breaking news
Kakinada District News
-
దస్తావేజు లేఖర్ల పెన్డౌన్
కాకినాడ లీగల్: జీఓ–396కి వ్యతిరేకంగా దస్తావేజు లేఖర్లు చేపట్టిన రెండు రోజుల పెన్డౌన్తో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయానికి రూ.4 కోట్ల మేర గండి పడిందని ఉద్యోగులు చెబుతున్నారు. లేఖర్ల ఆందోళనతో జిల్లావ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ దాదాపు నిలిచిపోయింది. తొలి రోజు జగ్గంపేటలో 1, పిఠాపురంలో 3, కాకినాడలో 1 కలిపి మొత్తం 5 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.7.50 లక్షల ఆదాయం వచ్చింది. రెండో రోజయిన మంగళవారం జిల్లాలోని 9 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఒక్క రిజిస్ట్రేషన్ కూడా జరగలేదు. దస్తావేజు లేఖర్ల సంఘ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు బీజే ప్రసాద్, కాకినాడ దస్తావేజు లేఖర్ల సంఘ అధ్యక్షుడు చోడపునీడి గోవిందరావు మాట్లాడుతూ, జీఓ–396 అమల్లోకి వస్తే వేలాది మంది లేఖర్ల జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ సేవలను ప్రైవేటు సంస్థలకు అప్పగించే విధానాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్ల శాఖకు రూ.4 కోట్ల ఆదాయానికి గండి! -
కడియం సబ్ రిజిస్ట్రార్పై విచారణ
కాకినాడ లీగల్: ఎక్కడి నుంచైనా ఆస్తుల రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం అమలులో ఉన్న నేపథ్యంలో.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఆస్తులకు కడియం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేసిన వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. తగిన లింక్ డాక్యుమెంట్లు, ఇతర ఆధారాలు లేకుండానే ఉమ్మడి జిల్లాలోని ఆస్తులకు వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఆ శాఖ ఉన్నతాధికారులకు ఇటీవల ఫిర్యాదులు వచ్చాయి. ఈ మేరకు రిజిస్ట్రేషన్ల శాఖ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ) సీహెచ్ జానకీదేవి విచారణ నిర్వహించారు. తగిన ఆధారాలు లేకుండానే పలు రిజిస్ట్రేషన్లు జరిగాయని, దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగే అవకాశం ఉందని ఈ సందర్భంగా గుర్తించారు. దీనిపై రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీకి కొద్ది రోజుల కిందట నివేదిక సమర్పించారు. దీని ఆధారంగా ఉన్నతాధికారులు శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. ఈ మేరకు కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ కె.ప్రసాదరావును ప్రజెంటింగ్ ఆఫీసర్గా, కోనసీమ జిల్లా రిజిస్ట్రార్ సీహెచ్ నాగలింగేశ్వరరావును విచారణ అధికారిగా నియమిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రసాదరావు సమక్షంలో నాగలింగేశ్వరరావు కడియం సబ్ రిజిస్ట్రార్ ఇ.లక్ష్మిని మంగళవారం విచారించారు. నిబంధనలకు విరుద్ధంగా పూర్వార్జితంగా చేసిన రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ఆధారాలు, నిబంధనల అమలు తదితర అంశాలపై వివరణ కోరినట్లు తెలిసింది. -
ఎస్పీకి మహిళా కమిషన్ నోటీసులు
కాకినాడ క్రైం: ఓ మహిళా న్యాయవాదిపై సీఐ దురుసుగా ప్రవర్తించడాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ బిందుమాధవ్కు నోటీసులు జారీ చేసింది. వివరాలివీ.. కాకినాడకు చెందిన సీనియర్ మహిళా న్యాయవాది కొయ్య నాగజ్యోతి గత మార్చి 21న తన క్లయింట్ టి.గంగాభవాని పెట్టిన కేసు విషయమై కాకినాడ మహిళా పోలీసు స్టేషన్కు వెళ్లారు. కేసుకు సంబంధించిన పత్రాలు కోరగా.. నాగజ్యోతితో అప్పటి సీఐ రవికుమార్ అభ్యంతరకరంగా, దురుసుగా వ్యవహరించారు. ఆయన వ్యవహార శైలిని నిరసిస్తూ నాగజ్యోతి స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. ఈ విషయంపై ఎస్పీ బిందుమాధవ్కు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. ఈ ఘటనపై నిగ్గు తేల్చేందుకు సీసీ టీవీ ఫుటేజీ ఇవ్వాలని కోరినా నిరాకరించారు. నాగజ్యోతికి ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఐలూ) అండగా నిలిచింది. సీసీ టీవీ ఫుటేజీ తీసి, వాస్తవాల ఆధారంగా సీఐపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరినా ఫలితం లేకపోయింది. దీంతో, బాధితురాలు రాష్ట్ర మహిళా కమిషన్ను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా గత ఏప్రిల్ 24న ఎస్పీకి కమిషన్ నోటీసులు జారీ చేసింది. దీనికి కూడా ఎస్పీ స్పందించకపోవడాన్ని కమిషన్ తీవ్రంగా పరిగణించింది. తాజాగా మరోమారు ఈ నెల 3న ఎస్పీకి రిమైండర్ నోటీసు జారీ చేసింది. తొలి నోటీసుకు బదులేమీ ఇవ్వలేదని ప్రస్తావిస్తూ, సీఐ రవికుమార్పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది, తక్షణమే చర్యలు తీసుకుని యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. ఆశా వర్కర్ల ఆందోళన పిఠాపురం రూరల్: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విరవ, గొల్లప్రోలు పీహెచ్సీల వద్ద ఆశా వర్కర్లు మంగళవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రోజువారీ అత్యవసర ఆరోగ్య విధులు నిర్వహిస్తున్న తమకు బీఎల్ఓ విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మార్చి 5న ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, తమ యూనియన్ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల్లో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన జీఓలు, సర్కులర్లు వెంటనే విడుదల చేయాలని, కోరారు. కనీస వేతనం అమలు చేయాలని ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హక్కుల సాధన కోసం ఈ నెల 31న జరగనున్న చలో కలెక్టరేట్ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. జాతీయ ఎస్టీ కమిషన్ సీరియస్ రంపచోడవరం: రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొజ్జిరెడ్డి నేతృత్వంలో స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో ఇటీవల అధికారికంగా జరిగిన గ్రీవెన్స్కు కలెక్టర్, ఐటీడీఏ పీఓ, రంపచోడవరం ఆర్డీఓ హాజరు కాకపోవడాన్ని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ అత్యంత తీవ్రంగా పరిగణించిందని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనిపై తాము పంపిన ఫిర్యాదులను స్వీకరించిన కమిషన్, ప్రొటోకాల్ ఉల్లంఘన, విధుల్లో నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించిందన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శికి జాతీయ నోటీసులు జారీ చేసిందన్నారు. బాధ్యులైన అధికారులపై క్రమశిక్షణా, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించిందని తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎస్.భార్గవి తక్షణం స్పందించారని, ఈ వ్యవహారంపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుని, పూర్తి నివేదికను నేరుగా ఢిల్లీ, భువనేశ్వర్లోని జాతీయ కమిషన్కు సమర్పించాలని కలెక్టర్ను ఆదేశించినట్లు శ్రీను పేర్కొన్నారు. టెన్త్ విద్యార్థుల డేటాలో మార్పులకు చివరి అవకాశం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా లోని అన్ని యాజమాన్యాల ప్రభుత్వ, ఇతర గుర్తింపు పొందిన పాఠశాలల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్ష మార్కుల జాబితా వివరాల్లో అవసరమైన సవరణలకు ఈ నెల 10వ తేదీ వరకూ చివరి అవకాశం కల్పించారు. డీఈఓ కంది వాసుదేవరావు మంగళవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ప్రధానోపాధ్యాయులందరూ విద్యార్థుల వివరాలను జాగ్రత్తగా సరి చూసుకుని, ఏవైనా సవరణలుంటే గడువులోగా హెచ్ఎం లాగిన్ల ద్వారా సమర్పించాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు, విద్యా ర్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్ఈ.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. -
డ్రైవింగ్లో అప్రమత్తంగా ఉండాలి
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): వాహనాల డ్రైవింగ్లో అప్రమత్తంగా ఉండాలని జిల్లా రవాణా అధికారి కె.శ్రీధర్ అన్నారు. తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదన్నారు. బడి బస్సు డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలన్నారు. వాహనాలపై ఈ నెలలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని, అక్రమ గ్రావెల్ రవాణా వంటి వాటిపై విస్తృత తనిఖీలు చేపట్టామని చెప్పారు. జిల్లా రవాణా శాఖ వార్షిక ఆదాయ లక్ష్యం రూ.13.40 కోట్లు కాగా, ఇప్పటి వరకూ 9 వేల కేసులు నమోదు చేసి, రూ.3 కోట్ల వరకూ జరిమానా విధించామని వివరించారు. రహావీర్(గుడ్ సమరిటన్ చట్టం–2016)పై అవగాహన పెంచుకోవాలన్నారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆసుపత్రుల్లో చేర్పిస్తే చట్టంలోని నిబంధనల ప్రకారం రూ.1.50 లక్షల వరకూ ఉచిత వైద్యం చేస్తారని చెప్పారు. సహాయం చేసిన వ్యక్తికి రహావీర్ కింద రూ.25 వేల ప్రోత్సాహకం అందజేస్తారని తెలిపారు. గోల్డెన్ అవర్లో చేర్చితే రవాణా శాఖ ద్వారా గ్యాలెంరట్రీ అవార్డు, నగదు బహుమతి ఇస్తారని చెప్పారు. వీరికి ఏవిధమైన పోలీసు కేసులు, కోర్టు సాక్ష్యాల వంటి భయం ఉండదని శ్రీధర్ స్పష్టం చేశారు. సమావేశంలో ఆర్టీఓ మురళీకృష్ణ, ఏఎంవీఐ నాగేంద్ర పాల్గొన్నారు. -
బాల్య వివాహాలు జరిగితే అధికారులపై చర్యలు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): రానున్న రోజుల్లో కౌమార గర్భధారణ, బాల్య వివాహాలు నమోదైతే సంబంధిత శాఖల అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ హెచ్చరించారు. జిల్లాలో కౌమార దశ గర్భధారణలు, బాల్య వివాహాల నివారణ, బాలల హక్కుల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ అంశంపై కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కౌమారదశ గర్భధారణలు, బాల్య వివాహాల నివారణను ఉద్యమంలా చేపట్టి, ఈ మహమ్మారిని జిల్లా నుంచి తరిమికొట్టేందుకు గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకూ ప్రతి అధికారీ చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆదేశించారు. బాలికల డ్రాపౌట్లపై విద్యా శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై పోలీసు అధికారులు తక్షణమే స్పందించి, కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కౌమారదశ గర్భధారణ నిర్మూలనపై రూపొందించిన పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఎన్యూమరేషన్ పత్రాలు నూరు శాతం పంపిణీ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా జిల్లాలో నూరు శాతం ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ పూర్తయ్యిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. అసెంబ్లీ నియోజవర్గాల ఈఆర్ఓలతో కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 1,640 పోలింగ్ కేంద్రాల పరిధిలోని 16,50,811 మంది ఓటర్లకు 100 శాతం ఎన్యూమరేషన్ పత్రాల పంపినీ పూర్తయ్యిందని చెప్పారు. ఇప్పటి వరకూ డిజిటలైజేషన్ ప్రక్రియ 60.30 శాతం మేర పూర్తయ్యిందని, ఏఈఆర్ఓలు, బీఎల్ఓలు, సూపర్వైజర్లు ఓటర్లకు పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ పత్రాలను తిరిగి స్వీకరించి, డిజిటలైజేషన్ చేసే ప్రక్రియను ముమ్మరంగా చేపట్టాలని ఆదేశించారు. వలస, షిఫ్టెడ్, డెత్ ఓటర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, వారికి కచ్చితంగా నోటీసులు జారీ చేయాలని సూచించారు. -
‘సర్’ను వేగవంతం చేయండి: జేసీ
కాకినాడ లీగల్: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం (సర్)ను వేగవంతం చేయాలని కాకినాడ సిటీ నియోజకవర్గ నోడల్ అధికారి, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆయన సర్ ప్రక్రియను పరిశీలించారు. నగర నియోజకవర్గంలో 46 శాతం మాత్రమే ఈ ప్రక్రియ డిజిటలైజేషన్ పూర్తయ్యిందని గమనించిన జాయింట్ కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోపు కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలని ఈఆర్వోలు, ఏఈఆర్వోలకు సూచించారు. ఒకవైపు ఓటర్ల నుంచి ఫారాలను స్వీకరిస్తూనే, మరోవైపు వాటిని వెంటనే డిజిటలైజేషన్ చేసేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి దశను ఈఆర్వోలు, ఏఈఆర్వోలు నిశితంగా పర్యవేక్షిస్తూ ఎలాంటి జాప్యం లేకుండా కార్యక్రమాన్ని పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈఆర్వో, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కేటీ సుధాకర్ మాట్లాడుతూ ఇప్పటికే ఏఈఆర్వోలు, సూపర్వైజర్లు, బీఎల్ఓలకు అవసరమైన మార్గదర్శకాలు జారీ చేశామని చెప్పారు. సమావేశంలో ఏఈఆర్వో, అర్బన్ తహసీల్దార్ జితేంద్ర, ఎన్నికల విభాగం డిప్యూటీ తహసీల్దార్ గోవిందరాజులు పాల్గొన్నారు. కూటమి సర్కారులో నిరుద్యోగులకు అన్యాయం ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు అమలాపురం టౌన్: కేజీ బేసిన్ పరిధిలోని ఐదు జిల్లాల ప్రయోజనాలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు ఆరోపించారు. దీనివల్ల నిరుద్యోగ యువతకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అమలాపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్సీ సోమవారం విలేకరులతో మాట్లాడారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కేజీ బేసిన్ ప్రయోజనాలపై నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేజీ బేసిన్ ద్వారా రావాల్సిన ఉద్యోగులను పట్టించుకోకపోవడంతో ఈ ప్రాంత నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. కేజీ బేసిన్లో లభ్యమవుతున్న సహజ వాయువుల నుంచి వచ్చే గ్రీజ్ టియర్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ ద్వారా ప్రభుత్వం యువతకు రుణాలు, రాయితీలు ఇచ్చి చిన్న కంపెనీలు పెట్టిస్తే నిరుద్యోగ సమస్య కొంత వరకు తగ్గుతుందన్నారు. అమలాపురంలో గ్యాస్ ఆధారిత ఇండస్ట్రీయల్ పార్కు కోసం జిల్లా కలెక్టర్ ఎస్టేట్ ల్యాండ్ ఎలకేట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఓఎన్జీసీ రిలేటెడ్గా సెల్ఫ్ ఎంప్లాయిమెంట్కు గ్యాస్ ఆధారిత ఇండస్ట్రీయల్ పార్కును ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. ఇలా చేస్తే కేజీ బేసిన్ పరిధిలోని నిరుద్యోగ యువతకు ముఖ్యంగా ఇంజినీరింగ్లో టెక్నికల్ అభ్యర్థులకు ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంటుందన్నారు. ఈ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. 15 నుంచి అమరావతి చాంపియన్షిప్ పోటీలు అమలాపురం రూరల్: హాకీ మాంత్రికుడు ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా ఆగస్టు 29న జరిపే జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో అమరావతి చాంపియన్షిప్ పోటీలు నిర్వహించనున్నారు. సోమవారం దీనికి సంబంధించిన పోస్టర్ను జాయింట్ కలెక్టర్ నిడియాదేవి, ఎంపీ గంటి హరీష్ మాధుర్, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి ఆగస్టు 26 వరకు మూడు దశల్లో పోటీలు ఉంటాయన్నారు. అండర్–17, 23 బాలురు, బాలికల విభాగాల్లో నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, బాస్కెట్బాల్, చెస్, హాకీ, కబడ్డీ, ఖోఖో, వెయిట్ లిఫ్టింగ్, వాలీబాల్, యోగా తదితర 12 క్రీడాంశాల్లో పోటీలు ఉంటాయన్నారు. పనిచేయని బీఎల్ఓలపై చర్యలు తీసుకోండి అమలాపురం రూరల్: అమలాపురం నియోజకవర్గంలో జరుగుతున్న సర్ ప్రక్రియలో పనిచేయని బీఎల్ఓలపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. సోమవారం అమలాపురం కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్లో జాయింట్ కలెక్టర్ వైఖోం నైదియాదేవికి వైఎస్సార్ సీపీ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, జిల్లా బూత్ కమిటీ అధ్యక్షుడు చీకట్లు కిషోర్, జిల్లా ఎస్ఐఆర్ టాస్క్ఫోర్స్ సభ్యుడు తోరం గౌతంరాజా వినతిపత్రం అందించారు. పట్టణంలో 48వ బూత్లో బీఎల్ఏ ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఎ న్యూమనేషన్ పత్రాలు ఇవ్వకుండా, బయట వ్యక్తుల తో పంపుతున్నారని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన షె డ్యుల్ సమయం దగ్గర పడుతున్నా, సర్ ప్రక్రియ సక్రమంగా జరగడం లేదన్నారు. ఇక్కడ బీఎల్ఓను మా ర్పు చేసి, ప్రక్రియను పూర్తి చేయాలని వారు కోరారు. -
కోటితలంబ్రాల పంటగ కోసం..
ఎన్నాళ్లీ తిరుగుడు పీజీఆర్ఎస్పై ప్రజల పెదవివిరుపు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): సమస్యలతో విసుగుపోయాం.. ఎన్నో బాధలు అనుభవిస్తున్నాం.. వీటిపై అధికారులకు మొరపెట్టుకుంటున్నాం.. అయినా పరిష్కారం కానరావడం లేదని అర్జీదారులు మండిపడుతున్నారు. ప్రతి వారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)పై పెదవి విరుస్తున్నారు. ఎన్నాళ్లీ తిరుగుడు అంటూ మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే కాకినాడ కలెక్టరేట్లో సోమవారం కలెక్టర్ హరేంధిరప్రసాద్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లా నుంచి మొత్తం 347 అర్జీలు వచ్చాయి. నాలుగు సార్లు ఫిర్యాదు చేశా.. నా వ్యవసాయ భూమిని పక్కనే ఉన్న దేవదాయ శాఖ భూమిలో కలిపివేశారు. సర్వే చేయాలని రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నాను. ఇప్పటికే నాలుగుసార్లు అధికారులకు ఫిర్యాదు చేశాను. నా భూమి ఆన్లైన్లో చూపడం లేదు. దేవదాయ శాఖ, రెవెన్యూ అధికారులు పట్టించుకోవాలి. –ఎస్వీ హరికుమార్, ఇంజరం, తాళ్లరేవు మండలం పింఛను ఇప్పించండి కిడ్నీ, గుండె, లివర్ వంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్నాను. నా అనారోగ్య సమస్యల కారణంగా కుటుంబ సభ్యులు చాలా అవస్థలు ఎదుర్కొంటున్నారు. మందులకు నెలకు రూ. 10 వేల ఖర్చు అవుతుంది. పింఛన్ ఇవ్వాలని అధికారులకు స్థానికంగా వినతి అందించాను. ఏడాది నుంచి పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేస్తూనే ఉన్నాను. అయినా పింఛన్ ఇవ్వడం లేదు. –కంకణాల ప్రసాద్, సామర్లకోట ఎండనక, వాననక చెరువులు తవ్వుతారు.. తట్టెత్తి మట్టిని మోస్తారు.. పార పట్టి చెత్తను తీస్తారు.. శ్రమైక్య జీవనం సాగిస్తారు.. చెమట చిందించి సొంత ఊరిలోనే ఉపాధి పొందుతారు.. అలాంటి వారినీ చంద్రబాబు ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోంది. చేసిన పనులకు వేతనాలు ఇచ్చేందుకు మొండి వైఖరి అవలంబిస్తుంది. చేతిలో చిల్లిగవ్వ లేక, కూలీలకు ఆకలి కేకలే మిగులుతున్నాయి. గతమెంతో ఘనం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఉపాధి హామీ కూలీలకు బకాయిలు లేకుండా వారి ఖాతాల్లో వేతనాలు జమ అయ్యేవి. వారి శ్రమకు తగిన ఫలం ఎప్పుటికప్పుడు అందేది. ఇప్పుడు అందుకు విరుద్ధంగా పరిస్థితి తయారైంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు, నాలుగు నెలలకు పైగా కూలి సొమ్ము పెండింగ్ పెట్టడంతో కూలీలు ఇబ్బంది పడుతున్నారు. వ్యవసాయ పనులు లేని సమయంలో ఉపాధి పనులకు వస్తుంటే, ఇలా చేయడం సరికాదని వారంటున్నారు. కేంద్ర ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను సకాలంలో కూలీలకు జమ చేయడం లేదని పలువురు అంటున్నారు. ఇలా సామర్లకోట, పిఠాపురం, కరప, గోకవరం, జగ్గంపేట, గోకవరం, ఏలేశ్వరం కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని మండలాల్లో మూడు నెలలు, మరికొన్ని మండలాల్లో రెండు నెలలు కూలి సొమ్ము పడాల్సి ఉంది. గొల్లప్రోలు మండలంలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): చెమట చిందిస్తున్న శ్రమజీవులకు చంద్రబాబు ప్రభుత్వంలో కన్నీళ్లు తప్పడం లేదు. పొట్ట నింపుకొనేందుకు ఎండనక, వాననక పనులు చేసినా, ఉపాధి కూలీలకు వేతనాలు అందించపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో మొత్తం 1.59 లక్షల మంది ఉపాధి కూలీలు ఉన్నారు. వీరిలో 1.21 లక్షల మందికి జాబ్కార్డులు ఉన్నాయి. ఈ ఉపాధి హామీ పథకంలో పని చేసిన కూలీలకు సుమారు రూ.52 కోట్ల మేర కూలి బకాయిలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. సుమారు 92 వేల మంది కూలీలు తమ కష్టార్జితం కోసం ఎదురు చూస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే జూలై 1 నుంచి జాతీయ గ్రామీణ ఉపాధి పథకానికి వీబీజీ రాంజీ పథకంగా పేరు మార్చి అమలులోకి తెచ్చారు. ప్రస్తుతం ఈ పథకం కింద పనులు జరుగుతున్నాయి. అయితే పాత బకాయిలపై స్పష్టత లేకపోవడంతో కూలీలు ఆందోళన చెందుతున్నారు. కొత్త పనులు చేయాలా.. లేదా..? పాత డబ్బులు ఎప్పుడు ఇస్తారనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనులు లేని సమయంలో ఉపాధి పనులే తమకు ప్రధాన ఆధారమని కూలీలు చెబుతున్నారు. ఇప్పటికే చేసిన పనులకు వేతనాలు అందకపోవడంతో అప్పులు చేసి జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలల తరబడి కూలి సొమ్ము ఇవ్వకపోవడంతో తమ కుటుంబాల పోషణ కష్టం మారిందని కూలీలు మండిపడుతున్నారు. కొత్త పథకం అమలు చేస్తున్న అధికారులను పాత డబ్బుల మాట ఏంటని అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదని వాపోతున్నారు. పేరు మార్పు సరే.. ఇప్పటి వరకూ మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు ఉపాధి చూపేవారు. 1 నుంచి కేంద్ర ప్రభుత్వం దీని పేరును వీబీజీ రామ్జీగా మార్చింది. ప్రస్తుతం కూలీల హాజరు, పాత బకాయిలు అంతా కూడా కొత్త పథకం పేరుతోనే నమోదవుతున్నాయి. నెలలుగా బకాయిలు చెల్లించా ల్సి ఉండగా, ఆ డబ్బులు ఎప్పుడు పడతాయని కూలీ లు ఎదురు చూస్తుండగా, ప్రస్తుతం పేరు మార్పు కారణంగా తమ బకాయిలు ప్రభుత్వం ఇవ్వదనే అపోహ అందరిలో వెంటాడుతుంది. పథకం పేరు మార్పుతో ఇకపై కొత్త యాప్లోనే కూలీలు తమ ఉపాధి మస్తర్లు నమోదు చేసుకుంటున్నారు. పాత పేరుతో వేసిన మస్తర్లు, పనులు ప్రస్తుతం కొత్త యాప్లో కనిపించకపోవడంతో తాము కష్టపడి పనిచేసినా ప్రభుత్వం ఎసరు పెడుతుందనే ఆందోళన ఎక్కువైంది. ● ఆందోళన వద్దు జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పేరు వీబీజీ రామ్జీ పథకంగా మార్చారు. పేరు మార్చినా కూలీలకు ఎటువంటి ఇబ్బంది ఉండ దు. వారి బకాయి వేతనాలు తప్పక పడతాయి. ఈ విషయంలో ఎలాంటి ఆందోళన వద్దు. చేసిన ప్రతి పనికి డబ్బులు మంజూరు చేస్తాం. త్వరలోనే వారి ఖాతాల్లో సొమ్ము జమవుతుంది. –ఎస్.మధుసూదన్, డ్వామా పీడీ ●06కేకేడీ182: ఎస్.మధుసూదన్, డ్వామా పీడీ గోకవరం: భద్రాచలం, ఒంటిమిట్ట, అయోధ్య ఆలయాల్లో శ్రీరామ నవమి ఉత్సవాలకు ప్రత్యేక స్థానం ఉంది. అక్కడ నిర్వహించే శ్రీసీతారాముల కల్యాణానికి సంబంధించి కోటితలంబ్రాల కోసం పండించే పంటకు శ్రీకారం చుట్టారు. గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలో కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణం అప్పారావు ఆధ్వర్యంలో 16వ కోటి తలంబ్రాల జ్ఞాన యజ్ఞంలో భాగంగా ఎకరం పొలంలో కోటి తలంబ్రాల పంటను పండిస్తున్నారు. సోమవారం శ్రీరాముని వేషధారణతో పాటు జాంబవంతుడు, ఆంజనేయుడు, సుగ్రీవుడు, అంగదుడు వేషధారణలో భక్తులు రామనామ స్మరణతో పొలంలో దుక్కి దున్ని విత్తనాలు చల్లి నారుమడిని సిద్ధం చేశారు. ఈ కార్యక్రమం ఆద్యంతం భక్తిపారవశ్యంతో సాగింది. కళ్యాణం అప్పారావు మాట్లాడుతూ వచ్చే ఏడాది భద్రాచలం, ఒంటిమిట్ట, అయోధ్యలో నిర్వహించే సీతారాముల కల్యాణానికి తలంబ్రాల కోసం సుమారు 800 కిలోల ధాన్యం అవసరం అవుతుందన్నారు. ఇక్కడ నాటే వరి విత్తనాలను భద్రాచలంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీసుకువచ్చామన్నారు. ఇక్కడ పండించిన ధాన్యాన్ని ఆంధ్ర, తెలంగాణతో పాటు మరో మూడు రాష్ట్రాల్లోని ఐదు వేల మంది భక్తులకు పంపించి గోటితో ఒడ్లు ఒలిపించి తలంబ్రాలు సిద్ధం చేస్తామన్నారు. భద్రాచలానికి 16వ సారి, ఒంటిమిట్టకు 9వ సారి, అయోధ్యకు నాలుగోసారి ఈ తలంబ్రాలు పంపించామని చెప్పారు. తుని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న దస్తావేజు లేఖర్లు కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న దస్తావేజు లేఖర్లు ఫ ఉపాధి కూలీలకు వేతన బకాయిలు ఫ జిల్లాలో రూ.52 కోట్ల మేర పెండింగ్ ఫ సుమారు 92 వేల మందికి తప్పని పాట్లు -
సంస్కరణం
ఉపాధికి గండి ఇప్పటివరకు దస్తావేజుల తయారీ, స్లాట్ బుకింగ్, స్టాంప్ డ్యూటీ చెల్లింపులు, ఆన్లైన్ డేటా అప్లోడ్ వంటి సేవలను దస్తావేజు లేఖర్లు నిర్వహిస్తున్నారు. కొత్త విధానం అమల్లోకి వస్తే ఈ సేవలన్నీ ప్రైవేట్ సంస్థలకు వెళ్లే అవకాశం ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది దస్తావేజు లేఖర్లు, వారి సహాయకులు జీవనోపాధి కోల్పోతారనే ఆందోళన వ్యక్తమవుతోంది. జీఓ 396ను వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు ఈ నెల 6, 7 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా పెన్డౌన్ నిర్వహించాలని సంఘాలు నిర్ణయించాయి. ఫ రిజిస్ట్రేషన్ శాఖలో కొత్త జీఓ జారీ ఫ జిల్లాలో దస్తావేజు లేఖర్ల ఆందోళన ఫ జీవనోపాధి కోల్పోతామని ఆవేదన ఫ 6, 7 తేదీల్లో పెన్డౌన్కు పిలుపు కాకినాడ లీగల్: రాష్ట్ర ప్రభుత్వం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో సంస్కరణల పేరుతో జీఓ నంబరు 396ను తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో నేరుగా నిర్వహిస్తున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల సేవలను ఇకపై పబ్లిక్ – ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) విధానంలో చేపట్టేందుకు నిర్ణయించింది. ఈ విధానంతో సేవలు వేగవంతం అవుతాయని ప్రభుత్వం చెబుతుండగా, తమ ఉపాధికి ముప్పు వాటిల్లుతుందని దస్తావేజు లేఖర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ జీఓ ప్రకారం రాష్ట్రంలోని (పోలవరం, అల్లూరి జిల్లాలు మినహా) అన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ సర్వీస్ సెంటర్లు (ఆర్ఎస్కే) ఏర్పాటు చేయనున్నారు. పాస్పోర్ట్ సేవా కేంద్రాల తరహాలో సింగిల్ విండో విధానంలో పౌరులకు సేవలు అందించనున్నారు. కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ఆర్ఎస్కేలు ఏర్పాటు చేస్తారు. అక్కడ దస్తావేజుల తయారీ, డేటా ఎంట్రీ, అడ్వాన్స్ స్లాట్ బుకింగ్, స్టాంప్ డ్యూటీ చెల్లింపులు, పత్రాల పరిశీలన వంటి సేవలను ప్రైవేట్ సంస్థలే నిర్వహిస్తాయి. తుది రిజిస్ట్రేషన్కు సంబంధించిన ఆమోదం మాత్రం సబ్ రిజిస్ట్రార్ చేతుల్లోనే ఉంటుంది. ప్రతి దస్తావేజుపై రూ.2 వేల వరకు సేవా రుసుం వసూలు చేయనున్నట్లు జీఓలో పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా ఆధునిక సాంకేతికతతో వేగవంతమైన సేవలు అందుతాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇప్పటికే ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఫీజులు, స్టాంప్ డ్యూటీలు చెల్లిస్తున్న ప్రజలకు ఇది అదనపు భారం కానుంది. రిజిస్ట్రేషన్ శాఖలో ప్రతి దస్తావేజుపై ఇప్పటికే రూ.500 చొప్పున ఎమినిటీస్ ఫండ్ పేరుతో వసూలు చేస్తున్నారు. 2025–26లో కాకినాడ జిల్లాలోని తొమ్మిది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సుమారు 90 వేల దస్తావేజులు నమోదు కావడంతో సుమారు రూ.4.50 కోట్ల యూజర్ చార్జీలు వసూలయ్యాయి. ఈ నిధులతో కార్యాలయాల్లో మౌలిక సదుపాయాలు మాత్రం కల్పించలేదు. ఆస్తి వివాదాలకు ఆస్కారం దస్తావేజు రచన అనేది కేవలం కంప్యూటర్లో డేటా నమోదు చేయడం మాత్రమే కాదని నిపుణులు అంటున్నారు. స్థానిక ఆస్తుల చరిత్ర, పాత లింక్ దస్తావేజులు, సరిహద్దులు, హక్కుల వివరాలపై అవగాహన ఉన్న దస్తావేజు లేఖర్లు ఇప్పటివరకు వివాదాలకు తావులేకుండా పత్రాలు సిద్ధం చేస్తున్నారని చెబుతున్నారు. ఈ బాధ్యతలను ప్రైవేట్ సంస్థల సిబ్బందికి అప్పగిస్తే భవిష్యత్తులో ఆస్తి వివాదాలు పెరిగే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. పారదర్శకత లోపిస్తుంది రిజిస్ట్రేషన్ శాఖలో ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రజలకు భరోసా ఉంది. ఇప్పుడు ప్రైవేటు సంస్థలకు ఆస్తుల రిజిస్ట్రేషన్ అప్పగిస్తే, ప్రమాదకరంగా మారుతుంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ విధానంలో 15 నిమిషాలోన్లే దస్తావేజు ఇస్తున్నారు. ఈ తరుణంలో రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రైవేటీకరించడం వల్ల పారదర్శకత లోపిస్తుంది. –బీజే ప్రసాద్, రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంఘ గౌరవాధ్యక్షుడు, కాకినాడ వ్యతిరేకంగా ఉద్యమాలు పీపీపీ విధానానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘాలు నల్లబ్యాడ్జీలతో నిరసనలు, పెన్డౌన్ వంటి కార్యక్రమాలను చేపడుతున్నాయి. ఈ పనులపైనే ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది దస్తావేజు లేఖర్లు, స్టాంపు వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు, వారి వద్ద పనిచేసే సహాయకులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉంది. –చోడపునీడి గోవిందరావు, దస్తావేజు లేఖర్ల సంఘం అధ్యక్షుడు, కాకినాడ కొత్త విధానం తీసుకొస్తే, నలుగురికి ఉపయోగపడాలి.. నలుగురి పొట్టకొట్టేలా ఉండకూడదు.. చంద్రబాబు సర్కారు మాత్రం రెండో విధానాన్నే అమలు చేస్తోంది.. ప్రభుత్వం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో సంస్కరణల పేరుతో తీసుకొచ్చిన 396 జీఓ దస్తావేజు లేఖర్లకు గుదిబండ అయ్యింది.. వారి ఉపాధికి విఘాతంగా మారింది.. ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా వారంతా ఆందోళన బాట పట్టారు. -
సీడీపీఓ ఆత్మహత్యపై విచారణ
రాజవొమ్మంగి: రాజవొమ్మంగి సీడీపీఓగా పని చేస్తూ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆమె చికిత్స పొందుతూ మే నెల 6వ తేదీన మరణించింది. దీనిపై విచారణ జరుగుతోందని స్థానిక ఎస్సై వెంకట్రావు తెలిపారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీకాంత్రాజు కోర్టు ఇచ్చిన ఇంటెరిమ్ ఆర్డర్తో ఆదివారం రాజవొమ్మంగి స్టేషన్కు వచ్చారని ఎస్సై అన్నారు. కోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ఈ నెల 14 వరకు చెల్లుతుందన్నారు. కాగా సీడీపీఓ కేసు విచారణ నిమిత్తం పోలీసులకు సహకరించాలని, పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు స్టేషన్కు వెళ్లాలని కోర్టు శ్రీకాంత్రాజుకు షరతులు విధించడంతో ఆయన లాయర్ను వెంట పెట్టుకొని స్టేషన్కు వచ్చారని ఎస్సై అన్నారు. దీంతో శ్రీకాంత్రాజును విచారిస్తున్నామన్నారు. -
అంతకంతకూ ఆలస్యం
ఫ ఇంజినీరింగ్ ప్రవేశాలకు జాప్యం ఫ కౌన్సెలింగ్ షెడ్యూల్పై లేని స్పష్టత ఫ ఈఏపీ సెట్ ఫలితాలు వచ్చినా సాగని ప్రక్రియ బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే అన్ని పరీక్షలు ముగిశాయి. ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఇందులో ఇంజినీరింగ్ ప్రవేశాలు ప్రధానమైనవి. ఈఏపీ సెట్ ఫలితాలు పరీక్షల నిర్వహణ అనంతరం దాదాపు నెలన్నర తరువాత ఈ నెల 1న విడుదల చేశారు. రోజులు గడుస్తున్నా కౌన్సెలింగ్ షెడ్యూల్పై ఇంకా స్పష్టత ఇవ్వకపోవడంపై విద్యార్థులు నిరుత్సాహ పడుతున్నారు. ఇంకా ఫీజులు ఖరారు చేయకపోవడంతో షెడ్యూల్ విడుదల చేయలేదని కళాశాలల యాజమన్యాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే తెలంగాణలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రారంభం కాగా, తొలి విడత అడ్మిషన్లు ఈ నెల 10వ తేదీకి పూర్తి చేయనున్నారు. మన రాష్ట్రంలో ఇంకా ఏవిధమైన సమాచారం లేకపోవడంతో ఈఏపీ సెట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ప్రైవేట్, డ్రీమ్డ్ యూనివర్సిటీలు దాదాపు ప్రవేశాలు పూర్తి చేసుకున్నాయి. ప్రైవేట్ కళాశాలల యాజమన్యా కోటా సీట్లకు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ప్రవేశ పరీక్ష రాసి అర్హత సాధించిన వారు మాత్రం ఎదురుచూపులు చూస్తున్నారు. యాజమన్యా కోటాకు సైతం ప్రభుత్వం నిర్ణయించే ఫీజులే ప్రామాణికం. ఏపీ ఫీజు పర్యవేక్షణ కమిటీ (ఎపీఎఫ్ఆర్ఏంసీ)కి ఇంత వరకూ చైర్మన్ను నియమించలేదు. సభ్యుల ప్రక్రియ పూర్తి కాలేదు. ఈ నియామకం పూర్తయితే కళాశాలల ఆదాయ వ్యయాలు పరిశీలించి ఫీజులను నిర్ణయిస్తారు. కమిటీ నియామకానికి మంత్రి మండలి ఆమోదించి ఇప్పటికే మూడు నెలలు పూర్తయ్యింది. ఉన్నత విద్యా సంస్థ మూడేళ్లకొకసారి ఫీజులు నిర్ణయిస్తారు. గతంలో నిర్ణయించిన ఫీజులు 2025–26 విద్యా సంవత్సరంతో ముగిసింది. 2026–27 నుంచి మరో మూడేళ్లకు ఫీజులు నిర్ణయించేందుకు సమయం లేదనుకుంటే పాత వాటినే ఈ ఏడాది కొనసాగిస్తామనే జీఓ ఉన్నత విద్యాశాఖ ఇవ్వాల్సిన అవసరం ఉంది. పాత ఫీజులనే అమలు చేస్తుందా.. లేకుంటే పెంచుతారా అనే అంశంపై సందిగ్ధత నెలకొంది. ఇంజినీరింగ్ కళాశాలలు కనీస ఫీజు రూ.40 వేలుగా నిర్ణయించగా, ఈ ఏడాది కనీస ఫీజు రూ.60 వేలు ఉండాలని యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇంజినీరింగ్ ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల కాకముందే కళాశాలలు అడ్మిషన్లపై హడావుడి చేస్తున్నాయి. పెద్ద పెద్ద హోర్డింగ్లు ఏర్పాటు చేసి మరీ ప్రచారానికి దిగుతున్నాయి. ఈఏపీ సెట్ రాసిన వారి వివరాలు జిల్లా దరఖాస్తులు హాజరు ఉత్తీర్ణత కాకినాడ 5,706 (ఇంజినీరింగ్ 5,469 4,090 2,975 (ఫార్మశీ) 2,733 2,455 తూర్పు 8,836 (ఇంజినీరింగ్) 8,477 6,747 గోదావరి 2.680 (ఫార్మశీ) 2,493 2,317 కోనసీమ 3.302 (ఇంజినీరింగ్) 3,199 2,323 1,320 (ఫార్మశీ) 1,200 1,096 మూడింతల వసూలు ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో యాజమన్యా కోటా సీట్ల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించే ఫీజులే ఆధారం. కన్వీనర్ కోటాపై మూడింతలు వసూలు చేసుకునే అవకాశం యాజమాన్యాలకు ఉంది. దీని ప్రకారమే ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ఒప్పందాలు చేసుకుంటాయి. గతేడాది కన్వీనర్ కోటా కంటే 20 శాతం పైగా ఎక్కువగా చూపి మూడింతలు వసూలు చేస్తున్నారని కొంత మంది విద్యార్థులు తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఫీజులు నిర్ణయిస్తేనే యాజమాన్య కోటా కింద ఎంత చెల్లించాలో స్పష్టత వస్తుంది. ఉమ్మడి జిల్లాలో రెండు ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలల్లో 950 సీట్లతో పాటు, 26 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో దాదాపు 15 వేల సీట్లు ఉన్నాయి. -
సమాచార శాఖ డీడీగా పద్మజ బాధ్యతలు
బోట్క్లబ్: జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ నూతన డిప్యూటీ డైరెక్టర్గా బి.పద్మజ ఆదివారం కాకినాడ డీపీఆర్వో కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. కడప జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తున్న ఆమె పదోన్నతిపై ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కలెక్టర్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులను సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. భక్తజన సంద్రంలా రత్నగిరి అన్నవరం: స్థానిక శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆదివారం భక్తజన సంద్రంగా మారింది. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, రెండు వేల వ్రతాలు జరిగాయి. సత్యదేవుని దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. ఈ ఒక్కరోజు దేవస్థానానికి రూ. 35 లక్షల ఆదాయం సమకూరింది. ఆరు వేల మంది స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించారు. లోవలో భక్తుల సందడి తుని రూరల్: తలుపులమ్మ లోవ అమ్మవారి దేవస్థానం ఆదివారం భక్తులతో నిండిపోయింది. వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో 25 వేల మంది భక్తులు తరలివచ్చి, అమ్మవారిని దర్శించుకున్నట్టు కార్యనిర్వహణ అధికారి పి.విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసా దాల విక్రయం ద్వారా రూ.2,64,525, పూజా టికెట్లకు రూ.4,15,984, కేశఖండనశాలకు రూ.18,160, వాహన పూజలకు రూ.21,116, వసతి గదులు, కాటేజీల అద్దెలు రూ.96,600, విరాళాలుగా రూ.14,660, వేద ఆశీర్వచనాలకు రూ.10,602 వచ్చిందని ఈఓ వివరించారు. విఘ్ననాయకా భజేహం అయినవిల్లి: విఘ్నాలను తొలగించే అయినవిల్లి విఘ్నేశ్వర స్వామివారిని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామికి తెల్లవారు జామున మేలుకొలుపు సేవ, విశేష పూజలను ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి చేశారు. స్వామివారికి ఇరువురు జంటలు పంచామృతాభిషేకాలు, 34 మంది లఘున్యాస అభిషేకాలు చేశారు. శ్రీలక్ష్మీగణపతి హోమంలో 19 మంది భక్తులు పాల్గొన్నారు. 19 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం, ముగ్గురికి అన్నప్రసన, 10 మందికి తులాభారం, 40 మంది వాహన పూజలు చేయించుకున్నారు. 2,250 మంది స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ ఒక్కరోజు ఆలయానికి రూ.3,08,106 ఆదాయం సమకూరిందని ఆలయ అసిస్టెంట్ కమిషనర్, ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.ఐటీఐలో సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ ముమ్మిడివరం: 2026–27 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో చేరేందుకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 8 నుంచి 12 వరకు కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల కన్వీనర్ ఎం.వేణుగోపాల వర్మ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. రెండు జిల్లాల్లో 1,831 మంది నుంచి ఆన్లైన్ దరఖాస్తులు వచ్చాయన్నారు. కౌన్సెలింగ్కు హాజరయ్యే అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. కౌన్సెలింగ్లో మిగిలిన సీట్లకు 13, 14 తేదీల్లో ఇతర అభ్యర్థులతో భర్తీ చేస్తామని తెలిపారు. -
సోమవారం శ్రీ 6 శ్రీ జూలై శ్రీ 2026
కడలిలో కలిపేసుకుని.. ఆశల సౌధం అలలకు కరిగిపోతోంది.. పేర్చిన ఇటుక ఒక్కొక్కటిగా కూలిపోతోంది.. చివరికి కడలిలో కలసిపోతోంది. జ్ఞాపకాల పునాదిని మిగుల్చుతోంది.. ఉప్పాడ తీరంలో మత్స్యకారుల జీవన విధానానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వంలో ఉప్పాడ తీర రక్షణకు నిర్మించిన రక్షణ గోడ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. ప్రజల ఆస్తులకు రక్షణ కవచంలా నిలిచింది. ఆనక పర్యవేక్షణ లేక ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. రక్షణ గోడ మూడొంతులు సముద్రంలో కలిసిపోయింది. తుపాన్లు వచ్చినప్పుడల్లా ప్రజాప్రతినిధుల హామీలు తప్ప, ఆచరణ లేక ఆస్తులు, విలువైన భూములు, ప్రభుత్వ భవనాలు ఇలా కడలిలో కలిసిపోతున్నాయి. -
బదిలీ అయినా.. బాదరబందీయే!
● సర్దుబాటు ప్రక్రియ కోసం ఎదురుచూపులు ● ఉమ్మడి జిల్లాలో 608 మిగులు పోస్టులు రాయవరం: పాఠశాల విద్యాశాఖలో గత ఏడాది బదిలీ అయిన ఉపాధ్యాయుల్లో సుమారు 100 మంది వరకు ఇప్పటికీ పాత పాఠశాలల్లోనే పనిచేస్తున్నారు. బదిలీ ఆర్డర్లు తీసుకున్న వెంటనే కొత్త స్థానాల్లో రిపోర్టుచేసి తిరిగి పూర్వ పాఠశాలలకు వచ్చి ఇక్కడే పనిచేస్తున్నారు. కొత్తగా పోస్టింగ్ వచ్చిన పాఠశాలలకు పంపాలని వారు కోరుతున్నా విద్యాశాఖ నుంచి స్పందించలేదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు ఎనిమిదేళ్లపాటు వివిధ ప్రాంతాల్లో పనిచేసిన టీచర్లు గత ఏడాది జూన్లో చేపట్టిన బదిలీల్లో వారు కోరుకున్న ప్రాంతాలకు వెళ్లారు. కానీ వారి సంతోషం ఎంతోసేపు నిలవలేదు. కారణం వారు ప్రస్తుతం పనిచేసే స్థలానికి మరో టీచర్ రాకపోవడమే. వారు వస్తే కానీ వీరు రిలీవ్ కారు. వారిలో అత్యధికులు హిందీ స్కూల్ అసిస్టెంట్లే ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో హిందీ టీచర్లకు కొరత ఉంది. గత ఏడాది డీఎస్సీలో ఈ పోస్టులను పూర్తిస్థాయిలో భర్తీ చేయలేదు. ప్రత్యామ్నాయంగా టీచర్లు లేకపోవడంతో వారిని రిలీవ్ చేయవద్దని సంబంధిత హెచ్ఎంలను విద్యాశాఖ ఆదేశించింది. కానీ వారి జీతాలు మాత్రం బదిలీ అయిన పాఠశాలల నుంచే తీసుకుంటున్నారు. దీనివల్ల భవిష్యత్తులో బదిలీలకు వచ్చే వెయిటేజ్ పాయింట్లలో కోత పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిగులు జాబితాకు ఎదురుచూపు పాఠశాల విద్యాశాఖ చేపట్టిన మిగులు టీచర్ల సర్దుబాటు ప్రక్రియ మండల స్థాయిలో దాదాపుగా పూర్తి కావొచ్చింది. మండల స్థాయిలో సర్దుబాటు పూర్తి చేసిన అధికారులు ఆమోదం కోసం జిల్లా విద్యాశాఖకు, అక్కడి నుంచి రాష్ట్ర ఉన్నతాధికారులకు పంపించారు. సవరణ షెడ్యూల్ ప్రకారం మండల స్థాయిలో కౌన్సెలింగ్ చేసి, అవసరం ఉన్న స్థానాలకు సర్దుబాటు చేయాల్సి ఉంది. సీనియారిటీ జాబితాల కోసం ఎంఈవోలు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఆదివారం డీఈవో లాగిన్కు చేరుకున్నట్లుగా సమాచారం వచ్చింది. మొదటి షెడ్యూల్ అడుగు ముందుకు పడకుండానే ముగిసిపోగా, రెండవ షెడ్యూల్ను ప్రకటించి, శుక్రవారం జిల్లాలోని హైస్కూల్ ఫ్లస్ టీచర్లకు కౌన్సెలింగ్ చేసి ఆప్షన్ ఇచ్చిన సబ్జెక్టు టీచర్లకు స్థానాలు కేటాయించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మిగులు పోస్టుల జాబితా ఉమ్మడి జిల్లా డీఈవో వెబ్సైట్లో పొందుపరచి 608 మంది టీచర్లు ఉన్నట్టుగా తేల్చారు. తూర్పుగోదావరి జిల్లాలో 201, కోనసీమ జిల్లాలో 136, కాకినాడ జిల్లాలో 255, పోలవరం జిల్లాలో 26 టీచర్ పోస్టులు మిగులు ఉపాధ్యాయులుగా ఉన్నారు. నేడు మండల స్థాయిలో కౌన్సెలింగ్: మిగులు టీచర్లుగా ఉన్న వారికి సోమవారం మండల స్థాయిలో ఎంఈవోలు కౌన్సెలింగ్ చేసే అవకాశముంది. మండల స్థాయిలో ఉన్న ఖాళీలకు మించి మిగులు ఉపాధ్యాయులు ఉంటే తర్వాత రోజు డివిజన్ స్థాయిలో కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశముంది. జిల్లాల వారీగా ఎస్జీటీ, ఎస్ఏ నాన్ లాంగ్వేజ్ మిగులు పోస్టులు ఇలా: జిల్లా ఎస్జీటీ గణితం పీఎస్ బీఎస్ ఎస్ఎస్ తూర్పు 111 15 11 13 10 కోనసీమ 77 12 08 09 07 కాకినాడ 162 18 19 12 09 పోలవరం 10 01 00 02 02 జిల్లాల వారీగా ఎస్ఏ లాంగ్వేజ్ మిగులు టీచర్లు.. జిల్లా ఇంగ్లీషు తెలుగు హిందీ తూర్పు 16 17 08 కోనసీమ 10 12 01 కాకినాడ 10 10 15 పోలవరం 08 03 00 -
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో డిగ్రీ కళాశాలల వివరాలు
● ఏప్రిల్లోనే ఇంటర్ ఫలితాలు ● డిగ్రీ ప్రవేశాలకు ఇప్పటికీ వెలువడని నోటిఫికేషన్ ● రెండున్నర నెలలుగా నిరీక్షిస్తున్న విద్యార్థులు ● ఎడతెగని జాప్యంతో కళాశాలల్లో మిగిలిపోతున్న సీట్లు ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల లబ్ధి కోసమే.. ప్రైవేటు, కార్పొరేట్ ఇంజినీరింగ్ కళాశాలలకు లబ్ధి చేకూర్చేందుకే ప్రతి ఏటా డిగ్రీ కళాశాలల నోటిఫికేషన్ కావాలని జాప్యం చేస్తున్నారు. దీని వలన డిగ్రీ చదవాలనుకునే విద్యార్థులకు నష్టం కలుగుతుంది. – బి.సిద్ధూ, రాష్ట్ర సహ కార్యదర్శి, పీడీఎస్యూ, వెదురుపాక, రాయవరం మండలం నోటిఫికేషన్ విడుదల కావాలి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అభ్యర్థులు అడ్మిషన్కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. త్వరలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముంది. – డాక్టర్ టీకేవీ శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మండపేట రాయవరం: డిగ్రీ అడ్మిషన్లపై చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లుగా గందరగోళాన్ని సృష్టిస్తోందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. డిగ్రీ అడ్మిషన్లపై ఇప్పటి వరకూ ఎటువంటి నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం దీనికి బలం చేకూరుస్తోంది. ఇంటర్మీడియెట్ ఫలితాలు ఏప్రిల్ 15న విడుదలయ్యాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 36,450 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. సప్లిమెంటరీ ఫలితాలు సైతం జూన్ 18న విడుదలయ్యాయి. ఇంటర్ ఫలితాలు విడుదలై రెండున్నర నెలలు దాటుతున్నా డిగ్రీ ప్రవేశాలకు ఉన్నత విద్యా మండలి ఇప్పటి వరకూ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. దీంతో, డిగ్రీ ప్రవేశాలకు అసలు నోటిఫికేషన్ ఎప్పుడిస్తారు.. ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుంది.. తరగతులు ఎప్పుడు ప్రారంభిస్తారనే దానిపై విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. అడ్మిషన్లు ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియక పలువురు విద్యార్థులు కళాశాలల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నోటిఫికేషన్ రాకపోవడంతో ఆ విద్యార్థుల పేర్లు, ఫోన్ నంబర్లు తీసుకుని సిబ్బంది వెనక్కి పంపిస్తున్నారు. ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరికకు కౌన్సెలింగ్ షెడ్యూల్ సైతం ప్రకటించారు. కానీ, డిగ్రీ ప్రవేశాలకు మాత్రం నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎప్పుడా అని నిరీక్షిస్తున్నారు. రెండేళ్లుగా ఇదే పరిస్థితి డిగ్రీ తరగతులు 2024–25 విద్యా సంవత్సరంలో ఆగస్టు నెలాఖరుకు ప్రారంభం కాగా, గత విద్యా సంవత్సరంలోనూ అదే పరిస్థితి ఉంది. ఆగస్టు 20న నోటిఫికేషన్ విడుదలవగా, సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభించారు. ఈ ఏడాదైనా జూన్లో అడ్మిషన్లు ప్రారంభిస్తారని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు ఆశించాయి. కానీ, ప్రభుత్వం ఆ విషయాన్నే మరచినట్టు కనిపిస్తోంది. అడ్మిషన్లలో ఎడతెగని జాప్యం జరుగుతూండటంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా డిగ్రీ కళాశాలల్లో వేలాదిగా సీట్లు మిగిలిపోతున్నాయి. ఆదికవి నన్నయ యూనివర్సిటీ పరిధిలోని ఈ 171 డిగ్రీ కళాశాలల్లో మొత్తం 53,978 సీట్లు ఉండగా.. గత విద్యా సంవత్సరంలో 20,277 మంది విద్యార్థులు మాత్రమే అడ్మిషన్లు పొందారు. మిగిలిన 33,701 సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి.జిల్లా ప్రభుత్వ ప్రభుత్వ ప్రైవేటు ప్రైవేటు అన్ మహిళా కళాశాలలు మొత్తం సీట్లు గత ఏడాది ఖాళీ అటానమస్ అటానమస్ ఎయిడెడ్ ఎయిడెడ్ ప్రభుత్వ ప్రైవేటు అడ్మిషన్లు సీట్లు తూర్పుగోదావరి 6 1 0 1 39 2 4 16,770 6,748 10,022 కాకినాడ 5 2 1 2 44 0 7 22,206 9,834 12,372 కోనసీమ 7 0 1 0 45 0 4 15,002 3,965 11,037 -
భక్తులతో సత్యగిరి కిటకిట
● సత్యదేవుని దర్శించిన 40 వేల మంది ● 2,500 వ్రతాల నిర్వహణ అన్నవరం: సత్యదేవుని ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. రాష్ట్రంలో వివాహాలు జరుగుతుండడంతో నవ దంపతులు, వేలాదిగా బంధుగణంతో స్వామివారి దర్శనానికి వస్తుండడంతో పార్కింగ్ స్థలాలు వాహనాలతో నిండిపోయాయి. ఘాట్ రోడ్డు సైతం భక్తులతో నిండిపోవడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారి దర్శనానికి రావడంతో క్యూలైన్లు, వ్రత మండపాలు నిండిపోయాయి. స్వామివారి దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట సమయం పట్టింది. భక్తులు సప్తగోకులంలో శ్రీకృష్ణుడు, గోవులకు ప్రదక్షిణ చేసి పూజలు చేశారు. స్వామివారి వ్రతాలు 2,500 జరిగాయని, ఆలయానికి రూ.40 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. సుమారు ఆరు వేల మంది అన్న ప్రసాదం స్వీకరించారు. -
ప్రభుత్వం ఆదుకోవాలి
కనీస పెట్టుబడులు రాక తీవ్రంగా నష్టపోతున్నాం. అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకుని పట్టు రైతును ఆదుకోవాలి. లేకపోతే గొల్లప్రోలు మండలంలో పట్టు సాగు లేకుండా పోయే పరిస్థితి ఎదురవుతుంది. – వులవకాయల రాంబాబు, పట్టు రైతు, చేబ్రోలు, గొల్లప్రోలు మండలం ప్రత్యేకత ఉన్న పంటను పట్టించుకోపోతే ఎలా? పట్టు పరిశ్రమ అంటే దేశంలోనే అత్యంత ప్రాధాన్యమైనది. ఈ సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం ఇవ్వకపోవడం దురదృష్టకరం. గత వైఎస్సార్ సీపీ హయాంలో పాత బకాయిలతో సహా ఇన్సెంటివ్ ఇచ్చి ఎక్కువ ధర వచ్చేలా చూసి పట్టు గూళ్లు ఇక్కడే కొనుగోలు జరిగేలా ప్రాధాన్యం ఇచ్చాం. ఇప్పుడు కనీసం పట్టించుకోడం లేదు. ఇచ్చిన హామీలు విస్మరించారు. దానికి నిదర్శనమే పట్టు సాగు తగ్గిపోవడం. బకాయిలు వెంటనే విడుదల చేయాలి. లేకపోతే రైతులతో కలిసి పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. – వంగా గీత, వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్, పిఠాపురం -
శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్పై ఫిర్యాదు
భూ వివాదం పరిష్కరిస్తానని రూ.10 లక్షలు తీసుకున్నారని ఆరోపణ కాకినాడ రూరల్: టీడీపీ నేత, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబుపై కాకినాడ సంతోష్నగర్కు చెందిన చింతాకుల విజయ్ గాంఽధీ శనివారం రాష్ట్ర మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి పి.నారాయణకు ఫిర్యాదు చేశారు. స్థానిక శశికాంత్నగర్లో నిర్వహించిన టీడీపీ నాయకుల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనకు విజయ్గాంధీ ఫిర్యాదు అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పేరిట రాసిన ఫిర్యాదులో తమ కుటుంబానికి చెందిన భూ వివాదంలో ప్రయోజనం కలిగేలా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పిస్తానని సత్తిబాబు నమ్మించడంతో గత ఏడాది ఫిబ్రవరిలో రూ.10 లక్షలు ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి సొమ్ము బదిలీ వివరాలు, సత్తిబాబు వాట్సప్ సందేశాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. రోజులు గడుస్తున్నా సమస్య పరిష్కారం అవ్వలేదని, సత్తిబాబును అడిగితే దాటవేసే ప్రయత్నం చేస్తున్నాడని పేర్కొన్నారు. న్యాయం చేస్తారని నమ్మకంతో ఫిర్యాదు చేశామని విజయ్ గాంధీ పేర్కొన్నారు. ఫిర్యాదుపై మంత్రి నారాయణ సానుకూలంగా స్పందించారు. ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వరూ పెద్దాపురం: మండలంలోని ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో ఎన్యూమరేషన్ ఫారాలు అందక ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు. గ్రామంలో సుమారు 2400 పైగా ఓటర్లు ఉండగా అందులో 200 మందికి పైగా ఎన్యూమరేషన్ ఫారాలు అందలేదని గ్రామానికి చెందిన మిరియాల సూరిబాబు అవేదన వ్యక్తం చేశారు. సర్ కార్యక్రమంపై క్షేత్రస్థాయిలో అధికారులు పారదర్శకంగా పనిచేసేలా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు. శృంగార వల్లభుని ఆదాయం రూ.1.9 లక్షలు సామర్లకోట: పెద్దాపురం మండల పరిధిలోని తిరుపతి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ, భూ సమేత శృంగారవల్లభ స్వామి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి దర్శనానికి వివిధ గ్రామాల నుంచి భక్తులు కాలి నడకన వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. తెల్లవారు జామున స్వామివారి తొలి హారతిని తిలకించడానికి భక్తులు పోటీ పడ్డారు. అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు పూజాదికాలు నిర్వహించారు. సుమారు 12 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.1,26,880 అన్నదాన విరాళాలు రూ.37,091, కేశ ఖండన ద్వారా రూ.4,480, తులాభారం ద్వారా రూ.400, లడ్డు ప్రసాదం విక్రయం ద్వారా రూ.21,675తో కలిపి రూ.1,90,526 ఆదాయం వచ్చిందని ఈఓ వివరించారు. మూడు వేల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. మాజీ సర్పంచ్ మొయిలి కృష్ణమూర్తి, ట్రస్టు బోర్డు చైర్మన్ మొయిలి సంధ్య తదితరులు సేవలందించారు. 8న రాజగోపురంపై కలశ ప్రతిష్ఠ తుని రూరల్: తలుపులమ్మ తల్లి లోవ దేవస్థానంలో కొత్తగా నిర్మించిన ఐదు అంతస్తుల రాజగోపురంపై ఈ నెల ఎనిమిదో తేదీన కలశ ప్రతిష్ఠ చేయనున్నట్టు ఈఓ పి.విశ్వనాథరాజు శనివారం తెలిపారు. రూ.2.6 కోట్లతో నిర్మించిన రాజగోపురంపై 108 దేవీ అవతారాల విగ్రహాలు తీర్చిదిద్దారు. ఆరో తేదీన విఘ్నేశ్వర పూజతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమై ఏడున మంటపారాధనలు, శిఖర యంత్ర హవనం, హోమం, జపాలు నిర్వహిస్తారు. ఎనిమిదో తేదీ ఉదయం 9.55 గంటలకు శిఖర కలశ స్థాపన చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
‘పట్టు’ రైతులను ఆదుకోండి
పిఠాపురం: పట్టు పరిశ్రమను పట్టించుకోకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని, తమకు న్యాయం చేయాలని గొల్లప్రోలు మండలం చేబ్రోలు రైతులు శనివారం కలెక్టర్ హరేంధిరప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. కూటమి పాలనలో పట్టు పరిశ్రమ మూతపడే పరిస్థితికి రావడంతో శుక్రవారం వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి వంగా గీతకు రైతులు వినతి పత్రం అందజేశారు. ఈ నేపథ్యంలో వారి సమస్యలను కలెక్టర్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు శనివారం ఆమె రైతులతో కలిసి సమస్య వివరించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 40 ఏళ్లుగా పట్టు పరిశ్రమతో మమేకమై సుమారు 300 పట్టు పురుగుల పెంపక షెడ్లలో పట్టు పురుగులు పెంచుతూ జీవనోపాధి పొందుతున్నామన్నారు. నేడు ఈ పరిశ్రమ అనేక సమస్యలతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుండటంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. రూ.4 కోట్ల పట్టుగూళ్ల ఇన్సెంటివ్లు బకాయిలు ఉన్నాయని పేర్కొన్నారు. చేబ్రోలు పట్టుగూళ్ల మార్కెట్ శిథిలావస్థకు చేరుకుందని వర్షాలు పడితే గూళ్లు తడిసిపోతున్నాయని, తక్షణం మరమ్మతులు చేయాలని, అసంపూర్తిగా ఉన్న మార్కెట్ భవనాన్ని పూర్తిచేయాలని కోరారు. పట్టుగూళ్లకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. తమ సమస్యలు పరిష్కరించి పట్టు పరిశ్రకు పూర్వ వైభవం తీసుకురావాలని రైతులు కలెక్టర్ను కోరారు. యాప్తో ఇబ్బందులు పడుతున్నాం ఎరువుల సరఫరా కోసం అమలు చేస్తున్న యాప్ వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు కలెక్టర్కు వివరించారు. యాప్పై రైతులకు తగిన అవగాహన, ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడం, ప్రతి రైతు వద్ద స్మార్ట్ఫోన్ సౌకర్యం లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నట్టు వారు పేర్కొన్నారు. సర్వర్ సాంకేతిక లోపాలు, ఎరువుల ఎంపిక సమయంలో ధరలు, పూర్తి వివరాలు అందుబాటులో లేకపోవడం ఇబ్బంది పడుతున్నట్టు పేర్కొన్నారు. యాప్ విధానాన్ని రద్దు చేసి, గతంలో అమలులో ఉన్న సాధారణ పద్ధతిలో ఎరువులు అందించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. ఈ మేరకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వులవకాయల నాగ లోవరాజు, గొల్లపిల్లి నానాజీ, ఒ.చక్రధరుడు, పలువురు రైతులు పాల్గొన్నారు.కలెక్టర్కు వంగా గీత, రైతుల వినతి -
కూటమి పాలనలో రైతులకు కష్టాలే..
