం హామీని పవన్ కల్యాణ్ అమలు చేయాలి. కుమారస్వామి పేరిట విడుదల చేసిన మేనిఫెస్టోలో హామీలను అమలు చేయాలి. కాపులకు ఐదేళ్లలో రూ.15 వేల కోట్లు ఇస్తానని చెప్పారు. జగన్ ఫైనాన్స్ ఇంజినీరింగ్ వల్ల ఖజానా ఎప్పుడూ నిండుగా ఉండేది. ఎన్నికల్లో 143 హామీలిచ్చిన చంద్రబాబు చేసిన వంచనను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలి. ప్రతి వ్యాపారి డొక్కలు ఎండిపోయాయి. ప్రతి హామీ అమలు చేసేంత వరకూ కాలర్ పట్టుకుని లోకేష్ను అడుగుతాం. ఆ రోజు కాలర్ పట్టి అడగమని ఆయనే చెప్పారు. మత్స్యకార భరోసాను తొలి ఏడాది ఎగ్గొట్టిన బాబు.. వారికివ్వాల్సిన డీజిల్ రాయితీని ఎత్తేసి మోసం చేశారు. – దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కూటమిని నమ్మి మోసపోయిన మహిళలు మహిళల భద్రతను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసింది. మహిళల భద్రత కోసం నాటి సీఎం వైఎస్ జగన్ ఎన్నో ఆలోచనలు చేశారు. ప్రజలు మోసపోయారనే పరిస్థితి కూటమి పాలనలో స్పష్టంగా కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని చంద్రబాబు, పవన్లను ప్రజలు అడగాలి. ప్రజల తరఫున నిరంతరం పోరాడాల్సిన సమయమిది. ప్రతిపక్షంగా ఆ బాధ్యత మనపై ఎంతో ఉంది. నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇవ్వకుండా ఏడాది కాలంగా నిరుద్యోగులను నిలువునా మోసం చేసిన బాబు తీరును ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలి. ఏడాదిలో మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు. ఒక్కటే ఇచ్చారు. తల్లికి వందనం మొదటి ఏడాది ఎగ్గొట్టేశారు. ఉచిత బస్సు ఊసే లేదు. వీటన్నింటిపై పోరాడటానికి సిద్ధంగా ఉండాలి. చంద్రబాబుకు నిజాయతీ, నిబద్ధత లేనే లేవు. – వంగా గీతా విశ్వనాథ్, వైఎస్సార్ సీపీ పిఠాపురం కో ఆర్డినేటర్ -
హామీలు అమలయ్యే వరకూ ప్రజా పోరాటం
గద్దెనెక్కేందుకు చంద్రబాబు మాయమాటలతో ప్రజలను నమ్మించారు. కౌంటింగ్ అయిన అనంతరం జూన్ 24 నుంచి హామీలన్నింటినీ అమలు చేస్తానన్న బాబు.. గద్దెనెక్కి ఏడాదైనా వాటిని గాలికొదిలేశారు. ఆయన ఇచ్చిన హామీలు అమలయ్యే వరకూ ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరఫున పోరాడటానికి క్యాడర్ సిద్ధంగా ఉంది. జగన్ ఇచ్చిన పిలుపు మేరకు చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్తాం. – దాట్ల సూర్యనారాయణరాజు, పార్టీ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు హామీలను గంగలో కలిపేశారు ప్రజలకిచ్చిన హామీలను చంద్రబాబు గంగలో కలిపేశారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేంత వరకూ ప్రజల తరఫున పోరాడటానికి అందరూ సమన్వయంతో ముందుకు రావాలి. వైఎస్సార్ సీపీ ఓడిపోయిందంటే ఎవరూ నమ్మడం లేదు. జగన్ జనాదరణ కలిగిన నాయకుడు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు కాబట్టే ఎక్కడకు వెళ్లినా జనం పోటెత్తుతున్నారు. అక్రమ అరెస్టులతో ప్రజా వ్యతిరేకతను నిలువరించడం అసాధ్యం. – విప్పర్తి వేణుగోపాలరావు, జెడ్పీ చైర్మన్ -
వర్తక రిజిస్ట్రేషన్తో ప్రయోజనాలు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): వ్యాపార రంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) సభ్యురాలు దుర్గాంజలి అన్నారు. స్థానిక ఎన్ఎఫ్సీఎల్ రోడ్డులోని ఐసీఏఐ కాకినాడ శాఖ కార్యాలయంలో శుక్రవారం ఎంఎస్ఎంఈ మహోత్సవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాపారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా పరిశ్రమల కేంద్రం (డీఐసీ) జీఎం గణపతి మాట్లాడుతూ, ఎంఎస్ఎంఈ పథకం ద్వారా ఏర్పాటు చేసే యూనిట్లకు ప్రభుత్వం రాయితీలిస్తుందన్నారు. ది గోదావరి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గ్రంధి నారాయణరావు మాట్లాడుతూ, వ్యాపారులతో ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్లు చేయించేందుకు కృషి చేస్తామన్నారు. ఐసీఏఐ చైర్మన్ తాళ్ళూరి శ్రీనివాసరాజు మాట్లాడుతూ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి ఎంఎస్ఎంఈపై భారీ స్థాయిలో అవగాహన సదస్సు ఏర్పాటు చేసేందుకు, స్పాట్ రుణాలు అందించేందుకు కార్యక్రమం రూపొందిస్తున్నామని చెప్పారు. అనంతరం డీఐసీ జీఎం గణపతిని సత్కరించారు. కార్యక్రమంలో ఐసీఏఐ కాకినాడ బ్రాంచి కార్యదర్శి పాండురంగమూర్తి, ట్రెజరర్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆరుటి గెల!
అంబాజీపేట: సాధారణంగా అరటి గెల రెండు లేదా మూడడుగులు ఉంటుంది. కానీ అంబాజీపేటలో పచ్చ అరటి గెల ఆరు అడుగులు ఉండి అబ్బురపరిచింది. కొర్లపాటివారిపాలేనికి చెందిన కొర్లపాటి వెంకటేశ్వరరావు తన పెరట్లో పచ్చ అరటి మొక్కను పది నెలల క్రితం నాటారు. టిష్యూ కల్చర్లో భాగంగా గింజ నాటడం ద్వారా వచ్చిన మొలకను స్థానిక పండ్ల వ్యాపారి గండ్రోతు సూరిబాబు ఇచ్చారని వెంకటేశ్వరరావు తెలిపారు. ఆ మొక్కను నాటి సేంద్రియ ఎరువులు వాడడంతో సుమారు పది అడుగులు ఎత్తు ఎదిగి బలమైన గెలలు వేసిందన్నారు. చెట్టుకు భారం కాకుండా రెండు వెదురు గెడలను ఇరువైపులా వేసి బలంగా కట్టి చెట్టుకు నిలబెట్టామన్నారు. ఈ భారీ గెలకు 13 హస్తాల ద్వారా సుమారు 300 కాయలతో బలమైన గెల వేసిందన్నారు. అరటి గెలను పలువురు ఆసక్తిగా తిలకించారు. -
విధి నిర్వహణలో విగతజీవులై..
ఆలమూరు/కోదాడ రూరల్: కర్తవ్య నిర్వహణే ప్రథమ ధర్మం అంటారు. ఆ కర్తవ్య నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బంది రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందడం ఆ కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. విధి నిర్వహణలో క్షణం తీరిక లేకుండా ఉండే ఆ ఉద్యోగులు శాశ్వత విశ్రాంతిని పొందారు. మాదక ద్రవ్యాల (గంజాయి) రవాణా చేస్తున్న నిందితుడిని పట్టుకోవడానికి వెళుతూ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ దినోత్సవం రోజునే ఓ ఎస్సై, ఓ కానిస్టేబుల్ అసువులు బాసారు. వివరాల్లోకి వెళితే.. ఆలమూరు మండల పరిధిలోని 216 ఏ జాతీయ రహదారిలో గతంలో గంజాయి అక్రమ రవాణా కేసు నమోదైంది. ఆ కేసులో నిందితుల్లో ఒకరు హైదరాబాద్లో ఉన్నాడన్న సమాచారంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక ట్రాక్ను సొంతం చేసుకున్న ఎస్సై అశోక్ బుధవారం రాత్రి పది గంటలకు ఆత్రేయపురం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఎస్.బ్లెసన్ జీవన్, రావులపాలెం సీఐ కార్యాలయం ఐడీ పార్టీ హెడ్ కానిస్టేబుల్ దొంగ స్వామితో కలిసి నిందితున్ని అరెస్ట్ చేసేందుకు డ్రైవర్ జి.రమేష్ను వెంటబెట్టుకుని ఎర్టిగా కారులో హైదరాబాద్కు బయల్దేరారు. మార్గమధ్యలో డ్రైవర్ తనకు నిద్రవస్తోందని చెప్పడంతో అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద ఏపీ వైపు గంటన్నరపాటు కారు పక్కకు ఆపి నిద్రించారు. బయల్దేరిన 10 నిమిషాలకే.. కొద్దిసేపటి తర్వాత వీరు తిరిగి హైదరాబాద్కు బయల్దేరగా.. ఆ తర్వాత పది నిమిషాలకే కోదాడ పట్టణ పరిధిలోని దుర్గాపురం జంక్షన్లో రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారుతో ఢీకొట్టారు. కోదాడ పట్టణ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ప్రమాదంలో ఎస్సై అశోక్ (45) కానిస్టేబుల్ బ్లెసన్ (32) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. అందులో ప్రయాణిస్తున్న డ్రైవర్ రమేష్, హెడ్ కానిస్టేబుల్ స్వామి తీవ్ర గాయాలతో బయట పడ్డారు. విధి నిర్వహణలో రాజీ పడకుండా, అక్రమార్కులకు సింహస్వప్నంగా, రక్షణ కోసం వచ్చిన వారికి ఆపద్బాంధవుడిగా పేరు తెచ్చుకున్న అశోక్ మృతితో అంతటా విషాదం అలముకుంది. కారులో ఇరుక్కుపోయిన ఎస్ఐ మృతదేహం లారీని కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. కారు