breaking news
Kakinada District Latest News
-
మా బాధలు విన్నారు..
మేము సాగునీటి కోసం అందరినీ అడిగాం. ఎవరూ పట్టించుకోలేదు. నీరు రాక నారుమళ్లు ఎండిపోయే పరిస్థితి ఎదురైంది. కనీసం మోటార్లతో తోడి నారుమళ్లకు నీరు పెడదామన్నా, కాలువలు ఎండిపోయాయి. మా బాధలను వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి వంగా గీతకు చెప్పుకొన్నాం. ఆమె వెంటనే స్పందించారు. మా బాధలు విని మాతో కలసి ఆందోళన చేశారు. అధికారులకు సమస్యను వివరించారు. సమస్య తీర్చకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. దీంతో దిగొచ్చిన అధికారులు సాగునీరు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఇదంతా గీత చేసిన పోరాట ఫలితమే. –తటవర్తి సీతారామయ్య, రైతు, మల్లవరం, గొల్లప్రోలు మండలం పంట చేతికందే వరకూ పోరాటం ఖరీఫ్కు పూర్తిగా సాగునీరందే వరకూ రైతుల పక్షాన పోరాటం చేస్తాం. అధికారులు ప్రకటించినట్లు రోజూ వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలి. పంట చేతికందే వరకు సాగునీటి ఎద్దడి రాకుండా చూడాలి. రైతుల తరఫున తాము చేసిన పోరాటంపై పవన్ కళ్యాణ్ స్పందించారు. అయితే ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షించి రైతులకు అన్యాయం జరగకుండా చూడాలి. కొందరు ఇప్పటికే పూర్తి స్థాయిలో నీరు వస్తోందని, తామే రాజకీయం చేస్తున్నామంటూ ఆరోపణలు చేస్తున్నారు. నిజంగా పూర్తి స్థాయిలో నీరు వస్తే నారుమళ్లు ఎందుకు ఎండిపోయాయి. కాలువలు ఎందుకు అడుగంటాయనేది ఆ నేతలే చెప్పాలి. –గీత వంగా, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్, పిఠాపురం ● -
కూటమి దందా సాగుతోంది
సామర్లకోట: అచ్చంపేట జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న ప్రైవేట్ భూములను కూటమి నాయకులు కౌలుకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ భూముల్లో వరి నాట్లకు సంబంధించి ఊడ్పులు జరగడంతో ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 20 ఏళ్ల క్రితం ఈ గ్రామంలో జనచైతన్య పేరుతో 32 మంది రైతుల నుంచి 20 ఎకరాల 88 సెంట్ల భూమిని సేకరించారు. ఆ భూములను లేఅవుట్ చేసి ప్లాట్లు విక్రయించారు. అయితే ఆ లేఅవుట్కు మౌలిక సదుపాయాలు లేక ఇళ్ల నిర్మాణాలు చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. కత్తిపూడి నుంచి అచ్చంపేట మీదుగా 216 జాతీయ రహదారి నిర్మాణంతో ఈ రోడ్డుకు ఇరువైపులా ఉన్న జనచైతన్య భూముల విలువ పెరిగింది. అయితే ఆ భూముల్లో ఇళ్లు నిర్మించుకోవడానికి రోడ్డుతో సమానంగా ఉండాలంటే, సుమారు 10 అడుగుల వరకు ప్లాట్లను ఎత్తు చేయాల్సి ఉంది. దాంతో ఆ భూములు ఖాళీగా ఉండటంతో అచ్చంపేటకు చెందిన కూటమి నాయకుల కన్ను పడింది. ఆ భూములను సాగు చేసుకోవడానికి కౌలుకు ఇచ్చి కొందరు సొమ్ము చేసుకొంటున్నారు. లేఅవుట్కు సంబంధించి మక్కు రాళ్లు మాత్రం గట్లపై దర్శనం ఇస్తున్నాయి. ఒకసారి లేఅవుట్లో గుర్తించిన భూములు తిరిగి ఏవిధంగా సాగులోకి తీసుకు వస్తారనే ప్రశ్నలు వస్తున్నాయి. దీనిపై విచారణ చేసి ప్లాట్లు కొనుగోలు చేసుకున్న వారికి న్యాయం చేయాలని అచ్చంపేట గ్రామ ప్రజలు కోరుతున్నారు. దీనిపై తహసీల్దార్ కొవ్వూరి చంద్రశేఖరరెడ్డిని వివరణ కోరగా, ప్లాట్లు కొనుగోలు చేసుకున్న వారు ఫిర్యాదు చేస్తే దానిపై స్పందిస్తామని చెప్పారు. -
అవినీతికి అడ్డాగా చినరాజప్ప పాలన
వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ దొరబాబు విమర్శ సామర్లకోట: పెద్దాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, అతని కుమారుడు రంగనాగ్ల అవినీతి రోజురోజుకూ పెరిగిపోతుందని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు అన్నారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముద్రగడ పద్మనాభం ఉద్యమం కారణంగానే మొదటిసారిగా పెద్దాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నిమ్మకాయల చినరాజప్పకు కాపు కోటాలో గతంలో హోం మంత్రి, డిప్యూటీ సీఎం పదవులు లభించాయని తెలిపారు. అటువంటి ముద్రగడపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ముద్రగడ తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి జీవించారని గుర్తుచేశారు. అటువంటి వ్యక్తి మృతి చెందితే పార్టీ రహితంగా నివాళి అర్పించాల్సి ఉండగా, సంతాప సభకు హాజరైన వారిని దూషించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. వచ్చే నెల 1న పార్టీలకు అతీతంగా కిర్లంపూడిలో ముద్రగడ సంతాప సభ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఉమ్మడి జిల్లాలో అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు జిందాల్ ఫ్యాక్టరీని తిరస్కరిస్తే ఎమ్మెల్యే చినరాజప్ప మాత్రం ముడుపులు తీసుకుని, రామేశంపేటలో గత వైఎస్సార్ సీపీ పాలనలో పేదలకు ఇచ్చిన స్థలాల్లో ఫ్యాక్టరీకి అనుమతులు ఇచ్చారని అన్నారు. సమాచార చట్టంలో సమాచారం కొరితే జిందాల్ ఫ్యాక్టరీ వస్తుందని, వృద్ధాశ్రమం వస్తుందని తమకు తెలియదని అధికారులు సమాచారం ఇచ్చారని దొరబాబు తెలిపారు. రైతులు ఎరువులు, నీటి కోసం ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. సామర్లకోట మండలం బ్రహ్మానందపురంలో పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం కలెక్టర్ను కోరిన విధంగా రామేశంపేటలో ఇళ్ల నిర్మాణం చేయగలరా అని ప్రశ్నించారు. చినరాజప్ప డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో కొండలను గుల్లచేసి రూ.కోట్లు సంపాదించారన్నారు. అదే అవినీతి నేటికీ కొనసాగుతుందని ధ్వజమెత్తారు. పెద్దాపురం మండలం దివిలి గ్రామంలోని జిల్లా పరిషత్తు హైస్కూల్ ఎడ్యూకేషన్ సొసైటీకి చెందిన ఎకరం 75 సెంట్ల భూమిని ఆక్రమించి ఎమ్మెల్యే కుమారుడు ప్రైవేట్ లేఅవుట్ చేయడానికి ప్రయత్నించడం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. నియోజకవర్గంలో 14 వేల మంది ఇళ్ల నిర్మాణ రుణాల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి నెక్కంటి సాయిప్రసాద్, ఆవాల లక్ష్మీనారాయణ, గోపు మురళీ, ఎంపీపీ బొబ్బరాడ సత్తిబాబు, వీరంరెడ్డి నాని, నాగనబోయిన రాజబాబు, వారా సుధాకర్, ఇరుసుమళ్ల సాయి, పట్టణ పార్టీ ఽఅధ్యక్షుడు పాగా సురేష్కుమార్, నేతల హరిబాబు, సేపెని సురేష్, రెడ్నం దొరబాబు తదితరులు పాల్గొన్నారు. -
దిగొచ్చినీరండోయ్!
పిఠాపురం: చివరికి ప్రభుత్వం దిగొచ్చింది.. పుడమి పుత్రుల కన్నీళ్లు తుడిచేందుకు వైఎస్సార్ సీపీ చేపట్టిన పోరాటానికి ఫలితం దక్కింది.. నీరు లేక ఎండుతున్న నారుమళ్లను చూసి, వెంటనే రైతులతో కలసి ఆందోళన బాట పట్టింది. రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని, పంటలకు పూర్తి స్థాయిలో నీరిచ్చే వరకూ పోరాటం ఆగదని హెచ్చరించింది. అవసరమైతే ‘చలో ఏలేరు’ నిరసన కార్యక్రమం చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం కళ్లు తెరిచింది. పంటలకు నీరిచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంతో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ వంగా గీత ఆధ్వర్యంలో చేపట్టిన పోరాటం ఫలించింది. గత నెల రోజుల ముందే పిఠాపురం నియోజకవర్గ పరిధిలో ఏలేరు చివరి ఆయకట్టుకు నీరిస్తామని.. నారుమళ్లు సిద్ధం చేసుకోవాలని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రకటించారు. దీంతో అప్పులు చేసి రైతులు నారుమళ్లు వేసుకున్నారు. ఈ నేపథ్యంలో సాగునీరందక నారుమళ్లు ఎండిపోతుండడంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. చివరికి హామీ ఇచ్చిన అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. వారి నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో రైతులంతా కలసి మాజీ ఎంపీ వంగా గీత వద్దకు వెళ్లి తమ సమస్యను విన్నవించుకున్నారు. వెంటనే స్పందించిన ఆమె ఎండుతున్న నారుమళ్లను పరిశీలించారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు శివారు మల్లవరం రోడ్డులోని కొత్త కాలువను పరిశీలించారు. అడుగంటిన కొత్త కాలువలోకి దిగి రైతులతో కలసి నిరసన తెలిపారు. పొలాలకు నీరు సరఫరా చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని వంగా గీత ఆరోపించారు. ఒకవైపు వ్యవసాయ అధికారులు నెల రోజుల నుంచి నారుమడులు వేయాలని ప్రచారం చేశారని, తీరా నాడుమడులు వేసిన తర్వాత నీరు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతులంటే అంత చులకనా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతులు కన్నెర్ర చేస్తే ప్రభుత్వాలు కూలిపోతాయని గుర్తు చేశారు. కనీసం నారుమడులు తడపడానికి కూడా నీరు లేకపోయిందని వాపోయారు. పశువులు తాగడానికి కూడా నీరు లేక కాలువలు అడుగంటాయన్నారు. రైతులకు నష్టం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని, అవసరమైతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. రైతులతో కలసి చలో ఏలేరు కార్యక్రమాన్ని చేపడతామని అన్నారు. పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ వెంటనే స్పందించాలని, పొలాలకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని కోరారు. దీంతో కదిలిన అధికారులు ఏలేరులో నీటి నిల్వలు సరిపడా లేకపోవడంతో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా ప్రతి రోజూ వెయ్యి క్యూసెక్కుల సాగు నీరందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.వంతుల వారీగా నీరు విడుదల బోట్క్లబ్ (కాకినాడ సిటీ): రైతులకు సాగునీరు సక్రమంగా, సమానంగా అందేలా వంతుల వారీగా ఏలేరు నీరు విడుదల చేస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఏలేరు నుంచి ప్రతి రోజు వెయ్యి క్యూసెక్కుల నీరు విడుదల చేస్తామన్నారు. వంతుల వారీ విధానం క్షేత్రస్థాయిలో కచ్చితంగా అమలయ్యేలా చూసేందుకు, జల వనరుల, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులతో కూడిన ప్రత్యేక గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. ఖరీఫ్కు నీరందించాలని వైఎస్సార్ సీపీ ఆందోళన వంగా గీత సారథ్యంలో పోరాటం చివరికి దిగివచ్చిన ప్రభుత్వం సాగు నీరందించేందుకు నిర్ణయం -
వెదురుతో వెయ్యి లాభాలు
సామర్లకోట: వెదురు సాగుతో వెయ్యి లాభాలు పొందవచ్చనే సత్యాన్ని వెదురు ప్రాజెక్టు నిరూపిస్తుందని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అన్నారు. సామర్లకోట టీటీడీసీలో వెదురు సాగు ఫైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక కావడంతో బుధవారం ఆయన టీటీడీసీలో వెదురు మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెదురు మొక్కల పెంపకం ద్వారా నాలుగేళ్ల నుంచి 40 ఏళ్ల వరకు భారీ ఆదాయం పొందవచ్చని తెలిపారు. ఈ మేరకు లక్ష్యాన్ని సాధిస్తారని మహిళలు వివిధ శిక్షణలు పొందుతున్న ఈ కేంద్రాన్ని ఎంపిక చేశామన్నారు. మహిళల ఆర్థిక స్వలంబనకు పారిశ్రామిక వేత్తలుగా అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. స్థానిక టీటీడీసీలో మహిళల కోసం చేపట్టిన వివిధ పథకాలను ఆయన సమీక్షించారు. డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ జి.శ్రీనివాసు, ఏపీడీ జిలానీ, డీసీఎంలు రాయ్, బాబూరావు, భరత్, ఏపీఎంలు అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు. తల్లి, శిశువుల ఆరోగ్యం కీలకం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): తల్లీ శిశువుల ఆరోగ్యం కోసం గర్భధారణ మధ్య సరైన సమయం పాటించడం అత్యంత కీలకమని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 11 నుంచి 18 వరకు ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా బుధవారం స్థానికంగా లక్కీడీప్ విజేతలకు నగదు, ప్రశంసాపత్రాలను అందించారు. పిల్లల జననం మధ్య సరైన విధానం పాటించడం వల్ల తల్లి, శిశు ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు కుటుంబ సంక్షేమం, పిల్లల పోషణ మెరుగుపడుతుందనే విషయంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కె.అనిత పాల్గొన్నారు. -
ముద్రగడ జీవితం ప్రజాసేవకే అంకితం
రౌతులపూడి: నీతి, నిజాయితీలకు మారుపేరుగా నిలిచిన మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం తన జీవితమంతా ప్రజా సేవకే అంకితం చేశారని మండల వైఎస్సార్ సీపీ శ్రేణులు అన్నారు. ముద్రగడ మృతికి సంతాపంగా రౌతులపూడిలో పార్టీ నేత వాసిరెడ్డి భాస్కరబాబు ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ శ్రేణులు బుధవారం సంస్మరణ సభ నిర్వహించారు. తొలుత ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బడుగు, బలహీన వర్గాల వారికే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని కాపుల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించిన మహోన్నత వ్యక్తి ముద్రగడ అని నేతలు కొనియాడారు. ఆయన మృతి నియోజకవర్గానికే కాకుండా యావత్ రాష్ట్రానికే తీరని లోటన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు గొల్లు చినదివాణం, మండల పార్టీ కన్వీనర్ సీహెచ్వీవీ సత్యనారాయణ, నాయకులు వాసిరెడ్డి బాబ్జీ, కాకి నాని, సర్నం శ్రీను, రాయి ప్రసాద్, సోమరౌతు తిరముల వెంకన్నదొర, గొల్లు వెంకటరమణ, పారేపల్లి శ్రీరామకృష్ణ, అచ్చిర్తి సాంభమూర్తి, కొరుప్రోలు దేవుడు, సైపురెడ్డి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీపాద శ్రీవల్లభా... శిరసా నమామి
పిఠాపురం: దత్తాత్రేయుని అవతారాల్లో ఒకటైన శ్రీపాదుని జన్మ స్థలమైన పిఠాపురంలో గురుపూజోత్సవం కనుల పండువగా జరిగింది. గురు పౌర్ణమి సందర్భంగా బుధవారం పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం వేలాది మంది భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, హోమాలు, అర్చనలు నిర్వహించారు. భక్తులు ఉదయం నుంచి బారులుతీరి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పాదగయ క్షేత్రంలో దత్తాత్రేయ స్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. జగన్ను అనుసరిస్తూ చంద్రబాబు పాలన కాకినాడ రూరల్: ఏపీ రాజధాని అంశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలను అమలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి అన్నారు. గురువారం ఆమె విలేకర్లతో మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ చేసిన ‘మావిగన్’ రాజధాని ప్రతిపాదన అసలు విలువేంటో ఇప్పుడు చంద్రబాబుకు అర్థం అవుతుందన్నారు. ఇన్నాళ్లు అమరావతి అని పట్టుకుని వేలాడిన చంద్రబాబు ఇప్పుడు తాజాగా విజయవాడ, గుంటూరు నగరాలను కలిపి రాజధానిగా అభివృద్ధి చేయాలని అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో స్పష్టం చేశారన్నారు. మచిలీపట్నంలో ఉన్న బందరు పోర్టు ప్రాధాన్యాన్ని గుర్తించి త్వరలోనే ఆ దిశగా చంద్రబాబు ఆలోచనలు మారడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదన్నారు. గత ప్రభుత్వంలో జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలను ఇప్పటికే కాపీ కొట్టారని, అయితే మావిగన్ ప్రతిపాదనను ఎప్పటికై నా కాపీ కొడతారన్న నమ్మకం తనకు ఉందన్నారు. ఇక కూటమి ప్రభుత్వంలో జరిగిన మెగా డీఎస్సీ దగాపై మంత్రి నారా లోకేష్ స్పందించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న లోకేష్కు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయాలన్నారు. ఈవీఎం గోదాంల పరిశీలన బోట్క్లబ్ (కాకినాడ సిటీ): నెలవారీ తనిఖీల్లో భాగంగా కాకినాడ కలెక్టరేట్ దగ్గరలోని ఈవీఎం, వీవీ పాట్స్ గోదాములను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ రెవెన్యూ, పోలీస్, ఎన్నికల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవీఎంల భద్రతకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. జిల్లా రెవెన్యూ అధికారి టి.తిప్పే నాయక్, కాకినాడ అర్బన్ తహసీల్దార్ వి.జితేంద్ర, ఇతర ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. ఎల్ఎన్డీ పేట ప్రాంతంలో పులి సంచారం దేవరపల్లి: గోపాలపురం మండలం కరిచర్లగూడెం, తొక్కిరెడ్డిగూడెం, గుడ్డిగూడెం, కరగపాడు, బుచ్చియపాలెం, నందిగూడెం గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పెద్ద పులి మంగళవారం రాత్రి అధికారులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకుని పారిపోయింది. కరిచర్లగూడెం శివారులోని మెట్టపై రిజర్వుడు ఫారెస్ట్లో పెద్దపులి ఉన్నట్టు అటవీ శాఖ అధికారులు డ్రోన్, ట్రాకర్ ద్వారా గురించారు. దాన్ని పట్టుకునేందుకు శ్రీశైలం టైగర్ టీం, తూర్పుగోదావరి జిల్లా హనుమాన్ టీం, ఉభయ గోదావరి జిల్లాల నుంచి 60 మంది సిబ్బందిని ఐదు బృందాలుగా ఏర్పాటు చేశారు. పులి దాగి ఉన్న కొబ్బరి, కోకో తోటను అధికారులు చుట్టుముట్టారు. మత్తు ఇంజెక్షన్ ఇచ్చే సమయంలో గన్ మిస్ఫైర్ కావడంతో పులి అక్కడ నుంచి తప్పించుకుని, కరగపాడు, తొక్కిరెడ్డిగూడెం గ్రామాల వైపు పారిపోయింది. మార్గం మధ్యలో గేదె దూడపై దాడి చేసి హతమార్చింది. వచ్చిన దారిలోనే పులి తిరిగి పోలవరం మండలం ఎల్ఎన్డీ పేట ప్రాంతంలోని అటవీ ప్రాంతానికి చేరుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. -
శాస్త్రోక్తంగా వరుణ యాగం ప్రారంభం
అన్నవరం: రాష్ట్రంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని అన్నవరంలోని శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో బుధవారం వరుణ యాగం ప్రారంభించారు. ఉదయం తొమ్మిది గంటలకు దేవస్థానంలోని దర్బారు మండపంలో గణపతి పూజ, మండపారాధన, అగ్ని ప్రతిష్టాపన, వరుణ నామ పారాయణ, విరాట్ పర్వ పారాయణ, ఋష్యశృంగ పారాయణలతో వరుణ యాగానికి అంకురార్పణ చేశారు. కొండ దిగువన పంపా నదిలో నడుము వరకు మునిగి పండితులు వరుణ జపాలు నిర్వహించారు. తూర్పు రాజగోపురం ముందు ఋష్య శృంగునికి పూజలు నిర్వహించి పారాయణ చేశారు. శుక్రవారం జరిగే వరుణ యాగం పూర్ణాహుతితో ముగుస్తుందని అధికారులు తెలిపారు. -
గల్లంతైన వారి జాడ లేదు..
చింతూరు: ఘాట్రోడ్లో వ్యూ పాయింట్ వద్ద సోకిలేరు వాగులో గల్లంతైన ఇద్దరి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. మన్యం అందాలు తిలకించేందుకు వచ్చిన పశ్చిమగోదావరి జిల్లా వీరంపాలేనికి చెందిన పెండెం కల్యాణ్, పెండెం బాబి మంగళవారం వ్యూ పాయింట్ వద్ద సోకిలేరు వాగులో గల్లంతైన సంగతి విదితమే. మంగళవారం రాత్రి వరకు వారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో బుధవారం ఉదయం నుంచి తిరిగి వాగులో వెతుకులాట ప్రారంభించారు. చింతూరు సీఐ గోపాలకృష్ణ, మోతుగూడెం ఎస్సై అబ్దుల్ నాసిర్హుస్సేన్ పర్యవేక్షణలో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తాళ్లు, కర్రల సాయంతో సాయంత్రం వరకు వెతికినా గల్లంతైన వారి ఆచూకీ లభ్యం కాలేదు. మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షానికి వాగు ఉధృతి మరింత పెరగడంతో గల్లంతైన వారు దిగువకు కొట్టుకుపోయే అవకాశముందని పలువురు అనుమానిస్తున్నారు. -
బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
ఆత్రేయపురం: కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ఇటీవల మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని ఆత్రేయపురం పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. బొబ్బర్లంక సెంటర్లో ఎస్సై ఎస్.రాము బుధవారం ఉదయం తమ సిబ్బందితో వాహనాల తనిఖీ నిర్వహించారు. తనిఖీ చేస్తున్న విషయం గమనించి నిందితుడు సబ్బు వీరబాబు దొంగిలించిన మోటార్సైకిల్ వేసుకుని పారిపోతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు దేవీపట్నం మండలం ఇందుకూరుపేటకు చెందిన వీరబాబు (27గా గుర్తించారు. అతడిని విచారించి గత కొన్ని రోజులుగా వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద పార్కింగ్ ఏరియాలో దొంగిలించిన రూ.మూడు లక్షలు విలువైన నాలుగు మోటార్ సైకిళ్లను అతడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, కొత్తపేట కోర్టులో ప్రవేశపెట్టగా మెజిస్ట్రేట్ ముద్దాయికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు ఆత్రేయపురం ఎస్ఐ తెలిపారు. -
బైక్ను ఢీకొన్న వాహనం
● యువకుడి దుర్మరణం ● మరొకరికి తీవ్రగాయాలుకురవి: ఓ బొలెరో వాహనం (కోళ్లవ్యాన్) రాంగ్రూట్లో వచ్చి ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా (మహబూబాబాద్ జిల్లా) పరిధి కురవి మండలం బంచరాయి తండా జీపీ పరిధిలోని ప్రాథమిక పాఠశాల సమీపాన బంగారుగూడెం క్రాస్ రోడ్డుపై చోటు చేసుకుంది. ఎస్సై సతీశ్ కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన మల్లిడి సాయినాఽథ్రెడ్డి(18), గంజి శివ కొంతకాలంగా మహబూబాబాద్లోని భవానీనగర్లో ఉంటున్నారు. ఈ క్రమంలో బుధవారం వీరు బైక్పై మహబూబాబాద్ నుంచి బయ్యారం వైపునకు వెళ్తున్నారు. ఇదే సమయంలో బయ్యారం నుంచి మహబూబాబాద్ వెళ్తున్న బొలెరో రాంగ్రూట్లో వచ్చి బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో సాయినాథ్రెడ్డి అక్కడికక్కడే మరణించగా శివకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సాయంతో క్షతగాత్రు డిని వెంటనే అంబులెన్స్లో మహబూబాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి భాస్కర్రెడ్డి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 23,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 24,000 గటగట (వెయ్యి) 21,500 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
అమ్మ పాలుకరింపు మంచిదే..
రాయవరం: తల్లి పాలు అమృతంతో సమానం. పుట్టిన మరుక్షణం నుంచి కనీసం ఆరు నెలలైనా బిడ్డకు తల్లిపాలు పట్టాలి. పిల్లల సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్ తదితర అంతర్జాతీయ సంస్థలతో పాటు, జాతీయ సంస్థలు తల్లిపాల ప్రాధాన్యాన్ని తెలియజెప్పేందుకు ఏటా ఆగస్టు 1 నుంచి 7 వరకు తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నాయి. సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ, వైద్యశాఖలు సంయుక్తంగా ‘బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ ఏ సస్టైనబుల్ స్టార్ట్ ఇన్ లైఫ్’ అనే నినాదంతో తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో పరిస్థితి ఇదీ.. కాకినాడ జిల్లాలో 1,986 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల పరిధిలో 10,121 మంది గర్భిణులు, 7,856 మంది బాలింతలు, 0–6 నెలల్లోపు చిన్నారులు 7,567, ఆరు నెలల నుంచి మూడేళ్ల లోపు చిన్నారులు 46,301, మూడేళ్ల నుంచి ఆరేళ్ల లోపు చిన్నారులు 21,851 మంది ఉన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో.. కోనసీమ జిల్లాలో 1,484 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల పరిధిలో 5,846 మంది గర్భిణులు, 7,725 మంది బాలింతలు, 0–6 నెలల లోపు చిన్నారులు 5,840, ఆరు నెలల నుంచి మూడేళ్ల లోపు చిన్నారులు 32,173, మూడేళ్ల నుంచి ఆరేళ్ల లోపు చిన్నారులు 20,504 మంది ఉన్నారు.తూర్పుగోదావరి జిల్లాలో.. తూర్పుగోదావరి జిల్లాలో 1,798 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల పరిధిలో 9,419 మంది గర్భిణులు, 7,373 మంది బాలింతలు, 0–6 సంవత్సరాల చిన్నారులు 6,704, ఆరు నెలల నుంచి మూడేళ్ల లోపు చిన్నారులు 42,964, మూడేళ్ల నుంచి ఆరేళ్ల లోపు చిన్నారులు 27,182 మంది ఉన్నారు. ఏటా అవగాహన కల్పిస్తున్నాం తల్లిపాల విశిష్టతను తెలియజేసేందుకే తల్లులకు ఏటా అవగాహన కల్పిస్తున్నాం. తల్లిపాల వారోత్సవాల్లోనే కాకుండా సాధారణ రోజుల్లో కూడా తల్లిపాల విశిష్టతను గర్భిణులుగా ఉన్నప్పుడే వివరిస్తున్నాం. తల్లిపాల వారోత్సవాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని అంగన్వాడీ కార్యకర్తలకు ఆదేశాలు ఇస్తున్నాం. – కె.నాగమణి, పీడీ, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా బిడ్డకు ముర్రుపాలే తొలి టీకా పుట్టిన వెంటనే బిడ్డకు పడితే ఆరోగ్యం శిశు మరణాల నియంత్రణకు చెక్ ఆగస్టు 1 నుంచి 7 వరకు తల్లిపాల వారోత్సవాలు జిల్లాలో 9,479 మంది గర్భిణులు, 7,373 మంది బాలింతలు -
అతి వేగం.. తీసింది ప్రాణం
కొత్తపల్లి: అతి వేగమే ఉప్పాడ–పిఠాపురం రోడ్డులో ప్రమాదానికి కారణమైంది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పిఠాపురం–ఉప్పాడ రోడ్డులో కొండయ్యకాలువ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తికి గాయాలైనట్లు తెలిపారు. మండలంలోని ఎండపల్లికి చెందిన విజ్జపురెడ్డి రామస్వామి (64), అదే గ్రామానికి చెందిన కామేశ్వరరావు మోటార్సైకిల్పై పిఠాపురం వెళుతున్నారు. పిఠాపురం నుంచి ఉప్పాడ వస్తున్న కారు కొండయ్య కాలువ వద్ద ప్రమాదవశాత్తూ ఢీకొంది. ఈ ప్రమాదంలో రామస్వామి, కామేశ్వరరావు గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని పిఠాపురం ప్రభుత్వాసుత్రికి తరలించారు. రామస్వామి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కారు డ్రైవర్ అతివేగంగా రావడంతో పాటు ఆటోని తప్పించబోయి ఎదురుగా వస్తున్న మోటార్సైకిల్ను ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. దీనిపై ఎస్సై వెంకటేష్ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
తమ ప్రదర్శనలకు అనుమతులిచ్చి ఆదుకోండి
● అశ్లీల నృత్యాల జాబితాలో రికార్డింగ్ డ్యాన్స్లను చేర్చవద్దు ● సినీ హీరోల అనుకరణ కళాకారుల సంఘం నాయకుల విజ్ఞప్తి ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): పొట్టకూటి కోసం సినీ హీరోలను అనుకరిస్తూ డ్యాన్స్ ప్రదర్శనలు ఇస్తున్న తమకు ఇబ్బంది కలగకుండా అనుమతులు ఇప్పించాలని గోదావరి జిల్లాల సినీ హీరోల అనుకరణ(డూప్)ల కళాకారుల సంఘం అధ్యక్షుడు ములపర్తి అనిల్కుమార్ (ఎన్టీఆర్ ఫేమ్), కార్యదర్శి మజ్జి శ్రీనివాసరావు (శోభన్బాబు ఫేమ్), పసలపూడి దివాకర్బాబు (బాలయ్య ఫేమ్) కోరారు. స్థానిక గణేష్చౌక్లోని ది రాజమండ్రి ప్రెస్క్లబ్లో బుధవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గడచిన 40 ఏళ్లకు పైగా ఈ వృత్తినే నమ్ముకుని చాలామంది జీవనం సాగిస్తున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 70 వేల మంది కళాకారులు ఈ వృత్తిలో ఉన్నారని, జిల్లాలో 3500 మంది వరకు ఉన్నారని తెలిపారు. ఏడాదికి మూడు నెలలు మాత్రమే ఆయా ప్రాంతాల్లో జాతరలు, ఉత్సవాలకు తమకు ప్రదర్శనలు ఉంటాయని, మిగిలిన సమయం దాదాపు ఖాళీగానే ఉంటూ ఇదే వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నామన్నారు. అయితే కొంతమంది అశ్లీల నృత్యాలు చేయడం వలన తమలాంటి కళాకారులకు ఇబ్బంది వస్తోందని, ఫలితంగా తమకు కూడా కొన్నిచోట్ల అనుమతులు ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎక్కడా అశ్లీలతకు తావులేకుండా ప్రదర్శనలు ఇస్తున్నామని, ఇబ్బందులు కలిగించకుండా అనుమతి ఇచ్చేలా చూడాలని, తద్వారా తమను ఆదుకోవాలని డూప్ హీరోలు కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్, మంత్రి నారా లోకేష్ల దృష్టికి విషయాలను తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. -
సత్యదేవుని దర్శించుకున్న జిల్లా జడ్జి అహ్మద్
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణ స్వామిని బుధవారం తూర్పుగోదావరి జిల్లా (రాజమహేంద్రవరం) ప్రిన్సిపల్ జడ్జి మౌలానా జునైద్ అహ్మద్ కుటుంబ సభ్యులతో కలసి దర్శనం చేసుకుని పూజలు చేశారు. ఆలయం వద్ద వారికి పండితులు ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం వేదపండితులు వేదాశీస్సులు అందజేసి స్వామివారి ఫొటో, ప్రసాదాలు అందజేశారు. మందపల్లి పార్వతీదేవికి సారె సమర్పణకొత్తపేట: ఆషాఢమాసంలో అమ్మవార్లకు సారెను అందించే ఆనవాయితీని అనుసరించి మందపల్లి మందేశ్వర (శనైశ్చర) క్షేత్రంలో పార్వతీదేవి అమ్మవారికి వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రం నుంచి బుధవారం సారెను సమర్పించారు. మందపల్లి క్షేత్రంలో దేవదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, దేవస్థానం ఈఓ దారపురెడ్డి సురేష్ బాబు ఆధ్వర్యంలో ఆషాఢమాసం కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. పార్వతీదేవిని శాకంబరిగా అలంకరించారు. శనైశ్చరస్వామితో పాటు క్షేత్రంలో కొలువైన బ్రహ్మేశ్వర, నాగేశ్వరస్వామివార్లను కూరగాయలు, ఆకు కూరలు, పండ్లతో విశేషంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. క్షేత్ర పాలకుడు వేణుగోపాలస్వామిని పుష్పాలతో విశేషంగా అలంకరించారు. మేళతాళాలతో ఊరేగింపు దేవదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, వాడపల్లి దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఆ దేవస్థానం తరపున సూపరింటెండెంట్ పి.రాంబాబు, పాలకమండలి తరఫున కో ఆప్టెడ్ సభ్యుడు వాడపల్లి శేషావతారం, దేవస్థానం సిబ్బంది, పండితులు చీర, పసుపు కుంకుమలు, సారె తీసుకు వచ్చారు. వారికి రావులపాలెం – అమలాపురం ప్రధాన రహదారిలో శనైశ్చరస్వామి దేవస్థాన ముఖద్వారం వద్ద ఈఓ సురేష్బాబు ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు, గ్రామస్తులు, మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. మేళతాళాలు, కోలాటం ప్రదర్శన, బాణసంచా కాల్పులతో భారీ ఊరేగింపుగా ఆలయానికి సారెను తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. మందపల్లి, ఏనుగుల మహల్, పరిసర గ్రామాల నుంచి అత్యధిక సంఖ్యలో మహిళా భక్తులు కూడా సారెను సమర్పించారు. కార్యక్రమాల్లో ఎంపీటీసీ సభ్యుడు సిద్దంశెట్టి వీవీ సత్యనారాయణ, దేవస్థానం మాజీ చైర్మన్లు చింతం విజయకృష్ణ మోహన్, సలాది బాబ్జీ, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. -
కొబ్బరి గోదాంలో అగ్నిప్రమాదం
రూ.90 లక్షల ఆస్తి నష్టం ముమ్మిడివరం: మండలంలోని కొత్తలంకలో బుధవారం షార్ట్సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్నిప్రమాదంలో కొబ్బరి గోదాం దగ్ధమై రూ.90 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. ఆ గ్రామానికి చెందిన గుత్తుల మల్లికార్జునరావుకు చెందిన కొబ్బరి గోదాంలో అదే గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి సత్యనారాయణ 2.50 లక్షల కురిడీ కొబ్బరికాయలను నిల్వ చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి కొబ్బరికాయలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో రూ.80 లక్షల విలువైన కొబ్బరికాయలు కాలి బూడిద కాగా రూ.10 లక్షల విలువైన గోదాం ధ్వంసమైంది. ముమ్మిడివరం అగ్నిమాపక అధికారి ఎస్.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. స్థానిక తహసీల్దార్ టి.సుభాష్, వీఆర్ఓ రెడ్డి సుబ్రహ్మణ్యం క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించి నష్టాలను నమోదు చేశారు. గుర్తుతెలియని వ్యక్తి మృతదేహంపిఠాపురం రూరల్: స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లప్రోలు టోల్ ప్లాజా సమీపాన గొరిఖండి కాలువలో బుధవారం గుర్తుతెలియని ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వయస్సు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటుందన్నారు. అతడు జీన్స్ ఫ్యాంటు, ఫుల్ హ్యాండ్ షర్ట్ ధరించి, ఫ్యాంటుకు బెల్టు ధరించి ఉన్నట్లు గుర్తించారు. మృతుడి కుడి చేతిపై ‘ఎస్ఆర్’ అని ఇంగ్లీషులో టాటూ, అలాగే ఎడమ చేతిపై ‘అమ్మ నాన్న‘ అని తెలుగులో, ‘శిరీషా‘ అని ఇంగ్లీషులో టాటూ గుర్తులు ఉన్నట్లు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతుడి వివరాలు తెలిసిన వారు లేదా అతని ఆచూకీ గుర్తించగలిగిన వారు పిఠాపురం సీఐ–9440796523 లేదా పిఠాపురం రూరల్ పోలీస్ ఎస్సై 9490760765 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. -
ఇన్వర్టర్ పేలి రేకులషెడ్డు దగ్ధం
అల్లవరం: దేవగుప్తం పంచాయతీ పరిధిలోని బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ఎదురుగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుంచి హైఓల్టేజీ రావడంతో బుధవారం పద్మనాభం సూరిబాబు ఇంట్లోని ఇన్వర్టర్ పేలి రేకుల షెడ్డు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో సూరిబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. కిచెన్లో వంట చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఇన్వర్టర్ పేలి షెడ్డలో మంటలు వ్యాపించడంతో సూరిబాబు మంటలు ఆర్పే ప్రయత్నం చేశాడు. ఆ మంటల ధాటికి అతడికి గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో షెడ్డులోని గృహోపకరణాలు కరిగిపోయాయి. మంటల వేడికి పైకప్పు రేకులు ధ్వంసం కాగా, కిటీకి అద్దాలు, డోర్లు కాలి బూడిదగా మిగిలాయి. అమలాపురం ఫైర్ ఇంజిన్ ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. అగ్ని ప్రమాదంతో రూ.2 లక్షల వరకు నష్టం ఉంటుందని బాధితుడు వాపోయాడు. సూరిబాబు భార్య అనారోగ్యంతో మరణించగా, ముగ్గురు కుమార్తెలకు పెళ్లిళ్లు చేశారు. ఇంట్లో ఆయనొక్కరే నివాసం ఉంటున్నారు. చిన్నపాటి కిరాణాషాపుతో జీవనం సాగిస్తున్నారు. అగ్నిప్రమాదంలో గాయపడిన సూరిబాబుని పలువురు పరామర్శించారు. బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్కు ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్తో పలుమార్లు గృహోపకరణాలు ధ్వంసమయ్యాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. బాఽధితుడికి వైఎస్సార్ సీపీ నాయకుల పరామర్శ ఇన్వర్టర్ పేలి గాయాల పాలై అల్లవరం సీహెచ్సీలో చికిత్స పొందుతున్న సూరిబాబుని వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్, మాజీ ఎంపీ చింతా అనురాధ బుధవారం పరామర్శించారు. సూరిబాబు ఆరోగ్యంపై వైద్యులతో మాట్లాడి చికిత్స అందించాలని కోరారు. వారి వెంట ఎంపీపీ ఇళ్ల శేషగిరిరావు, జెడ్పీటీసీ కొనుకు గౌతమి, జిల్లా ఉపాధ్యక్షుడు యల్లమిల్లి బోసు, మండల పార్టీ అధ్యక్షులు కొనుకు బాపూజీ, వాసంశెట్టి వెంకటేశ్వరరావు, బర్రే సీతారత్నం తదితరులు పరామర్శించారు. -
అమరావతి చాంపియన్షిప్కు జిల్లా స్థాయి ఎంపికలు
అమలాపురం రూరల్: క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆగస్టు 16, 17, 23 తేదీల్లో జరిగే అమరావతి రాష్ట్ర స్థాయి చాంపియన్షిప్ పోటీల కోసం బాలయోగి స్టేడియంలో మంగళవారం జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించారు. జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి ఎల్ఆర్ రుద్ర ఆధ్వర్యంలో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బాస్కెట్బాల్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, యోగా, వెయిట్లిఫ్టింగ్, బాక్సింగ్ తదితర క్రీడాంశాల్లో ఎంపికలు జరిగాయి. నియోజకవర్గం స్థాయిలో అర్హత కలిగిన క్రీడాకారులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో 100 బాలురు, 80 మందికి బాలికలు జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీలు పందిరి శ్రీహరిరామ్గోపాల్, గెడ్డం సంపదరావు, ఎంపీడీఈఓ ఉండ్రు బాబ్జీరాజు, రూరల్ సీఐ ప్రశాంతకుమార్, పీఈటీలు, గణేష్, ఈశ్వరరావు, భీమేశ్వరరావు, కామన మధుసూదనరావు, ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు. -
తెలుగుదేశమే ఫేక్ పార్టీ
● ఆ నిజం మంత్రి లోకేశ్ తెలుసుకోవాలి ● వైఎస్సార్ సీపీ నాయకురాలు జమ్మలమడక నాగమణి కాకినాడ రూరల్: తెలుగుదేశమే ఫేక్ పార్టీ అని, ఆ పార్టీ డీఎన్ఏ ఏమిటో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలుసుకోవాలని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి హితవు పలికారు. ఆమె మంగళవారం మాట్లాడుతూ వైఎస్సార్ సీపీని ఉద్దేశించి లోకేశ్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు ఎలా కబళించారో తెలుగు ప్రజలందరికీ తెలుసనన్నారు. ఆ విషయంపై లోకేశ్కు అవగాహన లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంక్షేమాన్ని ఆకాంక్షించి పార్టీని స్థాపించారని తెలిపారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని దొడ్డి దారిన చేజిక్కుంచున్న వాళ్లే ఫేక్ అని స్పష్టం చేశారు. తాజాగా ప్రజలను మరోసారి మభ్యపెట్టేందుకు ఇంటింటికి తెలుగుదేశం అంటూ కొత్త డ్రామాకు చంద్రబాబు, లోకేశ్ తెరతీశారని మండిపడ్డారు. కానీ తెలుగు తమ్ముళ్లు మాత్రం ప్రజల వద్దకు ఏ ధైర్యంతో వెళ్లాలా అని ఆందోళన చెందుతున్నారన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్ ఇచ్చిన హామీలను కాపీ కొట్టినా, వాటిని ఆ స్థాయిలో అమలు చేయలేకపోతున్నారని మండిపడ్డారు. కూటమి పాలనలో అన్ని రంగాలు తిరోగమనంలో సాగుతున్నాయన్నారు. 31న కాకినాడలో జాబ్ మేళా బాలాజీచెరువు (కాకినాడ): కాకినాడలోని గవర్నమెంట్ ఐటీఐ కాలేజీ ఆవరణలో ఈ నెల 31న జాబ్ మేళా నిర్వహించనున్నారు. జిల్లా ఉపాధి అధికారి శ్రీనివాస్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్.గోపీకృష్ణ, గవర్నమెంట్ ఐటీఐ ప్రిన్సిపాల్ వర్మ మంగళవారం ఈ వివరాలను వెల్లడించారు. పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ (ఎలక్ట్రికల్, ఫిట్టర్), ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన, 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి కలవారు ఆ ఉదయం 10 గంటలకు కాకినాడ గవర్నమెంట్ ఐటీఐ కాలేజీకి హాజరుకావాలన్నారు. ముందుగా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.నైపుణ్యం.ఏపీ.జీవోవి.ఇన్ వెబ్సైట్లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు. ఇతర వివరాలకు 86399 51441, 86398 46568 నంబర్లను సంప్రదించాలని కోరారు. 53 వేల ఎకరాలకు సాగు నీరుబోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఏలేరు ఆయకట్టు కింద ఉన్న 53 వేల ఎకరాలకు ఏలేరు జలాశయం నుంచి వెయ్యి క్యూసెక్కుల నీటి విడుదలకు ప్రత్యేక సాగునీటి సలహా సంఘం నిర్ణయించిందని కలెక్టర్, సాగునీటి సలహా సంఘం చైర్మన్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. జిల్లా నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతన కలెక్టరేట్లో మంగళవారం ప్రత్యేక సాగునీటి సలహా సంఘం సమావేశం జరిగింది. సమావేశంలో ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ పిడుగు హరి ప్రసాద్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఇరిగేషన్ ఈఎన్సీ కె.నరసింహమూర్తి, అసిస్టెంట్ కలెక్టర్ ప్రియ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, ఏలేరు ప్రాజెక్ట్ చైర్మన్ ఎన్.సునీల్, గోదావరి ప్రాజెక్టు చైర్మన్ వీరబాబు, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, రైతులు హాజరై ఖరీఫ్ సాగునీటి విడుదలపై సమీక్షించారు. ప్రధాని సభకు ఆర్టీసీ బస్సులుబోట్క్లబ్ (కాకినాడ సిటీ): భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవ సందర్భంగా నిర్వహించే ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభకు జిల్లాలో అర్టీసీ బస్సులు పంపుతున్నామని జిల్లా ప్రజారవాణాధికారి మనోహర్ అన్నారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 30, 31, ఆగష్టు 1న పూర్తి స్థాయిలో బస్సులు అందుబాటులో ఉండవని తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ఒకటి నుంచి పశు వైద్యశిబిరాలు అమలాపురం టౌన్: జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఆగస్టు ఒకటి నుంచి పశు వైద్యశిబిరాలు నిర్వహించనున్నట్టు జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ బి.నాగేశ్వరరావు తెలిపారు. ఇదే సమయంలో పాడి రైతుల ఆర్థికాభివృద్ధి కోసం మహిళా డెయిరీ సహకార సంఘాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ మేరకు మంగళవారం అమలాపురంలోని పశు సంవర్ధక ఏరియా వైద్యాలయంలో సహాయ సంచాలకులు డాక్టర్ ఎల్.విజయరెడ్డి అధ్యక్షతన జిల్లాలోని వైద్యాధికారులు, సహాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వైద్య శిబిరాలతో పాటు ఆయా గ్రామాల్లోని ఆవులకు లంపి స్కిన్ వ్యాధి నిరోధక టీకాలు వేస్తామన్నారు. -
బస్సుల్లో చోరీలు చేస్తున్న ఇద్దరి అరెస్ట్
ఫ రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాల రికవరీ ఫ పెద్దాపురం డీఎస్పీ తిలక్ సామర్లకోట: బస్సుల్లో ప్రయాణికుల బ్యాగ్ల నుంచి చోరీకి పాల్పడుతున్న ఇద్దరు బ్యాగ్ లిఫ్టర్లను పెద్దాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వారిని విచారించగా వారి వద్ద నుంచి రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు రికవరీ చేసినట్లు పెద్దాపురం డీఎస్పీ ఏజీబీ తిలక్ చెప్పారు. డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు తెలిపారు. ఏప్రిల్ 30న పి.లక్ష్మి బస్సులో ప్రయాణిస్తుండగా తన బ్యాగ్లో బంగారు ఆభరణాలు చోరీకి గురయినట్లు పెద్దాపురం పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసింది. అలాగే ఎం.రేఖ మే ఒకటిన విశాఖపట్నంలో బస్సెక్కి కాకినాడలో దిగి బ్యాగ్లో పెట్టుకున్న బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్టు కాకినాడ టూటౌన్ పోలీసుస్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ రెండు కేసులను దర్యాప్తు ప్రారంభించగా మంగళవారం పాండవుల మెట్ట వద్ద అనుమానంగా తిరుగుతున్న గుంజ గిడ్డన్న, తమ్మిశెట్టి వాణి అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇరువురిని విచారించి వారి వద్ద నుంచి 174 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకొన్నారు. వాటి విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని తెలిపారు. సమావేశంలో సీఐలు, ఎస్సై పాల్గొన్నారు. -
మెగా మోసంపై ఆగ్రహ జ్వాల
భావి భారత పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలన్నదే వారందరి లక్ష్యం. దాని సాధనకు ఏళ్ల తరబడి పుస్తకాలతో కుస్తీ పట్టారు. కష్ట నష్టాలను ఓర్చుకుని పాఠాలు చదివారు. ఎన్నో ఆశలతో డీఎస్సీ పరీక్ష రాసిన వారికి చంద్రబాబు ప్రభుత్వం తీరని ద్రోహం చేసింది. ఉపాధ్యాయ పోస్టులను అంగడిలో సరుకుల్లా అమ్మేసింది. ఉద్యోగానికి వెలకట్టి, అనర్హులను అందలం ఎక్కించింది. దీంతో మోసపోయిన నిరుద్యోగులందరికీ వైఎస్సార్ సీపీ అండగా నిలిచింది. అర్హులకు న్యాయం చేయాలంటూ జిల్లా కేంద్రమైన కాకినాడలో నిరసన గళమెత్తింది.పాలకుల తీరును ప్లకార్డుతో ప్రశ్నిస్తూ..బోట్క్లబ్ (కాకినాడ సిటీ): మెగా డీఎస్సీ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగులకు చేసిన మోసంపై వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, యువత, నిరుద్యోగులు బుధవారం కాకినాడలో కదం తొక్కారు. మెగా డీఎస్సీపై పూర్తిస్థాయి విచారణ చేయాలని, అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి చెల్లించాలని, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక డీ కన్వెన్షన్ నుంచి మెయిన్ రోడ్డులోని సూపర్ బజార్, మసీద్ సెంటర్ మీదుగా బాలాజీ చెరువు సెంటర్లోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వరకూ వైఎస్సార్ సీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. వేల మంది యువజన, విద్యార్థి విభాగం నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలి పార్టీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోట రాంజీ మాట్లాడుతూ మెగా డీఎస్సీ పేరుతో ప్రభుత్వం హడావుడి చేసి, చివరకు నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. అనేక అక్రమాలకు పాల్పడి, అనర్హులకు ఉద్యోగులు ఇచ్చిందన్నారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలన్నారు. నీట్ పేపర్ లీకై న ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారన్నారు. అలాగే డీఎస్సీ లోపాలకు లోకేశ్ బాధ్యత వహించి, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అర్హులందరికీ అన్యాయం వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాగిరెడ్డి అరుణ్ కుమార్ మాట్లాడుతూ నీట్ పరీక్ష పేపర్ లీకై తే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలిసి 15 రోజులు పోరాటం చేశారన్నారు. ఆ పోరాటంపై అనేక మంది చాలా రకాల వ్యాఖ్యానాలు చేశారని, అయినప్పటికీ పోరాటం ఉధృతం చేయడంతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి కేంద్ర విద్యాశాఖ మంత్రితో రాజీనామా చేయించిందన్నారు. డీఎస్సీలో అర్హులైన వారికి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా, డబ్బులు వసూలు చేసుకుని అక్రమంగా అమ్ముకున్నారని విమర్శించారు. నిజమైన వారికి ఉద్యోగాలు లేకుండా పోయాయన్నారు. అందుకే అర్హులైన వారందరూ రోడ్డుపైకి వచ్చి ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్నారన్నారు. హామీలిచ్చి మోసం వైఎస్సార్ సీపీ హయాంలో ప్రతి పాఠశాలలోనూ ఇంగ్లిష్ మీడియం బోధనను తీసుకు వస్తే.. నేడు కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 900 పాఠశాలను మూసివేశారని, విద్యా దీవెన, వసతి దీవెన, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేస్తున్నారని అరుణ్ కుమార్ అన్నారు. జగన్మోహన్రెడ్డి హయాంలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని చెబుతున్న చంద్రబాబు నాయుడు.. ఆయన అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి, ఒక సంక్షేమ పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని విమర్శించారు. నిరసనలో యువజన విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎంజీకే కిశోర్ కుమార్, యువజన విభాగం నాయకులు ఎం.రాజబాబు, దాసం వెంకటేష్, వీరంరెడ్డి నాని, సకురు గుర్రాజు, ఎం.దొరబాబు, ఉలవల భూషణం, కరణం భాను, వేల మంది కార్యకర్తలు, నిరుద్యోగులు పాల్గొన్నారు. నిరుద్యోగ భృతి ఏమైంది? కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఉద్యోగ ప్రకటనలు రాక నిరుద్యోగులు అనేక అవస్థలు పడుతున్నారని తోట రాంజీ అన్నారు. ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ భృతిగా నెలకు రూ.3 వేలు ఇస్తామని ఎన్నికల ప్రచార సభలో ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్మెంట్ సక్రమంగా ఇవ్వకపోవడంతో విద్యార్థులు కష్టాలు పడుతున్నారన్నారు. అంగడిలో పోస్టుల విక్రయం స్పోర్ట్స్ కోటా పేరుతో అక్రమాలకు పాల్పడి ఒక్కొక్క పోస్టును రూ.20 లక్షల నుంచి రూ. 30 లక్షలకు అమ్ముకున్నారని రాగిరెడ్డి అరుణ్ కుమార్ విమర్శించారు. క్రీడల్లో బంగారు పతకాలు గెలుచుకున్న అభ్యర్థులకు కాదని, అక్రమ మార్గంలో సర్టిఫికెట్లు తీసుకువచ్చిన వారికి ఉద్యోగాలు కట్టబెట్టారన్నారు. లంచాలు ఇచ్చి, ఉద్యోగాలు సాధించిన వారు పిల్లలకు పాఠశాలల్లో ఏమి బోధన చేస్తారని ప్రశ్నించారు. పాలకులు అప్పులు తెచ్చి అమరావతి పేరు చెప్పి దోచుకుతింటున్నారన్నారు. అధికారంలోకి వస్తే ప్రశ్నిస్తామని ఎన్నికల ముందు చెప్పిన నాయకులు ప్రస్తుతం ప్రశ్నించటాన్ని మర్చిపోయారని ఎద్దేవా చేశారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలని అడిగిన యువకులు, నిరుద్యోగులు, వైఎస్సార్ సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని ఆరోపించారు. కదం తొక్కిన వైఎస్సార్ సీపీ శ్రేణులు డీఎస్సీ అక్రమాలపై విచారణ నిర్వహించాలి మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలి కాకినాడలో భారీ ర్యాలీ తరలివచ్చిన నిరుద్యోగులు, యువత -
వర్జీనియా @ రూ.275
● కిలోకు రూ.10 పెరిగిన పొగాకు ● జగన్ పర్యటన నేపథ్యంలో కదలిక దేవరపల్లి: రెండు రోజులుగా వర్జీనియా పొగాకు ధర మార్కెట్లో స్వల్పంగా పెరిగింది. దాదాపు వంద రోజులుగా నిలకడగా ఉన్న కిలో గరిష్ఠ ధర రూ.265 నుంచి రూ.10 పెరిగి రూ.275కి చేరింది. ఈ ఏడాది కొనుగోళ్లలో ఎక్కువ శాతం కిలో పొగాకు రూ.160 నుంచి రూ.180 పలకడంతో రైతులు దిగాలు పడ్డారు. దీంతో ఆందోళన బాట పట్టిన రైతులకు మే ఆరో తేదీన దేవరపల్లి వేలం కేంద్రం వద్ద వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మాజీ హోం మంత్రి తానేటి వనిత నాయకత్వంలో పార్టీ శ్రేణులు అండగా నిలచి ధర్నా చేసి, గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశాయి. అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చలనం లేకపోవడంతో పొగాకు రైతులు ఇటీవల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి తమ ఇబ్బందులు వివరించి, వేలం కేంద్రాలను సందర్శించి, తమకు న్యాయం జరిగే వరకు పోరాడాలని కోరారు. మీరు అడుగు పెడితే తమకు మేలు జరుగుతుందని కోరారు. ఈ మేరకు వచ్చే నెల 5న దేవరపల్లి వేలం కేంద్రాన్ని ఆయన సందర్శించనున్న నేపథ్యంలో సోమవారం నుంచి మార్కెట్లో ధర పెరిగింది. కిలోకు రూ.10 పెంచి కొనుగోలు చేస్తున్నారు. మంగళవారం టుబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో కిలో గరిష్ఠ ధర రూ.275, కనిష్ఠ ధర రూ.170, సగటు ధర రూ.243.72 లభించింది. ఐదు వేలం కేంద్రాలకు 4127 బేళ్లు విక్రయానికి రాగా, 2536 బేళ్లు కొనుగోలు చేశారు. 1591 బేళ్లు తిరస్కరించారు. రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో ఇప్పటి వరకు జరిగిన పొగాకు ధరలు ఇలా ఉన్నాయి. వేలం కేంద్రం గరిష్ఠ ధర కనిష్ఠ ధర కొనుగోళ్లు (కిలోల్లో) సగటు ధర దేవరపల్లి 275 170 1388483 239.55 జంగారెడ్డిగూడెం–1 275 170 1994422 245.22 జంగారెడ్డిగూడెం–2 275 170 2156770 244.75 కొయ్యలగూడెం 275 170 1976976 242.02 గోపాలపురం 275 170 1989829 245.68 -
కరిచర్లగూడెంలో పెద్దపులి!
