breaking news
Kakinada District News
-
శ్రీరస్తు.. శుభమస్తు..
● వివాహ సందడి మళ్లీ ప్రారంభం ● నవంబర్ 26 వరకూ ముహూర్తాలే ● ఫంక్షన్ హాల్స్, టెంట్హౌస్లు, బ్యాండ్ మేళాలకు డిమాండ్ కాకినాడ సిటీ: సుమారు 80 రోజుల విరామం తర్వాత శుభకార్యాలకు మళ్లీ మంచి ముహూర్తాలు మొదలయ్యాయి. దీంతో జోరుగా పెళ్లి బాజాలు మోగనున్నా యి. మే 25 నుంచి జూలై 26 వరకు ముహూర్తాలు లేక పోవడంతో శుభకార్యాలకు బ్రేక్ పడింది. శ్రావణ మా సం శుభకార్యాలకు శ్రేష్టం కావడం.. ఈ నెల 27 నుంచి నవంబర్ 26వ తేదీ వరకూ 35 మంచి ముహూర్తాలు ఉండటంతో లగ్గాలు, వివాహాలు, నూతన గృహ ప్రవేశాలు జోరుగా జరగనున్నాయి. ఈ నెల 30, 31; ఆగస్టు 1, 3, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 17, 20; సెప్టెంబర్ 24, 26, 27, 28; అక్టోబర్ 1, 2, 3, 4, 8, 10, 11, 12, 22, 24, 29, 30, 31; నవంబర్ 1, 2, 7, 8, 12, 13, 15, 22, 23, 26 తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయి. ఈ నాలుగు నెలల్లో మొత్తం 35 ముహూర్తాలు ఉండటంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో లెక్కకు మిక్కిలిగా వివాహాలు జరగనున్నాయని పురోహితులు చెబుతున్నారు. వీరికి డిమాండ్ వివాహాల సీజన్ మొదలవడంతో పురోహితులు, బ్యాండ్ మేళాలు, టెంట్హౌస్లు, డెకరేషన్, ఫొటో, వీడియోగ్రాఫర్లకు ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వీరిని ముందుగానే మాట్లాడుకున్నారు. పెళ్లివారు ముందుగానే అడ్వాన్స్లు కూడా ఇచ్చారు. మరోవైపు ఫంక్షన్ హాళ్లకు కూడా ఎక్కడ లేని డిమాండూ వచ్చింది. ఇప్పటికే ముహూర్తాలు నిర్ణయించుకున్న వారు 2 నెలల ముందే ఫంక్షన్ హాళ్లు బుక్ చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో 3,500కు పైగా ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్, మరో వెయ్యి వరకూ టీటీడీ, ప్రభుత్వ కమ్యూనిటీ హాళ్లు ఉన్నాయి. చాలా మంది ఫంక్షన్ హాల్స్ దొరక్కపోవడంతో ఇళ్ల వద్ద ఖాళీ స్థలాల్లో సైతం వివాహాలు జరపడానికి సిద్ధపడుతున్నారు. -
తల్లికి వంచన ఎందుకు?
● తల్లికి వందనం డబ్బులు రాకపోవడంపై ఆగ్రహం ● కలెక్టరేట్కు పెద్ద సంఖ్యలో క్యూ కట్టిన తల్లిదండ్రులు ● పీజీఆర్ఎస్లో ఫిర్యాదుల వెల్లువకాకినాడ సిటీ: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తమ సమస్యలు చెప్పుకొనేందుకు జిల్లా నలుమూలల నుంచీ ప్రజలు కలెక్టరేట్కు తరలివచ్చారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో తమ ఇబ్బందులు ఏకరువు పెట్టారు. ఎన్నడూ లేనివిధంగా ఏకంగా 921 మంది తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. ముఖ్యంగా తల్లికి వందనం నగదు తమకు జమ కాలేదంటూ అత్యధిక సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. అర్హతలున్నప్పటికీ తమకు తల్లికి వందనం డబ్బులివ్వలేదని, ఈ వంచన ఏమిటని ప్రశ్నించారు. దీంతో కలెక్టరేట్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒక దశలో అర్జీలదారులను నియంత్రించలేక కలెక్టరేట్ సిబ్బంది, పోలీసులు చేతులెత్తేశారు. చివరకు తల్లికి వందనం అర్జీలు స్వీకరించేందుకు కలెక్టర్ షణ్మోహన్ ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేసి మరీ అర్జీలు స్వీకరించారు. తల్లికి వందనం నగదు జమపై విద్యా శాఖ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని, పేద విద్యార్థుల తల్లులకు డబ్బులు ఎందుకు పడలేదో సంతృప్తికరమైన సమాధానం ఇవ్వాలని, అర్హుల జాబితా తయారు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నిర్లిప్తంగా విధులు నిర్వహిస్తే కుదరదని స్పష్టం చేశారు. విద్యుత్ బిల్లులు అధికంగా వచ్చాయనే పేరుతో తల్లికి వందనం పథకానికి అర్హులు కాదంటూ తమ పిల్లలను పక్కన పెట్టడం సరికాదని పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని సచివాలయాల్లో తల్లికి వందనం ఆన్లైన్ నమోదును ఇష్టానుసారం చేశారని, దీంతో తమ పిల్లలు ఈ పథకానికి దూరమయ్యారని ఆరోపించారు. ఒకవైపు అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం, మరోవైపు విద్యుత్ చార్జీలు పెంచడం వంటి కారణాలతో అంశాలతో బిల్లులు పెరిగిపోయాయని చెప్పారు. ప్రభుత్వం విద్యుత్ బిల్లులను లెక్కల్లోకి తీసుకోవడం సరికాదని, తమ పిల్లలు పేదలా, కాదా అనేది ప్రత్యక్షంగా చూడాలని డిమాండ్ చేశారు. పేద, మధ్య తరగతి వర్గాల పిల్లల చదువును ప్రోత్సహించే ఉద్దేశంతో అమ్మ ఒడి పథకం ప్రవేశపెట్టారని, పిల్లలను బడికి పంపిన ప్రతి తల్లికీ గతంలో ఏటా రూ.15 వేల చొప్పున అందించారని గుర్తు చేశారు. కుల, మత, వర్గ, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు అమ్మ ఒడి అందేదని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ఏడాది కాలం తల్లికి వందనం రాలేదని, రెండో ఏడాది వస్తుందని ఎదురు చూస్తూంటే వివిధ రకాల కారణాలతో ఈ పథకాన్ని దూరం చేశారని వాపోయారు. గతంలో మాదిరిగానే పాఠశాలలకు వెళ్లే పిల్లల తల్లిదండ్రులందరికీ తల్లికి వందనం పథకాన్ని అందించాలని కోరారు. సంతృప్తికరమైన పరిష్కారం చూపండి పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలకు ఆయా శాఖల అధికారులు సంతృప్తికరమైన పరిష్కారాలు చూపించాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి ఇతర అధికారులతో కలసి ఆయన అర్జీలు స్వీకరించారు. తల్లికి వందనం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, బియ్యం కార్డు మంజూరు, కార్డులో పేర్ల మార్పులు, చేర్పులు, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, ఆన్లైన్లో భూమి వివరాల నమోదు, రీ సర్వే, ఆక్రమణల తొలగింపు, డ్రైన్, కాలువల్లో పూడికల తొలగింపు, పారిశుధ్యం, తల్లికి వందనం ఆన్లైన్ తదితర సమస్యలపై ప్రజలు అర్జీలు సమర్పించారు. -
ప్రారంభమైన వివాహాలు
శ్రావణ మాసం ప్రారంభం కావడం.. నవంబర్ 26 వరకూ వివాహ ముహూర్తాలు ఉండటంతో జిల్లాలో అధిక సంఖ్యలో జంటలు ఒక్కటి కానున్నాయి. ఇప్పటికే 150కి పైగా పెళ్లిళ్లకు ముహూర్తాలు పెట్టాను. – సుబ్రహ్మణ్యశాస్త్రి, పండితులు, కాకినాడ టెంట్ హౌస్లకు ఫుల్ గిరాకీ పెళ్లిళ్ల సీజన్ కావడంతో ముందుగానే టెంట్హౌస్ సామగ్రిని బుక్ చేసుకుంటున్నారు. ఆర్డర్స్ ఎక్కువగా వస్తున్నాయి. సుమారు 80 రోజులుగా శుభకార్యాలు లేకపోవడంతో ఖాళీగా ఉన్నాం. ప్రస్తుతం టెంట్హౌస్లకు గిరాకీ పెరిగింది. – కొండబాబు, టెంట్హౌస్ నిర్వాహకుడు, కాకినాడ -
అనుబంధ విభాగాలతో పార్టీ బలోపేతం కావాలి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పార్టీ అనుబంధ విభా గాలు సమన్వయంతో పని చేయడం ద్వారా జిల్లా లో పార్టీ బలోపేతం కావాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అన్నారు. కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల పార్టీ అనుబంధ విభాగాల ఇన్చార్జిగా నియమితులైన వై.సాయిప్రశాంత్ కాకినాడ లో సోమవారం రాజాను కలిశారు. ఈ సందర్బంగా రాజా మాట్లాడుతూ, జిల్లాలోని అనుబంధ విభాగాల ప్రతినిధులు పార్టీ అభ్యన్నతికి పాటు పడేలా సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. పెండింగ్లో ఉన్న అనుబంధ విభాగాలను త్వరితగతిన నియమించాలన్నారు. పార్టీ అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్, నాయకుడు బత్తుల సాయిరామ్ కూడా పాల్గొన్నారు. ఆషాఢం ఆదాయం అదుర్స్ తలుపులమ్మ తల్లికి రూ.1.56 కోట్ల రాబడి తుని రూరల్: లోవ దేవస్థానంలో కొలువై ఉన్న తలుపులమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం ఆదాయం రూ.1.56 కోట్లు లభించింది. అన్నవరం దేవస్థానం డిప్యూటీ కమిషనర్, సహాయ కార్యనిర్వహణాధికారి పి.బాబూరావు పర్యవేక్షణలో లోవ దేవస్థానం ఆవరణలో హుండీలను సోమవారం తెరిచారు. అమ్మవారి పంచలోహ విగ్రహాల ప్రాంగణంలో ఆదాయం లెక్కించారు. నోట్లు రూ.63,15,141, నాణేలు రూ.4,42,318 కలిపి మొత్తం రూ.67,57,459 సమకూరిందని లోవ దేవస్థానం ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. ఆషాఢ మాసం నెల రోజులూ పూజా టికెట్లు, వసతి గదుల అద్దెలు, లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం, విరాళాల రూపంలో మరో రూ.88,59,239 ఆదాయం లభించిందని వివరించారు. మొత్తం రూ. 1,56,16,698 ఆదాయం సమకూరిందన్నారు. గత సంవత్సరంతో పోల్చితే ఈసారి రూ.26.62 లక్షలు అధికంగా లభించిందన్నారు. నగదు లెక్కింపులో దేవస్థానం సిబ్బంది, శ్రీవారి సేవకులు, నాయీ బ్రాహ్మణులు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. పీ–4 నిర్బంధం చేస్తే బహిష్కరిస్తాం అమలాపురం టౌన్: పీ–4 కార్యక్రమాన్ని నిర్బంధం చేస్తే బహిష్కరిస్తామని యూటీఎఫ్ కోనసీమ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.సురేంద్రకుమార్, ఎంటీవీఏఎస్ సుబ్బారావు సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. పీ–4 కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు 5, ఉపాధ్యాయులు 2 పేద కుటుంబాలను తప్పనిసరిగా దత్తత తీసుకోవాలన్న ఆంక్షలు సమంజసం కాదన్నారు. -
ఉత్సాహం..ఉత్తేజం
సమావేశానికి తరలివచ్చిన దళితులుసమావేశంలో మాట్లాడుతున్న సుధాకర్బాబుఅక్టోబర్ నుంచి దళిత ఫోర్స్ పర్యటనలు పార్టీ అధిష్టానం ఆదేశాలతో అక్టోబర్ నుంచి గ్రామాలు, మండలాల్లో దళిత ఫోర్స్ పర్యటించాలంటూ కుమార్రాజా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి తోట నరసింహం, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పార్టీ ఉభయ గోదావరి జిల్లాల ఎస్సీ సెల్ పరిశీలకులు బి.శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ నియోజకవర్గాల అధ్యక్షులు బల్ల సూరిబాబు, పెదపాటి రమేష్ కుమార్, బంగారు కృష్ణ, గుడాల వెంకటరత్నం, లంక కృపానందం, భుల అబ్బులు కూడా ప్రసంగించారు. పార్టీ అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట రాంజీ, అనుబంధ విభాగాల కోనసీమ, కాకినాడ పరిశీలకుడు వై.సాయిప్రశాంత్, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీప్తి కుమార్, సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, సిటీ మహిళా అధ్యక్షురాలు పసుపులేటి వెంకటలక్ష్మి, ప్రచార విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావూరి వెంకటేశ్వరరావు, బీసీ సెల్, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు అల్లి రాజబాబు, రాగిరెడ్డి బన్ని, సిటీ యూత్ అధ్యక్షుడు రోకళ్ల సత్య తదితరులు పాల్గొన్నారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, అంబేడ్కర్, బాబూ జగ్జీవన్రామ్ చిత్రపటాలకు నివాళులర్పించారు. సామర్లకోట ఎంపీపీ బొబ్బరాడ సత్తిబాబు వందన సమర్పణ చేశారు. ● వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ సమావేశానికి పోటెత్తిన దళితులు ● కూటమి సర్కారుపై నిప్పులు ● సాగనంపే వరకూ నిద్రపోబోమని ప్రతిన ● కేసులకు, దౌర్జన్యాలకు భయపడేది లేదని స్పష్టీకరణ ● జగన్ను సీఎంను చేయడానికి సిద్ధమంటూ నినాదం సాక్షి ప్రతినిధి, కాకినాడ: కూటమి సర్కారుపై దళితుల్లో నెలకొన్న అసంతృప్తి కాకినాడలో సోమవారం జరిగిన వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా విస్తృత స్థాయి తొలి సమావేశంలో ప్రస్ఫుటమైంది. మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా పర్యవేక్షణలో జరిగిన ఈ సమావేశానికి ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు శెట్టిబత్తుల కుమార్రాజా అధ్యక్షత వహించారు. జిల్లా నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలో తరలివచ్చిన దళితులతో సమావేశ ప్రాంగణమైన సూర్య కళా మందిరం కిక్కిరిసిపోయింది. సగం మంది బయటే ఉండిపోవాల్సి వచ్చింది. ప్రారంభం నుంచి చివరి వరకూ జగన్ నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. ఆకట్టుకున్న టీజేఆర్ ప్రసంగం ముఖ్య అతిథిగా పాల్గొన్న పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకుంది. కూటమి 13 నెలల పాలనలో దళితులు, దళిత మహిళలపై వివక్ష, కక్షపూరితంగా జరుగుతున్న దాడులను తనదైన శైలిలో ఆయన ఎండగట్టిన తీరు సభికుల్లో రెట్టించిన ఉత్సాహాన్ని నింపింది. దళితుల సంక్షేమ పథకాల్లో పెడుతున్న కోతలను గణాంకాలతో అర్థమయ్యే రీతిలో వివరించారు. వారిని అణగదొక్కేందుకు చూస్తున్న కూటమి సర్కారును కడిగి పారేశారు. ఆ సందర్భంగా జై జగన్ నినాదాలు మిన్నంటాయి. ‘మీ సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకువచ్చిన జగన్ను ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి నేను సిద్ధం. మీరు సిద్ధమేనా?’ అంటూ ప్రశ్నించి అందరిలో ఉత్తేజాన్ని నింపారు. ‘కూటమి సర్కారు పెట్టే కేసులకు బెదిరిపోయి బయటకు రారా.. తలలు పగలగొడతారని భయపడతారా.. ప్రాణాలైనా అర్పించడానికి వెనుకాడేది లేదు.. మన సంక్షేమ పథకాలను పునరుద్ధరించుకోవాలంటే జగన్ను సీఎంను చేసుకోవాలి’ అని సుధాకర్బాబు నొక్కి చెప్పినప్పుడు.. ‘ప్రాణాలైనా అర్పిస్తాం.. జగన్ను సీఎంను చేస్తాం’ అనే నినాదాలతో సమావేశ మందిరం ప్రతిధ్వనించింది. దళితుల భవిష్యత్తు బాగుండేందుకు కూటమి సర్కారును సాగనంపేలా ప్రతి గ్రామం, ప్రతి మండలంలో దళితులు సత్తా చాటాలని పిలుపునిచ్చినప్పుడు దళితులు జగన్కు జై కొట్టారు. వెలుగుల కోసం సత్తా చాటాలి పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు ప్రసంగం అందరినీ ఆలోచింపజేసింది. వెలుగుల నుంచి చీకట్లోకి నెట్టేసిన కూటమిని సాగనంపి.. తిరిగి వెలుగుల కోసం దళిత సత్తా చాటాలని పిలుపునిచ్చారు. దళితుల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అన్న చంద్రబాబుకు, దళితులంటే నాకు మేనమామలు అన్న జగన్ మనస్తత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కనకారావు అర్థమయ్యేలా వివరించినప్పుడు జనం చప్పట్లతో స్వాగతించారు. చంద్రబాబు కేబినెట్లో దళితులకు రెండే రెండు పదవులిస్తే.. జగన్ తన కేబినెట్లో హోం, విద్య, ఎకై ్సజ్ వంటి కీలక శాఖలతో సమున్నత స్థానం కల్పించారని, ఆయనను తిరిగి సీఎంను చేసుకోవాలని అన్నప్పుడు ‘సీఎం జగన్’ అంటూ దళితులు ముక్తకంఠంతో నినదించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యువతులు అదృశ్యమయ్యారని దుష్ప్రచారం చేసిన పవన్.. అనంతపురంలో సామూహిక అత్యాచారంతో తల్లి అయిన బాలికను కనీసం పరామర్శించలేదంటూ కనకారావు తూర్పారబట్టిన తీరు ఆకట్టుకుంది. జగన్ వెంటే దళితులు ● చంద్రబాబు మాటలు నమ్మి అన్ని వర్గాలూ మోసపోయినా దళితులు మాత్రం జగన్ వెంటే ఉన్నారని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. దేశమంతా అంబేడ్కర్ రాజ్యాంగం అమలవుతూంటే రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందంటూ పెదబాబు, చినబాబుల తీరును ఆయన ఎండగట్టారు. ● ఆవిర్భావం నుంచీ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న దళితులు జగన్ను మరోసారి సీఎంను చేసేంత వరకూ పోరాటాలకు సిద్ధపడాలని జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు పిలుపునిచ్చారు. ● అధికారం ఉన్నా లేకున్నా జగన్ వెంటే జనం.. అదే ప్రభంజనం అని మాజీ ఎంపీ వంగా గీత అన్నారు. ● ‘ప్రాణాలైనా అర్పిద్దాం.. జగన్ను సీఎంను చేసుకుందాం. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో దళిత ఫోర్స్తో సమన్వయంగా ముందడుగు వేద్దామని ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు శెట్టిబత్తుల కుమార్రాజా పిలుపునకు అనూహ్య స్పందన లభించింది. జగన్ను సీఎంను చేసుకుంటేనే మన సంక్షేమం మనకు తిరిగి దక్కుతుందనే విషయాన్ని ఆయన నొక్కి చెప్పారు. ● కూటమి పాలనలో దళితులు, దళిత మహిళలపై జరుగుతున్న దాడులు, అణచివేతలకు ఎదురొడ్డి పోరాడాల్సిన అవసరాన్ని మాజీ ఎమ్మెల్సీ అంగుళూరి శివకుమారి, మాల కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ పెదపాటి అమ్మాజీ, పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత, గుల్లా ఏడుకొండలు వివరించారు. ● 75 ఏళ్ల స్వాతంత్య్ర రాజకీయ చరిత్రలో తొలిసారి రెల్లి సామాజికవర్గానికి కాకినాడ డిప్యూటీ మేయర్ పదవి కట్టబెట్టిన జగన్ దళితుల పక్షపాతి అని మాజీ డిప్యూటీ మేయర్ మీసాల ఉదయ్కుమార్ అన్నారు. దళితుల సత్తా చూపాలి కూటమి ప్రభుత్వం దళితుల హక్కులు కాలరాస్తూ వారి పథకాలను ఎత్తేస్తోంది. 2027 లేదా 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిరిగి సీఎంను చేసుకోవడం ద్వారా దళితుల సత్తా ఏమిటో తెలియజేయాల్సిన సమయం ఆసన్నమైంది. జగన్ తన ఐదేళ్ల పాలనలో లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా రూ.2.75 లక్షల కోట్లు జమ చేశారు. ఇందులో 40 శాతం అంటే రూ.37 వేల కోట్లు దళితులకే వెళ్లాయి. కూటమి ప్రభుత్వం పథకాలన్నింటినీ ఆపేసి దళితుల అభ్యున్నతిని దెబ్బ తీస్తోంది. కూటమి పాలనలో ఏటా రూ.10 వేల కోట్ల మేర దళితులు నష్టపోతున్నారు. పవన్ కల్యాణ్ సినిమాల్లో చేస్తున్న పాత్రలు చూసి సామాజిక న్యాయం పాటిస్తారనుకున్నాం. అంబేడ్కర్ రాజ్యాంగం ప్రకారం ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్.. తాను సనాతన వాదినని చెప్పుకోవడమేమిటో అర్థం కావడం లేదు. పవన్ను చూసి రాజకీయం సిగ్గుతో తల వంచుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో జగన్ను సీఎంను చేసుకోవడానికి దళితులు, మైనార్టీలు ప్రాణాలర్పించడానికి కూడా వెనుకాడరు. 13 నెలల చంద్రబాబు పాలనలో చినబాబు రెడ్బుక్ రాజ్యాంగంతో వారి స్థాయి ఏమిటో ప్రజలకు తెలిసొచ్చింది. మీ పాలన ఇక వెయ్యి రోజులు మాత్రమే, 1001 రోజు కచ్చితంగా మీకు దళితుల సత్తా ఏమిటో తెలిసొస్తుంది. అంబేడ్కర్ స్మృతివనాన్ని పీపీపీ విధానంలో వ్యాపార కేంద్రంగా మార్చేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన 13 నెలల కాలంలో తల్లికి వందనం తప్ప మరో పథకమేదైనా అమలు చేసిందా? ఈ పథకాన్ని దళిత, బలహీనవర్గాలకు కాకుండా టీడీపీ నేతలకు దోచి పెడుతున్నారు. క్యాబినెట్ మంత్రి అయి ఉండి అచ్చెన్నాయుడు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలని ఎలా అన్నారు? – టీజేఆర్ సుధాకర్బాబు, వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు -
పెరిక సంఘం పటిష్టతకు కృషి
ప్రత్తిపాడు: గ్రామ స్థాయి నుంచీ సంఘం పటిష్టతకు సామాజిక వర్గీయులు కృషి చేయాలని రాష్ట్ర పెరిక (పురగిరి క్షత్రియ) సంఘం అధ్యక్షుడు కత్తిక రాఘవరావు పిలుపునిచ్చారు. సంఘం జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రత్తిపాడులో ఆదివారం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాఘవరావు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా పెరిక సామాజిక వర్గీయులున్న గ్రామాల్లో కనీసం రూ.లక్ష నిధితో పెరిక ట్రస్ట్ ఏర్పాటు చేయాలని అన్నారు. దీని ద్వారా తమ వర్గీయుల పేద పిల్లలకు చదువు చెప్పించడం వంటి సామాజిక సేవలు చేపట్టాలని సూచించారు. అమరావతిలో రూ.2.5 కోట్లతో సామాజిక భవనం నిర్మించనున్నామన్నారు. కాకినాడలో కూడా ఇప్పటికే అరెకరం కొనుగోలు చేశామన్నారు. కాకినాడలో కమ్యూనిటీ హాలు, అన్నవరంలో కాటేజీ నిర్మాణానికి కృషి చేస్తున్నామని రాఘవరావు తెలిపారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి వీరలంక సూరిబాబు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు సోము మధు, విశాఖ, అనకాపల్లి, పశ్చిమ గోదావరి జిల్లాల నాయకులు పాల్గొన్నారు. అధ్యక్షుడిగా బద్రి పెరిక (పురగిరి క్షత్రియ) సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా కాకినాడకు చెందిన వనపర్తి వీరభద్రరావు (బద్రి) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవాధ్యక్షులుగా పోకల అప్పలరాజు (యల్లమిల్లి), ధనేకుల వీరభద్రరావు (సిరిపురం), కార్యదర్శిగా జి.సత్యనారాయణ (తుని), కోశాధికారిగా గోడే మాణిక్యాలరావు (చిల్లంగి), సభ్యులుగా వనపర్తి సతీష్, మదినే దొరబాబు, చిలకమర్తి వీరభద్రం, చిలకమర్తి నల్లబాబుతో పాటు 70 మంది సభ్యులతో నూతన కార్యవర్గం ఏర్పాటైంది. వారితో రాఘవరావు ప్రమాణ స్వీకారం చేయించారు. -
విద్యుత్ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించండి
కాకినాడ సిటీ: ప్రజలపై విద్యుత్ చార్జీల భారాలను మోపే ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాలని వామపక్షాల నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు. కాకినాడ సుందరయ్య భవన్లో సీపీఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు అధ్యక్షతన ఆదివారం వామపక్షాల జిల్లా సమావేశం నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కె.బోడకొండ, నగర సహాయ కార్యదర్శి ఎ.భవాని, జె.వెంకటేశ్వరరావు (సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ), ఏగుపాటి అర్జునరావు, గొడుగు సత్యనారాయణ (సీపీఐ (ఎంఎల్) లిబరేషన్), ఏఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి అంజిబాబు, వి.రాజబాబు (ఏపీఆర్సీఎస్), సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు దువ్వా శేషుబాబ్జీ, ఎం.రాజశేఖర్, పలివెల వీరబాబు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలకు విద్యుత్ అత్యవసరం కాబట్టి ప్రైవేటు కంపెనీలకు లాభాలు చేకూర్చేందుకే కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల చట్టం తీసుకువచ్చిందన్నారు. అదానీ ప్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తోందని ఆరోపించారు. విద్యుల్ చార్జీలకు వ్యతిరేకంగా 2000 సంవత్సరంలో జరిగిన పోరాటం ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలుసన్నారు. అదే స్ఫూర్తితో వామపక్షాలు పోరాటానికి సిద్ధమవుతున్నాయని ప్రకటించారు. ఆగస్టు 5న ప్రజా వేదిక ఆధ్వర్యాన విద్యుత్ కార్యాలయాల వద్ద జరిగే ధర్నాలను జయప్రదం చేయాలని నేతలు పిలుపునిచ్చారు. వరద గోదారి ● సముద్రంలోకి 6 లక్షల క్యూసెక్కులు ● ఎగువన తగ్గుతున్న ఉధృతి ధవళేశ్వరం: గోదావరి వరద ఉధృతి పెరిగింది. దీంతో, ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి ఆదివారం రాత్రి 6,01,884 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. ఎగువ నుంచి వరద నీరు పోటెత్తుతూండటంతో మిగులు జలాల విడుదలను పెంచారు. మరోవైపు ఎగువ ప్రాంతాల్లో గోదావరి వరద ఉధృతి తగ్గుతోంది. దీంతో, ధవళేశ్వరం వద్ద కూడా సోమవారం నీటి ఉధృతి తగ్గే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 34.60 అడుగులకు చేరింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 10.90 అడుగులుగా నమోదైంది. -
ఇదో ఫ్రీతలాటకం
తల్లికి వందనానికి ఆంక్షల కత్తెర ● స్కూళ్లలో ఉచిత సీట్ల పేరిట తల్లికి వందనం నిలిపివేత ● కుటుంబంలో ఫ్రీ సీటు ఇచ్చింది ఒకరికి ● ఆ పేరుతో మిగిలిన వారందరికీ కోత ● తల్లిదండ్రుల ఆగ్రహంపిఠాపురం: తమ పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో ఉచితంగా సీట్లు కేటాయిస్తున్నారంటే ఆ తల్లిదండ్రులు ఎంతో సంబరపడ్డారు. సర్కారు వారి సాయంతో కనీసం తమ పిల్లలైనా మంచి చదువులు చదివి ఉన్నత స్థాయికి ఎదుగుతారని అనుకున్నారు. తీరా చూస్తే ప్రభుత్వం ఫ్రీ సీటు అయితే ఇచ్చింది కానీ, ఆ పేరుతో ఆయా కుటుంబాలకు తల్లికి వందనం నిధులు నిలిపివేసింది. అది కూడా ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలుంటే ఒకరికి ఉచితంగా సీటు ఇచ్చి.. ఆ పేరుతో మిగిలిన పిల్లలంరికీ తల్లికి వందనం నిధులు ఎగ్గొట్టేసింది. ఇటు తమ బిడ్డలకు ప్రైవేటు స్కూలులో ఉచిత సీటు వచ్చిందన్న ఆనందం ఆ తల్లిదండ్రులకు అంతలోనే ఆవిరైపోయింది. తమ పిల్లలకు తల్లికి వందనం డబ్బులివ్వాలంటూ అనేక మంది ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఫ్రీ సీట్లు ఇచ్చినప్పటికీ అమ్మ ఒడి డబ్బులు మాత్రం యథాతథంగానే జమ చేసేవారు. అటువంటిది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ‘ఉచితం’ పేరుతో అనుచిత విధానం అవలంబిస్తోందంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2,960 ఉచిత సీట్లు విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఒకటో తరగతిలో 25 శాతం ఉచిత సీట్లు కేటాయించాలి. దీని ప్రకారం, జిల్లావ్యాప్తంగా 2,960 మంది విద్యార్థులకు వివిధ ప్రైవేటు పాఠశాలల్లో ఉచితంగా సీట్లు కేటాయించారు. ఇప్పటి వరకూ 1,207 మంది ఆన్లైన్లో, 216 మంది ఆఫ్లైన్లో కలిపి మొత్తం 1,423 మంది వారికి కేటాయించిన పాఠశాలల్లో చేరారు. మరో 1,537 మంది ఆయా పాఠశాలల్లో ఇంకా చేరాల్సి ఉంది. ఉచిత సీట్లకు సంబంధించి జిల్లాలో ఇప్పటి వరకూ 48.08 శాతం మంది విద్యార్థులు మాత్రమే చేరారు. 20 శాతం మంది ఫ్రీ సీటు తీసుకోవడానికి నిరాకరించినట్లు అధికారులు చెబుతున్నారు. ఉచిత సీట్లు పొందిన వారిలో తల్లికి వందనం నిలిచిపోయిన విద్యార్థులు సుమారు 500 మంది ఉన్నట్లు తెలుస్తోంది. తమకు తల్లికి వందనం సాయం ఎందుకు నిలిచిపోయిందో అర్థం కాక వీరందరూ అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కోతలే కోతలు ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ తల్లికి వందనం కింద ఏటా రూ.15 వేల చొప్పున ఇస్తామని గత ఎన్నికల్లో చంద్రబాబు అండ్ కో గొప్పగా డప్పేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత రకరకాల సాకులతో అనేక మంది అర్హులకు ఈ పథకంలో కోతలు పెడుతున్నారు. కరెంటు బిల్లులు అధికంగా చూపించి కొందరికి, వ్యవసాయ భూములు లేని వారికి కూడా ఉన్నట్లు చూపించి పలువురికి ఈ పథకం ఆపేశారు. మరి కొందరికి పథకం వర్తింపజేసినా రూ.15 వేలకు బదులు రూ.13 వేలు, రూ.9 వేలు మాత్రమే వేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఫ్రీ సీటు వంకతో ఆయా కుటుంబాల్లోని ఇతర విద్యార్థులకు ‘తల్లికి వందనం’లో కోత పెట్టారు. ఇద్దరు పిల్లలకు వెయ్యలేదు మాకు కార్తీక్, తేజ ఇద్దరు కుమారులు. ఒకరికి ఫ్రీ సీటు ఇచ్చారు. ఇద్దరికీ తల్లికి వందనం పథకం డబ్బులు వెయ్యలేదు. అధికారులను అడిగితే ఆన్లైన్లో చూసుకోమన్నారు. ఆన్లైన్లో చూస్తే ‘పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఆర్టీఈ’ అని చూపిస్తోంది. మేము అర్హులమే కదా! లిస్టులో ఎలిజిబుల్ అని వచ్చింది కదా! అలా ఎందుకు చూపిస్తోందని అధికారులను అడిగితే తామేమి చేయలేమని చెబుతున్నారు. ఏం చేయాలో తెలియక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాం. ఇలా ఎప్పుడూ జరగలేదు. గతంలో డబ్బులు కచ్చితంగా పడిపోయేవి. ఇప్పుడే ఇలా వంకలు పెట్టి ఆపేస్తున్నారు. అర్హత ఉన్నా పథకం ఆపేయడం చాలా దారుణం. – రసబోయిన అర్జమ్మ, చేబ్రోలు,గొల్లప్రోలు మండలం ముగ్గురికీ వెయ్యలేదు మా ముగ్గురు పిల్లలు రిషికుమార్, పూజిత, జాహ్నవి తల్లికి వందనం పథకానికి అర్హులని ఆన్లైన్లో వచ్చింది. అందరికీ పడినట్లే ముగ్గురు పిల్లలకూ కలిపి మాకూ రూ.45 వేలు పడతాయని ఎదురు చూశాం. కానీ పడలేదు. మా పిల్లల్లో ఒకరికి ఫ్రీ సీటు ఇచ్చారు. మిగిలిన ఇద్దరికై నా వేస్తారనుకుంటే వెయ్యలేదు. అధికారులను అడిగితే తమ చేతుల్లో లేదని, ప్రభుత్వం వెయ్యాలని అంటున్నారు. ఆన్లైన్లో చూస్తే ‘పేమెంట్ హోల్డ్ బై డిపార్టుమెంట్ ఆర్టీఈ’ అని చూపిస్తోంది. ఇలా ఎందుకు వచ్చిందని, అసలు డబ్బులు పడతాయా, లేదా అని అడిగితే ఎవరూ సమాధానం చెప్పడం లేదు. రెండు వారాలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. గతంలో ఎప్పుడూ సమయానికి అమ్మ ఒడి డబ్బులు పడేవి. గత సంవత్సరం ఎలాగూ ఇవ్వలేదు. ఈ ఏడాది ఇలా మెలిక పెట్టి ఆపేశారు. అర్హత ఉన్నా మాలాంటి చాలా మంది డబ్బులు పడక ఇబ్బంది పడుతున్నారు. – నూజివీడు దేవి, చేబ్రోలు, గొల్లప్రోలు మండలం ఫిర్యాదులు చేస్తున్నారు ఫ్రీ సీటు పొందిన వారి కుటుంబంలో మిగిలిన పిల్లలకు తల్లికి వందనం డబ్బులు జమ కాలేదు. దీనిపై చాలా మంది ఫిర్యాదులు చేస్తున్నా రు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది. – పి.రమేష్, జిల్లా విద్యాశాఖాధికారి, కాకినాడ -
వేతన వేదన
అన్నవరం: ఆవులూ ఆవులూ కుమ్ములాడుకుని లేగదూడల కాళ్లు తొక్కేసినట్టుగా ఉంది అన్నవరం దేవస్థానం పారిశుధ్య సిబ్బంది పరిస్థితి. రూ.30 లక్షల నకిలీ ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) చలానాలు సమర్పించిన వ్యవహారంలో దేవస్థానం శానిటేషన్ కాంట్రాక్టర్ విజయవాడకు చెందిన కనకదుర్గా మ్యాన్పవర్ సర్వీసెస్పై క్రిమినల్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో దేవస్థానం శానిటేషన్ ఇన్స్పెక్టర్ వేంకటేశ్వరరావు, గుమస్తా ఎం.రామకృష్ణను ఈఓ వీర్ల సుబ్బారావు ఇటీవల సస్పెండ్ చేశారు. గతంలో కాంట్రాక్టర్ ఉన్నప్పుడే పారిశుధ్య సిబ్బందికి జీతాలు సక్రమంగా చెల్లించేవారు కాదు. ఈ విషయాన్ని ‘సాక్షి’ పలు సందర్భాల్లో వెలుగులోకి తీసుకుని రావడంతో జీతాల చెల్లింపునకు చర్యలు తీసుకునేవారు. ఈ నెలలో 27 రోజులు గడచినప్పటికీ జూన్ నెల జీతాలు ఇంకా ఇవ్వలేదు. ఇప్పుడు ఫేక్ పీఎఫ్ చలానాల వ్యవహారంలో కాంట్రాక్టర్ను తొలగించడంతో దేవస్థానంలో పని చేస్తున్న 350 మంది పారిశుధ్య సిబ్బందికి జీతాల చెల్లింపు ప్రశ్నార్థకంగా మారింది. ఈ నెలాఖరుకై నా వస్తాయనే నమ్మకం కలగడం లేదని సిబ్బంది వాపోతున్నారు. ‘సాక్షి’ కథనంతో.. దేవస్థానంలో ఏ టెండరూ పిలవకుండా, ఎటువంటి డిపాజిట్ లేకుండానే నెలకు రూ.59 లక్షలు చెల్లించేలా కనకదుర్గా మ్యాన్పవర్ సర్వీసెస్కు గత మార్చి నెలలో శానిటేషన్ కాంట్రాక్ట్ను నామినేషన్ పద్ధతిలో అప్పగించిన విషయం విదితమే. నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్ ప్రతి నెలా సిబ్బంది జీతంలో 22.5 శాతం (12.5 శాతం దేవస్థానం వాటా, 10 శాతం ఉద్యోగి వాటా) అంటే సుమారు రూ.10 లక్షలు పీఎఫ్ చెల్లించాలి. ఆ రశీదు దేవస్థానానికి జమ చేస్తే, దానిని పరిశీలించి శానిటేషన్ సిబ్బంది జీతాలు చెల్లించేందుకు రూ.59 లక్షల బిల్లును దేవస్థానం ఆమోదించేది. అయితే గత మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఆ కాంట్రాక్టర్ ఫేక్ పీఎఫ్ రసీదులు సృష్టించి రూ.1.77 కోట్ల మేర బిల్లు చేయించుకున్నారు. తమ ఖాతాల్లో పీఎఫ్ పడలేదని గుర్తించిన పారిశుధ్య సిబ్బంది ఆందోళన వ్యక్తం చేయడంతో దేవస్థానం అధికారులు కాంట్రాక్టర్పై ఒత్తిడి తెచ్చి మూడు నెలల పీఎఫ్ మొత్తం తిరిగి జమ చేయించారు. ఇలా చేస్తే ఏ గొడవా ఉండదని అధికారులు, కాంట్రాక్టర్ కూడా భావించారు. దీనిపై ‘అన్నవరంలో శానిటేషన్ కాంట్రాక్టర్ మోసం’ శీర్షికన ఈ నెల 17న సాక్షి వార్త ప్రచురించడంతో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. దీనిపై స్పందించిన దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి విచారణ జరిపి, నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పీఎఫ్ అధికారుల విచారణ అనంతరం కాంట్రాక్టర్పై కేసు నమోదు చేసి, ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేసి అధికారులు చేతులు దులుపుకొన్నారు. ఎవరి ఒత్తిళ్లతో చేశారో! ఏ ప్రభుత్వ శాఖలోనైనా ఒక భవనం నిర్మించడానికి కాంట్రాక్ట్ పొందిన వ్యక్తికి మరో భారీ భవనం నిర్మించే కాంట్రాక్ట్ ఎంతమాత్రం ఇవ్వరు. ఆ భారీ భవనం నిర్మాణానికి కూడా టెండర్ పిలిచి కాంట్రాక్టర్ను ఖరారు చేస్తారు. కానీ, అన్నవరం దేవస్థానంలో మాత్రం ఇలాగే చేశారు. కేవలం 34 మంది సిబ్బందిని సరఫరా చేయడానికి టెండర్ ద్వారా ఎంపిక చేసిన కనకదుర్గా మ్యాన్పవర్ సర్వీసెస్కే ఎటువంటి టెండర్ పిలవకుండా ఏకంగా 350 మంది పారిశుధ్య సిబ్బందిని సరఫరా చేసే కాంట్రాక్ట్ను గత మార్చి నెలలో అప్పగించేశారు. దీనికి దేవస్థానం అధికారులు ప్రతిపాదన పంపడం.. కమిషనర్ వెంటనే అనుమతి ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. నెలకు రూ.59 లక్షలు చెల్లించే ఈ భారీ కాంట్రాక్ట్ను ఇలా ఎందుకు అప్పజెప్పారు.. దీని వెనుక ఎవరి ఒత్తిళ్లున్నాయనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ద్వారకా తిరుమల దేవస్థానంలో పారిశుధ్య నిర్వహణకు సెవెన్ హిల్స్ సంస్థ పొందిన కాంట్రాక్ట్ గత ఏడాది అక్టోబర్తో ముగిసింది. టెండర్ పిలవకుండా కాంట్రాక్ట్ ఇవ్వాలని చాలా మంది ఒత్తిళ్లు తెచ్చినా అక్కడి అధికారులు లొంగలేదు. కొత్త కాంట్రాక్టర్ వచ్చే వరకూ పాతవారినే కొనసాగిస్తున్నారు. అన్నవరం దేవస్థానంలో కనకదుర్గ మ్యాన్పవర్ సంస్ధకు అప్పగించారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిగితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జీతాల చెల్లింపు ఎలా? ఫేక్ పీఎఫ్ చలానాల వివాదం నేపథ్యంలో పారిశుధ్య సిబ్బందికి వేతనాలు ఏవిధంగా చెల్లించాలనే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. జూన్ నెల జీతాల చెల్లింపునకు దేవస్థానం సెక్యూరిటీ కాంట్రాక్టర్ సహకారం కోరారు. ఆ కాంట్రాక్టర్ దేవస్థానంలో 60 మంది సెక్యూరిటీ సిబ్బందిని సరఫరా చేస్తున్నారు. పారిశుధ్య సిబ్బందిని కూడా అతడే సరఫరా చేసినట్లు చూపించి, అతడి ద్వారానే పీఎఫ్ కట్టించి, జీతాలు చెల్లించే ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. దీనికి కమిషనర్ కూడా అంగీకరించారని చెబుతున్నారు. ఈవిధంగానైనా తమకు నెలాఖరులోగా జీతాలివ్వాలని సిబ్బంది కోరుతున్నారు. రత్నగిరి శానిటేషన్ సిబ్బంది జీతాల చెల్లింపులో మళ్లీ ప్రతిష్టంభన ఫేక్ పీఎఫ్ రసీదుల వ్యవహారంతో అయోమయం కాంట్రాక్టర్ తొలగింపు.. కేసు నమోదు ఇద్దరు సిబ్బంది సస్పెన్షన్తో కొరవడిన పర్యవేక్షణ ఆ బాధ్యతలు తీసుకోవడానికి వెనుకాడుతున్న సిబ్బంది ఈ నెల ముగిసిపోతున్నా అందని గత నెల వేతనాలు -
ఘనంగా జన్మనక్షత్ర పూజలు
● సత్యదేవుని దర్శించిన 30 వేల మంది ● రూ.30 లక్షల ఆదాయంఅన్నవరం: జన్మ నక్షత్రం మఖను పురస్కరించుకుని సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు ఆదివారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆయుష్య హోమం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున రెండు గంటలకు ఆలయం తెరచి స్వామి, అమ్మవార్లకు అర్చకులు సుప్రభాత సేవ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, సత్యదేవుడు, అమ్మవార్ల మూలవిరాట్టులకు, శివలింగానికి మహన్యాస పూర్వక పంచామృతాభిషేకం చేసి, సుగంధభరిత పుష్పాలతో అలంకరించి పూజించారు. ఉదయం 7 గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. యాగశాలలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ సత్యదేవుడు, అమ్మవారికి ఆయుష్య హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. పూర్ణాహుతి అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. స్వామి, అమ్మవారిని ఆలయ ప్రాకారంలో టేకు రథంపై ఊరేగించారు. ఈ కార్యక్రమాలను వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, యనమండ్ర శర్మ, ఉపాధ్యాయుల రమేష్, చిట్టి శివ, ఆలయ ప్రధానార్చకుడు ఇంద్రగంటి నరసింహమూర్తి, అర్చకులు ఇంద్రగంటి వేంకటేశ్వర్లు, దత్తాత్రేయశర్మ, పరిచారకుడు గణేష్ తదితరులు నిర్వహించారు. సత్యదేవుడిని సుమారు 30 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి వ్రతాలు రెండు వేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. -
నేడు వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా పిలుపునిచ్చారు. కాకినాడ సూర్యకళా మందిరంలో సోమవారం ఉదయం 10 గంటలకు జరగనున్న ఈ సమావేశానికి పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్బాబు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వేధింపులు, అక్రమ కేసులు, దౌర్జన్యాలను దీటుగా ఎదుర్కోవడంపై ఈ సమావేశంలో దిశానిర్దేశం చేస్తారన్నారు. ఎస్సీ సెల్ రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ విభాగాల అధ్యక్షులు, ఇతర ముఖ్య నాయకులు హాజరై ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని రాజా కోరారు.ఎంపీడీఓలకు నేటి నుంచి శిక్షణ సామర్లకోట: రాష్ట్రవ్యాప్తంగా ఎంపీడీఓలుగా పదోన్నతులు పొందిన వారికి స్థానిక విస్తరణ, శిక్షణ కేంద్రం(ఈటీసీ)లో సోమవారం నుంచి శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కేంద్రం పరిధిలో శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకూ ఉన్న 11 జిల్లాల్లోని 89 మంది ఎంపీడీఓలకు ఆగస్టు 26 వరకూ శిక్షణ ఇస్తారు. మొదటి బ్యాచ్లో 46 మందికి సోమవారం శిక్షణ ప్రారంభమవుతుంది. ఈ శిక్షణను ఈటీసీ ప్రిన్సిపాల్ కేఎన్వీ ప్రసాదరావు ప్రారంభిస్తారు. వైస్ ప్రిన్సిపాల్ జి.రమణ, ఫ్యాకల్టీలు, గెస్ట్ ఫ్యాకల్టీలు శిక్షణ ఇస్తారు. ఆదివారాలు, రెండో శనివారం, వరలక్ష్మీ వ్రతం, కృష్ణాష్టమి సెలవులుంటాయని ప్రిన్సిపాల్ తెలిపారు. ఆగస్టు 15న స్వాత్రంత్య దినోత్సవం అందరితో కలసి నిర్వహిస్తామన్నారు. గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకూ పరిపాలనా విధానాలు, సంక్షేమ పథకాలు, సభలు, సమావేశాల నిర్వహణ వంటి అంశాలపై శిక్షణతో పాటు ఫీల్డు విజిట్ కూడా ఉంటుందని ప్రసాదరావు వివరించారు. లోవకు కొనసాగుతున్న భక్తుల రద్దీ తుని రూరల్: ఆషాఢ మాసోత్సవాలు ముగిసి, శ్రావణ మాసం ప్రారంభమైనప్పటికీ లోవ దేవస్థానానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ జిల్లాల నుంచి ఆదివారం ప్రత్యేక వాహనాల్లో 30 వేల మంది భక్తులు తరలి వచ్చి, తలుపులమ్మ అమ్మవారిని క్యూ లైన్ల ద్వారా దర్శించుకున్నారని ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. పులిహోర, లడ్డూ ప్రసాదాల విక్రయం ద్వారా రూ.2,48,265, పూజా టికెట్లకు రూ.2,62,031, తలనీలాలకు రూ.19,150, వాహన పూజలకు రూ.7,550, వసతి గదులు, పొంగలి షెడ్లు, కాటేజీల అద్దెలు రూ.87,576, విరాళాలు రూ.66,375 కలిపి మొత్తం రూ.6,90,947 ఆదాయం లభించిందని వివరించారు. తలుపులమ్మ అమ్మవారికి భక్తులు హుండీల ద్వారా సమర్పించిన నగదును సోమవారం లెక్కిస్తామని ఈఓ తెలిపారు. దేవదాయ శాఖ, బ్యాంకు అధికారుల పర్యవేక్షణలో హుండీలను తెరచి, నగదు లెక్కిస్తామన్నారు. కార్యక్రమంలో దేవస్థానం ఉద్యోగులు, శ్రీవారి సేవకులు పాల్గొంటారన్నారు. అంతరిక్ష యానంపై నేడు సదస్సు పిఠాపురం: అంతరిక్ష యానంపై పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ స్కూల్లో విద్యార్థులకు సోమవారం ఉదయం 9 గంటలకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. జిల్లా విద్యాశాఖాధికారి పి.రమేష్ ఆదివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఇస్రో ప్రయోగాలు, ఉపగ్రహాలు, మిషన్లపై ప్రదర్శనలు, స్పేస్ మోడల్స్, వీడియో ప్రదర్శనలు, ఇంటరాక్టివ్ సెషన్లు, క్లియర్ టాక్స్, సైన్స్ సిటీ రిసోర్స్ పర్సన్ల ప్రత్యేక ఉపన్యాసాలు, స్పేస్ క్విజ్, గేమ్స్, హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్, సర్టిఫికెట్ల ప్రదానం వంటి కార్యక్రమాలు ఈ సందర్భంగా ఉంటాయని వివరించారు. కలెక్టర్ షణ్మోహన్ సగిలి పర్యవేక్షణలో విద్యా శాఖ, సమగ్ర శిక్ష, ముస్కాన్ సంస్థ, సైన్స్ సిటీ సంయుక్త ఆధ్వర్యాన ఈ సదస్సు నిర్వహిస్తున్నారన్నారు. పిఠాపురం పరిసర ప్రాంతాల విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేసేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని డీఈఓ కోరారు. -
నేడు పీజీఆర్ఎస్
కాకినాడ సిటీ: జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమం కాకినాడ కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాలులో సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరుగుతుంది. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆదివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. దీనికి జిల్లా అధికారులందరూ విధిగా హాజరు కావాలని ఆదేశించారు. దీనికి రాలేని వారు తమ అర్జీలను ‘మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్’ వెబ్సైట్లో కూడా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అర్జీల నమోదు స్థితి తెలుసుకోవడానికి 1100 నంబర్కు నేరుగా కాల్ చేయవచ్చన్నారు. మరిడమ్మ సన్నిధికి పోటెత్తిన భక్తులు పెద్దాపురం: మరిడమ్మ మహోత్సవాల్లో భాగంగా ఆఖరి ఆదివారం అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చి, క్యూలైన్లలో బారులు తీరారు. సుమారు 50 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. అమ్మవారి దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా ఆలయ ట్రస్టీ చింతపల్లి శ్రీహర్ష, అసిస్టెంట్ కమిషనర్ కె.విజయలక్ష్మి ఆధ్వర్యాన ఏర్పాట్లు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. పెద్దాపురం బ్రాహ్మణ సేవా సంఘం, సామర్లకోట లయన్స్ క్లబ్ ఆధ్వర్యాన భక్తులకు పులిహోర పంపిణీ చేశారు. కొత్తపేట, పాశిలి వీధి సంబరాలు ఘనంగా నిర్వహించారు. -
ఎంపీ మిథున్రెడ్డి అరెస్ట్ దారుణం
ఫ అడుగంటుతున్న ప్రజాస్వామ్య విలువలు ఫ ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎంపీ మిథున్రెడ్డిని అరెస్ట్ చేయడం దారుణమని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు అన్నారు. రాజమహేంద్రవరంలోని శ్యామలాంబ ఆలయ సెంటర్లో ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టిబలిజ సంఘ అధ్యక్షుడు పిల్లి సుబ్రహ్మణ్యం నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సూర్యనారాయణ రావు మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాల ముందు రోజు కావాలనే అరెస్టు చేసినట్లు కనిపిస్తోందన్నారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్లో కీలకమైన భావ ప్రకటన హక్కుని, వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం తగదన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్య విలువలు అడుగంటిపోతున్నాయని సూర్యనారాయణ విచారం వ్యక్తం చేశారు. బ్రిటిష్ వారు వదిలిన లెగసీని ప్రస్తుతం పోలీసులు అందిపుచ్చుకున్నారని అన్నారు. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్, రాజ్యాంగ పండితులు ప్రజాస్వామ్యాన్ని ఉన్నత విలువలతో నిలబెట్టాలని చూశారన్నారు. రాజ్యసభలో ప్రభుత్వానికి బలం లేనప్పుడు మిథున్రెడ్డి కీలకంగా వ్యవహరించి, ప్రజాస్వామ్య విలువలను కాపాడారని ఆయన అన్నారు. ఒక సాధారణ వ్యక్తిగా ఎలాంటి హంగూ ఆర్భాటం లేని మిథున్రెడ్డి వ్యక్తిత్వం రెండేళ్లుగా ఆయనతో చేస్తున్న ప్రయాణం వల్ల తనకు తెలిసిందన్నారు. రాజకీయ నాయకుడి కంటే, మాములు వ్యక్తిగానే ఆయన వ్యవహరిస్తారన్నారు. విచారణకు సహకరించేవాళ్లను అరెస్టు చేసి ఇబ్బంది పెట్టడం పోలీసులకు తగదన్నారు. ఇండియన్ పోలీస్ యాక్ట్ను అతిక్రమిస్తున్నారని ఆయన వాపోయారు. మిథున్రెడ్డిని భేషరతుగా బెయిల్పై విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారం ఉంది కదా అని ఆధారాలు లేకుండా అరెస్టు చేస్తే ఎలాగన్నారు. ప్రజాస్వామ్య పోకడలు ఎక్కడికి పోతున్నాయని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్రెడ్డిని ప్రధాని మోదీ కౌగిలించుకుని వెన్నుపోటు పొడిచారని, ఇప్పుడు మంత్రి లోకేష్ని మోదీ కౌగిలించుకున్నారని రేపటి పరిస్థితి ఏంటో అని ఛలోక్తి విసిరారు. మిథున్రెడ్డితో ములాఖత్ కోసం ప్రయత్నిస్తున్నానని, ఇస్తారో లేదో చూడాలని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సమావేశంలో ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టిబలిజ సంఘ అధ్యక్షుడు పిల్లి సుబ్రహ్మణ్యం, అమలాపురం లీగల్ సెల్ అధ్యక్షుడు కుడుపూడి త్రినాథ్, ఎం.ప్రసాద్, పిల్లి గంగాధర్, కురుమిల్లి శాంతి స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. -
నైపుణ్యాభివృద్ధి శిక్షణకు ఒప్పందం
గండేపల్లి: పారిశ్రామిక నైపుణ్యాభివృద్ధి శిక్షణకు సీఎస్సీ ఇండియాతో అవగాహన ఒప్పందం చేసుకున్నట్టు ప్రగతి ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ పి.కృష్ణారావు తెలిపారు. సూరంపాలెం ప్రగతి ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక అంశాలైన ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, 3డీ ప్రింటింగ్, డేటా ఇంజినీరింగ్, రోబోటిక్స్, తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు, అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారని తెలిపారు. ఈ అవగాహన పత్రాలను మార్చుకున్న కార్యక్రమంలో డైరెక్టర్ ఎంవీ హరనాథబాబు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. తెగిపడిన విద్యుత్ తీగలు రెండు తాడిపెద్దుల మృతి తుని: స్థానిక మార్కెట్ యార్డులో విద్యుత్ తీగలు తెగిపడిన సంఘటనలో రెండు తాడి పెద్దులు మృతి చెందాయి. శనివారం ఉదయం పశువులు ఆ మార్కెట్లోని వ్యర్థాలను తింటుండగా ఒక్కసారిగా విద్యుత్ తీగలు పడటంతో రెండు తాడిపెద్దులు విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ సమయంలో జనం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు సరఫరాను నిలిపివేశారు. విద్యుత్ శాఖ లైన్ల నిర్వహణ సమయంలో తగు చర్యలు తీసుకోవాలని వ్యాపారులు కోరారు. -
ఆరోగ్యవంతం.. కోరంగి మడ అటవీ ప్రాంతం
తాళ్లరేవు: దేశంలోనే రెండో అతిపెద్ద మడ అటవీ ప్రాంతమైన కోరంగి అభయారణ్యం కల్కతాలోని సుందర్బన్స్తో పోలిస్తే ఆరోగ్యవంతమైందని ఫారెస్ట్ రేంజర్ ఎస్ఎస్ఎస్ఆర్ వరప్రసాదరావు అన్నారు. శనివారం కోరంగి బయోడైవర్సటీ కాంప్లెక్స్లో అంతర్జాతీయ మడ అడవుల దినోత్సవాన్ని వరప్రసాదరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోరింగ అభయారణ్యంలో ఏడాదికి నాలుగు నెలలపాటు గోదావరి నీరు పుష్కలంగా లభించడంతో ఆరోగ్యవంతమైన వృక్ష, మత్స్య సంపద అభివృద్ధి చెందుతుందన్నారు. సునామీలు, తుపాన్ల నుంచి రక్షించే మడ అడవులను హోప్ ఐలాండ్ దీవిలో పెంచుతున్నట్లు తెలిపారు. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రముఖ పర్యావరణవేత్త కె.మృత్యుంజయరావు మాట్లాడుతూ మడ అడవులు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడంలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతానికి 111 రకాల వలస పక్షులు వస్తున్నాయని, వాటిలో చాలావరకు సముద్ర పక్షులేనని తెలిపారు. ఫిషింగ్ క్యాట్ నిపుణులు కునాల్ గోకుల్, అల్ ఈజ్ వెల్ అధ్యక్షుడు ఎన్.కిషోర్కుమార్ తదితరులు మడ అడవులు, వన్యప్రాణుల ప్రాముఖ్యత, వాటి పరిరక్షణ తదితర అంశాలను వివిధ కళాశాలల నుంచి హాజరైన విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ఎఫ్ఎస్ఓలు సింగ వీరభద్రరావు, కుంచే సిద్ధార్థ, ఎఫ్బీఓలు కె.మహేష్, కె.ధనుంజయరావు, పి.సంధ్యారాణి, సీహెచ్ ధన లక్ష్మి, డి.మహేష్బాబు, సిబ్బంది పాల్గొన్నారు. -
రేపు ఎస్సీ సెల్ విస్తృత స్థాయి సమావేశం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి పార్టీ నేతలు, అభిమానులు తరలి వచ్చి విజయవంతం చేయాలని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా విజ్ఞప్తిచేశారు. కాకినాడ సూర్యకళా మందిరంలో సోమవారం ఉదయం 10 గంటలకు జరగనున్న ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్బాబు హాజరుకానున్నారని శనివారం మీడియాకు తెలియచేశారు. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వేధింపులు, అక్రమ కేసులు, దౌర్జన్యాలను ధైర్యంగా ఎదుర్కొనేందుకు సుధాకర్బాబు దిశానిర్దేశం చేయనున్నారని వివరించారు. పార్టీ ఎస్సీ సెల్ కార్యాచరణపై చర్చించనున్నట్టు రాజా తెలిపారు. ఎస్సీ సెల్ రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ విభాగ అధ్యక్షులు, ఇతర ముఖ్య నాయకులు హాజరై విజయవంతం చేయాలని రాజా కోరారు. 30న జాబ్మేళా బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 30వ తేదీన జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధికల్పన అధికారి ఇ.వసంతలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో ఫార్మశీ సంస్థ 20 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తోందని, 18 నుంచి 35 ఏళ్ల లోపు అభ్యర్థులు హాజరుకావచ్చని, పదో తరగతి అపైన ఇంటర్మీడియెట్, బి.ఫార్మశీ, ఎం.ఫార్మశీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు హాజరుకావాలని సూచించారు. వివరాలకు 86398 46568 నెంబరులో సంప్రదించాలని సూచించారు. పీ–4ను ముందుకు తీసుకువెళ్లాలి బోట్క్లబ్ (కాకినాడసిటీ): ఆర్థిక అసమానతలను తొలగించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పీ–4 కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు బంగారు కుటుంబాల సంఖ్యకు అనుగుణంగా మార్గదర్శకులను ఎంపిక చేయాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లో పీ4, స్వర్ణాంధ్ర –2047 విజన్ ప్లాన్ వంటి అంశాలపై నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్గా తాను ఐదు బంగారు కుటుంబాలను స్వీకరించినట్టు తెలిపారు. జిల్లాలో 1.02 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించామని వచ్చేనెల రెండో వారం నాటికి 80 వేల బంగారు కుటుంబాలు దత్తత తీసుకునేలా పనిచేయాలన్నారు. ఆశా అభ్యర్థులు మోసపోవద్దు కాకినాడ క్రైం: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో ఇటీవల ప్రకటించిన ఆశా కార్యకర్తల ఖాళీల భర్తీపై శనివారం డీఎంహెచ్వో డాక్టర్ నరసింహ నాయక్ ఓ ప్రకటన విడుదల చేశారు. పోస్టు వేయిస్తామని అభ్యర్థుల నుంచి కొందరు డబ్బులు గుంజుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఎంపిక కలెక్టర్ పర్యవేక్షణలో డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ నిర్వహిస్తుందని, మోసం చేస్తున్న వ్యక్తులపై కలెక్టర్, పోలీసులకు ఫిర్యాదు చేస్తే క్రిమినల్ కేసులు నమోదయ్యేలా సిఫార్సు చేస్తామన్నారు. -
రుణాల వసూళ్లకు ప్రత్యేక చర్యలు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): రుణాల వసూళ్లకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి అన్నారు. కాకినాడ డీసీసీబీ కార్యాలయంలో శనివారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 52 డీసీసీబీ బ్రాంచ్ల్లో మేనేజర్లు, ఇతర సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం నష్టాల బాటలో ఉన్న డీసీసీబీని రెండేళ్లలో లాభాల బాటలో నడిపించే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. రుణాల వసూళ్లు బాగుంటేనే డీసీసీబీ బాగుంటుందన్నారు. గతంలో బినామీ పేర్లతో రుణాలు అధికంగా ఇచ్చిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆయా రుణాల మంజూరుకు సహకరించిన బ్యాంకు సిబ్బందిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఆయా రుణాలను వారి నుంచి రికవరీ చేస్తామన్నారు. పిఠాపురం బ్రాంచ్ పరిధి బి.కొత్తూరు గ్రామంలో డ్వాక్రా సంఘాల సభ్యులు రుణాలు తీసుకుని తిరిగి కట్టడం లేదన్నారు. చిన్న గ్రామమైనప్పటికీ ఆ గ్రామంలో లేనివారి పేర్లతో కూడా రుణాలు తీసుకుని బ్యాంకుకు ఒక్క రూపాయి కూడా చెల్లించడం లేదన్నారు. ప్రస్తుతం ఇటువంటి రుణాల వసూళ్లకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ తరహా రుణాల మంజూరుకు ఏఏ అధికారులు సహకరించారో వారిపై చర్యలు తప్పవన్నారు. అనంతరం అన్నీ బ్రాంచ్లు సిబ్బందిని ఎంత మేర రుణాలు ఇచ్చారు, ఎంత తిరిగి చెల్లించారు, రుణాలు రికవరీకి తీసుకొంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో డీసీసీబీ ఇన్చార్జ్ సీఈఓ ప్రవీణ్కుమార్, డీజీఎం శ్రీధర్ పాల్గొన్నారు. -
సత్యదేవా జయము.. జయము
పల్లకీపై సత్యదేవుని ఊరేగింపు స్వామి, అమ్మవార్ల రథోత్సవానికి వర్షం ఆటంకం కలిగించడంతో ఆలయ ప్రాంగణంలో కాకుండా లోపలి ప్రాకారంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాలను దేవస్థానం వేదపండితులు గొల్లపల్లి ఘనపాఠి, గంగాధరభట్ల గంగబాబు, చిట్టి శివ, ముష్టి పురుషోత్తం, ప్రధానార్చకులు ఇంద్రగంటి నర్శింహమూర్తి తదితరులు నిర్వహించారు. అన్నవరం: రత్నగిరీశుడు వీర వేంకట సత్యనారాయణ స్వామివారి 135వ జయంత్యుత్సవాలు (ఆవిర్భావ దినోత్సం) శనివారం ఘనంగా నిర్వహించారు. వివిధ వైదిక, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం ప్రత్యేక శోభను, ఆధ్యాత్మిక సౌరభాన్ని సంతరించుకుంది. తెల్లవారుజామున రెండు గంటలకు ఆలయం తెరచి పూజల అనంతరం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకూ ప్రధానాలయంలోని సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు, శంకరుని మూలవిరాట్లకు పంచామృతాలతో మహన్యాస పూర్వక అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను అలంకరించారు. ఆరు గంటల నుంచి స్వామివారి దర్శనాలు కల్పించారు. ఘనంగా ఆయుష్యహోమం పూర్ణాహుతి అనివేటి మండపంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఆయుష్యహోమంలో శనివారం ఉదయం 11 గంటలకు పూర్ణాహుతి చేశారు. దేవస్థానం ఛైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు ఇతర అధికారులు పాల్గొన్నారు. 18 మంది పండితులకు సత్కారం వేడుకల్లో భాగంగా చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు 18 మంది వేద పండితులను సత్కరించారు. రాజమహేంద్రవరానికి చెందిన దువ్వూరి సూర్యప్రకాశ అవధాని, పుల్లెల సత్యనారాయణ శాస్త్రి, విజయవాడకు చెందిన విరూపాక్షం శ్యావాస మహర్షి, భీమవరానికి చెందిన టీటీడీ ఆస్థాన సిద్ధాంతి, అన్నవరం దేవస్థానం పంచాగకర్త తంగిరాల వేంకట కృష్ణ పూర్ణ సిద్ధాంతి, కందుకూరి సుబ్బారావు, కొండవీటి రాంబాబు సత్కారాలు పొందిన వారిలో ఉన్నారు. అలాగే దేవస్థానం విశ్రాంత వేద పండితుడు ముష్టి కామశాస్త్రి, చింతా చలపతి అవధాని, గొర్తి సుబ్రహ్మణ్య ఘనపాఠి, విశ్రాంత ప్రధాన అర్చకుడు ఇంద్రగంటి గోపాలకృష్ణ శాస్త్రి, నాగాభట్ల సత్యనారాయణ తదితరులను సత్కరించారు. వైభవంగా రత్నగిరీశుని జయంత్యుత్సవం మూలవిరాట్లకు పంచామృత అభిషేకాలు ఘనంగా ఆయుష్యహోమం ఆలయ ప్రాకారంలో పల్లకీ సేవ వేద పండితులకు ఘన సత్కారం -
ప్రాణాలు పోయినా పట్టించుకోరా!
