Bapatla District Latest News
-
భూమి మ్యుటేషన్పై అధికారుల నిర్లక్ష్యం
వేమూరు: న్యాయపరమైన భూమికి సంబంధించిన మ్యుటేషన్ ప్రక్రియను అధికారులు కావాలని నిర్లక్ష్యం చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. వేమూరు మండలంలోని చంపాడు గ్రామానికి చెందిన కాకాని కన్యాకుమారి, ఆమె కుమార్తె తహసీల్దారు కార్యాలయం వద్ద బుధవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ.... 4.75 సెంట్ల భూమిని రెవెన్యూ అధికారులు చట్ట విరుద్ధంగా అక్రమ మ్యుటేషన్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై బాపట్ల జిల్లా కలెక్టరుకు పీజీఆర్ఎస్లో అర్జీ ఇచ్చామని చెప్పారు. ఇంత వరకు పరిష్కారం కాలేదని తెలిపారు. గత నెల 29వ తేదీన జిల్లా కలెక్టరు తహసీల్దారు కార్యాలయానికి వచ్చి అర్జీకి సంబంధించిన రికార్డులు పరిశీలించారు. రికార్డులు సక్రమంగా లేకపోవడంతో మండల సర్వేయరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేశారు. అప్పటివరకు నిరసన కొనసాగుతుందని ఆమె హెచ్చరించారు. -
నిలిచిన నిధులు.. కదలని పనులు
వేటపాలెం: జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా 25 మండలాల పరిధిలో 489 గ్రామ పంచాయతీలున్నాయి. ప్రభుత్వం మార్చి నుంచి మూడు నెలలుగా గ్రామ పంచాయతీల సాధారణ నిధులు బ్యాంకు ఖాతాల నుంచి నగదు డ్రా చేసుకునే అవకాశాన్ని నిలిపివేడంతో అభివృద్ధి పనులు పూర్తిగా కుంటుపడ్డాయి. మరో వైపు పంచాయతీలకు రావాల్సిన స్టాంప్ డ్యూటీ వాటా కూడా టీడీపీ ప్రభుత్వ అధికారం చేపట్టిన తరువాత విడదల కాకపోవడంతో స్థానిక సంస్థల ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది. గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఏడాదిలో మూడు నెలలకు ఒకసారి స్టాంప్ డ్యూటీ నిధులు పంచాయతీల ఖాతాలకు జమ చేసేవారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాల నిర్వహణ, తాగునీటి సరఫరా, చిన్నపాటి మరుమ్మతుల వంటి రోజువారీ అవసరాల కోసం వినియోగించే నిధులు అందుబాటులో లేకపోవడంతో కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్యానికి వినియోగించే మెటీరియల్ కొనుగోలు, గ్రామాల నుంచి చెత్తను తరలించే ట్రాక్టర్లు డీజిల్, మరమ్మతులు, చెత్త సేకరణ వాహన ఖర్చులు, విద్యుత్ బిల్లులు చెల్లింపులు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. పారిశుద్ధ్య నిర్వహణపై ప్రభావం... నిధుల కొరత కారణంగా అనేక గ్రామాల్లో శానిటేషన్ కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించలేక పోతున్నారు. బ్లీచింగ్ పౌడర్, ఫినాయిల్, ఇతర పారిశుద్ధ్య సామగ్రి కొనుగోలు చేయడానికి కూడా నిధులు లేకపోవడంతో గ్రామాల్లో పరిశుభ్రత దెబ్బతింది. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో వ్యాధుల నివారణ చర్యలు చేపట్టడం కూడా కష్టసాధ్యంగా మారిందని అధికారులు చెబుతున్నారు. విద్యుత్ బిల్లుల చెల్లింపుల్లో జాప్యం.. గ్రామాల్లో వీధి దీపాలకు సంబంధించిన విద్యుత్ బిల్లులు చెల్లించలేక పంచాయతీలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే కొన్ని పంచాయతీలకు బకాయిలు పెరిగిపోయాయని, ఇదే పరిస్థితి కొనసాగితే విద్యుత్ సరఫరాపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారు. పంచాయతీల ఆదాయ వనరుల్లో ప్రధానమైన స్టాంప్ డ్యూటీ వాటా టీడీపీ ప్రభుత్వ అధికారం చేపట్టిన నాటి నుంచి విడుదల కాకపోవడంతో మరో సమస్యగా మారింది. ఈ నిధులు అందితే గ్రామాల్లో మౌలిక వసతులు అభివృద్ధి, రహదారులు, కాలువలు, తాగునీటి సదుపాయాల మెరుగుదలకు ఉపయోగపడతాయని కార్యదర్శులు చెబుతున్నారు. అయితే బకాయిలు పేరుకుపోవడంతో అభివృద్ధి నిలిచిపోయింది. -
రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సందర్శన
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయాన్ని భారత వాతావరణ శాఖ చైన్నె రీజనల్ హెడ్ డాక్టర్ డి.శివానంద బుధవారం సందర్శించారు. స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ ఉపయోగించే అత్యాధునిక సాంకేతికతను పరిశీలించారు. అనంతరం వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావంపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విపత్తుల సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. కౌసర్ బానో మాట్లాడుతూ తుఫాన్లు, భారీ వర్షాలు, పిడిగుపాటు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించేందుకు భారత వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థ, ఆర్జీజీఎస్ అవేర్ సంయుక్తంగా పనిచేస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో అమరావతి వాతావరణ కేంద్ర డైరెక్టర్ స్టెల్లా, ఎస్డీఎంఏ పరిపాలనా అధికారి కొడారి రవిబాబు, ఎస్ఈఓసీ ఇన్చార్జి పీటర్, ఐఎండీ శాస్త్రవేత్త సాగర్ పాల్గొన్నారు. మంగళగిరి టౌన్: సెక్యూరిటీ గార్డుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 7వ తేదీన రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నట్లు ఏపీ ప్రైవేటు సెక్యూరిటీ గార్డ్స్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ముజఫర్ అహ్మద్ తెలిపారు. మంగళగిరి పట్టణం సీఐటీయూ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముజఫర్ మాట్లాడుతూ మంగళగిరి పట్టణ పరిధిలోని రత్నాల చెరువు వద్ద ఉన్న సింహాద్రి శివారెడ్డి భవనంలో సదస్సు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణరావు, యూనియన్ మంగళగిరి కార్యదర్శి బుచ్చిబాబు, నాయకులు సునీత, బాలాజీ పాల్గొన్నారు. చందోలు(కర్లపాలెం): ప్రముఖ నేపథ్య గాయకుడు మనో దంపతులు బుధవారం చందోలు బగళాముఖి అమ్మ వారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం మనో దంపతులకు ఆలయ ఈవో నరసింహమూర్తి అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. చందోలు ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన కె.మాధవరావు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. మడకసిర మాజీ ఎమ్మెల్సీ తిప్పె స్వామి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. -
ఓటర్ల జాబితాపై విచారణ ముఖ్యం
జిల్లా కలెక్టర్ వి.వినోద్కుమార్ చీరాల: ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా తయారీలో తప్పుగా నమోదైన వివరాలను క్షేత్రస్థాయిలో సరిచేయాలని కలెక్టర్ వి.వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా ప్రక్రియపై చీరాల ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం కలెక్టర్ పట్టణంలోని గంజిపాలెంలోని ఓటర్ల ఇళ్లకు వెళ్లి ఆయన స్వయంగా విచారించారు. చీరాల నియోజకవర్గంలో 2,03,641 మంది ఓటర్లున్నారని చెప్పారు. వీరిలో 1,16,283 ఓట్లను మ్యాపింగ్ చేశామన్నారు. ఇప్పటి వరకు 57 శాతం ఓట్లు మ్యాపింగ్ జరగ్గా, 87,358 ఓట్లను మ్యాపింగ్ జరగకపోవడంపై కలెక్టర్ ఆరా తీశారు. 21,188 ఓట్లు తప్పుడుగాను, డబుల్ ఎంట్రీలుగాను, సవరణలు, చిరునామాలు స్పష్టత లేదన్నారు. మ్యాపింగ్ జరిగిన ఓట్లన్నింటినీ ప్రింట్ చేసి పంపిణీకి సిద్ధం చేయాలన్నారు. లాగిన్ వివరాలపై అసహనం ఓటర్ల జాబితా తయారీ, విచారణలో చీరాల, వేటపాలెం ఎంపీడీఓలకు, చీరాల మున్సిపల్ కమిషనర్కు లాగిన్ ఇచ్చిన విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకపోవడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. చీరాల నియోజకవర్గంలో 218 పోలింగ్ కేంద్రాలున్నాయని, ఆ కేంద్రాల పరిధిలో 218 మంది బీఎల్ఓలు ఉన్నారన్నారు. వారి లాగిన్ నుంచి ఎప్పటికప్పుడు విచారణ ప్రక్రియ కొనసాగించాలన్నారు. చీరాల నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఓటర్లు ఉన్న నేపథ్యంలో ఆ రెండు మండలాల ఎంపీడీఓలకు, చీరాల మున్సిపల్ కమిషనర్కు లాగిన్ ఇచ్చామన్నారు. విచారణ చేయాల్సి ఉండగా నేటికీ ఆ ప్రక్రియ జరగకపోవడంపై ఆరా తీశారు. ఆన్లైన్లో దరఖాస్తులు నేటికీ పరిశీలించకపోవడం, లాగిన్ వినియోగించకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి ఎందుకు తీసుకురాలేదని నిలదీశారు. అనంతరం చీరాల పట్టణంలోని గంజిపాలెంలో కలెక్టర్ పర్యటించారు. 91 సంవత్సరాల ఓటరు సయ్యద్ మస్తాన్తో ఆయన మాట్లాడారు. 50 సంవత్సరాలుగా ఇదే ప్రాంతంలో సొంత ఇంటిలో నివసిస్తున్నప్పటికీ 2002 ఓటరు జాబితాలో ఆయన పేరు కనిపించకపోవడంపై విచారించారు. 15 ఏళ్ల క్రితం ఉపాధి నిమిత్తం అద్దంకిలో నివాసం ఉన్నట్లు ఆయన కలెక్టర్కు వివరించారు. ముందుగా పర్చూరు, కారంచేడు మండలాల్లో ఉన్నట్లు చెప్పడంతో విచారించారు. ఆయన కుమారుడిని పిలిపించి కలెక్టర్ విచారణ చేశారు. అద్దంకిలో ఉండి ఓటు వేసినట్లు చెప్పడంతో సంబంధిత యాప్లో గుర్తించి ఓటు ఉన్నట్లు గుర్తించారు. జిల్లా కలెక్టర్ వెంట ఇన్చార్జి ఆర్డీఓ లవన్న, మున్సిపల్ కమిషనర్ డానియేల్ జోసఫ్, తహసీల్దార్లు గోపీకృష్ణ, గీతావాణి, చీరాల, వేటపాలెం ఎంపీడీఓలు విజయ, రాజేష్, బీఎల్ఓలు పాల్గొన్నారు. -
బాపట్ల
గురువారం శ్రీ 4 శ్రీ జూన్ శ్రీ 2026వైభవంగా షిరిడి సాయినాథ బ్రహ్మోత్సవాలు తెనాలి: స్థానిక మార్కెట్ యార్డులో బుధవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.1,500, గరిష్ట ధర రూ.2,500, మోడల్ ధర రూ.1,900 వరకు పలికింది.అచ్చంపేట : పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 32,0877 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు.గుంటూరు ఎడ్యుకేషన్ : జిల్లాలో నూతన విద్యాసంవత్సరంలో పాఠశాలలు తెరిచిన రోజున విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయాల్సిన విద్యార్థి మిత్ర కిట్లు సిద్ధం కాలేదు. టీడీపీ సర్కారు ముందు చూపు లేని పనులతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద, బడుగు, బలహీనవర్గాలకు చెందిన విద్యార్థులకు నిరాశే మిగలనుంది. వేసవి సెలవుల అనంతరం ఈ నెల 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం రోజున ఆనందంగా పాఠశాలకు వచ్చే విద్యార్థులకు ఈ కిట్లు అందే పరిస్థితులు కనిపించడం లేదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో భేష్.. గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 89,157 మంది విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ చేయాలని విద్యాశాఖ, సమగ్రశిక్ష అధికారులు అంచనా వేశారు. కానీ పూర్తి స్థాయిలో సిద్ధం చేసేందుకు మరో నెలకుపైగా పట్టే పరిస్థితులు నెలకొన్నాయి. పాఠ్య పుస్తకాలు మినహా జిల్లాకు పూర్తిస్థాయిలో సామగ్రి చేరుకోలేదు. కానీ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యార్థుల భవిష్యత్తుకు, వారి చదువులకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చారు. నాణ్యమైన సామగ్రితో కూడిన విద్యాకానుక స్టూడెంట్ కిట్లను వ్యక్తిగత పర్యవేక్షణతో సిద్ధం చేయించారు. ఏటా పాఠశాలలు తెరిచిన మొదటి రోజున ఒక పండుగగా విద్యాకానుక కిట్ల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారుల సమక్షంలో విద్యార్థులకు ఈ కిట్లు పంపిణీ చేయించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకాన్ని కల్పించారు. ఈ విధంగా ఐదేళ్లపాటు పాఠశాలలు తెరిచిన మొదటి రోజునే విద్యార్థుల చేతుల్లో కిట్లను ఉంచారు. నగరంపాలెం: స్థానిక హౌసింగ్ బోర్డుకాలనీ షిరిడి సాయినాథ మందిరంలో 24వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం సుప్రభాత సేవ, కాకడ హారతి, బాబా వారికి పంచామృతాలతో అభిషేకం, 108 కళాశాలతో జలాభిషేకం నిర్వహించారు. అనంతరం అలంకార పూజ, ప్రత్యేక హారతులు నిర్వహించారు. సాయంత్రం వేళ సంధ్యా హారతి అనంతరం శ్రీరామ భక్త వీరాంజనేయ బృందం భజన జరగ్గా, భక్తులను కార్యక్రమం అలరించింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ అధ్యక్షుడే మామిడి సీతారామయ్య, గౌరవాధ్యక్షుడు మామిడి రామారావు, సభ్యులు పాల్గొన్నారు. సంక్షోభంలో ఆక్వా రంగం 7ప్రస్తుత టీడీపీ పాలనలో విద్యార్థులకు ఆ భరోసా కరువైంది. పాఠశాల తెరిచేందుకు మరో 10 రోజుల వ్యవధి సైతం లేని పరిస్థితుల్లో జిల్లాకు పాఠ్య పుస్తకాలు మినహా మిగిలిన సామగ్రి చేరుకోలేదు. విద్యార్థి మిత్ర కిట్లో భాగంగా విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయాల్సిన బ్యాగు, రెండేసి జతల చొప్పున యూనిఫాం, బూట్లు, నోటు పుస్తకాలు, సాక్సులు, టై, బెల్టు అరకొరగా వచ్చాయి. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన 15,26,181 పాఠ్యపుస్తకాల్లో ఇప్పటి వరకు 14,64,850 .... అదే విధంగా నోటు పుస్తకాలు 5,32,451 వచ్చాయి. ఇలా అరకొరగా వచ్చిన సామగ్రితో కిట్లు సిద్ధం చేసి, పాఠశాలలు తెరిచిన రోజున విద్యార్థులకు పంపిణీ చేయడం సాధ్యమయ్యే విషయం కాదని తెలుస్తోంది. -
బాపట్ల
మంగళవారం శ్రీ 2 శ్రీ జూన్ శ్రీ 2026సీబీఐ విచారణ చేపట్టాలి అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,1294 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 520.40 అడుగులకు చేరింది. జలాశయం నుంచి కుడికాలువకు 7,033 క్యూసెక్కులు విడుదలవుతోంది. తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.2,500, గరిష్ట ధర రూ.4,200, మోడల్ ధర రూ.3,400 వరకు పలికింది. దగా డీఎస్సీపై సత్వరం సీబీఐ విచారణ చేపట్టాలని మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు డీఎస్సీ కోసం నోటిఫికేషన్ వేస్తే దానిని అడ్డుకునేందుకు టీడీపీ, కూటమి నేతలు ఆందోళన చేశారని గుర్తు చేశారు. కూటమి సర్కారు వచ్చాకా మెగా డీఎస్సీ అంటూ నిరుద్యోగులను దగా చేశారని కోన రఘుపతి పేర్కొన్నారు. కనీసం నిబంధనలు పాటించని ఈ డీఎస్సీ విధానంపై సీబీఐ విచారణ చేపట్టాలని, విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని కోన రఘుపతి డిమాండ్ చేశారు. – కోన రఘుపతి, మాజీ డెప్యూటీ స్పీకర్ 6 -
అర్జీలు పునరావృతం కాకుండా చర్యలు
బాపట్ల: పీజీఆర్ఎస్లో అర్జీదారులు అందజేసే సమస్యల అర్జీలు పునరావృతం కాకుండా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ అధికారులకు సూచించారు. స్థానిక కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట, డీఆర్వో జి.గంగాధర్గౌడ్లతో కలసి అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 132 అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో నమోదైన అర్జీలను క్షేత్రస్థాయికి వెళ్లి అర్జీదారులతో మాట్లాడి పరిష్కారం చేయాలన్నారు. మండల స్థాయిలో అత్యధికంగా అర్జీలు పెండింగ్లో ఉన్న వాటిని పరిశీలించి పరిష్కారం చేయాలన్నారు. పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై వ్యక్తిగతంగా ప్రజల అభిప్రాయ సేకరణ చేపడతామన్నారు. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న అర్జీలపై ఆడిట్ చేయాలని ఆదేశించారు. జనగణన ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలన్నారు. ఫారం 6,7,8 పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.విజయమ్మ, గ్రామీణ నీటి సరఫరా శాఖ ఎస్ఈ అనంతరాజు, సీపీఓ.ఏ.ఎస్.రాజు, డ్వామా, మెప్మా, గృహ నిర్మాణ సంస్థ, సీ్త్ర శిశు సంక్షేమ శాఖల పీడీలు విజయలక్ష్మి, పాల్, వెంకటేశ్వరరావు, రాధామాధవి, ఆనంద సత్యపల్, మార్క్ఫెడ్ డీఎం కరుణశ్రీ, డీసీహెచ్ఎస్ పద్మావతి, డీటీసీ పరంథామరెడ్డి, జీఎండీఐ సి.రామకృష్ణ, పంచాయతీరాజ్ ఎస్ఈ రాజన్బాబు, జిల్లా వ్యవసాయ అధికారి ఏ.లక్ష్మి, డీఎస్ఓ ఆర్.జమీర్ బాషా, సివిల్ సప్లయీస్ డీఎం శ్రీలక్ష్మి, డీఎల్డీఓ.విజయలక్ష్మి, గ్రామ వార్డు సచివాలయాల జిల్లా కోఆర్డినేటర్ యశ్వంత్, బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖల అధికారులు జయరాములు, రాజాదేబోరా, డీఎఫ్ఓ రవిశంకర్, డీఈఓ శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ -
దివ్యాంగులశాఖ కార్యాలయాన్ని తెరిపించాలి
వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు చల్లా రామయ్య బాపట్ల: దివ్యాంగుల సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేయాల్సిన దివ్యాంగుల శాఖ కార్యాలయం ఎప్పుడు మూసివేసి ఉండటాన్ని వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం తీవ్రంగా ఖండించింది. సోమవారం కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. చల్లా రామయ్య మాట్లాడుతూ కూటమి పాలనలో దివ్యాంగుల శాఖ కార్యాలయం ఎప్పడు మూసివేసే ఉంటుందన్నారు. కనీసం సమస్యలు చెప్పుకునేందుకు కూడా ఎవరు ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని స్పందన కార్యక్రమంలో అర్జీ రూపంలో ఏవో మల్లికార్జునరావుకు వినతి పత్రం అందించారు. నిరసనలో వైఎస్సార్సీపీ దివ్యాంగుల నాయకులు ఎం శ్యాం ప్రకాష్, చల్లపల్లి గోపి, ఆసోది రామిరెడ్డి, ఆట్ల శ్రీనివాస్ రెడ్డి, బాబు, కొండమ్మ, వెంకటేశ్వరమ్మ, బాలాజీ, కళ్యాణ్, నాని పి.జి.ఆర్, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. చికిత్సకని వెళుతూ తిరిగిరాని లోకాలకు.. వెల్దుర్తి: మంగళగిరిలోని ఎయిమ్స్ వైద్యశాలలో చికిత్స చేయించుకునేందుకు వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఇద్దరు మృతిచెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్న ఘటన జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. మండలంలోని రచ్చమల్లపాడు గ్రామానికి చెందిన రెంటాల ఆదిలక్ష్మమ్మ (60)కు మోకాళ్ల నొప్పులు అధికం కావడంతో కొడుకు పాలంకయ్యతో కలిసి మంగళగిరిలోని ఎయిమ్స్ వైద్యశాలకు బయల్దేరింది. వీరిని మాచర్లలో గుంటూరు వెళ్లే ఫస్టు బస్సు ఎక్కించేందుకు ఆదిలక్ష్మమ్మ కుమార్తె కుమారుడు (మనవడు) ఐతంరాజు మారుతి(18) తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని మాచర్ల బస్టాండ్కు బయలుదేరాడు. ఈక్రమంలో సోమవారం తెల్లవారుఝామున 3.30గంటలకు వస్తున్న సమయంలో మాచర్ల నుంచి యర్రగొండపాలెం వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం మాచర్ల – శ్రీశైలం జాతీయ రహదారిలోని మండాది బోడు వద్ద బలంగా ఢీ కొట్టడంతో బండి పై ప్రయాణిస్తున్న వారు ఎగిరి రోడ్డు పక్కన పడ్డారు. ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం సుమారు 60 అడుగుల దూరం లాక్కెల్లింది. ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్న రెంటాల ఆదిలక్ష్మమ్మ, ఐతంరాజు మారుతిలు అక్కడికక్కడే మృతిచెందారు. రెంటాల పాలంకయ్య తీవ్ర గాయాలపాలై కోమాలోకి వెళ్లాడు. మండాది నుంచి మాచర్లకు వస్తున్న వారు గమనించి క్షతగాత్రుడు పాలంకయ్య మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పాలంకయ్యకు ప్రథమ చికిత్స చేయగా.. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం నర్సరావుపేటకు తరలించారు. మారుతి తండ్రి అంజి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంధన పొదుపునకు అందరూ సహకరించాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ బాపట్ల: ఇంధన పొదుపు అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం ఉదయం కలెక్టర్ బంగ్లా నుంచి మున్సిపాలిటీ పరిధిలో పింఛన్లు పంపిణీ కార్యక్రమానికి పాల్గొనేందుకు హెల్మెట్ ధరించి ద్విచక్రవాహనంపై వెళ్లారు. హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించారు. అర్జీలు పునరావృతమైతే చర్యలు తప్పవు ఎస్పీ బి.ఉమామహేశ్వర్ బాపట్లటౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అర్జీలు పునరావృతమైతే చర్యలు తప్పవని ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 44 మంది అర్జీదారులు ఎస్పీ కార్యాలయానికి చేరుకొని తమ సమస్యలను ఎస్పీకి వివరించారు. బాధితుల సమస్యలు తెలుసుకున్న ఎస్పీ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లాలోని పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అర్జీదారుల సమస్యలను చట్ట పరిధిలో విచారించి నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలన్నారు. వివిధ సమస్యలతో పోలీస్ కార్యాలయాలకు వచ్చే బాధితులకు భరోసాగా పోలీస్ శాఖ ఉండాలన్నారు. అర్జీలను పూర్తి స్థాయిలో విచారించి శాశ్వతంగా పరిష్కారం చూపాలన్నారు. కార్యక్రమంలో బాపట్ల సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్నాయక్, పీజీఆర్ఎస్ సెల్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చినగంజాం: మండలంలోని కొత్తపాలెం పంచాయతీ మూలగానివారిపాలెం గ్రామానికి చెందిన అక్కల అజిత్రెడ్డి జేఈఈ అడ్వాన్స్ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంక్ సాధించాడు. అడ్వాన్స్ పరీక్షలో మొత్తం 221 మార్కులు రాగా పాజిటివ్ మార్కులు 226 సాధించాడు. ఆల్ ఇండియా (ఐఐటీ) 738వ ర్యాంక్ సాధించాడు. అజిత్రెడ్డి స్థానిక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు నాగరాజురెడ్డి కుమారుడు. పదో తరగతి స్థానిక సత్యం హైస్కూల్లో చదివాడు. అజిత్రెడ్డి ర్యాంక్ సాధించడంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఆలస్యంగా సాగిన పింఛన్ల పంపిణీ కారంచేడు: నెల ప్రారంభం రోజే పంపిణీ చేయాల్సిన పింఛన్లు సర్వర్లు మొరాయించడంతో లబ్ధిదారులు సోమవారం ఇబ్బందులు పడ్డారు. మండల వ్యాప్తంగా వృద్ధాప్య, వికలాంగ, వితంతు పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఆలస్యంగా సాగింది. ఉదయం నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభమైనప్పటికీ సర్వర్లు మొరాయిండంతో ఒక్కో పింఛన్ పంపిణీకి సుమారు 20 నుంచి 30 నిమిషాల సమయం పట్టినట్లు సిబ్బంది తెలిపారు. -
దగా డీఎస్సీపై యువాగ్రహం
బాపట్ల: నిరుద్యోగులను నిలువునా మోసం చేసిన దగా డీఎస్సీపై వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఆగ్రహం వ్యక్తం చేసింది. యువత చేపట్టిన నిరసన ప్రదర్శనతో బాపట్ల హోరెత్తిపోయింది. భారీగా యువత, నిరుద్యోగులు, పార్టీ శ్రేణులు తరలివస్తారనే సమాచారం మేరకు పోలీసులు భారీగా మోహరించారు. గ్రామీణ ప్రాంతాల్లో నుంచి పట్టణంలోని యువతను రాకుండా పలుచోట్ల అడ్డంకులు కల్పించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ యువత రెట్టించిన ఉత్సాహంతో నిరసనలో పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జెండాలతో చేపట్టిన నిరసన బాపట్ల భారీగా సోమవారం కొనసాగింది. భారీగా మోహరించిన పోలీసులు వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కొక్కిలిగడ్డ చెంచయ్య ఆధ్వర్యంలో ద్విచక్రవాహనాలతో భారీ ప్రదర్శన చేపట్టేందుకు నిర్ణయించారు. పార్టీ కార్యాలయం నుంచి కలెక్టర్రేట్ వరకు ప్రదర్శనకు భారీగా చేరుకున్నారు. అయితే గడియార స్తంభం సెంటర్ వద్ద భారీగా పోలీసులు మెహరించి ద్విచక్రవాహన ప్రదర్శనను అనుమతి నిరాకరించారు. దీంతో పార్టీ కార్యాలయం నుంచి భారీ ప్రదర్శనగా కలెక్టరేట్కు చేరుకున్నారు. కలెక్టరేట్వద్ద కూడా పోలీసులు నాయకులు, కార్యకర్తలను ముందుకుపోకుండా అడ్డుకున్నారు. శాంతియుత ప్రదర్శనను అడ్డుకోవటంపై మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆగ్రహం వ్యక్తం చేయటంతో కొద్దిమంది నాయకులను కలెక్టర్ను కలిసేందుకు అనుమతి ఇచ్చారు. సీబీఐ విచారణ చేపట్టాలని వినతి డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్కు నాయకులు వినతిపత్రం అందించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి విచారణ కొనసాగేవిధంగా చూడాలని కోరారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా యువజన విభాగం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు కాగత సుధీర్బాబు, మరుప్రోలు ఏడుకొండలురెడ్డి, ఉయ్యూరు లీలా శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు మేరుగ చందన్ నాగ్, మంగళగిరి నియోజకవర్గ పరిశీలకులు యార్లగడ్డ మదన్ మోహన్గౌడ్, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి నక్కా వీరారెడ్డి, మండే విజయ్కుమార్, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి దొంతిబోయిన జయ భారత్ రెడ్డి, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి జోషికాంత్, రేపల్లె అధికార ప్రతినిధి వీరేంద్ర, జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షులు శీలం చంటి, రవి శంకర్ రెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు యల్లావుల సోహిత్, అడే చందు, శాయిల మురళి,ఉరబిండి గోపినాధ్ తదితరులు ఉన్నారు. డీఎస్సీలో కొన్ని పోస్టులను అంగట్లో సరుకుల టీడీపీ ప్రభుత్వం అమ్ముకుందని వైఎస్సార్ సీపీ బాపట్ల నియోజకవర్గ పరిశీలకులు జి.సురేంద్ర పేర్కొన్నారు. దగా డీఎస్సీపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రజలను మోసం చేసే చంద్రబాబుకు సరైన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. – జి.సురేంద్ర, వైఎస్సార్ సీపీ బాపట్ల నియోజకవర్గ పరిశీలకులు -
జాతీయ అథ్లెటిక్స్లో రవీంద్రకు బంగారు పతకం
నరసరావుపేట ఈస్ట్: జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో మండలంలోని గురవాయిపాలెం గ్రామానికి చెందిన జొన్నలగడ్డ నాగరవీంద్ర బంగారు పతకం సాధించాడు. పంజాబ్ రాష్ట్రం ఆధ్వర్యంలో జమ్మూ, కశ్మీర్లో నిర్వహించిన 6వ యూత్ స్పోర్ట్స్ ప్రమోషన్ అసోసియేషన్ (వైఎస్పిఏ) నిర్వహించిన నేషనల్ చాంపియన్షిప్ పోటీల్లో 200 మీటర్ల పరుగు పందెంలో 23.04 సెకండ్లలో లక్ష్యాన్ని చేరుకొని నాగరవీంద్ర బంగారు పతకం సాధించాడు. రవీంద్ర గతంలోనూ 2025 జూలైలో నేపాల్లో నిర్వహించిన 5 దేశాల అంతర్జాతీయ చాంపియన్షిప్ పోటీలో రాణించి 200 మీటర్లలో గోల్డ్ మెడల్ సాధించాడు. రవీంద్ర ఇప్పటికే పలు జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాడు. రవీంద్ర మాట్లాడుతూ పోటీల్లో పాల్గొనేందుకు శిక్షణ ఇస్తున్న కోచ్ నెల్లూరుకు చెందిన ప్రవీణ్కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. తనను ఆర్థికంగా ఆదుకుంటూ ప్రోత్సహిస్తున్న బంధువులు, స్నేహితులు, గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. అందరి ప్రోత్సాహంతో 2028లో జరగనున్న ఒలంపిక్స్లో భారత్ తరపున పాల్గొని 200 మీటర్లు పరుగు పందెంలో బంగారు పతకం సాధించగలనని ధీమా వ్యక్తం చేశారు. గుంటూరువెస్ట్(క్రీడలు): నైట్ క్యాజిల్స్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో స్థానిక ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన అండర్–15 బాలబాలికల చెస్ పోటీలు విజయవంతంగా ముగిశాయని పోటీల నిర్వాహకుడు వైవీకే చక్రవర్తి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాలుర విజేతలుగా పునీత్, శ్రీ లక్ష్మీ కార్తికేయ, చేతన్ ముక్కపాటి, మర్రెడ్డి తేజ్ భరత్రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి కట్టెపోగు నిలిచారన్నారు. బాలికల విభాగంలో తేజ అనూష తన్నీరు, జయ అహల్య తన్నీరు, ధార్మిక నూతి, కావ్య ఏఎన్ఎస్ఎస్ లు నిలిచారన్నారు. విజేతలకు జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు సీహెచ్ రవీంద్ర రాజు, సీనియర్ కోచ్ మురళీకృష్ణ, వై.హరిహరరాయులు, ఇంటర్నేషనల్ మాస్టర్ బాలచంద్ర ప్రసాద్లు బహుమతులు ప్రదానం చేశారన్నారు. పోటీల్లో మొత్తం 120 మంది చిన్నారులు పాల్గొన్నారని తెలిపారు. ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ తాడేపల్లి రూరల్: యువత మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ఏపీ ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ స్పష్టం చేశారు. తాడేపల్లి పట్టణ పరిధిలోని బ్రహ్మానందపురంలో నిర్వహిస్తున్న ఫ్యాక్టరీ ప్రీమియర్ లీగ్ సీజన్–2 క్రికెట్ టోర్నమెంట్లో 50 జట్లు తలపడగా ఆదివారం సులోచన, మొబిన్ సీసీ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ యువతలో ఆరోగ్యకరమైన జీవని శైలిని ప్రోత్సహించే లక్ష్యంతో డ్రగ్స్ వద్దు బ్రో నినాదాన్ని తీసుకువచ్చారని, అదే స్ఫూర్తితో ఈగల్ ఆంధ్రప్రదేశ్ క్రికెట్ ఆడు బ్రో కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. ప్రతి యువకుడు కనీసం రెండు క్రీడలను అలవాటు చేసుకోవాలని సూచించారు. మొబైల్ఫోన్లు, ఇంటర్నెట్లో గడపడం వల్ల శారీరక ధారుడ్యం తగ్గిపోతుందని, ఆరోగ్య సమస్యలు పెరుగుతాయని వివరించారు. గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగం, విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే ఏపీ ఈగల్ టోల్ఫ్రీ నెంబర్ 1972కు సమాచారం అందజేయాలని కోరారు. అనంతరం గెలుపొందిన మొబిన్ సీసీ జట్టుకు కప్ ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఈగల్ ఎస్పీ నగేష్బాబు, డీఎస్పీ శాంతరాజ్, ధనంజయ, వెంకటరావు, పెంచలయ్య, వినోద్, కిరణ్, తదితరులు పాల్గొన్నారు. -
పేషెంట్ కేర్ కోసం ఏదైనా చేస్తా..
జీజీహెచ్ నూతన సూపరింటెండెంట్ డాక్టర్ సుందరాచారి గుంటూరు మెడికల్: పేషెంట్ కేర్ కోసం ఏదైనా చేస్తానని గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగార్జునకొండ వెంకటసుందరాచారి అన్నా రు. అవసరమైతే రోగిని వీల్చైర్లో తానే తీసుకెళ్లి చికిత్స అందిస్తానని చెప్పారు. ఆదివారం డాక్టర్ యశస్వి రమణ నుంచి డాక్టర్ సుందరాచారి సూపరింటెండెంట్గా బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం డాక్టర్ సుందరా చారి మీడియాతో మాట్లాడుతూ జీజీహెచ్ క్యాజువాల్టీ వైద్యసేవలు మెరుగుపరుస్తామని తెలిపారు. కుటుంబంలో ఎవరికై నా అనారోగ్యం వచ్చి అత్యవసర వైద్యసేవలు కావాలనుకుంటే వారు మొట్టమొదటగా జీజీహెచ్ క్యాజువాల్టీకి వెళ్లి వైద్యసేవలు పొందాలనే తరహాలో క్యాజువాల్టీ సేవలు మెరుగుపరుస్తామని వెల్లడించారు. గుంటూరు వైద్య కళాశాలలో చదువుకుని కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేస్తూ నేడు అదనంగా జీజీహెచ్ సూపరింటెండెంట్ బాధ్యతలు కూడా చేపట్టినట్లు పేర్కొన్నారు. వైద్య కళాశాల, ఆస్పత్రిలో 45 సంవత్సరాల అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ఎన్.వి. సుందరాచారికి ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్, డెప్యూటీ కలెక్టర్ చిన్నం సుధారాణి, అసిస్టెంట్ డైరక్టర్ పూసల శ్రీనివాసరావు, అడ్మినిస్ట్రేటర్ బచ్చు ప్రవీణ్కుమార్, సీనియర్ అసిస్టెంట్లు జమ్ముల అరుణ్, నూతక్కి శ్రీకాంత్, వేణు, లంకపల్లి శ్రీనివాస్,జీవీ కోటేశ్వరరావు, జూనియర్ అసిస్టెంట్స్ వాసిరెడ్డి కార్తిక్, తిరుపతిరావు, ఆనంద్, పలువురు నర్శింగ్ సిబ్బంది తదితరులు శాలువా కప్పి, బొకే అందజేసి అభినందనలు తెలిపారు. -
వైభవంగా ఇంద్ర‘గిరి ప్రదక్షిణ’
పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): అధిక జ్యేష్ఠ పౌర్ణమి నేపథ్యంలో ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ ఆదివారం వైభవంగా సాగింది. తెల్లవారుజామున 5.55 గంటలకు దుర్గగుడి ఘాట్రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం వద్ద శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులకు ఆలయ అర్చకులు, ఈవో దంపతులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. తొలుత ప్రత్యేకంగా అలంకరించిన పూల వాహనాన్ని ఆదిదంపతులు అధిరోహించగా, ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు. ఆదిదంపతులతో పాటు దేవస్థాన ప్రచార రథం ముందుకు సాగగా మేళతాళాలు, మంగళవాయిద్యాలు, కోలాట నృత్యాలు, డప్పు కళాకారుల విన్యాసాల మధ్య గిరిప్రదక్షిణ కనుల పండువగా సాగింది. ఓకే నెలలో రెండు పర్యాయాలు గిరి ప్రదక్షిణ జరగడం విశేషం. మే 1వ తేదీ వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకొని గిరి ప్రదక్షిణ జరగగా, మే 31వ తేదీ అధిఖ జ్యేష్ఠ పౌర్ణమి రావడంతో మరోమారు ఆదివారం గిరిప్రదక్షిణ జరగింది. ప్రదక్షిణ ఇలా.. దుర్గగుడి నుంచి ప్రారంభమైన గిరిప్రదక్షిణ ఊరేగింపు కుమ్మరిపాలెం, విద్యాధరపురం, సితారా, కబేళా, పాల ప్రాజెక్టు, కేఎల్రావునగర్, చిట్టినగర్, కేటీరోడ్డు, బ్రహ్మణ వీధి మీదగా ఆలయానికి చేరుకుంది. పెద్ద ఎత్తున భక్తులు, ఉభయదాతలు, సేవా సిబ్బంది, ఆలయ అధికారులు, సిబ్బంది కుటుంబ సమేతంగా గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు. తమ ఇంటి ముంగిటకు విచ్చేసిన ఆది దంపతులకు భక్తులు పూజా సామగ్రి సమర్పించి ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు దేవస్థానం కుంకుమతో పాటు పులిహోర ప్రసాదాలను పంపిణీ చేసింది. -
మాజీ మంత్రి వెంకటరెడ్డికి కన్నీటి వీడ్కోలు
పావులూరు(చినగంజాం): మాజీ మంత్రి, రాష్ట్ర సీనియర్ నాయకుడు గాదె వెంకటరెడ్డి అంతిమ యాత్ర కార్యక్రమం ఆదివారం ఆయన స్వగ్రామం అయిన ఇంకొల్లు మండలం పావులూరులో నిర్వహించారు. ఆదివారం ఉదయం 10.30 గంటల తరువాత ప్రముఖులు, అభిమానుల సందర్శన అనంతరం ప్రత్యేకంగా పూలతో అలంకరించిన అంతిమ యాత్ర(ఆఖరి మజిలీ యాత్ర) రథంపై ఆయన భౌతికకాయం ఉంచారు. బ్యాండు మేళం, బాణసంచాతో భారీ జనసందోహం, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బంధువులు అనుసరించారు. గాదె వెంకటరెడ్డి పెద్ద కుమారుడు, పర్చూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి గాదె మధుసూదనరెడ్డితో పాటు సోదరులు సుధాకరరెడ్డి, శ్రీకాంత్రెడ్డితో కలిసి వారి సొంత ఫార్మింగ్ స్థలం వరకు ఊరేగింపుగా తీసుకొని వెళ్లారు. అనంతరం శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు వైఎస్సార్ సీపీ ఇన్చార్జి వరికూటి అశోక్బాబు, బాపట్ల జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు గవిని శ్రీనివాస్, గాదె శివరామకృష్ణారెడ్డి, బొల్లెద్దు ప్రతాప్, బి.నరేంద్రరెడ్డి, బొర్రెపాటి శ్రీనివాసరెడ్డి, వారి చంద్రశేఖర్, దాసరి కిరణ్బాబు, పెనమలూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి దేవభక్తుని చక్రవర్తి, పర్చూరు నియోజకవర్గ మాజీ ఇన్చార్జి యడం బాలాజీ, వారి సోదరుడు లక్ష్మీదీపక్, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, ఉగ్రనరసింహారెడ్డి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి, రాయపాటి అరుణ నివాళులర్పించారు. అంతియాత్రలో బాపట్ల శాసనసభ్యుడు వేగేశన నరేంద్ర వర్మ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఒక గొప్ప నాయకుడు, ప్రజా సేవకుడు, నిరంతర ప్రజా సేవా తత్పరుడు వెంకటరెడ్డిని కోల్పోవడం బాధాకరం అన్నారు. -
నేటి నుంచి ఆన్లైన్లో ప్రాథమిక ఉర్దూ శిక్షణ తరగతులు
గుంటూరు ఎడ్యుకేషన్: ఉర్దూ భాష నేర్చుకోవాలనే ఆసక్తి కలిగిన విద్యార్థులు, యువతకు ఉర్దూ ప్రాథమిక శిక్షణ తరగతులను సోమవారం నుంచి 30 రోజుల పాటు ఆన్లైన్లో నిర్వహిస్తున్నట్లు ఇంటర్మీడియెట్ బోర్డు ఉర్దూ ప్రత్యేకాధికారి షేక్ నాగూర్వలీ ఆదివారం ఓప్రకటనలో పేర్కొన్నారు. ఉర్దూ భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం వంటి ప్రాథమిక అంశాలు సులభంగా బోధిస్తామని తెలిపారు. ఉర్దూ మన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని, ఉర్దూ భాషను నేర్చుకోవడం ద్వారా విద్యార్థులకు విద్యా, ఉపాధి రంగాల్లో విస్తృత అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఇంటర్మీడియెట్ స్థాయి లో ఉర్దూను చదవడంద్వారా విద్యార్థులు తమ మాతృభాషను పరిరక్షించుకోవడంతో పాటు ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల్లో ముందుకు వెళ్లగలరని, వివరాలకు 98851 39827 నంబర్లో సంప్రదించాలని సూచించారు. రోడ్డు ప్రమాదంలో పాఠశాల కరస్పాండెంట్ మృతి రాజుపాలెం: రోడ్డు ప్రమాదంలో పాఠశాల కరస్పాండెంట్ మృతి చెందిన సంఘటన మండలంలోని మాచర్ల–గుంటూరు రహదారిపై అనుపా లెం చప్టా వద్ద శనివారం రాత్రి జరిగింది. గాడిపర్తి మురళీమోహన్ (52)దాచేపల్లిలో శారదా పాఠశాలకు కరస్పాండెంట్గా వ్యవహరిస్తూ పాఠశాల నడుపుతున్నాడు. మురళీమోహన్ శనివారం ఉదయం తన వ్యక్తిగత పనులపై ద్విచక్ర వాహనంపై గుంటూరు వెళ్లి పనులు ముగించుకుని తిరుగు ప్రయాణంలో అనుపాలెం చప్టా వద్ద రోడు పనులు నిమిత్తం ఏర్పాటు చేసిన రమ్మును ఢీకొనగా అక్కడికక్కడే రోడ్డుపై పడడంతో తలకు బలమైన గాయం తగలడంతో కోమాలోకి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు 108 వాహనంలో సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. డాక్టర్లు పరీక్షలు నిర్వహించి మృతి చెందినట్లు నిర్థారించారు. బంధువులు మృతదేహాన్ని రాత్రే దాచేపల్లికి తీసుకెళ్లారు. రోడ్డు ప్రమాదంపై ఎలాంటి కేసు నమోదు కాలేదని రాజుపాలెం ఎస్ఐ మణికృష్ణ తెలిపారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు విజయవాడకు చెందిన భక్తులు ఆదివారం అరకిలో వెండిని కానుకగా సమర్పించారు. విజయవాడకు పేరువీటి స్వరూప రాణి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. రూ. 1.36 లక్షల విలువైన అరకిలో వెండిని చైర్మన్ బొర్రా రాధాకృష్ణకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం ఇవ్వగా.. దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసా దాలు, శేషవస్త్రాలను బహూకరించారు. పటమట(విజయవాడతూర్పు): ‘సస్టైనబుల్ సిటీస్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ పైలట్ ఇన్ ఇండియా’ ముగింపు సదస్సు జూన్ 1, 2 తేదీల్లో విజయవాడలోని లెమన్ ట్రీ ప్రీమియర్ హోటల్లో నిర్వహించనున్నట్లు వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ (వీఎంసీ) సహకారంతో ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (యునిడో), గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ (జీఈఎఫ్), కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంవోయూహెచ్ఏ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ (ఎన్ఊయూఏ) సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. పట్టణ సుస్థిరత, వాతావరణ చర్యల పురోగతి అనే అంశంపై నిర్వహించనున్న ఈ సదస్సులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల మున్సిపల్ కమిషనర్లు, అదనపు కమిషనర్లు, పట్టణాభివద్ధి నిపుణులు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, స్వచ్ఛ భారత్ మిషన్, జీరో వేస్ట్ కార్యక్రమాల ప్రతినిధులు పాల్గొననున్నారన్నారు. ఈ సందర్భంగా యునిడో నిర్వహిస్తున్న జెమ్ అవార్డు – 2026 ను గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కు ప్రదానం చేయనున్నారని తెలిపారు. జూన్ 2న భాగస్వామ్య ప్రతినిధుల కోసం గుంటూరు జిల్లా జాగర్లమూడి వద్ద ఏర్పాటు చేసిన 500 కిలోవాట్ల తేలియాడే సౌర విద్యుత్ ప్లాంట్, ఇంటింటి చెత్త సేకరణకు వినియోగిస్తున్న ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాల చార్జింగ్ కేంద్రాలను సందర్శించే ప్రత్యేక ఫీల్డ్ విజిట్ కూడా నిర్వహించనున్నారని చెప్పారు. -
విద్యతోనే సామాజిక అసమానతలు దూరం
గుంటూరు మెడికల్: మహాత్మ జ్యోతి రావు పూలే, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ స్ఫూర్తితో పనిచేయాల్సిన అవసరం ఉందని రాష్ట్రీయ జనతాదళ్ అధికార ప్రతినిధి డాక్టర్ కాంచన యాదవ్ అన్నారు. ఆదివారం గుంటూరు అమరావతి రోడ్డు నగరాల్లో శ్రీకష్ణ యాదవ సేవా సమితి ఆధ్వర్యంలో పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతి అందజేత, కెరీర్ గైడెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు వారి తల్లిదండ్రులు జిల్లా వ్యాప్తంగా 1500 మంది పాల్గొన్నారు. శ్రీకష్ణ యాదవ సేవా సమితి గౌరవాధ్యక్షుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆర్జేడీ అధికార ప్రతినిధి డాక్టర్ కాంచన యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ విద్యార్థులు రాజకీయాలలో ప్రధాన పాత్ర పోషించాల్సిన అవసరం నేటి యువతకు ఉందన్నారు. హేతువాద దక్పథం, పరిశీలన శక్తి శాసీ్త్రయ అవగాహన అవసరమని పేర్కొన్నారు. విమర్శనాత్మక దృష్టి విద్యార్థులు అలవర్చుకోవాలని కోరారు. 2004లో ప్రారంభమై నేటికీ ప్రతి ఏడాది పదోతరగతి విద్యార్థులకు కెరీర్ గైడెన్న్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లను ఆమె అభినందించారు. సభాధ్యక్షుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నేటి సమాజంలో విద్య యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని దానికి అనుగుణంగా భవిష్యత్తు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో విద్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ పేదలకు అందకుండా చేశారన్నారు. విద్యారంగం అభివృద్ధి పూర్తిగా మర్చిపోయిందని చెప్పారు. టీటీడీ బోర్డు సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ జంగా కష్ణమూర్తి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థానానికి ఎదగాలంటే విద్య ఒక్కటే ఆయుధమని చెప్పారు. కార్యక్రమంలో శ్రీకష్ణ యాదవ సేవా సమితి అధ్యక్షుడు డాక్టర్ ఎన్వీ శివరామకృష్ణ, ప్రధాన కార్యదర్శి వీవీ శ్రీనివాసరావు, కోశాధికారి టి.రామకృష్ణ ,ఉపాధ్యక్షులు పెరుగు ఏడుకొండలు, ఎ.రాంబాబు, ఎ.మధు కుమార్, సాంబశివరావు, డొక్కా శ్రీనివాస్ రావు, దర్శి హరినాథ బాబు, దాసరి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు రూ.8 లక్షల నగదు అందించారు. ఆర్జేడీ అధికార ప్రతినిధి డాక్టర్ కాంచన యాదవ్ -
పచ్చ నేతల సేవలో...!