● పామాయిల్ తోటలో మకాం ● పొలాల్లో ప్రత్యేక బృందాల రెస్క్యూ ఆపరేషన్ దేవరపల్లి: ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలకు కొంత కాలంగా దడ పుట్టిస్తున్న పెద్ద పులి ఎట్టకేలకు గోపాలపురం మండలం కరిచర్లగూడెం, తొక్కిరెడ్డిగూడెం గ్రామాల మధ్య పొలాలకు చేరుకుంది. సోమవారం మండలంలోని కరగపాడు, బుచ్చియపాలెం, నందిగూడెం ప్రాంతాల్లో పెద్దపులి సంచరించినట్టు పాదముద్రల ద్వారా గుర్తించిన అటవీ, పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా అటవీ శాఖ రాజమహేంద్రవరం రేజ్ అధికారి దావీద్ రాజు ఆధ్వర్యంలో అక్కడి ప్రజలను అప్రమత్తం చేశారు. 60 మంది సిబ్బందిని 5 బృందాలుగా పంపి గాలింపు చేపట్టారు. పులి మెడలోని ట్రాకర్ ద్వారా దాని కదలికలను గమనిస్తున్నారు. మంగళవారం ఉదయం నందిగూడెం అటవీ ప్రాతం నుంచి తొక్కిరెడ్డిగూడెం మీదుగా కరిచర్లగూడెం బొల్లేరు చెరువు సమీపంలోకి చేరుకున్నట్టు అధికారులు గుర్తించారు. ఆవుదూడను చంపి సమీపంలోని కొబ్బరి, కోకో, ఆయిల్పామ్ తోటల్లోకి లాక్కెళ్లినట్టు గుర్తించిన అధికారులు తోటను చుట్టిముట్టి అక్కడ బోను ఏర్పాటు చేశారు. మత్తు ఇంజక్షన్, డ్రోన్ సహాయంతో పులిని పట్టుకోవడానికి అధికారులు సిద్ధమయ్యారు. దీని కోసం శ్రీశైలం టైగర్ టీం, జిల్లా హనుమాన్ టీం, ఉభయ గోదావరి జిల్లాల నుంచి 60 మంది సిబ్బందిని ఐదు బృందాలుగా ఏర్పాటు చేశారు. -
ఇంజినీరింగ్లో 84,800 సీట్లకు అనుమతి
బాలాజీ చెరువు (కాకినాడ సిటీ) : ప్రస్తుత విద్యా సంవత్సరంలో జేఎన్టీయూ కాకినాడ పరిధిలో అనుబంధంగా ఉన్న 103 కళాశాలల్లో ఇంజినీరింగ్ అడ్మిషన్ల నిమిత్తం 84,800 సీట్లు భర్తీ చేసుకోవడానికి అనుమతిచ్చారు. అలాగే, జేఎన్టీయూకేలోని యూనివర్సిటీ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ ఏడాది నుంచి మరిన్ని సీట్ల పెంపుదలకు కూడా అనుమతి వచ్చింది. సీఎస్ఈ, మెకానికల్, ఈసీఈ, ఈఈఈ, సివిల్ వంటి విభాగాల్లో ఇప్పటివరకు ఒక్కో విభాగానికి ఈడబ్ల్యూఎస్ కోటాతో కలిపి 55 సీట్లు మాత్రమే ఉండేవి. ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి కొత్తగా వచ్చిన అనుమతితో ఒక్కో సెక్షన్కు 60, ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఆరు సీట్లు కలిపి మొత్తం 66 చొప్పున అన్ని విభాగాల్లో రెండు సెక్షన్లు చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఒక్కో కోర్సుకు రెండు సెక్షన్లు ఉంటాయి. ఉన్నత విద్యా మండలికి నివేదిక రాష్ట్రంలో ఉన్న అన్ని వర్సిటీల నుంచి సీట్ల సంఖ్య నివేదికను ఉన్నత విద్యామండలికి నివేదిస్తేనే అక్కడి నుంచి ఆన్లైన్లో కళాశాలల వివరాలు విద్యార్థులకు కనబడతాయి. రాష్ట్రంలో అత్యధిక కళాశాలలకు అనుబంధంతో పాటు సాంకేతిక వర్సిటీలో కీలకంగా ఉన్న జేఎన్టీయూకే ఈ ప్రక్రియ పూర్తిచేసి ఉన్నత విద్యా మండలికి నివేదిక పంపించింది. ఇక ఈ నెల 21 నుంచి వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభం కాగా.. కళాశాల, కోర్సు ఎంపికకు కీలకమైన వెబ్ ఆప్షన్లకు ఈనెల 31 వరకు అవకాశముంది. ఉన్నత ప్రమాణాలున్న కళాశాలలకే.. ఉన్నత విద్యా మండలి సూచనల మేరకే సాంకేతిక విద్యలో ఉన్నత ప్రమాణాలు ఉన్న కళాశాలలకే గుర్తింపు ఇచ్చాం. అటువంటి కళాశాలలో అభ్యసిస్తే విద్యార్థులకు ఉద్యోగావకాశాలు దక్కుతాయి. –డాక్టర్ ఆర్.శ్రీనివాసరావు, రిజిస్ట్రార్, జేఎన్టీయూకే అదనంగా మరో సెక్షన్ ఏర్పాటు జేఎన్టీయూ కాకినాడ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ ఏడాది అన్ని విభాగాల్లో సీట్లు పెంచి కొత్తగా మరో సెక్షన్ ఏర్పాటు చేస్తున్నాం. దీంతో మరింత మంది విద్యార్థులు కళాశాలలో చేరడానికి అవకాశం ఉంటుంది. వచ్చిన ర్యాంకు ఆధారంగా అర్హులైన వారు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలి. – కొప్పిరెడ్డి పద్మరాజు, ప్రిన్సిపాల్, యూసీఈకే కళాశాల ఫ జేఎన్టీయూకే పరిధిలో సీట్లు ఖరారు ఫ మొత్తం 103 కళాశాలలకు గుర్తింపు ఫ 31 వరకు కళాశాల, కోర్సు ఎంపికకు వెబ్ ఆప్షన్లు -
ఎస్సై సమయ స్ఫూర్తి
కోటనందూరు: ఓ భక్తుడిని కాపాడడంలో ఎస్సై సమయ స్ఫూర్తిని ప్రదర్శించారు. తలుపులమ్మ లోవ దేవస్థానంలో ఆదివారం కోటనందూరు ఎస్సై టి.రామకృష్ణ విధులు నిర్వహించారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నుంచి తలుపులమ్మను దర్శించుకునేందుకు భార్యతో కలసి ఓ భక్తుడు వచ్చాడు. తిరుగు ప్రయాణంలో గుండెపోటు రావడంతో రోడ్డుపై కుప్పకూలిపోయాడు. పక్కనే విధి నిర్వహణలో ఉన్న ఎస్సై స్పందించి కుప్పకూలిన భక్తుడికి సీపీఆర్ చేశారు. కొద్ది క్షణాలకు ఆ భక్తుడు శ్వాస తీసుకోవడంతో 108 అంబులెన్స్లో తుని ఏరియా ఆసుపత్రికి తలించారు. అక్కడ వైద్యులు మెరుగైన వైద్యం అందించడంతో భక్తుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఎస్సై రామకృష్ణ స్పందించిన తీరు, ప్రదర్శించిన సమయ స్ఫూర్తికి పోలీసు ఉన్నతాధికారులతో పాటు భక్తులు, స్థానికులు ప్రశంసించారు. రేపటి నుంచి వరుణ యాగం అన్నవరం: రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ అన్నవరంలోని శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ఆషాఢ పౌర్ణమి (గురు పౌర్ణమి) బుధవారం నుంచి వరుణ యాగం నిర్వహించనున్నట్లు దేవస్థానం అఽధికారులు తెలిపారు. దేవస్థానంలోని దర్బారు మండపంలో వరుణ యాగానికి అంకురార్పణ చేస్తారు. రుష్యశృంగుని విగ్రహంతో ఆలయ ప్రాకారంలో ప్రదక్షిణ నిర్వహిస్తారు. అదే విధంగా కొండ దిగువన పంపా నదిలో కూడా రుత్విక్కులు వరుణ జపాలు చేస్తారు. గురువారం కూడా వరుణ యాగం, జపాలు కొనసాగించి శుక్రవారం రత్నగిరిపై పూర్ణాహుతి నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. జాడలేని ఓటర్లు 21,604 పెద్దాపురం: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమం ముగిసిన తర్వాత పెద్దాపురం నియోజకవర్గంలో జాడలేని ఓట్లు 21,604గా అధికారులు గుర్తించారు. నియోజకవర్గంలో పెద్దాపురం రూరల్లో 58 పోలింగ్ బూత్లో 61,056 ఓట్లు ఉండగా, అందులో 56,533 ఓట్లు మ్యాపింగ్ అయ్యాయి. పెద్దాపురం అర్బన్లోని 37 పోలింగ్ బూత్ల పరిధిలో 41,714 ఓట్లు ఉండగా, 37,582 మందికి మ్యాపింగ్ జరిగింది. సామర్లకోట రూరల్లో 69 బూత్ల పరిధిలో 71,261 ఓటర్లకు గాను 63,413 ఓటర్ల మ్యాపింగ్ చేశారు. సామర్లకోట అర్బన్లో 37 పోలింగ్ బూత్ల పరిధిలో 43,971 ఓటర్లు ఉండగా, 38,867 ఓటర్లు మ్యాపింగ్ అయ్యినట్టు అధికారులు తెలిపారు. నియోజకవర్గంలో మొత్తం 201 పోలింగ్ బూత్లలో 2,18,002 ఓటర్లు ఉండగా, 1,96,398 ఓట్లను డిజిటలైజేషన్ చేశారు. నియోజకవర్గంలో 9,192 మంది ఓటర్లు చనిపోయినట్టు, 5,395 మంది వలస వెళ్లినట్లు, డూప్లికేట్ ఓటర్లుగా 3,911 మందిని గుర్తించారు. అసలు ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకోని వారు 3,091 మంది ఉన్నారు. దస్తావేజు లేఖర్ల నిరసన కాకినాడ లీగల్: దస్తావేజు లేఖర్ల వృత్తికి భంగం కలిగించే జీఓ నంబరు 396ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా దస్తావేజు లేఖర్ల సంఘం ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. జిల్లాలోని 9 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో దస్తావేజు లేఖర్లు తరలివచ్చారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు బీజే ప్రసాద్, చోడపునీడి గోవిందరావు మాట్లాడుతూ ఆ జీఓతో రాష్ట్రంలో లక్షలాది మంది దస్తావేజు లేఖర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉపాధిని కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో పారదర్శకత లోపిస్తుందని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్కు వినతి పత్రం అందజేశారు. -
నీతి, నిజాయితీకి ప్రతీక ‘ముద్రగడ’
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిబద్ధతకు ప్రతీకగా మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నిలిచారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడలోని జిల్లా వైఎస్సార్ సీపీ కార్యాలయంలో సోమవారం కన్నబాబు అధ్యక్షతన ముద్రగడ పద్మనాభం సంతాప సభ నిర్వహించారు. కాకినాడ జిల్లా పరిధిలోని వివిధ నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, సమన్వయకర్తలు హాజరై ముద్రగడ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కురసాల కన్నబాబు మాట్లాడుతూ, ముద్రగడ నిష్కలంక రాజకీయవేత్తగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ, రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న ముద్రగడ ఉద్యమశక్తిగా ఎదిగినా, వ్యక్తిగతంగా ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నారని అన్నారు. మాజీ ఎంపీ వంగా గీత మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడిన గొప్ప ఉద్యమ నాయకుడిగా ముద్రగడ పేరొందారని అన్నారు. మాజీ ఎంపీ తోట నరసింహం మాట్లాడుతూ, ఉత్తర కంచి దీక్షతో ఉద్యమాలకు శ్రీకారం చుట్టిన ముద్రగడ దేశవ్యాప్తంగా అనేక మంది అభిమానులను సంపాదించుకున్నారని గుర్తుచేశారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ, ముద్రగడ కుటుంబంతో తనకు వ్యక్తిగతంగా ఎంతో మంచి అనుబంధం ఉందని, ఆయన మరణం పార్టీకే కాకుండా వ్యక్తిగతంగా కూడా తనకు తీరని లోటని భావోద్వేగంతో తెలిపారు. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దవులూరి దొరబాబు మాట్లాడుతూ, రాజకీయాల్లో ముద్రగడ లాంటి విలువలకు కట్టుబడి పనిచేసే నాయకులు ఎంతో అరుదుగా ఉంటారని అన్నారు. ఈ సంతాప సభలో మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి, రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, జిల్లా అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్, స్మార్ట్ సిటీ మాజీ చైర్మన్ అల్లి రాజబాబు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు రాగిరెడ్డి బన్నీ, రాష్ట్ర ప్రచార కమిటీ ఉపాధ్యక్షుడు రావూరి వెంకటేశ్వరరావు, మాకినీడి శేషుకుమారి, కుమార్ రాజా పాల్గొన్నారు. 1న కిర్లంపూడిలో సభ వచ్చే నెల 1న కిర్లంపూడిలో నిర్వహించ తలపెట్టిన ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి కురుసాల కన్నబాబు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. సీఎం వ్యాఖ్యలపై మండిపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు తమ పార్టీ శ్రేణులు ఈ సభలో పాల్గొనవద్దని వ్యాఖ్యానించడంపై వైఎస్సార్ సీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కురసాల కన్నబాబు మాట్లాడుతూ ముద్రగడను ఒక వర్గ శత్రువుగా చూడటం సీఎం హోదాలో ఉన్న వ్యక్తికి తగదని అన్నారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ ‘జీవించి ఉన్నంతకాలం ముద్రగడపై కక్ష సాధించారు, ఇప్పటికై నా ఆయనపై రాజకీయాలు చేయడం మానుకోండి’ అని హితవు పలికారు. మాజీ మంత్రి కురసాల కన్నబాబు -
ప్రచారం చూస్తే ఆహా.. ఓహో!
కాకినాడ రూరల్: రాష్ట్ర అభివృద్ధి ప్రచారంలో చంద్రబాబు ఆహా ఓహో అంటారని.. కాగ్ రిపోర్టు చూస్తే అసలు రంగు బహిర్గతమైందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వ కాగ్ నివేదికలు, రాష్ట్ర ప్రగతి చూసినప్పుడు చంద్రబాబు ఫెయిల్యూర్స్తో కనీసం పాస్ మార్కులు కూడా తెచ్చుకోలేని దీనస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. సోమవారం కాకినాడలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అప్పుల్లో అగ్రస్థానం, అభివృద్ధిలో అథమ స్థానంలో ఉందని చెప్పారు. రాష్ట్రానికి 23 నెలల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాయని, 23 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని చంద్రబాబు, లోకేష్లు కలసి అబద్ధాలను ప్రజల్లోకి తీసుకువెళ్లారన్నారు. తీరా చూస్తే కేంద్ర ప్రభుత్వం వాస్తవాన్ని కళ్లకు కట్టినట్టు చూపిందన్నారు. రాష్ట్రానికి రూ.6,962 కోట్లు మాత్రమే రెండేళ్లలో పెట్టుబడులు వచ్చాయని, కేంద్ర ప్రభుత్వం అధికారికంగా పార్లమెంట్లో ప్రకటించిందని కన్నబాబు చెప్పారు. 23 లక్షల ఉద్యోగాలు కూడా డొల్ల అని తేలిపోయిందన్నారు. డీపీఐఐ ఇన్వెస్ట్ ఇండియా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో రెండేళ్లలో కేవలం పది ప్రాజెక్టులు మాత్రమే వచ్చాయని, వీటి విలువ పెట్టుబడి రూ.6,962 కోట్లని కేంద్రం చెప్పిందన్నారు. వీటి ద్వారా భవిష్యత్తులో 22,162 ఉద్యోగాలు లభించనున్నాయని, 10 ప్రాజెక్టుల్లో ఇప్పటికి రెండు మాత్రమే పూర్తయ్యాయని వివరించారు. ఏ జిల్లాలో ఎన్ని పరిశ్రమలు ప్రారంభమయ్యాయి? ఏ జిల్లాకు ఎన్ని పెట్టుబడులు వచ్చాయి? ఏ జిల్లాలో ఏ పరిశ్రమ నిర్మాణం చేపట్టారు? మొత్తం పెట్టుబడులు ఎంత? ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని? ఇవ్వాల్సినవి ఎన్ని? అని శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని కన్నబాబు అన్నారు. చంద్రబాబు రోజుకు సగటున రూ.492 కోట్ల అప్పు తెస్తున్నారని తెలిపారు. ఇప్పటికి రెండేళ్లలో రాజధాని, బడ్జెట్ లోపల, బయట అన్నీ కలిపి రూ.3.59,157 కోట్ల అప్పులు చేశారన్నారు. రైతులను ఆదుకోరా! ఎల్నినో ప్రభావం ఉందని రైతులను వరి వేయవద్దని చంద్రబాబు చెబుతున్నారని, గోదావరి, కృష్టా డెల్టా పరిధిలో వరి తప్ప మరో పంట వేయలేని లక్షలాది ఎకరాలు ఉన్నాయని కన్నబాబు అన్నారు. క్రాప్ హాలిడే ప్రకటిస్తారా, ప్రకటిస్తే ఎకరాకు ఎంత నష్ట పరిహారం ఇస్తారని నిలదీశారు. పోని ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక ఇచ్చారా ఎరువులు, విత్తనాలు సబ్సిడీపై ఇస్తామని చెబుతున్నారా అని ప్రశ్నించారు. సొంత ఆదాయంలో 22వ స్థానానికి.. సొంత ఆదాయంలో మన రాష్ట్రం 22వ స్థానానికి పడిపోయిందని కన్నబాబు చెప్పారు. రాష్ట్రంలో 4,520 ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయని చెప్పారు. మూతపడిన పరిశ్రమల ద్వారా 48,477 ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని, మీరు తెస్తామన్న ఉద్యోగాలు 22,167 పోగా ఇంకా 36,310 ఉద్యోగాల పరిస్థితి ఏంటని నిలదీశారు. ఇన్వెస్టర్ ఫ్రెండ్సీ ఇండెక్స్లో నంబరు వన్ స్థానం నుంచి 8వ స్థానానికి పడిపోయిందన్నారు. రెడ్బక్ వేధింపులు భరించలేక సుమారు రూ.6,500 కోట్ల పెట్టుబడులు వెళ్లిపోయాయన్నారు. ఆ రోజు వైఎస్ జగన్ ఇన్వెస్టర్ల ఫ్రెండ్లీగా ఉండడంతోనే పెట్టుబడులు వచ్చాయన్నారు. శాంతిభద్రతల్లో 26వ స్థానంలో ఉన్నామని, మీకు సిగ్గు ఉందా అని కన్నబాబు నిలదీశారు. డీఎస్సీలో అక్రమాలపై విచారణను సీబీఐకి ఇవ్వండంటే మాట్లడడం లేదని అన్నారు. డీఎస్సీ అక్రమాలపై బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలన్నారు. ముద్రగడ వర్గ శత్రువా? ముద్రగడ పద్మనాభం వర్గ శత్రువా.. రాజకీయాల్లో మానవ సంబంధాలు ఉండవా అని చంద్రబాబును కన్నబాబు నిలదీశారు. ఆ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నాయకులు సంస్మరణ, సంతాప సభలకు వెళితే మహా ఘోరంగా చిత్రీకరిస్తున్నారంటే చంద్రబాబు నిజస్వరూపం తెలిసిపోయిందన్నారు. ఫ కాగ్ రిపోర్టుతో అసలు రంగు బహిర్గతం ఫ అథమ స్థానంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు ఫ మాజీ మంత్రి కురసాల కన్నబాబు -
బాబు ఎగనామం
ఎన్నికల సమయంలో కల్లబొల్లి హామీలు ఇచ్చారు.. బాబు వస్తే జాబ్ అన్నారు.. లేకపోతే నిరుద్యోగ భృతి అంటూ నమ్మించారు.. ఇలా మాయమాటలు చెప్పి ‘కూటమి’గా ఏర్పడి అధికార పగ్గాలు చేపట్టారు. రెండేళ్లు దాటినా రిక్తహస్తమే చూపుతున్నారు.. యువతను నిలువునా దగా చేస్తున్నారు.. అలాగే ఉన్నత చదువుల కోసం ఉద్దేశించిన ఫీజు రీయింబర్స్మెంట్ను పక్కనబెట్టేశారు.. చంద్రబాబు ప్రభుత్వ విధానాలపై విసుగు చెందిన యువతకు బాసటగా మంగళవారం జిల్లా కేంద్రం కాకినాడలో వైఎస్సార్ సీపీ విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో పోరుబాట జరుగనుంది. బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఎన్నికల్లో హామీలు ఇవ్వడం.. ఆనక దగా చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. 2014 ఎన్నికల ప్రచార సభలో తాను అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు ఉద్యోగం కల్పిస్తానని.. లేకుంటే రూ.మూడు వేల చొప్పున నెలకు భృతి ఇస్తామని చంద్రబాబు నమ్మించారు. ఈ మాటలు నమ్మి అనేకమంది నిరుద్యోగులు ఓటు వేశారు. కానీ రెండేళ్లు దాటినా ఉద్యోగం లేకపోగా, కనీసం భృతి అయినా ఇవ్వకపోవడంతో ఆగ్రహంతో రోడ్డెక్కుతున్నారు. ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే విద్యార్థుల ఉన్నత చదువుకు ఉద్దేశించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రెండేళ్లుగా పేరుకుపోతున్నాయి. జిల్లాలో సుమారు 5 లక్షలకు పైగా నిరుద్యోగులు ఉన్నారు. ఈ రెండేళ్లలో వారికి ఒక ఉద్యోగం కూడా రాలేదు. ఈ లెక్కన చంద్రబాబు ఇంటికొక నిరుద్యోగికి రూ. 3 వేలు భృతి చెల్లిస్తే, రెండేళ్లలో రూ.3,600 కోట్లు అందించాల్సి ఉంటుంది. దానికీ అతీగతి లేదు. జిల్లాలో మొత్తం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలతో పాటు, ఇంజినీరింగ్, ఐటీఐ కళాశాలలు 86 ఉన్నాయి. ఇందులో సుమారు 1,960 మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హులు. ఈ రెండేళ్లలో వారికి రూ.72.59 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకపోవడంతో ఆయా కళాశాలలు విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయి. లేకుంటే పరీక్షలు రాయకుండా హాల్ టికెట్లు నిలిపివేస్తున్నాయి. చేసేదిలేక తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ ఫీజు బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి దాపురించింది. నేడు కాకినాడలో పోరుబాట డీఎస్సీ నియామకాలపై తీవ్ర వివాదం నెలకొన్న నేపథ్యంలో సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ మంగళవారం కాకినాడలో వైఎస్సార్ సీపీ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ మేరకు సోమవారం కాకినాడ సిటీ వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నిరసన ర్యాలీ పోస్టర్ను పార్టీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు తోట రాంజీ, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాగిరెడ్డి అరుణ్కుమార్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎంజీకే కిశోర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యువత, విద్యార్థుల సమస్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని వాపోయారు. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై సీబీఐ విచారణ చేపట్టాలన్నారు. వేలాది మంది విద్యార్థులకు అందాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. ఎన్నికల హామీలో భాగంగా నిరుద్యోగ భృతిని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై మంగళవారం నిర్వహించే భారీ నిరసన ర్యాలీలో పార్టీ శ్రేణులు, యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాకినాడ డీకన్వెన్షన్ నుంచి మెయిన్ రోడ్డు మీదుగా, బాలాజీచెరువు సెంటర్లోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వరకూ ఈ ర్యాలీ సాగుతుందన్నారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం కాకినాడ రూరల్ అధ్యక్షుడు మామిడాల గౌతమ్తేజ, నాయకులు పూసల అనిల్, గన్నవరపు రాజేష్, యసలపు పవన్, మిడిమళ్ల కుమార్, సూర్యకాంత్, సాయిపవన్, మనోజ్కుమార్ పాల్గొన్నారు. గతమెంతో ఘనం ప్రజా సంకల్ప యాత్ర సమయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక మంది యువత కష్టాలు చూశారు. నిరుద్యోగ సమస్యను పారద్రోలాలని భావించారు. అధికారంలోకి వచ్చాక అనుకున్నదే తడవుగా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. జిల్లా వ్యాప్తంగా 620 గ్రామ వార్డు సచివాలయాల్లో 534 మంది నిరుద్యోగులను సచివాలయ ఉద్యోగులుగా నియమించారు. అలాగే వలంటీర్ వ్యవస్థ ద్వారా రెండు లక్షల ఉద్యోగాలను కల్పించారు. ఇదిలా ఉంటే నేడు జాబ్ క్యాలెండర్ లేక, నిరుద్యోగ భృతి అందక, ఉన్నత చదువులు చదివిన యువత పొరుగు రాష్ట్రాలకు వలస బాట పడుతున్నారు. బీటెక్, ఎంటెక్, పీజీలు చదివిన విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు లేక హైదరాబాద్, బెంగళూర్, చైన్నె తదితర రాష్ట్రాలకు పొట్టచేత పెట్టుకుని వెళ్లిపోతున్నారు. ప్రభుత్వ నిర్వాకంతో ఉద్యోగాలు లేక చాలామంది వయసు దాటిపోతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం, ప్రభుత్వాన్ని మేల్కొలిపేందుకు వైఎస్సార్ సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో యువత, విద్యార్థులకు మద్దతుగా ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఫ ఎన్నికల హామీలు బుట్టదాఖలు ఫ రెండేళ్లుగా ఉద్యోగం లేదు.. భృతి రాదు ఫ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.72. 59 కోట్లు ఫ నేడు వైఎస్సార్ సీపీ విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యాన పోరుబాట -
ఎగసి పడుతున్న అలలు
కొత్తపల్లి: కడలి కల్లోలంగా మారింది. కెరటాల ఉధృతి పెరిగింది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఉప్పాడ, కోనపాపపేట తీర ప్రాంతాల్లో కెరటాలు ఎగసి పడుతున్నాయి. ఇప్పటికే కెరటాల తాకిడికి ఉప్పాడ– కాకినాడ బీచ్ రోడ్డు కోతకు గురైంది. బీచ్ రోడ్డులో రక్షణ గోడగా వేసిన బండరాళ్లు సైతం కెరటాల ఉధృతికి రోడ్డుపైకి వస్తున్నాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. మత్య్సకారులు వేటకు వెళ్లరాదని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. పీజీఆర్ఎస్కు 343 అర్జీలు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): స్థానిక కలెక్టరేట్లోని వివేకానంద హాలులో సోమవారం జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ నిర్వహించారు. ప్రజల నుంచి కలెక్టర్ ఎం.హరేంధిర ప్రసాద్ అర్జీలను స్వీకరించారు. మొత్తం 343 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అర్జీదారుల సమస్యలను అధికారులు ఓపిగ్గా విని పరిష్కారానికి కృషి చేయాలన్నారు. -
విద్యుత్ తీగల దొంగలు దొరికారు
ఫ రెండు కేసుల్లో 9 మంది అరెస్ట్ ఫ వివరాలు వెల్లడించిన సీఐ వీరయ్య గౌడ్ రాజానగరం: వెలుగుబంద, పాలచర్ల తదితర ప్రాంతాల్లోని లేఅవుట్లలో ఉన్న విద్యుత్ స్తంభాల నుంచి తీగలను, పొలాల్లో బోర్ల వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలోని కాపర్ వైర్ను చోరీ చేస్తున్న రెండు ముఠాలను పట్టుకున్నామని రాజానగరం సీఐ వీరయ్య గౌడ్ తెలిపారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన మంగి సుధాకరరెడ్డి, అల్లూరి సీతారామరాజు జిల్లా రంగినిగూడకు చెందిన కిల్లో రాజు, బోండాంకు చెందిన పొంగి విజయ్, బసికి చెందిన కొర్రా ప్రహ్లాదలను ఒక కేసులో అరెస్ట్ చేశామన్నారు. వీరు గత ఏడాది నుంచి రాజానగరం, సీతానగరం, కొవ్వూరు మండలాల్లోని విద్యుత్ స్తంభాల నుంచి తీగలను కత్తిరించి అపహరిస్తున్నారని, వీరిపై జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో తొమ్మిది కేసులు ఉన్నాయన్నారు. నిందితుల నుంచి రూ.3,57,500 విలువైన 1,430 కిలోల అల్యూమినియం కండక్టింగ్ వైరును స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఫ మరో కేసులో కాకినాడ జిల్లా గండేపల్లికి చెందిన శివగంగ బాబూరావు, నేమవరపు మురళీకృష్ణ, మేడిశెట్టి మణికంఠ, బసమని వీరబాబు, శివగంగ రాజులను అరెస్ట్ చేశారని సీఐ తెలిపారు. వీరు కూడా రాజానగరం, సీతానగరం మండలాల్లోని పొలాల వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పగలకొట్టి, దానిలోని కాపర్ వైర్ను దొంగిలిస్తున్నారన్నారు. తోటల్లో ఉండే గెస్ట్ హౌస్ల వద్ద, లేఅవుట్లలోని విద్యుత్ స్తంభాల నుంచి తీగలను కత్తిరించి అపహరిస్తున్నారని తెలిపారు. వీరిపై జిల్లాలో 9 కేసులు నమోదు కాగా రాజానగరం పోలీసు స్టేషన్ పరిధిలో ఏడు కేసులు ఉన్నాయన్నారు. వీరి నుంచి 361 కేజీల అల్యూమినియం తీగలను కరిగించి తయారు చేసిన దిమ్మలు, 23 కేజీల రాగి దిమ్మలతో పాటు దొంగతనానికి ఉపయోగించిన ఒక ఆటో, రెండు బైకులను స్వాధీనపర్చుకున్నామని వివరించారు. ఎస్సై ప్రియకుమార్ ఆధ్వర్యంలో ఈ రెండు కేసులలో చోరులనుచాకచక్యంగా పట్టుకున్నారని సీఐ తెలిపారు. -
రాష్ట్ర స్థాయిలో రంగంపేట విద్యార్థినుల సత్తా
ఫ క్లే మోడలింగ్ పోటీల్లో ప్రథమ స్థానం ఫ అభినందించిన హెచ్ఎం, ఉపాధ్యాయులు రంగంపేట: రాష్ట్ర స్థాయి క్లే మోడలింగ్ పోటీల్లో రంగంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థినులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటారు. కాకినాడ జిల్లా కోరింగ వన్యప్రాణి అభయారణ్యంలో ఈ నెల 26న వరల్డ్ వైల్డ్ ఫారెస్ట్ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మ్యాంగ్రోవ్ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఈ పోటీలు నిర్వహించారు. పాఠశాలకు చెందిన సత్య, జ్ఞాన, లక్ష్య, కార్తీక, సంతోషిణితో కూడిన బృందం ఆ పోటీల్లో ప్రథమ బహుమతి సాధించిందని ప్రధానోపాధ్యాయుడు వి.పార్థసారథి తెలిపారు. ఈ మేరకు సోమవారం పాఠశాలలో నిర్వహించిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ తమ విద్యార్థినులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానాన్ని సాధించడం గర్వకారణమన్నారు. విద్యార్థినులకు శిక్షణ అందించిన జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు రమ్యసుధ మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సుమారు 300 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారని తెలిపారు. తమ విద్యార్థినులు కోరింగ ఆవరణ వ్యవస్థ అంశంపై క్లే మోడల్ను రూపొందించి న్యాయనిర్ణేతల ప్రశంసలు అందుకుని ప్రథమ బహుమతిని సాధించారని వివరించారు. విజేత విద్యార్థినులను, గైడ్ టీచర్ రమ్యసుధను మండల విద్యాశాఖ అధికారులు కె.శ్రీనివాసరావు, పి.మధుసూదనరావు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా అభినందించారు. -
ప్రకృతి సంపద పరిరక్షణలో ఎఫ్బీవోలు కీలకం
రాజానగరం: దేశంలోని ప్రకృతి సంపదను పరిరక్షించడంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల (ఎఫ్బీవో)ల పాత్ర కీలకమని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన యూనివర్సిటీ వీసీ డాక్టర్ ధనుంజయరావు అన్నారు. అటవీ సంపదను కాపాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా గురుతర బాధ్యతను నిర్వర్తిస్తున్నారన్నారు. లాలాచెరువులోని ఏపీ స్టేట్ ఫారెస్ట్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసిన ఎఫ్బీవోలకు సోమవారం నిర్వహించిన స్నాతకోత్సవంలో సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ధనుంజయరావు మాట్లాడుతూ పర్యావరణ స్థిరత్వానికి, వాతావరణ సహనశీలతకు వ్యవసాయం, ఉద్యానం, అడవులు అనుసంధానమైన మూలస్తంభాలన్నారు. ఈ క్రమంలో అటవీ శాఖతో తమ యూనివర్సిటీ ఎంవోయూ కుదుర్చుకోవాలని భావిస్తుందన్నారు. అకాడమీ డైరెక్టర్ బి.విజయ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్కి నూతనంగా ఫారెస్ట్ అకాడమీని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిందన్నారు. అలా 2017 నుంచి ఇప్పటివరకు అకాడమీలో 878 మంది అటవీ ఫ్రంట్లైన్ సిబ్బందికి శిక్షణ ఇచ్చామని తెలిపారు. కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, అకాడమీ అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
యువత పోరాటం స్ఫూర్తిదాయకం
ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య కాకినాడ రూరల్: రమణయ్యపేట ఇందిరా కాలనీలో సోమవారం ఉదయం సిరిమల్లి పవన్ కుమార్ (21) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సర్పవరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలిటెక్నిక్ డిప్లమో పూర్తి చేసిన పవన్ కుమార్ ఇంటి వద్దే ఉంటున్నాడు. తండ్రి ట్రావెల్స్లోను, తల్లి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయంలో స్వీపర్గా పనిచేస్తున్నారు. తల్లిదండ్రులిద్దరూ ఉదయం విధులకు వెళ్లిన తర్వాత పవన్ కుమార్ ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని మృతి చెందాడు. తల్లి సిరిమల్లి దుర్గాభవాని ఫిర్యాదు మేరకు ఎస్సై లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో ఖాళీగా ఉండడంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. పవన్కుమార్ కుటుంబం 2004లో కరీంనగర్ నుంచి కాకినాడకు వచ్చి స్థిరపడింది. బోట్క్లబ్ (కాకినాడ సిటీ): నీట్ పరీక్ష కోసం చనిపోయిన 93 మంది విద్యార్థులకు ఉద్యమాన్ని అంకితమిస్తున్నామని జై భీమ్రావ్ భారత్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రముఖ న్యాయవాది జగ్గారపు మల్లికార్జున అన్నారు. కాకినాడలోని పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద యువత నిర్వహించిన పోరాటం అందరికీ స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ఆ నిరసనకు తమ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ మద్దతు తెలిపారన్నారు. యువతతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ తెలుసుకోవాలన్నారు. ఈ కారు ఎవరిదో! కాట్రేనికోన: పల్లంకుర్రు శివాలయం సమీపంలోని చింతల చెరువు రోడ్డులో అనుమానాస్పద కారు కలకరం లేపుతోంది. ఏపీ 05 ఈడబ్ల్యూ 0123 నంబర్ గల కారును కొన్ని నెలలుగా రోడ్డు పక్కనే గుర్తు తెలియని వ్యక్తులు పార్కు చేసి వదిలేశారు. ఆ కారు సుదీర్ఘ కాలం ఉండటంతో కుట్ర కోణం ఏమైనా ఉందానే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు స్పందించి కారు నంబర్ ఆధారంగా సమాచారం సేకరించి అపరిచితులను గుర్తించాలన్నారు. -
మోదీ పాలనలో 152 సార్లు పేపర్ల లీక్
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే 12 ఏళ్ల పాలనలో 152 సార్లు పేపర్లు లీక్ అయ్యాయని, అయితే ఏ ఒక్కదానిలో ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోలేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి విమర్శించారు. రాజమహేంద్రవరంలోని ధర్మంచర కమ్యూనిటీ హాల్లో సోమవారం కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజుతో కలసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని, వారి ఇళ్లలో అర్హులకు ఉద్యోగం ఇవ్వాలని, అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్డీయే విధానాలను నిరసిస్తూ ఆగస్టు 9న ఢిల్లీలో కాంగ్రెస్ భారీ ర్యాలీ తలపెట్టిందని రుద్రరాజు అన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బోడా వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
కొండంత భారం తగ్గాల్సిందే!
చెక్కుల బౌన్స్పై ఆగ్రహం వివిధ వ్యాపారస్తులు ఇచ్చిన సుమారు 20 చెక్కులు బౌన్స్ కావడంపై ట్రస్ట్బోర్డు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెక్కు బౌన్స్ అయిన సందర్భంగా ఆ వ్యాపారులు డబ్బును జమ చేయకపోతే వారిపై కేసులు వేయాలని సూచించారు. దేవస్థానం ఈఓ నల్లం సూర్య చక్రధరరావు, ట్రస్ట్బోర్డు సభ్యులు, దేవస్థానం అధికారులు పాల్గొన్నారు. ఫ అన్నవరం ట్రస్ట్బోర్డు సమావేశంలో సభ్యుల తీర్మానం ఫ ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై చర్చ ఫ లీజు బకాయి ఫైళ్ల పరిశీలన అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వెంకట సత్యనారాయణస్వామివారి దేవస్థానంలో షాపుల లీజుదారులు బకాయిలు చెల్లించకపోతే వెంటనే షాపులను మూసివేయించాలని దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశంలో సభ్యులు ఆదేశించారు. చైర్మన్ ఐవీ రోహిత్ అధ్యక్షతన సోమవారం ఉదయం 11 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. దేవస్థానంలో వివిధ షాపులను టెండర్ కం బహిరంగ వేలం ద్వారా లీజుకు తీసుకున్న వ్యాపారస్తులు దేవస్థానానికి రూ.నాలుగు కోట్లు బకాయి పెట్టారని ‘సాక్షి’ పత్రికలో కొండంత భారం శీర్షికన శనివారం ప్రచురితమైన వార్త ఆధారంగా చర్చ జరిపారు. కాఫీ మెషీన్ల షాపుల నుంచి పూజా ద్రవ్యాల దుకాణాల వరకు అన్ని వ్యాపారాల బకాయిలుపై ట్రస్ట్ బోర్డు సభ్యులు సమీక్షించారు. వచ్చే సమావేశం నాటికి బకాయిలన్నీ వసూలు చేయాలని ఆదేశించారు. కాగా.. ఈ నెలలో రూ.2.60 కోట్ల బకాయిలు వసూలు చేశామని అధికారులు తెలిపారు. ఆ మొత్తంలో కొత్తగా వేలం జరిగిన రెండో నెంబర్ పూజా ద్రవ్యాల షాపు పాడిన నిర్వాహకుడు జమ చేసిందే రూ.1.20 కోట్లు ఉండడం విశేషం. ఇతర తీర్మానాలు ఫ సత్యగిరిపై విష్ణుసదన్ ఉత్తరం వైపుగల ఖాళీ స్థలంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో 300 గదుల సత్రం నిర్మాణానికి టీటీడీ ఈవోను కోరుతూ తీర్మానం చేశారు. ఫ దేవస్థానం కళాశాల విద్యార్థులకు దేవస్థానం నిధులతో మధ్యాహ్న భోజనం పెట్టాలని తీర్మానించారు. సత్యదేవుని నిత్యాన్నదాన పథకానికి దాతలు ఇచ్చిన విరాళాల నుంచి మధ్యాహ్న భోజనం పెట్టడానికి గతంలో తీర్మానించి ఈ నెల రెండో తేదీ నుంచి మూడు రోజులు అమలు చేసిన విషయం తెలిసిందే. అయితే అన్నదానం నిధుల వినియోగంపై విమర్శలు రావడంతో నిలిపివేశారు. ఫ రత్నగిరిపై 23 అడుగుల ఎత్తు కలిగిన గరుడ విగ్రహాన్ని కాంక్రీట్తో నిర్మించేందుకు కాకినాడకు చెందిన దాత లింగంగుంట సుమలత ముందుకు వచ్చినందున, దీనిపై నిర్ణయాన్ని వచ్చే సమావేశానికి వాయిదా వేశారు. ఫ ప్రముఖ దాతలు, దేవస్థానం ట్రస్ట్బోర్డు ప్రత్యేక ఆహ్వానితులు మట్టే సత్యప్రసాద్, ఎంఎస్ రెడ్డిలకు ట్రస్ట్బోర్డు సమావేశం అజెండా పంపకపోవడంపై సభ్యుడు రావిపాటి సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై నిబంధనలను అనుసరించి చర్యలు తీసుకుంటామని ఈవో తెలిపారు. ఫ ఆలయ ప్రాకారంలో అగరవత్తుల విక్రయ షాపు, నిర్మాల్య పత్రితో తయారు చేసే ఉత్పత్తుల విక్రయించే షాపుతో భక్తులకు అసౌకర్యంగా ఉన్నందున వీటి లీజు రద్దు చేసే విషయాన్ని తదుపరి సమావేశానికి వాయిదా వేశారు. ఫ ఈఓ కార్యాలయం దిగువన గల పాత మెయిన్ క్యాంటీన్ను సేవా కార్యకర్తలకు వసతి కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సభ్యులుతీర్మానించారు. -
ఏకలవ్య విద్యార్థినికి తీవ్ర అస్వస్థత
అడ్డతీగల: వేటమామిడి ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న యాట్ల సాత్విక అనే గిరిజన విద్యార్థిని సోమవారం తీవ్ర అస్వస్థతకు గురైంది. గంగవరం మండలం నీలవరానికి చెందిన ఆ విద్యార్థిని రెండేళ్లుగా ఏకలవ్య స్కూల్లో చదువుకుంటోంది. సోమవారం సాయంత్రం ఊపిరాడని పరిస్థితి తలెత్తడంతో స్కూల్ సిబ్బంది అడ్డతీగల సీహెచ్సీకి చికిత్స కోసం తరలించారు. గతం నుంచి ఈ బాలికకు షుగర్ ఉన్న నేపథ్యంలో దానికి మందులు వాడుతోందని బాలిక బంధువులు, ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. షుగర్ ఎక్కువగా ఉన్న కారణంగా ఊపిరాడని పరిస్థితి తలెత్తిందని వైద్యులు తెలిపారు. ప్రాథమిక వైద్యం అందించిన వెంటనే అంబులెన్స్లో రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించారు. ముగిసిన సీబీఎస్ఈ స్కేటింగ్ పోటీలు నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ వివేకానంద పార్కు ఆవరణలోని వైఎస్సార్ మున్సిపల్ స్కేటింగ్ రింక్లో నాలుగు రోజులుగా లిటిల్ వుడ్స్ స్కూల్ ఆధ్వర్యంలో జరుగుతున్న సీబీఎస్ఈ సౌత్జోన్ స్కేటింగ్ పోటీలు సోమవారం సాయంత్రం ముగిశాయి. చివరి రోజు కార్యక్రమానికి లిటిల్వుడ్స్ స్కూల్ చైర్మన్ జీకేవీవీ నాగేశ్వరరావు, డైరెక్టర్లు జి.రాధాలక్ష్మి, శ్రీరామ్ సుహాన్లు అతిథులుగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పాండిచ్చేరి, తమిళనాడు, అండమాన్ నికోబార్ నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. అండర్ 9, 11, 17 బాలుర, బాలికల విభాగాల్లో పోటీలు జరిగాయి. క్రీడాస్ఫూర్తిని అలవర్చుకోవాలి విద్యార్థులు క్రీడాస్ఫూర్తిని అలవర్చుకోవాలని అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్ అన్నారు. కాకినాడ సురేష్ నగర్లోని శ్రీప్రకాష్ స్కూల్లో సీబీఎస్ఈ బాలుర బ్యాడ్మింటన్ పోటీలు ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి కాకినాడ సిటీ, రూరల్ ఎమ్మెలేలు కొండబాబు, పంతం నానాజీలు, ఎన్సీసీగ్రూప్ కాకినాడ కమాండెంట్ కల్నల్ రితిన్ మోహన్ అగర్వాల్ అతిథులుగా విచ్చేశారు. అండర్ 14, 17, 19 విభాగాల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.సామర్లకోట: పెద్దాపురం రామారావుపేట లోని శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాలన చేతన్ ఆనంద్ సందర్శించారు. పాఠశాల ఆవరణ, అక్కడి ఆట స్థలాలను పరిశీలించి, విద్యార్థులతో ముచ్చటించారు.శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాల డైరెక్టర్ విజయ్ ప్రకాష్ మాట్లాడుతూ తల్లిదండ్రులు సూచించిన మార్గంలో విద్యార్థులు ప్రయా ణం చేస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. అనంతరం పాఠశాలలో ఉత్తమ విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, ఆత్మకథ పుస్తకాలను అందజేశారు. జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు.. తుని: శ్రీప్రకాష్కు చెందిన అండర్ – 19 బాలికల ఖోఖో జట్టు సీబీఎస్ఈ క్లస్టర్ పోటీల్లో విజయం సాధించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించిందని సంయుక్త కార్యదర్శి సీహెచ్ విజయ్ ప్రకాష్ తెలిపారు. ఆయన సోమవారం మాట్లాడుతూ ఈ నెల 23 నుంచి 26 వరకు తెలంగాణలోని కరీంనగర్లో నిర్వహించిన ఖోఖో పోటీల్లో ఈ జట్టు విజయం సాధించి, బంగారు పతకాన్ని కై వసం చేసుకుందన్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు రాజధాని చైన్నెలో సెప్టెంబర్ 19 నుంచి 23 వరకు జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటుందన్నారు. -
శిశువు కోసం ‘సమరం’
కాకినాడ క్రైం: ఓ తల్లి కన్న శిశువును తమకివ్వాలని కొందరు హిజ్రాలు ఘర్షణకు దిగడంతో కాకినాడ జీజీహెచ్లో అలజడి రేగింది. వివరాల్లోకి వెళితే.. అమలాపురానికి చెందిన 30 ఏళ్ల ఆకుమర్తి మేరీ కుమారి తన భర్త ఉండుర్తి శ్రీనుతో విడిపోయింది. 9 ఏళ్ల కుమార్తె ఉండగా తండ్రితోనే ఉంటోంది. ఆ తర్వాత మేరీకి నరేష్ అనే వ్యక్తితో పరిచయమైంది. ఏడాదిన్నర క్రితం అమలాపురం నుంచి ఆమెను తీసుకొచ్చిన నరేష్ రాజమహేంద్రవరంలో నివాసం ఉంటూ సహజీవనం చేశాడు. ఈ క్రమంలో మేరీ కుమారి గర్భం దాల్చింది. ఆ విషయం తెలిసి నరేష్ ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. పోషణ బరువవ్వడంతో నిండు చూలాలిగా రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్లో భిక్షాటన చేస్తూ మేరీ బతుకీడుస్తోంది. దీనగాథ విని.. : సామర్లకోటకు చెందిన శ్రీకన్య అనే హిజ్రా సుమారు 10 రోజుల క్రితం రైలులో భిక్షాటన కోసం రాజమహేంద్రవరానికి వెళ్లింది. అక్కడ స్టేషన్లో మేరీని చూసి, ఆమె డబ్బులు అడగడంతో రూ.50 ఇచ్చింది. ఆమె దీనగాథ విన్న శ్రీకన్య చలించి చేరదీసింది. గర్భిణి అనుమతితో సామర్లకోటకు తీసుకొచ్చి ఇంట్లో ఉంచింది. ఇంటికి చేరాక, నీ బిడ్డను నాకిస్తావా.. నిన్ను. బిడ్డను బాగా చూసుకుంటానని కోరింది. అందుకు మేరీ అంగీకరించింది. అప్పటి నుంచి మంచి ఆహారంతో పాటు వైద్య సదుపాయాలు అందించింది. ప్రసవ నొప్పులు రావడంతో ఈ నెల 24వ తేదీ అర్ధరాత్రి మేరీని శ్రీకన్య కాకినాడ జీజీహెచ్లో చేర్చింది. 25వ తేదీ మధ్యాహ్నం 12.15 గంటలకి మేరీ 2.5 కిలోల బరువుతో పండంటి మగ బిడ్డను ప్రసవించింది. ఆస్పత్రిలో ఘర్షణ : బిడ్డను శ్రీకన్యకు ఇవ్వడానికి ఆమె తల్లి ఒప్పకోకపోవడంతో గొడవ మొదలైంది. ఆసుపత్రిలోని ప్రసూతి వార్డులో మేరీకుమారి, శ్రీకన్య మధ్య జరిగిన వాగ్వాదం చిలికి చిలికి గాలివానగా మారింది. ఆసుపత్రి వర్గాల ద్వారా విషయం వన్స్టాప్ సెంటర్కు చేరింది. పీడీ చెరుకూరి లక్ష్మి ఆదేశాల మేరకు, సిబ్బంది మేరీకి రక్షణగా నిలిచారు. వార్డులో వైద్య సిబ్బంది సాయంతో ఆమెను సంరక్షిస్తున్నారు. తన బిడ్డను ఇవ్వనని, తమ ఇద్దరికీ రక్షణ కల్పించాలని బాలింత వారిని కోరింది. ఈ నేపథ్యంలో శ్రీకన్య సోమవారం సాయంత్రం మరికొందరు హిజ్రాలతో కలిసి ఆసుపత్రిలో ఘర్షణకు దిగింది. వారంతా వార్డును చుట్టుముట్టడంతో ఆసుపత్రి అధికారులు అప్రమత్తమయ్యారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఘర్షణ తాత్కాలికంగా సద్దుమణిగింది. ఆ బిడ్డ తనదేనంటూ శ్రీకన్య బృందం వాదిస్తుండడంతో మేరీకి, ఆమె బిడ్డకు వార్డులో పోలీస్ భద్రత మధ్య వైద్య సేవలు కొనసాగుతున్నాయి. ఫ కాకినాడ జీజీహెచ్లో అలజడి ఫ హిజ్రాలు, బాలింత మధ్య ఘర్షణ -
డివైడర్ను ఢీకొని లారీ బోల్తా
రావులపాలెం: జాతీయ రహదారిపై రావులపాలెంలోని కళా వెంకట్రావు సెంటర్లో సోమవారం తెల్లవారుజామున లారీ బోల్తా పడింది. కోల్కతా నుంచి భీమవరానికి బీఎస్ఎన్ఎల్కు సంబంధించిన గొట్టాలను ఈ లారీలో తీసుకువెళుతున్నారు. రావులపాలెం వద్ద డ్రైవర్కు నిద్రమత్తు వచ్చి, డీవైడర్ను ఢీకొనడంతో లారీ బోల్తా కొట్టింది. ఆ సమయంలో అక్కడ ట్రాఫిక్ లేకపోడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో డైవరుకు స్వల్ప గాయాలు అయ్యాయి. హైవే, పోలీసులు అధికారులు గొట్టాలను వేరే లారీపైకి లోడ్ చేయించి క్రేన్ సాయంతో లారీని తొలగించారు. -
చెత్త వ్యాన్ ఢీకొని యువకుడి మృతి
పెరవలి: కట్టుకున్న భర్త మృతి చెందాడు, చేతికంది వచ్చిన కుమారుడు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లి రోదిస్తున్న తీరు కంటతడి పెట్టించింది. కొవ్వూరు పట్టణంలో చెత్త వ్యాన్ ఢీకొన్న ఘటనలో యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన మోస మణికంఠ (19) పెయింటింగ్, కూలి పనులు చేసుకుంటూ తల్లిని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం పని ముగించుకుని మోటారు సైకిల్పై ఇంటికి వస్తున్న అతడిని మున్సిపాలిటీకి చెందిన చెత్త వ్యాన్ ఢీకొంది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన మణికంఠను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలిసిన తల్లి నాగమణి విలపిస్తూ ఆసుపత్రికి చేరుకుని కుమారుడి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించింది. తండ్రి లేకపోయినా ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేసిన కుమారుడు ఆసరాగా ఉన్న సమయంలో భగవంతుడు తీసుకుపోయాడని, తాను ఎవరి కోసం బతకాలి అంటూ దీనంగా రోదించింది. డ్రైవర్ లేకపోవడంతో.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మున్సిపాలిటీ చెత్త వ్యాన్ను అనుభవం ఉన్న డ్రైవర్ కాకుండా మున్సిపాలిటీ సిబ్బంది నడిపినట్టు తెలిస్తోంది. ఆ వ్యాన్కు శాశ్వత డ్రైవర్ లేకపోవటంతో పారిశుధ్య కార్మికులే నడుపుతున్నారని, అందుకే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. -
త్వరలో ఓరియంటేషన్ తరగతులు
ఇన్స్పైర్ మనక్ ప్రాజెక్టుల రూపకల్పనపై త్వరలోనే సైన్స్ ఉపాధ్యాయులకు ఓరియంటేషన్ తరగతులు నిర్వహిస్తాం. విద్యార్థులు తమ ప్రతిభను నిరూపించుకుని బాల శాస్త్రవేత్తలుగా ఎదగడానికి నేందుకు ఇన్స్పైర్ మనక్ పోటీలు ఒక చక్కటి అవకాశం. – జి.నాగమణి, ఆర్జేడీ, పాఠశాల విద్యాశాఖ, కాకినాడ ఆ బాధ్యత సైన్స్ ఉపాధ్యాయులదే.. జిల్లాలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సైన్సు ఉపాధ్యాయులు ప్రాజెక్టులు తయారు చేసే విధంగా విద్యార్థులను ప్రోత్సహించాలి. రాష్ట్ర స్థాయిలో పోటీ పడే విధంగా ప్రాజెక్టులకు రూపకల్పన చేయాలి. – గిరజాల వెంకట సత్య సుబ్రహ్మణ్యం, జిల్లా సైన్స్ అధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ● -
బీసీల సంక్షేమంలో చంద్రబాబు విఫలం
● మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన ● చర్చకు పిలుస్తుంటే రాజకీయాలు మాట్లాడుతున్నారని ఎద్దేవా రాజమహేంద్రవరం రూరల్: బలహీన వర్గాల సంక్షేమంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ విమర్శించారు. వైఎస్ జగన్ పాలనలో బలహీన వర్గాలకు విస్తృతంగా మేలు జరిగిందని, ప్రస్తుతం విద్య, ఆరోగ్యం, సంక్షేమ రంగాల్లో బీసీలు నష్టపోతున్నారని తెలిపారు. ఆదివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ బీసీలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయలేకపోయిందని విమర్శించారు. బలహీన వర్గాల సంక్షేమంపై మాట్లాడే నైతిక హక్కు ఈ ప్రభుత్వానికి లేదన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీసీలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని తెలిపారు. బీసీలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేసిన మేలును నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం కూడా తమ పనితీరును ప్రజల ముందు వివరించాలని సవాల్ విసిరారు. దీనికి చంద్రబాబు ప్రభుత్వంలోని మంత్రి స్పందిస్తూ బలహీన వర్గాల గురించి మాట్లాడే అర్హత వైఎస్సార్ సీపీకి లేదని మాట్లాడుతున్నారని, బలహీన వర్గాలకు ఎవరు మంచి చేశారో చర్చకు వస్తే ప్రజలే నిర్ణయిస్తారని వేణుగోపాలకృష్ణ తెలిపారు. దానిని పక్కన పెట్టి తాను సుబ్బారెడ్డికి నమస్కారం పెట్టిన విషయం పైన, జోగి రమేష్ కుటుంబ వ్యవహారం పైన, సీదిరి అప్పలరాజు కుమారుడి యాక్సిడెంట్ గురించి మాట్లాడుతూ వ్యక్తిత్వ హననం చేస్తున్నారన్నారు. బీసీల సమస్యలపై చర్చకు రమ్మంటుంటే చంద్రబాబు ప్రభుత్వం భయపడుతోందన్నారు. బలహీన వర్గాల ప్రయోజనాలను పణం పెట్టి.. బీసీ నాయకులు మాట్లాడితే వారిపై కేసులు పెడుతున్నారన్నారు. అన్యాయంగా పెడుతున్న కేసులకు ప్రజలే చంద్రబాబు ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరపడుతున్నాయని వేణు స్పష్టంచేశారు. -
మమ అనిపింఛెన్..
