breaking news
Kakinada District News
-
తుపాను నేపథ్యంలో పలు రైళ్ల రద్దు
రాజమహేంద్రవరం సిటీ: తుపాను ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లా మీదుగా నడిచే పలు రైళ్లను మంగళవారం రద్దు చేసినట్లు అధికారులు సోమవారం ప్రకటించారు. తిరుపతి– విశాఖపట్నం(08584), మహబూబ్నగర్– విశాఖపట్నం (12862), చైన్నె– విశాఖపట్నం స్పెషల్ (22802), రాజమహేంద్రవరం– విశాఖపట్నం(67286), భువనేశ్వర్ – బెంగళూరు ఎక్స్ప్రెస్ (18463), భువనేశ్వర్ – సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్(17015), భువనేశ్వర్ –పాండిచ్చేరి (20851) రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించారు. రద్దయిన రైళ్లలో రిజర్వేషన్ పొందిన ప్రయాణికులకు టికెట్ పూర్తి మొత్తాన్ని అందించేందుకు అవసరమైన కౌంటర్లను స్టేషన్లో ఏర్పాటు చేశారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని 24 గంటలు అందుబాటులో ఉండేలా రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు రైల్వే స్టేషన్ సీటీఐ సుంకర చంద్రమౌళి తెలిపారు. ప్రయాణికులు రైళ్ల రాకపోకల వివరాలను తెలుసుకునేందుకు 83319 87657 నంబర్లో సంప్రదించాలన్నారు. -
తుపాను నుంచి పశువులను ఇలా కాపాడాలి
పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ విజయరెడ్డి అమలాపురం టౌన్: మోంథా తుపాను హెచ్చరికల నేపథ్యంలో పశువులను మేపే రైతులంతా తమ పశువుల పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని పశు సంవర్ధక శాఖ అమలాపురం సహాయ సంచాలకులు డాక్టర్ ఎల్. విజయరెడ్డి సూచించారు. తన పరిధిలో ఉన్న రైతులను, పశు వైద్యాధికారులు, సహాయకులను ఆయన అప్రమత్తం చేశారు. పశువులను పెంచే పలు ప్రాంతాలకు డాక్టర్ విజయరెడ్డి సోమవారం వెళ్లి పశు పోషణ రైతులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. తుపాను కారణంగా పశువుల్లో అస్వస్థత, మరణాలు సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించారు. జాగ్రత్తలు ఇలా.. ● పశువుల షెడ్లు గాలి వానకు కూలి పోకుండా మరమ్మతులు చేయించాలి. ● పశువులకు నట్టల నివారణ మందులను వాడి వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. ● బాహ్య పరాన్న జీవుల నిర్మూలన మందులను వాడాలి. ● విష సర్పాల నుంచి కాపాడుకోవాలి. ● అధిక వర్షాలు, తుపాను సమయంలో పశువులను రాటకు కట్టకుండా వదిలేయాలి. ● లేగ దూడలు చలి బారిన పడకుండా వెచ్చని వాతావరణం కల్పించాలి. ● అవసరాలకు అనుగుణంగా దాణాను, మేతను నిల్వ ఉంచుకోవాలి. ● పశువులను విద్యుత్ తీగలకు, కరెంట్ స్తంభాలకు దూరంగా ఉంచాలి. ● వాతావరణ కేంద్రం సూచనలకు అనుగుణంగా యాజమాన్య పద్ధతులు పాటించాలి. ● పశువుల మేత తడిసిపోకుండా భద్ర పరుచుకోవాలి. ● పశువుల దాణా తడిస్తే బూజు పడుతుంది కాబట్టి జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. ● పశువులను వర్షంలో మేతలకు తోలకూడదు. ● కూలిపోయే అవకాశం ఉన్న చెట్ల కింద, గోడల దగ్గర, పాకల దగ్గర పశువులను కట్టకూడదు. ● పశువులు వర్షంలో తడిస్తే శరీర ఉష్ణోగ్రత తగ్గిపోయి జబ్బు పడి చనిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దూడలు, గొర్రెలను తడవకుండా కాపాడుకోవాలి. ● పశువులకు ఏమైనా జబ్బుగా ఉంటే దగ్గరలోని పశు వైద్య సిబ్బందికి తెలియజేస్తే తక్షణమే వైద్యం అందుతుంది. ● పశువులు ఎక్కడైనా చనిపోతే పశు వైద్య సిబ్బందికి తెలియజేస్తే పై అధికారులకు వివరాలు పంపేందుకు వీలు ఉంటుంది. ● గేదెలు, ఆవులకు పచ్చిక దొమ్మ, జబ్బ వాపు రాకుండా, గొర్రెలకు నేల మరక రాకుండా టీకాలు వేయించుకోవాలి. ● పశువులకు తుపాను కారణంగా ఏ చిన్న సమస్య ఎదురైనా తక్షణమే ఆ సమాచారాన్ని రైతులకు సమీపంలో ఉన్న పశు వైద్యాలయం లేదా పశు వైద్యాధికారులకు అందజేస్తే తమ సిబ్బంది తక్షణమే స్పందిస్తారని సహాయ సంచాలకులు డాక్టర్ విజయరెడ్డి విజ్ఞప్తి చేశారు. -
పర కాల్వలో పడి బాలుడి గల్లంతు
● మేనమామతో కాజ్ వే దాటుతుండగా గోతిలో పడిన బైక్ ● రాత్రి వరకు ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది గాలింపు కాకినాడ రూరల్: మండలంలోని సూర్యారావుపేట గ్రామ పరిధిలోని పర కాల్వలో సోమవారం 12 ఏళ్ల బాలుడు పోలవరపు సాయి చరణ్ రుత్విక్ గల్లంతయ్యాడు. తిమ్మాపురం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడ మధురానగర్కు చెందిన పోలవరపు రమణకు భార్య, పాప, బాబు ఉన్నారు. రమణ వాచ్మన్గా పనిచేస్తున్నాడు. బడికి సెలవు ఇవ్వడంతో కుమారుడు చరణ్ కాకినాడ ఆర్టీఓ కార్యాలయం వద్ద గల మేనమామ కొప్పిశెట్టి శ్రీనివాస్ ఇంటికి వచ్చాడు. నేమాం గ్రామంలో శ్రీనివాస్ ఇల్లు నిర్మించుకుంటుండడంతో చూసేందుకు మేనల్లుడితో కలిసి ఉదయం 11గంటల సమయంలో బయలుదేరాడు. సూర్యారావుపేట గ్రామం దాటిన తరువాత పోలవరం గ్రామ మార్గంలో పంట పొలాల్లో నుంచి వచ్చే నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్న పర కాల్వ కాజ్ వే దాటే ప్రయత్నం చేశారు. కాజ్ వే పైనుంచి నీరు ప్రవహిస్తుండడంతో బైక్పై వెళుతూ నీటి అడుగున వంతెనపై ఉన్న గోతిలో పడ్డారు. శ్రీనివాస్ ఒక వైపునకు, చరణ్ కాల్వ వైపు పడిపోయారు. శ్రీనివాస్ తేరుకుని వచ్చే లోపు కాల్వలో ఈదుతూ చరణ్ కనిపించాడు. వెంటనే అవతలి ఒడ్డుకు వెళ్లే ప్రయత్నాన్ని శ్రీనివాస్ చేసేలోపు చరణ్ నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. దీంతో వెంటనే స్థానికులు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న తిమ్మాపురం ఎస్సై గణేష్కుమార్, సిబ్బంది పర కాల్వ వద్దకు చేరుకుని ప్రమాదం జరిగిన ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. ప్రయోజనం లేకపోవడంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. గల్లంతైన బాలుడి కోసం ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది మధ్యాహ్నం 3.30 గంటల నుంచి గాలించారు. రాత్రి చీకటి పడేవరకు దాదాపు మూడు గంటల పాటు కాల్వ దిగువ భాగంలో గాలింపు చేపట్టినా బాలుడి ఆచూకీ లభ్యం కాలేదు. ప్రమాదం జరిగిన కాల్వను తహసీల్దార్ కుమారి తదితరులు సందర్శించారు. తుపాను నేపథ్యంలో ప్రమాదభరితమైన పర కాల్వ కాజ్వే వంతెనపై రాకపోకలు బంద్ చేయకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
ఫీజు రీయింబర్స్మెంట్పై ఎస్ఎఫ్ఐ ధర్నా
బాలాజీచెరువు: దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ ఎదుట సోమవారం వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆందోళన చేపట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని ఆందోళనకారులు కోరారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.6,400 కోట్లు పెండింగ్ బకాయిలు ఉన్నాయని, దీంతో పరీక్ష ఫీజు సైతం కళాశాలలు కట్టించుకోవడం లేదన్నారు. నేటితో ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సర పరీక్ష ఫీజు చివరి తేదీ అని జేఎన్టీయూకే ప్రకటించిందని, విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.గంగా సూరిబాబు, నగర అధ్యక్షుడు వాసుదేవ్, నాయకులు జయరాం, కరిష్మా, శశిప్రియ, శీరిష, దుర్గాప్రసాద్, వివేక్ పాల్గొన్నారు. కారు డ్రైవర్ అదృశ్యం అమలాపురం టౌన్: కొంకాపల్లికి చెందిన కారు డ్రైవర్ కంచిపల్లి శ్రీనివాస్ అదృశ్యమైనట్టు అతని కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటలకు తెలుపు రంగు సుజుకి యాక్సెస్ స్కూటీపై రాజమహేంద్రవరం వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తిరిగి ఇంటికి రాలేదు. స్నేహితులు, బంధువుల ఇళ్లలో అతని ఆచూకీ కోసం ప్రయత్నించినప్పటికీ ఫలితం లేదు. దీంతో అతని కుటుంబీకులు పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ పి.వీరబాబు తెలిపారు. శ్రీనివాస్ ఆచూకీ తెలిసిన వారు డయల్ 112కి లేదా పట్టణ సీఐ 94407 96561, ఎస్సై 98481 32305 ఫోన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని సీఐ వీరబాబు తెలిపారు. కాలువలో పడి వ్యక్తి మృతి తాళ్లరేవు: మండల పరిధిలోని లచ్చిపాలెం గ్రామానికి చెందిన కొండేపూడి గోవిందు(43) ప్రమాదవశాత్తూ కాలువలో పడి మృతి చెందాడు. గోవిందు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు ఈ నెల 25వ తేదీన గోవిందు స్థానిక బ్యాంక్ కెనాల్లో చేపలు పట్టేందుకు వెళ్లాడు. అయితే భారీ వర్షాల నేపథ్యంలో గల్లంతయ్యాడని, గాలింపు చర్యలు చేపట్టగా సోమవారం కేంద్రపాలిత ప్రాంతమైన యానాం దరియాలతిప్పలో మృతదేహం లభించిందన్నారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పేకాడుతున్న 18 మంది అరెస్టు రావులపాలెం: రెండు వేర్వేరు ప్రాంతాల్లో పేకాడుతున్న జూదరులను సోమవారం రాత్రి రావులపాలెం పోలీసులు దాడి చేసి అరెస్టు చేశారు. మండలంలోని వెదిరేశ్వరం గ్రామంలో ఒక ఇంటిలో పేకాడుతున్న సీఐ శేఖర్బాబుకు అందిన సమాచారంతో దాడి చేసి 10 మందిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.25,070 నగదు, తొమ్మిది సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక బండిరేవు పుంతలో పేకాడుతున్న మరో ఎనిమిది మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 2,305 నగదు స్వాధీనం చేసుకున్నట్టు సీఐ తెలిపారు. కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 28,000అంబాజీపేట కొబ్బరి మార్కెట్ -
రత్నగిరిపై మోంథా ఎఫెక్ట్
● కార్తిక సోమవారం 80 వేల మంది వస్తారని అంచనా ● తుపాను ప్రభావంతో 40 వేలకే పరిమితమైన భక్తులు అన్నవరం: రత్నగిరిపై మోంథా తుపాను ప్రభావం పడింది. కార్తిక మాసంలో తొలి సోమవారం కావడంతో సుమారు 80 వేల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేసి, ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. అయితే తుపాను హెచ్చరికలతో భక్తుల సంఖ్య 40 వేలకే పరిమితమైంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ మాత్రమే ఆలయంలో రద్దీ నెలకొనగా, ఆ తరువాత నుంచి దేవస్థానం క్యూ లైన్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. సత్యదేవుని వ్రతాలు ఏడు వేలు జరుగుతాయని అధికారులు భావించగా 4,500 మాత్రమే జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.35 లక్షల ఆదాయం సమకూరింది. ఆలయంలో ఏర్పాట్లను దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు పర్యవేక్షించారు. తుపాను ప్రభావంతో మంగళ, బుధవారాల్లో కూడా భక్తులు పెద్దగా రకపోవచ్చునని అంచనా వేస్తున్నారు. వర్షంతో ఇబ్బందులు తుపాను ప్రభావంతో రత్నగిరిపై కురిసిన వర్షంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. దేవస్థానంలో పలుచోట్ల విశ్రాంతి షెడ్లు నిర్మించినప్పటికీ ఆలయం చుట్టూ ఉన్న రథం పాత్, పశ్చిమ రాజగోపురం ముందు గ్రీన్ షేడ్ నెట్తో ఏర్పాటు చేసిన షెల్టర్లే ఉన్నాయి. వీటి ద్వారా ఎండ నుంచి రక్షణ ఉంటుంది తప్ప వర్షం వస్తే ఏమాత్రం ఉపయోగం ఉండదు. దీంతో, వర్షం కురిసిన సమయంలో వీటి కింద ఉన్న భక్తులు తడిసిపోయారు. పశ్చిమ రాజగోపురం లోపలకు వెళ్లేందుకు నిర్మించిన ర్యాంపు మీద కూడా షెల్టర్ లేక భక్తులు వర్షంలో తడవాల్సి వచ్చింది. ఇక్కడ పొడవాటి షెల్టర్ నిర్మించినా అది ర్యాంపు వరకూ లేకపోవడంతో ఇబ్బంది తప్పలేదు. ఆదివారం రాత్రి, సోమవారం తెల్లవారుజామున దేవస్థానంలో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవదంపతులు వారి బంధువులు, ఇతర ప్రాంతాల్లో వివాహాలు చేసుకున్న వారు సత్యదేవుని దర్శనానికి వచ్చి, వర్షంలో ఇబ్బంది పడ్డారు. వర్షానికి తడిసిపోకుండా పలువురు గొడుగులు వేసుకుని, వ్రత మండపాలు, ఆలయానికి వెళ్లారు. కార్తిక మాసం సందర్భంగా దేవస్థానంలో పలుచోట్ల వేసిన రేకులతో షెడ్లు నిర్మించి, వాటిని క్లాత్తో అలంకరించారు. తుపాను గాలులకు ఆ షెడ్డు రేకులు ఎగిరిపోయే అవకాశం ఉండటంతో, వాటిని తాళ్లతో గట్టిగా కట్టి రక్షణ చర్యలు చేపట్టారు. మొత్తం అన్ని షెడ్ల మీద ఇటువంటి చర్యలు తీసుకున్నట్లు దేవస్థానం ఈఈ రామకృష్ణ తెలిపారు. ఇలా చేస్తే మేలు రథం పాత్లో తూర్పు రాజగోపురానికి ఇరువైపులా టెన్సిల్ షెడ్లు భక్తులకు వర్షం నుంచి రక్షణ కల్పించాయి. ఇదేవిధంగా రథం పాత్ చుట్టూ కూడా గ్రీన్ షేడ్ నెట్ స్థానంలో టెన్సిల్ షెడ్లు నిర్మిస్తే భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుంది. వర్షం కురిస్తే శని, ఆదివారాల్లో నిర్వహించే స్వామివారి తిరుచ్చి, రథ సేవలను నిలిపివేస్తున్నారు. టెన్సిల్ షెడ్లు నిర్మిస్తే వర్షం వచ్చినా ఆ సేవలు యథాతథంగా నిర్వహించే అవకాశం ఉంటుంది. -
దూసుకొస్తున్న మోంథా
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): గత వారంలో అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయి. వాటి నుంచి జిల్లా వాసులు తేరుకుంటున్నారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎండ కాసి, వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. కానీ, ఇదే సమయంలో మోంథా తుపాను ఉగ్ర రూపంతో దూసుకొస్తోందన్న వార్త మాత్రం జిల్లా వాసులను కలవరపరుస్తోంది. మారిన వాతావరణం తుపాను ప్రశాంతత అనే రీతిలో కనిపిస్తోంది. ఈ తుపాను తీవ్ర రూపం దాల్చి కాకినాడ వద్ద తీరం దాటుతుందనే వార్తతో ఇక్కడి ప్రజల గుండెల్లో అలజడి రేగుతోంది. పలువురు 1996 తుపాను సృష్టించిన విధ్వంసాన్ని గుర్తు చేసుకుని వణికిపోతున్నారు.వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి, తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించిన విష యం తెలిసిందే. దీనికి ‘మోంథా’ అని పేరు పెట్టారు. ఇది కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని, ఆ సమయంలో 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, కనీసం 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ తుపాను ప్రభావంతో సోమవారం నుంచి గురువారం వరకూ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవవచ్చని భావిస్తున్నారు. మరోవైపు సముద్ర అలలు పెద్ద ఎత్తున ఎగసిపడే ప్రమాదం పొంచి ఉంది. వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.ముందస్తు చర్యలుతుపాను నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్ షణ్మోహన్ సగిలి జిల్లాలోని ఉన్నతాధికారులు, మండల, జోన్ అధికారులతో ఆదివారం అత్యవసర టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎటువంటి విపత్తు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రాణ, ఆస్తి, పంట నష్టాలు జరగకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలన్నీ తీసుకోవాలని సూచించారు. జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిల్లో పని చేసే అధికారులు, సిబ్బంది వారివారి ప్రదేశాల్లోనే ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు.తీర ప్రాంతం.. అప్రమత్తంతుపాను ప్రభావం ముందుగా సముద్ర తీర ప్రాంతం పైనే ఉంటుంది. అందువలన జిల్లా యంత్రాంగం ప్రధానంగా తీర గ్రామాలపై దృష్టి సారించింది. తొండంగి, యు.కొత్తపల్లి, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, తాళ్లరేవు మండలాలు సముద్ర తీరంలో ఉన్నాయి. ఆయా మండలాల నుంచి సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులను ఇప్పటికే వెనక్కి రప్పిస్తున్నారు. ఎవరైనా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్తే వారిని సురక్షితంగా తీరానికి చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ షణ్మోహన్ మత్స్య శాఖ అధికారులను ఆదేశించారు. తుపాను ప్రభావం ఉండే గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా 269 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూము ఏర్పాటు చేశారు.హోప్ ఐలాండ్ నుంచి..రెవెన్యూ అధికారులు ఆదివారం ఉదయం కాకినాడ సమీపంలోని హోప్ ఐలాండ్కు వెళ్లి అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు రావాలని సూచించారు. అయితే, అక్కడి ప్రజలు ససేమిరా అనడంతో చేసేది లేక తిరిగి వచ్చారు. మోంథా తుపాను ప్రభావం జిల్లాపై అధికంగా ఉన్న విషయం చెప్పి, వారిని అక్కడి నుంచి తరలించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించడంతో రెవెన్యూ, పోలీసు అధికారులు సాయంత్రం అక్కడకు ప్రత్యేక బోట్లు పంపించారు. పోలీసుల సాయంతో ఉన్న హోప్ ఐలాండ్లో ఉన్న 110 మందిని తాళ్లరేవులోని సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చారు.ఉప్పాడ రోడ్డు మూసివేతకాకినాడ నుంచి సూర్యారావుపేట మీదుగా ఉప్పాడ వెళ్లే ప్రధాన రహదారిని తుపాను కారణంగా మూసివేశారు. ఈ రోడ్డులో ఎవ్వరూ వెళ్లకుండా పోలీసులు గస్తీ ఏర్పాటు చేశారు. కాకినాడ సూర్యారావుపేట బీచ్లోనికి కూడా సందర్శకులు వెళ్లకుండా ఏర్పాట్లు చేశారు.31 వరకూ విద్యా సంస్థలకు సెలవుమోంథా తుపాను నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ, గురుకుల హాస్టళ్లలోని విద్యార్థులను సైతం వారి వారి ఇళ్లకు పంపిచేశారు.పీజీఆర్ఎస్ రద్దుకలెక్టరేట్తో పాటు ఆర్డీఓ, మండల కార్యాలయాలు, సచివాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని తుపాను నేపథ్యంలో ఈ వారం రద్దు చేశారు. కలెక్టర్ షణ్మోహన్ ఈ విషయం తెలిపారు.జిల్లాకు ప్రత్యేకాధికారిమోంథా తుపాను నేపథ్యంలో జిల్లాకు ఐఏఎస్ అధికారి మైలవరపు కృష్ణతేజను ప్రత్యేకాధికారిగా నియమించారు. ఆయన జిల్లాలోని అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.కలెక్టరేట్ కంట్రోల్ రూము నంబర్ 0884–2356801సన్నద్ధంగా ఉండాలిబోట్క్లబ్ (కాకినాడ సిటీ): మోంథా తుపానును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధతతో ఉండాలని కలెక్టర్ షణ్మోహన్, జిల్లా ప్రత్యేక అధికారి మైలవరపు కృష్ణతేజ అధికారులను ఆదేశించారు. తుపాను నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై ఎస్పీ బిందుమాధవ్, ఇతర ఉన్నతాధికారులు జిల్లాలోని అన్న మండలాల క్షేత్రస్థాయి అధికారులతో కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తొండంగి, ఉప్పాడ, తాళ్లరేవు, కాకినాడ రూరల్, పట్టణ ప్రాంతాల అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అన్ని గ్రామాల్లోనూ తుపాను హెచ్చరికలు జారీ చేసి, ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేకాధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాల్లోని సహాయక శిబిరాలకు, బాలింతలు, వృద్ధులను సమీప ఆస్పత్రులకు ముందుగానే తరలించాలని సూచించారు. ఆస్పత్రుల్లో వైద్యులకు ప్రత్యేక డ్యూటీలు వేసి, మందులు సిద్ధంగా ఉంచాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. 108, 104 వాహనాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. పునరావాస కేంద్రాలకు అవసరమైన కూరగాయలు, నిత్యావసర వస్తువులు, ఇతర సామగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవాలన్నారు. కోతకు వచ్చిన పంటలు రెండు మూడు రోజుల పాటు కోయకుండా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. వీఆర్ఓలు, పంచాయతీ కార్యదర్శుల ద్వారా సహాయక శిబిరాలను గుర్తించాలని, ఏయే ప్రాంత ప్రజలను ఎక్కడికి తరలించాలో ముందుగానే జాబితా సిద్ధం చేసుకోవాలని అన్నారు. -
జాకీలతో ఇంటి ఎత్తు పెంపు
కపిలేశ్వరపురం (మండపేట): మండపేట మండలం మారేడుబాక మహిళా నగర్లోని ఓ ఇల్లు ఇప్పుడు అందరి దృష్టి ఆకర్షించింది. కొన్నేళ్లుగా పల్లంలో ఉన్న ఆ ఇల్లు ఇప్పుడు మూడు అడుగుల ఎత్తుకు పెరిగింది. సాధారణంగా ఇల్లు అనుకూలంగా లేకపోతే కూల్చి మళ్లీ కడతారు. ఇక్కడ ఇల్లు కూల్చకుండానే ఎత్తు చేశారు. పల్లంలో ఉంటున్న ఇంట్లో నివసించడానికి ఇబ్బందిగా భావించిన యజమాని మోటుపల్లి వీరగణేష్.. ఆ ఇంటిని కూల్చే సాహసం చేయలేకపోయారు. ఇంటిని ఎత్తు చేసేలా ప్రత్యామ్నాయ ఆలోచన చేశారు. జాకీల సాయంతో ఇంటి ఎత్తు పెంచే విజయవాడలోని ఓ సంస్థ ప్రతినిధులను సంప్రదించారు. స్థానిక పరిస్థితుల నేపథ్యంలో మూడు అడుగులు ఎత్తు చేయవచ్చంటూ సంస్థ ప్రతినిధులు భరోసా ఇచ్చారు. అందుకయ్యే ఖర్చును చెల్లించేందుకు యజమాని సిద్ధపడటంతో, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, జాకీలతో ఇంటిని మూడు అడుగుల ఎత్తు పెంచారు. ప్రస్తుతం ఆ ప్రక్రియ పూర్తికావడంతో అనుబంధ పనులను చేస్తున్నారు. -
పశువులను అక్రమంగా తరలిస్తున్న వ్యాన్ సీజ్
రాయవరం: పశువులను అక్రమంగా తరలిస్తున్న వ్యాన్ను పోలీసులు స్వాదీనం చేసుకుని, పశువులను రక్షించిన ఘటన రాయవరం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ విషయాన్ని రాయవరం ఎస్సై డి.సురేష్బాబు ఆదివారం విలేకరులకు తెలిపారు. జగ్గంపేట సంతలో పశువులను కొనుగోలు చేసి, అక్కడి నుంచి రామచంద్రపురం వరకు, అక్కడి నుంచి నెల్లూరుకు ఓ వ్యాన్పై తరలిస్తున్నారు. కొత్తూరుకు చెందిన సంసేన్ను, తమిళనాడు జిల్లా తిరువళ్లూరు ప్రాంతానికి చెందిన వ్యాన్ డ్రైవర్ వెట్రివేల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యాన్లో అక్రమంగా తరలిస్తున్న 16 ఎద్దులు, 14 చిన్న దూడలను సంరక్షించి, సామర్లకోట గోశాలకు తరలించారు. అక్రమంగా పశువులను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. అలాగే వ్యాన్ను సీజ్ చేసినట్టు ఎస్సై సురేష్బాబు తెలిపారు. -
రత్నగిరిపై భక్తజన ప్రవాహం
● కొనసాగుతున్న రద్దీ ● సత్యదేవుని దర్శించిన 50 వేల మంది ● రూ.50 లక్షల ఆదాయం అన్నవరం: రత్నగిరిపై ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. సత్యదేవుని దర్శించేందుకు వేలాదిగా భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలు కిక్కిరిసిపోయాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ భక్తుల రద్దీ కొనసాగింది. స్వామివారిని సుమారు 50 వేల మంది దర్శించుకున్నారు. సత్యదేవుని వ్రతాలు ఐదు వేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని సత్యదేవుని ఆలయాన్ని తెల్లవారుజాముప 2 గంటలకే తెరిచి, భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించడంలో పాటు వ్రతాల నిర్వహణ కూడా ప్రారంభించారు. వ్రత మండపాలతో పాటు పాత కల్యాణ మండపంలో కూడా వ్రతాలు నిర్వహించారు. స్వామివారి ఉచిత దర్శనానికి 2 గంటలు, రూ.200 టికెట్టుతో దర్శనానికి గంట సమయం పట్టింది. స్వామివారిని దర్శించిన భక్తులు సప్త గోకులంలో గోవులకు ప్రదక్షిణ చేశారు. తూర్పు రాజగోపురం ముందున్న రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. నిత్యాన్నదాన పథకం వద్ద భక్తులకు పులిహోర, దద్ధోజనం పంపిణీ చేశారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ ఉదయం నుంచీ ఆలయ ప్రాంగణంలోను, ఈఓ వీర్ల సుబ్బారావు సత్యగిరి పైన ఏర్పాట్లను పరిశీలించారు. నేడు కూడా కిటకిట! కార్తిక మాసంలో తొలి సోమవారం కావడంతో సత్యదేవుని ఆలయానికి నేడు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారనే అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వేకువజామున ఒంటి గంట నుంచే వ్రతాల నిర్వహణకు, దర్శనాలకు భక్తులను అనుమతించనున్నారు. సుమారు 60 వేల మందికి పైగా భక్తులు వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదు వేలకు పైగా వ్రతాలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. భక్తులకు తీరని కష్టాలు ● కార్తిక మాసంలో పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయడంలో అధికారుల వైఫల్యం కనిపిస్తోంది. ● పడమటి రాజగోపురం లోపల ఉన్న క్యూల నుంచి, అక్కడ నిర్మించిన కంపార్ట్మెంట్లలోకి భక్తులను పంపిస్తున్నారు. అక్కడ భక్తులకు మంచినీరు అందించడం లేదు. కేవలం క్యూలలోనే మంచినీరు సరఫరా చేస్తున్నారు. దీంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ● వ్రత మండపాలకు ఎలా వెళ్లాలి, రూ.300, రూ.వెయ్యి, రూ.1,500 వ్రత మండపాలకు ఎలా వెళ్లాలో తెలిపే సైన్ బోర్డులు ఎక్కడా ఏర్పాటు చేయలేదు. అలాగే, ప్రసాదం కౌంటర్లు తెలిపే బోర్డులు కూడా లేవు. వీటిని తూర్పు, పశ్చిమ రాజగోపురం వద్ద ఏర్పాటు చేయాలి. దర్శనం టికెట్లు, టాయిలెట్లు ఎక్కడ ఉన్నాయో తెలిపే బోర్డులు కూడా ఏర్పాటు చేయాలి. ● డిజిటల్ చెల్లింపులు చేయవచ్చనే ఉద్దేశంతో చాలామంది భక్తులు నగదు తక్కువ తెచ్చుకుంటున్నారు. కానీ, రత్నగిరిపై సెల్ఫోన్ సిగ్నల్స్ లేక, డిజిటల్ చెల్లింపులు జరగక ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యపై గతంలో ‘సాక్షి’ పలు కథనాలు ప్రచురించింది. దీంతో, గత ఏప్రిల్లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ దేవస్థానానికి వచ్చినప్పుడు భక్తుల సౌకర్యార్థం ఉచిత వైఫై సదుపాయం కల్పించారు. కొన్నాళ్లు అది బాగానే ఉపయోగపడినా పరిస్థితి ఇప్పుడు మళ్లీ పూర్వ స్థితికి వచ్చేసింది. ● దేవస్థానంలోని ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ ఏటీఎంలలో చాలినంత నగదు ఉండక భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ● దర్శనం చేసుకున్న భక్తులు తిరిగి రథం పాత్లోకి రాకుండా తూర్పు రాజగోపురం దిగువన ఉన్న మెట్ల ద్వారా సర్కులర్ మండపం వైపు వెళ్లేలా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సన్ డయల్ ఎదురుగా బారికేడ్లు కట్టి, భక్తులు వెనక్కి రాకుండా చేశారు. అయితే, సన్ డయల్ వెనుక టాయిలెట్లు ఉన్నాయి. ఈ బారికేడ్ల వలన ఆ టాయిలెట్ల వద్దకు భక్తులు వెళ్లలేని పరిస్థితి. రథం పాత్కు సమీపాన ఇక్కడ మాత్రమే టాయిలెట్లు ఉన్నాయి. లేదంటే రామాలయం పాత మెయిన్ గెస్ట్ హౌస్ వెనుకన లేదా పశ్చిమ రాజగోపురం వద్ద ఉన్న టాయిలెట్ల వద్దకు భక్తులు వెళ్లాలి. ఇవి చాలా దూరం. అందువలన సన్ డయల్ వద్ద ఉన్న టాయిలెట్లు భక్తులు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలి. -
రాజకీయ బలోపేతమే శెట్టిబలిజల లక్ష్యం
● సందడిగా శెట్టిబలిజ కార్తిక వన మహోత్సవం, ఉచిత వివాహ పరిచయ వేదిక ● మంత్రులు, ఎమ్మెల్సీలు, ప్రముఖుల హాజరు రాజమహేంద్రవరం రూరల్: శెట్టిబలిజ సామాజిక వర్గం రాజకీయంగా బలోపేతం కావాల్సిన అవసరం ఉందని పలువురు ప్రముఖులు స్పష్టం చేశారు. రాష్ట్ర శెట్టిబలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం హైవే పక్కనున్న చెరుకూరి తోటలో శెట్టిబలిజ కార్తిక వన మహోత్సవం, శెట్టిబలిజ వధూవరుల ఉచిత వివాహ పరిచయ వేదిక నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, విశిష్ట అతిథులుగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు, శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, వైఎస్సార్ సీపీ రాజమండ్రి పార్లమెంటరీ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ మాట్లాడుతూ, శెట్టబలిజలు రాజకీయంగా ఎదగాలని ఆకాంక్షించారు. మంత్రి సుభాష్ మాట్లాడుతూ, శెట్టిబలిజ సామాజిక వర్గ సంక్షేమానికి చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో ఆదరణ పథకంలో గీత సామాజిక వర్గం వారికి ఉపకరణాలు అందిస్తామని, బీసీ కార్పొరేషన్ రుణాలూ అందుతాయని చెప్పారు. ఈ సందర్భంగా శెట్టిబలిజ సంఘానికి సేవలు చేసిన ప్రముఖుల స్మారక అవార్డులను పది మందికి ప్రదానం చేశారు. సంఘ నూతన సంవత్సర క్యాలెండర్ను మంత్రి సుభాష్ ఆవిష్కరించారు. అనంతరం సంఘ రాష్ట్ర నాయకుడు సానబోయిన రామారావును సత్కరించారు. సంఘ రాజమండ్రి నాయకులు, శెట్టిబలిజ ప్రముఖులను మంత్రి శాలువా, జ్ఞాపికలతో సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర శెట్టిబలిజ, గౌడ, ఈడిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాలిక శ్రీను, రాష్ట్ర ఖాదీ బోర్డు మాజీ వైస్ చైర్మన్ పిల్లి నిర్మల, సంఘ ప్రతినిధులు, సంఘీయులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
చంద్రుడు ప్రతిష్ఠించిన సోమేశ్వరులు
పడమర వెంటూరు ద్రాక్షారామకు పడమర దిక్కులో రాయవరం మండలం వెంటూరులో పార్వతీ సమేత ఉమాసోమేశ్వరస్వామి పూజలందుకుంటున్నారు. వెంటూరు చేరుకోవాలంటే రామచంద్రపురం–వాకతిప్ప ఆర్టీసీ బస్సులో వెళ్లవచ్చు. రామచంద్రపురం నుంచి నేరుగా ఆటోల సౌకర్యం ఉంది. వెంటూరులోని పార్వతీ సమేత ఉమాసోమేశ్వరస్వామి తూర్పున కోలంక ద్రాక్షారామ భీమేశ్వరాలయానికి తూర్పున కాజులూరు మండలం కోలంక గ్రామంలో పార్వతీ సమేత ఉమా సోమేశ్వరస్వామివారు నెలకొని ఉన్నారు. కార్తిక మాసంలో ఈ స్వామిని దర్శించుకుని పూజలు చేస్తే కోర్కెలు తీరుతాయని ప్రసిద్ధి. కోలంకకు చేరుకోవాలంటే ద్రాక్షారామ నుంచి యానాం వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కాలి. ఆటో సదుపాయమూ ఉంది. కోలంకలోని పార్వతీ సమేత ఉమాసోమేశ్వరస్వామి ● ఎనిమిది దిక్కుల్లో కొలువైన అష్ట సోమేశ్వరాలయాలు ● భక్తుల పాలిట వరాలు ● కార్తిక మాసంలో దర్శించుకుంటే విశేష పుణ్యఫలం రామచంద్రపురం: కార్తిక మాసం ఈశ్వరునికి ఎంతో ప్రీతి పాత్రమైనది. భక్తిశ్రద్ధలతో కొలిస్తే ఈశ్వరానుగ్రహం తప్పక దొరుకుతుందని పండితుల ఉవాచ. ఈశ్వరానుగ్రహం పొందేందుకు నలుదిక్కులా అష్టసోమేశ్వరాలయాల్లో ఆ స్వామి కొలువుదీరిన అరుదైన ఆలయాలున్నాయి. దేవతలతో ప్రతిష్ఠించినట్టు విశేష ప్రాచుర్యం పొందిన ఆ ఆలయాల్లో ఈశ్వరుడు కొలువయ్యాడు. అష్టసోమేశ్వరాలయాలను దర్శించుకుంటే భగవత్ సంకల్పం నెరవేరుతుందని పండితులు చెబుతున్నారు. కార్తిక మాసంలో అష్ట సోమేశ్వరాలయ దర్శనానికి ఎంతో ప్రాముఖ్యముంది. రామచంద్రపురం, మండపేట పరిసర ప్రాంతాల్లోని అష్ట సోమేశ్వరాలయాలకు ప్రత్యేకత ఉంది. ద్రాక్షారామలోని మాణిక్యాంబ సమేత భీమేశ్వరాలయం దక్షిణ కాశీగా విరాజిల్లుతోంది. సూర్యునితో స్వయం ప్రతిష్ఠగా ప్రసిద్ధికెక్కిన ద్రాక్షారామ భీమేశ్వరుడు అష్ట సోమేశ్వరాలయాల నడుమ కొలువుదీరి పూజలందుకుంటున్నారు. అనుకోని అవాంతరం కారణంగా కాలహరణమై ముహూర్త సమయం మించిపోతుండడంతో భీమేశ్వరుడు స్వయంభు లింగంగా ద్రాక్షారామలో అవతరించారు. భీమలింగాన్ని సూర్యభగవానుడు ప్రతిష్ఠించి భీమేశ్వరునికి ప్రథమార్చన చేసినట్టు పురాణ ప్రతీతి. ఇంద్రాది దేవతలు పూజించగా, సప్త గోదావరి పవిత్ర జలాలతో స్వామివారిని సప్త రుషులు అభిషేకించారు. సూర్య ప్రతిష్ఠత తాపాన్ని, ఉగ్రతను నియంత్రించేందుకు ఆగమ సంప్రదాయం ప్రకారం నలు దిక్కులే కాకుండా, విదిక్కుల్లోనూ సోమేశ్వరాలయాలు వెలిశాయి. చంద్రునితో స్వయం ప్రతిష్ఠితాలుగా ద్రాక్షారామ భీమేశ్వరాలయం అష్ట దిక్కుల్లోనూ సోమేశ్వరాలయాలు ప్రతిష్ఠించబడినట్టు పురాణగాథలు చెబుతున్నాయి. ద్రాక్షారామ భీమేశ్వరునికి ఒక్కొక్క యోజన దూరంలో అష్టసోమేశ్వరాలయాలు నెలకొని ఉండటం విశేషం. కార్తిక మాసంలో ద్రాక్షారామ భీమేశ్వరుని దర్శనంతో పాటు, అష్ట సోమేశ్వరాలయాల్లోని సోమేశ్వరులను దర్శించుకోవడాన్ని భక్తులు పవిత్రంగా భావిస్తారు. సూర్య ప్రతిష్ఠ గావించిన భీమేశ్వరుని దర్శనం అనంతరం.. చంద్ర ప్రతిష్ఠితాలుగా పేరొందిన అష్ట సోమేశ్వరాలయాల్లోని స్వామివారి దర్శనంతో భక్తులకు సకల పాప పరిహారంతో పాటు, ఎంతో పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. -
పేద కుటుంబంలో చిమ్మిన విషాదం
● బైక్ను ట్రాక్టర్ ఢీకొని తల్లి మృతి ● కుమారుడి పరిస్థితి విషమం ● కూలీ పనులకు వెళ్లొస్తుండగా ప్రమాదం గండేపల్లి/జగ్గంపేట: రెక్కాడితే కానీ డొక్కాడని ఆ పేద కుటుంబంపై ట్రాక్టర్ రూపంలో పెనుకష్టం వచ్చి పడింది. కూలీ పనులే జీవనాధారంగా బతుకుతున్న ఆ కుటుంబంలో ఒకరిని మృత్యువు బలిగొనగా.. మరొకరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ట్రాక్టర్ ఢీకొన్న సంఘటనలో తల్లి మృతి చెందగా, కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని గుర్రప్పాలెం పంచాయతీ పరిధిలోని సగరపేటకు చెందిన తల్లీకొడుకులు నక్కా చిట్టమ్మ(40), బాపిరాజు ఆదివారం మోటార్ సైకిల్పై జగ్గంపేట కూలీ పనులకు వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తుండగా.. సగరపేట సమీపంలో ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ బలంగా ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. బంధువులు, స్థానికులు క్షతగాత్రులను చికిత్స కోసం గండేపల్లి మండలం జెడ్.రాగంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే చిట్టమ్మ మరణించినట్టు ధ్రువీకరించారు. తీవ్ర గాయాలతో ఉన్న బాపిరాజును మెరుగైన వైద్యం కోసం కాకినాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎసై టి.రఘునాథరావు తెలిపారు. రెక్కాడితే కానీ.. పేద కుటుంబం కావడంతో రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఆ కుటుంబానిది. మృతురాలు చిట్టమ్మ, భర్త వెంకన్న, పెద్ద కొడుకు పురుషోత్తం, చిన్న కొడుకు బాపిరాజు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం కూలీ పనులు ముగించుకుని వస్తుండగా ఈ ప్రమాదానికి గురయ్యారు. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో మృతురాలి తలకు తీవ్ర గాయమై, కొంత భాగం ట్రాక్టర్ ట్రక్కుకు అంటుకున్నట్టు చెప్పారు. గ్రామంలో జన సంచారం ఉండే ప్రాంతంలో ట్రాక్టర్ను డ్రైవర్ అజాగ్రత్తగా, వేగంగా నడిపి ప్రమాదానికి కారణమయ్యాడన్నారు. ఇటువంటి వాటిపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ఏలేరు.. డేంజర్!
● రిజర్వాయర్లో పెరుగుతున్న నీటిమట్టం ● దిగువకు అదనపు జలాల విడుదల ● అధిక మొత్తంలో ఒకేసారి వదిలేస్తే ముంపు ముప్పు ● పరీవాహక ప్రాంత ప్రజల్లో కలవరం పిఠాపురం: జిల్లాలోని ఏలేశ్వరం వద్ద ఉన్న ఏలేరు జలాశయం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయం నీటిమట్టం దాదాపు గరిష్ట స్థాయికి చేరుకుంది. దీని పూర్తి స్థాయి నీటిమట్టం 86.56 మీటర్లు కాగా, శనివారం నాటికే 85.57 మీటర్లకు చేరింది. పూర్తి సామర్థ్యం 24.11 టీఎంసీలు కాగా, నీటి నిల్వలు సుమారు 23 టీఎంసీలకు చేరుకున్నాయి. ఈ తరుణంలోనే మోంథా తుపాను దూసుకొస్తూండటంతో మరింతగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పటికే ఏలేరు రిజర్వాయర్ లోనికి వరద నీరు భారీగా వచ్చి చేరుతూండటంతో అధికారులు రోజుకు 3 వేల క్యూసెక్కుల చొప్పున నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ఎక్కువ మొత్తంలో అదనపు జలాలు వదిలేందుకు అధికారులు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. దీంతో, తమకు మరోసారి ముంపు ముప్పు తప్పదేమోనని పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలు కలవరపడుతున్నారు. గత ఏడాది అపార నష్టం గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఏలేరు అదనపు జలాలను కాలువ సామర్థ్యానికి మించి ఒక్కసారిగా వదిలేయడంతో పిఠాపురం, గొల్లప్రోలు, యు.కొత్తపల్లి మండలాల్లో అపార నష్టం సంభవించింది. ఈ మూడు మండలాల్లోనూ వరి, వాణిజ్య పంటలు పూర్తిగా నీట మునిగి, పనికి రాకుండా పోయాయి. మొత్తం 42 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా సుమారు 36 వేల ఎకరాల్లో పంట ముంపు బారిన పడింది. ఎకరానికి రైతులు రూ.25 వేల పెట్టుబడి పెట్టగా, అంతా వరదల్లో తుడిచిపెట్టుకుపోయింది. నాటి ఏలేరు వరదల కారణంగా సుమారు రూ.150 కోట్ల మేర నష్టం సంభవించింది. ఏలేరు కాలువకు గండి పడిన ప్రాంతాల నుంచి భారీగా ఇసుక, మట్టి వచ్చి పొలాల్లో మేటలు వేసింది. పిఠాపురం మండలం రాపర్తి, రాయవరంతో పాటు గొల్లప్రోలు మండలంలోని వివిధ గ్రామాల్లో సుమారు 200 ఎకరాల్లో ఇసుక మేటలు వేసింది. రైతులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొన్నారు. రాపర్తి ప్రాంతంలోని వరి పొలాల్లో సుమారు 2 అడుగుల మేర ఇసుక మేటలు వేసింది. ఆ ఇసుక తొలగించుకోడానికి సైతం రైతులు వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది. మరోవైపు నాడు రూ.కోట్లు వెచ్చించి, ఏలేరు, పిఠాపురం బ్రాంచి కెనాల్ (పీబీసీ) గండ్ల పూడ్చివేత పేరుతో కూటమి నేతలు తూతూమంత్రంగా పనులు చేసి, చేతులు దులిపేసుకున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికీ ఎక్కడి గండ్లు అక్కడే ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో వరి పైరు చిరుపొట్ట దశలో ఉంది. ఈ తరుణంలో ఇప్పుడు మళ్లీ ఏలేరు నుంచి నీటిని ఒక్కసారిగా వదిలేస్తే తమకు మరోసారి కోలుకోలేని దెబ్బ తగులుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా, మరోసారి వరద ఖాయమని భావిస్తున్న అధికారులు ముందు జాగ్రత్త చర్యల పేరిట కాలువల్లో పూడికల తొలగింపు చేపట్టారు. పిఠాపురం మండలం మాధవపురం వద్ద ఏలేరు కాలువకు గత ఏడాది సెప్టెంబర్లో గండి పడటంతో నీట మునిగిన ఇసుకపల్లి గ్రామం, పంట చేలుఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు మాధవపురం గండి పూడ్చి మా పంటలు కాపాడాలని ఎన్నిసార్లు మొర పెట్టుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీనిపై పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పాడా) అధికారులకు గ్రీవెన్స్లో ఫిర్యాదులు చేశాం. అయినా ఫలితం లేదు. ఇది పెద్ద గండి కాదని వదిలేసినట్లు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. వరద వచ్చినప్పుడు ఏలేరు అదనపు జలాలు, పీబీసీ నీరు ఒకేసారి వచ్చి పడటంతో ఈ కాలువకు గండి పడింది. దీనివల్లే గత ఏడాది సుమారు 2 వేల ఎకరాల్లో వరి పంట, వందలాదిగా ఇళ్లు నీట మునిగా యనే విషయం గుర్తించాలి. అటువంటిది ఇది పెద్ద గండి కాదనడం ఎంతవరకూ సమంజసమో అధి కారులే చెప్పాలి. అన్ని గండ్లూ పూడ్చివేస్తున్నామ ని అధికారులు, నేతలు చెబుతున్నారు. కానీ, అవసరమైన, ప్రమాదకరమైన ఇలాంటి గండ్లను ప ట్టించుకోవడం లేదు. మాధవపురం గండిని ఇప్ప టికై నా పూడ్చి, గట్టును పటిష్టపరచకపోతే వేలాది ఎకరాలు నీట మునగడం మరోసారి ఖాయం. – వై.ప్రసాదరెడ్డి, రైతు, నాగులాపల్లి, యు.కొత్తపల్లి మండలం -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 28,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 29,000 గటగట (వెయ్యి) 27,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 23,000 – 25,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)23,000 – 25,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,250 కిలో 350 -
చెరువులో వృద్ధురాలి మృతదేహం
సీతానగరం: ఏం కష్టం వచ్చిందో.. ఏమిటో ఓ పండుటాకు చెరువులో నిర్జీవమై కనిపించింది. మండలంలోని కాటవరానికి చెందిన తెలగారెడ్డి నాగమణి (96) వారం రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆదివారం చెరువులో ఆమె మృతదేహం కనిపించింది. ఆమె మనవడు, మనవడి భార్య బండారు బ్రహ్మం, అరుణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మతిస్తిమితం లేని వృద్ధురాలు నాగమణి ఎవరికీ చెప్పకుండా ఈ నెల 19న ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు తమ బంధువులను ఆరా తీసినా.. ఆమె ఆచూకీ దొరకలేదు. దీనిపై ఈ నెల 20న స్థానిక పోలీసులకు వారు సమాచారం ఇచ్చారు. కాటవరంలోని మొండి పుంత చెరువులో ఆమె మృతదేహం ఉన్నట్టు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు స్థానికుల ద్వారా తెలిసింది. అది నాగమణి మృతదేహంగా కుంటుంబ సభ్యులు గుర్తించారు. దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై రాంకుమార్ తెలిపారు. -
ఏడు వారాల స్వామీ.. మనసా స్మరామి
కొత్తపేట: భక్తుల కోరిన కోర్కెలు తీరుస్తూ ఏడు వారాల వెంకన్నగా ప్రసిద్ధికెక్కిన వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రం శనివారం భక్తజనంతో కోలాహలంగా మారింది. రాష్ట్రం నలుమూలల నుంచీ భక్తులు వాడపల్లి క్షేత్రానికి భారీగా తరలివచ్చారు. కొందరు స్వామివారిని దర్శించుకునేందుకు కాలినడకన చేరుకున్నారు. ఏడు ప్రదక్షిణలు చేస్తున్న వేలాది మంది భక్తులతో మాడ వీధులు, స్వామి దర్శనానికి క్యూలైన్లు నిండిపోయాయి. ఏడుకొండల వాడా.. గోవిందా.. గోవింద నామస్మరణతో క్షేత్రం మార్మోగింది. దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో సిబ్బంది ఏర్పాట్లు చేశారు. స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు ఉదయం సుప్రభాత సేవ, నీరాజన మంత్రపుష్పం తదితర పూజాధికాలు నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా సుగంధ పరిమళ పుష్పాలతో విశేషంగా అలంకరించారు. శ్రీవేంకటేశ్వర సహిత ఐశ్వర్యలక్ష్మీ హోమం నిర్వహించారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలో వేంచేసియున్న అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదం స్వీకరించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తుల విశిష్ట దర్శనం, ప్రత్యేక దర్శనం, వేదాశీర్వచనం, ఆన్లైన్, నిత్య, శాశ్వత అన్నదానం విరాళాలు, లడ్డు విక్రయం తదితర రూపాల్లో ఈ ఒక్కరోజు రాత్రి 8 గంటల వరకూ దేవస్థానానికి రూ. 42.01 ,916 ఆదాయం వచ్చినట్లు ఈఓ చక్రధరరావు తెలిపారు. ధర్మపథం కార్యక్రమంలో భాగంగా రాత్రి వివిధ ప్రాంతాలకు చెందిన నృత్య కళాకారుల బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన చేసింది. -
భక్తులకు అన్ని వసతులూ కల్పించాలి
● దేవదాయ కమిషనర్ రామచంద్రమోహన్ ● కార్తిక మాసం ఏర్పాట్లపై అసంతృప్తి ● దేవస్థానం సిబ్బందికి పలు సూచనలు అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్ధానానికి కార్తికమాసంలో విచ్చేసే భక్తుల కోసం చేసిన ఏర్పాట్లపై దేవదాయ ధర్మాదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన శనివారం దేవస్థానంలో వివిధ విభాగాలను పరిశీలించారు. కార్తిక మాసంలోని ఏకాదశి, పౌర్ణిమ వంటి పర్వదినాలలో అధిక సంఖ్య భక్తులు వస్తారని, దానికి తగ్గట్టుగా ఇక్కడ ఏర్పాట్లు కనిపించడం లేదన్నారు. ఈఓ వీర్ల సుబ్బారావు, దేవస్థానం సిబ్బంది మధ్య సమన్వయలోపం కనిపిస్తోందని, అభిప్రాయ భేదాలను పక్కన సమన్వయంతో పనిచేయాలన్నారు. శానిటేషన్ విభాగంలో అదనపు సిబ్బందిని ఇంకా నియమించలేదని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ చెప్పడంతో ఆ విషయంపై కూడా కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విష్ణుసదన్ సత్రం ఆవరణలో ఫ్లోరింగ్ అపరిశుభ్రంగా ఉందన్నారు. విష్ణుసత్రంలో వివాహాలు చేసుకున్నాక కల్యాణ మండపాలను అలాగే వదిలేయకూడదని, సంబంధిత కాంట్రాక్టర్తో చెప్పి వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించారు. సిబ్బందితో సమావేశం దేవస్థానంలో పరిశీలన అనంతరం సిబ్బందితో కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కార్తికమాసంలో శని, ఆది, సోమవారాలతో పాటు దశమి, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి పర్వదినాలలో తెల్లవారుజాము ఒంటి గంట నుంచి, ఇతర రోజుల్లో తెల్లవారుజాము మూడు గంటల నుంచి స్వామివారి వ్రతాల నిర్వహణ, భక్తులకు దర్శనం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నవంబర్ 2న జరిగే సత్యదేవుని తెప్పోత్సవం, ఐదున జరిగే సత్యదేవుని గిరి ప్రదక్షణకు భారీగా ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు, ఈఈలు నూకరత్నం, రామకృష్ణ, ఏఈఓలు కృష్ణారావు, ఎల్ శ్రీనివాస్ భాస్కర్ పాల్గొన్నారు. సత్యదేవుని దర్శించిన 40 వేల మంది కార్తికమాసంలోని తొలి శనివారం సందర్భంగా అన్నవరం దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించారు. స్వామివారి వ్రతాలు 2,500 నిర్వహించారు. సప్త గోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, రావిచెట్టు వద్ద దీపాలు వెలిగించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. ఐదు వేల మంది భక్తులకు అన్నదాన పథకంలో భోజనం పెట్టారు. ఆలయ ప్రాకారంలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని తిరుచ్చి వాహనంపై ఘనంగా ఊరేగించారు. కార్తికమాసం రద్దీ కారణంగా ఉదయం పది గంటలకు జరగాల్సిన తిరుచ్చి సేవను సాయంత్రం నాలుగు గంటలకు మార్చారు. సత్యదేవుడు, అమ్మవారి ఉత్సవ మూర్తులను తిరుచ్చి వాహనంపై ప్రతిష్ఠించి, అర్చకుడు కంచిభట్ల కుమార్ పూజలు చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రాగా మూడు సార్లు ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. తిరిగి స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఆలయానికి చేర్చారు. -
వైఎస్సార్ సీపీలో పలువురికి పదవులు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ అధిష్టానం పలువురు జిల్లా నాయకులను వివిధ హోదాల్లో నియమించింది. జిల్లా ఐటీ వింగ్ ఉపాఽధ్యక్షుడిగా దిడ్డి ప్రతాప్ (జగ్గంపేట), జనరల్ సెక్రటరీలుగా మేడిశెట్టి సీతారామ్ (తుని), కేఎన్ఎం స్వామి (పిఠాపురం), సెక్రటరీలుగా బొకిస ప్రసాద్ (తుని), మొగిలి శ్రీనివాస్ (జగ్గంపేట), ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా త్రిమూర్తుల నాగేంద్ర(తుని), పైలా గంగాధర్ (తుని), తూము సురేష్ (జగ్గంపేట), అడారి రమేష్ (జగ్గంపేట) నియమితులయ్యారు. డాక్టర్స్ విభాగంలో.. జిల్లా డాక్టర్స్ వింగ్ ఉపాధ్యక్షులుగా గొర్లి విష్ణు (తుని), వేగి సాంబశివ (జగ్గంపేట), సెక్రటరీలుగా యాసరపు వెంకట రమణ (తుని), నాంబారి సత్యనారాయణ (జగ్గంపేట), ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా బర్ల శ్రీను (తుని), యాసరపు భూషణం (తుని), యల్లపు పవన్ కుమార్ (జగ్గంపేట), ములపర్తి నాగేశ్వరరావు (జగ్గంపేట)లను నియమించారు. జిల్లా వలంటీర్ల విభాగంలో.. జిల్లా వలంటీర్ల విభాగం ఉపాధ్యక్షుడిగా ఉమ్మలూరి వెంకట రమణ (ప్రత్తిపాడు), జనరల్ సెక్రటరీలుగా అడిగర్ల ప్రసాద్ (తుని), మడగల నవీన్ (జగ్గంపేట), సెక్రటరీలుగా గరగ నాగ దుర్గాప్రసాద్ (తుని), అమరాది కాశి (ప్రత్తిపాడు), మంగరౌతు గౌరి (జగ్గంపేట), ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా బట్ట సాయి (తుని), మేడిశెట్టి ఫణీంద్ర సాయి (తుని), అడబాల వెంకట రమణమూర్తి (ప్రత్తిపాడు), మాదపురెడ్డి జితేంద్ర (ప్రత్తిపాడు), కె.అప్పారావు (జగ్గంపేట), పిల్ల అప్పారావు (జగ్గంపేట) నియమితులయ్యారు. -
హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు
● సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింగరావు ● పెద్దాపురంలో జిల్లా మహాసభలు ప్రారంభం పెద్దాపురం (సామర్లకోట): కేంద్రం, రాష్ట్రంలో ఉన్న డబుల్ ఇంజిన్ సర్కార్ కార్మికుల హక్కులను కాలరాస్తోందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు అన్నారు. పెద్దాపురంలో శనివారం ప్రారంభమైన సీఐటీయూ జిల్లా మహాసభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ మేరకు యాసలపు సూర్యారావు భవనంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషబాబ్జీ జెండాను ఆవిష్కరించారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి, అమర వీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నర్సింగరావు మాట్లాడుతూ ప్రజల సంపదను కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వాలు దోచిపెడుతున్నాయని, అంతర్జాతీయంగా చమురు రేట్లు తగ్గినప్పటికీ దేశంలో పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడంతో ప్రజలపై భారం విపరీతంగా పడిందన్నారు. కార్పొరేట్ సంస్థల లాభాలపై పన్ను రేటును 33 నుంచి 20 శాతానికి తగ్గించడం దారుణమన్నారు. ట్రంప్ టారిఫ్లు, టెర్రరిజం విధానంతో ఇతర దేశాలపై దాడికి అమెరికా పూనుకుందన్నారు. దీన్ని చైనా తిప్పికొట్టినా, ప్రధాన మోదీ మాత్రం ట్రంప్కు సలాం చేస్తున్నారన్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ భూములను కారు చౌకగా కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తోందన్నారు. సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీరాణి మాట్లాడుతూ దేశంలో పోర్టులు, ఎయిర్ పోర్టులను అదానీకి మోదీ అప్పగించారన్నారు. మహాసభలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి.అప్పారెడ్డి, ఎన్ఎఫ్ఐ జిల్లా కార్య దర్శి ఎం.సూరిబాబు, జిల్లా నాయకులు భాస్కర్, వల్లు రాజబాబు, సీహెచ్ రాజ్ కుమార్, మలక వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీని నేరాంధ్రప్రదేశ్గా మార్చేశారు
తుని రూరల్: కూటమి పాలనలో రాష్ట్రం నేరాంధ్రప్రదేశ్గా మారిపోయిందని, దుర్మార్గమైన పరిపాలన సాగుతోందని, లైంగిక దాడులు, హత్యలు, డ్రగ్స్ పెరిగిపోయాయని మాజీ ఎమ్మెల్సీ అంగుళూరి శివకుమారి ఆరోపించారు. తుని మండలం జగన్నాథగిరి గురుకుల పాఠశాలలో లైంగిక దాడి యత్నానికి గురైన బాధిత బాలికను వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత, జిల్లా ప్రధాన కార్యదర్శి రాయి మేరీ అవినాష్తో కలసి బుధవారం మాజీ ఎమ్మెల్సీ శివకుమారి పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దళితులపై, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించరు, మాట్లాడరని మండిపడ్డారు. పాయకరావుపేట, తుని, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో మహిళలే ఎమ్మెల్యేలుగా ఉన్నారని, పిఠాపురంలో డిప్యూటీ సీఎం ఉన్నారని, ఈ ప్రాంతంలోనే ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. అయినప్పటికీ ఈ దారుణంపై ఎవ్వరూ స్పందించకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకువెళ్తోందో చెప్పాలన్నారు. లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని, బాధిత బాలికకు న్యాయం చేయాలని, ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఏవిధంగా ఆదుకుంటుందో ప్రకటించాలని, పాఠశాల నిర్వహకులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫ రాష్ట్రంలో దుర్మార్గమైన పరిపాలన సాగుతోంది ఫ లైంగిక దాడులు, హత్యలు, డ్రగ్స్ పెరిగిపోయాయి ఫ అయినా హోం మంత్రి స్పందించరు ఫ మాజీ ఎమ్మెల్సీ శివకుమారి ఆగ్రహం ఫ బాధిత బాలికకు పరామర్శ -
పిఠాపురం వైద్యులపై విచారణ జరపాలి
పిఠాపురం: పురిటిలోనే తల్లి మృత్యువాత పడటం చాలా దారుణమని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వంగా గీతా విశ్వనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురం ఆస్పత్రిలో వైద్యం వికటించి, బాలింత మృత్యువాత పడిన సంఘటన పైన, సంబంధిత వైద్యుల పైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో మృతురాలి కుటుంబాన్ని బుధవారం ఆమె పరామర్శించారు. బాధిత కుటుంబానికి వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో అత్యంత పటిష్టంగా పని చేసిన వైద్య రంగాన్ని కూటమి ప్రభుత్వం పట్టించకోవడం మానివేసిందన్నారు. మాతా శిశు సంరక్షణలో ప్రభుత్వాస్పత్రికి మించింది లేదనే నమ్మకం గతంలో ఉండేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వాస్పత్రికి వెళ్తే ప్రమాదమన్నట్టుగా ప్రజల్లో భయాందోళనలు కలిగించేలా చేస్తున్నారని దుయ్యబట్టారు. చేబ్రోలుకు చెందిన శ్రీదుర్గను హైరిస్క్ బాలింతగా అంగన్వాడీ, ఆశా వర్కర్లు ధ్రువీకరించారన్నారు. నెలలు నిండకుండా కేవలం వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్తే ఆమె బలవంతంగా పురుడు పోసే ప్రయత్నం చేసినట్లు మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారన్నారు. ఎటువంటి రక్షణ చర్యలూ తీసుకోకుండా బలవంతంగా పురుడు పోయడం వల్లనే తల్లి చనిపోయిందని చెబుతున్నారన్నారు. చివరకు పుట్టిన బిడ్డ కూడా అనారోగ్యంతో దివ్యాంగురాలిగా ఉందని, దీనంతటికీ వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ఈ సంఘటనను ఇప్పటికే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారని, ఉన్నతాధికారులతో విచారణ జరిపించి, బాలింత మృతికి కారకులైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని గీత డిమాండ్ చేశారు. పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో దిగజారిపోతున్న వైద్య సేవలపై అధికార పార్టీ నేతలు, అధికారులు దృష్టి సారించాలని, పేదలకు మంచి వైద్యం అందేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో గొల్లప్రోలు జెడ్పీటీసీ సభ్యుడు ఉలవకాయల నాగ లోవరాజు, సర్పంచ్ దొండపాటి లోవతల్లి తదితరులు పాల్గొన్నారు.ఫ వైద్య వ్యవస్థను పాలకులు పట్టించుకోడం లేదు ఫ పురిటిలోనే తల్లి మృత్యువాత పడటం దారుణం ఫ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి ఫ వైద్యులపై చర్యలు తీసుకోవాలి ఫ వైఎస్సార్ సీపీ నేత వంగా గీత -
కక్ష సాధింపే..
