breaking news
Kakinada District News
-
జీజీహెచ్లో హైఎనర్జీ లీనియర్ యాక్సిలరేటర్
కాకినాడ క్రైం: స్థానిక జీజీహెచ్లో క్యాన్సర్ సేవల కోసం హైఎనర్జీ లీనియర్ యాక్సిలరేటర్ మెషీన్ మంజూరైంది. ఓఎన్జీసీ సంస్థ సౌజన్యంతో ఈ పరికరం సమకూరింది. ఈ మేరకు, శనివారం ఆసుపత్రి అధికారులు రేడియాలజీ కాన్ఫరెన్స్ హాల్లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ సూపరింటెండెంట్, రేడియేషన్ అంకాలజీ ప్రొఫెసర్, హెచ్ఓడీ శ్రీనివాసన్ మాట్లాడుతూ, క్యాన్సర్ బాధితులకు చికిత్స, నివారణ కోసం రేడియేషన్ చేస్తామన్నారు. ఇందుకు జీజీహెచ్లో తక్కువ సామర్థ్యం ఉన్న టెలీ కోబాల్ట్ మెషీన్ను వినియోగిస్తున్నామన్నారు. ఒక రోజులో గరిష్టంగా 30 మందికి మాత్రమే రేడియేషన్ ఇవ్వగలుతున్నామన్నారు. అయితే కొత్తగా మంజూరైన హైఎనర్జీ లీనియర్ యాక్సిలరేటర్ ద్వారా ఒక రోజులో 100 మందికిపైగా క్యాన్సర్ బాధితులకు రేడియేషన్ చేయవచ్చని తెలిపారు. ఈ యంత్రం ధర రూ.36.6 కోట్లు కాగా, రూ.3.5 కోట్ల విలువైన సీటీ సిమ్యులేటర్ను ఓఎన్జీసీ అందిస్తోందన్నారు. వీటిని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ ఐటీఐ సమీపంలో మూడెకరాల్లో నిర్మిస్తున్న క్యాన్సర్ ఆసుపత్రి ఆవరణలో 12,800 ఎస్ఎఫ్టీ విస్తీర్ణంలో ప్రత్యేక విభాగాన్ని నిర్మించామన్నారు. భారీ బంకర్లు సిద్ధమయ్యాయని, యంత్రాలను వీటిలోనే ఉంచుతామని శ్రీనివాసన్ తెలిపారు. ప్రస్తుత కలెక్టర్ హరేంధిర ప్రసాద్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి యంత్రం జీజీహెచ్కు మంజూరు అయ్యేలా అన్ని అధికారిక కార్యకలాపాలు సకాలంలో పూర్తి చేశారన్నారు. -
మహాధర్నాను విజయవంతం చేయండి
ప్రత్తిపాడు: ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ జేఏసీ పిలుపు మేరకు ఈ నెల 17న విజయవాడ ధర్నా చౌక్ వద్ద జరుగనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని ఏపీ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా కన్వీనర్ అజయ్ పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, అప్పటి వరకు 100 శాతం గ్రాస్ శాలరీ ఇవ్వాలని, చనిపోయిన ఉద్యోగి కుటుంబానికి రూ. 50 లక్షల నష్ట పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగ సదుపాయం కల్పించాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేయాలనే ప్రధాన డిమాండ్లతో ప్రభుత్వానికి 45 రోజుల గడువు ఇచ్చామన్నారు. ఈ నెల 20 నాటికి గడువు ముగుస్తుందని చెప్పారు. గడువులోగా ప్రభుత్వం నుంచి చర్చలు జరపకపోతే సెప్టెంబర్ 7వ తేదీ దాటిన తర్వాత ఏ క్షణం నుంచైనా సమ్మె చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు సమ్మె నోటీసులను వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీపీహెచ్, డీఎంఈ, దీఎస్హెచ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కె.అనితతో పాటు జిల్లాలోని మండల స్థాయి వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు అందజేశామని అజయ్ వివరించారు. -
రిమాండ్ ఖైదీ పరారీ
కాకినాడ క్రైం / తుని రూరల్: తుని సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోక్సో నిందితు డు పోలీసుల కళ్లుగప్పి పరా రయ్యాడు. పోలీసుల కథ నం ప్రకారం. తుని రూరల్ కేఓ మల్లవరం గ్రామానికి చెందిన 23 ఏళ్ల అడిగెళ్ల భానుప్రకాష్ కొద్దిరోజుల క్రితం పోక్సో కేసులో అరెస్టయ్యి తుని సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. కోర్టు ఆదేశాల మేరకు భానుప్రకాష్ను ఎస్కార్ట్తో కాకినాడ జీజీహెచ్కు సామర్థ్య పరీక్ష కోసం శనివారం పంపారు. పరీక్ష పూర్తయిన తర్వాత ఎం–4 వార్డులో ఉంచారు. అ దే సమయంలో ముద్దాయి భార్య, కుమారుడు అ క్కడికి వచ్చారు. తన కుమారుడిని ఎత్తుకుంటాన ని కోరగా ఎస్కార్ట్ కానిస్టేబుల్ బేడీలు తొలగించారు. ఇదే అదునుగా ఒక్కసారిగా ఖైదీ పరుగు అందుకున్నాడు. ఆగమేఘాలపై మెడికల్ వార్డు నుంచి బయటకు వచ్చి, జన్మభూమి సత్రం మీదు గా ఆసుపత్రి వెనుక గోడ దూకి పరారయ్యాడు. ఎవరికై నా ముద్దాయి సమాచారం తెలిస్తే వెంటనే సర్కిల్ ఇన్స్పెక్టర్ 94407 96531, రూరల్ ఎస్సై 94407 96573 ఫోన్ నంబర్లకు తెలిపారు. కొనసాగుతున్న జూడాల నిరసనకాకినాడ క్రైం: కాకినాడలో జూనియర్ డాక్టర్ల నిరసన పదకొండో రోజుకు చేరింది. అత్యవసర వైద్య సేవలను బహిష్కరించిన జూడాలు శనివారం రిలే నిరాహార దీక్షలు, ఫ్లాష్ మార్చ్ నిర్వహించారు. స్టైఫండ్ 15–30 శాతం మేర పెంచాలని, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల్లో ఎండీ, ఎంఎస్ చదివిన వారికే ప్రాధాన్యం ఇవ్వాలని, 65 ఏళ్ల వరకు ఉద్యోగ విరమణ వయసును పెంచడం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సాయంత్రం నిర్వహించిన ఫ్లాష్మార్చ్ పీఆర్ కళాశాల, డీఎంహెచ్ఓ కార్యాలయం, జిల్లా పరిషత్ జంక్షన్ మీదుగా జీజీహెచ్ తల్లి పిల్లల విభాగం వరకు కొనసాగింది. -
ప్రతి అర్జీకీ పరిష్కారం చూపుతాం: కలెక్టర్
కాకినాడ రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చే ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతామని కలెక్టర్ ఎంఎస్ హరేంధిర ప్రసాద్ అన్నారు. వన్ మంత్ – వన్ విలేజ్– ఫోర్ విజిట్లో భాగంగా రమణయ్యపేట సర్పవరం జంక్షన్ వద్ద ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం పీజీఆర్ఎస్ నిర్వహించారు. కాకినాడ రూరల్, కరప మండలాలకు చెందిన పలువురు వచ్చి అర్జీలు అందజేయడంతో వాటిని కలెక్టర్ తీసుకుని సంబంధిన అధికారులను విచారించి, పరిష్కారానికి హామీలు ఇచ్చారు. కలెక్టరు మాట్లాడుతూ రూరల్లో సుమారు 60కు పైగా అర్జీలు వచ్చాయన్నారు. పరిష్కారం చూపకుంటే ఎలా.. తమ అర్జీలకు పరిష్కారం చూపని గ్రీవెన్స్లు ఎందుకుని తిమ్మాపురం మాజీ సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. తిమ్మాపురంలో ఎకరం స్థలంలో నాన్ లేఅవుట్పై తాము గతంలో ఫిర్యాదు చేశామని, పంచాయతీ తీర్మానం చేసినా అధికారులు చర్యలు తీసుకోలేదని ఆయన కలెక్టర్కు వివరించారు. గ్రామ పరిధిలో అనుమతులు లేకుండా ఓ ఫంక్షన్ హాలు నిర్మించారని, అలాగే తిమ్మాపురంలోని ఓ పీజీ స్టడీ సెంటర్లో అనుమతి లేకుండా భవనాలను నిర్మించారన్నారు. అనుకూలంగా ఉన్నందుకా.. తిమ్మాపురం గ్రామ పంచాయతీలలో లైబ్రరీ అటెండర్గా దొరబాబు అనే దివ్యాంగుడు దాదాపు 16 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. వైఎస్సార్ సీపీ చెందిన గ్రామ మాజీ సర్పంచ్ బెజవాడ సత్యనారాయణకు అనుకూలంగా ఉంటున్నాడనే ఒక్క కారణంతో అతడి సర్వీసును పరిగణనలోకి తీసుకోకుండా కూటమి నేతల ఒత్తిడితో విధులకు రావద్దని హుకుం జారీ చేయడంతో పాటు రెండు నెలలుగా జీతం అందించలేదు. దీంతో దొరబాబు తన ఆవేదనను జిల్లా కలెక్టర్కు లిఖిత పూర్వకంగా తెలిపాడు. దీనిపై పంచాయతీ కార్యదర్శి రాజబాబును కలెక్టర్ వివరణ కోరడంతో లైబ్రరీ లేదని తెలిపారు. మెట్ల వద్ద వేచి ఉన్న వృద్ధుడు కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో పీజీఆర్ఎస్కు కలెక్టర్ వారడడంతో సర్పవరానికి చెందిన వృద్ధుడు వాసంశెట్టి వెంకటకృష్ణ అర్జీ ఇచ్చేందుకు వచ్చి సుమారు గంటకు పైగా వీల్ చైర్లోనే ఉన్నారు. మొదటి అంతస్తులో గ్రీవెన్స్ జరగడంతో అక్కడకు వీల్ చైర్లో వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఒంటి గంటకు కార్యక్రమం ముగించుకుని కిందకు వచ్చిన కలెక్టరు హరేంధిర ప్రసాద్కు అర్జీని ఆయన అందించారు. తనకు వృద్ధాప్య పింఛను వస్తుందని, కాలు దెబ్బతినడంతో నడవలేని స్థితిలో ఉన్న తనకు దివ్యాంగ పింఛను ఇప్పించాలని వేడుకున్నాడు. -
● ఈ పైనమేలా..
పట్టుజారితే ప్రమాదమని తెలిసినా పట్టించుకోవడం లేదు. తొండంగి మండలం గోపాలపట్నం నుంచి బెండపూడి జాతీయ రహదారిపై పలు వాహనాలు ఇలా ప్రమాదకరంగా ప్రయాణించాయి. బరువైన బండ రాళ్లను రవాణా చేసే సమయంలో ఇనుప రోప్లతో భద్రంగా తీసుకెళ్లాలి. కానీ ట్రాలీపై గ్రానైట్ రాళ్లను కట్టకుండానే తరలిస్తున్నారు. అదేవిధంగా గూడ్స్ వ్యాన్లో జనాన్ని ఎక్కించుకుని, కేబిన్పై సైతం కూర్చోబెట్టి తీసుకెళ్లారు. ఇలాంటి ప్రయాణాలను అరికట్టాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. – తొండంగి -
నూకరాజు కుటుంబం ఆత్మహత్య కలచివేసింది
కలెక్టర్ హరేంధిర ప్రసాద్ కాకినాడ రూరల్: పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ టి.నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం కలచివేసిందని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అన్నారు. ఉద్యోగులు కుటుంబ పరమైన సమస్యలను, ఒత్తిడి, మానసిక ఇబ్బందులను సహచర ఉద్యోగులతో పంచుకోవాలని సూచించారు. కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో శనివారం పీజీఆర్ఎస్కు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. ఆదివారం రాత్రి 11 గంటలకు నూకరాజు వాట్సాప్ మెసేజ్లు పెట్టడంతో పంచాయతీరాజ్ సిబ్బంది ఆయన వద్దకు రీచ్ అయ్యేందుకు ప్రయత్నించారన్నారు. కింద స్థాయి ఉద్యోగులు రెగ్యులర్గా ఎలా ఉంటున్నారో.. టెన్షన్లో ఉన్నారా అనేది గుర్తు పెట్టాలని, నూకరాజు ఉదంతం ఒక పాఠం లాంటిందన్నారు. ఆయన సమస్యను తమ దృష్టికి తీసుకువచ్చి ఉంటే కచ్చితంగా న్యాయం చేసేవారమన్నారు. నేడు కాకినాడకు సాధిక్ ఖాన్ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. షేక్ సాధిక్ ఖాన్ వేధింపుల కారణంగానే వారు ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ లెటర్ల ఆధారంగా పోలీసులు గుర్తించారు. అప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ ఘటనకు ప్రధాన కారకుడిగా భావిస్తున్న షేక్ సాధిక్ ఖాన్ను పట్టుకునేందుకు రాజమహేంద్రవరం, కాకినాడ పోలీసులు జల్లెడ పట్టారు. అతను దేశం దాటి వెళ్లిపోకుండా ముందుగా పోలీసులు పాస్పోర్ట్ను సీజ్ చేశారు. అనంతరం అతను విదేశాల్లో ఎవరెవరిని సంప్రదిస్తున్నాడో కాల్ డేటా ఆధారంగా వివరాలు సేకరించారు. చివరికి శుక్రవారం సాయంత్రం నిందితుడిని మీరట్లో పట్టుకుని అక్కడి కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు ట్రాన్సిట్ వారెంట్పై అతన్ని కాకినాడకు తీసుకువస్తున్నారు. రిమాండ్ ఖైదీ మృతి కంబాలచెరువు: రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న ఆవుల శ్రీనివాస్ (55) శనివారం అనారోగ్యంతో మృతి చెందాడు. అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం బొయిగాపల్లికి చెందిన శ్రీనివాస్ను జగ్గంపేట పోలీసులు ఈ ఏడాది ఫిబ్రవరి 6న గంజాయి కేసులో అరెస్టు చేశారు. కోర్టు అతనికి రిమాండ్ విధించింది. శ్రీనివాస్కు పలు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఇదిలా ఉండగా తెల్లవారుజామున కడుపునొప్పి రావడంతో జైలు సిబ్బంది అతనిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతను అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు. ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రత్నగిరి కిటకిట అన్నవరం: స్థానిక శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయానికి శ్రావణ శుద్ధ దశమి, శనివారం సందర్భంగా వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. క్యూలైన్లు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారి సన్నిధికి విచ్చేశారు. రెండు వేల సత్యదేవుని వ్రతాలు జరిగాయి. దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. సుమారు ఐదు వేల మందికి అన్నదానంలో భోజనం పెట్టారు. ఉదయం సత్యదేవుడు అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు పల్లకీ సేవ నిర్వహించారు. ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తూర్పురాజగోపురం లోపల ప్రాకారంలోకి ఊరేగింపుగా తీసుకువచ్చారు. పూజలు చేసి పల్లకీ సేవ ప్రారంభించారు. పోక్సో చట్టంపై అవగాహన అవసరం ధవళేశ్వరం: మహిళలు, చిన్నారులకు పోక్సో చట్టంపై అవగాహన పెంచాలని రాజమహేంద్రవరం ప్రిన్సిపల్ సివిల్ జడ్జి రెడ్డిప్రసన్న సూచించారు. ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గణేష్ నేతృత్వంలో శనివారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల, ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికోన్నత పాఠశాలలో బాలికలకు చట్టాలు, పోక్సో యాక్ట్, ఇతర అంశాలపై అవగాహన కల్పించారు. దీనికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రిన్సిపల్ సివిల్ జడ్జి రెడ్డి ప్రసన్న మాట్లాడుతూ చదువుకునే దశలో పిల్లలు పాటించాల్సిన నియమాలు, అపరిచిత వ్యక్తులతో ప్రవర్తించాల్సిన తీరు, ఈవ్టీజింగ్, గంజాయి వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరించారు. ధవళేశ్వరం పీఎస్ ఎస్సై హరిబాబు మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. -
వాడపల్లికి పోటెత్తిన భక్తజనం
ఆత్రేయపురం: మండలంలోని వాడపల్లి వవేంకటేశ్వరుని దర్శనానికి శనివారం భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. భక్తుల గోవింద నామ స్మరణతో మాడవీధులు మార్మోగాయి. స్వామివారిని సుమారు లక్షకు పైగా భక్తులు దర్శించారని, భారీ ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో, దేవదాయ శాఖ ఉప కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్థానిక గౌతమి గోదావరిలో స్నానమాడి అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. భారీ భక్తజనంతో క్యూలైన్లు నిండిపోయాయి. ఆలయంలో సుప్రభాత సేవ, తొలి హారతి, నీరాజనం, ఐశ్వర్య లక్ష్మీ హోమం, బాలభోగం నిర్వహించారు. భక్తులు విశిష్ట దర్శనం, ఉచిత దర్శనం ద్వారా స్వామిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. క్షేత్రపాలకులు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామిని భక్తులు దర్శించారు. భక్తులు ఉచిత అన్న ప్రసాదం, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆర్యవైశ్య సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులుకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈఓ సూర్యచక్రధరరావు, చైర్మన్ ముదునూరి వెంకటరాజు, కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు వాడపల్లి సుందర శేషావతారం స్వామి వారి పూజలు, సేవలు, కై ంకర్యాలను పర్యవేక్షించారు. -
బ్యాగోతాలు బట్టబయలు
చంద్రబాబు సర్కారు బాగోతమిది.. భావిభారత పౌరులపై చూపిన నిర్లక్ష్యమిది.. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు నాసిరకం బ్యాగులు ఇచ్చి, అపహాస్యం చేసిన వైనమిది.. ఆ బ్యాగులు ఎక్కడికక్కడే చిరిగిపోయి, జిప్లు, కుట్లు ఊడిపోవడం కనిపిస్తోంది. ఇది అందరినీ విస్తుపోయేలా చేసింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నాణ్యమైన బ్యాగులు ఇవ్వగా, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నాసిరకానికే పెద్దపీట వేసింది. కాకినాడలో చిరిగిన బ్యాగ్ను సైకిల్ పెట్టుకుని స్కూల్కు వెళ్తూ..● విద్యార్థులకు నాసిరకం స్కూల్ బ్యాగులు ● చంద్రబాబు సర్కారు బాగోతమిది ● రెండు నెలలకే మూలకు చేరిన వైనం ● జిల్లా వ్యాప్తంగా 70 శాతం ఇదే పరిస్థితి సాక్షి, ప్రతినిధి, కాకినాడ: భావిభారత పౌరులను సైతం మోసగించిన చరిత్రను చంద్రబాబు ప్రభుత్వం మూటగట్టుకుంది. విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకు ఉండాల్సిన స్కూల్ బ్యాగులు మూణ్ణాళ్ల ముచ్చటగానే మారాయి. బ్యాగులు అందించిన రెండు నెలలకే జిప్లు ఊడిపోతున్నాయి. బ్యాగు చిరిగిపోతోంది. పోనీ కుట్టించుకుని వాడుకుందామంటే కుట్టించిన రోజుల వ్యవధిలో బ్యాగు వస్త్రం చివికిపోతోంది. చేసేది లేక.. విద్యార్థులు తమ సొంత డబ్బులతో బ్యాగులు కొనుగోలు చేసుకునే పరిస్థితి తలెత్తింది. జిల్లా వ్యాప్తంగా 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు ‘డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’ (ఎస్ఆర్కేవీఎం) పేరుతో కిట్లు పంపిణీ చేశారు. మొత్తం 1,280 ప్రభుత్వ పాఠశాలల్లో 1,28,988 స్కూల్ బ్యాగుల కోసం విద్యా శాఖ ఇండెంట్ పెట్టింది. జూన్ 20 నాటికి 20,850 బ్యాగులు మాత్రమే జిల్లాకు వచ్చాయి. అంత తక్కువగా వచ్చినా, ఆ పార్టీ నేతలతో వాటిని ఆర్భాటంగా పంపిణీ చేయించేశారు. మిగిలినవి జూలై రెండో వారానికి దశల వారీగా వచ్చాయి. ఇదేం కక్కుర్తి చంద్రబాబు సర్కారు మూడు దశల్లో పంపిణీ చేసిన బ్యాగులు కనీసం రెండు నెలలు కూడా ఉండకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పుస్తకాలు ఎక్కువగా పెట్టుకుంటే బ్యాగ్ మొత్తం కుప్పకూలే పరిస్థితి ఏర్పడింది. ఇదే విషయమై తల్లిదండ్రుల సమావేశాల్లో (పీటీఎం)లలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులను నిలదీశారు. ఇచ్చిన నెలల వ్యవధిలోనే బ్యాగ్లు పాడైపోవడమేంటని ప్రశ్నించారు. దీంతో నీళ్లు నమిలిన విద్యాశాఖ అధికారులు పాడైన బ్యాగ్ల స్థానంలో కొత్త బ్యాగ్లు అందిస్తామని చెప్పారు. అయితే జిల్లాలో కొంత మందికి మాత్రమే ఇచ్చి.. మిగిలిన వారికి పంగనామాలు పెట్టారు. ఇలా ప్రభుత్వం పంపిణీ చేసిన 100 బ్యాగుల్లో 70 బ్యాగుల పరిస్థితి ఇలాగే ఉందన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వం రూ.2 వేలు పెట్టి కొనుగోలు చేసి.. విద్యార్థులకు ఇచ్చిన బ్యాగులు పట్టుమని రెండు నెలలు కూడా మన్నకపోవడంతో తల్లిదండ్రులు అవాక్కవుతున్నారు. చేసేది లేక చిరిగిపోయిన బ్యాగ్ల స్థానంలో సొంత డబ్బులతో కొత్త బ్యాగులు కొనుగోలు చేసుకుంటున్నారు. కిట్లలోనూ కిటుకే.. చంద్రబాబు ప్రభుత్వం అందించిన విద్యార్థి మిత్ర కిట్లలోనూ కనికట్టే చూపారు. బ్యాగులు అత్యంత నాసిరకంగా ఉన్నాయి. బూట్ల సైజు సరిపోవడం లేదు. ఒక తరగతి విద్యార్థికి ఇవ్వాల్సినవి రెండో తరగతి విద్యార్థికి ఇచ్చారు. కిట్లో ఒక వస్తువు ఇస్తే మరో వస్తువు ఉండటం లేదు. బ్యాగులతో పాటు డిక్షనరీలు, యూనిఫాం, సాక్స్లు ఇవ్వకపోవడంతో తల్లిదండ్రులే కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతమెంతో ఘనం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ‘జగనన్న విద్యా కానుక’ పేరుతో నాణ్యమైన బ్యాగ్లు, బూట్లు, యూనిఫామ్ అందించేవారు. పైగా పాఠశాలలు తెరిచేందుకు రెండు నెలల ముందే విద్యార్థులకు కానుకలు చేరేవి. అలా ఏటా 1.59 లక్షల మందికి పైగా విద్యార్థులకు నాణ్యమైన కిట్లు అందించేవారు. ఇందుకు గాను సుమారు రూ.30 కోట్లు వెచ్చించేవారు. కొనుగోలు చేసుకున్న కొత్త బ్యాగ్తో.. కమీషన్లు దండుకోవడం సిగ్గుచేటు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కూటమి ప్రభుత్వం సరఫరా చేస్తున్న స్కూల్ బ్యాగులు వారం రోజుల్లోనే చిరిగిపోతున్నాయి. ఈ బ్యాగుల సరఫరాలో కమీషన్లు దండుకోవడం సిగ్గుచేటు. మార్కెట్లో రూ.150 కూడా చేయని నాసిరకం బ్యాగులు ఇచ్చారు. జిప్లు పనిచేయడం లేదు, బెల్టులు తెగిపోతున్నాయి, కుట్లు ఊడిపోతున్నాయి. బడా కాంట్రాక్టర్లకు రూ.వేల కోట్లు కట్టబెట్టారు. గత ప్రభుత్వం ఇచ్చిన కిట్లను రద్దు చేసి, నాసిరకం సరుకు ఇవ్వడం ద్వారా పేద విద్యార్థులను అవమానిస్తున్నారు. జిల్లాలో పంపిణీ చేసిన అన్ని బ్యాగులను వెనక్కి తీసుకుని, నాణ్యమైన బ్యాగులు ఇవ్వాలి. – చింతలపూడి సునీల్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యుడు -
జీవనోపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్నాం
● పండగ వేళల్లో అవకాశం కల్పించాలి ● ఉమ్మడి జిల్లా బాణసంచా తయారీదారుల డిమాండ్ ● పెద్దాపురంలో సర్వసభ్య సమావేశం సామర్లకోట: బాణసంచా తయారీదారులపై అధికారులు కరణ చూపాలని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా బాణసంచా తయారీదారుల సంఘం డిమాండ్ చేసింది. ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కొప్పిశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షతన శనివారం వేట్లపాలెంలో నియోజకవర్గ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కొప్పిశెట్టి శ్రీనివాసరావు, కోనసీమ జిల్లా ఉపాధ్యక్షుడు నామన దుర్గాప్రసాద్, రాజమహేంద్రవరం జిల్లా ఉపాధ్యక్షుడు బాబు బేగ్, కాకినాడ జిల్లా ఉపాధ్యక్షుడు వినకోటి శ్రీనివాసు, నియోజకవర్గ అధ్యక్షుడు కొప్పిశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 60 మంది బాణసంచా లైసెన్సు తయారీదారులు ఉన్నారన్నారు. తాము కుటీర పరిశ్రమగా నడుపుతున్న బాణసంచా తయారీ కేంద్రాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి సుమారు 1,500 మంది జీవిస్తున్నట్లు తెలిపారు. ఆరు నెలలుగా జీవనోపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు, రాబోయే పండగల రోజుల్లో బాణసంచా తయారీకి అధికారులు లైసెన్సులు అందించి, జీవనోపాధి కల్పించాలన్నారు. బాణసంచా తయారీని నిలిపి వేయడంతో దానిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. తమ ఇబ్బందులపై కలెక్టరు, ప్రజాప్రతినిధులను కలిసినా లైసెన్సులు పునరుద్ధరించకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. శివకాశీలో మాదిరిగా బాణసంచా తయారీకి ఏపీఐఐసీ భూముల్లో ఓకే చోట స్థలం కేటాయింపునకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందని, అది తమకు అనువైన నిర్ణయం కాదన్నారు. పెద్ద పరిశ్రమలకు మాత్రమే అటువంటి ప్రణాళికలు ఉపయోగడపడతాయని అభిప్రాయ పడ్డారు. కుటీర పరిశ్రమలకు వ్యక్తిగతంగా స్థలాలు అవసరం ఉంటుందన్నారు. సమావేశంలో నియోజకవర్గ స్టీరింగ్ కమిటీ సభ్యులు జ్యోతుల శ్రీనివాసు, కార్యదర్శి కింతాడ దుర్గారావు, కోఽశాధికారి గుంటముక్కల శ్రీనివాసు అసోసి యేషన్ నాయకులు పాల్గొన్నారు. -
కట్టుకున్న భర్తే కాలయముడు
యానాం: ప్రేమించి, కులాంతర వివాహం చేసుకుని, ఆరేళ్ల కాపురం చేసిన అనంతరం కట్టుకున్న భార్యను ఓ వ్యక్తి దారుణంగా హతమార్చాడు. యానాంలో కలకలం రేపిన ఈ ఘటనపై సీఐ డి.సురేష్బాబు తెలిపిన వివరాల ప్రకారం.. యానాం పట్టణ పరిధిలో భీమ్ నగర్కు చెందిన పువ్వల రేఖ (25), కనకాలపేటకు చెందిన చెక్కా అప్పారావు ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేరుకున్నారు. వీరిలో రేఖ ఎస్సీ సామాజికవర్గానికి, అప్పారావు మత్స్యకార సామాజిక వర్గానికి చెందినవారు. పెళ్లయిన అనంతరం దంపతులిద్దరూ కనకాలపేటలో నివాసం ఉంటున్నారు. అయితే వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో రేఖను అప్పారావు దారుణంగా హింసించి, చాతీపై కూర్చుని ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. మృతదేహాన్ని ఆటోలో తీసుకుని వెళ్లి మెట్టకూరు శివారు గణపతి నగర్ బైపాస్ కాలువలో పడేశాడు. అనంతరం తన భార్య కనిపించడం లేదంటూ యానాం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అప్పారావుపై అనుమానంతో పోలీసులు విచారణ చేయగా కొంతసేపటికి నిజాన్ని అంగీకరించాడు. దీంతో కాలువలో పడేసిన మృతదేహాన్ని పోలీసులు వెలికితీసి, పోస్టుమార్టం కోసం యానాం జీజీహెచ్కు తరలించారు. ఈ దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
పాయసం శ్రీనివాసరావు
వృత్తి : స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్, అయినవిల్లి మండలం నల్ల చెరువు జెడ్పీ ఉన్నత పాఠశాల. రిఫరీగా అర్హత: వెటరన్ రిఫరీ దివంగత రంకిరెడ్డి కాశీ విశ్వనాథం సూచనతో 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఖమ్మంలో జరిగిన స్టేట్ అంపైర్ పరీక్షలో ఉత్తీర్ణత. 2013లో కటక్లో గ్రేడ్–2, 2019లో గ్రేడ్–1 నేషనల్ అంపైర్గా ఉత్తీర్ణత. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ టెక్నికల్ అఫీషియల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు. అలాగే బ్యాడ్మింటన్ ఇండియా టెక్నికల్ అఫీషియల్స్ అసోసియేషన్ దక్షిణ భారతదేశ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు. రిఫరీగా అనుభవం: 15 ఏళ్లు అత్యుత్తమ ప్రాతినిధ్యం ● థామస్ – ఉబెర్ కప్ ఫైనల్స్. ● ఢిల్లీలో అత్యంత ప్రతిష్టాత్మక ప్రపంచ టీమ్ ఛాంపియన్ షిప్. ● వరల్డ్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్, ఢిల్లీ. ● బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్ షిప్. ● హైదరాబాద్లో 37వ జాతీయ క్రీడలు. ● గోవా, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2020. ● ఒడిశా ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ 2026. -
ఆటే పంచప్రాణాలు
సాక్షి, అమలాపురం: కోనసీమ అంటే పచ్చని కొబ్బరి తోటల అందం, గోదావరి పాయల పరవశం మాత్రమే కాదు. ఇప్పుడు షటిల్ బ్యాడ్మింటన్కు కూడా చిరునామాగా మారింది. అంతర్జాతీయ డబుల్స్ సంచలనం సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, ఆకుల సునీల్, కృష్ణంరాజు, డి.సునీల్ కుమార్ వంటి స్టార్ షట్లర్లను ఈ నేల అందించింది. ప్రస్తుతం కోర్టుకు న్యాయం చేసే న్యాయ నిర్ణేతలకు సైతం పుట్టినిల్లుగా మారింది. ఆశ్చర్యం ఏమిటంటే.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న ఐదుగురు టెక్నికల్ అఫీషియల్స్ పేర్లు శ్రీనివాసే కావడం విషయం. పాయసం, గొల్లకోటి, దొడ్డా, ఏవీ, అడపా.. వీరే కోనసీమ షటిల్ పంచ పాండవులు. టీచర్ ఉద్యోగం చేస్తూనే (ఒకరికి త్రుటిలో తప్పింది), షటిల్పై మక్కువతో 18 ఏళ్లుగా కోర్టులో సైడ్లైన్కు, సర్వీస్ ఫాల్ట్లకు కాపలా కాస్తున్న ఈ పంచ పాండవుల ప్రస్థానంపై కథనం. అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన బ్యాడ్మింటర్ రిఫరీలు ఐదుగురి పేరూ శ్రీనివాస్ కావడం గమనార్హం నలుగురు ఉపాధ్యాయులు, ఒకటికి త్రుటిలో తప్పిన అవకాశం -
చికిత్స పొందుతూ యువకుడి మృతి
రౌతులపూడి: రౌతులపూడి – కత్తిపూడి ఆర్ అండ్ బీ రహదారిలో బంగారయ్యపేట సమీపంలో ఈ నెల 20న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ములగపూడికి చెందిన కాపారపు ఏలిసా రాజు (23) చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. వివరాలు.. కాజులూరు మండలం దుగ్గుదుర్రుకు చెందిన కొందరు ఒక ప్రైవేటు కారులో నాతవరం మండలం సరుగుడు వాటర్ పాల్స్కు వెళ్లి తిరిగి వస్తున్నారు. బంగారయ్యపేట సమీపంలో ఎదురుగా రౌతులపూడి వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్న కాపారపు ఏలిసా రాజును ఢీకొన్నారు. తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరిన రాజును వెంటనే స్థానికులు రౌతులపూడి సీహెచ్సీకి తరలించారు. అక్కడి వైద్యుడు భరత్ క్షతగాత్రుడికి వైద్య పరీక్షలు జరిపి, మెరుగైన చికిత్స కోసం కాకినాడ తరలించారు. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ రాజు మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు. కాగా.. రాజుకు తల్లి రాఘవ, తండ్రి వరహాలు, సోదరుడు విజయ్బాబు, సోదరి వరలక్ష్మి ఉన్నారు. మద్యం మత్తులో కారు డ్రైవింగ్ త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడిన కాబోయే వరుడు పిఠాపురం రూరల్: మద్యం మత్తులో అతి వేగంగా డ్రైవింగ్ చేసిన యువకుడు అదుపు తప్పి కాలువ పక్కనున్న పొదల్లోకి కారుతో దూసుకుపోయాడు. పిఠాపురం మహారాజా వారధి సమీపంలో శనివారం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. పెద్దాపురానికి చెందిన దమ్మాల వీర వెంకట దుర్గా ప్రసాద్కు ఈ నెల 26న వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో శనివారం స్నేహితులతో కలిసి మద్యం పార్టీ చేసుకుని అనంతరం కాకినాడ నుంచి పిఠాపురం వైపు కారులో బయలుదేరాడు. మద్యం మత్తులో అతివేగంగా కారు నడపడంతో పిఠాపురం మహారాజా వారధి సమీపాన అదుపు తప్పి రహదారి పక్కనున్న కాలువ పొదల్లోకి దూసుకెళ్లింది. వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు కారులో చిక్కుకున్న దుర్గా ప్రసాద్ను బయటకు తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కారులో వివాహ ఆహ్వాన పత్రికలతో పాటు మద్యం బాటిల్ ఉన్నట్లు గుర్తించారు. కాగా.. దుర్గా ప్రసాద్ కాకినాడ ఎస్ఆర్ఎంటీ – ఏపీఎస్పి ప్రాంతం మధ్యలో కారు నడుపుతూ పలుమార్లు అటూ ఇటూ ఊపుతూ, ఎదురుగా వెళుతున్న ఆటోలను సైతం పక్కకు తప్పించుకుంటూ వచ్చినట్లు ఓ ఆటో డ్రైవర్ తెలిపాడు. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి అడ్డతీగల: ట్రాక్టర్ను ఆటో ఢీకొన్న ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న గిరిజన మహిళ మృతి చెందింది. అడ్డతీగల మండలం వీరభద్రపురం వద్ద జాతీయ రహదారిపై శనివారం ఈ ప్రమాదం జరిగింది. వీరంపాలెం గ్రామానికి చెందిన 12 మంది ఆటోలో రాజవొమ్మంగి వెళ్లి స్వగ్రామానికి తిరిగి వస్తున్నారు. వీరభద్రపురం వద్ద ఆ గ్రామం నుంచి జాతీయ రహదారిపైకి ట్రాక్టర్ వస్తుండగా, దాన్ని తప్పించబోయి ఆటో ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న లోతా లక్ష్మి సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. అదే గ్రామానికి చెందిన బచ్చల చంటమ్మ, పేరు కాంతమ్మ, రేవుల ఈశ్వరమ్మ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అడ్డతీగల సీహెచ్సీకి తరలించారు. ఈ ఘటనపై అడ్డతీగల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దొడ్డా శ్రీనివాస్
వృత్తి: స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గూడపల్లి పల్లిపాలెం, మలికిపురం మండలం. రిఫరీ అర్హత: 2011లో స్టేట్ అంపైర్ గా ఉత్తీర్ణత. 14 ఏళ్లుగా సేవలు అత్యుత్తమ ప్రాతినిధ్యం ● సౌత్ ఆసియా ఛాంపియన్ షిప్, హైదరాబాద్. ● సబ్ జూనియర్ నేషనల్ ఛాంపియన్ షిప్. ● ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్. ● ఆల్ ఇండియా మాస్టర్స్ ర్యాంకింగ్ టోర్నమెంట్. ● రాష్ట్ర స్థాయి ఛాంపియన్ షిప్, ఎస్జీఎఫ్, సీబీఎస్ఈ, సీఐఎస్ఈ జాతీయ టోర్నమెంట్లు అడబాల విజయ శ్రీనివాస్ వృత్తి: స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కేశనపల్లి, మలికిపురం మండలం. రిఫరీ అర్హత: 2007 స్టేట్ రిఫరీ, 2012లో గ్రేడ్–2, 2017లో గ్రేడ్–1 రిఫరీలు రిఫరీగా అనుభవం: 18 ఏళ్లు అత్యుత్తుమ ప్రాతినిధ్యం ● వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ 2009, హైదరాబాద్. ● ఇండియన్ ఓపెన్ వరల్డ్ సూపర్ సిరీస్, ఢిల్లీ. ● ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్, హైదరాబాద్. ● సౌత్ జోన్, సెంట్రల్ జోన్ ఇంటర్ స్టేట్ ఛాంపియన్ షిప్స్. ● ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ ఛాంపియన్ షిప్స్. -
పుత్రశోకంలోనూ ప్రాణదాతలై..
కాకినాడ రూరల్/సఖినేటిపల్లి: ఎదిగొచ్చిన కుమారుడు తమకు అండగా ఉంటాడని మురిసిపోయిన ఆ తల్లిదండ్రులను విధి చిన్న చూపు చూసింది. డ్రైవర్గా పనిచేస్తూ చేదోడుగా ఉన్న అతడిని వారికి దూరం చేసింది. అయితే కుమారుడి అవయవాలను దానం చేసి, పుత్ర శోకంలోనూ ఆ తల్లిదండ్రులు ఆదర్శంగా నిలిచారు. వివరాల్లోకి వెళితే.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ముత్యాల తేజా దుర్గ హనుమంత్ (19) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయ్యాడు. బిడ్డను కోల్పోయిన విషాదంలో ఉన్న తల్లిదండ్రులు వరలక్ష్మి, నాగేశ్వరరావు, మేనమామ రావి ఆంజనేయులు, అక్కా బావ చల్లా శిరీష, పవన్లు హనుమంత్ అవయవదానానికి ముందుకు వచ్చి సమ్మతించారు. ఈ మేరకు సర్పవరం జంక్షన్లోని కిమ్స్ ట్రస్ట్ ఆస్పత్రిలో శనివారం తెల్లవారుజామున హనుమంత్ అవయవాలను సేకరించారు. ఒక కిడ్నీని కిమ్స్ ట్రస్ట్ ఆస్పత్రిలో అవసరమైన రోగికి విజయవంతంగా మార్పిడి చేశారు. మరో కిడ్నీని అవయవ కేటాయింపు ప్రక్రియ ప్రకారం విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కిమ్స్ ట్రస్ట్లో నిర్వహించిన క్యాడావర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కార్యక్రమంలో సర్జన్ డాక్టర్ గణేష్ ఆదిమూలం, వైద్యులు సనా ప్రవీణ్, కిశోర్ కుమార్, కళ్యాణ్ చక్రవర్తి, ఎస్పీహెచ్ఎస్ రామకృష్ణ పాల్గొన్నారు. కిడ్నీ మార్పిడి విజయవంతంగా జరిగినట్టు కిమ్స్ ట్రస్ట్ ఆస్పత్రి సీఓఓ డాక్టరు రవి సంతోష్ తెలిపారు. గేదె అడ్డురావడంతో ప్రమాదం సఖినేటిపల్లి మండలం అంతర్వేదికరకు చెందిన ముత్యాల తేజ దుర్గా హనుమంతు ఈ నెల 17వ తేదీ రాత్రి అంతర్వేది దేవస్థానం నుంచి ఇంటికి బైక్పై వస్తున్నాడు. మార్గం మధ్యలో గేదె అడ్డు రావడంతో దాన్ని ఢీకొని పడిపోయాడు. అపస్మారక స్థితికి చేరుకున్న అతడిని కుటుంబ సభ్యులు తొలుత మలికిపురం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అటుపై మెరుగైన చికిత్స కోసం అమలాపురం కిమ్స్, అక్కడ నుంచి కాకినాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, అనంతరం ట్రస్టు ఆసుపత్రికి తరలించారు. అక్కడ గత రాత్రి హనుమంతు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అనారోగ్యంతో బాధపడుతున్న కొందరికి జీవితం ఇవ్వాలన్న ఉద్దేశంతో హనుమంతు అవయవాలను తల్లిదండ్రులు దానం చేశారు. ఆదర్శంగా నిలిచిన తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదంలో కుమారుడు బ్రెయిన్ డెడ్ అవయవాలను దానం చేసిన కుటుంబ సభ్యులు కిమ్స్ ట్రస్ట్ హాస్పటల్లో విజయవంతంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ -
పాము కాటుకు వ్యవసాయ కూలీ మృతి
పి.గన్నవరం: కొబ్బరి తోటలో పనిచేస్తుండగా పాము కాటు వేయడంతో వ్యవసాయ కూలీ మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే. కె.ఏనుగుపల్లికి చెందిన శేరు ముసలయ్య (49) చేపల వేటతో పాటు, వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం ఉదయం వై.కొత్తపల్లి సమీపంలో ఒక రైతుకు చెందిన తోటలో కొబ్బరి కాయలు దింపు తీస్తుండగా, ముసలయ్య వాటిని పోగు చేసి మరొక చోటికి తరలిస్తున్నాడు. ఈక్రమంలో అతడి ఎడమ కాలుపై పొడపాము కాటు వేసింది. సంబంధిత రైతు ముసలయ్యను వెంకటనే కారులో పి.గన్నవరం సీహెచ్సీకి తీసుకువచ్చాడు. అక్కడ చికిత్స పొందుతూ ముసలయ్య మృతి చెందాడు. మృతుడికి భార్య మంగాదేవి, కుమారుడు దుర్గా ప్రసాద్, కుమార్తె కొండాలక్ష్మి ఉన్నారు. మృతదేహానికి రాజోలు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ప్రమాదానికి కారణమైన పామును గ్రామస్తులు హతమార్చారు. పి.గన్నవరం ఎస్సై ఇ.నరసింహమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రాష్ట్ర స్థాయి క్రీడలకు గిరిజన విద్యార్థిని
రాజవొమ్మంగి: స్థానిక గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బోయపాడు గ్రామానికి చెందిన కాకూరి దీక్షిత అమరావతిలో త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి క్రీడాపోటీలకు ఎంపికై ంది. ప్రిన్స్పాల్ సత్యవేణి శుక్రవారం విలేకరులకు ఈ విషయం తెలిపారు. ఇటీవల పాడురులో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో అండర్ – 17 విభాగంలో కోకోలో ఆమె ప్రతిభ చూపిందన్నారు. కాగా.. ఆ బాలికను పలువురు అభినందించారు. సమస్యలపై రాజీలేని పోరాటం రామచంద్రపురం రూరల్: రాష్ట్రంలో విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటాలు చేయాలని పీవైఎల్ మహాసభలో వక్తలు అన్నారు. రామచంద్రపురంలోని చెలికాని రామారావు స్మారక భవనంలో శుక్రవారం నిర్వహించిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా 7వ మహాసభలో పలు తీర్మానాలు చేశారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలని, మద్యం, గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలను నిషేధించాలని, నీట్ పరీక్ష లీకేజీ, అవినీతి, అక్రమాల కారణంగా ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థులకు కుటుంబాలకు రూ. 1 కోటి చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద ఓసీ విద్యార్థుల స్కాలర్షిప్పులు, ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ బకాయిలను తక్షణం విడుదల చేయాలని తదితర తీర్మానాలు చేశారు. నేటి నుంచి వనదుర్గమ్మ జాతర అన్నవరం: రత్నగిరి వనదేవతగా పూజలందుకుంటున్న వనదుర్గమ్మ శ్రావణ మాస జాతర మహోత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. వీటిని ఈ నెల 28 తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు శనివారం ఉదయం తొమ్మిది గంటలకు వనదుర్గ అమ్మవారి ఆలయంలో పండితులు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం నిర్వహించి జాతర మహోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. నవధాన్యాలతో మండపారాధన, కలశస్థాపన జరుపుతారు. 50 మంది రుత్విక్కులు నవగ్రహ జపాలు, శ్రీచక్రార్చన, మూలమంత్ర జపాలు నిర్వహిస్తారు. జాతరలో భాగంగా అమ్మవారిని తొలిరోజు బాలా త్రిపుర సుందరిగా, 23న సరస్వతిగా, 24న అన్నపూర్ణగా, 25న మహాలక్ష్మిగా, 26న గాయత్రీదేవిగా, 27న వారాహి అమ్మవారిగా, 28న రాజరాజేశ్వరిగా అలంకరించి పూజలు నిర్వహిస్తారు. తలుపులమ్మకు చండీహోమం తుని రూరల్: లోవదేవస్థానంలోని తలుపులమ్మ తల్లికి వేదపండితుల, అర్చకులు మహాచండీ హోమం, కుంకుమార్చనలు నిర్వహించారు. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమాల అనంతరం భక్తులకు దర్శనాలు కల్పించారు. హత్య కేసులో నిందితుడి అరెస్ట్ శంఖవరం: పి.మల్లాపురం పంచాయతీ శృంగధార గ్రామంలో రాజమ్మంగి మండలం వాతంగి పంచాయతీ ఓకూర్తి గ్రామానికి చెందిన ముర్లా మణికుమార్ను హత్య చేసిన ఘటనలో నిందితుడు కాకూరి చంద్రయ్యను శుక్రవారం అరెస్ట్ చేశారు. ప్రత్తిపాడు సీఐ సూర్య అప్పారావు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రయ్య, భార్య సూర్యావతిలను గతంలో మణికుమార్ నాటు తుపాకీతో కాల్చి గాయపర్చాడు. ఆ కేసులో జైలు శిక్ష అనుభవించి తిరిగి వచ్చాడు. అనంతరం మళ్లీ సూర్యావతిని ఇబ్బంది పెట్టడంతో మణికుమర్కు చంద్రయ్య హత్య చేశాడు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి, త్వరితగతిన విచారణ చేపట్టి, 72 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు అన్నవరం ఎస్సై శ్రీహరిబాబు తెలిపారు. -
ప్రశ్నిస్తే పరారవుతారా!
కపిలేశ్వరపురం (మండపేట): ప్రభుత్వ లోపాలను ప్రశ్నిస్తామని తెలిసి, ముందే కౌన్సిల్కు మంత్రి నారా లోకేష్ పరారు కావడం, ఆయన బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండిపడ్డారు. రాష్ట్రంలోని డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై తాము బాధ్యతాయుతంగా కౌన్సిల్లో ప్రశ్నించామన్నారు. ప్రతి రోజూ అసెంబ్లీకి వచ్చిన లోకేష్ ఆ కౌన్సిల్కు రాకపోవడంతో తమ ఆరోపణలు వాస్తవమని తేలిందన్నారు. శుక్రవారం మండపేటలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో విలేకరులతో ఎమ్మెల్సీ త్రిమూర్తులతు మాట్లాడారు. రాష్ట్రంలో నిరుద్యోగులు, రైతులు, మహిళలు, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై తాము ప్రశ్నించామని, అవి పరిష్కారమవుతాయని ఆశించిన ప్రజలకు చంద్రబాబు ప్రభుత్వం నుంచి నిరాశ ఎదురైందన్నారు. డీఎస్సీలో సుమారు 400 మందికి క్రీడా కోటాలో ఉద్యోగాలిచ్చామని చెప్పడం, అందుకు క్రీడాకారిణి పీవీ సింధూకు ఉద్యోగం ఇవ్వడంతో పోల్చి చెప్పడం వెనుక లోకేష్ అక్రమాలకు పాల్పడారన్న దానికి బలం చేకూరుతుందన్నారు. పీవీ సింధూ వంటి స్థాయి క్రీడాకారులకు గౌరవార్థం ఉద్యోగాలిస్తారని, వారు ఉద్యోగ విధుల్లో ఉండకపోవచ్చన్నారు. సింధూతో పోల్చడాన్ని బట్టి చూస్తే చంద్రబాబు ప్రభుత్వంలో క్రీడా కోటాలో ఉద్యోగాలు పొందిన 400 మంది ఉద్యోగ విధుల్లో చేరకపోయినా ఫర్వాలేదా అని ప్రశ్నించారు. అవస్థలకు ఎల్నినో కారణమా? సాగునీరు అందక రైతులు అవస్థ పడుతున్నారని, ఎల్నినో కారణమంటూ కూటమి చెప్పడాన్ని ఎమ్మెల్సీ తోట తప్పుబట్టారు. పంట సాగు చేసే ముందే సాగునీటి పరిస్థితిపై రైతులకు అవగాహన కల్పించకపోవడాన్ని నిలదీశారు. అన్నదాతా సుఖీభవ పేరుతో ఏడాదికి రూ.20 వేల చొప్పున రెండేళ్లలో రూ.40 వేల పెట్టుబడి సాయం అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు రూ. మూడు వేల నిరుద్యోగ భృతి హామీలు అమలు కాలేదన్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల పేరుతో కూటమి ప్రభుత్వం హడావుడి చేస్తుందని, వాస్తవానికి అమలు చేసే చిత్తశుద్ధి మాత్రం కనిపించడం లేదని ఎమ్మెల్సీ అన్నారు. దీనికి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా కేంద్రంతో చర్చించి ఆ అంశాన్ని 9వ షెడ్యూల్లో పెట్టించాలన్నారు. బీసీలకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 50 శాతానికి పైగా రాజకీయపరంగా రిజర్వేషన్లు ఇచ్చారని గుర్తుచేశారు. చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీబీఐ విచారణకు సిద్ధం డీఎస్సీ అక్రమాలపై సమాధానం చెప్పలేని ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో గ్రూప్స్ నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ ఇంతకాలం తర్వాత హంగామా చేస్తుందని త్రిమూర్తులు మండిపడ్డారు. గత ప్రభుత్వంలో గ్రూప్స్, ప్రస్తుత ప్రభుత్వంలోని డీఎస్సీ రెండింటి మీదా కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో సీబీఐ విచారణ వేసుకోవచ్చని చెప్పారు. అధికారం చేతిలో ఉండగా, చేయాల్సిన పనులు చేయకుండా గత ప్రభుత్వంపై బురద చల్లడం, అసెంబ్లీలో కూటమి ప్రతినిధులతో ప్రశంసించుకోవడంతో చంద్రబాబు ప్రభుత్వం కాలం వెళ్లబుచ్చుతుందన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉద్యోగాలివ్వలేదంటూ కూటమి అధినాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారానికి ప్రజలే సమాధానం చెబుతారన్నారు. ఫ బాధ్యతారాహిత్యంగా మంత్రి లోకేష్ తీరు ఫ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండిపాటు ఫ చిత్తశుద్ధి ఉంటే డీఎస్సీపై విచారణకు ఆదేశించండి -
ముస్లింలపై దుష్ప్రచారం దారుణం
కాకినాడ క్రైం: పంచాయతీ రాజ్ ఏఈ నూకరాజు కుటుంబం మూకుమ్మడి ఆత్మహత్య ఘటనలో సాధిక్ ఖాన్ అంశం తెరమీదికి వచ్చినప్పటి నుంచి ముస్లిం సమాజాన్ని కించపరిచేలా కొందరు దారుణమైన ప్రచారం చేస్తున్నారని ముస్లిం అడ్వకేట్స్ అసోసియేషన్ (మా) రాష్ట్ర అధ్యక్షుడు, ముస్లిం మైనారిటీ జేఏసీ కో కన్వీనర్ ఎండీ జవహర్ అలీ అన్నారు. ఈ మేరకు కాకినాడ గంజాం వారి వీధిలోని తన కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఏ మూల ఏం జరిగినా ముస్లింలతో ముడిపెట్టడం పరిపాటిగా మారిందన్నారు. తప్పు చేసిన వ్యక్తిని కేవలం వ్యక్తిగతంగానే చూడాలి తప్ప యావత్ కులానికో, మతానికో ఆపాదించడం తగదని హితవు పలికారు. హిందూ ముస్లింల మధ్య తారతమ్యాలు సృష్టించి, లేనిపోని గొడవలు పెట్టి, తమ పబ్బం గడుపుకోవడానికి కుటిల యత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రశాంతతకు మారుపేరైన కాకినాడ నగరంలో ముస్లింలు, హిందువులతో సహా మిగిలిన మతస్తులు అందరితోనూ ఎంతో సోదరభావంతో మెలుగుతారన్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా ముస్లింలపై చేస్తున్న దుష్ప్రచారాలకు అడ్డూ అదుపూ లేదని, అడ్డుకునే నాథుడు కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితిని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పారు. తప్పు చేసే ఏ ఒక్కరికీ తమ మద్దతు ఉండదని, చట్టం ముందు కులమతాలకు అతీతంగా ఎవరైనా సమానులేనని జవహర్ అలీ స్పష్టం చేశారు. సమావేశంలో మా జాయింట్ సెక్రటరీ యజజుద్దీన్, వైఎస్సార్ సీపీ మైనారిటీ నాయకుడు ఎండీ అస్గర్, జేఐహెచ్ కాకినాడ నాయకులు ఎండీ రహత్ షరీఫ్, ఎస్డీ ఇమ్రాన్, టీడీపీ మైనారిటీ నాయకుడు ఎం.ఇనాముల్లాహ్, ఎండీ బాషా తదితరులు పాల్గొన్నారు. తప్పు చేసిన ఎవరైనా చట్టం ముందు సమానులే సాధిక్ ఖాన్ ఘటనతో మతానికి సంబంధం ఏమిటి? ముస్లిం మైనారిటీ జేఏసీ కో కన్వీనర్ జవహర్ అలీ -
పండగ వేళ పెను విషాదం
● జ్యూస్ తయారు చేస్తుండగా విద్యుత్ షాక్ ● రాయవరంలో చిరు వ్యాపారి మృతి రాయవరం: శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీ వ్రతం చేసుకునేందుకు భార్య సిద్ధమైంది. ఈ లోపు జ్యూస్ షాప్ నిర్వహిస్తున్న ఆమె భర్త విద్యుత్ షాక్తో మృతి చెందాడు. ఈ హృదయ విదారక ఘటన రాయవరంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా కావలికి చెందిన జి.వెంకటేశ్వర్లు (42) రాయవరం బస్టాండ్ సెంటర్లో భార్య భవానీతో కలిసి కొన్నేళ్లుగా ఫ్రూట్ జ్యూస్ షాపు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం మిక్సర్లో జ్యూస్ తయారు చేస్తుండగా విద్యుత్ షాక్కు గురయ్యాడు. వరలక్ష్మీ వ్రతం చేసుకునేందుకు సిద్ధమవుతున్న భవానీ వెంటనే ఈ విషయాన్ని గమనించి, విద్యుత్ షాక్ను తప్పించేందుకు చీపురుతో బలంగా కొట్టింది. అప్పటికే పరిస్థితి విషమించడంతో వెంకటేశ్వర్లు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమకు దేవుడు అన్యాయం చేశాడంటూ ఆమె బోరును విలపించింది. ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ఇద్దరు చిన్నారులతో కలిసి విలపిస్తున్న ఆమెకు స్థానికులు భరోసాగా నిలిచారు. వెంకటేశ్వర్లు మృతదేహాన్ని కావలి తీసుకువెళ్లేందుకు వ్యాపారులు, ఆటో యూనియన్ నాయకులు, స్థానికులు కలిసి రూ.30 వేలు సేకరించి అంబులెన్స్ను ఏర్పాటు చేశారు. పుట్టెడు దుఖంతో భర్త మృతదేహాన్ని తీసుకుని భవాని కావలికి బయలుదేరింది. -
కోయకుండానే కన్నీరు!