రాజమహేంద్రవరం సిటీ: దశాబ్దాల తరబడి జీవితాన్ని విధులకు అర్పించిన ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల వృద్ధాప్య జీవితం అగమ్యగోచరంగా తయారైందని ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ)లో 34–38 ఏళ్ల పాటు తమ ఉద్యోగ జీవితంలో అహర్నిశలు శ్రమించి పని చేసిన తమకు మందుల కొనుగోలుకు సైతం సరిపోని పెన్షన్ ఇస్తున్నారని దీని వలన జీవితం దుర్భరంగా మారిందని ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర మనోవేదన చెందుతున్నారు. 2014కు పూర్వం ఏపీఎస్ఆర్టీసీలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన వారికి ఈపీఎఫ్ఓ ద్వారా రూ.వెయ్యి పెన్షన్ వచ్చేది. 2014 తర్వాత ఉద్యోగ విరమణ చేసిన వారికి రూ.వెయ్యి నుంచి మూడు వేలు పెన్షన్ మాత్రమే వచ్చే అవకాశం ఉందని ఈ విధమైన పెన్షన్తో ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సామాజిక పింఛన్కు అనర్హులే.. తాము ఏపీఎస్ఆర్టీసీ సంస్థలో ఉద్యోగులుగా చేయడం వల్ల ఉద్యోగ విరమణ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అందించే ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్ సైతం పొందేందుకు అనర్హులమయ్యామని వారు ఆవేదన చెందుతున్నారు. పెరిగిన నిత్యావసరాల ధరలు, ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో వృద్ధాప్యంలో జీవితాన్ని కొనసాగించాలంటేనే ఇబ్బందిగా ఉందని వాపోతున్నారు. ఈపీఎఫ్ఓ కార్యాలయం ఎదుట ఎన్నిసార్లు నిరసనలు చేపట్టినా ఏ విధమైన చర్యలు కనిపించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి ప్రతి రిటైర్డ్ ఉద్యోగికి మినిమం పెన్షన్ రూ.9000 పెంచడంతో పాటు, రెండు డీఏలు ప్రకటించి రిటైర్డ్ ఉద్యోగి కుటుంబానికి వైద్య సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. జిల్లా పింఛన్దారులు కాకినాడ 615 తూర్పుగోదావరి 365 డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ 380 మొత్తం 1360 ప్రభుత్వ పింఛన్ కన్నా తక్కువ పింఛన్ సంస్థ, ప్రభుత్వం నుంచి రిటైర్డ్ ఉద్యోగులకు నిరాదరణ రాష్ట్ర వ్యాప్తంగా 27 వేల మంది పెన్షన్దారులు -
బాల శాస్త్రవేత్తలకు ఆహ్వానం
రాయవరం: విద్యార్థులకు కేవలం పుస్తక విజ్ఞానమే కాకుండా, ప్రయోగాత్మక పరిశోధనలపై మక్కువ పెంచేందుకు సరికొత్త వేదిక సిద్ధమైంది. ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో 32వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ 2026కు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 10–17 ఏళ్ల వయస్సు ఉన్న విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం, పరిశోధనా నైపుణ్యాలను వెలికి తీసేందుకు జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ వేదిక కానుంది. ఈ ఏడాది ‘సుస్థిరత కోసం సైన్న్స్, ఆవిష్కరణలు’ ప్రధాన ఇతివృత్తంతో పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ అన్ని యాజమాన్యాల పాఠశాలల విద్యార్థులు పోటీల్లో పాల్గొనవచ్చు. ఆసక్తి ఉన్న విద్యార్థులు తమ గైడ్ టీచర్ల సాయంతో ఈనెల 31లోగా పోర్టల్లో తమ వివరాలను నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఇలా.. జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ అధికారిక పోర్టల్ ఎస్సీఎస్సీ పోర్టల్లో వివరాలు నమోదు చేయాలి. విద్యార్థి పేరు, వయసు, ఈ మెయిల్ ఐడీ, ఫొటోగ్రాఫ్తో పాటు ప్రాజెక్ట్ శీర్షిక అవసరం. ఈ మెయిల్కు వచ్చే ఓటీపీ నమోదు చేసి వివరాలు పరిశీలించి ఓకే చేయాలి. ఈ నెల 1 నుంచి దేశ వ్యాప్తంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. విద్యార్థులు ఒంటరిగా గానీ లేదా ఇద్దరు కలిసి ఒక టీమ్ గానీ ప్రాజెక్టు సిద్ధం చేయవచ్చు. విద్యార్థులు తయారు చేసిన నివేదికను తెలుగు లేదా ఇంగ్లిష్ భాషలో సమర్పించవచ్చు. ఐదు ఉప అంశాలు ప్రతి పాఠశాల 5 ముఖ్యమైన ఉప అంశాల నుంచి కనీసం ఒక ప్రాజెక్ట్నైనా తప్పనిసరిగా సమర్పించాలి. ● వ్యర్థాల నిర్వహణ కోసం ఆర్–5 సూత్రం: (రెడ్యూస్, రీయూజ్, రీట్రైవ్, రీడిజైన్, రీసైకిల్) ● ఇంధనం/శక్తి(ఎనర్జీ)కోసం ఈ–4 సూత్రం (ఎక్స్ప్లోర్, ఎక్స్పరిమెంట్, ఎన్హేన్స్, ఎవాల్వ్) ● జల సంరక్షణలో భాగంగా నీరు (హార్వెస్టింగ్, రీసైక్లింగ్, కన్జర్వేషన్) ● ఆహారం, వ్యవసాయం, ఆరోగ్యం, సంస్కృతి, సంప్రదాయం, ఆరోగ్యకర ఆచరణలు అనే అంశాలు ఉంటాయి. ● అప్లికేషన్ ఆఫ్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ ఫర్ సస్టైనబిలిటీపోటీలు ఎప్పుడంటే? జిల్లా స్థాయిలో పోటీలు అక్టోబర్, నవంబర్ నెలల్లో నిర్వహిస్తారు. రాష్ట్ర స్థాయి పోటీలు డిసెంబరు నెలలో, జాతీయ స్థాయి పోటీలు వచ్చే ఏడాది జనవరి తర్వాత నిర్వహిస్తారు. జాతీయ స్థాయి పోటీల్లో విజేతలకు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు అందజేస్తారు. జిల్లా నుంచి అధిక శాతం మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
షాపుల లీజు బకాయిలపై ఆరా
అన్నవరం: స్థానిక వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో వివిధ షాపులను లీజుకు తీసుకున్న వ్యాపారులు రూ.నాలుగు కోట్ల బకాయిలు పెట్టిన వైనంపై ఆదివారం ‘సాక్షి’ దినపత్రికలో ‘కొండంత భారం’ శీర్షికన వచ్చిన కథనం వచ్చింది. దీనికి స్పందించిన దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు ఆదివారం ఆ దుకాణాలను పరిశీలించారు. ఆయా షాపుల నిర్వాహకులు చెల్లించాల్సిన బకాయిల గురించి సంబంధిత విభాగం ఏఈఓ అనకాపల్లి ప్రసాద్ను వివరణ కోరారు. సోమవారం ఉదయం దేవస్థానంలో జరగనున్న ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ బకాయిలకు సంబంధించిన పూర్తి వివరాలు అందజేయాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే దేవస్థానం ట్రస్ట్ బోర్డు సమావేశంలో ఈ లీజు బకాయిలతో పాటు వివిధ అంశాలపై చర్చించనున్నారు. -
ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా
దేవరపల్లి: న్యాయం కోసం ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగిన సంఘటన నల్లజర్ల మండలం దూబచర్లలో ఆదివారం జరిగింది. తన ఏడు నెలల పసిపాపతో ప్రియుడి ఇంటి ముందు కుటుంబ సభ్యులతో ఆమె బైఠాయించి పోరాటం చేస్తుంది. పెళ్లి చేసుకుంటానని తనను శారీరకంగా వాడుకుని, ముఖం చాటేస్తున్న అనిల్ కుమార్కు డీఎన్ఏ పరిక్ష చేసి తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేసింది. సంఘటనకు సంబంధించి బాధితురాలి కథనం ప్రకారం ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం గొల్లగూడేనికి చెందిన అడబాల హేమలత నల్లజర్ల మండలం దూబచర్లలో ఓ జీడిగింజల ఫ్యాక్టరీలో పనిచేసే సమయంలో ఫ్యాక్టరీ యజమాని కుమారుడు అనిల్కుమార్ తనకు మాయమాటలు చెప్పి ప్రేమిస్తున్నానని లొంగదీసుకున్నట్టు ఆమె తెలిపారు. తనను పెళ్లి చేసుకోవాలని అడగ్గా అలాగేనని నమ్మించి ముఖం చాటుశాడని ఆమె తెలిపారు. దీనిపై ఏడాది క్రితం నల్లజర్ల పోలీసులను ఆశ్రయించి జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేసింది. అయినప్పటికి తనకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదని ఆమె వాపోయారు. తనను మోసం చేసిన వ్యక్తికి ఇంతవరకు డీఎన్ఏ పరీక్ష చేయించలేదని ఆమె తెలిపారు. ఆమె తల్లి అడబాల లక్ష్మి కుమార్తెకు అండగా ఉన్నారు. దీనిపై నల్లజర్ల సీఐ రవికుమార్ను ‘సాక్షి’ వివరణ కోరగా ఈ సంఘటన 2025లో జరిగిందన్నారు. బాధితురాలు హేమలత ఇచ్చిన ఫిర్యాదుపై కేసు దర్యాప్తు పూర్తయిందని ఆయన తెలిపారు. అయితే అనిల్కుమార్కు డీఎన్ఏ పరీక్ష చేయించాలని హేమలత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం వల్ల కోర్టు ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నట్టు ఆయన తెలిపారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 23,000 గటగట (వెయ్యి) 20,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 22,000 గటగట (వెయ్యి) 19,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
నేడు ముద్రగడ సంస్మరణ సభ
బోట్క్లబ్ (కాకినాడ): కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ సోమవారం ఏర్పాటు చేయనున్నట్లు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా వెల్లడించారు. సమసమాజ స్థాపన, జాతి హక్కుల కోసం ముద్రగడ అలుపెరగని పోరాటం చేశారన్నారు. ప్రజల హక్కుల సాధనకు ఆయన, ఆయన కుటుంబం చేసిన పోరాటాలు చిరస్మరణీయమన్నారు. ఆయన సేవలను స్మరించుకుని, ఘన నివాళులు అర్పించేందుకు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కాకినాడలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో మధ్యాహ్నం 3.30 గంటలకు సంస్మరణ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సభలో వైఎస్సార్ సీసీ శ్రేణులు, కార్యకర్తలు, ముద్రగడ అభిమానులు పాల్గొని ఘన నివాళులు అర్పించాలని కోరారు. -
లోకేష్కు నైతికత లేదా?
ఫ డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి ఫ వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు సాక్షి ప్రతినిధి, కాకినాడ: డీఎస్సీలో పెద్దఎత్తున అక్రమాలు, అవినీతి జరిగిందని వైఎస్సార్ సీపీ స్పష్టం చేసింది.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విలేకరుల సమావేశంలో ఆధారాలు చూపించారు.. అయినా ఇప్పటి వరకు ప్రభుత్వం, విద్యా శాఖ మంత్రి లోకేష్ స్పందించలేదని ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. ఆదివారం జిల్లా కేంద్రమైన కాకినాడలో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. దీనిని బట్టి చూస్తే లోకేష్కు బాధ్యత, నైతికత ఉందా? అని ప్రశ్నించారు. అక్రమాలు నిరూపించాలని గతంలో లోకేష్ ఛాలెంజ్ చేస్తే.. తాము సిద్ధమయ్యామని, టీడీపీ నేతలు, లోకేష్ మాత్రం వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యక్తిత్వ హననం చేస్తూ తప్పించుకు తిరుగుతున్నారని దుయ్యబట్టారు. నీట్ అక్రమాలపై యువత పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తే.. బాధ్యత వహిస్తూ మీ కూటమిలోని బీజేపీకి చెందిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.. రాష్ట్రంలో జరిగిన డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ ఎందుకు రాజీనామా చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. లోకేష్కు నైతిక బాధ్యత లేదా అని నిలదీశారు. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణ ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. అక్రమ వ్యవహారం నిగ్గుతేలే వరకు వైఎస్సార్ సీపీ పోరాటాలు చేస్తుందని స్పష్టం చేశారు. తుపాన్ హెచ్చరికలతో వేటకు వెళ్లరాదు కొత్తపల్లి: తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని నియోజకవర్గ మత్స్యశాఖ అధికారి శివరామకృష్ణ అన్నారు. బంగాళాఖాతంలో వాయుగుండం తుపాన్గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లరాదని అన్నారు. కొత్తపల్లి మండలంలోని తీర ప్రాంత గ్రామాల్లో ఆదివారం మత్స్యశాఖ అధికారులు పర్యటించారు. తీర ప్రాంతంలో లంగరు వేసిన బోట్లను సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని, వలలు, వేట సామగ్రిని భద్రపరచుకోవాలని సూచించారు. వేటకు మత్స్యకారులు ఎవరైనా వెళ్తే, తక్షణమే తీరానికి చేరుకోవాలని అన్నారు. తుపాన్ కారణంగా సముద్రంలో అలల ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున, తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దీనిపై గ్రామాల్లో ప్రచారం చేయిస్తున్నట్లు వివరించారు. ఆర్డీఓ ఇంట్లో చోరీ పెద్దాపురంలో ఘటన సామర్లకోట: పెద్దాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి పి.కృష్ణమూర్తి ఇంట్లో శనివారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దాపురం రామారావుపేటలో ఆర్డీఓ కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నారు. రోజులాగే శనివారం ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడ్డారు. ఇంటి బీరువాలోని 10 కాసుల బంగారు ఆభరణాలు, రూ.70 వేలు చోరీ చేశారు. పెద్దాపురం డీఎస్పీ ఏబీజీ తిలక్ పర్యవేక్షణలో క్రైం సీఐ అంకబాబు, సీఐ వైఆర్కే శ్రీనివాసు, పెద్దాపురం పోలీసు సిబ్బంది, వేలిముద్ర నిపుణులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇంట్లో నిద్రిస్తున్న వారిపై మత్తు మందు పిచికారీ చేసి ఉంటారని, దీని కారణంగా మెలుకువ రాలేదనే వాదనలు వినిపించాయి. కాగా ఆర్డీఓ నివా సం ఉంటున్న ఇంటి వెనుక తలుపులు వేయకపో వడంతో అటు నుంచి దొంగలు ఇంట్లోకి చొరబడి ఉంటారని సీఐ శ్రీనివాసు తెలిపా రు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 30న సప్తకళా వేడుకలు ఐ.పోలవరం: పుల్లెల తాతయ్య మెమోరియల్ అసోసియేషన్ (పీటీఎం), ప్రజ్ఞా సాహితి సంయుక్త ఆధ్వర్యాన ఈ నెల 30న ఐ.పోలవరంలో సప్తకళా వేడుకలు నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన రావి బేబీ సత్యవాణి కూచిపూడి నృత్య ప్రదర్శన, సుప్రసిద్ధ రంగస్థల నటి మహంతి రమణ బృందంతో తారామణి నాటక ప్రదర్శన, ప్రముఖ మెజీషియన్ వి.శ్రీరామారావు మ్యాజిక్ షో ప్రధాన ఆకర్షణగా ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. వీటితో పాటు శాస్త్ర దిగ్గజాలు అనే అంశంపై వకృత్వం, పాటల పరిమళాలు, కవితా లహరి వంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని వివరించారు. ముఖ్య అతిథిగా పరిపాలనాధికారి బీహెచ్ఎస్ఆర్ సుబ్రహ్మణ్యం, విశిష్ట అతిథిగా ఎంఈఓ ఎన్.ప్రసాద్ కుమార్ పాల్గొంటారన్నారు. కార్యక్రమాల బ్రోచర్ను నిర్వాహకులు ఆదివారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో రేవు యజ్ఞశ్రీ, ప్రత్తి సత్తిబాబు, ఎ.వెంకట నారాయణ, వి.లక్ష్మీనారాయణ, పల్లెపు వెంకటేశ్వరరావు, ఎస్.పుల్లారావు పాల్గొన్నారు. -
పళ్లాలమ్మకు గాజుల అలంకరణ
కొత్తపేట: మండలంలోని వానపల్లి గ్రామ దేవత పళ్లాలమ్మ అమ్మవారు ఆదివారం గాజుల అలంకరణతో దర్శనమిచ్చారు. ఆషాఢమాసం ఆదివారాల్లో అమ్మవారికి వివిధ అలంకరణల్లో భాగంగా రెండో ఆదివారం ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మద్దింశెట్టి ఆదినారాయణ ఆధ్వర్యంలో గాజులతో అలంకరించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో భక్తులు ముఖ్యంగా మహిళలు సుమారు 20 వేలు గాజులు సమర్పించగా వాటిని దండలుగా కట్టి, ఆలయ ఆసాదులు అమ్మవారికి అలంకరించారు. అలాగే అమ్మవారికి ఆషాఢమాసం సారె ఆనవాయితీని అనుసరించి గ్రామస్తులు సారె కావళ్లు సమర్పించారు. అందరూ వానపల్లి కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి మేళతాళాలతో పళ్లాలమ్మ వారి ఆలయానికి చేరుకున్నారు. వివిధ రకాల స్వీట్స్ సుమారు 200 కేజీలు సారెను ఆసాదులు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. వానపల్లి పరిసర గ్రామాలకు చెందిన భక్తులు పాల్గొనగా వారికి తీర్థ, ప్రసాదాలు పంపిణీ చేశారు. గాజుల అలంకరణలో వానపల్లి గ్రామ దేవత పళ్లాలమ్మ -
క్రమశిక్షణ చర్యలు రద్దుపై 29న విచారణ
అన్నవరం: రత్నగిరిపై ప్రథమశ్రేణి వ్రత పురోహితుడిపై క్రమశిక్షణ చర్యలను దేవస్థానం ట్రస్ట్ బోర్డు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై విచారణకు హాజరు కావాలని దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు, పురోహితుడు గురుమూర్తిని దేవదాయ శాఖ అడిషనల్ కమిషనర్ ఎస్ఎస్ చంద్రశేఖర్ అజాద్ ఆదేశించారు. గత ఏడాది డిసెంబర్ 21న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సత్యదేవుని సామూహిక వ్రతాల నిర్వహణకు వెళ్లిన ఆరుగురు పురోహితుల బృందంలో మల్లాది గురుమూర్తి ఒకరు. ఆయన అక్కడ వ్రతకథ చెబుతూ భక్తులను గోదానం, భూదానం ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు ఫిర్యాదు అందింది. దీనిపై కమిషనర్ ఆదేశాల మేరకు అప్పటి ఈఓ వేండ్ర త్రినాథరావు విచారణ జరిపి గురుమూర్తికి రెండు ఇంక్రిమెంట్లు కట్ చేయడంతో పాటు భవిష్యత్లో వ్రతకథ చెప్పవద్దని మార్చి 21న ఆదేశించారు. కాగా, గత నెల 24న జరిగిన దేవస్థానం ట్రస్ట్బోర్డు సమావేశంలో గురుమూర్తిపై ఆ చర్యలను పాక్షికంగా రద్దు చేస్తూ తీర్మానం చేశారు. దీనిపై ఈ నెల 3న ‘సాక్షి’ దినపత్రికలో ‘ఒట్టి అమాయకుడు గురూ..’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ విషయమై 29న విచారణకు హాజరు కావాలని ఈఓ, పురోహితులను అడిషనల్ కమిషనర్ ఆదేశించారు. -
పందిరి సాగు.. లాభాలు బాగు
● లంక భూముల్లో ఎంతో అనుకూలం ● విత్తనశుద్ధి, జాగ్రత్తలు తప్పనిసరి ● విత్తన కొనుగోలుకు హెక్టార్కు రూ.మూడు వేల సాయం ఆలమూరు: వర్షాకాలం ప్రారంభమైనందున లంక భూముల్లో పందిరిపై సాగు చేసే కూరగాయల సాగుకు సమయం ఆసన్నమైంది. వేడి వాతావరణాన్ని తట్టుకోవడంతో పాటు నీటిని నిలుపుకొనే లంక మట్టి నేలలు ఈ పంటల సాగుకు అనుకూలంగా ఉంటాయి. అసలు ఈ సమయంలో ఏయే పంటలు సాగు చేయవచ్చు, విత్తనాలు కొనుగోలు, తెగుళ్ల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను కొత్తపేట డివిజన్ ఉద్యాన శాఖాధికారి జి.కోటేశ్వరరావు వివరించారు. జూలై నుంచి సెప్టెంబర్ వరకూ పందిరి కూరగాయలైన బీర, ఆనప, కాకర, పొట్ల, గుమ్మడి, బూడిద గుమ్మడితో పాటు వంగ, బెండ, టమాటా తదితర రకాలను సాగు చేసి అధిక దిగుబడులను సాధించవచ్చు. అన్ని సీజన్లలో వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకునే దొండ సాగును ఏడాది పొడవునా సాగు చేసుకునే అవకాశం ఉంది. ఆనప, బీర, పొట్ల, కాకర పంటను పందిరిపై పెంచితే మంచి నాణ్యమైన దిగుబడి వచ్చి అధిక లాభాలను పొందే అవకాశం ఉంటుంది. 25 వేల ఎకరాల్లోనే సాగు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 3.75 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగు చేస్తుండగా కేవలం 25 వేల ఎకరాల్లో మాత్రమే కూరగాయలు సాగు చేస్తున్నట్లు ఉద్యానశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఉద్యానశాఖ గతంలో రాయితీపై విత్తనాలను పంపిణీ చేయడగా ప్రస్తుతం ఆ పథకం నిలిచిపోయింది. విత్తనాల కొనుగోలు కోసం ఉద్యానశాఖ కేవలం హెక్టార్కు రూ.మూడు వేలు మాత్రమే ఆర్థికసాయం అందిస్తుంది. వంగ, క్యాబేజీ, కాలీఫ్లవర్ నారును ఉద్యానశాఖ సూచనలకు అనుగుణంగా రైతులే తయారు చేసుకుంటే పెట్టుబడి ఆదా అవుతుంది. కూరగాయలు సాగు చేసే రైతులు తమ భూమి పాస్బుక్, ఆధార్కార్డు, విత్తనాల బిల్లును ఉద్యానశాఖకు అంందజేస్తేనే ఈ రాయితీ అందుతుంది. విత్తే ముందు జాగ్రత్తలు తప్పనిసరి కూరగాయల సాగుకు తొలుత విత్తనశుద్ధి తప్పనిసరి. కిలో విత్తనానికి మూడు గ్రాముల ధైరమ్, ఐదు గ్రాముల ఇమిడా క్రోఫిన్ మందును ఒక దాని తరువాత మరొకటి కలిపి విత్తనశుద్ధి చేస్తే కూరగాయ మొక్కలు తెగుళ్లను తట్టుకునే శక్తి ఉంటుంది. విత్తే ముందు ఎకరానికి ఆరుటన్నుల పశువుల ఎరువు, 35 కిలోల భాస్వరం, 18 కిలోల పొటాష్ మిశ్రమాన్ని విత్తన గుంటల్లో వేయాలి. విత్తిన 25–30 రోజుల్లో లేదా పిందె దశలో సుమారు 30 కిలోల నత్రజనిని రెండు సమపాళ్లుగా చేసి మొక్కలకు అందించాలి. కూరగాయల సాగు వేయాలని నిశ్చయించుకుంటే వేసవిలోనే దుక్కి దున్ని ఉంచుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఎప్పటికప్పుడు కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కూరగాయ తోటలకు ఈ సీజన్లో పెంకు పురుగు, బూడిద తెగుళ్లు సోకే అవకాశం ఉంది. నులిపురుగు కూడా పంటను దెబ్బతీసే అవకాశం ఉండటంతో రైతులు అప్రమత్తంగా ఉండాలి. -
బతుకు దుర్భరంగా ఉంది
నా వయస్సు 83 సంవత్సరాలు. 38 ఏళ్ల పాటు సీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ (ఎస్టీఐ) ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యాను. నెలకు నాకు రూ.600 పెన్షన్ వస్తుంది. ఈ వృద్ధాప్యంలో ఏమీ చేయలేని పరిస్థితి. ఉద్యోగ విరమణ తరువాత జీవితం దుర్భరంగా మారింది. – కస్తూరి రామచంద్రరావు, రిటైర్డ్ ఉద్యోగి వైద్య ఖర్చులకు సరిపోవడం లేదు నా వయస్సు 71 సంవత్స రాలు. ఆర్టీసీలో 36 ఏళ్ల పాటు గ్రేడ్–3 ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా పని చేసి రిటైరయ్యాను. ప్రతి నెల నాకు ఈపీఎఫ్ఓ ద్వారా రూ.2475 మాత్రమే అందుతుంది. వైద్య ఖర్చులకు ఏ మాత్రం సరిపోని దుస్థితి. కేంద్ర ప్రభుత్వం కనీస పింఛన్ రూ.9 వేలకు పెంచి రిటైర్డ్ ఉద్యోగులను ఆదుకోవాలి. – ఓఆర్ బాబు, రిటైర్డ్ ఉద్యోగి, రాజమహేంద్రవరం జీవితం దయనీయం ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల జీవితం దయనీయంగా ఉంది. నిత్యావసరాల కొనుగోలు మాట అటుంచితే ఆరోగ్యం కోసం మందులు కొనుగోలుకు సైతం ఉపయోగం లేని పెన్షన్ ఇస్తున్నారు. తక్కువ పెన్షన్ అందుతున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే పింఛన్ మంజూరయ్యే విధంగా వెసులుబాటు కల్పించాలి. – యర్రంశెట్టి కొండలరావు, ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు● -
పుడుతూనే గిడుతు..
అమ్మ గర్భం నుంచి ఆపదలన్నీ దాటి ఊపిరిపోసుకున్న శిశువు ఊపిరిరాడక విలవిలలాడుతోంది. నవమాసాలు మోసి కన్న అమ్మ, బిడ్డ పుట్టే మైమరపులో బతికేస్తున్న నాన్న గుండెల్ని పిండేస్తుంది. ఏ దేవుడి తలరాతో.. కన్నైనా తెరవకుండానే కన్ను మూస్తున్న దయనీయత హృదయాంతరాళాల్ని బరువెక్కిస్తోంది. ముక్కుపచ్చలారని శిశుతనం అసువులు బాసుతోంది. ఈ పాపంలో సర్కారు నిర్లక్ష్యం అలముకుంది. జీజీహెచ్లోనే 169 మరణాలు కాకినాడ జీజీహెచ్ను చంటి పిల్లల వైద్య సేవలకు అత్యంత సురక్షిత కేంద్రంగా చెబుతారు. అందుకు కారణం కోరమండల్, ఓఎన్జీసీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు జీజీహెచ్ పీడియాట్రిక్స్ విభాగాన్ని పూర్తి సదుపాయాలతో తీర్చిదిద్దడమే. అటువంటి జీజీహెచ్లోనే 169 మంది శిశువులు చనిపోయారు. మరో 11 మంది జిల్లాలో వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో, 12 మంది ప్రైవేటు ఆసుపత్రుల్లో, 15 మంది ఇళ్ల వద్ద, 26 మంది ఆసుపత్రికి తరలిస్తూ, ఇతర ప్రయాణాల్లో మృతి చెందారు. ఫ కన్నపేగుకు కన్నీరు ఫ ఏడాదిలో 233 శిశు మరణాలు ఫ నివారణ చర్యలు శూన్యం కాకినాడ క్రైం: జిల్లాలో శిశు మరణాలు ఆవేదన కలిగిస్తున్నాయి. ఏడాది కాలంలో వందలాది ప్రాణాలు పోయాయి. ఉన్నతాధికారుల నుంచి ఆయా శాఖల అధికారుల వరకూ శిశు మరణాల నివారణే లక్ష్యం అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నా, క్షేత్రస్థాయి వాస్తవికతకు ఏ మాత్రం పొంతన ఉండడం లేదు. జిల్లాలో కేవలం ఏడాదిలో 233 శిశు మరణాలు చోటుచేసుకున్నాయి. ఇందులో అప్పుడే పుట్టిన శిశువులతో పాటు ఐదేళ్లలోపు పసిమొగ్గలున్నారు. జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో రెండు డివిజన్లు ఉన్నాయి. అందులో కాకినాడ డివిజన్ పరిధిలో 111, పెద్దాపురం డివిజన్ పరిధిలో 122 మరణాలు చోటుచేసుకున్నాయి. 0–28 రోజుల మధ్య శిశువులు 127 మంది మరణిస్తే, 29 రోజుల నుంచి ఏడాది లోపు వారు 76 మంది, ఏడాది కంటే ఎక్కువ వయసున్న వారు 30 మంది ఉన్నారు. గ్రామీణంలోనే ఎక్కువగా.. శిశు మరణాలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా చోటు చేసుకోవడం, వైద్య సేవల కొరతకు అద్దం పడుతోంది. జిల్లాలో కేవలం గ్రామీణ ప్రాంతాల్లో 178 మంది శిశువులు ప్రాణాలు కోల్పోవడం విస్మయానికి గురిచేస్తోంది. అర్బన్ ప్రాంతాల్లో ఈ మరణాల సంఖ్య 55గా నమోదైంది. కారణాలు ఏంటంటే.. నియోనియాతో 25 మంది, నెలలు నిండక, బరువు తక్కువతో 44, నియోనాటల్ ఇన్ఫెక్షన్తో 29, బర్త్ ఆస్ ఫిక్సియా, బర్త్ ట్రామాతో 37, ఫిట్స్తో ఒకరు, ప్రమాదాలు సంభవించి ఆరుగురు, సర్జికల్ కండీషన్స్తో ఒకరు, కాన్జనిటల్ హార్ట్ డిసీజ్తో ఐదుగురు, ఘన, ద్రవాల కల్తీతో ముగ్గురు, నీట మునిగి ముగ్గురు, ఇతర కారణాలతో 65 మంది మృత్యువాత పడ్డారు. వీరంతా అప్పుడే పుట్టిన నవజాత శిశువుల నుంచి ఐదేళ్లలోపు పసివాళ్లే. పాలు తాగుతూ.. ఈ మరణాల్లో మరింత హృదయవిదారక సందర్భాలు ఏంటంటే, శిశువు పాలు తాగుతూ ప్రాణాలు కోల్పోవడం. ఏడాది కాలంలో ఏకంగా 14 మంది శిశువులు పాలు తాగుతూ ప్రాణాలొదిలారు. గర్భధారణ మొదలు అంగన్వాడీ సిబ్బంది నుంచి వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల వరకు తల్లి వెంటే ఉంటూ వారి ఆరోగ్యాన్ని సంరక్షిస్తున్నామని చెబుతుంటారు. అయితే అదెక్కగా జరగడం లేదు. కనీసం బిడ్డకు పాలెలా పట్టాలో కూడా తల్లికి వివరించలేని నిర్లక్ష్యం కొనసాగుతోంది. కట్టుదిట్టమైన చర్యలు చేపడతాం కొత్తగా బాధ్యతలు చేపట్టిన వారం రోజుల్లో రెండు సార్లు సమీక్షలు నిర్వహించాం. అంతకుముందు పరిస్థితిపై ఆరా తీస్తున్నాం. శిశు మరణాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు కారణాలను పరిశీలిస్తున్నాం. క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరు మెరుగ్గా ఉంటే శిశు మరణాలు తగ్గించవచ్చని గుర్తించాం. అందుకు తగిన మార్గనిర్దేశం ఇచ్చాం. పాలు పట్టే శాసీ్త్రయ విధానాలను తల్లులకు అందించేలా ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని నిర్ణయించాం. రక్తహీనత, న్యూమోనియా సహా పోషకాహార లోపం కూడా శిశు మరణాలకు కారణమవుతోంది. వీటిని నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. –డాక్టర్ కోనాల అనిత, డీఎంహెచ్ఓ, కాకినాడ జిల్లా -
అధనపు దోపిడీ !
ఎప్పుడైనా దొరుకుతోంది జిల్లాలో ఏ సమయంలోనైనా మందు దొరుకుతోంది. ఉదయం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యాన్ని విక్రయిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు మద్యం దుకాణాలను ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలి. అలాగే బార్లలో ఉదయం 10 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే విక్రయాలు చేపట్టాలి. కానీ క్షేత్ర స్థాయిలో అందుకు భిన్నంగా జరుగుతోంది. సమయం పాలన పాటించడం లేదు. ఎమ్మార్పీ కంటే అదనంగా రూ.30 నుంచి రూ.50 ఇస్తే ఏ సమయంలోనైనా ఇస్తున్నారు. మద్యం పాలసీ అన్నారు.. మహా దోపిడీ చేస్తున్నారు. ఎమ్మార్పీకే అందిస్తామన్నారు.. ఎక్కువేసి అమ్మేస్తున్నారు.. అంతా ‘కూటమి’గా ఏర్పడి అనధికార బాదుడికి తెరతీశారు.. ఈ తంతు బహిరంగంగానే జరుగుతున్నా, అధికారులు చోద్యం చూస్తున్నారు.. రోజుకు రూ.లక్షల్లో దోచేస్తున్నా అడిగేవారు లేకపోయారు. ‘బాబు’రే ఇదేం బాదుడు అంటూ మందుబాబులు నిట్టూర్పు వదులుతున్నారు. ఫ బరితెగించిన మద్యం సిండికేట్ ఫ క్వార్టర్పై రూ.10 అదనపు వసూళ్లు ఫ ఏడాదిన్నరలో బాటిల్పై రూ.30 పెరుగుదల సాక్షి ప్రతినిధి, కాకినాడ: చంద్రబాబు ప్రభుత్వంలోని మద్యం సిండికేట్ బరితెగిస్తోంది. అధికార అండతో రెచ్చిపోతోంది. నిర్దేశించిన ఎమ్మార్పీని ఉల్లంఘించి విక్రయాలు చేపడుతోంది. క్వార్టర్పై రూ.10 నుంచి రూ.20 అదనంగా బాదేస్తోంది. ఇలా రోజూ రూ.లక్షల్లో ఆర్జిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం విధానాన్ని అస్తవ్యస్తం చేసింది. ప్రభుత్వం ఆధ్వర్యంలో సజావుగా నడుస్తున్న వ్యవస్థను అతలాకుతలం చేసింది. కూటమి నేతలకు కట్టబెట్టేందుకు ప్రైవేటు విధానాన్ని తీసుకువచ్చింది. మద్యం షాపులకు టెండర్లు ఆహ్వానించి, కూటమి నేతలు లబ్ధి పొందేలా చేసింది. ప్రైవేటుకు అప్పగించిన మొదట్లో అనధికారికంగా క్వార్టర్ బాటిల్పై రూ.10 పెంచి విక్రయిస్తున్నా చూసీచూడనట్లు వ్యవహరించింది. ఇలా రూ.190 ఉన్న క్వార్టర్ బాటిల్ రూ.200కు చేరింది. అనంతరం సంక్రాంతి పండగకు అధికారికంగా క్వార్టర్ బాటిల్పై మరో రూ.10 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో రూ.210కు చేరింది. బాటిల్పై ఎమ్మార్పీ ధర మాత్రం రూ.200 ఉంటుంది. తాజాగా మద్యం సిండికేట్ మరో అడుగు ముందుకేసింది. మరో రూ.10 అనధికారికంగా పెంచేసింది. ప్రస్తుతం సిండికేట్ పెంచి వసూలు చేస్తున్న రూ.10తో క్వార్టర్ ధర రూ.220కు చేరింది. ఈ పెంపు అన్ని బ్రాండ్లకు వర్తింపజేస్తోంది. దీంతో మద్యం దుకాణం వద్దకు వెళ్లిన మందుబాబులకు ఒక్కసారిగా షాక్ తగులుతోంది. ఇదిలా ఉంటే ఆఫ్ తీసుకున్నా అదనంగా రూ.10 చెల్లించాల్సి వస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా ఒకసారి, అనధికారికంగా రెండు సార్లు అదనపు బాదుడిపై మందుబాబులు గగ్గోలు పెడుతున్నారు. మందుబాబులకు తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందిస్తామని కూటమి ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఇప్పుడు మద్యం షాపుల యజమానులకు లబ్ధి చేకూర్చేందుకు ఈ ఎత్తుగడ వేసింది. బాటిల్పై రూ.10 అదనంగా వసూలు చేస్తున్నా.. ప్రభుత్వం, ఎకై ్సజ్ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. బెల్టుషాపుల్లో మరింత.. మద్యం షాపుల్లో ధరలు పెరగడంతో అందుకు అనుగుణంగా నడుస్తున్న బెల్టు షాపుల్లో కూడా మరింత బాదుడు తప్పడం లేదు. ప్రతి మద్యం షాపునకు అనుబంధంగా 10 నుంచి 20 బెల్టు షాపులు వెలిశాయి. తమకు కావాల్సిన బ్రాండ్లు ఫోన్లో అర్డర్ ఇస్తే చాలు, అనుకున్న సమయానికి చేరిపోతున్నాయి. పండగలు, పుట్టిన రోజు, పెళ్లిరోజు తదితర ఫంక్షన్లకు ఎక్కువ మొత్తం ఆర్డర్లు ఇస్తున్నారు. గతంలోనే ఎమ్మార్పీ కంటే ఒక్కో బాటిల్పై రూ.30 నుంచి రూ.50 వరకు వసూలు చేసేవారు. ప్రస్తుతం బాటిల్పై రూ.10 పెరగడంతో వారి ధర సైతం పెంచేశారు. ప్రస్తుతం రూ.50 నుంచి రూ.60 అదనంగా తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే తంతు నడుస్తోంది. జిల్లాలో వ్యాపారం ఇలా.. జిల్లాలో మొత్తం 170 మద్యం షాపులున్నాయి. వీటికి సామర్లకోట ఐఎంఎల్ డిపో నుంచి సరకు సరఫరా చేస్తున్నారు. ప్రతి రోజూ సుమారు 4,201 కేసుల బీర్లు, 9,651 కేసుల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. అంటే నెలకు 1,26,030 కేసుల బీర్లు, 2,89,530 కేసుల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. వీటి విలువ రోజుకు సుమారు రూ.7.95 కోట్లు ఉండగా.. నెలకు సుమారు రూ.238 కోట్ల వ్యాపారం జరుగుతోంది. పండగ రోజుల్లో మరింత అధికంగా ఉంటుంది. ఆ రోజుల్లో సుమారు రూ.8 కోట్ల వరకు వ్యాపారం జరుగుతున్నట్లు సమాచారం. అనధికారికంగా పెంచి వసూలు చేస్తున్న రూ.10తో ప్రతి నెలా మందుబాబులపై రూ.41,55,600 అదనపు భారం పడుతోంది. -
ఉద్యమాలకు పెద్ద దిక్కు ముద్రగడ
అమలాపురం టౌన్: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఉద్యమాలకు పెద్ద దిక్కు అని వివిధ రాజకీయ పార్టీల నేతలు కొనియాడారు. ఆయన మరణంతో ఉభయ తెలుగు రాష్ట్రాలు.. ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు ఉద్యమాల పరంగా ఓ పెద్ద దిక్కును కోల్పోయినట్లయ్యిందని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర కాపు రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి ఆధ్వర్యాన అమలాపురం గడియారం స్తంభం సెంటర్లో ఆదివారం దివంగత ముద్రగడ పద్మనాభం జిల్లా స్థాయి సంతాప సభ నిర్వహించారు. ఇందులో వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. సమితి రాష్ట్ర నాయకుడు నల్లా పవన్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సంతాప సభలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ, ఉద్యమ స్ఫూర్తి, నిజాయితీ, ముక్కుసూటితనం ఉన్న ముద్రగడను కోల్పోవడం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా దురదృష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్ మాట్లాడుతూ, ముద్రగడ మరణంతో ఉద్యమాల ఊపిరి ఆగిందా అనే సందేహం కలుగుతోందని అన్నారు. ఎంపీ గంటి హరీష్ మాధుర్ మాట్లాడుతూ, తన తండ్రి, మాజీ లోక్సభ స్పీకర్ దివంగత బాలయోగి, ముద్రగడ పద్మనాభం ఒకేసారి ఎంపీలుగా పని చేశారని గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్ సీపీ ముమ్మిడివరం, రాజోలు నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు పొన్నాడ వెంకట సతీష్ కుమార్, పాముల రాజేశ్వరీదేవి మాట్లాడుతూ, ముద్రగడతో తమకున్న అనుబంధాన్ని తలచుకుని కన్నీరు పెట్టుకున్నారు. అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (అముడా) చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, కాపు జేఏసీ నాయకులు కల్వకొలను తాతాజీ, ఆకుల రామకృష్ణ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, వంటెద్దు వెంకన్నాయుడు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, పార్టీ పట్టణ అధ్యక్షుడు సంసాని బులినాని, జిల్లా అధికార ప్రతినిఽధి సూదా గణపతి, మాజీ కౌన్సిలర్ చిట్టూరి పెదబాబు, టీడీపీ, బీజేపీ జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి, అడబాల సత్యనారాయణ, టీడీపీ, జనసేన నాయకులు మెట్ల రమణబాబు, నల్లా శ్రీధర్, ఏడిద శ్రీను తదితరులు తమ ప్రసంగాల్లో ముద్రగడ ఉద్యమాల పంథాను కొనియాడారు. నేతలందరూ ముద్రగడ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జోహార్ ముద్రగడ అంటూ నినాదాలు చేశారు. ఫ ఘన నివాళులర్పించిన అఖిలపక్ష నేతలు ఫ కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యాన సంతాప సభ -
ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టిన వ్యాన్
అమలాపురం రూరల్: ఈదరపల్లి నుంచి ముక్కామల వైపు వెళ్లే బైపాస్ రోడ్డులో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పాలగుమ్మి సమీపాన రోడ్డు పక్కన ఆగి ఉన్న గూడ్స్ వ్యాన్ను ఎదురుగా ఈదరపల్లి వైపు వస్తున్న వ్యాన్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్లో ఉన్న నలుగురికి గాయాలు కాగా అమలాపురం ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే ఈ ఘటనపై ఏ విధమైన ఫిర్యాదు అందలేదని తాలూకా ఎస్సై తెలిపారు. పల్లెవెలుగు బస్సును ఢీ కొన్న లారీ దేవరపల్లి: రాజమహేంద్రవరం నుంచి జంగారెడ్డిగూడెం వెళుతున్న ఆర్టీసీ పల్లెవెలుగు అల్ట్రా బస్సును దేవరపల్లి మండలం గౌరీపట్నం వద్ద మహారాష్ట్ర నుంచి చాగల్లుకు కోళ్లమేత తీసుకు వెళుతున్న లారీ ఢీ కొట్టింది. పోలీసుల కథనం ప్రకారం రాజమహేంద్రవరం–దేవరపల్లి పాత జాతీయ రహదారిలో 40 మంది ప్రయాణికులతో జంగారెడ్డిగూడెం వెళుతున్న పల్లెవెలుగు బస్సును ఆదివారం ఉదయం 10.30 గంటల సమయంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురికి గాయాలయ్యాయి. వీరిలో జంగారెడ్డిగూడేనికి చెందిన కుక్కల పద్మకు తీవ్రగాయాలు కాగా, మిగిలిన ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పి.మనోహర్ తెలిపారు. క్వారీలు, క్రషర్ల నుంచి మెటల్ లారీలు ఎక్కువ సంఖ్యలో తిరగడం, ఆదివారం ఉదయం వర్షం కురవడమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు వాపోయారు. వేగంగా దూసుకొచ్చి.. బైక్ను ఢీకొట్టి గంగవరం: ఓ కారు వేగంగా దుకాణాల వైపు దూసుకువచ్చి.. పక్కనే బైక్తో ఆగి ఉన్న ఇద్దరు వ్యక్తులను కారు ఢీకొట్టిన ఘటన గంగవరం పాతవీధిలో ఆదివారం సాయంత్రం జరిగింది. ఈ ప్రమాదంలో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. దుకాణాలపైకి కారు దూసుకురావడంతో దుకాణాలకు ఉన్న గోడలు, గేట్లు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న చోడి చిన్నబ్బాయిదొర, రామన్నదొరలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆటోలో గోకవరం తరలించి, అక్కడ నుంచి 108లో రాజమహేంద్రవరానికి తరలించారు. రాజవరం గ్రామానికి చెందిన చోడి చిన్నబ్బాయిదొరకు తలకు, కాళ్లకు తీవ్ర గాయం కాగా, గంగవరం గ్రామానికి చెందిన మడకం రామన్నదొరకు రెండు కాళ్లకు, నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. చిన్నబ్బాయిదొర ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
నానవు.. చిరగవు
● త్వరలో మనకూ ప్లాస్టిక్ కరెన్సీ ● 68 దేశాలకు చెందిన పాలిమర్ నోట్లు సేకరించిన కృష్ణ కామేశ్వర్ అమలాపురం టౌన్: ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాలు పాలిమర్ (ప్లాస్టిక్) నోట్లు ముద్రించి చెలామణి చేస్తున్నాయి. ఈ నోట్లు నీటిలో నానవు, చింపినా చిరగవు. అందుకే ప్రపంచ దేశాలు ఒక్కొక్కటిగా పాలిమర్ నోట్ల ముద్రణ వైపు అడుగులు వేస్తున్నాయి. మన దేశం కూడా త్వరలోనే పాలిమర్ కరెన్సీ నోట్లను చెలామణిలోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఈ సంవత్సరాంతానికి తొలుత రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్లను ముద్రించి చెలామణిలోకి తీసుకువస్తామని కేంద్రం ఇటీవల ప్రకటించింది. ఈ క్రమంలో అమలాపురానికి చెందిన కరెన్సీ నోట్ల సేకరణకర్త పుత్సా కృష్ణ కామేశ్వర్ ప్రపంచంలోని పలు దేశాలు ముద్రించిన పాలిమర్ నోట్లను సేకరించారు. ఆయన ఇప్పటికే 68 దేశాలకు చెందిన 144 పాలిమర్ కరెన్సీ నోట్లు సేకరించారు. మన దేశంలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా దాదాపు పుష్కర కాలం కిందటే పాలిమర్ నోట్లు ప్రవేశపెట్టాలని రిజర్వ్ బ్యాంక్ ఆలోచన చేసిందని, అది మనకు సరిపడదని భావించి ఆ ఆలోచనను పక్కన పెట్టిందని సేకరణకర్త కృష్ణ కామేశ్వర్ తెలిపారు. ఆయన సేకరించిన తన ఖజానాలో భద్రపరుచుకున్న పలు దేశాల పాలిమర్ కరెన్సీ నోట్లను ఆయన మీడియాకు చూపారు. -
రైతులకు నీరివ్వకుంటే ఎలా!