ఫ రహదారులు దిగ్బంధించి మత్స్యకారుల నిరసన ఫ కాకినాడలో తీవ్ర ఉద్రిక్తత ఫ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు కాకినాడ క్రైం: నగరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం తాళ్లరేవు సమీపంలో పటవల వద్ద చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, బాధిత కుటుంబాలు మత్స్యకార నేతల ఆధ్వర్యంలో న్యాయ పోరాటానికి దిగాయి. న్యాయం చేయాలని రోడ్డెక్కాయి. ఈ పరిస్థితి నగరంలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రధాన కూడళ్లలో మూడుచోట్ల రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపారు. రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. సమన్వి ట్రావెల్స్ అధినేత రావాలని, ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్న కాకినాడ జీజీహెచ్ మార్చురీ వద్ద మత్స్యకార నాయకుడు సంగాడి ఈశ్వరరావు సహా పెద్దలు నిరసన వ్యక్తం చేశారు. 60 మందితో మొదలైన ఈ నిరసన వెయ్యి మందికి చేరుకుంది. తొలుత జీజీహెచ్ వద్ద వార్ప్ రోడ్డులో బాధిత కుటుంబీకులు రోడ్డుపై బైఠాయించారు. అక్కడి నుంచి ర్యాలీగా వాహనాలతో కాలినడకన వెళ్లి జగన్నాథపురం కొత్త వంతెనపై నిరసన తెలిపారు. జగన్నాథపురం నుంచి వార్ప్ రోడ్డు నుంచి వెళ్లే మార్గాన్ని దిగ్బంధించారు. అక్కడి నుంచి పాత వంతెనపైకి వెళ్లి నిరసన తెలిపారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని, సమన్వి ట్రావెల్స్ అధినేతను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆ అధినేత అమర్నాథ్ యాత్రలో ఉన్నారని పోలీసులు చెప్పడంతో ఒక్కసారిగా మత్స్యకారులంతా మండిపడ్డారు. ప్రాణాలు తీసేసి యాత్రలు చేస్తుంటే కళ్లకు గంతలు కట్టుకున్నారా అని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే సహా డిప్యూటీ సీఎం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కానరాని కొండబాబు తన సామాజిక వర్గ పేదలు, అందులోనూ మహిళలు ప్రాణాలు కోల్పోతే కాకినాడ టీడీపీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పందించిన తీరుపై మత్స్యకార నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. బాధితులు ఆయన దగ్గరకు వెళితే, బీమా వచ్చాక పరిహారం అందుతుందని, పరోక్షంగా తానేమీ చేయలేనని చేతులెత్తేశారని మత్స్యకారులు వాపోయారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఆయన ఇంటికి కొద్ది దూరంలోనే నినాదాలు చేశారు. శుక్రవారం జీజీహెచ్కు వచ్చి మీడియాకు పోజులిచ్చి వెళ్లిపోయారని వారన్నారు. తన సొంత సామాజిక వర్గానికే న్యాయం చేయలేని వ్యక్తి కాకినాడకు ఏం చేస్తారని బాహాటంగానే విమర్శించారు. మూడు నిండు ప్రాణాలు పోతే ఇంతేనా చేసేదంటూ ప్రశ్నించారు. మృతదేహాల తరలింపు ఉద్రిక్తత తీవ్రరూపం దాల్చుతున్న తరుణంలో నిరసనకారులు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాలతో బస్సు యాజమాన్యంతో మాట్లాడిన పోలీసులు మత్స్యకార పెద్దలతో ప్రాథమిక దశ చర్చలు నిర్వహించి, నిరసనకు తాత్కాలిక విరమణ ఇచ్చారు. పోస్ట్మార్టం అనంతరం మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించగా శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. క్షతగాత్రురాలికి కొనసాగుతున్న చికిత్స ప్రమాద ఘటనలో గాయపడిన ఓలేటి లక్ష్మి కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతోంది. ఆమెకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఎడమ కాలు, చేయిలో ఎముకలు విరిగాయని, శస్త్రచికిత్స చేస్తామని అన్నారు. -
యువకుడి అదృశ్యం
కె.గంగవరం: యువకుడి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు కె.గంగవరం ఎస్సై జానీ బాషా తెలినారు. ఆయన కథనం ప్రకారం.. రామచంద్రపురం మండలం భీమకోసుపాలేనికి చెందిన కలిదిండి చంద్రశేఖర్(27) శుక్రవారం సాయంత్రం తన స్నేహితుడికి చనిపోతున్నానని మెసేజ్ పెట్టి కనిపించకుండా వెళ్లిపోయాడు. చంద్రశేఖర్కు చెందిన మోటారు సైకిల్, సెల్ ఫోన్ సుందరపల్లి ఏటిగట్టుపై కనిపించాయి. గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడనే అనుమానంతో గాలింపు చర్యలు చేపట్టాని ఎస్సై జానీ బాషా చెప్పారు. -
ఆర్మీ ర్యాలీ, హాకీ టోర్నమెంట్కు విరాళం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): స్థానిక జిల్లా క్రీడా మైదానంలో ఆగస్టులో నిర్వహించే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ, హాకీ జాతీయ జూనియర్ మహిళా టోర్నమెంట్కు ఽశ్రీప్రకాష్ విద్యాసంస్థలు రూ.2 లక్షల సహకారం అందించాయి. జిల్లా కలెక్టర్ షణ్మోహన్కు శ్రీప్రకాష్ విద్యా సంస్థల డైరెక్టర్ సీహెచ్ విజయప్రకాష్ శనివారం కలెక్టర్ చాంబర్లో చెక్ అందజేశారు. ఈ సందర్భంగా శ్రీప్రకాష్ విద్యాసంస్థల యాజమాన్యాన్ని కలెక్టర్ అభినందించారు. ఇటువంటి కార్యక్రమాలకు సహకరించడం సంతోషంగా ఉందని కృతజ్ఞతలు తెలిపారు. -
లిటిల్ బడ్స్ బర్త్డే.. ట్రెండీగా!
నెలకో పండగ.. ఏడాదికో ఉత్సవంఒక మధుర జ్ఞాపకం ప్రస్తుతం పిల్లల పుట్టిన రోజులు నెలవారీగా చేస్తూ ఫొటోలు తీయడం సంప్రదాయంగా మారింది. ఈ ఫోటోలు వారి శారీరక వృద్ధి, హావభావాలు, వ్యక్తిత్వ వికాసాలను నెలనెలా చిత్రీకరిస్తూ.. వా ప్రగతిని కళ్లకు కడతాయి. ఇది కేవలం వయసు పెరిగిన రోజు కాదని, వారి బాల్యంలో అమూల్యమైన క్షణాలను పదిలం చేస్తాయి. – బి.హేమ, సైంటిస్ట్, రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం రూరల్: ఏ ఇంట అయినా క్యార్మని శబ్దం ఎప్పుడు వినిపిస్తుందా అని ఎదురుచూడని దంపతులు ఉండరు. ఆ రోజు కోసం ఏళ్ల తరబడి నిరీక్షణ. అది ఫలించిన నాడు ఆ ఇంట అంతకు మించిన పండగ ఏముంటుంది. ఆ బిడ్డ పెరుగుదలలో ప్రతి అంకం ఆ ఇంట ఓ ఉత్సవమై అలరారుతుంది. గత తరాల అమ్మమ్మల సంప్రదాయం.. నేటి అమ్మల ట్రెండీనెస్ కలగలసి బుజ్జాయిల పుట్టిన రోజులు థీమ్లుగా రూపాంతరం చెందుతున్నాయి. గత తరాల అమ్మమ్మలు శిశువు రెండో నెలలో నవ్వితే నువ్వుండలు చేసి పంచడం.. మూడో నెలలో బోర్లా పడితే బొబ్బట్లు చేసి సందడి చేయడం.. ఆరో నెలలో పాకడం మొదలుపెట్టగానే పరమాన్నం వండి నోరు తీపిచేయడం.. ఏడో నెల గడప దాటితే గారెలు వంటి సరదాగా దండ వేసి పంచడం.. పదో నెలలో అడుగులేస్తుంటే అరిసెలు వండడం.. అందరికీ తెలిసిందే. నేటికీ చాలా ఇళ్లలో ఈ సందడి కనిపిస్తున్నా వీటికి అదనంగా ప్రతి నెలా పుట్టినరోజు చేస్తూ తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. అదికూడా ట్రెండీగా. ఏడాది పాటు ప్రతి నెలా ఒక్కో థీమ్తో పుట్టిన రోజును చేస్తున్నారు. ఆ పన్నెండు నెలల జ్ఞాపకాలను ఫొటో ఫ్రేమ్లు, వీడియోల రూపంలో క్రోడీకరించి మొదటి ఏడాది పుట్టినరోజును వైభవంగా నిర్వహిస్తూ బంధుమిత్రులకు చూపి, సోషల్ మీడియాలో పోస్టుచేసి లైక్లకు, కామెంట్లకు మురిసిపోతున్నారు. నయా బర్త్డే సెలబ్రేషన్స్పై ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ. సరికొత్తగా అలంకరణ విభిన్న థీమ్లతో నిర్వహణ ఏడాది పొడవునా సంబరాలు అదో మధురానుభూతి ఏడాదికి ఓ బర్త్డే నుంచి నెలనెలా వేడుకలు జరుపుకోవడం కొత్త ట్రెండ్. మాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్దవాడు అభిరామ్కు నెలనెలా కొత్త బట్టలతో అలంకరించి పండ్లు, స్వీట్లు, చాక్లెట్స్తో అలంకరించాం. ఇప్పుడు చిన్నవాడు అనిరుథ్కు కూడా అలాగే చేస్తున్నాం. ఇది వారి జీవితంలో మధురానుభూతిగా నిలిచిపోతుంది. ప్రతి నెల ఫొటోలను భద్రంగా ఉంచి, ఏడాది పూర్తయిన తరువాత అన్నీ కలిపి ఫ్రేమ్ చేయించి ఇంటిలో పెట్టుకుంటాం. – అడ్డాల ఇందుమాధురి, గృహిణి, బొమ్మూరు కలకాలం గుర్తుండాలని... బర్త్డేకి ఏడాది వరకు ఎదురు చూడడం ఎందుకని.. నెలనెలా ఒక్కో థీమ్తో మా పాపను రెడీ చేశా. ఫొటోలు తీసి భద్రంగా ఉంచా. పెద్దయ్యాక చూపిస్తే తను కూడా సంబరపడుతుంది. ఒకప్పుడంటే కెమెరామన్ వచ్చి ఫొటోలు తీసేవాడు. ఇప్పుడు ఫోన్లోనే ఫొటోలు తీసి ఎడిటింగ్ చేస్తున్నా. మంచి పాటను యాడ్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెడితే చాలా లైక్లు, కామెంటు వస్తున్నాయి. – వలవల దేదీప్య, గృహిణి, మోరంపూడి ప్రతి నెలా పండగే మా గారాలపట్టి యశశ్వి పుట్టినరోజును ప్రతి నెలా ఓ వేడుకలా చేసుకుంటున్నాం. కుటుంబసభ్యులంతా కలిసి సందడి చేస్తాం. పిల్లల చిన్నప్పటి ఫొటోలు భద్రంగా ఉంచితే పెద్దయ్యాక చూసి మురిసిపోతారు. ప్రతినెల కొత్త బట్టలు వేసి ఒక్కో రకమైన వస్తువులు, ఇతర పండ్లతో నెలల నంబర్లు వేసి ఫొటోలు తీసుకుంటాం. ఏడాది పాటు ఈ ఫొటోలను భద్రపరచి ప్రదర్శిస్తాం. – సుకీర్తి, సచివాలయ ఉద్యోగి, నగరం -
సంక్షామ హాస్టళ్లు
కరప మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయం (బాలుర)లో వసతులులేక విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారు. తరగతికి, పడుకోవడానికి విడిగా గదులులేవు. పగలు తరగతిగా, రాత్రి పడక గదిగా వినియోగిస్తున్నారు. కిటికీలకు, గుమ్మాలకు, వరండాలలో ఉతికిన దుస్తులు ఆరబెట్టుకుంటున్నారు. 450 మంది ఉండాల్సిన గురుకుల విద్యాలయంలో సరిపడా తరగతి గదులు, వసతి గదులు లేక విద్యార్థుల సంఖ్య సగానికి సగం పడిపోయింది. డైనింగ్ హాల్ లేక నేలపై భోజనాలు చేసే పరిస్థితుల్లో రెండు నెలల క్రితం రేకుల షెడ్ నిర్మించి, డైనింగ్హాల్కు కేటాయించారు. ఈ హాస్టల్కు ప్రహారీగోడ లేక కుక్కలు, పందులు విచ్చలవిడిగా తిరుగుతున్నా, ఆకతాయిలతో రాత్రి పూట విద్యార్థులు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఇరుకు గదిలో 20, 30 మంది విద్యార్థులు. ఒకే గదిలో బోధన, భోజనం. కటిక నేలపై తిండీ తిప్పలు.. కూలిపోయిన ప్రహరీలు. కుక్కలు, పందులతో సావాసం. చీకటి పడితే భయం. ఇంటి నుంచి తెచ్చిన దుప్పట్లే దిక్కు. కూటమి పాలనలో జిల్లాలోని వసతిగృహాల దుస్థితి ఇది. కోట్లు ఖర్చు చేస్తున్నా వసతి గృహాల్లో సౌకర్యాలు ఎందుకు దిగజారిపోతున్నాయంటూ ఉన్నత న్యాయస్థానం ఇటీవల కూటమి సర్కార్కు అక్షింతలు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లాలోని వసతి గృహాల్లో స్థితిగతులపై ‘సాక్షి’ క్షేత్ర స్థాయి పరిశీలన ఇది. ఈ సందర్భంగా విద్యార్థులు అనేక సమస్యలు ఏకరువు పెట్టారు. ప్రత్తిపాడు, ఏలేశ్వరం, తుని, కరప, జగ్గంపేట, పెద్దాపురం, సామర్లకోట, తాళ్లరేవు తదితర మండలాల్లోని వసతిగృహాల్లో సమస్యల సమాహారమిది. ● తుని డి.పోలవరంలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో అడ్మిషన్లు కరువయ్యాయి. హాస్టల్, పాఠశాల మధ్య కిలో మీటరు దూరం. హాస్టల్కు వెళ్లాలంటే ప్రధాన రహదారి దాటాలి. ఏ ప్రమాదాల బారిన పడతారో అని తల్లిదండ్రులు అందులో పిల్లలను చేర్చడంలేదు. మూడు నుంచి పదో తరగతి వరకు ఈ ఏడాది కూడా ఎవరూ చేరక విద్యార్థుల సంఖ్య 20కి పడిపోయింది. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలైనా వారికి కనీసం యూనిఫాం, దుప్పట్లు ఇవ్వలేదు. వెంట తెచ్చుకున్న దుస్తులు, దుప్పట్లే దిక్కయ్యాయి. ఇనుప మంచాలపై నిద్ర వారికి నరకప్రాయంగా ఉంది. మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించిన పెండింగ్ బిల్లులు విడుదల కాక వడ్డీలకు అప్పులు తెచ్చి విద్యార్థులకు భోజనాలు పెడుతున్న దుస్థితి. ● ప్రత్తిపాడు ఎస్సీ బాలుర వసతి గృహంలో 116 మంది, బీసీ బాలిక వసతి గృహంలో 110 మంది విద్యార్థులు ఉన్నారు. హాస్టళ్ల పరిసరాల్లో దోమలతో విద్యార్థులు నరకం చూస్తున్నారు. ప్రభుత్వం కనీసం దోమ తెరలను కూడా పంపిణీ చేయలేకపోయింది. దీంతో విద్యార్థులు జ్వరాల పాలవుతున్నారు. రెండు హాస్టళ్లలో విద్యార్థులకు నేలపై నిద్రపోతున్నారు. బీసీ బాలికల హాస్టల్కు మంచాలు మంజూరు చేసినా సరిపడా గదులు లేక వినియోగంలోకి తీసుకురాలేదు. ఎస్సీ బాలుర హాస్టల్లోనూ నేలపైనే నిద్ర. ఈ హాస్టల్ బయట పేరుకుపోయిన మురుగునీటితో దోమలు పెరిగి విద్యార్థులు జ్వరాల బారిన పడుతున్నారు. ● ఏలేశ్వరంలో బాలుర వసతిగృహానికి గుక్కెడు నీరు కరువైంది. ఆర్వో వాటర్ ఫిల్టర్ పనిచేయక కుళాయి నీరు తాగుతూ జ్వరాల బారిన పడుతున్నారు. హాస్టల్ కిటికీల అద్దాలు పగిలిపోవడంతో దోమలతో నరకం చూస్తున్నారు. బాలికల వసతిగృహంలో ఫ్యాన్లు లేకపోవడంతో విద్యార్థులు ఉక్కపోతకు గురవుతున్నారు. ● జగ్గంపేట శివారు యానాదుల కాలనీ వద్ద వున్న బాలికల వసతి గృహం శిథిలావస్థకు చేరుకుంది. బీసీ వెల్ఫేర్ వసతి గృహ విద్యార్థులకు మెస్ చార్జీలు, కాస్మెటిక్ చార్జీలు విడుదల కాలేదు. ఐదు నెలల బిల్లులు పెండింగ్లో ఉండటంతో హాస్టల్ నిర్వహణ కష్టంగా ఉంది. ఒక్కొక్క విద్యార్థికి చెల్లిస్తున్న మెస్ చార్జీలు రూ.53 ఏ మూలకూ రావడం లేదు. ● గోకవరం మండలంలో ఎస్సీ బాలుర, ఎస్టీ బాలికల వసతి గృహాలు ప్రభుత్వ భవనాల్లో నిర్వహిస్తుండగా బాలికల వసతి గృహాలను అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. ● తాళ్లరేవు మండలంలో బీసీ బాలికల వసతి గృహాన్ని ప్రైవేటు భవనంలో నిర్వహిస్తున్నారు. సుమారు 60 మంది విద్యార్థినులు ఉన్న అద్దె భవనం పురాతనమైనది కావడంతో అస్తవ్యస్తంగా ఉంది. ఒక గదిలో సుమారు 20 మంది విద్యార్థులు ఉంటున్నారు. బీసీ ఎస్సీ బాలుర వసతి గృహాలలో ఒకే గదిలో ఇరుకిరుకుగా 15 నుంచి 20 మంది ఉంటున్నారు. ఎస్సీ బాలుర హాస్టల్కు వెళ్లే రహదారి అధ్వానంగా ఉండటంతో విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతం. ● పెద్దాపురం బీసీ బాలికల హాస్టల్లో భోజనం అధ్వానంగా ఉంటోందని బాలికలు స్వయంగా కలెక్టరుకు ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది. పెద్దాపురంలో బీసీ బాలికల, బాలుర, ఎస్సీ బాలికల హస్టళ్లు ఉన్నాయి. ఈ హాస్టళ్లలో గతంలో మెరుగైన సదుపాయాలు ఉండటంతో వీటికి మంచి డిమాండ్ ఉండేది. ప్రస్తుత ఈ హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. మూడు హాస్టళ్లు శిథిలావస్థకు చేరినా ఎవరికీ పట్టడంలేదు. బీసీ బాలుర హాస్టల్ ప్రహరీ కూలిపోవడంతో పాముల భయం వెంటాడుతోంది. బీసీ బాలికల హాస్టల్ ప్రహరీ చుట్టు పిచ్చి మొక్కలు పెరిగి అక్కడ సైతం పాముల భయాన్ని ఎదుర్కొంటున్నారు. మరుగుదొడ్లు అధ్వానంగా ఉండటంతో బాలికలు ఇబ్బందులకు గురవుతున్నారు. ● సామర్లకోట బీసీ బాలుర హాస్టల్ శిథిలం కావడంతో ఇరుకుగా ఉన్న అద్దె భవనంలోనే కాలక్షేపం చేస్తున్నారు. బీసీ బాలిక హాస్టల్ చుట్టూ మురుగునీరు, సెప్టిక్లీన్ ట్యాంకర్లు పార్క్ చేయడంతో దోమలతో పాటు దుర్వాసన భరించలేకపోతున్నామని విద్యార్థులు అంటున్నారు. గతంలో 25 మంది ఉండే ఈ హాస్టల్లో నేడు ఐదుగురు మాత్రమే ఉంటున్నారు. ఇరుకిరుకు గదిలో 20 మంది కటిక నేలపైనే తిండీ తిప్పలు చీకటిపడితే భయంభయం కొరవడిన మౌలిక వసతులు పట్టించుకోని కూటమి పాలకులు అసౌకర్యాల ‘చెర’లో వసతిగృహాలు -
మా బాబు బంగారం!
బంగారు కుటుంబాలివీ.. కాకినాడ జిల్లాలో బంగారు కుటుంబాలు 1,02,450. ఇందులో ఆగస్టు 15 నాటికి నిర్దేశించిన లక్ష్యం 80,158 కుటుంబాలు. ఇప్పటికే దత్తత తీసుకున్న కుటుంబాలు 3,844. ఇంకా దత్తత తీసుకోవాల్సిన కుటుంబాలు 76,314. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఎంపిక చేసిన కుటుంబాలు 64 వేలు ఉండగా వడపోతల అనంతరం 35 వేలకు చేరుకోవచ్చునని అంచనా వేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 57 వేల బంగారు కుటుంబాలను ప్రాథమిక సర్వేలో గుర్తించారు. ఇందులో 1226 మార్గదర్శకులకు 12,500 బంగారు కుటుంబాలను మ్యాపింగ్ చేశారు. ఇదే విషయాన్ని ఆ జిల్లా కలెక్టర్ ప్రశాంతి శుక్రవారం రాత్రి సీఎం నిర్వహించిన వీడియోకాన్ఫ్రెన్స్లో నివేదించారు. కలెక్టర్ మలకపల్లి గ్రామానికి చెందిన సనమండ్ర పోసిబాబు కుటుంబాన్ని దత్తత తీసుకున్నట్టు వీసీలో వివరించారు. వీరందరికీ మార్గదర్శకులను అన్వేషించాల్సిన భారం ఇప్పుడు అధికారులపై పడింది. పూర్వ కాలంలో రాబిన్హుడ్ సినిమాలు విపరీతమైన ప్రజాదరణ పొందేవి. కారణం వారు ధనవంతులను దోచి పేదలకు పంపకాలు చేసేవారు. దాంతో వారు ఆ పేదలకు ఆరాధ్యులయ్యేవారు. బందిపోటు భీమన్న చిత్రంలో ఎస్వీ రంగారావు.. కొదమసింహంలో చిరంజీవి ఇలా ఎన్నో చిత్రాలు ఆ కథాంశంతో సాగి విజయవంతమైనవే. కానీ అవి కేవలం రెండున్నర గంటల చిత్రాలు. వాటిని అలాగే చూడాలి. వాస్తవానికి వస్తే ఎంత చెట్టుకు అంతగాలి అన్నట్టు ఎంత సంపాదించినా దానికి తగ్గ ఖర్చులు ప్రతి ఇంటా ఉంటాయి. ఎంతమంది వచ్చినా విస్తరి వేసే రోజులు పోయాయి. అలాంటి వారి వారసులు నేడు చాలా వరకు మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండన్న స్థితిలో గొప్పలు చెప్పుకోవడానికే పరిమితమైపోయారు. ఈ నేపథ్యంలో పీ–4 పథకం కింద కొందరికి ఉన్నవారని ముద్ర వేసి బలవంతపు బాధ్యతలు అప్పగించాలని చూస్తోంది కూటమి సర్కార్. బాబ్బాబు కొన్ని పేద కుటుంబాలను ఆదుకోండని వారిని బతిమాలుతోంది. లేదంటే ఏదో ఒక రూపంలో వారిని వంచైనా బాధ్యతలు అప్పగించే ప్రయత్నం చేస్తోంది. కొందరేమో అబ్బే మావల్ల కాదని, మరికొందరు మాకు తోచిన సేవ మేం చేస్తున్నామని సున్నితంగా ఆ ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నారు. అయినా ఈ బలవంతపు అప్పగింతలేమిటని కొందరు సర్కార్ను ప్రశ్నిస్తున్నారు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? మరి ఎన్ని కుటుంబాలను సర్కారు బంగారుమయం చేస్తుందో చూడాల్సిందే. సాక్షి ప్రతినిధి, కాకినాడ: సంపద సృష్టిస్తామని గద్దె నెక్కిన చంద్రబాబు సంపన్నుల వెంట పడుతున్నారు. జీరో పేదరికమే లక్ష్యంగా బంగారు కుటుంబాలకు ఉజ్వల భవిష్యత్ కల్పిస్తామని కూటమి సర్కార్ గొప్పగా ప్రకటించింది. ఇందుకోసం విజయవాడలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి జిల్లాల నుంచి బంగారు కుటుంబాల పేరుతో పెద్ద ఎత్తున జనాన్ని బస్సుల్లో తరలించి హడావిడి చేసింది. అలా అని ఆ బాధ్యతను ప్రభుత్వం మీద వేసుకోవడం లేదు. ఎంపిక చేసిన బంగారు కుటుంబాలను ఉన్నత స్థితికి తీసుకువచ్చే బాధ్యతను సంపన్నులకు అప్పగించే ఏర్పాట్లు చేస్తోంది. బంగారు కుటుంబాలను దత్తత తీసుకునే వారికి మార్గదర్శులనే నామకరణం చేసింది. వాస్తవానికి సమాజంలో అట్టడుగున ఉన్న కుటుంబాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అటువంటి ప్రభుత్వమే సమాజంలో సంపన్నులను గుర్తించి వారికి నిరుపేదలను దత్తత ఇవ్వడమంటే ప్రభుత్వం పేదల సంక్షేమం నుంచి వైదొలగి ఎన్జీఓలకు అప్పగించడమేనని విజ్ఞులు అభిప్రాయపడుతున్నారు. పేదలను ఉన్నత స్థాయికి తీసుకువస్తామని ప్రచారం చేసుకుంటున్న కూటమి సర్కార్ (పబ్లిక్–ప్రైవేట్–పీపుల్ పార్టనర్షిప్) పీ–4 అమలుకు కిందా మీద పడుతోంది. ఉగాది సందర్భంగా ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. పీ–4 ప్రారంభంలో పెద్ద ఎత్తున బంగారు కుటుంబాల ఎంపిక చేశారు. తీరా చూస్తే ఆ కుటుంబాలను దత్తత తీసుకునేందుకు మార్గదర్శకులు ముందుకు రావడం లేదు. ఆగస్టు 15 నాటికి నిర్దేశించిన లక్ష్యాలు సాధించాలని ముఖ్యమంత్రి వీడియో కాన్ఫ్రెన్స్లో దిశానిర్దేశం చేశారు. ఆ మేరకు జిల్లా కలెక్టర్లు క్షేత్ర స్థాయికి వెళ్లి అధికారులల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. అంతటితో ఆగకుండా సంపన్నుల్లో స్ఫూర్తి నింపేందుకు జిల్లా కలెక్టర్లు నిరుపేద కుటుంబాలను దత్తత తీసుకున్నారు. అయినా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా మార్గదర్శుల కోసం అన్వేషణ తప్పడం లేదు. క్షేత్ర స్థాయిలో పరిస్థితితో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. పీ–4 ‘ఆదిలోనే హంసపాదు’ అన్న సామెత చందంగా తయారై ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కు అన్నట్టుగా సాగుతోంది. కూటమి ప్రభుత్వంపై విశ్వాసం లేకనో మరేమిటో కారణం తెలియదు కానీ చంద్రబాబు చెబుతున్నట్టుగా ఆశించిన స్థాయిలో సంపన్నులు (మార్గదర్శులు) ముందుకు రావడం లేదు. ప్రభుత్వ ఆదేశాలతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అధికార యంత్రాంగం అంతా సంపన్నుల అన్వేషణలో తలమునకలై ఉంది. ప్రభుత్వం నిర్దేశించిన గడువు ఆగస్టు–15 దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో మిగిలిన పనులన్నింటినీ పక్కనబెట్టి అధికారులు సంపన్నుల అన్వేషణలో పడ్డారు. మార్గదర్శకులు ముందుకు రాకపోవడంతో పీ–4 ప్రారంభంలో పెద్ద సంఖ్యలో ఎంపిక చేసిన బంగారు కుటుంబాల సంఖ్య తగ్గించే పనిలో పడ్డారు. బంగారు కుటుంబాల తుది జాబితా కోసం సచివాలయ ఉద్యోగుల దగ్గర నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు సర్వేలలో తలమునకలై ఉన్నారు. ఉదాహరణకు కాకినాడ జిల్లా యంత్రాంగం పారిశ్రామిక సంస్థలు, విభిన్న సంపన్న వర్గాలను మార్గదర్శకులుగా అభ్యర్థిస్తూ 80 లేఖలు రాశారని సమాచారం. మిగిలిన రెండు జిల్లాల్లోను కొద్ది అటు, ఇటుగా దాదాపు ఇదే వాతావరణం కనిపిస్తోంది. ఈ సరికే చారిటీలతో పేదలకు సేవలందిస్తున్నామని కొందరు, కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఫండ్తో సేవలు చేస్తున్నామని మరి కొందరు, నిరుపేదలను ఆదుకుంటున్నామని ఇంకొందరు ఆసక్తి చూపకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. పేదల్లో నిరుపేదల ఎంపిక పేరుతో బంగారు కుటుంబాల సంఖ్య కుదించే పనిలో పడ్డారు. బంగారు కుటుంబాల తగ్గింపు, మార్గదర్శకుల గుర్తింపు ప్రక్రియ మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు గుదిబండగా మారింది. మండల స్థాయిలో ఒక్కో అధికారి నలుగురికి తక్కువ కాకుండా మార్గదర్శకులను గుర్తించాలని ఉన్నత స్థాయి నుంచి అధికారులపై ఒత్తిళ్లు ఉన్నాయి. ఈ మేరకు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. పారిశ్రామిక సంస్థలు, ప్రవాస భారతీయులు, వైద్యులు, విభిన్న రంగాలకు చెందిన సంపన్నులను గుర్తించి పీ–4 అమలులో మార్గదర్శకులుగా వారిని భాగస్వాముల్ని చేయాల్సిన బాధ్యతను అప్పగించడం అధికారులకు గుదిబండగా మారింది. మొదట్లో ఎడాపెడా కుటుంబాలను ఎంపిక చేయించిన ప్రభుత్వం ఇప్పుడు మార్గదర్శకాల పేరుతో కుటుంబాల సంఖ్యను తగ్గించే పని అప్పగించింది. సొంతిల్లు, విద్యుత్ కనెక్షన్, కుళాయి కనెక్షన్.. ఇవేవీ లేని అత్యంత నిరుపేదలను ఎంపిక చేయాలని పై నుంచి వచ్చిన ఆదేశాలతో మండల స్థాయిలో అధికారులు తల పట్టుకుంటున్నారు. ప్రజల కనీస అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. కానీ సంపన్నులకు ఆ బాధ్యతను అప్పగించడమంటే ప్రభుత్వం పేదల సంక్షేమం నుంచి వైదొలగడమేనని మేధావి వర్గం అభిప్రాయపడుతోంది. ప్రభుత్వ పథకాల నుంచి పేదలు లబ్ధి పొందితే ఎవరికీ జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉండదు. పీ–4లో సంపన్నుల నుంచి సాయం అందితే పేదలను వారి చెప్పుచేతల్లో పెట్టడమేనని అ భిప్రాయపడుతున్నారు. పీ–4 కోసం సంపన్నుల గుర్తింపు పెద్ద ప్రహసనంగా తయారై మండల స్థాయిలో అధికారులకు తలకు మించిన భారంగా తయారైంది. పల్టీ కొడుతున్న పీ–4 పథకం సంపద సృష్టి అని సంపన్నుల వెంట ప్రదక్షిణ బంగారు కుటుంబాల కోసం ముందుకు రాని మార్గదర్శకులు అధికారులకు గుదిబండగా సంపన్నుల అన్వేషణ బంగారు కుటుంబాల్లో కోత మార్గదర్శకుల సహకారంతో పీ–4జీరో పేదరికమే ధ్యేయంగా మార్గదర్శకుల సహకారంతో ఆర్థిక అసమానతలను రూపుమాపేందుకు పీ–4 దోహదపడుతుంది. ఉన్నత ఆశయంతో చేపట్టిన ఈ పథకం విజయవంతానికి సంపన్నులు, పారిశ్రామికవేత్తలు, ప్రవాసభారతీయులు ముందుకు రావాలి. అందరి సహకారంతో తక్కువ సమయంలో బంగారు కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాం. క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అంతా సమిష్టిగా కృషిచేసి సమాజంలో ఆర్థిక సాధికారతలో భాగస్వామ్యులు కావాలి. బంగారు కుటుంబాలను దత్తత ఇచ్చేందుకు గ్రామ సభల ద్వారా మార్గ దర్శకులను ఎంపిక చేయాలి. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలి. ఈ కార్యక్రమం ద్వారా సుస్థిరాభివృద్ధి సాధ్యమవుతుంది. – షణ్మోహన్, జిల్లా కలెక్టర్, కాకినాడ కుటుంబాల కుదింపు సరికాదు పీ–4తో మొదట్లో పెద్ద సంఖ్యలో పేదలను ఎంపిక చేశారు. ఇప్పుడేమో సవాలక్ష నిబంధనలు పెట్టి కుటుంబాల సంఖ్యను తగ్గించేయాలనుకుంటున్నారు. ఈ రకమైన విధానంతో ప్రభుత్వం ఏం సాధించాలనుకుంటోందో స్పష్టత ఇవ్వాలి. పూర్వం సంపన్నవర్గాలు సాయం, అప్పు రూపంలో డబ్బులిచ్చి అందుకు తగ్గట్టు పనిచేయించుకునే వారు. ఆ పరిస్థితి చంద్రబాబు సర్కార్ తీసుకువస్తున్న పీ–4లో కనిపిస్తోంది. పేదలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అందుకు నేరుగా అవసరమైన సాయం అందించాలి. – కర్ణాకుల వీరాంజనేయులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రైతుకూలీ సంఘం, జగ్గంపేట -
సత్యదేవుని జయంత్యుత్సవాలకు శ్రీకారం
రుత్విక్కులకు దీక్షావస్త్రాలు అందజేసిన చైర్మన్ రోహిత్, ఈఓ సుబ్బారావు అన్నవరం: రత్నగిరీశుని 135వ ఆవిర్భావ వేడుకలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఎనిమిది గంటలకు పండితులు విఘ్నేశ్వరపూజ, పుణ్యావహచనం తదితర కార్యక్రమాలను నిర్వహించి స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి జయంత్యుత్సవాలకు అంకురార్పణ చేశారు. ప్రధాన ఆలయంలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను పట్టువస్త్రాలతో, స్వర్ణాభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. జప, తపాలు చేసే 40 మంది రుత్విక్కులకు దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు దీక్షా వస్త్రాలను అందచేశారు. రుత్విక్కుల వేద మంత్రాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. సూర్య నమస్కారాలు, లింగాష్టకం, నవావరణ అర్చన, రామాయణ, భాగవత పారాయణ, శ్రీ, పురుష సూక్త పారాయణ, బాలా, కౌమారీ, సువాసినీ పూజలు నిర్వహించారు. సాయంత్రం దర్బారు మండపంలో మండపారాధన, కలశస్థాపన ఆయుష్యహోమానికి అంకురార్పణ చేశారు. గరుడ వాహనంపై ఊరేగింపు సత్యదేవుడు, అమ్మవారిని సాయంత్రం 6.30 నుంచి 8 గంటల వరకు గరుడ వాహనంపై కొండ దిగువన ఊరేగించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంగణాలను విద్యుద్దీపాలు, పూలతో అలంకరించారు. కార్యక్రమంలో దేవస్థానం ఆస్థాన వేదపండితులు గొల్లపల్లి ఘనపాఠి, యనమండ్ర శర్మ, గంగాధరభట్ల గంగబాబు, శివ ఘనపాఠి, ముష్టి పురుషోత్తం, ప్రధానార్చకులు ఇంద్రగంటి నర్శింహమూర్తి పాల్గొన్నారు. నేడు స్వామివారి జయంత్యుత్సవం సత్యదేవుని జయంత్యుత్సవాల్లో భాగంగా శనివారం ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించనున్నారు. తెల్లవారుజామున రెండు గంటలకు స్వామి, అమ్మవార్ల మూలవిరాట్లకు పంచామృతాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం స్వామి, అమ్మవారు, శంకరులకు అలంకరణ, 11 గంటలకు అనివేటి మండపంలో ఆయుష్యహోమం పూర్ణాహుతి నిర్వహించనున్నారు. -
చంద్రబాబు, లోకేష్లపై కేసులు పెట్టాలి
తుని: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే కాలర్ పట్టుకుని నిలదీయాలని చెప్పిన మంత్రి నారా లోకేశ్, మోసగించిన చంద్రబాబులపై ప్రజలు పోలీస్ కేసులు పెట్టాలని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ప్రజలను కోరారు. శుక్రవారం తుని మర్చంట్ అసోసియేషన్ భవనంలో బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీపై పట్టణ వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశం రాష్ట్ర మున్సిపల్ విభాగం కార్యదర్శి రేలంగి రమణగౌడ్ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దాడిశెట్టి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను వంద శాతం అమలు చేసి ఎన్నికలకు వెళ్లారని, ఇది చూసి ఆందోళన చెందిన చంద్రబాబు సూపర్ సిక్స్ పేరిట సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారన్నారు. ఏడాది పూర్తవుతున్నా రెండు పథకాలు మాత్రమే అమలు చేశారని, మిగిలిన వాటి జోలికి వెళ్లడంలేదన్నారు. ఆడబిడ్డ నిధి అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలని మరో మంత్రి అచ్చెన్నాయుడు అనడాన్ని ఎద్దేవా చేశారు. తల్లికి వందనం పథకంలో 30 లక్షల మందికి మెండి చేయి చూపించారని విమర్శించారు. ఇదే చంద్రబాబు వైఎస్సార్ సీపీ హయంలో సంక్షేమ పథకాలు ఇస్తుంటే రాష్ట్రం శ్రీలంక, సోమాలియాలా అయిపోతుందని గగ్గోలు పెట్టారన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో 13 శాతం గ్రోత్ రేటు ఉంటే ఈ ప్రభుత్వంలో 3 శాతం ఉందని, అంటే 10 శాతం వృద్ధి రేటు తగ్గిందన్నారు. ప్రజలు 2014–19, 2019–24 మధ్య కాలంలో ఎవరి పాలనలో ప్రజలకు మేలు జరిగిందో విశ్లేషించుకోవాలన్నారు. మద్యం కేసుకు సంబంధించి గత ప్రభుత్వం 3.28 కోట్ల పత్రాలను ధ్వంసం చేసిందని చెబుతున్నారని, ఇది ఏలా సాధ్యమో ప్రజలు తెలుసుకోవాలన్నారు. చంద్రబాబు నాయుడు, ఎల్లో మీడియాలో వస్తున్న కథనాలను నమ్మవద్దన్నారు. కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాలు అందించారని, ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో నిరంతరం కృశారని, ఇదే చంద్రబాబు అయితే రూ.కోట్లలో నిధులు పక్కదారి పట్టి ఉండేవన్నారు. తుని పట్టణ బాధ్యతను తానే తీసుకుంటున్నానని, ప్రజలకు అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు యనమల కృష్ణుడు మాట్లాడుతూ అందరికీ పథకాలు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబితే తునిలో ఉన్న సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మాత్రం టీడీపీ కార్యకర్తలకే ఇస్తామని చెబుతున్నారని విమర్శించారు. రాష్ట్ర క్రిష్టియన్ విభాగం రాష్ట్ర కార్యదర్శి నక్కా జాన్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలను మోసగించడంలో దొందూ దందే ప్రజా సంక్షేమం కోసం జగన్ పని చేశారు కరోనా సమయంలో ఆర్థికంగా ఆదుకున్నారు మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా -
ఆయకట్టుకు నేడు పంపా నీరు
● తొలుత 40 క్యూసెక్కుల విడుదల ● 93.5 అడుగులకు చేరిన నీటిమట్టం ● అవసరాన్ని బట్టి మరిన్ని జలాలు ● ఈఈ శేషగిరిరావు అన్నవరం: పంపా రిజర్వాయర్ నుంచి ఆయకట్టుకు శనివారం సాగునీరు విడుదల చేస్తున్నట్లు పెద్దాపురం డివిజన్ ఇరిగేషన్ ఈఈ జి.శేషగిరి రావు శుక్రవారం తెలిపారు. ఉదయం తొమ్మిది గంటలకు రైతు నాయకులు నదికి పూజలు చేసి సారె సమర్పించిన అనంతరం నీటిని విడుదల చే యనున్నట్టు ఈఈ తెలిపారు. ప్రస్తుతం 20 క్యూ సెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని రైతుల అ వసరాల మేరకు మరింత వదులుతామని ఆయన తెలిపారు. వాతావరణం అనుకూలంగా ఉన్నందున ఈ ఏడాది పూర్తి స్థాయిలో పంపా ఆయకట్టులో 12,500 ఎకరాలకు సాగునీరు అందిస్తా మని తెలిపారు. చివరి ఆయకట్టుకు కూడా నీరు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నీటిమట్టం 93.5 అడుగులు పంపా రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టం 103 అడు గులు కాగా, శుక్రవారం సాయంత్రానికి 93.5 అ డుగులకు చేరుకుంది. గరిష్ట నిల్వ 0.43 టీఎంసీ లు కాగా ప్రస్తుతం 150 ఎంసీఎఫ్టీ నిల్వ ఉంది. రెండ్రోజులుగా పంపా క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు కురుస్తున్నందున రిజర్వాయర్ లోకి 105 క్యూసెక్కుల నీరు వస్తోందని, నీటిమట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని ఈఈ తెలిపారు. ఎస్జీటీ, స్కూలు అసిస్టెంట్లకు పరీక్ష రేపు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కొంతమూరులోని ఈస్టర్ ఎక్స్న్ రెసిడెన్షియల్ ఎయిడెడ్ ఎలిమెంటరీ, హైస్కూల్లో ఖాళీగా ఉన్న ఎస్జీటీ, స్కూలు అసిస్టెంట్ పోస్టులకు ఆదివారం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు శుక్రవారం తెలిపారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు ఈ పరీక్షకు హాజరుకావాలన్నారు. మొదటి సెషన్ ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. కాకినాడలోని అయాన్ డిజిటల్ జోన్, అచ్యుతాపురంలో 486 మందికి మొదటి సెషన్లో స్కూలు అసిస్టెంట్, 500 మందికి రెండో సెషన్లో ఎస్జీటీ వారికి పరీక్షలు జరుగుతాయన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, లూథర్గిరిలోని అయాన్ డిజిటల్ జోన్లో 263 మందికి రెండో సెషన్లో ఎస్జీటీలకు పరీక్షలు జరుగుతాయన్నారు. ఈవీఎం, వీవీ ప్యాట్లకు పటిష్ట భద్రత బోట్క్లబ్: ఈవీఎం, వీప్యాట్ (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు)లకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం, వీవీ ప్యాట్ గోదాములను శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ అసిస్టెంట్ సీఈఓ, రాష్ట్ర ఈవీఎంల నోడల్ అధికారి పి .తాతబ్బాయి, రెవెన్యూ, ఎన్నికలు, పోలీస్శాఖల అధికారులతో కలసి కలెక్టర్ పరిశీలించారు. ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లను తనిఖీ చేసి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
భారీ ప్యాకేజీలే లక్ష్యం!
సీఎస్ఈ వైపు మొగ్గుతున్నారు ఇంజినీరింగ్ అంటే సాఫ్ట్వేర్ అనే విధంగా ప్రస్తుతం ట్రెండ్ మారిపోయింది. బీటెక్లో సంప్రదాయ కోర్సులు ఉన్న నేటి కాలంలో సా ంకేతికతకు అనుగుణంగా కొత్త కోర్సులు రావడంతో విద్యార్థులు వాటివైపే మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా ఆర్టిఫీషియల్ ఇంటిలెజెన్స్, డేటాసై న్స్ వంటి వాటిపై ఆసక్తి చూపుతున్నారు. ఎమర్జింగ్ టెక్నాలజీ, కోడింగ్ ప్లాట్ఫామ్స్, సాఫ్ట్స్కిల్స్పై అవగాహన ఉంటే ఉపాధి త్వరగా పొందవచ్చు. – ఎన్.రామకృష్ణయ్య, సీఎస్ఈ ప్రొఫెసర్, జేఎన్టీయూకే రేపటి నుంచి రెండవ దశ కౌన్సెలింగ్ మొదటి దశలో సీటు పొందిన విద్యార్థులు శనివారం సాయంత్రంలోగా కళాశాలలో రిపోర్టు చేయాలి. లేకుంటే సీటు రద్దవుతుంది. రెండో దశ కౌన్సెలింగ్కు సంబంధించి 27వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్కు షెడ్యూల్ విడుదల చేశారు. షెడ్యూల్ ఇదే.. 27వ తేదీ నుంచి 30 వరకూ రిజిస్ట్రేషన్. 28 నుండి 30 వరకూ సర్టిఫికెట్లు అప్లోడ్. 28 నుండి 31 వరకూ వెబ్ అప్షన్లు. ఆగస్టు 1న వెబ్ అప్షన్లు మార్పు. ఆగస్టు 4న సీట్లు కేటాయింపు. ఆగస్టు 8న రిపోర్టింగ్కు తుది గడువు. బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంజినీరింగ్ కళాశాలల్లో మొదటి దశ ప్రవేశాలకు కన్వీనర్ కోటా ద్వారా సీట్లు సాధించిన విద్యార్థుల చేరికకు శనివారం సాయంత్రంతో తుది గడువు ముగియనుంది. దీంతో మరో వారం రోజుల్లో విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇంజినీరింగ్లో దాదాపు 40 వరకూ వివిధ కోర్సులకు బ్రాంచ్లు ఉన్నప్పటికీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ విద్యార్థులు మూడో ఏడాదిలోనే భారీ వార్షిక ప్యాకేజీతో ఉద్యోగాలు సాధిస్తున్నారు. ప్రస్తుత కంపెనీల అవసరాలకు అనుగుణంగా జాబ్ మార్కెట్ ట్రెండ్కు అనువుగా కంప్యుటర్ సైన్స్లో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ), ఇంటర్నెట్ ఆఫ్థింగ్స్(ఐవోటీ) బ్లాక్ చైన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, మెషీన్ లెర్నింగ్, డైటా సైన్స్ వంటి కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. వీటికి దేశ విదేశాల్లో అపార ఉద్యోగ అవకాశాలు ఉండడంతో విద్యార్థులు ఈ కోర్సులకు ఆసక్తి చూపుతున్నారు. కన్వీనర్ కోటాలో సీటు రాకపోయినా ప్రతి కళాశాలకు బ్రాంచ్కు 12 సీట్లు చొప్పున మేనేజ్మెంట్ కోటా ఉండటంతో ఈ కోటాలో చేరడానికి ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. కాకినాడ జిల్లా పరిధిలో పేరొందిన ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్ఈ బ్రాంచ్కు రూ.3 నుంచి రూ.4 లక్షలు డోనేషన్ చెబుతున్నారంటే ఏ స్థాయిలో డిమాండ్ ఉందో తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఉన్న కళాశాలల్లో అన్ని విభాగాలు కలిపి 16,700 సీట్లు ఉండగా వీటిలో 5,600 వరకూ సీఎస్ఈ విభాగానికి చెందినవే. వీటిలో 90 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఉన్న బ్రాంచ్లలో సీట్లు తగ్గించి సీఎస్ఈ సంబంధిత కోర్సులకు అధిక సీట్లు కేటాయించాలని ఉమ్మడి జిల్లాలోని ఏడు కళాశాలలు జేఎన్టీయూకేకు దరఖాస్తు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు అంతగా ఆసక్తి చూపని మెకానికల్, సివిల్, కెమికల్, ఆటో మొబైల్, ఈఈఈ, మైనింగ్ వంటి విభాగాలో కోర్సులను ఆయా కళాశాలలు వదిలించుకుంటున్నాయి. ప్రారంభ ప్యాకేజీ రూ.4 లక్షలు సీఎస్ఈ విభాగంలో బీటెక్ పూర్తిచేసిన వారికి ప్రారంభ ప్యాకేజీ రూ.4 కావడం, టీసీఎస్, విప్రో, హెచ్పీసీఎల్, మెక్రోసాఫ్ట్, టెక్ మహీంద్ర, ఐబీఎం వంటి కంపెనీలు ఆ కోర్సులు చేసిన విద్యార్థుల కోసం క్యూ కట్టడంతో డిమాండ్ పెరిగిపోయింది. గత ఏడాది సీఎస్ఈ విద్యార్థులు ఇద్దరికి రూ.36 లక్షలు, సీఎస్ఈ ఎంటెక్ విద్యార్థికి గూగుల్ సంస్థలో సెక్యూరిటీ అనలిస్ట్గా రూ.67 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం రావడం జేఎన్టీయూకే చరిత్రలో మైలు రాయిగా నిలచింది. జేఎన్టీయూకేతో పాటు అనుబంధ కళాశాలల్లో సీఎస్ఈ బ్రాంచ్ విద్యార్థులు 95 శాతం నాలుగో ఏడాదిలో ఉండగానే ఉద్యోగాలు రావడం వంటివి మరింత ఉత్సాహాన్నిస్తున్నాయి. సంప్రదాయ సీట్లకు తగ్గిన ఆదరణ ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, ఐటీ, సివిల్ వంటి బ్రాంచ్ల సీట్లు జేఎన్టీయూకే వంటి కళాశాలలలో తప్ప వాటి అనుబంధ ప్రైవేట్ కళాశాలల్లో పూర్తి స్థాయిలో భర్తీ కావడం లేదు.బ్రాంచ్కు 60 సీట్లు చొప్పున ఉంటే 30 నుంచి 35 వరకూ మాత్రమే భర్తీ అవుతున్నాయని యాజమాన్యాలు చెబుతున్నాయి. ఏ కోర్సు చేసిన సాఫ్ట్వేర్ రంగమే బీటెక్లో ఏ కోర్సు అభ్యసించిన నాలుగో ఏడాది సాఫ్ట్వేర్ రంగ సంస్థలు చేపట్టే క్యాంపస్ ఇంటర్వ్యూల్లో పాల్గొని ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఉదాహరణకు కాకినాడ పరిధిలో పేరొందిన ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈసీఈ, మెకానికల్ విద్యార్థులు నాలుగో ఏడాదిలో ఉండగా 20 లక్షల ప్యాకేజీతో ఇటీవల ఉద్యోగాలు సాధించారు. ప్రైవేట్ కళాశాలలో అన్ని బ్రాంచ్ల విద్యార్థులకు సీఆర్టీ (క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్) తరగతులు నిర్వహించి క్యాంపస్ ఇంటర్వ్యూలకు సన్నద్ధమయ్యేలా శిక్షణ ఇస్తున్నారు. జేఎన్టీయూకే అన్ని బ్రాంచ్లు కలిపి 300 సీట్లు ఉండగా 90 శాతం మంది ప్రముఖ టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి సంస్థల్లో ఉద్యోగాలు సాధిస్తున్నారు. దీన్నిబట్టి ఏ బ్రాంచ్ తీసుకున్నా అఖరి సంవత్సరంలో ఒకే రంగంలోకి వస్తున్నారన్నది అర్థమౌతోంది. జేఎన్టీయూకే ఈసీఈ విద్యార్థి బొడపాటి నివాస్ రూ.35 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించాడు. ఏఐ, డేటాసైన్స్లే అందరి ఆప్షన్ సంప్రదాయ కోర్సులు కాదని సీఎస్ఈ వైవే విద్యార్థుల మొగ్గు ఉమ్మడి జిల్లాలో 5,600 సీట్లు అవే నేటితో తొలి దశ షెడ్యూల్ ముగింపు రేపటి నుంచి రెండో దశ షెడ్యూల్ -
వెయ్యి మందికి విజయవంతంగా ఐవీఎఫ్
కాకినాడ క్రైం: కాకినాడ మెడ్వే సంజీవి ఐవీఎఫ్ సెంటర్లో వెయ్యి మందికి మహిళలకు ఐవీఎఫ్లు నిర్వహించి, తల్లి కావాలన్న వారి కలను సాకారం చేశామని ఐవీఎఫ్ నిపుణురాలు, గైనకాలజిస్టు డాక్టర్ ఎన్.కిన్నెర వీణ అన్నారు. ఆ సెంటర్లో శుక్రవారం వరల్డ్ ఐవీఎఫ్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్లో డాక్టర్ కిన్నెర మాట్లాడుతూ సమగ్ర సంరక్షణ ద్వారా తల్లిదండ్రుల కల నెరవేర్చడమే తమ లక్ష్యమన్నారు. సెంటర్ హెడ్ దినేష్ కుమార్ మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో ఐవీఎఫ్ చికిత్స అందిస్తున్నామన్నారు. మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సూర్యప్రసాద్ మాట్లాడుతూ ఐవీఎఫ్ కేవలం ఓ వైద్య ప్రక్రియ కాదని, వైవాహిక జీవితాన్ని సంపూర్ణం చేసే ఓ అద్భుతమన్నారు. డాక్టర్ సందీప్ మాట్లాడుతూ ప్రతి ఐవీఎఫ్ కేసుపై వ్యక్తిగత పర్యవేక్షణ కొనసాగిస్తూ తల్లిదండ్రుల కలలు సాకారం చేస్తున్నామని తెలిపారు. కాగా.. ఐవీఎఫ్ ద్వారా విజయవంతంగా పిల్లల్ని పొందిన తల్లిదండ్రులు తమ అనుభవాల్ని పంచుకున్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 23,000 – 23,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 27,500 గటగట (వెయ్యి) 25,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,000 గటగట (వెయ్యి) 24,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
పరామర్శకు వెళుతూ మృత్యుఒడికి..
● ఆటోను ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్ బస్సు ● తల్లీ కుమార్తెలు, ఆటోడ్రైవర్ మృతి ● మరొకరికి తీవ్ర గాయాలు ● పటవల వద్ద ప్రమాదం తాళ్లరేవు: ఆటోను ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జాతీయ రహదారి 216లో పటవల జిల్లా పరిషత్ హైస్కూల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు, కోరంగి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ ఏటిమొగ గ్రామానికి చెందిన తల్లీకూతుళ్లు పోతాబత్తుల దుర్గ, లంకే భవానితో పాటు దుర్గ చెల్లెలు ఓలేటి లక్ష్మి శుక్రవారం గాడిమొగ పంచాయతీ చినవలసల గ్రామానికి సంగాడి గంగరాజును పరామర్శించేందుకు ఆటోలో బయలు దేరారు. గంగరాజు ఇటీవల కంటికి ఆపరేషన్ చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. జాతీయ రహదారి 216లో పటవల జిల్లా పరిషత్ హైస్కూల్ సమీపంలోకి వచ్చే సరికి వీరి ఆటోను ప్రైవేటు బస్సు ఢీకొంది. ఈ ఘటనలో పోతాబత్తుల దుర్గ (55), లంకే భవాని (35)తో పాటు యానాం కురసాంపేటకు చెందిన ఆటో డ్రైవర్ కూరాకుల కుమార్ రాజు (30) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఓలేటి లక్ష్మిని అంబులెన్స్లో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని కాకినాడ రూరల్ సీఐ చైతన్య కృష్ణ, కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ సందర్శించారు. ప్రమాదానికి కారణమైన బస్సును సీజ్ చేసి, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురి మృతదేహాలను కాకినాడ జీజీహెచ్కు తరలించారు. కాగా.. విజయవాడ సమీపంలో నందిగామ వద్దనున్న కేతవరం గ్రామంలో నివసిస్తున్న దుర్గ తన కుమార్తె భవాని కుమారులు శ్రీనివాస్, దేవేంద్రల చదువు నిమిత్తం కాకినాడకు వచ్చి ఉంటోంది. అలాగే కురుసంపేట వీటీసీకి చెందిన రాజు ఆటో నడుపుతూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. వీరి మృతితో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. -
28 నుంచి ఎంపీడీఓలకు శిక్షణ
సామర్లకోట: స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో ఈ నెల 28 నుంచి ఎంపీడీఓలుగా పదోన్నతి పొందిన 89 మందికి శిక్షణ ఇస్తున్నట్లు శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ కేఎన్వీ ప్రసాదరావు తెలిపారు. ఆయన శుక్రవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలో పదోన్నతి పొందిన ఎంపీడీఓలకు నెల రోజుల పాటు శిక్షణ ఉంటుందన్నారు. ఈ నెల 28 నుంచి ప్రారంభమయ్యే మొదటి బ్యాచ్లో 46 మంది ఎంపీడీఓలు హాజరవుతారన్నారు. మొదటి బ్యాచ్ శిక్షణ పూర్తయిన తర్వాత రెండో బ్యాచ్ శిక్షణ ఉంటుందన్నారు. -
మహిళను రక్షించిన పోలీసులు
తాళ్లపూడి (కొవ్వూరు): స్థానిక రోడ్ కం రైల్వే వంతెన పైనుంచి గోదావరిలో దూకబోయిన మహిళను పట్టణ పోలీసులు రక్షించారు. వివరాల్లోకి వెళితే. కొయ్యలగూడెం మండలానికి చెందిన సుమారు 30 ఏళ్ల మహిళ తన కుటుంబ సమస్యలతో మనస్తాపం చెంది, ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో శుక్రవారం కొవ్వూరులోని రోడ్ కం రైల్వే వంతెన పైకి వచ్చింది. అటుగా ఆటోలో వెళ్తున్న శ్రీనివాస్ అను వ్యక్తి ఆ మహిళను గమనించి, 112 ద్వారా జిల్లా పోలీసులకు సమాచారం అందించాడు. ఎస్పీ డి.నరసింహ కిశోర్ ఆదేశాల మేరకు కొవ్వూరు పట్టణ సీఐ పి.విశ్వం వెంటనే కొవ్వూరు టౌన్ సిబ్బంది ఎంవీవీ సత్యనారాయణను స్థలానికి పంపారు. దీంతో ఆ మహిళను గుర్తించి, ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకుని, పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత ఆమె బంధువులకు అప్పగించారు. -
126 ఏళ్ల వృక్షానికి పునరుజ్జీవం
రాజమహేంద్రవరం సిటీ: నగరంలోని సుమారు 126 ఏళ్ల వయసున్న వృక్షానికి పునరుజ్జీవం వచ్చింది. స్థానిక టౌన్ హాలు రోడ్డులోని మెరక వీధిలో కొద్ది రోజుల క్రితం ఆ చెట్టు కూలిపోయింది. దీంతో రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ స్పందించింది. ఆ క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ తీగెల రాజా ఆధ్వర్యంలో ఆ చెట్టును శుక్రవారం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయ ఆవరణలో నాటారు. ఐకాన్స్ ప్రెసిడెంట్ మండవల్లి వెంకన్న బాబు, ప్రోగ్రాం చెర్మన్ రైతుబిడ్డ దుర్గాప్రసాద్, జాయింట్ సెక్రటరీ డి.నవీన్ ప్రసాద్, సభ్యులు పాల్గొన్నారు. -
ఉద్యోగుల బకాయిలు విడుదల చేయాలి
● సచివాలయ ఉద్యోగులతో వెట్టిచాకిరీ ● రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు బాపూజీ ముమ్మిడివరం: ఉద్యోగులకు ఇవ్వాల్సిన రూ.25 వేల కోట్ల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దాల బాపూజీ డిమాండ్ చేశారు. ముమ్మిడివరం డీఎంహెచ్ఓ కార్యాలయ ఆవరణలో శుక్రవారం జరిగిన జిల్లా ఉద్యోగుల సంఘ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయాలని, పెండింగ్ డీఏ బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కాశీభట్ల రామసూర్యనారాయణ నాయకత్వంలో రాష్ట్రంలో ఎనిమిది లక్షల ఉద్యోగులను ఐక్యం చేసి ముందుకు సాగుతామన్నారు. జిల్లాలో అర్బన్, రూరల్ ప్రాంతాలలో సచివాలయ ఉద్యోగులతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని బాపూజీ వాపోయారు. సెలవు దినాలలో కూడా ఉద్యోగులతో పని చేయించుకోవడం అన్యాయమన్నారు. ఫీల్డ్ వర్కు పేరుతో నిర్బంధించి పని చేయించడం ఉద్యోగుల హక్కులను కాలరాయడమేనన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కె.మల్లిబాబు మాట్లాడుతూ ఈ నెల 25, 26 తేదీల్లో విజయవాడలో జరిగే ప్రభుత్వ ఉద్యోగుల రాష్ట్ర సమావేశంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటానికి పిలుపు ఇస్తామన్నారు. జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు కె.వీరబాబు, జిల్లా కోశాధికారి ఎస్.రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ముమ్మిడివరం తాలూకా కమిటీ నియామకం జరిగింది. తాలూకా అధ్యక్షుడిగా జీఎస్వీడీ ప్రసాద్, కార్యదర్శిగా రెడ్డి సుబ్రహ్మణ్యం, అసోసియేట్ అధ్యక్షుడిగా ఎం.నూకరత్నం, ఉపాధ్యక్షులుగా డాక్టర్ పూజ, టి.సుజాత, డి.సువర్ణరాజు, ఎం.స్టీవెన్, కోశాధికారి డి.మహేష్, సహయ కార్యదర్శులుగా ఎం.రమేష్, సీహెచ్ లలిత నియమితులయ్యారు. -
గంజాయి తరలిస్తున్న ముగ్గురి అరెస్టు
రాజమహేంద్రవరం రూరల్: గంజాయి తరలిస్తున్న ముగ్గురిని ఎౖక్సైజ్ అధికారులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి చింతా డ లావణ్యకు వచ్చిన సమాచారం మేరకు శుక్రవారం కొంతమూరు గ్రామ పరిధిలోని జాతీయ రహదారిపై గల నయరా పెట్రోల్ బంక్ సమీపంలో ఎకై ్సజ్ అధికారులు వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కారులో 220 కేజీల గంజాయిని తరలిస్తున్న తమిళనాడుకు చెందిన నాగరాజు, సుబ్రహ్మణ్యం, జైసల్వాలను అదుపులోకి తీసుకున్నారు. వారిపై ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ నార్త్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పి.హనుశ్రీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడిలో ఎస్సై సీహెచ్ రాజేష్, ఎం.శ్రీనివాసరావు, ఏ.రామాంజనేయులు, సిబ్బంది పాల్గొన్నారు. -
శిశువులకు అమృతమే..