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): తొలకరి ప్రారంభమైంది.. సాగుకు సమయం ఆసన్నమైంది.. ఈ నేపథ్యంలో జిల్లాలో కీలకమైన వ్యవసాయ శాఖ అధికారి పోస్టు ఖాళీగా ఉండడంతో ఇబ్బంది ఎదురవుతోంది. ఈ కుర్చీ కోసం పోటీ కారణంగా తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారుల నియామకంపై చంద్రబాబు సర్కారు కాలయాపన చేస్తుంది. జిల్లా వ్యవసాయ శాఖ అధికారిగా పనిచేసిన విజయ్కుమార్ గత నెల 30న ఉద్యోగ విరమణ చేశారు. ఆయన స్థానంలో కొత్తగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని నియమించాల్సి ఉండగా, మూడు రోజులైనా ఎవరినీ కేటాయించలేదు. కనీసం వ్యవసాయ శాఖ ఏడీకి కూడా ఇన్చార్జి ఉత్తర్వులు కూడా ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఖరీఫ్ పనులు ముమ్మురం అయ్యాయి. ఒకపక్క రైతులు ఎరువుల కోసం అనేక ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన యాప్తో రైతులు ఎరువుల కోసం నానా అవస్థలు పడుతున్నారు. మొబైల్ ఫోన్లలో ప్రత్యేక యాప్ ద్వారా ఇండెంట్ పెట్టుకున్న వారికి మాత్రమే ఎరువులు సరఫరా చేయడంతో రైతులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. యాప్లో ఎరువులు బుకింగ్ జరగని రైతులకు నేరుగా అందించే ఏర్పాట్లు చేయాల్సి ఉంది. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాల్సిన బాధ్యత జిల్లా వ్యవసాయ శాఖాధికారికి ఉంది. ఇప్పుడు ఆ పోస్టు ఖాళీగా ఉండడంతో కీలక సమయంలో ఇబ్బంది ఎదురవుతోంది. జిల్లాలోని పలు మండలాలకు చెందిన వ్యవసాయ శాఖ ఏడీలు, మండల వ్యవసాయశాఖాధికారులు సైతం జిల్లా కార్యాలయానికి ఫోన్లు చేసి ఎవరిని నియమించారని అడుగుతుంటే, సమాధానం చెప్పలేక పోతున్నామని ఓ అధికారి తెలిపారు. ఆ ఇద్దరి మధ్య పోటీ జిల్లా వ్యవసాయ శాఖ అధికారిగా పనిచేసేందుకు ఇద్దరు అధికారుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. గతంలో జిల్లా వ్యవసాయ శాఖ డీడీగా పనిచేసిన వీటి రామారావు ఇక్కడకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన విజయనగరం జిల్లా వ్యవసాయ శాఖ అధికారిగా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆత్మ పీడీగా పనిచేస్తున్న రాబర్ట్ పాల్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. రామారావుకు మెట్టకు చెందిన ఓ ఎమ్మెల్యే మద్దతు ఉన్నట్లు సమాచారం. రాబర్ట్పాల్ సైతం ఇద్దరు ఎమ్మెల్యే మద్దతుతో గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరు నియమించాలో తెలియక వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో తర్జనభర్జన పడుతున్నట్లు తెలిసింది. పిఠాపురం: కూటమి పాలనలో కష్టాలు అనుభవిస్తున్నామని, తమకు న్యాయం చేయాలంటూ గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన పలువురు రైతులు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎంపీ వంగా గీతకు మొరపెట్టుకున్నారు. ఈ మేరకు ఆమెకు తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఆ రైతులు మాట్లాడుతూ పట్టు రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రూ.4 కోట్ల మేర బకాయిలు ఉన్నాయన్నారు. పంటలు నష్టపోవడం, తెగుళ్ల కారణంగా చాలా మంది రైతులు పట్టు పురుగులు పెంపకం వదిలేసి, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇన్సెంటివ్ బకాయిలు విడుదల చేస్తామని, ఈ ప్రాంతాన్ని సిల్క్ సిటీగా అభివృద్ధి చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికలు ముందు హామీ ఇచ్చారన్నారు. రెండేళ్లు గడిచినా ఆ హామీ నెరవేర్చలేదన్నారు. యాభై ఏళ్లుగా రెండు వేల ఎకరాల్లో మల్బరీ తోటలు పెంపకం, 300 షెడ్లలో పట్టు పురుగులు పెంపకం చేపట్టేవారమన్నారు. ఇప్పుడు 300 ఎకరాల్లో మాత్రమే తోటలు, 50 షెడ్లలో పురుగులు పెంపకం జరుగుతుందన్నారు. యాప్ల వల్ల రైతులకు ఎరువులు అందడం లేదని వాపోయారు. సాంకేతిక సమస్యలు, వెబ్ ల్యాండ్లో లోపాలతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు లేక ఎరువులు అందడం లేదన్నారు. గడచిన రెండేళ్ల నుంచి బీమా కూడా ఇవ్వలేదన్నారు. ఈ సమస్యలపై వంగా గీత స్పందిస్తూ తక్షణమే విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతులు అన్ని విధాలా అవస్థలు పడుతున్నారని అన్నారు. రైతులకు ఏ సమస్య వచ్చినా తాము ముందు ఉంటామన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు వులవకాయల నాగలోవరాజు, వైఎస్సార్ సీపీ నాయకులు, ములికే సత్యనారాయణ, ఓరుగంటి చక్రి, రవి, శ్రీను, లోకారెడ్డి అప్పన్నదొర, ఓరుగంటి సీతారామరాజు, నూజివీడు సూర్య, యలమంచిలి గంగారావు, శీరం పోతురాజు, వులవకాయల రాంబాబు, ఓరుగంటి ఈశ్వరుడు తదితరులు పాల్గొన్నారు. ఫ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నియామకంలో జాప్యం ఫ ఇద్దరి మధ్య గట్టి పోటీతో గందరగోళం! ఆదుకోవాలని మాజీ ఎంపీ గీతకు రైతుల వినతి -
రాష్ట్రంలో పసిబిడ్డలకు రక్షణ ఎక్కడ!
తుని రూరల్: రాష్ట్రంలో పసిబిడ్డలు, మహిళలకు రక్షణ కరువైందని, రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి తప్పిపోయి నెలరోజులవుతున్నా ఆచూకీ కనుగొనలేకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ అన్నారు. ఇందుకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్, పోలీసు వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకున్న మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారం ఆయిల్పామ్ తోటలో ఉన్న జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు సుంకర భవానీ, గణేష్లను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈ అంశంలో ముఖ్యమంత్రితో పాటు హోం శాఖను, పోలీసులను గుప్పెట్లో పెట్టుకుని నడిపిస్తున్న మంత్రి నారా లోకేష్ సిగ్గుపడాలన్నారు. రాష్ట్రంలో అనేక సంఘటనలు, లా అండ్ ఆర్డర్ సమస్యలు ఎలా ఉన్నాయో రోజూ ప్రజలు చూస్తున్నారని రామచంద్ర యాదవ్ చెప్పారు. దళితులు, బీసీలపై దాడులు పెరిగిపోయాయని అన్నారు. నిన్నటికి నిన్న ఒంగోలులో ఓ నాయీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి తన షాపులో ఉండగా, అధికార పార్టీకి చెందిన వ్యక్తి మద్యం తాగి వచ్చి కత్తితో గొంతు కోసి దాడికి పాల్పడడం దారుణమని అన్నారు. ఇటువంటి ఘటనలు అనేక జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని రామచంద్ర యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. వీటికి బాధ్యత వహించాల్సిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆ శాఖ తనది కాదని చెప్పి, తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లకు చిత్తశుద్ధి ఉంటే, టెక్నాలజీల గురించి మాట్లాడే మీరు తప్పిపోయిన పాపపై శ్రద్ధ పెట్టి ప్రత్యేక బృందాల ఏర్పాటుతో ఆచూకీ తెలుసుకుని తల్లిదండ్రులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఫ బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఫ జ్ఞానేశ్వరి ఆచూకీ తెలుసుకోకపోవడం ప్రభుత్వ వైఫల్యమే -
క్లోజారు పనులు
పిఠాపురం: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇలాకాలో క్లోజర్ పనులు ఇవి. ఇందులో అవినీతి కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. వరదల నుంచి రక్షణ కల్పించాల్సిన కాలువ గట్లను రూ.లక్షల నిధులు దిగమింగి కేవలం మట్టితో కప్పి ఇసుక బస్తాలతో అందంగా పేర్చి నీటిపారుదల శాఖ అధికారులు, జనసేన నేతలు ఇలా చేశారు. క్లోజర్ పనుల్లో భాగంగా పిఠాపురం మండలం రాపర్తి సమీపంలో ఏలేరు కాలువ గొర్రిఖండి వద్ద గట్టును అభివృద్ధి చేశారు. శుక్రవారం కురిసిన చిన్నపాటి వర్షానికే అండలు జారి జనసేన నేతల అవినీతిని బయటపెట్టింది. ఏలేరు నుంచి అదనపు జలాలు వదిలినా, భారీ వర్షాలు కురిసినా ఇక ఏమవుతుందో చూడాలి. వేలాది క్యూసెక్కుల నీటి ప్రవాహం ఇక్కడకు చేరుకుంటుంది. ఇక్కడ గట్టుకు గండి పడితే సుమారు 12 వేల ఎకరాలు నీటపాలవుతుంది. గత కొన్నేళ్లుగా వరదలు రావడం, పంటలు నష్ట పోవడం పరిపాటిగా మారింది. అలాంటి ప్రాధాన్యం ఉన్న గట్టుకు చేసిన మరమ్మతులు చినుకులకే గట్టు అండలు జారితే, పెద్ద వర్షం వస్తే అసలు గట్టే కనిపించదంటున్నారు రైతులు. ఏలేరు ఆయకట్టు పరిధిలో కాలువ మరమ్మతు పనుల్లో అవినీతి చోటు చేసుకుంటుందని, నాణ్యత మచ్చుకై నా కనిపించడం లేదని ఈ నెల 2న అవి‘నీటి’ జలగలు అనే శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో కథనం వెలువడిన విషయం తెలిసిందే. ఇలాంటి పనులతో తమ పంటలకు రక్షణ ఎక్కడ ఉంటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ప్రభుత్వ విధానాలతో నష్టం
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ప్రభుత్వ విధానాలే విశాఖ ఉక్కు పరిశ్రమలో ప్రమాదానికి కారణమని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవీ నాగేశ్వరరావు అన్నారు. విశాఖ ఉక్కు ప్రమాదంలో చనిపోయిన పది మంది కుటుంబాలకు రూ. కోటి, క్షతగాత్రులకు రూ.50 లక్షల పరిహారం అందించాలని, ప్రమాదంపై జ్యుడీషియల్ విచారించి నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రమాదానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే కారణమని విమర్శించారు. విధానాల రూపకల్పనలో ఏమాత్రం సంబంధం లేని ఆరుగురు చిరుద్యోగులను సస్పెన్షన్ చేసి, అసలు దోషులను రక్షిస్తున్నారన్నారు. బాధితులను పరామర్శించేందుకు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ వ్యవహార శైలి ప్రమాద మృతుల త్యాగాలను అవమానపరిచేలా ఉందన్నారు. పోరాడి, త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దువ్వా శేషబాబ్జి, చెక్కల రాజ్కుమార్, కోశాధికారి మలకా రమణ, సహాయ కార్యదర్శి చంద్రమళ్ల పద్మ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి కాకినాడ క్రైం: ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ ఎన్జీఓ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు కాకినాడ శాఖ కమిటీ చైర్మన్ గుద్దటి రామ్మోహనరావు ఆధ్వర్యంలో శుక్రవారం అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పలను కలసి పీఆర్సీ ఏర్పాటు, నాలుగు డీఏల విడుదల, ఇంటీరియల్ ఏర్పాటుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏపీఎన్జీఓ జిల్లా కార్యదర్శి పాలపర్తి మూర్తిబాబు, జేఏసీ సెక్రటరీ జనరల్ కేవీవీ నగేష్, ఎన్జీఓ నాయకులు మట్టపర్తి వెంకటేశ్వరరావు, కె.సతీష్, ఎన్వీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కిక్కిరిసిన రత్నగిరిఅన్నవరం: స్థానిక వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయం శుక్రవారం భక్తులతో కిక్కిరిసింది. ఉమ్మడి జిల్లాతో పాటు సత్యదేవుని సన్నిధిలో గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారుజామున పెద్దఎత్తున వివాహాలు జరిగాయి. ఆ నవ దంపతులు, వారి బంధుమిత్రుల రాకతో సత్యదేవుని ఆలయంలో సందడి నెలకొంది. వారంతా స్వామివారి వ్రతాలాచరించారు. సుమారు 30 వేల మంది భక్తులు రాగా, సత్యదేవుని దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట సమయం పట్టింది. అనంతరం భక్తులు సప్త గోకులంలో శ్రీకృష్ణుడు, గోవులకు ప్రదక్షిణ చేశారు. సత్యదేవుని వ్రతాలు 2,100 జరగ్గా, ఈ ఒక్కరోజు దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. సుమారు ఆరు వేల మంది స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించారు. -
కాస్త అవగాహన.. మరింత జాగ్రత్త ఉంటేనే విలువైన ఓటు అనే వజ్రాయుధాన్ని కాపాడుకోగలం. రాజ్యాంగం కల్పించిన హక్కు, ప్రజాస్వామ్యానికి కీలకమైన ఓటు సంరక్షణ ఎంతో అవసరం.. ప్రస్తుతం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) జరుగుతోంది. దీనిపై జనంలో అనేక అనుమానాలు ఉన్నాయి
ఫ ఓటు ఉండాలంటే జాగ్రత్త అవసరం ఫ అవగాహనతోనే సందేహాల నివృత్తి పిఠాపురం: జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కొద్ది రోజులుగా జరుగుతోంది. దీనిపై జనంలో ఎన్నో సందేహాలు, మరెన్నో అనుమానాలు ఉన్నాయి. సర్ కార్యక్రమం అందరినీ టెన్షన్ పెడుతోంది. ఓటు ఉంటుందో లేదో అనే ఆందోళన ఎక్కువవుతోంది. పక్కాగా ఓట్లు ఉండడమే లక్ష్యమని ఎన్నికల సంఘం చెబుతుంటే, కొందరివి తొలగిస్తారంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీటిపై ఓటర్లు అవగాహనతో ఉండాల్సిన అవసరం ఉంది. జిల్లాలోని 1,640 పోలింగ్ బూత్ల పరిధిలో 16,50,811 మంది ఓటర్లకు గాను.. 13,25,011 మంది ఓటర్ల మ్యాపింగ్ పూర్తి చేశారు. 3,25,800 మంది ఓటర్లు మ్యాపింగ్ కాలేదు. దీంతో వీరంతా మ్యాపింగ్ చేయించుకోవడంతో పాటు తమ ఓట్లు రద్దు కాకుండా చూసుకోవడానికి తగిన ఆధారాలు చూపించాల్సి ఉంది. లేకుంటే ఇబ్బందే. ఇలా చేయండి ఓటర్లు ముందుగా 2002 ఓటరు జాబితాలో పేరు ఉందో లేదో చూసుకోవాలి. ప్రస్తుతం ఎన్యూమరేషన్ పూర్తి చేసి ఇస్తేనే ఓటు కొనసాగుతుంది. జూలై 21న ముసాయిదా జాబితా విడుదల చేస్తారు. అందులో పేరు లేకుంటే ఆగస్టు 20లోగా అభ్యంతరం తెలియచేయాలి. వాటిని పరిష్కరించి సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. అప్రమత్తంగా లేకపోతే ఓటు హక్కు పోయినట్లే. బీఎల్ఓలు రాకుంటే.. ఇప్పటివరకు బీఎల్ఓలు మీ ఇంటికి రాకుంటే తక్షణం వారిని సంప్రదించండి. 2002 ఓటరు జాబితాలో పేరు ఉంటే ఎటువంటి అదనపు వివరాలు బీఎల్ఓకి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ప్రతి బీఎల్ఓ మీ ఫొటో వివరాలు ముద్రించిన రెండు ఎన్యూమరేషన్ ఫారాలు ఇస్తారు. ఇందులో ఒక ఫారం మీ దగ్గర ఉంచుకుని, ఇంకొకటి మీ బీఎల్ఓకి ఇవ్వాలి. ఎన్యూమరేషన్ ఫారంపై మీ తాజా ఫొటో అంటించి, ఫారం పూర్తి చేసి సంతకం చేసి ఇవ్వాలి. ఒకవేళ మీ తరఫున ఎవరైనా ఈ ఫారాలు అందజేస్తే, ఆ ఓటరు మీకు ఏమవుతారు? అనే వివరాలను కూడా పేర్కొనాల్సి ఉంటుంది. ఎటువంటి తప్పుడు సమాచారాన్ని ఇవ్వడం లేదని, తప్పుడు సమాచారం ఇస్తే ఎలాంటి శిక్ష విధిస్తారనే వివరాలు మీకు తెలుసని ధ్రువీకరిస్తూ డిక్లరేషన్ కూడా ఇవ్వాలి. మీకిచ్చిన ఎన్యూమరేషన్ ఫారంలో ‘గత ఎస్ఐఆర్ ఓటర్ల జాబితాలో ఓటరు వివరాలు’ అనే కాలంలో వివరాలు పూర్తి చేస్తే సరిపోతుంది. ఓటరు పేరు, ఓటరు గుర్తింపు కార్డు (అందుబాటులో ఉంటే) ఇవ్వాలి. తప్పనిసరి కాదు, బంధువు పేరు తండ్రి లేక తల్లి జిల్లా, రాష్ట్రం నియోజకవర్గం, బూత్ నంబర్ వివరాలు ఇవాల్సి ఉంటుంది. ఈ గుర్తింపు పత్రాల్లో ఏదొకటి చాలు ఫ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉద్యోగి గుర్తింపు కార్డు లేక, పెన్షన్ గుర్తింపు కార్డు. ఫ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లేదా స్థానిక సంస్థలు, బ్యాంకులు, పోస్టాఫీసులు, ఎల్ఐసీ, పబ్లిక్ సెక్టార్ యూనిట్లు జారీ చేసిన గుర్తింపు కార్డులు లేదా ధ్రువీకరణ పత్రాలు ఫ ఫ విశ్వవిద్యాలయాలు లేదా సంబంధిత బోర్డులు జారీ చేసిన విద్యార్హత కార్డులు ఫ సంబంధిత రాష్ట్రాలు జారీ చేసిన శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం ఫ ఓటరు పుట్టిన తేదీ, ఆధార్ కార్డు నంబరు (ఇది ఐచ్ఛికం), మొబైల్ నంబర్, తండ్రి పేరు, తండ్రి లేక సంరక్షకుడి ఓటరు గుర్తింపు కార్డు నంబరు (అందుబాటులో ఉంటే), తల్లి పేరు, తల్లి ఓటరు కార్డు (అందుబాటులో ఉంటే), జీవిత భాగ స్వామి (వర్తిస్తేనే) పేరు, జీవిత భాగస్వామి ఓటరు కార్డు నంబరు (అందుబాటులో ఉంటేనే) ఇవ్వాల్సి ఉంటుంది. ఫ సంబంధిత శాఖలు జారీ చేసిన ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు ఫ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఫ రాష్ట్ర, స్థానిక అధారిటీలు జారీ చేసిన ఫ్యామిలీ రిజిస్టర్ ఫ ప్రభుత్వం జారీ చేసిన భూమి, గృహ కేటాయింపుల సర్టిఫికెట్ ఆన్లైన్లోనూ సమర్పించవచ్చు వేరే ప్రాంతాల్లో నివసించే వారు కూడా ఆన్లైన్ ద్వారా ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించే వీలుంది. దీనికోసం ‘ఈసీఐనెట్’ యాప్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ‘ఈ–సైన్’ ద్వారా ఫారాన్ని సమర్పించేందుకు మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఓటరు గుర్తింపు కార్డుతో అనుసంధానించి ఉండాలి. గుర్తింపు కార్డుపై ఉన్న ఓటరు పేరు స్పెల్లింగ్, ఓటు ఆధార్ కార్డుతో కచ్చితంగా సరిపోవాలి. ఏదైనా వ్యత్యాసం ఉంటే డిజిటల్ ఈ–సైన్ విఫలం అవుతుంది. అలాంటప్పుడు ఓటర్ తన బూత్ లెవెల్ ఆఫీసర్ ద్వారా ఫిజికల్గా ఫారం సమర్పించాల్సి ఉంటుంది. నోటీసులు ఎవరికి ఇస్తారంటే? ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు వచ్చినప్పటికీ, 2002 ఓటర్ల జాబితాతో మ్యాపింగ్లో పాక్షిక తేడాలను గుర్తించిన ఓటర్లతో పాటు 2002 ఓటర్ల జాబితాతో తమతో పాటు తమ బంధువుల పేర్లు లేని ఓటర్లకు ఈఆర్వోలు నోటీసులు ఇస్తారు. నిర్దేశిత తేదీ విచారణకు హాజరై వీరు ఎన్నికల సంఘం నిర్దేశించిన 12 రకాల పత్రాల్లో ఏదో ఒక పత్రాన్ని తమ లేక తమ తల్లిందండ్రుల పుట్టిన తేదీ పుట్టిన ప్రాంతం ధ్రువీకరణగా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం 40 ఏళ్లలోపు వయసు ఉన్నవారు ఎవరికీ 2002 ఓటరు జాబితాలో పేరు ఉండే అవకాశం లేదు. వీరంతా తమ ఓటు హక్కును కాపాడుకోవాలంటే, తండ్లి లేక తల్లి 2002లో ఎక్కడ ఓటు కలిగి ఉన్నారనే విషయాన్ని నిర్ధారించాల్సి ఉంటుంది. దీని కోసం బీఎల్ఓ ఇచ్చిన ఎన్యుమరేషన్ ఫారం రెండో కాలంలో గత ఎస్ఐఆర్లో ముందు కాలంలో పేర్కొన్న బంధువు వివరాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. తండ్రి పేరు అనేచోట ఆయన ఓటరు కార్డు నంబరు బంధువు పేరు ఉన్నచోట తాతయ్య లేక తండ్రి ఓటుహక్కు కలిగి ఉన్న నియోజకవర్గం, బూత్ నంబరు వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. కాకినాడ జిల్లాలో సర్ ప్రక్రియ ఇలా.. నియోజకవర్గం మొత్తం ఓటర్లు పోలింగ్ బూత్లు ఈఎఫ్ పంపిణీ ఈఎఫ్ డిజిటలైజేషన్ తుని 226071 224 225615 126064 ప్రత్తిపాడు 219988 227 219988 76571 పిఠాపురం 240773 242 240770 105313 కాకినాడ రూరల్ 271318 264 271311 107184 పెద్దాపురం 218002 201 218002 99174 కాకినాడ సిటీ 242514 234 242241 79290 జగ్గంపేట 232145 248 232141 103301 -
గుప్త నిధుల కోసం తవ్వకాలు!
● ఇంటి నిర్మాణం పేరుతో అనుమతి ● లోతుగా తవ్వకాలు, మట్టి తరలింపు ● అనుమానంతో అధికారుల పరిశీలన కొత్తపల్లి: ఇంటి నిర్మాణం పేరుతో పంచాయతీ అనుమతి తీసుకుని, భారీ లోతుగా తవ్వకాలు జరుపుతున్న ఘటన పాత ఇసుకపల్లి గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సమీపంలో జరిగింది. గుప్త నిధుల కోసమే ఇంత లోతు తవ్వుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ మేరకు శుక్రవారం తహసీల్దార్ చిన్నారావు, ఎస్సై వెంకటేష్ ఘటనా ప్రాంతానికి వెళ్లి, సంబంధిత వ్యక్తిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనుమతులకు మించి తవ్వకాలు చేపట్టడంపై ఆరా తీశారు. తహసీల్దార్ తెలిపిన వివరాల ప్రకారం.. నడింపల్లి నరసింహరాజు అనే వ్యక్తి 200 గజాల స్థలంలో ఇంటి నిర్మాణం కోసం పంచాయతీ నుంచి అనుమతులు తీసుకున్నాడు. అయితే కొన్ని రోజులుగా పరిమితికి మించి సుమారు 20 అడుగులకు లోతుకు పైగా తవ్వకాలు చేపట్టాడు. ఆ గొయ్యిలో రెండు ప్రదేశాల్లో మట్టి జారి పోకుండా కర్రలు కట్టి చెక్కలు దాపు పెట్టి, మరికొంత లోతుగా తవ్వించాడు. విషయం తెలుసుకున్న స్థానిక రెవెన్యూ అధికారి కిషోర్, పంచాయతీ కార్యదర్శి యాళ్ల జీయన్న సంబంధిత నరసింహరాజుకు నోటీసులను అందజేశారు. అయినా తవ్వకాలు ఆపకపోవడంతో తహసీల్దార్, ఎంపీడీఓ, ఎస్సైలకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో తహసీల్దార్, ఎస్సై సంఘటనా స్థలానికి పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఇంటి నిర్మాణానికి ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని పంచాయతీకి ఆదేశించామన్నారు. తవ్విన మట్టిని యథాతథంగా వేయాలని చెప్పామన్నారు. ఈ తవ్వకాల విషయాన్ని కలెక్టర్, ఆర్డీఓ, పాడా పీడీలకు సమాచారం అందించామన్నారు. పలు అనుమానాలు తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని గుడి దిబ్బగా పిలుస్తారు. గతంలో ఇదే ప్రదేశంలో ఆలయం ఉండేదని పలువురు చెబుతున్నారు. ఈ ఆలయానికి సంబంధించి గుప్త నిధులు ఉండొచ్చనే కారణంతో ఇక్కడ తవ్వకాలు జరుపుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇంటి నిర్మాణం కోసం సుమారు 6 నుంచి 7 అడుగులే తవ్వుతారు. కానీ ఇక్కడ సుమారు 20 అడుగులకు పైగా తవ్వకాలు చేపట్టడంపై అనుమానాలు వస్తున్నాయి. -
దేశం గర్వించదగిన నటుడు ఎస్వీఆర్
● స్మరించుకున్న ప్రముఖులు ● ఘనంగా జయంత్యుత్సవం ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి, వాటిని రక్తి కట్టించిన ఎస్వీ రంగారావు (ఎస్వీఆర్) దేశం గర్వించదగిన నటుడు అని వక్తలు కొనియాడారు. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్టు, చిరంజీవి ఫ్యాన్స్, ఎస్వీఆర్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం గోదావరి గట్టున ఉన్న ఎస్వీఆర్ విగ్రహం వద్ద శుక్రవారం ఆయన జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంటరీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆర్యాపురం కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్ చల్లా శంకరరావు, ప్రముఖ కాంట్రాక్టర్ ఆర్ సుబ్బరాజు, కాంగ్రెస్ నేతలు టీకే విశ్వేశ్వరరెడ్డి, రామినీడి మురళీ, టీడీపీ నేత యర్రా వేణుగోపాలరాయుడు, జనసేన సిటీ ఇన్చార్జి వై.శ్రీనివాస్, ఎస్వీ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్వీఆర్ జయంతిని ఏటా నిర్వహిస్తున్న పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ పంతం కొండలరావు, చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడు కొత్తపేట రాజాను వక్తలు అభినందించారు. వచ్చే ఏడాది నుంచి ఎస్వీఆర్ జయంతిని కొత్తపేట రాజా, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్టు సభ్యుడు యెనుముల రంగబాబు, కాపునాడు జిల్లా అధ్యక్షుడు గుదే రఘునరేష్, లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ అధ్యక్షుడు నామన వాసు ఆధ్వర్యంలో జరుగుతాయని ప్రకటించారు. ఈ సందర్భంగా పేదలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. -
ఫ మసి పూసి.. మస్తర్ వేసి..
వీబీ జీ రామ్జీ పథకంలో ఓ కూలీకి ఈ–కేవైసీ సమయంలో ముఖ గుర్తింపు ప్రక్రియలో వింత ఘటన ఎదురైంది. ఉపాధి కూలీల సంఘ ప్రతినిధి ముత్యాల శ్రీనివాసరావు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. మోరిపోడులో రావి వినోద్ అను ఉపాధి కూలీకి జాబ్ కార్డు ఇచ్చే సమయంలో ఈ–కేవైసీ చేశారు. ఆ సమయంలో అతడికి మీసం, తలపై ఎక్కువ జుట్టు ఉండేది. ఇక ఉపాధి పనులు మొదలైనప్పుడు టెక్నికల్గా ఎటువంటి ఇబ్బందులు రాలేదు. తాజాగా అతడు జుట్టు దగ్గరకు కత్తిరించుకోవడంతో పాటు, ముఖంపై మీసం తొలగించాడు. ఈ నేపథ్యంలో అతడి ముఖ గుర్తింపునకు ఈ–కేవైసీలో శతవిధాలా ప్రయత్నం చేసినా, ఎంత సమయం తీసుకున్నా కూడా ఫలితం రాలేదు. సదరు గ్రూపులోని ఒక వ్యక్తి సలహా మేరకు అతడి తలకు, మీసం మాదిరిగా బొగ్గుతో దట్టంగా దిద్దారు. వెంటనే అతడి ముఖ గుర్తింపు లభించింది. – సఖినేటిపల్లి -
అమ్మవారి మంగళ సూత్రాల అపహరణ
సఖినేటిపల్లి: కేశవదాసుపాలెం గ్రామంలోని ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి మంగళ సూత్రాలు అపహరణకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిపై సఖినేటిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు శుక్రవారం తెలిపారు. ఈ నెల 26వ తేదీన పట్ట పగలు ఈ చోరీ జరిగింది. దీనికి సంబంధించి ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాల్లో పుటేజీలను పరిశీలించిన పోలీసులు ఓ అనుమానిత వ్యక్తిని గుర్తించారు. అతడి సమాచారం తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్కు తెలియజేయాలని ఎస్సై కె.దుర్గా శ్రీనివాసరావు సూచించారు. -
లాభాల గెలగల
ఫ్యాక్టరీకి రవాణా చేయడానికి సిద్ధం చేసిన గెలలు● టన్ను ఆయిల్పామ్ గెలల ధర రూ.23,777 ● ఎకరాకు రూ.2.40 లక్షల ఆదాయం ● సాగుకు రైతుల ఆసక్తి ● ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం దేవరపల్లి: పొగాకు, జీడిమామిడి పంటలకు మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో ఆయిల్పామ్ సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలోని మెట్ట ప్రాంత భూములు ఆ పంటకు అనుకూలంగా ఉండడం, లాభాలు ఇవ్వడం దీనికి కారణం. రెండేళ్లుగా జిల్లాలో సుమారు 2 వేల హెక్టార్లలో మొక్క తోటలు వేసి సాగు చేస్తుండగా, ఈ ఏడాది ఖరీఫ్లో అదనంగా 4,800 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగుకు అధికార యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 28,611 హెక్టార్లలో సాగు జిల్లాలోని 21 మండలాల్లో 28,611 హెక్టార్లలో ఆయిల్పామ్ను సాగు చేస్తున్నారు. మొక్క నాటిన 4వ ఏట నుంచి ప్రారంభమైన దిగుబడి 25 ఏళ్ల వరకు ఉంటుంది. మొక్క తోటల నుంచి ఎకరాకు 4 నుంచి 5 టన్నుల గెలలు దిగుబడి రాగా, 7వ ఏడాది నుంచి 10 టన్నులకు పైగా వస్తుంది. వాతావరణం అనుకూలిస్తే ఎకరాకు 12 నుంచి 13 టన్నులు వచ్చే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. ఈ పంటకు సంబంధించి రబీలో దిగుబడి తక్కువగా ఉన్నప్పటికి గెలలకు మద్దతు ధర లభిస్తుంది. ఖరీఫ్లో జూన్ నుంచి గెలల దిగుబడి ప్రారంభమై, ఎకరాకు సగటున 10 టన్నులు వస్తుంది. ఖర్చులు పోను ఎకరాకు రూ.1.20 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు నికర లాభం ఉంటుందని అంచనా. ఉచితంగా మొక్కలు ఉద్యాన శాఖ ద్వారా హెక్టారుకు రూ.29 వేల విలువైన 240 మొక్కలను ఉచితంగా అందజేస్తున్నారు. ఎకరాకు 50 నుంచి 57 మొక్కలు వేయాల్సి ఉండగా, మొక్క నాటిన నాలుగో ఏడాది నుంచి దిగుబడి మొదలై, మొదటి ఏడాది ఎకరాకు టన్ను ఉంటుంది. అలాగే హెక్టారుకు ఏడాదికి రూ.10,500 చొప్పున వరసగా నాలుగేళ్లు రైతులకు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తుంది. కాగా.. వరి నుంచి ఆయిల్పామ్కు వెళ్లిన రైతులకు అదనంగా హెక్టారుకు రూ.21 వేలు ఇస్తున్నారు. ఆయిల్ రికవరీని బట్టి ధర నిర్ణయం ఆయిల్పామ్ గెలల ధరను ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ రికవరీని బట్టి నిర్ణయిస్తోంది. జూన్లో ఫ్యాక్టరీకి రైతులు సరఫరా చేసిన గెలలకు జూలై 15 దాటిన తర్వాత ధర నిర్ణయించి, రైతుల బ్యాంకు ఖతాకు జమ చేస్తుంది. జూన్లో టన్ను గెలల ధర రూ.23,770 ఉంది. ప్రతి నెలా ఆయిల్ పామ్ గెలల ధర పెరుగుతూ వస్తోంది. జిల్లాలో ఆయిల్పామ్ తోటలు (హెక్టార్లలో) మండలం సాగు విస్తీర్ణం అనపర్తి 287.67 బిక్కవోలు 1,043.39 రంగంపేట 4,351.41 రాజానగరం 2,903.49 కోరుకొండ 1,287.64 గోకవరం 939.57 సీతానగరం 560.58 రాజమహేంద్రవరం రూరల్ 97.62 కొవ్వూరు 32.51 చాగల్లు 690.07 తాళ్లపూడి 383.26 పెరవలి 86.51 ఉండ్రాజవరం 66.59 దేవరపల్లి 4,570.63 గోపాలపురం 2,232.28 నిడదవోలు 394.99 నల్లజర్ల 8,284.17 మండపేట 368.49 కపిలేశ్వరపురం 24.93 గెలల ధర పెరుగుదల (2026 నుంచి టన్నుకు) జనవరి రూ.19,218 ఫిబ్రవరి రూ.20,680 మార్చి రూ.21,546 ఏప్రిల్ రూ.22,936 మే రూ.23,656 జూన్ రూ.23,770లాభదాయకం ఆయిల్పామ్ తోటల సాగు లాభదాయకంగా ఉంది. 2026–27 ఖరీఫ్లో జిల్లాలో వరికి బదులుగా 4,800 ఎకరాల్లో పామాయిల్ సాగు చేయాలని ప్రణాళిక రూపొందించాం. ఇప్పటికే నల్లజర్ల మండలంలో 800 హెక్టార్లలో కొత్తగా మొక్కలు వేశారు. రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రాయితీలు అందజేస్తోంది. – ఎన్.మల్లికార్జునరావు, జిల్లా ఉద్యాన అధికారి, రాజమహేంద్రవరం -
12 కిలోల వెండి వస్తువుల చోరీ
దేవరపల్లి: జ్యూయలరీ దుకాణంలోని 12 కిలోల వెండి వస్తువులను దొంగలు చోరీ చేశారు. నల్లజర్ల మండలం పోతవరంలో గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనా వివరాలు ఇవీ.. పోతవరంలో శ్రీనిధి జ్యూయలరీ పేరుతో కల్వకుంట్ల శ్రీనివాసరావు దుకాణం నిర్వహిస్తున్నాడు. రోజూ మాదిరిగానే గురువారం రాత్రి దుకాణం మూసి ఇంటికి వెళ్లాడు. శుక్రవారం ఉదయం వచ్చి తెరవగా లోపల గాజులు, అద్దాలు పగిలి వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వెనుక వైపు ఉన్న తాళం బద్దలు కొట్టి ఉండడంతో పాటు దుకాణంలోని సుమారు 12 కిలోల వెండి వస్తువులు కనిపించలేదు. దీంతో శ్రీనివాసరావు నల్లజర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్, నల్లజర్ల, దేవరపల్లి సీఐలు రవికుమార్, బీఎన్ నాయక్, నల్లజర్ల ఎస్సై ఆంజనేయబాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ రవికుమార్ తెలిపారు. -
నిత్యాన్నదానానికి రూ.9.53 లక్షల విరాళం
ద్వారకాతిరుమల: శ్రీవారి నిత్యాన్నదాన పథకానికి నలుగురు భక్తులు వేర్వేరుగా శుక్రవారం రూ.9,53,338 విరాళంగా అందజేశారు. నల్లజర్లకు చెందిన కొఠారి సురేష్ రూ.6,52,222, పెనుగొండ మండలం నడిపూడికి చెందిన కాశీ విశ్వేశ్వర సత్య హరిశ్చంద్ర వీర వెంకట సత్యనారాయణ రూ.1 లక్ష, హైదరాబాద్కు చెందిన చెరువు శివరామకృష్ణ శాస్త్రి రూ.1 లక్ష, ద్వారకాతిరుమల మండలం సూర్యచంద్రరావుపేటకు చెందిన పాకలపాటి కృష్ణ రూ.1,01,116 లను నిత్యాన్నదాన ట్రస్ట్కు జమ చేశారు. ఈ సందర్భంగా దాతలకు ఆలయ ప్రధానార్చకుడు పీవీఎస్ఎస్ఆర్ జగన్నాథాచార్యులు, ఏఈఓ మెట్టపల్లి దుర్గారావు, సూపరింటెండెంట్లు ఐవీ రామారావు, కోటగిరి కిషోర్ విరాళం బాండ్లను అందజేశారు. -
రైళ్లలో చోరీలు చేస్తున్న నలుగురి అరెస్ట్
ఇద్దరు మహిళా దొంగల అరెస్ట్ జగ్గంపేట: బస్సులు, ఆటోల్లో ప్రయాణిస్తున్న అమాయక మహిళలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు మహిళా దొంగలను మండలంలోని రామవరం వద్ద శుక్రవారం జగ్గంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై రఘునాథరావు తెలిపిన వివరాల ప్రకారం.. జగ్గంపేట బస్టాండ్లోని సీసీ కెమెరాలను నిరంతరం పర్యవేక్షిస్తున్న పోలీసులకు ఇద్దరు మహిళలు తరచూ బస్టాండ్లో తిరగడం గమనించారు. వారే చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించి నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో పక్కా సమాచారంతో రామవరం వద్ద అనకాపల్లి జిల్లా చోడవరం గ్రామానికి చెందిన 35 ఏళ్ల తోట హుస్సేన్బీ, అనకాపల్లికి చెందిన 25 ఏళ్ల గంట మరియమ్మను అరెస్ట్ చేశారు. వీరిద్దరూ సాధారణ ప్రయాణికులతో కలిసి పోయి, వారు బస్సులు ఎక్కే సమయంలో బ్యాగులు, నగదు, బంగారు వస్తువులను దొంగతనం చేస్తున్నట్టు నిర్దారించారు. వీరిని పెద్దాపురం కోర్టులో హాజరుపర్చగా, న్యాయమూర్తి రిమాండ్ విధించారు. నిందితులను అరెస్టు చేయడానికి కృషి చేసిన సీఐ బి.తిరుపతిరావు, జగ్గంపేట ఎస్సై రఘునాథరావను ఉన్నతాధికారులు అభినందించారు.విందు ఏర్పాట్లలో విషాదం● విద్యుత్ షాక్తో ఆర్టీసీ డ్రైవర్ మృతి ● చిత్రాడలో ఘటన పిఠాపురం రూరల్: తన అన్న ఉద్యోగ విరమణ చేయడంతో తమ్ముడు ఎంతో సంతోషించాడు. ఈ సందర్భంగా తన ఇంటి వద్ద వేడుకలు ఘనంగా నిర్వహించాడు. అనంతరం బంధువులకు విందు ఇస్తున్న వేళ విద్యుత్ షాక్తో మృతి చెందాడు. పిఠాపురం మండలం చిత్రాడలో శుక్రవారం ఈ విషాద ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. చిత్రాడకు చెందిన పెండెం వెంకట సుబ్రహ్మణ్యం (57) ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆయన అన్న కోటేశ్వరరావు సీఐఎస్ఎఫ్ ఉద్యోగిగా గత నెల ఉద్యోగ విరమణ చేశారు. ఈ నేపథ్యంలో తన ఇంటికి అన్న రావడంతో గురువారం రిటైర్మెంట్ ఫంక్షన్ను సుబ్రహ్మణ్యం ఘనంగా నిర్వహించాడు. అనంతరం శుక్రవారం బంధువులకు విందు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తుండగా, అక్కడే విద్యుత్ తీగలు తగిలి షాక్కు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సుబ్రహ్మణ్యానికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. తుని: రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. తుని జీఆర్పీ ఎస్.సత్తిబాబు తెలిపిన వివరాల ప్రకారం. ఈ నెల 2వ తేదీ ఉదయం బెంగళూర్ నుంచి భువనేశ్వర్ వెళుతున్న ప్రశాంతి ఎక్స్ప్రెస్లో అన్నవరంలో జనరల్ బోగిలో ఎక్కిన నలుగురు యువకులు ప్రయాణికులను బ్లేడ్లతో బెదిరించారు. దీంతో ప్రయాణికులు వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా రైలు నుంచి దిగి పారిపోయారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు విశాఖపట్నం జీఆర్పీ పోలీస్స్టేషకు ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి వచ్చిన సమాచారం మేరు తుని జీఆర్పీ ఎస్సై సత్తిబాబు అప్రమత్తమయ్యారు. సెల్ టవర్ ఆధారంగా నిందితుల సెల్ఫోన్లను ట్రేస్ చేసి పౌల్ (24), వనర్జీ పౌల్ (22), సబ్బవరపు సాంబశివరావు(25), షేక్ రఫీ (18)ని అరెస్ట్ చేశారు. -
శాస్త్రోక్తంగా గర్భాలయ శిలాస్థాపన
ఐ.పోలవరం: మురమళ్ల భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా శుక్రవారం గర్భాలయానికి శిలాస్థాపనను శాస్త్రోక్తంగా నిర్వహించారు. శైవాగమ పండితుడు యనమండ్ర సత్య సీతారామశర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత భారీ శిలను గర్భాలయంలో అమర్చారు. అనంతరం ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులు, పురోహితులు ప్రత్యేక పూజలు జరిపారు. ఈ దైవ కార్యక్రమంలో రూ.లక్ష, అంతకంటే ఎక్కువ విరాళం అందించిన దాత పేరును శిలాఫలకంపై చెక్కిస్తామని నిర్వాహకులు తెలిపారు. వెండి నంది విగ్రహం సమర్పణ కాకినాడకు చెందిన ఆకొండి శ్రీరామమూర్తి, ధర్మావతి దంపతుల కుమారుడు శ్రీకాంత్, కోడలు లక్ష్మీజ్యోతి, మనవడు సంపత్ 628 గ్రాముల వెండితో తయారు చేసిన సుమారు రూ.2 లక్షల విలువైన నంది విగ్రహాన్ని వీరేశ్వరస్వామి ఆలయానికి అందజేశారు. తొలుత అర్చకుడు సత్య సీతారామశర్మ ఆధ్వర్యంలో నందికి సంప్రోక్షణ చేశారు. అనంతరం దాత కుటుంబానికి శేషవస్త్రం, చిత్రపటం, ప్రసాదం అందించి ఆలయ మర్యాదలతో సత్కరించారు. -
‘ఇక మాకెవరు దిక్కు’
● రోడ్డు ప్రమాదంలో కూలీ మృతి ● రోదించిన భార్య, కుటుంబ సభ్యులు రాజానగరం: నిత్యం సైకిల్పై కలవచర్ల నుంచి రాజమహేంద్రవరం కూలి పనికి వెళ్లి రావడం అతడికి అలవాటే. రోజు మాదిరిగానే ఉదయాన్నే భోజనం తీసుకు వెళ్లిన భర్త రాత్రికి తిరిగి వస్తాడని ఆ ఇల్లాలు ఎదురు చూసింది. కానీ లారీ రూపంలో మృత్యువు అతడిని మింగేసిందని తెలిసి కుప్పకూలిపోయింది. తన ఇద్దరు పిల్లలతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని కన్నీటి సంద్రమైంది. ‘మమ్మల్ని అనాథలను చేసి పోయావయ్యా... ఇక మాకెవరు దిక్కు’ అంటూ రోదించింది. జాతీయ రహదారిపై రాజానగరం వద్ద గురువారం రాత్రి జరిగిన ఈ విషాద సంఘటన వివరాలు. కలవచర్లకు గొనూరి నూకరాజు (39) కూలి పని కోసం సైకిల్పై రాజమహేంద్రవరానికి వెళ్లి, వస్తుంటాడు. ఈ క్రమంలో పాత సైకిల్తో ఇబ్బంది పడుతున్నాడని గ్రహించిన యజమాని రెండు రోజుల క్రితమే కొత్త సైకిల్ కొనిచ్చాడు. దానిపై గురువారం రాత్రి ఇంటికి తిరిగి వెళ్తున్న అతడిని జాతీయ రహదారిపై కలవచర్ల రోడ్డు మలుపు తిరుగుతున్న సమయంలో విశాఖపట్నం నుంచి వస్తున్న లారీ ఢీకొంది. లారీ అతడి తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న మృతుని భార్య గొనూరి బేబీ, కుటుంబ సభ్యులు ప్రమాద దృశ్యాన్ని చూసి చలించిపోయారు. గుండెలవిసేలా రోదించారు. మృతుడికి 14, 15 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమారులున్నారు. రాజానగరం పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
శక్తి పీఠాన పోలీసు ఠాణా.. లేనట్లే
రామచంద్రపురం రూరల్: శైవ క్షేత్రం ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి ఆలయానికి ఉత్తరాన ఉన్న పంచాయతీ ఖాళీ స్థలంలో కొత్తగా పోలీస్ స్టేషన్ నిర్మించాలని రెవెన్యూ, పోలీసు అధికారులు భావించారు. దీనిపై గురువారం ‘సాక్షి’ దినపత్రికలో ‘శక్తి పీఠాన పోలీసు ఠాణా’ అనే శీర్షికన వచ్చిన కథనంతో వెనక్కి తగ్గారు. ద్రాక్షారామ పోలీస్ స్టేషన్ నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరైన నేపథ్యంలో మంగళవారం ఆర్డీఓ పి.సరళావతి సందర్శించి దీనికి ఆమోద ముద్ర వేశారు. దీంతో ద్రాక్షారామ పోలీసులు ఈ పంచాయతీ స్థలంలో 10 సెంట్లలో పోలీస్ స్టేషన్ నిర్మాణం చేపట్టాలని భావించి ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ స్థలాన్ని కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల బుధవారం పరిశీలించిన సమయంలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ప్రజలు తమ మనోభావాలను వివరించారు. దీంతో పాటు గురువారం ‘సాక్షి’ పత్రికలో కథనం రావడంతో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా స్పందించి ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పుడు ఆ స్థలం వద్దని తెలపడంతో ఇక్కడి అధికారులు గురువారం తాము వేసిన ఫెన్సింగ్ను తొలగించారు. దీంతో గ్రామస్తులు, హిందూ సంఘాలు హర్షం వ్యక్తం చేశారు. -
కాలయాపనే కొంప ముంచిందా!
● రావణ్ ఎపిసోడ్తో పిఠాపురం, కాకినాడల్లో ఉద్రిక్తత ● పోలీసుల తీరుపై విమర్శలు పిఠాపురం: ప్రశ్న యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ అరెస్టు ఉదంతంతో రెండు వర్గాల మధ్య విద్వేషాలు చెలరేగినట్టు కనిపిస్తోంది. పిఠాపురం పోలీస్ స్టేషన్ వద్ద బుధవారం నెలకొన్న ఉద్రిక్తతే దానికి నిదర్శనం. ఇటీవల ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ సమర శంఖారావం సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లపై జోసెఫ్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో, అతడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పిఠాపురానికి చెందిన జనసేన నాయకుడు బొజ్జా రామ్కుమార్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే, పోలీసులు మెరుపు వేగంతో కదిలారు. హుటాహుటిన కేసు నమోదు చేసి, ఎక్కడో హైదరాబాద్లో ఉన్న జోసెఫ్ను ఆగమేఘాల మీద పిఠాపురం తీసుకువచ్చారు. ఇంతవరకూ బాగానే ఉన్నా అతడిని చడీచప్పుడూ లేకుండా కోర్టులో హాజరు పరచాల్సి ఉండగా.. విషయం బయటకు పొక్కేంత వరకూ కాలయాపన చేశారనే విమర్శలు వచ్చాయి. దీంతో, జోసెఫ్కు మద్దతుగా దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పోలీస్ స్టేషన్కు చేరుకుని ఆందోళనకు దిగారు. ఆయనను వెంటనే వదిలిపెట్టాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ఇది తెలుసుకున్న జనసేన, విశ్వహైందవ పరిషత్ నాయకులు సైతం పోలీస్ స్టేషన్కు చేరుకుని ఆందోళన బాట పట్టారు. దీంతో, పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అలా చేసి ఉంటే... అధికార పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గతంలో పలు ఫిర్యాదులు రాగా.. కేవలం విచారణకు పిలిచి 41 నోటీసులిచ్చి పోలీసులు పంపించేవారు. అటువంటిది జోసెఫ్ కేసులో మాత్రం దుడుకుగా వ్యవహరించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిందితుడిని మంగళవారం రాత్రి తీసుకువచ్చిన పోలీసులు బుధవారం ఉదయం కోర్టులో హాజరు పరచి ఉంటే ఎటువంటి అలజడికీ ఆస్కారం ఉండేది కాదు. అలా కాకుండా కాలయాపన చేయడం వల్లనే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని పట్టణ వాసులు విమర్శిస్తున్నారు. జోసెఫ్ను తీసుకువచ్చినప్పటి నుంచి అతడిని రాత్రి పిఠాపురం ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎదుట హాజరు పరిచేంత వరకూ జరిగిన పరిణామాలన్నీ ప్రశ్నార్థకంగానే ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. సాధారణంగా ఒక ఫిర్యాదు వచ్చినప్పుడు ఆ కేసులో ఏయే సెక్షన్లు అమలవుతాయో పోలీసులకు తెలిసే ఉంటుంది. జోసెఫ్పై అన్నీ బెయిలబుల్ సెక్షన్లే వేయాల్సి రావడంతో ఎలాగైనా రిమాండ్ వేసేలా చూడాలన్న ఒత్తిళ్లతోనే కాలయాపన చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చివరకు పిఠాపురం కేసులో జోసెఫ్కు బెయిల్ మంజూరైంది. అయితే, ఈ మొత్తం ఎపిసోడ్తో పట్టణంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. అదే జోసెఫ్ను ఎవరికీ తెలియకుండా ఉదయమే కోర్టులో హాజరు పరచి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదని, కేవలం పోలీసుల తీరు వల్లే ఇలా పట్టణం అంతా ఉద్రిక్తంగా మారిందని స్థానికులు విమర్శిస్తున్నారు. జోసెఫ్కు ఇక్కడ బెయిల్ మంజూరు కావడంతో తమ పాచిక పారలేదనే అక్కసుతోనే అతడిని మరో కేసులో మళ్లీ అరెస్టు చేశారని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీంతో, మళ్లీ కాకినాడలోనూ గురువారం అదే పరిస్థితి నెలకొని, రెండు వర్గాల మధ్య పోరుగా మారిందని అంటున్నారు. ఈ ఉద్రిక్తతలకు పోలీసు ఉన్నతాధికారులు ఏవిధంగా కళ్లెం వేస్తారో చూడాల్సి ఉంది. -
ఒట్టి అమాయకుడు గురూ..