బాపట్లసోమవారం శ్రీ 1 శ్రీ జూన్ శ్రీ 2026‘మత్స్యకార సేవలో’ మితిమీరిన టీడీపీ నేతల జోక్యం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,1710 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. వినుకొండ: పట్టణంలోని శ్రీనివాసనగర్లోగల అలివేలు మంగా పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం 108 కలశాలతో విశేష జ్యేష్ఠాభిషేకం నిర్వహించారు. చీరాల అర్బన్: సముద్రంలో వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు అందించే భత్యం అర్హులందరికీ దరిచేరలేదు. ఇదిలా ఉంటే సముద్రంలో మత్స్య సంపదను వేటాడటం తెలియని పలువురి పేర్లు అర్హుల జాబితాలో చేరాయి. దీంతో పలువురు అర్హులైన మత్స్యకారులు నష్టపోయారు. కొందరు సారంగులు(బోటు యజమానులు)కు భత్యం సొమ్ము రాలేదు. ఇదేమని అడిగిన వారికి స్థానిక అధికారుల నుంచి రుసరుసలు, కప్పదాటు సమాధానాలు వస్తున్నాయి. ఇదెక్కడి పచ్చపాతమని అర్హులు వాపోతున్నారు. మితిమీరిన పచ్చ రాజకీయం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరి కోసం మత్స్యకార సేవ.. ఏప్రిల్ 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు 61 రోజుల పాటు సముద్రంలో వేటకు విరామం. మత్స్యసంపద పునరుత్పతి జరిగే కాలం. ఆ సమయంలో మత్స్యకారుల జీవన భృతికి ప్రభుత్వ పరంగా సాయం అందిస్తుంది. అర్హులైన ప్రతి మత్స్యకారుడు, సారంగు (బోటు యజమాని)లకు సంధికాలపు భత్యంగా రూ.20వేలు అందించాలి. అందుకు సంబంధించి ఈ నెల 19వ తేదీన మత్స్యకార సేవలో.. పేరుతో ఆ నగదును వారి, వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. అయితే అందులో అర్హులైన పలువురు మత్స్యకారులకు ఆ సాయం దరిచేరలేదు. మితిమీరిన ‘పచ్చ’ పాతం మత్స్యకార సేవలో పథకానికి అర్హులైన ప్రతి ఒక్క మత్స్యకారుని పేరు జాబితాలో ఉండాలి. అయితే అర్హులైన పలువురి మత్స్యకారుల పేర్లు జాబితాలో లేవు. పలువురు అనర్హుల పేర్లు జాబితాలో చేరాయి. ఇదెక్కడి న్యాయమని మత్స్యకారులు ప్రశ్నిస్తున్నారు. మితి మీరిన పచ్చ రాజకీయమే అందుకు కారణమనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇది సరైన పద్ధతి కాదని, అర్హులందరికీ భత్యం సొమ్ము అందాలని కోరుతున్నారు. 7నాకు బోటు ఉంది. బోటు రిజిస్ట్రేషన్ కాగితం ఉంది. డీజిల్ రాయితీ కాగితం ఉంది. మా పెద్దల నుంచి బోటు ఉంది. ఇప్పుడు భత్యం సొమ్ము నా బ్యాంకు ఖాతాలో జమ కాలేదు. ఇదేమని అడిగితే పై నుంచి వచ్చిన జాబితాలో నీ పేరు లేదని చెబుతున్నారు. అదేమంటే కోప్పడుతున్నారు. మత్స్యకారులు కాకుండా కొందరు ఇతర కులాల వాళ్లు వేట చేస్తారు. అలాంటి వారి పేర్లు ఉండాలి. తప్పు లేదు. అసలు వేటంటే తెలీనోళ్లు పేర్లు కూడా ఉన్నాయి. – రాజారావు, సారంగు, వాడరేవుమా కుటుంబంలో నా పేరు ఒక్కటే పెట్టుకున్నాం. కళాసీగా పని చేస్తుంటా. మేం ఇక్కడ కాగితం పెట్టుకున్నా, తరువాత అవి మారిపోతుంటాయి. అందుకే వాటి మీద ఆశలు వదులుకున్నాం. ఎవరిని అడిగి ప్రయోజనం ఏముంది? – శివ, మత్స్యకారుడు, వాడరేవుమామూలుగా కాగితాలు పెట్టుకుని పేర్లు రాసేపుడు బోటు దగ్గర నిలుచోబెట్టి ఫొటోలు తీస్తారు. కొందరు అలా బోటు దగ్గరకు వచ్చి ఫొటోలు తీపించుకో లేదు. కానీ థంబ్ వేయటానికి వచ్చినపుడు చూశాం. వారికి సముద్రంలో వేట గురించి ఏ మాత్రం తెలీదు. మరి వారి పేర్లు అర్హుల లిస్టులోకి ఎలా వచ్చాయనేది పెద్ద ప్రశ్న. నాకు డబ్బులు పడ్డాయి. మా బోటు యజమానికి డబ్బు పడలేదు. వేరేవాళ్లకు ఇచ్చుకుంటారో, మానుకుంటారో మాకు అనవసరం. కానీ నిజంగా వేట చేసేవారి పేర్లు లేకపోవటం సరికాదు. దీనిపై మళ్లీ విచారించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. – రమణ, మత్స్యకారుడు, వాడరేవు -
యువతి బలవన్మరణం కేసులో హైడ్రామా
యద్దనపూడి: మండలంలోని అనంతవరంలో శనివారం ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఆదివారం యద్దనపూడి పోలీస్స్టేషన్ వద్ద, అనంతవరం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వివరాలు.. అనంతవరంలోని బీసీ కాలనీకి చెందిన కుంచాల వీరకుమారి (27) తన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకొని మరణించిన విషయం విధితమే. మృతురాలి తల్లిదండ్రులు ఆమెకు ఇష్టం లేని వివాహం చేయటానికి ప్రయత్నం చేశారని ఎస్ఐ రత్నకుమారి ఇచ్చిన స్టేట్మెంట్తో ఆదివారం పత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి. కాగా ఎస్ఐ రత్నకుమారి నిరక్షరాస్యులైన తాము చెప్పిన స్టేట్మెంట్ను వక్రీకరించి స్థానిక రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో ఆమె ఇష్టానుసారం ఫిర్యాదు నమోదు చేసుకోవటం దారుణమంటూ యద్దనపూడి పోలీస్స్టేషన్ వద్ద ఆదివారం మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు మీడియా ముందు వాపోయారు. తమ కుమార్తె బలవన్మరణానికి బీసీ కాలనీకి చెందిన తన్నీరు అశోక్ కారణమని, వీరకుమారి ఆత్మహత్య అనంతరం అతడు కుటుంబంతో సహా గ్రామం వదిలి పరారయ్యాడని అతని వేధింపుల కారణంగానే తమ బిడ్డ ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ బిడ్డ మృతికి అశోక్ కారణమని ఫిర్యాదు చేసినప్పటికీ ఎస్ఐ రత్నకుమారి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహంతో ధర్నా పోస్టుమార్టం నిర్వహించిన వీరకుమారి మృతదేహాన్ని ఆమె మరణానికి కారణమని చెబుతున్న నిందితుడు అశోక్ ఇంటిముందు ఉంచారు. తమకు న్యాయం జరిగే వరకు తమ కుమార్తె మృతదేహనికి అంత్యక్రియలు నిర్వహించబోమని తెగేసి చెప్పారు. ఈ విషయమై మీడియా ప్రతినిధులు.. నిందితుడిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఎస్ఐ రత్నకుమారిని ప్రశ్నించగా దర్యాప్తు చేస్తున్నామని.. నిందితుడు ఎక్కడ ఉన్నాడో తమకు తెలియదని చెప్పటం గమనార్హం. ఈ క్రమంలో స్టేషన్కు వెళ్లిన మీడియా సిబ్బందిని అధికారపార్టీకి చెందిన ఓ నాయకుడు ఇక్కడ మీడియాకు ఏం పని అంటూ ప్రశ్నించారు. నిందితుడు తమ కుమార్తెను లోబరచుకొని ఆత్మహత్యకు ప్రేరేపించి ఆమె మరణానికి కారకుడయ్యాడని, సెల్ఫోన్లో ఉన్న ఆధారాలతో అతనిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పరారీలో ఉన్న నిందితుడిపై పోలీసులు చర్యలు తీసుకోకుంటే తామే అతనిపై చర్యలు తీసుకోవాల్సి వస్తోందని, అప్పటి వరకు తమ కుమార్తె మృతదేహన్ని నిందితుడి ఇంటిముందు నుంచి తొలగించబోమని, అంత్యక్రియలు కూడా నిర్వహించబోమని బాధిత కుటుంబ సభ్యులు తెగేసి చెబుతున్నారు. -
రైతుల నోట్లో ‘మట్టి’
శావల్యాపురం: శావల్యాపురం మండలం వయ్యకల్లు గ్రామంలో మట్టి, ఇసుక మాఫియా పడమటి వాగును పిండేస్తోంది. అధికార పార్టీ ముఖ్యనేతల అండదండలతో కొందరు నేతలు యథేచ్ఛగా ఇసుక అక్రమ దందాకు తెరలేపారు. గ్రామ మాజీ సర్పంచ్ కుమారుడు, మండల స్థాయి అధికార పార్టీ నేత ఒకరు ఈ అక్రమ మైనింగ్ వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా వ్యవహరిస్తూ, ఇసుక, మట్టిని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని గ్రామస్తులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఇసుక దోపిడీకే బ్రిడ్జి నిర్మాణం! ఇటీవల కాలంలో ప్రభుత్వం సుమారు రూ. 50 లక్షలతో పడమటి వాగుపై ఒక బ్రిడ్జిని నిర్మించింది. అయితే ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయినప్పటి నుంచే సదరు నేత కన్ను ఇక్కడి ఇసుక నిల్వలపై పడింది. బ్రిడ్జి నిర్మాణాన్ని ఆసరాగా చేసుకుని, ఆఘమేఘాల మీద పొక్లెయిన్లను రంగంలోకి దించారు. చుట్టుపక్కల రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, నిబంధనలకు విరుద్ధంగా వాగు అంచుల్లో భారీగా తవ్వకాలు జరుపుతూ ఇసుకను తరలిస్తున్నారు. కన్నెత్తి చూడని అధికారులు ఇంత బహిరంగంగా పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుక దోపిడీ జరుగుతున్నా సంబంధిత అధికారులు స్పందించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సదరు అధికార పార్టీ నేత అధికారులను మభ్యపెట్టారా, లేక తన రాజకీయ బలంతో భయపెట్టారా అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. పొంచి ఉన్న భారీ ముంపు పడమటి వాగు అంచున ఉన్న పొలాలకు ఈ అక్రమ తవ్వకాల వల్ల భారీ వరద ముప్పు పొంచి ఉంది. గతంలో పలుమార్లు ఈ వాగు పొంగిపొర్లడం వల్ల చుట్టుపక్కల రైతులు తీవ్రంగా పంట నష్టపోయారు. ఇప్పుడు వాగు అంచులను ఇష్టారాజ్యంగా తవ్వేస్తుండటంతో, రాబోయే వర్షాకాలంలో వాగు గట్టు తెగి పొలాలు పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నిస్తే ఎదురుదాడి.. దౌర్జన్యం ‘ఇలా అక్రమంగా ఇసుక తవ్వడం వల్ల మా పొలాలు మునిగిపోతాయి, ఇది పద్ధతి కాదు’ అని ప్రశ్నించిన రైతులపై సదరు నేత దౌర్జన్యానికి దిగుతున్నాడు. ‘నా ఇష్టం.. నన్ను అడిగేదెవడు?‘ అంటూ ఎదురుదాడికి పాల్పడుతూ, రైతులను నానా దుర్భాషలాడుతూ బెదిరింపులకు గురిచేస్తున్నాడని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆదివారం సాయంత్రం వరకు కూడా ఇక్కడ యథేచ్ఛగా పొక్లెయిన్లతో తవ్వకాలు సాగాయని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, వయ్యకల్లు పడమటి వాగులో జరుగుతున్న అక్రమ మైనింగ్పై విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ముంపు ముప్పు నుంచి తమ పొలాలను కాపాడాలని రైతులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. -
పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు
ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు చిలకలూరిపేటటౌన్: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కాలువలోకి దూసుకుపోవడంతో ఐదుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మండలంలోని పసుమర్రు సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాధితులంతా తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం త్రిపురానికి చెందిన యువకులుగా గుర్తించారు. త్రిపురారం గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు కారులో చీరాల బీచ్ విహారయాత్రకు వెళ్లారు. అక్కడ సరదాగా గడిపి, తిరిగి సొంతూరికి ప్రయాణమయ్యారు. కారు చిలకలూరిపేట మండలం పసుమర్రు పరిసరాల్లోకి రాగానే ఒక్కసారిగా అదుపుతప్పి, అతివేగంతో రహదారి పక్కనే ఉన్న పొలాల కాలువలోకి దూసుకువెళ్లింది. ప్రమాద తీవ్రతకు కారు తీవ్రంగా దెబ్బతినగా, అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, హైవే సిబ్బంది వెంటనే స్పందించి కారులో చిక్కుకున్న యువకులను వెలుపలికి తీశారు. 108 వాహనంలో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో బాల్టి ప్రదీప్ అనే యువకుడి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న ఉచిత ప్రసాద వితరణ పథకానికి విజయవాడ లబ్బీపేటకు చెందిన ఎం. నరేంద్ర జ్యోతి రూ. 1,00,116ల విరాళాన్ని అందజేశారు. అలాగే అమ్మవారి నిత్యాన్నదానానికి సికింద్రాబాద్ సికింద్రాబాద్ వెంకటాపురానికి చెందిన వి. కల్కి చరణ్, శివానిల పేరిట కుటుంబ సభ్యులు రూ. లక్ష విరాళాన్ని అధికారులకు అందించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో దర్శనం కల్పించి ప్రసాదాలు, శేషవస్త్రం, అమ్మవారి చిత్రపటం అందచేశారు. వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ గుంటూరు లీగల్: రైతులపై నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలని వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆదివారం ఒక ప్రకనటలో డిమాండ్ చేశారు. పొన్నూరు మండలంలోని మామిళ్లపల్లి గ్రామానికి చెందిన మొక్కజొన్న రైతులకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ వారికి అండగా నిలిచిన వారితో పాటు నాయకులపై అక్రమంగా కేసులు నమోదు చేయడం దారుణమని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం మొక్కజొన్నకు మద్దతు ధర కల్పించడంలో విఫలమైందని మండిపడ్డారు. గిట్టుబాటు ధర లేక గోదాముల్లో దాచుకున్న మొక్కజొన్న బస్తాలను అక్రమ నిల్వలంటూ టీడీపీ నాయకులు దాడి చేసిన నేపథ్యంలో వైఎస్సార్ సీపీ రైతుల పక్షాన నిలవడం తప్పా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అనుచరులు చేసిన దుర్మార్గ చర్యను నిరసిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపిన రైతులు, నాయకులపై వరసగా కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని పేర్కొన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన యంత్రాంగం, పాలకులు పట్టించుకోకుండా సంఘీభావ కార్యక్రమాల్లో పాల్గొన్న పార్టీ వేమూరు సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు, రేపల్లె సమన్వయకర్త పీట నాగమోహన్ కృష్ణ, అంబటి వెంకటేశ్వరరావు, ఆకుల వెంకటేశ్వరరావు, షేక్ మీరజ్, షేక్ గౌస్, ఖాదర్ బాషా, మమత, అంబటి పార్వతితో పాటు మరి కొంతమంది నాయకులపై కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పోలీస్ స్టేషన్లలో నమోదైన రెండు కేసులలో రైతులు, కూలీలు, నాయకులపై నమోదైన కేసులను పరిశీలిస్తే ఎమ్మె ల్యే ధూళిపాళ్ల నరేంద్ర కక్ష పూరితంగా వ్యవహరించినట్లు స్పష్టమవుతుందని వెల్లడించారు. కేసులను ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. -
ఇదేనా మర్యాద!
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలోని జిందాల్ ఫ్యాక్టరీ పరిశీలన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ అధికారులతో శనివారం వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఫ్యాక్టరీ పనితీరుపై వాకబు చేస్తున్న సమయంలో పవన్కళ్యాణ్ కాలు మీద కాలు పెట్టుకుని ఊగుతూ అహంకార ధోరణిలో సమీక్ష నిర్వహిస్తున్న వీడియో, మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ, పల్నాడు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ, జిందాల్ ఫ్యాక్టరీ ఉన్నతాధికారులు చేతులు కట్టుకుని నిలుచున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. సినిమాటిక్ హీరోయిజం పండించేందుకు ఇలా చేశారా... లేదా పవన్ ఆసలు స్వభావం అధికారం వచ్చిన తరువాత ఇలా బయటపడిందా అనే చర్చ మొదలైంది. ఏదైతేనేం ఉన్నతవిద్యావంతులైన ఐఏఎస్లు, ఇంజినీర్లు, ఇతర ఉన్నతాఽధికారులు నిలబడి పరిశ్రమ పనితీరు, పర్యావరణానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తుంటే కాలు మీద కాలు వేసుకుని నిర్లక్ష్యంగా, అధికారులను అవమానించే విధంగా ప్రవర్తించిన వ్యవహార శైలిని నెటిజన్లు తప్పుపడుతున్నారు. అధికారులు ప్రభుత్వ పాలకులకు జవాబుదారీగా మాత్రమే ఉంటారని.. బానిసలు కాదని, వారి చదువుకై నా గౌరవం ఇవ్వాలని సోషల్ మీడియాలో హెచ్చరిస్తున్నారు. పదవీ వచ్చాక అహంకారంతో సభ్యసమాజంలో ఇలాంటి పోకడలు సరికాదని మండిపడుతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధులు, అధికారులు పరస్పర గౌరవంతో వ్యవహరించాల్సి ఉండగా.. తాజా దృశ్యాలు అందుకు భిన్నంగా ఉన్నాయని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. -
కారుపై అకస్మాత్తుగా విరిగిపడిన భారీ వృక్షం
భవానీపురం(విజయవాడపశ్చిమ): ప్రయాణిస్తున్న ఒక కారుపై రోడ్డు పక్కన ఉన్న భారీ వృక్షం అకస్మాత్తుగా విరిగిపడిన సంఘటన ఆదివారం సాయంత్రం విద్యాధరపురంలో చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు కారు నడుపుతున్న వ్యక్తి త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. సేకరించిన సమాచారం మేరకు సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. విద్యాధరపురం సితార జంక్షన్ నుంచి కుమ్మరిపాలెం సెంటర్ వైపు వెళుతున్న వెర్టిగ కారు చెరువు సెంటర్ సమీపంలో రోడ్ పక్కనే ఉన్న చిన్న సాయిబాబా గుడి వద్దకు వచ్చేసరికి కొన్నేళ్లనాటి పురాతన భారీ వృక్షం ఒక్క సారిగా విరిగి కారుపై పడింది. పోలీసులకు, నగరపాలక సంస్థ అధికారులకు సమాచారాన్ని అందించారు. స్థానికుల సహకారంతో కారులో ఇరుక్కుపోయిన వ్యక్తిని అతికష్టంపై బయటకు తీశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి నులకపేట రాజీవ్ కాలనీకి చెందిన కొక్కిలిగడ్డ రాజశేఖర్(45) ట్రావెల్స్ కారు నడుపుతూ ర్యాపిడో నిమిత్తం విజయవాడ వచ్చారు. తిరిగి తాడేపల్లి వెళిపోతున్న క్రమంలో ప్రమాదం జరిగినట్లు తెలిసింది. కారుపై పడింది పెద్ద వృక్షం కావడంతో కారుకు నష్టం వాటిల్లినట్లు సమాచారం. విద్యాధరపురం కుమ్మరిపాలెం సెంటర్ నుంచి సితార జంక్షన్కు వెళ్లే ఈ అంబేడ్కర్ రోడ్లో నిత్యం ప్రజల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ రహదారిలో కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న భారీ వృక్షాలను తొలగించాల్సిన అవసరం ఉందని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. -
చట్టసభల్లో సముచిత స్థానం కల్పించాలి
చిలకలూరిపేట: సూర్యవంశ వడియ రాజులకు చట్టసభల్లో సముచిత స్థానం కల్పించాలని సూర్యవంశ వడియ రాజుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు కందుల చంద్రశేఖర్ వడియరాజు డిమాండ్ చేశారు. సూర్యవంశ వడియ రాజుల ఆత్మీయ సమ్మేళనం పట్టణంలోని మెడికల్ హాలులో ఆదివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సుమారు 50 లక్షలకు పైగా జనాభా ఉన్న తమ సామాజిక వర్గానికి రాష్ట్ర రాజకీయాల్లో కనీస గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ధికంగా, రాజకీయంంగా, సామాజకంగా వడియరాజులు ఇంకా వెనుకబడే ఉన్నారని వెల్లడించారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధుల వద్దకు వెళితే కనీసం పట్టించుకొనే నాధుడే కరువయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి మారాలంటే తమకు చట్టసభల్లో సముచిత స్థానం లభించాల్సి ఉందన్నారు. 2029 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 10 ఎమ్మెల్యే, నాలుగు ఎంపీ స్థానాలు తమ సామాజిక వర్గానికి రాజకీయ పార్టీలు కేటాయించాలన్నారు. అలాగే రాష్ట్ర వడ్డర కార్పొరేషన్కు ప్రభుత్వం రూ. 100 కోట్లు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లాకు సంబందించిన పలువురికి నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు కందుల రవీంద్రరాజు, బత్తుల లక్ష్మీకాంతయ్య, వేముల శివరాజు, ఓర్సు వీరభాస్కర్, తన్నీరు రమణయ్య, వేముల శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సూర్యవంశ వడియ రాజుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు కందుల చంద్రశేఖర్ వడియరాజు -
మొక్కు తీర్చుకునేందుకు వెళుతున్న వాహనానికి ప్రమాదం
సత్తెనపల్లి: రోడ్డు ప్రమాదంలో ఇరువురికి తీవ్ర గాయాలు కాగా ఒకరు అస్వస్ధతకు గురైన ఘటన సత్తెనపల్లి మండలం కంటెపూడి సమీపంలో ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కొండమోడు – పేరేచర్ల రహదారి విస్తరణలో భాగంగా సత్తెనపల్లి మండలం కంటెపూడి సమీపంలో బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. గుంటూరు వైపు నుంచి సత్తెనపల్లి వైపుకు బేబీ చిప్స్తో వస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల వద్ద వాహనాన్ని నెమ్మదిగా నడుపుతుండగా వెనుక నుంచి 50 మంది ప్రయాణికులతో గుంటూరు స్వర్ణ భారతి నగర్ నుండి మొక్కు తీర్చుకోవడం కోసం దామరచర్ల గ్రామం గండి మైసమ్మ దేవాలయానికి ప్రయాణమైన భక్తుల డీసీఎం లారీ ఢీ కొట్టింది. దీంతో డీసీఎం లారీ వాహనం ముందు క్యాబిన్ ధ్వంసమై క్యాబిన్లో కూర్చున్న ఓర్చు వెంకటేశ్వర్లుకు రెండు కాళ్లు విరగ్గా, ఓర్చు యేసురాజుకు కాళ్లకు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఓర్చు రమణమ్మకు ఛాతిలో నొప్పి అధికమై అస్వస్థతకు గురైంది. క్షతగాత్రులను సత్తెనపల్లి ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం కాళ్లు విరిగిన వెంకటేశ్వర్లు, యేసురాజులను గుంటూరు జీజీహెచ్కు తరలించారు. ఇది ఇలా ఉంటే డీసీఎం లారీ వాహన డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు బాధితులు వాపోయారు. ఇరువాహనాల డ్రైవర్లు పరారయ్యారు. సంఘటనా స్థలాన్ని సత్తెనపల్లి రూరల్ పోలీసులు సందర్శించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇరువురికి తీవ్ర గాయాలు -
హ్యాకథాన్లో మంగళగిరి విద్యార్థుల ప్రతిభ
తాడేపల్లి రూరల్: మంగళగిరి పట్టణ పరిధి వీవర్స్ కాలనీలోని పీఎంశ్రీ ఎంటీఎంసీ హైస్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయి హ్యాకథాన్లో ప్రతిభ కనబరిచి బెస్ట్ ఇన్నోవేటివ్ థింకింగ్ అవార్డు అందుకున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.వెంకటేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మే 25 నుంచి 29వ తేదీ వరకు విశాఖపట్నంలోని గీతమ్ విశ్వవిద్యాలయంలో అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ కార్యక్రమం, లీడర్ షిప్ ఫర్ ఈక్విటీ సంయుక్తంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. పోటీలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి మొత్తం 23 జట్లు పాల్గొన్నాయని తెలిపారు. తమ స్కూలు విద్యార్థులు ప్రదర్శనలు ప్లాస్టిక్ ఫ్రీ మంగళగిరి, సేవ్ టుడే, సెక్యూర్ టుమారో అనే ప్రాజెక్ట్ న్యాయనిర్ణేతలను ఆకట్టుకున్నట్లు వివరించారు. ప్రాజెక్ట్లో రివార్డు ఆధారిత ప్లాస్టిక్ వ్యర్థ నిర్వహణ వ్యవస్థను రూపొందించారని, ప్రజలు ప్లాస్టిక్ వ్యర్ధాలను సక్రమంగా పారవేయడానికి ప్రోత్సహించే విధంగా ఈ వ్యవస్థ పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ వ్యవస్థలో ఇచ్చే రివార్డుల స్థితిని పర్యవేక్షించడానికి విద్యార్థులు ఎంఐటి యాప్ ఇన్వెంటర్ ద్వారా ఒక మొబైల్ అప్లికేషన్కు అభివృద్ధి చేశారని, ఈ యాప్ ద్వారా వినియోగదారులు తమకు లభించిన రివార్డులు, ప్లాస్టిక్ వ్యర్థాల సమర్పణ వివరాలను సులభంగా ట్రాక్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ ప్రాజెక్ట్కు వృత్తి శిక్షనాధికారి గుమ్మ వెంకట వినీత మార్గదర్శకత్వం వహించారని పేర్కొన్నారు. అవార్డు గెలుచుకున్న విద్యార్థులను అభినందిస్తున్నామని తెలిపారు. -
ధరల పెంపుపై జూన్ ఒకటి నుంచి ఆందోళన
వామపక్ష పార్టీల నాయకుల వెల్లడి లక్ష్మీపురం: పెట్రోలు, డీజిల్, గ్యాస్, నిత్యావసరాల ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా జూన్ ఒకటి నుంచి 9వ తేదీ వరకు ఆందోళన నిర్వహించనున్నట్లు వామపక్ష పార్టీలు వెల్లడించాయి. గుంటూరు బ్రాడీపేటలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో వామపక్షాల సమావేశం శనివారం నిర్వహించారు. అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ, సీపీఐ నగర కార్యదర్శి ఎ.అరుణ్కుమార్, సీపీఐ(ఎంఎల్) నాయకులు యు.నాగేశ్వరరావు, సీపీఐ(ఎంఎల్) రెడ్స్టార్ రాష్ట్ర నాయకులు మన్నవ హరిప్రసాద్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు వి.నరసింహారావు, సీపీఐ(ఎంఎల్) ప్రజాపోరు నాయకులు పి.కొటేశ్వరరావు, ఎం.సీపీఐ(యూ) నాయకురాలు డి.నాగలక్ష్మి విలేకరులలో మాట్లాడారు. జూన్ ఒకటి నుంచి 7వ తేదీ వరకు ప్రచారం నిర్వహించాలని, అనంతరం 9వ తేదీన రాస్తారోకో చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో కరపత్రాలను ప్రజల్లో విస్తృతంగా పంపిణీ చేయాలని, 4వ తేదీన గుంటూరులో సదస్సు నిర్వహించాలని, 9వ తేదీన జరిగే రాస్తారోకో పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఎం నాయకులు పాశం రామారావు, కె.నళినీకాంత్, ఈమని అప్పారావు పాల్గొన్నారు. -
గాదె వెంకటరెడ్డికి ప్రముఖుల నివాళులు
ఇంకొల్లు (చినగంజాం): వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి భౌతిక కాయానికి పలువురు ప్రముఖులు శనివారం నివాళులర్పించారు. వృద్ధాప్యం, అనారోగ్యంతో శుక్రవారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో మృతిచెందగా, శనివారం బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లు మండలం పావులూరులోని ఆయన స్వగృహానికి భౌతికకాయాన్ని తీసుకొచ్చారు. పార్టీలకతీతంగా నాయకులు, అభిమానులు, ప్రజలు హాజరై సందర్శించి నివాళులర్పించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి, పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఎంఎల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, దర్శి ఎమ్మెల్యే, పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, తదితరులు నివాళుల ర్పించారు. వారితో పాటు రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, వైఎస్సార్ సీపీ అద్దంకి ఇన్చార్జ్ చింతలపూడి అశోక్ కుమార్, నరసరావుపేట, చీరాల మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డి, రాష్ట్ర ఎస్సీసెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, బాపట్ల మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్థనరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, మార్కాపురం కేపీ కొండారెడ్డి, చీరాల పార్టీ పరిశీలకుడు మోదుగుల బసవపున్నారెడ్డి, రాష్ట్ర పార్టీ సంయుక్త కార్యదర్శి పాలెపోగు రాంబాబు, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కొల్లాటి ఏడుకొండలు, మాజీ పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ వైఎం ప్రసాద్రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి బండారు ప్రభాకరరావు, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి ఉప్పలపాటి అనిల్ చౌదరి, అంబటి హరినాథ్ , మారెళ్ళ వెంకటరావు, జిల్లా ఉపాధ్యక్షుడు పఠాన్ కాలేషావలి, రామారావు, వై శివారెడ్డి, పర్చూరు నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్లు, వివిధ అనుబంధ విభాగాల సభ్యులు గ్రామ అధ్యక్షులు, అభిమానులు, రిటైర్డ్ అధికారులు నివాళులర్పించారు. సజ్జల, అంబటితో పాటు హాజరైన పలువురు నాయకులు -
ముఖదర్శనం తప్పనిసరి
గుంటూరు ఎడ్యుకేషన్: వేర్వేరు ఉద్యోగాలు చేస్తూ, ఖాళీ సమయంలో కళాశాలకు వెళ్లకుండా ఉండడం, ఇష్టమొచ్చినప్పుడు కళాశాలలో బోధన చేయడం, కళాశాల ముఖమే చూడకుండా కేవలం సర్టిఫికెట్ల కోసమే కోర్సులు పూర్తి చేస్తున్నవారు కోకొల్లలు. ఇటువంటి వారికి చెక్ పెడుతూ ఉన్నతవిద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రోజూ రెండుసార్లు ముఖ ఆధారిత హాజరు (ఫేషియల్ అటెండెన్స్) నమోదు చేసే విధంగా మార్గదర్శకాలు విడుదల చేసింది. డిగ్రీ కళాశాలల్లో ఇప్పటికే అమలు ప్రైవేటులోనూ అమలుకు రంగం సిద్ధం -
జీజీహెచ్ సూపరింటెండెంట్గా డాక్టర్ సుందరాచారి
జిల్లా ఇన్చార్జి మంత్రి పార్థసారథి బాపట్ల: భారత చిత్రపటంలో సూర్యలంక, చీరాల బీచ్లు ప్రత్యేక స్థానాన్ని సంతరించుకోనున్నాయని జిల్లా ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. సూర్యలంక బీచ్లో ‘బీచ్ ఆఫీసు’, ‘బీచ్ మెడికల్ ఎమర్జెన్సీ రెస్పాన్న్స్ సెంటర్’లను మంత్రి పార్థసారథి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్, బాపట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ రాజు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి.కోటేశ్వరరావు, బావుడా చైర్మన్ రాజశేఖర్బాబులతో కలిసి శనివారం సాయంత్రం ప్రారంభించారు. అత్యవసర విభాగంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలు, వస్తువులు, పరికరాలను మంత్రి పరిశీలించారు. బే ఆఫ్ బాపట్ల లోగోతో ముద్రించిన టోపీలు, జనపనార సంచులు, కీచైన్లు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ముందుగా కొబ్బరి మొక్కలు నాటారు. బీచ్ వద్ద పునఃనిర్మించిన బీఎస్ఎన్ఎల్ టవర్ను ప్రారంభించారు. ప్రజలు సైతం పర్యాటకంపై ఎంతో ఆసక్తి చూపుతున్నారని వివరించారు. బాపట్ల జిల్లా అభివృద్ధి బాట పట్టిందని మంత్రి పార్థసారథి చెప్పారు. కార్యక్రమంలో బాపట్ల ఆర్డీఓ పి.గ్లోరియా, డీపీఓ ప్రభాకరరావు, ఇన్చార్జి టూరిజం ఆఫీసర్ ఆనంద్ సత్యపాల్, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.విజయమ్మ తదితరులు పాల్గొన్నారు. నగరంపాలెం: ప్రతి ఒక్కరూ సమర్థంగా విధులు నిర్వర్తించాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి అన్నారు. గుంటూరు రేంజ్లోని పలు యూనిట్లలో ఉద్యోగోన్నతి పొందిన 24 మంది సీఐలు శనివారం గుంటూరు కలెక్టర్ బంగ్లా రోడ్లోని గుంటూరు రేంజ్ కార్యాలయంలో ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఐజీ మాట్లాడుతూ క్రమశిక్షణ, నిబద్ధత, ప్రజా సేవా దృక్పథంతో పోలీస్ శాఖ ప్రతిష్టను పెంపొందించాలని సూచించారు. సీఐలుగా ఉద్యోగోన్నతి పొందిన వారిలో గుంటూరు జిల్లాలో పది మంది, పల్నాడు జిల్లాలో ఐదుగురు, ప్రకాశం జిల్లాలో ముగ్గురు, సీఐడీలో ఇద్దరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, బాపట్ల జిల్లా, తిరుపతి జిల్లా, సీీసీఎస్ నుంచి ఒక్కొక్కరూ ఉన్నారని తెలిపారు. కోడూరు: హంసలదీవి సాగరతీరం అల్లకల్లోలంగా మారింది. వాతావరణ మార్పులతో రెండు రోజుల నుంచి అలలు ఉధృతి ఎక్కువగానే ఉంది. శనివారం ఆ తీవ్రత మరింత అధికమైంది. సముద్ర అలలు సుమారు మూడు మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్నాయి. సముద్రం నీరు కూడా ముందుకు చొచ్చుకువచ్చి డాల్ఫిన్ భవనం చుట్టూ చేరాయి. ఈ నేపథ్యంలో అటవీ అధికారులు ముందు జాగ్రత్తగా తీరం గేట్లను మూసివేశారు. పాలకాయతిప్ప కరకట్ట వద్దే పర్యాటకుల రాకపోకలను నిషేధించారు. -
మొక్కజొన్న, పొగాకు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి
లక్ష్మీపురం: మొక్కజొన్న, పొగాకు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు కోరారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడు కొల్లి రంగారెడ్డి అధ్యక్షతన గుంటూరు కొత్తపేటలోని మల్లయ్య లింగం భవన్లో శనివారం సంఘ సమావేశం నిర్వహించారు. సమావేశంలో నాగేశ్వరరావు మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి వినియోగించే ట్రాక్టర్లకు, ఆయిల్ ఇంజన్లకు డీజిల్ లీటరు రూ.30లకు సరఫరా చేయాలని కోరారు. వ్యవసాయానికి వినియోగించే డ్రోన్లకు, పవర్ స్పెయర్లకు రూ.50లకు లీటర్ పెట్రోలు సరఫరా చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు న్యాయమైన ధర కల్పించి, పొగాకు బోర్డు ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్న, జొన్న, అపరాలకు రైతులు నష్టపోకుండా స్వామినాథన్ సిఫార్సు మేరకు 50 శాతం మిగులు ఉండునట్లు కొనుగోలు చేయాలన్నారు. ఈ సమావేశంలో రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పచ్చల శివాజీ, కార్యదర్శి యార్లగడ్డ వెంకటేశ్వరరావు, కౌలు రైతు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కంజుల విఠల్ రెడ్డి, పీవీ జగన్నాథం, సీపీఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, నాయ కులు ముప్పాళ్ల శివశంకరరావు, పచ్చల సాంబశివరావు, ఆంజనేయులు, వేణు తదితరులు పాల్గొన్నారు. -
స్థల వివాదంలో అన్నదమ్ముల ఘర్షణ
చిలకలూరిపేట టౌన్: మండలం పరిధిలోని వేలూరు గ్రామం ఎస్సీ కాలనీలో శనివారం ఉదయం ఉద్రిక్తత చోటుచేసుకుంది. వరుసకు అన్నదమ్ములు ఘర్షణకు దిగారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేలూరు ఎస్సీ కాలనీకి చెందిన వంజా జ్ఞానయ్య, వంజా సురేంద్రం వరుసకు అన్నదమ్ములు. వీరిద్దరి ఇళ్లు పక్కపక్కనే ఉన్నాయి. కొంతకాలంగా వీరి మధ్య నాలుగు సెంట్ల స్థలానికి సంబంధించి తీవ్ర వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే శనివారం ఉదయం ఇరుపక్షాల మధ్య మాటామాటా పెరిగి, అది కాస్తా ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకునే వరకూ వెళ్లిది. ఘర్షణ అనంతరం ఇరువర్గాల వారు చిలకలూరిపేట రూరల్ పోలీస్స్టేషనుకు చేరుకుని పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రూరల్ ఎస్ఐ జి. అనిల్కుమార్ తెలిపారు. ఆప్తమాలజీ హెచ్ఓడీగా డాక్టర్ శ్రీదేవి గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ కంటి వైద్య విభాగాధిపతిగా డాక్టర్ శ్రీదేవిని నియమిస్తూ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కంటి వైద్య విభాగాధిపతిగా పనిచేస్తున్న డాక్టర్ రవిబాబు ఉద్యోగ విరమణతోపాటు, డాక్టర్ శ్రీదేవిని హెచ్ఓడీగా నియమించారు. -
నదుల రక్షణకు యాక్షన్ప్లాన్
యడ్లపాడు: నదుల ప్రక్షాళనపై రాజీపడేదే లేదని, పారిశ్రామిక వ్యర్థాలతో నదులను మురికికూపాలుగా మారిస్తే సహించబోమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. శనివారం పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం కొత్తపాలెం గ్రామ పరిధిలోని జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ (వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి) ప్లాంట్ను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ప్లాంట్లోని కంట్రోల్ రూమ్, మురుగునీటి శుద్ధీకరణ కేంద్రం, ఘనవ్యర్థాల ప్రాసెసింగ్ యూనిట్లతో పాటు అన్ని విభాగాలను పరిశీలించిన డిప్యూటీ సీఎం, అక్కడి సాంకేతికతపై అధికారులతో చర్చించారు. ప్లాంట్ నిర్వహణ, వ్యర్థాల సేకరణ, బాయిలర్ ప్రాసెస్, కర్బన ఉద్గారాల నియంత్రణ వంటి సాంకేతిక అంశాలు, యూనిట్ విద్యుత్ విక్రయ చార్జీలు గురించి పవన్ కల్యాణ్ అడిగి తెలుసుకున్నారు. జిందాల్ ప్లాంట్లో వాడుతున్న అధునాతన కాలుష్య నివారణ పద్ధతులను, రాజమండ్రిలోని ప్రసిద్ధ ఆంధ్ర పేపర్ మిల్లు ఎందుకు పాటించడం లేదంటూ పవన్ కల్యాణ్ అధికారులను ప్రశ్నించారు. పారిశ్రామిక వ్యర్థాలతో నదులు మురికికూపాలుగా మారడాన్ని ఎంతమాత్రం సహించేది లేదని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో నిత్యం టన్నుల కొద్దీ ఉత్పత్తి అవుతున్న చెత్తను శాసీ్త్రయంగా సద్వినియోగం చేసుకునేందుకు, మరిన్ని ఘనవ్యర్థాల నిర్వహణ ప్లాంట్లను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. పర్యటనలో ప్లాంట్ ఆపరేషన్స్ విభాగం ప్రెసిడెంట్ ఎం.వి.చారి, పంచాయతీరాజ్ అధికారి కృష్ణతేజ, కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజినీర్ నజీమాబేగం, పల్నాడు జిల్లా ఇన్న్చార్జి కలెక్టర్ సంజానా సింహ, ఎస్పీ బి.కృష్ణారావు, ఆర్డీఓ బాలకృష్ణ, చిలకలూరిపేట అర్బన్, రూరల్ సీఐలు పి.రమేష్, బి.సుబ్బానాయుడు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
కారా మార్గదర్శకాలతో దత్తత
బాపట్ల: జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శిశు గృహంలో ఆశ్రయం పొందుతున్న పాప, బాబును జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ చేతులమీదుగా శనివారం దత్తత ఇచ్చారు. చైన్నెకి చెందిన దత్తత తల్లిదండ్రులకు కారా నూతన మార్గదర్శకాలు అనుసరించి దత్తత ఇచ్చామన్నారు. మిషన్ వాత్సల్య పోర్టల్లో పేరు నమోదు చేసుకుంటే చట్టబద్ధమైన దత్తత ద్వారా పిల్లల్ని ఇస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ అధికారి పి.పురుషోత్తం బాలల సంరక్షణ అధికారి జి.కృష్ణ, రోజిలిన్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్మీడియెట్ పాఠ్యపుస్తకాల పంపిణీ నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా పరిధిలో ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేస్తున్న ఇంటర్మీడియెట్ కళాశాలలకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేపట్టారు. జిల్లా ఇంటర్మీయెట్ విద్యాశాఖాధికారి కార్యాలయంలో శనివారం నుంచి పాఠ్యపుస్తకాల పంపిణీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు అన్ని సబ్జెక్ట్లకు 3,383, సీనియర్ ఇంటర్ విద్యార్థులకు 3,327 పాఠ్యపుస్తకాలను అందచేయనున్నారు. జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ప్రథమ సంవత్సరం 1,016, ద్వితీయ సంవత్సరం 1,030 పుస్తకాలను అందచేయనున్నారు. జెడ్పీ హైస్కూల్స్లో 133 (ప్రథమ), 90 (ద్వితీయ), ఏపీఆర్జేసీ కళాశాలకు 175 (ప్రథమ), 192 (ద్వితీయ), కస్తూర్బా విద్యాలయాలకు 811 (ప్రథమ), 836 (ద్వితీయ) ఏపీ మోడల్ స్కూల్స్లోని ఇంటర్మీయెట్ విద్యార్థులకు 1,248 (ప్రథమ), 1,179 (ద్వితీయ) పుస్తకాలను పింపిణీ చేస్తున్నట్టు జిల్లా ఇంటర్మీయెట్ విద్యాశాఖాధికారి ఎం.నీలావతిదేవి తెలిపారు. సెమీ కండక్టర్ టెక్నాలజీలో శిక్షణకు దరఖాస్తు చేసుకోండి నరసరావుపేట: బెంగళూరులోని ఇండియన్ ఇన్నిస్టిట్యూట్ ఆఫ్ సైన్ ్సకు చెందిన సెంటర్ ఫర్ నానో సైన్స్ అండ్ ఇంజినీరింగ్ సంస్థ ద్వారా గిరిజన విద్యార్థులకు ఇచ్చే సెమీ కండక్టర్ టెక్నాలజీలో శిక్షణకు జిల్లాలోని విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి బి.గోవింద్ నాయక్ శనివారం ఒక ప్రకటన పేర్కొన్నారు. మారుతున్న ఉద్యోగ డిమాండ్లకు అనుగుణంగా విద్యార్థుల కోసం సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్–క్యారెక్టరైజేషన్ శిక్షణ‘ అనే ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. మూడేళ్ల కాలపరిమితి గల ఈ ప్రాజెక్ట్ కింద 1500 మంది గిరిజన విద్యార్థులకు ప్రాథమిక శిక్షణ, 600 మంది గిరిజన విద్యార్థులకు ఉన్నత స్థాయి శిక్షణ అందించడానికి అవకాశం ఉందన్నారు. పౌండేషన్ ప్రోగ్రాం ఆన్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సును ఆన్లైన్ విధానంలో 60గంటలు, అడ్వాన్స్డ్ ప్రోగ్రాం ఆన్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సు ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో 90 గంటలు శిక్షణ ఇస్తారన్నారు. యూజీ ఇంజినీరింగ్, ఎంఎస్సీ, పౌండేషన్ ప్రోగ్రామ్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు శిక్షణ ఇస్తారన్నారు. మరిన్ని వివరాలు కోసం వెబ్పేజ్ లింకును అనుసరించాలన్నారు. స్విమ్మింగ్ రాష్ట్ర జట్టు ఎంపిక పోటీలు నరసరావుపేట ఈస్ట్: ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ ఆక్వాటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం 3వ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ వాటర్ పోలో సెలక్షన్స్– 2026 పోటీలు నిర్వహించారు. పల్నాడు జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ పర్యవేక్షణలో శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల స్విమ్మింగ్ పూల్లో ఈ పోటీలను నిర్వహించారు. పోటీలను కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు కపలవాయి విజయకుమార్, ఏపీ స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి మోహన్ ప్రారంభించారు. రాష్ట్రంలోని 14 జిల్లాల నుంచి 77 మంది స్విమ్మర్లు పోటీలో పాల్గొన్నారు. వీరిలో 55 మంది బాలురు, 22 బాలికలు ఉన్నారు. పోటీలో ప్రతిభ కనపరిచిన క్రీడాకారుల నుంచి 14 మంది చొప్పున బాల బాలికల జట్లు ఎంపిక చేయనున్నారు. ఎంపికై న జట్లు జులై 7 నుంచి 12వ తేది వరకు చైన్నెలో జరగనున్న 79వ సీనియర్ అక్వాటిక్ చాంపియన్షిప్–2026 పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని అసోసియేషన్ కార్యదర్శి మోహన్ తెలిపారు. కార్యక్రమంలో పల్నాడుజిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి వై.వి.సుబ్బారెడ్డి, రాష్ట్ర సీనియర్ కోచ్ నటరాజ్, స్విమ్మింగ్ పూల్ కోచ్ జి.సురేష్ పాల్గొన్నారు. -
మహిళలపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు
చీరాల: మహిళలపై నేరాలకు పాల్పడితే దండన తప్పదని ఎస్పీ బి.ఉమామహేశ్వర్ హెచ్చరించారు. చీరాల కొత్తపేటలోని రావి జయలక్ష్మి, సుబ్బారాయుడు కల్యాణ మండపంలో పోలీస్శాఖ ఆధ్వర్యంలో శనివారం మహిళల భద్రత, సాధికారతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలో మహిళలు, బాలికలపై జరిగే నేరాల విషయంలో జిల్లా పోలీస్శాఖ జీరో టాలరెన్స్ పాలసీని అవలంబిస్తోందని, నిందితులు ఎంతటి ప్రభావశీలులైనా చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేశారు. మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, మహిళా సంబంధిత కేసుల్లో నిర్దేశిత 60 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేసి కోర్టుల్లో చార్జిషీట్ దాఖలు చేయడం తప్పనిసరి చేశామన్నారు. తీవ్రమైన కేసులను ఫాస్ట్ట్రాక్ కోర్టులకు బదిలీ చేసి నిందితులకు అత్యంత వేగంగా కఠిన శిక్షలు పడేలా పోలీస్ యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తోందన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడితే చట్టం నుంచి తప్పించుకోవడం అసాధ్యమన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు మహిళలపై నేరాలకు పాల్పడిన 37 మందికి కోర్టుల ద్వారా జైలు శిక్షలు ఖరారయ్యాయన్నారు. ఇందులో ఆరుగురికి జీవిత ఖైదు, మరో ఐదుగురుకి 20 ఏళ్ల సుదీర్ఘ జైలుశిక్ష, 26 మందికి పదేళ్లు అంత కంటే తక్కువ కాలం జైలుశిక్ష పడేలా పోలీస్ వ్యవస్థ సమర్ధవంతంగా పనిచేసిందన్నారు. లైంగిక దాడులు గృహ హింస, పోక్సో కేసుల్లో నేరస్తులపై శిక్షలు పడేలా చేయడం, నేరాల నియంత్రణ లక్ష్యంగా ఆపరేషన్ దండాయన కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. మహిళలు, బాలికల భద్రత కోసం పోలీస్శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగిందని, ప్రతి మహిళ, విద్యార్థిని స్మార్ట్ ఫోన్లో శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 80 వేలకు పైగా శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకున్నారన్నారు. ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీలు అడిగినా, ప్రైజ్ మనీ పేరుతో బ్యాంకు ఖాతా వివరాలు అడిగినా నమ్మవద్దన్నారు. ఆన్లైన్లో మోసాలకు గురై డబ్బులు పోగొట్టుకుంటే తక్షణమే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నెంబర్కు ఫిర్యాదు చేయాలన్నారు. డిజిటల్ అరెస్ట్ల పేరుతో భయపెడితే మోసపోవద్దని, డిజిటల్ అరెస్ట్ లేదన్నారు. అనంతరం పోలీస్శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ దండాయన పోస్టర్ను ఎస్పీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో చీరాల డీఎస్పీ ఎండీ మొయిన్, సీడీపీఓ ఝాన్సీరాణి, చీరాల సెయింట్ ఆన్స్ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మి, చీరాల మహిళా కాలేజి లెక్చరర్ నీలిమ, గౌతమి కాలేజీ ప్రిన్సిపాల్ రవీంద్ర, పోలీస్ అధికారులు, మహిళలు, విద్యార్థినులు పాల్గొన్నారు. -
ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ సిబ్బందికి సన్మానం
నగరంపాలెం: పోలీస్ శాఖలో ఆరోగ్యంగా ఉద్యోగ విరమణ చేయడమనేది సంతోషకరమని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. ఎస్ఐలు షేక్ సలాం(పెదకాకాని పీఎస్), ఎం.బ్రహ్మయ్య(తెనాలి పీసీఎస్), ఏఎస్ఐలు కె.రాజశేఖర్బాబు(నల్లపాడు పీఎస్), అన్వర్ బాషా(ఎస్బీ), షేక్ సత్తార్(దుగ్గిరాల పీఎస్), రాధాకృష్ణమూర్తి(కాకుమాను పీఎస్), హెడ్కానిస్టేబుళ్లు సీహెచ్ చంద్రశేఖర్రావు(పెదకాకాని పీఎస్), నున్న సాంబశివరావు(నగరంపాలెం పీఎస్), ఏఆర్ హెడ్కానిస్టేబుళ్లు కరిముల్లాఖాన్, ఎస్.వరప్రసాద్రావు ఉద్యోగ విరమణ పొందారు. ఈ మేరకు శనివారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని హాల్లో సత్కరించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పలు స్థాయిల్లో పోలీస్ శాఖకు సేవలందించడం అభినందనీయమని అన్నారు. మిగతా జీవితాన్ని ఆనందంగా జీవించాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీలు జీవీ రమణమూర్తి (పరిపాలన), ఏ హనుమంతు(ఏఆర్), ఎస్బీ డీఎస్పీ అళహరి శ్రీనివాస్, వెల్ఫేర్ ఆర్ఐ సురేష్, జిల్లా పోలీస్ అసోసియేషన్ సభ్యులు లక్ష్మయ్య, కరిముల్లా, హుస్సేన్, మైల సాంబశివరావు, పీఆర్ఓ శ్రీనివాసరావు, పోలీస్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు దళవాయి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
వ్యవసాయాన్ని కాపాడుకుందాం
తాడేపల్లి రూరల్(మంగళగిరి): వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడం ద్వారానే దేశాన్ని రక్షించుకోగలమని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య పేర్కొన్నారు. శనివారం ఉండవల్లిలో రాజధాని రైతు సంఘం 3వ మహాసభ నిర్వహించారు. మహాసభకు అధ్యక్షవర్గంగా ఎస్కే పేరు సాహెబ్, జి.నాగేశ్వరరావు వ్యవహరించారు. తొలుత రైతు సంఘం జెండాను ప్రజాసంఘాల కార్యాలయం ఎదుట టి.బక్కిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో రైతాంగానికి రెట్టింపు ఆదాయం తెస్తామన్న మోదీ, కూటమి ప్రభుత్వం రైతులు ఆత్మహత్యలు చేసుకునే విధానాలకు నెట్టివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువులు వాడకం సగానికి తగ్గించేశారని విమర్శించారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తేనే వ్యవసాయం మనుగడని పేర్కొన్నారు. పొదుపు పేరుతో ఆహార పదార్థాలు, నూనెలు తగ్గించి వాడమంటున్నారని, పాలన చేతకాని ప్రభుత్వాలలే ఇటువంటి విధానాలను అనుసరిస్తున్నాయని విమర్శించారు. దేశంలో తీవ్రంగా ఎరువుల కొరత ఉన్నా ప్రభుత్వాలు సమాధానం చెప్పలేక దాటవేస్తున్నాయని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న ల్యాండ్ బ్యాంక్ విధానం రైతులను భూముల నుంచి వెళ్లగొట్టడానికే అని స్పష్టం చేశారు. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ పేరుతో 65 శాతం మంది ఆధారపడిన వ్యవసాయాన్ని 10 శాతానికి కుదించే ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ అనుసరిస్తున్న విదేశాంగ విధానం వల్ల రూపాయితో డాలర్ విలువ తీవ్రంగా పడిపోయందని విమర్శించారు. అమెరికాలో 10 లక్షల మంది భారతీయులు ఇబ్బంది పడుతుంటే కేంద్రం చోద్యం చూస్తోందని విమర్శించారు. మహాసభలో రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జొన్న శివశంకరరావు, ప్రజా సంఘాల నాయకులు ఎం.రవి, కె.జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. -
పోలీసు సిబ్బందికి సత్కారం
నరసరావుపేట రూరల్: శాంతి భద్రతల పరిరక్షణ కోసం సుదీర్ఘకాలం పోలీసు శాఖలో బాద్యతలు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందుతున్న అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు అభినందించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఉద్యోగ విరమణ పొందుతున్న అధికారులు, సిబ్బంది అభినందన కార్యక్రమం శనివారం నిర్వహించారు. నరసరావుపేట ట్రాఫిక్ పోలీస్స్టేషన్ ఎస్ఐగా పనిచేస్తున్న ఆర్.మంత్రునాయక్, యడ్లపాడు ఏఎస్ఐ ఎస్కె ఇస్మాయిల్, చిలకలూరిపేట ఎస్బీ ఏఎస్ఐ వై.శ్రీనివాసరావు, నరసరావుపేట రూరల్ పోలీస్స్టేషన్ ఏఎస్ఐ జి.వెంకటేశ్వరరావు, జిల్లా డీఏఆర్ ఏఎస్ఐ సిహెచ్ శామ్యూల్, కానిస్టేబుల్ పి.రహమతుల్లా ఖాన్, మాచర్ల హోంగార్డ్ బి.రాజానాయక్లు శనివారం ఉద్యోగ విరమణ పొందారు. వీరిని జిల్లా ఎస్పీ పూలమాలలు, బహుమతులతో సత్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ జీవితంలో, ఉద్యోగంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని సమాజానికి మంచి పోలీసు సేవలు అందించిన మీ సేవలు స్ఫూర్తిగా నిలుస్తాయని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ(అడ్మిన్) జేవీ సంతోష్, అదనపు ఎస్పీ( ఏఆర్) వి.సత్తిరాజు, ఏఆర్ డీఎస్పీ మహాత్మాగాంధీరెడ్డి, హోంగార్డ్ ఆర్ఐ ఎస్.కృష్ణ, వెల్పేర్ ఆర్ఐ ఎల్.గోపినాథ్ పాల్గొన్నారు. -
విద్యుత్ స్తంభాల కింద పడి బాలుడు మృతి
దాచేపల్లి: విద్యుత్ స్తంభాల కింద పడి బాలుడు మృతి చెందిన సంఘటన శనివారం జరిగింది. దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని దుర్గాభవానీ కాలనీలో జరిగిన ఈ ఘటనలో అదే కాలనీకి చెందిన ఆవుల శ్రీను, హనుమమ్మ దంపతుల చిన్న కుమారుడు పవన్ (5)దుర్మరణం చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. పవన్ తన తోటి స్నేహితులతో కలిసి సరదాగా ఆడుతున్నాడు. కాలనీలో నిల్వ చేసిన విద్యుత్ స్తంభాలు ఎక్కి పిల్లలందరూ సరదాగా ఆడుకుంటుండగా పోల్స్ జారి పవన్ మీద పడ్డాయి. పవన్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పవన మృతదేహన్ని చూసిబోరున విలపించారు. పవన్ తండ్రి శ్రీను రెండేళ్ల క్రితం మృతి చెందాడు. పవన్కి అన్న అంజి ఉన్నాడు. కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేసేందుకు స్థానిక నాయకులు చర్చలు జరుపుతున్నారు. -
ఈదురు గాలులకు కూలిన జీవ ధ్వజస్తంభం