జిల్లాలో పరిస్థితి అంగన్వాడీ కేంద్రాలు 1,726 బాలింతలు 5,846 గర్భిణులు 7,725 ఆరు నెలల లోపు చిన్నారులు 901 6 నెలల నుంచి మూడేళ్ల లోపు చిన్నారులు 7,017 3–6 ఏళ్ల వయస్సున్న చిన్నారులు 8,041 ● తల్లిపాలలో పోషకాలు ● బిడ్డలకు తాగిస్తే ఎన్నో ప్రయోజనాలు ● తల్లులకూ ఉపయోగమే ● వచ్చే నెల ఒకటి నుంచి తల్లిపాల వారోత్సవాలు రాయవరం: శిశువుకు అత్యంత బలం, రోగనిరోధక శక్తిని అందించేవి తల్లిపాలే. అవి దాదాపు అమృతంతో సమానం. అందుకే పిల్లలు పుట్టిన వెంటనే తల్లి పాలు పట్టించాలని వైద్యులు చెబుతారు. తల్లి పాలు తాగిన పిల్లలకు రోగనిరోధకశక్తి పెరుగుతుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఎదుగుదల చాలా చక్కగా ఉంటుంది. అయితే పిల్లలకు తల్లి పాలు ఎప్పటి వరకూ పట్టించాలి, ముర్రుపాలు అంటే ఏమిటి అనే విషయాలపై అవగాహన పెంచుకోవడం చాలా అవసరం. దీని కోసం ఆగస్టు ఒకటి నుంచి ఏడో తేదీ వరకూ తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గర్బిణులు, బాలింతలకు తల్లిపాల విశిష్టతపై అవగాహన కల్పిస్తారు. తల్లిపాల గొప్పదనం తల్లిపాలు బిడ్డకు అమృతం లాంటివి. బిడ్డ పుట్టిన వెంటనే అర్ధగంటలోపు ముర్రుపాలు పట్టాలి. ఎందుకంటే ఆ పాలలో బిడ్డను వ్యాధుల నుంచి రక్షించే ఖనిజాలు, మాంసకృతులు, విటమిన్–ఏ సమృద్ధిగా ఉంటాయి. ముర్రుపాలు బిడ్డకు వ్యాధి నిరోధక టీకాగా పనిచేస్తుంది. తల్లిపాలు శిశువులకు ప్రకృతి ప్రసాదించిన అత్యుత్తమమైన పౌష్టికాహారం అని చెప్పవచ్చు. వీటి వల్ల పిల్లలకు మలవిసర్జన సులభంగా అవుతుంది. తల్లితో చక్కటి అనుబంధం ఏర్పడుతుంది. బిడ్డ కోరుకున్న ప్రతి సారి ఎంతసేపు తాగితే అంతసేపు తల్లి పాలు పట్టించాలి. ఆరోగ్యకర సమాజం సాంకేతిక కొత్త పుంతలు తొక్కుతున్న నేటి కాలంలో తల్లుల వైఖరిలో కూడా మార్పు వస్తోంది. బిడ్డకు పాలిస్తే తమ అందం పాడవుతుందని ఆలోచించే తల్లులు కూడా నేటి సమాజంలో దర్శనమిస్తున్నారు. తల్లి పాలు పట్టడం వలన బిడ్డలు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా, ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందన్న ఉద్దేశంతో వరల్డ్ అలైన్స్ ఫర్ బెస్ట్ ఫీడింగ్ ఏక్షన్(వాబా) అనే సంస్థ పర్యవేక్షణలో డబ్ల్యూహెచ్వో, యునిసెఫ్ వంటి అంతర్జాతీయ, బీపీఏఐ వంటి జాతీయ సంస్థల అనుబంధంగా ప్రపంచ వ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. తల్లిపాలను ముఖ్యంగా బిడ్డ పుట్టిన గంట లోపే ముర్రుపాలు ఎందుకు పట్టించాలనే అంశంపై ఏటా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో ఐసీడీఎస్, వైద్య ఆరోగ్యశాఖలు సంయుక్తంగా తల్లిపాల విశిష్టతపై అవగాహన కార్యక్రమాలు జరుపుతున్నాయి. వైద్యారోగ్యశాఖ రక్షణ అవసరం బాలింతలకు వైద్యఆరోగ్యశాఖ రక్షణ అవసరం. వారికి అవసరమైన మందులు అందించాలి. ముఖ్యంగా రక్తహీనత రాకుండా చర్యలు తీసుకోవాలి. అవసరమైన సమయంలో గర్భిణుల రక్తశాతాన్ని పరిశీలించాలి. ప్రసవం తర్వాత కాల్షియం, ఐరన్ మాత్రలను ఆరు నెలల పాటు అందించాలి. అధిక పోషకాలు పిల్లల సంపూర్ణ ఆరోగ్యానికి తల్లి పాలు మాత్రమే పట్టించాలి. తల్లి పాలలోనే పోషకాలు ఉంటాయి. ఆకలితో ఉన్న బిడ్డకు డబ్బా పాలు ఇవ్వడం వల్ల శక్తిని కోల్పోతారు. బిడ్డకు ఆరు నెలల వరకు తల్లి పాలు మాత్రమే అందించాలి. డబ్బా పాల ద్వారా పౌష్టికాహారం అందదు. – డాక్టర్ రమ్య, పీహెచ్సీ వైద్యాధికారి, రాయవరం వ్యాధులు దూరం దేవుడు సృష్టించిన తల్లి పాలు ఒక టీకా కంటే గొప్పవి. తల్లి పాలు పట్టించడం వల్ల బిడ్డకు వైరల్ ఇన్పెక్షన్లు రాకుండా ఉంటాయి. తల్లి పాలలో ఎన్నో పోషకాలు, ప్రొటీన్లు ఉంటాయి. బిడ్డలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుదలకు, శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదం చేస్తాయి. – డాక్టర్ పి.ప్రశాంతి, గైనకాలజిస్ట్, మండపేట సీహెచ్సీ తల్లికీ ప్రయోజనాలు బిడ్డకు తల్లి పాలివ్వడం వల్ల ఆరు నెలల్లోపు గర్భం దాల్చే అవకాశం ఉండదు. ఇది సహజ కుటుంబ నియంత్రణ పద్ధతిగా ఉపయోగపడుతుంది. పాలిచ్చే తల్లులకు రొమ్ము, గర్భసంచి, అండాశయం క్యాన్సర్లు వచ్చే అవకాశం తక్కువని కొన్ని రకాల అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే ప్రసవ సమయంలో స్థిరత్వం కోల్పోయిన గర్భసంచి పూర్వస్థితికి వచ్చి రక్తస్రావం తగ్గుతుంది. తల్లిపాల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, అవి పుష్కలంగా రావాలంటే గర్భిణిగా ఉన్నప్పటి నుంచే పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలి. పాలు, చేపలు, గుడ్లు, తాజా కూరగాయలు, పండ్లు తగిన మోతాదులో తినాలి. -
ఆటంకాలు వద్దన్నా..
అల్లవరం: ఎన్నో చిత్ర విచిత్రాలు.. మరెన్నో ఆక్రమణలు.. చూసిన వారు నోరెళ్లబెట్టేలా ఘటనలు.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సాగునీటి వ్యవస్థ తీరు చూస్తే అర్థమవుతోంది. కాలువలు ఎక్కడికక్కడే అధ్వానంగా ఉండడంతో ఇప్పటికే సాగునీరు అందక రైతన్నలు అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పుడేమో ఉన్న కాలువలను బక్కచిక్కేలా చేస్తున్నా ఆ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. స్వయానా జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఇటీవల ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించి, కాలువల వెంబడి ఆక్రమణలను తొలగించి శివారు ప్రాంతాలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించాలని సూచించినా ఆ ఆదేశాలను ఎవరూ ఖాతరు చేయడం లేదు. ఆ వివరాల్లోకి వెళితే.. అల్లవరం మండలం బోడసకుర్రు పంచాయతీ ఐలావారివీధి సమీపంలో ప్రధాన కాలువను ఆనుకుని ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించి రెండు అంతస్తుల భవనాన్ని యథేచ్ఛగా నిర్మిస్తున్నారు. కూటమి పార్టీలకు చెందిన కొందరు ఈ నిర్మాణానికి పూనుకున్నట్లు సమాచారం. కాలువలకు సాగునీరు విడుదల చేసేనాటికి రెండు అంతస్తుల భవనం పునాది స్థాయిలో ఉంది. అప్పటి నుంచి నేటి వరకూ ఈ విషయం ఇరిగేషన్ అధికారులకు తెలియకుండా ఉంటుందా అనేది ప్రశ్నగా మారింది. కాలువ వెంట ఆక్రమణలు తొలగించాలని జిల్లా కలెక్టర్, జేసీలు ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా ఆక్రమణ ఎక్కడా ఆగడం లేదు. ఇలా కాలువలను ఆక్రమించుకుని భవనాలు కడితే శివారు ప్రాంతాలకు సాగునీరు ఎలా అందుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇదే కాలువపై ఎంట్రుకోన ఎంపీపీ స్కూల్ వద్ద ఇటీవల వంతెన నిర్మాణం చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా కాలువ వెడల్పును తగ్గించి పనులు చేస్తున్నారు. దీనివల్ల నీటి ప్రవాహం గణనీయంగా తగ్గిందని రైతులు వాపోతున్నారు. కాలువలపై వంతెనలు, కల్వర్టులు నిర్మించేటప్పుడు ఇవన్నీ ఇరిగేషన్ అధికారులు చూడకపోవడం శోచనీయం. ఇప్పటికై నా జిల్లా స్థాయి అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తగిన చర్యలు తీసుకుంటాం బోడసకుర్రు ప్రధాన కాలువ అంచున రెండతస్తుల భవన నిర్మాణంపై ఇరిగేషన్ కన్జర్వేషన్ అసిస్టెంట్ చంద్రమౌళిని ‘సాక్షి’ వివరణ కోరింది. దీనిపై ఆయన మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న వారికి నోటీసులు ఇచ్చామన్నారు. తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే ఎంట్రుకోన వద్ద నిర్మిస్తున్న వంతెన గురించి ఇరిగేషన్ కన్జర్వేషన్ అసిస్టెంట్ శామ్యూల్ను అడగ్గా, ఈ నిర్మాణ పనులు పరిశీలించి, కాలువ వెడల్పు తగ్గినట్లు గుర్తిస్తే సంబంధిత కాంట్రాక్టర్కు నోటీసులు ఇస్తామని చెప్పారు. కలెక్టర్ హెచ్చరిస్తున్నా బేఖాతర్ ఇరిగేషన్ స్థలం ఆక్రమణ నిబంధనలకు విరుద్ధంగా వంతెన, భవన నిర్మాణం -
కొత్త కార్యవర్గం ఎన్నిక
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక ఎస్కేవీటీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయుల సంఘ నూతన కౌన్సిల్ సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా 2025– 27 సంవత్సరాలకు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల పరిశీలకుడిగా ప్రధానోపాధ్యాయుల సంఘ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి చెవ్వూరి రవి హాజరయ్యారు. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా కేవీ రమణారావు, ప్రధాన కార్యదర్శిగా ఐ.పంగిడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మంగిన శ్రీరామారావు, ఆర్థిక కార్యదర్శిగా పల్లి రాజు, రాష్ట్ర కౌన్సిలర్లుగా కోలా సత్యనారాయణ, జి.గణపతిరావు, కె.ఫణిశేఖర్, ఉపాధ్యక్షులుగా ఆర్.విజయదుర్గ, ఎం.చిమ్మరాజుదొర, జాయింట్ సెక్రటరీలుగా జేవీ శ్రీనివాస్, పి.వెంకట్రెడ్డి, మహిళా కార్యదర్శిగా జి.ప్రమీలరాణి, సీహెచ్ సుబ్బలకి్ష్మ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొత్త కార్యవర్గ సభ్యులతో ఎన్నికల పరిశీలకుడు చెవ్వూరి రవి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయులపై ఉన్నతాధికారులు పని ఒత్తిడి పెంచుతున్నారని, సర్వీస్ రూల్స్ లేకపోవడం వల్ల 15 ఏళ్ల నుంచి ఎటువంటి ప్రమోషన్లు లేకుండా ఉద్యోగ విరమణ చేస్తున్నారన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించాలన్నారు. రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి తుని: రైలు నుంచి జారిపడి మహారాష్ట్ర వాసి గురువారం మృతి చెందాడు. ఆ వివరాల్లోకెళితే.. మహారాష్ట్ర రాష్ట్రం నాందేడ్ జిల్లా, రీసంగాన్ గ్రామానికి చెందిన పరమేశ్వర్ పాండురంగ్ వవర్ (45) లారీ క్లీనర్గా పని చేస్తున్నాడు. నాందేడ్ నుంచి లారీపై అనకాపల్లి జిల్లా అచ్యుతాపురానికి లోడ్ తీసుకొచ్చాడు. లారీని డ్రైవర్కు అప్పగించి తిరుగు ప్రయాణంలో భాగంగా నాందేడ్ వెళ్లేందుకు యలమంచిలిలో రైలు ఎక్కాడు. నర్సీపట్నం రోడ్డు, గుల్లిపాడు రైల్వే స్టేషన్ల మధ్య ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానిక జీఆర్పీ ఎస్సై జి.శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు. -
సెలూన్లు, స్పా సెంటర్లలో తనిఖీలు
సెలూన్లు, స్పా సెంటర్లలో తనిఖీలుకాకినాడ క్రైం: జిల్లాలో వ్యభిచార మూలాలు విస్తృతమవుతున్న తరుణంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కాకినాడలో సెలూన్లు, స్పా సెంటర్లలో గురువారం విస్తృత తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ పర్యవేక్షణలో కాకినాడ ఏఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్ పర్యవేక్షణలో నగర వన్ టౌన్, టూ టౌన్, త్రీ టౌన్, పోర్టు పీఎస్ పరిధిలో ఉన్న సెలూన్లు, స్పా సెంటర్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేస్తున్నామని ఏఎస్పీ అన్నారు.హిజ్రా స్థావరాలపై పోలీసుల దాడి తాళ్లరేవు: జాతీయ రహదారి 216లోని యానాం బైపాస్ రహదారిలో ఉన్న హిజ్రాల స్థావరాలపై కోరంగి పోలీసులు దాడి చేసి, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ కథనం ప్రకారం.. యానాం బైపాస్ రహదారిలోని పెట్రోల్ బంకు నుంచి లచ్చిపాలెం ఆంజనేయస్వామి ఆలయం వరకూ రహదారి చెంతన హిజ్రాలు స్థావరాలు ఏర్పాటు చేసుకుని అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు అందిన ఫిర్యాదు మేరకు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇద్దరు హిజ్రాలను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసి మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ వద్ద హాజరు పరిచి బైండోవర్ చేశారు. హిజ్రాలకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి వారి జీవన విధానాన్ని మార్చుకోవాలని, హితబోధ చేశారు. -
వాడపల్లి హుండీల ఆదాయం రూ.1.53 కోట్లు
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి ఆలయ హుండీల ద్వారా రూ.1.53 కోట్ల ఆదాయం వచ్చిందని దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. 28 రోజుల అనంతరం దేవదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో గురువారం హుండీలను తెరిచారు. ఆయా హుండీల్లో భక్తులు చెల్లించిన నగదుతో పాటు స్వామికి చెల్లించిన ముడుపులను స్వామివారి వసంత మండపంలోకి తెచ్చారు. దేవస్థానం సిబ్బంది, అర్చకులు, స్థానికులు, సేవాదళం భక్తులు, శ్రీవారి సేవకులు నగదు, మొక్కుబడులను విభజించి లెక్కించారు. ఆలయంలో వేంకటేశ్వరస్వామివారి, విశ్వేశ్వరస్వామివారి హుండీల ద్వారా రూ.1.26,78,200, అన్నప్రసాదం హుండీల ద్వారా రూ.26,12,993 సమకూరింది. బంగారం 47 గ్రాములు, వెండి కిలో 600 గ్రాములు, 11 దేశాల కరెన్సీ నోట్లు 24 వచ్చినట్టు ఈఓ చక్రధరరావు తెలిపారు. ఆలయ క్షేత్రపాలకుడు అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామివారి ఆలయ హుండీల ద్వారా రూ.3,45,300 ఆదాయం వచ్చిందన్నారు. పర్యవేక్షణ అధికారులుగా కొత్తపేట మండలం మందపల్లి ఉమామందేశ్వర (శనైశ్చర) స్వామివారి దేవస్థానం ఏసీ అండ్ ఈఓ దారపురెడ్డి సురేష్బాబు, దేవదాయ శాఖ రాజమహేంద్రవరం ఇన్స్పెక్టర్ టీవీఎస్ఆర్ ప్రసాద్, అర్చకులు, గ్రామస్తులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. -
కొండచిలువ కలకలం
నల్లజర్ల: స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వెనుక తుప్పల్లో బుధవారం రాత్రి పది అడుగుల కొండ చిలువ కలకలం సృష్టించింది. ఇక్కడి పులి భాస్కరరావు ఇంటి సమీపంలో తుప్పల్లో కదలికలు రావడం చూసి పరిసర ప్రజల సాయంతో ఆయన కొండ చిలువను గుర్తించారు. తుప్పలు తొలగించి చూడగా కొండ చిలువ బయటకు వచ్చింది. దానిని యువకులు గునపాలతో పొడిచి చంపేశారు. ఆ ప్రాంతానికి ఎగువన అన్నీ ఉద్యాన తోటలే. కొంగువారిగూడెం నుంచి వచ్చే ఎర్రకాలువ కూడా ఉంది. అటవీ ప్రాంతం నుంచి ఇక్కడకు వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. గతంలో చిన్న చిన్న పాములు కనపడుతుండేవని, ఈ తరహా కొండ చిలువ రావడం ఇదే తొలిశారని గ్రామస్తులు అన్నారు. -
శ్రావణం... ఆధ్యాత్మిక తోరణం
కల్యాణ మండపాలకు గిరాకీ ఈ నెల 26 నుంచి శుభ ముహూర్తాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పెళ్లిళ్లు కుదుర్చుకున్న వారు తమ పిల్లల వివాహాలను ఈ ముహూర్తాల్లోనే అట్టహాసంగా జరిపించాలని భావిస్తున్నారు. ఎక్కడికక్కడ కల్యాణ మండపాలు బుక్ అయిపోయాయి. నూతన వైరెటీ కల్యాణ మండపాలు, సరికొత్త ఈవెంట్స్ను బుక్ చేసుకుంటున్నారు. ఈ ఏడాది నవంబరు 27 వరకూ ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. అమలాపురం టౌన్/ కొత్తపేట/సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): శ్రావణం.. అంటే మహిళలు వరలక్ష్మీదేవిని నెలంతా మనసారా కొలిచే మాసం. ఈ నెలలో వచ్చే శుక్రవారాల్లో మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో వ్రతాలను ఆచరించడం ఆనవాయితీగా వస్తోంది. అమ్మవార్ల దేవస్థానాలు, ఆలయాలు ఈ నెల రోజులూ భక్తులతో కిటకిటలాడుతుంటాయి. సామూహిక లక్ష్మీదేవి వ్రతాలకు నిలయమవుతాయి. శ్రావణ మాసం ఈ నెల 25వ తేదీ శుక్రవారం నుంచి మొదలు కావడంతో జిల్లాలోని మహిళలు తమ వీలును బట్టి ఫలానా శుక్రవారం వరలక్ష్మీదేవి వ్రతాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వచ్చే నెల 8న శ్రావణ శుక్రవారం కావడంతో ఆ రోజు జిల్లాలో అధిక సంఖ్యలో మహిళలు వ్రతాలు జరుపుకొనేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ మాసమంతా ప్రతి ఇల్లూ ఓ ఆలయంగా మారి సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువైనట్లుగా భావిస్తారు. ఇళ్లలో వరలక్ష్మీదేవి వ్రతాలే కాకుండా ఇక ఆలయాలు, పలు ఆధ్యాత్మిక సంస్థల ఆధ్వర్యంలో మహిళలతో సామూహిక వ్రతాలు గావించే దృశ్యాలు ఆధ్యాత్మికతకు దర్పణం పడతాయి. పండగలు.. పూజలు శ్రావణ మాసంలో పలు పండగలు జరుపుకోనున్నారు. ఈ నెల 25న తొలి శుక్రవారం, వచ్చే నెల ఒకటో తేదీ రెండో శుక్రవారం, 8న మూడో శుక్రవారం, 15న నాలుగో శుక్రవారం, 22న ఐదో శుక్రవారం కావడంతో ఇళ్లలో వ్రతాలు, ఆలయాల్లో సామూహిక వ్రతాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే మాసంలో ఆగస్టు 9న రాఖీ పౌర్ణమి, అదేరోజు జంధ్యాల పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, 15న శ్రీకృష్ణాష్టమి పండగలు జరగనున్నాయి. ఈ మాసంలో మహిళలు మంగళగౌరీ వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తుంటారు. మాంగల్యానికి అధిదేవత అయిన గౌరీదేవిని ప్రతి మంగళవారం ఆరాధిస్తారు. రూ.8 కోట్లకు పైగా వ్యాపారం మూఢం కారణంగా 48 రోజులుగా అంతగా విక్రయాలు లేకపోవడంతో పలు వ్యాపారులు నిరాశ చెందారు. శ్రావణం ఆగమనంతో తమ వ్యాపారాలు ఊపందుకుంటాయని ఆనందిస్తున్నారు. పెళ్లిళ్ల ముహూర్తాలు, శుభ కార్యక్రమాలు లేకుండా ఉన్న పురోహితులు ఈ మాసంలో ఒక్కసారిగా బిజీ కానున్నారు. బంగారు దుకాణాలు, పువ్వులు, పండ్లు, మిఠాయి దుకాణాలు రద్దీగా మారనున్నాయి. ముఖ్యంగా పురోహితులు శ్రావణ మాసమంతా బిజీ అవుతారు. బంగారు రూపుల, పువ్వులు, పండ్లు, మిఠాయిల అమ్మకాలతో జిల్లాలో సుమారు రూ.8 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని అంచగా వేస్తున్నారు. జిల్లాలో దాదాపు 800 బంగారు దుకాణాల ద్వారా రూపుల విక్రయాలు జరుగుతాయి. వరలక్ష్మీదేవి వ్రతంలో బంగారు రూపు ఉంచితే సీ్త్రల మాంగల్యపరంగా శుభం జరుగుతుందనేది నమ్మకం. అలాగే జిల్లాలో 1,200 వరకూ పూలు, పండ్ల దుకాణాలు ఉన్నాయి. వ్రతాల్లో అన్ని రకాల పువ్వులు, పండ్లు సమర్పించి లక్ష్మీదేవిని పూజించడం ఆనవాయితీ. దాదాపు రెండు వేలకు పైగా మిఠాయి (స్వీటు) దుకాణాల్లో అమ్మకాలు ఊపందుకోనున్నాయి. అమ్మవార్ల ఆలయాలకు ముస్తాబు రాజమహేంద్రవరంలోని దేవీచౌక్లో వేంచేసిన శ్రీబాలా త్రిపుర సుందరిదేవి ఆలయం, వంకాయల వారి వీధిలో వరలక్ష్మి దేవాలయం, అష్టలక్ష్మి దేవాలయాలను ముస్తాబు చేశారు. గాడాలలో వేంచేసిన గుడ్లగూబ సమేత శ్రీమహాలక్ష్మిదేవీ ఆలయం ప్రత్యేక శోభను సంతరించుకుంది. అలాగే నగరంలో కోటిలింగాల, పుష్కర, సరస్వతీ, గౌతమ, వీఐపీ ఘాట్లకు పుణ్యస్నానాలు ఆచరించడానికి వేలాదిగా భక్తులు వస్తుంటారు. కానీ ఇప్పటి వరకూ ఘాట్లను శుభ్రం చేయకపోవడంతో భక్తులు ఆవేదన చెందుతున్నారు. నేటి నుంచి సౌభాగ్యాల కాలం వరలక్ష్మీ వ్రతాలకు మహిళల ఏర్పాట్లు ప్రారంభం కానున్న పెళ్లిళ్ల సీజన్ -
రాజకీయ ప్రేరేపిత అరెస్టులు అన్యాయం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్రంలో పాలన గాడితప్పి ఎమెర్జెన్సీ నడుస్తోందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ విమర్శించారు. కక్ష సాధింపులతో కూటమి పాలన సాగుతోందన్నారు. బుధవారం కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎకై ్సజ్శాఖకు ఎటువంటి సంబంధం లేకున్నా అన్యాయంగా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డిని అరెస్టు చేశారన్నారు. తప్పుడు ఆరోపణలు, బలవంతపు ఒప్పందాలు, అధికార దుర్వినియోగం ద్వారా కేసులు నమోదుచేయడం కుట్ర కోణాన్ని చెప్పకనే చెబుతోందన్నారు. మిథున్రెడ్డి అక్రమ అరెస్టును ప్రజాస్వామ్యవాదులు ముక్తకంఠంతో ఖండించాలన్నారు. తప్పుడు కేసులో ఇరికించి ఇరుకున పెట్టడం చాలా బాధాకరమన్నారు. 2014–19లో మద్యం మాఫియా నడిచిందని, ఇప్పుడు కూడా అదే సాగుతోందని రాష్ట్రం కోడైకూస్తోందన్నారు. రాష్ట్రంలో 4380 లిక్కర్ షాపులు, 43 వేల బెల్ట్షాపులు, పర్మిట్ రూమ్లు ప్రైవేటు మాఫియాకు అప్పగించారన్నారు. ఇటువంటి వాస్తవాలు అన్నింటినీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. కక్షపూరిత రాజకీయాలకు ఇప్పటికై నా కూటమి సర్కార్ స్వస్తి పలికి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయడంపై దృష్టి పెట్టాలని విప్పర్తి విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇలా అక్రమ అరెస్టులకు పాల్పడటం సమంజసం కాదన్నారు. కక్షపూరిత పాలనకు స్వస్తి పలకండి జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు -
తీరంలో అలజడి
● తీరప్రాంతంలోనికి చొచ్చుకు వస్తున్న నీరు ● కోతకు గురవుతున్న ఇళ్లు, రోడ్లుకొత్తపల్లి: రెండు రోజులుగా తీరప్రాంతంలో సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. తీరప్రాంతంతో పాటు మత్స్యకారుల ఇళ్లు కోతకు గురవుతున్నాయి. అలలు ఉవ్వెత్తున ఎగసి పడడంతో నీరు గ్రామంలోకి చొచ్చుకువస్తోంది. దీంతో మత్స్యకారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై స్పందించిన పంచాయతీ అధికారులు గ్రామంలో నీరు నిలువలేకుండా కచ్చా డ్రైన్లు తువ్వుతున్నారు. ఎటువంటి తుపాన్ హెచ్చరికలు లేకపోయినా అలలు ఉధృతంగా మారడంతో తీరప్రాంత గ్రామాల్లోని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాలలో కాకినాడ–ఉప్పాడ బీచ్రోడ్డులో సముద్రపు అలలు ఎగసి పడడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. -
అచ్చెన్న వ్యాఖ్యలు అన్యాయం
ఆడబిడ్డ నిధిపై బాధ్యతాయుతమైన మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు అన్యాయం. ఆ పథకం అమలుచేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలని ఎలా అంటారు? రాష్ట్ర ఖజానాపై ఎంత భారం పడుతుందో లెక్కా పత్రం లేకుండా సార్వత్రిక ఎన్నికల్లో ఎందుకు హామీ ఇచ్చారు? అంటే ప్రజలను నిలువునా వంచన చేసి ఓట్లు వేయించుకోవడం కాదా? అధికారంలోకి వచ్చేశామనే ధైర్యంతో ఇప్పుడు ఇలా మాట్లాడతారా? ప్రజలు అన్ని విషయాలు గమనిస్తూనే ఉన్నారు. సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు. – రాగిరెడ్డి చంద్రకళాదీప్తికుమార్, వైఎస్సార్ సీపీ మహిళా రాష్ట్ర కార్యదర్శి. కౌడా మాజీ చైర్పర్సన్. కాకినాడ ఆడబిడ్డకు అన్యాయం చేస్తారా? అధికారంలోకి వచ్చీ రాగానే ఆడబిడ్డ పథకాన్ని అమలు చేస్తామన్నారు. 2024 జూన్ నుంచే కమ్రం తప్పకుండా పేద మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18000 ఇస్తామని బాబు, పవన్కల్యాణ్ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఇలా వారి కేబినెట్లో ఒక మంత్రితో ఇలా మాట్లాడించడం మహిళలను మోసం చేయడమే. ‘బాబు ష్యూరిటీ– భవిష్యత్తు గ్యారంటీ’ పేరిట ప్రజలకు అందించిన బాండ్లలో సైతం ఆడబిడ్డ నిధి పథకం అమలు చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఈ విషయంపై మహిళలకు సమాధానం చెప్పాల్సిందే. – సుంకర శివప్రసన్నవిద్యాసాగర్. వైఎస్సార్ సీపీ సిటీ అధ్యక్షురాలు, మాజీ మేయర్, కాకినాడ -
ఆ బండరాళ్లు పేలుళ్ల వల్ల పడలేదు
తుని రూరల్: మండలం కుమ్మరిలోవ సమీపంలో జరుగుతున్న పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులను కలెక్టర్ షణ్మోహన్ పర్యవేక్షించారు. బుధవారం తుని వచ్చిన ఆయన ఇటీవల ఒకటో వార్డులో బండరాళ్లు పడిన ఘటన వివరాలను అధికారులు, కాంట్రాక్ట్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఇళ్లపై పడిన పేలుళ్ల వల్ల పడలేదని, ఆ కంపనాలకు కొండపై నుంచి పడ్డాయని తెలిపారు. అనంతరం ఆయన తాండవ నదిపై నిర్మిస్తున్న అక్విడెక్ట్ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ 12 ఏళ్లుగా నిలిచిపోయిన పోలవరం ప్రధాన ఎడమ కాలువ పనులు కాలనీవాసుల సహకారంతో శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఇప్పటి వరకు 35 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించగా మరో 60 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వాల్సి ఉందన్నారు. ఇక్కడి నిర్వాసితుల సమస్యలను రెండు వారాల్లో పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా బాధితుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. పెద్దాపురం ఆర్డీఓ శ్రీరమణి, పోలవరం ఇరిగేషన్ ఈఈ గోవిందు, డీఈ మురళి, తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీఓ కె.సాయినవీన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆ కంపనాలకు కొండపై రాళ్లు దొర్లి ఇళ్లపై పడ్డాయి రెండు వారాల్లో నిర్వాసితుల సమస్యలకు పరిష్కారం పోలవరం కాలువ పనులను పర్యవేక్షించిన కలెక్టర్ షణ్మోహన్ -
నాళంవారి సత్రం భూముల కౌలు వేలం మళ్లీ వాయిదా
తొండంగి: రాజమహేంద్రవరంలోని నాళంవారి సత్రానికి చెందిన శృంగవృక్షంలోని భూముల కౌలు వేలం ప్రక్రియ మళ్లీ వాయిదా పడింది. సత్రానికి చెందిన 268.64 ఎకరాల భూమికి మూడేళ్ల కౌలు కాలం ముగిసింది. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ 29న శృంగవృక్షంలో అధికారులు కౌలువేలం నిర్వహించగా పాత బకాయిల చెల్లింపు అనంతరం రైతులు గడువు కోరడంతో అప్పట్లో వాయిదా వేశారు. దాదాపు రెండున్నర నెలల అనంతరం రాజమహేంద్రవరం నాళం వారి సత్రంలో బుధవారం అధికారులు కౌలువేలం నిర్వహించారు. రెండు బిట్లుగా 53.04 ఎకరాలకు కౌలువేలం నిర్వహించగా మిగిలిన భూములకు కౌలువేలం వాయిదా వేసినట్టు సత్రం అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు 24 మంది రైతులు ప్రధమ ధరావతు చెల్లించి వేలంలో పాల్గొన్నారు. మొత్తం 13 బిట్లుగా విభజించి వేలం పాట ప్రారంభించగా మొదటి బిట్టు 27.19 ఎకరాలకు హెచ్చుపాటగా రూ.3.68 లక్షలకు శృంగవృక్షానికి చెందిన యనమల నాగేశ్వరరావు, రెండవ బిట్టు 25.85 ఎకరాలకు హెచ్చుపాటగా రూ.5.01 లక్షలకు మరో రైతు అమృత లోవబాబు కౌలు వేలం ఖరారు చేసుకున్నారు. అనంతరం రైతుల మధ్య వాగ్వివాదం రావడంతో 24 మంది రైతులకు 18 మంది అక్కడి నుంచి వెళ్లిపోయారన్న కారణంతో అధికారులు కౌలు వేలాన్ని వాయిదా వేసినట్టు ప్రకటించారు. మిగిలిన 11 బిట్లు 215.06 ఎకరాలకు త్వరలో కౌలువేలం నిర్వహిస్తామని సత్రం ధర్మకర్త నాళం వెంకటేష్, ఈవో టీవీఎస్ఆర్ ప్రసాద్ ప్రకటనలో తెలిపారు. ఏలేరులో 10.36 టీఎంసీల నీటి నిల్వలు ఏలేశ్వరం: ఏలేరు ప్రాజెక్టులో బుధవారం నాటికి 10.36 టీఎంసీల నీటినిల్వలు ఉన్నాయి. ఇటీవల వర్షాలకు ప్రాజెక్టులో స్వల్పంగా నీటినిల్వలు పెరిగాయి. ఎగువ ప్రాంతం నుంచి 19.87 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులో చేరుతోంది. దీంతో ప్రాజెక్టులో రూ.86.56 మీటర్లకు 77.15 మీటర్లు, 24.11 టీఎంసీలకు 10.36 టీఎంసీల నీటినిల్వలు ఉన్నాయి. దీంతో ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు 1200, విశాఖకు 150. తిమ్మరాజుచెరువుకు 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నేడు తలుపులమ్మకు సహస్ర ఘటాభిషేకంతుని రూరల్: లోవ దేవస్థానంలో గురువారం సహస్ర ఘటాభిషేకం నిర్వహించేందుకు వేదపండితులు, ప్రధాన అర్చకులు, అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 26న ప్రారంభమైన ఆషాఢ మాసోత్సవాలు ఈనెల 24 తో ముగియనున్నాయి. ముగింపు సందర్భాన్ని పురస్కరించుకుని అమ్మవారికి సహస్ర ఘటాభిషేకం నిర్వహించనున్నట్టు ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్, ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. ఇందులో భాగంగా వేదపండితులు, అర్చకులు సప్తనదీ జలాల కలశాలను ఆవాహనం చేసి విశేషంగా అలంకరించారు. భక్తులు తరలివచ్చి సహస్ర ఘటాభిషేకంలో భాగస్వాములు కావాలన్నారు. -
ఈ శిక్షణ మాకొద్దు..!
ప్రత్యామ్నాయం చూసుకున్నాను.. బీఎడ్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసేవాడిని. ఎస్జీటీకి బీఎడ్ చేసిన వారు అనర్హులుగా పేర్కొనడంతో బీఎడ్లో చేరే వారి సంఖ్య తగ్గిపోయింది. దీంతో అధ్యాపక వృత్తిని వదిలి అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. –బొడ్డపాటి సురేష్ కుమార్, చెల్లూరు, రాయవరం మండలం ఊహించని పరిస్థితి ఎదురైంది బీఎడ్పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ విద్యకు ఇటువంటి పరిస్థితి ఎదురవుతుందని ఊహించలేదు. బీఎడ్, ఎంఎడ్ చేసిన వారికి డీఎడ్ కళాశాలల్లో అధ్యాపకులుగా పనిచేయవచ్చు, కానీ వారిని ఎస్జీటీకి అనర్హులుగా పేర్కొనడం దారుణం. –డాక్టర్ వైవీ జగన్నాథ్, ప్రిన్సిపాల్, శ్రీక్షణ ముక్తేశ్వర బీఎడ్ కళాశాల, ముక్తేశ్వరం రాయవరం: ఉపాధ్యాయ విద్యకు ఆదరణ తగ్గుతోంది. ఉపాధ్యాయులుగా బోధించాలంటే ఛాత్రోపాధ్యాయులుగా శిక్షణ పొందాల్సి ఉంది. ఈ శిక్షణకు ఇంటర్ అర్హతతో డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్), డిగ్రీ అర్హతతో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సు చేయాల్సి ఉంది. ఉపాధ్యాయ విద్య అర్హత కోర్సుల్లో బీఎడ్కు రెండేళ్ల పాటు శిక్షణ ఇవ్వాలనే నిబంధన 2016 అక్టోబర్ నుంచి అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి బీఎడ్ ప్రవేశ పరీక్షకు అభ్యర్థులు క్రమంగా దూరమవుతున్నారు. 2015కు ముందు బీఎడ్ ప్రవేశ పరీక్షకు వేలల్లో దరఖాస్తులు రాగా, ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వందల్లోనే వస్తున్నాయి. 2025లో బీఎడ్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఎడ్సెట్కు జిల్లా నుంచి దరఖాస్తుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఈ కోర్సుకు డిమాండ్ తగ్గుతున్న నేపథ్యంలో ఆ కళాశాలల మనుగడ ప్రశ్నార్థకం కానుంది. 2014–15 విద్యా సంవత్సరం వరకూ బీఎడ్ శిక్షణ కాలం ఒక ఏడాది మాత్రమే ఉండగా, 2015–16 నుంచి రెండేళ్లకు పెంచారు. అదే ఏడాది కేవలం 531 మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఒకప్పుడు పోటీ.. ఇప్పుడు రారేంటి! ఒకప్పుడు ఉపాధ్యాయ శిక్షణ కోర్సు బీఎడ్కు ఎక్కడ లేని పోటీ ఉండేది. జిల్లాలో గడిచిన దశాబ్ద కాలంగా పోటీ తగ్గింది. 2015లో బీఎడ్ ప్రవేశానికి నిర్వహించిన ఎడ్సెట్కు వెయ్యి మంది కూడా దరఖాస్తు చేసుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 11,701 మంది దరఖాస్తు చేయగా, జిల్లా నుంచి కేవలం 531 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో బీఎడ్ ప్రవేశ పరీక్ష దరఖాస్తులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,462 దరఖాస్తులు రాగా, ప్రవేశ పరీక్షకు 1,125 మంది హాజరయ్యారు. ఒకప్పుడు వేల సంఖ్యలో రాగా ఆ సంఖ్య ఇప్పుడు వందల సంఖ్యకు పడిపోవడం బీఎడ్ కళాశాలల మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తుంది. ఎడ్సెట్ ఏర్పాటైనప్పటి నుంచి ఇంత తక్కువ సంఖ్యలో దరఖాస్తులు రావడం ఆశ్చర్యం కలిగిస్తుందని పలువురు బీఎడ్ కళాశాలల నిర్వాహకులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 1,200 సీట్లు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గతంలో 36 బీఎడ్ కళాశాలలు ఉండేవి. ఈ కళాశాలల్లో చేరేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో కళాశాలల సంఖ్య 22కు పడిపోయింది. బీఎడ్కు డిమాండ్ ఉన్న దశాబ్ద కాలం క్రితం ఒక్కో కళాశాలలో 100 వరకూ సీట్లు ఉండగా, ఇప్పుడు ఒక్కో కళాశాలకు 50 మాత్రమే ఉన్నాయి. 22 కళాశాలల పరిధిలో 1,200 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ బీఎడ్ కళాశాలలో 150 సీట్లు ఉండగా, ఒక్కో ప్రైవేట్ కళాశాలలో 50 సీట్లు ఉన్నాయి. 2015–16 విద్యా సంవత్సరంలో 3,600 సీట్లు ఉండగా, కేవలం 500 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. కారణాలు ఎన్నో.. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు బీఎడ్ విద్యకు ఆదరణ తగ్గడానికి పలు కారణాలు వినిపిస్తున్నాయి. బీఎడ్ ఉపాధ్యాయ శిక్షణను రెండేళ్లకు పెంచారు. ఒకప్పుడు ఏడాది శిక్షణ ఉండగా, రెండేళ్ల కాల పరిమితికి పెంచారు. ఇదిలా ఉంటే సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు బీఎడ్ చేసిన వారు అనర్హులుగా ప్రభుత్వం నిర్ణయించడంతో ఆ అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లినట్టు అయ్యింది. ప్రతి డీఎస్సీలోనూ ఎస్జీటీ పోస్టులే అధికంగా ఉంటాయి. అధికంగా ఉన్న ఎస్జీటీ పోస్టులకు బీఎడ్ చేసిన వారు అనర్హులుగా పేర్కొనడంతో బీఎడ్ విద్యకు ఒక్కసారిగా డిమాండ్ పడిపోయింది. 2027–28 విద్యా సంవత్సరం నుంచి.. ఉపాధ్యాయ శిక్షణ పొందే వారిలో బోధనాపరమైన నైపుణ్యాన్ని పెంపొందించేందుకు నేషనల్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) బీఎడ్ ట్రైనింగ్ కాల వ్యవధిని రెండేళ్లకు పెంచింది. అయితే రెండేళ్ల కాల వ్యవధి ఉన్న బీఎడ్కు క్షేత్ర స్థాయిలో ఆదరణ తగ్గిపోవడంతో 2027–28 విద్యా సంవత్సరం నుంచి బీఎడ్ ట్రైనింగ్ను ఏడాది కాల పరిమితికి కుదించనున్నట్లు సమాచారం. దీనిపై అధికారికంగా ఉత్తర్వులు విడుదల కావాల్సి ఉంది. ఏడాది కాల పరిమితికి బీఎడ్ కోర్సు ఉంటే భవిష్యత్తులో బీఎడ్కు తిరిగి ఆదరణ ఉండే అవకాశముంటుంది. ఎడ్సెట్కు 1,462 మందే దరఖాస్తు రెండేళ్ల శిక్షణకు వెనకడుగు వేస్తున్న అభ్యర్థులు ఎస్జీటీ పోస్టులకు బీఎడ్ అభ్యర్థులకు అవకాశం లేకపోవడం కారణమే -
గుమ్మడికాయల మాటున పశువుల రవాణా
కిర్లంపూడి: పైకి గుమ్మడికాయల లోడు కానీ.. అందులో పశువులను రవాణా చేస్తున్నారు. ఈ మినీ వ్యాన్ తుని నుంచి కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్కు వెళుతోంది. దీనిని బుధవారం స్వాధీనం చేసుకుని, కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్టు జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు. ఆయన వివరాల మేరకు, మినీ వ్యాన్ తొట్టె భాగంలో రెండు ఆవులు, 8 ఎద్దులను ఎక్కించి, అవి లేవకుండా గట్టిగా తాళ్లతో రాడ్లకు కట్టారు. ఎవరికీ అనుమానం రాకుండా వాటిపై చెక్కలు అమర్చి, గుమ్మడికాయల బస్తాల లోడు వేశారు. తమకు అందిన సమాచారంతో స్థానిక ఎస్సై జి.సతీష్ తన సిబ్బందితో కృష్ణవరం టోల్ప్లాజా వద్ద వాహనాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో మినీ వ్యాన్ పట్టుబడింది. పశువులను కృష్ణుడుపాలెంలో గోశాలకు అప్పగించి, ఇద్దరిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై జి.సతీష్ తెలిపారు. వృద్ధురాలి మృతి జగ్గంపేట: సీతానగరం వద్ద పురుగు మందు తాగి, చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన దంపతుల్లో వృద్ధురాలు కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. ఎస్సై రఘునాథరావు వివరాల మేరకు, సీతానగరం వద్ద మంగళవారం వృద్ధ దంపతులు సక్కుల సత్యనారాయణ, సక్కుల మంగతాయారు ఆత్మహత్యాయత్నం చేశారు. వారిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సక్కుల మంగతాయారు(65) మృతి చెందినట్టు ఎస్సై తెలిపారు. -
నడిసంద్రాన సాపాట్లు
శ్రావణంలో రత్నగిరికి కొత్త శోభ చేపల రుచులు చేదెక్కాయి. సాగర గర్భంలో పర్యావరణంలో మార్పులు చోటు చేసుకుంటుండడంతో మత్స్య సంపదకు ముప్పు ఏర్పడుతోంది. ఈ క్రమంలో పాటు లేక.. పూట గడవని మత్స్యకారులు వలసబాట పడుతున్నారు. ప్రభుత్వ విధానాలు, పెరిగిన డీజిల్ ధరలు వెరసి మత్స్యకారుల జీవన విధానంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇచ్చిన హామీలను, తమ డిమాండ్లను ‘కూటమి’ పెద్దలు నెరవేర్చాలని మత్స్యకారులు ఆందోళన బాట పట్టారు. పిఠాపురం: నిత్యం కాకినాడ హార్బర్తో పాటు, జిల్లాలోని వివిధ తీర ప్రాంతాల నుంచి గతంలో ప్రతి నెలా సుమారు 15,900 టన్నులకు పైగా చేపలు ఉత్పత్తి కాగా, రొయ్యలు 11 వేల టన్నులకు పైగా ఉత్పత్తి అయ్యేవి. ప్రస్తుతం చేపలు, రొయ్యల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. పారిశ్రామికీకరణ పేరుతో ఇష్టారాజ్యంగా సముద్రంలో తవ్వకాలు జరపడంతో పాటు, వ్యర్థాలను విచ్చలవిడిగా వదిలివేస్తుండడంతో సముద్ర గర్భంలో పర్యావరణం దెబ్బతింటోంది. కొన్ని రకాల నిషేధిత వలలు వేటకు విచ్చలవిడిగా ఉపయోగించడం వల్ల మత్స్య సంపద ఆదిలోనే అంతమవుతోంది. ముఖ్యంగా రింగు వలలు చేపల గుడ్లను సైతం వేటాడడం వల్ల మత్స్య సంపదకు శాపంగా పరిణమిస్తోంది. ఈ వలను నిషేధించినప్పటికీ, దీని అమలుకు మత్స్యశాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడం తీవ్ర పరిణామాలకు దారితీస్తోంది. చేపల వేట నిషేధ సమయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోవడం వల్ల విచ్చలవిడిగా సాగిన చేపల వేటతో మత్స్య సంపద గుడ్ల దశలోనే నాశనమవుతోంది. వివిధ పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం నేరుగా సముద్రంలో కలుస్తుండడంతో, సముద్ర గర్భంలో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. తద్వారా కొన్ని మత్స్య రకాలు కనుమరుగయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల కాలంలో టన్నుల కొద్దీ బరువైన తిమింగలాలు, సముద్ర తాబేళ్లు మత్స్యకారుల వలలకు చిక్కి, తీరానికి చేరడం సముద్ర పర్యావరణ అసమతుల్యతకు అద్దం పడుతున్నాయి. పశ్చిమ రాజగోపురం వద్ద.. కాగా, విశాఖపట్నానికి చెందిన లారెస్ ఫార్మాస్యూటికల్ కంపెనీ నిధులతో పశ్చిమ రాజగోపురం వద్ద విశ్రాంతి షెడ్డు నిర్మాణ పనులు కూడా ఈ శ్రావణ మాసంలోనే ప్రారంభించనున్నట్టు దేవస్థానం అధికారులు తెలిపారు. సుమారు రూ.1.5 కోట్ల వ్యయంతో వంద అడుగుల పొడవు, 175 అడుగుల వెడల్పున టెన్సిల్ షెడ్డు నిర్మించేందుకు లారెస్ కంపెనీ సంసిద్ధత తెలిపిందని అధికారులు చెప్పారు. మంచిరోజు చూసి పనులు ప్రారంభిస్తారని తెలిపారు. శంకుస్థాపనకు ఏర్పాట్లు అన్నవరం దేవస్థానంలో ప్రసాద్ నిధులతో వివిధ నిర్మాణాలకు శ్రావణ మాసంలో శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్, టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్తో శంకుస్థాపన చేయించేందుకు ప్రయత్నిస్తున్నాం. అనంతరం నిర్మాణాలు వేగంగా కొనసాగించి, రెండేళ్లలోపు పూర్తి చేస్తాం. – ఈశ్వరయ్య, చీఫ్ ఇంజినీర్, టూరిజం శాఖ మత్స్యకారుల డిమాండ్లివీ.. నష్ట పరిహారం రూ.11,500 ఇవ్వాలి. మత్స్యకారులకు రూ.50 లక్షల బీమా చేయించాలి. సముద్ర తీరంలో ఉన్న కంపెనీల్లో మత్స్యకారులకు 20 శాతం ఉద్యోగాలివ్వాలి. మత్స్యకారులను రైతులుగా గుర్తించి, డీసీసీబీ ద్వారా రుణాలు ఇవ్వాలి. సీఎస్సార్ నిధులు మత్స్యకార గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేయాలి. సొసైటీలను పునరుద్ధరించి, పరికరాలకు సబ్సిడీపై రుణాలు ఇవ్వాలి. మార్కెట్లలో మౌలిక సౌకర్యాలు కల్పించాలి. సన్నగిల్లుతున్న మత్స్యకారుల జీవనోపాధి కూటమి నేతలు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ డిమాండ్ల సాధనకు పోరుబాట పట్టిన మత్స్య కార్మిక, మత్స్యకార సంఘాల ఐక్యవేదిక -
వ్యభిచార గృహాలపై పోలీసుల దాడులు
ఇద్దరు మహిళలపై కేసు పెద్దాపురం: జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం డీఎస్పీ శ్రీహరిరావు ఆధ్వర్యంలో పోలీసులు స్థానిక వ్యభిచార గృహాలపై దాడులు చేశారు. ఈ దాడుల్లో ఇద్దరు మహిళలపై కేసులు నమోదు చేసినట్టు డీఎస్పీ శ్రీహరిరావు తెలిపారు. స్థానిక వక్కలంక వారి వీధి, మసీదు వీధి, కట్టమూరు పుంత ప్రాంతాల్లో దాడులు చేశామన్నారు. మసీదు వీధికి, కట్టమూరు పుంతకు చెందిన ఇద్దరు మహిళలను మధ్యవర్తుల సమక్షంలో అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశామన్నారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ, ఇటీవల సోషల్ మీడియాలో ఇద్దరు వ్యభిచార వృత్తిలో ఉన్న మహిళల అంశం ప్రసారమైందన్నారు. వీరి మధ్య అనేక ఏళ్లుగా వివాదం నడుస్తోందన్నారు. పెద్దాపురం సీఐ విజయశంకర్ కేసు దర్యాప్తు చేస్తున్నారన్నారు. దాడుల్లో ట్రైనీ డీఎస్పీ జీవన, పెద్దాపురం, సామర్లకోట, జగ్గంపేట, ప్రత్తిపాడు సీఐలు జయశంకర్, కృష్ణభగవాన్, వైఆర్కే శ్రీనివాస్, వి.సూరిఅప్పారావు, పలువురు ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
డిమాండ్లు నెరవేర్చాలి
మత్స్యకారుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే మరింత ఉధృతంగా ఆందోళన చేస్తాం. ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నా పాలక యంత్రాంగం పెడచెవిన పెడుతోంది. ఇది చాలా దారుణం. మత్స్యకారుల సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమం కొనసాగుతుంది. ఇప్పటికే తినడానికి తిండి లేక మత్స్యకారులు ఆకలితో అలమటిస్తున్నారు. కూటమి పాలకులు వెంటనే స్పందించి మత్స్యకారుల డిమాండ్లు నెరవేర్చాలి. లేకపోతే ఉద్యమం మరింత తీవ్రతరం చేయాల్సి ఉంటుంది. – సంగాడి ఈశ్వరరావు, మత్స్య కార్మిక సంఘం నాయకుడు, కాకినాడ ● -
రిగ్గులతో మత్స్యకారులకు నష్టం
సముద్రంలో రిలయన్స్, ఓఎన్జీసీ రిగ్గుల వల్ల కాకినాడ జిల్లాలో అద్దరిపేట నుంచి గాడిమొగ వరకున్న తీర ప్రాంతంలో మత్స్యకారుల జీవితాలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. సముద్రంలో కాలుష్యం పెరిగి, మత్స్య సంపద తగ్గి మత్స్యకారులు చేపల వేట సాగక తీవ్రంగా నష్టపోతున్నారు. తీరం వెంబడి ఉన్న వివిధ పరిశ్రమల వల్ల కాలుష్యం పెరిగి, చేపలు దొరక్క మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతున్నారు. ఇదే విషయమై గత ఎన్నికల్లో మా సమస్యలను కూటమి నేతల దృష్టికి తీసుకెళ్లాం. వాటిని పరిష్కరిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాటిచ్చారు. ఎన్నికలయ్యాక వాటిని విస్మరించారు. దీనిపై ఉద్యమం చేపట్టాలని నిర్ణయించుకున్నాం. మూడు రోజుల క్రితం పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించాం. ఆయన అందుబాటులో లేకపోగా, ఆయన ఇన్చార్జి కూడా అందుబాటులో లేక పోవడంతో మేము ఆందోళన చేయాల్సి వచ్చింది. చివరకు మా వినతిపత్రం జనసేన నేతలు తీసుకున్నారు. వారు స్పందించకుంటే భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటాం. మా డిమాండ్లు అమలు చేసే వరకు ఉద్యమం ఆపేది లేదు. – సీహెచ్ రమణి, ఏపీ మత్స్యకార, మత్స్య కార్మిక సంఘం, ఆలిండియా కమిటీ మెంబర్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, కాకినాడ ● -
నిడదవోలులో చోరీ
నిడదవోలు: పట్టణంలోని సంజీవయ్యనగర్లో సోమవారం రాత్రి దొంగలు పడి దొరికిన కాడికి దోచుకుపోయారు. గొట్టుముక్కల నాగేశ్వరరావు తన కుటంబ సభ్యులతో ఈ నెల 19న హైదరాబాద్లోని బంధువుల ఇంటికి వెళ్లారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి తిరిగి ఇంటికి వచ్చాక చోరీ జరిగినట్లు గుర్తించారు. దుండగులు ముందుగా ప్రధాన ద్వారానికి వేసిన తాళం పెకిలించి ఇంట్లోకి ప్రవేశించారు. గదిలో బీరువా తెరచి లాకర్లో దాచుకున్న రెండు కాసుల బంగారు వస్తువులు, రూ.లక్ష నగదును అపహరించారు. ఇంటి యజమాని నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్సై జగన్మోహన్రావు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పాలెం సర్పంచ్పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
కడియం: తమకు ప్రభుత్వం కేటాయించిన భూములను అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తున్న మాధవరాయుడుపాలెం సర్పంచ్ అన్నందేవుల చంటిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని జేగురుపాడు ఎస్సీ ఫిషర్మెన్ సొసైటీ అధ్యక్షుడు సాకా కిరణ్కుమార్, మాజీ అధ్యక్షుడు బళ్ల అన్నవరం, మద్దుకూరి సూరిబాబు, మోటిక మునియ్య మంగళవారం కడియం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వివరాలను కిరణ్కుమార్ విలేకరులకు తెలిపారు. 1977లో జేగురుపాడు గ్రామానికి చెందిన దళితులకు సర్వే నం.10లో 5.58 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించిందన్నారు. సర్వే నం.84, 86లో సుమారు పది ఎకరాల భూమిని మాధవరాయుడుపాలెం దళితులకు కూడా ఇచ్చిందన్నారు. ఆ భూమిలో దళితులు వ్యవసాయం చేసుకుంటున్నారన్నారు. ఇటీవల పాలెం సర్పంచ్ అన్నందేవుల చంటి దళితుల భూమిని కబ్జా చేయాలనే ఆలోచనతో తన అనుచరులతో గొడవలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. 52 ఏళ్లుగా తమ అధీనంలో ఉన్న భూమిని కబ్జా చేస్తారన్న భయంతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ శిలా విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయడంతో పాటు, చేపల చెరువును కూడా ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. తన రాజకీయ పలుకుబడితో రెవెన్యూ, పోలీసు అధికారులను అడ్డుపెట్టుకుని తాము ఏర్పాటు చేసుకున్న విగ్రహాన్ని, దిమ్మెను దౌర్జన్యంగా తొలగించారన్నారు. అందువల్ల చంటిపైనా, అతనికి సహకరించిన వారిపైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం ప్రకారం అరెస్టు చేయాలని కోరారు. -
మందుల దుకాణాల్లో తనిఖీలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లాలో మత్తు, వయాగ్రా మందుల అమ్మకాలు జరుగుతున్న నేపథ్యంలో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో 80 మందుల దుకాణాలకు పైగా తనిఖీ చేసినట్లు డ్రగ్స్ ఏడీ నాగమణి తెలిపారు. దుళ్లలోని శ్రీశ్రీనివాస మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్, శ్రీ మెడికల్స్లో డ్రగ్స్ అధికారులు దాడులు చేయగా అక్కడ ఫార్మాసిస్ట్ లేకపోవడం, బిల్లులు లేకుండా అమ్మకాలు చేయడం, షెడ్యూల్ రిజిస్టర్ సరిగా లేకపోవడం, కాలం చెల్లిన మందులు లభించడం కనుగొన్నామన్నారు. వీటితో పాటు మరికొన్ని దుకాణాలు ఇదే విధంగా ఉన్నాయని, వాటన్నింటిపై కేసులు నమోదు చేశామన్నారు. -
చోరీకి గురైన నగదు, నగలు స్వాధీనం
రౌతులపూడి: మండల కేంద్రమైన రౌతులపూడిలో ఇటీవల పేంటి మరియమ్మ ఇంట్లో చోరీకి గురైన రూ.30 వేల నగదు, 30 గ్రాముల బంగారు నగలను స్వాధీన పరచుకున్నట్లు రౌతులపూడి ఎస్సై జి.వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నెల 12వ తేదీన రౌతులపూడికి చెందిన పేంటి మరియమ్మ ఇంట్లో చోరీ జరిగిందని, బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేశామన్నారు. ఈ నేపథ్యంలో రౌతులపూడి శివారు మరిడమ్మతల్లి గుడి వద్ద ఇద్దరు బాలుర నుంచి రూ.30వేలు నగదు, 30గ్రాముల బంగారు నగలను స్వాధీన పరచుకున్నట్లు తెలిపారు. బాలురను జిల్లా ప్రొహిబిషన్ అధికారి వద్ద హాజరు పరచామన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ డీవీ రమణ, కానిస్టేబుళ్లు బోస్, నూకరాజు, ఉదయ్, లక్ష్మణ్ పాల్గొన్నారు. -
బ్రాండ్ బాజా!