● పెరిగిన ఉల్లిపాయల ధర ● ఇతర కూరగాయలదీ అదే దారి ● సామాన్య ప్రజల అవస్థలు తాళ్లపూడి: సాధారణంగా ఉల్లిపాయలు కోసినప్పుడు మన కళ్ల నుంచి కన్నీళ్లు వస్తాయి. అది సాధారణంగా జరిగే విషయమే అయినప్పటికీ ఇప్పుడు పెరిగిన ధరలతో ఉల్లిపాయలను కొనాలంటేనే కన్నీరు వస్తోంది. ఇతర కూరగాయల ధరలు కూడా పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది రోజులుగా కూరగాయల రిటైల్ మార్కెట్లు, రైతు బజార్లు, స్థానిక సంతలలో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ నెల మొదటి వారంలో నాణ్యమైన ఉల్లి కిలో రూ.25 నుంచి రూ.30 వరకు ఉండగా, ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో రూ.45 నుంచి రూ.50కి పైనే చేరింది. చిరు వ్యాపారులు ఆటోలపై ఇళ్ల వద్దకు వచ్చి విక్రయించే కొంచెం నాసిరకం ఉల్లిపాయలను మూడు కిలోలు రూ.100కు ఇస్తున్నారు. ఇటీవల మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో సంభవించిన ప్రకతి వైపరీత్యాలతో ఉల్లి పంట తీవ్రంగా దెబ్బతింది. దీనికి తోడు ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తి వేశారు. ఆ ప్రభావం దిగుమతులపై పడింది. డిమాండ్కు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో ఉల్లి ధరలు పెరిగిపోతున్నాయి. ధరల నియంత్రణ ఎక్కడ? ఉల్లి ధరల నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. ఉల్లి ఎగుమతులను నిషేధించడంతో పాటు నాఫెడ్లోని ఉల్లి నిల్వలను మార్కెట్లోకి అందుబాటులోకి తెస్తే ధరల నియంత్రణ సాధ్యమవుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కొవ్వూరు, తాళ్లపూడి, చాగల్లు మార్కెట్లలో అన్ని రకాల కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. కిలో ఉల్లిపాయలు రూ.45 నుంచి రూ.50, పచ్చిమిర్చి రూ.50, బీరకాయ, రూ.50, ఆకాకర రూ.160, టమాటా, బెండ, దొండ రూ.30, బీన్స్ రూ.150, క్యారెట్, బీట్రూట్, తెల్లవంకాయలు రూ.50, అల్లం రూ.120 పలుకుతున్నాయి. మరోవైపు ఆకుకూరలు, కొత్తి మీర ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. -
అన్న ప్రసాదంపై భక్తుల అసంతృప్తి!
● అన్నవరంలో నిత్యాన్నదానం ● చల్లారితే తినలేని పరిస్థితి ● బియ్యం నాణ్యతపై అనుమానాలు ● ప్రతిరోజూ 5 వేల మందికి భోజనం అన్నవరం: సత్యదేవుని ఆలయంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకంలో భోజనంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో భోజనం బాగుండేదని, ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బియ్యంలో నాణ్యత లేకపోవడంతో అన్నం వేడిగా ఉన్నప్పుడు తప్ప, వేడి తగ్గితే తినలేని పరిస్థితి ఉందని చెబుతున్నారు. కూరలు, పప్పు, సాంబారు కూడా చాలాసార్లు బాగోవడం లేదంటున్నారు. అన్నదాన విభాగంలో ఒకప్పుడు చేయితిరిగిన వంటవారు ఉండేవారు. వారందరూ ఉద్యోగ విరమణ చేశాక తాత్కాలిక పద్ధతిపై పనిచేసేవారే కొనసాగుతున్నారు. వారు కూడా కేవలం ఆరుగురే ఉండటం, వారికి అంతగా అనుభవం లేకపోవడం కూడా ఆహార పదార్థాల నాణ్యత తగ్గడానికి కారణంగా చెబుతున్నారు. ప్రతి రోజూ సుమారు ఐదు వేల మంది అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. రూ.69 కోట్లకు అన్నదానం డిపాజిట్లు సత్యదేవుని నిత్యాన్నదాన పథకానికి ఇప్పటివరకు భక్తులు సమర్పించిన విరాళాల డిపాజిట్లు రూ.69 కోట్లకు చేరాయి. వీటిపై ఏటా వచ్చే వడ్డీ రూ.4 కోట్లు. ఇక ఒక భోజనం తయారీకి రూ.39 వ్యయం అవుతుందని అంచనా. భోజనంలో సత్యదేవుని గోధుమ నూక ప్రసాదంతో పాటు పులిహోర, అన్నం, పప్పు, కూర, సాంబారు, మజ్జిగ వడ్డిస్తారు. ఇవీ ఇబ్బందులు నిత్యాన్నదానంలో వినియోగించే బాయిల్డ్ రైస్ను ఒక ప్రముఖ బియ్యం విక్రయ సంస్థ టెండర్ ద్వారా కేజీ రూ.42కు సరఫరా చేస్తోంది. తక్కువ నాణ్యత కలిగిన బియ్యాన్ని బాయిల్డ్ రైస్ అని చెప్పి సరఫరా చేస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. పీడీఎస్ బియ్యాన్ని పాలిష్ చేయించి సరఫరా చేస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ బియ్యం కొంత ఎక్కువ సేపు ఉడికితే జావ అయిపోవడం, తక్కువ ఉడికితే పలుకుగా ఉండటం జరుగుతోంది. దీంతో వేడిగా ఉంటే తప్ప ఈ అన్నం తినలేకపోతున్నామని భక్తులు చెబుతున్నారు. చర్యలు తీసుకుంటాం : ఈవో ఈ విషయాన్ని దేవస్థాన ఈవో ఎన్.సూర్యచక్రధరరావు దృష్టికి తీసుకెళ్లగా అన్నదాన పథకం అమలు తీరుపై దాదాపు ప్రతిరోజూ తనిఖీ చేస్తున్నానని చెప్పారు. భోజనం నాణ్యంగానే ఉందని భక్తులు చెబుతున్నారని, ఇంకా బాగుండేలా తగు చర్యలు తీసుకుంటానన్నారు. సాంబారు, పచ్చడి తయారీకి అవసరమైన కొబ్బరి ముక్కలు కాంట్రాక్టర్ ఇచ్చేలా తదుపరి టెండర్లో షరతు పెడతామన్నారు. రుచి లేక.. గతంలో సాంబారులో కొబ్బరి కోరు వేసేవారు. కొబ్బరి పచ్చడి కూడా వడ్డించేవారు. గతంలో దేవస్థానంలో వ్రతాల్లో భక్తులు కొట్టిన కొబ్బరి ముక్కలు తీసుకునే కాంట్రాక్టర్ అన్నదానం పథకానికి అవసరమైనన్ని కొబ్బరి ముక్కలు సరఫరా చేయాలనే నిబంధన ఉండేది. గతేడాది ఈ నిబంధన తీసేసి టెండర్ కం వేలం నిర్వహించారు. దీనివల్ల అన్నదాన పథకానికి కొబ్బరి ముక్కలు రాకపోవడంతో సాంబారు, పచ్చడిలో కొబ్బరి లేక అవి రుచిగా ఉండడం లేదు. గురువారం అన్నదానంలో భోజనం చేసిన అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్ అజాద్ కూడా సాంబారు రుచి, నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సాంబారును మరింత చిక్కగా, రుచిగా తయారు చేయాలని ఆదేశించారు. అలాగే క్యూలైన్లో వేచివుండే భక్తులు కూర్చునే సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారు. -
వీరి రూటు సెపరేటు!
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో పదోన్నతుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. అర్హతలు, సీనియారిటీతో సంబంధం లేకుండా కొందరికి పదోన్నతులు కల్పించేందుకు భారీగా ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలు బ్యాంకు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల పదోన్నతుల పేరుతో సుమారు రూ.2 కోట్ల మేర అక్రమ వసూళ్లు జరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పదోన్నతులు పొందిన కొందరు ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్లలో (ఎస్ఆర్) సీనియారిటీని మార్చినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఉద్యోగంలో చేరిన వారిని సైతం పదేళ్లకు పైగా క్రితమే విధుల్లో చేరినట్లుగా రికార్డులు సృష్టించి పదోన్నతులు కల్పించినట్లు బ్యాంకు వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అవకతవకలు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం ప్రాంతానికి చెందిన ఒక ఉద్యోగి సర్వీస్ రికార్డుల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. సహకార సంఘం అధ్యక్షుడి సంతకంతో సర్వీస్ వివరాలను మార్చినట్లు, అనంతరం సీనియారిటీ ఆధారంగా పదోన్నతి పొంది ప్రస్తుతం ఊడిమూడి పీఏసీఎస్ సీఈఓగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి మరికొన్ని ఎస్ఆర్లను కూడా సృష్టించి పదోన్నతులు కల్పించినట్లు బ్యాంకు వర్గాల్లో చర్చ జరుగుతోంది. పి.గన్నవరం సహకార సంఘంలో ఒక ఉద్యోగి స్టాఫ్ అసిస్టెంట్గా 14 నెలల 29 రోజులు పనిచేసి, అనంతరం 8 నెలల 5 రోజులు వడ్డిపర్రు సహకార సంఘంలో పనిచేసినట్లు, ప్రస్తుతం అదే వ్యక్తి వడ్డిపర్రు సహకార సంఘంలో ఇన్చార్జ్ సీఈవోగా పనిచేస్తున్నట్లు ఎస్ఆర్లో నమోదు చేశారు. అయితే ఎక్కడ పనిచేస్తే అక్కడ సహకార సంఘ అధ్యక్షులతో ఎస్ఆర్లో సంతకాలు పెట్టించుకోవాల్సి ఉండగా ఆ వ్యక్తి వడ్డిపర్రు సహకార సంఘం అధ్యక్షుడితో మూడు చోట్ల సంతకాలు చేయించుకున్నారు. ఇద్దరికి కీలక పదోన్నతులు డీసీసీబీ పరిధిలో ఇటీవల ఇద్దరు ఉద్యోగులకు కల్పించిన పదోన్నతులు కూడా అనుమానాలకు తావిస్తున్నాయి. రాజమహేంద్రవరంలో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగికి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఏజీఎం)గా పదోన్నతి లభించినట్లు సమాచారం. అదే విధంగా కాకినాడ జిల్లాలో సీనియర్ ఏజీఎంగా పనిచేస్తున్న మరో ఉద్యోగికి ఇన్చార్జి డీజీఎం బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ రెండు పదోన్నతుల విషయంలోనూ భారీగా ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సమగ్ర విచారణకు డిమాండ్ డీసీసీబీలో కొంత కాలంగా చోటుచేసుకున్న పదోన్నతులపై సర్వీస్ రిజిస్టర్లు, సీనియారిటీ జాబితాలు, నియామక ఉత్తర్వులు, పదోన్నతి కమిటీ నిర్ణయాలు, ఉద్యోగుల అర్హతలు, ఆర్థిక లావాదేవీలను సమగ్రంగా పరిశీలించాలని ఉద్యోగులు, సహకార రంగానికి చెందిన పలువురు కోరుతున్నారు. రూ.2 కోట్ల మేర ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలు నిజమా, ఎవరెవరి పాత్ర ఉంది, సర్వీస్ రిజిస్టర్లలో మార్పులు జరిగాయా అన్న విషయాలపై ఉన్నతస్థాయి విచారణ జరిగితే అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. జనసేన నేత పాత్రపై ఆరోపణలు పదోన్నతుల వ్యవహారంలో ఓ జనసేన నేత కీలకంగా వ్యవహరించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించి సిఫారసులు చేయడంతో పాటు వ్యవహారాలను చక్కదిద్దడంలో ఆయన పాత్ర ఉందని కొందరు ఆరోపిస్తున్నారు. కోనసీమ జిల్లా మాదిరిగా కాకినాడ జిల్లాలో పలు సహకార సంఘాల్లో తప్పుడు ఎస్ఆర్లు సృష్టించి ఉద్యోగాలు పదోన్నతుల పేరుతో భారీగా దండుకొనేందుకు సంబంధిత జనసేన నేత పన్నాగం పన్నినట్లు తెల్సింది. కానీ దీనికి జిల్లా సహకార శాఖ అధికారులు మోకాలడ్డు వేయడంతో కాకినాడ జిల్లాలో అక్రమాలకు అడ్డుకట్టపడిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. డీసీసీబీలో పదోన్నతుల మాయాజాలం! డబ్బులిచ్చి ప్రమోషన్లు పొందారనే ఆరోపణలు రూ.రెండు కోట్ల మేర ముడుపులు సర్వీస్ రిజిస్టర్లలో అక్రమ మార్పులపై అనుమానాలు -
కొనసాగిన జూడాల నిరసన
కాకినాడ క్రైం: జూనియర్ డాక్టర్ల నిరసన పదో రోజు శుక్రవారం కొనసాగింది. కాకినాడ జీజీహెచ్ ఎదురుగా ఉన్న పీజీ వసతి గృహ ఆవరణలో 600 మంది జూనియర్ డాక్టర్లు నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్ట్రైఫండ్ 15 నుంచి 30 శాతం పెంచాలని, వైద్యుల పదోన్నతి వయసు 65 ఏళ్లకు పెంచాలన్న నిర్ణయాన్ని విరమించుకోవాలని, ఎండీ, ఎంఎస్లు చేసిన వైద్యులకే అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల్లో తొలి ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాడతామని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ జెండా ఎగరాలి పార్టీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు పిలుపు రాజమహేంద్రవరం రూరల్: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేసేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి, రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా చెల్లుబోయిన వేణును పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో పార్టీ శ్రేణులు శుక్రవారం బొమ్మూరులోని పార్టీ కార్యాలయానికి చేరుకుని ఆయన్ని పుష్ఫగుచ్చాలు, శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. కేఆర్జే రాజేష్ మిత్ర బృందం హుకుంపేట డీబ్లాకు తదితర ప్రాంతాల నుంచి భారీ బైక్ ర్యాలీగా వచ్చి వేణును సన్మానించారు. కొంతమూరు నుంచి వైఎస్సార్ సీపీ మెనార్టీ సెల్ అధికార ప్రతినిధి ఎంఎం అలీ, నియోజకవర్గ పంచాయతీరాజ్ విభాగ అధ్యక్షుడు చెరుకూరి సత్యనారాయణలతో కలసి వచ్చి వేణును సత్కరించారు. పార్టీ మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ హమీద్ బాషా, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ నిజాముద్దీన్, ధవళేశ్వరం గ్రామానికి చెందిన పార్టీ నేత మెండా రాజేష్ మిత్ర బృందం, దామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన దళిత నేతలు వచ్చి వేణుకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. చంద్రబాబు ప్రభుత్వం బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచిందన్నారు. ప్రభుత్వం మోసాలను ప్రజలకు వివరించాలన్నారు. ‘సర్’పై నేడు, రేపు ప్రత్యేక ప్రచార దినాలు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–2026లో భాగంగా శని, ఆదివారాల్లో జిల్లాలో ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం తెలిపారు. అర్హులను ఓటరుగా నమోదు చేయడం, ఓటర్ల జాబితాలోని వివరాలను పరిశీలించడం, ఓటర్ల వివరాల్లో తప్పులు ఉంటే సరిచేయడం వంటివి చేపడుతున్నామని తెలిపారు. జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బూత్ స్థాయి అధికారులు తప్పనిసరిగా అందుబాటులో ఉండి ఓటర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు. స్వీకరించిన దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించి, జాప్యం లేకుండా ఆన్లైన్ చేయాలని ఆదేశించారు. ఆ రోజుల్లో ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యే సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. అంతర్వేదిలో సామూహిక వ్రతాలు సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో శ్రావణ మాసం రెండో శుక్రవారం పురస్కరించుకుని దేవస్థానం ఆధ్వర్యంలో సా మూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. ఆల య ఈవో ఎంకేటీఎన్వీ ప్రసాద్ పర్యవేక్షణలో ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్ ఆధ్వర్యంలో వింజమూరి రామరంగాచార్యులు, అర్చకులు వరలక్ష్మీ వ్రతాలు చేయించారు. ఈ సందర్భంగా 400 మంది మహిళలు సామూహికంగా కుంకుమ పూజలు నిర్వహించారు. -
ముంచెత్తే..!
● పేరుకే స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర ● జిల్లాలో ఎక్కడ చూసినా అపరిశుభ్రతే ● నిరుపయోగంగా చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు పిఠాపురం: పన్నులు పంచాయతీలకు... చెత్త ప్రజలకు అన్నట్టుంది వాస్తవ పరిస్థితులు. జిల్లాలో ఏ పల్లె చూసినా చెత్త సమస్యతో కనిపిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర పేరుతో ఎంతో అట్టహాసంగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెబుతున్నా, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. జిల్లాలో మొత్తం 385 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సుమారు 4,85,089 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఆయా పంచాయతీల నుంచి రోజుకు సుమారు 50 టన్నుల చెత్త వస్తోంది. అయినా వీటి తరలింపు మాత్రం ప్రహసనంలా మారుతోంది. నాడు అట్టహాసం.. నేడు అధ్వానం గత ప్రభుత్వంలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు నిర్మితమై, పంచాయతీలకు బాసటగా నిలిచాయి. అక్కడ తయారైన సేంద్రియ ఎరువులతో పంచాయతీలకు ఆదాయం సమకూరేది. చెత్త సమస్య తీరేది. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. చెత్త నుంచి సంపద తయారు చేయడానికి రూ.కోట్లతో నిర్మించిన ఆ కేంద్రాలు ప్రస్తుతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయాయి. ఇవి అనేక చోట్ల నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేక కొన్ని గ్రామాల్లో మందుబాబులకు అడ్డాలుగా మారాయి. అనేకచోట్ల చెత్త నుంచి సంపద తయారు చేస్తున్నామని అధికారులు చెబుతున్నా, అనేక కేంద్రాల్లో ఎరువుల తయారీ అరకొరగానే సాగుతోంది. దీంతో పల్లెల్లో ఎక్కడబడితే అక్కడ చెత్త సమస్య తాండవిస్తోంది. డంపింగ్ యార్డులు లేక.. జిల్లాలో మొత్తం 385 గ్రామ పంచాయతీలు ఉండగా, సగానికి పైగా పంచాయతీలకు డంపింగ్ యార్డులు లేవు. దీనివల్ల చెత్తను రోడ్లపైనే పోసి ఆయా పంచాయతీల సిబ్బంది చేతులు దులుపుకొంటున్నారు. దీనివల్ల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. నెలలో ఒకటి రెండు సార్లు చెత్తను తగలబెడుతుండటంతో వాయు కాలుష్యం ఏర్పడుతుంది. పొగ కారణంగా అటుగా వెళ్లే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అధికారుల పర్యవేక్షణా లోపం గ్రామాల్లో రోజూ గ్రీన్ అంబాసిడర్లు ఇంటింటికీ వెళ్లి సేకరించిన తడి, పొడి చెత్తతో పాటు వీధుల్లో పేరుకుపోయిన చెత్తను రిక్షాల ద్వారా చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు తరలించాలి. అక్కడ తడి, పొడి చెత్తను వేర్వేరుగా కుండీల్లో వేసి వర్మీకంపోస్టు, సేంద్రియ ఎరువు తయారు చేసి రైతులకు తక్కువ ధరకు విక్రయించడం, అలాగే ప్లాస్టిక్ వ్యర్థాలను స్క్రాప్ దుకాణాలకు విక్రయించి పంచాయతీలకు అదనపు ఆదాయం సమకూర్చాలన్నదే ఈ కేంద్రాల లక్ష్యం. అయితే అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడడంతో ఈ కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. దృష్టి పెట్టక.. చెత్త వీడక పలు పంచాయతీల్లో పారిశుధ్యం పూర్తిగా క్షీణిస్తోంది. శివారు గ్రామాల్లో పారిశుధ్య పనులు అసలు జరగడం లేదని స్థానికులు అంటున్నారు. వివిధ గ్రామాల్లో ఎక్కడ చూసినా చెత్తే కనిపిస్తోంది. యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ, వాకతిప్ప, అమీనాబాద్, కొత్తపల్లి, కొమరగిరి, గొల్లప్రోలు మండలం చేబ్రోలు, వన్నెపూడి, చిన్న జగ్గంపేట, దుర్గాడ,చెందుర్తి, తాటిపర్తి, పిఠాపురం మండలంలో గోకివాడ, మాధవపురం, చిత్రాడ, విరవాడ, మంగితుర్తి తదితర గ్రామాల్లో పారిశుధ్య సమస్య తీవ్రంగా ఉంది. అయినా పంచాయతీల్లో సిబ్బంది కొరత, అధికారుల ఉదాశీనత వెరసి ఇబ్బందిగా మారింది. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఎంతైనాఉంది. ఆర్భాటానికే కార్యక్రమం స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు ఆర్భాటానికేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కార్యక్రమాలకు మొదట్లో కొన్ని నిధులు విడుదల అయినప్పటికీ ఆ తర్వాత కాలం నుంచి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. తూతూ మంత్రంగా మాత్రమే ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇంకోవైపు ఆర్థిక సంఘాల నిధులు ఖర్చుపై ఆంక్షలు విధించడం, ఉన్న కాస్త సాధారణ నిధులు అభివృద్ధి పనులకు సైతం సరిపోకపోవడం వంటి అనేక కారణాలతో పల్లెల్లో పారిశుధ్య సమస్య వస్తోంది. -
కొత్తపేటలో భారీ చోరీ
● రూ.31.50 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాల మాయం ● వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లి సరికి వస్తువుల దొంగతనం కొత్తపేట: వైద్యం కోసం హైదరాబాద్కు వెళ్లి తిరిగి వచ్చే లోపు గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరపడి, బీరువాలో భద్రపరచిన బంగారం, వెండి వస్తువులు దోచుకుపోయారు. ఎస్సై జి.సురేంద్ర శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపేట ఆర్ఎస్ నగర్లో నివాసం ఉంటున్న చెల్లిబోయిన రాంబాబు ఈ నెల 18వ తేదీ రాత్రి తన భార్యతో కలిసి హాస్పిటల్ పని నిమిత్తం హైదరాబాద్ వెళ్లారు. తిరిగి 20వ తేదీన ఉదయం 8 గంటలకు ఇంటికి వచ్చే సరికి తలుపు పగలగొట్టి ఉంది. లోపలకు వెళ్లి చూడగా బీరువాలోని బంగారం, వెండి వస్తువులు కనిపించలేదు. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ఆ బంగారు ఆభరణాల విలువ సుమారు రూ.30 లక్షలు, వెండి వస్తువులు సుమారు రూ.1.50 లక్షలు ఉంటాయని అంచనా. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ పరిశీలించారు. -
అక్రమ అరెస్టులతో.. ఆత్మస్థైర్యం దెబ్బతీయలేరు
ఆలమూరు: కూటమి ప్రభుత్వం బనాయిస్తున్న అక్రమ కేసులు, చేస్తున్న అక్రమ అరెస్టులతో వైఎస్సార్ సీపీ శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయలేరని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. బడుగువానిలంక, మూలస్థాన అగ్రహారం వంతెనల పేర్ల విషయమై ప్రశ్నించిన పార్టీ మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్పై కూటమి నేతలు అక్రమ కేసు నమోదు చేయించి, ఈ నెల 17న అరెస్టు చేయించిన విషయం తెలిసిందే. ఆలమూరు కోర్టు రిమాండ్ విధించడంతో ఆయనను పోలీసులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగ్గిరెడ్డి.. న్యాయ సలహాదారులను నియమించి, కోర్టులో న్యాయ పోరాటం చేశారు. ఈ పోరాటం ఫలించడంతో మూడు రోజుల్లోనే తమ్మనకు కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణుల కోరిక మేరకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి భారీ కార్లు, బైక్ ర్యాలీ, బాణసంచా కాల్పుల నడుమ తమ్మనను గురువారం రాత్రి చెముడులంకలోని ఇంటికి తీసుకువచ్చారు. ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ధర్మం గెలిచింది.. దుర్మార్గం ఓడిందంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. తమ్మనను ఆయన కుటుంబ సభ్యులకు జగ్గిరెడ్డి అప్పగించారు. కూటమి అరాచకాలపై పోరాటం ఉధృతం ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ, జిల్లా, నియోజకవర్గవ్యాప్తంగా ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూ, కూటమి నేతల అకృత్యాలు, అరాచకాలపై పోరాటాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం దళారీ వ్యవస్థను ప్రోత్సహించడం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. పార్టీ శ్రేణులందరూ ఐకమత్యంతో ఉండి, కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిత్యం పోరాడాలని, రానున్న స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. జగ్గిరెడ్డి వెన్నంటే ఉంటాం వైఎస్సార్ సీపీ శ్రేణులకు ఏ కష్టనష్టాలు ఎదురైనా, అన్యాయానికి గురైనా అన్నివిధాలా అండగా ఉంటున్న జగ్గిరెడ్డి వెన్నంటి జీవితాంతం ఉంటామని ఆ పార్టీ మండల నేతలు పేర్కొన్నారు. ఏ నేరం చేయకపోయినా పార్టీలో చురుగ్గా ఉంటున్నారనే కక్షతో తమ్మనను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. తాను అరెస్టయి, విడుదలయ్యేంత వరకూ వెన్నంటి ఉన్న జగ్గిరెడ్డికి, కార్యకర్తలకు, నాయకులకు తమ్మన కృతజ్ఞతలు తెలిపారు. ప్రముఖుల పరామర్శ ఇదిలా ఉండగా తమ్మన శ్రీనివాస్ను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వద్ద పలువురు ప్రముఖులు పరామర్శించారు. వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంటరీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ ఎంపీ చింతా అనురాధ, రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు కర్రి పాపారాయుడు తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు. -
ఇలా వెలుగుబెట్టారు!
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఆగస్టు 20.. ఈ రోజుకు కాకినాడ జేఎన్టీయూ చరిత్రలో ఎంతో ప్రాధాన్యం ఉంది. అది యూనివర్సిటీ ఏర్పాటైన రోజు కావడంతో వ్యవస్థాపక దినోత్సవం ఏటా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సరిగ్గా 18 ఏళ్ల నుంచి కోవిడ్ సమయంలో తప్ప ఈ రోజు యూనివర్సిలో సందడే సందడి. విద్యార్థుల కోలాహలం.. ప్రొఫెసర్ల మాటామంతి.. ముఖ్య అతిథులు, ఆపై పూర్వ విద్యార్థులతో వర్సిటీలో కొత్త వెలుగులు నిండేవి. అలాంటి రోజు గురువారం కావడం, ఆ వెలుగులు, సందడి నేడు దూరమవడం అందరినీ విస్మయానికి గురి చేసింది. దీనికి కారణం ఏమిటోనని ఆ యూనివర్సిటీలోని కొందరు ప్రొఫెసర్లు చర్చించుకోవడం కనిపించింది. వ్యవస్థాపక దినోత్సవాన్ని ఇలా వెలగబెట్టారంటూ అంతా నిట్టూర్పు వదలడం శోచనీయం. అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కాకినాడ నగరంలో దాదాపు 100 ఎకరాలకు పైబడి విస్తీర్ణంలో 1946లో జేఎన్టీయూ–కాకినాడ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత 1972లో హైదరాబాద్లో జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) ఏర్పడింది. దీనికి హైదరాబాద్, అనంతపురం కాకినాడల్లోని ఇంజినీరింగ్ కళాశాలలు అనుబంధంగా ఉండేవి. వాణిజ్య, వ్యాపార పరంగా అభివృద్ధి చెందిన కాకినాడలో విద్యా రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అప్పట్లో సంకల్పించారు. ఈ మేరకు 2008 ఆగస్టు 20న కాకినాడ ఇంజినీరింగ్ కళాశాలలోనే జేఎన్టీయూ–కాకినాడ ఏర్పాటు చేశారు. ఇది జరిగి ఇప్పటికి 18 ఏళ్లు గడిచింది. ఇప్పటి వరకూ ఏటా వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవాలు నిర్వహిస్తూ వచ్చారు. ఎందుకో ఏమిటో కానీ ఈ ఏడాది ఈ ఉత్సవం గురించి కనీసం పట్టించుకోకపోవడంపై వర్సిటీ ప్రొఫెసర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీ ప్రొఫెసర్ల వాట్సాప్ గ్రూపుల్లో తమ ఆవేదన వ్యక్తం చేస్తూ చేసుకున్న చాటింగ్లను బట్టి వారు ఏవిధంగా ఆవేదన చెందుతున్నారో అర్థమవుతోందని పలువురు అంటున్నారు. కనీసం వర్సిటీ ప్రవేశ ద్వారంలో బ్యానర్ కూడా పెట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీ రూ.కోట్ల నిధులున్నా, వాటిని ప్రభుత్వానికి ఇవ్వడానికి చూపించిన ఆసక్తి వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవం చేయడంలో కనిపించలేదని మండిపడుతున్నారు. విస్తరించిన పరిధి పాత ఉమ్మడి తూర్పు, పశ్చిమ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని 264 ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలతో పాటు విజయనగరం, నరసారావుపేట, కాకినాడ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలు జేఎన్టీయూకేకి అనుబంధంగా పని చేస్తున్నాయి. 2021 నుంచి ఈ వర్సిటీ పరిధిలో ఉన్న విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు విజయనగరం యూనివర్సిటీ పరిధిలోకి మారిపోయాయి. వర్సిటీ ప్రారంభంలో తొలి ఉప కులపతిగా అల్లం అప్పారావు పనిచేయగా, తరువాత తులసీరామ్దాస్, వీఎస్ఎస్ కుమార్, రామలింగరాజు, జీవీఆర్ ప్రసాదరాజు సేవలందించారు. ప్రస్తుతం వరంగల్ నిట్ ప్రొఫెసర్ సీఎస్ఆర్కే ప్రసాద్ ఈ వర్సిటీ ఉప కులపతిగా ఉన్నారు. ఫ కానరాని జేఎన్టీయూకే వ్యవస్థాపక దినోత్సవం ఫ గతంలో ఎంతో వైభవంగా నిర్వహణ ఫ ఇప్పుడు ఆ వేడుకలకు దూరం అన్నీ ఉన్నా.. వేడుకలు సున్నా ఆవిర్భావం అనంతరం ఈ వర్సిటీ ప్రాంగణంలో దాదాపు రూ.100 కోట్లకు పైబడి నిధులతో వివిధ భవనాలు నిర్మించారు. ఇన్నోవేషన్ సెంటర్, ఐఈటీలు, స్టూడెంట్ ఎమినిటీ సెంటర్, ఎగ్జామ్స్ సెల్, బాలురు, బాలికల వసతి గృహాల వంటి నిర్మాణాలతో పాటు వర్సిటీ ఆవరణలో రోడ్లు నిర్మించారు. అప్పటి వరకూ కళాశాలగా ఉన్న ప్రాంగణం వర్సిటీగా మారడంలో ఈ ప్రాంత రూపురేఖలు మారిపోయాయి. వర్సిటీ నాలుగు వైపులా గేట్లతో పాటు ముఖద్వారాల్లో వైఎస్సార్, నెహ్రూ, గాంధీజీ వంటి ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. వర్సిటీ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకూ 12 స్నాతకోత్సవాలు నిర్వహించారు. 10 లక్షల మందికి పైగా డిగ్రీ పట్టాలు, 2 వేల మందికి పైగా పీహెచ్డీలు ప్రదానం చేశారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న యూనివర్సిటీ వ్యవస్థాపక దినోత్సవానికి దూరమవ్వడం విమర్శలకు తావిస్తోంది. -
15 శాతం శిక్షణ భృతి లక్ష్యం
కాకినాడ క్రైం: కనీసం 15 శాతం శిక్షణ భృతే (స్టైఫండ్) లక్ష్యమని జూడాలు నినదించారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా కాకినాడ ఆర్ఎంసీ జూనియర్ వైద్యులు చేపట్టిన నిరసన తొమ్మిదో రోజుకు చేరింది. జీజీహెచ్ ఎదురుగా ఉన్న పీజీ వసతి గృహ ఆవరణలో నిరసన కొనసాగుతోంది. ఇందులో భాగంగా గురువారం రక్తదానం నిర్వహించారు. సాయంత్రం ఫ్లాష్ మార్చ్ చేపట్టారు. జీజీహెచ్ నుంచి ఇంద్రపాలెం అంబేడ్కర్ విగ్రహం వరకు సెల్ఫోన్లలో ఫ్లాష్ లైట్లు ఆన్ చేసి నినాదాలు చేస్తూ సాగారు. ప్రభుత్వ మొండి వైఖరి వల్ల తమతో పాటు రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జూడాలు ఆవేదన వ్యక్తం చేశారు. శిక్షణ భృతితోపాటు ఉద్యోగ విరమణ వయసు 65 ఏళ్లకు పెంచాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. ఎండీ, ఎంఎస్ చేసిన వారికే అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. -
గడువులోగా ఓటర్ల జాబితా పూర్తి చేయాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో వివిధ ప్రక్రియలను నిర్ణీత గడువులోగా, అత్యంత పారదర్శకంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ ఈఆర్వోలను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో గురువారం ఓటర్ల జాబితాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి జిల్లాలో మొత్తం 31,695 నోటీసులకు గాను, ప్రస్తుతం కేవలం 1,305 మాత్రమే పెండింగ్లో ఉన్నాయన్నారు. కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణకు సంబంధించి ఫారమ్ 6లో 8,396, ఫారమ్ 8లో 5,386 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, ఈ దరఖాస్తులను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని, నిర్ణీత షెడ్యూల్ లోపే పరిష్కరించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఫ సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలల్లో పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహిస్తూ, ఆరోగ్యకర వాతావరణాన్ని నిర్మించే లక్ష్యంతో చేపట్టిన ‘నెట్ జీరో హెల్త్ క్యాంపస్’ ప్రాజెక్టును జిల్లాలో పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నెట్ జీరో హెల్త్ క్యాంపస్ ప్రాజెక్టు అమలు తీరు, మొక్కల పెంపకం, సోఫ్ కిట్, పారిశుధ్య నిర్వహణ, మధ్యాహ్న భోజనం, వసతి గృహాల్లో చేపట్టిన మరమ్మతులు వంటి అంశాలపై సంక్షేమ వసతి గృహాల వారీగా కలెక్టర్ సమీక్షించారు. కలెక్టర్ హరేంధిర ప్రసాద్ -
మహాలక్ష్మీ పాహిమాం..
రావమ్మా! మహలక్ష్మి రావమ్మా.. అంటూ శ్రావణ శుక్రవారం పూజలకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం వరలక్ష్మీ వ్రత పూజల సందర్భంగా గురువారం జిల్లాలోని ప్రధాన కేంద్రాల్లో మార్కెట్లు కిటకిటలాడాయి. పూజా సామగ్రి, బంగారు రూపుల కొనుగోలుతో సందడి నెలకొంది. కాకినాడ భానుగుడి, నాగమల్లితోట జంక్షన్, పిఠాపురం, పెద్దాపురం, తుని, ఏలేశ్వరం తదితర చోట్ల మార్కెట్లు రద్దీగా మారాయి. పూజా సామగ్రి ధరలకు రెక్కలొచ్చాయి. సామాన్యులు ఇబ్బంది పడ్డారు. –బోట్క్లబ్ (కాకినాడ), ఏలేశ్వరం -
ఆరుతడి పంటలపై దృష్టి పెట్టాలి
తొండంగి: జిల్లాలో 30,502 మంది రైతులు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనలో చేరారని వ్యవసాయ శాఖ జేడీ కె.రాబర్ట్పాల్ అన్నారు. గురువారం స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలోని తుని సబ్ డివిజన్ పరిధిలో అధికారులు, గ్రామ సచివాలయాల అగ్రికల్చర్ అసిస్టెంట్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్నినో కారణంగా దేశ వ్యాప్తంగా కూడా వర్షాలు పూర్తి స్థాయిలో కురవని పరిస్థితి ఉందన్నారు. ఈ నేపథ్యంలో పంపా, పీబీసీ ఆయకట్టు పరిధిలో రైతులంతా ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించేలా అధికార యంత్రాంగం అవగాహన కల్పించాలన్నారు. పంపా, పీబీసీ పరిధిలో ఇప్పటి వరకూ 2,754 ఎకరాల వరకూ వరి నాట్లు వేసినట్టు అధికారులు వివరించారు. మిగిలిన ప్రాంతాల్లో చిరు ధాన్యాలు వంటి సాగు చేయాలన్నారు. అదేవిధంగా ఇప్పటి వరకూ సాగు చేసిన వరి పొలాలకు ఈ– క్రాఫ్ నమోదు, బీమా చెల్లింపు తదితర అంశాలపై చర్చించారు. వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్, మండల వ్యవసాయ శాఖాధికారి ఎంఎంవీఎస్ పద్మశ్రీ, ఏఈఓ మాథన సతీష్వర్మ పాల్గొన్నారు. -
దోషులను కఠినంగా శిక్షించాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడడానికి రైఫిల్ షూటర్ షేక్ సాధిక్ ఖాన్ వేధింపులే కారణమని ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన సంబంధించి సాధిక్ ఖాన్తో పాటు అతనికి సహకరించిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలన్నారు. ఈ మేరకు ప్రజాసంఘాల నాయకులు గురువారం స్థానిక కలెక్టరేట్లో కలెక్టర్ హరేంధిర్ ప్రసాద్, ఎస్పీ బిందు మాధవ్లను కలసి వినతి పత్రాలను అందజేశారు. ఆత్మహత్య చేసుకునే సమయంలో ఏఈ కుటుంబ సభ్యులను సాధిక్ ఖాన్ వేధించారని, అందుకే బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు సూసైడ్ నోట్లను సౌజన్య రాశారన్నారు. పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి అతనికి కఠిన శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ఏఈ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. సాధిక్ ఖాన్ తమను ఇస్లాం మతంలోకి మారాలని తీవ్రంగా ఒత్తిడి చేయడంతోనే నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్లు జిల్లా కుమ్మర శాలివాహన సంఘ అధ్యక్షుడు టిల్లపూడి నాగేశ్వరరావు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ రహీమ్, మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ డైరెక్టర్ మాలకొండయ్య మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూకరాజు అల్లుడు జగదీష్రెడ్డికి సాధిక్ ఖాన్ పాయిజన్ ఇచ్చి హత్య చేశాడని సూసైడ్ నోట్లో సౌజన్య రాశారని అన్నారు. దీనిపై సమగ్రంగా విచారణ చేపట్టాలని కోరారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో శాలివాహన సంఘ నాయకులు సత్యనారాయణ, నారాయణరావు, వెంకటరమణ, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఖాన్, కాకినాడ సిటీ అధ్యక్షుడు పైసల్, జిల్లా సెక్రటరీలు కె.అలీఖాన్, ఆన్సర్ తదితరులు పాల్గొన్నారు. -
జానూ జ్ఞాపకాలతో చానల్
తుని రూరల్: తుని మండలం దొండవాక శివారు సీహెచ్.అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఙానేశ్వరి అదృశ్యమై 75 రోజులు గడిచినా నేటికీ ఆచూకీ లభించలేదు. అధికార యంత్రంగంతో పాటు తల్లిదండ్రులు సుంకర గణేష్, భవానీ, బంధువులు ఆమె ఆచూకీ కోసం చేయని ప్రయత్నం లేదు. తమ చిన్నారి ఎప్పటికై నా వస్తుందన్న ఆశతో ఆ తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. రోజులు గడిచిన తర్వాత గుర్తించేందుకు, తమ అనుబంధం, ఆప్యాయతలను గుర్తించేందుకు వీలుగా బుధవారం జాను పేరుతో యూట్యూబ్ చానల్ను ప్రారంభించినట్టు గణేష్, భవాని తెలిపారు. ఈ చానల్లో రెండేళ్లలో ఆమెతో ఉన్న ఫొటోలు, వీడియోలను అప్లోడ్ చేశారు. ఆ చానల్లో పెట్టిన ఫొటోలు చూసి ఆమె తన చెంతకు ఎప్పటికై నా రాకపోతుందా అనే ఆశతో ఉన్నట్టు వారు తెలిపారు. కాగా మంగళరం హైకోర్టు జ్ఞానేశ్వరి ఆచూకీపై ఆరా తీసి ఆమె దొరికే వరకు మరిన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. -
బైక్ దొంగల అరెస్టు
● పోలీసుల అదుపులో ఏడుగురు నిందితులు ● పరారీలో ముగ్గురు.. ● రూ.12 లక్షల విలువైన పది వాహనాల స్వాధీనం నిడదవోలు: ఇళ్ల వద్ద పార్క్ చేసిన మోటార్ సైకిళ్లను రాత్రి వేళలో దొంగిలిస్తున్న ఏడుగురు సభ్యుల ముఠాను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సీఐ పీవీజీ తిలక్ ఆ వివరాలను వెల్లడించారు. తణుకు పట్టణానికి చెందిన అబ్దుల్లా ఆదీబ్ రెహ్మాన్, తాళ్లపూడి సతీష్, ఉండ్రాజవరం మండలం వేలువెన్ను గ్రామానికి చెందిన గాలింకి మనోజ్ కుమార్, మన్యం సందీప్, మోర్త గ్రామానికి చెందిన వెలగట్ల జస్వంత్, పెరవలి మండలం ముక్కామలకు చెందిన దొంగ ప్రవీణ్కుమార్, నిడదవోలు మండలం పురుషోత్తపల్లి గ్రామానికి చెందిన షేక్ ఉమర్ అలీషాలను అరెస్టు చేసినట్టు సీఐ తెలిపారు. ఈ బృందంలో గౌతం, రావులపాలెం మండలం ఈతకోటకు చెందిన విఘ్నేష్, తణుకు పట్టణానికి చెందిన పెట్ట శ్యామ్ ఆస్టియన్ పరారీలు ఉన్నారని ఆయన తెలిపారు. ఆయా ప్రాంతాల్లో నిందితులు రాత్రిపూట మూడు బైక్లపై తిరుగుతూ ఇళ్లల్లో తాళం వేసి ఉన్న మోటార్సైకిళ్లను గుర్తించి అపహరిస్తారని సీఐ వెల్లడించారు. ఈ బృందంలోని గౌతమ్ ఉండ్రాజవరం మండలం కాల్దరి గ్రామంలో ఇటీవల జరిగిన దొంగతనం కేసులో ముద్దాయిగా ఉన్నాడని, అతడిని పట్టుకుని బంగారు ఆభరణాలను రికవరీ చేయాల్సి ఉందని తెలిపారు. ఏడుగురిని అదుపులోకి తీసుకోవడంలో కృషి చేసిన ఉండ్రాజవరం, సమిశ్రగూడెం ఎస్సైలు డి.రవికుమార్, బాలాజీ సుందరరావులను ఎస్పీ డి.నరసింహ కిశోర్ రివార్డులు ప్రకటించారని సీఐ తిలక్ తెలిపారు. -
గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
పెరవలి: మండలం ముక్కామల వద్ద బాపన్న కాలువలో మంగళవారం గల్లంతైన ఏడిద రవితేజ (41) మృతదేహం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం రామన్నపాలెంలో లభ్యమైనట్టు ఎసై అలెగ్జాండర్ తెలిపారు. కాలువలో స్నానానికి దిగి ప్రమాదశాస్తూ కాలువలో కొట్టుకుపోయిన రవితేజ మంగళవారం ఉదయం నుండి రాత్రి వరకు గాలించినా దొరకని విషయం తెలిసిందే. మంగళవారం కేసు నమోదు చేశామని, మృతదేహాన్ని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగిస్తామని ఎస్సై తెలిపారు. రూ.లక్ష విలువైన గడ్డి వామి దగ్ధం ˘ దేవరపల్లి: మండలంలోని బుచ్చియపాలెంలో మంగళవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో కాట్రు వీరవెంకటసత్యనారాయణకు చెందిన గడ్డివామి దగ్ధమైంది. గ్రామ శివారున ఉన్న తన పొలంలో సుమారు రూ.1 లక్ష విలువైన వెయ్యి కట్టల ఎండుగడ్డి పూర్తిగా కాలిపోయినట్టు రైతు వీర వెంకటసత్యనారాయణ తెలిపారు. కొవ్వూరు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. గడ్డివామి సమీపంలో పొగాకు బ్యారన్లు, రూ.లక్షల విలువ గల పొగాకు బేళ్లు ఉన్నాయని, ప్రమాద సమయంలో గాలి లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని ఆయన తెలిపారు. 22 నుంచి వనదుర్గ జాతర అన్నవరం: రత్నగిరి వనదేవత శ్రావణమాస జాతర మహోత్సవాలు 22వ తేదీ శ్రావణ శుద్ధ దశమి శనివారం నుంచి ప్రారంభమై 28వ తేదీ వరకు సాగనున్నాయి. 22న అమ్మవారిని బాల త్రిపురసుందరిగా, 23 సరస్వతిగా, 24న అన్నపూర్ణగా, 25 న మహాలక్ష్మిగా, 26న గాయత్రీదేవిగా, 27న వారాహిగా, 28న రాజరాజేశ్వరిగా అలంకరించి దర్శనాలు కల్పించనున్నారు. 28న అమ్మవారికి చండీ, ప్రత్యంగిర హోమాలు నిర్వహించి పూర్ణాహుతితో కార్యక్రమాలు ముగించనున్నారు. బాధల బడిబాట! చాగల్లు: విద్యార్థులే కూలీలుగా మారిన ఘటన వాడపల్లి చంద్రవరం రహదారిలో చోటుచేసుకుంది. కూటమి ప్రభత్వం వచ్చిన తరువాత రహదారుల పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. వాడపల్లి, చంద్రవరం రహదారిలో ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు గుంతలో దిగపడిపోయింది. విధిలేని పరిస్థితుల్లో విద్యార్థులే రాళ్లు తీసుకువచ్చి టైర్ కింద వేసి బస్సు కదిలేలా చేశారు. అధికారులు స్పందించి ఈ పుంత రోడ్డును నిర్మించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. కొనసాగుతున్న జూనియర్ వైద్యుల నిరసన కాకినాడ క్రైం: కాకినాడలో జూనియర్ వైద్యుల నిరసన దీక్ష కొనసాగుతోంది. ఎనిమిదో రోజుకు చేరిన దీక్షలో జూడాలు తమ డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేశారు. జీజీహెచ్ ఎదుట ఉన్న పీజీ వసతి గృహ ఆవరణలో రిలే దీక్షలు చేశారు. బుధవారం నాటి నిరసనలో 500 మందికి పైగా జూనియర్ వైద్యులు పాల్గొన్నారు. శిక్షణ భృతి, వయోపరిమితి 65కి పెంచడాన్ని ఉపసంహరించుకోవడం, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల్లో ఎండి, ఎంఎస్ చేసిన వైద్యులకే ప్రాధాన్యం ఇవ్వడం తమ ప్రధాన డిమాండ్లని నాయకులు తెలిపారు. నిందితుడికి రెండేళ్ల జైలు తుని: ఓ కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు, రూ.రెండు వేల జరిమాన విధించినట్లు సీఐ గీతారామకృష్ణ బుధవారం తెలిపారు. సీఐ కథనం ప్రకారం కాకినాడ రూరల్ పెనుమర్తి గ్రామానికి చెందిన విజ్జం నాగరాజు 2019లో జరిగిన ఓ కేసులో ముద్దాయి. అప్పటి ఎస్సై వి.శేషుకుమార్ కేసు నమోదు చేశారు. సమగ్ర విచారణ అనంతరం కోర్టులో ఇరువైపుల వాదనలు విన్న జేఎఫ్సీఎం జడ్జి వి.గోపాలకృష్ణపై శిక్ష విధించారు. -
పుర పోరుకు సిద్ధం!
కాకినాడ నగరం (ఫైల్) జిల్లా పరిషత్ కార్యాలయంసాక్షి ప్రతినిధి, కాకినాడ: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యక్ష పోరుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సీఎం అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోద ముద్ర పడింది. మేయర్, మున్సిపల్ చైర్మన్లను పజలే నేరుగా ఎన్నుకునే విధానానికి ఆమోదం లభించింది. 30 ఏళ్ల తర్వాత ఈ విధానం తెరపైకి వచ్చింది. ఈ ప్రక్రియ కార్యరూపం దాల్చితే మేయర్లు, మున్సిపల్ చైర్మన్లను ఎన్నికల విధానంలో ప్రజలే ఎన్నుకోనున్నారు. అర్బన్ ఎన్నికలకు సిద్ధమవుతుండటంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఇదీ సంగతి స్థానిక సంస్థల్లో మున్సిపల్ చైర్మన్, మేయర్ను గతంలో నేరుగా ప్రజలు ఓటు వేసి ఎన్నుకునేవారు. 30 ఏళ్ల క్రితం నుంచి పరోక్ష పద్ధతిలో ఎన్నుకునే విధానానికి శ్రీకారం చుట్టారు. అనంతరం రాజ్యాంగ సవరణలు చేపట్టడంతో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి మున్సిపల్ చైర్ పర్సన్లను కౌన్సిలర్లు, మేయర్లను కార్పొరేటర్లు ఎన్నుకునే విధానం అమలవుతోంది. ప్రత్యక్షం అంటే.. గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్ ఎన్నికలు తీసుకుంటే సర్పంచ్తో పాటు వార్డు మెంబర్లను ప్రజలు ఓట్లు వేసి ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. ఒకసారి ఎన్నికై న సర్పంచ్ ఐదేళ్ల పాటు పదవిలో ఉంటారు. వారిని అభిశంసనతో తొలగించే అవకాశం ఉండదు. పరోక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకోవడంతో రెండేళ్లకో, రెండున్నరేళ్లకో అభిశంసన ప్రక్రియ ద్వారా పదవుల్లో మార్పు చేసే అవకాశం ఉంటుంది. ప్రత్యక్ష ఎన్నికలు జరిపితే ఎన్నికై న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి ఐదేళ్ల పాటుపదవిలో ఉండే అవకాశం ఉంటుంది. జిల్లా పరిషత్ల విభజన! జిల్లా పరిషత్ల విభజనపై సైతం మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతమున్న 13 జిల్లా పరిషత్లను 28గా విభజించనున్నట్లు వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే ఒక్కో జిల్లాకు ఒక్కో జిల్లా పరిషత్ కార్యాలయంలో కొలువుదీరనుంది. ఉమ్మడి తూర్పుగోదావరిలో 62 మండలాలు ఉన్నాయి. 62 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా.. 58 స్థానాలకు జెడ్పీటీసీలు ప్రాతినిధ్యం వహిస్తుండగా, 4 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీళ్లంతా కాకినాడ జెడ్పీ కార్యాలయానికే వస్తున్నారు. ఉమ్మడి తూర్పు నాలుగు జిల్లాలుగా (కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పోలవరం) విడిపోయింది. జిల్లా పరిషత్ విభజనకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తరుణంలో నాలుగు జిల్లా కేంద్రాల్లో నాలుగు జెడ్పీ కార్యాలయాలు ఆవిర్భవించనున్నాయి. తూర్పుగోదావరి జిల్లాకు 22 మండలాలు, పోలవరం జిల్లాలో 12, కోనసీమ 19, కాకినాడ జిల్లాలోకి 21 మండలాలు వెళ్లనున్నాయి. ప్రస్తుత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు నియోజకవర్గాల్లోని మండలాలు కలవడంతో మండలాల సంఖ్య 74కు చేరింది. ఆ ప్రకారం నాలుగు జిల్లా పరిషత్లు, 74 జెడ్పీటీసీ స్థానాలు ఏర్పడనున్నాయి. టీడీపీ నేతల్లో గుబులు ప్రత్యక్ష ఎన్నికల ప్రకటనతో టీడీపీ ఆశావహుల్లో గుబులు రేగుతోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా విశ్వాసాన్ని కోల్పోతూనే వస్తోంది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, టీడీపీ నేతలు మద్యం, ఇసుక మాఫియా అవతారం ఎత్తి అవినీతికి పాల్పడటం, ప్రశ్నించే వారిపై దాడులకు దిగడం పరిపాటిగా మారింది. ఈ పరిణామం ప్రజల్లో టీడీపీ నేతలపై తీవ్ర వ్యతిరేకతను తీసుకువస్తోంది.ఉమ్మడి ‘తూర్పు’లో... ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 2 మున్సిపల్ కార్పొరేషన్లు (రాజమహేంద్రవరం, కాకినాడ), 9 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఉమ్మ డి జిల్లాలో మార్చి 14న అన్ని మున్సిపాలిటీల ఐదేళ్ల పదవీకాలం పూర్తయింది. అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. ఎన్నికలు నిర్వహిస్తే పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. మున్సిపాలిటీలకు 1987లో ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. మండపేట మున్సిపాలిటీకి బిక్కిని విజయ మున్సిపల్ చైర్ పర్సన్ గా గెలుపొందారు. 1995, 2000లో మున్సిపాలిటీల్లో డైరెక్టర్గా ఎన్నికలు జరిగాయి. 2005, 2014, 2020లో పరోక్ష ఎన్నికలు జరిగాయి. స్థానిక సంస్థల ఎన్నికలు అక్టోబర్లోగా నిర్వహించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దీనిలో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లను గుర్తించేందుకు మంగళవారం నుంచి ఇంటింటి సర్వే ప్రారంభించింది.వైఎస్సార్ సీపీకే ప్రజల మద్దతు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నిక విధానం తీసుకువచ్చేందుకు మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. అక్టోబర్లో ఎన్నికలు నిర్వహించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఎలాంటి ఎన్నికల విధానం అమలు చేసినా ప్రజా సమస్యలపై నిత్యం పోరాటాలు చేస్తున్న వైఎస్సార్ సీపీకే ప్రజల మద్దతు ఉంటుంది. స్థానిక సంస్థల్లో ప్రత్యక్ష, పరోక్ష ఎన్నికలైనా ప్రజలు వైఎస్సార్ సీపీకి అండగా నిలుస్తారు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఎదుర్కొనేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో సిద్ధంగా ఉన్నాం. – విప్పర్తి వేణుగోపాలరావు, జిల్లా పరిషత్ చైర్మన్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ప్రత్యక్ష పద్ధతిలో జరగనున్న మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఇప్పటి వరకు పరోక్ష విధానం అమలు -
పూతలకొద్దీ మేతలు!