నాదెండ్ల: మండలంలోని పలు గ్రామాల్లో గురువారం రాత్రి ఈదురు గాలులకు విద్యుత్స్తంభాలు విరిగిపడటంతో సరఫరా నిలిచింది. సుమారు గంట పాటు భీకరంగా ఈదులు గాలులు వీయటంతో గణపవరం గ్రామంలోని రుక్మిణిసత్యభామ సమేత సంతాన వేణుగోపాలస్వామి ఆలయంలో జీవ ధ్వజస్తంభం విరిగిపడింది. సుమారు 160 ఏళ్ళ క్రితం గ్రామానికి చెందిన అనుమంచి హనుమంతరావు నిర్మించిన ఆలయంలో 1987 సంవత్సరంలో జీవధ్వజ స్తంభం ప్రతిష్ట నిర్వహించారు. 2018 జూన్లో నూతన ధ్వజస్తంభం పునఃప్రతిష్టించారు. అప్పట్లో ధ్వజస్తంభానికి అమర్చిన మానికల నుంచి వర్షపునీరు దిగి ధ్వజస్తంభం మొదలు చచ్చుబడటంతో ఈదురుగాలులకు విరిగిపడింది. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఎదురుగా చెట్టు విరిగి విద్యుత్ స్తంభాలపై పడటంతో తీగలు తెగి ఉదయం వరకూ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నేడు ‘రాష్ట్ర స్థాయి వాటర్ పోలో’ జట్ల ఎంపికలు నరసరావుపేట: పల్నాడు జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం నరసరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కళాశాల స్విమ్మింగ్ పూల్లో ‘3వ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ వాటర్ పోలో సెలెక్షన్స్ నిర్వహించనున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి వైవీ. సుబ్బారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపికల ద్వారా రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించే పురుషుల, మహిళల జట్లను ఎంపిక చేస్తారన్నారు. ఇక్కడ ఎంపికై న జట్లు 2026 జూలై 17 నుండి 24 వరకు గుజరాత్ రాష్ట్రం రాజ్కోట్లోని ‘సరదార్ పటేల్ అక్వాటిక్ కాంప్లెక్స్’లో జరగబోయే ‘78వ సీనియర్ నేషనల్ అక్వాటిక్ ఛాంపియనన్షిప్‘ పోటీలలో పాల్గొంటాయని పేర్కొన్నారు. ఉదయం ఏడు గంటల నుంచి క్రీడాకారుల రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుందని, ఉదయం 7:30 గంటలకు ఎంపిక పోటీలు (ట్రయల్స్) మొదలవుతాయని వెల్లడించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి క్రీడాకారులు ఈ ఎంపికలలో పాల్గొనవచ్చని, అభ్యర్థులు నిర్ణీత సమయానికి వేదికకు చేరుకోవాలని కోరారు. క్రీడాకారుల ప్రతిభను పారదర్శకంగా అంచనా వేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, జిల్లాలో వాటర్ పోలో క్రీడాభివృద్ధికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పిడుగురాళ్ల: వైఎస్సార్ సీపీ నాయకులు స్థలాలు మావని ముందుకు వస్తే దాడులు తప్పవని టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ నాయకులపై దాడికి దిగిన సంఘటన పట్టణంలోని స్వర్ణ పిచ్చయ్య కాలనీలో శుక్రవారం జరిగింది. వైఎస్సార్సీపీ నాయకులు ఓర్సు బ్రహ్మయ్య, ఓర్సు దుర్గారావు, ఓర్సు శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు... పట్టణంలోని స్వర్ణ పిచ్చయ్య కాలనీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తన్నీరు కల్యాణికి రెండు సెంట్ల స్థలాన్ని స్వర్ణ పిచ్చయ్య కాలనీలో పట్టా ఇచ్చారు. ఇప్పుడు ఆ స్థలంలో మున్సిపల్ కార్యాలయానికి చెందిన పొక్లెయినర్ వచ్చి గుంతలు తీస్తుండటంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓర్సు దుర్గారావు, ఓర్సు బ్రహ్మయ్య, ఓర్సు శ్రీనివాసరావులు ఈ స్థలంలో గుంతలు ఎందుకు తీస్తున్నారని ప్రశ్నించటంతో పొక్లెయినర్ గుంతలు తీయటం నిలిపివేసింది. ఇంతలోనే అక్కడే ఉన్న టీడీపీ నాయకులు బుత్తుల శ్రీనివాసరావు, బత్తుల వెంకటేశ్వర్లు, మున్సిపల్ కార్యాలయంలో పని చేసే బత్తుల నాగరాజు, చెన్నయ్యతోపాటు మరికొంత మంది మహిళలు సుమారు 30 మంది దాకా హాజరై దాడికి పాల్పడ్డారు. దాడిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓర్సు బ్రహ్మయ్య, ఓర్సు శ్రీనివాసరావు, ఓర్సు దుర్గారావుకు స్వల్ప గాయాలు అయ్యాయి. వైఎస్సార్సీపీ నాయకులు ఎవరైనా సరే స్థలం వద్దకు వచ్చి తమదేనంటే వారిపై దాడులు చేయటానికి తామంతా సిద్దంగా ఉన్నామని టీడీపీ నాయకులు బహిర్గతంగానే తెలుపుతున్నారు. అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యేనే వైఎస్సార్సీపీ స్థలాలు అక్రమించుకొని తెలిపినట్లుగా టీడీపీ నాయకులు బహిరంగంగా చెప్పి భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం ఉందని, తాము చేసిందే రైట్ అని, అడ్డు ఎవరు చెప్పినా వారిని ఉపేక్షించేది లేదని, భయపెడుతున్నారని, వైఎస్సార్సీపీ నాయకులు పేర్కొన్నారు. -
కాలుష్యం నుంచి కాపాడండి
కొల్లూరు: కాలుష్యం నుంచి తమను కాపాడాలని, లేదంటే ఓటు హకై ్కనా తొలగించాలని జిల్లా కలెక్టర్కు ఓ వ్యక్తి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం కొల్లూరు మండల పరిషత్తు సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ వి. వినోద్ కుమార్ నేతృత్వంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆవులవారిపాలెంకు చెందిన సనకా రవి ఈ మేరకు అర్జీ ఇచ్చారు. అందులో... ఇటుక బట్టీల కారణంగా వెలువడుతున్న కాలుష్యంతో అనారోగ్యం పాలవుతున్నామని వాపోయారు. రహదారుల వెంబడి నిబంధనలకు విరుద్ధంగా బట్టీలు కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు. గతంలోనూ ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరించకుంటే తన ఓటు హక్కు రద్దుకు సిఫార్సు చేయాలని, తాను సైతం ఎలక్షన్ కమిషనర్ను లేఖ ద్వారా ఇదే విషయాన్ని కోరానని పేర్కొన్నారు. ప్రభుత్వ భూములను ప్రయివేటు భూములుగా సర్వే చేయడంపైనా మరో అర్జీ అందజేశారు. శుక్రవారం పీజీఆర్ఎస్లో 78 అర్జీలు అందినట్లు అధికారులు వెల్లడించారు. దేవదాయ శాఖ భూములను ఖాళీ చేయకుండా భట్టిప్రోలు మండలానికి చెందిన వ్యక్తి ఇబ్బందులు సృష్టిస్తున్నాడని ఓ ఫిర్యాదు అందింది. మండల పరిషత్తులకు పీఎంఏజేవై నిధులు కేటాయించి... పనులయ్యాక బిల్లుల సమయంలో వెనక్కు తీసుకోవడంతో ఇబ్బందులు పడుతున్నామని టీడీపీ నాయకులు కలెక్టర్కు అర్జీ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో అధికారులు నిర్లక్ష్య ధోరణి వీడాలన్నారు. క్షేత్ర స్థాయిలోనే సమస్యలు పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, వేమూరు మార్కెట్ యార్డు చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, జెడ్పీ సీఈఓ జ్యోతిబసు, ఎంపీడీఓ అమృతలూరు స్పందన, అధికారులు పాల్గొన్నారు. రికార్డులు పరిశీలన వేమూరు: పీజీఆర్ఎస్ దరఖాస్తులు వెంటనే పరిష్కారం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ అన్నారు. వేమూరు తహసీల్దారు కార్యాలయాన్ని కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీజీఆర్ఎస్ దరఖాస్తులను కలెక్టర్ పరిశీలించారు. కొన్ని రికార్డులు కనిపించడం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీజీఆర్ఎస్ దరఖాస్తుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దారు రవీంద్ర, మండల సర్వేయర్ అలీ, సిబ్బంది పాల్గొన్నారు. – అడ్డగోలుగా ఇటుక బట్టీల నిర్వహణపై జిల్లా కలెక్టర్కు వినతి -
ఒకటి నుంచి ప్రీమియర్ క్రికెట్ టోర్నీ
బాపట్ల: బాపట్ల క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూన్ 1వ తేదీ నుంచి బాపట్ల ప్రీమియం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు అంకమ్మ చౌదరి తెలిపారు. స్థానిక అసోసియేషన్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాపట్ల క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాపట్ల ప్రీమియర్ క్రికెట్ టోర్నమెంట్లు స్థానిక ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన వారికి మొదటి బహుమతి రూ.50వేలు, ద్వితీయ బహుమతి రూ.25వేలు అందించడంతోపాటు మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్కి రూ 5వేలు బహుమతి అందిస్తామని తెలిపారు. ప్రతి మ్యాచ్లో మేన్ ఆఫ్ ది మ్యాచ్కి రూ.1000లతోపాటు మెమోంటో అందిస్తారని తెలిపారు. నాకౌట్ పద్ధతిలో జరిగే ఈ టోర్నమెంట్కి ఆసక్తిగల క్రీడాకారులు తమ పేర్లను 9908950963 నంబర్కు ఫోన్ చేసి నమోదు చేసుకోవాలని సూచించారు. టోర్నమెంట్కి సహాయ సహకారాలు అందిస్తున్న స్పాన్సర్స్ అందరికీ బాపట్ల క్రికెట్ అసోసియేషన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు రోశయ్య, సెక్రటరీ స్టాండ్ విమల్ కుమార్, వైస్ జాయింట్ సెక్రెటరీ నరేష్, ట్రెజరర్ అబ్దుల్ కరీం, క్రీడాభిమానులు మంతెన శ్రీకాంత్ రాజు శ్రీనివాస్ పాల్గొన్నారు. -
మద్దతు ధరలు పెంచాలని నిరసన
పర్చూరు(చినగంజాం): వ్యవసాయ రంగానికి సంబంధించి పెరిగిన పెట్టుబడులకు అనుగుణంగా పంటల మద్దతు ధరలు పెంచాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పీ కొండయ్య డిమాండ్ చేశారు. వ్యవసాయ పంటల మద్దతు ధర నిర్ణయించడంలో కేంద్ర ప్రభుత్వ మోసపూరిత వైఖరిని ఖండిస్తూ పర్చూరు బొమ్మల సెంటర్, నాగులపాలెం అంబేడ్కర్ నగర్, ఉప్పుటూరు చెరువు వద్ద ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ పంటల మద్దతు ధర జీవో కాపీలన దహనం చేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర రూ.2400 ఉండగా కేవలం రూ 10 లు పెంచి రూ 2410, వరికి క్వింటాకు రూ.2441గా నిర్ణయించడం యావత్ భారత దేశ రైతులకు అన్యాయం చేయడమేనని అన్నారు. 13 రకాల పంటలకు అతి తక్కువ ధర నిర్ణయించడం అన్యామని వారన్నారు. ఎరువులు, పురుగు మందుల ధరలు విపరీతంగా పెరిగాయని, సాగు ఖర్చులు పెరిగాయని కానీ అందుకు తగినట్లుగా మద్దతు ధర పెంచలేదని అన్నారు. రైతులు పండించిన పంటలకు పెట్టుబడికి 50 శాతం కలిపి పంటల మద్దతు ధర నిర్ణయించాలన్న నిపుణుల సిఫార్సులను తుంగలో తొక్కి, డాక్టర్ స్వామినాధన్ సిఫార్సులను అమలు చేయకుండా, బడా పెట్టుబడి దారులు అదానీ, అంబానీలకు ఈ దేశ సంపదను దోచి పెట్టడానికి ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఉందని అన్నారు. రైతాంగం పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించకుండా రసాయనికి ఎరువుల ధరలు 50 కిలోల బస్తాపై రూ.100 నుంచి రూ.350 పెంచడం దుర్మార్గమని వారన్నారు. వెంటనే డాక్టర్ స్వామినాథన్ చేసిన సిఫారసులను అమలు చేయాలని, రసాయనిక ఎరువుల ధరలను, డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను తగ్గించాలని, 13 రకాల పంటలకు మద్దతు ధర పెంచాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉప్పుటూరులో రహీం, నాగులపాలెంలో రాజేష్, పర్చూరు బొమ్మల సెంటర్లో ఎం డేవిడ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీ భాస్కరరావు,కామినేని శ్రీనివాసరావు, డేవిడ్, ఏసుబాబు తదితరులతో పాటు స్థానిక రైతులు పాల్గొన్నారు. -
‘పల్మనరి ఎంబాలిజం’కు అత్యవసర చికిత్స
గుంటూరు మెడికల్: రోడ్డు ప్రమాదాలకు గురై అనేక ఎముకలు విరిగిన వారిలోనూ, వివిధ ఎముకలు, కీళ్లు, మెదడు, వెన్నెముక తదితర చికిత్సల అనంతరం కదలికలు లేని వారిలో పల్మనరీ ఎంబాలిజం ప్రాణాంతకంగా పరిణమిస్తున్నదని అమృత హాస్పిటల్స్ మత్తు, ఇంటెన్సివ్ కేర్ వైద్య నిపుణులు డాక్టర్ లక్ష్మీప్రసన్న అన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గుంటూరు శాఖ, ఐఎస్సీసీఎం సంయుక్తంగా జీఎంఏ హాల్లో వైద్యులకు నిరంతర వైద్య విద్యా కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. డాక్టర్ లక్ష్మీప్రసన్న పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గుంటూరు శాఖ అధ్యక్షుడు డాక్టర్ టి.సేవ కుమార్ అధ్యక్షత వహించారు. డాక్టర్ లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ ఐసీయూలో దీర్ఘకాలంగా శారీరక కదలికలు లేని వారిలోనూ, రక్తనాళాలలో రక్తపు గడ్డల(డీప్ వేయిన్ త్రంబోసిస్)తో బాధపడుతున్న వారిలోనూ, ఎముకలు, మెదడు సంబంధం శస్త్రచికిత్సలు చేసిన వారిలో ను పల్మనరీ ఎంబాలిజంను ఎక్కువగా గుర్తించటం జరుగుతుందని చెప్పారు. నిర్ణీత సమయంలో చికిత్స చేయలేకపోతే మరణం తప్పదని వెల్లడించారు. ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అంజత్ ఉప్పుటూరి మాట్లాడుతూ ఊపిరితిత్తులలోని రక్తపు గడ్డల విషయంలో అత్యవసర చికిత్సలవైద్య నిపుణులు ఎంతో నైపుణ్యంతో వ్యవహరించాలని చెప్పారు. న్యూరోసర్జన్ డాక్టర్ హేమంత్ ఉప్పుటూరి మాట్లాడుతూ ప్రమాదాలలో మెదడు గాయాలైనప్పుడు వారి మానసిక ,శారీరక పరిస్థితులను బట్టి రేడియోలాజికల్ పరీక్షలు అవసరమవుతాయన్నారు. ఆర్ధోపెడిక్ సర్జన్ డాక్టర్ మద్ది వినోద్ కుమార్ మాట్లాడుతూ అరుదైన వ్యాధులు సోకినవారు ఎంతో అరుదుగా వైద్యుల్ని ఆశ్రయించినప్పుడు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వక్తలకు ఐఎంఏ గుంటూరు శాఖ అధ్యక్షులు టి.సేవకుమార్, కార్యదర్శి బి.సాయికష్ణ ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఐఎంఏ గుంటూరు శాఖ ఉపాధ్యక్షులు డాక్టర్ శివప్రసాద్, సంయుక్త కార్యదర్శి డాక్టర్ సిహెచ్.శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
అకాల వర్షం... అపార నష్టం
కొల్లూరు: పెనుగాలల ధాటికి ప్రజలు బెంబేలెత్తారు. అర్ధరాత్రి వేళ విరుచుకుపడిన గాలులు.. జోరు వాన కారణంగా కృష్ణా నదీ పరివాహక గ్రామాలు అతలాకుతలమయ్యాయి. గురువారం రాత్రి కన్ను పొడుచుకున్నా కానరాని రీతిలో కురిసిన కుంభవృష్టికి గాలులు తోడయ్యాయి. భీకర మెరుపులు.. చెవులు చిల్లులు పడేలా ఉరుముల తాకిడికి ప్రజలు భయకంపితులయ్యారు. ఈ అకాల వర్షం, పెనుగాలల ధాటికి కృష్ణా పరివాహక లంక గ్రామాలలో వాణిజ్య పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. విద్యుత్తు స్తంభాలు విరిగి పడటంతో గురువారం రాత్రి నుంచి కొల్లూరు మండలంలోని కొల్లూరు, చిలుమూరు, జువ్వలపాలెం, సుగ్గునలంక సబ్స్టేషన్ల పరిధిలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం వాటిల్లింది. రేపల్లె – తెనాలి ప్రధాన మార్గంతోపాటు, ఇతర రహదారులపై భారీ వృక్షాలు కూలిపడటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తాటి, ఇతర చెట్లు విద్యుత్తు లైన్లపై పడటంతో స్తంభాలు అధిక సంఖ్యలో విరిగిపడ్డాయి. గురువారం రాత్రి 10 నుంచి శుక్రవారం సాయంత్రం వరకు సుమారు విద్యుత్తు సరఫరాకు అంతరాయం వాటిల్లింది. సిబ్బంది కూలిన వృక్షాలను తొలగించి మరమ్మతులు చేపట్టారు. అనంతరం విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించారు. వాణిజ్య పంటలకు తీవ్ర నష్టం లంక గ్రామాల పరిధిలో సాగులో ఉన్న వాణిజ్య పంటలకు పెనుగాలుల కారణంగా తీవ్ర నష్టం ఏర్పడింది. మండలంలోని ఈపూరు, చిలుమూరు, చిలుమూరులంక, సుగ్గునలంక, ఈపూరులంక, చింతర్లంక, పెదలంక, పోతార్లంక, తిప్పలకట్ట, జువ్వలపాలెం, కిష్కిందపాలెం, తడికలపూడి గ్రామాల పరిధిలో అరటి పంట తీవ్రంగా దెబ్బతింది. ఉద్యాన శాఖాధికారులు 500 ఎకరాల విస్తీర్ణంలో అరటి పంట దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా వేశారు. పంట నష్ట తీవ్రత వెయ్యి ఎకరాల వరకు ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాణిజ్య పంటలైన తమలపాకు, బొప్పాయిలకు స్వల్ప నష్టం వాటిల్లింది. ఇటుక పరిశ్రమపై సైతం వర్షం ప్రభావం పడింది. పచ్చి ఇటుక తడిసి ముద్దగా మారింది. పెనుగాలుల ధాటికి వాణిజ్య పంటలు దెబ్బతినడంతో రూ. కోట్లలో నష్టం వాటిల్లినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. -
‘విజేతలు‘ నాటికకు బహుమతుల పంట
తెనాలి: సాంఘిక నాటిక పోటీల్లో అద్దేపల్లి– ఆరాధ్యుల ఆర్ట్స్, తెనాలి వారి ‘విజేతలు‘ సాంఘిక నాటిక నాలుగు బహుమతులను గెలుచుకుంది. ఉత్తమ ప్రదర్శనగా జ్యూరీ బహుమతితోపాటు ఉత్తమ బాలనటి (తాడిగిరి ఊహశ్రీ), ఉత్తమ ఆహార్యం(శేషగిరి), ఉత్తమ నటన జ్యూరీ బహుమతి(సాత్విక)ని ఎంపికయ్యారు. పల్నాడు జిల్లా సాతులూరులో ఈనెల 24– 28వ తేదీల్లో ఎన్టీఆర్ కళాపరిషత్ నాటిక పోటీల్లో తెనాలికి చెందిన ప్రముఖ నర్తకి, రచయిత ఆరాధ్యుల తేజస్వి ప్రఖ్య రచించిన ఈ నాటికను అద్దేపల్లి లక్ష్మణశాస్త్రి దర్శకత్వంలో ప్రదర్శించారు. పరిషత్ పోటీల్లో తొలి ప్రదర్శనలోనే నాలుగు బహుమతులను గెలుచుకోవటంపై రచయిత ఆరాధ్యుల తేజస్విప్రఖ్య, పట్టణ కళాకారుల సంఘం మాజీ అధ్యక్షులు సత్యనారాయణ శెట్టి, జానీబాషా, పిట్టు వెంటక కోటేశ్వరరావు, దేవిశెట్టి కోటేశ్వరరావు, హార్మోనిస్ట్ యోహాను, పల్లపాటి ఫ్రాన్సిస్, పౌరాణిక నటుడు పరిశుద్ధరావు తదితరులు విజేతలను అభినందించారు. -
బాపట్ల
శనివారం శ్రీ 30 శ్రీ మే శ్రీ 20267అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో శుక్రవారంనాటికి ప్రస్తుత నిల్వ 32,1710 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 521.70 అడుగులకు చేరింది. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్కి 6,906 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.2,000, గరిష్ట ధర రూ.4,500, మోడల్ ధర రూ.3,000 వరకు పలికింది. 7 -
సారీ.. కమిషనర్
అమృతరావు దాడి ఘటనపై కేంద్ర మంత్రి పెమ్మసాని క్షమాపణ నగరంపాలెం: గుంటూరు నగర కమిషనర్ కార్యాలయంపై టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయపాటి అమృతరావు దాడి ఘటన, అనంతరం ప్రెస్మీట్ నిర్వహించి కమిషనర్పై చేసిన వ్యాఖ్యలపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ క్షమాపణ చెప్పారు. గుంటూరు నగరంలోని బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం సమీపంలోని నార్ల ఆడిటోరియం పునః ప్రారంభ పనులను శుక్రవారం ప్రారంభించారు. అనంతరంసభలో మంత్రి మాట్లాడుతూ... గుంటూరు నగర కమిషనర్ చాలా నిజాయతీ, కష్టపడే వ్యక్తిత్వం ఉన్నవారని చెప్పారు. ఈ నెల 25వ తేదీన గుంటూరు నగర కమిషనర్ కార్యాలయంలో అమృతరావు గొడవ చేశారని, ఆ తర్వాత విలేకర్ల సమావేశంలో కమిషనర్ గురించి మాట్లాడారని గుర్తుచేశారు. కమిషనర్పై ఇలా మాట్లాడితే సమాజంలో మంచి చేయడానికి ఎవరూ మిగలరని అన్నారు. టీడీపీ, జనసేన, భాజపా నాయకులకు ఇబ్బందులుంటే ఎమ్మెల్యే వద్దకు వెళ్లాలని, లేదంటే తన వద్దకు రావాలని సూచించారు. వెంటనే పనులు కాకుంటే కూర్చుని మాట్లాడుకోవాలని చెప్పారు. ఇలా ఆఫీస్లపైకి వెళ్తే ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టం తన పని చేసుకుంటూ వెళ్తుందని అన్నారు. దీనికిగాను నగర కమిషనర్కి బహిరంగ క్షమాపణ చెబుతున్నానని పేర్కొన్నారు. పెమ్మసాని మాట్లాడే సమయంలో ఒక్కసారిగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. -
దోమల నియంత్రణ మనందరి బాధ్యత
గుంటూరు మెడికల్: జూన్లో జరిగే మలేరియా వ్యతిరేక మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం గుంటూరు డీఎంహెచ్ఓ కార్యాలయంలో జిల్లా వ్యాధి నిరోధక అధికారి డాక్టర్ అమర్తలూరి శ్రావణబాబు, జిల్లా మలేరియా అధికారి సుబ్బారాయణం సంయుక్తంగా అనుబంధ శాఖల విభాగాల అధికారులతో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ దోమల నియంత్రణ మనందరి బాధ్యత అని అన్నారు. ప్రపంచ మలేరియా వ్యతిరేక మాసోత్సవాలు జూన్ నెలలో జరుపుకోవాలన్నారు. ప్రజలలో ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించాలన్నారు. నివారణ, నియంత్రణ, చికిత్సకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. క్షేత్రస్థాయిలో ప్రతి శుక్ర వారం డ్రై డే కార్యక్రమాన్ని విజయవంతంగా అమలుచేయాలన్నారు. సమావేశంలో డెప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ అన్నపూర్ణ, ఎన్సీడీ ప్రాజెక్ట్ ఆఫీసర్ డాక్టర్ శ్రీధర్, డెమో బి శివసాంబిరెడ్డి, జిల్లా టాస్క్ఫోర్స్ సభ్యులు పాల్గొన్నారు. -
రైళ్లలో చోరీలు.. వ్యక్తి అరెస్టు
చీరాల రూరల్: రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను చీరాల రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక జీఆర్పీ స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్సై సీహెచ్.కొండయ్య నిందితుని వివరాలు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం హనుమకొండ జిల్లా వడ్డిపల్లి గ్రామానికి చెందిన పల్లపు సాయిప్రియ ఈనెల 25వ తేదీ తన కుటుంబ సభ్యులతో తిరుచానూరు రైల్వే స్టేషన్ నుంచి నాందేడ్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తుండగా రైలు చీరాల రైల్వేస్టేషన్లో ఆగిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమె హ్యాండ్బ్యాగును అపహరించాడు. బ్యాగులో 9 గ్రాముల నల్లపూసల దండ, ఒక సెల్ఫోన్, రూ.1,500 నగదు ఉన్నట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నెల్లూరు డీఎస్పీ మురళీధర్ సూచనలతో ఒంగోలు ఐఆర్పీ ఎస్కే మౌలా షరీఫ్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీ ఫుటేజీలను పరిశీలించారు. నిందితుడు పాత నేరస్తుడు వేటపాలం మండలం కొత్తపేట ప్రసాద్నగర్కు చెందిన పెరికల సందీప్గా గుర్తించారు. చీరాల రైల్వేస్టేషన్లోని ప్లాట్ఫాం నంబర్ 4లో ఉన్న అతడిని అరెస్టు చేసినట్లు ఎస్సై కొండయ్య తెలిపారు. నిందితుని వద్ద నుంచి 9 గ్రాముల బంగారు నల్లపూసల దండ, మూడు సెల్ఫోన్లు రికవరీచేసి రిమాండ్ నిమిత్తం నెల్లూరు రైల్వే కోర్టుకు తరలించినట్లు ఎస్సై చెప్పారు. కొద్ది రోజుల్లోనే కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని కొద్దిరోజుల్లో ఛేదించిన జీఆర్పీ ఎస్సై సీహెచ్. కొండయ్య, పోలీసు సిబ్బందిని నెల్లూరు డీఎస్పీ ఎం.మురళీధర్, ఒంగోలు ఐఆర్పీ మౌలా షరీఫ్ అభినందించారు. నిందితుని నుంచి బంగారు నల్లపూసల దండ, మూడు సెల్ఫోన్లు స్వాధీనం -
భార్యపై దాడి కేసులో నిందితుడి అరెస్టు
కర్లపాలెం: మద్యం తాగి భార్యతో గొడవపడి ఆమె మెడపై కత్తితో నరికిన కేసులో నిందితుడు చింతాయపాలెంకు చెందిన ఇనుముల రమేష్ను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు కర్లపాలెం ఎస్ఐ ఎస్ఐ రవీంద్ర తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి 12రోజులు జ్యూడిషియల్ రిమాండ్ విధించటంతో బాపట్ల సబ్ జైలుకు తరలించారని ఎస్ఐ రవీంద్ర తెలిపారు. స్టాఫ్నర్సుల ఫైనల్ మెరిట్ లిస్టు విడుదల గుంటూరు మెడికల్: ఉమ్మడి గుంటూరు జిల్లా పిడుగురాళ్ల జీజీహెచ్లో 150 కాంట్రాక్టు స్టాఫ్నర్సు పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకున్న వారి ఫైనల్ మెరిట్ లిస్టును శుక్రవారం విడుదల చేసినట్లు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ జి.శోభారాణి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫైనల్ మెరిట్ లిస్టులో క్లరికల్, టైపో గ్రఫికల్, తప్పిదాలు ఏమైనా ఉంటే అభ్యంతరాలు ఉంటే ఈనెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు లిఖిత పూర్వకంగా తెలియజేయాలన్నారు. ఫైనల్ మెరిట్ లిస్టును సీఎఫ్డబ్ల్యూ.ఏపీ.ఎన్ఐసీ.ఇన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు.మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ పాట విడుదల గుంటూరు రూరల్: వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి డాక్టర్ కొమ్మెర్ల శివకుమార్ రచించిన మెగా డీఎస్సీ కాదు–ఇది దగా డీఎస్సీ పాటను వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య శుక్రవారం విడుదల చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిర్వహించిన డీఎస్సీలో చోటుచేసుకున్న అక్రమాలు, అ వ్యవస్థలు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలను ఈ పాటలో ప్రస్తావించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ విద్యార్థి నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కోర్టును ఆశ్రయించిన భూమి యజమాని నాదెండ్ల: నా తండ్రి ద్వారా సంక్రమించిన ఐదెకరాల భూమిని కౌలుకు తీసుకున్న వ్యక్తి ఆక్రమించుకుని తనపై దౌర్జన్యానికి పాల్పడుతున్నాడంటూ ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. బాధిత రైతు చిలకలూరిపేట పట్టణంలో నివాసం ఉండే సిద్ధాబత్తుని కోటేశ్వరరావు మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల కోటాలో నా తండ్రి నరసింహారావుకు 1971లో నాదెండ్ల గ్రామ రెవెన్యూ పరిధిలోని 476–2బి సర్వే నెంబరులో ఐదెకరాల భూమిని ప్రభుత్వం కేటాయించి పట్టా మంజూరు చేసిందన్నారు. కొన్నేళ్లు తామే వ్యవసాయం చేసుకుని పంట పండించి జీవించామన్నారు. తాను డ్రైవర్గా పనిచేస్తూ సుమారు 1990లో పొలాన్ని గ్రామానికి చెందిన బత్తిన కోటేశ్వరరావు అనే వ్యక్తికి కౌలుకు ఇచ్చినట్లు తెలిపాడు. ప్రతి ఏటా కౌలు చెల్లిస్తూ వచ్చిన కోటేశ్వరరావు, కొన్నేళ్ళుగా సదరు పొలం తనదంటూ కౌలు ఇవ్వకుండా తనను, తన కుటుంబంపై దౌర్జన్యానికి పాల్పడుతున్నాడని వాపోయాడు. ఈ విషయమై పలుమార్లు కలెక్టర్ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, చేసేది లేక న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలిపాడు. న్యాయస్థానం తీర్పు వెలువడే వరకూ బత్తిన కోటేశ్వరరావును పొలంలోకి వెళ్ళకుండా అధికారులు అడ్డుకోవాలని కోరాడు. దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం ఒకరు మృతి–పలువురికి గాయాలు నూజెండ్ల: మండల పరిధిలోని బుర్రిపాలెం గ్రామానికి చెందిన పోతుగంటి బాలిశెట్టి (70) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ప్రకాశం జిల్లా మేడపి సమీపంలో గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల మేరకు.. బాలిశెట్టి తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం వెళ్లి వస్తుండగా మేడపి సమీపంలో కారు అదుపు తప్పి పక్కనే ఉన్న గుంతలోకి దూసుకెళ్ళింది. ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలు కాగా వారిని ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో బాలిశెట్టి మార్గంమధ్యలో మృతి చెందాడు. ఈయనకు భార్య సుబ్బమ్మ ఆరుగురు ఆడపిల్లలు ఉన్నారు. ఆయన భౌతిక కాయాన్ని గ్రామానికి తరలించగా శుక్రవారం జరిగిన అంత్యక్రియల్లో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాలిశెట్టి గ్రామంలో 22 సంవత్సరాలుగా ప్రభుత్వ రేషన్ దుకాణం నిర్వహిస్తూ వివాదరహితుడిగా పేరు తెచ్చుకొన్నారు. నాలుగు కేసుల్లో నిందితుడికి శిక్ష పిడుగురాళ్ల: నాలుగు కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తికి శిక్ష పడినట్లు పిడుగురాళ్ల పట్టణ సీఐ శ్రీరాం వెంకట్రావు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...మాచర్ల పట్టణానికి చెందిన అడిగే మనీ పవన్కుమార్ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి వాటిలోని రాగి(కాపర్) వైర్ చుట్టలను దొంగలించిన కేసులో కోర్టు శిక్ష విధించినట్లు తెలిపారు. పిడుగురాళ్ల పట్టణంలో రెండు కేసులు, మాచరవరం పోలీస్ స్టేషన్లో ఒక కేసు, మాచర్ల పట్టణంలో ఒక కేసులు నమోదయ్యాయి. పిడుగురాళ్ల కోర్టు పరిధిలోని కేసును న్యాయమూర్తి టి. ప్రవల్లిక విచారణ చేసి ఆరు నెలల సాధారణ జైలు శిక్షతోపాటు రూ. 1000 చొప్పున అపరాధ రుసుం విధించారు. అపరాధ రుసుం చెల్లించని పక్షంలో అదనంగా 15 రోజుల జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించినట్లు సీఐ తెలిపారు. -
మెగా పేరిట దగా డీఎస్సీ
నిరుద్యోగులను నట్టేట ముంచేసిన చంద్రబాబు సర్కార్ బాపట్ల: నిరుద్యోగులను మోసం చేస్తూ కూటమి సర్కారు నిర్వహించిన దగా డీఎస్సీపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున డిమాండ్ చేశారు. దగా డీఎస్సీలో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టాలని కోరుతూ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు యల్లావుల సోహిత్యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి రథంబజారు మీదుగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సర్కిల్ వరకు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున మాట్లాడుతూ కూటమి సర్కారు వచ్చాక అన్ని రంగాలను నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. విద్యార్థులు, నిరుద్యోగుల మెడకు ఊరితాడు బిగించినట్లు వ్యవహరించారని ఆయన పేర్కొన్నారు. ఎంతో బాధ్యత కలిగిన డీఎస్సీ ప్రశ్నపత్రాల తయారీ బాధ్యతను కాంట్రాక్టు ఉద్యోగికి అప్పగించటం, విమర్శలు వచ్చిన వెంటనే ఆయనను అక్కడి నుంచి తప్పించటం చూస్తుంటే అక్రమాలు ఎలా జరిగాయో అర్థం అవుతోందన్నారు. ఒక పక్క కనీసం పరీక్షలు రాసిన వారికి ర్యాంకింగ్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందన్నారు. వారు చేసిన అవినీతి ఎక్కడ బయటపడుతుందోనని తప్పులమీద తప్పులు చేశారని మేరుగ నాగార్జున పేర్కొన్నారు. వీటిపై సీబీఐతోగానీ, సిట్టింగ్ జడ్జితోగానీ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల ద్రోహి చంద్రబాబు డీఎస్సీ నిర్వహణ, నిరుద్యోగులకు భృతి ఇవ్వకపోవటం చూస్తుంటే నిరుద్యోగుల పాలిట ద్రోహిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారని మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పేర్కొన్నారు. నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెప్పటంతోపాటు వలంటీర్లుకు రూ.10 వేలు ఇస్తామని నాలుగు లక్షల మందిని తొలగించిన రోడ్డున పడేసిన చరిత్ర చంద్రబాబుకే దక్కిందన్నారు. 65 సంవత్సరాలకు ఉన్న పెన్షను అర్హతను వైఎస్సార్సీపీ అధినేత, నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తగ్గించి 60 సంవత్సరాలకు ఇచ్చారన్నారు. 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పి మాట తప్పిన చంద్రబాబు ఇప్పుడు అర్హులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులు డీఎస్సీపై ఆశలు పెట్టుకుంటే అందులోనూ వారికి సంబంధించిన వారికే పోస్టులు దక్కేలా కుట్రలు చేసి మరోసారీ తన నైజాన్ని నిరూపించుకున్నారని పేర్కొన్నారు. బాపట్లతోపాటు రాష్ట్రంలోని మెడికల్ కళాశాలల పనులు నిలిచిపోవటం, అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆగిపోవటంతో ప్రజలు ఈ నీచ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ఎదురుచూస్తున్నారని కోన చెప్పారు. వైఎస్సార్సీపీ సర్కారు ఏర్పాటు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం డీఎస్సీలో అక్రమాలకు పాల్పడటం సరికాదని, ఈ విషయంలో విద్యార్థి విభాగం తమ సత్తా చూపుతుందని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు యల్లావుల సోహిత్యాదవ్ పేర్కొన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేలా నిరుద్యోగులు, విద్యార్థి లోకాన్ని మభ్యపెట్టాలనే ప్రయత్నాలు ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం చేస్తోందన్నారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలు వెలికితీయాల్సిందని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో భాగంగా డాక్టరు బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసిన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పట్టణ, మండల అధ్యక్షులు కాగిత సుధీర్బాబు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కొక్కిలిగడ్డ చెంచయ్య, ఎల్లావుల ఏడుకొండలు, చల్లా రామయ్య, రాష్ట్ర విద్యార్థి విభాగం కమిటీ జనరల్ సెక్రటరీ షేక్ పర్వేజ్, వడ్డిముక్కల రవితేజ, అడే చందు, మాచవరపు రవి, ఉరబిండి గోపి, గోసాల అశోక్, ప్రశాంత్రెడ్డి, పేర్తీ రిషివర్మ తదితరులు పాల్గొన్నారు. -
భట్టిప్రోలులో గాలివాన బీభత్సం
దెబ్బతిన్న పంటలు భట్టిప్రోలు: ఇప్పటివరకు ఎండలు తీవ్రంగా ఉన్న వాతావరణంలో అనూహ్య మార్పులతో గురువారం రాత్రి సంభవించిన ఆకస్మిక గాలులకు భట్టిప్రోలు మండలంలోని కృష్ణా నది పరివాహక లంక గ్రామాల్లోని వాణిజ్య పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఒక్కసారిగా వీచిన గాలులకు అరటి తోటలు నేలవాలాయి. పక్వానికి వచ్చిన అరటి గెలలు రాలిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. కల్లాల్లో ఆరబోసిన పసుపు పంట తడిసిపోయింది. మొక్కజొన్న కూడా వర్షానికి దెబ్బతింది. ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన ప్రభావంతో మండలంలోని గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. గురువారం రాత్రి 10:30 నుంచి శుక్రవారం 10:30 గంటల వరకు సరఫరాకు విఘాతం కలిగింది. -
సమైక్యతావాది గాదె వెంకటరెడ్డి
బాపట్ల: సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానంలో ఒక బలమైన నాయకుడిగా ఎదిగారు మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి. ఎన్నో సవాళ్లకు ఎదురొడ్డి పోరాడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీనియర్ రాజకీయవేత్తగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. హైదరాబాద్లో శుక్రవారం గాదె వెంకటరెడ్డి మృతి చెందారు. ఎప్పుడూ సమైక్యత వాదాన్ని వినిపిస్తూ ఒక సమైక్యతావాదిగా ఆయన వాసికెక్కారు. బాపట్లలో 2013 మే నెలలో ప్రథమాంధ్ర మహాసభల శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తెలుగు భాషా వికాసం కోసం ఆనాడు జరిగిన పోరాట స్ఫూర్తిని నేటి తరానికి తెలియజేయాలనే ఒక మహా సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని గాదె వెంకటరెడ్డి దిగ్విజయంగా నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో కీలక పాత్ర పోషించారు. నైతిక విలువలకు కట్టుబడి తన జీవితం మొత్తం ప్రజాసేవకే అంకితమై, రాజకీయ రంగాన పునరంకితమై పనిచేసిన అరుదైన అగ్ర నాయకుల్లో గాదె వెంకటరెడ్డి ఒకరిని చెప్పటం ఏమాత్రం అతిశయోక్తి కాదు. పర్చూరు నియోజకవర్గంతోపాటు బాపట్ల ప్రాంతాభివృద్ధికి విశేష కృషి చేశారు. ఈప్రాంతంలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి అంటే ఇది అని చేసి చూపిన గాదె వెంకటరెడ్డిని ఈప్రాంత ప్రజలు ఎప్పటికి స్థిరస్థాయిలో గుర్తిండిపోతారు. గాదె మృతికి కోన సంతాపం మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి మృతికి మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సంతాపం తెలిపారు. రాజకీయంగా ఎన్నో మెట్లు ఎక్కిన గాదె భావితరాలకు ఆదర్శమని గుర్తు చేసుకున్నారు. సంతాపం తెలిపిన వారిలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు మోదుగుల బసవపున్నారెడ్డి, చేజర్ల నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్ధన్రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ నరాలశెట్టి ప్రకాశరరావు, మాజీ కౌన్సిలర్ షేక్.సయ్యద్ పీర్ ఉన్నారు. -
ఉత్తమ ప్రదర్శన ‘చెరిగిపోని చిరునామా’
నాదెండ్ల: సాతులూరు గ్రామంలో ఈ నెల 24 నుండి 28 వరకూ జరిగిన నాలగవ జాతీయ స్థాయి నాటికల పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. నటరత్న ఎన్టీఆర్ కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో కళాకారులు పాల్గొన్నారు. గురువారం రాత్రి విజేతలకు బహుమతులు అందించారు. ఉత్తమ ప్రదర్శనగా విజయవాడ హర్షా క్రియేషన్స్ ‘చెరిగిపోని చిరునామా’ నాటిక ఎంపికై ంది. పొన్నూరు శ్రీ విశ్వకళా చైతన్య వేదిక ‘సూక్తం’ నాటికకు ద్వితీయ స్థానం, ఏలూరు హేలాపురి కల్చలర్ అసోసియేషన్ ‘అనగనగా ఒక రాత్రి’ నాటికకు తృతీయ స్థానం దక్కింది. ఉత్తమ ప్రోత్సాహక నాటికగా హైదరాబాద్ స్వర్ణసూ ర్య డ్రామా లవర్స్ ‘శ్రీమాత్రే నమః’, ఉత్తమ హాస్య నాటికగా యడ్లపాడు మానవతా క్రియేషన్స్ ‘బావా ఎప్పుడు వచ్చితివి’ పురస్కారాలు అందుకున్నాయి. ఉత్తమ దర్శకుడిగా ‘సూక్తం’ నాటిక దర్శకుడు జీవీ మనోహర్, ఉత్తమ రచయితగా ‘మలిసంధ్య’ నాటిక రచయిత గోవిందరాజుల నాగేశ్వరరావు, ఉత్తమ నటుడిగా ‘చెరిగిపోని చిరునామా’ నాటికలో సుబ్బారావు క్యారెక్టర్ ధరించిన కట్టా శ్యామ్ప్రసాద్, ఉత్తమనటిగా ‘చెరిగిపోని చిరునామా’నాటికలో సావిత్రి పాత్ర పోషించిన అమృతవర్షిణి, ద్వితీయ ఉత్తమ నటుడిగా ‘అనగనగా ఒకరాత్రి’ నాటికలో ఎమ్మెల్యే పాత్ర ధరించిన విజయ్కుమార్, ద్వితీయ ఉత్తమనటిగా ‘సీ్త్రమాత్రేనమః’ నాటికలో శ్వేత పాత్ర ధరించిన సురభీప్రియాంక, ఉత్తమ క్యారెక్టర్ నటుడిగా ‘సీ్త్రమాత్రేనమః’ నాటికలో సత్యానంద పాత్రధారుడు ఉదయ్ భాగవతుల, ఉత్తమ క్యారెక్టర్ నటిగా ‘అనగనగా ఒక రాత్రి’ నాటికలో కీలా పాత్రధారిణి వై భవాని, ఉత్తమ ప్రతినాయకుడిగా ‘చెరిగిపోని చిరునామా’ నాటిక లో రఘురామ్ ప్రాతధారి భాగ్యరాజ్, ఉత్తమ హాస్యనటుడిగా ‘బావా ఎప్పుడు వచ్చితివి’ నాటికలో సుబ్బారావు పాత్రధారి ముత్తవరపు సురేష్బాబు, ఉత్తమ హాస్యనటిగా ‘బావా ఎప్పుడు వచ్చితివి’నాటికలో సుబ్బలక్ష్మి పాత్ర పోషించిన లహరి, ఉత్తమ బాల నటిగా ‘విజేతలు’ నాటికలోని నాగప్రభ పాత్రధారిణి ఉహాశ్రీ పురస్కారాలు అందుకున్నారు. ఉత్తమ సంగీతం వై సాయితేజ, ఉత్తమ ఆహార్యం పి శేషగిరి, ఉత్తమ రంగాలంకరణ అనిల్, శ్రీకర్, జ్యూరీ–1 సాత్విక, జ్యూరీ–2 శొంఠినేని శ్రీనివాసరావు అందుకున్నారు. విజేతలకు పరిషత్ నిర్వాహకులు బండారుపల్లి సత్యనారాయణ, నడింపల్లి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా నగదు, మెమోంటో అందించారు. -
మ్యాజిక్ డ్రెయిన్ పరిశీలన
ప్రత్తిపాడు: ప్రత్తిపాడు మండలం బొర్రావారిపాలెంలో ఉపాధి హామీ నిధులతో నిర్మించిన మ్యాజిక్ డ్రెయిన్ను శుక్రవారం ఏపీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ కృష్ణతేజ, రాజ్యసభ సభ్యుడు సి.విజయేంద్రప్రసాద్లు పరిశీలిచారు. జిల్లా, స్థానిక అధికారులతో కలిసి గ్రామంలో పర్యటించిన వారు మ్యాజిక్ డ్రెయిన్ పనితీరు, మురుగు ఇంకే విధానం స్వయంగా అధ్యయనం చేశారు. నిర్మాణానికి ఎంత ఖర్చు అయ్యింది, నిర్మాణానికి రా మెటీరియల్ ఏమేమి ఎంత మొత్తంలో వినియోగించారు, పనితీరు ఎలా ఉంది అనే అంశాలను ఎన్ఆర్ఈజీఎస్ ఏపీవో ఏడుకొండలును అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడారు. మ్యాజిక్ డ్రెయిన్ వలన ఉపయోగాలేమైనా ఉన్నాయా, గతంలో మురుగు పారుదలకు, ఇప్పుడు మ్యాజిక్ డ్రెయిన్తో మురుగు ఇంకుతున్న తీరుకు ఏమైనా తేడా గమనించారా అని ప్రశ్నించారు. గతంలో మురుగు సక్రమగా తియ్యక, పారుదల లేక రోజుల తరబడి నిలిచి దోమల ఉధృతి అధికంగా ఉండేదని, కానీ ఇప్పుడు ఈ డ్రెయిన్ నిర్మాణంతో మురుగు అంతా ఇంకిపోతుందని మహిళలు తెలిపారు. డ్వామా పీడీ వి.శంకర్, జెడ్పీ సీఈవో జ్యోతిబసు, డీవీవో హనుమతంరావు, ఎంపీడీవో కె.శివపార్వతి, ఏపీవో ఏడుకొండలు తదితరులున్నారు. స్వచ్ఛరథాన్ని సద్వినియోగం చేసుకోవాలి పెదకాకాని: ప్రభుత్వం పారిశుధ్య నిర్వహణను ప్రోత్సహించడానికి స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యం సాధించడానికి స్వచ్ఛరథం కార్యక్రమం నిర్వహిస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ మైలవరపు కృష్ణతేజ అన్నారు. మండల పరిధిలోని అనుమర్లపూడి గ్రామంలో శుక్రవారం స్వచ్ఛ రథం పనితీరును పరిశీలించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు విజయేంద్రప్రసాద్, జెడ్పీ సీఈఓ జ్యోతిబసు, డీపీఓ నాగసాయి కుమార్, ఎంపీడీఓ రమావత్ శ్రీనివాసరావు, ఈఓపీఆర్డీ కెల్లంపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు వెస్ట్ (క్రీడలు): చైనాలో ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించిన సబ్ జూనియర్, జూనియర్ పవర్ లిఫ్టింగ్ ఏషియన్ ఎక్విప్డ్ చాంపియన్షిప్లో పతకాలు సాధించిన క్రీడాకారులను కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ అభినందించారు. గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతానికి చెందిన క్రీడాకారులు జూనియర్ విభాగంలో ఇ.లక్ష్మి వినయశ్రీ, మదిన షారూను బ్రాంజ్ పతకాలు, సబ్ జూనియర్ కేటగిరీలో బి.లిఖిత బ్రాంజ్ మెడల్ సాధించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో కలెక్టర్ సి.ఎం.సాయి కాంత్ వర్మను క్రీడాకారులు మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ వారితో ముచ్చటించి సాధన, పోటీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ పి.అఫ్రోజ్ ఖాన్, కోచ్ సాయి రేవతి పాల్గొన్నారు. పెదకాకాని: పెదకాకాని మండల పరిధిలోని తక్కెళ్లపాడు గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన లలితా పీవీఎస్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి జూన్ 3వ తేదీన సీఎం నారా చంద్రబాబునాయుడు ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో భద్రత, బందోబస్తు, ఇతర సమన్వయ ఏర్పాట్లను గుంటూరు జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్లు శుక్రవారం పరిశీలించారు. ఆసుపత్రి ఆవరణ, భవన అంతస్తులను సందర్శించారు. ఆసుపత్రి ప్రారంభోత్సవం వద్ద నుంచి సీఎం సందర్శించే ప్రాంతాలు, వేదిక ఏర్పాట్లు, వీవీఐపీల రాకపోకల మార్గాలు, ప్రజల రాకపోకలు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించారు. సీసీ కెమెరాలు, ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాటుపై చర్చించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, అదనపు ఎస్పీ ఏటీవీ రవికుమార్, ఆర్డీఓ శ్రీనివాసరావు, పెదకాకాని సీఐ టీపీ నారాయణస్వామి, ఆయా శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
జీజీహెచ్లో అత్యాధునిక వైద్యం
మాతా–శిశు సూపర్ స్పెషాల్టీ బ్లాక్లో గురువారం ప్రారంభమైన శస్త్ర చికిత్సలు గుంటూరు మెడికల్:రాష్ట్రంలోనే తొలిసారిగా గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి లో ఒకే భవనంలో మహిళలు, గర్భిణులు, శిశువులు, పిల్లల కోసం అత్యాధునిక సౌకర్యాలతో ఉచిత వైద్య సేవలు, శస్త్ర చికిత్సలు గురువారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా రూ.127 కోట్ల వ్యయంతో 600 పడకలతో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో డాక్టర్ కానూరి–జింఖానా ’మాతా శిశు సంరక్షణ సూపర్ స్పెషాల్టీ బ్లాక్ ’లో మహిళల మాతృత్వానికి సంబంధించిన అత్యంత క్లిష్టతరమైన శస్త్ర చికిత్సల కోసం సిద్ధం చేసిన ఏడు ఆపరేషన్ థియేటర్లు గురువారం నుంచి అందుబాటులోకి వచ్చినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ తెలిపారు. తొలి రోజు (గురువారం)) రెండు ఆపరేషన్లు జరిగాయని, ఇవి కాకుండా శిశువులు, పిల్లల కోసం ప్రత్యేకంగా మూడు ఆపరేషన్ థియేటర్లు సిద్ధం చేశామన్నారు. ఎక్విప్మెంట్స్ పనితీరు గమనించడం పూర్తి కావడంతో అత్యాధునిక సౌకర్యాల మధ్య శస్త్ర చికిత్సలు మొదలయ్యాయి. శిశు సంరక్షణలో కీలకంగా వ్యవహరించే ‘టోటల్ బాడీ కూలింగ్’, హై ప్రీక్వెన్సీ వెంటిలేటర్లు వంటి అత్యాధునిక సదుపాయలు ఈ బ్లాక్ లో కల్పించారు. ఐదు అంతస్తుల్లో 600 పడకల్లో 300 గైనిక్, 120 నవజాత శిశువులు, 12 ఏళ్లలోపు కలిగిన చిన్నారుల కోసం 180 చొప్పున పడకలు కేటాయించారు. నిర్మాణాలకు రూ.100 కోట్లను జింఖానా వారు వ్యయం చేయగా మిగిలిన రూ. 27 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ ఎస్ వి రమణ వెల్లడించారు. ఏడుగురు గైనిక్ ప్రొఫెసర్లు,ఆరుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు, 18 అసిస్టెంట్ ప్రొఫెసర్లు పనిచేస్తున్నారు. 60 మంది పీజీలు, ముగ్గురు సీనియర్ రెసిడెంట్స్ ప్రస్తుతం గైనిక్ విధుల్లో ఉన్నారని తెలిపారు. అత్యవసర చికిత్సలో భాగంగా శిశువులు నిమిషానికి 120 సార్లు గాలి పీల్చుకునే విధంగా హై ప్రిక్వెన్సీ వెంటిలేటర్లు 10 వరకు సూపర్ స్పెషాల్టీ బ్లాక్ లో ఉన్నాయి. గర్భంలో ఉన్నప్పుడు పేగులో చేరే వ్యర్థం ద్వారా శ్వాశ పీల్చుకునేందుకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ’నైట్రిక్ ఆకై ్సడ్’ (వాయువు) సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని పీడియాట్రిక్ విభాగం హెచ్ఓడీ దేవకుమార్ తెలిపారు. -
ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్
వ్యవసాయ కళాశాల ఇన్చార్జి డీన్ డాక్టర్ చంద్రశేఖర్ బాపట్ల: తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయి, తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అయిన నందమూరి తారక రామారావు కేవలం సినీనటుడిగానే కాకుండా ప్రజల సంక్షేమాన్ని కాంక్షించిన మహోన్నత నాయకుడిగా చరిత్రలో నిలిచారని వ్యవసాయ కళాశాల ఇన్చార్జి డీన్ డాక్టర్ కె.చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ 104వ జయంతి వేడుకలు గురువారం కళాశాలలో నిర్వహించారు. డాక్టర్ కె.చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ తన జీవితమంతా క్రమశిక్షణ, సేవాభావం, ఆత్మవిశ్వాసం అనే విలువలను పాటించారని, సినీరంగంలో ఎన్నో అపూర్వ విజయా లను సాధించి తెలుగు కళాసౌందర్యాన్ని ప్రపంచానికి పరిచయం చేశారని గుర్తు చేశారు.ఎన్టీఆర్ రాజకీయ రంగంలో ప్రవేశించిన తర్వాత ముఖ్యమంత్రిగా తెలు గు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడటమే తన లక్ష్యంగా ముందుకు సాగారని, ప్రజల కోసం నిజాయితీగా పనిచేస్తే ఎంతటి విజయాలనైనా సాధించవచ్చని ఆయన జీవితం గొప్ప సందేశాన్ని అందించిందన్నారు. ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రాం అధికారి డాక్టర్ బి.రవీంద్రరెడ్డి మాట్లాడుతూ సమాజమే నా దేవాలయం, ప్రజలే నా దేవుళ్లు అనే నినాదంతో పేద ప్రజానీకానికి రెండు రూపాయలకే కిలో బియ్యం, మహిళలకు ఆస్తిలో సమాన హక్కును కల్పించడం వంటి అనేక పథకాలను అమలు చేసి ఎన్టీఆర్ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. సంస్కృతి సంప్రదాయాలను గౌరవించడం ఆయన నేర్పిన ముఖ్యమైన విలువలని, ఆయన సేవా భావాన్ని ఆదర్శంగా తీసుకొని వ్యవసాయ విద్యార్థులు నిజాయితీ, నిబద్ధతతో ముందుకు సాగారని తెలిపారు. డాక్టర్ టి. మధుమతి, డాక్టర్ కె.సుశీల, డాక్టర్ మురళీధర్ నాయక్, డాక్టర్ ఎన్.కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మాటలు కట్టిపెట్రో..!
బాపట్లశుక్రవారం శ్రీ 29 శ్రీ మే శ్రీ 2026నాడు ధరలపై వ్యంగ్యం.. నేడు మౌనం తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో గురువారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.2,000, గరిష్ట ధర రూ.4,300, మోడల్ ధర రూ.3,000 వరకు పలికింది.అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,1710 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు.చీరాల అర్బన్: పెట్రో భారం పేద మధ్య తరగతి వర్గాల వారిని తీవ్ర ఆందోళనలోకి.. పేదరికంలోకి నెట్టే కాలం ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరల భారం ఎలా తగ్గించాలా, జనంపై కొంతైన భారం తగ్గించాలని ఆయా రాష్ట్రాలు చూస్తుంటే.. రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం ఇంధనంపై అదనపు పన్నులు వేస్తూ, ప్రజలపై అ‘ధన’పు భారం మోపుతోంది. ఎన్నికల వేళ సెల్ఫీలు.. ఎన్నికల వేళ నారా లోకేష్ పెట్రోలు బంకుల వద్ద సెల్ఫీలు తీసుకుంటూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై నిందలు మోపాడు. అధికారంలోకి రాగానే పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తామని ఊదరగొట్టాడు. అందుకు చంద్రబాబు తందాన అన్నారు. అయితే గత 20 రోజుల వ్యవధిలో 4 సార్లు ఇంధన ధరలు పెరిగితే మాత్రం ముఖం చాటేశారు. లీటరుకు సుమారు రూ.8 వరకు అదనపు భారం మోపారు. దేశంలోనే పెట్రోలు, డీజిల్ పై అత్యధిక పన్ను వసూలు చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రాకు గుర్తింపు తెచ్చారు. జిల్లాలో రోజుకు రూ.30 లక్షల అదనపు భారం జిల్లాలో సుమారు 130 పెట్రోలు, డీజిల్ బంకు లున్నాయి. వాహనాల సంఖ్య ఆధారంగా రవాణాకు సంబంధించి రోజుకు రు.1.4లక్షల లీటర్ల పెట్రోలు, 2.3లక్షల లీటర్లు డీజిల్ వినియోగం జరుగుతుందని అంచనా. వ్యవసాయం, ఆక్వా సాగు, పర్యాటకం, వస్త్ర వ్యాపారం తదితరాలతో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 216, 167ఏ జాతీయ రహదారులపై రాకపోకలు సాగించే వాహనాలతో వినియోగం గణనీయంగా ఉంటుంది. ఈ క్రమంలో సగటును రోజుకు 3.7లక్షల ఇంధన వినియోగం జరిరుగుతుంది. లీటరుపై రూ.8లు పెంపుతో రోజుకు సుమారు రూ.30లక్షల అదనపు భారం పడుతుంది. ఇంధన ధరల్లో ఏపీనే టాప్..! దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యాట్తో పాటు రూ.1 రోడ్డు డెవలప్మెంట్ సెస్ కింద వసూలు చేస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో, అదేవిధంగా కాకినాడకు కూతవేటు దూరంలో ఉన్న యానాంలో కూడా మనకన్నా తక్కువ ధరకే ఇంధనం దొరుకుతుండగా.. ఇక్కడ మాత్రం చంద్రబాబు సర్కార్ అదనపు పన్నులు మోపుతూ.. జనంపై మోయలేని భారం వేస్తోంది. ● భక్తిశ్రద్ధలతో బక్రీద్ త్యాగం, భగవంతునిపై విశ్వాసం, విధేయత, దానం, మానవత్వానికి ప్రతీకగా జరుపుకొనే బ్రకీదు పండుగను జిల్లాలో గురువారం ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకొన్నారు. ఆయా చోట్ల ఈద్గాలు, మసీదుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత పెద్దలు బక్రీదు సందేశం అందించారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. – రేపల్లె 7 -
వడదెబ్బకు గుర్తు తెలియని వ్యక్తి మృతి
తాడేపల్లి రూరల్: మంగళగిరి రూరల్ పరిధిలోని చినకాకాని హాయ్లాండ్ వద్ద గుర్తు తెలియని మృతదేహం ఉందని మంగళగిరి రూరల్ పోలీసులకు స్థానికులు గురువారం సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి వెళ్లిని రూరల్ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ మృతదేహాన్ని పరిశీలించారు. ఎటువంటి వివరాలు లభించలేదు. బహుశా వడదెబ్బవల్ల మృతి చెంది ఉంటాడని భావిస్తున్నట్లు తెలిపారు. మృతుడి శరీరంపై సిమెంట్ కలర్, నలుపురంగు గీతలు కలిగిన ప్యాంటు, తెలుపు, ఆకుపచ్చ గళ్ల చొక్క, గెడ్డం ఉన్నాయని, మృతుడి వయస్సు సుమారు 30–35 ఉండవచ్చని పేర్కొన్నారు. ఈ మృతదేహాన్ని ఎవరైనా గుర్తిస్తే మంగళగిరి రూరల్ పోలీసులను సంప్రదించాలని కోరారు. -
అభయమేది... బాబూ?