పిఠాపురం: నారు పోసుకోవాలని రైతులకు చెప్పి, ఇప్పుడు నీరు ఇవ్వకుంటే ఎలా అని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్సార్ సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జి వంగా గీతా విశ్వనాథ్ నిలదీశారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు శివారు మల్లవరం రోడ్డులోని కొత్త కాలువను శనివారం ఆమె పరిశీలించారు. అడుగంటిన కొత్త కాలువలోకి దిగి రైతులతో కలిసి గంట పాటు నిరసన తెలిపారు. రైతులు తమ ఆవేదనను వంగా గీతకు విన్నవించారు. తక్షణం బీబీసీ, ఏలేరు ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని, నారుమడులకు నీరు ఇవ్వాలని నినాదాలు చేశారు. పంటలకు నీరు కూడా ఇవ్వలేని ప్రభుత్వం గద్దె దిగాలని ఆగ్రహించారు. అనంతరం వంగా గీతకు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ యంత్రాంగం విఫలం వంగా గీత మాట్లాడుతూ రైతులకు నీరు అందించడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఇప్పటికే కలెక్టర్ను రెండుసార్లు కలిసి పిఠాపురం నియోజకవర్గ రైతులకు పీబీసీ, ఏలేరు నీటిని విడుదల చేయాలని కోరామన్నారు. ఇరిగేషన్, వ్యవసాయశాఖ అధికారులకు ఎప్పటికప్పుడు సమస్యను వివరించినట్టు తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగంలో మార్పు లేదన్నారు. ఒకవైపు వ్యవసాయ అధికారులు నెల రోజుల నుంచి నారుమడులు వేయాలని ప్రచారం చేశారని, ఇప్పుడు నాడుమడులు వేసిన తర్వాత ఇరిగేషన్ అధికారులు నీరు లేదని చెప్పడం హాస్యాస్పదమన్నారు. రైతులంటే చులకనా.. రైతులంటే ప్రభుత్వానికి చులకనగా ఉందని, రైతులు కన్నెర్ర చేస్తే ప్రభుత్వాలు కూలిపోతాయని వంగా గీత గుర్తు చేశారు. నారుమడులకు నీరు లేదని, కాలువలు ఎండిపోవడంతో పశువులు దాహార్తితో అలమటిస్తున్నాయన్నారు. ఏలేరులో నీటిని ఏ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తున్నారో స్పష్టత ఇవ్వాలన్నారు. రైతులకు నష్టం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని, వారితో కలిసి చలో ఏలేరు కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెంటనే స్పందించాలని, రైతాంగానికి సాగునీరు విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో గొల్లప్రోలు జెడ్పీటీసీ వులవకాయల నాగలోవరాజు, పార్టీ మండల అధ్యక్షుడు అరిగెల రామయ్య దొర, నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు గొల్లపల్లి నానాజీ, పిఠాపురం పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు, నియోజకవర్గం బూత్ కన్వీనర్ కొత్తెం దత్తుడు, ఏకే మల్లవరం మాజీ సర్పంచ్ అరిగెల మణిబాబు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు కడిమి శెట్టి కుమార భాస్కరరెడ్డి, ములికే సత్యనారాయణ, ఓరుగంటి చక్రి, చేబ్రోలు, ఏకే మల్లవరం అధ్యక్షుడు పుప్పాల బాబులు, శ్రీహరి, ఎంపీటీసీ తుమ్మలపల్లి ఈశ్వరరావు, కందా బాబ్జీ, విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఏడిది నరేష్, బీసీ సెల్ అధ్యక్షుడు నూజివీడు సూర్య, సోషల్ మీడియా అధ్యక్షుడు ఓరుగంటి సత్యనూకరాజు, ప్రచార కమిటీ అధ్యక్షుడు ఓరుగంటి ప్రసాద్, మండల బూత్ కమిటీ అధ్యక్షులు ఓరుగంటి కృష్ణార్జున తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ వంగా గీత అన్నదాతలతో ఆటలాడితే ఊరుకునేది లేదు ఖరీఫ్కు సాగు నీరు ఇవ్వాల్సిందే రైతులతో కలిసి నిరసన -
నారుమళ్లు ఎండిపోతున్నాయి
నీరు వస్తుందని చెబితే నారుమళ్లు వేశాం. ఇప్పుడు నీరందక అవి ఎండిపోతున్నాయి. నీటి గురించి అడుగుదామంటే అధికారులు కంటికి కనిపించడం లేదు. వేసిన నారుమళ్లకు మోటార్ల ద్వారా నీరు పెడదామంటే కాలువల్లో మురికి నీరు వస్తోంది. ఈ ప్రభుత్వం రైతులను నిలువునా నట్టేట ముంచింది. – తటవర్తి రామన్నదొర, మల్లవరం, గొల్లప్రోలు మండలం ఇలాగైతే ఖరీఫ్ లేనట్టే నీరు రాకపోవడంతో చాలామంది రైతులు నారుమళ్లు వేయడం ఆపేశారు. ఇలాంటి దారుణ పరిస్థితి మునుపెన్నడూ చూడలేదు. ఎవరు అధికారంలో ఉన్నా కనీసం నారుమళ్లకు సరిపడా నీరు ఇచ్చేవారు. ఉపముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే సాగునీటి ఎద్దడి నెలకొంది. ఇదే పరిస్థితి మరో 15 రోజులు కొనసాగితే ఇక ఖరీఫ్ సాగు లేనట్టే. – దాసరి సత్యనారాయణ, మల్లవరం, గొల్లప్రోలు మండలం నట్టేట ముంచారు నారు వేసుకోమని చెప్పి, నీరు ఇవ్వడం మానేశారు. వేసిన నారు ఎండిపోతోంది. రూ.వేల పెట్టుబడి నేలపాలవుతోంది. ఎవరికి చెప్పాలో తెలియని అయోమయ పరిస్థితిలో రైతులున్నారు. ఇంత ఇబ్బంది పడుతున్నా నారు వేసుకోమన్న అధికారులు, ప్రజాప్రతినిధులు కనిపించడం లేదు. – అడపా ఐరాజు, భోగాపురం, పిఠాపురం మండలం● -
5న దేవరపల్లికి వైఎస్ జగన్
దేవరపల్లి: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగస్టు 5న తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో పర్యటిస్తారని మాజీ హోం మంత్రి, గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత శనివారం తెలిపారు. దేవరపల్లిలోని పొగాకు వేలం కేంద్రాన్ని ఆయన సందర్శించి, వేలం ప్రక్రియను పరిశీలిస్తారని వెల్లడించారు. అనంతరం పొగాకు రైతులతో ముఖాముఖి చర్చించి వారి సమస్యలు తెలుసుకుంటారని చెప్పారు. దూర విద్యలో డిగ్రీ ప్రవేశాలకు ఆహ్వానం బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): ఆంధ్రా యూనివర్సిటీ దూర విద్య డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కో ఆర్డినేటర్ డాక్టర్ నాగేశ్వరరావు శనివారం తెలిపారు. డిగ్రీ, పీజీ, ఎంబీఏ విభాగాల్లో 30 రకాల కోర్సులకు నోటిఫికేషన్ జారీ అయ్యిందన్నారు. ఇతర వివరాలకు పీఆర్ డిగ్రీ కళాశాలలోని ఏయూ దూరవిద్యాకేంద్రాన్ని, లేదా 98484 05370 నంబర్ను సంప్రదించాలన్నారు. అక్టోబర్లో సీఐఐ భాగస్వామ్య సదస్సు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జేఎన్టీయూకే వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 9 నుంచి 14 వరకూ ఐదు రోజుల పాటు 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఆర్వో తిప్పేనాయక్ తెలిపారు. కలెక్టరేట్లో శనివారం వివిధ పైవ్స్టార్ హోటళ్ల ప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సదస్సుకు సీఎం చంద్రబాబుతో పాటు మరో 300 మంది పారిశ్రామికవేత్తలు, ఐఏఎస్ స్థాయి అధికారులు హాజరుకానున్న నేపథ్యంలో ఫైవ్ స్టార్ హోటళ్లలో 60కి పైగా వీఐపీ ప్రత్యేక రూమ్లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వీఐపీలు, వీవీఐపీలు కల్పించాల్సిన సౌకర్యాలపై హోటళ్ల ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. ఏడాది నవంబర్లో విశాఖపట్నంలో జరిగే ఫైనల్ సదస్సుకు ముందు ప్రిలిమినరీగా ఈ ప్రాంతీయ సదస్సును కాకినాడలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో సదస్సు నిర్వహించే జేఎన్టీయూకేలో వేదికను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఆటో కరప: ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఘటనలో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. కరప గ్రామంలోని అగ్నికుల క్షత్రియుల వీధికి చెందిన వాడ్రేవు నూకరాజు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆటోలో ప్రయాణికులను ఎక్కించుకుని శనివారం కాకినాడ వెళ్లి తిరిగి వస్తున్నాడు. కరప పంచాయతీ కార్యాలయం వద్దకు వచ్చే సరికి రామచంద్రపురం వైపు నుంచి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటో ముందుభాగం నుజ్జవ్వగా, డ్రైవర్ సీటులో నూకరాజు ఇరుక్కుపోయాడు. స్థానికులు స్పందించి రక్త గాయాలతో ఉన్న నూకరాజును ఆటో నుంచి బయటకు తీసి, 108లో చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న కరప పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, వివరాలు సేకరించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రత్నగిరిపై భక్తజన సంద్రం
అన్నవరం: తొలి ఏకాదశి పర్వదినం, శనివారం కలిసి రావడంతో అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణస్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. రత్నగిరిపై సత్యదేవుని సన్నిధిన, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఏడాది వివాహాలు చేసుకున్న దంపతులు, వారి బంధుమిత్రులు కూడా సత్యదేవుని దర్శనానికి తరలి వచ్చారు. వీరికి ఇతర భక్తులు కూడా తోడవడంతో తీవ్ర రద్దీ నెలకొంది. సుమారు 40 వేల మంది భక్తులు విచ్చేశారు. దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సత్యదేవుని దర్శనానికి రెండు గంటలు, అంతరాలయ దర్శనానికి గంట సమయం పట్టింది. భక్తుల రద్దీతో మధ్యాహ్నం వరకు అంతరాలయ దర్శనం నిలిపివేశారు. సత్యదేవుని వ్రతాలు 2,500 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షలు ఆదాయం సమకూరింది. సుమారు ఆరు వేల మందికి అన్నదానంలో భోజనం సౌకర్యం కల్పించారు. కాగా.. ఆదివారం ఉదయం పది గంటలకు సత్యదేవుడు, అమ్మవారిని ఆలయ ప్రాకారంలో టేకు రథంపై ఊరేగించనున్నారు. తొలి ఏకాదశి పూజలు తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకు స్వామి, అమ్మవార్లకు 108 స్వర్ణ పుష్పాలతో అష్టోత్తర పూజ జరిపారు. తొమ్మిది నుంచి 11 గంటల వరకు స్వామి, అమ్మవారికి పుష్పార్చన, కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం వేదపండితులు వేదాశీస్సులు అందచేసి ప్రసాదాలు నివేదించారు. ● తొలి ఏకాదశికి భారీగా తరలివచ్చిన భక్తులు ● స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు ● సత్యదేవుని దర్శించిన 40 వేల మంది -
చేను ఎడారి.. గుండె తడారి
● ఖరీఫ్ సాగుకు నీటి ఎద్దడి ● నారుమళ్లకూ నీరు లేని పరిస్థితి ● కనిపించని అధికారులు, నాయకులు ● అన్నదాతల ఆవేదన పిఠాపురం: ఖరీఫ్ సీజన్ వస్తుందంటే నీటి సరఫరాకు ముందుగానే ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. పొలాలు ఎండకుండా, అన్నదాతలు కంటతడి పెట్టకుండా చూసుకోవాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ప్రతి ఎకరాకు సాగునీరందుతుందని, నారుమళ్లు వేసుకోవాలని హడావుడిగా నాయకులు ప్రకటనలు ఇచ్చేసి వెళ్లిపోయారు. ఆ మాటలను నమ్మి నారుమళ్లు వేసుకున్న రైతులు ఇప్పుడు నీరందక అవస్థలు పడుతున్నారు. ఏలేరు, పీబీసీ శివారు ఆయకట్టు ప్రాంతాలైన పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి, తుని, తొండంగి మండలాల్లో వేలాది ఎకరాల పంట పొలాలు బీడు భూములుగా దర్శనమిస్తున్నాయి. కనుచూపు మేరలో ఎక్కడా నాట్లు కనిపించని పరిస్థితి నెలకొంది. నీరు లేక పంటలు ఆగిపోయాయని గగ్గోలు పెడుతున్నా పిఠాపురం నియోజకవర్గంలో పట్టించుకునే నాథుడే లేడు. నారుమళ్లకూ నీరు లేక.. ఏలేరు ప్రాజెక్టులో నీరు డెడ్ స్టోరేజ్కి చేరుకోక పోయినా ప్రస్తుతం ఏలేరు ఆయకట్టుకు నీటి ఎద్దడి ఏర్పడింది. కనీసం నారుమళ్లు వేసుకునేందుకు కూడా నీరు లేక ఖరీఫ్ సాగు నిలిచిపోయింది. సాధారణంగా ఏలేరు ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ ఆరు టీఎంసీలు కాగా ప్రస్తుతం 8 టీఎంసీలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో ఆరు టీఎంసీల డెడ్ స్టోరేజ్ ఉన్న సమయంలో కూడా నీటి ఎద్దడిని నివారించడానికి కేవలం 2 టీఎంసీలు మాత్రమే ప్రాజెక్టులో ఉంచి మిగిలిన నీటిని విడుదల చేసేవారు. ఇప్పుడు 8 టీఎంసీలు ఉన్నా పంటలకు నీరు అందించని పరిస్థితి ఏర్పడడంపై రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏటా ఈ సమయానికి నాట్లు పూర్తయి కలుపు తీసే పనులు నిర్వహించేవారు. ఇప్పుడు ఎక్కడా ఒక్క నారుమడి కూడా సిద్ధం కాలేదు. ఏలేరు నుంచి నీటిని విడుదల చేశామని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నప్పటికీ, చుక్క నీరు కూడా పిఠాపురం ఆయకట్టుకు చేరలేదు. సుమారు 62 వేల ఎకరాలు పిఠాపురం, తుని నియోజకవర్గాల పరిధిలో సుమారు 62 వేల ఎకరాల ఆయకట్టుకు ఏలేరు, పీబీసీ ద్వారా సాగునీరు అందించాలి. కానీ ఇప్పటి వరకు ఆ రెండింటి నుంచి నీరు రాక ఖరీఫ్ సాగు ఆలస్యమైంది. ప్రస్తుతం ఏలేరుకు, పీబీసీకి నీరు వదిలినట్టు చెబుతున్నా ఎక్కడా నీరు వచ్చిన జాడ లేదని రైతులు చెబుతున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇలాకాలోనే సాగునీటి ఎద్దడితో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదు. కోట్ల రూపాయలతో క్లోజర్ పనులు చేసినట్టు కూటమి పార్టీల నాయకులు చెబుతున్నప్పటికీ ఏ కాలువలో చూసినా ఎక్కడి పూడిక అక్కడే దర్శనమిస్తోంది. ప్రస్తుతం ఏలేరు, పీబీసీ కాలువల్లో వర్షపు నీరు కూడా అడుగంటిపోయి పశువులకు కూడా తాగునీటి ఎద్దడి నెలకొంది. -
కొండంత భారం
అన్నవరం: వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి కొండపై షాపుల లీజుదారులు దేవస్థానానికి సుమారు రూ.4 కోట్ల వరకూ టెండర్ పెట్టారు. వివిధ షాపులను టెండర్ కం బహిరంగ వేలం ద్వారా లీజుకు తీసుకున్న వీరి నుంచి అద్దెలు వసూలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యాపారులు దుకాణం సర్దేసి జారుకున్నాక ఇప్పుడు అధికారులు చెక్ బౌన్స్ కేసులు వేస్తున్నారు. వ్యాపారం గడువు ముగిసి దుకాణం సర్దేసి వెళ్లిపోయిన వ్యాపారులు దాదాపు రూ.2 కోట్లు, ప్రస్తుతం నిర్వహిస్తున్న వ్యాపారులు మరో రూ.2 కోట్ల వరకూ బకాయిలు ఉన్నట్టు తెలుస్తోంది. లీజుల ద్వారా రూ.10 కోట్లు రత్నగిరిపై పూజాద్రవ్యాలు, ఫ్యాన్సీ, శీతల పానీయాలు, ఆవునేతి దీపాల విక్రయం, సెల్ ఫోన్లు, చెప్పులు, సామగ్రి భద్రపర్చడం, టోల్ వసూలు, వ్రతాల్లో భక్తుల ఫొటోలు తీయడం వంటి వ్యాపారాల నిర్వహణకు దేవస్థానం రెండేళ్లకోసారి టెండర్ కం బహిరంగ వేలం నిర్వహిస్తుంది. హెచ్చు వేలం పాట లేదా టెండర్ వేసిన వ్యాపారికి వీటిని లీజుకు ఇస్తారు. మొదటి ఏడాది లీజుకు ఇచ్చిన మొత్తం మీద రెండో ఏడాది 10 శాతం పెంపుదల ఉంటుంది. ఈ మొత్తానికి జీఎస్టీ అదనం. ఈ వేలం ద్వారా ఏటా దేవస్థానానికి సుమారు రూ.10 కోట్ల ఆదాయం లభిస్తుంది. నిబంధనల ప్రకారం.. వేలం దక్కించుకున్న వ్యాపారి ఆరు నెలల లీజు మొత్తాన్ని అడ్వాన్స్గా చెల్లించి వ్యాపారం ప్రారంభించాలి. ఆ తర్వాత నుంచి ప్రతి నెలా సొమ్ము కట్టాలి. చివరి ఆరు నెలలకు ముందు కట్టిన అడ్వాన్స్ నుంచి మినహాయిస్తారు. అయితే, రెండేళ్లుగా ఈ లీజులు సక్రమంగా వసూలు చేయకపోవడం, ఆరు నెలల అడ్వాన్స్కు బదులుగా మూడు నెలలు మాత్రమే కట్టించుకుని షాపులను అప్పగించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వ్యాపారులు సీజన్లో వ్యాపారం నిర్వహించి, అనంతరం నష్టాలు వచ్చాయని చేతులు ఎత్తేశారు. వసూలుకు చర్యలు వ్యాపారస్తుల నుంచి బకాయిల వసూలుకు చర్యలు తీసుకుంటున్నాం. గతంలో రూ.7 కోట్లు ఉండే బకాయిలను సగానికి పైగా వసూలు చేశాం. మిగిలిన వాటి కోసం ఇద్దరు గుమస్తాలను నియమించాం. బకాయిలు పెట్టి వెళ్లిపోయిన వ్యాపారులు, బౌన్స్ అయిన చెక్కుల విషయంలో కూడా కేసులు వేస్తున్నాం. ఇకపై షాపుల లీజుకు సంబంధించి ఆరు నెలల సొమ్ము డిపాజిట్ చేస్తే తప్ప షాపులు అప్పగించే ప్రసక్తి లేదు. – నల్లం సూర్యచక్రధరరావు, ఈఓ, అన్నవరం దేవస్థానం అన్నవరం దేవస్థానానికి వ్యాపారుల షాక్ రూ.4 కోట్ల వరకూ లీజు పెండింగ్ వసూలు చేయడంలో అధికారుల నిర్లక్ష్యం వ్యాపారం చేసుకుని సర్దేసుకుంటున్న లీజుదారులు -
ఆశలన్నీ జలసమాధి
రామచంద్రపురం రూరల్: కాలువలో స్నానానికి వెళ్లి అన్నాచెల్లెళ్లు (ముగ్గురు) మృత్యువాత పడిన ఘటనతో రామచంద్రపురం మండలం వెలంపాలెంలో శుక్రవారం పెను విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన పోతుల మధు సాల్మన్ రాజు, శాంతకుమారి దంపతులకు నలుగురు కుమార్తెలు. ఏడాది క్రితం మధు సాల్మన్ రాజు మృతి చెందడంతో గురువారం హైదరాబాద్లో ఉపాధి నిమిత్తం ఉంటున్న ముగ్గురు కుమార్తెలు, రావులపాలెం సమీపంలోని తాతపూడి వద్ద ఉంటున్న నాలుగో కుమార్తె తమ పిల్లలతో సహా వెలంపాలెం గ్రామానికి వచ్చి కార్యక్రమం నిర్వహించుకున్నారు. ఒకరిని కాపాడబోయి మరొకరుగా.. హైదరాబాద్ చందానగర్లో ఉంటున్న ముగ్గురు కుమార్తెలు, వారి పిల్లలు శనివారం తిరుగు ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకున్నారు. శుక్రవారం కాకినాడ బీచ్కు, కోరంగి అభయారణ్యానికి వెళదామని అనుకున్నారు. కానీ వెళ్లకపోవడంతో సాయంత్రం పెద్ద కుమార్తె బొక్కే లత కుమారుడు వీరేంద్ర (18) మరో ఆరుగురు చిన్నారులను బైక్పై ఎక్కించుకుని సమీపంలోని వెంకటాయపాలెం కాలువ వద్దకు స్నానానికి తీసుకుని వెళ్లాడు. ఈ క్రమంలో మూడో కుమార్తె వేమన మంజుప్రియ కుమార్తె వర్షిత పావని (15) నీటి మునిగి పోయింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో వీరేంద్ర, రెండో కుమార్తె కనికెళ్ల కాంతి లత కుమారుడు రంజిత్ కుమార్ (15) కూడా నీట మునిగి మృత్యువాత పడ్డారు. రాఖీ కట్టించుకుని వెళతామన్నారుహైదరాబాద్కు శనివారం తిరుగు ప్రయాణం నిమిత్తం టికెట్లు తీసుకున్న నేపథ్యంలో తమ చెల్లెళ్లతో రాఖీలు కట్టించుకుని వెళతామని తన అక్కల కుమారులు చెప్పినట్టు కాళిదాసు రాజకుమారి (నాలుగో కుమార్తె) కన్నీటి పర్యంతమైంది. వారందరూ కాలువకు వెళ్లిన తర్వాత తాను తన చిన్న కుమార్తెకు చెవి పోగులు కుట్టించాలని బైక్ తీసుకుని రమ్మని పలుమార్లు ఫోన్ చేశానని తెలిపింది. అయితే ఫోన్ను వారితో పాటు వెళ్లిన తన పెద్ద కుమార్తెకు ఇచ్చేసి వారు స్నానానికి వెళ్లారని ఆవేదన వ్యక్తం చేసింది. పేద కుటుంబాలే.. ఫ పెద్ద కుమార్తె బొక్కే లత, గనిరాజు దంపతులది పసలపూడి. భర్త కర్ణాటకలో వెల్డింగ్ పని నిమిత్తం ఉంటుండగా లత తన తల్లి శాంతకుమారితో కలసి హైదరాబాద్ చందానగర్లో ఇళ్లల్లో పని చేసుకుంటూ కుమారుడు, కుమార్తెతో కలసి జీవిస్తోంది. చేతికి అందివచ్చిన కుమారుడిని పోగొట్టుకుని కన్నీరు మున్నీరు అవుతోంది. ఫ రెండో కుమార్తె కనికెళ్ల కాంతి లత, సత్యనారాయణ దంపతులది అంగర గ్రామం. హైదరాబాద్లో వాచ్మన్గా పనిచేసుకుంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఈ ప్రమాదంలో పెద్ద కుమారుడిని పోగొట్టుకున్నారు. ఫ మూడో కుమార్తె వేమన మంజు ప్రియ, భర్త ఆనంద కుమార్లది అంగర సమీపంలోని పడమర ఖండ్రిగ గ్రామం. ఆనంద కుమార్ చనిపోవడంతో మంజు ప్రియ హైదరాబాద్ చందానగర్లో ఇళ్లలో పనిచేసుకుంటూ తన కుమారుడు, కుమార్తెలతో జీవిస్తోంది. ఈ ప్రమాదంలో కుమార్తెను కోల్పోయింది. -
నేటి నుంచి రహదారి భద్రతా వారోత్సవాలు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్లలో శనివారం నుంచి రహదారి భద్రతా వారోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి ఎంయూవీ మనోహర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. కాకినాడ, ఏలేశ్వరం, తుని డిపోలో ఈ నెల 25 నుంచి 31 వరకూ ఈ వారోత్సవాలు జరుగుతాయన్నారు. వారం రోజుల పాటు డ్రైవర్లకు వైద్య పరీక్షలు, రహదారి భద్రతా నియమాలపై శిక్షణ తరగతులు, ఉత్తమ డ్రైవర్లకు ప్రశంసా పత్రాలు ఇస్తామని అన్నారు. పోక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు పిఠాపురం రూరల్: పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో నమోదైన పోక్సో కేసులో నిందితుడు గీసాల నాగేశ్వరరావు (65)కు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ కాకినాడ పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కె.శ్రీదేవి తీర్పు చెప్పారు. అలాగే బాధిత బాలికకు రూ.2 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు. రూ.1,000 జరిమానాతో పాటు మూడు నెలల సాధారణ కారాగార శిక్ష విధించారు. ప్రభుత్వ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.శ్రీదేవి వాదనలు వినిపించగా, సాకా్ాష్ధరాల ఆధారంగా న్యాయస్థానం నిందితుడిని దోషిగా నిర్ధారించింది. కేసు విచారణలో సాక్షులను సకాలంలో కోర్టుకు హాజరుపరచడంలో సీఐ జి.శ్రీనివాస్, ఎస్సై వి.మణికుమార్, కోర్టు హెడ్ కానిస్టేబుల్ విల్లా కిషోర్ చేసిన కృషిని ఉన్నతాధికారులు అభినందించారు. ముగిసిన రీజియన్ హ్యాండ్బాల్ పోటీలు పెద్దాపురం: పీఎంశ్రీ జవహర్ నవోదయ విద్యాలయంలో మూడు రోజులుగా జరుగుతున్న హైదరాబాద్ రీజియన్ హ్యాండ్బాల్ పోటీలు శుక్రవారం సాయంత్రం ముగిశాయి. ఈ పోటీలకు దక్షిణాది రాష్ట్రాల్లోని నవోదయ విద్యాలయ సమితి క్రీడాకారులు హాజరయ్యారు. పీఈటీ జనార్దన్ నాయుడు మాట్లాడుతూ ఆఖరి రోజు జరిగిన మ్యాచ్ల్లో అండర్ 14, 17 బాలుర విభాగాల్లో కోలార్ క్లస్టర్, అండర్ 19 విభాగంలో కరీంనగర్ క్లస్టర్ విజేతలుగా, పోలవరం క్లస్టర్, రాయచూరు క్లస్టర్లు రన్నర్లుగా నిలిచాయన్నారు. అలాగే అండర్ 14, 17 బాలికల విభాగంలో కోలార్ క్లస్టర్, అండర్ 19లో పుదుచ్చేరి విజేతలుగా, చిక్కంగళూరు, అల్లపి రన్నర్లుగా నిలిచాయన్నారు. నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ ఎస్ఎస్ కీర్తి మాట్లాడుతూ ఈ పోటీల్లో గెలుపొందిన జట్లు ఆగస్టు 28న పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్కు వెళతాయని తెలిపారు. విజేతలకు ముఖ్య అతిథిలుగా హాజరైన ప్రముఖ వ్యాపారవేత్త మట్టే శ్రీనివాసరావు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు రీజియన్ మేనేజర్ రవికుమార్ గుప్తా ట్రోఫీలను బహూకరించారు. పారిశ్రామికవేత్త టి.ఉమాశంకర్, ఎన్సీసీ ఆఫీసర్ ఎస్.సత్యనారాయణ, పీఈటీలు చక్రవర్తి, అనురాధ, పి.రామారావు, ప్రేమలత పాల్గొన్నారు. విద్యార్థి సంఘాల బంద్ విజయవంతం బాలాజీచెరువు: నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లాలో విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో జరిగిన బంద్ విజయవంతమైంది. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.గంగా సూరిబాబు, ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి వై.బాబి, విద్యార్థి జేఏసీ రాష్ట్ర కార్యదర్శి బుల్లిరాజు తదితరులు మాట్లాడుతూ గత 14 ఏళ్లలో 116 సార్లు పేపర్ లీకేజీలు జరిగాయని ఆరోపించారు. నీట్ లీకేజీపై 45 రోజులుగా నిరసనలు తెలుపుతున్నా, 21 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా, కేంద్రం స్పందించకపోవడం దారుణమన్నారు. ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీఛార్జి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. పీడీఎస్యూ, డీఐవైఎఫ్ నాయకులు సిద్ధూ, టి.రాజా, ఎస్ఎఫ్ఐ ప్రతినిధులు గమినివేలు, సత్యం, కరుణ్ కుమార్ పాల్గొన్నారు. విద్యార్థులకు దుర్వాసన వచ్చే భోజనమా! కొత్తపల్లి: పాఠశాలలో విద్యార్థులకు దుర్వాసన వచ్చే భోజనం పెట్టడంపై ఓ విద్యార్థి తల్లి వాపోయింది. స్థానిక జిల్లా బాలికల పరిషత్ పాఠశాలలో శుక్రవారం పేరెంట్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో రుచి, శుచిలేని భోజనాన్ని పిల్లలకు పెట్టడంపై తల్లిదండ్రుల సమావేశానికి హాజరైన ఓ తల్లి నాయకులను, అధికారులను, ఉపాధ్యాయులను నిలదీసింది. ఇటువంటి భోజనం పెట్టడం వల్ల అనారోగ్యానికి గురైతే బాధ్యులెవరంటూ ప్రశ్నించింది. నాసిరకం భోజనం తయారు చేస్తున్న ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని కోరింది. -
యువత సమస్యలపై 28న నిరసన ర్యాలీలు
రాజమహేంద్రవరం సిటీ: విద్యార్థు లు, నిరుద్యోగ యువత సమస్యలపై ఈ నెల 28న రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్టు వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు యువజన, విద్యార్థి విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో నీట్ ప్రశ్నపత్రం లీకేజీతో లక్షల మంది విద్యార్థుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణతో పారదర్శకమైన విచారణ చేయించాలని, ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చే శారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, డీఎస్సీ నియామకాల్లో అవకతవకలపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 8న పలు రైళ్ల రద్దు రాజమహేంద్రవరం సిటీ: సాంకేతిక మరమ్మతుల కారణంగా ఆగస్టు 8వ తేదీన పలు రైళ్ల రాకపోకలను రద్దు చేస్తున్నట్టు అధికారులు శుక్రవారం ప్రకటించారు. విశాఖపట్నం – కాకినాడ పోర్ట్ (17268), కాకినాడ పోర్ట్ – విశాఖపట్నం (17267), విశాఖపట్నం – రాజమహేంద్రవరం (67286), రాజమహేంద్రవరం – విశాఖపట్నం (67285) రైళ్లను రద్దు చేసినట్టు తెలిపారు. -
అన్నీ తిరకాసులే..!
● ‘తల్లికి వందనం’ సొమ్ము జమలో మెలికలు ● వివిధ సాకులు చూపుతూ అర్హులకు కోత ● మూతపడిన పాఠశాలకు మళ్లింపు ● ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు అందరికీ ‘తల్లికి వందనం’ అన్నారు.. ఇప్పుడు సాకులు వెతికి మరీ కోత పెట్టారు.. నిధుల జమలోనూ తిర‘కాసులు’ పెట్టేశారు.. ఈ పరిణామాలతో లబ్ధిదారులు తల్లడిల్లిపోతున్నారు.. ఎన్నో ఆశల మధ్య తమ పిల్లలను చదివించుకుంటున్న తల్లిదండ్రులకు ఆందోళన మిగిల్చారు. ఈ పథకం అమలులో భారీగా కోతలు పెట్టడంతో ఆయా వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోంది. పిఠాపురం: తల్లికి వందనం పథకం అమలుకు గ్రహణం పట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చదివిస్తున్న అర్హులైన తల్లులకు అందాల్సిన సొమ్ము ప్రైవేటు స్కూళ్లకు వెళ్తున్నాయి. మూతపడిన పాఠశాల ఖాతాలకు ఈ నిధులు మళ్లుతున్నాయి. తప్పులతడకగా ఈ పథకం అమలవుతోందనడానికి ఇదే నిదర్శనం. ఓ కుటుంబంలో చదువుతున్న విద్యార్థులందరికీ ‘తల్లికి వందనం’ పథకం కింద ఏడాదికి రూ.15 వేలు జమ చేస్తామని ఎన్నికల ముందు ఊదరగొట్టిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఆ పథకాన్ని అనేక సాకులతో మమ అనిపిస్తున్నారు. అధికార పగ్గాలు చేపట్టిన తొలి ఏడాది పూర్తిగా ఎగొట్టిన ప్రభుత్వం, గత ఏడాది అరకొర నిధులు విదిల్చింది. ఇప్పుడు తాజాగా మూడో ఏడాది పూర్తిగా అమలు చేస్తారని ఎదురు చూసిన తల్లులకు నిరాశే మిగిల్చింది. గత ఏడాది 2.28 లక్షల మందికి విడుదల చేయగా, ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య పెరిగినా, లబ్ధిదారుల్లో మాత్రం కోత విధించింది. గత ఏడాది లబ్ధి పొంది, ఈ ఏడాది జమ కాకపోవడంతో అర్హులు తల్లడిల్లిపోతున్నారు. చెప్పేదొకటి.. ఇచ్చేదొకటి ఇంట్లో ఎంతమంది చదువుతుంటే అంతమందికీ ఒక్కొక్కరికి రూ.15 వేలు జమ చేస్తామంటూ కూటమి నేతలు ఎన్నికల ముందు ప్రచారం చేసుకున్నారు. ఇప్పటికీ ప్రచారం చేస్తున్నారు. కానీ రూ.13 వేల చొప్పున మాత్రమే తల్లి వందనం సొమ్ము అందిస్తున్నారు. నిబంధనల పేరుతో కోత విధించి వేలాది మందిని అనర్హులుగా మార్చేయడంతో పాటు కుటుంబంలో ముగ్గురు విద్యార్థులు ఉంటే, రూ.13 వేలు మాత్రమే జమ అవుతోంది. తద్వారా మరో ఇద్దరికి రూ.26 వేలు కోత పెడుతున్నారు. ఒక్క రూపాయి కూడా తగ్గించకుండా పూర్తిగా జమ చేస్తామని మంత్రి లోకేష్ ప్రకటించారని, ఇప్పుడు ఒక్కొక్కరికీ రూ.2 వేలు తగ్గించి ఇవ్వడమేంటని పలువురు విద్యార్థుల తల్లులు ప్రశ్నిస్తున్నారు. ఎగ్గొట్టే సాకులెన్నో.. ఎగ్గొట్టాలంటే సవాలక్ష సాకులు ఉంటాయి. సరిగ్గా ఆ విధానాన్నే చంద్రబాబు ప్రభుత్వం అవలంబించింది. వేసవిలో విద్యుత్ వినియోగం పెరగడం సాధారణమే. ఇప్పుడు దానినే ప్రామాణికంగా తీసుకుని గ్రామీణ ప్రాంతాల్లో పేదలను సైతం పథకానికి దూరం చేసింది. నాలుగు చక్రాల వాహనం, 300 యూనిట్లు దాటిన కరెంటు బిల్లు, నెలసరి ఆదాయం రూ.12 వేలు వచ్చిందంటూ ఒక్క పిఠాపురం జగ్గయ్యచెరువు కాలనీలో 184 మంది నిరుపేద కుటుంబాలకు చెందిన తల్లులను అనర్హులుగా ప్రకటించింది. తల్లికి అడుగడుగునా దగా... చంద్రబాబు ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో తల్లులను అడుగడుగునా దగా చేస్తోంది. అనేక సాకులు చూపుతూ తల్లుల ఖాతాలో నిధులు జమ చేయడం లేదు. పథకంలో లబ్ధి పొందేందుకు అన్ని అర్హతలున్నా, లబ్ధి చేకూరడం లేదు. కొన్ని ప్రాంతాల్లో తల్లికి వందనం నిధులను డ్వాక్రా రుణాలకు జమ చేసుకుంటున్న ఘటనలు ఉన్నాయి. వాటిని హోల్డ్ చేస్తున్న దాఖలాలు ఉన్నాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పథకం ఫలాలు నేరుగా లబ్ధిదారులకే దక్కేవి. ప్రస్తుతం నిధులు ఎలా ఎగ్గొట్టాలా..? అని కారణాలు వెతకడం దారుణం. – కురసాల కన్నబాబు, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి, కాకినాడ వేరే స్కూల్ ఖాతాకు వేస్తూ.. నా ఇద్దరు పిల్లలు బీర భవ్యశ్రీ (3వ తరగతి), లహర్ష (2వ తరగతి). పిఠాపురం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. గత ఏడాది ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత సీటు వచ్చిందని చేరారు. ఉచిత సీటు ఉన్నా, మిగిలిన ఖర్చులు భరించలేక ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాను. గతంలో, ఇప్పుడు తల్లికి వందనం నిధులు ఆయా ప్రైవేట్ స్కూళ్ల ఖాతాల్లో జమ అయ్యాయి. మా పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. తల్లికి వందనం నిధులు జమయ్యే విధంగా చూడాలని రెండేళ్లుగా తిరుగుతున్నా, ఫలితం లేదు. – బీర ధర్మరాజు, అగ్రహారం, పిఠాపురం మూతపడిన పాఠశాలకు... మా అమ్మాయి కొల్లా బత్తుల లక్ష్మీభార్గవి సీబీఎం ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతుంది. గతంలో పిఠాపురంలోని ప్రైవేటు స్కూల్లో ఉచిత సీటు వచ్చిందని ఒకటో తరగతిలో చేర్పించాను. అదనపు ఫీజులు భరించలేక తిరిగి ప్రభుత్వ పాఠశాలలో చేర్చారు. రెండేళ్లుగా తల్లికి వందనం నిధులు ఆ ప్రైవేట్ స్కూల్ అకౌంట్కు జమవుతున్నాయి. ప్రస్తుతం ఆ పాఠశాల మూతపడి ఉంది. దీనిపై అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదు. – కొల్లాబత్తుల విజయ్ కుమార్, అగ్రహారం, పిఠాపురం జూనియర్ కళాశాల విద్యార్థులు : 55వేల మందిఅనర్హులు : 69వేల మందిజిల్లాలో తల్లికి వందనం ఇలా..1–10 చదువు తున్న విద్యార్థులు : 2.90లక్షల మందితల్లికి వందనం పథకానికి అర్హులు : 2.76లక్షలు -
విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలి
గోకవరం: విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రంపచోడవరం పర్యటన సందర్భంగా గోకవరం మండలం కృష్ణునిపాలెంలో రాత్రి వరకు విద్యార్థులను ఉంచిన మండల విద్యాశాఖ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ విజృంభణ రాష్ట్ర కార్యదర్శి కె.సతీష్ డిమాండ్ చేశారు. స్థానిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి లోకేష్ పర్యటనలో అత్యుత్సాహం ప్రదర్శించి, కృష్ణునిపాలెంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను రాత్రి 9 గంటల వరకు ఉంచడం హేయమైన చర్యన్నారు. విద్యాశాఖ అధికారులు చిన్నపిల్లలను ఇబ్బంది పెడుతూ, చీకట్లో ఉంచడం బాధాకరమని, ఈ సంఘటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని, పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థి సంఘాల నేతలతో బయటకు పంపించమంటే జీఓలు ఉన్నాయని, అలా కుదరదని చెప్పే విద్యాశాఖ అధికారులు ఇప్పుడు పిల్లలను చీకట్లో, దోమల్లో ఎలా ఉంచుతారని ఆయన ప్రశ్నించారు. తక్షణమే ఈ సంఘటనపై విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు. -
మత్స్య సహకార సంఘాలకు శిక్షణ
కాకినాడ రూరల్: జలాశయాల్లో చేప పిల్లల నిల్వ ప్రాముఖ్యత, మత్స్య అభివృద్ధిలో మత్స్య సహకార సంఘాల పాత్రపై కాకినాడలోని రాష్ట్ర మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ (ఎస్ఐఎఫ్టీ)లో మూడు రోజుల శిక్షణ గురువారంతో ముగిసింది. హైదరాబాద్కు చెందిన ఎన్ఎఫ్డీబీ సహకారంతో జలాశయాల్లో మత్స్య సంపద ద్వారా సహకార సంఘాలకు ఆదాయం వృద్ధి కోసం ఈ కార్యక్రమం నిర్వహించినట్టు ఎస్ఐఎఫ్టీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.అంజలి తెలిపారు. చెరువులు, జలాశయాల ఉత్పాదకత అంచనా, మత్స్య వనరులు, స్థిరమైన చేపల ఉత్పత్తి కోసం జలాశయాల నిర్వహణ తదితర అంశాలపై బెంగళూరుకు చెందిన సీఐఎఫ్ఆర్ఐ హెడ్, సైంటిస్ట్ డాక్టర్ ఎల్ఎస్ మూర్తి, మత్స్యశాఖ విశ్రాంత అధికారులు రామ్మోహనరావు, జయరావు, రంపచోడవరం కేవీకే శాస్త్రవేత్త వీరాంజనేయులు అవగాహన కల్పించారు. అనధికార లేఅవుట్ల తొలగింపు కాకినాడ రూరల్: కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కౌడా) ఎన్ఫోర్స్మెంట్ ఆధ్వర్యంలో జిల్లాలో పలు గ్రామ పంచాయతీల్లో అనధికార లే అవుట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. కౌడా చీఫ్ ప్లానింగ్ అధికారి మీనాకుమరి పర్యవేక్షణలో ఏపీఓ కృష్ణారావు, రామిరెడ్డి, ఆనందకుమార్, జేపీఓలు శివరామకృష్ణ, వెంకటరావు తమ సిబ్బందితో నాలుగో రోజు గురువారం మెట్టలో అనధికార లేఅవుట్లు ధ్వంసం చేశారు. జగ్గంపేట మండలం జె.కొత్తూరులో మూడు అనధికార లేఅవుట్లు, రామవరం, జగ్గంపేట, కిర్లంపూడి మండలం బూరుగుపూడి, కృష్ణవరం, సోమవరం గ్రామాల్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం లే అవుట్లలో సరిహద్దు రాళ్లను తొలగించి, రోడ్లను ధ్వంసం చేశారు. శిలాఫలకం ధ్వంసం పైశాచికం అనపర్తి: జి.మామిడాడ సూర్యనారాయణమూర్తి ఆలయానికి సుమారు రూ.2 కోట్ల విరాళాలిచ్చిన దాత దివంగత మాజీ సర్పంచ్ చింతపండు అమ్మిరెడ్డి పేరును శిలాఫలకంపై నుంచి తొలగించడం పైశాచికమని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనపర్తిలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ, భూరి విరాళాలిచ్చిన దాతలను సైతం అవమానిస్తూంటే సామాన్యుల పరిస్థితేమిటని ప్రశ్నించారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత దౌర్జన్యాలు, దాడులు తీవ్రతరమయ్యాయని ఆరోపించారు. సూర్యనారాయణస్వామి వారికి అమ్మిరెడ్డి సుమారు రూ.1.50 కోట్ల విలువైన బంగారు కిరీటం సమర్పించారని గుర్తు చేశారు. ఆయన మరణానంతరం సోదరుడు వెంకటరెడ్డి 2018లో సుమారు రూ.6.50 లక్షలతో ఆలయ ముఖద్వారంపై అశ్వాలతో కూడిన సూర్యనారాయణమూర్తి విగ్రహం ఏర్పాటు చేయించారని చెప్పారు. శిథిలావస్థకు చేరిన ధ్వజస్తంభానికి కూడా రూ.10 లక్షల విరాళం ఇచ్చారన్నారు. ఇవన్నీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న కాలంలోనే జరిగాయని, శిలాఫలకం కూడా అప్పుడే వేశారని చెప్పారు. అయితే, ఈ పనులన్నీ వైఎస్సార్ సీపీ హయాంలోనే జరిగాయంటూ ఆయన పచ్చి అబద్ధాలు చెబుతున్నారని సూర్యనారాయణరెడ్డి దుయ్యబట్టారు. పట్టపగలు శ్రేష్ఠమైన ముహూర్తాన చాగంటి కోటేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభమైన ఈ కార్యక్రమాలపై అర్ధరాత్రి వేళ దొంగచాటుగా దాడులు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ఆ రోజు శిలాఫలకాలపై అభ్యంతరం చెప్పని రామకృష్ణారెడ్డి, శిలాఫలకాలను ధ్వంసం చేయించడం దుర్మార్గమని విమర్శించారు. ఆయన నిజంగా సంబంధం లేకపోతే, శిలాఫలకం ధ్వంసం చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, అలాగే అక్కడ శిలాఫలకాన్ని యథాతథంగా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రామకృష్ణారెడ్డి వైఖరి వల్ల భవిష్యత్తులో ఏ దాతా ముందుకు వచ్చే పరిస్థితి ఉండదని డాక్టర్ సూర్యనారాయణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. -
పోషకాల పండుగ
● తాటిపండుతో ఎన్నో ఉపయోగాలు ● నోరూరించే వంటకాలు ● రుచికరమైన స్వీట్ల తయారీ ● తినడానికి ఆసక్తి చూపుతున్న ప్రజలు ఆలమూరు/మలికిపురం: వేసవిలో మండే ఎండలు, వేడి నుంచి ఉపశమనానికి తాటిముంజెలను తింటూ ఉంటాం. అలాగే శీతాకాలం చివరిలో వచ్చే తేగలంటే అందరికీ ఇష్టమే. ఈ రెండు కాలాల మధ్య మనకు లభించే తాటిపండుకు ఎన్నో పోషక గుణాలున్నాయి. దీని గుజ్జు నుంచి వివిధ రకాల పిండి వంటలు, స్వీట్లు తయారు చేస్తున్నారు. ప్రముఖ స్వీట్ షాపుల్లోనూ తాటి పండు వంటకాలు లభిస్తున్నాయి. ముంజెకాయ పండిపోయి తాటి పండు రూపంలో చెట్టు నుంచి నేల మీదకు పడుతుంది. దాని నుంచి తీసిన గుజ్జుతో ఇడ్లీలు, గారెలు, రొట్టెలు చేసుకుని తినడం మన పూర్వకాలం నుంచీ వస్తోంది. ఆధునిక కాలంలో తాటిగుజ్జుతో స్వీట్లు కూడా తయారు చేస్తున్నారు. కనుమరుగు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఒకప్పుడు ఎక్కడ చూసినా తాటిపండ్లు విరివిగా లభించేవి. కానీ ఇప్పుడు దాదాపు కనుమరుగైపోయాయి. ఒకప్పుడు చెట్ల నుంచి జారి పడిన తాటిపండ్లను రైతులు తమ చుట్టుపక్కల వారికి ఉచితంగా ఇచ్చేవారు. కానీ నేడు పల్లెల్లో కూడా వీటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమలాపురం, రాజమహేంద్రవరం, కాకినాడ, పిఠాపురం, పెద్దాపురం, తుని, రామచంద్రపురం తదితర ప్రాంతాల్లో రోడ్డు పక్కన దుకాణాలు ఏర్పాటు చేసి, తాటిపండును సైజును బట్టి రూ.30 నుంచి రూ.50 వరకూ విక్రయిస్తున్నారు. రుచి మధురం తాటిపండు గుజ్జుకు బెల్లం, వరి నూక, కొబ్బరి కోరును సమపాళ్లలో కలిపి ముద్దగా తయారు చేస్తారు. దానిలో గారెలు, రొట్టెలు తయారు చేసుకోవచ్చు. తాటి గుజ్జుతో తయారు చేసిన తాండ్ర మరింత రుచికరంగా ఉంటుంది. ముందుగా గుజ్జును శుభ్రమైన తాటాకు చాప మీద రోజూ పొరలా పూస్తుంటారు. అలా ఎండిన గుజ్జు కొద్ది రోజుల తర్వాత మందంగా మారి తాండ్రగా తయారవుతుంది. ఈ తాండ్రను చిన్నారులు అమితంగా ఇష్టపడతారు. తాటిగుజ్జుతో చేసిన వంటకాలు నాలుగైదు రోజులు నిల్వ ఉంటాయి. ఆరోగ్యకరం తాటి పదార్థాల్లో ఏ, బీ, సీ విటమిన్లు, ఐరన్, జింక్, పాస్ఫరస్, పొటాషియం వంటి అధిక పోషకాలు ఉండటం వల్ల మానవ శరీరంలో కణజాల పెంపునకు దోహద పడతాయని వైద్యులు చెబుతున్నారు. అలాగే శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. తాటి టెంకలో ఉండే పీచుతో జీర్ణకోశ వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. తేగలు తింటే మలబద్ధకం దూరమవుతుంది. తాటి ముంజెలు శరీర ఉష్ణోగ్రతను తగ్గించి చలువ దనాన్ని ఇస్తాయి. తాటి తాండ్రను తినడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుందని. టైప్ 2 డయాబెటిస్తో బాధపడే వారు మంచి ఫలితాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. -
పారా స్పోర్ట్స్లో భరద్వాజ ప్రతిభ
కాకినాడ రూరల్: సమగ్ర శిక్షా పీఎంశ్రీ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి పారా స్పోర్ట్స్లో తిమ్మాపురం గ్రామానికి చెందిన భవిత సెంటర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న దివ్యాంగ విద్యార్థి రెడ్డి భరద్వాజ ప్రతిభ చూపాడు. 400, 100 మీటర్ల విభాగాల్లో బంగారు పతకాలు, షాట్ఫుట్లో కాంస్య పతకం సాధించినట్టు కాకినాడ రూరల్ ఐఈఆర్టీ వెంకటలక్ష్మి తెలియజేశారు. భరద్వాజను ఎంఈఓలు ఈశ్వర శాస్త్రి, బి.శ్రీనివాస్ కుమార్ అభినందించారు. కార్యక్రమంలో పీడీ జయలక్ష్మి, భవిత సెంటర్కు చెందిన వీర గణేష్ పాల్గొన్నారు. పవర్ లిఫ్టింగ్లో కానిస్టేబుల్ సత్తా అల్లవరం: ఓడలరేవు మైరెన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న బి.అప్పన్న జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో సత్తా చాటి వెండి పతకం గెలుచుకున్నాడు. మహారాష్ట్రలోని జౌరంగబాద్లో ఈ నెల 18 నుంచి 21 జరిగిన మాస్టర్స్ నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో 120 కేజీల విభాగంలో ఈ ఘనత సాధించాడు. ఈ సందర్భంగా ఆయనను గురువారం అమలాపురం హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్లో కోనసీమ పవర్ లిఫ్టింగ్ అసోషియేషన్ అధ్యక్షుడు యనుముల పద్మరాజు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. అప్పన్న గతంలో రెండు సార్లు 550 కేజీల బరువుల ఎత్తి, జాతీయ స్థాయి విజేతలుగా నిలిచారన్నారు. కార్యక్రమంలో కోచ్ కంకిపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆటంకాలు దాటేనా!
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): అమరావతి చాంపియన్షిప్ పేరుతో ఆటల పోటీలను నిర్వహిస్తున్నట్టు కూటమి ప్రభుత్వం అట్టహాసంగా ప్రచారం చేసింది. 12 క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయని ప్రకటించింది. అయితే పోటీల నిర్వహణకు నియోజవర్గానికి కేవలం రూ.5 వేలు మాత్రమే కేటాయించింది. ఈ సొమ్ముతో ఎలా నిర్వహించాలో తెలియని పరిస్థితి నిర్వాహకులకు ఏర్పడింది. అలాగే క్రీడా పరికరాలు సమకూర్చకపోవడం, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో తగినంత మంది వ్యాయామ ఉపాధ్యాయులు లేకపోవడంతో నిర్వహణ కత్తిమీద సాములా మారింది. వసతుల కొరత జాతీయ క్రీడా దినోత్సవాన్ని (ధ్యాన్చంద్ జయంతి, ఆగస్టు 29) పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కలసి రూ.90 లక్షల ప్రైజ్మనీతో అమరావతి చాంపియన్ షిప్ పేరుతో క్రీడా పోటీలకు సన్నాహాలు చేశాయి. ఈ టోర్నమెంట్ నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో నిర్వహించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. క్రీడాప్రాధికార సంస్థతో పాటు విద్యాశాఖ సమన్వయంతో నిర్వహించాలని, పోటీల నిర్వహణకు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, డిగ్రీ కళాశాలల మైదానాలు, వ్యాయామ ఉపాధ్యాయులు, అధ్యాపకులను వినియోగించుకోవాలని ఇప్పటికే ఆయా యూనివర్సిటీలు, కళాశాలకు ఆదేశాలు జారీ అయ్యాయి. కానీ డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో వసతులు, మైదానాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వ్యాయామ అధ్యాపకులు లేకపోడంతో ఈ టోర్నమెంట్ నిర్వహణ క్రీడాభివృద్ధి ఽఅధికారులకు కత్తిమీద సాములా తయారైంది. మరో వైపు ఈ టోర్నమెంట్లో పాల్గొనే ప్రతి క్రీడాకారుడు క్రీడాయాప్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి. కానీ రిజిస్ట్రేషన్ నత్తనడకగా సాగిందనే విమర్శలు వస్తున్నాయి. ఈ నెల 27 నుంచి షెడ్యూల్ అమరావతి చాంపియన్ షిప్ను ఈ నెల 15 నుంచి ఆగస్టు 26 వరకు నిర్వహించాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. రాష్ట్రంలో వారం రోజులుగా వర్షాలు కురవడంతో నియోజకవర్గ స్థాయిలో ఈ నెల 27 నుంచి షెడ్యూలు ప్రకటించారు. అండర్ 17, 23 విభాగాల్లో ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, బాస్కెట్ బాల్, చెస్, హాకీ, కబడ్డీ, ఖోఖో, వెయిట్ లిఫ్టింగ్, వాలీబాల్, యోగాతో కలిపి 12 విభాగాల్లో పోటీలు జరుగుతాయి. ఈ నెల 27న తుని క్రీడా వికాస కేంద్రం, 28న ప్రత్తిపాడు జెడ్పీ పాఠశాల, 27న జగ్గంపేట ప్రభుత్వ పాఠశాల, 28న పెద్దాపురం లూథరన్ పాఠశాల, 29న పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ కళాశాల, 30న కాకినాడ ఆర్బన్ పరిధిలో, 31న కాకినాడ రూరల్ పరిధిలో కాకినాడ డీఎస్ఏలో నియోజకవర్గస్థాయిలో పోటీల నిర్వహణకు క్రీడాప్రాధికార సంస్థ అధికారులు షెడ్యూలు ప్రకటించారు. దాతలే ఆధారం నియోజకవర్గ స్థాయిలో పోటీల నిర్వహణకు కేవలం రూ.5 వేలను ప్రభుత్వం కేటాయించింది. స్థానిక ఎమ్మెల్యేలు, దాతల సహకారంతో పోటీలు నిర్వహించాలని ఆదేశించింది. అవుట్ డోర్ గేమ్స్ అయిన వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, హాకీ, అథ్లెటిక్స్, బాస్కెట్బాల్ పోటీలు నిర్వహించేందుకు అనువైన క్రీడా మైదానాలు లేకపోవడం, జిల్లాలో అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో వీటి నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పీడీల కొరత, మైదానాలు అంతంత మాత్రంగా ఉండడంతో పోటీల నిర్వహణకు ఇబ్బంది కలుగుతుందని క్రీడాసంఘాల ప్రతినిధులు భావిస్తున్నారు. కాకినాడ డీఎస్ఏలో వర్షం కారణంగా బురదగా మారిన మైదానం పెద్దాపురం లూథరన్ హైస్కూల్ మైదానం ఆదేశాలు ఇవే.. పోటీల్లో పాల్గొనే విద్యార్ధులకు మిడ్డే మీల్స్లో భోజన సదుపాయాలు కల్పించాలి. నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లాకు వచ్చే క్రీడాకారుల్లో బాలికలు, మహిళలు ఫ్రీ బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోవాలి. పురుషులు, బాలురకు ఒక వైపు చార్జీలు మాత్రమే అందిస్తారు. ఇక ప్రైజ్ మనీ రూ.90 లక్షలు ప్రకటించినా ఏ స్థాయిలో ఎంత ఇస్తారనే దానిపై స్పష్టత లేదు. అమరావతి చాంపియన్ షిప్ నిర్వహణకు ప్రభుత్వం ఆదేశం పోటీల నిర్వహణకు షెడ్యూల్ విడుదల అరకొరగా నిధుల కేటాయింపు నిర్వాహకులకు కత్తిమీద సాము వేధిస్తున్న మైదానాల కొరత, వసతుల లేమి -
కొత్త సమస్యలు సృష్టిస్తే ఎలా?