‘సాక్షి’ దిన పత్రిక, ఎడిటర్, విలేకర్లపై పోలీసులు కక్ష సాధింపుతోనే వేధిస్తున్నారు. నకిలీ మద్యం వార్తలను జీర్ణించుకోలేకే కూటమి ప్రభుత్వం ఇలాంటి కుట్రలకు పాల్పడుతోంది. ‘సాక్షి’ రాసే వార్తల వల్ల ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బందులుంటే ఖండనలు లేదా వివరణలు ఇచ్చుకోవాలే తప్ప ఇలా పత్రిక ప్రధాన కార్యాలయానికి పోలీసులను పంపించి వేధించడం సబబు కాదు. ముఖ్యంగా ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డిని, ఆయన స్థాయి, విలువను గుర్తించకుండా పోలీసులు కేసులు నమోదు చేయడం, నోటీసులు ఇవ్వడం దారుణం. కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని చేస్తున్న ఈ కుట్ర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. ‘సాక్షి’పై ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజల అండదండలు ఎప్పుడూ ఉంటాయి. – పినిపే విశ్వరూప్, మాజీ మంత్రి, అమలాపురం పైశాచికత్వానికి పరాకాష్ట ‘సాక్షి’ దినపత్రికపై దాడి ప్రభుత్వ పైచాచికత్వానికి పరాకాష్ట. ‘సాక్షి’ పట్ల, పత్రిక ఎడిటర్ పట్ల కూటమి ప్రభుత్వం, దాని తరఫున పోలీసు అధికారులు దాడులు, బెదిరింపులకు దిగడం వాస్తవాలపై, ప్రజలపై దాడి చేయడమే. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే మీడియాపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. పత్రికా స్వేచ్ఛను హరించడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. ఈ సంస్కృతి సరి కాదు. ప్రజాస్వామ్యవాదులు అక్రమ కేసులను ఖండించాలి. ప్రభుత్వ దమన నీతిపై ప్రశ్నించాలి. ప్రజాస్వామ్యం కోసం పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. – చిర్ల జగ్గిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, కొత్తపేట, వైఎస్సార్ సీపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు -
ఇక మౌనం సాధ్యం కాదు
ఇక మౌనం సాధ్యం కాదు. ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు, నర్సులు, సిబ్బంది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న బకాయిలు వెంటనే చెల్లించాలి. ఆలస్యంగా జరుగుతోన్న చెల్లింపుల్లో మార్పులు రావాలి. ప్యాకేజీ రివిజన్ వంటి సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. ఇది ఆరోగ్య రంగం నిలదొక్కుకునే స్థితినే ప్రమాదంలోకి నెట్టేస్తున్న పరిస్థితులపై పోరాటం మాత్రమే. పెండింగ్ బకాయిలపై స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించాలి. ఏడాది కాలంగా నెట్వర్క్ ఆస్పత్రులు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను ప్రజలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం. ఇంత కాలం సేవలందించిన మాకు ఈ కష్ట కాలంలో అండగా నిలవాలని అభ్యర్థిస్తున్నాం. – డాక్టర్ వై.కల్యాణ్ చక్రవర్తి, కో ఆర్డినేటర్, ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ (ఆషా), కాకినాడ -
రత్నగిరిపై రద్దీ
అన్నవరం: కార్తిక మాసం తొలి రోజైన బుధవారం నుంచే రత్నగిరిపై భక్తుల రద్దీ మొదలైంది. సాధారణంగా కార్తిక శుద్ధ చవితి (నాగుల చవితి) వరకూ రత్నగిరికి భక్తుల తాకిడి పెద్దగా ఉండదు. కానీ, తొలి రోజైన పాడ్యమి నాడే సుమారు 30 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకోవడం విశేషం. తెల్లవారుజామున 4 గంటలకే స్వామివారి ఆలయం తెరచి భక్తులను దర్శనానికి అనుమతించడంతో పాటు వ్రతాల నిర్వహణ కూడా ప్రారంభించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ భక్తుల రద్దీ కొనసాగింది. స్వామివారి ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట సమయం పట్టింది. స్వామివారిని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేశారు. తూర్పు రాజగోపురం ముందున్న రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి, పూజలు చేశారు. సత్యదేవుని వ్రతాలు 1,800 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. సత్యదేవుని సన్నిధిలో శనివారం నుంచి భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ తరువాత ఆదివారం, సోమవారం పర్వదినాలు కావడంతో ఆ మూడు రోజులూ సత్యదేవుని ఆలయానికి లక్ష మందికి పైగా భక్తులు వచ్చేస్తారనే అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి వ్రతాలు ఆది, సోమవారాల్లో తెల్లవారుజామున ఒంటి గంట నుంచి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. -
చర్యలు తీసుకుంటున్నాం
స్ట్రీట్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ దుకాణాలపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను అనుసరించి ఎప్పటి కప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. ప్రధానంగా చిరు వ్యాపారులు చేస్తున్న రోడ్ల ఆక్రమణ, శానిటేషన్ విషయాల్లో అవగాహన సమావేశాలు పెట్టి హెచ్చరిస్తున్నాం. పంచాయతీ పరిధిలో ఉన్న ప్రతి అంశంపై దృష్టి సారించడంతో పాటు నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – ఎల్.దుర్గాప్రసాద్, పంచాయతీ కార్యదర్శి, రావులపాలెం ● -
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
కాకినాడ క్రైం: బేకరీలో పనిచేసే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. కాకినాడ సంతచెరువు జంక్షన్లో ఉన్న ఎస్ఆర్కే బిల్డింగ్లో కర్ణాటకకు చెందిన కేఎస్ వెంకటేష్ అనే వ్యక్తి జై మారుతీ బెంగళూరు అయ్యంగార్ బేకరీని నడిపిస్తున్నాడు. ఈ భవనం కింద అంతస్తులో బేకరీ, మొదటి అంతస్తులో తయారీ కేంద్రం ఉంది. బాలాజీ చెరువుకు చెందిన ర్యాలీ లక్ష్మి (40) దాదాపు రెండు నెలలుగా ఈ తయారీ కేంద్రంలో పని చేస్తోంది. రోజూ మాదిరిగానే మంగళవారం ఆమె తయారీ కేంద్రానికి వచ్చింది. సాయంత్రం 5.30 సమయంలో అదే అంతస్తులో మరో దుకాణం నడుపుతున్న వ్యక్తి.. బేకరీ తయారీ కేంద్రంలో మహిళ పడిపోయి ఉండడాన్ని చూసి షాపు యజమాని వెంకటేష్కు సమాచారం అందించాడు. అతడు వెళ్లి చూసే సరికీ లక్ష్మి విగత జీవిగా కనిపించింది. ఆయన ఈ విషయాన్ని లక్ష్మి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించాడు. ఆమెను కాకినాడ జీజీహెచ్కు తరలించగా, అప్పటికే లక్ష్మి మృతి చెందిందని వైద్యులు నిర్ధారణ చేశారు. ఈ ఘటనపై కాకినాడ త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. భర్తతో వేరుపడిన లక్ష్మికి పదేళ్ల కుమార్తె ఉంది. బేకరీలో పనిచేసుకుంటూ బాలికను పోషిస్తోంది. -
దారీతెన్నూ లేదు!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పారిశ్రామిక ప్రగతిలో పరుగులు పెడుతున్నామంటున్న కూటమి సర్కారు.. పారిశ్రామిక వాడ నిండా మునిగిపోయినా నిర్లక్ష్యాన్నే ప్రదర్శిస్తోంది. పరిశ్రమల ఏర్పాటు కోసం పెదబాబు, చినబాబు దేశాలు పట్టుకుని తిరుగుతున్నారు. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్, అమరావతిలో క్లౌడ్ టెక్నాలజీ వంటి ఉన్నత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చేస్తోందని గొప్పగా ప్రకటించుకుంటున్నారు. అసలు అవన్నీ ఎప్పుడు వస్తాయో తెలియదు కానీ ఉన్న పారిశ్రామికవాడలు కాస్తా నిండా నీట మునిగిపోతున్నా నిర్లక్ష్యం చూపుతున్నారు. ఇలా ఏర్పడింది.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాగా ఉండగా కాకినాడ సర్పవరం భావనారాయణస్వామి ఆలయ సమీపాన సుమారు 25 ఎకరాల్లో పారిశ్రామికవాడ (ఆటోనగర్) ఏర్పాటైంది. మోటారు వాహనాల వర్క్షాపులు, వెల్డింగ్ మెషీన్ యూనిట్లు, ట్రాన్స్ఫార్మర్లు, ప్యానల్ బోర్డుల తయారీ వంటి యూనిట్లు అప్పట్లో కాకినాడ నగరంలో ఎక్కడి పడితే అక్కడ నిర్వహించేవారు. దీనివలన నగరంలో కాలుష్యం పెరిగిపోవడంతో పాటు జనావాసాలకు చాలా ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ నేపథ్యంలో అప్పటి మోటార్ యూనియన్ ప్రతినిధిగా నాగం వీర్రాజు తదితరులు 1999 నుంచి జరిపిన కృషి ఫలితంగా ఆటోనగర్ ఏర్పాటుకు అంకురార్పణ జరిగింది. అప్పట్లో ఒక్కొక్కరికి ఐదారు వందలు నుంచి ఏడు వందల మీటర్ల స్థలాలు వంతున మీటరు రూ.170కి ఏపీఐఐసీ ద్వారా ఇచ్చారు. ఇక్కడి వారందరూ మోటార్ ఇంజిన్ల మరమ్మతులు, విడి భాగాల అసెంబ్లింగ్, లారీ, ట్రాక్టర్ తదితర మెకానిక్ షెడ్లు, ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుల వంటి చిన్న, మధ్యతరహా యూనిట్లు 260 వరకూ ఇక్కడున్నాయి. ఆటోనగర్పై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా 12 వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఆక్రమణలతో.. సామర్లకోట నుంచి కాకినాడకు వచ్చే గోదావరి కాలువ ముంపే ఆటోనగర్కు పెద్ద శాపంగా మారింది. మాధవపట్నం వద్ద ఈ కాలువ ఆక్రమణలతో కుచించుకుపోయింది. మాధవపట్నం నుంచి కాకినాడ రూరల్ మండలం సర్పవరం వెళ్లే మార్గంలో ఈ కాలువ వెడల్పు 12 అడుగులు ఉండాలి. కానీ, ఆక్రమణలతో నాలుగడుగులకు కుదించుకుపోయింది. దీంతో, ఇది దిగువన ఉన్న ఆటోనగర్ను ముంచెత్తుతోందని యూనిట్ల యజమానులు, కార్మికులు చెబుతున్నారు. ఆటోనగర్ వరకూ ఉన్న ఈ కాలువ ఆక్రమణలకు గురవుతున్నా ఏపీఐఐసీతో పాటు సంబంధిత అధికారులెవ్వరూ పట్టించుకోవడం లేదు. చాలా కాలంగా ఈ సమస్యపై మొర పెట్టుకుంటున్నా ప్రభుత్వం నుంచి కనీస స్పందన కూడా లేదని ఆటోనగర్లోని యజమానులు, కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతర్గత డ్రైన్ల నిర్మాణం, రోడ్లు మరమ్మతులు చేపట్టాల్సిన యంత్రాంగం నిధుల్లేవంటూ చేతులెత్తేస్తోంది. ఇన్ని వేల మంది పొట్ట కొడుతున్న ఆటోనగర్ ఇండస్ట్రియల్ పార్క్ సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఇక్కడి వారు కోరుతున్నారు. ఫ ఆటోనగర్లో అష్టకష్టాలు ఫ పోటెత్తిన సామర్లకోట గోదావరి కాలువ ఫ వెళ్లేదెలా.. బయటకు వచ్చేదెలా? ఫ ముంపులో లక్షల విలువైన యూనిట్లు ఐదారు రోజులుగా ముంపులో.. నగరంలో ఇష్టమొచ్చినట్టు నిర్వహిస్తున్న మోటార్ రంగాన్ని ఒకచోట ఏర్పాటు చేయాలనే సంకల్పం మంచిదే. కానీ తాంబూలం ఇచ్చేశాం అనే సామెత చందంగా స్థలాలిచ్చారు తప్ప, కనీస మౌలిక వసతులు కూడా కల్పించ లేదు. అదే ఇప్పుడు ఆటోనగర్కు శాపమైంది. ఏపీఐఐసీ అజమాయిషీలో నడుస్తున్న ఈ ఆటోనగర్ ప్రస్తుతం సామర్లకోట – కాకినాడ కాలువ ముంపు నీటితో మునిగిపోయింది. ఐదారురోజులుగా ముంపు నీటిలో నానుతున్నా పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడు. ఆటోనగర్లో ఎనిమిది అంతర్గత రహదారులున్నాయి. వీటిలో కొన్ని మోకాలి లోతు, మరికొన్ని నడుం లోతు నీట మునిగిపోయాయి. ఎటు చూసినా ముంపు నీరు ముట్టడించడంతో ఆయా యూనిట్లలో అడుగు పెట్టలేని దుస్థితి నెలకొంది. ఆటోనగర్కు వెళ్లాలన్నా, అక్కడి నుంచి బయటకు రావాలన్నా నరకం చూస్తున్నారు. ముంపుతో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఎప్పటి మాదిరిగానే రోజువారీ పనులు ముగించుకుని ఎక్కడి మెషీన్లు అక్కడే విడిచిపెట్టి, ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ముంపులో మునిగిపోయి లక్షల్లో నష్టపోయామని ఆయా యూనిట్ల యజమానులు గగ్గోలు పెడుతున్నారు. -
దెబ్బ తిన్న యంత్రాలు
వివిధ యూనిట్లలోని యంత్రాల్లోకి ముంపు నీరు చేరి రోజుల తరబడి నిలిచిపోవడంతో ఆ యంత్రాలు ఇక పని చేయవేమోనని యజమానులు దిగులు చెందుతున్నారు. ఇక్కడ తయారయ్యే ట్రాన్స్ఫార్మర్లు, వెల్డింగ్ మెషీన్లు, ప్యానల్ బోర్డులు రాష్ట్రంలోని పలు జిల్లాలకు వెళ్తూంటాయి. అప్పుడే నాలుగైదు రోజులుగా పనులు నిలిచిపోవడంతో రూ.లక్షల్లో నష్టపోతున్నామని వారు మధనపడుతున్నారు. వెల్డింగ్ మెషీన్లు, ఒక మోస్తరు యంత్ర పరికరాలు ముంపులో ఉండటంతో నీరు లాగేసినా తిరిగి అవి పని చేస్తాయో లేవోననే దిగులు వారిని వెంటాడుతోంది. -
యువకుడిపై కానిస్టేబుల్ దాడి
సామర్లకోట: కానిస్టేబుల్ తీవ్రంగా కొట్టడంతో ఓ యువకుడు ప్రాణాపాయస్థితికి చేరాడు. ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. దీపావళి సందర్భంగా ఏటా బ్రౌన్పేట – కోటపేటకు చెందిన యువకులు తారాజువ్వలను నేలబారున విడిచిపెట్టే పోటీ పెట్టుకుంటారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి రెండు వర్గాలకు చెందిన యువకులు జువ్వలు వేసుకోవడం ప్రారంభించారు. పోలీసులు అక్కడకు చేరుకుని రెండు పర్యాయాలు వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో జువ్వల పోటీతో ఎటువంటి సంబంధం లేని దడాల అక్షయ కుమార్ అనే యువకుడు ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అతడిని కానిస్టేబుల్ సతీష్ కుమార్ కొట్టడం ప్రారంభించాడు. ఆ క్రమంలో అక్షయ కుమార్ వీపుపై లాఠీ బలంగా తగలడంతో స్పృహ తప్పి పడిపోయాడు. విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే హుటాహుటిన స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్షయ కుమార్కు చిన్నతనం నుంచీ పక్షవాతం ఉంది. ఎప్పుడైతే కానిస్టేబుల్ లాఠీతో కొట్టాడో అతడు కోమాలోకి వెళ్లాడు. ఆస్పత్రి సిబ్బంది వైద్యం ప్రారంభించిన కొద్ది సేపటికి ఊపిరి ఆగి పోవడంతో అక్షయ కుమార్ చనిపోయాడని భావించారు. ఇంతలో డాక్టర్ వచ్చి సీపీఆర్ చేయడంతో ఊపిరి పీల్చుకున్నాడు. వెంటనే 108లో కాకినాడ తరలించడానికి ప్రయత్నం చేయగా దాదాపు గంటంప్పావు వరకూ అంబులెన్స్ అందుబాటులోకి రాలేదు. ఆ తర్వాత 108లో పోలీసుల సహకారంతో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పెద్దాపురం డీఎస్పీ డి.శ్రీహరిరాజు, సీఐ ఎ.కృష్ణ భగవాన్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బాధితుడికి న్యాయం చేయాలి అమాయకుడైన అక్షయ కుమార్ను కానిస్టేబుల్ లాఠీతో కొట్టడం దారుణమని దళిత సంఘాల నాయకులు సతీష్ బాబు, లింగం శివప్రసాద్, నేతల హరిబాబు, పిట్టా సత్యనారాయణ అన్నారు. ఆ కానిస్టేబుల్ను సస్పెండ్ చేసి, అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అక్షయ కుమార్కు అవుట్ సోర్సింగ్లో ఉద్యోగం ఇవ్వాలన్నారు. గతంలో కూడా ఒక దళిత యువకుడు చనిపోవడానికి పోలీసులే కారణమని గుర్తు చేశారు. దీనిపై విచారణ చేసి క్షతగాత్రుడికి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. ప్రాణాపాయస్థితిలో బాధితుడు గంటంపావు వరకూ రాని108 అంబులెన్స్ కాకినాడ ఆస్పత్రిలో చికిత్స తారాజువ్వల పోటీలో కలకలం -
ఆకాశ దీపంతో శుభారంభం
ఫ రత్నగిరిపై కార్తిక మాసోత్సవాలకు శ్రీకారం ఫ పూర్తయిన ఏర్పాట్లు అన్నవరం: ఆకాశ దీపం ఏర్పాటు ద్వారా రత్నగిరిపై కార్తిక మాసోత్సవాలకు అర్చకులు మంగళవారం శ్రీకారం చుట్టారు. సత్యదేవుని ప్రధానాలయంలో ధ్వజస్తంభం వద్ద ప్రత్యేక పూజలు చేసి, ఆకాశ దీపం ఏర్పాటు చేశారు. కార్తిక అమావాస్య అయిన నవంబరు 20వ తేదీ వరకూ ప్రతి రోజూ ఆకాశ దీపం ఏర్పాటు చేస్తామని ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం తెలిపారు. బుధవారం తెల్లవారుజాము నుంచి పాడ్యమి దీపాలు ఏర్పాటు చేయనున్నారు. కార్తిక అమావాస్య వరకూ వీటిని వెలిగిస్తారు. మార్గశిర పాడ్యమి తెల్లవారుజామున పోలిస్వర్గం దీపాలు వెలిగించి, నదుల్లో వదలడం ద్వారా కార్తిక మాసోత్సవాలు ముగియనున్నాయి. కార్తిక మాసం సందర్భంగా అన్నవరం దేవస్థానంలో చేపట్టిన ఏర్పాట్లు పూర్తి చేశారు. పశ్చిమ రాజగోపురం ఎదురుగా లారెల్స్ ఫార్మాస్యూటికల్స్ చేపట్టిన భక్తుల విశ్రాంతి షెడ్డు నిర్మాణం పూర్తయింది. అలాగే, క్యూ లైన్లు, విశ్రాంతి మండపాలు, పార్కింగ్ స్థలాలు కూడా సిద్ధం చేశారు. కార్తిక మాసంలో శని, ఆది, సోమ, దశమి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి తదితర పర్వదినాల్లో అర్ధరాత్రి 2 గంటల నుంచి మిగిలిన రోజుల్లో తెల్లవారుజామున 4 గంటల నుంచి సత్యదేవుని వ్రతాలు ప్రారంభిస్తారు. అలాగే, స్వామివారి దర్శనాలు కూడా పర్వదినాల్లో అర్ధరాత్రి నుంచి, మిగిలిన రోజుల్లో తెల్లవారుజాము నుంచి ప్రారంభమవుతాయి. వ్రతాలు, దర్శనాల టికెట్లు, ప్రసాదం విక్రయాలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రత్యేక అధికారుల నియామకం కార్తిక మాసంలో భక్తుల రద్దీకి తగినట్లుగా ఏర్పాట్లు చేయడానికి, నవంబరు 2న తెప్పోత్సవం, 5న గిరి ప్రదక్షిణ ఏర్పాట్ల పర్యవేక్షణకు గాను దేవదాయ శాఖ కాకినాడ డిప్యూటీ కమిషనర్ రమేష్బాబు, లోవ తలుపులమ్మ తల్లి, వాడపల్లి దేవస్థానం ఈఓలు పి.విశ్వనాథరాజు, ఎన్ఎస్ చక్రధర్రావు ప్రత్యేకాధికారులుగా నియమితులయ్యారు. ఈ మేరకు దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. అన్నవరం దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావుతో కలసి వీరు కార్తిక మాసం ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. -
వానోస్తే ముంపే..
ఆటోనగర్లో మెకానిక్ షెడ్ల నిర్వాహకులం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. వానొస్తే ముంపు తప్పడం లేదు. విలువైన సామగ్రి, ఇంజిన్లు చెడిపోతున్నాయి. రోడ్లు, మౌలిక సదుపాయాలు లేవు. – మణికంఠ ● శాశ్వత పరిష్కారం చూపాలి ఆటోనగర్లో చాలా సమస్యలున్నాయి. రోడ్లు, డ్రైనేజీలు సక్రమంగా లేవు. ముఖ్యంగా వర్షాలకు ముంపులోకి వెళ్లడంతో పనులు నిలిచిపోతున్నాయి. ఉపాధి దెబ్బ తింటోంది. ఏపీఐఐసీ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి, ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. – సతీష్ రూ.2.50 కోట్లతో డ్రైనేజీకి ప్రతిపాదన ఆటోనగర్ పల్లపు ప్రాంతంగా మారింది. పంట పొలాలను ఆనుకుని ఉండటంతో వర్షాలకు నీరు బయటకు పోవడం లేదు. పంట పొలాల్లోని గోదావరి, ఏలేరు జలాలు ఆటోనగర్ ఇండస్ట్రియల్ పార్కులోకి వస్తున్నాయి. పలు షాపుల్లోకి నీరు చేరడంతో పాటు వీధులు మునిగిపోయి ముంపులో ఉంటున్నాయి. సమస్య పరిష్కారానికి రూ.2.50 కోట్లతో మేజర్ డ్రైనేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు చేశాం. – అబ్బిరెడ్డి రమణారెడ్డి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్, కాకినాడ -
ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
కాకినాడ క్రైం: స్థానిక జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ షణ్మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశిష్ట అతిథులుగా స్థానిక ప్రజాప్రతినిథులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద పరేడ్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తూండటం స్ఫూర్తిదాయకమని అన్నారు. నాయకులు మాట్లాడుతూ పోలీసు అమర వీరుల కుటుంబాలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఆయా కుటుంబాలకు నగదు అందించి, పండ్లు పంచారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, చినరాజప్ప, పోలీసు అధికారులు పాల్గొన్నారు.డీఏ జీఓ మోసపూరితం కరప: రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు డీఏ మంజూరు చేస్తూ జారీ చేసిన జీఓ మోసపూరితమైనదని యూటీఎఫ్ జిల్లా నాయకుడు ఐ.ప్రసాదరావు విమర్శించారు. గురజనాపల్లిలో మంగళవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు 2024 జనవరి నుంచి ఇవ్వాల్సిన కరవు భత్యం (డీఏ) 3.64 శాతం ఈ నెల నుంచి చెల్లించేందుకు జీఓ 60 జారీ చేశారన్నారు. అయితే 2024 జనవరి నుంచి చెల్లించాల్సిన 21 నెలల బకాయిలు ఉద్యోగులు రిటైరయ్యాక చెల్లిస్తామంటూ జీఓ జారీ చేయడం సరికాదన్నారు. పెన్షనర్లకు 2027–28లో చెల్లించాలంటూ మరో జీఓ 61 జారీ చేశారన్నారు. ఇది ఉద్యోగులను మోసం చేయడమేనని పేర్కొన్నారు. సర్వీసులో ఉన్న ఉద్యోగులకు వారి ఖాతాల్లో తక్షణం జమ చేయాలని, అలా సర్దుబాటు కాకుంటే ఉద్యోగ, ఉపాధ్యాయుల వ్యక్తిగత పీఎఫ్ ఖాతాల్లో బకాయిలు జమ చేయాలని ప్రసాదరావు డిమాండ్ చేశారు. సీపీఎస్ ఉద్యోగులకు 90 శాతం నగదు, పెన్షనర్లకు తక్షణం నగదు చెల్లించాలని కోరారు. ఎరియర్లకు సంబంధించిన జీఓను సవరించాలని యూటీఎఫ్ జిల్లా నాయకుడు ప్రసాదరావు అన్నారు. ఇటువంటి జీఓల మూలంగా ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారన్నారు. భవిష్యత్లో ఉద్యోగులకు డీఏ చెల్లించకుండా ప్రభుత్వాలు తాత్సారం చేసే అవకాశముందని చెప్పారు. ఈ జీఓ సవరణ కోసం ఉద్యమించేందుకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు సన్నద్ధం కావాలని ప్రసాదరావు పిలుపునిచ్చారు. నేటి నుంచి కార్తిక మాసోత్సవాలు సామర్లకోట: స్థానిక పంచారామ క్షేత్రమైన బాలాత్రిపుర సుందరీ సమేత కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయంలో కార్తిక మాసోత్సవాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. కోనేరులో గోదావరి జలాలు నింపారు. ఉచిత దర్శనంతో పాటు ప్రత్యేక దర్శనాలకు సంబంధించి క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. రోజూ సాయంత్రం ఆకాశ దీపం వెలిగించి, పూజలు చేస్తారు. కార్తిక మాసంలో నవంబర్ 5న పౌర్ణమి, 6న కృత్తికా నక్షత్రాన్ని పురస్కరించుకొని స్వామివారి గ్రామోత్సవం, అనంతరం జ్వాలాతోరణం నిర్వహిస్తారు. 18న మాస శివరాత్రి పూజలు, 20వ తేదిన అమావాస్యను పురస్కరించుకొని ఆలయంలో కోటి దీపోత్సవం, 21న పోలి పాడ్యమి సందర్భంగా స్వామి వారి జటాజూటం అలంకరణ ఉంటాయని ఈఓ బళ్ల నీలకంఠం, ట్రస్టు బోర్డు చైర్మన్ కంటే జగదీష్ మోహనరావు తెలిపారు. -
బీసీ, ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కమిటీ
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): బీసీ, ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా నూతన కమిటీ ఎన్నిక మంగళవారం స్థానిక రా మారావుపేటలో జరిగింది. ప్రస్తు త జిల్లా అధ్యక్షుడు రామానుజన్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు గుత్తుల వీరబ్రహ్మం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంఘం నూతన అధ్యక్షుడిగా వాసంశెట్టి కామేశ్వరరావు (వి ద్యాశాఖ), గౌరవాధ్యక్షుడిగా రామానుజన్ శ్రీనివాస్ (విద్యుత్ శాఖ), ప్రధాన కార్యదర్శిగా జోగా రామకృష్ణ (వైద్య, ఆరోగ్య శాఖ), ఆర్థిక కార్యదర్శిగా నరసింహమూర్తి (విద్యా శాఖ), రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా గంటి రాధాకృష్ణ, కాకినాడ పట్టణ శాఖ గౌరవాధ్యక్షుడిగా చోడే శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్గా సంగాడి రాజసింహవర్మ, అధ్యక్షుడిగా కడలి నాగరాజు, ప్రధా న కార్యదర్శి ముక్తేష్, సంయుక్త కార్యదర్శిగా ములంపాక శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కామేశ్వరరావు మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని మండలాల్లో కమిటీలు ఏర్పాటు చేసి, సంఘాన్ని బలోపేతం చేస్తా నని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సంఘం ఉమ్మడి జిల్లా కార్యవర్గ సభ్యులు సిద్ధి వెంకటేశ్వరరావు, అద్దంకి వెంకన్నబాబు, ముల్లు సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు దొమ్మేటి సుధాకర్, రాపాక శ్రీనివా స్, వీరభద్రరావు, డి.ఏడుకొండలు, టేకుమూడి శ్రీనివాస్, సత్యప్రసాద్, గుత్తుల వెంకటేష్ పాల్గొన్నారు. -
బుధవారం శ్రీ 22 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టే.. పత్రికలకు భారత రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛకు భంగం కలిగించేలా కూటమి ప్రభుత్వం పోలీసు శాఖ ద్వారా అణచివేత ధోరణి అవలంబించడం సమంజసం కాదు. పత్రికల స్వేచ్ఛను హరించడానికి, హక్కులను నిర్మూలించడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వారు శిక్షార్హులు కూడా. పత్రికా స్వాతంత్య్రం అణచివేతకు ప్రయత్నించిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలి. – పిల్లి సుభాష్చంద్రబోస్, రాజ్యసభ సభ్యుడు కేసులు ఉపసంహరించాలి పత్రికలకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. ఆ స్వేచ్ఛను హరించేలా కొత్త సంప్రదాయానికి కూటమి ప్రభుత్వం తెర తీసింది. ‘సాక్షి’ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది. ఆ పత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డితో పాటు జర్నలిస్టులపై కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తోంది. పత్రిక కార్యాలయంపై దాడులు తగవు. పత్రికలకు గౌరవం ఇవ్వాలి. కేసులు ఉపసంహరించాలి. – కురసాల కన్నబాబు, మాజీ మంత్రి, కాకినాడ జిల్లా -
ఫారెస్ట్ రిజర్వ్గా మధ్యలంక
మామిడికుదురు: బి.దొడ్డవరం గ్రామంలోని మధ్యలంకను గ్రామ పంచాయతీ అనుమతితో ఫారెస్ట్ రిజర్వ్ ప్రాంతంగా ప్రకటిస్తామని జిల్లా ఫారెస్టు అధికారి ఎంవీ ప్రసాదరావు తెలిపారు. ఆయన మంగళవారం బోటులో సిబ్బందితో వెళ్లి మధ్యలంకలో నివాసం ఉంటున్న పక్షులను పరిశీలించారు. ఆగ్నేయాసియా నుంచి వలస వచ్చిన ఓపెన్ బిల్ స్టార్క్ పక్షులు గత మూడేళ్లుగా అక్కడ నివాసం ఉంటున్నాయన్నారు. వలస వచ్చిన పక్షులు నత్తలను కొట్టుకుని ఆహారంగా తింటాయన్నారు. మధ్యలంకలో సుమారుగా 10 వేల వరకు పక్షులు ఉంటాయని చెప్పారు. వాటి పరిరక్షణ కోసం ఆ ప్రాంతాన్ని రిజర్వు ప్రాంతంగా ప్రకటించేందుకు కార్యాచరణ చేపడతామన్నారు. -
తిన్నారంటే తిప్పలే..
రావులపాలెం/అమలాపురం టౌన్: ఇటీవల కాలంలో స్ట్రీల్ ఫుడ్ వ్యాపారం విపరీతంగా పెరిగింది. వీధుల్లో ఏర్పాటు చేసే చిన్న చిన్న బళ్ల వద్ద ఆహార పదార్థాలను తినేవారు ఎక్కువయ్యారు. పిల్లలతో సరదాగా బయటకు వచ్చిన తల్లిదండ్రులు, షికారుకు వచ్చిన యువత, వాకింగ్ వచ్చిన పెద్దలు.. ఇలా అందరూ బండ్లపై అమ్మే పదార్థాలను ఇష్టంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో రోడ్ల చెంతన, వీధుల్లో ఫాస్ట్ఫుడ్, టిఫిన్ సెంటర్లు, బజ్జీ దుకాణాలు, పానీపూరీ బండ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అయితే వీటి నిర్వాహకుల్లో కొందరు నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ప్రతి వీధిలోనూ.. రావులపాలెంతో పాటు ప్రధాన జాతీయ రహదారి, ఆర్అండ్బీ రోడ్లు విస్తరించిన పరిసర గ్రామాల్లో రోడ్ల వెంబడి అనేక ఫాస్ట్ఫుడ్ సెంటర్లు వెలిశాయి. దీనికి తోడు మిరపకాయ బజ్జీలు, న్యూడిల్స్, పానీపూరీ, మాంసం పకోడీ విక్రయించే తోపుడు బండ్లు ప్రతి వీధిలోనూ దర్శనమిస్తున్నాయి. అయితే వీరిలో కొందరు వ్యాపారులు ఒకే నూనెను అనేకసార్లు మరిగించి, వాడడం వల్ల వినియోగదారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులకు కారణవుతోంది. ఇలా ఆహార కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నది తొలుత యువతే. ఇటీవల ఏదైనా సుస్తీ చేసి ఆస్పత్రులకు వెళితే తొలుత డాక్టర్లు.. ఫాస్ట్ ఫుడ్, వీధి బళ్లమీద విక్రయించే ఆహారం తీసుకోవద్దని సలహా ఇస్తున్నారు. నిఘా కరవు ఫాస్ట్ఫుడ్ సెంటర్లపై ఫుడ్ సేఫ్టీ, పంచాయతీ, పొల్యూషన్ కంట్రోల్ అధికారుల నిఘా కరవైంది. కేవలం పెద్ద హోటళ్లపై మాత్రమే దాడులు, తనిఖీ చేస్తున్నారు. తర్వాత రాజకీయ ఒత్తిళ్లతో కేసులను నీరుగార్చేస్తున్నారు. రావులపాలెంలో ఇటీవల ప్రముఖ హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ, విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. నిల్వ ఉన్న ఆహార పదార్థాలను గుర్తించి కేసులు నమోదు చేశారు. అలాగే రాజకీయ, ఆర్థిక పలుకుబడులతో నామమాత్రపు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకొన్నారు. కానీ స్ట్రీట్ ఫుడ్ దుకాణాలను ఏ అధికారులూపట్టించుకున్న దాఖలాలులేవు. పొగతో కాలుష్యం కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం, కొత్తపేట, ఆలమూరు, ఆత్రేయపురం పరిసర గ్రామాల రోడ్ల చెంత తాత్కాలికంగా ఫాస్ట్ ఫుడ్, న్యూడిల్స్, పానీపూరీ, మాంసం పకోడీ షాపులు, తోపుడు బండ్లు అనేక ఉన్నాయి. ఈ వ్యాపారులందరూ రోజూ సాయంత్రం నాలుగింటికి తమ వ్యాపారం మొదలు పెడతారు. మరిగించిన నూనెలోనే పదార్థాలను తయారు చేయడం వల్ల తిన్నవారి ఆరోగ్యం పెను ప్రమాదంలో పడుతోంది. న్యూడిల్స్, పానీపూరీ, ఫ్రైడ్ రైస్ కూడా ఈ కోవలోకే వస్తాయి. అలాగే ఈ షాపులు, తోపుడు బండ్లపై గ్యాస్ సిలిండర్ల వాడడం, నూనె మరగడం వల్ల వచ్చే పొగతో వెలువడే ఆయా ప్రాంతాల్లో కాలుష్యం కమ్ముకుంటోంది. రావులపాలెంలో హైవే సర్వీసు రోడ్డు, రింగ్ రోడ్డు, పార్కు వద్ద, మార్కెట్ సెంటర్, రైతు బజార్ సెంటర్, ఊబలంక రోడ్డు, అమలాపురం రోడ్డు ఇలా చెప్పుకుంటూ పోతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెడీమేడ్ ఆహార పదార్థాలు విక్రయించే తోపుడు బండ్లు అనేకం దర్శనమిస్తాయి. ఒక్క రావులపాలెం పంచాయతీ పరిధిలో స్ట్రీట్ పుట్ బండ్లు సుమారు 60 వరకూ ఉన్నట్టు సమాచారం. జిల్లా కేంద్రంలో.. జిల్లా కేంద్రమైన అమలాపురం పట్టణంలో హోటళ్లు, పాస్ట్ ఫుడ్ సెంటర్లు రెట్టింపు అయ్యాయి. అయితే పలు హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఆహారం కలుషితం అవుతోందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ఒక మాంసాహార హోటల్లోని పలావులో మండ్ర కప్ప ఉందన్న విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దీంతో మున్సిపాలిటీ, ఫుడ్ సేఫ్టీ అధికారుల్లో కదలిక మొదలైంది. అప్పటి వరకూ పలు మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో కొందరు కౌన్సిలర్లు పట్టణంలో కలుషిత ఆహారం అధికమవుతోందని ఆందోళన చెందినా కదలిక లేదు. అమలాపురం పట్టణం వ్యాప్తంగా పలు కూడళ్లలో దాదాపు 24 వరకూ పాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉన్నాయి. వాటిలో పదార్థాల తయారీకి ఉపయోగించే పొయ్యిల గొట్టాలను రోడ్డు వైపు పెట్టేస్తున్నారు. వాటి నుంచి ఆయిల్ తుంపర్లు, పొగ విపరీతంగా వెలువడుతోంది. హోటళ్ల కంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలోనే ఆహార కలుిషితం ఎక్కువ అవుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంబాజీపేటలోని ఓ హోటల్లో టిఫిన్ తిన్న 20 మంది అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలవడంతో కలుషిత ఆహారంపై ప్రజల్లో మరింత ఆందోళన పెరిగింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు తరచూ హోటళ్లు, పాస్ట్ ఫుడ్ సెంటర్లపై దాడులు, తనిఖీలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.సహజ ప్రసవం చేసి ప్రాణాలు తీసేశారంటూ.. విపరీతంగా పెరిగిన ఫాస్ట్ ఫుడ్ దుకాణాలు కొన్నింటిలో నాణ్యతకు తిలోదకాలు లైసెన్సులు లేకుండా వ్యాపారం ప్రమాదంలో ప్రజారోగ్యందృష్టి సారించని అధికారులు పంచాయతీ పరంగా శానిటేషన్, ఎన్విరాల్మెంట్ పరిశుభ్రత అంటూ అధికారులకు ఈ సెంటర్లు, షాపులను తనిఖీ చేసే అధికారం ఉన్నా.. వారు ప్లాస్టిక్ కవర్లు తదితర సామగ్రిపైనే దృష్టి పెడుతున్నారు. కల్తీ ఆహార విక్రయాలు, కాలుష్యాన్ని పట్టించుకోవడం లేదు. గతంలో పంచాయతీలకు శానిటరీ ఇన్స్పెక్టర్లు ఉండేవారు, ఇప్పుడు ఆ పోస్టులు లేకపోవడంతో పంచాయతీ సెక్రటరీలు, గుమస్తాలపై ఈ భారం పడింది. జిల్లా స్థాయిలో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అధికారులు ఈ తరహా దుకాణాలను తనిఖీలు చేస్తే నిర్వాహకులకు కనీసం భయమైనా ఉంటుంది. ఈ దుకాణాల నిర్వహణకు ఎవ్వరూ లైసెన్సులు తీసుకోవడం లేదు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రోడ్ల చెంత తిను బండారాలు విక్రయించే ప్రతి వీధి వ్యాపారి తప్పని సరిగా లైసెన్స్ పొందాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు. -
కార్తికం.. భక్త్యుత్సవం
అన్నవరం: హరిహరాదులకు ప్రీతికరమైన కార్తిక మాసం బుధవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. సామర్లకోటలోని పంచారామ క్షేత్రం శ్రీ కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయం, పిఠాపురం పాదగయ క్షేత్రంతో పాటు హరిహర క్షేత్రంగా భాసిల్లుతున్న అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో కార్తిక మాసోత్సవాలకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆశ్వయుజ అమావాస్య సోమవారం సాయంత్రం ప్రారంభమై మంగళవారం సాయంత్రానికి ముగుస్తుంది. అయితే, శుద్ధ పాడ్యమి తిథి ఉదయం వేళకు ఉండటాన్ని పరిగణనలోకి తీసుకుంటారు కాబట్టి పంచాంగం ప్రకారం బుధవారమే కార్తిక మాసం ఆరంభమవుతుంది. అయితే, కార్తిక శుద్ధ పాడ్యమి తిధి మంగళవారం సాయంత్రమే వస్తున్నందున ఆలయాల్లో మాత్రం ఆ రోజు రాత్రి ఆకాశ దీపం ఏర్పాటుతో కార్తిక మాసోత్సవాలు ప్రారంభించనున్నారు. అన్నవరం దేవస్థానంలో అర్చకులు మంగళవారం రాత్రి ధ్వజస్తంభం వద్ద ఆకాశ దీపం ఏర్పాటు చేయడం ద్వారా కార్తిక మాసోత్సవాలకు శ్రీకారం చుడతారు. కార్తిక అమావాస్య అయిన నవంబర్ 20వ తేదీ వరకూ ప్రతి రోజూ ఆకాశ దీపం ఏర్పాటు చేస్తామని ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇవీ ఏర్పాట్లుకార్తిక మాసంలో సత్యదేవుని సన్నిధికి లక్షలాదిగా భక్తులు తరలి రానున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని దేవస్థానంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఫ శని, ఆది, సోమవారాలతో పాటు, దశమి, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, కార్తిక పౌర్ణమి తదితర 16 పర్వదినాల్లో వేలాదిగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున తెల్లవారుజామున ఒంటి గంట నుంచే సత్యదేవుని వ్రతాలు, 2 గంటల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. ఫ పౌర్ణమి, ఏకాదశి, పర్వదినాల్లో పశ్చిమ రాజగోపురం వద్ద రోప్ పార్టీ ఏర్పాటు చేసి, అధిక సంఖ్యలో వచ్చే భక్తులను బృందాల వారీగా దర్శనానికి అనుమతిస్తారు. ఫ పర్వదినాల్లో ముందు రోజు రాత్రే వ్రతాల టికెట్లు ఇస్తారు. దీనికి గాను ఇప్పటికే ఉన్న వాటికి అదనంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. స్వామివారి దర్శనం టికెట్లు, ప్రసాద విక్రయాలకు కూడా అదనంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. ఫ కార్తిక శుద్ధ ద్వాదశి (క్షీరాబ్ది ద్వాదశి) సందర్భంగా నవంబర్ రెండో తేదీ రాత్రి 6.30 గంటల నుంచి పంపా సరోవరంలో సత్యదేవుని తెప్పోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. ఫ కార్తిక పౌర్ణమి సందర్భంగా నవంబర్ ఐదో తేదీ ఉదయం సత్యదేవుని గిరి ప్రదక్షిణ పల్లకీ మీద లాంఛనంగా నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు సత్యరథంతో గిరి ప్రదక్షిణ ఘనంగా ప్రారంభించి, సాయంత్రం ఆరున్నర గంటలకు ముగిస్తారు. అదే రోజు సాయంత్రం 5.45 గంటలకు పంపా జలాశయం వద్ద పంపా హారతులు, రాత్రి 7 గంటలకు తొలి పావంచా వద్ద జ్వాలాతోరణం నిర్వహిస్తారు. ఫ కార్తికం నెల రోజులూ చిన్న కార్లు, ఆటోలు మినహా మరే ఇతర వాహనాలను కొండ మీదకు అనుమతించరు. పెద్ద వాహనాలను భక్తులు కళాశాల మైదానంలో నిలిపివేసి, దేవస్థానం బస్సులు, ఆటోల ద్వారా కొండ మీదకు చేరుకోవాలి. ఫ కొండ మీదకు వచ్చే చిన్న కార్లను సత్యగిరి రోడ్డు పక్కన, సత్రాల ఆవరణలో నిలుపు చేస్తారు. దీనికోసం పార్కింగ్ స్థలాన్ని ప్రత్యేకంగా విశాలంగా రూపొందిస్తున్నారు. సుమారు 4 వేల కార్ల పార్కింగ్కు ఏర్పాట్లు చేస్తున్నారు. కొండ దిగువకు వెళ్లే వాహనాలను ఆదిశంకర మార్గ్ ద్వారా పంపిస్తారు. ఫ రత్నగిరిపై 2 వేల మంది సేద తీరేందుకు వీలుగా డార్మెట్రీ, విష్ణు సదన్లో 36 హాళ్లు ఉన్నాయి. సీఆర్ఓ కార్యాలయం వద్ద నిర్మించిన డార్మెట్రీలో లాకర్లతో పాటు అన్ని సదుపాయాలూ కల్పించారు. ఈఓ కార్యాలయం దిగువన ఉన్న మెయిన్ క్యాంటీన్ను కూడా డార్మెట్రీగా మార్చనున్నారు. ఫ విద్యుత్ సరఫరా 24 గంటలూ నిరాటంకంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఫ దేవస్థానం, కొండ దిగువన మెయిన్ రోడ్డు, రైల్వే స్టేషన్ రోడ్డులో పారిశుధ్యం మెరుగు పడేలా అదనపు సిబ్బందిని నియమించారు. ఫ భక్తుల కోసం రత్నగిరి పైన, దిగువన 457 టాయిలెట్లు ఉన్నాయి. గిరి ప్రదక్షిణ రోడ్డులో 24 టాయిలెట్లు తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. గిరి ప్రదక్షిణ రోడ్డులో ఈసారి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయనున్నారు. ఫ కార్తిక మాసంలో అన్నదానానికి బదులు సర్కులర్ మండపం వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకూ భక్తులకు పులిహోర, దద్ధోజనం.. చిన్నారులకు పాలు, బిస్కెట్లు పంపిణీ చేస్తారు. అన్నదాన పథకంలో సెక్యూరిటీ సిబ్బందికి, కళాకారులకు మాత్రమే భోజన సౌకర్యం ఉంటుంది. ఫ పశ్చిమ రాజగోపురం వద్ద లారెస్ ఫార్మాస్యూటికల్స్ (విశాఖపట్నం) నిర్మించిన విశ్రాంతి షెడ్డులో సుమారు 5 వేల మంది భక్తులు సేద తీరే అవకాశం ఉంది. ఈ షెడ్డులోనే భక్తులకు వ్రతాలు, దర్శనం, ప్రసాదాల టికెట్ల విక్రయాలకు కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. రూ.3 కోట్లతో ఏర్పాట్లు కార్తిక మాసంలో లక్షలాదిగా వచ్చే భక్తుల కోసం దాదాపు రూ.3 కోట్ల వ్యయంతో నిర్మాణా లు చేపట్టాం. వివిధ సత్రాలకు రూ.కోటితో మరమ్మతులు చేసి, రంగులు వేయించాం. వ్రతాలాచరించే భక్తుల కోసం కూడా తగిన ఏర్పాట్లు చేశాం. భక్తులను ఇబ్బంది పెట్టవద్దని వ్రత పురోహితులను ఆదేశించాం. రూ.15 లక్షలతో తెప్పోత్సవ ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. గిరి ప్రదక్షిణకు కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. ఇందులో పాల్గొనే భక్తులకు మజ్జిగ, పండ్లు, ఫలహారాలు పంపిణీ చేస్తాం. – వీర్ల సుబ్బారావు, ఈఓ, అన్నవరం దేవస్థానం 22 లక్షల మంది వస్తారని అంచనా గత ఏడాది కార్తికంలో సత్యదేవుని ఆలయానికి 20 లక్షల మంది భక్తులు వచ్చారన్నది అంచనా. ఈసారి 22 లక్షల మందికి పైగా వస్తారని భావిస్తూ ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. 2022 కార్తికంలో 1.42 లక్షలు వ్రతాలు జరిగాయి. 2023లో తుపాన్ల కారణంగా ఆ సంఖ్య 1.25 లక్షలకే పరిమితమైంది. గత ఏడాది కార్తికంలో 1.47 లక్షలకు పెరిగింది. ఈసారి సుమారు 1.50 లక్షల వ్రతాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. గత ఏడాది కార్తికంలో సత్యదేవుని ప్రసాదం ప్యాకెట్లు 22 లక్షలు విక్రయించారు. ఈసారి 25 లక్షలకు పైగా విక్రయించే అవకాశం ఉంది. దీనికి అవసరమైన గోధుమలు, నెయ్యి, పంచదార సిద్ధంగా ఉంచారు. గత కార్తికంలో సత్యదేవునికి రూ.21.14 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి రూ.25 కోట్లు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. సాక్షి, కాకినాడ 99516 02838ఫ రేపు రాత్రి ఆకాశ దీపంతో ఉత్సవాల ప్రారంభం ఫ నవంబరు 2న సత్యదేవుని తెప్పోత్సవం ఫ 5న గిరి ప్రదక్షిణ ఫ రత్నగిరిపై విస్తృతంగా ఏర్పాట్లు -
వన్స్టాప్ సెంటర్
మహిళలు, బాలబాలికలు, మేజర్లు, మైనర్లు ఇలా ఎవరికై నా కష్టమొచ్చిందంటే వారికి కొండంత అండగా నిలుస్తోంది కాకినాడ జీజీహెచ్లోని సఖి వన్స్టాప్ సెంటర్. బాధితులను సంరక్షించి, తాత్కాలిక వసతి కల్పించి, అన్ని రకాలుగా రక్షణ కల్పిస్తున్నారు. వారి సంరక్షణ కోసం వన్స్టాప్ సెంటర్లో పోలీసులు, న్యాయ నిపుణులు కూడా పని చేస్తారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ శైలజ ఇటీవల కాకినాడలో పర్యటించిన సందర్భంగా వన్స్టాప్ సెంటర్ సేవలను ప్రశంసించారు. ఈ సెంటర్కు కలెక్టర్ షణ్మోహన్ స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర అవార్డు అందజేశారు కూడా. ఈ సెంటర్లో ఒక అడ్మినిస్ట్రేటర్, పారా లీగల్ పర్సనల్, కౌన్సిలర్, ఐటీ పర్సన్తో పాటు కేసు వర్కర్లు ఇద్దరు, సెక్యూరిటీ గార్డులు, హెల్పర్లు ముగ్గురు చొప్పున మొత్తం 12 మంది ఉన్నారు. వీరిలో ఏ ఒక్కరికీ ఏడు నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. అధికారులు సిఫారసులు చేసినా ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ప్రతిష్టంభన కొనసాగుతోంది. జీతాల విడుదలకు రిజర్వు బ్యాంకుకు సిఫారసు చేయాల్సి ఉండగా, ప్రభుత్వం ఆ పని ఇప్పటి వరకూ చేయడం లేదు. దీంతో, ఈ ఉద్యోగుల కంట కన్నీళ్లు తప్పడం లేదు. -
పండగ పూటా.. పస్తులే..
కాకినాడ క్రైం: మహిళా, శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్) అనుబంధ విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు పండగ పూటా పస్తులు తప్పడం లేదు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వంటి ఉన్నత చదువులు చదివి, ప్రభుత్వ ఒప్పంద ఉద్యోగాల్లో చేరి, గొడ్డు చాకిరీ చేస్తున్నా.. వారికి ప్రభుత్వం నెలల తరబడి జీతాలు చెల్లించడం లేదు. ఐసీడీఎస్కు అనుబంధంగా జిల్లా బాలల పరిరక్షణ విభాగం (డీపీయూ), శిశుగృహ, వన్స్టాప్ సెంటర్ (ఓఎస్సీ), డొమెస్టిక్ వయోలెన్స్ సెల్(డీవీసీ) సీ్త్రలు, బాలలు, శిశువుల సంక్షేమం, సంరక్షణ కోసం పని చేస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా ఈ విభాగాల్లో 40 మంది పని చేస్తున్నారు. వారికి ప్రభుత్వం మూడు నుంచి ఏడు నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. దీంతో, దీపావళి పండగ వేళ పిల్లలు నాలుగు టపాసులు కొనమంటే చేతిలో చిల్లిగవ్వ లేక, నిస్సహాయంగా వారి ముఖాలు చూడాల్సి వస్తోందని ఆ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. శిశుగృహ ఈ విభాగం చిన్నారుల వసతి, సంక్షేమాన్ని పర్యవేక్షిస్తుంది. ఇందులో మొత్తం 12 మంది ఉద్యోగులున్నారు. వీరిలో మేనేజర్, వైద్యుడు, నర్సు, సోషల్ వర్కర్, చౌకీదారుతో పాటు ఆరుగురు ఆయాలుంటారు. నిర్లక్ష్యానికి గురైన శిశువులు, చెత్తకుప్పల్లో దొరికిన ఆడ శిశువులు, రోడ్లు, ఆసుపత్రుల్లో విడిచేసిన పిల్లలకు శిశుగృహే సొంతిల్లు. ఇక్కడి సిబ్బంది పూర్తి సేవా నిరతితో పని చేస్తూంటారు. ఎవరూ లేని అనాథ చిన్నారులను తమ కన్నబిడ్డల్లా చూసుకుంటారు. వారికి జీతాలు చెల్లించి నాలుగు నెలలైంది. వీరి బాధను కనీసం వినే నాథుడే లేడు. డొమెస్టిక్ వయోలెన్స్ సెల్ గృహ హింసకు గురైన ప్రతి మహిళకు డొమెస్టిక్ వయోలెన్స్ సెల్ కొండంత బలాన్నిస్తుంది. ఇంటి నుంచి, తమ వారి నుంచి కూడా పొందలేని రక్షణను ఈ సెల్లో మహిళ పొందగలుగుతుంది. అక్కడి న్యాయనిపుణులు ఆమె సమస్యకు పరిష్కారం సూచిస్తారు. కష్టం నుంచి బయట పడేంత వరకూ ఆమెకు రక్షణగా నిలుస్తారు. ఈ విభాగంలో సోషల్ కౌన్సిలర్, లీగల్ కౌన్సిలర్, డీఈఓ, ఇద్దరు హోంగార్డులు పని చేస్తున్నారు. వీరిలో పోలీసులకు తప్ప మరెవ్వరికీ మూడు నెలలుగా జీతాల్లేవు. విధులకు రావడానికి కూడా వాహనంలో పెట్రోలు కూడా లేక ఇబ్బంది పడుతున్నామని వారు ఆవేదన చెందుతున్నారు. ఫ ఏడు నెలలుగా జీతాల్లేవు ఫ ఉద్యోగుల విలవిల ఫ ఐసీడీఎస్ అనుబంధ విభాగాల్లో దుస్థితి -
బాలల పరిరక్షణ విభాగం
ఇందులో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి (డీసీపీఓ), ముగ్గురు పీఓలు, ఒక కౌన్సిలర్, ఇద్దరు సోషల్ వర్కర్లు, ఒక డేటా ఎనలిస్టు, ఒక అకౌంటెంట్, ఒక ఏడీఈఓ, కింది స్థాయిలో అవుట్రీచ్ వర్కర్ (ఓఆర్డబ్ల్యు) పని చేస్తూంటారు. రోడ్లపై తిరుగుతున్న బాలల నుంచి, చిన్నారులను చంకనెత్తుకొని భిక్షాటన చేస్తున్న వారి వరకూ.. పిల్లలకు ఎక్కడ ఏ కష్టమొచ్చినా వీరు అమాంతం వాలిపోతారు. బాలల సంరక్షణపై నిత్యం సమావేశాలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. బాలల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం రోడ్లు పట్టి, ఎండనక వాననక పాటు పడతారు. ఆ సేవలకు మంత్రముగ్ధులైన కలెక్టరే వారిని ఘనంగా సత్కరించారు. ఇటువంటి కీలక శాఖలోని సిబ్బందికి నాలుగు నెలలుగా ప్రభుత్వం జీతాలు ఇవ్వడం లేదు. దీంతో, వారి ఇళ్లల్లో ఏ పండగకూ సందడి లేకుండా పోయింది. వీరికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి జీతాలు చెల్లించాలి. అయితే, కేంద్రం నుంచి సొమ్ము రాలేదంటూ రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకుంటోంది. బడ్జెట్ విడుదల కాలేదనే సాకుతో మిన్నకుంటోంది. -
నేడు పీజీఆర్ఎస్ రద్దు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని దీపావళి పండగను పురస్కరించుకుని ఈ వారం రద్దు చేశారు. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆదివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుని, ప్రమాదాల బారిన పడకుండా పండగ నిర్వహించుకోవాలని సూచించారు. జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండగ ప్రతి ఇంట్లో వెలుగులు నింపాలని ఆకాక్షించారు. కాలుష్యం లేని, ఆనందకరమైన దీపావళిని ప్రతి ఒక్కరూ నిర్వహించుకోవాలని కోరారు. హరిత టపాసులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఉత్సాహంగా ‘చెకుముకి’ పోటీలు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహించినట్లు జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.భీమయ్య, ఎన్.రవిబాబు ఆదివారం తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల్లోనూ వివిధ పాఠశాలల్లో ఈ సంబరాలు నిర్వహించామన్నారు. నాలుగు స్థాయిల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మొదటి స్థాయిలో పాఠశాల స్థాయి సంబరాలకు 8, 9, 10 తరగతుల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. నవంబర్ 1న మండల, పట్టణ స్థాయిల్లో చెకుముకి పరీక్ష జరుగుతుందని, పాఠశాల స్థాయి విజేతలు ఈ పోటీల్లో పాల్గొనాలని సూచించారు. -
కాకినాడలో గోల్డ్కప్ హాకీ ఇండియా పోటీలు
● ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ● ఘనంగా ఫెన్సింగ్ పోటీల ప్రారంభం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో కాకినాడలో మొదటి సారిగా గోల్డ్కప్ హాకీ ఇండియా చాంపియన్షిప్ 2026 పోటీలు జరుగుతాయని క్లబ్ ఫౌండర్ రవిచంద్ర తెలిపారు. ఈ మేరకు పోటీల బ్రోచర్ను శనివారం కలెక్టర్ షణ్మోహన్కు అందించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 నుంచి 14 వరకూ ఈ పోటీలు జరుగుతాయన్నారు. ఈ పోటీల్లో 12 పురుషుల జట్లు, ఆరు మహిళా జట్లు పాల్గొంటాయన్నారు. హాకీ ఇండియా పోటీల బ్రోచర్ను కలెక్టర్కు అందజేస్తున్న క్లబ్ సభ్యులు వాడవాడలా వేంకటేశునామమే..కొత్తపేట: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవ యజ్ఞం శనివారం ఘనంగా ముగిసింది. చక్రస్నానం శశాస్త్రోక్తంగా జరిగింది. రాత్రి జరిగిన ఽఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఆలయ ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఈ నెల పదో తేదీ నుంచి ప్రారంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుమలలో జరిగే వేడుకలను తలపించాయి. ఆలయ ప్రాంగణం, మాడ వీధులను పుష్పాలంకరణలతో, క్షేత్రం అంతటా విద్యుద్దీపాలతో అలంకరించారు. నిత్యం పూజలు, అభిషేకాలు, శ్రీవారి అలంకరణలు, వాహన సేవలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సాగాయి. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఉత్సవాలను తిలకించారు. ఆఖరి రోజు ఈఓ చక్రధరరావు పర్యవేక్షణలో వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం ఖండవిల్లి రాజేశ్వరవర ప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్, అర్చక బృందం ఉదయం నుంచి స్వామివారికి విష్వక్షేన పూజ, పుణ్యాహవచనం, మహా శాంతి హోమం, మహా పూర్ణాహుతి, ధ్వజారోహణం, నీరాజన మంత్రపుష్పాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. వైభవంగా చక్రస్నానం ఉత్సవాల ముగింపునకు సూచికగా గౌతమీ నదీ తీరంలో వేలమంది భక్తుల గోవింద నామ స్మరణల నడుమ అవభృతస్నానాన్ని (చక్రస్నానం) దేవస్థానం అధికారులు, అర్చకులు, వేద పండితులు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఉత్సవ కమిటీ చైర్మన్ ముదునూరి వెంకట్రాజు తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం వివిధ పూజలతో పాటు మహాదాశీర్వచనం, ఏకాంతసేవ నిర్వహించారు. స్వామిని దర్శించిన భక్తులు తన్మయులయ్యారు. యథాతథంగా ఆర్జిత సేవలు శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో రద్దు చేసిన ఆర్జిత సేవలైన అష్టోత్తర పూజలు, శ్రీవేంకటేశ్వర సహిత ఐశ్వర్యలక్ష్మీ హోమాలు, నిత్య కల్యాణోత్సవాలు ఆదివారం నుంచి పునరుద్ధరిస్తున్నట్టు ఈఓ తెలిపారు. క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ రూరల్ మండలం లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్లో అండర్–14 బాలబాలికల ఫెన్సింగ్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సబ్ జూనియర్స్ విభాగంలో నిర్వహించే ఈ పోటీల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, వనమాడి వెంకటేశ్వరరావు, పంతం నానాజీ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల పల్లి రామస్వామి, ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ ఎన్.శేషారెడ్డి హాజరయ్యారు. కార్యక్రమానికి పాఠశాల డైరెక్టర్ నల్లమిల్లి సుగుణారెడ్డి అధ్యక్షత వహించారు. ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా, సుగుణారెడ్డి పోటీలను ప్రారంభించారు. ఎంపీ శ్రీనివాస్ మాట్లాడుతూ క్రీడల్లో రాణించడం వల్ల ఆత్మ విశ్వాసం పెరుగుతుందన్నారు. ఈ పోటీలలో 13 జిల్లాల నుంచి 200 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఫెన్సింగ్ సంఘ కార్యదర్శి కృష్ణమోహన్, మాజీ అధ్యక్షుడు నాగేశ్వరరావు, పాఠశాల ప్రిన్సిపాల్ బొహ్రా పాల్గొన్నారు. వైభవంగా సుదర్శన హోమంఅమలాపురం టౌన్: వేంకటేశ్వరస్వామికి ప్రీతిపాత్రమైన శనివారం రోజున ద్వాదశి కలిసి రావడంతో భక్తులు అమలాపురం స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. ద్వాదశి సందర్భంగా సుదర్శన హోమం వైభవంగా నిర్వహించారు. దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ కంచిపల్లి అబ్బులు, ఈవో సత్యకుమార్, ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు. -
తండ్రిని సాగనంపి.. తనయుడూ ఆ వెనకే..