పిఠాపురం రూరల్: కోట్లాది రూపాయల ప్రజా ధనంతో నిర్మించిన రహదారులు కొద్ది నెలల్లోనే గోతులు, ప్యాచ్ వర్క్లతో దర్శనమివ్వడంతో నాణ్యత ప్రమాణాలపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. పిఠాపురం–సామర్లకోట ప్రధాన రహదారిని 8.2 కిలోమీటర్ల మేర 8 నెలల క్రితం సుమారు రూ.15 కోట్లతో నిర్మించారు. ఇంతలోనే ఈ రహదారిపై గోతుల పడి, వాటికి ప్యాచ్ వర్కులు చేయడం, కొద్దిరోజులకే మళ్లీ అవి కంకర తేలి గోతులు పడి అస్తవ్యస్తంగా మారింది. రహదారి మొత్తంలో 48 ప్యాచ్లు.. 8.2 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారిలో 48 చోట్ల గోతులు ఏర్పడి వాటికి మరమ్మతుల పేరుతో వేసిన కంకరతో చూసిన వారికి అది రహదారా లేక అతుకుల బొంతా అన్నట్టు తయారైంది. కల్వర్టులపైనే అధికం ఈ మొత్తం రహదారిలో చాలా మటుకు దెబ్బతిన్న భాగాలన్నీ కల్వర్టులపైనే కావడం గమనార్హం. పాత కల్వర్టులు కావడం వల్లే ఆయా ప్రాంతాల్లో వేసిన రహదారులు సరిగా అమరక, అతుక్కోక ఇలా దెబ్బ తిన్నట్టు చెప్తున్నారు. ఇందుకు కారణాలను సంబంధిత అధికారులు, సాంకేతిక నిపుణులే చెప్పాల్సి ఉంటుంది. పిఠాపురం–సామర్లకోట ప్రధాన రహదారి కావడంతో దీనిపై వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. దీని వల్ల ఒరిపిడి ఎక్కువై తరచూ గోతులు పడుతున్నట్టు వాహన చోదకులు చెప్తున్నారు. రాత్రి వేళల్లో కల్వర్టుల వద్ద గోతులు కనపడక మరిన్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయని ద్విచక్ర వాహన చోదకులు అంటున్నారు. పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఏళ్ల తరబడి ఒకేచోట పాతుకుపోయిన ఆర్అండ్బీ అధికారులు గుత్తేదారులతో పెనవేసుకున్న బలమైన బంధాల వల్ల ఆయా నిర్మాణాల సమయంలో పర్యవేక్షణ ఉండడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. రూ.15 కోట్లతో రహదారి నిర్మిస్తున్నారంటే గ్రావెల్ పొరలు, వాటికి నీరు పెట్టడాలు, వాటిపై కంకర పొరలు, వాటిపై రోలర్తో అణగదొక్కి దానిపై తారు కంకర మిక్స్చర్ ఎంత మందాన వేయాలో సరైన పర్యవేక్షణ జరిగిందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అంత మొత్తంలో నిధులు వెచ్చించినా చివరికి పై పూతలు మాత్రం తప్పలేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమగ్ర విచారణ చేపట్టాలని... ఈ రహదారిపై ఉన్నతాధికారులు సమగ్ర సాంకేతిక తనిఖీ నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. రహదారిలోని కల్వర్టులన్నింటినీ అధికారులు పరిశీలించి, వాటిపై వేసిన రహదారి నాణ్యతను పరీక్షించాల్సి ఉంది. లోపాలున్నట్టు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. రూ.15 కోట్లతో రహదారి నిర్మాణం 8 నెలల్లో 48 చోట్ల రాళ్లు తేలి గోతులు వాటిపై అతుకుల బొంతలా కంకర పూతలు పిఠాపురం–సామర్లకోట రహదారి దుస్థితి -
అయ్యోరు చెప్పారని మళ్లీ మనువు!
అన్నవరం: మీ జీవిత భాగస్వామిని మళ్లీ మనువాడితే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని జ్యోతిష్యుడు చెప్పడంతో తొమ్మిది జంటలు సత్యదేవుని సాక్షిగా మళ్లీ పెళ్లిళ్లు చేసుకున్నారు. విశాఖ జిల్లా అచ్యుతాపురం, ఆనందపురాలకు చెందిన ఆ జంటలు వారి జ్యోతిష్యుడు కూర్మేశ్వరరావు సూచన మేరకు బుధవారం ఉదయం 9–30 గంటలకు రత్నగిరిపై ఒకటయ్యారు. అనుకున్న పనులు కావడం లేదని, ఏవేవో వారి సమస్యలు ఆయనకు చెప్పడంతో వారి ఇళ్ల వాస్తులను, జాతకాలను పరిశీలించి మీకు సరైన ముహూర్తాల్లో వివాహాలు జరగకపోవడం వల్లే ఈ సమస్యలు వస్తున్నాయని, మంచి ముహూర్తంలో మళ్లీ మీ భాగస్వాములను వివాహమాడితే సమస్యలు తొలగుతాయని సెలవిచ్చారు. దీంతో ఆయన సలహా మేరకు వారంతా స్వామివారి సన్నిధిలో ఒకటయ్యారు. జ్యోతిష్కుని సలహా మేరకే మాది ఆనందపురం. కొంత కాలంగా మా ఆర్థిక పరిస్థితి బాగోలేదు. దీనిపై జ్యోతిష్కుడు కూర్మేశ్వరరావును సంప్రదించాం. మా జాతకాలు, వాస్తు చూసి ఆయన ఇచ్చిన సలహాతో ఇలా స్వామివారి సన్నిధిలో వివాహం చేసుకున్నాం. – సత్తిబాబు, లక్ష్మి సత్యదేవుని సన్నిధిలో పునఃవివాహం చేసుకున్న తొమ్మిది జంటలు -
అసలేం జరిగింది!
● ఏఈ నూకరాజు ఘటనపై పోలీసుల ముమ్మర దర్యాప్తు ● డిలీట్ అయిన సెల్ఫోన్ మెసేజ్లే కీలకం ● వాటిని రికవరీ చేసేందుకు చర్యలు ● నిందితుడు సాధిక్ ఖాన్పై నిఘా పిఠాపురం: పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ముందుగా నూకరాజు, ఆయన కూతురు సౌజన్య రాసిన మరణ వాంగ్మూలాలు, అనంతరం వియ్యంకుడు భాస్కరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. నూకరాజు, సౌజన్యల సెల్ ఫోన్లలో డిలీట్ చేసిన డేటాను రికవరీ చేయడం ద్వారా కీలక ఆధారాలు లభిస్తాయనే కోణంలో వారి సెల్ ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించే పనిలో ఉన్నారు. మరో పక్క ఈ కేసులో నిందితుడైన సాధిక్ ఖాన్ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. అతడు కర్ణాటకకు పారి పోయినట్లు గుర్తించి, నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అలాగే గోదావరిలో గల్లంతైన నూకరాజు భార్య మీనా, కూతురు సౌజన్యల ఆచూకీ మూడో రోజూ లభ్యం కాలేదు. ఫోన్ సంభాషణలే ఆధారం నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు యత్నించిన ఆదివారం రాత్రి ఏం జరిగింది అనే దానిపై పోలీసులు దృష్టి సారించారు. కుటుంబ సభ్యులతో కలిసి కారులో రాజమహేంద్రవరం బయలు దేరిన ఆయన.. దారిలో ఎవరిని కలిశారు, ఎక్కడెక్కడ ఆగారు, ఏ ప్రాంతంలో ఎంత సేపు ఉన్నారు, ఎవరితో మాట్లాడారు తదితర వాటిపై ఆరా తీస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి అర్ధరాత్రి గోదావరిలోకి దూకే వరకు ఫోన్ సంభాషణలను విశ్లేషిస్తున్నట్లు సమాచారం. కాకినాడ నుంచి బయలుదేరి రాజమహేంద్రవరం వెళ్లే వరకు సాధిక్ పలు మార్లు కాల్ చేసి బెదిరించినట్లు నూకరాజు మనవడు కార్తికేయరెడ్డి ఇచ్చిన సమాచారంపైనా పోలీసులు దృష్టి సారించారు. మెసేజ్లపై దృష్టి నూకరాజు కుటుంబ సభ్యులకు సంబంధించిన సామగ్రిని, వారి సెల్ఫోన్లను పోలీసులు ఆయన కారులో స్వాధీనం చేసుకున్నారు. అయితే వారి సెల్ఫోన్లలో వాట్సాప్ మెసేజ్లను ఆత్మహత్యలకు ముందు డిలీట్ చేసినట్లు గుర్తించారు. వాటిని రికవరీ చేస్తే కీలక ఆధారాలు లభించే అవకాశం ఉందని భావించి, ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. లేఖల పరిశీలన నూకరాజు, సౌజన్య రాసిన లేఖలను విశ్లేషిస్తున్న పోలీసులు నూకరాజు వియ్యంకుడు ఇచ్చిన ఫిర్యాదుపై కూడా దృష్టి సారించారు. తన కుమారుడిపై కోచ్ సాధిక్ ఖాన్ విష ప్రయోగం చేసి చంపేశాడని ఆయన ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మృతుడు జగదీశ్వరరెడ్డి అంతిమ సంస్కారాలు నిర్వహించిన ప్రాంతాలను పరిశీలించారు. అయితే దాదాపు రెండు నెలల క్రితం జరిగిన సంఘటన కావడం, జగదీశ్వరరెడ్డి మృతదేహాన్ని దహనం చేయడంతో ఆధారాలు లభించే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే జగదీశ్వరరెడ్డి చనిపోవడానికి ముందు తీవ్ర అస్వస్థతకు గురై సుమారు 20 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందినట్టు చెబుతున్నారు. విష ప్రయోగం జరిగి ఉంటే అప్పటి మెడికల్ రిపోర్టుల్లో విషయం బయటకు వచ్చే అవకాశం ఉండొచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. కర్ణాటకకు పారిపోయిన నిందితుడు! నిందితుడు సాధిక్ ఖాన్పై రాజమహేంద్రవరం టూటౌన్, కాకినాడ సర్పవరం పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అతడి కోసం పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. అయితే సాధిక్ ఖాన్ సోమవారం తెల్లవారుజామునే పారిపోయినట్లు గుర్తించి, సాంకేతిక ఆధారాలతో పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాకినాడలోని అతడి ఇల్లు, రైఫిల్ షూటింగ్ అకాడమీ, బంధువుల ఇళ్ల వద్ద నిఘా ఏర్పాటు చేశారు. కాగా.. సాధిక్ ఖాన్ తన సెల్ఫోన్ వదిలేసి పారిపోయినట్లు తెలుస్తోంది. ఇతర సాంకేతిక ఆధారాల ద్వారా అతడు కర్ణాటక పారిపోయినట్లు గుర్తించిన పోలీసులు, నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలను అక్కడకు పంపినట్టు సమాచారం. -
సుమబాలకు శ్రావణ శోభ
కడియం: శ్రావణమాసం రావడంతోనే మండలంలోని కడియపులంక పూవుల మార్కెట్కు కొత్త కళ సంతరించుకుంది. జనవరి నుంచి అంతంత మాత్రంగా సాగిన క్రయ విక్రయాలతో కళతప్పిన ఈ మార్కెట్ శ్రావణం నుంచి ప్రారంభమైన శుభ ముహూర్తాలతో సందడి నెలకొంది. శుక్రవారం వరలక్ష్మీవ్రతం నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కొనుగోలుదారులతో స్థానిక మార్కెట్లో రద్దీ నెలకొంది. దిగుబడి లేక దిగుమతి.. సీజన్ ప్రారంభమైనప్పటికీ స్థానికంగా పువ్వుల దిగుబడులు లేవని రైతులు చెబుతున్నారు. లిల్లీ, మల్లి, జాజులు, కనకాంబరం, దేశవాళీ గులాబీలు మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వరలక్ష్మీ వ్రతాలకు ప్రధానంగా వినియోగించే బంతి, చామంతులకు తీవ్రమైన కొరత ఏర్పడడంతో తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి దిగుమతి చేస్తున్నారు. వాటి ధరలు సైతం అలాగే ఆకాశాన్నంటుతున్నాయని వ్యాపారులు అంటున్నారు. బుధవారం పూల ధరలు ఇలా.. చామంతి కేజీ రూ.300–450 పసుపు బంతి రూ.80–100 ఆరెంజ్ బంతి రూ.90–110 లిల్లీ రూ.300, మల్లి రూ.1200 జాజులు రూ.800 కాగడాలు రూ.1200 స్టార్ గులాబీ రూ.350–450 కనకాంబరాల బారు రూ.350–400 సంపంగి (వంద) రూ.1000 కడియపులంక మార్కెట్కు కొత్త కళ శుభ ముహూర్తాల వేళ జోరుగా విక్రయాలు స్థానిక దిగుబడి లేక ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి డిమాండ్ మేరకు పెరుగుతున్న ధరలు -
బీసీలకు దాడిశెట్టి రాజా ప్రాధాన్యం
● ఇంటి ముట్టడిని అడ్డుకుంటాం ● స్పష్టం చేసిన వైఎస్సార్ సీపీ నాయకులు తుని రూరల్: వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా బీసీలకు వెన్నెముకగా నిలుస్తున్నారని, అటువంటి నాయకుడి ఇంటిని ముట్టడిస్తామని అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. తుని మండలం ఎస్.అన్నవరంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం జెడ్పీ వైస్ చైర్మన్ మెరుగు పద్మలత, ఎంపీపీ లగుడు శ్రీను, పెరిక కార్పొరేషన్ డెవలప్మెంట్ మాజీ చైర్మన్ పురుషోత్తం గంగాభవాని, నాయకులు రేలంగి రమణ గౌడ్, దుంగల నాగేశ్వరరావు, సత్యనారాయణ తదితరులు విలేకర్లతో మాట్లాడారు. తెలుగు జనతా పార్టీ నాయకుడి ఆధ్వర్యంలో బీసీలతో ఈ నెల 23న దాడిశెటి రాజా ఇంటిని ముట్టడిస్తామని పి.వెంకటేశ్వరరావు అనడం విడ్డూరంగా ఉందన్నారు. కాపునాడు ఉద్యమంలో టీడీపీ ప్రభుత్వం సంబంధం లేని బీసీలను అరెస్ట్ చేసినప్పుడు పెద్దన్నగా చెప్పుకుంటున్న వెంకటేశ్వరరావు కనీసం పరామర్శించారా అని ప్రశ్నించారు. తుని మున్సిపల్ చైర్ పర్సన్, పార్టీ పట్టణ అధ్యక్ష, కోటనందూరు ఎంపీపీ, రాష్ట్ర పెరికి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పదవులు ఇచ్చి బీసీలపై తనకు ఉన్న ఆప్యాయతను దాడిశెట్టి రాజా చాటుకున్నార న్నారు. అటువంటి నాయకుడిపై బీసీ వ్యతిరేకని ముద్రవేయడం వెనుక ఎవరున్నారని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీలో కీలక పదవులన్నీ బీసీలకు, ఎస్టీల కు ఇచ్చారన్నారు. ఏదైనా సమస్య ఉంటే చర్చల ద్వా రా పరిష్కరించుకుందామన్నారు. అంతేగానీ ముట్టడిస్తాం, బీసీ వ్యతిరేకి అంటూ చేసే ప్రయత్నాలను బీసీలుగా తామంతా అడ్డుకుంటామన్నారు. నియోజకర్గంలో 1.20 లక్షల మంది బీసీలు ఉన్నారని, వారంతా దాడిశెట్టి రాజా వెంటే నడుస్తారన్నారు. -
అలరించిన గాతా రహే మేరా దిల్
● ఉర్రూతలూగించిన ఎస్పీ శైలజ సినీ గీతాలు ● ముగిసిన శ్రీప్రకాష్ వ్యవస్థాపక దినోత్సవాలు తుని: శ్రీప్రకాష్ విద్యా సంస్థల వ్యవస్థాపక దినోత్సవాలు సంగీత స్వరాలు, విద్యార్థుల కేరంతల నడుమ బుధవారం ఘనంగా ముగిసాయి. విద్యాసంస్థలు ఏర్పడి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సంస్థ సంయుక్త కార్యదర్శి సీహెచ్.విజయ్ప్రకాష్ ఆధ్వర్యంలో గాతా రహే మేరా దిల్ కార్యక్రమానికి సినీ నేపథ్య గాయని ఎస్పీ శైలజ ముఖ్య అతిథిగా హాజరై న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. తుని, పాయకారావుపేట, అన్నవరం, కాకినాడ, పెద్దాపురం, రాజమహేంద్రవరం శ్రీప్రకాష్ విద్యా సంస్థల విద్యార్థులు హాజరయ్యారు. జూనియర్, సీనియర్ విభాగాల్లో విజేతలకు విద్యాసంస్థల అధినేత సీహెచ్వీకె నరసింహారావు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ శైలజ పాడిన పాటలు యువతను ఉర్రూతలూగించాయి. విద్యాసంస్థల తరఫున ఆమెను నరసింహారావు, రామసీత దంపతులు సత్కరించారు. డాక్టర్ నరేంద్రబాబు, ఎస్.సూర్యనారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల పూర్వ విద్యార్థులు 400 మంది రక్తదానం చేసినట్టు విజయప్రకాష్ తెలిపారు. 40 కంటే ఎక్కువ సార్లు రక్తదానం చేసిన విద్యార్థులను ఆయన సత్కరించారు. -
గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి చర్యలు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కాకినాడ పోర్టు దక్షిణ ద్వారం నుంచి ఉప్పలంక వద్ద ఉన్న జాతీయ రహదారి వరకు సుమారు ఐదు కిలోమీటర్ల మేర కొత్త రహదారిని ఏర్పాటు చేస్తామని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అన్నారు. పోర్టు నుంచి జాతీయ రహదారి 216 వరకు నాలుగు వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారిని నిర్మించేందుకు బుధవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమా వేశం నిర్వహించారు. సంస్థ అధికారి బి.కృష్ణమూర్తి నాలుగు వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారిని నిర్మించే ప్రాజెక్టు నివేదికను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం పోర్టు నుంచి వచ్చే సరుకు రవాణా వాహనాలు కాకినాడ నగరం మీదుగా సుమారు 27 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోందన్నారు. కొత్తగా నిర్మించనున్న ఈ ఐదు కిలోమీటర్ల రహదారితో రవాణా దూరం 22 కిలోమీటర్లు తగ్గడమే కాకుండా, ప్రయాణ సమయం 30 నుంచి 40 నిమిషాల వరకు ఆదా అవుతుందన్నారు. తద్వారా నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని, రహదారి భద్రత పెరుగుతుందని, ఉపాధి అవకాశాలు ఏర్పడతాయన్నారు. పనులు వేగవంతం చేయాలి జిల్లా పరిధిలో చేపట్టిన సివిల్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని వివిధ శాఖల ఇంజినీర్లను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. పంచాయతీరాజ్, ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ ఇనన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎంఎస్ఐడీపీ), ఆర్అండ్బీ, కాకినాడ నగరపాలక సంస్థకు చెందిన ఇంజినీర్లతో వివిధ నిధుల కింద చేపట్టిన సివిల్ పనుల పురోగతిపై సమీక్షించారు. అలాగే ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో సర్ ప్రక్రియలో భాగంగా అభ్యంతరాలు స్వీకరించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. బూత్ లెవల్ అధికారులు ఆ రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకూ తమ పోలింగ్ కేంద్రాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. -
సబ్ స్టేషన్ నిర్మాణానికి రూ.7 కోట్ల విలువైన భూమి వితరణ
రాజమహేంద్రవరం రూరల్: హుకుంపేట గ్రామానికి చెందిన స్వర్గీయ సత్యవోలు పాపారావు చిన్న కోడలు వడ్డాది గౌరి హుకుంపేటలో 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణానికి సుమారు రూ.7 కోట్ల విలువైన 2,400 చదరపు గజాల స్థలాన్ని విరాళంగా అందజేశారు. ఈపీ డీసీఎల్ పర్యవేక్షక ఇంజినీర్ కె. తిలక్ కుమార్, రాజమహేంద్రవరం టౌన్ డివిజన్ కార్యనిర్వహక ఇంజినీర్ నక్కపల్లి శామ్యూల్ ప్రతిపాదన మేరకు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, హుకుంపేట గ్రామానికి చెందిన వల్లేపల్లి సుబ్రహ్మణ్యం అభ్యర్థన మేరకు ఈ స్థలాన్ని వితరణ చేశారు. ఈ మేరకు బుధవారం కడియం సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసి ఈఈ శామ్యూల్కు గౌరి సదరు పత్రాలను అందజేశారు. ఈ మేరకు దాత గౌరికి సీఎండీ పృథ్వీతేజ్ కృతజ్ఞతలు తెలిపారు. వాడపల్లి వెంకన్న హుండీల ఆదాయం రూ.2.97 కోట్లు ఆత్రేయపురం: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి వేంకటేశ్వరస్వామికి హుండీల ద్వారా 35 రోజులకు రూ.2,97,95,990 ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో దేవదాయ శాఖ ఉప కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. గతంలో కంటే ఆదాయం గణనీయంగా పెరిగినట్లు గతంలో రోజుకు హుండీల ద్వారా రూ.7,93,823 ఉండగా ఇప్పుడు రోజుకు రూ.8,51,314 సరాసరి ఆదాయంగా లభించినట్లు తెలిపారు. కాగా వాడపల్లి ఆలయ ఆవరణలో ఆలయ హుండీలను బుధవారం దేవదాయ శాఖ పర్యవేక్షణ అధికారులు, జిల్లా దేవదాయ శాఖ అధికారి వి.సత్యనారాయణ, రాజమహేంద్రవరం దేవదాయ శాఖ తనిఖీదారు ఎస్టీపీటీ శ్రీనివాస్, గ్రూపు దేవాలయాల ఈవోలు బి.కిరణ్(గోపాలపురం), మడికి గ్రూపు దేవాలయాల ఈవో ఎం.శివరామకృష్ణల సమక్షంలో లెక్కింపు నిర్వహించినట్లు తెలిపారు. స్వామివారి ప్రధాన హుండీల ద్వారా విశ్వేశ్వరస్వామి హుండీలతో కలిపి రూ.1,81,93,365, అన్న ప్రసాదం హుండీల ద్వారా రూ.1,16,02,625 రూపాయలు లభించాయన్నారు. -
గోదావరి పుష్కర ప్రాజెక్టు సిద్ధం
రాజానగరం: వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలను సమర్ధంగా నిర్వహించేందుకుగాను గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జిజియు)తో కలిసి ‘గోదావరి పుష్కర ప్రాజెక్టు’ను రూపొందించినట్టు అమెరికాకు చెందిన ‘ఎక్స్ట్రాన్స్ సొల్యూషన్స్’ సంస్థ సీఈఓ శివకుమార్ మతపతి, కాలిఫోర్నియాలోని సొనోమా స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఫరీద్ ఫర్హ్మాండ్ తెలిపారు. ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టు అమలుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. బుధవారం జీజీయూను సందర్శించిన వారు ఈ విషయాలను తెలియజేశారు. నగర మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనాతో ఇప్పటికే వివిధ అంశాలపై చర్చించామన్నారు. వర్సిటీ ప్రొఫెసర్ వీసీ డాక్టర్ కేవీబీ రాజు, రిజిస్ట్రార్ డాక్టర్ పీఎంఎంఎస్ శర్మ, డైరెక్టర్ డాక్టర్ ఎం.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల ఉజ్వల భవితకు.. విద్యార్థులకు ఉజ్వల భవిత అందించే సంకల్పంతో తమ వర్సిటీ అమెరికాకు చెందిన ‘ఎక్స్ట్రాన్స్ సొల్యూషన్స్’ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందని స్థానిక గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జీజీయూ) ప్రొఫెసర్ వీసీ డాక్టర్ కేవీబీ రాజు తెలిపారు. ఇందుకు సంబంధించి బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఉభయ సంస్థల ప్రతినిధులు చర్చించుకుని, పరస్పర అవగాహన పత్రాలను మార్చుకున్నారు. కార్యక్రమంలో ఎక్స్ట్రాన్స్ సొల్యూషన్స్ సంస్థ సీఈఓ శివకుమార్ మతపతి, ప్రొఫెసర్ డాక్టర్ ఫరీద్ ఫర్హ్మాండ్, జీజీయూ రిజిస్ట్రార్ డాక్టర్ పీఎంఎంఎస్ శర్మ, డైరెక్టర్ డాక్టర్ ఎం. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
కిక్కురుమనరే!
అధిక ధరలకు విక్రయం! మద్యం షాపుల్లో ధరలు పెరగడంతో దానికి అనుగుణంగా నడుస్తున్న బెల్ట్ షాపుల్లో సైతం మరింత బాదుడు తప్పడం లేదు. ప్రతి మద్యం షాపునకు అనుబంధంగా ఉన్న బెల్ట్ షాపుల్లో రూ.30 నుంచి రూ.50 పెంచి మందుబాబుల జేబులకు చిల్లు పెడుతున్నారు. మందుబాబుల అభిరుచులకు అనుగుణంగా డోర్ డెలివరీ సైతం చేస్తున్నారు. వారికి కావాల్సిన బ్రాండ్లకు ఫోన్లో ఆర్డర్ ఇస్తే చాలు, అనుకున్న సమయానికి చేరిపోతున్నాయి. పండగలు, పుట్టిన రోజు, పెళ్లిరోజు తదితర పార్టీలకు ఎక్కువ మొత్తం ఆర్డర్లు ఇస్తున్నారు. గతంలో ఎమ్మార్పీ కంటే ఒక్కో బాటిల్ఊపై రూ.30 నుంచి రూ.50 వరకు వసూలు చేసేవారు. ప్రస్తుతం బాటిల్పై రూ.10 పెరగడంతో వారి ధర సైతం పెంచేశారు. ప్రస్తుతం రూ.50 నుంచి రూ.60 అదనంగా తీసుకుంటున్నారు. ఫ జోరుగా మద్యం అమ్మకాలు ఫ విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఫ ధరలను పెంచి దందా ఫ మందుబాబుల జేబులు గుల్ల ఫ పట్టించుకోని అధికారులు! ఫ తూతూమంత్రంగా దాడులు ఫ జిల్లాలో 170 మద్యం దుకాణాలు ఫ ఒక్కో షాపు పరిధిలో ఐదు బెల్ట్ షాపులు సాక్షి ప్రతినిధి, కాకినాడ: కూటమి ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతోంది. విచ్చలవిడిగా విక్రయాలు జరుగుతూ అన్ని సమయాల్లో మందు అందుబాటులో ఉంటోంది. ప్రభుత్వ ప్రోత్సాహం, మద్యం మాఫియా రెచ్చిపోతుండటంతో అనధికారిక విక్రయాలు పెరిగిపోయాయి. నియంత్రించాల్సిన ఎకై ్సజ్, పోలీసులు మామూళ్ల మత్తులో జోగుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీనికి తోడు బెల్టు షాపులను ఎక్కడపడితే అక్కడే ఏర్పాటు చేసేశారు. ఊరూరా బెల్టు జోరు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన అనంతరం మద్యం విక్రయాలను ప్రైవేటుకు కట్టబెట్టారు. టీడీపీ నేతల కనుసన్నల్లోనే మద్యం సిండికేట్ కొనసాగుతోంది. అధికారం ఉంది కదా అని అడ్డగోలు వ్యవహారానికి తెర తీస్తున్నారు. మద్యం షాపు అందుబాటులో లేని గ్రామాలను ఎంపిక చేసుకుని బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్నారు. వెరసి గ్రామీణ ప్రాంతాల్లో గల్లీకో బెల్టు దుకాణాం వెలిసింది. వాటిని అరికడుతున్నామని ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతోందే తప్ప, నియంత్రించిన దాఖలాలు లేవు. మద్యం షాపులకు అనుగుణంగా.. జిల్లా వ్యాప్తంగా 170 మద్యం షాపులకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. వీటికి సామర్లకోట ఐఎంఎల్ డిపో నుంచి మద్యం సరఫరా చేస్తున్నారు. ఇప్పటికే క్వార్టర్పై రూ.10 నుంచి రూ.20 వరకు పెంచి విక్రయాలు చేస్తున్నారు. ఇది చాలదన్నట్లు అక్రమార్జన కోసం అర్రులు చాస్తున్నారు. ఒక్కొ మద్యం షాపునకు అనుగుణంగా కనీసం మూడు నుంచి ఐదు బెల్ట్ షాపులు ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇలా జిల్లా వ్యాప్తంగా సుమారు సగటున మూడు లెక్కవేసుకున్నా 510 బెల్ట్ షాపులు ఉన్నట్లు సమాచారం. దాదాపు ప్రతి గ్రామంలో నాలుగేసి బెల్టు షాపులు వెలుస్తున్నాయి. యథేచ్ఛగా విక్రయాలు మండల కేంద్రాల్లోని మద్యం షాపుల ద్వారా బెల్ట్ షాపులకు మద్యం తరలిస్తున్నారు. ఏ గ్రామంలో ఎవరు బెల్ట్ షాపు నిర్వహించాలి? ఎంత మొత్తం చెల్లించాలన్న విషయమై మద్యం షాపు యజమానులు నిర్వహించిన ధరను చెల్లించి మరీ గొలుసు దుకాణాలు నిర్వహిస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. డబ్బులు తీసుకుని బెల్ట్ షాపులను మద్యం యజమానులు ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. వారు నిర్ణయించిన వ్యక్తి కాకుండా ఇతరులు ఎవరైనా విక్రయస్తే మాత్రం ఎకై ్సజ్, పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చి దాడులు చేయిస్తున్నట్లు తెలిసింది. -
మూడో యువకుడి మృతదేహం గుర్తింపు
సఖినేటిపల్లి: పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం ఐతంపూడి లాకుల వద్ద శనివారం అర్ధరాత్రి కాలువలోకి కారు దూసుకువెళ్లిన ఘటనలో సఖినేటిపల్లి మండలం మోరికి చెందిన మూడో ఇంజినీరింగ్ విద్యార్థి చెరుకూరి రాజారామ్ మృతదేహం ఎట్టకేలకు మంగళవారం గుర్తించారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, పోలీసు, అగ్నిమాపక బృందాలు చేపట్టిన గాలింపు చర్యల్లో పెనుగొండ వద్ద కాలువలో రాజారామ్ మృత దేహాన్ని కనుగొన్నారు. సఖినేటిపల్లి మండలం మోరి, మోరిపోడు, ఉయ్యూరువారి మెరక గ్రామాలకు చెందిన చెరుకూరి రాజారామ్ (17), పోతుల లక్ష్మీభానువికాస్ (18), నాగిరెడ్డి దుష్యంత్ (18)లు పై దుర్ఘటనలో ప్రమాదం బారిన పడ్డారు. ఈ మేరకు ఐతంపూడి వద్ద ఘటనలో నీటి ప్రవాహానికి గల్లంతైన ఐదుగురులో నలుగురి మృతదేహాలు ఆదివారం వెలికితీశారు. వీరిలో మండలానికి చెందిన పోతుల లక్ష్మీభాను వికాస్, నాగిరెడ్డి దుష్యంత్ మృతదేహాలకు అదే రోజున పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. అయితే అప్పటి నుంచి రాజారామ్ ఆచూకీ దొరకలేదు. దీంతో తండ్రి ప్రసాద్, తల్లి సత్యకుమారి పడ్డ వేదన వర్ణనాతీతం. కాగా రాజారామ్ మృతదేహానికి పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించనున్నారు. శోకసంద్రంలో కుటుంబ సభ్యులు రెండు రోజులుగా నీటిలోనే ఉండిపోవడంతో రాజారామ్ మృతదేహం ఉబ్బిపోయి, గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. కొడుకు కోసం నిద్రాహారాలు మాని సహాయక చర్యల్లో పాల్గొన్న తండ్రి దుర్గాప్రసాద్ విగతజీవిగా మారిన కుమారుడిని చూసి కన్నీరుమున్నీరుగా విలపించాడు. బంధువుల రోదనలతో పెనుగొండ–మార్టేరు రహదారిపై తీవ్ర విషాదం అలముకుంది. రాజారామ్ తండ్రి దుర్గాప్రసాద్ గల్ఫ్లో ఉపాధి పొందుతూ, ఇటీవల సెలవుపై స్వగ్రామానికి వచ్చారు. రాజారామ్ను సూరంపాలెంలోని ఆదిత్య యూనివర్సిటీలో బీటెక్ ఫస్టియర్లో చేర్పించారు. బుధవారం నుంచే తరగతులు ప్రారంభం కావాల్సి ఉండగా ఇంతలోనే ఈ ఘోర ప్రమాదం ఆ కుటుంబాన్ని తీవ్ర శోకంలోకి నెట్టింది. ఆటోడ్రైవర్ మానవత్వం మృతదేహం చెట్టుకొమ్మల్లో ఇరుక్కుపోయి, దుర్వాసన వస్తుండటంతో వెలుపలికి తీయడం పోలీసులకు సవాలుగా మారింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న పెనుగొండకు చెందిన ఆటోడ్రైవర్ చిట్టిబాబు తన ఆటోను ఆపి సహాయంగా నిలిచారు. ఎవరూ ముందుకు రాని పరిస్థితుల్లో అతడు ధైర్యంగా వెళ్లి, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి మృతదేహాన్ని అంబులెన్స్లోకి చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. చిట్టిబాబు ప్రదర్శించిన మానవత్వానికి పోలీసులతో పాటు స్థానికులు అభినందనలు తెలిపారు. ఐతంపూడి వద్ద ఘటన -
కలకాలం గుర్తుండేలా..
● జీవితంలో ఫొటోలకు అత్యంత ప్రాధాన్యం ● జ్ఞాపకాలకు మధుర రూపం ● అనుబంధాలను తెలిపే అద్భుతం ● నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం కపిలేశ్వరపురం: మానవుడు ఎంత డబ్బు ఖర్చు చేసినా, ఎన్ని పరిశోధనలు చేసినా గతించిన కాలంలోని ఒక్క క్షణాన్ని వెనక్కి తీసుకురాలేడు. కానీ ఒక్క ఫొటో మాత్రం గత కాలపు ఆనందాన్ని, వేడుకలను, ఆహ్లాదకర సమయాలను గుర్తుకు తెస్తుంది. మన జీవితంలో ఫొటోకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ముత్తాతల రూపం, తాతయ్య ఉమ్మడి ఇల్లు, నాన్న చిన్నప్పటి అల్లరి, మన బుడిబుడి అడుగులు.. ఇలా ప్రతి క్షణాన్ని తన గుండెలో దాచుకుని, కొత్త తరానికి పంచుతుంది. ప్రకృతి అందాలను తనలో బంధించి, ఆనందాన్నిస్తుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని గోదావరి గలగలలు, సముద్ర తీరం, కొబ్బరి తోటలు, పచ్చిక మైదానాలు ఇవన్నీ ఫొటోగ్రఫీకి చాలా బాగుంటాయి. నేపథ్యమిదే.. రాయడం, చిత్రించడమని అర్థం కలిగిన గ్రాఫోన్ అనే పదం నుంచి ఫొటోగ్రఫీ వచ్చింది. ఇది కమర్షియల్గా 1839 జనవరి తొమ్మిదిన ప్రపంచానికి పరిచయమైంది. మెటల్ ఆధారిత పరికరాలతో డాగ్యురియోటైప్ పద్ధతిలో ఫొటోగ్రఫీని లూయిస్ డాగ్యురీ, జోసఫ్ నైస్ఫోర్ రూపకల్పన చేశారు. 1839 ఆగస్టు 19న ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ద్వారా ఫ్రెంచ్ ప్రభుత్వం పేటెంట్ హక్కులను దక్కించుకుని ప్రపంచానికి ఫొటోగ్రఫీని అందించింది. పెరిగిన సాంకేతికత వ్యవసాయమే జీవనాధారం గల ఆ రోజుల్లో ఫొటోగ్రఫీ ఓ అద్భుతమైన కళగా మారింది. ఎవరికీ అంతుచిక్కని గొప్ప విచిత్రమైన వృత్తిగా ఉండేది. అధునాతనమైన నేటి రోజుల్లో అదే పెరిగిన సాంకేతికత ఫొటోగ్రాఫర్లను సుడిగుండంలోకి పడేసింది. డిజిటల్ పరికరాలు వచ్చాక వినియోగదారులే ఫొటో రూపకర్తలుగా మారడం వృత్తిదారులను ఇబ్బందుల్లోకి నెట్టింది. సెల్ ఫోన్లలో ఫొటోల నాణ్యతను అనేక రెట్లు పెంచిన నేపథ్యంలో ఈవెంట్ల సమయంలో తప్ప మిగిలిన ఏ సందర్భంలోనూ ప్రజలు స్టూడియోలకు వెళ్లడం లేదు. యాప్లు, వెబ్సైట్లలో డిజిటల్ అప్లోడ్స్ విధానం వచ్చాక ఫొటోప్రింట్ల అవసరం కూడా లేకుండా పోయింది. ఏఐ సహకారంతో ఫొటో, బ్యానర్, ఫ్లెక్సీల డిజైన్లు చేసేసుకుంటున్నారు. కెమెరానే నమ్ముకున్న జీవితాలెన్నో.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుమారు నాలుగు వేల స్టూడియోలున్నాయి. అధునాతన, ఖరీదైన ఫొటోగ్రఫీ పరికరాలతో నడుస్తున్న స్టూడియోలు సుమారు 25 వరకు ఉంటాయి. సామాజిక అంశాలపై స్పందించిన రాజమహేంద్రవరానికి చెందిన జీవీవీ ప్రసాద్, ఎస్బీ రాజేశ్వరరావు పాన్ ఇండియా సోషియో కల్చరల్ అసోసియేషన్ గోదావరి బెస్ట్ ఫోటో జర్నలిస్ట్ అవార్డులు 2025 పొందారు. కాకినాడ జిల్లా గొర్రిపూడి గ్రామానికి చెందిన మేరేటి సోమరాజు తాను క్లిక్ మనిపించిన చిత్రాలకు 2016, 2017, 2019లో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామానికి చెందిన పద్మాలయా స్టూడియోను 1986 ఆగస్టు 16న ప్రారంభించారు. ముగ్గురు అన్నదమ్ములు కుటుంబ సభ్యుల సమేతంగా ఆ వృత్తిలో శ్రమిస్తున్నారు. 40 ఏళ్లుగా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ కెమెరాను వదలకుండా ముందుకు సాగుతున్నామని చిక్కం నరసింహారావు, శ్రీనివాస్, కాశీ విశ్వనాథం చెబుతున్నారు. శ్రీనివాస్ తీసిన పలు ఫొటోలకు మండపేటలో జోనల్ స్థాయి ఫొటో టేకింగ్ పోటీల్లో ప్రథమ బహుమతులు దక్కాయి. ఫొటో అంటే కేవలం ప్రకృతి అందాలు, కుటుంబాల ఆప్యాయతలను మాత్రమే చూపించదు. యుద్ధాల సమయంలో జరిగే దారుణాలకు నిదర్శనంగా నిలుస్తోంది. అక్కడి ప్రజలు పడే ఇబ్బందులను ప్రపంచానికి తెలియజేసే ఆయుధంగా మారుతోంది. వరదలు, కరవు కాటకాల సమయంలో జరిగిన నష్టానికి సాక్ష్యంగా కూడా నిలుస్తోంది. ఇలా సంతోషం, బాధ, కష్టాలు, కన్నీరు ఇలా అన్నింటికీ ఆధారమవుతోంది. అన్నింటికీ ఆధారం -
భార్యను వేధిస్తున్న వ్యక్తి హత్య
● కత్తితో నరికి చంపిన భర్త ● శృంగధార గ్రామంలో ఘటన శంఖవరం: మండలంలోని పెద మల్లాపురం పంచాయతీ పరిధిలోని శృంగధారలో ఒక వ్యక్తి హత్యకు గురైన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. తన భార్యను వేధిస్తున్నాడనే కారణంతో రాజవొమ్మంగి మండలం వాతంగి పంచాయతీ ఓంపాలెం గ్రామానికి చెందిన ఎస్.మణికుమార్ (32)ను కాకూరి చంద్రయ్య కత్తితో నరికి హత్య చేశాడు. వీరిద్దరూ సమీప బంధువులు కావడం విశేషం. వివరాల్లోకి వెళితే.. గతంలో శృంగధారలో చంద్రయ్య భార్యతో మణికుమార్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆమె మణికుమార్ను వదిలించుకుని భర్తతో ఉండసాగింది. దీంతో అతడు నాటు తుపాకీతో చంద్రయ్య, అతడి భార్యను కాల్చాడు. అప్పుడు పోలీసులు మణికుమార్పై కేసు నమోదు చేసి జైలుకు పంపారు. జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆ మహిళను వేధింపులకు గురి చేశాడు. దీంతో మణికుమార్పై కాకూరి చంద్రయ్య కత్తితో దాడి చేయడంతో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో నిందితుడిని అన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రత్తిపాడు సీహెచ్సీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సైశ్రీహరిబాబు తెలిపారు. -
దారిలో బెదిరించి.. బలవంతంగా వసూలు
అనపర్తి: దారి తప్పి ఇబ్బంది పడుతున్న వారిని బెదిరించి, బలవంతంగా డబ్బు వసూలు చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై వాసంశెట్టి రవిచంద్ర కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ జిల్లా కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామానికి చెందిన మిరియాల సుబ్రహ్మణ్యం, పలివెల వీరబాబు ఆదివారం పందలపాకలో జరిగిన తమ తోటి తాపీమేస్త్రి యల్ల సింహాద్రి వివాహానికి మోటారు సైకిల్పై వచ్చారు. వివాహం ముగిసిన తర్వాత స్వగ్రామానికి బయలుదేరారు. అయితే దారి తప్పి రాత్రి సుమారు 10:30 గంటలకు ఆ గ్రామంలోని వైన్ షాప్ వద్ద తిరగసాగారు. ఇంతలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు స్కూటర్పై వచ్చి వీరిని అడ్డగించారు. బైక్ తాళాన్ని, సుబ్రహ్మణ్యం సెల్ ఫోన్ను బలవంతంగా లాక్కున్నారు. నిందితులలో ఒక వ్యక్తి వీరబాబును బెదిరించి, మద్యం కోసం డబ్బులు అడిగాడు. లేవంటే బెదిరించి, స్కానర్ ద్వారా వైన్ షాప్కు ఫోన్పేలో డబ్బు చెల్లించేలా బలవంతం చేశారు. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం జేబులోని రూ.500 తీసుకుని, సెల్ఫోన్తో సహా అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యా స్థలం పరిశీలన రాజానగరం: మండలంలోని చక్రద్వారబంధంలో వివాహిత హత్యకు గురైన ప్రాంతాన్ని ఎస్సై జీవీవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఫోరెన్సిక్ నిపుణులు మంగళవారం పరిశీలించారు. తాగుడుకు బానిసైన మట్టపర్తి నాగబాబు తన భార్య కుమారి పీక నులిమి, ఆపై గొంతును తాడుతో బిగించి హతమార్చిన సంగతి విదితమే. మృతురాలి తల్లి వనుం రాధ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన రాజానగరం పోలీసులు, హత్యకు దారితీసిన కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. నేడు పోలీసు కస్టడీకి ప్రియాంక కేసు నిందితులు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరంలో కారుతో ఢీకొట్టి డాక్టర్ ప్రియాంక మృతికి కారణమైన నిందితులను పోలీసులు బుధవారం కస్టడీకి తీసుకోనున్నారు. ఈ మేరకు న్యాయస్థానం సోమవారం ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరు సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్నారు. కోర్టు ఉత్తర్వుల మేరకు నిందితులు సూరారపు ధస్వంత్, ఆండ్రు జోసఫ్ ఎడ్వర్డ్లను పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. -
కొనసాగుతున్న జూడాల నిరసన
కాకినాడ క్రైం: జూనియర్ డాక్టర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే చర్చలు జరపాలని నాయకులు డిమాండ్ చేశారు. రంగరాయ వైద్య కళాశాల జూనియర్ డాక్టర్ల ఆందోళన మంగళవారం ఏడో రోజుకు చేరింది. జీజీహెచ్ ఎదుట ఉన్న పీజీ వసతి గృహ ఆవరణలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. సుమారు 700 మందికి పైగా హౌస్ సర్జన్లు, పీజీలు విధులు బహిష్కరించి నిరసన గళాన్ని వినిపించడంతో రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు. ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా వివిధ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న మెడికల్ ఆఫీసర్లు సహా అసిస్టెంట్ ప్రొఫెసర్లు వైద్య సేవలు అందిస్తున్నారు. ఆసుపత్రిలో కొనసాగుతున్న వైద్య సేవల్ని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ మంగళవారం పరిశీలించారు. కాగా..శిక్షణ భృతి (స్టైఫండ్)ని 15–30 శాతం మేర పెంచాలని, 65 ఏళ్ల ఉద్యోగ విరమణ నిర్ణయాన్ని విరమించుకోవాలని, నియామకాల్లో ఎండీ, ఎంఎస్ చదివిన మెడికోలకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. న్యాయమైన తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం దిగి వచ్చి జూడాలతో చర్చలు జరపాలని నాయకులు కోరారు. సీపీఎం మద్దతు జూనియర్ వైద్యుల సమ్మెకు సీపీఎం మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ నగర కన్వీనర్ పలివెల వీరబాబు మంగళవారం రాత్రి ప్రకటన విడుదల చేశారు. దీక్షా శిబిరాన్ని సందర్శించి సమస్యలు తెలుసుకున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 వేల మంది జూనియర్ డాక్టర్లు సమ్మెలో ఉంటే అందులో 700 మందికి పైగా కాకినాడలోనే ఉన్నారన్నారు. ప్రభుత్వం మొండిపట్టు వీడి తక్షణమే జూడాలతో చర్చలు జరిపాలన్నారు. -
కూరాడ పీఏసీఎస్ శిలాఫలకం ధ్వంసం
కరప: కూరాడలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం (పీఏసీఎస్) కార్యాలయ భవన ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. గతంలో ఆ పీఏసీఎస్ భవనం శిథిలావస్థకు చేరడంతో గ్రామస్తులు, రైతుల వినతి మేరకు 2023లో అప్పటి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కురసాల కన్నబాబు నిధులు మంజూరు చేసి, అదే సంవత్సరం మే 13న కొత్త భవనానికి ప్రారంభోత్సవం చేశారు. కాగా.. గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. సీఈఓ బి.పరశురాముడు మంగళవారం ఉదయం 10 గంటలకు కార్యాలయానికి వెళ్లగా భవన ప్రారంభోత్సవ శిలాఫలకం ముక్కలై ఉంది. ఇదే విషయాన్ని పీఏసీఎస్ చైర్మన్ వెలుగుబంట్ల సూరిబాబుకు ఆయన తెలియజేశారు. ఆయన ఆదేశాల మేరకు కరప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదే స్థానంలో కొత్త శిలాఫలకం ఏర్పాటు చేస్తామని పీఏసీఎస్ చైర్మన్ సూరిబాబు చెప్పినట్టు సీఈఓ తెలిపారు. కాగా.. దీనిపై పీఏసీఎస్ మాజీ చైర్మన్, మాజీ సర్పంచ్ రావుల ప్రసాద్ మాట్లాడుతూ దీనిపై విచారణ చేసి, తగిన చర్యలు తీసుకోకపోతే కార్యాలయం వద్ద రైతులతో కలిసి ఆందోళన చేపడతామన్నారు. కూరాడ సచివాలయంపై ఏర్పాటు చేసిన వైఎస్సార్, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు చిత్రపటాలను 2024 జూన్ 10న ధ్వంసం చేశారన్నారు. ఇలాగే వదిలేస్తే గ్రామంలోని శిలాఫలకాలన్నింటినీ ధ్వంసం చేసే అవకాశముందని ఆవేదన వ్యక్తం చేశారు. -
నా భర్తను చంపేశాడు!
ఫ వెలుగులోకి పిఠాపురం ఏఈ కుమార్తె లేఖలు ఫ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు పిఠాపురం: స్థానిక పంచాయతీరాజ్ ఏఈ టి.నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక విషయాలు బయట పడుతున్నాయి. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న సాధిక్ ఖాన్.. తన కుటుంబానికి సహాయం చేస్తున్నట్టుగా నటించి, తమను హింసించాడని, తన భర్తను హత్య చేశాడని, తన కుటుంబాన్ని చంపుతానంటూ బెదిరించాడంటూ నూకరాజు కుమార్తె రాసినట్లు చెబుతున్న లేఖలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. దీంతో, ఈ కేసు కీలక మలుపు తిరిగింది. సాధిక్ ఖాన్ వేధింపులు భరించలేక నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవడు కార్తికేయరెడ్డి కలసి రాజమహేంద్రవరం రోడ్డు కం రైల్వే బ్రిడ్జి మీద నుంచి ఆదివారం రాత్రి గోదావరి నదిలో దూకిన విషయం తెలిసిందే. ఈ విషయం సోమవా రం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో నూకరాజు మృతదేహం సోమవారం రాత్రి లభ్యం కాగా.. మీనా, సౌజన్యల ఆచూకీ మంగళవారం సాయంత్రానికి కూడా లభించలేదు. వారి కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు గజ ఈతగాళ్ల సా యంతో గాలింపు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనలో కార్తికేయరెడ్డి ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డాడు. ‘నన్ను బెదిరించాడు’ మృత్యుంజయుడిగా బతికి బయటపడిన నూకరాజు మనవడు కార్తికేయరెడ్డి, తన కోడలు సౌజన్య స్కూటీలో ఆధారాలున్నాయంటూ భాస్కరరెడ్డి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు పోలీసులు ఆమె స్కూటీని తనిఖీ చేసి మూడు కవర్లను గుర్తించారు. వాటిలో తన భర్త జగదీశ్వరరెడ్డి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ నూకరాజు కుమార్తె సౌజన్య రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాధిక్ ఖాన్ తనను బెదిరించి, తన ఆస్తిని, ఫోన్, ఏటీఎం కార్డులు, బ్యాంకు లాకరు వివరాలన్నీ తీసుకున్నాడని, చివరకు తన భర్తను పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేశాడని, మాట వినకపోతే తన కుటుంబాన్ని చంపుతానంటూ బెదిరించాడని సౌజన్య ఆ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. అతడి బెదిరింపులు, వేధింపులు భరించలేకే తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని ఆ లేఖలో పేర్కొన్నట్టు తెలిసింది. లలసాధిక్ ఖాన్పై మరో ఫిర్యాదు తన కుటుంబం ఆత్మహత్యకు పాల్పడేందుకు సాధిక్ ఖాన్ కారణమంటూ నూకరాజు పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ మేరకు సాధిక్ ఖాన్పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, అతడిపై తాజాగా హత్య కేసు కూడా నమోదైంది. తన కుమారుడు జగదీశ్వరరెడ్డికి సాధిక్ ఖాన్ పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి, హత్య చేశాడంటూ నూకరాజు వియ్యంకుడు, సౌజన్య మామ భాస్కరరెడ్డి మంగళవారం సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో మరో వ్యక్తి ప్రమేయం కూడా ఉందని ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు సాధిక్ ఖాన్పై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. పోలీసులు ఇప్పటికే నూకరాజు కారు డ్రైవర్ రాజు నుంచి సమాచారం సేకరిస్తున్నారు. నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. జగదీశ్వరరెడ్డి హత్యలో ఉన్న మరో వ్యక్తి ఎవరనే అంశంపై విచారణ చేపట్టారు. -
ఫఇంత నిర్లక్ష్యమా..