● భక్తుల నుంచి కానుకలు డిమాండ్ చేసిన వ్రత పురోహితుడు ● గత ఏడాది చివరిలో పాలకొల్లులో ఘటన ● విచారణ అనంతరం అప్పటి ఈఓ క్రమశిక్షణ చర్యలు ● వాటిని రద్దు చేయాలంటూ ఇటీవల ట్రస్ట్బోర్డు వివాదాస్పద తీర్మానం అన్నవరం: కానుకలివ్వాలంటూ భక్తులను వేధించిన ఓ వ్రత పురోహితుడికి అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు కొంత మంది అండగా నిలవడం వివాదాస్పదమవుతోంది. వివరాలివీ.. శ్రీ గోవింద భక్త సంఘం ఆహ్వానం మేరకు అన్నవరం దేవస్థానం నుంచి వ్రత పురోహిత బృందం గత ఏడాది డిసెంబర్ 21న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వెళ్లి, సామూహిక వ్రతాలు నిర్వహించింది. ఆ సందర్భంగా దేవస్థానం ప్రథమ శ్రేణి వ్రత పురోహితుడు మల్లాది గురుమూర్తి వ్రత కథ చెప్పారు. వ్రతాలు ముగిసిన అనంతరం ఆయన గోదానం, భూదానం, వస్త్రదానం అంటూ భక్తుల నుంచి కానుకలు డిమాండ్ చేశారని వీడియోలతో సహా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు అందింది. దీనిపై అప్పట్లో శ్రీసాక్షిశ్రీ సహా పలు పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఈ వ్యవహారంపై దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపి బాధ్యుడైన పురోహితులపై చర్యలు తీసుకోవాలని గత డిసెంబర్ 22న అప్పటి అన్నవరం దేవస్థానం ఈఓ వి.త్రినాథరావును ఆదేశించారు. విచారణ అనంతరం, వ్రతాల నిర్వహణకు నాడు పాలకొల్లు వెళ్లిన గురుమూర్తి సహా ఆరుగురు వ్రత పురోహితులును విధుల నుంచి ఆయన సస్పెండ్ చేశారు. అంతే కాకుండా ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి, గురుమూర్తికి రెండు వార్షిక ఇంక్రిమెంట్లు రెండేళ్ల పాటు తగ్గించారు. భవిష్యత్తులో వ్రత కథ చెప్పకుండా నిరోధిస్తూ గత మార్చి 23న క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకున్నారు. మిగిలిన వ్రత పురోహితుల సస్పెన్షన్ను రద్దు చేశారు. ట్రస్ట్బోర్డు సభ్యుల ఒత్తిడి ఇదిలా ఉండగా గురుమూర్తిపై క్రమశిక్షణ చర్యలు నిలుపు చేయాలంటూ గత నెల 24న జరిగిన దేవస్థానం ట్రస్ట్బోర్డు సమావేశంలో ఇద్దరు సభ్యులు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. గురుమూర్తి అమాయకుడని, ఆయనపై అనవసరంగా చర్య తీసుకున్నారని వారు వాదించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయనకు కట్ చేసిన రెండు ఇంక్రిమెంట్లలో ఒకటి పునరుద్ధరించడానికి, మూడు నెలల తరువాత మళ్లీ వ్రత కథ చెప్పడానికి అనుమతించాలని ట్రస్ట్బోర్డు తీర్మానించింది. వాస్తవానికి పాలకొల్లు ఘటనలోనే కాకుండా, గురుమూర్తి గతంలో కూడా పలుమార్లు సస్పెండవడం గమనార్హం. ట్రస్ట్బోర్డుకు ఆ అధికారం ఉందా? అన్నవరం దేవస్థానంలో సుమారు 250 మంది వ్రత పురోహితులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన పని చేస్తున్నారు. వీరికి దేవస్థానం వ్రతాల ఆదాయంలో 40 శాతం కమీషన్గా ఇస్తారు. రెగ్యులర్ ఉద్యోగులు కానందున వీరిపై అధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే దానిని ప్రశ్నించే లేదా తగ్గించే అధికారం ట్రస్ట్బోర్డుకు లేదు. ఈ మేరకు 2011 ఫిబ్రవరి 16న ట్రస్ట్బోర్డుకు అప్పటి ఈఓ ఓ లేఖ సమర్పించారు. దేవస్థానం రెగ్యులర్ ఉద్యోగులకు వర్తించే నిబంధనలు వీరికి వర్తించవని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో గురుమూర్తి వ్యవహారంలో ట్రస్ట్బోర్డు ఏ అధికారంతో తీర్మానం చేసిందనే ప్రశ్న తలెత్తుతోంది. దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు గత నెల 23న వ్రత పురోహితులతో సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ భక్తుల నుంచి బలవంతంగా కానుకలు డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విచిత్రంగా ఆ మర్నాడే గురుమూర్తిపై క్రమశిక్షణ చర్యలు రద్దు చేస్తూ ట్రస్ట్బోర్డు తీర్మానించడం గమనార్హం. ట్రస్ట్బోర్డు సభ్యుల అండ ఉంటే ఏమీ కాదనే సంకేతం ఇస్తున్నట్టుగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.న్యాయ సలహా తీసుకున్నాకే చర్యలు వ్రత పురోహితుడు గురుమూర్తి వ్యవహారంపై ట్రస్ట్బోర్డు చేసిన తీర్మానంపై న్యాయపరమైన సలహా తీసుకుంటాం. ఆ తరువాతే తదుపరి చర్యలు చేపడతాం. – నల్లం సూర్యచక్రధరరావు, ఈఓ, అన్నవరం దేవస్థానం -
రావణ్ మళ్లీ అరెస్టు.. బెయిల్ మంజూరు
మరో కేసులో అరెస్టుకు పోలీసుల యత్నం కాకినాడ లీగల్: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులో జోసెఫ్ అలియాస్ రావణ్ను సర్పవరం పోలీసులు బుధవారం రాత్రి మరోసారి అరెస్టు చేశారు. ఆయనను కాకినాడ స్పెషల్ మొబైల్ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో గురువారం హాజరు పరిచారు. కోర్టు సమయం ముగిసిపోవడంతో మెజిస్ట్రేట్ ఎన్.ఉషా లక్ష్మీ కుమారి ఎదుట ఆమె నివాసంలో హాజరు పరిచారు. జోసెఫ్ తరఫున జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. అనంతరం, సొంత పూచీకత్తుతో జోసెఫ్కు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. కాగా, జోసెఫ్ను ప్రభుత్వం వెంటాడుతున్నట్టు కనిపిస్తోంది. ఆయనను మరో కేసులో అరెస్టు చేసేందుకు మచిలీపట్నం పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. -
● పుడమితల్లికి పచ్చబొట్లు
‘అన్నపూర్ణ’లాంటి నేలతల్లిని నమ్ముకుని.. కోట్లాది మంది కడుపాకలి తీర్చే సాగు యజ్ఞానికి అన్నదాత శ్రీకారం చుట్టాడు. అదునుకు చినుకు రాలకపోయినా.. చెమట చుక్కలతో భూమిని తడిపి.. దుక్కి చేసి, నారు పోసి, నాట్లు వేసి, పసిడి పంటలకు ప్రాణం పోసేందుకు అడుగు వేశాడు. సమయం మించిపోతే ‘పంట పండదేమో’ననే ఆందోళన వెంటాడుతున్న వేళ.. అవకాశమున్నచోట్ల కర్షకులు.. నేల పొరల్లో దాగిన పాతాళగంగను వెలికితీసి.. మడికి తడిని అందించి.. వరి నాట్లు వేస్తూ.. పుడమితల్లికి ఇలా పచ్చ బొట్లు పెడుతున్నారు. రాజమహేంద్రవరం రూరల్ వెంకట నగరం – తొర్రేడు గ్రామాల మధ్య ఈ శ్రమైకజీవన సౌందర్యం ఆవిష్కృతమైంది. – ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్, రాజమహేంద్రవరం -
అందనిధి!
కొత్త విధానం కొరివి పెట్టింది.. కాంట్రాక్టు ఉద్యోగులకు ఆకలి కేకలు తెచ్చింది.. ప్రభుత్వ రూపొందించిన విధానంలో లోపాల కారణంగా వేతనాల విడుదలకు జాప్యం జరుగుతోంది.. సమస్య ఉత్పన్నమై ఐదు నెలలు అవుతున్నా, చంద్రబాబు ప్రభుత్వం చోద్యం చూస్తోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన నిధి పోర్టల్ సక్రమంగా పనిచేయక ఉమ్మడి జిల్లాలోని సుమారు పది వేల మంది ఉద్యోగులకు ఇబ్బంది ఎదురవుతోంది. సత్వరమే చెల్లించాలి రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులకు సత్వరమే వేతనాలు మంజూరు చేయాలి. నిధి పోర్టల్లో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని పరిష్కరించాలి. పర్మినెంట్ ఉద్యోగుల మాదిరిగానే తమకు ప్రతి నెలా వేతనాలు అందించి, ఆర్థిక భరోసా కల్పించాలి. – డి.సుగుణ, ఫార్మాసిస్టు, పెదపళ్ల, ఆలమూరు లోపాలు పరిష్కరిస్తున్నాం నిధి పోర్టల్లో సాంకేతిక లోపాలను పరిష్కరించే పనిలో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం బకాయి పడిన వేతనాలకు సీఎంఎఫ్ఎస్ విధానంలోనే జూన్ వరకూ జీతాలు అందించాలని సూచించింది. కాంట్రాక్టు ఉద్యోగులకు వారం రోజుల వ్యవధిలోనే అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – బి.రామనాథం, డీటీఓ ఇన్ ట్రెజరీస్, ముమ్మిడివరం. ఆలమూరు: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రతి శాఖలోని ఉద్యోగికి ఠంచనుగా ఒకటో తేదీనే జీతాలు పడేవి. చంద్రబాబు సర్కారులో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. ప్రతి నెలా ఒకటో తేదీన అందాల్సిన వేతనాలు ఐదు నెలల నుంచి రాకపోవడం అయోమయానికి గురిచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల మంజూరు కోసం రూపొందించిన నిధి పోర్టల్ సక్రమంగా పనిచేయక వచ్చిన సమస్య ఇది. ఫలితంగా విద్య, వైద్య, ఆరోగ్య, వ్యవసాయ, పంచాయతీరాజ్ తదితర శాఖల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాల ఊసే లేకుండా పోయింది. ఇలాగైతే కుటుంబాలు ఎలా గడుస్తాయనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం మొద్దు నిద్రలోకి జారుకుంది. ఉద్యోగుల దయనీయస్థితిని పట్టించుకోవాల్సిన యంత్రాంగం మౌనం వహిస్తోంది. ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు పది వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఇందులో తూర్పుగోదావరి జిల్లాలో 3,500, కోనసీమలో 2,500, కాకినాడ జిల్లాలో 4 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను ఇరుకున పెట్టేందుకే ప్రభుత్వం నిధి పోర్టల్ తెచ్చిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. వివరాలు ఎక్కడ బాబూ! ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఇతర కాంట్రాక్టు ఉద్యోగులకు గతంలో సీఎఫ్ఎంఎస్ విధానం ద్వారా వేతనాలను మంజూరు చేసే పరిస్థితి ఉండేది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేవలం కాంట్రాక్టు ఉద్యోగులకు మాత్రం ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన నిధి పోర్టల్ ద్వారా వేతనాలు అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి 14న రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఆ పోర్టల్లో ఉద్యోగుల వివరాలు, ఆధార్ ఈ–కేవైసీ, పోస్టుల మంజూరు వివరాలను నిక్షిప్తం చేయాలి. అనంతరం, ట్రెజరీ ఆమోదం తీసుకోవాలి. అందులో ఏది సక్రమంగా లేకపోయినా వేతనాల బిల్లు రూపొందే అవకాశం లేదు. ఐదో నెల పూర్తయినా ఇంకా నిధి పోర్టల్లో ఉత్పన్నమైన సాంకేతిక సమస్యలను పరిష్కరించడం లేదు. దీంతో ఈ పోర్టల్ పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాలేదు. దీనివల్ల ఫిబ్రవరి నుంచి జూన్ వరకూ ఐదు నెలల నుంచి ఉద్యోగులకు వేతనాలు అందలేదు. ఆర్థిక ఇబ్బందుల్లో కాంట్రాక్టు ఉద్యోగులు అరకొర వేతనాలతో చాకిరి చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు ఐదు నెలలుగా జీతాలు అందక ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. జూలై నెల ప్రవేశించినా తమ పిల్లలకు ఇంకా పుస్తకాల కొనుగోలు, స్కూల్ ఫీజులు చెల్లించలేని పరిస్థితి వారిలో నెలకొంది. ఇంటి అద్దె, బ్యాంకు రుణాల చెల్లింపులు, వైద్య ఖర్చులు, నిత్యావసరాల కొనుగోలు వంటి అంశాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి కుటుంబాన్ని పోషించుకోవాల్సిన పరిస్థితి కాంట్రాక్టు ఉద్యోగులకు ఉత్పన్నమైంది. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న తమకు వేతనాలు ఇవ్వకుండా ఇటువంటి దుస్థితి కల్పించడమేంటని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామన్న వాగ్దానాన్ని సత్వరమే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఫ నిధి పోర్టల్తో ఉద్యోగులకు కష్టాలు ఫ ఐదు నెలలుగా అందని వేతనాలు ఫ ఉద్యమ బాటలో కాంట్రాక్టు ఉద్యోగులు -
జీఓ–396 రద్దు చేయాలి
కాకినాడ లీగల్: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటీకరించేలా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ–396ను వెంటనే రద్దు చేయాలని దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కాకినాడలోని జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట దస్తావేజు లేఖర్లు, వారి సహాయకులు గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సంఘం గౌరవాధ్యక్షుడు బీజే ప్రసాద్, కాకినాడ సంఘం అధ్యక్షుడు చోడపునీడి గోవిందరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానం ప్రజల ఆస్తుల భద్రతకు ముప్పుగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ద్వారా ప్రతి దస్తావేజుపై రూ.2 వేల అదనపు రుసుం వసూలు చేయడం వల్ల సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని అన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రైవేటీకరించడం వల్ల పారదర్శకత దెబ్బ తింటుందని, ప్రజల హక్కులు, ఆస్తుల భద్రతపై అనిశ్చితి నెలకొనే ప్రమాదం ఉందని అన్నారు. జీఓ–396ను తక్షణమే ఉపసంహరించుకుని, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటు నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరారు. దస్తావేజు లేఖర్ల లైసెన్సులను పునరుద్ధరించి, లేఖర్లు, వెండర్ల జీవనోపాధికి భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
చైతన్యపై రౌడీషీట్ దారుణం
కాకినాడ రూరల్: వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్యపై రౌడీషీట్ తెరవడం చాలా దారుణమని ఆ పార్టీ విద్యార్థి, యువజన విభాగాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పుసల అనిల్ ఆధ్వర్యాన బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. విద్యార్థి విభాగం కాకినాడ రూరల్ నియోజకవర్గ అధ్యక్షుడు మామిడాల గౌతమ్ తేజ, యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి ఉంగరాల సంతోష్, సోషల్ మీడియా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి గన్నవరపు రాజేష్ మాట్లాడుతూ, మెగా డీఎస్సీలో అవకతవలపై ఆయన ప్రజాగళం వినిపించిన వారిని నిలువరించేందుకే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. భూదాహంతో అమరావతి ప్రాంత రైతులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్న పరిస్థితుల్లో వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వద్ద పెనుమాక రైతులు తమ గోడు వినిపించారన్నారు. రైతుల విన్నపం మేరకు కమిటీతో పాటు చైతన్య వెళ్లారని, టీడీపీ గూండాలు దాడులు చేసినా ఆయన ప్రతిఘటించలేదని చెప్పారు. అయినప్పటికీ గత సంఘటనలు కొన్ని పేర్కొంటూ ఆయనపై ఇప్పుడు రౌడీషీట్ తెరవడం దుర్మార్గమని అన్నారు. రాష్ట్రంలోని విద్యార్థులు, యువతను కట్టడి చేసేందుకే చైతన్యపై కేసు నమోదు చేశారన్నారు. వైశ్య సామాజికవర్గానికి చెందిన చైతన్యను కేసులతో భయపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. -
ఉత్తమ కథగా అడవి మల్లి
అనపర్తి: జీబీఆర్ కళాశాల గణిత ఐఐటీ ఫ్యాకల్టీ కొత్తపల్లి రవికుమార్ రచించిన అడవి మల్లి కథకు శ్రీమతి చల్లా సరోజనీదేవి స్మారక సంస్థ పురస్కారం లభించింది. ఈ మేరకు జూన్ 28న హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో రవికుమార్ పురస్కారం అందుకున్నారు. చల్లా భాను కిరణ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, రచయితలు ఆకెళ్ల రాఘవేంద్ర, గోపి చిరంజీవి, పాటల రచయిత వెనిగళ్ల రాంబాబు, హాస్య నటుడు శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. కాగా.. రవి కుమార్ను జీబీఆర్ సంస్థల కరస్పాండెంట్ తేతలి ఆదిరెడ్డి (కొండబాబు), జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పీఎల్ఆర్ స్వామి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ నల్లమిల్లి అబ్బాయిరెడ్డి అభినందించారు. -
అల్లుకున్న నిర్లక్ష్యం
పెద్దాపురం/కొత్తపల్లి: విద్యుత్ స్తంభాలను పిచ్చి పాదులు అల్లుకుపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీని వల్ల సరఫరాకు ఆటంకం కలగడంతో పాటు పశువులు ఆకులను తీనే సమయంలో షాక్కు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. వర్షం పడితే విద్యుత్ తీగల నుంచి నిప్పులు రాలుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. పెద్దాపురం మండలం దివిలి నుంచి రాజుపాలెం వెళ్లే ఆర్అండ్బీ రోడ్డు పొడవునా విద్యుత్తు స్తంభాలకు పిచ్చి పాదులు దర్శనమిస్తున్నాయి. అలాగే కొత్తపల్లి మండలం కొమరగిరి సెంటర్లోని గోర్స శ్మశాన వాటిక వద్ద ఉన్న విద్యుత్ స్తంభానికి పాదులు అల్లుకుపోయాయి. కొత్తపల్లి పోలీస్ స్టేషన్ వెనుక విద్యుత్ స్తంభానికి పాకేశాయి. కొత్తపల్లి పోలీస్ స్టేషన్ వెనుక పరిస్థితికొత్తపల్లి మండలం కొమరగిరి సెంటర్లో.. -
లోవ ప్రాంగణంలో కొండచిలువల హల్చల్
తుని రూరల్: తలుపులమ్మ లోవ ప్రాంగణంలో కొండచిలువలు హల్చల్ చేశాయి. వాటిని ఆలయ సెక్యూరిటీ సిబ్బంది పట్టుకుని అడవిలో విడిచిపెట్టారు. వివరాల్లోకి వెళితే.. అమ్మవారి కొండ దిగువన ఉన్న పాకల వద్దకు సోమవారం మధ్యాహ్నం కొండచిలువ వచ్చింది. దాన్ని స్థానికులు గుర్తించి వెంటనే లోవ సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు. రాజు, సత్తిబాబు అనే ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది హుటాహుటీన అక్కడకు చేరుకుని 15 అడుగులకు పైగా పొడవున్న కొండచిలువను పట్టుకున్నారు. ఈ క్రమంలో అది అటు ఇటూ తిరుగుతూ భక్తులను బెంబేలెత్తించింది. సిబ్బంది దాన్ని పట్టుకుని అడవిలో విడిచిపెట్టారు. అలాగే రోజు రాత్రి విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి పది అడుగుల పొడవుగల మరో కొండ చిలువ రాజగోపురం మెట్లు దిగుతూ కనిపించింది. వెంటనే దీన్ని సైతం పట్టుకుని అడవిలో వదిలేశారు. ఇలా ఒకే రోజు రెండు కొండ చిలువలు కనిపించడం, జూన్ రెండో తేదీన కూడా పాకల వద్ద ఓ కొండ చిలువ సంచరించడంపై ఆందోళన నెలకొంది. కాగా.. ఆహారం ఆఽన్వేషణ, వాతావరణ మార్పులతో కొండ చిలువలు బయటకు వస్తున్నాయని, ఎవరైనా గమనిస్తే సమాచారం ఇవ్వాలని, కనీసం పట్టుకుని అటవీ ప్రాంతాల్లో వదిలిపెట్టాలని తుని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసరావు సూచించారు. -
అర్ధరాత్రి పెను విషాదం
సామర్లకోట: అది సామర్లకోట – కాకినాడ రహదారి. సోమవారం అర్ధరాత్రి సమయం. వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఆ సమయంలో కంటైనర్, ట్రాలీ ఎదురుపడ్డాయి. కంటైనర్లో మోటారు సైకిళ్లు, ట్రాలీపై భారీ యంత్ర పరికరం రవాణా అవుతున్నాయి. అయితే ట్రాలీపై యంత్ర పరికరానికి ఉన్న భారీ ఇనుప రాడ్డులు కంటైనర్ను చీల్చుకుంటూ పోయాయి. ఈ ఘటనలో కంటైనర్ డ్రైవర్ సీటులోనే మృతి చెందాడు. సీఐ ఎ.కృష్ణభగవాన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్లోని మధురై నుంచి కాకినాడ యమహా షోరూమ్కు కొత్త మోటారు సైకిళ్ల (యమహా ఎఫ్జెడ్)ను కంటైనర్ తీసుకువస్తోంది. అలాగే కాకినాడ పోర్టు నుంచి రాజమహేంద్రవరం వైపునకు ఓ భారీ యంత్ర పరికరాన్ని ట్రాలీ తీసుకువెళుతున్నారు. ఆ భారీ యంత్ర పరికరానికి చివర నలువైపులా పొడవైన ఇనుప కడ్డీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సామర్లకోట– కాకినాడ రోడ్డులో సాంబమూర్తి రిజర్వాయర్ వద్ద కంటైనర్, ట్రాలీ ఎదురుపడ్డాయి. ముందుకు సాగు క్రమంలో కంటైనర్ డ్రైవర్ ముందు భాగం నుంచి వెనుక భాగం వరకు ట్రాలీలోని యంత్ర పరికరానికి ఉన్న ఇసుక కడ్డీలు చీల్చుకుంటూ పోయాయి. ఈ ప్రమాదంలో కంటైనర్ సగం భాగం రెండుగా చీలిపోయింది. డ్రైవింగ్ సీటులో ఉన్న డ్రైవర్ షేర్ సింగ్ (45) అక్కడిక్కడే మృతి చెందాడు. రెండు భారీ వాహనాలు ఎదురు కావడం, చెట్ల కొమ్మలు తగ్గిలే అవకాశం ఉందని, రోడ్డు మార్జిన్ విడిచి వేగంగా వెళ్లడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఆ సమయంలో వెనుక వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ట్రాలీని సామర్లకోట సుగర్ ఫ్యాక్టరీ యార్డులోకి తరలించారు. ధ్వంసమైన కంటైనర్ను రోడ్డు మార్జిన్లోకి తీసుకువెళ్లారు. మోటారు సైకిళ్ల షోరూమ్ యజమానులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని, మరో కంటైనర్లో మోటారు సైకిళ్లు తరలించడానికి ఏర్పాట్లు చేశారు. డ్రైవర్ మృతదేహన్ని పోస్టుమార్టం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించామని, ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ ఎ.కృష్ణభగవాన్ తెలిపారు. ఫ ప్రమాదానికి కారణమైన ట్రాలీపై యంత్ర పరికరం ఫ కంటైనర్ను చీల్చుకుంటూ వెళ్లిపోయిన వైనం ఫ డైవర్ మృతి -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొని టిప్పర్ దగ్ధం
నిడదవోలు రూరల్: మునిపల్లి గ్రామ శివారున మంగళవారం తెల్లవారుజామున విద్యుత్ స్తంభాన్ని టిప్పర్ ఢీకొని దగ్ధమైంది. స్థానికుల వివరాల ప్రకారం.. తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ కొల్లి కృష్ణ ఐ.పంగిడి నుంచి నరసాపురానికి మెటల్ లోడ్తో వెళుతున్నాడు. మార్గం మధ్యలో నిద్రమత్తు కారణంగా లారీ అదుపు తప్పి మునిపల్లి రహదారి పక్కనే ఉన్న కోయిల వెంకటేష్కు చెందిన ప్రహరీతో పాటు విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ఘటనలో లారీ బోల్తా పడడంతో డీజిల్ ట్యాంకుపై విద్యుత్ తీగలు మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో చిక్కుకున్న డ్రైవర్ కృష్ణను స్థానికులు బయటకు లాగారు. ఈ ఘటనలో అతడి కాలుకు తీవ్రగాయమైంది. గ్రామస్తుల సమాచారం ఇవ్వడంతో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. సమిశ్రగూడెం ఎస్సై బాలాజీ సుందరరావు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. -
వీరేశ్వరుని ఆలయానికి చేరిన కృష్ణ శిల
ఐ.పోలవరం: మురమళ్ల భద్రకాళీ వీరేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి వినియోగించే భారీ కృష్ణశిల మంగళవారం రాత్రి ఆలయానికి చేరుకుంది. రాతి కట్టుబడితో ఆలయ నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ విప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ తదితరులు శిలకు ప్రత్యేక పూజలు చేశారు. వ్యభిచార గృహ నిర్వాహకుడికి రిమాండ్ గండేపల్లి: వ్యభిచార గృహ నిర్వాహకుడికి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించినట్టు ఎస్సై యూవీ శివ నాగబాబు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కె.నాయకంపల్లి శివారులో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్టు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు సీఐ బి.తిరుపతి ఆధ్వర్యంలో సోమవారం దాడి చేశారు. నిర్వాహకుడు బండి వర ప్రసాద్ (చిన్నోడు)ను అరెస్ట్ చేసి, పెద్దాపురం కోర్టలో హాజరుపర్చారు. అతడికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించిగా, సబ్ జైలుకు తరలించారు. నిందితుడి నుంచి మోటారు సైకిల్ స్వాధీనం చేసుకుని, బాధిత మహిళలకు కౌన్సెలింగ్ నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంతర్ జిల్లా దొంగల అరెస్ట్ కాకినాడ క్రైం: M>MìS-¯éyýl, ™èl*Æý‡$µ-Vø-§é-Ð]lÇ, A¯]l-M>-ç³-ÍÏ hÌêÏÌS ç³Ç-«¨ÌZ Æ>{† ÐólâýæÌZÏ §ö…VýS™èl-¯é-ÌSMýS$ ´ëÌSµyýl$-™èl$¯]l² ¯]lË$VýS$Æý‡$ A…™èlÆý‡ hÌêÏ §ö…VýSÌS¯]l$ ´ùÎ-çÜ$Ë$ AÆð‡‹Üt ^ólÔ>Æý‡$. Gïܵ ¼…§ýl$-Ð]l*«§ýlÐŒæ ™ðlÍ-í³¯]l ÑÐ]l-Æ>ÌS {ç³M>-Æý‡….. M>MìS-¯éyýl fVýS¯é²-£ýl-çœ#-Æ>°MìS ^ðl…¨¯]l «§ýlÆ>Ãyìl §ýl$Æ>Y-{ç³-Ýë§Šæ, A¯]l-ç³-Ç¢ Ð]l$…yýlÌS… ºÌS¿ýæ-{§ýl-ç³#-Æ>°MìS ^ðl…¨¯]l Vö{Çç³Nyìl Ððl…MýSr Æý‡Ð]l$׿, MýS$™èl$-Æý‡$Ë*Æý‡$MýS$ ^ðl…¨¯]l ´ëíÜ ÔóæQÆŠæ, ™éyól-ç³-ÍÏ-VýS*yðl… M>MýS-Æý‡Ï-Ð]lÊ-yìlMìS ^ðl…¨¯]l VóS§ðlÌS Ð]l$õßæ‹-Ù™ø ´ër$ K »êË$yýl$ Æ>{† ÐólâýæÌZÏ CâôæÏ ÌS„ýSÅ…V> §ö…VýS™èl¯éË$ ^ólçÜ$¢-¯é²Æý‡$. fÌêÞ-ÌSMýS$ AÌS-Ðér$ ç³yìl¯]l ÒÆý‡…§ýlÆý‡* Cç³µsìæ-Ð]l-Æý‡MýS* 10 CâýæÏÌZ ^øÈÌSMýS$ ´ëÌSµ-yézÆý‡$. D ¯ólç³-£ýlÅ…ÌZ Ðéǰ ÝùÐ]l$ÐéÆý‡… ÝëĶæ$…{™èl… ™èl*Æý‡…W ÕÐé-ÌSĶæ$… çÜÒ$-ç³…ÌZ A§ýl$-ç³#-ÌZMìS ¡çÜ$-MýS$-¯é²Æý‡$. ÐéÇ ¯]l$…_ 380.7 {V>Ð]l¬ÌS º…V>-Æý‡…, 2.854 MìSÌZÌS Ððl…yìl, JMýS ÌêÅ‹³-sꋳ ÝëÓ«-©¯]l… ^ólçÜ$MýS$-¯é²Æý‡$. ÐéÇ ÑË$Ð]l çÜ$Ð]l*Æý‡$ Æý‡*.57 ÌS„ýSË$ E…r$…§ýl° Gïܵ ™ðlÍ-´ëÆý‡$. MóSçÜ$¯]l$ ból¨…^èlyýl…ÌZ MîSÌSMýS…V> Ð]lÅÐ]l-çßæ-Ç…-_¯]l M>MìS-¯éyýl hÌêÏ HGïܵ §ólÐ]l-Æ>gŒæ Ð]l$±‹Ù ´ësìæÌŒæ, M>MìS¯éyýl Æý‡*Æý‡ÌŒæ ïÜI O^ðl™èl-¯]lÅ-MýS–çÙ~, C…{§ýl´ëÌñæ… G‹ÜI ÒÆý‡»êº$, {MðS•… G‹ÜI Ððl…MýSsôæ-ÔèæÓÆý‡$Ï, íܺ¾…¨° AÀ-¯]l…-¨…-^éÆý‡$. ˘ నేవీ లెఫ్టినెంట్గా తాళ్లపూడి యువకుడు తాళ్లపూడి: దేశ రక్షణలో కీలకమైన ఇండియన్ నేవల్ సర్వీస్ (భారత నౌకాదళం)లో తాళ్లపూడి యువకుడు గుడా విహాస్ సత్తా చాటాడు. తన ప్రతిభతో లెఫ్టినెంట్ స్థాయికి ఎదిగి, అంతర్జాతీయ శిక్షణలోనూ ఆల్ రౌండ్ ఆఫీసర్ అవార్డు దక్కించుకున్నారు. వివరాల్లోకి వెళితే.. తాళ్లపూడిలోని సాయి స్ఫూర్తి ఆస్పత్రి సీఈవో గూడా విజయరాజు, మాజీ సర్పంచ్ గూడా హరిత రాణిల ఏకై క కుమారుడు విహాస్. కోరుకొండ సైనిక్ స్కూల్లో తన కెరీర్ను ప్రారంభించాడు. క్రమశిక్షణ, పట్టుదలతో అడుగులు వేస్తూ ఇండియన్ నేవీలో ప్రవేశించాడు. ఇటీవల మహారాష్ట్రలోని లుమావాలాలో గల ఐఎన్ఎస్ శివాజీ ట్రైనింగ్ కాలేజీలో ఎంటెక్ పూర్తి చేశాడు. 101వ బ్యాచ్కు చెందిన ఈల్ రౌండ్ ఆఫీసర్ శిక్షణలో ఐదు దేశాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ శిక్షణలో అత్యంత ప్రతిభను కనబరిచిన విహాస్ ఐదు విభాగాల్లో ద్వితీయ స్థానంతో పాటు, ప్రతిష్టాత్మకమైన ఆల్ రౌండ్ ఆఫీసర్ అవార్డును అందుకుని భారత్ తరఫున సత్తా చాటాడు. మైరెన్ ఇంజినీర్గా, లెఫ్టినెంట్గా పదోన్నతి పొందడమే కాకుండా, తనకున్న ప్రత్యేక నైపుణ్యంతో ఈ అరుదైన అవార్డును కై వసం చేసుకున్నారు. పూణేలో జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్న విహాస్ తల్లిదండ్రులు విజయరాజు, హరిత రాణిలు తమ ఆనందాన్ని పంచుకున్నారు. దేశం గర్వించే ఇండియన్ నేవీలో యుద్ధ నౌకకు లెఫ్టినెంట్గా తమ కుమారుడు బాధ్యతలు చేపట్టడం గర్వకారణంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. -
టీడీపీ నాయకుల ఇంటి వద్దనే బీఎల్వోలు
సామర్లకోట: బూత్ లెవెల్ ఏజెంట్లు ఇంటింటికీ తిరిగి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయాల్సి ఉండగా టీడీపీ నాయకుల ఇళ్ల వద్ద, పంచాయతీ కార్యాలయంలో కూర్చుని ఫారాలు పంపిణీ చేస్తున్నారని వైఎస్సార్ సీపీ పంచాయతీరాజ్ వింగ్ జిల్లా అధ్యక్షుడు మోరంపూడి శ్రీరంగ నాయకులు ఆరోపించారు. కొందరు బీఎల్వోలు పంచాయతీ కార్యాలయంలో ఫారాలు ఇస్తారని మైక్ ద్వారా ప్రచారం చేయడంతో అనేక మంది అక్కడకు వెళ్లి ఫారాలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అన్ని పార్టీల నాయకుల బూత్ లెవెల్ ఏజెంట్లకు సమాచారం ఇవ్వాల్సి ఉండగా, వైఎస్సార్ సీపీ ఏజెంట్లకు మాత్రం సమాచారం ఇవ్వడం లేదన్నారు. పారదర్శకంగా నిర్వహించాల్సిన సర్ సర్వే కార్యక్రమం ఏకపక్షంగా కొనసాగుతోందన్నారు. ఫారాల పంపిణీపై బీఎల్వోను ప్రశ్నిస్తే ఇళ్ల చిరునామాలు తెలియకపోవడంతో ఒక చోట ఉండి పంపిణీ చేస్తున్నామంటూ సమాధానం ఇస్తున్నారని తెలిపారు. దీనిపై రెవెన్యూ అధికారులు విచారణ చేసి చర్యలు తీసుకోవాలన్నారు. రాజకీయ నాయకుల చేతుల మీదుగా ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. సోమవారం మేడపాడులో ఎమ్మెల్యే చినరాజప్ప, టీడీపీ నాయకులు ఫారాలు పంపిణీ చేశారని రంగనాయకులు తెలిపారు. దీనిపై తహసీల్దార్ కొవ్వూరి చంద్రశేఖరరెడ్డిని వివరణ కోరగా జి.మేడపాడులో నలుగురు బీఎల్వోలు ఉన్నారని, మండల పరిధిలో బీఎల్వోలతో సమావేశమై నిబంధనలు తెలియజేస్తానన్నారన్నారు. -
టూరెస్ట్ ప్రాజెక్టు
ఆత్రేయపురం: కాటన్ బ్యారేజీ సమీపంలోని పిచ్చుక లంకలో తలపెట్టిన టూరిజం ప్రాజెక్టు ఒక్క అడుగు ముందుకు కదలడం లేదు. దశాబ్దాల తరబడి పనులు జరగకపోవడంతో ప్రజలు నిరాశ చెందుతున్నారు. తెలుగుదేశం పాలనలో 1988 ఏప్రిల్ 20న పిచ్చుక లంక రక్షకాభివృద్ధి పథకానికి శంకుస్థాపన జరిగింది. అప్పటి నుంచి ఎక్కడి వేసిన గొంగళి అక్కడే ఉందని చందంగా మారింది. దాదాపు 38 ఏళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. రాజమహేంద్రవరం ప్రజలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు ఇది ఆహ్లాదకరంగా, ఉపయోగకరంగా ఉంటుందని, పర్యాటకంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భావించారు. రాబోయే పుష్కరాలు నాటికై నా ఇక్కడ టూరిస్ట్ ప్రాజెక్టు అభివృద్ధి చేస్తారని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎంతో ఆర్భాటంగా శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టు పనులు దాదాపు ముందుకు కదల్లేదనే చెప్పాలి. మధ్యలో కొద్దిగా మెరక చేసి వదిలేయడం మినహా ఈ ప్రాజెక్టు అభివృద్ధికి ఏమాత్రం పనులు చేపట్టలేదు. కనీసం చుట్టూ రక్షణ గోడను సైతం నిర్మించకపోవడం దారుణం. ఉపన్యాసాలే తప్ప.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తోంది. రాజమహేంద్రవరానికి కూత వేటు దూరంలోనే రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఉంటున్నారు. ఆయనతో పాటు కూటమి నాయకులందరూ పిచ్చుకలంక అభివృద్ధిపై ఉపన్యాసాలు ఇస్తున్నారే తప్ప, ఆచరణలో చూపడం లేదు. పిచ్చుకలంకలో టూరిజం ప్రాజెక్టు వస్తే ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కలుగుతాయని స్థానిక యువత భావించారు. కానీ ఆ ఆశలన్నీ ఎండమావులుగా మారాయి. అధ్వానంగా.. ప్రస్తుతం పిచ్చుకలంకలో ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. గతంలో టీడీపీ పాలనలో పిచ్చుకలంకలో వ్యవసాయ పరిశోధనా స్థానం నిర్మాణానికి సైతం శంకుస్థాపన శిలాఫలకం వేశారు. ఆ పనులకు ఇంతవరకు అతీగతీ లేదు. శిలాఫలకం ఆచూకీ కూడా దొరకడం లేదు. పైగా ఈ ప్రాంతంలో కొందరు దేశం నాయకులు బినామీలుగా అరటి తోటలు సాగు చేసుకుంటూ లబ్ధి పొందుతున్నాని సమాచారం. రాబోయే పుష్కరాల నాటికై నా పిచ్చుకలంక టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పిచ్చుక లంక టూరిజం ప్రాజెక్టు కోసం కేటాయించిన ప్రాంతం{´ëgñæMýS$t MøçÜ… 1988ÌZ ˘ ఆవిష్కరించిన శిలాఫలకంఫ కలగా మిగిలిన పిచ్చుకలంక టూరిజం ప్రాజెక్టు ఫ ముందుకు కదలని పనులు ఫ గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన ఫ ఏళ్ల తరబడి ప్రజల ఎదురుచూపులు ఫ పట్టించుకోని పాలకులు -
ఆశలు నెరవేరలేదు
పిచ్చుకలంక టూరిజం ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భావించాం. కానీ ఆ ఆశలు నెరవేరలేదు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి టూరిజం ప్రాజెక్టును అభివృద్ధి చేయాలి. – కుండ అన్నపూర్ణ, ఆత్రేయపురం మండల పరిషత్ అధ్యక్షురాలు అభివృద్ధి చేయాలి పిచ్చుకలంకను అభివృద్ధి చేస్తే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రజలందరికి టూరిస్ట్ ప్రదేశంగా మారుతుంది. కూటమి నేతలు ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ టూరిజం ప్రాజెక్టును అభివృద్ధి చేయాలి. రాబోయే గోదావరి పుష్కరాల నాటికై నా పూర్తి చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. – గొట్టుముక్కల గోపాలకృష్ణంరాజు (గోపి), వైఎస్సార్ సీపీ ప్రైవేటు ఉపాధ్యాయ సంఘాల నేత -
వ్యాన్ బోల్తా పడి కూలీలకు గాయాలు
చింతూరు: అడ్డుగా వచ్చిన పశువులను తప్పించే క్రమంలో వ్యాన్ బోల్తా పడింది. చింతూరు మండలం సింగన్నగూడెంలో మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో పది మంది కూలీలకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. చింతూరు మండలం ఎర్రంపేటలో ఇంటి నిర్మాణ పని కోసం భద్రాచలం నుంచి 10 మంది కూలీలు వ్యాన్లో బయలుదేరారు. వారి వాహనం సింగన్నగూడెం వద్దకు వచ్చేసరికి జాతీయ రహదారి 30పై పశువులు అడ్డుగా వచ్చాయి. ఈ క్రమంలో వాహనం అదుపు తప్పి రహదారిపై బోల్తా పడడంతో దానిలో పది మంది కూలీలు గాయపడ్డారు. వారిని చికిత్స కోసం చింతూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో వర్సా వీరభద్రం, రాములమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో భద్రాచలానికి రిఫర్ చేశారు. -
జాతరోత్సవం.. కన్నుల వైభవం
వీఆర్పురం: ప్రతి మూడేళ్లకు ఒక్కసారి జరిగే గిరిజనుల జాతర మహోత్సవం కుర్రాజుల కొలుపులు మంగళవారం రేఖపల్లి గ్రామంలో ఘనంగా ముగిసింది. గిరిజనుల ఆరాధ్య దైవం కుర్రాజుల చిన్న దారులమ్మ, పెద్ద దారులమ్మ దేవతల జాతరను 11 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నిప్పుల గుండం తొక్కి ఉత్సవాలను కుల పెద్దలు ఘనంగా జరిపారు. నాయకపోడు కొండరెడ్లతో కలిసి కనుల పండువగా జాతర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. గిరిజనుల పండగ అయినప్పటికీ కులాలకు అతీతంగా భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బాలల హక్కుల కమిషన్ సభ్యులు ఉండవల్లి గాంధీబాబు, తహసీల్దార్ సరస్వతి, ఎంపీడీవో జగన్నాథరావు పూజలు చేశారు. ఎస్సై సాదిక్ సిబ్బందితో కలిసి బందోబస్తు నిర్వహించారు. -
డెల్టాలకు 9,593 క్యూసెక్కులు
ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ నుంచి గోదావరి డెల్టా కాలువలకు మంగళవారం 9,593 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 2,679, మధ్య డెల్టాకు 1,914, పశ్చిమ డెల్టాకు 5 వేల క్యూసెక్కుల చొప్పున వదిలారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 8.20 అడుగులు ఉంది. నేటి నుంచి ఫ్లడ్ కంట్రోల్ రూమ్ ధవళేశ్వరం: వరదల సీజన్ ప్రారంభం కానుండటంతో ధవళేశ్వరం హెడ్వర్క్స్ కార్యాలయం వద్ద బుధవారం నుంచి ఫ్లడ్ కంట్రోల్ రూమ్ పని చేయనుంది. ఇది అక్టోబర్ 31వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుందని హెడ్వర్క్స్ ఈఈ జి.శ్రీనివాసరావు తెలిపారు. వరదలకు సంబంధించి ఎటువంటి సమాచారం కావాలన్నా ఫ్లడ్ కంట్రోల్ రూమ్ను 0883–2417066 నంబరులో సంప్రదించాలని సూచించారు. ముద్రగడ త్వరగా కోలుకోవాలి రాజమహేంద్రవరం సిటీ: హైదరాబాద్లోని సింధు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభాన్ని మాజీ ఎంపీ, ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్, రాష్ట్ర కార్యదర్శి తోట రామకృష్ణ మంగళవారం పరామర్శించారు. ముద్రగడ ఆరోగ్య పరిస్థితిని ఆయన కుమారుడు వైఎస్సార్ సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జి గిరిబాబును అడిగి తెలుసుకున్నారు. ముద్రగడ త్వరగా కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. సురక్షితంగా స్వదేశానికి..అమలాపురం రూరల్: మస్కట్లో ఇబ్బందులు ఎదుర్కొన్న మహిళను కేసీఎం అధికారులు సురక్షితంగా స్వదేశానికి రప్పించారు. అల్లవరం మండలం ఎన్.రామేశ్వరం చెందిన సీహెచ్.ధనలక్ష్మి మస్కట్కు ఉపాధి నిమిత్తం వెళ్లి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కలెక్టర్ మహేష్కుమార్ చొరవతో ఆమెను సురక్షితంగా భారతదేశానికి రప్పించడం జరిగింది. ఆమె 13 ఏప్రిల్ 2026న విజయవాడకు చెందిన ఏజెంట్ పి. సునీత ద్వారా మస్కట్కు వెళ్లారు. అక్కడ అధిక పని గంటలు, తీవ్రమైన పని ఒత్తిడి, అనారోగ్య పరిస్థితుల కారణంగా పనిచేయలేని స్థితికి చేరుకోవడంతో స్వదేశానికి రావాలని కోరుకున్నారు. కుటుంబ సభ్యులు కలెక్టరేట్లోని కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్లో ఫిర్యాదు చేశారు. కేసీఎం అధికారులు ఏజెంట్, యజమాని ఇతర సంబంధిత వర్గాలతో సమన్వయం చేసి ధనలక్ష్మిని సురక్షితంగా కోనసీమకు రప్పించారు. కేసీఎం నోడల్ అధికారి సుబ్బారావుకు, కలెక్టర్కు, ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సమన్వయకర్త గోళ్ళ రమేష్, బి నాగరాజు(మస్కట్ ) కడియాల సత్తిబాబు, షేక్ బీబి సఫియా పాల్గొన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి అడ్డతీగల: సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అడ్డతీగల సీఐ గజేంద్ర కుమా ర్ అన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో మంగళవా రం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అపరిచితులతో మొబైల్ చాటింగ్, కాల్స్ మాట్లాడడం, అనుమానిత యాప్లను డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించడం చేయరాదన్నారు. మహిళలు ఎలాంటి వేధింపులకు గురైనా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. గంజాయి తదితర మత్తు పదార్థాలతో అనేక అనర్థాలు కలుగుతాయని, వాటికి దూరంగా ఉండాలని హితవు పలికారు. వాహనచోదకులు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలన్నారు. -
కిం కర్తవ్యం!
● రత్నగిరిపై పూజాద్రవ్యాల రేట్లపై సందిగ్ధత ● 6 కొబ్బరి కాయలు, 6 అరటిపండ్లకు రూ.180కి పాట ● రూ.280కి పెంచాలని పాటదారుల వినతిఅన్నవరం: రత్నగిరిపై పూజాద్రవ్యాల షాపుల్లో కొబ్బరి కాయలు, అరటి పండ్లు ఎంత ధరకు విక్రయించాలనే దానిపై సందిగ్ధత నెలకొంది. సత్యదేవుని వ్రతాల్లో 6 కొబ్బరి కాయలు, 6 అరటి పండ్లను వ్రతం సెట్టుగా భావిస్తారు. వ్రతం సెట్టును నిర్ణీత రూ.180కి కాకుండా రూ.300 వరకూ విక్రయిస్తున్నారంటూ జూన్ 24న జరిగిన ట్రస్ట్బోర్డు సమావేశంలో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి హాజరైన పాటదారులు ఈ విషయాన్ని అంగీకరిస్తూనే.. రూ.180 రేటు పదేళ్ల కిందటిదని, ఇది గిట్టుబాటు కాదని చాలాసార్లు వినతి పత్రాలు సమర్పించామని, ఆ రేట్లకే అమ్మాలనడం సమంజసం కాదని తెలిపారు. దీనిని రూ.280కి విక్రయించేందుకు అనుమతించాలని వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలోని అన్ని దేవస్థానాల్లో కొబ్బరి కాయ రూ.35 నుంచి రూ.50 వరకూ, అరటి పండ్లు డజను రూ.60 నుంచి రూ.80 వరకూ విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. విజయవాడ, ద్వారకా తిరుమల దేవస్థానాల్లో కొబ్బరి కాయ రూ.35కు విక్రయిస్తున్నారు. ఆమేరకు రత్నగిరిపై 6 కొబ్బరి కాయలు రూ.210కి, అరడజను అరటి పండు రూ.40కి విక్రయించేందుకు అనుమతించాలని పాటదారులు కోరుతున్నారు. మిగిలిన రూ.30కి పసుపు, కుంకుమ, పు వ్వులు, తులసి దళాలు, అగరువత్తులు, హారతి కర్పూ రం ఇస్తారు. ఈ పదేళ్లలో షాపుల అద్దెలు మూడు రెట్లు పెరిగినా ఈ రేట్లు మాత్రం పెంచలేదని తెలిపారు. రూ.4 కోట్ల ఆదాయం పశ్చిమ రాజగోపురం వద్ద ఉన్న రెండు పూజాద్రవ్యాలు, ఫ్యాన్సీ షాపులకు జూన్ 17న జరిగిన వేలంలో రికార్డు స్థాయిలో పాట ఖరారైంది. షాపు నంబర్–1కు నెలకు రూ.16.73 లక్షలు (పాత వేలం పాట రూ.13.81 లక్షలు), షాపు నంబర్–2కు నెలకు రూ.18.33 లక్షల(పాత పాట రూ.10.26 లక్షలు)కు వేలం పాడారు. తద్వారా దేవస్థానానికి ఏడాదికి రూ.4.20 కోట్ల ఆదాయం రానుంది. దీనిపై జీఎస్టీ 18 శాతం చెల్లించాలి. రెండో ఏడాది ఈ మొత్తంపై 10 శాతం అధికంగా చెల్లించాలి. ఈ రెండు షాపుల్లోనూ పూజాద్రవ్యాలతో పాటు ఫ్యాన్సీ వస్తువులు కూడా అమ్ముకోవచ్చు. దేవస్థానానికి ఆరు నెలల పాట సొమ్ము జమ చేసి, వ్యాపారం చేయాలనేది నిబంధన. జూలై 13 నుంచి ఈ పాట అమలులోకి రానుంది. పాటదారుల విజ్ఞప్తి నేపథ్యంలో పాత రేటు రూ.180నే కొనసాగించాలా లేక రూ.280కి పెంచాలా అనేదానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. రేటు పెంచాలని నిర్ణయిస్తే ఈ షాపులతో పాటు రామాలయం ఎదురుగా ఉన్న మరో రెండు పూజాద్రవ్యాల షాపులకు కూడా వర్తింపజేయాల్సి ఉంటుంది. దీనికి నిబంధనలు వర్తిస్తాయా అనే సందేహం కూడా ఉంది. కమిషనర్ ఆదేశాల మేరకే నిర్ణయం దేవస్థానంలో వ్రతం సెట్టు రేటు పెంపు అంశాన్ని దేవదాయ శాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి, ఆయన ఆదేశాల ప్రకారం వ్యవహరిస్తాం. ఒకవేళ మళ్లీ వేలం నిర్వహించాలని ఆదేశిస్తే ఆ మేరకు చర్యలు తీసుకుంటాం. – నల్లం సూర్యచక్రధరరావు, ఈఓ, అన్నవరం దేవస్థానం -
డాక్టర్ సత్యవతికి లెజెండరీ అవార్డు
కాకినాడ క్రైం: నగరానికి చెందిన ప్రముఖ గైనకాలజీ వైద్యులు ఏఎల్ సత్యవతిని ప్రతిష్టాత్మక ఏపీ ఐఎస్ఏఆర్ లెజెండ్స్ ఆఫ్ రిప్రొడెక్టివ్ మెడిసిన్ అవార్డు వరించింది. ఏపీ ఐఎస్ఏఆర్ (ఇండియన్ సొసైటీ ఫర్ అసిస్టెడ్ రీప్రొడక్షన్) ఆధ్వర్యాన గుంటూరు జింఖానా ఆడిటోరియంలో మంగళవారం జరిగిన రాష్ట్ర స్థాయి కాన్క్లేవ్లో ఆమె ఈ అవార్డు అందుకున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో 1998లోనే తొలి ఐవీఎఫ్ సెంటర్ ఏర్పాటు చేసి, 2000 మార్చిలో తొలి టెస్ట్ట్యూబ్ బేబీకి డాక్టర్ సత్యవతి ప్రాణం పోశారు. సింగపూర్లోని నేషనల్ యూనివర్సిటీ హాస్పిటల్స్, బెల్జియంలోని జంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫెర్టిలిటీ టెక్నాలజీస్లో ప్రపంచ ప్రఖ్యాత ఎంబ్రియాలజిస్ట్ మార్టిన్ ఎన్ఐజేఎస్ వద్ద మన దేశానికి అప్పటికి పరిచయం కాని ఇంట్రా సైటాప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజక్షన్ (ఇక్సీ) ఫలదీకరణ విధానంపై శిక్షణ పొందారు. ఈ ప్రక్రియను 2001లో ప్రయోగాత్మకంగా అమలు చేసి, ఇంక్యుబేటర్లో మూడు రోజుల పాటు బాహ్య ఫలదీకరణ చేసి, నాలుగో రోజు బ్లాస్టోసిస్ట్ కల్చర్ అవలంబించి ఓ శిశువుకు ప్రాణం పోసి, సంచలనం సృష్టించారు. అరుదైన శాసీ్త్రయ విధానాల్లో పుట్టిన వీరందరూ ప్రస్తుతం పూర్తి ఆరోగ్యవంతులుగా వారి జీవితాలను ఆనందంగా కొనసాగిస్తున్నారు. కాకినాడలోని సృజన మల్టీస్పెషాలిటీ హాస్పిటల్, ఐవీఎఫ్ సెంటర్ ద్వారా డాక్టర్ సత్యవతి వందలాది ప్రసవాలు చేశారు. ఎక్కువ మంది కవలలకు ప్రసవాలు చేసిన ఘనత దక్కించుకున్నారు. కొద్ది రోజుల క్రితం ప్రాణాలతో పుట్టడానికి ఏమాత్రం ఆస్కారం లేని ఎపిడెర్మోలసిస్ బులోసా (చర్మం ఊడి పుట్టడం) అనే అరుదైన జన్యులోపంతో పుట్టిన మగశిశువు ప్రసవాన్ని విజయవంతంగా నిర్వహించారు. తల్లి గర్భం నుంచి శిశువును ప్రాణాలతో బయటకు తీసి, కుటుంబ సభ్యుల విన్నపం మేరకు మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్లో చేర్చారు. వీటన్నింటి నేపథ్యంలో డాక్టర్ సత్యవతిని ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఆమెను సీనియర్ వైద్యులు సహా ప్రముఖులు అభినందించారు. -
ఖరీఫ్ కన్నీరేనా!
సాగు ప్రారంభం కాక పిఠాపురం మండలం రాపర్తిలో ఖాళీగా ఉన్న పంట భూములు ● శివారు పొలాలకు ఇప్పటికీ అందని సాగునీరు ● నిండుకున్న ‘ఏలేరు’ ● నారుమళ్లు ఆలస్యం ● ఆందోళనలో రైతులుపిఠాపురం: ఆలస్యం అమృతం విషం అన్నారు పెద్దలు. ప్రభుత్వ పెద్దలు కూడా అదే చెప్పుకొచ్చారు. తీరా చూస్తే వారి మాటలకు అర్థాలే వేరు అన్నట్టుగా ఖరీఫ్ సాగు పరిస్థితి తయారైంది. ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని, రైతులు ముందస్తు సాగు చేసుకోవాలని ప్రభుత్వ యంత్రాంగం పదేపదే చెబుతోంది. కానీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు తగినట్టుగా లేదు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి జూన్ ఒకటో తేదీనే నీరు విడుదల చేసినా.. అది ఇప్పటికీ శివారు ప్రాంతాలకు చేరలేదు. మరో వారం రోజులకు కానీ చివరి భూములకు నీరందే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు అదునుకు కురిసిన వానలూ అంతంత మాత్రమే. కొన్నిచోట్ల అవి మడిని తడపడానికి మాత్రమే ఉపయోగపడ్డాయి. ఫలితంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికీ నారుమడులు ప్రారంభం కాలేదు. మరోవైపు జిల్లాలోని ఏలేరు, తాండవ, పంపా రిజర్వాయర్లతో పాటు పుష్కర ఎత్తిపోతల పథకం నుంచి జలాలు ఎప్పుడు విడుదల చేస్తారో స్పష్టత లేదు. దీంతో, పిఠాపురం, తుని, ప్రత్తిపాడు, పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల రైతుల్లో ఖరీఫ్ సాగుపై అయోమయం నెలకొంది.నిండుకున్న ‘ఏలేరు’ జిల్లాలోని అతి పెద్ద మీడియం ఇరిగేషన్ పథకం ఏలేరు రిజర్వాయర్. దీని పూర్తి స్థాయి నీటిమట్టం 86.56 మీటర్లు. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 24.11 టీఎంసీలు. సాధారణంగా జూన్ పదో తేదీ నాటికే ఏలేరు జలాలు విడుదల చేసేవారు. దీంతో, రైతులు నారుమళ్లు వేసి, జూలై మొదటి వారానికి వరి నాట్లు పూర్తి చేసేవారు. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి కనిపించడం లేదు. రిజర్వాయర్ నుంచి 150 క్యూసెక్కుల నీరు విడుదల చేసినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ అవి శివారుకు చేరుకోవడం సాధ్యం కాదని రైతులు అంటున్నారు. ఈ ఏడాది సరైన వర్షాలు లేకపోవడంతో ఏలేరు రిజర్వాయర్లో నీటి నిల్వలు ప్రస్తుతం 8.57 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఇందులో 6 టీఎంసీలు డెడ్ స్టోరేజీ. మిగిలిన 2.80 టీఎంసీల నీటినే విశాఖపట్నం స్టీల్ప్లాంటుకు, పంటల సాగుకు విడుదల చేయాలి. ఇంత తక్కువ నీరు మెట్టలో వరిసాగుకు ఏమాత్రం సరిపోదు. రిజర్వాయర్లో నీటి నిల్వలు 12 టీఎంసీలకు పెరిగితేనే కానీ సాగునీరు విడుదల చేసే అవకాశం ఉండదు. ఇటీవలి వర్షాలకు జలాశయంలో నీటి నిల్వలు పెరిగిన దాఖలాలు లేవు. ఈ పరిస్థితు ల్లో ఏలేరు నీటి విడుదలలో మరింత జాప్యం జరగవచ్చనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. ఏలేరు జలాలు మడిని తడిపితేనే దమ్ములు చేసుకోగలమని అంటున్నారు. పరిస్థితి చూస్తూంటే ఆగస్టు మొదటి వారం వరకూ వరి నాట్లు సాగుతూనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆధునీకరణ లేక.. ప్రభుత్వం ఏలేరు ఆధునీకరణను చేపట్టకపోవడంతో ఏటా ఆగస్టు, అక్టోబర్లో వరదలు, తుపానులు రావడం, ఆయకట్టులోని పంటలు ముంపు బారిన పడి, రైతులు నష్టపోవడం జరుగుతూనే ఉంది. ఖరీఫ్ ముందస్తు సాగు చేపడితే ఈ వరదల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందని భావించినా.. షరా మామూలుగానే జాప్యం జరిగింది. దీంతో, ఈ ఏడాది కూడా తమ పంటలకు ముప్పు తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు. నీరు రాక.. నారు లేక.. జిల్లాలో జూన్ 16 నుంచి నారుమళ్లు వేసి, జూలై నెలాఖరుకు నాట్లు పూర్తి చేయాలని అధికారులు చెప్పారు. దీనివలన పంట చివరిలో ప్రకృతి వైపరీత్యాల బారిన పడకుండా ఉంటుందన్నారు. ప్రస్తుత ఖరీఫ్లో జిల్లావ్యాప్తంగా 2,36,435 ఎకరాల్లో వరి సాగు చేయాలన్నది లక్ష్యం. ఈపాటికే 2,700 హెక్టార్లలో నారుమళ్లు వేయాల్సి ఉండగా.. ఇవి 10 శాతం కూడా దాటలేదు. నారు వేసే పనులు జూలై నెలాఖరుకు కానీ పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికే ఖరీఫ్ సాగు 25 రోజులు ఆలస్యమవడంతో ముందస్తు సాగు కాస్తా వెనుకపట్టు పట్టే పరిస్థితి కనిపిస్తోంది. -
పెట్టుబడా మోసం!