● అంతిమ సంస్కారం చేసివచ్చి కుప్పకూలిన తనయుడు ● తండ్రి మరణం జీర్ణించుకోలేక మృతి ప్రత్తిపాడు రూరల్: తండ్రి దహన సంస్కారాలు పూర్తి చేసి ఇంటికి వచ్చిన తనయుడు అస్వస్థతకు గురై మృతి చెందిన ఘటన మండలంలోని ఉత్తరకంచిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కందా నరసింహమూర్తి (70) అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుమారుడు కందా రాజా (45) తండ్రికి దహన సంస్కారాలు పూర్తి చేసి ఇంటికి చేరుకున్నాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజా ఆరోగ్యం సహకరించకపోవడానికి తోడు, తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు రాజాను చికిత్స నిమిత్తం ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. ఆయన అతంత్యక్రియలను బంధువులు నిర్వహించారు. ఈ ఘటన కుటుంబ సభ్యులతో పాటు స్థానికులను కన్నీరు పెట్టించింది. రాజా పంచాయతీ వర్కర్గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. రాజా కుటుంబాన్ని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని విచారం వ్యక్తం చేశారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
● అతడి భార్యకు తీవ్రగాయాలు ● విజయవాడ నుంచి ఇచ్చాపురం వెళ్తుండగా ఘటన ప్రత్తిపాడు: మండలం ధర్మవరం గ్రామ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయ పడిన ఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం లొద్దిపుట్టి గ్రామానికి చెందిన పిట్టా వసంతకుమార్ (32) విజయవాడలోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. తన స్వగ్రామం వెళ్లేందుకు తన భార్య సంధ్యతో కలిసి బైక్పై బయలుదేరాడు. అరకు లోయ వెళ్లి, అక్కడి నుంచి స్వగ్రామం వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. జాతీయ రహదారిపై ధర్మవరం గ్రామ సమీపంలో రొయ్యల మేత తీసుకువెళ్తున్న వ్యాన్ మరమ్మతులకు గురికావడంతో నిలిపివేశారు. ఆగి ఉన్న వ్యాన్ను వసంతకుమార్ బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన సంధ్యను ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ తరలించారు. మృతదేహాన్ని శవపరీక్షకై స్థానిక సీహెచ్సీ తరలించారు. ప్రత్తిపాడు ఎస్సై ఎస్.లక్ష్మీకాంతం కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చర్యలు తీసుకోవాలి
ఎక్కడైనా అనుమతి లేకుండా బాణసంచా విక్రయిస్తే కేసులు నమోదు చేస్తాం. ప్రభుత్వ నిబంధనల మేర మాత్రమే క్రాకర్స్ విక్రయాలు చేపట్టాలి. ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. ప్రజలు కూడా జాగ్రత్తలు వహించాలి. ఈ దీపావళిని ఆనందంగా జరుపుకోవాలి. –సుంకర మురళీమోహన్, డీఎస్పీ, కొత్తపేట వెంటనే సమాచారం అందించాలి దీపావళి బాణసంచా కాల్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పూరిళ్లు, గడ్డివామిలు ఉండేచోట వాటిని నీటితో తడపడం, నీటిని సమీపంలో ఉంచుకోవడం మేలు. అలాగే బాణసంచా అమ్మేవారు కూడా అగ్నిమాపక నియంత్రణ పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలి. ప్రమాదం జరిగితే తక్షణమే 100, 101కు లేదా సమీపంలో ఫైర్ స్టేషన్, పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలి. –ఎన్.పార్థసారధి, జిల్లా అగ్నిమాపక అధికారి, అమలాపురం -
తప్పాసులు జాగ్రత్త
ఫ కాల్చేటప్పుడు అప్రమత్తత అవసరం ఫ పిల్లలను ఓ కంట కనిపెట్టాలి ఫ ఈ నెల 20న దీపావళి పర్వదినం కొత్తపేట: మతాబుల మమతలు పూయ.. చిచ్చుబుడ్లు కాంతులనీయ.. తారాజువ్వలు గాలిలో ఎగరేయ.. వెన్నముద్దలు వెలుగులనీయ.. అందాల తారలు వాకిట్లో వాలినట్లు టపాసులతో సందడి చేయ.. వెలుగుల పండగను ఆనందాల రవళిలా జరుపుకొందాం. ఈ నెల 20న దీపావళి సందర్భంగా టపాసుల మోతతో ఊరూవాడా దద్దరిల్లనుంది. అయితే వాటిని కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఎవరికి వారే గ్రహించి అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఏమాత్రం అజాగ్రత్త ఉన్నా పెను ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా దీపావళి రోజున పాటించాల్సిన జాగ్రత్తలు కొత్త కాకపోయినా మరోసారి గుర్తు చేసుకుంటే చాలా మంచిదని చెబుతున్నారు. టపాసులు కాల్చే చిన్నారులను దగ్గరుండి చూసుకోవాలని, వారి విషయంలో తస్మాత్ జాగ్రత్త అని అంటున్నారు. దీపావళి దగ్గర పడుతున్న కొద్దీ బాణసంచా తయారీలో యాజమాన్యం, సిబ్బంది విశ్రమించకుండా పనిలో నిమగ్నమవుతారు. చిన్నపాటి నిర్లక్ష్యం, అజాగ్రత్త పెను ప్రమాదానికి దారితీస్తుంది. ఏటా జిల్లాలో ఒకటో, రెండో ప్రమాదాలు జరుగుతున్నాయి.. ప్రాణాలు హరిస్తున్నాయి. ఈ ఏడాది తాజాగా రాయవరంలో భారీ విస్ఫోటం సంభవించి పది మంది, అయినవిల్లి మండలం విలసలో ఇద్దరు మృత్యువాత పడిన ఘటనలను అధికారులు ప్రస్తావిస్తున్నారు. ఇకపై ఏ చిన్న ప్రమాదం జరగకుండా దీపావళిని జరుపుకోవాలని సూచిస్తున్నారు. పండుగ రోజున ఇలా చేద్దాం.. ఫ గ్రామీణ ప్రాంతాల్లో పంట పొలాలు, గడ్డివామిలు, పూరి గుడిసెలు ఉండే ప్రదేశాల్లో రాకెట్లు, చిచ్చుబుడ్లు, తారాజువ్వలు వంటి టపాసులు కాల్చరాదు. ఫ టపాసుల పనితీరు, వెలిగించాల్సిన విధానం తదితర అంశాలపై అవగాహన కలిగి ఉండాలి. ఫ పిల్లలు పెద్దల పర్యవేక్షణలోనే క్రాకర్స్ కాల్చాలి. ఫ ఇరుకై న ప్రదేశాలు, వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే చోట టపాసులు కాల్చరాదు. ఫ బాణసంచా కాల్చేటప్పుడు కాటన్ దుస్తులు మాత్రమే ధరించాలి. జిల్లాలో బాణసంచా షాపులు తయారీ కేంద్రాలు 18 హోల్సేల్ షాపులు 15 రిటైల్ షాపులు సుమారు 455 (తాత్కాలిక లైసెన్స్ షాపులు) అగ్నిమాపక కేంద్రాల ఫోన్, ఎస్ఎఫ్ఓల ఫోన్ నంబర్లు అమలాపురం–9963727665– 8856 231101 కొత్తపేట – 9963728051 – 08855 243299 మండపేట – 9963727741–08855 232101 రామచంద్రపురం–9440149394–08857 242401 రాజోలు– 9603727995 – 08862 221101 ముమ్మిడివరం–7989956542–08856271101 పర్యావరణాన్ని పరిరక్షించేలా.. దీపావళి రోజున పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అన్నివర్గాల ప్రజలు చైతన్యవంతులు కావాలి. క్రాకర్స్ ఎంత తక్కువ వినియోగిస్తే వాతావరణ కాలుష్యం అంత తగ్గుతుంది. దీపావళి అంటేనే వెలుగుల పండగ. అందుకే ప్రతి ఒక్కరూ ఇళ్ల ముందు దీపాలు వెలిగించుకుని పండగ జరుపుకోవాలని పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు. వ్యాపారులూ అప్రమత్తత అవసరం జనసంచారం లేని, ఊరికి దూరంగా ఉండే ప్రాంతాల్లో బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేయాలి. అక్కడ ప్రమాదాలు జరగకుండా తగిన అగ్ని ప్రమాద నియంత్రణ సామగ్రి ఉంచుకోవాలి. బాణసంచా అమ్మే చోట ఇసుక, నీరు, కార్బన్ డై ఆకై ్సడ్ను అందుబాటులో ఉంచాలి. దుకాణాల వద్ద పొగ, మద్యం తాగరాదు. ప్రతి దుకాణానికి మధ్య కనీసం 10 అడుగుల దూరం ఉండేలా చూసుకోవాలి. అలాగే విక్రయ కేంద్రాల వద్ద విద్యుత్ వైరింగ్ సరిగ్గా చూసుకోవాలి. ప్రతి షాపు వద్ద క్రాకర్స్ ధరల పట్టిక, అగ్నిమాపక కార్యాలయం ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంచాలి. -
డి.పోలవరంలో యూరియా కష్టాలు
తుని రూరల్: మండలంలోని డి.పోలవరంలో రైతులు యూరియా కష్టాలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం సక్రమంగా సరఫరా చేయకపోవడంతో గత్యంతరం లేక తమ పంటల సంరక్షణకు అదనపు ధర చెల్లించి, కొనుగోలు చేసుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. గ్రామంలో వ్యవసాయ, ఉద్యాన పంటలు 2,200 ఎకరాల్లో సాగవుతున్నాయి. వ్యవసాయ శాఖ సకాలంలో యూరియా అందించలేదు. ఇటీవల డిమాండ్కు అనుగుణంగా రైతు సేవా కేంద్రం ద్వారా విక్రయిస్తున్నారు. రైతులను గుర్తించి యూరియా విక్రయించాల్సి ఉండగా, మొదట్లో ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ యూరియా ఇచ్చారు. ఈ విధానంపై రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు, బయోమెట్రిక్తో ఒక్కొక్కరికి ఒక బస్తా చొప్పున ఇస్తున్నారు. గ్రామానికి యూరియా వచ్చిందని తెలిస్తే రైతులందరూ ఒక్కసారిగా ఎగబడుతున్నారు. అధికార పార్టీ నాయకులకు అడిగినన్ని ఇస్తూండగా, ఎన్ని ఎకరాలున్నా తమకు ఒమ్క బస్తా మాత్రమే ఇస్తున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో, ఖరీఫ్లో యూరియా ఆవసరాలు తీర్చుకునేందుకు బ్లాక్లో అదనంగా చెల్లించాల్సి వస్తోందని, రూ.270 బస్తాకు బ్లాక్లో రూ.450 నుంచి రూ.500 చెల్లిస్తున్నామని వాపోతున్నారు. అధికార పార్టీ నాయకులు తీసుకువెళ్లిన యూరియా బస్తాలనే అదనపు ధరకు విక్రయిస్తున్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు. పంచాయతీలో పలుకుబడి కలిగిన నాయకుడి సూచనలతో అక్రమార్కులకు అడిగినన్ని బస్తాలు ఇస్తూండటంతో సాగుదారులు యూరియా కోసం అవస్థలు పడుతున్నారు. ఈ అక్రమాలను అరికట్టి, సాగు భూమి ఆధారంగా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మండల వ్యవసాయాధికారి అశోక్ కుమార్ను వివరణ కోరగా, డిమాండ్కు అనుగుణంగా యూరియా రప్పిస్తున్నామని, ఇప్పటి వరకూ 80 టన్నులు అందుబాటులో ఉంచామని చెప్పారు. సిఫారసులతో ఎవ్వరికీ అదనంగా యూరియా ఇవ్వలేదని, పారదర్శకంగానే రైతులందరికీ యూరియా అందిస్తున్నామని అన్నారు. -
వైఎస్సార్ సీపీ కమిటీల్లో పలువురికి పదవులు
కాకినాడ రూరల్: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురు నాయకులను పార్టీ కమిటీల్లో వివిధ హోదాల్లో నియమించారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఈ వివరాలు తెలియజేసింది. ● ఎస్టీ విభాగం జిల్లా ఉపాధ్యక్షులుగా చెరుకూరి మృత్యుంజయరాజు, సింగం లోకేష్; ప్రధాన కార్యదర్శిగా తడాల అప్పారావుదొర; కార్యదర్శులుగా నెర్వాడ రాజుబాబు, గుమ్మిడి పొట్టియ్య, తుంపాటి సత్తిబాబు; కార్యవర్గ సభ్యులుగా సింగం వీరబాబు, కనుసు సూరిబాబుదొర, కొల్లపు పుష్పకుమారి, నందా చిన్నాబ్బాయి, దుర్గరాజు నారాయణలను నియమించారు. ● విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శులుగా లాలం శ్రీనివాస్, శెట్టి సోమరాజు, కీర్తి వివేక్; కార్యదర్శులుగా చిక్కాల వెంకట సాయిరామ్, రెడ్డి భాను ప్రతాప్, వెలుగుల ఏసుబాబు; కార్యవర్గ సభ్యులుగా సుంకర శివరామకృష్ణ, నేలపర్తి వంశీ, కాపావరపు ఈశ్వర ప్రసాద్, నంది జ్యోతిరాజా, గొట్టుపల్లి వంశీ, పోలమతి శాంతి భరత్ నియమితులయ్యారు. ● క్రిస్టియన్ మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శులుగా కనికెళ్ళ ఫిలిప్, యర్రంశెట్టి మీకా, చట్టాల సుదర్శనమ్ శామ్యూల్; కార్యదర్శులుగా బండి దానియల్, అంబటి అబ్రహం; కార్యవర్గ సభ్యులుగా దడాల యాకూబ్, గంపల బాలు, సజ్జా జాన్ ప్రసన్నకుమార్, అడపా త్రిమూర్తులును నియమించారు. ● మైనార్టీ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడిగా షేక్ మహబూబ్ సుభానీ; ప్రధాన కార్యదర్శులుగా ఎస్కే పోరా సాహెబ్, షేక్ మహబూబ్ సుభానీ, షేక్ రబ్బానీ, సయ్యాద్ ఖాజా నజీమ్ మహమ్మద్; కార్యదర్శులుగా ఎస్కే ఖాదర్ బాషా, ఎస్కే సలీమ్, షేక్ ఇస్మాయిల్, షేక్ రజుద్దీన్, ఎండీ కరీముల్లా, ఎండీ కరీముద్దీన్, ఎస్కే రఫీ, ఎండీ మహబూబ్ షరీఫ్; కార్యవర్గ సభ్యులుగా ఆలీ సాహెబ్, ఎస్కే ఇమామ్ సాహెబ్, ఎస్కే అబ్దుల్ ఘనీ, ఎస్కే వల్లీఖాన్, షేక్ లంకా, అబ్దుల్ బాషా, సయ్యాద్ మదీనా బాషా, షేక్ ఆమీన్ సాహెబ్లను ఎంపిక చేశారు. ● పంచాయతీరాజ్ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడిగా అడపా మురళి; ప్రధాన కార్యదర్శులుగా బడ్డి నూకరాజు, గానుగుల అప్పలరాజు, కాయల వెంకటేశ్వరరావు; కార్యదర్శులుగా పదిలం బాబూరావు, కునిశెట్టి మాణిక్యం, బత్తుల వెంకట రామకృష్ణ; కార్యవర్గ సభ్యులుగా రెడ్డి స్వామినాయుడు, దూలం బాబూరావు, దేవర రమేష్, కొండపల్లి వెంకటేశ్వరరావు, పోతూరి వీర్రాజు, బచ్చా శివకృష్ణలను నియమించారు. ● ఆర్టీఐ వింగ్ జిల్లా ప్రధాన కార్యదర్శులుగా నున్నం రాంబాబు, లింగంపల్లి బీకే శివకుమార్, పెద్దిరెడ్ల సురేష్; కార్యదర్శులుగా అల్లాడి గోపాల మణికంఠ, ఏఎస్ఎన్ మూర్తి, కటకం ఈశ్వరరావు; కార్యవర్గ సభ్యులుగా గంధం నాగ వీరబాబు, మైలవరపు శ్రీనివాసరావు, కాపారపు రాజు, అరిగెల తాతయ్యదొర, ఎస్.రాజేష్, కాలిన గంగాధర్ నియమితులయ్యారు. ● అంగన్వాడీ వింగ్ జిల్లా ప్రధాన కార్యదర్శుగా వి.నాగమణి, కంచుకోట లక్ష్మి; కార్యదర్శులుగా పి.కుమారి, సోము వెంకట దుర్గా అచ్యుతాంబ; కార్యవర్గ సభ్యులుగా దిమిలి మేరీ, ఎస్.దయామణి, మిరియాల పద్మావతి, అచ్చింత అశ్వినిలను ఎంపిక చేశారు. ● కల్చరల్ వింగ్ జిల్లా ఉపాధ్యక్షుడిగా కొప్పన సుబ్బారావు; ప్రధాన కార్యదర్శులుగా సీహెచ్ నూకరాజు, పురంశెట్టి నరేంద్ర; కార్యదర్శులుగా చవ్వాకుల రమణ, కొడమాటి కుమార్బాబు, నీలపల్లి అప్పారావు; కార్యవర్గ సభ్యులుగా అల్లు కాశీ నాయుడు, చిల్లపల్లి సత్యనారాయణ, ముప్పిడి కృపారావు, గొందేసి సత్యానందం, పందిరి బుజ్జిబాబు, మండేటి డేవిడ్రాజు నియమితులయ్యారు. ● దివ్యాంగుల విభాగం జిల్లా ఉపాధ్యక్షుడిగా యాదగిరి మనోహర్; ప్రధాన కార్యదర్శిగా వెల్లపు సూరిబాబు; కార్యదర్శులుగా రౌతు దుర్గా ప్రసాద్, బదిరెడ్డి సత్యనారాయణ; కార్యవర్గ సభ్యులుగా అంబటి దుర్గాప్రసాద్, చింతకాయల రాజు, కోలా శ్రీను, శివుడు త్రిమూర్తులు ఎంపికయ్యారు. ● గ్రీవెన్స్ సెల్ కమిటీ జిల్లా ఉపాధ్యక్షుడిగా కన్నూరి శ్రీనివాసరావు; ప్రధాన కార్యదర్శులుగా అడబాల సూర్యనారాయణ, సుర్ల సత్తిబాబు; కార్యదర్శులుగా జీవీవీ సూర్యనారాయణ, అల్లాడ సూరిబాబు, గాబు వీర వెంకట సత్యనారాయణ; కార్యవర్గ సభ్యులుగా అలమండ సుబ్రహ్మణ్యం, కాకర చిన్నోడు, కోరుకొండ వెంకట రామకృష్ణ, వెన్నా శివకుమార్, చిటికెల శ్రీరామ పాత్రుడులను నియమించారు. ● లీగల్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడిగా బత్తుల రవికుమార్; ప్రధాన కార్యదర్శులుగా పోతుల జోగేష్, పిట్టా సుగుణరావు; కార్యదర్శులుగా అడపా సురేష్, పోతుల జోగేశ్వరరావు; కార్యవర్గ సభ్యులుగా పాకలపాటి రవిధర్మ చక్రవర్తి, చోడిశెట్టి బాలాజీరావు, రామిశెట్టి సత్యనారాయణ, సింహాద్రి సూరిబాబు నియమితులయ్యారు. ● పబ్లిసిటీ వింగ్ జిల్లా ఉపాధ్యక్షుడిగా అరుమిల్లి ఏసుబాబు; ప్రధాన కార్యదర్శులుగా ఏనుగు శ్రీను, రావుల స్వామి; కార్యదర్శులుగా పెద్దిర్శి రమేష్, పక్తుర్తి జయబాబు, దొడ్డా వెంకటేశ్వరరావు; కార్యవర్గ సభ్యులుగా యడ్ల వెంకటరమణ, రావి శ్రీను, ఈగల గంగా వెంకట సతీష్, నెమలికంటి కుమారి, బొడ్డు ఆంజనేయ చౌదరి, మదుకూరి రామకృష్ణ ఎంపికయ్యారు. ● సోషల్ మీడియా వింగ్ జిల్లా ఉపాధ్యక్షుడిగా జల్లి ప్రవీణ్కుమార్; ప్రధాన కార్యదర్శులుగా నెమలి శ్రీను, గంటా భాస్కర్; కార్యదర్శులుగా యేలగుండి జార్జికిరణ్, మోతుకూరి ధర్మరాజు, తుమ్మల గంగాధర్; కార్యవర్గ సభ్యులుగా సీహెచ్ గణేష్, కాలా వినయ్, గొర్రెల రాంబాబు, గుమ్ములూరి ఎస్ఆర్ సురేష్ పద్మరాజు, నక్కా పాండురంగ, సిమిల్లి బాలును నియమించారు. ● వీవర్స్ వింగ్ జిల్లా ప్రధాన కార్యదర్శులుగా దొడ్డి బాబ్జీ, నీలి అబ్బులు, యర్రా వెంకటేశ్వరరావు; కార్యదర్శులుగా జక్కా వరహాలుబాబు, వానపల్లి వెంకటరమణ, చుక్కల నాని, కాడా సూర్య సింగారావు; కార్యవర్గ సభ్యులుగా మొండి బాపనయ్య, బలపాటి సోమరాజు, శీరం దొంగబాబు, కొప్పుల చినబాబు, యర్రా శ్రీనివాసు, అల్లాడ పాపారావు నియమితులయ్యారు. ● వైఎస్సార్ టీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడిగా నరాలశెట్టి నరసయ్య; ప్రధాన కార్యదర్శులుగా బర్రే అప్పారావు, శెట్టి సత్తిబాబు, జలిమి రాము; కార్యదర్శులుగా కలిగట్ల నానాజీ, పులి మధు, అక్కిరెడ్డి నాగార్జున; కార్యవర్గ సభ్యులుగా తోటాడ రాజు, అన్నంరెడ్డి రాజేష్, పిల్లా చిన్నా, బంగారు రాంబాబు, కండెల్లి రమేష్, గొంతిన రామారావులను ఎంపిక చేశారు. -
రోడ్డుపై కూలిన భారీ వృక్షం
స్తంభించిన ట్రాఫిక్ కరప: కాకినాడ – రామచంద్రపురం ప్రధాన రహదారిలో కరప మండలం వాకాడ బస్టాప్ సమీపంలో శుక్రవారం ఉదయం భారీ వృక్షం రోడ్డుపై నేలకూలింది. దీంతో ట్రాఫిక్ మూడు గంటల పాటు స్తంభించింది. వాతావరణం మారి, ఈదురు గాలులు వీస్తుండటంతో శుక్రవారం ఉదయం 7.30 గంటల సమయంలో భారీ వృక్షం కూలిపోయి, రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. ఉదయం పనులకు వెళ్లే కూలీలు, కళాశాలలు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, కాకినాడ నగరానికి వివిధ పనుల నిమిత్తం వెళ్లే వారితో ఈ రహదారి రద్దీగా ఉంటుంది. రోడ్డుకు అడ్డంగా చెట్టు పడిపోవడంతో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కరప పోలీసులు, అధికారులు స్పందించి రోడ్డుపై పడిపోయిన వృక్షాన్ని మూడు గంటల్లో పక్కకు తొలగించి ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. -
కలం.. నిరసన గళం
పత్రికా స్వేచ్ఛను హరించడం దుర్మార్గం ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగం సక్రమంగా అమలు పత్రికల వల్లే సాధ్యం. పత్రికలకు ఆ స్వేచ్ఛ ఉండాలి. జర్నలిజం అంటే ప్రజాస్వామ్యంలో జరుగుతున్న తప్పులను వెలికితీసి, ప్రజలకు తెలియజేయాలి. ఇదే రీతిలో వార్తలు రాస్తున్న ‘సాక్షి’ పత్రికా కార్యాలయాలకు మూడు నాలుగు రోజులుగా పోలీసులు వెళ్లడాన్ని సీపీఐ త్రీవంగా ఖండిస్తోంది. ఇది ప్రజాస్వామ్యానికి తీరని మచ్చ. ఈ ధోరణి రాజ్యాంగాన్ని బలి చేయడమే. ఈ మాట ఎందుకంటున్నానంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ, జనసేన పార్టీలు పత్రికా స్వేచ్ఛపై నిరంతరం మాట్లాడేవారు. ఇప్పుడు అధికారంలోకి రాగానే పత్రికా స్వేచ్ఛపై దాడులు చేస్తున్నారు. ఇది మంచిది కాదు. ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేయకండి. ‘సాక్షి’పై దాడులు పునరావృతమైతే అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని ఉద్యమిస్తాం. – తాటిపాక మధు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, కాకినాడ ● ‘సాక్షి’ గొంతు నొక్కే కుట్రలు సాగవు ● ప్రజాస్వామ్యంతో పరిహాసాలా? ● కూటమి సర్కారు తీరుపై నిరసన జ్వాల ● జిల్లావ్యాప్తంగా పాత్రికేయుల నిరసనలు ● ప్రజా సంఘాల సంఘీభావం సాక్షి ప్రతినిధి, కాకినాడ: కలానికి సంకెళ్లు వేస్తారా? పోలీసు అక్రమ కేసులతో ‘సాక్షి’ మీడియా గొంతు నొక్కుతారా? పదేపదే పత్రిక కార్యాలయానికి వెళ్లి వేధిస్తారా? సంపాదకుడు ఆర్.ధనంజయరెడ్డి, సిబ్బందిపై కేసులు పెట్టి భయపెట్టాలనుకుంటారా? రాజకీయాలతో పత్రికలకు ముడిపెట్టే సంస్కృతి విడనాడండి. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తే జర్నలిస్టులు ఎటువంటి పోరాటాలకై నా వెనుకాడేది లేదు అంటూ జిల్లావ్యాప్తంగా పాత్రికేయులు శుక్రవారం గళమెత్తారు. ఎక్కడికక్కడ ర్యాలీలు, ధర్నాలు నిర్వహించి, అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు సంఘాలు, ప్రజా సంఘాల ప్రతినిధులు ఒకే గొడుకు కిందకు వచ్చి.. ‘సాక్షి’ మీడియాపై కక్ష కట్టిన కూటమి సర్కారు.. వెంటనే తన తీరు మార్చుకోవాలని ముక్తకంఠంతో నినదించారు. ప్రభుత్వ ప్రోద్బలంతో పెడుతున్న అక్రమ కేసులను ఎత్తేయాలని, తక్షణమే వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద.. ఏపీయూడబ్ల్యూజే, కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్, చిన్న పత్రికల సంఘాల సంయుక్త ఆధ్వర్యాన కాకినాడ కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డిని అక్రమంగా విచారిస్తున్న పోలీసుల ఛాయాచిత్రాలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన గళం వినిపించారు. ఎడిటర్ ధనంజయరెడ్డి సహా ‘సాక్షి’ మీడియాపై పెట్టిన అక్రమ కేసులను బేషరతుగా ఎత్తివేయాలి.. జర్నలిస్టులు, పత్రికలపై అక్రమ కేసులు సిగ్గుసిగ్గు.. పత్రికలను రాజకీయాలతో ముడిపెట్టడం మానుకోవాలి.. వియ్ వాంట్ జస్టిస్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ధర్నా అనంతరం జర్నలిస్టులు ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్లో కలెక్టర్కు విజ్ఞాపన అందజేయాలని భావించారు. అయితే, కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి.. ఇలా ఉన్నతాధికారులెవరూ అక్కడ లేకపోవడంతో కలెక్టరేట్లోని జాతిపిత గాంధీజీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం అక్కడి నుంచి కలెక్టరేట్ పరిపాలనాధికారిని కలిసి విజ్ఞాపన అందజేశారు. జర్నలిస్టుల ఆందోళనకు సీపీఐ నేత తాటిపాక మధు మద్దతు తెలిపారు. పత్రికా స్వేచ్ఛను హరించాలనుకోవడం అవివేకం ఏపీయూడబ్ల్యూజే సీనియర్ నేత డాక్టర్ సబ్బెళ్ల శివనారాయణరెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతుకగా నిలిచే పత్రికల స్వేచ్ఛను హరించాలనుకోవడం ప్రభుత్వాల అవివేకమే అవుతుందన్నారు. అణచివేతతో జర్నలిస్టులు మరింత రాటుదేలి ఉద్యమంలోకి వస్తారనే వాస్తవాన్ని ప్రభుత్వాలు గుర్తెరిగి వ్యవహరించాలని హితవు పలికారు. పత్రికల స్వేచ్ఛను హరించడమంటే ప్రజల భావప్రకటనా స్వేచ్ఛను నొక్కేయడమేనని కాకినాడ సిటీ ప్రెస్క్లబ్ అధ్యక్షుడు రెడ్డిపల్లి రాజేష్ అన్నారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా విభాగం జిల్లా అధ్యక్షుడు అంజిబాబు, జర్నలిస్టు వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మంగా వెంకట శివరామకృష్ణ, సాక్షి బ్యూరో చీఫ్ ఎల్.శ్రీనివాసరావు, సాక్షి టీవీ కరస్పాండెంట్ బొక్కినాల రాజు, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు డెంకాడ మోహన్, సాయినాథ్, కొమ్మిరెడ్డి శ్రీధర్, ముమ్మిడి చిన్నా తదితరులు పాల్గొన్నారు. పెద్దాపురం డీఎస్పీ తీరుపై నిరసన పెద్దాపురంలో పాత్రికేయులు శాంతియుతంగా నిరసన తెలిపి, వినతిపత్రం అందజేసేందుకు వెళ్లగా.. అక్కడి డీఎస్పీ శ్రీహరిరాజు కార్యాలయం తలుపులు మూసేసుకున్నారు. పోలీసులతో కబురు పంపించినా కార్యాలయం లోపలకు జర్నలిస్టులను అనుమతించలేదు. పాతిక మంది జర్నలిస్టులు బయట వేచి ఉన్నా కనీసం మాట్లాడేందుకు కూడా అనుమతించలేదు. డీఎస్పీ తీరుపై జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. ఇది జరిగిన కొద్దిసేపటికే దొంగలను, బంగారం పట్టుకున్న విషయంపై డీఎస్పీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి రావాలని అక్కడి సీఐ ద్వారా కబురు పంపగా జర్నలిస్టులు ఆ సమావేశాన్ని బహిష్కరించారు. ఏలేశ్వరం తహసీల్దార్ కార్యాలయం వద్ద పాత్రికేయులు ధర్నా చేశారు. వారికి సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జునరావు, సీపీఎం, సీఐటీయూ తదితర ప్రజా సంఘాలు సంఘీభావంగా నిలిచాయి. పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి, నియోజకవర్గ కేంద్రం జగ్గంపేట తదితర ప్రాంతాల్లో కూడా జర్నలిస్టులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. జర్నలిస్టులపై పెరుగుతున్న వేధింపులు ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు నదీముల్లాఖాన్ దుర్రాని మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో జర్నలిస్టులపై అక్రమ కేసులు, మానసిక వేధింపులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పత్రికల స్వేచ్ఛకు భంగం కలిగించేలా ప్రభుత్వ ప్రోద్బలంతో పోలీసులు అనుసరిస్తున్న వైఖరి మారకుంటే జర్నలిస్టులు ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తారని చెప్పారు. -
సత్యదీక్షలు ప్రారంభం
అన్నవరం: రత్నగిరిపై సత్యదీక్షలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. సత్యదేవుని జన్మనక్షత్రం మఖను పురస్కరించుకుని వందలాదిగా భక్తులు ఈ దీక్షలు చేపట్టారు. పసుపు వస్త్రాలు ధరించి, తెల్లవారుజామున ఐదు గంటలకు ఆలయ ప్రధానార్చకుడు ఇంద్రగంటి నరసింహమూర్తి చేతుల మీదుగా తులసి మాలలు వేయించుకుని దీక్షలు ప్రారంభించారు. రత్నగిరిపై సత్యదేవుని ఆలయం వద్ద, కొండ దిగువన నేరేళ్లమ్మ, వినాయకుని ఆలయాల వద్ద సుమారు 400 మందితో పాటు జగ్గంపేట, అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగలలోని పవనగిరి స్వామీజీ ఆధ్వర్యాన మరో 400 మంది ఈ దీక్షలు స్వీకరించారు. తెలంగాణలోని నల్గొండ, ఖమ్మం తదితర ప్రాంతాలకు చెందిన భక్తులు కూడా దీక్షలు చేపట్టడం విశేషం. వీరు 27 రోజుల అనంతరం నవంబర్ 13న సత్యదేవుని సన్నిధిలో దీక్ష విరమిస్తారు. సత్యదీక్షలు ప్రారంభమైన సందర్భంగా వార్షిక కల్యాణ మండపం వద్ద సత్యదేవుడు, అమ్మవారికి పండితులు ప్రత్యేక పూజలు చేశారు. దీక్ష విరమణ జరిగే వరకూ ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ఇక్కడ పూజలు చేయనున్నారు. ఇంటి వద్ద పీఠం పెట్టే అవకాశం లేని స్వాములు వార్షిక కల్యాణ వేదిక మీద జరిగే పూజల్లో పాల్గొనవచ్చునని అధికారులు తెలిపారు. సముద్రంలోకి 2.08 లక్షల క్యూసెక్కులు ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ నుంచి శుక్రవారం 2,08,519 క్యూసెక్కుల గోదావరి మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. తూర్పు డెల్టాకు 2,700, మధ్య డెల్టాకు 1,800, పశ్చిమ డెల్టాకు 6 వేల క్యూసెక్కుల నీరు వదిలారు. భద్రాచలంలో 18, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 10.40 అడుగుల నీటిమట్టం ఉంది. -
ప్రజా వ్యతిరేకంగా చంద్రబాబు పాలన
కాకినాడ కూరల్: కార్పొరేట్ శక్తుల పక్షాన నిలుస్తూ, ప్రజలకు వ్యతిరేకంగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్, కాకినాడ రూరల్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆక్షేపించారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా తొలిసారిగా నేమాం గ్రామంలో గురువారం ఆయన రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తుల నుంచి సంతకాలు సేకరించి, ఆ ప్రతులను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎక్కడైనా పేదలకు విద్య, వైద్యం ఉచితంగా అందిస్తారని, కానీ, చంద్రబాబు మాత్రం ప్రభుత్వ వైద్యాన్ని దూరం చేసేలా మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరిస్తున్నారని విమర్శించారు. ఎంతో మందికి ప్రాణాలు పోసిన ఆరోగ్యశ్రీ పథకాన్ని దాదాపు ఎత్తేసే పరిస్థితి తెచ్చారని, వైద్య కళాశాలలను పైవేటు రంగానికి ఇచ్చేస్తున్నారని అన్నారు. ఇన్ని దుర్మార్గాలు జరుగుతున్నా అడిగే వారు లేరని సొంత మీడియాతో ప్రచారం చేయింకుంటున్నారని దుయ్యబట్టారు. వైద్య కళాశాలలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించనీయబోమని వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు ఇచ్చారన్నారు. ప్రజల్లోకి వెళ్లి కోటి సంతకాలు చేపట్టడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారని చెప్పారు. అన్ని గ్రామాల్లోనూ ఈ కార్యక్రమం విస్తృతంగా నిర్వహించి, కోటి సంతకాలు సేకరించి, గవర్నర్కు అందిస్తామన్నారు. జగన్మోహన్రెడ్డి ఎంతగా అభివృద్ధి చేశారో అనే నిజం ప్రచారం అయ్యేలోపు.. చంద్రబాబు అనే ఒక అబద్ధం దేశాన్ని చుట్టి మళ్లీ అధికారంలోకి వచ్చి కూర్చుందని, ఆయన నోరు విప్పితే అన్నీ అబద్ధాలేనని కన్నబాబు దుయ్యబట్టారు. రూ.99కే క్వార్టర్ మద్యం ఇస్తామని చెప్పి, నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. రూ.99కే మద్యం అనే మాట నిలబెట్టుకోకుండా విశాఖలో మాత్రం ప్రభుత్వ భూములను ఎకరం 99 పైసలకే అప్పనంగా కట్టబెడుతున్నా రని విమర్శించారు. ఈ మోసాలు ప్రజలకు, నాయకులకు అర్థమయ్యేలా సోషల్ మీడియా ద్వారా తెలియజేయాల్సి ఉందన్నారు. రుషికొండపై టూరిజం కట్టడాలను జగన్ ప్యాలస్ అంటూ ఆరోపించారని, ఇప్పుడు ప్రైవేటుకు ఇచ్చేందుకు టెండర్లు పిలిచారని అన్నారు. కొన్నాళ్లకు పాఠశాలలను ప్రైవేటీకరించినా ఆశ్చర్యపోనవసరం లేదని కన్నబాబు ఎద్దేవా చేశారు. నేమాం సర్పంచ్, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు రామదేవు సూర్యప్రకాశరావు (చిన్నా) మాట్లాడుతూ, తమ గ్రామంలో బెల్టు షాపులు కుటీర పరిశ్రమల్లా ఉన్నాయని, వాటిని తొలగించేందుకు ఉద్యమం చేపడతామని అన్నారు. కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన వస్తోందన్నారు. చిన్నా ఆధ్వర్యాన, కాకినాడ రూరల్ జెడ్పీటీసీ సభ్యుడు నురుకుర్తి రామకృష్ణ (కిట్టు) అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి, ఎస్ఈసీ సభ్యుడు గోపుశెట్టి బాబ్జీ, మహిళా విభాగం జోనల్ ప్రెసిడెంట్ మాకినీడి శేషుకుమారి, వివిధ విభాగాల నాయకులు పాల్గొన్నారు. కార్పొరేట్ శక్తుల పక్షాన నిలుస్తున్నారు ప్రభుత్వ వైద్యాన్ని నీరు గార్చేలా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వైఎస్సార్ సీపీ నేత కురసాల కన్నబాబు నేమాంలో రచ్చబండ ద్వారా సంతకాల సేకరణ -
‘సాక్షి’పై పోలీసుల తీరు చట్ట విరుద్ధం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘సాక్షి’ కార్యాలయానికి పోలీసులు రావడం చట్ట విరుద్ధమైన చర్య అని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు వాతాడ నవీన్రాజ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘సాక్షి’ పత్రికా కార్యాలయంలోకి వచ్చి, ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డికి నోటీసులు ఇవ్వడం, ఇబ్బందికర పరిస్థితులు సృష్టించడం, అక్రమ కేసులు బనాయించడం, అర్ధరాత్రి వరకూ హడావుడి చేయడం సరి కాదని అన్నారు. ఇతర పాత్రికేయులను భయభ్రాంతులకు గురి చేసేలా వ్యవహరించడాన్ని ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈవిధంగా వ్యవహరించడం మంచిది కాదని, జర్నలిస్టుల పట్ల ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని నవీన్రాజ్ డిమాండ్ చేశారు. ధాన్యం సేకరణకు సిద్ధం కావాలిబోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఖరీఫ్ ధాన్యం సేకరణ సజావుగా సాగేందుకు అధికారులు ప్రణాళిక ప్రకారం పని చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. ఖరీఫ్ ధాన్యం సేకరణ ప్రక్రియపై జిల్లా స్థాయి ధాన్యం కొనుగోలు కమిటీ సమావేశాన్ని జూమ్ ద్వారా ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా ఈ నెలాఖరు నుంచి 269 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ చేపడతామన్నారు. రెవెన్యూ, పౌర సరఫరాలు, వ్యవసాయం, సహకారం, రవాణా, కార్మిక శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. రైతు సేవా కేంద్రాల పరిధిలో ధాన్యం సేకరణపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. జిల్లాలోని 116 రైస్ మిల్లులను తనిఖీ చేశామని, అవన్నీ తమ బ్యాంకు గ్యారంటీలను త్వరితగతిన సమర్పించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు అవసరమైన వాహనాలను, హమాలీలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కాకినాడ కార్పొరేషన్ ప్రత్యేకాధికారిగా కలెక్టర్ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలిని కాకినాడ కార్పొరేషన్ ప్రత్యేకాధికారిగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. నగరపాలక సంస్థ కమిషనర్గా పని చేసిన భావన బదిలీ కావడంతో ఇన్చార్జి కమిషనర్గా డిప్యూటీ కమిషనర్ కేటీ సుధాకర్ను నియమించారు. కార్పొరేషన్కు పాలక వర్గం లేకపోవడంతో కలెక్టర్ను ప్రత్యేకాధికారిగా ప్రభుత్వం నియమించింది. ఏలేరులో పెరిగిన నీటినిల్వలు ఏలేశ్వరం: పరివాహక ప్రాంతంలో వర్షాలు కురుస్తూండటంతో ఏలేరు రిజర్వాయర్లో నీటి నిల్వలు పెరుగుతున్నాయి. ఎగువ నుంచి గురువారం 2,200 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 86.56 మీటర్లు కాగా, 85.25 మీటర్లకు చేరింది. పూర్తి సామర్థ్యం 24.11 టీఎంసీలు కాగా, నీటి నిల్వలు 21.47 టీఎంసీలకు చేరాయి. ఆయకట్టుకు 1,200, విశాఖకు 175 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. తిమ్మరాజు చెరువుకు నీటి విడుదలను నిలిపివేశారు. -
బెధరగొట్టేలా..
● అమాంతం పెరిగిన కూరగాయల ధరలు ● వర్షాలతో కుళ్లిపోయిన తోటలు ● తగ్గిన దిగుబడి ● రైతుబజార్లకు తగ్గిన దిగుమతులు ● గతంలో ప్రతి రోజూ 25 టన్నుల విక్రయాలు ● నేడు 17 టన్నులు మాత్రమే.. ● ధరలు తగ్గించాలని ప్రజల డిమాండ్ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): చిక్కుడు కాయలు చిక్కనంటున్నాయి.. దొండకాయలు దడ పుట్టిస్తున్నాయి.. బొబ్బర్లు అబ్బో అనిపిస్తున్నాయి.. ఆకుకూరలు హడలెత్తిస్తున్నాయి.. మార్కెట్లో కూరగాయల రేట్లు ఒక్కసారిగా పెరగడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. వర్షాలు కురవక ముందు రూ.100 పెడితే నాలుగైదు రోజులకు సరిపడా కూరగాయలు రైతుబజారులో దొరికేవి. నేడు ఆ పరిస్థితి మారిపోయింది. పది రోజుల్లోనే కూరగాయల ధరలు అనూహ్యంగా పెరిగాయి. కిలో చిక్కుడు కాయలు పది రోజులు క్రితం రూ.75 ఉంటే ఇప్పుడు రూ.110కి చేరింది. తోటకూర, పాలకూర వంటి ఆకుకూరలు గతంలో రూ.20కి నాలుగు కట్టలు ఇచ్చేవారు. ప్రస్తుతం ఒక్కో కట్ట రూ.20 పలుకుతోంది. కొత్తిమీర అయితే కట్ట రూ.30కి విక్రయిస్తున్నారు. వరుణుడి ప్రతాపంతో.. వారం రోజులు క్రితం వరకూ దాదాపు ప్రతి రోజూ క్రమం తప్పకుండా కురిసిన భారీ వర్షాల ప్రభావంతో తోటల్లో నీరు నిలిచిపోయి, తోటలు కుళ్లిపోయాయి. దీంతో, కూరగాయల దిగుబడి భారీగా పడిపోయింది. ఫలితంగా రైతుబజారుతో పాటు హోల్సేల్ మార్కెట్కు వచ్చే కూరగాయలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. జిల్లాలో పెద్దాపురంలో 1, కాకినాడలో 2 రైతుబజార్లున్నాయి. ఈ మూడింటిలో ప్రతి రోజూ 25 టన్నుల కూరగాయలు విక్రయించే వారు. ప్రస్తుతం వర్షాల కారణంగా 17 టన్నులు కూడా రాని పరిస్థితి నెలకొంది. దీంతో రైతుబజారులోనే ధరలు మండిపోతున్న పరిస్థితి ఏర్పడింది. ఇక రిటైల్ మార్కెట్తో పాటు, ఇంటింటికీ తిరిగి అమ్మే వారి వద్ద కూరగాయలు కొనాలంటేనే వినియోగదారులు భయపడుతున్నారు. వంగ, దొండ, చిక్కుడు.. ఇలా కొన్ని రకాల కూరగాయలు ధరలు అధికంగా పెరిగాయి. మిగిలినవి కూడా కిలోకు రూ.10 నుంచి రూ.20 వరకూ పెరిగాయి. రైతుబజారుకు కూరగాయల కోసం వస్తున్న ప్రజలు వాటి ధరలు విని అవాకై ్కపోతున్నారు. బయటి మార్కెట్లో కిలోకు అదనంగా రూ.20 చెబుతున్నారు. ఇంకా కార్తిక మాసం మొదలవకుండానే ఇలా ఉంటే.. ఇకపై ధరలు ఎలా పెరుగుతాయోనని వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. అయ్యప్ప భక్తులతో పాటు, మిగిలిన చాలా మంది కార్తిక మాసమంతా మాంసాహారం తీసుకోరు. దీంతో, ఆ మాసమంతటా కూరగాయల ధరలకు మరింతగా రెక్కలొస్తాయేమోనని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు రైతుబజారులో కొందరు తాము పండించిన కూరగాయలు కాకుండా హోల్సేల్ మార్కెట్లో కొని ఇక్కడ విక్రయిస్తున్నారు. దీంతో, హోల్సేల్ కంటే కూడా రైతుబజారులో ఎక్కువ ధరలు చెబుతున్నారని వినియోగదారులు మండిపడుతున్నారు. ప్రభుత్వం, అధికారులు వెంటనే జోక్యం చేసుకుని, ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలు దిగుమతి చేయించి, ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 10 రోజుల వ్యవధిలో రైతుబజారులో కూరగాయలు ధరలు పెరిగాయిలా.. (కిలోకు రూ.లు) నల్ల వంకాయ 25.00 40.00 మువ్వ వంకాయ 35.00 50.00 కాకర 20.00 30.00 బీర 25.00 40.00 క్యారెట్ 35.00 54.00 దొండ 20.00 30.00 గోరుచిక్కుడు 35.00 50.00 చిక్కుడు 75.00 110.00 బొబ్బర్లు 26.00 40.00 ఆకాకర 75.00 90.00 దిగుబడి బాగా తగ్గింది వర్షాల కారణంగా తోటలు కుళ్లిపోవడంతో కూరగాయల దిగుబడి ఒక్కసారిగా తగ్గింది. ఇక్కడి రైతుబజారుకు పది రోజుల క్రితం 10 టన్నుల కూరగాయలు వచ్చేవి. ప్రస్తుతం రెండు మూడు టన్నులు మాత్రమే వస్తున్నాయి. బయటి మార్కెట్లో కూరగాయల ధరలు పెరగడంతో వినియోగదారులు రైతుబజారుకు అధికంగా వస్తున్నారు. రైతులను ఒప్పించి, తక్కువ ధరలకు అమ్మాలని ఆదేశాలు జారీ చేశాం. – కృష్ణారావు, ఆర్టీసీ కాంప్లెక్స్ రైతుబజారు ఎస్టేట్ అధికారి, కాకినాడ తోటలు కుళ్లిపోయాయి వీరవరంలో రెండెకరాల్లో కూరగాయలు సాగు చేస్తున్నాను. గత నెల, ఈ నెలలో కురిసిన వర్షాల కారణంగా వంగ, టమాటాతో పాటు ఇతర కూరగాయల పంటలు కుళ్లిపోయాయి. ప్రస్తుతం ఎండ కాయడంతో బతికి ఉన్న కొన్ని మొక్కల నుంచి కూరగాయలు తెచ్చి, ఇక్కడ విక్రయిస్తున్నాం. – పి.సూరిబాబు, రైతు -
పెత్తందార్లకు దోచిపెట్టేందుకే ప్రైవేటీకరణ
● ఆ బాటలోనే చంద్రబాబు దోపిడీ పాలన ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ● పెరుమాళ్లపురంలో కోటి సంతకాల సేకరణ ఉద్యమం తొండంగి: సంపద సృష్టిస్తానంటూ అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు.. తన మందిమాగధులైన పెత్తందార్లకు దోచి పెట్టేందుకు ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని తొండంగి మండలం పెరుమాళ్లపురంలో గురువారం ఆయన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందాలనే లక్ష్యంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్రం సహకారంతో ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల స్థాపనకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. వీటిలో కొన్ని నిర్మాణంలో ఉన్నాయన్నారు. ముఖ్యంగా నర్సీపట్నంలో 600 పడకల ఆస్పత్రితో పాటు వైద్య కళాశాల నిర్మాణంలో ఉన్నప్పటికీ అధికార కూటమి నేతలు అక్కడ కళాశాల, ఆస్పత్రి, వాటికి సంబంధించిన జీఓ లేదంటూ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తే వాటిని తీసుకున్న పెత్తందార్లకు ప్రజలు సొమ్ము చెల్లించాల్సి ఉంటుందన్నారు. రాజ్యాంగం ప్రకారం ప్రజలకు విద్య, వైద్యం అందించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యతని చెప్పారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో తుని ఏరియా ఆస్పత్రిలోనే సుమారు 30 రకాల వైద్య పరీక్షలకు అవసరమైన సామగ్రిని అందుబాటులోకి తెచ్చామని రాజా గుర్తు చేశారు. సంపద సృష్టిస్తానంటూ అన్నీ ప్రైవేటీకరించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు రూ.25 లక్షల విలువైన చికిత్సను కార్పొరేట్ ఆస్పత్రుల ద్వారా అందేదని, చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారని అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు అనేక సంక్షేమ పథకాలను అటకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నార ని ధ్వజమెత్తారు. ఇసుక, మద్యం.. ఇలా అన్ని మార్గా ల ద్వారా దోపిడీయే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే చేసిన అప్పుల భారం అంతా ప్రజల పైనే పడుతుందని చంద్రబాబు పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అన్నారు. కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం ద్వారా చంద్రబాబు చేపట్టిన వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం కోటి సంతకాల సేకరణ నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సమస్యలు తెలుసుకున్నారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేత యనమల కృష్ణుడు, వివిధ విభాగాల నాయకులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ కమిటీల్లో పలువురి నియామకం
కాకినాడ రూరల్: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురు నాయకులను పార్టీ కమిటీల్లో వివిధ హోదాల్లో నియమించారు. పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఈ వివరాలు తెలిపింది. రాష్ట్ర రైతు విభాగం సంయుక్త కార్యదర్శులుగా దాసరి వెంకటేశ్వరావు (జగ్గంపేట), అడారి రాజబాబు (జగ్గంపేట). రాష్ట్ర మైనార్టీ సెల్ సంయుక్త కార్యదర్శిగా మహ్మద్ అలీషా (కాకినాడ సిటీ) నియమితులయ్యారు. గొల్లప్రోలు నగర పంచాయతీ అధ్యక్షుడిగా మైనం బుల్లియ్య (రాజా)ను నియమించారు. ● మండల అనుబంధ, బూత్ కమిటీల అధ్యక్షులుగా రేలంగి రమణగౌడ్ (తుని మున్సిపాలిటీ), కుర్రా నాగేశ్వరరావు (తుని), వీసం పద్దరాజు (తొండంగి), ఆర్.జోగిరాజు (కోటనందూరు) నియమితులయ్యారు. ● మండల ఇంటలెక్చువల్ ఫోరమ్ అధ్యక్షులుగా టీవై సోమశంకరరావు (తుని మున్సిపాలిటీ), జక్కన రామచంద్రరావు (తుని), సోమిశెట్టి వెంకట సత్య చలపతి (తొండంగి), కాకర్లపూడి వెంకట సీతారామరాజు (కోటనందూరు)లను నియమించారు. ● జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షులుగా ఈరంకి వెంకట సాయి ఉదయ్కుమర్, వజ్రపు వీరేష్; ప్రధాన కార్యదర్శులుగా చోడిశెట్టి వెంకటేష్, పాటి సాయి వివేక్, తిరుమలశెట్టి లక్ష్మీకాంత్, ఓరుగంటి రవి; కార్యదర్శులుగా పోలుపర్తి తాతాజీ, బొల్లి నాని, కోర్పు దుర్గాప్రసాద్, మాకినీడి రాజేష్, కడారి సతీష్, మోనిది శివరామకృష్ణ, అనిశెట్టి లోవరెడ్డి, యరకం వెంకట దివాకర్ రెడ్డి, యాసరపు పవన్, కొపనాతి బాబీ, పాలెపు రవి, మాదపాటి సతీష్యాదవ్; కార్యవర్గ సభ్యులుగా రామిశెట్టి గోపి, అప్పికొండ లచ్చబాబు, పల్లె కొండలు, తోట తిమ్మరాజు, కొడుకుల సుధీర్, తోలెం విజయ్ నియమితులయ్యారు. ● జిల్లా మహిళా విభాగం ఉపాధ్యక్షులుగా ఎ.సూర్యకాంతం, యేలేటి అనంతలక్ష్మి; ప్రధాన కార్యదర్శులుగా శరకణం కనకలక్ష్మి, వట్టికోళ్ల నాగవేణి, పోలిశెట్టి పద్మావతి, అడ్డాల శ్రీలక్ష్మి, బత్తిన మంగ; కార్యదర్శులుగా వరుపుల కనకలక్ష్మి , రెడ్డి దుర్గాభవాని, పెదపాటి సుజాత, దాకే ధనలక్ష్మి, బొడ్డు ధనలక్ష్మి, నందిక వరలక్ష్మి, దేవకి, మలకల సత్యవేణి, వడ్డి నమని, పి.సూర్యప్రభ, అనిశెట్టి సుభాషి ణి; కార్యవర్గ సభ్యులుగా రేపల్లి వెంకటలక్ష్మి, శరకణం రామలక్ష్మి , బండారు అప్పలనరస, కటకం శ్రీదేవి, ఈగల విజయదుర్గ, మాకిరెడ్డి సీతాదేవి, కనేటి రాజేశ్వరి, కొప్పిశెట్టి సత్యకుమారి, పోలనాటి నూకరత్నంలను నియమించారు. ● జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శులుగా ఇజనగిరి ప్రసాద్, నేరపురెడ్డి నాయుడు, గొల్లవిల్లి రామకృస్ణ, సంగాని నందం, దోని చిట్టిబాబు, పినబోతు సత్తిబాబు; కార్యదర్శులుగా బుద్దా లోవబాబు, నేమల దేవుడు, బిత్తర సుబ్బారావు, కటారి త్రిమూర్తులు, లంకే గోపి, వెలమల మల్లేశ్వరరావు, బొర్రా వెంకటేశ్వరరావు, బొర్రా రమణ, మట్టపర్తి రఘు, గర్రే బాబ్జీ, రాయుడు వెంకటేశ్వరరావు, గంటా అప్పలస్వామి, ముప్పనబోయిన సోమరాజు, అనుసూరి గోపి; కార్యవర్గ సభ్యులుగా చిలకమర్తి వెంకటరమణ, తుట్టా జమిందారు, అంకంరెడ్డి పోతురాజు, పెరుమల రాజు, అల్లం వెంకన్న, సింబూతుల శ్రీను, గండేపల్లి సత్యనారాయణలను నియమించారు. ● జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులుగా సలాది బాబులు, చిల్లి దేవరాజు; ప్రధాన కార్యదర్శులుగా దిబ్బా శ్రీను, గొల్లపల్లి రవిబాబు, గొల్ల జయశంకర్, సిగల మధు, బత్తిన రాజు; కార్యదర్శులుగా కర్రి జగదీష్, బొడ్డా విజయ్కుమా ర్, బత్తుల నాగార్జున, బొండాడ అదృష్ట దీపక్, రెడ్డి భీమారావు, నందకుమార్, ఎం.డేవిడ్రా జు, దాకరపు వరప్రసాద్, సద్గున మూర్తి, వరసాల జాన్ ప్రభాకర్, పులగల శ్రీనుబాబు, దా ర వెంకట్రావు, దిమ్మల సత్తిబాబు, పాలిక రాజు, మాతా నాగేశ్వరరావు; కార్యవర్గ సభ్యులుగా నడిపల్లి వీరప్రసాద్, నందిక కళ్యాణ్, బొర్రా శాంతిమోహన్, బి.అమృతరావు, బొడ్డు శ్రీను, టి.ఏసురత్నం నియమితులయ్యారు. -
ఆ రూ.5.88 లక్షలు ఎక్కడివి?
