breaking news
Kakinada District News
-
వనదుర్గమ్మ సన్నిధిలో నేటి నుంచి ఖడ్గమాల పూజ
● టికెట్టు రూ.1,116 ● ప్రతి శుక్రవారం నిర్వహణఅన్నవరం: సత్యదేవుని సన్నిధిలో వన సంరక్షురాలిగా, రత్నగిరి వనదేవతగా పూజలందుకుంటున్న వనదుర్గ అమ్మవారి ఆలయంలో దుర్గామాతకు అత్యంత ప్రీతికరమైన ఖడ్గమాల పూజ నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రతి శుక్రవారం వనదుర్గమ్మ ఆలయంలో చండీ హోమం.. ప్రతి పౌర్ణమి, అమావాస్య నాడు ప్రత్యంగిర హోమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వీటికి భక్తుల వద్ద నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ క్రమంలోనే కొత్తగా ఖడ్గమాల పూజను శుక్రవారం ఉదయం 10.30 గంటలకు లాంఛనంగా ప్రారంభించనున్నట్లు దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాథరావు తెలిపారు. దీనిని ప్రతి శుక్రవారం ఉదయం 7.30 నుంచి 8.30 గంటల వరకూ నిర్వహిస్తామని తెలిపారు. ఈ పూజకు టికెట్టును రూ.1,116గా నిర్ణయించారు. వనదుర్గ ఆలయ అర్చకుడు, వ్రత పురోహితులు ఈ పూజ నిర్వహిస్తారు. పూజ చేయించుకుంటున్న దంపతులు అమ్మవారికి ఎదురుగా కూర్చుని, అర్చకుడు చెప్పినట్లుగా మంత్రాలు చదువుతూ శ్రీచక్రంపై పసుపు, కుంకుమ, ఇతర ద్రవ్యాలతో పూజ చేస్తారు. పూజ అనంతరం ఆ దంపతులకు వారు పూజ చేసిన అమ్మవారి కుంకుమ, రాగి డాలర్, కండువా, రవికల వస్త్రం, 250 గ్రాముల పులిహోర ప్రసాదం అందజేస్తారు. భక్తులు కొబ్బరికాయ, అరటి పండ్లు, పూలు మాత్రం తీసుకురావాలి. మిగిలినవి దేవస్థానం సమకూరుస్తుంది. దుర్గ గుడిలో మాదిరిగా.. విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో నిర్వహించే ఖడ్గమాల పూజ మాదిరిగానే ఇక్కడ కూడా ఈ పూజ నిర్వహిస్తారు. ఐదు చదరపు అంగుళాల పరిమాణంలో, ఒకవైపు శ్రీచక్ర యంత్రం, మరోవైపు అమ్మవారి చిత్రం ముద్రించిన యంత్రాలను ఈ పూజలో ఉపయోగిస్తారు. దీని కోసం 50 యంత్రాలు, వంద ఇత్తడి పళ్లాలు, వంద పంచపాత్రలు, ఉద్ధరిణులను వ్రత పురోహిత సూపర్వైజర్లు ప్రయాగ అంజిబాబు, దేవులపల్లి సూర్యనారాయణ, డ్యూటీ సభ్యులు నాగాభట్ల రవిశర్మ, కర్రి సూర్యనారాయణమూర్తి తదితరులు దేవస్థానానికి సమర్పించారు. పూజ అనంతరం ఈ యంత్రాలను దేవస్థానం వెనక్కి తీసుకుంటుంది. ఒకవైపు వనదుర్గ అమ్మవారు, మరోవైపు శ్రీచక్ర యంత్రం ముద్రించి ఉన్న చిన్న డాలర్లను మాత్రం భక్తులకు అందజేస్తారు. ప్రస్తుతం అమ్మవారి ఆలయ మండపం చాలా చిన్నదిగా ఉండటంతో ఏకకాలంలో 20 జంటలకు మించి ఈ పూజ చేసుకునే అవకాశం లేదు. అందువలన ఈ మండపాన్ని 30 అడుగుల ముందుకు విస్తరించనున్నారు. దీని కోసం రూ.40 లక్షలతో ఆలయం మొదటి అంతస్తు, రెండో అంతస్తుకు శ్లాబులు వేయనున్నారు. ఈ పనులకు త్వరలోనే టెండర్లు పిలవనున్నట్లు చైర్మన్, ఈఓ తెలిపారు. -
జిల్లా రిజిస్ట్రార్గా ప్రసాదరావు బాధ్యతల స్వీకరణ
కాకినాడ లీగల్: జిల్లా నూతన రిజిస్ట్రార్గా కె.ప్రసాదరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సాఫ్ట్వేర్లోని సాంకేతిక లోపాలు త్వరలోనే పరిష్కారమవుతాయన్నారు. ఆస్తి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు క్రయవిక్రయదారులకు ఓటీపీ వస్తుందని, ఆ తర్వాత ఆస్తి వివరాలు స్వయంగా నమోదు చేయడం ద్వారా ఎటువంటి అక్రమాలకూ తావుండదని చెప్పారు. ఎటువంటి లోపాలూ లేకుండా వేగవంతంగా రిజిస్ట్రేషన్లు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రసాదరావు 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా విధుల్లో చేరారు. అనంతరం వివిధ ఉద్యోగోన్నతులు పొంది, కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో సబ్ రిజిస్ట్రార్గా విధులు నిర్వహించారు. కృష్ణా జిల్లా చల్లపల్లి సబ్ రిజిస్ట్రార్గా పని చేస్తున్న ఆయనకు ఉద్యోగోన్నతి కల్పించి, జిల్లా రిజిస్ట్రార్గా కాకినాడలో నియమించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రసాదరావును జాయింట్ సబ్ రిజిస్ట్రార్లు–1, 2, ఆర్వీ రామారావు, పీఎస్వీఎస్ఎస్ వీరభద్రరావు, ఇతర సబ్ రిజిస్ట్రార్లు, ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిశారు. బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శుల నియామకం పిఠాపురం: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పిఠాపురం నియోజకవర్గానికి చెందిన వెంగళి సుబ్బారావు, పైలా కృష్ణమూర్తిలను రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శులుగా నియమించారు. పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపింది.చార్విక చికిత్సకు దాడిశెట్టి రాజా ఆర్థిక సాయం తొండంగి: కాలేయ వ్యాధితో బాధ పడుతున్న చిన్నారి చార్విక చికిత్సకు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా గురువారం రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. కోన ప్రాంతానికి చెందిన చార్విక చికిత్స నిమిత్తం అద్దరిపేటకు చెందిన యువత దాతలను ఆశ్రయించి విరాళాలు సేకరిస్తోంది. ఇన్స్టాగ్రామ్లో ఈ విషయం గమనించిన దాడిశెట్టి రాజా తన వంతు సాయాన్ని తునిలోని తన కార్యాలయంలో అద్దరిపేట యువతకు, చిన్నారి కుటుంబ సభ్యులకు అందించారు. కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మడదా హేమంత్ తదితరులున్నారు. రూ.10 లక్షల గంజాయి పట్టివేత వై.రామవరం: అక్రమంగా తరలిస్తున్న రూ.10 లక్షల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. అడ్డతీగల సీఐ బి.నరసింహమూర్తి కథనం ప్రకారం.. ఒడిశా రాష్ట్రం చిత్రకొండ నుంచి మండలంలోని కోట, చవిటిదిబ్బలు గ్రామాల మీదుగా రాజమహేంద్రవరానికి మినీ వ్యాన్లో అక్రమంగా రవాణా చేస్తున్న 50 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఒడిశాకు చెందిన బాబుల్ హంతాల్, ముబారాజ్లను పోలీసులు అరెస్టు చేశారు. -
జగ్గంపేటలో రూ.200 కోట్లకు పైగా అవినీతి
కిర్లంపూడి: జగ్గంపేట నియోజకవర్గంలో రూ.200 కోట్లకు పైగా అవినీతి జరిగిందని గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పాటంశెట్టి సూర్యచంద్ర ఆరోపించారు. బూరుగుపూడిలోని తన నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ హయంలో ఈ అవినీతి చోటు చేసుకుందని ఆరోపించారు. దోచుకున్న ప్రజాధనాన్ని ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ, మైనింగ్ శాఖల అండదండలతో మామిడాడ, కృష్ణవరం, గండేపల్లి, మురారి, నాయకంపల్లి, బావాజీపేట, సూదికొండ, వేలంకతో పాటు అనేక గ్రామాల్లో మట్టి, ఇసుక అక్రమంగా తరలించి కోట్ల రూపాయాలు అక్రమంగా ఆర్జిస్తున్నారని ఆరోపించారు. నిబంధనలు ఉల్లంఘించి, అధిక లోడుతో వస్తున్న మట్టి, ఇసుక లారీలను కృష్ణవరం టోల్గేటు ద్వారా కాకుండా కృష్ణవరం గ్రామం నుంచి పోలవరం కాలువ గట్టు ద్వారా బూరుపూడికి మళ్లిస్తున్నారని అన్నారు. దీనికి వ్యక్తిగత టోల్గేటు ఏర్పాటు చేసుకుని, వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. ఈ అవినీతిని నిరూపించడానికి తాను సిద్ధమని, స్థలం, సమయం, తేదీ చెప్తే, అక్కడకు వెళ్లి, అవినీతిని బయటపెడతానని సూర్యచంద్ర సవాల్ చేశారు. ఒకవేళ నిరూపించలేకపోతే ఆ సమావేశంలోనే వారి కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పి, రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. -
అర్చకుల ఆస్తులపై దాడి
● తాళ్లూరు జీయన్న మఠంలో ఘటన ● ఇంటి వెనుక స్థలంలో పోల్స్, చెట్ల కూల్చివేత ● వ్యక్తిగత కక్షలతో దుశ్చర్యకు పాల్పడ్డారని బాధితుల ఆవేదన గండేపల్లి: వ్యక్తిగత కక్షలతో టీడీపీకి చెందిన గ్రామ ఉప సర్పంచ్ పైణ్ని వెంకటేశ్వరరావు, దాపర్తి సీతారామయ్యలు తమ ఆస్తులపై గురువారం దాడులకు పాల్పడ్డారని తాళ్లూరు జీయన్న మఠం వేంకటేశ్వర స్వామి ఆలయ అర్చకులు ఆరోపించారు. జేసీబీతో తమ ఇంటి వెనుక భాగంలోని సిమెంట్ స్తంభాలు, చెట్లు తొలగించి, తమ కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేశారని మఠాధిపతి, భారతీయ ధర్మ పరిషత్ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, భగవద్ రామానుజాచార్య సేవా ట్రస్ట్ చైర్మన్ పొడుగు ప్రసాదాచార్యులు ఆవేదన వ్యక్తం చేశారు. దాడి నేపథ్యంలో మఠంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఈ భూ వివాదంపై రెవెన్యూ శాఖ విచారణ నిర్వహించిన సందర్భంగా వెంకటేశ్వరరావు తమపై దూషణకు దిగారని, తమ అంతు చూస్తానంటూ బెదిరించారని అన్నారు. ఆ కక్షతోనే తనతో పాటు కోరుకొండ చక్రధరాచార్యులు, కోరుకొండ నానాజీ ఆచార్యులుకు చెందిన సరిహద్దు స్థలంలో నేడు ఈ దుశ్చర్యకు పూనుకున్నారని అన్నారు. తమ ముత్తాతల కాలం నుంచి మఠంలోనే ఉంటున్నామని, తమకున్నా, లేకున్నా స్వామివారికి కై ంకర్యాలు చేసేవారమని, ఏనాడూ ఇటువంటి దౌర్జన్యం చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిమెంటు స్తంభాలు, చెట్లు ఎందుకు తొలగిస్తున్నారని ప్రశ్నించినందుకు గాను మఠానికి చెందిన ముష్టిగూడల సూర్య భాస్కరాచార్యులు, రమేష్ ఆచార్యులపై అసభ్య పదజాలంతో దూషణలకు దిగారని, దీంతో, వారి మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తిందన్నారు. తొలగింపుదార్లను మిగిలిన అర్చకులు ప్రశ్నించడంతో వివాదం ముదిరిందని చెప్పారు. విషయం తెలుసుకున్న అర్చక సంఘం జిల్లా నాయకులు బి.వెంకన్నబాబు, వీఎస్ఎన్ మూర్తి, కొత్తలంక శ్రీనివాసరావు, దుర్గాప్రసాద్, మురళి తదితరులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, అర్చకులకు అండగా నిలిచారని వివరించారు. ఇంత జరుగుతున్నా దేవదాయ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. వివాదం కోర్టులో ఉన్నందున తమ ఆలయానికి ఎటువంటి పాలక మండలీ లేదని చెప్పారు. గ్రామానికి చెందిన ఒక వ్యక్తి చైర్మన్ అని చెప్పుకుంటూ ఆలయ సంప్రదాయలకు భంగం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు గూడుతో పాటు కూడు కూడా లేకుండా చేసి, మఠం నుంచి తరిమేసే యత్నాల్లో భాగంగానే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే స్వామివారి కల్యాణోత్సవాలకు తమ సహకారం ఉండబోదని ప్రసాదాచార్యులు హెచ్చరించారు. అర్చకులంటే అలుసా! అర్చకుల ఆస్తులపై దాడిని వైఎస్సార్ సీపీ గ్రీవెన్స్ విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఒబిణ్ని వీరబాబు తీవ్రంగా ఖడించారు. జీయన్న మఠం అర్చకులంటే అంత అలుసా అని ప్రశ్నించారు. గత పుష్కరాల్లో ఆలయ నిర్మాణ సమయంలోనూ అర్చకులు అనేక అవమానాలకు గురయ్యారని వివరించారు. స్వామి సేవలో పునీతులవుతున్న అర్చక కుటుంబాలపై దాడి హేయమని అన్నారు. అర్చకులకు తాము పూర్తి మద్దతు ఇస్తున్నామని, దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
కౌలుకునేదెలా!
● రుణాలకు నోచుకోని కౌలు రైతులు ● ప్రభుత్వ పథకాలకూ దూరం ● 18 నెలలుగా పట్టించుకోని ప్రభుత్వం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): సాగు పెట్టుబడికి రుణాలివ్వరు.. విత్తనాలు, ఎరువులు అందించరు.. సంక్షేమ పథకాలు వర్తింపజేయరు.. గిట్టుబాటు ధర మాటే మరిచారు.. ఫలితంగా జిల్లాలోని కౌలు రైతులు చక్రబంధంలో చిక్కుకుని నలిగిపోతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయం పండగలా ఉండేది. గ్రామ స్థాయిలో విత్తు మొదలు.. విక్రయాల వరకూ రైతులకు వారి చెంతనే సేవలు అందించేవారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత వ్యవసాయం రంగంపై నిర్లక్ష్యం చూపుతున్నారనే విమర్శ వస్తోంది. తమ సంక్షేమాన్నయితే పూర్తిగా విస్మరించారని కౌలు రైతులు ఆవేదన చెందుతున్నారు. గుర్తింపులోనే జాప్యం ఖరీఫ్, రబీ సీజన్లలో కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియను ప్రభుత్వం చేపడుతుంది. వారికి పంట సాగుదారు హక్కు (సీసీఆర్) కార్డు ఇస్తూంటుంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఈ కార్డు ఆధారంగా విత్తనాలు, ఎరువులు, పంట రుణాలు అందించడంతో పాటు వారి నుంచి మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేసేవారు. అయితే, చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత కౌలు గుర్తింపులోనే జాప్యం చోటు చేసుకోవడంతో కౌలు రైతులకు ఎరువులు, విత్తనాలు, బ్యాంకుల నుంచి పంట రుణాలు అందడం లేదు. గడచిన 18 నెలల్లో జిల్లావ్యాప్తంగా 35 వేల మందికి సీసీఆర్ కార్డులు మంజూరు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు ఖరీఫ్, రెండు రబీ సీజన్లు వచ్చాయి. మొత్తం ఈ నాలుగు పంటకాలాల్లోనూ తమకు ప్రభుత్వం మొండిచెయ్యే చూపించిందని, ఒక్క రూపాయి కూడా రుణం ఇచ్చిన దాఖలాలు లేవని కౌలు రైతులు వాపోతున్నారు. గత్యంతరం లేక సాగు పెట్టుబడికి బయటి వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. పరిహారంలోనూ మొండిచెయ్యి ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బ తిన్నప్పటికీ నయా పైసా కూడా నష్టపరిహారం ఇవ్వలేదు. కేవలం భూమి సర్వే నంబర్ల ఆధారంగా భూయజమానులైన రైతుల ఖాతాల్లో పంట నష్టపరిహారం జమ చేసింది. వారు ఆ మొత్తాన్ని ఇచ్చేందుకు ససేమిరా అనడంతో కౌలు రైతులు నష్టపోయారు. పంట నష్టం జరిగిన ప్రతి ఎకరాకూ ప్రభుత్వం రూ.10 వేల చొప్పున జమ చేసింది కానీ కౌలు రైతులకు మాత్రం మొండిచెయ్యి చూపింది. మరోవైపు ప్రభుత్వం ఒక్క పథకం కూడా తమకు వర్తింపజేయలేదని కౌలుదార్లు గగ్గోలు పెడుతున్నారు. అప్పులపాలు ఎకరా భూమికి యజమానికి రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకూ కౌలు చెల్లించాలి. ఆ తర్వాతే కౌలుదార్లు సాగుకు ఉపక్రమిస్తారు. విత్తనాల కొనుగోలు, దమ్ములు, వరి నాట్లు వేయడం, ఎరువులు, పురుగు మందులు ఇలా అన్నింటికీ కలిపి మరో రూ.25 వేలకు పైబడి పెట్టుబడి అవుతుంది. అంటే ఎకరం భూమి కౌలుకు చేయాలంటే రూ.50 వేల వరకూ పెట్టుబడి అవుతుంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కౌలు గుర్తింపు కార్డు ఉన్న ప్రతి రైతుకూ రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ ఎటువంటి హామీ లేకుండా పంట రుణాలు ఇచ్చేవారు. ప్రస్తుతం గుర్తింపు కార్డులు ఇచ్చినప్పటికీ రుణాలు మాత్రం ఇవ్వడం లేదని కౌలు రైతులు చెబుతున్నారు. దీంతో, వచ్చిన పంట అంతా కౌలుకు, వడ్డీలకే పోతోందని మధనపడుతున్నారు. అదే బ్యాంకుల నుంచి పంట రుణాలిప్పిస్తే తక్కువ వడ్డీ కావడంతో తమకు ఆ మొత్తమైనా మిగిలేదని అంటున్నారు. ధాన్యం విక్రయాలకూ ఇబ్బందులే... కౌలు రైతులు పండించిన ధాన్యం విక్రయాల సమయంలో రైతు సేవా కేంద్రాల్లో అనేక ఇబ్బందులు వస్తున్నాయి. కౌలు రైతుల పేరిట ఈ–కేవైసీ చేయకపోవడంతో గత ఖరీఫ్లో వారి నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయలేదు. దీంతో, వారు దళారులకు తక్కువ రేటుకే ధాన్యం విక్రయించుకోవాల్సి వచ్చింది. దీంతో బస్తాకు రూ.350 వరకూ నష్టపోయారు. గత ప్రభుత్వ హయాంలో భరోసా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో తమకు కూడా బ్యాంకుల నుంచి పంట రుణాలిచ్చేవారని కౌలు రైతులు గుర్తు చేసుకుంటున్నారు. అంతే కాకుండా, ఇతర రైతుల మాదిరిగానే వారికి కూడా వైఎస్సార్ రైతుభరోసా కింద ఏటా రూ.13,500 పెట్టుబడి సాయం, పంట నష్టపరిహారం వంటివి అందేవి. మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేయడం తదితర అనేక విధాలుగా గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఆదుకునేది. -
భార్యను హతమార్చిన భర్త
అనపర్తి: తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం రంగాపురంలో ఓ బాలికపై టీడీపీ నాయకుడి కుమారుడు లైంగిక దాడికి యత్నించిన ఘటనను మరువక ముందే అదే గ్రామంలో.. అదే పార్టీకి చెందిన ఓ కార్యకర్త తన భార్యను దారుణంగా హతమార్చిన ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. రంగాపురానికి చెందిన టీడీపీ కార్యకర్త దొనకొండ దుర్గయ్య తన భార్య జ్యోతి (32) తలపై బలమైన వస్తువుతో మోది హత్య చేశాడు. అనంతరం పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అతడిని బంధువులు బిక్కవోలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. తన అక్క కుమార్తె జ్యోతిని దుర్గయ్య పన్నెండేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు మగ పిల్లలు. కొంత కాలంగా భర్తతో విభేదాల కారణంగా జ్యోతి అదే గ్రామంలోని పుట్టింట్లో తల్లి వద్ద ఉంటోంది. నెల రోజుల క్రితం కుల పెద్దల సూచనల మేరకు భర్తతో కాపురానికి వెళ్లింది. ఎప్పటిలానే భర్త, అతడి అన్నదమ్ములు పెడుతున్న వేధింపులు భరించలేక పుట్టింటికి వచ్చేసింది. పెద్దాపురంలోని ఓ రొయ్యల ఫ్యాక్టరీలో జ్యోతి పని చేస్తోంది. రోజూ మాదిరిగానే ఫ్యాక్టరీ నుంచి బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో ఇంటికి వస్తోంది. అదే సమయంలో దుర్గయ్య, మరికొంత మంది రెండు మోటార్ సైకిళ్లపై వచ్చి, ఆమె చేతి వేళ్లు వెనుకకు విరిచి, తలపై బలమైన వస్తువుతో కొట్టి, పక్కనే ఉన్న డ్రైనేజీలో పడేసి, తొక్కేశారని జ్యోతి తల్లి మంగ చెబుతోంది. దుర్గయ్య వారం పది రోజులుగా తనను, తన భర్తను, కుమార్తె జ్యోతిని వేధిస్తున్నాడని బిక్కవోలు పోలీస్ స్టేషన్లో చెప్పినా స్పందించ లేదని మంగ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. స్థానిక టీడీపీ గ్రామ శాఖ నాయకుడి అండతోనే తన కుమార్తెను దుర్గయ్య హత్య చేశాడని ఆరోపించింది. తన కుమార్తెను తన తమ్ముడే చంపాడంటూ మంగ రోదిస్తున్న తీరు చూపరులను కలచివేసింది. తల్లి మరణించి, తండ్రి ఆస్పత్రి పాలవ్వడంతో ఏం జరిగిందో తెలియక చిన్నారులు ఆడుకుంటున్న తీరు స్థానికులను ఆవేదనకు గురి చేసింది. ఇదిలా ఉంటే జ్యోతి హత్యపై ఆమె అన్న తంగెళ్ల మణికంఠ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు అనపర్తి సీఐ వీఎల్వీకే సుమంత్ తెలిపారు. జ్యోతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించామన్నారు.ఫ అనంతరం ఆత్మహత్యాయత్నం ఫ నిందితుడు టీడీపీ కార్యకర్త ఫ కొద్ది రోజులుగా వేధిస్తున్నాడంటున్న హతురాలి తల్లి ఫ పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన -
సామాజిక న్యాయ దినోత్సవాన్ని జయప్రదం చేయాలి
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య పిలుపు ● ముగిసిన రాష్ట్ర సమితి సమావేశాలు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 20న రాష్ట్రవ్యాప్తంగా ప్రతిజ్ఞ నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. మూడు రోజులుగా కాకినాడలో జరుగుతున్న ఆ పార్టీ రాష్ట్ర సమితి సమావేశాలు గురువారం ముగిశాయి. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ, దేశంలో కొద్ది మంది వద్ద పోగు పడిన సంపదను వివిధ పన్నుల ద్వారా సేకరించి పునఃపంపిణీ చేయడం ద్వారా సామాజిక న్యా యం సాధించాలని అన్నారు. దీని కోసం పోరా డుతున్న శ్రామిక, దళిత, బహుజన, మైనార్టీ, మహిళా సంఘాలన్నీ ఇందులో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశించిన సాంఘిక న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం నేటి పాలకుల కార్పొరేట్ అనుకూల విధానాల వల్ల ప్రమాదంలో పడ్డాయన్నారు. మోదీ ప్రభుత్వం అంటేనే బిలియనీర్లు, కార్పొరేట్ల ప్రభుత్వమన్నారు. కార్పొరేట్ పన్ను 35 నుంచి 22 శాతానికి తగ్గించారన్నారు. సంపద పన్ను, వారసత్వ పన్ను చట్టాలను రద్దు చేశారన్నారు. మోదీ పాలనలోనే కార్పొరేట్లకు రూ.20 లక్షల కోట్ల రుణమాఫీలు, రాయితీలు ఇచ్చారని ఆయన చెప్పారు. విమానాశ్రయాలు, పోర్టులు, గనులు, సహజవాయు నిక్షేపాలు కట్టబెట్టారన్నారు. ప్రతిఫలంగా వారు బీజేపీకి రూ.వేల కోట్లు ఎన్నికల నిధులు ఇస్తున్నారన్నారు. గ్రామీణ పేదలకు ఎంతో తోడ్పాటునిచ్చే మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారన్నారు. అందరికీ హక్కుగా మంచి ప్రమాణాలతో విద్య, వైద్య సేవలు అందించాలని, పంటలకు చట్టబద్ధంగా లాభసాటి ధరలు ఇవ్వాలని, యువతకు ఉచితంగా ఉపాధి నైపుణ్యాలు, హక్కుగా ఉపాధి లేదా పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. మోదీ పన్నెండేళ్ల పాలనలో ప్రజాస్వామ్యాన్ని కాలరాసి, రాజ్యాంగానికి ఏ మాత్రం గౌరవం ఇవ్వడం లేదని ఆరోపించారు. పూర్తి మెజార్టీ వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామంటూ గత ఎన్నికల్లో బీజేపీ ప్రచారానికి ఒడిగట్టిందన్నారు. పాలకులు రాజ్యాంగ సంస్థలను చేతిలోకి తీసుకుని గుత్తాధిపత్యం చెలాయిస్తున్నాయని ఈశ్వరయ్య ఆరోపించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తాటిపాక మధు మాట్లాడుతూ, మార్చి 1 నుంచి 15వ తేదీ వరకూ గడప గడపకూ కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు పార్టీ శ్రేణులు వెళ్లాలని కోరారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి ప్రవేశపెట్టిన తీర్మానాలను సమితి ఏకగ్రీవంగా ఆమోదించింది. -
శుక్రవారం శ్రీ 20 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
అబద్ధపు హామీలకు అద్దంలా... రాష్ట్ర బడ్జెట్ చంద్రబాబు అబద్ధపు హామీలకు అద్దం పట్టేలా ఉంది. ఎన్నికల ముందు అబద్ధపు హామీలిచ్చి మోసగించిన చంద్రబాబు నేడు బడ్జెట్ ద్వారా మరోసారి అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు. మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చి ఘనకార్యం సాధించినట్లు హడావుడి చేశారు. కానీ, వారిని తెలివిగా మోసం చేసి, ప్రతి నెలా ఇస్తామన్న రూ.1,500 ఎగ్గొట్టారు. నిజానికి ప్రతి నెలా బస్సులలో తిరిగితే రూ.1,500 అవుతుందా అనే విషయాన్ని మహిళలు ఒక్కసారి ఆలోచించాలి. బడ్జెట్లో ఇరిగేషన్, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు తగిన కేటాయింపుల్లేవు. నిరుద్యోగ భృతి ఊసే లేదు. – తోట నరసింహం, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, జగ్గంపేటఅన్ని వర్గాలనూ మోసగించారు రాష్ట్ర బడ్జెట్ కేటాయింపుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలనూ మోసగించారు. ఎన్నికల హామీలు, మేనిఫెస్టోలో పెట్టిన పథకాలకు నిధులు కేటాయించ లేదు. రైతులను ఆదుకునే అన్నదాత సుఖీభవ పథకం అమలుకు దాదాపు రూ.10 వేల కోట్లు అవసరం కాగా రూ.6,600 కోట్లు మాత్రమే కేటాయించి మమ అనిపించారు. సున్నా వడ్డీ ఊసే లేదు. రైతు పండించిన పంటలకు మద్దతు ధరల ప్రస్తావన లేదు. అర్హులైన ఎంతోమంది పేదలు పింఛన్ కోసం ఎదురు చూస్తున్నా పట్టించుకోవడం లేదు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన పథకాల్లోనూ మోసం చేస్తున్నారు. – డాక్టర్ గూడూరి శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి -
ఖైదీ మృతిపై విచారణ
కాకినాడ క్రైం: గత ఏడాది నవంబర్ 25న కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ మృతి చెందిన రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు ఖైదీ మృతిపై బుధవారం మెజిస్ట్రీరియల్ విచారణ జరిగింది. గుంటూరుకు చెందిన మృతుడు మెట్టు భాస్కర్రెడ్డి తరఫు బంధువులు, జైలు అధికారులు, వైద్యులు, పోలీస్ సిబ్బంది సహా సాక్షులను ఈ సందర్భంగా ఆర్డీవో మల్లిబాబు ఆధ్వర్యాన కాకినాడలోని డివిజన్ రెవెన్యూ కార్యాలయంలో విచారించారు. ఈ విచారణలో ట్రైనీ కలెక్టర్ జె.మనీషా తదితరులు పాల్గొన్నారు. నూనె గింజల సాగుతో ఆర్థిక వృద్ధి రంగంపేట: మెట్ట ప్రాంతమైన రంగంపేట మండలంలో సార్వా వరి తర్వాత రైతులు నూనె గింజల పంటలను సాగు చేయాలని జిల్లా ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ చల్లా వెంకట నరసింహరావు సూచించారు. దీని ద్వారా నాణ్యమైన, పోషక విలువలున్న నూనెను ఉత్పత్తి చేసుకోవడమే కాకుండా, విలువ ఆధారిత ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకుని ఆర్థిక వృద్ధి సాధించవచ్చన్నారు. రంగంపేటలోని నువ్వు పంట సామూహిక ప్రదర్శన క్షేత్రాన్ని బుధవారం వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, ప్రధాన శాస్త్రవేత్త మానుకొండ శ్రీనివాస్, జిల్లా వనరుల కేంద్రం ఏడీఎఎస్ జయరామలక్ష్మితో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ నరసింహరావు మాట్లాడుతూ సామూహిక ప్రదర్శన క్షేత్రం కోసం వైఎల్ఎం 146 రకాన్ని రైతులకు ఇచ్చామని, పంట ఆరోగ్యంగా ఉందన్నారు. ఒక ఎకరా వరికి కావాల్సిన నీటితో ఐదు ఎకరాల్లో నువ్వు పంట సాగు చేయవచ్చని తెలిపారు. ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మానుకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ తక్కువ తడులతో, ఎరువులతో ఆరోగ్యమైన పంటను తీసుకోవచ్చన్నారు. -
అగ్రి గోల్డ్ బాధితుల కోసం ప్రత్యేక కోర్టు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు విజయవాడలో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు, సీపీఐ కేంద్ర కమిటీ సభ్యుడు ముప్పాళ్ళ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సూర్య కళామందిరంలో అగ్రిగోల్డ్ బాధితులతో కలిసి బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అగ్రిగోల్డ్ సంస్థను మూసివేసి ఈ ఏడాది జనవరి నాటికి 12 ఏళ్లు అయిందని, సమస్య అలాగే ఉందన్నారు. 8 రాష్ట్రాల్లో 32 లక్షల మంది వినియోగదారులు ఉండగా ఒక ఏపీలో 19 లక్షలకు పైగా బాధితులు ఉన్నారన్నారు. తక్షణమే అగ్రిగోల్డ్ యాజమాన్యం బినామీ పేర్లతో వారి దగ్గర ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకొని వేలం వేసి, ఈ సమస్యను ఈ ఏడాది ఆఖరి నాటికి పరిష్కరించాలన్నారు. 2015 జనవరిలో అగ్రిగోల్డ్ ఆస్తులను పోలీసులు సీజ్ చేశారని అప్పటి నుంచి ఆ సమస్యను అలాగే ఉంచారన్నారు. ప్రభుత్వ వైఫల్యంతో పాటు యాజమాన్యం వైఫల్యం పూర్తిగా కనిపించిందని అందుకే న్యాయం చేయడంలో వారు వెనుకంజ వేస్తున్నారన్నారు. ఇంకా అగ్రిగోల్డ్ యాజమాన్యం వద్ద రూ.ఐదు వేల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని వాటికి తక్షణమే వేలం పాట నిర్వహించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. మార్చి రెండో తేదీ నుంచి అగ్రిగోల్డ్ బాధితుల కోసం రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. టీడీపీ మేనిఫెస్టోలో అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కరిస్తామని చెప్పిందని, సీఎం చంద్రబాబు దృష్టి సారించి బాధితులకు న్యాయం చేయాలని ముప్పాళ్ళ డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ – కస్టమర్ ఏజెంట్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి దొమ్మేటి రాంబాబు, అర్జున్ రావు, నారాయణరావు బాధితులు పి.నరేష్కుమార్, పి నరసింహమూర్తి, మండ వీరరాఘవ, పీవీఎస్ నారాయణ పాల్గొన్నారు.సీపీఐ కేంద్ర కమిటీ సభ్యుడు ముప్పాళ్ళ డిమాండ్ -
సంపద సృష్టి లేదు.. అంతా చెత్తే!
పిఠాపురం: నాడు చెత్త నుంచి సంపద సృష్టించిన కేంద్రాలు నేడు చెత్త తయారీ కేంద్రాలుగా దర్శనమిస్తున్నాయి. చెత్త నుంచి సంపద తయారు చేయడానికి రూ.కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ కేంద్రాలు ప్రస్తుతం అసాంఘిక కార్యకలాపాలకు, మందుబాబులకు అడ్డాలుగా మారిపోయాయి. చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాలు అనేకచోట్ల నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. పలుచోట్ల అరకొర సంపదకే పరిమితమవుతున్నాయి. దీంతో పల్లెల్లో ఎక్కడబడితే అక్కడ చెత్త పోగుపడి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ కేంద్రాలు అక్కరకు రాకపోవడంతో ఊరి చివరన చెత్తను పోగు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం మెరుగుపరచడం, చెత్తను వనరుగా మార్చే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు మందుబాబులకు అడ్డాగా మారి మద్యం బాటిళ్లు, ప్లాస్టిక్ వ్యర్థాలతో దర్శనమిస్తున్నాయి. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కొన్ని గ్రామాల్లో ఇవి మందుబాబులకు అడ్డాలుగా మారాయి. గ్రామ శివార్లలో డంపింగ్ అనేక కేంద్రాలలో చెత్త నుంచి సంపద తయారు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితుల్లో అనేక కేంద్రాలలో సంపద తయారీ అరకొరగానే సాగుతోంది. కొన్ని కేంద్రాల్లో అప్పుడప్పుడూ సంపదను తయారు చేస్తున్నప్పటికీ కొనేవారు ముందుకు రావడం లేదు. చాలా కేంద్రాలు తూతూ మంత్రంగా కొంత చెత్తను పోగు చేసి సంపద సృష్టిస్తున్నట్లుగా లెక్కలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పలు గ్రామపంచాయతీల్లో చెత్తను గ్రామాల శివార్లలో డంపింగ్ చేస్తున్నారు. దీనివల్ల కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. నెలలో ఒకటి రెండు సార్లు చెత్తను తగలబెడుతుండటం వల్ల వాయు కాలుష్యం ఏర్పడుతోంది. విపరీతమైన దుర్వాసన వస్తుండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. కానరాని అధికారుల పర్యవేక్షణ గ్రామాల్లో రోజూ గ్రీన్ అంబాసిడర్లు ఇంటింటికీ వెళ్లి సేకరించిన తడి, పొడి చెత్తతో పాటు వీధుల్లో పేరు కుపోయిన చెత్తను రిక్షాల ద్వారా ఈ కేంద్రాలకు తరలించాలి. అక్కడ తడి, పొడి చెత్తను వేర్వేరుగా కుండీల్లో వేసి వర్మీకంపోస్టు, సేంద్రియ ఎరువు తయారు చేసి రైతులకు తక్కువ ధరకు విక్రయించడం, అలాగే ప్లాస్టిక్ వ్యర్థాలను స్క్రాప్ దుకాణాలకు విక్రయించి పంచాయతీలకు అదనపు ఆదాయం సమకూర్చాలన్నదే ఈ కేంద్రాల లక్ష్యం. అయితే అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడిన నేపథ్యంలో ఈ కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. దాంతో అనేక సంపద కేంద్రాలు అలంకారప్రాయంగా మారాయన్న విమర్శలు గ్రామీణ ప్రాంతాల ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. క్షీణిస్తున్న పారిశుధ్యం స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలు పేరుకే అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కార్యక్రమాలకు మొదట్లో కొన్ని నిధులు విడుదల అయినప్పటికీ ఆ తర్వాత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. తూతూ మంత్రంగా మాత్రమే ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇంకోవైపు ఆర్థిక సంఘాల నిధుల ఖర్చుపై ఆంక్షలు విధించడం, ఉన్న కాస్త సాధారణ నిధులు అభివృద్ధి పనులకు సైతం చాలకపోవడం వంటి అనేక కారణాల వలన పల్లెలో పారిశుధ్యం బాగా క్షీణిస్తోంది. అధ్వానంగా పారిశుధ్యం పలు పంచాయతీల్లో పారిశుధ్యం పూర్తిగా క్షీణిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. శివారు గ్రామాల్లో పారిశుధ్య పనులు అసలు జరగడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురం మండలం కోలంక గ్రామంలో 4,657 మంది జనాభా ఉండగా ఈ గ్రామంలో ప్రతీ రోజు సుమారు టన్ను చెత్త తయారవుతోంది. కాని చెత్త సక్రమంగా తీయకపోవడంతో ఎక్కడి చెత్త అక్కడే దర్శనమిస్తోంది. ఇక్కడ చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రం మూతపడింది. దీంతో రోడ్లపైనే చెత్త తాండవిస్తోంది. దీంతో దోమలు పెరిగి తీవ్ర అనారోగ్యాల పాలవుతున్నామని గ్రామస్తులు గగ్గోలు పెడుతున్నారు. పిఠాపురం మండలం జములపల్లిలో 2100 జనాభా ఉండగా ఇక్కడి పరిస్థితి ఇలాగే ఉంది. గ్రామంలో ఎక్కడ చూసినా చెత్తే కనిపిస్తోంది. దీంతో గ్రామస్తులు ఆస్పత్రుల పాలవుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యు.కొత్తపల్లి మండలంలోని ఉప్పాడ, వాకతిప్ప, అమీనాబాద్, కొత్తపల్లి, కొమరగిరి, గొల్లప్రోలు మండలం చేబ్రోలు, వన్నెపూడి, చిన్న జగ్గంపేట, దుర్గాడ, చెందుర్తి, తాటిపర్తి, పిఠాపురం మండలంలో గోకివాడ, మాధవపురం, చిత్రాడ, విరవాడ, మంగితుర్తి తదితర గ్రామాల్లో పారిశుధ్య పరిస్థితులు తీవ్రంగా ఉండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మందుబాబులకు అడ్డాగా మారిన పిఠాపురం మండలం కోలంకలోని చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రంపిఠాపురం మండలం ఎఫ్కేపాలెంలో మూతపడిన సంపద తయారీ కేంద్రంజిల్లాలో ఇలా.. గ్రామ పంచాయతీలు – 385 కుటుంబాలు – 4,85,089 జనాభా – 15,00,798 రోజుకు తయారవుతున్న చెత్త – సుమారు 50 టన్నులు సంపద తయారీ కేంద్రాలు ఉన్న గ్రామాలు – 290 నిరుపయోగంగా మారిన కేంద్రాలు – 270 కి పైగా మూతపడిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు పేరుకే స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర పల్లెల్లో ఎక్కడబడితే అక్కడ దర్శనమిస్తున్న చెత్త డంపింగ్ యార్డులుగా మారిన గ్రామ శివారులు పర్యవేక్షణ లేకే.. చెత్త నుంచి సంపద సృష్టించేందుకు నిర్మించిన కేంద్రాలు సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఉపయోగం లేకుండా మారాయి. మా గ్రామంలో నిర్మించిన కేంద్రం కూడా అలాగే ఉంది. సరైన అవగాహన, పర్యవేక్షణ లేక వాటిని ఎవరూ వినియోగించడం లేదు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకువస్తే అటు రైతులకు, ఇటు గ్రామ ప్రజలకు ఉపయోగంగా ఉంటుంది. – అల్లు వీర ప్రసాద్, భోగాపురం, పిఠాపురం మండలం రోడ్లనే చెత్త కేంద్రాలుగా మార్చేశారు మా గ్రామంలో నిర్మించిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం నిరుపయోగంగా మారింది. ఈ కేంద్రం నిరుపయోగంగా మారడంతో గ్రామం నుంచి సేకరించిన చెత్త గ్రామ శివారులో రహదారిపై వేస్తున్నారు. రహదారిపై చెత్త వేయడంతో ఆ ప్రాంతమంతా డంపింగ్ యార్డ్గా మారి ప్రజల జీవన విధానానికి, వాహనదారులకు ఇబ్బందిగా మారింది. మా కోలంక గ్రామంలో ఉన్న చెట్టు నుంచి సంపద తయారీ కేంద్రాన్ని వినియోగంలోకి తీసుకువస్తే అటు రైతులకు, ఇటు గ్రామ ప్రజలకు ఉపయోగంగా ఉంటుంది. – పెదపాటి రమేష్, కోలంక, పిఠాపురం మండలం -
నేత్రపర్వంగా భీమేశ్వరుని జల విహారం
● ఆలయ పుష్కరిణి చుట్టూ జన సందోహం ● భారీ ఎత్తున బాణసంచా కాల్పులు సామర్లకోట: స్థానిక పంచారామ క్షేత్రంలోని బాలాత్రిపుర సుందరి సమేత కుమార రామ భీమేశ్వరస్వామి జల విహారం బుధవారం రాత్రి నేత్ర పర్వంగా జరిగింది. మహాశివరాత్రి ఉత్సవాలు, స్వామి వారి కల్యాణం సందర్భంగా ఈ ఉత్సవం వైభవంగా నిర్వహించారు. గతంలో కార్తిక మాసంలో స్వామివారి జన్మ నక్షత్రం ఆరుద్రను పురస్కరించుకొని ఏటా ఆలయ కోనేరులో ఈ కార్యక్రమం నిర్వహించేవారు. అయితే స్వామి వారి కల్యాణం సందర్భంగా తెప్పోత్సవం నిర్వహించాలనే పండితుల సూచనల మేరకు శ్రీ పుష్పయోగోత్సవానికి ముందు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 13న స్వామివారి కల్యాణం జరిగిన విషయం విదితమే. దీనిలో భాగంగా రాత్రి ఆలయం చుట్టూ పల్లకీలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను బ్యాండ్ మేళాలు, వేద మంత్రాల మధ్య ఊరేగింపు నిర్వహించి ఆలయ కోనేరు వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్దకు తీసుకొనివచ్చారు. పూలతో అలంకరణ చేసిన వేదికపై స్వామి, అమ్మవారి విగ్రహాలను ఉంచి ఆలయ పండితులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈఓ బళ్ల నీలకంఠం, ట్రస్టుబోర్డు చైర్మన్ కంటే జగదీష్మోహన్రావు దంపతులు పీటలపై కూర్చుని పూజలు చేశారు. బాణసంచా కాల్పుల మధ్య స్వామి, అమ్మవార్లను ఆలయ కోనేరులో విద్యుత్తు దీపాలంకరణతో ఏర్పాటు చేసిన హంస వాహనంపై ఉంచి వేద పండితుల ఆధ్వర్యంలో జల విహారం కార్యక్రమం నిర్వహించారు. మూడు పర్యాయాలు కోనేరులో ఈ జలవిహారం జరిగింది. సీఐ ఎ కృష్ణభగవాన్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. వైభవంగా శ్రీపుష్పయాగం స్వామివారి శ్రీపుష్పయాగం బుధవారం రాత్రి వైభవంగా జరిగింది. జల విహారం అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కల్యాణ వేదిక వద్దకు మేళతాళాలతో తీసుకొచ్చారు. వేదికపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు అమ్మవారి ఆలయాన్ని పూలతో అలంకరణ చేశారు. పూలు, వివిధ రకాల పండ్లు, మిఠాయిలతో అలంకరించిన ఊయలలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఉంచారు. ట్రస్టుబోర్డు చైర్మన్ కంటే జగదీష్మోన్ దంపతులు, ఈఓ బళ్ల నీలకంఠం దంపతులకు దంపత తాంబూలాలు అందజేశారు. శ్రీసత్యకృష్ణ కూచిపూడి కళానిలయం ఆధ్వర్యంలో నాట్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. -
రైతులకు తీవ్ర నిరాశ
రాష్ట్ర అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ రైతులను నిరాశపరిచింది. వరి, మామిడి, టమాటా, పొగాకు, ఉల్లి, సజ్జ, కూరగాయలు, ఉద్యాన పంటలకు కనీస మద్దతు ధర ఊసే లేదు. ఉచిత పంటల బీమాకు పూర్తిగా తిలోదకాలు ఇచ్చారు. ఇరిగేషన్ శాఖకు నిధుల కేటాయింపులు శూన్యం. డెల్టా, డ్రెయిన్ల ఆధునీకరణను, మహిళలు, యువత, నిరుద్యోగులను విస్మరించారు. సంపద సృష్టిస్తామని మాయ మాటలు చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలో మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టి అన్ని వర్గాలనూ మోసం చేశారు. సూపర్ సిక్స్ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమయ్యారు.– జున్నూరి రామారావు, వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లానిరుద్యోగులకు అన్యాయంరాష్ట్ర బడ్జెట్లో నిరుద్యోగులకు మరలా మొండిచేయి చూపించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లవుతోంది. సూపర్ సిక్స్.. సూపర్ హిట్ అంటూ ప్రచారం జోరుగా చేస్తున్నారు. ప్రభుత్వ తీరును ప్రశ్నించిన వారిపై రెడ్ బుక్ను ప్రయోగించి, భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారు. తాము అధికారంలోకి వచ్చిన మరుక్షణం నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతిగా రూ.3 వేలు ఇస్తామని, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని యువగళం పాదయాత్రలో నారా లోకేష్ హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా కనీసం ఉద్యోగాల మాట లేకపోవడం సిగ్గుచేటు.– ఎస్.కిరణ్ కుమార్, పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజమహేంద్రవరం -
అంబటికి ఘన స్వాగతం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి మాజీ మంత్రి అంబటి రాంబాబు బుధవారం విడుదలయ్యారు. కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో సాయంత్రం 5 గంటలకు జైలు అధికారులు విడుదల చేశారు. అంబటి విడుదలవుతున్నారనే సమాచారం తెలిసిన వైఎస్సార్ సీపీ శ్రేణులు, అభిమానులు జైలు వద్దకు భారీగా చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా పూర్తిగా జనసంద్రంగా మారింది. లాలాచెరువు నుంచి కంబాలచెరువు వెళ్లే రహదారి పూర్తిగా అభిమానులతో నిండిపోయింది. ఆ రహదారి గుండా వెళ్లే వాహనాలను పోలీసులు దారి మళ్లించారు. అన్ని పత్రాలు పరిశీలించాక జైలు అధికారులు అంబటిని బయటకు పంపారు. ఆయన బయటకు వచ్చే సమయంలో అభిమానులు జై జగన్, జైజై జగన్ అంటూ నినాదాలు చేశారు. జైలు బయట మాజీ మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, మాజీ ఎంపీ వంగా గీత, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, చిర్ల జగ్గిరెడ్డి, తలారి వెంకట్రావు, వైఎస్సార్ సీపీ నాయకులు గూడూరి శ్రీనివాసరావుతో పాటు ఇతర నాయకులు స్వాగతం పలికారు. అంబటి తప్పు చేయలేదని, ఆయన జైలుకు వెళ్లిన నాటి నుంచి పూర్తి ధైర్యంగా ఉన్నారని జక్కంపూడి రాజా అన్నారు. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రతిపక్షంపై కక్ష సాధించడానికే ప్రజలు అధికారమిచ్చారని చంద్రబాబు అనుకుంటున్నారన్నారు. తానేటి వనిత మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ నేతలపై కక్ష సాఽధించడం తప్ప చంద్రబాబు ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి కొత్తగా ఏపీలో లోకేశ్ రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారన్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, త్వరలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. అనంతరం అంబటి అందరికీ అభివాదం చేసుకుంటూ కారు ఎక్కారు. అనంతరం అంబటి మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయనను వైఎస్సార్ సీపీ నాయకులు కలిసి మాట్లాడారు. గురువారం ఉదయం ఆయన గుంటూరు వెళ్లనున్నారు. దీంతో ఆయనకు భారీగా వీడ్కోలు చెప్పేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. సెంట్రల్ జైలు వద్దకు భారీగా చేరిన వైఎస్సార్ సీపీ శ్రేణులు -
రసవత్తరంగా ఏఎస్సార్ వాలీబాల్ పోటీలు
ఉప్పలగుప్తం: మండలంలోని గొల్లవిల్లిలో భీమేశ్వర ఆలయ ప్రాంగణంలో శివరాత్రి సందర్భంగా స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో జరుగుతున్న ఏఎస్సార్ (అరిగెల శ్రీరంగయ్య) మెమోరియల్స్ మెన్, ఉమెన్ జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు బుధవారానికి నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఆయా రాష్ట్రాల నుంచి ఈ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు గురువారం జరగనున్న ఫైనల్స్లో విజేతలుగా నిలబడడానికి తమ సత్తా చాటుతూ గెలుపే లక్ష్యంగా సాగుతున్నారు. ఫ్లడ్లైట్లలో జరుగుతున్న ఈ పోటీలకు చుట్టు పక్కల ప్రాంతాల వారితో పాటు, క్రీడాభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని వీక్షిస్తున్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే (ఎస్సీఆర్) సికింద్రాబాద్, ఎస్ఆర్ఎం (చైన్నె) మధ్య జరిగిన రసవత్తర పోరులో 25–19, 25–22, 29–27 స్కోర్తో వరుస మూడు సెట్లను ఎస్సీఆర్ సికింద్రాబాద్ జట్టుపై ఎస్ఆర్ఎం జట్టు ఘనవిజయం సాధించింది. ఇండియన్ బ్యాంకు (చైన్నె), జీఎస్టీ (ముంబై) మధ్య జరిగిన ఆటలో 25–18, 25–16, 25–16 స్కోరుతో వరుస మూడు సెట్లను గెలుచుకుని జీఎస్టీ జట్టుపై ఇండిమన్ బ్యాంకు జట్టు విజయం సాధించింది. ఐఓబీ చైన్నె, కర్ణాటక జట్ల మధ్య జరిగిన పోరులో 25–14, 25–16, 25–21 స్కోరుతో వరుస మూడు సెట్లు కర్ణాటక జట్టుపై ఐఓబీ చైన్నె జట్టు గెలుపొందింది. జీఎస్టీ ముంబై, ఐఓబి చైన్నె జట్ల మధ్య జరిగిన పోటీలో 25–19, 25–21, 25–14 స్కోరుతో వరస మూడు సెట్లు గెలుచుకుని జీఎస్టీ ముంబై జట్టుపై ఐఓబి చైన్నె జట్టు విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్, కేరళ జట్ల మధ్య మ్యాచ్ కొనసాగుతుంది.నేడు ఫైనల్స్ -
వాహనం అదుపు తప్పి యువకుడి మృతి
జగ్గంపేట: మండలంలోని గొల్లలగుంట గ్రామంలో మంగళవారం మోటారు సైకిల్పై వెళ్తున్న యువకుడు వాహనం అదుపుతప్పి తీవ్ర గాయాలపాలై మృతి చెందాడు. ఏఎస్సై మాణిక్యం అందించిన వివరాల మేరకు సామర్లకోట బ్రౌన్ పేటకు చెందిన మర్రి శ్రీనివాస్ అతని భార్య మంగ 15రోజుల క్రితం మండలంలోని గొల్లలగుంట గ్రామంలో నాటు కోళ్లు ఫారంలో పనికి వచ్చారు. వీరి కుమారుడు సామర్లకోట నుంచి మంగళవారం ఉదయం గొల్లలగుంటకు తల్లితండ్రులు చూసేందుకు వచ్చాడు. సాయింత్రం ఇంటికి వెళ్లడానికి సమాయత్తం అవుతున్న నేపథ్యంలో తల్లితండ్రులకు కిరాణా సరుకులు తెచ్చేందుకు గ్రామంలోని దుకాణం వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా తన మోటారు సైకిల్ అదుపు తప్పడంతో రోడ్డుపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతని తలకు బలమైన గాయాలు కావడంతో స్థానికులు జగ్గంపేట పీహెచ్సీకి తరలించారు. అప్పటికే అతడు మృతిచెందాడని వైద్యులు తెలిపారు. మృతుడు సామర్లకోటలో చాపల వ్యాపారి వద్ద కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఏడాది క్రితం అతడికి వివాహం కాగా మూడేళ్ల కుమార్తె వుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.కార్పొరేట్లకు మోదీ, బాబు ఊడిగంసీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణబోట్క్లబ్ (కాకినాడ సిటీ): కార్పొరేట్లకు ఊడిగం చేయడంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు పోటీ పడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆరోపించారు. గుజరాత్కి చెందిన 20 మంది కార్పొరేట్ పెద్దలు సుమారు రూ.27 లక్షల కోట్ల రుణాలు ఎగ్గొట్టినా వారిపై చర్యలు తీసుకోకుండా ఆ రుణాలు మాఫీ చేస్తున్నారని ఆరోపించారు. కాకినాడలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల సందర్భంగా బుధవారం నారాయణ విలేకరులతో మాట్లాడారు. బిల్ గేట్స్ను తీసుకొచ్చి అమరావతిలో అరటి తోటలు చూపించిన చంద్రబాబు వ్యవసాయ రంగానికి చేటు చేస్తున్న మోదీని నిలువరించడంలో భయపడుతున్నారన్నారు. ఉపాధి హామీ పథకం పేరు మార్చడం సమంజసం కాదన్నారు. ప్రస్తుత పథకాన్ని అమ లు చేయడం రాష్ట్రానికి భారమవుతుందనే విష యం చెప్పే స్థాయిలో చంద్రబాబు లేకపోవడం విచారకరమన్నారు. సీపీఐ నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, తాటిపాక మధు పాల్గొన్నారు.వాగ్వాదం ముదిరి నిప్పంటించి..● పనిముట్ల విషయమై మెకానిక్ల మధ్య తగాదా● విచక్షణ కోల్పోయి ఒకనిపై పెట్రోలు పోసి నిప్పంటించిన వైనంతుని: ఇద్దరు మెకానిక్ల మధ్య జరిగిన తగాదాలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పాయకరావుపేట మండలం రామభద్రపురానికి చెందిన బైక్ మెకానికు రాజాకు, అదే మండలం శ్రీరామపురం గ్రామానికి చెందిన సైకిల్ మెకానిక్ నానాజీకి తుని రామా థియేటర్ ప్రాంతంలో పక్కపక్కనే షాపులు ఉన్నాయి. నానాజీ తరచూ రాజు దగ్గరకు వెళ్లి పనిముట్లు తెచ్చుకుని ఇవ్వడంలో అలసత్వం చూపేవాడు. ఈ క్రమంలో బుధవారం రెంచీల కోసం వెళ్లిన నానాజీతో రాజు వాగ్వాదానికి దిగాడు. వివాదం ముదిరి రాజు కోపంతో పక్కనే ఉన్న పెట్రోల్ను నానాజీపై పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన నానాజీని స్థానిక ఏరియా ఆస్పత్రికి పంపి అనంతరం మెరుగైన చికిత్సకు కాకినాడ జీజీహెచ్కు తరలించారు. ఎస్సై విజయ్బాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తెగుళ్ల తీగ సాగులేక..