పిఠాపురం: కొత్త సమస్యలు సృష్టిస్తున్న పట్టు పరిశ్రమ శాఖ డీడీ గీతారాణి వస్తే.. తాము సమావేశానికి వచ్చేది లేదని పట్టు రైతులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు గొల్లప్రోలు మండలం చేబ్రోలులో సమావేశాన్ని పట్టు రైతులు బహిష్కరించారు. పట్టు రైతుల సమస్యల పరిష్కారం, సూచనలు, సలహాల కోసం గురువారం చేబ్రోలు పట్టు పరిశ్రమ కేంద్రం వద్ద పట్టు పరిశ్రమ శాఖ డీడీ గీతారాణి ఆధ్వర్యంలో సెంట్రల్ సిల్క్ బోర్డు శాస్త్రవేత్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే గ్రామంలో ముందుగా రైతులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుని, అధికారులు ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ డీడీ గీతారాణి పట్టు పరిశ్రమను దివాలా తీయిస్తున్నారని ఆరోపించారు. తమ సమస్యలు చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆమెను వెంటనే బదిలీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ సమావేశాన్ని తాము బహిష్కరిస్తే, వేరేచోట వ్యక్తులతో ఫోటోలు తీయించి సమావేశం నిర్వహించినట్లు ప్రభుత్వానికి పంపించారని ఆరోపించారు. ఈ విషయమై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి.. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. సమావేశాన్ని బహిష్కరించిన పట్టు రైతులు -
పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
రాయవరం: విద్య, యోగా, ఆధ్యాత్మిక, ధార్మిక, వైద్యం, సంగీతం, సాహిత్యం, సాంస్కృతిక, నృత్యం, కళలు, క్రీడలు, కరాటే వంటి రంగాల్లో ప్రతిభ చూపుతున్న ఉపాధ్యాయుల నుంచి గురుబ్రహ్మ, గురు శిరోమణి పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. వీటికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఉపాధ్యాయులందరూ దరఖాస్తు చేసుకోవాలని సర్వేజనా సుఖినోభవంతు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, లయన్ డాక్టర్ ఈఎస్ఎస్ నారాయణ గురువారం ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుతో పాటు ప్రతిభను తెలిపే సర్టిఫికెట్లు, ఫొటోలు, పత్రికల క్లిప్పింగ్లు, గతంలో పొందిన పురస్కారాల సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, నాలుగు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలను ఈ నెల 31వ తేదీలోగా పంపించాలన్నారు. సర్వేజనా సుఖినో భవంతు, డోర్ నంబరు 1–20–164, తిరుమలగిరి, గోకుల్నగర్, వెంకటాపురం, సికింద్రాబాద్–15 నంబరుకు పోస్టు చేయాలన్నారు. మరిన్ని వివరాలకు 96523 47207 నంబర్ను సంప్రదించాలని కోరారు. -
వివిధ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఏలూరు జిల్లా అరిగిపల్లి హీల్ ప్యారడైజ్లో జరిగిన రాష్ట్ర స్థాయి పారా స్పోర్ట్స్ మీట్లో జిల్లా దివ్యాంగ విద్యార్థులు పరుగు, లాంగ్ జంప్ వంటి విభాగాల్లో విశేష ప్రతిభ కనబరిచారు. ఈ టోర్నీలో 7 బంగారు, 4 సిల్వర్, 10 రజిత పథకాలు సాధించారు. కాజులూరు మండలం నుంచి నలుగురు విద్యార్థులు, కాకినాడ అర్బన్ నుంచి ఒకరు, కాకినాడ రూరల్ నుంచి ఒకరు, పెదపూడి మండలం నుంచి ఇద్దరు, ప్రత్తిపాడు నుంచి ఒకరు విజేతలుగా నిలిచారు. ఈ మేరకు గురువారం కాకినాడ కలెక్టరేట్లో కలెక్టర్ హరేంధిర ప్రసాద్ను విద్యాశాఖ అధికారులతో విజేతలు కలిశారు. వారిని కలెక్టర్ అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ భవిష్యత్తులోనూ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. జిల్లా విద్యాశాఖ అధికారి పి.రమేష్, సమగ్ర శిక్ష ప్రాజెక్టు కోఆర్డినేటర్ సత్యనారాయణ పాల్గొన్నారు. -
కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి
ఎస్ఎఫ్ఐ, ప్రజా సంఘాల డిమాండ్పిఠాపురం రూరల్: నీట్ పేపర్ లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురువారం నిరసన తెలిపారు. ఈ మేరకు పిఠాపురం రథాలపేట అంబేడ్కర్ సెంటర్ వద్ద కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీ కారణంగా పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, యువతపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. విద్యా వ్యవస్థలో పేపర్ లీకేజీలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలపై ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్చుక్కు మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. శుక్రవారం విద్యార్థి సంఘాల జేఏసీ పిలుపునిచ్చిన దేశవ్యాప్త బంద్ను విజయవంతం చేయాలని విద్యార్థులు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ లోవరాజు, మండల అధ్యక్షుడు జి.చిన్ని, మండల కార్యదర్శి కె.సిద్ధూ, ప్రజా సంఘాల నాయకులు కె.చిన్న, జి.వీరబాబు, కోనేటి రాజు, గోపాలకృష్ణ, నాగేశ్వరరావు, పప్పుల వీరబాబు, ఎస్ రాజేష్, సత్యనారాయణ, గోవింద్, సూర్యనారాయణ, సీహెచ్ శ్రీనివాస్, కె అప్పన్న, బి వడ్డీకాసులు, చంటిబాబు తదితరులు పాల్గొన్నారు. -
రత్నగిరిపై వరుణ యాగానికి నిర్ణయం
అన్నవరం: రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసి, పంటలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ అన్నవరంలోని శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో త్వరలో వరుణ యాగం నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. గురువారం ఆయన దేవస్థానం వేదపండితులు, ప్రధానార్చకులు, ఇతర వైదిక కమిటీ సభ్యులతో సమావేశమై ఈ యాగం నిర్వహణపై చర్చించారు. ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా, రైతు ప్రయోజనాలు ఆకాంక్షిస్తూ ఈ యాగం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ యాగం ఎప్పటి నుంచి ప్రారంభించాలనే దానిపై ముహూర్తం నిర్ణయించాలని దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి, పంచాంగ కర్త శ్రీతంగిరాల వెంకట కృష్ణ పూర్ణప్రసాద్ సిద్ధాంతిని కోరినట్టు తెలిపారు. కార్యక్రమంలో దేవస్థానం వేదపండితులు గంగాధరబట్ల గంగబాబు, చిట్టి శివ, గొల్లపల్లి ఘనాపాఠి, వేదుల సూర్యనారాయణ, యనమండ్ర శర్మ, ఆలయ ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యశర్మ, వ్రత పురోహిత సంఘం అధ్యక్షుడు ఛామర్తి కన్నబాబు, పురోహితుడు పాలంకి పట్టాభి తదితరులు పాల్గొన్నారు. -
ఎల్నినో ప్రభావంతో పంటలకు చీడపీడలు
● సస్యరక్షణ చర్యలు తప్పనిసరి ● రైతులకు వ్యవసాయాధికారుల అవగాహన అనపర్తి: ఎల్నినో ప్రభావంతో అడపాదడపా కురిసే వర్షాలు, అధిక ఉష్ణోగ్రతలకు ఖరీఫ్ వరి పంటను చీడపీడలు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుందని, రైతులు తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్ చల్లా వెంకట నరసింహారావు అన్నారు. మండలంలోని పులగుర్త గ్రామంలో గురువారం ఆత్మ సౌజన్యంతో రైతు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు పలు జాగ్రత్తలు వివరించారు. ఆ ప్రకారం.. ● ఎల్నినో నేపథ్యంలో వరిని ఆకునల్లి ఆశించి, ఆకులు ఎర్రబడతాయి. దాని నివారణకు డైకాఫోల్ 5.0 మిల్లి లీటర్ల మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ● ఎండాకు తెగులు సోకితే పొలంలోని పాత నీటిని తీసివేసి ఆరగట్టి తిరిగి నీరు పెట్టాలి. నత్రజని ఎరువుల వాడకాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలి. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను ఎకరాకు 20 కిలోలు చల్లాలి. తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటే ప్లాంటోమైసిన్ 1.0 గ్రాములు, కాపర్ హైడ్రాకై ్సడ్ 2.0 గ్రాములను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ● గడ్డి దుబ్బు తెగులు లేదా కాండం కుళ్లు తెగులు క నిపిస్తే, నివారణకు టెబ్యూకోనజోల్ 2.0 మిల్లీ లీ టర్ల మందు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ● ఎలుకల నివారణకు పొలం గట్లను చెక్కుకొని, అక్కడక్కడా ఎలుక బుట్టలు అమర్చుకొంటే, వలస పోయే ఎలుకలు అందులో పడి చనిపోతాయి. ఎలుక బొరియల్లో పొగబారించాలి. బ్రోమోడయోలిన్ 2 శాతం ఎర మందు (96 పాళ్లు నూకలు, 2 పాళ్లు నూనె, 2 పాళ్లు బ్రోమోడయోలిన్ మందు) తయారు చేసి, 10 గ్రాముల పొట్లాలుగా కట్టి, ఎలుక బోరియల వద్ద అమర్చాలి. రైతులందరూ ఈ ప్రక్రియను సామూహికంగా చేపట్టాలి. ● వరిలో మొవ్వు పురుగు నివారణకు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2.0 గ్రాములు లేదా క్లోరంట్రనిలిప్రోల్ 0.3 గ్రాములు లేదా క్లోరిఫైరీఫాస్ 2.5 మిల్లీలీటర్లను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 23,000 గటగట (వెయ్యి) 20,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 22,000 గటగట (వెయ్యి) 19,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్
మోతుగూడెం: మోటారు సైకిల్పై గంజాయిని తరలిస్తున్న ఇద్దరు యువకులను డొంకరాయి పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై చరణ్ నాయక్ గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా నుంచి గుంటూరుకు పది కేజీల గంజాయిని బైక్పై ఇద్దరు యువకులు తరలిస్తున్నారు. గుర్తేడు మండలం బొడ్డుగంటి పంచాయతీ పరిధిలో డొంకరాయి చెక్పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా వీరు పట్టుబడ్డారు. ఈ నేపథ్యంలో గంజాయిని, వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. గుంటూరుకు చెందిన సద్దాం పవన్ మాధవ్, కుందేటి చెన్నకేశవరావును అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసి రిమాండ్ తరలించారు. లోవలో జంతుబలి నిషేధించాలి తుని రూరల్: తలుపులమ్మ లోవ దేవస్థానంలో జంతుబలి, మద్యాన్ని నిషేధించాలని కాకినాడ భోగి గణపతి పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు అన్నారు. ఆయన గురువారం కుటుంబ సభ్యులతో లోవ దేవస్థానానికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. పీఠం తరఫున అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన, మహా హారతి సేవలు నిర్వహించారు. లోక కల్యాణార్థం ప్రత్యేక పూజలు చేసినట్టు తెలిపారు. లోవలో జంతువులను వధించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని నిషేధించాలని కోరుతూకార్యనిర్వహణ అధికారికి లేఖ ఇచ్చినట్టు తెలిపారు. బ్యాడ్మింటన్ పోటీలకు ఏర్పాట్లు పూర్తి నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ శ్రీ ప్రకాష్ స్కూల్లో ఈ నెల 25 నుంచి 27 వరకు నిర్వహించనున్న సీబీఎస్ఈ క్లస్టర్ బ్యాడ్మింటన్ పోటీలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని పాఠశాల డైరెక్టర్ విజయ ప్రకాష్ గురువారం తెలిపారు. ఈ పోటీలకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి 700 మంది క్రీడాకారులు హాజరవుతున్నారన్నారు. అండర్–14, 17, 19 విభాగాల్లో సింగిల్స్, డబుల్స్లో పోటీలు జరుగుతాయని, ఇందుకోసం నాలుగు కోర్టులను ఫ్లడ్లైట్లతో సిద్ధం చేశామన్నారు. పాల్గొనే వారు పాస్పోర్టు సైజు ఫొటో, రిజిస్ట్రేషన్ చేసుకున్న పత్రాలు, ప్రిన్సిపాల్తో కూడిన గ్రూప్ ఫొటోతో హాజరు కావాలని కోరారు. -
సామాజిక ఉద్యమకారులకు ముద్రగడ ఆదర్శం
కిర్లంపూడి: తెలుగు నేలపై సామాజిక ఉద్యమకారులకు మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత దివంగత ముద్రగడ పద్మనాభం ఆదర్శమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ అన్నారు. గురువారం కిర్లంపూడిలోని ముద్రగడ పద్మనాభం నివాసానికి వచ్చిన ఆయన ముద్రగడ సతీమణి పద్మావతి, కుమారులు వైఎస్సార్ సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు, ఆయన పెద్ద కుమారుడు ముద్రగడ వీరరాఘవరావు (బాలు)ను పరామర్శించారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ విలేకర్లతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో గొప్ప నాయకుడు దివంగత ముద్రగడ పద్మనాభం అని అన్నారు. దివంగత వంగవీటి మోహన్రంగా కాపు వర్గాల్లోనే కాకుండా దళితులు, పీడిత వర్గాల గుండెల్లో చోటు పొందారన్నారు. ఆయన తర్వాత ముద్రగడ పేరొందారని కొనియాడారు. తమలాంటి ఉద్యమకారులకు ఆయన అంటే ఎనలేని గౌరవం అని తెలిపారు. పదవులు వస్తుంటాయి.. పోతుంటాయని, తాను నమ్ముకున్న జాతికోసం రాజకీయాలు, పదవులు లెక్కచేయకుండా దృఢ సంకల్పంతో సాగారన్నారు. దళితులను అక్కున చేర్చుకుంటామని ఎంతో మంది రాజకీయ నాయకులు అంటారని, ముద్రగడ వాటిని తూచా తప్పకుండా ఆచరించారని అన్నారు. తాను నివసించే ఇంట్లోనే మహనీయులు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మాజీ సీఎం దామోదరం సంజీవయ్య విగ్రహాలను ఏర్పాటు చేయడం ఆయన గొప్పతనానికి నిదర్శనం అన్నారు. ఆయన కుమారులు ముద్రగడ గిరిబాబు, వీరరాఘవరావులు ముద్రగడ బాటలోనే నడుస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో దళిత నాయకులు పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ -
బుగ్గిపాలైన జీవనాధారం
● కాలిపోయిన మూడు టీ పాయింట్లు ● మరో హోటల్కు పాక్షికంగా నష్టం దేవరపల్లి: ఖమ్మం–దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలోని దేవరపల్లి జంక్షన్ వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మూడు దుకాణాలు (టీ పాయింట్లు) పూర్తిగా కాలిపోగా, ఓ హోటల్ పాక్షికంగా దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ టీ పాయింట్లో ఉద యం ఐదు గంటల సమయంలో టీ కాస్తుండగా మంటలు వ్యాపించాయి. అవి పక్కనే గల మరో రెండు దు కాణాలకు పాకి మూడు కాలిబూడిదయ్యాయి. వీటికి అనుకుని ఉన్న ఓ హోటల్ పాక్షికంగా దెబ్బతింది. మంటలకు దుకాణాల్లోని వంట గ్యాస్ సిలిండర్లు పేల డంతో పరిసర ప్రజలు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న కొవ్వూరు అగ్నిమాపక అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. గోపాలపురం మండలం పెద్దాపురం, గోపాలపురానికి చెందిన పిల్లి లక్ష్మణరావు, దాసి చందు, కందుల రామకృష్ణ ఈ దుకాణాలను అద్దెకు తీసుకుని టీ పాయింట్లు ఏర్పాటు చేశారు. అప్పులు చేసి వీటిని నిర్వహిస్తున్నామని, ప్రమాదంలో సుమారు రూ.20 లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు బాధితులు వాపోయారు. మంటలు వ్యాపించిన సమయంలో టీ కాస్తున్న వ్యక్తి స్వల్పంగా గాయపడ్డారు. -
కూటమిలో ఉనికిపాట్లు!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కూటమిలో ‘ఉనికి’పాట్లు మొదలుపెట్టారు.. ఎవరికి వారు మైలేజ్ పాలి‘ట్రిక్స్’కు తెరలేపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూటమిలో టీడీపీ నేతల దందాలు పేట్రేగిపోతున్నాయి. మద్యం మాఫియాతో పాటు, ఇసుక, మట్టి తవ్వకాలు, అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో జనసేన నేతలకు ప్రాతినిథ్యం ఇవ్వగా.. మరికొన్ని నియోజకవర్గాల్లో మిత్రపక్షమైన జనసేన, బీజేపీ నేతలకు మాత్రం ఎంట్రీ ఉండటం లేదు. ఈ పరిణామం బీజేపీ, జనసేన నేతల్లో మింగుడుపడని అంశంగా మారింది. కూటమి అధికారంలోకి వచ్చిన రెండేళ్ల నుంచీ ఇదే తంతు సాగుతోంది. కూటమంటే కేవలం టీడీపీ అనే భావన ప్రజల్లో కలుగుతుండటంతో మిత్రపక్ష పార్టీలు నయా పంథాకు తెర తీశాయి. కూటమిలో తామూ ఉన్నామంటూ ప్రజలకు తెలిపేందుకు పడుతున్న పాట్లు వర్ణనాతీతం. యాత్ర.. సొంత పాత్ర ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి జీవనాడి పోలవరం ప్రాజెక్టును కేంద్రంగా చేసుకుని బీజేపీ ప్రత్యేక రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తోందనే చర్చ విస్తతంగా జరుగుతోంది. ఇటీవల రాజమహేంద్రవరం నుంచి బీజేపీ నేతలు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్వర్మ, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తదితరులతో భారీ ర్యాలీగా పోలవరం సందర్శనకు వెళ్లడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇందులో టీడీపీ, జనసేన నేతలు లేకపోవడం చర్చకు దారితీసింది. దీనిని బట్టి చూస్తే రాష్ట్రంలో బీజేపీ మైలేజ్ పెంచుకోవడం కోసం ప్రయత్నిస్తోందన్న ప్రచారం జరుగుతుంది. ఇదేమని ప్రశ్నించిన రాజకీయ విశ్లేషకులకు బీజేపీ నేతలు వింతైన వాదన వినిపిస్తున్నట్లు సమాచారం. పోలవరం కేవలం ఒక సాగునీటి ప్రాజెక్టు కాదని.. రాష్ట్ర ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన అంశంగా చెబుతున్నారు. పోలవరంతో బీజేపీకి దశాబ్దాలుగా ఎమోషనల్ బాండింగ్ ఉందని, జనతా పార్టీ కాలం నుంచే పోలవరం కోసం ఉద్యమాలు చేశామని ప్రచారం చేసుకుంటున్నారు. ఏపీ పునర్విభజన చట్టంలో పోలవరం చేర్చడంలో బీజేపీ కీలక పాత్ర పోషించిందని, జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన ఘనత మోదీ ప్రభుత్వానిదే అన్నట్లు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ ఒంటరిగా పోలవరం ప్రాజెక్టుపై ప్రచారం చేసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. స్థానిక సంస్థల్లో సై అంటూ.. కూటమిలో మరో భాగస్వామిగా ఉన్న జనసేన స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు పట్టున్న అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తుందని జనసేన కీలక నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యుల స్థానాల్లో అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తామని ఇటీవల విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు చీలకుండా ఉండేందుకు, కూటమిని బలపర్చేందుకు తగ్గి పోటీ చేశామని, రాబోయే ఎన్నికల్లో అదే విధంగా పోటీ చేస్తామనడం అసంభవమన్నారు. భవిష్యత్తులో అలాంటి విధానం వర్తించదన్నారు. జనసేనకు పట్టున్న స్థానాల్లో పోటీ చేస్తామని, ఇందులో టీడీపీ ఆదేశాలు పాటించే పరిస్థితి లేదని నర్మగర్భంగా వెల్లడించారు. దీనిని బట్టి చూస్తే జనసేన, టీడీపీ మధ్య క్షేత్ర స్థాయిలోనే కాదు.. పై స్థాయిలో సైతం విభేదాలు ఉన్నాయన్న విషయం తేటతెల్లమవుతోంది. ఈ పరిణామం టీడీపీ నేతలకు మింగుడుపడని అంశంగా మారింది. ఇప్పటికే పార్టీ కోసం శ్రమించిన అనేక మంది టీడీపీ శ్రేణులు పదవుల కోసం నిరీక్షిస్తున్నారు. అలాంటి తరుణంలో జనసేన నేతలు పక్కలో బల్లెం తరహాలో తయారవుతుండటంతో టీడీపీ నేతలు అయోమయానికి గురవుతున్నారు. ఫ జనసేన, బీజేపీ, టీడీపీ మధ్య వర్గ విభేదాలు ఫ ప్రాధాన్యం చాటుకునేలా బీజేపీ పోలవరం యాత్ర ఫ స్థానిక సంస్థల్లో బలమున్న స్థానాల్లో పోటీ చేస్తామని నాదెండ్ల ప్రకటన ఫ ఈ పరిణామాలతో కూటమిలో ఏం జరుగుతుందోనని చర్చ ఉమ్మడి తూర్పులో విభేదాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ నేతల మధ్య వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాట్లలో భాగంగా ఎమ్మెల్యే స్థానాలు త్యాగం చేశారు. నామినేటెడ్ పదవుల భర్తీలోనూ అత్యధిక శాతం పోస్టులు టీడీపీ నేతలకే కట్టబెట్టారు. బీజేపీ, జనసేన నేతలకు మాత్రం నామమాత్రంగా కేటాయించారు. ఇకపై ఆ విధానం ఉండదని చర్చించుకుంటున్నారు. ఫ నిడదవోలు నియోజకవర్గంలో జనసేన, టీడీపీ నేతల మధ్య వర్గ పోరు కొనసాగుతూనే ఉంది. మంత్రి కందుల దుర్గేష్, టీడీపీ ఇన్చార్జ్ బూరుగుపల్లి శేషారావు వర్గాల మధ్య ఆధిపత్య పోరు చల్లారడం లేదు. కూటమిలో భాగమైనా.. అధికారిక కార్యక్రమాలకు శేషారావు దూరంగా ఉంటున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో జనసేన నేతలకు అందలం వేయడం, బీజేపీ, టీడీపీ నేతలను విస్మరించడంపై నేతలు గుర్రుగా ఉన్నారు. ఫ కొవ్వూరు నియోజకవర్గంలోనూ ఇదే తంతు సాగుతోంది. ఫ రాజానగరం నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, టీడీపీ ఇన్చార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి వర్గాల మధ్య విభేదాలు రాజుకున్నాయి. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే స్థాయికి చేరాయి. ఫ పిఠాపురం నియోజకవర్గంలో సైతం ఇదే పరిస్థితి ఉంది. టీడీపీ సీనియర్ నేత వర్మకు జనసేన నేతల మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయికి చేరింది. ఎంతగా అంటే.. టీడీపీలో సీనియర్ నేత అయినా వర్మను ఇన్చార్జి పదవి నుంచి తొలగించే స్థాయికి చేరిందంటే ఏ స్థాయిలో వైషమ్యాలు ఉన్నాయో అర్థమవుతోంది. ఫ అమలాపురంలో టీడీపీ ఎమ్మెల్యే ఆనందరావు, జనసేన నేతలకు పచ్చగట్టి వేస్తే భగ్గుమంటోంది. కూటమిలో మిత్రపక్షమైన, ఎమ్మెల్యే విజయానికి కృషి చేసిన తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని జనసేన నేతలు గుర్రుగా ఉన్నారు. కేవలం ఈ నియోజకవర్గాల్లోనే కాదు.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఇదే తంతు సాగుతోంది. -
గంజాయితో ఏడుగురి అరెస్టు
నాలుగున్నర కేజీల సరకు స్వాధీనం రాజోలు: చెడు వ్యసనాలు, మద్యానికి బానిసైన ఏడుగురు యువకులు గంజాయి విక్రయానికి పాల్పడి సఖినేటిపల్లి పోలీసులకు చిక్కారు. స్థానిక సీఐ కార్యాలయంలో సీఐ బి.సురేష్బాబు, ఎస్సై కె.దుర్గ శ్రీనివాసరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సఖినేటిపల్లి మండలం గొంది గ్రామానికి చెందిన కొపనాతి దుర్గాప్రసాద్ అనే రింటు, మామిడికుదురు మండలం ఆదుర్రు గ్రామానికు చెందిన రాయుడు యశ్వంత్, సఖినేటిపల్లి మండలం మోరిపోడు గ్రామానికి చెందిన కొల్లాటి ధర్మరాజు అనే ధర్మ, కేశవదాసుపాలేనికి చెందిన చెల్లుబోయిన భగవాన్ అనే చింటూ, ఉయ్యూరి వారి మెరక కంతేటి వారి పోడు గ్రామానికి చెందిన కడలి ప్రదీప్కుమార్ అనే పాండు, అదే గ్రామానికి చెందిన మత్తి ఆనంద్కుమార్, కేశవదాసుపాలానికి చెందిన కడలి హర్షవర్ధన్లను బుధవారం అరెస్టు చేసి స్థానిక కోర్టులో హాజరుపర్చగా 14 రోజులు రిమాండ్ విధించారు. నర్సీపట్టణంలోని గుర్తుతెలియని వ్యక్తుల వద్ద నుంచి దుర్గాప్రసాద్ గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్లో విక్రయించే ఉద్దేశంతో మిగిలిన స్నేహితులతో కలసి అంతర్వేది దేవస్థానం గ్రామంలోని బీచ్ వద్ద ఈ నెల 21న చిన్న పొట్లాలుగా కడుతున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని 4.690 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ధర్మరాజు, యశ్వంత్, కిరణ్రాజు గత నెల 25న మోరిపోడులోని రంపాలమ్మ గుడి సమీపంలో గంజాయి, మద్యం సేవించి వి.వి.మెరక, కె.వి.పోడు ప్రాంతాల్లో ఇళ్లపై రాళ్లు విసరడం, కోళ్ల దొంగతనాలు చేసి బీభత్సం సృష్టించారు. అలాగే స్థానికంగా డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ బొమ్మతో ఉన్న శిలా ఫలకాన్ని ధ్వంసం చేశారు. ఈ రెండు ఘటనలకు సంబంధించి వారిని అరెస్టు చేసిన అరెస్టు చేసిన సీఐ సురేష్బాబు, ఎస్సై కె.దుర్గ శ్రీనివాసరావులను ఎస్పీ, డీఎస్పీలు అభినందించారు. మహిళ మృతి కేసులో 13 ఏళ్ల జైలు ఇద్దరు దోషులకు కోర్టు తీర్పు యానాం: పట్టణ పరిధిలో 2011లో జరిగిన ఓ మహిళ అనుమానాస్పద మృతికి సంబంధించి కేసులో విచారణ అనంతరం బుధవారం ఇద్దరికి 13 ఏళ్ల పాటు జైలు శిక్ష పడింది. వివరాల్లోకి వెళితే యానాంకు చెందిన ఓలేటి సత్యవతి 2011 మే 9వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అప్పటి నుంచి పుదుచ్చేరి మూడో అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో విచారణ సాగుతోంది. ఈ క్రమంలో పట్టణ పరిధిలో ఫడ్బ్యాంకు రోడ్డు, ఉదయకృష్ణ కాలనీ, దరియాలతిప్పకు చెందిన ఎ1 చెక్క శ్రీనివాసు, ఎ2 బలసాడి వెంకటేశ్వర్లును దోషులుగా నిర్ధారిస్తూ 3వ అదనపు జిల్లా న్యాయస్థానం పై విధంగా తీర్పు ఇచ్చింది. దానితో పాటు ఒకొక్కరికి రూ.15 వేల చొప్పున జరిమానా విధించినట్టు సీఐ డి.సురేష్బాబు తెలిపారు. -
చిట్టీల పేరుతో మోసం
పోలీసులకు బాధితుల ఫిర్యాదు నిడదవోలు: చీటీల పేరుతో ప్రజలను మోసం చేసిన ఓ మహిళపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై జగన్మోహన్రావు తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని గౌడవీధికి చెందిన మెరకనపల్లి తిరుమల అనే మహిళ 8 ఏళ్లుగా చీటీలు వేస్తోంది. ఆ నమ్మకంతో తన వద్ద చిట్టీలు వేసిన 70 మందికి చెందిన రూ.90 లక్షలతో ఈనెల 18 తేదీ నుంచి ఆమె కనపడకుండా పోయింది. బాఽధితులకు అనుమానం వచ్చి ఇంటికి వెళ్లి ఆమె భర్త వెంకటరమణను అడగగా తనకు ఎటువంటి సంబంధం లేదని తెలిపాడు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులకు కుమారుడి అప్పగింత ● పశ్చిమ బెంగాల్ నుంచి తప్పిపోయి వచ్చిన యువకుడు ● హృదయాలయంలో ఆశ్రయం నిడదవోలు: స్థానిక సహాయ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హృదయాలయం మానసిక దివ్యాంగుల పునరావాస కేంద్రంలో ఆటిజంతో బాధ పడుతున్న 18 ఏళ్ల యువకుడిని బుధవారం నిర్వాహకులు అతడి తల్లిదండ్రులకు అప్పగించారు. పశ్చిమ బెంగాల్ వర్ధమాన జిల్లా దబిపూర్ గ్రామం నుంచి కింగ్షుక్ అనే యువకుడు గతనెల 22న రాజమహేంద్రవరం వచ్చాడు. అతడిని రాజమండ్రి చైల్డ్ వేల్ఫేర్ కమిటీ ఇక్కడి మానసిక దివ్యాంగుల కేంద్రానికి పంపించారు. అప్పటి నుంచి అతడి చిరునామా తెలుసుకునేందుకు ప్రయత్నించి ఎట్టకేలకు తల్లిదండ్రుల కాంటాక్టు నంబరు తెలుసుకుని వారికి సమాచారం ఇచ్చారు. అతడి తల్లిదండ్రులు కృష్ణందీ మెడక్, రాఖీ మెడక్ బుధవారం హృదయాలయానికి చేరుకోగా అధికారుల సమక్షంలో వారి కుమారుడిని అప్పగించినట్టు నిర్వాహకులు దండే గణేష్ బాబు, ఎడ్యుకేటర్ బలగం విశాలాక్షి తెలిపారు. -
నిరీ్జవ నేలలో ఉద్యాన హేల
ఆదర్శంగా నిలుస్తున్న నర్సరీ రైతు మామిడికుదురు: చుట్టూ ఆక్వా చెరువులు.. ఎటు చూసినా రొయ్యలు, చేపల సాగు. అలాంటి చోట సున్నితమైన మొక్కల పెంపకమా? సాధ్యం కాదంటూ కొందరు పెదవి విరిచారు. కానీ, ఆయన పట్టు వదలని విక్రమార్కుడిలా ముందడుగు వేశారు. తలపెట్టిన కార్యాన్ని రెండేళ్లలోనే సాకారం చేసి లూటుకుర్రు గ్రామాన్ని నర్సరీ పటంలో నిలబెట్టారు. ఆయన పేరు బోనం సత్తిరాజు. చదివింది పదో తరగతే అయినా మొక్కల పెంపకంపై ఉన్న మక్కువ, అనుభవం నర్సరీ రంగంలో రాణించేలా చేశాయి. ఇప్పటికే కడియం, అనంతపురం జిల్లాల్లో నర్సరీలు ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహిస్తున్నారు. రెండేళ్ల క్రితం లూటుకుర్రులో ఐదు ఎకరాల విస్తీర్ణంలో నర్సరీని ప్రారంభించారు. ఆక్వా చెరువుల మధ్య మొక్కల పెంపకం కత్తి మీద సామే అయినా, ప్రత్యేక శ్రద్ధతో అనుకూల వాతావరణాన్ని సృష్టించి అద్భుత ఫలితాలు సాధించారు. ఇక్కడి మొక్కలు ప్రస్తుతం ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలకు సైతం ఎగుమతి అవుతుండటం విశేషం. వ్యాపారమే కాకుండా, స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తూ ఎందరికో నిలుస్తున్నారు సత్తిరాజు. స్వగ్రామంలో ఉపాధి కల్పనే లక్ష్యం నా సొంత ఊరు లూటుకుర్రులో నర్సరీ పెట్టి ఇక్కడి యువతకు ఉపాధి చూపించాలనేది నా బలమైన కోరిక. చుట్టూ ఆక్వా చెరువులు ఉండటంతో ఇక్కడ మొక్కలు బతకవని చాలామంది చెప్పారు. కానీ పట్టుదలతో ప్రయత్నిస్తే సాధ్యం కానిది లేదని నమ్మాను. శాస్త్ర సాంకేతిక పద్ధతులు, సరైన యాజమాన్య విధానాలు పాటించి రెండేళ్లలోనే ఆశించిన ఫలితాలు సాధించాం. ఈ రోజు మన ఊరి మొక్కలు ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంటే చాలా గర్వంగా ఉంది. – బోణం సత్తిరాజు, లూటుకుర్రు -
ఇదేం.. దారిద్య్రం
సీటీఆర్ఐ: కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడినట్లు ఉంది నగరంలోని రోడ్ల పరిస్థితి. నగరంలోని రోడ్లు మరి అధ్వాన స్థితిలో ఉన్నాయి. రోడ్లపై గోతులతో నిండి ప్రమాదకరంగా మారాయి. ఈ రహదారులపై ప్రయాణించాలంటే ప్రమాదాలతో చెలగాటమాడటమేనని వాహనచోదకులు భావిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం పాలన మొదలై రెండేళ్లు పూర్తయింది. ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలు చేశారు. అందులో ముఖ్యంగా రాష్ట్రంలోని అన్ని రోడ్లు అద్దంలా మెరిసేలా తయారు చేస్తామన్నారు. కానీ ఇప్పటివరకు ఒక్క రోడ్డుకు కూడా మోక్షం కలగలేదు. నగర ఎమ్మెల్యే శంకుస్థాపనలతోనే సరిపెట్టడంతో నగరంలో అసలు రోడ్లకి మోక్షం కలుగుతుందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. నాణ్యత లేని ప్యాచ్ వర్కులతో సరి నగరంలో రోడ్ల దుస్థితిపై ప్రజల్లో వ్యతిరేకత రావడంతో అప్పటికప్పుడు రోడ్లపై ప్యాచ్ వర్కులు చేయాలని నిర్ణయించారు. కొన్ని చోట్ల రోడ్లపై గుంతలను పూడ్చడానికి అక్కడక్కడ ప్యాచ్ వర్కులు చేశారు. కానీ నాణ్యత లేకపోవడంతో మళ్లీ శిథిలావస్థకు చేరుకున్నాయి. అసలు పూర్తి స్థాయిలో రోడ్లు ఎప్పుడు నిర్మిస్తారో తెలియక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. నగరంలో పలు చోట్ల తాత్కాలికంగా గుంతలను పూడ్చడానికి ప్యాచ్ వర్కులు చేశారు. స్థానిక వైజంక్షన్ నుంచి నందం గనిరాజు జంక్షన్ వరకు, బైపాస్ రోడ్డు నుంచి తాడితోట సెంటర్ వరకు, క్వారీ మార్కెట్ సెంటర్ నుంచి లాలాచెరువు సెంటర్ వరకు, టీటీడీ రోడ్డు, కంబాలచెరువు జంక్షన్, పేపర్మిల్లు రోడ్డు, సీతంపేట, ఆర్యాపురం, వీరభద్రపురం, ఆనంద్నగర్ వంటి పలు రద్దీ ప్రాంతాల్లో ప్యాచ్ వర్కులు చేశారు. కానీ ఈ ప్యాచ్ వర్కులు ఇప్పుడు చాలా ప్రమాదకరంగా మారాయి. పాత రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చడానికి అక్కడ తారు వేసి ప్యాచ్ వర్కులు చేశారు. పాత రోడ్డు కంటే అదనంగా అరడుగు మందంలో కొత్తగా ప్యాచ్ వర్క్ చేయడంతో వాహనచోదకులు ఇబ్బందులకు గురవుతున్నారు. వాహనచోదకులు ప్రయాణించేటప్పుడు పాత రోడ్డు నుంచి గుంతలు పూడ్చిన వైపునకు బైక్ నడపడంతో టైర్ స్కిడ్ అయి ప్రమాదాల బారిన పడుతున్నారు. బోల్తా కొట్టిన ఆటో క్వారీ మార్కెట్ నుంచి లాలాచెరువు వెళ్లే రోడ్డులో దుర్గమ్మ గుడి వద్ద రోడ్డు మధ్యలో పెద్ద గొయ్యి ఉంది. ఈ ప్రాంతంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ గొయ్యిలో పడి ప్రమాదాల బారిన పడటంతో ఆ గొయ్యిలో మట్టి కప్పి తాత్కాలికంగా గొయ్యి పూడ్చారు. కానీ మొన్న కురిసిన వర్షాలకి మట్టి కొట్టుకుపోయి గోతిలో నీళ్లు నిండిపోయాయి. సుబ్బారావునగర్కి చెందిన దడాల సత్తయ్య ఆటో ప్రయాణం చేస్తుండగా ఆ గోతిలో పడి ఆటో బోల్తా పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆటో డ్రైవర్తో పాటు, ప్రయాణికుడు సత్తయ్యకి తీవ్ర గాయాలయ్యాయి. సత్తయ్యకి కాలు ఆటోకింద పడిపోవడంతో అతని కాలు విరిగింది. దీంతో పనులు చేసుకోలేక కుటంబంతో నానా ఇబ్బందులు పడుతున్నాడు. -
7 నెలలుగా నీరే ఆధారం!
● ఏడేళ్లుగా మంచంపైనే జీవనం! ● నేతన్న దీనావస్థ పిఠాపురం: తన చేతులతో అందమైన చీరలు నేసిన నేతన్నకు నేడు ఎంతో కష్టం వచ్చింది. చేయి తిరిగిన చేనేత కార్మికుడిగా పేరొందాడు. అనుకోని అతిథిలా వచ్చిన ఆపద అతనిని మంచాన పడేసింది. గత ఏడేళ్లుగా ఆయన మంచానికే పరిమిత మయ్యాడు. శరీరం రాను రాను క్షీణించడంతో ఆహారం ఏదీ లోపలికి వెళ్లక కేవలం తాగు నీరు మాత్రమే ఆధారంగా ఏడు నెలలుగా జీవన పోరాటం చేస్తున్నాడు. కొత్తపల్లికి చెందిన చేనేత కార్మికుడు పొన్నగంటి అప్పారావు పరిస్థితి ఇది. ఆయన భార్య గతంలో మృతి చెందగా ఒక్కగానొక్క కూతురి వద్దే ఆయన ఉంటున్నారు. ఏడేళ్ల క్రితం కాలికి వచ్చిన పుండు ఆయనను మంచాన పడేలా చేసిందని ఆయన బంధువులు చేప్తున్నారు. అది మానినా లేవలేని స్థితిలోకి వెళ్లిన అప్పారావు ఏడేళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. గత ఏడు నెలల క్రితం వరకు అతి కష్టం మీద ఆహారం అందించే వాళ్లమని, ఏడు నెలల నుంచి కేవలం మంచినీరు తప్ప మరేది తీసుకోలేక పోతున్నాడని అయినవారు తెలిపారు. చేనేత పైనే ఆధారపడి జీవిస్తున్న ఆ కుటుంబం భారమనుకోకుండా ఆయనను గంట గంటకు మంచినీరు ఇస్తూ కాపాడుకుంటున్నారు. ఒక కేవలం తాగునీటితో ఇన్నాళ్లుగా జీవనం సాగించడాన్ని చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యానికి గురవుతున్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 23,000 గటగట (వెయ్యి) 20,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 22,000 గటగట (వెయ్యి) 19,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
ఆకట్టుకుంటున్న ‘గంట మందారం’
కొత్తపేట: సాధారణంగా మందార పువ్వు పైకి లేదా పక్కకు విడుస్తుంది కానీ ఈ మందారం తల కిందకి దించి గంట ఆకారంలో ఉంటుంది. అందుకే దాన్ని గంట మందారం పిలుస్తారు. స్థానిక కమ్మిరెడ్డిపాలెం ప్రాంతానికి చెందిన పురోహితుడు పెద్దింటి రామచంద్ర శ్రీహరి (రామం) రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాలు, నర్సరీల నుంచి రకరకాల మొక్కలు తెచ్చి తన ఇంటి పెరట్లో పెంచుతుంటారు. కడియపులంకలో ఒక నర్సరీ నుంచి రామం నెల క్రితం గంట మందారం మొక్కను తెచ్చి పాతారు. దానికి రెండు రోజుల క్రితం మొగ్గ పూసింది. అది బుధవారం పుష్పంగా విడిచిందని రామం తెలిపారు. -
విద్యతో పాటు క్రీడల్లో రాణించాలి
● ఆదిత్య ప్రొ వైస్ చాన్సలర్ సతీష్రెడ్డి ● అట్టహాసంగా హ్యాండ్బాల్ క్రీడలు ప్రారంభం ● దక్షిణాది రాష్ట్రాల నుంచి 250 మంది క్రీడాకారుల హాజరు పెద్దాపురం: విద్యతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలు సాధించవచ్చని ఆదిత్య విద్యా సంస్థల ప్రో వైస్చాన్సలర్ నల్లమిల్లి సతీష్రెడ్డి తెలిపారు. నవోదయ విద్యాలయ సమితి నేతృత్వంలో హైదరాబాద్ రీజియన్ పరిధిలోని విద్యాలయాల క్రీడాకారులకు స్థానిక పీఎంశ్రీ జవహార్ నవోదయ విద్యాలయంలో బుధవారం హ్యాండ్బాల్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు సాగే ఈ పోటీలను సతీష్రెడ్డి ప్రారంభించి మాట్లాడుతూ జవహార్ నవోదయ విద్యాలయాలు విద్యతో పాటు ఆటలకు సముచిత స్థానం కల్పిస్తూ ఉన్నతమైన పౌరులను అందిస్తోందన్నారు. సుమారు 250 మంది క్రీడాకారులు ఈ పోటీలకు హాజరయ్యారు. కార్యక్రమంలో పెద్దాపురం నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ ఎస్ఎస్ కీర్తి, మహారాణి కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణమూర్తి, ఎన్సీసీ ఆఫీసర్ ఎస్.సత్యనారాయణ, వ్యాయామ ఉపాధ్యాయుడు చక్రవర్తి, అనురాథ, సీహెచ్ జనార్దన్ నాయుడు, పి.రామారావు, ప్రేమలత, రాజ్యలక్ష్మి, ఎం.లక్ష్మణరావు, కె. విజయ్కుమార్, కె.రామచంద్రు తదితరులు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో తాపీ మేస్త్రి మృతి
రామచంద్రపురం రూరల్: కుటుంబ భారం మోసే యువకుడి మృతితో ఆ కుటుంబీకులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ద్రాక్షారామ ఎస్సై ఎం.లక్ష్మణ్, స్థానికులు తెలిపిన సమాచారం మేరకు మండలంలోని వెలంపాలెం గ్రామానికి చెందిన యడ్ల రామాంజనేయులు (33) తాపీ పని చేస్తూ వృద్ధురాలైన తల్లితో కలసి జీవిస్తున్నాడు. అతడికి 8 మంది అక్కలు, ఒక అన్నయ్య ఉన్నారు. కుటుంబ బాధ్యత నెత్తిమీద వేసుకుని అక్కల పెళ్లిళ్లు చేయడంతో పాటు వారి మంచిచెడు అతడే చూస్తూ ఉంటాడు. వృద్ధురాలైన తల్లి కళ్లు కనిపించని స్థితిలో అతడే ఆధారంగా ఉన్నాడు. ఈ క్రమంలో బుధవారం ద్రాక్షారామలో ఒక ప్రైవేటు భవనం పై అంతస్తులో పిట్ట గోడ నిర్మాణ పనులు చేస్తున్న సమయంలో ఊచ జారి 33 కేవీ విద్యుత్ లైన్ వైరు తగలడంతో ప్రమాదానికి గురయ్యాడు. దీనితో స్థానికులు ద్రాక్షారామలో ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీనితో రామాంజనేయులు సోదరుడు యడ్ల వెంకన్న ఫిర్యాదు, ఆసుపత్రి సమాచారాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ద్రాక్షారామ ఎస్సై ఎం.లక్ష్మణ్ తెలిపారు. జయహో జాతీయ పతాక.. మామిడికుదురు: స్థానిక పాఠశాలలో బుధవారం జాతీయ జెండా (పతాక) దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు భారతదేశ నమూనా (మ్యాప్) ఆకారంలో నిలబడి, చేతుల్లో త్రివర్ణ పతాకాలను పట్టుకుని అందరినీ అలరించారు. 1947 జూలై 22న రాజ్యాంగ సభ త్రివర్ణ పతాకాన్ని అధికారికంగా ఆమోదించిందని స్కూల్ కరస్పాండెంట్ డీవీవీ సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రతి జూలై 22వ తేదీని జాతీయ జెండా దత్తత దినోత్సవాన్ని జరుపుకొంటున్నామన్నారు. మన జాతీయ జెండాను ఆంధ్రప్రదేశ్కు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య రూపొందించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం యక్కలదేవర నాగన్నబాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
దాడిశెట్టి రాజాకు జగన్ పరామర్శ
తుని రూరల్: స్వల్ప అస్వస్థతకు గురై విశాఖపట్నంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజాను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఫోన్లో పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్, పార్టీ నాయకులు వాసిరెడ్డి జమీలు, ఇసం రామకృష్ణ, చొక్కా హరిబాబు తదితరులు పరామర్శించారు. తన ఆరోగ్యంపై నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందొద్దని, ఆస్పత్రికి ఎవరూ రావద్దని రాజా అన్నారు. -
తలుపులమ్మకు పంచామృతాభిషేకం
తుని రూరల్: లోవ దేవస్థానంలో కొలువైన తలుపులమ్మ అమ్మవారికి బుధవారం పంచామృతాలతో అభిషేకం చేశారు. ఆషాఢమాసం, జన్మ నక్షత్రం కావడంతో వేద పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా 108 పంచామృత కలశాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారికి అభిషేకించారు. భారీ సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రేపు లక్ష తులసి పూజ ఆషాఢ మాసోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం శుద్ధ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి లక్ష తులసి పూజ నిర్వహించనున్నట్టు డిప్యూటీ కమిషనర్ పి.విశ్వనాథరాజు తెలిపారు. ముద్రగడ మృతి తీరని లోటు ఏలేశ్వరం: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి అందరికీ తీరని లోటని వైఎస్సార్ సీపీ పట్టణ నాయకులు అన్నారు. ఆయన మృతికి సంతాపంగా హనుమాన్ జంక్షన్ వద్ద గల నాలుగు రోడ్ల కూడలిలో బుధవారం భారీ అన్నసమారాధన నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ ముద్రగడ ఆశయాల సాధనకు కృషి చేస్తామని, ముద్రగడ గిరిబాబు నాయకత్వంలో పార్టీని ముందుకు నడిపిస్తామన్నారు. శిడగం వెంకటేశ్వరరావు, బదిరెడ్డి గోవిందు, సామంతుల సూర్యకుమార్, సుంకర రాంబాబు, వాగు బలరామ్ తదితరులు పాల్గొన్నారు. కీచకుడిపై పోక్సో కేసు కాకినాడ క్రైం: తల్లి, ఇద్దరు బాలికలపై అఘాయిత్యానికి పాల్పడిన కీచకుడు, కాకినాడ సూర్యనారాయణపురానికి చెందిన 24 ఏళ్ల గిరిపై మూడో పట్టణ పోలీస్స్టేషన్లో పోక్సో కేసు నమోదు చేశారు. ఈ ఘాతుకంపై ఈ నెల 20న సాక్షి దినపత్రికలో ‘కీచకుడి చేతిలో విలవిల’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందన లభించింది. కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ప్రత్యేక చొరవతో, సమీప బంధువు అల్లాడి వీరబాబు ఫిర్యాదుతో గిరి దౌర్జన్యం బట్టబయలైంది. కలెక్టర్ సూచనలు, ఎస్పీ బిందుమాధవ్ ప్రత్యేక ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని సీఐ సత్యనారాయణ తెలిపారు. కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చి బాధితురాలిగా పేర్కొంటున్న 14 ఏళ్ల మైనర్ బాలికకు వైద్య పరీక్షలకు సిఫార్సు చేస్తామన్నారు. మినీమార్ట్లతో పేదలకు ఉపయోగం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): రేషన్ షాపులకు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న మినీ మార్ట్ (మీ మార్ట్) వ్యవస్థతో రేషన్ డీలర్లకు ఆర్థిక భద్రత చేకూరడంతో పాటు, సామాన్య, మధ్య తరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్ భారం గణనీయంగా తగ్గనుందని జేసీ అపూర్వ భరత్ స్పష్టం చేశారు. స్థానిక కలెక్టరేట్లో బుధవారం మినీ మార్ట్ల ఏర్పాటు, నిర్వహణ విధి విధానాలపై సమీక్షించారు. బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరకు 250 రకాల నిత్యావసరాలు మినీ మార్టుల ద్వారా విక్రయించేందుకు ఆసక్తి గల డీలర్ల జాబితాలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఇన్చార్జ్ డీఎస్వో లక్ష్మీప్రసన్న పాల్గొన్నారు. దేవస్థానం సిబ్బంది బదిలీలపై విజిలెన్స్ ఆరా! అన్నవరం: దేవస్థానంలో ఉద్యోగుల బదిలీలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు ఆరా తీశారు. గత పదేళ్లుగా బదిలీ కాకుండా ఉన్న ఉద్యోగుల వివరాలు పంపించాలంటూ దేవస్థానం అధికారులను ఆదేశించారు. కొందరు ఉద్యోగులు ఏళ్ల తరబడి దేవస్థానంలోనే పాతుకుపోయి, అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని కొందరు ఇటీవల విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. కాగా.. ఆ మేరకు బదిలీ అయిన ఉద్యోగుల వివరాలు దేవస్థానం అధికారులు తెలియజేశారు. అలాగే పుష్కర కాలువ పక్కన గిరిప్రదక్షిణ రోడ్డును ఆనుకుని ఉన్న భూములను దేవస్థానం కొనుగోలు చేసిందా అని కూడా విజిలెన్స్ అధికారులు ప్రశ్నించారు. దానికి చేయలేదని సమాధానం చెప్పినట్టు అధికారులు తెలిపారు. -
దాతల పేర్లు తొలగించడం సరికాదు
పెదపూడి: జి.మామిడాడలోని సూర్యనారాయణమూర్తి ఆలయంపై ఏడు గుర్రాల రథం వద్ద గతంలో ఏర్పాటు చేసిన దాతల శిలాఫలకం, పేర్లు తొలగించడం సరికాదని వైఎస్సార్ సీపీ నాయకుడు, ప్రముఖ దాత ద్వారంపూడి వెంకటరెడ్డి (చింతపండు) ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ తన అన్నయ్య, దివంగత నేత, మాజీ సర్పంచ్ ద్వారంపూడి అమ్మిరెడ్డి సుమారు 11 బిస్కెట్ల బంగారంతో కేజీ బరువుగల బంగారు కిరీటాన్ని తయారు చేయించి సూర్యనారాయణస్వామి మూల విగ్రహానికి అందజేశారన్నారు. తర్వాత 2016–17లో దేవస్థానానికి సంబంధించిన కమిటీ ప్రతినిధులు గోపురం ఎదురుగా ఏడు గుర్రాల మీద సూర్యనారాయణస్వామి ఉండే విగ్రహం ఏర్పాటు చేస్తే బాగుంటుందని తనను అడిగారన్నారు. ఆ విగ్రహానికి సుమారు రూ.6.50 లక్షలు ఖర్చయ్యిందని, 2018 జనవరి 24న ప్రారంభించామన్నారు. దానిపై విగ్రహ దాత చింతపండు అమ్మిరెడ్డి సోదరుడు వెంకటరెడ్డి అని తన పేరు ముద్రించారన్నారు. అయితే ఆ పేర్లను గత సోమవారం రాత్రి స్థానిక టీడీపీ నేత గోపిరెడ్డి మరో ఇద్దరు వ్యక్తులు అక్రమంగా తొలగించారన్నారు. కొందరు దాతలు వివిధ భవనాలకు ఆర్థిక సాయం అందించి వారి బంధువుల పేర్లు వేయించుకున్నారన్నారు. అయితే గ్రామ పంచాయతీ, ప్రభుత్వ నిధులతో నిర్మించిన రామాలయం వద్ద కాంప్లెక్స్కు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తన తండ్రి మూలరెడ్డి పేరు ఎలా పెట్టారని ప్రశ్నించారు. ఫ టీడీపీ నాయకుల చర్యలు దారుణం ఫ విలేకరులతో ద్వారంపూడి వెంకటరెడ్డి -