రూ.19 లక్షలు కట్టాను నేడు, నా భార్య, పిల్లల పేరిట రూ.19 లక్షల పెట్టుబడి పెట్టాను. 10 నెలలు, 20 నెలలు, 30 నెలల గడువుతో ఆదాయం వస్తుందని చెప్పారు. నెలనెలా సొమ్ములు ఇవ్వడం లేదు. మాకు భయం వేస్తోంది. సొమ్ము ఇప్పించేలా అధికారులు చొరవ తీసుకోవాలి. – వనమాడి చిన్నా, గుడారిగుంట, కాకినాడ పది నెలల క్రితమే కట్టాం రూ.లక్షకు రూ.8 వేల వడ్డీ అన్నారు. విడతల వారీగా రూ.25 లక్షలు కట్టాం. ఐదు నెలలుగా డబ్బులు వేయడం లేదు. అధిక వడ్డీపై ఆశతో బంగారం తాకట్టు పెట్టి మరీ కట్టాం. ఇప్పుడు ఆందోళనగా ఉంది. మా సొమ్ము ఇప్పించాలి. – పడమర రాజేశ్వరి, కాకినాడ కాకినాడ రూరల్: తమ వద్ద పెట్టిన పెట్టుబడిని స్వల్ప వ్యవధిలోనే మూడు రెట్లు చేస్తామన్న సంస్థ నాలుగు నెలలుగా నెలవారీ ఇస్తామన్న సొమ్ము ఇవ్వడం లేదని బాధితులు ఆందోళన చెందుతున్నారు. వివరాలివీ.. కాకినాడ ఎన్ఎఫ్సీఎల్ రోడ్డులోని సిద్ధార్థ నగర్ కేఆర్కే ప్లాజాలో ఆల్మైటీ జెనెసిస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ పేరిట ఓ సంస్థ కొన్నేళ్లుగా ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తోంది. రూ.లక్ష పెట్టుబడి పెడితే 30 నెలల్లో దాదాపు రూ.3 లక్షల వరకూ ముట్టజెబుతామని చెప్పింది. రూ.లక్ష కట్టిన వారికి మొదటి 10 నెలలకు ప్రతి నెలా రూ.15 వేల చొప్పున, తరువాత 20 నెలలకు సొమ్ము ఇస్తామని ఆ కంపెనీ సిబ్బంది చెప్పారు. అదేవిధంగా ప్రతి నెలా చెల్లించడంతో చెప్పడంతో వేలాది మంది రూ.లక్షల నుంచి రూ.25 లక్షల వరకూ పెట్టుబడి పెట్టారు. అయితే, నాలుగు నెలలుగా నెలవారీ చెల్లింపులు నిలిచిపోవడంతో వారిలో అనుమానం, ఆందోళన మొదలైంది. కంపెనీ సిబ్బందిని నిలదీస్తే జూన్ నెలాఖరున ఇస్తామని చెప్పడంతో మంగళవారం సాయంత్రం వరకూ వేసి చూశారు. అప్పటికీ సొమ్ము ఇవ్వకపోవడంతో పలువురు ఆ కంపెనీ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో, ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న సర్పవరం సీఐ సీహెచ్ ప్రకాష్, సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. బాధితుల నుంచి, సంస్థ కార్యాలయంలోని సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా సీఐ మీడియాతో మాట్లాడుతూ, ప్రజల నుంచి ఫోన్ రావడంతో తాము వచ్చామన్నారు. బాధితులకు కంపెనీ ఏవిధంగా హామీ ఇచ్చింది, ఎంత మంది పెట్టుబడి పెట్టారో, వారికి ఎందుకు చెల్లించలేదో తేలాల్సి ఉందని చెప్పారు. ఇద్దరు డైరెక్టర్లున్నట్లు చెబుతున్నారని, ఒకరు ఏలూరులో ఉన్నారని అన్నారు. రూ.4 లక్షలు పైబడి చెల్లించిన వారికి అసలు, వడ్డీ కలిపి నెలనెలా ఇస్తామన్నారని బాధితులు చెప్పారన్నారు. బాధితుల నుంచి ఫిర్యాదు అందిన తరువాత చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రాథమిక అంచనా ప్రకారం డిపాజిటర్లు సుమారు రూ.50 లక్షల వరకూ పెట్టుబడి పెట్టి ఉంటారని భావిస్తున్నామన్నారు. తీవ్ర ఆందోళనలో బాధిత మహిళలు పెట్టుబడిని మూడేళ్లలో మూడు రెట్లు చేస్తామని ఎర నెలవారీ సొమ్ములు ఇవ్వకపోవడంతో బాధితుల్లో అనుమానం కాకినాడలోని సంస్థ కార్యాలయం వద్ద ఆందోళన -
సర్ విధుల్లో అలసత్వం వద్దు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) విధుల నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ హెచ్చరించారు. సర్ ప్రక్రియలో భాగంగా స్థానిక శాంతి నగర్లోని 48వ పోలింగ్ కేంద్రం పరిధిలో ఎన్యూమరేషన్ పత్రాల పంపిణి ప్రక్రియను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీలో జాప్యానికి గల కారణాలను ఏఈఆర్ఓ, బూత్ లెవెల్ అధికారి (బీఎల్ఓ), సూపర్వైజర్ను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా నిర్ణీత గడువులోగా జిల్లాలో ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు. చనిపోయిన, ఆచూకీ తెలియని, శాశ్వతంగా వలస వెళ్లిన వారి ఓట్ల పట్ల అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఆచూకీ తెలియని, శాశ్వత వలస ఓటర్ల గృహాలకు నిబంధన ప్రకారం తప్పనిసరిగా నోటీసులు అతికించాలని ఆదేశించారు. ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ, తిరిగి ఓటర్ల నుంచి స్వీకరించడంలో స్వయం సహాయక సంఘాలు, అంగన్వాడీ, ఆశా వర్కర్ల సహాయం తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో అర్బన్ తహసీల్దార్ వి.జితేంద్ర కూడా పాల్గొన్నారు. ఇంటర్మీడియెట్ విద్యాధికారిగా రాంబాబు బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): జిల్లా ఇంటర్మీడియెట్ విద్య అధికారిగా జ్యోతుల రాంబాబు నియమితులయ్యారు. ఇప్పటి వరకూ పని చేసిన వి.కేశవరావు ఉద్యోగ విరమణ చేశారు. దీంతో, ఆయన స్థానంలో కాకినాడ పీఆర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్గా విధులు నిర్వహిస్తున్న రాంబాబును నియమించారు. ఆయనను పలువురు జూనియర్ కళాశాలల అధ్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బంది అభినందించారు. ఐఆర్ ప్రకటించాలి అమలాపురం టౌన్: నిత్యావసర వస్తువుల ధరలు, ఆస్పత్రుల ఖర్చులు పెరిగిపోయాయని కోనసీమ జిల్లా ఇంటర్మీడియట్ పెన్షనర్ల అసోసియేషన్ సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దృష్ట్యా ప్రభుత్వం తక్షణమే పీఆర్సీ వేసి ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేసింది. స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జిల్లా అసోసియేషన్ ప్రతినిధి కోలా వెంకటేశ్వరరావు అధ్యక్షతన మంగళవారం సమావేశం జరిగింది. పెండింగ్ డీఏలు విడుదల చేయాలని, హెల్త్ కార్డులు కార్పొరేట్ ఆస్పత్రుల్లో పనిచేసేలా చూడాలని డిమాండ్ చేశారు. 70 ఏళ్లు నిండిన పెన్షనర్లకు అదనపు క్వాంటమ్ 7 నుంచి 10 శాతానికి, 75 సంవత్సరాలు నిండిన వారికి 12 నుంచి 15 శాతం పెంచాలని సూచించారు. -
ఎరువాక సాగారు..
జగ్గంపేట: మండలంలోని మామిడాడలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులతో కలసి నాగలి పట్టి పొలం పనులను కాకినాడ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ప్రారంభించారు. వ్యవసాయ శాఖ, ఆత్మ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల పరిశీలన బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ధ్రువపత్రాలను దగ్గరలోని ప్రభుత్వ ఐటీఐలో పరిశీలన చేయించుకోవాలని ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ఎంవీజే వర్మ సోమవారం తెలిపారు. ఇప్పటి వరకూ ఆన్లైన్ ద్వారా 2,052 దరఖాస్తులు రాగా, 1,342 మంది అభ్యర్థులు మాత్రమే వెరిఫికేషన్ చేయించుకున్నారన్నారు. ఈ ప్రక్రియ వచ్చే నెల 2వ తేదీలోగా పూర్తి చేయాలని సూచించారు. ఆన్లైన్ దరఖాస్తులకు మంగళవారం సాయంత్రంతో గడువు ముగుస్తుందని, అభ్యర్థులకు సందేహాలు ఉంటే 94404 08182 ఫోన్ నంబర్లో సంప్రదించాలని వివరించారు. తనిఖీలు పూర్తయ్యాకే బోట్లకు అనుమతి దేవీపట్నం: గోదావరి నదిలో పోశమ్మగండి నుంచి పాపికొండల విహారయాత్రకు వెళ్లే పర్యాటక బోట్లకు పూర్తి స్థాయిలో తనిఖీలు పూర్తయ్యాకే అనుమతులు మంజూరు చేస్తామని పోలవరం జేసీ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్కుమార్ తెలిపారు. పోశమ్మగండి వద్ద పర్యాటక బోట్ల యాజమాన్యంతో కలసి సోమవారం ఆయన పర్యాటక బోట్లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పర్యాటకుల భద్రతే ప్రధానమని దీనిని దృష్టిలో ఉంచుకుని పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించి ఫిట్నెస్ కలిగిన వాటిపై జిల్లా కలెక్టర్కు నివేదిక సమర్పిస్తామన్నారు. భద్రతా ప్రమాణాలు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, నిర్దేశించిన భద్రతా పరికరాలు లేని బోట్లను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదన్నారు. ప్రతి టూరిస్టు లైఫ్ జాకెట్లు వాడేలా చర్యలు చేపట్టాలన్నారు. బోట్లలో అనుమతించిన పరిమితికి మించి ఎక్కించుకున్నా, పర్యాటకులు భద్రత విషయంలో నిర్ల్యక్షం వహించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బోటు యజమానులు అన్ని భద్రతా నియమాలు, నిబంధనలు పాటిస్తూ అధికారులకు సహకరిస్తూ పర్యాటకులు భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. డీఏసీఎల్ స్పెషాలిటీ కెమికల్స్ ప్లాంట్కు ఒప్పందం తొండంగి: కాకినాడ జిల్లా కోన ప్రాంతం కేఎస్ఈజెడ్ (కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి)లో రూ.500 కోట్ల పెట్టుబడితో గుజరాత్ రాష్ట్రానికి చెందిన డీఏసీఎల్ ఫైన్ కెమ్ అత్యాధునిక ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు కేఎస్ఈజెడ్, డీఏసీఎల్ సంస్థల మధ్య సోమవారం కీలక ఒప్పందం జరిగింది. కేఎస్ఈజెడ్ పరిధిలోని తొండంగి మండలంలో 50 ఎకరాల విస్తీర్ణంలో రూ.500 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక స్పెషాలిటీ కెమికల్స్ ఉత్పాదక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికంగా వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కాకినాడ సెజ్ సీఈఓ రామ్రెడ్డి ఓజిలి తెలిపారు. ఈ మేరకు డీఏసీఎల్ ఫైన్ కెమ్ లిమిటెడ్ చైర్మన్ అమిత్ మెహతాను కలసి ఒప్పందంపై సంతకాలు చేసినట్టు వెల్లడించారు. అరబిందో ఇండస్ట్రియల్ సిటీగా వ్యవహరిస్తున్న కాకినాడ సెజ్ సుమారు 600 ఎకరాల్లో విస్తరించి ఉందని, దేశంలోని అతి పెద్ద పోర్ట్ ఆధారిత పారిశ్రామిక పార్కుల్లో ఇది ఉందని చెప్పారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో 12కు పైగా సీఫుడ్ పరిశ్రమలు ఉన్నాయన్నారు. అరబిందో 500 ఎకరాల్లో పెద్ద ప్లాంట్ ఏర్పాటు చేయగా.. కొత్తగా మరో ఆరు సంస్థలు ప్రాజెక్టుల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. డీఏసీఎల్ ఫైన్ కెమికల్స్తో పాటు డయా మైన్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థలుగా ఉన్నాయన్నారు. ఫార్మా ఆగ్రో కెమికల్స్, పాలిమర్స్, పెయింట్స్ వంటి రంగాలకు అవసరమైన కీలక రసాయనాలను (ముఖ్యంగా ఇథిలీనమైన్స్)ను దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల కోసం తయారు చేస్తుందన్నారు. -
పదే పదే తిరుగుతున్నా..
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): పదే పదే తిరుగుతున్నాం.. మొర ఆలకించండంటూ మొరపెట్టుకుంటున్నాం.. కాళ్లు అరుగుతున్నాయ్ తప్ప ప్రయోజనం శూన్యమంటూ అర్జీదారులు నిట్టూర్పు వదులుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)పై అర్జీదారులకు నమ్మకం సన్నగిల్లుతోంది. ప్రతి వారం ఈ కార్యక్రమం మొక్కుబడి తంతుగా సాగుతుందని వారు వాపోతున్నారు. తమ సమస్యలు ఎప్పటికి పరిష్కారమవుతాయోనని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న సమస్యల పరిష్కారానికీ నెలలు తరబడి తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని అంటున్నారు. స్థానిక కలెక్టరేట్లో సోమవారం కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన పీజీఆర్ఎస్కు 318 అర్జీలు వచ్చాయి. ఇందులో పలువురు వచ్చిన అర్జీలను పరిశీలిస్తే.. గుక్కెడు నీరు అందక.. కొన్ని రోజులుగా తాగునీరు రాకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. స్థానికంగా ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో నీరు కొనుగోలు చేసుకుని తాగాల్సి వస్తోంది. మా ప్రాంతంలో అందరూ నిరుపేదలే. స్థానిక నాయకులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. అందుకే ఇక్కడకు వచ్చా. – లంగడ మాలతి, కేశవపురం, తాళ్లరేవు మండలం పంట కాలువను మూసివేశారు స్థానిక టీడీపీ నాయకులు మా పంట పొలాలకు వెళ్లేదారి, పంట కాలువను ఆక్రమించారు. వేలంక గ్రామంలో సుమారు 50 ఎకరాలకు పైగా సాగునీరు అందక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో ఏలేరు కాలువకు అనుసంధానంగా ఉన్న కాలువను మూసివేయడంతో ఇబ్బందులు పడుతున్నాం. స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో కాకినాడ వచ్చి ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. – దోమాల వెంకటేశ్వరరావు, గణేశ్వరరావు, కృష్ణజడ్జి, వేలంక, కిర్లంపూడి మండలం ఏడాదిగా తిరుగుతున్నా.. నేను నడవలేని స్థితిలో ఉన్నాను. మనిషి సాయం లేనిదే బయటకు రాలేను. ఎక్కడికై నా వెళితే వీల్ చైర్ ఉండాలి. పింఛను అందించాలంటూ స్థానిక సచివాలయంలో అనేక సార్లు అర్జీలు పెట్టుకున్నా పట్టించుకోలేదు. ఎన్నో ఇబ్బందులు పడి కలెక్టరేట్కు వచ్చినా ఎవరూ స్పందించడం లేదు. – ఆవాల రమాదేవి, ఫ పీజీఆర్ఎస్పై సన్నగిల్లుతున్న నమ్మకం ఫ ఎన్నాళ్లు తిరగాలంటున్న అర్జీదారులు -
ప్రతిభ ఉంటే మెరికలే : కలెక్టర్
రంగంపేట: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో అపారమైన ప్రతిభ దాగి ఉందని, వారికి సరైన మార్గదర్శకం అందిస్తే మెరికల్లా తయారవుతారని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. జాతీయ, అంతర్జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనల్లో అద్భుత ప్రతిభ కనబర్చిన రంగంపేట జెడ్పీ హైస్కూల్ విద్యార్థినులను సోమవారం రాజమహేంద్రవరం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఆమె ప్రత్యేకంగా అభినందించారు. గతేడాది అక్టోబర్ 18, 19 తేదీల్లో మలేషియా రాజధాని కౌలాలంపూర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సైన్స్ కాస్టిల్ ఆసియా అంతర్జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనలో రంగంపేట పాఠశాల విద్యార్థిని ఆవుపాటి రమ్య సరికొత్త రికార్డు సృష్టించింది. ఆసియా ఖండానికి చెందిన 10 దేశాల విద్యార్థులు గట్టి పోటీనిచ్చినప్పటికీ, రమ్య రూపొందించిన ప్రాజెక్టు ‘స్టూడెంట్ ఫ్రెండ్లీ పెన్’తో కాంస్య పతకం సాధించి దేశానికే గర్వకారణంగా నిలిచింది. ఈ వినూత్న ఆవిష్కరణ విద్యార్థుల నిజ జీవిత అవసరాలకు ఎంతో ఉపయోగపడుతుందని కలెక్టర్ కొనియాడారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన ‘ఇండియన్ యంగ్ ఇన్నోవేటర్స్ అండ్ ఇన్వెన్షన్ చాలెంజ్’లో రంగంపేట జెడ్పీ హైస్కూల్ విద్యార్థినులు బి.పల్లవి, ఎం.జాహ్నవి రూపొందించిన ‘బయోమెట్రిక్ మెషీన్’ ప్రాజెక్టుకు జాతీయ స్థాయి రజత పతకం లభించడంతో కలెక్టర్ అభినందించారు. -
కోతల ఆపరేషన్ మొదలు
గతంలో ఇంటికే రేషన్ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇలాంటి వృద్ధులు, వితంతువులు, రోగులతో పాటు లబ్ధిదారులందరి కోసం ఇంటింటికి రేషన్ సరకుల వాహనాన్ని పంపి ఇళ్ల వద్దే రేషన్ తీసుకునే పరిస్థితిని కల్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటింటికి వెళ్లే వాహనాలను రద్దు చేసి చౌక డిపోల వద్దకు వెళ్లే విధానాన్ని మళ్లీ అమలు చేసింది. ఇప్పటి వరకూ డీలర్లు తమ పరిధిలోని వితంతువులు, 60 ఏళ్లు దాటిన వృద్ధులకు, అనారోగ్యంతో ఇంటి నుంచి బయటకు రాలేని వారికి ఇళ్లకే రేషన్ సరకులు పంపించేవారు. ఇలా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 2 లక్షల మందికి లబ్ధి చేకూరేది. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఇళ్లకే రేషన్ సరకులు తీసుకు వెళ్లే విధానాన్ని ఇక నుంచి 65 ఏళ్లు దాటిన వృద్ధులకు మాత్రమే వర్తించేలా పరిమితులు విధించింది. ఇక నుంచి డీలర్ల అలా పంపుదామన్నా ప్రభుత్వం చౌక డిపోల సర్వర్లో ఆ ఆప్షన్ను ఈ నెల నుంచి తొలగించింది. కేవలం 65 ఏళ్లు దాటిన వారి ఇంటికి పంపేలా పాత విధానాన్ని కొనసాగించనుంది. డీలర్లు అక్రమాలకు పాల్పడున్నారని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. అమలాపురం టౌన్ /సీటీఆర్ఐ: వారందరూ ఆరు పదుల దాటిన వృద్ధులు, విధి వంచితులైన వితంతువులు, అనారోగ్యంతో ఇంట్లోంచి బయటకు రాలేని రోగులు. వీరికి ఇప్పటి వరకూ రేషన్ డిపోలకు వెళ్లకుండానే సరకులను డీలర్లు మానవతా దృక్పథంతో ఇళ్లకే అందించేవారు. కూటమి ప్రభుత్వ నిర్వాకంతో ఈ నెల నుంచి వారికి రేషన్ సరకులు ఇళ్లకు రాకుండా పోతున్నాయి. ఇక నుంచి ప్రతి నెలా 1 నుంచి 15 వరకూ డిపోలకు వెళ్లి సరకులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆప్షన్ తొలగించి.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోససీమ జిల్లాలోని 779 చౌక డిపోల్లో దాదాపు 3.59 లక్షలు, తూర్పుగోదావరి జిల్లాలోని 871 చౌక డిపోల్లో 6.5 లక్షలు, కాకినాడ జిల్లాలోని 1060 దుకాణాల్లో 6.50 లక్షల కార్డులు ఉన్నాయి. ప్రతి డిపో పరిధిలో ఇళ్లకే రేషన్ పంపించే కార్డులు 50కి తక్కువ కాకుండా ఉన్నాయి. ఉదాహరణకు అంబాజీపేటలో ఓ వృద్ధ దంపతులు ఉన్నారు. వారిలో భర్తకు 70, భార్యకు 64 ఏళ్ల వయసు ఉంది. ఇంటి ఇల్లాలు పేరుతో రేషన్ కార్డు ఉంటుంది. సంబంధిత డీలరు వారికి రేషన్ను ఎప్పటిలాగే ఇంటికి పంపించేందుకు సర్వర్ ఓపెన్ చేయగా ఆప్షన్ చూపించలేదు. రేషన్ డిపోకు రమ్మంటున్నారు నా భార్య వయసు 64 ఏళ్లు, ఆమె పేరుతోనే రేషన్ కార్డు ఉంది. నాకు 70 ఏళ్లు నిండాయి. పైగా రోగిని కూడా. నా భార్యకు 64 ఏళ్లు కావడంతో డీలర్ సర్వర్లో ఆమెకు ఇంటికే రేషన్ ఇచ్చే ఆప్షన్ లేకుండా చేశారు. ప్రతి నెలా రేషన్ సరకులను ఇంటి వద్దే అందుకునే వాళ్లం. ఇక నుంచి డిపోకు రావాలని చెబుతున్నారు. ప్రభుత్వం మానవతా ధృక్పథంతో స్పందించి నాలాంటి వృద్ధులు, రోగుల ఇళ్లకే రేషన్ సరకులను పంపించాలి. – పి.రామారావు, అంబాజీపేట 65 ఏళ్లు దాటిన వారికి మాత్రమే.. ఇక నుంచి 65 ఏళ్లు దాటిన వారి ఇళ్లకు మాత్రమే ప్రతి నెలా 26వ తేదీ నుంచి నెలాఖరు వరకూ రేషన్ డీలర్లు సరకులు పంపిస్తారు. మిగిలిన వారందరూ 1వ తేదీ నుంచి చౌక డిపోలకు వెళ్లి తీసుకోవాల్సిందే. 60 ఏళ్లు దాటిన వృద్ధులు, వితంతువులు, రోగులకు ఇంటికి అందించే ఆప్షన్ను సర్వర్ల నుంచి తొలగించారు. – అడపా ఉదయ భాస్కర్, పౌర సరఫరా అధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఫ 65 ఏళ్లు నిండితేనే ఇంటికి రేషన్ ఫ చంద్రబాబు ప్రభుత్వం కొత్త మెలిక ఫ ఇప్పటి వరకూ వితంతువులు, 60 ఏళ్లు నిండిన వారికి పంపిణీ ఫ ఇక నుంచి ఆ విధానం తొలగింపు ఫ చౌక డిపోల వద్దే తీసుకోవాలని ఆదేశం -
సీఎంఆర్ బియ్యం ఇవ్వడంలో ఇబ్బందులు
కాకినాడ డీమార్టు సమీపంలో ఓ టీచర్ రాత్రి వేళ ద్విచక్ర వాహనంపై వెళ్తూ రోడ్డుపై ఉన్న పశువులను ఢీకొని ప్రాణాలు కోల్పోయారు. వార్పు రోడ్డులో ఓ న్యాయవాది కోర్టుకు వెళ్తుండగా, ఓ ఎద్దు వేగంగా వచ్చి ఆయన బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ కుటుంబం ఉప్పాడ నుంచి ద్విచక్ర వాహనంపై వస్తుండగా, బీచ్ రోడ్డులో పశువులు వేగంగా వాహనంపైకి దూసుకొచ్చాయి. ఈ ప్రమాదంలో 7 ఏళ్ల బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. కాకినాడ జీజీహెచ్లో చేర్పించి చికిత్స అందించారు. కాకినాడ క్రైం: ఈ ఘటనలు మచ్చుకు కొన్నే... జిల్లా వ్యాప్తంగా రోజుకు అనేకచోట్ల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. పశువుల వల్ల రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్నా, అధికారులు మాత్రం పట్టించుకోక ప్రజా జీవనానికి, ప్రయాణానికి శాపంగా పరిణమిస్తోంది. రోడ్డెక్కితే భయంగా భయంగా వెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. జిల్లాలో ఏడాది కాలంలో పశువుల కారణంగా 415 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 8 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరుకాక 1,390 మంది గాయాల పాలయ్యారు. ఈ ప్రమాదాల్లో 350కి పైగా పశువులు గాయాల పాలైనట్లు అంచనా. వాహనాలు, ఆస్తుల నష్టం విలువ సుమారు రూ.3.5 కోట్లు అని అధికార గణాంకాలు చెబుతున్నాయి. పశువులు రోడ్డెక్కుతున్నాయి.. జనజీవనానికి ఆటంకం కలిగిస్తున్నాయి.. అనేక ప్రమాదాలకు కారణమవుతున్నాయి.. అయినా అధికారులు మనకెందుకే అన్నట్లు వదిలేయడం విమర్శలకు తావిస్తోంది. జిల్లా కేంద్రం కాకినాడతో పాటు చాలా ప్రాంతాల్లో ఈ సమస్య ఉంది. కాకినాడ జగన్నాథపురం, పెదమార్కెట్, సినిమారోడ్డు, జీజీహెచ్, గాంధీనగర్ మార్కెట్, సర్పవరం పూలమార్కెట్, రమణయ్యపేట మార్కెట్లో ఈ సమస్యల ప్రధానంగా ఉంది. సామర్లకోట మార్కెట్ వీధి, రైల్వే స్టేషన్ ప్రాంతాలు, పెద్దాపురంలో కట్టమూరు రోడ్డు, కాండ్రకోట రోడ్డు, వడ్లమూరు– దివిలి రహదారి, పిఠాపురంలో ఉప్పాడ సెంటర్, చర్చి సెంటర్, కోటగుమ్మం తదితర ప్రాంతాల్లో పశువులు తిష్ట వేస్తున్నాయి. తునిలోని ఎస్.అన్నవరం రోడ్డు, మెయిన్రోడ్డు, ఏలేశ్వరంలో దిబ్బలపాలెం, మార్కెట్ వీధి తదితర ప్రాంతాల్లో మూగజీవాలు నడిచే స్పీడ్ బ్రేకర్లుగా మారాయి. ఈ పశువుల సంచారం పలు అనర్థాలకు దారితీస్తోం. చివరికి ప్రాణనష్టం అనివార్యమవుతోంది. గుంపులు గుంపులుగా తిరగడం, రోడ్లపై తిష్ట వేయడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. రాత్రి వేళల్లో పశువులు సరిగ్గా కనిపించక, రోడ్డు ప్రమాదాలు చాలాచోట్ల జరుగుతున్నాయి. ఈ మూగజీవాల కారణంగా పారిశుధ్య సమస్య కూడా తలెత్తుతుంది. మలమూత్ర విసర్జకాల వల్ల మార్గం తేమగా మారి ద్విచక్ర వాహనదారులు, సైకిలిస్టులు, పాదచారులు జారిపడిపోయే ప్రమాదం ఉంది. ఒక్కో సందర్భంలో పశువులు తోసుకుంటూ, పొడుచుకుంటూ ప్రజలకు హాని కలిగించవచ్చు. ఇంత జరుగుతున్నా, ఐదు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం ఆవరించింది. మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖ ఇవి పశువుల నియంత్రణలో కీలకంగా వ్యవహరించాల్సిన శాఖలు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామీణ ప్రాంతాల స్థాయిలో పశువులను పట్టుకోవడం, గోఽశాలలు నిర్మించి తరలించడం, రోడ్లపైకి పశువులను వదిలేసే యజమానులపై చట్టపరమైన చర్యలకు సిఫార్సు చేయడం ఈ శాఖ పని. ఇన్ని బాధ్యతలు ఉన్న వీరికి చీమకుట్టినట్టయినా లేకపోవడం శోచనీయం. పోలీస్ శాఖలోని ట్రాఫిక్ విభాగం ఇది రెండో కీలక విభాగం. రాత్రి వేళ ప్రమాదాల నివారణకు పశువుల కొమ్ములు, మెడకు రేడియం స్టిక్కర్లు అతికించేలా చొరవ తీసుకోవడం, వీటి సంచారం వల్ల ట్రాఫిక్ జామ్ అయితే క్లియర్ చేసి, రాకపోకలను క్రమబద్ధీకరించడం, పశువులను వదిలేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పెంపకందార్లపై కేసులు నమోదు చేయడం వీరి పని. పశుసంవర్థక శాఖ రోడ్లపై జంతువుల సంచారం నివారించడంలో ఈ శాఖది కీలక పాత్ర. పశువులకు ఇనాఫ్ (ఈ–గోపాల/ఐఎన్ఏఎఫ్) గుర్తింపు ట్యాగ్లు వేయడం ద్వారా రోడ్లపై తిరుగుతున్న పశువు ఎవరిదో సులభంగా గుర్తించవచ్చు. తద్వారా యజమానులను పిలిచి అప్పగించే అవకాశం ఉంటుంది. ఈ శాఖ అధికారులూ పట్టించుకోకపోవడం ప్రజలకు ప్రాణసంకటంగా మారుతోంది. అంతేకాకుంగా పశువుల్ని రోడ్లపైకి వదిలేస్తే కలిగే నష్టాలు, పాకల్లో పెంచితే ఒనగూరే లాభాలపై పాడి రైతుల్లో అవగాహన కల్పించాలి. అలాగే నేషనల్ హైవే, రోడ్లు, భవనాల శాఖ అధికారులు సంయుక్త ప్రణాళికలు, కార్యాచరణతో రోడ్లపై పశువులు సంచారానికి అవకాశం లేని చర్యలు తీసుకోవాలి. రహదారులకు అటు ఇటు ఫెన్సింగ్లు లేదా ఐరన్ గ్రిల్స్ ఏర్పాటు చేసి పశువుల సంచారాన్ని నిలువరించాలి. సంచారం అధికంగా ఉన్న ప్రాంతాలు గుర్తించి ‘క్యాటిల్ క్రాసింగ్’ సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా కాలుష్య నియంత్రణ మండలి, పారిశుధ్య శాఖలు పశువుల విసర్జకాల వల్ల ఏర్పడే అపరిశుభ్రతను తొలగించి, కలుషితమయ్యే పరిసరాలను సంరక్షించాలి. వ్యర్థాల నిర్వహణ చేపట్టాలి. ఈ ఐదు శాఖలు పరస్పర సమన్వయంతో సమస్యను పరిష్కరించాలి. కాకినాడ సినిమా రోడ్డులో రాత్రి వేళ తిష్ట వేసిన పశువులుజీజీహెచ్ వద్ద...బోట్క్లబ్ (కాకినాడ సిటీ): రబీ సీజన్కు సంబంధించి సీఎంఆర్ ధాన్యం మర ఆడించి బియ్యం తిరిగి ఇవ్వడంలో జాప్యానికి అనేక కారణాలు ఉన్నాయని జిల్లా రైస్మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు వల్లూరు సూర్యప్రకాశరావు తెలిపారు . స్థానిక జిల్లా రైస్మిల్లర్ల అసోసియేషన్ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎంటీయూ 2636, ఎంసీ 13, 1156, 1153 రకాలు పచ్చి బియ్యంగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మిల్లింగ్ చేసిన తర్వాత 35 శాతం నుంచి 45 శాతం వరకు నూకలు వస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో కనీసం 25 శాతం వరకు నూకలతో బియ్యం సేకరించడానికి ప్రభుత్వం అనుమతించాలని కోరామన్నారు. కానీ ఎఫ్సీఐ కేవలం 10 శాతం నూకలతో బియ్యాన్ని స్వీకరించడానికి అనుమతులు ఇచ్చిందన్నారు. అయితే రైస్ మిల్లర్ల విజ్ఞప్తి మేరకు 20 శాతం నూకలతో అనుమతులు వస్తాయని కొంతకాలం రైస్మిల్లర్ల యాజమాన్యం ఎంతగానో ఆశగా ఎదురు చూసిందన్నారు. ఎఫ్సీఐ నుంచి అనుమతులు రాకపోగా, జాప్యానికి కారణంగా నిలిచిందన్నారు. మర ఆడించిన బియ్యాన్ని ఎఫ్సీఐ గోదాములకు తరలించాలంటే కాకినాడ జిల్లాలో గోదాములు ఖాళీగా లేవన్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఉన్న 550 రైస్మిల్లుల యాజమాన్యాలు బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలో గోదాములకు లారీల ద్వారా తరలించే వారమన్నారు. అందరూ ఏకకాలంలో బియ్యం తరలించడంలో లారీలు క్యూ కట్టి అన్లోడింగ్కు అనేక ఇబ్బందులు పడ్డామన్నారు. ఇకపై సీఎంఆర్ బియ్యం ఇవ్వడానికి మిల్లర్లు సిద్ధంగా ఉన్నారన్నారు. బియ్యం రైల్వే వేగన్ల ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలించడంతో కాకినాడ జిల్లాలో ఎఫ్సీఐ గోదాములు ఖాళీగా ఉన్నాయన్నారు. ఇక నుంచి వేగంగా బిల్డింగ్ చేసి బియ్యం ఎఫ్సీఐకి ఇస్తామన్నారు. ‘జయలక్ష్మీ’ బాధితులకు న్యాయం చేయండిబోట్క్లబ్ (కాకినాడసిటీ): జయలక్ష్మీ కోఆపరేటివ్ సొసైటీ బాధితులకు న్యాయం చేయాలని సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ స్టీరింగ్ కమిటీ కార్యదర్శి రఘుభూషణ్ మాట్లాడుతూ డిపాజిట్దారులకు ఎక్కువ వడ్డీ ఆశచూపడంతో సుమారు 19 వేల మంది ఈ సొసైటీలో డిపాజిట్లు చేశారన్నారన్నారు. సొసైటీ బోర్డు తిప్పేసిన తర్వాత అధ్యక్షుడిగా ఎన్నికై న గంగిరెడ్డి త్రినాథరావుపై చర్యలు తీసుకోవాలన్నారు. జయలక్ష్మీ ఆస్తులను వేలం వేసి బాధితులు నష్టపోయిన సుమారు రూ. 600 కోట్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సొసైటీకి నెల్లూరులో ఉన్న ఆస్తి వేలం, సొసైటీలో రూ. 4.60 కోట్లు అవినీతి చేసిన గంగిరెడ్డి త్రినాథరావుపై పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారు. సొసైటీలో రికార్డులు తారుమారు చేయకుండా భద్రత కల్పించాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఇలా చేస్తే మేలుశాఖల మధ్య సమన్వయం, ప్రణాళిక అమలు అత్యంత కీలకం. యజమానులు పశువులను రోడ్లపై వదిలేయకుండా చూడాలి. స్థానికంగా సంచార పశువులను గుర్తించి గోశాలలు లేకుంటే, నిర్దేశిత కేంద్రాలకు తరలించాలి. రోడ్లపై పశువుల్ని వదిలేస్తున్న యజమానులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి. ఇలా చేస్తే కలిగే నష్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. పశువుల వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలి. ఫ రోడ్లపై స్పీడ్ బ్రేకర్లుగా మూగజీవాలు ఫ పట్టనట్లు వ్యవహరిస్తున్న అధికారులు ఫ ఏడాదిలో 415 ప్రమాదాలు, 8 మంది మృత్యువాత -
సోమవారం శ్రీ 29 శ్రీ జూన్ శ్రీ 2026
● ఇదెక్కడి నిర్లక్ష్యం? వారిద్దరూ మన రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పి, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహనీయులు. ఒకరు.. రూ.2కే కిలో బియ్యంతో పాటు వివిధ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేసిన మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు. మరొకరు.. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి వినూత్న పథకాలతో తన చివరి ఊపిరి వరకూ పేదల సంక్షేమాన్నే శ్వాసించడమే కాదు.. అప్పటి చంద్రబాబు ప్రభుత్వ నిరాదరణకు గురైన అన్నదాతల కన్నీరు తుడిచి, జలయజ్ఞం వంటి వినూత్న పథకాలతో అడుగడుగునా అండగా నిలిచిన మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. ఈ ఇద్దరు మహనీయుల గురించి తెలియని వారు ఏ ఒక్కరూ ఉండరు. ఆ నేతల నుంచి నిత్య స్ఫూర్తి పొందేందుకు గండేపల్లి మండలం రామేశంపేట నాలుగు రోడ్ల జంక్షన్లో అభిమానులు వారి విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం ఏడీబీ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఆ విగ్రహాలను పక్కనే ఉన్న ఒక ఖాళీ ప్రదేశంలోకి మార్చారు. అప్పటి నుంచీ వాటి ఆలనా పాలనా పట్టించుకున్న వారే లేరు. ఆ ప్రదేశాన్ని మట్టితో నింపేయడంతో ఆ విగ్రహాలు మొల లోతులో కూరుకుపోయి ఇలా దర్శనమిస్తున్నాయి. ఈ మార్గంలో నిత్యం అనేక మంది అధికారులు, ప్రజాప్రతినిధులు రాకపోకలు సాగిస్తూంటారు. కానీ, ఈ మహనీయుల విగ్రహాలను ఏ ఒక్కరూ పట్టించుకోకుండా ఇలా అగౌరవపరచడంపై వారి అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – గండేపల్లి -
రత్నగిరిపై భక్తుల రద్దీ
అన్నవరం: వేలాదిగా వచ్చిన భక్తులతో రత్నగిరి ఆదివారం రద్దీగా మారింది. వివాహ ముహూర్తాలుండటంతో వ్రతాలు, సత్యదేవుని దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. సుమారు 40 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు. రెండు వేల వ్రతాలు జరిగాయి. వివిధ విభాగాల ద్వారా రూ.40 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. సుమారు ఆరు వేల మంది భక్తులు సత్యదేవుని అన్న ప్రసాదం స్వీకరించారు. ఉదయం నుంచీ భారీ వర్షం కురవడంతో సత్యదేవుని సన్నిధికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆలయ ప్రాంగణం చుట్టూ ఉన్న గ్రీన్ షేడ్ నుంచి వాన నీరు కారడంతో దాని కింద నుంచి వెళ్లిన వారు తడిసి ముద్దయ్యారు. వేసవిలో పలుచోట్ల నిర్మించిన చలువ పందిళ్ల నుంచి కూడా వర్షపు నీరు కారుతూండటం వలన కూడా భక్తులు ఇబ్బంది పడ్డారు. రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో భక్తుల కోసం అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేస్తారో వేచి చూడాలి. -
ఏరువాక.. సాగులేక
ఫ దోబూచులాడుతున్న రుతుపవనాలు ఫ పెరిగిన సాగు ఖర్చు ఫ అందని ప్రభుత్వ సాయం ఫ నేడు ఏరువాక పౌర్ణమి ఫ రైతుల్లో నిర్వేదం ఉమ్మడి జిల్లాలో ఖరీఫ్ సాగు వివరాలు.. జిల్లా వరి సాగు విస్తీర్ణం (ఎకరాలో)్ల తూర్పు గోదావరి 2,40,000 కాకినాడ 2,36,435 కోనసీమ 1,68,760 పోలవరం 1,17,000 (అన్ని పంటలు) పిఠాపురం/కపిలేశ్వరపురం: అన్నదాతలు వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టే ఏరువాక పౌర్ణమి (జ్యేష్ట మాస పౌర్ణమి) నేడు. గతంలో ఏరువాక పౌర్ణమిని రైతులు పండగలా.. ఎంతో కోలాహలంగా చేసేవారు. కానీ, రెండేళ్లుగా ప్రభుత్వం నుంచి తగిన తోడ్పాటు లేకపోవడంతో అన్నదాతల్లో ఆ ఉత్సాహం కనిపించడం లేదు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా 7,62,195 ఎకరాల్లో రైతులు ఖరీఫ్ సాగుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే, వారికి ఆదిలోనే అనేక ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. ఎన్నో ప్రతిబంధకాలు ముందస్తు సాగు కోసం ఈ నెల ఒకటో తేదీనే సాగునీరు విడుదల చేసినట్లు ప్రభుత్వం ఘనంగా చెబుతోంది. కానీ, 28 రోజులైనా క్షేత్ర స్థాయిలో పొలాలకు నీరందని పరిస్థితి. సెంట్రల్ డెల్టాలో కాలువలపై పలు వంతెనలు నిర్మిస్తూండటంతో నీటిపారుదలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. తూర్పు డెల్టాలోని మండపేట, కోరంగి కాలువల్లోనూ అదే పరిస్థితి. జిల్లా స్థాయి సాంకేతిక కమిటీలు ఏటా పంటల వారీగా రుణ పరిమితిని (స్కేల్ ఆఫ్ ఫైనాన్స్) నిర్ణయిస్తాయి. ఒక ఎకరా లేదా హెక్టార్ సాగుకు ఎంత ఖర్చవుతుందో అంచనా వేసి, పంటను బట్టి రైతులు ఎకరాకు ఎంత రుణం పొందవచ్చో దీని ద్వారా నిర్ణయిస్తారు. ఇది ప్రస్తుత ఖరీఫ్లో ఉమ్మడి జిల్లాలో ఎకరాకు రూ.55 వేల నుంచి రూ.60 వేల వరకూ నిర్ధారించారు. కానీ, రైతులకు పంట రుణాలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. ఉదాహరణకు గడచిన రబీ సీజన్లో కాకినాడలోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు రైతులకు రూ.914 కోట్ల మేర రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, రూ.160 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఈ దృష్ట్యా ఈసారి కూడా తమకు రుణాలు పూర్తి స్థాయిలో అందే పరిస్థితి ఉండకపోవచ్చని, ప్రైవేటుగా అధిక వడ్డీలకే అప్పులు చేయాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద కేంద్రంతో సంబంధం లేకుండా రైతులకు ఏటా రూ.20 వేల పెట్టుబడి సాయం ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు అండ్ కో హామీ ఇచ్చారు. తీరా ఆచరణలోకి వచ్చేసరికి దానిని రూ.14 వేలకు కుదించారు. అది కూడా చాలా మంది రైతులకు ఎగ్గొట్టారు. కౌలు రైతులకై తే పూర్తిగా ఎగనామం పెట్టారు. గత ఏడాది చివరిలో మోంథా, దిత్వా తుపాన్లు సంభవించాయి. ముఖ్యంగా మోంథా తుపాను ప్రభావంతో తూర్పు గోదావరి జిల్లాలోని 40,860 ఎకరాల్లో 33,262 మంది రైతులకు చెందిన వివిధ పంటలు దెబ్బ తిని, రూ.40.96 కోట్ల మేర నష్టం వాటిల్లింది. కాకినాడ జిల్లాలోని సుమారు 52 వేల ఎకరాల్లో 46,900 మంది రైతులకు రూ.57.21 కోట్లు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని సుమారు 73 వేల ఎకరాల్లో దాదాపు 41 వేల మంది రైతులకు రూ.73.86 కోట్ల మేర నష్టం జరిగింది. ఈ రైతులకు ప్రభుత్వం ఇప్పటికీ నష్టపరిహారం అందించలేదు. మరోవైపు గత ఏడాదితో పోలిస్తే ఎరువుల ధరలు గణనీయంగా పెరిగాయి. సూపర్ ఫాస్ఫేట్ బస్తా రూ.500 నుంచి రూ.700కు పెంచారు., పొటాష్ రూ.1,800 నుంచి రూ.1,975కు, కాంప్లెక్స్ ఎరువులు రూ.1,300 నుంచి రూ.1,600 వరకూ పెరిగాయి. పైగా, ఈ ఏడాది నుంచి ఎరువుల పంపిణీకి ప్రభుత్వాలు యాప్లు తీసుకొచ్చాయి. దీని ద్వారా ఎకరానికి రెండు బస్తాలు మాత్రమే అది కూడా మూడు విడతలుగా ఇస్తామని చెబుతున్నారు. అంటే, అంతకంటే ఎక్కువగా ఎరువులు అవసరమైన రైతులు సొంత డబ్బుతో కొనుక్కోవాల్సి వస్తుంది. రైతులకు ఇస్తున్న సబ్సిడీని తగ్గించుకునేందుకే ప్రభుత్వాలు ఈ విధానం అమలు చేస్తున్నాయని రైతు నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో కనీస మద్దతు ధర క్వింటాల్కు రూ.50 మాత్రమే పెంచారు. ధరల భారంతో పాటు క్షేత్రస్థాయిలో దళారులు గద్దల్లా వాలిపోతూండటంతో.. మద్దతు ధర లభించక, ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకూ నష్టపోతున్నట్టు రైతులు చెబుతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతులకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఉచిత పంటల బీమా అందించింది. దీనికి చంద్రబాబు ప్రభుత్వం మంగళం పాడింది. ప్రీమియం భారం రైతుల పైనే మోపింది. గత సీజన్లో హెక్టారు వరి పంట విలువను రూ.1.05 లక్షలుగా నిర్ధారించి, రైతు రూ.1,575 ప్రీమియం చెల్లించాలని పేర్కొంది. ఇది భారం కావడంతో వేలాది మంది రైతులు పంటల బీమాకు దూరమవుతున్నారు. ఫలితంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు జరిగిన పంట నష్టానికి బీమా పరిహారం అందక కుదేలవుతున్నారు. ప్రభుత్వం తీరుతో పలు ఇన్సూరెన్స్ కంపెనీలు రాష్ట్రాన్ని బ్లాక్లిస్టులో పెట్టాయి. ఉమ్మడి జిల్లాలో 80 శాతం మంది కౌలు రైతులే ఉన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వీరిని అన్నివిధాలా ఆదుకునేది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ హయాంలో జిల్లాలో 59,282, తూర్పు గోదావరి జిల్లాలో 1,15,718, కాకినాడ జిల్లాలో సుమారు 70 వేలు, పోలవరం జిల్లాలో వెయ్యి మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలన్న లక్ష్యం అమలుకు దూరంగా ఉంది. తమకు ప్రభుత్వం నుంచి ఏ ఒక్క సంక్షేమ పథకమూ అందడం లేదని కౌలు రైతులు వాపోతున్నారు. కత్తి మీద సాము పంట పండించడమంటే రైతుకు ఇప్పుడు కత్తి మీద సాములా ఉంది. ఏ పథకమూ సక్రమంగా అందడం లేదు. పండిన పంటలు అమ్ముకునే దారి లేదు. అంతా ప్రైవేటు వ్యక్తుల ప్రమేయంతోనే జరుగుతున్నాయి. గిట్టుబాటు ధర దక్కక నష్టాల పాలవుతున్నాం. సాగునీటి కాలువలు అధ్వానంగా ఉన్నా పట్టించుకున్న వారే లేరు. అన్నింటికీ యాప్లు అంటున్నారు. గతంలో యూరియా ఎక్కువ వాడాలని చెప్పింది ప్రభుత్వమే. ఇప్పుడు వాడవద్దంటున్నదీ ప్రభుత్వమే. – ములికే తలుపులు, రైతు, చేబ్రోలు, గొల్లప్రోలు మండలం సంక్షోభంలో రైతులు ‘రైతన్నా మీకోసం’ అంటున్నారు. పుట్టుకతోనే వ్యవసాయం అలవాటయిన రైతులకు ఏం నేర్పుతారు? వారికి రాయితీలు, సహకారం అందించకుండా అవగాహన కల్పిస్తామని ప్రభుత్వం అనడం హాస్యాస్పదంగా ఉంది. ఇప్పటికే గిట్టుబాటు ధర లేక, సాగు పెట్టుబడులు ఎక్కువై రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం 14 పంటలకు ప్రకటించిన మద్దతు ధర ఇప్పటి వరకూ రైతుకు అందే పరిస్థితి లేదు. వీటితో పాటు, విద్యుత్తును ప్రైవేటీకరించి, మీటర్లు పెట్టి, ఆ ధరల భారం కూడా మోపేందుకు ప్రయత్నిస్తున్నారు. యూరియాపై సబ్సిడీని తప్పించుకోవడానికే యాప్ తీసుకువచ్చారు. – గుర్రాల అప్పారెడ్డి, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి, నాగులాపల్లి -
93 శాతం మందికి పోలియో చుక్కలు
కాకినాడ క్రైం: పల్స్పోలియో చుక్కల మందు కార్యక్రమం ఆదివారం జిల్లావ్యాప్తంగా జరిగింది. మొత్తం 1,63,310 మంది ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయాలన్నది లక్ష్యం కాగా 1,51,611 మందికి (93 శాతం) వేశామని డీఎంహెచ్ఓ నరసింహ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. సిబ్బంది సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ వెళ్లి మిగిలిన పిల్లలకు ఈ మందు వేస్తారన్నారు. పారదర్శకంగా ‘సర్’ కాకినాడ లీగల్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. జిల్లాలోని ఎన్నికల నమోదు అధికారులు (ఈఆర్ఓలు), సహాయ ఎన్నికల నమోదు అధికారుల(ఏఈఆర్ఓల)తో కలెక్టరేట్ నుంచి ఆదివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. వివిధ రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్ల(బీఎల్ఏ)తో సమన్వయం చేసుకుంటూ సర్ ప్రక్రియను బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో నగర పాలక సంస్థ కార్యాలయం నుంచి పాల్గొన్న కాకినాడ సిటీ ఈఆర్ఓ కేటీ సుధాకర్ మాట్లాడుతూ, సిటీ నియోజకవర్గంలో సర్ ప్రక్రియ పురోగతిని కలెక్టర్కు వివరించారు. సమావేశంలో అర్బన్ తహసీల్దార్ జితేంద్ర, డిప్యూటీ కమిషనర్ కె.శ్రీనివాస్, డీసీపీ కృష్ణారావు, ఎన్నికల విభాగం డిప్యూటీ తహసీల్దార్ గోవిందరాజులు, ఏపీఓ రామిరెడ్డి, ఏఎస్డబ్ల్యూఓ వాణి, డిప్యూటీ తహసీల్దార్లు అనిల్, తాతారావు తదితరులు పాల్గొన్నారు. 7 కిలోల గంజాయితో వ్యక్తి అరెస్టు వై.రామవరం: మండలంలోని గుర్తేడు పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం సుమారు రూ.3.5 లక్షల విలువైన 7 కిలోల గంజాయిని గుర్తేడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై రాజకోటి తెలిపిన వివరాల మేరకు సరిహద్దు ప్రాంతం నుంచి గంజాయి అక్రమ రవాణా అవుతుందన్న సమాచారం మేరకు మండలం జి.కొత్తూరు గ్రామ సమీపంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, నరసారావుపేటకు చెందిన రాజనాల కోటిరెడ్డి (62) ఈ సరకుతో పట్టుబడ్డాడు. సరకును దారకొండ నుంచి గుర్తేడు మీదుగా నరసారావుపేట తరలిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. నిందితుడు, గంజాయితో పాటు, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తామని ఎస్సై తెలిపారు. నేడు ఏపీ జేఏసీ అమరావతి సమావేశం సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యాన స్థానిక కోటిపల్లి బస్టాండ్ సమీపాన ఉన్న రెవెన్యూ భవనంలో జాయింట్ యాక్షన్ కమిటీలో భాగస్వాములుగా ఉన్న వివిధ ఉద్యోగ సంఘాల జిల్లా, డివిజన్ నాయకులతో సోమవారం సమావేశం నిర్వహిస్తున్నారు. ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ ఎం.కాంతిప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఏఆర్ శివకుమార్ ఆదివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఈ సమావేశానికి అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై, ఉద్యమ కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తారని పేర్కొన్నారు. అడ్డతీగలలో అత్యధిక వర్షపాతం అడ్డతీగల: జిల్లాలో ఆదివారం ఉదయం 8.30 గంటల వరకూ నమోదైన వివరాల ప్రకారం అడ్డతీగలలో అత్యధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలో పలు చోట్ల స్వల్ప నుంచి ఒక మోస్తరు వర్షపాతం నమోదైంది. అడ్డతీగల మండలంలో అత్యధికంగా 18.2 మిల్లీమీటర్లు నమోదు కాగా ఎటపాకలో 14.8, గంగవరంలో 12.4, రంపచోడవరంలో 9.2, గుర్తేడులో 6.4, వై.రామవరంలో 5, దేవీపట్నంలో 4.8, రాజవొమ్మంగిలో 2.6, మారేడుమిల్లిలో 1.2, వీఆర్ పురంలో 1.2, కూనవరంలో 0.8 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.కాగా చింతూరు మండలంలో వర్షపాతమే నమోదు కాలేదు. -
ముద్రగడ ఆరోగ్యం కోసం మహా మృత్యుంజయ హోమం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసి సభ్యుడు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థిస్తూ ఆ పార్టీ అమలాపురం పార్లమెంటరీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యాన మహా మృత్యుంజయ హోమం నిర్వహించారు. గోదావరి గట్టున శ్రీధర్మశాస్త అయ్యప్ప స్వామి ఆలయంలో ఆదివారం ఈ హోమం జరిగింది. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ, హైదరాబాద్లోని ఆసుపత్రిలో ముద్రగడ చికిత్స పొందుతున్నారని, ఆయనకు అందుతున్న వైద్య సేవలపై ప్రజలు ఎటువంటి అపో హా పడవద్దని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి మేరకు ప్రముఖ సూపర్ స్పెషలిస్ట్ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. జక్కంపూడి రాజా మాట్లాడుతూ, నీతి నిజాయితీ గల నాయకుడుగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన ముద్రగడ పద్మనాభం ఆయురారోగ్యాలతో క్షేమంగా ఇంటికి తిరిగి చేరుకోవాలని ఈ హోమం నిర్వహించామని అన్నారు. -
ఉపాధ్యాయులకు సర్దుపోటు
రాయవరం: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తికి అనుగుణంగా టీచర్ల నియామకానికి విద్యా శాఖ చర్యలు చేపట్టింది. ఈ నెల 20వ తేదీ నాటికి పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల ఎన్రోల్మెంట్ను పరిగణనలోకి తీసుకుని సర్దుబాటు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవైపు ఎన్రోల్మెంట్ ప్రక్రియ జరుగుతూండగా.. మరోవైపు వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో సర్దుబాటు చేయడంపై టీచర్లు, ఉపాధ్యాయ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్లు తగ్గడంతో ఉపాధ్యాయ పోస్టులను భారీగా సర్దుబాటు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు తక్కువగా ఉన్న పాఠశాలల్లో మిగులు ఉపాధ్యాయులను, విద్యార్థులు ఎక్కువగా ఉన్న పాఠశాలలకు సర్దుబాటు చేసే అవకాశం ఉంది. అన్ని మండలాల్లోనూ ఉపాధ్యాయ పోస్టులు సర్ప్లస్ (మిగులు) అయ్యే అవకాశం ఉండటం ఉపాధ్యాయుల్లో గుబులు రేపుతోంది. ఈ నెల 30వ తేదీ ఎన్రోల్మెంట్ ప్రాతిపదికగా సర్దుబాటు ఉత్తర్వుల్లో మార్పులు చేయాలని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. వర్క్ అడ్జస్ట్మెంట్ ఇలా.. ఫ గత ఏడాది జారీ చేసిన జీఓ–21, 33 ప్రకారం 121 మంది విద్యార్థులున్న మోడల్ ప్రైమరీ పాఠశాలలో ఒక హెచ్ఎం, ఐదుగురు ఎస్జీటీలను ఇచ్చారు. ఈ ఏడాది దీనిని 151 మంది విద్యార్థులకు పెంచారు. అయితే, గతంలో మాదిరిగానే 120 మంది విద్యార్థులకు 1+5 విధానం కొనసాగించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఫ స్కూల్ అసిస్టెంట్ల (ఎస్ఏ) విషయానికి వస్తే ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6, 7, 8 తరగతుల్లో 10 మంది విద్యార్థులకు ఒక ఎస్ఏ, 11 నుంచి 30 వరకూ ఇద్దరు, 31 నుంచి 140 వరకూ నలుగురు, 141 నుంచి 175 వరకూ ఐదుగురు చొప్పున ఎస్ఏలు ఉండేలా సర్దుబాటు చేయాలని తాజా నిబంధనల్లో పేర్కొన్నారు. ఫ ఉన్నత పాఠశాలల్లో ఐదు సెక్షన్లకు జీహెచ్ఎం సహా 8 మంది ఎస్ఏలు, 6 సెక్షన్ల వరకూ 9 మంది, 7 సెక్షన్ల వరకూ 12 మంది, 8 సెక్షన్ల వరకూ 13 మంది, 9, 10 సెక్షన్ల వరకూ 15 మంది, 10, 11 సెక్షన్ల వరకూ 16 మంది, 13 సెక్షన్లకు 18 మంది, 14 సెక్షన్లకు 19 మంది చొప్పున ఎస్ఏలను మంజూరు చేశారు. ఈవిధంగా 25 సెక్షన్లకు జీహెచ్ఎంతో కలిపి 31 ఎస్ఏ పోస్టులు మంజూరు చేస్తారు. ఫ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, జీహెచ్ఎంలు వర్క్ అడ్జస్ట్మెంట్ పరిధిలోకి రారు. నిబంధనలు సడలించాలి ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియలో ప్రభుత్వం నిబంధనలు సడలించాలి. ఫౌండేషన్, బేసిక్ ప్రైమరీ పాఠశాలల్లో 15 నుంచి 20 మంది విద్యార్థులుంటే కచ్చితంగా ఇద్దరు ఎస్జీటీలను ఇచ్చేలా ఉత్తర్వులివ్వాలి. – చింతాడ ప్రదీప్ కుమార్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు, కాకినాడ నూతన నిబంధనల ప్రకారం విద్యార్థుల సంఖ్య ఆధారంగా.. ఫౌండేషన్ స్కూల్స్ విద్యార్థుల పీఎస్ ఎస్జీటీ సంఖ్య హెచ్ఎం 1–20 0 1 21–60 0 2 బేసిక్ ప్రైమరీ స్కూల్స్ 1–20 0 1 21–59 0 2 60–150 1 4 బేసిక్ ప్రైమరీ సెక్షన్స్ ఇన్ హైస్కూల్స్ 1–10 0 1 11–30 0 3 31–59 1 3 మోడల్ ప్రైమరీ స్కూల్స్ 1–20 0 1 21–39 1 2 40–59 1 3 60–150 1 4 151–180 1 5 181–210 1 6 211–240 1 7 241–270 1 8 కటాఫ్ డేట్ పెంచాలి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 5,600 వరకూ ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్య పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిల్లో దాదాపు 18 వేల మంది ఉపాధ్యాయులున్నారు. సాధారణంగా అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టడం పరిపాటి. ఇతర పాఠశాలల నుంచి బదిలీలు, రిలీజ్ రిక్వెస్ట్లు ఇంకా పెండింగ్లో ఉండగానే సర్దుబాటు చేపట్టడం వలన విద్యార్థులకు నష్టం జరుగుతుందనేది ఉపాధ్యాయుల వాదన. ఇప్పటికే జిల్లా విద్యా శాఖ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఎంఈఓలు సర్దుబాటు ప్రక్రియలో తలమునకలయ్యారు. ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నుంచి వస్తున్న వ్యతిరేకత నేపథ్యంలో ఈ నెల 30వ తేదీ విద్యార్థుల నమోదు ప్రాతిపదికగా వర్క్ అడ్జస్ట్మెంట్ చేపట్టాలని ఉన్నతాధికారులు పునరాలోచన చేస్తున్నట్లు సమాచారం. ఉన్నతాధికారులు తొలుత ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం వర్క్ అడ్జస్ట్మెంట్ కౌన్సెలింగ్ ఆదివారం జరగాల్సి ఉంది. అయితే, ఈ నెల 30వ తేదీ విద్యార్థుల ఎన్రోల్మెంట్ను ప్రాతిపదికగా తీసుకుంటే జూలై మొదటి వారంలో సర్దుబాటు ప్రక్రియ పూర్తయ్యే అవకాశముంది. తిరిగి స్పష్టమైన ఆదేశాలతో షెడ్యూల్ ప్రకటిస్తే, ఆ ప్రకారం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఫ ఈ నెల 20వ తేదీ అడ్మిషన్ల ఆధారంగా ఉత్తర్వులు ఫ 30వ తేదీ ప్రాతిపదికగా తీసుకోవాలని టీచర్ల డిమాండ్ జూలై 31 రోల్ అధారంగా.. అడ్మిషన్లు కొనసాగుతూండగానే అత్యవసరంగా వర్క్ అడ్జస్ట్మెంట్ చేయడం తగదు. జూలై 31 నాటి విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఈ ప్రక్రియ చేపట్టాలి. హడావుడిగా టీచర్లను సర్దుబాటు చేయడం వలన విద్యార్థులు నష్టపోయే అవకాశముంది. – జీవీ రమణ, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ -
ఉత్సాహంగా ఎడ్ల పట్టు పోటీలు
ఆలమూరు: చొప్పెల్లలో ఆదివారం రాష్ట్ర స్థాయి ఎడ్ల పట్టు పోటీలు జరిగాయి. గ్రామ దేవత శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి జాతర తీర్థ మహోత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ ఈ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా 13 ఎడ్ల జతలు పోటీల్లో పాల్గొన్నాయి. ఆలమూరు మండలం చొప్పెల్లకు చెందిన సుంకర వెంకట సాయినాథ్కు చెందిన ఎడ్లు ప్రథమ, రావులపాలెం మండలం ఊబలంక శివారు తోకలంకకు చెందిన గెడ్డం ప్రసాద్ ఎడ్లు ద్వితీయ, సీతానగరం మండలం వంగలపూడికి చెందిన చంద్రాల శ్రీనివాస్ ఎడ్లు తృతీయ స్థానాలను కై వసం చేసుకున్నాయి. విజేతలకు నగదు బహుమతులు, జ్ఞాపికలను నిర్వాహకులు అందజేసి, సత్కరించారు. పోటీలను తిలకించేందుకు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. -
గోదావడిలోకి బాల్యం
● నదిలో మునిగి ఇద్దరి మృతి ● సరదాగా స్నానం చేస్తుండగా ఘటన సీతానగరం: నవ్వుల పువ్వులు రాలిపోయాయి.. ఆటపాటల జ్ఞాపకాలు చెరిగిపోయాయి.. కన్నవారిలో తీరని విషాదాన్ని నింపాయి.. సరదాగా గోదావరిలో స్నానానికి వెళ్లిన ఇద్దరు విద్యార్థులను ఆ నది తనలోకి లాగేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. సీతానగరం మండలం వెదుళ్లపల్లి పంచాయతీ పరిధి రాజంపేటకు చెందిన పసుపులేటి దుర్గాప్రసాద్ (14), రాజమహేంద్రవరం రూరల్ తొర్రేడుకు చెందిన అల్లు సాయిదుర్గా మహేష్ (14) రాజంపేట వద్ద గోదావరిలో నీట మునిగి మృతి చెందారు. వెదుళ్లపల్లి జెడ్పీహెచ్ స్కూల్లో దుర్గాప్రసాద్ పదో తరగతి చదువుతున్నాడు. తొర్రేడుకు చెందిన మహేష్ సీతానగరం మండలం కాటవరంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు రోజు కావడంతో రాజంపేటలో బంధువుల ఇంటికి మహేష్ వచ్చాడు. మధ్యాహ్నం వర్షం పడటంతో గోదావరి చూద్దామని దుర్గాప్రసాద్, మహేష్లు మరో ముగ్గురు స్నేహితులతో కలసి ఏటిగట్టు పక్కన ఉన్న లంక భూమిలో క్రికెట్ను చూసి, అక్కడి నుంచి ఇసుక లారీలు వెళ్లడానికి వేసిన రోడ్డుపై నుంచి గోదావరి ఒడ్డుకు చేరుకున్నారు. ముగ్గురు ఒడ్డున కూర్చోగా, దుర్గాప్రసాద్, మహేష్లు గోదావరిలోకి దిగి కేరింతలు కొడుతూ ఈత కొట్టారు. ఈ నేపథ్యంలో ప్రమాదవశాత్తూ వారిద్దరూ గోదావరిలో మునిగిపోయారు. ఒడ్డున ఉన్న విగతా ముగ్గురూ భయభ్రాంతులకు గురై పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు, మత్స్యకారులు గోదావరిలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. రాత్రి 7 గంటలకు ఆ ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. దుర్గాప్రసాద్ తండ్రి వెంకటరమణ వ్యవసాయ కూలి. తల్లి శ్యామల, ఇంటర్ ద్వితీయ ఏడాది చదువుతున్న అక్క హేమసుధ ఉన్నారు. మహేష్ తండ్రి శ్రీను, తల్లి కలసి బోరున విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్చార్జి ఎస్సై టి.శ్యామ్సుందర్ తెలిపారు తాకట్టు పెట్టిన బంగారాన్ని మార్చేసి.. రామచంద్రపురం రూరల్: ప్రైవేట్ సంస్థలో బంగారం తాకట్టు పెడితే, ఆ స్థానంలో నకిలీ బంగారం పెట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. ద్రాక్షారామ మణప్పురం గోల్డ్ లోన్ సంస్థలో బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న 8 మంది ఖాతాదారుల తాలూకా ఆభరణాలను గతంలో పనిచేసిన మేనేజర్ ఎస్.మగేష్ దొంగిలించి, వాటి స్థానంలో నకిలీ బంగారం పెట్టి మోసానికి పాల్పడినట్లు ఇంటర్నల్ ఆడిట్లో గుర్తించారు. ఈ మేరకు ఏరియా మేనేజర్ పి.భానుప్రకాష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎం.లక్ష్మణ్ తెలిపారు. 8 మంది ఖాతాదారులకు సంబంధించిన సుమారు రూ.19,63,000 విలువైన 151 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు ఫిర్యాదు అందిందని చెప్పారు. -
దుంపముంచింది!