ముందు భాగంలో కూర్చున్న ఎస్ఐ మృతదేహం అందులో ఇరుక్కుపోయింది. కోదాడ పోలీసులు కారు భాగాలను తొలగించి అతికష్టం మీద ఆయన మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటన తర్వాత లారీతో సహా డ్రైవర్ పరారయ్యాడు. అయితే పోలీసులు లారీని పట్టుకుని డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కోనసీమ ఏఎస్పీ, కోదాడ డీఎస్పీ నివాళులు కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో ఎస్ఐ, కానిస్టేబుల్ మృతదేహాలకు కోనసీమ జిల్లా అడిషనల్ ఎస్పీ ఏవీఆర్పీబీ ప్రసాద్, కోదాడ డీఎస్పీ శ్రీధర్రెడ్డి నివాళులర్పించారు. అనంతరం మృతదేహాలను ఏపీ పోలీసులకు అప్పగించారు. క్షతగాత్రుడు హెడ్ కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కోదాడ పట్టణ సీఐ శివశంకర్ తెలిపారు. పదోన్నతి వస్తుందనుకునే లోపే.. ఎస్సై అశోక్కు ఈ ఏడాది సర్కిల్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి వస్తుందని కుటుంబ సభ్యులు భావిస్తున్న నేపథ్యంలో ఇంతటి ఘోరం జరగడం వారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే ఉన్నతాధికారుల సాయంతో అనేక కేసులను ఛేదించి పలు అవార్డులు, రివార్డులను సొంతం చేసుకున్నారు. అశోక్ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని రుస్తుంబాదా కాగా ప్రస్తుతం రాజమహేంద్రవరంలోని ఏవీ అప్పారావు రోడ్డులో కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు సోదరులు, ఒక సోదరి, ఇద్దరు కుమారులు ఉన్నారు. నరసాపురంలోని అశోక్ నివాసంలో మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. విధి నిర్వహణలో ఎస్సై అశోక్కు తోడుగా వెళ్లి మృత్యు ఒడిలోకి వెళ్లిన కానిస్టేబుల్ బ్లెసన్ స్వస్థలం ఆలమూరు. ఆయన తన తల్లి హెప్సీబా, సోదరులు ప్రిన్స్ ఆదిత్య, అలెక్స్ కలసి ఉంటున్నారు. కష్టపడి చదివి ఉద్యోగం సాధించిన బ్లెసన్ తమ కుటుంబానికి అండగా ఉంటాడనుకుంటే హఠాత్తుగా మృతి చెందడంపై కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. వచ్చే ఏడాది కొత్త ఇల్లు నిర్మించుకుని పెళ్లి చేసుకుందామనుకుంటున్న తన సోదరుడు బ్లెసన్ ఆ ముచ్చట తీరకుండానే కానరాని లోకాలు వెళ్లిపోయాడని సోదరులు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. బ్లెసన్ మృతి పట్ల పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు. రోడ్డు ప్రమాదంలో ఎస్సై, కానిస్టేబుల్ మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు గంజాయి రవాణా నిందితుడి అన్వేషణలో దుర్ఘటన -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఎదురెదురుగా వాహనాలు ఢీకొని ఘటన తాళ్లపూడి: మండలంలోని అన్నదేవరపేట వద్ద రెండు మోటార్ సైకిళ్లు ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై టి.రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు అన్నదేవరపేటకు చెందిన కొయ్య ముత్యాలు (38) ఠాగూర్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. గురువారం ఉదయం పని ముగించుకుని తన స్కూటీపై ఇంటికి వస్తుండగా అదే గ్రామానికి చెందిన ఎస్కే సుధీర్ తాళ్లపూడి నుంచి అన్నదేవరపేట వస్తూ అన్నదేవరపేట సొసైటీ వద్ద పరస్పరం ఢీకొన్నారు. ఈ ఘటనలో ముత్యాలు తీవ్రంగా గాయపడి సంఘటనా ప్రదేశంలో మృతి చెందాడు. గాయాలపాలైన సుధీర్ను 108లో గోపాలపురం ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. యువకుడికి నివాళి ముత్యాలు కుటుంబ సభ్యులను వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు, నాయకులు పిట్టా శ్రీనివాస్ పరామర్శించారు. సంతాపం తెలియజేశారు. -
ఇంటర్నేషనల్ రోబోటిక్స్ పోటీల్లో ప్రతిభ
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): రోబోరోర్ మలేషియా–25 వెఫా రోబోటిక్ నిర్వహించిన ఇంటర్నేషనల్ రోబోటిక్స్ పోటీల్లో కాకినాడ లక్ష్య స్కూల్ విద్యార్థులు ప్రతిభ చూపారు. స్మోర్పీ ఇమాజినరీలో ప్రథమ, తృతీయ స్థానాలు, స్మోర్పీ పైలట్ విభాగంలో రెండు రజత పతకాలు, కాంస్య పతకం సాధించారు. స్మోర్పీ స్క్వేర్ అటానమస్ విభాగంలో రెండు స్వర్ణం, రజక పతకం సాధించి ఓవరాల్ చాంపియన్షిప్ కై వసం చేసుకున్నారు. టీమ్ వన్లో రిహాన్సనా, లలిత్ కుమార్వర్మ, సాజిత్, ఆదిత్య ఆనంద్, ఎ.వీనిత్లు పాల్గొనగా టీమ్–2లో డి.మనోహర్రెడ్డి, దుర్గాఆదిత్య శశాంక్, ముకుంద, నాగసాయి అభినవ్, ఎన్.అర్జున్ పాల్గొన్నారు. స్కూల్ డైరెక్టర్ సుగుణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు రోబోటిక్స్ ఒక ప్రత్యేక సబ్జెక్టుగా నేర్పిస్తున్నామన్నారు. ఆదిత్య విద్యాసంస్థల అధినేత శేషారెడ్డి మాట్లాడుతూ పలు దేశాలు పాల్గొన్న పోటీల్లో ఇండియా నుంచి తమ స్కూల్ విద్యార్థులు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థుల బృందాన్ని ప్రిన్సిపాల్ వందనబోహ్రా, ఉపాధ్యాయులు అభినందించారు. -
గుట్టుగా దోపిడీ!
పిఠాపురం: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వతహాగా సినీ నటుడు కావడంతో ఆయన ఇలాకాలో అభివృద్ధ్ది పేరుతో చేస్తున్న పనులు సినిమా యాక్షన్ను తలపిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. క్లాప్.. స్టార్ట్.. కెమెరా.. యాక్షన్.. అన్నట్టుగా గట్టుపై ఒక జేసీబీ పెడుతున్నారు.. కొందరు నేతలు వస్తారు.. కొబ్బరి కాయలు కొడతారు.. వారు వెళ్లి పోగానే జేసీబీతో అక్కడ మట్టి ఇక్కడ వేసి జేసీబీని తరలించేస్తారు. ఈ యాక్షన్ సన్నివేశం ఖరీదు రూ.లక్షల్లో ఉంటుంది. క్లోజర్ పనుల్లో కూటమి నేతలు దోపిడీకి దారి వేసుకున్నారు. రూ.వేలల్లో పని చేసి రూ.లక్షల్లో దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూటమి నేతల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్లోజర్ పనుల్లో నాణ్యతకు గోతులు తవ్వి దోపిడీకి గుట్టుగా దారి చేసుకుంటున్నారు అంటూ రైతులు ఆరోపిస్తున్నారు. గత ఏడాది ఏలేరుకు వచ్చిన వరదల్లో ఏలేరు కాలువకు గండ్లు పడి పిఠాపురం నియోజకవర్గంలో వేలాది ఎకరాల పంట నీట మునిగి రైతులు రూ.కోట్లలో నష్టపోయారు. పంట పొలాల్లో ఇసుక మేటలు వేయడంతో కొందరు రైతులు పంట వేసే పరిస్థితి లేకుండా పోయింది. వీటికి నష్టపరిహారాలు ఇవ్వడంలోనూ కూటమి ప్రభుత్వం రైతులకు మొండి చేయి చూపించిందని రైతులు వాపోతున్నారు. ఏలేరు సుద్దగడ్డ ఆధునీకరించి చూపిస్తానంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వాగ్దానాలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. ఇప్పటికే ఏలేరు కాలువ గట్లు బలహీనంగా మారి గట్టిగా వరదొస్తే వెంటనే గండ్లు పడే పరిస్థితి ఏర్పడింది. ఉన్న గండ్లను పూడ్చడంలో నాణ్యత లోపాలు ఉండడంతో ఏ మాత్రం వరద వచ్చినా మొత్తం పంటలన్నీ నష్టపోయే అవకాశం ఉంది. వేలాది ఎకరాల ఆయకట్టుకు ఏలేరు కాలువ పటిష్టత ఆయువుపట్టు వంటిది. అటువంటి ఏలేరు కాలువలో గండ్లు పూడ్చివేత పనులు నాణ్యతా ప్రమాణాలతో చేయకపోవడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గండ్లు పూడ్చివేతకు రూ.కోట్లు వెచ్చిస్తున్నప్పటికీ పక్కనే ఉన్న మట్టిని తీసి గట్లు వేసి ఽతూతూ మంత్రంగా గండ్లు పూడ్చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మట్టి తీసి గట్టుపై వేసి సరిపెట్టేస్తే మళ్లీ వరదొస్తే మా పరిస్థితి ఏంటి అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. పక్కనున్న మట్టి వేయడానికే రూ.