breaking news
Bapatla District Latest News
-
బాపట్ల
మంగళవారం శ్రీ 2 శ్రీ డిసెంబర్ శ్రీ 2025అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 3000 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 42.1600 టీఎంసీలు.విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 580.10 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 37,513 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశం బాపట్ల: జాతీయ ప్రతిభా ఉపకార వేతనాల పరీక్ష(ఎన్ఎంఎంఎస్)ను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు.పరీక్ష నిర్వహణపై సంబంధిత అధికారులతో సోమవారం స్థానిక కలెక్టరేట్లోని వీక్షణ సమావేశ మందిరంలో ఆయన మాట్లాడారు. పరీక్ష ఈనెల 7వ తేదీ ఆదివారం ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు. పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన వారికి 12 వేల రూపాయల చొప్పున నాలుగు సంవత్సరాలు అందజేస్తారని ఆయన పేర్కొన్నారు. పరీక్షకు 2,412 మంది విద్యార్థులు జిల్లాలోని బాపట్ల, చీరాల, రేపల్లె రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 11 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని, 2,412 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. పరీక్ష నిర్వహణకు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, చీఫ్ సూపరింటెండెంట్లు, రూట్ అధికారులు, కస్టోడియన్లను నియమించాలని చెప్పారు. ముందస్తు జాగ్రత్తగా పరీక్ష కేంద్రాల్లో ఏఎన్ఎంలను నియమించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ బస్సులు నడపాలని చెప్పారు. కేంద్రాల్లో విద్యుత్ సరఫరాతో పాటు శుభ్రమైన తాగునీరు ఏర్పాటు చేయాలని తెలిపారు.పోలీసుల బందోబస్తుతో పాటు 144 సెక్షన్ అమలు చేయాలని తెలిపారు. సమీపంలో జిరాక్స్ సెంటర్లు మూసి వేయించాలని కలెక్టర్ చెప్పారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం, అనుబంధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. జే.పంగులూరు: కోట్లు విలువ చేసే దేవుని మాన్యం అన్యాక్రాంతం అవుతున్నా దేవదాయ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. ఆక్రమణదారులు సొంత భూములుగా కౌలుకు ఇచ్చి వాడుకుంటున్నారు. దీనికి అధికారులు వత్తాసు పలుకుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కొండమూరు గ్రామానికి చెందిన (ఖాతా నంబర్ 1504 ) రాజ్యలక్ష్మి అమ్మవారి పేరుతో 171–1, 3లో 1.36 ఎకరాల పొలం ఉంది. ఆదే గ్రామానికి చెందిన (ఖాతా నంబర్ 1505 ) మల్లేశ్వరస్వామివారి పేరు మీద 172–సీ 1, 3 పేరుతో 8.50 ఎకరాల పొలం ఉంది. ఇవి జాతీయ రహదారికి ఆనుకొని ఉండటంతో కొందరు ప్రైవేటు వ్యక్తులు రిజిస్టార్ డాక్యుమెంట్లు తీసుకువచ్చి ఇష్టానుసారంగా వాడుకుంటున్నారు. 2011లో ఇది అక్రమం అని మార్టూరు సబ్ రిజిస్ట్రార్ రద్దు చేశారు. ప్రైవేటు వ్యక్తులు అనంతరం హైకోర్టును ఆశ్రయించారు. ఆస్తి ప్రైవేటు వ్యక్తులకు చెల్లదని, దేవుడికే చెందుతుందని 21 డిసెంబర్ 2019న తీర్పు ఇచ్చింది. పట్టించుకోని అధికారులు హైకోర్టు నుంచి తీర్పు వచ్చినా ఇప్పటి వరకు అధికారులు స్వాధీనం చేసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో ఆ భూముల్లో చిల్లచెట్లు మొలిచాయి. ఇటీవల మళ్లా కొందరు ప్రైవేటు వ్యక్తులు చిల్లచెట్లు తొలగించి, భూములు దున్నేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారుల్లో చలనం లేదు. 2011లో గ్రామస్తులు లోకాయుక్తలో ఫిర్యాదు మాన్యం భూములు దేవాలయాల ఆవసరాలకే ఉండాలని, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండకూడదని గ్రామానికి చెందిన వాసుపల్లి సుబ్బారెడ్డి 2006లో లోకాయుక్తకు వెళ్లారు. ఈ కేసు ఆర్డీవో విచారణ చేయాలని 2011లో ఆదేశించింది. ఈ భూమిని వెంటనే స్వాధీనం చేసుకొని దేవాలయాలకు అప్పగించాలని 2019లో హైకోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చింది. అన్యాక్రాంత భూముల్లో ఇప్పటికే చిల్లచెట్లు తొలగింపు ఆపాం. లీగల్ ఓపీనియన్ తీసుకుంటున్నాం. వీలున్నంత వరకు అతికొద్ది కాలంలోనే దేవుని మాన్యం భూమిని స్వాధీనం చేసుకుంటాం. – వాసు, ఎండోమెంట్ ఈవో సంవత్సరాల పాటు కొండమూరు దేవుని మాన్యం భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి. కాని ఎండోమెంట్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వారి వల్లే భూములు అన్యాక్రాతం అవుతున్నాయి. కోర్టు స్వాధీనం చేసుకోమని ఉత్తర్వులు ఇచ్చినా ఆసక్తి చూపలేదు. – నువ్వుల నాగేశ్వరరావు, కొండమూరు 2006లో నేను లోకాయుక్తాలో కేసు వేశా. అప్పుడే ఆర్డీవో విచారణ చేశారు. 2011లో మార్టూరు రిజిస్ట్రార్ కూడా భూములు దేవాలయానికి చెందినవే అని తేల్చారు. అనంతరం ప్రైవేటు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించగా దేవునివే అని ఉత్తర్వులు ఇచ్చింది. సంబంధిత అధికారులు వెంటనే భూములను స్వాధీనం చేసుకోవాలి. –వాసుపల్లి సుబ్బారెడ్డి, కొండమూరుచేలో ‘వరి’గిపోయింది7 -
అన్నదాతకు అడుగడుగునా కష్టాలు
చెరుకుపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్నదాతను అడుగడుగునా కష్టాలు వెంటాడుతున్నాయని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల పరిశీలకుడు యార్లగడ్డ మదన్మోహన్ తెలిపారు. చెరుకుపల్లి మండలంలో రైతులు యంత్రాల ద్వారా కోసి ఆరబెట్టిన ధాన్యాన్ని ఆయన సోమవారం పరిశీలించారు. కొనుగోలు తీరుపై రైతులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కౌలు రైతులను పూర్తిగా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దిత్వా తుఫాను దెబ్బకు రైతులు క్షణక్షణం భయాందోళన చెందుతున్నారని తెలిపారు. దళారులకు తక్కువ ధరకే అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా అమ్ముకోవాలంటే పంట నమోదు, తేమ శాతం, రాళ్ల శాతం అంటూ ఆంక్షలు పెడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఆంక్షలను సడలించి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ ఆదుకోవాలని మదన్ మోహన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర బిసీ సెల్ కార్యదర్శి పీటా మోహన్ కృష్ణ, వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా కార్యదర్శి లుక్కా బాపనయ్య పాల్గొన్నారు. -
రైతు సేవా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
నిజాంపట్నం: రైతు సేవా కేంద్రాలలో కల్పిస్తున్న సౌకర్యాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వినోద్కుమార్ చెప్పారు. స్థానిక రైతు సేవా కేంద్రాన్ని సోమవారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతు తమ ధాన్యాన్ని రైతు సేవా కేంద్రంలో విక్రయించి గిట్టుబాటు ధర పొందాలన్నారు. టార్పాలిన్ పట్టలు, ధాన్యం నింపుకునేందుకు గోనె సంచులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. తేమ శాతం పరిశీలన చేయించుకుని అనంతరం ధాన్యంను విక్రయించాలని సూచించారు. ప్రస్తుతం దిత్వా తుపాను ప్రభావం బాపట్ల జిల్లాలో ఉందని వాతావరణ శాఖ నుంచి హెచ్చరికలు వచ్చాయన్నారు. ఇప్పటికే సాగుభూమిలో వరిపైరు కోతలు కోసి ఉంటే తమ ధాన్యాన్ని కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కోతల ప్రక్రియను నిలుపుదల చేయాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామంలోని తుపాను షెల్టర్ను పరిశీలించారు. అదే విధంగా భారతీయ తీర రక్షణ దళం కార్యాలయాన్ని సందర్శించి కమాండెంట్ రాజేంద్ర స్వరూప్తో చర్చించారు. కార్యాలయంలో అందుబాటులో ఉన్న లైఫ్జాకెట్లను పరిశీలించి గజ ఈతగాళ్లతో మాట్లాడారు. ఆయన వెంట ఆర్డీఓ రామలక్ష్మి, తహసీల్దార్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ వినోద్కుమార్ -
గంజాయి విక్రయించే ఇద్దరు యువకులు అరెస్ట్
నగరంపాలెం: గంజాయి విక్రయించే ఇద్దరు యువకులను పాత గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పు సబ్ డివిజనల్ కార్యాలయంలో సోమవారం కేసు వివరాలను తూర్పు డీఎస్పీ అబ్దుల్ అజీజ్ తెలిపారు. రెండు రోజుల కిందట కాకాని రోడ్డులోని ఓ ఖాళీ స్థలంలో గంజాయి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో పాతగుంటూరు పీఎస్ సీఐ వెంకటప్రసాద్ సిబ్బందితో ఆకస్మిక సోదాలు చేశారు. ఈ క్రమంలో అడవితక్కెళ్లపాడు టిడ్కో గృహసముదాయంలో ఉంటున్న మహంకాళి శివమణికంఠ, నెహ్రూనగర్ ఒకటో వీధికి చెందిన భేటి బద్రినారాయణలను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ మేరకు వారిద్దర్ని అరెస్ట్ చేసి, 1,160 గ్రాముల గంజాయి, మోటారుసైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. స్నేహితులైన ఇద్దరు గంజాయికి బానిసయ్యారు. మార్టూరు క్వారీ వద్ద ఉంటున్న ఒడిశాకు చెందిన కార్మికుడు మంగల్ పాండే అలియాస్ మాము వద్ద గంజాయి కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందని అన్నారు. చిన్న ప్యాకెట్లగా తయారుచేసి ఎక్కువ ధరకు విక్రయించేవారని తెలిపారు. -
మోసపోయాం.. న్యాయం చేయండి
తాడేపల్లి రూరల్: రాజధాని గ్రామమైన కురగల్లు పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం లిమిటెడ్)లో 72 మంది రైతులు నగదు డిపాజిట్ చేయగా, సహకార సంఘం సీఈఓ రమేష్ నకిలీ డిపాజిట్ బాండ్లను ఇచ్చిన విషయం విధితమే. సొసైటీ అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులను కలిసినా బాధితులకు ఎటువంటి భరోసా లభించకపోవడంతో సోమవారం గుంటూరు కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్కు హాజరై వినతిపత్రం అందజేశారు. అధికారులు రైతుల బాధలు విని 21 రోజుల్లో వారి సమస్యను పరిష్కరిస్తామని రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ రాజధానిలో వున్న ఎకరం, అర ఎకరం పంటపొలాలను రాజధాని నిర్మాణానికి ఇచ్చామని, అందుకు ప్రభుత్వం ఇచ్చిన డబ్బులను నగదు రూపంలో కురగల్లులోని పీఏసీఎస్ బ్యాంక్లో డిపాజిట్ చేశామని, సీఈఓ రమేష్ రైతులందరితో కలివిడిగా ఉండేవాడని, అతనిపై నమ్మకంతో రూ.లక్ష నుంచి కోటి వరకు 72 మంది రైతులు డిపాజిట్ చేయగా, మొత్తం రూ.12 కోట్లకు సంబంధించి రైతులకు నకిలీ డిపాజిట్ బాండ్లను అందజేశాడని వాపోయారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనపై మంగళగిరి రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశామని, పత్రికల్లో వార్తలు రావడంతో రాజకీయ నాయకుల, ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిళ్లు రావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు పట్టించుకోవడం మానేశారని ఆరోపించారు. ఈ కేసు విషయమై ఎవరినీ పూర్తిగా విచారించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానిలో భూములు అమ్ముకుని, ఆ వచ్చిన డబ్బు పోగొట్టుకున్న తమ పరిస్థితి ఏంటని వాపోయారు. -
దిత్వాను ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధం
చీరాల టౌన్: దిత్వా తుపానును ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధం చేశామని, భారీ వర్షాలు కురిస్తే తీర ప్రాంత గ్రామాల ప్రజల్ని ఇబ్బందులు లేకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశామని తహసీల్దార్ కుర్రా గోపీకృష్ణ తెలిపారు. దిత్వా తుపాను తీరం దాటే సమయంలో భారీ వర్షాలు, ఈదురుగాలులు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు, ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది వాడ రేవు తీర ప్రాంతంలో పర్యటించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని ఆదేశించారు. దీంతో మత్స్యకారులు వలలు, బోట్లు, వేట సామగ్రిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వాడరేవులో సముద్రం అలల ఉద్ధృతి అధికంగా ఉండటంతో తీర ప్రాంతానికి పర్యాటకులను అనుమతించకుండా రెవెన్యూ, మైరెన్, సివిల్ పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గోపీకృష్ణ మాట్లాడుతూ తుపాను తీవ్రత తగ్గేంత వరకు మత్స్యకారులు, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వాహనాలు, పునరావాసా కేంద్రాలు, ఆహార సదుపాయాలను సిద్ధం చేశామన్నారు. తమసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని తెలిపారు. తుపాను తీవ్రత తగ్గేంత వరకు రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. తీర ప్రాంతానికి పర్యాటకులు రాకుండా చర్యలు చేపట్టామని చెప్పారు. కార్యక్రమంలో వీఆర్వో శేఖర్, పంచాయతీ సెక్రటరీ, సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు. -
గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన డీసీఓ
నూజెండ్ల: నూజెండ్ల మండలం ఉప్పలపాడులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలను ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఎస్ జిల్లా కో ఆర్డినేటర్ శ్రీదేవి సోమవారం తనిఖీ చేశారు. ‘కుక్కలు తిన్నాకే తినాలా’ అనే శీర్షికన సోమవారం సాక్షిలో కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీనిపై అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించారు. ఎంపీపీ మేడం జయరామిరెడ్డి, ఎంఈఓలు సత్యనారాయణ, రవిచంద్ర, ఎంపీడీఓ ఉమాదేవిలు గురుకులాన్ని సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలను పరిశీలించిన జిల్లా కో ఆర్డినేటర్ శ్రీదేవి ప్రహరీ పడిపోయి ఉండటం గమనించి రెండు సంవత్సరాలైనా నిధులు కేటాయించలేకపోయారా అంటూ విస్మయం వ్యక్తం చేశారు. ఆమె ఉన్నప్పుడే 30 పైగా శునకాలు ఆవరణలో తిరుగుతుండటం విశేషం. ప్రిన్సిపల్ రమణమ్మ, పాఠశాల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందిని విచారించారు. కుక్కలు ఆహారాన్ని తింటుంటే చూస్తూ ఉంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి వారం చికెన్ పెడుతున్నారా అంటూ విద్యార్థులను ఆరా తీశారు. ప్రిన్సిపల్ స్థానికంగా ఉండాల్సిందేనని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. శ్రీదేవి మాట్లాడుతూ ఉపాధ్యాయుల నుంచి వ్యక్తిగత అభిప్రాయాలు తీసుకున్నామని పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. -
దిత్వా తుపానుపై అప్రమత్తత అవసరం
బాపట్ల: దిత్వా తుపాను ప్రభావంతో జిల్లాలో అధిక వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. కలెక్ట్రేట్లోని వీక్షణ సమావేశ మందిరంలో సోమవారం ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎక్కడా పంట నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇటీవల మొంథా తుపాను సమయంలో తీసుకున్న జాగ్రత్తలను దృష్టిలో పెట్టుకుని అధికారులు సమన్వయంతో పని చేయాలని చెప్పారు. గ్రామ సచివాలయాల్లో నైపుణ్యం కలిగిన సిబ్బంది ఉన్నారని, వారికి శిక్షణ ఇచ్చి వారి సేవలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ప్రతి గ్రామ సచివాలయం ఒక యూనిట్గా ఏర్పాటు చేసుకొని, మండల స్థాయి అధికారిని సూపర్వైజర్గా నియమించి, ప్రణాళిక ప్రకారం పని చేయాలని ఆయన సూచించారు. ప్రతి శాఖకు అవసరమైన జూమ్ లైసెన్స్ను కొనుగోలు చేయాలని, వాటికి సంబంధించి ప్రతిపాదనలను అందజేయాలని అధికారులకు సూచించారు. తుపాను కారణంగా వీచే గాలులకు పడిపోయిన విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించాలని, వాటి వివరాలు ఎప్పటికప్పుడు డాష్ బోర్డులో నిక్షిప్తం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట పాల్గొన్నారు. -
మణప్పరంలో బంగారం మాయంపై ఆందోళన
కొల్లూరు: బంగారం చైన్ విషయంలో మణప్పరం మేనేజర్ చేతి వాటం ప్రదర్శించి కాలం గడుపుతున్నాడంటూ ఆ శాఖ వద్ద ఆందోళన చేపట్టిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. కొల్లూరు ఎస్సీ ప్రాంతానికి చెందిన యలవర్తి సతీష్, మణప్పరం కొల్లూరు శాఖలో క్యాషియర్గా విధులు నిర్వహిస్తున్నాడు. సంబంధిత శాఖ మేనేజర్ మనోజ్ చరణ్ తన తాకట్టు లక్ష్యాన్ని చేరుకునేందుకు రుణం ఇవ్వకుండానే రుణం ఇచ్చినట్లు లెక్కల్లో చూయించాడు. ఈక్రమంలో సంస్థలో ఆడిటింగ్ జరుగనుండటంతో క్యాషియర్ సతీష్ను ఏదైన బంగారం వస్తువు తీసుకొస్తే రెండు రోజులు గోల్డ్ లెక్కల్లో చూపించి ఆడిటింగ్ ముగిసిన అనంతరం తిరిగి ఇస్తానని మేనేజర్ కోరడంతో బంగారు గొలుసు తీసుకెళ్లి అందజేశాడు. ఆడిటింగ్ ముగిసిన అనంతరం తిరిగి చైన్ను మేనేజర్ తిరిగి ఇచ్చాడు. కొన్ని రోజుల అనంతరం మళ్లీ మేనేజర్ చైన్ తీసుకొస్తే ఫైనల్ ఆడిట్ ముగిసిన అనంతరం తిరిగి ఇస్తాననడంతో క్యాషియర్ సెప్టెంబర్ 25న బంగారు గొలుసు తీసుకువెళ్లి కార్యాలయం బల్లపై ఉంచాడు. సంస్థ పనిపై మేనేజర్ బయటకు వెళ్లిరావాలని కోరడంతో క్యాషియర్ కార్యాలయం బయటకు వచ్చాడు. ఈక్రమంలో టేబుల్పై బంగారు గొలుసు ఉంచిన విషయం జ్ఞాపకం వచ్చి సంస్థలోని సిబ్బందికి ఫోన్ చేసి చెప్పడంతో అక్కడ ఎటువంటి బంగారం వస్తువు లేదని బదులిచ్చారు. దీంతో మేనేజర్ను అడగడంతో చైన్ మాయం విషయం తనకు సంబంధం లేదని బదులిచ్చాడు. సంస్థలో సీసీ టీవీ ఫుటేజ్ చెక్ చేయాలని బాధితుడు కోరగా ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటనపై అప్పట్లోనే కొల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంస్థ హెడ్ క్వార్టర్ నుంచి సీసీ ఫుటేజ్ సేకరణకు అనుమతి రావాలని రెండు నెలల నుంచి మేనేజర్ కాలం గడుపుకొస్తుండటంతో క్యాషియర్ సంబంధువులు ఆందోళనకు దిగారు. మణప్పరం సంస్థ తెరిచే సమయానికి అక్కడకు చేరుకొని ఆ శాఖ తాళాలు తీయనీయకుండా అడ్డుకొని ఆందోళన చేశారు. ఈ ఘటనపై కొల్లూరు పోలీసులు ఆందోళన విరమింపజేసి బంగారం మాయం విషయంపై ఫిర్యాదు చేస్తే దర్యాప్తు చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. అనంతరం కొల్లూరు పోలీసు స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించి దర్యాప్తు జరుపుతామని హామీ ఇచ్చారు. -
చేతులు మారిన భూమి
కొండమూరు గ్రామంలోని మల్లేశ్వరస్వామి, రాజ్యలక్ష్మి అమ్మవార్ల దేవాలయాలకు 15 ఎకరాల భూమి ఉంది. దీన్ని అప్పట్లో భజంత్రీలకు ఇచ్చారు. కొంతకాలం తరువాత వేరొకరికి అమ్మారని తెలుస్తోంది. ఇప్పటికీ ఆ భూమి మూడు చేతులు మారింది. కొంత భాగం జాతీయ రహదారి విస్తరణలో పోగా, కొంత ఆక్రమణలకు గురైంది. ప్రస్తుతం 9.86 ఎకరాల మాత్రమే ఉంది. కొండమూరులోని మల్లేశ్వరస్వామివారి దేవాలయం కొండమూరులోని రాజ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం -
సఖి సురక్షతో మహిళలకు మేలు
రేపల్లె: స్వయం సహాయ సంఘాల మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రవేశపెట్టిన సఖి సురక్ష కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కాకర్ల సాంబశివరావు కోరారు. పట్టణంలోని వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాలులో మెప్మా ఆధ్వర్యంలో సఖి సురక్ష వైద్యశిబిరం సోమవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ శిబిరంలో 35 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన మహిళలకు 16 రకాల ఆరోగ్య పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు. వైద్యులు సురేందర్, హరిప్రసాద్, ఆయుష్, నీలిమ, శ్రావణి పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సూచనలు చేశారు. కార్యక్రమంలో మెప్మా డీపీఎం బాబు, సీఓ రాజేంద్ర, టీఎల్ఎఫ్ లక్ష్మీ నరసమ్మ, నాగలీల, జయప్రద, టీడీపీ నాయకుడు అనగాని శివప్రసాద్ పాల్గొన్నారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): సంపూర్ణ ఆరోగ్య మహా సూత్రమే యోగా అని యోగా శిక్షకుడు వంగా వెంకటేష్ తెలిపారు. సోమవారం స్థానిక బ్రాడీపేటలోని జాయ్అండ్ షైన్ వెల్నెస్ సెంటర్లో ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ప్రారంభమైన యోగా శిక్షణ శిబిరాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ సంక్లిష్టమైన కరోనా సమయంలో యోగా సాధకులు అధిక సంఖ్యలో అకాలమరణం పాలు కాకుండా జీవించడానికి కారణం యోగా సాధనే అని తెలిపారు. రోజుకు కనీసం 45 నిమిషాలైనా యోగా, మెడిటేషన్ సాధన చేస్తే జీవన కాలాన్ని అతి సులభంగా పెంచుకోవచ్చని పేర్కొన్నారు. జాయ్అండ్ షైన్ వెల్నెస్ సెంటర్ ఫిటెనెస్ కోచ్ కె.జ్యోతి శ్యామ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన మిషన్ ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా యోగా శిక్షణా శిబిరం ఏర్పాటు చేశామన్నారు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం యోగా శిక్షణతోపాటు ఫిట్నెస్, చక్కని ఆరోగ్యం తదితర అంశాలపై ప్రముఖులతో పాఠాలు చెప్పిస్తామన్నారు. అనంతరం యోగా తరగతులను వెంకటేష్ నిర్వహించారు. అయితి సతీష్, భావన్నారాయణ, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ యానీ అమల, శైలజ, సల్మా, సంధాని, వెంకాయమ్మ పాల్గొన్నారు. -
అనారోగ్యంతో పోలీస్ జాగిలం రెమో మృతి
నగరంపాలెం: అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పోలీస్ జాగిలం (శునకం) రెమో ఆదివారం రాత్రి మృతిచెందింది. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) సమీపంలోని ఖాళీ ప్రదేశంలో రెమోకు పోలీస్ గౌరవ లాంఛనాలతో నివాళులర్పించి, అంత్యక్రియలు నిర్వహించారు. జిల్లా పోలీస్ విభాగానికి విశిష్ట సేవలందించిన రెమో మరణంపై జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సంతాపం వ్యక్తం చేశారు. రెమో జిల్లా భద్రతా విభాగంలో 2014 ఏప్రిల్ 29న విధుల్లో చేరి, సుమారు 12 ఏళ్లు క్రమశిక్షణ, నిబద్ధతతో సేవలు అందించినట్లు పలువురు కొనియాడారు. నివాళులర్పించిన వారిలో జిల్లా ఏఎస్పీ (ఏఆర్) హనుమంతు, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ముగిసిన రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ క్రికెట్ పోటీలు