● తమలపాకు తోటల యాజమాన్యం అవసరం ● సస్యరక్షణతో చర్యలతో మంచి దిగుబడి పెరవలి: జిల్లాలో తమలపాకు తోటలు 183 హెక్టార్లలో సాగవుతున్నాయి. పెరవలి, కొవ్వూరు, నల్లజర్ల, కడియం మండలాల్లో సాగులో ఉన్న పంటపై తెగుళ్లు దాడి చేస్తుండడంతో అవి ఆకులు మాడిపోయి రైతుకు నష్టాలు మిగులుస్తున్నాయి. సహజంగా అయితే తీగ నాటిన రెండో నెల నుంచే ఆకులు కోతకు వస్తాయి. ఏడాదికి దిగుబడి 30 వేల పంతాలు వస్తుంది (పంతం అంటే 100 ఆకులు). ఎకరం తోటకు రూ.4 లక్షలు పెట్టుబడి అవసరం అవుతుంది. దిగుబడి బాగుండి ఎగుమతులు బాగుంటే పెట్టుబడి పోను రూ.4 లక్షల ఆదాయం వస్తుంది. అదే తెగుళ్లు సోకి దిగుబడి తగ్గితే ఒక్కొక్క సారి పెట్టుబడి సైతం కోల్పోవలసిన పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం వాతావరణంలో అధికంగా తేమ ఉండడమే తెగుళ్లకు కారణమని, దీనివల్ల పొగాకు లద్దె పురుగు, అగ్గిపురుగు, నల్లి, బర్మా పురుగు, ఎండుతెగులు, బాక్టీరియా, ఆకుమచ్చ తెగులు, కొలటోట్రై కం ఆకుమచ్చ తెగులు వంటివి ఆశించాయని కొవ్వూరు ఉద్యానవన అధికారి డి.సుధీర్ కుమార్ తెలిపారు. వీటి నివారణకు రైతులు తీసుకోవలసిన సస్యరక్షణ చర్యల గురించి ఇలా వివరిస్తున్నారు. పొగాకు లద్దె పురుగుకు వేపనూనెతో సరి తమలపాకు తోటపై పొగాకు లద్దెపురుగు ఆశిస్తే ఆకులను తీవ్రంగా నష్టపరుస్తాయి. ఆకులను తింటూ రంధ్రాలు చేస్తాయి. దీని వల్ల మార్కెట్లో గిట్టుబాటు ధర రాదు. దీని నివారణకు 5 మిల్లీ లీటర్ల వేపనూనెను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎకరానికి ఒక లీటరు వేపనూనె పిచికారీ సరిపోతుంది. అగ్గిపురుగు నివారణ ఇలా.. ఆకుల నుంచి రసం పీల్చడం వల్ల ఆకులపై కాలిన మచ్చలు ఏర్పడతాయి. ఈ పురుగు ఉధృతంగా ఉంటే ఆకులు పసుపుబారి కుళ్లిపోతాయి. దీని నివారణకు కార్బరిల్ 50 శాతం 2 గ్రాముల పొడిని లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి ఆకును ముడత పెట్టే నల్లి ఆకుల అడుగు భాగాన చేరి రసం పీల్చడం వలన ముడతపడతాయి. దీనివల్ల పంటకు తీవ్ర నష్టం. దీని నివారణకు లీటరు నీటికి 4 గ్రాముల నీటిలో కరిగే గంధకపు పొడిని కలిపి పిచికారీ చేయాలి. అవిశె మొక్కల తలలు తుంచేస్తే.. బర్మా పురుగులు అవిశె మొక్కల కాండంలోపల భాగాన్ని తొలిచివేయడం వలన బలహీనపడి మొక్కలు విరిగిపోతాయి. దీనివల్ల తమలపాకు తీగలు పైకి వెళ్లడానికి ఆస్కారం లేక తీగలు దెబ్బతింటాయి. ఈ పురుగు అవిశె మొక్కలను సోకిన వెంటనే మొక్కల తలలను విరిచేస్తే వీటి ప్రభావాన్ని తగ్గించవచ్చు. కొలటో ట్రై కం ఆకుమచ్చ తెగులు తెగులు సోకిన ఆకుల పైభాగాన గుండ్రని గోధుమరంగుతో కూడిన పసుపురంగు మచ్చలు ఏర్పడి క్రమేపీ నల్లబడి ఆకంతా వ్యాపిస్తాయి. ఈ తెగులు సోకిన ఆకులు నాణ్యత కోల్పోతాయి. దీని నివారణకు 3 కాపర్ ఆక్సీక్లోరైడ్ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేస్తే నివారణ అవుతుంది. ఎరువుల యాజమాన్యం తమలపాకుల తోట వేసే రైతులు దుక్కులో 40 కిలోల సూపర్ ఫాస్పేట్, 40 కిలోల పొటాష్ వేసి రెండుసార్లు దుక్కి దున్నాలి. తీగ నాటిన రెండునెలల నుంచి ఎకరానికి నత్రజని, వేపపిండి, యూరియా 1:1 నిష్పత్తిలో 3 రకాలను 80 కిలోలు ఉండేలా ఎరువులను వేయాలి. ఇలా సంవత్సరానికి పరిస్థితులను బట్టి 4 నుంచి 6 దఫాలుగా పొలానికి అందించాలి. ఎకరానికి ఒక టన్ను జిప్సం కూడా వేయాల్సి ఉంది. ఉమ్మిడివారిపాలెంలో తెగుళ్లు సోకిన తమలపాకు తోటలుబర్మా పురుగు సోకకుండా అవిశె మొక్కల తలలను విరుస్తున్న కూలీలు ఎండు, మొదలు కుళ్లు తెగుళ్లకు.. ఆకులపై గుండ్రటి గోధుమరంగు మచ్చలు ఏర్పడి నల్లగా మారతాయి. తెగులు తీగ మొదట్లో ఆశించినప్పుడు వేరు గోధుమరంగుకి మారి తరువాత నల్లగా మారి కుళ్లిపోతాయి. ఈ దశలో తీగపై ఆకులు పసుపురంగుకి మారి క్రమంగా ఆకులు, తీగలు ఎండిపోతాయి. దీని నివారణకు తెగులు లక్షణాలు ఉన్న ఆకులను, తీగలను ఎప్పటికప్పుడు తీసివేయాలి. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు నెలకు ఒకసారి 0.5 శాతం బోర్డో మిశ్రమాన్ని లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. బాక్టీరియా ఆకుమచ్చ తెగులు ఆకుల అడుగుభాగాన గోధుమ వర్ణపు మచ్చలు ఏర్పడి క్రమంగా పెద్దవై నలుపు రంగుకు మారి ఆకులు కుళ్లిపోతాయి. ఇవి మొక్కపైన, కాండంపైన, తీగలను ఆశించినప్పుడు అవి పగుళ్లు ఏర్పడటం, నలుపు మచ్చలు ఏర్పడటం వంటివి జరుగుతుంది. దీని నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేస్తే నివారణ అవుతుంది. -
30 టన్నుల రేషన్ బియ్యం సీజ్
సరకు విలువ రూ.13.80 లక్షలుఆలమూరు: నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న రేషన్ బియ్యం, లారీని స్థానిక పోలీసులు సీజ్ చేశారు. స్థానిక ఎంఎస్ఓ పి.వెంకటేశ్వరరావు, ఎస్సై జి.నరేష్ కథనం ప్రకారం విజయవాడ పరిసర ప్రాంతాలలో కొనుగోలు చేసిన 600 రేషన్ బియ్యం బస్తాలలోని 30 టన్నుల బియ్యాన్ని లారీలో కాకినాడకు తరలిస్తున్నారు. అయితే మండలంలోని జొన్నాడ ఏటిగట్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు ఈ సరకును గుర్తించారు. దీనిపై పోలీసులు ఆరా తీయగా లారీ యజమాని కాకినాడకు చెందిన కె.చంద్రశేఖర్ అని డ్రైవర్ ఎ.శివకృష్ణ మణికంఠ తెలిపారు. సీజ్ చేసిన బియ్యం విలువ రూ.13.8 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఈ బియ్యాన్ని మండపేట మండలంలోని వేములపల్లి గోడౌన్ లో దిగుమతి చేసి, లారీని ఆలమూరు పోలీసు స్టేషన్కు తరలించారు. ఈ మేరకు ఎస్సై నరేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.విద్యుదాఘాతంతో వ్యక్తి మృతిదేవరపల్లి: విద్యుదాఘాతానికి గురై గోపాలపురంలో ఓ వ్యక్తి బుధవారం దుర్మరణం చెందాడు. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన చింతలపూడి శ్రీనివాస్ (35) స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల్లో విద్యుత్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. సబ్స్టేషన్ పరిధిలోని 11 కేవీ విద్యుత్ తీగల మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ ప్రవహించడంతో స్తంభం పైనే అతడు తీవ్రంగా గాయపడ్డాడు. కొన ఊపిరితో ఉన్న అతడిని చికిత్స కోసం గోపాలపురంలోని సామాజిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. శ్రీనివాస్కు భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. పని చేస్తున్న ప్రదేశంలో నాలుగు లైన్లను అసిస్టెంట్ లైన్మెన్ ఎల్సీ(లైన్ క్లియరెన్స్) తీసుకుని, పనులు చేశారని, తీగలకు సరఫరా ఏలా వచ్చిందో తెలియడం లేదని ఏఈ శ్రీనివాస్ తెలిపారు. శ్రీనివాస్ ప్రైవేటు కార్మికుడిగా పనిచేస్తున్నాడని ఆయన తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పి.మనోహర్ చెప్పారు.రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలుశంఖవరం: కత్తిపూడి జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలయ్యాయి. అన్నవరం పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని కత్తిపూడి గ్రామానికి చెందిన వెన్నా తమ్మయ్యదొర పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డు దాటుతుండగా రాజమండ్రి నుంచి తుని వైపు వెళ్తున్న బోలెరో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాధితుడి కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. అన్నవరం పోలీసులు చికిత్స నిమిత్తం క్షతగాత్రుడిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎస్సై శ్రీహరిబాబు కేసు నమోదుచేశారు.రోడ్డు ప్రమాదం కేసులో ఆరు నెలల జైలుకంబాలచెరువు(రాజమహేంద్రవరం): రోడ్డు ప్రమాదం కేసులో రాజమహేంద్రవరం ఆర్యాపురానికి చెందిన మామిడి శ్రీనాఽథ్ అనే వ్యక్తికి ఆరు నెలలు జైలుశిక్ష విఽధిస్తూ ఐదో ఏజేఎఫ్సీఎం మెజిస్ట్రేట్ జి.శ్రీనివాసరెడ్డి బుధవారం తీర్పునిచ్చారు. కొప్పిశెట్టి సునీల్కుమార్ 2020 ఆగస్టు 25న పొలం పని మీద బయటికి వెళ్లి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఇంటికి వస్తున్నాడు. అప్సర థియేటర్ వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న శ్రీనాఽథ్ తన ఆటోతో వేగంగా ఢీకొట్టాడు. దీంతో సునీల్కుమార్ తన మోటార్ సైకిల్తో సహా కింద పడిపోయి కుడికాలుకు బలమైన గాయమై స్పృహతప్పాడు. అతడిని స్థానిక ఆర్థోపెటిక్ హాస్పిటల్లో చేర్పించి వైద్య చికిత్స అందించారు. కేసు విచారణలో నిజనిర్ధారణ కావడంతో న్యాయమూర్తి పై తీర్పు వెలువరించారు. కేసును అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీవీ మోహన్రావు వాదించారు. త్రీటౌన్ ఎస్సై భీమరాజు సాక్షులను ప్రవేశపెట్టి, కేసుకు సహాయ సహకారాలు అందించారు. -
నాటికలకు పూర్వ వైభవమే లక్ష్యం
● సీఆర్సీ కాటన్ కళాపరిషత్ ఆధ్వర్యంలో సిల్వర్ జుబ్లీ ఉగాది ఆహ్వాన నాటికల పోటీలు ● మార్చి 19, 20, 21 తేదీల్లో ప్రదర్శనలు రావులపాలెం: తెలుగు నాటికలకు పూర్వ వైభవం తీసుకురావాలనే లక్ష్యంతో ఉగాదికి కాస్మోపాలిటన్ రిక్రియేషన్ క్లబ్ (సీఆర్సీ) కాటన్ కళాపరిషత్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో 25 ఏళ్లుగా నాటికల పోటీలను నిర్వహిస్తూ సిల్వర్ జూబ్లీకి దూసుకువెళ్తున్నారు. బుధవారం స్థానిక సీఆర్సీ ఓల్డేజ్ హోమ్ మీటింగ్ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కళాపరిషత్ కన్వీనర్ గొలుగూరి వెంకటరెడ్డి, సీఆర్సీ అధ్యక్షుడు తాడి నాగమోహన్రెడ్డి, కార్యదర్శి నల్లమిల్లి వీర్రాఘవరెడ్డి, కళాపరిషత్ డైరెక్టర్ కె.సూర్య తెలిపారు. మార్చి 19, 20, 21 తేదీల్లో ఉగాది సందర్భంగా ఈ నాటికలను ప్రదర్శిస్తామన్నారు. తొలిరోజు రెండు నాటికలు గోవాడ క్రియేషన్స్ హైదరాబాదు వారి అమ్మ చెక్కిన బొమ్మ, బీవీకే క్రియేషన్స్ కాకినాడ వారి కన్నీటికి విలువెంత, రెండో రోజు మూడు నాటికలు అభినయ ఆర్ట్స్ గుంటూరు వారి సహాన, తెలుగు కళా సమితి విశాఖపట్నం వారి చిటికెన వేలు, చైతన్య కళా స్రవంతి విశాఖపట్నం వారి అసత్యం, మూడో రోజు రెండు నాటికలు ఎస్వీ రంగారావు కళా స్రవంతి కాకినాడ వారి ఆచమనం, భద్రం ఫౌండేషన్ విశాఖపట్నం వారి దొందూ దొందే నాటికలతో పాటు చివరి రోజు సీఆర్సీ వారి ప్రత్యేక ప్రదర్శన ఉంటుందన్నారు. ప్రతి నాటికకు రూ.25 వేల పారితోషికం, ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత బహుమతులు ఉంటాయన్నారు. అలాగే ప్రథమ బహుమతిగా రూ.లక్ష, ద్వితీయ బహుమతిగా రూ.75 వేలు, తృతీయ బహుమతిగా రూ.50 వేలు ఇవ్వనున్నామన్నారు. సమావేశంలో సీఆర్సీ డైరెక్టర్లు మల్లిడి అంజనీకుమార్రెడ్డి, కుడుపూడి శ్రీనివాసరావు, జి.రంగనాయకులు, బి.నాగేశ్వరరావు, పలివెల త్రిమూర్తులు పాల్గొన్నారు. -
స్వర్ణాంధ్ర – 2047 అనేది అభూత కల్పన
రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే క్రమంలో స్వర్ణాంధ్ర – 2047 తమ లక్ష్యమంటూ కూటమి నేతలు చెప్పిన మాటలు అభూత కల్పన మాత్రమే. పది సూత్రాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథాన నడిపించేందుకు కృషి చేస్తున్నామంటూ పాలకులు చెప్పడాన్ని ప్రజలు ఏ మాత్రమూ స్వాగతించరు. 22 నెలల పాలనా కాలంలో తొలి ఏడాదంతా సంక్షేమ పథకాలను ఎగ్గొట్టారు. తర్వాత అందజేసిన పథకాల లబ్ధి అరకొరగా ఉంది. ఈ తరహా పాలనను చూసిన ప్రజలకు చంద్రబాబు ప్రభుత్వంపై నమ్మకం పోయింది.– తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ మండపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్తీవ్ర నిరాశకు గురి చేసిందిరాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, విశ్రాంత ఉద్యోగ వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచినా నాలుగు డీఏలు, చెల్లించాల్సిన రూ.40 వేల కోట్ల పైబడి బకాయిల ప్రస్తావన లేదు. నూతన పీఆర్సీ కమిషన్, ఐఆర్ గురించి పట్టింపే లేదు. ఈ వర్గాలకు ఈ బడ్జెట్ అన్యాయం, మోసం చేయడమే. దీనిని ప్రభుత్వం సరిదిద్దాలి.– అప్పారి జయప్రకాష్,వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు, తూర్పుగోదావరి జిల్లా -
భవిష్యత్ కమ్యూనిజానిదే..
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): సీపీఐ వంద సంవత్సరాల పోరాట చరిత్రను ప్రజలు గమనిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. ఖమ్మంలో జరిగిన పార్టీ శతవార్షికోత్సవాల ముగింపు సభకు లక్షలాది మంది తరలి వచ్చారని, ఆ తరువాత కొత్తగూడెం కార్పొరేషన్లో సీపీఐ జెండా ఎగిరిందని చెప్పారు. భవిష్యత్ అంతా కమ్యూనిజానిదేనన్నారు. స్థానిక సూర్యరాయ కల్యాణ మండపంలో సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఖమ్మంలో జరిగిన శతవార్షికోత్సవాల సభకు దేశం నలుమూలల నుంచీ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు, మేధావులు, విద్యార్థులు, మహిళలు, రైతు లు, కార్మికులు భారీగా తరలివచ్చి, కమ్యూనిస్టు ఉద్యమానికి మద్దతు ప్రకటించారని గుర్తు చేశారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ, దేశంలో భూస్వామ్య దోపిడీకి, సామ్రాజ్యవాదానికి, కుల వివక్షకు, మత విద్వేషానికి వ్యతిరేకంగా జరిగిన అనేక పోరాటాలకు కమ్యూనిస్టు ఉద్యమం నాయకత్వం వహించిందని అన్నారు. భూమి కోసం, పని కోసం, రొట్టె కోసం, హక్కుల కోసం జరిగిన ప్రతి కీలక పోరాటంలో సీపీఐ ముందు వరుసలో నిలిచిందన్నారు. దళితులు, పేదలు, మైనారిటీలు, గిరిజనులు, మహిళలు, కార్మిక వర్గాలకు సామాజిక న్యాయం సాధించడమే లక్ష్యంగా నిరంతరం పని చేసిందని వివరించారు. శతవార్షికోత్సవాల సందర్భంగా పోరాట వారసత్వాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ, ప్రజల సమస్యలపై ఉద్యమాలను ఉధృతం చేయాలని ప్రతిజ్ఞ చేసిందని తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడటం, భారత రాజ్యాంగాన్ని రక్షించడం, దేశ లౌకిక సంప్రదాయాన్ని కొనసాగించడం నేడు అత్యవసరంగా మారాయని అన్నారు. మతోన్మాదంతో సమైక్యతకు ముప్పు మోదీ ప్రభుత్వం కార్మిక చట్టాలను నీరుగార్చి, నాలుగు లేబర్ కోడ్ల పేరుతో కార్మికుల హక్కులను కాలరాస్తోందని ముప్పాళ్ల విమర్శించారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేకుండా చేసి, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి నెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. దేశ సంపదను కొద్దిమంది బడా కార్పొరేట్లకు దోచిపెట్టి, సామాన్యులపై పన్నుల భారం మోపుతోందని మండిపడ్డారు. దేశంలో పెరుగుతున్న మతోన్మాద రాజకీయాలు ప్రజల మధ్య విభజనకు దారి తీస్తున్నాయని, ఇది భారత ఐక్యతకు, సమైక్యతకు తీవ్రమైన ముప్పుగా మారిందన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి రానున్న ఎన్నికల్లో బీజేపీని అధికారం నుంచి దించాల్సిన అవసరముందని అన్నారు. మెడికల్ మాఫియాపై చర్యలు తీసుకోవాలి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో మెడికల్ మాఫియాపై చర్యలు తీసుకునేంత వరకూ పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ప్రభుత్వాసుపత్రులను బలోపేతం చేయాలని, వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే డిమాండ్లతో ఈ ఉద్యమం నిర్వహిస్తున్నామని చెప్పారు. పార్టీని రానున్న రోజుల్లో మరింత బలోపేతం చేసేందుకు ప్రతి సభ్యుడూ వాడవాడలా అంకిత భావంతో పని చేయాలని పిలుపునిచ్చారు. పార్టీతో పాటు అనుబంధ సంఘాలను బలోపేతం చేయాలని, ఉద్యమాల్లో కార్మికులు, రైతులు, యువత, మహిళలు చురుగ్గా పాల్గొనేలా భాగస్వాములను చేయాలని అన్నారు. మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా భావజాల పోరాటంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తాటిపాక మధు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె.నారాయణ, జాతీయ కార్యవర్గ సభ్యులు రావుల వెంకయ్య, అక్కినేని వనజ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జేవీ సత్యనారాయణమూర్తి, పి.హరినాథ్రెడ్డి, జంగాల అజయ్ కుమార్, డి.జగదీష్, డేగ ప్రభాకర్, పి.దుర్గా భవాని జల్లి విల్సన్ తదితరులు పాల్గొన్నారు.ఫ సీపీఐ నేత రామకృష్ణ ఫ పార్టీ రాష్ట్ర సమితి సమావేశాలు ప్రారంభం -
ఇవేం కల్తీ రాజకీయాలు?
పిఠాపురం: కల్తీ రాజకీయాలు చేస్తే సహించేది లేదని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ కూటమి నేతలను హెచ్చరించారు. పిఠాపురంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. తిరుమల లడ్డూ విషయంలో సీబీఐ సిట్ స్పష్టమైన నివేదిక ఇచ్చినప్పటికీ మళ్లీమళ్లీ దుష్ప్రచారాలు చేస్తూ వేంకటేశ్వరస్వామి వారిని, లడ్డూ ప్రసాదం పవిత్రతను దెబ్బ తీసేలా కూటమి నేతలు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఉక్రోషం, ఆయనపై తప్పు దొరకలేదనే బాధతోనే సీబీఐ నివేదిక వచ్చిన తరువాత కూడా తప్పుడు ప్రచారం ఆపలేదని అన్నారు. దీనిని ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ నేతలు, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై, విడదల రజనిపై దాడులు చేయడం పెట్రోలు, యాసిడ్ బాంబులు వేయడం వంటి దుశ్చర్యలకు ఒడిగట్టారని, ఫ్లెక్సీలు, వాల్పోస్టర్లతో తప్పుడు ప్రచారాలకు దిగారని ధ్వజమెత్తారు. ఇక్కడా అదే దుష్ప్రచారం మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా భగవంతుడు సాక్షిగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ అదే దుష్ప్రచారానికి దిగడం దారుణమని గీత ఆగ్రహం వ్యక్తం చేశారు. శివుని దర్శనానికి వచ్చిన లక్షలాది మంది భక్తులకు రాజకీయ దురుద్దేశంతో కరపత్రాలు పంపిణీ చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ఇలాంటి చర్యల వల్ల ఇప్పటికే ఘర్షణలు జరిగాయని, కొట్టిన వారు చక్కగా తిరుగుతూండగా బాధితులు మాత్రం జైలులో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి నేతల కుట్రలకు ఇది పరాకాష్ట అని అన్నారు. అసలు ఆ కరపత్రం ఎవరు ముద్రించారో దమ్ముంటే చెప్పాలని ప్రశ్నించారు. వేంకటేశ్వరస్వామిపై, లడ్డూ ప్రసాదంపై, జగన్పై వ్యంగ్యంగా కరపత్రం ముద్రించడమేమిటని మండిపడ్డారు. తప్పు కప్పిపుచ్చుకోవడానికే బురదజల్లుడు వేంకటేశ్వరస్వామి వారిని అభాసుపాలు చేయాలని చూశారని, అక్కడితో ఆగకుండా కుక్కుటేశ్వరస్వామి ఆలయ ప్రతిష్టను దిగజార్చడానికి పూనుకున్నారని గీత ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారంతో పాదగయ వద్ద కరపత్రాలు పంచారని, వీటిని భక్తులు తిప్పికొట్టారని, భగవంతుడితో ఆటలాడితే భక్తుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆలయాల వద్ద మత రాజకీయాలు చేస్తారా అని నిలదీశారు. దొంగే దొంగా అని అరచినట్టు.. వారే తప్పులు చేసి దానిని కప్పి పుచ్చుకోవడానికి ఎదుటి వారిపై బురద జల్లుతున్నారని అన్నారు. చేసిన తప్పునకు భక్తులకు క్షమాపణలు చెప్పాల్సింది పోయి.. వైఎస్ జగన్పై ఇంకా కక్ష సాధించడానికి ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. అన్నీ తప్పుడు ప్రచారాలే.. అన్ని విషయాల్లోనూ కూటమి నేతలు తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారని గీత అన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కేవల రూ.3 లక్షల కోట్ల అప్పు చేస్తే రూ.14 లక్షల కోట్లంటూ దుష్ప్రచారం చేశారన్నారు. పట్టాదారు పాసు పుస్తకాలపై కూడా ఇలాగే తప్పుడు ప్రచారం చేశారని, విజయవాడ ప్రకాశం బ్యారేజీని పడవతో ఢీకొట్టించారన్నారని.. ఇలా రోజుకో అబద్ధం ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. రాష్ట్ర బడ్జెట్లో సూపర్ సిక్స్ పథకాలకు పంగనామం పెట్టారని అన్నారు. పరిపాలనంటే దాడులు, అక్రమ కేసులా? పరిపాలన అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై దాడులకు పాల్పడి, అక్రమ కేసులు పెట్టడమేనా అని గీత ప్రశ్నించారు. ఎన్ని దుష్ప్రచారాలు, దాడులు చేసినా, కేసులు పెట్టినా తమ నాయకుడు జగన్ను ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. అసెంబ్లీకి రారు 11 మంది అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని, ఆ 11 మందికే మీరంతా భయపడి పల్టీలు కొడుతున్నారని దుయ్యబట్టారు. ధైర్యం ఉంటే ఆ 11 మందికి ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి అంటూ కూటమి నేతలకు సవాల్ విసిరారు. ప్రెస్ మీట్లో జగన్ లేవనెత్తిన అంశాలకు ఒక్క మంత్రి కూడా సమాధానం చెప్పలేని, చేతకాని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. బడ్జెట్ గురించి బుగ్గన రాజేంద్రనాథ్ అడిగిన ప్రశ్నలకు ఒక్కరూ సమాధానం చెప్పలేకపోయారన్నారు. ఉన్నత పదవులు నిర్వహించిన తమ నేత బొత్స సత్యనారాయణపై అవాకులు చవాకులు పేలితే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ప్రసాదంపై తప్పుడు ప్రచారాన్ని ఇకనైనా ఆపాలని, కుక్కుటేశ్వరస్వామిపై భక్తితో ఆగాం తప్ప చేతకాక ఊరుకోలేదని స్పష్టం చేశారు. భక్తి వాతావరణాన్ని దెబ్బ తీయడం ఇష్టం లేకనే తప్పుడు కరపత్రాలపై ప్రతిచర్యకు దిగలేదన్నారు. ఉత్సవాలు పూర్తయ్యాయి కాబట్టి దీనిని ఇప్పుడు ఖండిస్తున్నామన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించబట్టే తప్పుడు ప్రచారాలు చేయగలిగారని, అదే తాము ప్రతిచర్యకు దిగితే పరిస్థితి మరోలా ఉండేదని కూటమి నేతలను గీత హెచ్చరించారు.ఫ వీటిని సహించేది లేదు ఫ వైఎస్సార్ సీపీ నేత వంగా గీత ఫ కూటమి నేతల తీరుపై ఆగ్రహం ‘సుప్రీం’ చెప్పినా లెక్క లేదా? ప్రపంచవ్యాప్తంగా భక్తుల మనోభావాలను దెబ్బ తీసేలా ఎవ్వరూ ఎటువంటి స్టేట్మెంట్లూ ఇవ్వరాదంటూ స్వయంగా సుప్రీంకోర్టే చెప్పినా కూటమి నేతలకు లెక్క లేకుండా ఉందని గీత దుయ్యబట్టారు. ఉన్నత పదవుల్లో ఉన్న ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి సైతం ఉచ్చం నీచం మరచి, పంది కొవ్వు, ఆవు కొవ్వు, ఇంకా చెప్పడానికి వీలు కాని వాటిని కలిపారంటూ చెప్పడం వారి దిగజారుడుతనానికి నిరద్శనమని అన్నారు. అటువంటివేవీ లేవని సీబీఐ నివేదిక ఇచ్చినా కూడా దుష్ప్రచారాలకు ఒడిగడుతున్నారని, దైవ ప్రసాదాన్ని వీధుల పాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎటువంటి ఆధారాలూ లేకుండా లడ్డూ ప్రసాదంపై కల్తీ ఆరోపణలు చేసిన కూటమి నాయకులు వెంటనే ప్రజలకు, కోట్లాది మంది భక్తులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చిన నివేదిక ప్రకారం ఏదైనా తేడా ఉంటే దాని ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, అంతే కానీ ఇలా దిగజారి దేవుడిని వీధుల్లోకి లాగవద్దని ఆమె హితవు పలికారు. మరోసారి ఇటువంటి కరపత్రాలు వేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ముద్రగడ రాజకీయ అనుభవం పార్టీకి అవసరం
కిర్లంపూడి: సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం రాజకీయ అనుభవం పార్టీకి ఎంతో అవసరమని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ముద్రగడను కిర్లంపూడిలోని నివాసంలో మంగళవారం అమర్నాథ్తో పాటు పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, అక్కడి జెడ్పీ చైర్మన్, భీమిలి నియోజకవర్గం పరిశీలకుడు మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు బొడ్డేడ ప్రసాద్, అనకాపల్లి నియోజకవర్గ పరిశీలకుడు చిక్కాల రామారావు మర్యాదపూర్వకంగా కలిశారు. పలు రాజకీయ అంశాలపై పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ కో ఆర్డినేటర్ గిరిబాబుతో చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నీతి నిజాయతీలకు ముద్రగడ పద్మనాభం మారుపేరని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఆయన సలహాలు, సూచనలు తీసుకుని పార్టీ విజయానికి కృషి చేస్తామని చెప్పారు. జిల్లా రిజిస్ట్రార్ల నియామకం కాకినాడ లీగల్: రిజిస్ట్రేషన్ల శాఖలో కాకినాడ, రాజమహేంద్రవరం జిల్లాల రిజిస్ట్రార్లుగా కె.ప్రసాదరావు, కె.జగన్మోహన్రావులను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. లంచం తీసుకున్న కేసులో గత ఏడాది మార్చి 28న అప్పటి కాకినాడ జిల్లా రిజిస్ట్రార్గా కె.ఆనందరావును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అప్పటి నుంచీ జిల్లా ఇన్చార్జి రిజిస్ట్రార్గా జయలక్ష్మి విధులు నిర్వహిస్తున్నారు. ఆమె స్థానంలో కృష్ణా జిల్లా చల్లపల్లిలో సబ్ రిజిస్ట్రార్గా పని చేస్తున్న కె.ప్రసాదరావుకు పదోన్నతి కల్పిస్తూ కాకినాడ జిల్లా రిజిస్ట్రార్గా నియమించారు. అలాగే, రాజమహేంద్రవరం జిల్లా రిజిస్ట్రార్ రెడ్డి సత్యనారాయణను గత జనవరి 30న ఉద్యోగోన్నతిపై విజయవాడ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్(డీఐజీ)గా నియమించారు. రాజమహేంద్రవరం జిల్లా ఇన్చార్జి రిజిస్ట్రార్గా నాగలింగేశ్వరరావు నియమించారు. ఆయన స్థానంలో మచిలీపట్నం సబ్ రిజిస్ట్రార్–1గా పని చేస్తున్న కె.జగన్మెహన్రావుకు ఉద్యోగోన్నతి కల్పిస్తూ రాజమహేంద్రవరం జిల్లా రిజిస్ట్రార్గా నియమించారు. వీరేశ్వరస్వామి జల విహారానికి ఏర్పాట్లు ఐ.పోలవరం: మురమళ్ల శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 15న ప్రారంభమైన మహా శివరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఐదు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. రోజూ స్వామి వారి అభిషేకాలు, కుంకుమ పూజలు దర్శనాలు విశేషంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆఖరి రోజయిన 19వ తేదీన నిర్వహించే స్వామివారి జల విహారం ఏర్పాట్లను చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, అసిస్టెంట్ కమిషనర్, కార్య నిర్వాహణాధికారి వి.సత్యనారాయణ మంగళవారం పరిశీలించారు. వృద్ధ గౌతమీ నదీపాయ వద్ద తెప్పోత్సవం జరిగే ప్రాంతాన్ని వారు పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని పర్యవేక్షణ అధికారిని ఆదేశించారు. తొలుత ఆలయం నుంచి భారీ ఊరేగింపు, కేరళ వాయిద్యాలు, కోలాటాలు, శక్తి వేషాలు, గరగ నృత్యాలతో స్వామి వారిని, అమ్మవారిని రథంపై ఊరేగింపుగా వృద్ధ గౌతమి నది వద్దకు తీసుకువస్తారు. తరువాత గోదావరి మాతకు ప్రత్యేక పూజలు, పంచ హారతులు, అనంతరం హంస వాహనంపై జల విహార మహోత్సవం నిర్వహించనున్నారు. డెల్టా వ్యవస్థ పరిశీలన పి.గన్నవరం: గోదావరి డెల్టా వ్యవస్థ తీరుతెన్నులపై పరిశీలన చేస్తున్నట్టు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ బీపీ పాండ్య, జీఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ కాంబోజీ తెలిపారు. ఇరిగేషన్ ఎస్ఈ గోపీనాథ్, ఈఈ కె.వెంకటేశ్వరరావులతో కలిసి జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం వారు పర్యటించారు. పి.గన్నవరం పాత అక్విడెక్టును, వైనతేయ నదీ పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు. ఇరిగేషన్ డీఈఈ భూపతిరాజు ప్రసాదరాజు, ఏఈ బి.రమేష్బాబు తదితరులు పాల్గొన్నారు. -
సహకారం.. సమరపథం
● సహకార ఉద్యోగుల సమ్మె ● 71 సొసైటీల్లో నిలిచిన సేవలుబోట్క్లబ్ (కాకినాడ సిటీ): తమ సమస్యలు పరిష్కరిస్తామని చంద్రబాబు హామీలు ఇవ్వడం తప్ప.. సర్కారు వాటిని నెరవేర్చకపోవడంపై ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (సొసైటీలు) ఉద్యోగులు సోమవారం సమ్మె బాట పట్టారు. ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా సొసైటీల్లో పని చేస్తున్న ఉద్యోగులు ఆయా కార్యాలయాలను మూసివేసి ఎక్కడికక్కడ ధర్నాలు నిర్వహించారు. జిల్లాలోని 71 సొసైటీల ద్వారా ప్రతి రోజూ సుమారు రూ.40 కోట్లు లావాదేవీలు జరుగుతూంటాయి. సుమారు 1.80 లక్షల మంది సొసైటీల సేవలను వినియోగించుకుంటున్నారు. ఒక్కో సొసైటీకి ప్రతి రోజూ 30 నుంచి 50 మందికి పైగా రైతులు వస్తూంటారు. ప్రతి సహకార సంఘంలో రోజుకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ లావాదేవీలు జరుగుతూంటాయి. సమ్మె కారణంగా సొసైటీలు మూత పడటంతో ఆయా లావాదేవీలు నిలిచిపోయి, రైతులకు ఇబ్బంది తప్పలేదు. ఖరీఫ్ రుణాలు చెల్లించిన రైతులు పలువురు రబీ పెట్టుబడికి అవసరమైన డబ్బుల కోసం సహకార సంఘాలకు వచ్చారు. వాటికి తాళాలు వేసి ఉండటంతో ఉసూరుమంటూ వెనుతిరగాల్సి వచ్చింది. ఇవీ డిమాండ్లు ● వేతన సవరణ చేపట్టాలి. అప్పటి వరకూ మధ్యంతర భృతి ఇవ్వాలి. ● గ్రాట్యుటీ సీలింగ్ పెట్టి, రూ.2 లక్షలు మాత్రమే చెల్లిస్తున్నారు. అలా కాకుండా చట్ట ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలి. ● సహకార సంఘాల సిబ్బందికి కూడా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలి. ● ఉద్యోగులకు రూ.5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య బీమా కల్పించాలి. సర్వీస్లో ఉండగా మరణిస్తే ఆ కుటుంబం ఆధారం కోల్పోతున్నందున ప్రతి ఉద్యోగికీ రూ.20 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించాలి. ● అనేక సంఘాల్లో ఉద్యోగుల జీతభత్యాలను డ్యుటు పద్దులో ఉంచారు. ఈ పద్దులను రద్దు చేయాలి. ● 2019 తర్వాత సహకార సంఘాల్లో చేరిన ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలి. వారికి జీవో నంబర్ 36 అమలు చేయాలి. ● డీసీసీబీల ద్వారా నేరుగా కాకుండా సహకార సంఘాల ద్వారా మాత్రమే రైతులకు రుణాలిచ్చేలా చర్యలు తీసుకోవాలి. ● సంఘాలు చెల్లించిన షేరు ధనంపై కనీసం 6 శాతం డివిడెండ్, 6 శాతం కనీస వడ్డీ చెల్లించాలి. ● అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ క్లర్క్, కంప్యూటర్ ఆపరేటర్లను సీనియారిటీ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న సంఘాల సీఈఓలుగా నియమించాలి. -
కార్యదర్శులకు పన్నుపోటు
గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామం ● నూరు శాతం వసూలు చేయాలని ఒత్తిళ్లు ● లేకపోతే సస్పెన్షన్లు తప్పవని హెచ్చరికలు ● ఆందోళన చెందుతున్న కార్యదర్శులుసాక్షి ప్రతినిధి, కాకినాడ: గ్రామ పంచాయతీ కార్యదర్శులు ‘పన్ను’ పోటుతో సతమతమవుతున్నారు. అంటే పన్ను వారు చెల్లించాలని కాదు. ప్రజల నుంచి నూ రు శాతం పన్నులు వసూలు చేయాలంటూ కార్యదర్శు ల కుత్తుకలపై సర్కారు కత్తులు పెడుతోంది. ఈ నెలలోనే రెండు విడతల్లోగా నూరు శాతం పన్నులు వసూ లు చేయకపోతే కఠిన చర్యలు తప్పవంటూ అధికారు లు హెచ్చరిస్తున్నారు. ఈ నుంచి వస్తున్న హెచ్చరికలతో పంచాయతీ కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రజలపై భారాలు మోపబోమంటూ ఎన్నికలకు ముందు చంద్రబాబు అండ్ కో గొప్పగా చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటికే విద్యుత్ చార్జీలు అడ్డంగా పెంచేశారు. ఏడాదిన్నర కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. నెలవారీ పచారీ సరకుల కొనుగోలుకే బిల్లు నాలుగైదు వేల రూపాయలు దాటిపోతోంది. ఈ పరిస్థితుల్లో అధిక శాతం ప్రజలు పన్నుల చెల్లింపునకు ముందుకు రావడం లేదు. సరిగ్గా ఇటువంటి పరిస్థితుల్లోనే గ్రామ పంచాయతీల్లో ప్రజల నుంచి పన్నులు వసూలు చేయాల్సిందేనని కార్యదర్శులపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. దీంతో, జిల్లాలోని గ్రామ పంచాయతీల కార్యదర్శులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఓవైపు పల్లె ప్రజలపై పన్నుల భారం మోపుతూ.. మరోవైపు అది వసూలు కాకపోతే కార్యదర్శులను బలి చేసేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోంది. లక్ష్యం మేరకు పన్నులు వసూలు చేయకుంటే ఇంటికి సాగనంపేందుకు కూడా వెనుకాడేది ప్రభుత్వం హెచ్చరించింది. ఈ ఒత్తిళ్లు భరించలేక ఈ రెండు నెలలూ సెలవు పెట్టేసి వెళ్లిపోవడమే శ్రేయస్కరమని పలువురు కార్యదర్శులు అభిప్రాయపడుతున్నారు. వసూలు లక్ష్యాలు ఇలా.. జిల్లాలోని 295 గ్రామ పంచాయతీల్లో ఈ ఏడాది రూ.86.21 కోట్ల మేర పన్నులు వసూలు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దీనిని ఇంటి పన్ను, నీటి పన్ను, నాన్ ట్యాక్స్ ఇండస్ట్రీస్ నుంచి వసూలు చేయాల్సి ఉంది. తొలి విడతగా ఈ నెల 15వ తేదీ నాటికి సుమారు రూ.43 కోట్లు (50 శాతం), మిగిలిన మొత్తం నెలాఖరుకు వసూలు చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. కానీ, ఈ నెల 11వ తేదీ వరకూ రూ.32.27 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగారు. అది కూడా ఆదివారం, సెలవు రోజులని కూడా చూడకుండా ప్రతి ఇంటికీ రెండు మూడుసార్లు తిరిగితేనే కానీ వసూలు కాలేదు. పన్ను వసూళ్లలో లక్ష్యం సాధించలేని వారిపై సస్పెన్షన్ వేటు వేస్తారనే సంకేతాలు రావడంతో పలువురు కార్యదర్శులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ‘ఆన్లైన్’తో అవస్థలు ఇవన్నీ ఒక ఎత్తయితే పన్ను వసూళ్లకు రూపొందించిన ఆన్లైన్ వ్యవస్థ అనేక అవస్థలకు కారణమవుతోందని కార్యదర్శులు చెబుతున్నారు. ఈ విధానంలో ప్రజలు ఇంటి పన్ను, కుళాయి పన్నులను తమ మొబైల్ నుంచే చెల్లించాలి. అయితే, పల్లెల్లో మొబైల్ నెట్వర్క్ సరిగ్గా పని చేయక, ఆన్లైన్ చెల్లింపులకు అనేక అగచాట్లు పడుతున్నారు. మరోవైపు సంబంధిత సర్వర్లు తరచుగా స్తంభించిపోతూ ప్రజలు నరకం చవి చూస్తున్నారు. ఇప్పటికే గ్రామ పంచాయతీ కార్యదర్శులకు సవాలక్ష పనులు అప్పజెబుతున్నారు. వీటికి తోడు తమ మెడపై ఇప్పుడు పన్ను వసూళ్ల కత్తి పెట్టడంతో వారు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. క్షేత్ర స్థాయిలో కష్టాలు ప్రతిసారీ ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి నెలలో ఇంటి పన్నుల కోసం ముందస్తు నోటీసులు జారీ చేయడం పరిపాటి. అలా జారీ చేసినా, చేయకున్నా ఏప్రిల్ నెలాఖరుకు కార్యదర్శులు పన్నులు వసూ లు చేస్తూండటం ఎప్పటి నుంచో ఉంది. అయితే, చంద్రబాబు ప్రభుత్వం గద్దెనెక్కాక ఈ నిబంధనల ను తుంగలోకి తొక్కి, కొత్త పోకడలకు తెర తీసి, తమపై వసూళ్ల భారం మోపిందని గ్రామ కార్యద ర్శులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి నెలాఖరుకే మొత్తం పన్నులు వసూలు చేయాలనే ఆదేశా లు తమను మానసిక ఆందోళనకు గురి చేస్తున్నా యని లబోదిబోమంటున్నారు. పన్నుల కోసం ఒకే ఇంటికి రెండు మూడుసార్లు తిరుగుతున్నా చేతిలో సొమ్ములు లేవంటూ తిప్పి పంపేస్తున్నారని అంటున్నారు. గట్టిగా అడిగితే కొన్ని గ్రామాల్లో అధికార పార్టీ నేతల పేర్లు చెప్పి ఎదురు తిరుగుతున్నారని ఆవేదన చెందుతున్నారు. రమణయ్యపేట, సర్పవరం, కరప, జగ్గంపేట తదితర గ్రామ పంచాయతీల్లో పన్ను వసూళ్లు పెద్ద సవాల్గా మారాయని చెబుతున్నారు. పన్ను వసూళ్ల ప్రాతిపదికన పనితీరును నిర్ధారిస్తామని, లేకుంటే వేటువేస్తామని అంటే ఉద్యోగం ప్రశాంతంగా ఎలా చేయగలుగుతామని ప్రశ్నిస్తున్నారు. ఈ తరహా ఒత్తిళ్లు గతంలో ఏ ప్రభుత్వంలోనూ చూడలేదని అంటున్నారు. -
ఎట్టకేలకు కొత్త సత్రం నిర్మాణం
● 22న శంకుస్థాపన ● 105 గదులతో నిర్మాణం ● అదే రోజు రత్నగిరి రెండో మెట్లదారి ప్రారంభంఅన్నవరం: సత్యదేవుని సన్నిధిలో ఎట్టకేలకు కొత్త సత్రం నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. శిథిలావస్థకు చేరిన పాత సీతారామ సత్రం స్థలంలో కొత్త సత్రం నిర్మాణానికి దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈ నెల 22న శంకుస్థాపన చేయనున్నారు. దేవస్థానం ఈఓ వి.త్రినాథరావు ఈ విషయం తెలిపారు. అదే రోజు రత్నగిరి టోల్గేట్ నుంచి కొండ పైకి రూ.90 లక్షలతో నిర్మించిన రెండో మెట్ల దారిని కూడా ప్రారంభించనున్నారు. గత ప్రభుత్వ హయాంలోనే.. రత్నగిరిపై సుమారు 30 ఏళ్ల కిందట నిర్మించిన శ్రీ సీతారామ సత్రం శిథిలావస్థకు చేరిందని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 2024లో గుర్తించారు. ఈ సత్రాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలని అప్పటి దేవస్థానం ఈఓ, ప్రస్తుత దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ ఆర్అండ్బీ అధికారులను కోరారు. వారు ఈ సత్రాన్ని కూల్చివేసి కొత్తది నిర్మించాలని అప్పట్లోనే నివేదిక ఇచ్చారు. ఆ మేరకు 2024 మే నెలలో సీతారామ సత్రం భవనాన్ని కూల్చివేసి, సగం స్థలంలో ఎ–బ్లాక్ పేరిట 105 గదులతో కొత్త సత్రం నిర్మించేందుకు రూ.8.82 కోట్ల అంచనాతో టెండర్లు పిలిచారు. దీనిని 19.80 శాతం తక్కువకు అంటే సుమారు రూ.7.07 కోట్లకు డీడీ గిరి కన్స్ట్రక్షన్స్ దక్కించుకుంది. పాత సత్రాన్ని కూల్చివేసి ఇనుము, కలప తీసుకుని, మిగిలిన రద్దు వేరొక చోటుకు తరలించేందుకు కూడా మరో టెండర్ ఖరారు చేశారు. అయితే, గత ఏడాది ఫిబ్రవరిలో ఈ సత్రాన్ని దేవదాయ శాఖ సలహాదారు కొండలరావు పరిశీలించి, మరమ్మతులు చేస్తే సరిపోతుందని సిఫారసు చేశారు. దీంతో, గందరగోళం నెలకొంది. పాత సత్రం మరమ్మతులకు సుమారు రూ.2 కోట్లు అవుతుందని అంచనా వేశారు. అయితే, మరమ్మతులు చేశాక కూడా అది కూలిపోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమైంది. ఈ విషయాన్ని అప్పట్లో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దీనిపై కమిషనర్ రామచంద్ర మోహన్ స్పందించి, సత్రం కూల్చివేతపై జేఎన్టీయూకే ప్రొఫెసర్ల అభిప్రాయం కోరారు. వారు మరమ్మతులకు బదులు సత్రం కూల్చివేతకే సిఫారసు చేశారు. ఈ మేరకు పాత భవనం కూల్చివేసి, గతంలో టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ ద్వారా కొత్త సత్రం నిర్మించాలని కమిషనర్ ఆదేశించారు. గత ఏడాది కార్తిక మాసంలో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఆ తరువాత పాత భవనం కూల్చివేయాలని నిర్ణయించారు. గత డిసెంబర్లో పాత భవనంలో సగ భాగం కూల్చేశారు. ఇక్కడే కొత్త సత్రం నిర్మించనున్నారు. 105 గదులతో.. గ్రౌండ్ ఫ్లోర్తో పాటు మూడంతస్తుల్లో ఎ–బ్లాక్ పేరిట కొత్త సత్రాన్ని నిర్మించనున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ను పార్కింగ్కు కేటాయిస్తారు. ప్రతి అంతస్తుకు 35 చొప్పున మూడంతస్తుల్లో 105 గదులు నిర్మిస్తారు. నిర్మాణం 16 నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇది పూర్తయ్యాక సీతారామ సత్రంలో మిగిలిన భాగాన్ని కూడా కూల్చివేసి అక్కడ కూడా మరో 105 గదుల సత్రాన్ని నిర్మిస్తారు. వచ్చే ఏడాది జూన్కు పూర్తి కొత్త సత్రం నిర్మాణాన్ని వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేస్తాం. గోదావరి పుష్కరాల నాటికి భక్తులకు అందుబాటులోకి తేవాలని భావిస్తున్నాం. ఈ మేరకు దేవస్థానం ఈఈ రామకృష్ణను ఆదేశించాం. రత్నగిరి రెండో మెట్ల దారికి ప్రారంభంలో రూ.30 లక్షలతో ఆర్చి, మెట్ల పక్కన పారాపెట్ వాల్ పనులు చురుకుగా జరుగుతున్నాయి. – వి.త్రినాథరావు, ఈఓ, అన్నవరం దేవస్థానం -
పోస్టు కార్డు ఉద్యమానికి విశేష స్పందన
పీఆర్సీ కమిషన్ చైర్మన్ను వెంటనే నియమించాలని యూటీఎఫ్ ఇచ్చిన పిలుపునకు ఉపాధ్యాయులు విశేషంగా స్పందించారు. సీఎం చంద్రబాబుకు పోస్టుకార్డులు రాస్తూ తమ డిమాండ్లను ఆయన దృష్టికి తీసుకెళ్తున్నారు. – ఎస్ఎస్ఆర్ ప్రసాద్, యూటీఎఫ్ అధ్యక్షుడు, తూర్పుగోదావరి జిల్లా బోధనేతర పనులు రద్దు చేయాలి ఉపాధ్యాయులకు బోధనేతర పనులను రద్దు చేయాలి. వి ద్యార్థులకు బోధన చేసేందుకు సమయాన్ని పూర్తిగా కేటా యించే పరిస్థితులను ప్రభుత్వం కల్పించాలి. – కె.కృష్ణ, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, పోలవరం జిల్లా -
గుర్రువుల పోరు
కపిలేశ్వరపురం: భావిభారత పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయుడంటే సమాజంలో ఎనలేని గౌరవం ఉంటుంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం వారికి కనీస విలువ ఇవ్వడం లేదు. ఎన్నికల సమయంలో వారికి కూటమి నేతలు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు. ఎన్నిసార్లు గుర్తు చేసినా పట్టించుకోవడం లేదు. చేసేది లేక ప్రజాస్వామ్య పద్ధతిలో ఉపాధ్యాయులు మంగళవారం రణభేరి 2.0 పేరుతో ఆందోళనకు దిగుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయులిలా.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని 4,570 ప్రభుత్వ పాఠశాలల్లో 18,316 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని 962 ప్రభుత్వ పాఠశాలల్లో 5,814 మంది, కాకినాడ జిల్లాలోని 1,246 పాఠశాలల్లో 6,493 మంది, కోనసీమ జిల్లాలోని 1,562 పాఠశాలల్లో 4,109 మంది, పోలవరం జిల్లాలోని సుమారు 800 ప్రభుత్వ పాఠశాలల్లో 1,900 మంది చొప్పున ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. నేటి విజయవాడ ధర్నాకు ఉపాధ్యాయులు పలు ప్రధాన డిమాండ్లతో ‘ఉపాధ్యాయ రణభేరి’ పేరిట యూటీఎఫ్ మంగళవారం చలో విజయవాడ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఉపాధ్యాయులకు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డుపై ధర్నా చేయనున్నారు. ఆ మేరకు ఈ నెల 13న విజయవాడలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు తదితరులు రణభేరి కార్యక్రమం పోస్టర్ను విడుదల చేశారు. అదే రోజు పోలవరం జిల్లా వీఆర్పురం మండలం రేఖపల్లిలో ఆందోళన సన్నాహక సమావేశం నిర్వహించారు. తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో కూడా సన్నాహక సమావేశాలు నిర్వహించారు. విజయవాడకు తరలివెళ్లే విషయమై సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి దిశా నిర్దేశం చేశారు. నాడు హామీల ఎర.. నేడు విస్మరణ సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఉద్యోగ, ఉపాధ్యాయులకు పలు హామీలు గుప్పించారు. అధికారంలోకి వచ్చి 20 నెలలయినా ఆ హామీలను నెరవేర్చడం లేదు. యూటీఎఫ్, ఎస్టీయూ తదితర సంఘాల ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబుకు అనేక మార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ స్పందించడం లేదు. పైగా బోధనేతర పనులతో ఉపాధ్యాయులపై పని ఒత్తిడి పెంచారు. హామీల అమలుకు అనేకసార్లు విజ్ఞప్తులు చేసిన ఉపాధ్యాయులు చట్ట పరిధిలో శాంతియుత మార్గాన నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయినప్పటికీ ప్రభుత్వం ఖాతరు చేయకపోవడంతో ఈ నెల 13న ఎస్టీయూ ఆధ్వర్యాన కాకినాడ, రాజమహేంద్రవరాల్లోని కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించారు. ఆ సంఘం ఈ నెల 25న చలో విజయవాడకు పిలుపునిచ్చింది. యూటీఎఫ్ ఆధ్వర్యాన రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు సీఎం చంద్రబాబుకు లక్ష ఉత్తరాలు రాశారు. ఈ నెల 5న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా నిర్వహించగా ఉమ్మడి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు తరలి వెళ్లారు.పాఠశాలలను బలోపేతం చేయాలి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించాలి. పాఠశాలల్లో తగిన సదుపాయాలను మెరుగుపర్చాలి. – సీహెచ్ సూరిబాబు, యూటీఎఫ్ అధ్యక్షుడు, కాకినాడ జిల్లా హామీలు నెరవేర్చాలి సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఉపాధ్యాయు లకు పలు హామీలను ఇచ్చారు. వాటిని నెరవేర్చాలి. 29 శాతం ఐఆర్ వెంటనే ప్రకటించాలి. – ఎంటీవీఏఎస్ సుబ్బారావు, యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి, అంబేడ్కర్ కోనసీమ జిల్లాఉపాధ్యాయ రణభేరి 2.0 డిమాండ్లు ఇవీ.. 12వ పీఆర్సీ కమిషన్ వెంటనే నియమించాలి. 29 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించాలి. పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలి. ఉద్యోగుల, పెన్షనర్ల బకాయి చెల్లింపులకు రోడ్ మ్యాప్ ప్రకటించాలి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు రిటైరైన రోజే ఆర్థిక చెల్లింపులు పూర్తి చేయాలి. సీపీఎస్ రద్దు చేయాలి. హెల్త్కార్డుపై మెడికల్ బిల్ చెల్లింపు సమస్య పరిష్కరించాలి. కొత్త హెల్త్ కార్డులు మంజూరు చేయాలి. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలి. ఆ మేరకు కోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలి. సెలవుల్లో తరగతుల నిర్వహణ భారం తొలగించాలి. 2004 ముందు నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాల్లో చేరిన 2003 డీఎస్సీ ఉపాధ్యాయులు, పోలీసులు, ఇతర ఉద్యోగులకు, కేంద్రం ఇచ్చిన మెమో నంబర్ 57 ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. టీచర్ల గోడు పట్టని చంద్రబాబు ప్రభుత్వం హామీలను తుంగలోకి తొక్కిన వైనం ఎన్నిసార్లు విన్నవించినా దక్కని ఫలితం నేడు యూటీఎఫ్ రణభేరి 2.0 విజయవాడకు తరలివెళ్తున్న ఉపాధ్యాయులు -
మంగళవారం శ్రీ 17 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
ఇది ప్రజా వ్యతిరేకం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా ప్రజా వ్యతిరేకమైనది. రాష్ట్ర ప్రజలకు ఉపయోగ పడే రీతిలో నిధుల కేటాయింపు లేదు. నిరుద్యోగ భృతి, 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలనెలా ఆర్థిక చేయూత ఇస్తానన్న హామీల గురించి ప్రస్తావన లేదు. విద్యార్థులకు ఉపకార వేతనాలు, యువతకు ఉద్యోగ అవకాశాల మాటే లేదు. ఉద్యోగుల పీఆర్సీ ఊసే లేదు. – కుడుపూడి సూర్యనారాయణరావు, ఎమ్మెల్సీ, అమలాపురం సూపర్ సిక్స్కు మంగళం చంద్రబాబు ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలకు మంగళం పాడింది. 2026–27 బడ్జెట్లో సంక్షేమ పథకాలను విస్మరించింది. ఎన్నికల్లో అసత్య ప్రచారం చేసి అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను, రైతులను వంచించింది. ఆడబిడ్డ నిధికి, నిరుద్యోగ భృతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకాలకు బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. మూడు బడ్జెట్లలో పై పథకాలకు సుమారు రూ.1,62,600 కోట్లు ప్రభుత్వం ఎగ్గొట్టింది. – తానేటి వనిత, మాజీ హోం మంత్రి, గోపాలపురం 8 -
బీసీల వర్గీకరణ అవసరం
● వారు ఎప్పుడూ వెనుకబడే ఉంటున్నారు ● సీపీఐ నేతలు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): వెనుకబడిన తరగతులు ఎప్పుడూ వెనుకబడే ఉంటున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ, సీనియర్ నాయకుడు కె.నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజుల పాటు జరగనున్న సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు కాకినాడ సూర్య కళా మందిరంలో సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై సీపీఐ పోరుబాట నిర్వహిస్తుందని చెప్పారు. జనగణనలో భాగంగా కులగణన చేపడితే బీసీల సంఖ్య తేలుతుందన్నారు. బీసీల్లోని వివిధ ఉప కులాల వారికి సమాన అవకాశాలు కల్పించేందుకు ఎ, బి, సి, డి కేటగిరీలుగా వర్గీకరించాల్సిన అవసరం ఉందన్నారు. విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో అన్ని కులాలకు, వర్గాలకు సమాన అవకాశాలు లభించినప్పుడే దేశం సమగ్రంగా అభివృద్ధి చెందినట్లని అన్నారు. కులవృత్తిదార్లకు చిన్న చిన్న పరికరాలు అందించి ఓట్లు దండుకుంటున్నారని, ఇది వారి అభివృద్ధి, సంక్షేమం కాదని, ఆధునిక బానిసత్వమని అన్నారు. ప్రపంచం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరుగులు పెడుతూంటే మన దేశంలో కులాలకు, కుల వృత్తులకు బీసీలను కట్టిపడేస్తున్నారని అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ, జనగణనలో భాగంగా కులగణన జరిపించాలంటూ అన్ని రాజకీయ పార్టీలూ తీర్మానం చేసి, అందుకు కావలసిన కార్యాచరణ అమలు చేసే విధంగా ముందుకు కదలాలని కోరారు. ఆయా పార్టీలపై బీసీ నాయకులు ఒత్తిడి తేవాలన్నారు. జనగణనలో సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులను సమగ్రంగా నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు రావుల వెంకయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తాటిపాక మధు, నాయకులు అక్కినేని వనజ, ముప్పాళ్ల నాగేశ్వరరావు, జేవీ సత్యనారాయణమూర్తి, పి.హరినాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేడు నులిపురుగుల నివారణ దినం కాకినాడ క్రైం: జిల్లావ్యాప్తంగా మంగళవారం నులి పురుగుల నివారణ దినం నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్ఓ) నరసింహ నాయక్ తెలిపారు. తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ కార్యక్రమం వాల్పోస్టర్ను రాష్ట్ర నోడల్ అధికారి జె.మల్లీశ్వరితో కలసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఏడాది నుంచి 19 ఏళ్ల మధ్య వయసు వారికి ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తామని చెప్పారు. 1–2 ఏళ్ల మధ్య వయసు పిల్లలకు సగం మాత్ర, 2–19 ఏళ్ల వారికి పూర్తి మాత్ర ఇస్తామన్నారు. ఒకటి నుంచి ఐదేళ్ల లోపు పిల్లలకు మాత్ర పొడి చేసి అందిస్తామన్నారు. అనుబంధ శాఖల సహకారంతో నూరు శాతం మాత్రల పంపిణీకి చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. జిల్లా వ్యాప్తంగా 4,077 కేంద్రాల్లో 4,38,904 మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు వేస్తామని డీఎంహెచ్ఓ తెలిపారు. ఈ మాత్రలు వేసుకోవడం వలన రక్తహీనతకు తెరపడి పిల్లల్లో ఆరోగ్యం, ఎదుగుదల వృద్ధి చెందుతాయని చెప్పారు. కార్యక్రమంలో డీఐఓ కేవీ సుబ్బరాజు, ఎన్సీడీ ఆర్బీఎస్కే డీసీ వి.అరుణ, ఎపిడమాలజిస్టు ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. -
ముగ్ధ మనోహరమే..
పిఠాపురం: గరళకంఠుడి గజ్జెల సవ్వడితో పీఠికాపురం పులకించింది. ఆదిదేవుడు కై లాసం నుంచి భువికి దిగి వచ్చాడా అన్నట్టుగా నిర్వహించిన ఉమాకుక్కుటేశ్వర స్వామివారి దివ్య రథోత్సవం సోమవారం రాత్రి కనుల పండువగా జరిగింది. తెల్లవారు జామున పిఠాపురం మహారాజా రాజారావు వెంకట కుమార మహీపతి సూర్యారావు బహుద్దూర్ వారి పేరున ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో లింగోద్భావ పూజలు, అభిషేకాలు, తొలి అర్చన చేశారు. అధిక సంఖ్యలో విచ్చేసిన భక్త జనసందోహం నడుమ కుక్కుటేశ్వరస్వామి, రాజరాజేశ్వరీ అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాల అనంతరం ఆలయం నుంచి పల్లకిలో ఊరేగించారు. అనంతరం కుంతీ మాధవస్వామివారి ఆలయం వద్ద ఉన్న స్వామివారి రథం వద్దకు తీసుకెళ్లారు. బ్యాండుమేళాల నడుమ విద్యుద్ధీపాలు, పూలమాలలతో విశేషంగా అలంకరించిన రథంపై పట్టు వస్త్రాలు, నగలతో అలంకరించిన ఉత్సవ విగ్రహాలను వేదపండితులు అధిష్టించగా, రథోత్సవాన్ని ప్రారంభించారు. మెయిన్రోడ్డు మీదుగా ఉప్పాడ సెంటర్ వరకూ కొనసాగిన ఉత్సవానికి అశేష భక్త జనవాహిని కదిలి వచ్చి స్వామివారి రథాన్ని లాగి తరించింది. కలుపు మందు తాగి వ్యక్తి మృతి అంబాజీపేట: ఓ వ్యక్తి కలుపు మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. హెచ్సీ వి.సత్యనారాయణ కథనం ప్రకారం.. అంబాజీపేట నెల్లివారిపేటకు చెందిన నక్కా రవికుమార్ (48) ఈ నెల 14న గ్రామంలోని బస్టాండ్ వద్ద కలుపు మందు తాగాడు. అనంతరం తన సమీప బంధువుకు ఫోన్ చేసి చెప్పాడు. అతన్ని అమలాపురంలోని ప్రభుత్వాసుపత్రికి, తర్వాత మెరుగైన వైద్యం నిమిత్తం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. -
బడ్జెట్లో అరకొర నిధులేలా!