లక్షలు వ్యయం అవుతుందా అంటు రైతులు కూటమి నేతల దోపిడీని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. రూ.30 లక్షల విలువైన పనిని కేవలం 30 గంటల్లో పూర్తి చేసేశారంటే కూటమి నేతల అవినీతి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోందంటున్నారు రైతులు. పొలంలో మట్టి కొల్లగొట్టి పిఠాపురం మండలం రాపర్తి వద్ద గొర్రిఖండి కాలువకు గండ్లు పడి గత ఏడాది పంటలు కొట్టుకుపోయాయి. ఆ గండ్ల పూడ్చివేతకు తాత్కాలిక పనులు చేపట్టారు. ముక్కొల్లు నీటి సంఘం ఆధ్వర్యంలో నీటిపారుదల శాఖ అధికారులు 34 గండ్లు పూడుస్తున్నారు. పిఠాపురం మండలం రాపర్తి పరిధిలో వర్కు నంబరు 28 నుంచి 34 వరకు పనులు చేపట్టారు. వీటి నిర్మాణానికి రూ.30.32 లక్షలు కేటాయించారు. వీటిలో కొన్ని టీడీపీ, కొన్ని జనసేన నేతలకు కేటాయించినట్లు తెలిసింది. ప్రతి గండి పూడ్చివేతకు ఇతర ప్రాంతాల నుంచి మట్టిని తరలించి తీసుకువచ్చి పూడ్చుతున్నట్లుగా ఎస్టిమేట్లలో చూపించిన అధికారులు కాలువ పక్కనే ఉన్న భూముల్లో మట్టిని అక్కడికక్కడే తవ్వి గట్టుపై వేసేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో గట్టు పటిష్టత దెబ్బతిని మళ్లీ వరద వస్తే గండ్లు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రైతులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పొంచి ఉన్న ప్రమాదం తూతూమంత్రంగా గండ్లు పూడ్చివేత పనులు చేయడం వల్ల మళ్లీ వరద వస్తే క్షణాల్లో గట్లు తెగి వరద నీరు పంట పొలాలను ముంచెత్తే ప్రమాదం కనిపిస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గట్లు ౖపైపెన కొంత మేర మామూలు మట్టిని సర్దేయడం వల్ల పెను ముప్పు తప్పదని వారు అంటున్నారు. అక్కడి మట్టితోనే గండికి పూత! రాపర్తి వద్ద ఏలేరు కాలువ 10.100 కిలో మీటరు వద్ద గొర్రిఖండి కాలువకు పడిన గండి పూడ్చివేతకు వర్కు 34కి రూ.4.82 లక్షలు కేటాయించారు. దీని కోసం ఇతర ప్రాంతాల నుంచి మెటీరియల్ తీసుకు రావడం వల్ల ఇంత ఖర్చు అవుతున్నట్లు చూపించినట్లు తెలిసింది. కానీ నిబంధనలకు విరుద్ధంగా గట్టు పక్కనే ఉన్న రైతుల భూముల్లోని మట్టిని తవ్వి, కాలువలో ఉన్న ఇసుక బస్తాల్లో వేసి వాటిని పేర్చి మట్టి వేసి గట్టును తయారుచేసినట్టు చూపి చేతులు దులిపేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ గతంలో పడిన గండిని గతంలోనే తాత్కాలికంగా కొంతమేర మూసేశారు. దానిపైనే మట్టి వేసి మొత్తం గట్టు అంతా పూడ్చినట్టుగా బిల్లులు పెట్టుకుంటున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. సుమారు 10 మీటర్ల మేర ఉన్న ఈ గండికి పక్కనే ఉన్న మట్టిని వేయడం వల్ల కేవలం రూ.70 వేలకు మించి ఖర్చు కాదని చెబుతున్నారు. కానీ దీనికి ఏకంగా రూ 4.82 లక్షలు వ్యయం అయినట్లు చూపించి సుమారు రూ.4 లక్షలు దోపిడీ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి పక్కనే ఏలేరు కాలువ 10.200 కిలో మీటరు వద్ద గొర్రిఖండి కాలువకు పడిన గండి పూడ్చివేతకు వర్కు నంబరు 33కి రూ.5.63 లక్షలు కేటాయించారు. పక్కనే ఉన్న రైతుల భూముల్లోని మట్టిని తవ్వి ఇసుక బస్తాలు పేర్చి మట్టి వేసి గట్టు వేసేసినట్టు చూపుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పనికి సైతం కేవలం రూ.70 వేలకు మించి ఖర్చు కాదని, కానీ ఏకంగా రూ 5.63 లక్షలు వ్యయమైనట్టు బిల్లులు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈవిషయంపై ఏలేరు నీటిపారుదల శాఖ అధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులో లేరు. గొర్రి‘గండి‘ పనుల్లో అవినీతి జలగలు పక్క పొలంలో మట్టితో గండ్ల పూడ్చివేత రూ.వేలల్లో ఖర్చు.. రూ.లక్షలు మేత క్లోజర్ మొత్తం పనుల్లో కూటమిగా రూ.కోట్లు స్వాహా -
సత్యదేవునికి సిరుల వృష్టి
అన్నవరం: రత్నగిరి సత్యదేవునికి రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది. గత 35 రోజులకు హుండీల ద్వారా రూ.2,12,38,410 ఆదాయం సమకూరింది. బుధవారం హుండీలను లెక్కించగా రూ.2,00,76,264 కరెన్సీ, రూ.11,62,146 చిల్లర నాణేలు వచ్చాయని దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు తెలిపారు. సరాసరిన రోజుకు రూ.6,06,811 నమోదైనట్టు తెలిపారు. సాధారణంగా స్వామివారి హుండీ ఆదాయం నెలకు రూ.1.2 కోట్ల నుంచి రూ.1.5 కోట్ల వరకు వస్తుంది. కానీ రూ.2 కోట్లు దాటి రావడం అరుదనే చెప్పాలి. 602 గ్రాముల బంగారం.. హుండీలలో నగదుతో పాటు బంగారం సైతం రికార్డు స్థాయిలో 602 గ్రాములు వచ్చింది. బంగారం సైతం ప్రతి నెలా 50 నుంచి 60 గ్రామలు మాత్రమే వస్తుంది. ఈ సారి ఏకంగా పది రెట్లు రావడం గొప్ప విషయమే. ఈ బంగారం మార్కెట్ విలువ సుమారు రూ.60 లక్షలు ఉంటుంది. అలాగే వెండి 613 గ్రాములు వచ్చిందని అధికారులు తెలిపారు. ఓ కుటుంబం స్వామి వారికి నిలువుదోపిడీ (తాము ధరించిన ఆభరణాలు) సమర్పించినట్టు అధికారులు తెలిపారు. అలాగే వంద గ్రాముల బంగారు బిస్కెట్ కూడా హుండీలో వచ్చినట్టు తెలిపారు. పోటెత్తిన భక్తులు సత్యదేవుని కల్యాణోత్సవాల అనంతరం మే 21న లెక్కించిన తరువాత మళ్లీ బుధవారం హుండీలను లెక్కించారు. వేసవి సెలవులు, వైశాఖం, జ్యేష్ట మాసాల్లో వివాహాలు ఎక్కువగా జరగడంతో భక్తులు భారీగా తరలి రావడంతో రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరినట్టు అధికారులు చెప్తున్నారు. భారీగా విదేశీ కరెన్సీ సత్యదేవుని హుండీల ద్వారా పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీ కూడా లభించింది. అమెరికన్ డాలర్లు 87, సౌదీ అరేబియా రియల్స్ 55, సింగపూర్ డాలర్లు రెండు, బోత్స్వానా కరెన్సీ రెండు పులాలు, ఖతార్ రియల్స్ ఒకటి, యూఏఈ దీరామ్స్ 40, యూరోలు 20, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ బైసా 600 లభించాయి. హుండీ లెక్కింపులో ఈఓతో పాటు పలు స్వచ్ఛంద సేవా సంస్థల కార్యకర్తలు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం 35 రోజులకు రూ.2.12 కోట్ల నగదు 602 గ్రాముల బంగారం సమర్పణ -
ఇన్స్పైర్కు వేళాయె..
రాయవరం: చిన్నారుల్లో దాగిన సృజనాత్మకతను వెలికి తీసి, వారిలో విజ్ఞాన జిజ్ఞాసను రేకెత్తించేందుకు ఇన్స్పైర్ మనక్ ఎంతో దోహదపడుతుంది. కేంద్ర, శాస్త్ర సాంకేతిక విజ్ఞాన మండలి, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంయుక్తంగా ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగిన ప్రతిభను బయటకు తీయడం, సైన్స్పై వారికి ఆసక్తిని పెంచడం దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. ఈ నేపథ్యంలో 2025 – 26 విద్యా సంవత్సరానికి విద్యార్థుల నుంచి నూతన ప్రాజెక్టులను ఆహ్వానిస్తున్నారు. ప్రతి పాఠశాలకూ అవకాశం ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ విద్యా సంస్థల్లో ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులు, వారికి బోధించే ఉపాధ్యాయులతో కలిసి ఇన్స్పైర్ మనక్ ప్రోగ్రామ్లో పాల్గొనవచ్చు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. ప్రతి తరగతి నుంచి ఒకరు వంతున ప్రాథమికోన్నత పాఠశాలకు మూడు, ఉన్నత పాఠశాలలు ఐదు ప్రాజెక్టులను నమోదు చేసుకునే వీలుంది. 2008–09 సంవత్సరం నుంచి ఏటా ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ప్రాజెక్టులను పంపండిలా.. www.inspireawards-dst.gov.in వెబ్సైట్లో ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న పాఠశాల లాగిన్ ద్వారా సెప్టెంబరు 15వ తేదీ లోపు పాఠశాల విద్యార్థుల ఆలోచనలకు పదును పెట్టాలి. వారి నుంచి రూపుదిద్దుకున్న ప్రాజెక్టుల వివరాలను నమోదు చేయాలి. అవార్డుకు ఎంపికై న ప్రతి విద్యార్థి జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో తమ ప్రాజెక్టును ప్రదర్శించేందుకు వీలుగా రూ.10 వేల పారితోషకం, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని సత్తా చాటి జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికై న బాల శాస్త్రవేత్తలకు రూ.25 వేల వరకు తమ ప్రాజెక్టును మెరుగుపర్చుకునేందుకు శాస్త్ర సాంకేతిక శాఖ అదనపు నిధులు కేటాయిస్తుంది. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు రాష్ట్రపతి భవన్, జపాన్ సందర్శన తదితర అవకాశాలతో పాటు ఇంజినీరింగ్ కళాశాల విద్యలో మెరుగైన అవకాశాలు లభిస్తాయి. జాతీయస్థాయికి ఎంపికై న ప్రాజెక్టుకు పేటెంట్ లభించే అవకాశముంది. పూర్తి వివరాలకు జిల్లా సైన్స్ అధికారిని సంప్రదించాలి. నిబంధనలు ఇవే.. ముందుగా పాఠశాల స్థాయిలో ఐడియా కాంపిటేషన్ నిర్వహించాలి. స్థానిక సమస్యను తీర్చే విధంగా ఆలోచన ఉండాలి. తరగతి వారీగా ఉత్తమ ఆలోచనను ఎంపిక చేసి, ఆలోచనకు అవసరమైన ప్రాజెక్టును రూపొందించాలి. విద్యార్థి పేరు, తండ్రి పేరు, తరగతిని నమోదు చేయాలి. విద్యార్థికి సంబంధించిన బ్యాంకు ఖాతా నంబరు, ఆధార్ నంబరు ఎంటర్ చేయాలి. విద్యార్థి ప్రాజెక్టు సంక్షిప్తంగా, రాత పూర్వకంగా పొందుపర్చి, సంబంధిత రైటప్ వెబ్సైట్లో నమోదు చేయాలి. ప్రాజెక్టు పేరు, శాస్త్ర సాంకేతికతకు సంబంధించిన అంశాలు ఉండేలా చూసుకోవాలి. ప్రాజెక్టు ఎంపిక రెండు నెలల్లో పూర్తి చేసి జిల్లా స్థాయిలో ప్రకటిస్తారు. తర్వాత వాటిని రాష్ట్ర స్థాయికి ఎంపికకు పంపిస్తారు. ఎంపికై న ప్రాజెక్టుకు ప్రయోగం నిమిత్తం బ్యాంకు ఖాతాలో రూ.10 వేలు జమ చేస్తారు. ఈ దరఖాస్తుకు సెప్టెంబరు 15 తుది గడువు. జిల్లాలో పరిస్థితి కాకినాడ జిల్లాలో ప్రభుత్వ, ప్రెవేట్ పాఠశాలల నుంచి 2,140 ప్రాజెక్టులు నమోదు కాగా, 172 ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. ఎంపికై న ప్రాజెక్టులు తయారు చేసిన విద్యార్థుల ఖాతాలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక్కొక్కరికి రూ.10 వేలు వంతున ప్రాజెక్టు రూపకల్పనకు జమ చేశారు. అయితే అత్యధిక ప్రాజెక్టులు రిజిస్టర్ అయినప్పటికీ వాటి రూపకల్పనలో నాణ్యతా ప్రమాణాలు లోపించడం వల్లనే ప్రాజెక్టుల ఎంపిక సంఖ్య తగ్గుతోందనే విమర్శలున్నాయి. ప్రాజెక్టులో సృజనాత్మకత, నాణ్యత లోపించడం దీనికి కారణంగా తెలుస్తోంది. 2025–26 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలో 530 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి కనీసం మూడు, ఉన్నత పాఠశాలల నుంచి కనీసం ఐదు ప్రాజెక్టులు రూపొందించాలి. సృజనాత్మక ఆవిష్కరణలకు ఆహ్వానం ప్రతి పాఠశాల నుంచి ప్రాజెక్టులు పంపే వీలు బాల శాస్త్రవేత్తలకు భలే అవకాశం హెచ్ఎంలు చొరవ చూపాలి విద్యార్థులు సృజనాత్మక ప్రతిభను ప్రదర్శించేలా సైన్స్ ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. ఇన్స్పైర్ మనక్ పోటీల్లో విద్యార్థులందరూ పాల్గొనేలా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపాలి. జిల్లా నుంచి అత్యధికంగా నామినేషన్లు నమోదు అయ్యేలా చూడాలి. విద్యార్థులకు ఇది ఒక చక్కని అవకాశం. – పి.రమేష్, డీఈవో, కాకినాడ జిల్లా జాతీయ స్థాయిలో నిలిచేలా.. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పోటీ పడేలా ప్రాజెక్టులను విద్యార్థులు రూపొందించాలి. ఈ ప్రక్రియను సైన్స్ ఉపాధ్యాయులు పర్యవేక్షించాలి. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సైన్సు ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలి. – గిరజాల వెంకట సత్య సుబ్రహ్మణ్యం, కోనసీమ జిల్లా సైన్స్ అధికారి -
మారీటైమ్ బోర్డుకు సాల్ట్ భూములు బదలాయించాలి
కాకినాడ సిటీ: జిల్లాలో కేంద్ర ప్రభుత్వ సాల్ట్ డిపార్టుమెంట్కు చెందిన 1,245.28 ఎకరాల భూములను రాష్ట్ర మారీటైమ్ బోర్డుకు బదలాయించాల్సి ఉందని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా తెలిపారు. ఈ మేరకు ఈ భూముల ధరను నిర్ణయించేందుకు ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కమిటీ సమావేశం మంగళవారం కలెక్టరేట్లో జరిగింది. దీనికి అధ్యక్షత వహించిన జేసీ మాట్లాడుతూ, కాకినాడ, కరప, తాళ్లరేవు మండలాల్లో ఉన్న సాల్ట్ డిపార్టుమెంట్ భూములను రాష్ట్ర మారీటైమ్ బోర్డుకు బదిలీ చేసేందుకు ధర నిర్ణయించాల్సిందిగా చైన్నెలోని డిప్యూటీ సాల్ట్ కమిషనర్ను కోరారన్నారు. ఈ భూముల విలువను కలెక్టర్ షణ్మోహన్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ నిర్ణయిస్తుందన్నారు. గురజనాపల్లి, చొల్లంగి గ్రామాల్లో 626.37 ఎకరాలు, పెనుగుదురులో 501.26 ఎకరాలు, కాకినాడ జగన్నాథపురం, సాల్ట్ సూపరింటెండెంట్ ఆఫీసు ప్రాంగణంలో 117.65 ఎకరాల చొప్పున ఈ భూములున్నాయని వివరించారు. ఈ భూములను సంబంధిత తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లు పరిశీలించి, వాటి స్థితి, ధర వివరాలతో కమిటీకి నివేదిక అందజేయాలని జేసీ ఆదేశించారు. సమావేశంలో డీఆర్ఓ జె.వెంకటరావు, ఆర్డీఓ ఎస్.మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. లీఫియస్ ప్లాంట్ ప్రారంభించండి సాక్షి ప్రతినిధి, కాకినాడ: పరిశ్రమలు తీసుకువచ్చి సంపద సృష్టిస్తానంటున్న ప్రభుత్వం కాకినాడ ఎస్ఈజెడ్లో రూ.2,400 కోట్లతో సిద్ధమైన లీఫియస్ పెన్సిలిన్ ప్లాంట్కు ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని రాక్స్ మాల మహానాడు, సర్వజన సమాజ్ జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ ప్రశ్నించారు. కాకినాడలో మంగళవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సాంకేతిక సమస్యలతో నాలుగు నెలలుగా ప్లాంట్ నిర్వహణలోకి తీసుకురాకపోవడం అన్యాయమన్నారు. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన 2,500 కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభించి, ఉద్యోగుల జీతభత్యాలకు ఇబ్బందులు తలెత్తకుండా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పెన్సిలిన్–జీ యాంటీ బయోటిక్ను పెన్సిలియం క్రైసోజినం ఫంగస్ ఉపయోగించి ఫెర్మెంటేషన్ ద్వారా ఈ ప్లాంట్లో ఉత్పత్తి చేస్తున్నారన్నారు. ఈ ప్లాంట్కు ఏటా 15 వేల టన్నుల పెన్సిలిన్–జి, 1.8 లక్షల టన్నుల గ్లూకోజ్, 6 అమైనో పెన్సిల్లానిక్ యాసిడ్ 3,600 టన్నులు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని రత్నాకర్ తెలిపారు. పీజీ ఈసెట్లో 93.85 శాతం ఉత్తీర్ణత బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఆంధ్రా యూనివర్సిటీ నిర్వహించిన పీజీ ఈసెట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు 93.85 శాతం మేర ఉత్తీర్ణత సాధించారు. పీజీ విభాగంలో 13 సబ్జెక్టులకు సంబంధించి ఈ పరీక్షకు 931 మంది దరఖాస్తు చేసుకోగా 764 మంది రాశారు. వీరిలో 717 మంది ఉత్తీర్ణులయ్యారు. కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో కుంచె సుదర్శన్ (కాకినాడ రూరల్ పెనుమర్తి) 7, సివిల్ ఇంజినీరింగ్లో అల్లు సాయి నవీన్ (పెద్దాపురం) 8, కె.వెంకట రామప్రసాద్వర్మ 10, ఈఈఈ విభాగంలో ఎస్.లాస్య (సామర్లకోట) 3, సి.సత్య వెంకట లోవ శివ సమీర్ (తొండంగి) 10, ఎం.కృష్ణ కౌశిక్ (దుర్గాడ) 10, ఫుడ్ టెక్నాలజీలో బిళ్లకుర్తి జ్యోతి (కాకినాడ) 4, ఇన్స్ట్రుమెంట్ విభాగంలో రాయుడు సాయిరామ్ (జగన్నాథగిరి) 1, పి.సాయి (ఎ.కొత్తపల్లి) 4, మెకానికల్ విభాగంలో కె.లోకేష్ (సీతారామపురం) 1, మెటలర్జీ విభాగంలో ఎం.నాగేశ్వరి (పేపకాయయలపాలెం) 4, నానో టెక్నాలజీలో కె.విశాల్ (సర్పవరం) 9 ర్యాంకులు సాధించారు. ఎస్ఎస్ఏ ఉద్యోగుల బదిలీల సీనియారిటీ జాబితా విడుదల బాలాజీచెరువు (కాకినాడ సిటీ): సమగ్ర శిక్షా అభియాన్లో పని చేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్, కేజీబీవీ, పీటీ, సీఆర్ఎంటీఎస్, ఎంఐఎస్లకు సంబంధించిన ఉద్యోగుల బదిలీల సీనియారిటీ జాబితాను సమగ్ర శిక్ష తూర్పు గోదావరి వెబ్సైట్లో ఉంచినట్లు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ పి.వేణుగోపాలరావు మంగళవారం తెలిపారు. అభ్యంతరాలుంటే ఈ నెల 27వ తేదీలోగా తెలియజేయాలని సూచించారు. -
ఆషాఢం.. అదుర్స్!
