breaking news
Bapatla District Latest News
-
కబడ్డీ టోర్నీలో క్రీడాకారిణుల ప్రతిభ
గుంటూరు రూరల్: నగర శివారు లాంలోని చలపతి ఫార్మసీ కళాశాలలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళల కబడ్డీ టోర్నమెంట్ రెండో రోజు శుక్రవారం పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి. వివిధ కళాశాలల జట్లు ప్రతిభ చాటాయి. నరసరావుపేట కృష్ణవేణి డిగ్రీ కళాశాల, తెనాలి జె.ఎం.జె. డిగ్రీ కళాశాల, గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ అండ్ సైన్న్స్ విభాగం, గుంటూరు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలు వరుసగా తొలి నాలుగు స్థానాలు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ నాదెండ్ల రామారావు తెలిపారు. అనంతరం బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం యోగా కోఆర్డినేటర్ డాక్టర్ డి. సూర్యనారాయణ పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్, చలపతి విద్యాసంస్థల చైర్మన్ వైవీ ఆంజనేయులు తదితరులు విజేతలను అభినందించారు. -
చలో.. సూర్యలంక !
కార్తిక మాసం అనగానే మనుష్యుల మధ్య ఐకమత్యం, ప్రకృతితో మనిషికి గల అవినాభావ సంబంధాన్ని తెలిపే వన భోజనాలు గుర్తు కొస్తాయి. పచ్చ పచ్చని వనాల్లో సేద తీరడంతో భవిష్యత్పై ఆశలు పుడతాయి. సమష్టి తత్వం బోధ పడుతుంది. దైనందిన జీవితంలో ఆశ, నిరాశలు, ఒత్తిడి, బాధ్యతల బరువుతో సతమతమయ్యే మనిషికి కార్తిక మాసంలో చేసే వన భోజనాలు ఆటవిడుపుగా ఉంటాయి. బాపట్ల: కార్తిక మాసం వచ్చిందంటే చాలు అందరి కళ్లూ జిల్లాలోని సూర్యలంక తీరం పైనే ఉంటాయి. ఈ నెల 22 నుంచి కార్తీక మాసం ప్రారంభం కానుంది. రాష్ట్రంలోనే సహజసిద్ధమైన తీరంగా పేరున్న సూర్యలంకకు కార్తిక మాసంలో పర్యాటకులు, భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. సముద్ర స్నానాలు చేసి, తీరానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఫారెస్ట్ భూమిలో ఉన్న జీడిమామిడి తోటలో వన భోజనాలు చేస్తారు. వననర్సరీ చాలా అనువుగా ఉంటుంది. స్నానాలనంతరం పూజలు చేసుకునేందుకు వీలుగా తీరం వెంబడే ఆంజనేయస్వామి దేవాలయం ఉంది. చేరుకునేది ఇలా... బాపట్ల నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యలంక సముద్ర తీరానికి వెళ్లేవారు ముందుగా పట్టణంలోని ఆంజనేయస్వామి దేవాలయం వద్దకు చేరుకోవాలి. అక్కడి నుంచి ఆటో సర్వీసులు అందుబాటులో ఉంటాయి. బాపట్ల నుంచి నేరుగా సూర్యలంక వరకు వెళ్తుంటాయి. ఒక్కో మనిషికి రూ.20 చార్జీ ఉంటుంది. సర్వీసులు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. కార్తిక మాసంలో వచ్చే ప్రతి ఆది, సోమవారాల రోజున బాపట్ల నుంచి ఆర్టీసీ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. రైలు మార్గాన వచ్చే వాళ్లకు స్థానిక రైల్వేస్టేషన్ నుంచి నేరుగా సూర్యలంకకు, బస్సు మార్గాన వచ్చే వాళ్లకు బాపట్ల పాత బస్టాండ్ నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇతర జిల్లాల నుంచి వచ్చే పర్యాటకుల సౌకర్యార్థం గుంటూరు బస్ స్టేషన్ నుంచి కూడా నేరుగా బస్సులు అందుబాటులో ఉంటాయి. రిసార్ట్స్లో వసతి సౌకర్యం సహజ సిద్ధమైన సూర్యలంక తీరంలో ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు, పర్యాటకులు సేదతీరేందుకు వీలుగా తీరం ఒడ్డున హరితా రిసార్ట్స్ ఉన్నాయి. ఇందులో 25 ఏసీ రూమ్లు, రెండు నాన్ ఏసీ రూమ్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఆన్లైన్లో aptdc. gov. in అనే వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. పర్యాటకుల సౌకర్యార్థం తీరం వెంబడి రెస్టారెంట్, గ్రూపు యాత్రికుల కోసం క్యాటరింగ్ సౌకర్యం, టూరిస్టు బోటు , తీరం వెంబడే జిమ్ సెంటర్ను కూడా నిర్వహిస్తున్నారు. -
ఇంటింటికీ తాగునీరు సరఫరానే లక్ష్యం
బాపట్ల: జలజీవన్ మిషన్ కింద ఇంటింటికీ కుళాయిల ద్వారా తాగునీరు సరఫరా చేయాలని కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఆదేశించారు. గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణపై జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 265 గ్రామాల్లో 3.64 లక్షల కుటుంబాలు నివసిస్తున్నారని తెలిపారు. ఇందులో ప్రస్తుతం 1.48 లక్షల ఇళ్లకు మాత్రమే కుళాయి కనెక్షన్లు ఉన్నాయని, ఇంకా 2,15,808 ఇళ్లకు ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. డిసెంబర్ 31వ తేదీ నాటికి 4,493 కనెక్షన్లు ఇవ్వాలని చెప్పారు. 369 చిన్న చెరువులు, మధ్యస్త చెరువులు 25తో పాటు 5,083 చేతి పంపులు ఉన్నాయని వివరించారు. తాగునీటి ప్రాజెక్టులు సమర్థంగా నిర్వహణ, పర్యవేక్షణకు జిల్లా, గ్రామీణ స్థాయిలో కమిటీలు పని చేస్తున్నాయని తెలిపారు. 2028 నాటికి తలసరి 55 లీటర్ల నీటిని సరఫరా చేయాలనే లక్ష్యంతో జలజీవన్ మిషన్ కింద పనులు జరుగుతున్నాయని వివరించారు. జలజీవన్ మిషన్ 64 పనులను ప్రారంభించని ఏజెన్సీలకు నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రెండు వారాల్లో ప్రారంభించాలని చెప్పారు. రూ.167.48 కోట్లతో మంజూరు చేసిన 403 పనులను గడువులోగా పూర్తి చేయాలని, పురోగతిలో ఉన్న 277 పనులను ఆరు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. జల వనరుల సంరక్షణలో భాగంగా పంట కుంటలు, నీటి కుంటలు, ఇంకుడు గుంతలను విరివిగా తవ్వాలని సూచించారు. మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలి చెరువులు, పైపులైన్ల మరమ్మతుల కోసం రూ.9.94కోట్లు మంజూరు చేయాలని జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓలను కలెక్టర్ కోరారు. దీనివల్ల గ్రామీణ ప్రాంత ప్రజలకు నీటి సరఫరా సజావుగా సాగుతుందని వివరించారు. ప్రస్తుతం 40 శాతమే కుళాయి కనెక్షన్ల ద్వారా తాగునీరు సరఫరా అవుతున్న నేపథ్యంలో తప్పనిసరిగా జలజీవన్ మిషన్ పనులు చేపట్టాలని ఆయన ఆదేశించారు. తాగునీటి పథకాల మరమ్మతులకు గ్రామ పంచాయతీ నిధులు లేకపోతే మండల పరిషత్ నిధులను తప్పనిసరిగా కేటాయించాలని ఆయన సూచించారు. మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యాలను పూర్తి చేయాలి సామాజిక మరుగుదొడ్లు జిల్లాలో 406 మంజూరు కాగా, 223 మాత్రమే పూర్తయ్యాయని, మిగిలిన వాటిని పూర్తిచేయాలని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో 18,288 ఇళ్లకు మరుగుదొడ్లు లేకపోవడంపై ఆరా తీశారు. యుద్ధప్రాతిపదికన మంజూరు చేయాలని చెప్పారు. 342 సామాజిక మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.10.26 కోట్లు మంజూరయ్యాయని, పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. 79 అంగన్వాడీ కేంద్రాల్లో సామాజిక మరుగుదొడ్లు నిర్మాణానికి రూ.28.4 లక్షలు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. వాడిన నీటిని శుద్ధి చేసే ప్లాంట్ ఏర్పాటుకు అద్దంకి నియోజకవర్గంలోని మార్టూరు గ్రామాన్ని ఎంపిక చేశామని కలెక్టర్ చెప్పారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ అనంతరాజు, అనుబంధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఇసుక కొరత లేకుండా చర్యలు ప్రజల అవసరాలకు ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని మినీ వీక్షణ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో అందుబాటులో గల ఇసుక రీచ్ వివరాలపై కలెక్టర్ ఆరా తీశారు. వర్షాకాలం పూర్తవుతున్నందున జిల్లాలో కొత్త రీచ్లను అన్వేషించాలని తెలిపారు. ఓలేరు రీచ్పై కోర్టు కేసును త్వరగా పూర్తి చేసుకుని అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. అనుమతులు వచ్చిన వెంటనే జువ్వలపాలెం రీచ్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని ఆయన అధికారులు సూచించారు. ఇసుక సరఫరా చేసే వాహనాల రిజిస్ట్రేషన్, జీపీఎస్ తప్పనిసరిగా ఉండాలని ఆర్టీవోకు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్, గనుల శాఖ సహాయ సంచాలకులు రామచంద్ర, జిల్లా రవాణా అధికారి పరంధామరెడ్డి, చీరాల ఆర్డీవో చంద్రశేఖర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ -
విద్యార్థులు సృజనాత్మకతను పెంపొందించుకోవాలి
నరసరావుపేట రూరల్: విద్యార్థులు సృజనాత్మకతను పెంపొందించుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ తెలిపారు. జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ పోటీలు శంకరభారతీపురం జెడ్పీ హైస్కూల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పోటీలను జిల్లా విద్యాశాఖ అధికారి ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 30 నమూనాలను విద్యార్థులు పోటీలో ప్రదర్శనకు ఉంచారు. కాకాని జెడ్పీ హైస్కూల్కు చెందిన వక్కలగడ్డ కాత్యాయనీ ప్రథమ స్థానం, నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్కు చెందిన కోడిరెక్క ఇమ్మానియేల్కు ద్వితీయ స్థానం లభించింది. ఈ రెండు నమూనాలను శనివారం విజయవాడలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికచేశారు. రాష్ట్ర స్థాయి సైన్స్ సెమినార్లో జిల్లా విద్యార్థులు మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని డీఈవో తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈవో ఎస్కె సుభాని, సత్తెనపల్లి డీఈవో ఏసుబాబు, పాఠశాల ప్రదానోపాధ్యాయురాలు ఎం.పార్వతి, జిల్లా సెన్స్ అధికారి ఎస్.రాజశేఖర్, ఉపాధ్యాయులు రఘురాం, చింత శ్రీనివాసరెడ్డి, మధుకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సమయస్ఫూర్తితో ఆటల్లో విజయం
కర్లపాలెం: క్రీడాకారులు సమయస్ఫూర్తితో ఆడి విజయం సాధించాలని డీఈవో పురుషోత్తం తెలిపారు. మండలంలోని యాజలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం బాపట్ల డివిజన్ స్థాయిలో 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ వాలీబాల్ పోటీలు హోరాహోరీగా జరిగాయి. ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఈవో పురుషోత్తం ముందుగా వాలీబాల్ క్రీడాకారులను, వ్యాయామ ఉపాధ్యాయులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు గెలుపే ధ్యేయంగా ఆడాలని సూచించారు. నిష్పక్షపాతంగా పోటీలు నిర్వహించాలని వ్యాయామ ఉపాధ్యాయులకు చెప్పారు. పోటీల్లో మెరుగైన ప్రతిభ కనబరిచిన వారిని డివిజన్ స్థాయి టీమ్కు ఎంపిక చేస్తామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఎం సుగుణ మణి, వ్యాయామ ఉపాధ్యాయురాలు మెర్సీ, ఎంఈవోలు మనోరంజని, విజయశ్రీ, స్కూల్ గేమ్ ఫెడరేషన్ మాజీ కార్యదర్శి కరిముల్లా, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రతిమ, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొన్న 40 టీములు బాపట్ల డివిజన్ పరిధిలోని మొత్తం 12 మండలాల నుంచి అండర్–14, అండర్–17 బాలబాలికల విభాగాలలో మొత్తం 40 టీమ్లు పాల్గొన్నాయి. -
హత్య కేసులో నిందితుడి అరెస్ట్
తెనాలి రూరల్: తెనాలిలో పట్టపగలు నడిరోడ్డుపై ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటనలో నిందితుడిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. స్థానిక త్రీటౌన్ పోలీస్స్టేషన్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో డీఎస్పీ బి.జనార్దనరావు కేసు వివరాలను వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల మేరకు... బాపట్ల జిల్లా అమృతలూరు మండలం కోరుతాడిపర్రు గ్రామానికి చెందిన జూటూరి తిరుపతిరావు(60) ఈ నెల 14న పట్టణంలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. తిరుపతిరావు గ్రామంలోని రామాలయం పాలకవర్గంలో కీలకంగా ఉన్నాడు. ఆలయ చెరువుల వేలం పాటల నిర్వహణ బాధ్యత చూసేవాడు. 15 రోజుల క్రితం జ్వరం రావడంతో తిరుపతిరావు భార్యతో కలసి తెనాలిలో నివాసం ఉంటున్న కుమార్తె గండికోట దుర్గ ఇంటికి వచ్చాడు. ఈ నెల 14న టిఫిన్ కోసం బైక్పై ఇంటి నుంచి బయటకు వచ్చాడు. సమీపంలో టిఫిన్ సెంటర్ వద్ద బైక్పై కూర్చున్నాడు. అదే సమయంలో కోరుతాడిపర్రు గ్రామానికి చెందిన గండికోట వెంకటసుబ్బారావు వచ్చి కొబ్బరి బొండాల కత్తితో విచక్షణరహితంగా దాడి చేసి పారిపోయాడు. తిరుపతిరావుతో నిందితుడికి కొంతకాలంగా విభేదాలున్నాయి. నిందితుడి వ్యక్తిగత విషయాలలోనూ తిరుపతిరావు జోక్యం చేసుకున్న కారణంగా కక్ష పెంచుకొని ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆలయ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించడం, గతంలో తన తండ్రి మృతికి కూడా తిరుపతిరావు కారణమయ్యాడని భావించి రెక్కీ నిర్వహించి మరీ హత్యకు పాల్పడ్డాడు. నిందితుడిపై పట్టణ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో గతంలో మూడు కేసులు, అమృతలూరు పోలీస్స్టేషన్లో రెండు కేసులు నమోదైనట్లు వెల్లడించారు. తిరుపతిరావు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కంచర్లపాలెం రోడ్డులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు. సమావేశంలో సీఐ ఎస్. సాంబశివరావు, త్రీ టౌన్ ఎస్ఐ కరిముల్లా, రూరల్ ఎస్ఐ కె. ఆనంద్, సిబ్బంది పాల్గొన్నారు. ఆధిపత్య పోరు, పాత కక్షలే కారణమని డీఎస్పీ వెల్లడి -
విలువలతో కూడిన నాయకత్వం అవసరం
చేబ్రోలు: విద్య కేవలం జ్ఞాన సంపాదనకే కాకుండా విలువలతో కూడిన నాయకత్వం పెంచుకోవడానికి కూడా ముఖ్యమని ఐసీఎస్ఎస్ఆర్–ఎస్ఆర్సీ హానరరీ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.సుధాకర్రెడ్డి అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో ‘‘కల్టివేటింగ్ ఎథికల్ బిజినెస్ లీడర్స్’’పై రెండు రోజుల జాతీయ సదస్సు శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ప్రొఫెసర్ బి.సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నేటి యువత వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నప్పుడు సామాజిక బాధ్యతతో కూడిన నైతిక విలువలే మార్గదర్శకాలు కావాలని సూచించారు. ఉస్మానియా వర్సిటీ మాజీ డీన్ ప్రొఫెసర్ ఎ. సూర్యనారాయణ మాట్లాడుతూ ఆధునిక సంస్థల్లో ఎదురయ్యే నైతిక సమస్యలను ఆచరణాత్మక కోణంలో విశ్లేషించారు. పుదుచ్చేరి యూనివర్సిటీ మేనేజ్మెంట్ స్కూల్కు చెందిన ప్రొఫెసర్ యార్లగడ్డ శ్రీనివాసులు భారతీయ తత్వశాస్త్ర సంప్రదాయాల ప్రాధాన్యతను నైతిక నాయకత్వ అభివృద్ధితో అనుసంధానించి వివరించారు. ఐఐటీ హైదరాబాద్ మేనేజ్మెంట్ విభాగాధిపతి డాక్టర్ ఎం.పి.గణేష్ ఆధునిక అభివృద్ధి తత్త్వాలతోపాటు ప్రాచీన భారతీయ జ్ఞానాన్ని సమన్వయం చేయడం ఎంత అవసరమో వెల్లడించారు. వంద మందికిపైగా ప్రతినిధులు పరిశోధన పత్రాలను సమర్పించారు. వైస్ చాన్సలర్ పి.నాగభూషణ్, రిజిస్ట్రార్ పీఎంవీ రావు, డీన్లు తదితరులు పాల్గొన్నారు. -
రైలు ఎక్కితే రక్షణ కరువు
దాచేపల్లి : రైలు ప్రయాణికులకు భద్రత కరువైంది. ఇటీవల జరిగిన వరుస ఘటనలతో గుండెళ్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. ఇటీవల ప్రయాణికుల నుంచి దుండగులు బంగారం, నగదు దోచుకున్న ఘటనలు భారీగా జరిగాయి. తాజాగా సంత్రగాచి స్పెషల్ రైలులో ప్రయాణిస్తున్న మహిళపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడటం తీవ్ర సంచలనంగా మారింది. రైలు ప్రయాణికుల్ని కలవరపాటుకు గురి చేసింది. కత్తితో బెదిరించి అత్యాచారం ఏపీకి చెందిన ఓ మహిళా ప్రయాణికురాలు(35) సోమవారం రాజమహేంద్రవరం స్టేషన్లో చర్లపల్లి వెళ్లేందుకు సంత్రగాచి ప్రత్యేక రైలు ఎక్కింది. ఆమె అక్కడ ఇళ్లల్లో పని చేసుకుని జీవించేందుకు వెళుతోంది. రైలు గుంటూరు స్టేషన్కి చేరుకున్న తరువాత మహిళా బోగీలో ఉన్న ప్రయాణికులంతా దిగి పోయారు. ఆమె ఒక్కతే మిగిలింది. బోగీలోని 40 ఏళ్ల వయస్సున్న గుర్తు తెలియని వ్యక్తి ఎక్కేందుకు ప్రయత్నించగా ఆమె ఒప్పుకోలేదు. బలవంతంగా ఎక్కాడు. గుంటూరు రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరిన 20 నిమిషాల తరువాత బోగీ తలుపులు మూసివేశారు. ఒంటరిగా ఉన్న మహిళ ప్రయాణికురాలిని కత్తితో బెదిరించి, బలవంతంగా ఆత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె వద్ద ఉన్న రూ. 5,600తో పాటు సెల్ఫోన్, హ్యాండ్బ్యాగ్ లాక్కొని దాడి చేసి, పెదకూరపాడు చేరుతుండగా కిందకు దిగి పారిపోయాడు. రైలు మంగళవారం చర్లపల్లి స్టేషన్కు చేరుకున్న తరువాత బాధితురాలు సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. తర్వాత నడికుడి జీఆర్పీ పోలీసులకు బదిలీ చేశారు. బెంబేలెత్తుతున్న ప్రయాణికులు ఇటీవల నడికుడి, తుమ్మలచెరువు, పిడుగురాళ్ల, బెల్లంకొండ స్టేషన్ల పరిధిలో రైళ్లల్లో ప్రయాణికులను బెదిరించి బంగారం, నగదును దుండగులు దోచుకున్నారు. ఆగంతకులు రైళ్లను ఆపి పారిపోవడం ఆ శాఖకు సవాల్గా మారింది. ప్రయాణికుల గుండెల్లో రైళ్లు పెరుగుతున్న దోపిడీలు, దొంగతనాలు తాజాగా ప్రయాణికురాలిపై దుండగుడి లైంగికదాడి సికింద్రాబాద్లో కేసు నమోదు.. నడికుడికి బదిలీ జీఆర్పీ, ఆర్పీఎఫ్ల్లో సిబ్బంది కొరత రైల్వే ఆస్తులు, ప్రయాణికుల భద్రత కోసం ఏర్పాటైన జీఆర్పీ, ఆర్పీఎఫ్ల్లో సిబ్బంది కొరతతో ప్రయాణికులకు సరియైన భద్రత కల్పించటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. గుంటూరు రైల్వే డివిజన్లో రెండో అతి పెద్ద స్టేషన్ అయిన నడికుడి రైల్వే జంక్షన్లో ఉన్న ఆర్పీఎఫ్ కార్యాలయాన్ని పిడుగురాళ్లకు తరలించారు. నడికుడి స్టేషన్లోని జీఆర్పీ కార్యాలయంలో ఎస్ఐగా నరసరావుపేట స్టేషన్లో పని చేస్తున్న అధికారి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. స్టేషన్లలో, రైళ్లలో సరిపడా సిబ్బంది లేకపోవడం వల్ల దుండగులు యథేచ్ఛగా దోపిడీలకు పాల్పడుతున్నారు. -
కమనీయ కార్తికానికి సంసిద్ధం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై రానున్న రెండు నెలలో జరిగే విశేష పూజలు, పర్వదినాలను పురస్కరించుకుని అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని దుర్గగుడి చైర్మన్ రాధాకృష్ణ, ఈవో శీనానాయక్ పేర్కొన్నారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆవరణలోని మహా మండపం ఆరో అంతస్తులో గురువారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రానున్న రోజులలో దేవస్థానంలో నిర్వహిస్తున్న ఉత్సవాలు, విశేష పర్వదినాలు, భవానీ దీక్ష స్వీకరణలకు సంబంధించిన వివరాలను వివరించారు. తొలుత దేవస్థానం అమ్మవారి అలంకరణలు, ఆలయ బంగారు శిఖరం, రాజగోపురం ఫొటోలతో రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఆధ్యాత్మిక సంరంభం.. అక్టోబర్ 21వ తేదీ సాయంత్రం అమ్మవారి ఆలయం, నటరాజ స్వామి వారి ఆలయం, మల్లేశ్వర స్వామి వారి ఆలయాల్లో ఆకాశదీపం వెలిగిస్తామని, 22వ తేదీ నుంచి కార్తిక మాసోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. అక్టోబర్ 22వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు నిర్వహించే మాసోత్సవాలలో ప్రతి నిత్యం స్వామి వారికి విశేష అభిషేకాలు, అర్చనలు జరుగుతాయన్నారు. వీటితో పాటు ప్రతి రోజు సాయంత్రం 3 గంటలకు మల్లేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో సహస్ర లింగార్చన, సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ ఉంటుందన్నారు. వీటితో పాటు కార్తిక మాసంలో వచ్చే విశేషమైన రోజుల్లో స్వామి వారికి బిల్వార్చన, కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని కోటి దీపోత్సవం, జ్వాలా తోరణం, మాస శివరాత్రి వంటి పర్వదినాలను విశేష పూజలు నిర్వహిస్తామన్నారు. దుర్గమ్మ గాజుల సంబరం.. దుర్గమ్మకు 23వ తేదీన గాజులతో విశేష అలంకరణ చేస్తారని చైర్మన్, ఈవో పేర్కొన్నారు. అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు ఆలయ ప్రాంగణం, మూలవిరాట్కు గాజులతో విశేషంగా అలంకరిస్తామన్నారు. అమ్మవారికి అలంకరించిన గాజులను భక్తులకు పంపిణీ చేస్తామని వివరించారు. ప్రత్యేక బిల్వార్చన జరిగే తేదీలు.. కార్తిక మాసంలో మల్లేశ్వర స్వామి వారికి ప్రత్యేక తిథులలో బిల్వార్చన నిర్వహిస్తారు. 27వ తేదీ సోమవారం శుద్ధ చవితి, నవంబర్ 1వ తేదీ శనివారం శుద్ధ ఏకాదశి, 3వ తేదీ సోమవారం శుద్ధ త్రయోదశి, 05వ తేదీ బుధవారం కార్తిక పౌర్ణమి, 10వ తేదీ సోమవారం బహుళ పంచమి, 15వ తేదీ శనివారం బహుళ ఏకాదశి, 17వ తేదీ సోమవారం బహుళ త్రయోదశి 18వ తేదీ మంగళవారం మాస శివరాత్రిన ప్రత్యేక బిల్వార్చన నిర్వహించేందుకు వైదిక కమిటీ నిర్ణయించింది. నవంబర్ 1 నుంచి భవానీ దీక్షలు నవంబర్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు భవానీ మండల దీక్షలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అర్ధమండల దీక్షలు నవంబర్ 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు, డిసెంబర్ 4వ తేదీ కలశ జ్యోతి ఉత్సవం సత్యనారాయణపురంలోని శ్రీ శృంగేరి శారదాపీఠం పరిపాలిత శ్రీ శివరామకృష్ణ క్షేత్రం నుంచి ప్రారంభమవుతాయన్నారు. డిసెంబర్ 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు భవానీదీక్ష విరమణలు జరుగుతాయని, 15వ తేదీ ఉదయం 10 గంటలకు పూర్ణాహుతితో దీక్ష విరమణలు పరిసమాప్తమవుతాయన్నారు. మీడియా సమావేశంలో ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ వైదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ట్రస్ట్ బోర్డు సభ్యుల మధ్యలో అజయ్వర్మ ఠాకూర్ ఇంద్రకీలాద్రిపై 22 నుంచి కార్తిక మాసోత్సవాలు 23న దుర్గమ్మకు గాజుల అలంకరణ భక్తులకు ఇబ్బందుల్లేకుండా పక్కా ఏర్పాట్లు మీడియాతో దుర్గగుడి చైర్మన్ రాధాకృష్ణ, ఈవో శీనానాయక్ 20న దీపావళి వేడుకలు.. 19వ తేదీ ధనత్రయోదశి పర్వదినం సందర్భంగా ఉదయం 8 గంటలకు దేవస్థాన యాగశాలలో శ్రీమహాలక్ష్మీ యాగం నిర్వహిస్తామని చైర్మన్, ఈవో తెలిపారు. ఈ యాగం దేవస్థానం తరఫున ఆలయ అర్చకులు నిర్వహిస్తారని, భక్తుల పరోక్ష సేవగా జరుగుతుందన్నారు. ఇక 20వ తేదీ దీపావళి పర్వదినాన ప్రదోషకాలంలో అమ్మవారి ప్రధాన ఆలయంలో ధనలక్ష్మీ పూజ, దీపాలంకరణ, దీపావళి వేడుకల అనంతరం రాత్రి 7 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేస్తామన్నారు. తన భార్య ట్రస్ట్ బోర్డు సభ్యురాలు.. అనివార్య కారణాలతో ఆమె ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. అయితే ఏంటీ.. తన భార్యను ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా నియమించడంతో ఆమె స్థానంలో భర్త దర్జాగా ఆలయ అధికారులతో పరిచయ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ తర్వాత జరిగిన మీడియా సమావేశంలోనూ మిగిలిన బోర్డు సభ్యుల మధ్యలో కూర్చొని ఆద్యంతం సమావేశం ముగింపు వరకు అక్కడే ఉన్నారు. ఈ ఘటన గురువారం దుర్గగుడిలో చోటు చేసుకుంది. దుర్గగుడి ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా పద్మావతి ఠాకూర్ నియమితులయ్యారు. అయితే గత శనివారం ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణస్వీకారానికి పద్మావతి ఠాకూర్ హాజరు కాలేదు. గురువారం నిర్వహించిన సమావేశానికి కూడా ఆమె హాజరుకాకపోగా, ఆమె స్థానంలో భర్త అజయ్వర్మ ఠాకూర్ బోర్డు సభ్యులతో కలిసి సమావేశంలో పాల్గొనడం దుర్గగుడిలో చర్చనీయాంశంగా మారింది. -
మత్స్యకారులకు నిత్యావసర సరుకులు పంపిణీ
చొరవ చూపించిన మంత్రి నారా లోకేష్ తాడేపల్లి రూరల్: కృష్ణా నదిలో వరదల కారణంగా వల విసరక మత్స్యకారులకు భుక్తి కరువైంది. దయనీయంగా జీవిస్తున్నారని సాక్షిలో అక్టోబర్ 1వ తేదీన కథనం వెలువడింది. దీనికి స్పందించిన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ఆర్థిక సాయంతో గురువారం మత్స్యకారులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తాడేపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షుడు వల్లభనేని వెంకటరావు మాట్లాడుతూ గత మూడు నెలల నుంచి గంగ పుత్రులు వేట లేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. మంత్రి లోకేష్ సహాయంతో 300 మందికి రెండు వేల రూపాయల చొప్పున నిత్యావసర వస్తువులను అందజేశామని చెప్పారు. కార్యక్రమంలో మత్స్యకార సంఘ నాయకులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. -
బాణసంచా దుకాణాలకు అనుమతులు తప్పనిసరి
కారంచేడు: దీపావళి సమీపిస్తున్న తరుణంలో చీరాల సబ్ డివిజన్ పరిధిలో ఉన్న బాణసంచా గోదాముల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలని, దుకాణాలకు అనుమతులు తీసుకోవాలని చీరాల డీఎస్పీ మహ్మద్ మొయిన్, చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్నాయుడు స్పష్టం చేశారు. గురువారం మండలంలోని స్వర్ణ, కారంచేడుతోపాటు చీరాల, వేటపాలెం మండలాల్లో కూడా బాణసంచా గోదాములను వారు తనిఖీ చేశారు. నిబంధనల మేరకు నిల్వ చేయాలన్నారు. తగిన జాగ్రత్తలను పాటించాలని పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి హాని జరగని విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ధరల విషయంలో పట్టికలు వినియోగదారులకు అందుబాటులో ఉంచాలన్నారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు నష్టం కలిగించని విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కారంచేడు తహసీల్దారు జి.నాగరాజు, చీరాల ఫైర్ ఆఫీసర్ రామకృష్ణ, కారంచేడు ఎస్ఐ షేక్ ఖాదర్బాషా, మండల రెవెన్యూ, పోలీస్ సిబ్బంది, గోదాముల నిర్వాహకులు పాల్గొన్నారు. -
19న ‘మట్టి రంగు’ పుస్తకావిష్కరణ
బాపట్ల: ప్రముఖ కవయిత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కార గ్రహీత డా. చిల్లర భవానీదేవి రచించిన ‘మట్టి రంగు’ కవితా సంపుటి పుస్తకావిష్కరణ మహోత్సవం ఈ నెల 19వ తేదీ సాయంత్రం 6 గంటలకు స్థానిక హోటల్ గౌతం వేదిక హాలులో జరగనుంది. ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం ఉంటుందని బాపట్ల జిల్లా రచయితల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు తిమ్మన శ్యామ్ సుందర్ తెలిపారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పాపినేని శివశంకర్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారని పేర్కొన్నారు. రచయిత్రి డా. వెలువోలు నాగరాజ్యలక్ష్మి సభాధ్యక్షత వహించనున్నారని, సాహితీ విమర్శకులు డా. బీరం సుందరరావు పుస్తక పరిచయాన్ని చేస్తారని, ఆత్మీయ అతిథిగా ఫోరం ఫర్ బెటర్ కార్యదర్శి డా. పి.సి. సాయిబాబు పాల్గొననున్నట్లు ఆయన వివరించారు. ఈ సందర్భంగా కోటంరాజు సత్యనారాయణ శర్మ దంపతుల స్మారక సాహితి పురస్కారాన్ని డా. అప్పాజోస్యుల సత్యనారాయణకు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ‘కపాస్ కిసాన్’యాప్తో పలు ఉపయోగాలు కొరిటెపాడు(గుంటూరు): ‘కపాస్ కిసాన్’ యాప్తో పత్తి రైతులకు పలు ఉపయోగాలున్నాయని, వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) జనరల్ మేనేజర్ రాజేంద్ర షా గురువారం ఒక ప్రకటనలో సూచించారు. 2025–26 పంట కాలంలో సీసీఐ మద్దతు ధర(ఎంఎస్పీ)తో పత్తి విక్రయాలకు ‘కపాస్ కిసాన్’ మొబైల్ యాప్లో నమోదుకావాలని ఆయన తెలిపారు. యాప్ను గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ ఐఓఎస్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని, మొబైల్ ఫోన్ నంబరుకు వచ్చే ఓటీపీ ద్వారా లాగిన్ కావాలని ఆయన సూచించారు. మద్దతు ధరకు విక్రయానికి యాప్లో స్లాట్ బుక్ చేసుకోవాలని తెలిపారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పత్తి రైతుల ప్రయోజనాల కోసం, కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) పథకం కింద ప్రయోజనాలను పొందడానికి తప్పనిసరిగా యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన తెలియజేశారు. రైలులో గంజాయి పట్టివేత తెనాలి రూరల్: రైలులో తరలిస్తున్న గంజాయిని తెనాలి జీఆర్పీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాటా నగర్ నుంచి ఎర్నాకులం వెళ్లే రైలులో గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో జీఆర్పీ ఎస్ఐ జి. వెంకటాద్రిబాబు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. రైలు గురువారం తెనాలి చేరుకోగానే బోగీల్లో తనిఖీలు చేపట్టారు. ఎస్–3 బోగీలోని ఓ బ్యాగులో 4.4 కిలోల గంజాయిని గుర్తించి సీజ్ చేశారు. వెంటనే తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణకు సమాచారమందించి, ఆయన సమక్షంలో సీజ్ చేశారు. గంజాయి తరలిస్తున్న వ్యక్తి పరారయ్యాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పత్తిలో పూత రాలడాన్ని నివారించాలి
కేంద్రీయ సస్య రక్షణ కేంద్రం ప్లాంట్ ప్రొటెక్షన్ అధికారి కె. వీరయ్య చౌదరి ప్రత్తిపాడు: పత్తిలో పూత రాలడాన్ని నివారించే దిశగా రైతులు చర్యలు తీసుకోవాలని కేంద్రీయ సస్య రక్షణ కేంద్రం ప్లాంట్ ప్రొటెక్షన్ అధికారి కె. వీరయ్య చౌదరి సూచించారు. మండల పరిధిలోని పెదగొట్టిపాడులో గురువారం ఓ పత్తి పొలంలో పొలంబడి నిర్వహించారు. స్థానిక మండల వ్యవసాయాధికారి షేక్ సుగుణా బేగంతో కలిసి వీరయ్య చౌదరి పత్తి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధిక తేమ కారణంగా పత్తిలో పూత రాలడంతో పాటు పలు తెగుళ్లు, పురుగులను గమనించారు. నివారణకు తీసుకోవలసిన చర్యలను రైతులకు వివరించారు. పూత రాలడాన్ని నివారించేందుకు ఎకరానికి కేజీ 19–19–19 లేదా 13–0–45 పిచికారీ చేయాలని సూచించారు. పంటలో అక్కడక్కడా పచ్చ దోమ కూడా ఉందని, నివారణకు ఫిప్రోనిల్ 2 ఎం.ఎల్. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.4 ఎం.ఎల్. లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని తెలిపారు. అల్లిక రెక్కల పురుగు వంటి మిత్ర పురుగులను కూడా అధికంగా గమనించామని, ప్రస్తుత పరిస్థితుల్లో పురుగు మందులను ఎక్కువగా వాడనవసరం లేదని సూచించారు. అధిక వర్షాలకు సోకుతున్న ఆకుమచ్చ తెగులు నివారణకు ఒక గ్రాము స్టెప్టోసైక్లిన్, కాపర్ ఆక్సి క్లోరైడ్ 30 గ్రాములు పది లీటర్ల నీటికి కలిపి రెండు లేదా మూడుసార్లు పిచికారీ చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో వీహెచ్ఏ షణ్ముఖ్, రైతులు పాల్గొన్నారు. -
శునకాల దాడిలో 15 గొర్రెలు మృతి
బల్లికురవ: మండంలోని కొప్పరపాడులో కుక్కల దాడిలో 15 గొర్రెలు మృతి చెందాయి. బుధవారం అర్ధరాత్రి గ్రామంలోని బీసీ కాలనీలోని షేక్వలి గొర్రెల దొడ్డిలోకి ప్రవేశించిన శునకాలు వాటిపై దాడి చేసి చంపేశాయి. సుమారు వంద గొర్రెలను మేపుతూ వలి జీవనాన్ని వెళ్లదీస్తున్నాడు. కుక్కల దాడితో 15 చనిపోగా, గాయపడిన వాటిని స్థానిక పశు వైద్యశాలకు తీసుకెళ్లి వైద్యం చేయిస్తున్నారు. కుక్కకాటుకు గురవడంతో బతకడం కష్టమేనని వివరించారు. ప్రభుత్వపరంగా ఆదుకోవటంతోపాటు గ్రామంలో కుక్కలకు అడ్డుకట్ట వేయాలన్నారు. స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు బుర్రి ఆదినారాయణ, మూడావత్ దానానాయక్లు చనిపోయిన గొర్రెలను పరిశీలించారు. కుక్కలు ఏడాదిగా పలువుర్ని కరిచాయని ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదన్నారు. తాను రూ.2 లక్షల వరకు నష్టపోయానని వలి తెలిపారు. -
జిల్లా స్థాయి పోటీలకు గురుకుల విద్యార్థులు
వేటపాలెం: స్థానిక మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయి ఆటల పోటీలకు ఎంపికై నట్లు హెచ్ఎ ఎం.నహిద గురువారం తెలిపారు. ఇంకొల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల్లో నిర్వహించిన డివిజన్ స్థాయి ఆటల పోటీల్లో ఆ విద్యార్థులు ప్రతిభ చాటారన్నారు. అండర్– 17 విభాగంలో 100 మీటర్లు, 400 మీటర్లు పరుగు పందెంలో కాటం రాజు, 200 మీటర్లలో కిషోర్, కబడ్డీలో కాటంరాజు, చెస్లో గోపీకృష్ణ, వాలీబాల్లో కిషోర్, 3 కి.మీ., 5 కి.మీ. పరుగు పందెంలో గహత్, శ్రీను ప్రతిభ చాటారన్నారు. అండర్ 14 విభాగంలో 200 మీటర్లు, 400 మీటర్లు, వాలీబాల్లో వినయ్కుమార్, 400 మీటర్లలో సతీష్కుమార్, చెస్లో దేవరాజు, ఖోఖోలో చందు ప్రతిభ చూపారని పేర్కొన్నారు. జిల్లా స్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు తెలిపారు. విద్యార్థులను పీఈటీ కె. మమత, ఉపాధ్యాయులు అభినందించారు. -
కోనేరులోకి దూకి మహిళ ఆత్మహత్య