● గ్రంథాలయాల సంస్థకు అన్యాయం ● రాష్ట్ర సంఘ అసోసియేట్ అధ్యక్షుడు వర్మ అమలాపురం టౌన్: రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో గ్రంథాలయాల సంస్థకు చెందిన ఉద్యోగుల జీతాలు కోసం కేటాయించిన నిధులు కేవలం రూ.36.30 కోట్లు మాత్రమేని, ఈ అరకొర నిధులు ఎలా సరిపోతాయని అమలాపురానికి చెందిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు, రాష్ట్ర సంఘ అసోసియేట్ అధ్యక్షుడు జీవీఆర్ఎస్హెచ్కే వర్మ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం అమలాపురంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ బడ్జెట్లోనే గ్రంథాలయ ఉద్యోగుల జీతాలు, రిటైర్మెంట్ అయిన వారి బెనిఫిట్స్, పెన్షనర్లకు ఇవ్వాల్సి ఉంటుందని వర్మ గుర్తు చేశారు. ఈ కేటాయింపులు గ్రంథాలయ శాఖకు ఎంత మాత్రం సరిపోవని, తక్షణమే బడ్జెట్ను పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కేటాయింపులను రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథాలయ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. గత రెండేళ్లుగా తమ శాఖలో విశ్రాంత ఉద్యోగులుకు చెల్లించాల్సిన బెనిఫిట్స్ దాదాపు రూ.20 కోట్లు ఉందని గుర్తు చేశారు. ప్రతి నెలా ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల నిమిత్తం రూ. 10 కోట్ల నిధులు అవసరం అవతాయని స్పష్టం చేశారు. అంటే ఏడాదికి సుమారు రూ.120 కోట్లు ఖర్చు అవుతుందని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రంథాలయాలకు ప్రభుత్వం బడ్జెట్లో కేవలం రూ.36.30 కోట్లు కేటాయించడంతో ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయని వర్మ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో గత ఏడాది డిసెంబర్ నెల నుంచి గ్రంథాలయ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను చూస్తుంటే ముందు ముందు ఉద్యోగులకు, పెన్షన్దారులకు చెల్లింపులు నిలిచిపోయే అవకాశం ఉందన్నారు. గ్రంథాలయాలకు స్థానిక సంస్థలు చెల్లించాల్సిన సెస్ బకాయిలు ఈ ఆర్థిక సంవత్సరంలోనే దాదాపు రూ.100 కోట్లకు చేరిందని గుర్తు చేశారు. తమ శాఖ ఉద్యోగులు, పెన్షనర్లకు 010 పద్దు ద్వారా చెల్లించాలని, పూర్తి గ్రాంట్ విడుదల చేయాలని వర్మ డిమాండ్ చేశారు. -
మార్పు స్పష్టంగా కనిపిస్తోంది
ప్రస్తుతం లేటు వయసులో వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. యువత ఆలోచనా ధోరణిలో వచ్చిన మార్పే ఒక కారణమైతే, అమ్మాయిలు తక్కువగా ఉండడం మరో కారణం. పెళ్లిళ్లకు అధిక సమయం అమ్మాయిలను వెతుక్కోవడానికే సరిపోతోంది. వ్యవస్థలో వచ్చిన మార్పు స్పష్టంగా కన్పిస్తోంది. –విలపర్తి ఫణిధర్శర్మ, పురోహితుడు, రాయవరం 30 ఏళ్లు పైబడిన వారే అధికం మా దగ్గరకు జాతకాలు, ముహూర్తాల కోసం అధిక సంఖ్యాకులు 30 ఏళ్లు పైబడిన వారే వస్తున్నారు. చాలామంది తల్లిదండ్రులు వారి అబ్బాయిలకు తగిన అమ్మాయిలు దొరకడం లేదనే బాధను వ్యక్తం చేస్తున్నారు. అబ్బాయిలను ఎంచుకునే అవకాశం అమ్మాయిలకు లభిస్తుండడం గమనిస్తున్నాను. –కోట వీరవెంకట సత్యనారాయణమూర్తి, అర్చకుడు, పాదగయ క్షేత్రం, పురుహూతికా శక్తి పీఠం, పిఠాపురం● -
నేత్రపర్వం.. భీమేశ్వరుని రథోత్సవం
సామర్లకోట: పంచారామ క్షేత్రమైన సామర్లకోట బాలాత్రిపుర సుందరీ సమేత కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయం వద్ద రథోత్సవాన్ని సోమవారం నేత్రపర్వంగా నిర్వహించారు. తొలుత స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిపై ఉంచి ఊరేగింపుగా ఆలయం నుంచి గాంధీచౌక్కు తీసుకు వచ్చారు. ఆలయ పండితుల వేదమంత్రాల మధ్య స్వామి, అమ్మవార్లను పూలు, విద్యుత్తు దీపాలతో అలంకరించిన రథంపై ఉంచారు. గాంధీచౌక్లో రథోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవాల ప్రత్యేకాధికారి కె.నాగేశ్వరరావు, ఈఓ బళ్ల నీలకంఠం, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, గుణ్నం చంద్రమౌళి, బొడ్డు వెంకటరమణచౌదరి, నిమ్మకాలయ రంగనాగ్, చైర్మన్ కంటే జగదీష్మోహన్రావు రథోత్సవాన్ని ప్రారంభించారు. పట్టణ పురవీధుల నుంచి వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు, బాణసంచా కాల్పులు, సాంస్కృతిక ప్రదర్శనల మధ్య రథోత్సవం అత్యంత వైభవంగా సాగింది. దారి పొడవునా భక్తులు ఉత్సవ మూర్తులను దర్శించుకున్నారు. బుధవారం రాత్రి స్వామివారి తెప్పోత్సవం, శ్రీపుష్ప యాగం నిర్వహణతో ఉత్సవాలు ముగుస్తాయి. -
పెరుగుతున్న.. పెళ్లికాని ప్రసాద్లు
● వధువుల కోసం వెతుకులాట ● తగ్గుతున్న అమ్మాయిల సంఖ్య ● విద్యావంతులు కావడమూ పెళ్లికి సమస్యే! రాయవరం: కాలం మారుతోంది. కన్యాశుల్కం మళ్లీ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మ్యారేజ్ బ్యూరోల వద్ద పెళ్లి కాని ప్రసాద్ల జాబితా పెరిగిపోతోంది. కొడుకే పుట్టాలని కనిపించిన దేవుళ్లందరినీ కోరుకున్న తల్లిదండ్రులు ఇప్పుడు వారి కుమారులకు పెళ్లి చేసేందుకు గుర్తుకొచ్చిన దేవుళ్లకు మొక్కుతున్నారు. పురుషుల సంఖ్యకు తగ్గట్టు అమ్మాయిల సంఖ్య పెరగకపోవడమే ఇందుకు కారణం. ఒకప్పటిలా తల్లిదండ్రులు చూసిన వరుడితో తలవంచుకుని తాళి కట్టించుకునే అమ్మాయిలు ఇప్పుడు లేరు. అబ్బాయిలు రాజీ పడినా.. చదువుకున్న అమ్మాయిలు నో అంటున్నారు. మారిన రోజులు ఒకప్పుడు పెళ్లిచూపుల్లో రకరకాల యక్షప్రశ్నలు వేసి అమ్మాయి సహనాన్ని అబ్బాయిలు పరీక్షించేవారు. ఇప్పుడు రోజులు మారాయి. అమ్మాయి, ఆమె కుటుంబం బాగుంటే చాలు. ఆస్తిపాస్తులు ఇవ్వనవసరం లేదంటున్నారు. అమ్మాయికి నేను నచ్చానో లేదో ఒకసారి అడగండి అంటున్నారు. అవసరమైతే కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటామంటున్నారు అధిక శాతం అబ్బాయి తరపు తల్లిదండ్రులు. లింగ వివక్షతో అమ్మాయిల సంఖ్య తగ్గిపోవడం, వారిలో చాలా మంది విద్యావంతులు కావడం ఈ సమస్యకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. గతంలో వైద్య వృత్తి, ఫార్మసీ, డెంటల్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, బీఎస్సీ అగ్రికల్చర్, ఎంబీఏ, ఎంసీఏ, సీఏ, ఇంజినీరింగ్ వంటి కోర్సులను కేవలం కొన్ని వర్గాల ప్రజలు మాత్రమే చదివేవారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ వృత్తి విద్య కోర్సులు చదువుతున్నారు. ఇందుకు అనుగుణంగా కళాశాలల సంఖ్య కూడా గణనీయంగా పెరిగాయి. బాలికల తల్లిదండ్రులు కూడా విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. యూకేజీ నుంచి డిగ్రీ వరకు రూ.వేల నుంచి రూ.లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా అమ్మాయిలే విద్య, ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. ఇప్పుడు అమ్మాయిల కోసం ప్రత్యేకించి కళాశాలలు వెలుస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. పెరిగిన వివాహ వయసు ఒకప్పుడు అమ్మాయికి 16 వచ్చీ రాగానే పెళ్లి చేసేవారు. ఇప్పుడు 25 సంవత్సరాల వరకూ వివాహ ప్రస్తావన ఎత్తడం లేదు. చదువుకున్న కుటుంబాల్లో ఇది ఎక్కువగా ఉంది. అమ్మాయికి తగ్గ అబ్బాయి లభించడం లేదన్న కారణాన్ని కూడా తల్లిదండ్రులు చెబుతున్నారు. అబ్బాయిలు సైతం ఒకప్పుడు 20 ఏళ్లు వచ్చేలోపు పెళ్లి చేసుకునేవారు. కానీ వారు కూడా ఇప్పుడు 30 ఏళ్ల దాకా పెళ్లి మాట ఎత్తవద్దంటున్నారు. బాగా వెనుకబడిన ప్రాంతాలు, గ్రామాల్లో కొన్ని కుటుంబాల్లో మాత్రమే చిన్న వయసులో వివాహాలు జరుగుతున్నాయి. పట్టణాలు, చదువుకున్న కుటుంబాల్లో మాత్రం అధిక శాతం వివాహాలు ఆలస్యంగా జరుగుతున్నట్లు మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు చెబుతున్నారు. అందుకే తేడా.. తమను కని, పెంచి పెద్ద చేసేది సీ్త్ర. తల్లిగా, చెల్లిగా, అక్కగా ఉండవచ్చు కానీ కూతురుగా వస్తే మాత్రం చాలా మంది ఒప్పుకోవడం లేదు. గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలియగానే భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారనే విమర్శలున్నాయి. ఆడపిల్లను కంటే చదివించడం, పెద్ద చేయడం, సంరక్షించడం, పెళ్లి చేయడం భారంగా కొంతమంది తల్లిదండ్రులు భావిస్తున్నారు. అందుకే అబ్బాయిల, అమ్మాయిల నిష్పత్తిలో తేడా వస్తోందని పలువురు పేర్కొంటున్నారు. అయితే ఇటీవల కాలంలో తల్లిదండ్రుల ఆలోచనా సరళిలో మార్పు కన్పిస్తోంది. అమ్మాయి అయినా, అబ్బాయి అయినా ఓకే అనే పరిస్థితికి వస్తున్నారు. ఇది కొంత వరకు ఆశించదగ్గ పరిణామంగా చెప్పవచ్చు. అమ్మాయికి తగ్గ అబ్బాయిలు ఎక్కడ? ఉన్నత చదువులు చదివిన వారు, ప్రొఫెషనల్ కోర్సులు చేసిన అమ్మాయిలు సాదాసీదాగా డిగ్రీ, ఇంటర్ చదివిన అబ్బాయిలను ఇష్టపడడం లేదు. అబ్బాయి ఎంతగా ఆస్తిపరుడైనా ప్రొఫెషనల్ కోర్సు చేసి ఉండాలని అమ్మాయిలు కోరుకుంటున్నారు. ఈ మేరకు వారి డిమాండ్లను మ్యారేజ్ బ్యూరో నిర్వాహకుల ముందు ఉంచుతున్నారు. మరోవైపు అబ్బాయిలకు చదువుకు తగ్గ ఉద్యోగాలు లభించక పోవడంతో పలువురు వ్యాపారాల వైపు, వృత్తి విద్యా కోర్సుల వైపు దృష్టి మళ్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమ్మాయిల కోరికలకు తగ్గట్టు అబ్బాయిలు లభించడం లేదని మ్యారేజ్ బ్యూరో నిర్వాహకుడు వి.శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగం, సాఫ్ట్వేర్ ఇంజినీర్, వైద్యులు కావాలని అమ్మాయిలు అడుగుతున్నారు. ఒక్కడే కుమారుడై ఉండాలని, అత్తమామలు లేకుంటే మరీ మేలని అనే వారూ ఉంటున్నారని మరో మ్యారేజ్ బ్యూరో నిర్వాహకుడు నాగేశ్వరరావు తెలిపారు. దీంతో అబ్బాయిల కోర్కెలు తగ్గిపోయాయి. చాలా మంది పిల్లనిస్తే చాలనే ధోరణిలో ఉన్నారు. ఆ లెక్కలు చూస్తే.. 2011 లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలో 51,54,296 మంది జనాభా ఉంటే, ఇందులో పురుషులు 25,69,688, మహిళలు 25,84,608 మంది ఉన్నారు. లింగ నిష్పత్తి లెక్క వేస్తే ప్రతి వెయ్యి మంది పురుషులకు గాను 1,006 మంది మహిళలున్నారు. మొత్తం మీద పురుషుల కంటే మహిళలే అధికంగా ఉన్నారన్నమాట. అయితే, గత ఆరేళ్ల లోపు శిశు లింగ నిష్పత్తిని పరిశీలిస్తే, ప్రతి వెయ్యి మంది మగ శిశువులకు 968 మంది మాత్రమే ఆడబిడ్డలు ఉన్నారు. దీనిని బట్టి చూస్తే పురుషుల అధికమవుతోంది. 2001లో 7.93 శాతం జనాభా వృద్ధి రేటు ఉంటే, 2011లో జనాభా వృద్ధి రేటు 5.16 శాతంగా ఉంది. 2027 జనాభా లెక్కల అనంతరం ప్రస్తుత పరిస్థితి తెలుస్తుంది. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 74.51 శాతం జనాభా ఉంటే, పట్టణ ప్రాంతంలో 25.49 శాతం మంది ఉన్నారు. -
స్కూటీని ఢీకొన్న వ్యాన్
గండేపల్లి: జాతీయ రహదారిపై సోమవారం జరిగిన ప్రమాదంలో భర్తకు తీవ్ర గాయాలు కాగా, భార్య పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. జగ్గంపేటకు చెందిన భార్యాభర్తలు అనంతం వెంకట సీతారామారావు (రాంబాబు), లోకమణిలు స్కూటీపై రాజమహేంద్రవరంలోని పెద్ద కూతురు భారతి ఇంటికి వెళ్లి వస్తున్నారు. మల్లేపల్లి శివారులో అమ్మవారి ఆలయ సమీప దాబా వద్దకు వచ్చేసరికి తునిలో ఈవెంట్కు వెళుతున్న ఎస్బీజే బృందం ప్రయాణిస్తున్న వ్యాన్ వెనుక నుంచి స్కూటీని ఢీకొంది. ఈ ప్రమాదంలో రాంబాబుకు తీవ్ర గాయాలు కాగా, భార్య లోకమణి సంఘటనా స్థలంలోనే అపస్మారక స్థితికి చేరుకుంది. స్థానికులు, రోడ్డు సేఫ్టీ, హైవే సిబ్బంది క్షతగాత్రులను 108 అంబులెన్స్లో రాజమహేంద్రవరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే ప్రమాదం జరిగిన తర్వాత ఉడాయించేందుకు ప్రయత్నించడం, వ్యాన్ డ్రైవర్ను మార్చుతుండగా స్థానికులు అడ్డుకున్నారు. దీంతో వ్యాన్లో సిబ్బంది రుబాబుకు దిగినట్టు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్టు పోలీసులు తెలిపారు. -
జీవనోపాధి చూపండి
కాట్రేనికోన: చేపల వేటకు దూరం అవుతున్నాం.. జీవనోపాధిని కోల్పోతున్నాం.. ఇసుక మేటలు వేసి పూడుకుపోయిన మొగను తవ్వించండంటూ అగ్నికుల క్షత్రియులు మహా ధర్నా చేపట్టారు. సోమవారం కాట్రేనికోన మండలం గచ్చకాయలపోర సముద్ర తీరం వద్ద వేలాది మంది అగ్నికుల క్షత్రియులు ఆందోళనకు దిగారు. గచ్చకాయలపోర వద్ద సముద్రపు మొగ పూడుకుపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని వారు ముక్తకంఠంతో నినదించారు. రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగిడి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. మొగ పూడుకుపోవడంతో మత్స్య సంపద లేక ఉపాధి కోల్పోయామని, ప్రభుత్వం తక్షణమే స్పందించి మొగను తవ్వాలని కోరుతూ ఉప్పలగుప్తం, కాట్రేనికోన మండలాలకు చెందిన ఎన్.కొత్తపల్లి, రాఘవులుపేట, ఎస్.యానం, పల్లం, గచ్చకాయలపోర, నాగపట్టణం, మర్రిచెట్టుకాలనీ, రాజానగరం, వేట్లపాలెం, చిర్రయానం గ్రామాలకు చెందిన సుమారు 3 వేల మంది అగ్నికుల క్షత్రియులు పార్టీలకు అతీతంగా ధర్నా చేశారు. తొలుత మొగ నుంచి గచ్చకాయలపోర వంతెన వరకు ర్యాలీ చేపట్టారు. రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగేశ్వరరావు మాట్లాడుతూ కాట్రేనికోన, ఉప్పలగుప్తం మండలాల్లో సుమారు 4 వేల ఎకరాల పైబడి పర్ర భూములు ఉన్నాయని, కొంత మంది ఆక్రమించుకుని చెరువులు తవ్వేశారన్నారు. పర్ర భూముల్లో అక్రమ చెరువులు గుర్తించి తొలగించాలని డిమాండ్ చేశారు. కూనవరం మొగతో వచ్చే సముద్రపు ఆటుపోట్లతో మత్స్య సంపద పెరిగి మత్స్యకారులకు ఉపాధిగా ఉండేదన్నారు. మొగ మూసుకుపోవడంతో పర్ర భూములు ఇసుక మేటలతో పూడుకు పోయాయన్నారు. సముద్రపు నీరు పర్ర భూములకు రావడం లేదని, మత్స్య సంపద లేక చేపల వేటపై ఆధారపడి జీవించే సుమారు 20 వేల కుటుంబాలు జీవనోపాధిని కోల్పోయామన్నారు. చేపలు వేట లేక వలస కూలీలుగా ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమా, ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులు కూనవరం స్టైట్ కట్ను పరిశీలించారన్నారు. సముద్రపు పోటుకు ఉప్పు నీరు పంట చేలకు రాకుండా కూనవరం కాలువకు గచ్చకాయలపోర వద్ద ఆటోమేటివ్ సూయిజ్ కట్టి రైతులను ఆదుకుంటామని మాజీ మంత్రి దేవినేని ఉమా హామీ ఇచ్చారన్నారు. అయినా ఇప్పటికీ ఆ పనులు జరగలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు దండుప్రోలు సత్యం, బొమ్మిడి లింగేశ్వరరావు, మల్లాడి వెంకటరమణ, మూదే చిరంజీవి, సంగాని శ్రీను, ఆకుల రాంబాబు, బొడ్డు నాగేశ్వరరావు, అర్థాని శ్రీను తదితరులు పాల్గొన్నారు. ● తక్షణమే మొగ తవ్వించండి ● అగ్నికుల క్షత్రియుల మహా ధర్నా -
ఒక్క మాత్రతో నులిమేద్దాం..
రాజమహేంద్రవరం రూరల్: పిల్లల ఆరోగ్యంపై నులి పురుగులు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అనేక రకాల అనారోగ్యాలకు కారణమవుతున్న నులి పురుగుల నివారణకు కేవలం ఒకే ఒక్క ఆల్బెండజోల్ మాత్ర మింగించండి బుజ్జాయి ఆరోగ్యం తిరిగి చూసుకోవలసిన అవసరం లేదని వైద్యాధికారులు సూచిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా నులిపురుగుల నివారణ కోసం మంగళవారం ఉచితంగా మాత్రలు పంపిణీ చేయనున్నారు. ప్రధానంగా ఈ నులి పురుగులు చిన్నారుల్లో రక్తహీనతకు దారి తీస్తాయి. శారీరక, మానసిక ఎదుగుదలకు ఆటంకంగా మారతాయి. కడుపులో చేరి నొప్పి, మంట, వికారం కలిగిస్తాయి. దీనివల్ల ఆహారం సహించదు. ఆకలి ఉండదు. నీరసపడతారు. శారీరక, మానసిక ఎదుగుదల లోపాలు కలుగుతాయి. వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. వాంతులు, మలంలో రక్తం, అతిసార వంటి సమస్యలు విజృంభిస్తాయి. ఏడాది నుంచి 19 ఏళ్లలోపు పిల్లల్లో ఈ నులి పురుగుల సమస్య ఎక్కువగా ఉంటుంది. డోసేజీ ఇలా.. ఏడాది నుంచి రెండేళ్లలోపు చిన్నారులకు ఆల్బెండజోల్ సగం మాత్ర (200 మిల్లీ గ్రాములు) నీళ్లలో కలిపి పట్టించాలి. 2 నుంచి 19 ఏళ్ల లోపు పిల్లలకు 400 మిల్లీ గ్రాముల మాత్రను మధ్యాహ్నం భోజనం అయ్యాక చప్పరించేలా చూడాలి. మాత్రను మింగనీయకూడదు. 4,06,342 మందికి పంపిణీ తూర్పు గోదావరి జిల్లాలో ఏడాది నుంచి 19 ఏళ్లలోపు పిల్లలు 4,06,342 మందికి ఆల్బెండజోల్ మాత్రలు ఇవ్వనున్నారు. ఆ రోజు ఏ కారణంతోనైనా మాత్రలు తీసుకోని, అందుబాటులో లేని పిల్లలకు మళ్లీ 24వ తేదీన వేయనున్నారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, పభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలు, ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలు, ఒకేషనల్ ఇనిస్టిట్యూషన్లు, ప్రథమ సంవత్సర డిగ్రీ కళాశాలలు పారా మెడికల్, ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలలు, బడిబయటి పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు వేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ రేపు జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం 4,06,342 మందికి ఇచ్చేందుకు ఏర్పాట్లు -
సత్యదేవుడు.. భక్తవరదుడు
● ఘనంగా ముగిసిన కోటి తులసి పత్రి పూజ ● రత్నగిరిపై పది రోజుల పాటు నిర్వహణఅన్నవరం: భక్తవరదుడు.. కోరిన కోర్కెలు తీర్చే దేవదేవుడు సత్యదేవుడు. లోక కల్యాణార్థం ఆ స్వామివారికి పవిత్ర మాఘ మాసంలో కోటి తులసి పత్రి పూజ అట్టహాసంగా జరిగింది. సత్యదేవుని వార్షిక కల్యాణ మండపంలో పది రోజులుగా జరుగుతున్న ఈ క్రతువు మహా శివరాత్రి పర్వదినాన ఆదివారం ఉదయం రుద్రహోమం పూర్ణాహుతితో ఘనంగా ముగిసింది. కోటి తులసి దళాలతో సత్యదేవుడు, అమ్మవార్లకు 66 మంది రుత్విక్కులు, వేద పండితులు, అర్చక స్వాములు పది రోజుల పాటు పూజలు చేశారు. చివరి రోజు ఉదయం ఎనిమిది గంటలకు వార్షిక కల్యాణ మండపం వద్ద రుద్ర హోమం ఘనంగా జరిపారు. ఉదయం 11 గంటలకు జరిగిన పూర్ణాహుతిలో హోమ ద్రవ్యాలను వేదపండితుల మంత్రోఛ్చాటన మధ్య రుత్విక్కులు సమర్పించారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వేండ్ర త్రినాథరావు, డీసీ బాబూరావు, అసిస్టెంట్ కమిషనర్ మంజులా దేవి దంపతులు పాల్గొన్నారు. హోమం అనంతరం పవిత్ర జలాలను సత్యదేవుని ఆలయంతో పాటు ప్రాంగణంలో అర్చక స్వాములు చల్లారు. ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ కోటి తులసి పూజ ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేద పండితులు గొల్లపల్లి ఘనాపాఠి గంగాధరబట్ల గంగబాబు, యనమండ్ర శర్మ, చిట్టి శివ, ముష్టి పురుషోత్తం, ప్రధానార్చకులు ఇంద్రగంటి నర్శింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యం, అర్చకులు కంచిభట్ల సాయిరామ్, దత్తాత్రేయ శర్మ, పరిచారకులు శివ, కొండవీటి రాజా, కల్యాణబ్రహ్మ ఛామర్తి కన్నబాబు, వ్రత పురోహిత సంఘం మాజీ అధ్యక్షులు నాగాభట్ల రవిశర్మ, కర్రి సత్యనారాయణ మూర్తి (నాని), పురోహితులు పాలంకి పట్టాభి, చల్లపిళ్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వైదిక బృందానికి అభినందన పది రోజులుగా కోటి తులసి పూజను ఘనంగా నిర్వహించిన వేదపండితులు, అర్చకులు, వ్రత పురోహితులను దేవస్థానం చైర్మన్, ఈఓ అభినందిస్తూ ఉత్తమ సేవా పత్రాలను అందజేశారు. తులసి గొప్పదనంపై పది రోజుల పాటు ప్రవచనాలు సాగించిన సామవేద పండితుడు సూర్యనారాయణను ఈఓ సత్కరించారు. అదే విధంగా ఈ కార్యక్రమాలను విజయవంతం చేసిన ఏఈఓలు డీవీఎస్ కృష్ణారావు, అనకాపల్లి ప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గణపతిని అభినందించారు. కాగా, వార్షిక కల్యాణ మండపంలో సత్యదేవుని నమూనా విగ్రహాల వద్ద ప్రత్యేక ఆకర్షణగా ఉంచిన తులసి మొక్కలను పూజ అనంతరం భక్తులకు చైర్మన్, ఈఓ పంపిణీ చేశారు. త్వరలోనే మరో ఆధ్యాత్మిక కార్యక్రమం రత్నగిరిపై మాఘ మాసంలో నిర్వహించిన కోటి తులసి పూజకు భక్తుల నుంచి విశేష స్పందన లభించిందని అన్నవరం దేవస్థానం ఈఓ వి.త్రినాథరావు అన్నారు. తక్కువ సమయంలోనే ఈ పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. రూ.12 లక్షల బడ్జెట్గా నిర్ణయించామన్నారు. అయితే దాతల నుంచి రూ.15 లక్షలు విరాళాలు వచ్చాయన్నారు. ఇందులో 135 మంది ఒక రోజు పూజకు రూ.1,500 చెల్లించిన దాతలు ఉన్నారన్నారు. రుత్విక్కులకు రూ.3.65 లక్షలు సంభావనగా అందజేశామని తెలిపారు. త్వరలోనే మరో ఆధ్యాత్మిక, పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. -
పడవ సీజ్
తాళ్లపూడి: అనుమతులు లేకుండా గోదావరి నదిలో పడవపై భక్తులను తరలిస్తున్న వ్యక్తిని ఆదివారం అరెస్టు చేసినట్లు తాళ్లపూడి ఎస్సై టి.రామకృష్ణ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. కొవ్వూరు వాటర్ ట్యాంక్ ప్రాంతానికి చెందిన నూకరాజు 15 మంది భక్తులను కొవ్వూరు గోదావరి మాత విగ్రహం సమీపంలో పడవలోకి రహస్యంగా ఎక్కించుకుని ఎటువంటి భద్రతా చర్యలు పాటించకుండా పట్టిసీమకు తీసుకు వెళ్తున్నాడు. తాళ్లపూడి ప్రాంతంలో పోలీస్ బీట్ సిబ్బంది ఆ పడవను అడ్డుకుని, నూకరాజును అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి పడవను సీజ్ చేసి, భక్తులకు అసౌకర్యం కలగకుండా రోడ్డు మార్గంలో పంపారు. -
సోమవారం శ్రీ 16 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
ఇళ్ల స్థలాలకు కేటాయింపులేవీ? పేదలకు ఇళ్ల స్థలాలిస్తామని చంద్రబాబు నాయుడు ఆర్భాటంగా ఇచ్చిన హామీ ఎక్కడా అమలయ్యే అవకాశం కనిపించడం లేదు. దీనికి బడ్జెట్లో నిధుల కేటాయింపు సక్రమంగా లేదు. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లోని వారికి 2 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలిస్తామంటూ ప్రజలకు ఎన్నికల్లో హామీ ఇచ్చి, నమ్మించి మోసం చేశారు. రెండేళ్లవుతున్నా టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించలేదు. బ్యాంకు అప్పులు చెల్లించవద్దని గతంలో చంద్రబాబు చెప్పారు. దీనిపై నిర్ణయం తీసుకోపోవడంతో లబ్ధిదారులపై బ్యాంకు అధికారుల ఒత్తిడి పెరిగిపోతోంది. – ఆవాల రాజేశ్వరి, రాష్ట్ర అయ్యరక కార్పొరేషన్ మాజీ చైర్మన్, సామర్లకోట కొత్త పెన్షన్లు లేక ఇబ్బందులు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లవుతున్నా ఇప్పటి వరకూ ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయలేదు. దీనికి అవసరమైన నిధులను రాష్ట్ర బడ్జెట్లో కేటాయించకపోవడం దారుణం. కొత్త పింఛన్లు ఇవ్వకపోవడంతో నిరుపేదలైన దివ్యాంగులు, వితంతవులు, వృద్ధులు అనేక మంది తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం అట్టర్ఫ్లాప్ అయ్యింది. దీనికి సిగ్గుపడాలి. ఇప్పటికై నా కొత్త పెన్షన్లు మంజూరు చేయాలి. లేకపోతే పోరాటం తప్పదు. – దాడిశెట్టి వీరబాబు, జైభీమ్రావ్ భారత్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఏలేశ్వరం -
రాంగ్ రూట్ తెచ్చిన ముప్పు
● రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి ● జాతీయ రహదారిపై ఘటన దేవరపల్లి: రాంగ్ రూటే ముప్పు తెచ్చింది.. ఇద్దరి ప్రాణాలను హరించింది.. గుండుగొలను – కొవ్వూరు జాతీయ రహదారిపై దేవరపల్లి మండలం కొత్తగూడెం సమీపంలో యాదవోలు రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. దేవరపల్లి మండలం సుబ్బరాయపురం గ్రామానికి చెందిన ముప్పాల రాజశివకృష్ణ (24), అదే గ్రామానికి చెందిన పెనుమాక చిన్నారి (34) బైక్పై కొరుకొండ మండలం గోకవరం శివారు కృష్ణుడుపాలెం వెళ్లి శనివారం తిరిగి ఇంటికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో యాదవోలు రోడ్డు వద్ద హైవేపై శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో ఏలూరు వైపు నుంచి కొవ్వూరు వైపు వెళ్తున్న బొలెరో కారును ముప్పాల రాజశివకృష్ణ రాంగ్ రూట్లో వచ్చి ఢీకొన్నాడు. రాజశివకృష్ణ, చిన్నారి అక్కడకక్కడే మృతి చెందారు. మృతుడి తల్లి శాంతికుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వి.సుబ్రహ్మణ్యం తెలిపారు. మృతురాలు చిన్నారికి వివాహం కాగా, రాజశివకృష్ణకు వివాహం కాలేదని ఆయన చెప్పారు. రాంగ్ రూట్లో వెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు ఆయన వివరించారు. -
ఆడబిడ్డ నిధికి నిధుల్లేవ్..
బడ్జెట్ సమావేశంలో ఆడబిడ్డ నిధికి నిధులు కేటాయించ లేదు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం 18 నుంచి 59 వరకూ వయసున్న మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున సంవత్సరానికి రూ.18 వేల ఆర్థిక సహాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామంది. సూపర్ సిక్స్ పేరుతో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఊదరగొట్టింది. ఈ బడ్జెట్లోనూ మహిళలకు నిరాశే మిగిలింది. మహిళలను మోసం చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధహస్తుడని మరోసారి నిరూపించుకున్నారు. – గుమ్మడి దుర్గాభవాని, నేదునూరు, అయినవిల్లి మండలం ● -
ఘనంగా శూలాల సంబరం
అమలాపురం రూరల్: ఇమ్మిడివరప్పాడులో కరికాల భక్తుల ఆధ్వర్యంలో వీరభద్రస్వామి ఆలయం వద్ద శూలాల సంబరం ఆదివారం వైభవంగా జరిగింది. యువకులు ఉపవాస దీక్షతో బుగ్గలు, కంఠానికి శూలాలు గుచ్చుకుని తమ మొక్కులను తీర్చుకున్నారు. శూలధారులను ట్రాక్టరుపై ఉంచి బాజాభజంత్రీలతో గ్రామోత్సవం నిర్వహించారు. వరములివ్వు వినాయకా..అయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వరస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. తెల్లవారుజామున స్వామివారికి ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకాలు, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 53 మంది, లక్ష్మీగణపతి హోమంలో 29 మంది భక్తులు పాల్గొన్నారు. ఒక చిన్నారికి నామకరణ, ముగ్గురికి అన్నప్రశన, ముగ్గురికి అక్షరాభ్యాసాలు నిర్వహించారు. ఐదుగురికి తులాభారం సమర్పించారు. 46 మంది వాహన పూజలు చేయించుకున్నారు. 6,258 మంది స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ ఒక్కరోజు ఆలయానికి వివిధ పూజా టిక్కెట్లు, అన్నదాన విరాళాలుగా రూ.3,67,299 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్, ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. నేటి నుంచి సహకార సమ్మెఅమలాపురం టౌన్: జిల్లా సహకార ఉద్యోగులు సోమవారం నుంచి సమ్మె బాట పడుతున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని 18 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా ఫలితం లేక పోరాటానికి సిద్ధమవుతున్నారు. రాష్ట్ర సహకార సంఘాల ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో విధిలేక ఈనెల 16 నుంచి సమ్మెకు దిగుతున్నామని జిల్లా సహకార ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు యర్రంశెట్టి రామచంద్రరావు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఫలితంగా జిల్లా సహకార సేవలు సోమవారం నుంచి తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని 298 వ్యవసాయ ప్రాథమిక సహకార పరపతి సంఘాలకు చెందిన సీఈఓలు, ఇతర ఉద్యోగులు, సిబ్బంది సమ్మెలో పాల్గోనున్నారు. కోనసీమ జిల్లాలోని 166 సంఘాలు సోమవారం నుంచి మూత పడనున్నాయి. జీఓ నంబరు 36 ప్రకారం సహకార ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలన్నది ప్రధాన డిమాండ్. 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, ఉద్యోగ విరమణ 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచాలని ఇలా పలు డిమాండ్లతో సమ్మెకు దిగుతున్నారు. జిల్లాకు చెందిన రాష్ట్ర సహకార ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు తోట వెంకట్రామయ్య, రాష్ట్ర కోశాధికారి పెంకే సత్యనారాయణ, జిల్లా కోశాధికారి బొబ్బా సుబ్రహ్మణ్య చౌదరి, ఉపాధ్యక్షుడు మేడిచర్ల రామలింగేశ్వరరావు, ఉప ప్రధాన కార్యదర్శులు కుంపట్ల అయ్యప్పనాయుడు, మట్టపర్తి జయరామ్లు సమ్మెకు నాయకత్వం వహిస్తున్నారు. భాష్యం బ్లూమ్స్ స్కూల్ వార్షికోత్సవం బాలాజీచెరువు (కాకినాడ): స్థానిక భాష్యం బ్లూమ్స్ స్కూల్ రెండో వార్షికోత్సవాన్ని శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జేఎన్టీయూకే వీసీ ప్రొఫెసర్ సీఎస్ఆర్కే ప్రసాద్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు నైతిక విలువలు పెంపొందించేలా విద్యా బోధన సాగాలని కోరారు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత పాఠశాలలపై ఉందన్నారు. మరో ముఖ్య అతిథి డాక్టర్ పొలిశెట్టి పవన్కుమార్ మాట్లాడుతూ విద్యతో పాటు మానసిక, శారీరక వికాసానికి వ్యాయామం చాలా అవసరమన్నారు. పాఠశాల జోనల్ ఇన్చార్జ్ వి.గోవిందరాజులు మాట్లాడుతూ విలువలతో కూడిన విద్యకే తమ ప్రథమ ప్రాధాన్యమన్నారు. అనంతరం విద్యార్థుల ప్రదర్శనలు అలరించారు. ప్రిన్సిపాల్ దృవీన, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
సర్వం శివమయం
● శివరాత్రి వేళ భక్తజనసాగరాలైన ఆలయాలు ● ‘లక్ష’కు మిక్కిలిగా పాదగయకు.. ● ‘లక్ష’ణంగా సామర్లకోటకు తరలి వచ్చిన భక్తులు ● పుష్కరిణుల్లో పుణ్యస్నానాలు ● పరమ శివునికి అభిషేకాలు ● ప్రతిధ్వనించిన శివనామస్మరణ పిఠాపురం: మహాశివరాత్రి పర్వదినాన జిల్లాలో భక్తిరసం తెప్పలుగా ప్రవహించింది. ముక్కంటి కరుణ కోసం భక్తజనకోటి ‘శివ’మెత్తి మొక్కింది. వేలాదిగా భక్తులు వేకువజాము నుంచే పుష్కరిణులు, నదులు, గోదావరి కాలువలకు చేరుకుని, పుణ్యస్నానాలు ఆచరించి.. పరమ శివునికి భక్తితో ప్రణమిల్లారు. భక్తుల శివనామస్మరణలు ఆలయాల్లో ప్రతిధ్వనించాయి. దేశంలోని మూడు గయా క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధికెక్కిన పిఠాపురంలోని పాదగయ క్షేత్రానికి 2 లక్షల మందికి పైగా భక్తులు తరలి వచ్చారు. పట్టణంలో ఎక్కడ చూసినా జనప్రవాహమే కనిపించింది. పాదగయలో గయాసురుని పాదాలున్నాయన్నది భక్తుల విశ్వాసం. అందువలన శివరాత్రి నాడు ఇక్కడ పుణ్యస్నానమాచరిస్తే సకల పాపాలూ తొలగిపోతాయని నమ్ముతారు. ఈ నేపథ్యంలో తెల్లవారుజాము నుంచి రాత్రి వరకూ పాదగయకు భక్తులు వెల్లువలా తరలివచ్చారు. ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి, భారీగా బారులు తీరి మరీ కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకుని, అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో రాజరాజేశ్వరి, పురుహూతికా అమ్మవార్లకు, దత్తాత్రేయుడు, సాయిబాబాలను దర్శించుకున్నారు. కొందరు గంగామాతకు దీపారాధనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పితృతర్పణాలు, పిండప్రదానాలు ఆచరించారు. కుక్కుటేశ్వర స్వామివారికి అర్చకులు ఆదివారం వేకువజామున ఒంటిగంట నుంచి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. తెల్లవారుజామున 2 గంటల నుంచి స్వామి వారు భక్తులకు నిజరూపంలో దర్శనమిచ్చారు. స్వామివారికి రాత్రి లింగోద్భవ కాలాభిషేకం నిర్వహించారు. భక్తులు వచ్చిన వాహనాలతో 216 జాతీయ రహదారితో పాటు ఉప్పాడ, సామర్లకోట రోడ్లపై పలుమార్లు ట్రాఫిక్ స్తంభించిపోయింది. పట్ణణంలోని సోమేశ్వరస్వామి, సకలేశ్వరస్వామి ఆలయాలు కూడా భక్తులతో కిటకిటలాడాయి. పంచారామ క్షేత్రానికి పోటెత్తిన భక్తులు సామర్లకోట: పంచారామ క్షేత్రమైన సామర్లకోట బాలాత్రిపురసుందరీ సమేత కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయానికి సుమారు లక్ష మంది భక్తులు పోటెత్తారు. వేకువజామున ఒంటి గంట నుంచే క్యూలలో బారులు తీరారు. ఆలయం తెరచిన వెంటనే హరహర మహాదేవ శంభోశంకరా అనే నినాదం ఆలయ ప్రాంగణంలో మార్మోగింది. స్వామివారికి అర్చకులు తొలిగా క్షీరాభిషేకం, పిఠాపురం మహారాజా గోత్రనామాలతో తొలి పూజ చేశారు. వీటిని తిలకించేందుకు భక్తులు పోటీ పడ్డారు. రాత్రి 10 నుంచి 12.15 గంటల వరకూ స్వామివారికి మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, లింగోద్భవ కాల పూజలో గంగ, నర్మద, సరస్వతి, యమున, గోదావరి, కృష్ణా, కావేరి, భీమరథి, పుష్కరిణి, తుంగభధ్ర, సింధు, ప్రణీత నదుల జలాలతో అభిషేకాలు నిర్వహించారు. స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులు గోదావరి కాలువ, ఆలయ పుష్కరిణుల్లో పుణ్యస్నానాలు ఆచరించి, దీపాలు విడిచిపెట్టారు. పితృదేవతలను స్మరిస్తూ దానాలు ఇచ్చారు. ఏలేరులో భక్తజన తరంగం ఏలేశ్వరం: శివరాత్రి పర్వదినం సందర్భంగా ఏలేరు నదిలో వేలాదిగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఏలేశ్వరంలోని శ్రీ రాజరాజేశ్వరీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయం నుంచి ఏలేరు నది వరకూ రహదారి భక్తులతో కిటకిటలాడింది. ఏలేరు నది సమీపంలోని శివుని విగ్రహాలకు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.భక్తజన వాహిని: ఏలేశ్వరం వద్ద ఏలేరు నదిలో పుణ్యస్నానాలు చేస్తున్న భక్తులు -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 31,500 గటగట (వెయ్యి) 29,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 29,500 గటగట (వెయ్యి) 27,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)19,000 – 20,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
● మాకో మే...డ!
మనుషులకే కాదు మన్యంలో మూగజీవాలకూ మేడలు ఉంటాయి. ఆదివాసీలు తమ మేకలు, గొర్రెలను క్రూరమృగాలు, విష సర్పాల నుంచి రక్షించుకునేందుకు ఇలాంటి ఏర్పాట్లు చేసుకుంటారు. రాత్రిళ్లు అవి నివసించేందుకు మేడల మాదిరిగా ఎత్తయిన పాకలను నిర్మించి, దానికి అటక ఏర్పాటు చేస్తారు. అటకను సులువుగా ఎక్కేందుకు మెట్లు మాదిరిగా ఓ తడికెను నిర్మిస్తారు. ఉదయం మేతకు వెళ్లి సాయంత్రానికి ఆ పాకలో రాత్రుళ్లు విశ్రాంతి తీసుకుంటాయి. ఇది చింతూరు మండలం కొత్తూరులో ఆకట్టుకుంటోంది. – చింతూరు -
రత్నగిరిపై రద్దీ
అన్నవరం: మహాశివరాత్రి పర్వదినం, ఆదివారం కలసి రావడంతో రత్నగిరికి వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. దీంతో, సత్యదేవుని ఆలయ ప్రాంగణం, క్యూలు, వ్రత, విశ్రాంతి మండపాలు రద్దీగా మారాయి. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సత్యదేవుని వ్రతాలు రెండు వేలు జరిగాయి. స్వామివారి ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో సత్యదేవుని రథ సేవను ఉదయం టేకు రథంపై ఘనంగా నిర్వహించారు. నేటి నుంచి సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు సోమవారం నుంచి ఈ నెల 18వ తేదీ వరకూ స్థానిక సూర్య కళామందిరంలో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తాటిపాక మధు తెలిపారు. స్థానిక సూర్య కళామందిరంలో ఈ సమావేశాల నిర్వహణకు జరుగుతున్న ఏర్పాట్లను ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశ, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఈ సమావేశాల్లో చర్చిస్తామన్నారు. రాష్ట్రంలో మెడికల్ మాఫియా, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, మన గ్యాస్ – మన హక్కు, టిడ్కో ఇళ్లు, ఇళ్ల స్థలాలు తదితర అంశాలపై చర్చించి ఉద్యమ కార్యచరణ రూపొందిస్తామని వివరించారు. విభజన చట్టం హామీలు, నిరుద్యోగ భృతి, ఇంటింటా ఉచిత గ్యాస్ పైప్లైన్ తదితర అంశాలపై కూడా చర్చిస్తామని చెప్పారు. ఈ సమావేశాల్లో ముఖ్య అతిథులుగా సీపీఐ సీనియర్ నాయకుడు కె.నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్యతో పాటు 26 జిల్లాల నాయకులు పాల్గొంటారని తెలిపారు. ఉత్సాహంగా ఫుట్బాల్ పోటీలు నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): స్థానిక జిల్లా క్రీడా మైదానంలో అంతర్ జిల్లా ఫుట్బాల్ పోటీలు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్ఏ) ఫుట్బాల్ కోచ్ స్వామి పర్యవేక్షణలో ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. ఈ పోటీలను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (డీఎస్డీఓ) వి.సతీష్ కుమార్, తలాటం హరీష్ ప్రారంభించారు. ఈ పోల్లో రోనాల్డో టీము విజేతగా, భాటియా టీము రన్నర్గా నిలిచింది. విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. సివిల్ సర్వీసెస్ హాకీ పోటీలకు ఎంపిక నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఢిల్లీలో ఈ నెల 17 నుంచి 27వ తేదీ వరకూ జరిగే ఆలిండియా సివిల్ సర్వీసెస్ హాకీ పోటీలకు కాకినాడ క్రీడాకారులు ఎంపికయ్యారు. ఇన్కంట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉద్యోగి కడియాల రవిచంద్రప్రసాద్ ఆర్ఎస్బీ టీముకు కోచ్గా, ఎస్.వీరబాబు కెప్టెన్గా జట్టులో స్థానం పొందారు. వీరిద్దరూ కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో హాకీ ఆడినవారే. గత ఏడాది నిర్వహించిన సివిల్ సర్వీసెస్ హాకీ పోటీల్లో ఆర్ఎస్బీ జట్టు రన్నర్గా నిలిచింది. జేఎన్టీయూకే విద్యార్థిని ఆత్మహత్య బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జేఎన్టీయూకే ఇంజినీరింగ్ కళాశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన అరుణ కెమికల్ ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతూ.. కళాశాల ఆవరణలోని నాగవళి హాస్టల్లో ఉంటోంది. ఆదివారం మధ్యాహ్నం తన గది నుంచి ఆమె ఎంతకూ బయటకు రాలేదు. దీంతో, తోటి విద్యార్థులు వెళ్లి చూడగా గదిలో తాడుకు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. వెంటనే విద్యార్థులు కళాశాల యాజమాన్యానికి, హాస్టల్ అధికారులకు ఈ విషయం చెప్పారు. దీంతో, అధికారులు సర్పవరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గదిలో లభించిన ఆధారాలు, లేఖల ఆధారంగా అరుణ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని గుర్తించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
లాభాలతో మురవంగ
● ఏడాది పొడవునా పంట ● వేసవి సాగుకు ఇదే అదును సమగ్ర సస్యరక్షణ ఇలా.. ● పురుగు ఆశించిన కాయలు, కొమ్మలను తుంచి నాశనం చేయాలి. ● ఈ పంటలో అంతర పంటలుగా బంతి, ఉల్లి, వెల్లుల్లి వేసుకోవచ్చు. ● లింగాకర్షణ బుట్టలను ఎకరాకు 4 చొప్పున ఏర్పాటు చేయాలి. ● అల్లిక రెక్కల పురుగులను మొక్కకు రెండు చొప్పున పంట పెరిగే దశలో విడుదల చేయాలి. ● ట్రైకోగ్రామా బదనికలను ఎకరానికి 20 వేల చొప్పున విడుదల చేయాలి. ● బీటీ మందులను లీటరు నీటికి ఒక గ్రాము చొప్పున పూత దశలో పిచికారీ చేయాలి. ● పంట పూత దశలో, కాయ దశలో 2, 4–డి మందును 10 మిల్లీగ్రాములు ఒక లీటరు నీటికి లేదా నాఫ్తాలిన్ అసిటికామ్లం ఒక మిల్లీలీటరు 5 లీటర్ల నీటికి కలిపి పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేస్తే 15 నుంచి 20 శాతం అధికోత్పత్తి పొందవచ్చు.పెరవలి: వంగ తోటలతో లాభాల బాట పట్టవచ్చు.. కూరగాయల్లో అతి ప్రధానమైన ఈ పంటను ఏడాది పొడవునా పండించవచ్చు. సమయం, వాతావరణ పరిస్థితులను బట్టి సాగు చేస్తే మంచి దిగుబడులతో పాటు అధిక ఆదాయం పొందవచ్చు. తూర్పుగోదావరి జిల్లాలో కూరగాయల పంటలు 2,554 హెక్టార్లలో సాగు చేస్తుండగా, ఇందులో వంగ 900 హెక్టార్లలో ఉంది. ఈ పంట సాగుకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సస్యరక్షణ చర్యలు, ఎరువుల యాజమాన్యం, తెగుళ్ల నివారణ చర్యల గురించి కొవ్వూరు వ్యవసాయ సహాయ సంచాలకుడు (ఏడీఏ) సీహెచ్ శ్రీనివాస్ పలు సూచనలు చేశారు. ఆ వివరాలు ఇలా.. నారు.. ఆపై విత్తు ● వంగ పంటను ఏడాదిలో మూడు దఫాలు వేయవచ్చు. వర్షాకాలం పంటను జూన్ – జూలైలో, శీతాకాల పంటను అక్టోబర్ – నవంబర్లో, వేసవి పంటను జనవరి – ఫిబ్రవరి నెలల్లో నారు కోసం విత్తుకోవచ్చు. ● వంగ పంట సాగు చేసే రైతులు 30 నుంచి 35 రోజుల వయసు కలిగిన నారును మాత్రమే నాటుకోవాలి. వర్షాకాలం పంట జూలై – ఆగస్టులో, శీతాకాల పంట నవంబర్ – డిసెంబర్లో, వేసవి పంట ఫిబ్రవరి–మార్చి నెలల్లో నాటవచ్చు. విత్తన రకాలు ఎకరాకు సూటి రకాలు 250 గ్రాములు, సంకరజాతి రకాలు 150 గ్రాముల విత్తనం కావాలి. స్థానిక మార్కెట్లలో వినియోగదారుల అభిరుచిని బట్టి రకాలను ఎంపిక చేసుకోవచ్చు. జిల్లాలో ఎక్కువగా భాగ్యమతి, పూసాపర్పుల్ లాంగ్, పూసాపర్పుల్ క్లస్టర్, పూసా క్రాంతి, గులాబీ రకాలను వినియోగిస్తారు. అక్కడక్కడా చారల వంగను కూడా సాగు చేస్తారు. ఈ పంట రకాన్ని బట్టి 130 నుంచి 150 రోజులకు చేతికి వస్తుంది. నారుమడి పెంపకం వంగ పంట సాగు చేసే ముందు నారుమడి పెంపకానికి జాగ్రత్తలు తీసుకోవాలి. 6 అంగుళాల ఎత్తు, ఒక మీటరు వెడల్పు, 4 మీటర్ల పొడవు కలిగిన నారుమడులను ఎకరానికి 10 నుంచి 12 మడులను తయారు చేయాలి. 250 గ్రాముల విత్తనాన్ని ఈ మడులపై విత్తుకోవాలి. విత్తనాలను విత్తే ముందు 50 డిగ్రీల ఉష్ణోగ్రత కలిగిన నీటిలో విత్తనాలను 30 నిమిషాల పాటు నానబెట్టి నీడలో ఆరనివ్వాలి. ఆ తరువాత కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున థైరామ్ లేదా ఇండోఫిల్ అనే మందుతో విత్తనశుద్ధి చేయాలి. ఆ తరువాత ట్రైకోడెర్మావిరిడి కల్చర్ను ఒక గ్రాము విత్తనాలకు పట్టించి విత్తుకోవాలి. ఈ మడుల్లో నీరు నిల్వ లేకుండా చూడటంతో పాటు రోజూ మడులను తడపాలి. నీరు నిల్వ ఉండి మడులు మునిగిపోతే మాగుడు తెగులు ఆశిస్తుంది. దీని నివారణకు ఆక్సీక్లోరైడ్ మందును లీటరు నీటికి మూడు గ్రాముల చొప్పున కలిపి వారం వ్యవధిలో రెండు మూడు సార్లు పిచికారీ చేయాలి. ఎరువుల యాజమాన్యం ఎకరాకు 6 నుంచి 8 టన్నుల పశువుల ఎరువును పంట వేసే ముందు ఆఖరి దుక్కులో వేయాలి. 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాష్ దుక్కులో వేయాలి. నారు వేసిన తరువాత ఎరువులను 30వ రోజు, 60వ రోజు, 75వ రోజుతో పాటు 40 కిలోల నత్రజనిని మూడు సమ భాగాలుగా చేసి వీటిని అందించాలి. నీటి యాజమాన్యం వంగ మొక్కలను నాటిన వెంటనే నీరు పెట్టాలి. వర్షాకాలంలో అవసరాన్ని బట్టి, శీతాకాలంలో 7 రోజులకు, వేసవిలో 3 నుంచి 5 రోజులకు ఒకసారి నీరు అందించాలి. వేసవి పంటలో నీటితడులు కాయలు కోయడానికి రెండు రోజుల ముందే ఇవ్వాలి. ఇలా ఇవ్వకపోతే వంకాయలు చేదుగా ఉంటాయి.అన్నవరప్పాడులో వంగ తోట పురుగులు.. తెగుళ్లు మొక్కలు నాటిన 30 నుంచి 40 రోజులకు మొవ్వ మరియు కాయతొలుచు పురుగు ఆశించవచ్చు. ఇది ఆశించిన వెంటనే కొమ్మలను తుంచి కార్బరిల్ 50 శాతం 3 గ్రాములు లేదా ప్రొఫెనోపాస్ రెండు మిల్లీలీటర్లు లేదా సైపర్మెత్రిన్ ఓ మిల్లీలీటరు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. రసం పీల్చే పురుగుల నివారణకు డైమిథోయేట్ లేదా మిథైల్డెమెటాన్ లేదా పిప్రానిల్ లీటరు నీటికి 2 మిల్లీమీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. నారు నాటిన 30 రోజులకు ఆకుమాడు, కాయకుళ్లు తెగులు ఆశిస్తుంది. వీటి నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున పది రోజుల వ్యవధిలో రెండు నుంచి మూడు సార్లు పిచికారీ చేయాలి. వెర్రి తెగులు నివారణకు రోగార్ లేదా మిథైల్ డెమటాన్ 2 మిల్లీలీటర్లు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఎండు తెగులు నివారణకు ఎటువంటి చర్యలు లేవు. ఈ తెగులును తట్టుకునే రకాలను ఎంచుకుని సాగు చేయడం ఉత్తమం. -
జాబ్ క్యాలెండర్ ఏది బాబూ?
రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించ లేదు. యువతకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. ఇది నిరుద్యోగులను మోసం చేయడమే. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. కానీ అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. ఇప్పటికే ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులు వేలాది రూపాయలు వెచ్చించి కోచింగ్ తీసుకుంటున్నారు. కానీ ఫలితం లేకుండా పోతుంది. ఇప్పటికే చాలా మంది నిరుద్యోగులు అప్పుల పాలయ్యారు. – దంగేటి శ్రీప్రసాద్, విద్యార్థి నాయకుడు, పుల్లేటికుర్రు ● -
చోరీ కేసులో నిందితుల అరెస్ట్
రూ.15 లక్షల విలువైన సొత్తు రికవరీ కాజులూరు: రెండేళ్లుగా కాజులూరు, కరప తదితర మండలాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్టు కాకినాడ రూరల్ సీఐ డీఎస్ చైతన్యకృష్ణ, గొల్లపాలెం ఎస్సై ఎం.మోహన్కుమార్ తెలిపారు. వారి కథనం ప్రకారం.. కొత్త గైగొలుపాడు అంబేడ్కర్ కాలనీకి చెందిన పిల్లి సింహాచలం, కాకినాడ మధురానగర్కు చెందిన ద్రాక్షరాపు ఉమాశంకర్, సర్పవరం పూల మార్కెట్ ప్రాంతానికి చెందిన దార నాని గత కొంత కాలంగా వరుస దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నారు. వీరిని పట్టుకునేందుకు కాకినాడ జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్ ఆదేశాల మేరకు ఏఎస్పీ పాటిల్ దేవరాజ్, రూరల్ సీఐ చైతన్యకృష్ణల ఆధ్వర్యంలో గొల్లపాలెం, కరప పోలీస్టేషన్ల సిబ్బంది రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో గొల్లపాలెం శలపాక రోడ్లోని రైస్మిల్లు ప్రాంతంలో శుక్రవారం రాత్రి గొల్లపాలెం ఎస్సై మోహన్కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది వలపన్ని వారిని పట్టుకున్నారు. వీరి నుంచి రూ.15 లక్షల విలువజేసే కారు, ఏడు మోటారు సైకిళ్లు, ఒక ల్యాప్టాప్, 186 గ్రాముల వెండి వస్తువులు, మూడు సెల్ ఫోన్లు రికవరీ చేశారు. నిందితులను కోర్టుకు తరలించారు. -
అబాకస్ పోటీల్లో సత్తా
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): అంతర్జాతీయ అబాకస్, వేదిక్ మ్యాథ్స్ పోటీల్లో తమ విద్యార్థులు సత్తా చాటారని ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ ఎన్.శేషారెడ్డి తెలిపారు. వివిధ దేశాలకు చెందిన సుమారు 10 వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొనగా, వారిలో వెయ్యి మంది మాత్రమే ప్రతిభ చూపారని, ఇందులో 686 (68–66 శాతం) మంది తమ పాఠశాలకు చెందిన వారు ఉండటం గర్వకారణమన్నారు. ప్రతిభ చూపిన వారందరికీ హైదరాబాద్ రవీంద్రభారతిలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి చేతుల మీదుగా బహుమతులను శనివారం అందజేశారన్నారు. విజేతలను స్మార్ట్ జీనియస్ చైర్మన్ నల్లమిల్లి రాజ్యలక్ష్మి, డైరెక్టర్ శృతిరెడ్డి, సుగుణారెడ్డి, ప్రిన్సిపాల్స్ అభినందించారు. -
జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక
రాయవరం: జాతీయ స్థాయిలో నిర్వహించే వాలీబాల్ జట్టుకు రాయవరం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి పోలిశెట్టి భార్గవ్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని శనివారం పాఠశాల హెచ్ఎం వీఎస్ సునీత తెలిపారు. ఈ నెల 13న అనకాపల్లిలో వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బాలురు, బాలికల 46వ సబ్ జూనియర్ సెలక్షన్స్ నిర్వహించారు. ఇందులో బాలుర జట్టుకు ఎంపికై న భార్గవ్ ఈ నెల 24 నుంచి మార్చి 1 వరకూ పశ్చిమ బెంగాల్లోని హుబ్లీలో జరిగే జాతీయ వాలీబాల్ చాంపియన్ షిప్లో పాల్గోనున్నట్లు ఆమె తెలిపారు. భార్గవ్ను, తర్ఫీదునిచ్చిన ఫిజికల్ డైరెక్టర్లు సీహెచ్ అజ్జిబాబు, కె.శ్రీనివాసులును పలువురు అభినందించారు. దేవరపల్లి: అనకాపల్లిలో జరిగిన రాష్ట్ర స్థాయి వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెలక్షన్స్లో దేవరపల్లి మండలం దుద్దుకూరు రంగరాయ జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు బి.బాలు మహీధర్, ఎం.వెన్నెల ప్రతిభ చాటారని హెచ్ఎం ఎం.వీర్రాజు తెలిపారు. వీరు పశ్చిమ బెంగాల్లో జరుగనున్న జాతీయ స్థాయి చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొంటారు. -
దొంగతనాలకు ‘తాళం’ తెరిచి..
అన్నవరం: రోడ్డుపై చూస్తారు.. రానూ పోనూ గమనిస్తారు.. పాత బైక్ల తాళం అరిగిపోవడాన్ని గుర్తించి చాకచక్యంగా తెరిచేస్తారు.. వెంటనే ఆ బైక్ను అక్కడి నుంచి దొంగిలిస్తారు.. ఇలా పలు జిల్లాల్లో 51 మోటారు సైకిళ్లు చోరీ చేసిన ఇద్దరు నిందితులను అన్నవరం పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ వివరాల ప్రకారం.. గత కొద్ది రోజులుగా జిల్లాలో పలుచోట్ల మోటారు సైకిళ్ల దొంగతనాలు జరుగుతుండటంతో దర్యాప్తునకు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు పర్యవేక్షణలో ప్రత్తిపాడు సీఐ సూర్యఅప్పారావు ఆధ్వర్యంలో అన్నవరం పోలీస్ సిబ్బందితో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందం వలపన్ని కోనసీమ జిల్లా రాయవరం మండలం సోమేశ్వరానికి చెందిన దాసరి దుర్గాప్రసాద్, శాఖా ప్రసాద్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు రూ. 25 లక్షల విలువైన 51 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే వారి నుంచి బైక్లు కొనుగోలు చేసిన రాయవరం మండలం సోమేశ్వరానికి చెందిన నల్లమిల్లి దొరస్వామిరెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితులు పాత బైక్ల తాళం అరిగిపోవడాన్ని గమనించి చాకచక్యంగా తాళం తెరిచి అపహరిస్తున్నట్లు వివరించారు. అదే విధంగా యూనికార్న్ బైక్ల తాళం తీయడానికి కొత్త పరికరాలను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. వీరిపై కాకినాడ జిల్లాలో 41, కృష్ణా, ఎన్టీఆర్, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో పది కేసులు ఉన్నాయన్నారు. కేసును ఛేదించిన ప్రత్యేక టీం సభ్యులు హెడ్ కానిస్టేబుల్ ఎస్వీ రమణ, కానిస్టేబుల్స్ ఎం.నాగేశ్వరరావు, ఎన్.శ్రీను, హోం గార్డులు కె.నాగేశ్వరరావు, పి.అచ్యుతరామ్, పి.సత్తిబాబులను ఎస్పీ అభినందించారు. ఫ అంతర్ జిల్లా దొంగల అరెస్ట్ ఫ 51 మోటారు సైకిళ్ల స్వాధీనం -
బురిడీ బడ్జెట్
అప్పుల్లో నంబర్–1 ప్రజలపై పన్నుల భారం పెంచేలా రాష్ట్ర బడ్జెట్ ఉంది. అంకెల గారడీగా ఉన్న ఈ బడ్జెట్తో సామాన్యులకు, పేదలకు, రైతులకు ఒరిగిందేమీ లేదు. సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రూ.97 వేల కోట్లు అప్పు చేయాలని బడ్జెట్లో ప్రతిపాదించింది. చంద్రబాబు నాయకత్వంలో మన రాష్ట్రం అప్పుల్లో నంబర్–1గా నిలిచింది. మూడో బడ్జెట్కు వచ్చినా.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి, రూ.1,500 చొప్పున ఆడబిడ్డ నిధి, కొత్త పెన్షన్ల మంజూరు వంటి వాటి ఊసే బడ్జెట్లో లేదు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలిస్తామని హామీ ఇచ్చారు. కానీ, దీనికి బడ్జెట్లో ఏమీ కేటాయించలేదు. అన్నదాత సుఖీభవ పథకానికి రూ.10,700 కోట్లు అవసరం కాగా రూ.6,600 కోట్లు మాత్రమే కేటాయించారు. 54 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ.20 వేల చొప్పున ఇవ్వాల్సిన పెట్టుబడి సాయానికి అరకొర కేటాయింపులే చేశారు. ధరల స్థిరీకరణకు కేటాయించింది రూ.500 కోట్లు మాత్రమే. రైతులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. బడ్జెట్లో అంకెలు చూపిస్తారు తప్ప క్షేత్ర స్థాయిలో అవి వాస్తవం కావు. ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు కానీ ఆ ప్రస్తావనే లేదు. ఉద్యోగులకు సీపీఎస్ రద్దు, పీఆర్సీ, ఐఆర్ విడుదల అంశాలను బడ్జెట్లో పట్టించుకోలేదు. – కర్నాకుల వీరాంజనేయులు, ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రైతుకూలీ సంఘం వివిధ రంగాల విస్మరణ రాష్ట్ర బడ్జెట్ ప్రజల ఆకాంక్షలు, ఆశలను నీరుగార్చేసింది. వివిధ రంగాలను విస్మరించింది. వ్యవసాయానికి కేటాయింపులు తగ్గించి, రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మరోసారి చాటుకున్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద 46.86 లక్షల మంది రైతులకు రూ.6,650 కోట్లు ప్రతిపాదించిన ప్రభుత్వం, అందులో భూమి లేని కౌలు రైతులకు ఒక్క పైసా కూడా కేటాయించకపోవడం అన్యాయం. రాష్ట్రంలోని సాగు భూమిలో 80 శాతం పంటలు పండిస్తున్నది కౌలు రైతులే. 35 లక్షల మంది కౌలు రైతుల్లో 10 లక్షల మందికి పైగా భూమి లేని నిరుపేదలే. వారికి పెట్టుబడి సాయం అందించకపోవడం అన్యాయం. నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్మెంట్, ఆడబిడ్డ నిధి పథకాలకు మంగళం పాడినట్టే. – దాడిశెట్టి రాజా, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు విద్యారంగం నిర్వీర్యం పాఠశాలలు, ఉన్నత విద్యకు కేటాయించిన నిధులు అరకొరగా ఉన్నాయి. దాదాపు రూ.7 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, నాడు–నేడు అసంపూర్తి పనులు, పెండింగ్ బిల్లులపై స్పష్టత ఇవ్వలేదు. నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించకుండా మోసం చేశారు. సంక్షేమ హాస్టళ్లకు నిధుల కేటాయింపు పూర్తి స్థాయిలో లేదు. హాస్టళ్లలోని విద్యార్థులకు కనీస మెస్ చార్జీలను కూడా ప్రభుత్వం చెల్లించని పరిస్థితి. విద్యారంగం నిర్వీర్యమైనట్టే. – పెంకే రవితేజ, జిల్లా నిరుద్యోగ జేఏసీ కన్వీనర్, కాకినాడ విద్యారంగాన్ని విస్మరించారు కూటమి ప్రభుత్వం విద్యారంగాన్ని విస్మరించింది. బడ్జెట్లో చేసిన అరకొర కేటాయింపులే దీనికి నిదర్శనం. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ విద్యార్థులకు కూటమి ప్రభుత్వం రూ.8,900 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. కానీ, రూ.3,836 కోట్లే కేటాయించారు. దీనినిబట్టి పాత బకాయిలపై విద్యార్థులు ఆశలు వదులుకోవలసిందేననే అనుమానం కలుగుతోంది. విద్యా రంగానికి బడ్జెట్లో 9.5 శాతం మాత్రమే కేటాయించారు. ప్రభుత్వ విద్యారంగాన్ని అణచివేసి అందరూ ప్రైవేటు విద్యారంగం వైపు అడుగులు వేసేలా కుట్ర చేస్తోందనే అనుమానం కలుగుతోంది. మూడు రోజుల క్రితం రూ.1,200 కోట్లు విడుదల చేస్తున్నట్లు విద్యా మంత్రి లోకేష్ చేసిన ట్వీట్ ప్రకటనగా మాత్రమే మిగిలింది. తల్లికి వందనం నిధులు 80 లక్షల మందికి ఇవ్వాల్సి ఉండగా బడ్జెట్ కేటాయింపులను బట్టి 67 లక్షల మందికే ఇస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ పథకానికి కూడా శఠగోపం పెట్టినట్లే. – తోట శ్రీరాంజీ, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఉభయ గోదావరి జిల్లాల వర్కింగ్ ప్రెసిడెంట్ సాక్షి ప్రతినిధి, కాకినాడ/ప్రత్తిపాడు/గోకవరం/బోట్క్లబ్ (కాకినాడ సిటీ)/జగ్గంపేట: చంద్రబాబు ప్రభుత్వం శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నీరుగార్చేసిందన్న విమర్శ సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రధానంగా ప్రాధాన్యతా రంగాలను పూర్తిగా విస్మరించారని వివిధ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఈ బడ్జెట్ అంకెల గారడీగానే కనిపిస్తోందని మేధావి వర్గం విశ్లేషిస్తోంది. పేరుకు రూ.3 లక్షల కోట్ల పైచిలుకు బడ్జెట్గా చెప్పుకొంటున్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం చెప్పే గొప్పలకు.. చేసే పనులకు పొంతనే ఉండదనే విషయం ఈ కేటాయింపులు మరోసారి స్పష్టం చేశాయని చెబుతున్నారు. వీటికి కేటాయింపులేవీ? అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని లేకపోతే ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల భృతి ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. మూడో బడ్జెట్ ముగిసినా ఆ హామీకి బడ్జెట్లో చిల్లిగవ్వ కూడా కేటాయించలేదు. జిల్లా జనాభా 22,47,680. జిల్లావ్యాప్తంగా 5,33,908 కుటుంబాలున్నాయి. ఇంటికొకరు చొప్పున లెక్క వేసినా జిల్లాలో 5 లక్షల మంది పైగానే నిరుద్యోగులున్నారు. ఒక్కొక్కరికి నెలకు రూ.3 వేల చొప్పున లెక్క వేస్తే ప్రతి నెలా రూ.150 కోట్ల వరకూ నిరుద్యోగ భృతి చెల్లించాల్సి ఉంది. దీనికోసం ఈ బడ్జెట్లో నయా పైసా కూడా కేటాయించకుండా నిరుద్యోగులకు గతంలో మాదిరిగానే మరోసారి మొండిచేయి చూపారు. జిల్లావ్యాప్తంగా 2.10 లక్షల ఎకరాల్లో 1.80 లక్షల మంది రైతులు వివిధ పంటలు సాగు చేస్తున్నారు. వీరిలో 90 వేల మంది కౌలు రైతులే. ఈ బడ్జెట్లో కౌలు రైతులను విస్మరించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఏటా 73 వేల మంది రైతులకు రూ.400 కోట్ల మేర సాయం అందించేవారు. పైగా, ఉచిత పంటల బీమా వంటి అనేక పథకాలతో రైతులను ఆదుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వీటన్నింటికీ మంగళం పాడింది. ప్రాధాన్య రంగమైన వ్యవసాయాన్ని ఈ బడ్జెట్లో సైతం పూర్తిగా చిన్నచూపు చూసిందని రైతు ప్రతినిధులు మండిపడుతున్నారు. 19 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న మహిళలకు 2024 జూన్ నుంచి ప్రతి నెలా రూ.1,500 ఆడబిడ్డ నిధి ఇస్తామని సార్వత్రిక ఎన్నికల్లో బాబు హామీ ఇచ్చారు. ఈ పథకానికి జిల్లాలో 5 లక్షల మందికి పైగా అర్హులని అంచనా. వీరికి ప్రతి నెలా సుమారు రూ.85 కోట్ల వంతున ఏడాదిన్నరగా ఈ సొమ్ము అందించాల్సి ఉంది. కానీ, షరా మామూలుగానే ఆ హామీకి ఈసారి కూడా బడ్జెట్లో స్థానం లేకుండా పోయింది. జిల్లాలోని పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల్లోని 59 వేల ఎకరాలకు సాగు, ప్రజలకు తాగునీరు అందించే ఏలేరు ప్రాజెక్ట్ ఆధునీకరణ విషయాన్ని ఈ బడ్జెట్లో విస్మరించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ.. ఇక్కడి రైతుల కడగండ్లు తీర్చేలా ఏలేరు ఆధునీకరణకు రూ.300 కోట్లు కేటాయించాలనే ప్రతిపాదనలను సర్కార్ ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ అంశంపై రైతులకు ఎన్నికల్లో హామీ ఇచ్చి కూడా బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. పిఠాపురం బ్రాంచి కెనాల్ (పీబీసీ) ఆధునీకరణకు కూడా నిధులు కేటాయిస్తామని చంద్రబాబు, పవన్ గతంలో చెప్పారు. ఆ మేరకు బడ్జెట్లో నిధులు కేటాయిస్తారేమోనని సామర్లకోట నుంచి తొండంగి మండలం కోదాడ వరకూ ఉన్న 43 వేల ఎకరాల ఆయకట్టు రైతులు ఎదురు చూశారు. ఆధునీకరణకు నోచక సాగునీటి సమస్యతో పాటు ముంపును కూడా ఎదుర్కొంటున్నప్పటికీ, ప్రతిపాదిత రూ.50 కోట్లు కేటాయించకపోవడంతో ఇక్కడి రైతులకు నిరాశే మిగలనుంది. నిరుద్యోగులకు మొండిచేయి వ్యవసాయంపై చిన్నచూపు ఆడబిడ్డ పథకం అంతే సంగతులు ఏలేరు, పీబీసీకి నిధులు నిల్ రాష్ట్ర బడ్జెట్పై ప్రజల పెదవి విరుపు ఉద్యోగులకు మొండిచేయి రూ.3,32,205 కోట్లతో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన నూతన వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ప్రకటించకపోవడం తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. పెండింగ్ ఆర్థిక బకాయిలు, నాలుగు డీఏలు లేకపోవడం శోచనీయం. జాబ్ కేలండర్పై కనీస ప్రస్తావన కూడా లేకపోవడం నిరుద్యోగులకు నష్టం కలిగించే విషయం. విద్యారంగానికి కూడా కేటాయింపులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. గత సంవత్సరం కంటే 0.14 శాతం తక్కువగా కేటాయించారు. బడ్జెట్ ఆమోదం పొందేలోగా విద్యారంగానికి కనీసం 20 శాతం నిధులు కేటాయించాలి. – ఐ.ప్రసాదరావు, యూటీఎఫ్ సీనియర్ నాయకుడు, ప్రత్తిపాడు అప్పులు తప్ప ఆర్థిక ప్రగతి లేదు బడ్జెట్లో అప్పులు తప్ప ఆర్థిక ప్రగతి, సంక్షేమ పథకాలు, అభివృద్ధికి తగిన కేటాయింపులు లేవు. దాదాపు రెండేళ్ల పాలనలో రూ.2 లక్షల కోట్లకు పైగా అప్పులు ఇప్పించిన ఘనత కేంద్రానికి దక్కగా.. మరో రూ.లక్ష కోట్ల అప్పులకు ప్రస్తుత బడ్జెట్ రూపొందించినట్టుగా ఉంది. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, విద్యుత్, నిత్యావసరాల ధరలు అధికంగా ఉండటంతో సామాన్యుల పరిస్థితి ఇబ్బందిగా ఉంది. ఇకపై మరింత కష్టతరంగా మారుతుంది. కూటమి ప్రభుత్వం ప్రజాప్రయోజనాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. మితిమీరిన అప్పుల భారం గోరుచుట్టుపై రోకలి పోటులా ఉంది. – దూసర్లపూడి రమణరాజు, కన్వీనర్, పౌర సంక్షేమ సంఘం, కాకినాడ గారడీ బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ మాటల్లో గొప్ప చేతల్లో శూన్యంగా కనబడుతుంది. చంద్రబాబు మాటల గారడీలా ఉంది. ఇది తిరోగమన బడ్జెట్. సామాన్యులకు ఈ బడ్జెట్ బహు దూరం. నిరుద్యోగులకు ఇచ్చిన ఎన్నికల హామీల అమలు ఊసే లేదు. పోలవరం ప్రాజెక్టు 72 శాతం పూర్తయిందని ఇప్పటి వరకూ చెప్పి.. ఇప్పుడు 60 శాతం మాత్రమే పూర్తయిందని చెప్పడం బాబు పచ్చి అబద్ధాలకు నిదర్శనం. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల ప్రస్తావన లేదు. విద్యా రంగాన్ని నిర్వీర్యం చేశారు. రైతులను విస్మరించడం దుర్మార్గం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, కౌలు రైతులను కూటమి సర్కార్ దగా చేసింది. – తాటిపాక మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు -
కార్మికులంటే కట్టు బానిసలా?