అన్నవరం: సాధారణంగా ఆషాఢ మాసంలో ఏకాదశి, పౌర్ణమి వంటి పర్వదినాలు, శని, ఆదివారాలు మినహా సత్యదేవుని ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య తక్కువగా ఉంటుంది. కానీ, ఇదే సమయంలో అన్నవరం సత్యదేవుని గోధుమ నూక ప్రసాదానికి డిమాండ్ అమాంతం పెరిగిపోతుంది. తుని సమీపంలోని లోవ దేవస్థానంలో కొలువు తీరిన తలుపులమ్మ తల్లిని దర్శించుకునేందుకు ఉత్తరాంధ్రతో పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలి వెళ్తూంటారు. ఉమ్మడి జిల్లాలోని కోనసీమ, రాజమహేంద్రవరం, కాకినాడ పరిసర ప్రాంతాల నుంచి లోవకు వెళ్లే భక్తులు మధ్యాహ్నం రెండు గంటల నుంచి తిరుగు ప్రయాణమవుతూంటారు. వీరు మార్గం మధ్యలో అన్నవరంలో ఆగి, సత్యదేవుని గోధుమ నూక ప్రసాదాలు పెద్ద సంఖ్యలో కొనుగోలు చేస్తూంటారు. దీంతో, ఈ ప్రసాదం విక్రయాలు ఈ మాసంలో లెక్కకు మిక్కిలిగా జరుగుతూంటాయి. ఈ ఏడాది ఆషాఢ మాసం గురువారం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భక్తుల డిమాండ్కు అనుగుణంగా సత్యదేవుని ప్రసాదాలను అందుబాటులో ఉంచేందుకు అన్నవరం దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లు ఇలా.. ఫ ఆషాఢ మాసంలో ఆది, మంగళ, గురు, శుక్రవారాల్లో తలుపులమ్మ తల్లి దర్శనానికి వెళ్లే భక్తులు అధికంగా ఉంటారు. ఒక్క ఆదివారం నాడే సుమారు 50 వేల నుంచి లక్ష మంది భక్తులు లోవ దేవస్థానానికి వెళ్లే అవకాశం ఉంటుంది. వారిలో అధిక శాతం మంది తిరుగు ప్రయాణంలో సత్యదేవుని ప్రసాదాలు కొనుగోలు చేస్తారు. జాతీయ రహదారిపై నిర్మించిన సత్యదేవుని కొత్త, పాత నమూనా ఆలయాల వద్ద, తొలి పావంచా వద్ద ప్రసాద విక్రయ స్టాల్స్లో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఫ సాధారణ రోజుల్లో 60 వేలు, ఆదివారం నాడు పాత, కొత్త నమూనా ఆలయాల కౌంటర్లలో చెరో 20 వేలు, తొలి పావంచా కౌంటర్ వద్ద 30 వేలు, రత్నగిరిపై ఉన్న కౌంటర్ల వద్ద 30 వేలు, కలిపి మొత్తం లక్ష ప్రసాదం ప్యాకెట్లు అందుబాటులో ఉంచనున్నట్లు ప్రసాదం విభాగం అధికారులు తెలిపారు. ఈ కౌంటర్ల వద్ద అదనపు భద్రత కూడా ఏర్పాటు చేశారు. రూ.1.50 కోట్ల ఆదాయం! మొత్తం మీద ఆషాఢ మాసంలో కొండ దిగువన ప్రసాదం ప్యాకెట్ల విక్రయం ద్వారా అన్నవరం దేవస్థానానికి సుమారు రూ.1.50 కోట్ల ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్క ఆదివారం నాడే సుమారు 50 వేల నుంచి లక్ష ప్రసాదాల ప్యాకెట్ల విక్రయాలు జరుగుతాయి. ఒక్కో ప్రసాదం ప్యాకెట్ ఖరీదు రూ.20. దీని ప్రకారం ఆషాఢ మాసం నాలుగు ఆదివారాల్లోనే సుమారు రూ.80 లక్షల ఆదాయం సమకూరే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మిగిలిన రోజుల్లో ప్రసాద విక్రయాల ద్వారా మరో రూ.70 లక్షలు వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. రెండు పూటలా తయారీ రత్నగిరిపై ఉదయం, మధ్యాహ్నం కూడా ప్రసాదం తయారు చేసి భక్తులకు వేడిగా విక్రయిస్తున్నారు. గతంలో ఒక్క కార్తికం మినహాయిస్తే మిగిలిన మాసాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ మాత్రమే స్వామివారి గోధుమ నూక ప్రసాదం తయారు చేసేవారు. దానిని మర్నాడు ఉదయం వరకూ విక్రయించేవారు. అయితే ప్రసాదం నాణ్యతపై భక్తుల నుంచి విమర్శలు రావడంతో ఇప్పుడు ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఒక షిఫ్ట్, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ రెండో షిఫ్ట్లో ప్రసాదాలు తయారు చేసి, కౌంటర్ల ద్వారా విక్రయిస్తున్నట్లు ప్రసాదం విభాగం అధికారులు తెలిపారు. ఫ తలుపులమ్మ లోవకు భక్తుల తాకిడి ఫ జోరందుకోనున్న సత్యదేవుని ప్రసాద విక్రయాలు ఫ అన్నవరంలో అదనపు కౌంటర్ల ఏర్పాటు -
రూ.26,409 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాకు రూ.26,409 కోట్లతో రూపొందించిన వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్ షణ్మోహన్ సగిలి మంగళవారం ఆవిష్కరించారు. బ్యాంకులు, వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన జిల్లా కన్సల్టేటివ్ కమిటీ, జిల్లా స్థాయి రుణాల లక్ష్య సాధన ప్రగతి సమీక్ష కమిటీ సమావేశాలు కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వ్యవసాయ, అనుబంధ రంగాలు, పరిశ్రమలు, ఇతర ప్రాధాన్య రంగాలకు వార్షిక రుణ ప్రణాళిక ప్రకారం రుణాలివ్వాలని అన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాలకు మించి రుణాలిచ్చినందుకు బ్యాంకర్లకు అభినందించారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు మరింత చొరవ చూపాలని కోరారు. ఈ రుణాల ప్రగతిపై ప్రతి వారం సమీక్షిస్తామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ 10,500 మంది మంది కౌలు రైతులకు క్రాప్ కల్టివేటర్ రైట్స్ (సీసీఆర్) కార్డులు జారీ చేయగా, 8 వేల మంది రైతులు పంట రుణాల కోసం బ్యాంకులకు దరఖాస్తు చేసుకున్నారని కలెక్టర్ చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కమిటీ కన్వీనర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ రీజినల్ హెడ్ వి.కృష్ణమాచారి, ఎల్డీఎం, సీహెచ్ఎస్వీ ప్రసాద్, రిజర్వ్ బ్యాంకు ఎల్డీఓ ఎ.రామకృష్ణ, నాబార్డ్ ఏజీఎం వై.సోమునాయుడు, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్.విజయ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సమాజానికి స్వచ్ఛమైన రాజకీయాలు అవసరం
పెద్దాపురం: సమాజానికి సూర్యారావు లాంటి స్వచ్ఛమైన రాజకీయ నాయకులు ఎంతో అవసరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. మున్సిపల్ మాజీ కౌన్సిలర్, సీపీఎం నేత యాసలపు సూర్యారావు వర్ధంతి సభ ఆ పార్టీ మండల కార్యదర్శి డి.క్రాంతికుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అవినీతిపరులను పార్టీలోకి తీసుకుంటుందన్నారు. మత విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీస్తోందని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ మూడుసార్లు రాష్ట్ర పర్యటన చేసినా ఆంధ్రాకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీలు, ఆస్తి పన్నులను భారీగా పెంచిందన్నారు. తొలుత సూర్యారావు చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించారు. అనంతరం కళాకారులు ప్రదర్శించిన కళారూపాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు, జిల్లా కమిటీ సభ్యులు జి.బేబీరాణి, రాజశేఖర్, పలివెల వీరబాబు, నీలపాల సూరిబాబు, సిరపురపు శ్రీనివాస్, కేదారి నాగు, వీర్రాజు, కృష్ణ, గడిగట్ల సత్తిబాబు, స్నేహ, అప్పన్న, సిరిపురపు బంగార్రాజు, మంతెన సత్తిబాబు, మాగాపు నాగు, రామిశెట్టి సుబ్రహ్మణ్యం, అమృత, నమ్రత తదితరులు పాల్గొన్నారు.నేటి నుంచి పెద్దాపురం మరిడమ్మ జాతర పెద్దాపురం: కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా ప్రసిద్ధి చెందిన పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి జాతర మంగళవారం నుంచి వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ కె.విజయలక్ష్మి తెలిపారు. సోమవారం ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ, ఏటా 37 రోజుల పాటు ఈ మహోత్సవాలు జరుగుతాయన్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి జూలై 31 వరకూ ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. ఏటా లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపారు. మంగళవారం రాత్రి 8.08 గంటలకు జాతర ప్రారంభమవుతుందన్నారు. పీజీఆర్ఎస్కు 335 అర్జీలు కాకినాడ సిటీ: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు 335 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, డీఆర్ఓ జె.వెంకటరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డి.పెద్దిరాజు, ఎస్ఎస్ఏ పీఓ వేణుగోపాలరావు తదితరులు అర్జీలు స్వీకరించారు. బియ్యం కార్డు మంజూరు, కార్డులో పేర్ల మార్పులు, చేర్పులు, పింఛన్లు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, ఇళ్ల స్థలాలు, ఆన్లైన్లో భూమి వివరాల నమోదు, రీసర్వే, ఆక్రమణల తొలగింపు, డ్రైన్లు, కాలువల్లో పూడికల తొలగింపు, పారిశుధ్యం, తల్లికి వందనం ఆన్లైన్ సమస్యల వంటి అంశాలపై ప్రజలు అర్జీలు అందజేశారు. అర్జీదారులు పీజీఆర్ఎస్లోనే కాకుండా మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో కూడా అర్జీలు సమర్పించవచ్చని కలెక్టర్ తెలిపారు. అర్జీల ప్రస్తుత స్థితి తెలుసుకోవడానికి టోల్ఫ్రీ నంబర్ 1100కు నేరుగా కాల్ చేయవచ్చన్నారు. భీమేశ్వరాలయ అన్నదాన ట్రస్ట్కి రూ.5 లక్షల విరాళం రామచంద్రపురం రూరల్: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి ఆలయ అన్నదాన ట్రస్ట్కి విజయవాడకు చెందిన నాగులపల్లి శ్రీనివాస్, పల్లవి దంపతులు సోమవారం రూ.5 లక్షలు విరాళంగా అందజేశారు. వారి తరఫున విరాళం అందజేసిన ధారా జయరామకృష్ణ శాస్త్రికి ఆలయ ఈఓ, దేవదాయ శాఖ సహయ కమిషనర్ అల్లు వెంకట దుర్గాభవాని స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
శాన్ఫ్రాన్సిస్కోలో సెంచూరియన్ విశ్వవిద్యాలయం ప్రదర్శన