మంగళగిరి టౌన్: స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చెందిన పెద కోనేరులోకి దూకి ఓ మహిళ ఆత్మహత్యచేసుకున్న ఘటన మంగళగిరి నగరంలో గురువారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు... మంగళగిరి నగర పరిధిలోని గండాలయ్యపేటకు చెందిన చలంచలం కామాక్షి (29) తల్లి ధనలక్ష్మితో కలసి జీవిస్తోంది. కొన్నేళ్ల కిందట అనారోగ్యంతో భర్తతో పాటు పిల్లలు కూడా చనిపోయారు. పలు ఆలయాల వద్ద భిక్షాటన చేసుకుంటూ తల్లీకూతుళ్లు జీవనం సాగిస్తున్నారు. కామాక్షి కొంతకాలంగా విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతోందని, మానసిక ఆరోగ్య పరిస్థితి కూడా సరిగా లేదని తల్లి ధనలక్ష్మి పేర్కొంది. గురువారం మధ్యాహ్నం కోనేరు వద్దకు వెళ్లి ప్రహరీ ఎక్కి కోనేటిలోకి దూకేసింది. సమీపంలో కొందరు చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మంగళగిరి పట్టణ పోలీసులు సమీపంలోని సీసీ కెమెరా పుటేజ్ను పరిశీలించారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి కామాక్షి మృతదేహాన్ని వెలికి తీశారు. సంఘటనపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంగళగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా కోనేరు చుట్టూ ఫెన్సింగ్ ఉంటే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయని స్థానికులు తెలిపారు. కోనేరుకు మూడు పక్కలా ఫెన్సింగ్ ఉందని, దక్షిణం వైపు మాత్రం లేకపోవడం వల్లే ఈ ఘటనకు కారణమని వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దక్షిణం వైపు కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. -
వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
● వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి గాదె మధుసూదన రెడ్డి ● ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమం ప్రారంభం ఇంకొల్లు(చినగంజాం): ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కచ్చితంగా అడ్డుకుంటామని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ సమన్వయకర్త గాదె మధుసూదన రెడ్డి అన్నారు. ప్రభుత్వ వైద్యకళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం పోస్టరును ఆయన ఇంకొల్లు మండలం పావులూరు గ్రామంలోని తన నివాసంలో గురువారం ఆవిష్కరించారు. అనంతరం తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలని, పేద విద్యార్థులకు ఉచిత వైద్యవిద్య అవకాశాలు కల్పించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను చేపట్టిన విషయం గుర్తుచేశారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక కాలేజీలను ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తోందన్నారు. వైఎస్ జగన్మోహన రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలని కోరారు. కార్యక్రమంలో ఇంకొల్లు మండల కన్వీనర్ చిన్ని పూర్ణారావు, యద్దనపూడి మండల కన్వీనర్ రావూరి వేణుబాబు, పర్చూరు మండల కన్వీనర్ కఠారి అప్పారావు, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి బిల్లాలి డేవిడ్, నియోజక వర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు నూతలపాటి బలరాం, కొల్లా వెంకట సుబ్బారావు చౌదరి, నియోజక వర్గ వాణిజ్య విభాగం అధ్యక్షుడు మువ్వల రాంబాబు, బూరగ రాము, పల్లెపోగు ప్రసాద్, పులగం చందు, గోపతోటి బాబురావు, వెన్ను సురేష్, కరి వాసు, గూంటూరు శ్రీను, చిగురుపాటి శ్రీను, నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు కాటి లక్ష్మణ్, నక్కా పోతిరెడ్డి, దొడ్డా రవి, దాసరి వెంకటరావు, సవరపు వందనం, వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
రైస్ మిల్లుల్లో ధాన్యం నిల్వకు చర్యలు
భూసేకరణ పనులలో వేగం పెంచండి బాపట్ల: గుండ్లకమ్మ ప్రాజెక్ట్ భూసేకరణ పనులో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. ప్రాజెక్టుపై సంబంధితశాఖల అధికారులతో గురువారం కలెక్టరేట్ నుంచి ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. ప్రాజెక్ట్ కింద 50 ఎకరాల భూసేకరణ చేయకపోవడంతోనే జిల్లాలో 13,876 ఎకరాలకు సాగునీరు రావడం లేదని కలెక్టర్ చెప్పారు. ఇంకొల్లు మండలం దుద్దుకూరు గ్రామంలో 50 ఎకరాల భూసేకరణ పనులు నిలిచిపోవడంపై ఆరా తీశారు. తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ 14 గేట్లు మరమ్మతులు పూర్తి కాగా, మిగతా పనులు జరుగుతున్నాయన్నారు. వాటిని త్వరగా పూర్తి చేయాలన్నారు. తాజాగా జిల్లాలో 2,600 ఎకరాల ఆయకట్టు పరిధిలోకి తీసుకురావడానికి గజిట్ విడుదల చేయాల్సి ఉందన్నారు. మరో 78 ఎకరాలు ఆయకట్టులోకి తెచ్చేందుకు అధికారులు పరిశీలన చేయాల్సి ఉందన్నారు. ఈ ప్రక్రియ వారంలో పూర్తి చేయాలన్నారు. కొరిశపాడు, అద్దంకి మండలాలలోని మూడు గ్రామాలలో 1,100 కుటుంబాలకు పునరావాసం కింద ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలన్నారు. ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని ఆర్డీవో, తహసీఅల్దారులకు సూచించారు. ప్రాజెక్టు ఎస్ఈ అబూతలీమ్, ఆర్డీవో చంద్రశేఖర్, ఉప కలెక్టర్లు, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు. విజయవంతం చేయాలి బాపట్ల: పరిశ్రమల భాగస్వాముల ప్రేరణ కార్యక్రమాలు జిల్లాలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. సదస్సును పురస్కరించుకొని రూపొందించిన గోడ పత్రాలను గురువారం కలెక్టరేట్లో ఆయన విడుదల చేశారు. పెట్టుబడిదారుల భాగస్వాముల సదస్సు నవంబర్ 14, 15వ తేదీలలో విశాఖపట్నంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని కలెక్టర్ చెప్పారు. అందరూ భాగస్వాములు కావాలని కోరారు. బాపట్ల: ఐదేళ్ల లోపు చిన్నారులకు ఆధార్ తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. ఆధార్ కార్డుల నమోదు, నవీకరణ ప్రక్రియపై సంబంధిత అధికారులతో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలలో తక్షణమే ఈ ప్రక్రియ చేపట్టాలని చెప్పారు. ఈ నెల 23వ తేదీ నుంచి అన్ని పాఠశాలల్లో ఆధార్ నవీకరణ ప్రారంభిస్తామని తెలిపారు. జిల్లాలో 110 ఆధార్ నమోదు కేంద్రాలు ఉండగా, ప్రస్తుతం 80 మాత్రమే పని చేయడంపై ఆరా తీశారు. సచివాలయాలలో బదిలీల ప్రక్రియ నేపథ్యంలో ఏర్పడిన సాంకేతిక సమస్యలే కారణమని ఆధార్ కార్డుల రీజినల్ మేనేజర్ ప్రసాద్ తెలిపారు. డీఆర్వో జి.గంగాధర్ గౌడ్, డీఈవో పురుషోత్తం, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్. విజయమ్మ, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ పి.డి. రాధా మాధవి, డీపీఓ ప్రభాకర్ రావు, ఆధార్ జిల్లా కోఆర్డినేటర్ అశోక్ బాబు, కామన్ సర్వీస్ సెంటర్ మేనేజర్ వందనం తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ -
బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు అరెస్ట్
చీరాల: ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో నిందితుడు పిట్ల సూరిబాబును బుధవారం అరెస్ట్ చేరు. ఈపూరుపాలెం పోలీస్స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ ఎండీ మొయిన్ వివరాలు వెల్లడించారు. వేటపాలెం మండలం అక్కాయపాలెం పంచాయతీలోని చీరాల ఇంజినీరింగ్ కాలేజీ వెనుక ఉన్న జంగిలి కోటేశ్వరరావు కాలనీకి చెందిన పిట్ల సూరిబాబు అనే వ్యక్తి మద్యానికి బానిసై కాలనీలోని ఆడపిల్లలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తుండే వాడు. ఈ విషయంలో పలుమార్లు కాలనీవాసులు మందలించారు. ఈనెల 10వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో అదే ప్రాంతానికి చెందిన ఏడు సంవత్సరాల బాలికను తినుబండారాలు కొనిస్తానని మాయమాటలు చెప్పి ఆ కాలనీలోని పాడుబడిన ఇంటిలోనికి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. అది గమనించిన తోటి బాలిక వారి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో స్థానికులు వచ్చి సూరిబాబుకు దేహశుద్ధి చేయడంతో అక్కడ నుంచి తప్పించుకొని పారిపోయాడు. ఈ మేరకు బాలిక తల్లి ఈపురుపాలెం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడు కటారివారిపాలెంలోని జీడితోటలో ఉండగా.. అందిన సమాచారం మేరకు బుధవారం మధ్యాహ్నం మధ్యవర్తుల సమక్షంలో జీడితోటల్లో నక్కి ఉన్న నిందితుడిని అరెస్ట్ చేశారు. రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరచనున్నారు. సమావేశంలో రూరల్ సీఐ ఎం.శేషగిరిరావు, రూరల్ ఎస్ఐ ఎ.చంద్రశేఖర్, సిబ్బంది ఉన్నారు. -
లలిత సంగీత సరస్వతి
తెనాలి: బాలసరస్వతి స్వస్థలం ఉమ్మడి తెనాలి డివిజనులోని బాపట్ల. 1928 ఆగస్టు 28న జన్మించారు. తల్లిదండ్రులు విశాలాక్షి, పార్థసారథిరావు. లలిత కళలపై అభిమానం కలిగిన తండ్రి సితార, వీణ వాయించేవారు. గుంటూరులో రత్నా థియేటర్ పేరుతో సినిమాహాలు నిర్మించారు. థియేటరులో ప్రదర్శించే ఏదైనా సినిమాలో సంగీతానికి తగినంత ప్రాధాన్యం లేదని అనిపిస్తే, వెంటనే ఆ సినిమా ప్రదర్శన నిలిపివేసి, అందుబాటులో ఉన్న నాటక సమాజాన్ని పిలిపించి, పద్యనాటకం వేయించారు. అంతటి సంగీతాభిమాని ఆయన. కాలక్రమంలో వ్యాపారం దెబ్బతిని, థియేటర్ మూతపడింది. వారసత్వంగా ... తండ్రి వారసత్వం అన్నట్టుగా బాలసరస్వతికి సంగీతంపై ఆసక్తి ఏర్పడింది. అక్క, అన్నయ్య చక్కగా చదువుకుంటున్నా తండ్రితోపాటు నాటకాలు చూడటం, వాటిలోని పాటలు గానం చేయటం అలవాటైంది. అప్పట్లో గుంటూరులో హెచ్ఎంవీ (హిజ్ మాస్టర్స్ వాయిస్) గ్రామఫోను కంపెనీ ఆఫీసుండేది. పార్థసారిథిరావుకు పరిచయస్తులు. ఓసారి బాలసరస్వతిని పిలిపించి, ట్రైనింగ్లా పాడమన్నారు. బాగుండటంతో బెంగళూరులో రికార్డు చేశారు. ఆ విధంగా 1934లో ఆరేళ్ల వయసులో సోలో రికార్డు పాడిన ఘనతను బాలసరస్వతి దక్కించుకున్నారు. మైకు అందేంత ఎత్తు లేకపోవటతో సినీనటుడు సత్యం సోదరుడు కామేశ్వరరావు ఎత్తుకోగా, ఆమె ఆ పాట పాడారు. శ్రోతలను ఆకట్టుకునేలా.. అంతకుముందు 1941లో రేణుకావారి ‘భాగ్యలక్ష్మి’ సినిమాలో బీఎన్ఆర్ సంగీత దర్శకత్వంలో పాడిన ‘తిన్నెమీద చిన్నోడా’ పాట బాలసరస్వతి తొలి ప్లేబాక్ పాట. సుతిమెత్తగా, చక్కని భావప్రకటనతో, ప్రత్యేకమైన పాడే విధానంతో శ్రోతలను ఆకట్టుకుని మనసు లోతుల్లోకి ప్రవహించే అమృతధారగా పాటను మార్చుకున్న ప్రతిభాశాలి బాలసరస్వతి. ‘స్వప్నసుందరి’లో కథానాయిక కోసం పాడినా, ‘దేవదాసు’లో ద్వితీయ నాయికకు గానం చేసినా ఆమె తనకు తానే సాటిగా నిలిచారు. సినిమాలకు పాడుతూనే ఎస్.రాజేశ్వరరావు, బాలసరస్వతి కలిసి‘ లలిత సంగీతం’ పేరిట, తెలుగు సంగీత ప్రపంచంలో కొత్త విభాగాన్ని ఆవిష్కరించారు. ఆకాశవాణిలో వీరిద్దరూ పాడే లలిత గీతాలు లక్షల సంఖ్యలో అభిమానులను సంపాదించారు. 1946లో సింహళ చిత్రం ‘లైలా మజ్నూ’కు సంగీతం సమకూర్చారు. తాను సోలోగా పాడిన ప్రైవేటు గీతాలకు స్వయంగా సంగీతబద్దం చేసుకుంటూ వచ్చారు. 1974లో భర్త మరణం, దివాణాలు, వైభవాలు అంతరించటంతో చైన్నె, తర్వాత మైసూరు, బెంగళూరులో ఉంటూ 1995లో హైదరాబాద్లో స్థిరపడ్డారు. భూముల నష్టపరిహారమూ అందలేదు. మైసూరు నుంచి హైదరాబాద్ వస్తే సాంస్కృతిక శాఖలో ఉద్యోగం ఇస్తామన్న ఎన్టీ రామారావు ఆహ్వానంపై ఇక్కడికి వచ్చేసరికి రాకీయాలు మారిపోయాయి. 2015లో గుంటూరులో బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ బాలసరస్వతిని విశిష్ట సేవా పురస్కారంతో సత్కరించి రూ.లక్ష, రజత జ్ఞాపికను బహూకరించారు. ఈ సందర్భంగా ‘నిండుపున్నమి పండువెన్నెల’ పేరుతో అభినందన సంచికను విడుదల చేశారు. తొలి అడుగులు గుంటూరులోనే.. బాలగాయనిగా ఇక్కడి నుంచే సినీప్రస్థానం గతంలో విశిష్ట సేవా పురస్కారంతో సత్కారం ఆ సమయంలో అక్కడే ఉన్న సుప్రసిద్ధ దర్శకుడు సి.పుల్లయ్య, తన ‘సతీఅనసూయ–భక్త ధృవ’ సినిమాలో బాలనటిగా తీసుకున్నారు. అందులో గంగ పాత్రలో నటిస్తూ బాలసరస్వతి పాడిన పాట ‘ఏదీ దారి నాకిచట’ ఆ రోజుల్లో పెద్ద హిట్. కోల్కతాలో ఈ షూటింగ్ జరుగుతుండగా, అక్కడే చిత్రీకరిస్తున్న తమిళ చిత్రం ‘భక్తకుచేల’లో రెండు పాత్రలు ఇచ్చారు. మొదటి భాగంలో చిన్న కృష్ణుడు, రెండో భాగంలో కుచేలుని కూతురు పాత్రలో పోషించారు. అందులో పాటలు కూడా తానే పాడారు. తర్వాత ‘బాలయోగిని’ తమిళ సినిమాలో టైటిల్ రోల్ తనదే. అప్పటివరకు సరస్వతిగా ఉన్న ఆమె పేరుకు ముందు ‘బాల’ అని అప్పుడే కలిపారు. తన సినిమాల్లోని పాటలు, బయట కచేరీల్లో పాడుతూ బహుమతులను అందుకుంటూ వచ్చారు. బాలయోగిని సినిమా తర్వాత చైన్నెలో సెటిలయ్యారు. బాలనటిగా ‘తుకారం’ (1937), ‘మహానంద’, ‘తిరునీలంకర్’ (1939) సినిమాల్లో నటించాక, 1940లో ఇందిరా వారి ‘ఇల్లాలు’ సినిమాలో సంగీత దర్శకుడు ఎస్.రాజేశ్వరరావుతో కలిసి నటించారు. వరుసగా సినిమాల్లో నటిస్తుండగానే 1944లో తూర్పుగోదావరి జిల్లా కోలంక జమీందారు రావు ప్రద్యుమ్న కృష్ణ మహీపతి సూర్యారావుతో వివాహమైంది. దీనితో నటనకు స్వస్తిపలికి, పాటలకే పరిమితమయ్యారు. -
ప్రతిభ పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానం
బాపట్ల: కాపు సేవా సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు అందించనున్న ప్రతిభ పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవాలని సంఘం జిల్లా అధ్యక్షులు ఇక్కుర్తి శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక అన్నం సతీష్ప్రభాకర్ కాపు కళ్యాణ మండపంలో కరపత్రాలను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది నిర్వహించే కార్తిక వన సమారాధన సమయంలో అందజేస్తున్న విధంగా నే నవంబరు 16వ తేదీన పురస్కారాలు అందజేయనున్నట్లు చెప్పారు. బాపట్ల నియోజకవర్గానికి సంబంధించిన విద్యార్థులు, ఇంటర్ మొదటి సంవత్సరం నుంచి పై చదువులు చదువుతున్న 60 శాతం మార్కులు మించిన వారు ఈనెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుతో పాటు సంబంధిత సర్టిఫికెట్స్, జత చేసి అన్నం సతీష్ ప్రభాకర్ కాపు కళ్యాణ మండపంలో అందజేయాలని సూచించారు. వివరాలకు కె.శ్రీనివాసరావు 9346569982ను సంప్రదించాలని కోరారు. -
ఆర్మీ జవానుకు అంతీమ వీడ్కోలు
బాపట్ల: ఆర్మీ జవాను ఆసోది గోపిరెడ్డి అంత్యక్రియలు బాపట్ల మండలం ఆసోదివారిపాలెంలో సైనిక లాంఛనాలతో బుధవారం నిర్వహించారు. మాజీ సైనిక ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు తెలిపిన వివరాలు... ప్రకారం ఆసోదివారిపాలేనికి చెందిన సర్వింగ్ సోల్జర్ ఆసోది గోపిరెడ్డి సెలవుపై స్వగ్రామానికి వచ్చాడు. గత నెల 29 బాపట్ల ఇంజినీరింగ్ కాలేజీ వెనుక వైపు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదంలో గాయాలపాలైన గోపిరెడ్డి హైదరాబాద్లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడని తెలిపారు. ఆర్మీ జవాను స్వగ్రామంలో జరిగిన అంతిమ యాత్రలో ఉమ్మడి గుంటూరు జిల్లా సైనిక సంక్షేమ విభాగం అధికారులు, మాజీ సైనికులు పాల్గొన్నారు. గోపిరెడ్డికి భార్య వెంకటలక్ష్మి, కుమార్తె వినన్య, కుమారుడు దేవాన్న్ష్ నందన రెడ్డి ఉన్నారు. -
స్వదేశీ దర్శన్తో సూర్యలంక బీచ్కు మహర్దశ
ఆక్వా పార్క్, ఓడరేవు పనులు పరిశీలన బాపట్ల: స్వదేశీ దర్శన్– 2.0 కింద సూర్యలంక బీచ్ అభివృద్ధి పనులు గురువారం నుంచి ప్రారంభించాలని కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ ఆదేశించారు. అభివృద్ధి పనులపై అనుబంధ శాఖల అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సూర్యలంక బీచ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.97.52 కోట్లు నిధులు విడుదల చేసిందని తెలిపారు. అందులో భాగంగా 3.5 ఎకరాల విస్తీర్ణంలో పర్యాటకుల సౌకర్యార్థం మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. మరో రెండు ఎకరాల విస్తీర్ణంలో శాశ్వత దుకాణాల నిర్మాణం, వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. 1.5 కిలోమీటర్ల దూరం వరకు బోట్ల ద్వారా కెనాల్లో పర్యటించేందుకు అభివృద్ధి చేయాలని చెప్పారు. పరిసరాలు సుందరీకరణలో భాగంగా బీచ్ వద్ద మంచి మొక్కలు నాటాలని, పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగించేలా నిర్మాణాలు చేయాలని కోరారు. బీచ్ అభివృద్ధి పనులు 2026 సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. రక్షిత తాగునీటి వనరులు లేని దృష్ట్యా తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకుంటామని వివరించారు. జాతీయ రహదారి పనులు... వాడరేవు– చిలకలూరిపేట జాతీయ రహదారి 167ఏ నిర్మాణాన్ని సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ కోరారు. 47 కిలోమీటర్ల పొడవునా నిర్మించే రహదారి బాపట్ల జిల్లాలోనే 35 కిలోమీటర్ల పొడవున వెళ్తుందని చెప్పారు. చీరాల వాడరేవు బీచ్ వద్ద జాతీయ రహదారి ముగుస్తున్నందున చిన్న పార్క్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లాలో వెళ్లే రహదారికి ఇరువైపులా 5,500 మొక్కలు నాటాలన్నారు. ఆక్వా పార్క్కూ ప్రాధాన్యం.. ఆక్వా పార్క్ 192.42 ఎకరాలలో అభివృద్ధి చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. సమీకృత ఆక్వా పార్క్ నిర్మాణం ద్వారా మత్స్యకారులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. జిల్లాకు రూ. 88.08 కోట్లు మంజూరయ్యాయన్నారు. జిల్లా అభివృద్ధిలోనూ ఆక్వా పార్క్ ప్రాధాన్యం సంతరించుకోనుందన్నారు. నిజాంపట్నం రేవు 60 శాతం నిర్మాణం పూర్తయిందని వివరించారు. సమావేశంలో పర్యాటక శాఖ అధికారి నాగిరెడ్డి, ఏజెన్సీ ప్రతినిధులు, ఎన్హెచ్ఏ అధికారులు, గుత్తేదారుడు దిగ్విజయ్ సింగ్, మత్స్య శాఖ జిల్లా అధికారి శ్రీనివాస్ నాయక్ పాల్గొన్నారు. అందుబాబులో 308 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాలో 308 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆర్ఎస్కేలు, పీఏ సీఎస్ల 412 మెట్రిక్ టన్నుల యూరియాను 4,786 మంది రైతులకు పంపిణీ చేసినట్లు చెప్పారు. బీచ్ వద్ద ప్రమాదాల నివారణకు ప్రత్యేక ప్రణాళిక బాపట్ల: బాపట్ల, చీరాల రామాపురం బీచ్లకు వచ్చే పర్యాటకులు ప్రమాదాలకు గురికాకుండా ప్రణాళికలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ వి.వినోద్ కుమార్ ఆదేశించారు. బుధవారం బాపట్ల, చీరాల రామాపురం బీచ్ల వద్ద పర్యాటకుల భద్రతపై వీడియో కాన్ఫరెన్స్ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బీచ్లో సముద్ర స్నానానికి వచ్చే పర్యాటకులకు ఆడియో, వీడియోల ద్వారా అవగాహన కల్పించాలని ఆయన చెప్పారు. వీడియో కాన్ఫరెన్న్స్లో జిల్లా టూరిజం అధికారి నాగిరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయమ్మ, జిల్లా అగ్నిమాపక అధికారి వినోద్ పాల్గొన్నారు. నిజాంపట్నం: మండలంలోని హార్బర్ని పరిశీలించి దిండి పంచాయతీ పరిశావారిపాలెంలో ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్, ఓడరేవు అభివృద్ధి పనులను కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ బుధవారం పరిశీలించారు. మండలంలో 192.42 ఎకరాలలో ఆక్వా పార్క్ అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. ఆక్వా పార్క్ అభివృద్ధికి టెండర్ ప్రక్రియ పూర్తయినప్పటికీ పనులు ప్రారంభించకపోవటంపై కారణాలు, అడ్డంకులపై మేరటైన్ బోర్డు అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిధులు మంజూరు దృష్ట్యా పనులను వెంటనే ప్రారంభించి ఏడాదిలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిజాంపట్నంలోని ఓడరేవు అభివృద్ధి పనులకు 2022లో అగ్రిమెంట్ తీసుకొని, ఇప్పటివరకు పనులు పూర్తి చేయకపోవడానికి కారణాలపై అధికారులను ఆరా తీశారు. ఓడరేవులో జెట్టి నిర్మాణ పనులు పూర్తి కాగా, బ్యాక్ వాటర్ పనులు ప్రారంభించి మూడు నెలలలో పూర్తి చేస్తామని అధికారులు ఆయనకు వివరించారు. ఆక్వా పార్కు, ఓడరేవు అభివృద్ధి పనులకు సంబంధించి అధికారులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మత్స్య శాఖ జేడీ శ్రీనివాస్ నాయక్, ఉప సంచాలకులు గాలి దేవుడు, రేపల్లె రెవెన్యూ డివిజన్ అధికారి రామలక్ష్మి, నిజాంపట్నం ఇన్ఛార్జ్ తహశీల్దార్ ఎం.శ్రీనివాసరావు, మేరటైన్ బోర్డు డీఈ సూర్యనారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ -
కూటమి కుట్రలు బహిర్గతం చేద్దాం
చీరాల: రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కూటమి కుట్రలను బహిర్గతం చేద్దామని వైఎస్సార్ సీపీ చీరాల సమన్వయకర్త కరణం వెంకటేష్ బాబు పిలుపునిచ్చారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు కోటి సంతకాల ప్రజా ఉద్యమం పోస్టర్ను బుధవారం ఆవిష్కరించారు. అనంతరం స్థానిక క్యాంపు కార్యాలయంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ హయాంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలను రాష్ట్రానికి తీసుకొస్తే, వాటిని కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతోందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఆధీనంలో కాకుండా ప్రైవేటుపరం అయితే ఫీజులు ఎక్కువగా ఉంటాయని, పేద, మధ్య తరగతి విద్యార్థులు వైద్య విద్యకు దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి కుట్రలను బహిర్గతం చేయడానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్యాచరణ రూపొందించారని వివరించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అనాలోచిత చర్యలను వ్యతిరేకిస్తూ ప్రజల నుంచి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేస్తున్నట్లు చెప్పారు. చీరాల నియోజకవర్గంలో 60 వేల మంది సంతకాలు సేకరించి వాటిని పార్టీ కేంద్ర కార్యాలయంలో అందించనున్నట్లు పేర్కొన్నారు. వాటిని పార్టీ తరఫున గవర్నర్కు పంపిస్తామని వెల్లడించారు. పాలనపై తీవ్ర అసంతృప్తి.. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో సాగుతున్న పాలనపై ప్రజల్లో కూడా తీవ్ర అసంతృప్తి ఉందని కరణం వెంకటేష్బాబు పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు మేలు జరిగేలా మెడికల్ కాలేజీలను తీసుకొస్తే వాటిని ప్రైవేటు పరం చేసి దండుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కార్యక్రమాన్ని వార్డుల్లో, గ్రామాల్లో నిర్వహించేందుకు గ్రామాలు, మండలాల వారీగా కమిటీలు వేస్తామని చెప్పారు. కార్యకర్తలు, నాయకులు తరలివచ్చి కోటి సంతకాలు పూర్తి చేయాలని కోరారు. తాను నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని, ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని భరోసా కల్పించారు. రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతోందని, నకిలీ మద్యం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు యాతం మేరిబాబు, దేవాంగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీరక సురేంద్ర, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బొనిగల జైసన్బాబు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు గవిని శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వాసిమళ్ల వాసు, లీగల్ సెల్ అధ్యక్షుడు రాజు వెంకటేశ్వరరెడ్డి, మహిళా విభాగం నియోజకవర్గ అధ్యక్షురాలు సీతామహాలక్ష్మి, వేటపాలెం మండల అధ్యక్షుడు సాధు రాఘవ, మాజీ అధ్యక్షుడు బొడ్డు సుబ్బారావు, రమణారెడ్డి, కౌన్సిలర్లు కీర్తి వెంకట్రావు, కంపా అరుణ్, చీమకుర్తి బాలకృష్ణ, మైనార్టీ సెల్ నాయకులు షేక్ కబీర్, విద్యార్థి విభాగం జిల్లా నాయకులు గోసాల అశోక్, పి.శ్రీనివాసరెడ్డి, రాజ్కుమార్, సాంబిరెడ్డి, బిట్రా శ్రీనివాసరావు, డి.వెంకటసుబ్బారావు, ఎ.కొండలు, ఖాదర్ పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ ఆర్మీ జవాన్ మృతి
బాపట్ల టౌన్: చికిత్స పొందుతూ ఆర్మీ జవాన్ మృతి చెందాడు. వివరాలు.. మండలంలోని అసోదివారిపాలెం గ్రామానికి చెందిన సర్వింగ్ సోల్జర్ అసోది గోపిరెడ్డి(35) సెప్టెంబర్లో సెలవుపై స్వగ్రామానికి వచ్చారు. సెప్టెంబర్ 29న చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో గాయాలపాలయ్యారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రుడిని సికింద్రాబాద్ మిలటరీ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. మృతదేహాన్ని బుధవారం స్వగ్రామానికి పంపించనున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపినట్లు రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు తెలిపారు. బుధవారం గోపిరెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. -
జనార్దనరావు వీడియో వెనుక ప్రభుత్వ పెద్దలు
ఒంగోలు సిటీ: కుటీర పరిశ్రమలా నకిలీ మద్యం తయారు చేస్తూ, ఆధారాలతో సహా బయటపడినప్పటి నుంచి దాన్ని ఎలాగైనా వైఎస్సార్ సీపీకి అంటించేందుకు టీడీపీ పెద్దలు చేస్తున్న కుట్రలు పరాకాష్టకు చేరాయని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వరికూటి అశోక్బాబు ఆరోపించారు. నగరంలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిలీ మద్యం కేసులో వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్కు ప్రమేయం ఉందంటూ ఆ కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావు ఆరోపణ చేయడం విడ్డూరంగా ఉందని చెప్పారు. దానిపై ఎల్లో మీడియా రెచ్చిపోతూ, నిన్న సాయంత్రం నుంచే ట్రోల్స్ చేస్తోందన్నారు. కేవలం వైఎస్సార్ సీపీపైనా, ఆ పార్టీ నాయకులపైనా కక్ష సాధింపులకు పాల్పడడం, కేసు నుంచి బయట పడేందుకు డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా సీఎం నారా చంద్రబాబు చేసిన కుట్ర అని దుయ్యబట్టారు. ‘అసలు జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న అద్దేపల్లి జనార్దనరావు వీడియో ఎలా రికార్డ్ చేశాడు? పైగా తన ఫోన్ పోయిందని చెప్పినట్లు ఎల్లో మీడియాలోనే వచ్చింది. అలాగే ఏ కేసులో నిందితుడైనా, విచారణ అధికారుల ముందు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు నిలబడి, చేతులు కట్టుకుని వినమ్రతతో మాట్లాడతారు. కానీ నిన్న జనార్దనరావు లీక్ చేసిన వీడియోలో ఆయన చక్కగా చైర్లో కూర్చుని ఉన్నాడు. పక్క నుంచి ఆఫీసర్ ఎవరో ప్రామ్ట్ చేస్తునట్లుగా ఉంది. పైగా తను ఆఫ్రికా నుంచి వచ్చినప్పటి డ్రెస్తోనే ఉన్నాడు. మరి ఆ వీడియో ఎప్పుడు, ఎవరు, ఎవరి ఫోన్లో రికార్డు చేశారు? ఇదంతా చూస్తుంటే, ఒక పథకం ప్రకారం చేసిన కుట్ర మాదిరిగా కనిపించడం లేదా’ అని వరికూటి సూటిగా ప్రశ్నించారు. అలాగే ఆ వీడియోను మీడియాకు ఎవరు విడుదల చేశారు? అన్నది తేలాలన్నారు. ఈ కేసులో వాస్తవాలను కప్పిపుచ్చుతూ కొత్త కట్టుకథ వినిపించేందుకే ఆ వీడియో విడుదల చేశారన్నది స్పష్టమవుతోందని పేర్కొన్నారు. పోలీసుల అదుపులో, జైలు అధికారుల రిమాండ్లో ఉన్న వ్యక్తి వీడియో లీకు కావడానికి బాధ్యత ఎవరిదని నిలదీశారు. జనార్దనరావు గత వారం ఆఫ్రికా నుంచి కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడని, నకిలీ మద్యం తయారీలో పార్టీ, ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేదని, తాము మాత్రమే ఆ పని చేశామని చెప్పుకొచ్చాయడన్నారు. ఆ రోజే మరి నిజంగా జోగి రమేష్ పేరు ఎందుకు ప్రస్తావించలేదని, రమేష్ చెబితేనే తాను నకిలీ మద్యం తయారుచేసిన విషయాన్ని ఆ వీడియోలోనే ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు సన్నిహితుడే.. కేసులో ఏ–1 నిందితుడైన జనార్దనరావు చంద్రబాబుకు సన్నిహితుడేనని, 2024 ఎన్నికల్లో తంబళ్లపల్లె టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జయచంద్రారెడ్డికి చంద్రబాబు టికెట్ ఇచ్చినప్పుడు జనార్దనరావు అక్కడే ఉన్నాడన్నారు. బీఫాం ఇచ్చేటప్పుడు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులే ఉంటారు. మరి జనార్ధనరావు ఆ సమయంలో చంద్రబాబు, జయచంద్రారెడ్డిలతో ఉండటం దేనికి సంకేతమన్నారు. ఇన్ని ఆధారాలు కనిపిస్తున్నా జనార్దనరావుకు జోగి రమేష్ సన్నిహితుడన్న ప్రభుత్వ వాదన పూర్తిగా కట్టు కథగా చెప్పారు. ఇప్పుడు జనార్దనరావు తన వీడియోలో గత ప్రభుత్వ హయాం నుంచి జోగి రమేష్ చెప్పడం వలనే నకిలీ మద్యం తయారు చేశానని చెబుతున్నారని, దానికి, దీనికి లింక్ కుదరడం లేదని పేర్కొన్నారు. బాబు మాటలే జనార్దనరావు వీడియో.. జనార్దనరావు వీడియో సోమవారం సాయంత్రం విడుదల కాగా, అందులోని విషయాలపై ఆదివారం రాత్రి మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు సూచన ప్రాయంగా వివరాలు ఎలా వెల్లడించారు! అంటే సమాచారం ఒక రోజు ముందుగానే ఆయనకు తెలుసా అని ప్రశ్నించారు. ఇవన్నీ చూస్తుంటే.. ఇదంతా ఒక పక్కా వ్యూహం ప్రకారం విపక్ష వైఎస్సార్ సీపీపై బురద చల్లుతూ, తాము ఈ కేసు నుంచి బయట పడేందుకు, ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వ పెద్దలు చేస్తున్న కుట్రన్నారు.. ఒక్క మాటలో చెప్పాలంటే.. పెదబాబు, చినబాబు చేసిన కుట్ర, కుతంత్రం ఇదంతా? అది నిజం కాదని చెప్పే ధైర్యం ఆ ఇద్దరికీ ఉందా? అని ప్రశ్నించారు. ములకలచెరువు నకిలీ మద్యం మాఫియాలో కీలక పాత్రధారిగా ఉన్న టీడీపీ నేత జయచంద్రారెడ్డిని విదేశాల నుంచి రప్పించేందుకు పోలీసులు ఎందుకు ప్రయత్నించడం లేదు? ఆయనపై ఎందుకు ఇంకా లుక్ అవుట్ నోటీసు జారీ చేయడం లేదని వరికూటి ప్రశ్నించారు. ఆయన రాష్ట్రానికి వస్తే తమ దందా బయటపడుతుందని ప్రభుత్వ పెద్దలు భయపడుతున్నారని నిలదీశారు. నకిలీ మద్యం బయటపడగానే ముఖ్యమంత్రి చంద్రబాబు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారన్నారు. అసలు ఆ నకిలీ అన్నది ఒక ప్రాంతానికే పరిమితం అన్నట్టు నమ్మించేందుకు యత్నించారన్నారు. మరి ఇప్పుడు ఎందుకు రాష్ట్రవ్యాప్తంగా మద్యం నాణ్యత తనిఖీకి ప్రత్యేక యాప్ ప్రవేశపెట్టారు? అంటే నకిలీ మద్యం రాష్ట్రమంతా విస్తరించిందని ఒప్పుకున్నట్లే కదా అని ప్రశ్నించారు. నిజంగా జోగి రమేష్ చెబితేనే జనార్దనరావు నకిలీ మద్యం తయారు చేస్తే.. తాను జయచంద్రారెడ్డికి చెందిన వాహనంలోనే ఆ మద్యాన్ని రవాణా చేశానని జయచంద్రారెడ్డి డ్రైవర్ చెప్పారు. మరి అక్కడ కూడా జోగి రమేష్ చెబితేనే ఆ రవాణా జరిగిందా? అని నిలదీశారు. వైఎస్సార్ సీపీ డిమాండ్ చేస్తున్నట్లు నకిలీ మద్యం కేసుపై సీబీఐ దర్యాప్తు ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలోని అన్ని వైన్షాప్లు, పర్మిట్రూమ్లు, బార్లు, బెల్టు షాప్ల్లో తనిఖీలు ఎందుకు చేయడం లేదు? ఏది అసలు మద్యం? ఏది నకిలీ అనేది గుర్తించే ప్రయత్నం ఎందుకు చేయడం లేదని నిలదీశారు. -
రైళ్లలో చోరీలకు పాల్పడిన వ్యక్తి అరెస్టు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): రైళ్లలో వరుస చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) అరెస్టు చేశారు. అతని వద్ద 64 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జీఆర్పీ ఇన్స్పెక్టర్ జె.వి.రమణ కథనం మేరకు.. సెప్టెంబర్ నెలలో రైళ్లలో బంగారు ఆభరణాలు కలిగిన లగేజీ బ్యాగుల చోరీలపై నమోదైన రెండు కేసులకు సంబంధించి జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ ఫతే అలీబేగ్, జీఆర్పీ ఇన్స్పెక్టర్ జె.వి.రమణలు తమ సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వేజెండ్ల గ్రామానికి చెందిన మూల్పూరి ఫణేంద్ర కుమార్ను నిందితుడిగా గుర్తించారు. గతంలో రైళ్లు, స్టేషన్లలో ఇతడు నేరాలు చేసి జైలుకు కూడా వెళ్లొచ్చాడు. నిందితుడు మంగళవారం విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్, శివాలయం వీధిలో ఉన్నట్లు సమాచారం అందటంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ.3.68 లక్షల విలువైన నగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్కు తరలించారు. -
రైళ్లపై రాళ్లు విసిరిన అల్లరిమూకలు అరెస్టు