పట్నంబజారు: హైదరాబాద్కు చెందిన ఒక మహిళ గత కొద్ది రోజుల క్రితం ఆర్టీసీ బస్టాండ్కు వచ్చారు. అక్కడ ఆమె ఆటో ఎక్కిన తరువాత ఆటో డ్రైవర్ దుర్బుద్ధితో ఆమైపె అత్యాచారయత్నానికి ఒడిగట్టడంతో పాటు ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలు దోచుకుపోయాడు. ఇప్పటివరకు ఆ కేసు ఏమైందో కూడా పోలీసులు మాత్రం చెప్పటం లేదు. అంతకుముందు కొన్నాళ్ల క్రితం ఒక యువతిని నలుగురు తాగుబోతులు ఆటోలో ఎక్కించుకుని మణిపురం ఓవర్ బ్రిడ్జి వద్దే ఆమెను ఇబ్బందులకు గురి చేశారు. ఆ సమయాల్లో వారికి అండగా నిలిచేందుకు ఏ ఒక్క పరికరం అందుబాటులో లేకుండా పోయింది. అభాగ్యులకు అండగా.. ఇటువంటి పరిస్థితుల్లో బాధితులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకుని అత్యంత ప్రాధాన్యత కలిగిన పథకం ‘‘అభయం’’ ప్రాజెక్టు. అర్ధరాత్రి, ఇతర ఆపత్కర పరిస్థితుల్లోనైనా.. డ్రైవర్ రాంగ్ రూట్లో తీసుకుని వెళ్లినా.. వెంటనే బాధితులకు అండగా నిలవాలన్నదే అభయం ఉద్దేశం. మహిళలు, యువతులు, విద్యార్థినులకు సంబంధించి ఏదైనా సమస్య ఎదురైతే వారికి క్షణాల వ్యవధిలో రక్షణ కలిగించేలా రెండున్నర సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. ఈ మహోన్నత కార్యక్రమానికి చేయూతనిస్తూ.. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో, ముఖ్యంగా అర్ధరాత్రి పూట తిరిగే ఆటోల్లో అభయం మిషన్ ఏర్పాటుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. క్యూఆర్ స్కానింగ్లోనే వివరాలు... అభయం ప్రాజెక్టు కింద ఆటోల్లో పరికరం బిగించే సమయంలో ఇంజిన్కు కనెక్షన్ ఇస్తారు. దీంతో జీపీఎస్ ట్రాకింగ్తోపాటు, ప్యానిక్ బటన్ ఉంటాయి. ప్రయాణికులు ఆటో ఎక్కే ముందు ఫోన్లో ప్లే స్టోర్ ద్వారా అభయం యాప్ ఇన్స్టాల్ చేసుకుని, ఆటోపై ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే.. ఆటో నంబర్, డ్రైవర్ ఫొటో, అతని పేరు, సెల్నెంబర్లు అందులో వచ్చేస్తాయి. త్వదారా అసలు ఆటోలో ఉన్న వ్యక్తి సంబంధిత వ్యక్తా? వేరే వారా? అనే నిర్ధారించుకోవచ్చు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో... అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ట్రాకింగ్ పరికరాన్ని ఆటోల్లో అమర్చుతారు. వాహనానికి క్యూఆర్ కోడ్ ఇస్తారు. వాహనాన్ని స్టార్ట్ చేసే సమయంలో డ్రైవర్ తనకు జారీ చేసిన స్మార్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఐఓటీ డివైజ్ వద్ద ట్యాప్ చేయగానే డ్రైవర్ వివరాలన్నీ అభయ పరికరంలో నిక్షిప్తమవుతాయి. ఆటో ఎక్కిన తరువాత దారి తెలియని ప్రయాణికులు వారు ప్రయాణిస్తున్న వివరాలను సన్నిహితులకు పంపటం ద్వారా ఎటు వెళుతున్నారో తెలుస్తుంది. నమోదు చేసిన రూ ట్లు కాకుండా వేరే రూటుకు వెళ్లినా.. డ్రైవర్ ప్రవర్తన సరి లేకపోయినా.. పరికరంలోని ప్యానిక్ బటన్ నొక్కగానే.. సెకన్ల వ్యవధిలో కమాండ్ కంట్రోల్ రూమ్కు సమాచారం వెళుతుంది. జీపీఎస్ లోకేషన్ ట్రాకింగ్ ద్వారా బాధితులను రక్షించే అవకాశం ఉంటుంది. కాంట్రాక్ట్ ఆపేసి... చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత అభయం ప్రాజెక్టు సంబంధించిన కాంట్రాక్ట్లను రద్దు చేసిందని తెలుస్తోంది. విద్యార్థినులకు, మహిళలకు రక్షణ కల్పించే ఇలాంటి ప్రాజెక్టును కనీసం పట్టించుకోవటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు కాంట్రాక్ట్ సంగతి దేవుడికెరుక.. ఇప్పుడున్న రవాణాశాఖ అధికారులకు ఈ పథకం గురించి కూడా అవగాహన లేదంటే ప్రభుత్వ పనితీకు అద్దం పడుతోంది. ఇప్పటికై నా మహిళలు, విద్యార్థినులు, యువతులకు భద్రత కోసం చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాలో మొత్తం 40వేలకుపైగా ఆటోలు ఉన్నాయి. వాటిలో 20 వేల ఆటోలకు అభయం మిషన్లు ఏర్పాటు చేయాలని అప్పటి సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ మిషన్ల ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ క్రమంలో జిల్లాలో అప్పుడు అధికారులు నెలల వ్యవధిలో 2 వేలకుపైగా మిషన్లు ఏర్పాటు చేశారు. తొలుత గుంటూరు, వైజాగ్, విజయవాడ వంటి ముఖ్య ప్రాంతాల్లో ప్రారంభించారు. ఆ ప్రక్రియ పూర్తిగా సఫలం కావటంతో ప్రతి ఆటోలో బిగించేలా దృష్టి సారించారు. అనంతరం ఎన్నికలు రావటంతో ఆ అభయం ప్రాజెక్టుకు బ్రేకులు పడ్డాయి. అనంతరం చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత అసలు ఆ విషయాన్నే గాలికి వదలేసింది. రాష్ట్ర ప్రభుత్వ చేతకాని విధానాలతో ప్రాజెక్ట్ కొండెక్కింది. -
లిఫ్టర్లకు మంత్రి మనోహర్ అభినందన
తెనాలి: చైనాలో ఇటీవల జరిగిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్లో పతకాలను సాధించిన స్థానిక కేవీకే స్పోర్ట్స్ అకాడమీ విద్యార్థులను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అభినందించారు. గురువారం స్పోర్ట్స్ అకాడమీని సందర్శించిన మంత్రి, అంతర్జాతీయ పతకాలను సాధించిన ఈఎల్ వినయశ్రీ, ఎం.షానూన్ను అభినందించారు. క్రీడల్లో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. అకాడమీ కోచ్లు ఘట్టమనేని సాయి రేవతి, శివరామకిరణ్ రాజులు క్రీడాకారిణుల ప్రతిభను, సాధించిన విజయాలను మంత్రికి వివరించారు. సత్తెనపల్లి: విత్తన దుకాణదారులు ప్రతి దుకాణంలోనూ ధరల పట్టిక, విత్తన నిల్వల వివరాలు ప్రదర్శించాలని జిల్లా వ్యవసాయాధికారి ఎం.జగ్గారావు చెప్పారు. పట్టణంలోని పలు విత్తన దుకాణాలను ఆయన గురువారం తనిఖీ చేశారు. విత్తన డీలర్లు రైతులకు తప్పకుండా విత్తన అమ్మకాల బిల్లులు ఇవ్వాలని సూచించారు. ప్రతి రైతు లైసెన్స్ ఉన్న విత్తన అధీకృత డీలర్ నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. రసీదు పంట విత్తన కాలం మొత్తం తమ వద్ద ఉంచుకోవాలని తెలిపారు. నకిలీ పత్తి విత్తనాలు, గ్లైసిల్ బీటీ పత్తి విత్తనాలు కొనుగోలు చేయవద్దని సూచించారు. గ్రామాలలో గుడ్డ సంచుల్లో, ప్యాకింగ్ లేని విత్తనాలు అమ్మకాలు జరిపినట్లయితే సమచారం వ్యవసాయశాఖ అఽధికారులకు తెలియజేయాలన్నారు. తనిఖీల్లో సత్తెనపల్లి సబ్డివిజన్ సహాయ వ్యవసాయసంచాలకులు బి.రవిబాబు, సత్తెనపల్లి మండల విద్యాశాఖాధికారి బి.సుబ్బారెడ్డి పాల్గొన్నారు. యడ్లపాడు: చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచిన చారిత్రక కొండవీడు కోటపై మరో అరుదైన, ఆధ్యాత్మిక ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోటపై దాదాపు 700 ఏళ్ల క్రితం నిర్మితమై, కాలగర్భంలో కలిసిపోతున్న పురాతన షాహీ జుమ్మా మసీదులో ఈ శుక్రవారం సామూహిక జుమ్మా నమాజ్ నిర్వహించనున్నట్లు గుంటూరు నౌ అవర్ హిస్టరీ సంస్థ అధ్యక్షులు, మసీదు అభివృద్ధి కమిటీ ప్రతినిధి సూఫీ ఇమ్రాన్ వెల్లడించారు. ఒకప్పుడు రాజుల కాలంలో వైభవంగా వెలిగిన ఈ మసీదుకు పూర్వ వైభవాన్ని తీసుకురావడంతో పాటు, దీని చారిత్రక ప్రాధాన్యతను భావి తరాలకు అందించడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో అరబిక్ విభాగంలో పీహెచ్డీ పూర్తి చేసిన ప్రముఖ పండితులు డాక్టర్ మొహమ్మద్ ఇస్తాక్ నద్వీ ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో గురువారం దాత డాక్టర్ తాతినేని గోపాలరావు రూ.30 లక్షల విరాళంతో నూతనంగా నిర్మించిన మెడికల్ రికార్డు విభాగాన్ని (ఎంఆర్డీ) ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వీ రమణ గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారం టీచింగ్ ఆస్పత్రిలో ఎంఆర్డీ ఎంతో కీలకమని చెప్పారు. జనన మరణాల సర్టిఫికెట్లు మంజూరు విషయంలో ఎంఆర్డీ విభాగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. మెడికల్ రికార్డు ఆఫీసర్ కందిమళ్ల రామారావు, జింఖానా కోఆర్డినేటర్ డాక్టర్ వెనిగళ్ల బాలభాస్కరరావు, నాట్కో క్యాన్సర్ సెంటర్ కోఆర్డినేటర్ యడ్లపాటి అశోక్కుమార్, అడ్మినిస్ట్రేటర్ బచ్చు ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయస్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఎంపిక
ఐలవరం(భట్టిప్రోలు): జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు భట్టిప్రోలు మండలం ఐలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. బాపట్లలో జనవరి తొమ్మిది నుంచి 11వ తేదీ వరకు జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయిలో వి.హరికృష్ణ, ఎం.రోహిత్ నాగసాయి మణికంఠ, పి.విజయ్కుమార్రెడ్డి, సీహెచ్ డోలా పూర్ణచంద్ దినేష్ విశేష ప్రతిభ కనబరచి శుక్రవారం నుంచి ఈనెల 31వ తేదీ వరకు మార్టూరులో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యరు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న నలుగురు విద్యార్థులకు ఉత్తమ శిక్షణ ఇచ్చిన ఫిజికల్ డైరెక్టర్ తుమ్మా శ్రీనివాసరెడ్డి, హైస్కూల్ హెచ్ఎం ఎం. మోహన్రావు, ప్రస్తుత ఇన్చార్జి హెచ్ఎం చిలుకోటి తాండవకృష్ణ, ఫిజికల్ డైరెక్టర్ బాబు, గ్రామ మాజీ సర్పంచ్ మాచర్ల కోటేశ్వరరావు, ఉపాధ్యాయులు అభినందించారు. -
వైఎస్సార్ సీపీ రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాల్లో పలువురు నియామకం
సత్తెనపల్లి: పట్టణంలోని రంగా కాలనీ17వ లైన్ చివర వ్యవసాయ పొలాల్లో రైల్వే ట్రాక్ నుంచి 100 మీటర్ల దూరంలో గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యమైనట్లు పట్టణ సీఐ మల్లికార్జునరావు గురువారం తెలిపారు. మృతుడు వయసు సుమారు 25 సంవత్సరాలు ఉంటాయని, వంటిపై డాలర్బిగ్బాస్ కంపెనీ ఫుల్ అండర్ వేర్ ధరించి ఉన్నాడని, కుడి చేతి భుజముపై లవ్ సింబల్ పచ్చబొట్టు ఉందని తెలిపారు. ఎత్తు 5.5 అడుగులు, చామనఛాయ రంగుతో ఉన్నాడన్నారు. ముక్కు నుంచి రక్తం వచ్చినట్లుగా ఉందని, నిన్న మధ్యాహ్నం నుంచి అక్కడే ఉండి, మద్యంమత్తులో చనిపోయినట్లుగా అనిపిస్తుందన్నారు. ఆనవాలు గుర్తిస్తే పట్టణ పోలీస్స్టేషన్లో సంప్రదించాలని కోరారు. శావల్యాపురం: తాగునీటి అవసరాల నిమిత్తం సాగర్ జలాలు విడుదల చేస్తున్నట్లు లింగగుంట్ల ఎన్నెస్పీ ఈఈ డివి సుబ్బారావు గురువారం తెలిపారు. ఈఈ సుబ్బారావు మాట్లాడుతూ ఈనెల 30న శావల్యాపురం మండలం గంటావారిపాలెం గ్రామ సమీపాన ఉన్న అద్దంకి బ్రాంచ్ కెనాల్కు 1000 క్యూసెక్కుల సాగర్ జలాలు తాగునీరు అవసరాల కోసం విడుదల అవుతాయన్నారు. పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల పరిధిలోని మంచినీరు చెరువులు, వాగులు, కుంటలు నింపుకునేలా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రస్తుతం మాచర్ల పరిధిలో బొగ్గువాగు నింపుతున్నట్లు తెలిపారు. మండలంలోని తాగునీటి చెరువులను సాగర్ చెరువులను ఎన్నెస్పీ, పంచాయతీ కార్యదర్శులు, ఆర్డబ్ల్యూఎస్ అధికారుల పర్యవేక్షణలో నూరు శాతం నింపటానికి చర్యలు చేపట్టామన్నారు. సాగర్ జలాలు వృథా చేయరాదని, ఇతర అవసరాలకు వినియోగించరాదన్నారు. రొంపిచర్ల: భువనేశ్వర్లో నిర్వహిస్తున్న నేషనల్ బాలికల సబ్ జూనియర్ బేస్బాల్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ జట్టు నాలుగో స్థానం దక్కించుకుందని రొంపిచర్ల జెడ్పీహెచ్ఎస్ వ్యాయామ ఉపాధ్యాయుడు వై సైదయ్య తెలిపారు. గురువారం జరిగిన సెమీఫైనల్స్లో మహారాష్ట్ర–ఆంధ్ర జట్ల మధ్య నిర్వహించిన మ్యాచ్లో మొదటి ఐదు ఇన్నింగ్స్లో 1–1 స్కోర్తో ఆట డ్రా అయింది. అదనంగా ఆడిన ఆరవ ఇన్నింగ్స్లో మహారాష్ట్ర జట్టు ఆంధ్రప్రదేశ్ జట్టును 2–1 తేడాతో ఓడించి మహారాష్ట్ర జట్టు ఫైనల్కు చేరుకుంది. భువనేశ్వర్లో జరుగుతున్న నేషనల్ బాలికల సబ్ జూనియర్ బేస్బాల్ టోర్నమెంట్లో దేశం మొత్తం మీద 26 రాష్ట్రాల జట్టు పాల్గొన్నాయి. -
‘స్థానిక’ ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధం
తాడికొండ: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమని గుంటూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు మల్లికార్జునపేట 5వ లైన్లోని పార్టీ తాడికొండ నియోజకవర్గ కార్యాలయం వేదికగా ఎమ్మెల్సీలు, గుంటూరు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల సమన్వయకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులకు అండగా ఉండి ప్రతి ఒక్కరినీ గెలిపించి తీరాలనే లక్ష్యంతో పనిచేయాలన్నారు. తెలుగుదేశం పార్టీ వైఫల్యాలే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయానికి బాటలు వేయనున్నాయని, అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి బూత్ ఏజెంట్ల ఎంపిక, ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్ అన్ని అంశాలపై పట్టున్న నాయకులు, కార్యకర్తలను గుర్తించి, బలపరచాలన్నారు. టీడీపీ ప్రభుత్వానికి మేకపోతు గాంభీర్యం తప్ప ఎన్నికల్లో పోటీచేసి గెలిచే సత్తా లేదన్నారు. తొలుత మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. కార్యక్రమాంలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు, చంద్రగిరి ఏసురత్నం, గుంటూరు పార్లమెంటు జిల్లా పరిశీలకులు పోతిన మహేష్, నియోజకవర్గాల సమన్వయకర్తలు వనమా బాల వజ్రబాబు, నూరి ఫాతిమా, అంబటి మురళీకృష్ణ, దొంతిరెడ్డి వేమారెడ్డి, అన్నాబత్తుని శివకుమార్, బలసాని కిరణ్కుమార్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
వెంకటేశ్వరరావుది ముమ్మాటికీ టీడీపీ హత్యే
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, నియోజకవర్గ ఇన్చార్జ్ బలసాని గుంటూరు రూరల్: కారంపూడిపాడుకు చెందిన సందు వెంకటేశ్వరరావుది కేవలం టీడీపీ నాయకులు చేసిన హత్యేనని కావాలని పింఛన్ నిలిపివేసి అతనికి వైద్యం అందకుండా చేసి టీడీపీ నాయకులు హత్య చేశారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటిరాంబాబు, ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జి బలసాని కిరణ్కుమార్లు ధ్వజమెత్తారు. గురువారం వట్టిచెరుకూరు మండలం కారంపూడిపాడు గ్రామంలో సందు వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించి సంఘటన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంబటి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి అనుకూలం కాదని కక్షగట్టిన నాయకులు వెంకటేశ్వరరావుతోపాటు మరో ఇద్దరు దివ్యాంగులకు, ఒక డయాలసిస్ పేషెంట్కు, ఇద్దరు వృద్ధులకు పింఛను తొలగించాలని ఫిర్యాదు చేయగా రెండు నెలలుగా పింఛన్ నిలిపేశారన్నారు. టీడీపీ కుట్రకు నిండు ప్రాణం బలి మృతుడు వెంకటేశ్వరరావు తల్లి వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కొడుకును బతికించుకునేందుకు స్థానికంగా ఉన్న రైస్మిల్లులో రోజువారీ కూలీగా పనిచేసేదన్నారు. వచ్చిన కొద్దిపాటి నగదుతో కొడుకును, కుటుంబాన్ని పోషించుకునేందని తెలిపారు. వెంకటేశ్వరరావుకు 2018 నుంచి డయాలసిస్కోసం పింఛన్ మంజూరై పింఛన్ వస్తూ ఉండేదని తెలిపారు. ఆ వచ్చే పింఛన్తో వైద్యం చేయించుకుంటూ ఉండేవాడన్నారు. 2019లో తనకు రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్నాయని వైద్యులు తెలిపారని, అప్పటినుంచి క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకుంటూ బతుకుతున్నాడన్నారు. రెండు నెలలుగా పింఛన్ నిలిపివేయటంతో కనీసం చార్జీలకు కూడా డబ్బులేక ప్రభుత్వాసుపత్రిలో సమయానికి డయాలసిస్ చేయక ప్రాణాలు కోల్పోయాడన్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుడనే ఒకే ఒక్క కారణంతో స్థానిక టీడీపీ సర్పంచ్ చేసిన కుట్రకు ఒక నిండు ప్రాణం బలైందన్నారు. టీడీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు తిరిగి అతని ప్రాణాలు తీసుకురాగలరా? అని ప్రశ్నించారు. టీడీపీ అధికార దాహానికి ఎందరి ప్రాణాలు బలితీసుకుంటారని ప్రశ్నించారు. బతిమాలినా కనికరించలేదు.. నియోజకవర్గం ఇన్చార్జ్ బలసాని కిరణ్కుమార్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు ఓట్లు వేయరనే అనుమానంతో కారంపూడి గ్రామ టీడీపీ నాయకుడు టి. శ్రీనివాసరావు, కొండపల్లి అంకమ్మరావు, సంధు కష్ణయ్య, సంధు వెంకటేశ్వరరావు, తోటకూర రామారావు, మాదాసు సాంబయ్య, కొండపల్లి వెంకటసుబ్బారావులు మృతుడు వెంకటేశ్వరరావు అక్రమంగా పింఛను పొందుతున్నాడని గతనెల 29న ఎంపీడీఓకు ఫిర్యాదు చేశారన్నారు. వెంకటేశ్వరరావు బంధువులు టీడీపీ నాయకుడు శ్రీనివాసరావు వద్దకు వెళ్లి కిడ్నీలు పాడైపోయి ఇబ్బందులు పడుతున్న విషయం చెప్పి బతిమాలినా కనికరం చూపలేదన్నారు. కావాలని టీడీపీ నాయకులు చేసిన కుట్రకు ఒక నిరుపేద కుటుంబం నేడు రోడ్డున పడిందన్నారు. వెంకటేశ్వరరావు మృతికి కారణమైన తెలుగుదేశం పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అక్రమంగా ఫిర్యాదు చేసి పింఛన్ నిలిపేసిన ఆరుగురికి పింఛన్ మళ్లీ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. -
సంక్షోభంలో పాడి పరిశ్రమ
వ్యవసాయం, పాడిపరిశ్రమ రైతులకు రెండు కళ్లు. అయితే ప్రస్తుతం వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెరిగి, పంటకు గిట్టుబాటు ధరలు లేక రైతులు నష్టాలు చవి చూస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా రైతులు పాడిపశువుల పోషణ ద్వారా తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ప్రస్తుతం పాడిపరిశ్రమ కూడా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. రైతుల వద్ద నుంచి డెయిరీ యజమానులు లీటర్ పాలను రూ.60కి కొనుగోలు చేసి బహిరంగ మార్కెట్లో వెన్నశాతం పేరుతో రూ.80 నుంచి రూ.90 వరకు విక్రయిస్తున్నారు. గణనీయంగా పశుగ్రాసం, దాణా ధరలు పెరిగినా పాడి రైతులను ఆదుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదు. చీరాల టౌన్: బాపట జిల్లాలోని చీరాల, బాపట్ల, పర్చూరు, రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లో 2024లో నిర్వహించిన 21వ పశుగణన ప్రకారం ఆవులు 21,930, గేదెలు 3,81,764, గొర్రెలు 2,49,394, మేకలు 30,691 ఉన్నాయి. ఏడాదికి జిల్లాలో 51.60 కోట్ల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఏడాదికి నాలుగు విధాలుగా పాల ఉత్పత్తిని లెక్కిస్తారు. ఎండాకాలంలో మాత్రం పాల దిగుబడి చాలా వరకు తగ్గిపోయింది. పశువులకు సరైన దాణా, గడ్డి అందుబాటులో లేకపోవడంతో పాల ఉత్పత్తి పడిపోయింది. చీరాల మండలంలోని 15 గ్రామ పంచాయితీల్లో రోజుకు దాదాపు 56 వేల లీటర్ల పాలు సేకరిస్తున్నారు. గతంలో రోజుకు లక్ష లీటర్లపైగా పాల దిగుబడులు వచ్చేది. ప్రస్తుతం పశుపోషణ చేయలేక రైతులు పశువులను అమ్ముకుంటున్నారు. దీంతో పాల దిగుబడి గణనీయంగా పడిపోయింది. పశుగ్రాసం, దాణా ధరలు చుక్కల్లో.. పశుపోషణకు ప్రధాన ఆధారమైన ఎండు గ్రాసం, దాణా ధరలు చుక్కలను అంటుతున్నాయి. దీనికి ప్రధాన కారణం యంత్రాల సహాయంతో వరిపైర్లు కోసి వేయటంతో గడ్డి పనికిరాకుండా పోతోంది. దీంతో ఉన్న కొద్దిపాటి ఎండు వరిగడ్డి ఎకరా ట్రాక్టర్ బాడుగతో కలిపి దూరాన్ని బట్టి రూ. 20 వేల నుంచి రూ.25 వేలు పలుకుతోంది. అంత ధర పెట్టి పశుపోషకులు ఎకరాల లెక్కన గడ్డి కొనుగోలు చేయలేక చిల్లరగా రోజువారీగా ఒకటి రెండు మోపులు తెచ్చుకుని పశువులను పోషించుకుంటున్నారు. ఒక ఎండుగడ్డి మోపు రూ.150 వరకు ధర పలుకుతోంది. పశువులకు వరిగడ్డితోపాటు తవుడు, పిట్టు వంటి రోజువారీ దాణాలు తప్పనిసరిగా పెట్టాలి. మార్కెట్లో బియ్యంతోపాటు తవుడు రేటు కిలో రూ.40 నుంచి రూ.50 వరకు పలుకుతుంది. అదే రీతిలో పశువులకు వేసే వివిధ రకాల దాణా రేట్లు చుక్కల్లో ఉన్నాయి. ఎండల తీవ్రతకు తగ్గిన ఉత్పత్తి ఒక వైపు ఎండ తీవ్రత పెరగడం, పచ్చిమేత లేకపోవడంతో పశువుల్లో పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. రోజుకు 6 లీటర్లు ఇచ్చే గేదె ప్రస్తుతం 4 లీటర్లకు మించి ఇవ్వటంలేదు. దీంతో పశుపోషకులు ఇబ్బందులు పడుతున్నారు. బాపట్ల జిల్లాలోని రేపల్లె, వేమూరు లంక గ్రామాలు, బాపట్ల మండలంలోని కంకటపాలెం, నర్సాయపాలెం, చెరుకూరు, కారంచేడు తదితర మండలాలలో వరి పండించే గ్రామాల నుంచి ట్రాక్టర్లలో రైతులు వరి గడ్డిని కొనుగోలు చేస్తున్నారు. వెన్న శాతం పేరుతో మోసం.. రైతు తమ పశువులను ఎంతో కష్టపడి పోషించుకుంటూ వాటి ద్వారా వచ్చే పాలను దగ్గరలో ఉండే కేంద్రాలకు విక్రయిస్తుంటారు. పాలకేంద్రాల నిర్వాహకులు మాత్రం రైతు ఇచ్చిన పాలకు వెన్నశాతం ఆధారంగా ధర నిర్ణయిస్తారు. నిర్వాహకులు ప్రకటించిన వెన్నశాతం ఆధారంగా రైతులు తెచ్చిన పాలను కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన యంత్రం సహాయంతో శాతం నిర్ణయిస్తారు. వెన్నశాతం 5 వచ్చిన పాలకు ఒక ధర, 8 శాతం వస్తే మరో ధర, 10 శాతం వస్తే ఇంకో ధర నిర్ణయించారు. కేంద్రాలకు పాలు తెచ్చిన వారిలో ఎక్కువ మందికి 5–7 శాతం వరకే తమ వెన్నశాతం మిషన్ ద్వారా ధరలు నిర్ణయించి ఇస్తుంటారు. కేవలం కొద్దిమందికి మాత్రం 8 నుంచి 9 శాతం వేస్తుంటారు. బహిరంగ మార్కెట్లో భారీగా... రైతుల దగ్గర పాల కేంద్రాల ద్వారా సేకరించిన పాలకు లీటర్ రూ.80 నుంచి రూ.90 వరకు విక్రయిస్తున్నారు. అవే పాలు రైతుల వద్ద కేంద్రాల్లో కేవలం రూ.50 నుంచి రూ.60 కే కొనుగోలు చేస్తున్నారు. ఆ పాలల్లో వెన్న తీసుకుని మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. పాల డెయిరీలు మార్కెట్లో పాల ప్యాకెట్లను చిల్లర వ్యాపారులకు విక్రయిస్తుంటారు. ఆ చిల్లర దుకాణదారులు వినియోగదారులకు విక్రయిస్తుంటారు. ఇక్కడా వినియోగదారుడికే టోపీ పెడతున్నారు. ఆరుగాలం కష్టపడి పశువులకు పోషించే రైతుకు మాత్రం పాల ధరలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. దళారులుగా వ్యవహరించే పాల డెయిరీలు, చిల్లర వ్యాపారులు మాత్రం రైతులు తెచ్చే పాలపై వ్యాపారం నిర్వహించి లాభాలు గడిస్తున్నారు. రైతులు వ్యవసాయంలోనే కాక పాడిపరిశ్రమలోనూ దగా పడిపోతున్నారు. -
ఇంటర్ విద్యార్థులకు ఉపకారవేతనాలు
అమరావతి: వాతావరణంలో అధిక ఉష్ణోగ్రతలతో విద్యుత్ సరఫరాలో ఉత్పన్నమయ్యే సాంకేతిక సమస్యల పరిష్కారం కోసం రాయపూడి సీఆర్డీఏ విద్యుత్ ప్రాంగణంలో కాల్సెంటర్ను ఏర్పాటు చేశామని సీఆర్డీఏ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ చిరుమామిళ్ల వెంకటేశ్వరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 24 గంటలు పని చేసే విధంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. క్యాపిటల్ డివిజన్ పరిధిలోని తుళ్లూరు, తాడికొండ, అమరావతి, పెదకూరపాడు మండలాల వినియోగదారులు 1912 టోల్ప్రీ నంబర్కుగాని 9490615518 నంబరుగాని ఫోన్చేసి సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకోవాలని కోరారు. శాంతియుత వాతావరణంలో బక్రీద్ నిర్వహించాలినగరంపాలెం: బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో నిర్వర్తించుకోవాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. త్యాగానికి, సహనానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ను శాంతి, సామరస్య వాతావరణంలో చేసుకోవాలని అన్నారు. జిల్లాలోని ప్రధాన మసీదులు, మదరసాలు, ఈద్గాల వద్ద ప్రత్యేక బందోబస్త్ కొనసాగుతుందని అన్నారు. సున్నితమైన ప్రాంతాలపై నిఘా ఉంటుందని అన్నారు. సామాజిక మాధ్యమాలపై ప్రత్యేక దృష్టిసారించామని చెప్పారు. ప్రార్థనా స్థలాలు, రద్దీ కూడళ్లల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ వివరించారు. భట్టిప్రోలు: బాపట్ల జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్కు సంబంధించిన ఎన్నికలు ఈ నెల 31వ తేదీన నిర్వహించాల్సి ఉండగా... జూన్ 19 తేదీకి వాయిదా వేస్తున్నట్లు కార్యవర్గం పేర్కొంది. ఎండ తీవ్రత, వడగాల్పులను దృష్టిలో ఉంచుకుని క్రీడాకారులు, సభ్యుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్, ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరగనున్నట్లు నిర్వాహకుడు పాలాటి హనుమంతరావు తెలిపారు. -
‘ఉల్లాస్ –అక్షర ఆంధ్ర’ను విజయవంతం చేయాలి
బాపట్ల: ‘ఉల్లాస్– అక్షర ఆంధ్ర‘ కార్యక్రమాన్ని ఈ విద్యా సంవత్సరంలో సమర్థంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. ఉల్లాస్ జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం బుధవారం స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించారు. తొలి విడతగా గత ఏడాది ప్రారంభించిన ‘ఉల్లాస్– అక్షర ఆంధ్ర‘ కార్యక్రమం జయప్రదంగా నిర్వహించినట్లు గుర్తు చేవారు. గతేడాదిలో 62,286 మంది వయోజనులకు అక్షరాభ్యాసం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించిందన్నారు. 66,023 మంది వయోజనులు పరీక్షలలో ఉత్తీర్ణులై అక్షరాస్యులుగా మారారని చెప్పారు. బాపట్ల జిల్లా 99.60 శాతం పురోగతి సాధించినట్లు వివరించారు. మంచి పురోగతి సాధించడంపై సంబంధిత అనుబంధ శాఖల అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. నిరక్షరాస్యులైన వయోజనులు చదవడం, రాయడం, ప్రాథమిక గణితం, డిజిటల్ అక్షరాస్యత, ఆర్థిక అక్షరాస్యత, జీవన నైపుణ్యాలు వృద్ధి చేయడమే అక్షరాంధ్ర కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, సామాజిక భవనాలు, గ్రామ, వార్డు అభ్యాస కేంద్రాలలో ఈ తరగతులు నిర్వహించాలని కోరారు. ప్రణాళికబద్ధంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తే సులువుగా అక్షరాస్యత పెంచవచ్చన్నారు. అక్షరాస్యత సాధన దిశగా అధికారులు చిత్త శుద్ధితో పనిచేయాలని కలెక్టర్ అన్నారు. 2026–27 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలో 25 లక్షల మందిని అక్షరాస్యులను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించిందన్నారు. అందులో భాగంగా బాపట్ల జిల్లాలో 63,550 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ సూచించారు. పాండురంగాపురం రోడ్డు విస్తరణ పర్యాటక ప్రాంతమైన బాపట్ల– పాండురంగాపురం బీచ్ ఆర్ అండ్ బీ రహదారి విస్తరణ పనులు త్వరగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. వివిధ శాఖల ద్వారా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరుపై జిల్లా కలెక్టర్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ● చీరాలలో ప్రాంతీయ ప్రభుత్వ వైద్యశాలను త్వరగా నిర్మించి, వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ చెప్పారు. భవన నిర్మాణాల్లో జరుగుతున్న జాప్యంపై ఆయన ఆరా తీశారు. ఏపీఎంఐడీసీ ఇంజినీరింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆటిజం సెంటర్, భవిత సెంటర్ త్వరగా పూర్తిచేయాలన్నారు. ● ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం బాపట్ల తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. 2002 ఓటర్ల జాబితాలో నమోదైన ఓటర్లను గుర్తించి, 2025 ఓటర్ల జాబితాలో ఉన్న వారిని మ్యాపింగ్ చేయాలని సూచించారు. సమీక్షలో బాపట్ల ఆర్డీఓ గ్లోరియా, తహసీల్దార్ సలీమా, కర్లపాలెం తహసీల్దార్ కె.శ్రీదేవి, పీవీ పాలెం తహసీల్దార్ వెంకటేశ్వరరావు, మున్సిపల్ డీఈ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఎస్టీలు, దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి బాపట్ల: ఎస్టీలు, దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. వీరికి సంబంధించి బుధవారం స్థానిక కలెక్టరేట్లో ప్రత్యేక పీజీఆర్ఎస్ జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దివ్యాంగులు, ఎస్టీలు తమ సమస్యలను కలెక్టర్కు వివరించారు. వీరిని కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం మంచి పద్ధతి కాదని అధికారులకు కలెక్టర్ సూచించారు. ప్రతి అర్జీని పరిశీలించి వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రతి నెల నాలుగో శుక్రవారం నిర్వహించే దివ్యాంగులు, ఎస్టీల పీజీఆర్ఎస్ కార్యక్రమం ఇక నుంచి ప్రతి నెల నాలుగో బుధవారానికి మార్పు చేశామన్నారు. జేసీ భావన వశిష్ఠ, డీఆర్ఓ జి.గంగాధర్ గౌడ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ -
పరారైన ఖైదీ కోసం ముమ్మర గాలింపు
సత్తెనపల్లి: సత్తెనపల్లి సబ్జైలులో జీవిత ఖైదు అనుభవిస్తూ పరారైన తమ్మినేని శ్రీనివాసరావు ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినట్లు పట్టణ సీఐ మల్లికార్జునరావు బుధవారం తెలిపారు. ఖైదీ ఆచూకీ తెలిసిన వారు వెంటనే సత్తెనపల్లి పోలీస్స్టేషన్కు సమాచారం అందించవచ్చన్నారు. ఎక్కడ కనిపించినా వెంటనే 94407 96230 ఫోను నంబర్కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. గుంటూరు అరండల్పేట్లో జరిగిన హత్య కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాసరావు ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. -
‘కుందేరు’లో కబ్జాల జోరు
వేటపాలెం: కుందేరు.... ఒకప్పుడు చీరాల నియోజకవర్గానికి జీవనాడి. గతంలో తీరప్రాంతమైన చీరాలకు తరచూ వచ్చే విపత్తులను తట్టుకుని లోతట్టులో ఉన్న ఈ ప్రాంతాన్ని ముంపు నుంచి బయట పడేసేది. తీర ప్రాంతానికి ఆనుకుని ఉండే గ్రామాలు భారీ వర్షాలు, తుపాన్లు వంటి వైపరీత్యాల వల్ల ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటి ప్రవాహాన్ని కుందేరు ద్వారా సముద్రంలో కలుస్తుంది. చీరాల మండలం ఈపురుపాలెం స్ట్రయిట్ కట్ దగ్గర నుంచి కుందేరు మొదలై వేటపాలెం మండలం మీదుగా పయనించి చిన్నగంజాం మండలం పల్లెపాలెం దగ్గర సముద్రంలో కలుస్తుంది. దీని పొడవు 47.5 కిలోమీటర్లు కాగా, వెడల్పు 300 మీటర్లు ఉంటుంది. కుందేరు మొత్తం విస్తీర్ణం 1376.76 ఎకరాలు ఉండాలి. దీనిలో 483.88 ఎకరాలు ఆక్రమణలకు గురైందని అధికారులు తేల్చారు. అక్రమణలకు గురైన భూమి విలువ సుమారు రూ. 725 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. బడాబాబుల దర్జా కుందేరు ప్రాధాన్యత తగ్గిపోవడంతో కొన్ని ప్రాంతాల్లో కాలువగా మిగిలిపోయింది. కుందేరు భూములు మాత్రం దశాబ్దాల కాలంగా ఆక్రమణలకు గురవుతున్నాయి. గతంలో నిరుపేదలు మాత్రమే ఆ భూముల్లో నివాసం ఏర్పరుచుకునేవారు. కుందేరు చీరాల పట్టణం మధ్యలో ఉండటంతో ఆ భూములకు రెక్కలొచ్చాయి. నివాసాలున్న ప్రాంతాల్లో ఎకరా రూ.30 లక్షల నుంచి రూ. 40 లక్షలు ఉంది. వేటపాలెం, పందిళ్లపల్లి ప్రాంతాల్లో రొయ్యల చెరువులు ఉన్న ప్రాంతాల్లో అయితే ఎకరం రూ.30 లక్షల నుంచి రూ.45 లక్షలు వరకు పలుకుతోంది. విలువైన భూములు మూడొంతులు బడా బాబుల కంబంద హస్తాల్లో చిక్కుకున్నాయి. చీరాల ప్రాంతంలో పలువురు కుందేరు ఆక్రమించి భారీ భవనాలు, ఫ్యాక్టరీలను నిర్మించేశారు. వేటపాలెం, పందిళ్లపల్లి, మొటుపల్లి ప్రాంతాల్లో చాలామంది రొయ్యల చెరువు ఏర్పాటు చేసుకొని సాగుచేస్తున్నారు. మరికొందరు రొయ్యల చెరువులను లీజుకు ఇస్తున్నారు. ఆక్రమణ దారుల నుంచి భారీ మొత్తాల్లో నగదు తీసుకుని మౌనంగా ఉన్నారని విమర్శలున్నాయి. రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కళ్లెదుటే ఆక్రమణలకు గురవుతున్నా ప్రభుత్వ యంత్రాంగం స్పందించడం లేదు. చీరాల, కొత్తపేట వరకు ఈ తంతు సాగుతోంది. కొందరు ఈ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటున్నారు. అధికారులు మొద్దు నిద్ర వీడటం లేదు. కుందేరు భూమి వివరాలు (ఎకరాల్లో) మండలం అసలు భూమి ఆక్రమణకు గురైనది చీరాల 267.12 20.18 వేటపాలెం 656.06 173.26 చిన్నగంజాం 452.98 290.44 -
ఇసుక అక్రమ తవ్వకాలపై విచారణ
చీరాల అర్బన్: చీరాల నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై అందిన ఫిర్యాదు మేరకు విజిలెన్స్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా విచారణ చేపట్టారు. ఈ క్రమంలో అక్రమ తవ్వకాలు వాస్తమేనని వెల్లడైంది. అక్రమ తవ్వకాలకు సంబంధించిన కొలతలు నమోదు చేసుకున్నారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు. చీరాల నియోజకవర్గంలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా జరుగుతున్నాయి. ఈ క్రమంలో మీడియాలో అనేక పర్యాయాలు కథనాలు ప్రచురితమయ్యాయి. ఉన్నతాధికారులకు అందిన ఫిర్యాదుల మేరకు ఒంగోలు రీజనల్ విజిలెన్స్ స్క్వాడ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించినట్లు అసిస్టెంట్ జియాలజిస్ట్ సీహెచ్ సురేష్కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం చీరాల మండలం బోయినవారిపాలెం పరిధిలో రెవెన్యూశాఖకు సంబంధించి ఆర్ఐ, సర్వేయర్, వీఆర్వోలతో కలిసి విచారణ చేపట్టారు. ఆ ప్రాంతంలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలు ఏ మేరకు జరిగాయని కొలతలు తీశారు. బుధవారం వేటపాలెం మండలం పందిళ్లపల్లి పరిధిలో ఎర్రగేటు సమీపంలోని పలు సర్వే నెంబర్లలో జరిగిన ఇసుక తవ్వకాలకు సంబంధించి పందిళ్లపల్లి వీఆర్వో కృష్ణవేణి, వీఆర్ఏ రమేష్లతో కలిసి విచారణ చేపట్టారు. తవ్వకాలకు సంబంధించిన కొలతలు నమోదు చేసుకున్నారు. రాయల్టీ ఇన్స్పెక్టర్ శంకరయ్య, టెక్నికల్ అసిస్టెంట్ కృష్ణారెడ్డి, ఫిర్యాదుదారురులు, పలువురు రైతులు పాల్గొన్నారు. -
గంజాయి విక్రయిస్తున్న మహిళ అరెస్టు
తాడికొండ: తాడికొండ మండలం ముక్కామల గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త చిన్ని రామారావుకు మంగళగిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వైఎస్సార్ సీపీ బ్యానర్ కట్టారనే ఆరోపణలతో మంగళవారం వెనిగండ్లలోని నివాసంలో చిన్ని రామారావును పోలీసులు అరెస్టు చేసి బుధవారం రిమాండ్కు తరలించారు. న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. చేబ్రోలు: కొద్ది రోజులుగా వీస్తున్న వడగాడ్పులకు శతాధిక వృద్ధురాలు మృతి చెందింది. వివరాలు.. మండలం వడ్లమూడి యాదవపాలేనికి చెందిన తోట బసవమ్మ(104) మంగళవారం రాత్రి మృతి చెందింది. మృతురాలు బసవమ్మకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వంద సంవత్సరాలు దాటినప్పటికి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు. నాలుగు రోజులుగా తీవ్రమైన ఎండ, వడగాడ్పులకు అస్వస్థతకు గురైంది. స్థానిక పెద్దలు, బంధువులు మృతదేహానికి నివాళులర్పించారు. నగరంపాలెం: ఉమ్మడి జిల్లాలోని విత్తన దుకాణాల్లో గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారుల తనిఖీలు బుధవారం కొనసాగాయి. గుంటూరు ప్రాంతీయ విజిలెన్న్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి డి.సూర్యశ్రావణ్కుమార్ నేతృత్వంలో గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కుర్నుతల గ్రామంలోని మెస్సర్స్ కర్షక్ క్రాప్ సన్న్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో స్థానిక వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి తనిఖీలు చేశారు. స్టాక్ రిజిస్టర్, ప్రాసెసింగ్ సీడ్ రిజిస్టర్ నిర్వహించకపోవడం, అలాగే విత్తనాలకు సంబంధించి ఇన్వాయిస్లు, సోర్స్ ధ్రువీకరణ పత్రాలు లేకపోవడాన్ని తనిఖీల్లో గుర్తించారు. దీంతో రూ.45.88 లక్షల విలువ చేసే 11,677.5 కిలోల సూపర్–10 (మిరప), ఎర్ర మిరప, రెమినెంట్ విత్తనాల విక్రయాలు నిలిపివేస్తూ నోటీసులు జారీచేశారు. కొరిటెపాడు (గుంటూరు): ప్రస్తుతం వీస్తున్న ఈదురు గాలులతో కూడిన వర్షాలకు విద్యుత్ స్తంభాలు పడిపోయి వైర్లు తెగిపడినా, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన వెంటనే గుంటూరు విద్యుత్ శాఖకు తెలియజేయాలని ఆ శాఖ ఆపరేషన్ డివిజన్ టౌన్–1 ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు పీహెచ్ ఖాన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం గుంటూరు డివిజన్ కార్యాలయంలో 9440817527 నంబర్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ నంబరు 24 గంటలు అందుబాటులో ఉంటుందన్నారు. ఈ టోల్ నెంబర్లో విద్యుత్ సిబ్బంది నమోదు చేసుకొని సంబంధిత అధికారులకు సమాచారం అందించి సమస్యను వెంటనే పరిష్కరిస్తారని తెలిపారు. విద్యుత్ విభాగం సిబ్బంది క్షేత్రస్థాయిలో మరమ్మతులు చేస్తున్నారని వెల్లడించారు. విద్యుత్ తీగలు తెగిపడి ఉంటే వాటిని ముట్టుకోకుండా వెంటనే శాఖకు సమాచారం ఇవ్వాలని కోరారు. అనవసరపు ఆందోళనకు గురి కావద్దని, సిబ్బందికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
ఉచిత ప్లాస్టిక్ సర్జరీని సద్వినియోగం చేసుకోండి
ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ మంగళగిరి టౌన్: అగ్నిప్రమాద బాధితులు ఉచిత ప్లాస్టిక్ సర్జరీని సద్వినియోగం చేసుకోవాలని ఏపీ ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ పేర్కొన్నారు. మంగళగిరి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ ఈగల్ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఉచిత ప్లాస్టిక్ సర్జరీ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆకే రవికృష్ణ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు కాలిన గాయాలతో బాధపడుతున్న వారికి బర్న్ సర్వైవర్ మిషన్ – సేవియర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత ప్లాస్టిక్ సర్జరీలను ఉచితంగా హైదరాబాద్లో నిర్వహిస్తోందని పేర్కొన్నారు. తద్వారా బాధితులకు పునర్జన్మ, మెరుగైన జీవనం పొందేందుకు అవకాశం ఉంటుందని తెలియజేశారు. ఆర్ధిక ఇబ్బందుల వల్ల సర్జరీలు చేయించుకోలేని బాధితులకు ఒక అద్భుత అవకాశమని వెల్లడించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో డ్రగ్స్, గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా బాధితులకు వైద్యసహాయం అందించడంతో పాటు భవిష్యత్తులో తమ రెండు సంస్థలు కలసి మరింత విస్తృతంగా సామాజిక బాధ్యతలను చేపట్టనున్నట్లు ట్రస్ట్ ఫౌండర్ నీహారి మండలితో కలసి సంయుక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సర్జరీలు మే 28 నుండి జూన్ 2 వరకు జరుగుతాయని, ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. వివరాలు, పేర్ల నమోదు కోసం 7816079234ను సంప్రదించాలని తెలిపారు. అనంతరం ఉచిత ప్లాస్టిక్ సర్జరీ క్యాంప్ కరపత్రాలను ఆవిష్కరించారు. -
దౌర్జన్యం చేసిన పోలీసులపై ఫిర్యాదు
పొన్నూరు: మండలంలోని మామిళ్లపల్లి గ్రామ మొక్కజొన్న రైతులు, వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణను పరామర్శించేందుకు వెళుతున్న సమయంలో అడ్డగించి దౌర్జన్య చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త పీట నాగమోహన కృష్ణ బుధవారం పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈనెల 23వ తేదీన మామిళ్లపల్లి గ్రామానికి వస్తున్న సమయంలో తొట్టెంపూడి గ్రామ సమీపంలో పొన్నూరు రూరల్ ఎస్ఐ వి.శ్రీహరి, సీఐ పి.కృష్ణయ్యతో పాటు కొందరు పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఐ కృష్ణయ్య దురుసుగా ప్రవర్తించి పోలీసు జీపులోకి వస్తువును పడేసినట్లుగా నెట్టి, నా మెడపై మోచేతితో పొడిచి ఇబ్బంది పెట్టారని చెప్పారు. కారణం చెప్పకుండానే బలవంతంగా చేబ్రోలు పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్ళి దుర్భాషలాడుతూ గంటన్నర పాటు పోలీస్ స్టేషన్లో బంధించారని వివరించారు. మళ్లీ బలవంతంగా అక్కడి నుంచి పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించి అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించారని పేర్కొన్నారు. అక్రమ నిర్బంధాన్ని ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ వేమూరు సమన్వయకర్త వరికూటి అశోక్ బాబుతో పాటు నాయకులపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా మళ్లీ పోలీసు స్టేషన్లో కూడా తనతో దౌర్జన్యంగా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన గౌరవానికి భంగం కలిగించి దౌర్జన్యం చేసి అక్రమంగా నిర్బంధించిన వారిపై చర్యలు తీసుకోవాలని పీట నాగమోహన కృష్ణ, ఎస్ఐకు ఫిర్యాదు చేశారు. వరికూటి అశోక్ బాబు, పార్టీ నాయకులు, న్యాయవాదులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ రేపల్లె సమన్వయకర్త పీట నాగమోహన కృష్ణ -
సబ్సిడీ దాణాను సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా పశుసంవర్ధకశాఖాధికారి డాక్టర్ వేణుగోపాల్ బాపట్లటౌన్: ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న పశువుల దాణా, గడ్డి విత్తనాలను పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్ వేణుగోపాల్ తెలిపారు. మండలంలోని ఈతేరు గ్రామంలో బుధవారం పశుపోషకులకు సబ్సిడీపై అందిస్తున్న దాణా, గడ్డివిత్తనాలను పంపిణీ చేశారు. డాక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ ఈతేరు గ్రామంలో 4 టన్నుల దాణా, 3 క్వింటాళ్ళ జొన్న విత్తనాలను అందజేశామన్నారు. బాపట్ల సహాయ సంచాలకులు శ్రీనివాసరావు, పశు వైద్యాధికారిణి రేచెల్ దివ్య, స్పెషల్ ఆఫీసర్ శారద, వెంకటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. పర్చూరు(చినగంజాం): ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీ కొన్న ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పర్చూరు ఎస్ఐ పులి గోపి అందించిన సమాచారం ప్రకారం.. కారంచేడు నుంచి పర్చూరు వైపు ద్విచక్రవాహనంపై వస్తున్న తల్లీ కుమారుడు షేక్ నజీర్(36), షేక్ మీరాబీ (55)లను మంగళగిరి నుంచి చీరాల వైపు వెళుతున్న కారు ఎదురుగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మీరాబీ అక్కడికక్కడే మృతి చెందగా ద్విచక్ర వాహనం నడుపుతున్న నజీర్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ గోపి.. గాయాలపాలైన అతన్ని పర్చూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. జిల్లా విద్యాశాధికారి పీవీజే రామారావు పిడుగురాళ్ల: జిల్లాల్లో ఒక డ్రాప్ అవుట్ కూడా లేకుండా చూడాలని పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి పీవీజే రామారావు అన్నారు. పట్టణంలోని ఎంఈఓ కార్యాలయంలో విద్యాశాఖ అధికారులు, సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలోనే డ్రాపవట్లు లేని జిల్లాగా పల్నాడును నిలబెట్టాలన్నారు. అంగన్వాడీ సెంటర్లు, సచివాయాల్లో డేటా తీసుకొని ప్రతి మండలాన్ని జల్లడి పట్టి డ్రాప్ అవుట్లు లేకుండా చూడాలని తెలిపారు. దీనిలో భాగంగానే బెల్లంకొండ, కారంపూడి, పిడుగురాళ్ల, మాచవరం మండలాల్లో తనిఖీలు నిర్వహించామన్నారు. విద్యాశాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
రాజీకీయాలకు తలొగ్గుతారా?