అమలాపురం రూరల్: తీగ లాగితే డొంక కదిలినట్లు అమలాపురం తహసీల్దార్ అవినీతిపై ఏసీబీ అధికారులకు మరిన్ని ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. ఓ వ్యక్తి స్థలం సర్వే విషయంలో తహసీల్దార్ పి.అశోక్ప్రసాద్ రూ.లక్ష లంచం డిమాండ్ చేయడం, కార్యాలయ డేటా ఆపరేటర్, జనుపల్లి వీఆర్ఏ పుప్పాల రాము మధ్యవర్తిత్వంలో రూ.50 వేల బేరం కుదరడం, తర్వాత ఆ భూ యజమాని ఏసీబీ అధికారులను ఆశ్రయించడం, ఏసీబీ ట్రాప్లో తహసీల్దార్, డేట్ ఆపరేటర్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన పరిణామాలు తెలిసిందే. తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు జరిగినప్పుడు లంచం తీసుకుంటున్న రూ.50 వేలతో పాటు అక్కడ రూ.5.88 లక్షలు దొరకడం గమనార్హం. అక్కడ అనధికారికంగా ఉన్న రూ.5.88 లక్షలపై ప్రత్యేక దృష్టిపెట్టి, అసలు ఈ నగదు ఎక్కడిది..? ఎలా వచ్చింది...? అనే కోణంలో ఏసీబీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. తహసీల్దార్ను అరెస్ట్ చేసిన తర్వాత బుధవారం రాత్రి పొద్దుపోయాక ఏసీబీ అధికారులు తహసీల్దార్ ఇంటికి వెళ్లి విచారించారు. ఆ ఇంట్లో ఉన్న తహసీల్దార్ ల్యాప్టాప్ను అధికారులు సీజ్ చేశారు. అలాగే అధికారులు అమలాపురం ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి అక్కడా పలువురిని విచారించారు. తహసీల్దార్, డేటా ఎంట్రీ ఆపరేటర్ను తొలుత రాజమహేంద్రవరానికి తరలించారు. అక్కడి నుంచి విజయవాడలోని ఏసీబీ కోర్టుకు తీసుకు వెళ్లినట్లు సమాచారం. తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న రూ.5.88 లక్షల నగదు దీపావళి దుకాణాల ఏర్పాటు గురించి లంచంగా వసూలు చేసిన సొమ్మని తెలిసింది. ఏసీబీ అధికారులు కూడా ఆ దిశగానే దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులు -
పాలనపై పేదవి విరుపు
ప్రచారానికే ప్రాధాన్యం ఆధునిక సమాజంలో పేదల పరిస్థితులు మెరుగుపడాలంటే ప్రభుత్వం వ్యవస్థాపరమైన కృషి చేయాలి. కూటమి ప్రభుత్వం వచ్చాక వ్యవసాయం, పాడి పరిశ్రమ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమల ఏర్పాటు తదితర రంగాల్లో పటిష్టమైన కార్యాచరణ లేదు. ప్రచార కార్యక్రమాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. –ఎం.గౌరవ్, పిఠాపురం, సామాజిక కార్యకర్త కపిలేశ్వరపురం: జీవితం పూలపాన్పు కాకపోయినా పట్టెడన్నానికి లోటు లేకుండా సాగిపోతే చాలనుకునే వారెందరో.. పేద, మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ప్రస్తుత ‘కూటమి’ పాలనలో పేదల బతుకులు రోజురోజుకూ దయనీయంగా మారుతున్నాయి. సంపద సృష్టిస్తానంటూ కబుర్లు చెప్పిన కూటమి అగ్రనేతలు అధికారంలోకి వచ్చాక పేదలను సమస్యల సుడిగుండంలోకి నెట్టేస్తున్నారు. శుక్రవారం అంతర్జాతీయ పేదరిక నిర్మూలనా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఇది. ఉమ్మడి జిల్లాలో అన్నం పెట్టే వరి సాగు భూమి ఎక్కువగానే ఉంది. పండ్లు, కూరగాయల తదితర ఉద్యాన పంటలు పండే లంక, మెట్ట ప్రాంతమూ అధికమే. గౌతమి, వశిష్ట గోదావరి నదుల నుంచి పుష్కలమైన సాగునీరు లభ్యత ఇక్కడి ప్రత్యేకత. పారిశ్రామిక ప్రగతికి ప్రాథమిక భూమిక ఉమ్మడి జిల్లా.. ఇంత ప్రాధాన్యం ఉన్నా పేద, మధ్య తరగతి ప్రజలు ఆర్థిక, సామాజిక సమస్యలతో సతమతమవుతున్నారు. గత టీడీపీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో పేదల జీవితాలు తీసికట్టుగా మారాయి. తమ ప్రభుత్వం రాగానే సంపద సృష్టిస్తామని, ఇంటికో ఉద్యోగమిస్తామని ప్రజలను కూటమి నేతలు నమ్మించారు. 15 నెలల వారి పాలనలో కీలకమైన హామీలు ఆచరణకు నోచుకోలేదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కల్పించిన ఉపాధి అవకాశాలను సైతం కనుమరుగు చేశారు. కాకినాడ జిల్లాలో 445 గ్రామ సచివాలయాల పరిధిలో 9,015 మంది, 175 వార్డు సచివాలయాల పరిధిలో 3,257 మంది మొత్తం 620 సచివాలయాల పరిధిలో 12,272 మంది వలంటీర్లు ఉండేవారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 512 సచివాలయాల పరిధిలో 9,581 మంది, తూర్పుగోదావరి జిల్లాలో 119 వార్డు, 393 గ్రామ మొత్తం 512 సచివాలయాల పరిధిలో 9,117 మంది వలంటీర్లు సేవలందించే వారు. వారందరికీ రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామంటూ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం నమ్మబలికి అధికారంలోకి వచ్చాక తొలగించింది. ఇంటింటికీ రేషన్ సరకులు అందజేసేందుకు ఉద్దేశించిన వేలాది మంది ఎండీయూ ఆపరేటర్లను తీసేసింది. ఇలా ఆయా కుటుంబాలకు ఉపాధిని దూరం చేసింది. గతమెంతో ఘనం 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలోని పేదల జీవన ప్రమాణాలను మెరుగుపర్చే లక్ష్యంతో వ్యవస్థాపరమైన కార్యాచరణ చేసింది. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పటిష్ట చర్యలు తీసుకుంది. ప్రతి కుటుంబానికీ ఏదొక ప్రభుత్వ పథకం ద్వారా క్రమం తప్పకుండా ఆర్థిక లబ్ధి చేకూర్చింది. సచివాలయ, వలంటీర్ వ్యవస్థలను తీసుకొచ్చి వ్యవస్థాపరమైన సంక్షేమాన్ని, ఉద్యోగ కల్పనకు కృషి చేసింది. మహిళా మార్ట్లను ఏర్పాటు చేసి ఉపాధి, మార్కెట్ అవకాశాలను మెరుగుపరిచింది. పేద అక్క చెల్లెమ్మలకు రూ.5 లక్షల విలువైన ఇంటి స్థలాన్ని అందజేసే లక్ష్యంతో తూర్పుగోదావరి జిల్లాలో 431, కాకినాడ జిల్లాలో 241 లేఅవుట్లలో సుమారు 90 వేల ఇళ్ల పట్టాలను అందించింది. సాయం అందక వలసలు కూటమి వచ్చాక ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలు చాలా వరకూ నిలిచిపోయాయి. తొలి ఏడాదిలో రైతులకు అన్నదాతా సుఖీభవ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎగ్గొట్టారు. చేనేత కార్మికుల కుటుంబానికి ఇస్తామన్న రూ.25 వేలు ఇవ్వనేలేదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో గ్రామీణ పేదలు పట్టణ ప్రాంతాలకు, ఇతర వృత్తులకు వలస పోతున్నారు. మండపేట, రామచంద్రపురం నియోజకవర్గాల్లోని చేనేత కార్మికులు ఇతర వృత్తుల్లోకి మళ్లిపోవడం ఉదాహరణ. కొనలేం.. తినలేం ప్రస్తుతం నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కూరగాయల ధరలు ఒకొక్కటిగా పెరిగిపోతున్నాయి. ఎండుమిర్చి రూ.180 నుంచి రూ. 220, వెల్లుల్లి రూ. 240 నుంచి రూ.350 ధరలు పెరిగాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక రేషన్ దుకాణాల్లో ఫిబ్రవరి నుంచి కందిపప్పు సరఫరా నిలిచిపోయింది. వైఎస్సార్ సీపీ పాలనలో ఇంటి వద్దే రేషన్ సరకులు అందుకుంటున్న లబ్ధిదారులు (ఫైల్) అంగరలో చేనేత పనిలో మహిళ చదువుకు సాయం కరవు ఉమ్మడి జిల్లాలో వేలాది ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాలయాలు ఉన్నాయి. కోనసీమ జిల్లాలో 608 పాఠశాలలు, 70 కళాశాలలు, తూర్పుగోదావరి జిల్లాలో 635 పాఠశాలలు, 115 కళాశాలలు, కాకినాడ జిల్లాలో 300 పాఠశాలలు, 80 కళాశాలలు ఉన్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ ఇన్స్టాల్మెంట్లు చెల్లించక ఇంజినీరింగ్ విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం తొలి ఏడాది తల్లికి వందనం ఆర్థిక సాయాన్ని ఆపేసింది. కూటమి ప్రభుత్వంలో సంక్షేమం గాలికి సంపద కాదు సమస్యలు సృష్టిస్తున్న వైనం ఉపాధి కోసం వలసలు వెళ్తున్న బడుగులు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనే సుస్థిరాభివృద్ధి నేడు అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం -
ఎస్బీఐ బ్రాంచ్ను ముట్టడించిన డ్వాక్రా మహిళలు
కరప: డ్వాక్రా సంఘాల సొమ్మును స్వాహా చేసిన బ్యాంక్ సీసీపై చర్యలు తీసుకోకపోవడంపై వేళంగిలోని ఎస్బీఐ బ్రాంచ్ను గురువారం కూరాడ గ్రామ డ్వాక్రా మహిళలు ముట్టడించారు. తమ సంఘాల నుంచి దోచుకున్న రూ.95 లక్షలను రికవరీ చేయాలని, అక్రమాలకు పాల్పడిన బ్యాంక్ సీసీపై, ఇందుకు సహకరించిన యానిమేటర్లపై ఇంతవరకూ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూరాడలో 106 మహిళాశక్తి సంఘాలు ఉన్నాయి. వీరి నుంచి ముగ్గురు యానిమేటర్లు సంఘాల పొదుపు, రుణాల వాయిదా సొమ్మును వసూలు చేసేవారు. వేళంగి ఎస్బీఐ బ్రాంచ్ కూరాడలో బీసీ పాయింట్ ఏర్పాటు చేసి, కరస్పాండెంట్గా చిన్నం ప్రియభారతిని నియమించారు. ముగ్గురు యానిమేటర్లలో ఒకరు చిన్నం మంగ బ్యాంక్ సీసీ భారతి తల్లి కావడం, ఆమెకు మిగిలిన ఇద్దరు యానిమేటర్లు ఆలపాటి బేబీ, ఆచంట మాధవి సహకరించడంతో డ్వాక్రా సొమ్మును కాజేశారు. బ్యాంక్ సీసీ, యానిమేటర్లు ముగ్గురు ఏకమై పొదుపు, వాయిదాల సొమ్మును బ్యాంక్కు చెల్లించకుండా పక్కదారి పట్టించి, సొంతానికి వాడుకున్నారు. ఇది గత నెలలోనే బయటపడినా ఇంతవరకూ అధికారుల నుంచి స్పందన కరవైందని మహిళలు వాపోయారు. తమకు న్యాయం చేయాలని వేళంగిలోని ఎస్బీఐ బ్రాంచ్ను ముట్టడించారు. కరప పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారే కానీ ఇంతవరకూ ఎవరూ తమ గ్రామానికి విచారణకు రాలేదన్నారు. డీఆర్డీఏ పీడీ వచ్చాక చర్యలు తీసుకుంటారని ఏపీఎం ఎంఎస్బీ దేవి చెప్పారని, ఆయన వచ్చారో, లేదో తెలియడం లేదని మహిళలు వాపోయారు. అవినీతికి పాల్పడిన బ్యాంక్ సీసీ భారతిని విధుల నుంచి తొలగించాలని, స్వాహా చేసిన సొమ్మును రికవరీ చేసి డ్వాక్రా గ్రూపులకు చెల్లించాలని అసిస్టెంట్ మేనేజర్ ఎస్.ఫాల్గుణరావుకు వినతిపత్రం అందజేశారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఆయన చెప్పడంలో డ్వాక్రా మహిళలు వెనుతిరిగారు. స్వాహా చేసిన రూ.95 లక్షల రికవరీకి డిమాండ్ -
సదా వేంకటేశం.. స్మరామి స్మరామి
● వైభవంగా వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు ● అశేషంగా తరలివచ్చిన భక్తజనం కొత్తపేట: సదా వేంకటేశం.. స్మరామి స్మరామి.. అంటూ శ్రీవారిని కొలుస్తూ సాగుతున్న బ్రహ్మోత్సవాలు ఆబాలగోపాలాన్ని మురిపిస్తున్నాయి. కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రంలో శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడోరోజు గురువారం ప్రత్యేక పూజలు జరిగాయి. అశేష సంఖ్య భక్తజనం తరలివచ్చి వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య కార్యక్రమాలను తిలకించి తన్మయత్వం చెందారు. రాజాధిరాజ అలంకరణలో గజ వాహనంపై ఊరేగిన శ్రీవారిని వీక్షించి పరవశించిపోయారు. దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం వేద పండితుడు ఖండవిల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్, అర్చకులు, వేద పండితులు ఉదయం నుంచి రాత్రి వరకూ విశేష పూజలు, హోమాలు, బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈఓ చక్రధరరావు, ఉత్సవ కమిటీ చైర్మన్ ముదునూరి వెంకట్రాజు దంపతులు పూజాదికాలు నిర్వహించారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని, స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. ఉదయం నుంచి పుణ్యాహవచనం, అష్ట కలశారాధన, లక్ష తులసిపూజ, తిరుప్పావడ సేవ, ప్రధాన హోమాలు, దిగ్దేవతా బలిహరణ, నీరాజన మంత్రపుష్పం, సాయంత్రం స్వస్తివచనం, ప్రధాన హోమాలు, దిగ్దేవతా బలిహరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. గజ వాహనంపై ఊరేగిన శ్రీవారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి స్వామివారిని రాజాధిరాజ అలంకరణలో గజవాహన సేవ అద్భుతంగా సాగింది. శ్రీవారిని గజ వాహనంపై అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల గోవింద నామస్మరణ నడుమ వేద పండితుల వ్యాఖ్యోపన్యాసంతో ఈ వేడుక కన్నుల పండువగా సాగింది. రాజాధిరాజ అలంకరణ అనేది ఒక దేవతామూర్తిని ‘రాజులకు రాజుగా’ (రాజాధిరాజ), చక్రవర్తిగా అలంకరించే అత్యంత వైభవమైన అలంకారం. ఇది దేవాలయాల్లోని బ్రహ్మోత్సవాల వంటి ఉత్సవాల సమయంలో నిర్వహిస్తారు. దేవుని గజ (ఏనుగు) వాహనంపై ఊరేగిస్తారు. వాడపల్లి బ్రహ్మోత్సవాల్లో ఈ వాహన సేవ నిర్వహించారు. దైవత్వం యొక్క సర్వోన్నత అధికారాన్ని, వైభవాన్ని కీర్తించడం ఈ సేవ ఉద్దేశం. ఈ సేవ భక్తుల కోలాహలం నడుమ విశేషంగా సాగింది. పలువురు ప్రముఖులు, నాయకులు బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వాడపల్లిలో గజ వాహనంపై స్వామివారికి ఊరేగింపు బ్రహ్మోత్సవాల్లో శక్తివేషాల ప్రదర్శన -
తాండవ నదిలో మునిగి వ్యక్తి మృతి
కోటనందూరు: తాండవ నదిలో మునిగి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన అల్లిపూడి గ్రామంలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. అల్లిపూడి ఎస్సీ పేటకు చెందిన వడ్లమూరి శ్రీను (36) బుధవారం స్నానం చేసేందుకు సమీపంలోని తాండవ నదిలోకి దిగగా, ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోయాడు. అప్పటి నుంచి శ్రీను ఆచూకీ కోసం స్థానికులు గాలించగా, గురువారం ఉదయం అతని మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య వడ్లమూరి సంధ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామృకృష్ణ తెలిపారు. -
ఇంటికి చేరిన బాలుడు
కాజులూరు: గొల్లపాలెంలో నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన బాలుడు క్షేమంగా ఇంటికి చేరాడు. తల్లి మందలించడంతో మనస్థాపానికి గురై అతడు ఇంటి నుంచి వెళ్లిపోయినట్టు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. గ్రామంలోని చీకట్లవారిపేటకు చెందిన నాగ దినేష్ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. గత ఆదివారం మధ్యాహ్నం మిత్రులతో ఆడుకుంటానని చెప్పి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. తల్లిదండ్రులు తమ బంధువులు, అతడి స్నేహితులందరినీ విచారించినా ఆచూకీ తెలియలేదు. దీంతో తండ్రి గోవిందరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉండగా నాగ దినేష్ బుధవారం ఉదయం ఇంటికి చేరుకున్నాడు. పాఠశాల పూర్తయిన తర్వాత ఇంటికి రాకుండా స్నేహితులతో తిరుగుతున్నావంటూ తల్లి మందలించడంతో బాలుడు అలిగి వెళ్లిపోయినట్టు పోలీసులు తెలిపారు. విజయవాడకు వెళ్లిపోయిన నాగ దినేష్కు ఇంటిపై బెంగరావడంతో ఒక పోలీస్ కానిస్టేబుల్ సహకారంతో తిరిగి ఇంటికి చేరాడు. గొల్లపాలెం ఎస్సై ఎం. మోహన్కుమార్ ఆ బాలుడికి కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. -
రూ.72.23 లక్షలకు కొబ్బరి చెక్కల వేలం
అయినవిల్లి: అయినవిల్లి విఘ్నేశ్వరస్వామివారి ఆలయంలో భక్తుల కొట్టిన కొబ్బరి చెక్కలను పోగుచేసుకునే వేలం రూ.72,23,499కు ఖరారైంది. ఈ ఏడాది నవంబర్ 16 నుంచి వచ్చే ఏడాది నవంబర్ 15 వరకూ ఏడాది పాటు కొబ్బరి చెక్కలు తీసుకునేందుకు బుధవారం అమలాపురం ఆలయ తనిఖీదారు జంపా రామలింగేశ్వరరావు పర్యవేక్షణలో వేలం నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్, ఈఓ ముదునూరు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ – టెండర్, సీల్డ్ టెండర్, బహిరంగ వేలం ద్వారా పాట జరిగింది. తొండంగి మండలం సీతారామపురానికి చెందిన గింజాల నాగ వెంకట సత్తిబాబు రూ.72,23,499కు పాట దక్కించుకున్నాడు. గతేడాది రూ.45 లక్షలకు వెళ్లి వేలం ఈ సారి మరింత పెరిగిందని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు. -
మస్కట్ నుంచి సురక్షితంగా స్వదేశానికి..
అమలాపురం రూరల్: నకిలీ ఏజెంట్ కారణంగా మస్కట్లో చిక్కుకుపోయిన ఐ.పోలవరం మండలం టి.కొత్తపల్లికి చెందిన పిప్పర శ్రీలతను కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ అధికారులు స్వదేశానికి సురక్షితంగా తీసుకువచ్చారు. శ్రీలత గత జూన్లో మస్కట్ వెళ్లింది. అక్కడ సరైన పని దొరక్కపోవడం, యజమాని వేధింపులు, మూడు ఇళ్లలో పనికి చేరినా లాభం లేక తీవ్ర ఇబ్బందులు పడింది. వీటికి తోడు అనారోగ్య సమస్యలతో భారత రాయబార కార్యాలయానికి వచ్చేసింది. ఆమె సమాచారం మేరకు తండ్రి మల్లవరపు వెంకటేశ్వర్లు.. కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ను ఆశ్రయించారు. తన కుమార్తెను స్వదేశానికి సురక్షితంగా తీసుకురావాలని కలెక్టర్కు అర్జీ అందజేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ బృందం అక్కడి భారత రాయబారి ఇంటి రాజ్యలక్ష్మితో సంప్రదింపులు జరిపి, భారత విదేశీ రాయభార మంత్రిత్వ శాఖ సహకారంతో స్వదేశానికి సురక్షితంగా చేర్చినట్టు నోడల్ అధికారి, డీఆర్ఓ కె.మాధవి, సమన్వయ అధికారి గోళ్ల రమేష్ బుధవారం తెలిపారు. -
నగరపాలక సంస్థ కమిషనర్ బాధ్యతల స్వీకరణ
సీటీఆర్ఐ: రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్గా రాహుల్ మీనా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్న మీనాను రాజమహేంద్రవరం మునిసిపల్ కార్పొరేషన్కు కమిషనర్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆర్ఎంసీ కార్యాలయంలో కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. తొలుత కార్యాలయ ఆవరణలోని శ్రీ అభయ కనకదుర్గాదేవి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరపాలక సంస్థ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. పురవాసులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, సమస్యలుంటే తనను సంప్రదించాలని కోరారు. నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్యం, మౌలిక వసతులు కల్పిస్తామని వెల్లడించారు. సాంకేతికత సాయంతో గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామని వివరించారు. కలెక్టర్ కీర్తి చేకూరిని, జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ను కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందచేశారు. పంచారామాలకు ప్రత్యేక బస్సులు తుని: కార్తికమాసం సందర్భంగా తుని డిపో నుంచి అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్లు స్థానిక డిపో మేనేజర్ జీజీవీ రమణ తెలిపారు. బుధవారం ఆ మేరకు స్థానిక డిపోలో కరపత్రాలను విడుదల చేశారు. డిపో మేనేజర్ రమణ మాట్లాడుతూ ఈ నెల 26, నవంబర్ 2, 9, 16 తేదీల్లో (ఆదివారాలు) బస్సు తునిలో బయలుదేరి దర్శనానంతరం సోమవారం సాయంత్రం తిరిగి తుని చేరుతుందన్నారు. ఈ బస్సు టికెట్టు ధర రూ.1250 నిర్ణయించామన్నారు. వివరాలకు 73829 13216, 90633 66433, 73829 13016 నంబర్లను సంప్రదించవచ్చన్నారు. ఐఫోన్ కొనుగోలులో రూ.1.04 లక్షల మోసం రాజమహేంద్రవరం రూరల్: ఓఎల్ఎక్స్లో పెట్టిన ఐఫోన్ను కొనుగోలు చేద్దామనుకుంటే గుర్తు తెలియని వ్యక్తి తనను సంప్రదించి నగదు వేస్తే ఐఫోన్ అందజేస్తానని చెబితే అతని బ్యాంకు ఖాతాకు రూ.1.04 లక్షలు వేస్తే తనను మోసం చేసాడని మోరంపూడి సాయినగర్కు చెందిన పసగడుగుల రాజా శ్రీవెంకటసాయి బుధవారం బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం ప్రకారం మోరంపూడి సాయినగర్కు చెందిన సాయి ఓఎల్ఎక్స్లో ఐఫోన్ ఎం ప్రో మోడల్ను కొనుగోలు చేయడానికి గుర్తు తెలియని వ్యక్తికి గత నెల 26వ తేదీన బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాకు రూ.1.04 లక్షలు పంపాడు. కానీ సదరు వ్యక్తి ఐఫోన్ను అందించకుండా సాయి ఫోన్నెంబర్ను బ్లాక్ చేశాడు. సదరు వ్యక్తిపై వెంటనే సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేయడంతో ఆ మొత్తంలో రూ.1,03,970ను హోల్డ్లో పెట్టినట్టు సాయి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. రాష్ట్రంలో నాలుగు స్పోర్ట్స్ అకాడమీలు దేవరపల్లి: రాష్ట్రంలో నాలుగు స్పోట్స్ అకాడమీలను ఏర్పాటు చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ (శాప్) డైరెక్టర్ పేరం రవీంద్రనాథ్ తెలిపారు. బుధవారం ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు. తిరుపతి, నెల్లూరు, కాకినాడ, విశాఖలలో అకాడమీల ఏర్పాటుకు శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు అధ్యక్షతన ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో తీర్మానించినట్టు ఆయన చెప్పారు. ఈ ఏడాది తొలి విడతలో దేవరపల్లి, కొండెపి, కుప్పం, పాయకరావుపేటలో క్రీడా వికాస కేంద్రాలు నిర్మిస్తున్నట్టు ఆయన తెలిపారు. కొవ్వూరులో రాష్ట్రస్థాయి అండర్–17 వాలీబాల్ పోటీలు, దేవరపల్లిలో అండర్–17 సెపక్తక్రా రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు. దేవరపల్లి మండలంలో దేవరపల్లి, దుద్దుకూరు, యర్నగూడెం, చిన్నాయగూడెం, యాదవోలు గ్రామాల్లోని జెడ్పీ పాఠశాలల్లో క్రీడా మైదానాలు ఉన్నందున వాటి అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన చెప్పారు. అంగరంగ పవిత్రోత్సవాలు మామిడికుదురు: అప్పనపల్లి బాల బాలాజీ స్వామి సన్నిధిలో మూడు రోజులు జరిగే పవిత్రోత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీవారిలో విశేషమైన తేజస్సు కోసం నిర్వహించే ఈ పవిత్రోత్సవాలకు త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామి వారి శిష్య బృందం ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టారు. విష్వక్సేనారాధనతో ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. -
రత్నగిరిపై ముగిసిన సంప్రోక్షణ
● ఘనంగా శాంతి హోమం, పూర్ణాహుతి ● సాక్షి కథనంపై స్పందన అన్నవరం: రత్నగిరి వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో భక్తులు, సిబ్బంది, ప్రకృతి ద్వారా సంభవించే అపశృతులు, అపచారాల వల్ల ఎదురయ్యే దుష్ఫలితాలను పారదోలి భక్తి, ఆధ్యాత్మిక వాతావరణ పునరుద్ధరణకు చేపట్టిన సంప్రోక్షణ పూజలు బుధవారంతో ముగిశాయి. దేవస్థానం విశ్రాంత వేద పండితుడు, వైదిక సలహాదారు, త్రివేది బ్రహ్మశ్రీ కపిలవాయి రామశాస్త్రి సూచనలతో నిర్వహిస్తున్న శాంతి హోమం పూర్ణాహుతితో ముగిసింది. ఆలయంలోని దర్బారు మండపంలో పూజలు ముగిసిన అనంతరం పండితులు మంత్ర జలాలను స్వామి, అనంతలక్ష్మీ సత్యవతీ దేవి అమ్మవారు, శంకరులపై సంప్రోక్షించారు. అనంతరం ఆలయ ప్రాంగణం నలుమూలలా, యంత్రాలయం, రామాలయం, వ్రతమండపాలు, నిత్య కల్యాణమండపం, మెట్లదారి, ఘాట్రోడ్, వివిధ సత్రాలలో మంత్ర జలాన్ని చల్లి శుద్ధి చేశారు. దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు, కపిలవాయి రామశాస్త్రి సోమయాజి, వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠీ, గంగాధరభట్ల గంగబాబు, చిట్టి శివ, యనమండ్ర శర్మ, ముష్టి పురుషోత్తం, ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం, అర్చకులు దత్తాత్రేయ శర్మ,సుధీర్, కంచిబట్ల సాయిరామ్, కల్యాణ బ్రహ్మ చామర్తి కన్నబాబు, పురోహితులు పాలంకి పట్టాభి, అంగర సతీష్, ఇతర వైదిక బృందం నిర్వహించారు. ‘సాక్షి’ కథనంతో.. దేవస్థానంలో చాలా కాలంగా సంప్రోక్షణ పూజలు కాని, ప్రత్యేక యాగాలు, కోటి తులసి పూజలు జరగకపోవడంతో మూడు నెలలుగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు పండితులు, అర్చకస్వాములు అభిప్రాయపడ్డారు. దీనిపై ఏడో తేదీన సాక్షి దినపత్రికలో ‘ అపశృతులు అందుకేనా...?’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించిన దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు శాంతి పూజలు నిర్వహించాలని పండితులను ఆదేశించారు. దాంతో ఆలయ వైదిక సలహాదారు రామశాస్త్రి సోమయాజి సూచనలతో సంప్రోక్షణ పూజలు, శాంతి హోమం నిర్వహించారు. -
ఏటా సంప్రోక్షణ, శాంతి హోమం తప్పనిసరి
అన్నవరం దేవస్థానంలో తెలిసో తెలియకో జరిగే అపచారాల వల్ల ఎదురయ్యే దుష్పరిణామాలను ఎదుర్కొనేందుకు ఏటా సంప్రోక్షణ పూజలు, శాంతి హోమం నిర్వహించి ఆలయాన్ని శుద్ది చేయాలి. ప్రకృతి ప్రకోపం వలన ఏర్పడే తుఫాన్లు, సునామీ, కరోనా తదితర సమయాలలో ఎదురయ్యే దుష్పరిణామాలు ఈ వైదిక కార్యక్రమాల వల్ల సమసిపోతాయి. – బ్రహ్మశ్రీ కపిలవాయి రామశాస్త్రి సోమయాజి, త్రివేది, దేవస్థానం విశ్రాంత వేదపండితుడు, వైదిక సలహాదారు -
మనసు లేని మాటలేల!
పట్టాలు ఇచ్చారు.. భూమి చూపలేదు బాణసంచా తయారీ కేంద్రంలో ప్రమాదం జరిగి ఏళ్లు గడుస్తున్నా బాధిత కుటుంబాలకు ఇచ్చిన పట్టాలకు నేటికీ భూమిని చూపించలేదు. అక్టోబర్ పదో తేదీ 2014లో వాకతిప్పలో ఉన్న బాణసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగి 18 మంది అక్కడకక్కడే మృతి చెందారు. వారిలో నా భార్య మసకపల్లి పుష్పావతి, మరదలు మసకపల్లి కుమారి ఉన్నారు. అప్పట్లో బాధిత కుటుంబాలకు టీడీపీ ప్రభుత్వం ఒక్కొక్కరికి 50 సెంట్లు భూమి ఇస్తానని బి పట్టాలు ఇచ్చింది. ఆ భూమి చూపించాలని తహసీల్దార్ కార్యాలయం, స్పందనకు కాళ్లు అరిగేలా తిరుగుతూ వచ్చాం. ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. ఈ పట్టాలకు సంబంధించిన భూమిని గతంలో వేరే వారికి ఇచ్చారు. వారి దగ్గర పాస్ పుస్తకాలు కూడా ఉన్నాయి. మమ్మల్ని అప్పటి ప్రభుత్వం మోసం చేసింది. ఇప్పటికై నా ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఇస్తానన్న 50 సెంట్ల భూమిని ఇవ్వాలి. – మసకపల్లి నాగేశ్వరరావు, వాగతిప్ప సాక్షి, ప్రతినిధి, కాకినాడ: కూటమి ప్రభుత్వానికి మానవత్వం బొత్తిగా లేకుండా పోతోంది. ప్రజలకు కష్టం వస్తే ఆదుకోవలసిన బాధ్యత లేదా అనేలా వ్యవహరిస్తోంది. తాజాగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో సంభవించిన బాణసంచా విస్పోటంలో ప్రాణాలు కోల్పోయిన పది మందిలో బాణసంచా తయారీ దుకాణం యజమాని తప్ప మిగిలిన వారంతా రెక్కాడితే కానీ డొక్కాడని వారే. ఈ పెను విషాదం జరిగి వారం రోజులు గడిచినా మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చి నాలుగు మాటలు చెప్పి వెళ్లడమే తప్ప తక్షణ సాయం అందించే దిశగా ఎటువంటి చర్యలు లేవు. రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలో ఎప్పుడో ఓ టీడీపీ కార్యకర్త హత్యకు గురైతే ఆ కుటుంబంలో ఒకరికి ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగం కల్పించింది. అదే ఉదారత రాయవరం ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారిపై లేకపోవడం ఏంటని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని బుధవారం రాయవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రజా సంఘాలు ధర్నాకు దిగి అధికారులను నిలదీశాయి ఈ దుర్ఘటనలో బిక్కవోలు మండలం కొమరిపాలేనికి చెందిన బాణసంచా యూనిట్ యజమాని వెలుగుబంట్ల సత్యనారాయణమూర్తి (సత్తిబాబు) మినహాయిస్తే మిగిలిన వారంతా పొట్టకూటి కోసం బాణసంచా తయారీకి వచ్చిన వారే. కొమరిపాలేనికి చెందిన పొట్నూరి వెంకటరమణ, రాయవరం మండలం సోమేశ్వరం గ్రామానికి చెందిన పాకా అరుణ, వాసంశెట్టి విజయలక్ష్మి, అనపర్తికి చెందిన చిట్టూరి శ్యామల, చిట్టూరి యామిని, అనపర్తి సావరానికి చెందిన కుడుపూడి జ్యోతి, పెంకే శేషారత్నం, కొమరిపాలెం, పెదపూడి మండలం వేండ్రకు చెందిన లింగం వెంకటకృష్ణ, ఒడిశాకు చెందిన కె. సదానందం మృతులు. యజమాని మినహా మిగిలిన వారంతా ఎస్సీ, బీసీ సామాజికవర్గాల వారే. తమ ప్రభుత్వం ఎస్సీ, బీసీలకు అగ్రాసనం వేస్తుందని గొప్పగా చెప్పుకొనే సర్కార్ కనీసం వారిని ఆదుకోవాలని ఆలోచించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఘటన జరిగిన రోజు రాష్ట్ర హోంశాఖా మంత్రి వంగలపూడి అనిత, కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి వెళ్తున్నారు తప్ప ఎటువంటి సాయం ప్రకటించకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అలా కాదని సాయం కోసం ప్రశ్నిస్తే ఇచ్చే సాయం ఇవ్వరేమోననే భయం వారిని మాట్లాడనీయలేదు. వారిని పక్కనబెడితే కూటమి నేతలైన మండపేట, అనపర్తి ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బాధిత కుటుంబాలను పలకరించి ప్రభుత్వ పరంగా న్యాయం చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారే తప్ప ప్రభుత్వం ఇచ్చే పరిహారాన్ని ఎక్కడా ప్రస్తావించకపోవడం విస్మయానికి గురిచేసింది. అసలు సంఘటన జరిగిన రోజు వచ్చిన సందర్భంలోనే మంత్రులు ప్రభుత్వ సాయాన్ని ప్రకటించాల్సి ఉంది. అలా కాకుండా ఈ ఘటనపై సమీక్షించిన తరువాత అయినా ఆర్థిక సాయాన్ని ప్రకటించాల్సి ఉంది. కాగా బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాత్రం జ్యుడీషియల్, ప్రభుత్వం వైపు నుంచి విచారణ జరుగుతోంది, పరిహారం ఎలా ఇవ్వాలనేది ఆలోచిస్తున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కాలయాపనపై ప్రజా సంఘాలు కార్మిక న్యాయస్థానానికి వెళ్లేందుకు సిద్ధపడుతున్నాయి. కాగా, ఈ దుర్ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తనంతట తానుగా మంగళవారం కేసు నమోదుచేస్తున్నట్టు ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు కారణాలను ఎన్హెచ్ఆర్సీ ప్రశ్నించింది. మీడియా కథనాల ఆధారంగా కేసు నమోదుచేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ చేస్తున్నట్టు ప్రకటించింది. బాఽధితుల సమీప బంధువులకు పరిహారం అందించారా అనే విషయాన్ని కూడా రెండు వారాల్లో అందించే నివేదికలో పొందుపరచాలని ఆదేశించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అత్యంత విషాదకర ఘటనగా నిలిచిపోయిన వాకతిప్ప బాణసంచా పేలుడు 2014 అక్టోబర్ 10వ తేదీన జరిగింది. ఆ దుర్ఘటనలో 18 మంది మృతి చెందారు. నాడు ప్రతిపక్ష నేతగా జగన్ ఒకో కుటుంబానికి రూ.50 వేలు సొంత నిధులు అందించి ఆదుకున్నారు. అప్పట్లో అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్ తొలుత లక్షన్నర పరిహారం ప్రకటించింది. జగన్ వచ్చి వెళ్లాక ఆర్థిక సాయాన్ని రూ.3 లక్షలు చేసింది. జగన్మోహన్రెడ్డి హయాంలో ఇలాంటి ఘటనలు జరిగినపుడు ప్రభుత్వం మానవత్వంతో ఆదుకున్న ఉదంతాలు కోకొల్లలు. సామర్లకోట మండలం జి. మేడపాడులో 2019 అక్టోబర్లో బాణసంచా తయారు చేస్తుండగా జరిగిన ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో మృతుల కుటుంబాలకు జగన్ ప్రభుత్వం సుమారు రూ.15 లక్షలు సాయం అందించింది. రంపచోడవరం మన్యం ప్రాంతంలో కచ్చులూరు వద్ద 2019లో పాపికొండలకు వెళ్లే పర్యాటక బోటు బోల్తా పడిన సంఘటనలో 48 మంది మృత్యు వాతపడ్డారు. బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున సాయం అందించింది. అలాగే తాళ్లరేవు మండలం జి.వేమవరంలో బాణసంచా పేలుడు ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. వెంటనే కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారాన్ని, క్షతగాత్రులకు రూ.3 లక్షలు అప్పటి వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రకటించారు. ప్రభుత్వ తీరుపై సర్వత్రా విస్మయం పది మంది ప్రాణాలు పోయినా పరిహారానికి మీనమేషాలు ఎదురుతెన్నులు చూస్తున్న బాధిత కుటుంబాలు సర్కార్కు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జగన్ హయాంలో 24 గంటల్లోనే సాయం సత్వరం పరిహారం అందించాలి రాయవరం బాణసంచా ప్రమాద మృతులకు సాయం అందించడంలో కూటమి ప్రభుత్వం జాప్యం చేస్తోంది. ప్రమాదం జరిగి అప్పుడే వారం రోజులు గడచిపోయాయి. ఇప్పటి వరకు బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించక పోవడం విచారకరం. బాధిత కుటుంబాలు కూడా ఆందోళనలో ఉన్నారు. తక్షణం బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందించాలి. – డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి అనపర్తి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఎక్స్గ్రేషియా ప్రకటించి, కుటుంబాన్ని ఆదుకోవాలి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలి. రాయవరంలో ఈ నెల 8న సంభవించిన బాణసంచా తయారీ కేంద్రంలో తమ కుమారుడు లింగం వెంకటకృష్ణ (22) చికిత్స పొందుతూ కాకినాడ జీజీహెచ్లో ఈ నెల 12న చనిపోయాడు. ప్రభుత్వం తమ కుటుంబానికి పరిహారం ప్రకటించి ఆదుకోవాలి. చేతికి అందివచ్చిన కొడుకు కళ్ళముందు చనిపోతుంటే ఆ పరిస్థితిని చూసి తట్టుకోలేపోతున్నాం. – లింగం రాము, మృతుడు తండ్రి, వేండ్ర, పెదపూడి మండలం ప్రభుత్వం ఆదుకోవాలి నా తల్లి విజయలక్ష్మిని కోల్పోయాను. ఇంతకాలం మా కుటుంబాన్ని నెట్టుకుంటూ వచ్చింది. ఈ ప్రమాదంతో దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నాం. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదు. ప్రభుత్వం సాయం అందించి ఆదుకుంటుందని ఆశగా ఎదురుచూస్తున్నాం. – దుర్గాదేవి, సోమేశ్వరం, రాయవరం -
రా‘బంధువుల’ మధ్య జీవించలేనంటూ..
ఆలమూరు: బంధువులే రాబంధువులు అయ్యారు. అయిన వాళ్లే గద్దల్లా అనునిత్యం పొడుచుకుతిన్నారు. కేసులు పెట్టి హింసించి జైలుకు పంపించారు. సూటిపోటి మాటలతో వ్యక్తిత్వాన్ని కించపరచేవారు. దీంతో సమాజంలో తాను బతకలేనని అతడు భావించాడు. తాను చనిపోతే బిడ్డలు అనాథలైపోతారని భావించి, ముక్కుపచ్చలారని వారికి పురుగు మందు పట్టించి హత్య చేశాడు. తాను కూడా ఇంట్లో సీలింగ్ ప్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ హృదయ విచార సంఘటన ఆలమూరు మండలం మడికి శివారు చిలకలపాడులో బుధవారం తెల్లవారుజామున జరిగింది. వివరాలు ఇవీ.. స్థానిక శ్రీషిర్డీసాయి ఆలయం సమీపంలో నివసిస్తున్న పావులూరి కామరాజు అలియాస్ చంటి (36) గతంలో గ్రామ వలంటీర్గా పనిచేశాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామ వలంటీర్ వ్యవస్థను రద్దు చేయడంతో, తన కులవృత్తి అయిన సెలూన్ షాపు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. అయితే ఐదేళ్ల క్రితం చంటి భార్య నాగదేవి ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతికి చంటే కారణమంటూ అత్తింటి వైపు బంధువులు ఆగ్రహంతో ఉన్నారు. ఆ సమయంలో ఆలమూరు పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేయడంతో చంటి జైలు శిక్షకు గురయ్యాడు. ఇటీవల భార్య నాగదేవి ఆత్మహత్య కేసుపై రాజీ కుదరడంతో బయటపడ్డాడు. కానీ బిడ్డలను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. క్లూస్ టీం రాక బిడ్డలను చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై సమగ్ర విచారణ చేపట్టేందుకు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీ మోహన్, రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్, ఎస్సై జి.నరేష్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. కాకినాడ నుంచి క్లూస్ టీంను రప్పించి వివరాలు సేకరించారు. మృతుడు చంటి సెల్ఫీ వీడియోలోని ఆరోపించిన విధంగా ఆ ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వీటి వెనుక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం మండపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల రోదన గ్రామస్తులకు చేదోడు వాదోడుగా ఉంటూ అందరిని అప్యాయంగా పలుకరించే తన కుమారుడు చంటి, బుడిబుడి అడుగులతో అల్లరితో సందడి చేసే ఇద్దరు మనవలు ఒకేసారి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. లోకం పోకడ తెలియని ఆ చిన్నారులను చంపి ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డావంటూ వారు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టిస్తోంది. ముక్కుపచ్చలారని ఆ పసి బాలురు మృతదేహాలను చూసిన స్థానికులు చలించిపోయారు. ఇద్దరు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య ముగ్గురి వేధింపులే కారణమని సెల్ఫీ ఆలమూరు మండలం మడికిలో విషాదం కారణం ఆ ముగ్గురే.. తన సమీప బంధువులైన పావులూరి దుర్గారావు, కొరుప్రొలు తలుపులు, కొరుప్రొలు శ్రీనివాసరావు వేధింపులతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చంటి ఆరోపించాడు. చనిపోయే ముందు ఒక సెల్ఫీ వీడియోను రూపొందించి తన కుటుంబ సభ్యులకు పంపించాడు. ఇటీవల ఆ ముగ్గురూ తనను చంపేందుకు పలు రకాలుగా ప్రయత్నించారన్నారు. తాను చనిపోతే తన కుమారులు అనాథలై పోతారని ఆందోళన చెందాడు. తన మాదిరిగా బిడ్డల ఆలన పాలన ఎవ్వరూ పట్టించుకోరని ఆవేదన చెందాడు. ఆ ఉద్దేశంతోనే పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని వివరించాడు, ఆ ముగ్గురినీ కఠినంగా శిక్షించి తన కుటుంబానికి న్యాయం చేయాలని ఆ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. -
‘ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు’
పత్రికలు, వాటిలో పనిచేసే జర్నలిస్టుల పట్ల ప్రభుత్వాలు కక్ష సాధింపు చర్యలకు దిగడం అన్యాయం. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు అయ్యినా ఇప్పటికీ బ్రిటీష్ పాలన మాదిరిగా పత్రికలపై దాడులకు దిగడం నీతి బాహ్యమైన చర్యే. విజయవాడ, హైదరాబాద్ సాక్షి కార్యాలయంలోకి పోలీసులు వెళ్లడం ద్వారా పత్రిక రోజువారీ దినచర్యలకు ఆటంకం కలిగించడం సహేతుకం కాదు. పత్రికల స్వేచ్చకు భంగం కలిగిస్తే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టే... – రెడ్డిపల్లి రాజేష్, అధ్యక్షుడు, సిటీ ప్రెస్క్లబ్,కాకినాడ రాజకీయ కక్షలు కార్పణ్యాలతోనే... రాజకీయ కక్షలు కార్పణ్యాలతో ‘సాక్షి’ విూడియా సంస్థపై దాడికి దిగడం సరైన విధానం కాదు. మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామనే విషయాన్ని మరిచిపోకూడదు. అదికూడా సమయం సందర్భం లేకుండా తరచు సాక్షి కార్యాలయంపై పోలీసుల దాడి, కార్యాలయంలో పోలీసుల హల్చల్, సంపాదకుడు ధనుంజయరెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేయడం పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించడమే. ప్రజాస్వామ్యవాదులు ఈ దాడులను తీవ్రంగా ఖండించాల్సిందే. – నదీముల్లాఖాన్ దురాని, మాజీ ఉపాధ్యక్షుడు ఏపీడబ్ల్యూజే, ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లా -
కౌశల్ పోటీలను విజయవంతం చేయండి
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లోని విద్యార్థులు కౌశల్ రాష్ట్ర స్థాయి సైన్స్ ప్రతిభాన్వేషణ పోటీల్లో పాల్గొని జయప్రదం చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి పిల్లి రమేష్ కోరారు. పోటీలకు సంబంధించిన వాల్పోస్టర్లను మంగళవారం తన చాంబర్లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారతీయ విజ్ఞాన మండలి, సైన్స్ సిటీ ఆఫ్ ఏపీ, రాష్ట్ర శాస్త్ర, సాంకేతిక మండలి ఆధ్వర్యాన ఈ పోటీలు జరుగుతున్నాయన్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయి విజేతలకు నగదు బహుమతులు అందిస్తారన్నారు. ఈ నెల 23లోగ ఆన్లైన్లో విద్యార్థుల వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి ఎం.శ్రీనివాస్ వినీల్, కౌశల్ జిల్లా సమన్వయకర్త కేసరి శ్రీనివాసరావు, జాయింట్ కో ఆర్డినేటర్ పి.మోహన్రెడ్డి, ఏపీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్.చలపతి, ప్రధాన కార్యదర్శి సీహెచ్ఎన్ శ్రీనివాస్, వీవీఎం జిల్లా సమన్వయకర్త డి.శివప్రసాద్ పాల్గొన్నారు. ఫ క్విజ్ పోటీలు 8, 9, 10 తరగతుల వారికి ఉంటాయి. నవంబర్ 1, 2, 3 తేదీలలో పాఠశాల స్థాయిలో నిర్వహించే ఈ పోటీలకు తరగతికి ముగ్గురు చొప్పున మాత్రమే పాల్గొనాలి. ఫ తొమ్మిదో తరగతి వారు పోస్టర్–1, ఎనిమిదో తరగతి వారు పోస్టర్–2 పోటీలకు అర్హులు. ఫ రీల్స్ పోటీలకు 10వ తరగతి విద్యార్థులు మాత్రమే అర్హులు. ఫ పోటీల్లో పాల్గొన్న వారిలో పాఠశాల స్థాయిలో ప్రతి తరగతి నుంచి మూడు విభాగాల్లో ఇద్దరు చొప్పున విజేతలను జిల్లా స్థాయికి ఎంపిక చేస్తారు. వారి నుంచి ప్రతి ఈవెంట్కు ఇద్దరు చొప్పున రాష్ట్ర స్థాయికి వెళ్తారు. రాష్ట్ర స్థాయి పోటీలు డిసెంబర్ 27న తిరుపతి భారతీయ విజ్ఞాన జాతీయ సమ్మేళనంలో జరుగుతాయి. -
పెళ్లి బృందాలకు క్షవర కల్యాణం
ఫ దళారుల దందాఅన్నవరం: సత్యదేవుని సన్నిధిలో పేదలు తమ బిడ్డల వివాహాలు చేసుకునేందుకు వీలుగా రత్నగిరిపై పలువురు దాతలు ఉచిత కల్యాణ మండపాలు నిర్మించారు. కానీ, వీటి కేటాయింపులో దళారుల దందా సాగుతోంది. వారికి కొంతమంది దేవస్థానం సిబ్బంది అండదండలు ఉండటంతో పేదలకు ఉచిత కల్యాణ మండపాలు లభించడం దుర్లభంగా మారుతోంది. ఇటీవల జరుగుతున్న సంఘటనలే ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. ఉచిత కల్యాణ మండపాల కేటాయింపును దేవస్థానం అధికారులు సక్రమంగా పర్యవేక్షించకపోవడంతో దళారులు, కొంతమంది సిబ్బంది ఒక్కటై వివాహ బృందాలను దోచుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తాజా ఉదంతమే దీనికి ఉదాహరణ. రూ.25 వేలకు ఒప్పందం పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండకు చెందిన తోట నాగతేజ గత శనివారం రాత్రి రత్నగిరిపై వివాహం చేసుకున్నారు. ఈ వివాహ ఏర్పాట్ల కోసం ఆయన గత ఆగస్టులో దేవస్థానానికి వచ్చారు. మట్టే వారి సత్య శ్రీనివాస ఉచిత కల్యాణ మండపంలో ఏసీ కల్యాణ మండపం, పక్కనే సత్రంలో రెండు ఏసీ గదులు, పురోహితుడు, సన్నాయి మేళం కోసం దేవస్థానం సీఆర్ఓ కార్యాలయాన్ని సంప్రదించారు. సత్రం గదులు, వివాహ మండపం వివాహానికి నెల రోజులు ముందుగా మాత్రమే రిజర్వేషన్ చేస్తారని అక్కడి అధికారులు చెప్పారు. అక్కడి నుంచి నాగతేజ వెలుపలకు రాగానే అశోక్, పోరి అనే ఇద్దరు దళారులు అతడి వద్దకు వెళ్లారు. అక్టోబర్ 11 వివాహానికి గదులు, వివాహ మండపం సెప్టెంబర్ 11న వస్తే రిజర్వ్ చేస్తారని చెప్పారు. ఆయన రానవసరం లేకుండా అన్నీ తామే ఏర్పాటు చేస్తామని, రూ.25 వేలు ఇవ్వాలని చెప్పారు. ఆ మాటలు నమ్మిన నాగతేజ.. వారికి తన, పెళ్లి కుమార్తె ఆధార్ నకళ్లతో పాటు శుభలేఖ, రూ.15 వేల నగదు ఇచ్చారు. మిగిలిన రూ.10 వేలు వివాహ సమయంలో ఇస్తామని చెప్పారు. అయితే, వివాహం చేసుకునేందుకు గత శనివారం దేవస్థానానికి వచ్చిన నాగతేజకు నాన్ ఏసీ కల్యాణ మండపం, రెండు నాన్ ఏసీ గదులు మాత్రమే ఇచ్చారు. దీంతో, అతడు దళారులకు రూ.10 వేలకు బదులు రూ.7,500 మాత్రమే ఇచ్చారు. మిగిలిన రూ.2,500 కూడా ఇవ్వాలని దళారులు గొడవకు దిగడంతో నాగతేజ పెళ్లి దుస్తుల్లోనే వెళ్లి ఈఓ వీర్ల సుబ్బారావుకు ఫిర్యాదు చేశాడు. దళారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వివాదం సంగతి అలా ఉంచితే.. ఈ ఎపిసోడ్లో అసలు వ్యక్తులు రాకుండా దళారులు ఆధార్ కార్డులు ఇస్తే వివాహ మండపం, సత్రంలో గదులు ఎలా రిజర్వ్ చేశారు? సీఆర్ఓ కార్యాలయ సిబ్బంది ప్రమేయం లేకుండా ఇది జరిగే పనేనా వంటి అనేక సందేహాలు కలుగుతున్నాయి. నెరవేరని దాతల లక్ష్యం అన్నవరం దేవస్థానంలో సత్యగిరిపై పెద్దాపురానికి చెందిన శ్రీ లలితా రైస్ ఇండస్ట్రీస్ ఎండీ మట్టే శ్రీనివాస్ దంపతులు 2022లో 12 మినీ కల్యాణ మండపాలతో పెద్ద ఏసీ కల్యాణ మండపం నిర్మించారు. ఇదేవిధంగా విశాఖపట్నానికి చెందిన దాత ఎంఎస్ రెడ్డి కూడా 12 మినీ కల్యాణ మండపాలతో పెద్ద కల్యాణ మండపం నిర్మించారు. ఈ రెండు మండపాల్లో చెరో తొమ్మిది మినీ కల్యాణ మండపాల కేటాయింపును దేవస్థానానికి అప్పగించారు. మిగిలిన చెరో మూడు మండపాలను దాత సిఫారసు మేరకు కేటాయిస్తారు. ఈ మండపాల్లో పెళ్లిళ్లు చేసుకునే వారు రూపాయి కూడా అద్దె చెల్లించనవసరం లేదు. అలాగే, ఒక్కో వివాహానికి రెండు గదులను దేవస్థానం అద్దె ప్రాతిపదికన ఇస్తుంది. వివాహ ముహూర్తానికి నెల రోజుల ముందు మాత్రమే ఈ కల్యాణ మండపాలను రిజర్వ్ చేస్తారు. ఈ విషయం తెలియక చాలామంది వివాహానికి చాలా రోజుల ముందే వస్తున్నారు. తీరా విషయం తెలిశాక మళ్లీ రాలేకపోతున్నారు. అటువంటి వారిని గుర్తించి, దళారులు వల విసురుతున్నారు. ఇలా చేస్తే మేలు ఫ దేవస్థానంలో వివాహ మండపాలు, సత్రం గదుల కేటాయింపుపై ఎటువంటి ప్రచారమూ లేదు. వీటిని వివాహాలకు నెల రోజుల ముందు మాత్రమే కేటాయిస్తారని ఫ్లెక్సీలు, మైకుల ద్వారా ప్రచారం చేయాలి. ఫ సీఆర్ఓ కార్యాలయంతో పాటు దేవస్థానంలో దళారులు లేకుండా చర్యలు తీసుకోవాలి. వివాహ మండపాలు కేటాయించాలంటే పెళ్లి బృందం సభ్యులు సరిగ్గా నెల రోజుల ముందు మాత్రమే సీఆర్ఓ కార్యాలయం వద్దకు రావాలంటూ ప్రకటనలు చేయాలి. ఫ వివాహ బృందాల వారికి అవసరమైన సమాచారం ఇచ్చేందుకు టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేయాలి. ఆ నంబర్పై విస్తృత ప్రచారం చేయాలి. ఫ వివాహాల సీజన్లో ఈఓ, ఇతర ఉన్నతాధికారులు తరచుగా వివాహ మండపాలు, సీఆర్ఓ కార్యాలయంలో తనిఖీలు చేయాలి. పెళ్లి బృందాల అభిప్రాయాలు తెలుసుకుని, వారి సూచనల మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఫ ఉచిత వివాహ మండపాలు కేటాయించడానికి ముందు, వివాహం అయ్యాక ఎవరైనా డబ్బులు డిమాండ్ చేశారా అనే విషయమై ఆరా తీసి, ఆ మేరకు చర్యలు చేపట్టాలి. ·˘ Æý‡™èl²WÇOò³ ÑÐéçßæ Ð]l$…yýl´ëË$, సత్రం గదులు ఇప్పిస్తామని మోసాలు ·˘™égêV> DKMýS$ ఓ బాధితుడి ఫిర్యాదు ·˘§ólÐ]lÝ릯]l… íܺ¾…¨ సహకారంపై సందేహాలు -
‘ఎత్తిపోతల’కు ముప్పు!
ఏలేరుపై ఆధారపడి మెట్ట ప్రాంతంలో సుమారు 60 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రభుత్వ మనసు పెట్టి పని చేస్తే రెండో పంటకు సైతం సాగునీరు అందుతుంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఏలేరు నుంచి ఐదేళ్లూ క్రమం తప్పకుండా రెండో పంటకు సాగునీరు అందించారు. అటువంటి ఏలేరు తెలుగు తమ్ముళ్ల స్వార్థానికి బలైపోతోంది. నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మెట్ట ప్రాంత రైతులకు మేలు చేసేలా అప్పటి మంత్రి తోట నరసింహం సోమవరం గ్రామం వద్ద ఏలేరులో ఎత్తిపోతల పంపింగ్ స్కీమ్ నిర్మించారు. ఇసుకాసురులు ఈ పథకం చుట్టుపక్కల ఏలేరు నదికి తూట్లు పొడిచేస్తున్నారు. ఇక్కడ మరికొన్ని రోజులు ఇసుక తవ్వకాలు ఇలాగే కొనసాగితే ఈ ఎత్తిపోతల పథకం ఏలేరులో కూలిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఇసుక తవ్వకాలను శాశ్వతంగా నిలిపివేయాలని వారు కోరుతున్నారు. అడ్డగోలు తవ్వకాలతో ఏలేరులో పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయని, దీనివలన కూడా శివారు ఆయకట్టుకు సాగునీరు అందడం గగనమవుతుందని ఆవేదన చెందుతున్నారు. ఇక్కడ ఇసుక తవ్వకాలను కట్టడి చేయకుంటే జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్వగ్రామం ఇర్రిపాకతో పాటు కిర్లంపూడి మండలం బూరుగుపూడి, సోమవరం తదితర గ్రామాల్లోని ఆయకట్టు ప్రమాదంలో పడటం ఖాయమని చెబుతున్నారు. -
భయాందోళనలు చెందుతున్నాం
గ్రామంలో 60–70 టన్నుల లోడుతో లారీలు వేగంగా వెళ్తున్నాయి. దీంతో, ఎప్పుడే ప్రమాదం ముంచుకొస్తుందోనని భయాందోళనకు గురవుతున్నాం. మోటార్లతో ఇసుక తవ్వి తరలించేస్తున్నారు. దీనివల్ల స్థానికంగా ఇళ్లు నిర్మించుకునే వారికి ఇసుక దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. – మోర్త తాతారావు, సోమవరం ప్రమాదంలో ఎత్తిపోతల పథకం సోమవరంలోని ఎత్తిపోతల పథకం పంపు సమీపంలో యథేచ్ఛగా ఇసుక తోడేస్తున్నారు. దీనివల్ల పంపింగ్ స్కీమ్ కూలిపోయే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే సుమారు 1,200 ఎకరాలు బీడుగా మారిపోయే ప్రమాదం ఉంది. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అక్రమ ఇసుకతో సొమ్ము చేసుకుంటున్న నాయకులు.. రైతుల సమస్యలను కూడా పట్టించుకోవాలి. – అడబాల నాగరాజు, సోమవరం -
వంట గ్యాస్ లీకై ముగ్గురికి గాయాలు
పిఠాపురం: మల్లాం గ్రామంలోని ఒక ఇంట్లో వంట గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో మల్లెపాముల వీర నాగేశ్వరరావు ఇంట్లో పని చేస్తుండగా మంగళవారం అకస్మాత్తుగా గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి. దీంతో అతడితో పాటు, భార్య నాగలక్ష్మి, తమ్ముడు లోవరాజుకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం పిఠాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. ప్రమాద సమయంలో ఇంట్లో ఐదుగురు ఉన్నట్టు సమాచారం. చిన్న పిల్లాడు ఏడుస్తుండడంతో ఆ బాలుడితో పాటు మరో వ్యక్తి బయటకు రావడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. -
ఆ నలుగురూ ఒక్కడై..