● పలు సంస్థలు, పరిశ్రమల్లో దుర్భర పరిస్థితులు ● సీఐటీయూ నేత శేషుబాబ్జీ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కొన్ని పరిశ్రమల్లో కార్మికులను కట్టు బానిసల్లా చూస్తున్నారని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషుబాబ్జీ ఆరోపించారు. కచేరీపేటలోని సీఐటీయూ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి చెక్కల రాజ్కుమార్, కోశాధికారి మలకా రమణ తదితరులతో కలసి శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 12న సార్వత్రిక సమ్మె సందర్భంగా కార్మికుల సమస్యలపై జిల్లావ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో దిగ్భ్రాంతికర అంశాలు తమ దృష్టికి వచ్చాయని చెప్పారు. సర్వేలోని అంశాలపై ఆయన చెప్పిన వివరాలివీ.. ● అన్నవరం దేవస్థానంలో 20 సంవత్సరాలుగా పని చేస్తున్న శానిటేషన్ కార్మికుల్లో 50 ఏళ్ల వయసు దాటిన వారిలో 40 మందిని కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్ తొలగించారు. మరో 30 మందికి నెల రోజులుగా డ్యూటీలు నిలుపుదల చేసినా జిల్లా యంత్రాంగం కానీ, ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోవడం లేదు. పైగా వారి స్థానంలో తమవారిని పెట్టుకోవాలంటూ కొంతమంది ప్రజాప్రతినిధులు సిఫారసులు చేయడం హేయం. ● రాక్ సిరామిక్స్, పట్టాభి ఆగ్రో, కాకినాడ సీపోర్టులలో స్థానికులను తొలగించి, వలస కార్మికులతో పనులు చేయించుకోవడం పెరిగింది. ఆ వలస కార్మికులకు చట్ట ప్రకారం కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం లేదు. ఒకే రూములో 20 మందిని ఉంచి పని చేయించుకుంటున్నారు. ● కాకినాడ సీ పోర్టులో పని చేసే కార్మికులకు కనీసం మంచినీటి, భోజన వసతి, వాహనాల పార్కింగ్ సౌకర్యాలు లేవు. పని చేయించుకుని వేతనాలివ్వకుండా తిప్పించుకుంటున్నారు. ● కాకినాడ మెయిన్ రోడ్డులోని షాపింగ్ మాల్స్లో పని చేసే కార్మికులకు కూర్చునే సౌకర్యాలు కూడా లేవు. 12 గంటలు పని చేయించుకుంటూ, 8 గంటల వేతనం కూడా చెల్లించడం లేదు. ● జిల్లాలో కేరళ యాజమాన్యంలోని జీడిపిక్కల పరిశ్రమలు మొత్తం మూతపడ్డాయి. సామర్లకోట షుగర్ ఫ్యాక్టరీ, చిన్నంపేట జీడిపిక్కల పరిశ్రమలను ప్రత్యామ్నాయం చూపకుండా మూసివేయడంతో వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. ● కాకినాడ పారిశ్రామికవాడలోని ప్యారీ షుగర్స్ యాజమాన్యం మారుతూండటంతో ఉద్యోగ భద్రతపై కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ● ఉచిత బస్సు వల్ల ఆటో డ్రైవర్లకు ఆదాయం పడిపోయింది. దీంతో, వాయిదాలు కట్టలేకపోవడంతో వారిపై ఫైనాన్సర్ల వేధింపులు పెరిగాయి. ప్రభుత్వం తక్షణం రుణాలు మంజూరు చేసి, ఆటో కార్మికులను ఆదుకోవాలి. ● జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్ వంటి ఆన్లైన్ యాప్లపై పని చేసే గిగ్ వర్కర్ల సంఖ్య పెరిగింది. రోజంతా కష్టపడినా రూ.500కు మించి ఆదాయం రావడం లేదు. ప్రభుత్వమే ఆన్లైన్ యాప్ ఏర్పాటు చేయడం ద్వారా వీరి ఆదాయం పెంచాలి. ● భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిలో రూ.3 వేల కోట్లు మూలుగుతున్నా ఒక్క కుటుంబానికి కూడా చంద్రబాబు ప్రభుత్వం పరిహారం ఇవ్వడం లేదు. -
కిక్కిరిసిన రత్నగిరి
అన్నవరం: వేలాదిగా వచ్చిన భక్తులతో రత్నగిరి శనివారం కిక్కిరిసింది. వరుసగా శని, ఆదివారాలు సెలవులు రావడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకూ సత్యదేవుని దర్శనానికి భక్తులు వస్తూనే ఉన్నారు. సుమారు 40 వేల మంది భక్తులు రావడంతో క్యూలు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం కిటకిటలాడాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. పార్కింగ్ స్థలాలన్నీ భక్తుల వాహనాలతో నిండిపోయాయి. సత్యదేవుని వ్రతాలు మూడు వేలు జరిగాయి. సర్కులర్ మండపం వద్ద సుమారు 5 వేల మంది భక్తులకు పులిహోర, దధ్యోదనం పంచిపెట్టారు. ఆలయ ప్రాంగణం, ప్రసాద విభాగం, అన్నదానం, వ్రతాలు తదితర ఏర్పాట్లను దేవస్థానం ఈఓ వి.త్రినాథరావు పర్యవేక్షించారు. నిత్యాన్నదాన పథకంలో భక్తులతో కలసి భోజనం చేశారు. ఆహార పదార్థాలు ఎలా ఉన్నాయో భక్తుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. వివిధ విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం వచ్చింది. ఒక్క వ్రత విభాగం ద్వారానే రూ.20 లక్షలు సమకూరాయి. ప్రసాద విక్రయాలు, ఇతర విభాగాల ద్వారా మరో రూ.20 లక్షలు వచ్చాయి. మహా శివరాత్రి పర్వదినం కావడంతో ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగనుంది. రేపటి పీజీఆర్ఎస్ రద్దు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): మహాశివరాత్రి సందర్భంగా సోమవారం ప్రభుత్వం ఆప్షనల్ సెలవుగా ప్రకటించింది. ఈ నేపధ్యంలో ఆ రోజు జిల్లావ్యాప్తంగా జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని రద్దు చేశారు. కలెక్టర్ షణ్మోహన్ శనివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ‘బెజవాడ’కు అండగా ఉంటాం సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం సర్పంచ్ బెజవాడ సత్యనారాయణపై తప్పుడు కేసులు పెట్టి పోలీసులు వేధిస్తున్నారని, ఆయనకు తామంతా అండగా ఉంటామని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీ పిఠాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ వంగా గీత తెలిపారు. శనివారం ఆమె విలేకర్లతో మాట్లాడుతూ, శాంతిభద్రతల పరిరక్షణ, రాజ్యాంగం అమలులో రాష్ట్రం వెనుకబడి ఉందని కేంద్ర హోం శాఖ నివేదిక ఇచ్చిందన్నారు. సర్పంచ్ బెజవాడపై కావాలనే లేనిపోని కేసులు పెట్టి పలు స్టేషన్ల చుట్టూ తిప్పి వేధించారన్నారు. చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులే ప్రభుత్వం చెప్పిందని సర్పంచ్ను జైల్లో పెట్టేందుకు ఏకపక్షంగా కేసు పెట్టారన్నారు. ఎప్పుడూ ఒకే పార్టీ అధికారంలో ఉండదన్నారు. ఇరువర్గాల మధ్య కొట్లాట జరిగితే ఒక్కరి పైనే కేసు పెట్టడం చూస్తేనే పరిస్థితి అర్థమవుతోందన్నారు. పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాగిరెడ్డి బన్నీ, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి దీప్తి, కుమార్, పార్టీ కాకినాడ నగర అధ్యక్షురాలు సుంకర లక్ష్మీప్రసన్న ఉన్నారు. -
తొలి తిరుపతి భక్తజన జలధి
పెద్దాపురం (సామర్లకోట): తొలి తిరుపతిగా ప్రసి ద్ధి చెందిన పెద్దాపురం మండలం తిరుపతి గ్రా మంలో వెలసిన శృంగారవల్లభ స్వామి ఆలయం శనివారం భక్తజన సంద్రంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి సుమారు 50 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం కిటకిటలాడింది. ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా రూ.2,86,540, అన్నదాన విరాళాలు రూ.1,23,817, కేశఖండన ద్వారా రూ.4,640, తులాభారం ద్వారా రూ.800, లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా రూ.23,595 కలిపి దేవస్థానానికి రూ.4,39,392 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు వివరించారు. సుమారు 14 వేల మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. -
భార్య ఆత్మహత్య కేసులో వ్యక్తి అరెస్ట్
కాకినాడ క్రైం: మనస్తాపంతో ఈ నెల 2న ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటనలో భర్తను పోలీసులు అరెస్టు చేశారు. వారి వివరాల ప్రకారం.. అనుమలశెట్టి లక్ష్మీదీప్తి (36), తన భర్త జగదీష్ కుమార్తో కలసి తణుకులో నివాసం ఉంటోంది. భర్త బాధ్యతా రాహిత్యం, మరో వివాహం చేసుకున్నాడనే ఆరోపణలు, అప్పుల నేపథ్యంలో నిత్యం గొడవలు జరుగుతుండేవి. దీంతో లక్ష్మీదీప్తి మనస్తాపం చెంది కాకినాడ రామారావుపేటలోని పుట్టింటికి వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 2న ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు, కాకినాడ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. జగదీష్ను గురువారం అరెస్టు చేశారు. సూసైడ్ నోట్ రాసి వ్యక్తి అదృశ్యం సీతానగరం: తనకు అప్పులు ఉన్నాయని ఇంట్లో సరిగ్గా చూడడం లేదని, సూసైడ్ నోట్ రాసి తన భర్త కుమ్మరి కృపానందం ఎక్కడికో వెళ్లిపోయాడని అమూల్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేశామని ఎస్సై డి.రామ్కుమార్ గురువారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఈ నెల 10న ఉదయం రఘుదేవపురం గ్రామానికి చెందిన కృపానందం (36) ఇంట్లో సూసైట్ నోట్ పెట్టి బయటకు వెళ్లిపోయాడు. ఆ నోట్లో అప్పులు ఎక్కువగా ఉన్నాయని ఇంట్లో తనను సరిగా చూడటం లేదని, రెండు మొక్కులు ఉన్నాయని, వాటిని తీర్చి చనిపోతానని కృపానందం రాశాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఒంటిపై గ్రీన్ కలర్ టీషర్ట్, బ్లాక్ కలర్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. అతని ఆచూకీ తెలిసిన వారు కోరుకొండ సీఐ 94409 04829, సీతానగరం ఎస్సై 94409 04832 నంబర్లకు తెలపాలని ఎస్సై వివరించారు. వీఆర్వో ఆత్మహత్యాయత్నం గొల్లప్రోలు (పిఠాపురం): గొల్లప్రోలు మండల తహసీల్దార్ వేధిస్తున్నారంటూ ఓ వీఆర్వో కార్యాలయం ముందే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సంఘటన గురువారం గొల్లప్రోలులో కలకలం రేపింది. బాధితుడు, స్థానికుల కథనం ప్రకారం.. గొల్లప్రోలు నగర పంచాయతీ 6వ సచివాలయంలో పరమేశ్వరరాజు వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్నారు. తహసీల్దార్ రామ్కుమార్ తనపై పని ఒత్తిడి పెంచుతూ మానసికంగా హింసిస్తున్నారని బాధితుడు ఆరోపించారు. గత కొన్ని రోజులుగా సచివాలయ విధులతో పాటు అదనంగా దుర్గాడ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించి వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సహచర ఉద్యోగులు చెబుతున్నారు. ఎంత చెప్పినా వినకుండా తనపై అదనపు భారం మోపుతున్నారని ఆరోపిస్తూ పరమేశ్వరరాజు గురువారం తహసీల్దార్ కార్యాలయం బయట నిద్రమాత్రలు మింగారు. గమనించిన తోటి సిబ్బంది, స్థానికులు వెంటనే ఆయనను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఎస్సీసీలో ‘ప్రగతి’ విద్యార్థుల ప్రతిభ బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జాతీయ, రాష్ట్ర స్థాయి ఎన్సీసీ పరేడ్లో తమ కళాశాల ఇంజినీరింగ్ విద్యార్థులు సత్తా చాటారని చూపారని ప్రగతి కళాశాల చైర్మన్ పరుచూరి కృష్ణారావు గురువారం తెలిపారు. ఢిల్లీలో గత నెల 29 వరకూ నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఈఈఈ ఆఖరి సంవత్సర విద్యార్థి వీవీఎస్కేఆర్ సంజీవ్ పీఏం ర్యాలీ, బీటెక్ డేటా సైన్స్ తృతీయ సంవత్సర విద్యార్థి పి.నాగశ్రీ కర్తవ్యపద్లో పాల్గొని ప్రతిభ చూపారన్నారు. రాష్ట్ర స్థాయిలో అమరావతిలో నిర్వహించిన సీఎం కవాతులో బీటెక్ డేటా సైన్స్ విద్యార్థి సీహెచ్ సాయిరమ్య ప్రతిభ చూపారన్నారు. అలాగే బీటెక్ నాల్గో సంవత్సర ఈసీఈ విద్యార్థి ఎం.శ్రీభాను మహారాష్ట్రలో గత ఏడాది నిర్వహించిన ఇంటర్ డైరెక్టరేట్ స్పోర్ట్స్ షూటింగ్ చాంపియన్షిప్లో ప్రతిభ చాటి ఢిల్లీ స్టేట్ షూటింగ్ చాంపియన్షిప్కు అర్హత సాధించిందన్నారు. విద్యార్థులకు విద్య, ఉపాధి కల్పించడంతో పాటు నాయకత్వ, క్రమశిక్షణ పట్ల ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. విద్యార్థుల బృందాన్ని కళాశాల డైరక్టర్ ఎంవీ హరినాథబాబు, వైస్ ప్రెసిడెంట్ ఎం.సతీష్, అకడమిక్ డైరెక్టర్ కె.సత్యనారాయణ, ప్రిన్సిపాల్ జి.నరేష్ అభినందించారు. -
హాల్ టికెట్ తీసుకొస్తూ.. అనంత లోకాలకు..
● టిప్పర్ ఢీకొని యువతి దుర్మరణం ● మరొకరికి తీవ్ర గాయాలు తాళ్లరేవు యానాం: పరీక్షలు రాసేందుకు హాల్ టికెట్ తీసుకుని తిరిగి వస్తుండగా, జాతీయ రహదారి 216లోని పోలేకుర్రు చెక్పోస్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి దుర్మరణం పాలైంది. కోరంగి ఎస్ఐ పి.సత్యనారాయణ, స్థానికుల కథనం ప్రకారం.. యానాం పెదపూడి వీధికి చెందిన మహ్మద్ మోమినా తన్వీర్ (21), సయ్యద్ అఫ్రీన్ సుల్తానాలు పటవల పైడా విద్యా సంస్థలో ఎంబీఏ, ఎంసీఏ చదువుతున్నారు. శుక్రవారం నుంచి మొదటి సెమిస్టర్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఇద్దరూ ద్విచక్ర వాహనంపై కళాశాలకు వెళ్లి హాల్ టికెట్లు తీసుకున్నారు. తిరిగి వస్తుండగా పోలేకుర్రు చెక్పోస్టు వద్ద టిప్పర్ ఢీకొనడంతో తన్వీర్ కింద పడిపోయింది. ఆమె తలపై నుంచి టిప్పర్ వెళ్లిపోవడంతో నుజ్జునుజ్జు అయ్యి అక్కడికక్కడే మృతి చెందింది. కాగా సుల్తానా రెండో వైపునకు పడడంతో స్వల్ప గాయాలతో బయటపడింది. ఆమెను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతోంది. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న కోరంగి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. మృతురాలి తండ్రి జిలానీ యానాం మార్కెట్లో చికెన్ షాపు నిర్వహిస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె అర్ధాంతరంగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. తన్వీర్ సోదరుడికి రెండు నెలల క్రితం వివాహమైందని, ఇంతలోనే ఇంతటి విషాదం జరగడం దారుణమని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. చెక్పోస్టు నిర్వహణ వల్లే.. జాతీయ రహదారిలోని మలుపులో చెక్పోస్టు ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు ఆరోపించారు. అటు అమలాపురం నుంచి, ఇటు యానాం నుంచి వాహనాలు వేగంగా వచ్చే ప్రాంతం, చెక్పోస్టు వద్ద అనేక బారికేడ్లు ఏర్పాటు చేయడం, నిర్వహణ సక్రమంగా చేయకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయని, ప్రజాప్రతినిధులు స్పందించి చెక్పోస్టును సక్రమంగా నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. -
తిమ్మాపురంలో మూగజీవాల మృతి
కాకినాడ రూరల్: తిమ్మాపురం గ్రామంలో మూగజీవాలు అనుమానాస్పదంగా మృతి చెందడంపై తిమ్మాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. అక్కడి పెదపూడి శ్రీరామకృష్ణకు చెందిన మకాంలో మూడు గేదెలు, ఒక ఆవు గురువారం మృతి చెందాయి. దీనిపై విచారణ జరపాలని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న రూరల్ సీఐ చైతన్యకృష్ణ, ఎస్సై గణేష్కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతి చెందిన గేదెలు, ఆవుల విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందని తెలిపారు. దీనిపై తిమ్మాపురం పశు వైద్యురాలు వి.సుధ మాట్లాడుతూ తమకు సమాచారం వచ్చిన వెంటనే పశువుల మకాం వద్దకు చేరుకున్నామని, అప్పటికే రెండు చనిపోయాయని, మరో రెండింటికి వైద్యం చేసినప్పటికీ ప్రాణాలు నిలవలేదన్నారు. మృతికి గల కారణాలు పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తెలుస్తుందన్నారు. కరప ఏడీ సురేష్బాబు, ఆర్ఏడీడీఎల్ వైద్యుడు సందీప్ పర్యవేక్షణలో పీఎం నిర్వహించామన్నారు. -
పంచారామం.. శివమయం
● మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబు ● అమ్మ, స్వామివార్లకు వధూవరులుగా అలంకరణ ● నేటి రాత్రి కల్యాణంతో వేడుకలకు శ్రీకారం ● 15న మహాశివరాత్రిసామర్లకోట: మహాశివరాత్రి ఉత్సవాలకు శ్రీకారం చుట్టుకుంటున్న వేళ.. సామర్లకోటలోని సుప్రసిద్ధ పంచారామ క్షేత్రం శివనామంతో ప్రతిధ్వనిస్తోంది. ఏటా మాఘ మాసంలో బహుళ ఏకాదశి నాడు స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవంతో ఇక్కడ శివరాత్రి వేడుకలు ప్రారంభమవుతాయి. ఇందులో భాగంగా ఈ క్షేత్రంలో కొలువుదీరిన బాలా త్రిపుర సుందరీ దేవి అమ్మవారిని వధువుగా, కుమారారామ భీమేశ్వరస్వామి వారిని వరునిగా గురువారం అలంకరించారు. దీనిలో భాగంగా ఆలయంలోని నంది మండపం వద్ద ముత్తయిదువలు ఉదయం పసుపు దంచారు. అర్చకుల దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు మంగళ స్నానాలు చేయించి, మేళతాళాలు, వేద మంత్రాల ఘోష నడుమ స్వామి, అమ్మవార్లను పట్టు వస్త్రాలతో అలంకరించారు. సన్నిధిరాజు వెంకన్నబాబు దంపతులు పీటలపై కూర్చుని స్వామి వారిని వరునిగా.. అమ్మవారిని వధువుగా అలంకరించి, ప్రత్యేక వేదికపై వేంచేయించారు. ఈఓ బళ్ల నీలకంఠం, ట్రస్టు బోర్డు చైర్మన్ కంటే జగదీష్ మోహన్రావు దంపతులు పట్టు వస్త్రాలు, అలంకరణ సామగ్రిని అందజేశారు. శ్రీచక్ర పండితుడు వేమూరి సోమేశ్వరశర్మ, అభిషేక పండితుడు అళ్లకి రాజ్గోపాల్శర్మ, శ్రీకాకుళపు సత్యనారాయణమూర్తి పూజాదికాలు నిర్వహించారు. అర్చకులు చెరుకూరి రాంబాబు, శ్రీకాకుళపు వినయ్, ట్రస్టు బోర్డు సభ్యులు పాల్గొన్నారు. పలువురు భక్తిపారవశ్యంతో ఈ అపురూప సన్నివేశాన్ని తిలకించారు. యోగలింగ రూపుడై.. సామర్లకోట పంచారామ క్షేత్రంలో బాలాత్రిపురసుందరీ సమేత కుమారరామ భీమేశ్వరస్వామి వారు కోరిన కోర్కెలు తీర్చుతాడని భక్తులు విశ్వసిస్తారు. రాష్ట్రంలోని అతి ప్రాచీన పంచారామ క్షేత్రంలో ఇది ప్రముఖమైనది. ఈ క్షేత్రం పూర్వం చాళుక్య భీమవరంగా ప్రసిద్ధి చెందినట్లు ఇక్కడి శిలా శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ పరమేశ్వరుడు యోగ లింగ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ శివలింగాన్ని ఆ పరమేశ్వరుడి తనయుడైన కుమారస్వామి స్వయంగా ప్రతిష్ఠించాడని, అందువల్లనే ఈ స్వామిని కుమారారామ భీమేశ్వరునిగా పిలుస్తారని చెబుతారు. పిఠాపురంలో లభించిన శాసనం ప్రకారం తొమ్మిదో శతాబ్దం చివరిలో వేంగి చాళుక్య పాలకుడైన మొదటి చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. అందువలన ఈ ఆలయాన్ని చాళుక్య కుమారారామ భీమేశ్వరాలయంగా పిలుస్తారు. ఎన్నో విశేషాలకు నెలవు ఈ క్షేత్రంలో 14 అడుగుల స్ఫటిక శివలింగం ఉంది. ఆలయం చుట్టూ చెక్కిన రాతితో కట్టిన రెండు ప్రాకారాలున్నాయి. వెలుపలి ప్రాకారానికి నాలుగు దిక్కుల్లో నాలుగు గోపుర ద్వారాలున్నాయి. లోపలి ప్రాకారం మధ్యలో భీమేశ్వరాలయాన్ని చతురస్రాకారంగా ఒక అంతస్తుతో నిర్మించారు. భక్తులు కింది నుంచి మొదటి అంతస్తులోనికి ప్రవేశించి, పైన ఉన్న శివలింగాన్ని రుద్ర రూపునిగా పూజిస్తారు. ఆలయంలో ఉన్న శిలాస్తంభాలను దేనికదే ప్రత్యేకంగా చెక్కడం విశేషం. ఆలయంలోని సుందర నిర్మాణాల్లో ముఖ్యమైనది నూరు స్తంభాల మండపం. ఆలయంలోని ఊయల మండపం కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. నేటికీ ఈ మండపం ఊపితే ఊగుతుంది. ఈ క్షేత్రంలోని కోనేరు ఎదురుగా ధ్వజస్తంభం వద్ద నుంచి ఆలయంలోనికి ప్రవేశించగానే ఏకశిలతో చెక్కిన పెద్ద నందీశ్వరు విగ్రహం దర్శనమిస్తుంది. ఇది ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక్కడి గంటను ఒకసారి మోగిస్తే ఓంకారం ధ్వనిస్తుంది. స్వామి వారి ఆలయం చుట్టూ సూర్యనారాయణమూర్తి, గణపతి, సప్తమాతృకలు, దత్తాత్రేయస్వామి, సరస్వతి, కుమారస్వామి, మహిషాసురమర్దిని, మహావిష్ణులక్ష్మీదేవి, చండీశ్వరస్వామి, వీరభద్రస్వామి, సుబ్రహ్మణేశ్వర స్వామి ఉప ఆలయాలున్నాయి. వీటిల్లోని దేవతలను దర్శించుకున్న తరువాత భక్తులు భీమేశ్వరస్వామిని, తరువాత బాలాత్రిపురసుందరీ అమ్మవారిని దర్శించుకుంటారు. చైత్ర, వైశాఖ మాసాల్లో ఉదయం పూట సూర్యుని సువర్ణ కిరణాలు స్వామివారి పాదాలను, సాయంత్రం వేళ అమ్మవారి పాదాలను తాకే విధంగా ఆలయ నిర్మాణం జరగడం విశేషం. ఆలయంలో పశ్చిమంగా ఉన్న ఏకశిలా స్తంభాన్ని స్థానికులు కప్పస్తంభంగా పిలుస్తారు. దీనిపై ఉన్న శాసనాన్ని బట్టి కొంతమంది దొంగలు నిధి దొరుకుతుందనే ఆశతో నందిని తొలగించారని, చాళుక్య వంశానికి చెందిన నరసింహుని భార్య లక్ష్మి రాజమండ్రిలోని కోటిలింగాల రేవు నుంచి రాతిని తెప్పించి కొత్త నంది విగ్రహాన్ని చెక్కించి పునఃప్రతిష్ఠించారని తెలుస్తోంది. ఈ స్తంభానికి ఎదురుగా సుమారు 200 గజాల దూరంలో ప్రాచీన మాండవ్య నారాయణస్వామి ఆలయం ఉంది. సర్వం సిద్ధం పంచారామ క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశాం. శుక్రవారం ఉదయం విఘ్నేశ్వర పూజ, దీక్షధారణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం ఇత్తడి నంది వాహనంపై స్వామి, అమ్మవార్ల గ్రామోత్సవం జరుగుతుంది. గ్రామోత్సవం ఆలయానికి వచ్చే సమయంలో మదుగులమ్మ ఆలయం వద్ద స్వాగతం పలుకుతారు. అదే రోజు రాత్రి స్వామి వారి కల్యాణోత్సవం జరుగుతుంది. 14న స్వామివారికి అభిషేకాలు, పూజలు చేస్తారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని 15వ తేదీ వేకువజామున పిఠాపురం మహారాజా రావు వెంకట కుమార మహీపతి సూర్యారావు బహుదూర్ గోత్రనామాలతో పూజలు, అభిషేకాలు చేసి, భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. రాత్రి మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, లింగోద్భవ కాల పూజ నిర్వహిస్తారు. 16వ తేదీ ఉదయం స్వామివారికి అభిషేకాలు, పూజలు, అమ్మవారికి కుంకుమార్చన, మధ్యాహ్నం గాంధీ చౌక్ నుంచి రథోత్సవం జరుగుతాయి. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో నిర్వహించే రథోత్సవానికి రూ.7 లక్షలు కేటాయించాం. 17వ తేదీ ఉదయం త్రిశూల స్నానం, తీర్థపు సేవ, 18వ తేదీ రాత్రి ఆరు గంటలకు తెప్పోత్సవం, అనంతరం శ్రీపుష్పయాగోత్సవంతో మహాశివరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి. మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు అన్నదానం, అల్పాహారం, పాలు, మజ్జిగ, మంచినీరు అందించడానికి దాతలు ముందుకు వచ్చారు. వారికి స్థలాలు కేటాయించాం. – ఈఓ బళ్ల నీలకంఠం, ట్రస్టు బోర్డు చైర్మన్ కంటే జగదీష్ మోహన్రావు -
హాకీ పోటీల్లో విజేత ఎన్సీఓఈ
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఆటల్లో గెలుపు ఓటములు కన్నా క్రీడా స్ఫూర్తి ప్రదానమని రాజమహేంద్రవరం, కాకినాడ రేంజ్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ ప్రతాప్సింగ్ భూక్య అన్నారు. కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో ఈ నెల 4 నుంచి జరుగుతున్న మొదటి కోకనాడ గోల్డ్కప్ జాతీయ స్థాయి మహిళా విభాగ పోటీలు గురువారంతో ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రతాప్సింగ్ భూక్య, అతిథులుగా డీఈఓ రమేష్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఎస్కే చక్రవర్తి, డీఎస్డీఓ సతీష్ కుమార్, మాజీ అంతర్జాతీయ క్రీడాకారుడు దాసరి మురళీకృష్ణ, మెడికవర్ హెడ్ ఎం.అంజనేయస్వామి హాజరయ్యారు. టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి కె.రవిచంద్రప్రసాద్ అధ్యక్షత వహించారు. హాకీ మహిళల ఫైనల్స్లో హర్యానా, ఎన్సీఓఈ సోనిపట్ జట్లు పోటీ పడగా 2–1 స్కోర్తో ఎన్సీఓఈ విజయం సాధించింది. సాయిభోపాల్, యూనియన్ బ్యాంక్ జట్లు పోటీ పడగా 5–1 స్కోర్తో సాయిభోపాల్ జట్టు విజయం సాధించి మూడో స్థానాన్ని అందుకుంది. విజేతలకు అతిథులు బహుమతులు అందజేశారు. ఇండియన్ హాకీ టీం కెప్టెన్ ప్రీతమ్ శివాజ్, అసిస్టెంట్ టోర్నమెంట్ డైరెక్టర్ అజయ్ శర్మ, ఏపీ హాకీ సంఘ ప్రతినిధి రవిరాజు, కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు బాబ్జీ, పీడీలు సూరిబాబు, హరిబాబు, ఇన్కమ్ ట్యాక్స్ అధికారి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
నమ్మించి.. దోచేసి..
చోరీ కేసులో నిందితుల అరెస్ట్ కోరుకొండ: ఓ ఇంట్లో పనికి చేరారు.. ఎంతో నమ్మకంగా ఉన్నారు.. అత్యాశకు పోయి, చోరీ చేసి చివరికి కటకటాల పాలయ్యారు. కోరుకొండ మండలం శ్రీరంగపట్నంలో ఈ ఘటన జరిగింది. దీనిపై గురువారం కోరుకొండ పోలీస్ స్టేషన్లో నార్త్జోన్ డీఎస్పీ వై.శ్రీకాంత్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన కథనం ప్రకారం.. శ్రీరంగపట్నం గ్రామానికి చెందిన సర్పంచ్ మద్దాల అమ్మాజీ ఇంట్లో సరకనం జగత్ కొండలరావు, దండు అనిల్కుమార్లు పని చేస్తున్నారు. ఎంతో నమ్మకంగా ఉండేవారు. ఇదిలా ఉంటే ఆ ఇంట్లో ఈ నెల 10న దొంగతనం జరిగింది. 92 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.లక్ష చోరీకి గురయ్యాయి. దీనిపై సర్పంచ్ భర్త మద్దాల రమణ కోరుకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఇంట్లో, పరిసరాల్లో సీసీ కెమెరాలను పరిశీలించారు. దాని ఆధారంగా అనుమానం వచ్చి జగత్కొండలరావు, అనిల్కుమార్లను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి ఆభరణాలను రికవరీ చేశారు. ఆ ఇద్దరినీ కోర్టులో హాజరుపర్చగా, రిమాండ్ విధించింది. ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన ఎస్సై శ్రీనివాస్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. సమావేశంలో సీఐ ఎస్వీవీఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
రయ్రయ్.. దుమ్ము ఎగరెయ్
టిప్పర్ల వేగానికి లేచిన దుమ్ము ఏడీబీ రోడ్డుపై ఒకేసారి మూడు టిప్పర్ల ప్రయాణం రయ్ రయ్మంటూ ఒకే రోడ్డులో మూడు భారీ వాహనాలు వెళ్తూ జనానికి దడ పుట్టిస్తున్నాయి.. గండేపల్లి మండలం రామేశంపేట ఏడీబీ రోడ్డుపై గ్రావెల్ లోడుతో టిప్పర్లు ఒకదానికొకటి పోటీ పడి మరీ వెళ్తున్నాయి. ఒకే సమయంలో వేగానికి తోడు ఎదురెదురుగా తిరుగుతున్నాయి. ఈ టిప్పర్ల రాకపోకలతో దుమ్మూ ధూళిపైకి రేగడంతో దారి కనబడడం లేదు. అయినా ఇది అధికారుల కంట పడకపోవడం శోచనీయం. – గండేపల్లి ఆగిపోయిన మోటార్ సైకిల్ను మరో వాహనంపై ఉన్న వ్యక్తి ఇలా నెట్టుకొచ్చారు. రాయవరంలో ఈ చిత్రం కంట పడింది. ఇంధనం లేక బైక్ మొరాయించడంతో వెనుక నుంచి మరో వాహనం ద్వారా కాలితో మోటార్ సైకిల్ను ఇలా నెట్టుకొచ్చారు. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారి కావడంతో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇబ్బందే కదా! – రాయవరం -
దందానతాన..
● తీరంలో ఇసుక అక్రమ తవ్వకాలు ● అధికార అండతో రాత్రి వేళల్లో తరలింపు ● చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం అల్లవరం: తీర ప్రాంతం.. విలువైన భూములకు కేంద్రం. అలాంటి భూములపై కొందరి కన్ను పడింది. అదే అక్రమ దందాకు వేదికై ంది. అల్లవరం మండలం ఓడలరేవు, కొమరగిపట్నం గ్రామాల్లో తీర ప్రాంతం ఉంది. ఆ భూముల్లో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అడ్డూ అదుపు లేకుండా రాత్రి వేళల్లో ఇసుకను తవ్వి అక్రమంగా తరలిస్తున్నారు. ఇలా రూ.కోట్ల ఆదాయం దారి తప్పుతోంది. ఇసుక తవ్వి తరలించిన ప్రాంతాల్లో అనధికార అక్రమ రొయ్యల చెరువులు పుట్టుకొస్తున్నాయి. ఆయా గ్రామాల్లో రెవెన్యూ, మత్స్య శాఖ అధికారులు నిత్యం తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. అటు వైపు చూడడం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేసినా స్పందన ఉండడం లేదని పలువురు వాపోతున్నారు. గతంలో రెవెన్యూ, పోలీసు యంత్రాంగం తరచూ దాడులు నిర్వహిస్తుండడంతో ఇసుక దందా ఎక్కడా జరిగేది కాదు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక పట్టించుకునే వారే కరవయ్యారు. రెవెన్యూ, పోలీస్, మైన్స్ అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో మాత్రమే ఇసుక తరలించుకోవాలని అనధికార ఆదేశాలు ఇస్తున్నట్లు సమాచారం. ఇలా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఆ భూముల్లోనే ఎందుకంటే.. ఓడలరేవు, కొమరగిరిపట్నం రెవెన్యూ గ్రామాల్లో తీరం ఏడు కిలోమీటర్లు ఉంటుంది. ఇందులో రెండు కిలోమీటర్ల మేర విస్తరించిన ఉన్న ఇసుక భూముల్లో ఈ దందా సాగుతుంది. డీ– పట్టా, జిరాయితీ భూముల్లో ఈ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. రైతుల నుంచి ఇసుక తవ్వుకుని తరలించుకునేందుకు ఎకరానికి రూ. 5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు లీజుకు ఒప్పందం చేసుకుని, మూడు మీటర్ల లోతున ఇసుక తవ్వి రవాణాకు అనువైన ప్రాంతాల్లో స్టోర్ చేస్తున్నారు. రాత్రి వేళల్లో అమలాపురం, అల్లవరం, ఉప్పలగుప్తం మండలాలకు పదులు సంఖ్యలో లారీలు, ట్రాక్టర్లపై తరలిస్తున్నారు. ఇసుక తవ్విన క్షేత్రాల్లో గట్లు చదును చేసి రొయ్యల సాగు చేస్తున్నారు. మత్స్యశాఖ అధికారులు కనీసం పరిశీలన చేసి అనధికార సాగుపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు మండి పడుతున్నారు. ● అలాగే ఓడలరేవు నుంచి కొమరగిరిపట్నం శివారు ఎన్.రామేశ్వరం వరకూ సుమారు వెయ్యి ఎకరాల్లో సహజ సిద్ధంగా ఏర్పడిన ఇసుక దిండ్లను తవ్వేసి, ఆపై సమాంతరంగా ఉన్న ఇసుక భూముల్లో కూడా అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. ప్రభుత్వ భవనాల నిర్మాణాల నిమిత్తం రెవెన్యూ అధికారుల నుంచి అనుమతులు తీసుకోవడం, ఆపై తెర వెనుక రియల్టర్ల భూములకు తరలించి భారీగా సొమ్ము చేసుకోవడం పరిపాటిగా మారింది. ఇదంతా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ట్రాక్టర్ ఇసుకకు రూ.2 నుంచి రూ.2,200 వరకూ, లారీ ఇసుకై తే రూ. 7 వేల నుంచి దూరాన్ని బట్టి రూ. 10 వేల వరకూ తీసుకుంటున్నారు. దొరికిన కాడికి దోచేయ్.. జేబులు నింపేయ్ అన్నట్లు ఇసుక దందా సాగుతోంది. కళ్లెదుటే అక్రమ దందా సాగుతుంటే, అరికట్టాల్సిన యంత్రాంగం చోద్యం చూస్తోంది.. విలువైన భూములు కరిగిపోతున్నా, ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నా మనకెందుకులే అన్నట్లు వదిలేస్తోంది. అధికార అండతో కొందరు ఇష్టమొచ్చినట్లు ఇసుకను తరలిస్తూ అడిగే వారెవరంటూ సాగిపోతున్నారు.. అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలంలో జరుగుతున్న తంతు ఇది. అక్రమ మార్గాల్లో రవాణా ఇసుక అక్రమ రవాణాను గ్రామస్తుల సహకారంతో ఇటీవల అడ్డుకున్నాం. దీంతో తాత్కాలికంగా నిలిపివేసి ఇప్పుడు రూటు మార్చారు. ప్రత్యామ్నాయ దారుల్లో ఇసుక రవాణా సాగిస్తున్నారు. ఆ లారీలు, ట్రాక్టర్లను పట్టుకుని పోలీసులకు అప్పగిస్తుంటే, వారిపై కేసులు నమోదు చేయకుండా వదిలేస్తున్నారు. ఇటీవల పలువురు కలెక్టర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. –పెచ్చెట్టి వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యుడు, కొమరగిరిపట్నం ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు తీరం పొడవునా సీఆర్జెడ్ పరిధిలో అనధికారి ఇసుక తవ్వకాలు, రవాణాపై ఇటీవల జిల్లా కలెక్టర్ని కలసి ఫిర్యాదు చేశాం. పర్యావరణానికి హాని కలిగించే ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని కోరాం. అయితే అధికారులు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇసుక తవ్వకాలతో ఓడలరేవు, కొమరగిరిపట్నం గ్రామాలకు ప్రకృతి వైపరీత్యాల నుంచి పెను ముప్పు పొంచి ఉంది. – భైరిశెట్టి రామారావు, కొమరగిరిపట్నం, అల్లవరం మండలం -
గురుకులంలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
కరప: స్థానిక మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఐదు నుంచి ఎనిమిదో తరగతి వరకూ చదివేందుకు అర్హులైనవారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ప్రిన్సిపాల్ కేవీ కృష్ణారావు కరపలో గురువారం విలేకర్లతో మాట్లాడుతూ ఈ వివరాలు తెలిపారు. ఆయా తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తులను ఆన్లైన్లో https://mjpapbcwreis.apcfss.in వెబ్సైట్ ద్వారా మార్చి నాలుగో తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఐదో తరగతిలో ప్రవేశం కోరే వారికి ఏప్రిల్ 12వ తేదీన ఉదయం, 6, 7, 8 తరగతుల్లో ప్రవేశానికి ఏప్రిల్ 19వ తేదీ మధ్యాహ్నం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు 80749 75154, 99493 84806, 99491 84141 నంబర్లకు ఫోన్ చేసి సంప్రదించాలని కృష్ణారావు కోరారు. మరిడమ్మ ఆలయానికి రూ.27 లక్షల ఆదాయం సామర్లకోట: పెద్దాపురం మరిడమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి సమర్పించే గాజులు, చీరలు, జాకెట్టు ముక్కల విక్రయం ద్వారా దేవస్థానానికి రూ.27.45 లక్షల ఆదాయం వచ్చిందని ఈఓ కె.జయలక్ష్మి తెలిపారు. ఆలయంలో రెండేళ్ల పాటు గాజులు, చీరలు, జాకెట్టు ముక్కలతో పాటు కోడి, మేకపోతులను విక్రయించుకుని, తీసుకునే హక్కు కోసం గురువారం బహిరంగ వేలం నిర్వహించారు. కోడి, మేకపోతులకు పాటదారులు హాజరు కాలేదు. దీంతో, ఈ పాటను వాయిదా వేశామని ఈఓ తెలిపారు. మొదటి సంవత్సరం పాటకు రెండో ఏడాది 10 శాతం కలిపి, ఆలయానికి పాటదారు రూ.30,19,500 చెల్లించాల్సి ఉంటుందని ఈఓ తెలిపారు. బహిరంగ వేలంలో ఆలయ వంశపారంపర్య ధర్మకర్త చింతపల్లి హర్ష, పెద్దాపురం గ్రూప్ టెంపుల్ ఈఓ కె.జగదీశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.భీమేశ్వరుని హుండీల ఆదాయం రూ. 27.46 లక్షలు రామచంద్రపురం రూరల్: ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి ఆలయ హుండీల ఆదాయం రూ. 27,46,616 వచ్చినట్లు ఈఓ, దేవదాయ శాఖ ఏసీ అల్లు వెంకట దుర్గాభవాని గురువారం విలేకరులకు తెలిపారు. గత ఏడాది నవంబర్ 27వ తేదీ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 12వ తేదీ వరకు ఆలయ హుండీల నుంచి రూ.26,59,090, అన్నదానం హుండీల నుంచి రూ.87,526 వచ్చినట్లు పేర్కొన్నారు. ఈఓతో పాటు అంగర గ్రూపు టెంపుల్స్ ఈఓ ఎం.శ్రీదేవి, ఓదూరు గ్రూపు టెంపుల్స్ ఈఓ విత్తనాల శ్రీనివాస్, కె.గంగవరం గ్రూపు టెంపుల్స్ ఈఓ వి.బాలకృష్ణల పర్యవేక్షణలో లెక్కింపు సాగింది. ద్రాక్షారామ పీఏసీఎస్ చైర్మన్ ముప్పనపల్లి గణేష్, గ్రామ పెద్దలు దవులూరి రామకృష్ణ, అల్లం రామకృష్ణ, ఆళ్ల బుజ్జి, సలాది శ్రీను పాల్గొన్నారు. ద్రాక్షారామ ఎస్సై ఎం.లక్ష్మణ్ ఆధ్వర్యంలో సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. -
అగ్గి.. సర్వం బుగ్గి
● మామిడికుదురులో 11 తాటాకిళ్లు దగ్ధం ● రోడ్డున పడ్డ బడుగుజీవులు సర్వం కోల్పోయి దిగాలు చెందుతున్న బాధితులు ప్రమాదంలో కాలిపోయిన తాటాకు ఇళ్లు మామిడికుదురు: అనుకోని అగ్ని ప్రమాదం ఆ కుటుంబాలను రోడ్డున పడేసింది.. ఉన్న గూడును బుగ్గి చేసింది.. మామిడికుదురు ఆల్క్యాస్ట్ కాలనీలో గురువారం 11 తాటాకిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. మొత్తం 14 కుటుంబాలు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలాయి. సుమారు రూ.10 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారుల ప్రాథమిక అంచనా వేశారు. ఆరుగాలం శ్రమిస్తూ రెక్కాడితే కానీ డొక్కాడని నిరు పేద కుటుంబాలు ఈ ప్రమాదంలో అన్నీ కోల్పోయాయి. గ్యాస్ సిలెండర్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే రాజోలు అగ్నిమాపక కేంద్రం అధికారి కేఎన్వీ రమణ ఆధ్వర్యంలో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. డిగ్రీ చదువుకున్న తమ సర్టిఫికెట్లు ప్రమాదంలో కాలిపోయాయని జల్లి నాగరాజు, కల్లి దుర్గాప్రసాద్ కన్నీటి పర్యంతమయ్యారు. బాధితులకు మామిడికుదురు జెడ్పీహెచ్ స్కూల్లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, తహసీల్దార్ పి.సునీల్కుమార్, ఎంపీడీఓ జి.భవాని, ఎంఈఓ మోకా వెంకన్నబాబు, సర్పంచ్ గౌస్ మొహిద్దీన్ తదితరులు బాధితులను పరామర్శించారు. -
అధికార పార్టీ వారే పూజలు చేయాలా?
● శివరాత్రి పనులు చేయించే హక్కు సర్పంచ్కు లేదా? ● తిమ్మాపురంలో పోలీసులది ఏకపక్ష వైఖరి ● సర్పంచ్ బెజవాడ సత్యనారాయణపై తప్పుడు సెక్షన్లతో కేసులు ● ఆయన ఫిర్యాదు ఎందుకు తీసుకోలేదు? ● రెండో పక్షంపై ఎందుకు కేసు పెట్టలేదు? ● మాజీ మంత్రి కురసాల కన్నబాబు కాకినాడ రూరల్: ‘దేవుడిపై అధికార పార్టీకే హక్కుందా? వారు మాత్రమే పూజలు చేయాలా? మహాశివరాత్రి ఉత్సవాల పనులు చేయించే హక్కు గ్రామస్తుల తరఫున సర్పంచ్కు లేదా? తిమ్మాపురంలో పోలీసులు ఏకపక్షంగా పని చేస్తున్నారు’ అని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిమ్మాపురంలోని విశాలక్ష్మి సమేత విశ్వేశ్వరస్వామి ఆలయం వద్ద బుధవారం వివాదం చోటు చేసుకున్న నేపథ్యంలో ఆ గ్రామ సర్పంచ్, వైఎస్సార్ సీపీ ఎస్ఈసీ సభ్యుడు బెజవాడ సత్యనారాయణను, మరికొందరిని పోలీసులు అరెస్టు చేయడాన్ని కన్నబాబు తీవ్రంగా ఖండించారు. రమణయ్యపేట వైద్య నగర్లోని తన క్యాంప్ కార్యాలయంలో గురువారం రాత్రి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తిమ్మాపురంలో బుధవారం నుంచి పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు చూస్తూంటే రాష్ట్రంలో చట్టాలున్నాయా లేక చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజలను రెండుగా విడగొట్టి చట్టాలు చేస్తున్నారా అనేది అనుమానంగా ఉందని విమర్శించారు. పోలీసులు చాలా దుర్మార్గంగా వైఎస్సార్ సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. బెజవాడ సత్యనారాయణ, మరికొందరు గ్రామస్తులను రాత్రంతా అక్రమంగా నిర్బంధించి, తిమ్మాపురం పోలీసు స్టేషన్లో ఉంచి, తెల్లవారుజామున ఇంద్రపాలెం స్టేషన్కు తరలించి, తప్పుడు కేసు నమోదు చేసి, అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్కు తరలించారని అన్నారు. సర్పంచ్పై దురుసుగా ప్రవర్తించారు తిమ్మాపురంలో టీడీపీ 2016లో అధికారంలో ఉన్నప్పుడు గ్రామస్తుల విరాళాలతో ఊరుమ్మడి స్థలంలో శివాలయం నిర్మించారని కన్నబాబు తెలిపారు. దీనికి కరెంట్ చార్జీలను పంచాయతీయే చెల్లిస్తోందన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఈ ఆలయానికి శివరాత్రి నాడు వెళ్లేవాడినన్నారు. వచ్చే శివరాత్రికి శివపార్వతుల కల్యాణం జరుగుతుందనే సమాచారాన్ని ప్రజలకు తెలియజేసేందుకు ఆటోలో ప్రచారం చేస్తూంటే తిమ్మాపురం ఎస్సై గణేష్ కుమార్ అడ్డుకున్నారని, ఆ ఆటోను స్టేషన్కు తరలించారని చెప్పారు. అధికార పార్టీలో చేరిన శ్రీరామకృష్ణకు మాత్రమే హక్కుందని చెప్పి, శివాలయం వద్ద పనులు చేయించేందుకు వెళ్లిన సర్పంచ్ తదితరులను వెనక్కి పంపించారన్నారు. ఈ ఉత్సవాన్ని ఒక పార్టీకి సంబంధించినదిగా చిత్రీకరించవద్దని బెజవాడ సత్యనారాయణ చెప్పగా.. ఆయనపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారన్నారు. గ్రామంలోని జనసేన, కూటమి నాయకులు ఆలయం వద్దకు వెళ్లినట్లు తెలుసుకుని, ఇటు నుంచి కొంత మంది పెద్దలు వెళ్లగా అక్కడ వాగ్వాదం జరిగిందని చెప్పారు. పోలీసులు ఇరు వర్గాలనూ స్టేషన్కు పిలిపించారని, సీఐ చైతన్యకృష్ణ, ఎస్సై గణేష్ కుమార్ తప్పుడు సెక్షన్లతో సర్పంచ్ తదితరులపై కేసులు నమోదు చేశారని ఆరోపించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, రకరకాల సెక్షన్లు పెట్టి, రిమాండ్ వచ్చేలా చేశారని అన్నారు. బాధితులుగా ఉన్న సర్పంచ్ తదితరులు ఇచ్చిన ఫిర్యాదు తీసుకోలేదని, పోలీసులు ఏకపక్షంగా పని చేస్తున్నారని ఆరోపించారు. ఇంద్రపాలెం పోలీసు స్టేషన్కు వెళ్లిన సర్పంచ్ బంధువుల ఫోన్లు లాక్కున్నారన్నారు. ఫలానా వ్యక్తి, ఫలానా పార్టీయే పూజలు చేయాలని ఎక్కడైనా ఉంటుందా.. గ్రామంలో పూజలు, కల్యాణంలో పాల్గొనడం అందరి హక్కూ కాదా అని కన్నబాబు ప్రశ్నించారు. ఐపీఎస్లకు ప్రేక్షక పాత్ర తగదు ఐపీఎస్ అధికారులు మౌనంగా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని, జిల్లాలోని పోలీసులు అధికార పార్టీకి కార్యకర్తల్లా పని చేస్తున్నారని కన్నబాబు ఆరోపించారు. ఎల్లవేళలా అధికారం ఒకేచోట ఉండదని, చట్టాలను గౌరవించి, అమలు చేయాలని పోలీసులను కోరారు. నిజంగా తప్పుంటే ఇరు పక్షాలపై కేసులు పెట్టాలన్నారు. సర్పంచ్ను నీకేంటి సంబంధమని అన్నారని.. ఆ గుడి ప్రైవేటు స్థలంలో ఉందా అని పోలీసులను ప్రశ్నించారు. అరెస్టులకు వైఎస్సార్ సీపీ భయపడదని, పోలీసు అధికారులు తీరు ఎంతమాత్రం సబబు కాదని అన్నారు. ఇవే విధానాలు అనుసరిస్తే భవిష్యత్తులో పోలీసులే ఇబ్బంది పడతారని హెచ్చరించారు. సమావేశంలో తిమ్మాపురం ఎంపీటీసీ సభ్యుడు ముద్దన వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. తిమ్మాపురం సర్పంచ్ సహా 10 మందిపై కేసు తిమ్మాపురం గ్రామంలో శివాలయం వద్ద బుధవారం రాత్రి ఇరువర్గాల మధ్య తలెత్తిన వివాదం నేపథ్యంలో ఒక వర్గానికి చెందిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్సార్ సీపీ ఎస్ఈసీ సభ్యుడు, గ్రామ సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ సహా మొత్తం 10 మందిపై ఎస్సై గణేష్ కుమార్ కేసు చేశారు. ఈ పది మందిలో బెజవాడ సత్యనారాయణ, బెజవాడ భాస్కరరావు, ఎలుగంటి నూకరాజు (రాజా), బద్దిలి అచ్చారావు, కొల్లకోట ఆదివిష్ణు, గంగుమళ్ళ సాంబశివలను గురువారం శివాలయం వద్ద అరెస్టు చేసి, కాకినాడ నాలుగో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి, రిమాండుకు తరలించారు. -
కదం తొక్కిన కార్మిక లోకం
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, కనీస వేతనం రూ.30 వేలు చెల్లించాలని, పని గంటలు పెంచుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించి, ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని, కాంట్రాక్టు, స్కీమ్ వర్కర్లను రెగ్యులరైజ్ చేసి, వేతనాలు పెంచాలని, పంటలకు గిట్టుబాటు ధరల చట్టం చేయాలని, పాత ఉపాధి హామీ చట్టాన్నే అమలు చేయాలని, పలు ఇతర డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ జిల్లావ్యాప్తంగా కార్మిక లోకం కదం తొక్కింది. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కాకినాడతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వివిధ రంగాల కార్మికులు, ఉద్యోగులు ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. -
వృద్ధురాలి మెడలో పుస్తెల చోరీ
రాయవరం: నడుస్తూ వెళ్తున్న వృద్ధురాలి మెడలో నుంచి బంగారు పుస్తెలతాడును చోరీ చేసిన ఘటన రాయవరంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పులగం లక్ష్మి భర్తతో కలిసి కిరాణా వ్యాపారం చేస్తుంటుంది. షాపు నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో ఒక యువకుడు సెల్ఫోన్ చూస్తున్నట్టు నటిస్తూ ఆమె దగ్గరకు రాగానే ఆమె మెడలోని 11 కాసుల పుస్తెల తాడును గట్టిగా లాగాడు. వృద్ధురాలు ప్రతిఘటించడంతో ఒక మంగళసూత్రం, సగం బంగారు గొలుసు దొంగ చేతికి చిక్కగా, మిగిలిన సూత్రం, సగం గొలుసు వృద్ధురాలి వద్ద ఉంది. దీంతో ఆమె మెడ వద్ద గాయమైంది. ఆమె వేసిన కేకలకు భర్త పరుగున వచ్చి ఆ యువకుడి కోసం వెదకగా అప్పటికే అతడు పరారయ్యాడు. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ పి.దొరరాజు ఘటనా స్థలానికి చేరుకుని సమీపంలో ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలించి వచ్చిన వ్యక్తి 18 ఏళ్ల యువకుడిగా అనుమానిస్తున్నారు. చోరీకి గురైన బంగారం విలువ రూ.3.50 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు. ఆమెను నిత్యం గమనిస్తున్న వ్యక్తే ఈ చర్యలు పాల్పడి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చెట్టును ఢీకొని ట్రాక్టర్ డ్రైవర్ మృతి రంపచోడవరం: మారేడుమిల్లి మండలం బోదులూరు సమీపంలో చెట్టును ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఆ గ్రామానికి చెందిన చిన్న (40)బుధవారం మృతి చెందారు. మృతుడు మారేడుమిల్లి ఉప్పర్ల వీధి వాస్తవ్యుడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ పెద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబం సభ్యులు దుఖంలో మునిగిపోయారు. -
సమస్యల జడిలో..
కాకినాడ క్రైం: తల్లీబిడ్డల సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. కనీస వేతనం లేకపోగా శ్రమదోపిడీకి గురవుతూ, ఇతర ఒత్తిళ్లకు లోనవుతూ సతమతమవుతున్నారు. కాలానుగుణంగా అనేక మార్పులు వస్తున్నా తమ జీవితాల్లో మాత్రం ఎటువంటి మార్పూ లేదని ఆవేదన చెందుతున్నారు. జీతం గోరంత.. పని కొండంత జీతం గోరంత, పని భారం కొండంత అన్నట్లుగా ఉంది అంగన్వాడీల పరిస్థితి. అంగన్వాడీ కేంద్రంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ తరగతులు చెప్పాలి. ప్రతి విద్యార్థితో నోట్స్ రాయించాలి. ఎత్తు, బరువులు కొలిచి నమోదు చేయాలి. ఇంటింటికీ తిరిగి గర్భిణులు, బాలింతల ఆరోగ్య స్థితిని ప్రతి రోజూ పర్యవేక్షించాలి. బరువు తక్కువగా ఉన్న పిల్లల బరువు పెంచేందుకు చర్యలు తీసుకోవాలి. గర్భిణులను ఎప్పటికప్పుడు ఆసుపత్రులకు పంపించి, వైద్య సేవలు అందేలా చూడాలి. లబ్ధిదారులకు రేషన్ ఇవ్వాలి. చంటిపిల్లలు, బాలింతలు, గర్భిణులకు వ్యాక్సిన్లు వేయించాలి. గర్భిణులకు సీమంతాలు, చిన్న పిల్లలకు అన్నప్రాశనలు చేయించాలి. ఆరోగ్య అవగాహన సదస్సులు నిర్వహించాలి. వైద్య, ఆరోగ్య శాఖ సమన్వయంతో ప్రతి ఆరోగ్య కార్యక్రమంలోనూ పాల్గొనాలి. ప్రతి నెలా రెండు సమావేశాలకు వెళ్లాలి. ప్రత్యేక దినాల్లో జరిగే ర్యాలీల్లో తప్పనిసరిగా పాల్గొనాలి. ఇన్ని పనులు చేస్తున్నా రూ.11,500 వేతనం మాత్రమే ఇస్తున్నారంటే వారి దయనీయ స్థితిని అర్ధం చేసుకోవచ్చు. జీతంలో కోతలు అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు, ఇతర ఖర్చులను ప్రభుత్వం ఇవ్వాలి. కానీ, ఆ భారం సిబ్బంది పైనే పడుతోంది. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్న పిల్లలు తాగేందుకు మున్సిపల్ నీరే ఇస్తున్నారు. కానీ, అది ఎక్కడైనా కాలుష్యమయమవుతుందేమోననే భయంతో పలువురు కార్యకర్తలు సొంత ఖర్చుతో ఆయా కేంద్రాలకు మంచినీటి క్యాన్లు వేయిస్తున్నారు. రేషన్ దుకాణం నుంచి సెంటర్కు సరకుల రవాణాకు ప్రభుత్వం ప్రతి నెలా రూ.50 నుంచి రూ.60 వరకూ ఇస్తోంది. కానీ, వాస్తవంగా దీనికి కనీసం రూ.300 ఖర్చవుతోంది. వివిధ సందర్భాల్లో మిల్లెట్స్తో ఆహార పదార్థాలు, ఫ్లెక్సీలు, బ్యానర్ల వంటివాటన్నింటికీ చేతిచమురు వదిలిపోతోంది. పిల్లలకు వండి పెట్టేందుకు గ్యాస్, కూరగాయలు, వంట నూనె వంటి వాటికి ప్రభుత్వం ఇప్పటికీ పైసల్లోనే ఇస్తూండగా, వాస్తవంగా వాటి ధరలు మాత్రం రూ.పదులు దాటేశాయి. ఈ సరకుల కొనుగోలుతో పాటు రేషన్ తరలింపు వంటి వాటికి అంగన్వాడీ కార్యకర్తలు ప్రతి నెలా రూ.2 వేల వరకూ సొంతంగా వెచ్చించాల్సి వస్తోంది. అయినప్పటికీ ప్రభుత్వం పొంతన లేని చెల్లింపులే చేస్తోంది. ‘యాప్’సోపాలు వివిధ యాప్ల వలన కూడా అంగన్వాడీ కార్యకర్తలు నానా అగచాట్లూ పడుతున్నారు. పోషణ్ ట్రాకర్, బాల సంజీవని యాప్లలో హాజరు సహా పలు వివరాలు నమోదు చేయాలి. నెలలో ఎక్కువ రోజులు సర్వర్ల సమస్యతో ఈ యాప్లు పని చేయవు. నమోదు పూర్తయితేనే కానీ రేషన్ ఇచ్చే అవకాశం ఉండదు. ఈలోగా లబ్ధిదారులు వెళ్లిపోతే, వారి ఇళ్లకు వెళ్లి మరీ రేషన్ ఇవ్వాల్సి వస్తోంది. ఆధార్లో పాత ఫొటో ఉండి, తాజాగా ఫొటో తీస్తూంటే ఎఫ్ఆర్ఎస్ సహా మిగిలిన యాప్లలో ‘మిస్మ్యాచ్’ అని వస్తోంది. ఈ యాప్లు చాలవన్నట్లు అభా, అపారా యాప్లను కూడా అంగన్వాడీలే నిర్వహించాల్సి వస్తోంది. రికార్డుల్లో రాసుకున్న వివరాలే యాప్లలో కూడా నమోదు చేస్తూండటంతో ఒకే పని రెండుసార్లు చేయాల్సి వస్తోంది. దీనివలన పనిభారం పెరుగుతోంది. ఈ సమస్యలు పరిష్కరించకపోగా.. పని సకాలంలో పూర్తి చేయాలంటూ అధికారులు తమ మెడపై కత్తి పెడుతున్నారని అంగన్వాడీ కార్యకర్తలు వాపోతున్నారు. దీనికితోడు ఖాళీ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయకపోవడంతో ఉన్న సిబ్బందిపై పనిభారం రెట్టింపవుతోంది. స్థానిక నేతల అజమాయిషీ మరోవైపు తమపై అధికార కూటమి నేతల పెత్తనం నానాటికీ మితిమీరుతోందని అంగన్వాడీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రం తరఫున ఏవైనా కార్యక్రమాలు నిర్వహిస్తే మూడు పార్టీల నాయకులు ఎవరికి వారే తమను తప్పనిసరిగా పిలవాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. ఎవరిని పిలిస్తే ఎవరు అలుగుతారో అర్థం కాక సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలకు మంగళంఅంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ఐసీడీఎస్ స్కీమ్ వర్కర్లుగా మాత్రమే ఉన్నారు. వీరిని శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేదు. అయినప్పటికీ ప్రభుత్వ పోర్టల్లో మాత్రం వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగానే చూపిస్తున్నారు. తద్వారా వీరికి అందాల్సిన అన్ని రకాల సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ఎగనామం పెడుతోంది. కాకినాడ జగన్నాథపురంలో దివ్యాంగురాలైన ఓ అంగన్వాడీ ఆయాకు ప్రభుత్వం రూ.6 వేల సామాజిక భద్రతా పెన్షన్ ఇవ్వాల్సి ఉంది. ఆమె పేరు ప్రభుత్వ ఉద్యోగిగా నమోదైందని, ఆయాగా ఆమె నెలకు రూ.7 వేల గౌరవ వేతనం అందుకుంటోందని పేర్కొంటూ సామాజిక భద్రతా పెన్షన్ ఇవ్వడానికి అధికారులు నిరాకరించారు. వివిధ స్థాయిల్లో అధికారులను నిలదీస్తే తప్ప ఆమెకు ఆ పెన్షన్ మంజూరు చేయలేదు. ఈవిధంగా ఎంతోమంది అంగన్వాడీ సిబ్బంది వివిధ సంక్షేమ పథకాలకు దూరమయ్యారు. పోర్టల్లో ప్రభుత్వ ఉద్యోగి అనే మాటను తొలగించే అవకాశముంది. కానీ, ప్రభుత్వానికి ఆర్థిక భారం కాకూడదనే కుతంత్రంతోనే తొలగించడం లేదని సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఫ వెట్టిచాకిరీతో అంగన్వాడీల నరకయాతన ఫ జిల్లాలో 3,916 మంది సిబ్బంది ఫ పోర్టల్లో ప్రభుత్వోద్యోగులుగా తప్పుడు నమోదు ఫ సంక్షేమ పథకాలు వర్తించక అగచాట్లు జిల్లాలో ఐసీడీఎస్ ప్రాజెక్టులు 9 సీడీపీఓలు 9 సెక్టార్లు 70 సూపర్వైజర్లు 56 మొత్తం సెంటర్లు 1,986 అంగన్వాడీ కార్యకర్తలు 1,980 ఆయాలు 1,936 సేవలు పొందుతున్న గర్భిణులు 8,966 బాలింతలు 8,985 6–36 నెలల బాలలు 45,701 3–6 ఏళ్ల బాలలు 22,639 ఖాళీ పోస్టుల వివరాలు సూపర్వైజర్లు 24 ఆయా 50 అంగన్వాడీ టీచర్ 6 మొత్తం 80 మద్దతిచ్చిన వారు మాయమయ్యారు గతంలో సమస్యలపై ఉద్యమిస్తే మద్దతిచ్చిన కూటమి నేతలు ఇప్పుడు మాయమయ్యారు. ఆఖరికి చనిపోతే ఇచ్చే మట్టి ఖర్చుల్లోనూ మాయాజాలం చేస్తున్నారు. రూ.20 వేలు ఇవ్వాలని అప్పటి ప్రభుత్వం తీర్మానిస్తే రూ.15 వేలు మాత్రమే ఇవ్వాలని కూటమి సర్కారు జీఓ ఇచ్చింది. మరో తప్పుడు జీఓతో గ్రాట్యుటీ ప్రయోజనానికి వక్రభాష్యం చెప్పి అంగన్వాడీల భవితతో ఆటలాడుతోంది. 2011 నుంచి కేంద్రం తన వాటాగా అంగన్వాడీల జీతం పెంచలేదు. దశాబ్ద కాలంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.3,200 మాత్రమే పెంచింది. పీఎఫ్, ఈఎస్ఐ వంటి ప్రయోజనాలేవీ లేవు. ప్రభుత్వ వైఫల్యమే ఇన్ని సమస్యలకు కారణం. – గోసంగి బేబీరాణి, రాష్ట్ర అధ్యక్షురాలు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ -
కల్తీ కుళ్లు కూటమి నేతల్లోనే..