చీరాల: వేగంగా వెళ్తున్న రైళ్లపై గులకరాళ్ల విసిరిన అల్లరి మూకలను మంగళవారం ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆర్పీఎఫ్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ చంద్రశేఖర్ వివరాలను వెల్లడించారు. ఈనెల 12వ తేదీన చీరాల ఆర్వోబీ సమీపంలో గూడ్స్ రైలు, విక్రమ్ సింహపురి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలుపై అల్లరిమూకలు రాళ్లు విసిరినట్లు చెప్పారు. రైలుపై రాళ్లు విసరడంతో కోచ్ అద్దాలు పగిలిపోయి ప్రయాణికులకు త్రుటిలో ప్రమాదం తప్పిందన్నారు. అయితే రైళ్లపై రాళ్లు విసిరే ముఠా కోసం ఆర్పీఎఫ్ ఏఎస్ఐ రమేష్బాబు, ఇద్దరు హెడ్కానిస్టేబుళ్లు బృందంగా ఏర్పడి గాలింపు చేపట్టారన్నారు. ఈ క్రమంలో మంగళవారం ఆర్వోబీ వద్ద రావూరి మణికంఠ, జగతా సాయి వంశీ, మానుపాటి శ్రీనుని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నారన్నారు. ముగ్గురు నిందితులపై రైల్వే యాక్ట్ సెక్షన్ 153 కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఎవరైనా ఆకతాయిలు గానీ, చదువుకునే విద్యార్థులు గానీ ఇటువంటి చర్యలకు పాల్పడితే వారిపై రైల్వే చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సమావేశంలో జీఆర్పీ ఎస్ఐ కొండయ్య, ఆర్పీఎఫ్ ఎస్ఐ మనోజ్కుమార్రెడ్డి పాల్గొన్నారు. -
ఈత పోటీలలో రైల్వే ఉద్యోగి ప్రతిభ
లక్ష్మీపురం: దక్షిణ మధ్య రైల్వేలోని గుంటూరు డివిజనులో లోకో పైలట్ (గూడ్స్) గంపల సాంబశివరావు ఈత పోటీలలో ప్రతిభ చాటారు. జాతీయ, రాష్ట్ర స్థాయి ఈత పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన ద్వారా సంస్థకు కీర్తి తెచ్చిపెట్టారని గుంటూరు డీఆర్ఎం సుథేష్ఠసేన్ అన్నారు. పట్టాభిపురంలోని డీఆర్ఎం కార్యాలయంలో మంగళవారం సాంబశివరావును ఘనంగా సత్కరించారు. డీఆర్ఎం మాట్లాడుతూ ఈ నెల 11, 12వ తేదీల్లో మంగళగిరిలో ఎస్.మహబూబ్ షంషేర్ ఖాన్ జాతీయ స్విమ్మింగ్ చాంపియన్షిప్ పోటీలలో సాంబశివరావు 2 బంగారు, వెండి, కాంస్య పతకాలను కై వసం చేసుకోవడం అభినందనీయం అన్నారు. ఈ నెల 8వ తేదీన గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన 8వ అంతర్ జిల్లాల మాస్టర్ స్విమ్మింగ్ పోటీలలో సైతం 4 బంగారు పతకాలను కై వసం చేసుకున్నారని తెలిపారు. ఏడీఆర్ఎం ఎం.రమేష్కుమార్, అధికారులు అభినందించారు. -
స్రైయిట్కట్ సీమౌత్ తీరంలో సర్వే
అమరేశ్వరుని హుండీ ఆదాయం అమరావతి:అమరావతిలోని శ్రీ బాల చాముండికా సమేత శ్రీ అమరేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం హుండీలలోని కానుకలను లెక్కించారు. కోటప్పకొండ త్రికోటేశ్వరస్వా మి దేవస్థానం కార్యనిర్వహణాధికారి దాసరి చంద్రశేఖరరావు సమక్షంలో 12 హుండీలను తెరచి లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. మూడు నెలల 7 రోజుల కాలానికి దేవాలయంలో ఉన్న హుండీల ఆదాయం మొత్తం రూ. 20,07,999. అన్నదాన మండపంలోని హూండీ ద్వారా రూ.48, 809 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి రేఖ తెలిపారు. 19న త్రిపురనేని రామస్వామి పురస్కార ప్రదానోత్సవం గుంటూరు ఎడ్యుకేషన్ : తెలుగు సమాజంలోని గొప్ప సామాజిక విప్లవకారుడు కవిరాజు త్రిపురనేని రామస్వామి పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఈనెల 19న సాయంత్రం బ్రాడీపేటలోని యూటీఎఫ్ హాలులో నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను మంగళవారం ఆవిష్కరించారు. 2025వ సంవత్సరానికి రామస్వామి చౌదరి పురస్కారాలను సుప్రసిద్ధ కవి, సాహితీ విమర్శకులు డాక్టర్ కోయి కోటేశ్వరరావు, రాజకీయ, సామాజిక ఉద్యమకారుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లుకు ఇస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో డాక్టర్ మూకిరి సుధ, వీసీకే పార్టీ మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు కై లా జయసుధ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ – జాషువా – పూలే – పెరియార్ లిటరేచర్ ఫౌండేషన్ అధ్యక్షుడు బి.విల్సన్ పాల్గొన్నారు. నేటి నుంచి కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగుల సమ్మె లక్ష్మీపురం(గుంటూరువెస్ట్): విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు, జేఎల్ఎం గ్రేడ్ –2ల సమస్యల పరిష్కారం కోసం గురువారం నుంచి తలపెట్టిన నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలని ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్ పోరాట కమిటీ జిల్లా చైర్మన్ దాసరి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. పాత గుంటూరులోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో మంగళవారం కమిటీ జనరల్బాడీ సమావేశం రామ్ప్రభాకర్, జి.నాగరాజుల అధ్యక్షతన జరిగింది. చైర్మన్ దాసరి వెంకటేశ్వరరావు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సీహెచ్ నాగబ్రహ్మచారి, జిల్లా గౌరవాధ్యక్షుడు బి.లక్ష్మణరావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి వై.నేతాజీ, జిల్లా నాయకులు సుబ్బారెడ్డి మాట్లాడారు. సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె బాట పడతామని, దీనికి పూర్తిగా యాజమాన్యం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. నాయకులు జానీ, పవన్, రాంబాబు, వంశీ, అందే రాజేష్, కొండా, చంద్రశేఖర్ ఆచారి పాల్గొన్నారు. -
జీవన ఎరువులే పంటకు జీవం
యడ్లపాడు: ప్రతి పంటకు జీవం జీవన ఎరువులేనని పల్నాడు జిల్లా ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ఎం నగేష్ అన్నారు. జీవన ఎరువుల ప్రాముఖ్యతపై జరుగుతున్న వారోత్సవాలలో భాగంగా మంగళవారం యడ్లపాడు మండల పరిషత్ కార్యాలయంలో రైతు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఏరువాక ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పీవీ సత్యగోపాల్తో కలసి ఆయన పాల్గొన్నారు. నగేష్ మాట్లాడుతూ జీవన ఎరువుల వినియోగం వల్ల దాదాపుగా 25 శాతం రసాయన ఎరువుల వాడకం తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. ఇవి భూసారాన్ని పెంపొందించి, పంటలో జీవవైవిధ్యాన్ని పెంపొందించడంలో సహాయపడతాయని అన్నారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడిని, నాణ్యతతో కూడిన దిగుబడిని సాధించవచ్చని తెలిపారు. శాస్త్రవేత్త డాక్టర్ పీవీ సత్యగోపాల్ మాట్లాడుతూ ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా తయారయ్యే జీవన ఎరువులు రైతులకు ఎంతో ఉపయోగంగా ఉన్నాయని వివరించారు. గాలిలోని నత్రజనిని స్థిరీకరించి పంటకు అందుబాటులోకి తేవడం, భూమిలో అందుబాటులో లేని భాస్వరం, పొటాష్ పోషకాలను మొక్కకు అందుబాటులోకి తేవడం, రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో జీవన ఎరువులు ప్రధాన పాత్ర పోషిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో వి హేమలతాదేవి, అభ్యుదయ రైతు పోపూరి శివరామకృష్ణ, జగ్గాపురం, యడ్లపాడు గ్రామాల్లోని విద్యార్థినులు పి గాయత్రి, ఎ బేబీవిజయశ్రీ, సీహెచ్ కీర్తిశ్రీనిధి, జ్యోత్న్స, ఎ జోషితశ్రేయ, చాందిని, భాగ్యశ్రీ, ఎం జ్యోత్న్స, డి భువనేశ్వరీ, ఎన్ హర్షిత, కె హర్షిత, ఎండీ హమిద పాల్గొన్నారు. -
పట్టపగలే వ్యక్తి దారుణ హత్య
తెనాలి రూరల్: గుంటూరు జిల్లా తెనాలిలో పట్టపగలు ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. టిఫిన్ బండి వద్ద ఉన్న వ్యక్తిపై కొబ్బరి బొండాల కత్తితో దాడి చేసి దుండగుడు హతమార్చాడు. మృతుని కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు... బాపట్ల జిల్లా అమృతలూరు మండలం కోరుతాడిపర్రు గ్రామానికి చెందిన జూటూరి తిరుపతిరావు అలియాస్ బుజ్జి (60) గ్రామంలోని తమ సామాజిక వర్గంలో పెద్దగా ఉన్నాడు. ఆయనకు ఐదుగురు కుమార్తెలు. పెద్ద కుమార్తె గండికోట దుర్గ తెనాలి చెంచుపేటలోని ఎమ్మెల్యే బజారులో ఉంటోంది. బుజ్జి పది రోజుల క్రితం కుమార్తె వద్దకు వచ్చాడు. బైక్పై టిఫిన్ బండి వద్దకు మంగళవారం ఉదయం వెళ్లాడు దోశలు ఆర్డరిచ్చి వేరే వ్యక్తితో మాట్లాడుతున్నాడు. అంతలోనే ద్విచక్ర వాహనంపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి కొబ్బరి బొండాలు నరికే కత్తితో తిరుపతిరావుపై దాడి చేసి అత్యంత పాశవికంగా హత్య చేశాడు. నిందితుడు ముఖానికి మాస్క్ వేసుకుని ఉన్నాడని, హత్యానంతరం తన వాహనంపై వెళ్లిపోయాడని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న డీఎస్పీ బి. జనార్దనరావు, త్రీ టౌన్ సీఐ ఎస్. సాంబశివరావు, ఎస్ఐ కరిముల్లా తమ సిబ్బందితో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గుంటూరు నుంచి వచ్చిన డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారణమేంటి? పాత కక్షలు, ఆధిపత్య పోరు కారణంగానే ఈ హత్య జరిగినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కోరుతాడిపర్రు గ్రామంలో ఆలయానికి సంబంధించిన నగదు పాట నిర్వహించడం, ఆలయ వ్యవహారాల పర్యవేక్షణ వంటివి బుజ్జి చూస్తుంటాడు. అమృతలూరు సొసైటీ సభ్యుడిగా కూడా ఉన్నాడు. ఆలయ వ్యవహారం ఏళ్లుగా ఒక్కరే చూడాలా అంటూ గ్రామానికే చెందిన అల్లుడు వరుస అయ్యే వ్యక్తి ఇటీవల బుజ్జితో వాగ్వాదానికి దిగాడని, అలాగే తన తండ్రి మృతికి తిరుపతిరావు కారణమంటూ గతంలో ఘర్షణ పడ్డాడని తెలుస్తోంది. అతనే ఈ హత్య చేసి ఉంటాడని అటు గ్రామస్తులు కూడా భావిస్తున్నారు. మరో వైపు తిరుపతిరావు మనవరాలికి ఆమె భర్తకు మధ్య కుటుంబ కలహా లు ఉన్నాయి. మూడు రోజులుగా తెనాలి చెంచుపేటలో ఈ పంచాయితీ వ్యవహారం నడుస్తోంది. కుటుంబ కలహాలకు తిరుపతిరావే కారణమని, అతడిని హతమారిస్తే కలహాలు ఉండవంటూ మనవరాలి భర్త సోమవారం రాత్రి హెచ్చరించాడని చెబుతున్నారు. గ్రామంలో ఆధిపత్య పోరులో అల్లుడి వరుస అయ్యే వ్యక్తి లేదా మనవరాలి భర్త ఈ హత్యకు పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. వారిద్దరూ ఒక్కటై హత్య చేసి ఉంటారనే కోణంలోనూ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో రజత పతకం
గుంటూరు వెస్ట్ (క్రీడలు): ఒడిశాలో ఈ నెల 10 నుంచి 14 వ తేదీ వరకు జరిగిన 40వ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో గుంటూరుకు చెందిన ఎస్కే రోషన్ రజత పతకం సాధించాడు. అండర్ 20 యూత్ విభాగంలో 110 మీటర్ల హర్డల్స్లో ఈ పతకాన్ని సాధించాడని అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా కార్యదర్శి జి.వి.ఎస్. ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా రోషన్ను ఏపీ రెరా సభ్యుడు దామచర్ల శ్రీనివాసరావు స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో అభినందించారన్నారు. స్టేడియంలో అథ్లెటిక్స్ ట్రాక్ కూడా బాగు చేయాలని కోరారు. సదుపాయాలు కల్పిస్తే మరింత మంది రాణిస్తారని ఆకాంక్షించారు. రోషన్ను కోచ్ రామకృష్ణ, కె.రవి, కె.అరుణ్ కుమార్, పి.ఆనంద్ కుమార్, ఎస్కే మన్సూర్ వలి తదితరులు అభినందించారు. -
25న తెనాలిలో ఆంధ్రప్రదేశ్ పాడి రైతుల సభ
తెనాలి: పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల తరహాలో లీటరుకు రూ.8–10 ప్రోత్సాహకధర ఇవ్వాలని కోరుతూ ఈ నెల 25వ తేదీన తెనాలిలో సభ నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ పాడి రైతుల జిల్లా ప్రథమ మహాసభను జయప్రదం చేయాలని సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి కోరారు. తెనాలిలో మంగళవారం పాడిరైతులతో కలసి మహాసభ ఆహ్వానపత్రికను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ తెనాలి అయితానగర్లోని నన్నపనేని సీతారామయ్య సరస్వతమ్మ కల్యాణమండపంలో 25న ఉదయం 10 గంటలకు మహాసభ జరుగుతుందని తెలిపారు. గేదెపాలు లీటరుకు రూ.40, ఆవు పాలు రూ.20కు మించి డెయిరీల్లో ధర రావటం లేదన్నారు. పాడి పశువులకు బీమా మార్కెట్ ధర ప్రకారం నిర్ణయించాలని తెలిపారు. ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలని సంఘం జిల్లా నాయకురాలు వేజెండ్ల తబిత కోరారు. తెనాలి శాంతకుమారి, మాన్యం పద్మ, ఎల్లమాటి మేరమ్మ, కె.శకుంతల ఎ.సరోజిని, టి.నిర్మల, సంతోషం, సుశీల తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా ఏపీ ఎస్పీఎఫ్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం
ఏఎన్యూ (పెదకాకాని): క్రీడల ద్వారా దేహదారుఢ్యం, ఐకమత్యం పెంపొందుతాయని ఏపీ ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సీఎం త్రివిక్రమ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళం (ఏపీ ఎస్పీఎఫ్) రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు మంగళవారం ఏఎన్యూలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. త్రివిక్రమ్ ఈ పోటీలను ఇన్స్పెక్టర్ జనరల్ బీవీ రామిరెడ్డితో కలసి ప్రారంభించారు. 34వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పోటీలను నిర్వహిస్తున్నారు. డాక్టర్ త్రివిక్రమ్ మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటముల తేడా లేదని, క్రీడా స్ఫూర్తి గొప్పదన్నారు. ఇన్స్పెక్టర్ జనరల్ బీవీ రామిరెడ్డి మాట్లాడుతూ డైరెక్టర్ జనరల్గా త్రివిక్రమ్ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఏపీ ఎస్పీఎఫ్లో మార్పులు శరవేగంతో జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో పలు చోట్ల మినీ శిక్షణ కేంద్రాలు ఏర్పాటుకు ప్రభుత్వం స్థలాలు కేటాయించిందన్నారు. సిబ్బంది సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. ఉద్యోగుల పదోన్నతులు, నూతన నియామకాలపై దృష్టి పెట్టారని చెప్పారు. ఈ క్రీడా పోటీలలో వాలీబాల్, బాడ్మింటన్, 100 మీటర్లు, 400 మీటర్లు, 5 కిలో మీటర్ల పరుగు పందేలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ యూనిట్ల నుంచి దాదాపు రెండు వందల మంది అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విజయవాడ జోన్ కమాండెంట్ ముద్దాడ శంకర్రావు, కమాండెంట్ డీఎన్ఏ బాషా, అసిస్టెంట్ కమాండెంట్లు, ఇన్స్పెక్టర్లు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
మొబైల్ఫోన్లు బాధితులకు అప్పగింత
నగరంపాలెం: మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వారికి ఫోన్లను తిరిగి అప్పగించారు. సుమారు రూ.50 లక్షల విలువైన 250 ఫోన్లను మంగళవారం నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో బాధితులకు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... ఫోన్లను పొగోట్టుకున్న వెంటనే ఫిర్యాదు చేస్తే సమాచారం దుర్వినియోగం కాదని అన్నారు. ఇప్పటివరకు సుమారు రూ.6.82 కోట్ల విలువైన 3,414 ఫోన్లను బాధితులకు అప్పగించామని చెప్పారు. హెల్ప్ నంబర్ 86888 31574 లేదా సీఈఐఆర్ వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఐటీ కోర్ సీఐ నిషార్ బాషా, హెచ్సీ కిషోర్, కానిస్టేబుళ్లు శ్రీధర్, ఇమామ్సాహెబ్, యాసిన్, అరుణ, మానస, సీసీఏస్ హెచ్సీ రమేష్, కానిస్టేబుల్ కరీముల్లాలను జిల్లా ఎస్పీ అభినందించారు. -
సాగులో సాంకేతికతపై పట్టు సాధించాలి
రేపల్లె: వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించటంపై పట్టుసాధించి అధిక దిగుబడులు సాధించాలని వ్యవసాయ సహాయ సంచాలకులు అద్దేపల్లి లక్ష్మి అన్నారు. సాగులో సాంకేతికత వినియోగంపై వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఆత్మ) ఆధ్వర్యంలో మండలంలోని పేటేరు వ్యవసాయ సహాయ కేంద్రంలో మంగళవారం సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం వస్తున్న మార్పులకు అనుగుణంగా యంత్ర పరికరాలు వస్తున్నాయని, వీటితో సమయం, డబ్బులు ఆదా అవుతాయని చెప్పారు. వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎల్.ఏడుకొండలు మాట్లాడుతూ రైతులకు ఉపయోగపడే మినీ రైస్ మిల్, అపరాల పంటల విధానాలు, వివిధ రకాల నూనె గింజల నుంచి నూనె తయారు చేసే విధానాలను వివరించారు. డాక్టర్ వాసుదేవ మాట్లాడుతూ సోలార్ డ్రైయర్ పనితీరు, దీని ఉపయోగంతో పాటు పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ ద్వారా రైతులు పంటకు విలువ జోడించి అధిక ఆదాయం పొందే మార్గాలను సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ సందీప్, ఏఓ మహేష్బాబు, వీఏఏ రాయల్బాబు, రైతులు, బాపట్ల పోస్ట్ హార్వెస్టర్ రీసెర్చ్ సెంటర్ సిబ్బంది, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. -
కడలి వెంట కన్నీటి చూపులు
చీరాల: కడలి కెరటాలు ఆ కుటుంబాల్లో కన్నీటిని మిగిల్చాయి. సరదాగా సేద తీరేందుకు వచ్చి సముద్ర స్నానం చేస్తుండగా అలల తాడికిడి గల్లంతై ఐదుగురు విద్యార్థులు మృత్యువాత పడడంతో తీరం కన్నీటి సంద్రంగా మారింది. గల్లంతైన వారిలో ముగ్గురి మృతదేహాలు ఆదివారం రాత్రి ఒడ్డుకు చేరాయి. మరో విద్యార్థి మృతదేహం సోమవారం తీరానికి చేరింది.దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఆశలు అడియాస అమరావతి పరిధిలోని విట్ ఇంజినీరింగ్ కాలేజీలో ఎంటెక్ చదువుతున్న ఏడుగురు స్నేహితులు ఆదివారం సెలవు దినం కావడంతో సరదాగా గడిపేందుకు చీరాల రూరల్ మండలం వాడరేవు సముద్ర తీరానికి వచ్చారు. సరదాగా సముద్రతీరంలో కేరింతలు కొట్టారు. ఉవ్వెత్తున వస్తున్న అలల ధాటిని కూడా లెక్క చేయకుండా సముద్రంలో కేరింతలు కొట్టారు. కొద్దిసేపటికి అలలు ఎక్కువగా రావడంతో ఏడుగురు గల్లంతయ్యారు. స్థానిక మత్య్సకారులు గమనించి నలుగురు విద్యార్థులను బయటకు తీసుకువచ్చారు. అయితే, వీరిలో ఎంటెక్ చదువుతున్న సాయి మణిదీప్ (జడ్చర్ల), జీవన్ సాత్విక్ (హైదరాబాద్), శ్రీసాకేత్ (హైదరాబాద్)లు సముద్రంలో అలల తాకిడికి గల్లంతయ్యారు. ఎంత గాలించినా ముగ్గురి జాడ కానరాలేదు. కొంత సమయం తర్వాత ముగ్గురి మృతదేహాలు తీరానికి చేరాయి. భోరుమన్న గౌతమ్ కుటుంబ సభ్యులు మరో ఘటనలో వేటపాలెం మండలం వడ్డె సంఘానికి చెందిన ఇద్దరు విద్యార్థులు కూడా గల్లంతయ్యారు. ఆదివారం రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టినా ఇద్దరి ఆచూకీ లభించలేదు. జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ స్వయంగా వాడరేవు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. మైరెన్, గజ ఈతగాళ్లు, అగ్నిమాపక సిబ్బంది సహకారంతో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి కోసం కుటుంబ సభ్యులు రాత్రంతా తీరం వద్దనే వేచి ఉన్నారు. సోమవారం ఉదయం తీరానికి గౌతమ్ కృష్ణప్రసాద్ మృతదేహం వచ్చింది. దీంతో కుమారుడిని చూసి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి ఆదివారం వాడరేవు సముద్రతీరంలో గల్లంతై మృతి చెందిన ముగ్గురు విద్యార్థులు, సోమవారం తీరానికి చేరిన మరో విద్యార్థికి చీరాల ఏరియా వైద్యశాలలో సోమవారం పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. విద్యార్థులు గల్లంతైన సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలియచేయడంతో వారు హుటాహుటిన చీరాలకు వచ్చారు. ఏరియా వైద్యశాలలోని మార్చురీలో ఉన్న మృతదేహాలను చూసి కన్నీటిపర్యంతమయ్యారు. పెద్ద చదువులు చదువుకొని ఆసరాగా నిలుస్తారని అనుకుంటే అందరిని వదిలి వెళ్లిపోయావా? అంటూ కుటుంబ సభ్యులు చేస్తున్న ఆర్తనాదాలు కంటతడి పెట్టించాయి. తీరంలో గాలింపు చర్యలు ముమ్మరం ఆదివారం వాడరేవు సముద్రతీరంలో వేర్వేరు సంఘటనల్లో గల్లంతైన ఐదుగురు విద్యార్థుల్లో నలుగురు మృతదేహాలు లభ్యం కాగా మరో విద్యార్థి షారోన్ ఆచూకీ లభించలేదు. జిల్లా కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్, ఆర్డీఓ చంద్రశేఖర్నాయుడు, చీరాల డీఎస్పీ, సీఐలు, ఎస్సైలు తీరం వెంట గాలింపు చర్యలు చేపట్టారు. ఉదయం నుంచి వర్షం కురుస్తున్నా గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రానికి కూడా షారోన్ మృతదేహం లభించలేదు. దీంతో షారోన్ కోసం కుటుంబ సభ్యులు కూడా తీరం వెంటే ఉన్నారు. -
అవకాశం లేకే ఆ బిర్యానీ తిన్నాం !
ప్రత్తిపాడు: పెదనందిపాడు మండలం అన్నపర్రు బీసీ బాలుర హాస్టల్లో 54 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం బీసీ సంక్షేమశాఖ స్టేట్ అడిషనల్ డైరెక్టర్ డి.చంద్రశేఖర్రాజు, వైద్య ఆరోగ్యశాఖ అడిషనల్ డైరెక్టర్ బి.సుబ్రమణ్యేశ్వరి హాస్టల్లో విచారణ నిర్వహించారు. విద్యార్థులను ప్రశ్నించగా అవకాశం లేకే బిర్యానీ తిన్నామని చెప్పారు. తాజాగా ఉందా.. వాసన వస్తుందా ? అని అడుగ్గా తాజాగా లేదని తెలిపారు. హాస్టల్ వంటగది, విద్యార్థుల రూమ్లు, బెడ్లు, వంట పాత్రలు, తాగు నీరు తదితరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. హాస్టల్ వాతావరణం అపరిశుభ్రంగా, గదుల్లో బూజుపట్టి ఉండటంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇదేమని సిబ్బందిని ప్రశ్నించారు. ఇంత ఘటన జరిగిన తరువాత కూడా హాస్టల్ ఇలా ఉంటే ఎలాగని ఆగ్రహించారు. -
● కలెక్టర్ వినోద్కుమార్ ● గల్లంతైన విద్యార్థి కోసం గాలింపు ముమ్మరం
చీరాల: మండలంలోని వాడరేవులో ఆదివారం జరిగిన ఘటన చాలా బాధాకరమైనదని జిల్లా కలెక్టర్ వినోద్కుమార్ పేర్కొన్నారు. సోమవారం రాత్రి ఆయన చీరాల మండలం వాడరేవు సముద్ర తీరం వద్ద గాలింపు చర్యలను పర్యవేక్షించారు. బాధిత కుటుంబాలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారన్నారు. నలుగురి మృతదేహాలు లభించాయని, మరొకరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని తెలిపారు. జిల్లాలోని బీచ్ల వద్ద రానున్న రోజుల్లో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యార్థి ఆచూకీ కోసం పోలీస్, మత్య్సశాఖ, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ అధికారుల బృందాలు శ్రమిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి కోస్ట్గార్డ్, ఎన్డీఎఫ్ఆర్ కూడా తెలియచేసి వారి సహాయం కూడా తీసుకున్నామని చెప్పారు. సోమవారం ఉదయం కురిసిన వర్షం కారణంగా గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడిందని తెలిపారు. పది బోట్లు, ఆరు డ్రోన్ కెమెరాలు, పది మంది గజ ఈతగాళ్లు, పది మంది వీఆర్వోలను ఘటన జరిగిన వాడరేవు ప్రాంతం నుంచి ఇరువైపులా నాలుగు కిలోమీటర్ల పరిధిలో పరిశీలించేందుకు ఏర్పాట్లు చేశామని కలెక్టర్ వెల్లడించారు. చుట్టు పక్కల గల మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లిన సమయంలో మృతదేహం కనిపిస్తే చీరాల తహసీల్దార్, రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పామన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కలెక్టర్ వెంట జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాస నాయక్, జిల్లా అగ్నిమాపక అధికారి నవీన్, ఆర్డీవో చంద్రశేఖర్నాయుడు, తహసీల్దార్ కె.గోపీకృష్ణ, డీఎస్పీ ఎండీ మోయిన్, రూరల్ పోలీసులు ఉన్నారు. -
మహిళ అవయవాల దానం
తాడేపల్లి రూరల్: మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని మణిపాల్ ఆసుపత్రిలో సోమవారం అవయవాల దానం జరిగింది. ఈ సందర్భంగా హాస్పిటల్ డైరెక్టర్ రామాంజనేయరెడ్డి, ఆంధ్రప్రదేశ్ జీవన్దాన్ చైర్మన్ డాక్టర్ కె. రాంబాబులు మాట్లాడుతూ.. తాడేపల్లి పట్టణ పరిధిలోని నులకపేటకు చెందిన రాజులపాటి పాప (64) ప్రమాదానికి గురి అయిందన్నారు. ఆమె బంధువులు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారని తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం శస్త్రచికిత్స నిర్వహించారని పేర్కొన్నారు. అయినా ఆమె ఆరోగ్య పరిస్థితిలో మార్పు కనిపించలేదని చెప్పారు. అనంతరం బ్రెయిన్ డెడ్గా వైద్యులు ప్రకటించారని తెలిపారు. కుటుంబ సభ్యుల ఆమోదంతో ఆమె అవయవాలను సేకరించి కాలేయాన్ని మణిపాల్లో ఒక రోగికి ట్రాన్స్ప్లాంటేషన్ చేశారన్నారు. కార్నియాను ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి తరలించామని వివరించారు. మంచి కార్యానికి ముందుకు వచ్చిన దాత కుటుంబసభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తురకపాలెంలో ఎన్సీడీసీ బృందం గుంటూరు రూరల్: మండలంలోని తురకపాలెం గ్రామంలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) బృందం ప్రతినిధులు సోమవారం పర్యటించారు. గ్రామంలో పలు ప్రాంతాలను పరిశీలించారు. ఎస్సీ కాలనీలో , విలేజ్ క్లినిక్ ప్రాంతాల్లో మట్టిని సేకరించారు. బెంగళూరుకు చెందిన బృందంతోపాటు గుంటూరు జిల్లాలోని ఎన్సీడీసీకి చెందిన 40 మందికి పైగా పాల్గొన్నారు. గ్రామంలో నీటి నమూనాలను కూడా సేకరించారు. మట్టి, నీటిని పరీక్షల నిమిత్తం తీసుకెళుతున్నట్లు బృందం సభ్యులు తెలిపారు. న్యాయవాద కోర్సుల పరీక్షలు ప్రారంభం పెదకాకాని: నాగార్జున విశ్వవిద్యాలయం పీజీ పరీక్షల విభాగం ఆధ్వర్యంలో సోమవారం మాస్టర్ ఆఫ్ లా (ఎల్ఎల్ఎం) ద్వితీయ సెమి స్టర్, ఐదు సంవత్సరాల ఆనర్స్ బీబీఏఎల్ఎల్బీ, బీఏఎల్ఎల్బీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఈ మేరకు పీజీ పరీక్షల కో ఆర్డినేటర్ ఆచార్య ఎం.సుబ్బారావు తెలిపారు. ఎల్ఎల్ఎం పరీక్షలు ఏఎన్యూతోపాటు గుంటూరులోని జేసీ కాలేజ్ ఆఫ్ లా, ఏసీ కాలేజీ పరీక్ష కేంద్రాల్లో కొనసాగుతున్నాయన్నారు. ఐదు సంవత్సరాల ఆనర్స్ పరీక్షలు విశ్వవిద్యాలయంలోని టీటీఎం విభాగంలో ప్రారంభం అయ్యాయన్నారు. పరీక్షలను సమర్థంగా నిర్వహించేందుకు ప్రత్యేక తనిఖీల బృందాలను నియమించినట్లు వివరించారు. ఎంఎస్సీ కెమిస్ట్రీ ఫలితాలు విడుదల ఏఎన్యూ (పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ వరిధిలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ కోర్సు రెండో సెమిస్టర్ ఫలితాలను సీఈ ఆలపాటి శివప్రసాదరావు సోమవారం విడుదల చేశారు. 507 మందికిగాను 357 మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. వర్సిటీ అందిస్తున్న డిప్లమో ఇన్ ఫొటోగ్రఫీ కోర్సు రెండవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను కూడా విడుదల చేశారు. 15 మందికి గానూ అందరూ ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. రీవాల్యుయేషన్ కోసం ఈ నెల 23వ తేదీలోగా పేపరుకు రూ.1860 చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు. పులిచింతలకు 58,122 క్యూసెక్కులు విడుదల రెంటచింతల: మండలంలోని సత్రశాల వద్ద నున్న నాగార్జునసాగర్ టెయిల్పాండ్ విద్యుత్ ప్రాజెక్టు రిజర్వాయర్ ఐదు క్రస్ట్గేట్లు, రెండు యూనిట్లు ద్వారా విద్యుత్ ఉత్పాదన అనంతరం మొత్తం 58,122 క్యూసెక్కులను పులిచింతలకు విడుదల చేసినట్లు ఎస్ఈ వెంకటరమణ, ఈఈ సుబ్రమణ్యం సోమవారం తెలిపారు. టెయిల్పాండ్ ప్రాజెక్టు రిజర్వాయర్ ఐదు క్రస్ట్గేట్లు రెండు మీటర్లు ఎత్తు ఎత్తి 49,720 క్యూసెక్కులు, రెండు యూనిట్ల ద్వారా విద్యుత్పాదన అనంతరం 8,402 క్యూసెక్కులు మొత్తం 58,122 క్యూసెక్కులను దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్కు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. -
విజ్ఞాన్ ఫార్మసీ అవగాహన ఒప్పందం
చేబ్రోలు: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ ఫార్మసీ కళాశాల, అమెరికాలోని టెంపుల్ యూనివర్సిటీల మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని చైర్మన్ లావు రత్తయ్య సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెంపుల్ వర్సిటీతో ఫార్మాడీ ప్రోగ్రామ్కు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న దేశంలోని మొదటి సంస్థగా తమ కళాశాల గుర్తింపు పొందిందన్నారు. విద్యార్థులు, అధ్యాపకుల పరస్పర మార్పిడి కార్యక్రమాలు, సంయుక్త పరిశోధన ప్రాజెక్టులు, సాంస్కృతిక, ఇంటర్ డిసిప్లనరీ అవగాహనను పెంచనున్నామన్నారు. ఒప్పందాన్ని సాధ్య మయ్యేలా కృషి చేసినందుకు ఫార్మాడీ ప్రోగ్రాం డీన్ డాక్టర్ సతీష్ ఎస్. గొట్టిపాటిని విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య, వైస్ చైర్మన్ శ్రీకృష్ణ దేవరాయలు, సీఈవో డాక్టర్ మేఘన కూరపాటి, విభాగాధిపతులు, అధ్యాపక సిబ్బంది అభినందించారు. -
ప్రజలకు నాణ్యమైన సేవలందించాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ బాపట్ల: జిల్లా ప్రజలకు నాణ్యమైన సేవలందించాలని కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ అధికారులకు సూచించారు. స్థానిక కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఎంతో నమ్మకంతో అధికారుల దగ్గరకు సమస్యలను చెప్పుకోవడానికి వస్తారన్నారు. వాటిని సావధానంగా విని పరిష్కరించాలని ఆయన చెప్పారు. ప్రజల నుంచి రెవెన్యూ, పోలీస్, సర్వే శాఖలకు సంబంధించిన అర్జీలు ఎక్కువగా వస్తున్నాయని, వాటిని పరిశీలించడానికి అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. అర్జీలను గడువులోగా పరిష్కరించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. మండల స్థాయిలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలని ఆయన ఆదేశించారు. సంతమాగులూరు మండలంలో అర్జీలు ఎక్కువ శాతం పెండింగ్ ఉన్నాయని, వాటిని పరిష్కరించ డానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు. గ్రామాల్లో పర్యటన ప్రజా సమస్యలను పరిశీలించడానికి తాను మారుమూల గ్రామాల్లో సైతం పర్యటిస్తానని కలెక్టర్ ఈ సందర్భంగా చెప్పారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యంగా ఉన్న గ్రామీణ నీటి సరఫరా శాఖ ఎస్ఈకి, ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి గైర్హాజర్ అయిన ఆర్ అండ్ బీ ఎస్ఈకి నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రధానమంత్రి కుసుమ్ పథకం కింద ఏడు సబ్ స్టేషన్లు మంజూరయ్యాయని, వాటి నిర్మాణానికి భూసేకరణ వేగవంతంగా చేపట్టాలని చెప్పారు. అల్పపీడన ప్రభావం వల్ల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఈనెల 13వ తేదీ నుంచి 17 వరకు సీపీఆర్ వారోత్సవాలను నిర్వహించాలని తెలిపారు. అత్యవసర సమయాల్లో ప్రజలను ప్రాణాపాయ నుంచి రక్షించడానికి ప్రతి ఒక్కరూ సీపీఆర్ గురించి తెలుసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా చీరాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ శ్రీదేవి డెమోను ప్రదర్శించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి. గంగాధర్ గౌడ్, బాపట్ల రెవిన్యూ డివిజనల్ అధికారి పి.గ్లోరియా, కేఆర్సీ డెప్యూటీ కలెక్టర్ ఎస్.లవన్న, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయమ్మ, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాధా మాధవి, జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి రాజ్ దిబోరా, జిల్లా రవాణాశాఖ అధికారి పరంధామరెడ్డి పాల్గొన్నారు. -
జీజీహెచ్లో ప్రపంచ బ్యాంకు బృందం పర్యటన
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో సోమవారం ప్రపంచ బ్యాంకు బృందం పర్యటించింది. అత్యవసర సేవల విభాగం, ఎన్ఐసీయూ, పీఐసీయూ తదితర వైద్య విభాగాలను పరిశీలించింది. క్వాలిటీ ఎస్యూరెన్స్ నేషనల్ హెల్త్ మిషన్ తరఫున అత్యవసర విభాగం పనితీరు, అత్యధికంగా వస్తున్న రోగులకు మౌలిక వసతుల కల్పనపై అధ్యయనం చేసేందుకు క్యాజువాల్టీలో బృంద సభ్యులు పరిశీలించారు. అందులో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అత్యవసర చికిత్స కోసం ప్రతిరోజూ వచ్చే రోగులు, రోడ్డు ప్రమాద బాధితులకు అందించే చికిత్సలు, అత్యవసర వైద్య సేవలు అందించేందుకు క్యాజువాల్టీలో అందుబాటులో ఉన్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అత్యవసర విభాగం పనితీరు గురించి, క్యాజువాల్టీలో రోగుల రద్దీని తగ్గించడానికి తీసుకుంటున్న చర్యల గురించి బృందానికి జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ, వివరించారు. అనంతరం అప్పుడే పుట్టిన పసికందులకు చికిత్స అందించే ఎన్ఐసీయూ విభాగాన్ని బృంద సభ్యులు పరిశీలించారు. నవజాత శిశువుల మరణాల రేటు తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యలపై వైద్యులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. జీజీహెచ్లో రోగులకు ఇన్ఫెక్షన్ సోకకుండా కంట్రోల్ కోసం తీసుకుంటున్న చర్యలను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ, ఇతర వైద్యులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిని పరిశీలించిన వారిలో ప్రపంచ బ్యాంకు బృంద సభ్యులు డాక్టర్ మొహిర్ జోన్, డాక్టర్ ఎడ్వర్డ్, డాక్టర్ గణేష్ మణి, వాసు బాబు తదితరులు ఉన్నారు. -
భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయండి !
కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ బాపట్ల: ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు భూ సేకరణ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి సోమవారం ఆయన ఆర్డీఓలు, తహసీల్దార్లతో వీక్షణ సమావేశం నిర్వహించారు. జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ పనులకు అవసరమైన భూ సేకరణ వేగంగా చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు. భూ సేకరణ పూర్తయితేనే అభివృద్ధి పనులు వేగంగా జరుగుతాయని తెలిపారు. ఎన్హెచ్ –544 జీ నిర్మాణం కోసం జిల్లాలో సేకరించిన 19.8 హెక్టార్లకు గానూ మరో 4.5 హెక్టార్లలో భూమి సేకరించాల్సి ఉందన్నారు. ఈ ప్రక్రియను 45 రోజుల్లో పూర్తి చేయాలని చెప్పారు. ఇప్పటి వరకు సేకరించిన భూమికి నష్ట పరిహారాన్ని సదరు వ్యక్తులకు అందించాలని తెలిపారు. జాతీయ రహదారి–167 ఏ నిర్మాణానికి 88.38 హెక్టార్లలో భూమి సేకరించారని, మిగిలిన రెండు హెక్టార్లను కూడా త్వరగా సేకరించాలని ఆదేశించారు. భూమి సేకరించినప్పటికీ 158 మందికి నగదు చెల్లించకపోవడంపై ఆరా తీశారు. వినుకొండ నుంచి గుంటూరు రహదారి విస్తరణ పనులకు భూ సేకరణ ప్రక్రియ నవంబర్లోగా పూర్తి చేయాలని తెలిపారు. రొంపేరు కాలువ నిర్మాణానికి 117.45 ఎకరాల భూమి సేకరించగా, ఇందులో కొందరికి నేటికీ నగదు చెల్లించక పోవడంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. సోలార్ ప్రాజెక్ట్కు తక్షణమే భూమి సేకరించాలి సోలార్ ప్రాజెక్ట్ నిర్మాణానికి తక్షణమే భూమి సేకరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. దీని కోసం సంతమాగులూరు, బల్లికురవ మండలాల్లో 203.48 ఎకరాల ప్రభుత్వ భూమి, 1,591.17ఎకరాల పట్టా భూమిని సేకరించాల్సి ఉందన్నారు. మంచినీటి ట్యాంకుల శుభ్రపరిచే యూనిట్ ఏర్పాటు కోసం బాపట్ల మూలపాలెంలో రెండు ఎకరాలు, చీరాల దేవాంగపురి పంచాయతీలో 1.47 ఎకరాలు, ఇసుకపల్లిలో 3.5 4 ఎకరాలు, రేపల్లె బేతపూడిలో 1.35 ఎకరాల సేకరణలో సాంకేతిక సమస్య రావడంతో ప్రభుత్వానికి నివేదిక పంపాల్సి ఉందని తెలిపారు. నల్లమడ కాల్వ ఆధునికీకరణ పనుల సర్వే రెండు వారాలలో పూర్తి చేయాలని ఆదేశించారు. గుంటూరు చానల్ విస్తరణకు 51.34 ఎకరాలను పర్చూరు మండలంలో భూసేకరణ చేయాలని చెప్పారు. బాపట్లలో ఎస్టీ, బీసీ సామాజిక భవనాల నిర్మాణానికి భూమి సేకరించాలని, స్టేడియం నిర్మాణానికి 7.5 ఎకరాలు, ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలకు ఐదు ఎకరాలు, మార్టూరులో మినీ స్టేడియం ఏర్పాటుకు భూమి సేకరించాలని అధికారులకు సూచించారు.సమావేశంలో డీఆర్వో జి.గంగాధర్ గౌడ్, ఆర్డీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయిపై దాడి అనాగరిక చర్య
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గుంటూరు వెస్ట్: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బి.ఆర్ గవాయిపై సాక్షాత్తూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో న్యాయవాది చేసిన దాడి సభ్యసమాజానికి సిగ్గుచేటని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. సోమవారం స్థానిక డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ విగ్రహం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాకు వినతిపత్రం అందజేశారు. కృష్ణమాదిగ విలేకరులతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి దళితుడు కావడం వల్లే ఈ దాడి జరిగిందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అనేక అభిప్రాయాలుంటాయన్నారు. దానికి ఇలా దాడులు చేయడం అత్యంత హేయమన్నారు. దళితులు దేశంలో ఎన్నో వివక్షలకు గురవుతూ ఎదుగుతుంటే, కొంత మంది ఓర్వలేక అక్కసుతోనే ఇటువంటి సంఘటనలకు పాల్పడుతున్నారన్నారు. దళితులు మరింత పట్టుదలతో ఉన్నత స్థానాలను పొందాలని కోరారు. గుంటూరు వెస్ట్: కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి షేఖ్ ఖాజావలి తెలిపారు. సోమ వారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కార్మిక శాఖ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్లో భాగంగా నిర్వహించిన బైక్ ర్యాలీని డీఆర్వో జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ తగ్గిన పన్నుల శాతంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి గత నెల 22 నుంచి ఈ నెల 19వ తేదీ వరకు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. కార్మిక శాఖ బైక్ ర్యాలీ ద్వారా అవగాహన కల్పిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. కార్మిక శాఖ సంయుక్త కమిషనర్ ఆశారాణి తదితరులు ప్రసంగించారు. బైక్ ర్యాలీ కలెక్టరేట్ నుంచి హిందూ కళాశాల సెంటర్, జిన్నా టవర్, బస్టాండ్, మంగళగిరి రోడ్డు మీదుగా ఆటోనగర్ వరకు కొనసాగింది. రాష్ట్రస్థాయిలో సత్తా చాటిన క్రీడాకారులు గుంటూరు వెస్ట్ (క్రీడలు): రాష్ట్ర స్థాయి పిట్టు స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లాలోని చంద్రగిరిలో ఈ నెల 11, 12వ తేదీల్లో జరిగిన రాష్ట్రస్థాయి సీనియర్ చాంపియన్ షిప్ పోటీల్లో గుంటూరు జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. బాలుర జట్టు ప్రథమ స్థానం, బాలికల జట్టు తృతీయ స్థానం దక్కించుకున్నాయని అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు దావులూరు సుబ్బారావు, పాపబత్తిని శ్రావ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజేతలను చైర్మన్ రంభ ప్రసాద్, రాష్ట్ర అధ్యక్షుడు పి.సురేష్, రాష్ట్ర కార్యదర్శి కె.జె జోసఫ్ అభినందించారని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి పెదకాకాని: వాకింగ్ చేస్తున మహిళల్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. పెదకాకాని మండలం తక్కెళ్ళపాడు గ్రామానికి చెందిన రమావత్ లక్ష్మి, కొమ్మూరి అరుణ, శ్రీదేవిలు ఇరుగుపొరుగువారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న సర్వీసు రోడ్డుకు రోజూ మాదిరిగానే సోమవారం ఉదయం వాకింగ్కు వెళ్లారు. వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం వచ్చి ఢీకొని వెళ్లిపోయింది. రమావత్ లక్ష్మి(43) సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. గాయాలపాలైన కొమ్మూరి అరుణ, శ్రీదేవిలను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. లక్ష్మి భర్త రామునాయక్ ఆర్టీసీ కండక్టర్గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ టి.పి. నారాయణస్వామి తెలిపారు. -
చీఫ్ జస్టీస్ గవాయిపై దాడి హేయం
బాపట్ల టౌన్: చీఫ్ జస్టీస్ బి.ఆర్. గవాయిపై జరిగిన దాడిని భారత రాజ్యాంగంపై జరిగిన దాడిగా పరిగణించి దోషిని కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి మంద పెంచలయ్య డిమాండ్ చేశారు. మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు సోమవారం జిల్లాలోని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలోని గడియార స్తంభం నుంచి పాత బస్టాండ్, చీలు రోడ్డు సెంటర్ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మంద పెంచలయ్య మాట్లాడుతూ గవాయిపై అనాగరిక దాడి వెనుక ఉన్న వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని కోరారు. విచారణ కమిటీను నియమించి, దాడి వెనుక ఉన్న కుట్రలను త్వరితగతిన తేల్చాలని డిమాండ్ చేశారు. జిల్లా ఎంఎస్పీ అధ్యక్షుడు బుడంగుంట్ల లక్ష్మీ నరసయ్య మాట్లాడుతూ జస్టీస్ గవాయి ఒంటరివాడు కాదని, ఆయనకు అండగా దళిత సంఘాలు మొత్తం అండగా ఉన్నాయని తెలిపారు. కృష్ణ మాదిగ పిలుపు మేరకు ఈనెల 17న జిల్లాస్థాయిలో, 23న రాష్ట్రస్థాయిలో అమరావతిలో భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రజా సంఘాలు, దళిత సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు దుడ్డు వందనం, నాయకులు పాల్గొన్నారు. -
రైలులో అశోక్బాబు ప్రయాణం
భట్టిప్రోలు: వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మాజీ సీఎం వైఎస్. జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు కల్తీ మద్యంపై నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్న వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర అధికార ప్రతినిధి వరికూటి అశోక్బాబుకు పోలీసులు అడుగడుగునా అడ్డు తగిలారు. సోమవారం రేపల్లె నియోజక వర్గంలోని చెరుకుపల్లిలోని ఇంటి నుంచి వేమూరుకు వాహనంలో వస్తుండగా భట్టిప్రోలులో అడ్డు పడ్డారు. దీంతో ఆయన ఉదయం 9:30 గంటలకు భట్టిప్రోలు రైల్వే గేటు నుంచి కాలి నడకన రైల్వే స్టేషన్కు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి తరలి వచ్చారు. రేపల్లె నుంచి గుంటూరు వెళ్లే రైలు బండిని భట్టిప్రోలు ఎక్కి వేమూరులో దిగారు. ప్రయాణికులను కలసి వారిని కుశల ప్రశ్నలు వేశారు. ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. -
అర్జీలు పునరావృతమైతే కఠిన చర్యలు
బాపట్ల టౌన్: పీజీఆర్ఎస్లో అర్జీలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 66 మంది బాధితులు వచ్చారు. తమ సమస్యలను నేరుగా ఎస్పీకి వివరించారు. బాధితుల సమస్యలు తెలుసుకున్న అనంతరం ఆయన జిల్లాలోని పోలీస్ అధికారులతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ సమస్యల పరిష్కారం కోసం పోలీస్స్టేషన్లకు వచ్చే బాధితులతో మర్యాదగా మెలగాలని, వారి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకొని పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీదారుల సమస్యలను చట్ట పరిధిలో విచారించి నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలని చెప్పారు. బాధితులకు భరోసా కల్పించినప్పుడే పోలీస్ శాఖపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని తెలిపారు. ప్రధానంగా ఫిర్యాదులు కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఆస్తి తగాదాలు, భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీ మోసాలపై వస్తున్నాయన్నారు. వాటిపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో రేపల్లె డీఎస్పీ ఏ.శ్రీనివాసరావు, డీసీఆర్బీ సీఐ ఎం. శ్రీనివాసరావు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో భారీ నష్టం
ఇరవైకి పైగా ఇళ్లలో కాలిపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులు చినగంజాం: విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మండలంలోని మున్నంవారిపాలెం పంచాయతీ బేతాళవారిపాలెంలో సోమవారం పలు ఇళ్లలో ఎలక్ట్రానిక్ వస్తువులు భారీగా కాలిపోయాయి. రూ.లక్షల్లో నష్టం వాటిల్లింది. గ్రామంలోని సచివాలయం రోడ్డులో తీగ తెగడంతో అత్యధిక విద్యుత్ గృహ సర్వీసుల్లోకి రావడంతో భారీగా ఉపకరణాలు దెబ్బతిన్నాయి. గ్రామంలో 20 పైగా ఇళ్లలో 10కి పైగా టీవీలు, బల్బులు, 30కి పైగా ఫ్యాన్లు, వాషింగ్ మెషిన్లు, ఇన్వర్టర్లు, స్విచ్ బోర్డులు తగులబడ్డాయి. భారీ శబ్దాలతో విద్యుత్ ఉపకరణాలు తగులబడి పొగలు రావడంతో నివాసితులు భయపడిపోయారు. భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక చర్చిలోని ఫ్యాన్లు, లైట్లు, ఇన్వర్టర్ సైతంపొగలు వచ్చి కాలిపోయాయి. పాడై పోయిన వైర్లు ఇటీవల గ్రామంలో షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. విద్యుత్ వైర్లు పూర్తిగా పాడైపోయాయని, వాటిని తొలగించి మార్చాలని గ్రామస్తులు పలుమార్లు చెప్పినా ఆ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇదే విధంగా పరిస్థితి కొనసాగితే ప్రాణాలు సైతం కోల్పోయే పరిస్థితి తలెత్తుతుందని వాపోయారు. సమస్యపై సాక్షి విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించింది. ప్రస్తుతం గ్రామంలో తాత్కాలికంగా మరమ్మతులు నిర్వహించామని, రెండు రోజుల్లో పరిశీలించి, సమస్య నివారణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
కోడి పందేల స్థావరంపై దాడులు
పెదకాకాని: కోడిపందేల స్థావరంపై దాడులు జరిపి ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వెనిగండ్ల శివారులో ఆదివారం కోడి పందేలు వేసేందుకు సుమారు 50 మంది పందెంరాయుళ్లు కోళ్లతో అక్కడికి చేరుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు కోడిపుంజులు, రూ.9,300, 17 బైక్లు, 8 సెల్ఫోన్లు, కోడికత్తులను స్వాధీనం చేసుకున్నారు. కోడిపందేలు నిర్వహిస్తున్న వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెదకాకాని సీఐ టీపీ నారాయణస్వామి తెలిపారు. గత కొంతకాలంగా వెనిగండ్ల శివారులోని నిర్మానుష్య ప్రాంతాల్లో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. కోళ్లకు కత్తులు కట్టే వారు ఈ పందేల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. -
ఎన్ఓసీ క్లియరెన్స్ కాలపరిమితి తగ్గింపునకు ప్రతిపాదనలు
గుంటూరు రూరల్: ఒక ప్రాంతంలో కొత్త వ్యాపారాన్ని స్థాపించేందుకు అనుకూల వాతావరణం కల్పించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నామని, వాటిలో ఫైర్ ఎన్వోసీ క్లియరెన్్స్ కాలపరిమితిని తగ్గించడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ పి.వి.రమణ చెప్పారు. నగర శివారులోని గోరంట్ల గ్రామంలోగల నెక్ట్స్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఆదివారం జోన్–3 జిల్లాల ఫైర్ డిపార్ట్మెంట్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ముఖ్య అతిథిగా డీజీ రమణ, సౌత్ జోన్ అడిషనల్ డైరెక్టర్ ఆర్. జ్ఞానసుందరం, రీజనల్ ఫైర్ ఆఫీసర్ జిలానీ పాల్గొన్నారు. రీజనల్ ఫైర్ ఆఫీసర్, గుంటూరు, డీడీఆర్ఎఫ్వోలు సమస్యలపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. అన్ని కార్యకలాపాలను వివరంగా చర్చించారు. నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా (ఎన్బీసీ) ప్రకారం ఫైర్ సేఫ్టీ నామ్స్ సరిదిద్దడానికి అన్ని రకాల నోటీసులు జారీ చేయబడ్డాయని తెలిపారు. మేనేజ్మెంట్స్, ఫారమ్స్, స్కూల్స్, కళాశాలలకు నోటీసులు పంపామని, దశల వారీగా తీసుకోవాల్సిన మార్గదర్శకాలు జారీ చేసినట్లు డీజీ తెలిపారు. ప్రొవిజనల్ ఎన్వోసీ మూడు రోజుల్లోను, ఆక్యుపెన్సీ ఎన్వోసీ 21 రోజులలో జారీ చేయాలని, రెన్యువల్ ఎన్వోసీ 21 రోజులలో జారీ చేయాలని చెప్పారు. 15వ ఫైనాన్స్ కమిషన్ వర్క్స్, ఫండ్స్ కేటాయింపుపై చర్చించారు. సమావేశంలో ఆయా జిల్లాల ఫైర్ సర్వీసెస్ అధికారులు పాల్గొన్నారు. -
సెపక్తక్రా విజేత కృష్ణ
●ద్వితీయ, తృతీయ స్థానాల్లో ప్రకాశం, తూర్పు గోదావరి ●క్రీడాకారులకు జ్ఞాపికలు, సర్టిఫికెట్లు అందజేత చీరాల రూరల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి సెపక్తక్రా జూనియర్ బాల, బాలికల పోటీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. స్థానిక మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో శనివారం ప్రారంభమైన పోటీలకు రాష్ట్రంలోని 17 జిల్లాలకు చెందిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కృష్ణా జిల్లాకు చెందిన బాల, బాలికల జట్లు అన్ని విభాగాల్లో రాణించి విజేతలుగా నిలిచి ప్రథమ స్థానాలను కై వసం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా బాలికల జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. తృతీయ స్థానాన్ని తూర్పు గోదావరి జిల్లా జట్టు గెలుచుకుంది. అలానే బాలుర విభాగంలో కృష్ణా జిల్లా జట్టు బాలుర విభాగంలో ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకోగా ద్వితీయ స్థానాన్ని ప్రకాశం జిల్లా జట్టు గెలుపొందింది. తృతీయ స్థానంలో అనంతపురం జిల్లా జట్టు నిలిచింది. ఈ పోటీలు ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య ఆసక్తికరంగా.. ఉత్కంఠ భరితంగా జరిగాయి. బరువైన బాలును ఒక్క కాలితో గాలితో ఎగిరి కొట్టి అవతలి కోర్టులోని పంపాల్సి ఉంది. అయినప్పటికీ క్రీడాకారులు ఎంతో పట్టుదలతో గెలుపుకోసం ఆటపై పట్టు సాధిస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఆటను తిలకించేందుకు ప్రేక్షకులు భారీ సంఖ్యలో స్టేడియానికి తరలివచ్చారు. విజేతలుగా నిలిచిన క్రీడా జట్లకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన సెపక్తక్రా జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ వైద్యుల విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఇస్తర్ల బాబూరావు, ఏపీ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కా పరంజ్యోతి, నరసరావుపేట ఎంఎం కాలేజెస్ చైర్మన్ ఎంఆర్ రామశేషగిరిరావు, సెపక్తక్రా జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఇస్తర్ల సుభాషిణి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. బాపట్ల జిల్లా సెపక్తక్రా జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్ర, జిల్లా అథ్లెటిక్ ట్రాక్, ఫీల్డ్ కోచ్ వి.వనజ, గజవల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ఏపీ మాస్టర్ ప్రింటర్స్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గం ఎన్నిక
నరసరావుపేట: ఏపీ మాస్టర్ ప్రింటర్స్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆదివారం వినుకొండరోడ్డులోని రోటరీక్లబ్ భవనంలో అసోసియేషన్ గౌరవాధ్యక్షులు జమ్ముల రాధాకృష్ణ ఏపీ ఆఫ్సెట్ ప్రింటర్స్ అసోసియేషన్కు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికై న సందర్భాన్ని పురస్కరించుకొని అభినందనసభ, జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జిల్లా గౌరవాధ్యక్షులుగా కేవీ, కార్యదర్శిగా కసుకుర్తి రాజశేఖర్, కోశాధికారిగా రాంబాబు, చిలకలూరిపేట, సత్తెనపల్లి, మాచర్ల, పిడుగురాళ్లకు చెందిన జిల్లా సభ్యులతో జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నరసరావుపేట ప్రింటర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మన్నేపల్లి శ్రీనివాసరావు, పడవల వంశీకృష్ణ, కోశాధికారి చిన్ని వెంకటేష్ల ఆధ్వర్యంలో జమ్ముల రాధాకృష్ణను సన్మానించారు. ప్రింటింగ్ రంగంలో రాబోతున్న మార్పులు, అడ్వాన్స్ మిషనర్, క్లస్టర్స్, ఇతర విషయాలపై చర్చించారు. కార్యక్రమానికి హాజరైన వారందరికి ధన్యవాదాలు తెలియచేశారు. -
బ్రాహ్మణ వివాహ సమాచార కేంద్రం సేవలు శ్లాఘనీయం
తెనాలి: ఆంధ్రాప్యారిస్ తెనాలిలో నిర్వహిస్తున్న బ్రాహ్మణ ఉచిత వివాహ సమాచార కేంద్రం సేవలు శ్లాఘనీయమని రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య అధ్యక్షుడు కామేశ్వర ప్రసాద్ అన్నారు. స్థానిక నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ కళాసదనంలో ఆదివారం 15వ రాష్ట్రస్థాయి బ్రాహ్మణ వధూవరుల పరిచయవేదిక జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన సమావేశానికి సంఘ అధ్యక్షుడు దక్షిణామూర్తి అధ్యక్షత వహించారు. ఐదు రాష్ట్రాల్నుంచి 750 కుటుంబాలవారు పాల్గొన్నారు. ముఖ్యఅతిథి కామేశ్వరప్రసాద్ వివాహవేదిక సమాచార పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. శాఖ భేదాన్ని చూడకుండా వివాహాలు జరుపుకోవాలని హితవు పలికారు. రాష్ట్రస్థాయిలో 15 పర్యాయాలు పరిచయ వేదికను తెనాలిలో నిర్వహించటం గొప్పగా ఉందన్నారు. సంఘ అధ్యక్షుడు దక్షిణామూర్తి మాట్లాడుతూ వైష్ణవి కేటరర్స్ హైదరాబాద్, బ్రాహ్మణ పరిషత్, వివిధ బ్రాహ్మణ సంఘాలు, అర్చక సంఘాల సహకారంతో నిర్వహించినట్టు తెలిపారు. తెనాలిలో ప్రతి ఆదివారం ఉచిత సమాచార సేవలను అందిస్తున్నట్టు గౌరవ అధ్యక్షుడు ప్రకాష్రావు చెప్పారు. సమాచార వేదికను ఏర్పాటుచేసిన సూర్యప్రకాశరావు, సుబ్బారావు సత్యబాబు, రామ్మోహనరావు ఆశయానికి అనుగుణంగా సేవలు అందిస్తున్నట్టు కోశాధికారి రాజేంద్రప్రసాద్ చెప్పారు. వివిధ విభాగాల ద్వారా బ్రాహ్మణులకు, బ్రాహ్మణ సంఘాలకు సేవలు అందిస్తున్న ప్రముఖులను సత్కరించారు. ఏపీపీఎస్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేదం హరిప్రసాద్, నెల్లూరు హైదరాబాదు ప్రాంతాల ప్రతినిధులు ఉమాదేవి, జయలక్ష్మి, విశ్వనాథం, మనవ రాము, కందాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సత్యకుమార్, ఉపాధ్యక్షుడు ఆమంచి రాంబాబు, సంయుక్త కార్యదర్శి వేణుధర్, బీఎల్ సత్యనారాయణమూర్తి, పూర్ణ భాస్కర్, శ్రీనివాస్, కోదండ రామమూర్తి, వివిధ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు సాయి, శ్రీనివాసమూర్తి, వేణుగోపాల్ పాల్గొన్నారు. ఐదు రాష్టాల్నుంచి 750 కుటుంబాలు హాజరుకావటం విశేషం! 15వ రాష్ట్రస్థాయి బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదికలో రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య అధ్యక్షుడు కామేశ్వర ప్రసాద్ -
తురకపాలెంలో బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం
గుంటూరు రూరల్: రూరల్ మండలంలోని తురకపాలెంలో ఆకస్మిక మరణాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పందిస్తూ మరణించిన ఒక్కో వ్యక్తి కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఆదివారం గ్రామంలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన స్థానిక ఎమ్మెల్యే బి. రామాంజనేయులు, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాతో కలిసి పాల్గొన్నారు. ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ తురకపాలెం తరహాలో అనారోగ్యాలు ప్రబలినప్పుడు కంటికి రెప్పలా ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం అందరి పైనా ఉందని తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. -
ఫార్మసీ ప్రవేశాలకు కొత్త షెడ్యూల్
గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీ ఈఏపీసెట్–2025లో అర్హత సాధించి, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థుల కోసం రాష్ట్ర ఉన్నత విద్యామండలి, సాంకేతిక విద్యాశాఖ సంయుక్తంగా సవరించిన షెడ్యూల్ విడుదల చేశాయి. ఉమ్మడి గుంటూరుజిల్లాలో 43 ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు ఈనెల 14 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. రిజిస్ట్రేషన్ పూర్తయిన విద్యార్థులు కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు ఈనెల 14 నుంచి 17వ తేదీ వరకు ఆన్లైన్లో ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంది. దరఖాస్తు సమయంలోనే పూర్తయిన సర్టిఫికెట్ల పరిశీలన.. ఏపీ ఈఏపీ సెట్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు హెల్ప్లైన్ కేంద్రాలకు విధిగా వెళ్లాల్సిన అవసరం లేదు. దరఖాస్తు సమయంలోనే విద్యార్థులు సమర్పించిన టెన్త్, ఇంటర్ మార్కుల జాబితాలు, సామాజికవర్గ, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఆన్లైన్లో పూర్తి చేశారు. ధ్రువపత్రాల పరిశీలన అసంపూర్తిగా ఉన్న విద్యార్థులు వాటిని కంప్యూటర్ స్క్రీన్పై కనిపించే సూచనల ఆధారంగా తిరిగి, ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. గుంటూరు శివారు నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్లో హెల్ప్లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 25 నుంచి తుది విడత కౌన్సెలింగ్ బైపీసీ స్ట్రీమ్ మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ ముగిసిన వెంటనే కళాశాలల్లో మిగులు సీట్ల భర్తీ కోసం ఈనెల 25 నుంచి తుది విడత ప్రవేశాల ప్రక్రియ చేపట్టనున్నారు. ఏపీ ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ నోటిఫికేషన్లోనే రెండు విడతలకు సంబంధించిన షెడ్యూల్ వివరాలను పొందుపర్చారు. -
చదువుతో పాటు ఆటపాటలూ అవసరమే..
రేపల్లె: చిన్నారులు విద్యార్థి దశ నుంచే చదువుతో పాటు ఆటపాటల్లో రాణించే విధంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని డాక్టర్ ఆకురాతి సుబ్బారావు తెలిపారు. మండలంలోని పేటేరు జడ్పీ హైస్కూలులో ఏపీ పాఠశాల విద్యాశాఖ, రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్–14 బాలబాలికల తైక్వాండో పోటీలు ఆదివారం రెండవ రోజు ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో డాక్టర్ సుబ్బారావు మాట్లాడుతూ ప్రోత్సాహం ఉంటే విద్యార్థులు ఏదైనా సాధిస్తారని, వారిని విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించే విధంగా ప్రోత్సహించాలని కోరారు. క్రీడలతో శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటారని సూచించారు. జిల్లా కామన్ ఎగ్జామినేషన్ సెక్రటరీ కొచ్చెర్ల ప్రభాకరరావు మాట్లాడుతూ పోటీల్లో 260 మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. ఇందులో బాలికల విభాగంలో 11 మంది బంగారు, 11 మంది రజత, 22 మంది కాంస్య పతకాలు సాధించారని పేర్కొన్నారు.బాలుర విభాగంలో 11 మంది బంగారు, 11 మంది రజత, 22 మంది కాంస్య పతకాలు సాధించారని చెప్పారు. బంగారు పతకాలు సాధించిన బాలురు కొహిమాలో ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు జరిగే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. బాలికలు నవంబర్లో పంజాబ్లో జరిగే పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు చెరుకూరి బాబూజీ, దాతలు రావు హరిప్రసాద్, పర్చూరు శ్యామ్ప్రసాద్, విద్యాకమిటీ చైర్మన్ జె.రేణుకయ్య, సర్పంచ్ కనపర్తి వసుమతి, ఎంపీటీసీ సభ్యురాలు రావు నెహ్రూ లక్ష్మి, గ్రామస్తులు పాల్గొన్నారు. ముగిసిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలు -
జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం
మంగళగిరి టౌన్: మంగళగిరిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నేపాల్ దేశానికి చెందిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు గుంటూరు జిల్లా పెదకాకాని సమీపంలో వున్న ఓ బార్లో సుమారు సంవత్సరం నుంచి నేపాల్కు చెందిన మనోజ్ బిస్తా (26), రాకేష్ (34) పనిచేస్తున్నారు. భ్రమరాంబపురం కాలనీలో ఓ రూమ్ తీసుకుని ఇద్దరూ అద్దెకు ఉంటూ ప్రతిరోజూ విధులకు వెళ్లివస్తుంటారు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి 12 గంటలకు విధులను ముగించుకుని యజమాని దగ్గర నుంచి స్కూటీ తీసుకుని వెళ్లారు. తిరిగి వెళ్లే క్రమంలో ఆదివారం తెల్లవారుజామున 4.30 సమయంలో జాతీయ రహదారిపై విజయవాడ వైపు వెళుతుండగా మంగళగిరి వద్ద వెనుక నుంచి ఓ వాహనం ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు రోడ్డుమధ్యలో పడిపోయారు. అదేసమయంలో వెనుక నుంచి ఓ బస్సు వారిపై నుంచి వెళ్లడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సమీపంలో వున్న ఓ వ్యక్తి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న మంగళగిరి పట్టణ ఎస్ఐ రవీంద్రనాయక్ మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం మంగళగిరి ఎయిమ్స్కు తరలించి మృతుల వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో మనోజ్ బిస్తా (26) యువకుడికి తల్లిదండ్రులు లేరని, 10 సంవత్సరాల నుంచి గుంటూరు నగరంలో వివిధ బార్లలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడని ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. నేపాల్లోని సౌరన ప్రస్తకీర్ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకుల్లో రాకేష్ (34)కు తండ్రి లేడని, అమ్మ, చెల్లి మాత్రమే ఉన్నారని, ఇతను గత సంవత్సర కాలం నుంచి బార్లో పనిచేస్తున్నాడని ఇద్దరూ రూమ్లో అద్దెకు ఉంటూ పెదకాకాని గోల్డెన్ బార్లో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాకేష్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని పేర్కొన్నారు. -
ప్రభుత్వ విద్యారంగం పరిరక్షణే యూటీఎఫ్ లక్ష్యం
నరసరావుపేట: ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ, ఉపాధ్యాయుల సంక్షేమం యూటీఎఫ్ లక్ష్యమని ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూలులో ఏర్పాటు చేసిన మధ్యంతర కౌన్సిల్ సమావేశానికి జిల్లా అధ్యక్షులు పి.శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించారు. ప్రారంభ సూచికగా ఎస్టీఎఫ్ఐ పతాకాన్ని పూర్వ ప్రధాన కార్యదర్శి జి.విజయసారఽథి, యూటీఎఫ్ పతాకాన్ని సీనియర్ నాయకులు ఎ.నాగేశ్వరరావు ఆవిష్కరించారు. పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.మోహనరావు కార్యదర్శి నివేదిక ప్రవేశపెట్టారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ ధ్యేయంగా పని చేయాలని తెలిపారు. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని వేసవి సెలవుల్లో విస్తృత ప్రచారం చేశామన్నారు. పాఠశాలలో విద్యార్థులు ఉంటేనే ఉపాధ్యాయులు ఉంటారని, అవసరమైతే అదనంగా పనిచేసి ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు కట్టుబడి ఉంటామన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై యూటీఎఫ్ అగ్రభాగాన ఉండి పోరాడి సమస్యలు పరిష్కారానికి కృషి చేశామన్నారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలలో రెండు డీఏలను తక్షణమే విడుదల చేసి 30 శాతం ఐఆర్ ప్రకటించాలన్నారు. పీఆర్సీ కమిషన్ నియమించాలని మెమో నెం.57అమలు, 2003 డీఎస్సీ అభ్యర్థులకు ఓపీఎస్ అమలు చేయాలని, బోధనేతర పనులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగంలో 2021లో ఐదేళ్లు కాలానికి ప్రపంచబ్యాంక్తో ఆంధ్ర సపోర్టింగ్ లెర్నింగ్ ట్రాన్స్పర్మేషన్ ఒప్పందం చేసుకుని రూ.1860 కోట్ల అప్పు తీసుకున్నారన్నారు. ఈ పథకం ద్వారా విద్యార్థులను అంతర్జాతీయ విద్యార్థిగా తయారు చేయడం, నాణ్యమైన విద్య అందించడం కాగా లక్ష్యాన్ని నీరుగారుస్తూ ఆన్లైన్లో సమాచారాన్ని పంపించే పాఠశాలలుగా మార్చారన్నారు. విద్యకు బడ్జెట్లో కోత విధించడంతో, విద్యార్థులు, పాఠశాలల సంఖ్య తగ్గి విద్యార్థుల సామర్థ్యాలు తగ్గాయన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలను రక్షించుకోవడం కోసం ఉపాధ్యాయులు మానసిక ఒత్తిడి లేకుండా పని చేయడానికి సాల్టు పథకం రద్దు చేయాలని, దీనికై సామాజిక పోరాటం చేయాలన్నారు. ఉపాధ్యాయులపై యాప్ల భారాన్ని తగ్గించాలన్నారు. రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ టీఎస్ఎన్ మల్లేశ్వరరావు మాట్లాడుతూ యూటీఎఫ్ మండల శాఖలు బలోపేతం చేయాలని, సభ్యత్వం పూర్తిచేసి ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. నూతన ఉపాధ్యాయులకు సహాయ సహకారాలను అందించాలని తెలిపారు. ఎన్ఎంఎంఎస్ పరీక్ష మోడల్ బుక్లెట్ ఆవిష్కరణ ఎనిమిదో తరగతి విద్యార్థులకు నిర్వహించే నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్షకి సంబంధించిన మెంటల్ ఎబిలిటీ టెస్ట్ మెటీరియల్ను జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సంయుక్తంగా ప్రచురించిన బుక్లెట్ను రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. జిల్లా గౌరవ అధ్యక్షులు షేక్ కాసిం పీరా, సహాధ్యక్షులు జెవిడి నాయక్, జిల్లా సహాధ్యక్షురాలు ఎ.బాగేశ్వరిదేవి, కోశాధికారి ఎం.రవిబాబు, జిల్లా కార్యదర్శిలు మండల బాధ్యులు, సీనియర్ నాయకులు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మధ్యంతర కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు -
రాష్ట్ర స్థాయి సెపక్తక్రా పోటీలు ప్రారంభం
చీరాల రూరల్: చీరాల హైస్కూలు రోడ్డులోని మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో 29వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి సెపక్తక్రా జూనియర్ బాల, బాలికల పోటీలు శనివారం ఉత్సాహంగా ప్రారంభయమ్యాయి. ఈ పోటీల్లో రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీలను ముఖ్య అతిథిగా సెపక్తక్రా జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ వైద్యుల విభాగ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఇస్తర్ల బాబురావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ క్రీడకు బాపట్ల జిల్లాలో తగిన ప్రాధాన్యం లేదని తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలతో భవిష్యత్తులో ఆదరణ లభిస్తుందన్నారు. మొదటి రోజు పోటీల్లో ఆయా జిల్లాల క్రీడాకారులు ప్రథమ, ద్వితీయ స్థానాల కోసం ఎంతో శ్రమించారన్నారు. ఆదివారం కూడా ఇవి కొనసాగనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పొత్తూరి సుబ్బయ్య, వన్ టౌన్ సీఐ సుబ్బారావు, ఇస్తర్ల సుభాషిణి, క్రీడాకారులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ను అవమానిస్తే సహించం
వైఎస్సార్ సీపీ నాయకుల హెచ్చరికచీరాల: వైఎస్సార్ను కించపరిస్తే ఊరుకోబోమని వైఎస్సార్సీపీ నేతలు హెచ్చరించారు. నూతనంగా ఏర్పాటు చేయనున్న గడియార స్తంభం విషయమై వైఎస్సార్ విగ్రహం వద్ద మెట్లు, స్టీలు రెయిలింగ్ను తొలగించాలంటూ మున్సిపల్ చైర్మన్ తీసుకున్న నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. శనివారం చీరాలలో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. వైఎస్సార్ విగ్రహం వద్ద గల కూడలిలో గడియార స్తంభం నిర్మాణం గురించి రెండు రోజుల క్రితం మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు స్థానిక కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించారన్నారు. గతంలో ప్రతిపాదించిన రెండు అంశాలను కాకుండా మూడో అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని తెలిపారు. వైఎస్సార్ అభిమానుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా విగ్రహాన్ని ఆనుకొని ఉన్న మెట్లను, స్టీలు రాడ్లు తొలగించే ప్రయత్నాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. గతంలో కౌన్సిల్లో తీర్మానం చేసి ఏఆర్ఎం కాంప్లెక్స్పైన 25 అడుగుల గడియార స్తంభం నిర్మించేందుకు టెండర్ పిలిచారన్నారు. దానిని ముందుకు తీసుకెళ్లే క్రమంలో వ్యతిరేకించిన వ్యక్తి ఇప్పుడున్న చైర్మన్ కాదా అని ప్రశ్నించారు. రెండు సార్లు వైఎస్సార్సీపీ బీ– ఫాంపై గెలిచి నేడు వైఎస్సార్ సీపీ తరఫున కౌన్సిలర్గా ఉండి ప్రతిపాదించిన వ్యక్తులు టీడీపీ కండువా కప్పుకోవడం సిగ్గుచేటన్నారు. గతంలో కారంచేడు గేటు సెంటర్లో కూడా వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. కౌన్సిల్ ఆమోదించిన దానిని కాకుండా మరోలా చేయాలని చూస్తే సహించేది లేదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బొనిగల జైసన్బాబు, పార్టీ పట్టణ అధ్యక్షుడు యాతం మేరిబాబు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు గవిని శ్రీనివాసరావు, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు వాసిమళ్ళ వాసు, యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు కోడూరి ప్రసాద్రెడ్డి, బీసీ సెల్ మెంబర్ గోలి గిరి, పట్టణ ప్రధాన కార్యదర్శి చిరంజీవి మాస్టర్, లీగల్ సెల్ సభ్యులు రాజు వెంకటేశ్వరరెడ్డి, వేటపాలెం మండల అధ్యక్షుడు సాధు రాఘవరావు, మాజీ అధ్యక్షుడు బొడ్డు సుబ్బారావు, రైతు విభాగం చైర్మన్ కావూరి రమణారెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు జంగా మహేష్, కౌన్సిలర్లు బత్తుల అనిల్, కంపా అరుణ్, చీమకుర్తి బాలకృష్ణ, మహిళా నాయకులు ప్రసన్న, పార్టీ నాయకులు రాజ్కుమార్, చెల్లి బాబూరావు, కె.పూర్ణ, కె.చిట్టిబాబు, వెంకటరావు, టి.వినయ్, జంగా ప్రేమ్, బాలకోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గెలుపే లక్ష్యంగా ముందుకుసాగాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్బాపట్ల: క్రీడల తరహాలో జీవితంలోనూ గెలుపు లక్ష్యంగా పోటీతత్వంతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. ఏడవ రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక ఉత్సవాల్లో భాగంగా జిల్లా స్థాయి ఎంపిక పోటీలు శనివారం స్థానిక బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో మొదలయ్యాయి. రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ పోటీలను ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. జాతీయ జెండాను కలెక్టర్ ఎగురవేయగా, రెవెన్యూ అసోసియేషన్ జెండాను సంఘం జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు ఆవిష్కరించారు. తదుపరి వాలీబాల్, కబడ్డీ, కుర్చీలాట, చదరంగం, క్యారమ్స్ పోటీలను తిలకించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. రాష్ట్ర స్థాయి పోటీలలో గెలుపొందిన వారికి బాపట్లలో మంచి అవకాశాలు కల్పిస్తామని ప్రోత్సహించారు. పాఠశాల విద్యార్థిగా కర్ణాటక రాష్ట్రం సౌత్ జోన్ పరిధిలో క్రికెట్ ఆడానని, పదో తరగతిలో బాస్కెట్ బాల్ జిల్లా బృందంలో సభ్యుడిగా ఉన్నానంటూ తన అనుభవాలను మననం చేసుకున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల పురోగతిలో రెవెన్యూ ఉద్యోగుల బాధ్యత చాలా కీలకమని బాపట్ల ఆర్డీవో పి.గ్లోరియా చెప్పారు. క్రీడాకారులు పతకాలు సాధించాలని చీరాల ఆర్డీవో టి.చంద్రశేఖర్ తెలిపారు. గెలుపోటములు పక్కనపెట్టి జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని రేపల్లె ఆర్డీఓ రామలక్ష్మి తెలిపారు. జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు సి.హెచ్. సురేష్ బాబు, ఇంజినీరింగ్ కళాశాల కరస్పాండెంట్ ముప్పులనేని శ్రీనివాసరావు, కార్యదర్శి ఎం.నాగేశ్వరరావు, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.విజయమ్మ, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి కె.పాల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక మాయం.. కృష్ణమ్మకు శోకం
కృష్ణానదిలో ఇసుక అక్రమ తవ్వకాల వ్యవహారం ఎక్కువైంది. తవ్వకాలను నిలువరించేందుకు పోలీసు, రెవెన్యూ యంత్రాంగంతో బృందాలు ఏర్పాటు చేసినా ఇసుకాసురులు ట్రాక్టర్ల ద్వారా యథేచ్ఛగా ఇసుక తీసుకెళుతున్నారు. భారీ సంఖ్యలో ట్రాక్టర్లు నదిలోకి ప్రవేశించినా పోలీసు, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. కొల్లూరు: కూటమి ప్రభుత్వానికి చెందిన నాయకులు కృష్ణానదిలో ఇష్టానుసారంగా ఇసుకను తవ్వి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. శనివారం మండలంలోని గాజుల్లంక వద్ద ఇతర ప్రాంతాలకు చెందిన ట్రాక్టర్లు వందల సంఖ్యలో నదిలో నీటి మధ్యన ఇసుక తవ్వకాలు చేపట్టడం వివాదాస్పదమైంది. గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు నదిలో ఇసుక తవ్వకాలపై నిషేధం కొనసాగుతోంది. ఈ తరుణంలో రెవెన్యూ, పోలీసు బృందాలను ఈ తవ్వకాలను అరికట్టేందుకు ఏర్పాటు చేశారు. తీర గ్రామాలకు చెందిన వ్యక్తులను సైతం గృహ నిర్మాణ అవసరాలకు ఇసుక తరలింపుపై అధికారులు ఆంక్షలు పెట్టారు. ట్రాక్టర్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో స్థానికంగా ఆగ్రహం వ్యక్తమైంది. అధికారుల కళ్లెదుటే నదిలోకి ట్రాక్టర్లు వెళ్లినా పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉచిత ఇసుక సాకుతో భారీ సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా వాల్టా వంటి చట్టాలను అతిక్రమించి తవ్వకాలు చేపడుతున్నారని మండిపడ్డారు. కూటమి నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇలా వ్యహరిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. కేసులు కూడా శూన్యం ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న ట్రాక్టర్లను ఎప్పుడైనా స్వాధీనం చేసుకున్నా, సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేయడం లేదు. స్వాధీనం చేసుకున్న ట్రాక్టర్లను శనివారం పోలీసు స్టేషన్కు తరలించారు. అక్రమ రవాణాదారులతో అధికారులు కుమ్మక్కయ్యారని సమాచారం.కృష్ణా నదిలో ఇసుకను అక్రమంగా తవ్వి తరలించకుండా పోలీసు పికెట్ ఏర్పాటు చేశాం. ఉదయం వేళ అధికారుల బృందాలను లెక్క చేయకుండా నదిలోకి ట్రాక్టర్లు దిగాయి. ఇసుక లోడింగ్ చేస్తున్న సమాచారంతో సిబ్బందితో వెళ్లేసరికి ఇసుక అన్లోడ్ చేసి ట్రాక్టర్లతో పరారయ్యారు. ఇకపై తవ్వకాలు చేపడితే కేసులు తప్పవు. – జానకి అమరవర్ధన్, ఎస్ఐ, కొల్లూరు -
సంక్షేమ పథకాలకు రూ. 47వేల కోట్లు ఖర్చు
కొల్లిపర: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో రూ. 47 వేల కోట్లను సంక్షేమ పథకాలకు ఖర్చు చేశామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మండలంలోని చక్రాయపాలెంలో శఽనివారం రూ.81 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ (కల్యాణ మండపం) ప్రారంభంతో పాటు అత్తోటలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్తో కలసి శంకుస్థాపన చేశారు. కేంద్ర మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ ఎన్నికల్లో తనకు 95 శాతం ఓట్లు వేసి గెలిపించిన ఏకై క గ్రామం చక్రాయపాలెమని కొనియాడారు. కల్యాణ మండపం చుట్టూ కాంపౌండ్ వాల్, డొంక రోడ్డు , డ్రెయినేజీలు నిర్మాణ సమస్యలను గ్రామస్తులు తన దృష్టికి తీసుకు వచ్చినట్లు తెలిపారు. ఎంపీ నిధులు నుంచి కాంపౌండ్ వాల్ నిర్మాణానికి, విద్యుత్ ట్రాన్స్ఫారం కోసం రూ.13 లక్షలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. మిగిలిన సమస్యల్ని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర మంత్రి మనోహర్ మాట్లాడుతూ రాబోవు 15 రోజుల్లో దేశంలో ఎన్నడూ లేని విధంగా విశాఖపట్టంలో గూగుల్ సంస్థ రూ.87 వేల కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సహాయ, సహకారాలు అందిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో చందు నాగేశ్వరరావు, అమ్మిశెట్టి హరికృష్ణ, సీతారామయ్య, హరికృష్ణ, కూటమి నాయకులు పాల్గొన్నారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ -
యూపీఐ మోసాలపై అప్రమత్తత అవసరం
బాపట్ల టౌన్: యూపీఐ మోసాలపై వ్యాపారస్తులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఎఫైర్స్ 14సీ (ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్) నిర్వాహకులు అక్టోబర్ను సైబర్ నేరాల అవగాహన మాసంగా ప్రకటించారని తెలిపారు. దానిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేకంగా యూపీఐ పేమెంట్స్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల గురించి ప్రజలు, వ్యాపారస్తులకు అవగాహన కల్పించడానికి జిల్లా పోలీస్ అధికారులు కృషి చేస్తున్నట్లు తెలిపారు. తమ పరిధిలోని మార్కెట్లలో, వ్యాపార సముదాయాల్లో ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వివరించారు. దుకాణదారులు అపరిచిత వ్యక్తులకు యూపీఐ పిన్ నమోదు సంఖ్య చెప్పవద్దని ఎస్పీ సూచించారు. ఒక్కసారి సైబర్ నేరస్తుల వలలో పడితే పోయిన డబ్బులను తిరిగి పొందడం చాలా కష్టమని చెప్పారు. స్మార్ట్ ఫోన్న్లలో పేమెంట్ యాప్లను ఉపయోగించి సులభంగా లక్షల్లో లావాదేవీలు కూడా క్షణాల్లో చేసేస్తున్నారని పేర్కొన్నారు. తెలియని వ్యక్తులు దుకాణాలకు వచ్చి వస్తువులు కొనుగోలు చేసి ఫోన్న్పే, గూగుల్ పే చేస్తామని చెబుతారన్నారు. ముందుగా రూ.1 పంపి తర్వాత యూపీఐలో మనీ రిక్వెస్ట్ పంపి ఖాతాలో మొత్తం డబ్బుని దొంగిలిస్తున్నారని ఎస్పీ వివరించారు. ఎట్టి పరిస్థితులలోనూ ఫోన్ ఇతరులకు ఇవ్వకూడదని, సైబర్ మోసానికి గురైనట్లు గ్రహిస్తే వెంటనే హెల్ప్లైన్ నంబర్ 1930కు కాల్ చేయాలని సూచించారు. ఎస్పీ బి. ఉమామహేశ్వర్ -
సమన్వయంతో ఉత్తమ సేవలు అందించాలి
నరసరావుపేట రూరల్: పోలీస్ సిబ్బంది సమన్వయంతో ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు పేర్కొన్నారు. సెప్టెంబర్ నెల నేర సమీక్ష సమావేశం శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజలకు సత్వర, నాణ్యమైన సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి ఎస్పీ కృష్ణారావు దిశానిర్దేశం చేశారు. పోలీసు సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. పోలీస్స్టేషన్ రిసెప్షన్లో నైపుణ్యం కలిగిన సిబ్బందిని నియమించి, ఫిర్యాదుతో వచ్చే ప్రజలతో మర్యాదతో వ్యవహరించి, బాధ్యతతో పరిష్కరించాలని పేర్కొన్నారు. పీజీఆర్ఎస్లో అందిన ఫిర్యాదులను సమయానుకూలంగా, నాణ్యమైన రీతిలో పరిష్కరించాలన్నారు. మహిళల నుంచి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని, అవసరమైతే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని తెలిపారు. 60, 90రోజుల్లో దర్యాప్తు పూర్తిచేయాల్సిన కేసులను వేగంగా పూర్తిచేసి, న్యాయస్థానంలో ప్రాథమిక చార్జిషీట్ సమర్పించాలని స్పష్టంచేశారు. మహిళా పోలీసుల సహకారంతో శక్తి యాప్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రాత్రి గస్తీ వ్యవస్థను పటిష్టం చేయాలని ఆదేశించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ఫోన్ డ్రైవింగ్తోపాటు బహిరంగ ప్రాంతాల్లో మద్యం తాగే వారిపై కేసులు నమోదు చేయాలని తెలిపారు. సమస్యాత్మక గ్రామాల్లో పల్లె నిద్ర, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. బాణసంచా విక్రయ దుకాణాలను పరిశీలించి అనుమతి లేని విక్రయదారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ(అడ్మిన్) జేవి సంతోష్, అదనపు ఎస్పీ(క్రైమ్) లక్ష్మీపతి, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
కూలిన ఆలేరు రిటైనింగ్ వాల్
ఇంకొల్లు(చినగంజాం): మండలంలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఆలేరు సర్ప్లస్కు సంబంధించిన రిటైనింగ్ వాల్ కూలిపోయింది. నాలుగు సంవత్సరాల క్రితం వచ్చిన వర్షపు నీటి ఉధృతి కారణంగా ఒక రిటైనింగ్ వాల్ కూలిపోయింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు రెండో రిటైనింగ్ వాల్ శుక్రవారం రాత్రి కూలిపోయింది. రెండువైపులా రిటైనింగ్ వాల్ కూలిపోవడంతో ఆలేరు సర్ప్లస్ ప్రమాదంలో పడింది. ప్రస్తుతం వర్షపు నీరు ఉధృతంగా ప్రవస్తోంది. ఇప్పటికై నా ఆర్ అండ్ బీ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. -
ఆవు కడుపులో 55 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలు
కొల్లూరు : ప్లాస్టిక్ వినియోగాన్ని నిర్మూలించడంతో కూటమి ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. విచ్చల విడిగా వినియోగిస్తున్న క్యారీ బ్యాగ్ల కారణంగా ఓ మూగ జీవి ప్రాణాల మీదకు వచ్చిన సంఘటన కొల్లూరులో చోటు చేసుకుంది. కొల్లూరు గౌడపాలేనికి చెందిన మార్గన బాలాజీ రెండు నెలల కిందట రేపల్లె నుంచి వీధుల్లో తిరిగే ఆవును కొనుగోలు చేసి పోషిస్తున్నాడు. నెల రోజుల కిందట దూడ కూడా పుట్టింది. అయితే, ఆవు మేత తినకుండా మందకొడిగా ఉంటోంది. ఆందోళనకు గురైన యజమాని కొల్లూరు పశువైద్యాధికారిని సంప్రదించాడు. శనివారం గోవును పరిశీలించిన పశువైద్యాధికారి యశ్వంత్ పొట్ట గట్టిగా రాయిలా ఉండటంతో అనుమానం వచ్చి శస్త్ర చికిత్స చేశారు. గంటల కొద్దీ శ్రమించి కడుపులో ఉన్న 54.70 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. అనంతరం ఆవు ప్రాణాపాయ స్థితి నుంచి సాధారణ స్థితికి చేరుకోవడంతో వైద్యాధికారిని స్థానికులు అభినందించారు. క్రోసూరు: పిడుగుపాటులో ఇంటి స్లాబ్ పాక్షికంగా ధ్వంసమైన ఘటన శనివారం వేకువజామున చోటుచేసుకుంది. క్రోసూరులోని కటకం కల్యాణ మండపం ఎదురు బజారు(కొత్తూరు)లో షేక్ నాగూరు ఉంటున్నాడు. తెల్లవారుజామున ఇంటిపై పిడుగు పడింది. దాని ధాటికి ఇంటి వరండా స్లాబ్ బీటలు వారింది. విద్యుత్ మీటర్ కాలిపోయింది. ఫ్రిజ్, ఫ్యాన్లు, వాషింగ్ మిషన్లు పూర్తిగా పాడయ్యాయి. ఇంటి ముందున్న విద్యుత్ స్తంభం తీగలు తెగిపడిపోయాయి. అంతేకాకుండా అదే వీధిలోని అనేక మంది ఇళ్లలో విద్యుత్ పరికరాలు, నీళ్ల మోటార్లు, టీవీలు పాడయినట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలాన్ని మాజీ శాసనసభ్యుడు నంబూరు శంకరావు సందర్శించి, బాధితుడిని పరామర్శించారు. వీఆర్వో లేళ్ల బ్రహ్మనాయుడు బాధితుడి నుంచి వివరాలు సేకరించారు. మంగళగిరి టౌన్: మహిళలు శ్రమ దోపిడీకి గురవుతున్నారని, దీనికి వ్యతిరేకంగా సంఘటితంగా ఉద్యమించాలని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డి. శ్రీనివాసకుమారి పిలుపునిచ్చారు. మంగళగిరి నగర పరిధిలోని ఐద్వా కార్యాలయంలో శనివారం గుంటూరు జిల్లా 12వ మహాసభను నిర్వహించారు. ఐద్వా జెండాను ఆవిష్కరించిన అనంతరం శ్రీనివాసకుమారి మాట్లాడారు. సమాజంలో జరుగుతున్న పరిణామాలపై మహిళలు ప్రశ్నించేతత్వం అలవర్చుకోవాలని చెప్పారు. తొలుత మహిళా ఉద్యమంలో అమరులైన మల్లు స్వరాజ్యం, మోటూరు ఉదయం, మానికొండ సూర్యావతి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రామిక జిల్లా మహిళా కన్వీనర్ అరుణ, ఐద్వా జిల్లా నాయకురాలు సుధా కిరణ్, జిల్లా మాజీ కార్యదర్శి ప్రమీల, మంగళగిరి రూరల్ అధ్యక్ష, కార్యదర్శులు సంధ్య, విజయలక్ష్మి, సభ్యులు పద్మ, గిరిజ, కల్యాణి పాల్గొన్నారు. జిల్లా ఐద్వా కమిటీఎంపిక మహాసభలో గుంటూరు జిల్లా ఐద్వా కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా కె. పద్మ, కార్యదర్శిగా అరుణ, సహాయ కార్యదర్శులుగా గిరిజ, సుమ, ఉపాధ్యక్షులుగా శ్రీనివాసకుమారితో పాటు 15 మందితో కమిటీ ఎన్నికై ంది. -
రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలు ప్రారంభం
రేపల్లె: క్రీడలతో శారీరక దృఢత్వమే కాకుండా మానసికోల్లాసం, సంపూర్ణ ఆరోగ్యాలు చేకూరతాయని బాపట్ల జిల్లా కామన్ ఎగ్జామినేషన్ సెక్రటరీ కొచ్చెర్ల ప్రభాకరరావు తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, విద్యాశాఖల సంయుక్త ఆధ్వర్యంలో 16వ రాష్ట్రస్థాయి అండర్–14 బాల బాలికల తైక్వాండో పోటీలు మండలంలోని పేటేరు జడ్పీ హైస్కూలులో శనివారం ప్రారంభమయ్యాయి. పాఠశాలలో జెండా వందనం చేసి పోటీలను ప్రభాకరరావు ప్రారంభించి మాట్లాడారు. క్రీడల్లో రాణించే వారికి మంచి గుర్తింపుతో పాటు బంగారు భవిష్యత్ లభిస్తుందని చెప్పారు. కేవలం చదువుకే పరిమితం కాకుండా విద్యార్థులు ఆటపాటల్లో రాణించాలని తెలిపారు. పోటీలకు ఉమ్మడి 13 జిల్లాల నుంచి జిల్లాకు 20 మది చొప్పున 260 మంది క్రీడాకారులు హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు బాపూజీ, సర్పంచ్ కనపర్తి వసుమతి, ఎస్ఎంసీ చైర్మన్ వీర్లంకయ్య, బాపట్ల జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ కె.వెంకటేశ్వరరావు, రాష్ట్ర పరిశీలకులు దేవేంద్రనాథ్, నాయకులు గోలి రామశేషగిరిరావు, శాస్త్రి, పర్చూరు శ్యామ్ప్రసాద్, రావు ప్రభాకరరావు, కనపర్తి రవికిరణ్, వివిధ పాఠశాలల పీఈటీలు, ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
బాపట్ల టౌన్: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం ఉదయం మచ్చావారిపాలెం సమీపంలోని 216 జాతీయర హదారిపై చోటుచేసుకుంది. కర్లపాలెం గ్రామానికి చెందిన బొద్దులూరి చిట్టిబాబు(45) సైకిల్పై బాపట్ల మండలం చింతావారిపాలెంలో నివాసం ఉంటున్న పిన్ని వద్దకు వెళ్తున్నాడు. అదే సమయంలో అటుగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్ఐ విజయ్కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. -
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం
కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్బాపట్ల: బాల్య వివాహ రహిత బాపట్ల జిల్లా దిశగా కలిసికట్టుగా పని చేద్దామని కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్, బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్లోని న్యూ వీడియో కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం జిల్లా మహిళ శిశు సంక్షేమ శాఖ ముద్రించిన బాల్యవివాహాలు – చట్ట రీత్య నేరం, అత్యవసర హెల్ప్ లైన్ నంబర్లు, చైల్డ్ హెల్ప్ లైన్ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా జిల్లాలోని వివిధ పాఠశాలల్లో నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థినులకు ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులు అందజేశారు. దేవదాయ శాఖ భూములను పరిరక్షించాలి దేవదాయశాఖ భూముల పరిరక్షణపై జిల్లాస్థాయి కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. దేవదాయ శాఖ భూములు ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. భూములు, ఆస్తుల వివరాలను మండలాల వారీగా జాబితాలను తయారు చేయాలని ఆయన అధికారులకు చెప్పారు. సమావేశంలో జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సూర్య ప్రకాష్, సర్వే శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కనక ప్రసాద్, బాపట్ల ఆర్డీఓ పి.గ్లోరియా, చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్, రేపల్లె ఆర్డీఓ రామలక్ష్మి పాల్గొన్నారు. బాల కార్మికుల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలి బాల కార్మికుల నిర్మూలనకు అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాలులో న్శుక్రవారం బాల కార్మికుల నిర్మూలన జిల్లా కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. పాఠశాలకు రాని విద్యార్థుల వివరాలను సేకరించాలని ఆయన విద్యాధికారులకు తెలిపారు. 14 సంవత్సరాల్లోపు పిల్లలు ప్రభుత్వ నిబంధనల మేరకు పాఠశాలలోనే ఉండాలని, వారు ఎక్కడా పని చేయడానికి వీల్లేదని చెప్పారు. అసంఘటిత కార్మికుల సంక్షేమానికి చర్యలు వివిధ రంగాల్లో పనిచేసే అసంఘటిత కార్మికుల పేర్లను ఈశ్రం పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేయించుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈఎస్ఐ, ఈపీఎఫ్ సభ్యత్వం లేని వారు, ఆదాయ పన్ను పరిధిలోకి రానివారంతా అర్హులేనని కలెక్టర్ పేర్కొన్నారు. లబ్ధిదారులకు సామాజిక భద్రతతో పాటు ఇతర సంక్షేమ పథకాలు వర్తిస్తాయని చెప్పారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసే ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవాలని ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో కార్మిక శాఖ సహాయ కమిషనర్ వెంకట శివప్రసాద్, వ్యవసాయ మార్కెటింగ్ మేనేజర్ రమేష్, మత్స్యశాఖ ఉప సంచాలకులు గాలి దేవుడు, వ్యవసాయ శాఖ జేడీ సుబ్రహ్మణ్యేశ్వరరావు, బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజ్ దిబోరా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి విజయమ్మ, బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ రెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
కోటి సంతకాల సేకరణ విజయవంతం చేయండి
ఇంకొల్లు(చినగంజాం): మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమాన్ని విజయవంతం చేయాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ ఇన్చార్జ్ గాదె మధుసూదనరెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని పావులూరు పార్టీ కార్యాలయంలో శుక్రవారం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాలు సేకరణ పోస్టర్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తా కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని ముందుకు నడిపించాలని, ప్రభుత్వం స్పందించేలా భాగస్వాములు కావాలని ఆయన తెలిపారు. పేదవాడికి వైద్యసేవలను ఉచితంగా అందించే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దారుణమని, మహా ఉద్యమాన్ని ముందుకు నడిపించి విజయం సాధించాలని కోరారు. జిల్లా అధికార ప్రతినిధి బండారు ప్రభాకరరావు, నేతలు యు. అనిల్ చౌదరి, బండి రామయ్య, అడక గంగయ్య, చందోలు ఖాదర్ బాష, అట్లూరి జయపాల్, రమేష్, దుడ్డు ప్రసన్న, రావెళ్ల అంజిబాబు, మోషే, మైలా చిన నాగేశ్వరరావు, బుజ్జి నాయక్, అహ్మద్, ములకా సుబ్బారెడ్డి, సింహాద్రి బ్రహ్మారెడ్డి, తమ్మలూరి సురేష్,అట్లూరి కృష్ణారావు పాల్గొన్నారు. -
బాణసంచా తయారీ దుకాణాలపై నిఘా
బాపట్ల టౌన్: బాణసంచా తయారీ దుకాణాలపై నిత్యం నిఘా ఉండాలని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీగా బి. ఉమామహేశ్వర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా నిర్వహించిన సమావేశం కావడంతో జిల్లాలోని అన్ని అంశాలపై ఆయా అధికారులను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. తొలుత ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలు, పరిష్కరించేందుకు తీసుకున్న చర్యలు, విచారణ దశలో ఉన్న కేసుల పురోగతి, మహిళల మిస్సింగ్, గంజాయి, ఎస్సీ ఎస్టీ సంబంధిత కేసుల దర్యాప్తు, సైబర్ నేరాలు, శక్తి యాప్, మహిళ సంబంధిత చట్టాలపై సర్కిల్ వారీగా రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాణసంచా తయారీ, నిలువ చేసే కేంద్రాలు, విక్రయ దుకాణాలకు తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతులు ఉండాలని స్పష్టం చేశారు. జిల్లా పోలీస్ అధికారులు వాటిని తరచూ తనిఖీ చేస్తూ ఉండాలని ఆదేశించారు. జాగ్రత్తలు తీసుకోని వారిపై, నిబంధనలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇళ్లలో నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేసిన మందుగుండు సామగ్రిని సీజ్ చేయాలని తెలిపారు. పాత నేరస్తులపై నిఘా ఉంచాలి గతంలో నేరాలకు పాల్పడిన వారిపై నిరంతరం నిఘా ఉంచాలని, వారి కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఎస్పీ సూచించారు. పాత నేరస్తులు, రౌడీషీటర్లు, చెడు నడత కలిగిన వ్యక్తుల వివరాలు సంబంధిత స్టేషన్ ఎస్హెచ్ఓకు పూర్తిగా తెలిసి ఉండాలని చెప్పారు. నేరస్తుల పూర్తి సమాచారం ఉన్నప్పుడే నేరాలను సమర్థంగా కట్టడి చేయగలమని తెలిపారు. సోషల్ మీడియాపై నిఘా ఉంచాలన్నారు. ప్రజలు, రాజకీయ పార్టీలను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టిన వారిపై, ఇతరుల మనోభావాలకు భంగం కలిగే విధంగా వార్తలు వ్యాపింప చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గృహాలు, వ్యాపార సముదాయాలకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా యజమానులను ప్రోత్సహించాలని తెలిపారు. నిర్మానుష్య ప్రదేశాలు, బహిరంగ ప్రదేశాల్లో, నిరుపయోగంగా ఉన్న భవనాలు, అసాంఘిక కార్యకలాపాలు జరగడానికి అవకాశం ఉన్న ప్రదేశాలలో డ్రోన్లను ఎగురవేసి క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. దొంగతనాలు అరికట్టేందుకు నైట్ బీట్, పెట్రోలింగ్ పటిష్టంగా నిర్వహించాలని, స్టేషన్ ఎస్హెచ్ఓ కూడా తప్పనిసరిగా రాత్రిపూట పెట్రోలింగ్ నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు. సమావేశంలో రేపల్లె, బాపట్ల, చీరాల డీఎస్పీలు ఏ.శ్రీనివాసరావు, జి.రామాంజనేయులు, ఎండీ మోయిన్, సీసీఎస్ డీఎస్పీ పి. జగదీష్ నాయక్, డీసీఆర్బీ డీఎస్పీ బాలమురళీకృష్ణ పాల్గొన్నారు. -
పసిప్రాణాలంటే ఎంత అలుసో..!
చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యంతో ఆసుపత్రి పాలైన హాస్టల్ విద్యార్థులు ప్రత్తిపాడు: పెదనందిపాడు మండలం అన్నపర్రులోని బీసీ హాస్టల్లో నాలుగు నుంచి పది తరగతుల వరకు మొత్తం 107 మంది విద్యార్థులున్నారు. వీరికి గురువారం రాత్రి బెండకాయ వేపుడు, రసం, మజ్జిగతో భోజనం పెట్టారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఒకరి తరువాత ఒకరు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో బాధపడుతున్నారు. గమనించిన నైట్ వాచ్మన్ విషయాన్ని ఉదయం విధులకు వచ్చిన కుక్ కల్పనకు చెప్పారు. అప్పటికే 17 మంది అస్వస్థతకు గురై బాధపడుతుండటంతో కల్పన వారిని ఆటోలో పెదనందిపాడు పీహెచ్సీకి తరలించారు. ఉదయం కిచిడీ, టమాట చట్నీతో టిఫిన్ చేసిన తరువాత అదేవిధంగా బాధపడుతున్న మరో 37 మంది విద్యార్థులను కూడా ఆస్పత్రికి తరలించారు. వారిలో 16 మందిని మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్కు 108 వాహనాల్లో పంపించారు. సాయంత్రానికి 21 మందిని డిశ్చార్జ్ చేసి హాస్టల్కు తరలించగా, 17 మంది శిబిరంలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న కలెక్టర్ తమీమ్ అన్సారియా పెదనందిపాడు పీహెచ్సీకి చేరుకుని బాధిత విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులుతో కలిసి హాస్టల్ను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆస్పత్రిలో సరిపోని బెడ్లు ఒక్కసారే సుమారు యాభై మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రికి రావడంతో ఆస్పత్రిలో ఉన్న బెడ్లు సరిపోలేదు. దీంతో ఒక్కో మంచంపై ఇద్దరు, ముగ్గురు, నలుగురిని కూడా పడుకోబెట్టి చికిత్స అందించారు. మంచం చుట్టూ సైలెను స్టాండ్లు పెట్టడంతో చేతులు అటూ ఇటూ కదపలేక, కడుపునొప్పి తాళలేక విద్యార్థులు నరరకయాతన అనుభవించారు. అనంతరం వారి ఇబ్బందులను గమనించిన కలెక్టర్.. కల్యాణమండపంలో స్పెషల్ క్యాంప్ ఏర్పాటు చేయించారు. సైలెన్ స్టాండ్లు కూడా సరిపడినన్ని లేకపోవడంతో విద్యార్థులే ఒక చేతితో సైలెన్ బాటిల్ పట్టుకుని కనిపించగా, మరికొందరికి ఆశా కార్యకర్తలు బాటిళ్లు పట్టుకోవాల్సి వచ్చింది. తీవ్ర జ్వరంతో బాధపడుతూ.. అస్వస్థతకు గురైన విద్యార్థుల్లో పదహారు మందిని మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్కు తరలించారు. జ్వరం కూడా ఉన్నట్లు వైద్యులు గమనించారు. విద్యార్థులు ఇంత పెద్ద సంఖ్యలో అస్వస్థతకు గురవ్వడానికి స్పష్టమైన కారణాలు తెలియడం లేదు. దీంతో ఆయా శాఖల అధికారులు ఆహార పదార్థాల, తాగునీటి నమూనాలను సేకరించారు. ఇదిలా ఉంటే బుధవారం రాత్రి కూడా బయటి నుంచి బిర్యానీ, కలియా, పెరుగు చట్నీలు వచ్చాయి. వాటిని విద్యార్థులకు అందించారు. మరుసటి రోజు నుంచి కడుపునొప్పితో బాధపడినట్లు కొందరు విద్యార్థులు చెప్పారు. మంత్రి దుర్గేష్ ఆరా గుంటూరు మెడికల్: హాస్టల్లో విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై జిల్లా ఇన్చార్జి మంత్రి కందుల దుర్గేష్ ఆరా తీశారు. వారు అస్వస్థతకు గురవ్వడం బాధాకరమని పేర్కొన్నారు. గురువారం రాత్రి విద్యార్థులు భోజనం చేసే సమయంలోగానీ, ఉదయం విద్యార్థులు అస్వస్థతకు గురైనప్పుడుగానీ, వారిని ఆస్పత్రికి తరలించే సమయంలోగానీ వార్డెన్ అందుబాటులో లేకపోవడం ఆయన విధుల పట్ల వహిస్తున్న నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. కుక్కు సమీప బంధువు అయిన అశోక్ గత కొద్ది నెలలుగా హాస్టల్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇతనికి జీతం కూడా వార్డెన్ తన జేబు నుంచే చెల్లిస్తున్నట్లు చెబుతున్నారు. అశోక్ గురువారం రాత్రి వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. నీరు మాత్రమే తాగాడని సిబ్బంది చెబుతున్నారు. -
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలి
పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రవి రెంటచింతల: స్థానిక పీహెచ్సీ కేంద్రానికి వివిధ రకాల వ్యాధులతో వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కె.రవి సిబ్బందికి సూచించారు. స్థానిక పీహెచ్సీ కేంద్రాన్ని ఆయన శుక్రవారం జిల్లా మలేరియా అధికారి రత్నాకర్తో కలసి ఆకస్మికంగా సందర్శించారు. ల్యాబ్లో నిర్వహిస్తున్న పరీక్షల గురించి తెలుసుకుని రికార్డులు పరిశీలించారు. ప్రస్తుతం జ్వరాల సీజన్ కాబట్టి ల్యాబ్ టెక్నీషియన్లు నిత్యం ఆస్పత్రిలో అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఆరోగ్య సిబ్బందికి సలహాలు, సూచనలు అందిస్తూ ఉండాలని చెప్పారు. ప్రస్తుతం పీహెచ్సీ పరిధిలో జ్వరం కేసుల వివరాలను మెడికల్ ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోజూ పీహెచ్సీకి వచ్చే రోగుల వివరాలు(ఓపీ) నమోదు, ఆస్పత్రిలో రోగులకు ఆరోగ్య, ఆశా కార్యకర్తలు అందిస్తున్న సేవలు, రక్త పరీక్షల వివరాలు, మందులు ఇచ్చే విభాగం పనితీరు, వివిధ రికార్డులు పరిశీలించారు. అనంతరం రెంటచింతల గ్రామంలోని పలు ప్రాంతాలలో పర్యటించారు. ఫ్రైడే డ్రైడేను పరిశీలించారు. స్థానిక ఆరోగ్య సిబ్బందికి విష జ్వరాలపై పలు సూచనలు చేశారు. పారిశుద్ధ్య కార్యక్రమాలను మెరుగుపరచాలని ఆదేశించారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ ఎన్.కోటేశ్వరరావు, మలేరియా సూపర్వైజర్ సీహెచ్ అంకమ్మరావు, ఎంపీహెచ్ఈఓ ఏడీ శర్మ, ఎ.ఆంజనేయులు, హెల్త్ అసిస్టెంట్ షేక్ ఖాసింసా, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో 25 వేల మంది లబ్ధిదారులు
అప్పట్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో దాదాపు 25 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ నుంచి ఎల్ఐసీ బాండ్లు అందుకున్నారు. వీటి కాలపరిమితి కూడా ముగిసింది. పథకం కింద నగదు మంజూరు చేయాలని కోరుతూ జిల్లావ్యాప్తంగా 1192 మంది దరఖాస్తులు చేసుకొన్నారు. వీరిలో పలువురు రెండేళ్ల నుంచి ఐసీడీఎస్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రస్తుతం కాల పరిమితి ముగిసిన లబ్ధిదారుల నుంచి అధికారులు దరఖాస్తులు కూడా తీసుకోవడం లేదు. ముందు ఇచ్చిన బాండ్లకు ఇంత వరకు నగదు అందలేదు. కాల పరిమితి ముగిసిన వారు వందల సంఖ్యలో ఉన్నారు. తమకు నగదు ఇవ్వాలని పలువురు దరఖాస్తులు చేసుకోవడానికి ఇంకా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం కలుగజేసుకొని న్యాయం చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
సంపూర్ణ ఆరోగ్యానికి ఈత దోహదం
గుంటూరు వెస్ట్ (క్రీడలు): ఈతతో మెరుగైన శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఉల్లాసం కలుగుతాయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. హరినాథ్ పేర్కొన్నారు. శుక్రవారం శ్యామలానగర్లోని ఈత కొలనులో కానాల అంజనీ శ్రీకాంత్ రెడ్డి స్మారక 8వ మాస్టర్స్ అంతర్ జిల్లాల పోటీలు జరిగాయి. బహుమతి ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిత్యం ఏదో ఒక క్రీడలో సాధన చేయాలన్నారు. యోగా కూడా ఎంతో మేలు చేస్తుందని వెల్లడించారు. జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు పెద్ది రమణ రావు మాట్లాడుతూ 20–90 ఏళ్ల వరకు వయస్సున్న వారికి ఈ పోటీలను ఏటా మాదిరిగానే నిర్వహించామన్నారు. 180 మంది పాల్గొన్నారన్నారు. పోటీలను ఉదయం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే గళ్లా మాధవి, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావులు ప్రారంభించారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి పోటీలకు కారంచేడు విద్యార్థులు
కారంచేడు: త్వరలో జరగనున్న రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు కారంచేడు విద్యార్థులు ఎంపికయ్యారు. ఒంగోలులో ఈ నెల 7న నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలకు కారంచేడు యార్లగడ్డ నాయుడమ్మ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 7వ తరగతి విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 60 కేజీల బాలికల విభాగంలో భవ్యశ్రీ , బాలుర విభాగంలో బి. సుదీప్కుమార్ ఎంపికయ్యారు. 55 కేజీల విభాగంలో కె. దుర్గ ఎంపికై నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. విద్యార్థులను శుక్రవారం చీరాల డిప్యూటీ ఈఓ కె. గంగాధర్ అభినందించారు. త్వరలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చూపి గ్రామానికి, పాఠశాలకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న పాఠశాల పీడీ షేక్ మస్తాని, ప్రధానోపాధ్యాయురాలు ఎం. సామ్రాజ్యాన్ని అభినందించారు. -
స్వయం సహాయక సంఘాలకు రూ.5.07 కోట్లు కేటాయింపు
నరసరావుపేట రూరల్: స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే ఉద్దేశంతో పల్నాడు జిల్లాకు రూ.5.07 కోట్లు కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కేటాయించారని డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఝాన్సీరాణి పేర్కొన్నారు. శుక్రవారం కోటప్పకొండ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా సమాఖ్య సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం గ్రామనిధి అనే పోర్టల్ ప్రారంభించిందని, దీని ద్వారా జిల్లాలోని 26 మండలాలకు రూ.19.50 లక్షల చొప్పున మంజూరు చేశారన్నారు. గ్రామ సంఘాలలోని స్వయం సహాయక సంఘాల వారు అవసరం మేరకు దానిని గ్రామనిధి పోర్టల్లో అప్లోడు చేసుకోవాలని తెలియజేశారు. జిల్లా సమాఖ్య ప్రతినిధులు అందరూ కలిసి స్వయం సహాయక సంఘాలకు గ్రామ సంఘం అసిస్టెంట్లుగా మహిళలు మాత్రమే కొనసాగాలని జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు రజని ఏకగ్రీవంగా తీర్మానించారు. గ్రామ సంఘం అసిస్టెంట్గా మహిళలు ఉంటే ఏవిధమైన సమాచారమైనా చెప్పకోవటానికి అభ్యంతరాలు ఉండవని జిల్లా సమాఖ్య ప్రతినిధులు, ప్రాజెక్ట్ డైరెక్టర్ ఝాన్సీరాణి తెలియజేశారు. ఏపీడీ రాజా ప్రతాప్, డీపీఎంలు మల్లీశ్వరి, శ్రీనివాస్, డేవిడ్ పాల్గొన్నారు. -
తెగిపడిన యమపాశాలు
మార్టూరు: ఏడాదిగా వలపర్ల గ్రామస్తులు భయపడుతున్నట్లే జరిగింది. గ్రామంలోని ఏ వీధి చూసినా శిథిలమైన విద్యుత్ స్తంభాలు, వేలాడుతున్న విద్యుత్ వైర్ల గురించి ఆ శాఖ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. వలపర్ల సినిమా హాల్ సెంటర్లో నిత్యం రద్దీగా ఉండే వైన్స్ షాప్ ఎదురుగా శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో వేలాడుతున్న విద్యుత్ వైర్లు తెగి ఇద్దరిపై పడ్డాయి. అయితే, వారు తప్పించుకొని ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. సెంటర్లో అప్పటికే వైన్ షాప్ ముందు మందుబాబుల హడావుడితో పాటు హోటళ్ల ముందు ప్రజల రాకపోకలతో మెయిన్ రోడ్ అంతా హడావుడిగా మారింది. ఈ క్రమంలో చాలా కాలంగా వేలాడుతూ ఉన్న రెండు విద్యుత్ వైర్లు ఒక్కసారిగా తెగి కింద పడ్డాయి. గమనించిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. గ్రామానికి చెందిన పూరిమెట్ల వెంకటేశ్వర్లు, గోలి కృష్ణ ప్రసాద్కు అవి తగలడంతో గాయపడ్డారు. విద్యుత్ వైర్లు తెగి పడిన క్రమంలో ఫ్యూజులు పోవటంతో ప్రసారం నిలిచిపోయింది. లైన్మేన్ కుమార్, సిబ్బంది తెగిపడిన విద్యుత్ వైర్లను తాత్కాలికంగా సరి చేశారు. గాయపడిన కృష్ణ ప్రసాద్ను స్థానిక ప్రైవేటు వైద్యుని వద్ద ప్రథమ చికిత్స చేయించి, అనంతరం మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రెండో బాధితుడు వెంకటేశ్వర్లను బంధువులు మొదట ఇంటికి తరలించగా, గుండెల వద్ద నొప్పిగా ఉందని చెప్పడంతో సాయంత్రం స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. సమస్యపై పలుమార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఉమ్మడి జిల్లా హాకీ జట్టు ఎంపిక
బాపట్ల టౌన్: మండలంలోని చెరువుజమ్ములపాలెం జిల్లా పరిషత్ హైస్కూలులో శుక్రవారం ఉమ్మడి గుంటూరు జిల్లా అండర్– 14 బాలబాలికల హాకీ టీంను ఎంపిక చేశారు. స్కూల్ గేమ్స్ కార్యదర్శి ఎం. గోపి మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని తెలిపారు. పోటీలకు బాలురు 18, బాలికలు 18 మందిని ఎంపిక చేసినట్లు చెప్పారు. వీరంతా ఈనెల తిరుపతి జిల్లాలోని చంద్రగిరిలో జరిగే 69వ రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంఈవో–2 డి. ప్రసాదరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వి.వి.కృష్ణారావు, ఉపాధ్యాయులు బి. గంగాధర్, ఎం. సాంబశివరావు, వాణీ సుశీల, ఏ.టి.రాంబాబు పాల్గొన్నారు. -
ప్రథమ చికిత్సపై అవగాహన అవసరం
ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ వీర రాఘవయ్యరేపల్లె: విద్యార్థి దశ నుంచే ప్రథమ చికిత్సపై అవగాహన కలిగి ఉండాలని ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ రేపల్లె బ్రాంచి చైర్మన్ డాక్టర్ వసంతం వీరరాఘవయ్య సూచించారు. ప్రథమ చికిత్స, సీపీఆర్లపై పట్టణంలోని ఏబీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు గుంటూరు ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ వీరరాఘవయ్య మాట్లాడుతూ ప్రమాదాల్లో గాయపడిన వారు వైద్యశాలకు వెళ్లేలోపు ప్రథమ చికిత్స వల్ల కొంత మేర వైద్యం అందుతుందని, దీనివల్ల రక్షణ లభిస్తుందని తెలిపారు. ఎవరైనా గుండెపోటుకు గురైతే వైద్యశాలకు వెళ్లే ముందు సీపీఆర్ అందిస్తే అతను బతికేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. వివిధ సందర్భాల్లో గాయపడిన వ్యక్తులకు అందించే ప్రథమ చికిత్సలు, గుండెపోటు వచ్చిన సమయంలో అందించే సీపీఆర్ని గుంటూరు రెడ్క్రాస్ సొసైటీకి చెందిన డాక్టర్ రసూల్ బృంద సభ్యులు ప్రయోగపూర్వకంగా విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టీసీ రవిచంద్రకుమార్, కోఆర్డినేటర్ బుజ్జిబాబు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం కళాశాలలో ఆర్కే నారాయణ్ జయంతిని నిర్వహించారు. ఆయన సాహితీ సేవలను విద్యార్థులకు వివరించారు. ఘనంగా అంతర్జాతీయ బాలికా దినోత్సవం ఏబీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఐసీడీఎస్, మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థినులకు బాలికా హక్కులు, సమాన అవకాశాలు, శక్తి వికాసంపై వ్యాస రచన, వక్తృత్వం పోటీలు నిర్వహించి, గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మహిళా శక్తి వికాస్ సెల్ ఇన్చార్జ్ సుభాషిణి, సీడీపీవో సుచిత్ర, సీఆర్ఏఎఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీనివాసరావు, సూపర్వైజర్ హిమబిందు, టి.రాధిక, విద్యార్థినులు పాల్గొన్నారు. -
విద్యార్థులు వ్యవస్థాపకులుగా ఎదగాలి
పెదకాకాని: విద్యార్థులు వ్యవస్థాపకులుగా ఎదిగి పరిశ్రమలను స్థాపించాలని, వినూత్న ఆలోచనలతో నూతన ఆవిష్కరణలు చేపట్టి విజయవంతం కావాలని పల్నాడు జిల్లా పరిశ్రమల అధికారి ఎం.నవీన్ కుమార్ సూచించారు. వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్సిటీలోని మెకానికల్ ఇంజినీరింగ్, ఐఈఐ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రెండురోజుల జాతీయ స్థాయి సాంకేతిక సదస్సు ‘ఆమేయా –2కే25’ ముగింపు వేడుకలకు శుక్రవారం ముఖ్య అతిథిగా నవీన్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాస్తవ ప్రపంచ నైపుణ్యాలను నేర్చుకోవడానికి, పరిశ్రమలకు తగ్గట్టు సన్నద్ధం అవటానికి విద్యార్థి దశ కీలకమని తెలిపారు. మొబైల్ యాప్లను వినియోగించడమే కాకుండా సమాజానికి ఉపయోగపడేలా వాటి తయారీపై దృష్టి సారించాలని సూచించారు. సదస్సులో జిగ్ టెక్, పేపర్ అండ్ పోస్టర్ ప్రజెంటేషన్, ఆర్సీ కార్నేజ్, పిక్టో, క్రిక్ క్విజ్ వంటి సాంకేతిక పోటీలలో విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ వై. మల్లికార్జునరెడ్డి, డైరెక్టర్ డాక్టర్ రావెల నవీన్, మెకానికల్ విభాగాధిపతి డాక్టర్ టి.శ్రీనివాసరావు, సంధానకర్త వి.కిరణ్ కుమార్, ఐఈఎం విద్యార్థి విభాగ సభ్యులు ఎస్.పవన్ సాయి, సీహెచ్ విష్ణు, విద్యార్థులు పాల్గొన్నారు. -
చిన్నారుల హాజరు శాతం పెంచాలి
కర్లపాలెం: భవిత సెంటర్లో చిన్నారుల హాజరు శాతం పెంచాలని సహిత విద్య రాష్ట్ర పరిశీలకులు మల్లికార్జున్ చెప్పారు. కర్లపాలెం పంచాయతీ పరిధిలోని ఇందిరానగర్లో గల భవిత సెంటర్ను శుక్రవారం ఆయనతో పాటు సహిత విద్య జిల్లా సమన్వయకర్త జ్యోత్స్న తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు.సెంటర్లో చిన్నారులకు కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ చిన్నారుల సంఖ్యను 20కి పెంచాలని తెలిపారు. అడ్మిషన్లో ఉన్న చిన్నారులంతా భవిత సెంటర్కు వచ్చే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక ప్రాథమిక పాఠశాల హెచ్ఎం శైలజ, భవిత సెంటర్ టీచర్లు ఎన్. లక్ష్మీ ప్రసన్న, సీహెచ్. చందన పాల్గొన్నారు. -
ముగిసిన జిల్లాస్థాయి వాలీబాల్ జట్ల ఎంపిక
చీరాల రూరల్: స్థానిక సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన అండర్–19 బాలబాలికల జిల్లా జట్ల ఎంపిక ప్రక్రియ ముగిసింది. కళాశాల ప్రిన్సిపాల్ గారపాటి పుష్పరాజు, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం. చింపారెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ పుష్పరాజు, కరస్పాండెంట్ శీలం విద్యాసాగర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లో కూడా సత్తా చాటాలని సూచించారు. విజయం కోసం పట్టుదలతో కృషి చేయాలని తెలిపారు. వేటపాలెం బీబీహెచ్ కాలేజీ పీడీ బాపయ్య శెట్టి, పీడీ సుబ్బారెడ్డి, రిటైర్డ్ పీడీ డీసీ విద్యాసాగర్ పాల్గొన్నారు. -
ఏఆర్టీ సెంటర్ ఏర్పాటు వ్యాధిగ్రస్తులకు వరం
అద్దంకి: స్థానిక సీహెచ్సీలో ఏఆర్టీ సెంటర్ ఏర్పాటు క్షయ వ్యాధిగ్రస్తులకు వరమని బాపట్ల జిల్లా క్షయ, ఎయిడ్స్, టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ సోమల నాయక్ అన్నారు. సీహెచ్లో ఏఆర్టీ సెంటర్ ఏర్పాటు చేయనున్న దృష్ట్యా గురువారం సందర్శించారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కె. కె. వాహిలా చౌదరి, బాపట్ల జిల్లా హెచ్ఐవీ, ఎయిడ్స్ నియంత్రణ సమీకృత వ్యూహం, దిషా క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ సయ్యద్ జానీ బాషా, హెల్ప్ స్వచ్ఛంద సంస్థ టీఐ ప్రాజెక్టర్ బీవీ సాగర్తో కలిసి హాస్పిటల్లో కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. సోమల నాయక్ మాట్లాడుతూ హాస్పిటల్కి వచ్చే హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు ఇబ్బందులు, సమస్యలు తలెత్తకుండా గదులను ఏర్పాటు చేయడానికి పరిశీలిస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో శాశ్వత భవనాలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. అద్దంకి నియోజకవర్గ పరిధిలో 1,300కు పైగా ఉన్న హెచ్ఐవీ, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఏఆర్టీ సెంటర్ ఉపయోగపడుతుందని చెప్పారు. గతంలో వ్యాధిగ్రస్తులు మందుల కోసం ఒంగోలు వెళ్లాల్సి వచ్చేదన్నారు. కొన్నిసార్లు రవాణా చార్జీలు లేక ఇతర కారణాల ద్వారా మందులు మధ్యలో ఆపివేస్తుండటంతో ఆరోగ్యం క్షీణించి మరణానికి దగ్గరవుతున్నారని తెలిపారు. అద్దంకిలోనే ఏఆర్టీ సెంటర్ తీసుకురావడం ద్వారా వారు క్రమం తప్పకుండా మందులు వాడుకునే అవకాశం ఉంటుందని, త్వరలోనే ఇక్కడ ఏర్పాటు చేస్తామని సోమల నాయక్ పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ఎస్. తేజస్విని, డాక్టర్ అనిత జ్యోతి, ఐసీటీసీ కౌన్సిలర్ రమేష్, పారా మెడికల్ ఆఫీసర్ ఎన్. శ్రీనివాసరావు, బి. దుర్గ సురేంద్ర, ఔట్ రీచ్ వర్కర్ దుర్గాభవాని పాల్గొన్నారు.జిల్లా క్షయ, ఎయిడ్స్, టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ సోమల నాయక్ -
పగలు రెక్కీ.. రాత్రిళ్లు చోరీ
నగరంపాలెం: పగలు పల్సర్ బైక్పై తిరుగుతూ తాళాలు వేసి ఇళ్లను గుర్తించి, రాత్రిళ్లు చోరీలకు పాల్పడే భార్యాభర్తలను కొల్లిపర పోలీసులు అరెస్ట్ చేశారని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. దంపతుల నుంచి 173.19 గ్రాముల బంగారం, 226.36 గ్రాముల వెండి, రూ.2.15 లక్షలు, ఒక మోటారు సైకిల్, టీవీ, ఇనుపరాడ్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో గురువారం ఆయన మీడియాకు కేసు వివరాలు వెల్లడించారు. ఇటీవల కొల్లిపర మండల పరిధిలోని తాళాలు వేసి ఇళ్లల్లో వరుసగా చోరీలు జరిగాయి. తూములూరు గ్రామ వాసి మాటూరి మధుసూదనరావు గతనెల 28న ఊరెళ్లారు. ఈనెల 2న ఇంటికి రాగా, బీరువాలో దాచిన బంగారు సొత్తు చోరీ చేశారు. దీనిపై బాధితులు కొల్లిపర పీఎస్లో ఫిర్యాదు చేశారు. తెనాలి సబ్ డివిజన్ డీఎస్పీ బి.జనార్దనరావు, రూరల్ సీఐ ఆర్.ఉమేష్ నేతృత్వంలో కొల్లిపర పీఎస్ ఎస్ఐ పి.కోటేశ్వరరావు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు పరిసరాల్లోని సీసీ కెమెరాల పుటేజీలు పరిశీలించారు. సాంకేతిక ఆధారాలతో కొల్లిపర గ్రామ వాసి కటారి వెంకటేశ్వర్లుగా గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. నేరం రుజువైంది. గతంలోనూ మండల పరిధిలోని పలు గ్రామాల్లో 13 చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ చోరీల్లో కొంత వరకు భార్య తేజ నాగమణికి ఇచ్చి భద్రపరిచేవాడు. దీంతో భార్యాభర్తలను అరెస్ట్ చేసి, 173.19 గ్రాముల బంగారం, 226.36 గ్రాముల వెండి, రూ.2.15 లక్షలు, పల్సర్ బైక్, ఒక టీవీ, ఇనుపరాడ్ స్వాధీనం చేసుకున్నారు. ఇనుపరాడ్తో తాళాలు పగులకొట్టి.. గతంలో వెంకటేశ్వర్లు బేల్దారి పనులకు వెళ్లేవాడు. భార్యాభర్తలు కొద్దికాలంగా చోరీలకు పాల్పడుతున్నారు. భర్త ద్విచక్ర వాహనం (పల్సర్)పై వెళ్లి ఇళ్లకు తాళాలు వేసిన గృహాలను గుర్తించే వాడు. ఆ తర్వాత ఇరువురు కలసి చోరీకి వెళ్లేవారు. భర్త ఇనుపరాడ్డుతో తలుపులు పగలుకొట్టి, బంగారం, వెండి వస్తువులు, నగదుతో రెప్పపాటులో ఉడాయించేవాడు. భార్య ఘటనా స్థలంలో ఉండి వచ్చే, పోయే వారి కదలికలను గుర్తించేది. చోరీలకు పాల్పడి వచ్చాక ఏమీ తెలియనట్టు అందరితో కలిసిపోయేవారు. దొంగలించిన సొమ్ముతో జల్సాలు చేయడం, వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకునేవారు. నిందితుడైన వెంకటేశ్వర్లుకు పాత నేర చరిత్ర ఉంది. దాదాపు 13 కేసులు నమోదై ఉన్నాయి. త్వరితగతిన కేసు ఛేదించిన తెనాలి డీఎస్పీ బి.జనార్దనరావు, తెనాలి రూరల్ పీఎస్ సీఐ ఆర్.ఉమేష్, కొల్లిపర పీఎస్ ఎస్ఐ పి.కోటేశ్వరరావు, హెచ్సీలు రామకోటేశ్వరరావు, మురళీకృష్ణ, పీసీలు కూర్మారావు, శివరామకృష్ణలను జిల్లా ఎస్పీ అభినందించి, ప్రశంసాపత్రాలు అందించారు. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీ (పరిపాలన) రమణమూర్తి పాల్గొన్నారు. -
మనోవ్యాధులకూ మంచి ఔషధాలు
గుంటూరు మెడికల్: జిల్లాలో 25 మంది మానసిక వ్యాధి వైద్య నిపుణులున్నారు. ఒక్కో వైద్యుడి వద్దకు రోజూ 30 నుంచి 50 మంది వివిధ రకాల మానసిక సమస్యలతో చికిత్స కోసం వస్తున్నారు. గుంటూరు జీజీహెచ్లో రోజూ 160 మంది చికిత్స పొందుతున్నారు. ప్రతి ఏడాది మానసిక రోగుల సంఖ్య పెరిగపోవటంపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల్లో సైతం సమస్యలు రావటంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. వ్యాధి లక్షణాలు ఇవీ.. చిరాకు, కోపం, విసుగు తదితర లక్షణాలు వారానికి పైబడి ఉంటే మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించాలి. తనలో తాను మాట్లాడుకోవటం, ఒంటరిగా నవ్వుకోవటం, వ్యక్తిగత శ్రద్ధ తీసుకోకపోవటం, చేసిన పనిని పదేపదే చేయాలనుకోవటం, అనవసరమైన ఆలోచల్ని ఆపుకోలేకపోవటం, నిద్రలోపం, బరువు పెరగటం, నిర్ణయాలు తీసుకోవటంలో తీవ్ర జాప్యం చేసి తనమీద ఆధారపడే వారందరినీ ఇబ్బందికి గురి చేయడం, తాను కూడా ఇబ్బందులకు గురవ్వటం, ఎక్కువ సమయం పనిమీద ఏకాగ్రత లేకుండా కాలక్షేపం చేసే ధోరణిలో ఉండటం, తనకు హాని చేస్తున్నట్లు ఊహించుకుని తగాదాలు వరకు వెళ్లటం, తిరగబడి దాడి చేయటం, వ్యక్తిలో ఉన్న అనుమానాలు ఎన్ని రూపాల్లో నివృత్తి చేసే ప్రయత్నం చేసినా ఒప్పుకోకపోవటం తదితర లక్షణాలు మానసిక వ్యాధి సోకిన వారిలో కనిపిస్తాయి. రోటీన్ లైఫ్కు భిన్నంగా ఉండే ప్రవర్తన కనిపిస్తే వారిలో మానసిక సమస్య ఉన్నట్లు గుర్తించాలి. చదువుకునేందుకు ఆసక్తి చూపించకపోవటం, ఎక్కువ సమయం సెల్ఫోన్లకే పరిమితమవ్వటం, ఉద్యోగం, ఇతర పనులు చేయకుండా ఉండిపోవటం లక్షణాలు వ్యాధి బాధితుల్లో ఉంటాయి. గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందిన వారి వివరాలు.. ఏడాది రోగుల సంఖ్య 2023 22,189 2024 30,553 కరోనా వల్ల పెరిగిన మానసిక సమస్యల బాధితులను దృష్టిలో పెట్టుకుని మానసిక ఆరో గ్యానికి , వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. మానసిక సమస్యలపై అవగాహన కల్పించి ప్రజలు ఇబ్బంది పడకుండా చేసేందుకు ప్రతి ఏడాది అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘ సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. -
జీజీహెచ్లో ఉచిత వైద్య సేవలు
మానసిక వ్యాధులకు జీజీహెచ్లో ఉచిత వైద్య సేవలను అందించటంతోపాటుగా మందులు కూడా ఉచితంగానే అందజేస్తున్నారు. అవుట్ పేషేంట్ విభాగంలోని 21వ నెంబర్ గదిలో వైద్య పరీక్షలు చేసి అవసరం ఉన్న వారిని ఇన్పేషేంట్ విభాగంలో అడ్మిట్ చేసుకుంటారు. సోమవారం నుంచి శనివారం వరకు రోజూ ఓపీలో వైద్య సేవలు లభిస్తాయి. మందులతోపాటుగా రోగులకు కౌన్సెలింగ్ కూడా చాలా ముఖ్యం. – డాక్టర్ నీలి ఉమాజ్యోతి, మానసిక వ్యాధుల వైద్య విభాగాధిపతి, గుంటూరు జీజీహెచ్. -
12న బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక
తెనాలి: స్థానిక ఆంధ్రా ప్యారిస్ బ్రాహ్మణ ఉచిత వివాహ సమాచార కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన ‘రాష్ట్రస్థాయి బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక’ జరగనుంది. బోసురోడ్డులోని నూకల రామకోటేశ్వరరావు కల్యాణ మండపంలో కార్యక్రమం ఉంటుంది. స్థానిక రామలింగేశ్వరపేటలోని మూల్పూరు సుబ్రహ్మణ్య కల్యాణ మండపంలో గురువారం విలేకరుల సమావేశంలో కేంద్రం పాలకవర్గ అధ్యక్షుడు టి.దక్షిణామూర్తి సంబంధిత కరపత్రాన్ని ఆవిష్కరించారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి ఉచిత భోజన సౌకర్యంతోపాటు సమాచార బుక్లెట్ ఇస్తామన్నారు. ప్రధాన కార్యదర్శి ఎన్వీ సత్య కుమార్, సంయుక్త కార్యదర్శి పింగళి వేణుధర్, గౌరవాధ్యక్షుడు పీఎల్జీఎస్ ప్రకాశరావు, కోశాధికారి ఆర్.రాజేంద్రప్రసాద్, గౌరవ సలహాదారు బీఎల్ సత్యనారాయణమూర్తి, సభ్యులు డీవీ సోమయ్య శాస్త్రి పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర గజదొంగ అరెస్ట్
బాపట్ల టౌన్ : ఇళ్లలో బంగారు అభరణాలు, నగదు చోరీ చేసే గజదొంగను బాపట్ల సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను సీసీఎస్ డీఎస్పీ బి. జగదీష్నాయక్ గురువారం వెదుళ్లపల్లి పోలీస్స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పల్నాడు జిల్లా, యడ్లపాడు మండలం, యడ్లపాడు గ్రామానికి చెందిన కోడిరెక్క విజయ్కుమార్ తాపీమేస్త్రిగా జీవనం సాగిస్తుండేవాడు. చెడు వ్యసనాలకు లోనై సులభ రీతిలో డబ్బు సంపాదించేందుకు దొంగ అవతారమెత్తాడు. ఓ దొంగతనం కేసులో తెలంగాణ రాష్ట్రంలోని చౌటుప్పల్ పోలీసులు 2022లో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అనంతరం బెయిల్పై వచ్చి యడ్లపాడు గ్రామంలో తాపీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 2023లో చిలకలూరిపేట, యడ్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనానికి పాల్పడ్డాడు. చిలకలూరిపేట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. బెయిల్పై వచ్చిన జగదీష్నాయక్ మరలా ఈ ఏడాది అద్దంకి, సంతమాగులూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడాడు. ఇతడి కదలికలపై నిఘా పెట్టిన సీసీఎస్ పోలీసులు గురువారం ఉదయం అద్దంకి–మేదరమెట్ల బైపాస్ రోడ్డు జంక్షన్ సమీపంలో అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ. 5.70 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ. 30 వేలు విలువ చేసే వెండి అభరణాలు, రూ. 1.15 లక్షల నగదుతో పాటు రూ. 70 వేలు విలువ చేసే ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో సీసీఎస్ సీఐ పి.ప్రేమయ్య, అద్దంకి పట్టణ సీఐ ఏ.సుబ్బరాజు, సీసీఎస్ ఎస్.ఐ బి.రాంబాబు, సిబ్బంది పాల్గొన్నారు. కేసును ఛేదించడానికి విశేష కృషిచేసిన సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్ నాయక్, సీఐ పి.ప్రేమయ్య, ఎస్ఐ బి.రాంబాబు, కానిస్టేబుళ్లు ఎస్.కోటేశ్వరరెడ్డి, కె.చిరంజీవి, డి.వై.దాసు, కృష్ణలను జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ప్రత్యేకంగా అభినందించారు. -
అండర్ – 19 బాలుర ఖోఖో జట్టు ఎంపిక
జె.పంగులూరు: స్థానిక మాగుంట సుబ్బరామిరెడ్డి, బాచిన నారాయణమ్మ జూనియర్ కళాశాలలో గురువారం ఉమ్మడి ప్రకాశం జిల్లా అండర్ –19 విభాగంలో బాలుర ఖోఖో జట్టు ఎంపిక చేశారు. జిల్లా నుంచి 40 మంది వచ్చినట్లు కళాశాల పీడీ సీతారామిరెడ్డి తెలిపారు. సీనియర్ క్రీడాకారుడులు షేక్ అహ్మద్, పీడీ రవికిరణ్, వేణు మాట్లాడుతూ ప్రతిభ కనబరిచిన 12 మందిని ఎంపిక చేసిట్లు తెలిపారు. క్రీడాకారులకు ఉమ్మడి ప్రకాశం జిల్లా స్కూల్ గేమ్ సెక్రటరీ ఎం.చింపారెడ్డి, ఆర్ఐఓ ఆంజనేయులు అభినందనలు తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు వీరే.. మాగుంట సుబ్బరామిరెడ్డి జూనియర్ కళాశాల నుంచి సీహెచ్. బాబ్జీ, యన్. భరత్ కుమార్, ఐ. ప్రవీణ్ రెడ్డి, పి. నరేష్, డి. విజయ్, సి. లక్ష్మీనారాయణ, సీహెచ్. నాగవర్దన్, ఎం. ఆంజనేయులు, ఐ. అనిల్, కె. మోహన్రావు, శ్రీ విద్యానికేతన్ సింగరాయకొండ నుంచి ఏ. రమణ కృష్ణారెడ్డి, సాయిబాబు చైతన్య జూనియర్ కళాశాల నుంచి ఆర్. విఖ్యాత్ రెడ్డి ఎంపికయ్యారు. స్టాండ్ బై క్రీడాకారులు మాగుంట సుబ్బారామిరెడ్డి, బాచిన నారాయణమ్మ జూనియర్ కళాశాల నుంచి ఎం. దానియేలు, సి. శివ ప్రసాద్, బి. గోపీచంద్ స్టాండ్ బైగా ఎంపికయ్యారు. -
ప్రజా సంక్షేమం కోసమే జీఎస్టీ తగ్గింపు
చీరాల రూరల్: ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపు చేసిందని బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. గురువారం స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో సూపర్ జీఎస్టీ– సూపర్ సేవింగ్స్పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఎంపీ మాట్లాడుతూ ప్రజల పెనుభారాన్ని తగ్గించేందుకు గతంలో నాలుగు శ్లాబులుగా ఉన్న జీఎస్టీని ప్రస్తుతం రెండుగా చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ వి. వినోద్కుమార్, గుంటూరు జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ నాయుడు, మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్ తదితరులు పాల్గొన్నారు. మేదరమెట్ల: అంతర్జాతీయ బాలికా దినోత్సవం పురస్కరించుకొని బాపట్ల జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీల్లో రావినూతల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు గురువారం విశేష ప్రతిభ కనపరచారు. బాపట్లలో గురువారం ‘సేవ్ ది గర్ల చైల్డ్’ అనే అంశంపై వక్తృత్వ పోటీ నిర్వహించారు. ఇందులో రావినూతల హైస్కూలుకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని కె.హనీ జిల్లాస్థాయిలో రెండో స్థానం, చిత్రలేఖనం పోటీలో పదో తరగతి విద్యార్థిని ఎం.వర్ష ప్రథమ స్థానంలో నిలిచారు. జిల్లా కేంద్రంలో ఈనెల 11న నిర్వహించే బహుమతి ప్రదానోత్సవంలో రూ. 3 వేలు, రూ. 5 వేల చొప్పున అందుకోనున్నట్లు పాఠశాల హెచ్ఎం రాఘవరెడ్డి తెలిపారు. జిల్లాస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు అభినందించారు. నగరంపాలెం: విశ్రాంత పోలీస్ అధికారి ఎన్.గోపాలరావు (87) అంత్యక్రియలు గురువారం జరిగాయి. బుధవారం డొంకరోడ్డులోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. గోపాలరావుకు భార్య, నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 1961లో ఎస్ఐగా పోలీస్ శాఖలో చేరి సీఐ, డీఎస్పీ, ఏఎస్పీ, ఎస్పీగా విధులు నిర్వహించారు. ఏపీ విశ్రాంత పోలీస్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి కాళహస్తి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు ఎం.రంగాప్రసాద్, కోశాధికారి డాక్టర్ కేవీ నారాయణ తదితరులు నివాళులర్పించారు. -
మా ఆత్మగౌరవాన్ని కాపాడండి !