తూర్పుగోదావరి కలెక్టరేట్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాలలో ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆ సమయంలో మైదానమంతా మువ్వన్నెల జెండాలతో మెరిసిపోయింది. వేడుకలు ముగిసిన అనంతరం జెండాలను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ప్రస్తుతం మైదానంలో ఎక్కడ చూసినా కింద పడిపోయిన జెండాలు, ఇతర వ్యర్థాలు దర్శనమిస్తున్నాయి. వాటిని మంగళవారానికి కూడా తొలగించకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనం. – సాక్షి ఫొటోగ్రాఫర్, రాజమహేంద్రవరం -
వినాయక చవితికి పగడ్బందీ ఏర్పాట్లు
ఫ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఫ అధికారులు, ఉత్సవ కమిటీలతో సమావేశం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): వినాయక చవితి పండగ సందర్భంగా విగ్రహాల నిమజ్జనానికి జిల్లాలో పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అన్నారు. గణపతి నవరాత్రులు, నిమజ్జనం ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులతో మంగళవారం కలెక్టరేట్లో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతిని పూజించాలని, విగ్రహాల తయారీలో రసాయన రంగులకు బదులుగా సహజ రంగులను ఉపయోగించాలన్నారు. బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై గణేశ్ మండపాలు ఏర్పాటు చేసేటప్పుడు సంబంధిత శాఖల నుంచి తప్పనిసరిగా అనుమతి పొందాలన్నారు. మండపాల వద్ద ఉత్సవ కమిటీలు అగ్ని ప్రమాద నివారణ పరికరాలను అందుబాటులో ఉంచాలన్నారు. రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీ, అగ్నిమాపక, పోలీసు అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి, గ్రామీణ ప్రాంతాలతో సహా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గణేశ విగ్రహాల నిమజ్జనానికి అనువైన ప్రదేశాలను గుర్తించాలన్నారు. ఆ వివరాలను రెండు రోజుల్లో అందజేయాలని కోరారు. ఫ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించడమే లక్ష్యంగా అధికారులు పని చేయాలని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్లో ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 389 గ్రామాల్లో 75 గ్రామాలను హర్ ఘర్ జల్ గ్రామాలుగా గుర్తించడం జరిగిందని, వాటిలో ఇప్పటి వరకు 61 గ్రామాలను ప్రకటించామన్నారు. మిగిలిన గ్రామాల్లోని పనులు వేగవంతం చేసి సురక్షిత తాగునీరు సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోడౌన్లను కలెక్టర్ పరిశీలించారు. -
‘మత్తు’ మాయలో పడొద్దు
కాకినాడ క్రైం: మాదక ద్రవ్యాలకు అలవాటు పడి, మత్తు మాయలో పడొద్దని జిల్లా బాలల పరిరక్షణ విభాగం సంరక్షణ అధికారి జాగరపు విజయ అన్నారు. నగరంలో సీబీఎం కళాశాలలో మంగళవారం నషా ముక్త్ భారత్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పీడీ చెరుకూరి లక్ష్మి ఆదేశాల మేరకు సీడీపీవో చెదలవాడ వెంకట్రావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బాలలకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. వాటికి అలవాటు పడితే మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు కుటుంబ, సామాజిక బంధాల్లో సమస్యలు తలెత్తుతాయన్నారు. మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా కాకినాడను తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. సోషల్ వర్కర్ చినబాబు మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ, బాలల సంక్షేమం కోసం శాఖ ద్వారా అందుతున్న అవకాశాలు, పిల్లలకు దక్కే చట్టపరమైన రక్షణపై అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలను విక్రయించిన వారితో పాటు బానిసలైన వారిపైనా న్యాయపరమైన చర్యలు తప్పవని ప్యానల్ అడ్వకేట్ సునీల్కాంత్ తెలిపారు. సదస్సులో నాయవాదులు ఏసుబాబు, బషీర్, వసంత కుమారి, కళ్యాణి, పారా లీగల్ వలంటీర్లు మల్లికార్జున్, అబ్దుల్ ఎస్ రెడ్డి, ప్రిన్సిపాల్ క్రాంతిరేఖ పాల్గొన్నారు. -
ప్రగతి వెలుగుకు పోస్టుమార్ట్మ్
● మూతపడిన నిడదవోలు మహిళా మార్ట్ ● కూటమి మహిళా నేత పెత్తనంతో అస్తవ్యస్తం నిడదవోలు రూరల్: వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన నిడదవోలులోని వెలుగు మహిళా మార్ట్ లాభాల బాటలో పయనించింది. అతి తక్కువ కాలంలోనే కోట్ల టర్నోవర్ సాధించింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఆ పార్టీ మహిళ పెత్తనంతో మూతబడింది. వివరాల్లోకి వెళితే.. మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉన్నత ఆశయంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయంలో నిడదవోలు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మండల సమాఖ్య పరిధిలో వెలుగు మహిళా మార్ట్ను 2022 నవంబర్ 10న ప్రారంభించారు. 1700 గ్రూపుల పరిధిలోని ఒక్కొక్క సభ్యురాలు నుంచి రూ.220 చొప్పున మూలధన పెట్టుబడితో రూ.38.35 లక్షలతో దీన్ని ఏర్పాటు చేశారు. నాణ్యమైన సరుకులను బయట మార్కెట్ కంటే ఇక్కడి తక్కువ ధరలకే విక్రయించడంతో ప్రజల ఆదరణ పెరిగింది. తద్వారా స్టాక్ సేల్లో రాష్ట్రంలోని తొలి పది స్థానాల్లో ప్రతిరోజు నిలిచేది. రోజుకు రూ.లక్షకు పైగా వ్యాపారం చేయడంతో రూ.3 కోట్ల టర్నోవర్ సాధించింది. ఆమెదే పెత్తనం మండల సమాఖ్య సభ్యుల పారదర్శక పర్యవేక్షణలో సాగాల్సిన మహిళా మార్ట్ నిర్వహణను టీడీపీ నియోజకవర్గ మహిళా నేత తన గుప్పెట్లోకి తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే 2024 డిసెంబర్లో మండల సమాఖ్య అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించి, నిబంధనలకు విరుద్ధంగా ఆమె కుటుంబ సభ్యులు మార్ట్ రోజువారీ వ్యవహారాల్లో తలదూర్చారు. నగదు లావాదేవీల్లో వారి జోక్యం విపరీతంగా పెరిగింది. స్టాక్ రిజిస్టర్లో తప్పులు లెక్కలు చూపిస్తూ విక్రయాలు జరిపేవారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ మహిళా నేత భర్తతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఈ మార్ట్లోనే పనిచేస్తున్నట్లు జీతాలు తీసుకున్నారని డ్వాక్రా సభ్యులు విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వంలో మార్ట్ కార్యకలాపాల కోసం కొనుగోలు చేసిన ద్విచక్ర వాహనాన్ని సైతం ఆమె భర్త నడుపుతున్నారని తెలుస్తోంది. చివరకు మూతపడి.. నిడదవోలులోని ఓ ప్రైవేటు భవనంలో మహిళా మార్ట్ను ఏర్పాటు చేసి, నెలకు రూ.21 వేల అద్దె చెల్లించేవారు. ఈ ఏడాది జనవరి 10న మూసివేసిన మార్ట్ తిరిగి తెరవలేదు. భవన యజమానికి 8 నెలలు అద్దె చెల్లించాల్సి ఉండటంతో ఆయన అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో జూన్లో మార్ట్ ఫర్నిచర్ను సూరాపురంలోని గ్రామ సమాఖ్య భవనానికి తరలించారు. -
ఓటర్ల జాబితా రూపకల్పనకు సహకరించాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో జూలై 31న ప్రచురించిన డ్రాఫ్ట్ ఓటరు జాబితాపై ప్రజలకు అవగాహన కల్పించి, అత్యంత కచ్చితత్వంతో కూడిన ఓటర్ల జాబితాను రూపకల్పన చేసేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని డీఆర్వో డి.తిప్పే నాయక్ కోరారు. ఆయన మంగళవారం కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి, జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పురోగతిని వివరించారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా గత జూలై 31న డ్రాఫ్ట్ ఓటరు జాబితాను ప్రచురించామన్నారు. అప్పటి నుంచి ఆగస్టు 30 వరకు డ్రాఫ్ట్ జాబితాపై అభ్యంతరాలు స్వీకరించడం జరుగుతుందన్నారు. జిల్లాలో వివిధ కారణాలతో 1,95,602 ఓట్లను తొలగించడం జరిగిందని, వాటిలో 31,695 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేశామన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అయ్యేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రజలకు అవగాహన, క్లెయిమ్స్, అభ్యంతరాల నమోదుకు సహకరించాలని సూచించారు. -
వివాదాల సుడి.. సత్యదేవుని గుడి
ఫ షాపుల నుంచి లీజు వసూలులో లోపించిన పారదర్శకత ఫ నిబంధనలకు తిలోదకాలు ఫ పోస్ట్ డేటెడ్ చెక్కులతో నిర్వహణకు అనుమతి అన్నవరం: సత్యదేవుని దేవస్థానంలో వేలం ద్వారా షాపులను లీజుకు తీసుకున్న వ్యాపారుల విషయంలో అధికారులు ద్వంద వైఖరి పాటిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. రెండు నెలల క్రితం దేవస్థానంలోని పశ్చిమ రాజగోపురం వద్ద రెండు పండ్ల దుకాణాలకు వేలం నిర్వహించారు. దానిలో మొదటి షాపునకు నెలకు రూ.16.70 లక్షలు, రెండో నెంబర్ షాపునకు నెలకు రూ.18.33 లక్షలకు వేలం ఖరారైంది. నిబంధనల ప్రకారం లీజుదారులు ఆరు నెలల సొమ్మును జీఎస్టీ కలిపి దేవస్థానానికి చెల్లించాలి. ఆ ప్రకారమే రెండో నంబర్ షాపు లీజుదారు సుమారు రూ.1.30 కోట్లు చెల్లించి వ్యాపారం ప్రారంభించాడు. ఒకటో నంబర్ షాపు లీజుదారు కూడా అదేలా చెల్లించి షాపు ప్రారంభించాలి. కానీ రూ.55 లక్షలు చెల్లించి, మిగిలిన మొత్తానికి రెండు పోస్ట్ డేటెడ్ చెక్కులిస్తే అధికారులు అనుమతిచ్చేశారు. చెక్కులు బౌన్స్ అవుతున్నా.. ఇప్పటికే దేవస్థానంలో వివిధ వ్యాపారాలకు సంబంధించి లీజుదారులిచ్చిన రూ.3 కోట్ల విలువైన 20 చెక్కులు బౌన్స్ అయ్యాయి. వాటిలో ఐదు చెక్కులకు సంబంధించి లీగల్ నోటీసులు ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో మళ్లీ పోస్ట్ డేటెడ్ చెక్కులు ఎలా అంగీకరించారనేది వారికే తెలియాలి. షాపులు వెనక్కి జరపాలని.. పశ్చిమ రాజగోపురం వద్ద గల షాపులను వెనక్కి జరపాలని ట్రస్ట్ బోర్డు సభ్యులు కక్షగట్టి అధికారుల ద్వారా తమపై ఒత్తిడి తెస్తున్నారని వ్యాపారులు విమర్శిస్తున్నారు. ఈ నెల 20 లోగా నాలుగడుగులు వెనక్కి జరపాలని సి సెక్షన్ అధికారులు వ్యాపారులను సోమవారం ఆదేశించిన నేపథ్యంలో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షాపులు గత నాలుగేళ్ల నుంచి ఒకే లైన్లో ఉన్నాయని, కార్తిక మాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పుడు కూడా వెనక్కి జరిపించలేదని చెబుతున్నారు. కాగా.. పోస్ట్ డేటెడ్ చెక్కులు క్యాష్ కాకపోతే తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఈవో ఎన్.సూర్యచక్రధరరావు అన్నారు. దీనిపై ఆయనను వివరణ కోరగా పైవిధంగా స్పందించారు. ఇంకెవరికీ ఇలా అవకాశమివ్వబోమని చెప్పారు. -
కూలి పనికి వచ్చి కాలువలో గల్లంతు
పెరవలి: ముక్కామలలోని బాపన్న కాలువలో స్నానం చేస్తున్న వ్యవసాయ కూలీ ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి గల్లంతయ్యాడు. వివరాల్లోకి వెళితే.. కాకినాడ జిల్లా ఏలేశ్వరం గ్రామానికి చెందిన ఏడిద రవితేజ (41) మరికొందరితో కలిసి వ్యవసాయ పనుల కోసం గ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ముగ్గురు కాలువలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తూ మునిగిపోబోయారు. గమనించిన స్థానికుడు వెంటనే కాలువలోకి దూకి ఇద్దరికి కాపాడాడు. కానీ రవితేజ మాత్రం నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. విషయం తెలిసిన వెంటనే రెవెన్యూ అధికారులు, పోలీసులు స్థానిక గజ ఈతగాళ్లతో కాలువలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. తహసీల్దార్ కె.నిరంజన్ ప్రమాద స్థలానికి వెళ్లి అక్కడ పరిస్థితి పరిశీలించారు. కాలువలో గాలింపునకు ఎన్డీఆర్ఎఫ్ బృందం కావాలని ఉన్నతాధికారులను కోరారు. వారు వచ్చిన వెంటనే గాలింపు చర్యలు ముమ్మరం చేస్తామని ఆయన తెలిపారు. రైలు ఢీకొని వృద్ధుడి మృతి రాజమహేంద్రవరం సిటీ: గోదావరి రైల్వే స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని రైలు ఢీకొని సుమారు 65 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడని రాజమహేంద్రవం జీఆర్పీ స్టేషన్ ఎస్ఐ సతీష్ మంగళవారం తెలిపారు. అతడి ఎత్తు దాదాపు 5.2 అడుగులు ఉంటుందని, ఒంటిపై ఆకుపచ్చ రంగు లుంగీ ఉందన్నారు. మరే ఇతర ఆధారాలు లభ్యం కాలేదని, ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుడి వివరాలు తెలిస్తే జీఆర్పీ స్టేషన్ 94948 19898, 0883 244282కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఆర్టీసీ బస్సు చక్రం ఎక్కడంతో మహిళ కాలు ఛిద్రం కడియం: మండలంలోని వేమగిరిలో బస్సు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తూ ఒక మహిళ జారిపడిపోయింది. అదే బస్సు చక్రం ఆమె ఎడమకాలి మీదుగా వెళ్లడంతో కాలిభాగం నుజ్జునుజ్జయిపోయింది. కడియం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేమగిరి తోట ప్రాంతానికి చెందిన వాసంశెట్టి మంగ మంగళవారం బస్సు ఎక్కుతూ జారి పడింది. అప్పటికే బస్సు కదిలిపోవడంతో ఆమె కాలు మీదుగా బస్సు వెనుక చక్రం వెళ్లిపోయింది. స్థానికులు వెంటనే రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కడియం ఇన్స్పెక్టర్ అల్లు వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడి ఘటనలో వ్యక్తికి జైలు తొండంగి: అక్రమంగా ఇంట్లోకి చొరబడి, వ్యక్తిని గాయపరిచిన కేసులో నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ తుని అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ వి.గోపాలకృష్ణ మంగళవారం తీర్పు ఇచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2018 జనవరిలో తొండంగి మండలం బెండపూడి శివారు సుబ్బరాయపురం గ్రామానికి చెందిన ఈర్లు శ్రీనువాస్ ఇంట్లోకి అన్నవరం గ్రామానికి చెందిన మెరపల నాగ కన్నయ్య అక్రమంగా ప్రవేశించాడు. శ్రీనువాస్తో గొడవపడి అతడి దవడపై బలంగా కొట్టడంతో పాటు చంపుతానని బెదిరించాడు. ఈ ఘటనలో బాధితుడి చెవి నుంచి రక్తస్రావం జరిగింది. అతడి ఫిర్యాదు మేరకు అప్పట్లో తొండంగి ఎస్సై బి.కృష్ణమాచారి దర్యాప్తు పూర్తి చేసి చార్జ్షీట్ దాఖలు చేశారు. విచారణలో నిందితుడిపై నమోదైన అభియోగాలు రుజువు కావడంతో ఏడాది సాధారణ జైలు, మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.ఆరు వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి ఆలమూరు: మండలంలోని పెదపళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బండారు ఆది శేషుబాబు (36) మృతి చెందాడు. ఆలమూరు ఎస్సై జి.నరేష్ కథనం ప్రకారం గ్రామానికి చెందిన ఆది శేషుబాబు సోమవారం వేకువజామున వ్యక్తిగత పని నిమిత్తం తన బైక్పై వెళుతున్నాడు. అంతలో కుక్క అడ్డుగా రావడంతో అదుపు తప్పి పక్కనే ఉన్న మెట్లపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్రమైన గాయం కావడంతో తొలుత ఆలమూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లగా అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం రాజమహేంద్రవరం ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈమేరకు ఎస్సై నరేష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. సురక్షితంగా కువైట్ నుంచి కోనసీమకు.. అమలాపురం రూరల్: కువైట్లో ఇబ్బందులు ఎదుర్కొన్న మహిళను మైగ్రేషన్ మేనేజ్మెంట్ సెంటర్(ఎంఎంసీ) సమన్వయంతో సురక్షితంగా ఇంటికి తీసుకువచ్చారు. అయినవిల్లి మండలం కొండుకుదురులంకకు చెందిన పెట్టా అనంతలక్ష్మి కువైట్ దేశంలో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఈ విషయాన్ని ఆమె భర్తకు తెలిపింది. భర్త ఎంఎంసీ, కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దాంతో కలెక్టర్ మహేష్కుమార్ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం, ఎంఎంసీ కలసి ఆమెను సురక్షితంగా కోనసీమకు తీసుకువచ్చారు. -
12 జాతీయ లోక్ అదాలత్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో వచ్చే నెల 15న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైధ్ అహ్మద్ మౌలానా మంగళవారం తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) కార్యదర్శి శ్రీలక్ష్మి యార్లగడ్డ ఆధ్వర్యాన జాతీయ లోక్ అదాలత్, అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ సమావేశాలను మంగళవారం జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా లోక్ అదాలత్లో పరిష్కరించేందుకు వీలున్న పెండింగ్ సివిల్ కేసులు, రాజీ పడదగిన క్రిమినల్ కేసుల వివరాలను న్యాయమూ ర్తులు అడిగి తెలుసుకున్నారు. ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పరిష్కారానికి అనుకూలమైన కేసుల వివరాలను డీఎల్ఎస్ఏకి అందజేయాలని సూచించారు. అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ సమావేశంలో విచారణలో ఉన్న ఖైదీల కేసుల దర్యాప్తు, చార్జిషీట్ల దాఖలు అంశాలపై పోలీసు అధికారులకు సూచనలు చేశారు. బెయిల్, జామీను పొందడంలో ఖైదీలు ఎదుర్కొంటున్న సమస్యలను సమీక్షించి, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సిఫారసు చేశారు. కార్యక్రమంలో ఎస్పీ, ఉమ్మడి జిల్లా పోలీసు అధికారులు, రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్, కార్మిక శాఖలు, సెంట్రల్ జైలు, ప్రత్యేక జైలు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులు పాల్గొన్నారు. మరింత కట్టుదిట్టంగా నైట్ పెట్రోలింగ్ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లావ్యాప్తంగా నైట్ పెట్రోలింగ్ను మరింత పటిష్టం చేసి, నేరాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రజలకు రాత్రి వేళల్లో పూర్తి భద్రత కల్పించేందుకు పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా పని చేస్తోందని ఎస్పీ డి.నరసింహ కిశోర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాత్రి గస్తీ సమయంలో నేరాలకు అవకాశమున్న ప్రాంతాలు, ప్రధాన రహదారులు, నివాస ప్రాంతాలు, మార్కెట్లు, లాడ్జిలు, నిర్మానుష్య ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని వివరించారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామన్నారు. అనుమానాస్పద వ్యక్తులను పాత నేరస్తుల కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు. సున్నిత ప్రాంతాలు, నేరాలకు అవకాశమున్న ప్రాంతాలను గుర్తించి, అక్కడ పెట్రోలింగ్ మరింత పెంచామని తెలిపారు. ప్రజలు తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అత్యవసర సహాయానికి 112, సైబర్ మోసాల ఫిర్యాదులకు 1930, మహిళల సహాయానికి 181, బాలల సహాయానికి 1098 డ్రగ్స్పై 1933 నంబర్లను సంప్రదించాలని ఎస్పీ సూచించారు. -
కాళ్లు అరుగుతున్నాయ్!
బోట్క్లబ్ (కాకినాడసిటీ): వారం వారం వస్తున్నాం.. కాళ్లు అరిగేలా తిరుగుతున్నాం.. అయినా తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని అర్జీదారులు నిటూర్పు వదులుతున్నారు. మండల కేంద్రాల్లోని కార్యాలయాల్లో పనులు కాకపోవడంతో కాకినాడ కలెక్టరేట్కు వచ్చి పీజీఆర్ఎస్లో అర్జీలు ఇస్తున్నా ఫలితం లేదని వాపోతున్నారు. ప్రతి సోమవారం ప్రభుత్వం నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్పై వారు పెదవి విరుస్తున్నారు. అర్జీలకు సరైన పరిష్కారం లభించడం లేదని అంటున్నారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్కు 292 అర్జీలు వచ్చాయి. రెవెన్యూ క్లీనిక్కు 32 అర్జీలు సమర్పించారు. వీటిని కలెక్టర్ హరేంధిర ప్రసాద్, జేసీ అపూర్వ భరత్తో పాటు వివిధ శాఖల అధికారులు స్వీకరించారు. అయితే పరిష్కారం కాని పలు సమస్యలు పరిశీలిస్తే.. పింఛను కోసం అగచాట్లు గత రెండేళ్లుగా పింఛను ఇవ్వాలని తిరుగుతున్నా, ఎవరూ స్పందించడం లేదు. రోడ్డు ప్రమాదంతో నా కాళ్లు చచ్చుబడిపోయాయి. దీంతో బయటకు వెళ్లాలంటే వేరొకరి సహాయం అవసరం. నాకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం కుటుంబ పోషణ భారంగా ఉంది. 70 శాతం వైకల్యం ఉందని సదరం సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. అయినా పింఛన్ ఇవ్వడం లేదు. – జువ్వ సత్యనారాయణ, శృంగవృక్షం, తొండంగి మండలంఫ పీజీఆర్ఎస్పై అర్జీదారుల పెదవివిరుపు ఫ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన -
డాక్టర్ ప్రియాంక కేసులో మరో మలుపు
ఫ విచారణ అధికారిగా ఐపీఎస్ అధికారి పాటిల్ ఫ ఫైల్స్ను అప్పగించిన ప్రకాశ్నగర్ పోలీసులు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరంలో డాక్టర్ ప్రియాంక మృతి ఘటన సంచలనం సృష్టించింది. ఈ కేసు దర్యాప్తునకు తూర్పుగోదావరి జిల్లా అదనపు ఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్ను విచారణ అధికారిగా ప్రభుత్వం నియమించింది. దీంతో డాక్టర్ ప్రియాంక కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన అంశాలపై అనేక అనుమానాలు, ప్రశ్నలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ విచారణకు ప్రాధాన్యం ఏర్పడింది. ముఖ్యంగా స్థానిక ప్రసాదిత్య మాల్ వద్ద ఘటన జరిగిన తేదీ నుంచి విషయం అధికారికంగా వెలుగులోకి వచ్చే వరకు గడిచిన సమయం ఏమిటి? ఆ మధ్యలో అసలు ఏం జరిగింది? ఈ ఘటనకు సంబంధించిన సమాచారం పోలీసులకు ఎప్పుడు చేరింది? చేరిన వెంటనే ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనే ప్రశ్నలకు స్పష్టమైన ఆధారాలను సేకరించనున్నారు. అదేవిధంగా ఘటనా స్థలంలోని సీసీ కెమెరాల ఫుటేజీ, మృతురాలి కాల్స్ డేటా, ఆమెతో చివరిగా మాట్లాడిన వ్యక్తులు, నిందితుల కదలికలు, వాహనాల ప్రయాణ వివరాలు, ఫోరెన్సిక్ ఆధారాలు, పోస్ట్మార్టం నివేదికతో పాటు ఇప్పటివరకు సేకరించిన ప్రతి ఆధారాన్ని విచారణ అధికారి పరిశీలించాల్సిన అవసరం ఉంది. అసలు పరీక్ష ఇక్కడే.. ఇప్పటికే బయటకు వచ్చిన సమాచారాన్ని మాత్రమే ఽధ్రువీకరించడమా? లేకుంటే ఘటనకు ముందు నుంచి, ఘటన జరిగిన సమయం నుంచి, ఆ తర్వాత విషయం వెలుగులోకి వచ్చే వరకు జరిగిన ప్రతి పరిణామాన్ని స్వతంత్రంగా పరిశీలించడమా? అనేది కీలకం. ఈ విచారణలో ప్రతి అనుమానానికి ఆధారాలతో సమాధానం లభిస్తేనే ప్రజల్లో నెలకొన్న సందేహాలు తొలగుతాయి. ఎవరి తప్పు ఉన్నా బయటపెట్టడం, దర్యాప్తులో ఎక్కడైనా లోపం జరిగి ఉంటే దానిని కూడా స్పష్టంగా వెల్లడించడం ఈ విచారణకు అసలు సవాల్. -
రూ.30 కోట్లు మింగేసినా పట్టించుకోరా!
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): రూ.30 కోట్లు మింగేసినా పట్టించుకోరా.. టీడీపీ నాయకుడు కావడంతోనే వెనుకంజ వేస్తున్నారా అంటూ వినాయక్ ఈస్ట్ చిట్స్ ఫండ్ బాధితులు మండిపడ్డారు. ఎంతో కష్టపడి అవసరాలకు ఉపయోగపడతాయని రూపాయి, రూపాయి పోగుచేసుకొని చీటి కడితే.. తమ డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం కాకినాడలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ హరేంధిర ప్రసాద్కు బాధితుల సంఘ నాయకులు రాఘవులు, సక్కుబాయ్, అనసూరి రాజకుమారి వినతి పత్రం సమర్పించారు. వందలాది మంది వద్ద చీటీలు కట్టించుకుని రూ.30 కోట్లకు టోకరా వేసిన చిట్స్ యాజమాన్యం, డైరెక్టర్లందరినీ తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధితుల బాధలు పట్టించుకోకుండా చిట్స్ ఫండ్ యాజమాన్యానికి సహకరిస్తున్న అధికారులను తక్షణం సస్పెండ్ చేయాలని, ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని కోరారు. చిట్స్ ఫండ్ చైర్మన్ శేతుమాధవరావు టీడీపీ నాయకుడు కావడం వల్లే పోలీసులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు అతనిపై చర్యలు తీసుకోవడం లేదని బాధితులు వాపోయారు. బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసుల సహకారంతో అతను ప్రస్తుతం బెయిల్పై తిరుగుతున్నట్లు చెప్పారు. చిట్స్ ఫండ్ డైరెక్టర్లపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, తాము ఇప్పటికే పలుమార్లు పోలీసులు, వివిధ శాఖల అధికారులు చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. కలెక్టర్ను కలిసిన వారిలో బాధితులు సలాది కుమారి, త్రినాథ్, ఎర్రంశెట్టి సత్యనారాయణమూర్తి, కోటిపల్లి విజయశ్రీ, కోటిపల్లి వీరరాఘవులు, కృష్ణవేణి, సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.ఫ టీడీపీ నాయకుడు కావడంతోనే వెనుకంజా! ఫ వినాయక్ ఈస్ట్ చిట్స్ బాధితుల మండిపాటు -
గంటన్నరకు పైగా ఈతకొట్టి..
కారులో ఊరికి వెళుతున్నామని బయలుదేరాం. చుట్టాలింటికి అనుకున్నాను. కానీ రాజమహేంద్రవరం బ్రిడ్జిపై కారు ఆపి అందరం దిగాం. నేను చూస్తుండగానే మా తాత, అమ్మమ్మ గోదావరిలోకి దూకేశారు. వారి వెనుక మా అమ్మ నా చేయి పట్టుకుని దూకేసింది. కానీ నేను బ్రిడ్జి రెయిలింగ్ పట్టుకుని ఉండిపోయాను. కానీ కొంతసేపటికి చేయిజారి పోయి గోదావరిలో పడిపోయాను. నాకు ఈత రావడం వల్ల సుమారు గంటన్నరకు పైగా కిలోమీటరు దూరం వరకు ఈత కొడుతూ పైకి తేలాను. ఇంతలో ఒక బోటు వచ్చి, నన్ను కాపాడిందని మృత్యుంజయుడిగా బయటపడిన కార్తికేయరెడ్డి చెబుతున్న మాటలు విన్న వారిని కలిచివేశాయి. -
పారదర్శకంగా రీసర్వే చేపట్టాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): రీసర్వే నాలుగో దశకు సంబంధించిన డేటా ఎంట్రీని ఈ నెల 20వ తేదీలోగా పారదర్శకంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ రెవెన్యూ, సర్వే అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి సోమవారం తహసీల్దార్లు, రెవెన్యూ, సర్వే అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రీసర్వే ప్రక్రియను అత్యంత కచ్చితత్వంతో, పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. భూములపై వాస్తవ అనుభవదారులకు హక్కులు కల్పించే విధంగా రీసర్వే ప్రక్రియను నిష్పక్షపాతంగా చేపట్టాలని స్పష్టం చేశారు. రీ సర్వేకు సంబంధించి సర్వే నంబర్లు, ఆధార్ నంబర్ల నమోదులో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి నెలలకు సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి ఇప్పటి నుంచే ఈకేవైసీ, బుక్ ఫర్ ప్రింటింగ్ ప్రక్రియలపై దృష్టి సారించాలని ఆదేశించారు. అనంతరం కౌడా పరిధిలోని అభివృద్ధి పనులపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కౌడా పరిధిలో చేపట్టాల్సిన అన్ని సివిల్ పనులను ఈ నెల 24 నాటికి ప్రారంభించాలని అన్నారు. సమావేశంలో జేసీ అపూర్వ భరత్, ట్రైనీ కలెక్టర్ ప్రియా పాల్గొన్నారు. అనుమతి మేరకే పొగాకు సాగు చేయాలి దేవరపల్లి: పొగాకు బోర్డు అనుమతించిన మేరకే పంట సాగు చేయాలని బోర్డు కార్యదర్శి డి.వేణుగోపాల్ విజ్ఞప్తి చేశారు. సోమవారం గోపాలపురం పొగాకు వేలం కేంద్రాన్ని సోమవారం ఆయన సందర్శించారు. అనంతరం వేలం కేంద్రం వద్ద రైతులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పొగాకు సాగులో కొత్త నిబంధనలను వివరించారు. 2025–26 సీజన్లో అధిక ఉత్పత్తి కారణంగా మార్కెట్లో ధరలు తగ్గి రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. 2026–27 సీజన్లో పొగాకు (ఎఫ్సీవీ) సాగు విస్తీర్ణం, ఉత్పత్తిని పరిమితం చేయాలని బోర్డు నిర్ణయించిందన్నారు. రాష్ట్రంలో పొగాకు ఉత్పత్తిని 170 మిలియన్ల కిలోల నుంచి 81 మిలియన్ల కిలోలకు పరిమితం చేయాలని అధికారులు తేల్చారన్నారు. అధిక ఉత్పత్తి వల్ల ధరలు పడిపోకుండా రైతులకు ముందస్తుగా అవగాహన కల్పించనున్నట్టు ఆయన తెలిపారు. తక్కువ నాణ్యత గల పొగాకుకు గిట్టుబాటు ధర వచ్చేలా కొనుగోళ్లు చేపట్టాలని ప్రభుత్వం సూచించిందన్నారు. గ్రామీణ, పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేలా రైతు సంక్షేమ పథకంలో ప్రభుత్వ రుసుం రూ. 500 నుంచి రూ.1,325కు పెంచినట్టు వేణుగోపాల్ తెలిపారు. మరణించిన రైతు కుటుంబానికి ఆర్థిక సాయాన్ని పెంచారన్నారు. విద్యార్థుల ఉన్నత విద్యకు ప్రోత్సాహం అందించడమే లక్ష్యంగా పథకాన్ని అమలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. బోర్డు రీజినల్ మేనేజర్ జె.సురేంద్రకుమార్, వేలం నిర్వహణాధికారి బి.శ్రీహరి, ఐటీసీ మేనేజర్ కొట్రేషి, పీఎస్ఎస్హెచ్ కంపెనీ ప్రతినిధి రఘురామరాజు, జీపీఐ కంపెనీ ప్రతినిధి జనార్దన్రెడ్డి, బోర్డు మాజీ వైస్ చైర్మన్ గద్దే శేషగిరిరావు పాల్గొన్నారు. ప్రభుత్వానికి ఏటీఎంలా పోలవరం ప్రాజెక్టు రాజమహేంద్రవరం సిటీ: రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును డబ్బులు సంపాదించే ఏటీఎం మెషీన్లా వాడుకుంటోందని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ అన్నారు. దీనిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి కేంద్రం నిర్మించేలా ఒప్పందం జరిగినా, రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ బాధ్యత తీసుకుని, ఇంకా పూర్తి చేయకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రాజమహేంద్రవరంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి మొదట రూ.6 వేల కోట్లుగా ప్రకటించగా, ప్రస్తుతం రూ.66 వేల కోట్లు దాటిందన్నారు. ముంపు ప్రాంతాల్లో ఇప్పటికీ పూర్తి స్థాయిలో భూసేకరణ జరగలేదన్నారు. ఛత్తీస్గఢ్లో 4 గ్రామాలు, ఒడిశాలో 8 గ్రామాలు ముంపునకు గురయ్యే పరిస్థితి ఉండటంతో రెండు ప్రభుత్వాల అనుమతులు అవసరం ఉందన్నారు. నిర్వాసితుల కోసం నిర్మించిన కొన్ని కాలనీలు శిథిలావస్థకు చేరుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం నిర్మాణంలో లోపభూయిష్టమైన విధానాలు ఉన్నాయని, పోలవరం భూములు 5వ షెడ్యూల్, ఏపీ ఎల్పీఆర్ చట్ట పరిధిలో ఉన్నాయని చెప్పారు. షెడ్యూల్ ప్రాంతాల భూములను ప్రైవేట్ సంస్థలకు కేటాయించడం చట్టవిరుద్ధమన్నారు. పోలవరం హైడ్రో పవర్ను ప్రభుత్వ సంస్థ ఏపీ జెన్కోకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గిరిజన రైతుల నుంచి తీసుకున్న భూములను గ్రీన్కో, మెగా సంస్థలకు పవర్ ఉత్పత్తి కోసం కేటాయించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. ఈ వ్యవహారాన్ని పరిశీలించేందుకు జాతీయ గిరిజన కమిషన్, సంబంధిత గిరిజన సంక్షేమ సంస్థలు రంగంలోకి దిగాయన్నారు. ఈ భూముల కేటాయింపు విషయంలో చివరి వరకు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. ప్రైవేట్ సంస్థలకు కేటాయించిన భూములను ప్రభుత్వమే వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో కోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరించారు. -
నా భూమిని ఆక్రమించారు
మా గ్రామంలో టీడీపీకి చెందిన ఓ వ్యక్తి నకిలీ పత్రాలు సృష్టించి, నేను సాగు చేసుకుంటున్న కొంత భూమిని ఆక్రమించుకున్నాడు. 4.92 సెంట్ల భూమిని మూడు నెలల క్రితం టీడీపీ నాయకులు అధికారులతో కుమ్మకై ్క ఇలా చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా, పట్టించుకోలేదు. మూడు నెలలుగా తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదు. – ఎన్.సత్యవతి, శ్రీరామపురం, కొత్తపల్లి మండలం సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు కాకినాడ భానుగుడి సెంటర్లోని ఓ కళాశాలలో చదివాను. ఆ యాజమాన్యం నా విద్యార్హత సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. నేను ఫీజు చెల్లించినా మళ్లీ రూ.60 వేలు కట్టాలని లేకుంటే సర్టిఫికెట్లు ఇచ్చేది లేదని చెబుతున్నారు. ఇప్పటికే మూడు నెలలుగా తిరుగుతున్నా, అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. – వి.దొరబాబు, విద్యార్థి, కాకినాడ జగన్నాథపురం -
బాధితులకు అండగా వైఎస్సార్ సీపీ
పెద్దాపురం: కట్టమూరులో పచ్చకామెర్ల బాధితులను హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు పరామర్శించారు. సోమవారం ఆ గ్రామ ఎస్సీ పేటలో బాధిత చిన్నారులను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వ్యాధి ప్రబలడానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయా బాధిత కుటుంబ సభ్యులు, కాలనీ మహిళలు మాట్లాడుతూ తమ ఎస్సీ పేటకు సక్రమంగా తాగునీరు రావడం లేదని వాపోయారు. కలుషిత నీటి సరఫరాపై అధికారులకు ఫిర్యాదు చేసినా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు. గ్రామంలో చాలామంది చిన్నారులు, వృద్ధులు కామెర్లు, టైఫాయిడ్తో బాధపడుతున్నారని వాపోయారు. తూతూమంత్రంగా చర్యలు తీసుకుంటున్నారని, పూర్తి స్థాయిలో సురక్షిత నీరు రావడం లేదని చెప్పారు. ఈ విషయంపై దవులూరి దొరబాబు మాట్లాడుతూ గ్రామంలో సమస్యలను జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళతామని భరోసా ఇచ్చారు. కట్టమూరు గ్రామ ప్రజలకు వైఎస్సార్ సీపీ ఉంటుందని, తాను ప్రజల పక్షాన ఉండి పోరాటాలు సాగిస్తామని అన్నారు. గ్రామానికి రక్షిత నీరు సరఫరా చేసి, పూర్తి స్థాయిలో పారిశుధ్యం మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. ఎంపీటీసీ సభ్యులు నల్లల గోవిందు సూర్యకుమారి, ఉప్పటి ప్రసాద్, గ్రామ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు రంగనాథ్ శ్రీనివాసరావు, పార్టీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలు ఏలేటి అనంతలక్ష్మి, మండల సోషల్ మీడియా విభాగం అధ్యక్షులు జ్వోతుల నాగు, జెస్సీ, భూషణం, జీను వెంకటరమణ, జి.రాజు, జి.ఆనంద పాల్గొన్నారు.హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దవులూరి దొరబాబు -
తట్టుకోలేక..
తనువు చాలించాలని..పిఠాపురం: స్థానిక పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబంతో సహా ఆత్మహత్యా యత్నానికి పాల్పడడం.. దానికి కారణాలు తెలుపుతూ సూసైడ్ నోట్ రాయడం అందరినీ కలచివేసింది. ఈ ఘటన పిఠాపురంలో కలకలం రేపింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. నూకరాజుకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. వారిని అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేశారు. ఆనందంగా ఉంటున్న ఆ కుటుంబంలో విధి వక్రించింది. కుమారుడు కొన్నేళ్ల క్రితమే మృతి చెందడంతో విషాదం అలుముకుంది. దాని నుంచి తేరుకుని కుమార్తెకు జగదీశ్వరరావుతో పెళ్లి చేయగా, పండంటి మనువడు కార్తికేయరెడ్డి పుట్టడంతో వారింట్లో మళ్లీ ఆనందం వెల్లివిరిసింది. కుమార్తెను అల్లుడిని మనువడిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ, కొడుకు చనిపోయిన లోటును మర్చిపోయి ఆనందంగా ఉంటున్న వారి కుటుంబంలోకి షేక్ సాధిక్ఖాన్ అనే వ్యక్తి వేధింపులు అల్లుడిని కూడా పొట్టన పెట్టుకున్నట్లు చెబుతున్నారు. గత జూలైలో అల్లుడు చనిపోవడం, షేక్ షాధిక్ఖాన్ వేధింపులు రోజురోజుకూ రెట్టింపు కావడంతో కుటుంబం అంతా ప్రతి రోజూ నరకం అనుభవించేదని బంధువులు అంటున్నారు. సమాజంలో బాధ్యతాయుతమైన పదవిలో (పంచాయతీరాజ్ ఏఈగా) ఉంటూ కంటికి రెప్పలా చూసుకునే కన్న కూతురికి ఎదురైన వేధింపుల నుంచి ఆమెను కాపాడలేని నిస్సాయస్థితిలో సమాజంలో తలదించుకుని బతకాల్సి వస్తుందన్న భయంతో తండ్రిగా నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనువడు కార్తికేయరెడ్డి బలవన్మరణానికి తెగించేలా చేసిందంటున్నారు. రాజమహేంద్రవరంలో గోదావరిలోకి దూకిన నూకరాజు, ఆయన భార్య, కుమార్తె గల్లంతు కావడం.. ఆయన మనువడికి మాత్రం ఈత రావడంతో ప్రాణాలతో బయటపడడం జరిగింది. ఇంకా సూసైడ్ నోట్లు ఉన్నాయా! నూకరాజుతో పాటు ఆయన కుమార్తె, భార్య సైతం తాము చనిపోతున్నట్లు దానికి కారణాలను తెలుపుతూ మరో రెండు సూసైడ్ నోట్లు రాసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అవి బయటపడలేదంటున్నారు. వారు కూడా తమ బాధను వ్యక్తం చేస్తూ లెటర్లు రాసి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టినట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు వారు రాసినట్లు చెబుతున్న సూసైడ్నోట్లు బయటపడలేదు. అటువంటివి ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. దిగ్భ్రాంతిలో పిఠాపురం పిఠాపురంలో పంచాయతీ రాజ్ ఏఈగా పనిచేస్తున్న నూకరాజు కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నారన్న వార్తను పిఠాపురంలో సహచర ఉద్యోగులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు జీర్ణించుకోలేక పోతున్నారు. అందరితో కలుపుగోరుతనంగా ఉంటూ ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా తన పని తాను చేసుకుపోయే మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తిగా పేరున్న నూకరాజు హఠాత్తుగా ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం తెలియడంతో పిఠాపురంలో నేతలు అధికారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. 12 ఏళ్లుగా ఒకేచోట అదీ పిఠాపురంలో ఆయన పని చేస్తున్నారంటే ఆయన మంచితనమే ఇక్కడ ఇంతకాలం పనిచేసేలా చేసిందని సహచర ఉద్యోగులు చెబుతున్నారు. పిఠాపురంలో పోలీసుల విచారణ పిఠాపురం పంచాయతీరాజ్ విభాగంలో ఏఈగా పని చేస్తున్న నూకరాజు ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ కార్యాలయంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఆయన ఆత్మహత్యకు సూసైడ్ నోట్లో రాసిన కారణంతో పాటు ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా, ఆయన పని చేసేటప్పుడు ఎలా ఉండేవారు, ఇతర ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అనే కోణాల్లో సహచర ఉద్యోగులను అడిగి వివరాలు సేకరించారు. పిఠాపురం సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు వివరాలు తీసుకున్నారు. మరణ శాసనం రాసుకుని.. కాపాడాలని ప్రయత్నించినా.. నూకరాజు సూసైడ్ నోట్ తమ గ్రూప్లో పోస్టు చేసిన వెంటనే స్పందించి నూకరాజు కుటుంబం ఎక్కడ ఉందనే విషయాలను తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాం. సూసైడ్ నోట్ చూసిన వెంటనే కాకినాడలో ఆయన ఇంటికి వెళ్లి చూడగా, తాళాలు వేసి ఉండడంతో కంగారు వచ్చి ఆయన కోసం ఫోన్లో ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. చివరకు ఆయన కుటుంబంతో సహా ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించి గోదావరిలోకి దూకినట్లు తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాం. ఆయన ఒక వ్యక్తి వల్ల అవమానాలను వేధింపులను భరించలేక ఇంత దారుణమైన నిర్ణయం తీసుకున్నారని ఆయనే రాశారు. కానీ కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఆయన చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. అందుకే అవమానం భరించలేకపోయారు. అంతేగాని ఆయన తప్పుడు మనిషి కాదు. ఆయనపై ఎవరు ఎటువంటి తప్పుడు ప్రచారాలు చేయవద్దని వేడుకుంటున్నాం. – ఎన్.కాశీవిశ్వనాథ్, ఇంజినీరింగ్ అసిస్టెంట్, పిఠాపురంకంటికి రెప్పలా పెంచుకున్న కన్న కూతురి జీవితం ఎలా వెళ్తుందో.. కుటుంబ పరువు ఏమవుతుందోనని కలత ఆ తండ్రిని కుంగదీసింది. ఆ కుటుంబానికి అనుకోని ఓ వ్యక్తి బెదిరింపులు అసలు ఈ జీవితం ఎందుకనే స్థాయికి తీసుకెళ్లాయి.. అవి తట్టుకోలేక తనువు చాలించాలని పంచాయతీరాజ్లో ఏఈగా పనిచేస్తున్న నూకరాజు తన భార్య, కుమార్తెతో పాటు మనువడిని తీసుకుని రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో దూకేయడం కలకలం రేపింది. ఈ ఘటన పిఠాపురంలో విషాదాన్ని నింపింది. ఆ హృదయవిదారక ఘటనను తట్టిచూస్తే.. ఫ పంచాయతీరాజ్ ఏఈ కుటుంబం ఆత్మహత్యాయత్నం ఫ సూసైడ్ నోట్లో వివరాలు వెల్లడి ఫ పిఠాపురంలో విషాదఛాయలు ఎంత కాలం నుంచి ఇబ్బంది పడుతున్నారో ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడుతూ వచ్చిన నూకరాజు చివరకు తన మరణ శాసనాన్ని తానే రాసుకుని అవమానం, భయం ముంచెత్తిన వేళ తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. చివరి క్షణాల్లో తాను రాసిన సూసైడ్ నోట్ను తన సహచర ఉద్యోగుల వాట్సాప్ గ్రూప్లో ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో పోస్టు చేసినట్లు ఉద్యోగులు చెబుతున్నారు. అది చూసిన సహచర ఉద్యోగులు కంగారు పడి కాకినాడలో ఆయన ఇంటికి వెళ్లి చూడగా, ఇంటికి తాళం వేసి ఉన్నట్లు గుర్తించారు. అనంతరం ఆయన సెల్కు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఆయన కారు డ్రైవర్కు ఫోన్ చేయగా.. నూకరాజు కుటుంబ సభ్యులను తాను కారులో రాజమహేంద్రవరం తీసుకెళ్లానని అక్కడకు వెళ్లాక.. మా తమ్ముడి ఇంటికి వెళుతున్నాం.. నువ్వు కారు వదిలేసి రైలు ఎక్కి ఇంటికి వెళ్లిపోమని డ్రైవర్కు ఆయన చెప్పినట్లు సహచర ఉద్యోగులు వివరించారు. -
మొత్తమోంథా వదిలేసి..