జగ్గంపేట: తిరుపతి లడ్డూలో కల్తీ లేదని విచారణ సంస్థలు చెప్పడాన్ని కూటమి నేతల తట్టుకోలేక పోతున్నారని, కల్తీ కుళ్లు అంతా కూటమి నేతలలోనే వుంది తప్ప లడ్డూలో కాదని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్చార్జి తోట నరసింహం విమర్శించారు. జగ్గంపేట మండలం రాజపూడి గ్రామంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా వున్న శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులు మనోభావాలు దెబ్బ తినేలా లడ్డూ రాజకీయాన్ని కూటమి నేతలు కొనసాగించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల పట్ల, కూటమి నేతలకు కనీసం గౌరవం లేదని, తమ తప్పలను కప్పి పుచ్చుకోవడానికి చంద్రబాబు అండ్ కో ఎంతకై నా దిగజారుతారని విమర్శించారు. చంద్రబాబు అధికారంలో వున్నప్పుడు ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ప్రమాదాలు జరగడం, భక్తులు మరణించడం లాంటి ఘటనలు అనేకం జరగడం హిందువులు గమనిస్తున్నారని అన్నారు. చంద్రబాబు చేసే తప్పులకు భక్తులు బలికావడం పరిపాటిగా మారిందని ఆరోపించారు. గతంలో రాజమహేంద్రవరం పుష్కరాల సమయంలోను, ఇప్పడు సింహాచలం, తిరుపతిలోనూ జరిగిన ఘటనలలో అనేక మంది భక్తులు ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారని అన్నారు. శ్రీశైలంకు శివ మాల ధరించి వచ్చిన శివస్వాములకు సౌకర్యాలు కల్పించలేక వారిపై లాఠీచార్జి చేసిన దుర్మార్గపు ప్రభుత్వం చంద్రబాబుదని విమర్శించారు. తిరుపతి లడ్డూ కల్తీ పేరుతో వైఎస్సార్ సీపీని, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని ప్రజలకు ముఖ్యంగా హిందువులకు దూరం చేయాలని చంద్రబాబు చేసిన కుట్ర రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి భక్తులకు అర్థమయిందని అన్నారు. చేసిన తప్పును ఒప్పుకునే ధైర్యంలేక ఇంకా కల్తీ కుళ్లు రాజకీయాలు చంద్రబాబు కొనసాగిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రులుగా వైఎస్.రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో వేంకటేశ్వరస్వామి ఆలయాలు రాష్ట్రంలోను, దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా నిర్మించడానికి కృషి జరిగిందని చెప్పారు. శ్రీవాణి దర్శనం ఏర్పాటు చేసి ఆ సొమ్ముతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని వివరించారు. తిరుపతి వెంకన్న చంద్రబాబును క్షమించడు కేవలం వైఎస్సార్ సీపీని అణచివేయాలనే ఉద్దేశంతో తిరుపతి వేంకటేశ్వరస్వామిని రాజకీయాలకు వాడుకుంటే ఆయన చంద్రబాబును క్షమించడని అన్నారు. నిజంగా లడ్డూలో కల్తీ జరిగివుంటే బీజేపీ ఎప్పుడో విమర్శలు చేసేదని, లడ్డూ కల్తీపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాని, హిందూ సంస్థలు కాని ఎక్కడా మాట్లాడడం లేదని, తప్పు ఎవరితో వారికి తెలుసని అన్నారు. కూటమి నేతలు చేస్తున్న తప్పడు ఆరోపణలను ప్రశ్నించినందుకు వైఎస్సార్ సీపీ సీనియిర్ నేత అంబటి రాంబాబును రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో పెట్టారని, ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఖూనీ చేస్తున్నారని అన్నారు. పార్టీ జగ్గంపేట మండల అధ్యక్షుడు రావుల గణేష్రాజా, గోకవరం మండల అధ్యక్షుడు పాటి రాంబాబు, నేతలు రామకుర్తి శ్రీరామచంద్రమూర్తి, కరుటూరి వీర్రాజు పాల్గొన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పుణ్యక్షేత్రాలలో అపచారాలు, భక్తుల మరణాలు శ్రీశైలంలో శివస్వాములపై లాఠీచార్జి అన్యాయం మాజీ మంత్రి, తోట నరసింహం -
బడి బస్సు సీజ్
ముమ్మిడివరం: పాఠశాల బస్సులపై రవాణా శాఖాధికారులు జరిపిన దాడుల్లో నిబంధనలు పాటించని రెండు పాఠశాల బస్సులపై కేసులు నమోదు చేసి రూ.33,200 అపరాధ రుసుము విధించినట్టు జిల్లా రవాణా శాఖాధికారి డి.శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాలో బుధవారం వివిధ ప్రాంతాలలో రవాణా శాఖాధికారులు దాడులు నిర్వహించారు. అలాగే నిబంధనలు పాటించని ఒక బస్సును సీజ్ చేశామన్నారు. ఓవర్ లోడింగ్, అతివేగం, సెల్ఫోన్ డ్రైవింగ్పై దృష్టి పెడుతున్నామని పట్టుబడిన డ్రైవర్లపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ తనిఖీలలో ఎంవీఐ సురేష్కుమార్ కౌశిక్ పాల్గొన్నారు. బంగారు, వెండి ఆభరణాల చోరీ నల్లజర్ల: మండలంలోని దూబచర్లలో పూరెల్ల పవన్కు చెందిన ఇంటి తలుపులు పగులగొట్టి ఇంట్లోని బీరువా తాళాలు పగులగొట్టి అందులోని 7 కాసుల బంగారు ఆభరణాలు, 200 గ్రాముల వెండి వస్తువులు చోరీకి గురయ్యాయి. ఇంటి యజమాని పవన్ తనకు కొడుకు పుట్టిన ఆనందంలో తన అత్తవారింటికి ప్రకాశరావుపాలెం వెళ్లారు. ఇంటి పరసర ప్రాంతాల వారు తనకు ఫోన్ చేసి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయని చెప్పడంతో వచ్చి చూడగా చోరీ విషయం బయటపడినట్టు పవన్ తెలిపారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ రాంబాబు, ఎస్సై దుర్గాప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి కేసులో మరొకరి అరెస్టు గంగవరం: గంజాయి స్మగ్లింగ్, సరఫరా, ప్యాకింగ్, డబ్బుల పంపిణీ కేసులో ప్రధాన నిందితుడు, పరారీలో ఉన్న లాకే సహదేవ్ అలియాస్ టైగర్ సాయిని అరెస్టు చేసినట్లు ఎస్సై వెంకటేష్ బుధవారం తెలిపారు. స్టేషన్ పరిధిలో నమోదు చేసిన 187 కిలోల గంజాయి తరలింపు కేసులో సాయి పరారీలో ఉన్నాడన్నారు. ఒడిశాలోని చిత్రకుండ–జనబ గ్రామంలో ఉంటున్న లాకే సహదేవ్ది చింతపల్లి మండలం గడపరాయి గ్రామమని ఆయన తెలిపారు. అడ్డతీగల సీఐ బి.నరసింహమూర్తి పర్యవేక్షణలో కేసు విచారించినట్టు ఎస్సై తెలిపారు. ఆధునిక పద్ధతులతో అతని కదలికలపై నిఘా ఉంచి అరెస్టు చేసినట్టు ఆయన తెలిపారు. అతడు కిర్ల్లంపూడి స్టేషన్లో 80 కిలోల గంజాయి రవాణా కేసులో, గొలుగొండలో 193 కిలోల గంజాయి రవాణా కేసుల్లో కూడా ఉన్నట్లు వెలుగులోకి వచ్చిందని, నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
‘ఆర్చి’ నిర్మాణం ప్రారంభం
అన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో మొదటి ఘాట్రోడ్ వద్ద నుంచి రత్నగిరికి నిర్మించిన రెండో మెట్ల దారి ప్రారంభంలో ఆర్చి నిర్మాణ పనులు ఆరంభమయ్యాయి. దీంతో బాటు మెట్లకు ఇరువైపులా భక్తుల భద్రతకు పిట్టగోడ పనులు కూడా ప్రారంభించారు. సుమారు రూ.30 లక్షల వ్యయంతో చేయనున్నారు. పది అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పున ఆర్చి నిర్మించనున్నారు. దేవస్థానం కళాశాల మైదానం ఎదురుగా గల ఘాట్ రోడ్ నుంచి రత్నగిరికి నిర్మించిన రెండో మెట్లదారి నిర్మాణం పనులు పూర్తయ్యాయని, ఆర్చి, పిట్టగోడ నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాక ఈ మెట్లదారిని ప్రారంభిస్తామని ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. పొట్టి శ్రీరాములు ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం జగ్గంపేట: అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్టుకు రూ.10 లక్షల విరాళాన్ని పెద్దాపురానికి చెందిన లలితా ఎంటర్ప్రైజెస్ అధినేతలు మట్టే సత్యప్రసాద్, శ్రీనివాస్ బుధవారం అందజేశారని ఆర్యవైశ్య కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కొత్త కొండబాబు తెలిపారు. జగ్గంపేటలో ఆయన మాట్లాడుతూ అమరావతిలో ఏర్పాటు చేయనున్న 58 అడుగుల కాంస్య విగ్రహం, స్మృతి వనం, ఆడిటోరియం కోసం విరాళంగా రూ.10 లక్షలను వారు అందజేశారని చెప్పారు. రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దొండి రాకేష్తో కలిసి వెళ్లి పెద్దాపురంలో మట్టే సోదరులను కలిసామని చెప్పారు. వారు చెక్ను అందజేసారని తెలిపారు. మట్టే సోదరులను శాలువాలతో సత్కరించినట్లు ఆయన చెప్పారు. గుండెపోటుతో వైద్యుడి మృతి నిడదవోలు: పట్టణంలోని అమ్మ హాస్పిటల్ వైద్యుడు, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంవో అందే వీవీఎస్ తాతారావు (56) బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. తణుకులో విధులు ముగించుకుని నిడదవోలు ఇంటికి కారులో వస్తుండగా ఉండ్రాజవరం రాగానే ఆయనకు గుండెపోటు వచ్చింది. కారును రోడ్డు పక్కగా ఆపగా స్థానికులు గమనించి బయటకు తీసి అంబులెన్సులో తణుకు తరలిస్తుండగానే కన్నుమూశారు. ఆయనకు భార్య లావణ్య, కుమార్తెలు చిట్టి ప్రణతి, ప్రవళ్లిక ఉన్నారు. తాతారావు తల్లి మొగల్తూరు వైఎస్సార్ సీపీ ఎంపీపీగా చేస్తున్నారు. తండ్రి భుజంగరావు వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. ఆయన మృతికి రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే గెడ్డం శ్రీనివాస్ నాయుడు తదితరులు సంతాపం తెలిపారు. మహాలక్ష్మి ఆలయానికి రూ.11.5 లక్షల విరాళాలు పి.గన్నవరం: లంకల గన్నవరం గ్రామ దేవత మహాలక్ష్మి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి బుధవారం పలువురు గ్రామస్తులు రూ.11.5 లక్షల మేర విరాళాలు అందజేశారు. యర్రంశెట్టి అచ్యుత రామయ్య కుమారుడు రాజారావు రూ.3.01 లక్షలు, మొండెపులంక లాకు ప్రాంతానికి చెందిన యర్రంశెట్టి నాగేశ్వరరావు రూ.2.25 లక్షలు, యర్రంశెట్టి రాజు (జొన్నలరాజు) రూ.2.06 లక్షలు, యర్రంశెట్టి సత్యనారాయణ కుటుంబ సభ్యులు రూ.1.6 లక్షలు, యర్రంశెట్టి చిన్న లోన వారి సేవా కమిటీ సభ్యులు రూ.1.01 లక్షలు, తాపీమేస్త్రి అంబటి దుర్గారావు రూ.50 వేలు, గన్నవరపు అప్పారావు కుటుంబ సభ్యులు రూ.21 వేలు, రామేశ్వరపు గోవిందరావు రూ.20 వేలు, యర్రంశెట్టి బులి వెంకయ్య కుటుంబ సభ్యులు రూ.20 వేలు, లంకే పాల్గుణ రూ.15 వేలు, ఇంకా పలువురు దాతలు విరాళాలు అందజేశారు. ఈ సందర్భంగా దాతలను ఆలయ కమిటీ సభ్యులు సత్కరించారు. -
పొల్లూరు జల్లింత కావాలిలే...
మోతుగూడెం: ప్రకృతి అందాలకు నిలయమైన పొల్లూరు జలపాతం అభివృద్ధిపై అటవీ శాఖ దృష్టి సారించింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హాయంలోనే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు తయారై పనులు కూడా మొదలయ్యాయి. ఇందులో భాగంగా అక్కడి మౌలిక వసతుల కల్పనపై ఆ అటవీశాఖ దృష్టి సారించింది. ఏపీ జెన్కో సంస్థ కేటాయించిన రూ.50 లక్షల సీఎస్సార్ నిధులతో ఈ పనులు చేపట్టారు. అభివృద్ధితో పాటు సౌకర్యాలు.. ఏపీ జెన్కో సంస్థ ఇచ్చిన నిధులతో పొల్లూరు జలపాతం వద్ద అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. వర్షాకాలంలో ముఖ్యంగా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈ జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తూ పర్యాటకులకు కనువిందు చేస్తుంది. కొండల మధ్య సుమారు 50 అడుగులు ఎత్తు నుంచి నీరు జాలువారుతూ ఎందరో పర్యాటకులను ఆకర్షిస్తుంటుంది. ఈ జలపాతం పొల్లూరు నుంచి డొంకరాయికి వెళ్లే మార్గంలో రహదారికి అర కిలోమీటరు దూరంలో ఉంది. ఫోర్బే, డొంకరాయి అటవీ ప్రాంతాల నుంచి ప్రవహిస్తూ కొల్లూరు వద్ద సీలేరు నదిలో కలుస్తుంది. ఇక్కడి జలపాతం ప్రవేశ ద్వారాన్ని ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. సుమారు 50 వరకు కార్లు పార్కింగ్ చేయడానికి అనుకూలంగా ఈ స్థలాన్ని చదును చేశారు. అలాగే పర్యాటకులు సేదతీరేందుకు రెల్లుగడ్డితో నిర్మిచిన పగోడాలను, కూర్చొనేందుకు వీలుగా గ్రానైట్ బెంచ్లు ఏర్పాట్లు చేశారు. జలపాతాన్ని చూడడానికి వచ్చే మహిళల సౌకర్యం కోసం మూడు మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునేందుకు మూడు గదులు నిర్మిస్తున్నారు. అంతే కాకుండా కెప్ట్రే (టీ,కాఫీతో పాటు టిఫిన్, శీతల పానీయాలు) అందించేందుకు షాప్ను ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు సేవానియర్స్ ఏర్పాటు చేసి స్థానికంగా ఉండే అటవీ ఉత్పత్తులను ఈ స్టాల్లో ఉంచి పర్యాటకులకు అందిస్తున్నారు. ఇవే కాకుండా పది మీటర్ల సీసీ రహదారిని రూ.3.5 లక్షలతో నిర్మించారు. సోలార్ సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. పార్కింగ్ ప్రాంతాల్లో చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేన్నారు. అలాగే చెత్త లేకుండా శుభ్రంగా ఉంచడానికి డస్ట్బిన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు 70 శాతం సుందరీకరణ పనులు, మౌలిక సదుపాయాల కల్పన పూర్తయినట్లు స్థానిక రేంజర్ జి.నానాజీ తెలిపారు. అటవీ మార్గంలో ట్రెక్కింగ్ మారేడుమిల్లి మండలం గుడిస ప్రాంతానికి మోతుగూడెం సమీపాన సుకుమామిడి గ్రామం నుంచి (ఏనుగుల బాట ) 12 కిలోమీటర్ల మేర ట్రెక్కింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఐదు నెలల క్రితం ఈ గ్రామం నుంచి గుడిస వరకు కొండలు గుట్టలపై ట్రెక్కింగ్ మార్గానికి అటవీశాఖ అధికారులు సర్వే చేశారు. సుమారు ఐదు మీటర్ల వెడల్పున 12 కిలోమీటర్ల మేర కాలిబాటకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అటవీ శాఖ ప్రధాన కార్యాలయం నుంచి అనుమతులు రాగానే దీనికి రూపకల్పన చేయనున్నట్టు వారు తెలిపారు. ట్రెక్కింగ్ చేయాలనుకునే వారి నుంచి కొంత రుసుము తీసుకొని గైడ్లను ఏర్పాటు చేస్తామని, వర్షాకాలం లోపు ఫైర్ క్యాంపింగ్తో పాటు, నైట్ స్టే చేసేందుకు క్యాంపింగ్ టెంట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. వీటి వల్ల రాత్రి వేళల్లో కూడా గుడిసె అందాలను తిలకిస్తూ గడిపేందుకు అవకాశం ఉంటుంది. పర్యాటకులు బస చేసేందుకు మోతుగూడెంలో ఏపీ జెన్కో అతిథి గృహం ఉంది. ఇందులో ఆరు గదులు ఉన్నాయి. ఇవి అద్దెకు ఇచ్చే అవకాశం ఉంది. ప్రైవేట్ రిసార్టులు పొల్లూరులో ఒకటి, మోతుగూడెంలో ఏడు ఉన్నాయి. గదికి 24 గంటలకు రూ.2500 వరకు అద్దె ఉంటుంది. -
నాడి కాదు.. నోటు పడితే నర్సింగ్!
కాకినాడ క్రైం: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహిస్తున్న నర్సింగ్ పరీక్షలు వివాదాస్పదంగా మారాయి. విజయవాడలోని బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ (బీఈ జీఎన్ఎం బోర్డు) ఆధ్వర్యంలో జనవరి 19 నుంచి ఫిబ్రవరి 13 వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కనీస తరగతులు కూడా నిర్వహించకుండా విద్యార్థులకు పరీక్షలకు పంపే ప్రైవేటు నర్సింగ్ పాఠశాలల యాజమాన్యాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతున్నట్టు తెలుస్తోంది. కాకినాడ, రాజమహేంద్రవరంలో పరీక్షలు జరుగుతుండగా కాకినాడ, ఒంగోలు నుంచి రాజమహేంద్రవరానికి ఓఎస్డీగా వెళ్లిన ఇద్దరు నర్సింగ్ ట్యూటర్లు ఈ వసూళ్లు, కాపీయింగ్లలో కీలకంగా వ్యవహరిస్తూ సంబంధిత అధికారులను సైతం భాగం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో... కాకినాడ కేంద్రంగా జీజీహెచ్ అధికారుల నిర్వహణలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జీఎన్ఎం పరీక్షలు జరిగేవి. కాగా, పరీక్షలు రాస్తున్న వారి సంఖ్య 8,000కు చేరే సరికి నిర్వహణ క్లిష్టంగా మారింది. దీంతో రాజమహేంద్రవరం సమీపంలోని పాఠశాలల విద్యార్థులకు అక్కడ జీజీహెచ్లోనే పరీక్షలు నిర్వహించే ఏర్పాటు చేశారు. అంతకు ముందు నర్సింగ్ పరీక్షలలో కీలకంగా వ్యవహరించిన ఓ గుమాస్తా 18 ఏళ్లుగా అదే స్థానంలో పనిచేశారంటే వసూళ్లు ఏ మేరకు సాగి ఉంటాయో అంచనా వేయొచ్చు. ఈ పరిస్థితిని గమనించిన అప్పటి సూపరింటెండెంట్ అతనిని వేరే విభాగానికి సాగనంపారు. పరీక్షలు నిర్వహించే ప్రతీసారీ ఇదే తంతు నడిచేది. తాజాగా కాకినాడలో కాపీయింగ్ నియంత్రించినా, రాజమహేంద్రవరంలో వసూళ్లు సైతం యథేచ్ఛగా సాగుతున్నట్టు అక్కడ పరీక్షలు రాసి వచ్చినవారే చెప్పడం గమనార్హం. దీనిపై ఏకంగా ఇంటిలిజెన్స్ విభాగం ఆరా తీస్తోందంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. సబ్జెక్టుకు రూ.500 స్కూలుకి రూ.25 వేలు! రాజమహేంద్రవరంలో ప్రాక్టికల్స్ కోసం ప్రతి విద్యార్థి నుంచి సబ్జెక్టుకు రూ.500 చొప్పున వసూలు చేయగా, ప్రతి నర్సింగ్ స్కూల్ నుంచి థియరీ పరీక్షల కోసం రూ.25 వేల చొప్పున మొత్తం సుమారు రూ.40 లక్షల పైచిలుకు ఉండవచ్చని తెలుస్తోంది. దీంతో పరీక్ష హాల్లో నోట్సులు, స్లిప్పులను అనుమతిస్తున్నారనే చర్చ సాగుతోంది. దీనికి బలం చేకూర్చేలా తలుపులు మూసి పరీక్షలు నిర్వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాకినాడలో 33 పాఠశాలల్లోని 4,142 మంది, రాజమహేంద్రవరంలో 20 స్కూళ్లకు చెందిన సుమారు 3,500 మంది ఈ పరీక్షలు రాస్తున్నారు. మొత్తం 7 వేలపై చిలుకు ప్రాక్టికల్స్, థియరీ రెండు పరీక్షలకు హాజరవుతున్నారు. ఇంటలిజెన్స్ విచారణ.. రాజమహేంద్రవరం నర్సింగ్ పరీక్షల్లో అవినీతి రట్టవడం ఇంటలిజెన్స్ విభాగం రంగంలోకి దిగింది. వారు ఆస్పత్రిలో క్షేత్రస్థాయి విచారణ చేపట్టి వసూళ్లు, కాపీయింగ్ వ్యవహారంపై విద్యార్థులు సహా క్షేత్రస్థాయిలో ఆరా తీశారు. వారు పలు విధాలుగా విచారణ చేస్తున్నారు. కాకినాడ, రాజమహేంద్రవరంలో జీఎన్ఎం పరీక్షలు తలుపులు వేసి కాపీ చేయిస్తున్నారనే ఆరోపణలు ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ఇంటలిజెన్స్ విచారణ -
ఉత్సాహంగా సెపక్ తక్రా పోటీలు
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో సెపక్ తక్రా మెన్, ఉమెన్ అంతర్ కళాశాలల, వర్సిటీ జట్టు ఎంపికలను వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ బుధవారం ప్రారంభించారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలకు 30 మంది అబ్బాయిలు, 12 మంది అమ్మాయిలు హాజరయ్యారు. వీరిలో ప్రతిభ కనబరిచిన 8 మంది అబ్బాయిలను, ముగ్గురు అమ్మాయిలను వర్సిటీ జట్టుకు ఎంపిక చేశారు. వీరికి శిక్షణ ఇచ్చిన అనంతరం నైపుణ్యం ప్రదర్శించిన వారిని మార్చి 11 నుంచి 14వ తేదీ వరకు అస్సాం యూనివర్సిటీలో జరిగే టోర్నమెంట్లకు పంపిస్తారని వీసీ తెలిపారు. అత్యుత్తమ ప్రతిభను కనబరచి జాతీయ స్థాయిలో యూనివర్సిటీ ప్రతిష్టను ఇనుమడింపజేయాలని ఆమె విద్యార్థులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ పి. వెంకటేశ్వర్రావు, కార్యదర్శి డాక్టర్ కె.బాలసత్యనారాయణ, పరిశీలకుడు డాక్టర్ ఎంవీఎస్ఎస్ మూర్తి, సెలక్షన్ కమిటీ సభ్యులు కె.కనకరాజు, కె.సతీష్, అధ్యాపకులు, పీడీలు, ఎంపీఈడీలు, విద్యార్థులు పాల్గొన్నారు. -
యాజమాన్యంతో మొక్కవోని దిగుబడి
● మారిన వాతావరణంతో తెగుళ్లు ● సస్య రక్షణతో నివారించవచ్చునని సూచిస్తున్న వ్యవసాయ అధికారులు పెరవలి: మొక్కజొన్న పంటపై తెగుళ్ల ఉధృతి అధికంగా ఉంది. జిల్లాలో పెరవలి, నిడదవోలు, కొవ్వూరు, చాగల్లు, దేవరపల్లి, పోలవరం, నల్లజర్ల మండలాల్లో 1500 ఎకరాల్లో రబీ పంటగా దీనిని వేశారు. చల్లటి, వెచ్చని వాతావరణం ఉండడంతో ఈ పంటను తెగుళ్లు ఆశించాయి. ముఖ్యంగా కాండం తొలిచే చారల పురుగు, గులాబీరంగు పురుగు, రసం పీల్చే పురుగులు, ఆకుమాడు తెగులు, మసికుళ్లు తెగులు ఆశించి ఉన్నాయి. వీటి నివారణకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎరువుల యాజమాన్య పద్ధతుల గురించి కొవ్వూరు ఏడీఏ సీహెచ్ శ్రీనివాస్రావు వివరించారు. రసం పీల్చే పురుగులు మొక్కజొన్న పంట వేశాక 30 రోజుల వయసు కలిగిన పంటపై నల్లి, పేనుబంక ఆశిస్తాయి. తల్లి, పిల్ల పురుగులు మొక్క ఎదిగే భాగాల నుంచి, ఆకుల నుంచి రసం పీల్చడం వల్ల ఆకులు లేత పసుపు రంగుకు మారి గిడసబారిపోతాయి. ఈ పురుగులు తేనె లాంటి జిగురును విడుదల చేసి శిలీంధ్రాలు ఉత్పత్తి అయ్యేందుకు దోహదపడతాయి. దీనితో తెగులు ఉధృతి మరింత పెరుగుతుంది. నివారణ చర్యలు రసం పీల్చే పురుగులు ఆశించినట్లు గమనించిన వెంటనే డైమిథోయేట్ 2 మిల్లీ లీటర్లు లేదా ఎసిఫేట్ గ్రాము మందు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మసికుళ్లు తెగులు ఈ తెగులు సోకిన మొక్కలు మొదట ఆకులు తరువాత కాండం మొదలు భాగం ఆకుపచ్చగా మారి తరువాత గోధుమరంగుకు మారి క్రమేపీ మొక్క ఎండిపోతుంది. కాండం లోపల బెరడు కుళ్లిపోయి నాళాలపై బొగ్గుపొడి లాంటి నల్లని శిలీంధ్ర బీజాలు (స్ల్కిరోషియా) ఏర్పడి కాండం బలహీనపడి ఎండిపోతుంది. నివారణ చర్యలు ఈ తెగులు సోకినట్లు గుర్తించిన వెంటనే కార్బండిజిమ్ గ్రాము లేదా ప్రొపికోనజోల్ 1 మిల్లీ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. చేలో కలుపును నివారించి మొక్కలకు గాలి తగిలేలా చూడాలి. కాండం తొలిచే చారల పురుగు 10 నుంచి 20 రోజుల వయసు కలిగిన పైరును ఈ పురుగులు ఆశించి ఆకుల అడుగుభాగంలో గుడ్లు పెడుతుంది. ఈ గుడ్ల నుండి వచ్చిన పిల్ల పురుగులు మొక్కజొన్న అంకురంలోకి చేరి దానిని తినడంతో మొవ్వ చనిపోయి పంటకు తీవ్ర నష్టం కలుగజేస్తుంది. ఆకులకు రంధ్రాలు ఏర్పరచి తినేస్తాయి. ఈ పురుగులు ఆకులు, కాండాన్ని, పూతని, కంకిని ఆశించి నష్టాన్ని కలుగజేస్తాయి. గులాబీరంగు పురుగు ఈ పురుగు ఎక్కువగా రబీలో ఆశిస్తుంది. ఈ పురుగులు ఆకుల అడుగుభాగాన చేరి రాత్రి సమయాల్లో గుడ్లు పెడతాయి. ఆ గుడ్ల నుంచి వచ్చిన లార్వాలు ఆకుల మీద పత్ర హరితాన్ని గోకి తినడం వల్ల ఆకులు పలచగా తయారవుతాయి. అక్కడ నుంచి కాండంలో గుండ్రని లేక ఎస్ ఆకారంలో ఉండే సొరంగాలను ఏర్పాటు చేసుకుని అంకురాన్ని చేరతాయి. అంకురాన్ని తినడం వల్ల మొవ్వు చనిపోతుంది. ఆకులు ఒంగిపోయి రాలిపోతాయి. పై రెండు పురుగులను నివారించడానికి ఇవి సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. నివారణ చర్యలు ఈ పురుగులు ఆశించినట్లు రైతులు గుర్తించిన వెంటనే ఎకరం చేనుకి క్లోరాంట్రానిలిప్రోల్ 60 మిల్లీ లీటర్లు లేదా ఫ్లూబెండీఎమైండ్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. లేదా కార్బోఫ్యూరాన్ 3జి గుళికలు 3 కిలోలు మొక్కల మొవ్వలో వేయాలి. -
శివరాత్రి ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో మహాశివరాత్రి ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ షణ్మోహన్ సగిలి తెలిపారు. కలెక్టరేట్లో మంగలవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 15న మహా శివరాత్రి సందర్భంగా పిఠాపురం, సామర్లకోట శైవ క్షేత్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లో చేపట్టిన ఏర్పాట్లను వివరించారు. ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకూ పిఠాపురం, సామర్లకోట శైవక్షేత్రాల్లో శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయన్నారు. పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి, సామర్లకోటలోని చాళుక్య కుమారారామ భీమేశ్వరస్వామి వారి ఆలయాలకు లక్షలాదిగా భక్తులు వచ్చే అవకాశముందని, వారికి ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. గత ఏడాది పిఠాపురం 70 వేల మంది భక్తులు వచ్చారని, ఈసారి అంతకు మించి వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. దీనికి అనుగుణంగా క్యూలు, తాగునీటి సరఫరా, ఆహారం, స్నాన ఘట్టాల్లో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పారిశుధ్య నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. మంచినీటి నాణ్యతను పరీక్షించి, సరఫరా చేస్తామని చెప్పారు. పాదగయ పుష్కరిణిలో భక్తుల పుణ్యస్నానాలకు ఏలేరు నుంచి కొత్త నీరు వచ్చేలా ఇప్పటికే నీటిని విడుదల చేస్తున్నామన్నారు. ఈ రెండు క్షేత్రాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని, 108 వాహనాలు కూడా అందుబాటులో ఉంటాయని చెప్పారు. వీఐపీ, ప్రొటోకాల్ దర్శనాలను క్రమబద్ధీకరిస్తూ సామాన్య భక్తులకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. లింగోద్భవ పూజా సమయంలో అంతరాలయ దర్శనాలను రద్దు చేశామన్నారు. దీనికి వీఐపీలు కూడా సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 3 గంటల మధ్యనే వీఐపీలకు ప్రొటోకాల్ దర్శనం కల్పిస్తామన్నారు. ప్రత్యేక దర్శనం కోసం ఎటువంటి పాసులూ జారీ చేయడం లేదని షణ్మోహన్ స్పష్టం చేశారు. ఎస్పీ జి.బిందుమాధవ్ మాట్లాడుతూ, శైవక్షేత్రాల్లో ప్రస్తుతం ఉన్నవాటికి అదనంగా 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పిఠాపురం పాదగయ వద్ద భక్తుల రద్దీని అంచనా వేసేందుకు కంట్రోల్ రూము ఏర్పాటు చేసి, దీనికి సీసీ కెమెరాలను అనుసంధానం చేస్తామని చెప్పారు. క్యూల క్రమబద్ధీకరణకు డ్రోన్లను కూడా వినియోగిస్తున్నామన్నారు. శివరాత్రి సందర్భంగా 3 వేల నుంచి 10 వేల మంది వరకూ భక్తులు వచ్చే 15 దేవాలయాలను జిల్లాలో గుర్తించామన్నారు. అక్కడ కూడా అన్ని ఏర్పాట్లూ చేస్తున్నామన్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ చెప్పారు. సమావేశంలో డీఆర్వో టి.తిప్పేనాయక్ కూడా పాల్గొన్నారు. ఫ సామాన్య భక్తులకు అత్యధిక ప్రాధాన్యం ఫ కలెక్టర్ షణ్మోహన్ -
వక్ఫ్ బోర్డు ఆస్తులను ప్రైవేటుకు అప్పగించవద్దు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్న ముస్లింల సంపదను ఐటీ పార్కు పేరిట ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పే ప్రయత్నాలను విరమించుకోవాలని వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ జోనల్ అధ్యక్షుడు అబ్దుల్ బషీరుద్దీన్ ప్రభుత్వాన్ని కోరారు. పార్టీ ఆదేశాల మేరకు కలెక్టరేట్లో డీఆర్వో తిప్పేనాయక్కు మంగళవారం ఆయన వినతిపత్రం సమర్పించారు. ముస్లిం సమాజ అభివృద్ధి కోసం గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం చినకాకాని మండలంలో అంజుమన్ ఏ ఇస్లామియా సంస్థకు 1915లో 81.23 ఎకరాల భూమిని దాతలు ఇచ్చారని తెలిపారు. ఈ భూమిని ముస్లింల స్కిల్ డెవలప్మెంట్, లైబ్రరీ, ముస్లిం పిల్లలకు స్కాలర్షిప్, ముస్లిం విద్యా సంస్థల కోసం ఈ భూమిని ఇచారన్నారు. ఇందులో 71.57 సెంట్ల భూమిని ఏపీఐఐసీకి బదలాయించి, తద్వారా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలనే ఉద్దేశంతో గత ఏడాది డిసెంబర్ 19న గుంటూరు జిల్లా కలెక్టర్ నోటీసు జారీ చేశారన్నారు. తక్షణం దీనిని నిలిపివేయాలని బషీరుద్దీన్ డిమాండ్ చేశారు. డీఆర్వోకు వినతిపత్రం ఇచ్చిన వారిలో మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరీం బాషా, జాయింట్ సెక్రటరీ ఎండీ అలీషా, జిల్లా కార్యదర్శి ఎండీ కరీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
తల్లిదండ్రులను దైవాలుగా భావించాలి
పిఠాపురం: జన్మనిచ్చిన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తూ పీఠాలను, ఆలయాలను, గురువులను సందర్శించినా ముక్తి పొందలేరని పిఠాపురంలోని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య, ఆధ్యాత్మిక పీఠం అధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను దైవాలుగా భావించి, గౌరవించాలని సూచించారు. పీఠం 98వ వార్షిక జ్ఞాన మహాసభల్లో భాగంగా రెండో రోజయిన మంగళవారం పిఠాపురంలోని ఆశ్రమ ప్రాంగణంలో ఆయన భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి మనిషీ రాక్షసత్వాన్ని వీడి ఈశ్వరత్వం వైపు పయనించాలని, దీని కోసం ఆధ్యాత్మిక తత్వాన్ని గ్రహించాలని అన్నారు. ఆధ్యాత్మిక తత్వం, తాత్విక జ్ఞానంతో పొందే తాత్విక శక్తితో మనసును మంచి మార్గం వైపు మరల్చుకోవచ్చని చెప్పారు. అరిషడ్వర్గాలను స్థాయి పరచుకుంటే అది సాధ్యమవుతుందన్నారు. పీఠం అందిస్తున్న ధ్యాన, జ్ఞాన, మంత్ర, సాధనలతో కూడిన త్రయీ సాధన ద్వారా మనసులో ఉద్భవించే చెడు భావనలను నియంత్రించవచ్చని చెప్పారు. ఆధ్యాత్మిక చైతన్యమే సామాజిక చైతన్యానికి బీజం వేస్తుందని, ఆధ్యాత్మిక తత్వాన్ని గ్రహించడం ద్వారా అశాంతి, ఆందోళన, ఒత్తిడి వంటి వాటి నుంచి విముక్తి పొందవచ్చునని ఆలీషా అన్నారు. అనంతరం పీఠం రూపొందించిన పరతత్వ కీర్తనల గ్రంథాన్ని, పీఠం తెలుగు, ఇంగ్లిష్, హిందీ బ్రోచర్లను ఆయన ఆవిష్కరించారు. సభలో ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, మాజీ ఎమ్మెల్సీ, కిమ్స్ మెడికల్ కాలేజ్ చైర్మన్ చైతన్యరాజు, ప్రముఖ సిద్ధాంతి గరిమెళ్ల వెంకట రమణ, గిడుగు రామ్మూర్తి మనుమరాలు క్రాంతికృష్ణ తదితరులు కూడా ప్రసంగించారు. పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఫ రాక్షసత్వం వీడి ఈశ్వరత్వం వైపు పయనించాలి ఫ డాక్టర్ ఉమర్ ఆలీషా -
వైఎస్సార్ సీపీ నేత సూర్యచక్రరెడ్డి ఆకస్మిక మృతి
తుని: వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు అనిశెట్టి సూర్యచక్రరెడ్డి (60) మంగళవారం ఆకస్మికంగా మృతి చెందారు. పట్టణ శివారులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సూర్యచక్రరెడ్డి మృతి వార్త తెలియగానే ఆయన నివాసానికి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా చేరుకున్నారు. సూర్యచక్రరెడ్డి పార్థివ దేహానికి పూలమాల వేసి, శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సమకాలీన రాజకీయాల్లో వివాదరహితుడిగా పేరొందిన సూర్యచక్రరెడ్డి ఆకస్మిక మృతి వైఎస్సార్ సీపీకి తీరని లోటని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం నాయకుడిగా పని చేశారని చెప్పారు. ప్రజల పక్షాన పోరాడటంలో ఆయనకు మరొకరు సాటి లేరని కొనియాడారు. రాజకీయ ప్రస్థానంలో టీడీపీకి వ్యతిరేకంగా పని చేశారని గుర్తు చేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి తునిలో అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో కూడా పని చేసి అందరి మన్ననలూ అందుకున్న మహోన్నత నాయకుడిగా సూర్యచక్రరెడ్డి అరుదైన గౌరవం పొందారని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులు దూర ప్రాంతాల్లో ఉన్నందున అంత్యక్రియలు బుధవారం నిర్వహిస్తున్నారని తెలిపారు. సూర్యచక్రరెడ్డి మృతదేహానికి తుని, తొండంగి, కోటనందూరు మండలాలతో పాటు తుని పట్టణానికి చెందిన నాయకులు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు, సర్పంచులు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు నివాళులర్పించారు. బుధవారం జరిగే అంత్యక్రియలకు భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యే అవకాశం ఉందని నాయకులు తెలిపారు. ఫ పార్థివ దేహానికి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా నివాళి ఫ పార్టీకి తీరని లోటని ఆవేదన -
13, 14, 15 తేదీల్లో శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు
అమలాపురం రూరల్: మహాశివరాత్రి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం అమలాపురం ఆర్టీసీ డిపో నుంచి శ్రీశైలం ఆలయానికి ప్రత్యేక బస్సులు నడుపుతామని డీఎం డీఎల్ఎన్ శర్మ తెలిపారు. ఈ నెల 13, 14, 15 తేదీల్లో ఉదయం 9.30, సాయంత్రం 5.30, 6.15, 6.45, రాత్రి 7 గంటలకు ఈ సర్వీసులు నడుస్తాయన్నారు. ఈ బస్సులకు రిజర్వేషన్ సౌకర్యం ఉందని, ప్రయాణికులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అలాగే 15, 16 తేదీల్లో ఉదయం 5 నుంచి రాత్రి 7 వరకూ ప్రతి గంటకూ కుండలేశ్వరానికి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేస్తామన్నారు. భర్త అనుమానం.. మహిళ ఆత్మహత్య రాయవరం: అనుమానంతో భార్యను వేధించి, ఆమె ఆత్మహత్యకు కారణమైన వ్యక్తిని మండపేట రూరల్ సీఐ పి.దొరరాజు మంగళవారం అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. రాయవరం మండలం సోమేశ్వరం గ్రామంలో పాకలపాటి వీర వెంకట లక్ష్మీదుర్గ ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతుందనే అనుమానంతో భర్త మహేష్ తరచూ గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి కూడా ఆమెతో గొడవపడి, సెల్ఫోన్ లాక్కున్నాడు. మనస్తాపానికి గురైన లక్ష్మీదుర్గ మంగళవారం ఉదయం 6 గంటలకు ఇంట్లో ఫ్యాన్కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో నిందితుడు మహేష్ను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. అన్నవరంలో సిబ్బందికి అంతర్గత బదిలీలు అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణస్వామివారి దేవస్థానంలో సీనియర్ అసిస్టెంట్ నుంచి రికార్డు అసిస్టెంట్, రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది వరకూ 68 మందికి అంతర్గత బదిలీలు నిర్వహిస్తూ దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాథరావు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రసాదం విభాగంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న పి.లక్ష్మీనారాయణను నిత్య పూజలు, కల్యాణాల విభాగానికి బదిలీ చేశారు. అతడి స్థానంలో కేశఽఖండన శాలలో పనిచేస్తున్న చిక్కాల సాయిబాబాను నియమించారు. అన్నదానం స్టోర్స్ గుమస్తాగా పనిచేస్తున్న బండారు వెంకట రమణను ప్రసాదం విభాగంలో నియమించారు. వ్రతాల విభాగం సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న వెలగా రమేష్ కుమార్ను రిసెప్షన్కు మార్చారు. ఆయన స్థానంలో అన్నదానంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కంచిభట్ల రాంబాబును నియమించారు. ఇంకా మిగిలిన ఉద్యోగులను కూడా వారి స్థానాల నుంచి ఇతర విభాగాలకు మార్చారు. -
హడావేడి ఏమైందో!