జిల్లా పేరు మద్యం గీత కార్మికుల మొత్తం దుకాణాలు షాపులు కోనసీమ 133 13 146 తూర్పు గోదావరి 125 12 137 కాకినాడ 155 15 170● బ్రూవరీస్ కార్పొరేషన్ నిర్వాకం ● బ్రాండు ఒకటే.. ధరలే వేరు ● మద్యం వ్యాపారుల సరికొత్త దోపిడీ ● అందుబాటులో లేని రూ.99 మద్యం ఆలమూరు: బ్రూవరీస్ కార్పొరేషన్ చేస్తున్న మద్యం సరఫరా, ధరల నిర్ధారణ ఒక ప్రహసనంలా మారుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అండతో మద్యం సిండికేట్లు కుమ్మకై ్క మద్యం ప్రియుల బలహీనతలను ఆసరాగా తీసుకుని వారిని అనేక రూపాల్లో దోచుకుంటున్నారు. ఒకే మద్యం బ్రాండును ఒకే ధరకు విక్రయించవలసి ఉన్నా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. బ్రాండు ఒకటే అయినా ధర మాత్రం వేర్వేరుగా ముద్రించి వసూలు చేయడం ద్వారా ప్రజలను ప్రభుత్వం దోచుకుంటోంది. దీంతో మద్యం కొనుగోలుదారుల్లో మద్యం ధరలపై అయోమయం నెలకొంటోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనున్న 453 మద్యం దుకాణాలకు అమలాపురం, రాజమహేంద్రవరం, సామర్లకోట బ్రూవరీస్ కార్పొరేషన్ డిపోల నుంచి మద్యం సరఫరా జరుగుతుంది. మద్యం షాపుల స్థాయిని బట్టి 20 నుంచి 30 రకాల చీప్ లిక్కర్ నుంచి ప్రీమియం క్వాలిటీ వరకూ అందుబాటులో ఉంటున్నాయి. ఇటీవల జిల్లాలోని పలు మండలాల్లో చీప్ లిక్కర్ బ్రాండు అయిన 9 సీ హార్స్ కంపెనీ క్వార్టర్ మద్యం బాటిల్ ధర రూ.120గా ఉంది. అయితే గత ఏడాది నవంబర్లో తయారు చేసిన 179 బ్యాచ్ బాటిళ్లలో మూడు ఎంఆర్పీ ధరలు ఉండటం వినియోగదారులను నివ్వెర పరుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు రూ.99 ధర కలిగిన మద్యం బాటిళ్లు ఎక్కడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ చీప్ లిక్కర్ను ఐదు కంపెనీలు సరఫరా చేస్తున్నా పూర్తిస్థాయిలో మద్యం కొనుగోలుదారులకు అందుబాటులో ఉండటం లేదు. ఇదో రకం దోపిడీ ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మద్యం షాపుల వద్ద ఒక్కొక్క చోట ఒక్కొక్క ధర ముద్రించి దోచుకుంటున్నారని మద్యం కొనుగోలుదారులు ఆరోపిస్తున్నారు. 9సీ హార్స్ బ్రాండుకు చెందిన క్వార్టర్ బాటిల్ ధర రూ.120గా ఉంది. అయితే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని మద్యం షాపుల్లో ఒక్కొక్క చోట ఒక్కొ విధంగా రూ.120. రూ.130, రూ.140 ధరలు ముద్రించి ఉన్నట్లు బాటిళ్లను చూస్తే తెలుస్తోంది. ఈ ధరలు మద్యం విక్రయదారులు ముద్రించారా లేదా బ్రూవరీస్ కార్పొరేషన్ ముద్రించి అమ్మకాలు కొనసాగిస్తోందా అనే సందేహం కలుగుతోంది. ఈ ధరల తేడా వల్ల మద్యం కొనుగోలుదారులు సుమారు రూ.ఐదు లక్షల వరకూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నష్టపోవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. చీప్ లిక్కర్ ధరలను ప్రాంతానికి ఒక్కో విధంగా నిర్ణయించి ప్రజలతో చెలగాటం ఆడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మద్యం దుకాణాల వద్ద విధిగా ఏర్పాటు చేయాల్సిన మద్యం ధరల పట్టిక కాని, స్టాకు వివరాలు కాని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఏర్పాటు చేయకపోవడం పరిస్థితికి అద్దం పడుతుంది. ఎంఆర్పీలో తేడా ప్రస్తుతం ఒక బ్రాండు కేనా మిగిలిన బ్రాండులపై కూడా తేడాగా ముద్రిస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. కనిపించని రూ.99 మద్యం మద్యం షాపుల్లో పేదలకు అందుబాటులో ఉండే విధంగా నాణ్యమైన మద్యాన్ని రూ.99 కే విక్రయిస్తామన్న కూటమి నాయకుల ఎన్నికల హామీ బుట్టదాఖలైంది. బ్రూవరీస్ కార్పొరేషన్ నుంచి రేషన్ పద్ధతిలో వారానికి దుకాణానికి మూడు మద్యం కేసులకు మించి సరఫరా చేయడం లేదని తెలుస్తోంది. అలాగే రూ.99 మద్యం బాటిల్కు కమీషన్ను పూర్తిగా తగ్గించడంతో విక్రయదారులు కూడా ఆ బ్రాండ్లను అమ్మడానికి ఇష్టపడటం లేదని మద్యం ప్రియులు చెబుతున్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 23,000 – 23,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 29,500 గటగట (వెయ్యి) 27,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 28,000 గటగట (వెయ్యి) 25,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
కాలుష్య కారక పరిశ్రమలను రద్దు చేయాలి
అరుణోదయ విమలక్క డిమాండ్ పిఠాపురం: ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో తీర ప్రాంత మత్స్యకారులను రోడ్డున పడేసే కాలుష్య కారక పరిశ్రమలు నిలిపివేయాలని అరు ణోదయ సాంస్కృతిక సమాఖ్య ఉభయ రాష్ట్రాల చైర్పర్సన్ విమలక్క విజ్ఞప్తి చేశారు. అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య ఏఐఎఫ్టీయూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏఐఎఫ్టీయూ 34వ వార్షికోత్సవం సందర్భంగా మహాసభ మంగళవారం స్థానిక సూర్యరాయ గ్రంథాలయం ప్రాంగణంలో నిర్వహించారు. తొలుత ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి సభాస్థలి వరకు కార్మికులు ఎరజ్రెండాల చేతబట్టి ప్రదర్శన నిర్వహించారు. అంబేడ్కర్ సెంటర్లో అంబేడ్కర్ విగ్రహానికి విమలక్క పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏఐఎఫ్టీయూ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కుంచే అంజిబాబు అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆమె ప్రసంగించారు. తీర ప్రాంతంలో పలు విషతుల్యమైన పరిశ్రమల వలన వాతావరణ సమతుల్యం దెబ్బతింటోందన్నారు. దీనివల్ల తీర ప్రాంతంలో హేచరీస్ కనుమరుగైపోతాయని, అనేకమంది ఉపాధి దెబ్బతింటుందన్నారు. ప్రధాన వక్త ఆంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ విద్యుత్ చార్జీలు పెంచబోమని ఎన్నికలలో హామీ ఇచ్చి అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ప్రజలను నయవంచన చేస్తోందని విమర్శించారు. అదానీకి లబ్ధి చేకూర్చడం కోసం స్మార్ట్ మీటర్లను బలవంతంగా అమరుస్తున్నారని విమర్శించారు. ఏఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కరీం బాషా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ కరోనా కాలంలో 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా కుదిస్తూ చట్టం చేసిందని, దాన్ని అమలు చేయడం కోసం ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. ఏఐఎఫ్టీయూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గొల్ల అంజయ్య, ఏపీ ఆర్సీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వల్లూరి రాజబాబు, బి రమేష్, ఏపీఆర్సీఎస్ సీనియర్ నాయకులు కొండ దుర్గారావు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు ఏపూరి సుధాకర్, తెలంగాణ అధ్యక్షుడు మల్సూర్, ప్రగతిశీల మహిళా సంఘం (సీ్త్ర విముక్తి) కన్వీనర్ డొక్కులూరి సంగీత పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి
ఆలమూరు: 216 ఏ జాతీయ రహదారిపై మడికి వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ వెంపల చంద్రశేఖర్ (50) మృతి చెందాడు. ఆలమూరు పోలీసుల కథనం ప్రకారం అయినవిల్లి మండలంలోని ముక్కామల సమీపంలోని ఇరుసుమండకు చెందిన చంద్రశేఖర్ తన వ్యాన్పై సమీపంలోని కొత్తపేట నుంచి లోడు వేసుకుని రాజమహేంద్రవరం బయలుదేరాడు. రావులపాలెం వచ్చేసరికి ఒక ప్రయాణికుడిని తన వాహనంలో ఎక్కించుకున్నాడు. స్థానిక అంతర్రాష్ట కూరగాయల మార్కెట్ వద్దకు వచ్చేసరికి ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో డ్రైవర్ చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందగా అందులో ప్రయాణిస్తున్న వ్యక్తి వ్యాన్ క్యాబిన్లో చిక్కుకున్నాడు. దీంతో ఆ ప్రయాణికుడిని బయటకు తీసేందుకు పోలీసు, హైవే సిబ్బంది రెండుగంటల పాటు శ్రమించారు. అప్పటికే తీవ్ర గాయాలతో ఉన్న అతన్ని ఎన్హెచ్ అంబులెన్స్పై రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఎస్సై జి.నరేష్ కేసును నమోదు చేయగా రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇరుసుమండలో విషాద ఛాయలు అంబాజీపేట: చంద్రశేఖర్ మృత్యువాత పడటంతో ఇరుసుమండలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతునికి భార్య రామలక్ష్మి, కుమారులు పవన్, చందు ఉన్నారు. అందరితో కలిసి ఉండే చంద్రశేఖర్ ఇక లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మృతుని స్వగ్రామం తాడేపల్లిగూ డెం మండలంలోని మిలటరి మాధవరం. అయి తే 30 ఏళ్ల క్రితం వివాహనంతరం ఇరుసుమండ వచ్చి ఇక్కడే ఉంటున్నారని స్థానికులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి రాజానగరం: జాతీయ రహదారిపై స్థానిక వైఎస్సార్ జంక్షన్లో మంగళవారం జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ప్రత్తిపాడు మండలం ఒమ్మంగికి చెందిన చవల శ్రీనివాస్ (38) రాగితో తయారు చేసిన ఉంగరాలు, కడియాలను తీర్థాలలోను, గ్రామ గ్రామం తిరుగుతూ అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటాడు. అవివాహితుడైన అతను తల్లితో కలిసి కొంతమూరులో ఉంటున్నాడు. ఈ క్రమంలో పెద్దాపురంలోని మరిడమ్మ తీర్థంలో రాగి వస్తువులను అమ్ముకునేందుకు తన యాక్టివా స్కూటర్ పై వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ అతనిని ఢీ కొని, కొద్దిదూరం బైకుతో సహా ఊడ్చుకుంటూ పోయింది. దీంతో తీవ్రంగా గాయపడిన అతనిని అదే లారీ డ్రైవర్ అంబులెన్స్లో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లాడు. అయితే అప్పటికే అతను మృతి చెందాడని వైద్యులు తెలిపారు. కాగా యాక్టివా స్కూటర్పై ప్రయాణిస్తూ తలకు హెల్మెట్ ధరించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. కొడుకే ఆధారంగా ఉన్న ఆ వృద్ధ తల్లి అనాథగా మిగిలింది. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నారాయణమ్మ తెలిపారు. -
ముద్రగడ క్షేమంగానే ఉన్నారు
ముద్రగడ పెద్ద కుమారుడు వీర్రాఘవరావు కిర్లంపూడి: మాజీ మంత్రి, రాష్ట్ర వైఎస్సార్ సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సభ్యులు ముద్రగడ పద్మనాభం క్షేమంగా ఉన్నారని ఆయన పెద్ద కుమారుడు వీర్రాఘవరావు (బాలు)తెలిపారు. ముద్రగడ ఇటీవల అస్వస్థతకు గురికాగా హైదరాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించిన విషయం విదితమే. ముద్రగడ పద్మనాభం ఆరోగ్యానికేమి ఢోకా లేదని, ఆయన క్షేమంగా ఉన్నారని ఆయన పెద్ద కుమారుడు వీర్రాఘవరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. వైద్యుల పర్యవేక్షణలో ఐసీయూలో ఉండడంతో తన తండ్రి వద్దకు ఎవరినీ అనుమతించడం లేదన్నారు. ప్రజల ఆశీస్సులతో ఆయన క్షేమంగా తిరిగి వస్తారని దయచేసి ఎవరూ ఆసుపత్రికి వెళ్లొద్దని వీర్రాఘవరావు కోరారు. విద్యతోపాటు క్రీడలూ అవసరమే రాజానగరం: విద్యార్థులకు విద్యతోపాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని, వాటికి కూడా తగిన సమయాన్ని కేటాయించి, క్రీడలలోనూ మంచి ప్రతిభను చాటాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ పి. చంద్రశేఖర్ అన్నారు. స్థానిక జీఎస్ఎల్ వైద్య కళాశాల క్రీడా మైదానంలో యూనివర్సిటీ స్థాయిలో మూడు రోజులపాటు జరిగే 25 వ వుమెన్ స్పోర్ట్సు మీట్ని మంగళవారం గాలిలోకి బెలూన్స్ని వదిలి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. 24 మెడికల్ అండ్ డెంటల్ కళాశాలల నుంచి 567 మంది క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొంటున్నారని యూనివర్సిటీ స్పోర్ట్సు క్లబ్ సెక్రటరీ డాక్టర్ ఈ. త్రిమూర్తి తెలిపారు. వాలీబాల్, త్రోబాల్, బాస్కెట్బాల్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, బాడ్మింటన్, చెస్ వంటి ఆటలలో ఈ పోటీలు జరుగుతున్నాయని జీఎస్ఎల్ మెడికల్ కాలేజ్ పీడీ శ్రీనివాసరావు చెప్పారు. జీఎస్ఎల్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్ఎస్ మిశ్రా, సూపరింటెండెంట్ డాక్టర్ టీవీఎస్పీ మూర్తి పాల్గొన్నారు. చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి సీతానగరం: మండలంలోని బొబ్బిల్లంకకు చెందిన పోలిన వెంకట్రావు (70) రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ మంగళవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వెంకట్రావు అనారో గ్యం బారిన పడ్డారు. ఆ బాధ తట్టుకోలేక సోమ వారం రాత్రి 9 గంటలకు ఇంటి వద్ద పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యు లు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వెంకట్రావు మంగళవారం ఉదయం 9 గంటలకు మరణించారు. ఆసుపత్రి సమాచారం, మృతుని కుమారుడు పోలిన వీరవెంకట సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ తెలిపారు -
వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం
● చెరువులో దూకిన వారిని కాపాడిన స్థానికులు ● పురుగులు మందు కూడా తాగినట్టు పోలీసుల వెల్లడి ● సంతానం పట్టించుకోకపోవడమే కారణం? జగ్గంపేట: జీవిత చరమాంకంలో కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవనం సాగించవలిసిన వృద్ధ దంపతులు జీవితంపై విరక్తితో పురుగు మందు తాగి, చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జగ్గంపేట శివారు సీతానగరం గ్రామం వద్ద చోటు చేసుకుంది. అయితే స్థానికులు ఘటన జరిగిన వెంటనే స్పందించి వృద్ధ దంపతులను కాపాడి జగ్గంపేటలోని సీహెచ్సీకి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ ఆసుపత్రికి తరలించారు. జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ అందించిన వివరాల ప్రకారం తొండంగి మండలం ఏవీ నగరం గ్రామానికి చెందిన 70 ఏళ్ల సక్కుల సత్యనారాయణ, 65 ఏళ్ల సక్కుల మంగతాయారు దంపతులు. సత్యనారాయణ పెద్దాపురంలో శ్రీ చక్ర హాస్పిటల్లో వాచ్మన్గా పనిచేస్తున్నారు. సంతానం ఈ దంపతుల మంచి చెడ్డలు పట్టించుకోకపోవడంతో జీవితంపై విరక్తి చెందినట్టు భావిస్తున్నామన్నారు. దీంతో మంగళవారం జగ్గంపేట శివారు సీతానగరం గ్రామం వద్ద చెరువు వద్దకు చేరుకుని పురుగు మందు సేవించి ఆత్మహత్య చేసుకోవడానికి చెరువులో దూకారు. అయితే అక్కడ వున్న స్థానికులు దీన్ని గమనించి వారిని రక్షించి చెరువు గట్టుపై పడుకోబెట్టి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాసరావు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని జగ్గంపేట సీహెచ్సీకి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సీఐ తెలిపారు. -
త్వరలో కొత్త ట్రస్ట్ బోర్డు!
ఈ నియోజకవర్గాల నుంచే.. ఫ అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు పదవుల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే 25 పేర్లు సిఫారసు చేసినట్లు సమాచారం. ఫ జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం, కాకినాడ రూరల్ నుంచి ఆ పార్టీ తరఫున ఒక్కొక్కరిని ట్రస్ట్ బోర్డులో నియమించనున్నారు. ఫ అలాగే, బీజేపీ తరఫున రాజమహేంద్రవరం, ప్రత్తిపాడు నుంచి ఒకొక్కరిని మాత్రమే ట్రస్ట్ బోర్డులో నియమించనున్నారు. ఫ మిగిలిన 13 మందినీ టీడీపీ నుంచే ఎంపిక చేస్తారని సమాచారం. ఫ పెద్దాపురం నుంచి శ్రీ లలితా ఇండస్ట్రీ అధినేత మట్టే సత్యప్రసాద్ను రెండోసారి కూడా దాత కోటాలో టీడీపీ ప్రజాప్రతినిధి సిఫారసు చేసినట్లు సమాచారం. గతంలో 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో కూడా ఆయనను దేవస్థానం ట్రస్ట్బోర్డు సభ్యునిగా నియమించారు. ఆ తరువాత సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు సత్యప్రసాద్ దంపతులు రూ. 2.5 కోట్లతో వజ్ర కిరీటాలు చేయించారు. ఇటీవల అమ్మవారికి రూ.20 లక్షల విలువైన వజ్రాల హారాన్ని ఆయన కుమారుడు మట్టే ఆదిశంకర్ దంపతులు సమర్పించారు. వీటితో పాటు రూ.5 కోట్ల వ్యయంతో సత్యదేవుని ప్రసాద తయారీ భవనం, మరో రూ.2 కోట్ల విలువైన పూజాసామగ్రి సమర్పించారు. పలు భవనాలు కూడా నిర్మించారు. ఫ తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, కాకినాడ సిటీ, పాయకరావుపేట ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన వారికి ధర్మకర్తల మండలిలో చోటు దక్కే అవకాశం ఉంది. ఫ కోనసీమ నుంచి ఒకరు, మిగిలిన ఇద్దరూ గుంటూరు, విశాఖకు చెందిన వారు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఫ టీడీపీ నేతల నుంచి ఒత్తిళ్లు అధికమైతే మాత్రం జనసేన, బీజేపీల నుంచి ఒక్కొక్కరికి మాత్రమే చాన్స్ ఇస్తారు. టీడీపీ నుంచి మరో ఇద్దరిని నియమిస్తారు. ఫ అన్నవరం దేవస్థానానికి నెలాఖరులోగా నియమించనున్న సర్కారు ఫ 25 మంది పేర్లతో మంత్రులు, ఎమ్మెల్యేల ప్రతిపాదనలు ఫ కొత్త ధర్మకర్తల మండలి చైర్మన్గా ఐవీ రోహిత్.. మరో 17 మంది సభ్యులు ఫ 13 పదవులు టీడీపీకే.. ఫ జనసేన, బీజేపీకి చెరో రెండింటితో సరిపెట్టాలని యోచన అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో నూతన ధర్మకర్తల మండలి(ట్రస్ట్ బోర్డు)ని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2023లో ఏర్పాటు చేసిన ట్రస్ట్ బోర్డు కాలపరిమితి గత ఫిబ్రవరి 8న ముగిసింది. అప్పటి నుంచీ దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త, ఆలయ చైర్మన్ ఐవీ రోహిత్ ట్రస్ట్ బోర్డు తరఫున అధికారులతో సమావేశమై తీర్మానాలు చేస్తున్నారు. ఈ నెల 25 నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది. మంచి ముహూర్తాలు ఉండటంతో ఆ మాసంలోనే ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం జరిగేలా ఏర్పాటు చేయనున్నారని సమాచారం. రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవస్థానాలకు ఈ నెల 19వ తేదీకల్లా ధర్మకర్తల మండళ్లను ఏర్పాటు చేయాలని, అందుకు పేర్లు పంపించాలని ఆయా ఆలయాల పరిధిలోని ఎమ్మెల్యేలను ప్రభుత్వం ఇప్పటికే కోరింది. ఈ మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆశావహుల పేర్లను ప్రతిపాదించారు. దీనిపై ప్రభుత్వ వడపోత ముగింపు దశకు చేరుకుంది. ఈ నెలాఖరులోగా కొత్త ట్రస్ట్ బోర్డు ఏర్పాటయ్యే అవకాశాలున్నాయని సమాచారం. గతంలో అన్ని వర్గాలకూ ప్రాధాన్యం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2023లో 16 మందితో ఏర్పాటు చేసిన ట్రస్ట్ బోర్డులో అన్ని సామాజిక వర్గాలకూ ప్రాధాన్యం కల్పించారు. మొత్తం 15 మంది సభ్యుల్లో ఏడుగురు మహిళలు కాగా, మిగిలిన ఎనిమిది మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారే కావడం విశేషం. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నాయీబ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారికి కూడా ట్రస్ట్ బోర్డులో స్థానం కల్పించారు. అన్ని వర్గాలకూ ప్రాధాన్యం కల్పించినదిగా ఈ ట్రస్ట్ బోర్డు దేవస్థానం చరిత్రలో నిలిచిపోయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఇదే విధమైన ఫార్ములాతో ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాల్సి ఉంది. కొత్త ట్రస్ట్ బోర్డులో చైర్మన్తో పాటు మరో 17 మంది సభ్యులుంటారని తెలుస్తోంది. దేవదాయ శాఖ చట్టం ప్రకారం నూతన ట్రస్ట్ బోర్డుకు కూడా దేవస్థానం వ్యవస్థాపక కుటుంబానికి చెందిన ఐవీ రోహిత్ చైర్మన్గా నియమితులవ్వనున్నారు. మొత్తం సభ్యుల్లో నలుగురు లేదా ఐదుగురు మాత్రమే మహిళలుంటారని చెబుతున్నారు. అన్ని సామాజికవర్గాలతో పాటు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారికి కూడా ట్రస్ట్ బోర్డులో స్థానం కల్పించనున్నట్లు సమాచారం. నాయీబ్రాహ్మణ వర్గాల నుంచి కూడా ఒకరిని నియమించనున్నారు. అలాగే, దేవస్థానం తరఫున ఆలయ ప్రధానార్చకుడు ప్రత్యేక ఆహ్వానితునిగా ఉంటారు. జనసేన ‘పంచాయితీ’ ట్రస్ట్ బోర్డు నియామకంలో పిఠాపురం నియోజకవర్గం నుంచి సోషల్ మీడియాలో జనసేన తరఫున పిఠాపురం రూరల్ మండలానికి చెందిన ఒక వ్యక్తి పేరు ప్రతిపాదించారు. అతడు సోషల్ మీడియాలో వైఎస్సార్ సీపీతో పాటు అక్కడి టీడీపీ, జనసేనలోని ఒక వర్గం నాయకుల మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. దీనిపై టీడీపీ నియోజకవర్గ నాయకునితో పాటు జనసేనలోని కొంత మంది కూడా అతడిని హెచ్చరించారు. అయినా అతడి తీరు మారలేదని సమాచారం. ఇప్పుడు ధర్మకర్త మండలికి అతడి పేరు ఏవిధంగా సిఫారసు చేస్తారని జనసేనలోని మరో వర్గం సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్గా మారింది. కాగా, టీడీపీ నుంచి కూడా ట్రస్ట్ బోర్డులో ఒకరిని నియమించాలని టీడీపీ పిఠాపురం నియోజకవర్గ నాయక ులు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్లకు లేఖలు రాసినట్లు చెబుతున్నారు. ట్రస్ట్ బోర్డు సభ్యుల పేర్లు బయటకు వస్తే మిగిలిన నియోజకవర్గాల నుంచి కూడా ఇటువంటి వివాదాలు ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు. అన్నవరం దేవస్థానం -
ఇదేం భోజనం.. ఇవేం సౌకర్యాలు?
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి స్థానిక ఆర్ట్స్ కాలేజీ సమీపంలోని గిరిజన సంక్షేమ బాలురు, బాలికల హాస్టల్ను, బీసీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ను మంగళవారం సందర్శించారు. హాస్టళ్లలో వసతులు, ఆహారాన్ని పరిశీలించారు. వసతి గృహం సిబ్బందితో మాట్లాడారు. గిరిజన సంక్షేమ బాలుర హాస్టల్లో వసతులు, శుభ్రత విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. హాస్టల్ కిటికీలకు దోమ తెరలు లేవని, బాత్ రూములకు డోర్లు లేవని, భోజనం చేసే స్థలం శుభ్రంగా లేదని, భోజనం బాగోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వీటిని వెంటనే మెరుగు పరచాలని సూచించారు. విద్యార్ధులకు సురక్షిత తాగునీరు, మంచి ఆహారం అందించాలని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, వసతి గృహ ప్రాంగణంలో అవసరమైన మరమ్మత్తులు ఎప్పటికప్పుడు చేయించాలన్నారు. విద్యార్థులకు ఎటువంటి వైద్య సహాయం అవసరమైనా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పారు. వసతి గృహంలో ఎటువంటి సమస్యలున్నా, న్యాయ సహాయం కావాలన్నా డీఎల్ఎస్ఏకి తెలియజేయాలని శ్రీలక్ష్మి సూచించారు. డీఎల్ఎస్ఏ అందిస్తున్న సేవలను వివరించారు. హాస్టల్లో డీఎల్ఎస్ఏ కార్యదర్శి తనిఖీ -
రుణాలివ్వకపోవడం అన్యాయం
కార్పొరేషన్ రుణాల పేరు చెప్పి, కాపులను ప్రభుత్వం దగా చేసింది. అందరికీ రుణాలని ఆశలు కల్పించి, తీరా యూనిట్ల మంజూరు సమయం వచ్చేసరికి చేతులెత్తేయడం చంద్రబాబు సర్కార్కు కొత్తేమీ కాదు. ప్రతి ఎన్నికల్లోనూ జనాన్ని ఇలానే నమ్మించి మోసం చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. సబ్సిడీ సొమ్ము విడుదల చేయలేనప్పుడు అంత హడావుడిగా రుణ ప్రణాళిక ప్రకటించడమెందుకు? రుణాల మంజూరు ప్రక్రియ మొదలై ఐదు నెలలైనా ఇంతవరకూ ఒక్కరంటే ఒక్కరికై నా రుణం మంజూరు చేసి ఉంటే చెప్పాలి. – రావూరి వెంటేశ్వరరావు, వైఎస్సార్ సీపీ ప్రచార విభాగం కార్యదర్శి, కాకినాడ వెంటనే మంజూరు చేయాలి కుటుంబ పోషణ కోసం వస్త్ర, కిరాణా దుకాణాలు పెట్టుకుందామని బీసీ కార్పొరేషన్ రుణానికి దరఖాస్తు చేసుకున్న వారు ఆ రుణం వస్తుందా అని కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. ఐదు నెలలు గడచినా ఇప్పటి వరకూ రుణం మంజూరు కాలేదు. అధికారులను అడిగితే లబ్ధిదారుల లిస్టు పంపామంటున్నారు. రుణాలు మంజూరైన జాబితాయే రాలేదనీ చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి త్వరితగతిన బీసీ రుణాలు మంజూరు చేయాలి. – గుబ్బల వీర వెంకట సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ బీసీ విభాగం అధ్యక్షుడు, రాజోలు అసలు ఇస్తారా? ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ (ఈడబ్ల్యూఎస్) కార్పొరేషన్ రుణాలు వస్తాయని దరఖాస్తుదారులు మూడు నెలలుగా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఇస్తామన్న రుణాలు రాక బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. రుణాలు వెంటనే మంజూరు చేయాలి. స్వయం ఉపాధికి అవకాశాలు మరింత పెంచాలి. రుణాలకు సంబంధించి సబ్సిడీ ప్రభుత్వం విడుదల చేయకుంటే బ్యాంకులు మాత్రం ఎలా రుణాలు ఇస్తాయి? – దుర్వాసుల సత్యనారాయణ, బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షుడు, రాజమహేంద్రవరం ఆశలు ఆవిరి ప్రభుత్వం రాయితీ రుణాలిస్తుందని ఆశపడి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. మండల స్థాయిలో జాబితాలపై పరిశీలన జరిపి, బ్యాంకుకు వెళ్లేసరికి ప్రభుత్వం రాయితీ సొమ్ము విడుదల చేయలేదని సమాధానం చెబుతున్నారు. సర్కారు ఉదాసీనత కారణంగా ఐదు నెలలుగా ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరుతున్నా ఫలితం ఉండటం లేదు. అసలు రుణాలిస్తారో ఇవ్వరో అర్థం కావడం లేదు. – వేట్ల నాగేశ్వరరావు, మైనార్టీ బీసీ సంఘం అధ్యక్షుడు, రామచంద్రపురం -
దారుణ మోసం!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాయితీ రుణాలతో స్వయం ఉపాధికి పెద్దపీట వేస్తామని కూటమి సర్కార్ చెప్పిన మాటలు నీటిమీద రాతలుగానే మిగిలిపోయాయి. రూ.లక్ష, రూ.2 లక్షలు, రూ.3 లక్షలు రుణాలిస్తాంమని, సగం సబ్సిడీ అని, మిగిలిన సగం బ్యాంక్ రుణమని చంద్రబాబు, పవన్ కల్యాణ్ గొప్పగా డప్పేశారు. బీసీ, ఎస్సీ, కాపు సామాజికవర్గాలకు రుణాలో రుణాలంటూ దండోరా వేసి మరీ ప్రచారం చేశారు. మంత్రుల నుంచి ద్వితీయ శ్రేణి నేతల వరకూ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. దరఖాస్తు చేసుకోవడమే తరువాయి అందరికీ సబ్సిడీ రుణాలంటూ ఊదరగొట్టారు. మాయ మాటలతో జనాన్ని నమ్మించిన చంద్రబాబు గద్దెనెక్కారు. తరువాత ఎప్పటి మాదిరిగానే నిలువునా ముంచేశారు. దరఖాస్తు చేసి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ రుణాలు రాకపోవడంతో.. స్వయం ఉపాధి పొందవచ్చని ఆశపడిన వారు హతాశులవుతున్నారు. అంతన్నారింతన్నారే చంద్రబాబు.. నట్టేట్లో ముంచేశారే.. అని మండిపడుతున్నారు. లక్ష్యం మూరెడు.. దరఖాస్తులు బారెడు బీసీ, ఎస్సీ, ఈబీసీ, కాపు సామాజికవర్గాల్లో అర్హులైన వారికి రాయితీ రుణాలిస్తామని సర్కారు ఊరూవాడా ఊదరగొట్టింది. తీరా ఆచరణలోకి వచ్చేసరికి రుణ లక్ష్యాలు వందల్లోనే ఇచ్చారు. ఒక నియోజకవర్గంలో అన్ని కార్పొరేషన్లు కలిపి సుమారు 100 యూనిట్లు కేటాయిస్తే అంతకు పది రెట్లు దరఖాస్తులు కూడా వచ్చాయి. ఆయా కార్పొరేషన్ల ద్వారా రుణాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం మార్చి 11న ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించింది. ఆ నెలంతా స్వీకరించడంతో వేలాదిగా దరఖాస్తులు వచ్చిపడ్డాయి. వాటిని ఏప్రిల్ నెలలో మండల స్థాయిలో వడబోసిన ఎంపీడీఓలు.. ఆయా బ్యాంకులకు పంపించారు. బ్యాంకులు కూడా రుణం ఇచ్చేందుకు ఆసక్తి చూపాయి. బ్యాంకుల నుంచి ఆమోదం లభించిన వారంతా శ్రావణ మాసం మంచి రోజుల్లో యూనిట్లు ప్రారంభిద్దామని గంపెడాశతో ఎదురు చూస్తున్నారు. కానీ, వారి ఆశలపై ప్రభుత్వం నీళ్లు జల్లింది. మంజూరు చేసిన యూనిట్లకు, వచ్చిన దరఖాస్తులకు ఎక్కడా లంగరు అందకపోవడంతో ప్రభుత్వం మార్జిన్ మనీ విడుదల చేయకుండానే కార్పొరేషన్ రుణ ప్రక్రియను అప్పటికప్పుడు నిలిపివేసింది. ఈ రుణాలపై ముందుకు వెళ్లవద్దని మే 8న ఆదేశాలిచ్చింది. ఫలితంగా కార్పొరేషన్ రుణాల ప్రక్రియ ప్రారంభమై మూడు నెలలు కావస్తున్నా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఒక్క యూనిట్ కూడా ఇప్పటి వరకూ మంజూరు కాలేదు. ఒక యూనిట్ విలువ రూ.2 లక్షలనుకుంటే అందులో 50 శాతం అంటే రూ.లక్ష ప్రభుత్వ సబ్సిడీ. మిగిలిన రూ.లక్ష బ్యాంకు రుణం. ఇస్తానన్న 50 శాతం సబ్సిడీని ప్రభుత్వం విడుదల చేయకుండా మూడు నెలలుగా ముప్పుతిప్పలు పెడుతోంది. రుణాల పేరిట దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం ఎందుకు.. ఇప్పుడు తమ ఆశలను ఆడియాసలు చేయడం ఎందుకని దరఖాస్తుదారులు ప్రశ్నిస్తున్నారు. రుణం ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకొచ్చినా ప్రభుత్వం కావాలనే సబ్సిడీ విడుదల చేయకుండా చివరి నిమిషంలో అర్ధాంతరంగా ఈ ప్రక్రియను నిలిపివేసిందని మండిపడుతున్నారు. పెద్దాపురంలో కార్పొరేషన్ రుణాల ఇంటర్వ్యూలకు హాజరైన అర్జీదారులు (ఫైల్) మూడు జిల్లాల్లో ఆయా కార్పొరేషన్ల వారీగా రుణాల వివరాలురుణాల కేటగిరీ యూనిట్ల రుణాల లక్ష్యం దరఖాస్తు మంజూరు మొత్తం లక్ష్యం (రూ.లక్షలు) దార్లు చేసిన (రూ.కోట్లు) యూనిట్లు కాకినాడ జిల్లా బీసీ కార్పొరేషన్ 1,914 3,952.00 31,859 562 1,283.55 ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ 154 417.00 2,449 41 84.42 కాపు కార్పొరేషన్ 763 2,824.00 21,454 238 5.93 తూర్పు గోదావరి జిల్లా బీసీ కార్పొరేషన్ 1,374 2,887.00 16,408 234 5.22 ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ 203 540.00 2,211 20 0.54 కాపు కార్పొరేషన్ 757 2,715.00 8,193 174 4.53 కోనసీమ జిల్లా బీసీ కార్పొరేషన్ 1,394 2,954.00 15,147 246 5.87 ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ 154 417.00 1,657 12 0.24 కాపు కార్పొరేషన్ 757 2,714.00 15,644 158 4.62 ఒక్క యూనిట్ ఇస్తే ఒట్టు ఊదరగొట్టి ఉసూరుమనిపించారు మూడు నెలలైనా దిక్కుమొక్కు లేదు సబ్సిడీపై చేతులెత్తేసిన సర్కార్ -
ఇచ్చిన హామీని పవన్కల్యాణ్ నెరవేర్చాలి
పిఠాపురం: మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీని విస్మరించారని ఏపీ మత్స్యకార, మత్స్య కార్మిక సంఘం ఆలిండియా కమిటీ మెంబర్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సీహెచ్ రమణి ఆరోపించారు. మత్స్య కార్మిక సంఘం, మత్స్యకార సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం కాకినాడ నుంచి పిఠాపురం వరకు ర్యాలీ నిర్వహించి, పిఠాపురం జనసేన కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మత్స్యకారులకు ఎన్నికల ముందు అన్ని రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చాయన్నారు. ప్రధానంగా జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారని, కానీ అమలు చేయడం లేదన్నారు. దీనిపై దశలవారీ పోరాటం చేస్తున్నప్పటికీ, ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో వినతిపత్రం ఇస్తామని ముందుగా తెలియజేసినప్పటికీ, ఇన్చార్జి అందుబాటులో లేకుండా వెళ్లిపోయారని, ఇది మత్స్యకారులను అవమానించడమేనన్నారు. దీంతో వినతిపత్రం తీసుకుంటేనే కానీ కదిలేది లేదని బైఠాయించడంతో, కార్యాలయ సిబ్బంది వినతిపత్రం తీసుకున్నారన్నారు. ఇలాంటి చర్యలు కూటమి నేతలకు తగదన్నారు. నష్ట పరిహారం ఇప్పించాలి ఓఎన్జీసీ, ఆయిల్ కంపెనీలు, ఫార్మా కంపెనీల వల్ల నష్టపోతున్న మత్స్యకారులకు నష్ట పరిహారం నెలకు రూ.11,500 ఇప్పించాలని రమణి డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లాలోని మత్స్యకారులకు ఓఎన్జిసీ, ఇతర ఆయిల్ కంపెనీలు, ఫార్మా కంపెనీల కార్యకలాపాలతో వేట సరిగా జరగడం లేదన్నారు. దీంతో మత్స్యకారుల జీవనోపాధి దెబ్బ తింటుందని చెప్పారు. అందువల్ల ముమ్మిడివరం నియోజకవర్గం, యానాంలో ఇస్తున్నట్టుగా, కాకినాడ జిల్లాలోని మత్స్యకారులకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘ నాయకులు యు.సత్యనారాయణ మాట్లాడుతూ, తమ డిమాండ్లు పరిష్కరించకపోతే మరింత ఉధృతంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మత్స్య కార్మిక నాయకులు సంగాడి ఈశ్వరరావు, తెలుగు జనతా పార్టీ నాయకులు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. మత్స్యకారులకు బీమా చేయించాలని, తీరంలో ఉన్న కంపెనీల్లో ఉద్యోగాలు ఇవ్వాలని, మత్స్యకారులను రైతులుగా గుర్తించి బ్యాంకు రుణాలు ఇప్పించాలని, సీఎస్సార్ నిధులు మత్స్యకార గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేయాలని, సొసైటీలను పునరుద్ధరించాలని, సబ్సిడీపై పరికరాలు అందించాలని తదితర డిమాండ్లతో వినతిపత్రాన్ని అందజేశారు. సంఘ నాయకులు బడే సత్యారావు, కోనాడ తాతారావు, మైలపల్లి బుజ్జి, పిక్కి రాజు, వీరబాబు, బొడ్డు నాగేశ్వరరావు, వివిధ గ్రామాల మత్స్యకారులు పాల్గొన్నారు. మత్స్య కార్మిక సంఘం, మత్స్యకార సంఘాల ఐక్య వేదిక నాయకుల డిమాండ్ పిఠాపురం జనసేన కార్యాలయం వద్ద ఆందోళన -
అరెస్టును ఖండిస్తూ మోకాళ్లపై నిరసన
అమలాపురం రూరల్: ఎంపీ మిథున్రెడ్డి అరెస్టును ఖండిస్తూ వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కో–ఆర్డినేటర్ జిల్లెళ్ల రమేష్ ఆధ్వర్యంలో సోమవారం జనుపల్లిలో అంబేడ్కర్ విగ్రహం వద్ద కళ్లకు గంతలు కట్టుకుని, మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. ఆరోపణలు తప్ప, ఆధారాల్లేకుండా కూటమి ప్రభుత్వం మిథున్రెడ్డిపై కేసులు పెట్టిందని రమేష్ ఆరోపించారు. విద్యార్థి విభాగం నాయకులు పెయ్యాల సాయి, బడుగు మోహన్, వరసల సుజిత్, విన్సీ, సాగర్, ఆనంద్, రవికుమార్, సల్మాన్రాజ్ పాల్గొన్నారు. -
‘మా ఆకలి కేకలు పట్టవా?’
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): సుపరిపాలన తొలి అడుగు అంటూ.. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో సంక్షేమ పథకాలు చేపట్టామని గొప్పలు చెబుతున్న సీఎం, డిప్యూటీ సీఎంకు తమ ఆకలి కేకలు పట్టవా అని సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లాలాచెరువు ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం వద్ద వాటర్ ప్రాజెక్టు కార్మికులు చేస్తున్న సమ్మె సోమవారం 14వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా కార్మికులు సీఎం, డిప్యూటీ సీఎం ఫొటోలు పెట్టి, కళ్లకు గంతలతో నిరసన తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను అమలు చేయాలని కోరారు. ప్రాజెక్టు యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.శ్రీను, ఇసాక్ మాట్లాడుతూ, 19 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో.. కుటుంబ పోషణ కష్టమై సమ్మె బాట పట్టామన్నారు. 25 నెలలుగా ఈఎస్ఐ, పీఎఫ్ కట్టడం లేదని ఆరోపించారు. సుపరిపాలన అని చెప్పుకుంటూ తిరిగే నేతలకు తమ ఆకలి బాధ అర్థం కావడం లేదని మండిపడ్డారు. ఈ సమ్మె కారణంగా సుమారు 85 గ్రామాల్లో దాదాపు మూడు లక్షల మంది మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. తమ వేతనాల విషయమై ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆర్డబ్ల్యూఎస్ శాఖను పర్యవేక్షిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించి, తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో సమ్మె చేపట్టగా.. కార్మికుల సమస్యలను పరిష్కరిస్తానని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ హామీ ఇచ్చినప్పటికీ, అది ఆచరణకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం 52 మంది కార్మికుల కుటుంబాల ఆకలికేకలను దృష్టిలో ఉంచుకుని, పెండింగ్ వేతనాలను విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కోశాధికారి కె.రామకృష్ణ, సభ్యులు పాల్గొన్నారు. సీఎం, డిప్యూటీ సీఎంపై కార్మికుల మండిపాటు కళ్లకు గంతలతో సత్యసాయి డ్రింకింగ్ ప్రాజెక్టు సిబ్బంది నిరసన -
నవోదయం ఏదీ..?
రాయవరం: విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు జవహర్ నవోదయ విద్యాలయ సమితి కృషి చేస్తోంది. ప్రతిభావంతులైన విద్యార్థులకు పట్టం కట్టి, వారికి ఉజ్వల భవిష్యత్తునిచ్చే ఆలయంగా నవోదయ విద్యాలయం భాసిల్లుతోంది. అటువంటి నవోదయ విద్యాలయంలో సీటు వస్తే తమ పిల్ల భవిష్యత్తుకు ఢోకా ఉండదని తల్లిదండ్రులు ఆశ పడుతుంటారు. అందుకే తమ పిల్లల్ని చేర్చేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. కారణాలేమైనా ఈ ఏడాది దరఖాస్తుల ప్రక్రియ మందగించడంతో.. గతంతో పోలిస్తే దరఖాస్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. నవోదయలో ఆరో తరగతిలో చేరాలంటే ప్రవేశ పరీక్షే ఆధారం. ఇందులో ప్రతిభ చూపితే సీటు ఖాయం. 2026–27 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశానికి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానించారు. ఐదో తరగతిలో చదువుతున్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు దరఖాస్తు చేయాల్సి ఉండగా, ఈ ఏడాది దరఖాస్తుల సంఖ్య నిరాశాజనకంగా ఉంది. ఈ నెల 29తో దరఖాస్తుల గడువూ ముగియనుంది. కాకినాడ జిల్లాలో పెద్దాపురంలో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయంలో కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని విద్యార్థులు మాత్రమే ఇక్కడ దరఖాస్తు చేయాలి. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియేట్ వరకు ఉచిత విద్యను ఇక్కడ అందిస్తారు. విద్యతో పాటు, అధునాతన వసతుల కల్పన, ప్రయోగాత్మక విద్య, క్రీడలు, క్రమశిక్షణ, ప్రతిభకు పెద్దపీట వేయడం ఈ విద్యా సంస్థల్లో ప్రత్యేకత. అవగాహన లేక..? ఈ ఏడాది డిసెంబర్ 13న నిర్వహించే ప్రవేశ పరీక్షకు మూడు జిల్లాల నుంచి కేవలం 668 దరఖాస్తు మాత్రమే వచ్చాయి. ఉమ్మడి జిల్లా నుంచి అతి తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. 2023–24లో 8,506 దరఖాస్తులు రాగా, గతేడాది మూడు జిల్లాల పరిధిలో 8,971 దరఖాస్తులు వచ్చాయి. ఇలాఉంటే, ఈ ఏడాది 9 వేల వరకు దరఖాస్తులు వస్తాయనే అంచనాతో అధికారులు ఉన్నారు. గడువు సమీపిస్తున్నా తక్కువగా వచ్చిన దరఖాస్తుల సంఖ్య చూసి అధికారులు విస్తుపోతున్నారు. దీనికి కారణం.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సరైన అవగాహన కల్పించక పోవడమా, లేక వారిలో ఆసక్తి సన్నగిల్లడమా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. జవహర్ నవోదయ విద్యాలయంలో సీటు వచ్చినా, రాకున్నా విద్యార్థులతో దరఖాస్తు చేయిస్తే, ఐదో తరగతిలోనే విద్యార్థులకు పోటీతత్వాన్ని అలవాటు చేయడం, ఆన్లైన్ పరీక్షను పరిచయం చేసినట్టవుతుందని విద్యావేత్తలు చెబుతున్నారు. పెద్దాపురం జవహర్ నవోదయ విద్యాలయంలో మొత్తం 80 సీట్లు ఉన్నాయి. ఆరో తరగతిలో ప్రవేశానికి ప్రస్తుతం ఆయా మండలాల్లో ఐదో తరగతి చదువుతున్న బాలబాలికలు అర్హులు. జవహర్ నవోదయ పాఠశాలల్లో ఆరో తరగతిలో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఒక్కసారి మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంది. మూడు జిల్లాల్లో ఈ ఏడాది ఐదో తరగతిలో సుమారు 60 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. 2026–27 విద్యా సంవత్సరంలో అడ్మిషన్ పొందడానికి నిర్వహించే ప్రవేశ పరీక్షకు హాజరయ్యే బాలబాలికలు 2014 మే ఒకటో తేదీ నుంచి 2016 జూలై 31 మధ్య జన్మించి ఉండాలి. ప్రభుత్వం గుర్తించిన పాఠశాలల్లో 3, 4 తరగతుల్లో ఉత్తీర్ణత సాధించి, ఐదో తరగతి చదువుతున్న వారు మాత్రమే అర్హులు. గతేడాది ప్రవేశ పరీక్షకు హాజరైన వారు అనర్హులు. జిల్లాల వారీగా దరఖాస్తులు ఇలా.. జిల్లా వచ్చిన నేటి వరకు దరఖాస్తులు దరఖాస్తులు (గతేడాది) (ఈ ఏడాది) కోనసీమ 3,869 201 తూర్పు గోదావరి 1,741 107 కాకినాడ 3,361 360 జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షకు గణనీయంగా తగ్గిన దరఖాస్తులు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆసక్తి అంతంతమాత్రం ఈ నెల 29తో ముగుస్తున్న గడువు గతేడాది వచ్చినవి 8,971 ఈ ఏడాది ఇంత వరకు 668 మాత్రమే.. డిసెంబర్ 13న ప్రవేశ పరీక్ష పరీక్షా విధానమిలా.. నవోదయ ప్రవేశ పరీక్షను ఈ ఏడాది డిసెంబర్ 13న ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు జిల్లాలో నిర్దేశించిన పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్షను విద్యార్థులు ప్రస్తుతం చదువుతున్న భాషను(తెలుగు/ఇంగ్లిష్) ఎంచుకుని పరీక్ష రాయవచ్చు. ప్రవేశ పరీక్షలో 80 ప్రశ్నలుంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలో 100 మార్కులకు నిర్వహించే ప్రవేశ పరీక్ష రాసేందుకు రెండు గంటల సమయాన్ని కేటాయిస్తారు. మూడు విభాగాల్లో ప్రశ్నలు కేటాయిస్తారు. మేధా శక్తి(మెంటల్ ఎబిలిటీ)పై 50 మార్కులకు 40 ప్రశ్నలు, గణితం(అర్థమెటిక్), భాషపై ఒక్కొక్క విభాగానికి 20 వంతున 40 ప్రశ్నలు 50 మార్కులకు ఉంటాయి. తప్పుడు సమాధానాలకు నెగిటివ్ మార్కులు ఉండవు. దివ్యాంగులకు 40 నిమిషాల అదనపు సమయాన్ని కేటాయిస్తారు. పరీక్షా పత్రాల రూపకల్పన నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) నిర్వహిస్తుంది. ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులై, ప్రవేశానికి ఎంపికై న వారికి తొలి రెండేళ్లు తెలుగు/ఇంగ్లిష్ భాషల్లో బోధిస్తారు. పోటీ పరీక్షలపై అవగాహన జవహర్ నవోదయ విద్యాలయ సమితిలో సీటు పొందడాన్ని ప్రతిష్టగా భావిస్తారు. ఇందుకు ఏటా దరఖాస్తు చేసిన విద్యార్థులు ప్రత్యేకంగా తర్ఫీదు పొందుతారు. జిల్లాలో ఉన్న ఐదో తరగతి విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యేలా పాఠశాలల ఉపాధ్యాయులు కృషి చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా ఐదో తరగతి నుంచే పోటీ పరీక్షలపై విద్యార్థులకు అవగాహన కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఆ దిశగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆలోచన చేసి, అధిక సంఖ్యలో దరఖాస్తులు చేసేలా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి విద్యార్థితో దరఖాస్తు చేయించాలి విద్యార్థులకు అవగాహన కల్పించి ప్రతి విద్యార్థితో దరఖాస్తు చేసేలా ప్రధానోపాధ్యాయులు చొరవ చూపాలి. జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో ప్రవేశ పరీక్షకు ప్రతి విద్యార్థి దరఖాస్తు చేయడం ప్రధానమైన విషయంగా భావించాలి. ఈ నెల 29వ తేదీ దరఖాస్తుకు తుది గడువు. ప్రవేశ పరీక్ష దరఖాస్తులను మూడు జిల్లాల విద్యాశాఖాధికారుల ద్వారా పాఠశాలలకు పంపించాం. పాఠశాలలకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నాం. – బి.సీతాలక్ష్మి, ప్రిన్సిపాల్, జవహర్ నవోదయ విద్యాలయ సమితి, పెద్దాపురం డీఈవోలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి జవహర్ నవోదయలో గ్రామీణ పాంత విద్యార్థులకు అధిక శాతం సీట్లు కేటాయించడంతో వారికి ప్రయోజనం కలుగుతుంది. జిల్లా విద్యా శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఉప విద్యా శాఖాధికారులు, మండల విద్యా శాఖాధికారుల ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. ప్రవేశ పరీక్షను విద్యార్థులతో రాయించడం వల్ల వారిలో పోటీ పరీక్షలను ఎదుర్కోగలిగే ఆత్మ విశ్వాసం ఏర్పడుతుంది. – జి.నాగమణి, ఆర్జేడీ, పాఠశాల విద్యా శాఖ, కాకినాడ -
శాకంబరిగా పురుహూతికా అమ్మవారు
పిఠాపురం: బిడ్డల ఆకలి తీర్చే కన్నతల్లిలా.. ఈ సమస్త జగత్తు ఆకలినీ తీర్చే ఆ జగజ్జనని శాకంబరి దేవిగా దర్శనమిచ్చారు. అష్టాదశ శక్తిపీఠాల్లో పదోది అయిన పిఠాపురం పాదగయ క్షేత్రంలో వెలసిన పురుహూతికా అమ్మవారిని సోమవారం పలు రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో శోభాయమానంగా అలంకరించారు. మాలలుగా తయారు చేసిన కూరగాయలే ఆ తల్లికి వస్త్రాభరణాలయ్యాయి. ఈఓ జగన్మోహన్ శ్రీనివాస్ ఆధ్వర్యాన అమ్మవారితో పాటు ఆలయాన్ని సైతం కూరగాయలు, ఆకుకూరలతో అలంకరించారు. అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ దివ్యాలంకరణలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు తన్మయులయ్యారు.సత్యదేవునికి ఘనంగా ఏకాదశి పూజలుఅన్నవరం: ఆషాఢ బహుళ ఏకాదశిని పురస్కరించుకుని సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి సోమవారం విశేష పూజలు నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకు స్వర్ణ పుష్పార్చన, 9 నుంచి 11 గంటల వరకూ కుంకుమార్చన నిర్వహించారు. సుమారు 15 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించి, పూజలు చేశారు. వెయ్యి వ్రతాలు నిర్వహించారు. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.15 లక్షల ఆదాయం సమకూరింది. ఉదయం ఎండ.. మధ్యాహ్నం కుండపోత ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ తీవ్ర స్థాయిలో ఎండ కాయడంతో సత్యదేవుని దర్శనానికి రత్నగిరికి వచ్చిన భక్తులు అల్లాడిపోయారు. పశ్చిమ రాజగోపురం వద్ద చెట్ల నీడను ఆశ్రయించి, సేద తీరారు. అంతలోనే మధ్యాహ్నం నుంచి కుండపోత వర్షం కురవడంతో తడిసి ముద్దయ్యారు. పశ్చిమ రాజగోపురం వద్ద విశ్రాంతి షెడ్డు త్వరగా నిర్మించాలని కోరుతున్నారు. ధరల పట్టిక తప్పనిసరిగా ప్రదర్శించాలి కాకినాడ క్రైం: జిల్లాలో రిజిస్టర్ అయిన అన్ని ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, ల్యాబ్లలో సేవల ధరల పట్టిక తప్పనిసరిగా ప్రదర్శించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ నరసింహ నాయక్ సోమవారం ఒక ప్రకటనలో ఆదేశించారు. ఈ నెల 31వ తేదీలోపు ఏర్పాటు చేసిన ధరల పట్టికల ఫొటోలను statisticalofficerkakinada@gmail.comకు పంపాలని సూచించారు. అలా పంపని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
కౌలుకోనివ్వరా..!
● కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వని సర్కారు ● జిల్లాలో ఈ ఏడాది లక్ష్యం 63 వేలు ● ఇప్పటి వరకూ జారీ చేసినవి 23 వేలు ● కార్డులు లేక రైతులు విలవిల బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు పైగా అయ్యింది. ఒకపక్క వరి నారు పోసుకున్న కౌలు రైతులు.. అవసరమైన ఎరువుల కోసం రైతు సేవా కేంద్రాల(ఆర్ఎస్కే)కు వెళ్తే చుక్కెదురవుతోంది. వారికి పంట సాగు హక్కు (సీసీఆర్) కార్డులు లేకపోవడంతో ఎరువులు ఇచ్చేందుకు అక్కడి సిబ్బంది ససేమిరా అంటున్నారు. దీంతో, పంట పొలాలకు కావాల్సిన ఎరువులు బయటి మార్కెట్లో ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు బ్యాంకులు, సొసైటీల నుంచి పంట రుణాలు కూడా రాకపోవడంతో కౌలురైతులు నానా ఇక్కట్లూ పడుతున్నారు. బారెడు లక్ష్యం.. ఇచ్చింది స్వల్పం జిల్లావ్యాప్తంగా ప్రస్తుత ఖరీఫ్లో రైతులు 2.18 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఇందులో లక్ష ఎకరాలకు పైగా సాగు చేస్తున్నది కౌలు రైతులే. ఒక్కొక్కరు రెండు నుంచి ఐదెకరాల వరకూ కౌలుకు తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూలీల కొరత ఎక్కువగా ఉండటంతో చాలా మంది రైతులు తమ పొలాలు సాగు చేసేందుకు ఇష్టపడటం లేదు. కొంత మంది సొంతంగా సాగు చేసినా కూలి రేట్లు అధికంగా ఉండటం, ఉన్న కొద్దిపాటి భూమి సాగు చేసినా లాభాలు రాకపోవడంతో కౌలుకు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం తప్ప ఇతర పనులు చేసుకోలేని రైతులు ఆ భూములు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్లో జిల్లావ్యాప్తంగా 63 వేల మంది కౌలు రైతులకు సీసీఆర్ కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటి వరకూ 23 వేలు మాత్రమే ఇచ్చారు. వైఎస్సార్ సీపీ హయాంలో సీజన్ ప్రారంభం కాకముందే ఏటా కౌలు గుర్తింపు కార్డులు మంజూరు చేసేవారు. ఆయా గుర్తింపు కార్డుల ఆధారంగా కౌలు రైతులకు సైతం బ్యాంకులు రూ.లక్షకు తక్కువ కాకుండా రుణాలు మంజూరు చేసేవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా.. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చేందుకే ఆసక్తి చూపడం లేదు. ‘గుర్తింపు’ లేక.. పంటలకు అవసరమైన ఎరువుల కోసం కౌలు రైతులు ఆర్ఎస్కేలకు, సహకార సంఘాలకు వెళ్లినా ప్రయోజనం ఉండటం లేదు. సీసీఆర్ కార్డులు చూపిస్తున్న వారికి అక్కడ ఎరువులు ఇస్తున్నారు. అయితే, ఆ కార్డులు ఇంకా ఇవ్వకపోవడంతో చాలా మంది కౌలు రైతులు ఎరువుల కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం నారుమడులకు యూరియా, డీఏపీ వేయాల్సి ఉంది. గత్యంతరం లేకపోవడంతో కౌలు రైతులు ప్రైవేటు డీలర్ల వద్ద అధిక ధరలకు ఎరువులు కొనుగోలు చేస్తున్నారు. ఇదే అదనుగా ఎరువుల డీలర్లు యూరియా, డీఏపీపై బస్తాకు రూ.200 అధికంగా వసూలు చేస్తున్నారని రైతులు గగ్గోలు పెడుతున్నారు. నారుమడులకు ఎరువులు తక్కువగా వేస్తారు. వరి నాట్లు పూర్తయితే ఎకరాకు బస్తాకు పైగా యూరియా, కాంప్లెక్సు ఎరువులు మొదటి విడతగా వేయాల్సి ఉంటుంది. అప్పుడు పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుందని కౌలు రైతులు వాపోతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో సీసీఆర్ కార్డు ఆధారంగా కౌలు రైతులకు బ్యాంకుల ద్వారా రూ.లక్ష వరకూ రుణాలు సైతం మంజూరు చేసేవారు. అదే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత గత ఏడాది గుర్తింపు కార్డులిచ్చినా ఒక్క రూపాయి కూడా రుణం ఇవ్వలేదని కౌలు రైతులు మండిపడుతున్నారు. ఇబ్బందులు పడుతున్నాం వ్యవసాయానికి సంబంధించిన ఏ పనిపై వెళ్లినా అధికారులు కౌలు గుర్తింపు కార్డులు అడుగుతున్నారు. సీజన్ ప్రారంభమైనప్పటికీ ఈ ఏడాది ఇంకా గుర్తింపు కార్డులు ఇవ్వలేదు. రేపు మాపు అని చెబుతున్నారు. వ్యవసాయ అధికారులను అడిగితే రెవెన్యూ అధికారులు కార్డులివ్వాలని చెబుతున్నారు. – మారేళ్ల వెంకట రమణ, కౌలు రైతు, యండమూరు, కరప మండలం గత ఏడాది ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు గత ఏడాది ఇచ్చిన కౌలు గుర్తింపు కార్డులు పని చేయవని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం కార్డులు ఇవ్వలేదు. గత ఏడాది గుర్తింపు కార్డులు ఇచ్చినా బ్యాంకు రుణం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. బయటి వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి, వ్యవసాయ పెట్టుబడులు పెట్టుకుంటున్నాం. ఈ ఏడాదైనా కూటమి ప్రభుత్వం తక్కువ వడ్డీలకు బ్యాంకుల్లో రుణాలిప్పించే ఏర్పాట్లు చేయాలి. – ఇంటి వెంకటరావు, కౌలు రైతు, వీకే రాయపురం, సామర్లకోట మండలం -
మిథున్రెడ్డి అరెస్టు దుర్మార్గం
● తప్పుడు కేసులలో అక్రమంగా ఇరికించారు ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజాతుని రూరల్: రాజంపేట ఎంపీ మిథున్రెడ్డిని తప్పుడు కేసులలో ఇరికించి అక్రమంగా అరెస్టు చేశారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. తుని శివారు గెడ్లబీడు సాయి వేదికలో సోమవారం జరిగిన బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ మండల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. మూడుసార్లు ఎంపీగా ఎన్నికై న మిథున్రెడ్డిని అరెస్టు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రభుత్వమే నేరుగా దుకాణాల ద్వారా మద్యం విక్రయిస్తే రూ.25 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్ల ఆదాయం సమకూరిందని, కానీ, అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించిందని చెప్పారు. 2014–19 మధ్య చంద్రబాబు పాలనలోను, జగన్ ప్రభుత్వంలోను ఆదాయాలు ఎంత వచ్చాయో లెక్కలు చూడకుండానే కేసులు పెట్టాలనే లక్ష్యంతోనే అరెస్టులు చేస్తున్నారని అన్నారు. ఏ తప్పూ చేయకపోయినా మిథున్రెడ్డిపై బురద జల్లుతున్నారన్నారు. పచ్చ మీడియా బురద జల్లుతూ కథనాలు ప్రచరిస్తోందని, ఆ మీడియాలో ఉన్న వారు కాలకేయులు, అనకొండల మాదిరిగా విషం చిమ్ముతూ శకుని పాత్ర వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నాయకుడు జగన్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ నాయకులను ఎవరిని అరెస్టు చేసినా అంతకు ముందు పచ్చ మీడియాలో తప్పుడు కథనాలు, ప్రచారం చేస్తున్నారని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వంలో విక్రయించిన బ్రాండ్లనే చంద్రబాబు ప్రభుత్వం ఆరు నెలలు అమ్మిందన్నారు. మద్యం అక్రమాల ద్వారా జగన్ రూ.3,300 కోట్లు సంపాదించారని తప్పుడు ఆరోపణలు చేస్తూ, దానిని రికవరీ చేయాలనడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. దీనికోసం కొత్త చట్టాలు చేస్తామనడం హాస్యాస్పదమన్నారు. మొదటిసారి ఎమ్మెల్యేలుగా పోటీ చేసినప్పుడు చంద్రబాబు, యనమల అఫిడవిట్లో పేర్కొన్న ఆస్తులెంత, ఇప్పుడెంత ఉన్నాయో వెల్లడించాలని, తాను కూడా దీనికి సిద్ధమని, అదనపు ఆస్తులను ప్రజలకు పంచేద్దామా అని రాజా సవాల్ విసిరారు. చంద్రబాబు నాయుడే స్వయంగా రూ.లక్ష కోట్ల ఆస్తి ఉన్నట్టు ప్రకటించారన్నారు. రెండెకరాలతో రాజకీయాల్లోకి వచ్చిన ఆయనకు రూ.లక్ష కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఆ ఆస్తి రికవరీ చేద్దామని అన్నారు. బురద జల్లేసి మీరే కడుక్కోండని అంటున్నారన్నారు. కలసి చదువుకుంటున్న సమయంలో పెద్దిరెడ్డి ఏదో అన్నారని ఇప్పుడు ఆయన కొడుకుపై చంద్రబాబు పగ తీర్చుకుంటున్నారన్నారు. మిథున్రెడ్డిని పరామర్శించేందుకు జగన్మోహన్రెడ్డి రాజమహేంద్రవరం వస్తే పిలవకుండానే లక్షలాదిగా ప్రజలందరూ మద్దతు ఇస్తారని చెప్పారు. ఆ ప్రభంజనాన్ని అడ్డుకోగలరా అని ప్రశ్నించారు. పెద్ద సంఖ్యలో అభిమానులు వస్తే బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వస్తున్నారని అనడం సిగ్గుమాలిన ప్రేలాపనని అన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్కు వ్యతిరేకంగా అన్ని పార్టీలూ, నాయకులు ఏకమైనా అడ్డుకోలేమన్న విషయం చంద్రబాబుకు అర్థమైందని, వచ్చే మూడేళ్లలో లోకేష్ సీఎం కాకపోతే జీవితంలో ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరని చెప్పారు. వర్షం వస్తే రాజధాని మునిగిపోతోందని, అమరావతి ఎత్తిపోతల పథకంలా మారిందని విమర్శించారు. టీడీపీ సభలకు జనం వస్తే తమ్ముళ్లు వచ్చారని, వైఎస్సార్ సీపీకి వస్తే అల్లరి మూక వచ్చిందని పచ్చ మీడియా రాస్తోందన్నారు. వారి తప్పుడు కథనాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. పవన్ కల్యాణ్ సాక్షిగా ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయకుండా మోసగిస్తున్నారని దుయ్యబట్టారు. పవన్ కల్యాణ్ ప్రతిపక్షాన్ని కాకుండా 143 హామీలు అమలుపై చంద్రబాబును ప్రశ్నించాలని రాజా హితవు పలికారు. -
మిథున్రెడ్డి అరెస్టు రాజకీయ కుట్ర
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): వైఎస్సార్ సీపీ ఎంపీ మిథున్రెడ్డిని తప్పుడు కేసులో ఇరికించి, అక్రమంగా అరెస్టు చేయడాన్ని రాజకీయ కుట్రగా భావిస్తున్నామని మాజీ ఎంపీ, ఆ పార్టీ పిఠాపురం నియోజకవర్గ సమన్వయకర్త వంగా గీతా విశ్వనాథ్ అన్నారు. సోమవారం ఆమె విలేకర్లతో మాట్లాడుతూ, మిథున్రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండించారు. మిథున్రెడ్డి ఎకై ్సజ్ శాఖకు సంబంధం లేని వ్యక్తి అని, అయినప్పటికీ ఆయనపై తప్పుడు ఆరోపణలు, బలవంతపు ఒప్పందాలు, అధికార దుర్వినియోగం ద్వారా కేసులు నమోదు చేయడం తగదని అన్నారు. అధికారిక గణాంకాల ప్రకారం 2014–19 మధ్య మద్యం మాఫియా నడిచిందని, 4,380 లిక్కర్ షాపులు, 43 వేల బెల్ట్ షాపులు, పర్మిట్ రూములను ప్రైవేట్ మాఫియాకు అప్పగించారని అన్నారు. ప్రివిలేజ్ ఫీజు రద్దుతో రాష్ట్రానికి ఏటా రూ.1,300 కోట్ల నష్టం జరిగినట్లు కాగ్ నివేదిక చెబుతోందని స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ పాలనలో 43 వేల బెల్ట్ షాపులు మూసివేసి, లిక్కర్ ఔట్లెట్లను 4,380 నుంచి 2,934కి తగ్గించారని గీత గుర్తు చేశారు. ఈ–పేమెంట్ విధానం ద్వారా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పారదర్శకత తీసుకువచ్చిందన్నారు. మద్యం అమ్మకాలు తగ్గినా రాష్ట్ర ఆదాయం రూ.16,912 కోట్ల నుంచి రూ.24,760 కోట్లకు పెరిగిందని చెప్పారు. లిక్కర్ పాలసీపై వేసిన ఫిర్యాదులను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విచారించి, 2022 సెప్టెంబర్ 19న ఇచ్చిన ఉత్తర్వుల్లో మద్యం పాలసీలో ఎవ్వరికీ ఎటువంటి అన్యాయమూ జరగలేదని పేర్కొందన్నారు. వైఎస్సార్ సీపీ తీసుకొచ్చిన మంచి విధానాన్ని నాశనం చేయడానికి, 2014–19లో చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కూటమి ప్రభుత్వం ఈ అరెస్టుల కుట్రలు చేస్తోందని చెప్పారు. వైఎస్సార్ సీపీ ప్రజల పార్టీ అని, తాము ఎప్పటికీ ప్రజల పక్షాన నిలుస్తామని, మిథున్రెడ్డికి న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదని వంగా గీత స్పష్టం చేశారు. -
మంగళవారం శ్రీ 22 శ్రీ జూలై శ్రీ 2025
సాక్షి, రాజమహేంద్రవరం: విద్యుత్ శాఖలో స్మార్ట్ మీటర్లు కలకలం రేపుతున్నాయి. వీటిని తమ నెత్తిన బలవంతంగా పెట్టేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో విద్యుత్ వినియోగదారుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు విద్యుత్ వినియోగం నమోదు చేసే మీటర్ రీడర్లకు సైతం ఈ ‘స్మార్ట్’ షాక్ తగులుతోంది. దశల వారీగా అన్ని రకాల విద్యుత్ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు బిగించేందుకు విద్యుత్ శాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటికే 10 వేలకు పైగా స్మార్ట్ మీటర్లు బిగించారు. ఒక్క నవ్య తూర్పు గోదావరి జిల్లాలోనే 6 వేలకు పైగా బిగించారు. స్మార్ట్ మీటర్ల ప్రక్రియ పూర్తయితే మొబైల్ ఫోన్ల మాదిరిగానే విద్యుత్కు కూడా రీచార్జ్ పాలసీ అమలులోకి వస్తుంది. అంటే, కరెంటు కావాలంటే ముందుగానే డబ్బులు చెల్లించాలన్న (ప్రీపెయిడ్) మాట. ఇది వినియోగదారులకు ఇబ్బందికరంగా మారనుండగా.. మరోవైపు ఉపాధి కోల్పోయి మీటర్ రీడర్ల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తలెత్తనుంది. తొలి దశలో 5 లక్షల మీటర్లు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గృహ విద్యుత్ కనెక్షన్లు సుమారు 16.70 లక్షలున్నాయి. అలాగే, వాణిజ్యం 1,93,613, వ్యవసాయం 63,751, పారిశ్రామికం 6,314, హెచ్టీ 11 కేవీ 1,292 చొప్పున కనెక్షన్లు ఉన్నాయి. తొలి దశలో సుమారు 5 లక్షల మీటర్లు బిగించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. నవ్య తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 6.70 లక్షల విద్యుత్ సర్వీసులుండగా.. తొలి విడతగా 2 లక్షల వరకూ స్మార్ట్ మీటర్లు అమర్చే ప్రక్రియకు నాంది పలికారు. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలకు వీటిని బిగిస్తున్నారు. రోడ్డున పడనున్న మీటర్ రీడర్లు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 500 మందికి పైగా మీటర్ రీడర్లు ఉన్నారు. వీరిలో అత్యధికులు పదేళ్లకు పైగా అనుభవం ఉన్న వారే. ప్రతి నెలా 1 నుంచి 11వ తేదీ లోపు వీరు మీటర్ రీడింగ్ తీస్తారు. ఒక మీటర్ రీడింగ్ తీసినందుకు గాను విద్యుత్ శాఖ సంబంధిత కాంట్రాక్టర్కు రూ.6 నుంచి రూ.7 చెల్లిస్తుంది. రీడింగ్ యంత్రం చార్జీలు, ఫోన్ రీచార్జ్, పేపర్ రోల్, మరమ్మతులు, ఈఎస్ఐ, ఈపీఎఫ్ మినహాయింపులు పోనూ ఒక్కో రీడర్కు చేతికి మీటర్కు రూ.3.10 మాత్రమే అందుతుంది. సగటున ఒక్కో రీడర్ నెలకు 3 వేల మీటర్ల వరకూ రీడింగ్ తీస్తారు. దీని ప్రకారం వారి ఆదాయం ప్రతి నెలా కేవలం రూ.10 వేలలోపే ఉంటుంది. ప్రాంతం, పట్టణాన్ని బట్టి రీడింగ్ సామర్థ్యం మారుతుంది. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్)లో ఏళ్ల తరబడి పని చేస్తున్న కొంతమంది సిబ్బందితో పాటు మీటర్ రీడర్లు కూడా ఉద్యోగాలు కోల్పోతారనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికితోడు విద్యుత్ రీచార్జ్పై అవగాహన లేకపోతే ఇబ్బందులు తప్పవు. ముందుగా రీచార్జి చేయించుకోని వారి ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. దీనివలన నేరుగా లైన్ల నుంచి విద్యుత్ అక్రమంగా వినియోగించుకునే వారి సంఖ్య పెరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. పొట్టకూటి కోసం పోరుబాట చాలీచాలని వేతనాలతో బతుకుబండి లాగుతున్న విద్యుత్ మీటర్ రీడర్లు కూటమి ప్రభుత్వం షాక్ ఇవ్వడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకపోవడంతో ఉద్యమ బాట పట్టారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, తమ సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ చలో విజయవాడ నిర్వహించారు. సోమవారం విజయవాడ ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలని గళమెత్తారు. 20 ఏళ్లుగా విద్యుత్ శాఖలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్న తమకు న్యాయం చేయాలని నినదించారు. ఈ ఆందోళనకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వందలాది మంది తరలి వెళ్లారు. కూటమి ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు తీరుపై విమర్శలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు సీఎం అయిన తరువాత వాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై వినియోగదారులు మండిపడుతున్నారు. వ్యవసాయ బోరు బావుల వద్ద స్మార్ట్ మీటర్లు పెడితే పగులగొట్టాలంటూ అప్పట్లో పిలుపునిచ్చిన చంద్రబాబు, నారా లోకేష్.. ప్రస్తుతం వీటిని వ్యవసాయ కనెక్షన్లకు అమర్చేందుకు సన్నాహాలు ప్రారంభించడంపై రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలో ఉంటే ఒకలా.. ప్రతిపక్షంలో ఉంటే మరోలా వ్యవహరించడం తగదని హితవు పలుకుతున్నారు. మీటర్ రీడర్ల డిమాండ్లివీ.. కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు తీసుకువస్తున్నందున ఇప్పటికే కొనసాగుతున్న తమకు విద్యుత్ శాఖలోనే ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలని మీటర్ రీడర్లు డిమాండ్ చేస్తున్నారు. కనీస వేతనాలు అమలు చేయాలని, విద్యార్హతను బట్టి రీడర్లకు విద్యుత్ శాఖలో టెక్నికల్, నాన్ టెక్నికల్ షిఫ్ట్ ఆపరేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లుగా.. మిగిలిన వారిని వాచ్మెన్, అటెండర్లుగా నియమించాలని కోరుతున్నారు. అలాగే, ఎస్క్రో ఖాతా వెంటనే తెరవాలని, కాంట్రాక్టర్లు, విద్యుత్ శాఖ అధికారులతో ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. స్మార్ట్ మీటర్లు వద్దు విద్యుత్ శాఖనే నమ్ముకుని ఇరవయ్యేళ్లుగా బతుకుబండి లాగుతున్న మీటర్ రీడర్ల ఉపాధికి గండి కొట్టడం తగదు. అసలు మొత్తం స్మార్ట్ మీటర్ల ప్రక్రియనే విరమించుకోవాలి. ఇది అనైతికం. ప్రజల వద్ద పెద్ద ఎత్తున బిల్లులు వసూలు చేసేందుకు అమలు చేస్తున్న కుట్ర. ఒకవేళ తప్పనిసరిగా అమలు చేస్తే మీటర్ రీడర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి. – తాటిపాక మధు, సీపీఐ జిల్లా కార్యదర్శి లో10 స్మార్ట్ విద్యుత్ మీటర్లకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇకపై బిల్లు తీసే ప్రక్రియకు మంగళం ఉమ్మడి జిల్లాలో 500 మందికి పైగా మీటర్ రీడర్ల ఉపాధికి గండి -
స్వామిని చూడగ.. మది మురవగ
మామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి ఆలయానికి శనివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సుప్రభాత సేవ అనంతరం తొలి హారతితో దర్శనాలు ప్రారంభమయ్యాయి. తొలుత పవిత్ర వైనతేయ గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ముడుపులు, మొక్కులు చెల్లించారు. కొత్త ఆలయంతో పాటు పాత గుడి వద్ద కూడా స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థానానికి వివిధ సేవల ద్వారా రూ.2,21,626 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ వి.సత్యనారాయణ తెలిపారు. స్వామివారిని 3,800 మంది దర్శించుకున్నారని, 2,500 మంది అన్న ప్రసాదం స్వీకరించారని వివరించారు. -
ఆ కాంట్రాక్టర్పై పీఎఫ్ అధికారులే కేసు పెట్టాలి
● తక్షణం కొత్త కాంట్రాక్టర్ను ఎంపిక చేయాలి ● అన్నవరం దేవస్థానానికి న్యాయవాది సలహా! అన్నవరం: ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) చెల్లించినట్లు నకిలీ చలానాలు ఇచ్చిన విజయవాడకు చెందిన కనకదుర్గా మ్యాన్పవర్ సర్వీసెస్ శానిటేషన్ కాంట్రాక్టర్పై పీఎఫ్ అధికారులే కేసు పెట్టాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నకిలీ పీఎఫ్ చలానాల బాగోతంపై తీసుకోవాల్సిన చర్యలపై దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు, శానిటేషన్ విభాగం అధికారులు న్యాయవాదిని సలహా అడిగారు. మార్చి నెలలోనే సిబ్బంది ఖాతాలో పీఎఫ్ జమ చేయకపోతే అప్పట్లోనే సిబ్బంది కాంట్రాక్టర్కు ఆ విషయం తెలియజేయాలి. అతడి నుంచి ఎటువంటి సమాధానమూ రాకపోతే దేవస్థానానికి ఆ విషయం లిఖితపూర్వకంగా తెలియజేయాలి. అప్పుడు దేవస్థానం ఆధికారులకు చర్య తీసుకునే అధికారం ఉండేది. అలా జరగలేదు కాబట్టి ఆ కాంట్రాక్టర్పై దేవస్థానం క్రిమినల్ చర్య తీసుకోవడం అంత సులువు కాదని ఆ సందర్భంగా దేవస్థానం న్యాయవాది చెప్పినట్లు సమాచారం. కాకపోతే నకిలీ పీఎఫ్ చలానాలు సృష్టించి, మోసం చేశారంటూ పీఎఫ్ అధికారులకు దేవస్థానం ఫిర్యాదు చేయవచ్చని చెప్పినట్లు తెలుస్తోంది. దీనిని పీఎఫ్ అధికారులు పరిశీలించి, ఆ కాంట్రాక్టర్పై కేసు పెట్టవచ్చని న్యాయవాది చెప్పినట్లు సమాచారం. అదే సమయంలో ఆ కాంట్రాక్టర్ను వెంటనే తొలగించాలని సూచించినట్లు తెలుస్తోంది. షార్ట్ టెండర్ ద్వారా కొత్త కాంట్రాక్టర్ను ఎంపిక చేయాలని న్యాయవాది సలహా ఇచ్చినట్టు చెబుతున్నారు. టెండర్ పిలవకుండానా? దేవస్థానంలో చెత్త ట్రాక్టర్ నిర్వహణకు టెండర్ పిలిచారు. అదే విధంగా సత్రాల్లో దుప్పట్లు, కర్టెన్ల వంటివి ఉతికి, ఇసీ్త్ర చేయడానికి కూడా టెండర్ పిలిచారు. చిన్నచిన్న వాటికే టెండర్లు పిలుస్తున్నప్పుడు ప్రతి నెలా 350 మంది సిబ్బందిని సరఫరా చేసే కాంట్రాక్ట్కు టెండర్ పిలవకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేవస్థానంలో ఎటువంటి డిపాజిట్ లేకుండా, టెండర్ పిలవకుండా నామినేషన్ పద్ధతిలో కనకదుర్గా మ్యాన్పవర్ సర్వీసెస్కు శానిటేషన్ కాంట్రాక్ట్ కట్టబెట్టడమే ఈ నకిలీ వ్యవహారానికి దారి తీసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తం 350 మంది పారిశుధ్య సిబ్బందికి కార్మిక చట్టాల ప్రకారం జీతాలిచ్చేందుకు దేవస్థానం నెలకు రూ.59 లక్షలు చెల్లించేలా ఆ సంస్థతో ఒప్పందం కుదిరింది. ప్రతి నెలా దేవస్థానం 13 శాతం, సిబ్బంది వాటాగా 12 శాతం వసూలు చేసి పీఎఫ్ చెల్లించి, ఆ రసీదులు జమ చేస్తే దేవస్థానం బిల్లు ఇవ్వాలి. కానీ, మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించి ఆ సంస్థ పీఎఫ్ చెల్లించకుండానే ఫేక్ రసీదులు ఇచ్చి, సుమారు రూ.1.77 కోట్ల మేర బిల్లులు పొందింది. సిబ్బంది ఖాతాల్లో పీఎఫ్ జమ కాకపోవడంతో అనుమానం వచ్చిన అధికారులు నిలదీయడంతో మూడు నెలలకు కలిపి పీఎఫ్కు సుమారు రూ.30 లక్షలు జమ చేసి కొత్త రశీదులు అందజేశారు. తద్వారా తొలుత నకిలీ రసీదులు ఇచ్చి, దేవస్థానాన్ని మోసం చేసినట్టు ఆ కాంట్రాక్టరే స్వయంగా అంగీకరించినట్లయింది. కొత్త కాంట్రాక్ట్కు మరింత సమయం! మరోవైపు రాష్ట్రంలోని ప్రముఖ దేవస్థానాలన్నింటికీ కలిపి ఒకే శానిటేషన్ కాంట్రాక్ట్కు పిలిచిన టెండర్ ఖరారుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ కాంట్రాక్ట్ కోసం రెండోసారి గత నెల 12న టెండర్ పిలిచారు. గత నెల 30న టెక్నికల్ బిడ్ తెరవగా తిరుపతికి చెందిన పద్మావతి సంస్థ, విజయవాడకు చెందిన చైతన్యజ్యోతి సంస్థ క్వాలిఫై అయ్యాయి. ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ చేసి, టెండర్ ఖరారు చేయాల్సి ఉండగా దేవదాయ శాఖ అధికారులు ఆ బాధ్యతను ప్రభుత్వానికి అప్పగించారు. ఆ టెండర్ ఖరారయ్యేంత వరకూ దేవస్థానంలో శానిటేషన్ నిర్వహణను షార్ట్ టెండర్ ద్వారా కొత్త కాంట్రాక్టర్కు అప్పగించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రసీదుల తనిఖీపై సూచనలు పీఎఫ్ రసీదులు ఒరిజనల్ లేక ఫేక్ అనే విషయం తెలుసుకోవాలనే అంశంపై దేవస్థానం సిబ్బందికి పీఎఫ్ అధికారులు శనివారం అవగాహన కల్పించారు. ఈఓ సుబ్బారావు కోరిక మేరకు కాకినాడ పీఎఫ్ ఆఫీసుకు చెందిన ఇద్దరు అధికారులు దేవస్థానానికి వచ్చి, పీఎఫ్ రసీదులపై పలు సూచనలు చేశారు. రసీదుపై క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం, గూగుల్లో పీఎఫ్ వెబ్సైట్లో తనిఖీ చేయడం తదితర అంశాలను వివరించారు. -
ప్లాస్టిక్ కాలుష్య ప్రమాదం తప్పించాలి
కాకినాడ సిటీ: సమాజానికి ప్లాస్టిక్ కాలుష్య ప్రమాదాన్ని తప్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ప్రత్యేకాధికారి జి.వీరపాండ్యన్ అన్నారు. కాకినాడ పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా) ఆధ్వర్యాన శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమం స్థానిక ఆనంద భారతి గ్రౌండ్లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వీరపాండ్యన్ మాట్లాడుతూ, ప్లాస్టిక్ వస్తువుల వినియోగంతో ఎదురయ్యే దుష్పరిణామాలపై అవగాహన పెంచుకుని, ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ రహిత సమాజానికి కృషి చేయాలని అన్నారు. మరో ముఖ్య అతిథి కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ, నిత్య జీవితంలో మార్పులు చేసుకోవడం ద్వారా ప్లాస్టిక్ నిషేధాన్ని సంపూర్ణంగా సాధించవచ్చని చెప్పారు. జిల్లాలో ప్లాస్టిక్ నిషేధాన్ని కలెక్టరేట్ నుంచే ప్రారంభించామన్నారు. అనంతరం కలెక్టర్ అందరితో స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. పట్టణంలోని పారిశుధ్య కార్మికులను సత్కరించారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు, రంగోలిలో పాల్గొన్న మహిళలకు, ఆల్ ఈజ్ వెల్ స్వచ్ఛంద సంస్థ సభ్యులకు వీరపాండ్యన్, కలెక్టర్ బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, ట్రైనీ కలెక్టర్ మనీషా, నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ కేపీ సుధాకర్, మెప్మా పీడీ బి.ప్రియంవద, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి జె.నరసింహ నాయక్ తదితరులు పాల్గొన్నారు. తొలుత ప్లాస్టిక్ వస్తువుల నియంత్రణ, ప్లాస్టిక్ కాలుష్యం దుష్ప్రభావాలను వివరిస్తూ మెప్మా ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన స్టాల్స్ను, మహిళలు వేసిన ముగ్గులను అతిథులు పరిశీలించారు. -
సా్థనచలనం లేని వేతనం
సమస్యను పరిష్కరించాలి పొజిషన్ ఐడీలు వెంటనే కేటాయించక పోవడంతో బదిలీ అయిన ఉపాధ్యాయుల్లో కొందరు జీతాలు పొందలేకపోయారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు చెల్లించేందుకు, కుటుంబ ఖర్చులకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు తక్షణమే సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలి. – మేడిచర్ల త్రివెంకట ఆది సత్య సుబ్బారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్, కోనసీమ ప్రభుత్వం చర్యలు చేపట్టాలి పొజిషన్ ఐడీలు రాక ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయుల విషయంలో ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. జూన్, జూలై నెలలకు సంబంధించి వేతనాలు చెల్లించేందుకు ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వాలి. ఇప్పటికే ఒక నెల వేతనం రాక ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధ్యాయుల ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలి. – చింతాడ ప్రదీప్కుమార్, జిల్లా అధ్యక్షుడు, పీఆర్టీయూ, కాకినాడ జిల్లా రాయవరం: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు ముగిశాయి. అయితే, పొజిషన్ ఐడీలు రాక పలువురికి జీతభత్యాలు నిలిచిపోయాయి. ఇలా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా సుమారు 1,500 మందికి ఇబ్బందులు ఎదురయ్యాయి. సాధారణంగా ఉపాధ్యాయులు, ఉద్యోగులకు వారు బదిలీ అయిన ప్రాంతాల్లో జీతాలు తీసుకునేలా అక్కడి డీడీఓకు సమాచారం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గతంలో రెగ్యులర్ జీతాలు తీసుకుంటున్నప్పటికీ వీరి స్థానం మారడంతో ఏ స్థానానికి బదిలీ అయ్యారో ఆ స్థానానికి సంబంధిత ఉద్యోగికి పొజిషన్ ఐడీ కేటాయించాలి. అది జరిగితేనే సీఎఫ్ఎంఎస్లో వారి వివ రాలు డిస్ప్లే అవుతాయి. అప్పుడు మాత్రమే వేతనా లు చెల్లించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఉమ్మడి జిల్లాలో 6,533 మంది ఉపాధ్యాయులను బదిలీ చేశారు. గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులు 178 మందికి, మోడల్ ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా 284 మందికి, స్కూల్ అసిస్టెంట్, సమాన స్థాయి కేడర్ ఉపాధ్యాయులుగా 3,298 మందికి, సెకండరీ గ్రేడ్, సమాన స్థాయి కేడర్ ఉపాధ్యాయులుగా 2,995 మందికి, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులు 32 మందికి, ఆర్ట్/డ్రాయింగ్/క్రాఫ్ట్/మ్యూజిక్/ఒకేషనల్ ఉపాధ్యాయులు 20 మందికి స్థాన చలనం కలిగింది. జూన్ 15వ తేదీ నాటికి బదిలీలు, పదోన్నతుల ప్రక్రి య పూర్తయ్యింది. కొత్తగా ఏర్పడిన మోడల్ ప్రైమరీ స్కూల్స్కు పలువురు స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు బదిలీ అయ్యారు. మోడల్ ప్రైమరీ పాఠశాలలు కొత్త గా ఏర్పడడంతో ఇక్కడకు కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పొజిషన్ ఐడీలు కేటాయించాల్సి ఉంది. అయితే బదిలీలు జరిగి నెల కావొస్తున్నా నేటికీ అధిక శాతం ఉపాధ్యాయులకు పొజిషన్ ఐడీలు కేటాయించలేదు. ఫలితంగా జూలైలో తీసుకోవాల్సిన జూన్ నెల జీతాలు వీరికి మంజూరు కాలేదు. వేతనాలు రాకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు. సాధారణంగా జీతాల బిల్లులు ప్రతి నెలా 25వ తేదీ లోపు సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసి, ట్రెజరీకి బిల్లు సమర్పించాలి. ఈ నెల 25లోగా పొజిషన్ ఐడీలు రాకుంటే జూలై జీతం కూడా వీరు పొందలేని పరిస్థితి నెలకొంటుంది. పలు ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్ర స్థాయిలో పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ అధికారులకు వినతిపత్రాలు ఇస్తున్నా నేటికీ పూర్తి స్థాయిలో పొజిషన్ ఐడీలు క్రియేట్ కాలేదు. సమస్యలు ఎక్కడెక్కడంటే.. గత ప్రభుత్వం తీసుకొచ్చిన 6 రకాల పాఠశాలల స్థానంలో ఇప్పుడు 9 రకాల పాఠశాలలను ప్రస్తుత సర్కారు ఏర్పాటు చేసింది. ఇందులో ముఖ్యంగా మోడల్ ప్రైమరీ స్కూల్స్, అప్గ్రేడ్ అయిన యూపీ స్కూల్స్లో కొత్తగా ఉపాధ్యాయుల నియామకం జరిగింది. ఈ పాఠశాలలకు కొత్తగా పోస్టులు మంజూరు కావడంతో ఆ స్థానాలకు బదిలీ పొందిన వారికి పొజిషన్ ఐడీలు కేటాయించాల్సి ఉంది. మోడల్ ప్రైమరీ స్కూల్స్లో అప్పటి వరకూ అదే స్కూల్ పనిచేస్తున్న ఉపాధ్యాయులకు అప్పటికే పొజిషన్ ఐడీలు ఉండడంతో వారికి వేతనాలు చెల్లించారు. ఇదే పాఠశాలకు కొత్త గా వచ్చిన ఉపాధ్యాయులకు పాజిషన్ ఐడీలు రాకపోవడంతో వేతనాలు పొందలేని పరిస్థితి నెలకొంది. అ లాగే ప్రాథమికోన్నత పాఠశాల నుంచి ఉన్నత పాఠశాలలుగా అప్గ్రేడ్ అయిన పాఠశాలల్లో డీడీఓ మారడంతో అక్కడ ఏ ఒక్కరికీ జీతభత్యాలు రాని పరిస్థితి ఉంది. సాధారణంగా జూన్ నెలలో ప్రతి కుటుంబంలో పిల్లల స్కూల్ ఫీజులు, విద్యా సామగ్రి కొనుగోలుతో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. బ్యాంకు రుణాల వాయిదాలు, బదిలీ ప్రాంతానికి వెళ్లేందుకు రవాణా ఖర్చులు పెరిగిన నేపథ్యంలో జీతాలు రాకపోవడంతో ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. బదిలీలు, పదోన్నతులు సరే ఉపాధ్యాయులకు అందని జీతాలు పొజిషన్ ఐడీలు రాక అగచాట్లు ఉమ్మడి జిల్లాలో 1,500 మందిపై ప్రభావం -
తడుపు.. మోపెడు
పెట్టుబడి పెరిగింది నీటి ఎద్దడి కారణంగా మొక్కజొన్న సాగులో పెట్టుబడి పెరిగింది. కాలువల్లో నీరు లేకపోవడంతో కేవలం బోర్లపై ఆధారపడి సాగు చేయాల్సి వస్తోంది. బోర్ల ద్వారా నీటిని కుంటలకు మళ్లించి, మళ్లీ అక్కడి నుంచి ఇంజిన్లతో తోటలకు మళ్లించాల్సి వస్తోంది. అదే కాలువల్లో సాగునీరుంటే ఇంత ఇబ్బంది ఉండేది కాదు. ప్రస్తుతం నీటి ఎద్దడి వల్ల ఎకరానికి రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకూ అదనపు భారం పడుతోంది. వినాయక చవితికి మంచి డిమాండ్ ఉంటుందని మొక్కజొన్న సాగు చేపట్టాం. కానీ, వచ్చే లాభాల కంటే పెట్టుబడి తడిసి మోపెడయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. – సుంకర సూరిబాబు, మొక్కజొన్న రైతు, తాటిపర్తి ఎద్దడి లేకపోతే.. రైతులు ఎక్కువ ఆసక్తి చూపుతూండటంతో ఈ ఏడాది స్వీట్కార్న్ సాగు పెరిగింది. మార్కెటింగ్ సదుపాయంతో పాటు పెట్టుబడి పోనూ ఆదాయం కూడా అధికంగా ఉంటోంది. మెట్ట, లంకలు, ఏజెన్సీకే పరిమితమైన స్వీట్కార్న్ను ప్రస్తుతం డెల్టా ప్రాంతంలోనూ సాగు చేస్తున్నారు. జిల్లాలోని గొల్లప్రోలు మండలంలో మొక్కజొన్న సాగు అధికంగా ఉంది. అందరు రైతులకూ ఇచ్చేవి తప్ప మొక్కజొన్న రైతులకు ప్రత్యేకంగా ప్రోత్సాహకాలేవీ లేవు. నీటి ఎద్దడి లేకపోతే సాగు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. – స్వాతి, సహాయ సంచాలకులు, వ్యవసాయ శాఖ, పిఠాపురం ●● మొక్కజొన్నకు నీటి ఎద్దడి ● పెరుగుతున్న సాగు పెట్టుబడి ● గగ్గోలు పెడుతున్న రైతులుపిఠాపురం: వర్షాకాలంలో వరి, పత్తి తరువాత అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట మొక్కజొన్న. గింజల కోసమే కాకుండా.. పశువులకు పచ్చిమేత గాను ఇది ఉపయోగపడుతుంది. దీంతో, ఎక్కువ మంది రైతులు దీని సాగుకు మొగ్గు చూపుతారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం, గొల్లప్రోలు, పెద్దాపురం, కిర్లంపూడి, దేవీపట్నం, సీతానగరం ప్రాంతాల్లో మొక్కజొన్న సాగును రైతులు ఎక్కువగా చేపడుతున్నారు. మెట్ట ప్రాంతం, రేగడి నేలలు అధికంగా ఉండటంతో పాటు గత ప్రభుత్వం ప్రోత్సాహం అందించడంతో కొన్నేళ్లుగా మొక్కజొన్న సాగు గణనీయంగా పెరిగింది. కానీ, ఈ ఏడాది నీటి ఎద్దడి, మరోవైపు ప్రభుత్వం నుంచి ఎటువంటి రాయితీలూ లేకపోవడంతో మొక్కజొన్న సాగు విస్తీర్ణం అమాంతం పడిపోయింది. ఉమ్మడి జిల్లాలో మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం సుమారు 15 వేల హెక్టార్లు కాగా, ఈ సమయానికి 800 హెక్టార్లలో సాగు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, ఇప్పటి వరకూ సుమారు 200 హెక్టార్లలో మాత్రమే మొక్కజొన్న సాగు జరిగిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రుతుపవనాలు ప్రవేశించి ఇప్పటికే నెల రోజులు దాటిపోయింది. మొదట్లో భారీ వర్షాలతో దంచి కొట్టిన వరుణుడు కొన్నాళ్లుగా ముఖం చాటేశాడు. మరోవైపు గోదావరి డెల్టా కాలువలకు గత నెల ఒకటో తేదీ నుంచే నీరు విడుదల చేస్తున్నారు. అయితే, వరి సాగుకు మినహా ఈ నీరు తగినంత స్థాయిలో మొక్కజొన్న తోటలకు అందే పరిస్థితి లేకపోవడం దీని సాగుపై ప్రభావం చూపుతోంది. ప్రోత్సాహం కరవు ఆత్మ పథకం కింద వ్యవసాయ శాఖ గతంలో జిల్లావ్యాప్తంగా బ్లాకుకు రెండు మూడు రైతు క్షేత్రాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, మొత్తం 18 బ్లాకుల్లో మొక్కజొన్న సాగుపై రైతుల్లో అవగాహన కల్పించేది. ప్రతి రైతుకు రూ.3 వేల విలువైన స్వీట్కార్న్ (తీపి మొక్కజొన్న) విత్తనాలతో పాటు, రెండు రకాల క్రిమి సంహారక మందులు ఉచితంగా అందజేసేవారు. కానీ, ప్రస్తుతం ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహాకాలూ లేవు. ఫలితంగా మొక్కజొన్న సాగు గణనీయంగా తగ్గిపోయింది. మొక్కజొన్న తోటకు వివిధ రకాల పక్షులు, ఎలుకల బెడద ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా కాండం తొలిచే పురుగు ఆశిస్తూంటుంది. వీటన్నింటి నుంచి పంటను రక్షించుకుంటేనే అధిక దిగుబడి వస్తుంది. అది జరగడానికి ప్రభుత్వం నుంచి తగినంత సహకారం ఉండాలని రైతులు చెబుతున్నారు. పరిస్థితి ఎలా ఉన్నా రైతులు వినాయక చవితి ఉత్సవాలకు అందుబాటులోకి వచ్చే విధంగా కేవలం రెండు నెలల్లోనే దిగుబడి ఇచ్చే మొక్కజొన్న రకాలను సాగు చేస్తున్నారు. నీటి ఎద్దడి కారణంగా దిగుబడులు తగ్గి, నష్టపోయే అవకాశం ఉందని గగ్గోలు పెడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 15 వేల హెక్టార్లు ఈ ఏడాది సాగు అంచనా 10 వేల హెక్టార్లు ఇప్పటి వరకూ సాగు జరిగిన విస్తీర్ణం 200 హెక్టార్లు సాగు చేసిన రైతులు 380 మంది ఎకరాకు పెట్టుబడి సుమారు రూ.30 వేలు నీటి ఎద్దడితో పెరుగుతున్న ఖర్చు ఎకరాకు రూ.10 వేలు -
రత్నగిరికి పోటెత్తిన భక్తులు
అన్నవరం: రత్నగిరికి శనివారం భక్తులు పోటెత్తారు. సత్యదేవుని సుమారు 20 వేల మంది దర్శించుకున్నారు. ఉదయం నుంచీ భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలు రద్దీగా మారాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. స్వామివారి వ్రతాలు 1,500 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సత్యదేవుని ప్రాకార సేవ ఘనంగా నిర్వహించారు. లోవ భక్తుల కోసం లక్ష ప్రసాదం ప్యాకెట్లు ఆషాఢ మాసం ఆదివారం తలుపులమ్మ తల్లి దర్శనానికి లోవ దేవస్థానానికి వెళ్లే భక్తులు తిరుగు ప్రయాణంలో అన్నవరంలో సత్యదేవుని ప్రసాదాలు కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. గత మూడు వారాల్లో సుమారు 3 లక్షల ప్రసాదం ప్యాకెట్లు కొనుగోలు చేయగా దేవస్థానానికి రూ.60 లక్షల ఆదాయం సమకూరింది. నేడు ఆషాఢ మాసంలో చివరి ఆదివారం కావడంతో ఎక్కువ మంది భక్తులు తలుపులమ్మ తల్లి ఆలయానికి వెళ్లే అవకాశం ఉంది. వారు తిరుగు ప్రయాణంలో సత్యదేవుని ప్రసాదాలు కొనుగోలు చేసేందుకు వీలుగా రత్నగిరి తొలి పావంచా వద్ద స్టాల్, జాతీయ రహదారిపై రెండు నమూనా ఆలయాల వద్ద, రత్నగిరి పైన కౌంటర్లలో విక్రయానికి సుమారు లక్ష ప్రసాదం ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. శృంగార వల్లభుని ఆలయంలో రద్దీ పెద్దాపురం: మండలంలోని తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభ స్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 10 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారిని అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు విశేషంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ సేవల టికెట్లు, అన్నదానం, కేశఖండన ద్వారా స్వామి వారికి రూ.2,50,679 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు. సుమారు 3 వేల మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం ఏర్పాటు చేశామన్నారు. యాని‘మేత’ర్ అరెస్టు కిర్లంపూడి: మహిళా సంఘాల డబ్బులు కాజేసి, పరారైన ఓ యానిమేటర్ను కిర్లంపూడి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఎస్సై జి.సతీష్ కథనం ప్రకారం.. బూరుగుపూడి గ్రామానికి చెందిన దుర్గ అదే గ్రామంలో నాలుగేళ్లుగా 42 డ్వాక్రా గ్రూపులకు యానిమేటర్గా పని చేస్తోంది. 2023లో 12 మహిళా గ్రూపులకు సీ్త్రనిధి ద్వారా రుణాలు ఇప్పించింది. అనంతరం, ఆ డబ్బులు కాజేయాలనే దురుద్దేశంతో పథకం ప్రకారం ఎనిమిది గ్రూపుల సభ్యులను మభ్యపెట్టింది. వారి ఖాతాల్లో వేరే గ్రూపులకు సంబంధించిన డబ్బులు పడ్డాయంటూ మాయమాటలు చెప్పింది. ఆ డబ్బులు డ్రా చేసే నెపంతో వారి నుంచి వేలిముద్రలు, సంతకాలు తీసుకుని సుమారు రూ.20.25 లక్షలు కాజేసింది. అనంతరం సీ్త్రనిధి లోన్ డబ్బులు కట్టాలంటూ వెలుగు సిబ్బంది ఆయా గ్రూపుల సభ్యులను అడగడంతో గుట్టు రట్టయ్యింది. దీంతో, దుర్గను గ్రూపు సభ్యులు, వెలుగు సిబ్బంది నిలదీయగా అసలు విషయం చెప్పింది. వారం రోజుల్లో ఆ డబ్బులు చెల్లిస్తానని నమ్మబలికింది. అనంతరం గుట్టు చప్పుడు కాకుండా కుటుంబ సభ్యులతో కలసి, రాత్రికి రాత్రే గ్రామం విడిచి పరారైంది. దీనిపై దేవీశక్తి డ్వాక్రా గ్రూప్ అధ్యక్షురాలు కె.వీరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. దుర్గ మహారాష్ట్రలోని సోలాపూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించి, శుక్రవారం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను అరెస్టు చేసి, శనివారం ప్రత్తిపాడు కోర్టులో హాజరుపరిచారు. నిందితురాలికి న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండు విధించడంతో రాజమహేంద్రవరంలోని మహిళా జైలుకు తరలించామని ఎస్సై సతీష్ తెలిపారు. -
పొంచి ఉన్న నక్కలగండి
● తూతూమంత్రంగా అభివృద్ధి పనులు ● ముక్కలవుతున్న నక్కలఖండి కాలువ గట్టు ● 3 వేల ఎకరాల ఆయకట్టుకు ముంపు భయంపిఠాపురం: గత ఏడాది వచ్చిన వరదలకు గొల్లప్రోలు పరిధిలోని నక్కలఖండి కాలువకు పడమటదొడ్డి లాకుల సమీపాన పొలాల వద్ద గండి పడింది. దీంతో, సుమారు 3,000 ఎకరాల్లో రూ.కోట్ల విలువైన పచ్చని పంటలు ముంపు బారిన పడ్డాయి. ఆ గండిని అధికారులు ఇటీవల రూ.8 లక్షలు వెచ్చించి పూడ్చారు. అయితే, అత్యంత కీలకమైన ఈ పనులను తూతూ మంత్రంగా నిర్వహించారని రైతులు ఆరోస్తున్నారు. గండి పూడ్చివేత పనులు పూర్తయ్యి వారం రోజులు కూడా కాక ముందే తిరిగి అక్కడ గట్టు బీటలు వారుతూండటమే దీనికి కారణం. గట్టు అండలు అండలుగా జారిపోతోంది. ఒక మోస్తరు వర్షం కురిస్తే ఈ గట్టు తిరిగి ముక్కలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గండి పూడ్చివేత పనులను అధికారుల పర్యవేక్షణ లేకుండా, ఎటువంటి నాణ్యతా ప్రమాణాలూ పాటించకుండా నిర్వహించినందువల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని రైతులు విమర్శిస్తున్నారు. దీనికితోడు గండి పక్కనే గట్టు బలహీనంగా మారింది. అక్కడ మరో గండి పడే అవకాశముందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. దీనిపై జలవనరుల శాఖ అధికారులకు వినతిపత్రం ఇచ్చినా ఫలితం లేదని చెబుతున్నారు. దీంతో ఈ ఏడాది కూడా తాము పంటలు సాగు చేసే అవకాశం లేదని, ఒకవేళ సాగు చేసినా ఏ క్షణంలో వరద వచ్చినా పంటలు కొట్టుకుపోతాయని అంటున్నారు. అధికారులు వెంటనే గండి పడిన చోట, బలహీనంగా ఉన్న చోట గట్టును పటిష్టపరచాలని రైతులు కోరుతున్నారు. -
విజిలెన్స్ దాడులు
ఏలేశ్వరం: మండలంలోని లింగంపర్తిలోని ఎరువుల దుకాణంపై శుక్రవారం విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. వ్యవసాయశాఖ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మికంగా దాడి చేశారు. నిల్వల్లో తేడాలను గుర్తించి, ఓ ఫారమ్ లేకపోవడం నిర్ధారించి రూ.15,62,200 విలువ గల 66.5 మెట్రిక్ టన్నుల స్టాకు తదుపరి అదేశాలు ఇచ్చే వరకు అమ్మకాలు సాగించరాదని తెలిపారు. అనంతరం దుకాణదారుడిపై 6ఏ కేసు నమోదు చేశారు. దాడిలో వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు షాంసి, విజిలెన్స్ సీఐ శివరామకృష్ణ పాల్గొన్నారు. -
తలుపులమ్మకు రత్నగిరి నుంచి సారె
తుని రూరల్: లోవ దేవస్థానంలో కొలువై ఉన్న తలుపులమ్మ అమ్మవారికి అన్నవరం వీర వేంకట సత్యనారాయణస్వామి దేవస్థానం తరఫున చీర, సారె సమర్పించారు. ఆషాఢ మాసంలో ఆఖరి శుక్రవారం కావడంతో అన్నవరం దేవస్థానం సిబ్బందితో కలసి ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు తలుపులమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు, సారె, పండ్లు, పూలు సమర్పించారు. అనంతరం సామూహిక కుంకుమ పూజల్లో పాల్గొన్నారు. శాంతి హోమం, పూర్ణాహుతిలో పాల్గొని, అమ్మవారిని దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 20న ఆషాఢ బహుళ ఏకాదశి సందర్భంగా తలుపులమ్మ అమ్మవారికి విశేష పుష్పాలంకరణ, లక్ష బిల్వార్చన నిర్వహిస్తున్నట్టు లోవ దేవస్థానం ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. అమ్మవారికి 24న సప్తనదీ జలాలతో సహస్ర ఘటాభిషేకం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రూ.1.05 లక్షల విరాళం కాకినాడ సిటీ: కాకినాడలో హాకీ టోర్నమెంట్, ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ రూ.1,05,000 విరాళం సమర్పించింది. దీనికి సంబంధించిన చెక్కును సంఘం నాయకులు కలెక్టరేట్లో డీఆర్ఓ జె.వెంకటరావుకు శుక్రవారం అందజేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్ష కా ర్యదర్శులు ఎంవీఎస్ఎన్ఎన్ జగన్నాధం, జె.రాంబాబు, అసోసియేట్ అధ్యక్షులు ఎ.రత్నరాజు, ఏపీడీ భానుప్రకాష్, జీఎస్టీఓ స్వామి, పెద్దాపురం తాలూకా అధ్యక్షుడు ప్రసాద్ పాల్గొన్నారు. ఉద్యోగుల గ్రీవెన్స్కు 26 వినతులు కాకినాడ సిటీ: జిల్లాలోని ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ వివేకానంద హాలులో శుక్రవారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమాని కి 26 వినతులు వచ్చాయి. ఉద్యోగుల నుంచి డీఆర్ఓ జె.వెంకటరావు, హౌసింగ్ పీడీ ఎన్వీవీ సత్యనారాయణ, సీపీఓ పి.త్రినాథ్ వినతులు స్వీకరించారు. ఈ వినతులను పరిశీలించి, పరిష్కారానికి కృషి చేయాలని సంబంధిత అధికారులకు డీఆర్ఓ సూచించారు.నేడు ‘స్వచ్ఛ దివస్’కాకినాడ సిటీ: జిల్లావ్యాప్తంగా శనివారం స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్ర కింద స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ షణ్మోహన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అనవసరమైన ప్లాస్టిక్ వస్తువులను నివారించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించుకోవాలనే థీమ్తో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నివారణపై దృష్టి సారించాలన్నారు. -
ప్రమాదకర పరిశ్రమల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలి
కాకినాడ సిటీ: ప్రమాదకర పరిశ్రమల్లో ఎప్పటికప్పుడు మాక్ డ్రిల్ నిర్వహించాలని, సమీపంలో ఉంటున్న ప్రజలకు ఆయా పరిశ్రమల్లో సంభవించే ప్రమాదాలపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డీవీవీఎస్ నారాయణ ఆధ్వర్యాన కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన జిల్లా సంక్షోభ నివారణ కమిటీ సమావేశంలో తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ హాజరయ్యారు. జిల్లాలోని ప్రమాదకర పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల అమలు తీరు, ప్రమాదకర రసాయనాల తయారీ, నిల్వల వివరాలు, ప్రమాదాలు చోటు చేసుకునే సందర్భాల్లో పరిసర ప్రాంతాల ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులు తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులు, పరిశ్రమల ప్రతినిధులతో చర్చించారు. ప్రమాదకర పరిశ్రమల్లో తీసుకున్న భద్రతా చర్యలను డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఇటీవల రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు హైదరాబాద్లోని పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని ప్రమాదకర పరిశ్రమల్లో ఎప్పటికప్పుడు మాక్ డ్రిల్ కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ప్రధానంగా 15 ప్రమాదకర పరిశ్రమలను గుర్తించామని తెలిపారు. ఆయా పరిశ్రమల్లో ప్రమాదాలను ముందుగానే పసిగట్టి, సిబ్బందిని అప్రమత్తం చేసేలా అలారం, సెన్సార్, ఇతర భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రమాదాలను ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని పరికరాలను సిద్ధంగా ఉంచాలన్నారు. సమావేశంలో జిల్లా అగ్నిమాపక అధికారి పీవీఎస్ రాజేష్, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ ఎం.శంకరరావు, పరిశ్రమల శాఖ జీఎం సీహెచ్ గణపతి, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి జె.నరసింహ నాయక్, ఇండియన్ ఆయిల్, రిలయన్స్, ఓఎన్జీసీ, కోరమండల్, రాక్ సిరామిక్స్, ఏఎం గ్రీన్ అమ్మోనియా తదితర పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. -
అవి నకిలీ పీఎఫ్ చలానాలే
అన్నవరం: గత మార్చి నుంచి మే నెల వరకూ సుమారు రూ.30 లక్షల మేర ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) చెల్లించినట్లుగా అన్నవరం దేవస్థానం శానిటేషన్ కాంట్రాక్ట్ సంస్థ కనకదుర్గ మ్యాన్పవర్ సర్వీసెస్ అందజేసిన రసీదులు నకిలీవేనని అధికారుల తనిఖీలో వెల్లడైంది. దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు శుక్రవారం ఈ విషయం నిర్ధారించారు. దీంతో, ఈ అంశంపై రెండు రోజులుగా ‘సాక్షి’ ప్రచురించిన కథనాలు వాస్తవాలేనని రుజువైంది. చేసిన మోసం గుట్టు రట్టవడంతో ఆ కాంట్రాక్టర్ హడావుడిగా మూడు నెలలకు సంబంధించి ఈ నెల 9, 14, 15 తేదీల్లో రూ.10.09 లక్షలు, రూ.9.90 లక్షలు, రూ.9.75 లక్షల చొప్పున చెల్లించి, ఆ రసీదులు దేవస్థానానికి అందజేశారు. అవి మాత్రం ఒరిజనలేనని అధికారుల పరిశీలనలో తేలింది. అయితే, మొదట ఇచ్చిన మూడు రసీదులు నకిలీవని తేలడంతో కాంట్రాక్టర్పై క్రిమినల్ కేసు నమోదుకు దేవస్థానం అధికారులు న్యాయసలహా తీసుకుంటున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఆ కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టాలని దేవదాయ శాఖ ఉన్నతాధికారులను కోరనున్నట్లు తెలిసింది. జూన్ రసీదు కూడా ఫేక్ మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించి మొదట ఇచ్చిన పీఎఫ్ రసీదులు నకిలీవని రుజువై, వివాదం నడుస్తూండగా.. తాజాగా జూన్ నెలకు సంబంధించి ఈ నెల 11న చెల్లించినట్లు కాంట్రాక్టర్ సమర్పించిన పీఎఫ్ రసీదు కూడా ఫేక్ అని అధికారులు గుర్తించారు. టీఆర్ నంబర్ 1222507006348తో రూ.10,34,052 చెల్లించినట్టు ఆ రసీదులో ఉంది. దానిపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగా టీఆర్ నంబర్ 1222504006459తో మార్చి నెలకు సంబంధించి రూ.10,09,914 చెల్లించినట్లుగా వచ్చింది. దీంతో ఆ రసీదును కూడా తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు. తాజా వివాదంతో అన్నవరం దేవస్థానంలో పారిశుధ్య సిబ్బందికి ఈ నెల జీతాలు కూడా ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నెల 12న కాంట్రాక్టర్ బిల్లు ఇచ్చినప్పటికీ జూన్ నెలకు నకిలీ పీఎఫ్ రసీదు జమ చేయడంతో తిరస్కరించారు. మళ్లీ పీఎఫ్ చెల్లించి, రసీదు సమర్పించాక, తనిఖీలో అది ఒరిజనల్ అని రుజువయ్యాకే సిబ్బందికి జీతాలు అందనున్నాయి. ఇదంతా పూర్తయ్యాక ఈ నెల 24, 25 తేదీల్లో మాత్రమే సిబ్బందికి జూన్ నెల జీతాలు అందే అవకాశం ఉంది. మోసం రుజువైంది మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించి దేవస్థానం పారిశుధ్య సిబ్బంది పీఎఫ్ అకౌంట్కు రూ.30 లక్షలు చెల్లించినట్లు శానిటేషన్ కాంట్రాక్టర్ ఫేక్ రసీదులు జమ చేశారని తేలింది. దేవస్థానాన్ని మోసం చేసినందుకు గాను కాంట్రాక్టర్పై క్రిమినల్ చర్యలు తీసుకోవడంపై న్యాయ సలహా తీసుకుంటున్నాం. – వీర్ల సుబ్బారావు, ఈఓ, అన్నవరం దేవస్థానం తాజావి మాత్రం ఒరిజనల్ నిర్ధారించిన అన్నవరం దేవస్థానం అధికారులు శానిటేషన్ కాంట్రాక్టర్పై చర్యల దిశగా అడుగులు!సిబ్బంది ఖాతాలకు జమ అన్నవరం దేవస్థానంలో శానిటేషన్ కాంట్రాక్టర్ వద్ద 350 మంది సిబ్బంది పని చేస్తున్నారు. మార్చి నెలలో 332 మందికి, ఏప్రిల్లో 335 మందికి, మే నెలలో 328 మందికి పీఎఫ్ జమ అయినట్లు తేలింది. వివిధ కారణాలతో మార్చి నెలలో 15 మందికి, ఏప్రిల్లో 30 మందికి జమ కాలేదు. ఆ నెలలో వైఎస్సార్ సీపీ సానుభూతిపరులనే అభియోగం మోపి, కూటమి ప్రజాప్రతినిధి సిఫారసుతో 12 మంది శానిటేషన్ సూపర్వైజర్లను తొలగించి, వారి స్థానంలో అధికార పార్టీ కార్యకర్తలు 12 మందిని నియమించిన విషయం తెలిసిందే. దీంతో 24 మందికి పీఎఫ్ జమ కాలేదు. అలాగే అకౌంట్ నంబర్లలో తేడా వచ్చి మరో ఆరుగురికి జమ కాలేదని అధికారులు చెప్పారు. మే నెలలో 328 మందికి పీఎఫ్ జమ కాగా, 22 మందికి అవలేదు. వీరికి కూడా త్వరలోనే జమ అవుతాయని అధికారులు చెప్పారు. -
అస్వస్థతకు గురయిన విద్యార్థినులకు వైద్య పరీక్షలు
● పాఠశాలకు తగ్గిన విద్యార్థుల హాజరు ● స్కూల్ను సందర్శించిన మండల అఽధికారులు జగ్గంపేట: మండలంలోని కాండ్రేగుల గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అస్వస్థతకు గురయిన విద్యార్థినులకు శుక్రువారం వారి ఇంటి వద్ద వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించారు. గురువారం ఘటన అనంతరం విద్యార్థినులకు చికిత్స చేసి జగ్గంపేట సీహెచ్సీ నుంచి, ఒక ప్రయివేట్ ఆసుపత్రి నుంచి వారి ఇళ్లకు పంపారు. స్థానిక వైద్య సిబ్బంది శుక్రువారం వైద్య పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య పరిస్థితి బాగా ఉన్నట్లు మండల అధికారులకు తెలిపారు. పాఠశాలలో పరిస్థితిని జగ్గంపేట మండల పరిషత్ అధికారి చంద్రశేఖర్, మండల విద్యాశాఖాధికారి ఆర్.స్వామి సమీక్షించారు. పాఠశాలలో క్లాస్ రూమ్లు, వెంటిలేషన్, తాగునీటి శుభ్రత, డ్రైనేజీ వ్యవస్థను వారు క్షుణంగా పరిశీలించారు. విద్యార్థులతో అధికారులు మాట్లాడారు. పాఠశాలకు శుక్రవారం విద్యార్థుల హాజరు తగ్గిందని పాఠశాల హెచ్.ఎం మారిశెట్టి నాగేశ్వరరావు తెలిపారు. 217మంది విద్యార్థులకు కేవలం 5 తరగతి గదులు కాండ్రేగులలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కలిపి నిర్వహిస్తున్నారు. మొత్తం 217 మంది విద్యార్థులు వున్నారు. వీరిలో 165మంది హైస్కూల్ విద్యార్థులు కాగా 52 మంది ప్రాథమిక పాఠశాలకు చెందినవారు. హైస్కూల్ విద్యార్థులకు 5క్లాస్లకు కేవలం మూడే తరగతి గదులు వున్నాయి. రెండు క్లాస్లు వరండాలలో నిర్వహిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలకు రెండు తరగతి గదులు వున్నాయి. వీరిని సర్దుబాటు చేసి విద్యను అందిస్తున్నారు. –పాఠశాలలో వైద్యశిబిరం నిర్వహించాలి–విద్యార్దులకు జాగ్రత్తలు చెప్పాలి కాండ్రేగుల పాఠశాలలో గురువారం విద్యార్థుల అస్వస్థతకు గురికావడం జిల్లా వ్యాప్తంగా సంచలనం కలిగించింది. వేసవిని మించి ఎండలు కాస్తున్న నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలిపేందుకు అధికారులు వైద్య శిబిరం ఏర్పాటు చేసివుంటే బాగుండేదని పలువురు అభిప్రాయపడ్డారు. దీనిపై మండల అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు. -
సెంటు భూమి కూడా లేకపోయినా..
రాయుడు గిరిజ, శివప్రసాద్ దంపతులది కరప మండలం వేళంగి. వీరికిద్దరు పిల్లలు. వారికి తల్లికి వందనం కింద ఒకేసారి రూ.30 వేలు వస్తుందని ఆ దంపతులు సంబరపడ్డారు. కానీ, వారి ఆనందం అంతలోనే ఆవిరైపోయింది. ఉండటానికి ఇల్లు తప్ప ఎక్కడా సెంటు భూమి కూడా లేని ఈ కుటుంబానికి యండమూరులో సర్వే నంబర్ 509/2లో 1.4850, 505/1లో 9.810తో కలిపి మొత్తం 11.295 ఎకరాల భూమి ఉన్నట్టు రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేశారు. ఫలితంగా ఈ కుటుంబం తల్లికి వందనానికి దూరమూంది. దీనిపై యండమూరు వీఆర్ఓ, కరప తహసీల్దార్లను కలిసినా ఫలితం లేకపోవడంతో చివరకు కాకినాడ జిల్లా కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమంలో రెండుసార్లు అర్జీలు పెట్టుకున్నారు. సమస్య ఇప్పటికీ పరిష్కారమవలేదు. తమ పేరున ఉన్న భూములను రెవెన్యూ రికార్డుల నుంచి తొలగించి తల్లికి వందనమైనా ఇవ్వాలని, లేదంటే ఆ భూములైనా ఇప్పించాలని వారు అడగటంలో తప్పేముందని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. -
కంద రైతు కుదేలు
● గతేడాది పుట్టు కందఽ ధర రూ.11 వేలు, నేడు రూ.7 వేలు ● వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో గిట్టుబాటు– నేడు నష్టాల పాట్లు ● ఎకారానికి రూ.35వేల నుంచి రూ.1.75 లక్షల నష్టం ● జిల్లాలో కంద సాగు విస్తీర్ణం 1,450 హెక్టార్లు పెరవలి: జిల్లాలో కంద సాగుచేస్తున్న రైతులు కొన్నేళ్లుగా లాభాల బాట నుంచి నష్టాల ఊబిలోకి కూరుకుపోతున్నారు. మార్కెట్లో కందకు గిట్టుబాటు ధర లభించకపోవడంతోపాటు, దిగుబడి తగ్గడంతో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్టులో పుట్టు కంద ధర రూ.7వేలు పలకడంతో ఎకరానికి రూ.35 వేల నుంచి రూ.1.75 లక్షలు నష్టపోతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కంద ధరలు చరిత్ర సృష్టిస్తే.. నేడు ధరలు పతనం అవ్వడంతో రైతులు కుదేలవుతున్నారు. గతేడాది కంటే ఈ ఏడాది దిగుబడి బాగున్నా మార్కెట్లో ధరలు పడిపోవడంతో పెట్టుబడి కూడా రావట్లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం ఎకరానికి 50 నుంచి 70 పుట్టులు (పుట్టు– 232 కిలోలు) దిగుబడి వస్తోంది. సరైన ధర లేక రైతులకు ఎకరానికి రూ.35 వేల నుంచి రూ.1.75 లక్షల వరకు నష్టం రావటంతో దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారు. జిల్లాలో కందసాగు విస్తీర్ణం ఇలా .. జిల్లాలో కంద పంట గతేడాది కంటే ఎక్కువ మొత్తంలో సాగు చేపట్టారు. గతేడాది ఎవరూ ఊహించని విధంగా పుట్టు కంద ధర రూ.11 వేలు పలకటంతో సాగు విస్తీర్ణం పెరిగింది. జిల్లాలో పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి, కడియం, అనపర్తి, రాజమహేంద్రవరం రూరల్, బిక్కవోలు మండలాల్లో గతేడాది 1,050 హెక్టార్లలో సాగు చేస్తే ఈ ఏడాది 1,450 హెక్టార్లకు పెరిగింది. గతంలో ఈ పంట లాభాలు తీసుకురావటం వల్ల ఈ ఏడాది రైతులు పంట విస్తీర్ణం పెంచటంతో నేడు సాగు చేసిన రైతులు నష్టపోతున్నారు. రైతుల ఆందోళన కంద ధరలు ఊహించని విధంగా ఈ ఏడాది రూ.6 వేల నుంచి ప్రారంభమై ప్రస్తుతం రూ.7, వేలు వద్ద స్థిరంగా ఉంది. తవ్వకాలు చేపట్టిన మొదటిలోనే ఇలా ఉంటే, పంటంతా చేతికి అందే సమయంలో ధరలు మరింత పతనమవుతాయోనని తవ్వకాలు చేపట్టని రైతులు ఆందోళన చెందుతున్నారు. లాభాల నుంచి నష్టాలకు.. కంద సాగు చేసినప్పుడు పుట్టు విత్తనం కంద రూ.11 వేలకు కోనుగోలు చేయగా ఇప్పుడు మార్కెట్లో పుట్టు ధర రూ.7వేలు ఉండటం, దీనికితోడు దిగుబడి తగ్గటంతో రైతులకు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ధర ప్రకారం 50 పుట్టులకు రూ.3.50 లక్షలు, 60 పుట్టులకు రూ.4.20 లక్షలు, 70 పుట్టులకురూ.4.90 లక్షలు వస్తుంటే ఖర్చు రూ.5.60 లక్షలు ఒక ఎకరానికి అయ్యేది. దీంతో దిగుబడిని బట్టి ఒక ఎకరానికి రూ.35 వేలు నుంచి రూ.1.75 లక్షలు నష్టపోవాల్సి వస్తోంది. నష్టాలు ఇలా.. పెట్టుబడి ఎకరానికి రూ.5.25 లక్షలు అవుతుంటే ఎకరానికి 50 పుట్టులు, దిగుబడి బాగుంటే మార్కెట్ ధర ప్రకారం పుట్టు (232 కిలోలు) కంద ధర రూ.7 వేలు చొప్పున 50 పుట్టులకు రూ.3.50 లక్షలు వస్తుందని, అదే 60 పుట్టుల దిగుబడి ఉంటే రూ. 4.20 లక్షలు, 70 పుట్టుల దిగుబడి ఉంటే రూ.4.90 లక్షలు రైతులకు వస్తుంది. దీని ప్రకారం ఒక ఎకరానికి 70 పుట్టులు దిగుబడి వచ్చిన రైతులకు రూ.35 వేలు, 60 పుట్టులు, వచ్చిన వారికి రూ.1.05 లక్షలు, 50 పుట్టులు దిగుబడి వచ్చిన రైతులు రూ.1.75 లక్షలు నష్టపోతున్నారు. ఎకరానికి రూ.1.05 లక్షలు నష్టపోయాం ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో నేడు నష్టాల పాలవుతున్నాం. ఎకరానికి పెట్టుబడి పోను రూ.లక్షపైనే మిగులు వస్తుందనుకుంటే నేడు ఎకరానికి రూ.1.05 లక్షలు నష్టపోయాం. –వేండ్ర ఏసు, కంద రైతు, ముక్కామల ఇలాగైతే వ్యవసాయం ఎలా చేయాలి గత ఐదేళ్లూ కంద రైతులు లాభాలు అందుకోగా నేడు తీవ్రంగా నష్టపోయాం. గతంలో పెట్టుబడి సొమ్ము వచ్చేది. నేడు రాని పరిస్థితి. ఇలాగైతే వ్యవసాయం ఎలా చేయాలో తెలియటం లేదు. –బొలిశెట్టి వెంకటేశ్వరరావు, కంద రైతు, అన్నవరప్పాడు మార్కెట్లో వినియోగం తగ్గింది ఉభయ గోదావరి జిల్లాల్లో పండించిన కంద పంటకు చైన్నె, ముంబయి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కానీ ఈ ఏడాది కంద సాగు విస్తారంగా పెరగటం, మార్కెట్లో వినియోగం తగ్గటంతో ధరలు తగ్గాయి. అంతే కాకుండా అన్ని జిల్లాల్లో కంద దిగుబడి బాగుండటం ధరలు తగ్గటానికి కారణమైంది. –గడుగోయ్యిల సత్యనారాయణ, కంద వ్యాపారి దిగుబడి ఉన్నా.. గతేడాదిలాగే ఈ ఏడాది దిగుబడి ఉన్నా గతంలో ఉన్న ధర లేకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలు పాలవుతున్నారు. గతేడాది ఎకరానికి 50 నుంచి 60 పుట్టులు దిగుబడి వస్తే ఈ ఏడాది 50 నుంచి 70 పుట్టులు వచ్చింది. పెట్టుబడి.. కంద సాగు చేసే రైతులు రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టా ల్సి ఉంది. ఎకరం కంద వేయాలంటే 30 పుట్టుల విత్త నం వేయాలి. గతేడాది విత్తనం ధర పుట్టు రూ.11 వేలు చొప్పున 30 పుట్టులకు రూ.3.30 లక్ష లు, దుక్కు దున్నటానికి, కంద నాటడానికి, బోదెలు తవ్వటానికి, చచ్చు ఎక్కవేయటానికి కూలీలకు రూ. లక్ష ఖర్చు అయింది. పెంట వేయటానికి రూ.30 వే లు, ఎరువులు, పురుగు మందులకి రూ.40వేలు, నీటి తడులు, కలుపుతీతకు రూ.25వేలు .. మొత్తం ఖర్చు రూ.5.25 లక్షలు అవుతుండగా.. నేడు మార్కె ట్ ధరల ప్రకారం ఎకరానికి రూ.35 వేల నుంచి రూ.1.75 లక్షలు నష్టపోతున్నామని రైతులు చెబుతున్నారు. -
భూముల వేలంలో పాల్గొననివ్వలేదని ఆందోళన
తొండంగి: కౌలు వేలం ద్వారా శ్రీసంస్థానం భూము లు సాగు చేసుకుంటున్న తమను వేలం ప్రక్రియలో పాల్గొననివ్వకుండా కూటమి పార్టీ నాయకులు, అధికారులు అన్యాయం చేశారంటూ బాధిత రైతులు ఆందోళన నిర్వహించారు. శ్రీసంస్థానం సత్రానికి చెందిన తొండంగిలోని భూములు సుమారు 478 ఎకరాలకు ఈ నెల 14 నుంచి తొండంగి శివాలయంలో కౌలువేలం ప్రక్రియను దేవదాయఽ ధర్మాదాయశాఖ అధికారులు నిర్వహిస్తున్న సంగతి విదితమే. రోజుకో 30 బిట్లు చొప్పున అధికారులు కౌలువేలం నిర్వహిస్తున్నారు. శుక్రవారం 30 బిట్లుగా 169.16 ఎకరాలకు వేలం నిర్వహించగా రూ.13,56,998 ఆదాయం వచ్చిందని శ్రీసంస్థానం ఈవో నున్న శ్రీరాములు తెలిపారు. గతంలో ఈ భూములకు రూ12,73,800 ఆదాయం రాగా ఈసారి రూ.80198 ఆదాయం పెరిగిందన్నారు. శనివారం మరో 25 బిట్లకు కౌలు వేలం జరుగుతుందని చెప్పారు. కాగా అర్హత ఉన్న కొంతమంది రైతులను కౌలు వేలంలోకి పాల్గొననివ్వకుండా ఆలయం బయట పోలీసుల శాంతిభద్రతల సాకుతో అడ్డుకోవడంతో బాధిత రైతులంతా ఆల యం బయట ఆందోళన నిర్వహించారు. అర్హత ఉన్నప్పటికీ వేలంలో పాల్గొనివ్వలేదని బాధిత రైతులు వాపోయారు. దీంతో వారంతా పోలీసులు, అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. అనంతరం దేవదాయధర్మాదాయశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సక్రమంగా జరగనందున వేలంను రద్దు చేయాలంటూ బాధిత రైతులు డిమాండ్ చేశారు. -
గురుకుల పాఠశాలలో బాలికకు సీటు
జగ్గంపేట: సస్థానిక అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో గంగవరం మండలం పిడతమామిడి గ్రామానికి చెందిన బాలిక వాకాడ కుసుమ అర్చనకు ఎట్టకేలకు గురుకుల పాఠశాలలో డిస్ట్రిక్ కో ఆర్డినేటర్ ఆదేశాలతో సీటు లభించింది. రెండు రోజుల క్రితం అర్చనకు సీటు ఇస్తామని గురుకుల పాఠశాల నుంచి ఫోన్ రాగా, ఆమె చదువుతున్న పాఠశాలలోంచి టీసీ, సర్టిఫికెట్లు పట్టుకుని గురుకుల పాఠశాలకు వెళ్లగా రిజర్వేషన్లో తేడా వచ్చిందని సీటు ఇవ్వలేమని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ చెప్పడంతో ఆమె ఆవేదన చెందింది. ఇదే విషయమై సాక్షి పత్రిక శ్రీఅయోమయంలో 7వ తరగతి విద్యార్థినిశ్రీ అనే శీర్షికతో కథనం ప్రచురించింది. ఇన్చార్జి ప్రిన్సిపాల్ విజయ కూడా బాలికను గురుకుల పాఠశాలలో జాయిన్ చేసుకోకపోవడానికి వున్న ఇబ్బందులను జిల్లా గురుకుల పాఠశాలల కో – ఆర్డినేటర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనితో ఆమె స్పందించి వాకాడ కుసుమ అర్చనను పాఠశాలలో జాయిన్ చేసుకోమని ఆదేశాలు ఇవ్వడంతో గురుకుల పాఠశాలలో కుసుమ అర్చనను జాయిన్ చేసుకున్నట్లు ఇన్చార్జి ప్రిన్సిపాల్ విజయ తెలిపారు. -
కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్
అంబాజీపేట: పుల్లేటికుర్రు మలుపు వద్ద ప్రధాన రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కారును ఏపీఎస్ఆర్టీసీ బస్ బలంగా ఢీ కొట్టింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ముక్కామల నుంచి కె.పెదపూడి వైపు వెళుతున్న కారును అమలాపురం నుంచి రాజమహేంద్రవరం వెళుతున్న ఆర్టీసీ బలంగా ఢీకొట్టింది. కారు ముందు బాగం నుజ్జునుజ్జు అయ్యింది. కారులో ప్రయాణిస్తున్న కె.పెదపూడికి చెందిన సత్తిరాజాకు తీవ్ర గాయాలు కావడంతో అమలాపురం ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని అంబాజీపేట పోలీసులు పరిశీలించి ఆర్టీసీ బస్ను స్టేషన్కు తీసువచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పిడుగుపాటుకు ఇల్లు ధ్వంసం మలికిపురం: మండలంలోని పడమటిపాలెం గ్రామంలో గురువారం రాత్రి పిడుగుపాటుకు నల్లి దాసు ఇంట్లో వస్తువులు ధ్వంసం అయ్యాయి. విద్యుత్ మీటర్లతో పాటు మంచం, పరుపు కూడా కాలిపోయినట్లు దాసు తెలిపారు. ఈదురు గాలులుకు తోడు పిడుగులు పడ్డాయని ఆయన పేర్కొన్నారు. అదృశ్యమైన కుటుంబాన్ని పట్టుకున్న పోలీసులు కిర్లంపూడి: అదృశ్యమైన కుటుంబాన్ని గాలించి పట్టుకున్నామని జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. మండల పరిధి బూరుగుపూడి గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు, బాలిక, బాలుడు గత ఏడాది నవంబర్ 9వ తేదీ అర్ధరాత్రి తాము సామూహికంగా ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి గ్రామం విడిచి వెళ్లారు. సోదరుడు గణేశ్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది. మహారాష్ట్రంలోని షోలాపూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు సమాచారం రావడంతో స్థానిక ఎస్సై జి.సతీష్ పోలీస్ సిబ్బందితో మాటువేసి శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఆయన వెంట పోలీస్ సిబ్బంది డబ్ల్యూహెచ్సీ గురుశ్రీ, పీసీ శివప్రసాద్ ఉన్నారు. చాకచక్యంగా పట్టుకుని ఎస్సై సతీష్ను, సిబ్బందిని పెద్దాపురం ఎస్డీపీఓ శ్రీహరిరాజు, జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ అభినందించారు. -
‘40 మీటర్ల’ సిబ్బందిపై వేటు
● ఈపీడీసీఎల్ సామర్లకోట ఏఈ బదిలీ ● లైన్మన్, లైన్ ఇన్స్పెక్టర్ల సస్పెన్షన్ సాక్షి ప్రతినిధి, కాకినాడ: విద్యుత్ మీటర్ల అనుసంధానంలో ఉదాసీనంగా వ్యవహరించి, ఒక కుటుంబానికి తల్లికి వందనం రాకపోవడానికి బాధ్యులైన అధికారి, సిబ్బందిపై ఏపీ ఈపీడీసీఎల్ ఉన్నతాధికారులు వేటు వేశారు. సామర్లకోటలోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్న కటకం నాగ సత్య గంగాభవాని పేరిట ఏకంగా 40 విద్యుత్ మీటర్లు ఉన్నాయంటూ ‘మహిళ పేరుపై 40 విద్యుత్ మీటర్లు’ శీర్షికన ఈ నెల 17న ‘సాక్షి’ వార్త ప్రచురించింది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏపీ ఈపీడీసీఎల్ అధికారులు శాఖాపరమైన విచారణ నిర్వహించారు. గంగాభవాని పేరిట ఉన్న 40 విద్యుత్ కనెక్షన్లు వాస్తవానికి ఎవరెవరి పేరున ఉన్నాయో విచారించి, వారి ఆధార్కు అనుసంధానం చేశారు. ఈ వ్యవహారంపై విచారణ నిర్వహించి, బాధ్యులైన ఏపీ ఈపీడీసీఎల్ సామర్లకోట ఏఈ రమేష్ కుమార్ను డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఏపీ ఈపీడీసీఎల్లో కన్స్ట్రక్షన్స్ విభాగానికి బదిలీ చేశారు. లైన్మన్ టి.వెంకటేశ్వరరావు, లైన్ ఇన్స్పెక్టర్ యు.లక్ష్మణరావులను సస్పెండ్ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఏపీ ఈపీడీసీఎల్ జిల్లా ఎస్ఈ (ఆపరేషన్స్) వరప్రసాద్ వివరించారు. -
ఒక్క రోజులోనే హత్య కేసులో నిందితుడి అరెస్ట్
రాజోలు పోలీసులకు ఎస్పీ అభినందనలు రాజోలు: ప్రియురాలిని హత్య చేసి పరారైన నిందితుడు షేక్ షమ్మాను రాజోలు పోలీసులు 24 గంటల్లోనే అరెస్ట్ చేశారు. శుక్రవారం రాజోలు సర్కిల్ కార్యాలయంలో సీఐ టి.వి.నరేష్కుమార్, ఎస్సై బి.రాజేష్కుమార్లు వివరాలు వెల్లడించారు. హత్యకు గురైన పుష్ప తన భర్త నుంచి విడాకులు పొంది నాలుగేళ్ల కుమారుడు, తల్లి గంగతో కలసి బి.సావరం సిద్ధార్థనగర్లో ఉంటోంది. ఏడాదిక్రితం నుంచి రాజోలు కోళ్లవారి వీధికి చెందిన షేక్ షమ్మాతో ఆమెకు పరిచయం ఏర్పడింది. వారు ఇద్దరూ బి.సావరంలోని పుష్ప ఇంటి వద్ద సహజీవనం సాగిస్తున్నారు. కంప్యూటర్ క్లాస్ పేరుతో పుష్పను షమ్మా అమలాపురం తీసుకుని వెళ్లేవాడు. అర్ధరాత్రి వరకు ఆమెను ఇంటికి తీసుకుని వచ్చేవాడు కాదు. వ్యసనాలకు బానిస అయిన షమ్మా ఆమెను వ్యభిచారం చేసి డబ్బు సంపాదించాలని బలవతం పెట్టేవాడు. ఈ విషయాన్ని ఆమె తల్లి గంగకు, వరసకు అన్న అయిన వినయ్కు చెప్పింది. ఈ నెల 16వ తేదీన అమలాపురం నుంచి ఇంటికి అర్ధరాత్రి తీసుకుని రాగా షమ్మాను తల్లి గంగ, అన్న వినయ్ ప్రశ్నించారు. దీంతో అగ్రహించిన షమ్మా కప్బోర్డులో ఉన్న చాకుతో వినయ్పై దాడికి పాల్పడ్డాడు. అతనికి అడ్డుగా వెళ్లిన పుష్పను చాకుతో గుండెల్లో పొడవగా ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఆమెను రక్షించేందుకు అడ్డుగా వెళ్లిన తల్లి గంగ, అన్నయ్య వినయ్లకు కత్తి గాయాలు అయ్యాయి. ఎస్పీ కృష్ణారావు, డీఎస్పీ మురళీమోహన్ సూచనల మేరకు నిందితుడిని పట్టుకునేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేశారు. 24 గంటల్లో నిందితుడిని పట్టుకుని రిమాండ్కు పంపిన సీఐ నరేష్కుమార్, ఎస్సై రాజేష్కుమార్, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. -
40 మీటర్లు ఉన్నాయంటూ..