● కాకినాడ వాసి గొప్పదనం ● బహ్రెయిన్తో తెలుగు ప్రజల మృతదేహాలకు అంత్యక్రియలు కాకినాడ క్రైం: ఆఖరి మజిలీలో ఆ నలుగురూ తానే అభాగ్యులకు అండగా నిలుస్తున్నాడు మన కాకినాడ వాసి. స్వదేశానికి రాకుండా విదేశాల్లో ఉండిపోయిన తెలుగు ప్రజల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నాడు. ఎడారిలో అమృత బంధువుగా మారిన శివకుమార్ వివరాలు ఇవీ.. బతుకుతెరువు కోసం చాలా మంది తెలుగు ప్రజలు బహ్రెయిన్ దేశానికి ఉపాధి కోసం వెళుతుంటారు. ఏదైనా కారణాల వల్ల అక్కడ చనిపోతే, ఆ మృతదేహం స్వదేశానికి రావడానికి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ కారణంతో చాలా మృత దేహాలు అక్కడే ఫ్రీజర్లలో ఉండిపోతున్నాయి. ఈ విషయాన్ని ఆ దేశంలో స్థిరపడిన కాకినాడ వాసి దౌర్ల శివకుమార్ గమనించాడు. కూలి పనుల కోసం వచ్చి ప్రాణాలు పోగొట్టుకుంటున్న తెలుగు వారి కష్టాలను కళ్లారా చూశాడు. ఇరు దేశాల మధ్య మృతదేహాల తరలింపునకు చేసే ప్రక్రియల్లో వివిధ కారణాల వల్ల చోటు చేసుకుంటున్న జాప్యమే ఈ దుస్థితికి కారణమని తెలుసుకున్నాడు. దీంతో అక్కడి తెలుగు వారి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నాడు. మృతి చెందిన వారు తానకేమీ కాకున్నా అంతిమ వేళల్లో అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ మహిళ మృతదేహం ఐదేళ్లుగా బహ్రెయిన్లోనే ఉండగా, అక్కడి అధికారులతో మాట్లాడి ఇటీవల మృతదేహాన్ని విడుదల చేయించాడు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించాడు. -
హరిప్రియకు అభినందనలు
అంబాజీపేట: జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికైన అంబాజీపేట జెడ్పీ హైస్కూల్ ఆరో తరగతి విద్యార్థిని కుడుపూడి కావ్య సుందరి హరిప్రియను మంగళవారం ప్రధానోపాధ్యాయుడు కడలి సాయిరామ్ అభినందించారు. బాపట్ల జిల్లా పేటేరు హైస్కూల్లో ఈ నెల 10 నుంచి 12 వరకు జరిగిన తైక్వాండో రాష్ట్ర స్థాయి పోటీల్లో 20 కేజీల విభాగంలో హరిప్రియ మొదటి స్థానంలో నిలిచి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ందన్నారు. కార్యక్రమంలో పీడీ కుంపట్ల ఆదిలక్ష్మి, ఉమా మహేశ్వరరావు, పీఈటీ అందె సూర్యకుమారి, కోచ్ త్రిమూర్తులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి దేవరపల్లి: జాతీయ రహదారిపై యర్నగూడెం గండి చెరువు వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. పోలవరం మండలం కొత్తపట్టిసం గ్రామానికి చెందిన దొడ్డి నాగు (35) కొవ్వూరు మండలం పంగిడిలో నివాసం ఉంటున్నాడు. దొమ్మేరుకు చెందిన తాళ్ల అభిషేక్తో కలిసి నాగు బైక్పై విజయవాడలోని బంధువుల ఇంటికి బయలు దేరాడు. యర్నగూడెం సమీపంలో గండి చెరువు వద్ద హైవేపై వెళుతున్న క్వారీ లారీ సడన్గా సర్వీస్ రోడ్డులోకి వచ్చింది. దీంతో సర్వీస్ రోడ్డులో వెళుతున్న బైక్ అదుపు తప్పి లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో దొడ్డి నాగు తలకు బలమైన గాయం కావడంతో అక్కడకక్కడే మృతి చెందాడు. అభిషేక్ తల, కాలికి బలమైన గాయాలు కావడంతో చికిత్స కోసం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు నాగుకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. అభిషేక్ అవివాహితుడు. నాగు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గోపాలపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. దేవరపల్లి సీఐ బీఎన్ నాయక్, ఎస్సై వి.సుబ్రహ్మణ్యం ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. -
అప్పు తీర్చలేక స్నేహితుడి హత్య
● ఆపై భయంతో నిందితుడి ఆత్మహత్యాయత్నం ● వీడిన హత్యకేసు మిస్టరీ ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీహరి రాజు ఏలేశ్వరం: తీసుకున్న అప్పు తీర్చాలని స్నేహితుడు ఒత్తిడి చేయడంతో అతడిని హత్య చేశాడో దుర్మార్గుడు. ఆపై పోలీసులకు దొరికిపోతాననే భయంతో పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఆస్పత్రిలో చేరిన అతడిని పోలీసులు విచారణ చేయడంతో హత్య కేసు మిస్టరీ వీడింది. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు స్థానిక పోలీస్స్టేషన్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అడ్డతీగల మండలం కొత్తూరుకు చెందిన బొదిరెడ్డి వెంకటేశ్వర్లు ఈ నెల 4న ఏలేశ్వరంలోని తన కుమారుడు ఆంజనేయులు ఇంటికి వచ్చాడు. అనంతరం ఇంటికి నుంచి బయటకు వెళ్లి అదృశ్యమయ్యాడు. దీంతో తన తండ్రి కనిపించడం లేదంటూ ఆంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పురుగు మందు తాగి అడ్డతీగల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని పోలీసులు విచారణ చేయగా అతడే వెంకటేశ్వర్లును హత్య చేసినట్టు తేలింది. కోడిపందేలకు పిలిచి.. బొదిరెడ్డి వెంకటేశ్వర్లుకు ఏలేశ్వరానికి చెందిన వల్లూరి రాజా రమేష్తో కోడి పందేల వద్ద స్నేహం కుదిరింది. ఈ నేపథ్యంలో వెంకటేశ్వర్లు నుంచి రాజా రమేష్ రూ.10 లక్షల వరకు అప్పు తీసుకున్నాడు. తన బాకీ తీర్చమని వెంకటేశ్వర్లు ఒత్తిడి తేవడంతో అతడిని కడతేర్చేందుకు రాజా రమేష్ నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో నర్సీపట్నంలో కోడి పందేలు ఉన్నాయని చెప్పి, తనతో కారులో వెంకటేశ్వర్లును తీసుకుని బయలుదేరాడు. మార్గం మధ్యలో మత్తు మందు కలిపిన డ్రింక్ను వెంకటేశ్వర్లుకు ఇచ్చాడు. అది తాగి అపస్మారక స్థితిలోకి చేరుకున్న అతడిని హత్య చేసి, అతని వద్ద ఉన్న డబ్బు, బంగారం తీసుకున్నాడు. బురదరాళ్ల ఘాట్ రోడ్డులోని బొంతువలస గ్రామం వద్ద తుప్పల్లో మృతదేహాన్ని పారవేసి వెళ్లి పోయాడు. ఆ డబ్బుతో తాను తీసుకున్న బాకీలను తీర్చాడు. అయితే హత్య కేసులో పోలీసులకు దొరికిపోతాననే భయంతో రాజా రమేష్ పురుగు మందు తాగాడు. ఆస్పత్రిలో చేరిన అతడిని విచారణ చేసిన పోలీసులకు జరిగిన సంఘటన వివరించాడు. చికిత్స అనంతరం ఈ నెల 13న కోలుకోగా ప్రత్తిపాడు సీఐ సూర్య అప్పారావు అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం ప్రత్తిపాడు కోర్టుకు తరలించారు. -
రామేశంపేట మెట్టలో అక్రమ మైనింగ్
● ఆగే వరకూపోరాటం చేస్తాం ● బీజేపీ జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరావు బోట్క్లబ్ (కాకినాడసిటీ): మైనింగ్ మాఫియా ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు అన్నారు. స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో మంగవారం పెద్దాపురం మండలం రామేశం పేట మెట్టలో జరుగుతున్న అక్రమ మైనింగ్పై విలేకర్ల సమావేశం నిర్వహించారు. రామేశంపేటలో అక్రమ మైనింగ్ జరుగుతోందని తనకు 60 ఫిర్యాదులు అందాయన్నారు. తాను స్వయంగా అక్కడ వెళ్లగా అనధికార మైనింగ్ జరుగుతోందన్నారు. దానిపై కలెక్టర్కు, మైనింగ్ శాఖ డీడీ నరసింహారెడ్డికి ఫిర్యాదు చేశానన్నారు. కానీ అధికారులు చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేస్తున్నారన్నారు. ఇటీవల గ్రావెల్ వాహనం ఢీకొని కళాశాల విద్యార్థి మృతి చెందాడన్నారు. ప్రస్తుతం అక్రమ మైనింగ్ కారణంగా కొండలు రోజురోజుకీ తరిగిపోతున్నాయన్నారు. అధికారుల లెక్కల ప్రకారం 900 ఎకరాల్లో కేవలం 260 ఎకరాలకు మాత్రమే అనుమతి ఇచ్చారన్నారు. మిగిలినదంతా అనధికారికంగా జరుగుతోందన్నారు. రామేశంమెట్టలో అక్రమ మైనింగ్ ఆగే వరకూ బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. సమావేశంలో బీజేపీ నాయకులు కుండల సాయి, మొసలగంటి సురేష్ , చోడిశెట్టి రమేష్బాబు పాల్గొన్నారు. -
భక్తులకు అన్నవరమై..
పెళ్లి భోజనంలా.. అన్నదాన పథకంలో భక్తులకు పెళ్లి భోజనం మాదిరిగా ఆహార పదార్థాలు వడ్డిస్తారు. పులిహోర, స్వీట్, రెండు రకాల కూరలు, పచ్చడి, సాంబారు, పెరుగుతో కలిపి కేవలం అరటి ఆకులోనే భోజనం పెడతారు. ఇక్కడకు వచ్చిన భక్తులతో పాటు వాడపల్లి క్షేత్రానికి వెళ్లి వస్తున్న వారు కూడా అన్నవరప్పాడులో ఆగి, అన్న ప్రసాదం స్వీకరిస్తారు. స్వామి వారికి ప్రతి ఏడాది వైశాఖ మాసంలో అంగరంగా వైభవంగా కల్యాణం జరుపుతారు. ఆ సమయంలో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకూ వారం రోజుల పాటు అన్నదానం చేయడం విశేషం. ప్రస్తుతం ప్రతి శనివారం నిర్వహిస్తున్న అన్నదానాన్ని నిత్య అన్నదానంగా మార్చడానికి దేవదాయ ధర్మాదాయశాఖకు అనుమతులు కోరుతూ నివేదికలు సమర్పించారు. ● అన్నవరప్పాడు వెంకన్న ఆలయానికి భక్తుల రద్దీ ● ప్రతి శనివారం అన్నదానం ● పెళ్లి భోజనంలా ఆహార పదార్థాలు ● నిత్యాన్నదానంగా మార్చేందుకు చర్యలు పెరవలి: జాతీయ రహదారి పక్కనే పెరవలి మండలం అన్నవరప్పాడులో ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయం నిత్య కల్యాణం పచ్చతోరణంలా వెలుగొందుతోంది. నిత్యం ఈ ఆలయానికి వేల మంది భక్తులు తరలివచ్చి, స్వామివారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా తప్పక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఆలయంలో ప్రతి శనివారం భక్తులకు అన్నసమారాధన నిర్వహిస్తారు. వేల మంది భక్తులు తరలివచ్చి, స్వామివారి అన్నప్రసాదం స్వీకరిస్తారు. అయితే కేవలం భక్తులు ఇచ్చిన విరాళాలతోనే ఈ కార్యక్రమం జరపడం ఇక్కడి ప్రత్యేకత. ఆలయ చరిత్ర అన్నవరప్పాడులోని వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం వెనుక పెద్ద చరిత్ర ఉంది. గ్రామానికి చెందిన ఓసూరి సోమన్న కలలో తిరుమలలో కొలువైన వేంకటేశ్వరస్వామి సాక్షాత్కరించి, ఈ దివ్యస్థలిలో ఆలయం నిర్మించాలని ఆదేశించారంట. ఆయన ఈ విషయాన్ని గ్రామ పెద్దలకు తెలపడంతో అందరూ స్వామివారి ఆజ్ఞను పాటించాలని నిర్ణయించుకున్నారు. గ్రామస్తుల సహకారంతో విరాళాలు సేకరించి 1965లో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఆనాటి నుంచి నేటి వరకు ప్రతి ఏటా వైశాఖ మాసంలో స్వామివారికి అంగరంగ వైభవంగా వారం రోజుల పాటు కల్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. పూర్వం ఇదే ప్రదేశంలో అత్రి మహర్షి తపస్సు చేసిన కారణంగా ఈ క్షేత్రానికి ఇంతటి తేజస్సు లభించిందని నమ్మకం. అన్నదాన పథకం ఆలయంలో ఐదేళ్ల క్రితం అన్నదాన పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకాన్ని కేవలం భక్తుల విరాళాలతో మాత్రమే నిర్వహిస్తున్నారు. స్వామివారి మూలధనం నుంచి ఒక్క పైసా కూడా వినియోగించరు. ప్రతి శనివారం నిర్వహించే ఈ అన్నదానానికి భక్తులు ముందస్తుగానే తమ విరాళాలు అందిస్తారు. ఆలయంలో ప్రతి శనివారం 6 వేల నుంచి 9 వేల మంది వరకు భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ప్రత్యేక రోజుల్లో వారి సంఖ్య మరో మూడు వేలకు పెరుగుతుంది. ప్రతి వారం దర్శనం అన్నవరప్పాడులో కొలువైన వేంకటేశ్వరస్వామిని ప్రతి శనివారం దర్శించుకుంటాను. దాదాపు పదేళ్లుగా ఆలయానికి వస్తున్నాను. ఇక్కడ భక్తులు కోరుకున్న కోరికలను స్వామివారు తప్పకుండా తీర్చుతారు. – కాపక పాపారావు, భక్తుడు, కాకరపర్రు అన్నదానం బాగుంది ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించే అన్నదానం చాలా బాగుంది. వచ్చిన భక్తులందరికీ అన్న ప్రసాదం వడ్డిస్తారు. అది కూడా పెళ్లి భోజనంలా పెడతారు. ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. – కంటిపూడి సూర్యనారాయణ, భక్తుడు, తీపర్రు భక్తుల తాకిడి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. ప్రతి శనివారం నిర్వహించే అన్నదానాన్ని నిత్యాన్నదానంగా మార్చేందుకు అనుమతి కోసం ఉన్నతాధికారులకు నివేదించాం. 1965లో నిర్మించిన ఆలయం ప్రస్తుతం శిథిలస్థితికి చేరింది. దీంతో నూతన ఆలయ నిర్మాణానికి కూడా నివేదిక ఇచ్చాం. – మీసాల రాధాకృష్ణ, ఆలయ ఈఓ, అన్నవరప్పాడు విరాళాలు అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయంలో శాశ్వత అన్నదాన పథకం కింద ఇప్పటి వరకు రూ.4 లక్షల డిపాజిట్లు, బంగారం 376 గ్రాములు, 30 కిలోల వెండి ఆభరణాలు ఉన్నాయి. భక్తులు నిత్య గోత్రార్చన కింద రూ.12 లక్షలు డిపాజిట్లు ఉన్నాయి. ఇవి స్వామివారికి శాశ్వత డిపాజిట్లు కాగా, ప్రతి శనివారం నిర్వహించే అన్నదానం మాత్రం ఎప్పటికప్పుడు భక్తులు విరాళాలతో నిర్వహిస్తారు. పెళ్లిళ్ల గుడి ఆలయంలో ఏటా వేల సంఖ్యలో వివాహాలు జరుగుతూ ఉంటాయి. పెద్ద ముహూర్తాల సమయంలో ఆలయ ప్రాంగణంతో పాటు రోడ్లపైనే వివాహాలు జరుపుతారు. తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి భక్తులు ఎక్కువగా తరలివస్తారు. అందుకే ఈ వెంకన్న సన్నిధి.. పెళ్లిళ్లకు చల్లని పెన్నిధి అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. చాలామంది ఈ ఆలయాన్ని పెళ్లిళ్ల గుడిగా పిలుస్తారు. -
సంప్రదాయాలపై అవగాహన అవసరం
● నన్నయ వీసీ ఆచార్య ప్రసన్న శ్రీ ● వర్సిటీలో ఘనంగా యువజనోత్సవాలు రాజానగరం: చదువుతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెంచుకోవాలని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జాతీయ యువజనోత్సవాలలో భాగంగా జిల్లా యువజన సర్వీసుల శాఖ, సెట్రాజ్ (కాకినాడ) ఆధ్వర్యంలో ఆదికవి నన్నయ యూనివర్సిటీలోని కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం యువజనోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా యువజన సర్వీసుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎస్వీడీఎస్ రామకృష్ణ మాట్లాడుతూ యువతలోని ప్రతిభను ప్రోత్సహించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహ దపడతాయన్నారు. ఈ సందర్భంగా 15 ఏళ్ల నుంచి 29 ఏళ్ల వయసున్న 944 మంది విద్యార్థులు జానపద నృత్యం, జానపద గేయాలు, స్టోరీ రైటింగ్, పోస్టర్, ఫొటోగ్రఫీ, ఉపన్యాసం, పర్యావరణ పరిరక్షణ మున్నగు వాటిలో పోటీ పడ్డారు. విజేతలు వీరే.. ● ఇన్నోవేషన్ ట్రాక్ (సైన్స్ మేళా ప్రదర్శన)లో వంగ అయ్యప్ప గ్రూప్ ప్రథమ, షేక్ మోనినా గ్రూప్ ద్వితీయ, జానపద నృత్యం (గ్రూప్)లో ఎస్ఆర్ఎస్ గ్రూప్ ప్రథమ, వై.జానీ ఏంజెల్ గ్రూప్ ద్వితీయ, పి.డోలా స్రవంతి గ్రూప్ తృతీయ స్థానాల్లో నిలిచాయి. ● జానపద గేయాల విభాగంలో తాతరాజు గ్రూప్ ప్రథమ, ఎ.మొలరాజు గ్రూప్ ద్వితీయ, వై.జానీ ఏంజెల్ గ్రూప్ తృతీయ స్థానాలు సాధించాయి. ● ఉపన్యాసంలో విధూషీ శాండిల్య ప్రథమ, జి.ధ్రువిత్ ద్వితీయ, వైష్టవి కొల్లిమల్ల తృతీయ, కథ రాయడంలో వీబీ జ్ఞాన షర్మిల ప్రథమమ, అపూర్వ కొచ్చే ద్వితీయ, ఎ.లాలస్య తృతీయ బహుమతులు సాధించారు. ● పెయింటింగ్లో మహ్మద్ సమీర్, డి.వెంకట త్రివిక్రమ్, కె.లాజర్ మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. కవిత్వంలో జి.ధ్రువిత్ ప్రథమ, బోడా హాసిని ద్వితీయ స్థానాలు సాధించారు. ప్రథమ స్థానంలో నిలిచిన విజేతలు రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని సెట్రాజ్ సీఈఓ కాశీ విశ్వేశ్వరరావు తెలిపారు. -
గరుడ వాహనంపై మలయప్ప దర్శనం
● ఘనంగా వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు ● స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు కొత్తపేట: వాడపల్లి క్షేత్రంలో భూసమేత వేంకటేశ్వరస్వామివారి వార్షిక దివ్య బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. దీనిలో భాగంగా ఐదో రోజు మంగళవారం శ్రీవారు మలయప్ప అలంకరణలో గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాష్ట్ర నలుమూలల నుంచి అత్యధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు బ్రహ్మోత్సవాలను వీక్షించి తరించారు. దేవదాయ ధర్మాదాయశాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం ఖండవిల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్, అర్చక బృందం, వివిధ ప్రాంతాల వేద పండితులు ఉదయం నుంచి రాత్రి వరకూ నిరంతరాయంగా స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు, హోమాలు, వాహనసేవ, ఊరేగింపులు జరిపారు. గరుడ వాహనంపై శ్రీవారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారు మలయప్ప అలంకరణలో గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్శంగా పండితులు గరుడ వాహనంపై శ్రీవారు విహార ఘట్టం విశిష్టతను వివరించారు. కాగా..ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, నియోజకవర్గ జనసేన ఇన్చార్జి బండారు శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలూరి సత్యానందం, పలువురు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
కమనీయం.. కడు రమణీయం
● వాడపల్లిలో శ్రీనివాసుని కల్యాణం ● కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు ● యోగనారసింహ అలంకరణలో శ్రీవారు విహారం కొత్తపేట: శ్రీవారు ఓరకంట చూడగా.. అమ్మవారు సిగ్గులమొగ్గగా మారగా.. జగద్రక్షకుడి కల్యాణం కన్నుల పండువగా జరగ్గా.. ఈ క్రతువును తిలకించిన భక్తజనం మురిసిపోగా.. కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రంలో శ్రీ, భూ సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శ్రీనివాసుని కల్యాణం అట్టహాసంగా జరిగింది. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం చూసిన కనులదే భాగ్యం అన్నట్లు సాగింది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తజనం కల్యాణోత్సవాన్ని, వాహన సేవను తిలకించి పులకించింది. ఈ సందర్భంగా గోవింద నామస్మరణతో వాడపల్లి క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం ఖండవిల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్, అర్చక బృందం, వివిధ ప్రాంతాల వేద పండితులు ఉదయం నుంచి రాత్రి వరకూ నిరంతరాయంగా స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు, హోమాలు తదితర పూజలు చేశారు. ఉదయం నుంచి స్వామివారికి విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, అష్టకలశారాధన, మహాస్నపనం, ప్రధాన హోమాలు, నీరాజన మంత్రపుష్పం, దిగ్దేవతా బలిహరణ తదితర పూజలు నిర్వహించారు. కనుల వైకుంఠం.. శ్రీనివాసుని కల్యాణం లోక సంక్షేమార్థం శ్రీనివాసుని కల్యాణ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని ప్రదానం నుంచి తలంబ్రాల వరకూ వేదపండితుల వ్యాఖ్యానం నడుమ వైభవంగా నిర్వహించారు. సర్వాభరణ భూషితులైన స్వామి, అమ్మవార్లను ఆలయం నుంచి తీసుకువచ్చి మండపంలో అలంకరించారు. దేవస్థానం తరఫున డీసీ అండ్ ఈఓ చక్రధరరావు దంపతులు, ఉత్సవ కమిటీ చైర్మన్ ముదునూరి వెంకట్రాజు దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు, కల్యాణ మాలలు తదితరాలు సమర్పించారు. నూతన వధూవరుల శిరస్సులపై జీలకర్ర బెల్లం ధరింపజేసి, మాంగల్యధారణ, తలంబ్రాలు తదితర కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపారు. సాయంత్రం 5.30 గంటల నుంచి స్వస్తివచనం, ప్రధాన హోమాలు, స్వామివారికి విశేషార్చన, చతుర్వేద స్వస్తి, నీరాజన మంత్రపుష్పం జరిపారు. సింహ వాహనంపై ఊరేగిన శ్రీవారు శ్రీవారు యోగనారసింహ అలంకరణలో సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి సింహ వాహనంపై స్వామివారిని అలంకరించగా, మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా పండితులు సింహ వాహనంపై శ్రీవారు విహార ఘట్టం విశిష్టతను వివరించారు. ఈ ఘట్టం భక్తులకు ఐశ్వర్యం, యశస్సు, శ్రీ, జ్ఞానం తదితర గుణాలను ప్రసాదిస్తారని అర్థం. సింహం ధైర్యం, వేగం, చురుకుదనానికి ప్రతీక. కాబట్టి స్వామివారు ఈ వాహనంపై ఊరేగుతూ పైలక్షణాలను అనుగ్రహిస్తారు. యోగనారసింహ రూపంలో శ్రీవారిని దర్శించిన వారికి మంచి జరుగుతుందని వివరించారు. అనంతరం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వేంకటేశ్వర స్వామివారి వేషధారణలో ఒక కళాకారుడు ఆకట్టుకున్నారు. రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఎస్సై రాము బందోబస్తు నిర్వహించారు. నేటి కార్యక్రమాలు ఇవీ.. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు మంగళవారం బ్రహ్మోత్సవాల నిత్య పూజలు, హోమాలు, అభిషేకాలతో పాటు ఉదయం వసంతోత్సవం, అష్టదళ పాదపద్మారాధన నిర్వహిస్తారు. సాయంత్రం హనుమత్ మూలమంత్ర హవనం, అష్టోత్తర శత కలశారాధన, పంచశయ్యాధివాసం విశేష పూజలు, సేవలు, రాత్రి మలయప్ప అలంకరణతో గరుడ వాహనసేవ నిర్వహిస్తారు. -
ఉప్పాడ తీరంలో కోతకు గురవుతున్న మత్స్యకారుల గృహాలు కోతకు గురై సముద్రంలో కలిసిపోయిన సీసీ రోడ్డు ఉప్పాడ తీరంలో ఇలా..
తీరంలో ‘అల’జడికోతకు గురవుతున్న మత్స్యకారుల ఇళ్లు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో సోమవారం కాకినాడ జిల్లా ఉప్పాడ వద్ద సముద్ర అలలు ఎగసి పడుతున్నాయి. దీంతో సూరాడపేట, మాయాపట్న ం పాత మార్కెట్లోని మత్స్యకారుల ఇళ్లు కళ్ల ముందే కోతకు గురవుతున్నాయి. రాత్రికి రాత్రే ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇళ్లతో పాటు రోడ్లు, విద్యుత్ స్తంభాలు, వృక్షాలు సైతం నెలకొరుగుతున్నాయి. రూ.లక్షలతో నిర్మించుకున్న ఇళ్లు రాకాసి అలల ధాటికి మొండి గోడలుగా మిగులుతుండటంతో మత్స్యకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. ప్రధాన రహదారులు చెరువులను తలపించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. – కొత్తపల్లి -
రత్నగిరిపై సంప్రోక్షణ పూజలు ప్రారంభం
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలోని శ్రీవీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో సంప్రోక్షణ పూజలు, శాంతి హోమం సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఆలయంలోని దర్బారు మండపంలో ఉదయం తొమ్మిది గంటలకు ఈ పూజలు, హోమాన్ని శాస్త్రోక్తంగా ప్రారంభించారు. తొలుత కలశాలతో మండపారాధన చేశారు. వేదపండితుల మంత్రోచ్చారణ మధ్య ఈ పూజలు నిర్వహించారు. తర్వాత శాంతి హోమానికి అంకురార్పణ చేశారు. అన్నవరం దేవస్థానంలో కొన్ని నెలలుగా అనేక అగ్ని ప్రమాదాలు, అపశ్రుతులు జరిగిన నేపథ్యంలో ఈ సంప్రోక్షణ పూజలు, శాంతి హోమం నిర్వహిస్తున్నట్లు పండితులు తెలిపారు. బుధవారం ఉదయం శాంతి హోమం పూర్ణాహుతితో కార్యక్రమాలు ముగుస్తాయన్నారు. తరువాత మంత్ర జలాన్ని దేవస్థానం ఆవరణలో వెదజల్లి శుద్ధి చేస్తారు. దేవస్థానంలో చాలాకాలంగా సంప్రోక్షణ పూజలు కాని, ప్రత్యేక యాగాలు, కోటి తులసి పూజలు కాని జరగకపోవడంతో మూడు నెలల నుంచి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు పండితులు, అర్చకస్వాములు అభిప్రాయపడ్డారు. దీనిపై ఈ నెల 7న ‘సాక్షి’ దినపత్రికలో ‘అపశ్రుతులు అందుకేనా..?’ అనే శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దానికి దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు స్పందించి శాంతి పూజలు నిర్వహించాలని దేవస్థానం పండితులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన పూజల్లో చైర్మన్ ఐవీ రోహిత్తో పాటు వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, గంగాధరబట్ల గంగబాబు, చిట్టి శివ, యనమండ్ర శర్మ, ముష్టి పురుషోత్తం, ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం, అర్చకులు దత్తాత్రేయ శర్మ, కంచిబట్ల సాయిరామ్, కల్యాణ బ్రహ్మ ఛామర్తి కన్నబాబు తదితర బృందం పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో రికార్డ్ అసిస్టెంట్ మృతి
అనపర్తి, రాయవరం: రోడ్డు ప్రమాదంలో జూనియర్ కళాశాల రికార్డ్ అసిస్టెంట్ మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. కడియం మండలం వేమగిరి గ్రామానికి చెందిన మట్టపర్తి శ్రీనివాస్ (52) రాయవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రికార్డు అసిస్టెంట్గా పని చేస్తున్నారు. రోజూలాగే వేమగిరి నుంచి అనపర్తి కొప్పవరం మీదుగా రాయవరంలోని కళాశాలకు బయలుదేరారు. తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తుండడంతో కొప్పవరం గ్రామ శివారుకు చేరుకునే సరికి ఆయన బైక్ రోడ్డుపై జారి పోయింది. వాహనంతో పాటు ఆయన రోడ్డుపై పడిపోవడంతో అపస్మారక స్థితికి చేరుకోగా స్థానికులు గమనించారు. ఆయన జేబులోని సెల్ఫోన్ తీసి రాయవరం కళాశాలలోని సహోద్యోగులకు సమాచారం ఇవ్వగా, వారు వచ్చి హుటాహుటిన అనపర్తి ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాస్ మృతి చెందారు. ఈ మేరకు ట్రైనీ ఎస్సై సుజాత కేసు నమోదు చేశారు. -
మాగాంలో కొండముచ్చు దాడి
ఐదుగురికి తీవ్ర గాయాలు అయినవిల్లి: మాగం గ్రామంలో ఓ కొండముచ్చు రెండు రోజుల్లో ఐదుగురిపై దాడి చేసింది. ఆ గ్రామానికి చెందిన బి.సత్యనారాయణ, బొడపాటి రాజేష్, కొట్టల శ్రీనులు పొలం నుంచి ఇంటికి వస్తుండగా మార్గ మధ్యంలో కొండముచ్చు దాడి చేసి గాయపరిచింది. ఇలా మరో ఇద్దరిని తీవ్రంగా గాయపరిచిందని గ్రామస్తులు చెప్పారు. బాధితులు అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొండముచ్చు దాడి ఘటనపై అటవీ శాఖ అధికారులకు పంచాయతీ అధికారులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రజలు చెబుతున్నారు. గతంలో కూడా 15 మందిపై దాడి చేసినా అధికారులు స్పందించలేదని అంటున్నారు. ఇప్పటికై నా కొండముచ్చులను అదుపులోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపిక
రాష్ట్ర స్థాయి అండర్–19 షటిల్ బాడ్మింటన్ పోటీలకు ఎంపికై న బాలికలు ఎంపికై న బాలురు పెదపూడి: క్రీడలతో విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని జి.మామిడాడ జీఆర్ఎస్ఏ ఫ్యామిలీ హెల్త్ క్లబ్ అధ్యక్షుడు ద్వారంపూడి భాస్కరరెడ్డి, లయన్స్ క్లబ్ అడ్మిన్ మండ రాజారెడ్డి అన్నారు. జి.మామిడాడలోని జీఆర్ఎస్ఏ ఫ్యామిలీ హెల్త్ క్లబ్ ద్వారంపూడి దివాకర్రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అండర్–19 బాలుర, బాలికల విభాగాల్లో షటిల్ బ్యాడ్మింటన్ క్రీడా జట్ల ఎంపికలు సోమవారం జరిగాయి. ముఖ్య అతిథులుగా ద్వారంపూడి భాస్కర్రెడ్డి, మండ రాజారెడ్డి హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పడాల గంగాధర్రెడ్డి మాట్లాడుతూ ఈ ఎంపికలు స్థానిక లయన్స్ క్లబ్, జీఆర్ఎస్ఏ ఫ్యామిలీ హెల్త్ క్లబ్ సహకారంతో నిర్వహించామన్నారు. ఎంపికై న క్రీడాకారులు త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి అండర్–19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జట్టు తరఫున పాల్గొంటారన్నారు. షటిల్ బ్యాడ్మింటన్ సెలక్షన్ కమిటీ సభ్యులు టీఎన్వీఆర్ మూర్తి, ఫిజికల్ డైరెక్టర్లు ద్వారంపూడి యువరాజారెడ్డి, నల్లమిల్లి అప్పారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కళాశాల బస్సును ఢీకొన్న వ్యాన్
దేవరపల్లి: ప్రైవేటు కళాశాల బస్సును బొలెరో వ్యాన్ ఢీకొన్న ఘటనలో బస్సులోని 13 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఇందులో ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా, మిగిలిన విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి వద్ద ప్రైవేట్ కళాశాలకు చెందిన బస్సు సుమారు 40 మంది విద్యార్థులతో సోమవారం ఉదయం కళాశాలకు వెళుతుండగా, కృష్ణంపాలెం వద్దకు వచ్చేసరికి విజయవాడ నుంచి రాజమహేంద్రవరానికి కిరాణా సరకులతో వెళుతున్న వ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థులకు స్వల్ప గాయాలు కాగా స్థానిక పీహెచ్సీలో వైద్యం చేసి ఇళ్లకు పంపించారు. వ్యాన్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వి.సుబ్రహ్మణ్యం తెలిపారు. 13 మంది విద్యార్థులకు గాయాలు -
నకిలీపై సమరం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: మద్యపాన వ్యసనానికి ప్రజలను దూరం చేసి, వారి ఆరోగ్యాన్ని, తద్వారా సమాజంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ, ఫుల్ కిక్ ఇచ్చే మద్యాన్ని అందిస్తామంటూ గత సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు అండ్ కో మందుబాబులకు వల వేశారు. వారి బలహీనతతో ఆటాడుకుని, ఓట్లు దండుకున్నారు. అధికారంలోకి వచ్చారు. అప్పటి వరకూ ప్రభుత్వ ఆ ధీనంలో ఉన్న మద్యం షాపులను కూటమి నేతలకు కట్టబెట్టారు. తద్వారా వారికి ‘సంపద సృష్టించారు.’ అధిక ధరలకు మద్యం అమ్మకాలు మొదలుపెట్టి ఎడాపెడా దోచుకోవడం మొదలెట్టారు.. వీధివీధినా బెల్టు షాపులు తెరచి, మద్యం ఏరులై పారిస్తున్నారు. డోర్ డెలివరీ సైతం ఇస్తున్నారు. ఇది చాలదన్నట్టు టీడీపీ నేతలు విచ్చలవిడిగా నకిలీ మద్యం సరఫరా చేస్తూ మందుబాబుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రజలకు చేటుగా పరిణమించిన ఈ నకిలీ మద్యం, బెల్టు షాపులకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ సోమవారం పోరుబాట పట్టింది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమాల్లో.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానను సైతం లెక్క చేయకుండా.. ప్రజలు పెద్ద సంఖ్యలో కదం తొక్కారు. రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని అరికట్టాలని, బెల్టు షాపులను ఎత్తివేయాలని, మద్యం అమ్మకాలకు నిర్దేశిత సమయాలు పాటించాలని, నకిలీ మద్యం కుంభకోణంపై సిట్తో కాకుండా సీబీఐ విచారణ జరిపించాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. తుని, కాకినాడ రూరల్, పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాల్లో ఎకై ్సజ్ కార్యాలయాల వరకూ భారీ ప్రదర్శనలు నిర్వహించి అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ‘రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీని కుటీర పరిశ్రమగా మార్చి టీడీపీ నాయకులు వేల కోట్లు దిగమింగారు. ఇప్పటి వరకూ బెల్టు షాపులకు పరిమితమైన నేతలు ఇప్పుడు నకిలీ మద్యం ఏరులై పారిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నకిలీ మద్యంపై సీబీఎన్ (చంద్రబాబు నాయుడు) సిట్తో కాకుండా సీబీఐ విచారణ జరిపించాలి’ అని వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీగా తరలివచ్చి, స్థానిక ఎకై ్సజ్ శాఖ ఉప కమిషనర్ (డీసీ) కార్యాలయం వద్ద శాంతియుతంగా నిరసన తెలిపారు. కార్యాయల సిబ్బంది ఎంతకూ గేటు తెరవలేదు. దీంతో, నకిలీ మద్యం, బెల్టు షాపులకు వ్యతిరేకంగా వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చామని నాయకులు చెప్పడంతో ఎకై ్సజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వి.రేణుక బయటకు వచ్చారు. ఆమెకు కన్నబాబు వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటి వరకూ మద్యం విచ్చలవిడిగా విక్రయాలు, అధిక రేట్లు, బెల్టు షాపుల గురించి మాత్రమే చూశామని.. ఇప్పుడు ఏకంగా నకిలీ మద్యం ద్వారా వేల కోట్లు దిగమింగారని ఆరోపించారు. నకిలీ మద్యం కోసం స్పిరిట్ నుంచి లేబుళ్ల వరకూ వారే పెట్టేశారని, 15 నెలల నుంచి జరుగుతున్నా ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. తెలియకపోతే చేతకానితనమని, తెలిస్తే పార్టనర్షిప్గా భావించాల్సి వస్తుందని, రెండింటిలో ఏదో ఒకటి చెప్పాలని డిమాండ్ చేశారు. నాణ్యమైన మద్యం ఇస్తామని చెప్పి నకిలీ ‘ఎన్’ బ్రాండ్లు ఇస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో మద్యం మరణాలు 421 ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయన్నారు. నకిలీ మద్యంపై వార్తలు రాస్తున్న ‘సాక్షి’పై కక్ష కట్టి గొంతు నొక్కాలని ఎడిటర్, విలేకర్లపై కేసులు పెట్టడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సాక్షి’పై కేసులు ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు అని, ఇదేవిధంగా కక్ష కడితే చంద్రబాబుకు కొమ్ము కాస్తున్న పచ్చ పత్రికలు కనిపించవని, ఇది సోషల్ మీడియా యుగమనే విషయం గుర్తుంచుకోవాలని కన్నబాబు అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీశివకుమారి, పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు ఒమ్మి రఘురామ్, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి, పార్టీ ఎస్ఈసీ సభ్యులు బెజవాడ సత్యనారాయణ, గోపుశెట్టి బాబ్జీ, సరోజ, మాకినీడి శేషుకుమారి, మైనార్టీ సెల్ నేత కరీం బాషా, పి.నాగబాబు, కొప్పిశెట్టి గణేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడొద్దు విచ్చలవిడిగా సాగుతున్న నకిలీ మద్యం తయారీ, విక్రయాలపై సీబీఐ విచారణ చేపట్టాలి. ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా నాణ్యమైన మద్యం తక్కువ ధరకే సరఫరా చేస్తామని ఎన్నికల ముందు కూటమి నాయకులు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం అక్రమ కేసులు పెడుతూ నాయకులను ప్రభుత్వం వేధిస్తోంది. మద్యం దుకాణాలను కూటమి నేతలు తమ అనుచరులకు అప్పగించారు. నకిలీ మద్యం తాగిన వ్యక్తులు నాలుగైదు రోజుల్లో జవసత్వాలు కోల్పోతున్నారు. నకిలీ మద్యంపై రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకత వస్తున్నప్పటికీ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. చేతులు దులుపుకొనేందుకే చంద్రబాబు సిట్, సీఐడీ విచారణ అంటున్నారు. వేల కోట్ల రూపాయల స్కాములు చేసిన చంద్రబాబు, లోకేష్లు ఇకనైనా ప్రజల ఆరోగ్యంతో ఆటలాడకుండా నాణ్యమైన మద్యం అందించాలి. – దాడిశెట్టి రాజా, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ‘ఎన్’ బ్రాండ్ నకిలీ మద్యం కూటమి ప్రభుత్వం నకిలీ మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుని పాలన సాగిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున స్థావరాలు ఏర్పాటు చేసుకుని నకిలీ మద్యం తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో మద్యం షాపులను నిబంధన మేరకే నిర్వహించారు. నేడు కూటమి సర్కారు వేలాదిగా బెల్టు షాపులు తెరచి ‘ఎన్’ బ్రాండ్ నకిలీ మద్యం విక్రయిస్తోంది. దీనిని తాగిన మందుబాబులు మృత్యువాత పడుతున్నారు. నకిలీ మద్యం నిందితులు పట్టుబడుతున్నా ఎక్కడ బెల్టు షాపు కానీ, మద్యం దుకాణం కానీ సీజ్ చేయలేదు. – వంగా గీతా విశ్వనాథ్, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సీబీఎన్ సిట్ కాదు.. సీబీఐ విచారణ కావాలి నకిలీ మద్యానికి వ్యతిరేకంగా కదం తొక్కిన వైఎస్సార్ సీపీ శ్రేణులు సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ ఎకై ్సజ్ కార్యాలయాల వద్ద నిరసన వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆందోళనతుని తుని రైల్వే బ్రిడ్జి నుంచి పట్టణంలోని ప్రొహిబిషన్, ఎకై ్సజ్ స్టేషన్ ఎదుట నాయకులు, కార్యకర్తలతో కలసి భారీ ప్రదర్శన నిర్వహించారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యాన వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు ఈ ర్యాలీలో కదం తొక్కారు. కూటమి సర్కార్ మద్యం విధానానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. అనంతరం ఎకై ్సజ్ సీఐ పట్టాభి చౌదరికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నేతలు యనమల కృష్ణుడు, రాయి మేరీ అవినాష్, కోరుమిల్లి లలిత, నాగం దొరబాబు, సకురు నాగేంద్ర నెహ్రూ, రేలంగి రమణగౌడ్, పోతల రమణ తదితరులు పాల్గొన్నారు. -
చూసిన కనులదే భాగ్యం!
● వైభవంగా వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు ● 3వ రోజు స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు, హోమాలు కొత్తపేట: కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రంలో శ్రీ, భూ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో మూడోరోజు తిరువీధుల్లో శ్రీవారి విహార ఘట్టం కన్నుల వైకుంఠంగా సాగింది. శ్రీవారు కోదండరాముని అలంకరణలో హనుమద్వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు ఈ వాహన సేవను వీక్షించారు. భక్తుల గోవింద నామస్మరణతో వాడపల్లి క్షేత్రం మార్మోగింది. ఖండవిల్లి రాజేశ్వరవరప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్, అర్చక బృందం స్వామివారికి విష్వక్సేన పూజ, పుణ్యహవాచనం, పంచామృత మండపారాధన, మహాస్నపనము, ప్రధాన హోమాలు, దుష్ట్రగహ పరిహారార్థం మహాసుదర్శన హోమం, తోమాల సేవ, నీరాజన మంత్రపుష్పాలు నిర్వహించారు. సాయంత్రం 5 గంటల నుంచి స్వస్తివచనం, ప్రధాన హోమాలు, స్వామివారికి విశేషార్చన, చతుర్వేద స్వస్తి, దిగ్దేవతా బలిహరణ, నీరాజన మంత్రపుష్పాలు నిర్వహించారు. దేవస్థానం తరపున డీసీ అండ్ ఈఓ చక్రధరరావు దంపతులు, ఉత్సవ కమిటీ చైర్మన్ ముదునూరి వెంకట్రాజు దంపతులు స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. హనుమద్వాహనంపై శ్రీవారి విహారం బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారు కోదండరామ అలంకరణలో హనుమద్వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి హనుమద్వాహనంపై స్వామివారిని అలంకరించగా మాడ వీధుల్లో ఊరేగించారు. బ్రహ్మోత్సవాల్లో శ్రీవారిని కోదండరాముని అవతారంలో అలంకరించి, హనుమంత వాహనంపై ఊరేగించడం ఆనవాయితీ. ఈ ఘట్టం హనుమంతుడు తన భుజాలపై శ్రీరాముడిని మోసిన సందర్భాన్ని గుర్తు చేస్తుంది. హనమద్వాహనంపై స్వామి వారి విహారం భగవంతుని పట్ల హనుమతునికి ఉన్న భక్తికి, నమ్మకానికి, అణకువకు ప్రతీక. ఈ వాహన సేవ మనిషిలోని భక్తి, సేవ ద్వారా దివ్యత్వానికి ఎలా చేరగలరో చూపిస్తుంది. రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఎస్సై రాము బందోబస్తు నిర్వహించారు. నేటి కార్యక్రమాలు ఇవీ.. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగోరోజు సోమవారం బ్రహ్మోత్సవాల నిత్య పూజలు, హోమాలు, అభిషేకాలతో పాటు ఉదయం జగత్ కళ్యాణార్థం శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తారు. సాయంత్రం విశేష పూజలు, సేవలు, రాత్రి యోగనారసింహ అలంకరణతో సింహ వాహన సేవ నిర్వహిస్తారు. -
రూ.ఐదు లక్షల దీపావళి సామాన్లు సీజ్
తుని రూరల్: ఎస్.అన్నవరంలో అనుమతి లేకుండా నిల్వ ఉంచిన రూ.ఐదు లక్షల విలువ చేసే దీపావళి సామాన్లను సీజ్ చేసినట్టు రూరల్ ఎస్సై బి.కృష్ణమాచారి ఆదివారం తెలిపారు. ముందస్తు చర్యగా తనిఖీలు చేస్తుండగా ఎస్.అన్నవరంలో అక్రమంగా నిల్వ ఉంచిన దీపావళి సామాన్లను గుర్తించామన్నారు. సామాన్లను సీజ్ చేసి ఒకరిని అరెస్టు చేశామన్నారు. తనిఖీల్లో డిప్యూటీ తహసీల్దార్ ప్రదీప్, వీఆర్వో కృష్ణ పాల్గొన్నారు. 7వ బ్యాచ్ శిక్షణ ప్రారంభం సామర్లకోట: స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు ఉన్న 11 జిల్లాలోని మండల పరిషత్తు పరిధిలోని ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈలు, డిప్యూటీ ఎంపీడీఓలకు నిర్వహిస్తున్న శిక్షణలో భాగంగా ఆదివారం 7వ బ్యాచ్ శిక్షణను గ్రామీణ తాగునీటి విభాగం ప్రభుత్వ సలహాదారు తోట ప్రభాకరరావు ప్రారంభించారు. తాగునీటిపై ఏఈఈలకు అవగాహన ఉండాలన్నారు. విస్తరణ శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ కేఎన్వీ ప్రసాదరావు, విశ్రాంత ఎస్ఈలు ఉమాశంకర్, శ్రీనివాసు, సురేష్, పెద్దాపురం డీఈఈ స్వామి, ఎఈఈ శ్రీరామ్, ఈటీసీ సీనియర్ ఫ్యాకల్టీ శేషుబాబు శిక్షణ నిర్వహించారు. రామాలయంలో నగల చోరీ రంగంపేట: మండల పరిధిలోని ముకుందవరంలో దేవుని గుడిలో నగలు మాయమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని కాపుల రామాలయంలో దేవతల విగ్రహాలకు నాలుగు వెండి కిరీటాలు, అమ్మవారి బంగారు తాళిబొట్టు గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. వెండి కిరీటాల విలువ రూ.1.50 లక్షలు, బంగారం విలువ రూ. 1.20 లక్షలు ఉంటుందన్నారు. నగలు చోరీ జరిగినట్టు 9వ తేదీ గురువారం గుర్తించామన్నారు. 9వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. -
పదికి చేరిన ‘బాణసంచా’ మృతులు
చికిత్స పొందుతూ మరో ఇద్దరి మృతి కాకినాడ క్రైం/అనపర్తి: ఈ నెల 8న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో శ్రీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రంలో చోటు చేసుకున్న పెను విస్ఫోటం వల్ల మృతి చెందినవారి సంఖ్య పదికి చేరింది. ఆదివారం కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ మరో ఇద్దరు క్షతగాత్రులు ప్రాణాలు కోల్పోయారు. ఘటన జరిగిన సమయంలో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందగా, తీవ్ర గాయాలపాలైన క్షతగాత్రులు నలుగురిని కాకినాడకు తరలించారు. వారిలో ముగ్గురు కాకినాడ జీజీహెచ్లో చేరగా మరో వ్యక్తి ట్రస్ట్ ఆసుపత్రిలో చేరాడు. ఘటన జరిగిన రోజు సాయంత్రం ట్రస్ట్ ఆసుపత్రిలో చేరిన పాట్నూరి వెంకటరమణ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అదే రోజు అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో వాసంశెట్టి విజయలక్ష్మి అనే మహిళ కాకినాడ జీజీహెచ్లో మృతి చెందింది. ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడుతూ జీజీహెచ్ ఎస్ఐసీయూలో చికిత్స పొందుతున్న అనపర్తికి చెందిన చిట్టూరి యామిని(32) ఆదివారం తెల్లవారుజామున ఉదయం 3.19 గంటలకు ప్రాణాలొదిలింది. అదే ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న పెదపూడి మండలం వేండ్ర గ్రామానికి చెందిన లింగం వెంకటకృష్ణ (21)కాలిపోయి మాంసపు ముద్దగా మారి తుది వరకు మృత్యువుతో పోరాడాడు. ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రాణాలు విడిచాడు. ఆదివారం నాటి మరణాలతో విస్ఫోటంలో తీవ్ర గాయాలపాలైన వారిలో ఏ ఒక్కరూ ప్రాణాలతో మిగల్లేదు. అనపర్తిలో విషాద ఛాయలు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం అధికారులు వారి బంధువులకు అప్పగించారు. అనపర్తికి చెందిన యామిని మృతదేహం మధ్యాహ్నం తీసుకురావడంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
సత్యదీక్ష వస్త్రాలు, మాలల పంపిణీ
అన్నవరం: ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న సత్యదీక్షలకు ప్రచారంతో బాటు సత్యదీక్షలు చేపట్టే స్వాములకు దీక్షా వస్త్రాలు, మాలలు, దీక్షా నియమాల పుస్తకాల పంపిణీని ఆదివారం ప్రారంభించారు. శనివారం సాక్షి దినపత్రికలో ‘సత్యదీక్షకు ప్రచారమేదీ? శీర్షికన వార్త ప్రచురితమైన విషయం తెలిసిందే. ఆ వార్తకు స్పందించిన దేవస్థానం అధికారులుచైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు చేతులమీదుగా ఆదివారం దీక్షా వస్త్రాల పంపిణీ ప్రారంభించారు. త్వరలో అల్లూరి జిల్లా అడ్డతీగలలో కూడా ఈ దీక్షా వస్త్రాలు పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. సత్యదీక్షలపై సత్యరథంతో ప్రచారం చేయిస్తున్నట్టు తెలిపారు. -
సెప్టిక్ ట్యాంక్లో ఆవు నరకయాతన
బయటకు తీసి రక్షించిన స్థానికులు అమలాపురం టౌన్: సెప్టిక్ ట్యాంక్లో పడిన ఆవు నరకయాతన అనుభవించింది. నీరు, తిండి లేక బాగా నీరసించిపోయి కుంగిపోయింది. చివరకు స్థానికులు ఆ ఆవును సెప్టిక్ ట్యాంక్ నుంచి బయటకు తీసి రక్షించారు. అమలాపురం పట్టణం 22వ వార్డు పరిఽధి భోగరాజు వీధిలో తుప్పల్లో ఉన్న సెప్టిక్ ట్యాంక్లో ఆవు ప్రమాదవశాత్తూ పడిపోయింది. పచ్చిక మేత కోసం వెళ్లిన ఆవు ఆ ట్యాంక్లో పడి బయటకు రాలేక పోయింది. అమలాపురం సత్యసాయి సేవా సంస్థల డివిజన్ కో ఆర్డినేటర్, ఈఎన్టీ నిపుణులు డాక్టర్ జి.ప్రభాకర్ ఈ సమాచారాన్ని ఆ వార్డు కౌన్సిలర్ గొవ్వాల రాజేష్కు అందించారు. జేసీబీని రప్పించి ఆవును బయటకు తీయించారు. స్థానికుల సహాయంతో గంటకు పైగా శ్రమించి ఆవును బయటకు తీశారు. స్థానికులు గంగుమళ్ల శ్రీను, మేడిద రమేష్, రాజులపూడి భాస్కరరావు శ్రమించారు. బయటకు తీసిన ఆవు బాగా నీరసించిపోయి ఉండడంతో దానికి తాగునీరు, అరటి పండ్లు పెట్టి సేద తీర్చారు. -
మహిళా కబడ్డీ టోర్నమెంట్ కమ్ సెలెక్షన్స్ ప్రారంభం
పెదపూడి: జి.మామిడాడ డీఎల్ రెడ్డి డిగ్రీ కళాశాలలో ఆదివారం ఆదికవి నన్నయ యూనివర్సిటీ మహిళల కబడ్డీ జట్టు టోర్నమెంట్ కమ్ సెలెక్షన్స్ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా జి.మామిడాడ ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీ, కరస్పాండెంట్ డి.ఆర్.కే.రెడ్డి హాజరయ్యారు. డీఆర్కే రెడ్డి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ డాక్టర్ సబ్బెళ్ల శివన్నారాయణరెడ్డి మాట్లాడుతూ రెండ్రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాల నుంచి యూనివర్సిటీ పరిధిలోని 11 కళాశాలలకు చెందిన 150 మంది క్రీడాకారులు పాల్గొంటారన్నారు. వీరిలో 14 మందిని విశ్వవిద్యాలయం జట్టుగా ఎంపిక చేస్తారన్నారు. ఈ జట్టు ఈ నెల 29 నుంచి నవంబర్ రెండు వరకు తమిళనాడు రాష్ట్రం సేలంలో వినాయక మిషన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే జాతీయస్థాయి అంతర్ విశ్వవిద్యాలయాల మహిళా కబడ్డీ టోర్నమెంట్లో పాల్గొంటుందన్నారు. ఎంపికై న జట్టుకు పది రోజులపాటు డీఎల్ రెడ్డి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తారన్నారు. అబ్జర్వర్లుగా డాక్టర్ జీ.ప్రమీలరాణి, సభ్యులుగా వై.సుధారాణి, ఎం.వీరబాబు వ్యవహరించారు. టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.లోవరాజు, జి.మామిడాడ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడు ఎం.రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
నకిలీ మద్యంపై నేడు నిరసనలు
వైఎస్సార్ సీపీ నేత కురసాల కన్నబాబు కాకినాడ రూరల్: నకిలీ మద్యం తయారీ, అమ్మకాలు, బెల్టు షాపులకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యాన అన్ని నియోజకవర్గాల్లోనూ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. కాకినాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం ‘సాక్షి’తో మాట్లాడారు. కూట మి నాయకుల అండదండలతో నకిలీ మద్యం తయారీ, బెల్టు షాపుల నిర్వహణ జోరందుకున్నాయన్నారు. రాష్ట్రంలోని ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ నకిలీ మద్యం తయారీ, అమ్మకాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి వ్యతిరేకంగా ఎకై ్సజ్ స్టేషన్ల ఎదుట వైఎస్సార్ సీపీ చేపట్టే నిరసన కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరా రు. కాకినాడలో నాగమల్లితోట సమీపాన ఎకై ్సజ్ ఉప కమిషనర్ (డీసీ) కార్యాలయం వద్ద ఉద యం 10.30 గంటలకు శాంతియుతంగా నిరసన తెలియజేస్తామన్నారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనాలని కన్నబాబు కోరారు. తలుపులమ్మ సన్నిధిలో రద్దీ తుని రూరల్: వివిధ జిల్లాల నుంచి వచ్చిన 10 వేల మంది భక్తులు ఆదివారం తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,83,165, పూజా టికెట్లకు రూ.1,76,300, కేశఖండన శాలకు రూ.13,440, వాహన పూజలకు రూ.6,800, వసతి గదులు, పొంగలి షెడ్లు, కాటేజీల అద్దెలు రూ.81,572, విరాళాలు రూ.65,135, వెరసి మొత్తం రూ.5,26,412 ఆదాయం వచ్చిందని వివరించారు. -
రవాణా.. ప్రైవేటు పథాన!