అలజడితో వేటకు దూరం
అలల తీవ్రత పెరుమాళ్లపురంలో పోర్టు నిర్మాణంతో మా గ్రామాల తీరంలో అలల తీవ్రత ఎక్కువగా ఉంది. బోట్లపై సముద్రంలోకి వెళ్లేందుకు ఏమాత్రం వీలుండడం లేదు. పెరుమాళ్లపురం ప్రాంతంలో అలల తీవ్రత తక్కువగా ఉంది. మాకు అక్కడి నుంచి వెళ్లేందుకు అవకాశం కల్పించాలి. – చొక్కా దేవుడు, బోటు యజమాని, నర్శిపేట ఇబ్బందులు గుర్తించాలి కెరటాల ఎక్కువగా రావడంతో సముద్రంలోకి బోటు వేసుకుని వెళ్లలేకపోతున్నాం. ఇప్పటికే చేపలు సరిగ్గా పడక డబ్బులు రాక ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు అలల పుణ్యమా అని బోట్లపై వేటకు వెళ్లలేకపోతున్నాం. మా ఇబ్బందులను పోర్టు యాజమాన్యం గుర్తించాలి. – అర్జిల్లి ప్రసాద్, మత్స్యకారుడు, దానవాయిపేట తొండంగి: బోట్లపై సముద్రంలోకి చేపల వేటకు వెళ్లి కుటుంబాలను పోషించుకునే మత్స్యకారులు ప్రస్తుతం బతకడానికి పోరాటం చేస్తున్నారు. కడలిలో అలల ఉధృతి పెరగడంతో లోపలకు వెళ్లలేకపోతున్నారు. ఒక వేళ వెళ్లినా బోట్లు తిరగబడి ప్రమాదాలకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. తొండంగి మండలం పెరుమాళ్లపురంలో కాకినాడ గేట్వే పోర్టు నిర్మాణం జరిగింది. ఈ నేపథ్యంలో సముద్రంలో కొంత భాగం వరకూ పోర్టు బోట్లు నిలిచేందుకు వీలుగా ప్లాట్ఫాం ఏర్పాటు చేశారు. దీని ప్రభావంతో పరిసర గ్రామాల పరిధిలోని సముద్ర తీరంలో అలల ఉధృతి ఎక్కువైంది. దానవాయిపేట, నర్శిపేట, వాడములసయ్యపేట, ఎల్లయ్యపేట వరకు ఈ ప్రభావం చూపుతోంది. ఆయా గ్రామాల్లో వేటపై ఆధారపడిన మత్స్యకారులు తమ బోట్లపై సముద్రంలోకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. సుమారు 70 బోట్లు ఆయా గ్రామాల్లో సుమారు 70 వరకూ బోట్లు ఉన్నాయి. ఒక్కో బోటుపై ఎనిమిది నుంచి పది మందికి పైగా వేటకు వెళ్తుంటారు. అలల ఉధృతి కారణంగా వీరందరూ ప్రస్తుతం వేటకు వెళ్లలేనిస్థితిలో ఉన్నారు. అయితే పెరుమాళ్లపురానికి చెందిన మత్స్యకారులు సముద్ర తీరం నుంచి సునాయాసంగా సముద్రంలో బోట్లు వేసుకుని వేట సాగిస్తున్నారు. దీంతో తమకు కూడా అక్కడి నుంచి వెళ్లేందుకు అవకాశం కల్పించాలని దానవాయిపేట, వాడముసలయ్యపేట, నర్శిపేట తదితర గ్రామాల మత్స్యకారులు పోర్టు యాజమాన్యాన్ని రెండు రోజుల క్రితం కోరారు. అయితే పోర్టులో ఎగుమతి, దిగుమతులతో పాటు అభివృద్ధి ఇబ్బంది కలుగుందని పోర్టు ప్రతినిధులు నిరాకరించారు. దీంతో ఈ విషయంపై గురువారం మరోసారి చర్చించనున్నారు.ఫ పెరుమాళ్లపురంలో పోర్టు గేట్వే నిర్మాణం ఫ సముద్రంలో పెరిగిన అలల ఉధృతి ఫ వేటకు వెళ్లేందుకు మత్స్యకారుల అవస్థలు -
అనధికార లే అవుట్లపై కొరడా
కాకినాడ రూరల్: అనధికార లేఅవుట్లపై కాకినాడ అర్బన్ డవలప్మెంట్ అథారిటీ (కౌడా) అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. జిల్లాలో మూడు రోజులుగా వాటిని ధ్వంసం చేసే ప్రక్రియ చేపట్టారు. బుధవారం నాటికి తొడంగి మండలం బెండపూడి, శంఖవరం మండలం కత్తిపూడి, జగ్గంపేట, పెద్దాపురం, సామర్లకోట ప్రాంతాలలో సుమారు 22 నాన్ లే అవుట్లకు సంబంధించి సుమారు 80ఎకరాలలో రోడ్లు, నిర్మాణాలు ధ్వంసం చేశారు. వాటిలో ప్లాట్ల మధ్య ఏర్పాటు చేసిన రాళ్లను తొలగించారు. జిల్లాలో సుమారు 200కు పైగా అనధికార లే అవుట్లు ఉంటాయిని ప్రాథమిక అంచనాతో కౌడా అఽధికారులు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. అనధికార లేఅవుట్ల తొలగింపు చర్యల్లో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ టీమ్లో మూడు బృందాలను ఏపీఓలతో ఏర్పాటు చేశారు. కాగా.. కౌడా చైర్మన్ తలాటం సత్య మాట్లాడుతూ అనధికార లేఅవుట్లలో నిర్మాణాలకు అనుమతులు మంజూరుకావన్నారు. విద్యుత్, నీరు, ప్లానింగ్ అనుమతులు లభించక కొనుగోలుదారులు నష్టపోతారన్నారు. -
ముద్రగడ సేవలు చిరస్మరణీయం
గిరిబాబు, వీరరాఘవరావును పరామర్శిస్తున్న సత్యనారాయణరాజు, నాగమోహన్కృష్ణకిర్లంపూడి: మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు దివంగత ముద్రగడ పద్మనాభం సేవలు చిరస్మరణీయమని వైఎస్సార్ సీపీ కాకినాడ జిల్లా పరిశీలికులు దాట్ల సూర్యనారాయణరాజు అన్నారు. కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి బుధవారం రాష్ట్ర నలుమూలల నుంచి రాజకీయ ప్రముఖులు, అభిమానులు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆయన కుమారులు వైఎస్సార్ సీపీ ప్రత్తిపాడు కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు, ముద్రగడ వీరరాఘవరావు(బాలు)ను పరామర్శించారు. ముద్రగడ సమాధికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వారిని పరామర్శించిన వారిలో వైఎస్సార్ సీపీ రేపల్లి నియోజకవర్గం ఇన్చార్జి పీటా నాగమహన్కృష్ణ, తెదేపాకు చెందిన పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణ, అంతర్జాతీయ శిల్పకారుడు ఆచార్య దేవగుప్తాపు రాజ్కుమార్ వడియార్, ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట నియోజకవర్గాల ప్రజలు ఉన్నారు. -
కీచకుడిపై కేసు నమోదుకు ఆదేశం
కాకినాడ క్రైం: ఇద్దరు మైనర్లతోపాటు వారి తల్లిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కాకినాడ సూర్యనారాయణపురానికి చెందిన 24 ఏళ్ల యువకుడిపై తక్షణమే కేసు నమోదు చేయాలని కలెక్టర్ హరీంధర ప్రసాద్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు జిల్లా పోలీస్ శాఖకు చేరగా, ఎస్పీ బిందుమాధవ్ నుంచి త్రీ టౌన్కు సాయంత్రం అందాయి. కలెక్టర్ ఆదేశాలు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు బాధితులు ఇచ్చిన వాంగ్మూలాలు, సమీప బంధువు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయనున్నట్లు త్రీ టౌన్ సీఐ సత్యనారాయణ తెలిపారు. రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతితుని: మండలంలోని హంసవరం – అన్నవరం మధ్యలో రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి (సుమారు 40 ఏళ్లు) మృతి చెందాడని జీఆర్పీ ఎస్సై వి.సత్తిబాబు మంగళవారం తెలిపారు. అతడి శరీరంపై ఓం, లిజ అనే పచ్చబొట్టు, కుడి చేతిపై బీఆర్ఏ పచ్చబొట్టు ఉన్నాయన్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, మృతుడి వివరాలు తెలిస్తే తుని జీఆర్పీ పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. 6 కిలోల వెండి వస్తువుల అపహరణ తాళ్లరేవు: మండల కేంద్రమైన తాళ్లరేవు మార్కెట్ వీధిలో సోమవారం రాత్రి భారీ చోరీ జరిగింది. గ్రామానికి చెందిన వ్యాపారి అద్దేపల్లి సురేష్ తన కుటుంబ సభ్యులతో కలసి సినిమాకు వెళ్లారు. ఆ సమయంలో గుర్తు తెలియని దుండగులు ఇంటి వెనుక వైపు తలుపులు పగులగొట్టి లోపలకు ప్రవేశించారు. పూజ గదిలోని దేవుడి సామగ్రిని చిందరవందర చేశారు. బెడ్ రూములోని బీరువాను బద్దలుగొట్టి అందులో ఉన్న సుమారు 6 కిలోల వెండి వస్తువులు అపహరించుకుపోయారు. వీటి విలువ సుమారు రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ ఉంటుందని బాధితులు తెలిపారు. సినిమా చూసి ఇంటికి వచ్చిన సురేష్, కుటుంబ సభ్యులు చోరీ జరిగిన విషయం గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కోరంగి ఎస్సై సత్యనారాయణ బృందం ఆ ఇంటిని పరిశీలించింది. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. ఈ చోరీతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. మర్యాద పూర్వకంగా.. బోట్క్లబ్ (కాకినాడసిటీ): జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్గా బాధ్యతలు స్వీకరించిన ఎం.ఆనందరావును మంగళవారం ఆయన కార్యాలయంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వల్లూరి సూర్యప్రకాశరావు మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించారు. విజయవాడ పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేసిన ఆయన కాకినాడకు బదిలీపై వచ్చారు. ఇక్కడ మేనేజర్గా పనిచేసిన దేవుల నాయక్ తిరుపతి జిల్లాకు బదిలీ అయ్యారు. -
ప్రభుత్వ తీరుపై నిరుద్యోగుల నిరసన
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన 11,639 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని, లేని పక్షంలో నిరుద్యోగులతో కలిసి చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తామని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న అన్నారు. కాకినాడలో నిరుద్యోగులు మంగళవారం డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో కొండయ్యపాలెం బ్రిడ్జి నుంచి జెడ్పీ సెంటర్ మీదుగా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై బైఠాయించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న చంద్రబాబు ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామన్నారు. ఖాళీలతో సంబంధం లేకుండా కేవలం 2500 పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధపడటం సిగ్గుచేటన్నారు. కనీసం పది వేల పోస్టులతో కూడిన నోటిఫికేషన్ విడుదల చేయాలని చేశారు. డిగ్రీ, పిజీలు చదివిన వారికి ఒక్క ఉద్యోగం లేదని, కానీ ఇంటర్ ఫెయిల్ అయిన వారు మూడు, నాలుగు శాఖలకు మంత్రులుగా ఉన్న పరిస్థితి మన రాష్ట్రంలో ఉందన్నారు. అనంతరం కలెక్టర్ హరేంధిర ప్రసాద్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ నాయకులు టి.రాజా, వాసు, సత్యం, జయరాం, ఆదర్శ కార్తిక్, రాజు పాల్గొన్నారు. -
స్విమ్మింగ్ పోటీల్లో పతకాలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): విశాఖలో ఈ నెల 18, 19 తేదీల్లో జరిగిన రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు పలు విభాగాల్లో పతకాలు సాధించారు. జిల్లా స్విమ్మింగ్ సంఘ కార్యదర్శి ఐ.రాజు మంగళవారం ఈ విషయం తెలిపారు. గ్రూప్ –1లో సాయి మహాలక్ష్మి, శ్రీలాస్య బెస్ట్ స్ట్రోక్, బ్యాక్స్ట్రోక్లో బంగారు పతకాలు, ఫ్రీ స్టైల్లో కాంస్య పతకాలు సాధించారన్నారు. గ్రూప్ –2లో షణ్ముక్ వీర్ బ్యాక్ స్ట్రోక్లో బంగారు, బ్యాక్ స్ట్రోక్ లో రజత, బటర్ ఫ్లైలో కాంస్య పతకం, విరాజ్ విజయ్ బటర్ ఫ్లైలో రజత, ఫ్రీ స్టైల్లో కాంస్యం గెలుపొందాన్నారు. గ్రూప్ – 3లో సాయి చరణ్ బ్రెస్ట్ స్ట్రోక్లో బంగారు, బ్యాక్ స్ట్రోక్లో రజతం, ఎం.యశస్వి, తుషాంత్ ఫ్రీ స్టైల్, బ్రెస్ట్ స్ట్రోక్లో కాంస్య పతకాలు కై వసం చేసుకున్నారన్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులను డీఎస్డీఓ సతీష్ కుమార్, అసోసియేషన్ సభ్యులు అభినందించారు. భువనేశ్వర్లో ఆగస్టులో జరిగే జూనియర్ నేషనల్స్కు సాయి మహాలక్ష్మి, శ్రీలాస్య, అలాగే జైపూర్లో జరిగే సబ్ జూనియర్ నేషనల్స్కు సాయి చరణ్, రిషి సాత్విక్, షణ్ముక్ వీర్, విరాజ్, యశస్విమేధ ఎంపికయ్యారు. -
దోషరహితంగా ఓటరు జాబితా
బోట్క్లబ్ (కాకినాడసిటీ): సర్ ప్రక్రియలో భాగంగా జిల్లాలో రూపొందించనున్న ఓటరు జాబితాను అత్యంత పారదర్శకంగా, దోష రహితంగా సిద్ధం చేసేందుకు సహాయ, సహకారాలను అందించాలని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ కోరారు. ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్లో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నూరు శాతం ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ ప్రక్రియ పూర్తయిందని, 88.05 శాతం ఎన్యూమరేషన్ పత్రాలను డిజిటలేషన్ చేశారన్నారు. జిల్లాలో కొత్తగా 184 పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించడం జరిగిందని, వీటిపై తమ సలహాలు సూచనలు తెలియజేయాలని కోరారు. పటిష్టంగా చెత్తసేకరణ ఇంటింటా చెత్త సేకరణ ప్రక్రియను మరింత పటిష్టంగా అమలు చేయడంతో పాటు సేకరించిన ఘన వ్యర్థాలను ప్రణాళికా ప్రకారం శాసీ్త్రయ పద్ధతుల్లో నిర్వహించడంలో అధికారుల పాత్ర కీలకమని కలెక్టర్ అన్నారు. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026పై కాకి నాడ, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలకు చెందిన పంచాయతీ అధికారులకు మంగళవారం వర్క్షాపు నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్తో పాటు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ ఎం.సుధాకరరావు హాజరయ్యారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై అవగాహన కల్పించారు. కాలువల్లో చెత్త వేస్తే కఠిన చర్యలు కాకినాడ లీగల్: కాకినాడలో శానిటేషన్ వ్యవస్థను పూర్తిగా గాడిలో పెట్టేందుకు నిత్యం డోర్ టు డోర్ చెత్త సేకరణను వంద శాతం అమలు చేయాలని నగరపాలక సంస్థ అధికారులను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. నగరంలోని స్మార్ట్ సిటీ కార్యాలయంలో నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ ఎన్వీవీ సత్యనారాయణ, అదనపు కమిషనర్, డిప్యూటీ కమిషనర్, ఎంహెచ్వో, శానిటేషన్ అధికారులు, వార్డు శానిటేషన్ సచివాలయ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇంటింటికీ చెత్త సేకరణ సక్రమంగా జరగకపోవడం, కాలువల్లో చెత్త వేయడం వంటి సమస్యలపై నిరంతరం ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. వార్డు శానిటేషన్ సచివాలయ సిబ్బంది తమ పరిధిలోని ప్రతి వీధి, ప్రతి ఇంటి పరిస్థితిని పూర్తిగా తెలుసుకుని పని చేయాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాలువలు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తున్న వారికి మొదటి మూడుసార్లు హెచ్చరించాలని, వారిలో మార్పు రాకపోతే నాలుగోసారి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
అరాచకాలపై మహిళల కన్నెర్ర
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో మహిళలపై అరాచకాలు పెరిగిపోయాయి. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో లైంగిక దాడులు, వేధింపులు, హత్యలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళలకు భద్రత లేకుండా పోయింది. ఈ భయానక పరిస్థితిపై వైఎస్సార్ సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళలు కన్నెర్ర చేశారు. కాకినాడలోని ఇంద్రపాలెం సెంటర్లో ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వర్ధినిడి సుజాత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. వారిపై జరుగుతున్న దాడులు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యలు, అరాచకాలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పోలీస్ యంత్రాంగం పూర్తిగా అధికార పార్టీకి తొత్తుగా మారిందన్నారు. ఇటీవల గుంటూరు, బద్వేలు వంటి ప్రాంతాల్లో మహిళలపై జరిగిన అవమానవీయ ఘటనలు రాష్ట్రంలో దారుణంగా మారిన పరిస్థితికి అద్దం పడుతున్నాయన్నారు. కొన్ని ఘటనల్లో నిందితులకు అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నాయన్న ఆరోపణలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. రాజకీయ ఒత్తిడి కారణంగా కేసుల నమోదులో జాప్యం, విచారణలో నిర్లక్ష్యం, నిందితులపై చర్యలు తీసుకోకపోవడం జరుగుతోందని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మహిళల భద్రతకు తీసుకువచ్చిన దిశ చట్టాన్ని ఈ ప్రభుత్వ నిర్వీర్యం చేసిందన్నారు. మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీప్తి మాట్లాడుతూ రాష్ట్రంలో హోం మంత్రిగా మహిళ ఉన్నప్పటికీ మహిళలకు ఏమాత్రం రక్షణ లేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని విమర్శించేందుకే ఈ ప్రభుత్వానికి సమయం సరిపోవడం లేదన్నారు. అనంతరం మహిళలపై దాడులు ఆపాలి, చంద్రబాబు డౌన్డౌన్, మహిళల కన్నీళ్లకు విలువ లేదా అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించాలని కోరుతూ అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఆందోళనలో పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి, నగర అధ్యక్షురాలు పసుపులేటి వెంకటలక్ష్మి, కాకినాడ జిల్లా సోషల్ మీడియా అధ్యక్షురాలు బీర కృష్ణప్రియ, పార్టీ నాయకులు ఇసుకపట్ల లక్ష్మీకుమారి, మల్లిక, కర్రి అనంత, భవాని, సత్యప్రభ, లలిత, ప్రియ, ధనలక్ష్మి, నాగమణి పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పిస్తున్న మహిళా నాయకులుకాకినాడలో నిరసన తెలుపుతున్న వైఎస్సార్ సీపీ మహిళా విభాగం నాయకులు, కార్యకర్తలు -
పొలాల్లో విషం కలుపుతూ..
పిఠాపురం: పొలాల్లో కలుపు నివారణకు రైతులు కలుపు నివారణ మందును పిచికారీ చేస్తుంటారు. దీనివల్ల కలుపు మొక్కలు నాశనవుతాయని వారి ఆలోచన. అయితే పొలాల్లో కలుపు నివారణకు వాడే పారాకాట్ అనే మందు ఇప్పుడు మనిషి ప్రాణాలు తీస్తోంది. చాలామంది క్షణికావేశంలో ఈ మందు తాగి తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అలాగే భూసారానికి, పర్యావరణానికి నష్టం ఏర్పడుతోంది. ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులు సుమారు 2 లక్షల లీటర్ల పేరాకాట్ అనే గడ్డిమందును తమ పొలాల్లో వినియోగిస్తున్నట్టు అంచనా. విషపూరితం పంటలు వేశాక వాటిలో కలుపు తీయడానికి కూలీలు అవసరమవుతారు. ప్రస్తుతం కూలీల కొరత ఎక్కువగా ఉండడంతో రైతులు కలుపు నివారణ మందులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పంట వేయక ముందే వీటిని పిచికారీ చేస్తే మంచిదంటూ కొందరు పురుగు మందు దుకాణదారులు చెబుతున్నారు. రైతుల అవగాహనాలేమిని ఆసరాగా తీసుకుని నిషేధిత కలుపు మందులను విక్రయిస్తున్నారు. దీని వల్ల భూములు విషపూరితంగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. అవగాహన లేక.. ప్రస్తుతం ఖరీఫ్ సాగు ఆలస్యమవ్వడంతో పలు ప్రాంతాల్లోని ఖాళీ భూముల్లో కలుపు నివారణా మందులను విచక్షణా రహితంగా పిచికారీ చేస్తున్నారు. దీంతో గట్లు, చెట్లు, చేమలతో సహా భూములు మాడి మసైపోతున్నాయి. ఈ మందుల వల్ల కలుపు తాత్కాలికంగా మాడి పోతున్నప్పటికీ పంటలు వేశాక మళ్లీ యథాతథంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అసలు ఏ మందులు వినియోగించాలో కూడా రైతులకు చెప్పే నాథుడు కరువయ్యాడు. పర్యావరణానికి ముప్పు కలుపు మందు ఎక్కువగా పిచికారీ చేయడం వల్ల భూసారం తగ్గే అవకాశం ఉంది. పంట దిగుబడులపైనా ప్రభావం చూపడంతో పాటు పంట నాణ్యత దెబ్బతిని, ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది. కలుపు మందు అవశేషాలు ఉన్న పంటలను ఎగుమతులు చేసే అవకాశం ఉండదు. అమెరికా వంటి అగ్ర దేశాల్లో ఇప్పటికే కలుపు మందులను పూర్తిగా నిషేధించారు. వీటి వల్ల క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు వ్యాపించే అవకాశాలున్నట్లు పరిశోధనల్లో తేలింది. ఇప్పటికే కొన్ని రకాల కలుపు మందులను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. అయినా అవగాహనా లోపంతో రైతులు వీటిని విచ్చలవిడిగా వాడుతున్నారు. గడ్డి మందు అమ్మితే కఠిన చర్యలు గడ్డి మందుగా పిలిచే పేరాకాట్ను ఎవరు విక్రయించినా క్రిమిసంహారక చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం. పురుగు మందుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాం. రైతులు కలుపు మందుతో పని లేకుండా ఇతర మార్గాల ద్వారా కలుపు నివారణకు చర్యలు తీసుకోవడం మంచిది. – పి.స్వాతి, వ్యవసాయ శాఖ ఏడీఏ పిఠాపురం ఫ కలుపు నివారణకు మందుల పిచికారీ ఫ విచ్చలవిడిగా రైతుల వినియోగం ఫ భూసారం, పర్యావరణానికి నష్టం ఫ ఆ మందుతో అనేక అనర్థాలు -
చేపల వేటకు అనుమతి ఇవ్వండి
తొండంగి: సముద్రంలో పెరుమాళ్లపురం వద్ద కాకినాడ గేట్ వే పోర్టు డ్రెడ్జింగ్ నిర్మాణం కారణంగా అలల ఉధృతి ఎక్కువైందని, పోర్టు ప్రాంతం నుంచి తమను వేటకు వెళ్లనివ్వాలంటూ పోర్టు ప్రతినిధులతో దానవాయిపేట పరిసర గ్రామాల మత్స్యకారులు జరిపిన చర్చలు సఫలీకృతం కాలేదు. కాకినాడ గేట్ వే పోర్టును పెరుమాళ్లపురంలో నిర్మించడంతో దానవాయిపేట, నర్శిపేట, తాటియాకులపాలెం, వాడ ముసలయ్యపేట తదితర ప్రాంతాల్లో అలల ఉధృతి ఎక్కువైందని, ఈ నేపథ్యంలో ఆయా తీరాల నుంచి బోట్లు వెళ్లేందుకు అనువుగా లేదని బాధిత గ్రామాల మత్స్యకారులు చెబుతున్నారు. ఈ మేరకు మంగళవారం పెరుమాళ్లపురంలో కాకినాడ గేట్ వే పోర్టు ప్రతినిధులతో చర్చించారు. మత్స్యకార సంఘం నాయకులతో పాటు బోట్లు యజమానులు, మత్స్యకారులు సుమారు రెండొందలమందికి పైగా పెరుమాళ్లపురం పోర్టుకు వెళ్లారు. తమకు సుమారు వంద వరకు బోట్లు వరకూ ఉన్నాయని, ఒక్కో బోటుపై ఆరు నుంచి పది మంది వరకూ వేటకు వెళతామన్నారు. పోర్టు నిర్మాణం కారణంగా తమ ప్రాంతాల్లో అలల ఉధృతి ఎక్కువగా ఉందని, దీనివల్ల బోట్లు సముద్రంలోకి వెళ్లిన సందర్భాల్లో ప్రమాదాలకు గురవుతున్నాయన్నారు. పోర్టు ప్రాంతం నుంచి పెరుమాళ్లపురం మత్స్యకారులు బోట్లు వేసుకుని సులభంగా వేటకు చేసుకుంటున్నారని, తమకు కూడా అవకాశం కల్పించాలని కోరారు. అయితే పోర్టులో ఎగుమతి, దిగుమతులతో పాటు అభివృద్ధికి ఇబ్బందులు కలుగుతాయని పోర్టు ప్రతినిధులు వివరించారు. అయితే తమకు మూడు నెలల పాటు వేటకు అవకాశం కల్పించాలని మత్స్యకారులు కోరారు. దీనిపై పోర్టు యాజమాన్యంతో చర్చించి నిర్ణయం తెలుపుతామని పోర్టు ప్రతినిధులు తెలిపారు. గురువారం మరో మారు చర్చలు చేస్తామని బదులిచ్చారు. ఫ కాకినాడ గేట్వే పోర్టు ప్రతినిధులతో మత్స్యకారుల చర్చలు ఫ అంగీకరించని పోర్టు ప్రతినిధులు -
కొనసాగిన దస్తావేజు లేఖర్ల నిరసన
కాకినాడ లీగల్: రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రైవేటీకరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 396పై దస్తావేజు లేఖర్లు చేపట్టిన పెన్డౌన్ రెండో రోజు మంగళవారం కొనసాగింది. కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖర్లు, వారి సహాయకులు, డీటీపీ ఆపరేటర్లు, స్టాంపు వెండర్ల నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ) సీహెచ్ జానకీదేవి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మార్కెట్ అండ్ ఆడిట్ జిల్లా రిజిస్ట్రార్ జేఎస్యూ జయలక్ష్మి, కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ కె.ప్రసాదరావుకు వినతి పత్రాలు అందజేశారు. దస్తావేజు లేఖర్ల సంఘం నాయకులు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రైవేటీకరించడం వల్ల పారదర్శకత దెబ్బతింటుందని, ప్రజల హక్కులు, ఆస్తుల భద్రతపై అనిశ్చితి నెలకొనే ప్రమాదం ఉందన్నారు. జీవో 396ను తక్షణమే ఉపసంహరించుకుని, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటు నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరారు. ఉపాధి కోల్పోయే ప్రమాదం కాకినాడ రూరల్: రిజిస్ట్రేషన్ వ్యవస్థను దశల వారీగా ప్రైవేటుపరం చేసే ప్రయత్నం జరుగుతోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజులేఖర్లు చేపట్టిన పెన్డౌన్ ఆందోళనకు ఆమె సంఘీభావం ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ వ్యవస్థతో ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనం సాగిస్తున్న వేల మంది డాక్యుమెంట్ రైటర్లు, వారి కుటుంబాలు ఉపాధి కోల్పోయే ప్రమాదంలో ఉన్నాయన్నారు. భూములు, ఆస్తులకు సంబంధించిన అత్యంత కీలకమైన రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒకప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసిన చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు రిజిస్ట్రేషన్ వ్యవస్థనే ప్రైవేటు సంస్థల చేతుల్లోకి అప్పగించే విధానాన్ని ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించారు. దస్తావేజు లేఖర్లతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. -
రాజకీయాల్లో చెరగని ముద్ర
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, పీసీసీ మాజీ అధ్యక్షుడు జీఎస్ రావులకు నివాళులర్పిస్తున్న నాయకులు, అభిమానులు సభలో మాట్లాడుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి, పక్కన మాజీ మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన, మాజీ ఎంపీ భరత్రామ్ తదితరులుసాక్షి, రాజమహేంద్రవరం/ సీటీఆర్ఐ: కాపు జాతి కోసం అహర్నిశలు శ్రమించిన మహోన్నతులు ముద్రగడ పద్మనాభం, జీఎస్ రావు అని వక్తలు కొనియాడారు. ఇటీవల కాపు ఉద్యమ నేత, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, పీసీసీ మాజీ అధ్యక్షుడు జీఎస్ రావు మృతి చెందడంతో వారికి సంస్మరణ సభను రాజమహేంద్రవరంలో నగర కాపు సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేశారు. వేలాది మంది ముద్రగడ, జీఎస్ రావు అభిమానులు తరలివచ్చారు. జై ముద్రగడ, జై వంగవీటి, జై జీఎస్ఆర్, జై జక్కంపూడి రామ్మోహన్రావు అంటూ నినాదాలతో హోరెత్తించారు. పార్టీలకు అతీతంగా ముద్రగడ, జీఎస్ రావు చిత్రపటాలకు నివాళుల ర్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్సార్ సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే రాజకీయ మహోన్నతుడని కీర్తించారు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం, జీఎస్ రావులు సజీవంగా లేకపోయినా, వారి సేవలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉంటాయన్నారు. అనంతరం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ వ్యక్తిగతంగా ఎంతో కోల్పోయినా కాపుల అభ్యున్నతి కోసం ముద్రగడ పద్మనాభం పరితపించారని కొనియాడారు. జీఎస్ రావు నీతి, నిబద్ధత కలిగిన నాయకుడని గుర్తు చేసుకున్నారు. విజయవాడలో ముద్రగడ సంస్మరణ సభ నిర్వహించాలని కోరారు. రిజర్వేషన్ ఫలాలు కాపులకు అందిన రోజునే ముద్రగడ ఆత్మ శాంతిస్తుందన్నారు. వంగవీటి మోహనరంగా బతికి ఉంటే ముఖ్యమంత్రి అయ్యుండేవారన్నారు. కాపుల రిజర్వేషన్ కోసం అందరూ ఐక్యంగా పోరాడాలన్నారు. రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ నీతి, నిజాయితీ, నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం ముద్రగడ పద్మనాభం అని అన్నారు. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యదర్శులు తోట రామకృష్ణ, గిరజాల బాబు మాట్లాడారు. కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలి మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ నమ్మిన లక్ష్యం కోసం ముందుకు సాగిన గొప్ప నాయకుడు ముద్రగడ పద్మనాభం అని అన్నారు. గోదావరి జిల్లాల్లో పద్మనాభం కాంస్య విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో టీడీపీ ప్రభంజనంలోనూ జీఎస్ రావు గెలిచి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ముద్రగడ పద్మనాభం, జీఎస్ రావు ధ్రువతారలని కొనియాడారు. ప్రజల కోసం ఆలోచించే నాయకుడిని కోల్పోయామన్నారు. సత్యం కోసం హరిశ్చంద్రుడు ఎన్నో కష్టాలు పడినట్టు.. ఇచ్చిన మాట కోసం తీసుకున్న నిర్ణయాలకు ముద్రగడ కట్టుబడి ఉన్నారన్నారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ ముద్రగడ చూపిన బాటలో ముందుకు సాగుతామన్నారు. కాపులకు రిజర్వేషన్లు సాధించేందుకు పోరాడతామన్నారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ కులం కోసం అహర్నిశలు ముద్రగడ శ్రమించారన్నారు. ముద్రగడ మరణం రాష్ట్రానికి తీరని లోటు అని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. కాపు కార్పొరేషన్కు నిధులివ్వడం లేదు కాపు జేఏసీ నాయకుడు దాసరి రాము మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం సుదీర్ఘ రాజకీయ జీవితంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా, ఒకసారి ఎంపీగా పనిచేసినా అవినీతి మచ్చ లేకుండా ఉండటం సామాన్య విషయం కాదన్నారు. కాపు జాతికి ఆయన చేసిన సేవలను మరిచిపోకూడదన్నారు. జీఎస్ రావు కాపు జాతికి అనేక సేవలు అందించారన్నారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంపై పార్టీలకు అతీతంగా ఒత్తిడి తీసుకురావాలని కోరారు. కాపు కార్పొరేషన్కు సంవత్సరానికి రూ.మూడు వేల కోట్లు ఇస్తామని చెప్పినా, రెండేళ్లలో ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. అడ్వకేట్ కన్నా రజిని మాట్లాడుతూ మన జాతిలోనే మనల్ని అణగదొక్కే శక్తులున్నాయన్నారు. జీవితాంతం కాపుల కోసం పరితపించిన ముద్రగడని పొగడకపోయినా పర్వాలేదు కానీ కులద్రోహిగా చిత్రీకరించొద్దన్నారు. ఆఖరి కోరిక తీర్చేందుకే అడ్డుకున్నాం ముద్రగడ పద్మనాభం చివరి రోజుల్లో చాలా అవమానాలు ఎదుర్కొన్నారని వైఎస్సార్ సీపీ యువజన విభాగం మాజీ రీజినల్ కో ఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ అన్నారు. నేటి నుంచి తాను వ్యక్తిగతంగా ముద్రగడ కాపు అని చెప్పుకొంటానన్నారు. ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామన్నా.. ముద్రగడ ఆఖరి కోరిక తీర్చేందుకే తాను, మాజీ మంత్రి అంబటి రాంబాబు అడ్డుకున్నామన్నారు. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ పుట్టిన ప్రతి ఒక్కరూ మరణిస్తారని, కానీ కొంత మంది మాత్రమే మంచి కార్యక్రమాలు చేసి చిరంజీవులుగా మిగిలిపోతారన్నారు. అటువంటి వారిలో ముద్రగడ పద్మనాభం, జీఎస్ రావు ఉన్నారన్నారు. జాతి, కుల, మతాలకు అతీతంగా తరలివచ్చిన ఇంత మంది మనసులో వారు సజీవంగా ఉంటారన్నారు. రిజర్వేషన్ కోసం ఐక్యంగా ఉద్యమిస్తాం అనంతరం పలువురు కాపు సంఘం నాయకులు మాట్లాడుతూ ముద్రగడ, జీఎస్ రావుతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వారి బాటలోనే ముందుకు సాగుతామన్నారు. పార్టీలకు అతీతంగా రిజర్వేషన్ సాధన కోసం ఐక్యంగా ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, వైఎస్సార్ సీపీ రైతు విభాగం మాజీ అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి, రాజమహేంద్రవరం కాపు సంఘం అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ పెద్దాపురం నియోజకవర్గ ఇన్చార్జి దవులూరి దొరబాబు, భీమవరం ఇన్చార్జి చిన్నమిల్లి వెంకట్రాయుడు, తాడేపల్లిగూడెం ఇన్చార్జి వడ్డి రఘురామ్, ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శివరామసుబ్రహ్మణ్యం, రాజానగరం, నిడదవోలు నియోజకవర్గాల వైఎస్సార్ సీపీ పరిశీలకులు తోట రామకృష్ణ, గిరజాల బాబు, నాయకులు జెట్టి గురునాథం, యాళ్ల సురేష్, కాపు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణు, ఆరేటి సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఫ కాపుల అభ్యున్నతికి ముద్రగడ ఎనలేని కృషి ఫ నీతి, నిబద్ధతకు నిదర్శనం జీఎస్ రావు ఫ నగర కాపు సంఘం ఆధ్వర్యంలో సంస్మరణ సభ ఫ నివాళులర్పించిన వైఎస్సార్ సీపీ, ఇతర పార్టీల నాయకులు -
పుష్కరాల నాటికి పనులు పూర్తి చేయండి
అన్నవరం: స్థానిక శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో అన్నదాన భవనం, భక్తుల క్యూ కాంప్లెక్స్, సీతారామ సత్రం పనులను గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేయాలని దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఆదేశించారు. అన్నవరం దేవస్థానంలో కమిషనర్ పర్యటన రెండో రోజు సోమవారం కూడా కొనసాగింది. కేంద్ర ప్రభుత్వ ‘ప్రసాద్’ స్కీమ్ నిధులు రూ.18 కోట్లతో నిర్మిస్తున్న అన్నదాన భవనం, భక్తుల క్యూ కాంప్లెక్స్లను ఆయన పరిశీలించారు. క్యూ కాంపెక్స్లో భక్తులకు గాలి బాగా వచ్చేలా అన్ని వైపులా గ్రిల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అన్నదానం భవన నిర్మాణంలో గత పర్యటనలో చేసిన సూచనలకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారా అని కమిషనర్ ప్రశ్నించారు. రూ.15 కోట్లతో శ్రీసీతారామ సత్రం పనులను కమిషనర్ పరిశీలించారు. అనంతరం సత్యగిరిపై హరిహరసదన్ సత్రం వద్ద పెళ్లి కోసం వేసిన షామియానాలు అలాగే ఉంచేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని తొలగించి, కాంట్రాక్టర్కు అపరాధ రుసుం విధించాలని ఆదేశించారు. కొండ దిగువన దేవస్థానం గోశాల వద్ద ముందు ఉన్న స్థలంలో ప్రైవేట్ వ్యక్తులు పక్కా నిర్మిస్తున్న విషయం కమిషనర్ దృష్టికి తీసుకురాగా, దీనిని తొలగించేలా కలెక్టర్తో మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఈఓ నల్లం సూర్యచక్రధర్రావుకు తెలిపారు. -
జీవో 396ను రద్దు చేయాలని పెన్డౌన్
కాకినాడ లీగల్: ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 396ను రద్దు చేయాలని దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. సోమవారం కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖర్లు, వారి సహాయకులు, డీటీపీ ఆపరేటర్లు, స్టాంపు వెండర్లు నల్లబ్యాడ్జీలు ధరించి పెన్డౌన్ చేపట్టారు. ఈ సందర్భంగా దస్తావేజు లేఖర్ల సంఘ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు బీజే ప్రసాద్, కాకినాడ దస్తావేజు లేఖర్ల సంఘ అధ్యక్షుడు చోడపునీడి గోవిందరావు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రజలకు అందుతున్న సేవలన్నింటినీ తామే ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని తెలిపారు. ఆస్తులకు సంబంధించి టైటిల్ డీడ్, ఈసీ, రెవెన్యూ రికార్డుల పరిశీలన, ఆస్తి కొలతల అనంతరం దస్తావేజులు తయారు చేసి, క్రయ విక్రయదారులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీవోతో ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ద్వారా ప్రతి దస్తావేజుపై రూ.2 వేల అదనపు రుసుము వసూలు చేయడం వల్ల సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని అన్నారు. జీవో 396ను ఉపసంహరించుకుని, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటు నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరారు. దస్తావేజు లేఖర్ల పెన్డౌన్కు కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏలూరి సుబ్రహ్మణ్యం, న్యాయవాదులు సంఘీభావం తెలిపారు. విద్యారంగం బలోపేతానికి కృషి బాలాజీచెరువు (కాకినాడ సిటీ): విద్యారంగం బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని కలెక్టర్ హరేంధిర్ ప్రసాద్ అన్నారు. సోమవారం స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో జిల్లా పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులకు ప్రతిభా అవార్డులకు సంబంధించిన షైనింగ్ స్టార్స్–2026 కార్యక్రమం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 135 మంది పదో తరగతి విద్యార్థులకు, 173 మంది ఇంటర్ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున ప్రతిభ పురస్కారాలకు ఎంపికయ్యారన్నారు. ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖరం, ఎమ్మెల్యేలు పంతం నానాజీ, జ్యోతుల నెహ్రూ, వరుపుల సత్యప్రభ పాల్గొన్నారు. -
రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు
పిఠాపురం రూరల్: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని వైఎస్సార్ సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు వర్ధినీడు సుజాత సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గుంటూరులో వాటర్ బోర్ మోటార్ పంపు విషయంలో రూ.10 వేల లంచం ఇవ్వలేదనే కారణంతో టీడీపీ వార్డు సెక్రటరీ మల్లేల మూర్తి, అతని కుటుంబ సభ్యులు ఓ మహిళను వివస్త్రను చేసి నడిరోడ్డుపై దాడి చేసిన ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. కావలిలో గిరిజన మహిళలను టీడీపీ కౌన్సిలర్ వివస్త్రను చేసి కొట్టిన ఘటన మరువక ముందే మరో ఘటన జరగడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. తొండంగి మండలం కొమరగిరి పంచాయతీ వడపంపాదిపేటలో రాజేంద్ర అనే యువకుడు ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేయడంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కూడా మహిళలపై పెరుగుతున్న వేధింపులకు నిదర్శనమని తెలిపారు. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ ఘటనలపై బాధ్యత వహించి తక్షణం చర్యలు తీసుకోవాలని అన్నారు. నేడు కాకినాడలో నిరసన బోట్క్లబ్ (కాకినాడ సిటీ): చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన రెండేళ్ల నుంచి మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వర్ధినీడి సుజాత మండిపడ్డారు. ప్రభుత్వ చేతకానితనానికి, నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా కాకినాడలోని కలెక్టరేట్ సమీపంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద మంగళవారం ఉదయం 9 గంటలకు నిరసన చేపడతామన్నారు. ఫ మహిళలపై పెరిగిన అఘాయిత్యాలు ఫ వైఎస్సార్ సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సుజాత -
పదే పదే తిరుగుతున్నా..!
ఆరు నెలలుగా ఇంతే.. చెట్టుపై నుంచి పడిపోవడంతో ప్రస్తుతం వీల్చైర్లో తప్ప నడవడం వీలు కావడం లేదు. దీనివల్ల ప్రైవేటు ఉద్యోగం కాస్తా పోవడంతో ప్రస్తుతం కుటుంబం చాలా ఇబ్బంది పడుతుంది. నాకు పింఛన్ ఇప్పించాలని స్థానిక మండల కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగాను. పట్టించుకునే నాథుడే కరవయ్యారు. ఆరు నెలలుగా ఇదే పరిస్థితి ఉంది. –పి.శ్రీనివాస్, జి.మేడపాడు, సామర్లకోట మండలం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): పదే పదే తిరుగుతున్నాం.. సమస్యలు పరిష్కరించాలంటూ మొరపెట్టుకుంటున్నాం.. అయినా పరిష్కారం దొరకడం లేదంటూ అర్జీదారులు నిట్టూర్పు వదులుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) తూతూమంత్రంగానే జరుగుతోంది. అనేక మంది అర్జీదారులు వచ్చి తమ వెతలు చెబుతున్నా, పరిష్కారం మాత్రం కానరావడం లేదు. మళ్లీ మళ్లీ వారు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. సోమవారం కాకినాడ కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ నిర్వహించారు. జిల్లాలో పలు ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. క్షేత్ర స్థాయిలో సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడం వల్లే తాము ప్రతి వారం ఇంత దూరం వ్యయ ప్రయాసలు కోర్చి రావాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్జీదారుల నుంచి కలెక్టర్ హరేంధిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అర్జీలు స్వీకరించారు. అయితే కార్యాలయాల చుట్టూ తిరగడం మినహా తమకు సరైన పరి ష్కారం దొరకడం లేదని పలువురు వాపోయారు. నా కాలిని కోల్పోయినా.. రెండేళ్ల కిందట నా కాలిని కోల్పోయాను. ఎవరో ఒకరి సాయం లేనిదే బయటకు రాలేను. వికలాంగ పింఛన్ కోసం రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. ప్రతి సారీ ఏదొక షాకు చెబుతున్నారు. ఒకరి సహాయం తీసుకుని కలెక్టరేట్కు వచ్చి అర్జీ అందించాను. వచ్చినప్పుడల్లా ఆటో ఖర్చులు కూడా ఎక్కువగా అవుతున్నాయి. అధికారులు ఆదుకోవాలి. – సిద్ధాం రామారావు, జగన్నాథపురం, కాకినాడపనికావడం లేదు మా నాన్న ద్వారా సంక్రమించిన వ్యవసాయ భూమి నా పేరున పాస్ పుస్తకాలు ఇవ్వడానికి అధికారులు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. మండల కార్యాలయంలో పనికావడం లేదని జిల్లా కేంద్రానికి వస్తున్నా. ఏడాదిన్నర నుంచి తిరుగున్నా, ఇక్కడా సరైన పరిష్కారం దొరకడం లేదు. వచ్చిన ప్రతి సారీ దారి ఖర్చులు తప్పడం లేదు. –బి.వీరేంద్రకుమార్, ఎస్.అన్నవరం, తుని మండలం ఫ పీజీఆర్ఎస్ అర్జీలకు కానరాని పరిష్కారం ఫ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు తిరగని కార్యాలయం లేదు రెండేళ్లుగా తిరగని కార్యాలయం లేదు. దరఖాస్తు ఇవ్వని అధికారి లేరు. నా వ్యయసాయ భూమిని ఆన్లైన్ చేయడం లేదు. ప్రతి సారీ ఆటోలో కలెక్టరేట్కు వచ్చి దరఖాస్తు ఇవ్వాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. రెండేళ్లుగా తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. నా పేరున ఉన్న భూమి ఆన్లైన్ చేసేందుకు ఎందుకు ఇబ్బందో అధికారులు చెప్పడం లేదు. – పుణ్యమంతుల సీతాదేవి, ధర్మవరం, ప్రత్తిపాడు మండలం -
ముద్రగడ కుటుంబానికి ప్రముఖుల పరామర్శ
కిర్లంపూడి: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు దివంగత ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని సోమవారం పలువురు రాజకీయ ప్రముఖులు పరామర్శించారు. కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, వంగవీటి మోహన్రంగ తనయుడు వంగవీటి రాధాకృష్ణ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ చేరుకుని ముద్రగడ పద్మనాభం తనయులు వైఎస్సార్ సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు, పెద్ద కుమారుడు ముద్రగడ వీరరాఘవరావును పరామర్శించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు కిర్లంపూడి తరలివచ్చి ముద్రగడ పద్మనాభం సమాధిని సందర్శించి నివాళులు అర్పించారు. దివంగత ముద్రగడతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని కంటతడి పెట్టుకున్నారు. నివాళి అర్పించిన వారిలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర, విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోట శ్రీరాంజీ, రామచంద్రపురం నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాశ్, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు కుంచె రామారావు, జిల్లా టాస్క్ఫోర్స్ సభ్యుడు వాసిరెడ్డి జమీల్, రాజానగరం, ప్రత్తిపాడు, నరసాపురం నియోజకవర్గాల పరిశీలకులు తోట రామకృష్ణ, ఒమ్మి రఘురాం, ముదునూరి మురళీరాజు తదితరులు ఉన్నారు. -
కష్టానికీ.. కాష్టానికీ కనికరించరా!