గుంటూరు రూరల్: రాష్ట్రస్థాయి 69వ స్కూల్ గేమ్స్ అండర్–14 బాలుర క్రికెట్ పోటీలలో పశ్చిమగోదావరి జట్టు విజేతగా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్స్లో కర్నూలు జట్టుపై విజయం సాధించింది. గత మూడురోజులుగా రూరల్ మండలంలోని దాసుపాలెం గ్రామం లోగల గ్రౌండ్లో జరుగుతున్న పోటీల్లో భాగంగా చివరిరోజు సోమవారం తొలుత జరిగిన సెమీ ఫైనల్స్లో గుంటూరుపై కర్నూలు విజయం సాధించింది. అదేవిధంగా అనంతపురంపై పశ్చిమగోదావరి విజయం సాధించింది. 3వ స్థానంలో గుంటూరు, 4వ స్థానంలో అనంతపురం జట్లు నిలిచాయి. అనంతరం జరిగిన ఫైనల్స్లో కర్నూల్ను పశ్చిమ గోదావరి ఓడించి విజేతగా నిలిచింది. స్కూల్ గేమ్స్ రాష్ట్రస్థాయి అబ్జర్వర్ బంగారు రాజు, దిలీప్చక్రవర్తిలు పర్యవేక్షించారు. విజేతగా నిలిచిన పశ్చిమగోదావరి జట్టును పెదకాకాని జిల్లా పరిషత్ హైస్కూల్ హెచ్ఎం కె.భాస్కరరావు అభినందించారు. ఉప్పలపాడు జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం మైనేనీ నాగేశ్వరావు, గుంటూరు జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ సిహెచ్ గోపి, సుమేధ స్కూల్ డైరెక్టర్ ఎం.చంద్రశేఖర్రెడ్డి, ఆంధ్ర క్రికెటర్ అసోసియేషన్ త్రిమెన్ కమిటీ సెలక్టర్ సుధాకర్, ఏపీ పీఈటీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల కరిముల్లాచౌదరి, గుంటూరు జిల్లా అధ్యక్షుడు యార్లగడ్డ శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ దేశీయ ఆయుర్వేద సంఘం జనరల్ సెక్రెటరీ డాక్టర్ నామాల శ్రీనివాసరావు, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ భూపాల్ రెడ్డి. తదితరులు పాల్గొన్నారు. అండర్ –14 బాలుర విభాగంలో విజేతగా నిలిచిన పశ్చిమ గోదావరి జిల్లా జట్టు -
6,7 తేదీల్లో తెలుగు సాహితీ మహోత్సవం
తెనాలి: పట్టణానికి చెందిన బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన ఆధ్వర్యంలో ఈనెల 6,7 తేదీల్లో తెనాలిలో తెలుగు సాహితీ, సాంస్కృతిక మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి సౌజన్యంతో జరిగే ఈ వేడుకల ఆహ్వానపత్రికను సోమవారం ఇక్కడి ఎన్జీఓ కళ్యాణ మండపంలో విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ చందు సాంబశివరావు ఆవిష్కరించి, వివరాలను తెలియజేశారు. కొత్తపేటలోని తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో జరిగే ఉత్సవాల్లో భాగంగా తొలిరోజున ‘తెలుగుభాష–సాహిత్యం–వ్యక్తిత్వ వికాసం’ అంశంపై సదస్సు, అనంతరం ఉభయ తెలుగు రాష్ట్రాల కవులు 200 మందితో జాతీయస్థాయి కవి సమ్మేళనం ఉంటాయి. 11 నంది అవార్డులు పొందిన ఎం.సైదారావుచే జుగల్బందీ, విజయవాడ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ బృందంచే ‘భువన విజయం’నాటకం ఉంటాయని తెలిపారు. 7వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు తెనాలి కూచిపూడి కళాకారిణులు దాదాపు 500 మందితో మహానాట్య సమ్మేళనం, విభిన్న రంగాల్లో చేతివృత్తుల్లో కొనసాగుతున్న శ్రామిక యోధులు, కళారంగ ప్రముఖులకు చిరుసత్కారం ఉంటాయని వివరించారు. 7వ తేదీ ముగింపు సభలో ప్రముఖ సినీనటుడు బ్రహ్మానందకు బొల్లిముంత శివరామకృష్ణ జీవిత సాఫల్య పురస్కారాన్ని రూ.లక్ష నగదుతో బహూకరిస్తారు. ముందురోజున గుమ్మడి గోపాలకృష్ణకు విశిష్ట రంగస్థల కళాపురస్కారం, ప్రజాసాహితీ సంపాదకుడు కొత్తపల్లి రవిబాబుకు సాహితీ సత్కారాన్ని రూ.25 వేల చొప్పున నగదుతో అందజేస్తారు. కార్యక్రమంలో ఫౌండేషన్ కార్యదర్శి చందు సుబ్బారావు, మైత్రీ హాస్పటల్స్ అధినేత డాక్టర్ ఆలపాటి కృష్ణసందీప్, వీజీకే ఫౌండేషన్ కార్యదర్శి తుమ్మల కిశోర్బాబు, మొవ్వా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సినీనటుడు బ్రహ్మానందంకు జీవిత సాఫల్య పురస్కారం -
ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం
నగరంపాలెం: ఉద్యోగం పేరుతో తనను మోసగించారని ఓ బాధితురాలు వాపోయింది. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో పలువురు సమస్యలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ దృష్టికి తెచ్చారు. ఎస్పీ అర్జీల స్వీకరించి, వారి బాధలను ఆలకించారు. సంబంధిత ఎస్హెచ్ఓలతో జిల్లా ఎస్పీ ఫోన్లో మాట్లాడారు. ప్రజా సమస్యలను వేగంగా, చట్టబద్ధంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఒకసారి వచ్చిన అర్జీలు పునరావృతం కాకుండా పూర్తిస్థాయిలో విచారించి పరిష్కారం చూపాలని సూచించారు. జిల్లా ఏఎస్పీ (పరిపాలన) జీవీ రమణమూర్తి, డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్), బెల్లం శ్రీనివాసరావు (ట్రాఫిక్), మధుసూదనరావు (సీసీఎస్)లు కూడా అర్జీలు స్వీకరించారు. -
ఎయిడ్స్ రహిత సమాజం కోసం కృషి చేద్దాం
డీఆర్వో గంగాధర్గౌడ్ బాపట్ల: ఎయిడ్స్ రహిత సమాజం కోసం బాధ్యతతో కృషి చేద్దామని జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్ పేర్కొన్నారు. అంతర్జాతీయ ఎయిడ్స్ దినం సందర్భంగా సోమవారం బాపట్ల పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ హెచ్ఐవీ, ఎయిడ్స్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు వారికి పోషకాహారం అందించాలని సూచించారు. ఎయిడ్స్ నిర్మూలన, నియంత్రణ అవగాహన కార్యక్రమాలను జిల్లాలో క్షేత్రస్థాయిలో నిర్వహించాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో డీఎంఅండ్హెచ్ఓ కె.విజయమ్మ, జిల్లా లెప్రసీ, టీబీ అధికారి డాక్టర్ వి.సోమలనాయక్, బి.వి.సాగర్ పాల్గొన్నారు. తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై సోమవారం గీతా జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి మంగళా శాసనాలతో గీతా జయంతి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని తెలిపారు. ఉదయం 9.30 గంటలకు శ్రీమద్భగవద్గీత సామూహిక పారాయణం నిర్వహించామని పేర్కొన్నారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారని ఆయన తెలియజేశారు. మంగళగిరి టౌన్: మంగళగిరిలో వేంచేసియున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి కిరీటం, కర్ణాభరణాలను మంగళగిరికి చెందిన దంపతులు సోమవారం బహూకరించారు. పట్టణానికి చెందిన వెనిగళ్ల ఉమాకాంతం, భాగ్యలక్ష్మి కుటుంబ సభ్యులు రూ.5 లక్షల వ్యయంతో బంగారు పూత పూయించిన మూడు కిరీటాలు, ఆరు కర్ణాభరణాలు ఆలయ అధికారులకు అందజేశారు. ఏకాదశి పర్వదినం కావడంతో స్వామివారికి, అమ్మవారికి వాటిని ధరింపజేసి దేవస్థాన ప్రధాన అర్చకులు దివి అనంత పద్మనాభాచార్యులు, అర్చకులు నల్లూరి రఘులు శాంతి కల్యాణం నిర్వహించారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి కె.సునీల్కుమార్ కల్యాణ మహోత్సవ ఏర్పాట్లు పర్యవేక్షించారు. శాంతి కల్యాణ మహోత్సవంలో వెనిగళ్ల శివకుమార్, తిరుపతమ్మ దంపతులు, జొన్నాదుల వెంకటేశ్వరరావు, రేవతి దంపతులు పాల్గొన్నారు. మంగళగిరి టౌన్: మంగళగిరి మండలం పెదవడ్లపూడిలో ఉన్న భగవాన్ శ్రీ సత్య షిర్డీ సాయిబాబా మందిరంలో గీతాజయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం సామూహిక భగవద్గీత పారాయణాన్ని నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పారాయణం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గీతా జయంతి రోజున కృష్ణ భగవానుడ్ని తలచుకుంటే స్వామి ఆశీస్సులు ఉంటాయని, అందులో భాగంగా గీతా పారాయణం నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మందిర ప్రతినిధి పాతూరి సుధారాణి, నిర్వాహకులు పాతూరి శ్రీనివాసరావు, రాధిక, పలువురు సాయిభక్త బృందం ప్రతినిధులు పాల్గొన్నారు. -
చేనేత పరిశ్రమ కుదేలు
ప్రభుత్వాల నిర్లక్ష్యంతో చీరాల రూరల్: కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్న ఈ ప్రభుత్వాలు చేనేత పరిశ్రమను నిర్వీర్యం చేస్తున్నాయని, చేనేత వృత్తిని కోల్పోయిన ప్రతి కుటుంబానికి పరిహారంగా ప్రభుత్వం భూమిని కేటాయించి ఆదుకోవాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ, ఆల్ ఇండియా బీఎస్పీ పార్టీ జాతీయ సమన్వయకర్త డాక్టర్ పూర్ణచంద్రరావు డిమాండ్ చేశారు. ఆదివారం చీరాలలోని పద్మశాలీయ కల్యాణ మండపంలో ఆదివారం చేనేత రాష్ట్ర సదస్సు నిర్వహించారు. దామర్ల శ్రీకృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సదస్సులో ముఖ్య అతిథిగా డాక్టర్ పూర్ణచంద్రరావు పాల్గొని మాట్లాడారు. ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల జనాభా అంతా ఏదో ఒక వృత్తి చేసుకుని జీవనం పొందుతుండగా యాజమాన్య కులాలకు వృత్తి లేకుండా కేవలం రాజకీయాలనే వృత్తిగా చేసుకుని పెత్తనం చెలాయిస్తున్నారని పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో రెండే కులాలు రాష్ట్రాన్ని ఏలుతున్నాయన్నారు. తెలంగాణ ప్రాంతంలోని గచ్చిబౌలి ప్రాంతం బాగా అభివృద్ధి చెందిందని, అక్కడ చేనేతలు కూడా ఉన్నారని వారు ఏమైనా అభివృద్ధి చెందారా అని ప్రశ్నించారు. మన రాష్ట్రంలోని అమరావతి అభివృద్ధి చెందిందని చెబుతున్నారు కానీ అమరావతికి దగ్గరలో చేనేతలు ఉన్న మంగళగిరి ఏమైనా అభివృద్ధి చెందిందా అని ప్రశ్నించారు. హైదరాబాదులోని చేనేతలు ఎక్కువగా ఉండే సిరిసిల్లలో మాజీ ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్లో చేనేతలు ఎక్కువగా ఉండే మంగళగిరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు లోకేష్ ఎమ్మెల్యే అయినప్పటికి చేనేతల బతుకులు మాత్రం మారడంలేదన్నారు. ఎక్కడైనా భూములు ఉన్నవారే అభివృద్ధి చెందుతున్నారు కానీ భూములులేని చేతి వృత్తులను నమ్ముకుని జీవిస్తున్న నిరుపేదలు ఎప్పటికీ అభివృద్ధి చెందడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత జన సమాఖ్య రాష్ట్ర నాయకుడు మాచర్ల మోహనరావు మాట్లాడుతూ రాష్ట్రంలో చేనేతల పరిస్థితి చాలా దారుణంగా ఉందని చేనేత వృత్తికి ప్రభుత్వాలు తగిన ప్రాధాన్యం ఇవ్వడంలేదన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు చేనేతల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పిన ఆయన ఎన్నికల అనంతరం చేనేతలను ఏ మాత్రం పట్టించుకోవడంలేదన్నారు. చేనేత వృత్తిపై ఆధారపడిన చేనేతలంతా కలిసి ఉద్యమ కార్యచరణ ప్రకటించాలని కోరారు. డిమాండ్లు ఆమోదించాలి.. సదస్సులో చేనేతలకు సంబంధించిన డిమాండ్లు ఆమోదించాలని మోహనరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చేనేత సొసైటీలకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించి సొసైటీలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పారు. చేనేత ఉత్పత్తుల 11 వస్త్రాల రిజర్వేషన్ అమలు చేయాలని, చేనేతలకు రాష్ట్ర ప్రభుత్వం ఐదువేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని, చేనేత పరిశ్రమకు ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలని, చేనేత మగ్గాలను ఆధునీకరించి శారీరక శ్రమ తగ్గించాలని, చేనేతలకు, షెడ్డు కార్మికులకు రూ. 25 వేలు ఆర్థిక సాయం అందించి, రంగులు, రసాయనాలు నూలుపై 50 శాతం సబ్సి డీ ఇవ్వాలని, చేనేత ఉత్పత్తి దారులకు జాతీయ బ్యాంకుల నుంచి రుణ సదుపాయం కల్పించాలని, చట్ట సభల్లో స్థానిక సంస్థల్లో విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 52 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, బీసీలకు రక్షణ చట్టం తీసుకురావాలని సదస్సులో ఏకగ్రీవంగా ఆమోదించి తీర్మానించారు. డిమాండ్లు సాధనకు ఒక రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించి సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ తాత్కాలిక కన్వీనర్గా మాజీ ఎంపీపీ దామర్ల శ్రీకృష్ణను ఎంపిక చేశారు. ఏపీ బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కా పరంజ్యోతి, మాజీ ఎమ్మెల్యే పాలేటి రామారావు, చుండూరి వాసు, జంజనం శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ బూదాడ రాజయ్య, డాక్టర్ హైమా సుబ్బారావు, ఆకురాతి మురళి, ఎస్ఎన్ భగత్ సింగ్, వెంకటేశ్వరమ్మ, శీలం రవి, ఆకురాతి పద్మిని, గొర్రెపాటి రవికుమార్, తదితరులు పాల్గొన్నారు. అమరావతిలో భూములున్నవారికే రాజధానిలో లబ్ధి చేకూరింది, చేనేతలకు ఎటువంటి లాభం లేదు తెలంగాణలో హైదరాబాదు అభివృద్ధి చెందినా సిరిసిల్ల అభివృద్ధి చెందలేదు ఏపీలో అమరావతి అభివృద్ధి చెందినా మంగళగిరి, చీరాల అభివృద్ధి ఊసేలేదు చేనేత రాష్ట్ర చేనేత సదస్సులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ డాక్టర్ పూర్ణచంద్రరావు -
రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు
చెరుకుపల్లి: తిరుపతి వెంకటేశ్వరస్వామి సన్నిధికి వెళ్లెందుకు చెరుకుపల్లి నుంచి తెనాలి రైల్వే స్టేషన్కు వెళుతుండగా ఆటోను మరో వాహనం ఢీకొట్టటంతో నలుగురికి గాయాలైన సంఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగింది. బాధితుల కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. మండల పరిధిలోని వినయాశ్రమం గ్రామానికి చెందిన కుంచల శివారెడ్డి అతడి భార్య వెంకటేశ్వరమ్మ, కుమారుడు కునాల్రెడ్డితోపాటు పిట్టు వెంకటరెడ్డి, పిట్టు సాంబ్రాజ్యంతోపాటు ఆటో డ్రైవర్ బూసిరెడ్డి ఆదివారం తిరుపతి వెళ్లేందుకు తెనాలికి ఆటోలో బయలుదేరారు. చెరుకుపల్లి శివారులోని టింబర్ డిపో సమీపంలో బ్రాయిలర్ కోళ్ల లోడుతో వస్తున్న బొలేరో వాహనం ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. వారిలో శివారెడ్డి అతడి భార్య వెంకటేశ్వరమ్మ, బూసిరెడ్డిలను పొన్నూరులోని హాస్పిటల్కు, కునాల్రెడ్డిని తెనాలి ఏరియా హాస్పిటల్కు తరలించినట్లు తెలిపారు. మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్కు తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
13న ద్వితీయ అన్నమయ్య సహస్ర గళార్చన
నగరంపాలెం: సనాతన భారతీయ ధర్మంలో సంగీతానికి విశేష ప్రాముఖ్యత ఉందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం బృందావన్గార్డెన్న్స్లోని ఆయన కార్యాలయంలో జై కిసాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 13న శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరగనున్న ద్వితీయ అన్నమయ్య సహస్ర గళార్చన కార్యక్రమాల ఆహ్వాన పత్రికలను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ భారతీయ సంగీతంలో మనుషులతోపాటు పశుపక్షాదులు ఓలలాడతాయని పేర్కొన్నారు. అన్నమయ్య సహస్ర గళార్చన నిర్వాహకులు బండ్లమూరి స్వామి మాట్లాడుతూ భారతీయ జీవన విధానంలో హిందూ ధర్మం అంటే సన్మార్గమని అన్నారు. మానవుడిని సన్మార్గంలో నడిపించే ఒక జీవన విధానమని చెప్పారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారి సేవలో భాగంగా రాష్ట్రస్థాయిలో వందల మంది గాయకులతో ద్వితీయ అన్న మయ్య సహస్ర గళార్చన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 7799800900 నంబర్లో సంప్రదించాలని కోరారు. చిలకలూరిపేట: హీరో అనే పదం డ్రగ్ కంటే ప్రమాదకరంగా మారిందని, ఈ పదం వాడకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాసినట్లు న్యాయవాది, సామాజికవేత్త మాదాసు భానుప్రసాద్ తెలిపారు. ఆదివారం ఆయన మీడి యాతో మాట్లాడుతూ హీరో ఆరాధన వలన బాల్యదశ నుంచి యువత భవిష్యత్తుకు నష్టం వా టిల్లుతోందని చెప్పారు. సినిమాలో నటించేవారి ని హీరోకు బదులుగా లీడ్ యాక్టర్, లీడ్ యాక్ట్రెస్ అని సంబోదించాలని కోరారు. విద్యార్థులు హైస్కూల్ స్థాయి నుంచే హీరో పాత్రధారులను ఆరాధ్యులుగా భావిస్తున్నారని పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికుల కంటే, దేశానికి అన్నం పెట్టే రైతన్నల కన్నా, జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రుల కంటే హీరోలను గొప్పవాళ్లుగా భావిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నటులు రూ.200 కోట్లు, రూ.300 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుకోవడం వలన సినిమా ఖర్చు పెరిగిపోతున్న నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. రూ.10 మొక్కజొన్న పేలాలకు వందలు వసూలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడటం బాధాకరమన్నారు. ఈ విషయాలను పరిశీలించి ప్రభుత్వం తగు దిద్దుబాటు చర్యలు చేపట్టి, ఎమ్మార్పీ ధరలకే సినిమా క్యాంటీన్లలో విక్రయాలు చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో హరిప్రసాద్, మురుకొండ వెంకట్రావు, వెంకటేశ్వరరెడ్డి, అడపా రవి పాల్గొన్నారు. -
పురుగుమందు తాగి యువకుడు ఆత్మహత్య
చెరుకుపల్లి: కుటుంబ కలహాల కారణంగా ఓ యువకుడు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం అర్థరాత్రి జరిగింది. మృతుడి కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. చెరుకుపల్లికి చెందిన బొచ్చు నాగేశ్వరరావు, రాఘవల ఏకై క కుమారుడు అనంత నాగసాయి(32)కి ఏడాది కిందట వివాహం చేశారు. వివాహమైన కొద్ది కాలానికే భార్యా పుట్టింటికి వెళ్లిపోయింది. నాగసాయి హెదరాబాదులో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఐదు నెలల కిందట ప్రమాదం జరగగా అతడి కుడికాలు ఎడమ చేతిని సగ భాగం వరకు తొలగించారు. ఈ క్రమంలో మృతుడు కృత్రిమ కాలు అమర్చకుని జీవనం సాగిస్తున్నాడు. వివాహం జరిగి ఇంతకాలం జరుగుతున్న భార్యా కాపురానికి రాకపోవటంతో మనస్థాపం చెంది శనివారం అర్థరాత్రి తాను చనిపోవాలని నిర్ణయించుకొని తన తల్లిదండ్రులకు మెసేజ్ చేసి తాను ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న పొలాలకు కొట్టే పురుగుమందు ప్యాకెట్లను నీటిలో కలుపుకుని తాగి ఆరుంబాక పంచాయతీ పరిధిలోని టపాసుల గోడౌన్ సమీపంలో జాతీయ రహదారి ప్రక్కన మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు కొడుకు మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించి తల్లడిల్లిపోయారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని వివరాలు నమోదు చేసుకొని వృతుని తండ్రి నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాస్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
దళిత రైతు పంట ధ్వంసం
కొల్లూరు: దళిత రైతు సాగు చేసుకున్న వరి పంటను కూటమి నాయకులు ధ్వంసం చేసి రాత్రికి రాత్రి డొంక రోడ్డు నిర్మించారు. బాధిత రైతు కుటుంబం కథనం మేరకు... మండలంలోని గురివిందపల్లి రెవెన్యూ గ్రామం పరిధిలో 1–1, 1–8 సర్వే నంబర్లలో గొరికపూడి ప్రభాకరరావు పేరిట 0.74 సెంట్ల భూమి ఉంది. ఈ భూమిలో వరి సాగు చేపట్టాడు. 25 ఏళ్ల కిందట సంబంధిత రైతు ఆ భూమిని రిటైర్డు ఆర్మీ అధికారి వద్ద కొనుగోలు చేసి తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అప్పటి నుంచి తన అదీనంలో సాగు చేసుకుంటున్న భూమి డొంక రోడ్డు పరిధిలోకి వస్తుందని స్థానిక రైతులు డొంక రోడ్డు పునరుద్ధరణకు మట్టి మార్గం ఏర్పాటు చేయడం వివాదాస్పదం అయ్యింది. రెవెన్యూ రికార్డులలో తన పేరుపై అడంగల్లు, 1బీ రికార్డులు చూయిస్తుంటే డొంక రోడ్డు ఎలా అవుతుందని, తాను విశ్రాంత మిలటరీ ఉద్యోగి వద్ద కొనుగోలు చేయించుకొని రిజిస్ట్రేషన్ సైతం చేయించుకున్నానని డొంక రోడ్డు ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నాడు. సమస్య పరిష్కారం అవ్వకపోగా జఠిలమైంది. డొంక రోడ్డు ఏర్పాటుకు రైతు ఒప్పుకోకపోవడంతో అవకాశం కోసం కాసుకు కూర్చున కూటమి నాయకులు కొమ్ముకాస్తున్న రైతు శనివారం రాత్రి వరి పంటను ధ్వంసం చేసి పొక్లెయిన్తో మట్టి మార్గం ఏర్పాటు చేశాడు. ఉదయం పొలం వెళ్లిన బాధిత రైతు కుటుంబం అవాక్కయ్యింది. పోలీసు స్టేషన్కు చేరిన పంచాయితీ వరి పంట ధ్వంసం చేసి డొంక రోడ్డు వేసిన రైతులను తమ పొలంలో పంట నాశనం చేసి రోడ్డు ఎలా వేస్తారని బాధిత రైతు ప్రశ్నించడంతో పంచాయతీ కొల్లూరు పోలీసు స్టేషన్కు చేరింది. ధ్వంసం చేసిన పొంలం వద్దకు వెళ్లి పొలం పత్రాలు తీసుకొని పోలీసు స్టేషన్కు రావాలని పోలీసులు తెలపడంతో బాధిత రైతులు కొల్లూరు పోలీసుస్టేషన్కు చేరుకున్నారు. అక్కడ గంటల కొద్దీ పంచాయితీ నిర్వహించిన పోలీసులు దారి ఇవ్వాలని బాధిత రైతులను ఆదేశించడం వారికి మింగుడు పడని వ్యవహారంగా మారింది. కూటమి ప్రభుత్వంలోని ఓ టీడీపీ నాయకుడు పోలీసుస్టేషన్లో పంచాయితీ నిర్వహించి తమపై వత్తిడి తీసుకువస్తున్నట్లు బాధిత రైతు కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దారి ఇవ్వని పక్షంలో రెవెన్యూ అధికారుల వద్ద నుంచి ఫిర్యాదు స్వీకరించి తమపై కేసు నమోదు చేస్తామని పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారని రైతు కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తుంది. రికార్డులలో డొంక రోడ్డుగా నమోదు వివాదానికి కారణమైన సర్వే నంబరులోని భూమి రెవెన్యూ రికార్డులలో డొంక రోడ్డుగా నమోదు చేసి ఉంది. రీ సర్వేలో భాగంగా తాము రికార్డుల ప్రకారం ఆ భూమిని ప్రభుత్వ డొంకగా చూయించడం జరిగింది. గతంలో విశ్రాంత ఆర్మీ ఉద్యోగికి ఆ భూమిని ప్రభుత్వం కేటాయించినట్లు రెవెన్యూ రికార్డులలో నమోదైలేదు. రైతు వద్ద ఉన్న అడంగల్లు, 1బీ పరిశీలించిన అనంతరం రిటైర్డు ఆర్మీ అధికారి వద్ద పత్రాలు తీసుకురమ్మని సూచించాం. బి.వెంకటేశ్వర్లు, తహసీల్దార్, కొల్లూరు. మార్గం ఏర్పాటుచేసిన కూటమి నేతలు పొలం స్వాధీనం చేసుకోవడానికి కుయుక్తులు బాధిత రైతు ఆరోపణ పోలీసు స్టేషన్కు చేరిన పొలం పంచాయతీ రెవెన్యూ రికార్డుల్లో డొంక మార్గంగా ఉందంటున్న అధికారులు -
కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించాలి
కర్లపాలెం: తుఫాన్ ప్రమాదం పొంచి ఉన్నందున రైతులు కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే విక్రయించుకోవాలని జిల్లా ఇన్చార్జి వ్యవసాయాధికారి అన్నపూర్ణ తెలిపారు. ఆదివారం వ్యవసాయాధికారులతో కలసి ఆమె తుమ్మలపల్లి గ్రామంలో రైతులతో సమావేశమయ్యారు. ఇప్పటికే ధాన్యం ఉన్న రైతులు రైతు భరోసా కేంద్రాల ద్వారా విక్రయించాలని కోతలు కోయాల్సిన రైతులు తుఫాన్ ప్రభావం పోయిన తరువాత కోతలు చేపట్టాలని చెప్పారు. ఎంపీడీవో శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మవద్దని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో విక్రయించాలని రైతులకు చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే రైతులకు కావలసిన గోనె సంచులు ఇస్తారని ఎంపీడీవో తెలిపారు. కార్యక్రమంలో ఏవో సుమంత్కుమార్, రైతులు ఉన్నారు. -
కుక్కలు తిన్నాకే తినాలా?