● కనుమరుగవుతున్న కర్రపెండలం ● పెరగని ధరతో సంక్షోభం ● 60 వేల నుంచి 5 వేల ఎకరాలకు పడిపోయిన సాగు రంగంపేట: ఒకప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి మెట్ట ప్రాంత రైతులకు బంగారు పంట కరప్రెండలం (టాపియోకా) సాగు. ఈ దుంప నేడు కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకుంది. సగ్గు బియ్యం తయారీకి ప్రధాన ముడిసరుకై న ఈ పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు సాగును పూర్తిగా వదిలేస్తున్నారు. ఒకప్పుడు 60 వేల ఎకరాల్లో ఉండా, గత ఏడాది 8 వేల ఎకరాలకు, ప్రస్తుతం కేవలం 5 వేల ఎకరాలకు పరిమితం కానుండడం పరిస్థితిని తెలియజేస్తోంది. 1965లో తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి కొందరు అభ్యుదయ రైతులు కరప్రెండలం విత్తనాన్ని తీసుకురావడంతో ఈ పంట ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోకి అడుగుపెట్టింది. పదేళ్లలోనే 20 వేల ఎకరాలకు విస్తరించిన ఈ పంట, 2000 నాటికి రికార్డు స్థాయిలో 60 వేల ఎకరాలకు చేరుకుంది. రంగంపేట, పెద్దాపురం, జగ్గంపేట, గండేపల్లి, రాజానగరం, ప్రత్తిపాడు, రంపచోడవరం, గోకవరం, రాజవొమ్మంగి, కోటనందూరు తదితర 14 మండలాల్లో ఈ పంట విస్తరించడంతో జిల్లాలో 45 సగ్గుబియ్యం మిల్లులు ఏర్పడ్డాయి. క్రమంగా సంక్షోభంలోకి.. 2010 తర్వాత కర్రపెండలం పంట క్రమంగా సంక్షోభంలోకి జారుకుంది. పంట మార్పిడి లేక ఎకరానికి 40 పుట్ల (ఒక పుట్టి– 225 కిలోలు) దిగుబడి 20 పుట్లకు పడిపోయింది. అదే సమయంలో పుట్టికి రూ.వెయ్యి నుంచి రూ.1,200 మాత్రమే ధర లభించడం, పామాయిల్ సాగు వేగంగా విస్తరించడంతో పెద్ద రైతులు దుంప సాగును పూర్తిగా వదిలేశారు. దీంతో 2015 నాటికి సాగు ఇరవై వేల ఎకరాలకు, 2020 నాటికి పది వేల ఎకరాలకు, 2025లో ఎనిమిది వేల ఎకరాలకు, ప్రస్తుతం ఐదు వేల ఎకరాలకు పడిపోయే పరిస్థితి వచ్చింది. మూతపడుతున్న మిల్లులు ఒకప్పుడు జిల్లాలో 45 సగ్గుబియ్యం మిల్లులు ఉండేవి. సాగు విస్తీర్ణం తగ్గిపోవడంతో ప్రస్తుతం 8 మిల్లులు మాత్రమే కొనసాగుతున్నాయి. ఇదే పరిస్థితి ఉంటే మిగిలిన మిల్లులూ మూతపడే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని గిట్టుబాటు ధర ప్రకటించడమే కాకుండా, అధిక దిగుబడినిచ్చే ఆధునిక విత్తనాలు సరఫరా చేయాలి. సగ్గుబియ్యం మిల్లర్లతో చర్చించి కనీస ధరను ఖరారు చేయాలి. రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించాలి. రైతన్నలకు ‘పంట’గ లేకుండా చేశారు.. కష్టాల కొరివి పెట్టారు.. సాగును దండగగా మార్చారు.. చివరికి బంగారు పంటగా భావించే కర్రపెండలం కంటిచూపునకు కనిపించకుండా చేస్తున్నారు. ఈ పంటకు గిట్టుబాటు ధర లేక, రైతులు ఆపసోపాలు పడుతున్నారు.. చేసేదిలేక సాగునే వదిలేస్తున్నారు. ఆ వివరాలు ఇలా.. గిట్టుబాటు ధర కల్పించాలి కర్రపెండలం దుంపకు గిట్టుబాటు ధర లేకపోవడంతో సాగు విస్తీర్ణం తగ్గిపోతుంది. పదేళ్ల క్రితం ఇచ్చిన ధరే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని రైతులను ఆదుకోవాలి. లేదంటే కర్రపెండలం పంట చరిత్రలో కలసిపోతుంది. –పుట్టా సోమన్నచౌదరి, గౌరవ అధ్యక్షుడు, జిల్లా దుంప రైతుల సంఘం బెధరగొట్టేలా.. ఎరువులు, కూలీల ఖర్చులు, సాగు వ్యయం రెట్టింపు అయినా.. కర్రపెండలం ధర మాత్రం పదేళ్లుగా పుట్టికి రూ.వెయ్యి దాటలేదు. ఈ పరిస్థితి రైతులను తీవ్రంగా నష్టపరిచింది. ఈ ఏడాది పంట విరామం ప్రకటించడంతో మిల్లర్లు ప్రస్తుతం రూ.1,200 నుంచి రూ.1,500 వరకూ చెల్లించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. దీంతో సన్న, చిన్నకారు రైతులు మళ్లీ కొంతమేర సాగు ప్రారంభించారు. ఇటీవల కురిసిన వర్షాలతో రంగంపేట మండలం సింగంపల్లి, దొడ్డిగుంట, వీరంపాలెం, కోటపాడు తదితర గ్రామాల్లో కర్రపెండలం నాట్లు జోరుగా సాగుతున్నాయి. అయితే గిట్టుబాటు ధరపై స్పష్టత లేక రైతులు ఇంకా ఆందోళనలోనే ఉన్నారు. -
ఖండాంతరాలు దాటిన శ్రాద్ధకర్మ
● డేవిడ్కు అభిమానుల నిర్వహణ ● వీడియో కాల్లో వీక్షించిన కుటుంబ సభ్యులు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): హిందూ ధర్మం ప్రకారం ఎవరైనా చనిపోతే, వారికి వారసులు కానీ, బంధువులు కానీ శ్రాద్ధకర్మలు చేయడం ఆచారం. కానీ ఎక్కడో విదేశాల్లో ఉండే వ్యక్తి చనిపోయిన తర్వాత ఆయన అభిమానులు శ్రాద్ధకర్మ నిర్వహించడం ప్రత్యేకతను చాటింది. ఆదివారం రాజమహేంద్రవరం గోదావరి కోటిలింగాల ఘాట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. పితృకర్మలు, శ్రాద్ధం వంటి హిందూ సంస్కృతిలోని లోతైన అంశాలపై దాదాపు 40 ఏళ్ల పాటు అవిశ్రాంతంగా అధ్యయనం చేసి, వాటిపై అనేక గ్రంథాలను రచించిన డేవిడ్ ఈ నెల జూలై 4న యూఎస్ఏలోని వర్జినియాలో కన్నుమూశారు. ఆయన ఓ సంస్కృత పండితుడు. ప్రకృతి, సృష్టి ధర్మాల్లో ప్రధానమైన క్రతువులు, యజ్ఞ యాగాదులు నిర్వహించే నిత్య అగ్నిహోత్రుల గురించి డేవిడ్ ఎంతో పరిశోధన చేశారు. దాదాపు 3 వేల ఏళ్లగా యజ్ఞం, యాగం నిర్వహణలో ఎటువంటి మార్పులు చోటుచేసుకోకుండా ఆ సంస్కృతి, సంప్రదాయాలను నేటికీ కొనసాగిస్తూ వస్తున్న అగ్నిహోత్రుల గురించి, యాగ పండితుల గురించి అనేక పుస్తకాలను రచించి ప్రపంచానికి చాటి చెప్పారు. ఆయన ఓ విదేశీయుడుగా కేవలం గ్రంథాలు చదవకుండా శ్మశానంలో దిగి చితి దగ్గర కూర్చుని కర్మలను డాక్యుమెంట్ చేశారు. ఇది హిందూ మతంపై పాశ్చాత్యులకు ఉన్న అపోహలను తొలగించింది. రాజమహేంద్రవరం, కోనసీమకు చెందిన శ్రీరామపురం అగ్రహారం, నేదునూరు వ్యాఘ్రేశ్వరం, ఇరగవరంలలో పనిచేసిన ప్రొఫెసర్ కృష్ణయ్య తదితరులు కోటిలింగాల రేవులో ఈ కార్యక్రమాలను నిర్వహించారు. డేవిడ్ శ్రాద్ధ కర్మలను యూఎస్ఏలో ఉన్న ఆయన భార్య సుసాన్, కుమార్తె నికోల వీడియో కాల్లో తిలకించారు. -
అక్రమాలపై ప్రశ్నిస్తే గొంతు నొక్కుతారా?
ఐక్యత చాటుతున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మార్గాని భరత్రామ్, మార్గాని నాగేశ్వరరావు, కోడి ప్రవీణ్, వాసంశెట్టి గంగాధరరావు తదితరులు శెట్టిబలిజ సంఘీయుల రౌండ్ టేబుల్ సమావేశంలో నేతలు రాజమహేంద్రవరం సిటీ: చంద్రబాబు ప్రభుత్వంలో అన్యాయాలను ప్రశ్నిస్తే గొంతు నొక్కుతున్నారని.. రాజమహేంద్రవరంలో శెట్టిబలిజ సామాజిక వర్గీయుడైన వైఎస్సార్ సీపీ నగర బీసీ సెల్ చైర్మన్ పీతా రామకృష్ణపై పీడీ యాక్ట్ అక్రమంగా నమోదు చేశారని మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ధ్వజమెత్తారు. ఆదివారం రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డులోని శ్రీగ్రాండ్ కాన్ఫరెన్స్ హాల్లో వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ అధ్యక్షతన శెట్టిబలిజ సంఘీయుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఒత్తిడితో పీతా రామకృష్ణపై పోలీసులు పీడీ చట్టం ప్రయోగించడం దారుణమని సమావేశం పేర్కొంది. సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ఉద్యమాలు చేసేవారిపై పీడీ యాక్ట్ అమలు చేస్తే, దేశంలో ఉన్న జైళ్లు సరిపోవన్నారు. పీడీ యాక్ట్ను ఉపసంహరించుకోకపోతే శెట్టిబలిజ సంఘీయులంతా ఉద్యమాలకు దిగుతామని హెచ్చరించారు. రాష్ట్రంలో బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగం పక్కనపెట్టి, లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని అన్నారు. ఉభయ రాష్ట్రాల బీసీ సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు మార్గాని నాగేశ్వరరావు మాట్లాడుతూ, బీసీలు రాజకీయంగా ఎదగకుండా చంద్రబాబు కుట్రలు చేస్తూనే ఉన్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి వాసంశెట్టి గంగాధర్రావు మాట్లాడుతూ, ప్రతిపక్ష పార్టీలో ఉండి ప్రజల పక్షాన పోరాడుతున్న యువ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు. అధికారం శాశ్వతం కాదనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఐక్యంగా పోరాటం చేద్దాం వైఎస్సార్ సీపీ నాయకుడు కోడి ప్రవీణ్ మాట్లాడుతూ, రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు తగవన్నారు. భవిష్యత్లో ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఐకమత్యంగా పోరాటం చేద్దామన్నారు. మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో అక్రమాలపై ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయించడం దారుణమన్నారు. ముఖ్యంగా రామకృష్ణకు అన్యాయం జరిగిందని, శెట్టిబలిజ సంఘీయులు ఐక్యంగా ఉంటే కచ్చితంగా న్యాయం జరుగుతుందన్నారు. అమరావతిలో రైతుల పక్షాన నిలబడిన వైఎస్సార్ సీపీ నాయకులను అడ్డుకోవడమే కాకుండా, అధికార పార్టీ గుండాలతో రాళ్ల దాడితో చేయించడం చూస్తుంటే కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు తేటతెల్లమవుతున్నాయని అన్నారు. నగరంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కక్ష సాధింపు చర్యలు మితిమీరాయని, ఈ రెండేళ్లలో తనపై 17 అక్రమ కేసులు పెట్టారనీ భరత్రామ్ అన్నారు. ఇలా తన పాస్పోర్ట్ను కూడా నిలిపివేయించారన్నారు. కళా, సాంస్కృతిక చారిత్రాత్మక నగరమైన రాజమహేంద్రవరంలో ఎప్పుడూ రాజకీయ కక్ష సాధింపు చర్యలు చూడలేదన్నారు. రామకృష్ణపై పెట్టిన అక్రమ పీడీ యాక్ట్ విషయమై హైకోర్టులో సవాల్ చేస్తానని, న్యాయ పోరాటం చేస్తానని, అతని కుటుంబానికి అండగా ఉంటామన్నారు. జిల్లా కలెక్టర్రేట్లో పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశానని.. జిల్లా కలెక్టర్ సంబంధిత డీఎస్సీని వివరణ కోరగా ఆయన సమాధానం చెప్పలేకపోయారన్నారు. సమావేశంలో న్యాయవాది ఇళ్లా భాస్కరరావు, వైఎస్సార్ సీపీ నాయకులు, శెట్టిబలిజ సంఘీయులు పెద్దఎత్తున హాజరయ్యారు. పీతా రామకృష్ణపై పీడీ యాక్ట్ దారుణం మాజీ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ రాబోయే రోజుల్లో సిటీ ఎమ్మెల్యేకు గుణపాఠం చెబుతాం మాజీ ఎంపీ భరత్రామ్ ఆధ్వర్యంలో శెట్టిబలిజల రౌండ్ టేబుల్ సమావేశం -
రక్తమోడిన రహదారి
● వడిశలేరు సెంటర్లో ప్రమాదాలు ● నిమిషాల వ్యవధిలో రెండు ఘటనలు రంగంపేట: అసలే ప్రమాదకర కూడలి.. ఆపై ఒక్కసారిగా కురిసిన వర్షం.. వెరసి ఆదివారం సాయంత్రం రంగంపేట మండలం వడిశలేరు సెంటర్లో రక్తమోడింది. ఈ ఏడీబీ రోడ్డుపై నిమిషాల వ్యవధిలోనే జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాలు స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేశాయి. వడిశలేరు గ్రామానికి చెందిన కొవ్వూరి శ్రీను తన భార్య శశి, కుమార్తె లాస్యతో కలిసి బైక్పై రాజమహేంద్రవరం వెళ్లేందుకు బయలుదేరారు. వారు వడిసలేరు సెంటర్ దాటుతుండగా, అతి వేగంగా దూసుకొచ్చిన గూడ్స్ వ్యాన్ వారి బైక్ను బలంగా ఢీకొంది. దీంతో బైక్ నడుపుతున్న శ్రీనుకు తీవ్ర గాయాలు కాగా, ఆయన భార్య, కుమార్తె స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు తక్షణమే స్పందించి క్షతగాత్రులను రాజమహేంద్రవరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రమాదానికి కారణమైన గూడ్స్ వ్యాన్ డ్రైవర్కు స్థానికులు దేహశుద్ధి చేసి, అనంతరం రంగంపేట పోలీస్ స్టేషన్లో అప్పగించారు. మరో ఘటనలో.. ఈ ప్రమాదం జరిగి స్థానికులు కోలుకోకముందే అదే సెంటర్లో మరో ఘోర ప్రమాదం సంభవించింది. కాకినాడ బీచ్ నుంచి నిడదవోలు వెళ్తున్న ఒక టెంపో వ్యాన్ వడిశలేరు సెంటర్ వద్దకు రాగానే అదుపు తప్పి, ఏడీబీ రోడ్డుపై ఉన్న డివైడర్ను బలంగా ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వ్యాన్లో ప్రయాణిస్తున్న ఒకరికి గాయాలైనట్లు సమాచారం. ఇప్పటికే ఈ కూడలిలో అనేక ప్రమాదాలు జరిగి ఎంతోమంది ప్రాణాలు పోయినా, కాళ్లు చేతులు విరిగినా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. -
తలుపులమ్మకు జేజేలు
తుని రూరల్: లోవ దేవస్థానంలో కొలువైన తలుపులమ్మ తల్లిని దర్శించేందుకు ఆదివారం భక్తజనం తరలివచ్చింది. వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో భారీగా భక్తులు వచ్చారు. సుమారు 28 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని కార్యనిర్వహణ అధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. మధ్యాహ్నం వర్షం కురవడంతో చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో వంటలు చేసుకున్న భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పులిహోర, లడ్డూ ప్రసాదాలు విక్రయం ద్వారా రూ.2,37,435, పూజా టిక్కెట్లకు రూ.4,78,904, తలనీలాలకు రూ.21,080, వాహన పూజలకు రూ.18,828, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.1,02,165, విరాళాలుగా రూ.19,987 ఆదాయం వచ్చిందని ఈఓ విశ్వనాథరాజు తెలిపారు. -
ఈ పైనమేమిటో!
కష్టం వస్తే దేవుళ్లను కొలుస్తాం.. మమ్మల్ని చల్లంగ చూడాలని కోరుతాం.. అలాంటి అమ్మవారి దర్శనానికి వచ్చి, వెళ్లే భక్తులు ఇలా ప్రమాదపుటంచున ప్రయాణం సాగిస్తున్నారు. ఆదివారం తలుపులమ్మ లోవ అమ్మవారి దర్శనానికి వచ్చి, వెళ్లిన భక్తుల ప్రయాణ పదనిసలివి. లారీలు, ట్రాక్టర్లు, వ్యాన్లు, ఆటోల్లో పరిమితికి మించి, నిబంధనలు విస్మరించి ప్రయాణించారు. ప్రమాదాలు జరగకముందే అంతా మేల్కొంటే మంచిది. – తుని రూరల్ -
తూరు్పన కాసుల పంచాయితీ!
● శానిటేషన్ పేరుతో దారి మళ్లింపు ● రూ.6.01 కోట్లు బిల్లుల మాటేమిటి ● కమీషన్లకు కక్కుర్తిపడ్డ ఈఓలు ● 203 పంచాయతీల్లో దుర్వినియోగం సాక్షి ప్రతినిధి, కాకినాడ: గ్రామ పంచాయతీల్లో డ్రా చేసిన రూ.6.5 కోట్ల బిల్లులపై పెద్ద పంచాయితీయే నడుస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 200 పైబడి గ్రామ పంచాయతీల్లో ఈ బిల్లుల బాగోతం చర్చనీయాంశమైంది. బిల్లుల విడుదలలో కొందరు ఈఓలు చేతి వాటం ప్రదర్శించారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. గ్రామ పంచాయతీల్లో ఎటువంటి బిల్లులు డ్రా చేయవద్దంటూ గత ఏడాది డిసెంబరులో పంచాయతీరాజ్ శాఖ డైరక్టర్ కృష్ణతేజ ఆదేశాలు జారీ చేశారు. అప్పటి నుంచి పంచాయతీల్లో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. కనీసం పారిశుధ్య సిబ్బందికి వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు నెలకొన్నాయి. పల్లెల్లో మౌలిక వసతులు కూడా కల్పించడం లేదంటూ సదరు అధికారులపై తీవ్ర ఒత్తిడి మొదలైంది. దీంతో ఆర్థికంగా స్థితిమంతులైన సర్పంచ్లు చిన్న చితకా పనులు చేయించేవారు. ఇంతలో ఏప్రిల్లో పంచాయతీ పాలకవర్గాలు రద్దు కావడంతో సర్పంచ్లు పదవులు కోల్పోయారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో చిన్న చిన్న పనులు కూడా జరగడం లేదని, చివరకు పారిశుద్ధ్య వాహనాల నిర్వహణ కొరవడి అగమ్యగోచరంగా తయారైంది. ఆ వాహనాల నిర్వహణకు కనీసం ఇంధనం సొమ్ములు లేవని పంచాయతీ అధికారులు ఉన్నత అధికారులకు మొరపెట్టుకున్నారు. గ్రామాల్లో పారిశుధ్యం క్షీణించడంతో పాటు, పారిశుధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వలేని దుస్థితి నెలకొంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఆ శాఖ డైరెక్టర్ కృష్ణతేజ బిల్లుల మంజూరులో కొంత వెసలుబాటు కల్పిస్తూ డీపీఓలకు ఆదేశాలు జారీచేశారు. దీనిని ఆసరాగా చేసుకుని కొన్ని గ్రామ పంచాయతీల్లో ఈఓలు 5శాతం కమీషన్లకు కక్కుర్తిపడి బిల్లులు మంజూరు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. చెత్త తరలింపు వాహనాలకు డీజిల్, పెట్రోలు బిల్లుల మంజూరుకు అనుమతించడమే వారి పాలిట కల్పతరువైంది. ఇదే అదనుగా ఈఓలు చేతివాటం చూపారనే విమర్శలు వెల్లువెత్తాయి. పంచాయతీల్లో సాధారణ నిధుల నుంచి నిర్దేశిత వాహనాలకు ఆయిల్ బిల్లులే కాకుండా ఇతర బిల్లులు, ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పాత బిల్లులు కూడా డ్రా చేశారని తెలియవచ్చింది. ఈ బాగోతంపై పంచాయతీల వారీగా గడచిన రెండు నెలల కాలంలో విడుదల చేసిన బిల్లులపై అంతర్గత విచారణకు ఆయా జిల్లాల పంచాయతీ అధికారులకు ఆదేశాలు వచ్చాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మెజార్టీ గ్రామ పంచాయతీల్లో ఈ అవకతవకలు చోటుచేసుకున్నాయి. మొత్తం 203 పంచాయతీల్లో రూ.6.01 కోట్లకు లెక్కలు తేల్చాల్సి ఉంది. ఉదాహరణకు కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామ పంచాయతీకి ఇన్చార్జి ఈఓ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన అదే మండలం వాకలపూడి గ్రామపంచాయతీకి రెగ్యులర్ ఈఓ. రమణయ్యపేట గ్రామ పంచాయతీలో ఇప్పుడున్న ఈఓ కంటే ముందున్న ఈఓ చేసిన పనుల బిల్లులు కూడా తాజాగా విడుదల చేశారంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రమణయ్యపేట, సర్పవరం గ్రామ పంచాయతీలు గ్రేడ్–1 పరిధిలో ఉన్నాయి. అటువంటి రమణయ్యపేట గ్రామ పంచాయతీలో రూ.19.45 లక్షలు, సర్పవరం గ్రామ పంచాయతీలో రూ.15లక్షలు నుంచి రూ.20 లక్షలు వంతున డ్రా చేశారని చెబుతున్నారు. ఈ బిల్లులు విడుదలలో అవకతవకలపై అంతర్గత విచారణకు ఆదేశించడంతో గ్రామ పంచాయతీ అధికారుల్లో గుబులురేపుతోంది. జిల్లా పంచాయతీలు నిధుల విడుదల కోనసీమ 57 రూ.1.61 కోట్లు కాకినాడ 61 రూ.1.90 కోట్లు తూర్పుగోదావరి 85 రూ.2.50 కోట్లు మొత్తం 203 రూ.6.01 కోట్లు -
సత్యదేవుని నిత్యాన్నదాన పథకానికి విరాళాలు
అన్నవరం: సత్యదేవుని నిత్యాన్నదాన పథకానికి శనివారం భక్తులు రూ.7,12,232 విరాళాలు సమర్పించారు. విజయవాడకు చెందిన దీప్తి తమ కుమారుడు పి.హరికృష్ణ పేరిట రూ.2 లక్షలు, భీమవరానికి చెందిన ఈదర నాగ వెంకట సుబ్బారావు రూ.2 లక్షలు, ఖమ్మం పట్టణానికి చెందిన బోడిల్ల నాగేశ్వరరావు రూ.1,11,116, అమలాపురానికి చెందిన ఆర్వీఎల్ఎన్ఎస్ పార్వతి రూ.లక్ష, హైదరాబాద్కు చెందిన యలమంచిలి నవీన్, నాగిని దంపతులు రూ.1,01,116 విరాళంగా సమర్పించారు. దాతలకు డిప్యూటీ కమిషనర్ బాబూరావు తదితరులు అన్నదానం బాండ్లు అందజేశారు. కొనసాగిన వివాహిత ఆందోళన కొత్తపల్లి: నాగలాపల్లి గ్రామానికి చెందిన చింతపల్లి మురళీరెడ్డి ఇంటి వద్ద అతడి భార్య రామశంకరి చేపట్టిన ఆందోళన రెండో రోజు శనివారం కొనసాగింది. తనకు పిల్లలు పుట్టిలేదని మురళీకృష్ణ వేరే మహిళను వివాహం చేసుకొని తనను మోసం చేశాడంటూ ఆమె కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇరువైపులా పెద్దలతో చర్చించారు. వారి మధ్య ఒప్పందం కుదరకపోవడంతో మంగ ళవారం మరోసారి మాట్లాడాలని పోలీసులు నిర్ణయించారు. తనకు న్యాయం జరగకపోవడంతో రామ శంకరి ఆందోళనను కొనసాగించింది. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి తాళ్లరేవు: మండల పరిధిలోని జి.వేమవరం గ్రామంలో విద్యుదాఘాతంతో చింతపల్లి వెంకట రమణ (60) మృతి చెందాడు. కోరంగి ఎస్ఐ పి.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. వెంకట రమణ తన మామిడి తోటలో విద్యుత్ మోటారు వేసే క్రమంలో షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వైభవంగా శ్రీవారి చక్రస్నానం
సుదర్శన పెరుమాళ్కు చక్రస్నానం చేయిస్తున్న రుత్విక్లు మామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామివారి దివ్య తిరు కల్యాణోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శనివారం వైనతేయ గోదావరి నదిలో శ్రీవారి చక్రస్నానం అంగరంగ వైభవంగా జరిగింది. గ్రహ దోషాలు, అపమృత్యు దోషాలను నివారించే స్వామిగా ప్రాచుర్యం పొందిన సుదర్శన పెరుమాళ్తో పాటు గోవిందా...గోవింద అంటూ భక్తులు గోదావరిలో తలారా స్నానం చేసి పునీతమయ్యారు. దేవస్థానం ముఖ్య అర్చక గొడవర్తి శ్రీనివాసాచార్యులు, త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామివారి శిష్య బృందం ఆధ్వర్యంలో ఉభయ దేవేరులతో కొలువు దీరిన శ్రీవారిని ముందుగా పల్లకిలో ఊరేగిస్తూ గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీవారితో పాటు సుదర్శన పెరుమాళ్కు నదీతీరంలో జలాభిషేకం నిర్వహించారు. అనంతరం చక్రస్నానం జరిపించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం.రాంబాబురెడ్డి, ఆలయ వంశపారంపర్య ధర్మకర్త మొల్లేటి చక్రపాణి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరిగాయి. -
మరో మూడు రోజులే..
ఫ గ్యాస్ లబ్ధిదారులకు ఈ–కేవైసీ తప్పనిసరి ఫ ఈ నెల 30 వరకు మాత్రమే గడువు ఫ చేయించుకోకుంటే ఇబ్బందులు ఫ ఉమ్మడి జిల్లాలో 19,14,791 ఎల్పీజీ కనెక్షన్లు ఫ 75 శాతమే పూర్తయిన ప్రక్రియ కపిలేశ్వరపురం: గ్యాస్ కనెక్షన్ కలిగిన వినియోగదారులందరూ ఈ నెల 30వ తేదీలోపు తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ (ఈ–కేవైసీ) చేయించుకోవాలని ప్రభుత్వం నిబంధన విధించింది. అక్రమ కనెక్షన్లు తొలగించేందుకు ఈ ప్రక్రియ చేపట్టామని చెబుతోంది. అయితే ఈ విషయంపై గ్యాస్ వినియోగదారులందరికీ పూర్తిస్థాయిలో సమాచారం లేదు. ఈ నేపథ్యంలో ఈ–కేవైసీ విషయం తెలియని వారందరూ నష్టపోయే ప్రమాదం ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో 52, కాకినాడ జిల్లాలో 45, కోనసీమ జిల్లాలో 27 ఏజెన్సీల ద్వారా గ్యాస్ సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. ఎందుకంటే.. ఫ గ్యాస్ రాయితీ దుర్వినియోగానికి, అక్రమ కనెక్షన్లకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో ఈ–కేవైసీని తప్పనిసరి చేసినట్టు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ నెల 30వ తేదీ లోపు గ్యాస్ ఏజెన్సీ ద్వారా, ఆన్లైన్లో కానీ ఈ–కేవైసీ చేయించుకోవాలి. ఫ లేకపోతే గ్యాస్ సిలిండర్ ధరలో ప్రభుత్వ రాయితీ నిలిచిపోతుంది. గ్యాస్ సరఫరాను నిలిపివేయడం, సిలిండర్ను రద్దు చేయడమూ చేసే అవకాశం ఉండొచ్చు. ఫ సంబంధిత గ్యాస్ ఏజెన్సీలో ఈ–కేవైసీని ఉచితంగా చేస్తారు. అవగాహన ఉంటే ఆన్లైన్లో కూడా ఇంటిలో ఉండే చేసుకోవచ్చు. ఫ ప్లే స్టోర్ నుంచి సంబంధిత గ్యాస్ కంపెనీ అధికారిక యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. గ్యాస్ కనెక్షన్కు లింక్ అయిన మొబైల్ నంబర్తో యాప్లో లాగిన్ అవ్వాలి. ఫ ఈ– కేవైసీ ఆప్షన్పై క్లిక్ చేసి ఫేస్ స్కానింగ్ ద్వారా లేదా మొబైల్కి వచ్చే ఓటీపీ ద్వారా వినియోగదారు గుర్తింపును ధ్రువీకరించి సబ్మిట్ చేయాలి. 48 గంటల్లోపు ప్రక్రియపూర్తవుతుంది. సామాన్యుడిపై భారం కూటమి ప్రభుత్వం సామాన్య ప్రజలపై గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని మోపుతోంది. గృహ వినియోగ సిలిండర్పై ఈ ఏడాది మార్చి 7న రూ.60, ఈనెల 7న రూ.29 పెంచడంతో సిలిండర్ ధర రూ.971కి పెరిగింది. డెలివరీ ఖర్చులతో రూ.వెయ్యి అవుతోంది. వాణిజ్య సిలిండర్ ధరను గత మూడు నెలల్లో మూడు సార్లు పెంచడంతో ప్రస్తుతం దాని ధర రూ.3,406కి చేరింది. దీంతో చిరు వ్యాపారులు ప్రత్యక్షంగానూ, వారి వద్ద పదార్థాలు కొనుగోలు చేసే వినియోగదారులు పరోక్షంగానూ తీవ్ర భారాన్ని మోస్తున్నారు. ఉజ్వల పథకం ప్రారంభంలో సబ్సిడీపై ఏడాదికి 12 సిలిండర్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఒక్కో సిలిండర్కు రూ.300 రాయితీని అందజేసింది. ఆ తర్వాత కాలంలో ఆ సంఖ్యను 9కి ప్రస్తుతం 4కి కుదించింది. కొత్త కనెక్షన్ల కోసం తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 10 వేల మంది రెండు నెలలుగా ఎదురు చూస్తున్నారు. ఏడాది కాలంగా గ్యాస్ బుక్ చేసుకోకపోతే కనెక్షన్ ఇన్యాక్టివ్లోకి వెళ్లే అవకాశం ఉందన్న ప్రచారంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. గ్యాస్ వినియోగదారుల వివరాలు జిల్లా గ్యాస్ కనెక్షన్లు తూర్పుగోదావరి 6,92,825 కాకినాడ 6.50,000 కోనసీమ 4,79,563 పోలవరం 92,403 మొత్తం 19,14,791 సమాచారం లేక.. గ్యాస్ కనెక్షన్ లబ్ధిదారుల ఈ–కేవైసీ ప్రక్రియ ఇప్పటి వరకూ 75 శాతం మాత్రమే పూర్తయ్యింది. చేయించుకోని వారిలో చాలామందికి దీని సమాచారం తెలియదు. తెలిసిన వారిలో కొందరు ఇతర ప్రాంతాలకు పనుల కోసం వలస వెళ్లడంతో సంబంధిత గ్యాస్ ఏజెన్సీని సంప్రదించలేని పరిస్థితి ఏర్పడింది. తెలిసిన వారు ఆన్లైన్లో చేసుకునే వీలు ఉన్నప్పటికీ దానికి సంబంధించిన సాంకేతిక అవగాహన వారికి లేదు. -
ఈఓ పోస్టు ఇప్పించండి ప్లీజ్!
● సత్యదేవుని ఆలయంలో కుర్చీ కోసం రెవెన్యూ అధికారుల పైరవీలు ● మెట్ట ప్రాంత ప్రజా ప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు అన్నవరం: సత్యదేవుని ఆలయ ఈఓ కుర్చీ కోసం మళ్లీ జోరుగా పైరవీలు సాగుతున్నట్టు ప్రచారం సాగుతోంది. రానున్న పుష్కరాల నాటికి రెగ్యులర్ ఈఓ నియామకం తప్పని సరి అని భావించి ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. వాడపల్లి వేంకటేశ్వరుని దేవస్థానం ఈఓ నల్లం సూర్య చక్రధరరావు ప్రస్తుతం ఇక్కడ ఇన్చార్జి ఈఓగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ నెలాఖరు లేదా.. వచ్చే నెలలో.. ఈ నెలాఖరు లేదా వచ్చే నెలలో ఇక్కడ ఈఓను నియమిస్తారన్న సమాచారంతో పలు ఆలయాల అధికారులు మెట్ట ప్రాంత ఎమ్మెల్యేల సిఫార్సుల కోసం ప్రదక్షిణ చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో దేవదాయశాఖ కమిషనర్ కార్యాలయంలో పనిచేసిన డిప్యూటీ కమిషనర్, ఆయనతో బాటు గతంలో ఇక్కడ డీసీగా పనిచేసిన అధికారి, మరి కొందరు రెవెన్యూ అధికారులతో పాటు ప్రస్తుత ఈఓ కూడా ఇక్కడి ఈఓ పోస్టుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఒక్కరే ఆర్జేసీ.. ఐదు పోస్టులు.. ప్రస్తుతం దేవదాయశాఖలో వి.త్రినాథరావు ఒక్కరే రాజమహేంద్రవరం ఆర్జేసీగా పనిచేస్తున్నారు. గత నెలలో అడిషనల్ కమిషనర్గా ఆర్జేసీ ఎస్ఎస్ చంద్రశేఖర్ అజాద్కు పదోన్నతి కల్పించారు. దీంతో కలిపి ఐదు ఆర్జేసీ పోస్టులు ఖాళీ. రాష్ట్రంలోని ఏడు ప్రముఖ పుణ్యక్షేత్రాలలో అన్నవరంలోని చక్రధరరావును మినహాయిస్తే మిగిలిన ఆరు చోట్లా రెవెన్యూ అధికారులే ఈవోలుగా పనిచేస్తున్నారు. రెగ్యులర్ ఈఓ తప్పనిసరి దాదాపు రూ.150 కోట్లు పైబడి వార్షికాదాయం ఉన్న సత్యదేవుని ఆలయానికి రెగ్యులర్ ఈఓ ఉండడం చాలా అవసరం. ఆర్జేసీ హోదా ఉన్నవారే ఇక్కడి ఈఓ పోస్టుకు అర్హులు. ప్రస్తుత ఈఓ చక్రధరరావు అనుభవజ్ఞుడే అయినా ప్రస్తుతం డిప్యూటీ కమిషనర్ హోదాలో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ఆర్జేసీ పోస్టులు ఐదింటిని పదోన్నతి ద్వారా భర్తీ చేస్తే వాటిలో ఆయనకు చాన్స్ వచ్చే అవకాశం ఉంది. -
రత్నగిరిపై నీటి కొరత
ఫ శనివారం మధ్యాహ్నం 12 నుంచి 2.30 వరకూ భక్తుల అవస్థలు ఫ విద్యుత్ లేకపోవడమే కారణమంటున్న అధికారులు అన్నవరం: సత్యదేవుని దేవస్థానంలో శనివారం నీటి సమస్య ఏర్పడింది. స్వామివారి నిత్యాన్నదాన పథకంలో భోజనం చేసిన భక్తులు చేతులు కడుక్కోవడానికి కూడా నీరు లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో మొక్కలకు నీరు పోసే ట్యాంకర్ను తీసుకొచ్చి టబ్లలో ఆ నీటిని నింపారు. దేవస్థానం వాటర్ వర్క్స్ అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమనే విమర్శలు వినిపించాయి. దేవస్థానంలో నాలుగు లక్షల లీటర్ల కెపాసిటీ కలిగిన వాటర్ ట్యాంకులు ఉన్నాయి. వీటికి నిరంతరం మోటార్ల ద్వారా నీటిని ఎక్కించాలి. అయితే ఏపీఈపీడీసీఎల్ నుంచి సరఫరా అయ్యే విద్యుత్ నిలిచిపోవడంతో జనరేటర్ ద్వారా నీటిని దేవస్థానానికి సరఫరా చేశామని అధికారులు చెబుతున్నారు. శుక్రవారం రాత్రికి వాటర్ ట్యాంకుల్లో సగం వరకు మాత్రమే నీరు నిల్వ ఉందని, దేవస్థానంపై పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరగడంతో భక్తులు, సత్రాల్లోని పెళ్లిళ్ల బృందాలు ఈ నీటిని వాడేశాయన్నారు. అలాగే శనివారం ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేయడంతో ఒక్కసారిగా నీటి వినియోగం పెరిగిందని, దీనివల్ల కొరత ఏర్పడిందన్నారు. జనరేటర్ ద్వారా నీటిని తోడినప్పటికి ఎప్పటికప్పడు వాటర్ ట్యాంకులు ఖాళీ అయిపోయాయని వివరించారు. మధ్యాహ్నం నుంచే వివిధ సత్రాల్లో కూడా కుళాయిల ద్వారా నీరు రాకపోవడంతో వాటర్ టిన్నుల ద్వారా సరఫరా చేసినట్టు తెలిపారు. అన్నదాన పథకంలో.. అన్నదాన పథకంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఉదయం పది గంటలకే అక్కడ నీటి సమస్య ఏర్పడింది. వంటలు చేయడానికి వాటర్ టిన్నులు తేవాల్సి వచ్చింది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి చేతులు కడుక్కోవడానికి కూడా కుళాయిల ద్వారా నీరు రాలేదు. దీంతో అన్నదానం ఏఈఓ బలువు సత్యశ్రీనివాస్ మొక్కలకు నీటిని సరఫరా చేసే వాటర్ ట్యాంకర్ను తీసుకువచ్చి అన్నదానం హాలు బయట పెట్టి టబ్లలో నీటిని నింపించారు. మధ్యాహ్నం మూడు గంటలకు కుళాయిల ద్వారా నీరు సరఫరా అవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
పవన్ ఇలాకా.. ముంపు తాలూకా
ఫ చిన్న వర్షానికే పిఠాపురం జలమయం ఫ రోడ్లపైకి చేరిన నీరు పిఠాపురం: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం పట్టణంలో ప్రజల కష్టాలు తీరడం లేదు. రూ.కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తున్నాం అంటున్న నేతలు.. ప్రజల కష్టాలను చూసీచూడనట్టుగా వదిలేస్తున్నారు. శనివారం ఉదయం కురిసిన చిన్నపాటి వర్షానికి పిఠాపురంలోని 3వ వార్డు ముంపు బారిన పడింది. డ్రైనేజీలు సక్రమంగా లేకపోవడంతో వర్షం నీరు బయటకు వెళ్లే మార్గం లేకుండా పోయింది. ఆర్టీసీ కాంప్లెక్స్, కాంప్లెక్స్ బ్యాక్ సైడ్, వన్ వే ట్రాఫిక్ రోడ్, భాష్యం స్కూల్ రోడ్డు పరిస్థితి దారుణంగా మారింది. పిఠాపురం బస్టాండ్ నుంచి స్కూల్కు వెళ్లే పిల్లలు మోకాలు లోతు నీటిలో వెళ్లడం బాధాకరమని 2, 3, 4 వార్డుల సమస్యల పరిష్కార పోరాట కమిటీ కన్వీనర్ కరణం విశ్వనాథం అన్నారు. ఈ రెండున్నరేళ్లలో అనేకసార్లు పీజీఆర్ఎస్లో ఫిర్యాదులు ఇచ్చిన ఎటువంటి చర్యలూ తీసుకోలేదని తెలిపారు. -
వాడపల్లిలో వాన కష్టాలు
● నానా అవస్థలు పడిన భక్తులు ● పార్కింగ్ స్థలంలో బురద చీదర ఆత్రేయపురం: లక్షల్లో భక్తులు.. రూ.కోట్లలో ఆదాయం వస్తున్నా, వాడపల్లికీ వాన కష్టాలు తప్పలేదు. వర్షపునీరు ముంచెత్తడం, ఆపై బురద చేరడం భక్తుల సహనాన్ని పరీక్షించింది. కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి శనివారం ఉదయం వచ్చిన భక్తులకు వాన విసుగు పుట్టించింది. ఆలయ ఆవరణలో సైతం అడుగు మేర నీరు చేరడంతో ఇబ్బందులు పడ్డారు. వాహనాల పార్కింగ్ స్థలంలో భారీ వర్షానికి నీరు నిలిచి ఎటు వెళ్లాలో తెలియక తడిసి ముద్దయ్యారు. అలాగే కొందరి పాదరక్షలు, సామగ్రి కొట్టుకుపోయాయి. వాహనాల పార్కింగ్ స్థలంలో వర్షపు నీరు చేరడంతో కాలువను తలపించింది. అక్కడ అంతా బురదగా మారింది. మోకాలు లోతు నీరు నిలిచిపోవడంతో ఇబ్బందులు తప్పలేదు. అలాగే ఆలయంలో భారీ వర్షం పడటంతో దర్శనాలకు నానా అవస్థలు పడ్డారు. ఆలయ ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో ఆలయ ఆవరణలో నీటిని బయటకు పంపించడానికి మోటార్లను ఏర్పాటు చేయించి, పనులు చేపట్టారు. అలాగే పార్కింగ్ స్థలంలో ఆయన పర్యటించి, భక్తుల ఇబ్బందులను గమనించారు. అప్పటికప్పుడు ఏర్పాట్లు చేయడం కూడా కష్టసాధ్యంగా మారింది. ఇదిలా ఉంటే ఆలయం వద్ద వసతుల కల్పన, అభివృద్ధి పనులు నత్తనడకగా సాగుతుండటం పట్ల భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వకుళమాత అన్నదాన భవనం నిర్మాణ పనులు ఏళ్ల తరబడి కొనసాగుతున్నాయి. తాత్కాలిక అన్నదాన షెడ్డు భక్తుల భోజనాలకు అనువుగా లేదు. ప్రధానంగా ఇక్కడ అన్నదాన భవనం నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేసి, భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలి. అలాగే శ్రీనివాసమ్ వంటి ఇతర భవన నిర్మాణాలను త్వరితగతిని పూర్తి చేయాలి. పార్కింగ్ స్థలాలలో సైతం మెరక చేసే పనులు నాసిరకంగా ఉండటంతో ఇబ్బంది వస్తోంది. అక్కడ సరిచేయించాల్సి ఉంది. -
ఉసురు తీస్తున్న ఊబులు..
ధవళేశ్వరం/కపిలేశ్వరపురం: కాటన్ బ్యారేజ్ అందాలు వీక్షించడం ఓ మధురానుభూతి. ఓ పక్క గోదారి గలగలలు, మరో పక్క గోదారి పాయల నడుమ ఇసుక తిన్నెలు. ఇంకో పక్క పక్షుల కిలకిల రవాలు. భావుకులకు అదో అద్వితీయ దృశ్య కావ్యం. ఆస్వాదన వరకు బాగానే ఉంటుంది కానీ.. ఆ అందాలతో ఆకతాయి ఆటలాడితేనే సమస్య. గత మంగళవారం కాటన్ బ్యారేజీ దిగువున ఇసుక తిన్నెల్లో నీళ్లల్లోకి దిగి ఇద్దరు అన్నదమ్ములు మృత్యువాత పడ్డారు. గడిచిన పదేళ్లలో ఇలా సుమారు 70 మంది మునిగిపోయారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. వారంతా 12 నుంచి 25 ఏళ్ల మధ్య యువకులే కావడం గమనార్హం. ఎన్ని హెచ్చరిక బోర్డులు పెట్టినా నీటిని చూసి పొంగే ఆనందంలో, ఇసుక తిన్నెల్లో ఉన్న దొంగ ఊబులను గమనించక అనంత లోకాలకు వెళ్లిపోతున్నారు. ఇసుక గుంతలే మృత్యు కుహరాలు గోదావరి తీరం వెంబడి అనేక స్నాన ఘట్టాలున్నాయి. కపిలేశ్వరపురం మండలం కేదారిలంక, తాతపూడి, కపిలేశ్వరపురం గ్రామాల ర్యాంపుల్లో ఇసుక అక్రమ తవ్వకాలతో నదిలో లోతైన గోతులు ఏర్పడి మృత్యు కుహరాలుగా మారుతున్నాయి. నదిలో కలసిన ప్రాణాలెన్నో ● ఒక్క ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మాత్రమే కాదు.. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గోదావరి పాయల్లో ఇటువంటి ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి. ● ఈ నెల 14న మండపేట మండలం ఏడిద గ్రామానికి చెందిన జాగ్ దయాకర్ (18) కె.గంగవరం మండలం కోటిపల్లి రేవులో మృతి చెందాడు. ● ఈ నెల 23న ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద అదే గ్రామానికి చెందిన అన్నదమ్ములు పెద్దిపాటి హేమంత్ (21), జస్వంత్ కుమార్ (18) మృతి చెందారు. ● మే 11న యానాం గౌతమీ గోదావరి పుష్కర ఘాట్లో రాజమహేంద్రవరానికి చెందిన షేక్ ఫైజన్ (17) మృతి చెందాడు. ● 2025 నవంబర్ 9న అంబాజీపేట మండలం పుల్లేటికుర్రుకు చెందిన పదో తరగతి విద్యార్థి నామాడి బన్ను (17) కపిలేశ్వరపురం మండలం కేదారిలంక గ్రామ శివారు ధనమ్మ మర్రి ప్రాంతంలో ఇసుక గుంతల్లో చిక్కుకుని చనిపోయాడు. ఇసుక తిన్నెల్లో పొంచి ఉన్న ప్రమాదాలు పదేళ్లలో సుమారు 70 మంది మృత్యువాత హెచ్చరికలను ఖాతరు చేయని సందర్శకులు -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 23,000 గటగట (వెయ్యి) 20,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 22,000 గటగట (వెయ్యి) 19,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
నవోదయలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
సామర్లకోట: పెద్దాపురం జవహర్ నవోదయ విశ్వవిద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి ఆర్ట్స్ విభాగం 11వ తరగతిలో ఖాళీ సీట్లలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు వర్సిటీ ప్రతినిధులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు 2026 మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షలలో ఉత్తీర్ణులై ఉండాలని, ఉమ్మడి జిల్లాకు చెందిన అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థులు జూన్ 1వ తేదీ, 2009 – జూలై 31, 2011 మధ్య జన్మించి ఉండాలన్నారు. విద్యార్థులకు ఉచిత భోజన వసతితో పాటు స్టేషనరీ అందించి నాణ్యమైన విద్య అందిస్తామన్నారు. అభ్యర్థులు దరఖాస్తుతో పాటు పదో తరగతి మార్కుల జాబితా జతపరచి స్వయంగా పాఠశాల కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. దరఖాస్తులు ఈ నెల 29 వరకు లభిస్తాయని, పూర్తి చేసిన దరఖాస్తులను ఈనెల 30వ తేదీ లోగా నవోదయ పాఠశాలలో సమర్పించాలన్నారు. నేడే పల్స్ పోలియో కాకినాడ క్రైం: జిల్లా వ్యాప్తంగా ఆదివారం పల్స్ పోలియో నిర్వహించనున్నట్లు డీఎంహెచ్వో డాక్టర్ నరసింహనాయక్ తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పల్స్ పోలియో నిర్వహించేందుకు 990 బూత్లు, 56 ట్రాన్సిట్ పాయింట్లు, 61 మొబైల్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,44,762 మంది 0–5 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సిన్ వేస్తారన్నారు. స్థానిక రామారావుపేట యూపీహెచ్సీలో అధికారికంగా ప్రారంభిస్తామని తెలిపారు. 131 రూట్ సూపర్వైజర్ల ద్వారా కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తామన్నారు. ఏఎన్ఎంలు, అంగన్వాడీ సిబ్బంది క్షేత్రస్థాయిలో బూత్లకు పిల్లల్ని తరలిస్తారన్నారు. తల్లిదండ్రుల్లో అవగాహన పెంపొందించేందుకు గ్రామ, పట్టణ స్థాయిల్లో విస్తృత అవగాహన కల్పించామని అన్నారు. అందులో భాగంగా కాకినాడ భానుగుడి కూడలిలో మానవహారం ఏర్పాటు చేశామన్నారు. తల్లిదండ్రులు తప్పకుండా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు. అమరావతి అన్యాయాలను ప్రశ్నిస్తే దాడులా? జమ్మలమడక నాగమణి కాకినాడ రూరల్: అమరావతి ప్రాంతంలో పర్యటిస్తున్న వైఎస్సార్ సీపీ శ్రేణులపై టీడీపీ అకృత్యాలను గూండాల దాడిగా ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి అభివర్ణించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి రైతులు తమకు జరుగుతున్న అన్యాయంపై ఇటీవల పార్టీ అధినేత జగన్ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. అందులో భాగంగా నేడు పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మాజీ మంత్రులు పేర్ని నాని, అంబటి రాంబాబు సహా పలువురు ముఖ్య నేతలు అమరావతి పర్యటనకు వెళ్లారని పేర్కొన్నారు. ఉండవల్లిలో సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ సభ్యులు, వైఎస్సార్ సీపీ బృందంపై రాళ్లు, కోడిగుడ్లతో దాడికి పాల్పడటం హేయనీయమని ఆమె అన్నారు. ఎమ్మెల్సీ అరుణ్ కుమార్పై బండరాయితో దాడి చేయగా ఆయన తృటిలో తప్పించుకున్నారని, దీంతో ఆ రాయి అక్కడే ఉన్న పోలీస్ కానిస్టేబుల్ కు తగిలి తీవ్రగాయాలయ్యాయని తెలిపారు. గాయపడిన కానిస్టేబుల్ను వైఎస్సార్ సీపీ నేతలే ఆస్పత్రికి తరలించారని వివరించారు. ఉండవల్లి, పెనుమాక, బేతపూడి, కురగల్లు తదితర గ్రామాలతో పాటు అమరావతి రాజధాని ప్రాంతంలో బలవంతపు భూ సమీకరణను వ్యతిరేకిస్తున్న రైతులకు న్యాయ సహాయం చేయాలని మాజీ ముఖ్యమంత్రి జగన్ భావించారని తెలిపారు. అక్కడి పరిస్థితులను పరిశీలించేందుకు వెళ్లినవారిపై టీడీపీ గూండాలు దాడి చేశారన్నారు. పోలీసులు ఉన్నది శాంతి భద్రతలను పరిరక్షించానికా, టీడీపీ వారికి ఎస్కార్టులుగా ఉండడానికా అని ఆమె ప్రశ్నంచారు. అమరావతిలో జరుగుతున్న మట్టి దందాలు, కమీషన్లు, కాంట్రాక్టర్ల అవినీతి వ్యవహారాలపై ప్రజలకు వివరిస్తామని నాగమణి తెలిపారు. -
భర్త ఇంటి ముందు భార్య బైఠాయింపు
కొత్తపల్లి: తనను వదిలేసి, మరో పెళ్లి చేసుకున్న భర్త ఇంటి వద్ద ఓ భార్య బైఠాయించిన సంఘటన నాగు లాపల్లిలో చోటు చేసుకుంది. బాధితురాలు, పోలీసుల కథనం ప్రకారం.. నాగులాపల్లికి చెందిన చింతపల్లి మురళీరెడ్డికి, రమణక్కపేటకు చెందిన రామశంకరికి 2012లో వివాహమైంది. ఆ సమయంలో మురళీరెడ్డికి రామశంకరి తల్లిదండ్రులు రెండెకరాల భూమి, రూ.2 లక్షల నగదు, 40 కాసుల బంగారం కట్నంగా ఇచ్చా రు. ఆ దంపతులు కొన్నాళ్లు కాకినాడలో కాపురం ఉండేవారు. ఆమెకు పిల్లలు పుట్టడం లేదనే కారణంతో మురళీరెడ్డి గత ఏడాది నవంబరులో మరో మహిళను వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచీ కాకినాడ రాకపోవడంతో రామశంకరి ఆరా తీసింది. ఆమెతో కాపు రం చేయబోనని, తాను మరో వివాహం చేసుకున్నానని అతడు చెప్పాడు. దీనిపై ఇరు వర్గాల మధ్య 8 నెలలుగా వివాదం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులతో కలసి రామశంకరి శుక్రవారం మురళీరెడ్డి ఇంటికి వచ్చింది. తమను బయటకు గెంటేసి, గేటుకు తాళం వేసి, అతడు వెళ్లిపోయాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. మరో పెళ్లి చేసుకుని తనకు తీవ్ర అన్యాయం చేశాడని, న్యాయం జరిగే వరకూ భర్త ఇంటి వద్ద ఆందోళన చేస్తానని చెప్పింది. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఏడిపింఛెన్
శనివారం శ్రీ 27 శ్రీ జూన్ శ్రీ 2026● కొత్త పింఛన్ల పంపిణీ అంటూ ఆర్భాటం ● ఇదిగో ఇచ్చేస్తున్నారంటూ కూటమి నేతల హడావుడి ● సచివాలయాల వద్ద అర్హుల పడిగాపులు ● ప్రభుత్వ ఆదేశాలు లేవన్న అధికారులు ● ఆశావహులకు తప్పని నిరాశ పిఠాపురం: నరాల బిగువు, కరాల సత్తువ సన్నగిల్లి, ముదిమి మీద పడి కొందరు.. అవయవాలు సక్రమంగా లేక, ఏ పనీ చేయలేక బతుకు భారంగా ఈడుస్తున్న వారు మరికొందరు.. భర్తను కోల్పోయి, నా అనే దిక్కు లేక దీనావస్థలో ఇంకొందరు.. చంద్రబాబు సర్కారు నిరాదరణతో ఇటువంటి బాధాసర్పదష్టులు కన్నీరు పెట్టుకుంటున్న పరిస్థితి సర్వత్రా కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛను మొత్తాన్ని రూ.4 వేలకు పెంచి అదే మహా గొప్ప అన్నట్టు హడావుడి చేశారు. తీరా చూస్తే ప్రతి నెలా లబ్ధిదారుల సంఖ్యలో కోత పెడుతున్నారు. దీనికితోడు ప్రభుత్వం రెండేళ్లుగా కొత్త పింఛన్లు మంజూరు చేయడం లేదు. ఆ పింఛను వస్తే వృద్ధాప్యంలో, దిక్కులేని దీనావస్థలో ఊపిరి నిలబెట్టుకోవడానికి అవసరమైన మందులు మాకులు కొనుక్కోవడానికి, కడుపు నిండా కాస్త తినడానికి, ఆత్మగౌరవంతో బతకడానికి ఉపయోగపడుతుందని జిల్లాలో వివిధ కేటగిరీలకు చెందిన వేలాది మంది ఆశగా ఎదురు చూస్తున్నారు. దరఖాస్తులు చేసుకుని, సచివాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఆశ పెట్టి.. ఏడిపిస్తారా? ఈ తరుణంలో కూటమి ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 12 నుంచి కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం అంటూ కూటమి నేతలు ఇటీవ ల తెగ హడావుడి చేశారు. సోషల్ మీడియాలో సైతం ఆర్భాటం చేశారు. పలువురు కూటమి నేతలు, కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించి పింఛన్ ఆశావహుల నుంచి ధ్రువీకరణ పత్రాలు సైతం సేకరించారు. దీంతో, రెండేళ్లుగా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న అభాగ్యులు గంపెడాశతో సచివాలయాలకు క్యూ కట్టారు. తీరా చూస్తే కొత్త పింఛన్లు ఇవ్వాలంటూ ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి ఉత్తర్వులూ రాలేదని, అసలు వెబ్సైటే ఓపెన్ కాలేదని పంచాయతీ కార్యదర్శులు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, అధికారులు చెప్పడంతో కంగు తినడం ఆ నిర్భాగ్యుల వంతయ్యింది. పింఛన్లు ఇవ్వకపోయినా ఫర్వాలేదు కానీ, ఇస్తామని చెప్పి ఇలా ఏడిపించడమేమిటని వారు వాపోతున్నారు.కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న ఆశావహులుపదేపదే తిరిగినా.. కాళ్లు రెండూ చచ్చుబడిపోయి కుటుంబ పోషణ భారంగా మారింది. రెండేళ్ల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. కొత్త పెన్షన్ మంజూరు చేస్తున్నారంటూ ప్రచారం చేస్తే ఆశతో సచివాలయానికి వెళ్లాను. అటువంటిదేమీ లేదు పొమ్మన్నారు. ఏ ఆధారమూ లేక కుటుంబం గడవక చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించాలి. – పెనుబోతుల రాంబాబు, దివ్యాంగుడు, జగ్గయ్య చెరువు కాలనీ, పిఠాపురం అభాగ్యులతో ఆటలా? దివ్యాంగుడిగా ఉన్న నాకు ఎటువంటి ఆధారమూ లేకపోవడంతో పింఛను మంజూరు చేయాలంటూ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. ఈ నెల 12న కొత్త పింఛన్లు ఇస్తున్నారని ప్రచారం జరిగితే గంపెడాశతో వెళ్లాను. ఇప్పుడు అలాంటివేవీ లేవన్నారు. ఇవ్వనప్పుడు ప్రచారం చేయడం ఎందుకు? అభాగ్యులతో ఆటలాడొద్దు. వెంటనే కొత్త పింఛన్లు ఇవ్వాలి. – లంకా నాగరాజు, దివ్యాంగుడు, పిఠాపురం జిల్లాలో వివిధ కేటగిరీ పింఛన్ల పంపిణీ ఇలా.. కేటగిరీ లబ్ధిదారులు వృద్ధాప్య 1,30,826 దివ్యాంగులు 34,716 ఒంటరి మహిళలు 7,795 వితంతువులు 73,725 మత్స్యకారులు 6,236 కల్లుగీత 3,378 చేనేత 3,411 ఆరోగ్యపరమైనవి 783 మొత్తం 2,71,039 పింఛన్లుగా అందిస్తున్న మొత్తం రూ.116.88 కోట్లు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారు 35,000 -
భవన నిర్మాణ కార్మికులకు రూ.కోటి విరాళం ఏమైంది?