సామర్లకోట పట్టణం కిర్లంపూడి రోడ్డులోని జగనన్న కాలనీలోని ఓ ఇంట్లో కటకం నాగసత్య గంగాభవాని అద్దెకు ఉంటున్నారు. భర్త శ్రీను ఫ్రిజ్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు మరమ్మతులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటుంటారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. తల్లికి వందనం కింద ఇద్దరికీ రూ.30 వేలు వస్తుందని ఆశగా ఎదురు చూశారు. ఆ డబ్బులు రాకపోయేసరికి సచివాలయంలో ఆరా తీయడంతో అసలు విషయం తెలిసి ఆ దంపతులు కంగు తిన్నారు. కూటమి సర్కారు వచ్చాక ఒక మీటరుకు వస్తున్న బిల్లు చెల్లించడమే కష్టంగా ఉంది. అటువంటి గంగాభవాని పేరిట ఏకంగా 40 విద్యుత్ మీటర్లు ఉన్నట్లు ఏపీ ఈపీడీసీఎల్ అధికారులు రికార్డు చేశారు. దీంతో, ఆ దంపతులు సామర్లకోట సబ్ స్టేషన్కు వెళ్లి తమ పేరిట ఉన్న విద్యుత్ మీటర్లను రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. మీటరుకు రూ.35 చొప్పున చెల్లించాలని అక్కడి అధికారులు చెప్పారు. ఇందులో తమ తప్పేమీ లేనప్పటికీ గంగాభవాని దంపతులు 40 మీటర్లకు రూ.1,400 చెల్లించుకున్నారు. అయినప్పటికీ, మీటర్లు తొలగించడానికి ఈపీడీసీఎల్ సిబ్బంది నెల రోజులు చేశారు. అప్పటికే తల్లికి వందనం గడువు కూడా పూర్తయిపోయింది. ఆ డబ్బులు రాకపోగా, తమకు చేతి చమురు వదిలిపోయిందని గంగాభవాని దంపతులు ఆవేదన చెందుతున్నారు. ఆమె పేరిట ఏకంగా 180 మీటర్లు ఈపీడీసీఎల్ నిర్వాకాలు పరాకాష్టకు చేరాయనడానికి ఇది మరో ఉదాహరణ. సామర్లకోట నాలుగో వార్డుకు చెందిన సీకోలు శ్రీదేవి కుటుంబం ఒక రేకుల షెడ్లో నివాసం ఉంటోంది. ఆమె రొయ్యల ఫ్యాక్టరీలో కూలి పని చేసుకుంటోంది. ఆమె భర్త వ్యవసాయ కూలీ. వీరికి కుమారుడు (4వ తరగతి), కుమార్తె (3వ తరగతి) ఉన్నారు. తమ బిడ్డలకు తల్లికి వందనం డబ్బులు వస్తాయని ఆ దంపతులు గంపెడాశతో ఎదురు చూసినా నిరాశే మిగిలింది. దీనిపై సచివాలయంలో సంప్రదిస్తే ఏకంగా 17,758 యూనిట్ల విద్యుత్ వినియోగించినట్టు రికార్డుల్లో ఉందనే కబురు చల్లగా చెప్పారు. వాస్తవానికి ఆ కుటుంబం ఉంటున్న రేకుల షెడ్డుకు ఏనాడూ 60 యూనిట్లకు మించి కరెంటు బిల్లు రాలేదు. దీనిపై ఈపీడీసీఎల్ అధికారులను సంప్రదిస్తే శ్రీదేవి ఆధార్ నంబర్ 4329 0153 9009తో ఏకంగా 180 విద్యుత్ మీటర్లు లింక్ అయి ఉన్నాయని తెలిసింది. దీంతో, ఆ దంపతులకు గుండె ఆగిపోయినంత పనైంది. కూలీ పని చేసుకునే తమకు 180 మీటర్లు ఏమిటని నిలదీస్తే ఫిర్యాదు తీసుకుని, 179 మీటర్లు తొలగించారు. కానీ, ఆమె పేరిట వచ్చిన 17,758 యూనిట్ల బిల్లును సవరించలేదు. చివరకు కరెంటోళ్ల పుణ్యమా అని ఆ కుటుంబం తల్లికి వందనానికి దూరమైంది. వీరికి కోత కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం 2వ వార్డు సచివాలయ పరిధిలో నివాసం ఉంటున్న యల్ల గంగాభవాని, శ్రీను దంపతులు పది మందికి న్యాయం చేసే న్యాయవాద వృత్తిలో ఉన్నారు. వీరి పిల్లలు సత్యకిరణ్ వర్ధన్, హర్షవర్ధన్ ఇంటర్, టెన్త్ చదువుతున్నారు. ఇద్దరికీ కలిపి తల్లికి వందనం డబ్బులు రూ.30 వేలు వస్తాయని ఆ దంపతులు భావించారు. తీరా చూస్తే కిరణ్వర్ధన్కు రూ.9 వేలు, హర్షవర్ధన్కు రూ.10,900 మాత్రమే గంగాభవాని ఖాతాలో జమయ్యాయి. ఇంత తక్కువగా ఎందుకు పడ్డాయని సచివాలయాల చుట్టూ తిరుగుతున్నా సిబ్బంది నుంచి తెలియదనే సమాధానమే వస్తోంది. అందరి మాదిరిగా రూ.13 వేల చొప్పున పడినట్లు చెబుతున్నారు. కానీ ఖాతాలకు జమయ్యింది మాత్రం తక్కువగా ఉంది. అందరికీ న్యాయం చేసే వృత్తిలో ఉన్న ఆ దంపతులు తమకే అన్యాయం జరిగితే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. -
వారి పాపం.. తల్లులకు శాపం
● ఒక్కొక్కరి పేరిట పదులు, వందల్లో విద్యుత్ మీటర్లు ● కరెంటోళ్ల నిర్వాకంతో సంక్షేమానికి దూరమవుతున్న పేదలు ● రెవెన్యూ శాఖదీ అదే తంతు ● మండిపడుతున్న అర్హులు ● ఇదేం పాలనంటూ ఆగ్రహంసాక్షి ప్రతినిధి, కాకినాడ: ప్రభుత్వ సహాయంతో తమ పిల్లలను బాగా చదివించుకుందామని ఆశ పడిన వారికి ఆ ప్రభుత్వమే జెల్ల కొడుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న తప్పిదాలు అర్హులైన ఎంతో మంది పేద, మధ్య తరగతి ప్రజలను సంక్షేమ పథకాలకు దూరం చేస్తున్నాయి. అందులోనూ ఈమధ్య కరెంటోళ్ల బాగోతాలు అందరినీ నిర్ఘాంతపరుస్తున్నాయి. ఎంతటి స్థితిమంతులకై నా మహా అయితే ఆరేడు వరకూ విద్యుత్ మీటర్లు ఉంటాయి. కానీ, నిన్న కాక మొన్న సామర్లకోటకు చెందిన ఓ మహిళ పేరిట ఏకంగా 40 విద్యుత్ మీటర్లు ఉన్నాయని వెల్లడి కావడం చూసి అందరూ నివ్వెరపోయారు. తాజాగా, అదే పట్టణంలో మరో మహిళ పేరిట ఏకంగా 180 విద్యుత్ మీటర్లు ఉన్నాయంటూ కరెంటోళ్లు షాక్ ఇవ్వడం మరింత ఆశ్చర్యం కలిగించింది. అసలు ఒకే ఆధార్పై పదులు, వందల సంఖ్యలో మీటర్లు ఏవిధంగా ఉంటాయనే ఆలోచన కూడా తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ ఈపీడీసీఎల్) అధికారులకు, సిబ్బందికి రాకపోవడం వింతల్లోకెల్లా వింత. ఈపీడీసీఎల్ తీరు ఇలా ఉండగా.. తామేం తక్కువ కాదని రెవెన్యూ శాఖ కూడా అక్కడక్కడ నిరూపించుకుంటోంది. సెంటు భూమి కూడా లేని నిరుపేద తల్లుల పేరిట ఏకంగా 10, 11 ఎకరాల భూములు చూపించింది. ఇటువంటి అనేక కారణాలతో వివిధ ప్రభుత్వ పథకాలకు అర్హులైన వేలాది మంది.. ఆ సంక్షేమాన్ని అందుకోలేక కన్నీరు పెట్టుకుంటున్న పరిస్థితి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కూటమి సర్కార్ ఎంతో ఘనంగా ప్రకటించుకున్న తల్లికి వందనం పథకం డబ్బులు రాక పలువురు తల్లులు గ్రామ, వార్డు సచివాలయాలు, విద్యుత్ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూ నానా అవస్థలూ పడుతున్నారు. కొందరి సమస్య పరిష్కారమైనా, ఇప్పటికే గడువు ముగిసిపోవడంతో తామేమీ చేయలేమంటూ మరి కొంత మందిని సిబ్బంది తిప్పి పంపించేస్తున్నారు. ప్రభుత్వ నిర్వాకంపై ఆయా సంక్షేమ పథకాలకు అర్హులైన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సిబ్బంది చేసిన తప్పులకు తమను బలి చేయడమేమిటని, ఇదేం పరిపాలనని ప్రశ్నిస్తున్నారు. తల్లికి వందనం అర్హుల వివరాలు ● కాకినాడ జిల్లాలోని పాఠశాలల్లో 2.80 లక్షల మంది, జూనియర్ కళాశాలల్లో 48,690 మంది విద్యార్థులున్నారు. తొలి విడతలో 1,49,403 మందిని మాత్రమే తల్లికి వందనం పథకానికి అర్హులుగా గుర్తించారు. మిగిలిన విద్యార్థులు మాటేమిటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ● తూర్పు గోదావరి జిల్లాలో 1.88 లక్షల మంది విద్యార్థులున్నారు. వీరిలో 1.23 లక్షల మందిని అర్హులుగా తేల్చారు. మిగిలిన 65 వేల మందికీ అర్హత ఉన్నా వివిధ కారణాలతో తల్లికి వందనం డబ్బులు ఇప్పటికీ ఇవ్వలేదు. ● డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 2.10 లక్షల మంది విద్యార్థులున్నారు. వీరిలో 1.80 లక్షల మంది అర్హులుగా తేల్చారు. మిగిలిన 30 వేల మంది విద్యార్థులూ తల్లికి వందనానికి దూరమయ్యారు. గుత్తుల రాజేశ్వరికార్పొరేట్ పాఠశాలలో సీటు వచ్చిందంటూ.. కోనసీమ జిల్లా మండపేట మండలం ఏడిద గ్రామానికి చెందిన గుత్తుల రాజేశ్వరికి ఇద్దరు పిల్లలు. కుమారుడు దుర్గా చంద్రశేఖర్ 3, కుమార్తె శ్రీవల్లి 2 తరగతులు చదువుతున్నారు. అయినప్పటికీ వారికి తల్లికి వందనం జమ కాలేదు. విద్యా హక్కు చట్టం ప్రకారం కార్పొరేట్ పాఠశాలల్లో రాజేశ్వరి కుమార్తెకు సీటు వచ్చిందన్న కారణంతో ఇద్దరు పిల్లలకూ తల్లికి వందనం రాలేదని సచివాలయ ఉద్యోగులు చెబుతున్నారు. కానీ, ఇద్దరు పిల్లలూ ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నారు. సచివాలయాన్ని సంప్రదిస్తే అక్కడి సిబ్బంది తనిఖీ చేసి, ప్రస్తుతం పరిశీలన జరుగుతోందని బదులిస్తున్నారు. వేరే వారి భూమి లింక్ చేయడంతో... కోనసీమ జిల్లా అల్లవరం మండలం బోడసకుర్రుకు చెందిన పాలపు పోచమ్మ, సత్తిబాబు దంపతులకు కుమార్తె మానస (పదో తరగతి), కుమారుడు ప్రవీణ్ కుమార్ (7వ తరగతి) ఉన్నారు. కూటమి పాలకులు చెప్పిన విధంగా ఇంట్లో ఉన్న పిల్లలందరికీ రూ.15 వేల చొప్పున వస్తాయనుకున్నారు. ఇద్దరికీ కలిపి రూ.30 వేలు వస్తాయని, ఆ డబ్బులు బిడ్డల చదువుకు ఉపయోగపడతాయని ఆశించారు. అయితే, ఎక్కడో సప్త సముద్రాల అవతల అమెరికాలో ఉంటున్న వారికి చెందిన భూమి పోచమ్మ కుటుంబ సభ్యుల ఆధార్తో లింక్ అయ్యింది. మూడెకరాలు మానస ఆధార్కు, మరో నాలుగెకరాలు పోచమ్మ ఆధార్కు లింక్ అయ్యాయి. దీనిని కారణంగా చూపించి, ఆ కుటుంబంలో ఏ ఒక్కరికీ తల్లికి వందనం సొమ్మును ప్రభుత్వం ఇవ్వలేదు. నిజానికి పోచమ్మ కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలం తప్ప అదనంగా సెంటు భూమి కూడా లేదు. కానీ, రెవెన్యూ సిబ్బంది నిర్వాకంతో ఎన్ఆర్ఐల భూమి వీరి ఆధార్తో లింక్ అయ్యింది. ఆ ఎన్ఆర్ఐలు రూ.లక్షలు ఖర్చు పెట్టి స్వగ్రామం వచ్చి వేలిముద్ర వేసి, పోచమ్మ కుటుంబ సభ్యుల ఆధార్కు లింక్ అయిన భూములను ప్రభుత్వ జాబితా నుంచి తొలగిస్తేనే కానీ వీరికి తల్లికి వందనం రాదని సిబ్బంది చెబుతున్నారు. ఈ సమస్య పరిష్కరించాలని పోచమ్మ దంపతులు అమలాపురం కలెక్టరేట్లో అర్జీ ఇచ్చారు. అది ఇప్పటికీ పెండింగ్లోనే ఉంది. -
నూతన విద్యావిధానంతో ప్రపంచీకరణపై అవగాహన
జేఎన్యూ ప్రథమ మహిళా వీసీ శాంతిశ్రీ బాలాజీచెరువు (కాకినాడ సిటీ): నూతన విద్యావిధానం 36 ఏళ్ల తరువాత రూపొందించారని, దీని ద్వారా ప్రపంచీకరణపై అవగాహన కలుగుతుందని జేఎన్యూ ప్రథమ మహిళా వీసీ ప్రొఫెసర్ శాంతిశ్రీ ధూళిపూడి పేర్కొన్నారు. జేఎన్టీయూకేలో నిర్వహిస్తున్న ఓక్ ట్రీ ఉత్సవాల్లో భాగంగా రోల్ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ–2020 ఇన్ స్వర్ణాంధ్ర వికసత్ భారత్ – 2047 అంశంపై శుక్రవారం వర్క్షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ శాంతశ్రీ మాట్లాడుతూ పరిశ్రమకు నైపుణ్యాలతో కూడిన వ్యక్తుల అవసరం ఉందన్నారు. టర్కీ, చైనా దేశాలు ఎయిర్ఫోర్స్ గ్రౌండ్స్ మెయింటెనెన్స్ చేస్తున్న విధంగా భారతదేశం ముందడుగు వేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. జేఎన్యూ వంటి విశ్వవిద్యాలయాలు నోబుల్ అవార్డు గ్రహీతలను అందిస్తున్నాయన్నారు. పరిశ్రమలకు, విద్యావ్యవస్థలకు మధ్యనున్న అంతరాన్ని తగ్గించి విద్యార్థులకు సాంకేతిక విద్యానైపుణ్యాలను నేర్పించాలన్నారు. జేఎన్టీయూకే వంటి ప్రముఖ వర్సిటీల నుంచి ఏరోస్పేస్ సర్వీస్, డిఫెన్స్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎయిర్క్రాప్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఒకేషనల్ సిస్టమ్, పబ్లిక్ డిజైన్ వంటి కోర్సులను అందించి ఆధునికతకు పెద్దపీట వేయాలన్నారు. రాబోయే యుద్ధాలను ఎదుర్కొనేలా భారత ఇంజినీర్లు తమ శక్తి మేరకు అన్వేషణలు సాగించి సన్నద్ధమవ్వాలన్నారు. హైదరాబాద్ ఇప్లూ వీసీ ప్రొఫెసర్ ఎన్.నాగరాజు మాట్లాడుతూ భారతదేశంలో మిలియన్కు 260 మంది మాత్రమే నిపుణులు ఉండగా చైనాలో మిలియన్కు వెయ్యిమంది ఉన్నారని, భారతదేశం పరిశోధనపై కేవలం 0.64 శాతం మాత్రమే నిధులు వెచ్చిస్తోందన్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆప్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ మాజీ వీసీ బాలగంగాధర్ తిలక్ మాట్లాడుతూ అన్వేషణ, సాంకేతిక అభివృద్ధి, పరిశ్రమలు, సేవారంగం, తయారీ వంటి రంగాలను ఆర్థికాభివృద్ధి వైపు పయనించేలా చేయాలన్నారు. నాన్ ఇంజినీరింగ్ సబ్జెక్టులను ప్రవేశపెట్టి సోషల్ సైన్స్, టెక్నికల్ కోర్సులను కలిపి నేర్పించాలని, వరల్డ్ క్లాస్ యూనివర్సిటీలను నిర్మించడం కాకుండా ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా మార్గాలు అన్వేషించాలన్నారు. వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్, రెక్టార్ సుబ్బారావు, ప్రిన్సిపాల్ మోహనరావు, మాజీ వీసీలు డాక్టర్ ప్రసాదరాజు, శ్రీనివాసకుమార్, ప్రొఫెసర్ ఉదయభాస్కర్, పద్మరాజు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతానికి యువకుడి మృతి
● కూలి పనికి వచ్చి అనంత లోకాలకు ● సామాజిక ఆరోగ్య కేంద్ర వద్ద ధర్నా సామర్లకోట: స్థానిక పిఠాపురం రోడ్డులో విద్యుత్తు వైర్లు మార్పు చేయడానికి వచ్చిన ఒక కాంట్రాక్టు కార్మికుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. గణేష్ కాలనీకి చెందిన నులక బేతాలుడు (30) పిఠాపురం రోడ్డులో విద్యుత్తు వైర్లు మార్పు చేసే పనిలో భాగంగా స్తంభం ఎక్కిన సమయంలో 11కెవీ వైర్ల నుంచి విద్యుత్తు రావడంతో ఒకసారిగా కింద పడిపొయాడు. వెంటనే తోటి సిబ్బంది సమీపంలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ బేతాలుడు మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు సామాజిక ఆరోగ్య కేంద్రానికి చేరుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పిల్లలు చిన్న వారు కావడంతో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న వైస్చైర్మన్ ఉబా జాన్మోజెస్, సీఐ ఎ కృష్ణ భగవాన్, కౌన్సిలర్ పిట్టా సత్యనారాయణ, రాష్ట్ర మాలమహానాడు నాయకుడు లింగం శివకుమార్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నారు. పిఠాపురం రోడ్డు కాంట్రాక్టరుతో చర్చించి బాధిత కుటుంబానికి రూ.8.50 లక్షల నష్ట పరిహరం ఇచ్చేలా ఒప్పించారు. ఆస్పత్రి వద్ద భార్య, కుమార్తె రోదన స్థానికుల హృదయాలను కలచి వేసింది. కుమార్తె నాన్న కావాలని ఏడుస్తూ ఉంటే ఆ బాలికను సముదాయించడం స్థానికులకు సాధ్యం కాలేదు. సామర్లకోట–పిఠాపురం రోడ్డు విస్తరణ పనులలో భాగంగా విద్యుత్తు స్తంభాలను వెనుకకు మార్పు చేశారు. మార్పు చేసిన స్తంభాలకు వైర్లు ఏర్పాటు చేయడానికి శుక్రవారం విద్యుత్తు సబ్ స్టేషన్ నుంచి సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అయినా విద్యుత్తు వైర్లకు కరెంటు సరఫరా కావడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతదేహాన్ని పోర్టుమార్టమ్కు తరలించి కేసు నమోదు చేసి సీఐ ఎ కృష్ణభగవాన్ దర్యాప్తు చేస్తున్నారు. -
నకిలీలలు
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో శానిటేషన్ కాంట్రాక్టర్ ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) నకిలీ రసీదుల వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. వరుసగా మూడు నెలల పాటు పీఎఫ్ చెల్లిస్తున్నట్లు రూ.30 లక్షలకు నకిలీ రశీదులు సృష్టించి, నెలకు రూ.59 లక్షల చొప్పున కాంట్రాక్టర్ రూ.1.77 కోట్లకు శానిటేషన్ బిల్లు చేయించుకున్నా.. ఏ స్థాయిలోనూ అధికారులు కనిపెట్టలేకపోవడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఇది అధికారుల నిర్లక్ష్యమా.. అవగాహనా లోపమా.. లేక లాలూచీ వ్యవహారమా అనేది అర్థం కావడం లేదు. ఈ నకి‘లీలల’పై ‘అన్నవరంలో శానిటరీ కాంట్రాక్టర్ మోసం’ శీర్షికన ‘సాక్షి’ దినపత్రిక గురువారం ప్రచురించిన వార్తకు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పందించారు. దీనిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. టెండర్ పిలవకుండా.. సాధారణంగా దేవస్థానాల్లో ఏ పనికై నా టెండర్ పిలవడమో లేక నాలుగైదు సంస్థల నుంచి కొటేషన్లు స్వీకరించి వాటిలో తక్కువకు కోట్ చేసిన సంస్థకు కాంట్రాక్ట్ అప్పగిస్తారు. అయితే, అన్నవరం దేవస్థానంలో శానిటేషన్ టెండర్ను మాత్రం విజయవాడకు చెందిన కనకదుర్గా మ్యాన్పవర్ సర్వీసెస్కు అప్పగించాలని దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్కు ఈఓ వీర్ల సుబ్బారావు నివేదిక పంపగా.. ఆయన ఆమోదం తెలిపారు. 350 మంది శానిటేషన్ సిబ్బందిని దేవస్థానంలో వివిధ చోట్ల నియమించి, వారికి ప్రతి నెలా 25 శాతం పీఎఫ్తో కలిపి నెలకు రూ.59 లక్షల బిల్లు చెల్లించేలా, నెలకు రూ.12 లక్షల శానిటరీ మెటీరియల్ను దేవస్థానం ఇచ్చేలా ఆదేశాలు జారీ చేశారు. సాధారణంగా దేవస్థానంలో చిన్న కాంట్రాక్ట్ అప్పగించినా అంచనా మొత్తంలో దాదాపు 15 శాతం డిపాజిట్గా జమ చేయాల్సి ఉంటుంది. కానీ, కనకదుర్గా మ్యాన్పవర్ సర్వీసెస్ నుంచి ఒక్క రూపాయి కూడా డిపాజిట్ రూపంలో తీసుకోకుండా ఈ బాధ్యతలు అప్పగించడం విచిత్రం. అప్పట్లోనే దీనిపై విమర్శలు రాగా, ఒక నెల తాత్కాలిక అడ్జస్ట్మెంట్ అని, ఏప్రిల్లో కొత్త కాంట్రాక్టర్ వస్తారని అధికారులు సమాధానం చెప్పారు. అధికారుల నిర్లక్ష్యమే అలుసుగా.. దేవస్థానం అధికారుల నిర్లక్ష్యాన్ని అలుసుగా తీసుకున్న కనకదుర్గా మ్యాన్పవర్ సర్వీసెస్ నిర్వాహకులు నకిలీ పీఎఫ్ చలానాలు సృష్టించారు. వరుసగా మార్చి, ఏప్రిల్, మే నెలలకు రూ.10.09 లక్షలు, రూ.10.64 లక్షలు, రూ.10.45 లక్షలకు చలానాలు సృష్టించి దేవస్థానానికి జమ చేసి, బిల్లు చేయించుకున్నారు. మొత్తం 350 మంది సిబ్బంది జీతాలకు నెలకు రూ.59 లక్షల చొప్పున మూడు నెలలకు కలిపి దేవస్థానం రూ.1.77 కోట్ల మేర బిల్లులు చెల్లించింది. అయితే, తమ ఖాతాలకు పీఎఫ్ మొత్తం జమ కాకపోవడంపై శానిటేషన్ సిబ్బంది ఆరా తీశారు. దీంతో, అనుమానం వచ్చిన దేవస్థానం అధికారులు.. సంబంధిత కాంట్రాక్టర్ను నిలదీశారు. విధి లేని పరిస్థితిలో ఆ కాంట్రాక్టర్ మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించి ఈ నెల 9, 14, 15 తేదీల్లో రూ.10.09 లక్షలు, రూ.9.90 లక్షలు, రూ.9.75 లక్షల చొప్పున పీఎఫ్కు చెల్లించి, ఆ రశీదులు గత మంగళవారం జమ చేశారు. దీంతో పాత రశీదులు ఫేక్ అని ఆ కాంట్రాక్టరే స్వయంగా అంగీకరించనట్లయింది. అయితే, ఆ పాత రశీదుల క్యూఆర్ కోడ్లు స్కాన్ చేయగా.. అవి గతంలో వేరే సంస్థ తరఫున చెల్లించిన పీఎఫ్ చలానాలని, వాటి తేదీలు, మొత్తం, టీఆర్ నంబర్ మార్ఫింగ్ చేశారని తేలింది. ఆ కాంట్రాక్టర్ మూడు నెలలకు పీఎఫ్ తిరిగి చెల్లించి, రశీదులు ఇవ్వడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ అలా చెల్లించకపోయినా దేవస్థానం చేసేదేమీ లేదు. ఆ కాంట్రాక్టర్ దేవస్థానం వద్ద ఒక్క రూపాయి కూడా డిపాజిట్ చేయకపోవడమే దీనికి కారణం. ఆ రసీదు కూడా నకిలీయేనా ! ఇంత జరిగినా గత నెలకు కూడా పీఎఫ్ రసీదు నకిలీదే జమ చేశారు. దానిని ఈ నెల 12న జీతాల బిల్లుతో పాటు దేవస్థానానికి పంపించారు. కాంట్రాక్టర్ ఇచ్చిన రసీదులోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వచ్చిన సమాచారానికి అసలు పొంతనే లేదు. టీఆర్ నంబర్, నెల కూడా తేడాగా ఉన్నాయి. దీంతో ఇది కూడా నకిలీ అనే భావిస్తున్నారు. శానిటేషన్ కాంట్రాక్టర్ నిర్వాకాలపై గతంలో ‘సాక్షి’ అనేక కథనాలు ప్రచురించింది. ఏప్రిల్ 25న ‘మాకు జీతాలు ఎప్పుడిస్తారు?’ శీర్షికన ప్రచురించిన కథనానికి స్పందించి మార్చి నెల జీతాలు చెల్లించారు. అలాగే, ఏప్రిల్ జీతాల చెల్లించకపోవడంతో ‘వీరి కష్టం తుడిచేవారేరి’ శీర్షికన మే 26న కథనం ప్రచురించగా జూన్ 3న చెల్లించారు. మే నెల జీతాలివ్వకపోవడంతో ‘వేతనాల ఆలస్యం రివాజే’ శీర్షికన జూన్ 19న వార్త ప్రచురించాక చెల్లించారు. జూన్ నెల జీతాలు ఇంకా చెల్లించనేలేదు. వేతనాల చెల్లింపు ఆలస్యమైతే పీఎఫ్పై పెద్దగా దృష్టి ఉండదని, అందువల్ల నకిలీ చలానాలు జమ చేసినా పట్టించుకోరనే అభిప్రాయంతోనే ఆవిధంగా చేస్తున్నట్లు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. పీఎఫ్ రసీదులు పరిశీలిస్తున్నాం కాంట్రాక్టర్ అందజేసిన పీఎఫ్ రసీదులను వెరిఫై చేయిస్తున్నాం. అదే విధంగా ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్, లేబర్ కమిషనర్ కార్యాలయ సిబ్బందిని పంపించాలని కూడా జిల్లా కలెక్టర్ను కోరాం. వారు కూడా ఆ రశీదులు పరిశీలిస్తారు. ఒకవేళ ఆ రసీదులు నకిలీవని తేలితే ఆ కాంట్రాక్టర్ను విధుల నుంచి తప్పించే విషయమై ఉన్నతాధికారులతో మాట్లాడి నిర్ణయిస్తాం. చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటాం. – వీర్ల సుబ్బారావు, ఈఓ, అన్నవరం దేవస్థానం శానిటేషన్ కాంట్రాక్టర్ చీటింగ్తో రత్నగిరిపై ప్రకంపనలు ‘సాక్షి’ కథనంతో బయటపడుతున్న టెండర్ లొసుగులు వివరణ కోరిన దేవదాయ మంత్రి -
పెత్తందార్ల కోసమే చంద్రబాబు పాలన
● పేదల కోసం కాదు ● ఆయన నిర్లక్ష్యంతోనే పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గింపు ● మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తొండంగి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పాలన పేదల కోసం కాదని, ‘పచ్చ’ మీడియాతో పాటు వందిమాగధులు, పెత్తందార్ల అభివృద్ధి కోసమేనని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ కార్యక్రమంపై తొండంగిలో గురువారం జరిగిన పార్టీ మండల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాలనలో రూ.3.32 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేశారని, పేదలకు నవరత్నాలతో పాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి, పేదలకు అందించారన్నారు. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ పాలనలో చంద్రబాబు కేవలం ఏడాది కాలంలోనే దాదాపు రూ.1.72 లక్షల కోట్ల అప్పులు చేశారని చెప్పారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ సిక్స్తో పాటు 143 వరకూ సంక్షేమ పథకాలు అమలు చేయలేదని విమర్శించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులను 50 శాతం మేర జగన్ పూర్తి చేశారని దాడిశెట్టి రాజా చెప్పారు. ప్రాజెక్టు ఎత్తు 45.75 మీటర్లకు నిర్మాణ పనులు జరగ్గా.. చంద్రబాబు కేంద్రం వద్ద మాట్లాడకపోవడంతో దీనిని 41.15 మీటర్లకు తగ్గించారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గడం వల్ల లక్షలాది మంది ఆయకట్టు రైతులకు తీరని నష్టం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.15 వేల కోట్లు అధికంగా తెస్తే ప్రాజెక్టును పూర్తి స్థాయి ఎత్తులో నిర్మించవచ్చని వివరించారు. కేంద్రానికి టీడీపీ ఎంపీల మద్దతు అవసరం ఉన్నందున దీనిపై ఒత్తిడి తేవాలని రాజా డిమాండ్ చేశారు. పోలవరం పూర్తి కాకపోతే బనకచర్ల ప్రాజెక్టు కట్టినా ఉపయోగం లేదన్నారు. ఎక్కడో బిహార్లో ఎన్నికలు జరుగుతూంటే కేంద్రం లక్ష కోట్ల రూపాయల ప్యాకేజీ ఇస్తోందని అన్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చంద్రబాబు కమీషన్ల కోసం మాట్లాడుకున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన అనుభవంతో కేంద్రానికి తలవంచకుండా రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం పోలవరం ప్రాజెక్టు విషయంలోను, ప్రత్యేక హోదా సాధనకు కృషి చేయాలని రాజా సూచించారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ నేత యనమల కృష్ణుడు, పార్టీ పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శి కొయ్యా మురళి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ మేరుగు పద్మలత, రాష్ట్ర పెరిక కార్పొరేషన్ మాజీ చైర్మన్ పురుషోత్తం గంగాభవాని, పార్టీ మండల కన్వీనర్ బత్తుల వీరబాబు, వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, వైస్ ఎంపీపీ నాగం గంగబాబు తదితరులు పాల్గొన్నారు. -
15 వేల హెక్టార్లలో వరి నాట్లు
కరప: ప్రస్తుత ఖరీఫ్లో జిల్లావ్యాప్తంగా 93,500 హెక్టార్లలో వరి సాగు జరుగుతూండగా ఇప్పటి వరకూ 15 వేల హెక్టార్లలో నాట్లు పడ్డాయని జిల్లా వ్యవసాయాధికారి ఎన్.విజయ్ కుమార్ తెలిపారు. ఇందులో 6 వేల హెక్టార్లలో వెదజల్లు పద్ధతి అనుసరించామన్నారు. మరో నాలుగైదు రోజుల్లో 40 వేల ఎకరాల్లో నాట్లు పూర్తి చేయడానికి వరి నారు సిద్ధంగా ఉందని తెలిపారు. శివారు ప్రాంతాల్లో సాగునీటి సరఫరాను పరిశీలించేందుకు గురువారం ఆయన మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక రైతు సేవా కేంద్రం వద్ద విలేకర్లతో మాట్లాడారు. సాగునీటి ఎద్దడి లేని కరప, కాజులూరు, తాళ్లరేవు, పెదపూడి, సామర్లకోట, ఏలేశ్వరం మండలాల్లో వరి నాట్లు తొందరగా పూర్తి చేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నామని వివరించారు. ఎంటీయూ–7029 (స్వర్ణ), ఎంటీయూ–1318 రకాలను ఎక్కువగా సాగు చేస్తున్నారన్నారు. అవసరం మేరకే రైతులు ఎరువులు వాడాలని సూచించారు. నాట్లు పూర్తి చేసే సమయానికి మొదటి దఫాగా ఎకరానికి 25 కిలోల డీఏపీ, 10 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ వేస్తే సరిపోతుందన్నారు. ఈ సీజన్లో 48 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయని, ఇప్పటి వరకూ 18 వేల మెట్రిక్ టన్నులు సరఫరా చేశామని తెలిపారు. మరో 18 వేల టన్నుల ఎరువులను మార్క్ఫెడ్ ద్వారా అందుబాటులో ఉంచామన్నారు. ఎవరైనా ప్రైవేటు డీలర్లు కృత్రిమ కొరత సృష్టించినా, పురుగు మందులు కొంటేనే ఎరువులిస్తామని చెప్పినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాకు 42 డ్రోన్లు మంజూరయ్యాయని విజయ్ కుమార్ తెలిపారు. 36 గ్రూపులు సొమ్ము చెల్లించగా, 31 గ్రూపులకు డ్రోన్లు సరఫరా చేశామని తెలిపారు. 69 వేల మందికి కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వాల్సి ఉండగా.. ఇంతవరకూ 25 వేల మందికే ఇచ్చామన్నారు. అనంతరం కరప శివారు పేపకాయలపాలెంలో విజయ్ కుమార్ పర్యటించి పొలాలు, పంట కాలువల పరిస్థితిని పరిశీలించారు. సాగునీటి సమస్య ఉంటే తమ సిబ్బందికి తెలియజేయాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ ఐ.మంజు, కరప, కాకినాడ ఏడీఏలు కె.బాబూరావు, కె.దుర్గాలక్ష్మి, ఏఈఓ ప్రశాంత్ కూడా పాల్గొన్నారు. -
మరిడమ్మ దర్శనానికి భారీగా భక్తులు
పెద్దాపురం: భక్తుల కల్పవల్లిగా ఖ్యాతికెక్కిన పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి జాతర ఘనంగా జరుగుతోంది. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు గురువారం అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయం వద్ద భారీ క్యూ లైన్లలో బారులు తీరి మరీ అమ్మవారిని దర్శించుకున్నారు. ముడుపులు, మొక్కలు చెల్లించుకున్నారు. ఆలయ ట్రస్టీ చింతపల్లి శ్రీహర్ష, అసిస్టెంట్ కమిషనర్ కె.విజయలక్ష్మి ఆధ్వర్యాన సిబ్బంది ఏర్పాట్లు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. స్థానిక స్వచ్ఛంద సంఘాల ఆధ్వర్యాన భక్తులకు పులిహోర పంపిణీ చేశారు. ఈగల్ క్లబ్లు ఏర్పాటు చేయాలికాకినాడ సిటీ: మత్తు పదార్థాల వాడకం వలన కలిగే అనర్థాలపై విద్యార్థుల్లో అవగాహన, చైతన్యం పెంపొందించేలా జిల్లాలోని అన్ని విద్యా సంస్థల్లోనూ ఈగల్ క్లబ్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులతో కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదక ద్రవ్యాలు, గంజాయి వంటి వాటి వాడకం, అమ్మకం, రవాణాను అరికట్టేందుకు ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ (ఈగల్) టీమ్ అనే కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసిందని వివరించారు. ఈ టీమ్ మత్తు పదార్థాలు వాడే వారిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందన్నారు. ప్రతి పాఠశాలలో 8 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులతో ఈగల్ క్లబ్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా ఎస్పీ బిందుమాధవ్, జిల్లా విద్యాశాఖాధికారి పి.రమేష్, ఎస్ఎస్ఏ పీఓ వేణుగోపాలరావు, ఈగల్ టీమ్ అధికారి కె.ధర్మతేజ తదితరులు పాల్గొన్నారు. 1.03 లక్షల మందిని అక్షరాస్యులను చేయాలి కాకినాడ సిటీ: అక్షరాస్యత కార్యక్రమాల్లో అధికారులందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అన్నారు. వయోజన విద్యా శాఖ ఆధ్వర్యాన కలెక్టరేట్లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. 2023లో నిర్వహించిన క్యాస్ట్ సర్వే ద్వారా జిల్లాలో 3,39,963 మంది వయోజనులైన నిరక్షరాస్యులను గుర్తించారన్న్రాు. వారిలో మొదటి విడతగా ఈ ఏడాది 1,03,081 మందిని అక్షరాస్యులుగా చేయడానికి ఆయా శాఖల ద్వారా కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని ఆదేశించారు. తదుపరి మూడు సంవత్సరాల్లో మిగిలిన అందరినీ అక్షరాస్యులుగా చేయాలని సూచించారు. జిల్లా వయోజన విద్య నోడల్ అధికారి అనిశెట్టి వెంకటరావురెడ్డి మాట్లాడుతూ, రెండో దఫా అక్షరాంధ్ర అక్షరాస్యత కార్యక్రమం కింద ప్రతి పది మందికి ఒక వలంటీర్ టీచర్ని ఏర్పాటు చేసి, ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకూ ఒక రోజు జిల్లా స్థాయి శిక్షణ నిర్వహిస్తామని వివరించారు. ఈ నెల 29 నుంచి ఆగస్టు 6 వరకూ మండల స్థాయిలో వలంటీర్ టీచర్లు, రిసోర్స్ పర్సన్లకు ఎంపీడీఓల ఆధ్వర్యాన శిక్షణ నిర్వహిస్తామన్నారు. ఆగస్టు 7 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ నిరక్షరాస్యులకు ఫైనాన్షియల్, డిజిటల్, ఫంక్షనల్ లిటరసీల్లో శిక్షణ ఇచ్చి, మార్చి నెలలో పరీక్ష నిర్వహిస్తామని వివరించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల్లో చోటు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల్లో జిల్లా నుంచి ముగ్గురికి స్థానం కల్పించారు. పార్టీ వైఎస్సార్ టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జల్లిగంపల ప్రభాకర్ (ప్రత్తిపాడు నియోజకవర్గం), రాష్ట్ర మహిళా విభాగ కార్యదర్శులుగా అల్లవరపు నాగమల్లేశ్వరి, పచ్చిమళ్ల జ్యోతి అప్పలరాజులను (పిఠాపురం నియోజకవర్గం నియమించారు. -
సీఎస్ఈకే క్రేజ్..!
ఉమ్మడి తూర్పులో ఇలా... ఇంజినీరింగ్ కళాశాలలు : 34 ప్రభుత్వ : 2ప్రైవేటు : 32మొత్తం సీట్లు : 17,250సెట్లో అర్హత సాధించిన విద్యార్థులు : 15,222 ఇంజినీరింగ్లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ, అనుబంధ బ్రాంచ్ల) జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. కళాశాలల్లో ఏటా ఈ బ్రాంచి సీట్లే ఎక్కువగా భర్తీ అవుతున్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగావకాశాలు ఉండటంతో ఎక్కువ మంది సీఎస్ఈపై మక్కువ చూపుతున్నారు. ప్రముఖ కంపెనీల్లో కొలువు సాధిస్తే రూ.లక్షల్లో ప్యాకేజీలు ఉంటాయన్న ఆశతో సీఎస్ఈ బ్రాంచ్పై ఆసక్తి పెంచుకుంటున్నారు. ప్రస్తుతం ఆ కోర్సులో చేరేందుకు అత్యధిక శాతం విద్యార్థులు వెబ్ ఆప్షన్లను ఎంచుకుంటున్నారు. ఆ తర్వాత ఏఐ, డేటాసైన్స్, ఎంఎల్ తదితర కోర్సులకు డిమాండ్ ఉంది. ఇదే అదనుగా భావిస్తున్న ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. మేనేజ్మెంట్ సీట్ల పరిమితి లేకపోవడంతో ఇష్టారాజ్యంగా సీట్లు పెంచుకునే పనిలో నిమగ్నమయ్యాయి. సాక్షి, రాజమహేంద్రవరం: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఇంజినీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ మొదలైంది. విద్యార్థులు, తల్లిదండ్రులు వెబ్ ఆప్షన్ల నమోదులో తలమునకలవుతున్నారు. ఏపీఈఏపీసెట్–2025 వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఈ నెల 19వ తేదీ వరకూ జరగనుంది. 22న సీట్ల అలాట్మెంట్, 23న కళాశాలలో చేరిక, వచ్చే నెల 4న క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఉత్తమ ర్యాంకులు పొందిన విద్యార్థులు సీఎస్ఈ గ్రూప్నకే తమ వెబ్ ఆప్షన్లలో తొలి ప్రాధాన్యం ఇచ్చారు. రెండో ప్రాధాన్యంగా ఈసీఈ, ఏఐ కోర్సును ఎంచుకుంటున్నారు. ఒకప్పుడు తిరుగులేని గ్రూపులుగా వెలుగొందిన ఈఈఈ, మెకానికల్, సివిల్, కెమికల్ ఇంజినీరింగ్ కోర్సులకు ఆదరణ తగ్గిపోయింది. కనీసం ఈ బ్రాంచ్లను పది శాతం మంది కూడా ఎంచుకోవడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతోంది. ఈ నెల 19న జరిగే వెబ్ ఆప్షన్ల మార్పుల్లో సైతం ఇదే పంథా కొనసాగనుంది. దీన్ని బట్టి చూస్తే ఈ ఏడాది సెట్లో అర్హత సాధించిన విద్యార్థులకు ఈఈఈ, మెకానికల్, సివిల్, కెమికల్ ఇంజినీరింగ్ బ్రాంచ్లలో కన్వీనర్ కోటాలో ఏదో ఒక కళాశాలలో సీటు పక్కాగా లభించే అవకాశం ఉంది. యథేచ్ఛగా దోపిడీ సీఎస్ఈకి ఉన్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని కొన్ని ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు దోపిడీకి తెర తీశాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్, డీమ్డ్, అటానమస్ ఇలా అన్ని ప్రైవేటు కళాశాలల్లో సీఎస్ఈ కన్వీనర్ కోటా సీట్లు తప్ప మేనేజ్మెంట్, పేమెంట్ సీట్లను పూర్తి స్థాయిలో ఇప్పటికే విక్రయించేశారు. ఏఐసీటీఈ గతేడాది సీట్ల పరిమితిపై ఉన్న సీలింగ్ ఎత్తివేయడంతో ప్రైవేటు యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా తమ కళాశాలల్లో డిమాండ్ ఉన్న కోర్సులకు సీట్లు పెంచుకుంటున్నాయి. కళాశాల స్థాయి, పేరు ఆధారంగా ఒక్కో కోర్సుకు ఏడాదికి సుమారు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ వసూలు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై ప్రశ్నిస్తే సీటు ఇవ్వకుండా తిరస్కరిస్తారేమోనన్న భయంతో తల్లిదండ్రులు కూడా అడిగినంత ఫీజు చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. కన్వీనర్ కోటాకే పథకాల వర్తింపు కోర్సుల ఎంపికలో తల్లిదండ్రులు, విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. కన్వీనర్ కోటాలో సీట్లు పొందిన విద్యార్థులకు ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయంటున్నారు. అన్ని బ్రాంచిలూ ముఖ్యమైనవేనని, విద్యార్థుల అభీష్టం మేరకు కోర్సుల్లో చేరాలంటున్నారు. కళాశాలల దోపిడీని అరికట్టాలి ఇంజినీరింగ్ మేనేజ్మెంట్ సీట్ల భర్తీలో ప్రైవేటు కళాశాలలు దోపిడీ బహిరంగంగా కొనసాగుతోంది. ఇంత జరుగుతున్నా వర్శిటీ అధికారులు, ప్రభుత్వం, ఉన్నత విద్యాశాఖ పట్టించుకోవడం లేదు. విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రైవేటు కళాశాలలకు సీట్ల కేటాయింపు విచ్చలవిడిగా పెంచడంతో ఇదే అదునుగా భావిస్తున్న కళాశాలలు.. విద్యార్థుల నుంచి రూ.లక్షలు దండుకుంటున్నాయి. – ఎంవీ బ్రహ్మానందరెడ్డి, ఏపీటీపీఐఈఏ రాష్ట్ర అధ్యక్షుడు సీఎస్ఈ అంటున్నారు.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 34 ఇంజినీరింగ్ కళాశాలలున్నాయి. అందులో ప్రభుత్వ 2, ప్రైవేటు 32 ఉన్నాయి. 15,222 మంది సెట్లో అర్హత సాధించారు. 17,250 ఇంజినీరింగ్ సీట్లు ఉన్నాయి. వీటిలో 75 శాతానికి పైగా సీఎస్ఈనే ఎంచుకునే పరిస్థితి ఉందని విద్యా నిపుణులు అంటున్నారు. ఉపాధి, ఉద్యోగావకాశాలు అధికంగా ఉండటంతో సీఎస్ఈ గ్రూప్నే ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా సీఎస్ఈ జనరల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషీన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్చైన్ టెక్నాలజీ, క్లౌడ్ టెక్నాలజీ వంటి కోర్సుల హవా కొనసాగుతోంది. ఇంజినీరింగ్ కోర్సుల్లో కంప్యూటర్ సైన్స్దే పైచేయి సాఫ్ట్వేర్ రంగంలో డిమాండ్ ఉండటంతో విద్యార్థుల మొగ్గు సొమ్ము చేసుకోవడానికి రంగంలోకి దిగిన ప్రైవేటు కళాశాలలు కౌన్సెలింగ్ జరుగుతుండగానే విద్యార్థులను ఆకర్షించే యత్నాలు మేనేజ్మెంట్ సీట్ల భర్తీకి బేరసారాలు 70 శాతానికి పైగా సీఎస్సీ కోర్సు ఎంచుకునే అవకాశంకొత్త కోర్సులు ఇంజినీరింగ్లో ప్రస్తుతం కొత్త కోర్సులు పరిచయం అయ్యాయి. సీఎస్ఈలో ఏఐ, మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, వీఎల్ఎస్ఐ డిజైన్, ఆడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఏరోస్పేస్, అగ్రికల్చర్, మైరెన్, మైనింగ్, స్కిల్ అండ్ టెక్స్టైల్ వంటి కొత్త బ్రాంచ్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. -
‘జలగ’ండపై అప్రమత్తంగా ఉండాలి
పిఠాపురం: వాణిజ్య పంటలపై దాడి చేస్తున్న మెట్ట జలగల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని శాస్త్రవేత్తలు డాక్టర్ సీతారామశర్మ, డాక్టర్ రామభద్రరాజు సూచించారు. గొల్లప్రోలు మండలంలో వాణిజ్య పంటలపై మెట్ట జలగలు దాడి చేస్తున్నాయంటూ ఈ నెల 13న ‘జలగండం’ శీర్షికన ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో గురువారం పర్యటించారు. మెట్ట జలగలు సోకిన పత్తి, మొక్కజొన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు, మాట్లాడుతూ మెట్ట జలగలు ఎక్కువగా ఉంటే ఎకరాకు రెండు కేజీల ఉప్పు వాటి శరీరంపై పడేటట్లు జల్లాలన్నారు. ఉధృతి మరీ అధికంగా ఉంటే వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. జలగల నివారణకు రసాయన మందులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక వ్యవసాయ అధికారులకు సూచించారు. రైతులు సిఫారసు చేసిన మోతాదులో మాత్రమే నత్రజని ఎరువు వాడుకోవాలన్నారు. పొటాష్ కూడా వేస్తే పంటలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి, గింజ నాణ్యత బాగుంటుందని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీఏ స్వాతి, వ్యవసాయ అధికారి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
డిసెంబర్ నాటికి టిడ్కో ఇళ్ల పంపిణీ
కాకినాడ సిటీ: జిల్లాలో అసంపూర్తిగా ఉన్న 365/430 కేటగిరీ టిడ్కో గృహాలన్నింటినీ వచ్చే డిసెంబర్ నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పొంగూరి నారాయణ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలుత కలెక్టర్ షణ్మోహన్ గత సమావేశంలో చర్చించిన అంశాలపై చేపట్టిన చర్యలను కమిటీకి వివరించారు. జిల్లాలో జీరో పావర్టీ, పీ–4 కార్యక్రమ అమలు ప్రగతిని వివరించారు. రూరల్ నియోజకవర్గం పరిధిలో 11 ఏళ్లగా ఎన్నికలు జరగని ఏడు గ్రామ పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు విడుదల కాక, సాధారణ నిర్వహణ కష్టమవుతోందని, ఈ పంచాయతీలను కాకినాడ నగరంలో విలీనం చేసే ప్రక్రియ వేగవంతం చేయాలని ఎమ్మెల్యే పంతం నానాజీ కోరారు. సమావేశంలో ఒన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ స్కీమ్ కింద పెద్దాపురం సిల్క్ చీర ఉత్పత్తులు ఎంపికై నందుకు అధికారులను, నేతన్నలను మంత్రి అభినందించారు. సమావేశంలో జేసీ రాహుల్ మీనా, కాకినాడ మున్సిపల్ కమిషనర్ భావన, అసిస్టెంట్ కలెక్టర్ మనీషా తదితరులు పాల్గొన్నారు. ఎరువుల దుకాణంలో తనిఖీలు శంఖవరం: మండలంలోని కత్తిపూడిలో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎరువుల దుకాణాలపై బుధవారం ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడుల్లో భాగంగా స్థానిక భక్తాంజనేయ ఫెర్టిలైజర్స్ దుకాణంలో తనిఖీలు నిర్వహించగా రూ.2,49,200 విలువైన వరి విత్తనాలు, రూ.2,05,347 విలువైన ఎరువుల విక్రయాలు నిలిపివేశారు. గొడౌన్లో ఉన్న స్టాకు రిజిస్టరులో స్టాకుకు వ్యత్యాసం, రికార్డులు సక్రమంగా లేకపోవటంతో వాటిని నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ తనిఖీల్లో వ్యవసాయ సంచాలకుడు షంషీ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ పి.శివరామకృష్ణ, ఏఓ పి.గాంధీ, ఏఈఓ ఆర్.మౌళిప్రసాద్ పాల్గొన్నారు. 20న జిల్లా స్థాయి యోగాసన పోటీలు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): రాష్ట్ర భారత్ యోగాసన క్రీడా సంఘం, కోకనాడ యోగాసన క్రీడా సంఘం ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీ ఆదివారం స్థానిక జేఎన్టీయూ యోగా హాల్లో జిల్లా యోగాసన పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు సానా సతీష్ బాబు, అధ్యక్షుడు తుమ్మల రామస్వామి, ఉపాధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ సుధాదేవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదేళ్లు నిండిన వారి నుంచి 14 ఏళ్ల వారి వరకు, 14 నుంచి 18 వరకు, 18 నుంచి 28 వరకు, 28 నుంచి 35 వరకు, 35 నుంచి 45 వరకు, 45 నుంచి 55 ఏళ్లవారి వరకు వివిధ కేటగిరీలలో యోగాసన పోటీలు జరుగుతాయని వారు తెలిపారు. ఆరు విభాగాల్లో బాలురు, బాలికలు పాల్గొనవచ్చునని ప్రపంచ యోగాసన, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వారు ఇచ్చిన సిలబస్ ప్రకారం ట్రెడిషనల్ యోగ, రిథమిక్ యోగ, ఆర్టిస్ట్ యోగ, 10 రకాల పోటీలు జరగనున్నాయన్నారు. ఈ పోటీల్లో విజేతలను రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతామని, రాష్ట్రస్థాయిలో గెలుపొందిన వారికి ఉద్యోగాలలో రిజర్వేషన్ సౌకర్యం ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు 91334 33491 నంబరులో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. అతిథి అధ్యాపకులకు దరఖాస్తుల ఆహ్వానం సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం సిటీ): రాజమహేంద్రవరంలోని ఎస్.కె.ఆర్. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకులుగా పనిచేయడానికి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రాఘవకుమారి బుధవారం ఒక ప్రకటనలో తెలియచేశారు. జువాలజీ, కంప్యూటర్ సైన్స్, బోటనీ, ఫిజిక్స్, ఇంగ్లిష్, తెలుగు, ఎకనామిక్స్, పొలిటికల్ సైనన్స్ , కామర్స్లో ఖాళీలున్నాయన్నారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్ట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి కనీసం 55 శాతం మార్కులు సాధించి ఉండాలన్నారు. ఆసక్తి ఉన్న మహిళా అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 19 తేదీ లోపు కళాశాల ఆఫీసుకు అందజేయాలన్నారు. ఇంటర్వ్యూలు ఈ నెల 23వ తేదీన ఉదయం 9 గంటలకు నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు తమ అసలు సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలు వెంట తీసుకుని రావాలన్నారు. వివరాలకు 9398677385, 9866131354 నంబర్లలో సంప్రదించాలన్నారు. -
నీరుత్సాహంగా ఖరీఫ్
–8లోనిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం మామిడికుదురు: అప్పనపల్లి బాల బాలాజీ స్వామి ఆలయంలోని నిత్యాన్నదానం ట్రస్టుకు రాజమహేంద్రవరం రూరల్ మండలం వెంకటగిరికి చెందిన కొంపెల్ల అలివేలు, వారి కుటుంబ సభ్యులు బుధవారం రూ.లక్ష విరాళంగా అందజేశారు. ఆగుతూ.. ఊగుతూ.. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం వీర వెంకట సత్యనారాయణస్వామి దేవస్థానంలో శానిటరీ మెటీరియల్తో సహ క్లీనింగ్, హౌస్ కీపింగ్, పారిశుధ్య పనులు రీ టెండర్ ఖరారు మరింత ఆలస్యం కానుంది.గురువారం శ్రీ 17 శ్రీ జూలై శ్రీ 2025సాక్షి ప్రతినిధి, కాకినాడ: ముందస్తు సాగుపై ప్రభుత్వం లెక్క తప్పింది. అప్పుడేమో అంతన్నారింతన్నారు.. తీరా అదును దాటిపోతున్నా పాలకులు కన్నెత్తి చూడటం లేదు. ప్రకృతి విపత్తులకు దొరక్కుండా పంట చేతికి రావాలంటే ముందస్తు సాగుకు రైతులు సమాయత్తం కావాలంటూ కూటమి సర్కార్ ఊరూవాడా ఊదరగొట్టి చివరకు చేతులెత్తేసింది. కనీసం సమయానుకూలంగా సాగునీరు అందించలేక రైతులను ‘అడకత్తెరలో పోక చెక్క’ను చేసేసింది. జూన్ ఒకటి నుంచి కాలువలకు నీరు విడుదల, జూన్ 15 కల్లా నారుమళ్లు పూర్తిచేసి అదే నెల చివరికి నాట్లు ముగించాలి. అటు గోదావరి, ఇటు ప్రాజెక్టుల నుంచి సాగునీరు విడుదలకు ఇబ్బంది ఉండదని కూటమి పెద్దలు ఘనమైన ప్రకటనలు చేశారు. జిల్లా రైతులు వారి మాటలు నమ్మి తొలకరి సాగుకు సమాయత్తమయ్యారు. తీరా చూస్తే అనుకున్నట్టుగా కాలువలు, ప్రాజెక్టుల నుంచి నీరు రాక ఖరీఫ్ ప్రశ్నార్థకమై రైతులు లబోదిబోమంటున్నారు. అప్పుడే జూలై 16వ తేదీ వచ్చేసింది. కానీ జిల్లాలోని గోదావరి కాలువ కింద, మెట్ట ప్రాంతంలో ప్రాజెక్టుల కింద ఆయకట్టులో కనీసం 10 శాతం నారుమళ్లు కూడా వేయలేకపోయారు. కేవలం బోర్లపై ఆధారపడ్డ రైతులు మాత్రమే అక్కడక్కడా నారుమళ్లు పోసుకుని సాగునీటి కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 2024–25 ఖరీఫ్ సీజన్లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 94,594 హెక్టార్లు. ఖరీఫ్ అదును దాటిపోతున్నా ఇంతవరకు కేవలం 12 వేల హెక్టార్లలో మాత్రమే నాట్లు పడ్డాయి. కొన్ని మండలాల్లో సెంటు భూమిలో కూడా నాట్లు పడలేదు. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణంలో కనీసం 10 శాతం సాగు కూడా ముందుకు సాగని విషయాన్ని అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఈస్ట్రన్ డెల్టాలో ఇప్పుడిప్పుడే.. జిల్లాలో ఈస్ట్రన్ డెల్టాతో పాటు గోదావరి కాలువ ద్వారా సాగయ్యే సామర్లకోట, కరప మండలాల్లో సాగునీరు ఇప్పుడిప్పుడే వస్తోంది. పంపా, తాండవ, ఏలేరు, పుష్కర ప్రాజెక్టుల నుంచి ఇప్పటి వరకు నీరు విడుదల కాలేదు. ఏలేరు నుంచి సాగుకు ఇప్పుడు వదిలినా అది చేలలోకి ఎప్పుడు వస్తుందో తెలియని అయోమయ పరిస్థితి. సాధారణంగా జూన్ ఒకటో తేదీ నుంచి నారుమళ్లు వేసి జూన్ నెలాఖరుకు నాట్లు పూర్తవ్వాల్సి ఉంది. ఇదే విషయాన్ని అధికారులు ప్రచారం చేశారు. ఈ సమయంలో నారు వేసి నాట్లు వేస్తేనే సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వచ్చే ప్రకృతి వైపరీత్యాల బారిన పడకుండా ఉంటుందని అధికారులు చెబుతూ వచ్చారు. జూలై 16వ తేదీ వచ్చినా జిల్లాలో 10 శాతం నాట్లు కూడా పడలేదు. ఈ క్రమంలో నారు వేసే పనులు ఈ నెలాఖరుకు గాని పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికే ఖరీఫ్ సాగు 45 రోజులు ఆలస్యం కాగా మరింత జాప్యం జరిగితే ఆశలు వదిలేసుకోవాల్సిందేనంటున్నారు. వాస్తవానికి జూన్ నాటికి ఏలేరు జలాలు విడుదల చేయాల్సి వుంది. జూలై మొదటి వారం అయినా సాగునీరు విడుదల కాలేదు. ఏలేరు నుంచి విడుదల చేశామంటున్నా.. ఏలేరు ప్రాజెక్టు నుంచి 1600 క్యూసెక్కుల సాగునీరు విడుదల చేసినట్లు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏలేరు రిజర్వాయర్. ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని జగ్గంపేట, ఏలేశ్వరం, కిర్లంపూడి, పెద్దాపురం, పిఠాపురం, గొల్లప్రోలు సామర్లకోట, కాకినాడ రూరల్ మండలాల పరిధిలో సుమారు 56 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. ఈ ప్రాజెక్టు నుంచి 150 క్యూసెక్కులు విశాఖ స్టీల్ ప్లాంట్కు పోను 50 క్యూసెక్కులు తిమ్మరాజు చెరువుకు, మిగిలిన 1400 క్యుసెక్కులు నాలుగు నియోజకవర్గాలు దాటి పిఠాపురం రావాల్సి ఉంది. ఈ నియోజకవర్గంలో సాగుచేస్తున్న 16,943 హెక్టార్లకు సుమారు 159 హెక్టార్లలో వరి నారుమళ్లు అవసరం. కానీ ఇప్పటి వరకూ ఎక్కడా 10 శాతం మించి నారుపోసిన దాఖలాలు లేవు. కాగా, జగ్గంపేట నియోజకవర్గంలో సుమారు 25 వేల హెక్టార్లలో వరి సాగవుతోంది. మెట్టలో రైతులు ఎక్కువగా చెరువులు, బోర్లపై ఆధారపడి వ్యవసాయం సాగిస్తుంటారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువులు నీటితో నిండటంతో రైతులు ఖరీఫ్ పనులు ముమ్మరంగా చేపట్టారు. గోకవరం మండలంలో ముసురుమిల్లి ప్రాజెక్టు ద్వారా సుమారు పది వేల హెక్టార్లు సాగవుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయకపోవడంతో ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిర్లంపూడి మండలంలో ఏలేరు కాలువ పరిధిలో సుమారు పది వేల ఎకరాలకు పూర్తిస్థాయిలో నీరందక ఖరీఫ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. గతేడాది జూలై నెలలో 60 శాతం ఊడ్పులు పూర్తి కాగా, ఈ సీజన్లో 20 శాతానికి మించి కాలేదు. పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా సుమారు 27 వేల ఎకరాలకు సాగు నీరందాలి. ఈ సీజన్లో ఇప్పటికీ సాగునీరు విడుదల కాలేదు. సిమెంటు పైపుల స్థానంలో నూతనంగా ఐరన్ పైపులు నిర్మించడంతో పాటు ఇతర మరమ్మతులకు రూ.55 కోట్లకు ప్రతిపాదించగా ప్రభుత్వం మొండిచేయి చూపించడంతో పుష్కర నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది. బొర్రంపాలెం ఎత్తిపోతల పథకంలో ఆయకట్టుకు కూడా చుక్కనీరు విడుదల కాక రైతులు లబోదిబోమంటున్నారు. సక్రమంగా అందని గోదారి నీరు కాకినాడ రూరల్లో ఖరీఫ్ సీజన్లో సుమారు 4200 ఎకరాలలో వరి సాగు చేస్తుంటారు. చీడిగ, కొవ్వూరు, కొవ్వాడ, రేపూరు, గంగనాపల్లి, తూరంగి గ్రామాల ఆయకట్టుకు గోదావరి జలాలు, తిమ్మాపురం, సర్పవరం, పండూరు, పి.తిమ్మాపురం, నేమాం, తమ్మవరం, పెనుమర్తి తదితర గ్రామాల ఆయకట్టుకు ఏలేరు ఆధారంగా సాగవుతుంది. గోదావరి జలాలు విడుదల చేసినా సక్రమంగా అందడం లేదు. ఏలేరు నుంచి ఆలస్యంగా ఈనెల 7న నీరు విడుదల చేయగా కాకినాడ రూరల్ మండలంలోని ఆయకట్టు శివారుగా ఉండడంతో ఇప్పటికీ సాగునీరు సక్రమంగా అందడం లేదు. తిమ్మాపురం, పండూరు తదితర గ్రామాలలో నారుమళ్లు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు వర్షాలు లేక వెదజల్లు పద్ధతిలో సాగు చేపట్టేందుకు ఎదురు చూస్తున్న రైతులు నిరాశగా ఉన్నారు. తూతూ మంత్రంగా క్లోజర్ పనులు జిల్లాలో క్లోజర్ పనులు ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో మొదలు పెట్టడంతో తూతూ మంత్రంగా చేసేసి అయ్యిందనిపించడానికేనని రైతు సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. క్లోజర్ పనులు జరుతున్నందున జూన్ నెలాఖరు నాటికి నీరు విడుదల చేస్తామని అధికారుల ప్రకటనలు గాలిలో కలిసిపోయాయి. ఖరీఫ్ దమ్ములు జరగాలంటే పూర్తి స్థాయిలో ఏలేరు రావల్సిందేనని రైతులు చెబుతున్నారు. పిఠాపురం, తుని, ప్రత్తిపాడు, పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల్లో వరి పొలాల పరిస్థితి ఒకే విధంగా వుంది. ముందస్తు ఖరీఫ్ సాగు చేపడితే వరదల నుంచి తప్పించకునే అవకాశం ఉంటుందని బావించినా ప్రస్తుతం ఆలస్యం కావడంతో ఈ ఏడాది పంటలకు ముప్పు తప్పదంటున్నారు. ఏలేరు ఆయకట్టుకు అక్టోబర్ నెలలో వరద బెడద అధికం. మూడేళ్లుగా రైతులు వరదలతో నష్టపోతూనే వున్నారు. పంటల రక్షణకు జూన్లో వరి సాగు ప్రారంభించి నవంబరు, డిసెంబరు నాటికి వరికోతలు పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. కానీ ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేక సాగునీటి జాప్యంతో జిల్లాలో రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ఇంత జరుగుతున్నా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేదా జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగూరు నారాయణ, జిల్లా ప్రజాప్రతినిధులు ఎవరికీ తమ గోడు పట్టడం లేదని రైతులు ఆగ్రహంవ్యక్తంచేస్తున్నారు. 2024–25 ఖరీఫ్ సీజన్లో సాగు విస్తీర్ణం, నాట్లు వేసిన ఆయకట్టు వివరాలు (హెక్టార్లలో) మండలం విస్తీర్ణం నాట్లు కోటనందూరు 4110 0 తుని 3276 265 రౌతులపూడి 2446 220 శంఖవరం 1253 11 ఏలేశ్వరం 2669 0 జగ్గంపేట 4086 77 కిర్లంపూడి 5144 100 ప్రత్తిపాడు 4540 120 తొండంగి 5274 39 గొల్లప్రోలు 5372 816 పెద్దాపురం 4537 313 గండేపల్లి 3908 967 సామర్లకోట 9215 2738 పిఠాపురం 8000 38.71 యు.కొత్తపల్లి 4486 26 కాకినాడ రూరల్ 1780 80 కాకినాడ అర్బన్ 167 14 పెదపూడి 7361 760 కరప 5868 2060 కాజులూరు 7570 2758 తాళ్లరేవు 3532 606 మొత్తం 94594 12008.71 లెక్క తప్పిన అధికారులు నీరందక అన్నదాత లబోదిబో వరదలకు చిక్కుకోకూడదంటూ మొదట్లోనే ముంచేసిన వైనం జూలై 16 నాటికి జిల్లాలో కనీసం 10 శాతం నాట్లు కూడా పడని వైనం రైతుల గోడు పట్టని మంత్రులు దిక్కులు చూస్తున్న అన్నదాతలు నారుమళ్లు ఎండిపోతున్నాయి ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ముందుగానే సాగుకు సిద్ధం కావాలని అధికారులు చెప్పారు. వారి మాటలతో ఈ సారి ముందస్తు సాగు చేసేద్దామని ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. కానీ దుక్కులు దున్నుకోవడానికి సరైన వర్షాలు కూడా పడలేదు. వేలాది రూపాయలు వెచ్చించి వేసిన నారుమళ్లు ఎండిపోతున్నాయి. సాగునీరు ఎప్పుడు విడుదల చేసినా ముందుగానే నారుమళ్లు వేసుకునే వాళ్లం. కానీ ఈ సారి నారుమళ్లకు నీటి విడుదల లేకపోవడం, ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో తీవ్రంగా నష్టపోయే వాతావరణం కనిపిస్తోంది. – గంటా కొండబాబు, కాకరాపల్లి, కోటనందూరు మండలం నీరు లేక సాగని పనులు గతంలో ఎన్నడూ ఇలా లేదు. సాగునీరు అందకపోవడంతో ఖరీఫ్లో నారుమడులు కూడా వేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. కనీసం ఇంజిన్లతో నీరు తోడుకుందామంటే నీరు అందడంలేదు. నీళ్లు వదిలామని అధికారులు చెబుతున్నప్పటికీ కాలువల్లో నీరు కనిపించడంలేదు. నారుమడులకు నీటి ఎద్దడి ఇలా ఉంటే, రేపు నాట్లు పడితే ఎలా ఉంటుందో తెలియడంలేదు. – లోకారెడ్డి అప్పన్నదొర, చేబ్రోలు శివారు లక్ష్మీపురం, గొల్లప్రోలు మండలం -
ఖాతాకు ప్రాణం పోస్తేనే కాసులు
తపాలా శాఖ ప్రత్యేక డ్రైవ్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ) మ్యాపింగ్లో ఆధార్ అనుసంధానం లేకపోవడం వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని నేపథ్యంలో పోస్టల్ శాఖ ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. కేవలం రూ.200 తో గ్రామ స్థాయిలో వారి ఇంటి వద్దే ఖాతా ప్రారంభిస్తుంది. బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఆధునిక కాలంలో రూపాయి నుంచి ఎంత పెద్ద మొత్తమైనా డిజిటల్ లావాదేవీలే సాగుతున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ప్రతి రూపాయి లబ్ధిదారు ఖాతాలో జమయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఏదైనా తేడా జరిగినా తప్పు ఎక్కడ జరిగిందనేది సులభంగా తెలుసుకునే వీలుంటుంది. ఉదాహరణకు తల్లికి వందనం వంటి పథకాలు చాలా మందికి చేరలేదు. వీటిలో ఖాతా వినియోగంలో లేదంటూ సగటున ప్రతి సచివాలయానికి వంద నుంచి 150 వరకూ ఫిర్యాదులు వచ్చాయి. ఈ–కేవైసీ లేకపోవడం వల్ల జిల్లాలో దాదాపు రూ.2 కోట్లకు పైగా లబ్ధిదారుల ఖాతాకు చేరలేదు. దీంతో వారంతా సచివాలయాల చూట్టు ప్రదక్షిణలు చేయక తప్పడం లేదు. ఖాతాలకు ఆధార్ అనుసంధానం లేకపోవడంతో ఖాతాలు యాక్టివ్గా లేవని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నివేదికలో ఉంది. గత ఏడాది నవంబర్లో 2,74,488 ఖాతాలు యాక్టివ్గా లేవని సచివాలయాల వారీగా విభజించి ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో లబ్ధిదారుల ఖాతాలను ప్రదర్శించారు. దీంతో పోస్టల్, బ్యాంకింగ్ రంగాలు ప్రత్యేక డ్రైవ్ చేపట్టగా దాదాపు లక్ష ఖాతాల వరకూ మాత్రమే యాక్టివేట్ చేసుకున్నారు. దీని ప్రకారం ఖాతాదారులందరూ వెళ్లి ఈకేవైసీ పూర్తి చేసుకునేలా ఆయా సచివాలయాల పరిధిలో సిబ్బంది ప్రోత్సహించాల్సి ఉంది. ఖాతాలు లేకపోతే జాతీయ బ్యాంకుల్లోగాని, తపాలా కార్యాలయాల్లో కానీ పొదుపు ఖాతాలు తెరవాల్సి ఉంది. అనంతరం సచివాలయ సిబ్బందికి ఇచ్చిన యాప్లో ఆయా ఖాతాలను ఎన్పీసీఐ నిబందనల ప్రకారం అప్డేట్ చేస్తారు. ఖాతాలు బతికించాలి ప్రభుత్వం నుంచి మంజురయ్యే ఏ సంక్షేమ పథఽకమైన లబ్ధిదారులకు నేరుగా అందాలంటే బ్యాంక్ ఖాతా బతికి ఉండాలి. కొందరికి రెండుమూడు ఖాతాలు ఉండి వాటిలో వినియోగంలో లేకపోవడం సమస్యలకు దారి తీస్తొంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశాన్ని గుర్తించి అర్హులకు సంక్షేమ పథకాలు చేరవేయడానికి ప్రతి బ్యాంక్ ఖాతాను లైవ్లో ఉంచాలని భావిస్తోంది. వీలైనంత డిజిటల్ లావాదేవీలు జరిగేలా ప్రొత్సహించింది. దీంతో ప్రతిపైసాకు లెక్క ఉంటుందనే ప్రధాన ఉద్దేశం. అలా జరిగినప్పుడే 18 ఏళ్లు నిండిన లబ్ధిదారుల ఖాతాలకు నవశకం బెనిపిషరీ మేనేజ్మెంట్ పోర్టల్లో ప్రభుత్వం విడుదలచేసే సంక్షేమ నిధులు కచ్చితంగా అందుతాయనే భావనతో ప్రభుత్వం ఉంది. నిరర్ధక ఖాతాలు ఎన్నున్నా నిరుపయోగమే జిల్లాలో నిర్జీవంగా ఉన్న ఖాతాలు 1,76,500 అవి పునరుద్ధరిస్తేనే ప్రభుత్వ పథకాలు ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన పోస్టల్ శాఖ అధిక ఖాతాలతో ఇబ్బందులు కొందరికి రెండు, మూడు ఖాతాలు ఉండి వాటిలో ఏదో ఒక ఖాతా మాత్రమే వినియోగిస్తున్నారు. ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకునేటప్పుడు వినియోగంలో లేని ఖాతా నెంబర్ ఇవ్వడంతో సమస్యగా మారింది. ప్రతి లబ్ధిదారు ఖాతాను సద్వినియోగం చేసుకోవాలి. లేకపోతే మూసేసుకోవాలి. దీనిపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. – చందాల శ్రీవెంకట ప్రసాద్, ఎల్డీఏం కాకినాడ జిల్లా ప్రతి తపాలా కార్యాలయం ద్వారా ఐపీపీబీ ఖాతాలు ప్రతి తపాలా కార్యాలయంలో ఐపీపీబీ ఖాతాలు ప్రారంభించి ఆధార్ అనుసంధానం చేస్తున్నాం. కాకినాడ డివిజన్లో ఉన్న కాకినాడ, సామర్లకోట ప్రధాన తపాలా కార్యాలయంతో పాటు 54 ఉప తపాలా కార్యాలయాలు, 283 శాఖలలో సేవలు సద్వినియోగం చేసుకోవాలి. – దాసరి నాగేశ్వరరెడ్డి, ఇన్చార్జి పోస్టల్ సూపరిండెంట్, కాకినాడ -
మోదీ విధానాలతో దేశానికి ప్రమాదం
సామర్లకోట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డేగా ప్రభాకర్ అన్నారు. స్థానిక నీలమ్మచెరువు వద్ద జరిగిన సీపీఐ జిల్లా మహాసభకు ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం గాంధీచౌక్లో జరిగిన సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు తీర్మానాలు చేశారు. ప్రధాని మోది మతోన్మాద విధానాలతో దేశం ప్రమాద స్థితిలో ఉన్నదని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ఏటా లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి యువతను మోసం చేసిందని ప్రభాకర్ అన్నారు. వందేళ్ల చరిత్ర కలిగిన కమ్యూనిస్టు పార్టీ పోరాటాల ద్వారా అనేక ప్రజా సమస్యలను పరిష్కరించిందన్నారు. పారిశ్రామిక వేత్తకు రూ.15లక్షల కోట్లు రుణ మాఫీ చేసిన కేంద్రప్రభుత్వం కౌలు రైతులకు రూ.రెండు లక్షల చొప్పున రుణమాఫీ చేయడానికి ముందుకు రావడం లేదని ఆయన ధ్వజమెత్తారు. కాకినాడ నుంచి అమలాపురం వరకు ఉన్న గ్యాస్ నిక్షేపాలను పైపులైన్ ద్వారా మహారాష్ట్ర, గుజరాత్లకు తరలిస్తున్నారని, స్థానికంగా లభించే గ్యాస్, పెట్రోలు నిక్షేపాలను స్థానికంగా అందజేస్తే గ్యాస్ సిలిండర్ రూ.100కే వస్తుందన్నారు. రాష్ట్రంలో కూటమి నాయకుల పరిస్థితి మరింత దారుణంగా ఉందని, ప్రభుత్వ మద్యం దుకాణాలలో పని చేసే పది వేల కుటుంబాలను రోడ్డున పడేశారన్నారు. వలంటీర్ల పొట్ట కొట్టిన ఘనత చంద్రబాబుకు, పవన్ కల్యాణ్కు దక్కుతుందన్నారు. వలంటీరులకు రూ.10వేలు ఇస్తామని రెండున్నర లక్షల మందిని నమ్మించి మోసం చేశారన్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు ముడుపులు చెల్లిస్తే కానీ మద్యం పాటలు జరుపుకోవడానికి వీలు లేదని హుకుం జారీ చేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తూ ఉన్నా అడిగే దమ్ము అధికారంలో ఉన్న వారికి ఉందా అని ఆయన ప్రశ్నించారు. స్మార్ట్ మీటర్లను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని అన్నారు. చంద్రబాబు నాయుడు 21 పర్యాయాలు ఢిల్లీ వెళ్తే 21 పైసలు కూడా ఇవ్వలేదన్నారు. అమరావతికి ఒకసారి శంకుస్థాపన చేసి రెండో పర్యాయం శంకుస్థాపన చేయడం విడ్డూరంగా లేదా అన్నారు. మోది రాష్ట్రం వచ్చిన సమయంలో రూ.700 కోట్లు ఖర్చు అయిందన్నారు. పవన్ కల్యాణ్కు చాక్లెట్ ఇచ్చి చాక్లెట్ బాయ్ అన్నట్లుగా చేశారన్నారు. సభలో సీపీఐ జాతీయ సమితి సభ్యురాలు పి.దుర్గా భవాని, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాక మధు, జిల్లా కార్యదర్శి కె.బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ప్రభాకర్ -
వాడపల్లి క్షేత్రంలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రంలో భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు పెంచేందుకు చర్యలు తీసుకున్నట్టు డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. క్యూలైన్లు పెంచడంతో పాటు ప్రవేశ ద్వారాల వద్ద వెడల్పాటి మార్గాలను ఏర్పాటు చేయడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నామన్నారు. ప్రస్తుతం ఉన్న లడ్డూ కౌంటర్లకు అదనంగా మరికొన్ని కౌంటర్లు పెంచనున్నామన్నారు. వైద్య శిబిరాలను అందుబాటులో ఉంచనున్నామన్నారు. ఈ మేరకు ఏర్పాట్లను తహశీల్దార్ రాజేశ్వరరావు, డీసీ చక్రధరరావు బుధవారం పరిశీలించారు. అన్న ప్రసాద భవనానికి రూ.50 వేల విరాళం వకుళమాత అన్న ప్రసాద భవన నిర్మాణానికి భక్తులు విరివిగా విరాళాలు సమర్పిస్తున్నారు. దానిలో భాగంగా ఆకివీడుకు చెందిన కొల్లి వెంకటేశ్వరబాబు, వెంకటలక్ష్మి దంపతులు, వారి కుటుంబ సభ్యులు బుధవారం స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వకుళమాత అన్న ప్రసాద భవన నిర్మాణానికి రూ.50 వేలు విరాళంగా సమర్పించారు. దాతలకు డీసీ అండ్ ఈఓ చక్రధరరావు స్వామివారి చిత్రపటాలను అందించారు. దరఖాస్తుల ఆహ్వానం వాడపల్లి క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం ప్రతి శనివారం దేవస్థానం ద్వారా వైద్యశిబిరం ఏర్పాటు చేస్తున్నట్టు డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తెలిపారు. ఈ శిబిరంలో సేవ చేయడానికి నర్సింగ్ క్వాలిఫైడ్ అయిన మహిళలు / పురుషుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్టు తెలిపారు. ఆసక్తి గల వారు కార్యాలయంలో సంప్రదించాలన్నారు. -
శాకంబరిగా మరిడమ్మ
పెద్దాపురం : మరిడమ్మ అమ్మవారు మంగళవారం శాకంబరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక దర్గాసెంటర్ లక్కీ షాపింగ్ మాల్ యాజమాన్యం సహకారంతో మరిడమ్మ అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, పండ్లతో పండితులు అలంకరించగా అమ్మవారు శాకంబరిగా దర్శనమిచ్చారు. పెద్దాపురం సీఐ విజయశంకర్ పర్యవేక్షణలో ఎస్సై మౌనిక బందోబస్తు కల్పించారు. అనంతరం వీధి సంబరాల్లో భాగంగా కుమ్మరవీధి సంబరాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ విజయలక్ష్మి, ట్రస్టీ చింతపల్లి శ్రీహర్ష ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. -
జీజీహెచ్కు వైద్య పరికరాల అందజేత
కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్కు ఓఎన్జీసీ, యూనివర్సిటీ ఆఫ్ బయో ఫ్యూయెల్స్ ప్రైవేట్ లిమిటెడ్, జెమిని ఎడిబుల్ ఆయిల్ సంస్థలు సంయుక్తంగా రూ.78.77 విలువైన వైద్య పరికరాలను అందించాయి. ఈ యంత్ర పరికరాలతో పాటు న్యూరో ఓపీ షెడ్ను మంగళవారం కలెక్టర్ షణ్మోహన్, శాసనమండలి సభ్యురాలు కర్రి పద్మశ్రీతో కలిసి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ ఈ సంస్థల వితరణతో ట్రామాకేర్ బ్లాక్, న్యూరాలజీ, పల్మనాలజీ, అనస్థీషియా, కార్డియాక్ విభాగాలకు చెందిన వైద్య పరికరాలు సమకూరాయన్నారు. అనంతరం ఆర్థోపెడిక్ ఓపీ బ్లాక్ సమీపంలో ప్రివెంటివ్ ఆంకాలజీ షెడ్ను ప్రారంభించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి, రంగరాయ వైద్య కళాశాల డాక్టర్ విష్ణువర్దన్, జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసన్, ఓఎన్జీసీ జీఎంహెచ్ఆర్ కె.సునీల్ కుమార్, సీపీవో త్రినాథ్, ఏపిఎంఎస్ఐజీసీ ఈఈ సీహెచ్.రత్నరాజు పాల్గొన్నారు. -
పిఠాపురం ఉద్యో‘గాల్లో’ ఎందుకుంచారు?