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): టూ వీలర్ లేదా నాలుగు చక్రాలు ఆపైన సామర్థ్యం కలిగిన ఏ వాహనమైన రోడ్డెక్కాలంటే ముందుగా రవాణా శాఖ అధి కారుల దర్శనం చేసుకోవాల్సిందే. లేకుంటే ఆ వాహ నం రోడ్డెక్కే అవకాశమే ఉండేది కాదు. డ్రైవింగ్ లైసె న్స్, వాహనాల రిజిస్ట్రేషన్లు, పర్మిట్లు తదితర అన్ని సేవలూ పదేళ్ల కిందట రవాణా శాఖ కార్యాలయాల్లోనే అందేవి. కొన్నేళ్లుగా ఈ సేవలను ప్రభుత్వం క్రమంగా ప్రైవేటు పరం చేస్తోంది. దీంతో, ఒకప్పుడు వందలాది మంది వాహనదార్లతో కళకళలాడిన ఆర్టీఓ కార్యాలయాలు నేడు వెలవెలబోతున్నాయి. ‘ప్రైవేటు’కు అప్పగించారిలా... ● గతంలో ఎవరైనా వాహనం కొనుగోలు చేస్తే ప్రాంతీయ రవాణా శాఖ అధికారి (ఆర్టీఏ) కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేసేవారు. దీంతో, కొనుగోలుదార్లు అక్కడకు వెళ్లాల్సి వచ్చేది. ఈ ప్రక్రియను మొదటి దశలో ప్రైవేటు రంగానికి అప్పగించారు. వాహనం కొనుగోలు చేసిన వెంటనే డీలర్ వద్దనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగేలా చేశారు. ● స్కూల్ బస్సులు, లారీలు, వ్యాన్లు, ఆటోల వంటి వాటికి ప్రతి రెండేళ్లకోసారి ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించాలి. రవాణా శాఖ విధుల్లో ఇది అత్యంత కీలకమైనది. కానీ, ఈ అధికారాన్ని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల (ఎంవీఐ) నుంచి తప్పించి, ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు. వీటిపై కనీస పర్యవేక్షణాధికారం కూడా రవాణా శాఖ అధికారులకు లేకుండా చేశారు. ● ఇక మిగిలింది డ్రైవింగ్ లెసెన్స్ల జారీ. దీనిని కూడా డ్రైవింగ్ స్కూళ్లకు అప్పగించి, వారి ద్వారానే శిక్షణ కూడా ఇచ్చి లైసెన్సులు జారీ చేయించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ● మరోవైపు గతంలో వాహనాల పర్మిట్లు, టూరిస్టు వాహనాల పర్మిషన్లను కార్యాలయ పరిపాలనాధికారి స్థాయిలో మాన్యువల్గా చేసి జారీ చేసేవారు. ఈ సేవలను ఆన్లైన్ చేసి, అవసరమైన సమయానికి రుసుం చెల్లిస్తే కార్యాలయానికి వెళ్లకుండానే వీటిని జారీ చేస్తున్నారు. ● వాహనాల్లో సామర్థ్యానికి మించి సరకులు లోడ్ చేయడం, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, పర్మిట్ల వంటి వాటిపై రవాణా అధికారులు గతంలో చెక్పోస్టుల వద్ద తనిఖీ చేసేవారు. ఇప్పుడు ఆ చెక్పోస్టులు ఎత్తివేశారు. ● ఇలా రవాణా శాఖ అధికారాలను ఒక్కొక్కటిగా ప్రైవేటు పరం చేయడం లేదా కుదించడంతో అధికారులు కేవలం రోడ్లపై వాహనాలను ఆపి తనిఖీ చేసి, చలానాలు రాయడానికి మాత్రమే పరిమితమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో కొందరు ఎంవీఐ స్థాయి అధికారులు డెప్యూటేషన్పై వేరే శాఖకు వెళ్లాలని యోచిస్తున్నారు. ‘పరివాహన్’పై అవగాహన శూన్యం కాగిత రహిత సేవలకు ప్రాధాన్యం ఇస్తూ కేంద్ర రవాణా శాఖ 2019లో పరివాహన్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా రవాణా శాఖకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్, లెర్నింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ వంటి 16 రకాల సేవలు పొందవచ్చు. కానీ, యాప్పై వాహన యజమానులకు ఇప్పటికీ పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం లేదు. ఈ యాప్ నిర్వహణ కూడా సక్రమంగా లేకపోవడంతో వాహన యజమానులు పర్మిట్లు, లైసెన్సుల కోసం ప్రైవేటు ఏజెన్సీలను ఆశ్రయించాల్సి వస్తోంది. రవాణా శాఖలో లెర్నింగ్, డ్రైవింగ్ లైసెన్స్ పరీక్ష పాసైన తర్వాత వచ్చిన మెసేజ్ ఆధారంగా వాహన చోదకులు మీ–సేవ కేంద్రాలకు వెళ్లి ఆ పత్రాలు తీసుకోవాల్సి వస్తోంది. వీటిని ఉచితంగా ఇవ్వాల్సిన నిర్వాహకులు రూ.20 నుంచి రూ.50 వరకూ వసూలు చేస్తున్నారు. అదే కార్డు రూపంలో కావాలంటే రూ.100 నుంచి రూ.150 వరకూ చెల్లించాల్సి వస్తోంది. టూ వీలర్, ఫోర్ వీలర్ లైసెన్సులు, రెన్యువల్కు వచ్చే వారికి పెద్దగా ఇబ్బంది లేదు. కానీ, ఆటో, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్సులకు వచ్చే వారిలో అత్యధికులు నిరక్షరాస్యులే ఉంటారు. వారిని రవాణా కార్యాలయానికి తీసుకువెళ్లి ఓటీపీ చెప్పిన అనంతరం దరఖాస్తు చేయించాల్సి వస్తోంది. కాగిత రహితంగా చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి పూర్తి విరుద్ధంగా ఈ తతంగమంతా సాగుతోంది. ఏటీఎస్లు వద్దంటూ ఆందోళన వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేసేందుకు ప్రభుత్వం ప్రైవేటు ఏజెన్సీల ద్వారా ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు (ఏటీఎస్) ఏర్పాటు చేసింది. వాటి నిర్వాహకులు కావాల్సిన సర్టిఫికెట్ను బట్టి డబ్బులు డిమాండ్ ఆటో యూనియన్లు, రవాణా కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వీటిని పర్యవేక్షించే అధికారం రవాణా అధికారులకు లేకపోవడంతో ఏజెన్సీ నిర్వాహకులకు అడ్డు లేకుండా పోతుంది. జిల్లా మొత్తానికి కాకినాడలో ఒకే ఒక్క ఏటీఎస్ ఏర్పాటు చేయగా జిల్లా సరిహద్దుల్లో ఉన్న వారు తమ వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ల కోసం సుమారు 150 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. దీనివలన వారు అనేక వ్యయప్రయాసలకు గురవుతున్నారు. కార్యాలయాల్లో రద్దీ తగ్గింది ఒకప్పుడు రవాణా శాఖ కార్యాలయాలకు ఉదయం నుంచి రాత్రి వరకూ నిత్యం వందలాది మంది వివిధ పనులపై వచ్చేవారు. క్రమేణా సేవలన్నీ ఆన్లైన్తో పాటు ప్రైవేటు పరం చేయడంతో కార్యాలయాల్లో రద్దీ తగ్గింది. ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన ఫిట్నెస్ కేంద్రాలపై ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ సేవలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పుడు బండి కండిషన్ చూసి ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేసేవారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఏటీఎస్లు ఏర్పాటు చేసి ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించారు. ఇందులో మా పాత్రేమీ లేదు. – కె.శ్రీధర్, రవాణా శాఖ ఉప కమిషనర్ (డీటీసీ), కాకినాడఫ సేవలు ఒక్కొక్కటిగా ప్రైవేటు పరం ఫ డ్రైవింగ్ లైసెన్సు జారీని త్వరలో అప్పగించే చాన్స్ ఫ జనం లేక వెలవెలబోతున్న ఆర్టీఏ కార్యాలయాలు జిల్లాలో వాహనాల వివరాలు ప్రయాణికుల బస్సులు 489 స్కూల్ బస్సులు 1,494 గూడ్స్ క్యారియర్లు 13,546 మ్యాక్సీ క్యాబ్లు 481 మోటార్ క్యాబ్లు 1,730 ప్రైవేటు సర్వీస్ వెహికల్స్ 237 త్రీ వీలర్ (గూడ్స్) 3,484 ప్యాసింజర్ ఆటోలు 13,191 ట్రైలర్లు (కమర్షియల్) 3,491 కమర్షియల్ ట్రాక్టర్లు 912 -
కొండపై భక్తుల సందడి
● సత్యదేవుని దర్శించిన 40 వేల మంది ● దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయంఅన్నవరం: రత్నగిరికి ఆదివారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. కొండ పైన, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ శనివారం రాత్రి, ఆదివారం ఉదయం పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవదంపతులు, పెళ్లి బృందాలతో పాటు సెలవు దినం కావడంతో ఇతర భక్తులు కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. సుమారు 40 వేల మంది సత్యదేవుని దర్శించుకున్నారు. క్యూలు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం భక్తులతో రద్దీగా మారిపోయింది. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. స్వామివారి వ్రతాలు మూడు వేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. ఐదు వేల మంది సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని టేకు రథంపై ఆలయ ప్రాకారంలో ఉదయం ఘనంగా ఊరేగించారు. ఏసీ బస్సులో 10 శాతం రాయితీఅమలాపురం రూరల్: ఏపీఎస్ ఆర్టీసీ అమలాపురం డిపో నుంచి హైదరాబాద్కు నడుపుతున్న అమరావతి ఏసీ బస్సు టికెట్ రేట్లలో ఈ నెల 31 వరకూ 10 శాతం రాయితీ ఇస్టున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి ఎస్టీపీ రాఘవకుమార్ ఆది వారం తెలిపారు. అమలాపురం నుంచి హైదరాబాద్ ఎంజీబీఎస్కు రూ.1,250, బీహెచ్ఈఎల్కు రూ.1,300 ధరతో టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. అమలాపురం నుంచి రాత్రి 8.30 గంటలకు సర్వీస్ నంంబర్ 2572, హైదరాబాద్ నుంచి రాత్రి 7.45 గంటలకు సర్వీస్ నంబర్ 2573 బయలుదేరుతాయన్నారు. ఈ సర్వీస్ విజయవాడ నుంచి హైదరాబాద్కు నాన్స్టాప్గా నడుపుతున్నామని తెలిపారు. -
నేడు కొలువుదీరనున్న కొత్త ఉపాధ్యాయులు
లీప్ యాప్లో పోస్టింగ్ ఆర్డర్ల విడుదల రాయవరం: డీఎస్సీ–2025 ఉపాధ్యాయులు సోమవారం కొలువుదీరనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 20న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 1,241 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. 1,230 పోస్టులకు పోస్టింగ్ ఆర్డర్లు విడుదలయ్యాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 414 మంది ఉపాధ్యాయులు విధుల్లో చేరనున్నారు. వీరిలో 28 మంది మున్సిపల్ యాజమాన్యాల్లో నియామకం పొందగా, ప్రభుత్వ/స్థానిక సంస్థల యాజమాన్యాల్లో 386 మంది చేరనున్నారు. తూర్పు గోదావరి జిల్లాకు 164 మంది ఉపాధ్యాయులను కేటాయించగా, వీరిలో 53 మంది మున్సిపల్ కార్పొరేషన్, 111 మంది ప్రభుత్వ/స్థానిక సంస్థల యాజమాన్యాల పరిధిలో నియామకం పొందారు. కాకినాడ జిల్లాకు వివిధ కేటగిరీలకు చెందిన 474 మంది ఉపాధ్యాయులను నియమించారు. వీరిలో 124 మంది మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్లోను, 350 మంది ప్రభుత్వ/స్థానిక సంస్థల్లో నియమితులయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 173 మంది ప్రభుత్వ/స్థానిక సంస్థల యాజమాన్యాల పరిధిలో వివిధ క్యాటగిరీల కింద నియామకం పొందారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా విద్యాశాఖాధికారి తరఫున నియామక ఉత్తర్వులు లీప్ యాప్లో జారీ చేశారు. ఉపాధ్యాయులు సోమవారం వారికి కేటాయించిన పాఠశాలల్లో విధుల్లో చేరతారు.కేటాయించిన పోస్టుల వివరాలిలా.. కాకినాడ జిల్లా కేటగిరీ పోస్టు మున్సిపల్ ప్రభుత్వ/ స్థానిక సంస్థలు ఎస్ఏ ఇంగ్లిషు 03 34 ఎస్ఏ హిందీ 02 26 ఎస్ఏ తెలుగు 04 16 ఎస్ఏ బీఎస్ 06 50 ఎస్ఏ గణితం 02 41 ఎస్ఏ పీఈ 0 66 ఎస్ఏ పీఎస్ 0 43 ఎస్ఏ ఎస్ఎస్ 5 50 ఎస్జీటీ 102 24 కోనసీమ జిల్లా కేటగిరీ పోస్టు మున్సిపల్ ప్రభుత్వ/ స్థానిక సంస్థలు ఎస్ఏ ఇంగ్లిషు 18 105 ఎస్ఏ హిందీ 03 45 ఎస్ఏ తెలుగు 01 14 ఎస్ఏ బీఎస్ 0 91 ఎస్ఏ గణితం 01 06 ఎస్ఏ పీఈ 02 20 ఎస్ఏ పీఎస్ 0 31 ఎస్ఏ ఎస్ఎస్ 0 05 ఎస్జీటీ 18 105 తూర్పుగోదావరి జిల్లా కేటగిరీ పోస్టు మున్సిపల్ ప్రభుత్వ/ స్థానిక సంస్థలు ఎస్ఏ ఇంగ్లిషు 02 06 ఎస్ఏ హిందీ 0 06 ఎస్ఏ తెలుగు 01 02 ఎస్ఏ బీఎస్ 0 19 ఎస్ఏ గణితం 0 05 ఎస్ఏ పీఈ 0 42 ఎస్ఏ పీఎస్ 2 04 ఎస్ఏ ఎస్ఎస్ 6 17 ఎస్జీటీ 42 10 ఏఎస్ఆర్ జిల్లా కేటగిరీ పోస్టు మున్సిపల్ ప్రభుత్వ/ స్థానిక సంస్థలు ఎస్ఏ ఇంగ్లిషు 0 17 ఎస్ఏ హిందీ 0 01 ఎస్ఏ తెలుగు 0 04 ఎస్ఏ బీఎస్ 0 05 ఎస్ఏ గణితం 0 09 ఎస్ఏ పీఈ 0 09 ఎస్ఏ పీఎస్ 2 07 ఎస్ఏ ఎస్ఎస్ 6 02 ఎస్జీటీ 0 119 -
రత్నగిరికి కొబ్బరి సిరి!
● కొండపైనా, కిందా సుమారు 70 లక్షల కాయల విక్రయం ● రాష్ట్రంలో అధిక వినియోగం ఇక్కడే! ● కార్తికంలో రూ.20 కోట్లకు పైగా వ్యాపారం జరిగే అవకాశం ● ధర పెరుగుదలతో వ్యాపారుల ఆనందం అన్నవరం: కొబ్బరికాయ ధర కొండెక్కి కూర్చుంది. ఓ మాదిరి కొబ్బరికాయ రూ.40కి, కాస్త పెద్ద కాయ అయితే రూ.50 కి విక్రయిస్తున్నారు. ఈ పెరుగుదల వ్యాపారులకు సంతోషం కలిగిస్తున్నా భక్తులకు మాత్రం రుచించడం లేదు. గతేడాది కాయ ధర రూ.20 మాత్రమే ఉండగా, ఈ ఏడాది రెట్టింపైందని వారంటున్నారు. కాగా కొబ్బరి తోటలోనే వెయ్యి కాయ ధర రూ.30 వేలకు విక్రయిస్తున్నట్టు రైతులు చెప్తున్నారు. ఏటా 70 లక్షల కాయల విక్రయం రత్నగిరికి వచ్చే భక్తులు కొండదిగువన తొలి పావంచా వద్ద, నమూనా ఆలయాల వద్ద ఏటా దాదాపు 70 లక్షలు కొబ్బరికాయలు స్వామి వారికి కొడుతుంటారు. రాష్ట్రంలోని మరే ఇతర పుణ్యక్షేత్రంలో ఇంత వినియోగం లేదంటే అతిశయోక్తి కాదు. రానున్న కార్తికమాసంలో సుమారు పది లక్షలు కొబ్బరి కాయలు వినియోగిస్తారని, సుమారు రూ.20 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతోంది. కార్తికంలో అధిక వినియోగం ఈ నెల 22వ తేదీ నుంచి మొదలయ్యే కార్తికమాసంలో స్వామివారి సన్నిధికి భక్తులు లక్షలాదిగా వస్తారు. స్వామి వ్రతాలు సుమారు 1.3 లక్షలు జరిగే అవకాశం ఉంటుంది. వ్రతానికి ఆరు కొబ్బరికాయలు వినియోగిస్తారు. ఆ లెక్కన సుమారు ఎనిమిది లక్షల కాయలు వినియోగిస్తారు. ఇవి కాకుండా స్వామివారి దర్శనానికి మరో రెండు లక్షలు కొబ్బరికాయలు, కొండ దిగువన తొలిపావంచా వద్ద, నమూనా ఆలయాల వద్ద భక్తులు కొబ్బరికాయలు కొడతారు. కార్తిక పౌర్ణిమనాడు నిర్వహించే గిరిప్రదక్షణలో సత్యరథం ముందు కొబ్బరికాయలు కొట్టి ప్రదక్షణలో పాల్గొనడం ఆనవాయితీ కాబట్టి ఆ ఒక్క రోజే పది వేల కాయలు కొనుగోలు చేస్తారు. ఇన్ని కాయల విక్రయం వల్ల సుమారు రూ.మూడు కోట్ల విలువైన వ్యాపారం జరుగుతుంది. 50కి పైగా కొబ్బరికాయల దుకాణాలుఅన్నవరంలో 50కి పైగా కొబ్బరికాయల దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా సుమారు వంద కుటుంబాలు బతుకుతున్నారు. ఏటా లక్షలాది కాయలు విక్రయం ద్వారా రూ.కోట్లులో వ్యాపారం జరుగుతోంది. ఉత్పత్తి తగ్గి.. ధర పెరిగి.. కొబ్బరి ఉత్పత్తి కొంతకాలంగా తగ్గడం ధర పెరుగుదలకు కారణమని రైతులు అంటున్నారు. రాష్ట్రంలో నే కాకుండా, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలోనూ ఇదే పరిస్థితి. దీనికి తోడు ఉత్తరాది రాష్ట్రాలకు కొబ్బరి ఎగుమతి ఎక్కువగా ఉండడం వల్ల కూడా ధర పెరుగుదలకు మరో కారణమని వారంటున్నారు. దేవస్థానానికి రూ.ఆరు కోట్ల ఆదాయం అన్నవరం దేవస్థానంలో కొబ్బరికాయల దుకాణాల వేలం, వ్రతాలు, ఆలయాలలో కొట్టిన కొబ్బరికాయల ముక్కలు ఏరుకోవడానికి నిర్వహించిన వేలం పాట ద్వారా ఏడాదికి రూ.ఆరు కోట్లు ఆదాయం వస్తోంది. కొబ్బరి ధర పెరగడంతో ముక్కలు తీసుకునే వేలం నెలకు రూ.19.05 లక్షలకు ఖరారైంది. అంటే ఏడాదికి రూ.2.28 కోట్ల ఆదాయం దీని ఒక్కదాని ద్వారానే వస్తోంది. -
అప్పనపల్లి.. భక్తులతో శోభిల్లి
మామిడికుదురు: బాల తిరుపతి అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామివారి ఆలయానికి శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు. కలియుగ ప్రత్యక్ష దైవంగా ఆరాధించే స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. ప్రాతః కాలంలో ఆలయ అర్చకులు సుప్రభాత సేవ అనంతరం తొలి హారతి ఇచ్చారు. పవిత్ర వైనతేయ గోదావరి నదిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి, స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. స్వామివారి సన్నిధిలో నిత్యం నిర్వహించే శ్రీలక్ష్మీ నారాయణ హోమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. ఆలయానికి వివిధ సేవల ద్వారా రూ.2,91,093 ఆదాయం సమకూరిందని ఈఓ ముదునూరి సత్యనారాయణ రాజు తెలిపారు. నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.95.541 విరాళాలుగా అందించారన్నారు. నాలుగు వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారని, 2,500 మంది అన్న ప్రసాదం స్వీకరించారని తెలిపారు. -
భక్తులతో రత్నగిరి కిటకిట
● సత్యదేవుని దర్శించిన 50 వేల మంది ● ఆలయ ప్రాకారంలో సత్యదేవుని ఊరేగింపు అన్నవరం: రత్నగిరిపై శనివారం భక్తులు పోటెత్తారు. రెండో శనివారం సెలవుదినం కావడం, శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున పెళ్లిళ్లు జరగడంతో ఆ బృందాలతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. సుమారు 50 వేల మంది భక్తులు స్వామిని దర్శించి పూజలు చేశారు. దీంతో రత్నగిరిపై పార్కింగ్కు స్ధలం లేక భక్తులు తమ వాహనాలను సత్యగిరికి మళ్లించారు. కాగా స్వామివారి సర్వ దర్శనానికి మూడు గంటలు, రూ.200 టిక్కెట్పై అంతరాలయ దర్శనానికి రెండు గంటలు పట్టింది. వెలుపల నుంచే అంతరాలయ దర్శనం కల్పించడంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. స్వామివారి వ్రతాలు ఐదు వేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా ఆలయానికి రూ.50 లక్షలు ఆదాయం సమకూరింది. ఎనిమిది వేల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. తిరుచ్చి వాహనంలో ఊరేగింపు ఆలయ ప్రాకారంలో సత్యదేవుడు, అనంతలక్ష్మి సత్యవతీదేవి అమ్మవారిని ఉదయం పది గంటలకు తిరుచ్చి వాహనంపై ఘనంగా ఊరేగించారు. అర్చకుడు యడవిల్లి వేంకటేశ్వరరావు పూజలు చేయగా వేద పండితుల మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ మూడు సార్లు ఆలయ ప్రాకారంలో ఊరేగింగించి తిరిగి ఉత్సవ మూర్తులను ఆలయానికి చేర్చారు. -
రూ.25 నుంచి రూ.35 మధ్య విక్రయానికి అనుమతించాలి
అన్నవరం దేవస్థానంలో కొబ్బరికాయల విక్రయానికి ఏడాదికి రూ.రెండు కోట్లకు వేలం పాడాం. దీనికి జీఎస్టీ అదనం. గతంలో కాయ ఒక్కంటికి రూ.25 రేటు మంజూరు చేశారు. ఐదు నెలలుగా కొబ్బరి తోటలోనే కాయ రూ.30కి కొంటున్నాం. వాటిలో చిన్నకాయలు కూడా ఉంటాయి. అవి చాలా తక్కువ ధర పలుకుతాయి. కొన్ని కాయలు రవాణాలో పాడైపోతాయి. అవన్నీ మాకు నష్టమే. తోట నుంచి దేవస్థానానికి తేవడానికి రవాణా, ఇతర ఖర్చులు మరో రూ.రెండు నుంచి రూ.మూడు అవుతాయి. అంటే కనీసం కొబ్బరి కాయ రూ.33 వరకు మాకే ఖర్చు అవుతుంది. కొన్నిసార్లు తమిళనాడు నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నాం. అక్కడ కూడా అదే రేటు ఉంటోంది. అంటే కొబ్బరికాయ రూ.35 కి అమ్మితే మాకు అసలు రేటు పడుతుంది. ఆ మేరకు రేటు మంజూరు చేయాలి. డీమార్ట్, స్మార్ట్బజార్ లోనే కొబ్బరి కాయ రేటు రూ.30 దాటి విక్రయిస్తున్నారు. అందువలన దేవస్థానం అధికారులు మార్కెట్ లో కూడా వాకబు చేసి కొబ్బరి కాయ రేటు రూ.35 కి అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వాలి. – వీర్ల సూరిబాబు, కొబ్బరికాయల దుకాణం పాటదారుడు -
పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ నిరసన
సఖినేటిపల్లి: అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్ నిర్వహణలో పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం హార్బర్లో స్థానిక మత్య్సకారులు నిరసన వ్యక్తం చేశారు. హార్బర్ నిర్వహణ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం వల్ల తమ జీవనోపాధి దెబ్బతింటుందని, దీనిని తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్థానికుడు వనమాలి శ్రీనివాసరావు మాట్లాడుతూ సుమారు 40 ఏళ్లుగా ఇక్కడ జీవిస్తున్నామని, ఎటువంటి సమాచారం ఇవ్వకుండా హార్బర్ నిర్వహణను పీపీపీ పద్ధతిలో టెండర్ ప్రక్రియ చేపట్టి కాంట్రాక్టర్కు అప్పగించాలని ప్రభుత్వం చూస్తుందన్నారు. హార్బర్ నిర్మాణానికి ఫిషర్మెన్ ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ భూమి 20 ఎకరాలు ఇచ్చామని, గ్రామస్తులతో పాటు వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారంతా కలసి ఇక్కడ మంచి వాతావరణంలో వేట కొనసాగిస్తున్నట్టు తెలిపారు. స్థానికేతరులు వేట విరామం సమయంలో స్వగ్రామాలకు వెళ్లి, అనంతరం తిరిగి వచ్చి తమతో పాటు ఉంటారని అన్నారు. కాగా పీపీపీ పద్ధతిలో కొంత మంది తమకు కావాల్సిన వారిని జీతాలకు పెట్టుకుని, తమను బయటకు గెంటేసే పద్ధతిలో ఉన్నారని, మత్స్య సంపదను ఇక్కడ అమ్మడానికి వీల్లేదంటూ అప్పుడే ఒత్తిళ్లు తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు వ్యక్తుల నిర్వహణ వల్ల తమ బతుకు తెరువుకు ఇబ్బందిగా మారనుందని, తమకు పూర్తి న్యాయం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గ్రామస్తుడు పొన్నాల జయకృష్ణ మాట్లాడుతూ గ్రామస్తుల జీవనోపాధి మెరుగుపర్చేందుకు హార్బర్కు స్థలం ఇచ్చామని, గ్రామంలో ఎవరినీ సంప్రదించకుండా మధ్యస్థంగా పీపీపీ పద్ధతిలో టెండర్ ప్రక్రియకు చర్యలు తీసుకోవడం తగదని అన్నారు. పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. -
నకిలీ మద్యంపై మహిళల పోరు
● ఎకై ్సజ్ డీసీ కార్యాలయం వద్ద నిరసన ● సమయం ఇచ్చి డుమ్మా కొట్టిన అధికారులు సాక్షి ప్రతినిధి, కాకినాడ: నకిలీ మద్యంపై మహిళలు రోడ్డెక్కారు. పేదల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా చంద్రబాబు సర్కారు చెవికెక్కడం లేదంటూ వైఎస్పార్ సీపీ మహిళా విభాగం ఆధ్వర్యాన శుక్రవారం కాకినాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ నాయకత్వంలో జిల్లా నలుమూలల నుంచీ తరలి వచ్చిన పార్టీ మహిళా నేతలు, మహిళలు, ప్రజా సంఘాల సంయుక్త ఆధ్వర్యాన ఈ నిరసన ర్యాలీ చేపట్టారు. స్థానిక పైడా వీధిలోని పార్టీ కార్యాలయం నుంచి ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ (డీసీ) కార్యాలయం వరకూ ప్రదర్శన నిర్వహించారు. పేదల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా ప్రభుత్వంలో చలనం లేదని, మద్యం దుకాణాలు వేళాపాళా లేకుండా నడుపుతున్నారని, విచ్చలవిడి మద్యం అమ్మకాలను నియంత్రించాలని, కల్తీ మద్యాన్ని అరికట్టాలని, బెల్టు షాపులను పూర్తిగా నిర్మూలించాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. నకిలీ మద్యం విక్రయాలతో పేదలకు జరుగుతున్న నష్టాన్ని గుర్తించకుండా కేవలం ఆదాయమే పరమావధిగా పని చేస్తున్న కూటమి సర్కార్పై మహిళా నేతలు నిప్పులు చెరిగారు. నిరసన అనంతరం ఉదయం 11 గంటలకు ఎకై ్సజ్ డీసీకి వినతిపత్రం అందజేసేందుకు ముందుగానే అనుమతి తీసుకున్నప్పటికీ ఆయన కార్యాలయంలో అందుబాటులో లేకపోవడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి ఇచ్చి కూడా వెళ్లిపోవడమేమిటని మండిపడ్డారు. ఇతర అధికారులకు ఇవ్వాలని ప్రయత్నించినా వారు కూడా లేకపోవడంతో అందుబాటులో ఉన్న మహిళా ఎస్సైకి వినతిపత్రం అందజేశారు. విచ్చలవిడిగా నకిలీ మద్యం ఈ సందర్భంగా మహిళలనుద్దేశించి వంగా గీత మాట్లాడుతూ, రాష్ట్రంలో విచ్చలవిడిగా సరఫరా అవుతున్న నకిలీ మద్యంతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ధ్వజమెత్తారు. జిల్లాలో బెల్టు షాపులు లెక్కే లేకుండా ఏర్పాటయ్యాయని, వీటిని దొడ్డిదారిన ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని దుయ్యబట్టారు. మద్యం విక్రయాలు ఎనీ టైమ్ మద్యం (ఏటీఎం) మాదిరిగా తయారయ్యాయని ఆక్షేపించారు. రాష్ట్ర చరిత్రలోనే మద్యం అమ్మకాల్లో మునుపెన్నడూ ఇటువంటి పరిస్థితి చూడలేదన్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మద్యం యథేచ్ఛగా దొరుకుతూండటంతో పేద కుటుంబాలు గుల్లయిపోతున్నాయని, విచ్చలవిడి మద్యం అమ్మకాలు, కల్తీ మద్యంతో యువత మద్యానికి బానిసైపోయి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని గీత ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగులూరి శివకుమారి, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత, కాకినాడ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, రాష్ట్ర కార్యదర్శులు రాగిరెడ్డి దీప్తి కుమార్, బెహరా రాజేశ్వరి, అల్లవరపు నాగమల్లేశ్వరి, పి.సరోజ, మాకినీడి శేషుకుమారి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి తదితరులు పాల్గొన్నారు. -
అదిగో.. అల్లదిగో..
10ఆర్వీపీ63: ఫ వాడపల్లిలో ఆధ్యాత్మిక పరిమళాలు ఫ బ్రహ్మాండ నాయకునికి బ్రహ్మోత్సవాలు ప్రారంభం ఫ తొలిరోజు పరావాసుదేవ అలంకరణలో స్వామివారు కొత్తపేట: కోనసీమ వెంకన్నగా.. ఏడు వారాల స్వామిగా.. పూజలందుకుంటున్న బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.. ఆత్రేయపురం మండలం వాడపల్లిలో స్వయం భూగా వేంచేసిన శ్రీ, భూ సమేత వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆశ్వయుజ బహుళ చవితి శుక్రవారం ఆరంభమయ్యాయి. తొలిరోజు ఆ స్వామిని చూసిన భక్తజనం మురిసిపోయింది. రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామిని కొలిచారు. శేష వాహనంపై శ్రీవారి విహార ఘట్టం కన్నుల వైకుంఠంగా సాగింది. గోవింద నామస్మరణతో వాడపల్లి క్షేత్రం మార్మోగింది. ఆలయ ప్రాంగణం, మాడ వీధులు రంగు రంగుల పూలమాలలు, విద్యుత్ అలంకరణలతో కనువిందు చేసింది. దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్, అర్చక బృందం, వివిధ ప్రాంతాల నుంచి వేద పండితులు ఉదయం నుంచి రాత్రి వరకూ నిరంతరాయంగా స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు, హోమాలు, వాహన సేవ, ఊరేగింపు తదితర కార్యక్రమాలు నిర్వహించడంతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. తెల్లవారు జామునే సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి, అనంతరం తీర్థ బిందెలతో గోదావరి జలాలను తీసుకువచ్చి అభిషేకించారు. గోత్ర నామాలతో పూజలు చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం 9.35 గంటల నుంచి స్వామివారికి స్వస్తి వచనం, పుణ్యహ వాచనం, దీక్షాధారణ, అగ్నిప్రతిష్ఠాపన, విశేషార్చన, తీర్థప్రసాద గోష్టి నిర్వహించారు. సాయంత్రం 4 గంటల నుంచి మృత్యుంగ్రహణ, శాలా విహరణ, అంకురార్పణ, వాస్తుపూజ, వాస్తుహోమం, ధ్వజారోహణ, బలిహరణ, నీరాజన మంత్రపుష్పం తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. దేవస్థానం తరఫున ఈఓ చక్రధరరావు దంపతులు స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. శేషవాహనంపై శ్రీవారి విహారం బ్రహ్మోత్సవాలు ప్రారంభ వేళ స్వామివారు పరావాసుదేవగా భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7.30 గంటలకు శేషవాహనంపై స్వామివారిని అలంకరించగా, మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ సందర్శంగా పండితులు శేష వాహనంపై శ్రీవారు విహార ఘట్టం విశిష్టతను వివరించారు. వైకుంఠంలో శ్రీమన్నారాయణ స్వామి శేష పాన్పుపై ఉంటారని తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో ప్రథమ వాహనం శేష వాహనం అని, ఈ వాహనంపై స్వామివారిని దర్శిస్తే వైకుంఠంలో శ్రీమన్నారాయణుని దర్శించిన ఫలితం లభిస్తుందని వివరించారు. ఆ విధంగా స్వామివారిని దర్శించిన భక్తులు ఆనంద డోలికల్లో తేలియాడారు. తొలిరోజు కార్యక్రమాల్లో ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్కుమార్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారిని ఈఓ చక్రధరరావు సత్కరించి, స్వామివారి చిత్రపటాలను అందజేశారు. పలువురు ప్రముఖులు, నాయకులు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఎస్సై రాము పోలీసు బందోబస్తు నిర్వహించారు. వాడపల్లి మాడ వీధుల్లో శేష వాహనంపై ఊరేగుతున్న శ్రీవారు నేటి కార్యక్రమాలు ఇలా.. వెంకన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం బ్రహ్మోత్సవాల నిత్య పూజలు, హోమాలు, అభిషేకాలతో పాటు ఉదయం మహా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ, రాత్రి సరస్వతి అలంకరణతో హంస వాహనసేవ ఉంటుంది. -
అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలను ఆదుకోవాలి
రామచంద్రపురం: రాయవరంలో శ్రీగణపతి ఫైర్ వర్క్స్ కేంద్రంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం రూ. 50 లక్షల చొప్పున పరిహారం ప్రకటించి, ఆదుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం స్థానికంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఐఎఫ్టీయూ ఉమ్మడి జిల్లా కార్యదర్శి చీకట్ల వెంకటేశ్వరరావు, పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.సిద్ధూ, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకుడు వెంటపల్లి భీమశంకరం తదితరులు మాట్లాడారు. ఆ ఫైర్ వర్క్స్లో సుమారు 50 మంది కార్మికులు పనిచేస్తుండగా, ఆ రోజు 30 మంది మాత్రమే వచ్చారని, భోజన విరామ సమయంలో ప్రమాదం సంభవించడంతో మరణాల సంఖ్య కొంత తగ్గిందన్నారు. అయినప్పటికీ, నీటి వనరులు అందుబాటులో లేకపోవడం, అగ్నిమాపక చర్యల్లో నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం తీవ్రరూపం దాల్చిందన్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా రెవెన్యూ, అగ్నిమాపక, పరిశ్రమల, కార్మిక శాఖలు నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత సంఘటన స్థలాన్ని సందర్శించినా ఇప్పటి వరకూ ఎటువంటి నష్ట పరిహారం ప్రకటించకపోవడం విచారకరమన్నారు. క్షతగాత్రులకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాయవరం మండలంలోని అన్ని ఫైర్ వర్క్స్ యూనిట్లను తక్షణం తనిఖీ చేసి, భద్రతా ప్రమాణాలపై సమీక్ష చేపట్టాలని అధికారులను కోరారు. -
నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): నిబంధనలు పాటించని బాణసంచా తయారీ, విక్రయాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ హెచ్చరించారు. అగ్నిమాపక అధికారులు, తహసీల్దార్లు, బాణసంచా తయారీదార్లతో కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల కోనసీమ జిల్లా రాయవరంలోని బాణసంచా తయారీ కేంద్రంలో చోటు చేసుకున్న విస్ఫోటం నేపథ్యంలో తయారీ కేంద్రాల్లో పాటించాల్సిన నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. దీపావళి పండగ సందర్భంలో జిల్లాలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా బాణసంచా తయారీ, విక్రయదారులు నిబంధనలు నూరు శాతం అమలు చేయాలని స్పష్టం చేశారు. అన్ని అనుమతులూ ఉన్నా ప్రమాదం జరిగితే బాణసంచా తయారీదారుపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. జిల్లాలో 29 బాణసంచా తయారీ కేంద్రాలు, 11 స్టోరేజ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. తయారీ కేంద్రాల్లో పని చేసే కార్మికులకు తప్పనిసరిగా ప్రమాద బీమా చేయించాలన్నారు. ఉల్లి బాంబుల తయారీ, అమ్మకాన్ని నిషేధించామని కలెక్టర్ తెలిపారు. ఎస్పీ బిందుమాధవ్ మాట్లాడుతూ, బాణసంచా తయారీ కేంద్రాల వద్ద నూరు శాతం ఫైర్ సేఫ్టీ కచ్చితంగా పాటించాలని అన్నారు. అన్నవరం దేవస్థానానికి రూ.30 లక్షల బస్సు అన్నవరం: సత్యదేవుని దేవస్థానానికి స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రూ.30 లక్షల విలువైన 32 సీట్లు కలిగిన బస్సును సమకూర్చింది. ఈ బస్సు తాళాలను ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులుశెట్టి దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావుకు శుక్రవారం అందజేశారు. గతంలో కూడా ఎస్బీఐ రెండు బ్యాటరీ కార్లు, ఒక బస్సును దేవస్థానానికి అందజేసింది. కార్యక్ర మంలో ఎస్బీఐ అమరావతి సర్కిల్ సీజీఎం రాజేష్కుమార్ పటేల్, జనరల్ మేనేజర్ హేమంత్ కుమార్, డీజీఎం పంకజ్ కుమార్ (రాజమహేంద్రవరం), సర్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ పంకజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఐదు రోజుల ముందే సిఫారసు లేఖలు అన్నవరం: సత్యదేవుని సన్నిధిలోని సత్రాల్లో వసతి గదులు, దర్శనం, వ్రతాల కోసం ఐదు రోజుల ముందే సిఫారసు లేఖలు పంపించాల్సి ఉంటుంది. ఇకపై వాట్సాప్, ఫోన్ మెసేజ్లు అంగీకరించబోమని అన్నవరం దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సిఫారసు లేఖలను కూడా పరిశీలించిన అనంతరం, అవి వాస్తవమని నిర్ధారించుకున్నాక మాత్రమే చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. కార్తిక మాసాన్ని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అవిశ్వాస తీర్మానంపై తిరిగి సమావేశంసామర్లకోట మున్సిపల్ చైర్పర్సన్ ఉదంతంలో హైకోర్టు తీర్పు సామర్లకోట: మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణపై సభ్యులు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై తిరిగి సమావేశం నిర్వహించాలని హైకోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది. వివరాలివీ.. చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్కు 22 మంది సొంత పార్టీ సభ్యులు ఏప్రిల్ 2న సంతకాలు చేసి లేఖ ఇచ్చారు. ఈ మేరకు మే 15న అవిశ్వాస తీర్మానంపై సమావేశం ఏర్పాటుకు కలెక్టర్ అనుమతి ఇచ్చారు. ఈ సమావేశానికి కాకినాడ ఆర్డీఓ మల్లిబాబును ప్రత్యేకాధికారిగా నియమించారు. అయితే, ఆ సమావేశానికి ముందే చైర్పర్సన్ కోర్టును ఆశ్రయించారు. మే 15న జరిగిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 25 మంది సభ్యులు ఓట్లు వేశారు. దాంతో, ఆ తీర్మానం నెగ్గింది. అయినప్పటికీ, కోర్టులో విచారణ జరుగుతున్న కారణంగా ప్రత్యేకాధికారి ఈ విషయాన్ని అప్పట్లో ప్రకటించలేదు. అవిశ్వాస తీర్మానంపై మరోసారి సమావేశం నిర్వహించాల్సిందిగా హైకోర్టు తీర్పు ఇచ్చిందని చైర్పర్సన్కు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించిన రెడ్నం సునీత విలేకరులకు తెలిపారు. -
బోడసకుర్రులో బాణసంచా సామగ్రి స్వాధీనం
అల్లవరం: బోడసకుర్రు పోస్టాఫీస్ సమీపంలో నిల్వ ఉంచిన మందుగుండు సామగ్రిని అల్లవరం పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు ఎస్సై సంపత్కుమార్ ఆధ్వర్యంలో అల్లవరం పోలీసులు దాడి చేసి బాణసంచాను గుర్తించారు. బోడసకుర్రు పోస్టాఫీస్ను ఆనుకుని కిరాణా వ్యాపారం చేస్తున్న జక్కా కామేశ్వరరావు ఇంటి వెనుక బాత్రూమ్లో నిల్వ చేసిన బాణసంచాను సీఐ ప్రశాంత్కుమార్, తహసీల్దార్ వీవీఎల్ నరసింహారావు సమక్షంలో మూటలుగా కట్టి ట్రాక్టర్లోకి లోడ్ చేసి నిశిద్ధ ప్రదేశానికి తరలించారు. ఈ బాణసంచా విలువ రూ.1.94 లక్షలు ఉంటుందని సీఐ ప్రశాంత్కుమార్ తెలిపారు. అనుమతులు లేకుండా బాణసంచా నిల్వ చేసినా, తరలించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. -
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ దుర్మార్గం
కాకినాడ రూరల్: బృహత్తర బాధ్యతగా, తరతరాలకు ఉపయోగపడేలా రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలు, బోధనాస్పత్రు ల నిర్మాణాన్ని గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తే.. నేడు చంద్రబాబు ప్రభుత్వం వాటిని ప్రైవేటు కు అప్పగించాలని నిర్ణయించడం దుర్మార్గమైన చర్యని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడ వైద్య నగర్లోని తన నివాసంలో శుక్రవారం సాయంత్రం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 12 మెడికల్ కాలేజీలుంటే జగన్మోహన్రెడ్డి 17 కాలేజీల నిర్మాణానికి సంకల్పించారన్నారు. వీటిల్లో 5 కళాశాలల్లో అడ్మిషన్లు ప్రారంభించగా, మరో రెండు అడ్మిషన్లకు సిద్ధంగా, 10 కళాశాలు నిర్మాణంలో ఉన్నాయని చెప్పా రు. ఈలోగా ప్రభుత్వం మారడంతో కార్పొరేట్ల పక్షాన నిలిచే చంద్రబాబు వీటిని ప్రైవేటుకు అప్పగించాలని నిర్ణయించారన్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పేదల పక్షాన నిలిచే జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా ముందుకు వెళ్తున్నారన్నా రు. ఇందులో భాగంగా ఉద్యమ నిర్మాణం చేపడుతూ, కోటి సంతకాల సేకరణకు పిలుపునిచ్చారని చెప్పారు. జగన్ పర్యటనకు ప్రభం‘జనం’ :పోలీసుల ద్వారా ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా నర్సీపట్నం వద్ద మెడికల్ కాలేజీ సందర్శనకు గురువారం వచ్చిన వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు ప్రభంజనాన్ని తలపించేలా అన్ని వర్గాల ప్రజలూ తరలివచ్చారని కన్నబాబు అన్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. జగన్ పర్యటనలో దారి పొడవునా ప్రజల నుంచి వచ్చిన వినతులు చూస్తే ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. స్టీల్ప్లాంటును దశల వారీగా మూసివేసే కార్యక్రమం చేపడుతున్నారని, బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీలు వద్దంటూ మత్స్యకారులు నిరసనలు తెలియజేస్తుంటే అణచివేయాలని చూస్తున్నారని అన్నారు. చోడవరం సుగర్ ఫ్యాక్టరీ రైతులు నిరసన తెలియజేస్తున్నారన్నారు. కేజీహెచ్లో 65 మంది గిరిజన విద్యార్థులు కామెర్లతో చికిత్స పొందుతున్నారని, పార్వతీపురం ఆస్పత్రిలో 80 మంది.. ఇలా 600 మంది గిరిజన గురుకుల పాఠశాలల విద్యార్థుల్లో 200 మంది వరకూ అనారోగ్యంతో ఆస్పత్రి పాలవ్వడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. మలమూత్రాలు కలసిన నీరు తాగాల్సిన పరిస్థితి హాస్టల్ విద్యార్థులకు ఉందంటే ఎవరు తలదించుకోవాలని చంద్రబాబును కన్నబాబు ప్రశ్నించారు. ప్రైవేట్కు దోచిపెట్టేందుకే.. : నర్సీపట్నంలో 52 ఎకరాల భూమిని కేటాయించి వైద్య కళాశాల కడుతూంటే ప్రైవేటుకు ఇవ్వాలని ఎలా అనుకుంటున్నారని, పాడేరులో మెడికల్ కాలేజీ కట్టాలనే ఆలోచన 15 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబుకు ఎందుకు రాలేదని కన్నబాబు నిలదీశారు. ప్రైవేటుకు దోచిపెట్టే కార్యక్రమం తప్ప చంద్రబాబు చేసిందేముందన్నారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించే ఆలోచనను వెనక్కి తీసుకోవాలన్నారు. కేజీహెచ్ వద్ద విశాఖ పోలీస్ కమిషనర్ జగన్ పట్ల అనుచితంగా మాట్లాడినట్టు జర్నలిస్టులు చెప్పారని, ఇది సముచితమేనా అని ప్రశ్నించారు. జగన్ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే కాదని, మాజీ సీఎం అని, 2029లో కాబోయే సీఎం అనే విషయం గుర్తు పెట్టుకోవాలని అధికారులకు సూచించారు. ఎవరిని సంతోషపెట్టడానికి అధికారులు పని చేస్తున్నారని కన్నబాబు ప్రశ్నించారు. ఫ ప్రభుత్వ తీరును నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ ఉద్యమం ఫ వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు -
శిక్షణ ముగిసింది.. చేరికే మిగిలింది
ఫ కొత్త గురువులకు ఇండక్షన్ ట్రైనింగ్ పూర్తి ఫ 13న కొలువుల్లో చేరనున్న టీచర్లు రాయవరం: వారంతా ఎంతో శ్రమించారు.. పుస్తకాలతో కుస్తీ పట్టారు.. చివరికి కొలువులు సాధించారు.. తల్లిదండ్రుల కష్టాన్ని చూసి కొందరు.. గురువుల ప్రోత్సాహంతో ఇంకొందరు.. అన్నదమ్ముల ఆదర్శంతో మరికొందరు.. పుట్టిల్లు, మెట్టింటి వారి సహకారంతో.. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో గాథ.. పట్టుదలతో చదివి డీఎస్సీలో విజయం సాధించారు. కొత్తగా కొలువు సాధించిన ఉపాధ్యాయులకు ఇండక్షన్ ట్రైనింగ్ కూడా పూర్తయ్యింది. ఇక కొలువుల్లో చేరడమే తరువాయి. డీఎస్సీ–2025లోఎంపికై న నూతన ఉపాధ్యాయులకు ఈ నెల 3వ తేదీ నుంచి శిక్షణ ఇచ్చారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏడు వెన్యూస్లో ఆయా సబ్జెక్టుల వారీగా ఇచ్చిన శిక్షణ శుక్రవారంతో ముగిసింది. ఇందులో భాగంగా వృత్తిలో పెంపొందించుకోవాల్సిన నైపుణ్యాలను వివరించారు. విద్యాశాఖ ప్రవేశపెట్టిన విధి విధానాలు, కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. నిపుణ్ భారత్ లక్ష్యాలు, విద్యా, బాలల హక్కులు, పాఠ్య ప్రణాళికలు తయారు చేయడం, మూల్యాంకన విధానాలు, లీప్ యాప్, డిజిటల్ టూల్స్, ఐఎఫ్పీలను ఉపయోగించడం, టెక్నాలజీ ద్వారా కొత్త బోధన విధానాలను పరిచయం చేయడం, వృత్తి నైపుణ్యం, నియమాలు పాటించడం, విద్యార్థులకు ఆదర్శంగా నిలవడం తదితర అంశాలపై వీరికి ఎనిమిది రోజుల శిక్షణ ఇచ్చారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 1,668 మంది ట్రైనింగ్ పొందాల్సి ఉండగా, 1,659 మంది హాజరయ్యారు. వివిధ కారణాలతో తొమ్మిది మంది హాజరు కాలేదు. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు 524 మందికి 524, సోషల్ సబ్జెక్టు 131 మందికి 130 మంది, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు 210 మందికి 210, తెలుగు, హిందీ, ఇంగ్లిష్ సబ్జెక్టులకు సంబంధించి 230 మందికి 227 మంది, గణితం, ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్ సబ్జెక్టుల నుంచి 244 మందికి 244 మంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్లు 329 మందికి 324 మంది హాజరయ్యారు. బదిలీ ఉపాధ్యాయులకు మోక్షం అనేక పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా బదిలీ అయిన ఉపాధ్యాయుల్లో పలువురు కోరుకున్న స్థానాల్లో నేటికీ చేరలేదు. ఉపాధ్యాయుల కొరత ఉండడంతో బదిలీ జరిగిన ఉపాధ్యాయులనే వెనక్కి పంపించిన అధికారులు పాఠశాలల నిర్వహణ సాగిస్తున్నారు. కొత్త ఉపాధ్యాయుల చేరికతో బదిలీ అయ్యి రిలీవ్ కాలేని ఉపాధ్యాయుల సమస్యకు పరిష్కారం లభించనుంది. సమర్ధవంతంగా శిక్షణ ఇచ్చాం డీఎస్సీ–2025 ఉపాధ్యాయులకు నిర్వహించిన ఇండక్షన్ ట్రైనింగ్ను సమర్ధవంతంగా నిర్వహించాం. ఎక్కడా ఏ విధమైన లోటుపాట్లకు తావులేకుండా శిక్షణ ఇచ్చాం. నూతన ఉపాధ్యాయులు క్రమశిక్షణతో శిక్షణ తీసుకున్నారు. ఎస్ఆర్పీలు అన్ని అంశాలు వివరించారు. –డాక్టర్ షేక్ సలీం బాషా, డీఈఓ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వెబ్ ఆప్షన్లు పూర్తి కొత్తగా ఎంపికై న ఉపాధ్యాయులకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వెబ్ ఆప్షన్ల నమోదు పూర్తయ్యింది. పోస్టింగ్ ఆర్డర్లు జనరేట్ అయిన తర్వాత ఈ నెల 13న విధుల్లో చేరా ల్సి ఉంటుంది. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. –జి.నాగమణి, ఆర్జేడీ, పాఠశాల విద్యాశాఖ, కాకినాడ నేడు పోస్టింగ్ ఆర్డర్లు శిక్షణలో భాగంగా గురు, శుక్రవారాల్లో ఉపాధ్యాయులు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మేనేజ్మెంట్ల వారీగా ఖాళీలను ప్రకటించారు. వెబ్ లింక్ ద్వారా ఉపాధ్యాయులు వారికి కావాల్సిన పోస్టులను ఎంపిక చేసుకున్నారు. శనివారం ఉపాధ్యాయులకు వారు ఎంచుకున్న స్థానాలను కేటాయిస్తూ పోస్టింగ్ ఆర్డర్లు జనరేట్ అయ్యే అవకాశముంది. వారికి కేటాయించిన స్థానాల ప్రకారం ఈ నెల 13న ఉపాధ్యాయ కొలువుల్లో చేరనున్నారు. -
ఆరోగ్యశ్రీ..కూటమి ఉరి!
● జిల్లాలో 32 ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆస్పత్రులు ● రూ.110 కోట్లకు పైగా బకాయి పెట్టిన సర్కారు ● వెంటనే చెల్లించాలని ఆస్పత్రుల డిమాండ్ ● స్పందించని ప్రభుత్వం ● నిలిచిన ఎన్టీఆర్ వైద్య సేవలు ● నిలిచిపోయిన సర్జరీలు 90 పైనే ● నిరాశతో తిరుగుముఖం పట్టిన రోగులు సాక్షి ప్రతినిధి, కాకినాడ: నిరుపేదల ప్రాణ సంజీవని.. ఆరోగ్యశ్రీకి కూటమి సర్కారు ఉరి బిగిస్తున్నట్టే కనిపిస్తోంది. రెండు దశాబ్దాలుగా పేదలకు అధునాతన, కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్న ఆరోగ్యశ్రీ (ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవ) సేవలపై సర్కారు పిడుగు పడేసింది. ఎన్నిసార్లు విన్నవించుకున్నా కోట్లాది రూపాయల మేర పేరుకుపోయిన బకాయిలను కూట మి ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో జిల్లాలోని దాదాపు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులన్నీ ఈ పథకం కింద వైద్య సేవలను నిలిపివేశాయి. ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపివేసినట్టు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. జిల్లాలో ఎన్టీఆర్ వైద్య సేవల కోసం ప్రతి రోజూ నెట్వర్క్ ఆస్పత్రులకు వెయ్యికి తక్కువ కాకుండా ఔట్ పేషెంట్లు (ఓపీ) వస్తారని అంచనా. ఒక్కో నెట్వర్క్ ఆస్పత్రిలో రోజుకు మూడు నాలుగు సర్జరీలు జరుగుతూంటాయని చెబుతున్నారు. ఈ లెక్కన జిల్లావ్యాప్తంగా 32 నెట్వర్క్ ఆస్పత్రుల్లోనూ సమ్మె తొలి రోజైన శుక్రవారం 90కి పైగా సర్జరీలు నిలిచిపోయాయి. వీటిలో అత్యవసర శస్త్రచికిత్సలు కూడా ఉన్నాయని ఆస్పత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఆయా ఆస్పత్రుల వద్ద ఉచిత వైద్య సేవలను నిలిపివేయడంతో పేద, మధ్యతరగతి ప్రజలు నిరాశతో ఇంటిముఖం పట్టారు. పేదల మనసు తెలిసిన డాక్టర్గా నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. పేద, మధ్య తరగతి కుటుంబాల్లో ఎవరైనా అనారోగ్యానికి గురైతే ముందుగా గుర్తుకు వచ్చేది ఆరోగ్యశ్రీయే. ఈ పథకాన్ని గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరింత పరిపుష్టం చేశారు. రూ.లక్షలు ఖర్చయ్యే ఖరీదైన వైద్యాన్ని కూడా చిల్లిగవ్వ చెల్లించాల్సిన అవసరం లేకుండా ఈ పథకం ద్వారా అందించి, సంపూర్ణ ఆరోగ్యవంతుల్ని చేసేవారు. నిరుపేదల సంజీవనిగా నిలిచిన ఈ పథకం పేరు మార్చేసిన కూటమి సర్కారు.. ఇప్పుడు దీనికి ఏకంగా ఉరి బిగించే దిశగా అడుగులు వేస్తోంది. పదేపదే విన్నవించినా.. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రూ.కోట్లలో బకాయిలు పేరుకుపోయి ఏడాది పైనే అవుతోంది. అప్పటి నుంచీ వీటి చెల్లింపులో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. జిల్లా వ్యాప్తంగానే రూ.110 కోట్లు పైగా ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉంది. గుండె, గుండె సంబంధిత, గొంతు, చెవి, గ్యాస్ట్రో, సర్జరీ, మూత్రపిండ తదితర శస్త్రచికిత్సలకు రావాల్సిన బకాయిలు నిలిచిపోయాయి. ఇవి గుదిబండగా మారి, ఆస్పత్రుల నిర్వహణ ఇబ్బందికరంగా తయారవడంతో ఈ నేపథ్యంలో ఆరేడు నెలలుగా నెట్వర్క్ ఆస్పత్రులు వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తున్నాయి. బకాయిల విడుదలపై సానుకూలంగా స్పందించకుంటే వైద్య సేవలు నిలిపివేస్తామని ప్రభుత్వానికి ఇప్పటికే రెండు పర్యాయాలు విన్నవించాయి. గత ఏప్రిల్ నెలలో ఒకసారి సమ్మెలోకి వెళ్లాయి. అప్పట్లో సీఎం చంద్రబాబు బిల్లులు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో నమ్మి సమ్మె విరమించారు. తీరా చూస్తే చంద్రబాబు ఆ హామీని కూడా షరా మామూలుగానే గాలిలో కలిపేశారని నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నాయి. ఇప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో మండిపడుతున్న నెట్వర్క్ ఆస్పత్రులు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆషా) పిలుపు మేరకు ఎన్టీ ఆర్ వైద్య సేవలను నిలిపివేశాయి. ఈ మేరకు కాకినాడ నగరంలోని దాదాపు అన్ని నెట్వర్క్ ఆస్పత్రుల వద్ద సేవలు బంద్ అంటూ ఫ్లెక్సీలు ప్రదర్శించారు. దీంతో, ప్రభుత్వ ఆస్పత్రులు మినహా మిగిలిన ప్రైవేటు ఆస్పత్రుల్లో ఓపీ, డయగ్నోస్టిక్స్, ఇన్వెస్టిగేషన్ సేవలకు పూర్తిగా బ్రేక్ పడింది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో పేదలు ఖరీదైన వైద్యం అందుకోలేక నానా అగచాట్లూ పడుతున్నారు. -
ఇంటర్ పరీక్ష ఫీజుకు గడువు పెంపు
అమలాపురం టౌన్: ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపునకు ముందుగా ప్రకటించిన ఈ నెల 10వ తేదీ కాకుండా, ఆ గడువును ఈ నెల 22 వరకూ ఇంటర్మీడియెట్ విద్యా మండలి పెంచిందని డీఐఈఓ వనుము సోమశేఖరరావు తెలిపారు. ఈ విషయాన్ని అమలాపురంలో శుక్రవారం ఆయన తెలిపారు. గడవు తర్వాత ఈ నెల 30వ తేదీ వరకూ రూ.వెయ్యి అపరాధ రుసుంతో ఫీజు చెల్లించే అవకాశం ఉందన్నారు. మ్యాఽథమెటిక్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ : అమలాపురం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యలో ప్రవేశపెట్టిన సంస్కరణల నిమిత్తం మ్యాథమెటిక్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ జరిగింది. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకులు పాల్గొని బోధనా అంశాలపై చర్చించారు. డీఐఈఓ సోమశేఖరరావు హాజరై అధ్యాపకులకు పలు అంశాలు వివరించారు. -
వైద్య కళాశాలలు ప్రజల ఆస్తి
● వాటి నిర్వీర్యానికి కూటమి కుట్రలు ● ప్రజా చైతన్యంతో చలో నర్సీపట్నం విజయవంతం ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా తుని రూరల్: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కేంద్రంతో పోరాడి తీసుకువచ్చిన 17 వైద్య కళాశాలలు రాష్ట్ర ప్రజల ఆస్తి అని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు కోటి సంతకాల ప్రజా ఉద్యమం పోస్టర్లను ఎస్.అన్నవరంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ, జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వైద్య విద్యార్థులకు, ప్రజలకు మేలు చేసేందుకు ఒక్కో వైద్య కళాశాలలకు 50 ఎకరాల చొప్పున భూ సేకరణ జరిపిందని చెప్పారు. ఈ కళాశాలలు పూర్తయితే 630 పడకల ప్రభుత్వాస్పత్రులు ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇప్పటికే ఐదు కళాశాలల్లో రెండేళ్లుగా తరగతులు నిర్వహిస్తున్నారని, తరగతుల నిర్వహణకు మరో రెండు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. పది కళాశాలల నిర్మాణాలు వివిధ దశల్లో ఉండగా.. వీటిని తన తాబేదార్లకు కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ విధానంలో కంకణం కట్టుకుందన్నారు. 17 వైద్య కళాశాలల్లో వైద్య విద్యతో పాటు కోట్లాది మందికి వైద్య సేవలు అందుతాయని చెప్పారు. అటువంటి మహత్తరమైన వైద్య కళాశాలలను నిర్వీర్యం చేసేందుకు కూటమి ప్రభుత్వం పన్నాగాలు పన్నుతోందని మండిపడ్డారు. ఏ విద్యార్థి అయినా ప్రభుత్వ వైద్య కళాశాలల్లోనే సీట్లు కావాలనుకుంటారని అన్నారు. విశాఖపట్నంలో ఆంధ్రా మెడికల్ కాలేజీకి అనుబంధంగా కేజీహెచ్ ఉందన్నారు. గీతం, నారాయణ వంటి ప్రైవేట్ కాలేజీలున్నప్పటికీ ఆంధ్రా, రంగరాయ మెడికల్ కాలేజీల్లో సీట్ల కోసమే విద్యార్థులు పోటీ పడతారని చెప్పారు. అందుకే జగన్ పర్యటన స్పీకర్ హోదాలో ఉన్న అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ లేదని, జీఓ లేదని అంటూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించారని, ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్కడ పర్యటించి, కాలేజీ నిర్మాణాలను చూపించారని రాజా అన్నారు. అడ్డంకులు, నిర్బంధాలను దాటుకుని మరీ లక్షలాదిగా వచ్చిన ప్రజలు జగన్తో పాటు కాలేజీ నిర్మాణాలను కళ్లారా చూశారని చెప్పారు. తిమ్మిని బమ్మి చేసేందుకు చంద్రబాబుతో పాటు కొన్ని పత్రికలు ఆరాటపడుతున్నాయని దుయ్యబట్టారు. వైద్య సేవల్లో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై సాక్షాత్తూ రాజోలు ఎమ్మెల్యేనే అసంతృప్తి వ్యక్తం చేశారన్నారు. రక్షిత నీరు అందించని సర్కారు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నాడు–నేడుతో అన్ని పాఠశాలల్లోని విద్యార్థులకూ ఆర్వో వాటర్ అందిస్తే.. ఈ ప్రభుత్వం వాటిని అటకెక్కిస్తోందని రాజా మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో ఈ ఆర్వో ప్లాంట్ల నిర్వహణను గాలికొదిలేసిందన్నారు. ఫలితంగానే కలుషిత నీరు తాగి విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారని చెప్పారు. గుంటూరులోనూ ఇదే పరిస్థితి నెలకొన్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. రాష్ట్రంలో ప్రజలకు రక్షిత నీరు అందించలేని ప్రభుత్వం కర్ణాటకకు తాగునీరు అందిస్తామనడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. కల్తీ మద్యం తయారీ, విక్రయాలతో రూ.వేల కోట్లు కొల్లగొడుతున్నారన్నారు. సంపద సృష్టించడం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. రాజకీయ నాయకుల్లా అధికారులు కూడా మాజీ సీఎం జగన్ను ఎమ్మెల్యే అంటూ వ్యంగ్యంగా మాట్లాడటం సరికాదని, భవిష్యత్తులో ఏ ముఖం పెట్టుకుని సెల్యూట్ చేస్తారని ప్రశ్నించారు. 2029లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డేనని చెప్పారు. పోలీసులు, అధికార పక్షం జగన్ పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే ప్రాణాలకు తెగించి మరీ ప్రజలు తరలివచ్చి చలో నర్సీపట్నం కార్యక్రమాన్ని విజయవంతం చేశారని రాజా అన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రాయి మేరీ అవినాష్, పార్టీ తుని రూరల్, పట్టణ, తొండంగి, కోటనందూరు మండలాల అధ్యక్షులు దుంగల నాగేశ్వరరావు, అన్నవరం శ్రీను, బత్తుల వీరబాబు, చింతకాయల చినబాబు, రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు అన్నంరెడ్డి వీరరాఘవులు, ఆత్మ మాజీ చైర్మన్ చోడ్రాజు రాంబాబురాజు, సీనియర్ నాయకులు గొర్లి రామచంద్రరావు, చింతల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
‘సత్యదీక్ష’కు ప్రచారమేదీ..?