వైఎస్సార్ పాలనా కాలంలో సంక్షేమ బోర్డు.. అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతకు కేంద్రం ప్రభుత్వం 1996లో పార్లమెంటులో ప్రైవేటు బిల్లు తీసుకురాగా రాష్ట్రంలో మహానేత వైఎస్సార్ హయాంలో ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కనస్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు –2009 పేరుతో అమలు చేశారు. ● భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం అన్యాయం ● నిబంధనల పేరుతో సంక్షేమ బోర్డు నిర్వీర్యం ● ఉమ్మడి జిల్లాలో రూ.5 కోట్ల క్లెయిముల బకాయి ● ప్రమాదవశాత్తూ జరిగే మరణానికి సాయం కరువు కపిలేశ్వరపురం: తాజ్మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు అని ప్రశ్నించిన శ్రీశ్రీకి ఎప్పటికీ సమాధానం దొరకదేమో. చలువ రాతి మేడల్లో.. ఏసీ గదుల్లో.. గుండెలపై చేయి వేసుకుని నిద్రిస్తున్న ప్రతి మనిషి సుఖం వెనుక మరొకరి కష్టమనే పునాది రాయి దాగి ఉంది. ఆ భవన నిర్మాణానికి ఆ రోజుకు ఎవరో వస్తారు.. మేస్త్రి చెప్పిన పని చేసేసి వెళ్లిపోతారు. ఆ తరువాత ఎవరికి ఎవరో. కొన్నాళ్లకి ఆ నిర్మాణం ఇంద్రభవనంలా కళకళలాడుతూ పిల్లా పాపలతో సందడిగా మారిపోతుంది. అటుగా వచ్చిన ఆ కార్మికుడు ఇది నేనే కట్టానని చెప్పుకొని మురిసిపోతాడు. అదీ అతడి జీవన చిత్రం. అదేవిటో.. ఆ జీవన చిత్రాలన్నీ ఎప్పుడూ వెలిసిపోయే ఉంటాయి. వారి సంక్షేమాన్ని గుర్తించే వారు ఉండరు. భవన నిర్మాణ కార్మికుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత బాధాకరం. వారు పోరాడి సాధించుకున్న సంక్షేమ బోర్డును అంతకంతకూ నిర్వీర్యం చేస్తున్నారు. కార్మికుల సంఖ్య తగ్గిస్తూ కుట్ర.. కార్మిక శాఖ అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 67,755 మంది పురుషులు, 36,483 మంది సీ్త్రలు భవన నిర్మాణ కార్మికులుగా నమోదయ్యారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 2019 నాటికి బోర్డులో 2.45 లక్షల మంది ఉండేవారు. పునాది మొదలుకుని తుది నిర్మాణం వరకూ మొత్తం 52 రకాల వృత్తుల వారు భవన నిర్మాణ కార్మికుల జాబితాలోకి వస్తారు. అయితే 2020కి ముందు మంజూరైన కార్మికుల గుర్తింపు కార్డులను రెన్యువల్ చేయకూడదన్న ప్రభుత్వ నిర్ణయం వల్ల వారిలో 1.45 లక్షల మందిని తొలగించి ఈ ఏడాది మార్చి ఒకటి నాటికి ఆ సంఖ్యను 1.05 లక్షలకు పరిమితం చేసింది. ప్రయోజనాలు కుదించి.. సంక్షేమ బోర్డు అమలుకు సంబంధించి ఈ ఏడాది మార్చి 1న చంద్రబాబు ప్రభుత్వం పలు ఉత్తర్వులు జారీ చేసింది. అవి ప్రముఖంగా కార్మికుడి కుటుంబ సభ్యుల వివాహం సమయంలో, భార్య, కుమార్తెల కాన్పు సమయంలో, సహజ మరణం పొందినప్పడు మాత్రమే సాయం చేయాలని నిర్ణయించింది. వృత్తి నిర్వహణలో ప్రమాదవశాత్తూ మరణించినా, శాశ్వత అంగ వైకల్యం కలిగినా, కార్మికుల పిల్లల చదువులకు ఉపకార వేతనాల వంటివి వాటిలో ప్రస్తావించకపోవడాన్ని కార్మికులు విమర్శిస్తున్నారు. కార్మికుడి కుమార్తెకు వివాహం జరిగినప్పుడు రూ.40 వేలు ఇస్తామని కూటమి అనుకూల పత్రికల్లో ప్రచారం చేసుకున్నా రూ.20 వేలకు పరిమితం చేశారు. అదికూడా ఇద్దరికి మాత్రమే. కార్మికుని భార్య, కుమార్తెల కాన్పు సమయంలో రూ.20వేలు ఇస్తామన్న సాయాన్ని రెండు కాన్పులకు పరిమితం చేసింది. బకాయిల మాటేవిటి? 2019 నుంచి నేటి వరకూ ఉమ్మడి జిల్లాలో కార్మికుల క్లెయిమ్ దరఖాస్తు పరిష్కారానికి చెల్లించేందుకు ప్రభుత్వం రూ.5 కోట్లు బకాయి పడింది. దీనిపై ఎటువంటి స్పందనా లేదు. ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోంది కార్మికులు పోరాడి సాధించుకున్న సంక్షేమ బోర్డును ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. మరో పక్క బిల్డర్సుకు అనుకూలంగా వ్యవహరిస్తుంది. భవన నిర్మాణం చేపట్టినప్పుడు బిల్డరు కార్మిక శాఖకు లేబర్ సెస్సు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుత ప్రభుత్వం వసూలును పూర్తిగా పక్కకు పెట్టేయడం ద్వారా బిల్డర్ పక్షాన నిలబడింది. కానీ బిల్డరు తన భవనాలను అమ్మేటప్పుడు కొనుగోలు చేసే వినియోగదారుడి వద్ద నుంచి సెస్సు వసూలు చేస్తున్నాడు. మొత్తంగా సంక్షేమ బోర్డుకు చెందాల్సిన సెస్సు బిల్డర్ జేబులోకి వెళ్లిపోయేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. – చెక్కల రాజ్కుమార్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, సంక్షేమ బోర్డు స్క్రూటినీ కమిటీ సభ్యుడు, సీఐటీయూ నాయకుడు పోరాడుతున్నా పట్టని ప్రభుత్వం చంద్రన్న బీమా పథకాన్ని పునః ప్రారంభించబోతున్నట్టు ఈ ఏడాది జూన్ 12న కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ విజయవాడలో ప్రకటించినప్పటికీ ఆ దిశగా ఎలాంటి చర్యలు లేవు. భవన నిర్మాణ కార్మికుల దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఈ ఏడాది జూన్ 15న విజయవాడ లేబర్ కార్యాలయంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా లేబర్ కార్యాలయాలు ఎదుట ఆందోళన చేపట్టారు. -
చినబాబు చార్జ్పై చిటపటలు
● ఇన్చార్జిల నియామకంలో అసమ్మతి సెగలు ● కీలక నియోజకవర్గాలపై అధిష్టానం దృష్టి ● జెండాలు మోసినవారిని జోకొడుతున్న వైనం ● రాజానగరంలో చౌదరి మార్పు అనివార్యం సాక్షి, కాకినాడ: టీడీపీలో నియోజకవర్గ ఇన్చార్జిల నియామకం వర్గ విభేదాలకు ఆజ్యం పోస్తోందా..? చినబాబు అనుకూల వర్గానికి పట్టం కట్టేందుకు రంగం సిద్ధమైందా..? ఈ పరిణామం స్థానిక నేతల్లో అగ్గిరాజేస్తోందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇంతకీ విషయమేమిటంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిల నియామకంపై ఆ పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. పి.గన్నవరం, రాజానగరం, నిడదవోలు, కొవ్వూరు, పిఠాపురం నియోజకవర్గాలకు కొత్త ఇన్చార్జిల జాబితా ఇప్పటికే అధిష్టానానికి చేరినట్టు సమాచారం. నామినేటెడ్ పదవుల భర్తీ లాగే నియోజకవర్గ ఇన్చార్జిల నియామకాల్లోనూ చినబాబు ఆశీస్సులు ఉన్నవారికే పట్టం కట్టనున్నట్టు తెలియడంతో పార్టీ కోసం శ్రమించిన వారిలో ఆగ్రహాలు వెల్లువెత్తుతున్నాయి. పెందుర్తి అన్నపూర్ణకు చాన్స్? రాజానగరం టీడీపీలో ఉనికి కోసం పాట్లు మొదలయ్యాయి. ఇక్కడి ఇన్చార్జిగా పెందుర్తి వెంకటేష్ తరువాత బొడ్డు వెంకటరమణ చౌదరికి అవకాశం కల్పించగా ఆయనే నేటికీ కొనసాగుతున్నారు. ఆయనకు రుడా చైర్మన్, టీడీపీ జిల్లా అధ్యక్ష పదవులు ఉండడంతో ఇన్చార్జి మార్పు అనివార్యమైంది. అలాగే ఆయన పెద్దాపురం నియోజకవర్గానికి చెందినవారు కావడంతో స్థానిక నేతనే ఇన్చార్జిగా నియమించాలని యోచనలో ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రోగ్రాం కన్వీనర్ పెందుర్తి వెంకటేష్ భార్య పెందుర్తి అన్నపూర్ణ వైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. జనసేనకు ఝలక్..? ఈ పరిణామాల నేపథ్యంలో బొడ్డు వెంకటరమణ చౌదరి తనను ఇన్చార్జి పదవి నుంచి తొలగిస్తే రుడా చైర్మన్గా మరికొన్నేళ్లు కొనసాగించాలని కోరినట్టు, అందుకు అధిష్టానం ఓకే చేసినట్టు తెలిసింది. ఈ పరిణామం రాజమహేంద్రవరం సిటీ నేతల్లో ఆగ్రహావేశాలు నింపుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి సర్దుబాట్లలో భాగంగా సిటీ ఎమ్మెల్యే స్థానాన్ని జనసేన నేత అత్తి సత్యనారాయణ త్యాగం చేయడం, అందుకు బదులుగా రాజమహేంద్రవరం మేయర్ ఇస్తామని హామీ ఇవ్వడం తెలిసిందే. తాజాగా ఇప్పట్లో కార్పొరేషన్ ఎన్నికలకు అవకాశం లేకపోవడంతో రుడా చైర్మన్ పదవిని జనసేన డిమాండ్ చేస్తోంది. ఇది ఆ రెండు పార్టీల మధ్యా అగ్గి రాజేస్తోంది. కొవ్వూరులో కయ్యాలు.. కొవ్వూరులో ఎమ్మెల్యేగా ముప్పిడి వెంకటేశ్వరరావు ఉన్నా ద్విసభ్య కమిటీ నియోజకవర్గ బాధ్యతలు చూస్తోంది. ఆ కమిటీ పెత్తనాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. ఆ కమిటీని తొలగించి ఎమ్మెల్యేకు పూర్తి బాధ్యతలు ఇవ్వాలని శ్రేణులు కోరుతున్నట్టు సమచారం. కొందరు మాత్రం కమిటీ వైపే మొగ్గు చూపుతున్నారు. నిడదవోలుపై నజర్ నిడదవోలు ఇన్చార్జ్గా స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు వ్యవహరిస్తున్నారు. మళ్లీ ఆయనకే నియోజకవర్గ బాధ్యతలు ఇస్తారని తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన కేవలం పార్టీ కార్యక్రమాలకే పరిమితమవుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయనను తప్పిస్తారన్న ప్రచారం నడిచినా మళ్లీ ఆయననే నియమించనున్నట్టు తెలుస్తోంది. పొత్తులో భాగంగా ఎమ్మెల్యే స్థానాన్ని వదులుకున్న ఆయనను నియమించకుంటే పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతుందనే ఆలోచనలో అధిష్టానం ఉ్నట్టు తెలుస్తోంది. ఈ నియామకాలన్నీ చంద్రబాబు ఆమోదముద్ర పడ్డాక వెలువడే అవకాశం ఉందని సమాచారం. పిఠాపురంలో తేలని పరిస్థితి పొత్తులో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే స్థానాన్ని కోల్పోయిన వర్మ తదనంతర పరిణామాల్లో జనసేన నేతలతో వర్గ విభేదాలు ఏర్పడి నియోజకవర్గ ఇన్చార్జి పదవిని సైతం వదులుకోవలసి వచ్చింది. ఆ స్థానం పరిస్థితి ఏంటో తెలియాల్సి ఉంది. పి.గన్నవరం.. గరంగరం! ఈ నియోజకవర్గంలో స్థానికుడికే ఇన్చార్జి పదవి ఇవ్వాలని టీడీపీ క్యాడర్ డిమాండ్ చేస్తోంది. కానీ ఇక్కడ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ను నియమిస్తా రన్న ప్రచారం సాగుతోంది. కానీ ఆయన ముమ్మిడివరం నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఇక్కడి క్యాడర్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అలాగే ఇది ఎస్సీ రిజర్వుడు కావడంతో ఆ వర్గం వారినే నియమించాలని వారు కోరుతున్నా రు. కాగా సివిల్ సప్లైస్ డైరెక్టర్ అనంద్ సాగర్ ఈ స్థానం రేసులో ఉండగా ఆయననూ స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది. -
రత్నగిరి పవిత్రతకు భంగం కలిగించొద్దు
● అధికారులకు దేవదాయశాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ఆదేశం అన్నవరం: రత్నగిరి పవిత్రతకు భంగం వాటిల్లకుండా నిర్మాణాలు చేపట్టాలని రాష్ట్ర దేవదాయ, ధర్మదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ అధికారులను ఆదేశించారు. ఆదివారం సాయంత్రం ఆయన దేవస్థానంలో వివిధ నిర్మాణాలను పరిశీలించారు. సెల్ఫోన్ సిగ్నల్స్ కోసం ప్రకాష్సదన్ వద్ద నిర్మిస్తున్న టవర్పై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయానికి వచ్చే భక్తులు గోపురాలు, చెట్లను వీక్షిస్తూ ఆహ్లాద వాతావరణాన్ని ఆస్వాదించాలని రేడియో స్టేషన్ మాదిరిగా భారీ సెల్ టవర్లు కనిపించకూడదని అన్నారు. అనంతరం వినాయక అతిథిగృహంలో వివిధ నిర్మాణాలు, వివిధ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఖాళీ అయిన దేవస్థానం వైద్యాధికారి స్థానంలో గతంలో పనిచేసిన పాండురంగారావును సంప్రదించి ఆయన సేవలు వినియోగించుకోవాలని ఆదేశించారు. అలాగే ప్రసాద్ స్కీమ్లో చేపట్టిన నిర్మాణాలను వేగవంతం చేయాలని, వచ్చే పుష్కరాల నాటికి సీతారామ సత్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని, భూగర్భ విద్యుత్ కేబుల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే సత్రం గదుల ఆన్లైన్ రిజర్వేషన్లలో సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని సిస్టమ్స్ అడ్మిన్ను ఆదేశించారు. దేవస్థానం బస్సులన్నింటికీ కాషాయం రంగు వేయాలని సూచించారు. కాగా దేవస్థానం కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని పెట్టాలని ఎస్ఎఫ్ఐ నాయకులు కోరగా త్వరలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమీక్ష సమావేశంలో దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తదితరులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. బీజేపీ నేతల అడ్డగింపు రౌతులపూడి: సబ్ప్లాన్ ఏజెన్సీ ప్రాంతం జల్దాంలో ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొజ్జిరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన గిరిజన ఫిర్యాదుల పరిష్కార వేదికకు వెళ్తున్న జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఏలూరు జిల్లా పరిశీలకుడు చిలుకూరి రామ్కుమార్ను పోలీసులు అడ్డుకుని నిర్బంధించారు. తన చొరవతో చేపట్టిన ఈ కార్యక్రమానికి వెళ్లకుండా తనను ఆపడం సరికాదని ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం ఆ పార్టీ నేతలు పోలీసు స్టేషన్కు వెళ్లి కూటమిలో భాగమైన తమను అడ్డుకోవడం టీడీపీ నేతలకు తగదని కొంత సేపు రోడ్డుపై బైఠాయించారు. గిరిజనేతరులు, రాజకీయ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరుకావటం వల్ల శాంతిభద్రతలకు భంగం వాటిల్లుతుందనే నెపంతో ఆయనను అడ్డుకున్నట్లు పోలీసులు వివరించారు. కాగా జల్దాంలో కార్యక్రమం ముగించుకుని తిరుగు పయాణమైన బొజ్జిరెడ్డి పోలీసు స్టేషన్ వద్ద ఆగి బీజేపీ నాయకుల నిర్బంధానికి కారణాలపై విచారణ జరిపి వారం రోజుల్లో చట్టపరమైన చర్యలు చేపడతానని వారికి హామీ ఇచ్చారు. ఈ ఘటనపై బీజేపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ముద్రగడకు ప్రముఖుల నివాళి
ముద్రగడ గిరిబాబు, బాలును పరామర్శిస్తున్న ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ముద్రగడ సతీమణి పద్మావతిని పరామర్శిస్తున్న వంగవీటి ఆశాకిరణ్కిర్లంపూడి: మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం మరణం తీరని లోటని పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక ఆయన నివాసానికి మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు, వంగవీటి మోహన్రంగ కుమార్తె ఆశాకిరణ్, తణుకు ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పొన్నాడ సతీష్, పితాని, బాలకృష్ణ, తన్నీరు నాగేశ్వరరావు కిర్లంపూడి దళిత పేట నుంచి మహిళలు, దళిత నాయకులు, జిల్లా నలుమూలల నుంచి ఆయన అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి ముద్రగడ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆయన కుమారులు వైఎస్సార్ సీపీ ప్రత్తిపాడు కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబును, పెద్ద కుమారుడు వీరరాఘవరావు (బాలు)ను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. -
సీసీ రోడ్లను సరిచేశారు
పిఠాపురం రూరల్: మండలంలోని నరశింగపురం జగనన్న కాలనీలో పంచాయతీరాజ్ అండ్ ఇంజినీరింగ్ ఽశాఖ ఆధ్వర్యంలో రూ.11.10 లక్షల ఉపాధి నిధులతో నిర్మించిన సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టిన కొద్దిరోజులకే ముక్కలైంది. ఎఫ్కే పాలెం గ్రామ శివారున రూ.10 లక్షలతో నిర్మించిన నూతన సీసీ రోడ్డు బీటలు వారింది. ఈ విషయాలపై ఆయా గ్రామాల ప్రజలు ఇచ్చిన సమాచారం మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించి రోడ్లపై నాణ్యతపై ‘లక్షలతో రోడ్లు.. లక్ష్యానికి బీటలు’ శీర్షికతో ఈ నెల 7న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి సంబంధిత శాఖ అధికారులు స్పందించారు. ఆయా రోడ్లలో లోపాలను గుర్తించి అవసరమైన చోట పునర్నిర్మాణం చేపట్టారు. -
ఎగసిన అలలే.. యమపాశాలై..
అల్లవరం/అంబాజీపేట: ఇటీవల జరిగిన వివాహ వేడుకలో వారందరూ ఎంతో ఆనందంగా గడిపారు. తమతమ ఇళ్లకు వెళ్లే ముందు సరదాగా ఎంజాయ్ చేద్దామని బీచ్కు వెళ్లారు. అక్కడ మృత్యుపాశాల్లా ఎగసిపడిన కడలి అలలు ఇద్దరి ప్రాణాలను బలి తీసుకున్నాయి. అపార జలరాశిలో మరొకరి ఆచూకీ గల్లంతైంది. ఓడలరేవు బీచ్లో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. అప్పటి వరకూ ఆనందంగా గడిపి.. కాట్రేనికోన మండలం చెయ్యేరుకు చెందిన సూదా అరవింద్ (23) సోదరి సత్యకు, మామిడికుదురు మండలానికి చెందిన దొడ్డా ఫణికృష్ణకు ఇటీవల వివాహం జరిగింది. వీరు అంబాజీపేట మండలం మాచవరం గ్రామంలోని బంధువుల ఇంటికి వచ్చారు. ఈ నేపథ్యంలో మంచాల షణ్ముఖ్ (17), కొర్లపాటివారిపాలేనికి చెందిన మంచాల సాయి(22)తో పాటు మంచాల జ్ఞానేశ్వర్, మంచాల ప్రేమ్చంద్, మంచాల హర్షిత, మంచాల ప్రేమ్సాయి సరదాగా గడపాలని ఓడలరేవు బీచ్కు ఆదివారం మధ్యాహ్నం వచ్చారు. ఒకే బంధువర్గానికి చెందిన వీరందరూ తొలుత అమలాపురంలోని ఓ రెస్టారెంట్లో భోజనం ముగించుకుని మోటార్ సైకిళ్లపై బీచ్కు చేరుకున్నారు. ఓఎన్జీసీ టెర్మినల్ పశ్చిమ గేటుకు సమీపాన ఉన్న ఓఎన్జీసీ వెల్స్ వద్ద రెండు గ్రోయిన్ల మధ్య అరవింద్, షణ్ముఖ్, సాయి, జ్ఞానేశ్వర్, ప్రేమ్చంద్ కలసి ఉత్సాహంగా సముద్ర స్నానానికి దిగారు. సత్య, ఫణికృష్ణ, హర్షిత, ప్రేమ్సాయి ఒడ్డున ఉన్నారు. గ్రోయిన్లతో గోతులు పడి.. ఉవ్వెత్తున ఎగసి పడుతున్న కెరటాలు గ్రోయిన్లకు బలంగా తాకుతూండటంతో ఆ గ్రోయిన్ల వద్ద అప్పటికే భారీ గోతులు ఏర్పడ్డాయి. స్నానానికి దిగిన ఐదుగురు యువకులకు ఆ విషయం తెలియలేదు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఎగసిపడిన బలమైన అలల ధాటికి ఆ ఐదుగురూ సముద్రంలోకి కొట్టుకుపోయారు. కెరటాల తాకిడికి అరవింద్, షణ్ముఖ్ అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మంచాల సాయి ఆచూకీ గల్లంతైంది. జ్ఞానేశ్వర్, ప్రేమ్చంద్ ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డారు. బీచ్ నుంచి వచ్చిన తర్వాత ఆదివారం సాయంత్రం తమ ఇళ్లకు వెళ్లాలనుకున్నామని, ఇంతలోనే ఈ విషాదం చోటు చేసుకుందని బాధితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చేతికి అందివచ్చిన చెట్టంత కొడుకులు సముద్రంలో మృత్యువాత పడటంతో ఆయా కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇదిలా ఉండగా, సాయి ఆచూకీ కోసం గజ ఈతగాళ్ల సాయంతో గాలిస్తున్నట్లు మైరెన్ సీఐ మూర్తి, అల్లవరం ఎస్సై సంతోష్ కుమార్ తెలిపారు. అరవింద్, షణ్ముఖ్ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఉన్నత స్థానానికి వెళతాడనుకుంటే.. ఈ సంఘటనలో మృతుడు సూదా అరవింద్ కొత్తపేట మండలం బిళ్లకుర్రు పోస్టాఫీసులో బీపీఎంగా పని చేస్తున్నాడు. అంబాజీపేట మండలం మాచవరంలోని తన మేనమామ మంచాల వెంకటేశ్వరరావు ఇంటి నుంచి ప్రతి రోజూ ఉద్యోగానికి వెళ్లి వస్తూండేవాడు. ఊహించని విధంగా అరవింద్ కడలి కెరటాలకు బలి కావడంతో అతడి సోదరి దొడ్డా సత్య కన్నీరుమున్నీయ్యారు. తన తండ్రికి కొడుకు అందివచ్చాడనే ఆనందం మిగలకుండానే తమ్ముడు అనంత లోకాలకు వెళ్లిపోయాడంటూ ఆమె రోదిస్తున్న తీరు చూపరులను కలచివేసింది. ఆ కుటుంబానికి ఇక దిక్కెవరంటూ బంధువులు విలపించారు.ఫ ఇద్దరు యువకులను కబళించిన కడలి ఫ కానరాని మరొకరి ఆచూకీ ఫ ఓడలరేవు బీచ్లో విషాదం ఫ క్షేమంగా బయటపడిన మరో ఇద్దరు ఉద్యోగంలో చేరుతాడనుకుంటే.. కొర్లపాటివారిపాలేనికి చెందిన మంచాల శేషు పెద్ద కుమారుడు సాయి బీటెక్ పాసయ్యాడు. ఇటీవలే హైదరాబాద్లో ఓల్టాస్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. రెండు మూడు రోజుల్లో ఉద్యోగంలో చేరాల్సి ఉంది. ఇంతలోనే తమ కుమారుడిని కడలి ఎక్కడికో తీసుకుపోయిందని సాయి తల్లిదండ్రులు వంశీ, శేషు రోదించారు. సత్యసాయిబాబా తన కుటుంబానికి అన్యాయం చేయడని, తన బిడ్డ క్షేమంగా తిరిగి వస్తాడని తల్లి వంశీ కన్నీటిపర్యంతమయ్యారు. సాయితో పాటు సముద్ర స్నానానికి దిగిన అతడి సోదరుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కోల్కతా నిట్లో చేరాల్సి ఉంది మాచవరానికి చెందిన షణ్ముఖ్ (శ్రీరామ్) తండ్రి నాగబాబు హైదరాబాద్లో బీఎస్ఎన్ఎల్లో, తల్లి ఆర్బీఐలో ఏజీఎంగా విధులు నిర్వహిస్తున్నారు. ఇంటర్ పాసై కోల్కతా నిట్లో సీటు సాధించిన షణ్ముఖ్ త్వరలో ఆ సంస్థలో చేరాల్సి ఉంది. ఇంతలోనే వారి ఒక్కగానొక్క కొడుకు ఈ సంఘటనలో మృతి చెందాడనే వార్తను అతడి తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. -
అడుగు జారింది.. ఊపిరి ఆగింది!
● ప్రాణం తీసిన చేపల వేట ● గోదావరిలోకి జారి ఐదుగురి మృతి ● ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలు ● గొమ్ముకొత్తగూడెంలో తీవ్ర విషాదం ఎటపాక: చేపల వేట ఐదుగురిని బలిగొంది. ఎటపాక మండలం గొమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందిన తొమ్మిది మంది మహిళలు, ఇద్దరు పురుషులు వలలు పట్టుకుని శనివారం ఉదయాన్నే గొల్లగూడెం సమీపంలోని గోదావరి నది వద్దకు చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో చేపలు పడతాయని నీటి ప్రవాహానికి అడ్డంగా వలలు పట్టుకుని నిల్చున్నారు. ఇంతలో వల పట్టుకుని నీటిలో శివారున ఉన్న ఊకే రమేష్ (37) కాలు జారింది. అతను నీటి లోతులోకి జారిపోయాడు. రమేష్ నీటిలో మునిగిపోతుండగా, ఈత వచ్చిన బాసిబోయిన బాలరాజు (40) అతన్ని కాపాడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బాలరాజును రమేష్ గట్టిగా పట్టుకోవటంతో వారిద్దరూ ఒక్కసారిగా మునిగిపోయారు. వారిని కాపాడేందుకు అక్కడే వల పట్టుకుని ఉన్న ఊకే లక్ష్మి (37), ఊకే సుశీల (37), తుర్రం భారతి (40) వారి వద్ద ఉన్న చున్నీలు, వలలు విసిరి కాపాడే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఆ మహిళలూ అదుపుతప్పి మునిగిపోతుండగా, అది గమనించిన మరో గ్రూప్లోని మహిళలు కాపాడే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆ ముగ్గురితో పాటు రమేష్, బాలరాజు నీటిలో మునిగి కొట్టుకుపోయారు. దీనిని గమనించిన అక్కడి మహిళలు కేకలు వేయడంతో సమీపంలో నివాసం ఉంటున్న మత్స్యకారులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికే వారు నీటిలో మునిగి గల్లంతయ్యారు. చివరికి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ కృష్ణ, ఎస్సై అప్పలరాజు అక్కడికి చేరుకుని గజ ఈతగాళ్లు, పడవల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు కొంత దూరంలో మునిగిపోయిన ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషుల మృతదేహాలు లభ్యమయ్యాయి. అదే కారణమా.. శనివారం తెల్లవారుజాము నుంచి భారీగా వర్షం కురిసింది. వాగులు, వంకలు వరద నీటితో పారుతుంటే చేపలు ఎదురీదుతూ ఉంటాయని, ఆ సమయంలో చేపలు పడతాయని గిరిజనులు అంటుంటారు. ఈ క్రమంలో గోదావరిలో వేటకు వచ్చిన గొమ్ముకొత్తగూడెం వాసులు అనుకోని పరిస్థితుల్లో ప్రమాదంలో చిక్కుకున్నారు. వరద నీటి ఉధృతి ఉండడం, గోదావరిలో నీటి లోతు అంచనాకు దొరకకపోవడంతో రమేష్ కాలు జారిందని భావిస్తున్నారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు జారి గల్లంతయ్యారు. ఈ ఘటన గొమ్ముకొత్తగూడెం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాద సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు, బంధువులు అక్కడికి చేరుకోవడంతో ఆ ప్రాంతం రోదనలతో మార్మోగింది. ఒకే గ్రామానికి చెందిన బంధువులు విగత జీవులుగా పడి ఉండడం చూసి వారు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితులకు అండగా ఉంటాం చింతూరు: ఎటపాక మండలంలో గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురు మృత్యువాత పడిన సంఘటన చాలా బాధాకరమని, మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. మృతి చెందిన ప్రతి కుటుంబానికి తక్షణ సాయంగా రూ.25 వేలు అందజేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. గొమ్ముకొత్తగూడెంకు చెందిన గిరిజనులు చేపల వేటకు వెళ్లి గల్లంతైన విషయం తెలిసిన వెంటనే జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక సిబ్బందిని సంఘటనా స్థలానికి పంపి సహాయక చర్యలు చేపట్టామన్నారు. మృతులు ఊకే రమేష్, బాసిబోయిన బాలరాజు, ఊకే లక్ష్మి, ఊకే సుశీల కొంపముంచిన వేట వర్షాకాలం వచ్చిందంటే చేపల వేటంటే ఆదివాసీలకు ఎంతో ఇష్టం. పిల్లాపెద్దా అంతా మూకుమ్మడిగా వలలు చేతబట్టి చెరువులు, కాలువలు, నదుల్లో చేపలు పడుతుంటారు. పట్టిన చేపలను అంతా సమ భాగాలుగా చేసుకుని ఇంటికి చేరుకోవడం వారి ఆచారం. పట్టిన చేపలతో కుటుంబ సభ్యులంతా కలసి భోజనం చేసి ఆనందంగా గడుపుతుంటారు. మిగిలిన చేపలను ఎండబెట్టి తర్వాత వాడుకుంటారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. -
వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య
తొండంగి: ప్రేమించాలని వెంటపడిన యువకుడు, అతని స్నేహితుల వేధింపులతో మనస్తామానికి గురై యువతి ఆత్మహత్యకు పాల్పడింది. మండలం వేమవరం పంచాయతీ వాడపంపాదిపేటలో మృతురాలి తల్లి పోలీసులకు శనివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మత్స్యకార కుటుంబానికి చెందిన పల్లేటి బాబూరావు, సుజాత దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె రజని డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంది. అదే గ్రామానికి చెందిన గోసల రాజేంద్ర నాలుగేళ్ల క్రితం రజనితో చనువుగా ఉండేవాడు. ఈ నేపథ్యంలో ఆమె తల్లిదండ్రులు ఉప్పాడ కొత్తపల్లికి చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయించారు. దీంతో రజని అతనితో దూరంగా ఉండేది. ఇది భరించలేక ఈనెల 16న రాజేంద్ర పురుగు మందు తాగాడని దుష్ప్రచారం చేశారు. దీంతో యువతి తల్లి రాజేంద్ర, అతని స్నేహితుడు ఇళ్ల ప్రసాద్లకు ఫోన్ చేసి వివాహం నిశ్చయమైన తర్వాత ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నించింది. రాజేంద్రకు ఏమైనా జరిగితే మీ ఇంటికి వచ్చి గొడవ చేస్తామని, అలా కాకుండా ఉండాలంటే రజనీతో రాజేంద్రకు పెళ్లి చేయాలని బెదిరించారు. యువతి అమ్మమ్మ ఇంటికి రాజేంద్ర వెళ్లి గొడవ చేయడంతో శుక్రవారం రజని ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె తల్లి సుజాత ఫిర్యాదు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
క్షమాపణ పేరుతో పిలిచి చంపేశాడు
● గొల్లప్రోలు హత్య కేసును ఛేదించిన పోలీసులు ● నిందితుడితో పాటు నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ● మిగిలిన వారి కోసం గాలింపు గొల్లప్రోలు (పిఠాపురం రూరల్): గొల్లప్రోలు పట్టణ పరిధిలో ఈ నెల 14న జరిగిన లింగం అర్జునుడు హత్య కేసును పోలీసులు చేధించారు. సీఐ జి.శ్రీనివాస్ శనివారం మీడియాకు కేసు వివరాలు వెల్లడించారు. గొల్లప్రోలు ఎస్సీ కాలనీకి చెందిన లింగం అర్జునుడి హత్యకు గురైన నేపథ్యంలో అతని భార్య సంధ్య ఫిర్యాదుపై గొల్లప్రోలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దర్యాప్తులో వెల్లడైన వివరాల మేరకు అర్జునుడు నిందితుడైన బచ్చల మారుతి పవన్ అలియాస్ కళ్యాణ్ మరికొందరు స్నేహితులతో కలిసి ఈ నెల 14న దారపల్లి వాటర్ఫాల్స్కు వెళ్లారు. అక్కడి మద్యం కొనుగోలు విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. గొల్లప్రోలు ఎంపీడీవో కార్యాలయం సమీపంలో వైన్ షాప్ వద్ద మరొకసారి వారి మధ్య గొడవ జరిగింది. కళ్యాణ్ తల్లిని అర్జునుడు దూషించడం, ఆర్థికంగా స్థిరపడినవాడు కావడం వంటి కారణాలతో అతడిపై మరింత ద్వేషం పెంచుకున్నాడని సీఐ తెలిపారు. కల్యాణ్ కొందరు స్నేహితులతో కలిసి రాత్రి 8:15 సమయంలో అర్జునుడికి క్షమాపణ చెప్పే పేరుతో ఇంటికి వెళ్లి ముందస్తు పథకం ప్రకారం వెంట తెచ్చుకున్న చాకుతో పొట్టలో బలంగా పొడిచాడని, పిఠాపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా అర్జున్ చనిపోయినట్టు తెలిపారు. ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టి ప్రధాన ముద్దాయి బచ్చల మారుతి పవన్ అలియాస్ కల్యాణ్తో పాటు కారి కుమార్ రాజా, బోడపాటి నానిబాబు, చెల్లి ఆనంద్కుమార్లను అదులోకి తీసుకున్నామని, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు. -
చంద్రబాబువి కుటిల రాజకీయాలు
● సామాన్యులకు రక్షణ కరవు ● అధికారం కోసం ఎంతకై నా తెగిస్తారు ● రాజకీయాల్లో విలువల్లేకుండా చేశారు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): చంద్రబాబువి కుటిల రాజకీయాలని, అధికారం కోసం ఆయన ఎంతకై నా తెగిస్తారని, కుటుంబాలను సైతం రోడ్డు పాలు చేస్తారని వైఎస్సార్ సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ విమర్శించారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనుచరుల దాడిలో తీవ్రంగా గాయపడి జీజీహెచ్లో చికిత్స పొందుతున్న వైఎస్సార్ సీపీ ఎస్సీ కార్యకర్త నందిక సత్యనారాయణను మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డితో కలసి వేణు శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో సామాన్యులకు రక్షణ కరవైందని అన్నారు. రాజకీయాల్లో విలువలు లేకుండా చేసిన ఘనత చంద్రబాబుదేనని, అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే కుమారుడిని అదే నియోజకవర్గానికి టీడీపీ ఇన్చార్జిగా నియమించారని, ఇదెంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. సామాన్యులకు ఆపద వచ్చినప్పుడు వ్యవస్థ అండగా ఉండాలని, అటువంటిది ఎమ్మెల్యే అనుచరుల దాడిలో గాయపడిన బాధితులను అనపర్తి ఆసుపత్రి నుంచి కాకినాడ జీజీహెచ్కు రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో తరలించడం దారుణమని వేణు అన్నారు. పైగా అక్కడ ఎటువంటి వైద్యం అందించకుండా, పోలీసులు వచ్చి శుక్రవారం రాత్రి 9 గంటలకు సత్యనారాయణను బలవంతంగా డిశ్చార్జి చేయడం చూస్తూంటే రాష్ట్రంలో వ్యవస్థ ఏ విధంగా ఉందో అర్థమవుతోందన్నారు. శనివారం ఉదయం తిరిగి అస్వస్థతకు గురవడంతో సత్యనారాయణ తిరిగి కాకినాడ జీజీహెచ్లో చేరారని, బాధితుడికి సరైన వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. మాట్లాడితే బీసీ నినాదం తీసుకువస్తున్న రామకృష్ణారెడ్డి.. తానే ఆ శాఖకు రాష్ట్ర మంత్రిగా పని చేసిన విషయం మరచిపోయారా అని వేణు ప్రశ్నించారు. ఎమ్మెల్యే, ఆయన కుమారుడు అవినీతికి పాల్పడుతున్నా మాట్లాడకూడదనడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఈ ప్రభుత్వం అధికారులను పావుల్లా వాడుకుంటోందన్నారు. అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారయణరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కుమారుడి దౌర్జన్యాలు ఎక్కువగా ఉన్నాయని, ఇతరులు ఆస్తులపై దాడులు చేయడం దారుణమని మండిపడ్డారు. ఎమ్మెల్యే, ఆయన కుమారుడు తమ అనుచరులతో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడ్డారని, పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని, వైద్యం కూడా అందకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలకు, పార్టీ, తాను అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. -
గౌరవానికి గొళ్లాలు!
పిఠాపురం: జనగణన ప్రారంభించి నెలన్నర దాటుతున్నా సంబంధిత సిబ్బందికి వేతనాలు అందక నానా యాతన పడుతున్నారు. మే ఒకటో తేదీన జన, గృహ గణన ప్రారంభించి 30వ తేదీ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఇతర శాఖల సిబ్బంది ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లుగా పని చేశారు. వారందరికీ ప్రభుత్వ గౌరవ వేతనం చెల్లించాలి. నేటికీ వారికి నయా పైసా ఇవ్వలేదు. దీంతో సదరు సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెల్లించాల్సింది రూ.3 కోట్ల పైనే.. గృహగణన విధులు నిర్వర్తించిన ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు ఒకొక్కరికీ రూ.9 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లించాలి. అలాగే శిక్షణకు హాజరైనందుకు రూ.1,200 ఇవ్వాలి. ఇలా ఒక్కొక్కరికి మొత్తం రూ.10,200 చెల్లించాల్సి ఉంది. ఈ మేరకు జిల్లాలో 3100కు పైగా ఉన్న సిబ్బందికి రూ.3.10 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తాలకు సంబంధించిన నిధులను కలెక్టర్ల బ్యాంకు ఖాతాలకు జమ చేసినట్టు ప్రభుత్వం మే 12న ఉత్తర్వులు జారీ చేసినట్టు చెప్తున్నారు. జనగణనలో భాగంగా చేపట్టిన గృహ గణన పూర్తయితే వెంటనే ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు గౌరవ వేతనం చెల్లించాలనే ఆదేశాలను అధికారులు పక్కన పెట్టినట్లు సిబ్బంది చెప్తున్నారు. ఈ ప్రక్రియ ముగిసి నెలన్నర దాటినా వారికి ఏ చెల్లింపులూ జరగలేదు. దీనికి గృహగణనలో నమోదైన ఖాళీ ఇళ్లు, తాళం వేసిన ఇళ్లకు సంబంధించి ఎందుచేత ఖాళీగా ఉన్నాయి అనే వివరాలను యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఆదేశాలు రానందున గౌరవ వేతనం చెల్లించలేదని కొందరు అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో పని చేసిన తమకు రావాల్సిన గౌరవ వేతనం వెంటనే విడుదల చేయాలని సిబ్బంది కోరుతున్నారు. జనగణన నిర్వహిస్తున్న సిబ్బంది జనగణన చేసిన సిబ్బందికి అందని వేతనాలు నెలన్నర దాటినా పైసా విదల్చని అధికారులు ఖాళీ ఇళ్లు.. తాళాలున్న ఇళ్ల వివరాలు అప్లోడ్ చేశాకే అని మెలిక జిల్లాలో మొత్తంగా రూ.3.10 కోట్ల బకాయి -
వెంటనే విడుదల చేయాలి
జిల్లా పరిధిలో ఇటీవల నిర్వహించిన సెన్సెస్లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, సూపర్వైజర్లు, ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బంది తమ సాధారణ విధులతో పాటు అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తూ సెన్సెస్ పనులను విజయవంతంగా పూర్తి చేశారు. అయినప్పటికీ, ప్రభుత్వం మంజూరు చేసిన గౌరవ వేతనాలు ఇప్పటి వరకు ఉద్యోగుల ఖాతాల్లో జమ కాకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. – దారపురెడ్డి తాతాజీ, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కో ఆర్డినేటర్, ఏపీ గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం జాప్యం నివారించాలి ప్రభుత్వం నిర్దేశించిన విధంగా అవసరమైన ప్రక్రియ వేగవంతం చేసి, సెన్సెస్ విధుల్లో పాల్గొన్న ప్రతి ఉద్యోగికి వెంటనే గౌరవ వేతనం విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ–వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం, కాకినాడ జిల్లా శాఖ ప్రభుత్వాన్ని, సంబంధిత ఉన్నతాధికారులను విజ్ఞప్తి చేసింది. ఆ చెల్లింపుల్లో జాప్యాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. – షేక్ మహబూబ్ బాషా, కాకినాడ జిల్లా ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం ఎంతమాత్రం సమంజసం కాదు ప్రభుత్వం నిధులను విడుదల చేసినప్పటికీ, సాంకేతిక లేదా పరిపాలనా కారణాలను చూపుతూ ఉద్యోగులకు గౌరవ వేతనాలు అందించకపోవడం సమంజసం కాదు. ఇప్పటికే అధిక పనిభారం, ఆర్థిక ఇబ్బందులతో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఈ జాప్యం మరింత భారంగా మారుతోంది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వేతనాలను వెంటనే విడుదల చేయాలి. – బి.జాన్ క్రిస్టోఫర్, జనరల్ సెక్రటరీ, ఏపీ గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం, కాకినాడ జిల్లా -
జాతి కోసం ఉద్యమించిన మహోన్నతుడు ముద్రగడ
● ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ● సంతాప సభలో కాపు జేఏసీ నివాళులు కాకినాడ రూరల్: జాతి కోసం ఉద్యమం సాగించిన మహోన్నతుడు ముద్రగడ పద్మనాభం మృతి తీరని లోటని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. కాకినాడ శుభం కాపు కల్యాణ మండపంలో శనివారం ఆంధ్ర కాపు సద్భావన సంఘం, కాపు జేఏసీల సంయుక్త ఆధ్వర్యంలో వాసురెడ్డి ఏసుదాసు అధ్యక్షతన ముద్రగడ సంతాప సభ నిర్వహించారు. తొలుత కాపు నేతలు, వివిధ పార్టీల నాయకులు, అభిమానులు ముద్రగడ ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ 1978లో ఎమ్మెల్యేలు అయిన వారంతా రాజకీయంగా ఉన్నత పదవులతో పాటు ఆర్థికంగా స్థిరపడినప్పటికీ ముద్రగడ వారందరి కంటే గొప్ప కీర్తిని సంపాదించుకున్నారన్నారు. జాతి కోసం జీవితాన్ని అర్పించిన ముద్రగడకు రాష్ట్ర స్థాయిలో విజయవాడలో సంతాప సభ పెట్టాలని ప్రతిపాదించారు. మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ ముద్రగడ ఆప్యాయత, గౌరవానికి పెట్టింది పేరన్నారు. ఆయన చేసిన త్యాగాలు నేటి తరం మరువకూడదని కౌడా మాజీ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తికుమార్ పేర్కొన్నారు. కాపు సద్భావన సంఘ, కాపు జేఏసీ నేతలు వాసిరెడ్డి ఏసుదాసు, ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణుమూర్తి, కల్వకొలను తాతాజీ మాట్లాడుతూ ముద్రగడ ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. సంతాప సభలో ఆరేటి ప్రకాష్, పేపకాయల రామకృష్ణ, తోట రాజీవ్, నల్లా పవన్, దుగ్గన బాబ్జీ, చిట్నీడి శ్రీనివాస్, బసవ ప్రబాకరరావు, బుర్రా అనుబాబు, రాగిరెడ్డి కన్నా, బన్నీ, తుమ్మలపల్లి రమేష్ పాల్గొన్నారు. -
స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా సామర్లకోట
సామర్లకోట: ఇప్పటి వరకు సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న సామర్లకోటను స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినట్లు మున్సిపల్ కమిషనర్ నామా కనకరావు శుక్రవారం తెలిపారు. 2026 జూన్ 23న అప్పటి కౌన్సిల్ తీర్మానం ప్రకారం మున్సిపాలిటీని అప్గ్రేడ్ చేశారన్నారు. ఈ మేరకు 2023–24 నుంచి 2025–26 ఆదాయ, వ్యయాలను పరిశీలించి మున్సిపాలిటీని స్పెషల్ గ్రేడ్గా గుర్తించారని తెలిపారు. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా గుర్తించడంతో ఉద్యోగుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. -
వరుణుడి కటాక్షం కోసం..
పిఠాపురం: వరుణుడి కరుణ కోసం పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పిఠాపురం పాదగయ క్షేత్రంలో కుక్కుటేశ్వర స్వామివారి దివ్య సన్నిధిలో ద్విభాష్యం సుబ్రహ్మణ్యం శర్మ నేతృత్వంలో ఆస్థాన పురోహిత, పండిత, అర్చక బృందాలతో స్వామివారికి ఘట్టాభిషేకం, వరుణ జపాలు, మహా రుద్రాభిషేకం నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని కోరుతూ ఈ పూజలు నిర్వహించినట్లు ఆలయ ఈఓ కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, సూపరింటెండెంట్ బొల్లం వీరభద్రరావు, రెడ్నం ప్రసాద్, పెంటపాటి సత్తిరాజు, కొప్పిశెట్టి దత్తత్రేయ తదితరులు పాల్గొన్నారు. అలాగే పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానంలో లోకక్షేమం –సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని సంకల్పంతో శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి సన్నిధిలో మహారుద్రాభిషేకం, అష్టోత్తర శత కలశాభిషేకం, దత్త హోమం నిర్వహించారు. ఆలయ ఈఓ ఆర్.సౌజన్య ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. -
మన వాయిస్ను.. మన యాప్లో వినిపిద్దాం
తుని: ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, సోషల్ మీడియా అక్కౌంట్లను మిటా సంస్థకు ఫిర్యాదు చేసి బ్లాక్ చేయడం అధికార పార్టీకి అలవాటుగా మారిందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా దుయ్యబట్టారు. శుక్రవారం తుని మండలం ఎస్.అన్నవరం క్యాంప్ కార్యాలయంలో జగన్ 2.0 యాప్ పోస్టర్ను పార్టీ నాయకులతో కలసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరఫున పోరాటం చేయాల్సిన బాధ్యత వైఎస్సార్ సీపీ శ్రేణులపై ఉందన్నారు. తమ అభిప్రాయాలను యాప్ ద్వారా ప్రజలకు చేరువ చేయవచ్చన్నారు. రాష్ట్రంలో 80 శాతం సామాజిక మాధ్యమాలు ఓ పార్టీ చేతుల్లో ఉన్నాయని, ప్రశ్నిస్తున్న గొంతులను నొక్కి అకౌంట్లు బ్లాక్ చేస్తుందని ప్రభుత్వంపై మండిపడ్డారు. అమరావతిలో రూ.10 వేల కోట్ల పనులకు రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని, ఇదేంటని ప్రశ్నించిన వ్యక్తులపై కేసులు పెడుతున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో విశాఖపట్నం రుషికొండలో హరిత రిసార్ట్స్ తొలగించి భవనాలు నిర్మిస్తే పచ్చ మీడియా, టీడీపీ నాయకులు నానాయాగి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఎన్నో కొండలకు గుండుకొట్టిందని విమర్శించారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో కోవిడ్ మహమ్మారి మళ్లీ వచ్చిందని, ప్రజారోగ్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. ముద్రగడ మృతిని రాజకీయం చేయవద్దు కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతిని రాజకీయం చేయవద్దని దాడిశెట్టి రాజా హితవుపలికారు. ముద్రగడ అంత్యక్రియలు ఆయన ఇష్టం మేరకు నిర్వహించామని ముద్రగడ కుమారులు లేఖ రాశారని, ప్రభుత్వ లాంఛనాలు వద్దని పేర్కొన్న విషయాన్ని స్పష్టం చేసినా బురద చల్లడం మానుకోలేదన్నారు. కులం కోసం మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మహోన్నత నాయకుడు ముద్రగడ అని, అలాంటి వ్యక్తి భౌతికంగా లేకపోయినా ఓ వర్గం మీడియా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో పేదల ఇళ్ల స్థలాల కోసం దీక్ష చేసిన వంగవీటి మోహనరంగాను హత్య చేశారని, ఈ సంఘటనలో తుని మండలం ఎస్.అన్నవరానికి చెందిన 100 మంది కాపులు కోర్టుల చుట్టూ తిరిగారన్నారు. ఈ విషయాలను యువత తెలుసుకోవాలని సూచించారు. జెడ్పీ వైస్ చైర్మన్ మేరుగు పద్మలత, పెరికి కార్పొరేషన్ మాజీ చైర్మన్ పురుషోత్తం గంగాభవానీ, ఎంపీపీ లగుడు శ్రీనివాస్, అనుబంధ విభాగాల నాయకులు రేలంగి రమణాగౌడ్, బోడపాటి సతీష్, రాయిమేరీ అవినాష్, తుని, తొండంగి, కోటనందూరు మండలాలు, తుని పట్టణ పార్టీ కన్వీనర్లు దుంగల నాగేశ్వరరావు, చొక్కా హరిబాబు, చింతకాయల చినబాబు, అన్నవరం శ్రీను, తుని నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు అంగుళూరి సుశీల, పట్టణ అధ్యక్షురాలు చింతల సునీత తదితరులు పాల్గొన్నారు. ఫ అవినీతిని ప్రశ్నిస్తే కేసులు పెడతారా! ఫ మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఫ జగన్ 2.0 యాప్ పోస్టర్ ఆవిష్కరణ -
పసికందు మృతి
వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆందోళన అన్నవరం: స్థానిక ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంగా కారణంగా తమ మూడు నెలల పసికందు మృతి చెందాడని ఆరోపిస్తూ తల్లిదండ్రులు, గ్రామస్తులు శుక్రవారం రాత్రి ఆందోళన చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. శంఖవరం మండలం కొంతంగి గ్రామానికి చెందిన సతీష్, వీరదుర్గ దంపతుల మూడు నెలల కుమారుడికి రొంప, జ్వరం రావడంతో గురువారం స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు నయమైందని చెప్పడంతో ఇంటికి తీసుకు వెళ్లిపోయారు. తిరిగి శుక్రవారం జ్వరం రావడంతో ఆసుపత్రికి తీసుకు వచ్చారు. ఇక్కడ వైద్య సిబ్బంది ఆ బాలుడికి అంతా నయమవుతుందని చెప్పి, వైద్యం చేస్తున్నట్టు నటించారని బాధిత తల్లిదండ్రులు ఆరోపించారు. ఆక్సిజన్ స్థాయి పడిపోతుందని ఒకసారి, ఇప్పుడు బాగుందని ఇంకోసారి చెబుతూ వచ్చీ రాని వైద్యం చేశారని అన్నారు. ముందే తమ కుమారుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెబితే, వేరే ఆసుపత్రికి తీసుకు వెళ్లేవారమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నేపథ్యంలో అన్నవరం పోలీసులు వచ్చి ఇరువర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పారదర్శకత తప్పనిసరి బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత తప్పనిసరిగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలో పౌరసరఫరాల శాఖ పనితీరు, నిత్యావసరాల పంపిణీ వ్యవస్థపై శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో అధికారులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. మండల స్థాయి నిత్యావసర సరకుల నిల్వ కేంద్రాల వద్ద సరకుల భద్రత, స్టాక్ రిజిస్టర్ల నిర్వహణ పక్కాగా ఉండాలని అన్నారు. పౌర సరఫరాల వ్యవస్థలో ఎక్కడైనా అవకతవకలు జరిగినట్లు తేలితే సంబంధిత బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని జేసీ హెచ్చరించారు. సమస్యలు పరిష్కరించండి బోట్క్లబ్ (కాకినాడ సిటీ): న్యాయవాదుల సమస్యలను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ (ఐఎల్ఏ) జిల్లా శాఖ డిమాండ్ చేసింది. ఐఎల్ఏ ఆధ్వర్యంలో శుక్రవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం డీఆర్వో టి.తిప్పే నాయక్కు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏలూరు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ న్యాయవాదుల రక్షణ చట్టం చేసి అమలు చేయాలని, అర్హులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఐఎల్ఏ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు టి.పృథ్వీరాజ్ మాట్లాడుతూ న్యాయవాదులకు ఆరోగ్య బీమా కార్డులను మంజూరు చేయాలని, జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.10 వేల చొప్పున ఐదేళ్ల పాటు స్టైఫండ్ ఇవ్వాలని కోరారు. తొలుత న్యాయవాదులు స్థానిక కాకినాడ బార్ అసోసియేషన్ నుంచి ర్యాలీగా బయలు దేరి కలెక్టరేట్కు చేరుకుని నినదించారు. ఐఎల్ఏ జిల్లా ఉపాధ్యక్షుడు కోలా శ్రీహరిరావు, మహిళా కన్వీనర్ డాక్టర్ వసంత, ఐఎల్ఏ జిల్లా నాయకులు జేబీ రమణ, మంగా వెంకటశివరామకృష్ణ, కాకినాడ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు ఎం.సరోజినీ, కోశాధికారి పితాని శ్రీదేవి పాల్గొన్నారు. నేడు విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక గ్రీవెన్స్ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలోని దివ్యాంగుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారానికి శనివారం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రతి నెలా 3వ శనివారం దివ్యాంగుల సమస్యల పరిష్కార కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. శనివారం కాకినాడ కలెక్టరేట్ ప్రజావాణి హాలులో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ గ్రీవెన్స్ జరుగుతుందన్నారు. పింఛన్లు, సహాయ పరికరాల మంజూరు, విద్య, ఉపాధి, ఆరోగ్య సేవలు, సంక్షేమ పథకాలు ఇతర శాఖాపరమైన విషయాలకు సంబంధించి అర్జీలను నేరుగా సమర్పించవచ్చని తెలిపారు. -
● సమసెల్ వినేది ఇలానా!
ప్రజల సమస్యలు వింటున్న కలెక్టర్ హరేంధిర ప్రసాద్పీజీఆర్ఎస్లో సెల్ ఫోన్లు చూసుకుంటున్న అధికారులుఈ చిత్రం చూశారా.. ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించడానికి వచ్చిన అధికారులు ఇలా సెల్ఫోన్లు చూస్తూ ఉండిపోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. మండల, డివిజన్ స్థాయి అధికారులు ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి పిఠాపురం పాడా కార్యాలయంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పీజీఆర్ఎస్ నిర్వహించారు. ప్రజల బాధలను ఒకపక్క కలెక్టర్ వింటుంటే, మరోపక్క అధికారులు ఇలా సెల్ఫోన్లు చూస్తుండడంతో అక్కడికి వచ్చిన అర్జీదారులు ముక్కున వేలేసుకున్నారు. – పిఠాపురం -
ఇన్చార్జులు ఇంకెన్నాళ్లు!