పిఠాపురం: ఎంతైనా ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ నియోజకవర్గం కదా దానికి ఒక ప్రత్యేకత ఉండాలనుకున్నారో ఏమో చిరుద్యోగులను గాల్లో తిప్పుతున్నారు ఉన్నతోద్యోగులు. ఇతర ప్రాంతాల నుంచి బదిలీపై వచ్చిన వారిని ఇక్కడి అధికారులు జాయిన్ చేసుకోపోవడంతో గత 28 రోజులుగా గాల్లో ఉండిపోవాల్సి వచ్చిందంటూ వాపోతున్నారు ఉద్యోగులు. ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లే వారిని రిలీవ్ చేయకపోవడంతో బదిలీలు అయిన వారు ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి. ఇప్పటికే తాము పనిచేస్తున్న చోట రిలీవ్ అయిన ఉద్యోగులను ప్రస్తుతం ఇక్కడ జాయిన్ చేసుకోకపోవడంతో గాలిలో ఉన్నామంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ ఆర్డీ నుంచి బదిలీ ఉత్తర్వులతో పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాలిటీలకు జూనియర్ అసిస్టెంట్లు తుని, సామర్లకోట మున్సిపాలిటీల నుంచి బదిలీపై వచ్చిన సిబ్బంది ఉత్తర్వులతో మున్సిపల్ కార్యాలయం చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు తప్ప జాయినింగ్కు మాత్రం అధికారులు అనుమతి ఇవ్వడం లేదు. దీంతో రెండింటికి చెడ్డ రేవడిగా తయారయిన చిరుద్యోగుల పరిస్థితిపై సాక్షి దినపత్రికలో జూన్ 12వ తేదీన ‘‘మీదిక్కున్నచో చెప్పుకోండి,’’ జూన్ 24న ‘‘పిఠాపురం ఉద్యోగాల్లో’’ అనే శీర్షికన రెండు కథనాలు వెలువడగా కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్పందించింది. పిఠాపురం, గొల్లప్రోలు నగర పంచాయతీలలో ఐదేళ్ల సర్వీసు పూర్తయిన ఉద్యోగులు ఉండగా వారిని ఎందుకు బదిలీ చేయలేదంటూ కమిషనర్ను ప్రశ్నించింది. ఇతర ప్రాంతాల నుంచి బదిలీలపై వచ్చిన అధికారులను ఎందుకు జాయిన్ చేసుకోకుండా నెల రోజుల నుంచి కనీసం జీతాలు కూడా లేకుండా తిప్పుతున్నారంటూ ప్రశ్నించింది. బదిలీ ఉత్తర్వులను అమలు చేయాలంటూ మున్సిపల్ ఆర్డీ పలుమార్లు ఉత్తర్వులు ఇచ్చినా ఎందుకు అమలు చేయలేదంటూ ప్రశ్నించింది. నిబంధనలు పాటించని మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో సమాధానం చెప్పాలంటూ మంగళవారం కమిషనర్ కనకారావుకు మెమో జారీ చేసినట్లు మున్సిపల్ఽ అధికారిక వర్గాలు తెలిపాయి. పిఠాపురం మున్సిపల్ కమిషనర్కు మెమో జారీ చేసిన సీడీఎంఏ -
వరుస పురస్కారాలపై హర్షం
కాకినాడ సిటీ: రెడ్క్రాస్ జిల్లా శాఖ మరొకసారి పురస్కారాలు పొందడం మనకు గర్వకారణమని రెడ్క్రాస్ జిల్లా శాఖ అధ్యక్షుడు, కలెక్టర్ షణ్మోహన్ సగిలి హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రెడ్క్రాస్ శాఖ అధ్యక్షుడు, గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా రాష్ట్ర స్థాయిలో 2021–22 నుంచి 2023–24 సంవత్సరం వరకు వరుసగా మూడు సంవత్సరాలు అత్యుత్తమ జిల్లా శాఖగా కాకినాడ జిల్లా మొదటి స్థానాన్ని గెలుచుకోగా పురస్కారాలను సంస్థ చైర్మన్ వైడీ రామారావు, కోశాధికారి ఎన్వీవీఆర్కె ప్రసాద్బాబు, కార్యదర్శి కె శివకుమార్ మంగళవారం కలెక్టర్కు అందజేసిన సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఉత్తమ జిల్లా శాఖ అవార్డులు ఏర్పాటు చేసినప్పటి నుంచి వరుసగా ఏడుసార్లు మన జిల్లా శాఖ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలవడం గర్వకారణమన్నారు. చైర్మన్ వైడీ రామారావు మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని నూతన సేవా కార్యక్రమాల ద్వారా రెడ్క్రాస్ ప్రతిష్టను ఇనుమడింప చేయడానికి కృషి చేస్తామన్నారు. ఇటీవల రెడ్క్రాస్కు సేవలు అందించి గవర్నర్ ద్వారా పురస్కారాలు అందుకున్న ఓఎన్జీసీ, కేఎస్పీఎల్ ప్రతినిధులకు, సాయిరామ ప్రోజెన్ ఫుడ్స్ అధినేత ఎల్ సత్యనారాయణ, ఫిలిం డైరెక్టర్ బి సుకుమార్లకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఉప్పాడ తీర ప్రాంత కోత నివారణకు రక్షణ గోడ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఉప్పాడ తీర ప్రాంతం కోత నివారణకు రూ.323 కోట్లతో రక్షణ గోడ నిర్మించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసిందని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు దశాబ్దాలుగా యేటా సగటున 1.23 మీటర్లు మేర కోతకు గురవుతుండగా, ఒక్క 2017–18 ఏడాదిలోనే 26.3 మీటర్లు కోతకు గురైందన్నారు. ఇది ఉప్పాడ, నేమాం, అమీనాబాద్, సుబ్బంపేట, కొమరగిరి గ్రామాల మత్స్యకారుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. రక్షణ గోడ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి అందజేసిన ప్రాజెక్ట్ రిపోర్ట్ను చైన్నెలోని నేషనల్ సెంటర్ ఫర్ పోస్టల్ రీసెర్చ్కు పంపించగా రూ.323 కోట్లతో టెట్రాపాడ్ల ఆధారంగా శాశ్వత రక్షణ గోడ నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసిందన్నారు. వీటిని ఆమోదించేందుకు ఈ నెల 30న ఢిల్లీలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి అధ్యక్షతన సబ్ కమిటీ సమావేశం జరగనుందని ఆయన తెలిపారు. వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శులుగా రాంప్రసాద్, ఆనంద్ గోకవరం/పెదపూడి: వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శులుగా గోకవరానికి చెందిన సీనియర్ నాయకుడు తోలేటి రాంప్రసాద్, అనపర్తి నియోజకవర్గానికి చెందిన పందిరి ఆనంద్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. కాగా రాంప్రసాద్ భార్య తోలేటి రమ్యశ్రీ గోకవరం ఎంపీటీసీ 1గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరికి పార్టీ నేతలు అభినందనలు తెలిపారు. పెన్షన్ వేలిడేషన్ బిల్లు రద్దు చేయాలి అమలాపురం రూరల్: కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆర్థిక బిల్లుతో ఆమోదించిన పెన్షన్ వేలిడేషన్ బిల్లు వెంటనే రద్దు చేయాలి ప్రభుత్వ పెన్షనర్లు అసోసియేషన్ జిల్లా శాఖ అధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద మంగళవారం ధర్నా చేశారు. తొలుత పారుపూడి కృష్ణశాస్త్రి ధర్నాను ప్రారంభించారు. దశాబ్దాల పాటు పోరాటాలు చేసి పెన్షనర్స్ సాధించుకున్న హక్కులు, ప్రయోజనాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాయడం అమానుషమని, దీనిపై అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు ఫెడరేషన్, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ అమరావతి, గుంటూరు సంయుక్తంగా పెన్షనర్ల హక్కుల పరిరక్షణకు విధి లేని పరిస్థితులలో పోరుబాటను ఎంచుకోవలసి వచ్చిందని జిల్లా ప్రధాన కార్యదర్శి కేకేవీ నాయుడు అన్నారు. ఈ సవరణ అమలులోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు కూడా నష్టపోయే అవకాశం ఉందన్నారు. మాజీ ఎమ్మెల్సీ, పెన్షనర్ యిళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉద్యోగ, పెన్షనర్లకు కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ అమలు చేయాలని కోరారు. -
తమ్ముళ్ల స్వరకల్పనలో వేలంపాట!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కూటమి నేతలు అన్నంత పనీ చేస్తున్నారు. అధికారం చేతిలో ఉందనే ధైర్యంతో బరితెగించి మరీ శ్రీ సంస్థానం భూములను దోచి పెడుతున్నారు. వేలం అనే ముసుగువేసి తాంబూలం ఇచ్చిన వారికే భూములపై హక్కులు కల్పిస్తున్నారు. చేయి తడపని వారికి మొండిచేయి చూపిస్తున్నారు. టీడీపీ ముఖ్యనేతల ఆదేశాలు తు.చ. తప్పకుండా దేవదాయశాఖ అధికారులు అమలు చేస్తున్నారు. భూముల వేలాన్ని ఒక ప్రహసనంగా మార్చేశారు. పేద విద్యార్థుల ఆకలి దప్పులు తీర్చాలన్న ఆశయంతో పిఠాపురం మహారాజా దానం చేసిన శ్రీ సంస్థానం భూములపై గద్దల్లా వాలిపోయి అడ్డగోలుగా అయినకాడికి దోచుకోవాలనుకుంటోన్న కూటమి నేతల కుట్రకోణమిది. రెండో రోజూ కొనసాగిన తంతు పిఠాపురం కేంద్రంగా ఉన్న శ్రీ సంస్థానంకు తొండంగి మండలంలో 511 ఎకరాలు భూమి ఉంది. సుమారు 29 ఎకరాల మేర పుంతలు, గట్లు ఉన్నాయి. మిగిలిన 478.46 ఎకరాలకు మూడేళ్లకు ఒకసారి కౌలు వేలం నిర్వహిస్తుంటారు. ఆ గడువు కాస్తా ఇటీవల ముగిసినప్పటికీ టీడీపీ పెద్దల ఆదేశాలతో వేలం నిర్వహించకుండా దేవదాయశాఖ అధికారులు వాయిదాలపై వాయిదాలు వేసిన వైనాన్ని ‘సాక్షి’ వరుస కథనాలతో వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిిస్థితుల్లో దేవదాయశాఖ స్పందించి తాజాగా ఈ నెల తొమ్మిదిన వేలం నిర్వహణ ప్రకటన విడుదల చేసింది. నాలుగు రోజుల పాటు వేలం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సోమవారం తొండంగి రామలింగేశ్వరాలయంలో శ్రీసంస్ధానం ఈవో నున్న శ్రీరాములు సమక్షంలో మొదలైన వేలం ప్రక్రియ మంగళవారం కూడా కొనసాగింది. మరో రెండు రోజులు వేలం ప్రక్రియ నిర్వహించనున్నారు. కూటమి నేతల ప్రత్యక్ష పర్యవేక్షణలోనే దేవదాయశాఖ అధికారులు నిస్సిగ్గుగా సంస్థానం భూముల కౌలు వేలం నిర్వహిస్తున్న తీరుపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అదీ కూడా ఒక మొక్కుబడి తంతుగానే జరుగుతుండటంపై రైతులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. పక్కదారి పట్టిస్తున్న అధికారులు 478.46 ఎకరాలను 175 బిట్లుగా విభజించి రోజుకు 30బిట్లు చొప్పున వేలం వేస్తున్నట్టు ప్రకటించారు. ప్రతి బిట్టులో అరెకరం నుంచి 10 ఎకరాల వరకూ ఉన్నాయి. మూడేళ్ల కాలానికి వేలం నిర్వహిస్తున్నట్టు పైకి చెబుతున్నారు. దేవదాయ ధర్మాదాయశాఖ కౌలు నిబంధనల ప్రకారం ప్రథమ ధరావత్తుగా ఎకరాకు రూ.3,000 చొప్పున చెల్లించడంతోపాటు రెండేళ్ల శిస్తుకు సరిపడా సాల్వెన్సీ ఽహామీ ధ్రువపత్రాలు సమర్పించాలి. వేలం ఖరారైతే ప్రఽథమ ధరావత్తుతోపాటు ఒక ఏడాది కౌలు శిస్తు ముందుగా చెల్లించాలని నిబంధనల్లో నిర్దేశించారు. ఇవేమీ తమకు వర్తించవన్నట్టు కూటమి నేతలు, ఇందుకు తలాడిస్తూ దేవదాయశాఖ అధికారులు సంస్థానం భూముల వేలాన్ని పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. గడచిన రెండు రోజులుగా జరుగుతోన్న వేలం ప్రక్రియను చూసి అక్కడి కౌలు రైతులే విస్తుపోతున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. కూటమి నేతల బేరసారాలతో వేలం ప్రక్రియను మొక్కుబడి తంతుగా మార్చేశారంటున్నారు. తాంబూలం ఇచ్చే ఒప్పందానికి ముందుకు వచ్చిన వారికి పాత వేలం సొమ్ముపై నామమాత్రంగా పెంపు చూపించి కట్టబెట్టేస్తున్నారనే ఆరోపణలున్నాయి. తాంబూలానికి సై అంటే గనక ఆ బిట్లు వేలంలో మరెవరూ పోటీకి రాకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకుని తెలుగు తమ్ముళ్లు చక్రం తిప్పుతున్నారు. గత రెండు రోజుల్లో 124 ఎకరాలకు వేలం నిర్వహిస్తే కేవలం రూ.51 వేలు అదనపు ఆదాయంగా వచ్చినట్టు చెబుతున్నారంటే కూటమి నేతల పాత్ర ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతంత మాత్రంగా పెరిగిన ఆదాయం వరి ఎకరాకు కౌలు వేలం ఏడాదికి రూ.10 వేల నుంచి రూ.12 వేలు ఉంటుంది. దేవదాయ శాఖాధికారులు సోమవారం నిర్వహించిన వేలంలో 30 బిట్లుగా విభజించిన 61.90 ఎకరాలకు రూ.5.94 లక్షల ఆదాయం వచ్చింది. గతంలో ఇవే భూములకు వేలంలో రూ.5,79,300 వచ్చింది. ఈ లెక్కన మూడేళ్ల క్రితం నిర్వహించిన వేలంతో పోలిస్తే అదనంగా రానున్న ఆదాయం కేవలం రూ.15 వేలు కావడం గమనార్హం. మంగళవారం నిర్వహించిన కౌలు వేలంలో మరో 30 బిట్లుగా ఉన్న 63.21 ఎకరాలకు రూ.6.02 లక్షలు ఆదాయం వస్తుందని నిర్ధారించారు. ఈ భూములకు గతంలో రూ.5,66,200 ఆదాయం వచ్చింది. ఈసారి వేలంలో కేవలం రూ.36 వేలు మాత్రమే పెరగడం గమనించదగ్గ విషయం. రెండురోజులుగా నిర్వహిస్తోన్న వేలంలో గతంలో కంటే ఆదాయం రూ.51 వేలు మాత్రమే పెరిగిందంటే వేలం ప్రక్రియలో పారదర్శకత ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతోంది. వాస్తవంగా చూస్తే ఎకరాకు రూ.1,000 పెరిగినా 124 ఎకరాలకు రూ.1.50 లక్షల వరకూ ఆదాయం రావాలి అని లెక్కలు కడుతున్నారు. కౌలు రైతుల పొట్ట కొడుతున్న కూటమి నేతలు కూటమి నేతల అభీష్టానికి భిన్నంగా బహిరంగ వేలంలో పాల్గొనేందుకు ముందుకు వచ్చిన వారిని పోలీసులు బెదిరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సత్రం భూముల మీద పడి జేబులు నింపుకునే ఎత్తుగడతోనే ఇంత కాలం వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చిన కూటమి నేతలు చివరకు రూ.లక్షలు దిగమింగి దొడ్డిదారిన భూములు కట్టబెట్టే కుయుక్తులు పన్నుతున్నారు. ఫలితంగా నిజంగా సాగు చేసుకునే కౌలురైతుల పొట్టకొడుతున్నారని మండిపడుతున్నారు. ప్రొటోకాల్ లేని కూటమి ద్వితీయశ్రేణి నేతలు వేలం నిర్వహిస్తోన్న వేదికను పంచుకోవడంతో రైతులు విస్తుపోతున్నారు. చంద్రబాబు తరువాత టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు ఇలాకాలోనే శ్రీ సంస్థానం భూముల వేలంలో జరుగుతున్న అక్రమాలతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. శ్రీ సంస్థానంలో భూ‘మాయ’ ప్రహసనంగా వేలం తంతు ముట్టచెప్పిన వారికే హక్కులు 124 ఎకరాలకు పెరిగింది రూ.51 వేలే! -
మెట్ట జలగలతో జాగ్రత్త
ఉద్యాన శాఖాధికారి సోమరాజశేఖర్పిఠాపురం: మెట్ట జలగల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని, ప్రారంభ దశలోనే నివారణకు చర్యలు తీసుకోవాలని పిఠాపురం ఉద్యాన శాఖాధికారి వై.సోమరాజశేఖర్ రైతులకు సూచించారు. ఆయన మంగళవారం గొల్లప్రోలు మండలం చెందుర్తిలో పర్యటించి మెట్ట జలగలు సోకిన పంటలను పరిశీలించారు. ఇటీవల గొల్లప్రోలు మండలంలో వివిధ పంటలకు మెట్ట జలగలు సోకి తీవ్ర నష్టాలను కలిగించిన వైనంపై ‘సాక్షి’ దినపత్రికలో ‘జల గండం’ శీర్షికన వెలువడిన కథనానికి ఉద్యాన శాఖాధికారులు స్పందించారు. ఆయన మాట్లాడుతూ వాణిజ్య పంటల్లో మెట్ట జలగలను గమనించామన్నారు. ఎక్కువగా మిరప, బొప్పాయి వంటి తోటల్లో కనిపించాయని, వీటిని తొలి దశలోనే నివారించక పోతే ఎక్కువ మొత్తంలో పంటలకు నష్టం కలిగే అవకాశం ఉందన్నారు. పొలంలో తడి తగ్గించడమే కాక సాయంత్రం నీరు పెట్ట కూడదన్నారు. మిరప తోటలో కలుపు, వాడిన ఆకులు పూర్తిగా తొలగించుకోవాలన్నారు. మెట్ట జలగలకు ఆశ్రయం కలిగించే చెట్లను తొలగించాలని, రాళ్లు, చెత్త లేకుండా చూసుకుంటూ పొదల కింద వాతావరణం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. మెటాల్డిహైడ్ బైట్ 2.5 శాతం,1 నుంచి 2 కిలోలు ఎకరాకు ఇసుకలో కలిపి వేసుకోవాలన్నారు. ఐరన్ ఫాస్ఫేట్ బైట్ 2 నుంచి 4 కిలోలు ఎకరాకు సాయంత్రం వేళ పొలం చుట్టూ లేదా మిరప రద్దెల మధ్య చల్లుకోవాలన్నారు. దీనిని వర్షం వచ్చి పోయిన తర్వాత మళ్లీ వేయడం అవసరమన్నారు. పొగాకు పొడిని చేను అంతటా తడిగా ఉన్నప్పుడు చుట్టూ చల్లు కోవడం ద్వారా వీటిని నియంత్రివచ్చని తెలిపారు. వర్షం వచ్చి పోయిన తరువాత పొలం పరిశీలించడం ద్వారా వీటి ఉనికిని గమనించవచ్చన్నారు. పొలాల్లో మెట్ట జలగలు, నత్తలు కనిపిస్తే వెంటనే రైతు సేవా కేంద్రం ద్వారా ఉద్యాన శాఖ సిబ్బందికి తెలియజేస్తే వారు నివారణ చర్యలు సూచిస్తారన్నారు. -
యువతకు ఆసరా.. ఉపాధికి భరోసా
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ) అంటే ముందుగా గుర్తుకువచ్చేది సురక్షితమైన, సుఖవంతమైన ప్రయాణం. ఏపీఎస్ ఆర్టీసీ ప్రయాణికుల సేవలో కాకుండా నిరుద్యోగ యువత బంగారు భవిష్యత్కు బాటలు వేస్తుంది. ఆసక్తి గలవారికి హెవీ వెహికల్ డ్రైవింగ్లో శిక్షణ ఇస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ డ్రైవింగ్ స్కూళ్లు ఏర్పాటు చేశారు. 2020వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిరుద్యోగ యువత భవిష్యత్కు భరోసా కల్పించేందుకు వీటిని ప్రారంభించారు. వాహన చట్టాలపై అవగాహన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆర్టీసీ హెవీ వెహికల్లో డ్రైవింగ్ పాఠశాలలు ప్రారంభించింది. అందులో భాగంగా కాకినాడ జిల్లా కేంద్రమైన కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్లో హెవీ డ్రైవింగ్ శిక్షణ కార్యాలయం ఏర్పాటు చేసి యువతీ యువకులను బ్యాచ్లుగా ఏర్పాటు చేసి డ్రైవింగ్లో శిక్షణ, వాహన చట్టాల గురించి అవగాహన కల్పిస్తున్నారు. దీనికోసం నామమాత్రపు ఫీజు నిర్ణయించారు. శిక్షణ పూర్తి చేసేవారికి సర్టిఫికెట్తో పాటు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించి వారి జీవితానికి భరోసా కల్పిస్తున్నారు. ఇక్కడ డ్రైవింగ్ నేర్చుకుంటున్న అభ్యర్థులు భవిష్యత్లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో డ్రైవర్లుగా స్థిరపడేందుకు అవకాశం ఉంటుంది. ప్రభుత్వ రంగాల్లో అయితే ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ పొందిన వారికి ప్రాధాన్యం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకూ 19 బ్యాచ్లలో 305 మంది శిక్షణ పొందారు. నిరుద్యోగ యువతకు భవిష్యత్ కల్పించడం, డ్రైవింగ్లో మెళకువలు నేర్పించడం ముఖ్య ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. ఆర్టీసీలో హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ నిరుద్యోగులకు అండగా ఏపీఎస్ ఆర్టీసీ ఐదేళ్ల కాలంలో 305 మందికి తర్ఫీదు సుశిక్షితులైన నిపుణులతో నిర్వహణ 21 బ్యాచ్కు దరఖాస్తుల ఆహ్వానం సుశిక్షితులైన నిపుణులతో డ్రైవింగ్ శిక్షణ హెవీ వెహికల్ డ్రైవింగ్లో అభ్యర్థులకు సుశిక్షితులైన నిపుణులతో శిక్షణ అందిస్తున్నాం. రాత్రివేళ్లలో డ్రైవింగ్ నేర్పిస్తాం. సమయ పాలన ,క్రమశిక్షణ, అంకితభావంతో డ్రైవింగ్లో మెళుకువలు నేర్పుతూ రోజూ తరగతి గదిలో పాఠాలతో పాటు గ్యారేజీలో ఇంజిన్ భాగాలపై అవగాహన కల్పిస్తున్నాం. ఘాట్రోడ్డు ఎత్తు, పల్లం వంటి ప్రాంతాలలో ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నాం. ప్రస్తుతం 21వ బ్యాచ్కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం. – కే.డీ.ఎం.రాజు డ్రైవింగ్ స్కూల్ ఇన్స్పెక్టర్ హెవీ లైసెన్స్కు శిక్షణ జేఎన్టీయూకేలో బీటెక్ ఇంజినీరింగ్ అభ్యసిస్తున్నాను. భవిష్యత్లో కొన్ని ఉద్యోగాలకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అడిగే అవకాఽశం ఉంది. శిక్షణతో పాటు లైసెన్స్, డ్రైవింగ్కు సంబంధించి అన్ని విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు. – ఎం.జోష్, కాకినాడ డ్రైవింగ్పై అవగాహన వచ్చింది కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగాలకు సంబంధించి డిఫెన్స్ వంటి వాటికి హెవీ లైసెన్స్ తప్పనిసరిగా అడుగుతున్నారు. డ్రైవింగ్తో పాటు లైసెన్స్ జారీకు ఆర్టీసీ అందిస్తున్న సేవలు వినియోగించుకున్నాను. ఇటువంటి వాటి ద్వారా నేర్చుకుంటే అవగాహన పూర్తిగా వస్తుంది. – పి.బాలురెడ్డి, పీఆర్ డిగ్రీ కళాశాల -
3న జాతీయ చదరంగం పోటీలు
రాజమహేంద్రవరం సిటీ: జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా ఇండిపెండెన్స్ చదరంగం టోర్నమెంట్ను కాల్ ఫ్యూజన్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో ఆగస్టు 3న నిర్వహిస్తున్నట్లు టోర్నమెంట్ డైరెక్టర్ విత్తనాల హైమావతి తెలిపారు. మంగళవారం టోర్నమెంట్ బ్రోచర్ను ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ లోరియల్ హై గ్లోబల్ స్కూల్ ఆధ్వర్యంలో రూ.1,23,456 నగదు బహుమతితో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీలకు దేశం నలుమూలల నుంచి సుమారు 400 మంది వరకు చదరంగ క్రీడాకారులు హాజరవుతారన్నారు. విజేతలకు నగదు బహుమతులు, మెమెంటోలను అందజేస్తామన్నారు. స్కూల్ డైరెక్టర్ సుంకర రవికుమార్, ప్రిన్సిపాల్ ఏక్తా, టోర్నమెంట్ డైరెక్టర్ హైమావతి, చెస్ అకాడమీ డైరెక్టర్ విత్తనాలకుమార్ పాల్గొన్నారు. -
స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించండి
పెద్దాపురం: స్మార్ట్ మీటర్లను, విద్యుత్ సర్దుబాటు చార్జీల పెంపుదలను వ్యతిరేకించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు నీలపాల సూరిబాబు అన్నారు. దీనిలో భాగంగా పార్టీ ఆధ్వర్యంలో జరిగే ప్రచార కార్యక్రమ పోస్టర్ను సోమవారం పెద్దాపురంలోని యాసలపు సూర్యారావు భవనంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ ప్రభుత్వ అండతో ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి ఇంటినీ దోచుకునేలా అదానీ ఏర్పాటు చేసుకున్నారన్నారు. మన అనుమతి లేకుండా బెదిరించి మరీ, స్మార్ట్ మీటర్ మార్చడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. దీనిని అడ్డుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పటి వరకూ కరెంటు బిల్లు వచ్చిన 15 రోజులు, నెల రోజుల లోపు సొమ్ములు కట్టేవారమని, ఇక నుంచి బిల్లు ముందుగానే చెల్లించాల్సి వస్తుందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లు వేస్తే బద్దలు కొట్టండి అని చెప్పిన లోకేష్.. ఇప్పుడు ఎక్కడకు పోయారని ప్రశ్నించారు. బీజేపీ అండతో తెలుగుదేశం, జనసేన.. ప్రజల మీద కరెంటు చార్జీలు, స్మార్ట్ మీ టర్ల రూపంలో దాడి చేస్తున్నాయన్నారు. ప్రతి ప్రాంతంలోనూ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రొంగల వీర్రాజు, సుబ్బలక్ష్మి, దారపురెడ్డి కృష్ణ, నెక్కల నరసింహమూర్తి, కూనిరెడ్డి అప్పన్న పాల్గొన్నారు. -
తిరుమల విద్యార్థులకు అభినందన
రాజమహేంద్రవరం రూరల్: నీట్ 2025 ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 19వ ర్యాంకు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించిన రాజమహేంద్రవరం తిరుమల కళాశాల విద్యార్థి డి.కార్తిక్ రామ్కిరీటిని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అభినందించారు. జేఈఈ అడ్వాన్స్డ్–2025లో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఆలిండియా 8వ ర్యాంకు సాధించిన కె.యశ్వంత్ సాత్విక్, ఎస్సీ కేటగిరీలో ఆలిండియా రెండవ ర్యాంకు సాధించిన కె.ప్రణీత్లకు పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు. ఈ ఘనతను సాధించిన తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావును మంత్రి లోకేష్ అభినందించారు. స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తల్లిదండ్రులతో కలసి ఆయా విద్యార్థులు సోమవారం మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ చిన్న విషయాలకే నేటితరం విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారని, లైఫ్ అంటే చాలెంజ్ అన్నారు. దాన్ని స్వీకరించాలే తప్ప అధైర్యపడకూడదన్నారు. ఆ విద్యార్థుల భవిష్యత్తు లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. కలల సాధనకు నిరంతరం శ్రమించాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. -
రూ.లక్ష విరాళం అందజేత
కాకినాడ సిటీ/కాకినాడ క్రైం: జిల్లా స్పోర్ట్స్ అఽథారిటీ మైదానంలో ఆగస్టులో జరిగే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ, మహిళల హాకీ టోర్నమెంట్ల నిర్వహణకు ఏపీఎన్జీవో జిల్లా శాఖ రూ.లక్ష విరాళమిచ్చి ఆదర్శంగా నిలిచింది. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ గత వారంలో వివిధ ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. ర్యాలీ, క్రీడల ఘన నిర్వహణకు సంఘాల తరఫున చేయూతనందించాలని కోరారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల్లో జిల్లా ఏపీఎన్జీవో శాఖ రూ.లక్ష మొత్తాన్ని సమకూర్చింది. ఈ మొత్తాన్ని చెక్ రూపంలో సోమవారం ఆ సంఘ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుద్దటి రామ్మోహన్, పేపకాయ వెంకటకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాస్ చేతుల మీదుగా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాకు అందించారు. ఈ మేరకు సంఘ నేతలను జేసీ అభినందించారు. జేసీని కలసిన వారిలో సంఘ జిల్లా సహ అధ్యక్షుడు మట్టపర్తి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు పాలపర్తి మూర్తిబాబు, సరెళ్ల చంద్రరావు, సంయుక్త కార్యదర్శి శశికుమార్ ఉన్నారు. -
జనసేన నాయకుడి ఇసుక దందా
పెరవలి: కూటమి నాయకుల ఇసుక దందాకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. తాజాగా జనసేన గ్రామ అధ్యక్షుడు అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను అధికారులు సీజ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. పెరవలి మండలం మల్లేశ్వరం గ్రామానికి చెందిన జనసేన గ్రామ అధ్యక్షుడు మేడిచెర్ల భాస్కర శివ కుమార్ అదే గ్రామంలో అక్రమంగా 700 టన్నుల ఇసుకను నిల్వ చేశాడు. దీంతో గ్రామస్తులందరూ సోమవారం పీజీఆర్ఎస్లో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆమె ఆదేశాల మేరకు మైనింగ్ అధికారులు దాడి చేసి ఆ ఇసుక గుట్టను స్వాధీనం చేసుకున్నారు. శివకుమార్పై కేసు నమోదు చేయాలో లేక జరిమానా విధించాలో కలెక్టర్ ఆదేశాల మేరకు చేస్తామని జిల్లా మైనింగ్ అధికారి ఫణిభూషణ్ రెడ్డి తెలిపారు. అక్రమ ఇసుక నిల్వలపై తమకు ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు. దాడిలో జిల్లా మైనింగ్ అధికారి శైలజ, పోలీసులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. శతాధిక వృద్ధురాలి మృతి మామిడికుదురు: గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు అన్నంనీడి మహాలక్ష్మి (101) సోమవారం మృతి చెందారు. ఆమె 1924 ఫిబ్రవరి 15వ తేదీన జన్మించారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. తొమ్మిది మంది మనవలు, మనవరాళ్లు, 16 మంది ముది మనవలు ఉన్నారు. ఆమె మరణించే వరకు తన పనులు తానే చేసుకునే వారని కుటుంబ సభ్యులు తెలిపారు. 25 ఏళ్ల నుంచి ఒంటి పూట భోజనం చేస్తున్నారన్నారు. గ్రామంలోని శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. 17న జాబ్మేళా కొత్తపేట: స్థానిక వీకేవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 17న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్ డాక్టర్ కేపీ రాజు తెలిపారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. కళాశాల జవహర్ నాలెడ్జ్ సెంటర్ (జేకేసీ) అండ్ ప్లేస్మెంట్ సెల్, వికాస సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎస్బీ మోటార్స్, కేపీపీ పేపర్స్, అవంతి ప్రోజెస్ ఫుడ్స్, ఎల్ఐసీ, డెక్కన్ ఫైన్ కెమికల్స్, ఐజాన్ ఎక్స్పీరియన్సెస్, ఫోక్స్కాన్, హుండాయ్ మోబిస్, ఎస్ఎస్ఆర్ ఎల్టీఎల్ ట్రైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ముత్తూట్ ఫైనాన్స్, శివానిక్, ఇసుజు మోటార్స్ తదితర సంస్థలు ఈ మేళాకు హాజరై తమ ఆయా కంపెనీల్లో సుమారు 820 ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లమా, బీటెక్, పీజీ చదివిన వారందరూ తమ సర్టిఫికెట్లతో జాబ్మేళాకు హాజరుకావచ్చు. మరిన్ని వివరాలకు 81798 24845, 97043 02775, 98497 11253 నంబర్లను సంప్రదించాలి. ● అక్రమంగా 700 టన్నుల నిల్వ ● కలెక్టర్కు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు -
దుప్పట్లు ఉతికేందుకు టెండర్
● విడుదల చేసిన అన్నవరం దేవస్థానం ● ‘సాక్షి’ కథనానికి స్పందన ● ప్రస్తుతం నామినేషన్ విధానంలో నెలకు రూ.60 వేల చెల్లింపు అన్నవరం: స్థానిక వీర వెంకట సత్యనారాయణస్వామి దేవస్థానంలోని సత్రాల గదులలో ఉపయోగించే దుప్పట్లు, గలేబులు, డోర్ కర్టెన్లు, రగ్గులను ఉతికేందుకుగాను దేవస్థానం అధికారులు సోమవారం టెండర్ పిలిచారు. గత మార్చి నుంచి ఇవి ఉతికేందుకు గాను నామినేషన్ మీద నెలకు రూ.60 వేలు చొప్పున చెల్లిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో అధికారులు ఈ నామినేషన్ మీద కేటాయించారన్న విమర్శ కూడా ఉంది. టెండర్లు పిలిస్తే ఇంకా తక్కువకు వీటిని ఉతుకుతారనే అభిప్రాయం నెలకొంది. గత నెల 23న స్థానిక రజకవృత్తిదారుడు కింతాడ శ్రీనివాసరావు తాము నెలకు రూ.45 వేలకే వాటిని ఉతుకుతామని దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ దినపత్రికలో ‘సత్యదేవునికే టెండర్’ శీర్షికన వార్త ప్రచురితమైంది. 21 వరకూ దరఖాస్తులకు గడువు దేవస్థానంలో రెండేళ్లపాటు పారిశుధ్య కాంట్రాక్టు నిర్వహించిన కేఎల్టీఎస్ సంస్థ గత ఫిబ్రవరి నెలాఖరు వరకూ సత్రం గదులలో మంచాలపై వేసిన దుప్పట్లు, గలేబులు, డోర్ కర్టెన్లను ఉతికించే పని కూడా నిర్వహించేది. అప్పుడు వాషింగ్ మెషీన్ల ద్వారా శుభ్రం చేసేవారు. ఆ సంస్థ కాంట్రాక్టు పూర్తి కావడంతో గత మార్చి నుంచి నెలకు రూ.60 వేలు చొప్పున చెల్లిస్తూ శుభ్రం చేయిస్తున్నారు. గత నాలుగు నెలలుగా ఈ విధానం కొనసాగుతోంది. పైగా వాటిని ఉతికేందుకు మెటీరియల్ను దేవస్థానమే అందజేస్తోంది. ప్రస్తుతం మనుషులు ఉతుకుతుండడంతో అంతగా శుభ్రంగా ఉండడం లేదని, వాసన వస్తున్నాయన్న ఫిర్యాదులు భక్తుల నుంచి వస్తున్నాయి. దీంతో వాషింగ్ మెషీన్లు టెండరు దారుడే సమకూర్చుకుని ఉతికి ఇచ్చేందుకు టెండర్ పిలిచారు. ఈ నెల 21వ తేదీ లోపు దరఖాస్తులు సమర్పించాలని కోరారు. -
బాస్కెట్ బాల్ రన్నర్గా ఏపీఎస్పీ
కాకినాడ రూరల్: రాజమహేంద్రవరం ఎస్కేవీటీ కాలేజీలో ఈ నెల 13న జరిగిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జూనియర్ బాస్కెట్ బాల్ చాంపియన్ షిప్ – 2025 రన్నర్గా కాకినాడ ఏపీఎస్పీ జట్టు నిలిచింది. ఈ విషయాన్ని ఏపీఎస్పీ బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు సుబ్బరాజు తెలిపారు. రామచంద్రపురం జట్టుతో పైనల్ మ్యాచ్లో హోరాహోరీగా తలపడిందన్నారు. పోటీలో పాల్గొని ప్రతిభ చూపిన క్రీడాకారులను ఆయన సోమవారం అభినందించారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు మహేష్, శంకర్, రాజేష్, వెంకటేష్, రాజు పాల్గొన్నారు. -
సీట్ రైట్..
వసతులున్న కాలేజీలకే గుర్తింపు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు ఆన్లైన్ ద్వారా కళాశాలల ప్రమాణాలు పరిశీలన చేసి అనుమతి ఇవ్వాలని ఉన్నత విద్యామండలి సూచించింది. ఆ మేరకు జేఎన్టీయూ కాకినాడ ఆన్లైన్లో తనిఖీలు నిర్వహించింది. సాంకేతిక విద్యలో ఉన్నత ప్రమాణాలు పాటించడంతో పాటు అన్ని వసతులు ఉన్న వాటికే గుర్తింపు ఇచ్చాం. అటువంటి కళాశాలలో అభ్యసిస్తే విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. – డాక్టర్ ఆర్.శ్రీనివాసరావు, రిజిస్ట్రార్, జేఎన్టీయూకే ● జేఎన్టీయూకే పరిధిలో సీట్లు ఖరారు ● ఇంజినీరింగ్లో 62 వేల సీట్లకు అనుమతి ● 2025–26లో 106 కళాశాలలకు గుర్తింపు ● ఉన్నత విద్యామండలికి నివేదిక బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంజినీరింగ్ ప్రవేశాలల్లో వెబ్ ఆప్షన్ల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. జేఎన్టీయూకే పరిధిలో సీట్ల ఖరారు పూర్తయ్యింది. తొలుత ఈ నెల 11వ తేదీని ప్రకటించగా, సీట్లు కొలిక్కి రాకపోవడంతో 13వ తేదీకి మార్చారు. రాష్ట్రంలోని వర్సిటీల నుంచి సీట్ల సంఖ్య నివేదికను ఉన్నత విద్యామండలికి అందిస్తేనే.. అక్కడి నుంచి కౌన్సెలింగ్కు నోటిఫికేషన్ వస్తుంది. రాష్ట్రంలో అత్యధిక కళాశాలలకు అనుబంధంతో పాటు సాంకేతిక వర్సిటీలో కీలకంగా ఉన్న జేఎన్టీయూకే ఈ ప్రక్రియను పూర్తి చేసింది. వర్సిటీకి గతంలో పాత ఉమ్మడి జిల్లాలు 8 ఉండగా ఈ ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలు తూర్పు, పశ్చిమ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల కళాశాలలు అనుబంధంగా ఉన్నాయి. బీటెక్లో 62 వేల సీట్ల భర్తీకి అనుమతి 2024–25 విద్యాసంవత్సరానికి కాకినాడ వర్సిటీ పరిధిలో అనుబంధంగా ఉన్న 106 కళాశాలల్లో 62 వేల ఇంజినీరింగ్ సీట్లు భర్తీ చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. వీటితో పాటు ఈ ఏడాది కొత్తగా కృష్ణా జిల్లా ఏఎన్ఆర్, ప్రకాశం జిల్లాలో శ్రీహర్షిత కళాశాలకు గుర్తింపు లభించింది. బీటెక్ విభాగంలో గత ఏడాది దాదాపు 30 కళాశాలల వరకూ డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్ కోర్సు కోసం 4 వేల సీట్లకు అనుబంధ కళాశాలలు దరఖాస్తు చేసుకోగా అక్కడి సౌకర్యాలు బట్టి వాటికి అనుమతి ఇచ్చారు. కొత్త కోర్సులైన ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్లో వీఎల్ఎస్ఐ డిజైన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్లో అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కోర్సులకు వెయ్యి సీట్లకు పైగా అనుమతి లభించింది. జేఈఈ అడ్వాన్స్డ్ మెయిన్స్లో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఐఐటీ, ఎన్ఐటీలలో సీటు సాధించలేకపోయిన విద్యార్థులు ఏపీ ఈఏపీ సెట్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు. వీరు ప్రైవేట్ వర్సిటీలతో పాటు ఏ గ్రేడ్ ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్ఈ బ్రాంచ్లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆన్లైన్లో కళాశాలల తనిఖీ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆదేశాల మేరకు అనుబంధ కళాశాలల తనిఖీలను ఆన్లైన్లో చేపట్టారు. మౌలిక సదుపాయాల పర్యవేక్షణ, కళాశాల స్థితిగతులు, వసతులు, విద్యార్థి అధ్యాపక నిష్పత్తి, క్యాంపస్ కళాశాల పరిస్థితి, క్రీడా మైదానం, గ్రంథాలయ సదుపాయం, ల్యాబ్ తదితర అంశాలను పరిశీలన చేస్తారు. ఏటా ఇంజినీరింగ్ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే ముందు నిజనిర్థారణ కమిటీ ఈ పర్యవేక్షణ చేయిస్తుంది. కమిటీ సిఫారసు మేరకు ఏయే కళాశాలలకు ఎన్ని సీట్లు కేటాయించాలి అనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. మరో వైపు ఏఐసీటీఈ నుంచి అనుమతి తెచ్చుకున్న ఇంజినీరింగ్ సీట్లలో ఎన్ని సీట్లకు యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు ఇస్తుందనే అంశానికి నిజనిర్థారణ కమిటీ సిఫారసులే కీలకం. ఈ కమిటీలో వర్సిటీ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు సభ్యులుగా ఉంటారు. -
బంగారం, నగదు చోరీ
తుని: పట్టణంలోని తామాకులవారి వీధిలో గల ఇంటిలో బంగారం, నగదును చోరీ చేశారు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనపై బాధితుడు నక్కా లోకేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. లోకేష్, కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం పెద్దాపురం మరిడమ్మ తల్లిని దర్శించుకుని రాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చారు. కింది పోర్షన్లోకి వెళ్లి మంచినీరు తాగి తాళాలు వేశారు. అనంతరం మేడపైకి వెళ్లి అందరూ నిద్రపోయారు. సోమవారం ఉదయం 6 గంటలకు నిద్ర లేచి కిందికి రాగా తలుపులు తెరచి, తాళాలు పగలుకొట్టి ఉన్నాయి. లోపలకు వెళ్లి గమనించగా, బీరువాలోని 100 గ్రాముల బంగారం, రూ.4 వేలు మాయమయ్యాయి. దీంతో బాధితుడు తుని పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పట్టణ విజయ్బాబు సంఘటన స్థలాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. కాకినాడ నుంచి క్లూస్ టీం చోరీ జరిగిన గదిని పరిశీలించి, వేలిముద్రలను సేకరించింది. -
ఉపాధ్యాయులకు పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఉపాధ్యాయులకు పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని పీఆర్టీయూ నాయకులు డిమాండ్ చేశారు. కాకినాడలో ఆదివారం నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చింతా ప్రదీప్ కుమార్, బండి నూకరాజు మాట్లాడారు. ఏడాది నుంచి పెండింగ్లో ఉన్న 3 డీఏలు తక్షణం మంజూరు చేయాలని, 2023 జూలై నుంచి 12వ పీఆర్సీ అమలు చేయాలని, పీఆర్సీని నియమించి, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీహెచ్ శ్రీనివాస్, కన్వీనర్ వాకాడ వెంకట రమణ, కృష్ణకుమార్, మనోహర్, మంగారావు త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. విద్యా ప్రమాణాలకు పాతర బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఉపాధ్యాయులపై పని భారం పెంచి, విద్యా ప్రమాణాలకు కూటమి ప్రభుత్వం పాతర వేస్తోందని మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి విమర్శించారు. కాకినాడలో ఆదివారం నిర్వహించిన ఎస్టీయూ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులను బోధనకు దూరం చేసి విద్యా రంగానికి తీరని నష్టం చేస్తున్నారని, తరగతి గదిలో ప్రశాంతంగా పాఠం చెప్పే పరిస్థితి నేడు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే గిన్నిస్ బుక్ రికార్డుల కోసం యోగాంధ్ర, మెగా పీటీఎం వంటి కార్యక్రమాలు నిర్వహించి ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ పథకాల ఆన్లైన్ ఉపాధ్యాయులే చేయాలన్నది ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు. మొబైల్ ఫ్రీ క్లాస్ రూం విధానాన్ని అమలులోకి తేవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి, జిల్లా అధ్యక్షుడు కాశీ విశ్వనాథ్ పాల్గొన్నారు. ఏలేరు ఆయకట్టుకు నీరు విడుదల ఏలేశ్వరం: ఖరీఫ్ సాగుకు ఏలేరు రిజర్వాయర్ నుంచి ఆదివారం 1,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు జలాశయంలో నీటి నిల్వలు స్వల్పంగా పెరిగాయి. ఎగువ నుంచి 1,357 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 86.56 మీటర్లు కాగా 77.47 మీటర్లుగా నమోదైంది. పూర్తి స్థాయి సామర్థ్యం 24.11 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 10.68 టీఎంసీల మేర నీటి నిల్వలున్నాయి. విశాఖకు 150, తిమ్మరాజు చెరువుకు 50 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. దారులన్నీ తలుపులమ్మ సన్నిధానానికే.. తుని రూరల్: భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి తలుపులమ్మ తల్లిని దర్శించేందుకు వచ్చిన భక్తులతో దారులన్నీ కిక్కిరిసిపోయాయి. ఆషాఢ మాసం మూడో ఆదివారం.. అమ్మవారిని విశేషంగా ఆరు టన్నుల కూరగాయలతో శాకంబరిగా అలంకరించడంతో భక్తులు తండోపతండాలుగా లోవ దేవస్థానానికి తరలివచ్చారు. తీవ్రమైన రద్దీతో 16వ నంబరు జాతీయ రహదారి నుంచి లోవ ఆర్చి గేటు వరకూ పలుమార్లు ట్రాఫిక్ స్తంభించిపోయింది. సాయంత్రం ఆరు గంటలకు కూడా భక్తులు ప్రత్యేక వాహనాల్లో రావడంతో తిరుగు ప్రయాణంలో ఉన్న భక్తులకు ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. పోలీసులు ఎన్ని ఏర్పాట్లు చేసినా మందుబాబుల ఆగడాలు.. వాహనాలు నిలిపివేయడంతో గంటల తరబడి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. క్యూ లైన్లన్నీ కిక్కిరిసిపోవడంతో కొంతమంది భక్తులు బాలాలయంలోనే అమ్మవారిని దర్శించి, కనిపించిన ప్రతి చెట్టుకూ ఉపారాలు సమర్పించారు. లక్ష మంది వరకూ భక్తులు రాగా క్యూలైన్ల ద్వారా ఉదయం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు అమ్మవారిని 50 వేల మంది దర్శించుకున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.5,51,700, పూజా టికెట్లకు రూ.6,92,720, కేశఖండన శాలకు రూ.62,500, వాహన పూజలకు రూ.3,340, వసతి గదుల అద్దెలు రూ.1,09,892, విరాళాలు రూ.2,83,244 కలిపి మొత్తం రూ.17,03,396 ఆదాయం లభించిందని వివరించారు. భక్తులకు తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించామన్నారు. రూరల్ సీఐ జి.చెన్నకేశవరావు, ఎస్సై కృష్ణమాచారి ఆధ్వర్యాన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎస్సైలు, ఏఎస్సైలు, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. 13టియుఎన్105 : లోవ క్యూలైన్లలో కిక్కిరిసిన భక్తులు -
ఫ శాకంబరీ.. కారుణ్యమూర్తీ..