నూజండ్ల: మండల పరిధిలోని ఉప్పలపాడు అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో ఆదివారం విద్యార్థులకు అందించాల్సిన మజ్జిగను కుక్క తాగుతూ పలువురికి కనిపించడం చర్చనీయాంశంగా మారింది. సంఘటనపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుక్కలు తిన్న ఆహారం తింటే రేబిస్ వ్యాధి సోకే అవకాశాలు ఉందని భయపడ్డారు. అయితే, ఎటువంటి ఇబ్బంది కలగక పోవటంతో పిల్లల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై కేర్టేకర్ను వివరణ కోరగా అప్పటికే విద్యార్థులు భోజనాలు ముగించారని, కుక్క తిన్న ఆహారాన్ని పారవేశామన్నారు. పాఠశాలలో కుక్కల,కోతుల బెడద ఎక్కువగా ఉందని, సమస్యను స్థానిక పంచాయతీ అధికారుల దృష్టికి తెచ్చామన్నారు. ఇదిలా ఉంటే పాఠశాలలో ప్రిన్సిపాల్ స్థానికంగా ఉండరని విమర్శలున్నాయి. 600 పైగా విద్యార్థినులు ఉన్న వసతి గృహంలో 24 గంటల పర్యవేక్షణ ఉండాలి. కానీ అలా జరగటం లేదని తల్లిదండ్రులు అంటున్నారు. -
పది సవర్ల బంగారం చోరీ
మేదరమెట్ల: ఇంటి తలుపులు పగులగొట్టి బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలను దొంగలు తస్కరించిన సంఘటన కొరిశపాడు మండలం తిమ్మనపాలెంలో ఆదివారం చోటుచేసుకుంది. తిమ్మనపాలెం గ్రామానికి చెందిన యనుమల వెంకట రఘురామరెడ్డి తన భార్యతో కలిసి శనివారం ఇంటికి తాళాలు వేసి త్రోవగుంట వెళ్లి తిరిగి ఆదివారం ఇంటికి వచ్చి చూడగా ఇంటి వెనుక ఉన్న తలుపులు పగులగొట్టి ఉన్నాయి. లోపలకు వెళ్లి చూడగా ఇంట్లోని బీరువా కూడా పగులగొట్టి ఉంది. బీరువాలో ఉన్న పది సవర్ల బంగారం దొంగలు దోచుకుపోయినట్లు తెలుసుకున్న బాధితుడు పోలీసులకు సమాచాం అందించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న మేదరమెట్ల పోలీసులు బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ మహ్మద్రఫీ తెలిపారు. -
గ్రానైట్ సీనరేజ్ అక్రమ వసూళ్లు ఉపసంహరించుకోవాలి
అద్దంకి రూరల్: చంద్రబాబు సర్కార్ గ్రానైట్ సీనరీజ్ అక్రమ వసూళ్లు తక్షణమే ఉపసంహరించుకోవాలని లేదంటే పరిశ్రమల నిర్వాహకులు, కార్మికులకు అండగా నిలిచేందుకు తమ పార్టీ సిద్ధమని వైఎస్సార్ సీపీ అద్దంకి ఇన్చార్జి డాక్టర్ చింతలపూడి అశోక్కుమార్ వెల్లడించారు. ఆదివారం అద్దంకిలో విలేకర్లతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో నాణ్యత కలిగిన రాయికి క్యూబిక్ మీటర్కు రూ.27 వేలు సీనరీజ్ చెల్లించగా, ఎన్నికల ముందు పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ ఒంగోలులో సీనరేజ్ రాయల్టీ.. జగన్ మైనింగ్ కంపెనీకి చెల్లిస్తున్నారంటూ ఆరోపించారన్నారు. తాము అధికారంలోకి వస్తే సీనరేజ్ రాయల్టీని పూర్తిగా తగ్గిస్తామంటూ ప్రకటించిన వీడియోను రిలీజ్ చేశారు. నేడు తగ్గించకపోగా మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు సీనరేజ్ రాయల్టీ రూ.35 వేల పెంపుతో పాటు జీఎస్టీ మరో రూ.35 వేలు కలిపి నారా, కొణిదెల ట్యాక్స్ వసూళ్లు చేసే బాధ్యత ఏఎంఆర్ సంస్థకు అప్పగించారన్నారు. ఏఎంఆర్ సంస్థ నెలకు రూ. 47 వేల కోట్ల చెల్లింపుతో రెండు సంవత్సరాలకు ఒప్పందం కుదుర్చుకుని బల్లికురవ, అద్దంకి, మార్టూరు ప్రాంతాల్లో 54 చెక్పోస్టులు ఏర్పాటు చేసుకున్నారన్నారు. ఈ చెక్ పోస్టులతో కనీసం దేవాలయాలకు, ఇంటి నిర్మాణాలకు సైతం మట్టి, వేస్టు రాయి సైతం తోలుకోలేకపోతున్నారని తెలిపారు. పల్నాడు జిల్లాలో సీనరీజ్ చెల్లింపునకు ఇక్కడ సీనరేజ్ చెల్లింపుకు భారీ వ్యత్యాసం ఉందని అశోక్కుమార్ వివరించారు. గ్రానైట్ పరిశ్రమల్లో రెండు సంవత్సరాలుగా ఎగుమతులు లేక విద్యుత్ బిల్లుల పెంపుతో పరిశ్రమల నిర్వాహకులు కుదేలు అవుతున్నారని.. ఈ పరిస్థితుల్లో సీనరేజ్ రెట్టింపు పెంపుతో రోడ్డెక్కక తప్పటంలేదని తెలిపారు. నాణ్యత కలిగిన రాళ్లకు పాత పద్ధతిలోనే సీనరేజ్ వసూళ్లు చేపట్టాలని వృథా రాళ్లకు సీనరేజ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని అశోక్కుమార్ డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ అశోక్కుమార్ -
కుటుంబ కలహాలతో ఉరేసుకుని వ్యక్తి మృతి
ఉలవపాడు: ఉరేసుకుని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని కరేడు పంచాయతీ పరిధిలోని చిల్లకాల్వ సమీపంలోని రొయ్యల చెరువుల వద్ద ఆదివారం జరిగింది. అందిన వివరాల మేరకు.. వేటపాలెం మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన రావూరి సాంబశివరావు (52) ఉలవపాడు గ్రామానికి చెందిన ఓగుబోయిన ప్రసాద్కు చెందిన చెరువుల వద్ద పనిచేస్తున్నాడు. 17 ఏండ్ల నుంచి తన భార్య కోటేశ్వరమ్మతో విభేదించి వచ్చి రొయ్యల చెరువుల వద్ద ఉన్న రేకుల షెడ్లోనే ఉంటున్నాడు. కుటుంబ కలహాల వలన మనస్తాపం చెంది చనిపోవాలనే ఉద్దేశంతో రేకుల షెడ్కు ఉన్న ఇనుప కమ్మెకు ఉరివేసుకుని మృతి చెందాడు. మృత దేహాన్ని సీఐ అన్వర్ బాషా, ఎస్సై అంకమ్మ ఘటనా స్థలిని పరిశీలించారు. భార్య కోటేశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాచర్ల రూరల్: గంజాయిని ద్రవ రూపంలోకి మార్చి బాటిల్స్లో నింపి విక్రయిస్తున్న ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకొని, వారి నుంచి 494 గ్రాముల 260 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు గురజాల డీఎస్పీ జగదీష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు అలవాటుపడిన యువకులలో ఒకడైన మచిలీపట్నానికి చెందిన రమణీ అరవింద్, షేక్ నాగూర్ షరీఫ్, షేక్ నజీర్, షేక్ పఠాన్ సిరాన్ ఖాన్, షేక్ సలీం అనే యువకులు ఒడిస్సాలోని చిత్రకొండ పరిసరాలలో గంజాయితో తయారు చేసే హ్యాష్ ఆయిల్ బాటిల్స్ తెచ్చి మాచర్ల పట్టణ, పరిసర ప్రాంతాల్లో విద్యార్థులకు, యువకులకు అమ్ముతున్నారు. రూరల్ సీఐ షేక్ నఫీజ్ బాషా నేతృత్వంలో వెల్దుర్తి ఎస్ఐ డి. అశోక్ తనకు వచ్చిన సమాచారంతో మండాదిలోని కానాగు వాగు దగ్గరకు సిబ్బందితో వెళ్లారు.అక్కడ గంజాయి ఆయిల్ను 5ఎం.ఎల్. బాటిళ్లలో నింపుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కొందరు యువకులు సులభమార్గంలో డబ్బులు సంపాదించేందుకు విద్యార్థులు, యువకులను టార్గెట్గా చేసుకొని గంజాయి, డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్నట్లు డీఎస్పీ జగదీష్ తెలిపారు. వీటిని అరికట్టేందుకు పోలీసులతో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి పట్టణ, గ్రామ శివారులో తనిఖీలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. కాలేజీలలో అవగాహన కార్యక్రమాలతో పాటు యాజమాన్యంతోనూ ప్రత్యేకంగా చర్చించనున్నట్లు ఆయన చెప్పారు. ఇంత పెద్ద మొత్తంలో గంజాయి లిక్విడ్ను స్వాధీనం చేసుకుని, యువకులను అదుపులోకి తీసుకున్న రూరల్ సీఐ షేక్ నసీబ్ బాషా, వెల్దుర్తి ఎస్ఐ డి. అశోక్, సిబ్బందిలను పల్నాడు జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారన్నారు. వీరికి రివార్డులను అందించనున్నట్లు ఆయన తెలిపారు. -
కష్టాల ‘ప్లాజా’ !
మార్టూరు: జాతీయ రహదారిపై ఉన్న బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద అధికారులు, సిబ్బంది తీరుతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనదారుల నుంచి సంవత్సరానికి రూ.కోట్లు టోల్ ఫీజు వసూలు చేస్తున్నా.. వారి అవసరాలకు సరిపడా సౌకర్యాలను సమకూర్చడం లేదని ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న అధికారులు మరో కొత్త సమస్యకు తెర లేపడం గమనార్హం. టోల్ ప్లాజాకు ఇరువైపులా ఫ్రీ లెఫ్ట్ పేరుతో రెండు మార్గాలు ఉంటాయి. ఈ మార్గాల్లో వీవీఐపీల వాహనాలు, అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలు, కలెక్టర్, కేంద్ర, రాష్ట్రస్థాయి అధికారుల వంటి అత్యవసర వాహనాలు టోల్ ఫీజుతో సంబంధం లేకుండా వెళ్లిపోతుంటాయి. వీటితోపాటు టోల్ ప్లాజా పరిసర గ్రామాలకు చెందిన రైతుల ట్రాక్టర్లు, ఇతర వాహనాలు సైతం లోకల్ పాస్తో ఈ మార్గాల్లోనే వెళ్లి పోతుంటాయి. ఈ కారణంగా ఈ అత్యవసర వాహనాలు ఆలస్యం లేకుండా ప్రయాణం చేయడానికి వీలు కలుగుతుంది. ట్రాఫిక్ సమస్య కూడా తలెత్తదు. ● అదే రోజు అర్ధరాత్రి మార్టూరు వైపు నుంచి ఒంగోలుకు రోగులతో వెళ్తున్న ఓ అంబులెన్స్ ఫ్రీ లెఫ్ట్ మార్గం మూసి వేసి ఉండటంతో మిగిలిన వాహనాలతో పాటు క్యూలోనే ఉండటంతో రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాపాయంలో ఉన్న రోగుల పరిస్థితి చూసి ముఖ్యమంత్రి స్థాయి ప్రజాప్రతినిధులే అంబులెన్సకు దారి వదులుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయినా బొల్లాపల్లి టోల్ ప్లాజా అధికారులు మాత్రం ఇందుకు మినహాయింపులాగా వ్యవహరించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ● ఈ విషయమై సిబ్బందిని వివరణ కోరగా.. ఇటీవల కొత్తగా వచ్చిన అధికారి ఆదేశాలతో తాము ఫ్రీ లెఫ్ట్ మార్గాలను మూసివేసినట్లు తెలిపారు. ఇప్పటికై నా టోల్ ప్లాజా ఉన్నతాధికారులు స్థానిక సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాలని వాహనదారులు, ప్రయాణికులు, పరిసర గ్రామాల ప్రజలతో పాటు టోల్ ప్లాజా సిబ్బంది సైతం కోరటం విశేషం. బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద వాహనదారుల ఇక్కట్లు ఫ్రీ లెఫ్ట్ మార్గాలను మూసివేయించిన అధికారులు అంబులెన్సులు సైతం క్యూలో రావల్సిందేనంటూ హుకుం -
నేడు పీజీఆర్ఎస్ తాత్కాలికంగా రద్దు
బాపట్లటౌన్: దిత్యా తుఫాన్ కారణంగా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో జిల్లాలోని కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల్లో సోమవారం ఉదయం జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్, ఎస్పీ బి.ఉమామహేశ్వర్లు ఆదివారం ఒక ప్రకటలో పేర్కొన్నారు. చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో కొలువై ఉన్న బగళాముఖి అమ్మవారు ఆదివారం భక్తులకు ఐశ్వర్య ప్రదాయినిగా దర్శనమిచ్చారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని అమ్మవారి భక్తులు చందోలు గ్రామానికి వచ్చి బగళాముఖి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. మహిళలు అమ్మవారికి పసుపు కుంకుమలు, పూలు, పండ్లు సమర్పించి పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. పెదకాకాని: భక్తుల సౌకర్యార్థం పెదకాకాని మల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. శివాలయానికి విచ్చేసే భక్తులు ఆలయంలో వసతి గదులు, దర్శనాలు, రాహు కేతు పూజలు, స్వామి వారి అభిషేకాలు, చండీ రుద్ర హోమ పూజలు ఇతర సేవలు ఆన్లైన్ బుకింగ్ ద్వారా అందుబాటులో ఉంచామన్నారు. ప్రసాదాల టోకెన్ల విక్రయాలు సైతం ఆన్లైన్లో ఉండటం జరిగిందన్నారు. ఆన్లైన్ ద్వారా వివిధ సేవలు, దర్శనాల టికెట్స్ బుక్ చేసుకోవడంతోపాటు ప్రసాదం టోకెన్లు పొందిన భక్తులను ఆలయం వద్ద సాధారణ క్యూలైన్లో ఎక్కువ సమయం వేచి ఉండే అవసరం లేకుండా త్వరితగతిన దర్శనం, ప్రసాదాలు పొందుటకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. భక్తులు వివిధ సేవల కోసం ఆలయ వెబ్సైట్ ద్వారా కానీ మనమిత్ర వాట్స్యాప్ నెంబరు 95552300009 ద్వారా క్రెడిట్కార్డు, డెబిట్కార్డు, గూగుల్ పే, ఫోన్పే, పేటీయం, బీమ్ యూపీఎల్, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించి ఆయా సేవల టికెట్లు పొందవచ్చని డీసీ తెలిపారు. -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
బాపట్లటౌన్: దిత్వా తుఫాన్ నష్టాన్ని తగ్గించడానికి జిల్లా యంత్రాంగమంతా సంసిద్ధంగా ఉండాలని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల, గృహ నిర్మాణశాఖల మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. దిత్వా తుఫాన్ హెచ్చరికతో ముందస్తు జాగ్రత్త చర్యలపై అన్ని శాఖల జిల్లా అధికారులతో ఆదివారం కలెక్టరేట్లో మంత్రి సమీక్షించారు. గత తుఫాన్ అనుభవాలతో మరింత సమర్థంగా, అధికారులు పని చేయాలన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తం కావాలన్నారు. జిల్లాలో అద్దంకి, చినగంజాం మండలాలకు హై అలర్ట్ ఉందన్నారు. జిల్లాలో తీర ప్రాంతం అధికంగా ఉన్నందున ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఎన్ని ఉన్నాయి, బోట్లు అన్ని తీరానికి వచ్చాయా లేదా పునఃపరిశీలన చేయాలన్నారు. మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లనీయరాదన్నారు. ధాన్యం పండించిన ఏ ఒక్క రైతుకు నష్టం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజు 1,500 టన్నుల ధాన్యం సేకరించాలన్నారు. గోనె సంచుల కొరత లేకుండా చూడాలన్నారు. ● దిత్వా తుఫాన్ ప్రభావం బాపట్ల జిల్లాపై కొంతమేర చూపనుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. అద్దంకి, చిన్నగంజాం మండలాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైఅలర్ట్ వచ్చిందన్నారు. ఆ మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రికి వివరించారు. కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, 24 గంటల పాటు కంట్రోల్ రూమ్ పనిచేసేలా సిబ్బందిని నియమించామన్నారు. ధాన్యం కోత జరిగితే, దాచి పెట్టడానికి 150 ప్రాంతాలలో గోదాములు సిద్ధం చేశామన్నారు. ● దిత్వా తుపానుతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైందని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ రావు తెలిపారు. ఐదు మండలాలపై తుఫాన్ ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ఆ ప్రాంతాలలో పోలీస్ సిబ్బందిని నియమించామన్నారు. సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులంతా తిరిగి వచ్చేసినట్లు సమాచారం అందిందన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు సమర్ధంగా నడుస్తున్నాయని జాయింట్ కలెక్టర్ భావన విశిష్ట చెప్పారు. డీఆర్ఓ జి.గంగాధర్ గౌడ్, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. తుఫాన్ నేపథ్యంలో మంత్రి కొలుసు పార్ధసారధి సమీక్ష -
కంటిమీద కునుకు కరువు
విత్తు వేసేటప్పుడు చినుకు కోసం ఆశగా ఆకాశం వైపు చూసే అన్నదాత.. నేడు అదే ఆకాశం వైపు భయం.. భయంగా చూడాల్సిన దుస్థితి. పంట చేతికొచ్చే సమయానికి దూసుకొచ్చే తుఫాన్ల దెబ్బకు రైతులు హతాశులవుతున్నారు.. ఇప్పటికే ‘మోంథా’ తీవ్రంగా ముంచే యగా.. ఉన్న పంటనైనా కాపాడుకుందామన్న అన్నదాతలను ‘దిత్వా’ భయపెడుతోంది. ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కనీసం పట్టలు ఇచ్చేవారు కరువై.. రైతన్నలు పడరాని పాట్లు పడుతున్నారు. తుఫాన్ ప్రభావంతో చిరుజల్లులతో కూడిన వర్షం రహదారుల పైనే ధాన్యం రాశులు కాపాడుకునేందుకు పడరాని పాట్లు హడావిడిగా కుప్పలు వేసుకుంటున్న రైతులు టార్ఫాలిన్లు సైతం ఇవ్వని ప్రభుత్వం -
అత్యవసర వాహనాలు సైతం క్యూలోనే..