అన్నవరం: రాష్ట్రంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రంగా అన్నవరం పేరుగాంచింది.. నిత్యం వేలాది మంది భక్తుల రాకతో సందడిగా ఉంటోంది.. అలాంటి దేవస్థానం పరిపాలనలో కీలకమైన కార్యనిర్వహణాధికారి (ఈఓ) పోస్టును ఇన్చార్జులతోనే నెట్టుకురావడం విమర్శలకు తావిస్తోంది. ప్రస్తుతం అన్నవరం దేవస్థానం ఇన్చార్జి ఈఓగా డిఫ్యూటీ కమిషనర్ స్థాయి అధికారి, వాడపల్లి దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు కొనసాగుతున్నారు. గత ఏప్రిల్ 16న ఆయన నియమితులయ్యారు. మూడు నెలలుగా వారానికి మూడు రోజులకు తక్కువ కాకుండా అన్నవరం దేవస్థానంలోనే ఉంటూ పాలన సాగిస్తున్నారు. వీలును బట్టి సోమవారం నుంచి శుక్రవారం వరకూ అన్నవరం దేవస్థానంలో, శనివారం నుంచి సోమవారం వరకు వాడపల్లిలో ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇదిలా ఉంటే అన్నవరం దేవస్థానం ఈఓ పోస్టు కోసం తీవ్ర పోటీ ఉంది. ప్రజాప్రతినిధుల సిఫార్సులతో ఒకరిద్దరు దేవదాయశాఖ డీసీ క్యాడర్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇప్పటికిప్పుడు రెగ్యులర్ ఈఓను నియమించే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేసినట్టు సమాచారం. ఆ అవకాశం లేదు.. రెవెన్యూ శాఖకు చెందిన వారిని ప్రస్తుతం ఈఓలుగా నియమించే అవకాశం లేదని సమాచారం. గతంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను అన్నవరం దేవస్థానం ఈఓలుగా నియమించారు. ఇందులో 2002–03 సంవత్సరాల్లో ఎంవీ శేషగిరిబాబు, 2013–14లో ప్రసాదం వెంకటేశ్వర్లు, 2015–17 మధ్య కాకర్ల నాగేశ్వరరావు, 2017–18 మధ్య పనిచేసిన ఎం.జితేంద్ర దేవస్థానం అభివృద్ధికి కృషి చేశారు. 2024–25 మధ్య వీర్ల సుబ్బారావు పనిచేశారు. అనంతరం 2025 డిసెంబర్లో ఇన్చార్జి ఈఓగా దేవదాయ శాఖకు చెందిన రాజమహేంద్రవరం ఆర్జేసీగా పనిచేస్తున్న వి.త్రినాథరావును నియమించారు. ఆ తరువాత ఆయనను ద్వారకాతిరుమల ఈఓగా బదిలీ చేసి ఆయన స్థానంలో ఈ ఏడాది ఏప్రిల్లో వాడపల్లి ఈఓ పనిచేస్తున్న నల్లం సూర్యచక్రధరరావును ఇన్చార్జి ఈఓగా నియమించారు. ప్రస్తుతం సూర్యచక్రధరరావుతో సహా చాలా మంది డిప్యూటీ కమిషనర్లు ఆర్జేసీ పదోన్నతి కోసం ఎదురు చూస్తున్నారు. ఆ పదోన్నతులు పూర్తయ్యాకే అన్నవరం దేవస్థానానికి రెగ్యులర్ ఈఓను నియమిస్తారని సమాచారం. ఫ అన్నవరం దేవస్థానంలో భర్తీకాని ఈఓ పోస్టు ఫ శాశ్వత నియామకం ఎప్పటికో? -
Ð]l$–™èl-§ól-çßæ…™ø ˘ రోడ్డుపై నిరసన
పిఠాపురం రూరల్: యు.కొత్తపల్లి మండలం మూలపేటలో రెండు రోజుల క్రితం కాదా రాకేష్ (28) హత్యకు గురయ్యాడు. ఆ మృతదేహం ఉంచిన వాహనంతో మృతుడి బంధువులు, ఎమ్మార్పీస్ సంఘాల ప్రతినిధులు పిఠాపురం ప్రభుత్వాసుపత్రి మార్చురీ గేటు ఎదుట రోడ్డుపై శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. తొలుత పిఠాపురం పాడా కార్యాలయంలో కలెక్టర్ హరేంధిర ప్రసాద్ను కలసి వినతిపత్రం అందించారు. కలెక్టర్ను కలసినా తమకు సరైన హామీ లభించలేదని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మృతుడి భార్య మాట్లాడుతూ తన భర్తను కొంతమంది అన్యాయంగా చంపేశారని, దీంతో తమ కుటుంబానికి ఆసరా లేకపోయిందని కన్నీటిపర్యంతమయ్యారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. -
మన కాయర్ బంగారం
అంతర్జాతీయ డిమాండుకు తగినట్టుగా.. అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా కాయర్ పరిశ్రమను లాభాల బాట పట్టించవచ్చు. ప్రస్తుతం కేరళంలో వ్యాపారులు, పీచు ఉత్పత్తిదారులు ఇదే వ్యూహం అవలంబిస్తున్నారు. కేరళ, తమిళనాడుతో పోలిస్తే ఇక్కడ క్రాప్ విధానం చాలా తేడా. కొబ్బరి దిగుబడి, కాయ సైజు అన్నీ వేరుగా ఉన్నందున, కాయర్ ఉత్పత్తులను తగిన విధంగా తయారు చేయాల్సిన అవసరం ఉంది. నీడిల్ఫెల్ట్కు యూరప్లో మంచి డిమాండ్ ఉంది. – అజిత్ మాథ్యూ, కాయర్ స్ట్రాటజిక్ టెక్నికల్ పార్టనర్ కన్సల్టెంట్, కేరళం సాక్షి, అమలాపురం: ‘మన దేశంలో ఉత్పత్తి చేసే కాయర్ ప్రపంచంలోనే అత్యుత్తమ నాణ్యత కలిగినది. ఒకవిధంగా చెప్పాలంటే ఇది చెట్టు నుంచి వస్తున్న బంగారం. అయితే, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని మరింత నాణ్యమైన ఉత్పత్తి తయారు చేయాలి. అలాగే, డిమాండ్ ఉన్న ఉత్పత్తులపై దృష్టి సారించాలి’ అని కాయర్ నిపుణులు, శాస్త్రవేత్తలు, ఉత్పత్తిదారులు తెలిపారు. రాష్ట్రంలో నాణ్యమైన కాయర్ ఉత్పత్తి అవుతున్నప్పటికీ, సరైన బ్రాండింగ్ లేక, అంతర్జాతీయ మార్కెట్లో ఆశించిన గుర్తింపు లభించడం లేదని అన్నారు. ముమ్మిడివరం మండలం అనాతవరంలో రెండు రోజుల కాయర్ కాన్క్లేవ్–2026 గురువారం ప్రారంభమైంది. ఉద్యాన, ఎంఎస్ఎంఈ, మార్కెటింగ్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సును కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ప్రారంభించారు. తొలుత కాయర్ బోర్డు కార్యదర్శి ఎంఎస్ లక్ష్మీప్రియ వర్చువల్ విధానంలో ప్రసంగించారు. తరువాత కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, కాయర్ రంగ నిపుణులు, నాబార్డు, ఇతర ఆర్థిక సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ, కాయర్ ఉత్పత్తుల తయారీ, ఆధునిక సాంకేతికత, విలువ ఆధారిత ఉత్పత్తులు, బ్రాండింగ్, మార్కెటింగ్, ఎగుమతి అవకాశాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలపై రైతులకు, మహిళలకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించారు. మహిళల భాగస్వామ్యం అధికంగా ఉండటంతో గ్రామీణ ఉపాధి పెంపునకు కాయర్ పరిశ్రమ కీలకమని అన్నారు. ‘బ్రాండ్ కోనసీమ కాయర్‘ పేరుతో మార్కెటింగ్ చేపడితే జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మంచి అవకాశాలు లభిస్తాయని సూచించారు. ఈ సమావేశంలో ఉద్యాన శాఖ జిల్లా అధికారి బీవీ రమణ తదితరులు పాల్గొన్నారు. బ్రాండింగ్తో అంతర్జాతీయ మార్కెట్కు ఎదగాలి కాయర్ కాన్క్లేవ్లో నిపుణుల సూచన అనాతవరంలో ప్రారంభమైన రెండు రోజుల సదస్సు -
పట్టాలు తప్పిన గూడ్స్ వ్యాగన్
తుని: తుని రైల్వే స్టేషన్లో విశాఖపట్నం నుంచి నిడమనూర్ ఇనుప ఖనిజంతో వెళ్తున్న గూడ్స్ రైలుకు సంబంధించి వ్యాగన్ తుని స్టేషన్ లూప్ లైన్లో పట్టాలు తప్పింది. దీంతో విశాఖపట్నం – విజయవాడ మధ్య వెళ్లే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గురువారం రాత్రి జరిగిన సంఘటనకు సంబంధించి జీఆర్పీ ఎస్సై సత్తిబాబు, స్టేషన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం నుంచి ఇనుప ఖనిజంతో బయలు దేరిన గూడ్స్ రైలు తుని రైల్వే స్టేషన్లో లూప్ లైన్కు సిగ్నల్ ఇచ్చారు. రాత్రి 9.30 గంటలకు తాండవ బ్రిడ్జి నుంచి వస్తుండగా, 17వ నంబరు వ్యాగన్ పట్టాలు తప్పింది. దీంతో సగం వ్యాగన్లు తాండ నది బ్రిడ్జిపై ఉండిపోయాయి. ఇది గమనించిన అధికారులు విశాఖపట్నం– విజయవాడ వైపు వెళ్లే రైళ్లను అనకాపల్లి జిల్లా పరిధిలోని స్టేషన్లలో నిలిపివేశారు. తాండవ బ్రిడ్జిపై ఉండిపోయిన వ్యాగన్లను అధికారులు వేరే ఇంజిన్ సహాయంతో అనకాపల్లి జిల్లా గుల్లిపాడు రైల్వే స్టేషన్కు తరలించారు. తునిలో పట్టాలు తప్పిన వ్యాగన్ని యంత్రాల సహాయంతో తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి చాలా సమయం పడుతుందని అధికారులు చెప్పారు. ప్రయాణికులకు ఇబ్బందులు గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో తుని రైల్వే స్టేషన్లో విజయవాడ, హైదరాబాద్ వైపు, వెళ్లే ప్రయాణికులు ప్లాట్ఫామ్పై ఉండిపోయారు. విశాఖపట్నం నుంచి బయలుదేరిన గరీబ్రథ్, రాయగడ, మచిలీపట్నం, ప్రత్యేక రైళ్లను అనకాపల్లి జిల్లా పరిధిలోని రైల్వే స్టేషన్లలో నిలిపివేశారు. ప్రయాణికుల కోసం తుని రైల్వే స్టేషన్లో హెల్ప్లైన్ సెంటర్ ఏర్పాటు చేశారు. త్వరితగతిన రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. విజయవాడ – విశాఖపట్నం వైపు మాత్రం రైళ్లు యథావిధిగా నడుస్తున్నాయి. తుని రైల్వే స్టేషన్లో ఘటన -
కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది.. ఆరేళ్ల కిందట అనేక మంది ప్రాణాలను మింగేసింది.. బంధాలను తుడిచిపెట్టింది.. అయిన వాళ్ల కష్టాలు మిగిల్చింది.. తాజాగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కోవిడ్ కేసులు నమోదవడం, జిల్లాలో ఓ బాలిక మృతి చెందడం ప్రమాద ఘంటికలు మోగిస్
కోవిడ్ వార్డు ఏర్పాటు కాకినాడ జీజీహెచ్లో సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి ఆధ్వర్యంలో కోవిడ్ వైద్య సేవల ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈఎన్టీ భవనంలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశాం. ఆసుపత్రి వరకు కిట్లు, మందులు తగినంతగానే ఉన్నాయి. పల్మనాలజీ సహా ఇతర విభాగాల వైద్యులు అందుబాటులో ఉన్నారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరాకు కొరత లేదు. ప్రజల్లో కోవిడ్ నివారణ చర్యలపై అవగాహన కల్పించేందుకు ప్రచారం చేయాలని నిర్ణయించాం. కాకినాడతో పాటు తుని ఏరియా ఆసుపత్రిలోనూ ప్రత్యేక వార్డు ఏర్పాటైంది. త్వరలో జిల్లాలో ఇతర ఆరోగ్య కేంద్రాల్లో పరీక్ష కిట్లు సహా మందులు, ఆక్సిజన్ సరఫరా ఇతర అవసరాలను సమకూరుస్తాం. అత్యవసర మందుల కోసం ఇండెంట్ పెడతాం. – డాక్టర్ కోనాల అనిత, డీఎంహెచ్ఓ, కాకినాడ కాకినాడ క్రైం: కరోనా మహమ్మారి మరోసారి తన ఉనికిని చాటుతోంది. జిల్లాను తాకుతూనే ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. కోవిడ్ సోకి 16 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోవడంతో జిల్లా వాసుల్లో ఆందోళన నెలకొంది. ఇటువంటి అత్యవసర పరిస్థితిలో ప్రభుత్వ సన్నద్ధత చర్యలు కానరావడం లేదు. సరిగ్గా ఆరేళ్ల కిందట కరోనా జిల్లా వాసులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ఆ వైరస్ విజృంభించిన 18 నెలల కాలంలో ఇప్పటి కాకినాడ జిల్లా పరిధిలో ఏకంగా 9 వేల మరణాలు సంభవించాయి. ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. ఆసుపత్రులేవీ ఖాళీ ఉండేవి కావు. ప్రాణవాయువు గగనమైపోయేది. బయటకు వెళ్లాంటే భయం, ఇంట్లో ఉన్నా ప్రాణాలకు గ్యారంటీ ఉండేది కాదు. అంతటి విపత్కర స్థితే మరోసారి ఆవిష్కృతం కానుందా అనే భయం ప్రజల్లో నెలకొంది. గొల్లప్రోలులోని కరణంగారి తోట ప్రాంతంలో నివాసం ఉండే బాలిక (16)కు కోవిడ్ పాజిటివ్ వచ్చి మృతి చెందింది. ఆమెకు కొన్నాళ్ల క్రితం స్ల్పీనోక్టమీ చేసి ప్లీహాన్ని తొలగించారు. బాలిక జన్యుపరమైన సమస్యతో హిమోగ్లోబినోపతికి గురైంది. ఇందుకు ఆమె కొన్నాళ్లుగా చికిత్స పొందుతున్నా, ఏ నాడు ప్రాణాపాయం వాటిల్లలేదు. కాకినాడ, విశాఖపట్నంలో చికిత్స పొందుతోంది. మెరుగైన వైద్యం కోసం వారం కిందట తమిళనాడు రాష్ట్రం వెల్లూరు ఆసుపత్రికి బాలికను కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. ఆరోగ్యం మరింత మెరుగై వస్తుందనుకున్న తరుణంలో కోవిడ్ లక్షణాలతో ఆమె మృతి చెందింది. వైద్యులు పరీక్షించి కోవిడ్ పాజిటివ్గా తేల్చారు. దీంతో బాలిక మృతదేహాన్ని ప్రత్యేక భద్రతా చర్యల మధ్య కాకినాడ జిల్లా గొల్లప్రోలుకు పంపేశారు. గురువారం రాత్రికి బాలిక మృతదేహం స్వగ్రామానికి చేరుకుంటుందని అధికారులు తెలిపారు. అలముకున్న నిర్లక్ష్యం జిల్లాలో కోవిడ్ నివారణపై ఎటువంటి సన్నద్ధత కానరావడం లేదు. సాధారణ జ్వరం అన్నట్లు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాకినాడ జీజీహెచ్లో మాత్రమే ఏర్పాట్లు ఉన్నాయే తప్ప, జిల్లాలో మిగిలిన చోట్ల చేసిన ప్రత్యేక ఏర్పాట్లు అంటూ ఏమీ లేవు. ఆక్సిజన్ లభ్యతపై తగిన అంచనా లేదు. కోవిడ్ లక్షణాలకు వినియోగించే సాధారణ పారాసిటమాల్, అజిత్రోమైసిన్ వంటి మందులు తప్ప పరిస్థితి విషమిస్తే అప్పట్లో వినియోగించిన రెమిడెసివీర్, పొసకొనజోల్, యాంపిట్రోసిన్ డి, ఐవర్మెక్ట్రిన్ మందులు జిల్లాలో ఏ ఒక్క చోటా లేవు. అంతేకాదు, వ్యాధి నిర్ధారణకు వినియోగించే ఆర్టీపీసీఆర్ కిట్లు, కోవిడ్ ర్యాపిడ్ కిట్లు అందుబాటులో లేవు. ఆఖరికి బాధితులకు వైద్యం అందించేందుకు డాక్టర్లు, నర్సులు ధరించే పీపీఈ కిట్లు కనీసం అందుబాటులో లేవంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కనీస జాగ్రత్తలు శూన్యం గత కరోనా సమయంలో తీసుకున్న కనీస జాగ్రత్తలు ప్రస్తుతం ప్రజలెవరూ పాటించడం లేదు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆ దశగా ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు చేస్తున్న ప్రయత్నాలంటూ ఏవీ లేవు. సామాజిక దూరం కనుమరుగైపోయింది. శానిటైజర్ల వినియోగం చూద్దామన్నా కానరావడం లేదు. మాస్క్ ఊసే లేదు. అప్పట్లో అప్పుడప్పుడు చేపట్టిన అవగాహన కార్యక్రమాలు కాలగర్భంలో కలిసిపోయాయి. కోవిడ్ నివారణ కోసం ఏర్పాటైన ప్రత్యేక బృందాలేవీ ప్రస్తుతం చురుగ్గా లేవు. అసలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఆయా విభాగాల ఉనికే లేదు. జీజీహెచ్పైనే ఒత్తిడి.. జిల్లాలో క్షేత్ర స్థాయి ఏర్పాట్లు పూర్తిగా శూన్యంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కేసుల సంఖ్య పెరిగినా, అనుమానితులకు పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నా కాకినాడ జీజీహెచ్పై తీవ్ర ఒత్తిడి పడే అవకాశం ఉంది. ఇక్కడకు ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి పశ్చిమ, విశాఖలో కొంత ప్రాంత వాసులు కూడా వచ్చి వైద్య సేవలు పొందుతుంటారు. సాధారణంగా శస్త్రచికిత్స వంటి వైద్య ప్రక్రియలు నిర్వహించేటప్పుడు అన్ని వైద్య పరీక్షలు లాగానే కోవిడ్ పరీక్ష కూడా చేస్తారు. అంతవరకు మాత్రమే పరీక్ష కిట్లు ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయి. పరీక్షల కోసం క్యూ కడితే మాత్రం చేతులెత్తేసే పరిస్థితే కనిపిస్తోంది. జిల్లాలో ఏరియా ఆసుప్రతులు, పీహెచ్సీలు, యూపీహెచ్సీలలో కనీస ఏర్పాట్లు చేయకపోతే, అటు రోగి ప్రాణాలతో పాటు జీజీహెచ్లో బాధితుల వైద్య సేవల నిర్వహణ కూడా అత్యంత క్లిష్టంగా మారే అవకాశం ఉంది. ఫ జిల్లాలో డేంజర్ బెల్స్ ఫ కరోనా నివారణకు కానరాని చర్యలు ఫ ఇప్పటికే 16 ఏళ్ల బాలిక మృతి ఫ ఆసుపత్రుల్లో లేని పరీక్ష కిట్లు -
ఐక్యత, చైతన్యమే ఆయుధాలు
రాజమహేంద్రవరం సిటీ: సమస్యల పరిష్కారానికి, హక్కుల సాధనకు సంఘ నిర్మాణం, సభ్యుల ఐక్యత, చైతన్యమే ప్రధాన ఆయుధాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పి.గిరిప్రసాద్వర్మ అన్నారు. స్థానిక ఆనం కళా కేంద్రంలో గురువారం సంఘం నిర్మాణ వర్క్షాపు జరిగింది. రెండేళ్లుగా జిల్లాలో సంఘం చేపట్టిన కార్యక్రమాలను ఇందులో సమీక్షిస్తూ, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని సుమారు 10 వేల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంఘం నాయకత్వం వహిస్తోందని చెప్పారు. దీనిని మరింత బలోపేతం చేసేందుకు అన్ని స్థాయిల్లోని నాయకులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. సభ్యత్వ నమోదును ఉద్యమంలా కొనసాగించాలన్నారు. విజయవాడలో ఈ నెల 18, 19 తేదీల్లో జరిగే సమావేశంలో రాష్ట్ర నాయకత్వం కార్యాచరణ ప్రకటిస్తుందన్నారు. ఈ వర్క్షాపులో సుమారు 200 మంది జిల్లా, తాలూకా స్థాయి నాయకులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి వెల్సన్పాల్, నాయకులు చాంబర్లీన్, కె.వెంకటేశ్వరరావు, కె.గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ముద్రగడ మృతి తీరనిలోటు
కిర్లంపూడి: కాపు ఉద్యమ నేత, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం మృతి తీరని లోటని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు అన్నారు. గురువారం కిర్లంపూడిలోని ముద్రగడ పద్మనాభం సమాధికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వైఎస్సార్ సీపీ ప్రత్తిపాడు కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబును, బాలును పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాపు ఉద్యమ నేతకు నివాళి కాకినాడ రూరల్: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతి తీర్చలేని లోటని కాపు జేఏసీ, ఆంధ్ర కాపు సద్భావన సంఘం నేతలు అన్నారు. కాకినాడ శుభం కాపు కల్యాణ మండపంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘ నేతలు వాసురెడ్డి ఏసుదాసు, చిట్నీడి శ్రీనివాస్, సత్యనారాయణ, రంగనాయకులు, విష్ణు, ప్రకాష్, బాబ్జీ, నూకరాజు, రాజా తదితరులు మాట్లాడారు. 18న కాకినాడలో శుభం కాపు కల్యాణ మండపంలో సంతాప సభను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పార్టీలు, కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొని ముద్రగడకు ఘన నివాళులర్పించాలని కోరారు. రాష్ట్రంలోని కాపు, తెలగ, బలిజ, ఒంటరి నాయకుల కోరిక మేరకు సంతాప సభను కాకినాడలో పెడుతున్నామని వాసురెడ్డి ఏసుదాసు తెలిపారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ సభ జరుగుతుందన్నారు. రైల్వే గేటు వద్ద కలప ట్రాక్టర్ బోల్తా రెండు గంటల పాటు ట్రాఫిక్ జామ్ కపిలేశ్వరపురం: రాజానగరం మండలం రాధేయపాలెం నుంచి మండపేట మండలం ద్వారపూడిలోని సామిల్లుకు కలప లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ద్వారపూడి సమీపంలోని జెడ్.మేడపాడు రైల్వే గేటు వద్ద గురువారం బోల్తా పడింది. దీంతో, జెడ్.మేడపాడు వంతెన వద్ద సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది. రాజమహేంద్రవరం, కాకినాడ, మండపేట వైపు వెళ్లే వాహనదారులు తీవ్ర అవస్థలకు గురయ్యారు. ట్రాక్టర్పై అధిక కలప లోడు వేశారు. ఈ క్రమంలో రైల్వే గేటు వద్ద ఎత్తుగా ఉన్న రహదారి పైకి ఎక్కుతూండగా ట్రాక్టర్ బోల్తా పడింది. ప్రమాదాన్ని గమనించి, రాధేయపాలేనికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ గోపిశెట్టి వెంకటేశ్వరరావు కిందికి దూకేయడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ గాయాలు కాలేదు. -
20 నుంచి దస్తావేజు లేఖర్ల ‘పెన్డౌన్’
కాకినాడ లీగల్: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సేవల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, జీఓ నంబర్ 396ని రద్దు చేయాలని రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఈ నెల 6, 7 తేదీల్లో పెన్డౌన్ చేశారు. ఈ రెండు రోజుల్లో కాకినాడ జిల్లాలోని 9 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా రూ. 4 కోట్ల ఆదాయానికి గండిి పడింది. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో నిరసనలు ఉధృతం చేసేందుకు లేఖర్లు సిద్ధమయ్యారు. ఈ నెల 20 నుంచి 31వ తేదీ వరకూ పెన్డౌన్ చేసి ఆందోళలు చేపట్టాలని జిల్లాలోని 9 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలకు చెందిన దస్తావేజు లేఖర్లు సిద్ధమవుతున్నారు. కాకినాడ సబ్రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖర్లు గురువారం సమావేశమై 20వ తేదీ నుంచి చేపట్టనున్న పెన్డౌన్ నిరసనలపై చర్చించారు. తమ డిమాండ్ల సాధన కోసం నినాదాలు చేశారు. జీఓ 396 అమలైతే దస్తావేజు లేఖర్లు ఉపాధి కోల్పోయి రోడ్డున పడతామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పెన్డౌన్ కార్యక్రమానికి క్రయవిక్రదారులు, ప్రజలు సహకరించాలని దస్తావేజు లేఖర్ల సంఘం కాకినాడ అధ్యక్షుడు చోడపునీడి గోవిందరావు కోరారు. కార్యక్రమంలో జాడ అప్పలరాజు, మేడిశెట్టి శ్రీనివాస్, మేడిశెట్టి త్రినాథ్, మహేష్, నమశ్శివాయ తదితరులు పాల్గొన్నారు. -
ప్రపంచంలోనే మనది నాణ్యమైన కాయర్
మన కాయర్ ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైనది. మొత్తం శ్రీలంకలో ఒక రోజు ఉత్పత్తి అయ్యే కాయర్, తమిళనాడులోని పొలార్చిలో ఉత్పత్తి అయ్యే కాయర్కు సమానం. విలువ ఆధారిత ఉత్పత్తులకు భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉంది. కాయర్ నుంచి 6 వేల విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసే అవకాశముంది. – ఎస్కే గౌతమ్, కాయర్ కన్సల్టెంట్, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం, కోయంబత్తూర్ బ్రాండ్ కోనసీమతోనే అంతర్జాతీయ డిమాండ్ బ్రాండ్ కోనసీమను విస్తృతం చేస్తేనే జాతీయ, అంతర్జాతీయ డిమాండ్ సాధ్యం. ఇక్కడ తయారయ్యే కాయర్ ఉత్పత్తులకు ఆ స్థాయి నాణ్యత ఉండాలి. ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడినిచ్చే కొబ్బరి రకాలను రైతులు పండించాలి. ఉత్పత్తిదారుకు, ఉత్పత్తికి మధ్య ఉన్న అతి పెద్ద అంతరాన్ని ప్రభుత్వాలు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. – టీఎల్ఎన్ రావు, సైంటిస్ట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ -
మృతుడి కుటుంబానికి న్యాయం చేయండి
పిఠాపురం రూరల్: యు.కొత్తపల్లి మండలం మూలపేటలో బుధవారం కొందరు యువకుల మధ్య జరిగిన ఘర్షణలో కాదా రాకేష్ (28) మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గురువారం పోస్టుమార్టం జరగాల్సి ఉండగా, మృతుడి బంధువులు అడ్డుకున్నారు. రాకేష్కు భార్య, చిన్న పాప ఉన్నారని, అతని చనిపోవడంతో కుటుంబం రోడ్డున పడిందని అన్నారు. అతని భార్య బీఎస్సీ నర్సింగ్ చదివి ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. మృతుడి బంధువుల్లో ఐదుగురికి గాయాలయ్యాయని, నిందితులపై మెడికో లీగల్ కేసు, 17 సంవత్సరాల బాలికను వేధించిన నేపథ్యంలో పోక్సో కేసు నమోదు చేయాలని కోరారు. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సీఐ శ్రీనివాస్కు అందజేశారు. సీఐ హామీతో పోస్ట్మార్టం చేసేందుకు బంధువులు అంగీకరించారు. -
సాగుకు నీరేదీ?
● ఏలేరు, పీబీసీ ఆయకట్టులో నీటి ఎద్దడి ● ఎండుతున్న పంటలు ● కత్తి మీద సాములా ఖరీఫ్ సాగు పిఠాపురం: నారు పోసిన వాడే నీరు పోస్తాడని అంటారు. కానీ నారు పోసినా నీరు పోసే వారు లేరంటున్నారు రైతులు. ఖరీఫ్ సాగు ఆరంభమై 45 రోజులైంది. ఈ తరుణంలో ఎల్నినో ప్రభావంతో ఓవైపు వరుణుడు కరుణించడం లేదు. మరోవైపు కాలువల ద్వారా సాగునీరు సైతం అందక ఏలేరు, పీబీసీ పరిధిలో ఖరీఫ్ సాగు కత్తి మీద సాములా మారిందంటూ అన్నదాతలు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఏలేరు.. కన్నీరు జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టు ఏలేరు నుంచి ప్రతి సంవత్సరం జూన్ పదో తేదీ నాటికే జలాలు విడుదల చేసేవారు. తద్వారా రైతులు నారుమళ్లు వేసి, జూలై మొదటి వారానికి వరి నాట్లు పూర్తి చేసేవారు. కానీ ఈ సంవత్సరం భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఏలేరు జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 24.11 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.68 టీఎంసీల మేర మాత్రమే నీటి నిల్వలున్నాయి. దీని డెడ్ స్టోరేజీ 6.16 టీఎంసీలు. అంతకంటే తక్కువగా ఉంటే రిజర్వాయర్ నుంచి నీరు విడుదల సాధ్యం కాదు. వర్షాలు లేకపోవడంతో ఇన్ఫ్లో సైతం అరకొరగా ఉంది. దీంతో, ప్రత్తిపాడు, జగ్గంపేట, తుని, పెద్దాపురం, పిఠాపురం నియోజకవర్గాల్లో 53 వేల ఎకరాలకు పైగా ఆయకట్టుకు ఏలేరు జలాలు ఎంతవరకూ అందుతాయనేది ప్రశ్నార్థకంగానే మారింది. ఈ నెల 19 నుంచి ఏలేరు ఆయకట్టుకు నీరు విడుదల చేయనున్నారు. అనంతరం రెండు మూడు రోజులకు ఆ నీరు ఆయకట్టుకు అందుతుందని, నారుమళ్లు, నాట్లు వేసేందుకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఏలేరు నీటి పారుదల శాఖ డీఈ సంతోష్ కుమార్ చెప్పారు. మరోవైపు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి జలాలను ఏలేరుకు మళ్లిస్తామని అధికారులు చెబుతున్నా అది ఎంతవరకూ ఫలితమిస్తుందో వేచి చూడాలి. జూన్ 16 నుంచి నారుమళ్లు వేసి, ఈ నెలాఖరుకు నాట్లు పూర్తి చేయాలని అధికారులు ఉచిత సలహా ఇచ్చారు. కానీ, ఏలేరులో నీరు లేకపోవడంతో ఆయకట్టులోని దాదాపు 48 వేల మంది రైతులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. శివారుకు అందని నీరు జిల్లావ్యాప్తంగా 2.26 లక్షల ఎకరాల్లో రైతులు ఖరీఫ్ వరి సాగు చేయనున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి గత నెల ఒకటో తేదీ నుంచే నీరు విడుదల చేస్తున్నారు. జిల్లాలోని పలు మండలాలు శివారు ప్రాంతాలు కావడంతో నేటికీ పూర్తి స్థాయిలో గోదావరి జలాలు చేరడం లేదు. దీంతో, రైతులు నారుమడులు సైతం వేయలేకపోతున్నారు. పిఠాపురం బ్రాంచి కెనా ల్ (పీబీసీ) నుంచి ఆశించినంతగా నీరు రావడం లేదు. ఇప్పటి వరకూ కరప, కాజులూరు, పెదపూడి, గండేపల్లి తదితర మండలాల్లో నారుమళ్లు పూర్తి కాగా, పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి, తుని, తొండంగి తదితర మండలాల్లో నీరు లేక నారు పోసుకునే పరిస్థితి లేకపోయింది. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో సుమారు 32 వేల ఎకరాల్లో మాత్రమే నారుమడులు సిద్ధం చేయగా 13 వేల ఎకరాల్లో మాత్రమే నాట్లు, వెదజల్లు పద్ధతిలో సాగు పనులు పూర్తయ్యాయి. వాస్తవానికి ఈపాటికే సగం విస్తీర్ణంలో సాగు పనులు పూర్తి కావాల్సి ఉండగా సాగునీటి లభ్యత లేక రైతులు బేలచూపులు చూస్తున్నారు.నారు పోసినా.. నీరు లేదు సమయం మించిపోతూండటంతో కాలువలో ఉన్న కొద్దిపాటి నీరు, ఇటీవలి కురిసిన కొద్దిపాటి వర్షాలతో నారు పోశాం. ఈలోగా నీరు వస్తుందని ఆశ పడ్డాం. కానీ, పీబీసీ నుంచి సాగునీరు రావడం లేదు. మరోవైపు వానలూ లేవు. నారు వేసిన 21 రోజుల్లో సాగు నీరు రాకపోతే చాలా ఇబ్బంది. ఈ ఏడాది ఖరీఫ్ సాగు కలవరపెడుతోంది. – జోకా కామరాజు, రైతు, కొత్తపల్లి -
నాణ్యమైన బోధన జరగాలి
పెద్దాపురం: విద్యార్థులకు నూతన విధానాలతో నాణ్యమైన బోధన అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్, పీఎం జవహర్ నవోదయ విద్యాలయ చైర్మన్ హరేంధిర ప్రసాద్ అన్నారు. పెద్దాపురంలో నవోదయ విద్యాలయలో బుధవారం జరిగిన మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ఎన్సీసీ క్యాడెట్స్ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. విద్యాలయ కార్యకలాపాలు, ప్రగతిని సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రిన్సిపాల్ ఎస్ఎస్సీ కీర్తి వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులకు ఒకవైపు పోటీ పరీక్షలపై తర్ఫీదు ఇస్తూనే, బోధన అందించాలని సూచించారు. విద్యార్థులు కూడా తమ లక్ష్యాలకు అనుగుణంగా చదువుకోవాలని అన్నారు. సమావేశంలో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ ప్రియ, డీఈఓ పి.రమేష్, డీఎంహెచ్ఓ అనిత, ఎంఆర్ కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణమూర్తి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. డీఎంహెచ్ఓగా అనిత బాధ్యతల స్వీకరణ కాకినాడ క్రైం: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి(డీఎంహెచ్ఓ)గా కోనాల అనిత కాకినాడలోని కార్యాలయంలో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. శ్రీకాకుళం డీఎంహెచ్ఓగా పని చేసిన ఆమె సాధారణ బదిలీల్లో ఇక్కడకు వచ్చారు. బాధ్యతల స్వీకరణ అనంతరం కలెక్టర్ హరేంధిర ప్రసాద్ను డాక్టర్ అనిత మర్యాద పూర్వకంగా కలిశారు. వాటర్ఫాల్స్ వద్ద జరిగిన వివాదంతోనే హత్య గొల్లప్రోలు (పిఠాపురం రూరల్): గొల్లప్రోలు నగర పంచాయతీ రెండో వార్డు మాజీ కౌన్సిలర్ భర్త లింగం అర్జునుడు హత్యకు దారపల్లి వాటర్ఫాల్స్ వద్ద జరిగిన ఘర్షణే కారణమని పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మంగళవారం కొంతమంది స్నేహితులు దారపల్లి వాటర్ఫాల్స్కు వెళ్లారు. అక్కడ బచ్చల మారుతీ పవన్ అలియాస్ కల్యాణ్కు, అర్జునుడికి మధ్య ఘర్షణ చోటు చేసుకోగా ఇతర స్నేహితులు సర్ది చెప్పారు. ఈ ఘర్షణను మనసులో పెట్టుకున్న కల్యాణ్ క్షమాపణ చెప్పే నెపంతో అర్జునుడి ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో వెంట తీసుకు వెళ్లిన పదునైన చాకుతో అర్జునుడి కడుపులో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన అర్జునుడు పిఠాపురంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందాడు. దీనిపై గొల్లప్రోలు స్టేషన్లో హత్య కేసు నమోదు చేసి, నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చేపట్టారు. కత్తితో దాడి.. యువకుడి మృతి కొత్తపల్లి: కొంతమంది యువకులు కత్తితో దాడి చేయడంతో అమ్మమ్మ అంతిమ సంస్కారానికి వచ్చిన ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని మూలపేట గ్రామానికి చెందిన వేమగిరి రమణమ్మ మృతి చెందింది. పెదపూడి మండలం రామేశ్వరం గ్రామానికి చెందిన కాదా రాకేష్(28)కు ఆమె అమ్మమ్మ అవుతుంది. ఆమె అంతిమ సంస్కారంలో పాల్గొనేందుకు బుధవారం వచ్చాడు. తన చిన్న మేనత్త కుమార్తెను వేధిస్తున్నాడంటూ రాకేష్తో పండు అనే యువకుడు వాగ్వాదానికి దిగాడు. అనంతరం, అమ్మమ్మ అంతిమ సంస్కారాల్లో పాల్గొనేందుకు రాకేష్ వెళ్లాడు. ఆ సమయంలో కూడా వారిద్దరి మధ్య మళ్లీ వాగ్వాదం జరిగింది. దీంతో, అక్కడి వారు 112 నంబరుకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఇరు వర్గాల వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయితే, రమణమ్మ అంతిమ సంస్కారాలు ముగిసిన తరువాత ఇరు వర్గాల మధ్య మరోసారి ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో పండు, వడ్డి వంశీతో పాటు మరో కొంత మంది యువకులు రాకేష్పై దాడి చేసి, కత్తితో పొడిచారు. తీవ్రంగా గాయపడిన రాకేష్ను తొలుత నాగులాపల్లి ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి, మెరుగైన చికిత్స కోసం పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
గౌతమ్ యూరాలజీలో హై పవర్ లేజర్ ప్రారంభం
కంబాలచెరువు: ఉభయ గోదావరి జిల్లాల్లో యూరాలజీ, కిడ్నీ వైద్య సేవల్లో అధుతన టెక్నాలజీతో స్థానిక గౌతమ్ యూరాలజీ, కిడ్నీ సెంటర్లో రాష్ట్రంలోనే తొలిసారిగా అత్యాధునిక 160 వాట్స్ పొటెంట్ వోల్మియమ్ హై పవర్ లేజర్ యంత్రాన్ని ప్రారంభించినట్లు ఆసుపత్రి అధినేత, డాక్టర్ గౌతమ్రెడ్డి మంగళవారం తెలిపారు. హైదరాబాద్ మెడికవర్ హాస్పిటల్స్ యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ ఏవీ రవికుమార్ చేతుల మీదుగా దీనిని ప్రారంభించారన్నారు. కార్యక్రమంలో ప్రముఖ సీనియర్ యూరాలజిస్టు డాక్టర్ టీవీ నారాయణరావు, అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, ఆయన భార్య ఆదిలక్ష్మి, ప్రియాంక పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. -
ఆస్తి కోసం ఆలిని కడతేర్చాడు
● రాజవోలు గ్రామంలో దారుణం ● అనాథలైన పిల్లలు ధవళేశ్వరం: సొంత అక్క కూతురుని వివాహం చేసుకున్నాడు. పైళ్ళె 17 ఏళ్లు గడిచా యి. సాఫీగా సాగుతున్న సంసారంలో ఆస్తి తగాదాలు ప్రకంపనలు సృష్టించాయి. మనస్పర్థలు ముదిరి హత్యకు దారి తీశాయి. రాజమహేంద్రవరం రూరల్ మండలం రాజవోలు గ్రామంలో మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ధవళేశ్వరం పోలీసులు తెలిపిన వివరాల మేరకు రాజవోలు గ్రామం కోనేరు వీధికి చెందిన చింతా వరప్రసాద్ 2009లో అతని అక్క కూతురు చింతా నాగమణి (32)ని వివాహం చేసుకున్నాడు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. వరప్రసాద్ వడ్రంగి పనిచేస్తూ జీవిస్తున్నాడు. రాజవోలులోని అక్క పేరున ఇంటిని తన పేరున రాయాలని వరప్రసాద్ తన భార్యను వేధిస్తున్నాడు. నాగమణి సోదరితో కలిసి బాలాజీపేటలోని ఒక బిర్యానీ షాపులో పనిచేస్తోంది. మంగళవారం సాయంత్రం పని ముగించుకొని ఇంటికి వచ్చిన నాగమణితో ఎవరికి చెప్పి పనికి వెళ్లావంటూ గొడవ పడిన వరప్రసాద్ తన పనిముట్టు బాదిదతో ఆమె తలపై గట్టిగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి వరప్రసాద్ను అదుపులోకి తీసుకున్నారు. డిఎస్పీ శివప్రియ, సీఐ టి.గణేష్, ఎస్సై హరిబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. అనాథలైన పిల్లలు నాగమణికి ఇద్దరు పిల్లలు బొమ్మూరులో ఒక ప్రైవేటు పాఠశాలలో కుమార్తె పదో తరగతి, కుమారుడు ఏడో తరగతి చదువుతున్నారు. కన్నతండ్రే తల్లిని చంపడంతో వారి రోదన కంటతడి పెట్టించింది. తల్లి మృతి చెందడం, తండ్రి జైలుకు వెళ్లడంతో పిల్లలు అనాథలుగా మారారు. -
పంపాలో మునిగి ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
● స్నేహితులతో సత్యదేవుని దర్శనానికి వచ్చిన వైనం ● మృతుడు భీమవరం వాసి అన్నవరం: స్నేహితులతో కలిసి స్థానిక పంపా నదిలో స్నానం చేయడానికి వెళ్లిన ఇంజినీరింగ్ విద్యార్థి కె.బాల సాత్విక్ (21) నీటిలో మునిగి మృతి చెందాడు. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే వెడితే ఏలూరుకు చెందిన బాలసాత్విక్ భీమవరంలోని డీఎన్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సవరం చదువుతున్నాడు. సోమవారం స్థానిక గ్రామదేవత మరిడమ్మ జాతరకు స్నేహితులతో కలసి అన్నవరం వచ్చాడు. రాత్రి జాతరలో పాల్గొని మంగళవారం స్నేహితులతో కలిసి సత్యదేవుని దర్శించి అనంతర పంపాలో స్నానాల ఘాట్ వద్ద స్నేహితులతో కలసి స్నానం చేస్తూ మునిగిపోయాడు. స్నేహితులు రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. వారిచ్చిన సమచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఫైర్ సిబ్బందిని పిలిపించారు. వారు గాలించి మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం తుని ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి గొల్లప్రోలు (పిఠాపురం రూరల్): ఇద్దరు స్నేహితుల మద్య ఘర్షణ తలెత్తడంతో కత్తిపోట్లకు గురై ఒకరు మృతి చెందిన ఘటన పట్టణంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. స్థానిక ఎస్సీ పేటకు చెందిన లింగం అర్జునుడుపై (30) బచ్చల మారుతి పవన్ అనే యువకుడు మంగళవారం రాత్రి కత్తితో దాడి చేశాడు. అర్జునుడు పరిస్థితి విషమంగా ఉండటంతో పిఠాపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వీరిద్దరు మరి కొందరు స్నేహితులతో కలిసి దారపాలెం వాటర్ ఫాల్స్కు వెళ్లారు. అక్కడ ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఇంటికి వచ్చిన తరువాత కూడా ఘర్షణ జరగడంతో మారుతి పవన్ కత్తితో అర్జునుడిపై దాడి చేశాడు. మృతుడు అర్జునుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం పెందుర్తి: మండలం సరిపల్లి వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలుకు చెందిన కీర్తి మాణిక్యాలరావు(56) శనగ పొట్టు వ్యాపారం చేస్తుంటారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం గొల్లప్రోలులో బొలెరో వాహనం అద్దెకు తీసుకుని కొంత పొట్టు అనకాపల్లిలో, మరికొంత ఆనందపురంలో అన్లోడ్ చేసి తిరుగు ప్రయాణమయ్యాడు. సరిపల్లి వద్దకు వచ్చే సరికి బొలెరో డ్రైవర్ నాగరాజు ముందు ఉన్న లారీని తప్పించే క్రమంలో ట్రాఫిక్ మధ్యలో వాహనాన్ని ఉంచాడు. ఈ క్రమంలో వెనుక ఉన్న లారీ అదుపు తప్పి బొలెరోను ఢీ కొట్టింది. దీంతో బొలెరో ముందున్న మరో లారీని బలంగా ఢీకొట్టడంతో అందులో ఉన్న మాణిక్యాలరావు కేబిన్లో ఇరుక్కుపోయి అక్కడిక్కడే మృతి చెందాడు. డ్రైవర్ నాగబాబు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. మాణిక్యాలరావుకు భార్య లలిత, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెందుర్తి పోలీసులు అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. పిచ్చికుక్క దాడిలో గాయపడిన బాలుడి మృతి ఏలేశ్వరం: మండలంలోని లింగంపర్తి గ్రామంలో గత నెల 14న పిచ్చికుక్క దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు మంగళవారం మృతిచెందాడు. లింగంపర్తి గ్రామంలో సత్రం పంపు కాలనీకి చెందిన భీశెట్టి లక్ష్మణ్, లక్ష్మి దంపతుల కుమారుడు భీశెట్టి సాయిగణేష్ను (7) నెలరోజుల క్రితం పిచ్చికుక్క కరిచింది. ఏలేశ్వరం ప్రభుత్వాసుపత్రిలో బాలుడికి రేబిస్ వ్యాక్సిన్ వేయించారు. మూడు రోజుల క్రితం సాయిగణేష్ అనారోగ్యానికి గురికావడంతో ఏలేశ్వరం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయిగణేష్ మృతిచెందాడు. -
ఆరోగ్య ప్రదాయిని ఆషాఢం
● ఆచారాలకు సంప్రదాయాలకు నెలవైన మాసం ● ప్రతి ఆచారం వెనుక ఎంతో శాసీ్త్రయత ఆలమూరు: తొలకరి జల్లులతో ప్రకృతి శోభించే మాసం ఆషాఢం. శుభ కార్యాలు లేకపోయినా సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ఇది ఎంతో శుభప్రదమైనది. గ్రామ దేవతలకు జాతరలు, నైవేద్యాల సమర్పణకు నెలవైన కాలం. మేఘావృతమైన ఆకాశాలు.. చిరు జల్లుల సందోహాలు.. మునగాకు వంటకాల ఘుమఘుమలు.. నవ వధువులు గోరింట పంటలతో.. అంతే కాదు.. భావి జీవితం బాగుండాలని పెద్దల నిర్ణయం మేరకు వీడలేక వీడలేక నవదంపతులు ఎవరి పుట్టిళ్లకు వారు దారితీసే కాలమిదే. గ్రామీణాల్లో ఇవన్నీ సర్వ సాధారణమే అయినా ఇందులోని ప్రతి సంప్రదాయానికీ ఓ శాసీ్త్రయత నిమిడి ఉందని ఆధ్యాత్మికవేత్తలు చెపుతారు. మునగాకు దివ్యౌషధం ఆషాడ మాసంలో మునగాకుతో కూడిన ఆహార పదార్థాలు తినడం వల్ల శరీరంలో ఉష్ణ తత్వాన్ని పెంచి ప్రస్తుత శీతల వాతావరణానికి అనుగుణంగా సమతుల్యం చేస్తుందని ఆయుర్వేద వైద్యులు చెప్తుంటారు. అంతే కాదు దీనివల్ల లభించే పోషకాలు ఆరోగ్యానికి చాలా మంచిది. గోరింటాకుతో ప్రయోజనాలు అనేకం ఆషాఢ మాసంలో మహిళలు గోరింటాకు లేదా పారాణి పెట్టుకోవడాన్ని అందానికే కాదు లక్ష్మీప్రదంగా కూడా భావిస్తారు. ఇది కేవలం గ్రామాలకే పరిమితం కాలేదు నేడు మెహిందీ పేరుతో పట్టణాలకూ విస్తరించింది. గ్రీష్మం వెళ్లి వర్ష రుతువు ప్రవేశిస్తుంది. వర్షాలు పడే కాలం కావడంతో ఇంటి పనులు, పొలంపనులు చేసే మహిళలు తడి ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటారు. వారి కాళ్లకు, చేతులకు, గోళ్లలో పగుళ్లకు గోరింటాకు కానీ, పారాణి కానీ దివ్యౌషధంగా పని చేస్తుందని. పండగలకు విశేష ప్రాధాన్యం ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి నుంచే పండగలు వరస కడతాయి. ఈ మాసంలో దాన ధర్మాలు చేస్తే అనంత ఫలితం ఉంటుందన్నది పురాణ వచనం. సూర్య భగవానుడు దక్షిణాయణంలోకి ప్రవేశించడం ద్వారా ఈ ప్రాధాన్యత సంతరించుకుంటుంది. జైనులు ఈ నెలలోనే చాతుర్మాస వ్రతం చేపడతారు. జగన్నాథుడి రథయాత్ర, బోనాల పండగ, వారాహి నవరాత్రులు ఈ నెలలోనే వస్తాయి. దుర్గమ్మ శాకంబరిగా దర్శించునే భాగ్యం కలిగేది ఈ నెలలోనే కావడం విశేషం. -
ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడి మృతి
అన్నవరం: విజయవాడ నుంచి విశాఖ వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో గుర్తు తెలియని ప్రయాణికుడు మంగళవారం మధ్యాహ్నం అన్నవరం సమీపంలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే విశాఖ మధురవాడ డిపోకు చెందిన విజయవాడ– విశాఖ సూపర్ లగ్జరీ బస్సులో విజయవాడ నుంచి విశాఖకు వెళ్తున్న వ్యక్తి కత్తిపూడి వద్ద తన సీటులో వాలిపోయాడు. ఈ విషయాన్ని ఇతర ప్రయాణికులు డ్రైవర్ దృష్టికి తీసుకురాగా ఆయన 108కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చి అన్నవరం వద్ద ఆ వాహనంలోకి అతడిని ఎక్కించే ప్రయత్నం చేయగా అప్పటికే అతడు మృతి చెందినట్టు సిబ్బంది తెలిపారు. దాంతో మృతదేహాన్ని తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని వద్ద రూ.200 తప్ప మరే ఇతర గుర్తింపు కార్డులు లేకపోవడంతో అక్కడి ఆస్పత్రి మార్చురీలో మృతదేహాన్ని భద్రపరిచారు. అన్నవరం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సాంకేతికతకు అనుగుణంగా విద్యా విధానం
● డీఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్రెడ్డి ● జేఎన్టీయూకేలో ఓక్ జూబ్లీ ఉత్సవాలు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): సాంకేతిక అవసరాలకు అనుగుణంగా విద్యావిధానం సాగాలని డీఆర్డీఓ మాజీ చైర్మన్, రాష్ట్ర ప్రభుత్వ సలహదారు జి.సతీష్రెడ్డి పేర్కొన్నారు. జేఎన్టీయూ కాకినాడ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పడి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఓక్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీఇంటర్నేషనల్ సింపోజియం ఆన్ రీసెంట్ ట్రెండ్స్ ఇన్టెక్నికల్ ఎడ్యుకేషన్శ్రీ పేరుతో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సతీష్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ నేడు పరిశ్రమలకు నైపుణ్యాలతో కూడిన వ్యక్తుల అవసరం ఉందని, పరిశ్రమలు విద్యా వ్యవస్థ మధ్య అంతరాన్ని తొలగించాలన్నారు. రాబోయే యుద్ధాలను భారత ఇంజినీర్లు తమ శక్తి మేరకు ఎదుర్కొనేలా సన్నద్ధమవ్వాలన్నారు. జేఎన్టీయూకే వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్ మాట్లాడుతూ భారతదేశంలో మిలియన్కు 260 మంది మాత్రమే నిపుణులు ఉండగా చైనాలో మిలియన్కు వెయ్యిమంది ఉన్నారని, వరల్డ్ క్లాస్ యూనివర్సిటీలను నిర్మించడం కాకుండా ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా మార్గాలు అన్వేషించాలన్నారు. కార్యక్రమంలో రెక్టార్ సుబ్బారావు, ప్రిన్సిపాల్ కె.పద్మరాజు, వైస్ ప్రిన్సిపాల్ దీక్షితులు, స్వరూపరాణి, మాజీ వీసీలు డాక్టర్ ప్రసాదరాజు, మురళీకృష్ణ పాల్గొన్నారు. -
ఆక్వాకు కరెంట్ షాక్
● దెబ్బ మీద దెబ్బ● ఆక్వా ఫీడర్లపై ఎడాపెడా విద్యుత్ కోతలు ● చెరువుల్లో ఆక్సిజన్ స్థాయి తగ్గిపోయే ప్రమాదం ● గత్యంతరం లేక జనరేటర్ల వినియోగం ● డీజిల్కు నెలకు రూ.3 లక్షల వరకూ అదనపు ఖర్చు ● ఇప్పటికే ట్రంప్ సుంకాలతో పడిపోయిన రేట్లు ● మరోవైపు పెరిగిన మేత ధరలు ● ఆపై విజృంభిస్తున్న వ్యాధులు ● గడగడలాడుతున్న వనామీ రైతులు ఐ.పోలవరం: దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా ఉంది ఆక్వా రైతు పరిస్థితి. ఒకవైపు ట్రంప్ సుంకాలతో పడి పోయిన ధరలు.. మరోవైపు మేత ధరల పెంపు.. ఇంకోవైపు రొయ్యలపై వ్యాధుల పంజాతో ఇప్పటికే వా రు సతమతమవుతున్నారు. ఇవి చాలవన్నట్లు ప్రభు త్వం ఎడాపెడా విద్యుత్ కోతలు విధిస్తోంది. ముఖ్యంగా ఆక్వా ఫీడర్లకే ప్రత్యేకంగా రోజుకు నాలుగైదు గంటల పాటు కరెంటు సరఫరా నిలిపివేస్తోంది. ఆ సమ యంలో డీజిల్ జనరేటర్లపై ఏరియేటర్లు నడపాల్సి రా వడంతో పెట్టుబడి తడిసి మోపైడె, తీవ్రంగా నష్టపోతున్నామని వనామీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ ఇబ్బంది జిల్లాలో అధికారికంగా 21 వేల ఎకరాల్లో వనామీ రొయ్యల సాగు జరుగుతోంది. అనధికారికంగా కలిపి ఇది 35 వేల ఎకరాల వరకూ ఉంది. దీనిలో తొలి పంట మొత్తం సాగు జరుగుతూండగా రెండో పంట సుమారు 24 వేల ఎకరాల్లో సాగవుతున్నట్టు అంచనా. ఇక మూడో పంట సుమారు 14 వేల ఎకరాల్లో సాగవుతోంది. ఈవిధంగా చూస్తే అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకూ ఏడాది కాలంలో అన్ని పంటలూ కలిపి సుమారు 73 వేల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. ఆక్వా చెరువుల్లో రొయ్యలకు ఆక్సిజన్ నిరంతరాయంగా అందాలంటే ఏరియేటర్లు పని చేయాల్సి ఉంటుంది. ఐదెకరాల రొయ్యల చెరువు సాగుకు వన్ హెచ్పీ ఏరియేటర్లు 40 కావాల్సి ఉంటుంది. అదే టు హెచ్పీ ఏరియేటర్లు అయితే 20 వరకూ అవసరం. రొయ్యల కౌంట్ ఎక్కువగా ఉన్నప్పుడు రోజుకు 16 గంటలు, కౌంట్ తగ్గితే 18 గంటల పాటు ఏరియేటర్లు పని చేస్తూనే ఉండాలి. పగలు 4 గంటలు, సాయంత్రం 6 నుంచి ఉదయం 7 గంటల వరకూ నిరంతరాయంగా నడపాలి. సరిగ్గా ఇటువంటి కీలక సమయంలోనే ప్రభుత్వం విద్యుత్ సరఫరా నిలిపివేస్తూండటంతో ఏరియేటర్లు నిలిచిపోతున్నాయి. దీనివలన ఆక్సిజన్ లోపంతో రొయ్యలు చనిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. దీంతో, ఏరియేటర్లను పని చేయించేందుకు రైతులు జనరేటర్లపై ఆధారపడక తప్పడం లేదు. రెండేళ్లుగా సంక్షోభం వనామీ సాగు రెండేళ్లుగా తీవ్ర సంక్షోభంలో ఉంది. కరోనా సమయంలో కూడా ఎదురు కాని సవాళ్లు ఇ ప్పుడు ఎదురవుతున్నాయి. ట్రంప్ సుంకాలకు తోడు అమెరికా–ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఏర్పడుతున్న ఉద్రిక్తతలతో పంట చేతికి వచ్చే సమయానికి ధరలు పడిపోతున్నాయి. ఫలితంగా దేశానికి వందల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం తెస్తున్న వనామీ రైతుకు నష్టాలే మిగులుతున్నాయి. తాజాగా మేత కంపెనీలు సిండికేట్గా ఏర్పడి ధరలు పెంచేశాయి. వనా మీ రొయ్యల మేతను టన్నుకు రూ.10 వేలు, టైగర్ రొయ్యల మేతను టన్నుకు రూ.12 వేల వరకూ పెంచారు. గత నెలలో రూ.8 వేలు, రూ.10 వేల చొప్పున పెంచాలని నిర్ణయించగా, రైతులు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో ఇరు పక్షాలతో ప్ర భుత్వం చర్చలు జరిపింది. దీనిపై, ప్రభుత్వం నిర్ణ యం తీసుకునేలోపే కంపెనీలు మరో రూ.2 వేలు అదనంగా పెంచాయి. కిలో మేత ధరను రూ.4 తగ్గిస్తామ ని చెప్పి రూ.2 మాత్రమే తగ్గించాయి. జిల్లావ్యాప్తంగా ఏడాదికి 73 వేల ఎకరాల్లో జరుగుతున్న ఆక్వా సాగు కు 2.25 లక్షల మెట్రిక్ టన్నుల మేత అవసరం. ధర పెంపుతో రైతులపై రూ.225 కోట్ల అదనపు భారం పడింది. మేత ధరల పెంపును నిరసిస్తూ జిల్లాలోని వనామీ రైతులు గత నెలలో కలెక్టరేట్ను ముట్టడించారు. ఈ సమస్యలు చాలవన్నట్లు రొయ్యలకు గత నెలలో వైట్గట్, వైట్స్పాట్ వంటి వ్యాధులు సోకాయి. దీంతో, రైతులు మరిన్ని నష్టాలు చవిచూశా రు. ఒకవైపు ధరలు లేక.. మరోవైపు మేత మరింత ఖరీదైన పరిస్థితుల్లో ఇప్పుడు కరెంటు కోతలు కూడా విధిస్తూండటంతో ఆక్వా సాగు చేయడం కష్టమేనని వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సాగు చేయలేకపోతున్నాం ఆక్వా రైతులకు రాయితీ విద్యుత్ ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. మంచిదే. కానీ, రోజుకు నాలుగైదు గంటలు కరెంటు కోతలు విధిస్తూండటంతో మాకు సాగు భారంగా మారింది. డీజిల్ ధర పెరిగింది. విద్యుత్ లేక జనరేటర్లు ఉపయోగించాల్సి రావడంతో డీజిల్ వినియోగం పెరిగి రూ.లక్షల్లో పెట్టుబడి అవుతోంది. అటువంటప్పుడు ప్రభుత్వం ఇస్తున్న రాయితీ వల్ల ఉపయోగమేమిటి? ఆక్వా ఫీడర్లపై మాత్రమే కరెంటు కోతలు విధిస్తూండటంతో పూర్తి స్థాయిలో నష్టపోతున్నాం. – దంతులూరి నానీరాజు, అన్నంపల్లి ‘చమురు’ వదిలిపోతోందిలా.. ఐదెకరాల చెరువులో ఏరియేటర్లు తిప్పడానికి గంటకు 20 లీటర్ల డీజిల్ ఖర్చవుతుంది. రోజుకు 5 గంటల పాటు విద్యుత్ కోతలుంటే ఆ సమయంలో జనరేటర్లపై ఏరియేటర్లు తిప్పడానికి 100 లీటర్ల డీజిల్ అవసరమవుతుంది. దీని ప్రకారం రోజుకు రూ.10 వేలు, నెలకు రూ.3 లక్షల వరకూ డీజిల్కే ఖర్చవుతోంది. రొయ్యల పంట చేతికి రావడానికి 4 నెలలు పడుతుంది. అంటే ఈ నాలుగు నెలల్లో డీజిల్ కోసమే వనామీ రైతులకు రూ.12 లక్షల మేర చేతి చమురు వదిలిపోతోంది. అదే కరెంటు సరఫరా సక్రమంగా ఉంటే నెలకు రూ.25 వేలు మాత్రమే అవుతుందని రైతులు చెబుతున్నారు. ఆక్వాకు నిరంతరాయంగా కరెంటు ఇవ్వాలని, ఆక్వా ఫీడర్లకు విద్యుత్ కోతలు ఎత్తివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