జూన్ 30న చలో విజయవాడకు మద్దతు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వెంకట సుబ్బయ్య తెలిపారు. ఎన్నికల సమయంలో భవన నిర్మాణ కార్మికులకు వ్యక్తిగతంగా రూ.కోటి విరాళం ఇస్తానని ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆ హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కాకినాడలోని పీఆర్ భవన్లో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికుల హక్కులను దెబ్బ తీసే విధానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని విమర్శించారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో ఇటీవల జరిగిన ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై జూలై 3న రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యాన ధర్నాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగం, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. ఆర్టీసీ సేవలను ప్రైవేటీకరించే ప్రయత్నాలను విరమించుకోవాలని, ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే చర్యలను నిలిపివేయాలని కోరారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసేంత వరకూ ఉద్యమం కొనసాగిస్తామని సుబ్బయ్య స్పష్టం చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటిపాక మధు మాట్లాడుతూ రైతు సమస్యల పరిష్కారం, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30న నిర్వహించే ‘చలో విజయవాడ’ కార్యక్రమానికి రైతులు, కార్మికులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. విలేకర్ల సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు కశింకోట కిషోర్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ బొబ్బిలి శ్రీనివాసరావు, సీనియర్ కార్మిక నేత కె.ఆదినారాయణమూర్తి పాల్గొన్నారు. -
ప్రతి పంటకూ మద్దతు ధర
● 60 ఏళ్లు నిండిన ప్రతి రైతుకూ రూ.10 వేల పెన్షన్ ● కౌలుదారులకు చట్టబద్ధమైన రక్షణ ● ఏపీ రైతు సంఘం నేత సూర్యనారాయణ డిమాండ్ పిఠాపురం: స్వామినాథన్ కమిటీ సిఫార సు చేసిన విధంగా ప్రతి పంట ఉత్పత్తి వ్యయంపై కనీసం 50 శాతం లాభం కలిపి మద్దతు ధర నిర్ణయించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సూర్యనారాయణ డిమాండ్ చేశారు. సంఘం జిల్లా రెండో మహాసభ లు పిఠాపురం సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో శుక్రవారం జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న సూర్యనారా యణ మాట్లాడుతూ, 60 ఏళ్లు నిండిన ప్రతి రైతుకూ రూ.10 వేల పెన్షన్ ఇవ్వాలని, రుణమాఫీ చేయాలని, విద్యుత్ ప్రైవేటీకరణను ఆపాలని, కౌలు రైతులకు చట్టబద్ధమైన రక్షణ కల్పించాలని, వ్యవసాయ కార్మికులకు మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధనకు కార్యాచరణ రూపొందించే దిశ గా వచ్చే నెల 3, 4, 5 తేదీల్లో ఏలూరులో సంఘం రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవసాయ విధానాలు రైతులకు వ్యతిరేకంగా, కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా ఉన్నాయని సూర్యనారాయణ అన్నారు. ఇటీవల జరిగిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లలో అమెరికా, ఇంగ్లండ్, యూరోపియన్ దేశాల నుంచి జీరో ట్యాక్స్తో వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. ఈ ఒప్పందంతో ధరలు మరింత పడిపోయి రైతులు దారుణంగా దెబ్బ తింటారని చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 14 పంటలకు ప్రకటించిన మద్దతు ధర అందే పరిస్థితి లేదని ఆయన మండిపడ్డారు. సబ్సిడీకి కత్తెర వేసేందుకే ఎరువుల యాప్ రైతులకు ఇస్తున్న సబ్సిడీని తగ్గించుకునేందుకే ఎరువుల పంపిణీకి ప్రభుత్వా లు యాప్ తీసుకొచ్చాయని సూర్యనారాయణ అన్నారు. దీని ద్వారా ఎకరానికి మూడు విడతలుగా రెండు బస్తా లు మాత్రమే ఇస్తామంటున్నారన్నారు. గోదావరి జిల్లాల్లో మొక్కజొన్నకు ఎకరానికి 10 నుంచి 12 బస్తాల ఎరువులు వేస్తున్నారని, ప్రభుత్వం రెండు బస్తాలు మాత్రమే ఇస్తే, మిగిలింది రైతులు సొంత డబ్బుతో కొనుక్కోవాల్సి వస్తుందని చెప్పారు. సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుమలశెట్టి నాగేశ్వరరావు, నాయకుడు నీలపాల సూరిబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
బంగారంపై యుద్ధ సంక్షోభం
పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం బంగారంపై పడింది. గడచిన మూడు వారాలుగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. ధరలు తగ్గిన ప్రతి సందర్భంలోనూ ప్రజలు భయపడి కొనుగోళ్లు ఆపేస్తారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ధరలు ముందుముందు ఇంకా తగ్గుతాయనే భయంతో కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. ఈ పరిస్థితి మరో నెల రోజులుంటుందని అంచనా వేస్తున్నాం. – అనిల్ కుమార్ జైన్, రాష్ట్ర బులియన్ అసోసియేషన్ కోశాధికారి, అమలాపురం అప్పటి వరకూ ఆగాల్సిందే.. బంగారం కొనుగోళ్లు బాగా తగ్గిపోయాయి. ధర తగ్గిందని అనుకుంటే బంగారం కొనేందుకు వినియోగదారులు ముందుకు రావడం లేదు. ఒకప్పుడు రోజుకు పది పదిహేను మంది బంగారం కొనుగోలుకు వచ్చేవారు. ఇప్పుడు నలుగురైదుగురికి మించి రావడం లేదు. శ్రావణ మాసం వచ్చే వరకూ మార్కెట్లో ఈ అనిశ్చితి ఉండేలా కనిపిస్తోంది. – కొండేపూడి శివరామకృష్ణ, గోల్డ్ మర్చంట్, కరప -
సర్ వేగవంతం చేయాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో ఈ నెల 15 నుంచి జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కాకినాడ సిటీ నియోజకవర్గంలోని 34వ పోలింగ్ కేంద్రం భాస్కర్ నగర్లో బీఎల్ఓలు ఇంటింటా నిర్వహిస్తున్న ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీని గురువారం ఆయన అకస్మాత్తుగా పరిశీలించారు. పత్రాల పంపిణీ, వాటిని పూర్తి చేసి, ఓటర్ల తిరిగి స్వీకరిస్తున్న విధానాన్ని నేరుగా పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. చనిపోయిన, శాశ్వతంగా గ్రామం వదిలి వెళ్లిన, నాట్ ట్రేస్ అవుట్ వ్యక్తుల ఓట్ల విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులకు స్పష్టం చేశారు. నిర్దిష్ట గడువులోగా ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ పూర్తి చేయాలన్నారు. ఈ విధుల్లో నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సూపర్వైజర్లను కలెక్టర్ హెచ్చరించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ ప్రియ, కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు కూడా పాల్గొన్నారు. -
ధ్వజస్తంభంపై సుదర్శన చక్రం తొలగింపు
అన్నవరం: ఇటీవల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి సత్యదేవుని ఆలయ ధ్వజస్తంభంపై సుదర్శన చక్రం ఒకవైపు ఒరిగిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని గత ఆదివారం గుర్తించారు. దీనిని కిందికి దించి, సంప్రోక్షణ అనంతరం తిరిగి ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఒరిగిన ఆ చక్రాన్ని అర్చకుడు సుధీర్, పరిచారకుడు పవన్లు పండితుల మంత్రోచ్చారణల నడుమ బుధవారం తొలగించి, కిందకు దించారు. అనంతరం దర్బారు మండపంలో ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం ఆధ్వర్యాన పూజలు చేసి ఒంగిన సుదర్శన చక్రాన్ని సరి చేశారు. దీనికి గురువారం ఉదయం ప్రత్యేక పూజలు చేయనున్నారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పండ్ల రసాలతో అభిషేకం చేసిన అనంతరం, 9 గంటలకు పండితుల మంత్రోచ్చారణల నడుమ దానిని తిరిగి ధ్వజస్తంభంపై అమర్చుతారు. అక్కడ కూడా అభిషేకం చేసి, సుదర్శన చక్రానికి బూర్లు నివేదిస్తారని సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ నల్లం సూర్యచక్రధరరావు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొంటారని అధికారులు తెలిపారు. నేడు సంప్రోక్షణ, పునఃప్రతిష్ఠ -
బాలబాలాజీకి కల్యాణ తిలకం
మామిడికుదురు: జ్యేష్ఠ శుద్ధ దశమి శుభ ముహూర్తంలో వేద మంత్రాలు, భక్తుల గోవిందనామ స్మరణలు, మంగళ వాయిద్యాలు, కర్పూర పరిమళ సుగంధ ద్రవ్యాల నడుమ అప్పనపల్లి బాలబాలాజీ స్వామి వారి తిరు కల్యాణోత్సవాలకు బుధవారం అంకురార్పణ జరిగింది. పాంచరాత్ర ఆగమానుసారం స్వామి వారి వార్షిక దివ్య తిరు కల్యాణోత్సవాలకు శ్రీకారం చుట్టారు. అర్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్స్వామి శిష్యులు, యాజ్ఞిక బ్రహ్మ చలమచర్ల వేణుగోపాలాచార్యులు బృందం ఆధ్వర్యాన శ్రీవారి వార్షిక కల్యాణోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా బాలబాలాజీ స్వామితో పాటు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను సుందరంగా ముస్తాబు చేశారు. బుగ్గన చుక్క పెట్టి, నుదుటన కల్యాణం తిలకం దిద్ది, పెండ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెలుగా అలంకరించారు. ఎటువంటి ఆటంకాలూ కలగకుండా కల్యాణోత్సవాలు నిర్విఘ్నంగా జరగాలని కోరుతూ విష్వక్సేనారాధన చేశారు. ఆలయ ఈఓ ఎం.రాంబాబురెడ్డి దంపతులు, వంశపారంపర్య ధర్మకర్త, చైర్మన్ మొల్లేటి లక్ష్మీనారాయణ 108 కలశాలతో పాటు బ్రహ్మ కలశంలో పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, పసుపు, కుంకుమతో స్నపన తిరు మంజన సేవను వైభవోపేతంగా జరిపించారు. సేకరించిన పుట్టమన్నును తొమ్మిది పాత్రల్లో నింపి అంకురార్పణ నయనానందకరంగా జరిపించారు. పుణ్యాహవాచనం, పంచగవ్య ప్రాశన, పరిషదక్షిణ, మృత్సంగ్రహణం, హోమం తదితర కార్యక్రమాలు వైభవోపేతంగా నిర్వహించారు. కల్యాణోత్సవ కార్యక్రమాలను వీక్షించేందుకు విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తిరు కల్యాణ మహోత్సవ పూజా కైంకర్యాలను వీక్షించి మహదానందం పొందారు. -
ఒకరికి ఏకంగా రూ.12 వేల కటింగ్
అన్నవరం: పులికి లేడి లాంటి చిన్న జంతువులే లోకువ.. అది సాధారణంగా ఏనుగుల్లాంటి పెద్ద జంతువుల జోలికి వెళ్లదు. అది ఆటవిక న్యాయం. నాగరిక సమాజంలో కూడా పెద్ద ఉద్యోగుల జోలికి సాధారణంగా ఎవరూ వెళ్లరు. చిరుద్యోగులే ఎప్పుడు టార్గెట్ అవుతూంటారు. అన్నవరం దేవస్థానంలో సరిగ్గా ఇలాగే జరిగింది. దేవస్థానంలో రెగ్యులర్ ఉద్యోగులు సుమారు 215 మంది ఉన్నారు. వీరికి జీతభత్యాలు ఒక్కొక్కరికి నెలకు సుమారు రూ.లక్ష వరకూ ఉంటుంది. కాగా, దేవస్థానంలో ఎన్ఎంఆర్, అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, సెక్యూరిటీ, శానిటేషన్, స్వామివారి పల్లకీ బోయీలు, ఆలయాల్లో వైదికపరమైన పనులు చేసే పరిచారకులు సుమారు వెయ్యి మంది ఉంటారు. వీరి జీతాలు నెలకు రూ.12 వేల నుంచి రూ.18 వేల వరకూ ఉంటాయి. వీరు రోజూ బయోమెట్రిక్ అటెండెన్స్ వేయాలనే నిబంధన ఉంది. వీరిలో చాలా మంది సంబంధిత సెక్షన్ సూపరింటెండెంట్ల అనుమతితో వ్యక్తిగత కారణాల వలన తమ విధులను వేరొకరికి అప్పగించి, తరువాత వారి విధులను వీరు చేస్తూంటారు. తద్వారా పనులు, సేవల్లో లోటు లేకుండా చూసుకుంటారు. ఈ నేపథ్యంలో ఒక్కోసారి బయోమెట్రిక్ అటెండెన్స్ వేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి సందర్భాల్లో ఆ సూపరింటెండెంట్లు అటెండెన్స్ రిజిస్టర్లో విధులకు హాజరైనట్టు ‘పి’ అని నమోదు చేస్తారు. సూపరింటెండెంట్లు ఆవిధంగా నమోదు చేసినప్పటికీ సత్యదేవుని సన్నిధిలో పని చేస్తున్న 83 మంది చిరుద్యోగులకు మే నెల జీతాల్లో ఒకటి, రెండు రోజుల చొప్పున కోత విధించడం వివాదాస్పదమైంది. బయోమెట్రిక్ అటెండెన్స్ వేయకపోవడంతో గైర్హాజరైనట్లు భావిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈవిధంగా ఒక్కొక్కరి జీతాల్లో రూ.600, రూ.వెయ్యి చొప్పున కటింగ్ చేశారు. కట్ చేసిన మొత్తం రూ.3.5 లక్షలు దేవస్థానానికి జమ చేశారు. దీనిపై ఈఓ వద్ద పలువురు సూపరింటెండెంట్లు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఆయన వెనక్కి తగ్గకుండా కట్ చేయాల్సిందేనని ఆదేశాలు ఇచ్చినట్టు చెబుతున్నారు. ఈ ఉద్యోగులకు వచ్చే నెల జీతమే తక్కువ. అందులోనూ కోత పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పల్లకీ మోసినా తప్పని జీతం కోత దేవస్థానంలో 26 మంది పల్లకీ బోయీలకు ప్రస్తుతం 20 మంది పని చేస్తున్నారు. వీరందరూ రజకులే. శతాబ్దాల నుంచి నాలుగు ఇంటి పేర్ల వారే స్వామివారి పల్లకీ సేవలో పాల్గొంటారు. వీరు లేనిదే దేవుని సేవ జరగదు. వీరికి ఒక్కొక్కరికి అన్ని కటింగ్లూ పోనూ చేతికి రూ.18 వేల జీతం వస్తోంది. గత ఏప్రిల్ 26 నుంచి మే రెండో తేదీ వరకూ జరిగిన సత్యదేవుని వార్షిక కల్యాణోత్సవాల్లో ఈ బోయీలంతా పని చేశారు. రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి వరకూ జరిగిన వివిధ ఉత్సవాల్లో స్వామి, అమ్మవారిని వీరు ఆయా వాహనాల్లో ఊరేగించారు. ఇవి కాకుండా స్వామివారికి ప్రతి రోజూ ఏదో ఒక సేవ ఉండనే ఉంది. ఈ క్రమంలో ఆరుగురు బయోమెట్రిక్ అటెండెన్స్ సరిగా వేయలేదు. ఈ కారణంతో తమకు రూ.600 నుంచి రూ.3 వేల వరకూ జీతం కట్ చేశారని వారు వాపోయారు. ఈఓ లేనప్పుడు అందరూ పని చేస్తున్నారా? వాడపల్లి దేవస్థానం ఈఓగా ఉన్న నల్లం సూర్యచక్రధరరావు అన్నవరం దేవస్థానానికి ఇన్చార్జి ఈఓగా ఉన్నారు. ఆయన వారానికి మూడు నాలుగు రోజులు ఇక్కడ, మిగిలిన రోజుల్లో వాడపల్లిలో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఇక్కడ లేనప్పుడు బయోమెట్రిక్ అటెండెన్స్ వేసి, ఏ ఉద్యోగి ఎక్కడకు వెళ్తున్నారో ఎలా తెలుస్తుందని కొంతమంది ప్రశ్నిస్తున్నారు.·˘ ºÄñæ*-Ððl$-{sìæMŠS Asñæ…-yðl¯ŒSÞ వేయలేదని 83 మందికి జీతం కట్ ·˘ JMöPMýSP-Ç i™èl… ¯ðlÌSMýS$ రూ.12 వేల నుంచి రూ.18 వేలు ·˘ A…§ýl$ÌZ¯ól Æý‡*.600 ¯]l$…_ రూ.1,000 వరకూ కోత ·˘ çÜ™èlÅ-§ólÐ]l#° çܰ²-«¨ÌZ అధికారుల తీరుపై విమర్శలుపల్లకీ బోయీల్లో ఎవరైనా వృద్ధులైతే తమ కొడుకులు, అల్లుళ్లను ఈ పనిలో పెట్టుకుంటూంటారు. అలాగే, మైలు, ఇతర కారణాలతో ఎవరైనా విధులకు రాలేని పరిస్థితి ఏర్పడితే మరొకరిని ఆ సేవకు పంపిస్తారు. ఇదే విధంగా వృద్ధుడైన ఒక బోయీ తను రాలేని పరిస్థితిలో వేరొకరిని సేవకు పంపించాడు. అతడు రోజూ పల్లకీ సేవ చేశాడు. కానీ, బయోమెట్రిక్ అటెండెన్స్ వేయలేదనే కారణంతో ఆ వృద్ధ బోయీ జీతం నుంచి ఏకంగా రూ.12 వేలు కట్ చేసి, రూ.6 వేల జీతం మాత్రమే ఇచ్చారు. తనకు బదులు పని చేసిన వారికి అందులో నుంచి ఎంత మొత్తం ఇవ్వాలో తెలియక ఆ వృద్ధుడు ఇబ్బంది పడుతున్నాడు. జీతంలో కోత పడిన 83 మంది చిరుద్యోగుల పరిస్థితి ఇదేవిధంగా ఉంది. -
కూలికి వెళ్లి కనుమరుగు
రంగంపేట/సామర్లకోట: వారందరూ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకునే పేదలు. బతుకుతెరువు కోసం దూర ప్రాంతాలకు వెళ్లి పనులు చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లాకు పనికి వెళ్లారు. దాన్ని పూర్తి చేసి సంతోషంగా స్వగ్రామాలకు బయలుదేరారు. ఇంకో 20 కిలోమీటర్లు అంటే అరగంటలో గమ్యానికి చేసుకుంటారనగా మృత్యువు కబళించింది. వ్యాన్ బోల్తా పడడంతో ముగ్గురు మృతి చెందారు. ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. పనుల కోసం గుంటూరు జిల్లాకు.. కాకినాడ జిల్లా సామర్లకోట, పిఠాపురం మండలం జల్లూరు తదితర గ్రామాలకు చెందిన 11 మంది కూలీలు ఈ నెల 16వ తేదీన గుంటూరు జిల్లా కొల్లూరు ప్రాంతంలో సిమెంట్ పలకలతో గోడల ఫెన్సింగ్ పనులకు వెళ్లారు. వాటిని పూర్తి చేసుకుని సోమవారం రాత్రి ట్రక్కు ఆటోలో స్వగ్రామాలకు తిరుగు ప్రయాణమయ్యారు. వారి వాహనం రంగంపేట మండలం వడిశలేరు గ్రామ సమీపానికి చేరుకున్న సమయంలో డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యం కారణంగా ఏడీబీ రోడ్డుపై అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో కూలీలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోగా, వాహనంలోని సిమెంట్ పలకలు పడడంతో ముగ్గురు మృతి చెందారు. వారిని సామర్లకోటకు చెందిన మసకపల్లి బాలు (21), మురముళ్ల రాజ్ కుమార్ (25), తాతపూడి రాజేష్ (22)గా గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన ఎనిమిది మందిని 108 అంబులెనన్స్లో పెద్దాపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సీఐ సుమంత్ తెలిపారు. అలాగే మృతదేహాలను పోస్టుమార్టం కోసం అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనపర్తి సీఐ సుమంత్ ఆధ్వర్యంలో రంగంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబాల్లో విషాదం మృతుల్లో మసకపల్లి బాలు (20)కు ఐదేళ్ల క్రితమే చైతన్యతో వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల పూజ అనే కుమార్తె ఉంది. నాన్న వస్తాడు, మనకు బట్టలు తెస్తాడు అని ఆ పసిపాపకు తల్లి చెబుతున్న సమయంలోనే, తండ్రి ఇక లేడన్న వార్త వచ్చింది. ఇప్పుడు మాకు దిక్కెవరు అంటూ చైతన్య, కుటుంబ సభ్యులు గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. ఇక రాజేష్, రాజ్ కుమార్ల మరణాలు ఆయా కుటుంబాల్లో చీకట్లను నింపాయి. వరుస మరణాలు సామర్లకోటలోని కుమ్మరి వీధిని మరణాలు వెంటాడుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 28న జరిగిన ఘోర బాణసంచా ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆ సంఘటన జరిగి నెలలు గడవక ముందే రోడ్డు ప్రమాదంలో ఈ ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు మృతి చెందడం స్థానికులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. తరచూ మా వీధినే ఎందుకు ప్రమాదాలు వెంటాడుతున్నాయి అంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రమాద స్థలం వద్ద యువకుడి మృతదేహంక్షతగాత్రులను 108లోకి ఎక్కిస్తున్న సిబ్బంది ఫ వడిశలేరు సమీపంలో రోడ్డు ప్రమాదం ఫ కూలీలతో వెళుతున్న ట్రాక్కు ఆటో బోల్తా ఫ ముగ్గురి మృతి, ఎనిమిది మందికి గాయాలు ఫ గుంటూరు జిల్లాలో పనికి వెళ్లి వస్తుండగా ఘటన -
బీఎల్వోలు అప్రమత్తంగా ఉండాలి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే నేపథ్యంలో బూత్ లెవెల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్ సీపీ కాకినాడ సిటీ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. స్థానిక డి కన్వెన్షన్న్హాల్లో మంగళవారం వైఎస్సార్ సీపీకి చెందిన బీఎల్ఏలతో సమావేశం నిర్వహించారు. పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర శివ ప్రసన్న, బూత్ కమిటీల ఇన్చార్జి చౌదరి తదితరులు పాల్గొన్నారు. చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ సమగ్ర సర్వేలో వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓట్లను అధికార పార్టీ తొలగించే అవకాశం ఉంటుందన్నారు. అర్హత ఉన్న ఏ ఒక్క ఓటును తొలగిపోకుండా తగిన జాగ్రత్త వహించాలని సూచించారు. ప్రతి ఓటరు వద్దకు వెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు. 2002 ఓటర్ల జాబితాను సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు పార్టీ కార్యాలయం వద్ద అవసరమైన ఏర్పాట్లు చేశామని ద్వారంపూడి చెప్పారు. ప్రతి 10 బూత్లకు ఒక్కొక్క టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేశామని, ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకుని ఓటర్లలో చైతన్యం కలిగిస్తూ పనిచేయాలన్నారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కష్టాలలో ఉన్న ప్రజలకు అండగా నిలుస్తూ భరోసా కల్పించాలన్నారు. ఈ సందర్భంగా ఇటీవల మృతి చెందిన పార్టీ నాయకులు అంగటి అంజి, అడబాల నాగు, వాసంశెట్టి శ్రీనివాస్లకు సమావేశంలో సంతాపం తెలిపారు. కార్యక్రమంలో పలువురు మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
జెడ్పీలో పలువురికి ఉద్యోగోన్నతి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ పరిధిలో పని చేస్తున్న పలువురికి మంగళవారం ఉద్యోగోన్నతి కల్పించారు. ఈ మేరకు వారికి జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు నియామక పత్రాలు అందించారు. నలుగురు సీనియర్ అసిస్టెంట్లకు పరిపాలనాధికారులుగా, ముగ్గురు జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి లభించింది. కారుణ్య నియామకాల ద్వారా ఆరుగురు అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో లక్ష్మణరావు పాల్గొన్నారు. ప్రాణం తీసిన స్నానం సరదా గోదావరిలో మునిగి అన్నదమ్ముల మృతి ధవళేశ్వరం: సెలవులకు ఇంటికి వచ్చిన ఇద్దరు అన్నదమ్ములు గోదావరిలో స్నానానికి దిగి మృతి చెందారు. సరదాగా స్నానం చేయడానికి వచ్చి మృత్యువాత పడ్డారు. ప్రభువా.. నువ్విచ్చిన పిల్లలను నువ్వే తీసుకుపోయావా అంటూ వారి తండ్రి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తీరు కంటతడి పెట్టించింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన ఈ విషాద ఘటన వివరాల్లోకి వెళితే.. ధవళేశ్వరం రాఘవేంద్రస్వామి గుడి సమీపంలో నివసిస్తున్న పెద్దిపాటి శేషుకుమార్ స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ ఐటీఐలో లెక్చరర్గా పనిచేస్తున్నారు. ఆయన ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు హేమంత్ కుమార్ (21) తాడేపల్లిగూడెంలో హోమియోపతి కోర్సు ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. చిన్న కుమారుడు జశ్వంత్ కుమార్ (18) రామచంద్రపురంలో బీఎస్సీ నర్సింగ్ చదువుతున్నాడు. ఇటీవల సెలవులకు ధవళేశ్వరం వచ్చిన వీరు మంగళవారం సాయంత్రం స్నానం చేసేందుకు కాటన్ బ్యారేజీ దిగువన ఉన్న ఇసుక తిన్నెలకు వెళ్లారు. వారితో పాటు సావిత్రీ నగర్కు చెందిన స్నేహితుడు మహ్మద్ హసన్ రాజాకు వెళ్లాడు. ఇసుక తిన్నెల వద్ద స్నానానికి దిగిన వీరు టెన్నిస్ బాల్తో నీటిలో క్యాచ్లు ఆడుతుండగా హేమంత్ కుమార్ నీటిలో మునిగిపోతుండడంతో, అతడిని కాపాడబోయిన జశ్వంత్ కుమార్ కూడా గల్లంతయ్యాడు. దీంతో అక్కడే ఉన్న స్నేహితుడు మహ్మద్ హసన్ రాజా నీటి నుంచి బయటకు వచ్చి సమీపంలోని వారికి విషయాన్ని చెప్పాడు. సమాచారం తెలిసిన వెంటనే సీఐ టి.గణేష్, ఎస్సై హరిబాబు ఘటనా స్థలానికి చేరుకొని హేమంత్, జశ్వంత్ కోసం నీటిలో మత్స్యకారులతో గాలింపు చేపట్టగా వారి మృతదేహాలు లభించాయి. వ్యసనాలకు బానిసై చోరీలు అమలాపురం రూరల్: వ్యసనాలకు బానిసై చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు చాక చక్యంగా పట్టుకున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో మోటార్ సైకిళ్ల చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు అంతర్ జిల్లాల దొంగల ముఠాను అరెస్టు చేసి, వారి నుంచి రూ. 38 లక్షల విలులైన 38 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఈ వివరాలను అమలాపురం ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా వెల్లడించారు. గత నెల 22న రాత్రి రావులపాలెం మండలం పొడగట్లపల్లిలో ఓ ఇంటి బయట పార్క్ చేసిన మోటారు సైకిల్ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. దీనిపై రావులపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ మేరకు పెదపూడి మండలం రాజుపాలేనికి చెందిన లక్కోజు రాజేష్ కుమార్, జి.మామిడాడ చెందిన కళ్యాణం నరేష్ (బజి), గుండుపల్లి సూర్యతేజ, గండేపల్లి మండలం యర్రంపాలేనికి చెందిన రొట్టె నాగచైతన్య సంతోష్కుమార్, ఓ బాలుడు కలసి ఈ చోరీలు చేస్తున్నారు. రాజేష్కుమార్, నాగచైతన్యపై మోటార్ సైకిళ్ల చోరీ కేసులు, నరేష్పై పోక్సో కేసులు ఉన్నాయి. -
బైక్ అదుపుతప్పి యువకుడి మృతి
శంఖవరం: మండలంలోని కత్తిపూడి వద్ద జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. శంఖవరం గ్రామానికి చెందిన రోకల కార్తీక్ (19), మెరుగుల స్వరూప్ కుమార్ ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ, కత్తిపూడి నుంచి అన్నవరం వైపు వెళ్లే మార్గంలో పెట్రోల్ బంకు సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. వేగంగా వెళ్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో కార్తిక్ తలకు, శరీరంలోని పలుచోట్ల తీవ్ర గాయాలు కావడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని, తీవ్రంగా గాయపడిన స్వరూప్ కుమార్ను 108లో ప్రత్తిపాడు కమ్యునిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడ జీజీహెచ్కు తరలించారు. అన్నవరం ఎస్సై ప్రసాద్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అన్నవరం పోలీసులు కేసు నమోదు చసి దర్యప్తు చేపడుతున్నారు. గాయపడిన స్వరూప్ మృతుడు కార్తిక్మరొకరికి తీవ్ర గాయాలు -
కాకినాడలో ఘనంగా ఒలింపిక్ డే రన్
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ): అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం నగరంలో ఒలింపిక్ డే రన్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘం పిలుపు మేరకు కాకినాడ జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (డీఎస్డీవో) వీవీ సతీష్ కుమార్ జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి క్రీడాకారుడు పట్టుదల, కష్టపడే తత్వాన్ని అలవర్చుకుని, భవిష్యత్తులో ఒలింపిక్స్లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. జేఎన్న్టీయూకే వరకు పరుగు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ (డీఎస్ఏ) మైదానం నుంచి ప్రారంభమైన ఈ రన్ స్థానిక జేఎన్టీయూకే వరకు సాగి, తిరిగి స్పోర్ట్స్ అథారిటీ మైదానానికి చేరుకుంది. కాకినాడ జిల్లా ఒలింపిక్ సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ, రన్ కన్వీనర్ వి.రవి రాజు నేతృత్వంలో ఈ పరుగును పక్కా ప్రణాళికతో నిర్వహించారు. రన్ ముగిసిన వెంటనే పాల్గొన్న క్రీడాకారులందరికీ దివంగత డాక్టర్ పి.చిరంజీవిని జ్ఞాపకార్థం ప్రత్యేక ప్రశంసాపత్రాలను (సర్టిఫికెట్లు) అందజేశారు. కార్యక్రమంలో ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు అర్జునరావు, పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వర్మ, జిల్లా వ్యాయామ సంఘం అధ్యక్షుడు పి.శ్రీనివాస్, కార్యదర్శి వి.మాచరిరావు, కోశాధికారి నాగలింగేశ్వరరావు, ఖోఖో సంఘ అధ్యక్ష, కార్యదర్శులు కె.పట్టాభిరామం, శ్రీనివాస్ కుమార్, వెటరన్ అథ్లెట్ కాంతారావు, ఫిజికల్ డైరెక్టర్లు కేఎల్ నాగమణి, రాజు మంగ, నాగమణి తదితరులు పాల్గొన్నారు. ఫ జేఎన్టీయూకే వరకు ఉత్సాహంగా సాగిన పరుగు ఫ విజేతలకు సర్టిఫికెట్ల ప్రదానం -
నేడు అన్నవరం ట్రస్ట్బోర్డు సమావేశం
అన్నవరం: వీర వేంకట సత్యనారాయణస్వామి దేవస్థానంలో బుధవారం జరగనున్న ట్రస్ట్బోర్డు సమావేశంలో రూ.నాలుగు కోట్లతో చేపట్టే వివిధ నిర్మాణాలపై చర్చ జరుగనుంది. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో 2027లో జరిగే గోదావరి పుష్కరాల సందర్భంగా సత్యదేవుని ఆలయానికి విచ్చేసే భక్తుల కోసం వివిధ నిర్మాణాలు చేపట్టేందుకు వివిధ పనులు ప్రతిపాదించారు. అయితే అన్నవరం దేవస్థానం 2026–27 వార్షిక బడ్జెట్లో వివిధ నిర్మాణాలకు రూ. ఏడు కోట్లు మాత్రమే కేటాయించారు. ఇప్పటికే దేవస్థానంలో రూ.15 కోట్లతో 105 గదుల సీతారామ సత్రం మొదటి దశ నిర్మాణం జరుగుతోంది. గోదావరి పుష్కరాల కల్లా ఈ సత్రం నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఆ సత్రం నిర్మాణానికే బడ్జెట్లో పూర్తిగా నిధులు కేటాయించని పరిస్థితిలో అదనంగా రూ.నాలుగు కోట్లతో ఎలా నిర్మాణాలు చేపడతారనే దానిపై కొంతమంది ట్రస్ట్బోర్డు సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బుఽధవారం జరగనున్న ట్రస్ట్బోర్డు సమావేశం అజెండా కాపీలు అందుకున్న ట్రస్ట్బోర్డు సభ్యుల్లో కొందరు మంగళవారం దేవస్థానంలో సమావేశమై ఈ నిర్మాణ పనులపై చర్చించినట్టు సమాచారం. -
పల్స్ పోలియోను విజయవంతం చేయాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో ఈ నెల 28న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని జేసీ అపూర్వ భరత్ అన్నారు. ఆ కార్యక్రమం నిర్వహణపై మంగళవారం కలెక్టరేట్లో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్ల లోపు పిల్లలందరికీ విధిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,44,762 మంది పిల్లలకు వ్యాక్సిన్ వేసేందుకు 990 బూతులు, 56 ట్రాన్సిట్ పాయింట్లు, 61 మొబైల్ టీమ్లను ఏర్పాటు చేశామని, 131 మంది రూట్ సూపర్ వైజర్ల ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేస్తామన్నారు. పోలియో రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. దీనిలో భాగంగా ఈనెల 27న మైక్ ప్రచారం, ర్యాలీలు, పీహెచ్సీల పరిధిలో అవగాహన కల్పించాలన్నారు. -
అంతర్జాతీయ జర్నల్లో కాకినాడ వైద్యుడి పరిశోధన
కాకినాడ క్రైం: కోవిడ్ వేళ వ్యాధి నివారణకు తాను చేసిన మూడు మాత్రల పరిఽశోధన అంతర్జాతీయ జర్నల్లో ప్రచురితమైందని కాకినాడ వైద్యుడు యనమదల మురళీకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జర్నల్ ఆఫ్ ప్రైమరీ కేర్ స్పెషాలిటీస్ మే–ఆగస్టు 2026 సంచికలో తాను ప్రయోగాత్మకంగా రూపొందించిన ఆస్ప్రిన్, ప్రెడ్నిసోలాన్, అజిత్రోమైసిన్ వైద్య విధానం ఎంతో సత్ఫలితాలనిచ్చిందని పేర్కొన్నారు. 2021లో అప్పటి వైద్య రీతులను అనుసరించిన 60 మందితో తన వైద్య విధానాన్ని సరిపోల్చితే ఉత్తమ ఫలితాలు వచ్చాయన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన నిపుణులు తన పరిశోధనను అంతర్జాతీయ జర్నల్లో ప్రచురించారని మురళీకృష్ణ ప్రకటనలో పేర్కొన్నారు. -
ఊపిరితిత్తుల విభాగం తరలింపుపై స్పష్టతనివ్వాలి
కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్లో భాగంగా స్థానిక వార్ఫ్ రోడ్లో ఉన్న ఊపిరితిత్తుల విభాగాన్ని ఎక్కడికి తరలిస్తున్నారో స్పష్టతనివ్వాలని సంబంఽధిత స్పెషాలిటీ వైద్యులు డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఇటీవల కాకినాడకు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిసి నివేదించామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాకినాడ జీజీహెచ్లో నూతన ఓపీ భవంతి నిర్మాణానికి ఉత్తర్వులు జారీ చేశారని, వార్ఫ్ రోడ్లో ఉన్న పల్మనాలజీ భవంతి విభాగాన్ని కూడా తొలగించాలని నిర్ణయించారని తెలిపారు. అయితే ఊపిరితిత్తుల విభాగం సాధారణ వైద్య సేవలకు దూరంగా ఉండాలని నూతనంగా నిర్మిస్తున్న ఓపీ భవంతిలోనే ఈ సేవలను కూడా కొనసాగించనున్నారన్న ప్రచారం సాగుతోందని తెలిపారు. ఇదే నిజమైతే సాధారణ రోగులు, వారి సహాయకులకు మరిన్ని అనారోగ్య పరిస్థితులు తప్పవని అన్నారు. నూతన ఓపీ భవంతిలో నిర్మాణం చేపట్టకపోతే, ఎక్కడ నిర్మిస్తున్నారో సంబంధిత అధికారులు స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. చినవెంకన్న హుండీ ఆదాయం రూ.1.70 కోట్లు ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో హుండీల ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. ప్రమోద కల్యాణ మండపంలో దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, మద్ది ఆంజనేయస్వామి ఆలయ ఈఓ ఆర్వీ చందన, పోలీసుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. గడచిన 14 రోజులకు గాను నగదు రూపేణా స్వామివారికి రూ. 1,70,53,076 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. అలాగే కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 147 గ్రాముల బంగారం, 2.510 కిలోల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. అదేవిధంగా లెక్కింపులోకి రాని పాత రూ. 2 వేలు, రూ. 500 నోట్ల ద్వారా రూ.7,500 వచ్చిందన్నారు. ఈ లెక్కింపులో శ్రీవారి దేవస్థానం అధికారులు, సిబ్బంది, సేవాదళం సభ్యులు పాల్గొన్నారు. 1న డీసెట్ రాజమహేంద్రవరం రూరల్: డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (డీసెట్) 2026ను జూలై ఒకటిన నిర్వహించనున్నట్లు బొమ్మూరులోని జిల్లా ప్రభుత్వ విద్యా శిక్షణ సంస్థ (డైట్) ప్రిన్సిపాల్ ఆర్జేడీ రాజు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏపీడీఈఈసీఈటీ.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ లేదా సీఎస్ఈ.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్ల నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. -
ఎన్నిసార్లు తిరిగినా నిరాశే..
బోట్క్లబ్ (కాకినాడసిటీ): రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో సమస్యలు పరిష్కారమవుతాయని ఎంతో వ్యయప్రయాసలకోర్చి వస్తున్న అర్జీదారులకు నిరాశే ఎదురవుతోంది. మండల కేంద్రాల్లో సమస్య పరిష్కారం కాక జిల్లా కేంద్రమైన కాకినాడకు వచ్చి అర్జీదారులు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేస్తున్నారు. అయినప్పటికీ వాటికి ఏ విధమైన పరిష్కారం లభించడం లేదు. ఇచ్చిన అర్జీకి పరిష్కారం లభించకపోగా పరిష్కారం అయినట్లు మాత్రమే మొబైల్ ఫోన్లకు ఎస్ఎంఎస్లు వస్తున్నాయని అర్జీదారులు మండిపడుతున్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 321 ప్రజలు అర్జీలు సమర్పించారు. ఫ పరిష్కారం కానీ సమస్యలు ఫ అర్జీదారులు తప్పని అవస్థలు ఫ పీజీఆర్ఎస్ నిర్వహణపై పెదవి విరుపు -
నా భూమి నాకు ఇవ్వడం లేదు
తనకు తల్లిదండ్రులు పసుపు–కుంకుమ మాన్యం కింద ఇచ్చిన భూమిని కాజేసేందుకు కాకినాడ డీసీసీబీ చైర్మన్, జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు ఎత్తుగడ వేస్తున్నారని వరుసకు సోదరి అయిన అమలకంటి తులసి కిరణ్మయి వాపోయారు. కాకినాడ జిల్లా ఎర్రవరంలోని సర్వే నంబర్ 234, 253లో ఉన్న సుమారు 94 సెంట్లు భూమిని తన ఆధీనంలో పెట్టుకుని తుమ్మల బాబు వేధిస్తున్నారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆమె ఫిర్యాదు చేశారు. తన భర్త కిడ్నీ పేషెంట్ కావడంతో ఆ భూమి వ్యవహారం తాను చూసుకొంటానని నమ్మించి ప్రస్తుతం భూమికి సంబంధించిన పాస్ పుస్తకాలు తుమ్మల బాబు పేరుతో తయారు చేయించుకొన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే పెద్దాపురం మండలం పులిమేరులో ఉన్న తన తండ్రికి చెందిన ఐదు సెంట్ల స్థలాన్ని కూడా తుమ్మల బాబు కాజేసేందుకు ప్రయత్నిస్తున్నాడన్నారు. -
కాళ్లరిగేలా తిరుగుతున్నా..
రెండు కాళ్లు చచ్చుబడిపోయినా అధికారులు స్పందించడం లేదు. గత రెండేళ్లుగా అనేకసార్లు ఫిర్యాదు చేసినా నాకు వికలాంగ పింఛన్ ఇవ్వడం లేదు. సదరం సర్టిఫికెట్ కావాలని అధికారులు చెబుతున్నారు. ఆ సదరం సర్టిఫికెట్ కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి అనేక సార్లు తిరిగాను, అయినా ఎవరూ స్పందించడం లేదు. – పసుపులేటి నరసింహమూర్తి, రాజుపాలెం, కిర్లంపూడి మండలం ఆన్లైన్లో తప్పు సరిచేయడం లేదు నా వ్యవసాయ భూమి 4.43 ఎకరాలను ఆన్లైన్లో దేవదాయ భూమిగా చూపిస్తోంది. దీంతో ప్రభుత్వం నుంచి నాకు ఏ విధమైన సహాయం అందడం లేదు. ఆ భూమి కష్టార్జితంతో కొనుగోలు చేసిన భూమి. ఆన్లైన్ తప్పును సరిచేయాలని గత రెండేళ్లుగా అధికారులు చుట్టూ తిరుగుతున్నాను. ఎటువంటి ప్రయోజనం కనిపించడం లేదు. తిరిగి తిరిగి విసుగు చెందాను. – వి.వెంకన్నదొర, రావికంపాడు, తొండంగి మండలం -
సత్యదేవునికి భారీగా హుండీ ఆదాయం
ఫ 33 రోజుల ఆదాయం రూ.1.96 కోట్లు ఫ సరాసరిన రోజుకు రూ.5.96 లక్షల ఆదాయం అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి హుండీల ద్వారా 33 రోజులకు గాను రికార్డు స్థాయిలో రూ.1,96,59,883 ఆదాయం సమకూరింది. స్వామివారి హుండీ ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. ఈనెల 12 వరకు విద్యాసంస్ధలకు వేసవి సెలవులు వలన విద్యార్థులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి ఆలయానికి విచ్చేశారు. దీంతో ఆలయం భక్తులతో కళకళలాడింది. భక్తులంతా సమర్పించిన కానుకలతో భారీగా హుండీ ఆదాయం సమకూరింది. ఈ కానుకల్లో నగదు రూ.1,84,99,620 కాగా, చిల్లర నాణేలు రూ.11,60,263 వచ్చాయని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. వీటితో పాటు బంగారం 22.500 గ్రాములు, వెండి 567 గ్రాములు వచ్చినట్లు వారు తెలిపారు. సరాసరిన రోజుకి రూ.5,95,754 హుండీ ఆదాయం వచ్చినట్లు వారు తెలిపారు. హుండీల ద్వారా విదేశీ కరెన్సీ సత్యదేవుని హుండీల ద్వారా విదేశీ కరెన్సీ కూడా భారీగా లభించింది. 230 అమెరికా డాలర్లు, పది యూఏఈ దీనార్లు, పది కెనడా డాలర్లు, 119 సింగపూర్ డాలర్లు, ఒక మలేషియా రింగిట్, 55 యూరోలు, పది ఇంగ్లాండ్ పౌండ్లు, వంద డెన్మార్క్ క్రోనార్లు, వంద శ్రీలంక రూపాయలు, 200 సౌతాఫ్రికా ర్యాండ్స్ లభించాయని తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో చైర్మన్, ఈఓలతో పాటు దేవస్థానం ట్రస్ట్బోర్డు సభ్యులు పర్వత సురేష్, కామర్స్ చిరంజీవి, దేవస్థానం సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల సిబ్బంది పాల్గొన్నారు. -
అన్ని శాఖల సమన్వయంతో జాతర ఉత్సవాలు
సామర్లకోట: పెద్దాపురంలో వేంచేసిన మరిడమ్మ అమ్మవారి జాతరను అత్యంత వైభవంగా నిర్వహించడానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు, భక్తులు సహకరించాలని పెద్దాపురం ఆర్డీఓ పి.కృష్ణమూర్తి అన్నారు. వచ్చే నెల 14 నుంచి పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి జాతర పురస్కరించుకొని సోమవారం సాయంత్రం ఆలయ మండపంలో నిర్వహించిన ఉత్సవాల ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఆలయ ఈఓ, దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.విజయలక్ష్మి అధ్యక్షత వహించారు. గతంలో జరిగిన ఏర్పాట్లు, భక్తుల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. భక్తుల రద్దీని పురస్కరించుకొని ఆయా శాఖల అధికారుల సమన్వయంతో భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త చింతపల్లి శ్రీహర్ష మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతో ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి భక్తులు సహకరించాలన్నారు. ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. మరిడమ్మ జాతర ఉత్సవాలు వచ్చే నెల 14 నుంచి ఆగస్టు 19 వరకు జరుగుతాయని దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్(ఈఓ) కె.విజయలక్ష్మి తెలిపారు. జాతరలో భాగంగా ఈనెల 29న ఉయాల తాళ్లోత్సవం, వచ్చే నెల 13న జాగరణ జరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో పెద్దాపురం డీఎస్పీ ఏబీజీ తిలక్ మాట్లాడుతూ ఉత్సవాలకు అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తామన్నారు. సీఐలు వైఆర్కే శ్రీనివాసు, ఎ.కృష్ణభగవాన్, అగ్నిమాపక శాఖ అధికారులు, ఆర్అండ్బీ, మున్సిపల్, ఎలక్ట్రికల్, మెడికల్ అండ్ హెల్త్, ఆర్టీసీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ మేరకు ఉత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఫ పెద్దాపురం ఆర్డీఓ కృష్ణమూర్తి ఫ జూలై 14 నుంచి మరిడమ్మ జాతర ఫ 37 రోజుల పాటు కొనసాగనున్న ఉత్సవాలు -
ప్రశాంతంగా ‘నీట్’
90.02 శాతం హాజరు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): వైద్య విద్యా కోర్సులలో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. జిల్లాలోని 11 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 3,232 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 2,922 హాజరయ్యారు. ప్రశ్నపత్రం లీకవడంతో గత మే నెలలో నిర్వహించిన ఈ పరీక్షను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.15 గంటల వరకూ ఈ పరీక్షమరోసారి నిర్వహించారు. స్థానిక గాంధీనగర్ మున్సిపల్ స్కూల్, జేఎన్టీయూకేలోని పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో నీట్ పరీక్ష ప్రశాంత వాతావరణంలో జరిగిందని అన్నారు. మొత్తం 90.02 శాతం విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. లోవకు పోటెత్తిన భక్తులు తుని రూరల్: లోవ దేవస్థానానికి ఆదివారం వేలాదిగా భక్తులు పోటెత్తారు. వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో వచ్చిన 32 వేల మంది భక్తులు తలుపులమ్మ అమ్మవారిని దర్శించి పూజలు చేశారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.2,61,690, పూజా టికెట్లకు రూ.4,65,646, కేశఖండన శాలకు రూ.20,880, వాహన పూజలకు రూ.7,416, కాటేజీలు. పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.98,430, విరాళాలు రూ.10,602 కలిపి మొత్తం రూ.8,89,014 ఆదాయం లభించిందని కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై నేతల ఆరా గోకవరం: మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం కుమారుడు, ఆ పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబును ఆదివారం పలువురు నేతలు పరామర్శించారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ ముఖ్య నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి గిరిబాబును పరామర్శించారు. పద్మనాభం ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అలాగే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కూడా గిరిబాబును పరామర్శించారు. ముద్రగడ ఆరోగ్యంపై వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి, శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఫోన్ ద్వారా గిరిబాబును అడిగి తెలుసుకున్నారు. స్వగ్రామంలో ‘పెద్ది’ దర్శకుడి సందడి కొత్తపల్లి: ఉప్పెన, పెద్ది చిత్రాల దర్శకుడు సానా బుచ్చిబాబు ఆదివారం స్వగ్రామం కొత్తపల్లి వచ్చారు. తన నివాసంలో కుటుంబ సభ్యులు, బంధువులతో కలసి కేక్ కట్ చేసి, పెద్ది సినిమా విజయానందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి పలు విషయాలపై ఆయన ముచ్చటించారు. పెద్ది సినిమా తన జీవితంలో మరపురాని విజయాన్ని అందించిందని ఆనందం వ్యక్తం చేశారు. మరిన్ని మంచి చిత్రాలకు దర్శకత్వం వహించడానికి ప్రేరణ కలిగించిందన్నారు. త్వరలో మరో మంచి చిత్రానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు. నేడు ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని డీఎస్సీ 1998, 2008 జీఎస్టీ (ఎమ్టీఎస్) ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారందరికీ ఈ నెల 22న కాకినాడలోని సమగ్ర శిక్షా హాలులో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఉమ్మడి జిల్ల్లా విద్యాశాఖాధికారి పి.రమేష్ ఆదివారం తెలిపారు. డీఈవో.ఈజీ.ఆర్గ్లో పొందుపర్చిన ఉపాధ్యాయులు తప్పనిసరిగా కౌన్సెలింగ్కు హాజరుకావాలన్నారు. -
సమతుల జీవన విధానానికి యోగా
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆర్యోగకరమైన శరీరం, ప్రశాంతమైన మనస్సు, సమతుల జీవన విధానాన్ని అందించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కాకినాడలోని జిల్లా క్రీడా మైదానం ఇండోర్ హాలులో ఆదివారం జిల్లా స్థాయి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆరోగ్య పరిరక్షణకు, జీవన నాణ్యతను మెరుగు పరచుకోవడానికి యోగా ఎంతో ఉపయోగిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా యోగాంధ్ర రాష్ట్ర స్థాయి పోటీల విజేతలు వేదుల శ్రీకృష్ణ, ఫణీంద్రలను ఆయన అభినందించారు. చిన్నారులు చైత్ర శివ వాసుకి, ఐ.ఎరిక్, కె.మిథున ప్రదర్శించిన నృత్య యోగా అందరినీ అలరించింది. ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖర్, ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల కమిషన్ చైర్మన్ వేటుకూరు ఏవీఎస్ సూర్యనారాయణరాజు, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, జెడ్పీ సీఈఓ వీవీఎస్ లక్ష్మణరావు, పెద్దాపురం ఆర్డీఓ కృష్ణమూర్తి అతిథులుగా పాల్గొన్నారు. తొలుత పతంజలి మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి వేడుకలు ప్రారంభించారు. యోగాచార్యులు రాఘవానంద, బ్రహ్మకుమారి దీదీలు ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, ప్రజలతో యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యాన ప్రక్రియలు చేయించారు. కార్యక్రమంలో జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ ఎంఎస్ అలీ, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డీఎస్డీఓ సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేటు.. కార్పొరేటు.. ఫీజులుం..