దేశానికే అన్నం పెడుతున్న రైతన్నల నోటికాడ కూడును చంద్రబాబు ప్రభుత్వం దూరం చేస్తోంది.. ప్రకృతి కన్నెర్ర జేసి పొలాలను తుడిచి పెట్టేసినా, కనీసం అటువైపు చూడకుంది.. నెలల కిందట సంభవించిన మోంథా తుపానుతో అనేక మంది రైతులు నష్టపోయినా, పరిహారం అందించాల్సిన ప్రభుత్వం పరిహాసం చేస్తోంది. సాక్షి ప్రతినిధి, కాకినాడ: రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చంద్రబాబు ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతుందే తప్ప.. ఆచరణలో మాత్రం ఆమడ దూరం ఉంటోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులను దగా చేస్తూనే ఉంది. అన్నదాత సుఖీభవ నిధుల్లో కోత విధించింది. ఉచిత పంటల బీమాను ఎత్తివేసింది. మోంథా తుపాను నష్ట పరిహారం మంజూరులోనూ అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. గతేడాది అక్టోబర్లో సంభవించిన మోంథా తుపాను కర్షకులను నిండా ముంచేసింది. అప్పట్లో భారీ ఈదురు గాలులు, వర్షాలకు వరి, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వేల ఎకరాల్లో వరి నేలకొరిగింది. వరి పొలాల్లో నీరు చేరి సింహభాగం పంటను నష్టపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇలాంటి విపత్కర సమయంలో అండగా ఉండాల్సిన చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. తూతూ మంత్రంగా పంట నష్టం అంచనాలు రూపొందించి మమ అనిపించేసింది. నష్టం అంచనా వేసి అనేక నెలలు కావొస్తున్నా.. నేటికీ పరిహారం మంజూరు చేసిన దాఖలాలు లేవు. పరిహారం ఊసేలేదు. అంతా అతలాకుతలం మోంథా తుపాను దెబ్బకు రైతులు అతలాకుతలం అయ్యారు. జిల్లా వ్యాప్తంగా తుపాను నష్టాలపై కసరత్తు చేసిన అధికారులు తుది నివేదిక రూపొందించి ప్రభుత్వానికి పంపారు. జిల్లాలో 2.10 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. అధికారిక లెక్కల ప్రకారం వ్యవసాయ, ఉద్యాన పంటలకు సంబంధించి 46,929 మంది రైతులు నష్టపోయారు. మొత్తం 50,815 ఎకరాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతినగా.. వాటి విలువ రూ.52.17 కోట్లుగా నిర్ధారించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం, పిఠాపురం రూరల్, గొల్లప్రోలు, యు.కొత్తపల్లి మండలాలతో పాటు సామర్లకోట, పెద్దాపురం, కిర్లంపూడి, గోకవరం, కాకినాడ రూరల్, కరప తదితర మండలాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రతి రైతూ ఎకరానికి రూ.36 వేలకు పైగా నష్టపోయారు. అలాగే ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. మొక్కజొన్న 64 ఎకరాలు, తీపి మొక్కజొన్న 64.715 ఎకరాల్లో నష్టం వాటిలినట్లు తేల్చారు. అంచనాలు రూపొందించి పదకొండు నెలలు దాటుతున్నా.. నయాపైసా నష్టపరిహారం అందించిన దాఖలాలు లేవు. పరిహారం చెల్లింపులోనూ కుట్ర తుపాను కారణంగా దెబ్బతిన్న వరికి ఎకరానికి రూ.10 వేలు, మిగిలిన పంటలకు రూ.6 వేల చొప్పున ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి అన్ని పంటలూ కలిపి జిల్లా వ్యాప్తంగా రైతులకు రూ.150 కోట్లకు పైనే నష్టపోగా.. ప్రభుత్వం మాత్రం రూ.52.17 కోట్లుగా తేల్చింది. ఈ పరిణామం రైతుల్లో ఆగ్రహావేశాలు నింపుతోంది. జరిగిన నష్టాన్ని సైతం తక్కువగా చూపి.. పరిహారంలో కోత విధించేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగమేనన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల కొర్రి పెట్టి.. తుపాను ప్రభావంతో నష్టపోయిన పంట నమోదులో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించింది. పంట నష్టపోయిన రైతులందరి పేర్లు నమోదు చేయలేదు. 33 శాతం కంటే ఎక్కువ నష్టపోతే మాత్రమే నమోదు చేసింది. జిల్లాలో అత్యధికంగా 33 శాతం కంటే తక్కువగా పంట నష్టం వాటిల్లింది. సుమారు 10 వేల హెక్టార్లకు పైగా ఇదే పరిస్థితి నెలకొంది. వీరి పరిస్థితేంటో అర్థం కావడం లేదు. ఉచిత పంటల బీమాకు మంగళం చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత పంటల బీమా పథకానికి మంగళం పాడింది. ప్రీమియం సొమ్ము చెల్లింపులు నిలిపివేసింది. ఆ భారం రైతులపైనే మోపింది. ఈ మేరకు 2024–25 రబీ సీజన్లో ఉత్తర్వులు సైతం వెలువరించింది. వరి పంట హెక్టారు రూ.1.05 లక్షలుగా విలువ నిర్ధారించి రైతు వాటాగా 1.50 శాతం అంటే రూ.1,575 ప్రీమియం చెల్లించాల్సి ఉంది. ఇది రైతులే చెల్లించుకునేలా మార్గదర్శకాలు రూపొందించి అమలు చేసింది. జిల్లా వ్యాప్తంగా 2,15,068 ఎకరాల్లో ఖరీఫ్ సాగు చేయగా.. రైతులు ఎకరాకు రూ.210 చొప్పున 72,766 ఎకరాలకు మాత్రమే ప్రీమియం చెల్లించారు. మిగిలిన 1,42,302 ఎకరాలు క్రాఫ్ ఇన్సూరెన్స్కు దూరంగా ఉండటం గమనార్హం. ఫలితంగా మోంథా తుపానుకు నష్టపోయిన రైతులు బీమా పరిహారం పొందలేని పరిస్థితి తలెత్తింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వ్యవసాయం, రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసింది. మిచాంగ్ తుపాను ప్రభావంతో పంట నష్టపోయిన కర్షకుల కన్నీళ్లు తుడిచింది. నెలల వ్యవధిలోనే పంటలకు పరిహారం మంజూరు చేసింది. ఆదుకోవడంలో విఫలం రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. నష్టపోయిన పంటలకు సైతం నెలలు దాటుతున్నా, నేటికీ పరిహారం ఇవ్వకపోవడం దారుణం. పంటలకు కనీసం యూరియా సైతం ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందంటే, రైతుల సంక్షేమానికి ఏ మాత్రం పాటుపడుతుందో అర్థం అవుతోంది. –లంకా ప్రసాద్, వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఇంకా పరిహారం ఇవ్వలేదు వేమవరం రెవెన్యూ పంచాయతీ పరిధిలో ఎకరంన్నర భూమి ఉంది. అందులో వరి వేయగా, మోంథా తుపానుతో నీట మునిగింది. రూ.40 వేల పెట్టుబడి పెట్టాను. రూ.60 వేల ఆదాయం వచ్చేది. గతంలో అధికారులు నష్టపరిహారం నమోదు చేసుకున్నారు. నెలలు గడుస్తున్నా.. ప్రభుత్వం ఇంత వరకు పరిహారం చెల్లించలేదు. – అనసూరి రాజు, రైతు, కొత్తపేట, తొండంగి మండలం పంట నష్టం ఇలా.. పంట నష్టపోయిన నష్టం నష్టం పెట్టుబడి రాయితీ రైతులు ఎకరాలు (రూ.కోట్లలో) (రూ.కోట్లలో) మొక్కజొన్న 79 64 1.72 0.03వరి 44,522 49,473 144.60 50.05 మినుము 578 797.81 13.13 0.48 తీపి మొక్కజొన్న 65 64.715 1.73 0.03 తుపాను బాధితులకు అందని పరిహారం జిల్లాలో రూ.52.17 కోట్ల నష్టం నెలలు గడుస్తున్నా పైసా విదల్చని చంద్రబాబు సర్కారు పరిహారం కోసం రైతులకు తప్పని నిరీక్షణ -
● పీతలు.. ఎగుమతుల్లో పరుగులు
ఉప్పాడ పీతలకు గిరాకీ పెరిగింది. ఇతర రాష్ట్రాలకు ఎగుమతుల్లో పరుగులు పెడుతోంది. కొత్తపల్లి మండలం అమీనాబాద్ తీర ప్రాంతంలోని మత్స్యకార వ్యాపారులు పీతల వ్యాపారంతో బిజీబిజీ అయ్యారు. ఇక్కడి నుంచి తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు తరలిస్తున్నారు. వారానికి 4 నుంచి 5 టన్నుల వరకూ ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో పీతలు రూ.200 నుంచి 250 వరకూ విక్రయిస్తున్నారు. వీటి విలువ ఇతర రాష్ట్రాల్లో రూ. 5 వందల నుంచి రూ.8 వందలు ఉంటోంది. ఉడకబెట్టి.. ప్యాక్ చేసి మత్స్యకారుల వలలకు చిక్కిన పీతలను కొనుగోలు చేసిన వ్యాపారులు వాటిని పెద్ద పాత్రల్లో ఉడకబెడుతున్నారు. ఇలా ఉడకబెట్టిన పీతలను చల్లారిన తరువాత వాటిని శుభ్రపరిచి, పెంకు తీసి కవర్లలో వేసి ఐస్ పెట్టెల్లో పెట్టి ప్యాకింగ్ చేస్తున్నారు. తర్వాత ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. తాజాగా ఉంచడం కోసమే పీతలను ఉడకబెడుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. – కొత్తపల్లి -
స్ఫూర్తి ప్రదాత ముద్రగడ
కిర్లంపూడి: రాజకీయాల్లో స్ఫూర్తి ప్రదాతగా మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు దివంగత ముద్రగడ పద్మనాభం నిలుస్తారని, ఆయన మృతి తీరని లోటని వైఎస్సార్ సీపీ పుంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం కిర్లంపూడిలో ముద్రగడ నివాసానికి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి చేరుకుని ముద్రగడ పద్మనాభం సతీమణి ముద్రగడ పద్మావతి, వైఎస్సార్ సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు, ఆయన పెద్ద కుమారుడు ముద్రగడ వీరరాఘవరావు (బాలు)ను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలసి ముద్రగడ సమాధికి గజమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ దివంగత ముద్రగడ పద్మనాభంతో తనకు ఎన్నో ఏళ్ల అనుబంధం ఉందన్నారు. ముద్రగడను ఎప్పుడు కలిసినా, ఎంతోగానో గౌరవించేవారని, ఆయన వైఎస్సార్ సీపీలోకి వచ్చిన తరువాత మరింత అనుబంధాలు బలపడ్డాయని తెలిపారు. ఆయన ఎప్పుడు తిరుపతి వచ్చినా తనను కలిసేవారని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణవార్త తనను కలిచి వేసిందన్నారు. స్వామి మాల ధరించి ఉండడంతో ఇప్పటి వరకు రాలేకపోయామని తెలిపారు. ముద్రగడ కుటుంబానికి ఆయన లేనిలోటు ఎవరూ తీర్చలేనిదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, మాజీ మంత్రులు తోట నరసింహం, కురసాల కన్నబాబు, పేర్ని నాని, మాజీ ఎంపీ వంగా గీత, మాజీ ఎమ్మెల్యేలు జ్యోతుల చంటిబాబు, జక్కంపూడి రాజా, ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి, పెద్దాపురం, పి.గన్నవరం, రామచంద్రపురం, రాజోలు, అమలాపురం నియోజకవర్గాల పార్టీ కోఆర్డినేటర్లు దవులూరి దొరబాబు, గన్నవరపు శ్రీనివాసరావు, పిల్లి సూర్యప్రకాష్, పాముల రాజేశ్వరీదేవి, పినిపే శ్రీకాంత్, పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తోట శ్రీరాంజీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముదునూరి మురళీ కృష్ణంరాజు, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు పోకల అశోక్కుమార్, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, రాజానగరం, తుని నియోజకవర్గాల పార్టీ పరిశీలకులు తోట రామకృష్ణ, వాసిరెడ్డి జమీల్, అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు ఉన్నారు. -
కారుచీకటిలో ఆఖరి మజిలీ
సఖినేటిపల్లి/ఇరగవరం: స్నేహితుడి బంధువు ఇంట వివాహానికి వెళ్లి సందడి చేసి తిరిగి వచ్చేటప్పుడు వారు చెప్పినదే తుది వీడ్కోలు అవుతుందని వారికి తెలీదు. తిరుగు పయనంలో వారిని గోదారమ్మ మింగేస్తుందని వారికేం తెలుసు. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం అయితంపూడి లాకుల వద్ద శనివారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో కారు అదుపు తప్పి నరసాపురం కాలువలోకి దూసుకువెళ్లి నలుగురు బీటెక్ విద్యార్థులు మృతి చెందగా ఒకరు గల్లంతై, ఒక విద్యార్థి ప్రాణాలు దక్కించుకున్నాడు. వివరాల్లోకి వెళితే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని సఖినేటిపల్లి మండలం మోరి, మోరిపోడు, ఉయూరివారి మెరక గ్రామాలకు చెందిన చెరుకువాడ రామ్చరణ్ అలియాస్ రాజారామ్ (17), పోతుల లక్ష్మీభాను వికాస్ (19), నాగిరెడ్డి దుస్వంత్ సాయి (18), నరసాపురానికి చెందిన నాగాబత్తుల సాయిసూర్యతేజ (19), మట్టా సంతోష్, పాలకొల్లు మండలం చింతపర్రుకు చెందిన వీరమల్లు వెంకట సాయికిరణ్ (19) నరసాపురంలోని స్వర్ణాంధ్ర ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నారు. వారంతా స్నేహితుడి బంధువు ఇంట జరిగిన వివాహానికి కారులో తూర్పుగోదావరి జిల్లా పెరవలి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో అయితంపూడి లాకుల వద్ద కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకుపోయింది. కారులోని వారంతా గల్లంతవగా స్థానికుల సాయంతో ప్రమాదం నుంచి బయటపడిన సంతోష్ ఆ విషయాలు వెల్లడించాడు. సమాచారం అందుకున్న పోలీసు అధికారులు ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది సహకారంతో హుటాహుటిన సహాయకచర్యలు చేపట్టారు. ప్రమాదస్థలికి రెండు కిలోమీటర్ల దూరంలో లక్ష్మీభాను వికాస్, దుస్వంత్సాయి, సాయిసూర్యతేజ, సాయికిరణ్ మృతదేహాలు లభ్యం కాగా, రామ్చరణ్ కోసం గాలిస్తున్నారు. ఒక్కడే కొడుకు.. ప్రమాదంలో మృతి చెందిన లక్ష్మీభాను స్వస్థలం సఖినేటిపల్లి మండలం మోరిపోడు. అతని తల్లిదండ్రులు పోతుల శ్రీనివాసరావు, దేవి. శ్రీనివాసరావు జీడిపప్పు వ్యాపారం చేస్తున్నాడు. వీరిది మధ్యతరగతి కుటుంబం. వారి కుమార్తె ప్రవల్లిక కిమ్స్ ఆసుపత్రిలో వైద్య విభాగంలో పనిచేస్తోంది. ఇంజినీర్ అయ్యి కుటుంబానికి ఆసరాగా నిలుస్తాడనుకున్న కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేక వారు బోరున విలపిస్తున్నారు. తల్లిదండ్రులకు కడుపుకోత.. మరో విద్యార్థి దుస్వంత్ స్వస్థలం సఖినేటిపల్లి మండలం ఉయ్యూరువారి మెరక. అతని తల్లిదండ్రులు నాగిరెడ్డి సురేష్, శ్యామల. సురేష్ మలికిపురం ఎల్ఎస్ ల్యాండ్మార్క్లో ఉద్యోగి. వీరిదీ మధ్య తరగతి కుటుంబమే. వారి ఇద్దరి కుమారుల్లో దుస్వంత్ రెండవ వాడు. పెద్ద కొడుకు నెహేన్ సాయి హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగి. దస్వంత్ మరణాన్ని తట్టుకోలేక ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రయోజకుడవుడాడనుకున్నంతలో కడుపుకోత మిగిల్చాడని గుండెలవిసేలా రోదిస్తున్నారు. చెట్టుకొమ్మల ఆసరాగా బయటపడి.. ప్రమాదం నుంచి బయటపడిన సంతోష్ తాను బయటపడిన విధానాన్ని వివరిస్తూ ప్రమాదం జరిగిన వెంటనే తనకు దొరికిన చెట్టుకొమ్మలను పట్టుకొని కారు పైకి ఎక్కానని, తనకు ఈత రావడంతో అక్కడి నుంచి ఒడ్డుకు చేరుకున్నానని తెలిపాడు. అర్ధరాత్రి కావడంతో తాము ఎక్కడ ఉన్నామో తెలియలేదని చెప్పాడు. మృతులు లక్ష్మీ భానువికాస్ దుస్వంత్సాయి సాయి సూర్యతేజ వెంకట సాయికిరణ్ కాలువలోకి కారు దూసుకువెళ్లి నలుగురి మృతి ప్రమాద సమయంలో ఆరుగురు విద్యార్థులు ఒకరు గల్లంతు, సురక్షితంగా బయటపడ్డ ఓ విద్యార్థి స్నేహితుని బంధువు ఇంట వివాహానికి వెళ్లి వస్తుండగా ఘటన -
రత్నగిరిపై భక్తజన సందడి
అన్నవరం: రత్నగిరి సత్యదేవుని ఆలయం ఆదివారం భక్తులతో నిండిపోయింది. శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజామున సత్యదేవుని సన్నిధిలో, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ పెళ్లి బృందాలు, నవ దంపతుల రాకతో ఆలయం కిటకిటలాడింది. సుమారు 30 వేల మంది భక్తులు తరలిరాగా, 2 వేల వ్రతాలు జరిగాయి. స్వామివారి దర్శనానికి రెండు గంటలు, రూ.200 టిక్కెట్తో అంతరాలయం దర్శనానికి గంట సమయం పట్టింది. దేవస్థానానికి రూ.35 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో ఐదు వేల మంది భక్తులు ప్రసాదం స్వీకరించారు. రూ. 367.98 కోట్ల పొగాకు విక్రయాలు దేవరపల్లి: టొబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల పరిధిలో ఈ ఏడాది ఇప్పటి వరకు రూ. 367.98 కోట్ల విలువైన 15.14 మిలియన్ల కిలోల వర్జీనియా పొగాకు విక్రయాలు జరిగినట్టు రీజినల్ మేనేజర్ జె.సురేంద్రకుమార్ తెలిపారు. శుక్రవారం వేలం కేంద్రాలకు 4,449 బేళ్లు అమ్మకానికి రాగా, 2,628 బేళ్లు కొనుగోలు చేశారు. కొనుగోలుదారులు 1,821 బేళ్లను తిరస్కరించారు. కిలో గరిష్ట ధర రూ.292, కనిష్ట ధర రూ. 150, సగటు ధర రూ. 248.37 లభించినట్టు ఆయన తెలిపారు. ఐదు వేలం కేంద్రాల్లో ఈ ఏడాది ఇప్పటి వరకు కిలో సగటు ధర రూ. 243.06 ఉందని ఆయన వివరించారు. దేవరపల్లి వేలం కేంద్రంలో ఇప్పటి వరకు 2.28 మిలియన్ల కిలోల విక్రయాలు జరగ్గా, కిలో సగటు ధర రూ.238.12, జంగారెడ్డిగూడెం–1 వేలం కేంద్రంలో 3.23 మిలియన్ల కిలోలు విక్రయాలు జరగ్గా, కిలో సగటు ధర రూ. 243.24, జంగారెడ్డిగూడెం–2 కేంద్రంలో 3.59 మిలియన్ల కిలోలు విక్రయం సరగ్గా, కిలో సగటు ధర రూ. 242.45, కొయ్యలగూడెం వేలం కేంద్రంలో 3.13 మిలియన్ల కిలోల పొగాకు విక్రయం జరగ్గా, కిలో సగటు ధర రూ. 242.52, గోపాలపురం వేలం కేంద్రంలో 2.88 మిలియన్ల కిలోల విక్రయం జరగ్గా, కిలో సగటు ధర రూ. 248.15 పలికినట్టు సురేంద్రకుమార్ తెలిపారు. -
పూర్తి కావొస్తున్న డైవర్షన్ పనులు
తొండంగి: మండలంలోని బెండపూడి జాతీయ రహదారిపై పోలవరం, పుష్కర కాలువ వద్ద డైవర్షన్ వంతెనల నిర్మాణ పనులు పూర్తి కావొస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ప్రధాన రహదారికి రాజమహేంద్రవరం, విశాఖ రెండు వైపులా వాహనాల మళ్లింపు కోసం డైవర్షన్ వంతెనలు నిర్మించారు. ప్రస్తుతం అప్రోచ్ రోడ్ల పనులు జరుగుతున్నాయి. మరో రెండు రోజుల్లో డైవర్షన్ వంతెనలపై నుంచి వాహనాల రాకపోకలకు అనుమతించనున్నారు. అనంతరం ప్రధాన రహదారిని తొలగించి వంతెనల నిర్మాణం ప్రారంభించనున్నారు. అయితే ఈ ప్రాంతంలోనే బెండపూడి గ్రామంలోకి వెళ్లే ప్రధాన జంక్షన్ కావడంతో ఇప్పటికే పలు ప్రమాదాలు జరిగే ప్రదేశంగా ఉంది. ఈ నేపథ్యంలో డైవర్షన్ వంతెనల అప్రోచ్ కూడా రావడంతో ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. పోలవరం, నేషనల్ హైవే అధికారులు ఈ ప్రాంతంలో తగిన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా తమ్మయ్యపేట శివారు విద్యుత్ సబ్ స్టేషన్ జంక్షన్ జాతీయ రహదారి నుంచి రావికంపాడు వెళ్లే రహదారిలో కూడా వంతెన పనులు జరుగుతున్నాయి. దీంతో ఈ రహదారిలో కూడా వాహనాల రాకపోకలు నిలిపివేసి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. త్వరలో ఈ పనులు పూర్తయితే వాహనాల రాకపోకలను యథావిధిగా అనుమతించనున్నారు. -
రత్నగిరి వాసా.. చిద్విలాసా
అన్నవరం: రత్నగిరి వాసా.. చిద్విలాసా అంటూ ఆ సత్యనారాయణ స్వామివారిని భక్తులు కొలిచారు. అన్నవరంలోని శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం శనివారం భక్తులతో కిక్కిరిసింది. శ్రావణమాసం సందర్భంగా తిరిగి వివాహాలు ప్రారంభం కావడంతో వధూవరులు, వివాహ బృందాలతో రద్దీగా మారింది. సుమారు 50 వేల మంది భక్తులు రాగా, రూ.200 టిక్కెట్తో ప్రత్యేక దర్శనానికి గంట సమయం, సాధారణ దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు. రావిచెట్టు వద్ద జ్యోతులను వెలిగించి పూజలు చేశారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. నిత్యాన్నదాన పథకంలో ఐదు వేల మంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. శృంగారవల్లభ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు సామర్లకోట: పెద్దాపురం మండల పరిధిలోని తిరుపతి గ్రామంలో కొలువైన శ్రీదేవి, భూదేవి సమేత శృంగారవల్లభ స్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. స్వామివారికి అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు 15 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. స్వామివారిని, ఆలయాన్ని పూలమాలలతో అలంకరించారు. ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా రూ.1,84,440, అన్నదాన విరాళాలుగా రూ.45,663, కేశ ఖండన ద్వారా రూ.6,400, తులాభారాలతో రూ.550, లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా రూ.20,400 కలిపి మొత్తం రూ.2.57,453 ఆదాయం వచ్చిందని ఈఓ వివరించారు. ఆలయంలో నాలుగు వేల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారని ఈఓ తెలిపారు. మాజీ సర్పంచ్ మొయిలి కృష్ణమూర్తి, ట్రస్టు బోర్డు చైర్మన్ మొయిలి సంధ్య, దేవస్థాన సిబ్బంది, గ్రామ పెద్దలు భక్తులకు సేవలందించారు. జూనియర్ డాక్టర్ల సమస్యలు పరిష్కరించండి కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జూనియర్ డాక్టర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో మూడు రోజులుగా జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మెకు శనివారం ఆయన సంఘీభావం ప్రకటించారు. సమ్మె శిబిరం వద్దకు వెళ్లి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూనియర్ వైద్యులకు ప్రతి రెండేళ్లకు స్టైఫండ్ పెంచాలని, ఈ ఏడాది 30 శాతం పెంచాల్సి ఉన్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదన్నారు. జూనియర్ వైద్యులు పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదన్నారు. అలాగే వైద్యుల ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు కొనసాగించాలన్నారు. జూనియర్ వైద్యులు సమ్మెలో ఉన్నా, అత్యవసర సేవలకు ఎటువంటి ఆటంకం లేకుండా విధులు నిర్వర్తిస్తున్నారని, దీనిని తాను అభినందిస్తున్నామన్నారు. ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో వారితో కలిసి పోరాటం చేస్తామన్నారు. వేలాది మంది రోగులకు నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న జూనియర్ డాక్టర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.కిరణ్ కుమార్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తున్న జూనియర్ డాక్టర్ల శ్రమకు తగిన విధంగా స్టైఫండ్ను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం తక్షణమే చర్చలు జరిపి సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించాలన్నారు. ఈ పోరాటానికి పీడీఎస్యూ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. -
మహనీయుల త్యాగ ఫలమే స్వాతంత్య్రం
వైఎస్సార్ సీపీ కార్యాలయంలో స్వాతంత్య్ర దిన వేడుకలుసాక్షి ప్రతినిధి, కాకినాడ: స్వాతంత్య్రం కోసం ఎందరో మహనీయులు త్యాగాలు చేశారని, వారిని స్మరించుకుంటూ ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, సమానత్వం కోసం ముందుకు సాగుదామని వైఎస్సార్ సీపీ శ్రేణులు అన్నారు. కాకినాడలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో 80వ స్వాతంత్య్ర దిన వేడుకలు నిర్వహించారు. తొలుత రాజా పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం తెచ్చేందుకు ఎందరో త్యాగధనులు ఎన్నో త్యాగాలు చేశారన్నారు. వారిని స్మరించుకోవడం మన బాధ్యతని అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, మాజీ మంత్రి తోట నరసింహం, జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి, మాజీ ఎంపీ వంగా గీత, పెద్దాపురం నియోజకవర్గ ఇన్చార్జి దవులూరి దొరబాబు, కుడా మాజీ చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, మాజీ మేయర్, నగర అధ్యక్షురాలు సుంకర ప్రసన్న శివప్రసన్న తదితరులు పాల్గొన్నారు. -
మరిడమ్మకు పసుపు కొమ్ముల సమర్పణ
సామర్లకోట: అమ్మవార్లకు పసుపు, కుంకుమ సమర్పించడం వలన మంచి జరుగుతుందని మహిళల నమ్మకం. ఈనెల 13 నుంచి 28 వరకు పెద్దాపురం మరిడమ్మ ఆలయంలో పసుపు కొమ్ములు స్వీకరించే కార్యక్రమాన్ని దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.విజయలక్ష్మి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఆలయ ఆవరణలో కలశం ఏర్పాటు చేసి వాటిలో మహిళలు పసుపు కొమ్ములు సమర్పించే ఏర్పాటు చేశారు. మహిళలు సమర్పించిన పసుపు కొమ్ములను ఆలయంలో నిర్వహించే సామూహిక వరలక్ష్మీ వ్రతాలకు ఉపయోగిస్తామని తెలిపారు. శనివారం పెద్దాపురం పట్టణానికి చెందిన లలితా సంకీర్తన భక్త మండలి సభ్యులు పసుపు కొమ్ములు ఆలయానికి తీసుకొచ్చారు. పసుపు కొమ్ములను కలశంలో సమర్పించి ఆలయ ప్రాంగణంలో పారాయణ నిర్వహించారు. దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ భక్తులకు అమ్మవారి ప్రసాదం అందజేశారు. -
త్యాగధనుల స్ఫూర్తిగా..
● ఎగిరిన త్రివర్ణ పతాకం ● కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో స్వాతంత్య్ర దినోత్సవం ● ఆకట్టుకున్న ప్రదర్శనలు, శకటాలు ● 242 మందికి ఉత్తమ సేవా పురస్కారాలు సాక్షి ప్రతినిధి, కాకినాడ, కాకినాడ క్రైం: దేశానికి స్వేచ్ఛా వాయువులు తీసుకొచ్చిన త్యాగధనుల స్ఫూర్తి గా.. త్రివర్ణ పతాకం నింగిన ఎగసింది.. స్వాతంత్య్ర దినోత్సవ వేళ అందరిలో దేశభక్తిని నింపింది.. వందే మాతర గీతం అందరి నోటా ప్రతిధ్వనించింది.. దీనికి కాకినాడ వేదికై ంది. గురువారం స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జిల్లా స్థాయి 80వ స్వాతంత్య్ర దిన వేడుకలు నిర్వహించారు. దీనికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీసమేతంగా హాజరయ్యారు. కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆధ్వర్యంలో ఎస్పీ బిందుమాధవ్ భద్రతా పర్యవేక్షణలో జాతీయ జెండాను పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సాంస్కృతిక ప్రదర్శనలు, పోలీస్ జాగిలాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కట్టిపడేసిన ప్రదర్శనలు సర్పవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు గగన వీధిలో రెపరెపలాడే జెండా, కాకినాడ గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ విద్యార్థులు ఇదే మన భారతం ఇలలో పూల రథం, కోటనందూరు మండలం అల్లిపూడి కేజీవీబీ పాఠశాల విద్యార్థులు వందేమాతం, యర్రవరం పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు భారతమాతకి జయహో, సుభానికేతన్, శ్రీప్రకాష్ ఎన్సీసీ యూనిట్ విద్యార్థులు సుజలం సుఫలాం మలయజ శీతలం పాటలకు నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇందులో అల్లిపూడి కేజీబీవీ విద్యార్థులకు ప్రథమ, సర్పవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ద్వితీయ, సుభానికేతన్, శ్రీప్రకాష్ ఎన్సీసీ యూనిట్కు తృతీయ స్థానాలు దక్కాయి. ప్రాజెక్ట్ హనుమాన్ ప్రథమం వివిధ ప్రభుత్వ శాఖలు రూపొందించిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. అన్నవరం సత్యనారాయణ స్వామి, వందేభారత్ ట్రైన్ పైలెట్, వీబీజీ రామ్జీ పల్లె పండగ, గ్రేట్ గ్రీన్ వాల్, వ్యవసాయ, ఉద్యానవన, రైతన్న మీకోసం, ప్రాజెక్టు హనుమాన్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అడవి తల్లి బాట, జిల్లా ప్రజా పరిషత్– స్వచ్ఛ రథం, జిల్లా విద్యాశాఖ– పీఎంశ్రీ పాఠశాల శకటాలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. ఇందులో అటవీశాఖ ప్రదర్శించిన ప్రాజెక్ట్ హనుమాన్కు ప్రథమ స్థానం దక్కింది. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ అడవితల్లి బాటకు ద్వితీయ, జిల్లా విద్యా శాఖ పీఎంశ్రీ పాఠశాలకు తృతీయ స్థానాలు దక్కాయి. ఆయా శాఖల ఉన్నతాధికారులకు జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ జ్ఞాపికలు అందజేశారు. మెరిసిన స్టాల్స్ సృజనాత్మకత ఉట్టిపడేలా వివిధ స్టాల్స్ ఏర్పాటయ్యాఇయి. గ్రామీణ అభివృద్ధి సంస్థ, ఏపీఎంఐపీ, మహిళా శిశు సంక్షేమ శాఖ, పంచాయతీ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, మత్స్య శాఖ స్టాళ్ల ద్వారా కార్యకలాపాలను ప్రతిబింబించారు. స్టాళ్ల కేటగిరిలో పోలీస్ శాఖకు ప్రథమ, మహిళా శిశు సంక్షేమ శాఖకు ద్వితీయ, జిల్లా మత్స్య శాఖకు తృతీయ స్థానాలు దక్కాయి. ఆకట్టుకున్న కవాతు పోలీస్ గౌరవ వందన స్వీకరణతో మొదలైన వేడుక కవాతుతో ముగిసింది. పోలీస్, ఎన్సీసీ దళాలు సంయుక్తంగా నిర్వహించిన సంప్రదాయ కవాతు అలరించింది. ఉత్తమ కవాతు కేటగిరీలో 3 ఆంధ్ర ఎన్సీసీ బాలికల బెటాలియన్కు ప్రథమ స్థానం, 18 ఆంధ్ర ఎన్సీసీ బాలురకు ద్వితీయ స్థానం, సమ్మన్ గార్డ్ డీఏఆర్ కంటిన్జెంట్కు తృతీయ స్థానాలు దక్కాయి. 242 మందికి పురస్కారాలు జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న 242 మంది ఉద్యోగులకు ఉత్తమ సేవా పురస్కారాలు దక్కాయి. వీరిలో అధికారులు, సిబ్బంది ఉన్నారు. 21 మంది జిల్లా స్థాయి అధికారులు ప్రశంసా పత్రాలు అందుకున్న వారిలో ఉన్నారు. వీరంతా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్నారు. వీరితో పాటు సిబ్బందికి ఇచ్చారు. ఈ వేడుకల్లో పార్లమెంట్ సభ్యుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తలాటం నాగవెంకటసత్య, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
ఘనంగా సత్యదేవుని జయంత్యుత్సవం
అన్నవరం: పవిత్ర శ్రావణ మాసం తొలి శుక్రవారం.. అందునా సత్యదేవుని 136వ జయంత్యుత్సవం కావడంతో రత్నగిరి నూతన శోభను సంతరించుకుంది. సత్యదేవుని జన్మ నక్షత్రం మఖ సందర్భంగా తెల్లవారుజామున రెండు గంటలకు ఆలయం తెరచి, పూజలు చేశారు. స్వామి, అమ్మవార్లతో పాటు శంకరుని మూలవిరాట్టులకు పంచామృతాలతో మహాన్యాస పూర్వక అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను నూతన పట్టు వస్త్రాలతో, స్వర్ణ, వజ్రకర్ణాభరణాలతో, సుగంధభరిత పుష్పాలతో అలంకరించి పూజించారు. ఉదయం 6 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. ఉదయం పది గంటలకు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని వెండి రథంపై ఘనంగా ఊరేగించారు. 11 గంటలకు నిర్వహించిన ఆయుష్య హోమం పూర్ణాహుతిలో దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ నల్లం సూర్యచక్రధరరావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా 19 మంది పండితులను దేవస్థానం చైర్మన్, ఈవో ఘనంగా సత్కరించారు. కార్యక్రమాలను దేవస్థానం వేద పండితులు గంగాధరభట్ల గంగబాబు, చిట్టి శివ, గొల్లపల్లి ఘనపాఠి తదితరులు నిర్వహించారు. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వ్రతాలు 2,500 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. సత్యదేవుని అన్నప్రసాదాన్ని సుమారు 5 వేల మంది భక్తులు స్వీకరించారు. సత్యదేవుని జయంత్యుత్సవం సందర్భంగా ప్రధానాలయాన్ని, ద్వారాలను ఫలపుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించారు.స్వామి, అమ్మవార్లకు పూజలు చేస్తున్న పండితులు. చిత్రంలో దేవస్థానం చైర్మన్, ఈఓ తదితరులుఆలయం వద్ద ఫలపుష్పాలతో చేసిన అలంకరణ -
గుర్రపుడెక్కతో స్వయం ఉపాధి
కరప: గుర్రపుడెక్కతో డ్వాక్రా మహిళలు స్వయం ఉపాధి పొందవచ్చని కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ అన్నారు. డీఆర్డీఏ, సెర్ప్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యాన కరప, కాజులూరు మండలాల్లోని 40 మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు కరప మండలం గొర్రిపూడి గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాలువల్లో నీటి ప్రవాహానికి ఆటంకంగా మారుతున్న గుర్రపుడెక్కను ఎండబెట్టి, దానితో వివిధ వస్తువులు, కళాకృతులు తయారు చేసి లబ్ధి పొందేలా ఈ శిక్షణ ఏర్పాటు చేశామని చెప్పారు. గుర్రపుడెక్క దొరకని సమయంలో జూట్, ప్లాస్టిక్ బ్యాగులు తయారు చేసేలా మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని చెప్పారు. డ్వాక్రా మహిళలు తయారు చేసే వస్తువుల మార్కెటింగ్కు చర్యలు తీసుకుంటామన్నారు. ‘స్వయం’ అనే బ్రాండ్ ద్వారా ఈ వస్తువుల విక్రయానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందని తెలిపారు. ఈ ఉత్పత్తులను అమెజాన్ వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో విక్రయించడం ద్వారా దేశవ్యాప్తంగా 10 వేలకు పైగా ప్రాంతాలకు గ్రామాల నుంచే వస్తువులను పంపిణీ చేసే అవకాశం ఉంటుందని వివరించారు. బ్యాగుల తయారీకి అవసరమైన ఫోల్డింగ్, ప్రెస్సింగ్ మెషీన్ల వంటి ఉపకరణాలను సబ్సిడీపై అందించేందుకు ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ చెప్పారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ ప్రియ, డీఆర్డీఏ పీడీ జి.శ్రీనివాసరావు, డీపీఎం టి.బాబూరావు, తహసీల్దార్ ఏఎల్ లక్ష్మి, ఎంపీడీఓ జె.శ్రీనివాస్, ఏపీఎం ఎన్.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
జూడాల రిలే నిరాహార దీక్ష
కాకినాడ క్రైం: స్థానిక వైద్య విద్యార్థుల పీజీ వసతి గృహం ఆవరణలో జూనియర్ డాక్టర్లు (జూడా) మూడో రోజైన శుక్రవారం కూడా రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. స్టైపెండ్ పెంచాలని, ఉద్యోగ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచడానికి వీల్లేదని, ఉద్యోగ నియామకాల్లో ఎండీ, ఎంఎస్ చదివిన అభ్యర్థులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జీజీహెచ్లో అత్యవసర సేవలు మినహా మిగిలిన సేవల్ని జూడాలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 16 నుంచి పూర్తి స్థాయిలో సేవల నిలుపుదలకు జూడాల అసోసియేషన్ నాయకులు పిలుపునిచ్చారు. ప్రేమను నిరాకరించిందని యువకుడి ఆత్మహత్యకరప: తన ప్రేమను ఓ యువతి నిరాకరించిందన్న బాధతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరప మండలం గురజనాపల్లిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఆ గ్రామానికి చెందిన అడ్డూరి సూర్య (21) కాకినాడలోని ఒక గ్యాస్ కంపెనీలో డెలివరీ బాయ్గా పని చేస్తున్నాడు. అతడికి తల్లి, సోదరుడు ఉన్నారు. సూర్య తండ్రి నానాజీ 15 ఏళ్ల క్రితమే మృతి చెందగా కూలి పనులు చేసుకుంటూ ఒకరికొకరు చేదోడువాదోడుగా జీవిస్తున్నారు. కొంత కాలం క్రితం ఇన్స్ట్రాగామ్లో పరిచయమైన వేరే గ్రామానికి చెందిన యువతిని సూర్య ప్రేమిస్తున్నాడు. అయితే, ఆ అమ్మాయి శ్రీనిన్ను ప్రేమించడం లేదు. నువ్వు నాకు సోదరుడివవుతావుశ్రీ అని చెప్పింది. దీంతో, మనస్తాపం చెందిన సూర్య గురువారం రాత్రి క్షణికావేశంలో తన ఇంటి ఎదురుగా ఉన్న వేపచెట్టుకు ఉరి వేసుకున్నాడు. కుటుంబ సభ్యులు వెంటనే కాకినాడ జీజీహెచ్కు తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి సోదరుడు అనిల్ శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్సై వెంకట రమణ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం సూర్య మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిధులు సమకూర్చుకుంటూ సమస్యల పరిష్కారంబోట్క్లబ్ (కాకినాడ సిటీ): దశలవారీగా నిధులు సమకూర్చుంటూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పురపాలక శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి పి.నారాయణ అన్నారు. కలెక్టరేట్లోని వివేకానంద సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన జిల్లా సమీక్షా కమిటీ (డీఆర్సీ) సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముఖ్యమంత్రితో సంప్రదించి, పంటల బీమా గడువు పెంచేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో వ్యవసాయ, జలవనరుల శాఖలు పూర్తి సమన్వయంతో పంటలను కాపాడాలని సూచించారు. ముద్రా, తదితర రుణాల కల్పనపై బ్యాంకర్లతో రుణమేళా ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు సానా సతీష్బాబు సూచించారు. పోలవరం ఎడమ కాలువ వెంబడి ఖాళీగా ఉన్న వరద కరకట్ట స్థలాలను ఇళ్ల స్థలాలకు కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కోరారు. దీనివల్ల భూసేకరణ నిధులు ఆదా అవుతాయని అన్నారు. జగ్గంపేట సీహెచ్సీలో ఎముకల వైద్య నిపుణులను నియమించాలని కోరారు. ఇటీవల కామెర్ల వ్యాధితో పెద్దాపురం ప్రజలు భయాందోళనలకు గురయ్యారని, ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. కాకినాడ జీజీహెచ్లో కార్డియాలజిను నియమించాలని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కోరారు. ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ అన్నారు. కార్యక్రమంలో కాకినాడ రూరల్, తుని ఎమ్మెల్యేలు పంతం నానాజీ, యనమల దివ్య, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు కూడా పాల్గొన్నారు. సముద్రంలోకి 1.47 లక్షల క్యూసెక్కులుధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ నుంచి శుక్రవారం 1,47,180 క్యూసెక్కుల గోదావరి మిగులు జలాలను సముద్రంలోకి విడిచి పెట్టారు. తూర్పు డెల్టాకు 5 వేలు, మధ్య డెల్టాకు 2,600, పశ్చిమ డెల్టాకు 7 వేలు కలిపి, డెల్టా కాలువలకు 14,600 క్యూసెక్కు ల నీటిని విడుదల చేశారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.90 అడుగులుంది. ఎగువన కాళేశ్వరంలో 6.09 మీటర్లు, పేరూరు 9.44, దుమ్ముగూడెం 7.05 మీటర్లు, భద్రాచలం 20.80 అడుగులు, కూనవరం 9.07 మీటర్లు, కుంట 4.85, పోలవరం 6.25, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 14.04 మీటర్లుగా నీటిమట్టాలు నమోదయ్యాయి. -
సత్యదేవునికి కొత్త వెండి రథం
అన్నవరం: సత్యదేవునికి కొత్త వెండి రథం సమకూరనుంది. ప్రస్తుతం స్వామివారి ఊరేగింపులో ఉపయోగిస్తున్న వెండి రథాన్ని 50 సంవత్సరాల క్రితం తయారు చేయించారు. ఇది శిథిలావస్థకు చేరడంతో రథసేవ నిర్వహించడం ఇబ్బందికరంగా మారింది. దీనిపై ‘ఏ తేరుగ ఊరేగెదవో స్వామీ..’ శీర్షికన సాక్షి శుక్రవారం ప్రచురించిన కథనానికి అన్నవరం దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ నల్లం సూర్యచక్రధరరావు స్పందించారు. ఊరేగింపు అనంతరం శుక్రవారం ఆ రథాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దాతలు లేదా దేవస్థానం నిధులతో సత్యదేవునికి కొత్త రథం తయారు చేయిస్తామని తెలిపారు. వచ్చే నెలలో జరిగే ట్రస్ట్బోర్డు సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. -
మువ్వన్నెల వేడుకలకు ముస్తాబు
కాకినాడ క్రైం: స్వాతంత్య్ర దినోత్సవానికి జిల్లా ముసాబైంది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు త్రివర్ణ కాంతులను అద్దుకున్నాయి. రైల్వే స్టేషన్, బస్టాండ్, జీజీహెచ్, కలెక్టరేట్, ఎస్పీ, ఆర్టీఏ సహా పలు జిల్లా స్థాయి కార్యాలయాలు పంద్రాగస్టు వేడుకలకు సిద్ధమయ్యాయి. కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ ఆధ్వర్యాన ఎస్పీ బిందుమాధవ్ భద్రతా పర్యవేక్షణలో కాకినాడలోని పోలీస్ పరేడ్ మైదానంలో జిల్లా స్థాయి వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 9 గంటలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసు దళాల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆయన ప్రసంగం అనంతరం పోలీస్ కవాతు, ప్రగతి శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉత్తమ ప్రతిభ చూపిన అధికారులు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేస్తారు. ఎస్పీ బిందుమాధవ్ ఆధ్వర్యాన శుక్రవారం వేడుకల రిహార్సల్స్ నిర్వహించారు. ఎస్పీ కార్యాలయం నుంచి భానుగుడి సెంటర్ వరకూ జరిగిన ర్యాలీలో విద్యార్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. తన కార్యాలయ ఆవరణలో ఆర్డీవో మల్లిబాబు చొరవతో ఏర్పాటు చేసిన వందేమాతరం జాతీయ గీతం తెలుగు భావానువాదం ఎంతో ఆకట్టుకుంది. ట్రాఫిక్ ఆంక్షలు పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో పోలీస్ పరేడ్ మైదానం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భారీ వాహనాలను మళ్లిస్తున్నారు. వేడుకల పేరుతో రోడ్లపై వాహనాల ప్రయాణాలకు ఆటంకం కలిగించేలా ఎటువంటి కార్యక్రమాలూ నిర్వహించరాదని, ద్విచక్ర వాహనాలపై జెండాలు ప్రదర్శిస్తూ మితిమీరిన వేగంతో వెళ్లడాన్ని సహించబోమని పోలీసులు హెచ్చరించారు. మద్యం తాగి వాహనాలు నడపడం, ఇతర ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.అవార్డులకు కత్తెర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితి, భద్రతా కారణాలతో ఉత్తమ సేవల అవార్డులకు అధికారులు కత్తెర వేశారు. ఒక్కో ప్రభుత్వ విభాగం నుంచి తొలుత 5 నుంచి 10 మంది వరకూ ఎంపిక చేయగా.. శుక్రవారం సాయంత్రానికి దీనిని ముగ్గురి నుంచి ఐదుగురికి పరిమితం చేశారు. -
రెండున్నరేళ్ల చిన్నారికి బ్రాంకోస్కోపీ
● శ్వాసనాళంలో ఇరుక్కున్న వేరుశనగపప్పు ● అరుదైన శస్త్రచికిత్స చేసిన వైద్యులు ● ప్రాణాపాయం నుంచి బయటపడ్డ చిన్నారి బీచ్రోడ్డు (విశాఖ): వేరుశనగపప్పు తింటుండగా ప్రమాదవశాత్తు శ్వాసనాళంలో ఇరుక్కుపోయిన రెండున్నరేళ్ల చిన్నారి విశాఖపట్టణంలోని ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రి వైద్యులు అరుదైన బ్రాంకోస్కోపీ శస్త్రచికిత్స చేశారు. కాకినాడకు చెందిన కరుణప్రియకు 20 రోజుల క్రితం వేరుశనగపప్పు శ్వాసనాళంలో ఇరుక్కుపోవడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. కాకినాడలోని పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందినా సమస్య గుర్తించలేదు. ఈనెల 10న కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు పరీక్షించి శ్వాసనాళంలో పప్పు ఉన్నట్లు గుర్తించి విశాఖ ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటివరకు 14 ఏళ్లకు పైబడిన వారికే బ్రాంకోస్కోపీ చేసిన ఆస్పత్రిలో తొలిసారిగా చిన్నారికి ఈ శస్త్రచికిత్స నిర్వహించారు. సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్కుమార్ ఆధ్వర్యంలోని వైద్య బృందం సుమారు 3 గంటలపాటు శస్త్రచికిత్స చేసి శ్వాసనాళంలోని వేరుశనగపప్పును విజయవంతంగా తొలగించింది. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ పిన్న వయసు చిన్నారికి బ్రాంకోస్కోపీ చేయలేదని, ఈ కేసును సవాల్గా తీసుకుని వైద్య బృందం సమష్టి కృషితో శ్వాసనాళంలోని వేరుశనగపప్పును విజయవంతంగా తొలగించామని తెలిపారు. చిన్నారి కరుణ ప్రియశ్వాసనాళం నుంచి తొలగించిన వేరుశనగపప్పు -
క్రమశిక్షణ చర్యల రద్దుపై 20న విచారణ
అన్నవరం: ఈ నెల 20న తన కార్యాలయంలో అన్నవరం దేవస్థానం ప్రథమ శ్రేణి వ్రత పురోహితుడు మల్లాది గురుమూర్తి విచారణకు హాజరు కావాలని దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ ఆదేశించారు. ఈ మేరకు అడిషనల్ కమిషనర్ ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గత ఏడాది డిసెంబర్ 21 పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సత్యదేవుని సామూహిక వ్రతాల నిర్వహణకు వెళ్లిన సందర్భంలో ఆయన వ్యవహార శైలిపై ఫిర్యాదులు రావడంతో అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం, ఆ తరువాత గత నెల 24న ఆ చర్యలను రద్దు చేస్తూ ట్రస్ట్ బోర్డు తీర్మానం చేయడం తెలిసిందే. దీంతో జూలై 3న ‘ఒట్టి అమాయకుడు గురూ’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనంతో ఆ తీర్మానాన్ని కమిషనర్ సస్పెండ్ చేశారు. దీనిపై గత నెల 29న విచారణకు రావాలని ఆదేశించారు. వ్యక్తిగత కారణాలతో రాలేనని గురుమూర్తి చెప్పడంతో వాయిదా వేశారు. తాజాగా దీనికి సంబంధించిన రికార్డులతో ఈ నెల 20న విచారణకు హాజరు కావాలని గురుమూర్తితో పాటు ఈఓను కమిషనర్ ఆదేశించారు. -
జూనియర్ వైద్యుల సమ్మెబాట
● స్టైపెండ్ పెంపుతో పాటు డిమాండ్ల సాధనకు పోరు ● జీజీహెచ్లో విధుల బహిష్కరణ సాక్షి, రాజమహేంద్రవరం: డిమాండ్ల పరిష్కారం కోరుతూ జూనియర్ డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్లు, పీజీ విద్యార్థులు, సూపర్ స్పెషాలిటీ వైద్యులు సమ్మె బాట పట్టారు. వైద్య ఆరోగ్య శాఖ, వైద్య విద్య డైరెక్టర్తో జరిపిన చర్చలు విఫలం కావడంతో వారు సమ్మెలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. ఫలితంగా గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)లో వైద్య సేవలకు కొంత విఘాతం కలిగే ప్రమాదం ఉంది. సుమారు 40 మందికి పైగా సమ్మెలో పాల్గొంటున్నారు. పేద రోగులకు ఇబ్బందే.. సమ్మెలో భాగంగా ఓపీ సేవలకు దూరంగా ఉన్నప్పటికీ అత్యవసర వైద్య సేవలకు అందుబాటులో ఉంటామని జూడాలు తెలిపారు. అయితే ఆస్పత్రిలో రోజూ వార్డుల నిర్వహణ, శస్త్రచికిత్సలు చేయడం, పరీక్షల నిర్వహణలో పీజీ వైద్యులు, జూడాలదే కీలక పాత్ర. ప్రస్తుతం వీరంతా విధులకు దూరం కావడంతో దూర ప్రాంతాల నుంచి జీజీహెచ్కు వచ్చే వేలాది రోగులు, వృద్ధులు, గర్భిణులకు ఇబ్బందులు తప్పని పరిస్థితి. ఇప్పటికే ఓపీ కోసం గంటల తరబడి నిరీక్షణ తప్పడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
సత్యదేవుని జయంత్యుత్సవాలకు శ్రీకారం
● వేద ఘోషతో మార్మోగిన రత్నగిరి ● నేడు సత్యదేవుని ఆవిర్భావ దినోత్సవం అన్నవరం: రత్నగిరీశుడు సత్యదేవుని 135వ సత్యవిదియ (ఆవిర్భావ దినోత్సవం) వేడుకలు శ్రావణ శుద్ధ పాడ్యమి, గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం నిర్వహించనున్న ఈ వేడుకను పురస్కరించుకుని ఉదయం ఎనిమిది గంటలకు విఘ్నేశ్వరపూజతో జయంత్యుత్సవాలకు అంకురార్పణ చేశారు. అనంతరం పండితుల వేదాశీస్సులు అందజేసి ప్రసాదాలు నివేదించారు. ఈ సందర్భంగా సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను స్వర్ణాభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ రెండు రోజుల పాటు జపతపాలు చేసే 50 మంది రుత్విక్కులకు దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ నల్లం సూర్య చక్రధరరావు దీక్షా వస్త్రాలను అందజేశారు. రుత్విక్కుల వేద మంత్రాలతో అనివేటి మండపం, ఆలయ ప్రాంగణం మార్మోగాయి. ఈ సందర్భంగా సూర్యనమస్కారాలు, లింగాష్టకం, నవావరణ అర్చన, రామాయణ, భాగవతాల పారాయణ, శ్రీసూక్త, పురుష సూక్త పారాయణ, బాల, కౌమారీ, సువాసిని పూజలు నిర్వహించారు. సాయంత్రం దర్బారు మండపంలో మండపారాధన, కలశస్థాపన ఆయుష్యహోమానికి అంకురార్పణ నిర్వహించారు. ఆస్థాన వేద పండితులు గంగాధరభట్ల గంగబాబు, శివ ఘనపాఠీ, గొల్లపల్లి ఘనపాఠీ, యనమండ్ర శర్మ, ముష్టి పురుషోత్తం, రమేష్, ప్రధానార్చకులు ఇంద్రగంటి నర్శింహమూర్తి తదితరులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ట్రస్ట్బోర్డు సభ్యులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ జయంత్యుత్సవాలను పురస్కరించుకుని సత్యదేవుని ఆలయం, రాజగోపురాలు, రామాలయం, ఆలయ ప్రాంగణాన్ని విద్యుద్దీపాలు, పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. నేడు ప్రత్యేక పూజలు సత్యదేవుని ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించనున్నారు. అలాగే పలువురు వేద పండితులను సత్కరించనున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను గరుడ వాహనంపై సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు ఊరేగించనున్నారు. -
డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నిస్తే అరెస్టులా?
ప్రత్తిపాడు రూరల్: డీఎస్సీ అవకతవకలపై ప్రశ్నిస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముదునూరి మురళీకృష్ణంరాజు మండిపడ్డారు. మండలంలోని ధర్మవరంలో గురువారం ఆయన స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని యువతను మోసం చేశారని, కేవలం 16 వేల ఉద్యోగాల భర్తీకి చేపట్టిన డీఎస్సీలోనూ భారీగా అవకతవకలకు పాల్పడిందని విమర్శించారు. అందుకే ఇది దగా డీఎస్సీ అని ఎద్దేవా చేశారు. ఈ దగాపై శాంతియుతంగా నిరసనలు, నిరాహార దీక్షలు చేస్తుంటే పార్టీ శ్రేణులను అక్రమంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. యువతకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్ సీపీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఈ అక్రమాలకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముదునూరి -
ఏ తేరుగ ఊరేగెదవో స్వామీ
● కళావిహీనమైన రథంలోనే సత్యదేవుని ఊరేగింపు! ● కొత్త రథం చేయించడంలో అధికారుల అలసత్వం అన్నవరం: స్వామివారి జయంత్యుత్సవాలు వస్తున్నాయి.. వెళ్తున్నాయి కానీ దేవేరులతో ఆయన ఊరేగడానికి వెండి రథాన్ని బాగుచేయించడానికి మాత్రం చేయించడానికి అధికారులకు తీరిక దొరకడం లేదు. ప్రస్తుతం ఊరేగుతున్నది 50 క్రితం నాటిది, జీర్ణావస్థకు చేరినప్పటికీ దానినే ఉత్సవాలకు వినియోగించడం శోచనీయం. ఈ రథం స్థానంలో స్వామి ఊరేగింపునకు 2023లో అప్పటి ఈఓ చంద్రశేఖర్ ఆజాద్ రెండు టేకు రథాలను చేయించారు. చిన్న రథాన్ని కొండపైన ఉత్సవాలకు తిప్పడానికి, రెండో పెద్ద రథాన్ని కొండ కింద తిప్పడానికి ఉద్దేశించారు. చిన్నరథానికే వెండి తాపడం చేయించాలని నిర్ణయించారు. అయితే ఆయన బదిలీతో ఆ ప్రతిపాదన ఆగిపోగా ఆ రథాన్ని మాత్రం నేడు పర్వదినాల్లో స్వామి సేవకు వినియోగిస్తున్నారు. తాజాగా ఆనవాయితీ ప్రకారం జయంత్య్త్సువాలకు వెండి రథాన్నే వినియోగిస్తుండడంతో దానిని తూర్పు రాజగోపురం ముందు ప్రాకారంలోకి తీసుకువచ్చి సిద్ధం చేస్తున్నారు. అపచారాన్ని మన్నించు దేవా స్వామివారి ఊరేగింపునకు తీసుకువచ్చిన రథాన్ని చూస్తే కడుపు తరుక్కుపోక మానదు. రథంపై సుదర్శన చక్రం ఒరిగిపోయి, మువ్వలు సగానికి పైగా రాలిపోయి, అరటి చెట్లు, ఆకులు తాళ్లతో కట్టబడి, మకర తోరణాలు అస్తవ్యస్తంగా తయారై, వెండి తాపడాల అతుకులు ఊడిపోయి చెక్కలు కనిపిస్తూ, రథ చక్రాలు ఊడిపోయి అధ్వానంగా ఉన్న రథాన్ని నేడు స్వామివారి సేవకు వినియోగిస్తున్నారు. ఈ కార్యక్రమం అనంతరం నిర్వహించే బృహత్కార్యానికై నా కొత్త రథాన్ని స్వామివారికి అమరుస్తారో లేదో వేచి చూడాల్సిందే. -
మోదీ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు
సామర్లకోట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాక అన్నారు. ఈనెల 6వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన పాదయాత్రల ముగింపు సందర్భంగా స్థానిక నీలమ్మ చెరువు నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక పాదయాత్రను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ మతోన్మాధ విధానాలతో దేశం ప్రమాద స్థితిలోకి చేరిందని హెచ్చరించారు. దేశ సమైకత్య సమగ్ర అభివృద్ధి సాధన లక్ష్యంగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఈనెల 6 నుంచి 14 వరకు ప్రజల కోసం, ప్రజలతో కలిసి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పాదయాత్ర చేపడుతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిరసనగా సెప్టెంబరు 1న ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సీపీఐ జిల్లా కార్యదర్శి, సహాయ కార్యదర్శులు కె.బోడకొండ, తోకల ప్రసాద్ మాట్లాడుతూ కాకినాడ నుంచి అమలాపురం వరకు ఉన్న గ్యాస్ నిక్షేపాలను పైపులైన్ ద్వారా మహారాష్ట్ర, గుజరాత్కు తరలిస్తున్నారన్నారు. స్థానికంగా లభించే గ్యాస్, పెట్రోలు నిక్షేపాలను స్థానికంగా అందజేస్తే గ్యాస్ సిలిండరు రూ.100కే వస్తుందన్నారు. అనంతరం పాదయాత్ర నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు మధు -
గడువులోగా సర్ పూర్తి చేయాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): సర్ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సూచించారు. ఈ ప్రక్రియకు సంబంధించి ఆయన గురువారం అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో మొత్తం 31,695 నోటీసులు జారీ చేయగా, ఇప్పటివరకు 7,335 నోటీసులు డెలివరీ అయ్యాయని, మిగిలిన 24,360 నోటీసుల డెలివరీ వేగవంతంగా జరుగుతోందన్నారు. ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో బూత్ స్థాయిలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అర్హులైన పౌరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఓటు హక్కు పొందాలని సూచించారు. క్లెయిమలు, అభ్యంతరాల నమోదుకు తుది గడువు 30వ తేదీ అని, వీటిని సెప్టెంబరు 28 లోపు పరిష్కరిస్తారన్నారు. అక్టోబర్ 3న తుది జాబితా ప్రచురితమవుతుందన్నారు. కార్యక్రమంలో డీఆర్వో డి.తిప్పే నాయక్, ఆర్డీవోలు ఎస్.మల్లిబాబు, పి.కృష్ణమూర్తి పాల్గొన్నారు. సంతృప్త స్థాయి పెంచాలి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని మరింత వేగవంతం చేసి ప్రజల సంతృప్త స్థాయిని పెంచాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు తదితర అధికారులతో సమీక్షించారు. పింఛన్ల పంపిణీ సమయంలో లబ్ధిదారులతో మంచిగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. పింఛన్ నిధులతో అక్రమాలకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి రికార్డులను కలెక్టరేట్కు సమర్పించాలన్నారు. తగ్గని పచ్చకామెర్లు ● కట్టమూరులో వైద్య శిబిరం ● ఇంటింటా ఆరోగ్య సిబ్బంది సర్వే పెద్దాపురం: మండలంలో కట్టమూరు గ్రామంలో వారం రోజులుగా కలుషిత నీరు, ఆహారం వల్ల చిన్నారులు, వృద్ధులు పచ్చకామెర్లతో ఆసుపత్రుల పాలవుతున్నారు. ఈ మేరకు స్థానిక సీహెచ్సీలో ఐదుగురు చికిత్స పొందుతున్నారు. చాలా మంది గ్రామంలో ఆర్ఎంపీల వద్ద, ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. జిల్లా వైద్యశాఖ అధికారులు ఆదేశాల మేరకు స్థానిక డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ ప్రశాంతి పర్యవేక్షణలో కాండ్రకోట పీహెచ్సీ వైద్యులు డాక్టర్ చంద్రకిరణ్బాబు తదితరులు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంటింటా తిరుగుతూ ఫీవర్ సర్వే నిర్వహించారు. అనుమానితులకు రక్షపరీక్షలు నిర్వహించి వాటిని ల్యాబ్కు పంపించారు. ఎంపీడీవో కె.సూర్యనారాయణ పర్యవేక్షణలో గ్రామంలో పారిశుధ్య పనులు చేపట్టారు. క్లోరినైజేషన్ చేసిన రక్షిత మంచినీటిని సరఫరా చేస్తున్నారు. గ్రామంలో ఎవరూ ఫాస్ట్ఫుడ్ సెంటర్ల వద్ద ఆహారం తినకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రేషన్ బియ్యం పట్టివేత పిఠాపురం: రేషన్ బియాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న లారీని సీజ్ చేసి, 29.640 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్ తెలిపారు. స్థానిక మోహన్నగర్ – గోర్స రోడ్డులో లారీలో తరలిస్తున్న 29.640 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని సివిల్ సప్లయిస్ డీటీ సమక్షంలో పట్టుకున్నామన్నారు. దీని విలువ సుమారు రూ.14.22 లక్షలు ఉంటుందని తెలిపారు. లారీని సీజ్ చేసి, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నామని అన్నారు. డీసెట్ రెండో దశ కౌన్సెలింగ్ ప్రారంభం రాజమహేంద్రవరం రూరల్: ఏపీ డీసెట్– 2026లో అర్హులైన అభ్యర్థులకు ప్రైవేట్ డీఎల్ఎడ్ కళాశాలలో మిగిలిన ఖాళీ సీట్ల భర్తీకి గురువారం నుంచి రెండో దశ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని బొమ్మూరులోని డైట్ ప్రిన్సిపాల్ ఆర్జేడీ రాజు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16న వెబ్ ఆధారిత ఆప్షన్ల్ల నమోదుకు అవకాశం ఇచ్చారన్నారు. శుక్రవారం నుంచి 20వ తేదీ వరకు సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. -
పింఛను ఇప్పిస్తామని వృద్ధురాలికి బురిడీ
● బంగారు ఆభరణాల అపహరణ ● నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ● మరో ఇద్దరు పరారీ కరప: రూ.10 వేల పింఛన్ మంజూరు చేయిస్తామని ఆశచూపించి, ఓ వృద్ధురాలి నుంచి బంగారు ఆభరణాలు అపహరించి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలం గొర్రిపూడి గ్రామంలో ఈనెల 8న జరిగిన ఈ మోసానికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. గొర్రిపూడిలోని పెదపుంతవీధిలో 70 ఏళ్ల వృద్ధురాలు ఎర్రంనీడి ఆంజనేయులమ్మ ఒక రేకులు షెడ్డులో ఒంటరిగా నివసిస్తోంది. ఆమెకు వివాహితులైన ఇద్దరు కుమార్తెలు వేరే గ్రామంలో ఉంటుండగా, ముగ్గురు కుమారులు సమీపంలోనే వేరేగా కాపురముంటున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 8న మధ్యాహ్నం ముగ్గురు వ్యక్తులు ఆమెను కలసి పింఛను వస్తోందా, రాకుంటే చెప్పండి సహాయం చేస్తామని నమ్మబలికారు. దీనికి ఆమె రూ.4 వేలు వస్తోందని చెప్పడంతో వారు రూ.10 వేలు పింఛను మంజూరు చేయిస్తామని ఆశ చూపి నమ్మబలికారు. వారి మాటలు నమ్మిన ఆమె వారు చెప్పినట్టు ధ్రువపత్రాలు అందజేసింది. ఫొటో తీయాలని ఇక్కడ సరిగా రావని, సమీపంలోని గుడికి వెళ్తామని తెలిపారు. మెడలోని బంగారు గొలుసు, చెవులకు ఉన్న బంగారు దుద్దులు తీసేసి, ఇంట్లో దాచుకోమని ఆమెకు నమ్మకం కలిగించారు. వారి మాటలు నమ్మిన ఆమె వాటిని తీసి ఇంట్లో భద్రపరిచింది. తర్వాత వారి మోటార్ సైకిల్పై ఎక్కగా ఆమెను తీసుకెళ్లిన వెంటనే వారిలోని ఒకడు ఇంట్లోకి వెళ్లి దాచిపెట్టిన బంగారు ఆభరణాలు అపహరించి, ఏమీ తెలియనట్టు కూర్చున్నాడు. మోసగాళ్లు ఆమెను ఇంటివద్ద దింపేసి, పరారయ్యారు. వృద్ధురాలు ఇంటిలోకి వెళ్లి చూడగా బంగారు ఆభరణాలు కనపడలేదు. దీంతో మోసపోయినట్టు గ్రహించిన ఆమె విషయాన్ని బంధువులకు వివరించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్లో ఒకడు మైనర్, ఒకడు పాత నేరస్తుడు ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. వారిలో ఒకరిని పట్టుకోగా, మిగిలిన ఇద్దరూ పరారీలో ఉన్నట్టు ఎస్ఐ తోట సునీత తెలిపారు. -
తలుపులమ్మకు సహస్ర ఘటాభిషేకం
తుని రూరల్: స్థానిక లోవ దేవస్థానంలోని తలుపులమ్మ తల్లికి సప్తనదీ జలాలతో ఘనంగా సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. ఆషాఢ అమావాస్యను పురష్కరించుకుని బుధవారం పంచలోహ విగ్రహాల ప్రాంగణంలో వేదపండితులు, అర్చకులు విఘ్నేశ్వరపూజ, మండపారాధన, పవిత్ర సప్తనదీ జలాల ఆవాహన పునఃపూజలు మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలతో ఆలయ ప్రాకారం చుట్టూ ప్రదక్షణలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. మూలవిరాట్కు ఘటాభిషేకాల అనంతరం అమ్మవారి పంచలోహ విగ్రహాలకు ధర్మకర్తలు, భక్తులు సప్తనదీ జలాలతో అభిషేకించారు. నీరాజన మంత్రపుష్పాల అనంతరం భక్తులకు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంతో తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాలు పూర్తయినట్టు ప్రకటించారు. ధర్మకర్తలు, వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. ముగిసిన ఆషాఢ మాసోత్సవాలు -
ఎస్ఐఎఫ్టీలో ఆక్వా సాగుపై శిక్షణ
కాకినాడ రూరల్: రాష్ట్ర మత్స్య సాంకేతిక సంస్థ (ఎస్ఐఎఫ్టీ)లో ఆక్వా సాగులో ఆరోగ్య నిర్వహణ, జీవ భద్రత ప్రమాణాలు అనే అంశంపై మూడు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించారు. శ్రీకాకుళం, పి.మన్యం, విశాఖపట్నం, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల ఆక్వా రైతులు, హేచరీల ఆపరేటర్లు ఈ శిక్షణలో పాల్గొన్నారు. జీవ భద్రత ప్రాముఖ్యతపై అవగాహన, నీటి నాణ్యత, మైక్రోబయాలజీ, పీసీఆర్ పరీక్షల ప్రత్యక్ష పరిశీలన, చేపలు, రొయ్యల్లో వచ్చే వైరల్, బ్యాక్టిరియల్ వ్యాధుల నివారణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. శిక్షణలో భాగంగా తాళ్లరేవు మండలలోని పాలి కల్చర్, రొయ్యల సాగు క్షేత్రాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. చివరి రోజు బుధవారం శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.అంజలి సర్టిఫికెట్లను అందజేశారు. డాక్టరు సుధాకర్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ రాజ్కుమార్, సప్తగిరి హేచరీస్ జీఎం డాక్టరు మురళీధర్, సైంటిస్ట్ పి.అందే, డాక్టరు వీరాంజనేయులు, రామ్మోహనరావు, ఏడీఎఫ్ శ్రావణికుమారి, ఎఫ్డీఓ రీనా తదితరులు శిక్షణ ఇచ్చారు. వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ప్రభుత్వం వీఆర్ఏలను చిన్నచూపు చూస్తోందని ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘ జిల్లా అధ్యక్షులు నిడమర్తి సురేష్ ఇజ్రాయిల్ మండిపడ్డారు. సంఘ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు బుధవారం కలెక్టరేట్ వద్ద మహా ధర్నా నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ పార్ట్ టైం ఉద్యోగులైన వారిని 24 గంటలూ వినియోగించుకుంటూ జీతాలు మాత్రం పెంచడంలేదన్నారు. అర్హులకు పదోన్నతులు ఇవ్వడం లేదని, అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని, అది జరిగి రెండేళ్లు గడుస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. జిల్లా కార్యదర్శి గెడ్డం చినబాబూజీ, కాకినాడ డివిజన్ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, పెద్దాపురం డివిజన్ అధ్యక్షుడు ఇ.వీరబాబు మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించకుంటే సీఎం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లాలోని అన్ని మండలాల వీఆర్ఏ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. -
ఏలినవారూ.. ఏలేరెక్కడ?