అన్నవరం: రత్నగిరి వాసుడు సత్యదేవుని సత్య దీక్ష అంటే గోదావరి జిల్లాల్లో ఎంతో ప్రాధాన్యం ఉంది. ఏటా ఈ దీక్షలను భక్తిశ్రద్ధలతో పాటించేవారు వందల్లో ఉంటారు. అల్లూరి జిల్లా ఏజెన్సీలో కూడా వందలాది మంది గిరిజనులు చేపడుతుంటారు. కార్తిక మాసానికి ముందు వచ్చే సత్యదేవుని జన్మనక్షత్రం ‘మఖ’ నాడు సత్య దీక్షలు ప్రారంభమవుతాయి. 27 రోజుల అనంతరం కార్తిక మాసంలో వచ్చే స్వామివారి జన్మనక్షత్రం రోజున ముగుస్తాయి. 27 రోజుల దీక్షలు చేయలేని వారి, మహిళల కోసం 18 రోజులు, తొమ్మిది రోజుల దీక్షలు కూడా ఉంటాయి. దీక్షల ముందు రోజు రాత్రి రత్నగిరిపై సత్యదేవుని పడిపూజ ఘనంగా నిర్వహిస్తారు. దీనిపై వివరంగా తెలియజేసేందుకు కనీసం నెల రోజుల ముందు నుంచి ప్రచారం చేసేవారు. ఈ ఏడాది 17వ తేదీ నుంచి దీక్షలు ప్రారంభం కానున్నా, ఇంత వరకూ ఎలాంటి ప్రచారం చేయకపోవడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రచార రథంతో జిల్లా అంతా సమాచారం చేరవేసేవారు. అదేవిధంగా గిరిజన భక్తులకు దీక్షా వస్త్రాలు, మాలలు ఉచితంగా అందజేసేవారు. ఇప్పుడూ అదే విధంగా చేస్తారా.. లేదా అనే దానిపై స్పష్టత లేదు. ఇవీ నియమాలు : పసుపు వస్త్రాలు ధరించి సత్యదేవుని ఆలయం లేదా, మరే ఇతర ఆలయంలోనైనా అర్చకుడు లేదా గురుస్వామి లేదా తల్లి చేతుల మీదుగా తులసి మాల ధరించి సత్యదీక్ష చేపట్టవచ్చు. ఈ నియమాలన్నీ స్వామి అయ్యప్ప నియమాలలా ఉంటాయి. ప్రాతః కాలానికి ముందు నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకుని సత్యదేవుని పూజ చేయడం, అదే విధంగా సూర్యాస్తమయం తరువాత స్వామివారికి పూజ చేయడం ప్రధానాంశాలు. స్వాములు ఒక పూట భోజనం, రాత్రి వేళ ఫలహారం, నేలపై నిద్ర, బ్రహ్మచర్యం పాటించడం, మాంసాహారం, ఉల్లిపాయ వంటివి తీసుకోకుండా ఉండడం చేయాలి. ఎవరినీ పరుషంగా మాట్లాడరాదు. స్వాములందరినీ సత్యదేవుని స్వరూపంగా భావించి గౌరవించాలి. మరో వారమే గడువు : సత్యదీక్షల ప్రారంభానికి మరో వారం రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికై నా దేవస్థానం అధికారులు స్పందించి దీని గురించి ప్రచారం చేయాలని భక్తులు కోరుతున్నారు. అదే విధంగా ఏజెన్సీ గిరిజన భక్తులకు సత్యదీక్ష వస్త్రాలు, మాలలు పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.ఫ రత్నగిరిపై 17 నుంచి ప్రారంభం ఫ ఇంకా వివరాలు ప్రకటించని అధికారులు -
ఆరోగ్యశ్రీ.. తీస్తున్నారా ఊపిరి!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఎంతో మంది ప్రాణాలు నిలిపి.. ఎన్నో కుటుంబాల్లో కొత్త వెలుగులను ప్రసరింపజేసి.. ఆపన్నులకు అపర సంజీవనిగా నిలిచిన ఆరోగ్యశ్రీ (కూటమి సర్కారు ‘ఎన్టీఆర్ వైద్య సేవ’గా పేరు మార్చింది) ఊపిరిని ఆపివేసేందుకు కూటమి సర్కారు శతవిధాల ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ పథకం కింద నెట్వర్క్ ఆస్పత్రులకు ఏడాదికి పైబడి కోట్లాది రూపాయల మేర బకాయిలు పెట్టింది. ఈ బకాయిల గుదిబండను ఇక మోయలేమంటూ నెట్వర్క్ ఆస్పత్రులు శుక్రవారం నుంచి సమ్మె బాట పడుతున్నాయి. ఈ పథకం కింద కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందుకుంటున్న పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఈ వార్త అశనిపాతమే అవుతోంది. పైసా ఖర్చు లేకుండా.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేసింది. పేద, మధ్య తరగతి ప్రజలకు పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించింది. క్యాన్సర్ వంటి ఖరీదైన జబ్బుల చికిత్సకు పరిమితి లేకుండా సాయం అందించింది. ఈ పథకం కింద 1,059 ప్రొసీజర్లు (చికిత్సలు) అందిస్తూండగా.. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ సంఖ్యను ఏకంగా 3,257కి పెంచారు. అంతే కాకుండా, కుటుంబానికి రూ.5 లక్షల వరకూ ఉన్న చికిత్స పరిమితిని ఏకంగా రూ.25 లక్షలకు పెంచారు. తద్వారా పేదల ఆరోగ్యానికి ఎంతో భరోసా కల్పించారు. జిల్లాలో ఎన్టీఆర్ వైద్యసేవ నెట్వర్క్ ఆస్పత్రులు 32 ఉన్నాయి. వీటిల్లో ప్రతి రోజూ 2,500 వరకూ ఓపీ నమోదవుతుండగా ఇన్ పేషెంట్లుగా ఐదారు వందల మంది వరకూ ఈ పథకం కింద చేరుతున్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాల్లోని రోగులకు ప్రతి నెలా రూ.25 కోట్ల విలువైన శస్త్రచికిత్సలు జరుగుతున్నాయని అంచనా. ఈవిధంగా పేదల పాలిట కల్పతరువుగా నిలిచిన ఈ మహత్తర పథకానికి మంగళం పాడేందుకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి సర్కారు ఎత్తులు వేస్తోంది. ఈ పథకం స్థానంలో ఆరోగ్య బీమా ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే నెట్వర్క్ ఆస్పత్రులకు కోట్లాది రూపాయల మేర బకాయిలు చెల్లించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బకాయిల గుదిబండ జిల్లాలోని ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం రూ.110 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఒక్కో ఆస్పత్రికి రూ.2 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకూ బకాయిలున్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అప్పుడే ఏడాదిన్నర అవుతోంది. ఈ బకాయిలు కూడా ఏడాది నుంచి తొమ్మిది నెలల కాలంలో ఉన్నవే. వీటిని వెంటనే విడుదల చేయాలని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆషా) నెల రోజుల క్రితం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కానీ, ప్రభుత్వం స్పందించలేదు. దీంతో, రాష్ట్రవ్యాప్తంగా నెట్వర్క్ ఆస్పత్రుల సమ్మె అనివార్యమైంది. ఇంత కాలం పంటి బిగువన సమస్యలు భరించామని, ఇక తమ వల్ల కాదని నెట్వర్క్ ఆస్పత్రులు స్పష్టం చేస్తున్నాయి. కోట్లాది రూపాయల మేర బకాయిలు చెల్లించకపోతే తాము ఎంత కాలం వైద్య సేవలు అందించగలుగుతామని ప్రశ్నిస్తున్నాయి. నెట్వర్క్ ఆస్పత్రులకు బకాయిల విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి స్పష్టంగా వివరించినా ఫలితం లేదని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో గత నెల 25న సమావేశమైన ఆషా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నామని నెట్వర్క్ ఆస్పత్రుల ప్రతినిధులు చెబుతున్నారు. ఈ మేరకు కాకినాడ సహా జిల్లాలోని 32 ప్రైవేటు, కార్పొరేట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ఆయా ఆస్పత్రుల్లో రోగులకు సహకారం అందించే ఆరోగ్యశ్రీ హెల్ప్ డెస్క్లలో ఆరోగ్య మిత్రలు లేకుండా చేస్తున్నారు. ప్రజల ఆందోళన నెట్వర్క్ ఆస్పత్రులు సమ్మె బాట పట్టడంతో ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచిత చికిత్సలు అందక తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని రోగులు, వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆరోగ్యశ్రీపై ఉచిత వైద్య సేవలు పొందేందుకు నెట్వర్క్ ఆస్పత్రులకు వచ్చే రోగులు సొమ్ము చెల్లిస్తేనే వైద్యం అందే పరిస్థితి కనిపిస్తోంది. సొమ్ము చెల్లించే స్తోమత లేని వారు ప్రాణాలు అరచేత పట్టుకుని వెనుతిరగాల్సిన దుస్థితి ఏర్పడనుంది. బకాయిలు విడుదల చేయకపోవడం అన్యాయం ఆరోగ్యశ్రీకి జవసత్వాలు లేకుండా చేయాలనుకోవడం అన్యాయం. నెట్వర్క్ ఆస్పత్రులకు కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయినా కూటమి సర్కారు స్పందించకపోతే ఇక పేదలకు వైద్యం ఎలా అందుతుంది? జిల్లాలోని దాదాపు అన్ని నెట్వర్క్ ఆస్పత్రులకూ రూ.100 కోట్ల బకాయిలు పేరుకుపోయినట్టు వైద్యులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి ఏడాదిన్నర అవుతోంది. ఇంతవరకూ బకాయిలు విడుదల చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం చూస్తూంటే పేదల ఆరోగ్యంపై ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోంది. – గుబ్బల తులసీకుమార్, జెడ్పీటీసీ సభ్యుడు, యు.కొత్తపల్లి పేదల ఆరోగ్యానికి తూట్లు పొడవకండి పేదల ఆరోగ్యానికి తూట్లు పొడవకండి. నిరుపేదలు, మధ్య తరగతి కుటుంబాలకు ఆరోగ్యశ్రీ పథకం ఒక వరం లాంటిది. ఆ పథకం పేరును కూటమి ప్రభుత్వం మార్చేసినంత మాత్రాన ఆ వర్గాలకు ఒరిగిందేమీ లేదు. ఆరోగ్యశ్రీ రూపురేఖలనే మార్చేస్తున్నారు. సేవలను కుదించేసి ఆ పథకాన్నే నీరుగార్చేసేందుకు పాలకులు కుట్రలు పన్నుతున్నారు. బకాయిలు విడుదల చేయకుండా నెట్వర్క్ ఆస్పత్రుల్లో పేదలకు వైద్యం ఉచితంగా చేయమంటే ఎలా చేస్తారు? అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయిపోయినా ఇంతవరకూ బకాయిలు విడుదల చేయకపోడం అన్యాయం. – జమ్మలమడక నాగమణి, పౌర సరఫరాల సంస్థ మాజీ డైరెక్టర్ నేటి నుంచి నిలిచిపోనున్న ఎన్టీఆర్ వైద్య సేవలు జిల్లాలో నెట్వర్క్ ఆస్పత్రులు 32 ఏడాది కాలంగా రూ.110 కోట్లు పైనే బకాయిలు నేటి నుంచి సేవల బంద్కు ఆషా పిలుపు -
ప్రమాద రహితంగా బాణసంచా తయారు
కొత్తపేట: ప్రమాద రహితంగా బాణాసంచా తయారీకి యజమానులు, సిబ్బంది ఫైర్ నిబంధనలు పాటిస్తూ , జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ రాహుల్ మీనా సూచించారు. జిల్లాలోని రాయవరం బాణసంచా తయారీ కేంద్రంలో బుధవారం భారీ విస్ఫోటం సంభవించి 8 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్పీ రాహుల్ మీనా జిల్లాలోని బాణసంచా తయారీ కేంద్రాల తనిఖీల్లో భాగంగా కొత్తపేట మండల పరిధిలోని బాణసంచా తయారీ కేంద్రాలను, దీపావళి బాణసంచా హోల్సేల్ షాపులను గురువారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల లైసెన్స్లు, వాటిని రెన్యువల్ చేశారా? ఆయా కేంద్రాల వద్ద, పరిసరాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారా? నిర్లక్ష్యంగా ఉన్నారా? అని నిశితంగా పరిశీలించారు. ఆయా కేంద్రాల యజమానులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. బాణసంచా కేంద్రాల వద్ద అగ్నిమాపక రక్షణ పరికరాలు ఉంచుకోవాలని, ఇసుక, నీరు అందుబాటులో ఉంచాలని, సీసీ టీవీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రమాదం సంభివిస్తే ప్రాణనష్టం జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా బాణసంచా కేంద్రాల వద్ద ధూమపానం చేయకుండా చూడాలని, మండే గుణం కలిగిన వస్తువుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, మైనర్లను పనిలో చేర్చుకోరాదని సూచించారు. ఎస్పీ వెంట రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్, ఎస్బీ సీఐ పుల్లారావు, కొత్తపేట ఎస్సై జీ సురేంద్ర ఉన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం ● నేడు పరావాసుదేవి అలంకరణలో శేష వాహనంపై ఊరేగింపు ● ముస్తాబైన కోనసీమ తిరుమల క్షేత్రం కొత్తపేట: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ, భూ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు ఈ నెల 18 వరకూ వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఆలయాన్ని, రాజగోపురంతో సహా ఉపాలయాలను, పరిసరాలను ఆ ప్రాంగణాన్ని, రంగు రంగుల పుష్పాలంకరణలు, విద్యుత్ దీప తోరణాలతో శోభాయమానంగా అలంకరించారు. స్వామివారు వివిధ అలంకరణలతో విహరించే వాహనాలను ముస్తాబు చేశారు. వాహన సేవలు, నిరంతరాంగా సాగే సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకోనున్నాయి. తొలిరోజు ఉదయం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రుత్విక్ వరుణ, దీక్షాధారణ, విశేషార్చన, నీరాజనం, సాయంత్రం వాస్తు హోమం, ధ్వజ పతాక హోమాలు నిర్వహించనున్నారు. రాత్రి స్వామి వారిని పరావాసుదేవ అలంకరణలో శేషవాహనంపై ఊరేగించనున్నారు. ఆ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తెలిపారు. -
రాజమహేంద్రవరం కమిషనర్గా జేసీ రాహుల్ మీనా
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్గా బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముఖేష్కుమార్ మీనా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జేసీగా మీనా సుమారు ఏడాది కాలం పాటు జిల్లాలో పని చేశారు. ఆయన స్థానంలో జాయింట్ కలెక్టర్గా ఎటపాక సబ్ కలెక్టర్ అపూర్వ భరత్ను నియమించారు. ఇదిలా ఉండగా కాకినాడ నగర పాలక సంస్థ కమిషనర్ భావన కూడా బదిలీ అయ్యారు. ఆమెను బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్గా నియమించారు. భావన ఇక్కడ సుమారు 15 నెలల పాటు కమిషనర్గా పని చేశారు. నేడు దిశ సమావేశం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం కలెక్టరేట్లోని వివేకానంద సమావేశ మందిరంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు జరుగుతుంది. కలెక్టర్ షణ్మోహన్ గురువారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు విధిగా హాజరు కావాలన్నారు. ఆయా శాఖలు అమలు చేస్తున్న వివిధ పథకాలు, అభివృద్ధిపై సమీక్ష ఉంటుందని పేర్కొన్నారు. జక్కంపూడి రామ్మోహనరావుకు ఘన నివాళి రాజమహేంద్రవరం సిటీ: ప్రజా పోరాట యోధుడు, మాజీ మంత్రి, తన తండ్రి జక్కంపూడి రామ్మోహనరావు ఆశయ సాధనకు కృషి చేస్తామని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. జక్కంపూడి రామ్మోహనరావు 14వ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక కంబాల చెరువు సెంటర్లో ఆయన విగ్రహానికి గురువారం ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ, బడుగు, బలహీన వర్గాలు, కార్మిక లోకం అభ్యున్నతి కోసం తన తండ్రి నిరంతరం పోరాడారని గుర్తు చేశారు. ఆయన పోరాట స్ఫూర్తిని ఆయుధంగా తీసుకుని ముందుకు వెళ్తున్నానని చెప్పారు. ఆయన ఆశయ స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, పేదల సంక్షేమానికి నిరంతరం కృషి చేసిన జక్కంపూడి రామ్మోహనరావు.. వారి హృదయాల్లో చెరగని ముద్ర వేశారని అన్నారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, పార్టీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు పోలు విజయలక్ష్మి, నాయకులు నీలి ఆనంద్, మహ్మద్ ఆరిఫ్, నరవ గోపాలకృష్ణ, మానే దొరబాబు తదితరులు పాల్గొన్నారు. -
పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను చెల్లించాలి
● వేతన సవరణ కమిటీని నియమించాలి ● ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ డిమాండ్ అమలాపురం టౌన్: పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను ఈ ప్రభుత్వం తక్షణమే ఉద్యోగులకు చెల్లించాలని, వేతన సవరణ కమిటీని నియమించాలని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ జేఏసీ చైర్మన్ ఆలపాటి విద్యాసాగర్ డిమాండ్ చేశారు. అమలాపురం సత్యసాయి కల్యాణ మండపంలో జిల్లా ఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. జిల్లా ఎన్జీవో అసోసియేషన్ ఇన్చార్జి అధ్యక్షుడు ఎం.వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు, కూటమి ప్రభుత్వం తమ పట్ల వహిస్తున్న నిర్లక్ష్యంపై చర్చించింది. వేతన సవరణ కమిటీని వేస్తామని ఇచ్చిన హామీ నేటికీ అమలు కాలేదని విద్యాసాగర్ అసహనం వ్యక్తం చేశారు. అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. హెల్త్ కార్డు సిస్టంను క్రమబద్ధీకరణ చేసి ఉద్యోగులకు వైద్యం అందించేలా సహకరించాలన్నారు. రాష్ట్ర అసోసియేషన్ కార్యదర్శి డి.వెంకటరమణ, ఉపాధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాస్ మాట్లాడుతూ పీఆర్సీ కమిషన్ను నియమించి, ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా ఎన్జీవో అసోసియేషన్కు నూతన అడహక్ కమిటీని సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. జిల్లా అధ్యక్షుడిగా మాధవరపు వెంకటేశ్వర్లు, కన్వీనర్గా గుత్తుల వెంకటేశ్వరరావు, కోశాధికారిగా గుర్రాల సురేష్ సింగ్, సభ్యులుగా తాడి ఏసుబాబు, రూతమ్మ, సీహెచ్ చిట్టిబాబు, పి.రవిలను సమావేశం ఎన్నుకుంది. అసోసియేషన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి పేపకాయల వెంకట కృష్ణ, జిల్లా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.సాయి ప్రసాదరావుతోతోపాటు జిల్లాలోని తాలూకా యూనిట్స్ కార్యవర్గ ప్రతినిధులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
మందుపాతరలతో సహజీవనం
తనిఖీ చేసిన కేంద్రంలోనే భారీ ప్రమాదం తయారీ కేంద్రాల వద్ద తీసుకుంటున్న రక్షణ చర్యలు, అధికారుల తనిఖీలు కూడా లోపభూయిష్టంగా ఉంటున్నాయి. ఉండాల్సిన స్థాయిలో వాటర్ ట్యాంకులు ఉన్నాయా? ఇసుక నిల్వలు ఉంచారా? తయారీ కేంద్రం ఊరికి దూరంగా ఏర్పాటు చేశారా లేదా? మంటలను ఆర్పే కార్బన్ డయాకై ్సడ్ కిట్టు ఉందా లేదా చూసి లైసెన్సులు రెన్యువల్ చేయడం, కొత్తగా ఏర్పాటు చేసుకుంటే అనుమతులు మంజూరు చేస్తున్నారు. రాయవరంలో ప్రమాదానికి గురైన బాణసంచా తయారీ కేంద్రాన్ని కూడా అధికారులు ఇటీవల తనిఖీ చేసి రెన్యువల్ చేశారు. అటువంటి చోటే భారీ ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం. సాక్షి, అమలాపురం: మందుగుండు సామగ్రి తయారు చేసే బాణసంచా తయారీ కేంద్రాలలో పని చేయడం అంటే ప్రాణాలను పణంగా పెట్టడమే. మిగిలిన చోట్ల ఏమోకాని.. బాణసంచా తయారీ కేంద్రంలో పనిచేయడం అంటే మృత్యువుతో నిత్యం చెలగాటం ఆడడమే. అది తెలిసి కూడా కార్మికులు, కూలీలు పొట్ట కూటికోసం వీటిలో పనిచేసేందుకు వెళుతున్నారు. మందుపాతర మీద కూర్చుని జీవన పోరాటం సాగిస్తున్నారు. దురదృష్టవశాత్తూ ప్రమాదాలు జరిగితే మృత్యువు బారిన పడుతున్నారు. గాయాలతో బయట పడినా జీవచ్ఛవాలుగా మారుతున్నారు. అనుమతి లేని కేంద్రాలే అధికం రాయవరంలో శ్రీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్ుక్సలో బుధవారం పెను విస్ఫోటం జరిగి ఎనిమిది మంది మృత్యువాత పడగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలై ప్రాణాలతో పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో బాధితులంతా అతి పేద కుటుంబాలకు చెందినవారే కావడం గమనార్హం. జీవనోపాధి కోసం ప్రాణాలు పణంగా పెట్టి మరీ వీరు ఇక్కడ పని చేస్తున్నారు. కోనసీమ జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రాలు అధికారికంగా 18 వరకు ఉండగా, ఒక స్టోరేజ్ కేంద్రం ఉంది. కాని వాస్తవంగా అనుమతి లేని కేంద్రాలు చాలా ఉన్నాయి. అనుమతి ఉన్న కేంద్రాలలో మాత్రమే అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమతి లేని తయారీ కేంద్రాలు, అమ్మకం దుకాణాల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఇటీవల అయినవిల్లి మండలం విలసలో ఇంటిలో నిల్వ ఉంచిన బాణసంచా పేలడం వల్ల ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. కార్మికుల రక్షణ పట్టని అధికారులు ● నిబంధనల ప్రకారం అన్ని రక్షణ చర్యలు తీసుకుంటేనే అనుమతులు ఇస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే ఇందులో పనిచేస్తున్న కార్మికుల రక్షణ విషయాన్ని మాత్రం అధికారులు పట్టించుకోవడంలేదు. ● బాణసంచా తయారీ కేంద్రంలో ప్రమాదం జరిగితే తొలుత బలైపోతున్నది కార్మికులు. ఇక్కడ పనిచేసే వారిలో 90 శాతం మంది రోజువారీ కూలీలే. వీరెవ్వరూ వృత్తి నైపుణ్యం ఉన్నవారు కాదు. అనుభవం ఉన్న కార్మికులకు సైతం బాణసంచాకు ఉపయోగించే రా మెటీరియల్పై అవగాహన ఉండదు. ఎటువంటి రసాయనాల సమ్మేళనం వల్ల పేలుడు సంభవిస్తుందనే అవగాహన సైతం వారికి లేదు. ● బాణసంచాలో పెద్ద శబ్దాలు వచ్చేందుకు అమోనియం నైట్రేట్ను అధికంగా వినియోగిస్తున్నారు. ఇది కొద్దిపాటి ఒత్తిడి పెరిగితే పేలిపోయే స్వభావం ఉంటుంది. అయితే పనిచేసే వారికి ఈ అవగాహన లేకుండా పోతోంది. ● పొటాషియం నైట్రేట్, మెగ్నీషియం పౌడర్, సల్ఫర్ రసాయనాలు అధికంగా వాడతారు. ఇవి వాడేటప్పుడు కనీస రక్షణ చర్యలు తీసుకోవాలి. పౌడర్గా తగు పాళ్లలో కలిపి క్రేకర్స్ తయారు చేయాల్సి ఉంది. ● బాణసంచా తయారు కేంద్రాల్లో అన్ని రసాయనాలు కలిపి నూరడం వల్ల పేలుడుకు దారి తీస్తాయి. విడివిడిగా ఫార్ములా తయారు చేయాలి. అన్ స్కిల్డ్ లేబర్తో నూరిస్తున్నారు. అదే పేలుళ్లకు దారి తీస్తోంది. ● బాణసంచా తయారు చేసే ప్రతి కార్మికునికి చేతులకి గ్లౌజ్లుండాలి. అగ్ని బారిన పడకుండా ప్రత్యేక వస్త్రాలు వేసుకోవడంతోపాటు తలకు హెల్మెట్ పెట్టుకోవాలి. ముఖానికి మాస్క్ తప్పనిసరి. తయారు చేస్తున్న బాణసంచా, దానికి వాడే రసాయనాలు, వాటిని ఎలా కలపాలి అనే దానిపై కార్మికుడికి అవగాహన కల్పించాల్సి ఉంది. కాని ఎక్కడా ఇటువంటివి పాటించడం లేదు. ● బాణసంచా తయారు చేస్తున్నప్పుడు కార్మికులు, కూలీల ఒంటికి రసాయనాలు దట్టంగా పట్టేస్తున్నాయి. కాళ్లు, చేతులు, ముఖం, వేసుకున్న దుస్తులకు రసాయనాలు పట్టడం వల్ల పేలుడు సమయంలో వారు కూడా పూర్తిగా కాలిపోతున్నారు. ఒకవేళ తీవ్ర గాయాలై ప్రాణాలతో బయటపడినా రసాయనాల వల్ల మండిపోయిన శరీరంతో జీవచ్ఛవాలుగా మారుతున్నారు. కనీసం గుర్తు పట్టేందుకు కూడా వీలు లేకుండా వారి శరీరాలు మారిపోతున్నాయి. జిల్లాలో ఇంచుమించు ప్రతి బాణసంచా కేంద్రంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ● రసాయనాలతో బాణసంచా తయారు చేసేటప్పుడు ప్రతీ కార్మికుని ముఖానికి మాస్క్ తప్పనిసరి. అయితే ఒక్కచోట కూడా ఈ పద్ధతి అవలంబించట్లేదు. దీనివల్ల కార్మికులు తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఊపిరితిత్తులు దెబ్బ తినడంతో పాటు చర్మవ్యాధులు ప్రబలుతున్నాయి. కొంతమంది చిన్న వయసులోనే క్యాన్సర్ల బారిన పడుతున్నారు. ● దీపావళి సమయంలో పెద్ద ఎత్తున వచ్చే ఆర్డర్ల కోసం తయారీదారులు అప్పటికప్పుడు సాధారణ కూలీలను కూడా పనిలో పెట్టుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీరికి తయారు చేసే అనుభవం లేకపోవడం వల్ల పేలుళ్లు సంభవిస్తున్నాయి. ● చిన్న పిల్లలను, మహిళలను మందుగుండు సామగ్రి తయారు చేసేందుకు అనుమతించ కూడదు. కానీ రాయవరంలో జరిగిన పేలుడులో మృతి చెందినవారిలో ఐదుగురు మహిళలే. ● ఇంత జరుగుతున్నా వీటిపై నిఘా పెట్టాల్సిన రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక, కార్మిక, వైద్య శాఖలు వీటి వైపు కన్నెత్తి చూడడం లేదు. వారి నిర్లక్ష్యమే కార్మికుల పాలిట శాపంగా మారింది.09ఎఎంపీ04: బాణసంచా కేంద్రాల్లో భద్రత లేని కూలీలు కనీస రక్షణ కరవు చుట్టూ పేలుడు పదార్థాలు ఒంటి మీద కూడా రసాయనాలే అందుకే ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోతున్న కార్మికులు ఘటనా స్థలంలోనే మృత్యువాత నిపుణులు కూడా కొరత దీపావళి సమయంలో తాత్కాలికంగా కూలీల నియామకం ఆర్డర్ల పేరుతో విశ్రాంతి లేకుండా పనులు రసాయనాల పట్ల అవగాహన ఉండాలి బాణసంచా తయారు చేసేందుకు వాడే రసాయనాలపై ప్రతి కార్మికునికి, కూలీలకు అవగాహన ఉండాలి. ఇందుకు ప్రభుత్వం ఆధ్వర్యంలో వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సి ఉంది. రసాయనాలను కలిపే సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఇవన్నీ మండే కారకాలే. కార్మికుల ఒంటి నిండా రసాయనాలు ఉంటున్నాయి. ఈ కారణంగానే చిన్న నిప్పురవ్వ రాజుకున్నా పేలుడు సంభవించడం, కార్మికుల చనిపోవడం పరిపాటిగా మారింది. – పెచ్చెట్టి కృష్ణ కిషోర్, రసాయన శాస్త్ర అధ్యాపకుడు, గోదావరి కాలుష్యంపై అధ్యయనకర్త, అమలాపురం -
పొగాకు నాట్లు ప్రారంభం
పరిమితికి మించి పంట వేయవద్దు పొగాకు బోర్డు ఇచ్చిన పరిమితికి లోబడి పంట వేయాలి. బ్యారన్కు 1.6 హెక్టార్ల విస్తీర్ణంలో పంట వేసి 35 క్వింటాళ్లు ఉత్పత్తి చేయాలి. అధిక విస్తీర్ణంలో పంట సాగు అనర్థదాయకమే. అంతర్జాతీయంగా పొగాకు ఉత్పత్తులు గణనీయంగా పెరుగుతున్నట్టు సంకేతాలు వస్తున్నాయి. పురుగు మందుల అవశేషాలు లేని నాణ్యమైన పొగాకు ఉత్పత్తి చేయాలి. వరి పంట వేసిన బాడవ భూములు, పల్లపు ప్రాంత భూముల్లో సాగు చేయవద్దు. నారుమడిలో మేలైన నారును ఎంచుకుని నాట్లు వేసుకోవాలి. రిజిస్ట్రేషన్ గల నర్సరీల నుంచి నారు కొనుగోలు చేయాలి. అప్పర్ ఎన్ఎల్ఎస్లో నాట్లు జరుగుతున్నాయి. దేవరపల్లి, గోపాలపురం వేలం కేంద్రాల పరిధిలో రెండు రోజులుగా నాట్లు వేస్తున్నారు. ఎక్కువ మంది రైతులు ట్రే నారు నాట్లు వేస్తున్నారు. – జీఎల్కే ప్రసాద్, పొగాకు బోర్డు రీజనల్ మేనేజరు, రాజమహేంద్రవరందేవరపల్లి: మన జిల్లాతో పాటు ఏలూరు జిల్లాలోని మెట్ట ప్రాంతంలో ప్రధాన వాణిజ్య పంటగా పండిస్తున్న వర్జీనియా పొగాకు సాగుకు రైతులు శ్రీకారం చుట్టారు. 2025–26 పంట కాలానికి రైతులు పొగాకు నాట్లు ప్రారంభించారు. వారం రోజులుగా నాట్లు వేస్తున్నారు. మెట్ట ప్రాంతంలోని ఎర్రమట్టి ఇసుక నేలలు, నల్లరేగడి భూముల్లో పొగాకు సాగు జరుగుతుంది. ఉత్తర తేలిక నేలల్లో(ఎన్ఎల్ఎస్) పండిస్తున్న పొగాకుకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో తూర్పు, ఏలూరు జిల్లాల్లో ఎన్ఎల్ఎస్ పొగాకు సాగు జరుగుతుంది. ఈ పొగాకుకు ఎగుమతి ఆర్డర్లు ఉండడంతో మంచి ధర పలుకుతుంది. రెండేళ్లుగా పొగాకు పంట రైతులకు కాసులు కురిపిస్తోంది. ఎక్కువ పెట్టుబడితో కూడిన పంట ఎన్ఎల్ఎస్ సాగు. ఎకరాకు దాదాపు రూ.3 లక్షలు పెట్టుబడి అవుతుంది. నవంబర్ నెలాఖరుకు పొగాకు నాట్లు పూర్తికానున్నాయి. ఈ నెల 15 తర్వాత నాట్లు ముమ్మరంగా జరుగుతాయని బోర్డు అధికారులు చెబుతున్నారు. ఎన్ఎల్ఎస్ ప్రాంతాన్ని అప్పర్ ఎన్ఎల్ఎస్, లోయర్ ఎన్ఎల్ఎస్ ప్రాంతాలుగా పిలుస్తారు. జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం వేలం కేంద్రాల పరిధిలోని ప్రాంతాలను అప్పర్ ఎన్ఎల్ఎస్, గోపాలపురం, దేవరపల్లి వేలం కేంద్రాల పరిధిలోని ప్రాంతాలను లోయర్ ఎన్ఎల్ఎస్ ప్రాంతంగా పిలుస్తారు. ఏటా అప్పర్ ఎన్ఎల్ఎస్ ప్రాంతంలో ముందస్తు సాగు ప్రారంభిస్తారు. అక్టోబర్ మొదటి వారంలో అక్కడ నాట్లు వేయగా, 20 రోజుల తేడాలో లోయర్ ఎన్ఎల్ఎస్ ప్రాంతంలో సాగు ప్రారంభిస్తారు. ప్రస్తుతం అప్పర్ ఎన్ఎల్ఎస్ ప్రాంతంలో ముమ్మరంగా నాట్లు జరుగుతున్నట్టు అధికారులు తెలిపారు. పెరిగిన సాగు రెండు జిల్లాల్లో సుమారు 80 వేల ఎకరాల్లో రైతులు పొగాకు పంట సాగు చేస్తున్నారు. గత ఏడాది బోర్డు లెక్కల ప్రకారం 29,480 హెక్టార్లలో పంట సాగు చేశారు. బోర్డు అనుమతి లేకుండా మరొక నాలుగు వేల హెక్టార్లలో సాగు చేసినట్టు సమాచారం. రాజమహేంద్రవరం రీజనల్ పరిధిలోని దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం–1,2 వేలం కేంద్రాల పరిధిలో 14,754 మంది రైతులు 12,723 బ్యారన్లు కలిగి ఉన్నారు. అధిక దిగుబడుల వంగడాల సాగు అధిక దిగుబడులు వస్తున్న వంగడాలను రైతులు సాగు చేస్తున్నారు. సీటీఆర్ఐ, ఐటీసీ సంస్థల నుంచి వంగడాలను రైతులు కొనుగోలు చేసి సాగు చేస్తున్నారు. ఎల్వీ–7, 1353 వంగడాలను రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ వంగడాలు ఎకరాకు 10 నుంచి 13 క్వింటాళ్లు దిగుబడి నిస్తున్నాయి. కిలో విత్తనం రూ.25 వేలకు కొనుగోలు చేస్తున్నారు. అంతరించిపోతున్న జీడిమామిడి పంట జీడిమామిడి పంట మెట్ట ప్రాంతంలో అంతరించిపోతోంది. మార్కెట్లో పొగాకు ధర లాభసాటిగా ఉండడం, కౌలు ఎక్కువగా రావడంతో రైతులు జీడిమామిడి తోటలను తొలగించి పొగాకు సాగు చేస్తున్నారు. జీడిమామిడి పంట దిగుబడి తగ్గడంతో పాటు ధర లేకపోవడంతో గిట్టుబాటు కావడంలేదని రైతులు అంటున్నారు. నాటడానికి మడుల్లో సిద్ధంగా ఉన్న పొగాకు నారు దేవరపల్లి మండలం సంగాయగూడెంలో పొగాకు నాట్లు వేస్తున్న కూలీలు 80 వేల ఎకరాల్లో పంట సాగు 14,754 మంది రైతులు 12,723 బ్యారన్లు ఆసక్తి చూపుతున్న కౌలురైతులు లాభసాటిగా పొగాకు సాగు గణనీయంగా పెరగనున్న సాగు విస్తీర్ణం కౌలు రైతుల మధ్య పోటీ రెండేళ్లుగా పొగాకు సాగు లాభసాటిగా ఉంది. కిలో రూ.430 ధర పలకడంతో కౌలుదారులు సాగుకు ఆసక్తి చూపుతున్నారు. కౌలుదారుల మధ్య పోటీ ఏర్పడంతో భూమి కౌలు ఎకరం రూ.80 వేల నుంచి రూ.1 లక్ష పలుకుతోంది. ప్రాంతాన్ని బట్టి కౌలు పలుకుతుంది. బ్యారన్ లీజు రూ.2లక్షల నుంచి రూ.2.50 లక్షలు పలుకుతుంది. బ్యారన్ లైసెన్స్ ఖరీదు రూ.10.50 లక్షలు పలుకుతుంది. మూడేళ్ల క్రితం బ్యారన్ ఖరీదు రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షలు ఉండగా, గత ఏడాది రూ.8 లక్షలు పలికింది. ప్రస్తుతం రూ.10.50 లక్షలు పలుకుతుండడంతో ఎక్కువ బ్యారన్లు ఉన్న రైతులు కొన్ని బ్యారన్లకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 21,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 31,500 గటగట (వెయ్యి) 30,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 28,500 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 23,000 – 24,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)23,000 – 24,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,250 కిలో 350 -
రాష్ట్ర స్థాయి సెపక్తక్రా పోటీలకు జిల్లా జట్ల ఎంపిక
దేవరపల్లి: రాష్ట్రస్థాయి సెపక్తక్రా పోటీలకు తూర్పుగోదావరి జిల్లా బాలబాలికల జట్ల ఎంపిక గురువారం దేవరపల్లి మండలం రామన్నపాలెం జెడ్పీ హైస్కూలు క్రీడా మైదానంలో జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగింది. ఎంపిక పోటీల్లో సుమారు 100 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. జూనియర్ విభాగంలో బాల బాలికల జట్ల ఎంపిక జరిగింది. ఈ జట్లు ఈ నెల 11,12 తేదీల్లో బాపట్లలో జరుగుతున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటున్నట్టు ప్రధానోపాధ్యాయుడు పేరం రవీంథ్రనాథ్ తెలిపారు. బాలుర జట్టుకు జి. కోట సతీష్(దొమ్మేరు), ఎం.ఆంథోని(రామన్నపాలెం), వై. పాల్(దొమ్మేరు), బి, చరణ్(దొమ్మేరు), ఎ. వివేక్(దేవరపల్లి), బి. రాధాకృష్ణ (రామన్నపాలెం) ఎంపికయ్యారు. బాలికల జట్టులో దుర్గామాధవశ్రీ (చిన్నాయగూడెం), ఎం. మహాలక్ష్మి (రామన్నపాలెం), ఎం.లాస్య(రామన్నపాలెం), ఎస్కే మనిషాబేగం(రామన్నపాలెం), ఎం.జేసీశ్రీ(రామన్నపాలెం), డి. సౌజన్య(చిన్నాయగూడెం), కె. సౌజన్య(చిన్నాయగూడెం), కె. సుభాషిణి (రామన్నపాలెం) ఎంపికై నట్టు రవీంధ్రనాథ్ తెలిపారు. పోటీలను పీడీలు ఎల్. గణపతి, టి.సరస్వతి, సీహెచ్ సతీష్, పి.సాయి పర్యవేక్షించారు. 11, 12 తేదీల్లో బాపట్లలో జాతీయ స్థాయి పోటీలు -
కూలీలను కాపాడబోయి యజమాని ఆహుతి
రాయవరం: బాణసంచా ప్రమాదాల్లో సాధారణంగా కూలీలే సమిధలవుతారు. అయితే రాయవరంలో జరిగిన బాణసంచా ప్రమాదంలో కూలీలతో పాటుగా తయారీ యజమాని వెలుగుబంట్ల సత్యనారాయణమూర్తి (సత్తిబాబు) మృత్యువాత పడ్డారు. దీపావళి సమీపిస్తుండడం, వివాహ ముహూర్తాలకు ఆర్డర్లు వస్తుండడంతో కూలీలతో పనులు చేయిస్తున్నారు. అనుకోకుండా జరిగిన దుర్ఘటన యజమాని సత్తిబాబుతో సహా ఎనిమిది మంది ప్రాణాలను బలిగొంది. అప్పటి వరకు బయట కూర్చున్న సత్తిబాబు ప్రమాదంలో చిక్కుకున్న కూలీల ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో భాగంగానే మృత్యువాత పడినట్లుగా భావిస్తున్నారు. ప్రమాద జరిగిన వెంటనే ఇద్దరు కూలీలను బయటకు లాగినట్లుగా స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం తెలుస్తోంది. మరొకరిని బయటకు లాగే సమయంలో అప్పటికే అగ్నికీలలు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో మృత్యువుకు చేరువైనట్లుగా భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బయట కుర్చీలో కూర్చున్న ఆయన అక్కడి నుంచి పారిపోయి ఉంటే ప్రాణాలతో బతికే వారని, కాని కూలీలను రక్షించే క్రమంలోనే అసువులు బాసినట్లుగా సమీపంలోని బాణసంచా తయారీ కేంద్రం యజమాని వేల్పూరి సత్తిబాబు చెబుతున్నారు. అప్పటి వరకు బయట కూర్చున్న మృతుడు సత్తిబాబుతో తాను మాట్లాడి వెళ్లిన కొన్ని నిమిషాలకే ఈ ప్రమాదం జరిగినట్లుగా సత్తిబాబు తెలిపారు. ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదన్నారు. -
మృతదేహాల అప్పగింత
రాయవరం: గ్రామ పరిధిలో బుధవారం జరిగిన బాణసంచా దుర్ఘటనలో మృతదేహాలను బాధిత కుటుంబాలకు గురువారం పోలీసులు అప్పగించారు. ఆరు మృతదేహాలకు రామచంద్రపురం, రెండు మృతదేహాలకు కాకినాడ జీజీహెచ్లో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ దుర్ఘటనలో బాణసంచా యజమాని వెలుగుబంట్ల సత్యనారాయణమూర్తి(సత్తిబాబు)తో సహా ఏడుగురు కూలీలు మృతి చెందిన విషయం పాఠకులకు విదితమే. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారు కోలుకుంటున్నట్లు రాయవరం ఎస్సై డి.సురేష్బాబు తెలిపారు. కుటుంబానికి ఆధారం కోల్పోయాం కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వాసంశెట్టి విజయలక్ష్మి(51) మృతి చెందిన విషయం పాఠకులకు విదితమే. రాయవరం మండలం సోమేశ్వరం గ్రామానికి చెందిన విజయలక్ష్మి పొట్టకూటి కోసం బాణసంచా తయారీకి కూలి పని నిమిత్తం వస్తోంది. ప్రతి రోజూ మాదిరిగానే బుధవారం కూలి పనికి వచ్చిన విజయలక్ష్మి దుర్ఘటనలో తీవ్రగాయాల పాలైంది. కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి సమయంలో మృతి చెందింది. ఇదిలా ఉంటే కూలి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న విజయలక్ష్మి మృతితో కుటుంబం ఆధారం కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కూలి పని చేసుకుని ఇంటికి వస్తుందని ఆశించామని, ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదంటూ కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. అంత్యక్రియలు పూర్తి అనపర్తి : శ్రీగణపతి గ్రాండ్ ఫైర్వర్క్స్లో జరిగిన విస్ఫోటంలో మృతిచెందినవారి అంత్యక్రియలు గురువారం మధ్యాహ్నం నిర్వహించారు. ఈ ప్రమాదంలో అనపర్తి శివారు సావరానికి చెందిన కుడిపూడి జ్యోతి, పెంకే శేషారత్నం, చిట్టూరి శ్యామల ఘటనా స్థలంలోనే మృతి చెందారు. వారి మృతదేహాలకు స్థానిక శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. -
పరిహారం.. పరిహాసం
● బాణసంచా పేలుడు బాధితులకు సాయం ప్రకటించని కూటమి ప్రభుత్వం ● తీరిగ్గా ఇప్పుడు తనిఖీలు ప్రారంభించిన జిల్లా యంత్రాంగం సాక్షి, అమలాపురం/ రాయవరం: రాయవరంలోని శ్రీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రంలో పెను విస్ఫోటం జరిగి నిరుపేద కూలీలు మృత్యువాత పడినా కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు పరిహారం ప్రకటించలేదు. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా ప్రభుత్వం నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉంది. జిల్లాకు చెందిన రాష్ట్ర కార్మి క శాఖమంత్రి వాసంశెట్టి సుభాష్, హోం శాఖమంత్రి వంగలపూడి అనితతోపాటు ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వెళ్లారు. బాధితులను అన్నివిధాలుగా ఆదుకుంటామని చెప్పారు. అయినా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి పరిహారంపై స్పష్టత లేదు. ఇటువంటి చోట పనిచేసేవారికి అటు యాజమాన్యం, ఇటు కార్మిక శాఖలు కలిసి ఇన్సూరెన్స్ చేయించాల్సి ఉంది. కాని చనిపోయిన వారి వివరాలు కూడా కార్మిక శాఖకు వెంటనే తెలియని దుస్థితి. మృతులు కార్మికశాఖ రికార్డుల్లో నమోదు కానట్టు తెలిసింది. ‘ఎంప్లాయిస్ కాంపన్సేషన్ యాక్టు’ ప్రకారం యజమానుల వద్ద నుంచి పరిహారం కోరతామని కార్మిక శాఖ అధికారులు చెబుతున్నారు. చేతులు కాలాక హడావుడి బాణసంచా తయారీ కేంద్రంలో పెను విస్ఫోటంతో తీవ్ర విషాదం నెలకొనడంతో జిల్లా యంత్రాంగం ఇప్పుడు హడావుడి చేస్తోంది. కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ జిల్లాలోని అన్ని శాఖ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఉన్న బాణసంచా తయారీ యూనిట్లు, హోల్సేల్ విక్రయ కేంద్రాల లైసెన్స్లను, భద్రత, రక్షణ ప్రమాణాల అంశాలను మూడు రోజులపాటు పర్యవేక్షణ బృందాలు తనిఖీ చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. కేంద్రాలలో పనిచేసే కార్మికులకు నైపుణ్యం ఉన్నదీ లేనిదీ చూడాలన్నారు. జిల్లా వ్యాప్తంగా బాణసంచా తయారీ యూనిట్లు 18 వరకు ఉన్నాయని, హోల్సేల్ డీలర్లు 19 మంది వరకు ఉన్నారన్నారు. ప్రతి కార్మికునికి బీమా చేయిస్తున్నదీ లేనిదీ చూడాలన్నారు. కలెక్టర్ ఆదేశాలతో తయారీ, విక్రయ కేంద్రాలను అధికారులు తనిఖీ చేస్తున్నారు. రూ.50లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి మృతుల కుటుంబాలకు రూ.50లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దడాల సుబ్బారావు డిమాండ్ చేశారు. బాణసంచా దుర్ఘటన జరిగిన ప్రాంతాన్ని ఆయన పార్టీ సభ్యులతో కలిసి గురువారం పరిశీలించారు. -
బాణసంచా కేంద్రాలపై దాడులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): అక్రమ బాణసంచా నిల్వలు, తయారీ కేంద్రాలపై జిల్లా పోలీసులు గురువారం మెరుపు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ డి.నరసింహకిశోర్ తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి బాణసంచా తయారీ కేంద్రాలు, స్టోరేజ్ గోడౌన్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బొమ్మూరు, రాజానగరం, బిక్కవోలు, కడియం, చాగల్లు, సమిశ్రగూడెం, సీతానగరం, గోకవరం, నల్లజర్ల పోలీస్ స్టేషన్ల పరిధిలో బాణసంచా తయారీ కేంద్రాలు, గోడౌన్లపై కేసులు నమోదు చేశారు. బాణసంచా లైసెన్సు కల్గిన వారు మాత్రమే ప్రభుత్వ నియమ నిబంధలనకు లోబడి బాణసంచా తయారీ లేదా విక్రయాలు చేయాలని ఎస్పీ డి.నరసింహాకిశోర్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించి ఎవరైనా జన సంచార స్థలాల్లోను, అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన, విక్రయాలు జరిపిన అటువంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా ప్రతిరోజు ఈ తనిఖీలు కొనసాగించాలని పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. జిల్లాలో ఎక్కడైనా ఎవరైనా రహస్యంగా మందుగుండు సామగ్రి తయారు చేస్తున్నట్లు, నిల్వ ఉంచినట్లు తెలిస్తే డయల్ 112 కాల్ ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. -
చెరువు నీటిలో విష అవశేషాలు
తాళ్లపూడి: పెద్దేవం చెరువు నీటిలో విష అవశేషాలు ఉన్నట్టు గుర్తించామని, రైతులు తమ పశువులకు ఇన్సూరెన్స్ చేసుకుంటే నష్టాన్ని నివారించవచ్చునని పశు సంవర్ధక శాఖ డీడీ డాక్టర్ ఎస్.సత్యనారాయణ తెలిపారు. మండలంలోని పెద్దేవం గ్రామంలో కొద్దిరోజులుగా అనారోగ్యంతో మృత్యువాత పడుతున్న గేదెల జబ్బును గుర్తించేందుకు వీలుగా ఆయన ఆధ్వర్యంలో బృందం పర్యటించి గేదెల పేడ, మూత్రం పరీక్షలు చేయించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా 50 మందికి పైగా రైతుల హాజరై తమ గేదెల పేడ పరీక్షలు చేయగా 90 శాతం గేదెలలో జలగ వ్యాధి ఉన్నట్లు గుర్తించినట్లు పశు సంవర్ధక శాఖ డీడీ పేర్కొన్నారు. డీడీ సత్యనారాయణ మాట్లాడుతూ ముఖ్యంగా గేదెలకు ప్రభుత్వ ఇన్సూరెన్స్ పథకం అమలులో లేనందున ప్రైవేట్ కంపెనీ ఇన్సూరెన్్స్ అయినా సరే తీసుకుంటే నష్ట నివారణకు అవకాశం ఉంటుందని అన్నారు. ప్రైవేట్ కంపెనీ ప్రతినిధులను రైతులకు పరిచయం చేశారు. మృత్యువాత పడ్డ ఒక గేదెకు పోస్ట్మార్టం నిర్వహించి, జరిపిన పరీక్షల్లో రెండు వైరస్లు గుర్తించినట్లు, చెరువు నీటిలో పేరాకాట్ పోయిజినింగ్ అవశేషాలు ఉన్నట్లు తేలిందని, అవి ప్రమాదకరమని, గేదెలలో వ్యాధి నిరోధక శక్తి నశించి, మిగతా వైరల్ రోగాల పెరుగుదలకు అవకాశం ఇస్తోందని అన్నారు. నష్ట పరిహారం ఇవ్వాల్సిందే గ్రామ ఉప సర్పంచ్ తోట రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి రైతు పేరాకాట్ పాయిజన్ పొలాల్లో వాడతారని దీనివల్ల గేదెలకు రోగాలు వచ్చాయనటం ఆశ్చర్యంగా ఉందని, గేదెలకు వచ్చిన రోగాన్ని నిర్ధారణ చేసి సరైన మందు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చెరువులో నీరు తాగని గేదెలకు కూడా వ్యాధి వచ్చిందని దానికి సమాధానం చెప్పాలని అన్నారు. పశుసంవర్ధక శాఖ డాక్టర్లు చేస్తున్న వైద్యం తమ గ్రామంలో రైతులకు సంతృప్తిగా లేదని తెలిపారు. దీనిని రాజకీయం చేయకుండా గేదెలు నష్టపోయినవారికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందజేయాలని డిమాండ్ చేశారు. పశు సంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ ఎ.వెంకటరెడ్డి, కాకినాడ ల్యాబ్కు చెందిన డాక్టర్ సందీప్, డాక్టర్ ఎస్.వెంకటేశ్వరరావు, తాళ్లపూడి మండల పశువైద్యాధికారులు డాక్టర్ వరలక్ష్మి, డాక్టర్ బాలాజీ పాల్గొన్నారు. -
బాణసంచా తయారీలో మూడు తరాలుగా..
రాయవరం: గ్రామం సమీపంలో ఉన్న బాణసంచా తయారీ కేంద్రాన్ని మూడు తరాలుగా ఒకే కుటుంబం నిర్వహిస్తోంది. రాష్ట్రంలో మొదటిసారిగా ఇక్కడి నుంచే బాణసంచా తయారీ కుటీర పరిశ్రమగా ప్రారంభమైంది. స్వాతంత్య్రానికి పూర్వమే వెలుగుబంట్ల వీరన్న బాణసంచా తయారీని ప్రారంభించినప్పటికీ వారి కుమారులు తాత నారాయణమూర్తి, రామకృష్ణల హయాంలోనే అభివృద్ధి చెందింది.తాత నారాయణమూర్తి కుమారుడు వెలుగుబంట్ల సత్యనారాయణమూర్తి (సత్తిబాబు), రామకృష్ణ కుమారుడు కోటిబాబులు వేర్వేరుగా వ్యాపారాన్ని సాగించారు. కోటిబాబు మరణించే వరకు ఈ వృత్తిని కొనసాగించగా, వారసులు వృత్తికి స్వస్తి పలికారు. ఇదిలా ఉంటే సత్యనారాయణమూర్తి మాత్రం బాణసంచా తయారీని కొనసాగిస్తున్నారు. దీపావళి పర్వదినానికే కాకుండా వివాహాది శుభకార్యాలకు, గ్రామాల్లో జరిగే అమ్మవారి జాతర్లు, రాజకీయ పార్టీల ఊరేగింపులు, ఉత్సవాలకు బాణసంచా తయారీ చేస్తున్నారు. 1952లో మద్రాస్లో జరిగిన ఏఐసీసీ సమావేశం, 1978లో బెంగళూరులో జరిగిన జాతీయ క్రీడలకు, 1983లో ఎన్టీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారానికి, 1983, 1999లలో ఫిలిం ఫెస్టివల్స్కు, పలు చలన చిత్రాల శత దినోత్సవాలకు వెలుగుబంట్ల సోదరులు తయారుచేసిన బాణసంచా కాల్చారు. వాటి తయారీలో ప్రత్యేక స్థానాన్ని సాధించి నిశిరాత్రిలో వెలుగుపూలు నింపిన వెలుగుబంట్ల సత్తిబాబు అదే బాణసంచా ప్రమాదానికి గురికావడాన్ని పలువురు జీర్ణించుకోలేకపోతున్నారు. వివాద రహితుడు, సౌమ్యుడిగా పేరున్న సత్తిబాబు మృతితో ఆయన అభిమానులు, మిత్రులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. -
బతుకులు చితికి..
చీకటి వెలుగుల రంగేళీ.. జీవితమే ఒక దీపావళి.. కానీ ఈ దీపావళి వారి జీవితాల్లో చీకట్లు నింపింది. మిరుమిట్లు గొలుపుతూ ఉవ్వెత్తున ఎగసే చిచ్చుబుడ్డి వెలుగులు వారి జీవితాల్లో చిచ్చుపెట్టాయి. ఎవరికి ఎవరూ కాకుండా చేశాయి. మరో పది రోజుల్లో దీపావళి వస్తుంది. ఇంటిల్లిపాదీ ఈ పండగకు ఏ లోటూ లేకుండా బాణసంచా కాల్చాలి.. కొత్త దుస్తులు వేసుకోవాలి.. ఇలా ఎన్నో ఆశలతో ఆ కూలీలు బాణసంచా తయారీలో నిమగ్నమయ్యారు. ఇంతలో రాజుకున్న చిన్న నిప్పురవ్వ పేదల ఇంట పెను విషాదాన్ని నింపి వారి కుటుంబాలను అంధకారమయం చేసింది.సాక్షి, అమలాపురం/రాయవరం/అనపర్తి/బిక్కవోలు: చుట్టూ పచ్చని పొలాలు.. సమీపిస్తున్న దీపావళి.. పండగ నాడు జనం కళ్లల్లో ఆనంద వెలుగులు చూడాలని అహోరాత్రాలు కష్టపడుతున్న బాణసంచా తయారీ కార్మికులు. అప్పుడప్పుడూ వచ్చిపోయే కొనుగోలుదారుల సందడి. అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న ఆ ప్రాంతంలో ఒక్క సారిగా పేలుడు శబ్దం. చిచ్చుబుడ్డి తయారు చేస్తున్న సమయంలో రాజుకున్న నిప్పురవ్వలు కొద్ది క్షణాలలోనే ఆ ప్రాంతాన్ని భస్మం చేసేశాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్లో పెను విస్ఫోటం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో కాకినాడ జీజీహెచ్లో వాసంశెట్టి విజయలక్ష్మి, కాకినాడ ట్రస్ట్ ఆస్పత్రిలో పొట్నూరి వెంకటరమణ చికిత్స పొందుతూ మృతి చెందారు. పేలుడు ధాటికి కార్మికులు పది నుంచి ఇరవై అడుగులు దూరం ఎగిరిపడ్డారు. మరి కొందరు కార్మికులు మంటల్లో చిక్కుకుని నీటితో ఆర్పుకొనేందుకు నాలుగువైపులా పరుగులు తీశారు. ఈ ఘటనతో తయారీ కేంద్రం మంటలకు ఆహుతై మరుభూమిని తలపించింది. ప్రమాదం బారిన పడిన వారిని రక్షించేందుకు వెళ్లిన వారికి అక్కడి దృశ్యాలు చూసి ఒళ్లు గగుర్పొడిచింది. ప్రమాద ధాటికి కొంతమంది కార్మికులు ఎగిరి పక్కనే ఉన్న పంట పొలాల్లో పడ్డారు. మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. చేతికి ఉన్న గాజులు, కాళ్లకు ఉన్న మట్టెల ఆధారంగా మాత్రమే పురుషులు, సీ్త్రలుగా గుర్తించారు. ఒంటిపై ఉన్న ఆభరణాలు, చేతికి ఉన్న ఉంగరాల ఆధారంగా తయారీ కేంద్రం యజమానిని గుర్తించారు. మృతుల కుటుంబీకులు చెప్పిన ఆనవాళ్లను బట్టి పోలీసులు కొందరిని గుర్తించారు.శుభకార్యం ప్రాణాలు నిలిపిందిపేలుడు ఘటనలో గ్రామానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడడంతో అనపర్తి సావరం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ గ్రామం నుంచి ప్రతిరోజు సుమారు 15 నుంచి 20 మంది మహిళలు బాణసంచా దుకాణంలో పని చేసేందుకు వెళ్తుంటారు. స్థానికంగా శుభకార్యం ఉండడం, రాబోయే దీపావళికి ఇల్లు శుభ్రం చేసుకునే పని ఉందని చాలామంది పనికి వెళ్లకపోవడంతో వారు మృత్యువు నుంచి తప్పించుకున్నారు. రోజూ తమతో పాటు పనికి వచ్చే వారిలో కొందరు మృతి చెందారని తెలిసి వారు కన్నీరుమున్నీరయ్యారు.ఇంత ఘోరం జరుగుతుందనుకోలేదుఅసలు తన భార్య బతికుందా.. లేదా.. అనేది తెలియడం లేదని రాయవరం మండలం సోమేశ్వరానికి చెందిన కూలీ పాకా సుబ్బారావు రోదిస్తున్నాడు. మధ్యాహ్నం భోజన సమయంలో 12.02 గంటలకు తన భార్య అరుణకు ఫోన్ చేశానని, ఆ తర్వాత 12.30 గంటలకు ప్రమాదం జరిగినట్టు తెలిసిందని, ఇంతలోనే అంత ఘోరం జరుగుతుందనుకోలేదని బావురుమన్నాడు.విషాదంలో కుటుంబ సభ్యులుయజమాని వెలుగుబంట్ల సత్యనారాయణమూర్తి మృతితో కుటుంబం విషాదంలో కూరుకుపోయింది. ఎవరూ ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఇంటి వద్ద నెలకొంది. ప్రమాద స్థలికి చిన్న కుమారుడు చిట్టిబాబు చేరుకుని గుండెలు పగిలే రోదించాడు.ఆలనాపాలనా చూసేవారెవరు?పెంకే శేషారత్నంకు భర్త సూరిబాబు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు కార్తిక్ అనపర్తిలో దుకాణంలో పని చేస్తుండగా, సుబ్రహ్మణ్యం 9వ తరగతి చదువుతున్నాడు. భర్త సూరిబాబు కార్పెంటర్గా పని చేస్తున్నారు. అనారోగ్యంతో ఒకరోజు పని చేస్తే రెండు రోజులు ఇంటి వద్దే ఉంటాడు. శేషారత్నం సంపాదిస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటోంది. తల్లి మృతి చెందిందని తెలిసి బేలగా చూస్తున్న చిన్నారులు స్థానికులకు కంట తడిపెట్టిస్తున్నారు. తమ చిన్నారుల పరిస్థితి ఏమిటని తండ్రి సూరిబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.పిల్లల చదువు కోసం పనికి వెళ్లి..నిరుపేద కుటుంబానికి చెందిన చిట్టూరి శ్యామలకు భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమె మృతి వార్త విన్న వృద్ధురాలైన ఆమె అత్తగారిని ఓదార్చడం ఎవరివల్లా కావడం లేదు. పిల్లలు ఇద్దరూ ఇంకా చదువుకుంటున్నారని వారికి ఖర్చులకు ఉంటాయని పనికి వెళ్లిందని, ఇలా మృత్యువాత పడుతుందని ఊహించలేదని రోదిస్తున్నారు. అత్తగారు గుండెలు పగిలేలా రోదిస్తుంటే ఓదార్చేందుకు మాటలు రావడం లేదని స్థానికులు వాపోతున్నారు.మా జీవన ‘జ్యోతి’ ఆరిపోయిందికుడిపూడి జ్యోతి కుటుంబ పరిస్థితి చాలా దయనీయం. కుమార్తె, కుమారుడు, వయసు పైబడిన తల్లి లక్ష్మి ఆమైపె ఆధారపడి జీవిస్తున్నారు. కుమార్తెకు ఇది వరకే వివాహం చేయగా, కుమారుడుకి ఇటీవలే వివాహమైంది. నాలుగు నెలల క్రితం భర్త సత్యనారాయణ మృతి చెందాడు. దీంతో వారి భారం జ్యోతిపై పడింది. ఆమె అనుకోకుండా ఈ ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబానికి దిక్కులేకుండా పోయిందని, అనారోగ్యంతో ఉన్న తనను ముందు రోజు ఆస్పత్రికి తీసుకుని వెళ్లి రూ.రెండు వేలు ఖర్చు పెట్టిందని గుండెలు పగేలా రోదిస్తోంది.మృతులు, క్షతగాత్రుల వివరాలుమృతులు1. వెలుగుబంట్ల సత్యనారాయణ (65), బాణసంచా తయారీ దుకాణం యజమాని, కొమరిపాలెం, బిక్కవోలు మండలం2. పాకా అరుణ(35),సోమేశ్వరం, రాయవరం మండలం3. చిట్టూరి శ్యామల(35), అనపర్తి4. పెంకే శేషారత్నం(40), అనపర్తి సావరం5. కుడుపూడి జ్యోతి(38), అనపర్తి సావరం6. కె.సదానందం (52), ఒడిశా వాసి7. పొట్నూరి వెంకటరమణ (55), కొమరిపాలెం, బిక్కవోలు మండలం8. వాసంశెట్టి విజయలక్ష్మి (51), సోమేశ్వరం, రాయవరం మండలంక్షతగాత్రులు1. చిట్టూరి యామిని, అనపర్తి2. లింగం వెంకట కృష్ణ, వేండ్ర, పెదపూడి మండలం -
ఆలనాపాలనా చూసేవారెవరు?