● ప్రైవేట్ విదాసంస్థల్లో భారీ దోపిడీ ● నియంత్రణలో విద్యాశాఖ విఫలం ● తల్లిదండ్రుల కన్నీటీతో విద్యా వ్యాపారం ● ఖాతాలకు జమకాని తల్లికి వందనం ఆలమూరు: రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్ల కార్పొరేట్, ప్రైవేటు విద్య మాఫియాగా తయారైంది. సగటు జీవి చదువును కొనలేని స్థితి ఏర్పడింది. నిబంధనల ఉల్లంఘన, ఫీజుల దోపిడీ, బలవంతపు స్టేషనరీ కొనుగోళ్లు యథేచ్ఛగా సాగుతున్నాయి. పాఠశాల ఫీజులు, బస్ ఫీజులను ప్రైవేటు యాజమాన్యాలు బాగా పెంచేశాయి. ఫీజుల నియంత్రణ కమిటీలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. ఈ దోపిడీని నియంత్రించడంలో విద్యాశాఖ పూర్తిగా విఫలమైంది. జిల్లాలోని 19 మండలాల్లో 2,275 పాఠశాలలు ఉండగా 1.93 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అందులో 1551 ప్రభుత్వ పాఠశాలల్లో 87 వేల మంది 724 ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో 1.96 లక్షల మంది ఉన్నారు. వారందరికీ విద్యా సంవత్సరం ప్రారంభించిన రోజే తల్లికి వందనం సొమ్ము పడాల్సి ఉంది. అయితే ఆ పథకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి పూర్తి స్పష్టత లేకపోవడంతో తల్లిదండ్రులు తమ బిడ్డలను చదివించేందుకు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అ‘ధన’పు తరగతులు కూటమి నేతల ప్రొద్బలంతో అధికార పార్టీ సానుభూతి పరుగులుగా ప్రసిద్ధిగాంచిన కొంతమంది ప్రైవేట్ విద్యాసంస్థల నిర్వాహకులు జిల్లాలో అనేక చోట్ల అనుమతులు లేకుండా 8, 9, 10 తరగతులు నిర్వహిస్తున్నారు. వాటిపై జిల్లా విద్యాశాఖకు ఫిర్యాదు చేసినా తూతూ మంత్రంగా దాడులు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆలమూరు మండలంలోని చెముడులంకలోని నేతాజీ ఇంగ్లీషు మీడియం స్కూల్లో వారం రోజుల క్రితం అదనపు తరగతులు నిర్వహిస్తున్నారంటూ కేసును నమోదు చేసి షోకాజ్ నోటీసు జారీ చేసినా ఇంకా స్పష్టమైన చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతలకు సంబంధించిన విద్యాసంస్థలే అధికంగా ఉండటంతో ఈ దోపిడీ పేట్రేగి పోతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి విద్యాసంస్థల దోపిడి పర్వం ఇలా ● ప్రైవేట్ విద్యాసంస్థలు ఎలాంటి అనుమతులు లేకుండా యేటా ట్యూషన్ ఫీజులను 30 శాతం నుంచి 50 శాతం వరకూ పెంచుతున్నారు. ● విద్యాసంవత్సరం ప్రారంభం కాకముందే సీట్ల కేటాయింపు పేరిట భారీ వసూళ్లకు పాల్పడుతున్నారు. ● ఏసీ క్లాస్ రూమ్స్, డిజిటల్ తరగతులు, ప్రత్యేక ఫీజుల పేరిట బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ● బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు దొరికే పాఠ్య, నోట్ పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫాం విద్యాసంస్థల్లోనే అధిక ధరలకు విక్రయిస్తున్నారు. పాటించాల్సిన నిబంధనలివీ ● ప్రైవేట్ విద్యాసంస్థలన్ని ఉచిత, నిర్బంధ విద్యాహక్కు చట్టాన్ని (2009) కచ్చితంగా అమలు చేయాలి. ● ప్రైవేట్ విద్యా సంస్థలకు ప్రభుత్వం ఇచ్చే స్టార్ ర్యాంకింగ్ ఆధారంగా నిర్ణయించిన ఫీజుకు అదనంగా ఒక రూపాయి కూడా వసూలు చేయరాదు. ● ప్రైవేట్ విద్యాసంస్థల్లో తప్పనిసరిగా విద్యాశాఖ సహకారంతో తల్లిదండ్రుల కమిటీ ఏర్పాటు చేయాలి. ● విద్యాసంస్థలన్నింటి వద్ద ఫీజుల వసూలు వివరాలతో కూడిన నోటీసు బోర్డులను ప్రదర్శించాలి. ● పాఠ్య, నోట్ పుస్తకాలు, యూనిఫాం ఇతర స్టేషనరీని సంబంధిత విద్యాసంస్థల్లో విక్రయించరాదు. ● విద్యాసంస్థలోనే కొనుగోలు చేయాలని లేదా సంబంధిత దుకాణం వద్దే కొనాలని బలవంతం చేయరాదు. ● ప్రభుత్వ మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు అమలు చేసి విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించాలి. ● ఫీజుల బకాయి పేరుతో విద్యార్థుల టీసీలను ఎట్టి పరిస్థితుల్లోను ఆపకూడదు. యాజమాన్యం ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు 1237 85 229 86.000 ప్రైవేట్ పాఠశాలలు 125 167 432 1.07.00 తల్లిదండ్రుల కమిటీకి తిలోదకాలు రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రతి ప్రైవేట్ విద్యాసంస్థలో తప్పనిసరిగా తల్లిదండ్రుల కమిటీని ఏర్పాటు చేయాలి. తరగతి గదులు, తాగునీటి వసతి, మరుగుదొడ్ల వంటి సౌకర్యాలను వారు పరిశీలించాలి. యాజమాన్యంతో తల్లిదండ్రుల కమిటీ చర్చించి ఫీజులను నిర్థారించి దానికి అనుగుణంగా తీర్మానాలు చేసి ఉన్నతాధికారుల ఆమోదం పొందాలి. వాటిని ప్రైవేటు పాఠశాల నోటీసు బోర్డులో ప్రదర్శించాలి. జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో అటువంటివేవీ కనపడవు. కారణం వాటికి విద్యాశాఖ దాసోహం కావడమే. ప్రైవేటు పాఠశాలలు ఇంతగా దోచుకుంటున్నా వాటిలోనే విద్యార్థుల చేరికలు అత్యధికంగా ఉంటున్నాయంటే ప్రభుత్వ విద్యపై ప్రజల్లో ఎంత ప్రతికూలత ఉందో అర్ధమవుతోంది. ఫీజుల మోత–ధరల వాత ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా లభించే పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, నిఘంటువులు, యూనిఫాం తదితర వస్తువులు ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులకు చుక్కలు చూపిస్తున్నాయి. జిల్లాలో ప్రాంతాన్ని బట్టి ఎల్కెజీ విద్యార్థికి ఏడాదికి పుస్తకాలు, బస్సు ఫీజు, ఏకరూప దుస్తులు, టై, సాక్సులు, బ్యాగుల కొనుగోలుకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకూ ఖర్చు అవుతుంది. ఇదే క్రమంలో పదో తరగతి విద్యార్థికి రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకూ అవుతుంది. విద్యార్థుల సౌకర్యాలు, ఫీజుల నియంత్రణకు విద్యాశాఖ చేపట్టాల్సిన తనిఖీలు భూతద్దం వేసి చూసినా కనిపించడం లేదు. మార్కెట్లో ఉన్న పాఠ్య పుస్తకాల ధరలకు ప్రైవేట్ విద్యాసంస్థల కొనుగోలు చేసే పుస్తకాల ధరలకు భారీ వ్యత్యాసం ఉందని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలను నియంత్రించాలి సామాన్య, మధ్య తరగతి ప్రజలను దోచుకుంటున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై ప్రభుత్వం నియంత్రణ ఉండాలి. ప్రతి ప్రైవేట్ పాఠశాలలో తప్పనిసరిగా ఫీజుల బోర్డులు ఏర్పాటు చేయాలి. నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలి. – జి.రవికుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాఽధికారి, ఆలమూరు -
సత్యదేవుని ధ్వజస్తంభంపై ఒరిగిన సుదర్శన చక్రం
అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని ఆలయ ధ్వజస్తంభం మీది సుదర్శన చక్రం ఇటీవల ఈదురు గాలులకు ఒకవైపు ఒరిగిపోయింది. దీంతో, ఆ చక్రాన్ని ఈ నెల 24న కిందకు దించి, ఆలయంలో భద్రపరచి, 25వ తేదీ ఉదయం సంప్రోక్షణ నిర్వహించి, తిరిగి పండితుల మంత్రోచ్చారణల నడుమ దానిని ధ్వజస్తంభంపై అమర్చనున్నట్లు అధికారులు తెలిపారు. సత్యదేవుని ఆలయంలో పాత ధ్వజస్తంభం శిథిలావస్థకు చేరడంతో.. 2024 మే నెలలో కొత్తది ప్రతిష్ఠించారు. దీనికి బంగారు రేకును అదే ఏడాది ఆగస్టులో అమర్చారు. ఆ సమయంలోనే స్వర్ణ సుదర్శన చక్రాన్ని కూడా కలశలతో పాటు ధ్వజస్తంభంపై అమర్చారు. గత వారం భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలకు ఈ సుదర్శన చక్రం ఉత్తరం వైపు ఒరిగిపోయింది. ఈ విషయాన్ని అధికారులు ఈ నెల 16వ తేదీన గుర్తించి, దేవస్థానం ఆగమ పండితుల కమిటీతో చర్చించారు. వారి సూచన మేరకు ఆ చక్రానికి సంప్రోక్షణ చేయాలని నిర్ణయించారు. -
చెదురుతున్న బాల్యం
వదలని జాడ్యం.. ఇలా చేస్తే విముక్తి ● పిల్లలను బిచ్చమెత్తించే వ్యక్తులు, ముఠాలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి. కన్న తల్లిదండ్రులైనా ఉపేక్షించకూడదు. ● పిల్లల భిక్షాటనను నివారించడంలో రక్షణ, పునరావాసం అత్యంత కీలకం. భిక్షాటన చేసే పిల్లల్ని గుర్తించి ఆశ్రయ గృహాలు, విద్యా సంస్థలు, నైపుణ్య శిక్షణ కేంద్రాలకు పంపాలి. నిర్బంధ విద్య కచ్చితంగా అమలు చేయాలి. ● పేద కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేసి, ఉపాధి అవకాశాలు కల్పించి, పిల్లలను భిక్షాటనకు పంపించే పరిస్థితి నుంచి దూరం చేయాలి. ● స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పిల్లల సంక్షేమం కోసం పని చేయాలి. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ప్రత్యేక నిఘా, హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలి. ● బాలల భిక్షాటన ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో నిరంతర తనిఖీలు నిర్వహించాలి. ● బాల కార్మికత్వం, అక్రమ రవాణా కూడా బాలల భిక్షాటనకు ప్రధాన కారణాలు, వీటిని నిర్మూలించాలి. కాకినాడ క్రైం: బడి వయస్సు పిల్లలందరూ బడిలోనే ఉండాలంటూ.. ఏటా వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచే సమయంలో ప్రభుత్వ యంత్రాంగం తెగ హడావుడి చేస్తూంటుంది. కానీ, జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ భావిభారత పౌరులైన బాలలు బిచ్చమెత్తుకుంటూనే కనిపిస్తున్నారు. బాలల భిక్షాటన నిర్మూలనకు అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనివ్వడం లేదనడానికి కాకినాడ నగరంతో పాటు జిల్లాలోని పలు పట్టణాల్లో నిత్యం రోడ్లపై కనిపిస్తున్న బాలలే సాక్ష్యం. బాలలను గుర్తిస్తున్నా.. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యాన బిచ్చమెత్తుతున్న బాలలను గుర్తిస్తున్నారు. గత రెండేళ్లలో 57 మంది బాల భిక్షకులు పట్టుబడ్డారు. 2024లో 13 మంది, 2025లో 32, 2026 మే నెలాఖరు వరకూ 12 మందిని గుర్తించారు. వీరిలో కేవలం నలుగురినే పాఠశాలల్లో చేర్చారు. మిగిలిన 53 మందికి, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ పేరుతో ఇలా చేయొద్దు.. పోయి చదువుకోండని నాలుగు మాటలు చెప్పి వదిలేశారు. విచిత్రమేమిటంటే.. ఏడాది, రెండేళ్ల క్రితం పాఠశాలల్లో చేర్చిన ఆ నలుగురు పిల్లలూ ఇప్పుడు స్కూళ్లకు వెళ్తున్నారా లేక మళ్లీ జోలె పట్టి భిక్షాటన మొదలు పెట్టారా అనే విషయంపై అధికారుల వద్ద ఎటువంటి సమాచారం లేదు. వీరు కాకుండా మరో 120 మందికి పైగా పిల్లలు జిల్లాలో భిక్షకులుగా సంచరిస్తున్నారని సమాచారం. మూడు హాట్స్పాట్లు జిల్లాలో పిల్లల భిక్షాటన జరుగుతున్న మూడు హాట్స్పాట్లను అధికారులు గుర్తించారు. సామర్లకోటలో రోడ్డు పక్కన పెట్రోలు బంక్, కాకినాడ అచ్చంపేట జంక్షన్లో వద్ద పి.కొత్తూరు, తాళ్లరేవు మండలం పి.మల్లవరం వద్ద హైవే వీటిల్లో ఉన్నాయి. ఈ మూడు ప్రాంతాల్లో సంచార జాతులు, వలస కుటుంబాలు ఎక్కువగా నివాసం ఉంటున్నాయి. వారి పిల్లలు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో భిక్షాటన చేస్తున్నారని చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తర ప్రదేశ్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన వారు ఇక్కడ ఉంటున్నారని అధికారులు అంటున్నారు. ఫ బిచ్చమెత్తుకుంటున్న భావిభారతం ఫ జిల్లాలో రెండేళ్లలో గుర్తించిన పిల్లలు 57 మంది ఫ వారిలో బడికి పంపిన వారు నలుగురు ఫ వారి సమాచారంపై సమాధానం నిల్ ఫ గుర్తించని వారు 120 మందికి పైగా ఉంటారని అంచనా ఫ సత్ఫలితాలనివ్వని నియంత్రణ చర్యలు ఇవీ కారణాలు బాల్యం భిక్షాటనలో మగ్గిపోవడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. వాటిలో ప్రధానమైనవి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, పేదరికం. అలాగే, పిల్లల్ని ఎత్తుకెళ్లే ముఠాలు వారిని బలవంతంగా భిక్షాటనలోకి దింపుతున్నాయి. మరోవైపు దానం రూపంలో సునాయాసంగా డబ్బు లభించడం, విద్య, భవితపై అవగాహన లోపం, పునరావాస సమస్యలు, సంచార జాతులు, వలస కుటుంబాల వంటివి పిల్లల భిక్షాటనకు కారణాలవుతున్నాయి. చట్టాల అమలులో లోపం వల్ల కూడా ఈ జాడ్యం వదలడం లేదు. అంతే కాదు.. గుర్తించిన పిల్లల చదువు, పునరావాసం వంటి చర్యలను ప్రభుత్వ యంత్రాంగం పక్కాగా చేపట్టడం లేదు. దీంతో, ఆ పిల్లలు ఆ మరుసటి రోజే జోలె పట్టి మరో ప్రాంతంలో భిక్షాటన చేస్తున్నారు. డబ్బులు కాదు.. సమాచారం ఇవ్వాలి బాలలకు భిక్షాటన నుంచి విముక్తి కల్పించేందుకు ప్రతి వ్యక్తీ తన వంతు బాధ్యతను పోషించాలని అధికారులు కోరుతున్నారు. బిచ్చమెత్తుకుంటున్న బాలలు చేతులు చాచి చిల్లర కోసం అడిగినప్పుడు డబ్బులు కాకుండా 1098కి సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. తద్వారా తమ సిబ్బంది వచ్చి, ఆ పిల్లల్ని రెస్క్యూ చేసి, సన్మార్గం వైపు నడిపిస్తారని అంటున్నారు. అక్షర భిక్ష యాచించాల్సిన చేతులు.. కన్నీటి చారలతో బిచ్చమెత్తుతున్నాయి.. పలకా బలపం పట్టాల్సిన వేళ్లు.. పళ్లెం పట్టుకుని ఆకలి తీర్చాలంటూ అర్థిస్తున్నాయి. అందమైన యూనిఫాం ధరించి బడికెళ్ళాల్సిన బాల్యం.. ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. చలికి వణుకుతూ.. ఒక పూట తిండి కోసం దేహీ.. అంటూ వీధిన‘బడి’ంది. దానం.. ధర్మం అంటూ జోలె పడుతోంది. పుట్టుకతోనే శాపగ్రస్తమై, వెనుకబాటుతనపు చీకట్లో మగ్గిపోతున్న బాల్యంపై.. వెలుగులు ప్రసరింపజేయడంలో ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం నిత్యం వెక్కిరిస్తూనే కనిపిస్తోంది. -
కానిస్టేబుల్ మృతదేహం లభ్యం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): మనస్తాపంతో గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఏపీఎస్ఎఫ్ కానిస్టేబుల్ వంశీ (33) మృతదేహం శనివారం లభ్యమైంది. పెళ్లి విషయంలో వేరే మహిళతో వాగ్వాదం అనంతరం, వంశీ శుక్రవారం తెల్లవారు జామున రోడ్డు కం రైల్వే బ్రిడ్జి వద్దకు చేరుకున్నాడు. అక్కడి నుంచి తన తండ్రి వెంకట్రావుకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పాడు. తాను చాలా ఇబ్బంది పడుతున్నానని, ఇంక జీవించలేనని, గోదావరిలో దూకేస్తున్నానంటూ చెప్పి ఫోన్ స్విచాఫ్ చేశాడు. దీనిపై రెండో పట్టణ పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. వంశీ మృతదేహం స్థానిక దోభీ ఘాట్ వద్ద ఉన్న గోదావరి నదిలో కనిపించింది. పోలీసులు వచ్చి మృతదేహాన్ని వెలికితీసి పోస్టు మార్టంనిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బుల్లెట్ నుంచి మంటలు అంబాజీపేట: స్థానిక నాలుగు రోడ్ల సెంటర్కు సమీపంలో సూర్యప్రభ డెంటల్ హాస్పిటల్ వద్ద శనివారం బుల్లెట్ నుంచి ఆకస్మికంగా మంటలు ఎగసిపడ్డాయి. ఆ హాస్పటల్ వైద్యుడు బిల్ల నీరజ్కుమార్కు చెందిన బుల్లెట్ను బయట నిలుపుదల చేశారు. బుల్లెట్ నుంచి మంటలు వస్తున్నాయని బయట నుంచి స్థానికులు కేకలు వేశారు. దాంతో ఆ మంటలను అదుపు చేసేందుకు స్థానికులు, నీరజ్కుమార్లు ప్రయత్నించారు. కూతవేటు దూరంలో ఉన్న పెట్రోల్ బంక్ నుంచి ఫైర్ ఫోమ్ను తీసుకువచ్చి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. రేపు కాకినాడలో ఎంటీఎస్ ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ కొత్తపేట: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డీఎస్సీ 2008, 1998 ఎస్జీటీ మినిమం టైం స్కేల్ (ఎంటీఎస్)గా పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సోమవారం కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు ఆ జిల్లా విద్యాశాఖాధికారి పి.రమేష్ తెలిపారు. ఆ మేరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుంచి శనివారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. డీఎస్సీ – 2008 ఎస్జీటీ (ఎంటీఎస్)గా పనిచేస్తున్న 196 మంది ఉపాధ్యాయులకు, డీఎస్సీ– 1998 ఎస్జీటీ (ఎంటీఎస్)గా పనిచేస్తున్న 184 మంది ఉపాధ్యాయులకు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడ సమగ్ర శిక్ష మీటింగ్ హాల్ నందు కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. డీఈఓఈజీ.ఓఆర్జీ వెబ్సైట్ నందు పొందుపరిచిన జాబితాలో ఉన్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. -
కొంపముంచిన ఫోన్పే
ఫ రూ.ఐదు లక్షలు ఉన్నాయని తెలుసుకుని హత్య ఫ ఆక్వా రైతు హత్య కేసులో కూలీలే నిందితులు ఫ ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు ఐ.పోలవరం: ఫోన్ పే కొంపముంచింది.. బ్యాంక్ అకౌంట్లో రూ. 5 లక్షలు ఉన్నాయని తెలుసుకుని ఓ ఆక్వా రైతును కూలీలే హత్య చేయడం చర్చనీయాంశమైంది. ఐ.పోలవరం మండలం మురమళ్ల ఆక్వా చెరువు వద్ద రైతు దాట్ల కృష్ణంరాజు (64) హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలను శనివారం పాత ఇంజరం పోలీస్ స్టేషన్ వద్ద అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్, ముమ్మిడివరం సీఐ మోహన్కుమార్ విలేకరులకు తెలిపారు. ఈ నెల 17న మురమళ్లకు చెందిన దాట్ల కృష్ణంరాజు తన ఆక్వా చెరువు వద్ద హత్యకు గురయ్యారు. చెరువు వద్ద పనిచేసే ఇద్దరు కూలీలు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసు విచారణలో తేలింది. నిందితుల్లో ఒకరు విశాఖ జిల్లా కొయ్యూరు గ్రామానికి చెందిన సలాపరెడ్డి బాబ్జీ కాగా, మరొకరు అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన బాలుడు. వారం రోజుల క్రితం వీరిద్దరూ కృష్ణంరాజు చెరువు వద్ద పనికి కుదిరారు. పని చేయకపోతే రైతు కృష్ణంరాజు ఊరుకునేవారు కాదని, ఇక్కడ పని చేయలేమని నిర్ధారించుకుని వారు మానేయాలని నిర్ణయించుకున్నారు. వారం రోజుల కూలీ డబ్బులు ఇచ్చేయండి, మేం వెళ్లిపోతామని కృష్ణంరాజుతో వారు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో 14న బాబ్జీ భార్య సెల్ఫోన్కు రూ.వెయ్యి ఫోన్పే చేయించుకున్నారు. అప్పుడే యజమాని కృష్ణంరాజు ఫోన్పేలో రూ.5 లక్షలు ఉన్నట్లు నిందితులు గుర్తించారు. 17న మధ్యాహ్నం కృష్ణంరాజు చెరువు వద్ద కుర్చీలో కూర్చుని ఫోన్ చూస్తుండగా, నిందితులు ఏరియేటర్ రాడ్డుతో ఆయన తలపై కొట్టి హత్య చేశారు. అనంతరం మృతదేహం కాళ్లకు నైలాన్ తాడు చుట్టి, ఆ తాడుకు నాలుగు ఫెన్సింగ్ రాళ్లు కట్టి ఎవరికీ కనిపించకుండా చెరువులో పడేశారు. మృతుడు కుర్చీని, షెడ్డు వెనుక మురికి కాలువలో పడేశారు. మోటార్ సైకిల్ను ఎవరికీ కనిపించకుండా రేకుల షెడ్డు పక్కన బాత్రూమ్ గోడకు ఆనుకుని ఉంచి, రాడ్ను సెప్టిక్ ట్యాంక్పై ఉన్న నల్లని బరకల్లో దాచిపెట్టారు. సాయంత్రం 4 గంటల సమయంలో మృతుడి ఫోన్, హత్య సమయంలో రక్తపు మరకలు అంటిన తమ దుస్తులు తీసుకుని నిందితులు కాకినాడకు వెళ్లిపోయారు. నిందితులను పట్టుకున్న పోలీసులు మృతుడి ఫోన్ స్వాధీనం చేసుకుని, ఫోన్పే ద్వారా రూ.90 వేలు ట్రాన్స్ఫర్ చేసినట్లు గుర్తించారు. కేసును ఛేదించి నిందితులను పట్టుకున్న సీఐ మోహన్ కుమార్, ఎస్సై రవీంద్రబాబును డీఎస్పీ అభినందించారు. -
రైలు నుంచి జారిపడిన కష్టజీవి
కాలు తెగిపోయి రక్తస్రావమై మృతి అనపర్తి: రోజూ రైళ్లలో సమోసాలు విక్రయించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఓ చిరు వ్యాపారి జీవితం విషాదాంతమైంది. అనపర్తి రైల్వే స్టేషన్లో శనివారం జరిగిన ప్రమాదంలో అతను మృత్యువాత పడడం అందరినీ కలచివేసింది. స్థానికులు, 108 సిబ్బంది కథనం ప్రకారం.. చిరు వ్యాపారి సత్యబాబు (55) రైళ్లలో సమోసాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ పోషణ కోసం రోజూ రైలు బోగీల్లో తిరుగుతూ ప్రయాణికులకు సమోసాలు విక్రయించేవాడు. అదే జీవన పోరాటం చివరకు అతని ప్రాణాలను బలిగొంది. శనివారం సింహాద్రి ఎక్స్ప్రెస్ రైలు అనపర్తి స్టేషన్లో నెమ్మదిగా వెళ్తున్న సమయంలో సత్యబాబు రైలు నుంచి దిగేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ జారి రైల్వే ట్రాక్పై పడిపోయాడు. ప్రమాదంలో అతని కుడి కాలు తెగిపోగా తీవ్ర గాయాలయ్యాయి. రక్తసిక్తమైన సత్యబాబును చూసి ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ ఈఎంటీ దుర్గాభవానీ, పైలెట్ ఆనందరావులు హుటాహుటిన అతికష్టంపై సత్యబాబును ప్లాట్ఫారమ్పైకి చేర్చి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం క్షతగాత్రుడిని అనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్ర రక్తస్రావం కారణంగా సత్యబాబు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. -
కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్కు శంకుస్థాపన
తుని: విద్యతో స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా, సంపాదన పట్ల అవగాహన ఉండాలని పతంజలి గ్రూప్ ఎండీ, పతంజలి విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య బాలకృష్ణ అన్నారు. తునికి వచ్చిన ఆయన పొరుగునే అనకాపల్లి జిల్లా పాయకరావుపేట శ్రీప్రకాష్ విద్యా సంస్థల్లో నిర్మించనున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్కు శనివారం శంకుస్థాపన చేశారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ, వ్యర్థాలను పునర్వినియోగం చేసే విధానంపై తమ యాజమాన్యంతో పతంజలి సంస్థ అవగాహన ఒప్పందం చేసుకుందని శ్రీప్రకాష్ విద్యా సంస్థల అధినేత సీహెచ్వీకే నరసింహారావు తెలిపారు. ఆయుర్వేద చికిత్సాలయం, ఔషధ వనం, పరిపాలన విభాగం నూతన భవనాలను ఆచార్య బాలకృష్ణ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి యోగా శక్తిని, ఐక్యతను చాటి చెప్పాలని కోరారు. త్వరలో శ్రీప్రకాష్ విద్యా సంస్థల సహకారంతో సర్క్యులర్ ఎకానమీ ప్రాజెక్టు మోడల్ అమలుకు నిర్ణయం తీసుకున్నట్టు ఆచార్య బాలకృష్ణ ప్రకటించారు. ఆయనను నరసింహారావు జ్ఞాపికతో సత్కరించారు. కార్యక్రమంలో కంటిపూడి నరేంద్రబాబు, విజయ్ ప్రకాష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
యోగక్షేమం ఇదేనా!
ఫ యోగాపై ప్రచారానికే ప్రభుత్వం పెద్దపీట ఫ కేంద్రాన్ని ప్రసన్నం చేసుకునేందుకు రూ.కోట్ల ఖర్చు ఫ ఆనక ఆ ఊసెత్తని వైనం ఫ నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం కపిలేశ్వరపురం: గోరంత చేసి కొండంత ప్రచారం చేసుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు సాటి ఎవరూ రారు. యోగాంధ్ర 2025 పేరుతో గతేడాది జూన్లో ప్రధాని నరేంద్ర మోదీని ప్రసన్నం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణకు సుమారు రూ.350 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసింది. రాష్ట్రంలో 3,03,654 మందితో విశాఖ తీరాన యోగాసనాలు వేయించి గిన్నిస్ బుక్ సంస్థ నుంచి ప్రపంచ రికార్డు పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందుకుంది. 22,122 మంది గిరిజన విద్యార్థులు 108 నిమిషాల పాటు చేసిన సూర్య నమస్కారాలతో రెండో గిన్నిస్ రికార్డు దక్కింది. 61,266 పాఠశాలల్లో యోగాంధ్ర నిర్వహించినట్టు సమగ్ర శిక్షా ఏఎస్పీడీ శ్రీనివాసరావు గతేడాది ప్రకటించారు. అప్పుడు మాత్రమే చెప్పిన ఈ లెక్కలు అంతకు ముందూ లేవు, ఇప్పుడూ లేవు. యోగా కేవలం ప్రచార ఆయుధం మాత్రమే అన్న చందంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తుంది. పురాతన కాలం నుంచీ యోగాకు ప్రత్యేక స్థానం ఉంది. దాని ప్రాశస్త్యాన్ని ప్రచారం చేయడమే జీవిత లక్ష్యంగా అనేక సంస్థలు, వ్యక్తులు ఎలాంటి ప్రచారాన్ని కోరుకోకుండా యోగా కోసం పాటుపడుతున్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం అందుకు భిన్నం యోగా డే నెలలో మాత్రమే ఆర్భాటం చేస్తుంది. ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకునేందుకు గతేడాది విశాఖలో యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని నిర్వహించిందన్న వాదన ఉంది. జిల్లాలో సుమారు రూ.కోటి పైగా ప్రజాధనాన్ని ఖర్చు చేశారు. సకల సమస్యలకు యోగానే మందు అనే రీతిలో చంద్రబాబు ఉపన్యాసాల్లో చెప్పారు. జిల్లాలో 8,72,916 మంది యోగా చేసేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు, వారికి యోగా శిక్షకులను కేటాయిస్తూ మ్యాపింగ్ చేసినట్టు, 4,600 ప్రాంతాల్లో యోగా శిబిరాలను నిర్వహించినట్టు గతేడాది ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంది. రాజమహేంద్రవరంలోని గ్రాండ్ ట్రంక్ రోడ్డులో 2 కిలోమీటర్ల మేర ప్రాంతంలో యోగాసనాలు చేయించింది. పాలన, ఇతర ప్రజావసరాలను పక్కన పెట్టి నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ప్రజలకు సమాచారం ఇవ్వకుండానే సిబ్బంది కార్యాలయాల్లో కూర్చుని యోగా చేసుకునేందుకు అంగీకరిస్తున్నానంటూ ప్రజల పేరుతో రిజిస్ట్రేషన్లు చేసేశారు. మీ విజ్ఞప్తి మేరకు పలానా చోట యోగా చేసేందుకు అనుమతిస్తున్నామంటూ ప్రజలకు మెస్సేజ్ రావడాన్ని చూసి వారు ఆశ్చర్యపోయారు. విశాఖకు జనాన్ని తరలించేందుకు జిల్లాలోని విద్యా సంస్థలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. దూరాన ఉన్న విశాఖకు వెళ్లేందుకు అర్ధరాత్రి 12 గంటలకే బస్సుల్లోకి ఎక్కించారు. కార్యక్రమం పూర్తయ్యాక అందిస్తామన్న ఆహార ప్యాకెట్లు అందక ఆకలితో అలమటించిన వారెందరో ఉన్నారు. ఆ రోజు గడిచాక నేటి వరకూ యోగాపై తీసుకున్న చర్యలేవీ లేవు. ఈ ఏడాది జిల్లాలో కార్యక్రమాలు ఇలా.. జిల్లా యంత్రాంగం, నగరపాలక సంస్థ, ఆయుష్ సంస్థ, పర్యాటక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో యోగాంధ్ర–2026ను నిర్వహిస్తున్నాయి. ఈ నెల 8న రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో యోగాభ్యాసన కార్యక్రమంలో జిల్లాకు చెందిన మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ కీర్తి చేకూరి, పలు ప్రభుత్వ శాఖల, నగర పాలక సంస్థ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 11న కడియంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, జేసీ మేఘ స్వరూప్ పాల్గొన్నారు. 14న రాజమహేంద్రవరం గౌతమీ ఘాట్ ప్రయాణ ప్రదేశంలో జిల్లా స్థాయి సామూహిక యోగా సాధన కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం యోగా దినోత్సవ జిల్లా స్థాయి కార్యక్రమాన్ని రాజమహేంద్రవరంతో పాటు జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నారు. యోగా.. వ్యాధులను తరిమికొట్టే దివ్యౌషధం.. నిశ్చలమైన మనసుతో నిండుగా జీవించేందుకు ఓ ఆయుధం.. మన ‘యోగ’క్షేమాలకు ఇదో శక్తివంతమైన పురాతన చికిత్సా విధానం.. అలాంటి యోగాను సైతం చంద్రబాబు ప్రభుత్వం ప్రచార ఆయుధంగా మార్చుకుంది.. యోగాకు ప్రాధాన్యం ఇస్తున్నామంటూ చెప్పుకొంటూ రూ.కోట్లు ఖర్చు చేసి, ప్రచార హంగామా చేస్తోంది.. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం..ప్రాధాన్యం ఇదీ.. ఆధునిక కాలంలో తలెత్తుతున్న రుగ్మతల నేపథ్యంలో ధ్యానం, యోగా వంటి ప్రాచీన విధానాలకు ప్రాధాన్యం పెరిగింది. యోగా అనేది సంస్కృతంలోని ‘యుజ్’ అనే పదం నుంచి వచ్చింది. ‘యుజ్’ అనే పదానికి ఐక్యం కావడమని అర్థం. మనసు, శరీరమూ ఒకదానితో మరొకటి ప్రభావితమై ఉంటాయి. ఆ రెండింటినీ ఏకం చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పొందవచ్చు. యోగాలోని 84 ఆసనాల్లో 32 అతి ముఖ్యమైనవి. క్రమం తప్పకుండా యోగాసనాలను వేయడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్రమశిక్షణ అలవడుతుంది. మానసిక, శారీరక ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఆలోచనలను నియంత్రించుకోగలుగుతారు. సూర్య నమస్కారాల్లోని పదకొండు ఆసనాల్లో ఆరోగ్య, ఆధ్యాత్మిక అంశాలు ఒదిగి ఉంటాయి. వాటిని చేయడం ద్వారా కదలికలు ఏర్పడి శరీర అవయవాల్లోని భాగాలకు రక్త ప్రసరణ వృద్ధి చెందుతుంది. -
గోవింద.. హరి గోవింద
ఫ వెంకన్న నామస్మరణతో మార్మోగిన వాడపల్లి క్షేత్రం ఫ వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఆత్రేయపురం: గోవింద.. హరి గోవింద నామస్మరణ మార్మోగింది. శనివారం కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం కిక్కిరిసింది. తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ నెలకొంది. కాలినడకన సైతం అనేక మంది ఆలయానికి చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయం వద్ద ఎటు చూసినా జనమే కనిపించింది. స్వామివారికి వేకువ జామునే సుప్రభాత సేవ, తొలి హారతి, నీరాజనం, ఐశ్వర్య లక్ష్మీ హోమం, బాలభోగం వంటి కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే ఆలయ ఆవరణలో వేంచేసి ఉన్న క్షేత్రపాలకులు, అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామి వారిని భక్తులు దర్శించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి ఉచిత అన్న ప్రసాదం, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దేవస్థానం ఆధ్వర్యంలో చల్లని మజ్జిగ, నీరు అందించారు. ఆర్యవైశ్య సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ ఒక్కరోజు సుమారు లక్ష మంది ఆలయాన్ని దర్శించుకున్నారని ఈఓ, దేవదాయ శాఖ ఉప కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. స్వామివారిని కొత్తపేట ఆర్డీఓ జీవీవీ సత్యనారాయణ దర్శించుకున్నారు. ఆలయంలో ఏర్పాట్లను ఈఓతో పాటు ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, కమిటీ సభ్యులు, సిబ్బంది పర్యవేక్షించారు. ఈ ఒక్కరోజే ఆలయానికి రూ.61,16,327 సమకూరింది. -
రోడ్డున పడేస్తారా?
● వార్ఫు రోడ్డులో ఫుడ్హబ్ ఏర్పాటుకు సన్నాహాలు ● అక్కడే చిరు వ్యాపారాలతో జీవిస్తున్న 120 కుటుంబాలు ● వారి దుకాణాలను తొలగిస్తున్న అధికారులు ● జీవనోపాధి కోల్పోతున్న బాధితులు న్యాయం చేయాలని డిమాండ్ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): అభివృద్ధి పేరుతో ప్రభుత్వం తమ పొట్ట కొడుతోందని చిరు వ్యాపారులు వాపోతున్నారు. ఎన్నో ఏళ్లుగా రోడ్ల పక్కన చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ పలువురు జీవనం సాగిస్తున్నారు. వారు ఏర్పాటు చేసుకున్న చిన్నచిన్న దుకాణాలను ఫుడ్హబ్ ఏర్పాటు చేస్తామనే పేరుతో అధికారులు తొలగిస్తున్నారు. దీంతో, తాము బతుకుతెరువు కోల్పోయి రోడ్డున పడాల్సి వస్తోందని ఆ చిరు వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. ఇదీ సంగతి.. కాకినాడ 30వ డివిజన్ వార్ఫు రోడ్డులో సుమారు 100 నుంచి 120కి పైగా కుటుంబాల వారు చాలా సంవత్సరాలుగా చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. పశువులు మేపుకొని పాలు, టిఫిన్లు, టీలు విక్రయించుకుంటూ కొందరు, పాత ఇనుప సామాన్లు కొనుగోలు చేస్తూ మరికొందరు జీవనం సాగిస్తున్నారు. పాత సామాన్ల విక్రయాల వంటి సుమారు 80కి పైగా షాపులు ఇక్కడున్నాయి. కొందరు పదేళ్లు, మరికొందరు 20 ఏళ్లుగా రోడ్డు పక్కనే బతుకుబండి లాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.4 కోట్లతో మంజూరు చేసిన మోడల్ స్ట్రీట్ ఫుడ్హబ్ను నగర పాలక సంస్థ అధికారులు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నిధులతో ఈ ప్రాంతాన్ని పర్యటక కేంద్రంగా కూడా అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో సుమారు కిలోమీటరు పొడవునా రోడ్డు పక్కన ఉన్న చిన్న దుకాణాలను గత రెండు రోజులుగా తొలగిస్తున్నారు. ఇక్కడ చిరు వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న చిన్న పాకలతో పాటు దుకాణాలను ఖాళీ చేయిస్తున్నారు. దీంతో, తాము రోడ్డున పడ్డామని, అర్ధాంతరంగా తమ బతుకుతెరువు కూల్చేయడంతో ఏవిధంగా జీవించాలో అర్థం కావడం లేదని బాధిత కుటుంబాల వారు ఆవేదన చెందుతున్నారు. అభివృద్ధికి తాము అడ్డు కాదని, ఎప్పటి నుంచో ఉన్న జీవనాధారాన్ని తొలగిస్తే రెండు పూటలా ఏం తిని బతకాలని కన్నీరు మున్నీరవుతున్నారు. తమకు పునరావాసం కల్పించాలని, లేదా వేరే ప్రాంతంలోనైనా జీవనోపాధి పొందేందుకు అవకాశం ఇవ్వాలని, కనీసం ఇక్కడ ఏర్పాటు చేసే ఫుడ్పార్కులోనైనా ఏదో ఒక వ్యాపారం చేసుకునేందుకు అనుమంతించి న్యాయం చేయాలని కోరుతున్నారు. కుటుంబ పోషణ కోసం చిన్న వ్యాపారాలు చేసుకునే తమను రోడ్డు మీద పడేసి పెద్ద వ్యాపారులకు ఇక్కడ అవకాశం కల్పించడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రత్యామ్నాయం చూపాలి ఎన్నో సంవత్సరాలుగా చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్న వీరిని హఠాత్తుగా ఖాళీ చేయించడం దారుణం. వీరి కుటుంబాలు రోడ్డున పడిపోతాయి. కనీసం కొన్ని రోజులు సమయం ఇవ్వాలి. వీరికి ప్రత్యామ్నయంగా వేరే ప్రాంతంలో వసతి కల్పించాలి. – రాగిరెడ్డి అరుణ్ కుమార్, మాజీ కార్పొరేటర్, వైఎస్పార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కుటుంబాన్ని ఎలా పోషించాలి? పదేళ్లుగా రోడ్డు పక్కన చిన్న వ్యాపా రం చేసుకుంటూ బతుకుతున్నాం. కార్పొరేషన్ అధికారులు వచ్చి మా షాపును పూర్తిగా తొలగించేశారు. ఏం చేయాలో పాలు పోవడం లేదు. కుటుంబాన్ని ఎలా పోషించాలో అర్థం కావడం లేదు. – కొయ్యా గోవిందమ్మ, వార్ఫు రోడ్డు చాలా దారుణం ఎప్పటి నుంచో ఇక్కడ ఉంటున్నాం. అటువంటిది ఇప్పుడు ఫుడ్హబ్ పేరు తో మా పొట్ట కొట్టడం ఈ ప్రభుత్వానికి తగదు. జీవనాధారం కోల్పోతే చాలా ఇబ్బందులు పడతాం. ఫుడ్హబ్లో మాకు ఏదైనా చిన్న షాపు ఏ ర్పాటు చేస్తే కుటుంబం షోషించుకునే వీలుంటుంది. – కె.సత్య, వార్ఫు రోడ్డు -
తొలి తిరుపతిలో భక్తుల రద్దీ
సామర్లకోట: పెద్దాపురం మండలం తొలి తిరుపతి గ్రామంలో వెలసిన శ్రీదేవి, భూదేవీ సమేత శృంగార వల్లభ స్వామి ఆలయానికి ఽశనివారం వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. వివిధ గ్రామాల నుంచి భక్తులు కాలి నడకన సైతం వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో, ఆల యం రద్దీగా మారింది. తెల్లవారుజామున స్వామి వారికి ఇచ్చిన తొలి హారతిని తిలకించడానికి భక్తులు పోటీ పడ్డారు. అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు పూజాదికాలు నిర్వహించారు. సుమారు 18 వేల మంది భక్తులు స్వామి వారి దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా రూ.1,62,680, అన్నదాన విరాళాలు రూ.63,525, కేశ ఖండన ద్వారా రూ.6,080, లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా రూ.20,460, ఇతరత్రా కలిపి దేవస్థానానికి రూ.2,53,495 ఆదాయం సమకూరిందని వివరించారు. స్వామివారి అన్నప్రసాదాన్ని 3,500 మంది భక్తులు స్వీకరించారని తెలిపారు. స్వామివారిని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, నిమ్మకాయల రంగనాగ్ దర్శించుకున్నారు. ఆలయంలో జరుగుతున్న గోపురం అభివృద్ధి పనులను పరిశీలించారు. -
ఆదివారం శ్రీ 21 శ్రీ జూన్ శ్రీ 2026
రత్నగిరి కిటకిట అన్నవరం: వేలాదిగా వచ్చిన భక్తులతో రత్నగిరి శనివారం కిటకిటలాడింది. సత్యదేవుని సన్నిధిలోను, వివిధ ప్రాంతాల్లోను శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున వివాహాలు జరిగాయి. ఆ నవదంపతులు, వారి బంధుమిత్రులతో పాటు ఇతర భక్తులు కూడా పెద్ద సంఖ్యలో స్వామివారి దర్శనానికి తరలి వచ్చారు. పార్కింగ్ స్థలాలన్నీ భక్తుల వాహనాలతో నిండిపోయాయి. ఘాట్ రోడ్డుకు ఇరువైపులా భక్తులు తమ వాహనాలను నిలిపివేయడంతో ట్రాఫిక్కు పలుమార్లు అంతరాయం ఏర్పడింది. సుమారు 40 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. వ్రతాలు 2,400 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. సుమారు ఆరు వేల మంది సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సత్యదేవుని జన్మ నక్షత్రం మఖ సందర్భంగా తెల్లవారుజామున స్వామివారికి, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి, శంకరునికి పంచామృతాభిషేకం, ఉదయం 9 గంటలకు ఆయుష్య హోమం నిర్వహించారు. న్యాయసేవలు వినియోగించుకోండి కాకినాడ లీగల్: ప్రిజన్ లీగల్ ఎయిడ్ క్లినిక్ సేవలను రిమాండ్ ఖైదీలు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి, రాజమహేంద్రవరం సీనియర్ సివిల్ జడ్జి వై.శ్రీలక్ష్మి అన్నారు. కాకినాడలోని స్పెషల్ సబ్ జైలును శనివారం ఆమె సందర్శించారు. వంటశాల, మహిళా ఖైదీల బ్యారక్, ఫిర్యాదుల పెట్టె, రికార్డులను పరిశీలించారు. రిమాండ్ ఖైదీలతో మాట్లాడి, వారి ఆర్యోగ పరిస్థితి, వసతి, భోజనం ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ఎన్ని రోజుల నుంచి జైలులో ఉన్నారో ఆరా తీశారు. వారికి అందుతున్న లీగల్ ఎయిడ్ సేవలపై అడిగి తెలుసుకున్నారు. -
‘సర్’కు సహకరించాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో ఈ నెల 15 నుంచి ప్రారంభమైన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సహకరించాలని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఆయా పార్టీల ప్రతినిధులు, అన్ని నియోజకవర్గ ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్ కార్యక్రమం గురించి వివరించారు. జిల్లావ్యాప్తంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 1,640 పోలింగ్ కేంద్రాల్లో 16,50,811 మంది ఓటర్లు ఉన్నారన్నారు. సర్ ప్రక్రియలో భాగంగా బీఎల్ఓలు ప్రతి ఇంటికీ ఎన్యూమరేషన్ పత్రాలు పంపిణీ చేస్తారని తెలిపారు. ఇప్పటి వరకూ 9,96,656 మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలు పంపిణి చేశామన్నారు. దీని ద్వారా 2002లోని ఓటర్ల జాబితాను ప్రస్తుత జాబితాతో మ్యాపింగ్ చేయడం పూరయ్యిందన్నారు. బీఎల్ఓలు ఇంటికి వచ్చినప్పుడు ఓటర్లు తమ పాస్పోర్టు సైజు ఫొటోతో పాటు ఏదైనా గుర్తింపు కార్డు అందుబాటులో పెట్టుకునేలా ఆయా పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో 1,200 మంది ఓటర్లు ఉండేలా, జిల్లాలో కొత్తగా 183 కేంద్రాలను ప్రతిపాదించామని, వీటిపై సలహాలు సూచనలు అందించాలని కలెక్టర్ కోరారు. -
ఇన్స్పైర్ మానక్ రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపిక
సామర్లకోట: ఇన్స్పైర్ మానక్ రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు స్థానిక బొడ్డు భాస్కర రామారావు మున్సిపల్ హైస్కూల్ విద్యార్థిని మట్టా యశ్విజ ఎంపికై ంది. పాఠశాల ఉపాధ్యాయుడు జీవీవీ సత్యనారాయణ శనివారం ఈ విషయం తెలిపారు. కేంద్ర విజ్ఞాన, సాంకేతిక శాఖ ఆధ్వర్యాన ఈ నెల 4న ఆన్లైన్లో నిర్వహించిన ఇన్స్పైర్ మానక్ జిల్లా స్థాయి పోటీల ఫలితాలను జిల్లా విద్యాశాఖాధికారి పి.రమేష్ విడుదల చేశారు. జిల్లా స్థాయి పోటీల్లో 93 మంది విద్యార్థులు పాల్గొనగా 9 మంది రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. దీనిలో భాగంగా యశ్విజ రూపొందించిన ఆటోమెటిక్ సీవింగ్ మెషీన్ (జల్లెడ యంత్రం) ప్రదర్శన రాష్ట్ర స్థాయికి ఎంపికై ందని సత్యనారాయణ తెలిపారు. ఆయన సూచనలతోనే యశ్విజ ప్రతిభ చాటుకుందని పాఠశాల ప్రధానోపాధ్యాయిని లలిత మాణిక్యాంబ అన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలు ఎప్పుడు జరిగేదీ త్వరలోనే తెలియజేస్తామని జిల్లా సైన్స్ అధికారి కేసరి శ్రీనివాసరావు తెలిపారు. యశ్విజను హెచ్ఎం మాణిక్యాంబ, ఎంపీఓలు ఎన్.లక్ష్మీతులసి, పి.పుల్లయ్య, ఉపాధ్యాయులు అభినందించారు. రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి బోట్క్లబ్ (కాకినాడ సిటీ): తమ సమస్యలు పరిష్కరించాలని రేషన్ డీలర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నల్లా వెంకటేశ్వరరావు ఆధ్వర్యాన నాయకులు జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్కు శనివారం వినతిపత్రం అందజేశారు. గత ఏడాది మోంథా తుపాను సమయంలో డీలర్లకు కేటాయించిన పంచదార, కందిపప్పు ఇంకా తమ వద్దనే ఉండిపోయాయని, వాటిని వెనక్కి తీసుకోవాలని కోరారు. కొన్ని మండలాల్లో తుపాను ప్రభావం లేకపోయినా అక్కడి డీలర్లకు ఇచ్చిన స్టాకు అలాగే ఉండిపోయిందని తెలిపారు. ఈ–పోస్ యంత్రాలకు గత ఆరు నెలలుగా పేపర్ రోల్స్ ఇవ్వడం లేదన్నారు. కొంత మంది డీలర్లను వారి మండలాల్లోని ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి కాకినాడ పాయింట్కు మార్చడంతో డీలర్లకు ఇబ్బందులు తప్పడం లేదని అన్నారు. కన్న తండ్రికి కన్నీటి వీడ్కోలు అంత్యక్రియలు నిర్వహించిన కుమార్తెలు అయినవిల్లి: కని, పెంచి, పెద్ద చేసి.. అనారోగ్యంతో మంచం పట్టి.. తనువు చాలించిన తండ్రికి కుమార్తెలే అంత్యక్రియలు నిర్వహించి, కన్నీటి వీడ్కోలు పలికిన సంఘటన అయినవిల్లి మండలం కె.జగన్నాథపురంలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన పిచ్చిక సత్యనారాయణ (52)కు భార్య, ముగ్గురు కుమార్తెలు ప్రసన్న, జ్యోతిక, జ్యోత్స్న ఉన్నారు. క్యాటరింగ్ పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. సత్యనారాయణ భార్య సరస్వతి మానసిక దివ్యాంగురాలు. ఏడాది క్రితం సత్యనారాయణకు పక్షవాతం రావడంతో పని చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో, కుటుంబ భారం పెద్ద కుమార్తె ప్రసన్నపై పడింది. ఆమె ముమ్మిడివరంలోని ఐస్క్రీమ్ పార్లర్లో పని చేస్తూనే కుటుంబాన్ని పోషిస్తోంది. మిగిలిన ఇద్దరు కుమార్తెలు జ్యోతిక, జ్యోత్స్న కవలలు. వీరు అదే గ్రామంలో ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నారు. ఈ పరిస్థితుల్లో సత్యనారాయణ శుక్రవారం తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. సత్యనారాయణకు అక్క, తమ్ముడు ఉన్నారు. వారి కుటుంబాల్లో శుభకార్యాలు జరుగుతూండటంతో మృతి చెందిన సోదరుడి ఇంటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో తండ్రి సత్యనారాయణ మృతదేహానికి కుమార్తెలు ప్రసన్న, జ్యోతిక, జ్యోత్స్నలు అంత్యక్రియలు నిర్వహించారు. వారి పరిస్థితిని చూసి, చలించిన గ్రామస్తులు కన్నీరు పెట్టుకున్నారు. తల్లికి మతిస్థిమితం లేకపోవడం, తండ్రి మృతి చెందడంతో.. ఆ అక్కాచెల్లెళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. -
బీచ్ షాక్స్తో యువత భవిష్యత్తు నాశనం చేస్తారా?
కాకినాడ రూరల్: సంస్కృతీ సంప్రదాయాలకు తిలోదకాలిస్తున్న కూటమి ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షు రాలు జమ్మలమడక నాగమణి అన్నారు. ఒకవైపు సనాతన ధర్మాన్ని కాపాడాలంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్ డాంబికా లు పలుకుతున్నారని.. మరోవైపు ప్రజలకు ఆహాదాన్ని పంచే బీచ్లలో బీచ్ షాక్స్ పేరిట మద్యం అమ్మకాలకు తెర తీస్తున్నారని విమర్శించారు. కాకినాడలో ఆమె శనివారం మాట్లాడుతూ, రా ష్ట్రంలోని ఎనిమిది బీచ్లలో మద్యం అమ్మకాల కోసం చంద్రబాబు సర్కార్ ప్రత్యేక జీఓ విడుదల చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఆదా యం కోసం ఇంతలా దిగజారిపోవాలా అని నిలదీశారు. పైలట్ ప్రాజెక్టుగా సూర్యలంక, విశాఖ రుషికొండ, కాకినాడ బీచ్లలో మద్యం విక్రయాలకు తలుపులు బార్లా తెరుస్తున్నారన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతూండటంతో ప్రధానంగా యువత పెడదో వ పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం మత్తులో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యా లు పెరిగిపోతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి పచ్చ పార్టీలోని ప్రతి ఒక్కరూ బా ధ్యత వహించాలన్నారు. పిల్లాపాపలతో ఉల్లా సంగా గడిపేందుకు ప్రజలు వచ్చే బీచ్లలో మ ద్యం పారించి రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్గా మా ర్చాలనుకుంటున్నారా అని చంద్రబాబును నిలదీశారు. గతంలో ఆయన సీఎంగా ఉండగా విశా ఖ బీచ్లో బికినీ పండగ చేయాలనుకున్నారని గుర్తు చేశారు. గోవా, ముంబై మాదిరిగా ఇక్కడి బీచ్లలో కూడా మద్యం అమ్మాలనుకోవడం సిగ్గుచేటన్నారు. పెట్టుబడులు ఆకర్షించే పేరుతో చంద్రబాబు, లోకేష్లు సింగపూర్, బ్యాంకాక్, హాంకాంగ్ వంటి దేశాలకు వెళ్లి వస్తూ అక్కడి దు ష్ట సంప్రదాయాలను ఇక్కడకు తీసుకురావాలను కోవడం అవివేకమని మండిపడ్డారు. ఒక మహి ళగా, ఒక తల్లిగా బీచ్లలో మద్యం విక్రయించాల నే నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని స్ప ష్టం చేశారు. చంద్రబాబుకు మహిళలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీచ్లను బార్లుగా మార్చే జీఓను వెనక్కు తీసుకోవాలని నాగమణి డిమాండ్ చేశారు. -
మోగిన పెళ్లిబాజా
ఫ మోగిన పెళ్లి బాజా ఫ నెల రోజుల తర్వాత రత్నగిరిపై తిరిగి సందడి ఫ నవ దంపతులతో కళకళలాడుతున్న సత్యదేవుని ఆలయం అన్నవరం: మూడు ముళ్ల బంధానికి లగ్గం కుదిరింది.. ఏడడుగులతో సాగే పయనానికి మంచి గడియ రానే వచ్చింది.. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో పెళ్లి బాజాలు తిరిగి మోగుతున్నాయి. అధిక జ్యేష్ట మాసం కారణంగా నెల రోజులు పెళ్లిళ్లకు బ్రేక్ పడింది. అది కాస్తా ముగిసి, నిజ జ్యేష్ట మాసం ప్రారంభం కావడంతో రత్నగిరిపై నవ దంపతుల సందడి మొదలైంది. ఈ మాసంలో సుమారు 600 వివాహాలు జరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఏటా చైత్ర మాసం నుంచి అంటే మార్చి – ఏప్రిల్ నుంచి జ్యేష్ట మాసం అంటే జూలై వరకూ వివాహాలు జరుగుతాయి. ఈ ఏడాది చైత్ర, వైశాఖ మాసాల్లో అంటే మార్చి 9 నుంచి మే 11వ తేదీ వరకూ వివాహాలు జరిగాయి. ఆ తరువాత అధిక జ్యేష్ట మాసం వివాహాది శుభకార్యాలకు మంచిది కాదన్న పండితుల సూచనలతో మే 17 నుంచి జూన్ 15 వరకూ వివాహాది శుభకార్యాలేవీ జరగలేదు. ఈ నెల 15 నుంచి నిజ జ్యేష్ట మాసం ప్రారంభమైంది. దీంతో, శుక్రవారం నుంచి వివాహ శుభకార్యాలు ప్రారంభమయ్యాయి. పెళ్లిళ్లన్నీ కల్యాణ మండపాల్లోనే.. ● అన్నవరం దేవస్థానంలో ఏటా చైత్ర మాసం నుంచి జ్యేష్టం వరకూ ఆలయ ప్రాంగణంతో పాటు కల్యాణ మండపాల్లో వివాహాలు జరుగుతాయి. అయితే, వర్షాకాలం ప్రారంభం కావడంతో ఈసారి వివాహాలన్నీ కల్యాణ మండపాలు, విశ్రాంతి షెడ్లలోనే జరుగనున్నాయి. ● సత్యగిరిపై దాత, పెద్దాపురానికి చెందిన శ్రీలలితా రైస్ ఇండస్ట్రీస్ ఎండీ మట్టే శ్రీనివాస్ దంపతులు నిర్మించిన శ్రీ సత్య శ్రీనివాసా కల్యాణ మండపంలో 12 చిన్న వివాహ మండపాలున్నాయి. అలాగే, విశాఖపట్నానికి చెందిన పారిశ్రామికవేత్త ఎంఎస్ రెడ్డి నిర్మించిన శ్రీ ఎంఎస్ రెడ్డి అంజనీ వివాహ వేదికలో కూడా 12 చిన్న కల్యాణ మండపాలున్నాయి. ఈ రెండు చోట్ల ఆయా ముహూర్తాల్లో 24 వివాహాలు జరగనున్నాయి. ఈ మండపాలను పెళ్లి బృందాలు ఇప్పటికే రిజర్వ్ చేసుకున్నాయి. ● దేవస్థానంలో సత్యగిరిపై విష్ణు సదన్ సత్రంలోని 36 మ్యారేజ్ హాళ్లలో కూడా ఆయా ముహూర్తాల్లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. వీటితో పాటు రత్నగిరి రామాలయం వద్ద గల విశ్రాంతి షెడ్డులో కూడా వివాహాలు జరుగుతున్నాయి. ● అన్నవరంలోని సుమారు 20 లాడ్జీల్లోని కల్యాణ మండపాల్లో కూడా వివాహాలు జరగనున్నాయి. సందడే సందడి.. పెళ్లిళ్ల సందడి మొదలు కావడంతో క్యాటరింగ్, సన్నాయి మేళం, పురోహితులకు డిమాండ్ ఏర్పడింది. వివాహ ముహూర్తాలతో సత్యదేవుని ఆలయానికి కూడా భక్తుల తాకిడి పెరగనుంది. రత్నగిరితో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వివాహాలు చేసుకున్న నవ దంపతులు, వారి బంధువులు కూడా సత్యదేవుని ఆలయానికి తరలి రానున్నారు.ఆషాఢంలో మళ్లీ విరామం ఆషాఢ మాసం వివాహాది శుభకార్యాలకు మంచిది కాదనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో జూలై 15 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకూ వివాహాది శుభ కార్యాలకు మళ్లీ బ్రేక్ పడనుంది. తిరిగి శ్రావణ మాసం అంటే ఆగస్టు 15 నుంచి మళ్లీ పెళ్లి బాజాలు మోగుతాయి.వచ్చే నెల 9 వరకూ.. శుక్ర, శనివారాల్లో వివాహ ముహూర్తాలున్నాయి. వీటితో పాటు ఈ నెల 21, 22, 24, 25, 26, 27, జూలై 1 తేదీ నుంచి 9వ తేదీ వరకూ పెళ్లి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. -
అదనపు ఎస్పీగా కిషోర్ కుమార్
కాకినాడ క్రైం: జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్)గా మహంతి కిషోర్ కుమార్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఎస్పీ బిందుమాధవ్ను ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. కాకినాడ ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) డీఎస్పీ వీజీ శ్రీహరి, స్పెషల్ బ్రాంచి డీఎఎస్పీ కేవీవీ సత్యనారాయణ, పరిపాలనాధికారి ఎంవీవీ సత్యనారాయణమూర్తి తదితరులు అదనపు ఎస్పీని కలిసి, అభినందనలు తెలిపారు. టెన్త్ సప్లిమెంటరీలో 97.94 శాతం ఉత్తీర్ణత బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 4,043 మంది హాజరవగా 3,951 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 2,290 హాజరు కాగా 2,248 మంది, బాలికలు 1,744 మందికి 1,703 మంది ఉత్తీర్ణులయ్యారని జిల్లా విద్యా శాఖ అధికారి పిల్లి రమేష్ తెలిపారు. కాగా, ఓపెన్ స్కూల్ పదో తరగతి పరీక్షలకు 1,292 హాజరవగా, 1,068 మంది.. ఇంటర్మీడియెట్ పరీక్షలు 3,087 మంది రాయగా 2,773 మంది ఉత్తీర్ణత సాధించారు. కూటమి ప్రభుత్వానికి బీసీలంటే చిన్నచూపు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కూటమి ప్రభుత్వానికి బీసీలంటే చిన్నచూపని వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు అల్లి రాజబాబు అన్నారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడు సునీల్ కుమార్ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ యాదవ, బీసీ సంఘాల ఆధ్వర్యాన శుక్రవారం జ్యోతిరావు ఫూలే విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాజబాబు మాట్లాడుతూ, రెడ్బుక్ రాజ్యంగంలో భాగంగా వైఎస్సార్ సీపీ నాయకులకు అణగదొక్కుతున్నారని, ప్రశ్నించే బీసీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ఇటువంటి అక్రమ అరెస్టులకు కేరాఫ్గా నిలుస్తోందని దుయ్యబట్టారు. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ రోజు ఉదయం 6 నుంచి 8 గంటల వరకూ కాకినాడలోని జిల్లా క్రీడా మైదానంలో యోగాంధ్ర కార్యక్రమం జరుగుతుందన్నారు. దీనికి అవసరమైన మౌలిక సదుపాయాలు, పారిశుధ్య నిర్వహణ, తాగునీరు తదితర ఏర్పాట్లను పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తొమ్మిది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు రావులపాలెం: ఈతకోట టోల్ప్లాజా వద్ద హైవేపై శుక్రవారం నిర్వహించిన తనిఖీల్లో 9 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేసి, రూ.9 వేల అపరాధ రుసుం విధించినట్టు డీటీఓ డి.శ్రీనివాసరావు తెలిపారు. రవాణా శాఖ అధికారులు మొత్తం 22 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు నిర్వహించారన్నారు. -
ఏం ఉద్ధరించారని విజయోత్సవాలు?
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రతి జిల్లా లో విజయోత్సవ సభలు నిర్వహిస్తు న్నారని, ఈ రెండేళ్లలో ప్రజలను ఏం ఉద్ధరించారని ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారో బహిరంగంగా చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తాటిపాక మధు ప్రశ్నించారు. సీపీఐ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘పెన్షన్లు, జీతాలు ఇవ్వడం ప్రతి ప్రభుత్వమూ చేస్తుంది. ఈ రెండేళ్లలో చంద్రబాబు ఓ ప్రాజెక్టు పూర్తి చేశారా? ఒక్క ప్రభుత్వ కళాశాలయినా నిర్మించారా? ఒక్క ప్రభుత్వ సంస్థనైనా నిర్మించారా? విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించారా? కడప స్టీల్ ఫ్యాక్టరీ తీసుకొచ్చారా? సాగునీటి ప్రాజెక్టులు కట్టారా? నిరంతరం పని చేసే కార్మికుల జీతాలు రూపాయి అయినా పెంచారా? ప్రైవేట్ విద్యా సంస్థలు అధిక ఫీజులతో తల్లిదండ్రులను దోచుకుంటూంటే అరికట్టరా? నిరుద్యోగ భృతి ఇచ్చారా? అని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచక పాలనే సాగుతోందని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేదని దుయ్యబట్టారు. బీచ్లో మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి, యువతను పక్కదోవ పట్టించడమే అభివృద్ధి అని ఎద్దేవా చేశారు. ‘మీరే బార్లు పెడతారు. తాగి రోడ్ల మీద తిరిగితే మళ్లీ మీరే కేసులు పెడతారు. తాగమనేది మీరే.. మా దగ్గర డబ్బులు దోచుకునేదీ మీరే. ఇదెక్కడి అన్యాయం?’ అని ఆయన నిలదీశారు. రైతు సమస్యలపై 30న చలో విజయవాడ రాష్ట్రంలోని రైతులు రెండేళ్లుగా తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారని, ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి దారుణంగా ఉందని మధు అన్నారు. పంటలకు కనీస మద్దతు ధర లేక సిండికేట్ మార్కెట్ మాయాజాలంలో రైతులు విలవిలలాడుతున్నారని చెప్పారు. అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ఒక్క కౌలు రైతుకూ ఏ బ్యాంకూ వ్యవసాయ, ఉద్యాన పథకాలు ఇవ్వడం లేదని విమర్శించారు. గత ఎన్నికల ముందు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ సిఫారసులు అమలు చేస్తామంటూ మోదీ చెప్పారని, ఇప్పటి వరకూ ఆ ఊసే లేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా మన రాష్ట్రంలో కూడా రూ.2 లక్షల వరకూ పంట రుణాలు మాఫీ చేసి, రైతులను ఆత్మహత్యల నుంచి కాపాడాలని, పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఇటీవల పెరిగిన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, పెట్రోలు, డీజిల్, వ్యవసాయ యంత్ర పరికరాల ధరలను వెంటనే తగ్గించాలని, ఆక్వా రైతులకు రొయ్యల ఫీడ్, సీడ్, మందుల ధరలను తగ్గించాలని, జోన్, నాన్ జోన్ పరిమితులు లేకుండా ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్తును 50 పైసలకే అందించాలని, రొయ్యలకు మద్దతు ధర ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. పాలకుల కళ్లు తెరిపించడానికి, హక్కుల సాధనకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘం ఈ నెల 30న నిర్వహిస్తున్న చలో విజయవాడ కార్యక్రమానికి సీపీఐ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. దీనికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులు, కౌలు రైతులు తరలి రావాలని కోరారు. విలేకర్ల సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కె.బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, కార్యవర్గ సభ్యులు పి.సత్యనారాయణ పాల్గొన్నారు. ఫ ఈ రెండేళ్లలో ఏమి సాధించారని విజయోత్సవ సభలు ఫ ఎక్కడ చూసినా అరాచకమే.. ఫ కూటమి పాలనపై సీపీఐ నేత మధు విమర్శ -
హఠాత్తుగా లాగేసుకున్నారు
రెండో విడతలో ఇళ్లు నిర్మించుకోవాలని మేమంతా అనుకుంటున్నాం. ఈలోగా హఠాత్తుగా మా స్థలాల నుంచి ఖాళీ చేయించారు. మా స్థలాల్లో వృద్ధాశ్రమం నిర్మించారు. మా స్థలాల కోసం అడిగితే పదేపదే కార్యాలయాల చుట్టూ తిప్పించుకున్నారు. చివరకు స్థలాలు చూపించారు కానీ, మా పేరుతో రిజిస్ట్రేషన్ చేయించలేదు. గతంలో ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా రిజిస్ట్రేషన్ కూడా చేయించింది. రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తేనే మాకు ఓ నమ్మకం ఉంటుంది. అలాగే, ఇళ్లు నిర్మించుకునేందుకు బ్యాంక్ రుణం కూడా వస్తుంది. – కోనాల ఆనంద్, జి.రాగంపేట, పెద్దాపురం -
వృద్ధాశ్రమం ముసుగులో..