పిఠాపురం: ఒక్క ఎకరం కూడా ఎండనివ్వం.. అన్ని భూములకూ సాగు నీరందిస్తాం.. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకి 1000 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తాం.. అంటూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పిన మాటలు నీటి మూటలే అయ్యాయి. చుక్క నీరు రాక ఏలేరు ఆయకట్టు ప్రాంతం ఎండిపోతోంది. ఆయకట్టులో 9 వేల ఎకరాల్లో నాట్లు పడలేదు. బోరు నీటితో వేసిన నారుమళ్ళు, నాట్లు ఎండిపోతున్నాయి. దీంతో అన్నదాతలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఒకవైపు ఏలేరు, మరోవైపు గోదావరి జలాలను అందిస్తున్నామని అధికారులు, ప్రజాప్రతినిధులు ఆర్భాటంగా ప్రకటనలు చేశారు. నీరున్న కాలువల వద్ద అభిమానులు వారి నాయకుడికి క్షీరాభిషేకాలు చేశారు. తీరా చూస్తే ఈ ప్రాంతానికి ఇస్తామన్న 1000 క్యూసెక్కుల్లో ఇక్కడి చెరువులకు గత 10 రోజులుగా ఒక్క క్యూసెక్కు కూడా రాలేదని రైతులు వాపోతున్నారు. ఎడారిలా కనిపిస్తున్న పంట భూములు పిఠాపురం మండలం పి.దొంతమూరులోని గోపాలరాజు చెరువు, పి.రాయవరం చెరువుల కింద 9 వేల ఎకరాల ఆయకట్టు సందిగ్ధంలో పడింది. దొంతమూరు, వెల్దుర్తి, పి.తిమ్మాపురం, పి.రాయవరం, బి.కొత్తూరు, రాపర్తి, భోగాపురం, బి.ప్రత్తిపాడు తదితర గ్రామాలకు ఈ చెరువుల నుంచే సాగు నీరందుతోంది. వేలాది రైతులు ఇక్కడ పంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పినట్లుగా పురుషోత్తపట్నం ఎత్తిపోతల నుంచి నీరయినా ఇస్తారేమోనని ఎదురు చూసినా, వారి ఆశ నిరాశే అయింది. రోజులు గడుస్తున్నా చెరువుల్లోకి నీరు రాలేదు. కిర్లంపూడి నుంచి వచ్చే నీరు కూడా రావడంలేదు. ఏలేరు, గోదావరి జలాలను వంతులవారీగా ఇస్తున్నామని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రకటించడంతో ఎంతో ఆశతో పంటల సాగుకు సన్నద్ధమయ్యామని, కానీ ఒక్క క్యూసెక్కు కూడా నీరు రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగు నీరు ఆలస్యమైతే ఆకుమడి ముదిరి, నాట్లకు పనికిరాకుండా పోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మా చెరువులోకి నీరు ఎప్పుడు వస్తుందో చెప్పండని రైతులు అధికారులను వేడుకొంటున్నారు. అడుగంటిన పిఠాపురం మండలం రాయవరం చెరువుపిఠాపురం మండలం వెల్దుర్తిలో నీరు లేక ఆరిపోయిన వరి చేలు ఫ డిప్యూటీ సీఎం ఇలాకాలో ఎండుతున్న పొలాలు ఫ పురుషోత్తపట్నం నుంచి వెయ్యి క్యూసెక్కులు ఇస్తామన్న పవన్ ఫ ఒక్క క్యూసెక్కు కూడా రాలేదంటున్న రైతులు ఫ ఏలేరు ఆయకట్టులో 9 వేల ఎకరాలకు సాగునీటి గండం ఫ ఆకుమడి ముదిరితే సాగుకు పనికిరాదంటున్న అన్నదాతలు ఫ ఏలేరు జలాలు ఎటు వెళ్లాయో చెప్పాలంటున్న రైతులు ఇంత దారుణం ఎప్పుడూ చూడలేదు నీటిని విడుదల చేశామని అధికారులు చెబుతున్నారు. కానీ చుక్క నీరు రాలేదు. అడుగుదామంటే ఏ అధికారీ కనిపించరు. చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నాను. ఇలాంటి దారుణ పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. వర్షాలు లేకపోయినా ప్రాజెక్టు నుంచి నీరు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఇస్తున్నామని చెప్పి.. ఆకుమడులు వేసుకోమని.. నీరివ్వడం లేదు. – ఎడ్ల పైడియ్య, రైతు, పి.తిమ్మాపురం, పిఠాపురం మండలం నారుమళ్లు, నాట్లు ఎండిపోతున్నాయి పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకు 1,000 క్యూసెక్కుల నీరు వస్తుందన్నారు. ఉప ముఖ్యమంత్రి ఆదేశాలు అన్నారు. కానీ ఎక్కడా నీరు వచ్చిన ఆనవాళ్లు లేవు. చెరువులు ఎండిపోతున్నాయి. బోర్ల ద్వారా ఆకుమడులు వేసుకుంటే కరెంటు లేక నారుమళ్లు ఎండిపోతున్నాయి. ఆయకట్టు పరిధిలోని చెరువులకు నీరు చేరేలా చర్యలు తీసుకోవాలి. – గుండ్ర బాబ్జి, రైతు, పి.దొంతమూరు, పిఠాపురం మండలం -
వీరంగం కట్టిపెట్టు స్వామీ
అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని ఆలయంలో మెట్ట ప్రాంతానికి చెందిన ఓ ట్రస్ట్బోర్డు సభ్యుడు, మరో సభ్యురాలి వీరంగం స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. వివరాల్లోకి వెళితే గత ఏప్రిల్ 16న ఐవీ రోహిత్ చైర్మన్గా 15 మందితో ఏర్పాటైన ట్రస్ట్ బోర్డుకు తోడు మరో ఆరుగురు సలహాదారులను నియమించారు. ప్రతినెలా వీరు సమావేశమై ఈఓ అందజేసే అజెండాపై చర్చించి తీర్మానాలు చేయాల్సి ఉంటుంది. కాగా ఈ సమావేశాల్లో వారు దేవస్థానానికి సలహాలు ఇవ్వడం తప్ప చర్యలు తీసుకునే పరిస్థితి ఉండదు. కానీ సదరు మెట్ట ప్రాంత సభ్యుడు తానే సర్వాధికారినన్నట్టు వ్యవహరిస్తున్నారు. పురోహితుని క్రమశిక్షణ చర్యల ‘పాక్షిక రద్దు’తో ‘వీర’ంగం మొదలు: దేవస్థానం వ్రత పురోహితునిపై వచ్చిన ఫిర్యాదుల మేరకు గత ఏడాది డిసెంబర్లో, ఆ తరువాత పొరపాట్లు చేసి ఆధారాలతో దొరకిన విషయం తెలిసిందే. అప్పటి ఈఓ గత మార్చిలో అతనికి రెండు ఇంక్రిమెంట్లు కట్చేసి, వ్రతకథ చెప్పకుండా ఉండేలా ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలను ఉపసంహరించేలా సదరు బోర్డు సభ్యుడు, మరో సభ్యురాలు చక్రం తిప్పి ఇతర సభ్యులపై ఒత్తిడి తెచ్చి తీర్మానం చేయించారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో ఆగ్రహం వ్యక్తం చేసి ఆ తీర్మానాన్ని సస్పెండ్ చేశారు. చప్పట్లు కొడితే బాబు.. చిటికేస్తే చినబాబు ఈ వ్యవహారంపైనా సదరు సభ్యుడు నా గురించి ఏమంటుకుంటున్నారు? నేను చప్పట్లు కొడితే బాబు, చిటికేస్తే చినబాబు లైన్లోకి వస్తారు. మీకు చాత కాకపోతే చెప్పండి నేను చూస్కుంటా అంటున్న కబుర్లు విని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇదే మాటలు సాక్షాత్తు దేవదాయ శాఖ కీలక అధికారి వద్ద కూడా ప్రస్తావించడంతో ఆయన సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గత నెలలో దేవస్థానం పర్యటనకు వచ్చిన సదరు అధికారిని బోర్డు సభ్యులు కలసి పరిస్థితిని వివరించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సదరు సభ్యుడు కూడా ఉండి దేవస్థానానికి రెగ్యులర్ ఈఓను వేయండి అని అడిగారు. దీంతో సదరు అధికారి చూద్దాం అనగానే మీ స్థాయిలో కాకపోతే చెప్పండి నేను సీఎంతో మాట్లాడతా అనగానే ఆయన కోపాన్ని నిగ్రహించుకుని నేను మాట్లాడతా అని బదులిచ్చి ఊరుకున్నారు. వ్యాపారులపైనా అదే తంతు దేవస్థానంలోని వ్యాపారాలు సక్రమంగా సాగుతున్నదీ లేనిదీ కేవలం పరిశీలించాల్సి ఉంటుంది. కానీ సదరు ట్రస్ట్ బోర్డు సభ్యుడు, ఆయనకు వత్తాసు పలుకుతున్న సభ్యురాలు ఆయా దుకాణాల వద్దకు వెళ్లి వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వ్యాపారులు సైతం వారి ఆగడాలను అడ్డుకుంటూ వారి పని వారు చూసుకుంటున్నారు. ఆ ఇద్దరు సభ్యుల ప్రవర్తనతో విసిగిపోయిన వ్యాపారులు స్థానిక ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యేను కలసి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన తాను వారిని పిలిపించి మాట్లాడతానని వ్యాపారులకు హామీ ఇచ్చారు. సత్యదేవుని సన్నిధిలో ట్రస్ట్ బోర్డు సభ్యుని ఆగడాలు అన్నింటా తానే అంటూ పెడసరపు వ్యవహారం ఎమ్మెల్యేలకు ఫిర్యాదు చేసిన వ్యాపారులు -
దుమ్ము దులిపారు
గోమాతపులస కాదండిఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పులస చేపలకు ఉన్న డిమాండ్ అందరికీ తెలిసిందే. దీన్ని సొమ్ము చేసుకునేందుకు కొందరు వ్యాపారులు మోసానికి పాల్పడుతున్నారు. ముంబై, ఒడిశా సముద్ర ప్రాంతాలలో లభ్యమయ్యే ఇలస చేపలను కాకినాడ తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. ఇక్కడి నుంచి కొందరు దాన్ని ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లి పులసగా విక్రయిస్తున్నారు. – కాకినాడ రూరల్ అధిక లోడుతో రాకపోకలు సాగిస్తున్న లారీల కారణంగా ఆ దారిలో దుమ్ము విపరీతంగా రేగుతోంది. సమీపంలోని ఇళ్లల్లోకి చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో గొల్లప్రోలు మండలం చందుర్తి గ్రామ శివారు దొడ్ల డెయిరీ వద్ద కేహెచ్ పేటకు చెందిన గ్రామస్తులు గ్రావెల్తో వెళుతున్న సుమారు 20 లారీలను మంగళవారం అడ్డుకున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. – గొల్లప్రోలు (పిఠాపురం రూరల్) సాధారణంగా ఆవులు తమ పిల్లలకు పాలివ్వడం అందరూ చూస్తుంటాం. కానీ ఓ గోమాత తన దూడతో కలిపి నాలుగింటికి పాలు ఇచ్చి, వాటి ఆకలి తీర్చింది. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట కూరగాయల మార్కెట్లో మంగళవారం ఈ దృశ్యం కనిపించింది. అందుకేనేమో ఆవును గోమాత అని తల్లితో పోల్చుతారు. – కాకినాడ రూరల్ -
పిఠాపురంలో పవన్కు ఇవే చివరి ఎన్నికలు
పిఠాపురం: రెండేళ్లుగా నేతన్నలకు పైసా కూడా విదల్చని కూటమి ప్రభుత్వం మూడో ఏట ముచ్చటగా గతంలో కంటే ఒక రూ.వెయ్యి పెంచి నేతన్న సేవ పేరుతో నేత కార్మికులకు ఆర్థిక సహాయం చేయడానికి ఏర్పాట్లు చేసింది. అయితే ఈ పథకంలో లబ్ధిదారుల ఎంపికలో కొందరు చేతివాటానికి పాల్పతున్నారని, భారీగా ముడుపులు చెల్లిస్తేనే అర్హుల జాబితాలో పేరు ఉంటుందన్న చెబుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొందరికి నేతన్న సేవ పథకంలో నిధులు విడుదల కాగా, చాలా మంది నేత కార్మికులకు జమ కాలేదు. దీంతో తమకు ఎందుకు రాలేదని అధికారుల వద్దకు వెళితే అర్హతను బట్టి రేట్లు నిర్ధారించి, ముడుపులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విడుదల కాని జాబితా సాధారణంగా ఏదైనా ప్రభుత్వ పథకం నిధులు విడుదలైనప్పుడు దానికి సంబంధించిన లబ్ధిదారుల జాబితాలను వెంటనే విడుదల చేస్తుంటారు. కానీ నేతన్న సేవ పథకంలో మాత్రం నిధులు విడుదల చేసి రోజులు గడుస్తున్నా అర్హుల జాబితాలను బయటపెట్టక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. చాలామంది నేత కార్మికులు తమకు నేతన్న సేవలో డబ్బులు పడక పోవడంతో చేనేత జౌళి శాఖ అధికారులను సంప్రదిస్తే వెంటనే తమ కార్యాలయానికి రమ్మని వివరాలు నమోదు చేస్తామంటూ పిలుపు వస్తున్నట్లు చెబుతున్నారు. తీరా అక్కడకు వెళ్లాక మగ్గం ఉంటే రూ.3 వేలు, మగ్గం లేకపోతే రూ.5 వేలు వసూలు చేస్తున్నారని, అలా ముడుపులు ఇచ్చిన వారికే వివరాలు నమోదు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్త జాబితా పేరుతో.. పథకం ప్రారంభానికి ముందే అర్హుల జాబితాను తయారు చేసిన అధికారులు ఇప్పుడు కొత్తగా లిస్టులు తయారు చేస్తున్నట్టుగా చూపించి భారీగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చాలామంది నేత పని మానేసి ఇతర వృత్తుల్లో ఉండగా వారందరి పేరున నేతన్న సేవ పథకం ఇప్పించేలా ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారని సమాచారం. అలా వారిని నేత నేస్తున్న వారిగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. దరఖాస్తుల స్వీకరణలోనే దోపిడీకి తెర ఏదైనా ఒక ప్రభుత్వ పథకాన్ని అమలు చేయాలంటే లబ్ధిదారుల అర్హతలకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి. కానీ నేతన్న సేవ పథకానికి మాత్రం ప్రభుత్వం నుంచి ఎటువంటి మార్గదర్శకాలు లేవని అధికారులు చెబుతున్నారు. దీంతో పాత జాబితాలను కొనసాగిస్తారనే ప్రచారం జరుగుతోంది. నేత కార్మిక కుటుంబాలకు ఇచ్చిన ఉచిత విద్యుత్ పథకంలో లబ్ధిదారులకు ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. అదే జరిగితే అద్దె భవనాల్లో ఉన్న వారి పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. దీంతో పాటు ఎటువంటి నేత నేయని వారు కూడా ఉచిత విద్యుత్ పథకంలో ఉండడంతో అనర్హులకు లబ్ధి చేకూరుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారీగా వసూళ్లు ఈ నేపథ్యంలో ఈ నెల 7వ తేదీన పథకం అమలు చేయడంతో కొందరు అధికారులు, పార్టీ నాయకులతో కలిసి వసూళ్లకు తెరలేపారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. మార్గదర్శకాలు లేకపోవడంతో తాము రాసిన వారికి మాత్రమే పథకం వస్తుందని, దానికి తగిన డబ్బులు సమర్పించుకోవాలని కొందరు సిబ్బంది బాహాటంగా చెబుతున్నట్లు సమాచారం. దీంతో ముడుపులుగా ఇచ్చిన రూ.5 వేలు పోయినా మరో రూ.20 వేలు మిగులుతుంది కదా అని అర్హత ఉన్న లబ్ధిదారులు సైతం అధికారులు అడిగిన డబ్బులు ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు. పిఠాపురం: పిఠాపురంలో అనేక ప్రజా సమస్యలు నెలకొని ఉన్నాయని, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజలకు అందుబాటులో లేకుండా ఉన్నారని, ప్రజలు బాధలు వినేవారు లేరని, ఇలాగే కొనసాగితే పవన్ కళ్యాణ్కి ఇవే చివరి ఎన్నికలు అవుతాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తాటిపాక మధు అన్నారు. సీపీఐ కాకినాడ జిల్లా 6వ రోజు పాదయాత్ర పిఠాపురంలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభనుద్దేశించి మధు మాట్లాడుతూ పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ నెగ్గితే తమ జీవితాలు మారిపోతాయని ప్రజలు ఆశించారని, నేడు అదే ప్రజలు ఎందుకు పవన్ కళ్యాణ్ని నెగ్గించుకున్నామా అని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఈ రెండున్నరేళ్ల కాలంలో పవన్ కళ్యాణ్ కేవలం ఐదారుసార్లు మాత్రమే పిఠాపురంలో ఉన్నారని తెలిపారు. మిగతా సమయం అంతా ఇతర ప్రాంతాల్లోనే గడుపుతున్నారని మధు చెప్పారు. పవన్ వల్ల పిఠాపురానికి ఏం లాభం? పేదవాడికి ఒక సెంటు స్థలం ఇవ్వలేదని, కొత్త పెన్షన్లు మంజూరు చేయలేదని, కనీసం కొత్త రేషన్ కార్డులు కూడా ప్రజలకు పంపిణీ చేయలేదని, మరి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉండడం వల్ల పిఠాపురానికి ఏం లాభం అని మధు ప్రశ్నించారు. పిఠాపురం నియోజకవర్గంలో అవినీతి రాజ్యమేలుతోందని, మైనింగ్, ఇసుక, మట్టి మాఫియా దందా రాత్రి సమయాల్లో జరుగుతోందని ఆయన తెలిపారు. ఉప్పాడ కొత్తపల్లిలో మత్స్యకారులకు ఇచ్చిన 100 రోజుల హామీని అమలు చేయడంలో పవన్ కళ్యాణ్ పూర్తిగా విఫలమయ్యారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పాల్గొన్నారు. విచారణ చేస్తాం నేతన్న సేవ పథకానికి డబ్బులు వసూలు చేస్తున్నారన్న ప్రచారంపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తాం. నేత కార్మికులెవ్వరూ ఎవరికి ఎటువంటి లంచాలు ఇవ్వనవసరం లేదు. అర్హత ఉంటే కచ్చితంగా పథకం వర్తిస్తుంది. – సూరిబాబు, జిల్లా చేనేత జౌళి శాఖాధికారి, కాకినాడ ఫ రెండున్నరేళ్లలో ఒక్క ఇంటి స్థలం, రేషన్ కార్డు, కొత్త పెన్షన్ ఇవ్వలేదు ఫ మైనింగ్, ఇసుక మాఫియా రాజ్యమేలుతున్నాయి ఫ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తాటిపాక మధు ఫ లబ్ధిదారుల ఎంపికలో అక్రమార్కుల చేతివాటం ఫ అర్హత ఉంటే రూ.3 వేలు, లేకుంటే రూ. 5 వేల వసూలు? ఫ జాబితా బయటకు రాకుండా జాగ్రత్తలు సహకార సంఘాలు 23,000నేత కార్మికులు కుటుంబాలు 5,000 నేతపై ఉఫాధి పొందుతున్న కార్మికులు 40,000 మగ్గాలు 2,400 -
ఏకగ్రీవంగా నూతన కార్యవర్గం
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (ఏపీఆర్ఎస్ఏ) కాకినాడ జిల్లా కలెక్టరేట్ యూనిట్కు 2026–29 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన అనంతరం ప్రతి పదవికి ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో ఎటువంటి ఉపసంహరణలు లేకుండా కార్యవర్గం ఏర్పాటైంది. ఎన్నికల అధికారిగా అసోసియేషన్ కాకినాడ డివిజన్ అధ్యక్షుడు డి.కృష్ణ, సహాయ ఎన్నికల అధికారిగా అసోసియేషన్ నాయకులు ఆర్.కల్యాణ్ చక్రవర్తి, ఎస్.రామ్ మోహన్ వ్యవహరించారు. అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎం.విజయ్ కుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్గా ఎం.శివరామకృష్ణ, ఉపాధ్యక్షులుగా ఎ.దీపక్ కుమార్, జీపీ రఘుపతిరావు, మహిళాఉపాధ్యక్షురాలుగా ఎన్వీ రమ్య, సెక్రటరీగా ఎం.శివకుమార్ నాయుడు, జాయింట్ సెక్రటరీలుగా ఆర్.సుధా మాధురి, ఎస్.షణ్ముఖ శ్రీనివాస్, రిజర్వ్ జాయింట్ సెక్రటరీగా ముక్కె రామకృష్ణ, కోశాధికారిగా కె. సతీష్ నాయుడు ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గాన్ని ఏపీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్షుడు పితాని త్రినాథరావు, సహాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, రమేష్, జగ్గంపేట తహసీల్దార్ ఎం.పార్థసారథి అభినందించారు. -
అవినీతిపై సమగ్ర విచారణ జరపాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): నేతన్నల సేవ పథకం అమలులో జిల్లా చేనేత శాఖ అధికారుల అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కులాల సమాఖ్య కన్వీనర్ పంపన రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ హరేంధిర ప్రసాద్కు వినతి పత్రం సమర్పించారు. తుని నియోజకవర్గంలోని తుని, తొండంగి, కోటనందూరు మండలాలకు చెందిన చేనేత కళాకారులు పాల్గొన్నారు. కేవలం కాకినాడ జిల్లాకే పరిమితం కాకుండా, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా పథకం అమలులో లబ్ధిదారుల ఎంపిక, గుర్తింపు విషయంలో అక్రమాలు జరిగినట్లు చేనేత కళాకారులు తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. వీటిపై సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, తప్పిదాలకు పాల్పడినట్లు నిర్ధారణ అయితే సంబంధిత ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. చేనేత కార్మికులను బెదిరించి , ఇతర మార్గాల్లో వసూలు చేసిన మొత్తాలను తిరిగి ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. -
ఇంజినీరింగ్లో ఎనర్జీ రంగాలకు ప్రాధాన్యం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంజినీరింగ్లో సస్టెనబులిటీ, రెన్యూవబుల్ ఎనర్జీ, గ్రీన్ టెక్నాలజీస్, ఎనర్జీ స్టోరేజ్ వంటి రంగాలకు భవిష్యత్తులో అత్యంత ప్రాధాన్యత ఉంటుందని జేఎన్టీయూకే వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్ అన్నారు. జేఎన్టీయూకే వర్సిటీ కాకినాడ, గ్రీన్కో, గ్రీన్కో స్కూల్ ఆఫ్ సస్టెనబులిటీ, ఐఐటీ హైదరాబాద్ మధ్య పరిశ్రమల అనుసంధానానికి మంగళవారం ఎంఓయూ కుదిరింది. ఈ సందర్భంగా వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్, కో ఆర్డినేటర్, మాజీ వీసీ ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాదరాజు, గ్రీన్కో ప్రతినిధి పరవస్తు రాంబాబు, ఐఐటీ హెచ్ ప్రొఫెర్ సీహెచ్ సుబ్రహ్మణ్యం ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. వీసీ ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులను కేవలం ఉద్యోగాలకు సిద్ధం చేయడమే కాకుండా దేశ సుస్థిర అభివృద్ధికి అవసరమైన పరిశోధకులు, సాంకేతిక నిపుణులు, భవిష్యత్తు నాయకులుగా తీర్చిదిద్దడమే జేఎన్టీయూకే లక్ష్యమన్నారు. గ్రీన్కో వంటి ప్రతిష్టాత్మక సంస్థలతో ఒప్పందాల ద్వారా పరిశోధన అవకాశాలు వస్తాయన్నారు. కో ఆర్డినేటర్ డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు మాట్లాడుతూ గ్రీన్కో తరఫున ప్రతి ఏడాది పది మంది ఎంటెక్ విద్యార్థులకు నెలకు రూ.10 వేల చొప్పున రెండేళ్ల పాటు అందిస్తారని, అలాగే ఇద్దరు పీహెచ్డీ విద్యార్థులకు నెలకు రూ.40 వేల చొప్పున నాలుగేళ్లపాటు డాక్టోరల్ పెలోషిప్లు అందిస్తారన్నారు. ఐఐటీ హెచ్ ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గ్రీన్కో భాగస్వామ్యం ద్వారా సుస్థిర ఇంజినీరింగ్ విద్య, పరిశోధన మరింత బలోపేతం అవుతుందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆర్.శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ పద్మరాజు, మాజీ వీసీ మురళీకృష్ణ, శ్రీనివాసరావు, వెంకటరెడ్డి, కృష్ణ ప్రసాద్, బీటీ కృష్ణ, ప్రొఫెసర్ నరేష్ పాల్గొన్నారు. -
వరినాట్లతో నిరసన
కరప: గ్రామంలోని మెరక వీధిలో వేణుగోపాలస్వామి ఆలయానికి వెళ్లే రోడ్డును ఆధునీకరించి, సీసీ రోడ్డుగా నిర్మించాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. దీంతో స్థానికులందరూ మంగళవారం వినూత్న రీతిలో ఈ రోడ్డుపై వరినాట్లు వేసి నిరసన తెలిపారు. ఆ దారిలో రెండు సీసీ రోడ్ల మధ్య సుమారు 30 మీటర్లను నిర్లక్ష్యంగా వదిలేశారు. ఇదే గ్రామంలో పలుచోట్ల పాత సీసీ రోడ్లపైనే మళ్లీ కొత్తగా నిర్మాణాలు చేస్తున్నారు. కానీ ఈ చిన్న ముక్కను మాత్రం వదిలేశారు. కొద్దిపాటి వర్షానికే అక్కడి నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నేడు తలుపులమ్మకు సహస్ర ఘటాభిషేకం తుని రూరల్: తలుపులమ్మ ఆషాఢ మాసోత్సవాలు ముగింపు దశకు చేరుకోవడంతో బుధవారం సహస్ర ఘటాభిషేకం నిర్వహించేందుకు వేద పండితులు, ప్రధాన అర్చకులు ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా మంగళవారం పంచలోహ విగ్రహాల ప్రాంగణంలో శాస్త్రోక్తంగా విఘ్నేశ్వర పూజ నిర్వహించి, కలశాలలో సప్తనదీ జలాల ఆవాహనం చేశారు. జూలై 15న లోవ దేవస్థానంలో ప్రారంభమైన అమ్మవారి ఆషాఢ మాసోత్సవాలు అమా వాస్య, బుధవారం సహస్ర ఘటాభిషేకంతో ముగుస్తాయని డిప్యూటీ కమిషనర్ పి.విశ్వనాథరాజు, చైర్మన్ పెంటకోట భాస్కర సత్యనారాయణ తెలిపారు. స్వాతంత్య్ర వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): స్వాతంత్య్ర సమరయోధుల పోరాటం, వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రజల్లో స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించేలా జిల్లా అంతటా ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలని అధికారులను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. ఆ ఏర్పాట్లతో పాటు హర్ ఘర్ తిరంగా కార్యక్రమ నిర్వహణపై అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులతో కలెక్టరేట్లో మంగళవారం జేసీ అపూర్వ భరత్తో కలిసి సమావేశం నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు ప్రణాళిక ప్రకారం పనిచేసి, నిర్ణీత సమయానికే ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. కలుషిత పదార్థాల తొలగింపునకు చర్యలు తొండంగి మండలం చిన్నయపాలెం వద్ద పోలవరం ఎడమ కాలువలో గుర్తుతెలియని వ్యక్తులు వేసిన కలుషిత పదార్థాలను తొలగించేందుకు లైమ్ (సున్నం)ను ఉపయోగించాలని జలవనరులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆయన కలెక్టరేట్ నుంచి వారితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆగస్టు 14 నుంచి పోలవరం ఎడమ కాలువ ద్వారా సాగు, తాగు నీటిని విడుదల చేయాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల ఆ తేదీని మరో 10 రోజులు పొడిగించడం జరిగిందన్నారు. ఈ లోపు కాలువలోని కలుషిత నీటిని శుద్ధి చేసేందుకు లైమ్ రసాయనాన్ని పిచికారీ చేయాలని ఆదేశించారు. పిచికారీ చేసిన రెండు రోజుల అనంతరం నీటి నాణ్యతను పరీక్షించి, నీరు శుద్ధి అయిందో లేదో పరిశీలించాలనిసూచించారు. శుద్ధి కాని పక్షంలో ఆ మురుగు నీటిని మోటార్ల ద్వారా పంపింగ్ చేసికాలువను సంపూర్ణంగా శుద్ధి చేయాలని స్పష్టం చేశారు. -
రేపటి నుంచి సత్యదేవుని జయంత్యుత్సవాలు
అన్నవరం: వీర వేంకట సత్యనారాయణస్వామివారి జయంత్యుత్సవాలకు దేవస్థానం ముస్తాబైంది. గురువారం నుంచి రెండు రోజుల పాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. తొలిరోజు ఉదయం 8.30 గంటలకు ఆలయంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం తదితర కార్యక్రమాలతో వేడుకలు మొదలవుతాయి. ఈసారి సత్యదేవుని జన్మ నక్షత్రం ‘మఖ’ కూడా స్వామివారి జయంత్యుత్సవం నాడు రావడం విశేషం. శుక్రవారం తెల్లవారుజామున సత్యదేవుడు, అమ్మవార్లకు, శివలింగానికి పంచామృతాలతో మహాన్యాశపూర్వక అభిషేకం నిర్వహిస్తారు. ఉదయం ఏడు గంటల నుంచి 11 గంటల వరకు జపతపాలు, పారాయణలు, మూల మంత్రజపాలు నిర్వహిస్తారు. సత్యదేవుని జయంత్యోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం 20 మంది పండితులను ఘనంగా సత్కరించనున్నారు. కాగా.. స్వామివారి ఆలయం, రాజగోపురాలు, రామాలయం, ఆలయ ప్రాంగణాన్ని రంగు రంగుల విద్యుద్దీపాలు, పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు. రత్నగిరిపై తూర్పు, పశ్చి మ రాజగోపురాలు రంగురంగుల విద్యుత్ దీపాల తో శోభాయమానంగా ప్రకాశిస్తున్నాయి. -
నోటీసులకు బెదరకుండా..
పెనుగుదురులో వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి కన్నబాబుకాకినాడ రూరల్ నియోజవర్గ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో డీఎస్సీ అక్రమాలపై సోమవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వేల మంది ద్విచక్ర వాహనాలతో కాకినాడ రూరల్ మండలం తూరంగిలోని డి మార్ట్ సెంటర్కు చేరుకున్నారు. అయితే ర్యాలీకి అనుమతి లేదని, ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు బెదిరింపులకు దిగారు. అంతకు ముందు కన్నబాబుకు నోటీసులు అందజేశారు. పోలీసుల నుంచి ఆయన తప్పించుకుని డి మార్ట్ వద్దకు చేరుకున్నారు. అక్కడ కొంతసేపు పోలీసులతో వాగ్వాదం జరిగింది. అనంతరం బైక్ ర్యాలీ ప్రారంభించారు. తూరంగి, నడకుదురు, పెనుగుదురు గ్రామాల మీదుగా కరపలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రడ్డి విగ్రహం వరకు ఏడు కిలోమీటర్ల మేర బైక్ ర్యాలీ సాగింది. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని, నిరు ద్యోగ భృతి చెల్లించాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలంటూ నినాదాలు చేశారు. కన్నబాబు మాట్లాడుతూ స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల్లో అంతులేని అవినీతికి పాల్పడ్డారన్నారు. -
14న ప్రత్తిపాడులో జాబ్ మేళా
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): వికాస ఆధ్వర్యంలో ఈ నెల 14న ప్రత్తిపాడులో మెగా జాబ్మేళా నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. జాబ్మేళా పోస్టర్ను సోమవారం ఆయన ఆవిష్కరించారు. వికాస సంస్థ పీడీ లచ్చారావు మాట్లాడుతూ 35 కంపెనీలు మేళాకు వస్తున్నాయని, సుమారు 1,550 ఉద్యోగాలను భర్తీ చేస్తాయని తెలిపారు. సత్యగిరి సర్వే ప్రారంభం అన్నవరం: వీర వేంకట సత్యనారాయణస్వామి దేవస్థానానికి చెందిన సత్యగిరి సర్వే పనులు సోమవారం మధ్యాహ్నం ప్రారంభమయ్యాయి. తొండంగి మండల సర్వేయర్ సత్యనారాయణ సూచనల మేరకు బెండపూడి సర్వేయర్ మల్లేశ్వరరావు రోవర్ మెషీన్ సాయంతో సర్వే చేశారు. దేవస్థానం ఈఈ వి.రామకృష్ణ, ఏఈఓలు అనకాపల్లి ప్రసాద్, విశ్రాంత ఆర్ఐ ప్రసాద్ ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత పంపా ఘాట్ల నుంచి సర్వే ప్రారంభించారు. కొంత దూరం ముందుకు వెళ్లి వెనక్కి వచ్చి సర్వే చేశారు. తొలి రోజు 25 ఎకరాలను సర్వే చేశామని, నాలుగు రోజుల్లో మొత్తం పూర్తవుతుందని అధికారులు తెలిపారు. సర్వే చేసిన ప్రాంతంలో సరిహద్దులు గుర్తించి రాళ్లు పాతారు. కాగా.. పోడు వ్యవసాయం పేరుతో గత వారం సత్యగిరిని ఆక్రమించేందుకు జరిగిన ప్రయత్నాలపై సాక్షి పత్రికలో వచ్చిన వార్తా కథనాలపై అధికారులు స్పందించి ఈ చర్యలు చేపట్టారు. టీడీపీ నేతల నిర్వాకం.. నిలిచిన దర్శనాలు ఆత్రేయపురం: టీడీపీ నేతల నిర్వాకం పుణ్యమా అని భక్తులకు శివయ్య దర్శనాలు నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. వివరాలివీ.. ఆత్రేయపురంలో 3 శతాబ్దాలకు పూర్వం నుంచి శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత రాజరాజేశ్వర స్వామి (శివాలయం) ఉంది. ఇక్కడ శివయ్యకు అత్రి మహర్షి సైతం పూజలు చేశారని పెద్దలు చెబుతారు. ఇంతటి ఖ్యాతికెక్కిన ఈ ఆలయాన్ని పునర్నిర్మించే పేరుతో ఇక్కడి అర్చకుల ఇళ్లను టీడీపీ నేతలు మూడు నెలల కిందట దౌర్జన్యంగా కూల్చివేశారు. ఆ సందర్భంగా అర్చకులపై దౌర్జన్యానికి సైతం పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఇక్కడ విధులు నిర్వహించడానికి అర్చకులు నిరాకరించారు. దీంతో, టీడీపీ నేతలు, ఆలయ కమిటీ ప్రతినిధులు కొంతకాలం విధులు నిర్వహించాలని ప్రధానార్చకుడు పుల్లేటికుర్తి భాస్కరశర్మను కోరారు. దీనికి ఆయన మూడు నెలలు మాత్రమే గడువు ఇచ్చారు. ఆ గడువు పూర్తి కాగా, ఇప్పటి వరకూ వేరే అర్చకుడిని నియమించలేదు. ఈ నేపథ్యంలో ఆలయంలో సోమవారం నుంచి దర్శనాలు, అభిషేకాలు నిలిపివేసినట్లు భాస్కరశర్మ తెలిపారు. ఇక్కడ శివకేశవుల ఆలయాల పునర్నిర్మాణానికి భక్తులు రూ.1.50 కోట్ల వరకూ విరాళాలు అందించారు. ఇంతవరకూ నిర్మాణ పనులు ముందుకు సాగకపోవడంపై దాతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రియాంక హంతకులను కఠినంగా శిక్షించాలి రాజమహేంద్రవరం సిటీ: నగరంలో పీజీ వైద్య విద్యార్థిని ప్రియాంకను కారుతో ఢీకొట్టి అత్యంత దారుణంగా హతమార్చిన వారిని కఠినంగా శిక్షించాలని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ మహిళా విభాగం, ఏపీ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ప్రియాంకకు ఆత్మశాంతి కలగాలని కోరుతూ, ఆమె కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ స్థానిక ఏపీ ఎన్జీవో హోమ్ నుంచి గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం వరకూ సోమవారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ జిల్లా చైర్మన్ మీసాల మాధవరావు మాట్లాడుతూ ప్రియాంక మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. -
లెక్కల్లో ఫుల్.. కేంద్రాల్లో డల్
తుని: చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ అధ్వానంగా ఉందని, పర్యవేక్షణ అధికారులు ఏమి చేస్తున్నారంటూ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డులను సక్రమంగా నిర్వహించని ఇద్దరు అంగన్వాడీ వర్కర్లను తొలగించాలని ఆదేశించారు. వివరాల్లోకి వెళితే. తుని పట్టణం గవరపేటలోని రెండు అంగన్వాడీ కేంద్రాలను సోమవారం ఫుడ్ కమిషనర్ చైర్మన్ ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడి రికార్డులను పరిశీలించగా పిల్లల హాజరు ఫుల్గా ఉంది. కానీ కేంద్రాల్లో మాత్రం పూర్తిస్థాయిలో కనిపించలేదు. అలాగే రికార్డుల్లో ఇతర సరుకుల వివరాలు కూడా సక్రమంగా లేనట్టు గుర్తించారు. ఆ ఇద్దరు అంగన్వాడీ వర్కర్లను విధుల నుంచి తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఇదే పరిస్థితులు మిగిలిన కేంద్రాల్లోనూ ఉంటే తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులతో మాట్లాడి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ, బీసీ వసతి గృహాలకు సంబంధించిన బాలికలు కిచిడీ బాగోలేదని తెలిపగా, వెజ్ బిర్యానీ పెట్టాలని ఆదేశించారు. వీరవరపుపేట ఎస్సీ వసతి గృహం శిథిలావస్థకు చేరిందని, భయంగా గడుపుతున్నామని బాలికలు చెప్పారు. ఆ భవనానికి సంబంధించి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఐసీడీఎస్, సివిల్ సప్లయిస్ అధికారులు పాల్గొన్నారు. ఫ అంగన్వాడీల్లో పిల్లల హాజరులో అవకతవకలు ఫ గుర్తించిన రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి ఫ ఇద్దరు వర్కర్ల తొలగింపునకు ఆదేశం -
మామ అఽధికారం.. మేనల్లుడి పెత్తనం!