పిడుగురాళ్ల: తమ ఆత్మగౌరవాన్ని కాపాడాలని సచివాలయ ఉద్యోగులు మొర పెట్టుకుంటున్నారు. సర్వేల పేరుతో ఇంటింటికీ తిప్పుతూ తమతో వెట్టిచాకిరి చేయిస్తున్నారని వాపోతున్నారు. వీటితోపాటు తమ ఇతర సమస్యలను కూడా పరిష్కరించాలని కోరుతూ సచివాలయ ఉద్యోగులు గురువారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం చర్చలకు పిలవకపోతే ఈ నెల 19న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వలంటీర్లను తొలగించటంతో ఆ విధుల భారాన్ని తమపై మోపారన్నారు. జాబ్ చార్ట్ ఇవ్వాలని కోరారు. పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది. ఇప్పటికీ ఏ శాఖలో పని చేస్తున్నామో అర్థం కావటం లేదు. రేషలైజేషన్ ప్రక్రియతో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఆందోళనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. – నరసింహారావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ, వార్డు సచివాలయ కన్వీనర్ సచివాలయాల్లో పని చేస్తున్న మహిళలకు గౌరవం లేకుండాపోతోంది. శానిటరీ సెక్షన్లో పనిచేసే సచివాలయ ఉద్యోగులకు తెల్లవారుజామున 4 గంటలకు రోడ్లపై విధులు కేటాయిస్తున్నారు. కార్యాలయాల్లో వసతులు కూడా లేవు. – దీప్తి, మహిళా పోలీస్ -
ధాన్యం కొనుగోలులో అప్రమత్తంగా ఉండాలి
జాయింట్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవ గుంటూరు వెస్ట్: ఖరీఫ్ సీజన్ 2025–26లో ధాన్యం సేకరణపై ఆయా శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో ఏపీ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యాన ఖరీఫ్ సీజన్ 2025–26లో ధాన్యం సేకరణపై అవగాహన, శిక్షణ సదస్సు నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ సీజన్లో రైతు సేవ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. జిల్లాలో 50 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు. ధాన్యం కనీస మద్దతు ధర సాధారణ రకం (కామన్) క్వింటా (100కిలోలు) రూ.2369, ‘ఏ’ గ్రేడ్ రకం క్వింటా (100కిలోలు) రూ.2,389లుగా నిర్ణయించినట్లు తెలిపారు. గత సంవత్సరం మద్దతు ధర కన్నా రూ.69 అధికంగా చెల్లించనున్నట్లు తెలిపారు. ధాన్యం విక్రయంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా టోల్ ఫ్రీ నంబర్ 1967కు ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఏడు గంటలలోపు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. గుంటూరు జిల్లా కంట్రోలు రూం ఏర్పాటు చేసినట్లు(నం.9491392717) తెలిపారు. సమావేశంలో సివిల్ సప్లయీస్ డీఎం తులసి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బండ్లమూడి వెంకయ్య చౌదరి, మిల్లర్లు పాల్గొన్నారు. -
● బలం లేకున్నా టీడీపీ బరితెగింపు ● వైఎస్సార్సీపీ అభ్యర్థులపై వేధింపుల పర్వం ● అవిశ్వాసం అంటూ డ్రామా
ముప్పాళ్ల: ముప్పాళ్ల మండల పరిషత్ అధ్యక్ష పీఠంపై టీడీపీ నాయకులు గురి పెట్టారు. 2021లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలకు పదకొండు స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు గెలుపొందారు. జనసేన ఒక స్థానంలో గెలుపొందింది. టీడీపీ ఒక్కచోట కూడా గెలిచిన దాఖలాలు లేవు. మాదల ఎంపీటీసీ సభ్యుడు మృతి చెందగా ప్రస్తుతం ఆ స్థానం ఖాళీగా ఉంది. భయపెడుతూ, ప్రలోభాలకు గురిచేస్తూ, పదవి ఆశ చూపుతూ ఆరుగురు ఎంపీటీసీలను టీడీపీ వైపునకు లాక్కున్నారు. ఎంపీపీతో కలిపి నలుగురు ఎంపీటీసీలు వైఎస్సార్ సీపీని వీడేందుకు ఇష్ట పడకపోవటంతో వారిపైన, వారికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను దెబ్బకొట్టేలా అధికార దర్పాన్ని ఉపయోగించుకుంటూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. కొత్తగా తెరపైకి అవిశ్వాసం డ్రామా కొత్తగా ఎంపీపీపై అవిశ్వాస డ్రామాను టీడీపీ నాయకులు తెర లేపారు. చాగంటివారిపాలెంకు చెందిన ఎంపీపీ మారూరి పద్మపై అవిశ్వాసం తీర్మానం పెట్టేందుకు సమావేశం నిర్వహించాలంటూ సత్తెనపల్లి ఆర్డీఓను మంగళవారం కలసి వినతిపత్రం అందించారు. అవిశ్వాస తీర్మానం ఇవ్వాలంటే కనీసం 8 మంది ఎంపీటీసీ సభ్యుల బలం ఉండాలి. ఎనిమిది మంది సభ్యులు ఆర్డీవో ఎదుట హాజరై అవిశ్వాస తీర్మానం కోరుతూ వినతిపత్రం అందించాల్సి ఉంటుంది. కేవలం ఐదుగురు సభ్యులతో సంతకాలు చేయించి అవిశ్వాస తీర్మానం అంటూ డ్రామా చేస్తున్నారు. ఈ విషయం పై వైఎస్సార్సీపీ సభ్యులు మాత్రం పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉంటామని ఖరాఖండిగా తేల్చి చెబుతున్నారు. పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉన్నాం. –మలిరెడ్డి అనూష, లంకెలకూరపాడు ఎంపీటీసీ సోషల్మీడియాలో టీడీపీ నాయకులు చేస్తున్న విష ప్రచారంలో వాస్తవం లేదు. అవిశ్వాస తీర్మానంపై ఆర్డీఓకు ఇచ్చిన పేపర్లలలో తన సంతకాన్ని ఫోర్జరీ చేశారు. వైఎస్సార్ సీపీ నిర్ణయానికే కట్టుబడి ఉంటాం. కేసులతో ఎన్ని ఇబ్బందులు పెట్టినా భయపడేది లేదు. -
అమరేశ్వరునికి పుష్పార్చన
అమరావతి: అమరావతిలోని అమరేశ్వరాలయంలో గురువారం లోక కల్యాణార్థం దాతల సహకారంతో స్వామికి పుష్పార్చన నిర్వహించారు. తొలుత మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. స్వామివారికి విశేష అలంకరణ చేసి సహస్ర నామాలతో రుత్విక్కులు పుష్పార్చన జరిపారు. అనంతరం బాల చాముండికా అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. రాజ్యలక్ష్మీఅమ్మవారికి బంగారు హారం బహూకరణ మంగళగిరి టౌన్: మంగళగిరిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దిగువ సన్నిధిలో ఉన్న శ్రీ రాజ్యలక్ష్మీ అమ్మవారికి దాత బంగారు హారాన్ని బహూకరించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కె. సునీల్కుమార్ తెలిపారు. అమ్మవారి అలంకరణ నిమిత్తం రూ. 3.50 లక్షల విలువైన బంగారు పచ్చల హారాన్ని మంగళగిరి పట్టణానికి చెందిన నీలి నాగమల్లేశ్వరరావు, రత్నకుమారి దంపతులు గురువారం ఆలయ అధికారులు, అర్చకులకు అందజేశారు. ఎన్ఆర్ఈజీఎస్ డిప్యూటీ కమిషనర్ పర్యటన గుంటూరు రూరల్: వెంగళాయపాలెంలో మహాత్మాగాంధీ ఎన్ఆర్ఈజీఎస్ వాటర్ షెడ్ ప్రోగ్రాం డిప్యూటీ కమిషనర్ సాగర్, జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.శంకర్లు గురువారం పర్యటించారు. గ్రామ పంచాయతీలో 21.38 ఎకరాల ఊర చెరువు ఉంది. వాటర్ షెడ్, అమృత్ సరోవర్ పథకాలలో భాగంగా చెరువుకు రివిట్మెంట్, వాకింగ్ ట్రాక్, ప్లాంటేషన్, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసేందుకు గల అవకాశాలను పరిశీలించారు. గ్రామ సర్పంచ్ నల్లపాటి లలితకుమారి, ఎంపీడీవో బి. శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి రవి, ఎన్ఆర్ఈజీఎస్ ఏపీవో శ్రీరామ్, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. నగదు రహిత చికిత్స అందించాలి గుంటూరు వెస్ట్: ఉద్యోగ, ఉపాధ్యాయ విశ్రాంత ఉద్యోగులకు నగదు రహిత చికిత్స అందించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు సయ్యద్ చాంద్ బాషా కోరారు. ఈ మేరకు గురువారం జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ ఉత్సవకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చాంద్ బాషా మాట్లాడుతూ నెట్వర్క్ ఆసుపత్రుల యజమానులతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ప్రజా సేవకు అంకితమైన ఉద్యోగుల ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యతగా భావించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు యు.సుమిత్రా దేవి, సంయుక్త కార్యదర్ళులు కోటా సాహెబ్, వి.కార్తిక్, కోశాధికారి శ్రీనివాస్, మహిళా విభాగం నాయకులు రమణి, మయూరి పాల్గొన్నారు. -
ఎంపీపీపై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధం
● పావులు కదుపుతున్న తమ్ముళ్లు ● ఇప్పటికే ఫోన్ ద్వారా సంప్రదింపులు ● పార్టీ మారేది లేదని తేల్చి చెప్పిన ఎంపీటీసీ సభ్యులు పెదకాకాని: ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే తెలుగు తమ్ముళ్లు ఆ దిశగా పావులు కదుపుతున్నారు. మండలంలోని పలువురు ఎంపీటీసీలకు ఫోన్లు చేసి నయానా, భయానా చర్చలు జరిపే పనిలో నిమగ్నమయ్యారు. అయితే పార్టీలు మారి పరువు పోగొట్టుకోవడానికి తాము సిద్ధంగా లేమని పలువురు ఎంపీటీసీ సభ్యులు స్పష్టంచేసినట్లు చెబుతున్నారు. పెదకాకాని మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడుగా అనుమర్లపూడి ఎంపీటీసీ సభ్యుడిని ఎన్నుకొని నాలుగేళ్లు పూర్తయ్యింది. నాలుగేళ్ల వరకూ ఎంపీపీ కుర్చీపై అవిశ్వాసం పెట్టడానికి అవకాశం లేదనే నిబంధనలు ఉన్నాయి. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం గడిచినప్పటికీ నాలుగేళ్లు పూర్తయ్యే వరకూ వేచి ఉన్నారు. గత నెల సెప్టెంబరుతో నాలుగేళ్లు పూర్తి కావడంతో ఎంపీపీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పెదకాకాని మండల పరిధిలో 12 గ్రామ పంచాయతీలు, ఒక హామ్లెట్ విలేజ్ ఉంది. ఆయా గ్రామాల్లో ఉన్న ఓటర్ల ఆధారంగా మండలంలో 21 మంది ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. వారిలో వైఎస్సార్ సీపీ చెందిన 15 మంది ఎంపీటీసీ సభ్యులు, ఆరుగురు టీడీపీ చెందిన ఎంపీటీసీలు గెలుపొందారు. మెజారిటీ ఎంపీటీసీ సభ్యులు ఉన్న వైఎస్సార్ సీపీ నుంచి అనుమర్లపూడి ఎంపీటీసీ సభ్యుడు తుల్లిమిల్లి శ్రీనివాసరావును ఎంపీపీగా ఎన్నుకున్నారు. తమ్ముళ్లు రాయబారాలు నడుపుతున్నప్పటికీ పార్టీ మారడానికి, ఎంపీపీకి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానంలో పాల్గొనడానికి పలువురు ఎంపీటీసీ సభ్యులు ససేమిరా అంటున్నారు. వైఎస్సార్ సీపీ నుంచి పోటీ చేసి వారి మద్దతుతో విజయం సాధించి పదవీకాలం పది నెలలు ముందు తాము పార్టీ మారడానికి, చేతులెత్తడానికి సిద్ధంగా లేమని చెబుతున్నారు. ఈ వ్యవహారం మండలంలో చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల సమయంలో వైఎస్సార్ సీపీ నుంచి పార్టీ మారిన వారిని కేవలం ఓటు బ్యాంక్గా వాడుకుని ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదనే చర్చ కూడా సాగుతోంది. -
చేయీ చేయి కలిపారు..
నాడునేడు ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని ఎదురుచూడకుండా స్థానిక విఠలేశ్వరస్వామి నగర్ కాలనీ నివాసితులు నడుం కట్టారు. చేయీ చేయి కలిపి రోడ్డును వేసుకున్నారు. ఇటీవల వర్షాలకు కాలనీ ప్రధాన రహదారి కాలువగా మారింది. నీరు నిలిచి పసికర్లు కూడా కట్టింది. నివాసితుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. వృద్ధులు, చిన్నారులు నానా అవస్థలు పడుతున్నారు. అసలే లోతట్టు ప్రాంతం. పైగా కాలనీ పక్కగా వెల్లటూరు చానల్ పారుతుండటంతో ఊట నీరు దిగి మరింత ముంపునకు గురవుతోంది. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షపు నీరు నిలిచి రహదారులు తటాకాలను తలపిస్తున్నాయి. సమస్యను అధికారులు, ప్రజా ప్రతినిధులు దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదు. పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. నిల్వ నీటితో జ్వరాలు, వ్యాధులు ప్రబలుతాయేమోనని భయంతో వణికిపోయారు. దీంతో కాలనీలోని అంతర్గత రహదారిలో నివసిస్తున్న ఏడుగురు కలసి సొంత ఖర్చుతో రోడ్డుకు మెరక తోలించుకున్నారు. – భట్టిప్రోలు -
డీఎంఎఫ్ పనుల్లో పురోగతి కన్పించాలి
బాపట్ల: డీఎంఎఫ్ (డిస్ట్రిక్ మినరల్ ఫండ్) నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల్లో ప్రతి వారం పురోగతి కన్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ ఆదేశించారు. ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, సమగ్ర శిక్ష అభియాన్, పబ్లిక్ హెల్త్, సీపీఓ, విద్యుత్, భూగర్భ గనుల శాఖ, ఇంజినీరింగ్ అధికారులతో గురువారం కలెక్టరేట్లో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ శాఖల ద్వారా జిల్లా ఏర్పడిన నాటికి రూ.35 కోట్లు డీఎంఎఫ్ నిధులు ఉన్నాయని తెలిపారు. అప్పటి నుంచి మూడున్నర ఏళ్లలో మరో రూ.16 కోట్లు వచ్చాయని పేర్కొన్నారు. డీఎంఎఫ్ కింద మొత్తం రూ.51 కోట్లు ఉండగా, వివిధ శాఖల ద్వారా 31 పనులకు గానూ రూ.48.28 కోట్లు అధికారికంగా మంజూరయ్యాయని వివరించారు. ఇందులో ఇప్పటి వరకు రూ.5.77 కోట్ల పనులు మాత్రమే జరగడమేమిటిని ఆయన ప్రశ్నించారు. పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. చీరాల ఓడరేవు నుంచి పిడుగురాళ్ల వరకు నిర్మిస్తున్న 167ఏ జాతీయ రహదారిని త్వరగా పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రూ.1,065 కోట్లతో నిర్మిస్తున్న రహదారి పనులు జిల్లాలో 95 శాతం పూర్తయ్యాయని, నవంబర్ నెలాఖరకు ముగించాలని చెప్పారు. అంతర్గత రోడ్లు వేగంగా నిర్మించాలి కలెక్టరేట్లో అంతర్గత రహదారులను ఆర్ అండ్ బీ అధికారులు వేగంగా నిర్మించాలని కలెక్టర్ ఆదేశించారు. అంతర్గత రహదారులు, ఏటీఎం గది ప్రతిపాదిత ప్రాంతాన్ని గురువారం ఆయన పరిశీలించారు. జిల్లా మినరల్ ఫండ్ నుంచి రూ.47.9 లక్షలతో ప్రతిపాదించిన అంతర్గత రహదారి ప్రాంతాన్ని తనిఖీ చేశారు. ఆయన వెంట జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్, ఆర్ అండ్ బీ డీఈ అరుణకుమారి, అధికారులు ఉన్నారు. కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ -
బాపట్ల
శుక్రవారం శ్రీ 10 శ్రీ అక్టోబర్ శ్రీ 2025భారత రాయబారిగా విల్సన్ బాబు నియామకం కూటమి కుట్రలపై విధేయతదే విజయం! పులిచింతల సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 66,450 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, దిగువకు 64,450 క్యూసెక్కులు వదులుతున్నారు. నీటి నిల్వ 42.1600 టీఎంసీలు . ఆలయ నిర్మాణానికి రూ.లక్ష విరాళం నరసరావుపేట రూరల్: ఇస్సప్పాలెం మహంకాళి అమ్మవారి ఆలయ నిర్మాణానికి తెలంగాణ మధిరకు చెందిన జంగా రామ్ భూపాల్రెడ్డి కుటుంబ సభ్యులు రూ.లక్ష అందజేశారు. క్రాకర్స్ షాపుల్లో తనిఖీలు చిలకలూరిపేట టౌన్: దీపావళి క్రాకర్స్ షాపుల్లో గురువారం పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. యజమానుల వద్ద ఉన్న లైసెన్సులు, అనుమతి పత్రాలను పరిశీలించారు. అద్దంకి: అన్నదాతలకు సంప్రదాయ సాగు భారంగా మారింది. అధిక పెట్టుబడులు, ప్రకృతి వైపరీత్యాలు పీల్చి పిప్పి చేస్తున్నాయి. తీరా పంట చేతికొచ్చేసరికి పడి పోతున్న ధరలతో నష్టాలే మిగులుతున్నాయి. సంప్రదాయ పంటల సాగుకు వెనకడుగు వేస్తున్నారు. తక్కువ ఖర్చుతో లాభాలొచ్చే పంటలపై ఆసక్తి చూపుతున్నారు. తక్కువ పెట్టుబడితో ఒక్కసారి నాటితే ఇరవై సంవత్సరాల పాటు ఆదాయాన్నిచ్చే సుబాబుల్ సాగు వైపు అడుగులేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 20 వేల ఎకరాల్లో సాగు చేపట్టారు. ఈ ఏడాది మరో 10 వేల ఎకరాల్లో సాగు చేసే అవకాశం ఉంది. వేగంగా పెరిగే సుబాబుల్ వేగంగా పెరిగే చెట్ల జాతిలో సుబాబుల్ ఒకటి. దీని ఆకులు పశుగ్రాసంగా ఉపయోగ పడతాయి. కాండాన్ని కాగితపు గుజ్జు పరిశ్రమలో ముడి సరుకుగా ఉపయోగిస్తారు. చౌడు నేలల మినహా అన్ని రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చు. ఎక్కువ తేమ కలిగిన నేలలు బాగా అనుకూలం. కాలువ, పొలాల గట్లపై పెంచుకోవచ్చు. నాటిన రెండు నుంచి మూడేళ్లకే కర్ర దిగుబడి వస్తుంది. నేలసారం పెంపు సుబాబుల్ తోటల సాగుతో సారం పెరుగుతుంది. నేలలోని పెట్రోలియం, పురుగు మందులు, భారీ లోహాలు వంటి కలుషితాలను తొలగించడానికి ఉపయోగపడుతుంది. రాలిన ఆకు ఎరువుగా మారి భూమి సారవంతంగా మారుతుంది. ఏటేటా పెరగనున్న ఆదాయం సుబాబుల్ చెట్టు కర్రను ఒలిచే పని లేకుండా నేరుగా కొట్టి విక్రయించుకోచచ్చు. ప్రస్తుతం మార్కెట్లో టన్ను ధర రూ.5,800 పలుకుతోంది. రెండు సంవత్సరాల తోట అయితే ఎకరాకు రూ.1 లక్ష వరకు, నాలుగు సంవత్సరాలు అయితే ఎకరాకు రూ.1.5 లక్షల నుంచి రూ. 2.5లక్షల వరకు ఆదాయం వస్తుండటంతో పలువురు రైతులు ఆసక్తి చూపుతున్నారు. Iపదేళ్ల నుంచి సాగు చేస్తున్నా.. ఎకరాకు 30 టన్నుల దిగుబడి నేను పదేళ్ల నుంచి సుబాబుల్ సాగు చేస్తున్నా. గిట్టుబాటు ధర బాగుంది. ఎరువు వేసి నీరు పెడితే మంచి దిగుబడి వస్తుంది. పైగా కర్ర తాట తీసే పనిలేకుండా కొనుగోలు చేస్తారు. పెద్దగా నీటి అవసరం లేదు. సాగు చేయటం కూడా తేలిక. సుబాబుల్ కర్రను కాగితం తయారీ కంపెనీలు కొంటున్నాయి. –కోటేశ్వరరావు, రైతు సాలుకు సాలుకు మధ్య రెండు మీటర్లు, మొక్క మొక్కకు మధ్య రెండు మీటర్ల దూరం ఉండాలి. ఎకరాకు 666 మొక్కల నుంచి 1000 వరకు నాటుకోవచ్చు. ఎకరాకు 30 టన్నుల నుంచి సారవంతమైన నేలలు అయితే 40 టన్నుల వరకు కూడా దిగుబడి వస్తుంది. చెట్టు మూడు నుంచి నాలుగు సంవత్సరాలో 20 మీటర్ల ఎత్తు పెగుతుంది. ముదురుతోటలో విత్తనాలు సేకరించి నాటుకోచ్చు. లేదా నర్సరీల నుంచి మొక్కలు తెచ్చి నాటుకోవచ్చు. -
బాపట్ల జిల్లా జేసీగా భావన వశిష్ట్
బాపట్ల టౌన్: బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్గా 2019 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారిణి భావన వశిష్ట్ను నియమిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ అసిస్టెంట్ కలెక్టర్గా శిక్షణ ప్రారంభించిన ఆమె తరువాత పార్వతీపురం సబ్ కలెక్టర్గా విధులు నిర్వర్తించారు. జీఎస్డబ్ల్యూఎస్ అడిషనల్ డైరెక్టర్గానూ సేవలందించారు. ఎన్నికలకు ముందు అల్లూరి సీతారామరాజు జిల్లా జాయింట్ కలెక్టర్గా పని చేశారు. గడిచిన 15 నెలలుగా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. తాజా ఉత్తర్వుల్లో భాగంగా బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్గా నియమితులయ్యారు. -
విద్యార్థిని చితకబాదిన వైస్ ప్రిన్సిపాల్
చెరుకుపల్లి: బాపట్ల జిల్లా గుళ్లపల్లి ఎన్ఆర్ఐ కళాళాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థి పాల్ గాంధీని వైస్ ప్రిన్సిపాల్ విచక్షణ రహితంగా కొట్టగా ఆస్పత్రి పాలైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థి తల్లిదండ్రుల వివరాల మేరకు... గుళ్లపల్లి శివాలయం కాలనీకి చెందిన విద్యార్థి చల్లా పాల్ గాంధీకి, యశ్వంత్ అనే విద్యార్థితో ఈ నెల 7న క్లాస్రూమ్ బెంచ్పై కూర్చునే విషయంలో ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో వైస్ ప్రిన్సిపాల్ విజయ్ తరగతి గదికి వచ్చి విద్యార్థులను అడగ్గా పాల్గాంధీ యశ్వంత్ను కొట్టాడని చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన వైస్ ప్రిన్సిపల్ పాల్గాంధీపై తన మోచేతితో వీపుమీద గుద్దుతుండగా దెబ్బలు తట్టుకోలేక చెయ్యి అడ్డం పెట్టాడు. చేతి వేళ్లు విరగడంతో తొలుత రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ స్కానింగ్, ఎక్సరే తీయగా కుడి చేతి వేలి ఎముక విరిగినట్టు తల్లిదండ్రులు తెలిపారు.విద్యార్థి పాల్ గాంధీ (ఫైల్)వైస్ ప్రిన్సిపాల్ కొట్టడంతో వాచిన చేయి -
ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చాలి
జిల్లా పంచాయతీ అధికారి సాయికుమార్గుంటూరు ఎడ్యుకేషన్ : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు సంపూర్ణ పారిశుధ్యాన్ని సాధించాలని జిల్లా పంచాయతీ అధికారి బీవీఎం సాయికుమార్ పేర్కొన్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం స్థానిక సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ‘ధీమ్–5 క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్’పై రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీపీవో సాయికుమార్ మాట్లాడుతూ గ్రామాల్లో అపరిశుభ్ర పరిస్థితులు, అధ్వాన్న వాతావరణం కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని చెప్పారు. సంపూర్ణ పారిశుధ్యాన్ని సాధించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచవచ్చునని తెలిపారు. జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతత ప్రజల్లో పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడం ద్వారా సత్ఫలితాలను సాధించవచ్చునని అన్నారు. శిక్షణ కార్యక్రమంలో డీపీఆర్సీ రీసోర్స్ పర్సన్ రామకృష్ణ, ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు పాల్గొన్నారు. -
ఏఎన్యూ వీసీగా సత్యనారాయణ రాజు
ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్గా ఆచార్య సామంతపూడి వెంకట సత్యనారాయణరాజు నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ నజీర్ అహ్మద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆచార్య సత్యనారాయణరాజు ఇప్పటి వరకూ వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఎంటోమాలజీ ప్రొఫెసర్గా ఉన్నారు. ఏఎన్యూలో గత కొంతకాలంగా ఇన్చార్జి వీసీగా ఆచార్య కె. గంగాధరరావు విధులు నిర్వహిస్తున్నారు. సత్యనారాయణరాజు అగ్రికల్చర్ బీఎస్సీని మహారాష్ట్రలోని డాక్టర్ పుంజాబ్రావు క్రిషి విద్యాపీఠ్ నుంచి 1983లో ఉత్తీర్ణులయ్యారు. ఎంఎస్సీ అగ్రికల్చర్ కోర్సును హిమాచల్ప్రదేశ్లోని డాక్టర్ వైఎస్ పర్మార్ యూనివర్సిటీ ఆఫ్ ఆర్టికల్చర్ అండ్ పారెస్ట్రీ నుంచి 1986 లోనూ, అగ్రికల్చర్ ఎంటోమాలజీలో పీహెచ్డిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసి బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి 1990లో పొందారు. బోధన రంగంలో 28, పరిశోధనా రంగంలో 32 సంవత్సరాల అనుభవం గడించారు. రైతులు అనుబంధ అంశాల్లో 28 సంవత్సరాలకు పైగా పాలు పంచుకున్నారు. -
ప్రభుత్వ పథకాల అమలులో అశ్రద్ధ వద్దు !
కలెక్టర్ వి.వినోద్కుమార్ బాపట్ల: ప్రభుత్వ పథకాల అమలులో జిల్లాను రాష్ట్రస్థాయిలో మూడవ స్థానంలో ఉంచేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. స్థానిక కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాలులో గురువారం వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల పర్యవేక్షణకు ప్రతి మండలంలో ఒక నోడల్ అధికారిని ఏర్పాటు చేశామని, ఆయన వసతి గృహాలను దత్తత తీసుకొని పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ సూచించారు. వసతి గృహాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనలో పూర్వ విద్యార్థులను మమేకం చేసుకొని వారి ద్వారా మెరుగుపరచాలని సూచించారు. సంక్షేమ వసతి గృహాల్లో లోపల, బయట పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలని ఆయన తెలిపారు. సమస్యల పరిష్కారానికి వచ్చే అర్జీదారులతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని సూచించారు. గ్రామస్థాయి అధికారులు ప్రజలను కలిసేటప్పుడు గుర్తింపు కార్డులు ధరించాలని కలెక్టర్ తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు జిల్లాలోని ప్రతి పీహెచ్సీని తనిఖీ చేసి నివేదికను తయారు చేయాలని జిల్లా వైద్యాధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలతో మమేకమై పనిచేసినప్పుడు వారి నుంచి సానుకూల స్పందన వస్తుందని, ఆ దిశగా పని చేయాలని ఆయన సూచించారు. జిల్లాలో స్వామిత్వ సర్వేని వేగవంతం చేయాలని అధికారులకు తెలిపారు. 205 రెవెన్యూ గ్రామాల్లో స్వామిత్వ సర్వేను నూరు శాతం పూర్తి చేయాలని చెప్పా. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చే అర్జీల ఆడిటింగ్, ఈ–క్రాప్ నమోదు, సీసీఆర్సీ కార్డుల జారీ తదితర విషయాలపై జిల్లా కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఇన్చార్జి సంయుక్త కలెక్టర్ జి. గంగాధర్ గౌడ్, ఏఏఓ అనూరాధ, డీపీఓ ప్రభాకర్, ఇన్చార్జి పీడీడీఆర్ డీఏ లవన్న, ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కనక ప్రసాద్, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాజ్ దిబోరా, గిరిజన సంక్షేమ శాఖ అధికారి ప్రకాశరావు, వీక్షణ సమావేశం ద్వారా ఆర్డీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. -
ఏరులై పారుతున్న నకిలీ మద్యం
సంతనూతలపాడు: ప్రజలందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారని వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున విమర్శించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు ఇస్తామని దేశంలో ఎక్కడా లేని వింత వాగ్దానంతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 16 నెలలుగా నకిలీ మద్యం ఏరులై పారిస్తున్నారని ధ్వజమెత్తారు. సంక్షేమ పథకాల్లో కోత విధిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 85 లక్షల మందికి తల్లికి వందనం ఇవ్వాల్సి ఉండగా కేవలం 40 నుంచి 50 లక్షల మందికే అందజేశారని విమర్శించారు. లైసెన్సు ఉన్న డ్రైవర్లందరికీ ఆర్థిక సాయం అందజేస్తానన్న చంద్రబాబు కేవలం ఆటోలు తోలే డ్రైవర్లకు అది కూడా కోత విధించడం దారుణమన్నారు. పేదలకు ఇళ్లు కట్టి ఇస్తామని ఆశ పెట్టి అధికారంలోకి వచ్చి మాట తప్పారన్నారు. నకిలీ మద్యం సరఫరాతో చంద్రబాబు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ హయాంలో బూం బూం అంటూ విమర్శలు గుప్పించిన కూటమి నాయకులు ఇప్పుడు ఆ బ్రాండ్తో పాటు సూపర్ సిక్స్ అనే బ్రాండ్ మద్యాన్ని కూడా అమ్ముతున్నారని ఎద్దేవా చేశారు. రాయలసీమలో నకిలీ మద్యం ప్లాంట్లు రెండు బయటపడడం, వీటి వెనుక టీడీపీ కీలక నేతలే ఉండడం, ఉత్తరాంధ్ర లోనూ నకిలీ మద్యం ప్లాంట్లు ఉన్నాయని సమాచారం రావడంతో రాష్ట్రంలో మద్యం ప్రియుల వెన్నులో వణుకు పుడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే నకిలీ మద్యాన్ని ప్రోత్సహిస్తోందని ప్రజలకు అర్థమైందన్నారు. నకిలీ మద్యం ఎలా తయారు చేయాలో కూటమి నాయకులకు ఆఫ్రికాలో శిక్షణ ఇచ్చి ఆ ఫార్ములా ద్వారా నకిలీ మద్యాన్ని ప్రభుత్వ పెద్దలే ఏరులై పారిస్తున్నారని విమర్శించారు. మందు తాగొద్దు.. తస్మాత్ జాగ్రత్త: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక కలుగు నాయుడుగా మిగిలిపోయారని మేరుగ నాగార్జున ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో అరవటం, రెచ్చిపోవటం, ఊగి పోవటం, తూగిపోవటం, జుట్టు పీక్కోవటం లాంటి చేష్టలు చేసిన ఆయన ఇప్పుడు మహిళలపై ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా మాట్లాడకుండా కలుగులోనే ఉంటున్నారని విమర్శించారు. సొంత అన్నయ్యను బాలకృష్ణ అగౌరవపరిచినా బయటకు రాకపోవడం దారుణమన్నారు. పవన్ కళ్యాణ్ నిజస్వరూపాన్ని ఇప్పుడు ప్రజలు చూస్తున్నారని అన్నారు. జగన్ ప్రభుత్వంలో జే బ్రాండ్ మద్యం అని వ్యాఖ్యానించిన కూటమి నాయకులు ప్రస్తుతం సీబీఎన్, పీకే, ఎల్కే బ్రాండ్లు తయారు చేసి వైన్ షాపులు, బెల్టుషాపుల్లో విక్రయిస్తున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ హయాంలో ప్రతి మద్యం బాటిల్ను డిస్టిలరీల్లోనే తయారు చేశారని, ఇప్పుడు టీడీపీ నాయకుల ఇళ్లలోనే నకిలీ మద్యం తయారవుతోందని ధ్వజమెత్తారు. మందు బాబులు ఈ మద్యం తాగి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. కూటమి సర్కారు పాపాలు పండే రోజు దగ్గర్లోనే ఉందని పేర్కొన్నారు. -
ముందస్తు పరీక్షలే బెస్ట్!