కొల్లూరు: రాజకీయ ఒత్తిళ్లతో నలిగిపోతూ చేతులు కట్టేసుకొని కాలక్షేపం చేస్తున్న ఖాకీలు ఎట్టకేలకు అరాచక శక్తుల కోసం రంగంలోకి దిగారు. చంద్రబాబు ప్రభుత్వంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలుతో పచ్చ పార్టీ నేతలు చట్టాలను పక్కనపెట్టి అనుయాయులు, రౌడీ మూకలతో సాగిస్తున్న అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు కొల్లూరు పోలీసులు ముందుకు కదిలారు. టీడీపీ నాయకుల ఒత్తిళ్లతో ఇన్నాళ్లూ వ్యహరించిన పోలీసులు చివరకు స్టేషనులోకి దుండగులు వచ్చి దాడులు చేసుకోవడం, ఖాకీలపైనా చేయి చేసుకోవడం ఉన్నతాధికారులను సైతం విస్మయానికి గురిచేసింది. ఘర్షణ, పోలీసు స్టేషనుపై దాడి కేసులో మున్ముందు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా దర్యాప్తు కొనసాగించి నిందితులకు శిక్ష పడేలా వ్యవహరిస్తారా అనే అనుమానాలు కూడా ప్రజల నుంచి వ్యక్తం అవుతున్నాయి. పీఎస్పై దాడికి దిగిన ఘటనతోపాటు టీడీపీ నాయకుల అనుయాయులు, జనసేన కార్యకర్తల కొట్లాట కేసులో నిందితులను అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఇరు వర్గాలకు చెందిన 21 మంది నిందితులను అదుపులోకి తీసుకుని మంగళవారం తెల్లవారుజామున తెనాలి కోర్టు న్యాయమూర్తి ముందు హాజరు పర్చారు. నిందితులకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. వీరిలో జనసేన కార్యకర్త జానకిరామయ్య వర్గానికి చెందిన 11 మందిని గుంటూరు జైలుకు తరలించారు. కొల్లూరులోని ఎస్సీ కాలనీకి చెందిన 10 మంది నిందితులను నెల్లూరు జైలుకు తరలించినట్లు సమాచారం. దాడి ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్లను నిశితంగా పరిశీలించి స్థానికుల సహకారంతో నిందితులను పోలీసులు గుర్తించారు. వీధుల్లో పరుగెత్తినా వదల్లేదు.. కేసుల విషయంలో రాజకీయ, కుల సంఘాల ఒత్తిళ్లు అధికమవుతున్నా అరెస్టులకు పోలీసులు శ్రీకారం చుట్టారు. రేపల్లె సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్ఐలు తమ సిబ్బందితో కొల్లూరు పోలీసులతో కలసి కొల్లూరు, ఆవులవారిపాలెం, గాజుల్లంకలోని పలు ప్రాంతాలలో నిందితుల ఇళ్లకు వెళ్లి అరెస్టులు చేశారు. సీసీ ఫుటేజ్ల ద్వారా దాడుల ఘటనలో సుమారు 40 నుంచి 50 మంది వరకు గుర్తించారు. ఎంతమందిపై కేసులు నమోదు చేశారనే అంశంలో పూర్తి గోప్యత పాటిస్తున్నారు. కొట్లాటలో ఉన్న నిందితులలో కొందరు ముందుగానే అరెస్టులను ఊహించి అజ్ఞాతంలోకి వెళ్లగా, మరొ కొందరు పోలీసులను చూసి పరారయినట్లు తెలుస్తోంది. పోలీసులు సైతం పారిపోతున్న వారిని వీధులలో వెంబడించారు. ఇతరుల గృహాలలోకి చొరబడి బాత్రూమ్ల్లో దాక్కున్నవారిని సైతం బయటకు లాగి సీనీ ఫక్కీలో అరెస్టు చేశారు. స్టేషన్లో దాడి ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ వెలుగులోకి రాకుండా ఉంచడం, నిందితుల పూర్తి వివరాల గోప్యత పాటించడం ప్రజలకు పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. పోలీసు అధికారులు మాత్రం శాంతిభద్రతల పరిరక్షణకు ముందు జాగ్రత్త చర్యలలో భాగంగానే కొంత గోప్యత పాటిస్తున్నట్లు వెల్లడిస్తున్నారు. ఈ వ్యవహారంతో సంబంధం లేని వ్యక్తులపైనా కేసులు నమోదు చేసి అరెస్టు చేయడంపై ప్రజలలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇప్పటికే ఇరు వర్గాలకు చెందిన కుల సంఘాల నాయకులు సైతం పోలీసు అధికారులను కలసి కొట్లాటలో లేని వ్యక్తుల పేర్లు తొలగించాలని విజ్ఞప్తులు సైతం చేశారు. దాడులు జరుగుతున్న సమయంలో ఆపడానికి యత్నించిన వ్యక్తులను, దాడి నుంచి తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నించిన వారిని, ఓ పక్క నిల్చుని ఉన్న వారిపైన సైతం కేసులు నమోదు చేశారన్న విమర్శలు వెలువడుతున్నాయి. వీటికి తోడు ఆయా వర్గాలకు చెందిన కుల సంఘాల సైతం అక్రమ కేసుల విషయంలో అంతర్గత సమావేశాలు నిర్వహించుకుంటున్నాయి. తమ కార్యాచరణపై చర్చలు జరుపుతున్నారు. కొల్లూరు ఎస్సీ కాలనీ వాసులు అక్రమంగా అరెస్టు చేసినవారిని తక్షణం విడుదల చేయాలన్న డిమాండ్తో రహదారిపై ధర్నా చేపట్టారు. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి అమాయకులను బలిచేయకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలనే అభిప్రాయం ప్రజలలో వ్యక్తమవుతోంది. -
శేకూరు చానెల్ పునరుద్ధరణ పనుల పరిశీలన
శేకూరు(చేబ్రోలు): చేబ్రోలు మండలం శేకూరు చానెల్ పునరుద్ధరణ పనులను జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజినీర్ వెంకటరత్నం, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.శంకర్, జిల్లా భూగర్భ జలాల శాఖ ఉప సంచాలకులు వందనం మంగళవారం పరిశీలించారు. జలధార–జలహారతి కార్యక్రమం, ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. భూగర్భ జలాలు బాగా తక్కువగా ఉన్న గ్రామాల్లో శేకూరు ఒకటి. ఇంకుడు గుంతల ఏర్పాటుకు అవకాశం ఉన్న మూడు ప్రదేశాలను గుర్తించి పనులు చేపట్టేలా చూడాలన్నారు. వర్షాకాలం నాటికి జిల్లాలో గుర్తించి చేపడుతున్న చెరువు పనులను పూర్తి చేసి సిద్ధం చేయాలని ప్రయత్నిస్తున్నామని తెలిపారు. నృసింహుని ఆలయంలో ‘ఆక్టోపస్’ మాక్డ్రిల్ మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణ పరిధిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి ఆక్టోపస్ బలగాలు మాక్డ్రిల్ నిర్వహించాయి. అనంతరం అధికారులు మాట్లాడుతూ ఆలయం వద్ద ఏదైనా దాడి జరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, భక్తులను ఏవిధంగా రక్షించాలనే దానిపై మాక్ డ్రిల్ నిర్వహించామన్నారు. ఉగ్రవాదులు ఆలయంలోని జొరబడితే ఎంత వేగంగా వారిని అదుపులోకి తీసుకోవాలనే అంశంపై శిక్షణ ఇచ్చారు. కమాండోలు ఉగ్రవాదులను తుదముట్టించే దృశ్యాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఆక్టోపస్ అడిషనల్ ఎస్పీ కె. రామచంద్రమూర్తి, డీఎస్పీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ శివాజీ పాల్గొన్నారు. మంగళగిరి టౌన్: గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఇద్దరు మహిళా పవర్ లిఫ్టర్లు పతకాలు సాధించినట్లు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయభాస్కరరావు, ప్రధాన కార్యదర్శి షేక్ సంధాని మంగళవారం తెలిపారు. మంగళగిరి పట్టణ పరిధిలోని వారి కార్యాలయంలో వివరాలను వెల్లడించారు. కోనసీమ జిల్లా అమలాపురంలో ఈనెల 15 –20వ తేదీ వరకు జరిగిన నేషనల్ సబ్ జూనియర్ అండ్ జూనియర్ క్లాసిక్ పవర్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో క్రీడాకారులు బి.లిఖిత, వినయశ్రీ బ్రాంజ్ మెడల్ సాధించారన్నారు. సంఘం ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. లిఖిత, వినయశ్రీలతోపాటు చైనాలో జరిగిన ఏషియన్ సబ్జూనియర్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పతకాలు సాధించిన షానూన్ను కూడా అభినందించారు. సంఘం కోశాధికారి వెంకటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్లు చంద్రిక, భాస్కరరావు పాల్గొన్నారు. సత్తెనపల్లి: జీవిత ఖైదీ పరారైన సంఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లి సబ్ జైలులో సోమవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు అరండల్పేటలో గతంలో జరిగిన హత్య కేసులో తమ్మినేని శ్రీనివాసరావు నిందితుడిగా ఉన్నాడు. అతడు నెల్లూరు జైలులో కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. అతని సత్ప్రవర్తనతో నెల్లూరు జైలు నుంచి ఓపెన్ జైలులో భాగంగా సత్తెనపల్లి సబ్ జైలుకు తరలించారు. సత్తెనపల్లిలోని సబ్ జైలు ఆధ్వర్యంలో నడుస్తున్న హెచ్పీసీఎల్ పెట్రోలు బంకులో విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం సాయంత్రం సమయంలో ఒక్కసారిగా పరారయ్యాడు. దీనిపై సబ్జైలు సూపరింటెండెంట్ వెంకటరత్నం మంగళవారం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టి, అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. -
డౌన్ డౌన్... ఎమ్మెల్యే బూర్ల
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ముట్లూరులో కాపులపై దాడి వివాదం రోజురోజుకీ ముదిరి పాకానపడుతోంది. జనసేన శ్రేణులు వివాదాన్ని సీరియస్గా తీసుకుని పావులు కదుపుతున్నాయి. న్యాయం జరగని పక్షంలో అవసరమైతే అధినాయకత్వంతో అయినా అమీతుమీ తేల్చుకునేందుకు వారు సిద్ధమవుతున్నారు. అటు తిరిగి ఇటు తిరిగి వివాదం చినికి చినికి గాలి వానలా మారి ఆ సెగ ఎమ్మెల్యే, ఎంపీ కార్యాలయాల వరకు చేరింది. ఒక దశలో ప్రజాప్రతినిధులు కూడా వారి పక్షాన నిలవకపోవడంతో ‘ఎమ్మెల్యే డౌన్ డౌన్’ అంటూ నిరసన గళం వినిపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దారుణంగా దాడి.. ప్రత్తిపాడు నియోజకవర్గం వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో ఈ నెల 11వ తేదీన రాత్రి పదకొండు గంటల సమయంలో ఓ టీడీపీ కార్యకర్త తన బైక్పై ఇంటకి వెళుతున్న సమయంలో అదే మార్గంలో కాపు సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు ఒకే బైక్పై ఎదురుగా వచ్చారు. రెండు ద్విచక్రవాహనాలు ఢీ కొనడంతో వారి మధ్య ఘర్షణ జరిగింది. వివాదం పెద్దది కావడంతో టీడీపీ కార్యకర్త గ్రామంలోని టీడీపీ ఎంపీటీసీకి ఫోన్ చేయడం, ఆయన మరికొంత మందితో కలిసి వచ్చి ముట్లూరు–కోవెలమూడి మధ్య నల్లకుంట ప్రాంతంలో కాపు సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు యువకులపై విచక్షణారహితంగా దాడి చేయడం, అంతటితో ఆగకుండా రోడ్డుపై కొట్టుకుంటూ గ్రామంలోనికి తీసుకువెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సదరు టీడీపీ ఎంపీటీసీపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని కాపు సంఘ నాయకులు గొడవ జరిగిన రోజు నుంచి పట్టుబడుతున్నారు. ఇప్పటికే ఓ సారి ఎంపీ వద్ద పంచాయితీ కూడా పెట్టారు. ఘటన జరిగి దాదాపుగా పదిహేను రోజులు గడుస్తున్నా సదరు ఎంపీటీసీపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో జనసేన నాయకులు, కాపు నేతలు, కాపు సామాజిక వర్గం రగిలిపోతోంది. ఎమ్మెల్యేకు నిరసన సెగ అటో ఇటో తేల్చుకునేందుకు మంగళవారం ముట్లూరు కాపు సామాజిక వర్గం యువకులు, నేతలు భారీ సంఖ్యలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు కార్యాలయానికి వెళ్లారు. కాపు యువకులపై విచక్షణరహితంగా దాడికి పాల్పడిన టీడీపీ ఎంపీటీసీపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని, తగిన చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఎదుట కాపు సామాజిక వర్గ బాధితులు తీవ్ర ఆవేదన, ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ఎమ్మెల్యే నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఆగ్రహించారు. ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన ఎదుటే ‘బూర్ల రామాంజనేయులు డౌన్ డౌన్’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అమీ తుమీ తేల్చుకుంటామని అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం. అనంతరం ముట్లూరు కాపు నేతలు ఎంపీ పెమ్మసాని కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ కూడా టీడీపీ ఎంపీటీసీపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని పట్టుబట్టారు. అయితే గొడవ జరిగిన రెండు రోజుల తరువాత ఇదే నాయకులు, కాపు సామాజిక వర్గ పెద్దలు ఎంపీ వద్దకు వెళ్లినప్పుడు తానున్నానని హామీ ఇచ్చిన ఎంపీ.. ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ సినిమా స్టైల్ మాటలు చెప్పినట్లు జనసేన నేతలు, కాపు నాయకులు వాపోతున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేల తీరు పట్ల వారు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. కాపు యువకులపై అన్యాయంగా విచక్షణరహితంగా దాడికి పాల్పడిన టీడీపీ ఎంపీటీసీపై రౌడీషీట్ ఓపెన్ చెయ్యకపోతే అధినాయకత్వం వరకు వెళ్లి అటో ఇటో తేల్చుకునేందుకు సిద్ధమని చెబుతున్నారు. -
పచ్చగడ్డి వేస్తే రియల్ భగ్గు!
టీడీపీ నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. రియల్ ఎస్టేట్ రంగంలో వారి ఆధిపత్య పోరు కారణంగా ఇటు ప్రజలు నష్టపోవడమే కాకుండా, అటు అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మండల కేంద్రం మార్టూరులో అక్రమంగా గతంలో వేసిన, ప్రస్తుతం వేస్తున్న అక్రమ లే అవుట్లను బయట నుంచి వచ్చిన టాస్క్ఫోర్స్ టీం అధికారులు మంగళవారం ధ్వంసం చేయబోగా తెలుగు తమ్ముళ్లు అడ్డుకున్నారు. ఇంత హఠాత్తుగా లేఅవుట్ల ధ్వంసానికి కారణం మార్టూరుకు చెందిన టీడీపీ నాయకుడే అంటూ మిగిలిన తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్టూరు: టౌన్ ప్లానింగ్ అధికారి అనూరాధ నేతృత్వంలో వేర్వేరు ప్రాంతాల నుంచి సుమారు పదిమంది అధికారులు మంగళవారం మార్టూరు అనధికార లేఅవుట్లను ధ్వంసం చేయాల్సిందిగా ఉన్నతాధికారుల ఆదేశాలపై తాము వచ్చినట్లు అనూరాధ మీడియాకు తెలిపారు. మార్టూరు పంచాయతీ కార్యదర్శి తన్నీరు శ్రీనివాసరావుతో కలిసి మొదటగా పక్క నియోజకవర్గ నేతకు చెందిన అనుచర వర్గం ప్రారంభించిన అనధికార లే అవుట్ను కొంతమేర రాళ్లు తొలగించి ధ్వంసం చేశారు. అనంతరం జేసీబీ, ట్రాక్టర్ యజమానులు ఇద్దరూ తమ వాహనాలు రిపేర్కు వచ్చాయంటూ అక్కడి నుంచి వెళ్లిపోవడం గమనార్హం. అడ్డుకున్న నాయకులు అంతట అధికారులు మరొక జేసీబీ సాయంతో సమీపంలోని జనసేన పార్టీ నాయకుడికి చెందిన లేఅవుట్లోని రాళ్లు తొలగించే ప్రయత్నం చేశారు. సదరు నాయకుడు జేసీబీకి అడ్డంగా నిలబడి మొదట ప్రారంభించిన లేఅవుట్లోని రాళ్లు తొలగించాకే తన భూమిలోకి రావలసిందిగా ఖరాఖండిగా తేల్చి చెప్పాడు. ఎటూ పాలుపోని అధికారులు ఆ లేఅవుట్ను ఆనుకొని ఉన్న మరో లేఅవుట్ తాలూకు ప్రహరీని ధ్వంసం చేయబోగా దానికి సంబంధించిన టీడీపీ నాయకులు అక్కడ కూడా అడ్డుకున్నారు. అధికారులు ప్రహరీరి వదిలి లే ఔట్లోనికి వెళ్లే మార్గాన్ని జేబీసీతో ధ్వంసం చేయించారు. అనంతరం రాజుగారిపాలెం గ్రామం వైపు వెళ్లే మార్గంలో వేసిన రెండు అనధికార లేఅవుట్లలోని రాళ్లను తొలగించారు. అసలు సంగతి ఇదా... ప్రస్తుతం మార్టూరులో కొద్దో గొప్పో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతున్న ప్రాంతం స్థానిక హర్షిణి విద్యాసంస్థల పరిసరాల్లో మాత్రమే. మార్టూరు టౌన్పై పెత్తనం చేస్తున్న ఇద్దరు ముఖ్య నాయకులలో ఓ మైనారిటీ నాయకుడు ఇటీవల ఈ ప్రాంతంలో కొంత భూమి కొనుగోలు చేసి లేఅవుట్ వేసే ప్రయత్నంలో ఉన్నాడు. సదర్ లే అవుట్లో ఆ నాయకుడికి తక్కువలో తక్కువ సుమారు రూ.కోటి లాభం రావచ్చనేది ఆ పార్టీ నాయకుల మాటా. ఇక రెండో నాయకుడు స్థానిక జాతీయ రహదారికి ఎదురుగా అత్యంత సుందరంగా అప్రూవల్ లే అవుట్ను వేసినప్పటికీ విక్రయాలు జరగటం లేదనేది కొందరి వాదన. ఈ సందర్భంగా హర్షిణీ విద్యాసంస్థల పరిసరాల్లోని అనధికారిక లేఅవుట్లను తొలగిస్తే పచ్చనేతకు చెందిన అప్రూవ్డ్ లే అవుట్లోని విక్రయాలు పెరుగుతాయనే ఆలోచనతో చక్రం తిప్పినట్లు ఆరోపణలు వచ్చాయి. టౌన్ ప్లానింగ్ అధికారులతో ఇలా ఆయనే దాడులు చేయించినట్లు బాధితులు బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరి బలం ఏమిటో త్వరలోనే తేలుస్తామని మాటల కత్తులు దూసుకోవటం విశేషం. అధికార పార్టీకి చెందిన ముఖ్య నాయకులలో చిచ్చుకు అక్రమ రియల్ ఎస్టేట్ వ్యాపారం కారణమై ఆధిపత్య పోరుకు దారితీసిందని ప్రజలు పేర్కొంటున్నారు. దీని ప్రభావం ఇంతటితో ఆగక రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో సైతం ఉంటుందని స్థానికంగా చర్చ జరగటం విశేషం. మాట్లాడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారి అనూరాధఈ సందర్భంగా మీడియాతో టౌన్ ప్లానింగ్ అధికారి అనూరాధ మాట్లాడుతూ... మార్టూరు కేంద్రంగా 2009 – 23 మధ్యకాలంలో అనధికారికంగా వేసిన లేఅవుట్లలోని రాళ్లను తొలగించాలని ఉన్నతాధికారులు తమను ఆదేశించారని జాబితా చూపారు. అందులో 25 మంది వ్యక్తులకు చెందిన 50కిపైగా సర్వే నంబర్లలో 85 ఎకరాల విస్తీర్ణంలోని అక్రమ లేఅవుట్లు ఉండటం గమనార్హం. -
సీఆర్జెడ్ నిబంధనలకు అనుగుణంగా బీచ్ల అభివృద్ధి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్బాపట్ల: సీఆర్జెడ్ నిబంధనలు అనుసరించి బీచ్లను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ చెప్పారు. సీఆర్జెడ్ జిల్లాస్థాయి కమిటీ సమావేశం మంగళవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. వేసవిలో మత్స్యకారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మత్స్యశాఖ రూపొందించిన పోస్టర్లను కలెక్టర్ విడుదల చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ సీఆర్జెడ్ నిబంధనలు అనుసరించి సముద్ర తీరం వెంబడి 200 నుంచి 500 మీటర్లలోనే రిసార్డ్స్లు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చని స్పష్టం చేశారు. ఆ నిబంధనలు పక్కాగా అమలయ్యేలా చూడాలని ఆదేశించారు. సమావేశంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కె విజయమోహన్, మత్స్య శాఖ డీడీ గాలి దేముడు, వీక్షణ సమావేశం ద్వారా వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు. సూర్యలంక బీచ్లో సీనియర్ సిటిజన్స్కు ప్రత్యేక ఏర్పాట్లు సీనియర్ సిటిజన్స్ కోసం సూర్యలంక బీచ్లో ప్రత్యేకంగా 20 మీటర్లు సీటింగ్ ఏర్పాటు చేయిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. వృద్ధుల సంక్షేమ చట్టంపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం మంగళవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వృద్ధులకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఎవరికై నా ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు ఏర్పడితే తక్షణమే ఫిర్యాదు చేయవచ్చన్నారు. వాట్సాప్లో సమాచారం సెండ్చేస్తే తక్షణమే ఎలాంటి సహాయం అయినా వృద్ధులకు అందేలా చూస్తామన్నారు. -
ఇండియన్ మోడల్ హంట్ విజేత దివ్యశ్రీ
కారంచేడు: ఇటీవల విజయవాడలో నిర్వహించిన ఇండియన్ మోడల్ హంట్ విజేతగా కారంచేడు మండలంలోని కుంకలమర్రు గ్రామానికి చెందిన కే దివ్యశ్రీ ఎంపికవ్వడం గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కుగ్రామమైన కుంకలమర్రులో వ్యవసాయ కుటుంబానికి చెందిన దివ్యశ్రీ చిన్నతనం నుంచే ఫ్యాషన్ షోలు, మోడలింగ్లపై మక్కువ ఉండేది. ఈ క్రమంలో చదువులతోపాటు మోడలింగ్లోను రాణిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో టీవీ సిరియల్ ఆర్టిస్ట్గాను ఆమె రాణిస్తున్నారు. ఈ క్రమంలో మోడలింగ్ ఆకాడమీ డైరెక్టర్ సతీష్ అడ్డాల, దీక్షల ఆధ్వర్యంలో విజయవాడ వేదికగా జరిగిన ఇండియన్ మోడల్ హంట్ సీజన్–4లో పాల్గొన్న దివ్యశ్రీ తన ప్రతిభ కనబరిచి ఎక్సలెన్స్ అవార్డు స్వీకరించారు. దేశవ్యాప్తంగా వందల మంది పాల్గొనగా ఫైనల్కు కేవలం 20 మందిని మాత్రమే ఎంపిక చేశారన్నారు. వారిలో తనను ఎంపిక చేసిన డైరెక్టర్ సతీస్ అడ్డాలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. దివ్యశ్రీ తల్లిదండ్రులైన కనపర్తి రాములు, జ్యోతి, గ్రామస్తులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
సత్తా చాటిన స్వర్ణ మైసూరు ఎడ్ల జత
స్వర్ణ(కారంచేడు): రాష్ట్రస్థాయి ఎడ్లబండి పోటీలు ఆకట్టుకున్నాయి. మండలంలోని స్వర్ణ గ్రామంలో స్వర్ణమ్మతల్లి తిరునాళ్ల సందర్భంగా స్వర్ణ–దగ్గుబాడు రోడ్డులోని గ్రామ సచివాలయం (పార్కు) సమీపంలో రాష్ట్రస్థాయి మైసూర్ ఎడ్ల బండలాగుడు పందేలు మంగళవారం నిర్వహించారు. ఈ పోటీల్లో మండలంలోని స్వర్ణ గ్రామానికి చెందిన రామాంజనేయులుకి చెందిన మైసూర్ ఎడ్ల జత ఈ ఏడాది ప్రథమ స్థానం కై వసం చేసుకున్నాయి. పోటీల్లో 14 ఎడ్ల జతలు తమ పేర్లు నమోదు చేసుకోగా ఎండల కారణంగా కేవలం 10 ఎడ్ల జతలు మాత్రమే పాల్గొన్నాయి. మొదటి స్థానం పొందిన రామాంజనేయులు ఎడ్ల జత నిర్దేశించిన 15 నిమిషాల సమయంలో 2498 అడుగుల దూరం లాగి గమ్యం చేరుకున్నాయి. తరువాత రెండో స్థానంలో ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కుందుర్రు గ్రామానికి చెందిన మందుల నజీర్, మందుల ఖాజావలీలకు చెందిన ఎడ్ల జత 2400 అడుగుల దూరం లాగాయి. మూడో స్థానాన్ని కూడా సంతమాగులూరు మండలం కుందుర్తి గ్రామానికి చెందిన ఉప్పు పండుకు చెందిన ఎడ్ల జత 2195 అడుగుల దూరం లాగాయి. నాలుగో బహుమతిని చీరాల–పేరాలకు చెందిన ఎడ్ల జత 2100 అడుగుల దూరం లాగాయి. విజేతల యజమానులకు ప్రథమ బహుమతిని గ్రామానికి చెందిన పగడాల బసవయ్య, సుబ్బారావులు రూ.20 వేలు, రెండో బహుమతిని రూ.15 వేలను కేళం శివరామకృష్ణప్రసాద్ అందించారు. మూడో బహుమతిని రూ.10 వేలు కటికి శింగయ్య, కొండే వెంకటేష్లు అందించారు. నాలుగో బహుమతిని రూ.5 వేలను ఎర్రిబోయిన రామాంజనేయులు అందించారు. పోటీలకు న్యాయనిర్ణేతలుగా శివరామకృష్ణప్రసాద్, కట్టా ప్రసాద్, పూల గోపిలు వ్యవహరించారు. గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లాల నుంచి ఎడ్ల జతలు పాల్గొన్నాయి. రాష్ట్రస్థాయి మైసూర్ ఎడ్ల పోటీలు -
108లో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం
రేపల్లె: అత్యవసర పరిస్థితుల్లో తరలిస్తున్న గర్భిణికి 108 అంబులెన్స్లోనే ప్రసవం జరిగింది. వైద్య సిబ్బంది సమయస్ఫూర్తితో స్పందించడంతో తల్లి, శిశువు సురక్షితంగా ఉన్నారు. వివరాల్లోకి వెళితే.. రేపల్లె మండలం లంకెవానిదిబ్బకు చెందిన చెందిన గర్భిణి నంబూరి అంకమ్మ (23)కు నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ఇది రెండో గర్భం కాగా, ఏడో నెలలోనే నొప్పులు అధికమవడంతో వైద్యులు పరిశీలించారు. మొదటి కాన్పు శస్త్రచికిత్స ద్వారా జరగడం, ప్రస్తుతం రక్తహీనత ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. దీంతో మంగళవారం తెల్లవారుజామున 108 వాహనంలో అంకమ్మను తెనాలికి తరలించే ఏర్పాట్లు చేశారు. వాహనం రేపల్లె – పెనుమూడి హైవేకు చేరుకున్న సమయానికే అకస్మాత్తుగా నొప్పులు ఎక్కువ అయ్యాయి. పరిస్థితి విషమంగా మారుతుండటాన్ని గమనించిన ఈఎంటీ కేసన మహేష్ చాకచక్యంగా వ్యవహరించి అంబులెన్స్లోనే ప్రసవం నిర్వహించారు. అంకమ్మ సురక్షితంగా ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. అనంతరం వారిని తెనాలి హాస్పిటల్కు తరలించి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించారు. అత్యవసర సమయంలో అప్రమత్తంగా వ్యవహరించి ప్రాణాలను కాపాడిన ఈఎంటీ కేసన మహేష్, పైలెట్ శ్రీనివాస్లను ఓఈ వెంకట మారుతి, డీఎం వెంకటేశ్వరరావులతో పాటు కుటుంబ సభ్యులు, స్థానికులు అభినందించారు. భార్య మృతికి కారణమైన భర్త అరెస్ట్ దాచేపల్లి: భార్య మృతికి కారణమైన భర్తని అరెస్ట్ చేసినట్లు సీఐ ఎం.రాజేష్ మంగళవారం తెలిపారు. మండలంలోని పెదగార్లపాడుకి చెందిన షేక్ జాన్బీ కుమార్తె ఆశాని మాచర్ల మండలం కొత్తూరుకి చెందిన షేక్ సుభానీకి ఇచ్చి గత 15 ఏళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి ఒక కుమార్తె సంతానం. ఉపాధి కోసం వీరిద్దరు మండలంలోని గామాలపాడు గ్రామంలో నివాసం ఉంటున్నారు. సుభాని చెడు వ్యసనాలకు లోనై తరచూ భార్య ఆశాని హింసపెడుతున్నాడు. సుభాని మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ, ఆశాని హింసలకు గురి చేయటంతో పాటుగా ఆత్మహాత్య చేసుకునేలా ప్రేరించాడు. దీంతో గత మార్చి నెల 6వ తేదీన ఇంట్లోనే చీరతో ఉరివేసుకుని ఆశా ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో తన కుమార్తె ఆత్మహత్యకు కారణమైన సుభానిపై జాన్బీ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సుభానిని అరెస్ట్ చేసి కోర్టులో హజరుపరిచామని సీఐ రాజేష్ చెప్పారు. విత్తన దుకాణంలో విజిలెన్స్ తనిఖీలు రూ. 45 లక్షల విలువ చేసే మిర్చి విత్తనాల అమ్మకాలు నిలిపివేత ప్రత్తిపాడు: మిర్చి విత్తనాలు విక్రయించే దుకాణంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. వట్టిచెరుకూరు మండలం కర్నూతల గ్రామంలోని కర్షక్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో మంగళవారం రాత్రి స్థానిక ఏవో సునీతతో కలిసి గుంటూరు విజిలెన్స్ సీఐ కె.చంద్రశేఖర్, ఎస్ఐ లక్ష్మీ మాధవిలు తనిఖీలు చేశారు. రికార్డులు, స్టాక్ రిజిస్టర్లు పరిశీలించారు. రికార్డులు సక్రమంగా లేకపోవడం, సరైన పత్రాలు చూపించక పోవడంతో సుమారు రూ.45 లక్షల విలువ చేసే మిర్చి సూపర్– 10 రకం విత్తనాల అమ్మకాలను నిలుపుదల చేసినట్లు ఏవో తెలిపారు. విత్తనాల నమూనాలు సేకరించారు. -
గోవధ చేస్తే జైలుకెళ్లడం ఖాయం
● చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు ● జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ బాపట్లటౌన్: గోవులను వధిస్తే జైలుకెళ్లడం ఖాయమని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లాపోలీస్ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఎస్పీ బి.ఉమామహేశ్వర్ మాట్లాడుతూ బక్రీద్ పండుగను పురస్కరించుకొని జిల్లాలోని ఈద్గాలు, మసీదుల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. గోవధ నిషేధం చట్టాన్ని ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బుధవారం బక్రీద్ పండుగ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్ట భద్రత చర్యలు తీసుకున్నామన్నారు. గో సంరక్షణ చట్టం–2017, జంతు సంరక్షణ చట్టం–1977 ప్రకారం గోవుల అక్రమ రవాణా నేరమని, గోవులను వధించడం పూర్తిగా నిషేధమని, ఈ చట్టాన్ని ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, మతసామరస్యానికి భంగం కలిగించే విధంగా ఎవరైనా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా, సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యల్లో భాగంగా జిల్లా సరిహద్దులతోపాటు జాతీయ రహదారుల్లోని టోల్ప్లాజాల వద్ద విస్త్రృత వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో ఏదైనా అవాంఛనీయ సంఘటనలు ఉత్పన్నమయ్యే పరిస్థితులు ఉంటే, ప్రజలు వెంటనే సమీప పోలీస్స్టేషన్కు, 100,112 నెంబర్లకు కాల్ చేసి సమాచారాన్ని అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. -
బగళాముఖి సేవలో బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్
చందోలు(కర్లపాలెం): చందోలులోని బగళాముఖి అమ్మవారిని బాపట్ల జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ కుటుంబ సభ్యులతో కలసి మంగళవారం దర్శించుకుని పూజలు చేశారు. అమ్మవారి ఆలయానికి విచ్చేసిన ఎస్పీ కుటుంబ సభ్యులకు ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ తన పుట్టిన రోజున కుటుంబ సభ్యులతో కలసి బగళాముఖి అమ్మవారిని దర్శించుకోవటం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. జిల్లా ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కలకోట చక్రధర్రెడ్డి, ఈవో నరసింహమూర్తి ఎస్పీ కుటుంబ సభ్యులకు అమ్మవారి చిత్రపటంతో పాటు ప్రసాదాలు అందజేశారు. డీఎంహెచ్ఓలో అవినీతిపై చర్యలు తీసుకోవాలి బాపట్ల: బాపట్ల డీఎంహెచ్ఓ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాలని మాదిగ సంక్షేమ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సుజన్మాదిగ కోరారు. జిల్లా కలెక్టర్ వి.వినోద్కుమార్ను మంగళవారం కలసి వినతిపత్రం అందించారు. ఈపురుపాలెం ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఎస్ రాధాకృష్ణ ఏప్రిల్ 2024 సంవత్సరం నుంచి డిసెంబర్ 2025 వరకు విధులకు హాజరుకాకున్నా, ఎఫ్ఆర్ఎస్ వేయకపోయినా జీతం మంజూరు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంకొల్లులో మెడికల్ ఆఫీసర్గా పని చేస్తున్న భానుప్రకాష్ నెల మొత్తం మీద కేవలం వారం రోజులు కూడా రాడని, వచ్చిన వారం రోజులు కూడా, ఫుల్లుగా మద్యం సేవించి, సిబ్బందిని ఇబ్బంది పెడుతుంటాడని కలెక్టర్కు వివరించారు. కలెక్టర్ను కలిసిన వారిలో నాయకులు ఆనంద్మాదిగ, శ్రీహరి ఉన్నారు. వడదెబ్బతో మాజీ సర్పంచ్ మృతి రొంపిచర్ల: రొంపిచర్ల మాజీ సర్పంచ్ పడాల వెంకిరెడ్డి (82) మంగళవారం మృతి చెందారు. ఆయన గత కొద్దిరోజులుగా విపరీతంగా కాస్తున్న ఎండలకు అస్వస్థతకు గురై, వడదెబ్బ తగిలి నరసరావుపేటలో ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన గ్రామ సర్పంచ్గా పనిచేసి గ్రామాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆయన మృతదేహాన్ని వైఎస్సార్ సీపీ, టీడీపీ నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. హత్యాయత్నం కేసులో ఇద్దరికి రిమాండ్ ముప్పాళ్ళ: ద్విచక్రవాహనం పై వస్తున్న వ్యక్తిని ట్రాక్టర్ తో ఢీకొట్టి హత్యచేయబోయిన సంఘటనపై నమోదైన కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్ఐ పి.అనిల్కుమార్ మంగళవారం తెలిపారు. మండలంలోని చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన కత్తి శివారెడ్డి ఈ నెల 23వ తేదీన సత్తెనపల్లి నుంచి ద్విచక్రవాహనం పై వస్తుండగా, అదే గ్రామానికి చెందిన మధిర వీరారెడ్డి అతనికి అల్లుడు వరసైన అన్నపురెడ్డి కోటిరెడ్డిలు పాతకక్షల నేపధ్యంలో బొల్లవరం అడ్డరోడ్డు వద్ద మట్టిలోడు ట్రాక్టర్తో ద్విచక్రవాహనం వెనుకగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో శివారెడ్డికి గాయాలు కావటంతో చికిత్స నిమిత్తం నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. శివారెడ్డి ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసి అందుకు బాధ్యులైన వారిని అరెస్ట్ చేసి సత్తెనపల్లి కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విఽధించినట్లు ఎస్ఐ తెలిపారు. ఓటర్ లిస్ట్ ‘సర్’ నైనా ప్రక్షాళన చేయాలి గుంటూరు మెడికల్: రాష్ట్రంలో ప్రారంభం కాబోతున్న స్పెషల్ ఇంటెన్సీ రివిజన్(సర్)నైనా ఓటర్ లిస్టులను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు మంగళవారం నిర్వహించిన గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల సమావేశంలో ఎన్నికల ముఖ్య అధికారి వివేక్ యాదవ్కు వినతిపత్రం అందజేశారు. అర్హత గల ఏ ఒక్క రాష్ట్ర పౌరుడిని ఓటు హక్కు కోల్పోకుండా... చనిపోయిన వారి, డూప్లికేట్ ఓటర్లను, దేశం, రాష్ట్రం విడిచి వెళ్లిపోయిన వారి ఓట్లను గుర్తించి తొలగించాలన్నారు. అందులో ఎలాంటి లొసుగులు ఉండకుండా చూడాలని ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ,రాష్ట్ర సమావేశంలో పాల్గొన్న ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ టి.సేవకుమార్ విజ్ఞప్తి చేశారు. ఆధార కార్డుకు సిటిజన్ షిప్ విషయంలో ప్రాధాన్యం లేక పోయినా చనిపోయిన వారి ఓట్లను, డూప్లికేట్ ఓట్లను, దేశం, రాష్ట్రం విడిచి వెళ్లిన వారి ఓట్లను తొలగించడం కోసం... సర్లో ఓటర్ లిస్టులను ప్రక్షాళన చేయడంలో ఆధార్ కార్డు తప్పనిసరి చేయాలని కోరారు. -
గంజాయి ముఠా అరెస్ట్
నగరంపాలెం(గుంటూరు): గంజాయి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని హాల్లో మంగళవారం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. దుగ్గిరాల పీఎస్ పరిధిలో రెండు వారాల క్రితం మాదక ద్రవ్యాల గుర్తింపు కిట్లతో గంజాయి వినియోగదారులైన గండికోట నాగేంద్ర, కోటేశ్వరరావులకు పరీక్షలు చేయించారని చెప్పారు. వారిద్దరూ మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు రుజువైందన్నారు. దీంతో మంగళగిరి రూరల్ పీఎస్ సీఐ ఏవీ బ్రహ్మం, దుగ్గిరాల పీఎస్ ఎస్ఐ వెంకటరవి నేతృత్వంలో ఇద్దరిని విచారించగా, మొత్తం 12 మంది ఉన్నారని వెల్లడైందని అన్నారు. ఐదుగురు గంజాయి తాగి, విక్రయాలు, సరఫరా చేసేవారని, మిగతా ఏడుగురు తాగేవారని చెప్పారు. ఈ క్రమంలో 12 మందిని దుగ్గిరాల లాకుల వద్ద అదుపులోకి తీసుకున్నారని వివరించారు. దుగ్గిరాల బంగ్లా సెంటర్లో ఉంటున్న దగ్గుబాటి రాజశేఖర్ అలియాస్ చంటిపై దుగ్గిరాల, తెనాలి మూడో పట్టణ పీఎస్లో గంజాయి కేసులు, ఎన్బీడబ్ల్యూ పెండింగ్లో ఉందన్నారు. పంజగల మునీంద్ర, షేక్నాగూర్బాబు (తెనాలి, పాండురంగపేట)పై తెనాలి మూడో పట్టణ పీఎస్లో గంజాయి, పేకాట, చోరీ కేసులు, ఏమినేని లక్ష్మీనారాయణపై దుగ్గిరాల పీఎస్లో రౌడీషీట్, గంజాయి కేసు, విజయవాడ రెండో పట్టణ పీఎస్లో దోపిడీ కేసులున్నాయని చెప్పారు. యార్లగడ్డ శశాంక్, గంజాయి వినియోగదారులైన వట్టిప్రోలు చక్రవర్తి(దుగ్గిరాల పీఎస్లో గంజాయి కేసు), ప్రస్తుతం పెదకాకాని నంబూరు గ్రామంలో ఉంటున్న ఈమని గ్రామానికి చెందిన ఉమామహేశ్వరరావు అలియాస్ ఉమా , గండికోట నాగేంద్రబాబు, జముడుగాని కోటేశ్వరరావు అలియాస్ సత్తిపండు, తెనాలి చినరావూరుకి చెందిన షేక్ నజీముద్దీన్ అలియాస్ నయూం, పఠాన్ ఇస్మాయిల్, కుందర చందులను అరెస్ట్ చేశారని అన్నారు. వీరి నుంచి 2.5 కిలోల గంజాయి, రూ.2 వేలు, మోటారు సైకిల్ సీజ్ చేశారని చెప్పారు. దగ్గుబాటి రాజశేఖర్ ఒడిశాలోని కోరాపుట్ వెళ్లి గంజాయి కొనుగోలు చేసేవాడని అన్నారు. తద్వారా మునీంద్ర, నాగూర్బాబు, లక్ష్మీనారాయణ, శశాంక్లకు విక్రయించేవారు. వీరు గంజాయి తాగి, దుగ్గిరాల, ఈమని, రేవేంద్రపాడు గ్రామాల్లో యువకులకు విక్రయించేవారు. విక్రయించిన సొమ్ముతో జల్సాలు చేసేవారని పేర్కొన్నారు. కేసు ఛేదించిన మంగళగిరి రూరల్ పీఎస్ సీఐ ఏవీ బ్రహ్మం, ఎస్ఐ ఎస్.వెంకటరవి, హెచ్సీ ఎం.కోటేశ్వరావు, కానిస్టేబుళ్లు డి.మరియకుమార్, అబ్దుల్ఫరీద్, కె.విజయ్ కుమార్, వై.సాంబయ్య, హోంగార్డు షేక్ సైదాలను జిల్లా ఎస్పీ అభినందించి, ప్రశంసా పత్రాలు అందించారు. -
ప్రత్యామ్నాయం చూపిన తర్వాతే ఇళ్లు తొలగించాలి
తాడికొండ: ఎన్–8 రహదారి నిర్మాణం వలన ఇళ్లు కోల్పోతున్న రైతులకు పరిహారం అందించి ప్రత్యామ్నాయం చూపిస్తే ఇళ్లు నిర్మించుకున్న అనంతరం తమ గృహాలను తొలగించాలని ఏపీ సీఆర్డీయే నిర్వహించిన గ్రామసభలో బాధితులు కమిషనర్ విజయ రామరాజుకు తెలిపారు. ఏపీ సీఆర్డీయే ఆధ్వర్యంలో మంగళవారం మందడం గ్రామంలో భూ సేకరణ గ్రామసభను నిర్వహించారు. రంజిత్ అనే రైతు మాట్లాడుతూ గ్రామకంఠం కింద తనకున్న 58 సెంట్లు భూమిలో పాలవాగు, ఎన్–8 రహదారి పోతుందని, అది పోగా మిగిలిన భూమిని కూడా తీసుకొని తనకు మొత్తం ఒకే చోట భూమి ఇవ్వాలని కోరాడు. కమిషనర్ వి విజయరామరాజు మాట్లాడుతూ రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతులు స్థానికంగా అందుబాటులో ఉండే కాంపిటెంట్ అథారిటీ కార్యాలయాలలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలన్నారు. గ్రామసభలో అడిషనల్ కమిషనర్లు ఏ భార్గవ తేజ, కొల్లాబత్తుల కార్తీక్, ఏపీ సీఆర్డీయే ప్లానింగ్ విభాగ డైరెక్టర్ బి సురేష్ కుమార్, డైరెక్టర్– ల్యాండ్స్(క్యాపిటల్ సిటీ) ఎన్ వసంత రాయుడు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే ఎస్ రవీంద్ర ప్రసాద్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు పి మధుసూదనరావు, ఎం శేషిరెడ్డి, తహసీల్దార్లు పి సతీష్, డి సునీల్ బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. మందడం గ్రామసభలో సీఆర్డీయే అధికారులకు మొరపెట్టుకున్న గ్రామస్తులు -
రోడ్డు ప్రమాదంలో 8 మందికి గాయాలు
గుంటూరు రూరల్: రోడ్డు ప్రమాదంలో టాటాఏసీ వాహనం.. కారు ఢీకొని 8 మందికి గాయాలైన ఘటన మంగళవారం నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నల్లపాడు పోలీసులు తెలిపిన వివరాలు.. మేడికొండూరుకు చెందిన టాటాఏసీ డ్రైవర్ శివరామకృష్ణ తన క్లీనర్ లింగాల నరసింహారావుతో కలసి టాటాఏసీ వాహనంలో విజయవాడ వెళుతున్నారు. ఈ క్రమంలో టాటాఏసీ బుడంపాడు సమీపంలోని సత్యసాయిబాబా ట్రస్ట్ ప్రాంతంలో ఎన్హెచ్ 16 వైవేలో వెళుతుండగా ఒక్కసారిగా వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొని గాల్లోకి లేచి అవతలవైపు రోడ్డుపై పడింది. ప్రమాదంలో డ్రైవర్ క్లీనర్ తీవ్రగాయాలపాలవ్వగా, అదే సమయంలో విజయవాడ నుంచి బాపట్ల జిల్లా వేటపాలేనికి చెందిన షేక్ జాఫర్సాదిక్, అతడి భార్య గౌషార్సుల్తాన్, కుమారుడు నవాజ్షరీఫ్, కుమార్తె వజీహాసుల్తానా, బావ సయ్యద్ మహబూబ్హుస్సేన్, షేక్ మామానాజిన్ ఆరుగురు కారులో వేటపాలెంకు వెళుతున్నారు. అదేసమయంలో రోడ్డు అవతలవైపునుంచి టాటాఏసీ వాహనం కారు ముందు సడన్గా పడటంతో కారు టాటాఏసీ వాహనాన్ని ఢీకొంది. ప్రమాదంలో కారులోని ఆరుగురు గాయపడ్డారు. అదే సమయంలో విజయవాడ నుంచి చిలకలూరిపేటకు వెళుతున్న ఒక ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురైన వాహనాలను ఢీకొంది. ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళుతున్న ఇరువురు యువకులకు స్వల్ప గాయాలు కాగా వారు తమ వాహనం తీసుకుని వెళ్లిపోయారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు ప్రమాదానికి గురైన కారులోని ఆరుగురిని, టాటాఏసీలోని ఇద్దరిని చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గాయాలపాలైన షేక్ జాఫర్ సాధిక్, గౌషార్సుల్తానా తీవ్రగాయాలైన డ్రైవర్ శివరామకృష్ణ -
● టీడీపీ నాయకులే బ్యానర్లు కట్టి.. పోలీసులకు ఫిర్యాదు ● రంగంలోకి దిగిన పోలీసులు ● రెండేళ్ల కిందట గ్రామం వదిలిన రామారావు అరెస్టు ● హత్యాయత్నం కేసులో శిక్ష తప్పదని ముందుగా పథక రచన
వైఎస్సార్ సీపీ నాయకులపై అక్రమ కేసులు తాడికొండ: తనపై ఉన్న హత్యాయత్నం కేసును రాజీ చేసుకునేందుకు మరో మార్గం లేక సాక్ష్యాలు, ఆధారాలు బలంగా ఉండటంతో ఎక్కడ శిక్ష పడుతుందో అనే భయంతో వైఎస్సార్ సీపీకి చెందిన నాయకులపై తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేసిన ఘటన తాడికొండ మండల పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. ముక్కామల గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త చిన్ని రామారావును 2024 ఎన్నికల ఫలితాల అనంతరం అదే గ్రామానికి చెందిన యార్డు మాజీ చైర్మన్ చిమటా పూర్ణచంద్రరావు మరి కొందరు కలిసి దాడిచేసి కత్తితో పీక కోయడంతో ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకున్నాడు. అనంతరం ప్రాణ భయంతో గ్రామం వదిలి పెదకాకాని మండలం వెనిగండ్లలో తలదాచుకుంటున్నాడు. ఆ కేసు తుది దశకు చేరడం సాక్ష్యాలు, ఆధారాలు బలంగా ఉండటంతో ఎక్కడ తనకు శిక్ష పడుతుందోననే భయంతో కుటిల పన్నాగం పన్ని గ్రామంలో నివాసం ఉండని వైఎస్సార్ సీపీకి చెందిన దామనబోయిన వెంకటేశ్వరరావు పుట్టిన రోజును వేదికగా చేసుకున్నాడు. అందులో భాగంగా పక్కా ప్రణాళికను రచించి పుట్టిన రోజు సందర్భంగా చిన్ని రామయ్య బ్యానర్ వేసినట్లు అందులో ‘సప్త సముద్రాల అవతల ఉన్నా పిలిపిస్తాం... ఓటమికి భయం పుట్టిస్తాం’ అనే క్యాప్షన్ను పెట్టి ఓ బ్యానర్ను సృష్టించి గ్రామంలో కట్టారు. దీనికి రక్తాభిషేకం చేసినట్లు బ్యానర్పై రక్తాన్ని చిమ్మి దానిని వైఎస్సార్ సీపీ కార్యకర్త చిన్ని రామారావు కట్టినట్లుగా ఫొటోలు వేసి వివాదాస్పదంగా ఉందంటూ పోలీస్స్టేషన్లో నేరుగా ఆయనే ఫిర్యాదు చేశాడు. ఇంకేముంది రంగంలోకి దిగిన పోలీసులు వెనిగండ్లలో ఉన్న చిన్ని రామారావును కౌన్సెలింగ్ ఇచ్చి మొత్తం 26 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. పుట్టిన రోజు చేసుకున్నట్లు బ్యానర్లో ఫొటో వేసిన వెంకటేశ్వరరావు గుంటూరులో నివాసం ఉంటుండగా బ్యానర్ కట్టినట్లు ఫిర్యాదు చేసిన చిన్ని రామారావు ఊరు వదిలి వెనిగండ్ల గ్రామంలో ఉంటున్నాడు. ఈ ఘటనపై బాధితుడు భార్య చిన్ని మాణిక్యమ్మ మాట్లాడుతూ తన భర్త ఇంటి వద్ద పని చేసుకుంటుండగా మధ్యాహ్నం సమయంలో పోలీసులు వచ్చి తీసుకెళ్లారని, అన్నం తిని వస్తానన్నా వినకుండా కారులో ఎక్కించుకొని మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో తీసుకెళ్ళి 5.30 గంటలకు పోలీస్స్టేషన్కు తీసుకొచ్చారన్నారు. తనను కూడా మాట్లాడనీయకుండా కేసు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు. తన భర్తపై హత్యాయత్నం చేసిన చిమటా పూర్ణచంద్రరావు ఆయనే బ్యానర్ కట్టి రాజీ కోసం తమను ఇలా తప్పుడు కేసులతో బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లా పాపలు, గోడ్డు గోదాతో ఊరు వదిలి తలదాచుకున్న మాపై ఇలా కక్ష్య సాధింపు చర్యలకు దిగడం ఎంతవరకు న్యాయమని కన్నీటి పర్యంతమయ్యారు. -
అర్జీలు పునరావృతం కాకూడదు
బాపట్ల: పీజీఆర్ఎస్లో అర్జీలు పునరావృతం కాకుండా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట, డీఆర్ఓ జి.గంగాధర్ గౌడ్ తో కలసి కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అర్జీదారుల సమస్యలకు సంబంధిత శాఖల పరిధిలో అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపగా మరికొన్నిటిని విచారణకు ఆదేశిస్తూ ఆయా శాఖలకు అందజేసి పరిశీలించి పరిష్కరం చూపాలని ఆదేశించారు. అదేవిధంగా జనగణన ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.విజయమ్మ, గ్రామీణ నీటి సరఫరా శాఖ ఎస్ఈ ఆనంతరాజు, సీపీఓ ఏఎస్ రాజు, ఇతర జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మరింత ఆకర్షణీయంగా సూర్యలంక బీచ్ సూర్యలంక బీచ్ను మరింత ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభు త్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం సూర్యలంక బీచ్లో స్వదేశ్ దర్శిని 2.0 పథకం ద్వారా జరుగుతున్న వివిధ రకాల అభివృద్ధి పనులను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ సూర్యలంక బీచ్ను మరింత ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. నిర్లక్ష్యానికి తావులేకుండా వేగవంతంగా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా ఇన్చార్జి టూరిజం అధికారి ఆనంద సత్యపాల్, ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ -
ఎమ్మెల్యే వేగేశన వల్ల ప్రాణహాని
ఎస్పీకి మాజీ కౌన్సిలర్ ఫిర్యాదు బాపట్ల: ఏబీఎం ఆస్తులను అక్రమ రిజిస్ట్రేషన్తో సొంతం చేసుకుని ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మరాజు అక్రమ కట్టడాలు చేపడుతున్నారని ఫిర్యాదు చేసినందుకు ఆయన నుంచి ప్రాణ హాని ఉందంటూ మాజీ కౌన్సిలర్ వేమవరపు విజయ్కుమార్ పేర్కొన్నారు. ప్రజాసమస్యల పరిష్కారవేదికలో సోమవారం ఎస్పీ పిజిఆర్లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేతోపాటు ఆయన అనుచరుల నుంచి కూడా తనకు ప్రమాదం పొంచి ఉందని సూచించారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు. తెనాలి: తెనాలిలో అదివారం రాత్రి కురిసిన వర్షం, గాలులకు తెగిపడిన విద్యుత్ తీగె ఉదయాన్నే ఓ నిండు ప్రాణం తీసింది. పట్టణ నాజరుపేటలోని రూరల్ పోలీసు స్టేషనుకు సమీపంలో రోడ్డు పక్కన ఇంటిలో నివసించే షేక్ ప్యారీజాన్ (68) సోమవారం ఉదయం ఇంటిముందు ఊడుస్తోంది. ఆదివారం రాత్రి కురిసిన వర్షం, గాలులకు రోడ్డుపై పడిన చెత్త ఊడ్చే క్రమంలో, సమీప పోలీస్స్టేషను ప్రాంగణంలో చెట్టుకొమ్మలు విరిగిపడటాన్ని గమనించారు. ఉత్సుకతతో చేతిలో డస్ట్బిన్తో సహా అక్కడకు వెళ్లారు. అప్పటికే అక్కడ తెగిపడిన విద్యుత్ తీగె ఆమె కాలికి తగలటంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెంది. ఇంటి బయట ఊడుస్తున్న ప్యారిజాన్ ఇంకా రాలేదేమని కుటుంబసభ్యులు ఆందోళనతో పరిసరాల్లో వెతుకుతుండగా విగతజీవురాలై కనిపించింది. ప్యారిజాన్ భర్త మాజీ సైనికుడు. ఇంతకుముందే మృతిచెందారు. కుమార్తెకు వివాహమైంది. గతేడాది ప్యారిజాన్ హజ్యాత్రకు కూడా వెళ్లివచ్చారు. గుంటూరు లీగల్: గుంటూరు జిల్లా కోర్టు పరిధిలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా బదిలీ చేస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయికళ్యాణ్ చక్రవర్తి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజా సేవలు–ఏపీజీఎంఎస్ఎస్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిబ్బందిని వివిధ కోర్టులకు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. రూ.24.78 లక్షల విత్తనాలు స్వాధీనం నగరంపాలెం: నగర పరిధిలోని విత్తన దుకాణంలో సోమవారం గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి డి.సూర్యశ్రావణ్కుమార్ ఆదేశాల మేరకు తనిఖీలు కొనసాగాయి. ఏటుకూరు రోడ్డులోని వాసవి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో పరిశీలించగా, రికార్డులు సరిగాలేకపోవడం, విత్తనాల తయారీకి వాడే ప్రాసెసింగ్, ప్యాకింగ్ లైసెన్న్స్ పొందకపోవడాన్ని గుర్తించారు. ఈ క్రమంలో ఐదు రకాల విత్తనాలైన సూపర్ బిబి–11 గోల్డ్, సూపర్ యమునా గోల్డ్ 1904, వరి, ప్రాసెస్ చేయబడిన/ రసాయన పూత పూసిన వరి(వదులుగా ఉన్నవి), ప్రాసెస్ చేయబడని/ శుద్ధి చేయని వరి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. రూ.24.78 లక్షల విలువ చేసే 26,791 కిలోల విత్తనాలు అని అధికారులు తెలిపారు. -
బగళాముఖి అమ్మవారి ఆదాయం రూ.7.65 లక్షలు