కాకినాడ రూరల్: మామ అధికారాన్ని అడ్డం పెట్టుకుని మేనల్లుడు పెత్తనం సాగించాలని చూస్తున్నాడు. ఇతడి చర్యలతో ప్రజలు విస్తుపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. కాకినాడ, పరిసర ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతుండడంతో ఖాళీ స్థలాలకు అమాంతం విలువ పెరిగిపోయింది. ఇదే అదనుగా కొందరు తప్పుడు డాక్యుమెంట్లు పుట్టించి స్థల యజమానులకు చుక్కలు చూపిస్తున్నారు. అధికార అండతో వ్యవస్థఽలను తమ గుప్పెట్లో పెట్టుకుని బాధితులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కాకినాడ నగరంలో విలీన ప్రతిపాదిత వాకలపూడిలో ప్రస్తుతం నెలకొన్న స్థల వివాదం మత్స్యకారుల్లో ఆగ్రహానికి కారణమయింది. గ్రామంలో కోరమాండల్ కమ్యూనిటీ హాలు ఎదురుగా ఉన్న స్థలంలో ఆరు ప్లాట్లల్లో రెండు ప్లాట్లపై వివాదం తలెత్తింది. ఆరు సైట్లకు సంబంధించి గ్రామానికి చెందిన మత్స్యకార సహకార సంఘం మాజీ అధ్యక్షుడు, జనసేన నాయకుడు చింతకాయల శ్రీను ఆయన భార్య రాణి, కుటుంబ సభ్యులు ఎరిపల్లి జయమణి, కోనాడ బేబి పేరిట ఉండడంతో వారి ఆధీనంలో స్థలాలు ఉన్నాయి. వీటిలో రెండు సైట్లు తమ కుటుంబ సభ్యులకు చెందినవిగా రెడ్డి నాయుడు అనే వ్యక్తి కొందరు వ్యక్తులను తీసుకువచ్చి ఇటీవల గోడలు పెట్టించే ప్రయత్నించడం వివాదానికి దారి తీసింది. తమ స్థలంలో గోడలు పెట్టడమేంటని శ్రీను, ఆయన కుటుబ సభ్యులు నిలదీయగా తమ కుటుంబ సభ్యుల పేరిట డాక్యుమెంట్లు ఉన్నాయని రెడ్డి నాయుడు గోడలు పెట్టే కార్యక్రమాన్ని కొనసాగించే ప్రయత్నం చేశారు. మరుసటి రోజు సర్పవరం పోలీసులు కలగజేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే మేనల్లుడి అండతోనే.. జనసేన నాయకుడు, బాధితుడు చింతకాయల శ్రీను మాట్లాడుతూ పార్టీ కోసం కష్టించి పనిచేశామని, ఈరోజు తమకే దిక్కు లేకుండా పోయిందన్నారు. జనసేన నాయకులే తమ స్థలాలపై గుండాలతో గోడలు పెట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కోర్టులో వివాదం కొనసాగుతుండగా ఎమ్మెల్యే మేనల్లుడు తూము కృష్ణచైతన్య (బన్ను) తమపై అధికార బలం ఉపయోగించి పోలీసులను లాఠీలతో బెదిరింపు చర్యలకు దింపారని, గుండాలను తీసుకువచ్చి గోడలు పెట్టించే ప్రయత్నం చేశారన్నారు. దీనిపై సీసీ ఫుటేజీలను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. తాము ఓట్లు వేస్తేనే గెలిచామా అని తమ కులాన్ని ఎమ్మెల్యే మేనల్లుడు అవమాన పరిచారని తెలిసిందన్నారు. స్థల వివాదంపై ఎమ్మెల్యేను కలిసే ప్రయత్నం చేసినా ఆయన స్పందించలేదన్నారు. తమపై పోలీసులతో లాఠీచార్జి చేయించారని ఆరోపించారు. పవన్కల్యాణ్ కలగజేసుకుని న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. బాధిత స్థల యజమాని కోనాడ బేబి మాట్లాడుతూ తనకు చెందిన స్థలం కబ్జా చేసేందుకు ఎమ్మెల్యే మేనల్లుడి అండతో ప్రయత్నం చేశారని ఆరోపించారు. వాడబలిజ సంఘం ఆగ్రహం వాడోళ్లు ఏమి చేస్తారులే అని తమ కులాన్ని ఎమ్మెల్యే మేనల్లుడు బన్ను అవమానించినట్టు తమ దృష్టికి వచ్చిందని, వాడోల్ల ఓట్లు కావాలా అని వాడబలిజ సంఘ నాయకులు గంపల చిన్నబ్బాయి అనే శివరావు, శీకోటి సింహాద్రి, గొల్లపల్లి పెద్ద అప్పారావు, పిరాధి అప్పారావు, తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సంఘాన్ని అవమాన పరిచారని ఓడబలిజ సంఘానికి చెందిన మత్స్యకారులు సోమవారం వాకలపూడిలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. తమ కులానికి చెందిన చింతకాయల శ్రీను జనసేన కోసం ఎంతో కష్టపడితే ఇప్పుడు ఆయన స్థలాన్నే కబ్జా చేయాలని చూస్తున్నారని దీనిపై జనసేన పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకువెళతామన్నారు. ఎమ్మెల్యే మేనల్లుడు తమను అవమానిస్తే సహించేది లేదన్నారు. ఇదే తీరు కొనసాగిస్తే మత్స్యకారులంతా సంఘటితమవుతామన్నారు. తమ బంధువులకూ రెండు సైట్లు ఇదిలా ఉండగా స్థల వివాదానికి సంబంధించి మరో వర్గానికి చెందిన రెడ్డి నాయుడు మీడియాతో మాట్లాడుతూ తమ బంధువుల పేరిట రెండు సైట్లు ఉండడంతో వాటికి గోడలు పెట్టే ప్రయత్నం చేశామని తాము ఎవరి సహాయం తీసుకోలేదని చెప్పారు. సివిల్ వివాదాల్లో తలదూర్చడంతో విమర్శల వెల్లువ వాకలపూడిలో తిరగబడిన మత్స్యకారులు తమ కులాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఎమ్మెల్యే మేనల్లుడిపై ఆగ్రహం జనసేన పార్టీకి పనిచేసిన తనకే దిక్కు లేదని మత్స్య సహకార సంఘ మాజీ అధ్యక్షుడి ఆవేదన -
మెగా దగాపై మహోద్యమం
తునిలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, పార్టీ శ్రేణులుడీఎస్సీలో జరిగిన అక్రమాలను నిరసిస్తూ, నిరుద్యోగులకు అండగా వైఎస్సార్ సీపీ చేపట్టిన ర్యాలీ విజయవంతమైంది. చంద్రబాబు ప్రభుత్వ తీరును ఖండిస్తూ చేపట్టిన ఈ కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ శ్రేణులతో పాటు యువత, నిరుద్యోగులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ర్యాలీకి అనుమతులు లేవంటూ ప్రభుత్వం ఆంక్షలు విధించినా, వాటిని దాటుకుని కదం తొక్కారు. అక్రమాలపై గర్జిస్తూ, అర్హులకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. మెగా డీఎస్సీ పేరుతో కూటమి చేసిన దగాపై ఉద్యమించారు.సాక్షి ప్రతినిధి, కాకినాడ: డీఎస్సీలో అక్రమాలపై ఉద్యమిస్తున్న వైఎస్సార్ సీపీ శ్రేణులు, యువత, అభ్యర్థులకు కూటమి ప్రభుత్వ నేతృత్వంలోని పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. ఉద్యమాన్ని అణచివేసేందుకు కుయుక్తులు పన్నారు. ర్యాలీలో పాల్గొన వద్దంటూ ముందస్తుగా నోటీసులు ఇచ్చి బెదిరింపులకు గురి చేశారు. వాటన్నింటినీ లెక్క చేయని వైఎస్సార్ సీపీ శ్రేణులు ఉద్యమ కెరటాలై ఉద్యమించారు. చంద్రబాబు ప్రభుత్వ పిరికిపంద చర్యను వ్యతిరేకించారు. భారీ బైక్ ర్యాలీలతో ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టించారు. ప్లకార్డులు చేతపట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డీఎస్సీ అక్రమాలకు మంత్రి నారా లోకేశ్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని పట్టుబట్టారు. నిర్వహణపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఫ డీఎస్సీ అక్రమాలపై కదం తొక్కిన వైఎస్సార్ సీపీ ఫ బాధితులకు అండగా జిల్లాలో ర్యాలీలు ఫ తరలివచ్చిన బాధితులు, యువత ఫ అణచి వేసేందుకు పోలీసుల కుయుక్తులు ఫ ర్యాలీలో పాల్గొనవద్దంటూ నోటీసులు ఫ లెక్కచేయకుండా ముందుకు సాగిన పార్టీ శ్రేణులు, యువత -
జగ్గంపేట
దగా డీఎస్సీ చంద్రబాబు ప్రభుత్వం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్వహించింది దగా డీఎస్సీ అని మాజీ మంత్రి, జగ్గంపేట నియోజకవర్గ ఇన్చార్జి తోట నరసింహం అన్నారు. జగ్గంపేటలో ఆయన ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి పురవీధుల మీదుగా మెయిన్ రోడ్డు వరకు సాగిన ర్యాలీలో వైఎస్సార్ సీపీ శ్రేణులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బైక్ ర్యాలీతో హోరెత్తించారు. తోట నరసింహం మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేస్తోందన్నారు. డీఎస్సీలో అనర్హులకు ఉద్యోగాలను కట్టబెట్టి, అర్హులకు అన్యాయం చేసిందన్నారు. ఈ అక్రమాలకు మంత్రి లోకేశ్ నైతిక బాధ్యత వహించి, రాజీనామా చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఒమ్మి రఘురాం, నాయకులు పాల్గొన్నారు. జగ్గంపేటలో మాట్లాడుతున్న కో ఆర్డినేటర్, మాజీ మంత్రి తోట నరసింహం -
వివాహ మండపాల వేలం ఖరారు
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో వివాహాలు చేసుకునేందుకు గాను వివిధ రకాల గుమ్మటా లు (మండపాలు) వేసే లైసెన్సుకు గాను సోమవారం నిర్వహించిన టెండర్ కం బహిరంగ వేలంలో రెండేళ్ల కాలపరిమితికి నెలకు రూ.15.05 లక్షలకు హెచ్చు టెండర్ దాఖలైంది. గతంలో ఈ వివాహ మండపాల లైసెన్స్ నెలకు రూ.6.60 లక్షలు మాత్రమే. ఈ ఏడాది రూ.15.05 లక్షలకు ఖరారవడంతో నెలకు దాదాపుగా రూ.8.45 లక్షలు పెరిగింది. అంటే ఏడాదికి సుమారు రూ.కోటి ఆదాయం అదనంగా పెరిగిందని అధికారులు తెలిపారు. ఇది ఒక ఏడాదికి మాత్రమే. రెండో ఏడాది దీనిపై పది శాతం అధికం చెల్లించాలి. దీనికి జీఎస్టీ అధికం. ఈఓ నల్లం సూర్యచక్రధరరావు సమక్షంలో ఈ వేలం నిర్వహించారు. ఇతర షాపుల వేలం పరిశీలిస్తే.. కొబ్బరి కాయలు, అరటిపళ్లు, పూజా ద్రవ్యాల షాపునకు రెండేళ్లకు గాను నెలకు రూ.4.03 లక్షలకు వేలం ఖరారైంది. షాపు నెం.3లో కొబ్బరికాయలు, అరటిపళ్లు, పూజాద్రవ్యాలు విక్రయించేందుకు రెండేళ్ల కాలపరిమితికి నెలకు రూ.4.03 లక్షలకు ఖరారైంది. సత్యగిరిపై క్యాంటీన్ నిర్వహణ టెండర్ నెలకు రూ.7.90 లక్షలకు ఖరారవగా.. గతం కంటే ఇది రూ.1.03 లక్షలు అధికం. నాలుగో నంబర్ షాపునకు నెలకు రూ.45,999కు వేలం ఖరారైంది. ఐదో నంబర్ షాపునకు రూ. 27,999తో సింగిల్ టెండర్, వివాహ మండపాలకు గతం కంటే అతి తక్కువగా రూ.3 లక్షలకు సింగిల్ టెండర్ వేయడంతో వాటిపై నిర్ణయం వాయిదా వేశారు. -
రాష్ట్ర స్థాయి టెన్నిస్బాల్ క్రికెట్ చాంపియన్గా ‘తూర్పు’
దేవరపల్లి: ప్రకాశం జిల్లా బాపట్ల కాజీపాలెంలో ఆదివారం జరిగిన అండర్–17 బాలికల విభాగం రాష్ట్రస్థాయి టెన్నిస్బాల్ క్రికెట్ పోటీల్లో తూర్పుగోదావరి బాలికల జట్టు చాంపియన్గా నిలిచింది. ఎనిమిది సంవత్సరాల తర్వాత మళ్లీ జిల్లాకు చాంపియన్ షిప్ దక్కిందని టెన్నిస్బాల్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శులు తంగెళ్ల మునేశ్వరరావు, చెల్లయమ్మ సోమవారం తెలిపారు. జట్టులో చిక్కాల, చిన్నాయగూడెం, గోపాలపురం జెడ్పీ హైస్కూలు విద్యార్థులున్నారని మునేశ్వరరావు తెలిపారు. జిల్లా జట్టు ప్రథమస్థానంలో నిలవడానికి పీడీలు కేవీవీ సత్యనారాయణ, డి.అశోక్, టి.గంగాధరరావు కృషి చేసినట్టు ఆయన తెలిపారు. జిల్లా జట్టులో మండలంలోని చిన్నాయగూడెం జెడ్పీ హైస్కూలు విద్యార్థులు ముగ్గురు పాల్గొని ప్రతిభ చూపినట్టు పీడీ కేవీవీ సత్యనారాయణ తెలిపారు. జట్టులో పి.సిరి చందన, ఎం.కీర్తన ఆడినట్టు ఆయన తెలిపారు. విద్యార్థులను హెచ్ఎం లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు అభినందించారు. -
ఐదో రోజుకు చేరిన రిలే దీక్షలు
రాజానగరం: తమకు ఉద్యోగ భద్రత కల్పించే వరకు దీక్షలను విరమించేది లేదని సోమవారం ఆదికవి నన్నయ యూనివర్సిటీ నాన్ టీచింగ్ (ఔట్సోర్సింగ్) సిబ్బంది స్పష్టం చేశారు. యూనివర్సిటీ ముఖద్వారం వద్ద వారు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఐదో రోజుకు చేరుకున్నాయి. ఈ క్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి, రాజమహేంద్రవరం ఆర్డీఓ శివరాముడు, రాజానగరం తహసీల్దార్ దివ్యభారతి, డీఎస్పీ జీవన సోమవారం దీక్ష శిబిరాన్ని సందర్శించారు. దీక్షలను విరమింపజేసేందుకు వారితో జరిపిన చర్చలు సఫలీకృతం కాలేదు. ఈ సమయంలో దీక్షాపరులు తమ సమస్యలను అధికారులకు వివరించారు. 20 ఏళ్ల నుంచి తాము చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్నామని, ఈ సమయంలో కాంట్రాక్టు పద్ధతిలో కొత్తవారిని నియమించే విధంగా టెండర్ నోటీసు జారీ చేయడం బాధాకరమన్నారు. తక్షణమే టెండర్ నోటీసును వెనక్కి తీసుకుని, తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు ఈ దీక్షలను విరమించేది లేదన్నారు. చర్చల్లో నాన్ టీచింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగారపు విజయబాబు, జనరల్ సెక్రటరీ వై.వీరభద్రచౌదరి, తదితరులు పాల్గొన్నారు. ఉన్నతాధికారులతో చర్చలు విఫలం -
పెద్దాపురం
సీబీఐ విచారణ చేపట్టాలి డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలని వైఎస్సార్ సీపీ కాకినాడ సిటీ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి డిమాండ్ చేశారు. డీఎస్సీలో అక్రమాలను నిరసిస్తూ స్థానిక ఆనంద భారతి గ్రౌండ్స్ నుంచి వైఎస్సార్ ఫ్లైఓవర్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ డీఎస్సీలో అక్రమాలు జరగలేదని చెబుతున్న ప్రభుత్వం సీబీఐ విచారణకు ఎందుకు వెనకాడుతోందని ప్రశ్నించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా విభజన విభాగం అధ్యక్షుడు రాగిరెడ్డి అరుణ్ కుమార్, పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర శివ ప్రసన్న, కుడా మాజీ చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, అధిక సంఖ్యలో యువజన విభాగం నాయకులు పాల్గొన్నారు. మండుటెండలో కదం తొక్కి.. డీఎస్సీలో అర్హులకు న్యాయం జరిగే వరకూ ఉద్యమం ఆగదని వైఎస్సార్ సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జి మాజీ ఎంపీ వంగా గీత అన్నారు. పిఠాపురం పార్టీ కార్యాలయం నుంచి పాదయాత్రగా బయలుదేరిన వైఎస్సార్ సీపీ శ్రేణులు రాజుగారికోట నుంచి ఉప్పాడ సెంటర్కు చేరుకున్నారు. అక్కడి నుంచి అంబేడ్కర్ సెంటర్కు చేరుకుని ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. వంగా గీత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో అక్రమాలు అక్రమాలు చోటు చేసుకున్నాయన్నారు. దీనిపై సీబీఐ విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు. మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలి డీఎస్సీ అక్రమాలపై పెద్దాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవలూరి దొరబాబు ఆధ్వర్యంలో మెహర్ కాంప్లెక్స్ నుంచి స్థానిక రైల్వే స్టేషన్లో సెంటర్ ర్యాలీ వరకు సాగింది. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఒక్కసారిగా వేల మంది తరలిరావడంతో మిన్నకుండిపోయారు. ఈ సందర్భంగా నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన సాగింది. స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో యువతను ఉద్దేశించి దొరబాబు, నియోజకవర్గ పరిశీలకుడు నక్క నగేష్ మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం యువతను మోసం చేసిందని, వారికి అండగా ఉండేందుకు పోరాటం చేస్తున్నామన్నారు. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని, విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాకినాడ సిటీపిఠాపురం -
టమాటా లారీ బోల్తా
● డ్రైవర్, క్లీనర్కు గాయాలు జగ్గంపేట: రాజమహేంద్రవరం వైపు నుంచి కోల్కతాకు టమాటాల లోడుతో వెళుతున్న లారీ మండలంలోని రామవరం పెట్రోల్ బంక్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో టమాటాలన్నీ రోడ్డు పక్కన పడిపోయాయి. దీంతో దారి వెంట వెళుతున్న ప్రజలు చేతికందిన టమాటాలను తీసుకుపోయారు. లారీ, డ్రైవర్ క్లీనర్కు గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసు రంగప్రవేశం చేసి టమాటాలు ఎవరూ తీసుకుపోకుండా చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. వైద్య విద్యార్థిని ప్రియాంకకు పోస్టుమార్టం పూర్తి కంబాలచెరువు: రాజమహేంద్రవరం ప్రసాదిత్యమాల్ వద్ద కారుతో ఢీకొట్టిన సంఘటనలో మృతి చెందిన వైద్య విద్యార్థిని కనికే ప్రియాంకకు సోమవారం రాజమహేంద్రవరం డీఎస్పీ సుభాష్ బృందం పోస్టుమార్టం నిర్వహించారు. వైద్య విద్యార్థిని ప్రియాంక కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఆమెకు పోస్టుమార్టం నిర్వహించేందుకు క్రైం డీఎస్పీ సుభాష్, ప్రకాశ్నగర్ సీఐ బాజీలాల్, ఎస్సై సతీష్, ఇద్దరు కానిస్టేబుళ్ల బృందం ఆదివారం రాత్రి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. మర్నాడు పోస్టుమార్టం పక్రియ పూర్తి చేసి ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం ప్రియాంక మృతదేహాన్ని భారీ ఊరేగింపుతో స్వగ్రామమైన గద్వాల్ జిల్లా అయిజ మండలంలోని ఎక్లాస్పురానికి తీసుకువచ్చి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. కాకినాడ గేట్ వే పోర్ట్ వద్ద 500 కోట్ల భారీ ప్రాజెక్టు తొండంగి: కాకినాడ గేట్వే పోర్ట్కు చెందిన స్థలంలో రూ.500 కోట్ల పెట్టుబడితో మైరెన్ ఫ్యూయల్, లిక్విడ్ స్టోరేజ్ నిల్వ కేంద్రం ఏర్పాటుకు గ్రీన్ ఫ్యూయల్ గ్లోబల్ ట్రేడింగ్ సోమవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని కాకినాడ గేట్వే పోర్ట్ డైరెక్టర్, సీఈఓ రామ్రెడ్డి ఓజిలి తెలిపారు. ఆయన మాట్లాడుతూ 1,50,000 కిలోలీటర్ల సామర్థ్యంతో మైరెన్ ఫ్యూయల్, లిక్విడ్ స్టోరేజ్ టెర్మినల్ను గ్రీన్ ఫ్యూయల్ గ్లోబల్ ట్రేడింగ్ ఏర్పాటు చేయనుంది. ఈమేరకు గ్రీన్ ఫ్యూయల్ గ్లోబల్ ట్రేడింగ్ మేనేజింగ్ డైరెక్టర్ సుధాకర్, రెండు సంస్థల ప్రతినిధుల సమక్షంలో ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారన్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల స్థానికంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలతో ఒప్పందాలు జరిగిన నేపథ్యంలో ఈ ఒప్పందం వల్ల కూడా తూర్పు తీరంలో కాకినాడ గేట్ వే పోర్ట్ వ్యూహాత్మక మైరెన్ ఎనర్జీ హబ్గా నిలుస్తుందని వివరించారు. 17 లోగా ఉత్తమ అవార్డుకు దరఖాస్తు చేసుకోండికంబాలచెరువు: జిల్లా 2026 ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ప్రైవేటు యాజమాన్యం మినహా మిగిలిన అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో పనిచేస్తూ, పదేళ్ల సర్వీస్ పూర్తి చేసిన ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు సోమవారం తెలిపారు. అర్హత గల ఉపాధ్యాయులు తమ పూర్తి వివరాలతో డీఈవో.ఈజీడీటీ వెబ్సైట్ నందు తెలిపిన నిబంధనలు, అప్లికేషన్, చెక్ లిస్ట్లను పూర్తి చేసి ఈనెల 17వ తేదీలోగా సంబంధిత మండల విద్యాశాఖాధికారికి అందజేయాలన్నారు. ఉరేసుకుని యువతి ఆత్మహత్యకొత్తపల్లి: రొయ్యల శుద్ధి పరిశ్రమంలో పనిచేసేందుకు వచ్చిన ఒక యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సోమవారం రాత్రి పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం పాడేరు జిల్లా హుకుంపేట మండలం మద్దిపుట్టు గ్రామానికి చెందిన మాదేల కాంతమ్మ (22) కొత్త మూలపేటలో ఉన్న రొయ్యల శుద్ధి పరిశ్రమలో పనిచేసేందుకు వచ్చింది. ఆమె గత కొద్ది రోజులుగా ఆమె స్నేహితురాలితో కలిసి మూలపేటలో ఒక అద్దె ఇంట్లో ఉంటుంది. సోమవారం బాత్రూంలో ఉరివేసుకుని మృతి చెందింది. ఆమె భర్త, తల్లిదండ్రులు ఇటీవల మృతి చెందారు. ఆమె మృతదేహాన్ని పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
లొంగిపోయిన మావోయిస్టులకు ఉపాధి కల్పిస్తాం
ములుగు రూరల్: మావోయిస్టు పార్టీ నుంచి లొంగిపోయిన వారు సమాజంలో విలీనమై జీవించాలని డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. సోమవారం కర్రెగుట్టల పర్యటన అనంతరం జిల్లా కేంద్రంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు పార్టీ సభ్యులకు హెల్త్ కార్డులు, రివార్డు చెక్కులు అందజేశారు. రాజమండ్రి జిల్లా ఆర్యాపురానికి చెందిన మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు కాకరాల సమత అలియాస్ మాధవి అలియాస్ దుర్గ అలియాస్ షకీల (దివంగత మావోయిస్టు పటేల్ సుధాకర్ రెడ్డి భార్య) డీజీపీ పర్యటన సందర్భంగా ములుగు జిల్లాలో ఆమె లొంగుబాటును చూపించారు. ఆమెకు ప్రభుత్వం నుంచి అందించే రూ.20 లక్షల రివార్డు చెక్కు అందించారు. డీజీపీ మాట్లాడుతూ.. సమత 40 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీలో వివిధ కేడర్లలో పని చేసినట్లు తెలిపారు. మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలసి బతకడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని వివరించారు. మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్న ముప్పాల లక్ష్మణ్రావు అలియాస్ గణపతి, అతడి భార్య లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో లొంగిపోయిన మావోయిస్టులు తమపై ఉన్న కేసులు ఎత్తివేయాలని, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరినట్లు తెలిపారు. కేసులు ఎత్తివేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలతో చర్చించి తీసుకోవలసిన నిర్ణయమని పేర్కొన్నారు. తెలంగాణలో మావోయిజం పూర్తిగా పోయిందని తెలిపారు. కర్రెగుట్టల ప్రాంతంలో అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. కార్యక్రమంలో మల్టీజోన్ వన్ ఐజీ చంద్రశేఖర్రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ కార్తికేయ, రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా, సీఆర్పీఎఫ్ ఏడీజీ విక్రమ్సింగ్, ఇంటెలిజెన్స్ ఎస్పీ సింధుశర్మ, కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, డీఎఫ్ఓ వికాస్ మీనా, ఏఎస్పీ మమన్ పాల్గొన్నారు. -
అర్జీలు ఇస్తున్నా.. పరిష్కారం సున్నా
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): సమస్య చిన్నదైనా దానికి పరిష్కారం మాత్రం లభించడం లేదని, పదే పదే అధికారులు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వస్తున్న ఫిర్యాదుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రాల్లో తమ గోడు పట్టించుకోకపోవడంతో జిల్లా కేంద్రానికి వస్తున్నామని, ఇక్కడ కూడా ఇదే వంతు జరుగుతోందని వాపోతున్నారు. కాగా.. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు 310 అర్జీలు సమర్పించారు. తాగునీటి కుళాయి ఇవ్వడం లేదని, పింఛన్ మంజూరు చేయడం లేదని, రైతు భరోసా నిధులు జమ కావడం లేదని, రీ సర్వేలో భూమి తక్కువగా నమోదయ్యిందటూ ఫిర్యాదులు చేశారు. కలెక్టర్ హరేంధిర ప్రసాద్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.ఫ చిన్న సమస్యకూ లభించని పరిష్కారం ఫ పీజీఆర్ఎస్ ప్రజల పెదవి విరుపు -
బ్రాహ్మణగూడెంలో చోరీ
చాగల్లు: మండలంలోని బ్రాహ్మణగూడెంలో ఓ ఇంట్లో దొంగలు చొరబడి బంగారం, వెండి వస్తువులు, నగదు అపహరించుకుపోయారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మాధవరెడ్డి రత్నకుమారి గత మంగళవారం విజయవాడలోని బంధువుల ఇంటికి పరామర్శ నిమిత్తం వెళ్లారు. తిరిగి ఆదివారం సాయంత్రం ఇంటికి వచ్చారు. తలుపులు పగులగొట్టి ఉండటాన్ని గమనించి ఇంట్లోకి వెళ్లి చూడగా, బీరువా పగులగొట్టి వస్తువులు మంచం మీద చెల్లాచెదురుగా పడేసి ఉన్నాయి. పక్కనే డ్రెస్సింగ్ టేబుల్ వస్తువులు, వంటగదిలోని వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని గమనించారు. డ్రెస్సింగ్ టేబుల్లో ఉన్న సుమారు 2 కాసుల బంగారు వస్తువులు, వెండి వస్తువులు, రూ.40 వేల నగదు, విలువైన రెండు వాచీలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు గుర్తించారు. తన కుమారుడు ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉంటున్నారని, ఇంట్లో ఒక్కదాన్నే ఉంటున్నానని, ఊరు వెళుతున్న సమయంలో ఇంట్లో లైట్లు వేసి వెళ్లానని ఆమె చెప్పారు. ఈ విషయంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. క్వాంటం టెక్నాలజీస్దే భవిష్యత్ ప్రపంచం రాజానగరం: సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో క్వాంటం టెక్నాలజీస్ భవిష్యత్ ప్రపంచాన్ని మరింత ప్రభావితం చేయగలదని పలువురు నిపుణులు అన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచి యువత ఈ రంగంపై అవగాహనను పెంచుకుని, అవసరమైన నైపుణ్యాలను వృద్ధి చేసుకోవడం ఉత్తమమని పేర్కొన్నారు. రాజానగరం సమీపాన గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జీజీయూ)లో ‘క్వాంటమ్ టెక్నాలజీస్ అండ్ కంప్యూటింగ్–ఇండస్ట్రీ పెర్స్పెక్టివ్స్ అండ్ స్టూడెంట్స్ ఇంటరాక్షన్’ అనే అంశంపై సోమవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఈ విషయాలను పలువురు నిపుణులు ప్రస్తావించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రొ.చాన్సలర్ కె. శశికిరణ్వర్మ మాట్లాడుతూ నేడు ప్రపంచంలో సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగునంగా విద్యార్థులు కూడా తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకోవాలన్నారు. విద్యార్థులు సంప్రదాయ కంప్యూటింగ్ పరిజ్ఞానంతో పాటు క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం అల్గారిథమ్స్, క్వాంటం సెక్యూర్టీ, క్వాంటం సాఫ్ట్వేర్ విభాగాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. -
కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జైల్ భరో
బోట్క్లబ్ (కాకినాడసిటీ): కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో సోమవారం తలపెట్టిన జైల్ భరో విజయవంతమైందని కేంద్ర కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. స్థానిక మెయిన్రోడ్డు హెడ్ పోస్టాఫీస్ వద్ద రాస్తారోకో అనంతరం పోస్ట్ ఆఫీస్ ముట్టడి నిర్వహించగా పోలీసులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారని అరెస్టు చేసి పోర్టు, త్రీటౌన్ పోలీస్స్టేషన్లకు ఆందోళనకారులను తరలించి అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షురాలు జి.బేబీరాణి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ ఏ రంగంలో పనిచేసే కార్మికుడికై నా కనీస వేతనం నేటి ధరలకు అనుగుణంగా రూ.31 వేలు చెల్లించాలని, తక్షణం 12వ పీఆర్సీ ప్రకటించి, బకాయిపడ్డ 6 డీఏలను చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధరను చట్టబద్ధం చేయాలని, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.25 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. వ్యవసాయాన్ని దివాళా తీయించే అమెరికాతో చేసుకునే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని, కనీస పింఛన్ రూ.9 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. దేశానికి ఈ కార్పొరేట్ విధానాల నుంచి విముక్తి కోసం విద్యార్థులు, కార్మికులు, రైతులు ఐక్యంగా మరో స్వాతంత్ర పోరాటానికి సిద్ధపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్కుమార్, జిల్లా కోశాధికారి మలకా రమణ, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెంకటలక్ష్మి, చంద్రమళ్ల పద్మ పాల్గొన్నారు. -
దాతలే దేవుళ్లు...
దాతలే దేవుళ్లై నడిపిస్తున్న సంకల్పం ఇది. ఆరేళ్లుగా వారి అండతోనే తండ్రిని కోల్పోయిన పిల్లల చదువులకు ఫీజులు చెల్లించగలుగుతున్నాం. ప్రముఖులు, వ్యాపారులు, అధికారులు, ఇతర వర్గాలు భాగస్వాములు అవుతున్నారు. సాయం పొంది స్థిరపడి మళ్లీ మా వద్దకు వచ్చి, తమ లాంటి పిల్లలను చదివించండని సహాయం అందించడం చూస్తే ఎంతో గర్వంగా ఉంది. తండ్రిని కోల్పోయిన ఏ విద్యార్థి చదువుకు ఆటంకం కలగకుండా ఉద్యోగంలో చేరే వరకూ సాయం అందించాలన్నదే మా సంకల్పం. –డాక్టర్ బొల్లం సతీష్, వ్యవస్థాపకుడు, శ్రీయువసేన స్వచ్ఛంద సేవా సంస్థ, కాకినాడ -
బెదిరింపులు అధికమయ్యాయి
కాకినాడ క్రైం: క్షణకాలంలో మారిపోయే రోగి ఆరోగ్య పరిస్థితి పలుమార్లు చావు బతుకులను నిర్ణయిస్తాయని, ఈ ఘటనల్లో వైద్యులను బ్లాక్మెయిలింగ్ చేస్తూ దాడులు పాల్పడడం దారుణమని కాకినాడ అబ్స్ట్రిక్స్ అండ్ గైనకాలజికల్ సొసైటీ (కాగ్స్) అధ్యక్షురాలు డాక్టర్ ఏఎల్ సత్యవతి అన్నారు. ఆదివారం స్థానిక రంగరాయ వైద్య కళాశాల ఆడిటోరియంలో కాగ్స్ ఆధ్వర్యంలో ‘అభయ’ దినోత్సవ చర్చా వేదిక జరిగింది. కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ సదస్సుకు విశిష్ట అతిథులుగా రాష్ట్ర డీఎంఈ డాక్టర్ అత్తలూరి విష్ణువర్థన్, కాకినాడ మూడో జిల్లా జడ్జి జి.ఆనంది, అదనపు ఎస్పీ మహంతి కిషోర్కుమార్ హాజరయ్యారు. కోల్కతాలో ఆర్జీ కార్ అమానవీయ ఘటన జరిగి సరిగ్గా రెండేళ్లు కావడంతో ‘అభయ’ సదస్సు నిర్వహించారు. డాక్టర్ సత్యవతి మాట్లాడుతూ సమస్య వచ్చినప్పుడు రోగుల బంధువుల ముసుగులో వచ్చే గుంపులు భయాందోళనలు కలిగిస్తున్నాయన్నారు. సోషల్ మీడియా, ఆర్టీఐ చట్టం పేరుతో చేస్తున్న బ్లాక్మెయిలింగ్ అంతా ఇంతా కాదని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులు, సిబ్బందికి రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. ఏపీ మెడికేర్ యాక్ట్ను అమలు చేసి వైద్యులు, వారి ఆస్తులకు రక్షణ కల్పించాలని ఐఎంఏ నాయకుడు డాక్టర్ కిరణ్ చిట్ల అన్నారు. రాష్ట్ర డీఎంఈ డాక్టర్ అత్తలూరి విష్ణువర్థన్ మాట్లాడుతూ వైద్యుల భద్రతకు కలెక్టర్, పోలీస్ శాఖ తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. కాకినాడ జీజీహెచ్లో పనిచేస్తున్న హౌస్ సర్జన్లు, పీజీలకు భద్రతే కాదు.. కనీసం బాత్రూమ్లు లేవని జూడా నాయకుడు హరికృష్ణ అన్నారు. క్యాజువాలిటీలో విధులు నిర్వర్తిస్తుంటే, రాత్రి వేళల్లో తాగుబోతులు ప్రవేశించి వైద్యులు, వైద్యేతర సిబ్బందిపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుందర్ అన్నారు. ఇటువంటి అవాంఛనీయ సంఘటనల నివారణకు సెక్యూరిటీతో పాటు తగిన పోలీస్ భద్రత అవసరమని నర్సింగ్ అసోసియేషన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి కోరారు. వైద్యులపై జరుగుతున్న దాష్టికాలను జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. కాగ్స్ తమకు నివేదించిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా జడ్జి ఆనంది మాట్లాడుతూ విఽధి నిర్వహణలో ఉండే వైద్యులకు సహకరిస్తే రోగులకుఅదనపు ఎస్పీ మహంతి కిషోర్కుమార్ మాట్లాడుతూ, సమస్యలు ఉంటే పోలీసుల వరకు ఎందుకన్న ధోరణిని విడనాడి తక్షణమే ఫిర్యాదు చేస్తే సత్ఫలితాలుంటాయని వివరించారు. ఫ వైద్యులపై దాడులు అమానుషం ఫ రక్షణ కల్పించాలని ‘అభయ’ సదస్సులో డాక్టర్లు -
సత్యగిరిపై నేటి నుంచి సర్వే
అన్నవరం: స్థానిక శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి చెందిన సత్యగిరిపై పోడు వ్యవసాయం పేరుతో ఆక్రమించేందుకు జరిగిన ప్రయత్నాలను దేవస్థానం అధికారులు భగ్నం చేసిన నేపథ్యంలో మొత్తం కొండ అంతా సర్వే చేసి సరిహద్దు రాళ్లు పాతేందుకు రంగం సిద్ధమైంది. సర్వే విభాగానికి చెందిన పది మంది సోమవారం ఉదయం నుంచి సర్వే పనులు ప్రారంభిస్తారు. 1998లో దేవస్థానం రెవెన్యూ శాఖ నుంచి కొనుగోలు చేసిన 308 ఎకరాల సత్యగిరిని సర్వే చేయనున్నారు. సర్వే పూర్తి చేసిన వెంటనే సరిహద్దు రాళ్లు పాతుతారు. తరువాత పది అడుగులకొక స్తంభాన్ని పాతి సిమెంట్ కాంక్రీట్ వేయాలని ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆదేశించారు. గిరిప్రదక్షిణ రోడ్డును ఆనుకుని ఉన్న సత్యగిరిపై పోడు వ్యవసాయం చేసేందుకు ప్రయత్నాలు చేయడంపై ‘సాక్షి’ దినపత్రికలో ఈ నెల మూడో తేదీన ‘పోడు’పొచ్చాలు శీర్షికన కథనం ప్రచురితమైంది. అధికారులు స్పందించి ఇప్పుడు సర్వేకు ఏర్పాట్లు చేశారు. -
పేదల ఆరోగ్యంతో ఆటలా?
సామర్లకోట: రాష్ట్ర ప్రభుత్వం పేదల జీవితాలతో ఆటలు ఆడుతుందని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజులగా బలుసులపేటకు చెందిన అనేక మంది పచ్చ కామెర్లు, కడుపునొప్పి, జ్వరాలతో బాధపడుతుండడంతో ఆయా కుటుంబ సభ్యులను ఆ వార్డు కౌన్సిలర్ నేతల హరిబాబు ఆధ్వర్యంలో పరామర్శించారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ కౌన్సిల్ పాలన ముగిసినప్పటి నుంచి బలుసులపేటలో బురద, ఆకుపచ్చ రంగులో నీరు వస్తుందన్నారు. మున్సిపల్ అధికారులకు తమ పార్టీ నాయకులు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదన్నారు. చిన్న పిల్లలు వ్యాధుల బారిన పడటంతో తల్లిదండ్రులు వారిని ఆస్పత్రులకు తిప్పుతున్నారని తెలిపారు. పేద కుటుంబాల్లోని చిన్నారులు ఆసుపత్రుల పాలుకావడంతో వారిని ఓదార్చడానికే బలుసుపేటలో పర్యటిస్తున్నట్లు దొరబాబు తెలిపారు. వైద్య శిబిరాలు పెడుతున్నామని ప్రచారం చేసుకొంటున్నారే తప్ప, క్షేత్రస్థాయిలో కనిపించడం లేదన్నారు. వెంటనే ఆరోగ్య సిబ్బంది ఇంటింటా వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. ఇక్కడి ప్రజలు కాచి చల్లార్చిన నీటినే తాగాలని దొరబాబు సూచించారు. వరదలకు గోదావరి కాలువ కలుషితమైందని మున్సిపల్ అధికారులు తప్పులను కప్పిపుచ్చుకొంటున్నారని అన్నారు. ఇక్కడ పారిశుధ్య పనులను ముమ్మరం చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అయ్యరక సంఘ అధ్యక్షుడు ఆవాల లక్ష్మీనారాయణ, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడు గోపు మురళి, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఉబా జాన్మోజెస్, పట్టణ పార్టీ అధ్యక్షుడు పాగా సురేష్కుమార్, పట్టణ ఐటీ విభాగం అధ్యక్షుడు దర్శిపాటి సత్యానందం, నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ వారా సుధాకర్, నియోజకవర్గ మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు ఇరుసుమళ్ల సాయి, నాయకులు మన్యం చంద్రరావు, వారా పాప, కానేటి బుల్లిఅప్పారావు, తర్లంపూడి కమల్రాజ్, రెడ్డి శ్రీనివాసు, చిట్టుమాని శ్రీనివాసు, పాలిక చంటిబాబు, నేతల శ్రీనివాస్, మాగాపు గోపి తదితరులు పాల్గొన్నారు.ఫ వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ దొరబాబు ఫ బలుసులపేట బాధితులకు పరామర్శ -
దగా డీఎస్సీపై పోరాటం కొనసాగిస్తాం
ఫ నేడు జిల్లా వ్యాప్తంగా నిరసన ర్యాలీలు ఫ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా సాక్షి ప్రతినిధి, కాకినాడ: డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్ సీపీ చేపడుతున్న పోరాటం కొనసాగుతుందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అన్నారు. నిరుద్యోగులు, విద్యార్థుల భవిష్యత్తు కోసం రాజీలేని పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వం చేస్తున్న అక్రమాలపై ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్య పరుస్తున్నామని అన్నారు. దగా డీఎస్సీపై చేపట్టిన శాంతియుత రిలే నిరాహార దీక్షలను అడ్డుకోవడం, దీక్షా శిబిరాలపై దాడులు చేయడం, అక్రమ అరెస్టులకు పాల్పడటం చంద్రబాబు ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలకు నిదర్శనమన్నారు. రిలే దీక్షలు ముగిసినా.. కాకినాడ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో విద్యార్థులు, యువత, నిరుద్యోగులు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్య వాదులతో కలసి సోమవారం నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ర్యాలీలో పార్టీ శ్రేణులతో పాటు యువత, విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వ విధానాలపై గళమెత్తుతారన్నారు. అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలన్న డిమాండ్లతో ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. -
హోం మంత్రి రాజీనామా చేయాలి
కాకినాడ రూరల్: రాజమహేంద్రవరంలో మెడికో ప్రియాంక మృతి ఘటనకు బాధ్యత వహిస్తూ హోం మంత్రి అనిత తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి డిమాండ్ చేశారు. కాకినాడ గైగోగుపాడులోని ఆమె నివాసంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారడంతో రహదారులపై రక్తపు మరకలు అంటుతున్నాయని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు ఇంటా.. బయట రక్షణ లేకుండా పోయిందని, రాజమహేంద్రవరంలో పీజీ చేస్తున్న వైద్యురాలిపై జరిగిన దాడికి రాష్ట్ర ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందన్నారు. పైగా ఈ ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు. మద్యం మత్తులో ఉన్న ఉన్మాదులు అత్యంత పాశవికంగా ప్రియాంకను కారుతో ఢీకొట్టడం దారుణమన్నారు. చంద్రబాబు ప్రభుత్వం దిశ బిల్లు రద్దు చేయడంతో మహిళల్లో అభద్రతా భావం పెరిగిపోయే ప్రమాదం ఉందన్నారు. మహిళలకు నాడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం దిశ చట్టం అందుబాటులోకి తీసుకువచ్చి భద్రత కల్పించిందని గుర్తు చేశారు. పోటీలకు ఏర్పాట్లు నాగమల్లితోట జంక్షన్: జిల్లా క్రీడాప్రాఽధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 12, 13 తేదీల్లో కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో నిర్వహించనున్న అమరావతి జిల్లా స్థాయి చాంపియన్షిప్ పోటీలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వి.సతీష్కుమార్ ఆదివారం తెలిపారు. కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ పర్యవేక్షణలో 12న అండర్–17, 23 బాలికలకు, 13న అండర్–17, 23 బాలురకు పోటీలు నిర్వహిస్తామన్నారు. నియోజకవర్గ స్థాయిలో ఎంపికై న క్రీడాకారులు మాత్రమే జిల్లాస్థాయికి అర్హులన్నారు. క్రీడాకారులు ఉదయం 8 గంటలకు క్రీడా మైదానంలోని పోటీల వేదిక వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్; బాక్సింగ్, బాస్కెట్బాల్, చెస్, యోగా, వాలీబాల్, వెయిట్లిఫ్టింగ్, ఖోఖో, కబడ్డీ, హాకీ విభాగాల్లో పోటీలు జరుగుతాయన్నారు. పోటీల నిర్వహణకు స్టేడియంలో వివిధ ప్లే ఫీల్డ్స్ను సిద్ధం చేశామని తెలిపారు. దరఖాస్తుల ఆహ్వానం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): దివ్యాంగుల సాధికారత జాతీయ పురస్కారాల కోసం అర్హులు, సంస్థల నుంచి ఆన్లైన్ ద్వారా నామినేషన్లు ఆహ్వానిస్తున్నామని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. దరఖాస్తులను ఈ నెల 15లోగా ఆన్లైన్లో సమర్పించాలన్నారు. -
ఆ చేతులకు మనసుంది..
కాకినాడ క్రైం: కరోనా భయానక మృత్యు విలయం సృష్టించింది. అయిన వారిని దూరం చేసింది.. ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబాల పరిస్థితి దయనీయంగా మార్చేసింది. పూట గడవడమే చాలనుకునే పరిస్థితి తెచ్చింది. పిల్లల చదువు భారమైంది. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన అతివలకు ఎలా బతకాలనే ఆలోచన కంటే, పిల్లలను ఎలా చదివించాలనే మదన ఎక్కువైంది. అటువంటి, దీనావస్థలో కాకినాడలోని శ్రీయువసేన స్వచ్ఛంద సేవా సంస్థ ఓ ఆశాకిరణంలా పేద జీవితాల్లో వెలుగై జనించింది. ఆ సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ బొల్లం సతీష్ సారధ్యంలో దాతలు ఆరేళ్లుగా ఎందరో పిల్లల చదువుకు ఆసరాగా నిలిచారు. ఇందులో 12 మంది చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాల్లో స్థిరపడ్డారంటే, దాతల సంకల్ప కాంతులు ప్రసరించిన వెలుగులెంత బలమైనవో అర్థమవుతోంది. 2021లో కోవిడ్ సమయంలో ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే, ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబాలు గుండెలవిసేలా రోదించాయి. సంపాదించే వ్యక్తి మరణిస్తే, ఆ వ్యక్తి అంతిమ సంస్కారాలకు కూడా డబ్బులు లేని దయనీయ ఘటనలు కన్నీళ్లు పెట్టించాయి. భర్త చనిపోయిన ఇళ్లలో ఆడవారు కుటుంబ, పిల్లల బాధ్యతలు మోశారు. ఆ సమయంలో పిల్లల చదువులు వారిని వేఽధించాయి. అలాంటి వారికి శ్రీయువసేన చేయూత ఇవ్వడంతో వారి కలలకు ఆటంకాలు తొలగాయి. పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. వారు ఉద్యోగాల్లో చేరేవరకూ ఫీజులన్నీ ఆ సంస్థ చెల్లించేందుకు మాటిచ్చి ముందుకు సాగుతోంది. 18 మందితో మొదలై 112 మందికి.. తొలిసారి 2021లో సుమారు 20 మంది దాతలు 18 మంది తండ్రిని కోల్పోయిన పిల్లలకు అందించే సాయంతో ఈ కార్యక్రమం మొదలైంది. ఆరేళ్లుగా పెరుగుతూ 112కు వచ్చారు. దాతల సంఖ్య 20 నుంచి 50కి పెరిగింది. తొలినాళ్లలో కోవిడ్లో తండ్రిని కోల్పోయిన విద్యార్థులనే చదివించేవారు. అనంతరం, వివిధ కారణాలతో నాన్నని పోగొట్టుకున్న పిల్లల చదువుకు సాయం అందిస్తున్నారు. ఇలా ఆరేళ్లలో సుమారు రూ.కోటి సాయం అందించారు. ఈ ఏడాదికి గాను శ్రీయువసేన వేదికగా 112 మందికి అవసరమైన రూ.27 లక్షల మొత్తాన్ని స్వయానా దాతలే నేరుగా లబ్ధిదారులకు అందజేయం విశేషం. ఇందులో ఇంజినీరింగ్, వైద్య, న్యాయశాస్త్రం అభ్యసిస్తున్న విద్యార్థులతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారు ఉన్నారు. బాధ్యతగా ముందుకు.. శ్రీయువసేన సంకల్పానికి మెచ్చి దాతలు ముందుకు వచ్చారు. దాతల్లో ప్రఖ్యాత వైద్యులు, వ్యాపారవేత్తలు, సామాజిక బాధ్యత ఉన్న వ్యాపారులు, ఉద్యోగులు ఉన్నారు. వీరు కాకుండా శ్రీయువసేన వేదికగా దాతల సాయం అందుకుని ఈ ఆరేళ్లలో స్థిరపడిన వారూ సాయంలో భాగస్వాములు కావడం విశేషం. శనివారం కాకినాడ రామారావుపేటలో దాతలతో పాటు లబ్ధిదారులు ఒకే వేదికపై కలిశారు. ఈ సమయంలో విద్యార్థుల తల్లుల భావోద్వేగానికి గురై తమ స్థితిని వివరించడం కళ్లు చమ్మగిల్లేలా చేసింది. చదువుతున్న చోటే... పిల్లలు అప్పటి వరకు చదువుతున్న కార్పొరేట్, ప్రైవేట్ విద్యాలయాల్లోనే చదువు కొనసాగించేలా రూ.లక్షల ఫీజు మొత్తాన్ని చెల్లించేందుకు శ్రీయువసేన చెల్లిస్తోంది. విద్యార్థుల భవిత, వారి తల్లుల కళ్లలో కాంతులు చూసేందుకు వ్యవస్థాపకుడు సతీష్ చేయని ప్రయత్నం లేదు. తన సంకల్పాన్ని వందలాది దాతల చుట్టూ తిరిగి చెప్పారు. పిల్లలను చదివించేందుకు సాయం చేయమని కోరారు. ఫ తండ్రిని కోల్పోయిన పిల్లలకు దాతల బాసట ఫ ఆరేళ్లుగా చదువులకు అండ ఫ 112 మంది పిల్లలకు 50 మంది సాయం ఫ శ్రీయువసేన స్వచ్ఛంద సేవా సంస్థ ఉదారత కర్కశ కరోనా వేళ.. అయిన వారిని కోల్పోయి.. కలత చెంది కలవరపడుతుంటే.. తల్లడిల్లి తలదించుకుంటే.. ఆ చేతులు ఆదుకున్నాయి. వాటికి మనసుందని నిరూపించాయి. అప్పటి నుంచి ఆరేళ్లుగా చిన్నారుల చదువుకు సాయం అందిస్తూ, స్ఫూర్తి ప్ర‘దాత’లై నిలిచాయి.. ఆ స్ఫూర్తికి నిండు మనసులు జేజేలు పలుకుతున్నాయి. -
దిశ బిల్లు రద్దు దారుణం
● ప్రభుత్వ చర్యలతో మహిళలకు రక్షణ దూరం ● మాజీ ఎంపీ వంగా గీత పిఠాపురం: దిశ బిల్లు రద్దు చేయడం దారుణమని, చంద్రబాబు ప్రభుత్వ చర్యలతో మహిళలకు రక్షణ దూరమవుతుందని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి వంగా గీత మండిపడ్డారు. శనివారం పిఠాపురం మండలం ఎఫ్కే పాలెంలో ఆమె విలేకర్లతో మాట్లాడారు. గతంలో తాను ఎంపీగా ఉన్నప్పుడు దిశ బిల్లును చట్టం చేయాలని అప్పటి కేంద్ర మంత్రులను, రాష్ట్రపతిని కలసి కోరామన్నారు. ప్రస్తుతం ఆ బిల్లు చట్టం కావడానికి చివరి దశలో ఉందని, అయినప్పటికీ చట్టం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం ఒప్పుకోవడం లేదన్నారు. అందుకే ఒక్క ఎంపీ కూడా ఇప్పటి వరకు పార్లమెంట్లో మాట్లాడడం లేదన్నారు. ప్రస్తుతం వచ్చిన క్రైం రిపోర్టుల్లో ఎక్కువగా మహిళలపై లైంగిక, చిన్న పిల్లలపై దాడులు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయన్నారు. దేశం మొత్తం మీద రాష్ట్రంలోనే మహిళలు, పిల్లలకు రక్షణ లేకుండా పోయిందనడానికి క్రైం రిపోర్టులే నిదర్శనమన్నారు. ఇంత దారుణంగా అరాచకాలు జరుగుతున్నా, వాటిని కూడా పట్టించుకోకపోవడం సరికాదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మహిళలు, పిల్లలకు రక్షణ కల్పించాలని ఆమె అన్నారు. లేకుంటే వైఎస్సార్ సీపీ తరఫున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. దిశ బిల్లును చట్టం చేసే వరకు ఉద్యమిస్తామన్నారు. మహిళలు క్షేమంగా సమాజంలో తిరిగే పరిస్థితి కల్పించాల్సిన ప్రభుత్వం దాడులు జరుగుతున్నా, పట్టించుకోకపోవడం దారుణమన్నారు. -
పగాకు నుంచి బాగుకు..
● పుంజుకొంటున్న పొగాకు ధర ● మాజీ సీఎం జగన్ రాకతో ‘ధర’హాసం ● రెండు రోజుల్లో కిలోకు రూ.16 పెంపు రైతుల మోముల్లో ఆనందం దేవరపల్లి: నాలుగు నెలలుగా నిలకడగా సాగిన పొగాకు ధర రెండు రోజులుగా పుంజుకొంటుంది. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాకతో ‘ధర’హాసం వచ్చింది. ఈ నెల 5న మాజీ సీఎం వైఎస్ జగన్ దేవరపల్లిలో పర్యటించి రైతులకు బాసటగా నిలిచిన విషయం తెలిసిందే. ఆయన పర్యటన ఖరారైన తర్వాత కిలోకు రూ.10 ధర పెరగగా, పర్యటన అనంతరం శుక్రవారం రూ.15 పెరిగింది. శనివారం మరో రూ.1 పెరుగుదలతో మొత్తంగా కిలోకు రూ.26 పెరిగినట్టయ్యిందని రైతులు తెలిపారు. రెండు రోజుల్లోనే రూ.16 పెరగడం విశేషం. తాజా ధరలు ఇలా.. శనివారం మార్కెట్లో కిలో గరిష్ట ధర రూ.291, కనిష్ట ధర రూ.150, సగటు ధర రూ.242.05 పలికింది. టొబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో శనివారం 4,645 బేళ్లు అమ్మకానికి రాగా, 2,239 బేళ్లు కొనుగోలు చేశారు. 2,406 బేళ్లు తిరస్కరించారు. 2.91 లక్షల కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. ఇప్పటివరకు 13.18 మిలియన్ల కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. దేవరపల్లి వేలం కేంద్రంలో 1.92 మిలియన్ల కిలోలు, జంగారెడ్డిగూడెం వేలం కేంద్రంలో 2.89 మిలియన్ల కిలోలు, జంగారెడ్డిగూడెం–2 వేలం కేంద్రంలో 3.12 మిలియన్ల కిలోలు, కొయ్యలగూడెం వేలం కేంద్రంలో 2.72 మిలియన్ల కిలోలు, గోపాలపురం వేలం కేంద్రంలో 2.51 మిలియన్ల కిలోల విక్రయాలు జరిగాయి. కిలో సగటు ధరలు దేవరపల్లిలో రూ.237.97, జంగారెడ్డిగూడెం–1లో రూ.242.97, జంగారెడ్డిగూడెం–2లో రూ.241.53, కొయ్యలగూడెంలో రూ.241.22, గోపాలపురంలో రూ.245.64 రైతులకు లభించాయి.55 శాతం బేళ్ల తిరస్కరణ వేలం కేంద్రాలకు తీసుకొచ్చిన బేళ్లను కొనుగోలు చేయకుండా ట్రేడర్లు తిరస్కరించడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తిరస్కరించిన బేళ్లు తిరిగి ఇంటికి తీసుకువెళ్లాలంటే ఆర్థికంగా నష్టపోతున్నారు. బేలుకు దూరాన్ని బట్టి రూ.100 నుంచి రూ.150 ఖర్చు అవుతుందని రైతులు వాపోతున్నారు. తీసుకొచ్చిన బేళ్లలో 55 శాతం కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 40 నుంచి 45 శాతం బేళ్లు అమ్ముడుపోతున్నాయని అంటున్నారు. ధర పెరిగినప్పటికీ నో బిడ్లు ఎక్కువగా ఉంటున్నాయని వారు గగ్గోలు పెడుతున్నారు. ధరతో పాటు పొగాకు కొనుగోలు శాతం కూడా పెరగాలని రైతులు కోరుతున్నారు. -
జగనన్న అడుగు పెట్టడంతో..
వేలం కేంద్రంలో మాజీ సీఎం జగన్ అడుగుపెడితే పొగాకు ధర పెరుగుతుందని మాకు నమ్మకం. ఇప్పుడదే జరిగింది. 2021–22లోనూ మార్కెట్లో ఇదే పరిస్థితి ఏర్పడింది. అప్పటి సీఎం వైఎస్ జగన్ రైతుల ఇబ్బందులు తెలుసుకుని మార్క్ఫెడ్ ద్వారా 10 మిలియన్ల పొగాకు కొనుగోలు చేసి ఆదుకున్నారు. – సత్తి సాయిఈశ్వరరెడ్డి, పొగాకు రైతు, కృష్ణంపాలెం, దేవరపల్లి మండలం రైతులకు న్యాయం జరిగింది జగనన్న వల్లే రైతులకు న్యాయం జరుగుతుంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పండించిన అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించింది. అప్పట్లో మార్క్ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేశారు. ఎందుకు పనికి రాని లోగ్రేడుకు రూ.120 ధర ఇచ్చి ఆదుకున్నారు. జగనన్న ప్రభుత్వంలో ఐదేళ్లు పొగాకుకు మంచి ధర లభించింది. పొగాకు రైతులను టీడీపీ ఎమ్మెల్యే వెంకట్రాజు బ్లేడ్ బ్యాచ్గా చెప్పడం మంచి పద్ధతి కాదు. – చిన్నం నాగార్జున, పొగాకు రైతు, గౌరీపట్నం వైఎస్సార్ సీపీ పోరాటంతోనే.. పొగాకు రైతులకు అండగా వైఎస్సార్ సీపీ పోరాటం చేసింది. జగనన్న పర్యటన ప్రకటన నుంచి ఇప్పటివరకు కిలోకు రూ.26 పెరిగింది. జగన్ పర్యటన వల్ల రైతులకు ఒరిగింది ఏమీ లేదని చెబుతున్న టీడపీ నాయకులు ఇప్పుడు ఏం చెబుతారు? పొగాకు రైతులకు జగనన్న అండగా నిలిచారు. – వల్లభనేని సత్యనారాయణ, పొగాకు రైతు, వెదుళ్లకుంట, గోపాలపురం మండలం వారెందుకు పట్టించుకోలేదు పొగాకు కొనుగోళ్లు ప్రారంభించి నాలుగు నెలలైంది. గిట్టుబా టు ధర లేదని రైతులు గగ్గోలు పెడుతున్నా, ప్రజాప్రతినిధులు ఎందుకు పట్టించుకోలేదు? గత ఏడాది సంగాయగూడెంలో పొగాకు రైతు ఆత్మహ త్య చేసుకోగా, ప్రజాప్రతినిధులు కనీసం పరామ ర్శించలేదు. రైతులకు బాసటగా వైఎస్ జగన్ పర్యటి స్తే, పొగాకు ధ్వంసం చేశారని అసత్య ప్రచారం చేస్తున్నారు. – సుంకవల్లి వెంకట శ్రీనివాస్, పొగాకు రైతు, సంగాయగూడెం, దేవరపల్లి మండలం -
సత్యదేవా శరణు శరణు
అన్నవరం: ఆషాఢ బహుళ దశమి, శనివారం కావడంతో అన్నవరం శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం శనివారం భక్తులతో కిక్కిరిసింది. సత్యదేవుని దర్శనానికి రెండు గంటలు, రూ.200 టిక్కెట్తో అంతరాలయ దర్శనానికి గంట సమయం పట్టింది. రూ.300 వ్రతా లు ఆచరించేందుకు భక్తులు వ్రత మండపాల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. సుమారు 40 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి వ్రతాలు రెండు వేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ. 40 లక్షల ఆదాయం సమకూరింది. ఐదు వేల మందికి అన్నప్రసాదం అందించారు. కాగా, ఆ షాఢ బహుళ ఏకాదశి సందర్భంగా ఆదివారం కూడా రత్నగిరిపై రద్దీ నెలకొనే అవకాశం ఉంది. ఆలయ ప్రాకారంలో ఉదయం 10 గంటల నుంచి టేకు రథంపై సత్యదేవుడు, అమ్మవారిని ఊరేగిస్తారు. ఏలేరు తీరంలో విహారయాత్రలు నిషిద్ధం జగ్గంపేట: భావవరం గ్రామ సమీప అటవీ ప్రాంతంలోని ఏలేరు ప్రాజెక్టు నదీ తీరంలో విహార యాత్రలకు ఎటువంటి అనుమతులు లేవని, ఈ ప్రాంతాన్ని నిషేధిత ప్రాంతంగా ప్రకటించినట్లు జగ్గంపేట ఎస్సై రఘునాథరావు తెలిపారు. కొంత కాలంగా ఈ ప్రాంతానికి పర్యాటకుల సందడి పెరిగింది. వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం జరగడంతో సెలువు రోజుల్లో పెద్ద ఎత్తున వస్తు న్నారు. కొద్ది రోజుల క్రితం ఓ కళాశాలకు చెందిన విద్యార్థులు విహారయాత్రకు వచ్చి ఓ యువకుడు నదిలో మునిగి ప్రాణాలు కోల్పోవడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ ప్రాంతంలో నది బాగా లోతుగా ఉండడంతో నీటిలో దిగితే ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని ఆయన తెలిపారు. అంతేకాకుండా రిజర్వ్ ఫారెస్టులోకి రావడానికి కూడా నిబంధనల ప్రకారం వీలుకాదని చెప్పారు. భావవరం ప్రాంతంలో నిషేధిత ప్రాంతంగా బోర్డులు ఏర్పాటు చేశామన్నారు. చేనేత అభివృద్ధికి రూ.10 కోట్లతో ప్రతిపాదన కొత్తపల్లి: నేషనల్ లెవెల్ ప్రోగ్రాం అండ్ డెవలప్మెంట్ (ఎన్ఎస్పీడీ)లో భాగంగా చేనేత అభివృద్ధికి రూ.10 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. శనివారం ఉప్పాడలో ఆయన పర్యటించారు. జాంధాని చీరల తయారీ విధానాన్ని పరిశీలించారు. అక్కడి చేనేత సహకార సంఘంలో పలు రకాల చేనేత చీరలను చూశారు. చేనేత సహకార సంఘాల అభివృద్ధికి ఎటువంటి చర్యలు చేపట్టాలనే విషయాలను కార్మికులను అడిగి తెలుసుకొన్నారు. ఎన్ఎస్పీడీలో భాగంగా మార్కెట్లోకి వచ్చే కొత్త డిజైన్లపై కార్మికులకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపడతున్నట్లు కలెక్టర్ వివరించారు. అదే విధంగా చేనేత రంగాన్ని మెరుగుపరిచేందుకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో ఎంఓయూ చేసినట్లు తెలిపారు. ఆయన వెంట అసిస్టెంట్ కలెక్టర్ ప్రియ ఉన్నారు. కట్టమూరులో నీటి నమూనాల సేకరణ పెద్దాపురం: కట్టమూరులో కలుషిత నీటి వల్ల చిన్నారులు రోగాల బారిన పడుతుండడంతో వైద్య సిబ్బంది అప్రమత్తం అయ్యారు. పలువురు కామెర్లు, వాంతులు, విరేచనాలు, జ్వరాలతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందుతున్న విషయాన్ని గమనించిన వైద్య ఆరోగ్య, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు నివారణ చర్యలు చేపట్టారు. శనివారం కట్టమూరులో అడిషనల్ డీఎంహెచ్ఓ ప్రశాంతి ఇతర వైద్య బృందం పర్యటించింది. గ్రామంలో వివిధ ప్రాంతాల్లో నీటి నమూనాలు సేకరించి పరీక్షల కోసం ల్యాబ్కు పంపించారు. గ్రామంలో పరిస్థితులు చక్కబడే వరకు గ్రామస్తులు కాచి చల్లార్చిన నీటిని తాగాలన్నారు. -
నిర్లక్ష్యమే కారణం
● తాగునీరు కలుషితంతోనే రోగాలు ● సీహెచ్సీలో రోగులను పరామర్శించిన దొరబాబు సామర్లకోట: కలుషిత నీటి కారణంగా సామర్లకోటలో అనేక మంది రోగాల బారిన పడుతున్నా, ఇంకా అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని వైఎస్సార్ సీపీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు మండిపడ్డారు. స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో పచ్చ కామెర్లు, జ్వరం, కడుపు నొప్పితో చికిత్స పొందుతున్న రోగులను శనివారం ఆయన పరామర్శించారు. రోగులకు అందిస్తున్న వైద్యంపై వైద్యులు కేఎస్ఎన్ఎస్ఎం కార్తీక్, వి.చంద్రకళాదేవి, పి.సుజాత, శివజ్యోతిలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అవసరమైన వారిని కాకినాడకు తరలించాలని దొరబాబు సూచించారు. అనంతరం రోగుల కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. దొరబాబు మాట్లాడుతూ కలుషిత జలాలు సరఫరా కావడానికి కారణమైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలన్నారు. వారం రోజులుగా వివిధ రోగాలతో అనేక మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. సీహెచ్సీ సమీపంలో శుక్రవారం ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారని, అయితే ఇక్కడ రోగులను పరామర్శించకపోవడంపై శోచనీయమన్నారు. రోజురోజుకూ రోగుల సంఖ్య పెరుగుతుందని, శనివారం కూడా మరో ఐదుగురు జ్వరాలతో ఆస్పత్రిలో చేరారని తెలిపారు. శుక్రవారం వైఎస్సార్ సీపీ నాయకులు ఆస్పత్రికి చేరుకుని అధికారులను ప్రశ్నించడంతోనే అంతా దిగి వచ్చారని అన్నారు. వారం రోజుల క్రితం డీజిల్ లేకపోవడం వల్ల ఫిల్టర్ బెడ్లో జనరేటర్ పనిచేయలేదని, డీజిల్కు కూడా నిధులు ఖర్చు చేయలేని స్థితిలో ఉన్నారని తెలిపారు. ఫిల్టర్ చెరువులో చేపల వేటకు అనుమతి ఇవ్వడం సరికాదన్నారు. మున్సిపాలిటీ నుంచి బురద, పసరు రంగులో నీరు రావడం కారణంగానే రోగాలు ప్రబలుతున్నాయని జిల్లా మానవ హక్కుల సంఘ అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండ ఆరోపించారు. వైఎస్సార్ సీపీ అయ్యరక సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఆవాల లక్ష్మీనారాయణ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఉబా జాన్మోజెస్, కోఆప్షన్ మాజీ సభ్యుడు మన్యం చంద్రరావు, నేతలు పాగా సురేష్కుమార్, నేతల హరిబాబు, సేపెని సురేష్, కరణం రాజ్కుమార్, చిట్టుమాని శ్రీనివాసరావు, ఇరుసుమళ్ల సాయి, లింగం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నవోదయానికి అడుగేద్దాం!