గుంటూరు మెడికల్: పేదల పెద్దాసుపత్రిగా పేరుగడించిన గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో రొమ్ము క్యాన్సర్ను ప్రాథమిక దశలోనే గుర్తించే వైద్య పరికరం మెమోగ్రఫీ వైద్య పరికరం అందుబాటులో ఉంది. నాట్కో ట్రస్ట్ వారు రూ. కోటి విలువైన త్రీడీ డిజిటల్ మెమోగ్రఫీ వైద్య పరికరాన్ని నాట్కో క్యాన్సర్ సెంటర్లో అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా రొమ్ము క్యాన్సర్ను ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చు. మెమోగ్రామ్ పరీక్ష చేసినందుకు ప్రైవేటు ఆస్పత్రుల్లో సుమారు రూ. 2వేలు వరకు ఫీజు తీసుకుంటున్నారు. జీజీహెచ్లో వ్యాధి నిర్ధారణతోపాటు, రొమ్ము క్యాన్సర్ బాధితులకు అవసరమైన ఆపరేషన్లు ఉచితంగా చేస్తున్నారు. ఆపరేషన్ల అనంతరం అవసరమయ్యే రేడియేషన్ థెరఫీ, కిమోథెరఫీ వైద్య సేవలు సైతం జీజీహెచ్ నాట్కో క్యాన్సర్సెంటర్లో పూర్తి ఉచితంగా అందిస్తున్నారు. మెమోగ్రామ్ పరీక్షలు చేయించుకున్నవారి వివరాలు ... జీజీహెచ్లో రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష మెమోగ్రామ్ 2023లో 368 మంది, 2024లో 381మంది, 2025 సెప్టెంబరు వరకు 381 మంది పరీక్షలు చేయించుకున్నారు. రొమ్ము క్యాన్సర్తో బాధపడుతూ 2022లో 34 మంది, 2023లో 73 మంది, 2024లో 69 మంది, 2025 సెప్టెంబరు వరకు 55 మంది రొమ్ము క్యాన్సర్ ఆపరేషన్ చేయించుకున్నారు. రొమ్ము కాన్సర్పై మహిళలకు అవగాహన అవసరం ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ఒకరు రొమ్ము కాన్సర్ బాధితులే అక్టోబరు రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం ఆధునిక జీవన శైలి వల్ల 50 ఏళ్లు దాటిన తరువాత వచ్చే రొమ్ము క్యాన్సర్లు నేడు 25 ఏళ్లకే కనిపించడం సర్వత్రా ఆందోళనకు దారి తీస్తోంది. విద్యావంతులు, చదువులేనివారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వ్యాధిపై అవగాహన లేకుండా నిర్లక్ష్యంగా ఉండటం వల్లే ప్రతి ఏడాది రొమ్ము క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని బారిన పడకుండా ప్రతి ఏడాది అక్టోబరు నెల రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసంగా నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా ‘సాక్షి’ అందిసున్న ప్రత్యేక కథనం. తొలి దశలోనే రొమ్ము క్యాన్సర్ను గుర్తించేందుకు మెమోగ్రామ్ పరీక్ష చేస్తారు. మెమోగ్రామ్తో రెండు మి.మీ కన్నా తక్కువ సైజులో రొమ్ములో గడ్డలు ఉన్నా గుర్తించి వెంటనే వైద్యం చేయవచ్చు తొలి దశలోనే వ్యాధిని గుర్తిస్తే వ్యాధి నుంచి త్వరితగతిన కోలుకోవటంతోపాటుగా మరణాన్ని తప్పించవచ్చు. మహిళలే స్వయంగా రొమ్ము పరీక్ష చేసుకుని రొమ్ములో ఏమైనా గడ్డలు ఉన్నట్లు అనిపిస్తే తక్షణమే వైద్యులను సంప్రదించాలి. – డాక్టర్ చక్కా సుజాత, సీనియర్ రేడియాలజిస్ట్, గుంటూరు -
రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు ఎంపిక
చీరాల రూరల్: జిల్లాస్థాయి తైక్వాండో స్కూల్ గేమ్స్ సెలక్షన్స్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన చీరాల క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 6న ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒంగోలులో 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ 2025–26 ఇంటర్ డిస్ట్రిక్ట్ తైక్వాండో సెలక్షన్స్ నిర్వహించారు. ఈ పోటీలను స్కూల్గేమ్స్ జిల్లా సెక్రటరీ, రాష్ట్ర తైక్వాండో వైస్ ప్రసిడెంట్ షేక్ అబ్దుల్ సలాం పర్యవేక్షణలో నిర్వహించారు. పోటీల్లో చీరాల్లోని విజ్ఞాన భారతి హైస్కూల్, గౌతమి, సెయింట్ ఆన్స్ స్కూలు, కస్తూర్భా గాంధీ బాలికల ఉన్నత పాఠశాలలకు చెందిన 12 మంది క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభచూపి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు చీరాల కోచ్ ఎస్డీ సలావుద్దీన్ తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులు.. అండర్–17 బాలుర 48 కేజీల విభాగంలో వి.హేమంత్, 59 కేజీల విభాగంలో ఎస్కే కాలేషావలి, 45 కేజీల విభాగంలో ఎన్.వెంకటరమణ, 55 కేజీల విభాగంలో వి.మనోహర్ ప్రథమ స్థానంలో నిలిచారు. అండర్–17 బాలికల 55 కేజీల విభాగంలో ఎస్కే తాహిర, 44 కేజీల విభాగంలో ఎన్.ప్రవళిక, 52 కేజీల విభాగంలో వై.లక్ష్మీప్రియ, 63 కేజీల విభాగంలో బి.కావ్యలు ప్రథమ స్థానంలో నిలిచారు. అండర్–14 బాలుర 44 కేజీల విభాగంలో ఎల్.కార్తీక్మణికంఠ, 41 కేజీల విభాగంలో వి.శరత్కుమార్, అలానే బాలికల అండర్–14 విభాగంలో 38 కేజీల విభాగంలో ఎస్కే తస్లీమా, 24 కేజీల విభాగంలో వి.జాహ్నవి ప్రథమ స్థానంలో నిలిచారు. అండర్–14 విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచిన క్రీడాకారులు ఈనెల 10, 11 తేదీల్లో రేపల్లెలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని కోచ్ సలావుద్దీన్ తెలిపారు. అండర్–17 విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచిన క్రీడాకారులు ఈనెల 18న వైఎస్సార్ కడప జిల్లాలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా నలుమూలల నుంచి వివిధ పాఠశాలల నుంచి 69 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులకు ఆయా పాఠశాలలకు చెందిన హెచ్ఎంలు, ప్రిన్సిపాల్స్, పీఈటీలు, క్రీడాకారులకు శిక్షణనిచ్చిన కోచ్లు సయ్యద్ సలావుద్దీన్, పి.ప్రశాంత్బాబును రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ ప్రతినిధులు అభినందనలు తెలిపారు. -
స్క్రీనింగ్ పరీక్షలతో చెక్
మహిళలంతా మెమోగ్రామ్, బయాప్సి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. క్యాన్సర్ను ప్రథమ దశలోనే గుర్తించి చికిత్స అందించడం ద్వారా పూర్తిగా నివారించవచ్చు. కుటుంబంలో ఎవరికై నా క్యాన్సర్ ఉంటే ఇతర కుటుంబ సభ్యులకు వచ్చే అవకాశాలు ఉన్న దృష్ట్యా ముందస్తుగా జనటిక్ పరీక్ష చేయించాలి. సంతానం లేనివారికి, ఆలస్యంగా పిల్లలు పుట్టిన వారికి సైతం రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ముందస్తుగా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. రొమ్ము క్యాన్సర్లకు రేడియేషన్ థెరపీ, కిమో థెరపీ, ఆపరేషన్లు అందుబాటులో ఉన్నాయి. –డాక్టర్ బైరపనేని స్రవంతి, క్యాన్సర్ వైద్య నిపుణులు, గుంటూరు -
రేపు రాష్ట్రస్థాయి మాస్టర్స్ స్విమ్మింగ్ పోటీలు
గుంటూరు వెస్ట్: దివంగత స్విమ్మర్ కానాల అంజినీ శ్రీక్రాంత్రెడ్డి స్మారకార్ధం ఈనెల 10న 8వ మాస్టర్స్ ఇంటర్ డిస్ట్రిక్స్ స్విమ్మింగ్ చాంపియన్షిప్–2025 పోటీలు నిర్వహిస్తామని మాస్టర్స్ స్విమ్మింగ్ అసోసియేషన్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెద్ది రమణారావు తెలిపారు. బుధవారం స్థానిక అరండల్పేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 23 జిల్లాల నుంచి మాస్టర్స్ స్విమ్మర్లు పాల్గొంటారన్నారు. పోటీల్లో విజేతలకు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.హరిహరనాథ్ చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. పోటీలను గుంటూరులోని ఎన్టీఆర్ స్టేడియం ఈతకొనలనులో ఏర్పాటు చేశామన్నారు. పోటీలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. -
ఉచితంగా రొమ్ము క్యాన్సర్ ఆపరేషన్లు...
నాట్కో క్యాన్సర్ సెంటర్లో కార్పొరేట్ ఆస్పత్రుల కంటే దీటుగా రొమ్ము క్యాన్సర్ బాధితులకు చికిత్స అందించేలా ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేశాం. గత ఏడాది 69 మందికి, ఈఏడాది ఇప్పటివరకు 55 మందికి ఉచితంగా క్యాన్సర్ ఆపరేషన్లు చేశారు. నన్నపనేని లోకాధిత్యుడు, సీతారావమ్మ స్మారక నాట్కో సెంటర్లో 24 గంటలు కార్పోరేట్ ఆస్పత్రుల కంటే ధీటుగా ఉచితంగా క్యాన్సర్ వైద్యసేవలను అందిస్తున్నారు. – నన్నపనేని సదాశివరావు, నాట్కో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ -
మతోన్మాదిని శిక్షించాలి..
బాపట్ల: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్ పై మతోన్మాద న్యాయవాది చేసిన దాడి యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని సీపీఎం జిల్లా కార్యదర్శి సీహెచ్ గంగయ్య అన్నారు. జస్టిస్ గవాయ్పై దాడికి నిరసనగా మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో బాపట్ల పాత బస్టాండ్ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గంగయ్య మాట్లాడుతూ ఈ దాడి ఒక వ్యక్తిపై కాదని భారత రాజ్యాంగం పై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఈ ఘటనపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి , స్పందించాలని డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టి.కృష్ణమోహన్, సిహెచ్ ముజుందర్, జిల్లా కమిటీ సభ్యులు పి కొండయ్య, నాయకులు కె. శరత్ , కె. నాగేశ్వరావు, టి.సుభాషిణి, మహబూబ్ సుభాని, చిన్న పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి గంగయ్య -
మిర్చి సీజన్ నాటికి ఏర్పాట్లు పూర్తి చేయాలి
కొరిటెపాడు(గుంటూరు): రాబోయే మిర్చి సీజన్ నాటికి మిర్చి యార్డు లోపల, బయట రైతులు, వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మార్కెటింగ్ శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ కాకుమాను శ్రీనివాసరావు కోరారు. మిర్చి సీజన్ ఏర్పాట్లపై మార్కెటింగ్ శాఖ అధికారులు, మిర్చి ఎగుమతి, దిగుమతి వ్యాపారులు, సూపర్ వైజర్లు, వేమెన్స్లతో మంగళవారం సన్నాహాక సమావేశం నిర్వహించారు. తొలుత పలువురు ఎగుమతిదారులు మాట్లాడుతూ మిర్చి సీజన్లో సుమారు లక్ష మంది, అన్ సీజన్లో 50 వేల మంది యార్డుపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. సీజన్లో యార్డులోని అన్ని గేట్లు తెరిచేలా చూడాలన్నారు. కొనుగోలు చేసిన మిర్చిని తరలించేందుకు ట్రాన్స్పోర్టు సమస్య ఉందని, యార్డుకు ఇరువైపులా రోడ్లు విస్తరించాలని సూచించారు. లారీల యూనియన్ సమస్య అధికంగా ఉందని, కిరాయి ఎక్కువగా ఉందని, దానిని నియంత్రించేలా చర్యలు చేపట్టాలని విన్నవించారు. పరిశ్రమలకు ఇండస్ట్రీ డెవలప్మెంట్ కింద మాకు సబ్సిడీపై భూమి కేటాయిస్తే గోదాములు నిర్మించుకుంటామని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాకుండా మిర్చిని ఆరబెట్టుకునేందుకు డ్రయర్లు ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం ఆర్జేడీ శ్రీనివాసరావు మాట్లాడుతూ సీజన్ ప్రారంభం నాటికి యార్డులో అన్ని మౌలిక వసతులు పూర్తి చేసేలా చర్యలు చేపడతామన్నారు. సమావేశంలో మార్కెటింగ్ శాఖ డీడీ దివాకర్, ఏడీఎం సత్యనారాయణ చౌదరి, యార్డు కార్యదర్శి ఎ.చంద్రిక, యార్డు అధికారులు సుబ్రహ్మణ్యం, శ్రీకాంత్, ఎగుమతి వ్యాపారులు జుగిరాజ్ భండారీ, కొత్తూరి సుధాకర్, తోట రామకృష్ణ పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి తైక్వాండోలో సత్తా
చినగంజాం: చినగంజాం విద్యార్థులు 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ తైక్వాండో పోటీల్లో సత్తా చాటారు. ఆరుగురు హాజరై గోల్డ్ మెడల్ సాధించారు. ఒంగోలులోని ఇస్లాం పేట షాదీకానాలో సోమవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అంతర జిల్లాల తైక్వాండో ఎంపికలు నిర్వహించారు. స్కూల్ గేమ్స్ జిల్లా కార్యదర్శి, తైక్వాండో వైస్ ప్రెసిడెంట్ షేక్ అబ్దుల్ సలాం, ఉమ్మడి ప్రకాశం జిల్లా కోచ్లు, క్రీడాకారుల సమక్షంలో జిల్లా నలుమూలల నుంచి 69 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అండర్–17 విభాగంలో చినగంజాం సత్యం హైస్కూల్కు చెందిన కుక్కల రక్షిత్ రెడ్డి (38 కేజీల కేటగిరీ) గోల్డ్ మెడల్, వాటుపల్లి మౌనిక (42 కేజీలు) గోల్డ్మెడల్, అండర్ 14 విభాగంలో ఎల్. గీతిక (32కేజీల కేటగిరి) గోల్డ్ మెడల్ సాధించారు. సత్యం స్కూల్ ప్రిన్సిపాల్ ఎన్.హరినాథ్, ఆర్. శ్రీనివాసరావు, సి.రమేష్ క్రీడాకారులను అభినందించారు. చినగంజాం జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు అండర్–17 విభాగంలో సీహెచ్ జాషువా (42 కేజీల కేటగిరి) గోల్డ్మెడల్, బి.యశ్వంత్ (68 కేజీల కేటగిరి) గోల్డ్ మెడల్ సాధించారు. వీరంతా రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం కె.శ్రీనివాసరెడ్డి, వ్యాయమ ఉపాధ్యాయుడు జి.అంకమ్మరావు, ఎస్.నరసింహరావు, పి.వెంకట ప్రసాద్, రాష్ట్రస్థాయి ఎంపికై న విద్యార్థులను, వీరికి శిక్షణ ఇచ్చిన కోచ్ వాటుపల్లి సుబ్రహ్మణ్యంను అభినందించారు. -
జాతీయ అథ్లెట్ రష్మిశెట్టికి ఘన సన్మానం
లక్ష్మీపురం: జాతీయ అథ్లెటిక్స్లో గుంటూరు రైల్వే డివిజన్కి చెందిన టీటీఐ(రైల్వే టికెట్ ఇన్స్పెక్టర్) రష్మిశెట్టి కాంస్య పతకం సాధించడం అభినందనీయమని గుంటూరు రైల్వే డీఆర్ఎం సుథేష్ఠ సేన్ అన్నారు. గుంటూరు పట్టాభిపురంలోని గుంటూరు రైల్వే డీఆర్ఎం కార్యాలయంలో మంగళవారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. రష్మిశెట్టి 64వ జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ క్రీడా పోటీలలో జావెలిన్ త్రో విభాగంలో కాంస్య పతకం సాధించారు. డీఆర్ఎం మాట్లాడుతూ ప్రధానంగా జాతీయ క్రీడా పోటీలలో గుంటూరు రైల్వే డివిజన్ తరుఫున జావెలిన్ త్రోలో పాల్గొని సత్తా చాటిన రష్మి శెట్టిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. రైతు ద్విచక్ర వాహనం నుంచి రూ. 3 లక్షలు చోరీ సత్తెనపల్లి: సినీఫక్కీలో గుట్టుచప్పుడు కాకుండా వెంబడించి రైతు ద్విచక్ర వాహనంలో నుంచి గుర్తు తెలియని దుండగులు రూ. 3 లక్షలు నగదు కాజేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. సత్తెనపల్లి మండలం కందులవారిపాలెం గ్రామానికి చెందిన రైతు బూతుకూరి శ్రీనివాసరెడ్డి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గల యూనియన్ బ్యాంకుకు వచ్చాడు. బంగారు నగలు కుదువపెట్టి రూ. 3 లక్షలు నగదు తీసుకున్నాడు. ఆ నగదును ద్విచక్ర వాహనంలో పెట్టుకొని మాచర్ల రోడ్లో గల పెద్ద మసీదు ఎదురు గల తిరుమల ఫర్టిలైజర్స్ ముందు ద్విచక్ర వాహనం ఆపి ఆ కొట్లో ఎరువులు కొనుగోలు చేసేందుకు వెళ్లాడు. ఎరువులు కొనుగోలు చేసి తిరిగి నగదు కోసం ద్విచక్ర వాహనం వద్దకు రాగా అప్పటికే బ్యాంకు వద్ద నుంచి మాటు వేసిన గుర్తు తెలియని దుండగుడు ద్విచక్ర వాహనంలోని నగదును చోరీ చేశాడు. ద్విచక్ర వాహనంలో నగదు లేకపోవడాన్ని గుర్తించిన శ్రీనివాసరెడ్డి లబోదిబోమంటూ హుటాహుటిన పట్టణ పోలీస్స్టేషన్కు చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పట్టణ ఎస్ఐ జె.శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వాల్మీకి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి
జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ బాపట్లటౌన్: వాల్మీకి మహర్షి జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం వాల్మీకి జయంతి కార్యక్రమం నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ధి పొందిన రామాయణ మహాకావ్యాన్ని రచించిన మహనీయుడు వాల్మీకి మహర్షి అన్నారు. యుగాలు మారినప్పటికీ రామాయణం ఇచ్చే ఆదర్శాలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయన్నారు. ప్రతి మనిషిలో ఉన్న చెడును తొలగించి మంచి దారిలో నడిపించే శక్తి వాల్మీకి రచనల్లో ఉందన్నారు. రామాయణ స్ఫూర్తితో కుటుంబ, మానవతా విలువలను పెంపొందించుకోవాలని, ధర్మబద్ధంగా జీవించాలన్నారు. ఎస్.బి. సీఐ జి.నారాయణ, అడ్మిన్ ఆర్ఐ షేక్ మౌలుద్దీన్, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
టీడీపీ శ్రేణులు వైఎస్సార్ సీపీలో చేరిక
చెరుకుపల్లి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన మళ్లీ రావాలని అన్నివర్గాల ప్రజలు కోరుకుంటున్నారని, ప్రజల ఆశీస్సులతో వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం తథ్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరు గణేష్ అన్నారు. మంగళవారం గుళ్లపల్లి లోని తన క్యాంపు కార్యాలయంలో మండలంలోని నడింపల్లి గ్రామానికి చెందిన న్యాయవాది, తెలుగుదేశం పార్టీ రేపల్లె నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి బడుగు ఫణికుమార్తో పాటు అదే గ్రామానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు, స్థానిక సర్పంచ్ ఏమినేని సుబ్బారావు, పార్టీ మండల కన్వీనర్ దుండి వెంకట రామిరెడ్డి, మరియు పలువురు వైఎస్సార్ సీపీ నాయకుల ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీలో చేరారు. డాక్టర్ ఈవూరు గణేష్ వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి, కండువాలు కప్పారు. ఈ సందర్భంగా ఫణి కుమార్ మాట్లాడుతూ పేదలకు పూర్తిస్థాయిలో సంక్షేమం అందాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటేనే సాధ్యమవుతుందన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్షతోనే వైఎస్సార్ సీపీలో చేరినట్లు పేర్కొన్నారు. డాక్టర్ గణేష్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూటమిని చిత్తుగా ఓడించి, వైఎస్ జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామన్నారు. పార్టీలో కొత్తా పాతా తేడా లేకుండా ఎలాంటి సమస్యవచ్చినా తనతో నేరుగా మాట్లాడి పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు, నాయకుడికి తప్పనిసరిగా గుర్తింపు లభిస్తుందన్నారు. గ్రామ ఉపసర్పంచ్ ఆరాధ్యుల రోశయ్య, అలివేలు సన్ని, పెనుమాల రవి, అంబటి రాంబాబు, జంగం మాణిఖ్యారావు, దావులూరి రాంబాబు, జంగం విజయ్కుమార్, పెనుమాల విద్యాసాగర్, మంచాల శ్రీనివాసరావు, షక్ ఫిరోజ్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు. -
చీఫ్ జస్టిస్ గవాయ్పై దాడి హేయం
రేపల్లె: దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయిపై న్యాయవాది రాకేష్ అనుచితంగా ప్రవర్తించటంపట్ల రేపల్లె బార్ అసోసియేషన్ న్యాయవాదులు మంగళవారం విధులను బహిష్కరించారు. స్థానిక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం సెంటరులో రేపల్లె బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొని దాడికి పాల్పడిన నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేయటమంటే రాజ్యాంగంపై దాడి చేయటమేనన్నారు. రాకేష్ను న్యాయవాద వృత్తి నుంచి శాశ్వతంగా బహిష్కరణ చేయటంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనగాని శ్రీనివాసమూర్తి, రేపల్లె బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఉప్పాల శ్రీనివాసరావు, మాజీ ప్రభుత్వ సహాయ న్యాయవాదులు దారం సాంబశివరావు, కర్రా ఐజాక్, న్యాయవాదులు గుంటూరు విజయ కుమారి, కట్టుపల్లి కాకమ్మ, ఎం.వెంకటేశ్వరరావు, గుడిపల్లి రవి, గురిందపల్లి రామారావు, నాలాది పోతురాజు, రేవు నాగరాజు, గుమ్మడి కుమార్ బాబు, మునిపల్లి సుబ్బయ్య, కర్రా జయరావు, నల్లూరి వెంకటేశ్వరరావు, దోవా రమేష్ రాంజీ తదితరులు పాల్గొన్నారు. దాడి అమానుషం.. చీరాల రూరల్: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్పై షూ విసిరి దాడిచేసేందుకు న్యాయవాది ప్రయత్నించడంపై మంగళవారం ఆగ్రహం పెల్లుబికింది. దళిత హక్కుల పరిరక్షణ సమితి నాయకులు, ఆల్ ఇండియా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆర్మీ నాయకులు మాట్లాడుతూ ఇది భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థలపై దాడిగా అభివర్ణించారు. చీరాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు తమ విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. తక్షణమే సీజేఐపై దాడికి యత్నించిన న్యాయవాదిపై చర్యలు తీసుకోవాలని ముక్తకంఠంతో కోరారు. దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు మంగళవారం స్థానిక దళిత మహాసభ కార్యాలయంలో మాచవరపు జూలియన్ అద్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. దేశ అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు సాక్షిగా సీనియర్ న్యాయవాది రాకేష్ కిషోర్.. సనాతన ధర్మాన్ని సీజేఐ బీఆర్ గవాయ్ అవహేళన చేశారని ఆరోపిస్తూ.. తన కాలిబూటు విసిరి దాడి చేసేందుకు యత్నించాడన్నారు. లౌకిక భారతదేశంలో సనాతనం పేరుతో అరాచకాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వ హయాంలో మతోన్మాదం పెరిగిపోతోందని, కరుడు కట్టిన ఆర్ఎస్ఎస్ భావజాలం జడలు విప్పుతోందని ఈ దాడివెనుక బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. తక్షణమే దాడికి యత్నించిన న్యాయవాదిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దారా అంజయ్య, బాపట్ల జిల్లా ఎంఎస్పీ అధ్యక్షుడు తేళ్ల జయరాజు, దళిత నాయకులు కాకుమాను రవి, గొర్రెముచ్చు ఏలియా తదితరులు పాల్గొన్నారు. విధులు బహిష్కరించిన న్యాయవాదులు దేశ అత్యున్న న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్పై న్యాయవాది బూటువిసిరి దాడిచేసేందుకు ప్రయత్నించినందుకు నిరసనగా మంగళవారం చీరాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి నిరసన తెలియజేశారు. ప్రజాస్వామ్యం దేశంలో ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గౌరవ రమేష్బాబు, మేరుగ రవికుమార్లు పేర్కొన్నారు. చీరాల రూరల్: ఆల్ ఇండియా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆర్మీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మార్పు దీనరాజు.. చీరాల గడియార స్తంభం సెంటర్లో కళ్లకు నల్ల రిబ్బన్ కట్టుకుని నిరసన తెలియజేశారు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో చీఫ్ జస్టి స్గా ఉన్న వ్యక్తిపై దాడి జరిగితే సామాన్యుల పరిస్థితి ఏవిధంగా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. కుల, మతాల మధ్య చిచ్చు పెట్టే విధానాన్ని తీవ్రంగా ఖండించారు. న్యాయవాదిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు
కొల్లూరు: కృష్ణా నదిలో ఇసుక అక్రమ రవాణా చేపడితే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ బి.వెంకటేశ్వర్లు హెచ్చరించారు. మంగళవారం మండలంలోని చింతర్లంక పరిధిలోని కృష్ణా నది నుంచి అధిక సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమ రవాణా చేపడతున్నట్లు అందిన సమాచారంతో తహసీల్దార్, రెవెన్యు సిబ్బంది, ఎస్ఐ జానకి అమరవర్ధన్తో కలసి నదిలోకి వెళ్లి పరిశీలించారు. ఆకస్మిక తనిఖీల సమయంలో నదిలో సుమారు 40 వరకు ట్రాక్టర్లు ఉండటాన్ని గమనించిన తహసీల్దార్, ఎస్ఐలు ట్రాక్టర్లతో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే సీజ్ చేసి కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. దీంతో ట్రాక్టర్లలో నింపుకొన్న ఇసుకను వాహనదారులు నదిలో అన్లోడ్ చేసి వెనుతిరిగారు. తనిఖీల సమయంలో ఇసుక నింపుకొని వెళుతున్న రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని కొల్లూరు పోలీసు స్టేషన్కు తరలించారు. కొల్లూరు తహసీల్దార్ బి.వెంకటేశ్వర్లు -
ఆసియా అభివృద్ధి బ్యాంకు బృందం పర్యటన
తాడికొండ: ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) బృందం రాజధాని అమరావతి పర్యటన వరసగా రెండో రోజు కొనసాగింది. విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయంలో కమిషనర్ కె.కన్నబాబు, అడిషనల్ కమిషనర్లు జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్, అమిలినేని భార్గవ తేజ్లతో ఏడీబీ– వాటర్– అర్బన్ డెవలప్మెంట్ సెక్టార్ బృందంలోని సభ్యులైన నోరియా సైటో(సీనియర్ డైరెక్టర్), మనోజ్ శర్మ(డైరెక్టర్), సంజయ్ జోషి(ప్రిన్సిపాల్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్), అశ్విన్ హోసూర్ విశ్వనాథ్(సీనియర్ ప్రాజెక్టు ఆఫీసర్) సమావేశమయ్యారు. అనంతరం అమరావతి సచివాలయంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, పురపాలక– పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్, పరిశ్రమలు– వాణిజ్య శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్, ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్ రాస్ ఐఏఎస్లను కలిశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఐఏఎస్ను ఆయన చాంబర్లో ఏడీబీ బృందం కలిసినట్లు సీఆర్డీయే అధికారులు వెల్లడించారు. ఈ సందర్బంగా రాజధాని అమరావతి ప్రాజెక్టు పనులలో పురోగతి, ఏడీబీ అందజేస్తున్న ఆర్థిక సహకారం తదితర అంశాలను బృందంలోని సభ్యులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో చర్చించారు. -
బాలికపై లైంగికదాడి కేసులో జైలు శిక్ష
మేదరమెట్ల: కొరిశపాడు మండలం మేదరమెట్ల పతులకాలనీకి చెందిన మైనర్ బాలిక (2) పై అదే ప్రాంతానికి చెందిన గురజాల మహేష్ అనే వ్యక్తి 2021 జనవరి నెలలో లైంగికదాడికి పాల్పడినట్టు మేదరమెట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం మహేష్కు 20 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష, రూ.12వేలు జరిమానా విధిస్తూ ప్రత్యేక ఒంగోలు పోక్సో కోర్టు న్యాయమూర్తి కె.శైలజ మంగళవారం తీర్పును వెలువరించినట్లు పోలీసులు తెలిపారు. మైనర్ బాలికకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.3 లక్షలు నగదు పరిహారాన్ని చెల్లించే విధంగా ఆదేశాలు జారీ చేశారు. నృసింహుని ఆదాయం రూ.48.45 లక్షలు పీజీ సోషల్ వర్క్ ఫలితాలు విడుదల విద్యుత్ సబ్ స్టేషన్ను సందర్శించిన జేసీ రంగా వర్సిటీలో వాల్మీకి జయంతినరసింహస్వామి హుండీ లెక్కింపుమంగళగిరి టౌన్ : మంగళగిరిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి హుండీ కానుకలను మంగళవారం దేవదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో సిబ్బంది లెక్కించారు. ఎగువ, దిగువ సన్నిధులు, ఘాట్రోడ్లోని పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాలకు మొత్తం రూ. 48,45,565 ఆదాయం వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. గతంలో కంటే రూ.2,94,429 అధికంగా వచ్చినట్లు వివరించారు. లెక్కింపు కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా పొన్నూరు శ్రీ సహస్ర లింగేశ్వరస్వామి వారి దేవస్థాన కార్యనిర్వహణాధికారి జి.వి.అమర్నాథ్ పర్యవేక్షించారు.సెమిస్టర్ ఫలితాలుఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ కోర్సు రెండో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను సీఈ ఆలపాటి శివప్రసాదరావు మంగళవారం విడుదల చేశారు. 13 మందికి 11 మంది ఉత్తీర్ణత సాధించారు. రీవాల్యూయేషన్కు దరఖాస్తు చేసుకునేవారు ఒక్కో పేపరుకు రూ.1,860 ఈనెల 17వ తేదీలోగా చెల్లించాలని సూచించారు.బీటెక్ సప్లిమెంటరీ ఫలితాలు..వర్సిటీ పరిధిలో బీటెక్ 3/4 మొదటి సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను సీఈ శివప్రసాదరావు విడుదల చేశారు. 132 మందికి 87మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. రీవాల్యూయేషన్ కోసం ఒక పేపరుకు రూ.2070 ఈనెల 17వ తేదీలోగా చెల్లించాలని సూచించారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
ఫిరంగిపురం: కారు, ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని పొనుగుపాడుకు చెందిన రత్నసాగర్(33) భార్య, ఇద్దరు పిల్లలతో కలసి గుంటూరు వెళ్లారు. గుంటూరు– కర్నూలు రాష్ట్ర రహదారిలో ఇంటికి తిరిగివస్తుండగా వేములూరిపాడు వద్ద గుంటూరు వైపు వెళ్తున్న ఇన్నోవా వాహనం ఢీకొట్టింది. ఘటనలో ఇన్నోవా రోడ్డుకు మరోవైపు వెళ్లింది. రత్నసాగర్తో పాటు భార్య, పిల్లలు గాయపడ్డారు. వీరితో పాటు అటువైపు నుంచి వస్తున్న గుర్తుతెలియని వాహన చోదకుడు గాయపడ్డారు. 108 అందుబాటులో లేకపోవడంతో ఆటోల్లో తరలిస్తుండగా రత్నసాగర్, గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం కారణంగా నిలిచిన ట్రాఫిక్ను పోలీసులు క్రమబద్దీకరించారు. -
రైతులకు కేళీ కష్టాలు
బాపట్లబుధవారం శ్రీ 8 శ్రీ అక్టోబర్ శ్రీ 2025రైతులు నమ్మి సాగు చేసిన విత్తనాల వల్ల ఏర్పడిన నష్టాన్ని పూడ్చే బాధ్యత సీడ్ కంపెనీనే భరించాలి. నా సోదరుల పొలంతో కలుపుకొని 40 ఎకరాలలో ఎన్ఆర్ఐ విత్తన కంపెనీకి చెందిన బీపీటీ 5204 రకపు విత్తనాలు సాగు చేశాం. ఇతర విత్తనాలు సాగు చేసిన పంట సాధారణ స్థితిలో ఉండగానే బీపీటీ 5204 రకం సాగు చేసిన మా పంటలో కేళీ కంకులు ఏర్పడ్డాయి. కేళీ కంకుల వల్ల ఏర్పడుతున్న నష్టాన్ని విత్తన కంపెనీ ప్రతినిధులు రైతులకు చెల్లించాలి. ధూళిపాళ్ల రవికుమార్, రైతు, అనంతవరం. 7 టీడీపీ నేత వద్ద విత్తనాలు కొనుగోలు కాలపరిమితికి ముందే కంకుల రాక పంటను పరిశీలించిన కంపెనీ ప్రతినిధులు కేళీలు ఉన్నట్లు నిర్ధారణ రైతులను ఆదుకుంటామని హామీ వరిలో కేళీల వల్ల కౌలుదారులకు తీవ్ర నష్టం ఏర్పడనుంది. 16 ఎకరాల భూమి కౌలుకు తీసుకొని వరి సాగు చేశాం. ఎన్ఆర్ఐకు చెందిన బీపీటీ 5204 రకం విత్తనాల కారణంగా తీవ్రమైన పంట నష్టం ఏర్పడనుంది. కేళీల కారణంగా ధాన్యం దిగుబడులు సగానికి సగం తగ్గిపోతే కౌలుకు తీసుకున్న పొలాలకు కౌలు చెల్లించే వెసులుబాటు ఉండకపోగా, అప్పుల పాలవ్వాల్చి వస్తుంది. –అలనేని శివప్రసాద్, కౌలు రైతు, అనంతవరం. అచ్చంపేట : పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 75,430 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 0,430 క్యూసెక్కులు వదులుతున్నారు. నరసరావుపేటటౌన్: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన న్యాయాధికారి సాయి కళ్యాణ్ చక్రవర్తిని పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా మంగళ వారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
దుర్గమ్మ దసరా హుండీ ఆదాయం రూ.10.30 కోట్లు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై నిర్వహించిన దసరా ఉత్సవాల్లో భక్తులు హుండీల ద్వారా రూ.10.30 కోట్లను సమర్పించారు. ఉత్సవాల్లో అమ్మవారికి సమర్పించిన కానుకల లెక్కింపు మంగళవారంతో పూర్తయింది. తొలిరోజున రూ.3,57,92,708 నగదు, 122 గ్రాముల బంగారం, 9.7 కిలోల వెండి లభ్యమవగా..రెండో రోజు రూ.6,73,02,813 నగదు, 265 గ్రాముల బంగారం, 9.750 కిలోల వెండి లభ్యమైంది. దసరా ఉత్సవాల్లో హుండీల ద్వారా 480 సంచులతో దుర్గమ్మకు కానుకలు వచ్చాయి. వీటిని లెక్కించగా రూ.10,30,95,521 నగదు, 387 గ్రాముల బంగారం, 19.450 కిలోల వెండి లభ్యమైంది. గతేడాది కంటే దాదాపు కోటి రూపాయలు హుండీల ద్వారా అదనంగా లభించింది. -
చెకుముకి సంబరాలను విజయవంతం చేయాలి
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థుల్లో సృజనాత్మకను వెలికితీసేందుకు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెకుముకి సైన్స్ సంబరాలను విజయవంతం చేయాలని జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ లక్ష్మణరావు తెలిపారు. సోమవారం బ్రాడీపేటలో సైన్స్ సంబరాల పోస్టర్లు విడుదల చేశారు. లక్ష్మణరావు మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక గత 35 ఏళ్లుగా ఈ సంబరాలను నిర్వహిస్తోందని వివరించారు. ఈ నెల 8న పాఠశాల స్థాయి, నవంబర్ 1న మండల స్థాయి, 23న జిల్లా స్థాయిలో పోటీలను నిర్వహిస్తామని తెలిపారు. డిసెంబర్ 12, 13, 14వ తేదీల్లో రాష్ట్రస్థాయి పోటీలు జరుగుతాయని వివరించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సంబరాల నిర్వహణకు విద్యాశాఖ అనుమతి ఇచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో జేవీవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తవ్వా సురేష్, ఎం.ఉదయ్ భాస్కర్, టి.జాన్బాబు, జి.వెంకట్రావు, టీఆర్ రమేష్, టీఆర్ చాందిని, కె.శ్రీనివాస్, యు.రాజశేఖర్ పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి స్కేటింగ్ పోటీలకు ఎంపిక
అద్దంకి: రాష్ట్రస్థాయిలో నిర్వహించనున్న స్కేటింగ్ పోటీలకు సోమవారం అద్దంకిలో క్రీడాకారులను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమాన్ని పట్టణంలోని సిరీ వెంచర్లో నిర్వహించారు. జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ సీహెచ్ వెంకటేశ్వర్లు హాజరై అద్దంకి, ఒంగోలు, సింగరాయకొండకు చెందిన 24 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు. ఇందులో 13 మంది అద్దంకి చెందిన వారు ఉన్నారు. వీరంతా రాష్ట్ర స్థాయిలో త్వరలో నిర్వహించనున్న అండర్– 11, అండర్ –14, అండర్– 17 విభాగాల్లో ఆడనున్నట్లు స్కూల్ గేమ్స్ సెక్రటరీ వెల్లడించారు.బెండ తోటను పీకేసిన దుండగులుఅద్దంకి: మండలంలోని చక్రాయపాలెంలో దుండగులు ఓ కౌలు రైతు బెండ తోటను పీకేశారు. గ్రామానికి చెందిన నగేశ్ భూమిని సంతమాగులూరు మండలంలోని కొమ్మాపాడుకు చెందిన కాలేషా మీరావలి నాలుగేళ్ల క్రితం కౌలుకు తీసుకుని ఏటా సాగు చేసుకుంటున్నాడు. ఈ ఏడాది అందులో బెండ తోట వేశాడు. ప్రస్తుతం అది కాపు దశలో ఉంది. ఈ క్రమంలో సోమవారం కౌలుదారు తోటను చూసుకునేందుకు వెళ్లగా అర ఎకరంలోని బెండ మొక్కలను గుర్తు తెలియని వ్యక్తులు పీకేశారు. దీనిపై మీరావలి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.జిల్లాకు 1620 మెట్రిక్ టన్నుల యూరియానాదెండ్ల: సాతులూరులోని రైల్వే ఎరువుల రేక్ పాయింట్ను నరసరావుపేట ఏడీఏ కేవీ శ్రీనివాసరావు పరిశీలించారు. పల్నాడు జిల్లాకు సీఐఎల్ యూరియా 1620 మెట్రిక్ టన్నులు కేటాయించినట్లు తెలిపారు. అనంతరం సాతులూరులోని ఆవాస్ గోడౌన్లు తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ కేటాయించిన ఎరువులు సొసైటీలకు , ప్రైవేటు డీలర్లకు సరఫరా చేసి రైతులకు సక్రమంగా పంపిణీ అయ్యేలా చూడాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. ఆయనతో పాటు ఏఓ టి.శ్రీలత, ఏఈఓ జీపీ శ్రీనివాసరావు ఉన్నారు. -
గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థ బలోపేతం లక్ష్యం
బాపట్ల: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు శుద్ధ జలాలు సరఫరా చేసేలా ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టమైన ప్రణాళిక ఉండాలని జిల్లా కలెక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. జల సంరక్షణ ప్రణాళికపై స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో నాలుగు జిల్లాల ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధికారులకు ఏర్పాటు చేసిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ సోమవారం ప్రారంభించారు. ప్రారంభ సూచికగా జ్యోతిని వెలిగించారు. గాంధీజీ, అంబేడ్కర్ చిత్రపటాలకు ఆయన పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమని తెలిపారు. జల వనరుల సంరక్షణ, అభివృద్ధిలోనూ ప్రజల సహకారం ఉండాలన్నారు. గ్రామాల అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అధునాతన సాంకేతికత పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని ఇంజినీర్లకు ఆయన సూచించారు. గ్రామాల్లో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థను బలోపేతం చేయాలని చెప్పారు. ప్రభుత్వ విధులను ఇష్టంతో, సంతోషంగా నిర్వర్తించాలని ఆయన తెలిపారు. జల జీవన్ మిషన్ పనులు పక్కాగా చేపట్టాలని, పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఆర్డబ్ల్యూఎస్ చీఫ్ ఇంజినీర్ సత్యనారాయణ మాట్లాడుతూ జల వనరుల సుస్థిరాభివృద్ధి, తాగునీరు నిరంతర సరఫరా లక్ష్యంతో అధికారులు పని చేయాలని తెలిపారు. జీవన్ మిషన్ పనులు 2028 సంవత్సరం వరకు పొడిగిస్తూ కేంద్రం అధికారికంగా అనుమతులు ఇచ్చిందన్నారు. భవిష్యత్తులో తాగునీటి సమస్యను అరికట్టడానికి ప్రణాళికలు రూపొందించుకోవాలని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రణాళికలు రూపొందించి అమలు చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని సూచించారు. జలజీవన్ మిషన్, స్వచ్ఛభారత్ కార్యక్రమాలను గ్రామాల్లో విరివిగా చేపట్టాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో విశ్రాంత పర్యవేక్షణ ఇంజినీర్ రాఘవులు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ అనంతరాజు, డీపీఓ ప్రభాకర్రావు, విస్తరణ శిక్షణ కేంద్రం ప్రధానాచార్యులు డి. వెంకటరావు పాల్గొన్నారు. పార్క్లను అభివృద్ధి చేయాలి బాపట్ల: ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కలిగించేలా పట్టణంలో పార్క్లను అభివృద్ధి చేయాలని కలెక్టర్ వి.వినోద్ కుమార్ సూచించారు. సోమవారం రాత్రి పట్టణంలోని వివేకానంద కాలనీలో గల మున్సిపల్ పార్క్లో జరుగుతున్న అభివృద్ధి పనులను కమిషనర్ జి.రఘునాథరెడ్డితో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పార్క్ను ఈ నెల 20న ప్రారంభోత్సవం చేయాలని, ఈలోగా వేగవంతంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి ఆదివారం పిల్లలు పార్కుకు వచ్చే విధంగా అభివృద్ధి చేయాలని సూచించారు. పిల్లలకు సంబంధించిన ఆట వస్తువులు, పరికరాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. పిల్లలతో పాటు వచ్చే పెద్దలు పార్కులో వాకింగ్ చేసే విధంగా ట్రాక్ ఏర్పాటు చేయాలని తెలిపారు. యువతకు ఉపయోగపడే జిమ్ పరికరాలను కూడా సిద్ధం చేయాలని ఆదేశించారు. నగరంలో ప్రతి వార్డులో పార్క్ ఉండే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. దీని కోసం పట్టణ పరిధిలో ప్రభుత్వ భూములను పరిశీలించాలని ఆర్డీఓను, తహసీల్దార్ను కలెక్టర్ ఆదేశించారు.ఆయన వెంట ఆర్డీఓ పి.గ్లోరియా, తహసీల్దార్ శాలీమా, మున్సిపల్ డీఈ సిబ్బంది ఉన్నారు. -
జీఎస్టీ సమావేశంలో గ్రూపు విభేదాలు బహిర్గతం
భట్టిప్రోలు(వేమూరు) : జీఎస్టీపై ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో తెలుగుదేశం పార్టీలో రెండు గ్రూపుల మధ్య కొనసాగుతున్న విభేదాలు బహిర్గతమయ్యాయి. భట్టిప్రోలులో సోమవారం ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు జీఎస్టీపై అవగాహన సదస్సు నిర్వహించారు. దీన్ని పార్టీలోని ఒక గ్రూపు బహిష్కరించింది. భట్టిప్రోలు మండల కేంద్రంలో తూనుగుంట్ల సాయిబాబా, బట్టు మల్లికార్జునరావు మధ్య గ్రూపు విభేదాలు నెలకొన్నాయి. రథం సెంటరులో జీఎస్టీపై అవగాహన సదస్సును సోమవారం తూనుగుంట సాయిబాబా ఆధ్వర్యంలో నిర్వహించారు. బట్టు మల్లికార్జునరావు వర్గానికి చెందిన పార్టీ నాయకులు హాజరు కాక పోవడంతో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తల పట్టుకున్నారు. పార్టీలో నాయకుల మధ్య ఉన్న అంతర్గత వర్గ పోరు బయట పడటంతో ఆయనకు ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. గత శుక్రవారం కొల్లూరు మండల కేంద్రంలోని బస్స్టాండ్ సెంటరులో శుక్రవారం జీఎస్టీపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో కొల్లూరు మండలంలోని మాజీ ఎంపీపీ కనగాల మధుసూదన ప్రసాద్, పార్టీ మండల అధ్యక్షడు మైనేని మురళీ మధ్య కొనసాగుతున్న వర్గ పోరు కొట్టుకునే దిశగా వెళ్లింది. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సమక్షంలో ఇరు వర్గాలు కొట్టుకున్నారు. కొంత మందికి గాయాలయ్యాయి. మిగితా మండలాల్లోనూ విభేదాలు బహిర్గతమయ్యే పరిస్థితి నెలకొందని కొందరు టీడీపీ నేతలు అంటున్నారు. వర్గాల పోరుపై ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి. ఎమ్మెల్యే హాజరైన కనిపించని నాయకులు -
అమరావతిలో ఏడీబీ బృందం పర్యటన
తాడికొండ: ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) బృందం సోమవారం రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించింది. తొలుత విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయానికి వెళ్లిన ఆ బృందానికి కమిషనర్ కె.కన్నబాబు, అడిషనల్ కమిషనర్లు జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్, అమిలినేని భార్గవ్ తేజలు స్వాగతం పలికారు. అనంతరం సీఆర్డీఏ, అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీఎల్)లోని ముఖ్య అధికారులతో బృందం సమావేశమైంది. అమరావతి నిర్మాణ పురోగతిని కమిషనర్ కన్నబాబు వివరించారు. తర్వాత రాజధాని ప్రాంతంలో కొనసాగుతున్న పలు పనులను బృందం పరిశీలించింది. గ్రీవెన్స్ రిడ్రెస్సల్ మెకానిజం(జీఆర్ఎం) గురించి వివరాలు తెలుసుకుంది. దీనిపై సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. పర్యటనలో ఏడీబీ– వాటర్ – అర్బన్ డెవలప్మెంట్ సెక్టార్ బృందంలోని సభ్యులైన నోరియా సైటో (సీనియర్ డైరెక్టర్), మనోజ్ శర్మ (డైరెక్టర్), సంజయ్ జోషి (ప్రిన్సిపాల్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్), అశ్విన్ హోసూర్ విశ్వనాథ్ (సీనియర్ ప్రాజెక్టు ఆఫీసర్)లు పాల్గొన్నారు. -
మాజీ సైనికుడు బాజీబాబాకు ఘనంగా నివాళులు
నిజాంపట్నం: మాజీ సైనికుడు షేక్ బాజీబాబా విశాఖపట్టణం జిల్లా భీమిలిలో అకాల మరణం చెందారు. ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామమైన నిజాంపట్నం మండలం బావాజీపాలేనికి తీసుకువచ్చారు. సోమవారం నిర్వహించిన అంతిమ యాత్రలో పలువురు సైనికులు, మాజీ సైనికులు, గ్రామస్తులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. అధికార లాంఛనాలతో ఆయన అంతిమయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా మాజీ సైనికుల అసోసియేషన్ అధ్యక్షుడు నజీర్ అహ్మద్, జిల్లా సైనిక్ వెల్పేర్ కార్యాలయ అధికారి మునిపల్లె శ్రీనివాసరావు, అసోసియేషన్ ట్రెజరర్ నిజాముద్దీన్, నిజాంపట్నం అసోసియేషన్ ప్రెసిడెంట్ షేక్ సుల్తాన్ మెహబూబ్, బాపట్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ షేక్ మొహినుద్దీన్, పొన్నూరు అసోసియేషన్ సెక్రటరీ మాసుం అలీ, మాజీ సైనికులు షేక్ అల్లావుద్దీన్, తాడివాక రుక్మధరరావు, చినమట్లపూడి, బావాజీపాలెం, పరిసర ప్రాంతాల మాజీ సైనికులు పాల్గొన్నారు. అంతిమ యాత్రలో పాల్గొన్న మాజీ సైనికులు -
లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం
తెనాలి రూరల్: బైక్ను వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, మృతుని బంధువులు తెలిపిన వివరాల మేరకు... పట్టణంలోని మారిస్పేటలో ఉన్న సీఎం కాలనీలో ఆదివారం రాత్రి గ్యార్మీ పండుగ చేసుకున్నారు. దీనికి బాపట్ల జిల్లా అప్పికట్లకు చెందిన నాయబ్ రసూల్ (45), అతని బంధువు గౌస్బాషా, మరో చిన్నారి వసీం కుటుంబసభ్యులతో వచ్చారు. తిరిగి సోమవారం ఉదయం అప్పికట్లకు బైక్పై వెళుతున్నారు. ఈ క్రమంలో తెనాలి వైకుంఠపురం నుంచి జగ్గడిగుంటపాలెం వైపు వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నాయబ్రసూల్ అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108లో తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. ఘటనాస్థలాన్ని త్రీ టౌన్ పోలీసులు పరిశీలించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు -
98 డీఎస్సీ టీచర్ల సభకు తరలిరండి
గుంటూరు ఎడ్యుకేషన్: విజయవాడలోని ధర్నా చౌక్లో ఈ నెల 11వ తేదీన తలపెట్టిన 1998–డీఎస్సీ ఎంటీఎస్ ఉపాధ్యాయుల రాష్ట్రస్థాయి విజ్ఞాపన సభకు తరలిరావాలని గుంటూరు జిల్లా 98 ఎంటీఎస్ టీచర్ల మహిళా విభాగ అధ్యక్షురాలు శారద, శౌరీలమ్మ, ధనలక్ష్మి, పార్వతి, రూత్బస్లీనాలు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. తమ సేవలను క్రమబద్ధీకరించి, ఉద్యోగ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలని కోరారు. రిటైర్ అయినవారికి రూ.20 వేల పింఛన్ అందించాలని డిమాండ్ చేశారు. పలు డిమాండ్లతో చేపడుతున్న సభకు ఉపాధ్యాయులు పెద్దసంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు.వృద్ధుడిని బలిగొన్న బైకు మోతడక(తాడికొండ): ద్విచక్ర వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందిన ఘటన తాడికొండ మండలం మోతడక గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోతడక గ్రామానికి చెందిన కొమ్మినేని సాంబశివరావు (67) ఆదివారం సాయంత్రం సచివాలయం సెంటర్లో రోడ్డు దాటుతున్నాడు. అమరావతి వైపు నుంచి వస్తున్న ద్విచక్ర వాహనం వేగంగా అతడిని ఢీకొట్టింది. తలకు బలమైన గాయం కావడంతో వెంటనే జీజీహెచ్కు తరలించారు. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కె.వాసు తెలిపారు.ఏనుగుపాలెంలో యువకుడి హత్యవినుకొండ: పల్నాడు జిల్లా వినుకొండ రూరల్ మండలం ఏనుగుపాలెం గ్రామంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన గుంటూరు శివ (35)ను గుర్తుతెలియని వ్యక్తులు గ్రామ సమీప పొలాల్లో గడ్డపారతో పొడిచి హత్య చేసినట్లు సోమవారం గుర్తించారు. స్థానిక రైతులు ఇచ్చిన సమాచారంతో నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు, ఇన్చార్జి సీఐ బాలాజీ సంఘటనా ప్రాంతానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. హత్యపై విచారణ చేస్తున్నామని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ తెలిపారు. మృతుడికి భార్య సుధతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.జిల్లా వ్యాప్తంగా వర్షాలుకొరిటెపాడు (గుంటూరు): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల గుంటూరు జిల్లా వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు అత్యధికంగా గుంటూరు పశ్చిమలో 49.6, అత్యల్పంగా వట్టిచెరుకూరు మండలంలో 1 మి.మీ. వర్షపాతం నమోదైంది. సగటు 16.5 మి.మీ.గా కురిసింది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు.. తెనాలి మండలంలో 47.2, మంగళగిరి 42.4, గుంటూరు తూర్పు 42.2, పెదనందిపాడు 15.2, పొన్నూరు 15, దుగ్గిరాల 13.8, కాకుమాను 12.4, ఫిరంగిపురం 9.8, తుళ్ళూరు 8.4, పెదకాకాని 8, తాడేపల్లి 6.2, తాడికొండ 6.2, ప్రత్తిపాడు 6, చేబ్రోలు 5.4, కొల్లిపర 5.2, మేడికొండూరు మండలంలో 2.2 మి.మీ. చొప్పున వర్షపాతం కురిసింది. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
మంగళగిరి టౌన్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన మంగళగిరిలో చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు.. విజయవాడ, ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన ముదిగొండ వెంకట ప్రమీల తన కుమారుడు వెంకట సురేంద్ర (18)తో కలసి ద్విచక్రవాహనంపై గుంటూరులోని బంధువుల ఇంటికి సోమవారం వెళ్లారు. తిరిగి వచ్చే క్రమంలో మంగళగిరి ఆత్మకూరు జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. సురేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో ప్రమీలను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మంగళగిరి రూరల్ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం సురేంద్ర మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సముద్ర స్నానానికి వచ్చి వివాహిత మృతి
చినగంజాం: సముద్ర స్నానం చేసేందుకు వచ్చి వివాహిత మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని మోటుపల్లి సముద్ర తీరంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ శీలం రమేష్ వివరాల మేరకు.. చీరాల వాడరేవు పరిధిలోని అడవి పల్లెపాలెం గ్రామానికి చెందిన ఊసుపల్లి శాంతి (25)కి ఉప్పుగుండూరు గ్రామానికి చెందిన సలగల వినయ్ అనే పాస్టర్తో చర్చికి వెళ్లే క్రమంలో పరిచయం ఏర్పడింది. ఆమె గడచిన కొద్ది రోజులుగా పందిళ్లపల్లి పాతరెడ్డి పాలెం గ్రామానికి వచ్చి ఆమె సోదరి ఇంటి వద్ద ఉంటోంది. ఈ క్రమంలో ఆమె పాస్టర్ వినయ్తో కలిసి మోటుపల్లి సముద్ర తీరానికి స్నానం చేసేందుకు వచ్చింది. ఇద్దరు స్నానం చేసే క్రమంలో ఆమెను నీటిలో వదలి పెట్టి వినయ్ బయటకు వచ్చేశాడు. ఘటనను గమనించి స్థానికంగా ఉన్న మత్స్యకారులు ఆమెను ఒడ్డుకు తీసుకొని వచ్చి 108కి సమాచారం అందించారు. ఆమె ఆ పాటికే చనిపోయినట్లు గుర్తించారు. మృతురాలికి భర్త, ఇద్దరు సంతానం ఉన్నట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పాస్టర్ వినయ్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. -
ప్రతి కార్యకర్తా సైనికుడిలా పోరాడాలి !