కర్లపాలెం: చందోలు గ్రామంలో వేంచేసియున్న శ్రీ బగళాముఖి అమ్మవారి ఆలయంలోని హుండీ కానుకల ద్వారా రూ.7,65,584ల ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ నరసింహమూర్తి తెలిపారు. సోమవారం బగళాముఖి అమ్మవారి ఆలయంలోని హుండీ కానుకలను భక్తులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, అధికారుల ఆధ్వర్యంలో లెక్కింపు జరిపారు. 114రోజులకు గాను లెక్కింపు జరిపామని, గతం కంటే రూ.95,546లు అధిక ఆదాయం వచ్చిందని ఈఓ తెలిపారు. పొన్నూరు హెచ్డీఎఫ్సీ బ్రాంచ్ మేనేజర్ నాగరాజు, దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఎం.గోపి, దేవస్థానం ట్రస్ట్బోర్డు అధ్యక్షుడు కలకోట చక్రధర్రెడ్డి, సభ్యులు, పూజారులు పాల్గొన్నారు. గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్ష కేంద్రాలను సోమవారం ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి పి.రంజిత్ బాషా తనిఖీ చేశారు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల, భాష్యం జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాలను సందర్శించిన రంజిత్ బాషా సీటింగ్ ఏర్పాట్లతో పేస్టు సీసీ టీవీల పనితీరు, విద్యార్థులకు అవసరమైన ప్రాథమిక సౌకర్యాలను తనిఖీ చేశారు. ఆయా పరీక్ష కేంద్రాల సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లతో మాట్లాడారు. ప్రస్తుతం నెలకొన్న తీవ్రమైన వేసవి తాపం దృష్ట్యా పరీక్షల సమయంలో విద్యార్థులకు, సిబ్బందికి చల్లని తాగునీటిని అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. ఆయన వెంట ఆర్ఐవో జి.సునీత, డీఈసీ సభ్యులు పాల్గొన్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా 52 కేంద్రాల్లో జరిగిన సప్లిమెంటరీ పరీక్షలకు కేటాయించిన 16,812 మంది విద్యార్థుల్లో 15,396 మంది హాజరయ్యారు. విజయపురిసౌత్: కృష్ణానది యాజమాన్య బోర్డు ఆదేశాల మేరకు నాగార్జునసాగర్ కుడికాలువకు తాగునీటిని అధికారులు సోమవారం విడుదల చేశారు. అనంతరం ప్రాజెక్ట్ ఈఈ రమేష్ మాట్లాడుతూ నాగార్జునసాగర్ కుడికాలువకు మొత్తం 10 టీఎంసీల నీటిని 15 రోజులపాటు విడుదల చేయనున్నట్లు తెలిపారు. కుడి కాలువ గేట్ల ద్వారా 6000 క్యూసెక్కులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. కుడి కాలువ ఆయకట్టు పరిధిలోని చెరువులను నింపుకొని తాగునీటి అవసరాల నిమిత్తం వాడుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో కార్యక్రమంలో సాగర్ ప్రాజెక్ట్ గేట్స్ డీఈ శ్రీకాంత్, ఏఈఈ సుధా, డ్యాం సిబ్బంది యాంపల్లి రమణ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో 13 మందికి గాయాలు సత్తెనపల్లి: రోడ్డు ప్రమాదంలో 13 మందికి గాయాలైన సంఘటన సత్తెనపల్లి మండలం పాకాలపాడు గ్రామానికి వెళ్లే కాలువ కట్ట వద్ద సోమవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నా యి. సత్తెనపల్లి మండలం అబ్బూరు గ్రామం నుంచి చండ్రాజుపాలేనికి చెందిన మిరప కూలీలతో వాహనాన్ని పాకాలపాడు నుంచి ఎదురుగా వస్తున్న థమ్సప్ కూల్డ్రింక్ లోడుతో వస్తున్న ఆటో ఢీకొంది. మిరప కూలీలు ఇరువురు పిల్లలు, ముగ్గురు మహిళలకు గాయాలు అయ్యాయి. మరో ఆరుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఇరువురు వాహనాల డ్రైవర్లకు స్వల్ప గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆహార భద్రత – పోషకాహార సాధనలో మహిళలే ఆదర్శం
కొల్లిపర(తెనాలి): ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆహార భద్రత, పోషకాహార మెరుగుదల, మహిళా సాధికారత సాధ్యమవుతోందని అంతర్జాతీయ ప్రతినిధుల బృందం అభిప్రాయపడింది. రైతు సాధికార సంస్థ (ఆర్వైఎస్ఎస్) ఎగ్జిక్యూటివ్ వైస్చైర్మన్ విజయ్ కుమార్, గ్లోబల్ అలయనన్స్ ఫర్ ఎ సస్టైనబుల్ ప్లానెట్ (జీఏఎస్పీ) సెక్రటరీ జనరల్ సత్య ఎస్.త్రిపాఠి, వోయసీ వెంచర్స్ సహ వ్యవస్థాపకులు ఫిలిప్ కుస్తో జూనియర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ హైకో హెన్నింగ్ సోమవారం సాయంత్రం కొల్లిపర మండలంలోని ప్రకృతి వ్యవసాయ నమూనాలను సందర్శించారు. ప్రకృతి వ్యవసాయం డీపీఎం రాజకుమారి ప్రతినిధుల బృందానికి స్వాగతం పలికారు. అనంతరం ప్రకృతి వ్యవసాయ తొమ్మిది సూత్రాల చక్రాన్ని పరిశీలించిన ప్రతినిధులు ‘చాలా గొప్ప ఆలోచన’గా ప్రశంసించారు. వీసీ విజయ్కుమార్ ప్రకృతి వ్యవసాయ తొమ్మిది సూత్రాల ప్రాముఖ్యతను వివరించారు. ముఖ్యంగా 365 రోజుల భూకవచం సూత్రం, పీఎండీఎస్ విత్తనాల పెలైటెజేషన్ విధానాన్ని వివరించార. తక్కువ నీటి వినియోగంతో అధిక మొలక శాతం సాధించగల పద్ధతిగా పెలైటెజేషన్ విధానాన్ని వారు అభినందించారు. అనంతరం మహిళా రైతు జి.లక్ష్మి సాగు చేస్తున్న సూర్య మండల పోషకాహార తోటను సందర్శించారు. ఇరవైకి పైగా రకాల పంటలు, కూరగాయలు, ఆకుకూరలతో ఏర్పాటుచేసిన ఈ నమూనాను పరిశీలించిన ప్రతినిధులు సంతృప్తిని వ్యక్తంచేశారు. రైతు లక్ష్మి సేవలను అభినందించారు. ముఖ్యంగా ఫిలిప్ కుస్తో జూనియర్, గ్రామ ఆరోగ్యం, పోషకాహారంపై శ్రద్ధను ప్రశంసించారు. అనంతరం ఆర్ఎస్కే కేంద్రంలో అభ్యుదయ వీఓ, ధనలక్ష్మి స్వయం సహాయక సంఘ సభ్యులతో సమావేశమయ్యారు. అక్కడి గ్రామ ప్రొఫైల్, మహిళా సంఘాల కార్యకలాపాలు, ఆహార బుట్ట కార్యక్రమాన్ని డీపీఎం వివరించారు. ఫిలిప్ కుస్తో జూనియర్ మాట్లాడుతూ, ‘ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాజెక్టులు, వ్యవసాయ నమూనాలు చూశాను...అయితే ఇక్కడ మహిళలు కుటుంబ ఆరోగ్యం, పోషకాహారం కోసం చేస్తున్న కృషి ఎంతో ప్రేరణాత్మకం’గా చెప్పారు.‘మహిళలు సమాజ నిర్మాణంలో దేవతలతో సమానం...ఆహార బుట్ట కార్యక్రమం గ్రామీణ కుటుంబాల ఆరోగ్య భద్రతకు ఆదర్శ నమూనాగా నిలుస్తోందని ఈవీసీ విజయకుమార్ చెప్పారు. మహిళల భాగస్వామ్యం, ప్రకృతి వ్యవసాయం, ఆరోగ్య–పోషకాహార కార్యక్రమాల సమన్వయం చూసి మహిళల నాయకత్వాన్ని మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ప్రతినిధులు బృందం అభిప్రాయపడింది. -
కుల చిచ్చు రేపడం టీడీపీ నాయకుడికి తగదు
జనసేన మండలాధ్యక్షుడు చలమయ్య కొల్లూరు: కులాలు.. మతాల మధ్య చిచ్చు రేపడం టీడీపీ వర్గాలలోని ఓ నాయకుడికి తగిన పని కాదని జనసేన మండల అధ్యక్షుడు బొందలపాటి చలమయ్య హితవు పలికారు. సోమవారం కొల్లూరు లాక్ సెంటర్లో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, టీడీపీ నాయకుడు కనగాల మధుసూదన్ ప్రసాద్ తమ పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మాటలను వక్రీకరించి కుల, మతాల మధ్య చిచ్చురేపే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మధుసూదన్ ప్రసాద్ మీడియా సమావేశంలో తన తప్పును కప్పి పుచ్చుకునేందుకు జనసేన నాయకులు, కులాలను గొడవలోకి లాగుతున్నారని విమర్శించారు. శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న దాడుల ఘటనలో తన ప్రమేయం లేదని చెబుతున్న మధుసూదన్ప్రసాద్ తన కాల్ డేటాను రేపల్లె డీఎస్పీకి అందజేసి నిష్పక్షపాతంగా విచారణకు సహకరించాలని సూచించారు. కాల్ డేటా ఆధారంగా కనగాల మధుసూదన్ ప్రసాద్ ప్రమేయం లేదని నిర్ధారణ అయితే తాము బహిరంగ క్షమాపణ చెప్పడానికై నా సిద్ధమన్నారు. టీడీపీకి చెందిన వ్యక్తులు దాడులకు పాల్పడితే తమ జిల్లా అధ్యక్షుడు గాదె చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి కుల, మతాల రంగుపులమడం మానుకోవాలని సూచించారు. రెండేళ్ల క్రితం జరిగిన ఇదే తరహాలో జరిగిన గొడవలలో కొందరు రౌడీ మూకలు జనసేన, కాపు కులస్తులపై విచక్షణా రహితంగా దాడులకు పాల్పడిన ఘటనలో కొందరి వ్యక్తులపై కేసులు నమోదు చేయకపోవడం వలనే ఇప్పుడు ఈ దాడి జరిగిందన్నారు. టీడీపీ నాయకుల అనుచరుల ప్రమేయం ఈ దాడులలో లేని పక్షంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, టీడీపీ మండల అధ్యక్షుడు మైనేని మురళీకృష్ణ ఇప్పటి వరకు ఎందుకు ఖండించలేకపోయారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఆనందబాబు మహానాడు ఏర్పాట్ల సమావేశంలో జనసేన కార్యకర్తలపై దాడులకు ఉసిగొల్పుతున్న కనగాల మధుసూదన్ ప్రసాద్ను పక్కన కూర్చోపెట్టుకోవడం ఎంత వరకు సమంజసమని నిలదీశారు. దాడికి గురైన ఉప్పు జానకిరామయ్యను ద్విచక్ర వాహనంపై పోలీసు స్టేషన్కు తీసుకువెళ్లిన యువకుడికి దాడులకు ఎటువంటి సంబంధం లేకపోయినా పోలీసులు కేసులు నమోదు చేయడం అన్యాయమన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా కేసు విచారణ చేసి అమాయకులపై కేసులు తొలగించాలని డిమాండ్ చేశారు. -
కొల్లూరులో కొనసాగిన ఉద్రిక్తత
కొల్లూరు: పోలీసు స్టేషన్పై దాడి ఘటనకు సంబంధించిన వ్యవహారంలో కొల్లూరులో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. సోమవారం దాడి ఘటనకు సంబంధించిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని ఇతర ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్లకు తరలించడం ఆందోళనకు దారితీసింది. కొల్లూరు దళితవాడకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున పోలీసుల అరెస్టులను నిరసిస్తూ సోమవారం రాత్రి రహదారి దిగ్భందించి నిరసన చేపట్టారు. పోలీసులు ఏకపక్ష ధోరణితో కేసులు నమోదు చేసి కొట్లాట, పోలీసు స్టేషన్లో దాడి ఘటనతో సంబందం లేని వ్యక్తులను, ఊరి నుంచి చుట్టం చూపునకు వచ్చిన పిల్లలను సైతం తీసుకుపోయారంటూ రేపల్లె – తెనాలి ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. సుమారు రెండు గంటలకు పైగా రోడ్డు మధ్యలో బైఠాయించి వాహనాల రాకపోకలు కొనసాగకుండా రోడ్డుపై ఆందోళ చేపట్టారు. ఎస్సీ కాలనీ వాసుల ఆందోళనతో రేపల్లె వైపు నుంచి వచ్చే వాహనాలు రాకపోకలు నిలిచిపోవడంతో అప్రమత్తమైన పోలీసులు వాహనాలను దోనేపూడి – కొల్లూరు కరకట్ట వైపు మళ్లించారు. వేమూరు సీఐ పీవీ ఆంజనేయులు, కొల్లూరు, వేమూరు ఎస్ఐలు కోటేశ్వరరావు, శ్రీనివాసరావులు ఆందోళన చేపట్టిన ప్రాంతానికి చేరుకొని వారికి నచ్చచెప్పి రాస్తారోకోను విరమించేందుకు యత్నించారు. అయితే దళితవాడ వాసులు తమ యువకులపై కోడి కత్తితో దాడి చేసిన యువకుడిని, కొట్లాటకు కారణమైన ఆ యువకుడికి చెందిన వ్యక్తులపై కేసులు నమోదు చేయలేదంటూ, వారిని అదుపులోకి తీసుకోలేదని పోలీసులపై విరుచుకుపడ్డారు. దీనిపై సీఐ దాడి ఘటనలో సంబంధం ఉన్న ప్రతి వ్యక్తిపై కేసు నమోదు చేశామని, కోడి కత్తితో దాడి చేసిన యువకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు, హత్యాయత్నం కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నామని నచ్చచెప్పారు. తమ వారిని అదుపులోకి తీసుకొని గుర్తు తెలియని ప్రాంతాలకు తరలించడంపై పోలీసులను నిలదీయడంతో స్థానికంగా ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ఇరు పక్షాలకు చెందిన వ్యక్తులను పలు స్టేషన్లకు తరలించడం జరిగిందని, ఇందులో ఎటువంటి పక్షపాతం లేదని వివరించారు. అమాయకులపై కేసులు నమోదు విషయంలో సీసీ పుటేజ్లు పరిశీలించి ప్రమేయం ఉన్న వ్యక్తులనే అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. పోలీసు స్టేషన్కు వస్తే సీసీ టీవీ పుటేజ్లు చూపించి అనుమానాలు నివృత్తి చేస్తామని హామీ ఇవ్వడంతోపాటు, కొన్ని వీడియోలను ఫోన్లో చూపడంతో శాంతించిన దళితవాడ వాసులు ఆందోళనను విరమించారు. అనంతరం వాహనాల రాకపోకలను పునరుద్ధరించిన పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు. -
చైతన్య గ్రామం.. పేకాట నిలయం
యడ్లపల్లిలో జోరుగా పేకాట తెనాలి: బాపట్ల జిల్లా చుండూరు మండల గ్రామం యడ్లపల్లి వ్యవసాయ ప్రధానమైంది... ఇక్కడి రైతులు, ప్రజలు చైతన్యవంతులు. దివంగత ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తుఫాన్కు పంటనష్టం ఎన్యూమరేషన్లో జరిగిన అన్యాయంపై చేసిన పోరాటాన్ని ఇప్పటికీ గుర్తుచేసుకుంటారు. ఫలితంగా అప్పటి సీఎం ఎన్టీఆర్ ఆ గ్రామాన్ని ప్రత్యేకంగా సందర్శించారు. సారా ఉద్యమానికి మద్దతుగా, జనావాసంలో మద్యం దుకాణానికి వ్యతిరేకంగా అక్కడి మహిళలు పోరాడారు. అంతటి చైతన్యవంతమైన గ్రామం ఇప్పుడు జూదక్రీడకు నిలయమైంది. రాజకీయ నేతలు, పోలీసుల ఆశీస్సులతో పేకాటకు కేంద్రంగా మారింది. ఎక్కడెక్కడి చేయితిరిగిన మొనగాళ్లు ఇక్కడ రోజూ పేకముక్కలు కలుపుతుంటారు. రూ.లక్షలు చేతులు మారుతుంటాయి. అయినా స్థానికులు మౌనం వహిస్తుండటం చిత్రంగా ఉంది. కొత్తవారికి ప్రవేశం నిషిద్ధం యడ్లపల్లిలోని జాతీయ బ్యాంకు దగ్గర్లోని ఓ నివాసంలో ప్రతిరోజూ సాయంత్రం నుంచి జూదక్రీడ ఆరంభిస్తారు. కొన్ని గంటలు సీక్వెన్స్ తర్వాత కోతముక్కాటకు దిగుతున్నారు. రెండు, మూడు గంటలు...ఫటాఫట్...! విజేతలు, తరాజులు ఎవరో తేలిపోతుంది. ఆరోజుకి ఇక సెలవు. కాదు కూడదనుకుంటే జూదక్రీడ...గ్రామానికి దగ్గర్లోని నిమ్మతోటకు మారుతుంది...లేదా సంగంజాగర్లమూడి రోడ్డులోని మరో ఇంటికి చేరుతుంది. పేకాట మాత్రం కామన్. మెడలో చైన్, జేబులో నోట్లు, కారు లేదా హీనపక్షం బైక్ కలిగిన సంపన్నులు, వ్యాపారవర్గాలకు చెందిన వ్యసనపరులకు మాత్రమే అక్కడ ప్రవేశం! యడ్లపల్లి పరిసరాల్లోని వారు, తెనాలిలోని కూటమిలోని ఒక పార్టీ నాయకులు, గుంటూరుకు చెందిన పేకాటరాయుళ్లు నిత్యం అక్కడ కలుస్తుంటారు. సెల్ఫోన్ వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే సమాచారమే అందరికీ సంధానకర్త. కొత్తవారికి అక్కడ ప్రవేశం నిషిద్ధం. చిల్లర ఆటగాళ్లకు అటుకేసి కన్నెత్తి చూసే ధైర్యం ఉండదు. వాహనాలను గ్రామంలోని రోడ్లపైనే అక్కడక్కడా నిలిపిఉంచుతారు. అధికార పార్టీ నేతల అండదండలతో.. అధికార కూటమి పార్టీకి చెందిన యడ్లపల్లికి చెందిన ఓ వ్యక్తికి పేకాట నిత్యకృత్యం. గతేడాది సంక్రాంతి సందర్భంగా చుండూరు మండలంలోని కేఎన్ పల్లి వద్ద కోడిపందేలు, పేకాట బరిని నిర్వహించారు. మళ్లీ ఈ సంవత్సరం సంక్రాంతికి కోడిపందేలను మినహాయించి, పేకాటకే అతడిని సరిపెట్టినట్టు తెలిసింది. వీటికి ముందుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో సంగం జాగర్లమూడి రోడ్డులో కోడిపందేలను నిర్వహించి, చూసేందుకు వచ్చిన ఔత్సాహికుల నుంచి రూ.100 చొప్పున ‘వినోద పన్ను’ వసూలుచేసిన ఘనాపాఠి ఆ కూటమి ఛోటానేత!. ఈసారి తెనాలి త్రీటౌన్ పోలీస్ స్టేషను పరిధిలోని తమకు అనుకూలంగా లేకపోవటంతో కూటమికి చెందిన స్థానిక నాయకుడు, యడ్లపల్లి తెలుగు తమ్ముడితో చేతులు కలిపి ఆ గ్రామంలో పేకాట కేంద్రం తెరిచారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఆశీర్వాదం లేకుంటే అంత భారీస్థాయిలో పేకాట జరగదని ఎవరైనా చెబుతారు. పెద్దల ఆశీస్సులుంటే పోలీసులు మటుకు ఎందుకు ఊరుకుంటారు! చివరకు జిల్లా ఎస్పీకి సమాచారం ఇవ్వాల్సిన ఎస్బీ పోలీసులు కూడా మౌనం వహిస్తున్నారంటే క్రమం తప్పక అందుతున్న మామూళ్లేనని జనం చర్చించుకుంటు న్నారు. ఎవరైనా తెగించి పోలీసులకు ఫోన్ చేసినా, నిముషాల వ్యవధిలో పేకాట నిర్వాహకులకు తెలిసిపోతోందని కూడా చెబుతున్నారు. దీంతో లేనిపోని తంటా ఎందుకు? అనుకుంటూ స్థానికులు మౌనరాగానికి పరిమితమయ్యారు. ఖాకీలు కన్నెత్తి చూడరు..! ఇంత భారీస్థాయిలో నిర్విఘ్నంగా పేకాట జరుగుతున్నా పోలీసులు అటుకేసి చూడటం లేదు. ఎవరైనా ఫిర్యాదుచేస్తే, హడావుడిగా వెళ్లి నలుగురిని పట్టుకున్నట్టు కేసు నమోదుచేస్తున్నారు. మళ్లీ షరా ‘మామూలే’! ఇదంతా పేకాట నిర్వాహకులు, పోలీసుల మధ్య అవగాహనతోనే జరుగుతోందనే ఆరోపణలున్నాయి. చుండూరు ఎస్ఐగా మహిళా అధికారిణి ఉన్నారు. జిల్లా ఎస్పీకి సమాచారం ఇవ్వాల్సిన స్పెషల్బ్రాంచి పోలీసులు నుంచి చుండూరు పోలీసు అధికారుల వరకు ఎవరి వాటా వారికి అందుతుందని, అందుకే అంత ధైర్యంగా పేకాట జరుగుతోందని బహిరంగంగానే వినిపిస్తోంది. పేకాట ఆటగాళ్లకు అవసరమైన వాటర్ బాటిళ్లు, సిగరెట్లు, కూల్డ్రింక్స్కు అక్కడ విపరీతమైన డిమాండ్ ఉంటోంది. ఆ చిరువ్యాపారులకే కాదు.. అక్కడ ఏస్థాయిలో పేకాట జరుగుతుందనేది గ్రామస్తుల్లో చాలామందికి తెలుసు. -
అస్తవ్యస్తంగా వార్డుల విభజన
మున్సిపాలిటీల్లో వార్డుల విభజన ప్రక్రియ శాసీ్త్రయంగా నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ చీరాల నియోజకవర్గ ఇన్చార్జి కరణం వెంకటేష్బాబు ఆదేశాల మేరకు పార్టీ పట్టణ అధ్యక్షులు యాతం మేరిబాబు, పార్టీ నాయకులు ఆధ్వర్యంలో వార్డుల పునర్విభజన ప్రక్రియను న్యాయబద్దంగా చేపట్టాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందించారు. వార్డుల విభజనతో ప్రజలు గందరగోళంలో ఉన్నారని, ప్రజాప్రతినిధులకు, అధికారులకు పూర్తి అవగాహన లేకుండా విభజించడం అన్యాయమన్నారు. వార్డుల విభజనలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని, జనాభాకు తగ్గట్లుగా విభజన చేయాలన్నారు. వార్డుల్లో వైఎస్సార్ సీపీ ఓట్లను చీల్చేందుకు విభజన ప్రక్రియను అడ్డుపెట్టుకుంటున్నారని ఆక్షేపించారు. చీరాల: జిల్లాలోని మున్సిపాలిటీల్లో వార్డుల విభజనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎటువంటి పారదర్శకత లేకుండా ప్రజాభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోకుండా కూటమి పార్టీలకు అనుకూలంగా విభజన ప్రక్రియ చేసినట్లు తేటతెల్లమవుతోంది. ఇటీవల మున్సిపాలిటీల్లో విడుదల చేసిన ముసాయిదా జాబితాలో వీధుల పేర్లు కనిపించడం లేదు. దీంతో వార్డుల విభజన అసంబద్ధంగా చేశారంటూ వైఎస్సార్ సీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ అధికారులకు వినతిపత్రాలు అందించారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలో చీరాల, బాపట్ల, రేపల్లె మున్సిపాలిటీలు ఉన్నాయి. వార్డుల పెంపు వివరాలు ప్రజలకు తెలియజేసేలా నోటీసు బోర్డుల్లో ఉంచి వారం రోజుల్లో అభ్యంతరాలు స్వీకరించాలని పురపాలక కమిషనర్లు సూచించారు. మున్సిపాలిటీల్లో జనాభా సంఖ్య ఆధారంగా వార్డుల విభజన ప్రక్రియను పురపాలక శాఖ చేపట్టింది. చీరాల మున్సిపాలిటీలో మొత్తం 33 వార్డులు, రేపల్లెలో 28 వార్డులు ఉన్నాయి. అయితే బాపట్ల మున్సిపాలిటీలో శివారు గ్రామాల విలీనంపై హైకోర్టులో కేసు విచారణలో ఉండటంతో గత ఎన్నికలు నిర్వహించలేదు. జనాభా ప్రాతిపదికన విభజన మున్సిపాలిటీల్లో జనాభా ప్రాతిపదికన వార్డుల విభజన ప్రక్రియపై అంచనాలు వేశారు. చీరాల మున్సిపాలిటీలో 2011 లెక్కల ప్రకారం 87 వేల మంది జనాభా ఉన్నారు. ప్రస్తుతం జనాభా లక్ష వరకు ఉందని అంచనా. మున్సిపాలిటీలో 33 వార్డులు ఉండగా 11 వార్డులు పెరగడంతో ఆ సంఖ్య 44కు చేరింది. అలాగే రేపల్లె మున్సిపాలిటీలో 2011 లెక్కల ప్రకారం 54 వేల మంది జనాభా ఉండగా ప్రస్తుతం 60 వేల వరకు పెరిగింది. ఇక్కడ 28 వార్డులు ఉండగా ప్రస్తుత జనాభా ప్రకారం 8 వార్డులు పెంచడంతో 36కు చేరింది. వార్డుల విభజనకు మున్సిపాలిటీల్లో రౌండ్ ది క్లాక్ విధానంలో విభజన చేశారు. అలానే వార్డుల్లో జనాభా ప్రాతిపదికన జనాభా సంఖ్య ఆధారంగా వార్డులను పునర్విభజన చేశారు. కూటమి నేతల కనుసన్నల్లోనే.. మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియ పారదర్శకంగా చేపట్టలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈనెల 17న మున్సిపాలిటీల్లో వార్డుల విభజన నమూనా ముసాయిదా జాబితా విడుదల చేశారు. టౌన్ ప్లానింగ్, సర్వేయర్లు కలిసి వార్డుల్లో జనాభా ప్రాతిపదికన వార్డులను విభజించారు. రౌండ్ ది క్లాక్ విధానంలో విభజన చేసినా ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా చేయడం అన్యాయమని పలు రాజకీయ పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. నమూనా ముసాయిదా జాబితాలో వీధుల పేర్లు లేవు. ఏ ప్రాంతం ఏ వార్డులో ఉందో, ఎంత జనాభా ఉందో తెలియడం లేదు. ఒకే సామాజికవర్గం ఉన్న వార్డులను విభజించి వేరే సామాజికవర్గం వారిని కలిపారు. గతంలో ఒకే సామాజికవర్గం వర్గం ఎక్కువగా ఉన్న వారిని విభజించారు. విభజించిన వార్డుల్లోనూ రోడ్డు కనెక్టివిటీ లేనట్టు తెలుస్తోంది. అస్తవ్యస్తంగా చేపట్టిన పునర్విభజనతో పట్టణ ప్రజల్లో గందరగోళంళ నెలకొంది. ఇదంతా కూటమి నేతల కనుసన్నల్లోనే సాగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాపట్ల మున్సిపాలిటీలో 2011 జనాభా లెక్కల ప్రకారం 77 వేల మంది జనాభా ఉండగా ప్రస్తుతం లక్ష వరకు పెరిగింది. ఏడు శివారు గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై కొందరు 2020 సంవత్సరంలో హైకోర్టుకు వెళ్లడంతో స్టే విధించింది. దీంతో 2021 మార్చిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించలేదు. ప్రస్తుతం జనాభా ప్రాతిపదికన వార్డుల సంఖ్య పెంపుదల, ఎన్నికల నిర్వహణపై స్పష్టమైన నిర్ణయానికి రాలేదు. కోర్టులో స్టే ఎత్తేస్తేనే ఎన్నిక నిర్వహించేందుకు అవకాశం ఉంది. -
రేషన్ డీలర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రవిచంద్రారెడ్డి
చెరుకుపల్లి: ప్రభుత్వం రేషన్ షాపులను మినీమాల్స్గా మార్చటానికి తీసుకున్న నిర్ణయం చాలా సంతోషకరంగా ఉందని, ఆ నిర్ణయాన్ని రేషన్ డీలర్లు స్వాగతిస్తున్నారని బాపట్ల జిల్లా రేషన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టి రవిచంద్రారెడ్డి పేర్కొన్నారు. సోమవారం చెరుకుపల్లిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రవిచంద్రారెడ్డి మాట్లాడుతూ రేషన్ కార్డుదారులకు బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరకు సరుకులు అందించటానికి వీలుగా రేషన్ షాపులను మినీమాల్స్గా మార్చటం ఇటు కార్డుదారుడుకి నాణ్యమైన సరుకులు తక్కువ ధరకు అందించటంతోపాటు ఇటు రేషన్ డీలర్లకు కూడా ఆర్థిక వెసులుబాటు ఉంటుందన్నారు. మండల డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగుల పున్నారావు మాట్లాడుతూ వృద్ధులకు, వికలాంగులకు, 65సంవత్సరాలు పైబడిన వారికి రేషన్ డోర్ డెలివరి డీలర్ల ద్వారా అందిస్తున్నామని అందుకు డీలర్లకు కొంత మొత్తాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. మినీమాల్స్ ఏర్పాటుకు ముందుకు రావాలని అందుకు స్థానిక అధికారుల ద్వారా పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రేషన్ డీలర్లు వై.రజనీకాంత్, ప్రసాద్, బాజీ, సుమలత తదితరులు పాల్గొన్నారు. గుంటూరు లీగల్: తప్పిపోయిన పిల్లల సంరక్షణ బాధ్యత తీసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ కోరారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు తప్పిపోయిన పిల్లల దినోత్సవాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. సయ్యద్ జియాఉద్దీన్ మాట్లాడుతూ పిల్లలు తప్పిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయమన్నారు. తల్లిదండ్రులు పిలల్ల విషయంలో జాగ్రత్త వహించాలని సూచించారు. గుడ్ టచ్, బాడ్ టచ్పై బాలికలకు అవగాహన కల్పించాలని చెప్పారు. ిపిల్లలు తప్పిపోయిన, ఎక్కువ సమయం కనపడకపోయిన దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కోరారు. ఫిర్యాదు తీసుకోని పక్షంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారికి అండగా ఉండి న్యాయం చేస్తుందని వివరించారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ మెంబర్ దుర్గా భవాని, డీసీపీఓ విజయ్కుమార్ పాల్గొన్నారు. -
అర్జీలు పునరావృతం కాకుండా పరిష్కరించాలి
బాపట్ల: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలు పునరావృతం కాకుండా, చట్ట పరిధిలో విచారించి సంతృప్తికర రీతిలో పరిష్కరించాలని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మొత్తం 59 మంది అర్జీదారులు తమ సమస్యలను ఎస్పీతో విన్నవించుకున్నారు. బాధితుల అర్జీలలో ప్రధానంగా భార్యాభర్తల వివాదాలు, కుటుంబ సమస్యలు, భూ తగాదాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన మోసాలు తదితర సమస్యలు ఉన్నాయి. ఫిర్యాదిదారుల సమస్యలను కూలంకషంగా విన్న ఎస్పీ, వారి అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, సత్వరమే స్పందించి వేగవంతంగా పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదిదారుల అర్జీలను చట్ట పరిధిలో విచారించి నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే అర్జీలు మళ్లీ మళ్లీ పునరావృతం కాకుండా క్షేత్రస్థాయిలో సంతృప్తికరమైన శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులకు స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్ నాయక్, పీజీఆర్ఎస్ సెల్ ఇనన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు తదితర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ -
బాపట్ల
మంగళవారం శ్రీ 26 శ్రీ మే శ్రీ 20267అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,1710 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న నిత్యాన్నదానానికి తాడేపల్లికి చెందిన కే శిరీష రూ.1,00,120 విరాళాన్ని సోమవారం అందజేశారు. తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.2,500, గరిష్ట ధర రూ.5,000, మోడల్ ధర రూ.3,700 వరకు పలికింది. 7 -
లక్ష్యాన్ని నెలాఖరుకు పూర్తి చేయాలి
గుంటూరు మెడికల్: హెచ్పీవీ వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని మే నెలాఖరుకు పూర్తి చేయాలని ఇన్చార్జి డీఎంహెచ్ఓ డాక్టర్ అమర్తలూరి శ్రావణ్బాబు అన్నారు. పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులకు హెచ్పీవీ వ్యాక్సిన్, ఎన్సీడీ, హీట్ వేవ్స్, జాతీయ ఆరోగ్య కార్యక్రమములపై సోమవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. డాక్టర్ అమర్తలూరి శ్రావణ్బాబు మాట్లాడుతూ సమావేశంలో ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ సుజాత, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ ప్రియాంక, శివ సాంబి రెడ్డి, వెంకటేశ్వర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు ఎడ్యుకేషన్: మనిషి మరణించిన సమాజానికి ఉపయోగపడితే జన్మకు పూర్తి స్థాయిలో సార్ధకత చేకూరుతుందని జీజీహెచ్ సూపరింటెండెంట్, ఆంధ్రప్రదేశ్ శరీర అవయవదాతల సంఘ అధ్యక్షుడు డాక్టర్ రమణ యశస్వి పేర్కొన్నారు. అఖిల భారత అవయవ శరీర దాతల సంఘ ఆధ్వర్యంలో సావిత్రీబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్(స్పెక్ట్) జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాన్ని సోమవారం అరండల్ పేటలోని ఆర్య సమాజం ప్రాంగణంలో నిర్వహించారు. సమావేశానికి సంఘ జిల్లా గౌరవాధ్యక్షుడు మేడూరి రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించారు. డాక్టర్ రమణ యశస్వి మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద జనాభా కలిగిన మనదేశంలో మూఢ విశ్వాసాలు, అపోహలు తొలగి రక్త, నేత్ర, అవయవ, దేహ దానం ఒక ఉద్యమంగా మారాల్సిన అవసరం ఉందని ఆకాంక్షించారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న అఖిలభారత శరీర అవయవదాతల సంఘ జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేహ, అవయవదానాలపై సరళీకృత విధానాలు తీసుకురావాలని కోరారు. అఖిలభారత శరీర అవయవదాతల సంఘం, స్పెక్ట్ ఆర్గనైజేషన్లు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా లక్షలాదిమందిని చైతన్యవంతులను చేస్తుందని వివరించారు. ఈ సందర్భంగా స్పెక్ట్ ప్రచార గోడ ప్రతులు ఆవిష్కరించిన అనంతరం ఇటీవల నేత్ర, అవయవ, శరీర దానాలు చేసిన వారి కుటుంబ సభ్యులను అతిథులు సత్కరించారు. కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ టి.సేవకుమార్, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
వేటపాలెం: రోడ్డుపై ఆగి ఉన్న బైక్ను వెనుక నుంచి మరో మోటార్ బైక్ ఢీకొన్న ఘటనలో వెనుక కూర్చుని ఉన్న వ్యక్తి మృతి చెందాడు. అక్కాయిపాలెం పంచాయతీ బైపాస్ రోడ్డు జక్షన్ దగ్గరలో ఘటన ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు.. చీరాల వైపు నుంచి ఎస్.శ్రీనివాసరావు(50) తన స్నేహితుడి బైక్పై వేటపాలెం వైపు వస్తున్నాడు. అక్కాయిపాలెం వద్దకు వచ్చే సరికి రోడ్డుపై నిలిపి ఉన్న మరో బైక్ను వెనక నుంచి ఢీకొట్టారు. బైక్ వెనుక కూర్చున్న శ్రీనివాసరావు రోడ్డుపై పడి మృతి చెందాడు. మృతుడు పర్చూరులో కోర్టులో ఉద్యోగం నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
భూములు తిరిగి ఇచ్చేంతవరకు పోరాడుదాం
చినగంజాం: వాన్పిక్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రైతుల నుంచి తీసుకున్న భూములు తిరిగి ఇచ్చేంతవరకు తాము పోరాదాం అని మండలంలోని తీరప్రాంత గ్రామాల ప్రజలు తీర్మానించారు. ఆదివారం మండలంలోని మోటుపల్లి పంచాయతీ రుద్రమాంబపురం రామాలయం ఆవరణలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నేతృత్వంలో మండలంలోని 13 తీరప్రాంత గ్రామాల కాపులు, పెద్దలు సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వాన్పిక్ ప్రాజెక్ట్ ఏర్పాటు కాని దృష్ట్యా స్థానికంగా రైతుల వద్ద నుంచి తీసుకున్న భూములను తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. మూడు దశలలో పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు వెల్లడించారు. ముందుగా రాష్ట్రంలోని అన్ని పార్టీల నాయకులను కలిసి సమస్యను వివరించడం, తరువాత న్యాయపరమైన పోరాటం చేయటం, మూడోదశలో పోరాటాన్ని ఉధృతం చేసి నిరసనలు, ధర్నాలు చేపట్టడం వంటి చర్యలతో ముందుకు సాగుదామన్నారు. కార్యక్రమంలో పండ్రాజు శంకరరావు, కొండూరి గోవింద్ పాల్గొన్నారు. -
గౌడ సామాజిక వర్గంపై సీఎం చంద్రబాబు కక్ష సాధింపు
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి మదన్మోహన్గౌడ్ రేపల్లె: మామిళ్లపల్లి గ్రామ మొక్క జొన్న రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న బీసీ గౌడ సామాజానికి చెందిన వైఎస్సార్ సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త పీటా మోహన్కృష్ణపై పొన్నూరు సీఐ దాడి చేయటం బాధాకరమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి యార్లగడ్డ మదన్మోహన్ గౌడ్ విమర్శించారు. ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. బీసీ గౌడ సమాజానికి చెందిన నాయకులపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా మామిళ్లపల్లిలో గిట్టుబాటు ధర కోసం ప్రశ్నించిన రైతులపై దాడులు చేయటమేగాక అక్రమ కేసులుపెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. రైతులకు సంఘీభావంగా వచ్చిన మాజీ మంత్రి జోగి రమేష్, రేపల్లె సమన్వయకర్త నాగమోహన్కృష్ణలపై ఉద్దేశపూర్వకంగా పోలీసులు దాడికి తెగబడ్డారన్నారు. సీఎం చంద్రబాబు, లోకేష్ల డైరెక్షన్లో రాష్ట్రవ్యాప్తంగా గౌడ సామాజికవర్గ నాయకులపై పోలీసులు, టీడీపీ నాయకులు దాడికి తెగబడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో చట్టాన్ని ఉల్లంఘిస్తున్న చంద్రబాబు భవిష్యత్లో తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి బొర్రా శ్రీనివాసరావు, పట్టణ, మండల కన్వీనర్లు కరేటి శేషగిరిరావు, మేడికొండ అనిల్, జిల్లా అధికార ప్రతినిధి కేవీ కృష్ణారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చిమటా బాలాజీ, మహిళా నాయకులు వీసం నాగలక్ష్మి, పద్మావతి పాల్గొన్నారు. -
ప్రభుత్వాలు రజకులను నిర్లక్ష్యం చేస్తున్నాయి
దాచేపల్లి: రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న రజకుల సమస్యలపై పూర్తిస్థాయిలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని రజక సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక విజయభాస్కర్ కల్యాణ మండపంలో రాష్ట్రస్థాయిలో రజకుల రౌండ్ టేబుల్ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి జాతీయ రజక సమాఖ్య సంక్షేమ సంఘం మాజీ ఉపాధ్యక్షుడు అక్కినపల్లి బాలయ్య అధ్యక్షత వహించారు. రాష్ట్రవ్యాప్తంగా రజకుల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. రజకులు రాజ్యాధికారం కోసం... ఆర్థిక అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రాష్ట్రవాప్తంగా 36 లక్షల మందికి పైగా రజక జనాభా ఉందని, రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని బాలయ్య డిమాండ్ చేశారు. అంటు బట్టల దగ్గరనుంచి శరీరంపై ఉన్న అన్ని బట్టలను శుభ్రం చేసేది రజకులని, వారిని సైతం గ్రామాల్లో అంటరానివారిగానే చూస్తారని, మరి ఎస్సీ జాబితాలో ఎందుకు చేర్చరన్నారు. ఎస్సీ హోదానే ఏక లక్ష్యంగా రజకులందరు ఐక్య పోరాటాలు చేయాలనన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద చేసే ప్రతీ ఆందోళన కేంద్రప్రభుత్వం దృష్టికి వెళుతుందని తెలిపారు. ఇప్పటికే తాము చేసిన ఆందోళనలు ప్రభుత్వం దృష్టికి వెళ్ళాయన్నారు. రానున్న రోజుల్లో అమరావతిలో లక్ష మందితో సభ నిర్వహించాలన్న ఆలోచన ఉందని బాలయ్య అన్నారు. ఈ సమావేశంలో రజక సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు పొత్తూరు షణ్ముఖం, రజక చైతన్య సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాకినాడ రామారావు,రాజమండ్రి నారాయణ, పోకల వెంకటేశ్వర్లు, గంధం అప్పాజి, లాయర్లు నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, మాస్టర్ లక్ష్మీనారాయణ, విజయలక్ష్మి, కల్లేపల్లి శైలజ, పొదిలి శ్రీనావాసరావు, భగత్, టి.భాస్కర్, సిహెచ్ రామకోటేశ్వరరావు. కె.సత్యనారాయణ, కోయ రామారావు, పిడుగురాళ్ళ సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఏం చేయగలవు... పోలీసు!
● రక్షకభటులపై స్టేషనులోనే టీడీపీ నేతల దాడులు ● రెడ్బుక్ రాజ్యాంగంతో నీరుగారుతున్న పోలీసు వ్యవస్థ ● టీడీపీ నేతల అండతో దర్జాగా తిరుగుతున్న అరాచక శక్తులు ● పోలీసులపై గతంలో దాడులు చేసినా చర్యలు శూన్యం ● స్టేషన్లోనే ప్రత్యర్థులపై యథేచ్ఛగా తమ్ముళ్ల ముష్టిఘాతాలు ● మాట వినని పోలీసులపై టీడీపీ నాయకుల తిట్ల దండకాలు ● ప్రజారక్షణ సంగతేమోగానీ.. స్వీయ రక్షణ కూడా చేతగాని ఖాకీలు చట్టాలను చుట్టాలుగా మార్చుకొని టీడీపీ నాయకులు చూపుతున్న పచ్చ పాత ధోరణి చివరకు పోలీసులనే చేతులు ముడుచుకొని కూర్చునేలా చేసింది. చంద్రబాబు ప్రభుత్వంలో అమలవుతున్న రెడ్బుక్ రాజ్యాంగం ఫలితంగా తమను తాము కాపాడుకోలేని పరిస్థితికి పోలీసులు దిగజారిపోయారన్న విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. కొల్లూరు పోలీసు స్టేషన్పై శుక్రవారం అర్ధరాత్రి జరిగిన దాడి ఘటన దీనికి నిలువెత్తు నిదర్శనంలా నిలుస్తోంది. -
బాపట్ల
సోమవారం శ్రీ 25 శ్రీ మే శ్రీ 2026విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 523.80 అడుగులకు చేరింది. ఎస్ఎల్బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. 7నరసరావుపేట రూరల్: ఇస్సపాలెం మహంకాళి ఆలయ నిర్మాణానికి సూరాబత్తిన సీతారామయ్య దంపతులు ఆదివారం రూ.1,11,116 విరాళంగా అందజేశారు. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,2126 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. -
జిల్లా ఫుట్బాల్ సంఘం అధ్యక్షుడిగా క్రాంతికుమార్
గుంటూరు వెస్ట్(క్రీడలు): గుంటూరు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కుమ్మర క్రాంతికుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం స్థానిక హోటల్లో జరిగిన కార్యవర్గ సమావేశంలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ నుంచి గుంజి రమేష్బాబు, అబ్జర్వర్గా చక్రవర్తి, జిల్లా ఒలింపిక్ అబ్జర్వర్లు ఎన్నికలను పర్యవేక్షించి ఫలితాలను ధ్రువీకరించారు. నూతన కమిటీలో ఉపాధ్యక్షులుగా ఎ. వెంకట చంద్రశేఖర్రావు, టి.శ్రీనివాసరావు, అంజలిదేవి, కోశాధికారిగా శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులుగా దుర్గామోహన్, మానస, బ్రహ్మేష్, వి.రాజేష్, జె. రాజేష్, జి.ప్రసన్న కుమార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈసారి ఇద్దరు మహిళలను కార్యవర్గంలోకి తీసుకున్నామని క్రాంతికుమార్ తెలిపారు. తెనాలిరూరల్: ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. తెనాలి ఆర్టీసీ డిపోకు చెందిన ఏపీ07జడ్0261 నంబరు గల బస్సు ఆదివారం సాయంత్రం కొల్లపర మండలం వల్లభాపురం నుంచి తెనాలి వస్తుండగా తెనాలి– విజయవాడ రహదారిలో కంచర్లపాలెం వంతెన వద్ద లారీ వేగంగా ఎదురుగా వచ్చింది. దీంతో డ్రైవరు బస్సును ఎడమ వైపును లాగాల్సి వచ్చింది. అప్పటికే వర్షం కురిసి ఉండడంతో రోడ్డు మార్జిన్లో తూర్పు కాల్వ గట్టుపై మట్టిలో ఇరుక్కుపోయింది. ఇంకొంచెం వెళ్లి ఉంటే బస్సు కాల్వలో పడి పెను ప్రమాదం జరిగి ఉండేది. బస్సును పొక్లెయిన్తో లాగాల్సి వచ్చింది. ఘటన జరిగినప్పుడు బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరికి ఎటువంటి హాని జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. గుణదల(విజయవాడ తూర్పు): వేసవి సెలవుల నేపథ్యంలో గుణదల మేరీమాత పుణ్యక్షేత్రానికి ఆదివారం భక్తజనం పోటెత్తారు. ఓ వైపు భానుడి ప్రతాపానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నా 43 డిగ్రీల ఎండ తీవ్రతను సైతం లెక్క చేయకుండా యాత్రికులు తమ భక్తి ప్రపత్తులను చాటుతున్నారు. క్రైస్తవ ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న గుణదల మేరీమాత పుణ్యక్షేత్రానికి యాత్రికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆదివారం సెలవు దినం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు పుణ్యక్షేత్రానికి తరలివచ్చారు. మరియమాతను దర్శించుకుని తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. కాలినడకన కొండ శిఖరాగ్రానికి చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పెదకూరపాడు: చేతికొచ్చిన పంట అగ్నికి ఆహుతి కావడంతో రైతు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. గుర్తు తెలియని దుండగులు పంటకు నిప్పు పెట్టినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. మండలంలోని రామాపురం – అత్తలూరు గ్రామాల మధ్య కొత్తలూరు గ్రామానికి చెందిన పుట్టి ఆంజనేయులు ఐదు ఎకరాలలో జామాయిల్ తోటలో సాగు చేశాడు. కర్ర కొట్టించేందుకు బేరం కూడా కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు పంటకు నిప్పు పెట్టడంతో పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినా ఫలించలేదు. సుమారు రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు తెలిపాడు. -
శిక్షణకు సిద్ధం.. సత్తా చాటుతాం
గుంటూరు వెస్ట్ (క్రీడలు) : ఒకప్పుడు క్రికెట్ అంటే కుర్రాళ్లే ఉత్సాహంగా ఆడేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. బాలికలు, యువతులు కూడా ఆసక్తి చూపుతున్నారు. మహిళా క్రికెట్లో రాణించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. వసతులను సద్వినియోగం చేసుకుని సత్తా చాటాలని శ్రమిస్తున్నారు. అప్పట్లోనే సకల వసతులు గతంలో జాతీయ మహిళా క్రికెట్ అకాడమీ గుంటూరులోని జేకేసీ కళాశాల క్రీడా మైదానంలో ఉండేది. ఇక్కడ ఆటతోపాటు అత్యాధునిక సదుపాయాలు కూడా అందుబాటులో ఉండేవి. అప్పట్లో జాగర్లమూడి నరేంద్రనాథ్ వంటి కొందరు మహిళా క్రికెట్ అకాడమీని ఇక్కడకు తీసుకు రావడానికి తీవ్ర కృషి చేశారు. క్రికెట్కు సేవలందించారు. ఆయన మరణంతో మహిళా క్రికెట్ అకాడమీ ఇక్కడి నుంచి వేరే రాష్ట్రానికి తరలిపోయింది. జిల్లాలో క్రికెట్ ఆడే యువతుల సంఖ్య కూడా బాగా తగ్గింది. ఒకానొక దశలో అన్ని ఫార్మెట్లలో కలిపి 15 మంది కూడా ఉండేవారు కాదంటే నమ్మాల్సిందే. గత ఏడాది భారత మహిళా క్రికెట్ జట్టు అనూహ్య రీతిలో ప్రపంచ మహిళా క్రికెట్ కప్ అందుకుంది. దీంతో మన దేశంలో యువతుల్లో క్రికెట్పై జోష్ పెరిగింది. పెరిగిన క్రీడాకారుల సంఖ్య ప్రస్తుతం జిల్లాలో అన్ని విభాగాల్లోనూ కలిపి క్రికెట్ ఆడే వారు దాదాపు 100 మంది ఉన్నారు. ఇందులో కొందరు రాష్ట్ర స్థాయిలో రాణిస్తున్నారు. ఆదివారం స్థానిక అరండల్పేటలోని జీడీసీఏ సారథ్యంలో త్రీమెన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సెలక్షన్స్లో సుమారు 70 మంది హాజరయ్యారు. దీనికి తోడు రంజీ మాజీ క్రీడాకారులు సరస్వతి రెడ్డి, శరత్తోపాటు సీనియర్ కోచ్ ఇండ్ల భాస్కర్లు శిక్షణ, అనుభవం కలిగిన మాజీ క్రికెటర్లు త్రీమెన్ కమిటీలో ఉండడం మహిళా క్రికెట్లో జోష్ పెంచుతోంది. త్వరలో ఇక్కడకు మహిళా కోచ్ కూడా రానున్నారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ శిక్షణ, జిమ్, ఆస్ట్రో టర్ఫ్ వికెట్లాంటి ఎన్నో సదుపాయాలు ఇక్కడ కల్పించారు. అదరగొడుతున్న మహిళా క్రికెటర్లు అవకాశాలు కల్పిసున్న ఏసీఏ జిల్లాలో వందమందికిపైగా క్రికెటర్లు జాతీయ జట్టులో స్థానమే లక్ష్యం త్వరలో మహిళా క్రికెట్ కోచ్ నియామకం ప్రస్తుతం జిల్లా స్థాయిలో ఇక్కడ క్రికెట్ అంతా బాగుంది. మాలాంటి వారికి మహిళా క్రికెట్ కోచ్ ఉంటే మరింత బాగుంటుంది. త్వరలోనే ఆ లోటు తీరుతుందని భావిస్తున్నాను. అండర్–19, 23 స్టేట్ ఆడాను. గత ఏడాది చేసిన రెండు సెంచరీలు నాలో ఆత్మ విశ్వాసం పెంచాయి. ప్రస్తుతం డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను. – ఎం.హాసినీ చౌదరి, గుంటూరు నేను దాదాపు 9 సంవత్సరాలుగా క్రికెట్ ఆడుతున్నా. ఒక పక్క చదువుతోపాటు క్రికెట్ సాధన చేస్తున్నా. ఈ క్రమంలో అండర్–16, 19, 23 స్టేట్తోపాటు సీనియర్ విభాగంలోనూ రాణిస్తున్నా. 2021లో జోనల్స్లో 5 వికెట్లు తీయడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఆల్రౌండర్గా రాణించాలని , జాతీయస్థాయిలో ఆడాలనేదే లక్ష్యం. – ఎస్.లక్ష్మీ ప్రసర్తి, గుంటూరు -
తెనాలిలో భారీ వర్షం
● గుంటూరు నగరంలో చిరుజల్లులతో కూడిన వర్షం ● వణికించిన ఈదురు గాలులు ● పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం తెనాలిరూరల్: తెనాలిలో ఆదివారం రాత్రి ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కొద్ది రోజులుగా రికార్డు స్థాయి ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు ఈ వర్షం చల్లటి ఊరటనిచ్చింది. వర్షం ధాటికి పలుచోట్ల రోడ్లపై నీరు చేరి ట్రాఫిక్కు స్వల్ప అంతరాయం కలిగింది. ఒక్కసారిగా వర్షం కురవడంతో వీధి వ్యాపారులు, పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యుత్ సరఫరాలోనూ అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల ట్రాన్స్ఫార్మర్లు పేలాయి. అనేక చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. గుంటూరులో... కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు నగరాన్ని ఆదివారం సాయంత్రం అకస్మాత్తుగా మారిన వాతావరణం అతలాకుతలం చేసింది. గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో వీచిన ఈదురు గాలులతోపాటు చిరుజల్లులతో కూడిన వర్షం నగరవాసులను ఆందోళనకు గురిచేసింది. ఆదివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దట్టమైన మేఘాలు కమ్ముకుని ఈదురుగాలులు బలంగా వీయడంతో రోడ్లపై దుమ్ము రేగింది. ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సుమారు గంటపాటు చిరుజల్లులు కురిశాయి. ఈదురు గాలుల ధాటికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అరండల్పేట, బ్రాడీపేట, పట్టాభిపురం, ఏటీ అగ్రహారం, బృందావన్ గార్డెన్స్, కొరిటెపాడు, అమరావతి రోడ్, కొత్తపేట, నల్లచెరువు, ఆర్టీసీ కాలనీ తదితర ప్రాంతాల్లో గంటకుపైగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలపై పడటంతో ఫీడర్లు ట్రిప్ అయ్యాయని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మరమ్మతులు చేపట్టి దశలవారీగా విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. అరండల్పేటలో ప్రతి ఆదివారం జరిగే సండే మార్కెట్లో చిరువ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆదివారం సెలవు కావడంతో బయటకు వచ్చిన ప్రజలు వర్షానికి తీవ్ర అవస్థలు పడ్డారు. నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ నెమ్మదించింది. వేసవి వేడిమితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగరవాసులకు ఈ చిన్నపాటి వర్షం కాస్త ఉపశమనం కలిగించింది. విద్యుత్ అంతరాయంతో ఇబ్బంది పడ్డామని స్థానికులు వాపోయారు. వచ్చే రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. -
విత్తన దుకాణాల్లో విజిలెన్స్ తనిఖీలు
రూ.6.76 లక్షల విత్తన విక్రయాలు నిలిపివేత నగరంపాలెం: పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట పట్టణంలో గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వ్యవసాయ అధికారులతో కలిసి శనివారం విత్తనాల దుకాణాలలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. గుంటూరు ప్రాంతీయ అధికారి డి.సూర్యశ్రావణ్కుమార్ ఆదేశాల మేరకు ఆయా దుకాణాల్లో స్టాక్ వివరాలను నిశితంగా పరిశీలించారు. చిలకలూరిపేట పట్టణం బోస్రోడ్డులోని వాసవి ఎంటర్ప్రైజెస్, అనంతలక్ష్మి ట్రేడర్స్ల్లో వేర్వేరుగా తనిఖీలు చేశారు. రికార్డులను నిర్వహించకపోవడం, విత్తనాలకు సంబంధించి మూల సంస్థ ధృవీకరణ పత్రాలు లేకపోవడాన్ని గుర్తించారు. ఆ రెండు దుకాణాల్లో రూ.6.76 లక్షల విలువ చేసే 889 ప్యాకెట్ల విత్తన విక్రయాలను నిలుపుదల చేశారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేయాలనే ఉద్దేశంతో తనిఖీలు నిర్వర్తించామని విజిలెన్స్ అధికారులు తెలిపారు. తనిఖీల్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. బాపట్ల: సూర్యలంక సముద్ర తీరం ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా మారాలన్న లక్ష్యంతో అధికారులు శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చేపట్టిన ప్లాస్టిక్ నిషేధ ప్రచారంలో భాగంగా బీచ్ వద్ద పర్యాటకులు, స్థానిక వ్యాపారులకు అవగాహన కల్పించారు. అనంతరం ఉచితంగా జూట్ బ్యాగులను పంపిణీ చేశారు. ధనిక్ భారత్ ఎడ్యుకేషనన్ ఇన్నిస్టిట్యూట్ ఛైర్మనన్ విక్రమ్ నారాయణ ఉచితంగా జూట్ బ్యాగులను సమకూర్చారు. జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్ మాట్లాడుతూ సూర్యలంక బీచ్కు వచ్చే పర్యాటకులు ప్లాస్టిక్ వ్యర్థాలను విచ్చలవిడిగా వదిలివేయడం వల్ల తీర ప్రాంత పర్యావరణం దెబ్బతింటోందని అన్నారు. ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా జనపనార (జూట్) సంచులను వినియోగించుకోవాలని సూచించారు. బాపట్ల జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఇన్న్చార్జి పర్యాటక శాఖ అధికారి సత్యపాల్ ఆనంద్, బీచ్ సూపర్వైజర్ జ్ఞానరాజు తదితరులు పాల్గొన్నారు. యడ్లపాడు: కొండవీడు కోటను శనివారం పర్యాటకులు విశేషంగా సందర్శించారు. పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా అటవీ అధికారి కృష్ణప్రియ చొరవతో చేపట్టిన ఈ పర్యాటక కార్యక్రమాలు శనివారం సాయంత్రం నుంచి కోట ప్రాంగణంలో ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. పచ్చని కొండల నడుమ, ప్రకృతి సోయగాల మధ్య ఏర్పాటు చేసిన నైట్ టెంటెడ్ అకామడేషన్ పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించింది. యువత, ప్రకృతి ప్రేమికులు, సాహస యాత్రికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ట్రెక్కింగ్, క్యాంప్ ఫైర్, సాంప్రదాయ ఆటలు, వినోదాత్మక గేమ్స్ను ఎంతో ఉత్సాహంగా ఆస్వాదించారు. పర్యాటకులకు అఖిల భారత పంచాయతీ పరిషత్ (ఢిల్లీ) జాతీయ ఉపాధ్యక్షులు, పల్నాడు జిల్లా టూరిజం కౌన్సిల్ సభ్యులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు సాదర స్వాగతం పలికారు. పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ, కొండవీడును రాష్ట్రస్థాయి ఎకో–టూరిజం గమ్యస్థానంగా మార్చడమే లక్ష్యంగా సాగుతుందన్నారు.ఔట్ రైవల్ అడ్వెంచర్స్ డైరెక్టర్ దలవాయి ఆషా, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పురుషోత్తం రాజు, ఏబీవో వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
కాపు కాసినా.. కక్ష సాధింపేనా?