సాక్షి, అమలాపురం/రాయవరం/అనపర్తి/బిక్కవోలు: చుట్టూ పచ్చని పొలాలు.. సమీపిస్తున్న దీపావళి.. పండగ నాడు జనం కళ్లల్లో ఆనంద వెలుగులు చూడాలని అహోరాత్రాలు కష్టపడుతున్న బాణసంచా తయారీ కార్మికులు. అప్పుడప్పుడూ వచ్చిపోయే కొనుగోలుదారుల సందడి. అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న ఆ ప్రాంతంలో ఒక్క సారిగా పేలుడు శబ్దం. చిచ్చుబుడ్డి తయారు చేస్తున్న సమయంలో రాజుకున్న నిప్పురవ్వలు కొద్ది క్షణాలలోనే ఆ ప్రాంతాన్ని భస్మం చేసేశాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్లో పెను విస్ఫోటం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో కాకినాడ జీజీహెచ్లో వాసంశెట్టి విజయలక్ష్మి, కాకినాడ ట్రస్ట్ ఆస్పత్రిలో పొట్నూరి వెంకటరమణ చికిత్స పొందుతూ మృతి చెందారు. పేలుడు ధాటికి కార్మికులు పది నుంచి ఇరవై అడుగులు దూరం ఎగిరిపడ్డారు. మరి కొందరు కార్మికులు మంటల్లో చిక్కుకుని నీటితో ఆర్పుకొనేందుకు నాలుగువైపులా పరుగులు తీశారు. ఈ ఘటనతో తయారీ కేంద్రం మంటలకు ఆహుతై మరుభూమిని తలపించింది. ప్రమాదం బారిన పడిన వారిని రక్షించేందుకు వెళ్లిన వారికి అక్కడి దృశ్యాలు చూసి ఒళ్లు గగుర్పొడిచింది. ప్రమాద ధాటికి కొంతమంది కార్మికులు ఎగిరి పక్కనే ఉన్న పంట పొలాల్లో పడ్డారు. మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. చేతికి ఉన్న గాజులు, కాళ్లకు ఉన్న మట్టెల ఆధారంగా మాత్రమే పురుషులు, సీ్త్రలుగా గుర్తించారు. ఒంటిపై ఉన్న ఆభరణాలు, చేతికి ఉన్న ఉంగరాల ఆధారంగా తయారీ కేంద్రం యజమానిని గుర్తించారు. మృతుల కుటుంబీకులు చెప్పిన ఆనవాళ్లను బట్టి పోలీసులు కొందరిని గుర్తించారు.శుభకార్యం ప్రాణాలు నిలిపిందిపేలుడు ఘటనలో గ్రామానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడడంతో అనపర్తి సావరం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ గ్రామం నుంచి ప్రతిరోజు సుమారు 15 నుంచి 20 మంది మహిళలు బాణసంచా దుకాణంలో పని చేసేందుకు వెళ్తుంటారు. స్థానికంగా శుభకార్యం ఉండడం, రాబోయే దీపావళికి ఇల్లు శుభ్రం చేసుకునే పని ఉందని చాలామంది పనికి వెళ్లకపోవడంతో వారు మృత్యువు నుంచి తప్పించుకున్నారు. రోజూ తమతో పాటు పనికి వచ్చే వారిలో కొందరు మృతి చెందారని తెలిసి వారు కన్నీరుమున్నీరయ్యారు.ఇంత ఘోరం జరుగుతుందనుకోలేదుఅసలు తన భార్య బతికుందా.. లేదా.. అనేది తెలియడం లేదని రాయవరం మండలం సోమేశ్వరానికి చెందిన కూలీ పాకా సుబ్బారావు రోదిస్తున్నాడు. మధ్యాహ్నం భోజన సమయంలో 12.02 గంటలకు తన భార్య అరుణకు ఫోన్ చేశానని, ఆ తర్వాత 12.30 గంటలకు ప్రమాదం జరిగినట్టు తెలిసిందని, ఇంతలోనే అంత ఘోరం జరుగుతుందనుకోలేదని బావురుమన్నాడు.విషాదంలో కుటుంబ సభ్యులుయజమాని వెలుగుబంట్ల సత్యనారాయణమూర్తి మృతితో కుటుంబం విషాదంలో కూరుకుపోయింది. ఎవరూ ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఇంటి వద్ద నెలకొంది. ప్రమాద స్థలికి చిన్న కుమారుడు చిట్టిబాబు చేరుకుని గుండెలు పగిలే రోదించాడు. -
ముందే హెచ్చరించిన ‘సాక్షి’
సాక్షి, అమలాపురం: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో దీపావళి వేళ ప్రమాదాలు చోటు చేసుకోవడం పరిపాటిగా మారింది. అధికారులు సమీక్షలకే పరిమితమవుతున్నారు. దీనిపై ‘సాక్షి’ దినపత్రిక ముందుగానే హెచ్చరించింది. ఈ నెల ఒకటో తేదీన ‘అలక్ష్యంతో అనర్థం’, నాలుగో తేదీన ‘ప్రాణ సంకటంగా బాణసంచా’ శీర్షికలతో కథనాలను ప్రచురించింది. దీపావళి సమయాల్లో గతంలో జరిగిన ప్రమాదాలను ఊటంకిస్తూ.. అధికారులు పర్యవేక్షణ లోపాలను ఎత్తిచూపింది. అయినా జిల్లా యంత్రాంగంలో కదలిక లేదు. తయారీ కేంద్రాన్ని ఇటీవల సందర్శించామని, అన్నీ జాగ్రత్తలు తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు. అయినా ఇంత ప్రమాదం జరగడం స్థానికులను విస్మయ పరుస్తోంది. -
లోపం ఎక్కడుంది?
రాయవరం: మండల కేంద్రం రాయవరంలో బుధవారం జరిగిన ప్రమాద ఘటన పలు లోపాలను ఎత్తి చూపుతోంది. ఈ ఘటనలో తప్పెవరిది అనే ప్రశ్నకు సమాధానం లేదు. ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంలో పలు ఊహాగానాలున్నాయి. దర్యాప్తు పూర్తయితే గానీ ప్రమాదానికి కారణం చెప్పలేని పరిస్థితి నెలకొంది. చిచ్చుబుడ్డిని దట్టించే సమయంలో ప్రమాదం జరిగిందా.. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా అనేది నిర్ధారించలేకపోతున్నారు.భీతావహ పరిస్థితిప్రమాద స్థలం మొత్తం మరుభూమిని తలపించింది. ప్రమాదం జరిగిన తర్వాత 7.30 గంటల సమయానికి కూడా ఆరో మృతదేహాన్ని గుర్తించలేక పోయారంటే అసలు పనికి ఎంతమంది ఎక్కడి నుంచి వెళ్తున్నారనేది పక్కాగా నమోదు చేయాల్సిన అవసరాన్ని తెలియజేస్తోంది.నివ్వెరపోయిన అధికారులు, ప్రజలుప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక అధికారులు కూడా సిబ్బందితో వచ్చి ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఘటనా స్థలిలో మృతదేహాలు ఉన్న తీరును చూసి అధికారులకు నోట మాట రాలేదు. అక్కడి పరిస్థితిని చూసిన వారు చలించిపోయారు.ఘటనా స్థలిని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, కలెక్టర్ డాక్టర్ మహేష్కుమార్, ఎస్పీ రాహుల్ మీనా, ఏఎస్పీ ఎన్బీఎం మురళీకృష్ణ, రామచంద్రపురం ఆర్డీవో అఖిల, డీఎస్పీ బి.రఘువీర్, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి సత్యం తదితరులు సందర్శించి ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. -
కార్యకర్తపై మండిపడ్డ మంత్రి దుర్గేష్ బంధువు
నిడదవోలు : పదేళ్ల నుంచి జనసేన పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ఓ కార్యకర్తపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ బంధువు ప్రశాంత్ దుర్భాషలాడుతూ మండిపడ్డ ఆడియో ఒకటి వైరల్ అవుతోంది. ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త ఫణీంద్రకుమార్ను ఇటీవల విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా ప్రభుత్వం నియమించింది. ఇందుకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సిఫారసు చేశారు. అయితే అదే గ్రామానికి చెందిన అంజి అనే జనసేన కార్యకర్త మంత్రి దుర్గేష్ అనుచరుడు ప్రశాంత్కి ఫోన్ చేసి అసలు గ్రామంలో ఎంకై ్వరీ చేయకుండా పదవి ఎందుకు ఇచ్చారంటూ నిలదీశాడు. గ్రామంలో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తల అభిప్రాయాలు తీసుకోకుండా పదవి ఎలా ఇచ్చారంటూ అంజి ప్రశ్నించాడు. దీంతో ప్రశాంత్ కార్యకర్త అంజిపై విరుచుకుపడ్డాడు. పార్టీ పదవుల విషయంపై నీకు ఏమిటి సంబంధం, నువ్వు ఎక్కువగా మాట్లాడితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారంటూ వార్నింగ్ ఇచ్చాడు. నాకు సంబంధం లేదా అంటూ కార్యకర్త అంజి వాపోయాడు. మంత్రి దుర్గేష్ ఇష్ట ప్రకారం డైరెక్టర్ పదవి ఇచ్చారని, ఎక్కువగా మాట్లాడితే నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామంటూ ప్రశాంత్ అన్నాడు. పార్టీ పట్ల నీకు ఇష్టం లేకపోతే రాజీనామా చేసి వెళ్లిపోమని దురుసుగా మాట్లాడాడు. మంత్రి కందుల దుర్గేష్కి ఫోన్ చేసి అడుగుతానని కార్యకర్త అంజి చెప్పడంతో మంత్రితో నువ్వు మాట్లాడతావా నువ్వు ఎంత..నీ స్థాయి ఎంత.నువ్వు కేవలం కార్యకర్తవు మాత్రమే.. లీడర్ను అనుకుంటున్నావా అంటూ మండిపడ్డాడు. వైరల్ అవుతున్న ఆడియో -
ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): బోయవాడైన ఒక సాధారణ మనిషి మహా రుషిగా మారి రామాయణం వంటి దివ్యమైన గ్రంథాన్ని రచించిచడం గొప్ప విశేషమని కలెక్టర్ షణ్మోహన్ అన్నారు. ఆదికవి వాల్మికి జయంతిని మంగళవారం కలెక్టరేట్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, రంపచోడవరం ఐటీడీఏ పీవో బి.స్మరన్ రాజ్ మహార్షి వాల్మీకి చిత్ర పటానికి పూలమాలలు వేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇతిహాసాలలో తొలి కావ్యంగా పేరుగాంచిన రామాయణం గ్రంథాన్ని సమాజానికి అందించిన మహర్షి వాల్మీకి జీవితం మనకందరికీ ఆదర్శప్రాయమన్నారు. రామాయణం వంటి మహాకావ్యాన్ని ఈ సమాజానికి పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి వాల్మీకి అని ఆయన కొనియాడారు. జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఎం.లల్లి, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎ.శ్రీనివాసరావు, సెట్రాజ్ సీఈవో కెఎస్వీ కాశీ విశ్వేశ్వరరావు పాల్గొన్నారు. -
ఆహార తయారీ కేంద్రాల విస్తృత తనిఖీలు
అమలాపురం రూరల్: జిల్లావ్యాప్తంగా వివిధ హోటళ్లలో, వ్యాపార కేంద్రాల్లో విపరీతమైన కల్తీ, ఆహార తయారీలో నాణ్యత లోపం, నిల్వ సరకుల సరఫరా జరుగుతున్నట్టు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తీవ్రంగా స్పందించిన జాయింట్ కలెక్టర్ నిషాంతి.. జిల్లాలోని ఆహార తయారీ కేంద్రాల తనిఖీకి ఆదేశించారు. ఈ నేపథ్యంలో మంగళవారం జిల్లావ్యాప్తంగా డీఎస్వో ఉదయభాస్కర్ ఆధ్వర్యంలో జిల్లాలోని ఏడు ముఖ్య పట్టణాల్లో పౌర సరఫరాల, ఆహార భద్రత, తూనికలు–కొలతల శాఖల సంయుక్తాధ్వర్యంలో తనిఖీలు జరిగాయి. దాదాపు 200 ప్రదేశాల్లో ఏకకాలంలో జరిగిన తనిఖీల్లో అనేక లోపాలను గుర్తించి, తక్షణ చర్యలు తీసుకున్నట్టు డీఎస్వో చెప్పారు. జేసీ నిషాంతి స్పందిస్తూ, ఎక్కడా ఆహార కల్తీలు కానీ, నాణ్యత లేని, అనారోగ్యాన్ని కలిగించే ఆహారాన్ని సరఫరా చేయడాన్ని సహించబోమని స్పష్టం చేశారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, ఇలాంటి తనిఖీలు విస్తృ తంగా చేపడతామని స్పష్టం చేశారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సూచించిన నియమాలను అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు తప్పక పాటించాలన్నారు. కొన్నిచోట్ల ఈ నిబంధనలు పాటించకపోవడం వల్ల ఆహారం కల్తీ కావడం, నాణ్యత తగ్గడం జరుగుతున్నాయని, ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఆయా యజమాన్యాలు వ్యవహరించాలని ఆదేశించారు. నిల్వ, కాలం చెల్లిన, హానికర పదార్థాలు ఆహార తయారీలో వినియోగించరాదన్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే, ఫుడ్ సేఫ్టీ, తూనికలు–కొలతల శాఖల జరిమానాలతో పాటు, లైసెన్స్ రద్దు వంటి చర్యలు తప్పవన్నారు. భద్రతతో కూడిన ఆహారం అందించకపోతే వ్యాపారాలను పూర్తిగా రద్దు చేయాలన్నారు. తనిఖీల్లో జిల్లా తూనికలు–కొలతల అధికారి విశ్వేశ్వరరావు, జిల్లా ఆహార భద్రత అధికారి రామయ్య, పౌర సరఫరాల శాఖ ఉప తహసీల్దార్లు పాల్గొన్నారు. హోటళ్లలో ఆహార తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం, కల్తీ, వంటి సమస్యలు ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్టు డీఎస్వో ఉదయభాస్కర్ చెప్పారు. జిల్లాలో 200 చోట్ల ఏకకాలంలో నిర్వహణ కల్తీ, నిల్వ లోపాలు గుర్తించి అధికారుల తక్షణ చర్యలు లైసెన్స్ రద్దు చేస్తామని జేసీ హెచ్చరిక -
వేగంగా విశ్రాంతి షెడ్డు నిర్మాణం
● పనులను పరిశీలించిన కమిషనర్ రామచంద్రమోహన్ ● కార్తికమాసం నాటికి పూర్తి చేయాలని ఆదేశం అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి ఆలయంలోని పశ్చిమ రాజగోపురం ఎదురుగా నిర్మిస్తున్న భక్తుల విశ్రాంతి షెడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. విశాఖపట్నానికి చెందిన ‘లారెస్’ ఫార్మాస్యూటికల్ సంస్థ రూ.2.5 కోట్ల వ్యయంతో విశ్రాంతి షెడ్డు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. గత నెల మూడో తేదీన ఈ షెడ్డు నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. పశ్చిమ రాజగోపురం ముందు గల ఖాళీ ప్రదేశంలో సుమారు మూడు వేల మంది భక్తుల సేద తీరేలా దీనిని నిర్మిస్తున్నారు. 120 అడుగుల పొడవు, 80 అడుగుల వెడల్పుతో విశ్రాంతి షెడ్డు నిర్మించనున్నారు. షెడ్డు చుట్టూ ఐదు అడుగుల మేర షేడ్ కూడా ఏర్పాటు చేయనున్నారు. సుమారు 10,625 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని నిర్మిస్తున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ విశ్రాంతి షెడ్డులో వ్రతాలు, స్వామివారి దర్శనం, ప్రసాదం టిక్కెట్లు విక్రయించేందుకు వీలుగా 12 కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. వాటి ముందు స్టెయిన్లెస్ స్టీల్ క్యూ లు, మూడు హెలికాఫ్టర్ (హై వాల్యూమ్ లో స్పీడ్ ) ఫ్యాన్లు, నలుగురు కూర్చునేలా 50 సెట్లు స్టీల్ కుర్చీలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. విశ్రాంతి షెడ్డు దిగువన మార్బుల్ ఫ్లోరింగ్ చేసి ఎప్పటి కప్పుడు క్లీనింగ్ చేసేలా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం విశ్రాంతి షెడ్డు రూఫ్ వరకు పూర్తయింది. పనులను దేవదాయశాఖ కమిషనర్ కే రామచంద్రమోహన్ మంగళవారం ఉదయం పరిశీలించారు. షెడ్డు పనుల పురోగతి గురించి ఆయనకు దేవస్థానం ఈఓ సుబ్బారావు, ఈఈ రామకృష్ణ వివరించారు. కార్తికమాసం నాటికి పనులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తేవాలని కమిషనర్ ఆదేశించారు. -
పంచారామ యాత్ర, శబరిమలైకి ప్రత్యేక బస్సులు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే కార్తికమాసం సందర్భంగా పంచారామ క్షేత్ర దర్శనం, అయ్యప్పస్వామి యాత్ర చేసే వారికి శబరిమలై ప్రత్యేక బస్సులు కాకినాడ డిపో నుంచి ఏర్పాటు చేస్తామని జిల్లా ప్రజారవాణాధికారి ఎం శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక ఆర్టీసీ డిపోలో మంగళవారం యాత్రకు సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. పంచారామ స్పెషల్ అక్టోబర్ 25, 26 తేదీల్లో, నవంబర్ 1, 2, 8, 9, 15, 16 తేదీల్లోను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కాకినాడలో శనివారం రాత్రి 8 గంటలకు బస్సు బయలుదేరి అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామ, సామర్లకోట దర్శనం తర్వాత కాకినాడ చేరుకొంటుందన్నారు. శబరిమలై యాత్రవెళ్లే అయ్యప్పభక్తులు వారు కోరుకున్న చోట నుంచి కోరుకొన్న క్షేత్రాలను చూపించడానికి స్పెషల్ బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ యాత్రకు వెళ్లే వారు 99592 25564 నంబర్లో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ మనోహర్, పీఆర్వో వెంకటరాజు పాల్గొన్నారు. -
ముగిసిన పవిత్రోత్సవాలు
పెరవలి: ఆలయానికి వచ్చే అపవిత్ర భక్తులు, మంత్రోచ్ఛారణలో తప్పులు, ఆలయంలోకి వచ్చే క్రిమికీటకాల వలన జరిగే అపవిత్రతను పోగొట్టేందుకే ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తామని ఆలయ ఈఓ మీసాల రాధాకృష్ణ తెలిపారు. పెరవలి మండలం అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. వేద పండితులు ఖండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో ఈ పవిత్రోత్సవాలు నిర్వహించారు. ఉదయం స్వామి అమ్మవార్లకు హోమగుండం ఏర్పాటు చేసి అనంతరం వేదపండితులు పవిత్రాలకు పూజలు చేశారు. అనంతరం పవిత్రాలను, కలశాలను నెత్తిన పెట్టుకుని స్వామి వారికి సమర్పించారు. ఈ పవిత్రాల వల్ల ఆలయానికి, స్వామి వారికి భక్తులు, పండితుల వలన జరిగిన అపవిత్రత పోయి మళీకల జీవం వస్తుందని వర ప్రసాదాచార్యులు తెలిపారు. -
జాతీయ ఫెన్సింగ్లో శేషురిషిత్రెడ్డి ప్రతిభ
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): సీబీఎస్ఈ జాతీయ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ 2025–26 పోటీల్లో లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి నల్లమిల్లి శేషురిషిత్రెడ్డి ఒక మార్కు తేడాతో మూడో స్థానం పొంది కాంస్య పతకం సాధించాడు. ఉత్తరాఖండ్ రుద్రపూర్లో గత నెల 30 నుంచి అక్టోబర్ 3 వరకూ నిర్వహించిన పోటీల్లో 1,400 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఉత్తరాఖండ్ క్రీడా శాఖ మంత్రి రేఖా ఆర్యా, నేషనల్ ఫెన్సింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజీవ్మెహతా కాంస్య పతకం అందజేశారు. శేషురిిషిత్రెడ్డిని ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ శేషారెడ్డి అభినందించారు. జాతీయ ఫెన్సింగ్ పోటీల్లో తొలిసారిగా ఏపీ నుంచి పాల్గొని ప్రతిభ చూపడం సంతోషంగా ఉందన్నారు. ఒలింపిక్స్లో ఇదే తరహాలో ప్రతిభ చూపి జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచాలన్నారు. స్కూల్ అధినేత సుగుణారెడ్డి, ప్రిన్సిపాల్ వందనబోహ్ర కూడా అభినందించారు.నదిలో పడిన వ్యక్తి మృతదేహం లభ్యం మలికిపురం: దిండి–చించినాడ వంతెన పైనుంచి గోదావరిలో పడిన వ్యక్తి మృతదేహం మంగళవారం లభ్యమైంది. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లాలంటూ కుటుంబ సభ్యులు ఒత్తిడి చేస్తుండడంతో.. అందుకు నిరాకరిస్తూ.. బెదిరించాలన్న ఉద్దేశంతో వంతెన ఎక్కిన అతడు అదుపుతప్పి నదిలోకి పడిపోయాడు. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు, సఖినేటిపల్లి మండలం వీవీ మెరక గ్రామానికి చెందిన మేడిది సుదర్శనరాజు (25)కు రష్యాలో రూ.1.50 లక్షల జీతంతో ఉద్యోగం వచ్చింది. అతడి నానమ్మతో పాటు, కుటుంబ సభ్యులు ఉద్యోగానికి వెళ్లాలంటూ ఒత్తిడి తెచ్చారు. మద్యానికి బానిసైన సుదర్శనరాజు అక్కడకు వెళ్లనని భీష్మించాడు. ఈ నేపధ్యంతో ఈ నెల ఐదో తేదీన దిండి–చించినాడ వంతెనపైకి వెళ్లాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న అతడు తన భార్యతో ఫోన్లో మాట్లాడుతూ, అదుపుతప్పి వంతెన పైనుంచి నదిలో పడిపోయాడు. అతడి మృతదేహం మంగళవారం అంతర్వేది పల్లిపాలెం వద్ద నదీ తీరంలో లభించింది. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం పోలీసులు రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై పీవీవీ సురేష్ తెలిపారు.వెబ్నార్లో ‘నన్నయ’ అధ్యాపకులుకాకినాడ రూరల్: అంతర్జాతీయ డీసిస్ వెబ్నార్లో నన్నయ ఎంఎస్ఎన్ పీజీ సెంటర్కు చెందిన పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు. భారత్–యూరోపియన్ యూనియన్ సంబంధాలపై విద్యార్థుల చురుకై న చర్చతో పాటు, ఎకనామిక్ డెమోక్రసీ అండ్ సోషల్ ఎకానమి తదితర అంశాలపై చర్చ జరిగింది. నన్నయ అధ్యాపకులు మనోజ్ దేవా, మధుకుమార్, అప్పారావు, మణికంఠేశ్వరరెడ్డి, శ్రీదేవి, ఉమా రజిత, యూరోపియన్ యూనియన్ నుంచి స్టెఫాన్ చచెవాలీవ్, అన్నా గలాజ్కా, ఫ్రెడరిక్ డుఫేస్, ఫ్రాంజిస్కా గోర్మార పాల్గొన్నారు. -
దేశభక్తి చాటేలా.. స్ఫూర్తి నింపేలా..
● విద్యార్థులకు వీరగాథ 5.0 ● మూడు నుంచి 12వ తరగతుల వారికి పలు పోటీలు ● కేటగిరీలుగా వివిధ అంశాలపై నిర్వహణ ● ఈ నెల 31తో ముగుస్తున్న గడువు రాయవరం: విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడంతో పాటు, వారిలో సృజనాత్మకతను వెలికితీసేందుకు జాతీయ విద్యా మంత్రిత్వ, రక్షణ శాఖలు సంయుక్తంగా వీరగాథ 5.0 పేరిట పోటీలు నిర్వహిస్తున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల విద్యార్థులకు ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. మూడు నుంచి 12వ తరగతి(ఇంటర్) వరకు విద్యార్థులకు నాలుగు అంశాల్లో పోటీలు చేపడుతున్నారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందిస్తూ, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరుల గాథలను వివరించడం, వారి త్యాగాలను తెలిపేలా విద్యార్థులకు పద్యాలు, కథలు, చిత్రలేఖనం, వ్యాసరచన, మల్టీమీడియా ప్రదర్శన వంటి పోటీలు నిర్వహిస్తున్నారు. ఆయా పోటీల్లో పాల్గొనే వారికి ఈ నెల 31వ తేదీ గడువు విధించారు. ఇప్పటికే ఈ పోటీలకు సంబంధించి జిల్లా విద్యా శాఖ ఆయా పాఠశాలలకు ఉత్తర్వులు పంపింది. నాలుగు విభాగాల్లో.. పాఠశాలల వారీగా ఆయా విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. 3–5 తరగతులకు ఓ విభాగంగా, 6–8, 9–10, 11–12 తరగతులకు వేర్వేరు కేటగిరీలుగా విభజించారు. 3–5 తరగతుల వారికి పద్యం, కథ (150 పదాలు), చిత్రలేఖనం, పెయింటింగ్, 6–8 తరగతుల వారికి పద్యాలు/కథ(300 పదాలు), చిత్రలేఖనం, పెయింటింగ్, మల్టీమీడియా ప్రదర్శన. 9–10 తరగతుల వారికి పద్యాలు, వ్యాసం(700 పదాలు), చిత్రలేఖనం, పెయింటింగ్, మల్టీమీడియా ప్రదర్శన. 11–12 తరగతుల వారికి పద్యాలు, వ్యాసం(వెయ్యి పదాలు), చిత్రలేఖనం, పెయింటింగ్, మల్టీమీడియా ప్రదర్శన ఉంటుంది. ఒకటి లేదా రెండు నిమిషాల నిడివితో దేశభక్తికి సంబంధించిన ప్రదర్శన వీడియో రూపంలో ఇవ్వడమే మల్టీమీడియాగా పరిగణిస్తారు. ఎంచుకోవాల్సిన అంశాలు వీరగాథ 5.0 పోటీల్లో పాల్గొనే విద్యార్థులు వారికి నచ్చిన అంశాలను ఎంచుకునే అవకాశాన్ని కల్పించారు. దేశం కోసం అత్యున్నత త్యాగం చేసిన వారిని రోల్ మోడల్గా ఎంచుకుని, వారి నుంచి నేర్చుకున్న విలువలను ప్రస్తావించాలి. ఆ విద్యార్థికి అవకాశమిస్తే ఏం చేయదలిచాడో చెప్పాలి. ఉదాహరణకు ఝాన్సీలక్ష్మీబాయి కలలోకి వచ్చి దేశానికి సేవ చేయాలని కోరితే.. ఏం చేస్తారో వివరించవచ్చు. 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటును తాను ఆదర్శంగా తీసుకున్న స్వాతంత్య్ర సమరయోధుల జీవిత కథఽలు విద్యార్థిపై ఎలా ప్రభావితం చేసిందో చెప్పాల్సి ఉంటుంది. అలాగే స్వాతంత్య్ర పోరాటంలో గిరిజనుల తిరుగుబాటు పాత్ర, ఇతర అంశాలను ఎంపిక చేసుకుని వివరించవచ్చు. సద్వినియోగం చేసుకోవాలి వీరగాథ 5.0 పోటీలను అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్య పాఠశాలల విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత ఈ పోటీల ద్వారా బయటకు వస్తుంది. విద్యార్థులకు నిర్వహించిన పోటీలు, మల్టీమీడియా వీడియోలు ఆన్లైన్లో నమోదు చేయాలి. – డాక్టర్ షేక్ సలీం బాషా, జిల్లా విద్యాశాఖాధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా జాతీయ స్థాయిలో ప్రతిభ చాటేలా.. వీరగాథ 5.0 కార్యక్రమం విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడమే కాకుండా, వారిలోని సృజనాత్మకతను వెలికితీసే చక్కటి కార్యక్రమం. విద్యార్థుల ప్రతిభ జాతీయ స్థాయిలో కనబర్చేలా ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గదర్శకత్వం చేయాలి. విద్యార్థుల్లో దేశభక్తిని చాటేలా, వీరుల గాథలు వారిలో స్ఫూర్తి నింపేలా పోటీలు నిర్వహించాలి. – జి.మమ్మీ, అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్, సమగ్ర శిక్షా, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నమోదు విధానం ఆయా పాఠశాలల విద్యార్థులకు ఉపాధ్యాయులు కేటగిరీలుగా, తరగతుల వారీగా పోటీలు నిర్వహించాలి. ఆసక్తి ఉన్న విద్యార్థులకు పోటీలు నిర్వహించి, వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలి. ఇందుకు ఇన్నోవేటివ్ ఇండియా.మై జీవోవీ.ఇన్/వీర్.గాథ 5.0 అనే వెబ్సైట్లో నమోదు చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ యువర్ ఎంట్రీ అని ఉన్న చోట క్లిక్ చేసి వివరాలను నమోదు చేయాలి. ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలల నుంచి అత్యుత్తమమైన నాలుగు ఎంట్రీలను అప్లోడ్ చేయాలి. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఉత్తమంగా ఎంపిక చేసిన వాటిని జాతీయ స్థాయికి పంపిస్తారు. జాతీయ స్థాయిలో ఒక్కో విభాగంలో 25 మంది వంతున అత్యుత్తమ ప్రతిభ చూపిన వారిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి రూ.10 వేల వంతున నగదు పారితోషికాన్ని, ప్రశంసాపత్రాన్ని అందజేస్తారు. ఇప్పటికే ప్రతిభ కనబరుస్తూ.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలో ఉన్న 2,030 ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యల పరిధిలో 2.08 లక్షల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఆయా పాఠశాలల్లో తరగతుల వారీగా, కేటగిరీల వారీగా ఉపాధ్యాయులు పోటీలు నిర్వహిస్తున్నారు. పలువురు విద్యార్థులు సొంతంగా దేశభక్తిని పెంపొందించేలా చిన్న వీడియోలు రూపొందిస్తున్నారు. -
కొవ్వాడలో పట్టపగలు చోరీ
● 50 కాసుల బంగారు ఆభరణాల అపహరణ ● సొత్తు విలువ రూ.40 లక్షలు కాకినాడ రూరల్: మండలంలోని కొవ్వాడ గ్రామంలో పట్టపగలే భారీ చోరీ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంటి గేటు, తలుపు తాళాలు పగులగొట్టి, లోనికి ప్రవేశించిన దొంగలు.. బీరువాలోని బంగారు ఆభరణాలు కొల్లగొట్టారు. ఇంద్రపాలెం పోలీసుల వివరాల మేరకు, కిర్లంపూడి ఎంఈఓ మక్కా చిన్నారావు కొవ్వాడలో నివసిస్తున్నారు. ఆయన భార్య విద్య మాధవపట్నంలో టీచర్గా పనిచేస్తున్నారు. ఇద్దరు కుమారులు చదువుకుంటున్నారు. సోమవారం ఉదయం 8.30కు ఇంటి తలుపులు వేసి, బయట గేటుకు తాళం వేసి వారు విధులకు వెళ్లిపోయారు. సాయంత్రం 4.30కు తిరిగొచ్చేసరికి గేటు తాళం పగులగొట్టి ఉన్నట్టు గుర్తించారు. లోనికి వెళ్లిచూడగా.. ఇంటి తలుపు తాళం తెరిచి, గదిలోని బీరువాలో వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువాలోని బంగారు ఆభరణాలు కనిపించకపోయేసరికి వారు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ద్వారా రూరల్ సీఐ చైతన్యకృష్ణ సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించారు. సుమారు 50 కాసుల బంగారు ఆభరణాలు దొంగిలించారని, వీటి విలువ రూ.40 లక్షలకు పైగా ఉంటుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారావు ఫిర్యాదు మేరకు ఎస్సై వీరబాబు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్న సీఐ చైతన్యకృష్ణ ఈ వివరాలను మంగళవారం రాత్రి మీడియాకు తెలిపారు. -
అతివేగం.. తీసింది ప్రాణం
● ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీ ● అక్కడికక్కడే ఇద్దరి దుర్మరణం రాజానగరం: ఒక్క క్షణం.. ఇంటి వద్ద ఓ కుటుంబం ఎదురుచూస్తుందని ఒక్క క్షణం ఆలోచిస్తే.. ఎంతో జీవితం మిగిలి ఉందన్న ఆలోచన ఒక్క క్షణమైనా వస్తే.. నిర్లక్ష్యపు ప్రయాణం, ప్రమాదకరమైన అతివే గం అనేవి ఉండవు. ఆ నిర్లక్ష్యం.. అతివేగం కారణంగానే రెండు నిండు ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. మండలంలోని నందరాడ–నరేంద్రపురం మధ్య ఎదురెదురుగా వచ్చిన రెండు బైకులు ఢీకొన్న దుర్ఘటనలో, వాటిపై ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం, జట్టు కూలీగా పని చేసే రాజానగరానికి చెందిన బుదిరెడ్డి సత్యనారాయణ (30) మంగళవారం సాయంత్రం కో రుకొండ నుంచి స్కూటీపై వస్తున్నాడు. అదే సమయంలో కొవ్వూరుకు చెందిన మోర్ల శ్రీనివాసరావు (45) కోరుకొండ మండలం శ్రీరంగపట్నంలోని అత్తవారింటికి వేరే మోటార్ బైక్పై వెళ్తున్నాడు. కాగితాలమ్మవారి గుడి సమీపంలో వీరి వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో గాయపడిన ఇద్ద రు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతిచెందిన సత్యనారాయణకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నా రు. కాగా శ్రీనివాసరావు వివరాలు తెలియాల్సి ఉంది. రాజానగరం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తీరని నష్టం : అతివేగం అనర్థదాయకమంటూ అనేక విధాలుగా హెచ్చరిస్తున్నప్పటికీ వేగ నియంత్రణపై జనాలు దృష్టి పెట్టడం లేదు. నందరాడలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణానికి అతివేగమే కారణంగా తెలుస్తోంది. వీరు ప్రయాణిస్తున్న రెండు వాహనాలు ధ్వంసమైన తీరు చూస్తుంటే.. వీరు ఎంత వేగంతో ప్రయాణిస్తున్నారో అవగతమవుతోంది. ఆ వేగమే వారి ప్రాణాల నూ హరించి, వారి కుటుంబాలకు తీరని నష్టాన్ని చేకూర్చింది. -
13 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
రాజానగరం: అనధికారికంగా తరలిస్తున్న 13 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. నిందితులపై 6ఏ కేసు నమోదు చేశారు. ఎంఎస్ఓ గొలుగూరి బాపిరాజు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కృష్ణా జిల్లా ఉయ్యూరు నుంచి కాకినాడ జిల్లా పిఠాపురానికి వ్యాన్లో రేషన్ బియ్యం తరలిస్తున్నారు. ముందుగా అందిన సమాచారంతో జాతీయ రహదారిపై తనిఖీలు చేస్తుండగా, వ్యాన్ ద్వారా గోనె సంచుల్లో తరలిస్తున్న 13,750 కిలోల రేషన్ బియ్యం లభ్యమైంది. దీని విలువ రూ.12 లక్షలు ఉంటుంది. పట్టుబడిన బియ్యానికి ఎటువంటి రికార్డులు లేకపోవడంతో పిఠాపురం మండలం భోగాపురానికి చెందిన డ్రైవర్ కోరసిక విజయ్, సరకు రవాణాదారు, వాహన యజమాని అయిన గొల్లప్రోలుకు చెందిన గారపాటి రాజుపై 6ఏ కేసు నమోదు చేశారు. రాజానగరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
సెల్ఫోన్, నగదు కోసమే హత్య
● ఇద్దరు నిందితుల అరెస్టు ● మారణాయుధం, సొత్తు స్వాధీనం సామర్లకోట/తుని రూరల్: తాగిన మైకంలో ఓ యువకుడితో గొడవపడి, అతడి వద్ద ఉన్న సెల్ఫోన్, రూ.ఐదొందలు నగదు కోసం అతడిని హతమార్చిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తుని రూరల్ పరిధిలోని నర్సీపట్నం బస్టాండ్ వద్ద ఈ నెల రెండో తేదీన రాత్రి తుని రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద (నర్సీపట్నం బస్టాండ్ వద్ద) జరిగిన గుర్తు తెలియని యువకుడి హత్య సంచలనం రేపింది. కాకినాడ జిల్లా ఎస్సీ జి.బిందుమాధవ్ ఆదేశాలతో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు పర్యవేక్షణలో నియమించిన ప్రత్యేక బృందాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి హత్య కేసును ఛేదించారు. మంగళవారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పెద్దాపురం డీఎస్పీ డి.శ్రీహరిరాజు వివరాలు వెల్లడించారు. గొల్లప్రోలు మండలం కొడవలికి చెందిన బొడ్డు సురేష్, పాయకరావుపేటకు చెందిన తర్రా ప్రసాద్ చిత్తు కాగితాలు ఏరుకుంటూ, ఆ సంపాదనతో జీవనం సాగిస్తున్నారు. కుటుంబమంటూ లేకపోవడంతో వారు ఆకతాయిలుగా తిరుగుతున్నారు. వీరిద్దరూ ఈ నెల రెండున రాత్రి బస్టాండ్ సమీపంలో మద్యం సేవిస్తున్నారు. అదే సమయంలో అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన తానార అప్పలనాయుడు(37) బస్టాండ్ వద్దకు వచ్చాడు. నిందితుల వద్దకు వచ్చిన సమయంలో పరధ్యానంలో అప్పలనాయుడు వారిపై పడబోయాడు. దాంతో సురేష్ అతడిని తోసేయడంతో జేబులో ఉన్న విలువైన సెల్ఫోన్ కిందపడింది. చొక్కా జేబులో నగదు కనిపించింది. అతని వద్ద ఉన్న సెల్ఫోన్, నగదు కాజేసేందుకు నిందితులు కుట్ర పన్నారు. అతడి సెల్ఫోన్, నగదును నిందితులు లాక్కునే క్రమంలో వారి మధ్య తోపులాట జరిగింది. సమీపంలో ఉన్న రాయి, ఇనుప రాడ్డుతో నిందితులు కలిసి అప్పలనాయుడిపై దాడి చేశారు. ఇష్టానుసారం కొట్టిన తర్వాత రాడ్డును తుప్పల్లోకి విసిరేసి, సెల్ఫోన్, నగదును తీసుకుని నిందితులు పరారయ్యారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా, సంఘటన స్థలిలో దొరికిన ఆధారాలతో పోలీసులు కేసును ఛేదించారు. మంగళవారం తుని పట్టణ శివార్లలో తచ్చాడుతున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు వాడిన ఇనుప రాడ్డు, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను బుధవారం కోర్టులో హాజరుపర్చుతామన్నారు. కేసును ఛేదించిన తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు, గీతారామకృష్ణ, తుని రూరల్ ఎస్సై కృష్ణమాచారి, తొండంగి ఎస్సైలు జగన్మోహన్, జె.విజయబాబు, సిబ్బంది, ప్రత్యేక బృందాలను జిల్లా ఎస్పీ బిందుమాధవ్ అభినందించారు. -
జనారణ్యంలోకి వన్యప్రాణి
● కుక్కకాట్లకు గురైన జింక ● చికిత్స అనంతరం అడవిలో విడిచిపెట్టిన అటవీ అధికారులు ప్రత్తిపాడు: దారి తప్పి జనారణ్యంలోకి ఓ వన్యప్రాణి చొచ్చుకొచ్చింది. శునకాల బారిన పడి గాయపడింది. ప్రత్తిపాడులో శస్త్రచికిత్స చేయగా, తిరిగి అరణ్యంలోకి స్వేచ్ఛగా అడుగిడింది. మంగళవారం జరిగిన ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. సమీప అటవీ ప్రాంతం నుంచి గొర్రెల మందతో పాటు ఓ జింక జనారణ్యంలోకి అడుగిడింది. రంగంపేట మండలం ఆనూరు గ్రామంలో ఓ గొర్రెల మందతో పాటు జింకను కాపర్లు గమనించారు. అప్పటికే అది కుక్కకాట్లకు గురై, గాయపడి ఉంది. ఈ మేరకు రంగంపేట గ్రామస్తులు జిల్లా అటవీ శాఖాధికారులకు సమాచారం అందించారు. ఏలేశ్వరం డిప్యూటీ రేంజ్ అధికారి ఎం.జాన్సన్ తన సిబ్బందితో రంగంపేట చేరుకుని, గాయపడిన జింకను చికిత్స కోసం ప్రత్తిపాడు ప్రభుత్వ పశు వైద్యశాలకు తరలించారు. పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ చిక్కం బాలచంద్ర యోగేశ్వర్ ఆ జింకకు శస్త్రచికిత్స అందించారు. కుదుటపడిన జింకను మంగళవారం సాయంత్రం ఏలేశ్వరం మండలం లింగంపర్తి రిజర్వు ఫారెస్ట్ ప్రాంతంలో విడిచిపెట్టినట్టు డిప్యూటీ రేంజ్ అధికారి జాన్సన్ తెలిపారు. -
ఉత్సాహంగా ఎస్జీఎఫ్ఐ ఎంపికలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య అండర్–14, 17 ఆధ్వర్యంలో మంగళవారం కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో వివిధ క్రీడాంశాల్లో క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికలను ఐపీఈ (ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్) సలీమ్ బాషా ప్రారంభించారు. బేస్బాల్, హాకీ, స్విమ్మింగ్లో అండర్–14, 17 బాలబాలికలను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. బేస్బాల్లో 64, హాకీలో 72, స్విమ్మింగ్లో 76 మంది ఎంపికై నట్టు ఎస్జీఎఫ్ఐ కార్యదర్శులు శ్రీనివాస్, సుధారాణి తెలిపారు. పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు ఎంపికలను పర్యవేక్షించారు. బేస్బాల్ పోటీలు ఎంపికై న కొవ్వూరు పాఠశాల క్రీడా సమాఖ్య ఽఆధ్వర్యంలో కాకినాడ డీఎస్ఏ మైదానంలో నిర్వహించిన అండర్–14, 17 బేస్బాల్ ఎంపికల్లో కొవ్పూరు జెడ్పీ పాఠశాల విద్యార్ధులు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. అండర్–14 విభాగంలో సోము దీక్షితారాణి, మాసాబత్తుల సూర్యహాసిని, బాలుర విభాగంలో మడుగుల తేజ, అనసూరి రోహిత్, వెంకట్గణేష్, అండర్–17లో విత్తనాల రాజా శ్రీవల్లి, వీధిసత్యశాంతి, సోము హారిక, బాలుర విభాగంలో రెడ్డిసత్య వెంకట్రావు, పిల్లి అభిరామ్ ఎంపికై నట్టు పాఠశాల హెచ్ఎం బండిసత్య శ్రీనివాస్, పీడీ ప్రసాద్ తెలిపారు. -
అధినేతతో జిల్లా నాయకులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మాజీ మంత్రి, పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, పార్టీ నరసాపురం పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు కలిశారు. తాడేపల్లి వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన పార్టీ సమీక్షా సమావేశాలలో పాల్గొన్న అనంతరం జగన్ను కలిసి కాకినాడ జిల్లాలో పలు అంశాలపై చర్చించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడికి నిరసన సామర్లకోట: అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్పై దాడి జరగడం దారుణమని పెద్దాపురం న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం పెద్దాపురంలో కోర్టు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. పెద్దాపురం బార్ అసోసియేషన్ పిలుపు మేరకు కోర్టు నుంచి వాకౌట్ చేసి కోర్టు ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. ఘనంగా ప్రత్యంగిర హోమం అన్నవరం: రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి ఆశ్వీయుజ పౌర్ణిమ పర్వదినం సందర్భంగా మంగళవారం ప్రత్యంగిర హోమం ఘనంగా నిర్వహించారు. ఉదయం తొమ్మిది గంటలకు పండితులు వనదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రత్యంగిర హోమం ప్రారంభించారు. హోమం అనంతరం ఘనంగా పూర్ణాహుతి నిర్వహించారు. తరువాత అమ్మవార్లకు వేద పండితులు నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. అనంతరం అమ్మవారికి ప్రసాదాలు నివేదించి భక్తులకు పంపిణీ చేశారు. ప్రత్యంగిర హోమంలో 30 మంది భక్తులు రూ.750 చొప్పున టిక్కెట్లు కొనుగోలు చేసి పాల్గొన్నారు. రూ.22,500 ఆదాయం దేవస్థానానికి సమకూరింది. వేద పండితులు యనమండ్ర శర్మ, గంగాధరబట్ల గంగబాబు, ఆలయ పరిచారకులు చిట్టెం వాసు, వేణు, వ్రత పురోహితులు దేవులపల్లి ప్రకాష్, కూచుమంచి ప్రసాద్ ప్రత్యంగిర హోమం నిర్వహించారు. కార్తిక మాస ఏర్పాట్లపై నేడు సమావేశం అన్నవరం: ఈ నెల 22 నుంచి నవంబర్ 20 వ తేదీ వరకు కొనసాగనున్న కార్తికమాసంలో అన్నవరం శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి విచ్చేసే భక్తుల కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపై బుధవారం వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, దేవస్థానం అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 11 గంటల నుంచి ప్రకాష్సదన్ సత్రంలోని ట్రస్ట్ బోర్డు హాలులో చైర్మన్ ఐవీ రోహిత్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. విదేశాల్లో విద్య, ఉద్యోగ అవకాశాలు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో విదేశాల్లో విద్య, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన ఇన్చార్జి అధికారి వీ.డీ.జీ.మురళీ మంగళవారం తెలిపారు. ఖతర్ దేశంలో హోమ్కేర్ నర్స్, జర్మనీలో ఫిజియో థెరఫిస్ట్, ఆపరేషన్ థియేటర్ టెక్నిషియన్ ఉద్యోగాలకు, రష్యాలో మెటలర్జీ డిప్లొమా కోర్సులో అడ్మిషన్లు కల్పిస్తున్నామన్నారు. అర్హత, ఫీజు వివరాలు తదితర వాటికోసం 99888 53335 నంబర్లో సంప్రదించవచ్చని సూచించారు. -
పట్టుబట్టి.. తూర్పార బట్టి..
సాక్షి ప్రతినిధి, కాకినాడ/బోట్క్లబ్: కూటమి సర్కార్ తీరుపై తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం గరంగరంగా సాగింది. జిల్లా పరిషత్లో పూర్తి ఆధిపత్యం కలిగిన వైఎస్సార్ సీపీ సభలో పైచేయి సాధించింది. సమావేశం ప్రారంభం నుంచి చివరి వరకు వైఎస్సార్ సీపీ సభ్యులు కూటమి సభ్యులకు చుక్కలు చూపించారు. సర్కార్ పాలనా తీరును వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు తీవ్ర స్థాయిలో ఎండగట్టడంతో సమావేశం ఆద్యంతం కూటమి పక్ష సభ్యులు ఖిన్నులయ్యారు. మంగళవారం కాకినాడలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన జరిగింది. తొలుత ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కరప ఎంపీడీఓ బి కృష్ణగోపాల్కు సంతాపంగా సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. అనంతరం అజెండాపై చర్చ ప్రారంభమవ్వగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో వచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చర్చకు వైఎస్సార్ సీపీ సభ్యులు పట్టుబట్టారు. జిల్లాలో రైతులను ఇబ్బందులు పాల్జేస్తోన్న యూరియా కొరత, మెట్ట ప్రాంత మండలాల్లో నకిలీ పత్తి విత్తనాలతో రైతులకు జరిగిన నష్టం, జీఎస్టీ, రంపచోడవరం ఏజెన్సీలో ప్రొటోకాల్ పాటించని తీరు, జిల్లాలో అధ్వానంగా తయారైన రహదారులు తదితర అంశాలపై చర్చ వాడివేడిగా జరిగింది. తొలుత గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మొదలుపెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి సర్కార్ ప్రైవేటీకరించడంపై సభ అట్టుడికింది. ఈ అంశంపై చర్చ జరగాల్సిందే, ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా సభ తీర్మానాన్ని ఆమోదించాల్సిందేనని వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు గన్నవరపు శ్రీనివాస్, కుడుపూడి శ్రీనివాసరావు, గుబ్బల తులసీకుమార్, ఉలవకాయల లోవరాజు తదితరులు పట్టుబట్టారు. టీడీపీ నుంచి ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ వ్యతిరేకించడంతో ఇరుపక్షాల మధ్య సంవాదం చోటు చేసుకుంది. సమావేశంలో ప్రైవేటీకరణపై చర్చ కోసం పట్టుబట్టి చివరకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైఎస్సార్ సీపీ సభ్యులు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. జెడ్పీ చైర్పర్సన్ వేణుగోపాలరావు కల్పించుకుని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్కు సూచించడంతో సభ్యులకు సర్దిచెప్పి తిరిగి సభలోకి తీసుకురావడంతో సమస్య సద్దుమణిగింది. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తీర్మానం అనంతరం జరిగిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై జరిగిన చర్చలో వైఎస్సార్ సీపీ సభ్యులు పాల్గొని కూటమి సర్కార్ తీరును ఎండగట్టారు. నిర్మాణాలు పూర్తి అయిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించి ప్రభుత్వ వైద్యవిద్యను పేదలకు దూరం చేసే కూటమి కుట్రలను రాజ్యసభ సభ్యుడు సుభాష్చంద్రబోస్, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు తీవ్ర స్థాయిలో నిరసించారు. 16 సంవత్సరాలు సీఎంగా ఒక్క కాలేజీ కూడా తీసుకురాలేకపోయిన చంద్రబాబు.. 17 కాలేజీలను జగన్మోహన్రెడ్డి తీసుకువస్తే వాటిని ప్రైవేటీకరిస్తున్నారని సభ్యులు ధ్వజమెత్తారు. చర్చ అనంతరం ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సర్వసభ్య సమావేశం తీర్మానాన్ని ఆమోదింపచేయడంలో వైఎస్సార్ సీపీ సభ్యులు సభలో పై చేయి సాధించారు. జిల్లాలో యూరియా కొరతతో రైతులు పడుతున్న కష్టాలు సర్కార్ చెవికెక్కలేదంటూ గొల్లప్రోలు, తాళ్లరేవు జెడ్పీటీసీ సభ్యులు ఉలవకాయల లోవరాజు, దొమ్మేటి సాగర్ ప్రశ్నించారు. 2023తో పోలిస్తే 2025లో 3వేల మెట్రిక్ టన్నులు యూరియా అధికంగా పంపిణీ చేశామని వ్యవసాయశాఖ జేడీ విజయకుమార్ ఇచ్చిన వివరణపై ఎంపీ బోస్ తప్పుపట్టారు. చెబుతున్న లెక్కలకు జిల్లాల్లో ఎరువుల పంపిణీకి అసలు పొంతనే ఉండటం లేదన్నారు. ఇంతలో ఎమ్మెల్సీ అనంతబాబు కల్పించుకుని రంపచోడవరం ఏజెన్సీలో వర్షాభావ పరిస్థితుల్లో ఐదు ఎకరాల రైతుకు ఒక యూరియా బస్తా కూడా ఇవ్వలేదన్నారు. మెట్ట ప్రాంతంతో పోలిస్తే ఏజెన్సీలో రైతులు యూరియా కోసం నానా పాట్లు పడ్డారన్నారు. జగన్ ప్రభుత్వంలో నూరుశాతం రాయితీ విత్తనాలు అందిస్తే ఇప్పుడు ఎంతమంది రైతులకు ఎన్ని టన్నులు ఇచ్చారో చెప్పాలని అనంతబాబు ప్రశ్నకు అధికారుల నుంచి సమాధానం లభించలేదు. ఏజెన్సీలో ప్రొటోకాల్ పాటించకపోవడాన్ని వై రామవరం ఎంపీపీ ఆనంద్, జెడ్పీటీసీ సభ్యురాలు వెంకటలక్ష్మి నిలదీశారు. వై రామవరం మండలం చింతలపూడి పంచాయతీలో రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే ఫ్లెక్సీ పెట్టి కుటుంబ సభ్యులు టెంకాయ కొట్టిన ఫ్లెక్సీ ఫొటోను అనంతబాబు సభలో ప్రదర్శించి అధికారుల తీరును ప్రశ్నించారు. ప్రొటోకాల్ పాటించకుండా జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలను అవమానపరుస్తున్నారని ఎమ్మెల్సీ అనంతబాబు, రంపచోడవరం ఎంపీపీ వెంకటలక్ష్మి ప్రశ్నించారు. ఐటీడీఏలో డీఈఈ చైతన్య చేసిన పనులకు రెండోసారి బిల్లులు పెట్టి రూ.40 లక్షలు కాజేసిన విషయాన్ని నిరూపిస్తానని ఎమ్మెల్సీ అనంతబాబు నిలదీయగా సమాధానం ఇవ్వలేక అధికారులు నీళ్లు నమిలారు. నకిలీ పత్తి విత్తనాల ప్రస్తావన పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు, చేబ్రోలు తదితర ప్రాంతాల్లో నకిలీ పత్తి విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని గొల్లప్రోలు జెడ్పీటీసీ సభ్యుడు లోవరాజు సభ దృష్టికి తీసుకువచ్చారు. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేయగా విచారణ చేస్తున్నామని, నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ షణ్మోహన్ వివరణ ఇచ్చారు. ఉప్పాడ బీచ్ రోడ్డు చాలా అధ్వానంగా తయారైనా పట్టించుకోవడం లేదని జెడ్పీ వైస్ చైర్పర్సన్ మేరుగు పద్మలత ప్రశ్నించారు. తుని ఏరియా ఆస్పత్రిలో ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చి తల్లి తనువు చాలించిన విషయాన్ని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు లేకపోవడాన్ని ఆమె నిలదీయగా విచారణ చేస్తున్నామని చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. మరో ఏడాది మాత్రమే తమ పదవీ కాలం ఉందని, ఇప్పటికై నా నిధులు విడుదల చేయాలని జెడ్పీటీసీ సభ్యులు డిమాండ్ చేశారు. జీఎస్టీకి అనుకూలంగా తీర్మానాన్ని ఆమోదించే విషయంపై కూటమి పక్ష ప్రజాప్రతినిధులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, సోము వీర్రాజుతో వైఎస్సార్ సీపీ రావులపాలెం, గొల్లప్రోలు జెడ్పీటీసీ సభ్యులు కుడుపూడి శ్రీనివాసరావు, లోవరాజు విభేదించారు. సమావేశానికి హాజరైన వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు మాట్లాడుతున్న చైర్పర్సన్ విప్పర్తి. చిత్రంలో కలెక్టర్ షణ్మోహన్, జెడ్పీ సీఈఓ లక్ష్మణరావుసాగునీటి కొరత రాకుండా చర్యలుఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 4.79 లక్షల ఎకరాల్లో పంటల సాగుకు నీటి కొరత రాకుండా చూడాలని సభ్యులు అధికారులకు సూచించారు. ఇప్పటి వరకూ 60 టీఎంసీలు సరఫరా చేశామని, గోదావరిలో చేరిన సర్ ప్లస్ సరఫరా చేస్తున్నామని అధికారులు వివరణ ఇచ్చారు. సీలేరు జలాలను కూడా తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ఆలమూరు మండలం లంక భూముల్లో మట్టిని ఇటుక బట్టీల కోసం లోతుగా తవ్వేయడంతో దొండ, ఇతర కూరగాయల పంటల సాగు కనుమరుగవుతోందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. గోకవరం, కోరుకొండ, రాజానగరం మండలాలు ఎక్కడో దూరంగా ఉన్న అమలాపురం ఇరిగేషన్ డివిజన్ పరిధిలో ఉండటం వల్ల అధికారుల పర్యవేక్షణకు, రైతుల సమస్యల పరిష్కారానికి అసౌకర్యంగా ఉందని, వాటిని రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలోకి తేవాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేసిన ప్రతిపాదనను సభ ఆమోదించింది. జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు, రంపచోడవరం ఐటీడీఏ పీవో బి.స్మరన్రాజ్, తూర్పుగోదావరి డీఆర్వో టీ.సీతారామమూర్తి, కోనసీమ జిల్లా డీఆర్వో కె.మాధవి పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తీర్మానం యూరియా కొరతపై గళం విప్పిన సభ్యులు నకిలీ పత్తి విత్తనాలపై నిలదీత రంపచోడవరం మన్యంలో ప్రొటోకాల్పై చర్చ గరం..గరంగా ‘తూర్పు’ జెడ్పీ సమావేశం