సాక్షి ప్రతినిధి, బాపట్ల: గ్రామ స్థాయిలో ప్రతి వైఎస్సార్ సీపీ కార్యకర్తా సైనికుడిలా మారాలని రాజ్యసభ సభ్యుడు, పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్ వై.వి. సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. బాపట్ల కోన భవన్లో సోమవారం నిర్వహించిన పార్టీ సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పార్టీ సంస్థాగత నిర్మాణం కీలకమని, గ్రామస్థాయి నుంచి తిరుగులేని శక్తిగా రూపొందించాలని తెలిపారు. ఇందు కోసం గ్రామ స్థాయి నుంచి అన్ని పార్టీ కమిటీలను నవంబర్ 20 నాటికి పూర్తి చేయాలని చెప్పారు. గ్రామ స్థాయిలో 30 మంది కార్యకర్తలు సైనికుల్లా మారాలన్నారు. నియోజకవర్గ స్థాయిలో 1400 మంది కార్యకర్తలు క్రియాశీలకంగా పని చేయాలని సూచించారు. కమిటీల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన నియోజకవర్గ సమన్వయకర్తలను ఆదేశించారు. ఇందుకోసం గ్రామ, మండల స్థాయి నాయకులు పని చేయాలని తెలిపారు. కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలం చెందిందని సుబ్బారెడ్డి దుయ్యబట్టారు. పేదల సంక్షేమ పథకాల్లోనూ కోత పెట్టిందన్నారు. రైతల పరిస్థితి దుర్భరంగా ఉందని పేర్కొన్నారు. పొగాకు, మిర్చి, టమోటాలకు ధరలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వైఎస్.జగన్మోహన్రెడ్డి పాలనలో రైతులకు అన్ని విధాలా మేలు జరిగిందని, గిట్టుబాటు ధరలు లభించాయని గుర్తు చేశారు. ప్రభుత్వం నడపాల్సిన మెడికల్ కళాశాలలను పీపీపీ మోడ్లో ప్రైవేటు పరం చేసిందని, నకిలీ మద్యం తయారు చేసి పేదల ప్రాణాలను బలికొంటోందని విమర్శించారు. బాధిత వర్గాల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుందని అభయమిచ్చారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను పార్టీ నేతలు, కార్యకర్తలు గడప గడపకు తీసుకు వెళ్లాలని తెలిపారు. ఇందుకోసం గ్రామస్థాయిలో పార్టీ మరింత బలోపేతం కావాలని దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా పరిశీలకులు, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున, సమన్వయకర్తలు కరణం వెంకటేశ్, ఈవూరు గణేష్, వరికూటి అశోక్బాబు, గాదె మధుసూదన్రెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు చేజర్ల నారాయణరెడ్డి, మోదుగుల బసవ పున్నారెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ సీతారామిరెడ్డి, డాక్టర్ అశోక్ కుమార్, పుత్తా శివశంకర్రెడ్డి, కారుమూరు వెంకటరెడ్డి, కోకి రాఘవరెడ్డి ,అంజనీప్రసాదరెడ్డి, చెంచయ్య, చల్లా రామయ్య, డేవిడ్, విజయకుమార్, అన్ని నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఆగని మరణ మృదంగం
స్జాక్షి ప్రతినిధి, గుంటూరు/ గుంటూరు రూరల్: గుంటూరు రూరల్ మండలం తురకపాలెం గ్రామంలో అంతుచిక్కని మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. గ్రామంలోని చల్లా కృష్ణవేణి (24) పది రోజులపాటు జ్వరంతో బాధపడి చికిత్స పొందుతూ చివరికి గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో ఆదివారం మృత్యువాతకు గురైంది. గత నెల సెప్టెంబర్ 3, 4 తేదీల్లో రెండు మరణాలు సంభవించిన అనంతరం తీరిగ్గా కూటమి ప్రభుత్వం స్పందించింది. అప్పుడు ఆరు రోజులపాటు గ్రామంలో ప్రజలకు భోజనాలు పెట్టారు. మరో నెల రోజులు మెడికల్ క్యాంప్ అంటూ హడావుడి చేశారు. అనంతరం పాలకులు చేతులు దులుపుకొన్నారు. కనీసం గ్రామంలో ప్రజల అనారోగ్యానికి కారణం.. ఏ వ్యాధితో మరణిస్తున్నారు.. దీనికి పరిష్కారం ఉందా? లేదా? అనే అంశాలపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యం వలనే ప్రాణం బలి పదిరోజులుగా జ్వరంతో ఉన్న కృష్ణవేణి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన రోజు బాగానే ఉందని, బాగానే మాట్లాడి తిరుగుతూనే ఉందని ఆమె భర్త దుర్గారావు, అత్త తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రిలో రోజుకు రూ.30 వేలు అడిగారని చెప్పారు. కూలీనాలీ చేసుకుని బతికే తాము అంత డబ్బు కట్టలేమని చెప్పటంతో జీజీహెచ్కు తీసుకెళ్లమన్నారని పేర్కొన్నారు. అక్కడికి వెళ్లాక కనీస స్పందన కరువైందని కుటుంబ సభ్యులు వాపోయారు. వైద్యులు పట్టించుకోలేదని తెలిపారు. చివరి నిమిషంలో కనీసం ఆక్సిజన్ అయినా పెట్టాలని తాము బతిమాలినా పట్టించుకోలేదని వాపోయారు. ప్రభుత్వం, వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని కన్నీరు మున్నీరయ్యారు. అక్కడికి వచ్చిన అధికారులను గ్రామస్తులతో కలిసి నిలదీశారు. ఆరు నెలలుగా అదే పరిస్థితి.. గ్రామంలో ఆరు నెలలుగా సుమారు 46 మందికిపైగా మృత్యువాతకు గురయ్యారు. దీంతో గ్రామంలో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. కొందరు గ్రామంలో బొడ్డురాయి సమస్య అని ఆందోళన చెందారు. నిపుణులు, రాజకీయపార్టీల నేతలు, అధికారులు కొందరు తాగునీరు కలుషితం కావడం వల్ల సమస్య వచ్చిందని పేర్కొన్నారు. ఈ రెండింటిలో బొడ్డురాయి సమస్యను స్థానిక పెద్దలు సంప్రదాయబద్ధంగా పరిష్కారం చూపారు. మెలియాయిడోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వ్యాధి సంక్రమించి అనారోగ్యాలకు గురవుతున్నారని వైద్యులు తెలిపారు. కానీ ఈ వ్యాధికి చికిత్స ఏంటి? ఏ మందులు వాడాలనే విషయాన్ని గ్రామస్తులకు చెప్పిన వారే లేరు. నెల రోజుల తరువాత మరో మరణం సంభవించటంతో గ్రామంలో కలకలం రేగింది. జీజీహెచ్లో చికిత్స పొందిన బాధితురాలు అదే వ్యాధితో మృతి చెందిందని వైద్యులు తెలిపినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. కొన్ని రోజుల హడావుడే.. గ్రామంలో ప్రజలు ఆకస్మిక మరణాల విషయం వెలుగు చూడటం, మీడియాలో సంచలన కథనాలు, వార్తలు రావడంతో ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసింది ఇంటింటికీ వెళ్లి రక్త నమూనాలు సేకరించారు. పరీక్షలు చేశారు. గ్రామంలో దాదాపు వెయ్యి మందికి కిడ్నీ సమస్యలున్నాయని తేలిందని, మరో 300 మందికిపైగా లివర్ సమస్యలతో బాధపడుతున్నారని గుర్తించామని వైద్యులు తెలిపారు. వారికి పరీక్ష ఫలితాలను ఇవ్వలేదు. టాబ్లెట్, ఇంజక్షన్ కూడా లేదు. ఆరు రోజులు భోజనాలు ఏర్పాటు చేశారు. తర్వాత ఆ ఊసే లేదు. మరణించినవారి కుటుంబాలకు న్యాయం చేయలేదు. బాధితులు కలెక్టరేట్, తదితర అధికారులకు గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసినా వారికి న్యాయం అందని ద్రాక్షగానే మిగిలింది. ఇంటికి ఒకరు ఇద్దరు చొప్పున జ్వరాలతో గ్రామస్తులు బాధపడుతూనే ఉన్నారు. కనీసం ఒక్కరు కూడా తమను పట్టించుకోవటంలేదని వాపోతున్నారు. గ్రామంలోనే విలేజ్ క్లినిక్లో ఒకరిద్దరు వైద్యులు ఉన్నా ఫలితం లేదని ఆరోపిస్తున్నారు. -
నకిలీ మద్యంతో పేదల ప్రాణాలు బలి
సాక్షి ప్రతినిధి, బాపట్ల: కూటమి అధికారంలోకి వచ్చాక ఏకంగా ఫ్యాక్టరీలు పెట్టి నకిలీ మద్యం ఉత్పత్తి చేసి, షాపులకు విక్రయిస్తూ పేదల ప్రాణాలను బలిగొంటోందని వైఎస్సార్ సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వై.వి. సుబ్బారెడ్డి విమర్శించారు. సోమవారం బాపట్లలోని కోన భవన్లో నిర్వహించిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో నకిలీ మద్యం పరిశ్రమను అధికారులే కనుగొన్నారని పేర్కొన్నారు. నాసి రకం మద్యానికి ప్రజలు బలి కాకముందే దీనిపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని వైవీ డిమాండ్ చేశారు. కూటమి పాలన వచ్చాక పేద ప్రజలకు కష్టాలు తప్పడం లేదని, సంక్షేమ పథకాల్లోనూ కోతలు పెట్టిందని తెలిపారు. ఏ ప్రభుత్వమైనా పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించాలని, కానీ కూటమి ప్రభుత్వం వాటిని వారికి అందకుండా చేస్తోందని వైవీ విమర్శించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ దుర్మార్గం వైఎస్.జగన్మోహన్రెడ్డి సదుద్దేశంతో నెలకొల్పిన మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం పీపీపీ మోడ్లో ప్రైవేటు పరం చేసిందని విమర్శించారు. జగన్ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 16 మెడికల్ కళాశాలలను మొదలు పెట్టి, ఆరు కళాశాలలను పూర్తి చేశారన్నారు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు వాటిని ప్రైవేటీకరించడం దుర్మార్గమని ఖండించారు. లేని లిక్కర్ స్కాం అంటగట్టి వైఎస్సార్సీపీ నేతలను బదనాం చేశారని విమర్శించారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని, దీన్ని పార్టీ సమర్థంగా ఎదుర్కొంటుందని తెలిపారు. బాధితులకు అండగా పార్టీ లీగల్ టీం పని చేస్తుందని, పార్టీ సైతం అండగా ఉందని హామీ ఇచ్చారు. అక్రమ కేసులు పెడితే చూస్తూ ఊరుకునేది లేదని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సంస్థాగతంగా వైఎస్సార్ సీపీని మరింత బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో పార్టీ జిల్లా పరిశీలకులు, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున, సమన్వయకర్తలు కరణం వెంకటేశ్, ఈవూరు గణేష్, వరికూటి అశోక్బాబు, గాదె మధుసూదన్రెడ్డి, డాక్టర్ అశోక్ కుమార్, పుత్తా శివశంకర్రెడ్డి, కారుమూరు వెంకటరెడ్డి, కోకి రాఘవరెడ్డి పాల్గొన్నారు. -
15న కార్తికేయుని హుండీ కానుకల లెక్కింపు
బోధనా నైపుణ్యాలు పెంచుకోవాలి: డీఈఓ చంద్రకళనరసరావుపేట ఈస్ట్: మెగా డీఎస్సీ–2025 ద్వారా ఉపాధ్యాయులుగా నియామకం పొందినవారు బోధనా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ తెలిపారు. ఉపాధ్యాయులుగా నియామకం పొందినవారికి అందిస్తున్న శిక్షణ తరగతులను సోమవారం డీఈఓ సందర్శించి, నిర్వహణ తీరును పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ శిక్షణ పొందిన ఉపాధ్యాయులు తమ పాఠశాలల్లోని విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలని హితవు పలికారు. కార్యక్రమంలో పల్నాడుజిల్లా విద్యాశాఖ ఏడీ బి.వి.రమణ, శిక్షణ కేంద్రాం ఇన్చార్జి సత్యనారాయణసింగ్, ఏఎంఓ పూర్ణచంద్రరావు, రిసోర్స్పర్సన్లు పాల్గొన్నారు.సాగర్ నీటిమట్టంవిజయపురిసౌత్: నాగార్జుసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 588.00 అడుగులకు చేరింది. ఇది 306.1010 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు 10,040, ఎడమ కాలువకు 9,076, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 33,211, ఎస్ఎల్బీసీకి 1,800, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదలవుతోంది. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 54,427 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 54,427 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.15న కార్తికేయుని హుండీ కానుకల లెక్కింపుమోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానంలో భక్తులు సమర్పించిన హుండీ కానుకుల లెక్కింపు ఈ నెల 15వ తేదీ ఉదయం 8 గంటలకు నిర్వహించనున్నట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామవరప్రసాదరావు సోమవారం తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ సమక్షంలో నిర్వహించే లెక్కింపులో పాల్గొనదలచిన భక్తులు డ్రస్కోడ్లో హాజరు కావాలని సూచించారు. కానుకల లెక్కింపు కారణంగా ఆ రోజున జరగాల్సిన స్వామివారి నిత్య శాంతి కల్యాణం ఉదయం 7 గంటలకు ప్రారంభిస్తారని తెలియజేశారు. -
క్లాప్ మిత్రల కృషితోనే జిల్లాకు అవార్డులు
కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ బాపట్ల: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పగలు, రాత్రీ తేడా లేకుండా క్లాప్ మిత్రలు పనిచేయడం ద్వారానే బాపట్ల జిల్లాకు విరివిగా అవార్డులు లభించాయని కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల ప్రదానోత్సవం సోమవారం స్థానిక కమ్మ కల్యాణ మండపంలో జరిగింది.అనంతరం స్వచ్ఛ ఆంధ్ర అవార్డులకు ఎంపికై న వారికి జిల్లా కలెక్టర్ అవార్డులు ప్రదానం చేశారు. ప్రజల ఆరోగ్యం, విద్యా, వైద్య రంగాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆయయన చెప్పారు. రానున్న మూడు నెలల్లో సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. వ్యర్థాలను పద్ధతి ప్రకారం తొలగించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చెత్త సంపద కేంద్రాలను సమర్థంగా నిర్వహిస్తామన్నారు. రాననున్న రోజుల్లో బాపట్ల జిల్లా అన్ని రంగాల్లో రాష్ట్రంలోనే తృతీయ స్థానంలో నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఇందుకోసం అధికారులు, ఉద్యోగులంతా కృషి చేయాలని చెప్పారు. చెరుకుపల్లి మండలంలోని కావూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాష్ట్రస్థాయి స్వచ్ఛత అవార్డు సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు. జిల్లాలో వివిధ రంగాలకు 49 అవార్డులు లభించడం సంతోషదాయకమని తెలిపారు. 146 గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. గాంధీజీ స్ఫూర్తితో పారిశుద్ధ్య కార్యక్రమాలు సమర్థంగా నిర్వహించామని ఇన్చార్జి సంయుక్త కలెక్టర్ జి.గంగాధర్ గౌడ్ తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల వల్లే ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ కార్యదర్శి బి.ఎస్.నారాయణభట్టు, బావుడా చైర్మన్ సలగల రాజశేఖర్బాబు, ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఎం.వెంకట రమణ, ఆర్డీఓ పి. గ్లోరియా, డీపీఓ ప్రభాకరరావు పాల్గొన్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతతో పని చేయాలి
జిల్లా కలెక్టర్ వి.వినోద్కుమార్ బాపట్ల: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతతో పని చేయాలని జిల్లా కలెక్టర్ వి. వినోద్ కుమార్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. కొన్నింటికి తక్షణమే పరిష్కార మార్గం చూపించారు. కొన్నింటిని సంబంధిత శాఖ అధికారులకు అందించి, తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించాలని, నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సూపర్ జీఎస్టీపై అవగాహన కల్పించాలి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రచారం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. గ్రామ, సచివాలయ పరిధిలో సమావేశాలు ఏర్పాటుకు షెడ్యూల్ తయారు చేయాలని ఆయన ఎంపీడీవోలను ఆదేశించారు. సెలూన్లు, యోగా సెంటర్లలో ధరల వివరాలను ప్రదర్శించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. జిల్లాస్థాయిలో వస్తు ఉత్పత్తుల, ధరలపై ఎగ్జిబిషన్ ఏర్పాటుకు షెడ్యూల్ తయారు చేయాలని పేర్కొన్నారు. జిల్లా, మండల స్థాయిలో డిస్ట్రిబ్యూటర్లకు జీఎస్టీపై సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. పాఠశాలలు, కళాశాలల్లో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్పై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, డిబేట్లు, పెయింటింగ్ పోటీలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. వీడియోలను తయారు చేసి విద్యార్థులకు అవగాహన కల్పించే విధంగా ప్రదర్శించాలని ఆయన తెలిపారు. రోజువారి నిర్దేశిత ప్రచార కార్యక్రమాలను ఆన్లైన్లో నమోదు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. స్థలాన్ని సేకరించాలి అద్దంకి నియోజకవర్గంలోని ఏడో సబ్స్టేషన్ పరిధిలో పీఎం కుసుమ పథకానికి భూ సేకరణపై రైతులతో బుధవారం నాటికి అగ్రిమెంట్లు పూర్తి చేసుకుని శనివారం పనులు మొదలు పెట్టాలని ఏపీ సీపీడీసీఎల్ ఎస్ఈని ఆదేశించారు. కార్యక్రమంలో ఇన్చార్జి సంయుక్త కలెక్టర్ జి. గంగాధర్ గౌడ్, ఇన్చార్జి పీడీ డీఆర్డీఏ లవన్న, బాపట్ల రెవెన్యూ డివిజన్ అధికారి గ్లోరియా, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మండల స్థాయిలో పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలను నూరు శాతం నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించి పరిష్కరించాలని చెప్పారు. సంబంధిత ఫోటోలు, వీడియోలను ఈ– ఆఫీస్లో అప్లోడ్ చేయాలని సూచించారు. కాల్ సెంటర్లో (1100) నమోదైన అర్జీల పరిష్కారంపై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. సమస్యల పరిష్కారంలో అధికారులు వేగంగా పని చేయాలని చెప్పారు. జిల్లాలో గిరిజనులకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, వారి కోసం ప్రత్యేకమైన గ్రీవెన్స్ను నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. గిరిజన సాంఘిక సంక్షేమ శాఖ అధికారి, ఇన్చార్జి పీడీడీఆర్ డీఏ సమన్వయంతో గిరిజనుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. -
కన్నవారిని కోల్పోయిన పిల్లలకు భరోసా
బాపట్ల: కరోనా సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు సోదరుడిలా ఉండి భరోసా కల్పిస్తానని జిల్లా కలెక్టర్ వి.వినోద్ కుమార్ అన్నారు. కరోనా సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలతో ప్రధానమంత్రి కేర్ మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా శనివారం స్థానిక కలెక్టరేట్లోని న్యూ వీసీ హాల్లో జిల్లా కలెక్టర్ ముఖాముఖిగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిల్లాకు సంబంధించి ఆరుగురు బాలలు ఆ విపత్తులో తల్లిదండ్రులను కోల్పోయారని చెప్పారు. వారు తిరుపతి, తెనాలి, కర్నూలు ప్రాంతాల్లో చదువుకుంటున్నారని పేర్కొన్నారు. వారికి సంబంధించిన అన్ని విషయాలను చూడాల్సిన బాధ్యత తమపైనే ఉందని చెప్పారు. లబ్ధిదారుల పేర్లు జాబితాల్లో చేరుస్తాం 19న బాపట్ల షాపింగ్ ఫెస్టివల్ బాపట్ల: ఈ నెల 19వ తేదీన బాపట్ల షాపింగ్ ఫెస్టివల్ను జిల్లాలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. శనివారం రాత్రి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ మురళీకృష్ణతో కలసి బాపట్ల, చీరాల ట్రేడర్ల సంఘం ప్రతినిధులతో ‘సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్’పై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని రకాల ట్రేడర్ల సంఘాలు సహకరించాలన్నారు. 7వ తేదీన ప్రతి పాఠశాలలోని తరగతి గదిలో 40 నిమిషాలపాటు జీఎస్టీ తగ్గింపుపై విద్యార్థులకు క్లాస్ నిర్వహించాలని డీఈఓను ఆదేశించారు. పర్యాటక అభివృద్ధికి చర్యలు జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే దృష్టితో క్యారవాన్ టూరిజం ప్రవేశపెట్టామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. శనివారం రాత్రి సూర్యలంక బీచ్లో జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరావుతో కలసి డ్రీమ్లైనర్స్ క్యారవాన్ సర్వీస్ లగ్జరీ బస్సును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ వాహనం వచ్చే శనివారం, ఆదివారం చీరాల బీచ్ వద్ద ప్రజల సందర్శనకు అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపారు. బాధితులకు న్యాయం చేయాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ -
మహనీయుల నిత్య చరిత్రను తెలిపే ‘సదాస్మరామి’
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ నగరంపాలెం(గుంటూరు వెస్ట్): తెలుగు భాషకు, సంస్కృతికి, చరిత్రకు, కళలకు, వన్నెతెచ్చిన మహనీయుల చరిత్రలను సమగ్రంగా, సంగ్రహంగా గ్రంథస్థం చేసి వర్తమాన భవిష్యత్ తరాలకు దిశా నిర్దేశం చేసిన గ్రంథకర్త మండలి బుద్ధప్రసాద్ అభినందనీయులని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ అన్నారు. బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ రచించగా మోదుగుల రవికృష్ణ సంపాదకత్వంలో శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ వెలువరించిన సదాస్మరామి పుస్తకావిష్కరణ సభ నగరంపాలెం కలెక్టర్ బంగ్లా రోడ్లోని భారతీయ విద్యాభవన్లో శనివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన జస్టిస్ కృష్ణమోహన్ మాట్లాడుతూ మహనీయుల చరిత్రను తెలుసుకునే అవకాశం సదాస్మరామి పుస్తకం ఇస్తుందని పేర్కొన్నారు. పుస్తక రచయిత, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ మహనీయుల గురించి రాయడం తన అదృష్టమన్నారు. దాన్ని వెలువరించిన బొమ్మిడాల కృష్ణమూర్తి ఫౌండేషన్కు కృతజ్ఞతలు తెలిపారు. సభలో ఎం.నాగేశ్వరరావు, న్యాయమూర్తి జగదీశ్వరి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు డాక్టర్ పాపినేని శివశంకర్, పెనుగొండ లక్ష్మీనారాయణ, భారతీయ విద్యాభవన్ కార్యదర్శి పి.రామచంద్రరాజు, బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, పలువురు రచయితలు, సాహితీవేత్తలు పాల్గొన్నారు. -
వైద్యుల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలి
చీరాల రూరల్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విధులు నిర్వర్తిస్తున్న వైద్యుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని వైఎస్సార్ సీపీ వైద్యుల విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఇస్తర్ల బాబురావు పేర్కొన్నారు. శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పీహెచ్సీల్లో విధులు నిర్వర్తిస్తున్న వైద్యులు గత కొద్దిరోజులుగా విధులు బహిష్కరించి నిరసన తెలియజేస్తున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో క్లినికల్ విభాగంలో 30 శాతం, నాన్ క్లినికల్లో 50 శాతం చొప్పున గత ప్రభుత్వంలో ఇన్ సర్వీస్ కోటా ఉండేదని గుర్తుచేశారు. ప్రస్తుతం ఈ కోటాను చంద్రబాబు ప్రభుత్వం రాగానే క్లినికల్ కోర్సుల్లో 15 శాతం, నాన్ క్లినికల్ విభాగంలో 30 శాతానికి తగ్గించినట్లు చెప్పారు. దీంతో వైద్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. తక్షణమే ప్రభుత్వం ఇన్ సర్వీసు కోటాను యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందిస్తున్న వైద్యులకు అలవెన్సులు, పదోన్నతులు కల్పించాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు విష జ్వరాలతో అల్లాడిపోతున్నారని గుర్తుచేశారు. పీహెచ్సీల్లో వైద్యులు ఎమర్జెన్సీ వైద్య సేవలు నిలిపివేయడంతో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లలేక పేదలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వైఎస్సార్సీపీ వైద్యుల విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఇస్తర్ల బాబురావు -
నేడు 650 మందికి ఉపకార వేతనాల పంపిణీ
తులసి గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ తులసి యోగీష్ చంద్ర కొరిటెపాడు(గుంటూరు): కృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ పూర్ అండ్ అండర్ ప్రివిలేజ్డ్, ఏపీ కాట్వా సంయుక్త ఆధ్వర్యంలో చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 650 మంది పేద విద్యార్థులకు రూ.24.50 లక్షల ఉపకార వేతనాలను పంపిణీ చేయనున్నట్లు తులసి గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ తులసి యోగీష్ చంద్ర శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిభకు పట్టాభిషేకం కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, అమలాపురంలోని ముక్తేశ్వరం రోడ్లోని సత్యనారాయణ గార్డెన్స్లో ఆదివారం ఉదయం 9 గంటకు కార్యక్రమం ప్రారంభమవుతోందన్నారు. తులసి గ్రూప్స్ చైర్మన్ తులసి రామచంద్ర ప్రభు ముఖ్య అతిథిగా హాజరై ఉపకార వేతనాలు వితరణ చేయనున్నట్టు వెల్లడించారు. ఇందులో 331 మంది విద్యార్థులకు రూ.11.84 లక్షలు తులసి సీడ్స్ ఆధ్వర్యంలో కృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ పూర్ అండ్ అండర్ ప్రివిలేజ్డ్ ద్వారా పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్నట్లు ఆయన వివరించారు. -
బోధనా నైపుణ్యాలు పెంచుకోవాలి
పాఠశాల విద్య జేడీ శైలజ నరసరావుపేట ఈస్ట్: మెగా డీఎస్సీ–2025లో ఎంపికై న ఉపాధ్యాయులు బోధనా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని పాఠశాల విద్య జేడీ పి.శైలజ తెలిపారు. డీఎస్సీ జోన్–3 పరిధిలో పీజీటీ, టీజీటీలుగా ఎంపికై న ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను శనివారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయుల నియామకం చేపట్టిందని తెలిపారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని ఆమె చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు నమ్మకం కలిగేలా కృషి చేయాలని హితవు పలికారు. విద్యార్థుల్లో సామర్థ్యాలు పెరిగేలా బోధన ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో పల్నాడు విద్యాశాఖ ఏడీ బి.వి.రమణ, ఎంఈఓలు ఎండీ. ఖాసిం, పి.సుధారాణి, ప్రధానోపాధ్యాయులు ఆర్.గోవిందరాజులు, వి.వెంకట్రావు, ఏఎంఓ పూర్ణచంద్రరావు, రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు. -
వయోవృద్ధుల సంక్షేమానికి కృషి
గుంటూరు వెస్ట్: వయోవృద్ధుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం నిబద్దతతో కృషి చేస్తుందని రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సెక్రటరీ సూర్య కుమారి తెలిపారు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశం మందిరంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం – 2025 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూర్యకుమారితోపాటు జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా, శాసన సభ్యులు గల్లా మాధవి, బూర్ల రామాంజనేయులు, రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాల మరియు వయోవృద్ధుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ నారాయణ స్వామి, రాష్ట్ర గ్రంధాలయ పరిషత్ చైర్మన్ జి.కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూర్యకుమారి మాట్లాడుతూ వయో వృద్ధుల సమస్యలను సాధ్యమైనంతవరకు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వృద్ధుల అనుభవాలు చాలా గొప్పవి జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా మాట్లాడుతూ వయోవృద్ధుల అనుభవాలు నేటి సమాజానికి ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. వారి నుంచి స్పూర్తి పొందాలన్నారు. అనంతరం రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన వయోవృద్ధులను ఘనంగా సన్మానించారు. రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాల వయోవృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్ జి. ప్రకాష్ రెడ్డి, డీఆర్ఓ ఎన్ఎస్కే ఖాజావలి, ఏడీ దుర్గాబాయి పాల్గొన్నారు. వయోవృద్ధుల సంక్షేమ శాఖ సెక్రటరీ సూర్య కుమారి -
రైతుకు విపత్తి
ప్రత్తిపాడు: గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం వరగానికి చెందిన నూనె గణపతికి ఎకరం భూమి ఉంది. మూడు నెలల కిందట మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. మొత్తం ఐదెకరాల్లో పత్తి సాగు చేశాడు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలు, పై ప్రాంతాల్లో కురిసిన వర్షపు నీరు కూడా పొలంలో రోజుల తరబడి నిలబడటంతో ఉరకెత్తి ఎర్ర తెగులు సోకింది. గులాబీ రంగు పురుగు కూడా పంటను తీవ్రంగా ఆశించింది. మూడు నెలలైనా రెండడుగులు కూడా పెరగలేదు. కౌలుకు రూ. లక్ష, వ్యవసాయం చేసేందుకు సుమారు మరో రూ.లక్ష వరకు పెట్టుబడులు అయ్యాయి. గుండె తరుక్కుపోయిన గణపతి పొలంపై ఆశలు వదులుకున్నాడు. కన్నబిడ్డలా సాగు చేసిన పైరును తన చేతులతోనే పీకేశాడు. -
రాష్ట్ర స్కూల్ గేమ్స్ టెన్నిస్ పోటీలకు ఎంపిక
గుంటూరు వెస్ట్ (క్రీడలు): శ్రీకాళహస్తిలో ఈనెల 7వ తేదీ నుంచి 9 వరకు జరగనున్న ఏపీ స్టేట్ స్కూల్ గేమ్స్ టెన్నిస్ చాంపియన్షిప్ పోటీల్లో ఎన్టీఆర్ స్టేడియంకు చెందిన ఆరుగురు క్రీడాకారులు జిల్లా జట్టుకు ఎంపికయ్యారని టెన్నిస్ కోచ్ జీవీఎస్ ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న క్రీడాకారులను రేమండ్స్ షో రూమ్ అధినేత టి.అరుణ్ కుమార్, ఏపీ రెరా సభ్యులు దామచర్ల శ్రీనివాసరావు, సహస్ర ఆర్థో అండ్ న్యూరో క్లినిక్ అధినేత డాక్టర్ ఎం. శివకుమార్, రక్షిత్, నాంచారయ్యలు అభినందించారన్నారు. ఎంపికై న క్రీడాకారుల వివరాలు... అండర్ 19 బాలుర విభాగంలో కె.విన్సెంట్, ఊరుబంది లలిత్ కుమార్, బాలికల విభాగంలో... సాధుర్ల కావ్య హర్షిత, అండర్ 17 బాలుర భాగంలో.... గంటా దిశాంత్, ఇ.జి. హర్షవర్ధన్, అండర్ 14 బాలుర విభాగంలో కుంభ సాయి నాగ కళ్యాణ్.