బుధవారం శ్రీ 18 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
-8లో
స్వర్ణాంధ్ర – 2047 అనేది అభూత కల్పన
రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే క్రమంలో స్వర్ణాంధ్ర – 2047 తమ లక్ష్యమంటూ కూటమి నేతలు చెప్పిన మాటలు అభూత కల్పన మాత్రమే. పది సూత్రాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథాన నడిపించేందుకు కృషి చేస్తున్నామంటూ పాలకులు చెప్పడాన్ని ప్రజలు ఏ మాత్రమూ స్వాగతించరు. 22 నెలల పాలనా కాలంలో తొలి ఏడాదంతా సంక్షేమ పథకాలను ఎగ్గొట్టారు. తర్వాత అందజేసిన పథకాల లబ్ధి అరకొరగా ఉంది. ఈ తరహా పాలనను చూసిన ప్రజలకు చంద్రబాబు ప్రభుత్వంపై నమ్మకం పోయింది.
– తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ మండపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్
తీవ్ర నిరాశకు గురి చేసింది
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, విశ్రాంత ఉద్యోగ వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచినా నాలుగు డీఏలు, చెల్లించాల్సిన రూ.40 వేల కోట్ల పైబడి బకాయిల ప్రస్తావన లేదు. నూతన పీఆర్సీ కమిషన్, ఐఆర్ గురించి పట్టింపే లేదు. ఈ వర్గాలకు ఈ బడ్జెట్ అన్యాయం, మోసం చేయడమే. దీనిని ప్రభుత్వం సరిదిద్దాలి.
– అప్పారి జయప్రకాష్,
వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు, తూర్పుగోదావరి జిల్లా
బుధవారం శ్రీ 18 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
బుధవారం శ్రీ 18 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026