గత నెల రోజులుగా ఫ్రీ లెఫ్ట్ మార్గాలను రెండు వైపులా అధికారులు సిబ్బందితో మూసి వేయించారు. దీనివలన అత్యవసరంగా వెళ్లవలసిన వాహనాలతో పాటు పరిసర గ్రామాలకు చెందిన రైతుల వాహనాలు సైతం మిగిలిన వాహనాలతో పాటు ప్లాజా రూటులోనే ప్రయాణిస్తున్నాయి. దీంతో ప్రయాణంలో జాప్యం పెరిగి వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ఎప్పటిలాగే ఫ్రీ లెఫ్ట్ మార్గంలోనే వెళ్తామంటూ సమీప గ్రామానికి చెందిన కొందరు రైతులు గత గురువారం ట్రాక్టర్తో ఆ మార్గానికి అడ్డుగా ఉంచిన సిమెంట్ దిమ్మెలను తొలగించే ప్రయత్నం చేశారు. ఈ విషయమై రైతులు టోల్ ప్లాజా సిబ్బందికి మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. అయినప్పటికీ సిబ్బంది ఆ మార్గంలో ఉంచిన అడ్డంకులను తొలగించకపోవడం గమనార్హం. -
బాపట్ల
సోమవారం శ్రీ 1 శ్రీ డిసెంబర్ శ్రీ 2025దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజ్ నుంచి పశ్చిమ డెల్టాకు నీటి విడుదల నిలుపుదల చేశారు. సముద్రంలోనికి 3,625 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 7అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 400 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. నీటి నిల్వ 42.1600 టీఎంసీలు. విజయపురిసౌత్: నాగార్జుసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 580.60 అడుగులకు చేరింది. ఇది 284.7452 టీఎంసీలకు సమానం. -
ప్రతిభ దివ్యం.. పోరు ఉత్కంఠం
గుంటూరు వెస్ట్ (క్రీడలు): దివ్యాంగుల ప్రతిభాపాటవాలు సమాజానికే ఆదర్శమని జిల్లా రెవెన్యూ అధికారి షేక్ ఖాజావలి అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో దివ్యాంగులకు క్రీడా పోటీలను నిర్వహించారు. పోటీలను డీఆర్ఓ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు విభిన్న అంశాల్లో ప్రతిభ కలిగి ఉంటారన్నారు. ఎందరో దివ్యాంగులు ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతులుగా, మోటివేటర్లుగా ఉన్నారని చెప్పారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా బ్రహ్మాండంగా రాణిస్తున్నారని చెప్పారు. దివ్యాంగుల్లో ప్రతిభకు కొదవలేదని వారిలో ఉన్న సృజనాత్మకతను మరింతగా వెలికి తీసి పదును పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. దివ్యాంగ క్రీడాకారులు క్రీడల్లో అభివృద్ధి చెంది జిల్లాకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. ఇన్చార్జి దివ్యాంగుల శాఖ సహాయ సంచాలకుల డి.దుర్గా భాయి మాట్లాడుతూ డిసెంబర్ మూడో తేదీన దివ్యాంగుల దినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. క్రీడా పోటీల్లోనూ, దివ్యాంగుల దినోత్సవంలోనూ పాల్గొనే దివ్యాంగ ఉద్యోగులకు ఆన్డ్యూటీగా పరిగణించడం జరుగుతుందన్నారు. వివిధ అంశాల్లో జరిగిన క్రీడాపోటీలు ఉత్కంఠ రేపాయి. డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ టి.విజయలక్ష్మి, కాలుష్య నియంత్రణ మండలి కార్యనిర్వహక ఇంజినీర్ నజీమా, విభిన్న ప్రతిభావంతుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
లైంగిక దాడులపై అవగాహన
తాడేపల్లి రూరల్ : ఉండవల్లి మండల ప్రాథమిక పరిషత్ స్కూలులో శనివారం గుడ్షెపర్డ్ సిస్టర్స్ సంస్థ ఆధ్వర్యంలో బాలికలపై లైంగిక దాడులు అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గుడ్ షెపర్డ్ కాన్వెంట్ సిస్టర్ విద్య మాట్లాడుతూ బాలికలపై లైంగిక దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు జరిగినపుడు చిన్నారులు బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక నరకయాతన పడుతున్నారన్నారు. బాలికలపై లైంగిక దాడులను నిరోధించేందుకు పోక్సో చట్టం అమలులో ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో గుడ్ షెపర్డ్ సిబ్బంది పోతురాజు, అనూష, నాగమణి, అనిల్ కుమార్, బాబు జగజ్జీవన్రావు పాల్గొన్నారు. తాడేపల్లి రూరల్ : ప్రకాశం బ్యారేజ్, ఉండవల్లి సెంటర్ సీడ్ యాక్సెస్ రోడ్లో వీవీఐపీలు పర్యటిస్తుండడంతో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు శనివారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లోని కల్వర్టులు, ముళ్ల పొదలు, ఇతర పైపులైన్లు, చెక్ పోస్టులతో పాటు ఇతర బ్రిడ్జిల వద్ద బాంబ్ స్క్వాడ్, ఇతర బృందాలు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఏఆర్ ఎస్పీ హనుమంతరావు మాట్లాడుతూ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వీవీఐపీలు, వీఐపీలు నివాసం ఉంటున్నారని, వారి భద్రత దృష్ట్యా మొత్తం 40 మంది సిబ్బంది నాలుగు బృందాలుగా ఏర్పడి ఈ తనిఖీలు నిర్వహించార ని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఎస్జీ డీఎస్పీ రామకృష్ణ, జిల్లా భద్రతా విభాగం ఆర్ఐ శ్రీనివాసరావు, ఎస్ఎస్జీ ఆర్ఐలు నరేష్, శంకర్ పాల్గొన్నారు. మంచికల్లు(రెంటచింతల): పలనాటి కోనసీమగా పేరొందిన మంచికల్లు గ్రామదేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారి తిరునాళ్ల ప్రారంభమైనట్లు కారంపూడి వెంకటాచార్యులు శనివారం తెలిపారు. తిరునాళ్లను వైభవంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. శుక్రవారం కుంకుమ బండ్లు, శనివారం దీనబండారంతో ఈ వేడుకలు ముగుస్తాయని వెల్లడించారు. మార్గశిర ఏకాదశి మొదలు బహుళపాఢ్యమి వరకు ప్రతి ఏటా ఈ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. మంగళగిరి టౌన్: డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఇటీవల విడుదల చేసిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫలితాల్లో మంగళగిరి విద్యార్థి ప్రతిభ చాటి రాష్ట్రంలోనే టాపర్గా నిలిచారు. మంగళగిరిలోని సాయినగర్కు చెందిన పాపన జితేంద్ర ఆర్థోపెడిక్ విభాగంలో 800 మార్కులకు 568 మార్కులు సాధించి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచారు. ఏలూరు జిల్లా ఆశ్రమ వైద్య కళాశాలలో జితేంద్ర వైద్యవిద్యను అభ్యసిస్తున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ చేబ్రోలు శ్రీనివాసరావు, ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ డాక్టర్ మల్లికార్జునరెడ్డి జితేంద్రను అభినందించారు. తమ కుమారుడు కష్టపడి చదివి పీజీ ఫలితాల్లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడం గర్వకారణంగా ఉందని జితేంద్ర తల్లిదండ్రులు శివరామ్ ప్రసాద్, ధనలక్ష్మి ఆనందం వ్యక్తం చేశారు. -
బాపట్ల
ఆదివారం శ్రీ 30 శ్రీ నవంబర్ శ్రీ 2025అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2100 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. దిగువకు 2000 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 42.1600 టీఎంసీలు ఉంది.విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 581.20 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 15,334 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. ధాన్యం సేకరణ వేగంగా జరగాలి7కలెక్టర్ వి. వినోద్కుమార్ -
రేషన్పై ఈ–కేవైసీ కత్తి
సత్తెనపల్లి: రేషన్ కార్డుదారులపై ఈ–కేవైసీ పిడుగు పడింది. పేదల గుర్తింపునకు ఈ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ తరుణంలో ఇందులో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఈ నెలాఖరులోపు వేలిముద్రలు వేసే ప్రక్రియను పూర్తి చేయాలని సర్కారు ఇటీవల ప్రకటించింది. ఒకవేళ ఎవరైనా చేయించు కోలేకపోతే వారికి ఇతర సంక్షేమ పథకాలు అందకుండా పోయే ప్రమాదమూ లేకపోలేదు. చేయించుకోలేదా .. సరుకులు బంద్ ఈ–కేవైసీ చేయించుకోకపోతే డిసెంబర్ ఒకటి నుంచి సరుకులను పంపిణీ చేయరనే చర్చ నడుస్తోంది. సర్కార్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పథకాలు పొందే ప్రతి ఒక్కరూ వేలి ముద్రవేసే ఈ–కేవైసీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు ఇది లేకపోయినా, సరుకులు సజావుగా అందేవి. ఇక నుంచి అలా కుదరదని, ప్రతి ఒక్కరూ చేయించుకోవాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. కార్డుతో అనుసంధానం కాని వారి జాబితాలను సిద్ధం చేసి, డీలర్లకు ఆ సమాచారాన్ని అందజేశారు. ఈ మేరకు జిల్లాలో దీన్ని చేయించుకోని ఐదేళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వారు రేషన్ షాపులకు వెళ్లి ఈ–పాస్ యంత్రంపై వేలిముద్ర వేసి డీలర్ లాగిన్లో ఈ– కేవైసీని పూర్తి చేసుకోవాల్సి ఉంది. గ్రామ/వార్డు సచివాలయాల్లోనూ అందుబాటులో ఉంది. క్షేత్రస్థాయిలో పర్యటనలు.. ఇప్పటికే గ్రామ/వార్డు సచివాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది తమ పరిధిలో క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ .. ఈ–కేవైసీ కోసం వేలిముద్రలు సేకరిస్తున్నారు. ఫలితంగా ఇతర ప్రాంతాల్లో ఉన్న చిరుద్యోగులు, కూలి పనులు చేసుకునేవారు దీనికి దూరమవుతున్నారు. ఈ కసరత్తుతో రేషన్ కార్డులకు భారీగా కోతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.జిల్లాలో రేషన్ కార్డుల లబ్ధిదారుల ఈ– కేవైసీ ప్రక్రియను దాదాపు పూర్తి చేశాం. ఇంకా 3.62 శాతం మాత్రమే మిగిలి ఉంది. వారు స్థానికంగా లేకపోవడం కారణంగా ఈ–కేవైసీ కాలేదు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కూడా ఈరోజుతో ఆఖరు. ఎవరైనా ఉంటే ఈరోజు తప్పనిసరిగా స్మార్ట్ రేషన్ కార్డులు పొందాలి. మిగిలి పోయిన వారి సమాచారాన్ని నివేదిక తయారు చేసి నివేదికతోపాటు స్మార్ట్ రేషన్ కార్డులను కూడా ప్రభుత్వానికి అందచేయనున్నాం. – ప్రసాద్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి, పల్నాడు జిల్లాలో 1,289 చౌకధరల దుకాణాల పరిధిలో 6,30,347 మంది రేషన్ కార్డుదారుల్లో 18,57,768 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పటి వరకు 17,44,739 మంది సభ్యులు ఈ– కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్నారు. ఇంకా 62,066 మంది ఈ– కేవైసీ పెండింగ్లో ఉంది. వీరికి ఈ ఒక్కరోజే అవకాశం ఉండడంతో ఎలా సాధ్యమవుతుందని కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు. అత్యధికంగా నరసరావుపేటలో 4,765 మంది ఈ–కేవైసీ పెండింగ్లో ఉండగా, అత్యల్పంగా శావల్యాపురం కనమర్లపూడిలో 948 మంది ఈ–కేవైసీ పెండింగ్లో ఉంది. ఇక స్మార్ట్ రేషన్ కార్డులను పరిశీలిస్తే, జిల్లాలో 6,30,347 మంది స్మార్ట్ రేషన్ కార్డు దారులకుగాను ఇప్పటివరకు 5,71,387 మందికి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఇంకా 58,960 మందికి సంబంధించిన స్మార్రేషన్ కార్డులు పొందక పోవడంతో అవి పెండింగ్లో ఉన్నాయి. వీటిని ఈ రోజు అందుకోకపోతే స్మార్ట్ రేషన్ కార్డులు రద్దయ్యే అవకాశం ఉంది. -
నేలబావిలో యువకుడి మృతదేహం
