సామర్లకోట: జీసస్ సిలువలో మరణించిన రోజైన గుడ్ ప్రైడేను విశ్వాసులు జిల్లావ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఏసుక్రీస్తును సిలువకు అప్పగించిన సందర్భానికి సంబంధించి 40 రోజుల పాటు క్రైస్తవులు ఉపవాస దీక్షను అవలంబించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఏసుక్రీస్తు సిలువలో పలికిన ఏడు మాటలను ధ్యానిస్తూ గుడ్ ఫ్రైడే ఆరాధనల్లో పాల్గొన్నారు. గ్రామాల్లో చర్చిలు భక్తులతో నిండిపోయాయి. సామర్లకోట గడియార స్తంభం సెంటర్ నుంచి బ్రౌన్పేట వరకు ఏసుప్రభు వేషధారణలోని సిలువ మోస్తూ నిర్వహించిన యాత్ర కంట తడి పెట్టించింది.