ఉన్నతాధికారులకు నివేదించాం విశ్వసనీయ సమాచారం మేరకు కడియం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాం. ఈ తనిఖీల్లో 911 డాక్యుమెంట్లను తక్కువ వాల్యూకు రిజిస్టర్ చేసినట్లు గుర్తించాం. సబ్ రిజిస్ట్రార్ లక్ష్మి టేబుల్ సొరుగులో రూ.79 వేలు, సమీప లేఖర్ల నుంచి రూ.1.32 లక్షలు స్వాధీనం చేసుకున్నాం. దీనిపై నివేదిక తయారుచేసి ఉన్నతాధికారులకు తెలియజేశాం, వారి ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయి. – ఎం.కిశోర్ కుమార్, డీఎస్పీ, ఏసీబీ, రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం రూరల్: అవినీతికి పాల్పడే ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులపై అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ) దాడులు చేస్తుంది. అలాగే ఆదాయానికి మించిన ఆస్తులున్న వారిపై కూడా నిఘా పెడుతుంది. అవినీతి జరుగుతున్నట్టు ఫిర్యాదు వచ్చిన వెంటనే తనిఖీలు నిర్వహించి, సమగ్రంగా విచారణ జరిపి, అక్రమార్కులను అరెస్టు చేస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ, కడియం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇటీవల జరిగిన దాడి వ్యవహారం మాత్రం దీనికి భిన్నంగా కనిపిస్తోంది. ఈ దాడి తర్వాత అంతా గప్చుప్గా మారింది. తనిఖీ చేసిన ఏసీబీ అధికారులు తదుపరి చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిస్తామంటూ వెళ్లిపోయారు. దాదాపు 12 రోజులు దాటినా ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. టీడీపీకి చెందిన ఓ మాజీ మంత్రి చక్రం తిప్పడం వల్లనే అధికారులు సైలెంట్ అయ్యిపోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాలివీ.. కడియం సబ్ రిజిస్ట్రార్ ఎప్పిలి లక్ష్మి విధుల్లో ఉండగా గత నెల 29వ తేదీన ఏసీబీ డీఎస్పీ కిశోర్ కుమార్ ఆధ్వర్యంలోని బృందం ఆకస్మిక తనిఖీలు చేసింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ తనిఖీల్లో సుమారు 911 డాక్యుమెంట్లను తక్కువ విలువకు రిజిస్టర్ చేసినట్లు గుర్తించామని ఏసీబీ అధికారులు ప్రకటించారు. అలాగే సబ్ రిజిస్ట్రార్ టేబుల్ సొరుగులో రూ.79 వేలు, సమీప లేఖర్ల నుంచి రూ.1.32 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సబ్ రిజిస్ట్రార్, కార్యాలయం సిబ్బంది, లేఖర్ల నుంచి ఏసీబీ అధికారులు ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. దీంతో వారు వేరే నంబర్లతో తమ కార్యకలాపాలను ఎప్పటి మాదిరిగానే చేస్తున్నారని కక్షిదారులు చెబుతున్నారు. తనిఖీల అనంతరం తదుపరి చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిస్తామంటూ ఏసీబీ అధికారులు వెళ్లిపోయారు. అప్పట్నుంచి అంటే దాదాపు పది రోజులుగా లక్ష్మి, సిబ్బంది యథాతథంగా కార్యాలయానికి వచ్చి విధులు నిర్వహిస్తున్నారు. చర్యల్లేనట్టేనా.. అదనంగా డబ్బులు కలిగి ఉండడం, తక్కువ విలువకు డాక్యుమెంట్లను రిజిస్టర్ చేయడం ద్వారా సుమారు రూ.2.62 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించినట్లుగా ఏసీబీ అధికారులు తమ విచారణలో నిర్ధారించారు. అయినప్పటికీ, దీనికి బాధ్యులైన వారిపై ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్న సమయంలోనే పలువురు బాధితులు రిజిస్ట్రార్ కార్యాలయానికి క్యూ కట్టారు. అయితే సంబంధిత అధికారులు వారిని పరిగణనలోకి తీసుకున్న దాఖలాల్లేవని తెలుస్తోంది. గతంలో రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ నేరుగా విచారణ జరిపి పలు అవకతవకలను వెలికి తీశారు. ఆ తరువాత ఏసీబీ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. గతంలో రిజిస్ట్రేషన్ల శాఖాధికారులు తేల్చిన అవకతవకలనే వారు మరోమారు మీడియాకు వెల్లడించారు. అదనంగా డబ్బులు, సెల్ఫోన్లను మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. ఈ తతంగమంతా ఆయా శాఖల విధి నిర్వహణలో భాగంగానే జరిగిందా? లేక ఎవరి ప్రయోజనాల కోసమైనా చేశారా అనే అనుమానాలూ లేకపోలేదు.మాజీ మంత్రి దన్ను ఈ కేసు గప్చుప్గా మారడం వెనుక టీడీపీకి చెందిన ఓ మాజీ మంత్రి హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంబంధిత ఉన్నతాధికారులతో ఆయనే నేరుగా మాట్లాడారని, ఈ నేపథ్యంలోనే విచారణ అనంతరం చర్యలు తీసుకోవడంలో కాలయాపన జరుగుతోందని చెబుతున్నారు. వీలైనంత కాలయాపన అనంతరం గుట్టుచప్పుడు కాకుండా నామమాత్రపు పెనాల్టీతో సరిపెట్టేస్తారని అంటున్నారు. అలా కాకపోతే ఎవరో ఒకరిని బలి చేసి అసలు వ్యక్తులను కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ మరో ప్రచారం కూడా జోరందుకుంది. దీంతో కడియం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఉద్యోగుల్లో అలజడి నెలకొంది. రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారుల విచారణలో ఏం తేలింది? ఎవరైనా తప్పు చేసి ఉంటే చర్యలు తీసుకోవడంలో ఎందుకు ఆలస్యమవుతోందనే ప్రశ్నలకు అటు రిజిస్ట్రేషన్ల శాఖ అధికారుల నుంచి గానీ, ఇటు ఏసీబీ అధికారుల నుంచి గానీ కచ్చితమైన సమాధానం లభించడం లేదు. కడియం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇటీవల ఏసీబీ తనిఖీలు అవకతవకలు గుర్తించినట్టు వెల్లడి దాడుల అనంతరం అంతా గప్చుప్ యథావిధిగా కొనసాగుతున్న సబ్ రిజిస్ట్రార్, సిబ్బంది -
మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి
రాజమహేంద్రవరం రూరల్: మహిళలు, బాలికలపై జరిగే నేరాలతో పాటూ మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ అన్నారు. ఆయన మంగళవారం సాయంత్రం బొమ్మూరు పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. స్టేషన్లోని పలు రికార్డులను, సీసీ కెమెరాలను పరిశీలించి, నమోదైన కేసులపై ఆరా తీశారు. అనంతరం ఐజీ మాట్లాడుతూ సోషల్ మీడియా పోస్టులపై ప్రత్యేక నిఘా ఉంచాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఇన్స్పెక్టర్ కాశీవిశ్వనాథం, ఎస్సైలకు సూచించారు. సైబర్ నేరాలు, సోషల్ మీడియా, యాంటీ డ్రగ్స్, రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పోలీసింగ్లో టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగించాలన్నారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను ఆయనకు ఎస్పీ డి.నరసింహ కిశోర్ వివరించారు. ముందుగా బొమ్మూరు పోలీస్ స్టేషన్లో నూతన భవనాన్ని ప్రారంభించి, మొక్కలు నాటారు. కార్యక్రమంలో సౌత్ జోన్ డీఎస్పీ భవ్య కిషోర్, ఈస్ట్ జోన్ డీఎస్పీ బి.విద్య తదితరులు పాల్గొన్నారు. -
● ఫుట్పాట్లు
చంద్రబాబు ప్రభుత్వం ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టాక మహిళా ప్రయాణికులు బాగా పెరిగారు. కానీ ఆ రద్దీకి అనుగుణంగా బస్సులను పెంచకపోవడంతో వారందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులో కూర్చోవడానికి సీటు కోసం చూసే స్థాయి నుంచి నిలబడే స్థలం దొరికితే చాలనే పరిస్థితి ఏర్పడింది. గతంలో ఫుట్పాత్పై నిలబడితే ప్రమాదమని చెప్పేవారు. ప్రస్తుతం అలాంటి స్థితిలోనే మహిళలు ప్రయాణం చేస్తున్నారు. రాజమహేంద్రవరంలో మంగళవారం కనిపించిన ఈ చిత్రం దానికి నిదర్శనంగా నిలుస్తోంది. – ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్, రాజమహేంద్రవరం -
కంచి కామకోటి విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఆహ్వానం
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కంచి కామకోటి విద్యాసంస్థల్లో ప్రవేశాలకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఆ విద్యాలయాల చీఫ్ కో ఆర్డినేటర్ మాంధాత మాధవి అన్నారు. జయేంద్ర నగర్ వినాయకుని ఆలయంలో మంగళవారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. ఉపనయనమైన బ్రాహ్మణులకు విద్య, వేదం, వైద్యంతో పాటు ఇంగ్లిషు, స్మార్తం, ఆగమనం, సంగీతం, రామాయణం వంటి వాటిలో ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. నాయీ బ్రాహ్మణులకు నాదస్వరం, మంత్రసాని, నర్సింగ్, యాదవులకు గోవిజ్ఞానం, కుమ్మరులకు కుంభాకార విద్య, విశ్వ బ్రాహ్మణులకు తక్ష విద్యతో పాటు ఆంగ్ల విద్యను బోధిస్తామని తెలిపారు. బ్రాహ్మణ ఆడపిల్లలకు సంప్రదాయ విద్య, మడి ఆచారం, ఇంగ్లిషు నేర్పిస్తామన్నారు. తమ విద్యా సంస్థలు తిరుపతిలో ప్రారంభమై దేశ వ్యాప్తంగా పదిచోట్ల ఉన్నాయని చెప్పారు. కాకినాడలోని సూర్యకళా మందిరంలో ఈ నెల 21 ఉదయం 9 గంటల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. కాంచీపురంలోని కంచి చంద్రశేఖర సరస్వతి మహా విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్, ఆర్ట్స్ అండ్ సైన్స్, పారామెడికల్, ఆయుర్వేదం, లా, నర్సింగ్ వంటి కోర్సులకు 2026 – 27 సంవత్సరానికి మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. వారికి వచ్చిన మార్కులను బట్టి స్కాలర్షిప్ సదుపాయం కూడా ఉందన్నారు. తమ విద్యాసంస్థల్లో వార్డెన్లు, వంటవారి ఉద్యోగాలు ఉన్నాయని, ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని మాధవి తెలిపారు. సమావేశంలో ఆకలి మురళీకృష్ణ, మాంధాత సూర్యారావు, మాంధాత స్వర్ణ పాల్గొన్నారు. స్కూల్ బస్సులపై కేసులు రావులపాలెం: నిబంధనలు పాటించని రెండు స్కూల్ బస్సులపై కేసులు నమోదు చేసి రూ.10,200 అపరాధ రుసుము విధించినట్టు జిల్లా రవాణా అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. స్కూల్ బస్సులపై జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు కొనసాగుతున్నాయన్నారు. ఓవర్ లోడింగ్, అతివేగం, సెల్ఫోన్ డ్రైవింగ్పై దృష్టి సారించామన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. -
● మీనమిలలు
● డేంజర్ ఫిష్ పల్లిపాలెం ఫిష్ మార్కెట్కు మంగళవారం వడగర్లు రకం చేపలు ఇబ్బడి ముబ్బడిగా వచ్చాయి. ఈ చేపలన్నీ కలిసి సుమారు మూడు టన్నులు ఉంటాయని మత్స్యకారులు చెప్పారు. వీటిని కేజీ రూ.50 చొప్పున విక్రయిస్తామని, మాంసాహార ప్రియులు ఈ రకం చేపల కోసం ఎదురు చూస్తుంటారన్నారు. అలాగే చాలామంది వాటిని కొనుగోలు చేశారు. వాటిని ఎగుమతి చేసేందుకు ఐస్ బాక్సుల్లో భద్ర పరిచే పనులు చేపట్టారు. – సఖినేటిపల్లి పల్లిపాలెం ఫిషింగ్ హార్బర్ కేంద్రంగా చేసుకుని సోమవారం సముద్రంపై వేటకు వెళ్లిన మత్య్సకారుల వలకు ఇతర రకాల సంపదతో పాటు కొమ్ముకోణం రకం భారీ చేప చిక్కింది. దాన్ని మంగళవారం ఫిష్ మార్కెట్కు తీసుకువచ్చారు. సుమారు 40 కేజీల బరువున్న కొమ్ముకోణం చేపను ఓ వ్యక్తి రూ.8 వేలకు కొనుగోలు చేశాడు. ఈ చేప ముక్కుకు కొమ్ము ఉండడంతో దీన్ని కొమ్ముకోణం అని పిలుస్తామని, మనిషి ప్రాణం తీసే శక్తి దీనికి ఉందని మత్స్యకారులు చెబుతున్నారు. – సఖినేటిపల్లి -
ఉద్రేకాగ్నిని సహనమనే నీటితో చల్లార్చాలి
● అప్పుడే మనస్సుకు ప్రశాంతత ● డాక్టర్ ఉమర్ ఆలీషాపిఠాపురం: ప్రతి వ్యక్తీ తనలో రగులుతున్న ఉద్రేకమనే అగ్నిని సహనం అనే నీటితో చల్లార్చుకోవాలని, అప్పుడే మనస్సు ప్రశాంతంగా ఉంటుందని పిఠాపురంలోని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య, ఆధ్యాత్మిక పీఠం అధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. పీఠంలో మూడు రోజుల పాటు జరిగే 98వ వార్షిక జ్ఞాన మహాసభలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలీషా మాట్లాడుతూ, తాత్విక జ్ఞానం పొందడం ద్వారా మనిషిలో జ్ఞాన నేత్రం తెరచుకుంటుందని అన్నారు. త్రయీ సాధన అనే ఆధ్యాత్మిక దిక్సూచి ద్వారా మానసిక స్థిరత్వం, ధైర్యం అలవడి జీవనాన్ని సుఖమయం చేసుకోవచ్చని చెప్పారు. ప్రతి మనిషీ అంతర్లీనంగా ఉన్న జ్ఞాననేత్రాన్ని గుర్తించగలిగితే భగవంతుడిని దర్శించవచ్చని అన్నారు. మనిషిని మహనీయుడిగా మలిచే జ్ఞాననేత్రం పొందడానికి గురుముఖంగా ఆధ్యాత్మిక తత్వాన్ని గ్రహించాలని సూచించారు. అనంతరం నివేదిక 2026, ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ దేవదారు బ్రోచర్లను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో రైల్వే బోర్డ్ సభ్యుడు నూర్ అహ్మద్, హుస్సేన్ షా, పీఠం సభ్యులు ఏవీవీ సత్యనారాయణ, రేఖా సత్యనారాయణ, ఎన్ఆర్ఐలు దిడ్డి సూర్యకుమార్, శ్రీధర్, డాక్టర్ ఎన్.రాంగోపాల్వర్మ, కె.స్వర్ణలత, టి.సాయి వెంకన్నబాబు, చింతపల్లి అమృతవల్లి తదితరులు కూడా ప్రసంగించారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, ప్రముఖ కవులు యామిజాల ఆనంద్,, డాక్టర్ శిరీష్, సినీ మాటల రచయిత పోలగాని భాను తేజశ్రీ, యోగ భారత్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ జ్యోతుల నాగేశ్వరరావు తదితరులు పీఠాధిపతిని దర్శించుకున్నారు. ఆశ్రమ ప్రాంగణంలో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యాన చిన్నారుల కోసం పాలకేంద్రం, శిశు సంరక్షణ కేంద్రాలను, ప్రాథమిక వైద్య శిబిరం వంటివి ఏర్పాటు చేశారు. పీఠం నిర్వహిస్తున్న తాత్విక బాల వికాస్లో శిక్షణ పొందుతున్న చిన్నారులు మాస్టర్ రేఖా ఉషా కిరణ్ బ్రదర్స్ ఉపన్యాసం సభికులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ, సెంట్రల్ కమిటీ సభ్యులు ఎన్టీవీ వర్మ, డాక్టర్ పింగళి ఆనంద కుమార్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
దూరమైన విద్య
● దూరవిద్య కేంద్రాలకు ఏయూ మంగళం ● కాకినాడ, రాజమహేంద్రవరంలోని స్టడీ సెంటర్ల మూసివేత ● విద్యార్థి నేతల ఆగ్రహం ● వీటిని కొనసాగించాలని డిమాండ్ ● లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరిక బాలాజీచెరువు (కాకినాడ సిటీ): చదువుకోవాలనే ఆశ ఉన్నా.. కుటుంబ పరిస్థితులు అనుకూలించనందువల్లనో.. ఇతర కారణాలతోనో ఉన్నత విద్య అభ్యసించలేకపోయిన వారికి.. డిగ్రీ చదువును చేరువ చేసి, పట్టాలు అందించిన ఘనత ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) దూరవిద్యా కేంద్రానిది. కేవలం చదవడం, రాయడం వస్తే చాలు.. ఎటువంటి విద్యార్హతా లేకపోయినా.. 18 సంవత్సరాలు నిండి.. వివిధ కారణాలతో కళాశాలలకు వెళ్లలేని వారికి.. మధ్యలోనే చదువుకు స్వస్తి చెప్పిన వారికి.. ఉద్యోగులు, ప్రమోషన్లు పొందాలనుకునే వారు, గృహిణులు తదితర వర్గాల వారికి డిగ్రీ, పీజీ వంటి ఉన్నత చదువులను దూరవిద్య విధానంలో అందుబాటులోకి తెచ్చారు. క్రమంగా ఏ విద్యార్హతా లేకుండా డిగ్రీ ఇవ్వకూడదని, పదో తరగతి, ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైన వారికే అడ్మిషన్లు ఇవ్వాలని యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) నిర్ణయించింది. ఆ మేరకు దూరవిద్య కేంద్రం డిగ్రీ అడ్మిషన్లు కల్పిస్తోంది. ఈ సేవలను విస్తృతం చేసేందుకు 1972లో పలు జిల్లాల్లో స్టూడెంట్ సపోర్టు సెంటర్లు (స్టడీ సెంటర్లు) ఏర్పాటు చేసింది. వీటిద్వారా అనేక మంది పట్టభద్రులవుతున్నారు. దాదాపు 50 సంవత్సరాలకు పైగా సేవలందిస్తూ, విద్యార్థుల ఆదరణ పొందిన దూరవిద్య కేంద్రం స్టడీ సెంటర్లు ఇక శాశ్వతంగా మూసివేయాలని ఏయూ ఉన్నతాధికారులు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో, వివిధ జిల్లాలతో పాటు కాకినాడ పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రాజమహేంద్రవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఇప్పటి వరకూ నిర్వహిస్తున్న స్టడీ సెంటర్లను ఇకపై పూర్తిగా మూసివేయనున్నారు. ఏటా 6 వేలకు పైగా అడ్మిషన్లు ఏయూ దూరవిద్యలో చేరికకు ఏటా జూన్ నెలలో నోటిఫికేషన్ ఇస్తారు. కాకినాడ, రాజమహేంద్రవరంలోని ఏయూ దూరవిద్య కేంద్రం స్టడీ సెంటర్ల ద్వారా వివిధ డిగ్రీ కోర్సులలో 6 వేల మంది, పీజీ కోర్సులలో 1,500 మంది ఏటా అడ్మిషన్లు పొందేవారు. వీరందరికీ అడ్మిషన్లు, వారాంతపు తరగతుల షెడ్యూల్, ఏ కళాశాలలో, ఏయే విభాగాల్లో కాంటాక్ట్ తరగతులు నిర్వహిస్తున్నారు, పరీక్ష ఫీజులు, దరఖాస్తుల స్వీకరణ, హాల్ టికెట్ల జారీ, పరీక్ష కేంద్రం తదితర వివరాలు అందించేందుకు ఆయా స్టడీ సెంటర్లలో జూనియర్ అసిస్టెంట్, అటెండర్ ఉండేవారు. వీరు పై పనులతో పాటు విద్యార్థులకు గుర్తింపు కార్డులు అందించడం వంటి సేవలు కూడా అందించేవారు. విద్యార్థులకు సమయానికి స్టడీ మెటీరియల్ అందకపోతే సీనియర్ల పుస్తకాలు తీసుకుని అందజేసేవారు. ఆయా కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకూ అందుబాటులో ఉండేవారు. ఈ సిబ్బందిని విశాఖపట్నంలోని ఏయూ కేంద్రానికి రావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ స్టడీ సెంటర్లను మూసివేయడంతో ఇకపై వీరి సేవలు అందవని, డిగ్రీ పట్టా పొందడం కష్టమేనని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. ఆన్లైన్లోనే అడ్మిషన్లు ఇక నుంచి డిగ్రీ లేదా పీజీ అడ్మిషన్ కావాలంటే ఏయూ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని అడ్మిషన్ పొందాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే, చాలా మందికి ఆన్లైన్పై అవగాహన లేదు. అలాగే, ఏదైనా నెట్ సెంటర్ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసినా.. ఫీజు చెల్లింపు, ఇతర విషయాల్లో తప్పిదాలు జరిగితే తాము నష్టపోతామని విద్యార్థులు వాపోతున్నారు. అయితే, వివిధ కోర్సులనే ఆన్లైన్లో నిర్వహిస్తూండగా.. అడ్మిషన్ల వంటివి ఆన్లైన్లో జరపడం పెద్ద విషయమేమీ కాదన్నట్టుగా ఏయూ వ్యవహరిస్తోంది. వాస్తవానికి యూజీసీ నిబంధనలు సక్రమంగా పాటించడం ద్వారా ఏయూ దూరవిద్య కేంద్రం సర్టిఫికెట్లకు మంచి గుర్తింపే ఉంది. అటువంటిది ఇకపై ఆన్లైన్ ప్రోగ్రాం ప్రవేశపెట్టడం ద్వారా అడ్మిషన్ల వేళ విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన నుంచి తరగతులు, పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన వంటివన్నీ ప్రైవేట్ ఎడ్యుటెక్ కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై దూరవిద్య కేంద్రం అధికారుల పర్యవేక్షణ ఉండదని అంటున్నారు. మరోవైపు యూజీసీ నిబంధనల ప్రకారం ప్రతి ఆన్లైన్ కోర్సుకు కచ్చితంగా 20 శాతం పైగా విద్యార్థి చేతిరాత ద్వారా తరగతులు, ప్రాక్టికల్ పరీక్షలు చేపట్టాలి. మిగిలిన 80 శాతం ఆన్లైన్లో ఉండవచ్చు. కానీ, ఏయూ మాత్రం 100 శాతం ఆన్లైన్లోనే కొనసాగించే ప్రయత్నం చేస్తోందని అంటున్నారు. ఇకపై డిగ్రీ, పీజీ సబ్జెక్టులను అధ్యాపకుడు తరగతి గదిలో బోధించడం కాకుండా ఆరు నెలల ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సు తరహాలో మార్చేస్తారని చెబుతున్నారు.ఈ నిర్ణయం సరికాదు ఎంతో చరిత్ర కలిగిన ఏయూ దూరవిద్య కేంద్రం ద్వారా జిల్లాలో లక్షలాది మంది పట్టభద్రులయ్యారు. వీరిలో ఎంతో మంది ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. స్టడీ సెంటర్కు సంబంధించిన అన్ని సేవలనూ ఆన్లైన్లో ఉంచి, ఈ కేంద్రాలను మూసివేయాలనేది సరైన నిర్ణయం కాదు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలి. – ఎం.గంగా సూరిబాబు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఉద్యమిస్తాం ఫీజు, అడ్మిషన్ల వంటివన్నీ ఏయూ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని, ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లు ఏర్పాటు చేసి సమాచారం అందిస్తామని అధికారులు చెబుతున్నారు. కానీ, స్టడీ సెంటర్లు మూసివేతతో ఆవిధంగా సమాచారం ఇచ్చేవారుండరు. హెల్ప్లైన్ నంబర్లు పని చేయవు. ఏదైనా సమస్య వస్తే విశాఖపట్నంలోని వర్సిటీకి వెళ్లాలి. ఆన్లైన్ విధానం చూస్తూంటే ప్రైవేటు సంస్థల వైపు మొగ్గు చూపేలా ఉంది. స్టడీ సెంటర్లను తిరిగి కొనసాగించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. లేని పక్షంలో ఉద్యమిస్తాం. – పెంకే రవితేజ, విద్యార్థి జేఏసీ రాష్ట్ర నాయకుడు -
ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు మాజీ మంత్రి పేర్ని నాని పరామర్శ
రామచంద్రపురం: సోదర వియోగంతో బాధ పడుతున్న ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ మండపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్ తోట త్రిమూర్తులును మాజీ మంత్రి పేర్ని వెంకట రామయ్య (నాని) వెంకటాయపాలెంలోని ఆయన నివాసానికి వెళ్లి సోమవారం పరామర్శించారు. త్రిమూర్తులు సోదరుడు తోట సత్యనారాయణ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. సత్యనారాయణ చిత్రపటానికి పేర్ని నాని పూలమాలలు వేసి నివాళులర్పించారు. శాసన మండలి ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ త్రిమూర్తులును ఫోన్లో పరామర్శించారు. ఎమ్మెల్సీలు బొమ్మి ఇజ్రాయిల్, వంకా రవీంద్ర, మాజీ ఎమ్మెల్యేలు పొన్నాడ వెంటన సతీష్ కుమార్, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, రాపాక వరప్రసాదరావు, పాముల రాజేశ్వరి, సింహాద్రి రమేష్, వైఎస్సార్ సీపీ ప్రత్తిపాడు కో ఆర్డినేటర్, ముద్రగడ గిరిబాబు, రామచంద్రపురం కో ఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాశ్, రామచంద్రపురం, మండపేట మున్సిపల్ చైర్పర్సన్లు గాధంశెట్టి శ్రీదేవి, పతివాడ నూక దుర్గారాణి, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాస్, అత్తిలి సీతారామస్వామి, పెదపూడి ఎంపీపీ కేతా తులసీ శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ వెంకటరెడ్డి, పెదపూడి మండలానికి చెందిన 14 మంది సర్పంచ్లు రామచంద్రపురం ఎంపీపీ అంబటి భవాని, వెంకటాయపాలెం సర్పంచ్ యర్రమల్లి సతీష్కుమారి, వైఎస్సార్ సీపీ నేత పెంటపాటి శ్రీను, అంబటి తుకారాం, ముద్రగడ క్రాంతి, పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు వైఎస్సార్ సీపీ నేతలు త్రిమూర్తులును పరామర్శించిన వారిలో ఉన్నారు. -
తిరుమల లడ్డూపై అసత్య ప్రచారం
ఆత్రేయపురం : మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక సీఎం చంద్రబాబు హిందువులకు అత్యంత పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంపై నిర్ధారణ లేకుండా అసత్య ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అమలాపురం పార్లమెంటరీ ఇన్చార్జి జక్కంపూడి విజయలక్ష్మితో కలసి ఆత్రేయపురంలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ఆలవాలమైన తిరుమలలో లడ్డూ ప్రసాదంపై అసత్య ప్రచారం నీచ రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. సీబీఐ సిట్ వాస్తవాలు చెప్పినా మరింత దిగజారి శ్రీశైలం మల్లికార్జునస్వామి లడ్డూ ప్రసాదంపై కూడా ఆరోపణలు చేయడం హిందువుల మనోభావాలను దెబ్బ తీయడమేనని మండిపడ్డారు. వెంటనే ఈ అసత్య ప్రచారాలను నిలిపివేసి స్వామివారి ప్రసాదంపై ప్రజల్లో ఉన్న అపారమైన విశ్వాసాన్ని కాపాడాలని, లేకపోతే ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ, చంద్రబాబు అత్యున్నత న్యాయస్థానం తీర్పులను సైతం లెక్క చేయకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి, ప్రజలను భయానికి గురి చేస్తున్నారని అన్నారు. హెరిటేజ్ పాలల్లో కొవ్వు శాతం తగ్గిందని వచ్చిన నివేదికలపై సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
కలెక్టర్ను కలిసిన డీఆర్వో
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) టి.తిప్పేనాయక్ కలెక్టర్ షణ్మోహన్ను, ఎస్పీ బిందుమాధవ్ను కలెక్టర్ చాంబర్లో సోమవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్కు మొక్కను అందజేశారు. డీఆర్వోగా తిప్పేనాయక్ ఆదివారం బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. నాలుగో రోజుకు కోటి తులసి పూజ అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో నిర్వహిస్తున్న కోటి తులసి పూజ సోమవారం నాలుగో రోజుకు చేరుకుంది. సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకు వార్షిక కల్యాణ వేదిక సత్యదేవునికి, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి పండితులు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకూ, తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల వరకూ 60 మంది రుత్విక్కులు ఐదేసి లక్షలు తులసి దళాలతో విష్ణు సహస్ర నామాలు పఠిస్తూ స్వామి వారిని అర్చించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.కోటి తులసి పూజ నిర్వహిస్తున్న స్వామివారి వార్షిక కల్యాణ మండపం విద్యుద్దీపాలంకరణతో కనువిందు చేసింది. నేడు జాబ్ మేళా బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లా ఉపాధి కార్యాలయంలో మంగళవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి జి.శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్అండ్టీ సంస్థలో వెల్డర్, ప్లంబర్, ఫిట్టర్, సర్వేయర్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామన్నారు. పదో తరగతి ఆపైన, ఏదైనా ఐటీఐ ట్రేడ్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు తమ విద్యార్హతల సర్టిఫికెట్లుతో హాజరు కావాలని సూచించారు. ఇతర వివరాలకు 86398 46568 నంబరులో సంప్రదించాలని కోరారు. కస్టోడియల్ మృతిపై మెజిస్టీరియల్ విచారణ కాకినాడ క్రైం: పోలీస్ కస్టడీలో ఉండి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి ఓ ఖైదీ మృతి చెందిన ఘటనపై అధికారులు మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. గుంటూరుకు చెందిన మెట్టు భాస్కరరెడ్డి (53) రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తూ, గత ఏడాది నవంబర్ 26న అనారోగ్యంతో కాకినాడ జీజీహెచ్లో చేరి, చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతడి మృతిపై మెజిస్టీరియల్ విచారణకు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాలు జారీ చేసినట్లు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరణం సంభవించడానికి కారణాలు, వాస్తవాలు, సంబంధిత అంశాల నిర్థారణకు ఈ విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. భాస్కరరెడ్డి మృతిపై కాకినాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందన్నారు. సంబంధిత పోలీస్, వైద్య, జైలు అధికారులతో పాటు మృతుడి కుటుంబ సభ్యులు కాకినాడ ఆర్డీఓ కార్యాలయానికి ఈ నెల 18న విచారణకు హాజరు కావాలని కలెక్టర్ తెలిపారు. పూర్తిగా కోలుకునే వరకూ వైద్య సేవలు రంపచోడవరం: అస్వస్థతకు గురైన విద్యార్థులు పూర్తిగా కోలుకునేంత వరకూ మెరుగైన వైద్య సేవలు అందిస్తామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఇన్చార్జి డైరెక్టర్ వి.ప్రసన్న వెంకటేష్ తెలిపారు. దేవరపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను ఆయన, పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్రాజ్ సోమవారం సందర్శించారు. రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొంది, కోలుకొని తిరిగి పాఠశాలకు వచ్చిన విద్యార్థులను పరామర్శించారు. ఇబ్బంది ఉంటే పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరంలో సేవలు పొందాలన్నారు. విద్యార్థులు నిద్రపోయే గదులు, స్టోర్ రూమ్లను పరిశీలించారు. పాఠశాలకు నిత్యావసర సరకుల సరఫరాపై ఆరా తీశారు. విద్యార్థులకు కాచి చల్లార్చిన నీరు అందించాలని, బయటి ఆహారం తినకుండా చూడాలన్నారు. మరుగుదొడ్లు మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. -
వన్నెపూడి వద్ద రోడ్డు ప్రమాదం
● బలంగా ఢీకొని, పల్టీలు కొట్టిన కార్లు ● ఐదుగురికి గాయాలుగొల్లప్రోలు (పిఠాపురం): గొల్లప్రోలు మండలం వన్నెపూడి – కొడవలి జంక్షన్ వద్ద 16వ నంబరు జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీకొట్టుకుని పల్టీలు కొట్టడంతో వాటిల్లో ప్రయాణిస్తున్న నలుగురు గాయపడ్డారు. గొల్లప్రోలు పోలీసుల కథనం ప్రకారం.. కిర్లపూడి మండలం జె.బూరుగుపూడికి చెందిన పాటంశెట్టి మణి నాగేంద్ర ప్రైవేటు ఫొటోగ్రాఫర్గా పని చేస్తున్నాడు. వృత్తి పనిలో భాగంగా సోమవారం ఉదయం బూరుగుపూడి నుంచి తన బావకు చెందిన కారులో తోటి ఫొటోగ్రాఫర్లు కేశనకుర్తి శ్రీను, ఆజేష్, వీర శివ, చిన వీర్రాజులతో కలసి షూటింగ్ కోసం విశాఖపట్నం బయలుదేరాడు. గొల్లప్రోలు మండలం కొడవలి జంక్షన్ వద్ద వీరి కారు ముందు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వైపు మరో కారు వీరి ముందు వెళ్తోంది. వన్నెపూడి వద్దకు వచ్చేసరికి ముందున్న కారును డ్రైవర్ అస్తవ్యస్తంగా నడుపుతూ, ఒక్కసారిగా పక్కకు వచ్చాడు. అదే సమయంలో ఓవర్టేక్ చేస్తున్న మణి నాగేంద్ర కారును బలంగా ఢీకొన్నాడు. దీంతో, రెండు కార్లూ పల్టీలు కొట్టి, నుజ్జునుజ్జయ్యాయి. మణి నాగేంద్ర కారుకు ఉన్న నాలుగు చక్రాలూ ఊడిపోయి సుమారు 12 పల్టీలు కొట్టింది. అందులో ప్రయాణిస్తున్న కేశనకుర్తి శ్రీను, ఆజేష్, వీరశివ, చిన వీర్రాజు, మణి నాగేంద్ర గాయపడ్డారు. వారిని హైవే పోలీసు సిబ్బంది ప్రత్తిపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం కాకినాడలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి వస్తున్న కారులో వారు ఎటువంటి గాయాలూ కాకుండా ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఎస్సై ఎన్.రామకృష్ణ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి
● ఎస్ఎఫ్ఐ నేతల డిమాండ్ ● కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్షబోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జిల్లా కమిటీ ఆధ్వర్యాన కలెక్టరేట్ వద్ద సోమవారం నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్ లోవరాజు, ఎం.గంగా సూరిబాబు మాట్లాడుతూ, అధికారంలోకి రాక ముందు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తామని చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక మాట మార్చారని మండిపడ్డారు. ప్రస్తుతం విద్యా శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ యువగళం పాద యాత్రలో విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారని, ఇప్పుడు ఆ మాట ఏం చేశారని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.7 వేల కోట్లున్నాయని, దీనిని విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యార్థులను మిడ్, సెమిస్టర్ పరీక్షలకు హాజరు కానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు చెల్లించిన వారికే హల్ టికెట్లు మంజూరు చేస్తామంటూ విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని చెప్పారు. తొలుత సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీరాణి మాట్లాడుతూ, ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థులను ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు. ఎస్ఎఫ్ఐ మాజీ నాయకుడు పలివెల వీరబాబు మాట్లాడుతూ, నిరాహార దీక్షకు చరిత్రలో చాలా ప్రాధాన్యం ఉందని, ఇటువంటి దీక్షలతో దేశ స్వాతంత్య్రంతో పాటు ఎన్నో విజయాలు సాధించామని గుర్తు చేశారు. జనవి/్ఞాన వేదిక జిల్లా నాయకుడు రెడ్డి కూడా ప్రసంగించారు. ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.రాజశేఖర్, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నగేష్లు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. -
ట్రాఫిక్కు సినిమా కష్టాలు
సామర్లకోట: రద్దీగా ఉండే సెంటర్.. ఆపై సినిమాతో కష్టాలను పట్టణ ప్రజలు సోమవారం ఎదుర్కొన్నారు. సామర్లకోట మఠం సెంటర్లో సినిమా షూటింగ్ జరగడంతో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ముఖ్యకూడలిలో సినిమా షూటింగ్కు అనుమతి ఇవ్వడంపై సర్వత్రా విమర్శలకు దారి తీసింది. జీవిత, రాజశేఖర్, వారి కుమార్తె శివానీ నటిస్తున్న చిత్ర షూటింగ్ సామర్లకోట మఠం సెంటర్లో ప్రారంభించారు. ఇక్కడ అంబేడ్కర్ విగ్రహం, కూరగాయల మార్కెట్, బడ్డీలు ఏర్పాటు చేసి షూటింగ్ జరిపారు. తొలిరోజు రాజశేఖర్ కుమార్తె శివానీ, ఆలీలు కూరగాయల మార్కెట్కు వచ్చిన సన్నివేశం చిత్రీకరించారు. సామర్లకోట – పెద్దాపురం రోడ్డు ముఖ్య కూడలి కావడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. దీనికితోడు షూటింగ్ చూడడానికి వచ్చిన స్థానికులను సినిమా యూనిట్కు చెందిన బౌన్సర్లు దగ్గరకు రాకుండా గెంటి వేయడంతో వాదోపవాదాలు జరిగాయి. ఏదేమైనా ముఖ్య కూడలిలో సినిమా షూటింగ్కు అనుమతి ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తాయి. -
ఆక్రందనలు ఆగోవు
ఫ సముద్ర తీరంలో ఆవుల మృత్యుఘోష ఫ బాలబందు మొక్కలను తిని చనిపోతున్న వైనం ఫ అధికారుల చర్యలు శూన్యం కాట్రేనికోన: మూగజీవాల మృత్యుఘోష ఆగడం లేదు.. విష తుల్యమైన ఆకులు తిని ఆవులు చనిపోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.. సముద్ర తీరం వెంబడి సంచరిస్తున్న ఆ జీవుల ఆక్రందనలు ఎవరికీ వినిపించడం లేదు.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని సఖినేటిపల్లి, అల్లవరం, కాట్రేనికోన మండలాల పరిధి శివారు ప్రాంతాలను ఆనుకుని సముద్ర తీరం విస్తరించి ఉంది. దీని వెంబడి సంచరిస్తున్న ఆవులు మేతగా తీగ జాతికి చెందిన (బాలబందు) మొక్క ఆకులను ఆహారంగా తీసుకుంటున్నాయి. చిర్రయానం నుంచి నీళ్లరేవు మధ్యలో సుమారు 700 ఆవులు సముద్ర తీరంలో జీవిస్తున్నాయి. అంతర్వేది, ఓడలరేవు, నక్కారామేశ్వరం, వాసాలతిప్ప, ఎస్.యానం, చిర్రయానం, నీళ్లరేవు, కొత్తపాలెం లైట్ హౌస్, మొగ ప్రాంతం సముద్ర తీరం వెంబడి తీగ జాతి మొక్కలు విరివిగా పెరుగుతున్నాయి. ఈ మొక్కలు విపరీతంగా పెరిగిపోవడంతో ఆవులు మేతకు అవసరమైన గడ్డి జాతి, ఇతర మొక్కలను పెరుగుదలను అడ్డుకుంటున్నాయి. సముద్ర తీరం వెంబడి వందలాది ఆవులు గుంపులు గుంపులుగా సంచరిస్తూ మేత లేక విషపూరితమైన ఈ తీగ జాతి మొక్కల ఆకులను ఆహారంగా తీసుకుంటున్నాయి. అలాగే సముద్ర తీరం వెంబడి ఆవులకు తాగేందుకు మంచి నీరు ఉండడం లేదు. గిర్రున తిరిగి.. కిందకు ఒరిగి విషపూరితమైన తీగ జాతి మొక్కల ఆకులను ఆహారంగా తీసుకుంటున్న ఆవుల తల తిరిగిపోవడంతో గిర్రున తిరిగి తూలుతూ కిందకు పడిపోతున్నాయి. అలా రోజుల పాటు ఆహారంగా తీసుకోవడంతో వాటికి తెలియని మత్తు రావడంతో తూలుతూ తిరుగుతై చివరకు మృత్యువాత పడుతున్నాయి. ఆ ఆవులు గంజాయి, మద్యం తాగిన వారివలే పడుతూ లేస్తూ ఉంటున్నాయి. సముద్ర తీరం వెంబడి మేత లేక వదిలినప్పుడు ఆకులు తినడంతో చనిపోతున్నాయని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మసమేథ్యం సమీపంలో కాల భైరవస్వామి ఆలయం అర్చకుడికి చెందిన ఐదు పాడి ఆవులు విష పూరితమైన ఈ ఆకులను ఆహారంగా తీసుకునే చనిపోయాయి. ఈ తీగను ఆహారంగా తిన్న తల్లి ఆవు పాలు తాగుతున్న పిల్లలు సైతం మృత్యువాత పడుతున్నాయి. ఇటీవల పల్లం శివారు బ్రహ్మసమేథ్యం కాలభైరవస్వామి ఆలయ సమీపంలో సముద్రం ఒడ్డున ఆవు దూడ చలికి శరీరం పూర్తిగా చల్లబడి వణికిపోవడంతో పాటు కాళ్లు బిగిసిపోవడంతో చలి మంటను వేసి ఆవు దూడకు వేడి తగిలే విధంగా స్థానికులు ఏర్పాటు చేశారు. అయితే విష పూరితమైన తీగ ఆకును ఆహారంగా తీసుకున్న తల్లి పాలతో పాటు ఆవు దూడ తీగ ఆకును తినడంతో పరుగులు పెడుతూ.. తూలుతూ.. పడి పోవుతూ.. కొన్ని రోజులకు చనిపోయింది. ఐదు ఆవులు చనిపోయాయి తీగ ఆకులు తినడంతో ఐదు ఆవులు చనిపోయాయి. ఇటీవల కాలభైరవస్వామికి క్షీరాభిషేకం, నైవేద్యం కోసం రూ.35 వేలు పెట్టి పాడి ఆవును కొన్నాం. మేతకు వదిలినప్పుడు తీగ జాతికి చెందిన ఆకులను తినడంతో గుండ్రంగా తిరుగుతూ కొన్ని రోజులకు మృత్యువాత పడింది. –కామేశ్వరరావు, కాలభైరవస్వామి ఆలయ అర్చకుడు, పల్లం పీక్కుతింటున్నాయి.. విషపూరితమైన తీగ ఆకులు ఆహారంగా తినడంతో తెలియని మత్తులో తూలుతూ, పడుతూ బలహీనంగా ఉన్న ఆవులను కుక్కలు, రాత్రి వేళ నక్కలు సైతం పీక్కు తింటున్నాయని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది రైతులు పాలు వదిలిన తరువాత సముద్ర తీరం వెంబడి ఆవులను వదిలేస్తున్నారు. తిరిగి ఆవులు బాగుంటే పాల కోసం తెచ్చుకుంటున్నారు. పాడి రైతులు సొంత ఆవులను పాలు వదిలిన తరువాత సముద్ర తీరం వెంబడి వదిలివేయకుండా చర్యలు తీసుకోవాలి. ఈ ఆవులను గుర్తించి గోశాలకు తరలించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అప్పుడే మూగజీవాలకు రక్షణ ఉంటుందని పశు ప్రేమికులు అంటున్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 31,500 గటగట (వెయ్యి) 29,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 29,500 గటగట (వెయ్యి) 27,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)19,000 – 20,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
రైతుకు అరుదైన పురస్కారం
రాజవొమ్మంగి: మండలంలోని కిండ్రకాలనీకి చెందిన రైతు గంపా నాగరాజుకు అరుదైన పురస్కారం దక్కింది. ఈ రైతు గ్రాండ్ నైన్ అనే అరటి సాగులో మంచి ఫలితాలు సాధించడంతో ఈ అవార్డు అందుకున్నారు. పంత్నగర్ (ఉత్తరాఖండ్) వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సోమవారం జరిగిన అఖిల భారత పండ్ల సమన్వయ పథకం వార్షిక గ్రూప్ మీటింగ్లో నాగరాజుకు ఈ గౌరవం దక్కింది. ప్రాజెక్టు కోఆర్డినేటర్లు డాక్టర్ ఘోష్, ప్రకాష్ పాటిల్ తదితరులు నాగరాజును సత్కరించి ఈ అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతు టిష్యూ కల్చర్ అరటి సాగులో సాంకేతిక సలహాలు ఇస్తూ, తనను ప్రోత్సహించిన డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం, కొవ్వూరు ప్రాంతీయ ఉద్యాన వన పరిశోధన కేంద్రాల శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన్ని మండలంలోని రైతులు అభినందించారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
కాకినాడ క్రైం: స్థానికంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడ గ్రామీణ మండలం వాకలపూడికి చెందిన మోకా గౌతమ్ (18) స్థానిక చికెన్ షాప్లో పనిచేస్తున్నాడు. ఆదివారం అతని పుట్టిన రోజు సందర్భంగా తన స్నేహితులను ఇంటికి పిలిచి భోజనాలు పెట్టాడు. అర్ధరాత్రి వరకూ సందడిగా గడిపి అందరూ వెళ్లిపోగా, ఉండూరుకు చెందిన ఏలేటి కార్తీక్ (20), యానాం సమీపంలో ఇంజరానికి చెందిన మేడిశెట్టి మణి వెంకటసాయి (25)లు గౌతమ్తోనే ఉన్నారు. నిద్రపోకుండా ఈ ముగ్గురు అర్ధరాత్రి దాటే వరకూ మేడపై మాట్లాడుకుంటూ కాలక్షేపం చేశారు. సోమవారం తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో ఈ ముగ్గురు స్కూటీపై మెయిన్ రోడ్కు వెళ్లారు. ఆ సమయంలో ఉదయం డ్యూటీ నిమిత్తం కాకినాడ జగన్నాథపురానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ షేక్ అహ్మద్ రాజా తన బుల్లెట్పై జగన్నాథపురం నుంచి వస్తున్నారు. మెయిన్ రోడ్లో కేఎఫ్సీ స్టోర్ వద్దకు వచ్చేసరికి ఈ రెండు వాహనాలు పరస్పరం ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఆ ముగ్గురు యువకులతో పాటు కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. మోకా గౌతమ్ అక్కడిక్కడే చనిపోగా, మేడిశెట్టి సాయి ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. నెత్తురోడుతున్న ఏలేటి కార్తీక్ను అక్కడి వారు కాకినాడ జీజీహెచ్కు, కానిస్టేబుల్ రాజాను కుటుంబ సభ్యులు అక్కడికి సమీపాన ఉన్న అపోలో ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా, ప్రమాదానికి కారణాలను పరిశీలిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. స్కూటీపై వచ్చిన ముగ్గురు యువకులు మద్యం తాగి, ట్రిపుల్ రైడింగ్లో అతి వేగంగా వచ్చారని కానిస్టేబుల్ రాజా కుటుంబీకులు ఆరోపిస్తుంటే, కానిస్టేబుల్ రోడ్ లైన్ను క్రాస్ చేసి రహదారి మధ్యలో వాహనం నడిపి ప్రమాదానికి కారణమయ్యాడని బాధితుల కుటుంబీకులు అంటున్నారు. ట్రిపుల్ రైడింగ్ నిజమేనని, మద్యం తాగి ఉన్నారా లేదా అనేది పోస్ట్మార్టం నివేదికలో వెల్లడి కావాల్సి ఉందని పోలీసులు అంటున్నారు. మృతులు అవివాహితులని పేర్కొన్నారు. కాకినాడ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ బుజ్జి బాబు దర్యాప్తు చేస్తున్నారు. -
దారిలో జలదరింపు
వీఆర్పురం – చింతూరు మండలాల ప్రధాన రహదారిలో ఏజీకొడేరు, తిమ్మిరిగూడెం నడుమ జల్లివారిగూడెం వాగు ఉంది. ఇది ప్రవహించే ప్రాంతంలో రహదారిపై గతంలో లోలెవల్ చప్టా నిర్మించారు. ఈ చప్టాకు ఎగువభాగంలో భారీగా ఇసుక మేటలు పేరుకుపోయాయి. దీంతో ఎగువ ప్రాంతంలో ఎక్కడ వర్షం పడినా ఆ నీరు చప్టాపై నుంచి ప్రవహిస్తూ రాకపోకలు నిలిచిపోతున్నాయి. చప్టాకు ఎగువభాగంలో పేరుకుపోయిన పూడికను తొలగిస్తే నీరు చప్టా కింద నుంచి ప్రవహిస్తుంది. ఆయా గ్రామాల ప్రజలు వర్షాకాలంలో ఈ చప్టా కారణంగా కష్టాలు ఎదుర్కొంటున్నారు. –చింతూరు పడితే.. అటో.. ఇటో పిఠాపురం మండలం భోగాపురంలో కల్వర్టుకు ఇరువైపులా రక్షణ గోడలు (రెయిలింగ్) లేక ప్రయాణం దినదిన గండంలా మారింది. నిత్యం వందలాది వాహనాలు ఇటుగా వెళ్తుంటాయి. శిథిలావస్థకు చేరిన ఈ కల్వర్టు ఎప్పుడు కూలిపోతుందోనన్న భయం అందరిలో నెలకొంది. కొత్తగా కల్వర్టు నిర్మించాలని, అప్పటి వరకూ కనీసం రక్షణ గోడలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. –పిఠాపురం రూరల్ -
మహిళ అదృశ్యం
అనపర్తి: ఓ మహిళ అదృశ్యంపై సోమవారం కేసు నమోదు చేసినట్టు బిక్కవోలు ఎస్సై వి.రవిచంద్ర కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. బిక్కవోలు మండలం కాపవరం గ్రామానికి చెందిన గాజుల పాపారత్నం (45)కు మతిస్థిమితం లేదు. ఆమె భర్త చనిపోవడంతో అదే గ్రామంలోని తల్లి ఇంటి వద్దే ఉంటుంది. శనివారం ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. బంధువుల ఇళ్ల వద్ద వెతికినా ఫలితం లేకపోవడంతో సోమవా రం ఆమె సోదరి చక్రమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపా రు. వివరాలు తెలిస్తే తన నంబర్ 94409 04851, అనపర్తి సీఐ సుమంత్ 94407 96538 ఫోన్ నంబర్లకు తెలియజేయాలని కోరారు. -
వైభవంగా గంధోత్సవం
● బషీర్ బీబీ దర్శనానికి పోటెత్తిన భక్తులు ● ప్రత్యేక ప్రార్థనలు ● కిక్కిరిసిన పొన్నాడ కొత్తపల్లి: స్థానిక పొన్నాడ బంగారు పాపమ్మ (బషీర్ బీబీ ఔలియా) ఉర్స్ ఉత్సవాలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నాడ పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిశాయి. భారీ పోలీసు బందోబస్తు నడుమ సుమారు 30 వేల మంది అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ ముజావర్లు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా గంధోత్సవం ఘనంగా నిర్వహించారు. మూలపేటకు చెందిన షేక్ మౌలాసాహేబ్ ఇంటి నుంచి పెద్దబొడ్డేపల్లికి చెందిన ఎండీ తాజుద్దీన్ బాబా సమర్పించిన గంధాన్ని (సంథల్) ప్రత్యేకంగా అలంకరించిన గుర్రంపై ఉంచి ఫకీర్ మేళాతో పొన్నాడ బషీర్బీబీ ఆలయం వరకూ ఊరేగించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సంప్రదాయ ప్రార్థనల అనంతరం భక్తులకు గంధం పంపిణీ చేశారు. ఉత్సవాల సందర్భంగా మూలపేట నుంచి పొన్నాడ వరకూ కాలినడకన వెళ్లేందుకు కూడా వీలులేని పరిస్థితి నెలకొంది. పలుమార్లు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పిఠాపురం, తుని, కాకినాడ నుంచి వాహనాల్లో వచ్చిన వారు పొన్నాడ చేరుకోవడానికి ఇబ్బంది పడ్డారు. ఎస్సై వెంకటేష్ ఆధ్వర్యాన సుమారు 120 సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోకి వాహనాలు వెళ్లకుండా పొన్నాడ, అమరవిల్లి, నాగులపల్లి వద్ద నిలిపివేశారు. గ్రామ కార్యదర్శి ఆధ్వర్యంలో భక్తులకు తాగునీరు, పారిశుధ్య నిర్వహణ ఏర్పాట్లు చేశారు. -
పూటుగా తాగి.. తన్నులాట
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో సెక్యూరిటీ వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉందో చెప్పడానికీ సంఘటన నిదర్శనంగా నిలుస్తోంది. రత్నగిరి దిగువన తొలి పావంచా వద్ద స్వామివారి ప్రసాదం కొనుగోలుకు వచ్చిన భక్తులు ఆదివారం క్యూలో ఘర్షణ పడి, దాదాపు పావుగంట పాటు కొట్టుకున్నారు. దీంతో, ప్రసాదం కొనుగోలుకు అక్కడకు వచ్చిన ఇతర భక్తులు భయభ్రాంతులకు గురై, ఏం జరుగుతుందోననే భయంతో పరుగులు తీశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు కానీ, దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది కానీ అక్కడ లేకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒక్క రోజే కాదు.. ప్రతి ఆదివారం లోవ దేవస్థానానికి వెళ్తున్న భక్తుల్లో కొంత మంది మద్యం తాగి, తిరుగు ప్రయాణంలో అన్నవరంలో ప్రసాదాల కొనుగోలుకు ఆగుతున్నారు. ఈ క్రమంలో వారిలో వారు తరచుగా ఘర్షణకు దిగుతున్నా ఆపేవారే ఉండటం లేదని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. అందుబాటులో ఉండని సిబ్బంది మరోవైపు తొలి పావంచా వద్ద ప్రసాదం కౌంటర్లలోని దేవస్థానం సిబ్బంది మధ్య సమన్వయం కొరవడుతోంది. ఈ నెల 2న తొలి పావంచా వద్ద ప్రసాదాల కొనుగోలుకు వెళ్లిన భక్తులకు చేదు అనుభవం ఎదురైంది. ప్రసాదం ప్యాకెట్లు ఇచ్చే ఉద్యోగి బయటకు వెళ్లాడని, పావుగంట ఆగాలని అక్కడ ప్రసాదం టికెట్లు విక్రయించే మరో ఉద్యోగి చెప్పాడు. చాలా దూరం వెళ్లాలని, ఇలా ఆలస్యం చేస్తే ఎలాగని ఆ భక్తులు పక్కనే గెస్ట్ హౌస్లో ఉన్న దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్కు ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే ఆ కౌంటర్ వద్దకు వచ్చి, అక్కడి ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేసి, దగ్గరుండి మరీ ప్రసాదాలు అమ్మించారు. ఆ సమయంలో అక్కడ సెక్యూరిటీ గార్డు కూడా లేడు. పోలీసులను నియమించే అవకాశం లేదు తలుపులమ్మ లోవకు వెళ్లి వచ్చిన కొంత మంది భక్తులు మద్యం తాగి వచ్చి, అన్నవరం వచ్చి ఆ మత్తులో ప్రసాదాల కౌంటర్ల వద్ద ఘర్షణ పడుతున్నారు. వారిని నియంత్రించేలా అక్కడ నియమించడానికి తగినంత మంది పోలీసులు మాకు లేరు. దేవస్థానమే అక్కడ సెక్యూరిటీ గార్డులను నియమించాలని చాలాసార్లు చెప్పాం. అయినప్పటికీ వారు నియమించడం లేదు. ఇప్పటికై నా దేవస్థానం అదివారం నాడు అక్కడ ఇద్దరు సెక్యూరిటీ గార్డులను నియమించాలి. ప్రసాదాల కౌంటర్ వద్ద ఘర్షణ పడిన వారు మాకు ఎటువంటి ఫిర్యాదూ చేయలేదు. – శ్రీహరిబాబు, ఎస్సై, అన్నవరం అంత సెక్యూరిటీ ఉన్నా ప్రయోజనమేదీ! అన్నవరం దేవస్థానంలో వంద మందికి పైగా సెక్యూరిటీ గార్డులు, 38 మంది పోలీసు శాఖకు చెందిన హోం గార్డులు పని చేస్తున్నారు. తొలి పావంచా వద్ద ఒక్క భద్రతా సిబ్బంది మాత్రమే ఉంటున్నారు. కనీసం ఇద్దరు హోంగార్డులు లేదా ఇద్దరు సెక్యూరిటీ గార్డులున్నా ఇలాంటి ఘర్షణలను నివారించే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన సమయంలో ఆ ఒక్కరు కూడా ఉండటం లేదనే విమర్శ ఉంది. ఫ సత్యదేవుని తొలి పావంచా ప్రసాదం స్టాల్ వద్ద భక్తుల ఘర్షణ ఫ పావుగంట పాటు కొట్టుకున్న వైనం ఫ భయభ్రాంతులకు గురైన ఇతరులు -
కోటి జన్మల ఫలం.. తులసి పూజ
● రత్నగిరిపై మూడో రోజుకు చేరిన పూజలు ● విశేషంగా హాజరైన భక్తజనం అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో నిర్వహిస్తున్న కోటి తులసి పూజ ఆదివారం మూడో రోజుకు చేరింది. వేకువజామున సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వార్షిక కల్యాణ వేదికపై ఆశీనులై ఉన్న స్వామి, అమ్మవార్లకు పండితులు ఉదయం 7 గంటలకు ప్రత్యేక పూజలు చేసి, ప్రసాదాలు నివేదించారు. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకూ 60 మంది రుత్విక్కులు 5 లక్షల తులసి దళాలతో విష్ణు సహస్ర నామాలతో స్వామి వారిని అర్చించారు. తిరిగి సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకూ మరో 5 లక్షల తులసి దళాలతో పూజలు చేశారు. వేదాశీస్సులు అందజేసి పవళింపు సేవతో రెండో రోజు కార్యక్రమాలు ముగించారు. షామియానా తొలగించారు ‘కోటి తులసి పూజకు శ్రీకారం’ శీర్షికన ‘సాక్షి’ శుక్రవారం ప్రచురించిన వార్తలో ఈ షామియానా కారణంగా భక్తులు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావించింది. 2022లో నిర్వహించిన కోటి తులసి పూజలో కల్యాణ వేదిక ముందు తులసి వనంలో సత్యదేవుడు, అమ్మవారి విగ్రహాలను ఉంచడం వల్ల భక్తులు అక్కడ ఫొటోలు దిగేవారు. ఇప్పుడు అటువంటి ఏర్పాటు లేకపోవడంతో వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే కల్యాణ వేదిక నుంచి విశ్రాంతి మండపం వరకూ షామియానా వేయడంతో వేదిక గోపురం కనిపించకపోవడంపై కూడా భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశాలను ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దీనిపై ఈఓ వి.త్రినాథరావు స్పందించారు. ఆయన ఆదేశం మేరకు ఆ షామియానాను సిబ్బంది తొలగించారు.కల్యాణ వేదిక ముందు విశ్రాంతి మండపంలో తులసి వనం మధ్య సత్యదేవుడు, అమ్మవారి ఉత్సవమూర్తులను సైతం ఏర్పాటు చేశారు. రత్నగిరి కిటకిటవేలాదిగా వచ్చిన భక్తులతో రత్నగిరి ఆదివారం కిటకిటలాడింది. సెలవు దినం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు సత్యదేవుని దర్శనానికి తరలి వచ్చారు. ఆలయ ప్రాంగణం, క్యూలు, వ్రత, విశ్రాంత మండపాలు భక్తులతో రద్దీగా మారాయి. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. సత్యదేవుని వ్రతాలు 3,800 జరిగాయి. స్వామివారి ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. సత్యదేవుని రథ సేవను ఆలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. -
కనికుట్టు
ప్రత్తిపాడు: మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ఇస్తాం.. సర్టిఫికెట్లతో పాటు కుట్టు మెషీన్లు ఉచితంగా అందిస్తాం.. స్వయం ఉపాధి కల్పిస్తాం.. లక్షాధికారుల్ని చేస్తాం.. అంటూ గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం పెద్ద హడావుడే చేసింది. తీరా చూస్తే శిక్షణ పూర్తయి నెలలు గడుస్తున్నా ఉచితంగా ఇస్తామన్న కుట్టు మెషీన్ల ఊసే తేవడం లేదు. వాటి కోసం ఎంపీడీఓ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న మహిళలు.. ఇది చంద్రబాబు మార్కు కనికట్టులా ఉందని విమర్శిస్తున్నారు. కూలీనాలీ చేసుకుంటూ జీవిస్తున్న తాము ప్రభుత్వ పెద్దల మాటలు నమ్మి.. చేస్తున్న పనులు మానుకుని ఉచిత కుట్టు శిక్షణ పొందితే మెషీన్లు ఎందుకివ్వడం లేదంటూ శాపనార్థాలు పెడుతున్నారు. శిక్షణ ఇచ్చారిలా.. మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ఇచ్చేందుకు జిల్లావ్యాప్తంగా 60 కేంద్రాలు ఏర్పాటు చేయాలని తొలుత భావించారు. చివరకు వాటిని 50కి పరిమితం చేశారు. సెంటర్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (సీయూఆర్డీ), సోషల్ ఏజెన్సీ ఫర్ పీపుల్స్ ఎంపవర్మెంట్ (ఎస్ఏపీఈ) సంస్థల ఆధ్వర్యాన ఈ శిక్షణ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. శిక్షణ ఇచ్చేందుకు ప్రతి కేంద్రంలోనూ ఒక ట్రైనర్, ఒక కంప్యూటర్ ఆపరేటర్ను నియమించారు. శిక్షణ, కేంద్రం అద్దె, కుట్టు మెషీన్, ఇతర పరికరాలు కలిపి ఒక్కో మహిళకు సుమారు రూ.22 వేల చొప్పున కేటాయించారు. ఈ శిక్షణకు జిల్లావ్యాప్తంగా 27,722 మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో వివిధ కార్పొరేషన్ల ద్వారా 6,568 మందిని ఎంపిక చేయగా చివరకు 4,920 మంది మాత్రమే శిక్షణకు హాజరయ్యారు. వీరికి గత ఏడాది జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో 90 రోజుల పాటు ఆయా కేంద్రాల్లో రెండు బ్యాచ్లుగా శిక్షణ తరగతులు నిర్వహించారు. శిక్షణ పూర్తయిన వెంటనే 75 శాతం హాజరు నమోదైన మహిళలకు సర్టిఫికెట్తో పాటు ఉచితంగా కుట్టు మెషీన్ అందజేయనున్నట్లు ప్రభుత్వం నమ్మబలికింది. అయితే, శిక్షణ పూర్తయి మూడు నెలలు గడిచినా, ఇప్పటి వరకూ సర్టిఫికెట్లు, కుట్టు మెషీన్లు మాత్రం ఇవ్వలేదు. దీంతో, శిక్షణ పొందిన మహిళలు ఆయా ఎంపీడీఓ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కుట్టు శిక్షణ తీసుకుంటే ఉపాధి లభిస్తుందనే ఆశతో ఇతర కూలి పనులు మానుకుని మరీ ఆయా కేంద్రాలకు రోజూ క్రమం తప్పకుండా వెళ్లి శిక్షణ పొందామని చెబుతున్నారు. ఇప్పటికై నా చెప్పిన విధంగా సర్టిఫికెట్లు, కుట్టు మెషీన్లు ఇవ్వాలని మహిళలు కోరుతున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు కుట్టు మెషీన్లు అందించాలని మాపై ఒత్తిడి వస్తోంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలందరికీ త్వరలోనే కుట్టు మెషీన్లు అందుతాయి. దీనిపై ఆందోళన అవసరం లేదు. – ఎ.శ్రీనివాసరావు, ఈడీ, బీసీ కార్పొరేషన్, కాకినాడ సోమవారం శ్రీ 9 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026ఫ ఉచిత కుట్టు శిక్షణ పేరిట సర్కార్ ఆర్భాటం ఫ సర్టిఫికెట్, కుట్టు మెషీన్ ఇస్తామని హడావుడి ఫ జిల్లాలో 27,722 మంది దరఖాస్తు ఫ 4,920 మందికే ట్రైనింగ్ ఫ శిక్షణ పూర్తయి మూడు నెలలు ఫ ఇప్పటికీ అందని కుట్టు మెషీన్లు ఫ ఎంపీడీఓ కార్యాలయాల చుట్టూ మహిళల ప్రదక్షిణలు వివిధ కార్పొరేషన్ల ద్వారా జిల్లాలో ఉచిత కుట్టు శిక్షణ ఇచ్చారిలా.. కార్పొరేషన్ మొత్తం నమోదైన ఎంపికై న శిక్షణకు యూనిట్లు మహిళలు వారు హాజరైన వారు బీసీ 1,984 15,131 3,506 2,496 ఈబీసీ 124 175 45 39 కమ్మ 239 177 55 34 రెడ్డి 227 157 72 46 ఆర్యవైశ్య 133 273 89 65 క్షత్రియ 105 65 12 6 బ్రాహ్మణ 174 85 31 23 కాపు 803 11,659 2,758 2,211 మొత్తం 3,789 27,722 6,568 4,920 -
ప్రభుత్వ ఉద్యోగాల సాధనకు బ్రాండ్ ‘శ్యామ్’
బోట్క్లబ్ (కాకినాడసిటీ): ప్రభుత్వ ఉద్యోగాల సాధనకు శ్యామ్ ఇనిస్టిట్యూట్ ఒక బ్రాండ్గా నిలిచిందని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ అన్నారు. పోలీస్ ఉద్యోగాలకే కాకుండా ఏపీపీ ఎస్సీ గ్రూప్– 2 ఉద్యోగాల్లోను శ్యామ్ ఇన్స్టిట్యూట్ విజయం సాధించడం అభినందనీయమన్నారు. స్థానిక శ్యామ్ ఇనిస్టిట్యూట్లో ఆదివారం గ్రూపు–2 విజేతల విజయోత్సవ సభ నిర్వహించారు. ఇనిస్టిట్యూట్ అధినేత గుంటూరి శ్యామ్ ఎంతో నిబద్ధతతో, క్రమ శిక్షణతో ఇనిస్టిట్యూట్ను తీర్చిదిద్దడంతో అనేకమందికి ఉద్యోగాలు అందించే సంస్థగా ఆవిర్భవించిందన్నారు. సంస్థ అధినేత గుంటూరి శ్యామ్, డైరక్టర్ శైలజ మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగాలకే పరిమితం కాకుండా గ్రూప్స్ వంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించేలా ప్రణాళికలు రూపొందించడంతో తొలి ప్రయత్నంలోనే గ్రూప్– 2 ఫలితాల్లో 94 పోస్టులను తమ విద్యార్థులు సాధించారన్నారు. సంస్థ ప్రారంభించిన 25 ఏళ్లలో 26 వేలకు పైగా ఉద్యోగాలు సాధించామన్నారు. రెండేళ్లుగా 7210 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించామని వివరించారు. గ్రూప్–2 విజేతలు మాట్లాడుతూ శ్యామ్ ఇనిస్టిట్యూట్లో ఉన్నతమైన బోధనతో పాటు మోటివేషన్, భరోసా, ఆత్మస్థైర్యం కల్పించడంతోనే ఈ ఉద్యోగాలు సాధించగలిగామన్నారు. అనంతరం విజేతలతో పాటు వారి తల్లితండ్రులను సత్కరించి జ్ఞాపిక అందించారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
డీఆర్ఓగా తిప్పేనాయక్
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్ఓ)గా డి.తిప్పేనాయక్ కలెక్టరేట్లోని తన చాంబర్లో ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన 2024 ఎన్నికల సమయంలో డీఆర్ఓగా ఇక్కడ బాధ్యతలు నిర్వహించి, బదిలీపై అనంతపురం జిల్లా డిప్యూటీ కలెక్టర్గా వెళ్లారు. అక్కడ సుమారు 14 నెలల పాటు పని చేసి, తిరిగి జిల్లాకు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా తిప్పేనాయక్ను కలెక్టరేట్ అధికారులు, ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిశారు. 12న దేశవ్యాప్త సమ్మె బోట్క్లబ్ (కాకినాడ సిటీ): నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలనే డిమాండుతో కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ నెల 12న నిర్వహిస్తున్న దేశవ్యాప్త సమ్మెలో తామూ పాల్గొంటున్నామని ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ (ఏపీఎంఎస్ఆర్యూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.వెంకట్రావు తెలిపారు. సమ్మె పోస్టర్ను కలెక్టరేట్ వద్ద ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పాత కార్మిక చట్టాలే అంతంత మాత్రంగా అమలవుతున్న పరిస్థితుల్లో కొత్త లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు మరింతగా అన్యాయం జరుగుతుందని అన్నారు. తమకున్న సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ను కూడా కొత్త లేబర్ కోడ్ ద్వారా రద్దు చేశారని చెప్పారు. రూ.18 వేల జీతం దాటిన వారు కార్మికులే కాదని, వారికి ఎటువంటి చట్టాలూ వర్తించవని పేర్కొన్నారని తెలిపారు. మెడికల్ రిప్స్కు నిర్దిష్ట పని పద్ధతులుండాలని, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే విధానాలు అరికట్టాలని కోరుతున్నామన్నారు. యూనియన్ కాకినాడ బ్రాంచి కార్యదర్శి సీహెచ్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, మెడికల్ రిప్స్ నిరంతరం యాజమాన్యాల వేధింపులకు గురవుతూంటారని చెప్పారు. లేబర్ కోడ్ల వల్ల వీరిపై ఒత్తిడి మరింత పెరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్త లేబర్ కోడ్లు రద్దు చేయాలని, పని గంటలు పెంచుతూ రాష్ట్ర క్యాబినెట్ చేసిన తీర్మానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూనియన్ రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్, బ్రాంచి అధ్యక్షుడు ఎంఏ స్వామి పాల్గొన్నారు. ఉత్సాహంగా సైక్లాథాన్ కాకినాడ రూరల్: ఓఎన్జీసీ ఆధ్వర్యాన సైక్లాథాన్ ఆదివారం ఉత్సాహంగా సాగింది, సాక్ష్యం కార్యక్రమంలో భాగంగా రమణయ్యపేట ఏపీఐఐసీ కాలనీలోని ఓఎన్జీసీ హెచ్టీపీ కార్యాలయం వద్ద ఈ కార్యక్రమాన్ని అసెట్ మేనేజర్ ప్రబల్సేన్ గుప్తా బెలూన్లు గాలిలోకి విడిచిపెట్టి, జెండా ఊపి ప్రారంభించారు. ఏపీఐఐసీ కాలనీ నుంచి సర్పవరం జంక్షన్ స్పెన్సర్స్ షాపు వరకూ, అక్కడి నుంచి తిరిగి ఓఎన్జీసీ హెచ్టీపీ కార్యాలయం వరకూ సైక్లాథాన్ సాగింది. ఇందులో ఓఎన్జీసీ సిబ్బంది, అధికారులు, మహిళలు, చిన్నారులు, గోదావరి, కాకినాడ సైక్లింగ్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రబల్సేన్ గుప్తా మాట్లాడుతూ, అంతరించిపోతున్న సంప్రదాయ ఇంధన వనరులను సంరక్షించేందుకు ప్రతి ఒక్కరూ ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వినియోగించుకోవాలని కోరారు. ఈస్ట్రన్ ఆఫ్షోర్ అసెట్ మేనేజర్ రజిత్ మల్హోత్రా, హెచ్ఆర్ సునీల్ కుమార్, మహ్మద్ రఫీ పాల్గొన్నారు. తలుపులమ్మ సన్నిధికి పోటెత్తిన భక్తులు తుని రూరల్: లోవ దేవస్థానంలో కొలువై ఉన్న తలుపులమ్మ అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వివిధ జిల్లాల నుంచి ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు ప్రత్యేక వాహనాల్లో లోవకు తరలివచ్చారు. అమ్మవారిని క్యూలో 15 వేల మంది దర్శించుకున్నారని దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఆలయ కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాద విక్రయాల ద్వారా రూ.1,80,455, పూజా టికెట్లకు రూ.2,40,090, తలనీలాలకు రూ.10,240, వాహన పూజలకు రూ.8,850, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.52,800, విరాళాలు రూ.48,759 కలిపి మొత్తం రూ.5,41,194 ఆదాయం లభించిందని వివరించారు. -
గట్టుకాయస్వాహా!
కె.గంగవరం: గోదావరి ఏటిగట్టును దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో రూ.వందల కోట్ల వ్యయంతో పటిష్టం చేశారు. ప్రస్తుతం దానిని ఇష్టమొచ్చినట్టు తవ్వేసి గుల్ల చేసేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలో కూళ్ల నుంచి యానం వరకు గౌతమి గోదావరి నది ఒడ్డు ఉంది. మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గోదావరికి వరద వచ్చినప్పుడు ముంపు గ్రామాల్లోని నీరు చేరకుండా ఏటిగట్టును ఐదు అడుగులకు పెంచారు. జొన్నడ నుంచి గొవలంక వరకు వందల కోట్లు ఖర్చు పెట్టి ఈ పనులు చేయించారు. ప్రస్తుతం పాలకులు పట్టించుకోకపోవడం వల్ల ఏటిగట్టు మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఏటిగట్టుపై ఉన్న మట్టిని కొందరు రాత్రివేళల్లో తవ్వేసి పట్టుకుపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల జరిగిన సంక్రాంతి కోడి పందేల కోసం బోదిలంక వద్ద ఏటిగట్టును రెండు చోట్ల తవ్వేసి రోడ్డును ఏర్పాటు చేశారు. దీంతో పాటు అనధికారిక ఇసుక ర్యాంపు కోసం కూడా కూళ్ల నుంచి బ్రహ్మపురి వరకు పలు చోట్ల గట్టును తవ్వి ర్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారుల నిర్లక్ష్యంగా ఉండడం విమర్శలకు తావిస్తోంది. గట్టును విచ్చలవిడిగా తవ్వేసి రోడ్డు మార్గాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల దాని మనుగడ ప్రశ్నర్ధకమైంది. వరదలు వచ్చినప్పుడు హడావిడి చేయడం తప్ప మామూలు రోజుల్లో ఏటిగట్టును పట్టించుకునే నాథుడు లేడని గోదావరి పరీవాహక ప్రజలు వాపోతున్నారు. అటు కన్జర్వెన్సీ అధికారులు కానీ, ఇటు స్థానిక రెవెన్యూ అధికారులు కూడా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు అంటున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు చొరవ తీసుకుని గట్టును కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. -
తొలి తిరుపతిలో పోటెత్తిన భక్తులు
● స్వామివారి దర్శనానికి 40 వేల మంది భక్తులు ● రూ.4.26 లక్షల ఆదాయం పెద్దాపురం (సామర్లకోట): మండల పరిధిలో తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన తిరుపతి గ్రామంలో వేంచేసి యున్న శృంగారవల్లభ స్వామి ఆలయంలో స్వామివారికి ప్రీతికరమైన రోజు ఽశనివారం, మాఘమాసం కావడంతో భక్తులు పోటెత్తారు. స్వామి వారికి ప్రత్యేక అలంకరణ చేశారు. మాఘమాసం మూడవ శనివారం పురస్కరించుకొని ధ్వజస్తంభంతో పాటు ఆలయ ప్రాంగణాన్ని పూలతో శోభయామనంగా తీర్చిదిద్దారు. గొంచాల, అచ్చంపేట గ్రామం నుంచి భద్రాద్రి రామాలయం నుంచి సీతారాముల ఉత్సవమూర్తుల విగ్రహాలతో రథయాత్రగా వెయ్యి మంది తరలి వచ్చారు. వివిధ గ్రామాల నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయం కిటకిట లాడింది. సుమారు 35వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.2.80,720 అన్నదాన విరాళాలకు రూ.1,13,968, కేశ ఖండన ద్వారా రూ.6,600, తులాభారం ద్వారా రూ.350, లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా రూ.24,705లతో కలిపి రూ.4.,26,343 ఆదాయం వచ్చిందని చెప్పారు. 15వేల మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారని ఈఓ తెలిపారు. -
ఫొటోషూట్కు ఎంతో అనుకూలం
చింతూరు, మారేడుమిల్లిలోని మన్యం ప్రాంతాలు ఫొటోషూట్ల కు ఎంతో అనుకూలంగా ఉన్నా యి. అటవీ ప్రాంతంలో మంచి లొకేషన్లు ఉండడంతో సినిమా, సీరియల్ దర్శకులు ఇక్కడ షూటింగ్లు నిర్వహించేందుకు ఆసక్తి చూపుతున్నారు. మా ఆర్గనైజేషన్ ఆధ్వ ర్యంలో ఇప్పటివరకూ ఇక్కడ తొమ్మిది నేషనల్ లెవల్ ఫొటో వర్క్షాప్లు నిర్వహించాం.–నాగరాజు దేవర, ఖమ్మం ఫొటోఆర్ట్స్ ఆర్గనైజేషన్ నిర్వాహకుడు రిసార్టులకు గిరాకీ పెరిగింది సినిమా, సీరియల్స్ షూటింగులతో పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగింది. పొల్లూరు సమీపంలోని వాటర్ఫాల్స్తో పాటు పుష్ప సినిమా చిత్రీకరించిన ఫోర్బై రిజర్వాయర్, దాని సమీపంలో పవర్ కెనాల్ అక్విడెక్ట్ (వంతెన) ఎంతగానో పాపులర్ అయ్యాయి. ఈ ప్రాంతాలను తిలకించేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారు. –పంచాడ నాని, రిసార్టు నిర్వాహకుడు, పొల్లూరు -
‘పుష్ప’తో ఒక్కసారిగా క్రేజ్
మారేడుమిల్లి, చింతూరు మండలాల్లో చిత్రీకరించిన పాన్ ఇండియా సినిమా పుష్ప ద రైజింగ్ విడుదలై సూపర్ హిట్ కావడంతో మన్యం ప్రాంతంపై ఒక్కసారిగా క్రేజ్ పెరిగింది. మారేడుమిల్లి మండలం గుడిస, చింతూరు మండలం ఫోర్ బై ప్రాంతంలో ఈ సినిమా చిత్రీకరణ అధిక శాతం జరిగింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ సమయంలో గుడిస ప్రాంతంలోని ఒంపులు తిరిగే ఎర్రటి ఘాట్ రోడ్పై వాహనాలు వెళ్లే దృశ్యాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. చింతూరు మండలం ఫోర్ బై రిజర్వాయర్ వద్ద ఈ సినిమాలోని సామీ, సామీ సాంగ్తో పాటు హీరో, హీ రోయిన్ నడుమ చిత్రీకరించిన కొన్ని కామెడీ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. దీంతో పాటు పుష్ప–2 సినిమాలోని మరికొన్ని సన్నివేశాలను మారేడుమిల్లి, తులసిపాక సమీపంలోని సోకిలేరువాగు ప్రాంతాల్లో తీశారు. ఈ ప్రాంతాల్లో నిత్యం షూటింగ్లు జరుగుతుండడంతో స్థానిక యువతకు సైతం క్యారెక్టర్ అర్టిస్టులుగా నటించే అవకాశం లభిస్తోంది. -
రత్నగిరి.. భక్తజన ఝరి
● సత్యదేవుని దర్శించిన 30 వేల మంది ● స్వామివారి ఆదాయం రూ.30 లక్షలు ● రెండు వేల వ్రతాల నిర్వహణ అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తుల రద్దీ కొనసాగింది. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారి సన్నిధికి విచ్చేయడంతో క్యూ లు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయాయి. సత్యదేవుని దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో శ్రీకృష్ణుడు, గోవులకు ప్రదక్షిణ చేశారు. అనంతరం రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి ప్రదక్షిణ చేశారు. సర్క్యులర్ మండపం వద్ద సుమారు ఐదు వేల మంది భక్తులకు పులిహోర, దద్దోజనం పంచిపెట్టారు. దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాథరావు ఆలయ ప్రాంగణం, ప్రసాదం విభాగం, అన్నదానం, వ్రతాలు తదితర ఏర్పాట్లు పర్యవేక్షించారు. భక్తులు రెండు వేల సత్యదేవుని వ్రతాలు ఆచరించారు. దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం శనివారం విచ్చేసిన భక్తుల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షలు ఆదాయం సమకూరింది. ఒక్క వ్రతాల విభాగం ద్వారానే దేవస్థానానికి రూ.15 లక్షల ఆదాయం సమకూరింది. మరో రూ.15 లక్షలు ప్రసాదాల విక్రయాలు, ఇతర విభాగాల ద్వారా వచ్చింది. ఘనంగా సత్యదేవుని ప్రాకార సేవ సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని శనివారం ఆలయ ప్రాకారంలో తిరుచ్చి వాహనంపై ఊరేగించారు. ఉదయం పది గంటలకు సత్యదేవుడు, అమ్మవారి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తూర్పురాజగోపురం వద్దకు తీసుకువచ్చి తిరుచ్చిపై ప్రతిష్ఠించారు. అనంతరం అర్చకులు దత్తు శర్మ, పరిచారకుడు ఇంద్రగంటి రాజా స్వామి, అమ్మవార్లకు పూజలు చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛాటన మధ్య, మంగళవాయిద్యాల నడుమ పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రాగా, స్వామి, అమ్మవార్లను మూడుసార్లు ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఊరేగింపు అనంతరం స్వామి, అమ్మవార్లకు మళ్లీ పూజలు చేసి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. నివేదన చేశారు. అనంతరం అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. -
రేపటి పీజీఆర్ఎస్ రద్దు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ప్రతి సోమవారం ప్రజా సమస్యలు నిమిత్తం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఈ నెల 9న రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ షణ్మోహన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అనివార్య కారణాల వల్ల పీజీఆర్ఎస్తోపాటు, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి ‘డయల్ యువర్ సీఎండీ’బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ సంబంధిత సమస్యలను మరింత వేగవంతంగా పరిష్కరించే లక్ష్యంతో ’డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండి’ విధానాన్ని ప్రవేశపెడుతున్నామని విద్యుత్శాఖ ఎస్ఈ ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించనున్న డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నామన్నారు. జిల్లాలకు చెందిన విద్యుత్ వినియోగదారులు ఫోన్ నంబరు 8688400499 ద్వారా విద్యుత్ సంబంధిత సమస్యలను తెలియజేయవచ్చునన్నారు. విశాఖపట్నం ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు, హెచ్చుతగ్గులు, కొత్త సర్వీసుల జారీలో జాప్యం, విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో జాప్యం, ట్రాన్స్ఫార్మర్ల మార్పిడి, తదితర విద్యుత్ సంబంధిత సమస్యలపై ఫిర్యాదులను నేరుగా సీఎండీ దృష్టికి తీసుకురావచ్చన్నారు. ఈ అవకాశాన్ని సంస్థ పరిధిలోని 11 జిల్లాల వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆల్ఇండియా సివిల్ సర్వీసెస్ విజేతకు సత్కారం రూ.10 వేల నగదు బహుమతి నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఆల్ఇండియా సివిల్ సర్వీసెస్ లాంగ్ జంప్ పోటీలలో బ్రాంజ్ మెడల్ సాధించిన వ్యాయామ ఉపాధ్యాయురాలు, క్రీడాకారిణి సునీతను కాకినాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం సత్కరించారు. కాకినాడ జిల్లా క్రీడామైదానంలో జరుగుతున్న జాతీయస్థాయి కోకనాడ గోల్డ్ కప్ హాకీ పోటీలలో భాగంగా శనివారం నిర్వహించిన మొదటి మహిళల మ్యాచ్కు ఆమె అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాకినాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపకులు రవిచంద్రప్రసాద్ సునీతను శాలువాతో సత్కరించి రూ.10వేల నగదును అందించారు. ఆలిండియా సివిల్ సర్వీసెస్ పోటీలలో మెడల్ సాఽధించిన ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీలో కూడా ఇంక్రిమెంట్లు అందించి ప్రోత్సహించాలని రవిచంద్ర కోరారు. సీబీడీటీ చీఫ్ కోచ్ అజయ్ శర్మ, కోశాధికారి వినయ్, క్లబ్ అధ్యక్షుడు బాబ్జి, మూర్తి, సురేష్రాజు పాల్గొన్నారు. ఘనంగా ‘కోటి తులసి పత్రి పూజ’ – రెండో రోజు కార్యక్రమంలో పాల్గొన్న పలువురు దాతలు అన్నవరం: లోక కల్యాణార్థం రత్నగిరి సత్యదేవుని సన్నిధిలో నిర్వహిస్తున్న ‘కోటి తులసి పూజ’ శనివారం రెండో రోజు కు చేరుకుంది. శనివారం తెల్లవారు జామున సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం పండితులు స్వా మి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉదయం తొమ్మిది గంటలకు 60 మంది రుత్విక్కులు ఆరు లక్షల తులసి దళాలతో స్వామిని అర్చించారు. 11–30 గంటలకు వేదాశీస్సులు అందచేసి స్వామి, అమ్మవారికి నివేదన సమర్పించారు. మధ్యాహ్నం 2–30 గంటల నుంచి ఆరు గంటల వరకు మరో ఐదు లక్షల తులసి దళాలతో స్వామివారికి రుత్విక్కులు పూజలు చేశారు. అనంతరం నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. సూర్యనమస్కారాలు, లింగార్చన కార్యక్రమాలను రుత్విక్కులు నిర్వహించారు. స్వామివారికి నూతన ధ్వజస్తంభం సమకూర్చి, స్వర్ణ తాపడం చేయించిన దాత రెడ్డి దంపతులు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కేబీ రామన్నదొర స్వామికి తులసి దళాలు నివేదించారు. -
కిలాడీ టెక్కీ.. పోలీసులకు చిక్కి..