తాడేపల్లి రూరల్: మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని యర్రబాలెం పెనుమాక రోడ్డు శివారులో పెనుమాక టిడ్కో గృహాలకు వెళ్లే మార్గంలో ఓ నేలబావిలో మృతదేహం ఉన్నట్లు బంధువులు గుర్తించి తాడేపల్లి పోలీసులకు శనివారం సమాచారం ఇచ్చారు. వివిధ వర్గాల నుంచి సేకరించిన వివరాల ప్రకారం.. మంగళగిరి కొత్తపేటకు చెందిన శంకర్, వీరకుమారి దంపతుల రెండవ కుమారుడు పిన్నిక ఆనంద్ (24) చదువు అనంతరం ఫొటోగ్రఫీ చేస్తు హైదరాబాద్లో నివాసముంటూ ఖాళీ సమయాల్లో ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. ఈనెల 26వ తేదీ నాయనమ్మ చనిపోవడంతో అంత్యక్రియలకు వచ్చాడు. అంత్యక్రియల అనంతరం 27వ తేదీ ఉదయం అన్నయ్య, మరో స్నేహితుడితో కలసి వెళ్లి మద్యం సేవించి సాయంత్రం 4 గంటల సమయంలో అన్నదమ్ములిద్దరూ ఇంటికి చేరుకున్నారు. అనంతరం ఆనంద్ ద్విచక్రవాహనంపై ఇంట్లోనుంచి బయటకు వెళ్లాడు. ఆ రాత్రి ఇంటికిరాలేదు. 28వ తేదీ మంగళగిరి పట్టణ పోలీస్స్టేషన్లో తన కుమారుడు కనిపించడం లేదంటూ శంకర్ ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదుచేయకుండానే బంధువులు చుట్టుపక్కలప్రాంతాల్లో వెతుకుతుండగా యర్రబాలెంకు చెందిన ఓ వ్యక్తి డొంకరోడ్డులో మీ అబ్బాయి ద్విచక్రవాహనం ఉందని తెలియజేయడంతో అక్కడకు వెళ్లి పరిశీలించగా పంటపొలంలో పాడైపోయిన బావిలో ఆనంద్ మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్ధలానికి వచ్చి బావిలో ఉన్న మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్మార్టం నిమిత్తం ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మృతుడి శరీరంలో కంటి కింద, తల వెనుక భాగంలో దెబ్బలు ఉన్నాయని, హత్యచేసి ఉంటారని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు మాత్రం అనుమానాస్పద కేసు అని, పోస్ట్మార్టం రిపోర్టు వస్తే తప్ప పూర్తి వివరాలు తెలియవని చెబుతున్నారు. పెనుమాకలో ఓ యువతిని ఆనంద్ ప్రేమించినట్లు వదంతులు వినిపిస్తున్నాయి. ఆనంద్ను హత్యచేశారా? ఆత్మహత్య చేసుకున్నాడా అనేది పోలీసులు నిర్ధారించాల్సి ఉంది. -
ఎంఎల్సీ కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి
గుంటూరు మెడికల్: జాతీయ హైవేల మీద యాక్సిడెంట్ బారిన పడిన వాళ్లకు జాతీయ హైవే అథారిటీ ద్వారా రూ.లక్షన్నర వరకు క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉందని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి అన్నారు. శనివారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో జిల్లా వైద్యశాల, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులకు జెండర్ బేస్డ్ వెల్నెస్, మెడికో లీగల్ కేసులపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ నేషనల్ హైవేలపై ప్రమాదాలకు గురయ్యేవారు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా లబ్ధి పొందవచ్చని చెప్పారు. అడిషన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఏపీపీ) పి.మురళీకష్ణ మాట్లాడుతూ ఆడపిల్లలపై హింస నివారించవలసిన బాధ్యత అందరి మీద ఉందన్నారు. మెడికో లీగల్ కేసుల విషయంలో వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హింసకులోనైన అనాధ చిన్నారులను, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని పునరావాస కేంద్రాలకు తరలించాలని వెల్లడించారు. ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ ఇ.అన్నపూర్ణ, డాక్టర్ రోహిణి రత్నశ్రీ, డాక్టర్ సుజాత, డాక్టర్ ప్రియాంక, వెంకటేశ్వర్లు, ఇస్మాయిల్, వాణి పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి -
పదిహేనేళ్ల తర్వాత తండ్రి చెంతకు కుమారుడు
గుడ్లూరు: 15 ఏళ్లుగా కనిపించని కుమారుడు దొరికితే ఆ సంతోషానికి అవధులు ఉండవు. ఈ ఘటన గుడ్లూరులో చోటుచేసుకుంది. వివరాలు... గుంటూరు జిల్లా రేపల్లె వద్ద లంక అనే గ్రామంలో వసంతరావు కుమారుడు రాముకు చిన్నప్పటి నుంచే మాటలు రావు. 15 ఏళ్ల క్రితం పని నిమిత్తం విజయవాడకు వెళ్లారు. రైల్వేస్టేషన్లో రాము తప్పిపోయాడు. అప్పుడు అతని వయసు 19 ఏళ్లు. ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. విజయవాడ రైల్వే స్టేషన్లో గుడ్లూరుకు చెందిన ఓ బాతుల వ్యాపారి చేరదీశాడు. కానీ వెట్టిచాకిరీ చేయించాడు. తమిళనాడు, తెలంగాణ తదితర రాష్ట్రాలు తిప్పాడు. ఏడాదికి ఒకసారి మాత్రమే గుడ్లూరుకు తీసుకువచ్చేవాడు. మాటలు రాని రాము చదువుకోలేదు. గిరిజన కాలనీలో నివాసం ఉంటున్న సీపీఎం కార్యకర్త రామచంద్రయ్యతో రాముకు స్నేహం కుదిరింది. ఆధార్ కేంద్రంలో వేలిముద్రల ద్వారా అతని చిరునామా కనుక్కొన్నారు. ఎట్టకేలకు తండ్రి వసంతరావు, మామ శ్రీనివాసరావులకు విషయం తెలియజేశారు. శనివారం వారు గుడ్లూరుకు చేరుకున్నారు. 45 ఏళ్ల రామును తండ్రి, మామ భావోద్వేగానికి గురయ్యారు. వెంటనే రామును తీసుకొని గ్రామానికి వెళ్లారు. -
రాష్ట్ర స్థాయి పోటీలకు గురుకుల విద్యార్థులు
వేటపాలెం: స్థానిక మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు క్రీడా పోటీల్లో జిల్లా స్థాయిలో ప్రతిభ చాటి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ మహమ్మద్ నహిద శనివారం తెలిపారు. జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో కె. వినయ్కుమార్, చెస్ అండర్ –17 విభాగంలో సంపత్ కమార్, టీ జైకృష్ణ, ఎం. హేమంత్, అండర్ –14 విభాగంలో పి. దేవరాజు, పి అనిల్లు ఎంపికై నట్లు పేర్కొన్నారు. డిసెంబరు 7వ తేదీ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు, జనవరి 14న ఒంగోలులో రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు జరగనున్నాయని తెలిపారు. విద్యార్థులను పీఈటీ కె. మమత, ఉపాధ్యాయులు అభినందించారు. -
పల్నాటి మాత... పాత పాటేశ్వరమ్మ
గురజాల: పట్టణంలో వందలాది సంవత్సరాల కిందట పాతపాటేశ్వరి అమ్మవారిదేవిగా అవతరించి పలనాటి మాతగా భక్తుల పూజలను అందుకుంటుంది. దుగ్గరాజు వంశం వారిచే ప్రతిష్టించబడినట్లు దేవాలయంలో ఏర్పాటుచేసిన శిలాశాసనం ద్వారా తెలుస్తోంది. పల్నాడు నడిబొడ్డున అమ్మవారి ఆలయం ఉండటం పల్నాడు ప్రాంత వాసులకు గర్వకారణం. అమ్మవారి మహిమలు కొల్లలు. పాతపాటేశ్వరి అమ్మవారి దేవాలయాలు వేరే ప్రాంతంలో ఉన్నప్పటికీ పల్నాటి మాతగా పేరుగాంచిన గురజాల పాతపాటేశ్వరి అమ్మవారి చరిత్ర మాత్రమే ప్రసిద్ధి పొందింది. నేటి నుంచి తిరునాళ్ల ఉత్సవాలు ప్రారంభం ఆదివారం నుంచి అమ్మవారి బియ్యం కొలత, డిసెంబర్ 1వ తేదీన అమ్మవారి గ్రామోత్సవం, 2వ తేదీన అమ్మవారి గ్రామోత్సవం, 3వ తేదీ అమ్మవారి బియ్యం విడుపు కొలత, 4వ తేది అమ్మవారి పొంగళ్ల సమర్పణ, 5వ తేదీన అమ్మవారి వసంతోత్సవం కార్యక్రమంతో తిరునాళ్ల ఉత్సవాలు ముగుస్తాయి. అమ్మవారి తిరునాళ్లకు ఏర్పాట్లు పూర్తి చేశాం. భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూలైన్లు, ప్రసాదం పంపిణీ ఏర్పాటుకు తగు చర్యలు తీసుకుంటాం. అమ్మవారి దేవాలయం కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయి. ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులుకావాలి. – చీతిరాల సుబ్బారావు, ఆలయ కమిటీ సభ్యుడు -
ఘనంగా లయోలా వజ్రోత్సవాలు
గుంటూరు రూరల్: విద్యద్వారానే అభివృద్ధి సాధ్యపడుతుందని, అటువంటి విద్యను అందిస్తున్న లయోలా స్కూల్స్ సమాజాభివృద్ధికి తమదైన ముద్రను వేస్తున్నాయని కేంద్ర సహాయ శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. శనివారం నల్లపాడు గ్రామంలోని లయోలా పాఠశాలలో లయోలా డైమండ్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ 75 ఏళ్ళ లయోలా విద్యాప్రస్థానంలో ఎందరో ఐఏఎస్లను, ఐపీఎస్లను, సమాజ సేవకులను, కార్పొరేట్ దిగ్గజాలను అందించిందన్నారు. ఎమ్మెల్యే బి.రామాంజనేయులు మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన విద్యను అందించటంలో లయోలా ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. విద్య, క్రీడలు, సాంకేతిక నైపుణ్యం అన్ని రంగాల్లో విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యను అందించిన లయోలా అభినందనీయమన్నారు. లయోలా డైమండ్ జూబ్లీ వేడుకల సావనీర్ను విడుదల చేశారు. పూర్వ ప్రిన్సిపల్స్, యాజమాన్యాన్ని సన్మానించారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. ఏఎంఆర్ ఇండియా సంస్థ చైర్మన్ ఎ.మహే ష్కుమార్రెడ్డి, పాఠశాల సుపీరియర్ కరస్పాండెంట్ రెవరెండ్ ఫాథర్ డాక్టర్ పి.ఆంథోని, ప్రిన్సిపాల్ రెవరెండ్ ఫాదర్ డాక్టర్ సహాయరాజ్ మార్క్, మోస్ట్ రెవరెండ్ డాక్టర్ భాగ్యయ్య, రెవరెండ్ పాథర్ డాక్టర్ కెఎ స్టానిస్లూయిస్, పాఠశాల వైస్ ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
‘దిత్వా’తో రైతుల్లో కలవరం
రేపల్లె: దిత్వా తుపాను ప్రభావంతో ఆకాశం మేఘావృతమై శనివారం వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో నియోజకవర్గంలోని రైతులు భయాందోళన చెందుతున్నారు. వర్షం కురిస్తే చేతికి అంది వచ్చిన పంట నీటిపాలు అవుతుందని ఆందోళన చెందుతున్నారు. 29, 30, 1 తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో పలు రైతులు ముందస్తుగా జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. కోతకు వచ్చిన వరిని కోయించేందుకు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే కోసిన పంటను కుప్పలు వేయించే పనిలో నిమగ్నమయ్యారు. నియోజకవర్గంలోని రేపల్లె మండలం పేటేరు, కారుమూరు, పెనుమూడి, రుద్రవరం, మోర్లవారిపాలెం, వేజళ్లవారిలంక, గుడ్డి కాయలంకలతో పాటు చెరుకుపల్లి, నగరం మండలంలోని పలు గ్రామాల్లో కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. రైతులు అప్రమత్తంగా ఉండాలి తుపాను హెచ్చరికల నేపథ్యంలో రైతులంతా అప్రమత్తంగా ఉండాలని మండల వ్యవసాయశాఖ అధికారి అవ్వారు మహేష్బాబు సూచించారు. మండలంలోని పలు గ్రామాల్లో శనివారం పర్యటించి, పొలాలను పరిశీలించారు. డిసెంబర్ 2వ తేదీ వరకు తుపాను ప్రభావంతో వర్షాలు పడే ప్రమాదం ఉందని, రైతులు వరి కోతలను విరమించుకోవాలని ఆయన సూచించారు. ఇప్పటికే కోతలు కోసి ఉంటే ధాన్యాన్ని జాగ్రత్త చేసుకోవాలని చెప్పారు. వరి ధాన్యంపై కప్పుకునేందుకు మండలంలో 70 టార్పాలిన్ పట్టాలు అందుబాటులో ఉన్నాయని, రైతు సేవా కేంద్రాల్లోని అధికారులను సంప్రదించాలని ఆయన తెలిపారు. పట్టాలు లేకపోతే కొనుగోలు కేంద్రాలకు తరలించి క్రయించుకోవాలని సూచించారు. పేటేరు, పిరాట్లంక, పోటుమెరక, సింగుపాలెం, బేతపూడి, చోడయపాలెం, గుడికాయలంక గ్రామాల్లోని కేంద్రాల్లో పట్టాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులకు ఇబ్బందులు తలెత్తితే 1,967 గానీ, 7702806804 నంబరుకు గానీ ఫోన్ చేసి కంట్రోల్ రూంకు సమాచారం అందించాలని ఆయన చెప్పారు. ఆయన వెంట పలువురు వ్యవసాయ అధికారులున్నారు. వేమూరు: తుపాను ప్రభావంతో మండలంలో పడుతున్న వర్షపు జల్లులతో రైతులు అందోళన చెందుతున్నారు. హడావుడిగా యంత్రాలతో కోతలు ప్రారంభించారు. ధాన్యాన్ని గ్రామాల్లో ఖాళీగా ఉన్న రహదారులపై రాశులుగా పోసి, పట్టాలు కప్పుతున్నారు. కొందరు ఆదరాబాదరాగా కుప్పులు వేస్తున్నారు. ధాన్యం రేటు పడిపోతుండటంతో కొనడానికి వ్యాపారులు కూడా ముందుకు రావడం లేదు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం, మరో వైపు జల్లులతో ధాన్యం తడిసిపోతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. -