కొల్లూరు: ‘కాపు’ కాసి కుర్చీలో కూర్చోపెట్టిన విశ్వాసం మరచి ఆ వర్గం వారిపైనే టీడీపీ వారు కక్షకట్టి దాడులుకు తెగబడుతున్నారని జనసైనికులు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు వద్ద ఈ మేరకు మొర పెట్టుకున్నారు. కొల్లూరుకు చెందిన జనసైనికుడు ఉప్పు జానకిరామయ్య, అతని కుటుంబసభ్యులపై పోలీసు స్టేషన్లో జరిగిన దాడి సంఘటనపై డీఎస్పీతో చర్చించేందుకు వచ్చిన జనసేన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు శనివారం కొల్లూరు పోలీసు స్టేషన్కు చేరుకున్నారు. ఆయన వద్ద కాపులపై జరుగుతున్న దాడులను శ్రేణులు ఆవేదన వ్యక్తం చేశాయి. వివాదంతో సంబంధం లేకున్నా.. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో దెబ్బలు తగిలిన జానకిరామయ్య వెంట తోడుగా వచ్చిన పాపానికి ‘కాపు నా కొడుకులు కనిపిస్తే కొట్టండరా’ అంటూ పోలీసు స్టేషన్లోనే తమపై దాడికి దిగితే ఎలా బతకాలని ప్రశ్నించారు. వివాదానికి సంబంధం లేని వ్యక్తులను సైతం కాపు కులం అనే ఒక్క సాకుతో చితకబాదారని, మహిళ అనే విచక్షణ సైతం లేకుండా జనకిరామయ్య సోదరిపై సైతం దాడి చేయడం టీడీపీ శ్రేణుల పైశాచికత్వానికి నిదర్శనంగా నిలుస్తోందని వాపోయారు. టీడీపీ వర్గీయులు దాడి చేస్తుంటే పోలీసు స్టేషన్ బాత్రూమ్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని ఓ జన సైనికుడు చెప్పుకొన్నారు. అనంతరం రేపల్లె డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావుతో దాడి సంఘటన గురించి గాదె చర్చించారు. జనసైనికులను.. ప్రత్యేకించి కాపు కులస్తులపై దాడులకు తెగబడితే మూకలను మూట గట్టుకు తీసుకువెళ్లడానికి ఎంతో సమయం పట్టదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని గాదె వెంకటేశ్వరరావు హెచ్చరించారు. తమ సహనాన్ని చేతగానితనంగా భావించి దాడులకు పురిగొల్పడం, చేయడం వంటి దుశ్చర్యలను మానుకోవాలన్నారు. తాము తిరగబడితే కాపాడే వారు కూడా ఉండరన్న విషయాన్ని గుర్తుంచుకొని మసలుకుంటే మంచిదని హితబోధ చేశారు. పార్టీ సిద్ధాంతాలను తాము మర్చిపోతే పోలీసు స్టేషన్లోకి దూరి మీరు జనసైనికులను, కాపు కులస్తులను కొట్టినట్టుగా, తాము ఇంటింటికి వచ్చి కొట్టడం పెద్ద విషయం కాదన్నారు. నడిపించే నాయకులు, వారి అనుచరుల విషయంలో తామూ దాడులకు దిగడానికి వెనకాడబోమన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. దాడి ఘటనలో తమ పార్టీకి చెందిన వ్యక్తులపైన సైతం కేసులు నమోదు చేశారని, వారికి అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని చెప్పారు. ఆందోళన వద్దని సూచించారు. -
మహిళలపై గృహ హింస నిరోధానికి కృషి చేయాలి
బాపట్ల: మహిళలపై గృహ హింస నిరోధానికి అందరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. గృహహింస నిరోధక చట్టం జిల్లా స్థాయి కమిటీ సమావేశం శనివారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు గృహ హింస నుంచి విముక్తి పొందాలంటే చైతన్యంతోనే సాధ్యమని చెప్పారు. హింస నుంచి బయటకు రావాలంటే చట్టంతో స్వేచ్ఛ లభిస్తుందన్నారు. బాపట్ల జిల్లాలో మహిళలపై వేధింపులు, దాడులు, అరాచకాలు తగ్గుముఖం పట్టాయన్నారు. మహిళలపై జరిగిన వేధింపుల నేపథ్యంలో గత ఏడాది 485 కేసులు నమోదు కాగా, ఈ సంవత్సరం కేవలం 139 కేసులు నమోదు అయ్యాయన్నారు. గృహ హింస నిరోధక చట్టం కింద గడిచిన నాలుగేళ్లలో 668 కేసులు బాపట్ల జిల్లాలో నమోదయ్యాయన్నారు. 155 కేసులు కోర్టులో పరిష్కారం కాగా, ఐదు కేసులు పోలీస్ అధికారుల ద్వారా పరిష్కారం అయ్యాయన్నారు. అందులో 408 కేసులు కోర్టు పరిశీలనలో ఉన్నాయని, మిగిలిన 101 కేసులు విచారణలో ఉన్నట్లు వివరించారు. చట్టం కింద గత ఏడాది 194 కేసులు నమోదు కాగా, ఈ సంవత్సరం 82 కేసులు మాత్రమే నమోదయ్యాయన్నారు. వరకట్న వేధింపులు నిరోధించడానికి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలను చైతన్య పరచడంతోనే వేధింపులను నివారించగలమన్నారు. మహిళలకు చట్టం అండగా నిలుస్తున్న విషయాలపై అవగాహన పెంచాలన్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో చైతన్య కార్యక్రమాలు విస్తృతం చేయాలన్నారు. విద్యార్థి దశ నుంచి ఈ ప్రక్రియ సమర్థంగా నిర్వహించాలన్నారు. 181 కాల్ సెంటర్, సఖి కేంద్రం మహిళలకు అండగా నిలుస్తుందన్నారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్రజల్లోకి వెళ్లాలని, మహిళలను చైతన్య పరచాలని ఆయన పలు సూచనలు చేశారు. బడి ఈడు పిల్లలను పాఠశాలలో చేర్చాలనే అంశంపై ‘బడి పిలుస్తోంది’ అంటూ ఎస్ఎఫ్ఐఆర్డీ సంస్థ రూపొందించిన పోస్టర్లను కలెక్టర్ విడుదల చేశారు. సమావేశంలో మహిళ శిశు సంక్షేమ శాఖ పీడీ రాధామాధవి, డీఎస్పీ పి.జగదీష్ నాయక్, సఖి కేంద్రం ప్రతినిధులు ఉషారాణి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పుష్ప, బి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. పర్యాటకులకు ఉచిత వైద్య సేవలు ప్రతి రోజూ సూర్యలంక బీచ్కు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నందున వారికి అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండేలా పీహెచ్సీ ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ పేర్కొన్నారు. సూర్యలంక బీచ్కు వచ్చే పర్యాటకులకు అవసరమైన సమయంలో ఉచిత వైద్య సేవలు అందించేందుకు తుఫాను రక్షిత భవనంలో ఏర్పాటు చేస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్సీ) జిల్లా కలెక్టర్ శనివారం పరిశీలించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్రంలో అవసరమైన వైద్య సిబ్బంది, ప్రాథమిక చికిత్స పరికరాలు, అత్యవసర మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు.జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ అధికారులు బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ పేర్కొన్నారు. శనివారం రాత్రి జిల్లా కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి వడగాల్పులు పరిస్థితి, జనగణన, ప్రజా సానుకూలత ప్రజాభిప్రాయం, జలధార–జలహారతి కార్యక్రమాల అమలుపై ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, డీఎల్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మండల నీటి వనరుల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్న్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పంపిణీ చేయాలన్నారు. మరో రెండు రోజులు వడగాడ్పులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. -
విద్యుత్తు సబ్స్టేషన్ వద్ద రైతుల ఆందోళన
కారెంపూడి: స్థానిక విద్యుత్ సబ్స్టేషన్ సెక్షన్ ఆఫీస్ వద్ద మండలంలోని పేటసన్నెగండ్ల శివారు సింగరుట్ల తండా రైతులు శుక్రవారం రాత్రి ఽఆందోళనకు దిగారు. తమ తండాకు నాలుగు రోజులుగా కరెంటు సక్రమంగా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత సిబ్బందికి అధికారులకు ఫోన్ చేసినా లిప్ట్ చేయడం లేదన్నారు. తండాకు వచ్చే జంపర్లు ఎత్తేసి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారని రోజుకు అనేక సార్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికి కరెంటు లోవోల్టేజీ హైలోవోల్టేజి వల్ల 10 మోటార్లు దాకా కాలిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫీసుకు వచ్చినా పట్టించుకునే నాధుడు లేకుండాపోయారన్నారు. దీనివల్ల పంటలకు నీరందక ఎండిపోతున్నాయని తమ బాధలు చెప్పుకోడానికి వస్తే ఇక్కడ ఎవరూ పట్టించుకోవడం లేదనే బాధను రైతులు వ్యక్తం చేశారు. సంబంధిత సిబ్బందిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. -
ఉపాధ్యాయులపై బోధనేతర భారాన్ని తగ్గించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయులపై బోధనేతర భారాన్ని తగ్గించి, స్వేచ్ఛగా బోధన చేసే అవకాశాన్ని కల్పించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘ రాష్ట్ర(ఎస్టీయూ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్లు రఘునాథరెడ్డి, సాయి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఎస్టీయూ ఆధ్వర్యంలో రెండు రోజుల రాష్ట్రస్థాయి ఉద్యమ శిక్షణ తరగతులను గుంటూరు శివారులోని విజ్ఞాన్ నిరుల ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు విద్యార్థుల అభ్యసనా సామర్ాధ్యల పెంపుదలతోపాటు, డ్రా పౌట్ల సంఖ్య తగ్గింపు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి విద్యాశాఖ పక్షాన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని డిమాండ్ చేశారు. బోధనేతర విధులు అభ్యసనా సామర్ధ్యం పెంపుదల ఒక అడ్డంకిగా ఉన్నాయని, వీటిని తొలగించాలని కోరారు. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు మూడేళ్ల గడువు కేటాయించాలని చెప్పారు. కార్యాచరణ ప్రణాళికల పేరుతో అకడమిక్ క్యాలెండర్ దారి తప్పకుండా, కాలనిర్ణయ పట్టికను అనుసరించి అన్ని తరగతులకు క్రమానుగతంగా బోధన జరిగేలా, అమలయ్యేలా చూడాలని కోరారు. ఉపాధ్యాయులకు శిక్షణలు, సైన్స్ ఫెయిర్ల నిర్వహణ, విద్యార్థులకు క్రీడలు, స్కూల్ కాంప్లెక్స్ల నిర్వహణ, నో బ్యాగ్ డేల అమలు ప్రణాళికాబద్ధంగా ఫలితం ఆధారిత అమలుకు చూడాలని కోరారు. ప్రశ్నపత్రాల రూపకల్పన, మూల్యాంకనంపై ఉపాధ్యాయ సంఘాలు, మేధావుల నుంచి సూచనలు, సలహాలు తీసుకొని విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని కోరారు. అసెస్మెంట్ రిజిస్టర్ నిర్వహణ, పాఠశాల సమయంలోనే మూల్యాంకనం, మార్కుల నమోదుపై పున: సమీక్ష అవసరమని తెలిపారు. మార్కుల నమోదు ఉపాధ్యాయుని రిజిస్టర్లో ఒకసారి, లీపు యాప్లో ఒకసారి, పాఠశాల సెంట్రల్ మార్కు రిజిస్టర్లో ఒకసారి ఇలా మూడుసార్లు నమోదు చేయాల్సిన పరిస్థితి వస్తుందని, సాంకేతికతను ఉపయోగించి పాఠశాల మొత్తానికి సమీకృత విధానాన్ని అమలుపరిచేలా చూడాలని సూచించారు. శిక్షణ శిబిరంలో మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, సీపీఐ నాయకులు జి.ఈశ్వరయ్య, ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఏఐఎస్టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి సిహెచ్.జోసెఫ్ సుధీర్ బాబు, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కే కోటేశ్వరరావు, ఉపాధ్యాయ వాణి ప్రధాన సంపాదకులు కె.వి.శేఖర్ పాల్గొన్నారు. -
ముస్లిం మహిళపై ఎమ్మెల్యే శ్రీధర్ వ్యాఖ్యలు సరికాదు
మార్టూరు: బాపట్ల జిల్లా మార్టూరు మండలం కోలలపూడి గ్రామానికి చెందిన డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు రాష్ట్ర ప్రభుత్వ సినీ, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ గా శనివారం నియమితులయ్యారు. నాలుగు దశాబ్దాలుగా నాటక, సినీ, టీవీ ఆర్టిస్టుగా, రచయితగా, దర్శకునిగా సేవలందిస్తూనే చిలకలూరిపేట కళాశాల అధ్యాపకుడిగా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందారు. డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాలలో సుపరిచితునిగా పేరుగాంచారు. ముఖ్యంగా మార్టూరు కేంద్రంగా స్థానిక రోటరీ క్లబ్తో కలిసి శ్రీకారం రోటరీ కళాపరిషత్ అధ్యక్షుడిగా గత 15 సంవత్సరాలుగా మార్టూరులో ఉభయ తెలుగు రాష్ట్రాలస్థాయిలో నాటిక పోటీలు నిర్వహించటంలో ఆయన కీలక భూమిక పోషించారు. డైరెక్టర్గా నియామకం పొందడం పట్ల శ్రీకారం కళాపరిషత్ కార్యదర్శి జాష్టి అనూ రాధ, ఎఫర్ట్ సంస్థ డైరెక్టర్ జేవీ మోహన్ రావు, మార్టూరు రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మాదల సాంబశివరావు, కోటేశ్వరరావు, శానంపూడి లక్ష్మయ్య, ఇంటూరి ఆంజనేయులు, రావి అంకమ్మ చౌదరి, బాపట్ల, పల్నాడు జిల్లాలలోని పలువురు కళాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ -
కాపులే లక్ష్యం.. దాడులే సాక్ష్యం
బాపట్లఆదివారం శ్రీ 24 శ్రీ మే శ్రీ 2026జీవితం నాశనం తెనాలి: స్థానిక మార్కెట్ యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ఠ ధర రూ.3,200, గరిష్ఠ ధర రూ.6,500, మోడల్ ధర రూ.4,400 వరకు పలికింది.విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 523.90 అడుగులకు చేరింది. జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకి 900 క్యూసెక్కులు విడుదల అవుతోంది.సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఉమ్మడి గుంటూరు జిల్లాలో కాపు నేతలు, కార్యకర్తలను తెలుగుదేశం నేతలు టార్గెట్ చేశారు. 2024 ఎన్నికల్లో వారి సహకారంతోనే గెలిచిన తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత తన అసలు రంగు బయట పెడుతోంది. ముఖ్యంగా జనసేన పార్టీని తొక్కేయడమే లక్ష్యంగా తెలుగుదేశం నేతలు పనిచేస్తున్నారని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. జనసేనకి, కాపులకు ఎటువంటి పనులు చేయవద్దని అధికారులకు కూడా మౌఖికంగా ఎక్కడికక్కడ ఆదేశాలు జారీ చేశారు. ఇవిగో నిదర్శనాలు గతంలో అంబటిపైనా.. ఇటీవల కాపు సామాజికవర్గానికి చెందిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై, కార్యాలయంపై దాడి చేసి ఏడున్నర గంటలకుపైగా విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. దాడికి గురైన అంబటి రాంబాబుపైనే తప్పుడు కేసులు బనాయించారు. అనంతరం జైలులో పెట్టిన విషయం కూడా జిల్లా వాసులు మర్చిపోలేదు. మొక్కజొన్నకు మద్దతు ధర లేకపోవడంతో ఒక గోడౌన్లో నిలవ ఉంచిన ఘటనలో తెలుగుదేశం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కాపు సామాజిక వర్గానికి చెందిన మామిళ్లపల్లి రైతులపై దాడి చేయించారు. దాడి చేసిందే కాక మహిళలపై కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించారు. రైతులను పరామర్శించడానికి వస్తున్న నేతలను పోలీసుల ద్వారా ప్రభుత్వం అడ్డుకుంటోంది. అరెస్టులు, దౌర్జన్యాలకు పాల్పడటం నిత్యకృత్యంగా మారింది. అచ్చంపేట మండలానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణ సహచరుడి పొలాన్ని ఆక్రమించుకుని అందులో మట్టి తవ్వేశారు. పర్చూరు నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గానికి చెందిన రైతులు ఎమ్మెల్యేను కలవడానికి వెళ్తే కలవకపోగా ‘లేబర్ వాళ్లు. తర్వాత కలుద్దాంలే’ అని అవమానించినట్లు కాపు నేతలు చెబుతున్నారు. ‘కాపులకు ఏ రకమైన పథకాలు లేవు. కూటమి ప్రభుత్వం కాపు కార్పొరేషన్కు రూ.రెండు వేల కోట్లు ఇవ్వాల్సి ఉంది. కాపు జేఏసీ నేత దాసరి రాము ఇప్పటికే అల్టిమేటం జారీ చేశారు.7జనసైనికులను.. ప్రత్యేకించి కాపు కులస్తులపై దాడులకు తెగబడితే మూకలను మూట గట్టుకు తీసుకువెళ్లడానికి ఎంతో సమయం పట్టదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని గాదె వెంకటేశ్వరరావు హెచ్చరించారు. తమ సహనాన్ని చేతగానితనంగా భావించి దాడులకు పురిగొల్పడం, చేయడం వంటి దుశ్చర్యలను మానుకోవాలన్నారు. తాము తిరగబడితే కాపాడే వారు కూడా ఉండరన్న విషయాన్ని గుర్తుంచుకొని మసలుకుంటే మంచిదని హితబోధ చేశారు. పార్టీ సిద్ధాంతాలను తాము మర్చిపోతే పోలీసు స్టేషన్లోకి దూరి మీరు జనసైనికులను, కాపు కులస్తులను కొట్టినట్టుగా, తాము ఇంటింటికి వచ్చి కొట్టడం పెద్ద విషయం కాదన్నారు. నడిపించే నాయకులు, వారి అనుచరుల విషయంలో తామూ దాడులకు దిగడానికి వెనకాడబోమన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. దాడి ఘటనలో తమ పార్టీకి చెందిన వ్యక్తులపైన సైతం కేసులు నమోదు చేశారని, వారికి అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని చెప్పారు. ఆందోళన వద్దని సూచించారు.శనివారం కొల్లూరులో జరిగిన దాడిలో గాయపడిన ఉప్పు జానకి రామయ్య మేనల్లుడు రాము బాల శివ గంగాధర్ (బాలు) మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కోసం తన జీవితాన్ని నాశనం చేసుకున్నానన్నారు. విదేశాలకు వెళ్లాల్సిన తాను తెలుగుదేశం పార్టీ వాళ్లు పెట్టిన కేసుల వల్ల వెళ్లలేని పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. జనసైనికులను.. ప్రత్యేకించి కాపు కులస్తులపై దాడులకు తెగబడితే మూకలను మూట గట్టుకుతీసుకువెళ్లడానికి ఎంతో సమయం పట్టదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని జనసేన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు హెచ్చరించారు. -
హత్య కేసులో నిందితుల అరెస్టు
క్రోసూరు: మండలంలోని నాగవరం గ్రామంలో ఈనెల 17వ తేదీన ఆస్తి కోసం వృద్ధురాలిని హత్య చేసిన హంతకులను శనివారం అరెస్ట్ చేసినట్లు సీఐ పి.సురేష్, ఎస్ఐ పి.రవిబాబు తెలిపారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ నాగవరం గ్రామానికి చెందిన షేక్ మస్తాన్వలికి సత్తెనపల్లికి చెందిన కరిష్మాకు ఆరేళ్ల కిందట వివాహమైంది. వివాహం సమయంలో కట్నం ఇచ్చినప్పటికీ అదనపు కట్నంతోపాటు అత్త పేరున ఉన్న ఇంటిని రాయించుకురావాలని వేధిస్తున్నాడు. అదే సమయంలో తాకట్టులో పెట్టిన వెండి వస్తువుల గురించి అత్త అల్లాబీ, మృతురాలు ఫాతిమూన్ తరచూ అడుగుతున్నారు. దీంతో వారిని హత్య చేస్తే అడ్డు తొలగిపోతుందని పథకం వేసుకున్నారు. దీంతో సాయంత్రం భార్య కరిష్మా, అత్త అల్లాబీ, మృతురాలు ఫాతిమూన్(75), ఇర్ఫాన్లపై ఇనుపరాడ్లు, కర్రలు, కారంతో దాడిచేయగా వృద్ధురాలు తీవ్రగాయాలతో అక్కడిక్కడే మృతి చెందింది. కేసు దర్యాప్తు చేసి హత్యలో పాల్గొన్న మస్తాన్వలి, సోదరులు ఇమాంసా, షేక్ ఇబ్రహీం, తండ్రి షేక్ మస్తాన్ వలి, తల్లి షేక్ సైదాబిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి రెండు నాటు కర్రలు, రెండు ఇనుపరాడ్లు స్వాధీన పరుచుకున్నట్లు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
పాలువాయిలో విషాదం రెంటచింతల: మా ఇంటి దీపాలు ఆరిపోయాయి...మేం ఎవరి కోసం బతకాలి అంటూ ఆ కన్నతల్లులు గురజాల ప్రభుత్వ ఆస్పత్రి వద్ద రోధిస్తున్న తీరు అక్కడినున్న వారిని కంటితడి పెట్టించింది. మృతి చెందిన బంగారి, భాస్కర్లు వరుసకు అన్నదమ్ములు. వెంకయ్య వారికి వరసకు బావమరిది. ముగ్గురూ వ్యవసాయ కూలీ పనులకు వెళ్తుంటారని వారి బంధువులు తెలిపారు. కోటేశ్వరరావు, శ్రీనివాసరావు కుటుంబాలకు ఒక్కొక్కరే కుమారులు. వీరు ఈ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ‘మేం ఏ పాపం చేశామయ్యా... 20 సంవత్సరాలుగా మా కంటి పాపలా చూసుకుంటే ఎదిగిన కుమారులు మా కళ్లముందు రక్తపు మడుగులో పడిపోయారు... దేవుడు మాకు ఎందుకు ఈ శిక్ష వేశాడు...’ అంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తీరుకు అక్కడివారు చలించిపోయారు. రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు చనిపోవడంతోపాటు మరో యువకుడు మృత్యువుతో పోరాడుతుండటంతో పాలువాయి గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. చూపరులు సైతం కంటతడి పెట్టుకున్నారు. -
‘డిజిటల్’ మోసగాళ్ల అరెస్టు
చీరాల: డిజిటల్ అరెస్ట్ పేరుతో విశ్రాంత ఉద్యోగిని మోసం చేసి నగదు అపహరించిన కేసులో విశాఖపట్నంకు చెందిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు బాపట్ల జిల్లా చీరాల డీఎస్పీ ఎండి మొయిన్ తెలిపారు. స్థానిక టూటౌన్ పోలీస్స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. చీరాల టూటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఏడాది మార్చి 30న కొత్తపేటకు చెందిన విశ్రాంత ఉద్యోగి కె.మోహనరావుకు సోషల్ మీడియా ద్వారా పోలీసులమని చెప్పి అతనిపై మనీ లాండరింగ్ కేసు నమోదైందని బెదిరించారు. ఈ కేసు నుంచి బయటపడాలంటే డబ్బు ఖర్చవుతుందని బెదిరించి రూ.26.50 లక్షల నగదును అకౌంట్లలో వేయించుకొని మోసం చేశారు. ఈ కేసులో సీబీఐ, ఈడీ అధికారులు ఉన్నారని, క్లీన్ చిట్ రావాలంటే నగదు ఇవ్వాలని నమ్మబలికారు. అయితే రోజులు గడుస్తున్నా ఎటువంటి స్పందన రాలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన ఆయన టూటౌన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా ఐటీ కోర్ సీఐ సూర్యనారాయణ ఆధ్వర్యంలో టెక్నికల్ బృందం సహాయంతో దర్యాప్తును ప్రారంభించారు. టూటౌన్ సీఐ శశికుమార్ ఆధ్వర్యంలో రెండు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. ఖాతాల్లో వేసిన నగదును మూడు బ్యాంకు అకౌంట్ల నుంచి వేరు వేరు అకౌంట్లకు నగదు బదిలీ అయినట్లు గుర్తించారు. టెక్నికల్ బృందం సమాచారం మేరకు టూటౌన్ సీఐ శశికుమార్ నేతృత్వంలో ఒక బృందం విశాఖపట్నం వెళ్లి విచారణ చేపట్టారు. విశాఖపట్నంలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో ఏ1 బొందలపు గోవిందు పీఓపీ వర్క్స్ చేస్తుండగా అతని వద్ద ఏ2 నాగ ప్రదీప్, ఏ3 నీల్కుమార్లు పనిచేస్తున్నారు. అయితే నాగ ప్రదీప్, నీల్కుమార్లు సైబర్ నేరాలపై అవగాహన పెంచుకునేందుకు కంబోడియా దేశానికి వెళ్లి అక్కడ స్కామర్ల వద్ద తర్ఫీదు పొందిన తర్వాత ఇండియాకు వచ్చారు. ఈ ఏడాది జనవరి నుంచి సైబర్ నేరాలు చేయడం ప్రారంభించారు. నాగప్రదీప్ వద్ద రూ.8 లక్షలు, నీల్కుమార్ వద్ద రూ.2 లక్షలు, గోవిందు అకౌంట్కు రూ.14 లక్షలు మొత్తం రూ.26.50 లక్షలు వారి అకౌంట్లుకు డబ్బులు వేయించుకున్నట్లు గుర్తించారు. కేసును సవాలుగా తీసుకుని ఐటీ కోర్ బృందం, చీరాల టూటౌన్ పోలీసుల నేతృత్వంలో బృందాలుగా ఏర్పడి ఇప్పటి వరకు ఈ కేసులో నిందితుల వద్ద నుంచి రూ.10 లక్షల నగదు, రెండు ల్యాప్టాప్లు, సిమ్కార్డులు, మెమొరీ కార్డు, పాస్పోర్టులు రికవరీ చేశామని డీఎస్పీ ఎండీ మొయిన్ చెప్పారు. అలానే ఈ కేసులో మరికొంతమంది నిందితులు ఉన్నారని, వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు. డిజిటల్ అరెస్ట్ అనేది లేదని, ప్రజలు భయభ్రాంతులకు గురై అపరిచిత వ్యక్తులను నమ్మి మోసపోవద్దన్నారు. సైబర్ నేరస్తుల ఉచ్చులో చదువుకున్న వారే ఇరుక్కుంటున్నారన్నారు. సైబర్ నేరాలకు గురైతే 1930 కు కాల్ చేసి సహాయం పొందాలని సూచించారు. ఈ కేసు ఛేదించేందుకు కృషి చేసిన టూటౌన్ సీఐ ఎ.శశికుమార్, ఎస్ఐ ఎం.వెంకటేశ్వర్లు, ఏఎస్ఐ కె.మురళి, హెడ్కానిస్టేబుల్ రాజేష్, కానిస్టేబుళ్లు ఎస్కే నాగూర్, ఎం.శ్రీనివాస్, టి.బాలాజీ, సీహెచ్ రమేష్, ఎస్.ఆంజనేయులు, వి.శివకృష్ణ, మహిళా కానిస్టేబుల్ శివపార్వతి, హోంగార్డు ఎం.ప్రభాకర్, ఐటీ కోర్ సీఐ సూర్యనారాయణ, ఎస్ఐ నజిమాలను డీఎస్పీ అభినందించారు. -
వేతన వెతలు
బాపట్లశనివారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 32.2126 టీఎంసీలు. విజయపురి సౌత్: నాగార్జునసాగర్ నీటిమట్టం శుక్రవారం 523.90 అడుగులకు చేరింది. సాగర్ నుంచి ఎస్ఎల్బీసీకి 900 క్యూసెక్కులు విడుదల అవుతోంది.తెనాలి: స్థానిక మార్కెట్ యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ఠ ధర రూ.3,000, గరిష్ఠ ధర రూ.6,200, మోడల్ ధర రూ.4,300 వరకు పలికింది. ఉద్యోగుల డేటా బదిలీలో జాప్యమా.. పట్టించుకోని పాలకులు – బయ్యా శంకర్, అధ్యక్షుడు, ఏపీ ఎల్టీ అసోసియేషన్, బాపట్ల జిల్లా – మల్లేశ్వరి, స్టాఫ్ నర్సు, స్వర్ణ పీహెచ్సీ – షేక్ అబ్దుల్ హఫీజ్, కాంట్రాక్టు ఉద్యోగి, చీరాల ప్రభుత్వ ఆసుపత్రి 7 -
అటవీ భూముల్లో కబ్జాపర్వం
తాడేపల్లి రూరల్: మంగళగిరి – తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని డోలాస్నగర్ శ్మశాన వాటిక వెనుక భాగంలో ఉన్న అటవీ భూముల్లో కొంతమంది గుట్టుచప్పుడు కాకుండా భారీ వృక్షాలను యంత్రాంల సహాయంతో నేలకూలుస్తున్నారు. ఈ భూముల్లో సుమారు 30–40 సంవత్సరాల వయస్సు ఉన్న తుమ్మ, వేప, గానుక తదితర చెట్లు ఉన్నాయి. సుమారు 5 సెంట్లలో ఈ చెట్లను తొలగించారు. మరోపక్క ఫారెస్ట్ భూముల్లో రాజధాని గ్రామాల్లో చెరువుల తవ్వకం నుంచి వచ్చిన నల్లమట్టితో గుంతలు పూడుస్తున్నారు. అంతేకాకుండా చిన్న నిర్మాణాలు చేపట్టారు. ఉండవల్లి ఫైరింగ్ రేంజ్ నుంచి యర్రబాలెం రోడ్డు వరకు పలు ప్రాంతాల్లో ఫారెస్ట్లో ఉన్న మొక్కలను తొలగించారు. అందులో నల్లమట్టి పోసి ప్లాట్లుగా చేసి కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు తెలిసింది. గతంలో ఫారెస్ట్ అధికారులు ఉన్న ఇళ్లను లెక్కించి నంబర్లు కేటాయించారు. తర్వాత ఇటువైపు కన్నెత్తి చూడకపోవడంతో కొంతమంది ఇదే అదునుగా భారీ వృక్షాలను తొలగించి రెండు మూడు సెంట్లుగా చేసి ఒక్కో సెంట్ రూ.2 లక్షల చొప్పున అమ్మేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మేం చూసుకుంటాం... ఉపాధి కోసం మార్కాపురం, ప్రకాశం జిల్లాల నుంచి వలస వచ్చినవారు ఈ ప్రాంతాల్లో అద్దెలు చెల్లించలేక భూములను కొనుగోలు చేస్తున్నారు. ఒకవేళ కొనుక్కునే వారికి ఫారెస్ట్ భూమి అని తెలిసినా అమ్మిన వ్యక్తిని ప్రశ్నిస్తే ‘‘మీరు ఇళ్లు వేసుకోండి, వచ్చిన వారితో మేం మాట్లాడి సెటిల్ చేస్తాం. రూ.10 – రూ.20 వేలు ఇస్తే వారేమీ అనరంటూ’’ భరోసా ఇస్తున్నాడు. యథేచ్ఛగా భూములను అమ్మేస్తున్నారు. ఇప్పటికై నా ఫారెస్ట్ అధికారులు దృష్టి సారించి పర్యావరణానికి హాని కలిగిస్తూ చెట్లను నరికేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
పలు రైళ్లు తాత్కాలిక రద్దు
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని రైల్వే ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) ఉన్నందున పలు రైళ్లను రద్దు చేసినట్లు డివిజన్ పీఆర్ఓ వినయ్కాంత్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విజయవాడ – గుంటూరు(రైలు నంబర్ 57201), గుంటూరు – మాచర్ల (57203), మాచర్ల – నడికుడి (57206), నడికుడి–మాచర్ల (57205), మాచర్ల –గుంటూరు (57204), గుంటూరు – విజయవాడ (57202), విజయవాడ – గుంటూరు (67229), గుంటూరు–రేపల్లె (67223), రేపల్లె–తెనాలి (67224), తెనాలి– విజయవాడ (67222), తెనాలి–రేపల్లె (67231), రేపల్లె– తెనాలి (67232), తెనాలి–రేపల్లె (67233), రేపల్లె–గుంటూరు (67234), గుంటూరు– రేపల్లె (67235), మార్కాపురం రోడ్ – తెనాలి (67239), తెనాలి – గుంటూరు (67236), గుంతకల్లు–మార్కాపురం రోడ్ (57407) రైళ్లు ఈనెల 23, 24, 30, 31 తేదీలలో రద్దు చేసినట్లు తెలిపారు. మార్కాపురం రోడ్డు– గుంతకల్లు (నంబర్ 57408) రైలు ఈ నెల 24, 25, 30, జూన్ 01వ తేదీల్లో రద్దు చేసినట్లు తెలిపారు. రేపల్లె –మార్కాపురం రోడ్డు (67238) రైలు గుంటూరు, మార్కాపురం రోడ్డు మీదుగా ఈనెల 23, 24, 30, 31 తేదీల్లో తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు గమనించి సహకరించాలని కోరారు. వినుకొండ: పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని వేక్షిత్ జ్యూయలర్స్లో గురువారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. దుకాణంలో ఉన్న వెండి, బంగారు ఆభరణాలను, నగదును అపహరించారు. చోరీకి గురైన బంగారం, నగదు విలువ రూ.20 లక్షలకు పైగా ఉంటుందని బాధితులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. షాపు లోపల డిజిటల్ వీడియో రికార్డు బాక్స్ని, సీసీ కెమెరాలను ఎత్తుకెళ్లారు. షాపులో పోలీస్ కుక్కలు పసికట్టకుండా కారం చల్లినట్లు గుర్తించారు. దీన్ని బట్టి చూస్తే దొంగలు పక్కా పథకం ప్రకారం చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. పట్టణంలోని ప్రధాన గోల్డ్ షాపులో ఇలాంటి భారీ చోరీ జరగడంతో స్థానిక వ్యాపారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. గుంటూరు రూరల్: మండలంలోని చిన్నపలకలూరు రైల్వే గేట్ వద్ద నల్లపాడు–బండారుపల్లి స్టేషన్ల మధ్య రైల్వే గేట్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ (ఆర్ఓబీ) నిర్మాణానికి శుక్రవారం కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెనీక్రిస్టీనా పాల్గొన్నారు. పెమ్మసాని మాట్లాడుతూ రైల్వే మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని, మెరుగైన కనెక్టివిటీ ప్రాజెక్టుల ద్వారా భద్రతను పెంపొందించడం అవసరమన్నారు. గుంటూరు మెడికల్: గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ)గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ జి.శోభారాణికి అడిషనల్ డైరెక్టర్గా పదోన్నతి లభించింది. గతేడాది ఆగస్టు నుంచి ఇన్చార్జి ఆర్డీగా విధులు నిర్వహిస్తున్నారు. గుంటూరు, పల్నాడుజిల్లా డీఎంహెచ్ఓగా గతంలో విధులు నిర్వహించారు. రీజనల్ పబ్లిక్ హెల్త్ లేబరేటరీలో సివిల్ సర్జన్ బ్యాక్టీరియాలజిస్టుగా పనిచేస్తూ ఇన్చార్జి ఆర్డీగా విధులు నిర్వహిస్తున్నారు. జి.శోభరాణిని ఆర్టీ కార్యాలయం డీడీ పాల్ సుధాకర్, ఆఫీస్ సూపరింటెండెంట్లు సత్యం, విజయకుమార్, సీనియర్ అసిస్టెంట్లు శ్రీక్రాంత్, బి.శ్యామ్అనిల్ అభినందించారు. -
రీ సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
రాష్ట్ర సర్వే, సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ కూర్మనాథ్ ఇంకొల్లు(చినగంజాం): రీ సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం అని రాష్ట్ర సర్వే, సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ డైరక్టర్ రోణంకి కూర్మనాథ్ పేర్కొన్నారు. శుక్రవారం కారంచేడు, ఇంకొల్లు మండలాల్లోని గ్రామాలలో గ్రౌండ్ ట్రూతింగ్, క్షేత్రస్థాయిలో రీ సర్వే పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. ఆయన అక్కడ ఉన్న రైతులు, రెవెన్యూ సర్వే సిబ్బందితో మాట్లాడారు. డైరెక్టర్ కూర్మనాథ్ మాట్లాడుతూ ప్రజలు, రైతుల సమక్షంలో పనులు చేపట్టి పూర్తి చేస్తేనే అత్యుత్తమ ఫలితాలు వస్తాయని.. భూ రికార్డులు ప్రక్షాళన రైతులకు కచ్చితమైన భూ హక్కులు కల్పించడమే లక్ష్యంగా రాత్రింబవళ్లు శ్రమిస్తున్న రెవెన్యూ సర్వే సిబ్బంది సేవలు అభినందనీయం అని అధికారులను కొనియాడారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న పలు సాంకేతిక భూ సమస్యలపై సుదీర్ఘంగా సమీక్షించారు. రీ సర్వే ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగుతుందని కారంచేడు, ఇంకొల్లు, చెరువు గ్రామాల్లో డైరెక్టర్ సమక్షంలో సిబ్బంది, రైతుల భూ కమతాలను సర్వే చేసి డేటాను సేకరించారు. కార్యక్రమంలో చీరాల ఆర్డీవో ఎస్ లవన్న, మల్టీ జోన్ 2 ఆర్జేడీ వెంకటేశ్వరరావు, జిల్లా సర్వే సహాయ సంచాలకులు శేషగిరిరావు, జిల్లా సర్వే ఇన్స్పెక్టర్ అల్తాఫ్, కారంచేడు, ఇంకొల్లు తహసీల్దార్ నాగరాజు, శ్రీనివాస్లతో స్థానిక మండల రెవెన్యూ సర్వే సిబ్బంది, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. -
కేవీలో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
బాపట్ల: బాపట్ల మండలం సూర్యలంక ఎయిర్ ఫోర్సు స్టేషన్ పీఎం శ్రీ కేంద్రియ విద్యాలయంలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు మిగులున్న తరగతుల సీట్ల భర్తీ కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ మృదుల శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తిగల వారు కేంద్రియ విద్యాలయంలో సంప్రదించి ఈనెల 27వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆమె తెలిపారు. బాపట్ల: అనంతపురం జిల్లాలో సర్వేలు చేయలేదని స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డులలో పని చేసే డిజిటల్ అసిస్టెంట్లు,వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీల జీతాలు నిలుపుదల చేయటం సరికాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం బాపట్ల జిల్లా చైర్మన్ జీవీవీ రాఘవరెడ్డి ఖండించారు. ఆధార్ కిట్ల వినియోగం, ఎల్ఎంఎస్ కోర్సులు పూర్తి చేయలేదని జీతాలు నిలుపుదల చేయటం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. వెంటనే అనంతపురం జిల్లా అధికారులు జోక్యం చేసుకుని జీతాల సమస్యను పరిష్కారించకపోతే రాష్ట్రవ్యాప్తతంగా ప్రత్యక్ష ఆందోళన చేస్తామని హెచ్చరించారు. చీరాల: చీరాల ఒన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో బాలనేరస్తుడిపై నేరం రుజువు కావడంతో ఒంగోలు జువనైల్ జస్టిస్ బోర్డు కమ్–2 అదనపు మెజిస్ట్రేట్ శిక్ష ఖరారు చేశారు. ఒన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో శుక్రవారం ఒంగోలు కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో బాధితురాలి తరఫున ఏపీపీ కె.కళావతి వాదనలు వినిపించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు బాల నేరస్తుడికి పునరావాసం, సత్ప్రవర్తన నిమిత్తం ఒక సంవత్సరం పాటు తిరుపతిలోని ప్రభుత్వ స్పెషల్ హోమ్ ఫర్ బాయ్స్లోని ప్లేస్ ఆఫ్ సేఫ్టీకి పంపాలని ఉత్తర్వులు జారీ చేశారు. అలానే బాధితురాలికి రూ.5 లక్షలు పరిహారం మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో బాలనేరస్తుడికి శిక్ష ఖరారు చేయడంతో పాటు బాధితురాలికి త్వరితగతిన న్యాయం చేయడంలో ప్రతిభ కనబరచిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ బి.ఉమామహేశ్వర్ అభినందించారు. ఆందోళనలో బాఽధితులు మాదల(ముప్పాళ్ల): మండలంలోని మాదల గ్రామానికి చెందిన మందుల దుకాణం వ్యాపారి సుమారు రూ.20లక్షల వరకు అప్పులు తీసుకొని అదృశ్యమవటంతో అప్పులిచ్చిన వారంతా లబోదిబోమంటున్నారు. సదరు వ్యాపారి మాదల గ్రామంలోని ప్రదాన కూడలిలో అద్దె ఇంట్లో ఉంటూ మందుల దుకాణం నిర్వహిస్తూ గ్రామంలోను, సత్తెనపల్లిలోను పలువురి వద్ద వడ్డీకి నగదు తీసుకున్నాడు. అప్పులు ఇచ్చిన వారంతా ఒత్తిడి చేస్తుండటంతో కాలయాపన చేస్తూ మాదల గ్రామంలో తనకున్న 147 చదరపు గజాల ఖాళీ స్థలాన్ని ఈ ఏడాది మార్చి 23, 2026న విజయవాడకు చెందిన వారికి అమ్ముకొని సొమ్ము చేసుకున్నాడు. ఆ తర్వాత రాత్రికి రాత్రే గ్రామం విడిచివెళ్లిపోయాడు. వ్యాపారి నుంచి అప్పలు ఇచ్చిన వారందరికీ ఈ నెల 18 వ తేదీన ఐ.పీ నోటీసులు అందటంతో ఖంగుతిన్నారు. వడ్డీకి ఆశపడి కష్టపడి సంపాదించుకున్న సొమ్మును ఇచ్చింది కాక నోటీసులు రావటంతో గ్రామంలో కలకలం నెలకొంది. కోర్టు నుంచి నోటీసులు అందుకోవటంతో బాఽధితులు లబోదిబో మంటున్నారు. బాఽధితుల్లో ఒకరైన యర్రంశెట్టి సుబ్బారావు అనే వ్యక్తి సదరు వ్యాపారి 2024 ఏప్రిల్ 4వ తేదీన రూ.రెండు లక్షలు మద్యవర్తి ద్వారా తీసుకున్నాడని, న్యాయం చేయాలంటూ ఈ ఏడాది ఏప్రిల్ 20వ తేదీన జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్లోను ఫిర్యాదు చేశారు. నరసరావుపేట టౌన్: గుర్తు తెలియని యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ సీహెచ్ ప్రభాకర్ శుక్రవారం తెలిపారు. విజేత థియేటర్ సమీపంలో గుర్తుతెలియని యువకుడు మృతి చెంది ఉన్నాడన్నా సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించామన్నారు. మృతుడు ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుడి ఆనవాళ్లు తెలిసిన వారు టూటౌన్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సీఐ కోరారు. బాపట్ల: వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శిగా కోళ్ల భువనేశ్వరిని నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కోళ్ల భువనేశ్వరిని పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శిగా నియమించటంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. -
గంజాయి కేసులో నిందితుడి అరెస్టు
పట్నంబజారు: గంజాయి కేసులో నిందితుడిని అరెస్టు చేసి పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. కొత్తపేట పోలీసు స్టేషన్లో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొత్తపేట పోలీసు స్టేషన్ సీఐ ఎం.వీరయ్యచౌదరి వివరాలు వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం హవేరి జిల్లా అప్పిఆలూరు గ్రామానికి చెందిన హిరేకాంక్షి నిషార్ అహ్మద్ అలియాస్ ఆరీఫ్ అనే యువకుడు విశాఖపట్నం వెళ్లి ఆరు కిలోల గంజాయి కొనుగోలు చేశాడు. తిరిగి వస్తూ గుంటూరు రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగి కర్ణాటక రాష్ట్రం వెళ్లేందుకు వివరాలు అడుగుతున్న నేపథ్యంలో అనుమానం వచ్చిన పోలీసులు పక్కా సమాచారంతో దాడిచేశారు. నిషార్ అహ్మద్ వద్ద ఆరు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. -
కారు, ద్విచక్రవాహనం ఢీ
నలుగురికి గాయాలు మాచర్ల రూరల్: కారు, ద్విచక్ర వాహనం ఢీకొని నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన సంఘటన పట్టణ పరిధిలోని శ్రీశైలం రోడ్డులో శుక్రవారం చోటుచేసుకుంది. మాచర్ల నుంచి వెల్దుర్తి వైపు వెళ్తున్న కారు మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేయటానికి ప్రయత్నించే సమయంలో గొట్టిపాళ్ల నుంచి మాచర్ల వైపు వస్తున్న ద్విచక్ర వాహనదారుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనదారుడు పులిమెల కోటయ్య తలకు తీవ్ర గాయాలై, ఎడమ కాలు విరిగింది. మరొక వ్యక్తి పులిమెల అశోక్కు కారు గ్లాసు ముఖం పై గుచ్చుకుంది. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటిన మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స నిర్వహించారు. ఈ మేరకు పట్టణ ఎస్ఐ వెంకట్రావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాడు. -
పేలిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్
వినుకొండ: పట్టణంలోని పాత ఎల్ఐసి బిల్డింగ్ సమీపంలో శుక్రవారం సాయంత్రం భారీ ప్రమాదం తప్పింది. అక్కడ ఉన్న విద్యుత్ ట్రాన్న్స్ఫార్మర్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ట్రాన్న్స్ఫార్మర్ పేలిన వెంటనే ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాద తీవ్రతను గమనించిన స్థానికులు అప్రమత్తమై, వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు తక్షణమే స్పందించి విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని, అందరూ ఊపిరి పీల్చుకున్నారని స్థానికులు తెలిపారు. -
వడదెబ్బతో వృద్ధురాలి మృతి
మంగళగిరిలో వృద్ధుడి..మంగళగిరి టౌన్: వడదెబ్బకు గురై ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన యర్రబాలెంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళగిరి మండల పరిధి యర్రబాలెం గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన వృద్ధుడు బత్తిని నరసింహారావు(78) గత రెండు రోజులుగా తీవ్రమైన ఎండల కారణంగా అనారోగ్యం పాలయ్యాడు. ఎండ వేడి తట్టుకోలేక వృద్ధుడు శుక్రవారం వడదెబ్బకు గురై మృతిచెందాడు. ఆయనకు భార్య ఉంది. భట్టిప్రోలు: హైవే జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతిచెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. భట్టిప్రోలు మండలం సూరేపల్లికి చెందిన చిత్రలేఖనోపాధ్యాయులు పాలాటి నరసింహారావు (60) పడమటివారిపాలెంకు చెందిన విద్యార్థి మట్టా విఘ్నేష్ను బైక్పై ఎక్కించుకుని వెళుతున్నాడు. భట్టిప్రోలు వేమవరం మధ్యలో ఎన్హెచ్ 216 రహదారిపై టిప్పర్ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ నరసింహారావును 108 వాహనంలో తెనాలి ఏరియా వైద్యశాలకు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. స్వల్ప గాయాలైన విఘ్నేష్ను సంగంజాగర్లమూడిలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. సమాచారం మేరకు ఎస్ఐ ఎం.శివయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చీరాల: మండలం వాడరేవులోని సముద్రతీరానికి శుక్రవారం ఉదయం ఓ వృద్ధుడి మృతదేహం కొట్టుకువచ్చిందని రూరల్ ఎస్ఐ ఎ.చంద్రశేఖర్ తెలి పారు. మృతుడి వయస్సు 55 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉంటుందని, ఎడమచేతి ఉంగరం వేలుకు ఎరుపు రాయి కలిగిన బంగారపు ఉంగరం ఉందన్నారు. మృతుడికి సంబంధించిన వివరాలు తెలిసిన వారు చీరాల రూరల్ ఎస్ఐ 9121102144, చీరాల రూరల్ సర్కిల్ సీఐ 9121102143 నంబర్లుకు సంప్రదించాలన్నారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
అమెరికాలో ఫాదర్ వేళంగిణిరెడ్డి మృతి
అచ్చంపేట: మండలంలోని తాళ్లచెరువుకు చెందిన విచారణకర్త రెవ.ఫాదర్ తుమ్మా వేళంగిణిరెడ్డి (45) సువార్త ప్రచారం కోసం అమెరికాలోని కాలిఫోర్నియా వెళ్లి గుండెపోటుతో గురువారం మృతి చెందారు. వీరి స్వగ్రామం తాళ్లచెరువు కాగా ఇదే గ్రామంలోని బాలయేసు చర్చిలో విచారణకర్తగా పనిచేశారు. ప్రస్తుతం పెదనందిపాడు మండలం అబ్బినేనిగుంటవారిపాలెంలో విచారణకర్తగా పనిచేస్తున్నారు. ఆయన ప్రతి యేటా మే నెలలో సువార్త ప్రచారం కోసం అమెరికా వెళుతుంటారు. ఈ ఏడాది కూడా వెళ్లి గుండెపోటుతో మృతి చెందినట్లు బంధవులు తెలిపారు. వీరు దివ్యవాణి టీవీ ఛానల్లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా పనిచేశారు. ఆయన సోదరుడు సాగర్థామస్రెడ్డి సినిమా డైరెక్టర్ కాగా, తల్లి నిర్మలామేరి విశ్వాసురాలు. తండ్రి పీటర్రెడ్డి దైవసేవకులుగా పనిచేస్తూ క్యాన్సర్ వ్యాధితో మృతిచెందారు. ఆయన విచారణ గురువులుగా ఫిరంగిపురం, రెంటచింతల, పాటిబండ్ల, యనమదల, పెద్దపలకలూరు తదితర ప్రాంతాలలో పనిచేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తాళ్లచెరువు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. -
నేరస్తులపై నిరంతర నిఘా
బాపట్లటౌన్: ప్రాపర్టీ నేరాలకు పాల్పడిన వారిపై నిరంతరం నిఘా ఉంచాలని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. ఎస్పీ కార్యాలయంలోని సీసీఎస్ పోలీస్స్టేషన్ గురువారం సీసీఎస్ పోలీస్ స్టేషన్ను సందర్శించి, స్టేషన్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ స్టేషన్ ఆవరణలో వివిధ కేసుల్లో సీజ్ చేసిన ద్విచక్ర వాహనాలను పరిశీలించి వాటికి సంబంధించిన చట్టపరమైన ప్రక్రియను వేగవంతం చేసి, అసలైన బాధితులకు త్వరితగతిన అప్పగించేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో నమోదైన దొంగతనం కేసుల రికవరీ పురోగతిపై ఆరా తీసిన ఆయన, రికవరీ శాతాన్ని మరింత పెంచాలని సూచించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలోని మొక్కలకు నీటిని అందించడానికి ఏర్పాటు చేసిన మోటార్, నీటి పంపింగ్ సిస్టంను ప్రారంభించి, ఆ పరిసరాలలో కొబ్బరి మొక్కను నాటారు. జిల్లాలో రానున్న నాలుగు రోజుల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంటుంన్నందున ప్రజలు, విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్ నాయక్, ఇన్స్పెక్టర్ పి.ప్రేమయ్య, ఎస్బీ సీఐ జి.నారాయణ, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ -
వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు అరెస్ట్
భట్టిప్రోలు: భట్టిప్రోలు పంచాయతీ పరిధిలోని అద్దేపల్లి దళితవాడలో 15 మంది దళితులపై నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ గ్రామంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన వైఎస్సార్ సీపీ రాష్ట్ర సోషల్ మీడియా జాయింట్ సెక్రటరీ దాసరి కిరణ్ బాబును పోలీసులు గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కిరణ్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహం సాక్షిగా రాజ్యాంగం కల్పించిన నిరసన హక్కును వినియోగించుకున్నందుకు అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. కిరణ్ అరెస్టును వైఎస్సార్ సీపీ శ్రేణులు, దళిత సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వం దళితుల పక్షాన లేదని.. దళితుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని...ఈ ఘటన రుజువు చేస్తుందని మండిపడ్డారు. -
డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మికి ఉద్యోగోన్నతి
గుంటూరు మెడికల్: గుంటూరు డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అడిషనల్ డైరెక్టర్గా ఉద్యోగోన్నతి పొందారు. గురువారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో డాక్టర్ కొర్రా విజయలక్ష్మిని వైద్య సిబ్బంది అభినందనలు తెలిపారు. డాక్టర్ అమర్తలూరి శ్రావణ్బాబు సివిల్ సర్జన్గా పదోన్నతి పొందారని, త్వరలో స్థల కేటాయింపు జరుగుతోందని డాక్టర్ విజయలక్ష్మి వెల్లడించారు. కార్యక్రమంలో ప్రొగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అమర్తలూరి శ్రావణ్బాబు, డాక్టర్ సుజాత, డాక్టర్ ప్రియాంక, సిబ్బంది పాల్గొన్నారు. ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధతో బోధన చేయాలని పాఠశాల విద్య ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖ–సమగ్రశిక్ష ఆధ్వర్యంలో గురువారం అమరావతిరోడ్డులోని నెక్ట్స్ జెన్ ఇంటర్నేషనల్ స్కూలులో గుంటూరు జోన్ పరిధిలోని ఉప విద్యాశాఖాధికారులు, ఎంఈవో–2లకు ఒక్కరోజు ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్జేడీ లింగేశ్వరరెడ్డి పర్సనల్ ఎడాప్టివ్ లెర్నింగ్ (పల్), టీచ్ టూల్, మధ్యాహ్న భోజన పథక అమలుపై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో పాఠ్యాంశాల ఆధారిత విజ్ఞానాన్ని అభివృద్ధి పర్చి, సంబంధిత సబ్జెక్టులపై పట్టు సాధించేలా తీర్చిదిద్దాల్సిన అవసరముందన్నారు. విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ చూపించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను విస్తృతంగా చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో పల్ రాష్ట్ర నోడల్ అధికారి బి.కిఫోర్బాబు పాల్గొన్నారు. చేబ్రోలు: చేబ్రోలు మండలం వీరనాయకునిపాలెం గ్రామంలోని క్వారీ ప్రాంతాన్ని గురువారం విజిలెన్స్, మైనింగ్, రెవెన్యూ అధికారుల బృందం పరిశీలించింది. వివిధ అంశాలలో సమాచారాన్ని నమోదు చేసుకున్నారు. వీరనాయకునిపాలెం గ్రామానికి చెందిన మెండెం ప్రభుదాసు 2024లో అక్రమ మైనింగ్పై గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై రెండు రోజులుగా విజిలెన్స్ అండ్ ఎన్పోర్సుమెంట్ అసిస్టెంట్ జియాలజిస్ట్ జి అనీల్, మైనింగ్ ఆర్ఐ సీహెచ్ ఆంజనేయులు, తహసీల్దారు కె శ్రీనివాసశర్మ, సర్వేయర్లు వీరనాయకునిపాలెం క్వారీ ప్రాంతాన్ని పరిశీలించి వారికి అవసరమైన సమాచారాన్ని సేకరించారు. రెండు రోజులపాటు ఆధునిక యంత్ర పరికరాలతో ప్రభుత్వ స్థలాలు, సర్వే నెంబర్లు, క్వారీలోని లోతు, ఎన్ని మెట్రిక్ టన్నుల గ్రావెల్ తరలించారు. అనే విషయాలపై పూర్తిస్థాయిలో నివేదిక తయారు చేయటం కోసం అధికారుల బృందం పరిశీలించింది. -
బాపట్ల
శుక్రవారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2026● పోలీసు జీపు డ్రైవర్ కొట్టడంతో పెట్రోల్ పోసుకొని బలవన్మరణానికి యత్నం ● అప్రమత్తతతో అడ్డుకున్న వ్యక్తి బంధువులు, పోలీసు సిబ్బంది కారంచేడులో 45 డిగ్రీల మోత.. ఇదేమి టెన్షన్ గురు..!నిర్మానుష్యంగా చినవంతెన సెంటర్అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 32.2542 టీఎంసీలు. -
గాలుల బీభత్సం
ప్రత్తిపాడు: అప్పటి వరకూ నిప్పులు చిమ్మిన సూరీడుని ఒక్కసారిగా కారుమబ్బులు చుట్టేసి, చీకట్లు కమ్ముకున్నాయి. గురువారం సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై భారీ ఈదురుగాలులు భీభత్సం సృష్టించాయి. నియోజకవర్గ కేంద్రం ప్రత్తిపాడుతో పాటు కోయవారిపాలెం, వట్టిచెరుకూరు మండలం ఐదవ మైలు, పుల్లడిగుంట, ఏటుకూరు.. ప్రాంతాల్లో ఈదురుగాలుల ధాటికి గుంటూరు–పర్చూరు పాతమద్రాసు రోడ్డులో ఉన్న భారీ వృక్షాలు నేలకొరిగాయి. గ్రామాల్లోని విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. అప్రమత్తమైన విద్యుత్శాఖ అధికారులు గ్రామాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. రోడ్డుపై భారీ వృక్షాలు అడ్డుగా పడిపోవడంతో గుంటూరు– బాపట్ల, ప్రకాశం, పల్నాడు జిల్లాల మధ్య కొంత సేపు వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఈదురుగాలుల ధాటికి గుంటూరు – పర్చూరు పాతమద్రాసు రోడ్డులో నేలకొరిగిన భారీ వృక్షం -
విద్యా వ్యవస్థపై శ్రద్ధ లేదు
ఏబీవీపీ నాయకుల ఆగ్రహంమంగళగిరి టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ఇతర రంగాలపై పెట్టే దృష్టి విద్యావ్యవస్థపై పెట్టడం లేదని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నాయకులు ఆరోపించారు. ఉన్నత విద్యావ్యవస్ధను సంస్కరించాలంటూ మంగళగిరిలోని రాష్ట్ర ఉన్నత విద్యాకార్యాలయం ఎదుట బుధవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏబీవిపి నాయకులు మాట్లాడుతూ ఫీజు రీయంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉన్నత విద్యామండలి నుండే కామన్ ఎంట్రన్స్ పరీక్షలను సకాలంలో నిర్వహించినా అడ్మిషన్లు మాత్రం జాప్యం జరుగుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఉన్నత విద్యామండలి చైర్మన్ మధుమూర్తికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏబీవిపి రాష్ట్ర కార్యదర్శి వెంకట గోపి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు అఖిల్, సాయి, సురేంద్ర, జాతీయ కార్యవర్గ సభ్యురాలు వేదశ్రీ, కార్యకర్తలు పాల్గొన్నారు. పోలీసుల అత్యుత్సాహం.... ఉన్నత విద్యామండలి కార్యాలయం ఎదుట ధర్నా చేసే సమయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించినట్లు నాయకులు ఆరోపించారు. ఒక్కసారిగా నాయకులంతా కార్యాలయం లోపలికి వెళ్లడంతో పోలీసులు వారిపై దురుసుగా ప్రవర్తించారు. పోలీసులకు, ఏబీవీపీ నాయకులకు మధ్య తోపులాటలు జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. కార్యాలయం లోపలే నినాదాలు చేస్తున్నారని అక్కడి నుంచి వారిని బయటకు పంపించామంటూ పోలీసులు చెబుతున్నారు. -
ఆంధ్రకేసరి జీవితం అందరికీ ఆదర్శం
ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిగుంటూరు ఎడ్యుకేషన్: టంగుటూరి ప్రకాశం పంతులు మార్గదర్శకత్వం అందరికీ ఆదర్శమని ఎమ్మెల్సీ, ఆంధ్రకేసరి అభిమాన సంఘ గౌరవాధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ఆంధ్రకేసరి అభిమాన సంఘ ఆధ్వర్యంలో శంకర్విలాస్ సెంటర్లోని ప్రకాశం చౌక్లో నిర్వహించారు. తొలుత ఆయన విగ్రహానికి లేళ్ల అప్పిరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గుంటూరు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బందా రవీంద్రనాథ్, పార్టీ సీఈసీ సభ్యులు మందపాటి శేషగిరిరావు, మాజీ కార్పొరేటర్లు ఈచంపాటి వెంకటకృష్ణ, పాపతోటి అంబేడ్కర్, షేక్ రోషన్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బత్తుల దేవానంద్, గీతా మందిరం చైర్మన్ వెలుగూరి రత్నప్రసాద్, వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, రాష్ట్ర యువజన నేత నూనె ఉమామహేశ్వరరెడ్డి, బందా శశి, పార్టీ నేతలు ఓర్చు శ్రీనివాసరావు, బైరెడ్డి రవీంద్రారెడ్డి, ఆలా కిరణ్, అరవ తిమ్మరాజు, చింతపల్లి రమణ, మన్నేపల్లి హనుమంతరావు, రెడ్డి కోటేశ్వరరావు, సింగు నరసింహారావు, సుందరరావు, సమీర్, శంకర్, వెంకటరెడ్డి, చిన్నా, వెంకటరమణ, సుశీలరావు, నీలి, ప్రసన్న, నారాయణ, విజయమాధవి, విజయమ్మ, రత్నకుమారి, దుర్గ, ఆదిలక్ష్మి పాల్గొన్నారు. -
అంబటి మురళీకృష్ణపై పోలీసుల జులుం
పొన్నూరు / చేబ్రోలు: గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్లపల్లి గ్రామంలో పోలీసులు మరోసారి జులుం ప్రదర్శించారు. వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో గత 15 రోజుల నుంచి జరుగుతున్న మొక్కజొన్న రైతుల పరామర్శను అడ్డుకోవడమే లక్ష్యంగా వ్యవహరించారు. బుధవారం రైతులను పరామర్శించేందుకు గ్రామానికి వచ్చిన రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్, పార్టీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణలను అరెస్టు చేసేందుకు దౌర్జన్యానికి దిగారు. మురళీకృష్ణ నివాసంలో ఉన్న ప్రభాకర్ను తమ వెంట పంపించాలని పోలీసులు ఒత్తిడి చేశారు. ఎందుకు పంపించాలో కారణం చూపించాలని మురళీకృష్ణ ప్రశ్నించారు. దీంతో పొన్నూరు రూరల్ ఎస్ఐ శ్రీహరి, సీఐ కృష్ణయ్య వాగ్వాదానికి దిగారు. రైతులపై దాడి చేసిన ఆ 31 మంది ఎమ్మెల్యే ధూళిపాళ్ల అనుచరులను అరెస్టు చేస్తే పోలీసులకు ఈ కష్టాలు ఉండవు కదా అన్నారు. రైతులకు అండగా నిలిచి శాంతియుతంగా కార్యక్రమాలు చేస్తున్న వైఎస్సార్ సీపీపై దాడి చేయడమేంటని మండిపడ్డారు. ఇంటి మొదటి అంతస్తులో ఉన్న ప్రభాకర్ను అదుపులోకి తీసుకునేందుకు వెళుతున్న పోలీసులను మురళీకృష్ణ అడ్డుకున్నారు. ఆగ్రహించిన పోలీసులు ఆయన్ను బలవంతంగా నెట్టుకుంటూ పోలీసు వాహనం ఎక్కించారు. తర్వాత మళ్లీ ఇంట్లోకి ప్రవేశించి మురళీకృష్ణ సోదరితోపాటు అనేక మంది మహిళలు ఉన్నప్పటికీ తోసుకుంటూ మొదటి అంతస్తులోకి వెళ్లి తలుపు పగలగొట్టి జూపూడి ప్రభాకర్ను బలవంతంగా తీసుకువచ్చి పోలీసు జీపు ఎక్కించారు. వాహనానికి అడ్డుపడిన పార్టీ కార్యకర్తలు, రైతులపై లాఠీచార్జ్ చేశారు. మహిళలను సైతం మగ పోలీసులు దౌర్జన్యం చేస్తూ లాగిపడేశారు. పొన్నూరు రూరల్ సీఐ కృష్ణయ్య, ఎస్ఐ శ్రీహరి, పట్టణ సీఐ వీరా నాయక్, తెనాలి సీఐ, చేబ్రోలు ఎస్ఐలతోపాటు పోలీసులు రైతుల పట్ల దారుణంగా వ్యవహరించడాన్ని గ్రామస్తులు, రైతులు ఖండించారు. వారిద్దరినీ చేబ్రోలు పోలీసు స్టేషన్కు తరలించి రెండు గంటల పాటు ఉంచి ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించారు. పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఇద్దరిని పంపించేశారు. ఈ సందర్భంగా అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ పోలీసులను అడ్డుపెట్టుకుని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ అరాచకం సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. మామిళ్లపల్లి గ్రామంలో టీడీపీ నాయకులు చేసిన దౌర్జన్యంలో నష్టపోయి, ఎస్సీ, ఎస్టీ కేసులు ఎదుర్కొంటున్న మొక్కజొన్న రైతులను వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు పరామర్శించి సంఘీభావం ప్రకటించడం తప్పా అని ప్రశ్నించారు.దౌర్జన్యం చేసిన పోలీసులపై న్యాయపోరాటం చేస్తామని అన్నారు. అరాచకం సృష్టిస్తున్న ఎమ్మెల్యే ధూళిపాళ్ల పొన్నూరు ఏమైనా పాకిస్థాన్లో ఉందా.. కష్టంపై ఆధారపడి జీవనం సాగించే రైతులపై టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నా చంద్రబాబుకు కనిపించడం లేదా అని వైఎస్సాఆర్ సీపీ గుంటూరు పార్లమెంటు పరిశీలకుడు పోతిన వెంకట మహేష్ నిలదీశారు. రైతులకు అండగా నిలిచిన వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ చేసింది నేరమా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి జోగి రమేష్, పార్టీ రాష్ట్ర నాయకుడు జూపూడి ప్రభాకర్ను పోలీసులతో అక్రమ అరెస్టులు చేయించడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చని ధ్వజమెత్తారు. కాపు రైతులకు అండగా నిలుస్తున్న మురళీకృష్ణను వేధించడం ప్రజాస్వామ్య విలువలను అపహాస్యం చేయడమేనని విమర్శించారు. -
స్క్రాప్కు పక్కాగా లెక్క..