● 60 కేసుల హైటెక్ దొంగ అరెస్ట్ ● పగలు సాఫ్ట్వేర్ కోడింగ్.. రాత్రి చోరీలు ● భారీగా సొత్తు, ఆడి కారు స్వాధీనం అల్లిపురం: పగలు కంప్యూటర్ ముందు కూర్చుని కోడింగ్ చేసే సాఫ్ట్వేర్ ఇంజినీర్.. రాత్రి వేళల్లో తాళం వేసిన ఇళ్లకు కన్నం వేయడాన్ని ప్రవృత్తిగా మార్చుకున్నాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి, 15 ఏళ్ల వయసులోనే దొంగతనాలు మొదలుపెట్టాడు. నేడు 60 నేరాల రికార్డున్న గజదొంగగా మారిన అచ్చి మహేష్ రెడ్డి అలియాస్ సన్నీని విశాఖ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నగర పోలీస్ కమిషనరేట్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఈ వివరాలను వెల్లడించారు. నిందితుడి నుంచి 699 గ్రాముల బంగారం, 3.8 కేజీల వెండి, నేరాలకు ఉపయోగించిన ఆడి కారు, నంబర్ ప్లేట్ లేని స్కూటీ, ఐరన్ రాడ్, డ్రిల్లింగ్ మెషిన్, సుత్తి, స్క్రూడ్రైవర్, కట్టింగ్ ప్లయిర్, ఫేస్ మాస్కులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. విశాఖ నగరంలో జరిగిన 26 దొంగతనం కేసుల్లో మొత్తం 108.494 తులాల బంగారం, 633.35 తులాల వెండి, నగదు రూ.40,500ను సన్నీ చోరీ చేసినట్లు సీపీ వెల్లడించారు. అసలేం జరిగిందంటే? గత ఏడాది అక్టోబర్ 10న గాజువాకలోని ఎన్టీఆర్ నగర్లో నివసించే కన్నా శివ రామకృష్ణ తన కుమార్తె డ్యాన్స్ ప్రోగ్రామ్ కోసం కుటుంబంతో అరుణాచలం వెళ్లారు. కాకినాడకు చెందిన సన్నీ వారి ఇంటి తాళాలు పగలగొట్టి 17 తులాల బంగారం, 30 తులాల వెండిని ఎత్తుకెళ్లాడు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న గాజువాక క్రైం ఇన్స్పెక్టర్ కల్లూరి శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అలాగే గాజువాక, ఆరిలోవ, మల్కాపురం, పెందుర్తి, దువ్వాడ ప్రాంతాల్లో ఒకే తరహా దొంగతనాలు జరగడంతో పోలీసులు దీనిని సవాలుగా తీసుకున్నారు. సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుడిని గుర్తించారు. నగరంలోని మాధవస్వామి కల్యాణ మండపం సమీపంలోని పార్క్ స్ట్రీట్లో నివాసం ఉంటున్న సన్నీని శనివారం గాజువాకలోని మింది ఆర్చ్ రోడ్ వద్ద క్రైం ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇదీ సన్నీ నేర చరిత్ర నిందితుడు మహేష్ రెడ్డి పీజీ పూర్తి చేశాడు. హైదరాబాద్లోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా చేస్తున్నాడు. అయితే చిన్నతనం నుంచే విలాసాలకు అలవాటు పడటంతో 15 ఏళ్లకే దొంగతనాలకు శ్రీకారం చుట్టాడు. పీఎంపాలెం పరిధిలో నాలుగు దొంగతనాలు చేసి తొలిసారి జువైనెల్ హోంకి వెళ్లాడు. అక్కడి నుంచి విడుదలైన తర్వాత కాకినాడ, సర్పవరం, రామచంద్రాపురం, రాజమండ్రి పరిసరాల్లో 32 దొంగతనాలు చేశాడు. ఈ క్రమంలో పట్టుబడి రాజమండ్రి జైలులో 14 నెలలు శిక్ష కూడా అనుభవించాడు. ఇలా మొత్తం 60కి పైగా దొంగతనాలు చేశాడు. అప్పుడప్పుడు విశాఖ వచ్చి దొంగతనాలు చేసి, మళ్లీ హైదరాబాద్ వెళ్లి విలాసవంతమైన జీవనం సాగిస్తున్నాడు. ఎట్టకేలకు అతన్ని విశాఖ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. -
యాస్ట్రో టర్ఫ్ హాకీ మైదానాలు ఏర్పాటు చేయాలి
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): రాష్ట్రంలో గ్రామీణ స్థాయి నుంచి హాకీ అభివృద్ధి చెందాలంటే ప్రతి జిల్లాలో యాస్ట్రో టర్ఫ్ హాకీ మైదానాలు ఏర్పాటు చేయాలని ఒలింపియన్, మాజీ ఇండియన్ టీమ్ గోల్ కీపర్ రజని తెలిపారు. కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో జరుగుతున్న జాతీయ స్థాయి మొదటి గోల్డ్కప్ హాకీ పోటీలను శనివారం తిలకించేందుకు తిరుపతి నుంచి ఆమె విచ్చేశారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ఆమె తన క్రీడానుభవాలు పంచుకున్నారు. తిరుపతి జిల్లాకు చెందిన తనను పీఈటీ వెంకటరాజు, ప్రసన్నకుమార్లు గుర్తించి క్రీడాల్లో ప్రోత్సహించారన్నారు. 2007లో తొలిసారి జూనియర్ నేషనల్స్ ఆడానని, 2009లో జాతీయ జట్టుకు ఎంపికై నట్లు తెలిపారు. 2013 నుంచి 2024 వరకూ ఏసియా కప్, ఏసియన్ చాంపియన్షిప్ ట్రోఫీ, వరల్డ్ కప్, కామన్ వెల్త్గేమ్స్, రియో ఒలింపిక్స్, ఏసియన్ గేమ్స్లో బంగారు, రజత, కాంస్య పతకాలు సాఽధించానన్నారు. కాకినాడలో జాతీయ స్థాయి పోటీలు ఈ స్థాయిలో నిర్వహిస్తున్న కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ను ఆమె అభినందించారు. భవిష్యత్తులో కాకినాడ నుంచి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు తయారు కావడానికి ఇదో చక్కని వేదిక అన్నారు. విశాఖ, తిరుపతి, కాకినాడలో హాకీ యాస్ట్రో టర్ఫ్ మైదానాలు ఉన్నాయని, ప్రభుత్వం ప్రతి జిల్లాలో హాకీ మైదానాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. కాకినాడలో జరుగుతున్న పోటీల్లో దేవేష్, దీపక్, రాఘవన్ వంటి జాతీయ, అంర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఆడుతున్నారని, వర్ధమాన క్రీడాకారులు వీరి నుంచి ఎంతో నేర్చుకోవచ్చన్నారు. సాధించాలనే పట్టుదల, అంకితభావం, నేర్చుకోవాలనే తపన ఉంటే ఏ క్రీడలోనైనా రాణించవచ్చన్నారు. -
పుష్కరిణి.. పట్టని ధోరణి
ఫ పాదగయలో కో‘నీటి’ కష్టాలు ఫ లక్షల మంది పుణ్యస్నానాలతో కలుషితం ఫ నీరు బయటకు పోయే ఏర్పాట్లు అవశ్యం పిఠాపురం: దేశంలోనే పేరున్న శైవక్షేత్రం.. త్రిగయలలో ఒకటైన పిఠాపురం పాదగయలో అతి పవిత్రమైన పుష్కరిణి భక్తుల పాలిట కల్పవల్లిగా విరాజిల్లుతోంది. అంతటి ప్రాధాన్యం ఉన్న పుష్కరిణి ముఖ్యమైన పర్వదినాల్లో కంపు కొడుతోంది.. ఏటా దసరా, మహా శివరాత్రి పర్వదినాల్లో ఈ సమస్య తలెత్తుతున్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో అధికారులు వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపై భక్తుల్లో ఆందోళన నెలకొంది. పాదగయ క్షేత్రంలోని పుష్కరిణిలో స్నానమాచరించడం పితృ ముక్తికరం, సర్వపాప హరం, సర్వాభీష్ట సిద్ధి ప్రదం అనే నానుడి ఉండడంతో, దీనికి అత్యంత ప్రాధాన్యం ఉంది. భారత దేశంలోని బీహార్ రాష్ట్రంలో శిరోగయ ఉండగా, ఒడిశా రాష్ట్రంలో నాభిగయ ఉంది. ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో పాదగయ ఉంది. త్రిగయ క్షేత్రాల్లో పాదగయకు విశిష్టత ఉంది. ఇక్కడ ఈశ్వరుడు ప్రధాన దైవం కావడం, పురుహూతిక అమ్మవారి శక్తిపీఠం ఉండటంతో ఈ క్షేత్రానికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. స్వయం భూ శివ క్షేత్రంగా విరాజిల్లుతోంది. దీనిని వ్యాస మహర్షి స్వయంగా దర్శించుకున్నట్లు శాస్త్రాలు చెబుతున్నాయి. మహా శివరాత్రి రోజుల్లో ఇక్కడ స్నానమాచరించని వారే ఉండరు. ఇలా చేస్తే మేలు.. పవిత్రమైన పాదగయ పుష్కరిణిలో నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు పాత నీరు పోయి కొత్త నీరు వచ్చే విధంగా చూడాలి. కలుషిత వ్యర్థాలు ఎప్పటికప్పుడు తొలగించాలి. పిండ ప్రదాన సామగ్రి బయటకు పోయే ప్రదేశాల్లోనే నిమజ్జనం చేసే విధంగా చూడాలి. ఉత్సవాలు పూర్తయ్యే వరకూ నీటి పారుదలపై దృష్టి సారించి, పుష్కరిణి పవిత్రతను కాపాడాలి. రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలి. ఒక్క రోజులోనే కలుషితం పాదగయ క్షేత్రంలోని పుష్కరిణిలో ప్రతి 10 నిమిషాలకు సుమారు వెయ్యి మందికి పైగా స్నానాలు ఆచరిస్తారని అంచనా. మహా శివరాత్రి రోజున ఈ పుష్కరిణిలో సుమారు 1.50 లక్షల మంది పుణ్య స్నానాలు ఆచరిస్తారు. ఇది పారే నది, ఏరు కాకపోవడంతో పాటు దీనికితోడు భక్తులు పితృ కార్యక్రమాలు చేసి పిండాలు, అరటి పండ్లు, డొప్పలు వదిలి పెట్టడంతో నీరు తొందరగా కలుషితమవుతుంది. సుమారు 24 గంటల పాటు నిర్విరామంగా భక్తుల తాకిడి ఉండి లక్షల్లో స్నానాలు ఆచరించడంతో నీరు పాడైపోతోంది. దీంతో మరుసటి రోజుకే దానిలో వేసిన వ్యర్థాలు కుళ్లి నీరు మురికి నీరుగా మారి దుర్గంధం వెదజల్లుతోంది. ఏటా ఈ పరిస్థితి ఎదురవుతోంది. ఉత్సవాల్లో భాగంగా శివరాత్రి తరువాత స్వామివారికి నిర్వహించే త్రిశూల స్నానం పుష్కరిణిలో చేయించాల్సి ఉండగా, నీరు కంపు కొడుతుండటంతో కుళాయి నీటితో చేయించిన సందర్భాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు చెత్తను తీయించే ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ ౖపైపె చెత్త మాత్రమే తొలగిస్తుండగా, నీటి అడుగుకు చేరిన పిండ వ్యర్థాలు మాత్రం నీటిని కలుషితం చేస్తుంటాయి. దీంతో కేవలం ఒక్క రోజులోనే పుష్కరిణి పుణ్యస్నానాల మాట అటుంచితే, కనీసం కాళ్లు కడుగుకోవడానికి కూడా పనికిరాకుండా మారిపోతుంటాయి. దాని పక్క నుంచి కూడా వెళ్లలేనంతగా దుర్గంధం వెదజల్లుతుంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం పుష్కరిణి నీరు ఒక రోజులోనే కలుషితం అవుతుంది. సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. పెద్ద బోర్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కొత్త నీరు వచ్చేలా చర్యలు తీసుకుంటాం. అలాగే పాత నీరు బయటకు పంపే ఏర్పాట్లు చేపట్టాం. కలుషిత పదార్థాలను ఎప్పటికప్పుడు ఏరి వేసేలా చూస్తున్నాం. ఐదు రోజుల పాటు నీరు కలుషితం కాకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాం. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకుంటున్నాం. భక్తులు కూడా తమకు సహకారం అందించాలి. –కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్, ఈఓ, పిఠాపురం పాదగయ క్షేత్రం -
ఊరెళ్లారని తెలుసుకుని ఉన్నదంతా ఊడ్చేశారు!
దుర్గాడలో భారీ చోరీ పిఠాపురం: ఇంట్లో వారు ఊరెళ్లారని తెలుసుకుని గుర్తుతెలియని వ్యక్తులు, ఆ ఇంటిని కొల్లగొట్టిన సంఘటన గొల్లప్రోలు మండలం దుర్గాడలో శనివారం చోటుచేసుకుంది. భారీగా బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు చోరీకి గురైంది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. దుర్గాడకు చెందిన కొండేపూడి సూర్యనారాయణ తన భార్యతో కలసి పూణేలో ఉంటున్న తన కుమారుడి ఇంటికి గత 24న వెళ్లారు. వెళ్లే ముందు తన ఇంటికి తాళాలు వేసి అదే గ్రామంలో నివాసముంటున్న తన అల్లుడు వెలుగుల భాస్కరరావుకు తన ఇంటిని అప్పగించారు. అప్పటి నుంచి ఇంటిని చూస్తున్న భాస్కరరావు రోజూ బయట గేటు తాళాలు తీసి ఇంటి బయట తుడిపించడం, లైట్లు వేయించడం చేస్తున్నారు. శనివారం వచ్చి చూసేసరికి ఇంటి ప్రధాన తలుపులు తీసి ఉండడంతో అనుమానం వచ్చి లోపలకు వెళ్లి చూడగా, దొంగతనం జరిగిందని గ్రహించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. గొల్లప్రోలు ఎస్సై ఎన్.రామకృష్ణ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. సుమారు 50 గ్రాముల బంగారం, రెండున్నర కిలోల వెండి ఆభరణాలతో పాటు కొంత నగదు పోయినట్లు బాధితులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసును పిఠాపురం సీఐ శ్రీనివాస్ పర్యవేక్షిస్తున్నారు. -
● ఇంకెన్నాల్.. ఈ పాట్లు
మాచవరం నుంచి చిరతపూడి వెళ్లే ప్రధాన పంట కాలువ చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు, మందు సీసాలు, పశు కళేబరాలతో నిండిపోయింది. అయినా ప్రభుత్వం, పాలకులు చోద్యం చూస్తున్నారు. వాటిని తొలగించాలని ఇరిగేషన్ అధికారులకు వివరించినా పట్టించుకోవడం లేదని రైతులు వాపోయారు. ఈ వ్యర్థాలతో దుర్వాసన వస్తుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. –అంబాజీపేట ● పొగబెట్టారండోయ్.. రావులపాలెం గౌతమి గోదావరి పాత బ్రిడ్జిపై శనివారం మధ్యాహ్నం నల్లని పొగ కమ్మేసింది. ఇది ఆకాశంలో మేఘంలా రావులపాలెం సెంటర్ వరకూ వ్యాపించింది. హుటాహుటిన పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. బ్రిడ్జి కింద గోదావరిలో పాత ఇసుక ర్యాంపు బాట ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు వ్యర్థాలతో పాటు, తారు లాంటి వ్యర్థాలకు నిప్పంటించారు. దీంతో బ్రిడ్జి అంతా పొగతో నిండిపోయింది. కొత్తపేట అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పి వేశారు. –రావులపాలెం ● నిలపడేలా ఎందుకో! నిత్యం అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. అజాగ్రత్తగా కారణంగానే ఎందరో ప్రాణాలు పోతున్నాయి. అయినా ఇలా ఆటో వెనుక ఇలా నిలబడి ప్రయాణం చేయడంపై అంతా ముక్కున వేలేసుకున్నారు. చింతూరు – కూనవరం రహదారిలో శనివారం ఓ ఆటోలో నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికులను ఎక్కించుకున్నారు. వెనుక డోరుపై మహిళలను సైతం నిలబెట్టి తీసుకెళ్లారు. –చింతూరు -
లడ్డూ ప్రసాదంపై రచ్చ వద్దు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో హిందూ ధార్మిక విశ్వాసాలు దెబ్బతినేలా వ్యవహరించవద్దని విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు ఆర్.రవిశంకర్ పట్నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ఇది రాష్ట్రంలో రాజకీయ అంశంగా మారుతోందని, దీనివల్ల ధార్మికతకు, భక్తుల విశ్వాసాలకు భంగం వాటిల్లుతోందని పేర్కొన్నారు. ఈ అంశంపై ఇప్పటికే దర్యాప్తు జరుగుతోందని, కోర్టు పరిధిలో ఉంది కాబట్టి రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణల విషయంలో ఆయా పార్టీలు సంయమనం పాటించాలని కోరారు. భక్తుల విశ్వాసాలు, మనోభావాలు దెబ్బతినేలా ఎవ్వరూ ప్రకటనలు చేయరాదన్నారు. రాష్ట్రంలో ఆవుల అక్రమ రవాణా, గోవధను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నగదు రహిత వైద్యం అందించకపోతే చర్యలు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. ఈ పథకం ద్వారా రోగులకు నగదు రహిత వైద్యం అందించాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన ఎన్టీఆర్ వైద్య సేవ డిస్ట్రిక్ డిసిప్లినరీ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పథకం కింద అందించిన వైద్య సేవలకు గాను రోగుల నుంచి డబ్బులు వసూలు చేసిన ఏడు ఆస్పత్రులకు పెనాల్టీ విధించారు. ఈ పథకం కింద ఏ నెట్వర్క్ ఆస్పత్రిలోనైనా చికిత్సను నిరాకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అటువంటి ఫిర్యాదులు వస్తే నమోదు చేయాలని క్షేత్ర స్థాయి సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి జె.నరసింహ నాయక్, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కో ఆర్డినేటర్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఘనంగా చండీహోమం అన్నవరం: రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి శుక్రవారం చండీహోమం ఘనంగా నిర్వహించారు. ఉదయం 9 గంటలకు అమ్మవారికి పండితులు ప్రత్యేక పూజలు చేసి, చండీహోమం ప్రారంభించారు. పూర్ణాహుతి అనంతరం అమ్మవార్లకు వేదాశీస్సులు, నివేదనలు, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. వేద పండితులు అమరేశ్వర ఘనపాఠి, వనదుర్గ ఆలయ అర్చకుడు ప్రయాగ రాంబాబు, వ్రత పురోహితులు దేవులపల్లి ప్రకాష్, కూచుమంచి ప్రసాద్, పరిచారకులు హోమం నిర్వహించారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్తో పాటు 30 మంది భక్తులు ఈ హోమంలో పాల్గొన్నారు. సత్యదేవుని ప్రధానాలయంలో అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి, రత్నగిరి తొలి పావంచా వద్ద కనకదుర్గ అమ్మవారికి పండితులు కుంకుమ పూజలు నిర్వహించారు. -
శనివారం శ్రీ 7 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
మద్యం దోపిడీని సహించేది లేదుబోట్క్లబ్ (కాకినాడ సిటీ): అధిక ధరలకు మద్యం విక్రయించే దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ హెచ్చరించారు. ఎక్సైజ్ అధికారులు, మద్యం దుకాణదారులు, లైసెన్స్దార్లతో కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధిక ధరలకు మద్యం విక్రయించడం చట్టవిరుద్ధమని, దుకాణదార్లు కచ్చితంగా నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్ మాట్లాడుతూ, మద్యం దుకాణదారులు ఎంఆర్పీని తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలు అమలయ్యేలా ఎకై ్సజ్ అధికారులు ముమ్మర తనిఖీలు చేయాలని అన్నారు. సమావేశంలో ఏఎస్పీ మనీష్ పాటిల్ దేవరాజ్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఎం.కృష్ణకుమారి, స్పెషల్ బ్రాంచి డీఎస్పీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
త్వరలో వనదుర్గమ్మ ఆలయ మండపం విస్తరణ
అన్నవరం: రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారి ఆలయ మండపాన్ని మరింత విస్తరించనున్నారు. ఆలయంలో ఈ నెల 20న ఖడ్గమాల కుంకుమ పూజ ప్రారంభించనున్న విషయం తెలిసిందే. దీనికి అధిక సంఖ్యలో భక్తులు వస్తారని అధికారులు భావిస్తున్నారు. అయితే, అందుకు తగినట్టుగా ఆలయ మండపం విశాలంగా లేదు. ఇక్కడ ప్రతి శుక్రవారం అమ్మవారికి చండీహోమం, ప్రతి పౌర్ణమి, అమావాస్య తిథుల్లో ప్రత్యంగిర హోమం నిర్వహిస్తున్నారు. వీటిల్లో కూడా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. కొన్నిసార్లు వందకు పైగా టికెట్లు కొనుగోలు చేసి భక్తులు ఈ హోమాల్లో పాల్గొంటున్నారు. అయి తే, అందుకు తగినట్టుగా ఈ మండపం చాలకపోవడంతో పలువురు భక్తులు వెలుపలే ఉండాల్సి వస్తోంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఈ మండపాన్ని విస్తరించాలని నిర్ణయించారు. దేవస్థానం అధికారుల విజ్ఞప్తి మేరకు దేవదాయ శాఖ డిప్యూటీ స్థపతి శ్రీనివాసాచారి దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాథరావులతో కలసి వనదుర్గ అమ్మవారి ఆలయాన్ని శుక్రవారం పరిశీలించారు. ఆలయ మండపాన్ని తూర్పు వైపు 30 అడుగుల ముందుకు పెంచుకోవచ్చని సూచించారు. ఆలయం ముందున్న మెట్లు తొలగించి, ఆలయం ముందు ఒక స్లాబ్, దిగువన హోమ మండపం మీద మరో స్లాబ్ వేసి విస్తరించనున్నట్లు ఈఈ రామకృష్ణ తెలిపారు. ఆలయ మండప విస్తరణ ప్లాన్ను డిప్యూటీ స్థపతి మూడు నాలుగు రోజుల్లో దేవస్థానానికి అందించనున్నా రు. ఆ వెంటనే అంచనాలు రూపొందించి, టెండర్ పిలిచి, నిర్మాణం ప్రారంభిస్తామని చెప్పారు.వనదుర్గ అమ్మవారి ఆలయం -
సర్కారు వారి జిందాల్బాద్!
ఆనూరులో జిందాల్ పవర్ప్లాంట్ ఏర్పాటుకు ప్రతిపాదించిన స్థలంగత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో సొంతిళ్లు కట్టుకోవచ్చని ఆ నిరుపేదలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తమ స్వప్నం సాకారమవుతుందని భావించారు. అంతలోనే ప్రభుత్వం మారింది. ఆ స్థలాలను కొత్త ప్రభుత్వం అభివృద్ధి చేసి, తమ కలలను నెరవేర్చుకునేందుకు పునాది వేస్తుందని లబ్ధిదారులు అనుకున్నారు. తీరా చూస్తే ఇప్పుడు వారి ఆశలకు సమాధి కడుతూ.. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్కు ఆ స్థలంలో పునాది వేయాలని సర్కారు ప్రతిపాదించింది. దీనికి వ్యతిరేకంగా గళం విప్పుతున్న వారిపై ఉక్కుపాదం మోపుతోంది. సాక్షి ప్రతినిధి కాకినాడ: నియోజకవర్గ కేంద్రమైన పెద్దాపురం సమీపాన కాకినాడ – రాజానగరం ఏడీబీ రోడ్డులో రామేశ్వరం మెట్ట వద్ద అప్పటి ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు హయాంలో 530 ఎకరాల భూమిని పేద దళితులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి ఎకరా 35 సెంట్ల చొప్పున ఇచ్చారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉండగా.. ఆ భూమిని చదును చేసి, సాగు చేసుకునేందుకు వీలుగా లబ్ధిదారులకు ఇస్తామనే మిషతో టీడీపీ నేతలు, అప్పటి ప్రజాప్రతినిధులు అక్కడి కొండను అడ్డగోలుగా తవ్వేసి, రూ.లక్షలు దిగమింగారు. ఇక్కడ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 250 మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది. ఆ భూమిని చదును చేసి, జగనన్న లే అవుట్గా అభివృద్ధి చేసి మరీ లబ్ధిదారులకు అప్పగించింది. ఈ లే అవుట్లో రెండో విడత ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉండగా 2024లో సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. అనంతరం, చంద్రబాబు ప్రభుత్వం గద్దెనెక్కడంతో ఈ లే అవుట్ను గాలికొదిలేశారు. వైఎస్సార్ సీపీకి ఎక్కడ పేరు వచ్చేస్తుందోననే దుర్బుద్ధితోనే ఈ జగనన్న లే అవుట్కు మంగళం పాడేశారని బాధితులు గొల్లుమంటున్నారు. డీల్ కుదిరిందా..! ఇదిలా ఉండగా పెద్దాపురం మండలం ఆనూరు గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నంబర్ 11/1, 12/3లో సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీ సమీపాన ఉన్న ఈ భూమిలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. జిందాల్ సంస్థ ఏర్పాటు చేసే ఈ ప్లాంట్ నిర్మాణానికి 12 ఎకరాలు, దీనికి అవసరమైన డంపింగ్ యార్డ్ కోసం మరో 40 ఎకరాలు అవసరమని తేల్చారు. ఈ మొత్తం వ్యవహారంలో అధికార పార్టీ నేతల జోక్యం అనేక అనమానాలకు తావిస్తోంది. దీని వెనుక పెద్ద డీల్ కుదిరిందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అలా కాకపోతే గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 250 మంది నిరుపేద లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు నిర్దేశించి, రామేశ్వరం మెట్టలో చదును చేసిన భూమిని విద్యుత్ ప్లాంట్ కోసం ఎందుకు ప్రతిపాదిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. అంత మంది లబ్ధిదారుల గూడు చెడగొట్టి ప్లాంట్కు ధారాదత్తం చేయడంలో ఆంతర్యమేమిటని నిలదీస్తున్నారు. గళం విప్పుతున్న బాధితులు ఈ భూమిని విద్యుత్ ప్లాంట్కు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించడంపై పేదలు మండిపడుతున్నారు. తమ పొట్ట కొట్టి, పెద్దలకు దోచి పెట్టడమేమిటని ప్రశ్నిస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యాన ఉద్యమిస్తున్నారు. ఇక్కడ చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ఏర్పాటు వలన కాలుష్యం కాటేస్తుందని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సైతం గళం విప్పుతున్నారు. ప్రజారోగ్యాన్ని పణంగా పెడుతూ, పంటలను నాశనం చేసే, పర్యావరణానికి ముప్పుగా మారే ఈ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు యత్నాలను విరమించుకోవాలనే డిమాండ్తో కొంత కాలంగా ఏపీ రైతు కూలీ సంఘం ఆధ్వర్యాన ఉద్యమిస్తున్నారు. ఈ ప్లాంట్ నిర్మిస్తే వెలువడే వాయు కాలుష్యంతో తమ ఆరోగ్యాలు దెబ్బ తింటాయని సమీపంలోని ఆనూరు, కొండపల్లి, రామేశ్వరంపేట, సూరంపాలెం, వాలు తిమ్మాపురం తదితర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పవర్ ప్లాంట్లో చెత్తను మండిస్తే వచ్చే హానికర రసాయనాలు ఇక్కడి గాలిని కలుషితం చేస్తాయని చెబుతున్నారు. దీనివలన ప్రజారోగ్యంపై దుష్ప్రభావం పడటమే కాకుండా సమీపంలోని పచ్చని పంటలు, పండ్ల తోటలు మాడి మసైపోతాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. థర్మల్ పవర్ ప్లాంట్తో పోలిస్తే చెత్త దహన యంత్రాలు పాదరసం, సీసం, నైట్రోజన్ ఆకై ్సడ్లను అధిక స్థాయిలో విడుదల చేస్తాయని నిపుణులు చెబుతున్నా పరిగణనలోకి తీసుకోవడం లేదని ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న వామపక్ష ప్రజాసంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనివలన పరిసర గ్రామాల ప్రజలు శ్వాసకోశ వ్యాధులు, నరాల రుగ్మతలు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగాల బారిన పడతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్లాంట్ నుంచి వచ్చే కాలుష్యంతో గాలి, నీరు, నేల కలుషితమై పర్యావరణం దెబ్బ తింటుందని ఆరోపిస్తున్నారు. ప్రమాదకర స్థాయిలో బాటమ్ యాష్!ఢిల్లీ సమీపాన ఓఖ్లాలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు వ్యతిరేకంగా గతంలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. పర్యావరణంపై దుష్ప్రభావం చూపిందని పేర్కొంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2016లో ఓఖ్లా ప్లాంట్కు రూ.25 లక్షల జరిమానా కూడా విధించిందని చెబుతున్నారు. వాస్తవానికి బాటమ్ యాష్ 20 శాతం కంటే ఎక్కువ ఉండకూడదని, కానీ చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లో అది 40 శాతం వరకూ ఉంటుందని, ఇది ఆందోళన కలిగిస్తోందని ఉద్యమకారులు అంటున్నారు. బాటమ్ యాష్ వ్యర్థాలను శుద్ధి చేయడం, నిల్వ చేయడం పెద్ద సమస్యగా మారుతుందనే ఆందోళన నెలకొంది. ఇటువంటి అంశాల్లో ప్రజల ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాల్సిన ప్రభుత్వం.. ఈ ప్లాంట్కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వారిపై కేసులు పెడుతూ ఉక్కుపాదం మోపుతూండటంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. రామేశ్వరం మెట్ట వద్ద జగనన్న లే అవుట్ గత సీఎం జగన్ హయాంలో 250 మందికి స్థలాలు ఇళ్ల నిర్మాణానికి వీలుగా చదును చేసి మరీ అప్పగింత ఆ లే అవుట్ను గాలికొదిలేసిన బాబు సర్కార్ ఆ భూములపై అధికార పార్టీ నేతల కన్ను విద్యుత్ ప్లాంట్కు అప్పగించేందుకు ప్రతిపాదనలు భగ్గుమంటున్న నిరుపేదలు వెంటనే రద్దు చేయాలి ఆనూరులో జిందాల్ పవర్ప్లాంట్ ఆధ్వర్యాన ప్రతిపాదించిన చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని రద్దు చేయాలి. దీనిని ఏర్పాటు చేస్తే చుట్టూ ఉన్న పచ్చటి పంటలు, మామిడి, జీడిమామిడి, ఆయిల్పామ్, నిమ్మ వంటి తోటలు మాడిపోతాయి. చెత్తను మండించడం వలన దుర్వాసన రావడంతో పాటు, హానికర రసాయనాలు గాలిని కలుషితం చేస్తాయి. చుట్టుపక్కల ప్రజలు వివిధ రోగాల పాలయ్యే ప్రమాదముంటుంది. అందువలన ఈ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలి. లేకుంటే ప్రజలను సమీకరించి ఉద్యమిస్తాం. – కర్నాకుల వీరాంజనేయులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం పేదలకు అన్యాయం ఆనూరులో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించిన భూములను నేటి చంద్రబాబు ప్రభుత్వం వెనక్కి తీసుకుని జిందాల్ కంపెనీకి కట్టబెట్టడం అన్యాయం. దీంతో మహిళల సొంతింటి కల నెరవేరడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత హౌసింగ్ రుణాలిచ్చి ఆదుకుంటుందని అనుకుంటే.. అసలు ఇంటి స్థలమే లేకుండా చేస్తోంది. అలాగే, వాలుతిమ్మాపురానికి చెందిన దళితుల భూముల్ని కూడా ప్రభుత్వం స్వల్ప ధరకు తీసుకుని కంపెనీకి ఇచ్చేస్తోంది. కాలుష్యాన్ని వెదజల్లే జిందాల్ పరిశ్రమను వెంటనే రద్దు చేసి, ఆ భూములను తిరిగి లబ్ధిదారులకు పంపిణీ చేయాలి. – రెడ్డి దుర్గాదేవి, జిల్లా నాయకురాలు, ప్రగతిశీల మహిళా సంఘం (సీ్త్ర విముక్తి), ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కమిటీ -
గాండ్రింపు ఆగింది..
చిక్కదు.. దొరకదు.. అన్నట్టుగా తూర్పు గోదావరి జిల్లా ప్రజలకు వారం రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పులి.. ఎట్టకేలకు పట్టుబడింది. రాయవరం మండలం కూర్మాపురంలోని ఓ పాడుబడిన ఇంట్లో నక్కిన పులిని పట్టుకునేందుకు అటవీ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం నుంచి విశ్వ ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ, అది అక్కడి నుంచి తప్పించుకుని, సాయంత్రానికి సమీపంలోని పశువుల పాకలో నక్కింది. అక్కడి నుంచి అది తప్పించుకోవడానికి వీలు లేకుండా.. ఆ పాక చుట్టూ అధికారులు వల పన్ని, చివరకు ట్రాంక్విలైజర్తో మత్తు మందు ఇచ్చి, బంధించారు. దీంతో, గత నెల 31న సీతానగరం మండలంలో మొదలైన టైగర్ టెర్రర్కు తెర పడింది. – వివరాలు 8లో.. -
కోటి తులసి పూజకు శ్రీకారం
● సత్యదేవుని సన్నిధిలో ఘనంగా ప్రారంభం ● 10 రోజుల పాటు నిర్వహణఅన్నవరం: సత్యదేవుని సన్నిధిలో పది రోజుల పాటు జరిగే కోటి తులసి పత్రి పూజ ఘనంగా ప్రారంభమైంది. రత్నగిరి రామాలయం వద్ద సత్యదేవుని వార్షిక కల్యాణ మండపంలో శుక్రవారం ఉదయం 7.30 గంటలకు దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాథరావు దంపతులు పండితుల మంత్రోచ్చారణల నడుమ ఈ పూజకు శ్రీకారం చుట్టారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు తులసి దళాలు సమర్పించారు. కోటి తులసి పూజలో పాల్గొంటున్న వేద పండితులు, అర్చకులు, వ్రత పురోహితులు, ఆగమ పాఠశాల విద్యార్థులకు చైర్మన్, ఈఓలతో పాటు అసిస్టెంట్ కమిషనర్ ఎం.మంజులాదేవి దీక్షా వస్త్రాలు అందించారు. 15వ తేదీ వరకూ.. కోటి తులసి పూజలో భాగంగా మహాలింగార్చన, సూర్య నమస్కారాలు, నవావరణార్చన, రామాయ ణ, భారత, భాగవత పారాయణ తదితర కార్యక్రమా లు నిర్వహించారు. విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం తదితర కార్యక్రమాల అనంతరం, రుత్విక్కులు విష్ణు సహస్ర నామాలు పఠిస్తూ స్వామి, అమ్మవార్లను తులసి దళాలతో అర్చించారు. ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకూ ఈ కార్యక్రమం కొనసాగింది. అనంతరం, స్వామి, అమ్మవార్లకు నివేదనలు చేసి, నీరాజన మంత్రపుష్పాదులు సమర్పించి, భక్తులకు ప్రసాదాలు వితరణ చేశారు. తిరిగి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ తులసి పూజ నిర్వహించారు. రోజుకు 10 లక్షల చొప్పున ఈ నెల 15వ తేదీ నాటికి కోటి తులసి పూజ పూర్తి చేస్తారు. చివరి రోజు ఉదయం 8 గంటలకు రుద్రహోమం నిర్వహించడంతో ఈ మహా క్రతువు ముగియనుందని ఈఓ త్రినాథరావు తెలిపారు. ప్రతిధ్వనించిన వేదనాదం కోటి తులసి పూజ సందర్భంగా రత్నగిరిపై వేదనాదం ప్రతిధ్వనించింది. దేవస్థానం వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, యనమండ్ర శర్మ ఘనపాఠి, గంగాధరభట్ల గంగబాబు, సూర్యనారాయణ, చిట్టి శివ, ముష్టి పురుషోత్తం, ప్రధానార్చకులు ఇంద్రగంటి నరసింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యం, అర్చకులు సుధీర్, దత్తాత్రేయశర్మ, కల్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు, పురోహితులు పాలంకి పట్టాభి, కొంపెల్ల మూర్తి, పరిచారకులు శివ, పవన్, మరో 60 మంది పండితుల సుస్వర వేద మంత్రోచ్చారణలతో ఈ క్రతువు నిర్వహించారు. ఈ పూజను పురస్కరించుకుని సత్యదేవుని వార్షిక కల్యాణ మండపం, విశ్రాంతి మండపాలను పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. మహాయజ్ఞంతో సమానమైన ఈ క్రతువును అందరూ తిలకించి సత్యదేవుని కృపకు పాత్రులు కావాలని పండితులు కోరారు. కోటి తులసి పూజకు రూ.5 లక్షల విరాళం సమర్పించిన అరబిందో ఫార్మా కంపెనీ తరఫున డైరెక్టర్ లక్ష్మి, దేవస్థానానికి వివిధ రూపాల్లో సుమారు రూ.20 లక్షల విరాళం ఇచ్చిన పీఎస్ కుమార గురుపరన్, శాంతి దంపతులు (చైన్నె), పలువురు దాతలు స్వామివారికి తులసి దళాలు సమర్పించారు. ఏర్పాట్లను ఏఈఓలు కృష్ణారావు, అనకాపల్లి ప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గణపతి తదితరులు పర్యవేక్షించారు. సుమారు 50 మంది స్వచ్ఛంద సేవా కార్యకర్తలు తులసి దళాలను సిద్ధం చేసే సేవలో పాల్గొన్నారు. సత్యదేవుని దీక్ష ప్రచార కర్త నల్లమిల్లి కృష్ణబాబు కూడా సేవలో పాల్గొన్నారు. ● కోటి తులసి పూజ సందర్భంగా స్వామివారి వార్షిక కల్యాణ వేదికపై అలంకరణ బాగుంది. అయితే, కల్యాణ వేదిక నుంచి విశ్రాంతి మండపం వరకూ షామియానా వేయడంతో ఆ అలంకరణతో పాటు కల్యాణ వేదిక గోపురం కూడా కనిపించడం లేదు. దీనిపై అందరూ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిని గుర్తించిన ఈఓ త్రినాథరావు ఆ షామియానాను తొలగించాలని ఆదేశించారు. ● 2022లో కోటి తులసి పూజ జరిగినప్పుడు మండపం ప్రారంభంలో తులసి మొక్కల కుండీల నడుమ సత్యదేవుని ఉత్సవమూర్తులను ఏర్పాటు చేశారు. భక్తులు అక్కడ ఫొటోలు దిగేవారు. ఇప్పుడు అటువంటి ఏర్పాట్లు లేకపోవడంతో అందరూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ● 2022తో పోల్చితే అలంకరణ కూడా తక్కువగా ఉంది. మిగిలిన రోజుల్లోనయినా అలంకరణ బాగా చేయాలని భక్తులు కోరుతున్నారు. ● కోటి తులసి పత్రి పూజకు సప్తగిరి హేచరీస్ ఎండీ పెదబాబు శుక్రవారం రూ.1.08 లక్షల విరాళం అందజేశారు. -
గ్రావెల్ తవ్వకాలపై విజిలెన్స్ దాడులు
గోకవరం: మండలంలోని సూదికొండ, గంగంపాలెం గ్రామాల పరిధిలో గ్రావెల్ అక్రమ తవ్వకాలపై తూర్పుగోదావరి జిల్లా భూ గర్భ, గనుల శాఖ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించా రు. ఈ దాడుల్లో అక్రమంగా మైనింగ్ జరుగుతున్నట్టు నిర్ధారించి తవ్వకాలు నిర్వహిస్తున్న రెండు పొక్లెయిన్లను సీజ్ చేశారు. జిల్లాలో అనుమతులు లేకుండా తవ్వకాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా గనులు, భూగర్భ శాఖ అధికారి డి.ఫణిభూషణ్రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ జియాలజిస్ట్ జి.విఘ్నేశ్వరుడు, రాయల్టీ ఇన్స్పెక్టర్ జ్యోతిర్మయి, టెక్నికల్ అసిస్టెంట్లు శైలజ, మనీషా, స్థానిక రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
రాజమహేంద్రవరం రూరల్: పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు పిలుపునిచ్చారు. శుక్రవారం కాతేరు గ్రామంలో శ్యామలాంబ గుడి వద్ద నుంచి ‘‘ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం’’ అనే నినాదంతో సామాజిక కార్యకర్త గారపాటి వనజ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం నుంచి తిరుమలకు మహిళలు చేపట్టిన పాదయాత్రను ఆయన ప్రారంభించారు. తిరుమలరావు మాట్లాడు తూ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సామాజిక కార్యకర్త వనజ ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం పేరిట ఎన్నో కార్యక్రమా లు చేస్తున్నారని, అందులో భాగంగానే పాదయాత్రను ప్రారంభించారన్నారు. అనంతరం వనజ మాట్లాడుతూ అన్నదానాలు, వేడుకల్లో స్టీల్ గ్లాస్లు, ప్లేట్లు, అరటి ఆకులు, విస్తరాకులు ఉపయోగించి సకల జీవరాశుల ఆరోగ్యాన్ని, భూమాత ఆరోగ్యాన్ని కాపాడాలన్నారు. వాడిన ప్లాస్టిక్ను పక్కన పెట్టి పొడి చెత్తగా పారిశుధ్య కార్మికులకు అందజేసి పునరుత్పత్తి వినియోగానికి సహకరించాలన్నారు. పాదయాత్ర పొడవునా ఉన్న గ్రామాల్లో ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి కలిగే నష్టాలను వివరిస్తామన్నారు. పాదయాత్రలో గారపాటి వనజ, గారపాటి విజేత, నీరుకొండ అనిత, ముళ్లపూడి శేషకుమారి, ముళ్లపూడి చిట్టి, కాట్రగడ్డ ఉమాదేవి పాల్గొంటున్నారు. ఆ మహిళలను ముఖ్య అతిథులు ఘనంగా సత్కరించారు. వీరు కాతేరులో ఒక్కో మొక్కను నాటారు. నున్న కృష్ణ, గంగిన హనుమంతరావు, గంగిన జాహ్నవి, మద్దిపట్ల రాజు, మద్దిపట్ల చిన్ని, కాతేరు యూత్ సభ్యులు పాల్గొన్నారు. -
మహిళ ఆత్మహత్యాయత్నం
పెద్దాపురం (సామర్లకోట): అప్పుల బాధ తాళలేక ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికుల కథనం ప్రకారం.. పాత పెద్దాపురం బొమ్మల గుడి వీధికి చెందిన కె.శేషమ్మ (50) అక్కడి రాయచెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సమాచారం తెలిసిన వెంటనే ఎస్సై మౌనిక హుటాహుటిన సంఘటనా ప్రదేశానికి చేరుకుని శేషమ్మను రక్షించారు. గజ ఈతగాళ్లను పంపి ఆమెను రక్షించారు. శేషమ్మ కుమార్తె అప్పులు చేసి తీర్చకపోవడంతో శేషమ్మపై అప్పుల వారి ఒత్తిడి పెరగడంతో ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. శేషమ్మకు ఎస్సై మౌనిక కౌన్సెలింగ్ ఇచ్చి బంధువులకు అప్పగించారు. -
దక్కని ఆధరవు
అరటికి డిమాండ్ మూడేళ్లుగా అంతంత మాత్రంగా ఉన్న అరటి ధరలు ప్రస్తుతం ఆకాశాన్ని అంటుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ నష్టాలను చవి చూసిన రైతులు అరటి సాగు తగ్గించడం, మరోపక్క ప్రకృతి వైపరీత్యాలకు ఉన్న పంట నేలకూలడం, మరికొంతమంది ప్రత్యామ్నాయంగా కంద, కోకో, పసుపు, కూరగాయ పంటల వైపు మొగ్గు చూపడం వంటి కారణాలతో దిగుబడి తగ్గింది. గతంలో కోనసీమ జిల్లావ్యాప్తంగా 25,204 ఎకరాల్లో అరటి సాగు జరగగా ఇప్పుడు 13 వేల ఎకరాల్లో మాత్రమే ఉందని అంచనా. విజయవాడ, గుంటూరు, కడప తదితర మధ్య, దక్షిణాంధ్ర ప్రాంతాల్లో కూడా రైతులు మొక్కజొన్న, మిర్చి సాగుకు మొగ్గు చూపడంతో అరటి విస్తీర్ణం తగ్గింది. విజయనగరం, సాలూరు, పార్వతీపురం తదితర ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో గాలులకు అరటి చెట్లు పడిపోవడంతో ఇక్కడి అరటికి డిమాండ్ పెరిగింది. రావులపాలెం మార్కెట్ యార్డ్ ద్వారా రోజుకు 25 వేల నుంచి 30 వేల అరటి గెలల ఎగుమతులు జరిగేవి. ప్రస్తుతం 10 నుంచి 12 వేల గెలలు మాత్రమే వస్తున్నాయి. దీంతో, వీటికి భారీ డిమాండ్ ఏర్పడింది. గత నెలలో రూ.200 నుంచి రూ.300 వరకూ ఉన్న కర్పూరం, తెలుపు, ఎరుపు చక్కరకేళీ ధరలు ప్రస్తుతం అమాంతం రూ.700 నుంచి రూ.800కు పెరిగాయి. అరటి ధరలు మార్చి నెల వరకూ ఇలాగే ఉంటాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. మహాశివరాత్రి, రంజాన్ మాసం ప్రారంభం కావడంతో పాటు, శ్రీరామనవమి, ఉగాది పండగలు ఉండడంతో ధరలు తగ్గే అవకాశం లేదంటున్నారు. ధర ఉన్నా.. సరకు లేదు మూడేళ్లుగా అరటికి సరైన ధర లేక రైతులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం ధర చుక్కల్లో ఉన్నా సరకు లేదు. రైతులు అరటి పంటకు ప్రత్యామ్నాయంగా కంద సాగుకు వెళ్లడం ఈ పరిస్థితికి కారణం. ఏప్రిల్ నాటికి అరటి పంట అందుతుంది. అప్పటి వరకూ పండగలు, పూజల కారణంగా మార్చి నెలాఖరు వరకూ ధరలు తగ్గకపోవచ్చు. – కోనాల చంద్రశేఖర్రెడ్డి, అరటి వ్యాపారి, ఊబలంక, రావులపాలెం సాక్షి, అమలాపురం/ రావులపాలెం: జిల్లాలో కొబ్బరి, అరటి, వెనామీ రొయ్యల ధరలు పెరిగినా రైతులకు లబ్ధి చేకూరడం లేదు. మార్కెట్లో సరకుకు డిమాండ్ ఉండి మంచి ధర పలుకుతున్నా ఆ ఫలాలను అందుకోలేని స్థితిలో రైతులు ఉన్నారు. ఆశించిన స్థాయిలో ధరలు పెరిగినా దిగుబడులు గణనీయంగా తగ్గిపోవడం వల్ల గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొబ్బరికి మంచి రేటు నాలుగు నెలలుగా ధర లేక ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులకు ఊరట కలిగిస్తూ గత నెల నాలుగో వారంలో కొబ్బరి ధరలు పెరిగాయి. అంబాజీపేట మార్కెట్లో పచ్చి కొబ్బరి వెయ్యికాయల ధర రూ.19 వేల నుంచి రూ.20 వేల వరకూ ఉంది. గయర కాయ (పెద్ద కాయ) ధర రూ.21 వేల వరకూ పెరిగింది. అడపాదడపా తగ్గుతున్నా డిమాండ్ను బట్టి మార్కెట్లో ధర పెరుగుతోంది. పండగ సీజన్లు కావడంతో పాటు దిగుబడి గణనీయంగా తగ్గడం కూడా కొబ్బరి డిమాండ్కు కారణం. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 1.30 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతోంది. కొబ్బరి సగటు దిగుబడి ఎకరాకు 1,200 నుంచి 1,400 కాయలు. దిగుబడి ఏకంగా 30 శాతం నుంచి 40 శాతం వరకు తగ్గి ఎకరాకు 600 నుంచి 700 కాయలు మాత్రమే వస్తున్నాయి. దీనివల్ల ధరలు పెరిగాయి. ధర పెరిగినా దిగుబడి తగ్గడం వల్ల తమకు గిట్టుబాటు కావడం లేదని రైతులు చెబుతున్నారు. వనామీ రేటు పెరిగినా.. వంద కౌంట్ (కేజీకి వంద రొయ్యలు) ధర ప్రస్తుతం రూ.250 వరకూ ఉంది. ఇటీవల కాలంలో వంద కౌంట్కు ఈ ధర రావడం అరుదైన విషయమే. 90 కౌంట్ రూ.260 ఉండగా, 80 కౌంట్ రూ.280, 70 కౌంట్ రూ.310, 60 కౌంట్ రూ.330, 50 కౌంట్ రూ.350, 40 కౌంట్ రూ.380, 30 కౌంట్ రూ.480 వరకూ ధరలు ఉన్నాయి. 30 కౌంట్కు ధర రూ.480 రావడం ఈ మధ్య కాలంలో ఇదే మొదటిసారి. గత ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో వనామీ రొయ్యల కౌంట్కు మంచి ధర వచ్చింది. తరువాత ఎగుమతులపై అమెరి కా టారిఫ్ల కొరడాతో ధరలు పతనమయ్యాయి. అమెరికా టారిఫ్లు తగ్గించామని చెప్పడానికి ముందే వనామీ రొయ్యల ధరలు ఈ స్థాయిలో ఉన్నాయి. కోన సీమ, కాకినాడ జిల్లాల్లోని తీరాన్ని ఆనుకుని సుమారు 23 వేల ఎకరాల్లో వనామీ సాగు జరుగుతోంది. కానీ, ప్రస్తుతం రైతులు ఈ ఏడాది తొలి పంటకు సిద్ధమవుతున్నారు. మొత్తం సాగులో పావు వంతు అంటే సుమారు 6 వేల ఎకరాల్లో మాత్రమే సాగు జరుగుతోందని అంచనా. రొయ్యల లభ్యత తక్కువగా ఉండటం ధరల పెరుగుదలకు కారణమైంది. ఎప్పుడూ ఇదే తీరు పట్టుబడులు జరిగే సమయంలో వనామీ రొయ్యల ధరలు తగ్గడం, దిగుబడి తక్కువగా ఉన్న సమయంలో పెరగడం సాధారణమైపోయింది. కొనుగోలుదారులు సిండికేటుగా మారడం వల్లనే ఈ పరిస్థితి. ఇప్పుడు మార్కెట్కు రొయ్యల రాక తగ్గింది. దీనివల్లే వీటి ధరలు పెరిగాయి. – దంతులూరి నానాజీరాజు, ఆక్వా రైతు, అన్నంపల్లి. జిల్లాలో పెరిగిన కొబ్బరి, అరటి, వెనామీ రొయ్యల రేట్లు అయినా రైతుకు లబ్ధి చేకూరని దుస్థితి కొబ్బరి, అరటికి కలసి వచ్చిన మహా శివరాత్రి, మాఘమాసం కొబ్బరి వెయ్యికాయలు రూ.20 వేలు 40 శాతం తగ్గిన దిగుబడులు కర్పూరం అరటి గెల రూ.700 రావులపాలెం మార్కెట్కు వచ్చేది సగం గెలలు వనామీ రొయ్యలకు అంచనాలకు మించి ధర ప్రస్తుతం పావు వంతు మాత్రమే సాగు -
రేషన్ బియ్యం స్వాధీనం
అంబాజీపేట: పేదలకు చేరాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని గురువారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంబాజీపేట ఎస్సై కె.చిరంజీవి కథనం ప్రకారం.. మామిడికుదురుకు చెందిన గోకవరపు రాఘవ అవినాష్ 82 బస్తాల్లో 2,988 కిలోల రేషన్ బియ్యాన్ని మామిడికుదురు నుంచి ఆలమూరుకు బొలెరో వాహనంలో తరలిస్తున్నారు. ముక్కామల వచ్చేసరికి పోలీసులు దాడి చేసి ఆ వాహనాన్ని పట్టుకున్నారు. రేషన్ బియ్యాన్ని తక్కువకు కొనుగోలు చేసి ఆలమూరు పరిసర ప్రాంతాల్లో పనులు చేసే కూలీలకు ఎక్కువ ధరకు విక్రయిస్తారని ఎస్సై తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. బియ్యాన్ని ఎమ్ఎస్ఓ పూర్ణిమ సారధ్యంలో సివిల్ సప్లయిస్ గొడౌన్కు తరలించామన్నారు. త్రుటిలో తప్పిన ప్రమాదంనిడదవోలు: స్థానిక గణేష్చౌక్ సెంటర్లో గురువారం ఓ వృద్ధుడికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. పంగిడి నుంచి విజ్జేశ్వరం వెళ్తున్న క్వారీ లారీ పట్టణంలో గణేష్చౌక్ సెంటర్లో మలుపు తిరుగుతున్న సమయంలో స్కూటీపై వెళుతున్న వృద్ధుడు దుప్పాడ రామారావును ఢీకొంది. ఈ ప్రమాదంలో అతను లారీ కింద పడ్డాడు. లారీ టైర్లు అతనిపై ఎక్కకపోవడంతో స్పల్ప గాయాలతో బయటపడ్డాడు. అతన్ని స్థానికులు బయటకు లాగి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి లారీని స్టేషన్కు తరలించారు. అయితే కేసు నమోదు చేయలేదు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందిన వృద్ధుడి పేరు కూడా పోలీసులకు తెలియకపోవడం చర్చనీయాంశమైంది. పంగిడి, దేవరపల్లి ప్రాంతాల నుంచి క్వారీ లారీలు అడ్డూఅదుపు లేకుండా వేగంగా రాకపోకలు సాగిస్తుండడంతో ఇక్కడ నిత్యం ప్రమాదాలు జరుతున్నాయి. పోలీస్ అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదు. విద్యార్థి ఆత్మహత్య కొత్తవలస: విజయనగరం జిల్లా కొత్తవలస మండలం విజయనగరం రోడ్డులో ఉన్న డిఫెన్స్ అకాడమీలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి ముడికి వికాస్ (16) తీవ్రమైన తలనొప్పిని భరించలేక బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై సీఐ సీహెచ్ షణ్ముఖరావు కథనం ప్రకారం.. కాకినాడ జిల్లా కాజులూరు మండలం పల్లెపాలెం గ్రామానికి చెందిన వికాస్ ఇక్కడి డిఫెన్స్ అకాడమీలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతున్నాడు. కొద్ది నెలలుగా అతను తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నట్లు తండ్రి సుబ్రహ్మణ్యంతో పాటు తోటి విద్యార్థులు తెలిపారు. ఈ క్రమంలో బుధవారం మరోమారు తలనొప్పి రావడంతో కళాశాల సిబ్బంది వికాస్ తండ్రికి ఫోన్లో సమాచారం అందించారు. ఇంటికి పంపించేస్తామని తెలిపారు. ఇప్పుడు బయల్దేరితే ఇంటికి వచ్చేసరికి అర్ధరాత్రి అవుతుందని, మరుసటి రోజు పంపించాలని కళాశాల సిబ్బందిని మృతుడి తండ్రిని కోరాడు. తోటి విద్యార్థులు డ్రిల్ కోసం మైదానంలోకి వెళ్లగా.. హాస్టల్ రూమ్లో ఎవరూ లేని సమయంలో బెడ్షీట్తో ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు. తోటి విద్యార్థులు రూమ్కు వచ్చి చూసేసరికి ఫ్యాన్కు వేలాడుతూ కనిపించడంతో వెంటనే కళాశాల సిబ్బంది సహాయంతో కిందకు దించి స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
వడ్డీంచరేం?