భక్తవరదాయినిగా ఖ్యాతికెక్కిన తలుపులమ్మ అమ్మవారిని.. ఆషాఢ మాసం మూడో ఆదివారాన్ని పురస్కరించుకుని శాకంబరి దేవిగా అలంకరించారు. దీనికోసం అమలాపురానికి చెందిన అర్లపల్లి శివ, ఏలూరి అయ్యప్ప ఆరు టన్నుల కూరగాయలు వితరణ చేశారని లోవ దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. గర్భాలయంలో స్వయంభువుగా వెలసిన అమ్మవారిని, పంచలోహ విగ్రహాలను కూరగాయలతో అలంకరించి, జీడిపప్పుతో కిరీటం అమర్చామని చెప్పారు. శాకంబరి అలంకరణలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు తన్మయులయ్యారు. – తుని రూరల్ -
మరిడమ్మా.. కరుణించమ్మా..
పెద్దాపురం: ఆషాఢ మాస జాతర మహోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం మరిడమ్మ తల్లిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. ఆలయం వద్ద భారీ క్యూలలో బారులు తీరి అమ్మవారిని దర్శించుకున్నారు. ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. సుమారు లక్ష మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని అధికారులు అంచనా వేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలూ కలగకుండా ఆలయ ట్రస్టీ చింతపల్లి శ్రీహర్ష, అసిస్టెంట్ కమిషనర్ కె.విజయలక్ష్మి ఆధ్వర్యాన సిబ్బంది ఏర్పాట్లు చేశారు. డీఎస్పీ శ్రీహరిరాజు ఆదేశాల మేరకు సీఐ విజయ్ శంకర్ పర్యవేక్షణలో ఎస్సై మౌనిక ఆధ్వర్యాన పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పెద్దాపురం బ్రాహ్మణ సేవా సంఘం, సామర్లకోట లయన్స్ క్లబ్ ఆధ్వర్యాన భక్తులకు పులిహోర పంపిణీ చేశారు. చాచా విద్యా నికేతన్ ఆధ్వర్యాన అన్నదానం నిర్వహించారు. -
రత్నగిరికి భక్తుల తాకిడి
ఫ సత్యదేవుని దర్శించిన 25 వేల మంది ఫదేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. స్వామివారిని సుమారు 25 వేల మంది దర్శించి, పూజలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు కావడంతో ఉదయం నుంచే వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలు భక్తులతో నిండిపోయాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేశారు. రావిచెట్టు వద్ద జ్యోతు లు వెలిగించి, పూజలు చేశారు. స్వామివారి వ్రతాలు రెండు వేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 5 వేల మంది భక్తులకు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. ఘనంగా రథ సేవ రత్నగిరిపై సత్యదేవుని రథసేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం పది గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను పండితులు ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువచ్చి రథం మీద వేంచేయించారు. అర్చకులు దత్తాత్రేయశర్మ, గణేష్ తదితరులు స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. కొబ్బరికాయ కొట్టి ప్రాకారసేవ ప్రారంభించారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో సేవ నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు నీరాజనం ఇచ్చి, భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఉత్సవమూర్తులను తిరిగి ప్రధానాలయానికి చేర్చారు. 1.10 లక్షల ప్రసాదం ప్యాకెట్ల విక్రయం ఆషాఢ మాసం మూడో ఆదివారం కావడంతో సత్యదేవుని గోధుమ నూక ప్రసాదం ప్యాకెట్ల విక్రయాలు రికార్డు స్థాయిలో జరిగాయి. ఈ ఒక్క రోజే 1.10 లక్షల ప్రసాదం ప్యాకెట్లు విక్రయించారు. సత్యదేవుని ఆలయానికి వచ్చిన భక్తులకు రత్నగిరిపై సుమారు 30 వేల ప్రసాదం ప్యాకెట్లు విక్రయించారు. మిగిలిన 80 వేల ప్యాకెట్లను లోవ దేవస్థానంలో తలుపులమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్లిన భక్తులు తిరుగు ప్రయాణంలో కొనుగోలు చేశారని దేవస్థానం అధికారులు తెలిపారు. 150 గ్రాముల ప్రసాదం ప్యాకెట్ రూ.20 చొప్పున లక్ష ప్యాకెట్లకు గాను దేవస్థానానికి రూ.20 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. లోవ దేవస్థానానికి వెళ్లిన భక్తులు తిరుగు ప్రయాణంలో సత్యదేవుని ప్రసాదం కొనుగోలు చేసేందుకు పోటీ పడ్డారు. దీంతో, కొండ దిగువన తొలి పావంచా వద్ద, పాత, కొత్త నమూనా ఆలయాల వద్ద రద్దీ నెలకొంది. తొలి పావంచా వద్ద, జాతీయ రహదారిపై సత్యదేవుని పాత నమూనా ఆలయం వద్ద చెరో 30 వేలు.. కొత్త నమూనా ఆలయం వద్ద 10 వేల చొప్పున ప్రసాదం ప్యాకెట్లు విక్రయానికి ఉంచారు. రాత్రి ఏడు గంటల సమయానికే ఈ ప్యాకెట్లన్నీ అమ్ముడయ్యాయి. దీంతో మరో 10 వేల ప్యాకెట్లు తయారు చేయించి, కౌంటర్లలో ఉంచినట్లు అధికారులు తెలిపారు. -
పవన్.. కాకినాడ సెజ్ను మరిచారా?
ఫ పరిశ్రమలు పెట్టండి ఫ లేదా ఆ భూమిని పేదలకివ్వండి ఫ సీపీఐ నేత తాటిపాక మధు కాకినాడ సిటీ: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ సెజ్పై ఇచ్చిన హామీలు మరిచారా అని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాక మధు ప్రశ్నించారు. ఇచ్చిన హామీ ప్రకారం కాకినాడ సెజ్ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, లేదంటే ఆ భూములను పేదలకివ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక పొన్నమండ రామచంద్రరావు భవన్లో ఆదివారం జరిగిన సీపీఐ కాకినాడ నగర 23వ మహాసభలో ఆయన పాల్గొన్నారు. ముందుగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, సీనియర్ నాయకుడు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పొన్నమండ రామచంద్రరావు చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం మధు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెజ్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయని అంతా ఎదురు చూస్తున్నారన్నారు. కానీ, ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదని అన్నారు. సెజ్ ఏర్పాటు చేసి 19 ఏళ్లు గడుస్తున్నా పరిశ్రమలు రాకపోగా ఆ భూములన్నీ ఖాళీగానే ఉన్నాయన్నారు. పట్టుమని పదెకరాల్లో కూడా కార్యకలాపాలు కనిపించడం లేదన్నారు. చైనాకు చెందిన పల్స్ప్లష్ అనే సంస్థ బొమ్మల తయారీ యూనిట్ నడుపుతోందన్నారు. మరో మూడు ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లు మాత్రమే ఉన్నాయని చెప్పారు. కొందరు మహిళలకు మాత్రమే వీటిలో ఉపాధి లభిస్తోందన్నారు. కాకినాడ పెట్రో కారిడార్ పేరిట పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా హామీలు కురిపించడం తప్ప పనులు జరిగిన దాఖలాలు లేవని విమర్శించారు. రైతుల నుంచి భూములు తీసుకున్న ఉద్దేశం నెరవేరలేదన్నారు. సెజ్ రైతుల సమస్యల పరిష్కారానికి గత ఏడాది నవంబర్ 4న పిఠాపురం పర్యటన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కాకినాడ సెజ్లో పరిశ్రమలు తెచ్చేందుకు చర్యలు తీసుకోనున్నట్లు గత ఏడాది జూలై 3న జరిగిన బహిరంగ సభలో సైతం హామీ ఇచ్చారని చెప్పారు. ఇక్కడి ప్రజలు గెలిపించిన తరువాత పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు పిఠాపురం పట్టణంలోని ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో జరిగిన బహిరంగ సభలో సైతం పవన్ కల్యాణ్ సెజ్ గురించి ప్రస్తావించారని అన్నారు. కానీ, ఏళ్లు గడుస్తున్నా సెజ్లో పరిశ్రమల జాడ కనిపించడం లేదని, పరిశ్రమలు వస్తే పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎదురు చూస్తున్న యువత ఆశలపై పాలకులు నీళ్లు జల్లుతున్నారని విమర్శించారు. స్మార్ట్ కరెంటు మీటర్ల బిగింపును వ్యతిరేకించాలని, బిల్లులు పెంచేందుకే వీటిని బిగించేందుకు సిద్ధమవుతున్నారని, వీటి రద్దుకు ఊరంతా ఏకమవ్వాలని, స్మార్ట్ మీటర్లు బద్దలుగొట్టాలని మధు పిలుపునిచ్చారు. పప్పు ఆదినారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో సీపీఐ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, నగర కార్యదర్శి టి.అన్నవరం, మహిళా సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.భవాని తదితరులు కూడా ప్రసంగించారు. -
బాక్స్ బద్దలవుతుందనే భయంతో..
ఫ బాక్స్ టెండర్లు నిలిపివేసిన అధికారులు ఫ ఆన్లైన్ టెండర్లకు ఆమోదం పిఠాపురం: ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై న పాలకవర్గాన్ని పక్కన పెట్టి, అధికారం ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టు చేయాలనుకున్న కూటమి నేతల ప్రయత్నాలు బెడిసికొట్టాయి. తమ నేత మంజూరు చేసిన నిధులతో తామే పనులు చేయాలంటూ పట్టుబట్టి.. అధికారులపై ఒత్తిడి తెచ్చి.. ఆయా కాంట్రాక్టులు తమకే దక్కేలా చేసుకునేందుకు వారు చేసిన కుంతంత్రాలు చెల్లలేదు. వారి ఒత్తిడికి తలొగ్గి, పాలకవర్గాన్ని కాదని కొందరు అధికారులు చేసిన ప్రయత్నాలను కింది స్థాయి అధికారులు సైతం ఒప్పుకోలేదు. దీంతో, దిగివచ్చిన అధికారులు చివరకు నిబంధనల ప్రకారం పనులు చేయించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిఠాపురం మున్సిపాలిటీ అభివృద్ధికి కొన్నాళ్ల కిందట రూ.3 కోట్లు విడుదల చేశారు. తమకు కలసి వచ్చేందుకు వీలుగా ఈ పనులకు ఆన్లైన్లో కాకుండా బాక్స్ టెండర్లు పిలవాలని జనసేన నేతలు అధికారులపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. ఆ మేరకు అధికారులు బాక్స్ టెండర్లకు రంగం సిద్ధం చేశారు. దీనిని మున్సిపల్ పాలకవర్గం వ్యతిరేకించింది. అయినప్పటికీ లెక్క చేయకుండా మున్సిపల్ అధికారులు బాక్స్ టెండర్లకే మొగ్గు చూపారు. దీనిపై ఆమోదిస్తే బాక్స్ బద్దలే.. శీర్షికన గత నెల 28న సాక్షి కథనం ప్రచురించింది. దీంతో, దిగి వచ్చిన అధికారులు ఎట్టకేలకు బాక్స్ టెండర్లను నిలిపివేసి, ఆన్లైన్ టెండర్లకు ప్రకటన విడుదల చేశారు. అయినప్పటికీ గత పది రోజులుగా ఏదో ఒక విధంగా బాక్స్ టెండర్లు వేసేలా చూడాలని జనసేన నేతలు అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దీనికి ఒక జిల్లా ఉన్నతాధికారి కూడా మద్దతు పలకడంతో మున్సిపల్ అధికారులు బాక్సు టెండర్లకు ఏర్పాట్లు చేశారు. ఈవిధంగా నిబంధనలకు వ్యతిరేకంగా బాక్స్ టెండర్లు పిలిస్తే తాము బలైపోతామని మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగపు అధికారులు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనికి ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఒప్పుకోబోమని వారు స్పష్టం చేశారు. దీనికితోడు కోర్టును ఆశ్రయించేందుకు పాలకవర్గం సిద్ధమైంది. చివరకు గత్యంతరం లేని పరిస్థితుల్లో మున్సిపల్ అధికారులు ఆన్లైన్ టెండర్లు పిలుస్తూ శనివారం ప్రకటన జారీ చేశారు. ఆదివారం సాయంత్రం నుంచి టెండర్లు స్వీకరణకు ఏర్పాట్లు చేశారు. -
● ‘తడుపు’.. మోపెడు !
పూర్వం మెట్ట రైతులు నానా ప్రయాసలూ పడి.. కావిళ్లతో నీరు మోసుకుని తెచ్చి, పొలాల్లోని మొక్కలకు నీరందించేవారు. కొన్నేళ్లుగా అన్ని సౌకర్యాలూ అందుబాటులోకి వచ్చాక ఇటువంటి పరిస్థితి ఇటీవల ఏ రైతుకూ రాలేదు. కానీ ఈ ఏడాది సాగు నీరందించడంలో ప్రభుత్వం విఫలమైంది. దీంతో, రైతులు బకెట్లతో నీటిని తెచ్చుకుని మొక్కలకు పోసుకోవాల్సిన దుస్థితి ఎదురైంది. కనీసం పంట కాలువల్లో కూడా నీరు లేకపోవడంతో.. రైతులు అక్కడక్కడ ఉన్న బోర్ల నుంచి నీళ్లు మోసుకుని తెచ్చుకుని, ఎండిపోతున్న పంటను కాపాడుకోడానికి ఇలా యాతనలూ పడుతున్నారు. – పిఠాపురం -
ప్రసూతి సేవలకు ఏఐ అనుసంధానంతో అద్భుతాలు
కాకినాడ క్రైం: ప్రసూతి సేవలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అనుసంధానం చేయడం ద్వారా అద్భుతాలు ఆవిష్కృతమవుతాయని రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడు (డీఎంఈ) డాక్టర్ డీఎస్వీఎల్ నరసింహం అన్నారు. తద్వారా మహిళకు అత్యంత నాణ్యమైన వైద్య సేవలు అందుతాయన్నారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల (ఆర్ఎంసీ) ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్ చాప్టర్ ఆఫ్ ఆబ్స్ట్రిక్స్ అండ్ గైనకాలజీ (ఏపీసీఓజీ) ఆధ్వర్యాన ఆంధ్రప్రదేశ్ ఆబ్స్ట్రిక్స్ అండ్ గైనకాజికల్ సొసైటీ పదో వార్షిక సదస్సు శనివారం జరిగింది. కాకినాడ ఆబ్స్ట్రిక్స్ అండ్ గైనకాజికల్ సొసైటీ ఆర్గనైజింగ్ చైర్పర్సన్ డాక్టర్ వై.అనురాగమయి, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ గీతాశ్రీ, ట్రెజరర్ డాక్టర్ లక్ష్మీకిరణ్ సంయుక్త పర్యవేక్షణలో ఈ సదస్సు నిర్వహించారు. 72 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి 1,200 మంది ప్రసూతి వైద్య నిపుణులు ఈ సదస్సుకు హాజరయ్యారు. పలు రాష్ట్రాలకు చెందిన నిపుణులు గైనకాలజీలో అందుబాటులోకి వచ్చిన అధునాతన వైద్య సేవలు, ఏఐ అనుసంధానం, నూతన వైద్య ప్రక్రియలు, ఔషధాల పని తీరు, వివిధ ఆరోగ్య స్థితులల్లో ప్రసవ ప్రక్రియలను వివరించారు. అంతకు ముందు వర్క్షాప్ చైర్మన్ డాక్టర్ కొండమూరి సత్యనారాయణ ఆధ్వర్యాన నిర్వహించిన వర్క్షాప్లలో 20 వరకూ శస్త్రచికిత్సలు చేశారు. సదస్సు నిర్వహణలో డాక్టర్ సూర్యకుమారి, డాక్టర్ శ్రీధర్ కీలకంగా వ్యవహరించారు. ఆర్ఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ విష్ణువర్ధన్ మాట్లాడుతూ, రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఈ సదస్సు శనివారం ప్రారంభమైందని తెలిపారు. నూతన ప్రసూతి వైద్య నిపుణులకు ఈ సదస్సు ఓ వరమన్నారు. సదస్సులో ప్రముఖ ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఏఎల్ సత్యవతి, పాడేరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హేమలతాదేవి, మాజీ ఐఏఎస్ బాబూరావు నాయుడు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి తదితరులు పాల్గొన్నారు. వక్తలుగా డాక్టర్ సంకేత్ పిసాట్, డాక్టర్ వినీత్ మిశ్రా, డాక్టర్ రామకృష్ణ హనుమాన్ వ్యవహరించారు. -
భారీ నష్టం వచ్చేలా ఉంది
రాత్రికి బాగున్న పంట ఉదయానికి నాశనమైపోతోంది. ఈ జలగ పురుగులను మేము ఎప్పుడూ చూడలేదు. మొదట్లో ఒకటి రెండు కనిపించగా ఉన్నట్టుండి వందల సంఖ్యలో కనిపిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం మాత్రమే ఆకులపై ప్రత్యక్షమవుతున్నాయి. రాత్రికి బాగున్న ఆకులు ఉదయానికి లేకుండా పోతున్నాయి. ఇలా పంట పూర్తిగా దెబ్బ తింటోంది. ఈ పురుగులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు. వీటిని ఎలా నివారించాలో కూడా తెలియడం లేదు. వీటి వల్ల నేను వేసిన మిరప పంట చాలా వరకూ దెబ్బ తింది. పెట్టుబడి కూడా వచ్చే అవకాశం కనిపించడం లేదు. భారీ నష్టం వచ్చే అవకాశం కనిపిస్తోంది. కొన్ని పురుగు మందులు కొట్టినా అవి పోవడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. – ఓరుగంటి వెంకట సత్యనారాయణ,మిరప రైతు, చేబ్రోలు తామర పురుగు పోయి జలగలు వచ్చాయి ఎక్కడో చెరువుల్లోనో కాలువల్లోనో చూసే జలగలు ఇప్పుడు పంటలపై దాడి చేస్తున్నాయి. ఇప్పటి వరకూ తామర పురుగుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇప్పుడు కొత్తగా జలగలు వచ్చి పడ్డాయి. అప్పటి వరకూ అవి ఎక్కడుంటున్నాయో కూడా తెలియడం లేదు. ఉదయం, సాయంత్రం కాగానే మొక్కలపై, ఆకులపై కనిపిస్తున్నాయి. ఒక్క రోజులోనే వందల సంఖ్యలో కనిపిస్తున్నాయి. ఏ మొక్కపై చూసినా ఇవే. ఆకుల్లోని రసాన్ని నిమిషాల్లో పీల్చేస్తున్నాయి. దీంతో సత్తువ కోల్పోయి మొక్కలు చనిపోతున్నాయి. పురుగు మందులు వాడినా ఫలితం లేదు. వీటి దాడితో మా పత్తి పంట తొలి దశలోనే నాశనమవుతోంది. – ఓరుగంటి శేఖర్, పత్తి రైతు, చేబ్రోలు చర్యలు తీసుకుంటాం ఈ జలగలు ఎక్కువగా పగలు దాక్కుని, రాత్రుళ్లు బయటకు వచ్చి, మొక్కలపై పాకుతూ, కాండం, ఆకులు తినేస్తాయి. దీంతో, మొక్క నాశనమవుతుంది. ఇవి ఎక్కువగా తేమగా ఉండే మట్టిలో కనిపిస్తాయి. నర్సరీల నుంచి తెచ్చిన మొక్కల్లో ఎక్కువగా ఉంటాయి. ప్రకాశం జిల్లా వంటి ప్రాంతాల్లో ఈ మెట్ట జలగలను గుర్తించారు. ఇవి మన ప్రాంతంలో కనిపించడం ఇదే మొదటిసారి. ఇది కొంత ఆందోళనకరమైన విషయమే. ఇవి వ్యాపించిన పంటలను పరిశీలించి, శాస్త్రవేత్తల సలహాలు తీసుకుని, నివారణ చర్యలు తీసుకుంటాం. – వై.సోమరాజశేఖర్, ఉద్యాన శాఖాధికారి, పిఠాపురం కొత్తగా కనిపిస్తున్నాయి మెట్ట జలగల వల్ల అపారనష్టం వస్తుంది. వీటి నివారణకు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ ప్రాంతంలో ఎక్కడా ఎప్పుడూ లేవు. వీటి ఉనికి కొత్తగా కనిపిస్తోంది. వీటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై శాస్త్రవేత్తలను సంప్రదిస్తాం. తోటలను పరిశీలించి, ఏ మేరకు వ్యాపించాయి, ఎంత నష్టం కలిగిస్తున్నాయనే విషయాలు తెలుసుకుని, తగు చర్యలు తీసుకుంటాం. – వీవీ సత్యనారాయణ, వ్యవసాయశాఖాధికారి, గొల్లప్రోలు ● వాణిజ్య పంటలపై మెట్ట జలగల దాడి ● పత్తి, మిర్చి పంటలకు అపార నష్టం ● రైతుల ఆందోళన పిఠాపురం: పంటలకు పురుగులు, తెగుళ్ల బెడద సర్వసాధారణం. మిడతల దండు దాడి చేసిన అరుదైన సందర్భాలూ ఉన్నాయి. కానీ, కనీవినీ ఎరుగని రీతిలో పంటలను నమిలి మింగేస్తున్న మెట్ట జలగల (డిరోసిరాస్ రెటికల్టమ్) గురించి మీరెప్పుడైనా విన్నారా! ఈ జలగలు ఇప్పుడు గొల్లప్రోలు మండలంలో స్వైర విహారం చేస్తున్నాయి. జలగ అంటే నీటిలో ఉండే జీవిగా మాత్రమే అందరికీ తెలుసు. కానీ ఈ మెట్ట జలగలు పంటలపై సంచరిస్తూ వాటికి పెను ప్రమాదంగా మారాయి. ఈ జలగలను చూస్తే ఒళ్లంతా జలదరిస్తుంది. ఇవి మెల్లగా పాకుతూ వెళ్లిన మార్గం తళతళా మెరుస్తూ ఉంటుంది. ఈ జలగలు పంటలపై దాడి చేస్తూండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నివారణకు ఎన్ని పురుగు మందులు వాడినా ఫలితం ఉండటం లేదని గగ్గోలు పెడుతున్నారు. వేలాదిగా దాడి చేస్తున్న జలగలు రాత్రికి రాత్రే పంటను నాశనం చేసేస్తున్నాయి. దీంతో రైతుకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలం వాణిజ్య పంటలకు పెట్టింది పేరు. ఇక్కడ టమాటా, బెండ, మిరప, బీర, కాకర తదితర పంటలతో పాటు పత్తి కూడా రైతులు సాగు చేస్తూంటారు. ఇటీవల ఈ పంటలను మెట్ట జలగలు పీల్చి పిప్పి చేస్తున్నాయి. మొక్కల కాండంపై పాకుతూ, ఆకులు కాండం తినేస్తున్నాయి. దీంతో, మొక్కలు చనిపోతున్నాయి. సాధారణంగా భూమిలోనే ఉంటూ కనిపించకుండా పోతున్న ఈ జలగలు ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రం ఒక్కసారిగా మొక్కలపై ప్రత్యక్షమై, పంటలను నాశనం చేస్తున్నాయి. గొల్లప్రోలు మండలం చేబ్రోలు, చెందుర్తి తదితర ప్రాంతాల్లో మిరప, పత్తి పంటలపై ఈ జగలగలు దాడి చేస్తున్నాయి. ఈ గ్రామాల్లోని రైతులు సుమారు 950 ఎకరాల్లో పత్తి, 60 ఎకరాల్లో మిరప పంటలు సాగు చేశారు. సుమారు 300 ఎకరాల్లో పత్తి, మిరప పంటలపై ఈ జలగలు వ్యాపించి, మొక్క దశలోనే పంటను నాశనం చేస్తున్నాయి. పంటలు తొలి దశలోనే పాడైపోతూండటం చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకుని పంటలను రక్షించాలని కోరుతున్నారు. పంటను తినేస్తున్న మెట్ట జలగలుజలగల దాడితో మొక్క దశలోనే దెబ్బ తిన్న పత్తి మొక్క పంట పొలాల్లో మెట్ట జలగల గుడ్లు మెట్ట జలగలు -
తొలి తిరుపతికి పోటెత్తిన భక్తులు
పెద్దాపురం: మండలంలోని తొలి తిరుపతి గ్రామంలో వెలసిన స్వయంభూ శృంగార వల్లభస్వామి ఆలయానికి శనివారం భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు సుమారు 25 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు. ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు విశేషంగా అలంకరించారు. వివిధ సేవల టికెట్లు, అన్నదానం, కేశఖండన ద్వారా దేవస్థానానికి రూ.3,73,904 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఐదు వేల మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం ఏర్పాటు చేశామన్నారు. శాకంబరిగా నేడు తలుపులమ్మ దర్శనం తుని రూరల్: ఆషాఢ మాసం మూడో ఆదివారం కావడంతో తలుపులమ్మ అమ్మవారు నేడు శాకంబరీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో విశేషంగా అలంకరించి, భక్తులకు దర్శనం కల్పించనున్నట్టు డిప్యూటీ కమిషనర్, లోవ దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ అమ్మవారి దర్శనాలకు భక్తులను అనుమతిస్తామని పేర్కొన్నారు. లోవ భక్తులకు సత్యదేవుని ప్రసాదం సిద్ధం అన్నవరం: ఆషాఢ మాసం మూడో ఆదివారం తలుపులమ్మ అమ్మవారి దర్శనానికి లోవ వెళ్లి వచ్చే భక్తులకు సత్యదేవున్ని గోధుమ నూక ప్రసాదం సిద్ధమవుతోంది. వారికి విక్రయించేందుకు లక్షకు పైగా సత్యదేవుని ప్రసాదం ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నారు. గత ఆదివారం కొండ దిగువన, జాతీయ రహదారిపై ఉన్న నమూనా ఆలయాల వద్ద లోవ భక్తులు సత్యదేవుని ప్రసాదం ప్యాకెట్లు సుమారు 60 వేలు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆదివారం అంతకన్నా ఎక్కువగా కొనుగోలు చేస్తారనే అంచనాతో అన్నవరం దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రత్నగిరిపై సత్యదేవుని దర్శనానికి వచ్చే భక్తుల కోసం సుమారు 60 వేలలు, లోవ భక్తుల కోసం సుమారు లక్ష ప్రసాదం ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రసాదాల విక్రయాల ద్వారా ఆదివారం సుమారు రూ.30 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కిక్కిరిసిన రత్నగిరిఅన్నవరం: రత్నగిరి వాసుడు సత్యదేవుని ఆలయానికి శనివారం భక్తులు వేలాదిగా పోటెత్తారు. రెండో శనివారం, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు కావడంతో ఉదయం నుంచే స్వామివారి సన్నిధికి భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో, ఆలయ ప్రాంగణం, వ్రత మండపాలు, క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సత్యదేవుని వ్రతాలు రెండు వేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. ఆలయ ప్రాకారంలో ఉదయం సత్యదేవుడు, అమ్మవారిని తిరుచ్చి వాహనంపై ఘనంగా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సత్యదేవుని ఆలయానికి ఆదివారం కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఉదయం 10 గంటల నుంచి ఆలయ ప్రాకారంలో సత్యదేవుడు, అమ్మవారిని టేకు రథంపై ఊరేగిస్తారు. రేపు పీజీఆర్ఎస్ కార్యక్రమం కాకినాడ సిటీ: జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమం కలెక్టరేట్ గ్రీవెన్స్ హాలులో సోమవారం ఉదయం 10 నుంచి ఒంటిగంట వరకూ యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ షణ్మోహన్ సగిలి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులదరూ విధిగా హాజరు కావాలని ఆదేశించారు. మండల స్థాయిలో జరిగే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి ఆయా మండలాల అధికారులందరూ విధిగా ఉదయం 9.30 గంటలకే హాజరు కావాలని సూచించారు. -
శనైశ్చరునికి ప్రత్యేక పూజలు
కొత్తపేట: మండల పరిధిలోని మందపల్లిలో శనిదోష నివారణకు ప్రసిద్ధి చెందిన ఉమా మందేశ్వర (శనైశ్చర) స్వామిని శనివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించి ప్రత్యేక పూజలు, తైలాభిషేకాలు నిర్వహించారు. స్వామి వారి ప్రాతఃకాల అర్చన అనంతరం భక్తులు తైలాభిషేకాలు, సర్వదర్శనాలు చేసుకున్నారు. దేవస్థానం ఈఓ దారపురెడ్డి సురేష్బాబు ఆధ్వర్యంలో సిబ్బంది భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించారు. టిక్కెట్లు, వివిధ సేవల ద్వారా రూ.1,73,820 ఆదాయం వచ్చినట్లు ఈఓ సురేష్బాబు తెలిపారు. అలాగే అన్నప్రసాద పథకానికి పలువురు భక్తుల ద్వారా విరాళాల రూపంలో మరో రూ.41,203 రాగా మొత్తం 2,15,023 ఆదాయం వచ్చినట్టు ఆయన తెలిపారు. సిబ్బంది, పలువురు గ్రామస్తులు భక్తులకు అన్నప్రసాద సేవలో పాల్గొన్నారు. తెలంగాణా ఆర్టీసీ ఎండీ/అదనపు డీజీపీ విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్ సతీ సమేతంగా శనైశ్చరుని దర్శించి, ప్రత్యేక పూజలు, తైలాభిషేకాలు జరిపించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం దేవస్థానం అధికారులు వారికి ప్రత్యేక స్వాగతం పలికారు. అనంతరం వేదాశీర్వచనం చేసి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. -
ఇంటింటికీ ‘బాబు’ మోసాలు తీసుకువెళ్లాలి
● హామీల అమలుకు ప్రజల గళమై ప్రశ్నించాలి ● కార్యకర్తలకు వైఎస్సార్ సీపీ నేత బొత్స సత్యనారాయణ పిలుపు ఏలేశ్వరం: చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఇంటింటికీ తీసుకువెళ్లి, ప్రజలను చైతన్యపరచాలని వైఎస్సార్ సీపీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్, శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. కిర్లంపూడిలో శనివారం జరిగిన బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ ప్రత్తిపాడు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ సంయుక్తంగా బాబు ష్యూరిటీ.. భవిష్యత్ గ్యారంటీ పేరిట ప్రమాణ పత్రాలు పంపిణీ చేశారన్నారు. సాధ్యం కాని హామీలిచ్చిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఐదు కోట్ల మంది ప్రజలను మోసం చేశారని చెప్పారు. అధికారం చేపట్టి 13 నెలలవుతున్నా, తూతూమంత్రంగా ఒక్క గ్యాస్ సిలిండర్, అరకొరకగా తల్లికి వందనం మినహా చేసిందేమీ లేదని గుర్తు చేశారు. ప్రభుత్వ మోసాలను ప్రశ్నిస్తున్న తమపై రాజద్రోహం కేసులు పెడతామంటూ బెదిరించడం దారుణమన్నారు. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా తగ్గేదే లేదని, రాష్ట్రాన్ని కాపాడుకోవల్సిన బాధ్యత ప్రతిపక్షంగా తమపై ఉందని అన్నారు. ఇచ్చిన హామీలు చేసేంత వరకూ ప్రజల గొంతుకై ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం మేనిఫెస్టోను భగవద్గత, బైబిల్, ఖురాన్గా భావించిందని, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలను మొదటి సంవత్సరంలోనే అమలు చేశారని బొత్స చెప్పారు. ప్రజలపై రూ.19 వేల కోట్ల భారం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ, బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని గ్రామ స్థాయిల్లో ఇంటింటికీ తీసుకువెళ్లి ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు విద్యుత్ చార్జీలు పెంచి రాష్ట్ర ప్రజలపై రూ.19 వేల కోట్ల భారం మోపారని అన్నారు. మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, చంద్రబాబు, మరో ఆరుగురు కలిసి మోసాల కంపెనీని ప్రారంభించారని, చంద్రబాబు ఎండీగా, లోకేష్ సీఎండీగా, పవన్, మిగతా వాళ్లు సభ్యులుగా కలిసి రాష్ట్ర ప్రజలను మోసం చేశారని విమర్శించారు. పార్టీ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు దాట్ల సూర్యనారాయణరాజు మాట్లాడుతూ, చంద్రబాబు చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు మాట్లాడుతూ, చంద్రబాబు పాలనలో ప్రజలను మోసం చేయడం మినహా చేసిన అభివృద్ధి లేదని అన్నారు. వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ముద్రగడ గిరిబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ మంత్రులు తానేటి వనిత, తోట నరసింహం, మాజీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, పార్టీ పెద్దాపురం కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట రాంజీ, మాజీ ఎమ్మెల్సీ అంగులూరి లక్ష్మీశివకుమారి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సుజాత, పార్టీ నాయకుడు యనమల కృష్ణుడు, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి బెహరా రాజరాజేశ్వరి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి బదిరెడ్డి గోవింద్, వాసిరెడ్డి జమీలు తదితరులు పాల్గొన్నారు. -
గోదావరి పరవళ్లు
● కడలిలోకి 5.29 లక్షల క్యూసెక్కులు ● ఎగువన తగ్గుతున్న వరద ఉధృతి ధవళేశ్వరం: గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి వచ్చి చేరుతున్న నీటితో నది ఉధృతి క్రమేపీ పెరుగుతోంది. దీంతో అప్రమత్తమైన ఇరిగేషన్ అధికారులు మిగులు జలాలను ఎప్పటికప్పుడు సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటిమట్టం శనివారం రాత్రి 10.60 అడుగులకు చేరింది. బ్యారేజీ నుంచి 5,29,209 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. ధవళేశ్వరం వద్ద వరద ఉధృతి ఆదివారం మరింత పెరిగే అవకాశం ఉంది. కాటన్ బ్యారేజీ వద్దకు సుమారు 7 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఎగువ ప్రాంతాల్లో నది ఉధృతి క్రమంగా తగ్గుతోంది. భద్రాచలం వద్ద శనివారం 41.10 అడుగులకు చేరిన నీటిమట్టం క్రమేపీ 40.90 అడుగులకు తగ్గింది. దీంతో, ఆదివారం సాయంత్రం నుంచి ధవళేశ్వరం వద్ద కూడా వరద ఉధృతి తగ్గే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు భావిస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో గోదావరి నీటిమట్టాలు (మీటర్లలో) కాళేశ్వరం 8.77 పేరూరు 13.87 దుమ్ముగూడెం 11.50 కూనవరం 16.14 కుంట 7.30 పోలవరం 10.78 రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి 14.94 రాజమహేంద్రవరం పుష్కరాల రేవు వద్ద గోదావరి ఉధృతి -
అన్నవరప్పాడులో భక్తుల రద్దీ
పెరవలి: వేలాదిగా భక్తులు తరలిరావడంతో అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయంలో రద్దీ ఏర్పడింది. రెండో శనివారం సెలవు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తెల్లవారుజాము నుంచే తరలివచ్చి ఆలయ ప్రాంగణం చుట్టూ బారులు తీరారు. ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. వందలాది మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి అభిషేకం నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. స్వామివారి దర్శనానికి గంట సమయం పట్టింది. స్వామి, అమ్మవార్లను అర్చకులు బీరకాయలతో విశేషంగా అలంకరించారు. సుమారు 7 వేల మంది భక్తులకు అన్నసమారాధన నిర్వహించినట్లు ఆలయ ఈఓ మీసాల రాధాకృష్ణ తెలిపారు. -
సర్కారు వారి బీమా కలాపం!
అప్పులతో సతమతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు అప్పులతో సతమతమవుతున్నారు. ప్రభుత్వం నుంచి ఏ విధమైన ప్రోత్సాహం లేకపోవడంతో రైతులు ప్రయివేటు వ్యాపారస్తులు దగ్గర నుంచి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి సాగు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గత ఏడాది రైతు నేస్తం కింద ఇస్తామన్న రూ. 20 వేలు కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టింది. ప్రస్తుతం రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధమయ్యారు. మే నెలలో రైతు నేస్తం ఇస్తామన్నారు. జూన్ నెల కూడా అయిపోయింది. జులై వచ్చినా ఇంకా రైతు నేస్తం డబ్బు రైతుల ఖాతాల్లో జమ కాలేదు. ప్రస్తుతం రైతులు పెట్టుబడి కోసం అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇటువంటి తరుణంలో బీమా ప్రీమియం కూడా తాము చెల్లించాలని చెప్పడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ప్రీమియం డబ్బు కోసం ఎక్కడ అప్పు చేయాలో అర్థం కాక అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబునాయుడు మాటలు నమ్మి తాము మోసపోయామని గత రబీలో ధాన్యం డబ్బు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూనే తమ పైనే అదనపు భారం మోపడం న్యాయం కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.● కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉచిత పంటల బీమాకు మంగళం ● రైతులపై ప్రీమియం భారం రూ.16 కోట్లు ● ఎకరాకు రూ.760 చొప్పున చెల్లించాలి ● వైఎస్సార్ సీపీ హయాంలో ఐదేళ్లూ ఉచితం ● జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్లో 2.10 లక్షల ఎకరాల్లో వరి సాగు ● ఆందోళన చెందుతున్న అన్నదాతలు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): విత్తు దగ్గర నుంచి కుప్ప నూర్పిడి వరకూ రైతులకు అండగా నిలిచే ఉచిత పంటల బీమా పథకానికి కూటమి ప్రభుత్వం ఎగనామం పెట్టింది. రైతులకు పంట బీమా కావాలంటే ఎకరా వరి పొలానికి రూ.769 రైతులే చెల్లించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది జిల్లాలో 2.10 లక్షల ఎకరాల్లో వరినాట్లు వేస్తున్నారు. ఇప్పటికే చాలామంది రైతులు వరినారు వేసుకొని పంటలు దమ్ము చేసుకొంటున్నారు. ఖరీఫ్ సాగుకు సన్నాహాలు పూర్తి చేసుకున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఉచిత పంటల బీమా పథకం ఊసు తేవడం లేదు. రైతులు సొంతంగా పంట బీమా చేయించుకోవాలని మండల వ్యవసాయశాఖ ఆధికారుల ద్వారా గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. తమకు అన్నీ చేస్తామని చెప్పి తీరా చూస్తే ప్రతీ పథకానికి గండి కొడుతున్నారని రైతులు మండిపడుతున్నారు. తాము అధికారంలోకి వస్తే రైతు నేస్తం పథకం కింద ప్రతీ ఏడాది రూ.20 వేలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి గత సంవత్సరం ఖరీఫ్, రబీలో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి సహాయం చేయకుండా రైతులను మోసం చేసిన కూటమి సర్కార్ ప్రస్తుతం పంట బీమా పథకానికి మోకాలడ్డు వేసింది. దీంతో జిల్లాలో రైతులపై రూ.16 కోట్ల భారం పడనుంది. బీమా భారమంతా రైతులు పైనే.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఉచిత పంట బీమా పథకం అమలు చేసింది. రైతులు ఒక్క రూపాయి కూడా కట్టకుండా పంట బీమా ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లించేది. ప్రతీ ఏడాది కాకినాడ జిల్లాలో రూ.16 కోట్లు పైబడి ప్రభుత్వం చెల్లించేది. వైఎస్సార్ సీపీ ఐదేళ్ల పాలనలో రైతుల నుంచి ప్రీమియం కోసం ఏనాడూ డబ్బు వసూలు చేయలేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాదితోపాటు ఈ ఏడాది కూడా పంటల బీమా పథకం అమలు చేయకుండా రైతులపైనే భారం వేస్తోంది. గ్రామాల్లో ఐదారెకరాలు సాగుచేసే రైతులు సుమారు రూ.4 వేలలో ప్రస్తుతం పంట బీమా చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రీమియం చెల్లించకుంటే దక్కని బీమా రైతులు ప్రీమియం చెల్లించకుంటే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఒక్క రూపాయి కూడా బీమా వర్తించదు. ఖరీఫ్లో వరి సాగు చేసే రైతులకు నవంబర్, డిసెంబర్ నెలలో వచ్చే తుపాన్ల కారణంగా నష్టం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఎకరా వరి పొలానికి రూ.769 ప్రీమియం చెల్లిస్తే ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో ఎకరాకు రూ.6 వేల వరకూ నష్టపరిహారం వచ్చే అవకాశం ఉంటుంది. రైతులు ఎవరైనా ప్రీమియం చెల్లించకుంటే పరిహారం రాదు. గతంలో ప్రభుత్వమే మొత్తం ప్రీమియం చెల్లించడంతో ప్రకృతి వైపరీత్యాలు వస్తే ప్రతీ రైతుకు పంట నష్ట పరిహారం వచ్చేది. ప్రస్తుతం ప్రీమియం చెల్లించేందుకు చాలామంది రైతుల వద్ద డబ్బు లేని పరిస్థితి. రైతులు బ్యాంకుల నుంచి అప్పు తీసుకొంటే ప్రీమియంను మినహాయించి మిగిలిన సొమ్ము ఇస్తారు. దీంతో రుణాలు తీసుకొనే ప్రతీ రైతుకు పంట బీమా వర్తిస్తుంది. జిల్లాలో సుమారు లక్ష మందిలోపు మాత్రమే రైతులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొంటారు. మిగిలినవారు సొంతంగా పంటల బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఉచిత పంటల బీమా పథకం అమలు చేయాలి ఉచిత పంటల బీమా పథకం ఎత్తివేయడంతో రైతులపై ప్రీమియం భారం పడుతోంది. నేను 5 ఎకరా లు సాగు చేస్తున్నాను. దీంతో రూ.3,845 ప్రీమియం చెల్లించాల్సి వస్తోంది. గతంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే ప్రీమియం చెల్లించేది. దీంతో రైతులపై ఎటువంటి భారం ఉండేది కాదు. కూటమి ప్రభుత్వం రైతులను ఇబ్బందులు పెడుతోంది తప్ప, రైతులకు ఏ విధమైన పథకాలు అమలు చేయడం లేదు. – తుమ్మల అచ్చియ్య, రైతు పులిమేరు, పెద్దాపురం మండలం రైతులను ప్రీమియం చెల్లించమనడం దారుణం నాకు ఉన్న భూమితోపాటు అదనంగా మరో 7 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాను. దీంతో పది ఎకరాలకు రూ.7,690 ప్రీమియం చెల్లించాల్సి వస్తోంది. ఇప్పడే డబ్బు లేక విత్తనాలు కొనుగోలుకు బయట అప్పులు తెచ్చాను. మళ్లీ ప్రీమియం కట్టాలంటే చాలా కష్టం. ఇప్పుడు ఏమీ చేయాలో అర్థం కానీ పరిస్థితి. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఐదు సంవత్సరాలూ ప్రభుత్వమే ప్రీమియం చెల్లించింది. ప్రస్తుతం రైతులను ప్రీమియం చెల్లించడమనడం దారుణం. – సుర్ల నాగేశ్వరరావు, రైతు టీజే నగరం, కోటనందూరు మండలం -
ఎంపీడీవో రాజేశ్వరరావు సస్పెన్షన్
తొండంగి: శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండల పరిషత్ ఇన్చార్జి ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తుండగా ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసిన కారణంగా మండల పరిషత్ ఎంపీడీవో బి.రాజేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్దిశాఖ కమిషనర్ వి.ఆర్.కృష్ణ తేజ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2022లో శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండల పరిషత్త్లో ఈవోపీఆర్డీ, ఇన్చార్జి ఎంపీడీవోగా బి.రాజేశ్వరరావు విధులు నిర్వహించారు. రూ.14,84,900 నిధుల దుర్వినియోగం జరిగింది. ఈ ఆరోపణల నేపథ్యంలో అప్పటి జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపి ఆ శాఖ ఉన్నతాధికారులకు నివేదించారు. వ్యక్తిగత ఖర్చుల నిమిత్తం ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేయడంతో క్రిమినల్ మిస్ కాండక్ట్ కింద ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా తుని మండలం ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్న కె.సాయినవీన్కు తొండంగి మండలం ఎంపీడీవో ఇన్చార్జి బాధ్యతలు అప్పగించినట్టు జిల్లా పరిషత్ సీఈఓ నుంచి ఆదేశాలందాయి. వైఎస్సార్ సీపీ రాష్ట్ర మున్సిపల్ విభాగ ప్రధాన కార్యదర్శిగా అయ్యారావు పిఠాపురం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించిన రాష్ట్ర మున్సిపల్ విభాగ కమిటీలో ప్రధాన కార్యదర్శిగా గొల్లప్రోలుకు చెందిన వైఎస్సార్ సీపీ సీనియర్ నేత మొగలి మాణిక్యాలరావు (అయ్యారావు) నియమితులయ్యారు. పార్టీ అధిష్టానం తనపై నమ్మకం ఉంచి పదవి ఇచ్చిందని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ పటిష్టతకు, సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అయ్యారావు తెలిపారు. తనకు పదవి రావడానికి కృషి చేసిన వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి వంగా గీతావిశ్వనాఽథ్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఆరా కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్లో చోటు చేసుకున్న పారామెడికల్ విద్యార్థులపై లైంగిక వేధింపుల ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించింది. శుక్రవారం రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అత్త లూరి విష్ణువర్దన్కు కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ ఫోన్ చేశారు. ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. విచారణపై ఆరా తీసి, నిందితులపై కళాశాల తరఫున చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. -
రత్నగిరి భద్రత పటిష్టతకు తొలి అడుగు
● సీసీ టీవీ దృశ్యాల రికార్డింగ్ బ్యాకప్ 90 రోజులుండేలా చర్యలు ● ఇందుకోసం రూ.70 లక్షలతో ఆన్లైన్ సర్వర్లు, హార్డ్డిస్క్లు ● అన్నవరం దేవస్థానం పాలకవర్గం తీర్మానం అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో భద్రతా చర్యలపై పాలకమండలి దృష్టి సారించింది. శుక్రవారం రత్నగిరిపై చైర్మన్ ఐవీ రోహిత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీసీ టీవీలు రికార్డు చేసిన దృశ్యాలు 90 రోజులపాటు సర్వర్లో ఉండేలా రూ.70లక్షల వ్యయంతో ఆన్లైన్ సర్వర్లు, హార్డ్డిస్క్లు ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. ప్రస్తుతం సీసీటీవీలు రికార్డు చేసిన దశ్యాలు 30 రోజులవి మాత్రమే సర్వర్లో ఉంటాయి. అయితే మిగిలిన ప్రముఖ దేవస్థానాలలో కనీసం 90 రోజులు సీసీటీవీ రికార్డింగ్ బ్యాకప్ సదుపాయం ఉంది. అన్నవరం దేవస్థానంలో 320 సీసీ టీవీ కెమెరాలు ఉన్నాయి. సీసీటీవీ బ్యాకప్ 90 రోజులకు పెంచుకోవాలని దేవదాయశాఖ ఉన్నతాధికారులు, పోలీస్ శాఖ పలుమార్లు దేవస్థానం అధికారులకు సూచించడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో ఈఓ వీర్ల సుబ్బారావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు వీ నూకరత్నం, వీ రామకృష్ణ, ఎలక్ట్రికల్ డీఈ వీ సత్యనారాయణ పాల్గొన్నారు. మొత్తం పది అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. తీర్మానాలు.. ● మొదటి ఘాట్ రోడ్ వద్ద నుంచి న్యూసెంటినరీ సత్రం వరకు నిర్మిస్తున్న రెండో మెట్లదారికి రూ.27 లక్షల వ్యయంతో విద్యుత్ దీపాలు, సౌండ్సిస్టమ్, సీసీ టీవీలు, అండర్ గ్రౌండ్ కేబుల్స్, ప్యానల్ బోర్డుల ఏర్పాటుకు ఆమోదం ● సత్యగిరి, రత్నగిరి ఘాట్రోడ్లలో, కొండ దిగువన ట్రాఫిక్కు అంతరాయం లేకుండా వాహనాల రాకపోకలకు వీలుగా రూ.23 లక్షల వ్యయంతో ప్రీ కాస్ట్ ఆర్సీసీ డివైడర్స్ ఏర్పాటు ఆమోదం ● దేవస్థానంలో సత్యగిరి పవర్హౌస్ నుంచి విష్ణుసదన్ సత్రానికి ప్రస్తుతం విద్యుత్ సరఫరా చేస్తున్న కేబుల్ పాడైనందున దాని స్థానంలో అండర్ గ్రౌండ్ కేబుల్, ప్యానల్ బోర్డును రూ.26 లక్షలతో ఏర్పాటు చేసేందుకు నిర్ణయం ● ప్రధానాలయం, వ్రత మంటపాలు, ఉచిత క్యూ శ్లాబ్ల, విష్ణుసదన్ సత్రం జాయింట్ బీమ్లలో లీకేజీలు అరికట్టేందుకు రూ.18.65 లక్షలతో రస్ట్ప్రూఫ్ ట్రీట్మెంట్ గ్రౌటింగ్ పనులు చేసేందుకు ఆమోదం ● రూ.16 లక్షలతో పంపా రిజర్వాయర్ పవర్ ఆఫీసు వద్ద నిర్మించిన బోర్వెల్స్ వద్దకు సిబ్బంది వెళ్లడానికి ర్యాంప్ నిర్మాణం, రత్నగిరి వై జంక్షన్ వద్ద నూతనంగా సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆమోదం -
కీచకులపై చర్యలు తీసుకోండి
కాకినాడ రూరల్: రంగరాయ మెడికల్ కళాశాల విద్యార్థినులపై వేధింపులకు పాల్పడిన కీచకులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి డిమాండ్ చేశారు. ఆమె శుక్రవారం వీడియో ప్రకటన విడుదల చేశారు. మాట్లాడుతూ రాష్ట్రంలోనే పేరున్న రంగరాయ కళాశాలను కూడా కీచకులు వదలడం లేదని, పారా మెడికల్ విద్యార్థినుల పట్ల ల్యాబ్ అటెండెంట్, టెక్నీషియన్లు ప్రవర్తించిన తీరు అమానుషమని దీన్ని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, దాడులు, హత్యలు, లైంగిక వేధింపులు ఎక్కువ అయ్యాయన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని ఆరోపణలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగరాయ ఘటనపై స్పందించాలని నాగమణి కోరారు. తలుపులమ్మకు సారె సమర్పణతుని: తలుపులమ్మ అమ్మవారి లోవ దేవస్థానానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. ఆషాఢమాసంలో మూడో శుక్రవారం కావడంతో పలు జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారికి చీర, సారె సమర్పించారు. ఇళ్లల్లో స్వయంగా తయారు చేసిన పిండి వంటలతో నింపిన బిందెలను శిరస్సుపై ధరించి వస్తున్న భక్తులకు రాజగోపురం వద్ద ఆలయ ఈఓ విశ్వనాథరాజు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. మహిళలు అమ్మవారికి సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. పండితులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఏర్పాట్లను కార్యనిర్వహణాధికారి విశ్వనాథరాజు పర్యవేక్షించారు. కుట్ర పూరితంగా ఎస్సీవర్గీకరణ అమలు జగ్గంపేట: ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతపై అన్ని రాజకీయ పార్టీలు కుట్ర చేస్తున్నాయని, ప్రధానంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎస్సీ వర్గీకరణ పేరుతో మాల సామాజిక వర్గాన్ని అణచివేయాలని చూస్తున్నారని నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ మాల మహానాడు అండ్ రాక్ నేత డాక్టర్ ఆర్.ఎస్.రత్నాకర్ తెలిపారు. జగ్గంపేటలో శుక్రువారం విలేకరులతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలలో మాలల ఉనికిని దెబ్బతీయడానికి పథకం ప్రకారం నేతలు ప్రయత్నిస్తున్నా వారికి బానిసలుగా, తొత్తులుగా మారిన మాల నాయకులు ఎవరూ నోరు మెదపకపోవడం దారుణమని అన్నారు. సుప్రీంకోర్టు, జడ్జిలు, దేశ సంపద, మంత్రి పదవులు తదితర వాటిలో ఎస్సీ వర్గీకరణ అవసరం లేదా, దాన్ని అమలు చేయరా అని ప్రశ్నించారు. రిజర్వేషన్ పేరుతో ఎస్సీలకు పడేసే ఎంగిలి మెతుకుల్లోనే వర్గీకరణ పేరుతో పంపకాలు పెడతారా అని ప్రశ్నించారు. దీంతో ఎస్సీ వర్గాల మధ్య ఘర్షణలు జరగడానికి పరోక్షంగా ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ ఎస్సీ జనాభా ప్రాతిపదికన చేయలేదని అన్నారు. నేతలు కొప్పుల ప్రేమ్ బాబు, కనికళ్ల నాని, బచ్చల చిన్నా,బొండు రాజు,కూసి కొండబాబు పాల్గొన్నారు. -
పవన్కల్యాణ్... ఇప్పుడేం అంటారు?
● లైంగిక వేధింపుల ఘటనపై మీ సమాధానమేంటి ? ● కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్సార్ సీపీ మహిళా నేత జక్కంపూడి విజయలక్ష్మి కాకినాడ క్రైం: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్కల్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం ఉన్న జిల్లాలోనే పారామెడికల్ విద్యార్థినులపై లైంగిక వేధింపులు జరగడం అమానవీయమని వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కాకి లెక్కలు చూపి మహిళలపై ఘోరాలు జరిగిపోతున్నాయని మొసలి కన్నీరు కార్చిన పవన్ కల్యాణ్ ఇప్పుడేమంటారని నిలదీశారు. ఘటన నేపథ్యంలో శుక్రవారం ఆమె కాకినాడలోని జీజీహెచ్కు వచ్చారు. లైంగిక వేధింపులు చోటు చేసుకున్న ఏడవ నంబరు, అంబానీ ల్యాబ్లను పరిశీలించారు. అనంతరం లెక్చర్ గ్యాలరీ సమీపంలో ఉన్న హెచ్వోడీ రూంలో ఆసుపత్రి అధికారులతో సమావేశమయ్యారు. ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని ల్యాబ్లు, వార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడాన్ని తప్పుబట్టారు. పర్యవేక్షణ లోపం వల్లే ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు ఈ ఘటనపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రి అధికారుల మాటలు పొంతన లేకుండా ఉన్నాయని విమర్శించారు. నిందితులపై నేర చరిత్ర ఉందన్న విషయాన్ని ఉద్దేశ పూర్వకంగానే దాస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం కీచకుల మయమని మండిపడ్డారు. శక్తి యాప్ ద్వారా ఉద్దరించిందేంటని నారా లోకేష్ను నిలదీశారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న వేలకొద్దీ దుర్యోధనులు, లక్షల కొద్దీ దుశ్సాసనులను శక్తి యాప్ ఏం చేయగలదని ప్రశ్నించారు. కీచకుల కొమ్ము కాస్తున్న కూటమి ప్రభుత్వం బెయిలబుల్ కేసులు పెడుతూ మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తోందన్నారు. విజయలక్ష్మి వెంట పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి దీప్తి కుమార్, పార్టీ జిల్లా అధ్యక్షురాలు మహిళా వర్దినీడి సుజాత, కాకినాడ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, సిటీ మహిళా అధ్యక్షురాలు పసుపులేటి వెంకటలక్ష్మి, పార్టీ మహిళా నేత, కాకినాడ మాజీ మేయర్ సరోజ, మహిళా నేత భవానీ ప్రియ ఉన్నారు. -
కష్టాలు కొనసాగేలా..
అధిక ధరకు విక్రయాలు వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు అందించేవారు. ఉన్న ఊళ్లోనే సేవలు అందేవి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎరువులు అందుబాటులో లేకుండా చేసింది. ప్రస్తుతం అన్ని ప్రైవేట్ షాపుల్లో ఎరువులు దొరకడం లేదు. ఉన్న షాపుల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. –పెదపూడి బాపిరాజు, అధ్యక్షుడు, కొత్తపేట నియోజకవర్గ వైఎస్సార్ సీపీ రైతు విభాగం ఎరువుల సరఫరాకు చర్యలు గ్రామాల్లో సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ఎరువులు ఇండెంట్ను గ్రామ వ్యవసాయ సహాయకులు (వీఏఏ) పెట్టాలి. ప్రస్తుతం వీఏఏల బదిలీలు జరుగుతున్నాయి. రెండు, మూడు రోజుల్లో ఆ ప్రక్రియ ముగుస్తుంది. వీఏఏలు చేరిన వెంటనే ఎరువుల ఇండెంట్ పెట్టించి, రైతులకు కావాల్సిన ఎరువుల సరఫరాకు చర్యలు తీసుకుంటాం. ఈ లోపు పలు సొసైటీల ద్వారా సరఫరా చేయిస్తున్నాం. –ఎం.వెంకటరామారావు, ఏడీఏ, కొత్తపేట కొత్తపేట: తొలకరి పలకరించింది.. ఖరీఫ్ సాగుకు ఆహ్వానం పలికింది.. ఎన్నో ఆశలతో ప్రతి రైతు అడుగు పొలాల వైపు పడింది.. వరి నారుమడులు, పొలాల దమ్ము పనుల్లో రైతాంగం నిమగ్నమైంది. ఇలా సాగు ఊపందుకుంటుంటే, ప్రభుత్వం నుంచి సన్నద్ధత కరవైంది. నేటికీ రైతు సేవా కేంద్రాల ద్వారా ఎరువులు మాత్రం అందించడం లేదు. ఎరువులు ఎప్పుడు వస్తాయో తెలియక రైతులు ఆ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ, రైతు ప్రోత్సాహక పథకాలను అందించేవారు. విత్తనాలు, ఎరువులు, పంటల బీమా, తదితర సేవలు సకాలంలో అందించేవారు. ముందుగానే సర్వం సిద్ధం చేసేవారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలకు రైతు సేవా కేంద్రాలు (ఆర్ఎస్కే)గా పేరుపెట్టి వాటి ద్వారా సేవలకు మాత్రం మంగళం పాడింది. ఇవి ప్రస్తుతం అలంకారప్రాయంగా మిగిలాయని రైతులు అంటున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం సుమారు 1,74 లక్షల ఎకరాలు. ఈ సీజన్లో యూరియా, కాంప్లెక్స్, డీఏపీ, ఎంఓపీ, సూపర్ ఎరువులు సుమారు 45,775 మెట్రిక్ టన్నుల అవసరం ఉంది. అయితే ఇంకా రైతు సేవా కేంద్రాలకు ఎరువులు రాలేదు. ఎప్పుడొస్తాయో తెలియడం లేదు. ముందస్తు అంటూ.. నిర్లక్ష్యం చూపుతూ ముందస్తు సాగుకు వెళ్లాలని అధికారులు చెబుతూనే రైతులకు సకాలంలో సేవలు అందించడంలో నిర్లక్ష్యం చూపుతున్నారు. దీనివల్ల సాగు పంట ఆలస్యమవుతుంది. దీనివల్ల పంట చేతికొచ్చే సమయంలో అంటే అక్టోబర్, నవంబర్ మాసాల్లో తుపాన్లు, భారీ వర్షాలకు పంట తడిసిపోయి ఇబ్బందులు పడాల్సి వస్తుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పక్కాగా ముందస్తు సాగుకు చర్యలు తీసుకునేది. ఇందులో భాగంగా ముందుగానే సాగునీరు విడుదల చేసేది. సకాలంలో రాయితీపై విత్తనాలు, రసాయన ఎరువులు అందించేది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని గాలికొదిలేసింది. అన్నదాత సుఖీభవ ద్వారా పెట్టుబడి సాయం ఇవ్వలేదు. గత రబీ ధాన్యం కొనుగోలు చేసి రెండు నెలలు దాటినా నేటికీ ఆ డబ్బులు రైతుల ఖాతాలకు జమ చేయలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఖరీఫ్ ప్రారంభమైనా, రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్కే) ద్వారా ఇంకా రాయితీపై విత్తనాలు, ఎరువులు అందించడం లేదు. ప్రైవేట్ డీలర్ల హవా ప్రస్తుతం నాట్లు వేసే సమయం. యూరియా, డీఏపీ అత్యవసరం. ఆర్ఎస్కేల వద్ద ఎరువులు అందుబాటులో లేవు. ఈ పరిస్థితుల్లో ప్రైవేట్ డీలర్ల వద్ద కూడా దొరకడం లేదు. కొంతమంది వద్దే స్టాక్ ఉంది. తప్పక ఆ షాపులకు వెళితే ఎంఆర్పీ రూ.265 ఉన్న యూరియా బస్తా రూ.320 చెబుతున్నారని రైతులు అంటున్నారు. ఇదేంటని అడిగితే తామే రూ.290కి కొనుగోలు చేశామని, రూ.30 కిరాయి, రూ.5 దిగుమతి చార్జి కలిపి మొత్తం రూ.325 అయ్యిందని అంటున్నారని వాపోతున్నారు. పైగా అవసరం లేకపోయినా యూరియాతో పాటు దానికి అనుసంధానంగా జింకు, సల్ఫర్ వంటి మందులు అంటగడుతున్నారని చెబుతున్నారు. ఫ ఎరువులు అందక అన్నదాతకు తిప్పలు ఫ నిరుపయోగంగా రైతు సేవా కేంద్రాలు ఫ సాగు కాలం మొదలైనా కానరాని సన్నద్ధత -
సుగుణారెడ్డికి రెడ్క్రాస్ పురస్కారం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్, రెడ్క్రాస్ జిల్లా వైస్ చైర్మన్ డాక్టర్ సుగుణారెడ్డికి రెడ్క్రాస్ సొసైటీ ఉత్తమ పురస్కారం అందజేసింది. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి రెడ్క్రాస్ వార్షిక సమావేశంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు. కాకినాడ రెడ్క్రాస్ను మూడేళ్లుగా ప్రథమ స్థానంలో నిలుపుతున్న సుగుణారెడ్డికి పురస్కారం రావడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. ఆదిత్య యూనిట్స్ ద్వారా రక్తదాన శిబిరాలు నిర్వహించి, సమాజ సేవలో ముందుంటున్నారని రెడ్క్రాస్ రాష్ట్ర చైర్మన్ వైడీ రామారావు తెలిపారు. అక్కాచెల్లెళ్ల అదృశ్యం రావులపాలెం: ఇద్దరు బాలికల అదృశ్యంపై కేసు నమోదు చేసినట్టు సీఐ ఎం.శేఖర్బాబు తెలిపారు. గోపాపురానికి చెందిన ఇద్దరు బాలికలు అక్కాచెల్లెళ్లు. గురువారం వారి తల్లిదండ్రులు బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఆ అక్కాచెల్లెళ్లు కనిపించలేదు. ఈ మేరకు తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 23,000 – 23,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 25,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 25,500 గటగట (వెయ్యి) 24,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
రక్షణ కల్పించాలని ప్రజల ఆందోళన
మామిడికుదురు: ఓఎన్జీసీ డ్రిల్లింగ్ బావి వద్ద బుధవారం జరిగిన గ్యాస్ కిక్ సంఘటన నేపథ్యంలో స్థానికులు గురువారం ధర్నా చేశారు. తమకు రక్షణ కల్పించాలంటూ ఆందోళన చేపట్టారు. పాశర్లపూడి – పాశర్లపూడిలంక గ్రామాల సరిహద్దులోని డ్రిల్లింగ్ నిర్వహిస్తున్న రిగ్ వద్ద ఈ ధర్నా జరిగింది. ఓఎన్జీసీ కార్యకలాపాలతో అనుక్షణం తాము భయం, భయంగా గడుపుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఎక్కడో కూర్చుని పరిస్థితి అదుపులో ఉందని చెప్పడం ఏంటంటూ నిరసన తెలిపారు. డ్రిల్లింగ్ జరుగుతున్న ప్రాంతానికి వచ్చి ప్రజలకు తగిన వివరణ, భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అక్కడ చేపట్టిన రిఫైర్స్ పనులను అడ్డుకున్నారు. ఈ నిరసనలో మాజీ సర్పంచ్ కొనుకు నాగరాజు, పొన్నమండ రామస్వామి, బిరుదుగంటి నరసింహమూర్తి, మోకా దుర్గారావు, అడబాల దొరబాబు, గోనిపాటి మధుబాబు, తాడి శ్రీనివాసు, రొక్కాల రాజశేఖర్, పొలమూరి గోపాల్, ఉండ్రు చిన్న, నాగిడి వీరవెంకటరమణ, కోలా సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.