భువనేశ్వర్: సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ–మేనేజ్మెంట్ (సీయూటీఎం) అరుదైన ఘనత సాధించింది. శాన్ఫ్రాన్సిస్కోలో ప్రారంభమైన 62వ డిజైన్ ఆటోమేషన్ కాన్ఫరెన్స్ (డీఏసీ)లో పాల్గొనే అరుదైన అవకాశాన్ని చేజిక్కించుకోవడమే కాకుండా తన సామర్థ్యాన్ని ప్రదర్శించి ప్రశంసలు అందుకుంది. ఈ కాన్ఫరెన్స్ ఈ నెల 22న ప్రారంభమైంది, 25 వరకు కొనసాగనుంది. సెమీకండక్టర్, డిజైన్ ఆటోమేషన్ పరిశ్రమ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కాన్ఫరెన్స్లో సెంచూరియన్ ప్రాతినిధ్యం వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. శ్రీచిప్స్ టు సిస్టమ్స్శ్రీ అనే శీర్షికతో నిర్వహిస్తున్న డీఏసీ కార్యక్రమానికి ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ (ఈడీఏ), సెమీకండక్టర్ టెక్నాలజీలు, సిస్టమ్ ఇన్నోవేషన్ రంగంలో దిగ్గజాలు హాజరయ్యాయి. వర్సిటీ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ డీఎన్ రావు ఆధ్వర్యంలో ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్దాస్, లక్ష్మీకాంత్ సుతార్లతో కూడిన బృందం సెంచూరియన్కు ప్రాతినిధ్యం వహించింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ డీఎన్ రావు మాట్లాడుతూ ప్రపంచ స్థాయి వేదికపై సామర్థ్యాన్ని ప్రదర్శించిన తొలి వర్సిటీగా సెంచూరియన్ నిలుస్తుందన్నారు. వర్సిటీలో సెమీకండక్టర్ టెక్నాలజీ పాఠ్యాంశాలు మెరుగుపరచడానికి మార్క్యూ సెమీ కండక్టర్స్తో ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. రానున్న కాలంలో ప్రపంచ స్థాయిలో సెంచూరియన్ తన ఉనికి చాటుకుంటుందని ఆశాభవం వ్యక్తం చేశారు. -
సుదర్శన హోమానికి సంప్రదాయ దుస్తులు తప్పనిసరి
● పురుషులు పంచె, కండువా.. ● మహిళలు చీర, జాకెట్టు లేదా పంజాబీ డ్రెస్ చున్నీతో.. సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానంలో నిత్యం నిర్వహిస్తున్న నారసింహ సుదర్శన హోమంలో పాల్గొనే భక్తులు ఇకపై సంప్రదాయ దుస్తులను తప్పనిసరిగా ధరించాలని దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీఎన్వీ ప్రసాద్ సోమవారం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు దేవస్థానం కార్యాలయంలో ఒక ప్రకటన విడుదల చేశారు. పురుషులు పంచె, కండువా, మహిళలు చీర, జాకెట్టు లేదా పంజాబీ డ్రెస్, చున్నీతో పాల్గొనాలన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించడంలో పరమార్థం దైవ దర్శనం సమయంలో సంప్రదాయ దుస్తులు ధరించడంలో పరమార్థం గురించి ఆలయ ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్, స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు వివరించారు. దేవాలయానికి వెళ్లిన దగ్గర నుంచి దర్శనం చేసుకుని బయటకు వచ్చే వరకూ మన దృష్టి దేవుని మీదనే ఉండాలి. అందుకే మన పెద్దలు భక్తులు ధరించే వస్త్రాలు సంప్రదాయ బద్ధంగా ఉండాలనే ఆచారాన్ని పెట్టారని వివరించారు. -
బాధితురాలి చేతికి చేరిన బంగారు గొలుసు
సామర్లకోట: విశాఖపట్నానికి చెందిన దంపతులు సామర్లకోటలో పొగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు సోమవారం బాధితురాలికి అందజేశారు. కలిపిరెడ్డి నారాయణమ్మ, జగన్మోహన్రావు ఆదివారం విశాఖపట్నం నుంచి బంధువుల ఇంటికి వచ్చి స్థానిక స్టేషన్ సెంటర్లో ఒక హోటల్లో అల్పాహారం చేశారు. అనంతరం ఆ దంపతులు రోడ్డుపై పర్సు జాడ విరుచుకున్నారు. రైల్వే స్టేషన్కు వెళ్లిన తరువాత చూసుకొంటే పర్సు కనిపించక పోవడంతో స్థానిక అవుట్ పోస్టులోని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు మూడు తూలాల బరువైన రూ. మూడు లక్షల విలువ కలిగిన బంగారు గొలుసు పోవడంతో ఎస్సీ ఈ కేసును ఛేదించాలని పోలీసులను ఆదేశించారు. దాంతో ట్రాఫిక్ ఎస్సై అడపా గరగారావు అవుట్ పోస్టు పోలీసు స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాను పరిశీలించారు. ఒక బిచ్చగాడు రోడ్డుపై పడిపోయిన పర్సు తీసుకొని జేబులో పెట్టుకోవడాన్ని గుర్తించారు. వెంటనే ట్రాఫిక్ పోలీసులు బిచ్చగాని కోసం గాలింపు చేసి గుర్తించి అతని వద్ద నుంచి పర్సును సోమవారం స్వాధీనం చేసుకున్నారు. పర్సులో బంగారు గొలుసు ఉండటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బాధితులకు సమాచారం ఇచ్చారు. పెద్దాపురం డీఎస్పీ కార్యాలయంలో డీఎస్సీ శ్రీహరిరాజు, సీఐ ఎ.కృష్ణభగవాన్, ట్రాఫిక్ ఎస్సై అడపా గరగారావు బంగారు గొలుసు అందజేశారు. -
కౌలుకోలేని దెబ్బ
● 24 గంటలన్నారు.. 45 రోజులైనా రాని ధాన్యం సొమ్ము ● ఖరీఫ్ పెట్టుబడికి డబ్బుల్లేక కౌలు రైతుల ఆందోళన ● పీజీఆర్ఎస్లో ఫిర్యాదు తీసుకోవడానికి అధికారుల నిరాకరణ ● కన్నీటి పర్యంతమైన అన్నదాతలుపిఠాపురం: ఖరీఫ్ సాగు మొదలైపోయింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో రైతులు పొలం బాట పడుతున్నారు. కానీ, చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. అప్పు పుట్టడం లేదు. కౌలు చెల్లిస్తేనే భూమిలో అడుగు పెట్టాలని యజమానులైన రైతులు కరాఖండిగా చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో.. ముందస్తు సాగు చేయాలని, ప్రకృతి వైపరీత్యాల నుంచి పంటలు కాపాడుకోవాలని ఊదరగొడుతున్న ప్రభుత్వం.. తమకివ్వాల్సిన ధాన్యం సొమ్ము గురించి మాత్రం నోరు మెదపడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రబీ ధాన్యం విక్రయించిన రైతులకు జిల్లా వ్యాప్తంగా రూ.60 కోట్లు, పిఠాపురం నియోజకవర్గంలో సుమారు 250 మంది రైతులకు రూ.10 కోట్లకు పైగా ప్రభుత్వం బకాయి పెట్టింది. ఈ డబ్బులు ఇవ్వకపోతే ఖరీఫ్ సాగుకు పెట్టుబడి ఎక్కడి నుంచి తీసుకురావాలని ప్రశ్నిస్తున్నారు. గత రబీలో పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరించింది. ఇది జరిగి 45 రోజులైంది. అప్పుడే ఖరీఫ్ కూడా వచ్చేసింది. అయినప్పటికీ ప్రభుత్వం ధాన్యం సొమ్ము ఇవ్వడం లేదు. ఈ డబ్బులు వెంటనే ఇవ్వాలని కోరుతూ నియోజకవర్గానికి చెందిన పలువురు రైతులు పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పాడా) కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీనిపై అర్జీ ఇచ్చేందుకు వారు ప్రయత్నించగా కాగితం రూపంలో వద్దని, మామూలుగా చెప్పాలని అంటూ రైతుల నుంచి ఫిర్యాదు తీసుకునేందుకు అధికారులు నిరాకరించారు. దీంతో, రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. పండించిన ప్రతి ధాన్యం గింజా కొంటామని, 24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని గొప్పలు చెప్పిన అధికారులు.. ఇప్పుడు అర్జీ తీసుకోవడానికి సైతం నిరాకరిస్తున్నారని, ఇక తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇవ్వాల్సిన ధాన్యం సొమ్ము ఇవ్వకపోగా తిరిగి అప్పులు చేయాల్సిన దుస్థితిలోకి ప్రభుత్వం నెట్టేసిందని వాపోయారు. మరోవైపు అప్పులు కూడా పుట్టడం లేదని చెబుతున్నారు. ప్రభుత్వాన్ని నమ్మి కోలుకోలేని విధంగా దెబ్బ తిన్నామని కన్నీరు పెట్టుకుంటున్నారు. మరో మూడు వారాలంటున్నారు ఖరీఫ్ సీజన్ వచ్చేసింది. ధాన్యం సొమ్ము రావడానికి ఇంకా మూడు వారాలు పడుతుందంటున్నారు. ముందు కౌలు ఇస్తే తప్ప భూమిలోకి రావద్దని యజమాని అంటున్నాడు. అప్పు చేసి ఇద్దామంటే అప్పులు ఇచ్చే వారు కూడా లేరు. రబీలోనే ఆస్తులు తాకట్టు పెట్టి, అప్పులు తెచ్చి సాగు చేశాం. ధాన్యం సొమ్ము వస్తుందని, పెట్టుబడికి ఇబ్బంది ఉండదని అనుకున్నాం. కానీ అటు సొమ్ము రాక.. ఇటు పంట వేసే దారి లేక ఆస్తులు తాకట్టులో ఉండిపోయి వడ్డీలు పెరిగిపోతున్నాయి. వచ్చే సొమ్ము వడ్డీలకే సరిపోని పరిస్థితి ఏర్పడింది. ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటే ధర తక్కువైనా వెంటనే సొమ్ము ఇచ్చేసేవారు. అలా అమ్మనీయకుండా అధికారులు వచ్చి మమ్మల్ని నమ్మించి, ఇప్పుడు నట్టేట ముంచారు. – విజయకుమార్, కౌలు రైతు, గొల్లప్రోలు మండలం ఇంత దారుణం ఎప్పుడూ చూడలేదు రైతును ఇంత దారుణంగా ఇబ్బంది పెట్టడం ఎప్పుడూ చూడలేదు. ‘గంటల్లో మీ డబ్బు మీ ఇంటికి వస్తుంది’ అని గొప్పగా చెప్పారు. ప్రైవేటు వ్యాపారికి అమ్మితే చర్యలు తీసుకుంటామని భయపెట్టారు. ప్రభుత్వానికి అమ్మితే మాకు రక్షణగా ఉంటుందని నమ్మాం. తీరా ధాన్యం అమ్మి 45 రోజులైనా ఇదిగో అదుగో అంటున్నారు తప్ప డబ్బులు వేయడం లేదు. అప్పుడు మా దగ్గరకు వచ్చి ధాన్యం అమ్మాలని చెప్పిన ఏ అధికారీ ఇప్పుడు సమాధానం చెప్పడం లేదు. ఎవరిని అడగాలో తెలియడం లేదు. కనిపించిన ప్రతి ఆఫీసుకు, అధికారి వద్దకు తిరుగుతున్నాం. ఇప్పుడు సాగు పెట్టుబడికి డబ్బుల్లేవు. ఇక తాకట్టు పెట్టడానికి మా దగ్గర ఆస్తులూ లేవు. అప్పులు ఇచ్చేవారూ లేరు. అన్నం పెట్టే రైతును ఏడిపించడం ప్రభుత్వానికి తగదు. – నాగేశ్వరరావు, కౌలు రైతు, గొల్లప్రోలు మండలం నట్టేట ముంచారు రైతులను నమ్మించి ప్రభుత్వం నట్టేట ముంచింది. రైతు సంక్షేమమే ధ్యేయమని చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు సమాధానం చెప్పాలి. 24 గంటల్లో డబ్బులు వేస్తామంటూ తెగ గొప్పలు చెప్పిన నేతలు, అధికారులు ఇప్పుడు మాట్లాడటం లేదు. ఆరుగాలం కష్టపడి ఎండనక వాననక ఒళ్లు గుల్ల చేసుకుని అప్పు చేసి మరీ పెట్టుబడులు పెట్టి పండించిన పంటకు డబ్బులు ఇవ్వకపోతే రైతు ఎలా మళ్లీ పంట పండిస్తాడు? ఉన్న అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయని రైతులు వాపోతూంటే ఇంకా వాయిదాలు వేయడమేమిటి? ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల వల్లే ఇలా జరుగుతోంది. రైతులకు వెంటనే ధాన్యం సొమ్ము చెల్లించాలి. లేకపోతే రైతుల తరఫున వైఎస్సార్ సీపీ ఉద్యమిస్తుంది. రైతులకు ఏమాత్రం అన్యాయం జరిగినా ఊరుకునేది లేదు. – వంగా గీతా విశ్వనాథ్, మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, పిఠాపురం -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 18,000 – 18,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 27,500 గటగట (వెయ్యి) 25,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 24,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 17,000 – 17,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 18,000 – 18,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
