కదం తొక్కిన కార్మిక లోకం
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, కనీస వేతనం రూ.30 వేలు చెల్లించాలని, పని గంటలు పెంచుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించి, ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని, కాంట్రాక్టు, స్కీమ్ వర్కర్లను రెగ్యులరైజ్ చేసి, వేతనాలు పెంచాలని, పంటలకు గిట్టుబాటు ధరల చట్టం చేయాలని, పాత ఉపాధి హామీ చట్టాన్నే అమలు చేయాలని, పలు ఇతర డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ జిల్లావ్యాప్తంగా కార్మిక లోకం కదం తొక్కింది. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కాకినాడతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వివిధ రంగాల కార్మికులు, ఉద్యోగులు ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు.