పట్నంబజారు: డబ్బులు పడేసిన లెక్కవేసి పడేయాలంటారు.. అలాగే వాహనాల విషయంలో పక్కాగా లెక్క ఉండాల్సిందే. వాహనం వయసు అయిపోయిందిలే.. సెంకడ్ హ్యాండ్ అమ్మేద్దాం.. లేదా స్క్రాప్కు పంపుదాం అనుకుంటే పొరపాటే. ప్రతి వాహనం కొనుగోలు చేసిన తరువాత దాని కాల పరిమితి 15 సంవత్సరాలు. ఆ తరువాత వాహన ఇంజన్ పరిస్థితిని బట్టి ఐదేళ్ల నుంచి మరింత పైగా వాహనాలకు కాలపరిమితిని పెంచే అవకాశం రవాణాశాఖ అధికారులకు ఉంది. కేవలం నూతన వాహనం కొనుగోలు చేసే క్రమంలో ప్రతి ధ్రువీకరణ పత్రాన్ని చూస్తాం. అలాగే వాహనం అది ద్విచక్రమైన, కారైనా, అంబులెన్స్, ఆటో మరేదైనా.. కచ్చితంగా వాహనం స్క్రాప్(తుక్కు) చేసే ముందుకు అధికారులకు ధరఖాస్తు ఎంతో అవసరం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. లేకుంటే ఆ వాహనంతో ఏదైనా ప్రమాదం జరిగినా.. ఏదైనా ఘటన చోటు చేసుకున్నా.. ఆ వాహన యజమాని కచ్చితంగా బాధ్యత వహించాల్సిందే. జిల్లాలో వాహనాలు ఇలా... జిల్లాలో మొత్తం సుమారు 2 లక్షలకుపైగా వాహనాలు ఉన్నాయి. వాటిలో 26,515 లారీలు, 1,603 మ్యాక్సీ క్యాబ్లు, 6,452 మోటార్ క్యాబ్లు, 16,800 కమర్షియల్ ట్రాక్టర్లు, 29,905 ఆటోలు, 2800పైగా స్కూల్ బస్సులతో పాటు ఇతరత్రా ట్రాన్స్పోర్ట్ వాహనాలు కలుపుకుని మొత్తం 2లక్షకుపైగా వాహనాలు ఉన్నాయి. అయితే వాటీలో అనేక సంవత్సరాలుగా త్రైమాసిక పన్నులు చెల్లించని వాహనాలు ఉన్నాయి. అధికారుల గణంకాల ప్రకారం ఇప్పటి వరకు 8,000పైగా ఉన్నట్లు గుర్తించారు. వాటిలో ఒక త్రైమాసికం చెల్లించనవి 750, రెండుకుపైగా చెల్లించనవి 376, మూడు త్రైమాసికాలు 293, నాలుగు చెల్లించనవి 400పైగా, ఐదు త్రైమాసికాలవి 220పైగా, ఐదుకు పైగా ఉన్నవి సుమారుగా ఐదు వేలకు పైగానే ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. మూలన పడ్డవి ఎన్నో.... జిల్లాలో త్రైమాసిక పన్నులు చెల్లించాల్సిన వాహనాలు 8,000 ఉండగా వాటిలో అసలు ఎన్ని మూలన పడ్డాయో.. ఎన్ని వాహనాలు కేసుల్లో ఉన్నాయో.. ప్రమాదాల్లో గురై ఆయా స్టేషన్లు, ఆర్టీఏ కార్యాలయాల్లో వదిలేసినవి, ఇతరత్రా కారణాలతో వదిలేసినవి వేలల్లోనే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. కాలం చెల్లిన వాహనాలను స్క్రాప్కు వేయటం, ఫైనాన్స్ కంపెనీల ప్రతినిధులు తీసుకుని వెళ్లిన వాహనాల గురించి పట్టించుకోకపోవటం, విక్రయించిన వాహనాల గురించి సమాచారం ఇవ్వకపోవటం వంటివి ప్రధానంగా గుర్తించారు. సుమారు 3వేలకుపైగా వాహనాలు స్క్రాప్తోపాటు, ఇతర అంశాల్లో సంబంధిత యజమానుల వద్ద లేనట్లు గుర్తించారు. పన్ను పడుతూనే ఉంది... వాహనాలకు సంబంధించి యజమానుల దగ్గర వాహనం లేనప్పటికీ త్రైమాసిక పన్నులు మాత్రం పడుతూనే ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో వాహనదారులు వాహనాలు స్క్రాప్కు వేసినా, ఇతరత్రా అంశాల్లో కోల్పోయినా.. కనీసం అధికారులకు సమాచారం ఇవ్వకపోవటంతోనే వాటికి పన్నులు పడుతూనే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అధికారులు వాహనాలకు సంబంధించి దరఖాస్తులు చేసుకోవాలని సూచిస్తున్నారు. వాహనాన్ని స్క్రాప్ కింద తీసివేసినా, ఫైనాన్స్ వారు తీసుకుపోయినా, ప్రమాదం జరిగి ఎక్కడైనా వాహనం నిలిచిపోయినా.. తప్పని సరిగా తెలియజేయాల్సి ఉందని నిబంధనలు చెబుతున్నాయి. ఈ మూడేళ్ల వ్యవధిలో కేవలం రెండు వేల వాహనాలు మాత్రమే స్క్రాప్కు ధరఖాస్తు చేసుకున్నారు. ఇందులో సుమారు 1400పైగా బైక్లు ఉన్నాయి. ముఖ్యంగా వాహనాలను స్క్రాప్కు పంపే విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్న అంశంపై ప్రజల్లో అవగాహన లేకపోవటమే ఇందుకు ప్రధాన కారణం. ఫైనాన్స్ కంపెనీల వారు తీసుకుని వెళ్లటం, వాటికి సంబంధించి యజమానులు దరఖాస్తు చేసుకోవటంపోవటం వలన పన్నులు పెరిగిపోతున్నాయని అధికారులు గుర్తించారు. స్క్రాప్కు వేసిన వాహనంకు సంబందించి ఛాయిస్ నంబర్లు దుర్వినియోగానికి పాల్పడితే.. దానికి సంబందించి వాహన యజమానే బాధ్యత వహించాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. -
ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
కాలువలోకి దూసుకెళ్లిన కారు చీరాల: వేగంగా వెళుతున్న కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఒకరు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం రాత్రి చీరాల– కారంచేడు రోడ్డులోని లారీ యూనియన్ ఆఫీస్ వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు... చీరాలలోని జవహర్నగర్కు చెందిన మనోజ్, వరుణ్, హేమంత్ కారులో చీరాల నుంచి కారంచేడు వెళ్లారు. తిరిగి వచ్చే క్రమంలో చీరాల సమీపంలోని లారీ యూనియన్ కార్యాలయం వద్ద కాలువలోకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మనోజ్(16) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మనోజ్ ఇటీవల పదో తరగతి పూర్తి చేశాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు క్షతగాత్రుల వద్ద నుంచి అవుటుపోస్టు పోలీసులు వివరాలను నమోదు చేసుకున్నారు. -
మహిళలు, చిన్నారులభద్రతపై అవగాహన
వినుకొండ: మహిళలు, చిన్నారుల భద్రతపై అవగాహన సదస్సు పల్నాడు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ కృష్ణారావు హాజరయ్యారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గృహ హింస బాధితులు 181, అత్యవసర సేవల కోసం 112, మహిళలపై వేధింపులు, అక్రమ రవాణాకు సంబంధించిన ఫిర్యాదుల కోసం 1091, చైల్డ్ సేఫ్టీ కోసం 1098 నంబర్ల వినియోగంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఎస్పీ హనుమంతరావు, రూరల్ సీఐ బ్రహ్మయ్య, సీఐ సుభాషిణి, పట్టణ కమిషనర్ శివరాం ప్రసాద్ పాల్గొన్నారు. ప్రతిభ పురస్కారాలకు దరఖాస్తులు గుంటూరు ఎడ్యుకేషన్: ఏకలవ్య ట్రైబల్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో పది, ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేయనున్నట్లు సొసైటీ రాష్ట్ర కన్వీనర్ డి.శ్రీనివాసరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన ఎరుకల సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పదో తరగతిలో 540, జూనియర్ ఇంటర్లో 420, సీనియర్ ఇంటర్లో 900 మార్కులకు పైబడి మార్కులు సాధించిన వారు అర్హులని తెలిపారు. జూన్ 15వ తేదీలోగా దరఖాస్తులను ‘133–8–1878, హిమనీనగర్ 3వ లైన్, నగరాలు, అమరావతిరోడ్డు, గుంటూరు–522035’ చిరునామాకు పంపాలన్నారు. ఇతర వివరాలకు 99594 14333, 79894 78961, 63043 57686 ఫోను నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
కేసీపీకి బెస్ట్ సిమెంట్ ఫ్యాక్టరీ అవార్డు
మాచర్ల రూరల్: కార్మికుల సంక్షేమ, కర్మాగారంలో భద్రత, పరిశుభ్రతతో పాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పాటిస్తున్న కేసీపీ సిమెంట్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ కర్మాగారం, శ్రమశక్తి అవార్డును అందజేసింది. బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి కలక్షేత్రంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చేతుల మీదుగా అవార్డును సీనియర్ మేనేజర్ కె.వెంకటరమణ అందుకున్నారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ దశాబ్దాలుగా కేసీపీ సిమెంట్స్ నాణ్యతలో రాజీ పడకుండా, కార్మికుల భద్రత, వారి కుటుంబ సంక్షేమలో యాజమాన్యం తీసుకుంటున్న చర్యలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి బెస్ట్ సిమెంట్ ఫ్యాక్టరీ, శ్రమశక్తి అవార్డును అందించిందన్నారు. ఇదే స్ఫూర్తితో ఉత్పత్తిలో నాణ్యత, ఉద్యోగుల భద్రతలో మరింత ప్రమాణాలు పాటిస్తూ ముందుకు పోతామన్నారు. రాష్ట్రస్థాయిలో కేసీపీ సంస్థకు బెస్ట్ అవార్డు రావడంపై ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు ఆనంద వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు. నరసరావుపేట: జిల్లాలో జల్ జీవన్ మిషన్ 2.0, స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) కార్యక్రమాలను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ పేర్కొన్నారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతి లాల్ దండే నిర్వహించిన వీడియా కాన్ఫరెన్స్కు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంతి లాల్ దండే మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్ పనులను వేగవంతం చేసి, పూర్తి చేసిన పథకాలను గ్రామ పంచాయతీలకు అప్పగించే ప్రక్రియను త్వరితగతిన ముగించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్ 2.0 కింద గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పీఎం పథకాలతో గ్రామాలకు ప్రాధాన్యతనిస్తూ తాగునీటి కనెక్షన్లను అందిస్తున్నామన్నారు. నీటి నాణ్యత పర్యవేక్షణ, గ్రామస్థాయి ఎఫ్టీకే పరీక్షలు, స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటి సదుపాయాల నిర్వహణ, ఘన వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామని తెలిపారు. గ్రామీణ పారిశుద్ధ్య కార్యక్రమాల పురోగతిని ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షించి పారిశుద్ధ్య కార్యక్రమాలు సక్రమంగా జరిగేలా చూస్తున్నామని పేర్కొన్నారు. నరసరావుపేట: రీసర్వేలో అక్రమాలకు పాల్పడిన ఆరోపణలపై అచ్చంపేట మండలం కోనూరు గ్రామ సర్వేయర్ కిరణ్ కుమార్, వీఆర్ఓ వెంకయ్యలను జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహా బుధవారం సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో కోనూరు గ్రామానికి చెందిన పలువురు గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సదరు అధికారులు ఇద్దరూ భూమి కొలతలు, రెవెన్యూ రికార్డుల మార్పులు, ఇతర ప్రభుత్వ సేవల కోసం పెద్ద ఎత్తున లంచాలు డిమాండ్ చేస్తున్నారని, తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. బాధితుల ఫిర్యాదులపై ప్రాథమిక విచారణ ఆధారంగా ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. రీసర్వే విషయంలో అధికారుల నిర్లక్ష్యం, అక్రమాలపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. నరసరావుపేట రూరల్: రూ.3వేలు చెల్లిస్తే రూ.3లక్షలు, ఆతర్వాత రూ.కోటి వస్తాయంటూ ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టుచేసినట్లు రూరల్ సీఐ ఎం.వి.సుబ్బారావు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.6లక్షల నగదు, ఒక ల్యాప్టాప్, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. బుధవారం సాయంత్రం రూరల్పోలీసుస్టేషన్ ఆవరణలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. చిలకలూరిపేట మండలం గొట్టిపాడు గ్రామానికి చెందిన నాగండ్ల వెంకటరావు, నాగండ్ల వంశి, అదే మండలం కావూరు గ్రామానికి చెందిన దేవళ్ల నరసింహారావు, తెలంగాణ రాష్ట్రం మంచీర్యాల జిల్లా చెన్నూరు గ్రామానికి చెందిన పెండ్యాల నీరజలను అరెస్టు చేశామన్నారు. కేశానుపల్లి పంచాయతీ పరిధిలోని ఎల్టీ నగర్లో ధూళిపాళ్ల సైదావలి ఇంటివద్ద నిందితులు ఓ కార్యాలయం ఏర్పాటుచేసి నరసరావుపేట మండలం చుట్టుపక్కల ప్రజలకు మాయమాటలు చెప్పి రూ.3వేలు డిపాజిట్ చేస్తే తొలుత రూ.3లక్షలు అకౌంట్లో వేస్తారని, ఆ తర్వాత రూ.కోటి, ఆ తర్వాత రూ.25కోట్లు అకౌంట్లో వేస్తారంటూ నమ్మబలుకుతూ వ్యవస్థీకృత నేరానికి పాల్పడుతున్నారన్నారు. దీనిపై మండలంలోని కేసానుపల్లి గ్రామ వీఆర్ఓ పామిశెట్టి రాంబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టుచేశామన్నారు. -
అన్నదాతలకు కన్నీళ్లు
దిక్కుతోచని స్థితిలో జిల్లా రైతులు చీరాల అర్బన్: ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలకు చేతలకు పొంతన ఉండదు. ఎన్నికల వేళ పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పారు. నిత్యావసర సరుకుల ధరలను నియంత్రిస్తామన్నారు. అది జరగకపోగా నిత్యావసర సరుకుల ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. పెట్రోలు, డీజిల్ ధరల పెంపు కొనసాగుతోంది. ఈ క్రమంలో వ్యవసాయ రంగానికి సంబంధించి వరి సాగు తగ్గించాలని పదే పదే చెప్పారు. అయితే మాగాణి సాగు తగ్గిస్తే, ప్రత్యామ్నాయం ఏంటని సాగుదారులకు సమాధానం చెప్పేవారు కరువయ్యారు. ఖరీఫ్ పంట కాలం ముంచుకొస్తోంది. విత్తనాల కొరత వెంటాడుతోంది. ఇప్పటికే పలు రకాల ఎరువుల ధరలను పెంచారు. గత ఏడాది అక్టోబర్లో వచ్చిన మోంథా తుపాను పంట నష్టపరిహారం ఇప్పటికీ అందలేదు. బ్యాంకర్లు రుణగ్రహీతల్లో స్థితిమంతులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సన్న, చిన్నకారు రైతుల పట్ల చిన్నచూపు చూస్తున్నారు. దీంతో సాగు సంకటంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాటి పరిస్థితి తలకిందులు.. కొమ్ముమూరు ఆయకట్టుకు జిల్లా ధాన్యాగారంగా పేరు. మాగాణికి పుట్టిల్లు. ఇది ఒకప్పటి మాట. ముఖ్యమంత్రి చంద్రబాబు వరి సాగు తగ్గించాలని చెబుతున్నారు. తాను వరన్నం తినడం లేదంటారు. మిల్లెట్స్ వైపు దృష్టి సారించాలని సూచించారు. మాగాణి రైతులకు వరి సాగుకు ప్రత్యామ్నాయం ఏంటనేది మాత్రం ఆయన చెప్పలేరని విమర్శలు ఉన్నాయి. దీంతో జిల్లా ధాన్యాగారంగా గొప్పగా చెప్పుకున్న రైతులే నేడు తమ పరిస్థితి దిక్కుతోచని విధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎరువుల ‘బరువు’ జిల్లాలో గత ఏడాది ఖరీఫ్లో 1.27 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేశారు. రబీలో 1.78 లక్షల హెక్టార్లలో సాగయ్యాయి. గత ఏడాది యూరియా కొరత వెంటాడింది. రైతులకు అవసరమైన మేర సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు మాగాణి రైతులు యూరియా వాడకం తగ్గించాలని చెప్పుకొచ్చారు. ఈ ఏడాది పంట కాలానికి ముందే పలు రకాల ఎరువుల ధరలను పెంచారు. ఇది రైతులకు అదనపు భారం. ఖరీఫ్ పెట్టుబడులు కష్టమే.. ఽగిట్టుబాటు ధరలు అటుంచి మద్దతు ధరలు కూడా పూర్తి స్థాయిలో అందక ఉత్పత్తులను అరకొరగానే విక్రయించారు. అయితే ఖరీఫ్ సాగుకు సన్నద్ధం కావాలంటే పెట్టుబడులకు రైతులు అరువు బాట పట్టాల్సి వస్తోంది. గత ఏడాది అక్టోబర్ మాసంలో మోంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు పంటలు నీట మునిగాయి. భారీగా నష్టపోయారు. జిల్లాలో 18,609 మంది రైతులకు గాను 12,700 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు నమోదు చేశారు. పరిహారంగా రూ.2,395 లక్షలు అందాల్సి ఉంది. సన్న, చిన్నకారు రైతులకు దక్కని బ్యాంకు రుణాలు రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం. కొత్తగా బాధ్యతలు స్వీకరించా. జిల్లాలో ఎక్కడా రైతుల ప్రయోజనాలకు ఇబ్బంది కలగకుండా మా పరిధిలో మేం పూర్తి స్థాయిలో పని చేస్తాం. ఇండెంట్ ప్రకారం విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. క్షేత్రస్థాయి పరిశీలన చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా తగిన చర్యలు చేపడతాం. ప్రభుత్వానికి నివేదిస్తాం. లక్ష్మి, డీఏఓ, బాపట్ల గత ఏడాది మొక్కజొన్న, వేరుశనగకు సంబంధించి సాగుదారులు కొంత ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నారు. దీంతో ఈ ఏడాది కొంతమేర వరి సాగు పెరిగే అవకాశం ఉంది. జూన్ 15 నుంచి ఖరీఫ్ పంట కాలం ప్రారంభమవుతుంది. ప్రస్తుతం సబ్సిడీపై యంత్రపరికరాల పంపిణీ జరుగుతోంది. తరువాత ముందస్తుగా పచ్చిరొట్ట విత్తనాలు, ఇతర విత్తనాలు ప్రాధాన్యత క్రమంలో పంపిణీ చేస్తాం. పచ్చి రొట్ట విత్తనాలకు 50 శాతం సబ్సిడీ ఉంటుంది. ఒక్కో రైతుకు విస్తీర్ణం ఎంత ఉన్నా హెక్టారుకు మాత్రమే సబ్సిడీ విత్తనాల పంపిణీ జరుగుతోంది. – నిర్మలాదేవి, ఏఓ, చీరాల జూన్ 15వ తేదీ నుంచి ఖరీఫ్ పంట కాలం మొదలవుతుంది. అందుకు ముందస్తుగా పచ్చిరొట్ట విత్తనాలను చేలలో ఎద పెడతారు. మొక్క పెరిగాక భూమిలో కలియదున్నుతారు. దీంతో భూమికి పోషకాలు లభించి భూసారం పెరుగుతుంది. అయితే ఈ ఏడాది ఇంతవరకు పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ జరగలేదు. సబ్సిడీపై ఇచ్చే విత్తనాలు కూడా అరకొరగానే ఉన్నాయి. జిల్లాలో ఖరీఫ్లో 1.20 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యే పరిస్థితి ఉంది. అందుకుగాను వ్యవసాయ శాఖ పరంగా పచ్చిరొట్ట విత్తనాలు 2,957 క్వింటాళ్లు మాత్రమే పంపిణీ చేయనున్నారు. ఒక్కో రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నా ఒక హెక్టారుకు మాత్రమే 50 శాతం సబ్సిడీపై ఆ విత్తనాలు ఇస్తారు. అంతకన్నా అవసరమైతే ప్రయివేటు మార్కెట్లో కొనుగోలు చేయాల్సిందే. వరికి సంబంధించి బీపీటీ 5204 రకం 800 క్వింటాళ్లు, ఎంటీయూ 1224 రకం 350 క్వింటాళ్లు, ఎంటీయూ 1061రకం 219 క్వింటాళ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. చీరాల డివిజన్లోని మాగాణి రైతుల్లో ఎక్కువ మంది ఎంటీయూ 1262 రకం వరి విత్తనాలను అడుగుతున్నారు. దీంతో వారు బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన పరిస్ధితి నెలకొంది. శనగలు జె.జి. 11 రకం 2176 క్వింటాళ్లు, కాక్ 2 రకం 2,200 క్వింటాళ్లు, ఎన్బీఈజీ 452 రకం 42 క్వింటాళ్లు పంపిణీకి సిద్ధం చేశారు. ఇవి కూడా సాగయ్యే విస్తీర్ణానికి పూర్తి స్థాయిలో సరిపోవడం లేదు. ఇక ఇతర విత్తనాల పరిస్థితి అదే విధంగా ఉంది. -
క్వింటా పసుపునకు రూ.7 వేలు చెల్లించాలి
దుగ్గిరాల బాధిత పసుపు రైతుల వినతి కొరిటెపాడు(గుంటూరు): దుగ్గిరాల శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజీ అగ్నిప్రమాదంలో నష్టపోయిన పసుపు రైతులకు క్వింటాకు రూ.7,000 చొప్పున పరిహారం చెల్లించాలని బాధిత రైతులు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందించినట్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఇన్సూరెన్న్స్ సొమ్ము కలిపి క్వింటాకు రూ.5,000 చొప్పున ఇస్తామని ఫైనల్ సెటిల్మెంట్గా భావించి తమతో సంతకాలు చేయించారని వెల్లడించారు. అయితే దానికి తాము అభ్యంతరం తెలిపామని, 2024 జూలైలో రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వద్ద రూ.7,000 చొప్పున ఇస్తామని కోల్డ్స్టోరేజీ యాజమాన్యం ఒప్పందానికి వచ్చిందని గుర్తుచేశారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్కు సంబంధించి ఇచ్చిన మార్పు లేఖను అంగీకరించి, తాము తయారుచేసిన పత్రాన్ని యాజమాన్యం అంగీకరించే వరకు నగదు పంపిణీ నిలిపివేయాలని అధికారులను కోరడం జరిగిందని వెల్లడించారు. అయినప్పటికీ రూ.5,000 పరిమితం చేసి ఫైనల్ సెటిల్మెంట్గా రసీదులు ఇవ్వడం అన్యాయమని బాధిత రైతులు ఎల్.భాస్కరరెడ్డి, రాజేష్, కళ్లం సీతారామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మీపురం: బక్రీద్ రోజున అనధికార జంతు వధ నిషేధమని జిల్లా కలెక్టర్ సీఎం సాయి కాంత్ వర్మ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బక్రీద్ పండుగ ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. గోవులను వధించరాదని, అధికారికంగా ఽధ్రువీకరించిన గొర్రెలు, మేకలను మాత్రమే వధింపుటకు అనుమతించడం జరుగుతుందని తెలిపారు. అనధికార జంతు వధపై సమాచారం అందించాలని కోరారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్– 8688831391, పశు సంవర్ధక శాఖ– 8333086999, గుంటూరు మునిసిపాల్ కార్పొరేషన్ – 9849908363, పొన్నూరు మునిసిపాలిటీ – 9849905834, తెనాలి మునిసిపాలిటీ – 9849905830, ఎంటీఎంసీ– 7093320018, తెనాలి సబ్కలెక్టర్– 9849904008, రెవెన్యూ డివిజినల్ అధికారి, గుంటూరు – 9849904006, జిల్లా పంచాయతీ అధికారి– 9492758041. గుంటూరు రూరల్: ప్రైవేటు కళాశాల బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రామకృష్ణ తెలిపిన వివరాలు.. తాడికొండ మండలం పాములపాడుకు చెందిన దొడ్డా పవన్కుమార్(35) నగరంలోని ఒక రియల్ ఎస్టేట్ కార్యాలయంలో పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో బుధవారం కార్యాలయంలో పనిముగించుకుని ఇంటికి వెళుతున్నాడు. అదే సమయంలో నగర శివారుల్లోని ఎన్హెచ్ 16లో ఉన్న ఒక ప్రైవేటు కళాశాల బస్సు డ్రైవర్ అమరావతి రోడ్డు గోరంట్ల చిల్లీస్ సెంటర్ సమీపంలో విద్యార్థులను దింపి కళాశాలకు వెళ్లేందుకు యూటర్న్ తీసుకుంటున్నాడు. అదే రోడ్డులో వస్తున్న పవన్కుమార్ యూటర్న్ తీసుకుంటున్న బస్సుకు ఢీకొన్నాడు. ప్రమాదంలో పవన్కుమార్ తీవ్రగాయాలు కాగా అతడిని స్థానికులు చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించి నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో 2026 ఫిబ్రవరిలో జరిగిన ఎంబీఏ(హెచ్ఎ) ఇంటిగ్రేటెడ్, ఎంఏ పబ్లిక్ పాలసీ 1వ సెమిస్టర్ ఫలితాలను బుధవారం పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాద్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఎంబీఏ(హెచ్ఎ) ఇంటిగ్రేటెడ్ పరీక్షకు 87 మంది హాజరు కాగా 54 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే ఎంఏ పబ్లిక్ పాలసీ పరీక్ష 52 మంది రాయగా 50 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈనెల 28 వరకు రీవ్యాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకుని, అనంతరం ఆ దరఖాస్తులను 29వ తేదీలోపు పీజీ కోఆర్డినేటర్ కార్యాలయంలో అందజేయాలన్నారు. ఒక్కో సబ్జెక్ట్కు రూ.1,860 చెల్లించాలని, పర్సనల్ వెరిఫికేషన్కు రూ.2,190 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్సైట్లో చూడవచ్చన్నారు. బాపట్ల: తేనెటీగలు ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని, పంటల పరాగసంపర్కంలో తేనెటీగల సేవలు వ్యవసాయ దిగుబడులను పెంచడంలో ఎంతో ఉపయోగపడతాయని బాపట్ల వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పి.ప్రసూన రాణి అన్నారు. ప్రపంచ తేనెటీగల దినోత్సవాన్ని పురస్కరించుకొని బాపట్ల వ్యవసాయ కళాశాల కీటక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ తేనె ఉత్పత్తితో పాటు తేనెటీగల పెంపకం గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే ఉత్తమ వాణిజ్య రంగమని వివరించారు. కీటక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎస్.ఆర్.కోటేశ్వరరావు మాట్లాడుతూ తేనెటీగల పెంపకంలో ఆధునిక సాంకేతిక పద్ధతులను అవలంభించడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని తెలిపారు. తేనె ప్రాసెసింగ్, నిల్వ, మార్కెటింగ్ అంశాలలో శిక్షణ పొందితే స్వయం ఉపాధి అవకాశాలు మరింత విస్తరిస్తాయని చెప్పారు. రైతులు, యువత తేనెటీగల పెంపకాన్ని అనుబంధ వ్యవసాయ వృత్తిగా స్వీకరించాలని సూచించారు. తేనెటీగలపై పరిశోధన చేస్తున్న ఎం.సాయికుమార్ తన పరిశోధనలోని పలు ఆసక్తికరమైన అంశాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి
తెనాలిరూరల్: యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కంచర్లపాలెంలో చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన కోపల్లె కార్తీక్(18) ఐటీఐ పూర్తి చేశాడు. ఆటోనగర్ నుండి సోమసుందరపాలేం వెళ్లే మార్గంలో కంచర్లపాలెం గ్రామ శ్రీవారు ప్రాంతంలో కార్తిక్ మృతిచెంది ఉండడాన్ని బుధవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాలీబాల్ కోర్టు వద్ద నెట్ వైరు గొంతుకు బిగించిన స్థితిలో పోల్కు వేలాడుతూ కనిపించాడు. డీఎస్పీ బి.జనార్ధనరావు, రూరల్ సీఐ నాయబ్ రసూల్, ఎస్ఐ కె.ఆనంద్ ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. గుంటూరు నుంచి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ వచ్చి ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నించింది. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడితో పాటు మరి కొందరు యువకులు మంగళవారం రాత్రి మద్యం తాగి, ఇంటికి వెళ్లే క్రమంలో బైక్లో పెట్రోలు అయిపోవడంతో నెట్టుకుంటూ వెళ్లినట్టు తెలుస్తోంది. ఇంటికి వెళ్లిన కార్తిక్ బయటకు ఎందుకు వచ్చాడు? ఏం జరిగిందన్న విషయాలను దర్యాప్తు చేస్తున్నారు. ఒంటిపై/లోపల గాయాలు లేవని పోస్ట్ మార్టం సందర్భంగా వైద్యులు గుర్తించినట్టు తెలిసింది. మృతికి గల కారణాలు దర్యాప్తులో తేలనున్నాయని సీఐ తెలిపారు. -
అడ్డగోలుగా తూకమేస్తున్నారు!
తూనికలు, కొలతల మోసాలతో సామాన్యుడికి నష్టంచంద్రబాబు పాలనలో ఇప్పటికే అన్ని నిత్యావసరాలు, కూరగాయల ధరలూ మండుతున్నాయి. సగటు మనిషి కుటుంబ సభ్యులతో కలిసి మూడు పూటలా పట్టెడన్నం తినలేకపోతున్నాడు. సంపాదన కన్నా రోజురోజుకు చుక్కలు చూపిస్తున్న సరుకుల ధరలే అందుకు కారణం. ఈ క్రమంలో వెచ్చాల నుంచి పాలు, కూరగాయలు, పండ్లు, మాంసం.. ఇలా కొనుగోలు చేసే క్రమంలో విక్రయదారుల చేతివాటంతో ఇంకొంత కుంగిపోతున్నారు. పలు రేషన్ దుకాణాలకు సంబంధించిన కాటాల విషయంలో కూడా విమర్శలున్నాయి. చెల్లించిన మొత్తానికి సరిపడా సరుకులు రావడం లేదు. కాటాలో చేతివాటమే అందుకు కారణం. వీటిపై చర్యలు చేపట్టాల్సిన తూనికలు, కొలతల శాఖ శీతకన్ను వేసింది. దీంతో సగటు జీవులు నష్టపోతున్నారు. చీరాల అర్బన్: తూనికలు, కొలతలు.. ఇవి ప్రతి ఒక్కరికి ఏదో సమయంలో అవసరం అవుతుంటాయి. అది బియ్యం, ఉప్పులు, పప్పుల నుంచి పాలు, నూనె వరకు ఏదైనా కావచ్చు. అందుకు సంబంధించి వినియోగదారులు నష్టపోకుండా నియంత్రించేందుకు ఉండేదే తూనికలు, కొలతల శాఖ. ఆ శాఖకు సంబంధించిన కార్యాలయాలు ఎక్కడ ఉంటాయో కూడా ప్రజల్లో ఎక్కువ మందికి తెలీదు. ఆ శాఖ విధుల నిర్వహణకు సంబంధించిన పరిధి ఎక్కువ. సంబంధిత అధికారుల పర్యవేక్షణ తక్కువనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రకాశం, నెల్లూరు, బాపట్ల జిల్లాలకు సంబంధించిన డిప్యూటీ కంట్రోలర్ నెల్లూరులో ఉంటారు. బాపట్ల జిల్లాకు సంబంధించి అసిస్టెంట్ కంట్రోలర్ బాపట్లలో ఉంటారు. బాపట్ల, చీరాల డివిజన్లకు సంబంధించి ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఒకరు బాపట్లలో, ఒకరు చీరాలలో ఉంటారు. అయితే వీరికి పరిధి ఎక్కువ కావడంతో పర్యవేక్షణ తక్కువగా ఉంటోందన్న విమర్శలున్నాయి. అసిస్టెంట్ కంట్రోలర్ జిల్లా పర్యవేక్షణలో ప్రధాన పాత్ర పోషిస్తారు. తూనికలు, కొలతల శాఖకు సంబంధించి అద్దంకి నియోజకవర్గం ఇప్పటికీ బాపట్ల జిల్లా పరిధిలోనే ఉంది. దీంతో పర్యవేక్షణ పరిధి 25 మండలాలుగా ఉంది. బాపట్ల ఇన్స్పెక్టర్ కార్యాలయం పరిధిలో 12 మండలాలు, చీరాల ఇన్స్పెక్టర్ కార్యాలయం పరిధిలో 13 మండలాలు ఉన్నాయి. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వారి పరిధిలో పెద్దపెద్ద కంపెనీల నుంచి తోపుడు బండ్లు, చిరు వ్యాపారుల వరకు కాటాలు, కొలతల పరికరాలు ఎక్కడెక్కడ వినియోగిస్తారో నిఘా ఉంచాలి. నిబంధనల మేరకు చిన్న కాటాలకు, ఎలక్ట్రానిక్ కాటాలకు, మిల్లీ లీటర్ల కొలతలకు సంబంధించి ఏడాదికి ఒకసారి, అడ్డ కాటాలు (ఇనుప రాళ్లవి)కు సంబంధించి రెండు సంవత్సరాలకు ఒకసారి ఆయా కాటాలపై శాఖాపరమైన ముద్రలు వేయాలి. అలా ముద్రలు వేయించుకోని వారిని గుర్తించి అధికారులు కేసులు నమోదు చేయాలి. అపరాధ రుసుం వసూలు చేయాలి. కొందరు విక్రయదారులు కాటాల్లో కనికట్టు చేస్తున్నారు. తూకాల్లో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. మరికొందరైతే ఏకంగా కాటాలకు నిబంధనల మేరకు ముద్రలు వేయించుకోకుండా వ్యాపారాలు చేస్తున్నారు. ఇవేమీ అధికారులు పట్టించుకోవడం లేదు. ముద్ర వేసినప్పుడు మామూళ్లు... సంబంధిత వ్యక్తులు నిబంధనల మేరకు ముద్రలు వేసేందుకు ప్రభుత్వానికి రుసుం కాకుండా అదనంగా మామూళ్లు చెల్లించాల్సి వస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యాపారుల స్థాయిని బట్టి మొత్తాలు అన్నట్లు వ్యవహరిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో వారు తిరిగి కొనుగోలుదారుల వద్ద చేతివాటం చూపుతున్నారు. బార్లలో మద్యం విక్రయాల కొలతల పరికరాలలోనూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రధానంగా నిబ్ (క్వార్టర్), ఔన్స్(30 ఎంఎల్) కొనుగోలుదారులకు ఇచ్చే సమయంలో కౌంటర్లోని వ్యక్తులు చేతివాటం ప్రదర్శిస్తుంటారు. తొలుత ఒకింత సక్రమంగా ఇచ్చినా.. ఆ తర్వాత ఆర్డర్ చేసిన వారు మద్యం మత్తులో పట్టించుకోరనే ఉద్దేశంతో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో పలు బార్ల వద్ద వాదనలు, ఘర్షణలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక, కొన్ని చోట్లయితే కొలతల పరికరాన్ని ఒకింత పైభాగం అరిగే విధంగా రుద్దుతారు. సంబంధిత అధికారులకు తెలిసే ఇది జరుగుతోందని, అందుకు తగిన ప్రతిఫలం వారికి ఉంటుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
బగళాముఖి సన్నిధిలో హైకోర్టు మాజీ న్యాయమూర్తి
చందోలు(కర్లపాలెం): స్థానిక బగళాముఖి అమ్మవారిని ఏపీ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ టి.మల్లికార్జునరావు దంపతులు మంగళవారం దర్శించుకున్నారు. ఆలయం వద్ద మాజీ న్యాయమూర్తి దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయంలోకి తీసుకొచ్చారు. శాస్త్రోక్తంగా పూజలు చేయించారు. అనంతరం వారికి పండితులు వేదాశీర్వచనాలను అందించారు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కె.చక్రధర్రెడ్డి, ఈవో నరసింహమూర్తిలు జడ్జికి అమ్మవారి చిత్ర పటం, ప్రసాదాలను అందజేశారు. ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు పొన్నూరు: పట్టణంలోని సహస్ర లింగేశ్వరస్వామి దేవస్థానాన్ని మంగళవారం హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు కుటుంబ సమేతంగా సందర్శించారు. అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామి వారిని మాజీ జడ్జి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బొల్లాపల్లి: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ట్రాన్స్కో పల్నాడు జిల్లా ఎస్ఈ డాక్టర్ పి.విజయకుమార్ సిబ్బందికి సూచించారు. బొల్లాపల్లి మండలం రేమిడిచర్ల సెక్షన్ పరిధిలో 33/11 కేవీ, గుమ్మనంపాడు, అయ్యన్నపాలెం, రావులాపురం, గండి గనుముల సబ్స్టేషన్లను ఎస్ఈ మంగళవారం తనిఖీ చేశారు. సబ్స్టేషన్ సిబ్బందికి, విద్యుత్ సబ్స్టేషన్ల నిర్వహణ గురించి పలు సూచనలు చేశారు. కరెంటు కోతలు, లో వోల్టేజ్ సమస్య లేకుండా చూడాలన్నారు. తనిఖీల్లో వినుకొండ డీఈఈ తన్నీరు శ్రీనివాసరావు, రేమిడిచర్ల సెక్షన్ ఏఈ బాణావత్ రామాంజనేయులు నాయక్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): సెంట్రల్ జీఎస్టీ గుంటూరు కమిషనరేట్ నూతన కమిషనర్గా అరుణ్ రిచర్డ్ మంగళవారం గుంటూరు కన్నావారితోటలోని ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. 2007 సివిల్ సర్వీసెస్ బ్యాచ్కి చెందిన అరుణ్ రిచర్డ్ విశాఖపట్నం జీఎస్టీ, కస్టమ్స్ జోన్లోని ఐదు కమిషనరేట్లకు అప్పిలేట్ అథారిటీగా, సెంట్రల్ ట్యాక్స్, కస్టమ్స్ అప్పీల్స్ కమిషనర్గా పనిచేస్తూ గుంటూరు జీఎస్టీకి బదిలీపై వచ్చారు. కమిషనర్ మాతృబాష తెలుగు అయినప్పటికీ, తెలుగు రాష్ట్రాలలో పనిచేయడం ఆయనకు ఇదే మొదటిసారి. అరుణ్ రిచర్డ్ను అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తొలుత కమిషనర్కు అడిషనల్ కమిషనర్ బి.లక్ష్మీనారాయణ, జాయింట్ కమిషనర్ దేవ్కుమార్, పీఆర్ఓ ఆర్.పి.పి. కుమార్లు స్వాగతం పలికారు. సిబ్బంది మార్చ్ఫాస్ట్ నిర్వహించారు. పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ తిక్కన కాన్ఫరెన్సు హాలులో మంగళవారం గుంటూరు రీజియన్ పరిధిలోని డిపో మేనేజర్లు, ట్రాఫిక్, మెకానిక్ ఇన్చార్జులతో ఆర్ఎం డి.సాంబ్రాజ్యం సమీక్ష సమావేశం నిర్వహించారు. డిపో అధికారుల పనితీరు, ఆదాయ మార్గాలు పెంపొందించేలా కేఎంపీఎల్ విధానాలపై సమీక్షించారు. బస్సులు మార్గంమధ్యలో ఎక్కడా బ్రేక్ డౌన్ కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రద్దీకి తగ్గట్టు బస్సులు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు అందితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సమావేశంలో పలువురు డిపో మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు. -
పూడికతీతలోనూ నిర్లక్ష్యమే
రేపల్లె: ఆరుగాలం శ్రమించి పంటలు పండించే రైతన్నలను మురుగు కాలువల సమస్య వెంటాడుతోంది. చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఈ ఖరీఫ్లో వరి పంటకు ముంపు బెడద తప్పేలా లేదు. తీరంలో నెలల తరబడి కష్టించిన రైతులకు పంట చేతికొచ్చే సమయంలో వర్షం కురిసిందంటే కాల్వల్లోని గుర్రపుడెక్క, తూటికాడ సమస్య వేధిస్తోంది. పంట చేతికొచ్చే సమయంలో ఆకస్మికంగా కురిసే వానలతో పొలాల్లో చేరిన వర్షపు నీరు బయటకు పోయే పరిస్థితులు కనిపించడం లేదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతుల ప్రభుత్వంగా వారి కష్ట సుఖాలనెరిగి ఖరీఫ్కు ముందే అవసరమైన డ్రెయిన్లలో తూటికాడ, గుర్రపు డెక్కలను తొలగించి సమస్యను పరిష్కరించేది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేపల్లె డివిజన్లోని డ్రెయిన్లలో పూడిక తీయించిన దాఖలాలు లేవు. ఈ వేసవిలోనైనా పూడికలు తీయించి ఖరీఫ్కు ముంపు బెడద నుంచి రక్షించాలని రైతులు కోరుతున్నారు. ప్రధాన డ్రెయిన్లు ఇవే... రేపల్లె సబ్ డివిజన్లో ప్రధానంగా ఉన్న ఆర్ఎం డ్రెయిన్, బీఏం డ్రెయిన్, జగజ్జెరువు కాలువ, రేపల్లె మురుగు కాలువ, వాడమురుగు డ్రెయిన్, రేపల్లె న్యూకోర్స్, ఓల్డ్ కోర్స్ కాలువలలో తూటి కాడ, గుర్రపు డెక్క, జన్నే కాలువ, బడే కాలువ, సౌత్మీడియం డ్రెయిన్, పిల్లివాగు డ్రెయిన్, తగడాల డ్రెయిన్ తదితర చోట్ల ప్లాస్టిక్, చెత్త చెదారాలు పేరుకుపోయాయి. వీటి ద్వారానే పంట పొలాల్లో వర్షపు నీరు బయటకు పోవాల్సి ఉంది. రేపల్లె నియోజకవర్గంలోని రేపల్లె, రేపల్లె మండలం, నగరం, నిజాంపట్నం, చెరుకుపల్లి మండలాల్లో 34,060 హెక్టార్లలో ఖరీఫ్ వరి సాగు అవుతోంది. ఈ భూమిలో వృథా నీరుతోపాటు అధిక వర్షాలు కురిసిన సమయంలో వదర ఈ ప్రధాన మురుగు కాల్వల ద్వారానే పారుదల కావాల్సి ఉంది. కాలువలు పూడుకుపోయి ఉండటంతో నీటి పారుదల ప్రశ్నార్థకంగా ఉందని రైతులు భయాందోళనలు చెందుతున్నారు. పంట చివరి దశ నవంబర్, డిసెంబర్ మాసాలలో ఈ ప్రాంతాలలో అధిక వర్షపాతం నమోదవుతూ ఉంటుంది. ఆ సమయంలో సకాలంలో నీరు పారుదల కాకుంటే పంట ముంపునకు గురై తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని రైతన్నలు భయాందోళనలకు గురవుతున్నారు. త్వరగా పనులు చేపట్టాలి వర్షాలు పడే సమయంలో కాలువల ద్వారా నీరు బయటకు పోయేలా అధికారులు డ్రెయిన్ల పూడికతీత పనులు పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు. వేసవి ప్రారంభమై నెల గడుస్తున్నా అటు పాలకులు, ఇటు అధికారులు పూడికతీత పనుల ఊసెత్తకపోవటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం, అధికారులు స్పందించి పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నారు. రేపల్లె వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని రేపల్లె, వేమూరు నియోజకవర్గాలలో ప్రధాన మురుగు కాల్వలలో పూడికతీతకు ప్రభుత్వం నుంచి రూ.1.50 కోట్లు నిధులు మంజూరు అయ్యాయి. టెండర్ల ప్రక్రియ ముగిసింది. పనులు త్వరలో ప్రారంభించి ఖరీఫ్ నాటికి పనులు పూర్తి చేస్తాం. – పి.వీరయ్య, డ్రైనేజీ డీఈఈ, రేపల్లె -
సొసైటీలో రూ.50 లక్షల గోల్మాల్
మార్టూరు: ‘ఒక్కరి కోసం అందరు.. అందరి కోసం ఒక్కరు‘ అనే సూత్రాన్ని ప్రాతిపదికగా చేసుకొని ఏర్పడిందే సహకార బ్యాంకింగ్ వ్యవస్థ. కానీ నేడు కొందరు స్వార్థం కోసం ఆ వ్యవస్థనే భ్రష్టు పట్టిస్తున్నారు. అధికారులు, సంబంధిత ప్రజాప్రతినిధుల తీరే దీనికి కారణం. బాపట్ల జిల్లా మార్టూరు మండలం ద్రోణాదుల గ్రామ సొసైటీలో దాదాపు రూ.50 లక్షల మేరకు గోల్మాల్ జరిగిందని సొసైటీ గేటు వద్ద రైతులు మంగళవారం నిరసనకు దిగారు. సొసైటీలో వందలాదిమంది రైతులు రుణాలు తీసుకున్నారు. తిరిగి చెల్లించడానికి ఇటీవల కొందరు వెళ్లారు. మధ్యలో తాము చెల్లించిన మొత్తం జమ కాకపోవడం, తీసుకున్న రుణం కన్నా అధిక మొత్తాలు తమ పేరిట కనిపించడంతో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు స్థానిక పోలీస్ స్టేషనుకు పంచాయితీ చేరింది. సొసైటీ మాజీ సీఈవో పెంట్యాల అనిల్ కుమార్ పోలీసులు ఎదుట తాను వాడుకున్న నిధులను తిరిగి చెల్లిస్తానని ఒప్పుకొని తర్వాత కనిపించకుండా తిరుగుతున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. దాదాపు రూ.50 లక్షలకుపైగా అనిల్ కుమార్ అవకతవకలకు పాల్పడినట్లు బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. గత ఖరీఫ్ సీజన్లో రైతుల కోసం సొసైటీకి కేటాయించిన నాలుగు లారీ లోడుల కాంప్లెక్స్ ఎరువులను అనిల్ కుమార్ బయట గ్రామాల్లో విక్రయించినట్లు ఆరోపణల నేపథ్యంలో అతడిని ఇటీవల ద్రోణాదుల నుంచి కారంచేడు మండలం కుంకలమర్రు గ్రామ సొసైటీకి బదిలీ చేశారు. అధికారులు ఇలా చేతులు దులుపుకోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దల ప్రమేయంపై అనుమానాలు తమ కష్టార్జితాన్ని అనిల్ కుమార్ ఒక్కడే కాజేయలేదని,. కొందరు పెద్దల ప్రమేయం కూడా ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. విచారణ జరిపించి వారి బండారం కూడా బయటపెట్టి కేసులు నమోదు చేసేంతవరకు సొసైటీ గేటు ముందు నిరసన ఆపబోమని రైతులు భీష్మించుకున్నారు. పరిమితికి మించి లోన్లు మంజూరు చేయటం, రుణాలలో దాదాపు నాలుగో వంతు అధికారులు, సిబ్బంది స్వాహా చేయడం, విపరీతంగా కమీషన్లు వసూలు చేయటం, దశలవారీగా చెల్లించిన రుణాలు సంబంధిత రైతుల ఖాతాలలో జమ కాకపోవటం వంటి సమస్యలతో రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. రైతుల కష్టార్జితాన్ని స్వాహా చేసి ఆస్తులు కూడబెట్టిన మాజీ సీఈవో అనిల్ కుమార్ను పోలీస్ స్టేషన్కు పిలిపించాలని, అతని ఆస్తులు అమ్మి తమను రుణ విముక్తులుగా చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు. రెండు రోజుల క్రితమే డీసీవోగా బాధ్యతలు తీసుకున్నాను. ద్రోణాదుల సొసైటీలో నిధుల గోల్మాల్ గురించి తెలిసింది. సంబంధిత వ్యక్తులపై శాఖాపరమైన విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకుంటాం. – యల్లమందరావు, డీసీవో -
అక్రమ కేసులకు భయపడేది లేదు
● వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వరికూటి అశోక్బాబు ● ప్రజా సమస్యలపై నిత్యం పోరుడుతాంభట్టిప్రోలు: భట్టిప్రోలు గ్రామంలోని ఓ దేవాలయం, బడి పక్కన మద్యం షాపులు పెట్టి మైనర్ బాలురకు మద్యం విక్రయించడాన్ని ప్రశ్నించినందుకు తనపై రెండు అక్రమ కేసులు బనాయించారని వైఎస్సార్ సీపీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వరికూటి అశోక్బాబు ఆరోపించారు. ఈ అక్రమ మద్యం కేసులో మంగళవారం రేపల్లె పట్టణ కోర్టుకు అశోక్బాబు పార్టీ నేతలతో కలసి హాజరయ్యారు. అశోక్బాబు మాట్లాడుతూ పవిత్రమైన దేవాలయం, చిన్నారులు చదువుకునే బడి పక్కన మద్యం షాపు పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తే కూటమి ప్రభుత్వ నాయకులు కక్ష సాధింపు చర్యలకు దిగారన్నారు. తనతో పాటు మరో 17 మందిపై రెండు అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. మైనర్ బాలురకు మద్యం విక్రయించడం చట్టవిరుద్ధం. సమాజాన్ని నాశనం చేసేలాంటి పనులను ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని ఇలాంటి అక్రమ కేసులకు భయపడేది లేదని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై అవినీతిపై తన పోరాటం ఆగదని...న్యాయం గెలుస్తుందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధింపు కేసులు పెట్టడం పరిపాటిగా మారిందని విమర్శించారు. కోర్టుకు భారీ సంఖ్యలో వేమూరుతో పాటు రేపల్లెకు చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తరలి వచ్చి అశోక్బాబుకు సంఘీభావం తెలియ చేశారు. కార్యక్రమంలో డి.ప్రతాప్, డి.కిరణ్బాబు, ఎం.కోటేశ్వరరావు, యలమంద, సయ్యద్ నబీ, వి. నాగేశ్వరరావు, సిరాజుద్ధీన్, తదితరులు ఉన్నారు.