వంచనపై సమరభేరి
సర్కార్కు కనువిప్పు కలగాలి యువత పోరుతో కూటమి సర్కార్కు కనువిప్పు కలగాలి. విద్యా సంవత్సరం ముగిసిపోయినా ఇప్పటికీ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా ప్రభుత్వం దగా చేస్తోంది. దీంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులు మానసిక ఆందోళనకు గురవుతున్నారు. దీనంతటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. మంత్రి లోకేష్ తాము ఇచ్చిన 31 హామీలు 31 కెమెరాల్లో ఫీడ్ చేసుకోమని నాడు ఎన్నికల సందర్భంగా చెప్పారు. ఇప్పుడేమో రెడ్బుక్ పట్టుకుని తిరుగుతున్నారే తప్ప హామీలు, సంక్షేమ పథకాలను పట్టించుకోవడం లేదు. ఫీజుల ఇబ్బందుల నుంచి విద్యార్థులను బయటపడేసేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. – రాగిరెడ్డి అరుణ్ కుమార్ (బన్నీ), వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు, కాకినాడ హామీలు అమలు చేయాలి హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తున్న కూటమి సర్కారుపై యువత తిరగబడింది. ఇది తొలి అడుగుగా గుర్తెరిగి విద్యార్థులు, యువతకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి. కూటమి ప్రభుత్వం కళ్లు తెరిపించేలా యువత పోరుకు విద్యార్థులు, యువత తరలివచ్చారు. ప్రభుత్వంపై ఏడాది కాలంగా నెలకొన్న వ్యతిరేకతకు ఇది అద్దం పడుతోంది. ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా, వసతి దీవెనలను అటకెక్కించిన సర్కారు.. విద్యార్థులను రోడ్డు పాలు చేసింది. – పూసల అనిల్ కుమార్, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు, కాకినాడ ● కదం తొక్కిన విద్యార్థులు, యువత ● కాకినాడలో భారీ ర్యాలీ ● కూటమి సర్కారు మోసంపై ఆగ్రహం ● ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి తక్షణం ఇవ్వాలని డిమాండ్ ● దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు ● కలెక్టర్కు వినతి సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘ఉద్యోగాలిస్తాం.. ఇవ్వలేకుంటే నెలనెలా రూ.3,000 నిరుద్యోగ భృతి ఇస్తాం. విద్యా సంవత్సరం ముగియకుండానే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేస్తాం’ అంటూ ఎన్నికల సమయంలో కూటమి నేతలు చంద్రబాబు అండ్ కో నమ్మించారు. తీరా గద్దెనెక్కిన తర్వాత తమను నిలువునా వంచించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థులు, యువత సోమవారం పెద్ద ఎత్తున కదం తొక్కారు. కూటమి నేతల మాయమాటలతో దగా పడిన విద్యార్థులు, యువత జిల్లా నలుమూలల నుంచీ తరలివచ్చి, కూటమి సర్కారు తీరును నిరసిస్తూ ప్లకార్డులు చేతబట్టి కాకినాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ఈ హామీలు ఏడాది కాలంగా అమలు చేయని చంద్రబాబు ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన ‘యువత పోరు’ పిలుపే ప్రభంజనమైనట్లు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచీ వేలాదిగా తరలివచ్చారు. యువ‘జన ప్రవాహం’ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు, యువత కాకినాడ బాలా త్రిపుర సుందరి ఆలయం సమీపాన ఉన్న వైఎస్సార్ సీపీ సిటీ కార్యాలయానికి తరలివచ్చారు. అక్కడి నుంచి పార్టీ నేతలు వెంట రాగా దిక్కులు పిక్కటిల్లేలా పెద్ద పెట్టున నినాదాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. పిండాల చెరువు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయం, మెక్లారిన్ కాలేజీ, పీఆర్ కాలేజీ, జిల్లా పరిషత్ జంక్షన్, సివిల్ సప్లైస్ పెట్రోల్ బంకు, ఆర్డీఓ కార్యాలయం మీదుగా కలెక్టరేట్ వరకూ ఈ ప్రదర్శన సాగింది. పెద్ద సంఖ్యలో విద్యార్థినులు ప్లకార్డులు చేతబట్టి ర్యాలీ ముందు భాగంలో నిలిచారు. పోలీసులు ఆంక్షలు పెట్టినప్పటికీ పార్టీ నేతలు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చి, కూటమి సర్కారు మోసాలను ఎండగడుతూ ప్రదర్శనలో పాల్గొన్నారు. పార్టీ సిటీ కార్యాలయం వద్ద బయలుదేరిన దగ్గర నుంచి జెడ్పీ సెంటర్ వరకూ ఆ మార్గమంతా కిక్కిరిసిపోయింది. ర్యాలీ జరిగిన రోడ్డు యువ జాతరను తలపించింది. ‘చంద్రబాబూ.. ఎన్నికల్లో ఇచ్చిన మాట ఏమైంది సిగ్గు సిగ్గు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా మోసం చేస్తారా సిగ్గు సిగ్గు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ సిగ్గు సిగ్గు, నాడు మామకు వెన్నుపోటు – నేడు యువతకు వెన్నుపోటు’ అంటూ ప్లకార్డులు, నినాదాలతో హోరెత్తించారు. ర్యాలీగా తరలివచ్చిన విద్యార్థులు, యువత, పార్టీ నేతలు కలెక్టరేట్కు చేరుకున్నారు. ప్రధాన గేటు ద్వారా కలెక్టరేట్ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పది మంది ముఖ్య నేతలను మాత్రమే అనుమతించడంతో, వారు వెళ్లి జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలికి వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. యువతపోరు విజయవంతం కావడం వైఎస్సార్ సీపీ నేతలు, శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, మాజీ ఎంపీ, పిఠాపురం కో ఆర్డినేటర్ వంగా గీత, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, నాగులాపల్లి ధనలక్ష్మి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, పెద్దాపురం కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు, పార్టీ యువజన, విద్యార్థి, మహిళా విభాగాల జిల్లా అధ్యక్షులు రాగిరెడ్డి అరుణ్ కుమార్ (బన్నీ), పూసల అనిల్కుమార్, వర్ధినీడి సుజాత, రాష్ట్ర మహిళా కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీప్తి కుమార్, సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, కాకినాడ సిటీ యూత్, విద్యార్థి విభాగాల అధ్యక్షులు రోకళ్ల సత్యనారాయణ, జలగడుగుల పృథ్వి, సిటీ మహిళా అధ్యక్షురాలు పసుపులేటి వెంకటలక్ష్మి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ జమ్మలమడక నాగమణి, పార్టీ ముఖ్య నేతలు సుంకర విద్యాసాగర్, వాసిరెడ్డి జమీలు, అల్లి రాజబాబు, నాగం గంగబాబు, లాలం బాబ్జీ, రావూరి వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యుడు ఉలవకాయల లోవరాజు, బెజవాడ సత్యనారాయణ, బెండా విష్ణు, కొప్పన శివ, గండ్రేడు రాము, గండేపల్లి బాబీ, మాదిరెడ్డి దొరబాబు, దాసం వెంకటేష్, కారే శ్రీనివాస్, ఆనాల సుదర్శన్, పార్టీ యువజన విభాగం రాష్ట్ర, జిల్లా నాయకులు తోట శ్రీరాంజీ, బదిరెడ్డి గోవిందు, సకురు గుర్రాజు, ఎంజీకే కిశోర్, కరణం భాను, వీరంరెడ్డి నాని, మాదేపల్లి రాజబాబు, మాదారపు నాని, సీడీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు దగా విద్యార్థులకు కూటమి సర్కార్ వేల కోట్ల రూపాయలు బకాయి పడింది. విద్యా సంవత్సరం ముగియకుండానే ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా విద్యార్థులను రోడ్డున పడేసింది. సమాధానం చెప్పకుండా తప్పించుకుంటోంది. వారానికో ఈవెంట్ చేస్తూ ఈవెంట్ మేనేజ్మెంట్ చేసే ప్రభుత్వంలా మారింది. ప్రజల్లోకి జగన్మోహన్రెడ్డి గళం వెళ్లకుండా ఉండేందుకు కుట్రలు చేస్తోంది. ప్రజలకు జగన్ నుంచి సహకారం అందకుండా చేయాలనుకుంటోంది. ఒక వ్యూహం ప్రకారం ప్రతిపక్షమనేది లేకుండా చేయాలని చంద్రబాబు అండ్ కో కుయుక్తులు పన్నుతున్నారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి 80 ఏళ్ల వయసులో కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్రెడ్డి తలకాయ నరికేస్తానంటూ ఒక ఎమ్మెల్యేగా ఆయన ఎలా మాట్లాడతారు? హామీలు అమలు చేయాలని, రాష్ట్ర సమస్యల పైన మీడియా సమావేశంలో ప్రభుత్వాన్ని జగన్ నిలదీశారు. మీడియా నుంచి వచ్చిన రప్పా రప్పా అనే ప్రశ్నకు ఆయన సమాధానం మాత్రమే చెప్పారు. ఒక టీడీపీ కార్యకర్త మోసపోయామనే బాధతో రప్పా రప్పా అని ఫ్లెక్సీ పెట్టుకున్న విషయాన్ని ప్రస్తావించారు. అది సినిమా డైలాగ్ తప్ప మరొకటి కాదని చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వం ఈ డైలాగ్ను టాపిక్ డైవర్షన్ కోసం వాడుకుంటోంది. నిరుద్యోగ భృతి రప్పా, ఫీజు రీయింబర్స్మెంట్ రప్పా రప్పా, హామీలన్నీ రప్పా రప్పా కాదా? – దాడిశెట్టి రాజా, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు -
నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి
● విస్తరణ శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ ప్రసాద్ ● తూర్పు గోదావరి జిల్లాలోని మహిళా సర్పంచ్లకు శిక్షణ ప్రారంభం సామర్లకోట: మహిళా ప్రజా ప్రతినిధులు నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని విస్తరణ శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ కేఎస్వీ ప్రసాదరావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని మహిళా సర్పంచ్లకు మూడు రోజుల శిక్షణను సోమవారం ఆయన ఈటీసీలో ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మహిళా సర్పంచ్లు స్వతంత్రంగా పని చేయాలని సూచించారు. రాజకీయంగా ఎదగడానికి సర్పంచ్ పదవి ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ప్రజల సమస్యలను దగ్గర ఉండి తెలుసుకొనే అవకాశం సర్పంచ్లకే ఉంటుందన్నారు. మహిళలు అన్ని రంగాలలోను పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారని, అయితే సర్పంచ్లు వెనుబడుతున్నారన్నారు. మహిళా సర్పంచ్లు స్వయం నిర్ణయాధికారంతో పాలన సాగించాలన్నారు. ఉత్తమ సేవలు అందిస్తే గ్రామంలోని ప్రతీ మహిళ ఆమెను ఆదర్శంగా తీసుకొని అభివృద్ధి చెందడానికి వీలు కలుగుతుందన్నారు. కోర్సు డైరెక్టరు కె. సుశీల శిక్షణ కేంద్రం ఆవరణలో మహిళా సర్పంచ్లను గ్రూపులుగా ఏర్పాటు చేసి వివిధ అంశాలపై చర్చలు జరిపే ఏర్పాట్లు చేశారు. వైస్ ప్రిన్సిపాల్ జి.రమణ, ఫ్యాకల్టీలు ఎస్ఎస్ శర్మ, ఎం చక్రపాణిరావు, ఎ.రవిశంకర్ శిక్షణ నిర్వహించారు. -
మహిళా ప్రజా ప్రతినిధులకు శిక్షణ ప్రారంభం
కాకినాడ సిటీ: రాష్ట్రంలో స్థానిక సంస్థల మహిళా ప్రజా ప్రతినిధులలో నాయకత్వ లక్షణాలు పెంపొందించేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణాభివృది పంచాయతీరాజ్ శిక్షణ సంస్థ ఏపీఎస్ఐఆర్డిపీఆర్ ఆధ్వర్యంలో జిల్లా ప్రజాపరిషత్ కాకినాడలో ఏర్పాటు చేసి శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వేణుగోపాలరావు మాట్లాడుతూ లింగ సమానత్వమే లక్ష్యంగా అనేక విధానాలు అమలులో ఉన్నప్పటికీ, మహిళలు రాజకీయాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో తక్కువ ప్రాతినిధ్యం పొందుతున్నారన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జెడ్పీ ముఖ్య కార్యనిర్వహణాధికారి వీవీఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ మహిళా సాధికారతతో స్వపరిపాలన సాధ్యం పేరిట ఈ శిక్షణ నిర్వహిస్తున్నామన్నారు. నిధులు, విధులు, భావ వ్యక్తీకీకరణ నైపుణ్యం, ప్రజాస్వామ్య విధుల సులభతరం వంటి అంశాలపై ఈ మూడు రోజుల శిక్షణ కార్యక్రమాలు రూపొందించినట్లు తెలిపారు. -
కోకో సాగు విస్తీర్ణం గుర్తింపునకు ఈ–క్రాప్
దేవరపల్లి: ఈ–క్రాప్ బుకింగ్ ద్వారా జిల్లాలో కోకో సాగు విస్తీర్ణాన్ని గుర్తిస్తామని కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. నల్లజర్ల మండలం చోడవరంలో సోమవారం కోకో తోటలను ఆమె పరిశీలించి, రైతులతో మాట్లాడారు. కోకో రైతులు ఈ–క్రాప్ బుకింగ్ చేయకపోవడం వల్ల వివరాలు తెలుసుకోవడంలో జాప్యం జరుగుతోందని చెప్పారు. ఈ–క్రాప్ బుకింగ్ సమయంలో ఏ రైతు ఏ పంట సాగు చేస్తున్నారనే వివరాలను తప్పకుండా నమోదు చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులుండవని ఉద్యానవన శాఖ అధికారులకు సూచించారు. నల్లజర్ల మండలంలో 457 ఎకరాల్లో అంతర పంటగా కోకో సాగు చేస్తున్నట్లు కలెక్టర్కు అధికారులు వివరించారు. కోకో రైతుల నుంచి ప్రతి గింజా కొనుగోలు చేసేందుకు మద్దతు ఇస్తామని కలెక్టర్ తెలిపారు. కోకో రైతుల నుంచి కంపెనీలు కిలో రూ.500 చొప్పున కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పారు. రైతు కొత్తపల్లి చంద్రశేఖర్ మాట్లాడుతూ, కిలో కోకో గింజలకు రూ.500 ధర ప్రకటించడం రైతులకు, కంపెనీలకు ఆమోదయోగ్యంగా ఉందని అన్నారు. -
ఆసనాలకు ప్రపంచ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం
అమలాపురం రూరల్: కలెక్టర్ ఆర్.మహేష్కుమార్, జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి నేతృత్వంలో జిల్లా యంత్రాంగం ఈ నెల మూడో తేదీన అంతర్వేది సముద్ర తీరంలో నిర్వహించిన వృక్షాసనం, భారీ మానవహారం ఆసనాలు ప్రపంచ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సాధించాయి. వికసిత్ భారత్లో భాగంగా నిర్వహించిన యోగ ఆంధ్ర మాసోత్సవాల ద్వారా అంతర్వేదిలో నిర్వహించిన వృక్షాసన భారీ మానవహారం ప్రపంచ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించడంపై డీఆర్వో రాజకుమారి, డ్వామా పీడీ ఎస్.మధుసూదన్, జిల్లా పౌరసరఫరాల అధికారి అడపా ఉదయ భాస్కర్ డీఎల్డీవో రాజేశ్వరరావు, ఎస్డీసీ పి.కృష్ణమూర్తి, జిల్లా రవాణా అధికారి డి.శ్రీనివాసరావు, జిల్లా స్థాయి అధికారుల బృందం కలెక్టర్, జాయింట్ కలెక్టర్లను అభినందించారు. ప్రపంచ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సాధించిన అంతర్వేది వృక్షాసన భారీ మానవహారం ఆసనాలు -
వేటగాళ్ల అరెస్టు
తుపాకీ స్వాధీనం గండేపల్లి: వన్య ప్రాణులను వేటాడే వ్యక్తులను అరెస్టు చేసినట్టు సీఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని కె గోపాలపురం శివారులో వన్య ప్రాణులను వేటాడేందుకు వచ్చిన వ్యక్తులను ఎస్ఐ శివ నాగబాబు, సిబ్బందితో కలిసి గండేపల్లికి చెందిన జి నాగార్జున, ఎం రాంబాబు, జి సత్తిబాబును అరెస్ట్ చేయగా రాజమహేంద్రవరానికి చెందిన మరో వ్యక్తి పరారీలో ఉన్నట్టు తెలిపారు. వీరి వద్ద నుంచి సింగిల్ బ్యారల్ నాటు తుపాకీ, 12 మీడియం ఐరన్ బాల్స్, 65 స్మాల్ ఐరన్ బాల్స్, 3 సెల్ ఫోన్స్, 2 మోటార్ సైకిళ్లు, 2 ఎడ్ టార్చ్ లైట్లు, తుపాకీ ఫైర్ చేయడానికి ఉపయోగించే రెండు రకాల పౌడర్లు స్వాధీనం చేసుకుని కోర్టుకు తరలించగా రిమాండ్ విధించినట్టు తెలియజేశారు. -
ఉపాధ్యాయుల సర్దుపాట్లు
ఫ కౌన్సెలింగ్ కేంద్రం వద్ద ధర్నా ఫ దూర ప్రాంతాలకు వెళ్లేది లేదని నిరసన రాయవరం: ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయ బదిలీల అనంతరం పలు పాఠశాలల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. ఆ ఖాళీలను మినిమమ్ టైమ్ స్కేల్ టీచర్ల (ఎంటీఎస్)తో సర్దుబాటు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఆదివారం కాకినాడలోని డీఈఓ కార్యాలయం వద్ద ఉమ్మడి జిల్లా కేంద్రంగా ఈ కౌన్సిలింగ్ నిర్వహించింది. అయితే తమకు బదిలీల్లో అన్యాయం జరిగిందంటూ ఎంటీఎస్ ఉపాధ్యాయులు ధర్నా చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 410 మంది ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఉన్నారు. ఇందులో 2008 డీఎస్సీ బ్యాచ్ 199 మంది, 1998 డీఎస్సీ బ్యాచ్ 211 మంది ఉన్నారు. వీరంతా మినిమమ్ టైమ్ స్కేల్ విధానంలో జిల్లాలోని వివిధ పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే.. కాకినాడలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఆదివారం జరిగిన బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియను 1998, 2008 ఎంటీఎస్ ఉపాధ్యాయులు వ్యతిరేకించారు. అక్కడ ధర్నాకు దిగారు. ఇటీవల జరిగిన రెగ్యులర్ ఉపాధ్యాయుల బదిలీల అనంతరం సుదూర ప్రాంతాల్లోనే ఖాళీలు ఏర్పడ్డాయి. ఇప్పుడు నిర్వహిస్తున్న కౌన్సెలింగ్లో ఎంటీఎస్ ఉపాధ్యాయులంతా ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాంతాలకు దూరంగా 100 నుంచి 200 కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీనిని వారు వ్యతిరేకిస్తున్నారు. అసలే అరకొర జీతాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్న తాము దూర ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు ఎలా చేస్తామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో 70 శాతం మంది ఉపాధ్యాయులు రెండు మూడేళ్లలో ఉద్యోగ విరమణ చేయనున్నారు. వారి డిమాండ్లు ఇవీ.. కేవలం రూ.32 వేలతో పనిచేస్తున్న ఎంటీఎస్ ఉపాధ్యాయులను ప్రస్తుతం పనిచేస్తున్న మండలాల్లోనే సర్దుబాటు చేయాలి. ప్రతి మండలంలో ఉన్న మోడల్ స్కూల్స్లో ఒక ఎంటీఎస్ టీచర్ను నియమించాలి. ప్రస్తుతం ప్రభుత్వం చూపిస్తున్న ఖాళీలు నివాసాలకు 200 కి.మీ దూరంలో ఉన్నందున ప్రభుత్వం ఇచ్చే జీతం ప్రయాణ ఖర్చులకే సరిపోతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రస్తుత ఖాళీల్లో సర్దుబాటు చేయాల్సి వస్తే హెచ్ఆర్ఏ, డీఏ ఇచ్చి రెగ్యులరైజ్ చేయాలి. జిల్లా వ్యాప్తంగా ప్రతి క్లస్టర్లో క్లస్టర్ వేకెన్సీలు క్రియేట్ చేసి, ఎంటీఎస్ ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలి. దివ్యాంగులుగా ఉన్న ఎంటీఎస్ ఉపాధ్యాయులకు వారు కోరుకున్న మండలంలో పని చేసేందుకు అవకాశం కల్పించాలి. మున్సిపల్ పాఠశాలల్లో వేకెన్సీలను కూడా చూపించాలి. 15 నుంచి 20 మంది విద్యార్థులున్న ప్రతి పాఠశాలలో ఒక ఎంటీఎస్ ఉపాధ్యాయుడిని నియమించాలి. గతంలో విశాఖపట్నంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ ప్రకారం నియర్ బై రెసిడెన్స్ అవకాశం కల్పించాలి. ● ఎంటీఎస్ ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ ఉదయం 9 నుంచి జరగాల్సి ఉండగా, వీరి ఆందోళన, చర్చల నేపథ్యంలో రాత్రి 8.30 గంటలకు మొదలైంది. ఉన్నతాధికారులు సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇవ్వడంతో వారు కౌన్సెలింగ్కు హాజరయ్యారు.