ఇందులో భాగంగా జి.రాగంపేట జగనన్న కాలనీలో ఖాళీగా ఉన్న స్థలాలపై అధికార పార్టీ నేతలు కన్ను వేశారు. ఇక్కడ రెండో విడతలో ఇళ్లు నిర్మించుకోవాల్సిన లబ్ధిదారులను అధికారం అండతో నయానో భయానో దారికి తెచ్చుకుని ఉన్న ఫళంగా ఖాళీ చేయించారు. సమాజ సేవ ముసుగులో జిల్లాలోని పలువురు ప్రముఖుల నుంచి భారీగా సేకరించిన విరాళాలతో అక్కడ వృద్ధాశ్రమం నిర్మాణం చేపట్టారు. ఈ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. దీనికి ఆనుకుని ఉపాధి హామీ పథకంలో కొత్తగా 40 అడుగుల సీసీ రోడ్డు కూడా వేశారు. ప్రజలు, సమాజ సేవపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే దాదాపు మూడేళ్లుగా 160 కుటుంబాలు నివాసం ఉంటున్న జగనన్న కాలనీలో రోడ్లు, డ్రైన్ల వంటి కనీస వసతులు కల్పిస్తే బాగుండేదని, అటువంటిది ఇంకా ప్రారంభం కూడా కాని వృద్ధాశ్రమానికి 40 అడుగుల రోడ్డు వేయడంలో ఔచిత్యమేమిటని పలువురు ప్రశ్ని స్తున్నారు. వృద్ధాశ్రమ నిర్మాణాన్ని ఏ ఒక్కరూ తప్పు పట్టడం లేదు. కానీ, నిరుపేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను ఖాళీ చేయించడం, అంతగా ప్రజోపయోగం లేనిచోట ప్రభుత్వ నిధులతో 40 అడుగుల రోడ్డు నిర్మించడాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ రోడ్డును చూపించి ఇప్పుడు 30 ఎకరాలు, భవిష్యత్లో 150 ఎకరాలకు వేసే లే అవుట్కు లైన్ క్లియర్ చేసుకోవాలనేదే ఈ సేవ వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ అని ఆరోపిస్తున్నారు. ఇదంతా రియల్టర్లు, అధికార పార్టీ నేతల మధ్య కుదిరిన వందల కోట్ల రూపాయల రహస్య ఒప్పందంలో భాగమే తప్ప మరొకటి కాదని అంటున్నారు. -
వృద్ధాశ్రమం పేరుతో
ఎమ్మెల్యే కొడుకు లే అవుట్ వృద్ధాశ్రమం పేరుతో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కుమారుడు వేసిన 30 ఎకరాల లే అవుట్కు లైన్ క్లియర్ చేసుకుంటున్నారు. జగనన్న లే అవుట్ను కబ్జా చేసి, పేదలను బలవంతంగా వెళ్లగొట్టి రూ.కోట్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. వృద్ధాశ్రమం నిర్మాణాన్ని నాతో సహా అందరం స్వాగతిస్తున్నాం. అవసరమైతే తోడ్పాటు కూడా అందిస్తాం. జి.రాగంపేటకు చెందిన 200 మందికి పైగా పేదలున్న జగనన్న కాలనీలో కనీస సదుపాయాలు కల్పించలేని ఎమ్మెల్యే చినరాజప్ప.. వృద్ధాశ్రమం నిర్మాణం పేరుతో సుమారు రూ.20 లక్షల ప్రభుత్వ నిధులతో 40 అడుగుల సీసీ రోడ్డు నిర్మించడంలో ఆంతర్యమేమిటో సమాధానం చెప్పాలి. ఎమ్మెల్యే కుమారుడి లే అవుట్ కోసమే ఈ రోడ్డు వేశారు. చంద్రబాబు మాదిరిగానే సంపద సృష్టిస్తామంటూ ఎమ్మెల్యే దోచుకు తింటున్నారు. వృద్ధాశ్రమంతో ఇళ్ల స్థలాలు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయం చూపించాలి. న్యాయం కోసం అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా. – దవులూరి దొరబాబు, వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్, పెద్దాపురం -
మైక్రో ఫైనాన్స్ ఏజెంట్ల నుంచి కాపాడాలి
ప్రత్తిపాడు: మైక్రో ఫైనాన్స్ కంపెనీల ఏజెంట్ల వేధింపుల నుంచి తమను కాపాడాలని లంపకలోవ గ్రామానికి చెందిన దశిత మహిళలు ప్రత్తిపాడులో శుక్రవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. రుణాలిప్పిస్తామంటే గ్రామానికి చెందిన రాజాల ఏసురత్నంకు ఆధార్ కార్డుల నకళ్ళు ఇచ్చామని పులగపూరి మరియమ్మ, బొడ్డు సూర్యకళ, మాసా నాగలక్ష్మి, చిన్నం అప్పలరాజు, బొర్రా అర్జమ్మ తదితరులు తెలిపారు. ఏసురత్నం ఇటీవల మృతి చెందడంతో కిర్లంపూడి బంధన్ బ్యాంకు, ప్రత్తిపాడు స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ లిమిటెడ్, ఏలేశ్వరం యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ముథూట్ మైక్రోఫిన్ కంపెనీల ఏజెంట్లు తమ ఇళ్లకు వచ్చి, తాము రుణాలు తీసుకున్నామని, తిరిగి చెల్లించకపోతే అరెస్టు చేయిస్తామంటూ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి వేధింపుల నుంచి తమకు విముక్తి కలిగించాలని కోరారు. -
సికిల్సెల్ అనీమియాపై అవగాహన
కాకినాడ క్రైం: ప్రపంచ సికిల్సెల్ అనీమియా నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన డీఎంహెచ్ఓ నరసింహ నాయక్, సిబ్బంది శుక్రవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత డీఎంహెచ్ఓ కార్యాలయ ఆవరణలో అవగాహన ప్రదర్శన, ర్యాలీ నిర్వహించారు. ఎర్రరక్త కణాలు కొడవలి ఆకారంలోకి మారి రక్తనాళాల్లో అడ్డుగా ఏర్పడతాయని డాక్టర్ నాయక్ ఈ సందర్భంగా తెలిపారు. దీనివలన నొప్పి, రక్తహీనత, అవయవ నష్టం వాటిల్లుతాయని చెప్పారు. గిరిజనుల్లో ఈ సమస్య అధికంగా ఉంటోందన్నారు. సికిల్సెల్ అనీమియా జిల్లా నోడల్ అధికారి డాక్టర్ ఐ.ప్రభాకర్ మాట్లాడుతూ, జిల్లాలో ఏడాది కాలంలో 11,800 మందికి సికిల్సెల్ పరీక్షలు నిర్వహించగా, ఐదుగురిలో వ్యాధి నిర్ధారణ అయిందని చెప్పారు. 63 మందిని వ్యాధి వాహకులుగా గుర్తించామన్నారు. బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ర్యాలీలో డీఎల్ఏటీఓ డాక్టర్ చలమయ్య, డీఐఓ డాక్టర్ కేవీ సుబ్బరాజు, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ వి.అరుణ, ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. -
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చర్యలు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై కలేక్టరేట్లో గురువారం జరిగిన జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ వ్యవస్థను పూర్తిగా రూపుమాపేందుకు నెల రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఇందులో భాగంగా ఇటుక బట్టీలు, క్వారీలు, హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీల్లో ముమ్మరంగా తనిఖీలు చేయాలన్నారు. రైల్వే స్టేషన్లు, ప్రధాన దేవాలయాల వద్ద భిక్షాటన చేస్తున్న బాలబాలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. గత ఏడాది 14 ఏళ్ల లోపు 9 మంది బాల కార్మికులను, 34 మంది కౌమారదశ కార్మికులను గుర్తించామని తెలిపారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటి వరకూ నలుగురు బాల కార్మికులను, ఐదుగురు కౌమారదశ కార్మికులను గుర్తించి, పునరావాసం కల్పించామని కలెక్టర్ చెప్పారు. సమావేశంలో కార్మిక శాఖ ఉప కమిషనర్ ఎన్.బుల్లిరాణి, విద్య, పోలీస్, మహిళా, శిశు సంక్షేమ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఫస్టియర్ పరీక్షలకు 2,131 మంది విద్యార్థులు హాజరవగా 1,015 మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం జనరల్ 60 శాతం ఒకేషనల్ 76 శాతం ఉత్తీర్ణత సాధించారని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యా శాఖ అధికారి వి.కేశవరావు తెలిపారు.ద్వారకా తిరుమల.. అ‘ద్వితీయం’ ద్వారకా తిరుమల: రాష్ట్రంలోని ఏడు ప్రధాన దేవాలయాలకు వచ్చే భక్తులకు ఆయా దేవస్థానాలు అందిస్తున్న సేవలపై ప్రభుత్వం తాజాగా నిర్వహించిన సర్వేలో ద్వారకా తిరుమల దేవస్థానానికి రెండో ర్యాంకు దక్కింది. ప్రతి నెలా వాట్సాప్, ఐవీఆర్ఎస్ ద్వారా దర్శనం, తాగునీటి వసతులు, ప్రసాదం రుచి, పారిశుధ్యం అంశాలపై ప్రభుత్వం సర్వే చేస్తోంది. ఇందులో గత నెల అన్ని అంశాల్లోనూ మొదటి ర్యాంక్ సాధించిన ద్వారకా తిరుమల దేవస్థానం, జూన్ నెలకు సంబంధించి ఈ నెల 16న వెలువడిన సర్వేలో ఓ మెట్టు దిగి, ద్వితీయ స్థానంలో నిలిచింది. దర్శనం, సౌకర్యాల కల్పన, ఇతర అంశాల్లో శ్రీకాళహస్తి 1, ద్వారకా తిరుమల 2, 3, సింహాచలం 4, 5, విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం 6, శ్రీశైలం 7 (చివరి) స్థానాలు సాధించాయి. -
డిగ్రీ ఖాళీశాలలు
పిఠాపురం ప్రభుత్వం డిగ్రీ కళాశాలజిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 7విద్యార్థులు 6,500కంప్యూటర్ కోర్సులు చదువుతున్న వారు 1,200● ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో గురువుల కరువు ● కోర్సులు ప్రారంభించిన పోస్టులు మంజూరు చేయని సర్కారు ● సరైన బోధన లేక విద్యార్థుల అవస్థలు పిఠాపురం: పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్టుగా తయారైంది ప్రభుత్వ విద్యా విధానం. ఉన్నత విద్యలో ఆర్భాటంగా కొత్త కోర్సులు ప్రారంభించేస్తున్న ప్రభుత్వం.. అందుకు తగినట్టుగా బోధన సిబ్బందిని మాత్రం నియమించడం లేదు. తాళము వేసితిని.. గొళ్లెము మరచితిని అన్న చందంగా అధ్యాపక పోస్టుల మంజూరులో మీనమేషాలు లెక్కిస్తోంది. ఫలితంగా బోధించే గురువులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా కాకినాడ, పిఠాపురం, పెరుమాళ్లపురం, తుని, ఏలేశ్వరం, జగ్గంపేట, పెద్దాపురాల్లో ఏడు డిగ్రీ కళాశాలలున్నాయి. వీటితో పాటు పెద్దాపురం ఎంఆర్, కాకినాడలో ఎంఎసెన్ చారిటీస్ ఎయిడెడ్ కళాశాలలు కూడా ఉన్నాయి. వీటిల్లో సుమారు 7 వేల మంది విద్యార్థులు వివిధ కోర్సులు అభ్యసిస్తున్నారు. ఈ కళాశాలల్లో బీఏ ఆనర్స్ ఎకనామిక్స్, బీకాం ఆనర్స్ కంప్యూటర్ అప్లికేషన్స్, బీఎస్సీ ఆనర్స్ కెమిస్ట్రీ, బీఎస్సీ ఆనర్స్ కంప్యూటర్ సైన్స్, బీఎస్సీ ఆనర్స్ జువాలజీ తదితర గ్రూపులు నిర్వహిస్తున్నారు. అయితే, చాలా కళాశాలల్లో విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా అధ్యాపకులు లేరు. మామూలు కోర్సులకే అరకొరగా అధ్యాపకులు ఉండగా.. కంప్యూటర్ కోర్సులకు చాలా కళాశాలల్లో అసలు అధ్యాపకులే లేని దుస్థితి నెలకొంది. దీంతో, సరైన బోధన లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. కోర్సులున్నా పోస్టులు సున్నా ● డిగ్రీ కళాశాలల్లో వివిధ కోర్సులు ప్రారంభిస్తున్న ప్రభుత్వం వాటిని బోధించే అధ్యాపక పోస్టులు మాత్రం మంజూరు చేయడం లేదు. ● పిఠాపురం డిగ్రీ కళాశాలలో బీకాం ఆనర్స్ కంప్యూటర్ అప్లికేషన్స్, బీఎస్సీ ఆనర్స్ కంప్యూటర్ సైన్స్ కోర్సులకు ముగ్గురు అధ్యాపకులుండాలి. కానీ, ఒక్కరు కూడా లేరు. అసలు ఈ కోర్సులకు అధ్యాపక పోస్టులు మంజూరు చేయకపోవడం విచిత్రం. గత్యంతరం లేక ఫ్యాకల్టీలతో బోధించాల్సిన దుస్థితి నెలకొంది. పోస్టులు మంజూరు చేస్తే తప్ప ఇక్కడ అధ్యాపకుల నియామకం సాధ్యం కాదు. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇదే కళాశాలలో బీఎస్సీలో ప్రతి మేజర్ కోర్సుకు కనీసం మూడు పోస్టులుండాలి. కానీ, ఒక్క పోస్టు మాత్రమే ఉంది. బీఏలో ప్రతి మేజర్ కోర్సుకు రెండు పోస్టులకు గాను ఒక్కటి మాత్రమే ఉంది. ● ఏలేశ్వరం, జగ్గంపేటల్లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో కంప్యూటర్ కోర్సులకు 9 పోస్టులు ఉండాలి. కానీ, ప్రభుత్వం ఒక్కటి కూడా మంజూరు చేయలేదు. బీఎస్సీలో 6, బీఏలో 3 చొప్పున పోస్టులు మంజూరు కావాల్సి ఉంది. ● ఇక స్వీపర్లు, స్కావెంజర్లు, వాచ్మెన్ వంటి నాన్ టీచింగ్ సిబ్బంది ఒక్కో కళాశాలకు కనీసం ఆరుగురు అవసరం. వారిని నియమించకపోవడంతో ఆయా కళాశాలల్లో విద్యార్థులే ఈ పనులు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఈ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వానికి పలుమార్లు నివేదికలు పంపినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. బోధించే వారు లేకపోతే నేర్చుకునేదెలా? ప్రైవేటు విద్యాసంస్థలను ప్రోత్సహించేలా ప్రభుత్వ విద్యా విధానాలున్నాయి. కంప్యూటర్ కోర్సులు నిర్వహిస్తున్న కాలేజీల్లో అధ్యాపకులు లేకపోవడం సిగ్గుచేటు. మామూలు కోర్సులైతే పుస్తకాలు చదివి నేర్చుకోవచ్చు. కంప్యూటర్ కోర్సులు బోధించే వారు కూడా లేకపోతే విద్యార్థులు ఎలా నేర్చుకుంటారు? పరీక్షలు ఎలా రాయగలుగుతారు? కాలేజీల్లో కోర్సులు ప్రవేశపెడుతున్న ప్రభుత్వం.. వాటికి సంబంధించిన పోస్టులు మంజూరు చేయకపోతే చదువెలా సాగుతుంది? కాలేజీల్లో నాన్ టీచింగ్ సిబ్బంది కొరత తీవ్రంగా ఉండడంతో విద్యార్థులే ఇతర పనులు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం వెంటనే తగినన్ని పోస్టులు మంజూరు చేయకపోతే ఉద్యమించక తప్పదు. – ఎం గంగా సూరిబాబు, ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి, కాకినాడ ప్రభుత్వానికి నివేదించాం నూతన కళాశాల భవనం అందుబాటులోకి వచ్చాక పూర్తి స్థాయిలో క్లాసులు ప్రారంభించాం. కళాశాలలో కంప్యూటర్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు సుమారు 130 మంది ఉన్నారు. ఈ కోర్సుకు అధ్యాపకులు లేక ఫ్యాకల్టీల ద్వారా బోధన చేయిస్తున్నాం. ఇతర కోర్సుల్లోనూ అధ్యాపకుల కొరత ఉంది. అధ్యాపకులను నియమించాలని ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించాం. త్వరలోనే పోస్టులు మంజూరు చేస్తారని భావిస్తున్నాం. నాన్ టీచింగ్ సిబ్బంది ఎవరూ లేకపోవడం చాలా ఇబ్బందిగా ఉంది. – డాక్టర్ పి.సుభాషిణి, ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పిఠాపురం -
జీజీహెచ్లో అనుమానాస్పదంగా రోగి మృతి
కాకినాడ క్రైం: స్థానిక జీజీహెచ్లో చికిత్స పొందుతున్న ఓ రోగి అనుమానాస్పదంగా మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడ గ్రామీణం మండలం పనసపాడు గ్రామంలో తన పెద్ద కుమారుడు రమేష్ ఇంట్లో నివాసం ఉంటున్న నర్ల వెంకటరమణ (71) జ్యూట్మిల్ కార్మికుడిగా పనిచేసేవాడు. అనారోగ్యానికి గురికావడంతో ఈ నెల 12న చిన్న కుమారుడు సతీష్ కాకినాడ జీజీహెచ్కు తీసుకువచ్చాడు. వైద్యులు పరీక్షించి టీబీ ఉందని నిర్ధారించి అడ్మిట్ అవ్వాలని చెప్పారు. దీంతో వెంకటరమణను 13న ఈఎన్టీ భవంతిలో ఉన్న టీబీ వార్డులో చేర్చారు. అప్పటి నుంచి తండ్రికి సతీష్ సాయంగా ఉంటున్నాడు. బుధవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో వెంకటరమణ అచేతనంగా తన మంచంపై నుంచి కింద పడి ఉండడం, అతడి మెడకు ఆక్సిజన్ ట్రాన్స్ (ప్రాణవాయువు అందించే సైలెన్ వంటి పైపు) బిగించి ఉండడాన్ని సహ రోగులు గమనించారు. అప్పటికి కుమారుడు సతీష్ వార్డు బయట ఉన్నాడు. దీంతో వారు సతీష్కి సమాచారం అందించారు. వైద్యులు వచ్చి పరీక్షించే సరికి అప్పటికే వెంకటరమణ మృతి చెందాడని నిర్ధారించారు. ఈ మృతి అనుమానాస్పదంగా ఉండడంతో ఆసుపత్రి అధికారులు అప్రమత్తమయ్యారు. ఆర్ఎంఓ డాక్టర్ మెహర్ వార్డును సందర్శించి సహ రోగులను ఆరా తీశారు. తనకు ఆక్సిజన్ అందిస్తున్న ట్రాన్స్ (పైప్)ను సైలెన్ స్టాండ్కు కట్టి మెడకు చుట్టుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అత్యంత బలహీనంగా ఉన్న ప్లాస్టిక్ పైప్తో మెడకు బిగించి ఉరి వేసుకోవడం, అందుకు తన కంటే తక్కువ ఎత్తు ఉన్న స్టాండ్ ఉపయోగించినట్లు కనిపించడం, అప్పటివరకు కుమారుడు అక్కడే ఉండడం, రాత్రి 1.30 సమయానికి అతడికి ఫోన్ రావడం, వార్డు నుంచి బయటకు వెళ్లి మాట్లాడడం వంటి అంశాలు సమాధానం లేని ప్రశ్నలుగా మిగిలాయని వారన్నారు. ఈ నేపథ్యంలో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని తెలిపారు. మృతుడికి భార్య మణి ఉంది. -
బీచ్ షాక్స్ వద్దు
సాగర తీరంలో బీచ్ షాక్స్ పేరిట మద్యం విక్రయాలకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కాకినాడకు చెందిన సామాజిక కార్యకర్త దూరస్లపూడి రమణరాజు నిరసించారు. కాకినాడ సూర్యారావుపేట న్యూ ఎన్టీఆర్ బీచ్లో ‘బీచ్ షాక్స్ వద్దు! సముద్ర తీరాల్లో యువత భవిష్యత్తు పాడు చేయవద్దు’ అంటూ ఫ్లెక్సీ ప్రదర్శించి, గురువారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 2024–25లో 362 లక్షల కేసులు 2025–26లో 414 లక్షల కేసుల మేర మద్యం అమ్మకాలు జరిగాయన్నారు. మద్యం ఆదాయం రూ.44 వేల కోట్లు దాటిందని, సిండికేట్ అధిక ధరలకు మద్యం విక్రయిస్తోందని, సరిహద్దు నుంచి మద్యం అక్రమ రవాణా పెరిగిపోయిందని చెప్పారు. మద్యం వలన 15 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్కులు ఎక్కువ ప్రభావితమవుతున్నారని, బీచ్ రోడ్లు, జాతీయ రహదారుల్లో మద్యం వల్లనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. కాకినాడ మీదుగా రూ.150 కోట్లు పైగా గంజాయి అక్రమ రవాణా జరుగుతోందని, ఇటువంటి పరిస్థితుల్లో బీచ్ షాక్స్ ఏర్పాటు వలన పరిస్థితి మరింత దిగజారుతుందని రమణరాజు ఆందోళన వ్యక్తం చేశారు. – కాకినాడ రూరల్ -
ఆక్వా రైతులను ఆదుకోవాలి
● మేత ధరలు తగ్గించాలి ● మాజీ మంత్రి కురసాల కన్నబాబు డిమాండ్ కాకినాడ రూరల్: రొయ్యల మేత ధరలను తక్షణం పూర్తి స్థాయిలో తగ్గించి, ఆక్వా రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం జిల్లాల సమన్వయకర్త కురసాల కన్నబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాకినాడ రమణయ్యపేట వైద్యనగర్లోని తన క్యాంప్ కార్యాలయంలో గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఫీడ్, సీడ్, ఎగుమతుల వరకూ కొంత మంది చేతిలో మాఫియాలా ఆక్వా రంగం మారిపోయిందని మండిపడ్డారు. ఫిబ్రవరిలో కేజీ మేతపై రూ.4, జూన్లో ఏకంగా రూ.10 పెంచారని, దీనిపై ఆక్వా రైతులు ఆందోళన చేస్తున్నారని అన్నారు. వారు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి, తమ గోడు వెళ్లబోసుకున్నారని చెప్పారు. జూలైలోగా మేత రేట్లు తగ్గించకుంటే ఆందోళనకు దిగుతామని ఆ సందర్భంగా జగన్ అల్టిమేటమ్ ఇచ్చారన్నారు. కృష్ణలంకలో లాకప్ డెత్ జరిగితే, ఆ కుటుంబంతో బేరాలాడుతున్నారని, ఇక్కడేమో రొయ్యల మేత కంపెనీలతో బేరాలాడి ధర కేజీకి కేవలం రూ.4 తగ్గించారని అన్నారు. కిలోకు రూ.14 పెంచి ఆక్వా రైతులను నాశనం చేస్తున్నారని, పెంచిన ధరలు వెంటనే పూర్తి స్థాయిలో తగ్గించాలని, కేవలం రూ.4 తగ్గించామని, అదే ఘన విజయమని ప్రభుత్వం చెప్తే కుదరదని స్పష్టం చేశారు. ఆక్వా రంగం ప్రభుత్వ సహాయంతో ఎదిగిన పరిశ్రమ కాదని, దానిని కూడా బేరసారాలకు దింపేసి రైతులను మోసం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నింటికీ డైవర్షన్ పాలిటిక్సే ప్రస్తుతం రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్, డైవర్షన్ న్యూస్ మాత్రమే చూస్తున్నామని కన్నబాబు అన్నారు. చిన్న సమస్య వస్తేనే తల్లడిల్లిపోయే చంద్రబాబు మీడియా, వారి మద్దతుదారులు.. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సంఘటన జరిగేసరికి రకరకాలుగా స్పందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోం మంత్రి మేకప్ గురించి ఏదో అన్నారంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్పై విరుచుకు పడ్డారని, రికార్డులు తీస్తే చింతమనేని నుంచి బండారు సత్యనారాయణమూర్తి వరకూ అందరూ బయటకు రావడంతో ఆ విషయాన్ని వదిలేశారని అన్నారు. లాకప్ డెత్ గురించి మాట్లాడవల్సిన వారు పేకప్ గురించి మాట్లాడారన్నారు. డీఎస్సీ అక్రమాలను వెలుగులోకి తెస్తే జగన్మోహన్రెడ్డి ఇంటి ముందుకు వచ్చి, తొడ కొడుతున్నానన్నట్టుగా లోకేష్ ప్రగల్భాలు పలికారన్నారు. డీఎస్సీ అక్రమాలపై లోకేష్తో చర్చకు సిద్ధమని తాను చెప్పి 24 గంటలు గడిచినా విద్యా శాఖ మంత్రిగా లోకేష్ ఎందుకు స్పందించలేదని కన్నబాబు ప్రశ్నించారు. -
గ్యాస్లో రాష్ట్రానికి 50 శాతం ఇవ్వాలి
మామిడికుదురు: రూ.లక్షల కోట్లు కార్పొరేట్కు, నిద్ర లేని రాత్రులు కోనసీమ ప్రజలకు అన్నట్లు పరిస్థితి తయారైందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఆంధ్ర ఉద్యమాల ఐక్య వేదిక కన్వీనర్ యరసూరి మహదేవ్ ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా – గోదావరి బేసిన్ సహజ వాయువు – సహజ వనరుల పరిరక్షణ ఐక్య వేదిక పేరిట వారు నగరం గ్రామంలో గురువారం పర్యటించారు. ఓఎన్జీసీ గ్యాస్ కలెక్షన్ స్టేషన్ (జీసీఎస్) గేటు ఎదుట ధర్నా చేశారు. నగరం గ్రామాన్ని దత్తత తీసుకోవాలని, స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలని, గ్రామానికి 8 శాతం రాయల్టీ ఇవ్వాలని, పీహెచ్సీని 100 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం, మీడియాతో మాట్లాడుతూ, నాటి పాశర్లపూడి బ్లో అవుట్, నగరం విస్ఫోటం, ఇరుసుమండ గ్యాస్ ప్రమాదం వంటి సంఘటనలతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఈ ప్రాంత, రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన లక్ష్యంగా రాజకీయ పార్టీలకు అతీతంగా తాము పోరాటం చేస్తున్నామన్నారు. గ్యాస్ వల్ల వస్తున్న సంపదలో 50 శాతం మన రాష్ట్రానికి ఇవ్వాలని, ఇటువంటి సహజ వనరులు ప్రభుత్వాల చేతుల్లో ఉండాలని, కార్పొరేట్ సంస్థల కబంధ హస్తాల్లో ఉండకూడదన్నదే తమ పోరాటం ఉద్దేశమని వివరించారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు రాష్ట్రానికి 8 శాతం రాయల్టీ ఇవ్వాలన్నారు. దీనిపై ప్రధాని మోదీకి వేదిక తరఫున అర్జీ పంపించామన్నారు. ఈ సందర్భంగా ‘ఆంధ్ర చమురు నిక్షేపాలు – అంబానీ పాలు’, ‘కృష్ణా – గోదావరి గ్యాస్ మన హక్కు’ పుస్తకాలను నాయకులు ఆవిష్కరించారు. -
ఉర్రూతలూగించిన నాటక ప్రదర్శనలు
ఫ వానపల్లిలో ప్రముఖ రంగస్థల నటుల సందడి ఫ వందలాదిగా తరలివచ్చిన కళాభిమానులు కొత్తపేట: మండలంలోని వానపల్లి శ్రీభద్రాద్రి సీతారామస్వామివారి ఆలయం వద్ద బుధవారం రాత్రి పౌరాణిక నాటక ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, పళ్లాలమ్మ దేవస్థానం మాజీ చైర్మన్ కామిశెట్టి అమ్మన్న నాయుడు, పద్మావతి దంపతులు సుమారు రూ.20 లక్షలతో రామాలయాన్ని పునర్నిర్మించారు. బుధవారం విగ్రహాల ప్రతిష్ఠను పురస్కరించుకుని పౌరాణిక నాటకాలను, ఆ కళాకారులను ప్రోత్సహించడంలో భాగంగా ఆలయ నిర్మాత అమ్మన్న నాయుడు ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ప్రదర్శనలు ఇస్తున్న ప్రముఖ నటులను ఏరికోరి ఆయా పాత్రలకు కూర్చారు. దక్షిణ భారతదేశంలో ప్రముఖ పౌరాణిక రంగస్థల కళాకారులుగా రాణిస్తున్న నటీనటులతో ఎంతో ప్రతిష్టాత్మకంగా, భారీ వ్యయంతో సత్యహరిశ్చంద్ర (వారణాసి, కాటి సన్నివేశం), రామాంజనేయ యుద్ధం నాటక ప్రదర్శనలు ఇచ్చారు. వారణాసి సన్నివేశం నుంచి ప్రస్తుత మూడో తరం నటుల్లో రంగస్థల రారాజుగా గుర్తింపు పొందిన జూనియర్ డీవీ సుబ్బారావు హరిశ్చంద్రునిగా, రంగస్థల కోకిలగా ఖ్యాతి పొందిన రత్నశ్రీ చంద్రమతిగా, నక్షత్రకునిగా లతాశ్రీ , వీరబాహుడిగా సత్యప్రసాద్ తదితరులు తమ నటనా కౌశలాన్ని ప్రదర్శించారు. యువకులు సైతం ఆ రాగాలాపనలో లీనమైపోయి ఈలలు, కేరింతలతో కళాకారులను ఉత్సాహపరిచారు. డీవీ సుబ్బారావు, రత్నశ్రీ ఉన్నత శృతిలో ఆలపించిన పద్యాలను గమనిస్తే రాష్ట్ర స్థాయి నంది నాటకోత్సవాలను తలపించాయి. ఇవి అందరినీ ఆకట్టుకున్నాయి. పోటాపోటీగా తండ్రీ తనయులు రామాజంజనేయ యుద్ధం నాటకంలో ఆంజనేయుడి పాత్ర అంటే గుర్తువచ్చే పేరు పేపకాయల లక్ష్మణరావు (సంపత్ నగర్). నంది అవార్డు గ్రహీత, అభినవ ఆంజనేయునిగా పేరొందిన లక్ష్మణరావు తనయుడు రామాంజనేయులు రాముడిగా, మనుమడు జూనియర్ లక్ష్మణరావు ఆంజనేయుడిగా యుద్ధ సన్నివేశంలో నువ్వా.. నేనా అన్నట్టు పోటాపోటీగా నటించారు. పద్యాలు ఆలపించి ప్రేక్షకులను మెప్పించారు. కళాభిమానులు అత్యధిక సంఖ్యలో తరలివచ్చి గురువారం ఉదయం వరకూ ఉండి ప్రదర్శనలను తిలకించారు. అనంతరం రంగస్థల నటులను అమ్మన్న నాయుడు ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల ప్రముఖులు ఘనంగా సత్కరించారు. బిళ్లకుర్రు మాజీ సర్పంచ్ నెల్లి లక్ష్మీపతిరావు, ట్రాన్స్కో డీఈఈ రామకృష్ణ, వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి బండారు దొరబాబు, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు పాలూరి సత్యానందం, ప్రముఖ వ్యాపారవేత్తలు గొలకోటి సోమరాజు, సింగిరెడ్డి గోవిందస్వామి, చీకట్ల నాని తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ప్రముఖ కవి మృతి
పి.గన్నవరం : రాజవరం – పొదలాడ రోడ్డులో బెల్లంపూడి గ్రామం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రావులపాలెం ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్న ప్రముఖ కవి కొప్పాడి శ్రీనివాస్ (47) మృతి చెందారు. పి.గన్నవరం మండలం పోతవరం గ్రామానికి చెందిన శ్రీనివాస్ ముమ్మిడివరం ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్నారు. ఆయన పలు కవిత్వాలు రాశారు. కొన్ని తెలుగు ఆల్బమ్స్కు పాటలు కూడా రాశారు. గురువారం రాజమహేంద్రవరం నుంచి నుంచి పోతవరం గ్రామంలోని స్వగృహానికి మోటార్ సైకిల్పై వస్తుండగా, బెల్లంపూడి వద్ద అదుపుతప్పి కొబ్బరి చెట్టును ఢీకొని పడిపోయారు. దీంతో అతనికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఆయనకు భార్య ఉషారాణి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అందరితో మంచిగా ఉండే కవి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పి.గన్నవరం ఎస్సై బి.శివకృష్ణ తెలిపారు. -
వెంకన్న హుండీ ఆదాయం రూ.2.44 కోట్లు
ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి హుండీల ద్వారా 34 రోజులకు రూ.2.44 కోట్ల ఆదాయం లభించిందని ఆలయ ఈఓ, దేవదాయ శాఖ ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధరావు తెలిపారు. దేవదాయ శాఖ పర్యవేక్షణాధికారులు సహాయ కమిషనర్, మందేశ్వర స్వామి ఆలయ ఈఓ దారపు రెడ్డి సురేష్బాబు, దేవదాయ శాఖ రాజమహేంద్రవరం తనిఖీదారు ఎస్టీపీటీ శ్రీనివాస్, గ్రూపు దేవాలయాల ఈఓలు, ఆత్రేయపురం బి.నరేంద్ర, వెలిచేరు ఎం.సత్యనారాయణల సమక్షంలో హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించామని పేర్కొన్నారు. ప్రధాన హుండీలు, విశ్వేశ్వరస్వామి ఆలయ హుండీలతో కలిపి రూ.1.77 కోట్లు, అన్నప్రసాద హుండీల ద్వారా రూ.66.55 లక్షల ఆదాయం లభించిందని వివరించారు. అలాగే, 52 గ్రాముల బంగారం, 1.588 కిలోల వెండి, 18 దేశాలకు చెందిన 77 విదేశీ కరెన్సీ నోట్లు లభించాయని తెలిపారు. -
యాప్సోపాలు
సామర్లకోట: ‘‘మాలో సగం మంది నిరక్షరాస్యులే.. అధిక శాతం కౌలు చేస్తున్న వాళ్లే.. స్మార్ట్ ఫోన్లపై మాలో చాలా మందికి అవగాహలేదు. అటువంటి మాకు అవసరమైన మొబైల్ యాప్ ద్వారానే ఎరువులు ఇస్తామనడమేమిటి? ఈ ‘యాప్’సోపాలు మావల్ల కాదు. ఇదే విధానం కొనసాగిస్తే క్రాప్ హాలిడే ప్రకటించడం తప్ప మరో మార్గం లేదు’’ అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరువుల సరఫరాకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘ఫ్రేమ్వర్క్ ఫర్ ఫెర్టిలైజర్స్ సేల్స్’ పేరిట ఓ మొబైల్ యాప్ను రూపొందించింది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం మన జిల్లాతో పాటు కృష్ణా జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. శాస్త్రవేత్తలు సూచించినప్పుడు వారు చెప్పిన పరిమాణంలో ఈ యాప్ ద్వారా మాత్రమే రైతులకు ఎరువులు సరఫరా చేస్తామని స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం రైతులు ఖరీఫ్ సాగు సన్నాహాల్లో ఉన్నారు. పలువురు నారుమళ్లు, దమ్ముల్లో బిజీగా ఉన్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఎరువుల యాప్పై అవగాహన పెంచుకోవాలంటూ వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా ప్రభుత్వం రైతులపై ఒత్తిడి తెస్తోంది. సర్కారు తీరుపై మండిపడుతున్న రైతులు సామర్లకోటలో రోడ్డెక్కారు. యాప్ ద్వారా ఎరువుల విక్రయానికి వ్యతిరేకంగా సామర్లకోటలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (సొసైటీ) వద్ద గురువారం ధర్నా చేశారు. అక్కడి నుంచి నీలమ్మ చెరువు, మఠం సెంటర్ మీదుగా స్థానిక స్టేషన్ సెంటర్లోని గడియారం స్తంభం వద్దకు పాదయాత్ర నిర్వహించారు. గడియారం స్తంభం వద్ద మూడు రోడ్ల కూడలిలో దాదాపు అరగంట పాటు రాస్తారోకో చేశారు. రైతుల ఆందోళనతో పెద్దాపురం – పిఠాపురం, కాకినాడ రోడ్డులో ట్రాఫిక్ స్తంభించిపోయింది. సమాచారం తెలియడంతో ట్రాఫిక్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. వ్యవసాయ అధికారులు వచ్చేంత వరకూ ఆందోళన విరమించేంది లేదని రైతులు స్పష్టం చేశారు. ఏఓ రావాలని నినాదాలు చేశారు. అనంతరం అక్కడకు వచ్చిన సామర్లకోట వ్యవసాయాధికారి (ఏఓ) వి.మురళీధర్కు వినతిపత్రం అందజేశారు. ఎన్నో ఇబ్బందులు ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ, సాగుదార్లలో 50 శాతం మంది నిరక్షరాస్యులేనని అన్నారు. వీరికి టచ్ ఫోన్లు ఉపయోగించడంపై అవగాహన లేదని చెప్పారు. అలాగే, కౌలు రైతులే ఎక్కువగా ఉన్నారని, అసలైన రైతులు ఇతర ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉన్నారని తెలిపారు. యాప్ ద్వారా ఎరువులు బుక్ చేస్తే ఓటీపీ ఎక్కడో ఉన్న రైతులకు వెళ్తుందని, వారు ఏవిధంగా ఓటీపీ చెబుతారని ఏఓను నిలదీశారు. ఈ పరిస్థితుల్లో యాప్ ద్వారా ఎరువుల విక్రయాలు తమకు సమస్యగా మారుతుందని చెప్పారు. యాప్ వద్దని, పాత పద్ధతే ముద్దని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. గతంలో మాదిరిగానే ఎకరానికి ఐదు బస్తాల యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరితో పాటు గడ్డి పండించుకోవడానికి ఎకరాకు మూడు బస్తాలిస్తే ఏవిధంగా సరిపోతాయని ప్రశ్నించారు. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే క్రాప్ హాలిడే ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఆందోళనలో రైతులు వల్లూరి వెంకట రమణ, బోళ్ల అప్పారావు, కోడూరి సూరిబాబు, నేతల హరిబాబు, మూతిన రాజు, చలికి వెంకట్రావు, బలుసు వీరభద్రరావు, మున్నియ్య, వట్టికూటి గోపి, సత్తి కొండలరావు, సిరట్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. మావల్ల కాదు ఎరువులకు యాప్ వద్దు పాత పద్ధతిలోనే ఇవ్వాలి లేకపోతే క్రాప్ హాలిడే రైతుల హెచ్చరిక సామర్లకోటలో నిరసనాగ్రహం -
రాళ్లు కట్టి చెరువులో పడేసి..
ఫ ఆక్వా రైతు దారుణ హత్య ఫ కూలీలపైనే అనుమానం ఫ కోనసీమ జిల్లాలో కలకలం ఐ.పోలవరం: దాడి చేసి, ఆపై రాళ్లతో కట్టి చెరువులో ఓ ఆక్వా రైతును పడేసి దారుణంగా హత్య చేశారు. అక్కడ పనికి వచ్చిన వారే ఈ ఘటనకు పాల్పడినట్టు స్థానికులు, పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. మురమళ్లకు చెందిన ఆక్వా రైతు దాట్ల కృష్ణంరాజు అనే లొల్ల కృష్ణ (64) బుధవారం రాత్రి తన సొంత చెరువుల వద్ద హత్యకు గురయ్యాడు. కొత్త మురమళ్ల వద్ద ఉన్న తన సొంత ఆక్వా చెరువుల వద్దకు సాయంత్రం నాలుగు గంటలకు వెళ్లాడు. ఎంత సేపటికీ రాకపోవడం, సెల్ఫోన్ స్విచ్ఛాప్ అని వస్తుండడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. స్థానికుల సహకారంతో అతని వెతికేందుకు ఆక్వా చెరువుల వద్దకు వెళ్లారు. అక్కడ చెప్పులు, రక్తపు మరకలు కనిపించాయి. కాని రైతు కృష్ణంరాజు జాడ తెలియలేదు. ఇదే సమయంలో చెరువుల వద్ద పనిచేస్తున్న కూలీలు కనిపించలేదు. వారికి ఫోన్ చేయగా, రైతు కృష్ణంరాజు తమకు రూ.ఏడు వేల సొమ్ము ఇచ్చేశారని, ఇంటికి వెళ్లిపోతున్నామని, ఆయన గురించి తమకేమీ తెలియదని చెప్పారు. కృష్ణంరాజు మోటారు సైకిల్ మురమళ్ల ఇరిగేషన్ రెగ్యులేటర్ వద్ద కనిపించింది. ఇవన్నీ చూసిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా, వారికి అనుమానం వచ్చి చెరువులో వెతుకులాట ప్రారంభించారు. చెరువులో అతని మృతదేహం లభ్యమైంది. అన్ని కోణాల్లో విచారణ కృష్ణంరాజు మృతదేహాన్ని చూస్తే కొట్టి చంపి, రాళ్లు కట్టి రొయ్యల చెరువులో పడేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక్కడ పనికి వచ్చిన వారే ఈ దుర్ఘటనకు పాల్పడినట్టు ఓ అంచనాకు వచ్చినట్టు సమాచారం. పది రోజుల క్రితమే ఆ కూలీలు ఇక్కడ పనిచేసేందుకు వచ్చినట్టు తెలిసింది. పైగా వీరికి గంజాయి తాగే అలవాటు ఉందని అనుమానంతో పోలీసులు ఆ కోణంలోనూ విచారిస్తున్నారు. విశాఖ జిల్లా కొయ్యూరు ప్రాంతానికి చెందిన కూలీలుగా పోలీసులు నిర్ధారించారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో చెరువు వద్ద కృష్ణంరాజుకు పని చేసేందుకు వచ్చిన వారి మధ్య అరుపులు వినిపించాయని స్థానికులు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్, ముమ్మిడివరం సీఐ ఎం.మోహన్ కుమార్, ఐ.పోలవరం ఎస్సై రవీంద్రబాబు ఘటనా స్థలానికి వచ్చి హత్య జరిగిన తీరును పరిశీలించారు. కృష్ణంరాజు హత్య ఘటనలో కూలీలపైనే బలమైన అనుమానం ఉందని జిల్లా డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. ఘటన అనంతరం పనివారు తమ నివాసాన్ని ఖాళీ చేసి పరారైనట్లు గుర్తించామన్నారు. వారిని పట్టుకునేందుకు విజయవాడ నుంచి ఎఫ్ఎస్ఎల్ బృందాన్ని రప్పించామన్నారు. బయటి వ్యక్తులే అధికం ఈ హత్య ఘటన జిల్లాలో ఆక్వా రైతుల్లో కలవరం రేపింది. ఆక్వా చెరువుల వద్ద స్థానిక కూలీల కన్నా కాకినాడ జిల్లాతో పాటు ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన వారు, ఒడిశా, ఛత్తీస్గఢ్, బీహార్ వంటి రాష్ట్రాల నుంచి వచ్చిన స్థానికేతరులు అధికంగా ఉంటున్నారు. 90 శాతానికి పైగా వీరే కావడం గమనార్హం. గత ఏడాది నవంబరు 19న రావులపాలెంలో మావోయిస్టు సరోజ్ మడవి (మాడ్వీ హాంధా)ను పోలీసులు అరెస్టు చేశారు. ఇతను మావోయిస్టు అగ్రనేత మాద్వి హిడ్మాకు అనుచరుడు. అదే సమయంలో మావోయిస్టుల కమ్యూనికేషన్ కమాండర్గా పనిచేశాడు. కోనసీమలో దాచుకోవడానికి వచ్చిన ఆయన సఖినేటిపల్లిలో ఆక్వా చెరువుల వద్ద సుమారు ఆరు నెలల పాటు పనిచేశాడు. అతని అరెస్టుతో అప్పట్లో ఆక్వా రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తాజాగా కృష్ణంరాజు హత్యతో మరోసారి ఉలిక్కిపడ్డారు. స్థానిక కూలీల కంటే సగం ధరకే ఇతర ప్రాంతాల వాసులు చెరువుల వద్ద పనులకు రావడం, వారు 24/7 చెరువుల వద్దనే నివాసముండి పనిచేయడంతో ఆక్వా రైతులతో పాటు పీచు ఉత్పత్తిదారులు వీరిపైనా ఆధారపడుతున్నారు. అయితే పనులకు పెట్టుకుంటున్న వారి ఆధార్, ఇతర గుర్తింపు కార్డు లు చూడకుండా, కనీసం తెలుసున్న జట్టు మేస్త్రితో సంబంధం లేకుండా నేరుగా కూలీలను నియమిస్తే ప్రమాదమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
ఈ యాప్ వద్దు
గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. పీవీ నరసింహరావు ఉన్న సమయంలో యూరియా లేదు. రైతుల పరిస్థితి అప్పటి కంటే ఇప్పుడు మరింత అధ్వానంగా ఉంది. ఒకవైపు ప్రకృతి ఇబ్బందులకు గురి చేస్తూంటే.. వారిని మరిన్ని కష్టాల్లోకి నెట్టేలా యాప్ ప్రవేశపెట్టడం సరికాదు. చదువుకోని రైతులకు యాప్ ఏవిధంగా అర్థమవుతుంది? ఈ యాప్ వద్దు. ప్రభుత్వం మొండిగా దీనిని కొనసాగిస్తే ఎరువుల కొనుగోలు బంద్ చేసి, క్రాప్ హాలిడే ప్రకటిస్తాం. మద్దతు ధర మొక్కుబడిగా పెంచి, ఎరువుల ధరలను విపరీతంగా పెంచుతున్నారు. – పైణ్ని చిట్టియ్య, రైతు, సామర్లకోట ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం ఏ విషయంలోనూ రైతుల నుంచి ఇంత వ్యతిరేకత రాలేదు. ఈ యాప్ను రైతులు వ్యతిరేకిస్తున్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. యాప్పై అవగాహన పెంచుకుంటే మేలు జరుగుతుంది. రైతులు కోరుకుంటే సిబ్బందిని సొసైటీ వద్ద ఉంచి యాప్పై అవగాహన కల్పిస్తాం. ఇతర రాష్ట్రాల్లో ఉండే రైతుల ఓటీపీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. స్మార్ట్ఫోన్ లేకపోయినా ఇబ్బంది లేదు. – వి.మురళీధర్, వ్యవసాయాధికారి, సామర్లకోట -
‘బిడ్డను మోసే తల్లే వీవీఐపీ’
● చాగంటి కోటేశ్వరరావు ● మాతాశిశు విభాగ భవన నిర్మాణ దాతలకు సత్కారం కాకినాడ క్రైం: కడుపులో బిడ్డను మోసే తల్లే వీవీఐపీ అని, ఆమెను కాదని ప్రాధాన్యం ఇవ్వాల్సిన వ్యక్తులెవరూ ఉండరని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు అన్నారు. కాకినాడ ప్రభుత్వాస్పత్రి(జీజీహెచ్)లో కొత్తగా నిర్మించిన బొల్లినేని వెంకమ్మ, రమణయ్య మాతా శిశు విభాగం (ఎంసీహెచ్) నిర్మాణానికి రూ.62 కోట్ల విరాళాలిచ్చిన దాతలను రంగరాయ వైద్య కళాశాల (ఆర్ఎంసీ) ఆడిటోరియంలో బుధవారం రాత్రి ఘనంగా సత్కరించారు. రంగరాయ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ (రామ్కోసా) ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో చాగంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నూతన భవంతిలో ప్రసవించే ప్రతి తల్లి ఆశీస్సులు దాతలకు, వారి కుటుంబాలకు దక్కుతాయని అన్నారు. ఎన్నోచోట్ల శిశువులను ఎలుకలు కొరకడం, ప్రసవానంతరం సదుపాయాలు లేక తల్లి కష్టాలు పడటం, ఒకే మంచంపై ఇద్దరు గర్భిణులను ఉంచి, చికిత్స చేయడం తనను కలచివేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరో ముఖ్య అతిథి రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడు డాక్టర్ అత్తలూరి విష్ణువర్ధన్ మాట్లాడుతూ, ఎందరో పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు నూతన ఎంసీహెచ్ బ్లాక్, అందులోని పరికరాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. శాసన సభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, కిమ్స్ హాస్పిటల్స్ చైర్మన్ బొల్లినేని బొల్లినేని భాస్కరరావు కూడా ప్రసంగించారు. కార్యక్రమంలో కలెక్టర్ హరీంధర్ ప్రసాద్, ఎంసీహెచ్ కమిటీ చైర్మన్ ఎ.వెంకట సుబ్బరాయ చౌదరి, రామ్కానా బోర్డ్ చైర్మన్ కలిదిండి విష్ణువర్మ, జీజీహెచ్ సూపరింటెండెంట్ లావణ్య కుమారి, ఆర్ఎంసీ ప్రిన్సిపాల్ ఉషాకిరణ్, రామ్కోసా అధ్యక్ష కార్యదర్శులు ఎంవీ ఆనంద్, ఆదిత్య సత్య ప్రసన్న, విశ్రాంత డీఎంఈ డీఎస్వీఎల్ నరసింహం తదితరులు పాల్గొన్నారు. నీట్ అభ్యర్థులకు ఉచిత ప్రయాణం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): వైద్య విద్యా కోర్సులలో ప్రవేశానికి ఈ నెల 21న జరిగే నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నారు. జిల్లా ప్రజా రవాణా అధికారి ఎంయూవీ మనోహర్ బుధవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డీనరీ బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణ సదుపాయం ఉంటుందన్నారు. విద్యార్థులు హాల్ టికెట్టు చూపించి ప్రయాణించవచ్చని మనోహర్ తెలిపారు. -
చివరికి నెట్టేస్తున్నారా!
● ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం ● ఆయిల్పామ్, సరుగుడు సాగుపై ప్రచారం ● వరి సాగును తగ్గించేలా అడుగులు ● రెండేళ్లుగా జిల్లాలో తగ్గుతున్న వరి విస్తీర్ణం పిఠాపురం: ఆంధ్రుల అన్నపూర్ణగా పేరొందిన గోదారి సీమ వరి సాగులో వెనుకబడే పరిస్థితులు పొంచి ఉన్నాయా అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. కొన్నాళ్లుగా జరుగుతున్న పరిణామాలు ఈ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయని అంటున్నారు. గోదావరి, తాండవ, ఏలేరు, పంపా జలాలతో వరి సాగులో రాష్ట్రంలోనే గోదారి సీమ ప్రథమ స్థానంలో ఉంది. అటువంటిది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వివిధ కారణాలతో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తోంది. ఫలితంగా వరి సాగులో ఈ ప్రాంతం వెనుకబడే పరిస్థితులు తలెత్తుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. భారం దించుకోవాలని.. జిల్లాలో గత ఏడాది సుమారు 1.45 లక్షల మంది రైతులు దాదాపు 94 వేల హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగు చేశారు. జిల్లాలో ఒక పంటకు సుమారు 6.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తోంది. వరి రైతులకు ప్రభుత్వం ఎరువులు, విత్తనాలు సబ్సిడీపై అందిస్తూంటుంది. అలాగే, ఇతర రాయితీలు కూడా ఇస్తుంది. వీటితో పాటు ప్రతి పంటకూ అదునుకు సాగునీరు అందించాలి. దీనికోసం కాలువల్లో పూడికల తొలగింపు, ఇతర నిర్వహణ పరమైన పనులు చేయాలి. అలాగే, ఉచితంగా వ్యవసాయ విద్యుత్ అందించాలి. దీనికితోడు ఈ ప్రాంత రైతులు అధిక వరి దిగుబడులు సాధిస్తూంటారు. వారు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలి. ఊహించని విధంగా తెగుళ్లు విజృంభించినా, ప్రకృతి విపత్తులు సంభవించినా పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలి. ప్రస్తుతం ఇవన్నీ భారమని భావిస్తున్న ప్రభుత్వం, దీని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. పొమ్మనకుండానే పొగ పెట్టినట్టు.. వరి సాగుకు ఇస్తున్న సహకారాన్ని క్రమంగా తగ్గిస్తూ.. రైతులు ఆయిల్పామ్, సరుగుడు వంటి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాల్సిన పరిస్థితులు కల్పిస్తోంది. అధికారిక లెక్కల ప్రకారమే గత రెండేళ్లలో వరి సాగు విస్తీర్ణం 9 వేల ఎకరాలకు పైగా పడిపోయింది. అనధికారికంగా ఇది మరింత అధికంగా ఉందని తెలుస్తోంది. లాభదాయకమేనా? వరి వంటి ఏక వార్షిక పంటలైతే పంట దిగుబడులు చేతికందిన వెంటనే రైతుకు ఎప్పటికప్పుడు ఆదాయం వస్తుంది. అదే బహు వార్షిక పంటలయిన ఆయిల్పా మ్, సరుగుడు వంటివి నాటిన తర్వాత కొన్నేళ్ల పాటు దమ్మిడీ ఆదాయం రాదు. అయినప్పటికీ వీటిని సాగు చేయాలంటూ రైతులపై రప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. ఈ నెలలో తుని మండలం చామవరం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఆయిల్పామ్ సాగును ప్రో త్సహించాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ముందుగా ఖాళీ భూములను గుర్తించి ఆయిల్పామ్ సాగు చేయాలని అధికారులు చెబుతున్నారు. మరోవైపు వరి, ఇతర పంటలను సైతం నిలిపివేసి ఆయిల్పామ్ సాగు చేసుకుంటే మంచి లాభాలు వస్తాయంటూ రైతులకు నచ్చజెప్పే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సాధారణంగా ఆయిల్పామ్, సరుగుడు సాగును నీటి వసతి తక్కువగా ఉన్న మెట్ట ప్రాంతాల్లో ఎక్కువగా సాగు చేస్తూంటారు. ఆయిల్పామ్ ఓ ఏడాది మంచి లాభాలు ఇచ్చినా.. కొన్నేళ్ల పాటు తీవ్ర నష్టాలనే మిగిల్చిందని రైతులు చెబుతున్నారు. ఆయిల్పామ్ సాగు చేస్తే నాలుగేళ్ల పాటు నయాపైసా ఆదాయం కూడా రాదు. దీనిలో అదనపు పెట్టుబడి పెట్టి అంతర పంటలు సైతం సాగు చేయాల్సి ఉంటుంది. అంత పెట్టుబడి తమ వల్ల కాదని చాలా మంది రైతులు మొత్తుకుంటున్నారు. పైగా అంతర పంటలు కూడా అంతగా ఆదాయం ఇవ్వవని చెబుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం తన స్వార్థం కోసం వరితో పాటు ఇతర పంటల సాగును నిలిపివేయించి ఆయిల్పామ్, సరుగుడు సాగును పెంచే పనిలో ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. వరి సాగు వదిలేసుకున్నా ఎన్నో ఏళ్ల నుంచి వరి సాగు చేస్తున్నాను. ఏటా సాగునీటి ఇబ్బందులు, నకిలీ విత్తనాల బెడద, తెగుళ్లు, ఎరువుల కొరత వంటి సమస్యలు వేధిస్తున్నాయి. ఇన్ని కష్టాలు పడి ధాన్యం పండిస్తే ప్రభుత్వం సక్రమంగా కొనుగోలు చేయడం లేదు. ఈ బాధలు పడలేక నా వరి పొలాన్ని సరుగుడు సాగుకు కౌలుకు ఇచ్చేశాను. ఎకరాకు ఏడాదికి రూ.31 వేలు ఇస్తున్నారు. పైసా ఖర్చు లేకుండా ఆదాయం వస్తోంది. ప్రభుత్వ విధానాలు వరి సాగుకు చాలా ఇబ్బందికరంగా మారడంతో ఇతర పంటల సాగుకు తమ భూమిని రైతులు ఇచ్చేస్తున్నారు. ఎక్కడో మెట్ట ప్రాంతాల్లో మాత్రమే సాగు చేసే సరుగుడును ఇక్కడి పొలాల్లో వేస్తున్నారంటేనే వరి సాగుకు రైతులు ఎంత భయపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. – ఓదూరి వెంకటరమణ, రైతు, చేబ్రోలు, గొల్లప్రోలు మండలం నష్టాలు రాకుండా చూడాలనే విచ్చలవిడిగా రసాయనాలు వాడటం వల్ల పంటలు దెబ్బ తిని రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్నారు. వారికి మేలు చేయడానికే ఆయిల్పామ్ బహు వార్షిక పంటలకు రాయితీలు ఇచ్చి ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. పంటల మార్పిడి జరిగితే రైతుకే మంచిది. దీని అమలుకు చర్యలు తీసుకుంటున్నాం. – ఎన్.విజయ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి, కాకినాడ జిల్లాలో వరి సాగు విస్తీర్ణం తగ్గిందిలా.. 2025లో విస్తీర్ణం 93,944 హెక్టార్లు 2026లో విస్తీర్ణం 90,298 హెక్టార్లు ఏడాదిలో తగ్గిన వరి సాగు విస్తీర్ణం 3,646 హెక్టార్లు 2025లో వరి సాగు చేసిన రైతులు సుమారు 1,45,000 వరి సాగు వదిలేసిన వారు 22,000