రాయవరం: విద్యార్థుల భవిష్యత్ను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు జవహర్ నవోదయ విద్యాలయ సమితిలో ప్రస్తుత విద్యాసంవత్సరం 6వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు మరో రెండు రోజులే గడువు. ఈ నెల 10తో గడువు ముగియనున్న నేపథ్యంలో కాకినాడ జిల్లా పెద్దాపురంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. కాగా శనివారం నాటికి 7,770 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. గత ఏడాది 9,279 దరఖాస్తులు రాగా, ఈ ఏడాది అంతకు పదిశాతం ఎక్కువ దరఖాస్తులు వస్తాయని అధికారులు భావించారు. కానీ దానికి ఇప్పటి వరకు 1,509 దరఖాస్తులు తక్కువ వచ్చాయి. పెద్దాపురం నవోదయ విద్యాలయాల్లో మొత్తం 80 సీట్లు ఉన్నాయి. కాగా ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది ఐదో తరగతి విద్యార్థులు సుమారు 60 వేల మంది ఉన్నారు. పరీక్షా విధానమిదీ ఈ ఏడాది నవంబరు 28న ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్దేశిత కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఇంగ్లిషు, తెలుగు మాధ్యామాల్లో నిర్వహించే ప్రవేశ పరీక్షలో 80 ప్రశ్నలు ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలో 100 మార్కులకు పరీక్షకు, రెండు గంటల సమయాన్ని కేటాయిస్తారు. మెంటల్ ఎబిలిటీపై 40 ప్రశ్నలు, 50 మార్కులకు, గణితం (అర్థమెటిక్), భాషపై ఒక్కొక్క విభాగానికి 20 ప్రశ్నలు వంతున 40 ప్రశ్నలు 50 మార్కులకు ఉంటాయి. దివ్యాంగులకు 40 నిమిషాల అదనపు సమయాన్ని కేటాయిస్తారు. ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి మొదటి రెండేళ్లు తెలుగు/ఇంగ్లీషు భాషల్లో బోధిస్తారు. పోటీ విధానం అలవడుతుంది జవహర్ నవోదయ విద్యాలయలో సీటు సంపాదించడాన్ని ప్రతిష్టగా భావిస్తారు. ఇందుకోసం పాఠశాలల్లోని ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించాల్సి ఉంది. సీటు రాకపోయినప్పటికీ నిరాశ చెందకుండా, ఇతర పోటీ పరీక్షలకు హాజరవడం అలవడుతుందని అధికారులు చెబుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే దరఖాస్తులు ఇలా.. జిల్లా 2026–27 2027–28 కోనసీమ 2,233 2,272 తూర్పుగోదావరి 2,521 1,745 కాకినాడ 4,215 3,753 ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం దాఖలుకు రెండు రోజులే గడువు గతేడాది వచ్చిన దరఖాస్తులు 9,279 ఈ ఏడాదిలో ఇప్పటికి వచ్చినవి 7,770 నవంబరు 28వ తేదీన ప్రవేశ పరీక్ష దరఖాస్తుల సంఖ్య పెంపుకు కృషి చేయాలి జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షలో గ్రామీణ విద్యార్థులు అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకునేలా ఎంఈఓలు చర్యలు తీసుకోవాలి. విద్యార్థులతో ఈ పరీక్షలు రాయించడం వల్ల వారిలో పోటీ పరీక్షలను ఎదుర్కోగలిగే ఆత్మ విశ్వాసం ఏర్పడుతుంది. – జి.నాగమణి, ఆర్జేడీ, పాఠశాల విద్యాశాఖ, కాకినాడ రేపటితో ముగుస్తున్న గడువు జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు చేసుకునేలా విద్యార్థులను ప్రోత్సహించాలి. ఆ మేరకు ఉపాధ్యాయులు కృషి చేయాలి. – ఎస్.శరత్చంద్ర కీర్తి, ప్రిన్సిపాల్, జవహర్ నవోదయ విద్యాలయ, పెద్దాపురం -
చంద్రబాబుకు భయం పట్టుకుంది!
పిఠాపురం రూరల్ ఎఫ్కే పాలెంలో నిర్వహించిన రిలే దీక్షల్లో మాజీ ఎంపీ వంగా గీత తదితరులు జగ్గంపేటలో రిలే దీక్షల్లో మాజీ మంత్రి తోట నరసింహం, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒమ్మి రఘురాంసాక్షి ప్రతినిధి, కాకినాడ: డీఎస్సీలో అక్రమాలు జరిగాయని తేలడంతోనే సీబీఐ దర్యాప్తునకు చంద్రబాబు వెనుకంజ వేస్తున్నారు.. అసలు నిజాన్ని దాచేందుకే సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.. లోకేశ్ మంత్రి పదవిని కాపాడే పనిలో బాబు ఉన్నారని వైఎస్సార్ సీపీ శ్రేణులు మండి పడుతున్నారు. మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను దగా చేసిన కూటమి ప్రభుత్వంపై ఉద్యమం ఉధృతం చేశారు. దశల వారీ ఆందోళనల్లో భాగంగా శనివారంతో రిలే నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. కాకినాడ జిల్లాలోని ఆయా నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, పార్టీ శ్రేణులు, అభ్యర్థులు దీక్షల్లో కూర్చున్నారు. కూటమి ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని పట్టుబట్టారు. అవినీతిపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. లోకేష్ బాధ్యత వహించాలి రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని, ప్రతిభకు అన్యాయం చేసి అడ్డదారిలో డీఎస్సీ ఉద్యోగాలను అనర్హులకు కట్టబెట్టిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా డిమాండ్ చేశారు. తుని సీఎంఆర్ సెంటర్లో డీఎస్సీలో అవకతవకలను నిరసిస్తూ పట్టణ, తుని మండలాలకు సంబంధించి మూడో రోజు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. దీక్షకు సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి మాట్లాడుతూ డీఎస్సీలో స్పోర్ట్స్, వికలాంగుల కోటాలో పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. డీఎస్సీలో జరిగిన లోపాలపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అస్తవ్యస్త పాలన పిఠాపురం: పిఠాపురం మండలం ఎఫ్కే పాలెంలో మూడో రోజు నిరాహార దీక్షలను నియోజకవర్గ కోఆర్డినేటర్ వంగా గీత ప్రారంభించారు. రాష్ట్రంలో చంద్రబాబు పాలన అస్తవ్యస్తంగా మారిందనడానికి డీఎస్సీ నియామకాలు ఓ ఉదాహరణ అని ఆమె అన్నారు. దీక్షలకు వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు రాగిరెడ్డి అరుణ్కుమార్ (బన్ని), జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత, మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి, పిఠాపురం బార్ అసోసియేషన్ న్యాయవాదులు సంఘీభావం తెలిపారు. మోసం చేయడమే చంద్రబాబు నైజం పెద్దాపురం: ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నైజమని వైఎస్సార్ సీపీ పెద్దాపురం నియోజకవర్గ పరిశీలకుడు నక్కా నగేష్ అన్నారు. సామర్లకోటలో నిరాహార దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించారు. డీఎస్సీలో నిరుద్యోగ యువతకు అన్యాయం జరిగిందన్నారు. మూడో రోజు నిరాహార దీక్షకు నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు అధ్యక్షత వహించగా, సీనియర్ నాయకుడు దవులూరి సుబ్బారావు, వైయస్సార్ సీపీ కాకినాడ జిల్లా పంచాయతీరాజ్ వింగ్ జిల్లా అధ్యక్షుడు మోరంపూడి శ్రీరంగనాయకులు, నియోజకవర్గ అధ్యక్షుడు నాగనబోయిన రాజబాబు. జెడ్పీటీసీ గవరసాయన సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.కూటమికి చెంపపెట్టు జగ్గంపేట: డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్ సీపీ చేస్తున్న ఆందోళనలు, రిలే దీక్షలతో కూటమి ప్రభుత్వంలో వణుకు పుడుతోందని, లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్ విద్యార్థి సంఘాల నుంచి పెరగడంతో కూటమి నేతలకు చెంపపెట్టులా మారిందని మాజీ మంత్రి, జగ్గంపేట నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి తోట నరసింహం అన్నారు. జగ్గంపేటలో వైఎస్సార్ విగ్రహం వద్ద మూడో రోజు నిరాహార దీక్షలను ఆయన ప్రారంభించారు. గండేపల్లి, కిర్లంపూడి మండలాలకు చెందని పార్టీ నేతలు, విద్యార్థి నేతలు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి తోట శ్రీరాంజీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒమ్మి రఘురాం పాల్గొన్నారు. డీఎస్సీలో అక్రమాల వల్లే సీబీఐ దర్యాప్తునకు వెనుకంజ లోకేశ్ మంత్రి పదవిని కాపాడుకునేందుకు పాకులాట ప్రభుత్వ అక్రమాలపై వైఎస్సార్ సీపీ నిరసన గళం ఉధృతమవుతున్న వైఎస్సార్ సీపీ ఉద్యమం రాజరికంలో ఉన్నట్టు.. కాకినాడ రూరల్: రాష్ట్రంలో చంద్రబాబు దుర్మార్గమైన పాలన సాగిస్తున్నారని, చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ రాజరికంలో ఉన్నట్టు భావిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దగా డీఎస్సీపై తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు చేపడుతున్న రిలే దీక్షలకు అనూహ్య స్పందన లభించిందన్నారు. సర్పవరం జంక్షన్లో మూడో రోజు రిలే దీక్షల శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. కరప, కాకినాడ రూరల్లోని పలు గ్రామాలకు చెందిన వారు దీక్ష చేపట్టి నిరసన తెలియజేశారు. -
రికార్డు స్థాయిలో భజన సంకీర్తన
● 108 రోజుల పాటు నిర్వహణకు ఏర్పాట్లు ● 864 భజన సమాజాలతో 2592 గంటల పాటు సంకీర్తన ● వేదిక కానున్న దుర్గాడ శివాలయం పిఠాపురం: గొల్లప్రోలు మండలం దుర్గాడలోని ప్రసిద్ధ పంచాయతన సమేత ఉమా రామలింగేశ్వర ఆలయ స్వర్ణోత్సవ, బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు అరుదైన ఘనత సాధించేందకు సిద్ధమయ్యారు. 108 రోజుల పాటు నిర్వరామంగా భజన నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయంలో స్వామి వారిని ప్రతిష్టించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 23వ తేదీ నుంచి డిసెంబర్ 12వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 864 భజన సమాజాలతో 2592 గంటల పాటు నిర్విరామ భజన నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. ఇది ప్రపంచ రికార్డు సాధించే అవకాశం ఉండడంతో ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. దీనిలో భాగంగా శనివారం ఆలయం ఆవరణలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి పందిరి రాట వేశారు. -
అన్నప్రసాదాన్ని ఆస్వాదిస్తూ ఆరగించనీ స్వామీ
తాత్కాలిక ఇరుకు షెడ్డులో భోజనాలు వడ్డించుకుంటున్న భక్తులు ఎండలో క్యూలైన్లో వేచి ఉన్న భక్తులు ఆత్రేయపురం: పిల్లా పాపలతో అన్న ప్రసాదం తినే భాగ్యం ఎప్పుడు స్వామీ అని భక్తులు వాడపల్లి వేంకటేశ్వరుని ప్రశ్నిస్తున్నారు. ప్రతి శనివారం ఇతర రాష్ట్రాలు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే లక్షకు పైగా వచ్చే భక్తులలో అన్న ప్రసాదం స్వీకరించే భక్తులు 30 నుంచి 40 వేల మంది ఉంటారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి స్థానిక ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆలయ అభివృద్ధి పనులను పరుగులు పెట్టించారు. సుమారు రూ.16 కోట్లతో చేపట్టిన పనుల్లో భాగంగా ప్రాకార మండపాన్ని పూర్తి చేయగా, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనుమతితో రూ.2.8 కోట్లతో కోనేటి అభివృద్ధి పనులను ప్రారంభించారు. అలాగే రూ.6.25 కోట్లతో వకుళమాత అన్నదాన భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. తదనంతర కాలంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో ఆ పనులన్నింటికీ బ్రేకులు పడ్డాయి. ఈ పనులపై నిత్యం ఆలయ నిర్వాహకులు, అధికారులు సమీక్షిస్తూనే ఉన్నప్పటికీ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టున్నాయి. విరాళాలు విరివిగా వస్తున్నా.. అన్నదాన భవనానికి భక్తులు భారీగా విరాళాలు ఇస్తుండడంతో ఆ నిధులు సుమారు రూ.12 కోట్లకు చేరుకున్నాయి. అయినప్పటికీ పనుల్లో పురోగతి లేదు. దీంతో పిల్లా పాపలతో వచ్చిన భక్తులు అన్న ప్రసాదం తినడానికి నానా అవస్థలు పడుతున్నారు. క్యూలైన్లలో కంచాలు తీసుకుని, అన్నం, కూరలు, సాంబారు వడ్డించుకుని తిందామనుకుంటే, సమీపంలో తాగునీరు లేక తిరిగి వడ్డించుకోలేక వారి బ్యాగులు మోయలేక కూర్చోలేక నుంచో లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. పట్టించుకోని కమిటీ సభ్యులు.. ఆలయ కమిటీ సభ్యులు శనివారం భక్తుల దర్శనాలకు సంబంధించిన వ్యవహారాలు తప్ప, అక్కడి భక్తుల ఇబ్బందులు పట్టించుకోవడంలేదు. అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నా ఉత్తుత్తి పర్యటనలు.. దేవదాయ శాఖ మంత్రి నుంచి, కమిషనర్ వరకు పనులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా పరిస్థితిలో మార్పు రావడంలేదు. తద్వారా అన్నదాతల ఆశయానికి ఇక్కడ తూట్లు పొడుస్తున్నారు. సౌకర్యవంతంగా అన్న ప్రసాదం తినేలా భవనాన్ని త్వరగా నిర్మించాలని భక్తులు కోరుతున్నారు. వకుళ మాత భవనం కోసం భక్తుల ఎదురుచూపు దాతల విరాళాలు రూ.12 కోట్లకు చేరినా జాప్యమే నత్తనడకన వాడపల్లిలో అభివృద్ధి పనులు -
కథల పోటీ కరపత్రం ఆవిష్కరణ
కపిలేశ్వరపురం (మండపేట): మండపేటలో శ్రీమతి అంగర లక్ష్మీకాంతం ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కథల పోటీ కరపత్రాన్ని శుక్రవారం సంగమం సాంస్కృతిక వేదిక నిర్వాహకులు డాక్టర్ చల్లా రవికుమార్, డాక్టర్ చల్లా మెహర్ ప్రసన్న ఆవిష్కరించారు. పోటీల నిర్వహణ కథా రచయితలకు రచనా అవకాశాలను కల్పిస్తుందని వారన్నారు. ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు అంగర కృష్ణశ్రీ మాట్లాడుతూ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 15 లోపు ‘కుటుంబ విలువలు’ అనే అంశంపై రాసిన తమ కథలను పంపాలన్నారు. మరిన్ని వివరాలకు 99631 63163 ఫోన్ నంబరులో సంప్రదించాలని కోరారు. -
రోగాల ముప్పేట దాడి
సామర్లకోట సీహెచ్సీలో చికిత్స పొందుతున్న బాధితులువైద్య బృందానికి పరిస్థితిని వివరిస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులుసామర్లకోట: ఒక్కొక్కరిగా మంచం పడుతున్నారు.. వివిధ రోగాలతో సతమతమవుతున్నారు.. పచ్చ కామెర్లు, కడుపు నొప్పి, జ్వరం ఇలా వివిధ రుగ్మతలతో సామర్లకోట సీహెచ్సీలో చికిత్స పొందుతున్నారు. పట్టణ ప్రజలకు తాగునీరు సరఫరా చేసే ఫిల్టర్ బెడ్ ప్లాంట్కు చెందిన చెరువులో చేపల వేటకు అనుమతి ఇవ్వడంతో నీరు కలుషితం కావడం వల్లే ఇలా జరుగుతుందని వైఎస్సార్ సీపీ నాయకులు మన్యం చంద్రరావు, కరణం రాజ్కుమార్, పాగా సురేష్కుమార్, నేతల హరిబాబు, సేపెని సురేష్, చిట్టుమాని శ్రీనివాస్, వారా సుధాకర్, కానేటి బుల్లి అప్పారావు, ఇరుసుమళ్ల సాయి, మాగాపు గోపు, లింగం శివకుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక సీహెచ్సీలో పచ్చ కామెర్లతో చికిత్స పొందుతున్న రోగులను వారు పరామర్శించారు. అలాగే విషయం తెలుసుకుని ఆస్పత్రికి మున్సిపల్ కమిషనర్ ఎన్.కనకారావు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ని వైఎస్సార్ సీపీ నాయకులు తాగునీటి కలుషితంపై నిలదీశారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని వారు ఆరోపించారు. అనేక మంది ఆస్పత్రిలో చేరితే ఎమ్మెల్యే కనీసం రాకపోవడం వింతగా ఉందన్నారు. సామర్లకోటలో అనేక మంది వివిధ రోగాల బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని కాకినాడ డీఎంహెచ్ఓ కార్యాలయానికి చెందిన బృందం సామర్లకోటకు వచ్చింది. డాక్టర్లు ప్రత్యూష, బేబీ, సీహెచ్ శ్రీనివాస్, రామానాయుడులు సీహెచ్సీలో రోగుల నుంచి వివరాలు సేకరించారు. అదేవిధంగా బలుసులపేట, భాస్కర్నగర్కు చెందిన బాధితులు ఎక్కువగా ఉండటంతో ఆయా ప్రాంతాలను డాక్టర్ల బృందం పరిశీలించింది. మున్సిపల్ కుళాయిల నుంచి వస్తున్న నీటిని తాగడం వల్లే రోగాల బారిన పడినట్లు బాధితుల బంధువులు వారికి తెలిపారు చేశారు. తాగునీటి చెరువును చేపల వేటకు అనుమతి ఇవ్వవద్దని ఫిర్యాదులు చేసినా, మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదని వైఎస్సార్ సీపీ నాయకులు తెలిపారు. కాలుష్య జలాలు సరఫరా కావడానికి కారణమైన సిబ్బందిని సస్పెండ్ చేయాలని, లేకుంటే ఆమరణ దీక్షలు చేస్తామని హెచ్చరించారు. దీనిపై ఆస్పత్రి ఇన్చార్జి కార్తీక్, డాక్టర్ శివజ్యోతి మాట్లాడుతూ సోమవారం కడుపు నొప్పి, వాంతులతో ఏడుగురు రోగులు చేరారని చెప్పారు. చికిత్స పొందుతున్న వారిలో ఒకరి పరిస్థితి మెరుగుపడటంతో ఇంటికి పంపామన్నారు. రోగాలకు గల కారణాలను తెలుసుకునేందుకు నీటి, ఆహార నమూనాలు సేకరించారని తెలిపారు. ఫ ఆసుపత్రిలో చేరిన బాధితులు ఫ కలుషిత నీరే కారణం ఫ అధికారులను నిలదీసిన వైఎస్సార్ సీపీ శ్రేణులు -
పెద్దాపురం
ప్రజలను మోసం చేయడమే చంద్రబాబు నైజమని వైఎస్సార్ సీపీ కాకినాడ పార్లమెంట్ పరిశీలకులు దాట్ల సత్యనారాయణరాజు అన్నారు. దాగా పడిన యువతకు మద్దతుగా సామర్లకోట స్టేషన్ సెంటర్లో నిరాహార దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించి, యువతను ఉద్దేశించి మాట్లాడారు. పిల్లను ఇచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు మోసాలు చేయడం కొత్త కాదన్నారు. ఈ దీక్ష శిబిరానికి పెద్దాపురం నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు నాయకత్వం వహించగా, రాష్ట్ర కార్యదర్శి నెక్కంటి సాయిప్రసాద్, పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డు తులసి మంగతాయారు, జెడ్పీటీసీ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
మానసిక ఒత్తిడిని జయిస్తే విజయమే
కాకినాడ క్రైం: రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్ శిక్షణలో తర్ఫీదు పొందుతున్న అభ్యర్థులకు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు మార్గనిర్దేశం చేశారు. కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ అధ్యక్షతన వర్చువల్ విధానంలో 5,560 మంది కానిస్టేబుళ్లు చాగంటి ఉవాచకు హాజరయ్యారు. విధి నిర్వహణలో మానసిక ఒత్తిడిని జయిస్తే జయమేనని కోటేశ్వరరావు అన్నారు. పోలీసు శాఖలో నిజాయతీ, క్రమశిక్షణ, ఓర్పు ఉన్నత స్థానాలకు చేరుస్తాయన్నారు. ప్రజలు నిస్సహాయ స్థితిలో వస్తే వారికి మేమున్నామన్న భరోసా ఇవ్వడం కొండంత అండన్విడమేనని చాగంటి అన్నారు. ఫిర్యాదుదారులతో మర్యాద పూర్వకంగా నడుచుకోవాలని తెలిపారు. అనంతరం ఆయనను రాష్ట్ర పోలీస్ శాఖ తరఫున ఎస్పీ బిందుమాధవ్ ఘనంగా సత్కరించారు. ఆన్లైన్ విధానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ ఐజీ అంబురాజన్, ట్రైనింగ్ ఏఐజీ సత్తిబాబు, 21 పోలీస్ శిక్షణ కళాశాలలకు చెందిన ప్రిన్సిపాల్స్, జిల్లా అదనపు ఎస్పీ మహంతి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ధరహాసంసాక్షి, అమలాపురం: కోనసీమ కొబ్బరి మార్కెట్లో మళ్లీ జోష్ నెలకొంది. శ్రావణ మాసం, వినాయక చవితి పండగ కొనుగోళ్లతో కొబ్బరి కాయలకు డిమాండ్ వచ్చింది. దీంతో, ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అంబాజీపేట కొబ్బరి మార్కెట్లో వెయ్యి కొబ్బరి కాయల ధర రూ.20 వేల నుంచి రూ.22 వేల వరకూ పలుకుతోంది. గత 15 రోజుల కిందట రూ.15 వేల వరకూ ఉన్న ధర ఏకంగా రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకూ పెరిగింది. అప్పుడే దింపు తీసిన పచ్చి కొబ్బరి కాయకు మాత్రమే ఈ ధర ఉంది. ముక్కుడు కాయ (3 నెలలకు పైగా నిల్వ ఉన్న) కాయ ధర మాత్రం రూ.17 వేల నుంచి రూ.18 వేల వరకూ ఉంది. ఇప్పటికే శ్రావణ మాసం సీజన్ అమ్మకాలు పూర్తి కాగా, వచ్చే భాద్రపదం, వినాయక చవితికి దండిగా అమ్మకాలు జరగనున్నాయి. ఇప్పుడు నిల్వ ఉన్న కొబ్బరి అమ్మే అవకాశం లేనందున కొత్తగా దింపు తీసిన కాయలకు మంచి డిమాండ్ ఏర్పడింది. వచ్చేది పండగల సీజన్ కావడంతో ప్రతి ఇంటా కొబ్బరి కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. అదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఆర్డర్లు కూడా పెరిగాయి. ఈ పరిణామం కూడా కొబ్బరి ధర పెరగడానికి కారణమైంది. మరోసారి రికార్డు స్థాయిలో పెరుగుతున్న కొబ్బరి రేటు వెయ్యి కాయల ధర రూ.20 వేల నుంచి రూ.22 వేలు 15 రోజుల్లో రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకూ పెరుగుదల శ్రావణం, వినాయక చవితితో కొనుగోలు సందడి జోరందుకున్న ఎగుమతులు తగ్గిన తమిళనాడు దిగుమతులు ఇదే సమయంలో తమిళనాడు ప్రాంతంలో తయారీ కొబ్బరి (ఎండు కొబ్బరి) ధర పెరిగింది. దీంతో, అక్కడి రైతులు పెద్ద ఎత్తున ఎండు కొబ్బరి తయారు చేస్తున్నారు. దీనివల్ల ఉమ్మడి గోదావరి జిల్లాలకు తమిళనాడు నుంచి కొబ్బరి కాయల దిగుమతులు తగ్గాయి. దీనివలన కూడా ఇక్కడి కొబ్బరి ధరలకు రెక్కలొస్తున్నాయి. సాధారణంగా ధర ఉంటే దిగుబడి ఉండదు. కానీ, ప్రస్తుతం ఎకరాకు రెండు నెలల దింపు సగటున వెయ్యి కాయల వరకూ ఉంటోంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 1.80 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతోంది. ధరలు పెరగడంతో ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతులు కూడా వేగం పుంజుకున్నాయి. ఇక్కడి నుంచి రోజుకు 75 నుంచి 100 లారీల కొబ్బరి ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, బిహార్, రాజస్థాన్లకు ఎగుమతి అవుతోంది. మార్కెట్లో నెలకొన్న ఈ జోష్ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని, ధర మరింత పెరుగుతుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. -
ప్రసవ వేదనను మించి వేధించారు..
ముమ్మిడివరం: స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల గర్భిణులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నట్టు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జి.దుర్గాప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలోని డాక్టర్ వీవీఎస్ సత్యకుమార్ నిర్లక్ష్యం వల్ల మండలంలోని అనాతవరానికి చెందిన గర్భిణి సకిలే విమల, ఆమె కుటుంబ సభ్యులు ఎదుర్కొన్న సమస్యపై దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో డీఎంహెచ్ఓకు ఫిర్యాదు చేశారు. ఈ నెల మూడో తేదీన విమలను ఆమె కుటుంబ సభ్యులు ప్రసవం కోసం ఆస్పత్రిలో చేర్చగా గైనకాలజిస్టు సత్యకుమార్ కొన్ని పరీక్షలు చేసి నాలుగో తేదీన ఆపరేషన్ చేస్తానని పంపేశారు. కాగా ఆ రోజు విమలను ఆపరేషన్ థియేటర్లోనికి తీసుకువెళ్లి 4 గంటల అనంతరం వచ్చి ఆమెకు ఆపరేషన్ చేయడం లేదని, మరికొన్ని పరీక్షలు చేయాలని, తల్లి, లేదా బిడ్డ ఎవరో ఒకరే బతికే అవకాశం ఉందని తమను తీవ్ర ఆందోళనకు గురిచేశారని ఆమె కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. చివరకు వైద్యానికి కాకినాడ తీసుకువెళ్లాలని చెప్పడంతో అంబులెన్స్ సిద్ధం చేశామని, అంతలోనే తానే ఆపరేషన్ చేస్తానని సత్యకుమార్ వారిని ఆపేశారు. దీంతో ఆయనపై అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చగా సాధారణ ప్రసవమై, తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని వారు తెలిపారు. దీనిపై ఆందోళనకు దిగిన విమల కుటుంబ సభ్యులు, సీఐటీయూ నాయకులతో ఆసుపత్రి సూపరింటెండెంట్తో చర్చలు జరిపారు. నిర్లక్ష్యంగా వ్యవహిరించిన డాక్టర్ సత్యకుమార్పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని భవిష్యత్లో ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాలని వారు డిమాండ్ చేశారు. అపరేషన్ చేస్తానని.. లేదు లేదు కాకినాడ తీసుకువెళ్లాలని.. వద్దులెండి నేనే చేస్తాను ఆగండని.. తల్లీ బిడ్డల్లో ఒకరే బతుకుతారని.. మానసిక వేదనకు గురిచేసిన ప్రభుత్వ ప్రసూతి వైద్యుడు చివరకు ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం సాధారణ ప్రసవంతో తల్లీ బిడ్డా క్షేమం ప్రభుత్వ వైద్యునిపై డీఎంహెచ్ఓకు ఫిర్యాదు -
దిశ బిల్లు రద్దుతో చీకటి రోజులు
పిఠాపురం రూరల్: దిశ బిల్లును రద్దు చేయడం అంటే, మహిళా లోకానికి చీకటి రోజులు తేవడమేనని వైఎస్సార్ సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత అన్నారు. దిశ బిల్లును రద్దు చేసిన కూటమి ప్రభుత్వానికి మహిళల రక్షణపై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతుందన్నారు. మహిళలపై పెరుగుతున్న దాడులు, వేధింపుల నేపథ్యంలో దిశ బిల్లు రద్దు చేయడం చాలా దారుణమన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మహిళలకు భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక ‘దిశ’ బిల్లు తెచ్చారని, ప్రమాద సమయంలో ఫోన్ ఊపితే చాలు 15 నిమిషాలలో పోలీసులు అక్కడికి వచ్చి రక్షించేవారన్నారు. దిశ యాప్ను 1.5 కోట్ల మంది మహిళలు డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు. అటువంటి దిశా చట్టాన్ని రద్దు చేస్తుంటే హోం మంత్రి అనిత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం దారుణమన్నారు. అదేవిధంగా రాజమహేంద్రవరానికి చెందిన వైద్యా విద్యార్థిని ప్రియాంకపై మద్యం మత్తులో కావాలని కారు ఎక్కించి మరణానికి కారణమైన ఇద్దరు దుర్మార్గులను ఉరి తీయాలని డిమాండ్ చేశారు. పారదర్శకంగా ‘సర్’ ప్రక్రియ కాకినాడ లీగల్: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (సర్) ప్రక్రియలో నోటీసులు అందుకున్న ప్రతి ఓటరుకు నిబంధనల ప్రకారం సముచితమైన విచారణ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల అదనపు కమిషనర్ ఢిల్లీ రావు అధికారులను ఆదేశించారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు జాబితాకు దూరం కాకుండా పారదర్శకంగా విచారణ చేపట్టాలని స్పష్టం చేశారు. శుక్రవారం వెలగపూడి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సర్ ప్రక్రియపై ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, బీఎల్వోలు, ఇతర సిబ్బందితో ఢిల్లీ రావు సమీక్ష నిర్వహించారు. కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో కమిషనర్ సత్యనారాయణ, కాకినాడ నగర ఈఆర్ఓ, అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, ఏఈఆర్ఓ, డిప్యూటీ కమిషనర్ కె.శ్రీనివాస్, కాకినాడ నగర ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ గోవిందరాజులు, సూపర్వైజర్లు, బీఎల్వోలు పాల్గొన్నారు. రుణ బాధితులకు చెక్కుల పంపిణీ మలికిపురం: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సఖినేటిపల్లి బ్రాంచిలో రుణ బాధితులకు వా రి బంగారానికి సంబంధించిన నగదు పంపిణీ ప్రారంభమైంది. ఈ ఎస్బీఐ బ్రాంచిలో సుమారు ఆరేళ్ల క్రితం జరిగి బంగారు రుణాల స్కామ్ను అప్పట్లో సాక్షి వెలుగులోకి తెచ్చింది. అప్పట్లో బంగారం కుదువ పెట్టి కొంత మంది ఖాతాదారులు రుణాలు పొందారు. కొంత మంది బ్యాంకు ఉద్యోగులు మాయాజాలం చేసి అదే బంగారంపై తిరిగి రుణాలు పొందారు. దీనిపై అప్పట్లో సీబీఐ విచారణ ప్రారంభం కాగా, రుణాలు పొందిన ఖాతాదారుల బంగారం బ్యాంకులో చిక్కు పడిపోయింది. రూ.కోట్లలో జరిగిన ఈ స్కామ్పై కొన్నాళ్లుగా సాక్షి ప్రచురించిన కథనాలకు రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ స్పందించారు. బ్యాంకు ఉన్నతాధికారులతో మాట్లాడి, బాధితులు అప్పట్లో కుదువ పెట్టిన బంగారానికి ప్రస్తుత మార్కెట్ విలువ కట్టి చెక్కులు ఇప్పించే ఏర్పాటు చేశారు. మొత్తం 72 గోల్డ్ లోన్లలో 59 మంది అర్హులుగా గుర్తించగా, తొలి విడతలో ఐదుగురికి ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ.35 లక్షల చెక్కులను విశ్వేశ్వరాయపురంలో పంపిణీ చేశారు. కొత్త డిజైన్లపై దృష్టి సారించాలి అమలాపురం రూరల్: చేనేత రంగాన్ని మరింత లాభసాటిగా తీర్చిదిద్దేందుకు నేతన్నలు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, డిమాండ్కు అనుగుణంగా నూతన డిజైన్లు, నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేయాలని కలెక్టర్ మహేష్ కుమార్ అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం జరిగిన జాతీయ చేనేత దినోత్సవ సభలో ఆయన మాట్లాడారు. చేనేత సహకార సంఘాలు కేవలం ప్రభుత్వ ఆర్డర్ల పైనే ఆధారపడకుండా ఓపెన్ మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకోవాలని అన్నారు. కలెక్టర్ను బండారులంకకు చెందిన మాజీ జెడ్పీటీసీ సభ్యుడు చింతా శంకరమూర్తి, చేనేత సంఘాల నాయకులు పర్వతం చిట్టిబాబు, ఆశపు రామలింగేశ్వరరావు, పిచ్చిక శ్యామ్లు రాట్నం, అయినవిల్లి సిద్ధివినాయకుని చిత్రపటం అందించి సత్కరించారు. డీఆర్ఓ వి.సుబ్బారావు, హ్యాండ్లూమ్స్ ఏడీ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
మిరపురాని రోజులొచ్చేలా..
● పొట్టి మిర్చికి పునర్జన్మ ● కనుమరుగైన పంటను కాపాడే ప్రయత్నం ● అరుదైన పంటగా పరిశోధనల్లో గుర్తింపు ● మళ్లీ ప్రారంభించేందుకు సన్నాహాలు ఆ రోజుల్లో పొట్టి మిర్చి ఓ వెలుగు వెలిగింది.. పుడమి పుత్రులకు లాభాలు తెచ్చిపెట్టింది.. అలాంటి అరుదైన పంట ఇప్పుడు కనుమరుగైంది. ఈ సాగుకు పుట్టినిల్లు అయిన కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలో మళ్లీ ఈ పంటను కాపాడే ప్రయత్నం మొదలైంది. ఇది అరుదైన రకంగా శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో తేలడంతో జీఐ ట్యాగ్ భౌగోళిక గుర్తింపు సాధించేందుకు ప్రయత్నాలు చేసి, సాగుకు సన్నాహాలు ప్రారంభించారు. పిఠాపురం: ఎర్రగా.. గుండ్రంగా చూడడానికి చెర్రీ పండులా నోరూరించేలా పొట్టి మిర్చి ఉంటోంది. దీనిని కొరికితే చెంబుడు నీళ్లు తాగాల్సి వస్తోంది. అంత కారంగా ఉంటుంది. దీని కారం లాగానే లాభాల ఘాటు కూడా ఎక్కువే. దేశ విదేశాల్లో మిర్చి రకాల్లో పేరొందిన ఈ పొట్టి మిర్చి కేవలం కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం పుట్టినిల్లు. మిరప పంటతో పాటు, మిరపపొడి (కారం) తయారీ కూడా ఇక్కడ ఎక్కువగా జరుగుతుంది. ఈ ప్రాంతంలోని రేవడి నేలలు పంటకు అనుకూలంగా ఉంటాయి. రేవడి పంటలో పొట్టి మిర్చి ప్రధానమైనది. ఈ రకం మిర్చిని జిల్లాలో ఒక్క గొల్లప్రోలు ప్రాంతంలోనే సాగు చేసేవారు. దీనినే ‘గొల్లప్రోలు మిర్చి’గా పిలుస్తారు. గొల్లప్రోలు, చేబ్రోలు, దుర్గాడ, చెందుర్తి, తాటిపర్తి, ఎ.విజయనగరం గ్రామాల్లో సుమారు 600 నుంచి 800 ఎకరాల్లో 350 మంది రైతులు పొట్టి మిర్చి సాగు చేసేవారు. దీనిని ఎండు మిర్చికే వాడతారు. దీనిని మరాఠీ వాసులు అమితంగా ఇష్టపడతారు. దీనిని వారు ‘బోరు’మిర్చి అని పిలుస్తారు. ఉత్తరాది వారు ‘బేర్’మిర్చి అని అంటారు. బోరు అనగా మరాఠీలో నేరేడు పండు అని అర్థం. నేరేడు కాయ సైజులో గుండ్రంగా ఉండటంతో వారు దీనిని బోరు మిర్చి అని పిలుస్తారు. ఇక్కడ పండిన పంటలు 90 శాతం మేర మహారాష్ట్రకు అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి అవుతుండేది. సొంతంగా విత్తనాభివృద్ధి ఇక్కడ రైతులు సొంతంగానే విత్తనాన్ని అభివృద్ధి చేసుకోవడం విశేషం. బయట మార్కెట్లో విత్తనాన్ని కొనుగోలు చేయరు. తమకు పండిన పంటలో నాణ్యమైన కాయలను ఎంపిక చేసుకుని ఎండబెట్టి విత్తనాన్ని సిద్ధం చేసుకుంటారు. వారే స్వయంగా విత్తనాభివృద్ధి చేసి తోటి రైతులకు సైతం విక్రయించేవారు. ఎకరాకు 70 నుంచి 80 బస్తాల దిగుబడి వస్తుంది. ఏడాదికి 250 నుంచి 330 టన్నులు గొల్లప్రోలు మండలంలో వివిధ గ్రామాల నుంచి సంవత్సరానికి 250 నుంచి 330 టన్నుల మిర్చి ఎగుమతి జరుగుతుండేది. ఇక్కడి నుంచి ఎక్కువగా మహారాష్ట్రలోని ముంబయి, పూణేలకు తరలిస్తుంటారు. అక్కడ వీటిని కారం తయారీకి ఉపయోగిస్తుంటారు. సాధారణ మిరప కంటే మూడు రెట్లు అదనపు ధర లభిస్తుండడంతో రైతులు పొట్టి మిరప సాగుపై ఎక్కువ ఆసక్తి చూపించేవారు. వాతావరణం అనుకూలిస్తే, పెట్టుబడి పోను ఎకరాకు రూ.70 వేల నుంచి రూ.90 వేల వరకు ఆదాయం లభించేదని రైతులు చెబుతున్నారు. పరిశోధనలు ప్రారంభం నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ కమర్షియల్ అగ్రికల్చర్ కేంద్ర వాణిజ్య పంటల పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో అత్యంత విలువైన డిమాండ్ ఉన్న పొట్టి మిరపపై పరిశోధనలు చేసేందుకు అప్పట్లో చర్యలు తీసుకున్నారు. దుర్గాడ పొట్టి మిర్చికి భౌగోళిక గుర్తింపు (జీఐ) ట్యాగ్ సాధించేందుకు రాజమహేంద్రవరం కేంద్రంగా పనిచేస్తున్న ఐసీఏఆర్–నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ కమర్షియల్ అగ్రి కల్చర్ (ఐసీఏఆర్ ఎన్ఐఆర్సీఏ) పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పాడా) సంయుక్తంగా చర్యలు ప్రారంభించాయి.శాసీ్త్రయ ఆధారాలు లభించాయి ఐసీఏఆర్– నిర్కా శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనల్లో దుర్గాడ పొట్టి మిర్చి అత్యుత్తమ నాణ్యతను కలిగి ఉండటమే కాకుండా, ఈ ప్రాంతంలోనే అత్యుత్తమంగా పండుతుందని నిర్ధారించడంతో జీఐ ట్యాగ్కు బలమైన ఆధారాలు లభించాయి. –రాజశేఖరరెడ్డి, సీనియర్ సైంటిస్ట్, ఐసీఏఆర్ ఎన్ఐఆర్సీఏ పూర్వ వైభవం తీసుకొస్తాం దుర్గాడ పొట్టి మిర్చి సాగును రైతులు విస్తరించేలా చర్యలు తీసుకుంటున్నాం. జీఐ గుర్తింపు లభిస్తే ఈ పంటకు ప్రత్యేక గుర్తింపు, అధిక మార్కెట్ విలువ లభించి రైతులకు లాభాలు పెరుగుతాయి. పొట్టి మిర్చికి పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నం విజయవంతం కావడం ద్వారా రైతులకు మేలు చేసేందుకు కృషి చేస్తున్నాం. –డాక్టర్ ఎన్వీ శివరాం ప్రసాద్, పాడా ప్రాజెక్టు డైరెక్టర్ -
పరుగులు తీసిన బ్యాటరీ కార్లు
అన్నవరం: స్థానిక వీరవెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయానికి వచ్చే భక్తుల్లో వృద్ధులు, వికలాంగుల కోసం దాతలు సమకూర్చిన బ్యాటరీ కార్లు తిరిగి రత్నగిరిపై పరుగులు తీస్తున్నాయి. ఈ బ్యాటరీ కార్లు ఆరు నెలలుగా మరమ్మతులకు గురై కొండ దిగువన గ్యారేజీలో ఉన్న వైనంపై ఈ నెల 5న ‘సాక్షి’ దినపత్రికలో ‘దర్శన భారము నీదే స్వామీ..!’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు స్పందించి వెంటనే బ్యాటరీ కార్లకు మరమ్మతులు చేయించాలని సిబ్బందిని ఆదేశించారు. వెంటనే ఈ కార్లకు మరమ్మతులు చేయించి రత్నగిరికి తీసుకువచ్చారు. శుక్రవారం పశ్చిమ రాజగోపురం నుంచి స్వామివారి నిత్యాన్నదాన పథకం, సత్రాలకు వికలాంగులు, వృద్ధులను తీసుకువచ్చి మరలా రాజగోపురం వద్దకు దింపారు. -
కాకినాడ రూరల్
అడ్డగోలుగా డీఎస్సీ నియామకాలు చేపట్టి, అర్హులైన అభ్యర్థులకు అన్యాయం చేసిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసే వరకూ ఉద్యమం ఆగదని కాకినాడ రూరల్ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ నాయకులు నిరసన గళం వినిపించారు. డీఎస్సీ అక్రమాలపై బాధితులకు అండగా వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు పార్టీ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. సర్పవరం జంక్షన్ వద్ద రెండో దీక్షలో కాకినాడ అర్బన్లోని రూరల్ నియోజకవర్గ డివిజన్ల నాయకులు, కార్యకర్తలు, పలు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 23,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 25,500 గటగట (వెయ్యి) 22,500 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
అత్యుత్సాహం ప్రదర్శించి..
శనివారం శ్రీ 8 శ్రీ ఆగస్టు శ్రీ 2026టెంట్లు తొలగించి.. తొండంగి: దగా డీఎస్సీపై వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో తొండంగిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షను భగ్నం చేసేందుకు టీడీపీ నేతల ప్రోద్బలంతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. రిలే నిరాహార దీక్షలను భగ్నం చేసేందుకు ప్రయత్నించారు. అయినా వెనక్కి తగ్గకుండా దీక్షను వైఎస్సార్ సీపీ, యువత కొనసాగించింది. తొండంగి గ్రామంలో ఓ ప్రైవేటు స్థలంలో రిలే నిరాహార దీక్ష కోసం ఏర్పాట్లు చేసుకోగా, స్థల యజమానిని పోలీస్ స్టేషన్కు పిలిపించి బెదిరించడంతో పాటు గురువారం రాత్రి తొండంగిలో ప్రతిపాదిత దీక్షా స్థలంలో ఏర్పాటు చేసుకున్న స్టేజీని, ఇతర సామగ్రిని తొలగించారు. పోలీసుల బెదిరింపులకు లొంగని వైఎస్సార్ సీపీ శ్రేణులు, యువత శుక్రవారం ఉదయం తొండంగిలోనే పార్టీ నాయకుని స్థలం వద్ద మళ్లీ టెంట్ ఏర్పాటు చేసుకొని రిలే నిరాహార దీక్ష చేపట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తొండంగి ఎస్సై జగన్మోహన్రావు, ఇతర పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాలతో సివిల్ డ్రస్లో అక్కడికి చేరుకొని రిలే దీక్షను భగ్నం చేసేందుకు యత్నించారు. అయినప్పటికీ వైఎస్సార్ సీపీ శ్రేణులు శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. అనంతరం పోలీసులు యూనిఫాం ధరించి నిరాహార దీక్ష చేపట్టిన స్థలం వద్ద టెంట్లను తొలగించారు. దీంతో మండుటెండైనా లెక్కచేయబోమంటూ ఎండలోనే వారంతా రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఎండ తీవ్రత పెరగడంతో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా వారందరికీ గొడుగులు ఏర్పాటు చేయించారు. దీంతో గొడుగులు చేతబట్టి సాయంత్రం వరకు రిలే నిరాహార దీక్ష కొనసాగించారు. దగా డీఎస్సీపై సీబీఐ విచారణ జరపాలని, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బేషరతుగా రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రిలే దీక్షకు సంఘీభావం దగా డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపి నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేయాలని తొండంగిలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో యువత చేపట్టిన రిలే నిరాహార దీక్షకు మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా సంఘీభావం తెలిపారు. ఆయన దీక్షలో కూర్చుని కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఈ సందర్భంగా రాజా విలేకరులతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుత వాతావరణంలో వైఎస్సార్ సీపీ యువత చేస్తున్న రిలే నిరాహార దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు స్పందించిన తీరును తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వ పాలనలో పోలీసులను వినియోగించుకుని రెడ్బుక్ పేరుతో దుష్టపాలన సాగిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మడదా హేమంత్, పార్టీ నేతలు పాల్గొన్నారు. ఫ తొండంగిలో దీక్షను భగ్నం చేసేందుకు కుట్ర ఫ తగ్గేది లేదన్న వైఎస్సార్ సీపీ శ్రేణులు, యువత ఫ సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి దాడిశెట్టి రాజా శాంతియుత నిరసనపై ‘కూటమి’ కుట్ర పన్నింది.. టెంట్లు తొలగించేలా, దీక్ష భగ్నం చేసేలా ఖాకీలకు పనిజెప్పింది.. ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు అత్సుత్సాహం ప్రదర్శించినా, చివరికి నిరసన గళం మొక్కవోని దీక్షతో కొనసాగింది. దీనికి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మద్దతు తోడవడంతో ఆందోళన విజయవంతం అయ్యింది. -
క్రీడా పోటీల నిర్వహణపై సమీక్ష
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): అమరావతి చాంపియన్ షిప్– 2026 జిల్లా స్థాయి టోర్నమెంట్ ఎంపిక పోటీలు ఈ నెల 12, 13 తేదీల్లో విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లో శుక్రవారం శాప్ ఆధ్వర్యంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ నిర్వహించనున్న ఈ పోటీల నిర్వహణపై ఆయన సమీక్షించారు. ఈ పోటీల్లో ఏడు నియోజకవర్గాలకు సంబంధించి అండర్– 17, 23 బాల బాలికలు సుమారు 1,500 వరకు పాల్గొంటారన్నారు. 12న బాలికలకు, 13న బాలురకు క్రీడలు నిర్వహిస్తారన్నారు. విజేతలు ఈ నెల 19 తేదీ నుంచి రాష్ట్ర స్థాయిలో తిరుపతిలో నిర్వహించే పోటీల్లో పాల్గొంటారన్నారు. డీఎస్డీఓ వసతి భోజన ఏర్పాట్లను పర్యవేక్షించాలన్నారు. ఫ వీబీజీ రాంజీ పథకాన్ని అటవీ శాఖ, డీఆర్డీఏ సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకువెళ్లాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉపాధి కల్పించేలా, దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చే పండ్లు ఇచ్చే మొక్కలు, వెదురు తోటల పెంపకాన్ని చేపట్టాలన్నారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ ప్రియా, జిల్లా అటవీ శాఖ అధికారి రామచంద్రరావు, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, డ్వామా పీడీ ఎస్.మధుసూదన్ పాల్గొన్నారు. -
తలుపులమ్మ తల్లికి సారె సమర్పణ
తుని రూరల్: లోవ దేవస్థానంలో కొలువైన తలుపులమ్మ తల్లికి ఆషాఢమాసం సందర్భంగా అన్నవరం వీరవెంకట సత్యనారాయణస్వామి దేవస్థానం తరఫున పట్టువస్త్రాలు, గాజులతో సారె సమర్పించారు. శుక్రవారం అన్నవరం దేవస్థానం ఈఓ నల్లల సూర్యచక్రధరరావు, ట్రస్ట్ బోర్డు సభ్యుల కుటుంబాలు సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవార్ల సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టువస్త్రాలు, మంగళద్రవ్యాలు, పసుపు కుంకుమలు, ఫల పుష్పాలు, పిండివంటల సారెతో లోవకు చేరుకుని తలుపులమ్మకు సమర్పించారు. అమ్మవారిని దర్శించిన ఈఓ, ట్రస్ట్ బోర్డు కుటుంబ సభ్యులకు వేదపండితులు వేదాశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా అన్నవరం, లోవ దేవస్థానం ఈఓలు సూర్యచక్రధరరావు, విశ్వనాథరాజు మాట్లాడుతూ ఆనవాయితీగా వచ్చే సంప్రదాయాలను కొనసాగిస్తూ దేవాలయాల మధ్య ఆధ్యాత్మిక అనుబంధం పెంచేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. చైర్మన్ పెంటకోట భాస్కర సత్యనారాయణ, ధర్మకర్తలు పాల్గొన్నారు. ● లోవ తలుపులమ్మ అమ్మవారికి రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత చీర సారెను సమర్పించారు. దేవస్థానానికి వచ్చిన అనితకు ఈఓ పి.విశ్వనాథరాజు, చైర్మన్ పెంటకోట భాస్కర సత్యనారాయణ, వేదపండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. -
కొనసాగిన బోధనేతర సిబ్బంది ఆందోళన
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది ఉద్యోగ భద్రత కోసం యూనివర్సిటీ ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజైన శుక్రవారం కూడా కొనసాగాయి. 20 ఏళ్ల నుంచి చాలీచాలని వేతనాలతో విధులు నిర్వర్తిస్తున్న తమ సర్వీసులను గుర్తించి, రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేశారు. అయితే ఈనెల ఒకటిన ఇందుకు విరుద్ధంగా జారీ చేసిన టెండర్ నోటీసును తక్షణమే రద్దు చేసి, తమకు న్యాయం చేయాలని కోరారు. అప్పటి వరకు ఈ దీక్షలను విరమించేది లేదని స్పష్టం చేశారు. వీరి దీక్షలకు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా సంఘీభావం తెలిపారు. సిబ్బంది సమస్యల పరిష్కరించే వరకూ తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని వారికి జక్కంపూడి భరోసా ఇచ్చారు.సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్యే రాజా