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): తీసుకున్న పంట రుణాలను సకాలంలో చెల్లించే రైతులకు ఇస్తున్న సున్నా వడ్డీ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఎసరు పెడుతోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దాదాపు ఈ 18 నెలల కాలంలో ఇప్పటి వరకూ నయా పైసా కూడా వడ్డీ రాయితీ విడుదల చేయలేదు. ఫలితంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని దాదాపు లక్ష మంది రైతులు నష్టపోతున్నారు. వడ్డీ రాయితీ ఇలా.. అన్నదాతలకు ఎంతో మేలు చేసే ఈ బృహత్తర పథకానికి 2004లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. తాను నిర్వహించిన ప్రజాప్రస్థానం పాదయాత్రలో పంట పెట్టుబడి కోసం రైతులు పడుతున్న కష్టాలను స్వయంగా చూసిన ఆయన ఈ పథకాన్ని ప్రకటించారు. అప్పటి వరకూ రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాలను ఒక్క సంతకంతో మాఫీ చేశారు. ఆ తరువాత రైతులు తీసుకున్న పంట రుణాలను సకాలంలో చెల్లిస్తే 4 శాతం వడ్డీ రాయితీ చెల్లిస్తామని ప్రకటించారు. ఆవిధంగా రూపుదిద్దుకున్న ఈ పథకం కింద పంట రుణాలు తీసుకున్న రైతుల నుంచి ఏడాదికి వసూలు చేసే వడ్డీలో కేంద్ర ప్రభుత్వం 3 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 4 శాతం చొప్పున భరిస్తున్నాయి. ఉదాహరణకు ఒక రైతు రూ.లక్ష పంట రుణం తీసుకుంటే ఏడాది రూ.7 వేలు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో కేంద్రం రూ.3 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.4 వేల చొప్పున చెల్లిస్తాయి. తద్వారా రైతుపై వడ్డీ భారం పడదు. ఈ సున్నా వడ్డీ పథకం రైతుకు ఆర్థికంగా ఎంతో ప్రయోజనకరంగా ఉంటోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతులకు ఐదేళ్లూ పూర్తి వడ్డీ రాయితీ అందించి, ఎంతో మేలు చేసింది. 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం అమలును పూర్తిగా విస్మరించింది. రైతుల పైనే వడ్డీ భారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) పరిధిలో 50 సహకార బ్యాంకు బ్రాంచిలు, 295 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (సొసైటీలు) ఉన్నాయి. వీటి పరిధిలో 2 లక్షల మందికి పైగా సభ్యులున్నారు. ప్రస్తుతం వీరికి ఏటా రూ.600 కోట్లకు తక్కువ కాకుండా రుణాలిస్తున్నారు. డీసీసీబీతో పాటు పలు వాణిజ్య బ్యాంకులు కూడా రైతులకు కనిష్టంగా రూ.లక్ష నుంచి గరిష్టంగా రూ.3 లక్షల వరకూ పంట రుణాలిస్తున్నాయి. రూ.లక్ష రుణం తీసుకున్న రైతులందరికీ వడ్డీ రాయితీ పథకం వర్తిస్తుంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం రాయితీకి ఎగనామం పెట్టడంతో వాణిజ్య బ్యాంకులతో పాటు సొసైటీల నుంచి తీసుకున్న రుణాలకు సంబంధించి అసలుతో పాటు మొత్తం వడ్డీని కూడా రైతులే చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏటా రుణాలు సక్రమంగా చెల్లించే ప్రతి రైతుకు క్రమం తప్పకుండా రూ.3 వేల చొప్పున వడ్డీ రాయితీ ఇస్తోంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన వాటా కింద ఇవ్వాల్సిన రూ.4 వేల వడ్డీ రాయితీని 18 నెలలుగా ఇవ్వడం లేదు. ఈవిధంగా ఉమ్మడి జిల్లాలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.200 కోట్ల మేర వడ్డీ రాయితీ చెల్లించాల్సి ఉందని సమాచారం. ప్రతి రైతూ దాదాపు రూ.8 వేల వరకూ నష్టపోవాల్సి వచ్చింది. ఇతర పథకాల్లానే ఎగనామం! ఇప్పటికే రైతు సంక్షేమానికి దోహదపడే ఒక్కో పథకానికీ రాష్ట్ర ప్రభుత్వం ఎగనామం పెడుతోందని, ఈ క్రమంలో సున్నా వడ్డీ పథకానికి కూడా పూర్తిగా ఎగనామం పెట్టిందనే విమర్శలు వస్తున్నాయి. అన్నదాత సుఖీభవ పథకం కింద కేంద్రంతో సంబంధం లేకుండా ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు అండ్ కో ఆర్భాటంగా ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పథకానికి ఒక ఏడాది ఎగనామం పెట్టింది. రెండో ఏడాది అరకొరగా రూ.10 వేలు మాత్రమే ఇచ్చింది. అది కూడా చాలా మంది రైతులకు ఇవ్వలేదు. అలాగే, ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన రైతులకు ఇప్పటి వరకూ పరిహారం చెల్లించలేదు. ఎప్పుడిస్తారనేది ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. ఇదే రీతిలో సున్నా వడ్డీ పథకానికి కూడా ఎగనామం పెడుతూండటంపై రైతుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. వడ్డీ చెల్లించకుంటే రుణం ప్రశ్నార్థకం పంట రుణాలపై ప్రభుత్వం 18 నెలలు గా వడ్డీ రాయితీ ఇవ్వకపోవడంతో ఆ భారం రైతుల పైనే పడుతోంది. ప్రభు త్వం వడ్డీ రాయితీ విడుదల చేస్తే ఆ మొత్తా న్ని తిరిగి జమ చేస్తామని చెబుతూ, వాణి జ్య బ్యాంకులతో పాటు సొసైటీలు కూడా రైతుల నుంచి వడ్డీ వసూలు చేస్తున్నాయి. ఎవరైనా రైతులు వడ్డీ చెల్లించకపోతే వారికి రుణాలిచ్చేందు కు ఆయా బ్యాంకులు నిరాకరిస్తున్నా యి. దీంతో, కొంత మంది రైతులు నానా తంటాలూ పడుతూ బ్యాంకులకు వడ్డీ చెల్లిస్తున్నారు. అలా చెల్లించలేని వారు తమకు పంట రుణాలు ఏవిధంగా వస్తాయో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు. పునరుద్ధరించాలి ఏటా రుణాలు సక్రమంగా చెల్లించడంతో బ్యాంకులు తిరిగి రుణాలివ్వడంతో పాటు, ప్రభుత్వం వడ్డీ రాయితీ కూడా సక్రమంగా అందించేది. కానీ, గత రెండేళ్లుగా రుణాలు సక్రమంగా చెల్లిస్తున్నా వడ్డీ రాయితీ రావడం లేదు. బ్యాంకు అధికారులు ఒత్తిడి తెస్తూండటంతో మరో గత్యంతరం లేక వడ్డీ కూడా చెల్లిస్తున్నాం. రైతులకు ఉపయోగపడే పథకాల్లో కోతలు పెట్టడం ప్రభుత్వానికి తగదు. – కరక అప్పలనాయుడు, రైతు, కేఈ చిన్నయ్యపాలెం, కోటనందూరు మండలం వెంటనే విడుదల చేయాలి ప్రభుత్వం వడ్డీ రాయితీ చెల్లిస్తుందని గత ఏడాది బ్యాంకులకు చెల్లించలేదు. ఇటీవల రుణం కోసం బ్యాంకుకు వెళ్తే ప్రభుత్వం వడ్డీ రాయితీ విడుదల చేయలేదని అక్కడి అధికారులు చెప్పి, గత ఏడాది తీసుకున్న రుణంపై వడ్డీ వసూలు చేశారు. అధికారంలోకి వస్తే రైతును రాజును చేస్తామని గొప్పలు చెప్పడం తప్ప, పథకాలకు నిధులు కేటాయించకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోంది. వెంటనే వడ్డీ రాయితీ బకాయిలు విడుదల చేసి రైతులను ఆదుకోవాలి. – రావుల ప్రసాద్, కూరాడ, కరప మండలం సున్నా వడ్డీకి ‘సున్నం’ సకాలంలో రుణాలు చెల్లించినా పైసా విదల్చని సర్కారు ఉమ్మడి జిల్లాలో సుమారు లక్ష మంది రైతులకు నష్టం సక్రమంగా తన వాటా ఇస్తున్న కేంద్రం 18 నెలలుగా ఆ ఊసే ఎత్తని రాష్ట్ర ప్రభుత్వం రైతులపై రూ.200 కోట్ల మేర భారం! -
దండిగా హుండీ ఆదాయం
● సత్యదేవునికి రూ.1.83 కోట్ల రాబడి ● అన్నవరం దేవస్థానం చైర్మన్, ఈఓ వెల్లడి అన్నవరం: సకల సంపదలకూ అధిష్టాన దేవత అయిన శ్రీమహాలక్ష్మి.. భక్తవరదుడైన సత్యదేవుని సన్నిధిలో ధనధార కురిపించింది. జనవరి నెలలో పెద్దగా భక్తులు రానప్పటికీ.. గడచిన 35 రోజులకు గాను స్వామివారికి హుండీల ద్వారా రికార్డు స్థాయిలో రూ.1,83,28,659 ఆదాయం సమకూరింది. దేవస్థానంలో హుండీలను గురువారం తెరచి భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. నగదు రూ.1,72,56,645, చిల్లర నాణేలు రూ.10,72,014 మేర లభించాయని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాథరావు తెలిపారు. వీటితో పాటు 11.5 గ్రాముల బంగారం, 625 గ్రాముల వెండి వస్తువులు లభించాయన్నారు. యుఎస్ డాలర్లు 157, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ దీనార్ ఒకటి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దీనార్లు 30, సింగపూర్ డాలర్లు 14, సౌదీ రియల్స్ 111, ఆస్ట్రేలియా డాలర్లు 60, ఖతార్ రియల్స్ 10, కెనడా డాలర్లు 25, మలేషియా రింగిట్స్ 11, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ మయన్మార్ క్యాట్స్ వెయ్యి, బ్యాంక్ ఆఫ్ కొరియా వాన్స్ 2 వేలు, స్కాట్లాండ్ పౌండ్లు 10, అంగోలా కరెన్సీ 500 క్వాంజాస్ లభించాయని తెలిపారు. మొత్తం 35 రోజులకు కలిపి హుండీల ద్వారా సగటున రోజుకు రూ.5,23,675 ఆదాయం లభించింది. స్వామివారి హుండీ ఆదాయాన్ని జనవరిలో లెక్కించలేదు. జనవరిలో సంక్రాతి సెలవులు, మాఘ మాసంలో భీష్మ ఏకాదశి, మాఘ పౌర్ణమి తదితర పర్వదినాలు మినహాయిస్తే మిగిలిన రోజుల్లో పెద్దగా భక్తులు రాలేదు. అయినప్పటికీ హుండీల్లో కానుకలు దండిగా రావడం విశేషం. ఆదాయం లెక్కింపులో చైర్మన్, ఈఓలతో పాటు డిప్యూటీ కమిషనర్ బాబూరావు, అసిస్టెంట్ కమిషనర్ మంజులాదేవి, దేవస్థానం సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు. -
పులిని బంధించడంలో ప్రభుత్వం విఫలం
రాజమహేంద్రవరం సిటీ: రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం నియోజకవర్గాల్లో ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్న పెద్ద పులిని బంధించడంలో ప్రభుత్వంతో పాటు అధికారులు విఫలమయ్యారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి శ్రీనివాస చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ధ్వజమెత్తారు. గురువారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తోందన్నారు. పులిని పట్టుకుని అటవీ ప్రాంతంలోకి పంపే ప్రయత్నం సక్రమంగా జరగడం లేదని అన్నారు. రాత్రయితే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నారు. రైతులు పొలం పనులకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. యుద్ధ ప్రాతిపదికన పులిని పట్టుకునే ప్రయత్నం చేయాలన్నారు. చనిపోయిన పశువులకు ఎక్స్గ్రేషియా ప్రకటించి యజమానులకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండు నియోజకవర్గాల్లో పది పశువులను చంపినట్లు రికార్డులు చెబుతున్నాయన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల హడావుడి తప్ప, పులిని బంధించే ప్రయత్నం కనిపించడం లేదని విమర్శించారు. సాంకేతికత పెరిగినా పులి జాడ కనిపెట్టడంలో విఫలం కావడం శోచనీయమని అన్నారు. పులిని పట్టుకునే ప్రయత్నాల్లో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శ్రద్ధ చూపకపోవడం దారుణమని అన్నారు. ప్రజలు భయాందోళన చెందుతున్నా కనీసం స్పందించక పోవడం సరైన విధానం కాదన్నారు. అనుకోని ప్రమాదం జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తక్షణ మే పశువులు కోల్పోయిన పాడి రైతులకు రూ.మూడు లక్షల చొప్పున నష్ట పరిహారం ఇవ్వా లని డిమాండ్ చేశారు. రానున్న 12 గంటల్లో పెద్ద పులిని పట్టుకునే ప్రయత్నాన్ని అటవీ శాఖాధికారులు ముమ్మరం చేయాలని, లేనిపక్షంలో ఆందోళనకు దిగుతామని వేణు, రాజా హెచ్చరించారు. మాజీ మంత్రి వేణు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా -
నేటి నుంచి కోటి తులసి పూజ
● రత్నగిరిపై పూర్తయిన ఏర్పాట్లు ● ఉదయం 7.30 గంటలకు ప్రారంభం ● రోజూ 11 లక్షల తులసి దళాలతో సత్యదేవునికి అర్చన ● 15న రుద్రహోమంతో ముగింపుఅన్నవరం: సత్యదేవుని సన్నిధిలో కోటి తులసి పత్రి పూజకు శుక్రవారం ఉదయం 7.30 గంటలకు శ్రీకారం చుడుతున్నారు. దీనికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశా రు. పూజకు అవసరమైన తులసి పత్రి, పూలు సేకరించారు. రత్నగిరి రామాలయం పక్కనే సత్యదేవుని వార్షిక కల్యాణ మండపంలో వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రజాప్రతినిధులు, దేవస్థానం చైర్మ న్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాథరావు ఈ పూజను ప్రారంభించనున్నారు. వాస్తవానికి ఈ క్రతువును తు ని తపోవనం సచ్చిదానంద సరస్వతి స్వామి ప్రారంభించాల్సి ఉండగా.. అనారోగ్య కారణాలతో ఆయన హాజరు కావడం లేదని అధికారులు తెలిపారు. అయితే, ఈ నెల 15వ తేదీ వరకూ ఈ పూజలు జరగనున్నందున ఆలోగా ఏదో ఒక రోజు స్వామీజీ వస్తారని చెప్పారు. అలాగే, ఈ పూజలో పాల్గొనాలని పలువురు ప్రజాప్రతినిధులను, ప్రముఖులను కూడా ఆహ్వానించారు. కోటి తులసి పూజతో పాటు లింగార్చన, వేద పారాయణలు, ఇతర పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. ఈ పూజలను భక్తులు తి లకించేందుకు కల్యాణ మండపం ఎదురుగా ఉన్న విశ్రాంతి మండపంలో ఏర్పాట్లు చేశారు. నాలుగేళ్ల త రువాత జరుగుతున్న క్రతువు కావడంతో వేద పండితులు, అర్చకులు, వ్రత పురోహితులు, ఇతర సిబ్బంది దీనిని విజయవంతం చేయాలని ఈఓ ఆదేశించారు. ఇదీ పూజా విధానం ఈ నెల 15వ తేదీ వరకూ ప్రతి రోజూ 11 లక్షల తుల సి దళాలతో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి పూజలు చేస్తారు. మొత్తం పది రోజుల్లో కోటి తులసి దళాల అర్చనలు పూర్తి చేస్తారు. సుమారు 60 మంది వేద పండితులు, రుత్విక్కులు ఈ పూజలో పాల్గొంటారు. ఉదయం 7.30 నుంచి 11.30 వరకూ, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ స్వామి, అమ్మవార్లకు తులసి దళాలతో పూజలు చేస్తారు. చివరి రోజైన ఈ నెల 15వ తేదీ ఉదయం 8 నుంచి 11 గంటల వరకూ నిర్వహించే రుద్రహోమంతో కోటి తులసి పూజ పరిపూర్ణమవుతుంది. సిబ్బందికి ప్రత్యేక విధులు కోటి తులసి పూజ నిర్వహణకు గాను దేవస్థానం సి బ్బందికి ప్రత్యేక విధులు అప్పగించారు. పూజలు జరి గే పది రోజులూ ఆ సిబ్బంది ఉదయం నుంచి సాయంత్రం వరకూ అందుబాటులో ఉండాలని ఈఓ త్రినాథరావు ఆదేశించారు. 50 మంది స్వచ్ఛంద సేవకులు తులసి పత్రి రెమ్మలు విడదీసి, దళాలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ పూజకు ఇప్పటి వరకూ రూ.9 లక్షల వరకూ విరాళాలు వచ్చాయి. విరాళాలిచ్చేందుకు ఇంకా చాలా మంది దాతలు ముందుకొస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ పూజకు రూ.12 లక్షల వరకూ వ్యయమవుతుందని అంచనా వేశారు. -
40 నిమిషాలు ఆలస్యంగా ప్రశ్నపత్రం
కాకినాడ క్రైం: స్థానిక రంగరాయ వైద్య కళాశాల (ఆర్ఎంసీ)లో జీఎన్ఎం నర్సింగ్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు విద్యార్థులకు 40 నిమిషాలు ఆలస్యంగా ప్రశ్నపత్రం ఇవ్వడం వివాదాస్పదమైంది. పరీక్షకు గంట ముందే హాజరవ్వాలని విద్యార్థులకు సూచనలు అందగా, అందుకు తగ్గట్లుగానే వందలాది మంది విద్యార్థులు ఉదయం 7 గంటల నుంచే జిల్లా నలుమూలల నుంచి కాకినాడకు వచ్చి పరీక్ష కేంద్రం బయటే పడిగాపులు కాశారు. అయితే వారికి ప్రశ్నపత్రం ఇవ్వడం 40 నిమిషాలు ఆలస్యం అయ్యింది. ఆర్ఎంసీలో ఎగ్జామినేషన్ హాల్–1, 2, డైనింగ్ హాలు, ఆడిటోరియం ఇలా నాలుగు చోట్ల పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు 1,801 మంది హాజరు కానున్నారన్న స్పష్టమైన సమాచారం ఉన్నా పరీక్షలు నిర్వహిస్తున్న జీజీహెచ్ బృందం విద్యార్థులను తీవ్ర గందరగోళానికి గురిచేసింది. కళాశాల ప్రధాన ద్వారం తెరిచింది మొదలు పదుల సంఖ్యలో విద్యార్థులు ఈ హాల్ నుంచి ఆ హాల్కి, ఈ సెంటర్ నుంచి ఆ సెంటర్కి అంటూ పరుగులు పెడుతూనే ఉన్నారు. తమ సీటు ఏదో తెలియక తీవ్ర గందరగోళానికి గురయ్యారు. కళాశాల ఆవరణలో హాల్ టికెట్ ఆధారంగా పరీక్ష గది ఎక్కడో తెలిపే సూచికలు (సైన్ బోర్డులు) ఏవీలేవు. అలా అని మార్గనిర్దేశం చేసే సహాయకులు కూడా లేరు. ఓ వైపు ఉదయం 9 గంటలు గడుస్తుండగా తీవ్ర ఒత్తిడితో ఎందరో విద్యార్థినులు అటు, ఇటు పరుగులు పెట్టడం కనిపించింది. ఇంతటి గందరగోళానికి తమదే తప్పని గుర్తించిన జీజీహెచ్ పరీక్షల నిర్వహణ బృందం విద్యార్థులందరూ తమ సీట్లలో కూర్చునే వరకు వేచి చూసి 40 నిమిషాలు ఆలస్యంగా ప్రశ్నపత్రాన్ని ఇచ్చింది. 12 గంటలకు ముగియాల్సిన పరీక్షను 12.30 వరకూ కొనసాగించారు. కూర్చునే ఏర్పాట్లు, సూచికలు సరిగ్గా లేక పరీక్షకు కొద్ది నిమిషాల ముందు తీవ్ర ఒత్తిడికి గురయ్యామని, సకాలంలో పరీక్ష జరగలేదని, నిర్ణీత వ్యవధిని వినియోగించుకోలేక పోయామని, విలువైన పది నిమిషాల సమయం కోల్పోయామని పరీక్షలు రాసి బయటకు వచ్చిన విద్యార్థులు వాపోయారు. ఈ ఘటనపై రాష్ట్ర డీడీ నర్సింగ్ జ్యోతిని వివరణ కోరగా, బాధ్యులపై చర్యలకు సిఫార్సు చేసి పునరావృతం కాకుండా చూస్తామన్నారు. 327 మంది గైర్హాజరు ఇదిలా ఉంటే జీఎన్ఎం మొదటి సంవత్సర పరీక్షలో 1,801 మందికి గాను 1,474 మంది హాజరయ్యారు. 327 మంది గైర్హాజరయ్యారు. జీఎన్ఎం పరీక్షల ఆరంభంలోనే వివాదం -
పకడ్బందీగా వంద రోజుల ప్రణాళిక
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు జిల్లాలో వంద రోజుల ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. జిల్లా పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యాన ప్రధానోపాధ్యాయులతో కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా సబ్జెక్టుల వారీగా సిలబస్ పూర్తి చేసి, ప్రతి రోజూ స్లిప్ టెస్ట్ నిర్వహించాలని, తద్వారా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుందని అన్నారు. సి, డి గ్రేడ్లు వచ్చిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు సమష్టిగా పని చేసి, నూరు శాతం ఫలితాల సాధనకు ప్రత్యేక కృషి చేయాల ని సూచించారు. సబ్జెక్టుల వారీగా లక్ష్యాలు నిర్దేశించుకోవాలన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి పి.రమేష్ మాట్లాడుతూ, వెనుకబడిన విద్యార్థులకు వంద రోజుల ప్రణాళిక ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఆయా సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులతో ఉపాధ్యాయులు ఎక్కువ సమయం గడపడం వలన వారిలో ఏకాగ్రత, మానసిక ధైర్యం పెరిగి, మార్కుల్లో గణనీయమైన మార్పు కనిపిస్తుందని చెప్పారు. మెడికల్ మాఫియాపై 14న ఆందోళన బోట్క్లబ్ (కాకినాడ సిటీ): రాష్ట్రంలో మెడికల్ మాఫియాను అరికట్టాలని, ప్రజారోగ్యాన్ని కాపాడాలనే డిమాండ్లతో ఈ నెల 14న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తాటిపాక మధు తెలిపారు. స్థానిక సీపీఐ భవన్లో పార్టీ నేత తోకల ప్రసాద్ అధ్యక్షతన గురువారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫార్మసీ కంపెనీలు, మెడికల్ షాపులపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో ఎవరికి తోచిన విధంగా వారు విచ్చలవిడిగా మందులు విక్రయిస్తూ, ప్రజలను పీక్కు తింటున్నారని ఆరోపించారు. మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈ నెల 14న నిర్వహిస్తున్న ఆందోళనను జయప్రదం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రైవేటు భాగస్వామ్యం కోసం ఇప్పటి వరకూ ఏ కార్పొరేట్ వ్యక్తులూ ముందుకు రాలేదని, దీనిని స్వాగతిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రైవేటు వ్యాపారులు పెట్టుబడులు పెట్టకూడదని, ఇది పేదల వైద్య విద్యకు సంబంధించిన విషయమని అన్నారు. ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకూ కాకినాడ సూర్య కళామందిర్లో సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు జరగనున్నాయని మధు తెలిపారు. ఈ సమావేశాలకు జాతీయ కార్యదర్శులు కె.రామకృష్ణ, పల్లా వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్యతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కె.బోడకొండ, జిల్లా కార్యవర్గ సభ్యులు పి.సత్యనారాయణ, పప్పు ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. -
160 కిలోల గంజాయి స్వాధీనం
జగ్గంపేట: gñæ.Mö™èl*¢Æý‡$ Ð]l§ýlª ¿êÈV> VýS…gêÆ‡$$° ´ùÎ-çÜ$Ë$ ÝëÓ«-©¯]l… ^ólçÜ$-MýS$°, ¯]lË$-VýS$ǰ AÆð‡çÜ$t ^ólÔ>Æý‡$. VýS$Æý‡$ÐéÆý‡… ©°Oò³ fVýSY…õ³r çÜÇPÌŒæ M>Æ>Å-ÌS-Ķæ$…ÌZ ò³§éª-ç³#Æý‡… yîlGïܵ }çßæ-ÇÆ>k ÑÌôæMýS-Æý‡Ï™ø Ð]l*sêÏ-yéÆý‡$. gñæ.Mö-™èl*¢-Æý‡$ÌZ° §ýl$Æý‡Y VýS$yìl çÜÒ$-ç³…ÌZ fVýSY…õ³r GOòÜÞ Æý‡çœ¬-¯é£ýl-Æ>Ð]l# B«§ýlÓÆý‡Å…ÌZ ´ùÎ-çÜ$ÌS ™èl°-TË$ ^ólç³-sêtÆý‡$. VýS*yŠæÞ BsZÌZ ™èlÆý‡-Í-çÜ$¢¯]l² 80 ´ëÅMðSrÏÌZ VýS…gêÆ‡$$, òÜÌŒæ¸ù¯Œl, Æý‡*.ÌS„ýS ÝëÓ«-©¯]l… ^ólçÜ$MýS$-¯é²Ð]l$° yîlGïܵ ™ðlÍ-´ëÆý‡$. Òsìæ ÑË$Ð]l Æý‡*.82.48 ÌS„ýSË$ E…r$…§ýl° ^ðl´ëµÆý‡$. JyìlÔ> Æ>[Úët-°MìS ^ðl…¨¯]l çÜ$«§éMýSÆŠ‡ §éÓÆ> D VýS…gêÆ‡$$° çÜ™èlÅ-ÝëÆ‡$$ hÌêÏÌZ Ñ{MýS-Ƈ$$…^ól…§ýl$MýS$ ¡çÜ$MýS$ Ððlâ¶æ$™èl$…-yýlV> ç³r$t-MýS$-¯]l²r$Ï ™ðlÍ-´ëÆý‡$. çÜ™èlÅ-ÝëÆ‡$$ hÌêÏMýS$ ^ðl…¨¯]l Ðól$MýSÌS {ç³M>‹-Ù, Ðól$MýSÌS Ô>ÅÐ]l$ÌS, A¯]l²-Ð]l$Ķæ$Å hÌêÏMýS$ ^ðl…¨¯]l BÐ]l#ÌS }°ÐéçÜ$Ë$, «§ýl°-Ķæ$ÅÌS A…f-Ð]l$ÃOò³ MóSçÜ$ ¯]lÐðl*§ýl$ ^ólÔ>Æý‡$. ïÜI OÐðlB-ÆŠ‡MóS }°-Ðé‹Ü ™èl¨™èl-Æý‡$Ë$ ´ëÌŸY-¯é²Æý‡$. ˘ -
13 నెలల తరువాత విధుల్లోకి..
రామచంద్రపురం రూరల్: రామచంద్రపురం మండల విద్యాశాఖ అధికారి మానుపూడి శ్రీనివాస్ గురువారం తిరిగి విధుల్లో చేరారు. ఆ వివరాల్లోకి వెళితే.. మండలంలో 13 నెలల క్రితం జరిగిన సమ్మేటివ్ పరీక్షల్లో పేపర్ లీకై ందన్న కారణంతో (లోకేష్ విద్యా శాఖ మంత్రిగా ఉండటంతో ప్రిస్టేజ్గా తీసుకుని) పేపర్ లీకేజీకి కారణమైన ఉపాధ్యాయుడిని విధుల్లోంచి పూర్తిగా తొలగించారు. ఇందులో ఎంఈఓ శ్రీనివాస్ను కూడా సస్పెండ్ చేశారు. అయితే గత ఏడాది ఏప్రిల్ నెలలోనే ఎంఈఓను విధుల్లోకి తీసుకోవాలని కోర్టు తీర్పు ఇచ్చినప్పుటికీ ఇంతకాలం సాగదీసి ఇప్పుడు విధుల్లోకి తీసుకున్నారు. ఇప్పుడు మంచి వ్యక్తికి న్యాయం జరిగిందంటూ ఎంఈఓ శ్రీనివాస్ను కలసి అభినందించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘ జిల్లా అధ్యక్షుడు వాడ్రేవు శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోలిశెట్టి వీరవెంకట సత్యానారాయణ మూర్తి, సుదర్శనరెడ్డి, రేఖా రామలక్ష్మి, యూటీఎఫ్ నాయకులు బాపూజీ, రమణమూర్తి, చైతన్యబాబు, శివగణేష్, పీఆర్టీయూ నాయకులు మొంగం అమృతరావు, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎంఈఓగా శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ -
‘కూటమి’లో ఇసుక ర్యాంపుల వివాదం
తాళ్లపూడి: కూటమిలోని టీడీపీ, జనసేన మధ్య వర్గ విభేదాలు మరోసారి బయట పడ్డాయి. ఇసుక ర్యాంపుల విషయంలో నాయకుల మధ్య చిచ్చు రేగింది. దీంతో వేగేశ్వరపురం ఇసుక ర్యాంపులో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారని అధికారులకు జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. మండలంలో జరిగే ఇసుక అక్రమాలపై ఇకపై తమ పార్టీ ప్రశ్నిస్తూనే ఉంటుందని జనసేన నాయకుడు, ఎంపీటీసీ సభ్యుడు హరిబాబు విలేకరులకు చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్నా మండలంలో మాత్రం జనసేనను దూరంగానే ఉంచుతున్నారని, టీడీపీ వర్గీయులు జనసేన వారిపై కేసులు పెడుతున్నారని అన్నారు. ఇసుక ర్యాంపులన్నీ టీడీపీ నాయకులే నిర్వహిస్తున్నారని, తమను చేతకానివారిగా చూస్తున్నారని అన్నారు. ఇసుక ర్యాంపుల్లో జరిగే తప్పులపై అందుకే గళం విప్పామని, ఎన్డీఏలో తాము భాగస్వామ్యమా? కాదా? తెలియకుండా ఉందని ఎంపీటీసీ ఆవేదన వ్యక్తం చేశారు. -
జాడలు సరే.. పులేది?
రాజమహేంద్రవరం రూరల్: ఐదు రోజులుగా జిల్లాలో పెద్దపులి సంచారం జిల్లా ప్రజలను వణికిస్తోంది. అటవీశాఖ అధికారుల అంచనాలను సైతం తారుమారు చేస్తూ ఇష్టారీతిన సంచరిస్తోంది. దీంతో అధికారులు శతావిధాల ప్రయత్నించినప్పటికీ పెద్దపులి చిక్కడం లేదు. మంగళవారం రాత్రి దివాన్చెరువు ఎస్వీపీసీ కళ్యాణమండపం వద్ద ప్రత్యక్షమైన పులి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మీదుగా బీజాపురి టౌన్షిప్లోకి వెళ్లింది. బుధవారం ఉదయానికి చూస్తే రఘనాథపురంలో మామిడితోటల్లో నుంచి వెళ్లినట్లు ఉన్న ప్లగ్ మార్కులను అధికారులు గుర్తించారు. అక్కడ ఒక గేదె దూడపై దాడిచేయడంతో అది మృతి చెందింది. అక్కడ నుంచి శాటిలైట్ సిటీ అక్కమ్మతల్లి కొండపైకి వెళ్లినట్లు ప్లగ్మార్క్ల ద్వారా అటవీశాఖ అధికారులు గుర్తించారు. అక్కమ్మతల్లి కొండపై నుంచి కిందకు దిగిందా లేదా వెనుక నుంచి జీడిమామిడి తోటల్లోకి ఏమైన వెళ్లిందా అనే కోణాల్లో అటవీశాఖ అధికారులు ఆలోచనలు చేస్తున్నారు. ఏది ఏమైనా బుధవారం రాత్రి పెద్దపులిని పట్టుకునేందుకు అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ చలపతిరావు నేతృత్వంలో జిల్లా అటవీశాఖ అధికారి ప్రభాకరరావు, అటవీ రేంజ్ అధికారి దావీదురాజు, సిబ్బంది అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా చీఫ్ కన్జర్వేటర్ చలపతిరావు మాట్లాడుతూ పెద్దపులి శాటిలైట్ సిటీలోని అక్కమ్మతల్లి కొండపై ఉన్నట్లు గుర్తించామని, దానిని పట్టుకునేందుకు పూణే నుంచి ఒక బృందంతో పాటు, మొత్తం 12 బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రజలు ఎవరూ భయపడవలసిన అవసరం లేదన్నారు. పోలీసులు, రెవెన్యూ, పంచాయతీ అధికారులు ప్రజలకు పెద్దపులి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారన్నారు. ఈ పులి తడోబా నుంచి ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రం పాల్వంచ మీదుగా ఏలూరు జిల్లా నుంచి మన జిల్లాలోకి వచ్చిందని తెలిపారు. పులిని పట్టుకునేందుకు రాత్రి వేళల్లో ధర్మల్ కెమెరాలను వినియోగించినట్టు తెలిపారు. ఇప్పటికే బోన్లతో పాటు ట్రాప్ కెమెరాలను సైతం ఏర్పాటు చేశామన్నారు. పులి సంచరించిన స్థలాన్ని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సందర్శించి ప్రజలకు సూచనలిచ్చారని తెలిపారు. బొమ్మూరు ఇన్స్పెక్టర్ కాశీ విశ్వనాథం, తహసీల్దార్ బి.శ్రీనివాస్, ఎంపీడీవో ఆర్మ్స్ట్రాంగ్, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శి, ఎస్సైలు, సిబ్బంది అటవీశాఖ అధికారులకు పూర్తి సహకారం అందిస్తున్నారు. అక్కమ్మతల్లి కొండ వద్ద పరిశీలిస్తున్న ఫారెస్టు చీఫ్ కన్జర్వేటర్ చలపతిరావు అక్కమ్మతల్లి కొండ వద్ద ఏర్పాటు చేసేందుకు తీసుకువచ్చిన బోను ఆందోళన చెందుతున్న రాజమహేంద్రవరం ప్రజలు పాద ముద్రలు తప్ప పులిని పట్టుకోలేకపోతున్న అధికారులు తాజాగా శాటిలైట్ సిటీ అక్కమ్మతల్లి కొండపై ఉన్నట్టు గుర్తింపు పూణే నుంచి నిపుణులతో పాటు 20 బృందాల ఏర్పాటు -
నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి కాకినాడకు చెందిన భక్తులు బుధవారం రూ.లక్ష విరాళం సమర్పించారు. కాకినాడ రమణయ్యపేటకు చెందిన గారికపర్తి నమశ్శివాయ కోట సూర్య నరసింహ, నాగమణి అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి వచ్చారు. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.1,00,152 విరాళం అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అర్చకులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. శాప్ అకాడమీల ఏర్పాటుకు చర్యలు నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ, తిరుపతి, విశాఖలో ఆయా క్రీడల ప్రాధాన్యాన్ని బట్టి అకాడమీలు ఏర్పాటు చేస్తామని, కాకినాడను స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతామని శాప్ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) చైర్మన్ ఏ.రవినాయుడు ప్రకటించారు. బుధవారం కాకినాడ వచ్చిన ఆయన డీఎస్ఏలో విలేకరులతో మాట్లాడారు. జగన్నాథపురంలో రూ.9.84 కోట్లతో 16 ఎకరాల్లో క్రీడా వికాస కేంద్రం ఏర్పాటుకు ఆమోదం ఇచ్చామని తెలిపారు. రూ.1.81 కోట్లతో లింగంపర్తి, రూ.1.07 కోట్లతో పెద్దాపురం, రూ.76.80 లక్షలతో జగ్గంేపేటలో కేవీకేల నిర్మాణాలకు ఉత్తర్వులు జారీచేశామన్నారు. శాప్ నుంచి కాకినాడ డీఎస్ఏకు ఈ సంవత్సరం ఏ మాత్రం నిధులు అందించారని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వలేదు. అనంతరం ఇండోర్ హాల్లో వివిధ అసోసియేషన్లతో సమావేశం నిర్వహించి క్రీడా సమస్యలను తెలుసుకున్నారు. డీఆర్వోగా తిప్పేనాయక్ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో)గా డి.తిప్పేనాయక్ను నియమిస్తూ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాకినాడ డీఆర్వోగా పనిచేస్తున్న జె వెంకట్రావు సింహాచలం దేవస్థానం ఈఓగా బదిలీ అయ్యారు. తిప్పే నాయక్ ప్రస్తుతం అనంతపురం జిల్లా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన రెండు, మూడు రోజుల్లో విధుల్లో చేరనున్నట్లు తెల్సింది. నేడు సత్యదేవుని హుండీల లెక్కింపు అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించనున్నారు. దేవస్థానంలో హండీ ఆదాయాన్ని చివరిసారిగా డిసెంబర్ 31న లెక్కించారు. దీంతో 35 రోజులలో భక్తులు సత్యదేవుని హుండీలలో సమర్పించిన కానుకలను గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి లెక్కించనున్నారు. దేవస్థానం సిబ్బంది అందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఈఓ త్రినాథరావు ఆదేశించారు. తిరుమల ప్రతిష్టను పాడు చేసింది బాబు సర్కారే వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి అల్లవరం: చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూటమి నేతలు తిరుమల వేంకటేశ్వరుని ప్రతిష్టను దిగజారుస్తూనే ఉన్నారని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు బుధవారం అన్నారు. మండలం డి.రావులపాలెంలోని ఆయన నివాసంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కక్ష సాధించేందుకు చంద్రబాబు ప్రభుత్వం స్వామివారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని అబద్ధాన్ని ప్రచారం చేసి తిరుమల ప్రతిష్టకు భంగం కలిగించారన్నారు. లడ్డూలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని సీబీఐ నిర్థారించినా చంద్రబాబు, కూటమి నేతలు హిందువుల మనోభావాలతో ఆటలాడుతున్నారని, వారిలో కొంచైమెనా పాశ్చాత్తాపం లేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన పాపాలను, తప్పులను కప్పి పుచ్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ వైఎస్సార్ సీపీ నేతలపై దాడులను ప్రోత్సహిస్తున్నారన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడి చేసిన వారిని వదిలేసి బాధితుడైన రాంబాబుపై కేసు నమోదు చేయడం అన్యాయమన్నారు. -
రేపటి నుంచి సత్యదేవునికి కోటి తులసి పత్రి పూజ
అన్నవరం: ఈ నెల ఆరో తేదీ నుంచి 15వ తేదీ వరకు సత్యదేవుని సన్నిధిలో జరగనున్న కోటి తులసి పత్రి పూజకు సుమారు వంద బస్తాల తులసి అవసరమని దేవస్థానం అధికారులు అంచనా వేశారు. ఆ మేరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి తులసిని తీసుకువస్తున్నారు. ఈ పది రోజులు రెండు పూటలా రోజూ 11 లక్షల తులసి దళాలు అవసరమవుతాయని వివరించారు. దాత వీర్ల రాంబాబు సహకారంతో వివిధ ప్రాంతాల నుంచి ఈ తులసిని సేకరిస్తున్నట్లు ఏఈఓ అనకాపల్లి ప్రసాద్ తెలిపారు. ఈ తులసిని భద్రపర్చడానికి ఈఓ వేండ్ర త్రినాథరావు ఆదేశాల మేరకు వ్రతాల విభాగంలోని కోల్డ్ స్టోరేజీ యూనిట్ను సిద్ధం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన తులసిని అక్కడ నిల్వ చేసి అక్కడ నుంచి అవసరమైన తులసి దళాలను పూజ కార్యక్రమం జరిగే వార్షిక కల్యాణ మండపానికి తీసుకురానున్నారు. కొమ్మలు, రెమ్మలుగా ఉన్న తులసిని విడదీసి దళాలుగా చేయడానికి 50 మంది స్వచ్ఛంద సేవా కార్యకర్తలను నియమించారు. రూ.రెండు లక్షల విరాళం సత్యదేవునికి నిర్వహించనున్న ‘కోటి తులసి పత్రి పూజ’కు విశాఖపట్నంలోని సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ రూ.రెండు లక్షల విరాళాన్ని అందజేశారు. పూజలో పాల్గొనే రుత్విక్కులు 40 మంది, వేదపండితులు, అర్చకులు మరో 20 మందితో కలిపి మొత్తం వంద మందికి మూడు పూటలా భోజనం, ఫలహారం ఏర్పాటు చేసే భాధ్యతలను దేవస్థానం వ్రత పురోహిత సంఘం అధ్యక్షుడు ఛామర్తి కన్నబాబు, మాజీ అధ్యక్షుడు నాగాభట్ల రవిశర్మకు అప్పగించారు. తునికి చెందిన దాత చక్కా సూర్యనారాయణ (తాతబాబు) నిర్మించిన నివేదన శాలలో ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఆదమరిస్తే అపాయమే..
ఐఎంఏ ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం కాకినాడ క్రైం: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కాకినాడ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం బుధవారం జరిగింది. స్థానిక డీఎస్ఐ గ్రౌండ్ సమీపంలో ఉన్న డాక్టర్ బి.ఎస్.రావు మెమోరియల్ ఐఎంఏ హాలులో నిర్వహించారు. ఆర్గనైజింగ్ చైర్పర్సన్గా ప్రముఖ ప్రకృతి వైద్యనిపుణురాలు డాక్టర్ ఎ.ఎల్.సత్యవతి వ్యవహరించగా, ముఖ్య అతిథిగా కాకినాడ మూడవ అదనపు జిల్లా న్యాయమూర్తి జి.ఆనంది హాజరయ్యారు. ఆమె ఉదయం 9.45 గంటలకు ఉచిత కేన్సర్ మెగా స్క్రీనింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్యాన్సర్ను ఆరంభ దశలో గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చునన్నారు. ఇటువంటి స్క్రీనింగ్ శిబిరాలు సమాజానికి ఎంతో ఉపయోగమన్నారు. డాక్టర్ ఎ.ఎల్.సత్యవతి మాట్లాడుతూ క్యాన్సర్ కేసులు నానాటికి పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. తీసుకుంటున్న ఆహారం, పెరుగుతున్న ఒత్తిడి, మారిన జీవనశైలి క్యాన్సర్ వ్యాప్తికి కారణమన్నారు. మహిళలు ముఖ్యంగా స్క్రీనింగ్ పరీక్షలు ఎప్పటికప్పుడు చేయించుకోవడం ద్వారా ముందస్తుగా గుర్తించి ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చునన్నారు. ఆదమరిస్తే అపాయమేనని తెలిపారు. సామాన్య ప్రజల నుంచి వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపితే కాకినాడను క్యాన్సర్ రహిత జిల్లాగా మార్చడం సాధ్యమేనని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా డీఎంహెచ్వో డాక్టర్ ఎ.నరసింహనాయక్ హాజరయ్యారు. ఐఎంఏ కాకినాడ అధ్యక్షుడు డాక్టర్ కాదా వెంకటరమణ, కార్యదర్శి డాక్టర్ ఎస్.సి.హెచ్.ఎస్.రామకృష్ణ కార్యక్రమం నిర్వహణలో కీలకంగా వ్యవహరించారు. ఐఎంఏ నాయకులు డాక్టర్ జీఎస్ మూర్తి, డాక్టర్ బీవీ మహేష్, డాక్టర్ మోకా పవన్కుమార్ హాజరయ్యారు. -
కాపులే టార్గెట్గా కూటమి ప్రభుత్వ పాలన
పిఠాపురం: అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంటు ఇలా విద్యాభివృద్ధికి తోడ్పడే పథకాలకు మంగళం పాడిన చంద్రబాబునాయుడు ప్రభుత్వం చివరకు పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ను కూడా ఇవ్వకుండా చేతులెత్తేసింది. చదువు కావాలంటే మీ డబ్బుతో మీరే కొనుక్కోండి అంటూ విద్యార్థులపై రూ.కోట్ల భారాన్ని మోపింది. 10వ తరగతి పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. పదింతలు ప్రయాస పడి మరీ దీనిలో విజయం సాధించి తమ జీవితంలో మొదటి మెట్టు ఎక్కాలని విద్యార్థులు కలలు కంటారు. అందుకే పదవ తరగతి పరీక్షలను ప్రభుత్వం కూడా పటిష్టంగా నిర్వహించడానికి చర్యలు తీసుకోవాల్సి ఉంది. కాని చంద్రబాబు ప్రభుత్వం పదవ తరగతి పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులను తొలి దశలోనే నట్టేట ముంచింది. వారికి అందజేయాల్సిన స్టడీ మెటీరియల్ను ఇవ్వకుండా ఎగ్గొట్టేసింది. ప్రభుత్వం ఇవ్వకపోగా స్టడీ మెటీరియల్ను మీరే తయారు చేయించుకోండి అంటు విద్యార్థులకు పీడీఎఫ్లు పంపించింది. విద్యార్థుల తల్లిదండ్రులపై రూ.2.75 కోట్ల ఆర్థిక భారం మోపింది. దీంతో విద్యార్థులు చదువు ‘కొనా’ల్సిందేనా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతులెత్తేసిన చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 16 నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 100 రోజుల ప్రణాళికలు అంటున్నారు. దీనిలో 60 రోజులు అయిపోయింది. అయినా స్టడీ మెటీరియల్ మాత్రం ఇచ్చే ఆలోచనే ఉన్నట్టు కనిపించడం లేదు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా స్టడీ మెటీరియల్ను పంపిణీ చేస్తోంది. పరీక్షలు సమీపిస్తున్న వేళ మెటీరియల్ పంపిణీ విషయంలో ఈ ఏడాది సర్కారు చేతులెత్తేసింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించడానికి విద్యార్థులకు భరోసా ఇస్తు ప్రతి ఏటా అక్టోబర్ నెలలోనే స్టడీ మెటీరియల్ పంపిణీ చేసేది. గత ఏడాది నుంచి కూటమి ప్రభుత్వం దానిని పట్టించుకోకుండా విద్యార్థులపై భారం మోపడంతో చదువుకునేదెలా అంటూ విద్యార్థులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. పరీక్షల నిర్వహణకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఎప్పటి మాదిరిగానే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ప్రణాళికను విద్యాశాఖ తయారు చేసింది. ఆ ప్రణాళిక ప్రకారం చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా సబ్జెక్టు నిపుణులతో తయారు చేయించిన స్టడీ మెటీరియల్ను అందజేయాల్సి ఉంది. అయితే ఇంతవరకు ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. స్టడీ మెటీరియల్ ఇచ్చేందుకు తమ వద్ద నిధులు లేవంటూ విద్యార్థులపైనే భారం వేస్తున్నారు. ఏటా జిల్లా పరిషత్ నుంచి స్టడీ మెటీరియల్ ఇచ్చేవారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రభుత్వం పంపిణీకి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. గత ప్రభుత్వం సకాలంలోనే విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ చేసింది. కూటమి ప్రభుత్వం మాత్రం మాకు సంబందం లేదన్నట్టుగా వ్యవహరించడంపై విద్యార్థులు మండిపడుతున్నారు. పీడీఎఫ్లతో విద్యార్థులపై భారీగా భారం రాష్ట్ర విద్యాశాఖ తయారు చేసిన స్టడీ మెటీరియల్ను పీడీఎఫ్ ఫైల్ రూపంలో వచ్చింది. దానిని అధికారులు అలాగే స్కూళ్లకు పంపించి వాటిని ప్రింట్ తీసుకొని చదువుకోవాలని సూచిస్తున్నట్లు విద్యార్థులు వాపోతున్నారు. అన్ని సబ్జెక్టులకు కలిపి సుమారు 500 పేజీల వరకు ఉండడంతో ప్రింటింగ్ తీయించుకుని చదువు కోవాలంటే అదనపు భారం తప్పడం లేదు. పేద, మధ్యతరగతి విద్యార్థులు నగదు వెచ్చించి ప్రింట్ తీయించుకోవడానికి అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక్కో పేపర్కు కనీసం రూ.2 జిరాక్సు షాపుల నిర్వాహకులు తీసుకుంటున్నారు. దీంతో స్టడీ మెటీరియల్ తీసుకోవాలంటే రూ.1,000కి పైగానే ఖర్చు అవుతోంది. ఇలా మొత్తం విద్యార్థులపై సుమారు రూ 2.75 కోట్ల భారం పడుతుంది. వచ్చేనెల 16 నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. మరో 39 రోజులు మాత్రమే గడువు ఉంది. ఉపాధ్యాయులకు విషమ పరీక్ష చేసేదేమీ లేక, ఎవరికి చెప్పుకోలేక ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కనీసం మా పాఠశాలకు స్టడీ మెటీరియల్ రాలేదని చెప్పుకోవడానికి కూడా ఉపాధ్యాయులు భయపడుతున్నారు. దయ చేసి మమ్మల్ని వీధిలో పెట్టకండి.. మేము చెప్పినట్టు తెలిస్తే మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారంటూ ఉపాధ్యాయులు ప్రాధేయపడుతున్నారు. తమకు ఎక్కడ ఇబ్బంది అవుతుందో అన్న భయంతో ‘మాకు స్టడీ మెటీరియల్ అందలేద’ని చెప్పుకుందామని చూసిన విద్యార్థుల నోరు నొక్కుతున్నారు ఉపాధ్యాయులు. అలాగని స్టడీ మెటీరియల్ లేక విద్యార్థులను ఎలా చదివించాలా అని తలపట్టుకుంటున్నారు. డిజిటల్గా మెటీరియల్ అందజేయగా ఫిజికల్గా మెటీరియల్ అందకపోవడంతో ఫీడీఎఫ్ను పుస్తకాల రూపంలోకి మార్చి కొందరు ఉపాధ్యాయులు విద్యార్థులకు అందజేయడానికి దాతల సహకారం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. సామర్లకోట: తెలుగుదేశం ప్రభుత్వం కాపులే టార్గెట్గా పని చేస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి ఇనుకొండ విష్ణుచక్రం అన్నారు. బుధవారం ఆయన సిరివాడ గ్రామంలో విలేకరులతో మాట్లాడుతూ గతంలో కాపు నాయకుడు ముద్రగడ్డ పద్మనాభంపై ఆయన కుటుంబ సభ్యులపై దాడి చేశారని, నేడు మరో కాపు నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడి చేశారన్నారు. కూటమి నాయకుల ఆరోపించినట్టు తిరుమల లడ్డూలో ఎటువంటి కల్తీ లేదని సుప్రీంకోర్టు, సీబీఐ స్పష్టం చేయడంతో దాని నుంచి తప్పించుకునే క్రమంలో భాగంగానే చంద్రబాబునాయుడు అండ్ కో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. పవిత్రమైన లడ్డూలో కల్తీ లేదని తేలడంతో పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు శాంతియుతంగా దేవాలయా లలో పూజలు చేశామన్నారు. దీనిలో భాగంగా అంబటి రాంబాబు పూజలు చేస్తూ ఉంటే ఆయనను హత్య చేయడానికి ప్రయత్నం చేయడం దారుణమని అన్నారు. అధికారంలో ఉన్న సమయంలో ప్రజలకు మేలు చేయాలి తప్ప ప్రశ్నించే వారిపై దాడి చేస్తే తగిన మూల్యం చెల్లించవలసి వస్తుందన్నారు. జగన్మోహన్రెడ్డి పాలనలో పార్టీలతో సంబంధం లేకుండా అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేశారని, ఈ విషయాన్ని తెలుగుదేశం నాయకులే అంగీకరించారని గుర్తు చేశారు. నేడు రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్రెడ్డిని ఎదుర్కొనలేక కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి లడ్డూను ఉపయోగించుకొని కుట్ర రాజకీయం చేశారన్నారు. పదో తరగతి స్టడీ మెటీరియల్ పంపిణీని ఎగ్గొట్టిన చంద్రబాబు సర్కారు తల్లిదండ్రులపై రూ.2.75 కోట్ల మేర భారం ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులుజిల్లాలో టెన్త్ విద్యార్థులు పాఠశాలలు – 476 బాలికలు – 15,003 మంది బాలురు – 14,634 మంది మొత్తం – 29,637మంది ఒక్కో విద్యార్థిపై పడే భారం – రూ.1,000కి పైగా స్టడీ మెటిరీయల్కు వెచ్చించాల్సిన సొమ్ము – రూ.2.75 కోట్లు ఇబ్బంది లేకుండా చర్యలు జిల్లాలో పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ లేదు. డిజిటల్గా అందరికి మెటీరియల్ అందజేశాం. కొంతమేర ఇబ్బందులు ఉన్నా తగిన చర్యలు తీసుకుని విద్యార్థులు అవస్థలు పడకుండా చూస్తున్నాం. ఉపాధ్యాయులకు తగిన సూచనలు ఇచ్చాం. ప్రత్యేక తరగతులు నిర్వహించి పరీక్షల్లో బాగా రాసే విధంగా విద్యార్థులకు తర్ఫీదు ఇస్తున్నాం. – పి.రమేష్, జిల్లా విద్యాశాఖాధికారి, కాకినాడ వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి -
నెలాఖరులోగా ఇంటి పన్నుల వసూలు
కాకినాడ రూరల్: గ్రామ పంచాయతీలలో ఇంటి పన్నులను ఫిబ్రవరి నెలాఖరులోగా నూరు శాతం వసూలు చేయాలని పంచాయతీ రాజ్ డిప్యూటీ కమిషనర్ నాగార్జున సాగర్ కోరారు. సర్పవరం జంక్షన్ వద్ద స్పందన ఫంక్షన్ హాలులో బుధవారం మధ్యాహ్నం జిల్లాలోని పంచాయతీరాజ్ విభాగానికి సంబంధించి డీఎల్డీఓలు, డీఎల్పీఓలు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, సచివాల కార్యదర్శులతో పీఆర్ కార్యకలాపాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటి పన్నుల వసూలు, స్వమిత్ర, నాన్ ట్యాక్స్లు వసూలు గురించి సమీక్షించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు, కాకినాడ, పెద్దాపురం డీఎల్డీఓలు వాసుదేవరావు, శ్యామల, కాకినాడ, పెద్దాపురం డీఎల్పీఓలు అన్నామణి, ఎం.బాలమణి పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
శంఖవరం: కత్తిపూడి ఫ్లైవర్ బ్రిడ్జి కింద బుధవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు. అన్నవరం పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కత్తిపూడి బస్ కాంప్లెక్స్ సమీపంలో పిఠాపురం నుంచి రౌతులపూడి వెళ్తున్న టిప్పర్ను అన్నవరం నుంచి వస్తున్న ఆటో ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. యు.కొత్తపల్లి మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన 15 మంది కూలీలు ప్రత్తిపాడు మండలం ధర్మవరంలోని సరుగుడు తోట నరికేందుకు ఆటోలో వెళ్తున్నారు. కత్తిపూడి బస్ కాంప్లెక్స్ సమీపానికి వచ్చేసరికి మలుపులో టిప్పర్ను ఆటో ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలోని కొత్తపల్లి మండలం శ్రీరామపురానికి చెందిన పితాని కామరాజు (65) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 12 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రత్తిపాడు పీహెచ్సీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అన్నవరం ఎస్సై శ్రీహరిబాబు తెలిపారు. -
అట్టహాసంగా హాకీ పోటీలు ప్రారంభం
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): స్థానిక జిల్లా క్రీడా మైదానంలో కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో మొదటి కోకనాడ గోల్డ్ కప్ జాతీయ స్థాయి హాకీ పోటీలు బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి డీఎస్డీఓ వి.సతీష్ కుమార్, హాకీ మాజీ ఇండియన్ కెప్టెన్, పద్మశ్రీ ధనరాజ్ పిళ్లై, కోచ్ ద్రోణాచార్య అవార్డు గ్రహీత బల్వీర్ సింగ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత ప్రీతమ్ శివాజ్, శాప్ డైరెక్టర్లు రవీంద్ర, జగదీశ్వరి, హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు చాణక్యరాజ్, కార్యదర్శి హర్షవర్ధన్, అడిషనల్ ఎస్పీ లక్ష్మీపతి హాజరయ్యారు. శాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ కాకినాడ డీఎస్ఏలో వచ్చే ఏడాది హాకీ అంతర్జాతీయ టోర్నీ నిర్వహణకు అవసరమైన సదుపాయాలు, గ్యాలరీ, టాయిలెట్స్, ఫ్లడ్లైట్లు వంటివి ఏర్పాటు చేస్తామన్నారు. ఒలింపియన్ ధనరాజ్ పిళ్లై మాట్లాడుతూ ఈ టోర్నీ వర్థమాన క్రీడాకారులకు స్ఫూర్తిని ఇఽస్తుందన్నారు. కాకినాడకు గతంలో ఒకసారి వచ్చానని, ఇక్కడ టోర్నమెంట్ ఏర్పాట్లు బాగున్నాయన్నారు. టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి రవిచంద్రప్రసాద్ మాట్లాడూ కోకనాడ గోల్డ్ కప్ హాకీ పోటీలకు దేశ వ్యాప్తంగా పురుష, మహిళల 24 జట్లు వచ్చాయన్నారు. ఈ నెల 14 వరకూ టోర్నీ జరుగుతుందన్నారు. జాతీయ జెండాను శాప్ చైర్మన్ రవినాయుడు, హాకీ ఆంఽధ్రప్రదేశ్ జెండాను ధనరాజ్ పిళ్లై, కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ జెండాను క్లబ్ అధ్యక్షుడు బాబ్జి ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థినుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ప్రతినిధులు సూరిబాబు, ఇమ్మానుయేల్ రాజు, సురేష్రాజు, పరుశురాం, హరిబాబు, పీఈటీ సంఘ రాష్ట్ర మాజీ అద్యక్షుడు రవిరాజు, పాఠశాల క్రీడా సమాఖ్య కార్యదర్శి సుధారాణి, డీఎస్ఏ కోచ్లు సమీర్, సురేష్, అప్పలనాయుడు, డీఎస్ఏ హాకీ కోచ్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. తొలిరోజు నాలుగు మ్యాచ్లు డీఎస్ఏ మైదానంలో ప్రారంభమైన కోకనాడ గోల్డ్ కప్ హాకీ పోటీల్లో భాగంగా తొలిరోజు నాలుగు మ్యాచ్లు జరిగాయి. మహిళల విభాగంలో ఎస్సీఓఈ భోపాల్, హర్యానా మధ్య జరిగిన మ్యాచ్లో హర్యానా జట్టు, ఎన్సీఓఈ సోనిపత్, బిలాయ్ స్టీల్ప్లాంట్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఎన్సీఓఈ జట్టు విజయం సాధించాయి. యూనియన్ బ్యాంక్, గ్వాలియర్ ఎంపీ అకాడమీ జట్ల మధ్య మ్యాచ్ డ్రాగా ముగిసింది. పురుషుల విభాగంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇండియన్ ఆర్మీ మధ్య జరిగిన మ్యాచ్లో ఇండియన్ ఆర్మీ జట్టు విజయం సాధించిందని నిర్వాహకులు ప్రకటించారు. -
పాదగయ పిలుస్తోంది
● మహా శివరాత్రికి ఏర్పాట్లు ● సిద్ధమవుతున్న పుష్కరిణి ● 13 నుంచి ఉత్సవాలు ఆరంభం పిఠాపురం: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పిఠాపురం పాదగయ క్షేత్రం భక్తులను రా రమ్మని పిలుస్తోంది.. మహా శివరాత్రి ఉత్సవాలకు ఇప్పటి నుంచే ముస్తాబవుతోంది.. ఈ నెల 13న శివరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ జరగనుంది. శివరాత్రి మహాత్సవాలను కన్నుల పండువగా నిర్వహించడానికి సర్వం సిద్ధమవుతోంది. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని పాదగయ క్షేత్రాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు. ఉత్సవాల ప్రారంభం నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉండడంతో ప్రత్యేక పూజలు అభిషేకాలు, అర్చనలు, కుంకుమ పూజలకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ప్రఖ్యాత శైవ క్షేత్రాల్లో పాదగయ క్షేత్రం ప్రాధాన్యం కలిగి ఉంది. మహా శివరాత్రి పర్వదినాల్లో ఈ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ ఉత్సవాలు పురస్కరించుకుని వారం రోజుల పాటు నిత్యం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ప్రత్యేక లక్షపత్రి పూజలు, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించనున్నారు. త్రిగయా క్షేత్రాల్లో పిఠాపురంలో వేంచేసియున్న పాదగయ క్షేత్రం అత్యంత ప్రాచీన దివ్య శైవ క్షేత్రం. పుణ్యస్నానంతో పునీతం పాదగయ పుష్కరిణిలో పుణ్యస్నానం చేస్తే పునీతం అవుతారని భక్తుల విశ్వాసం. అందుకే ఏటా వేలాది మంది భక్తులు వచ్చి ఈ పుష్కరిణిలో స్నానాలు ఆచరిస్తుంటారు. మహా శివరాత్రి ఉత్సవాల్లో అత్యంత ప్రాధాన్యం కలిగిన ఈ పుణ్య స్నానాలకు పుష్కరిణిని సిద్ధం చేస్తున్నారు. ఇటీవల అందులో పాత నీరు తొలగించిన అఽధికారులు పూర్తిగా శుభ్రం చేసి మరమ్మతులు నిర్వహిస్తున్నారు. కొత్త నీటితో నింపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కువ మంది భక్తులు ఒకేసారి పుణ్య స్నానాలు ఆచరించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ అధికారులు వివరిస్తున్నారు. 13న కుక్కుటేశ్వరుని కల్యాణం పాదగయ క్షేత్రంలో రాజరాజేశ్వరీ సమేత ఉమా కుక్కుటేశ్వరస్వామివారి దివ్య కల్యాణం ఈ నెల 13న రాత్రి 8.32 గంటలకు నిర్వహించనుండగా, 14న స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు జరుపనున్నారు. 15వ తేదీ మహా శివరాత్రి ఉత్సవం, 16న మధ్యాహ్నం 3 గంటలకు నాకబలి, దండాడింపు, దొంగలదోపు ఉత్సవాలు, స్వామివారి రథోత్సవం, 18న స్వామివారి త్రిశూల స్నానం, తెప్పోత్సవం, శ్రీపుష్పోత్సవం నిర్వహించనున్నారు. ప్రపంచ స్థాయిలో దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పిఠాపురం పాదగయ క్షేత్రంతో పాటు సకలేశ్వరస్వామి, సోమేశ్వరస్వామి ఆలయాలతో పాటు గొల్లప్రోలు మండలం దుర్గాడలోని ఉమారామలింగేశ్వరస్వామి, గొల్లప్రోలులో ప్రసిద్ధి చెందిన ఉమారామలింగేశ్వరస్వామి, చేబ్రోలులో పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వరస్వామి, తాటిపర్తిలో అపర్ణాసమేత నాగేశ్వరస్వామివారి ఆలయాల్లోనూ ఉత్సవాలు జరుగనున్నాయి. భారీ ఏర్పాట్లు చేస్తున్నాం ఈ ఏడాది మహా శివరాత్రి ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లా కలెక్టర్, ఎస్పీ, దేవదాయ శాఖ ఉన్నతాధికారుల తదితరులు ఇప్పటికే పలు సూచనలు చేశారు. వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నాం. వచ్చే భక్తుల సౌకర్యార్థం మౌలిక వసతులపై దృష్టి పెట్టాం. అందరికీ స్వామివారి దర్శనభాగ్యం కల్పిస్తాం. అంతా పుణ్యస్నానాలు ఆచరించే విధంగా పాదగయ పుష్కరిణిని సిద్ధం చేస్తున్నాం. తగిన విధంగా క్యూలైన్లు నిర్మిస్తాం. –కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్, పాదగయ ఈఓ, పిఠాపురం -
చితికిన బతుకులు
తాళ్లపూడి/ దేవరపల్లి: బతుకులు చితికిపోయాయి.. ఆ కుటుంబాలు పెద్దలను కోల్పోయి వీధిన పడ్డాయి.. లారీ మృత్యువై వెంటాడి అనంత లోకాలకు దూసుకుపోయింది.. కొవ్వూరు– రాజమహేంద్రవరం గామన్ బ్రిడ్జిపై బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దేవరపల్లి మండలం దుద్దుకూరుకు చెందిన ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. పట్టణ సీఐ విశ్వం, పోలీసుల కథనం ప్రకారం.. దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామానికి చెందిన వెలగన కోట సత్యనారాయణ (40), తాతపూడి చిన్న సుబ్బారావు (36)లు లోడింగ్ ట్రాక్టర్లపై డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. ఆ ట్రాక్టర్లు కోరుకొండలో ఉండడంతో డ్యూటీ ఎక్కడానికి ఉదయం 7 గంటలకు ఇంటి నుంచి బయలు దేరారు. ఈ నేపథ్యంలో వారు కొవ్వూరులోకి గామన్ బ్రిడ్జిపై నుంచి మోటార్ సైకిల్పై వెళ్తున్నారు. ఈ సమయంలో వారి మోటారు సైకిల్ను లారీ ఢీకొంది. వారు లారీ వెనక చక్రాల కింద పడ్డారు. కోట సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందగా, చిన సుబ్బారావును ఆసుపత్రి తరలిస్తుండగా మార్గ మధ్యంలో చనిపోయాడు. మృతుల శరీర భాగాలు నుజ్జునుజ్జు కావడంతో భయానక వాతావరణం నెలకొంది. మృతదేహాలను కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బంధువుల రోదనలతో ఆసుపత్రి వద్ద హృదయవిదారక వాతావరణం నెలకొంది. దుద్దుకూరులో విషాద ఛాయలు ఈ ఘటనతో దుద్దుకూరు గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. అందరితో మంచిగా ఉంటూ, ఆప్యాయతగా పలకరించే కోట సత్యనారాయణ, చిన సుబ్బారావు(40) మృతితో గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఉదయం 7 గంటలకు ఇంటి నుంచి బయలు దేరి వెళ్లిన కొద్దిసేపటికే ఇద్దరూ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. చిన సుబ్బారావుకు తొమ్మిదో తరగతి చదువుతున్న ప్రదీప్, 4వ తరగతి చదువుతున్న కుమార్తె సంజన ఉండగా, కోల సత్యనారాయణకు 15 ఏళ్ల కుమారుడు చైతన్య, 6వ తరగతి చదువుతున్న కుమార్తె మౌనిక ఉన్నారు. పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రమాద విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు సంఘటనా స్థలానికి వెళ్లారు. ప్రమాదానికి కారణమదేనా! కొద్దిరోజులుగా గామన్ బ్రిడ్జిపై మరమ్మతులు చేస్తున్నారు. ఒకవైపు దారిలోనే ఇరుపక్కల వాహనాలను పంపుతున్నారు. ఇక్కడ సరైన పర్యవేక్షణ లేక తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. బుధవారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు మరణించడానికి కూడా ఇదే కారణమని బాధిత కుటుంబ సభ్యులు వాపోతున్నారు. నిత్యం భారీ వాహనాల సంచారంతో రద్దీగా ఉండే ఈ రోడ్డులో వాహనాల వేగానికి కూడా కళ్లెం లేకపోయింది. ఇప్పటికై నా పోలీసు అధికారులు సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.