దళారులకు అమ్మి నష్టపోవద్దు
చెరుకుపల్లి: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని తక్కువ ధరకు దళారులకు అమ్ముకుని నష్టపోవద్దని, కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్ముకుని గిట్టుబాటు ధర పొందాలని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. నడింపల్లిలోని రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన శనివారం కలెక్టర్ వినోద్ కుమార్తో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ధాన్యాన్ని కొనుగోలు చేసి, 24గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 51లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, ఇప్పటికే 11లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి రూ.2,300కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. బాపట్ల జిల్లాలో ప్రభుత్వం 2లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అధికారులు మాత్రం మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కోనేందుకు ప్రణాళిక సిద్ధం చేశారని ఆయన వివరించారు. కొనుగోలు ప్రక్రియ సంక్రాంతి లేదా మార్చి వరకు జరుగుతుందని మంత్రి మనోహర్ రైతులకు వివరించారు. అనంతరం గ్రామంలో వరి కోత యంత్రాల ద్వారా కోసిన ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు రైతులకు టార్పాలిన్ పట్టాలను అందజేశారు. అనంతరం వ్యవసాయ శాఖ అధికారులతో కలసి జిల్లా కలెక్టర్ వి, వినోద్ కుమార్ కొనుగోలు కేంద్రం సిబ్బందిని సాంకేతిక ఇబ్బందులు గురించి అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది తెలిపిన సమస్యల్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భావన, రేపల్లె ఆర్డీవో ఎన్.రామలక్ష్మి, నాయకులు అనగాని శివప్రసాద్, జిల్లా పౌరసరఫరాల శాఖ డీఎం వి.లక్ష్మి, డీఎస్వో బాషా, ఇన్చార్జ్ వ్యవసాయ అధికారిణి అన్నపూర్ణ, స్థానిక తహసీల్దార్ సీహెచ్. పద్మావతి,ఎంపీడీవో మహబూబ్ సుభాని పాల్గొన్నారు. తేమ శాతంలో ఽతేడాలపై రైతులు గగ్గోలు కొల్లూరు : ధాన్యం కొనుగోలులో తేమ శాతంలో తేడాలపై రైతులు గగ్గోలు పెడుతున్నారు. కొనుగోలు కేంద్రంలో వచ్చిన శాతానికి.. రైస్ మిల్లర్లు వద్ద వస్తున్న శాతానికి తేడాలుండటం మింగుడుపడని అన్నదాతలు మంత్రి నాదెండ్ల మనోహర్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం కొల్లూరు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పరిశీలించారు. రైస్ మిల్లర్ల లీలలపై ఫిర్యాదులు ధాన్యం కొనుగోళ్లలో రైస్ మిల్లర్ల లీలలపై కూటమి నాయకులు, రైతుల నుంచి మంత్రి నాదెళ్లకు ఫిర్యాదులు వెల్లివెత్తాయి. కొనుగోలు కేంద్రంలో 16.5 తేమ శాతం వస్తుంటే, మిల్లర్ల వద్ద మాత్రం అదే ధాన్యం 20.5 శాతంగా చూపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన ఆయన కొల్లూరులో ధాన్యం కొనుగోళ్లకు అనుమతి ఉన్న రైస్ మిల్లులో తేమ శాతం పరిశీలించారు. ఆయన సమక్షంలో పౌరసరఫరాల శాఖాధికారులు పరిశీలించి రెండు శాతం అధికంగా ఉన్నట్లు నమోదు అవుతున్నట్లు మంత్రికి వివరించారు. రైతులను మోసగించే విధానాలను రైస్ మిల్లర్లు విడనాడాలని లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చెరుకుపల్లిలోని రోజా రైస్ మిల్లు నిర్వాహకులు ధాన్యం లోడ్ పంపిన అనంతరం తేమ శాతం అధికంగా ఉందని రూ. 14 వేలు చెల్లిస్తేనే దిగుమతి చేయించుకుంటామని డిమాండ్ చేశారని పెసర్లంకకు చెందిన రైతు మంత్రికి ఫిర్యాదు చేశారు. దీనిపై పౌరసరఫరాల శాఖ ఎండీ ఢిల్లీరావు సంబంధిత రైస్ మిల్లర్లను ఫోన్లో సంప్రదించి వివరణ కోరారు. తాము డిమాండ్ చేయలేదని చెప్పారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి ఆన్లైన్ పేమెంట్ ద్వారా మిల్లర్లకు నగదు జమ చేసినట్లు మంత్రికి ఫోన్లో చూపించారు. ఈ అంశంపై విచారణ చేపట్టాలని రేపల్లె ఆర్డీఓ ఎన్. రామలక్ష్మిని ఆదేశించారు. రానున్న రెండ్రోజులలో తుపాను ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశాలున్న నేపథ్యంలో రైతులు వరి కోతలను నిలుపుదల చేయాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో జేసీ వందన, తహసీల్దార్ బి. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
అమరేశ్వరాలయంలో కాలభైరవస్వామికి పూజలు
అమరావతి: లింగాపురం గ్రామానికి చెందిన కొచ్చిరి వసంతరావు ఇండియన్ పోలీస్ మెడల్ అందుకోవటంపై లింగాపురం గ్రామస్తులు, స్నేహితులు, అప్పటి సహ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశా రు. నిరుపేద కుటుంబంలో జన్మించిన వసంతరావు శ్రీ రామకృష్ణ హిందూ హైస్కూల్లో పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ ధరణికోట రాజావాసిరెడ్డి వెంకటాద్రినాయుడు కళాశాలలో చదివారు. 1991లో కేంద్ర హోం శాఖలో చేరి అంచెలంచెలుగా ఎదిగి 2025 రిపబ్లిక్ డేనాడు ఇండియన్ పోలీస్ మెడల్ అవార్డుకు ఎంపిక య్యారు. ప్రస్తుతం హైదరాబాద్లోని ఇంటిలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న వసంతరావు శుక్రవారం చత్తీస్గడ్లోని రాయపూర్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్షా చేతుల మీదుగా ఇండియన్ పోలీస్ మెడల్ అందుకున్నారు.శ్రీరామకృష్ణ హిందూ హైస్కూల్లో 1981–82 బ్యాచ్ పదో తరగతి విద్యార్థు లంతా తమ తోటి విద్యార్థి జాతీయ స్థాయిలో ఘనత సాధించినందుకు హర్షంవ్యక్తం చేశారు. నగరంపాలెం(గుంటూరు ఈస్ట్) : గుంటూరులోని లక్ష్మీపురం ఆనం మెడికల్ హబ్ వద్ద శ్రీధర్మశాస్త్ర అయ్యప్పస్వామి మహా పడిపూజ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. రెండు రోజులుగా నిర్వహిస్తోన్న పడిపూజ శుక్రవారం తెల్లవారుజామున ముగిసింది. శబరిమల ఆచారం ప్రకారం పూజలు, అభిషేకాలు నిర్వహించారు. గురుస్వామి ఏ.శ్రీనివాసన్ నాయర్ నేతృత్వంలో పూజలు చేపట్టగా, సంతోష్ స్వామి బృందం అయ్యప్ప, భవానీ పూజలను భక్తితో నిర్వహించారు. వందలాది మంది భక్తులకు పూజ కార్యక్రమాల అనంతరం తీర్థప్రసాదాలు అందించారు. పడిపూజ మహోత్సవం లో సీనియర్ వైద్యులు ఆర్.మురళీబాబురావు, బీవీ.సుధీర్బాబు, వంశీకృష్ణ, శ్రీబాలసుధ డయాగ్నస్టిక్స్ నిర్వాహాకులు ఆనం సంజీవరెడ్డి, బాలబాణి, వైద్యులు ఆనం గోపాల్రెడ్డి, నర్మదాసాయి, లక్ష్మీరెడ్డి, రెడ్డి అంకమ్మరెడ్డి, వంగా సుబ్బారెడ్డి పాల్గొన్నారు. తెనాలి: పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీప్రజ్ఞానంద సరస్వతి (బాలస్వామీజీ) ఆధ్వర్యంలో బుర్రిపాలెం రోడ్డులో సువర్ణభారతి క్షేత్ర సరస్వతీ దేవాలయం నిర్మాణ పనులకు శుక్రవారం అంకురార్పణ చేశారు. నీటిపంపు వేయటం ద్వారా గంగ పూజిత పనులను అక్కడ ఆరంభించారు. మహిళలతో లలితా సహస్ర పారాయణం, విష్ణుసహస్ర పారాయణం, హ నుమాన్ చాలీసా పారాయణం చేయించారు. భక్తులచే ప్రత్యేక పూజలు చేయించారు. కార్యక్రమంలో శ్రీసాలిగ్రామ మఠం ట్రస్ట్ సంయుక్త కార్యదర్శి ముద్దాభక్తుని రమణయ్య, గోపు రామకష్ణ, రావూరి సుబ్బారావు, గొడవర్తి సాయి హరేరామ్, మాజేటి గోపి పాల్గొన్నారు. -
ధాన్యమంతా కొనుగోలు
బాపట్లశనివారం శ్రీ 29 శ్రీ నవంబర్ శ్రీ 2025పేదలకు అన్యాయం పోలింగ్ బూత్ ఏజెంట్ల వివరాలివ్వండి ● రైతుల సమస్యలపై వెంటనే అధికారులు స్పందించాలి ● జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ ● వర్షసూచన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశం ● గోవాడ రైతు సేవ కేంద్రంలో ధాన్యం కొనుగోలు పరిశీలన పూడివాడలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో డాక్టర్ ఈవూరి గణేష్, పార్టీ నేతలు వేమూరు (అమర్తలూరు)/చెరుకుపల్లి: రైతులు పండించిన ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ భరోసా ఇచ్చారు. అమర్తలూరు మండలంలోని గోవాడ రైతు సేవ కేంద్రాన్ని ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ధాన్యం సేకరణలో భాగంగా ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ ప్రక్రియపై ఆరా తీశారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. అన్నదాతలు కచ్చితంగా తేమ శాతం నిర్దేశిత స్థాయిలో ఉండేలా ధాన్యం ఆరబెట్టి తీసుకురావాలని సూచించారు. రైతు సేవ కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి విక్రయించడం ద్వారా మద్దతు ధర పొందాలని కోరారు. ధాన్యం కొన్న వెంటనే గంటల వ్యవధిలోనే రైతుల బ్యాంకు ఖాతాలకు ఈ మొత్తం జమ అవుతుందని వివరించారు. ఈ నెల 29, 30 తేదీల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రైస్ మిల్లులను రైతు సేవ కేంద్రాలకు అనుసంధానించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దారు నెహ్రూబాబు, ఎంపీడీవో మారుతి శేషాంబ, మండల వ్యవసాయాధికారి ఎం.హేమంత్ భరత్ కుమార్, రైతులు పాల్గొన్నారు. అధికారులతో సమీక్ష చెరుకుపల్లి మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మద్దతు ధర లభించేలా రైతులకు అండగా ఉండాలని కోరారు. ధాన్యం ఆరబెట్టుకునేందుకు ఇప్పటికే వెయ్యి టార్పాలిన్ పట్టలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అవసరమైతే మరో వెయ్యి పట్టలు తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. డిసెంబర్ 5న జరగనున్న మెగా పేరెంట్స్ మీటింగ్ను ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అధికారులు చర్చించుకుని ఒక ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతం చెయ్యాలని పేర్కొన్నారు. ఇందుకు ప్రతి అధికారి భాగస్వామి కావాలని కలెక్టర్ ఆదేశించారు. తహసీల్దార్ సీహెచ్ పద్మావతి, ఎంపీడీవో షేక్మహబూబ్ సుభాని, మండల విద్యాశాఖ అధికారి టి. నవీన్కుమార్, మండల వ్యవసాయ అధికారి ఎండీ ఫరూఖ్, తదితరులు పాల్గొన్నారు. ప్రజల ఇబ్బందులను తక్షణమే పరిష్కరించాలి బాపట్ల టౌన్: ప్రజల ఇబ్బందులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ భావన విశిష్ట తెలిపారు. ఎస్టీలు, విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమం శుక్రవారం కలెక్టరేట్లో జరిగింది. బాధితులతో మాట్లాడి వారి సమస్యలను స్వయంగా జాయింట్ కలెక్టర్ తెలుసుకున్నారు. వెంటనే పరిష్కరించాలని తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. వీరిని రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. పీజీఆర్ఎస్లో నమోదైన ప్రతి అర్జీని తక్షణమే పరిష్కరించాలన్నారు. డిసెంబర్ ఒకటో తేదీన పింఛన్ నగదు పంపిణీకి ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. ముందుగానే బ్యాంకుల నుంచి నగదు తీసుకొచ్చి సంబంధిత సిబ్బందికి అందించాలని సూచించారు. 7వైద్య కళాశాలల ప్రైవేటీకరణతోబాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలు విడిపోతున్నాయని డీఆర్ఓ జి.గంగాధర్ గౌడ్ తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన గజిట్ నోటిఫికేషన్ను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శనకు ఉంచాలన్నారు. ప్రభుత్వ ప్రకటనలు ప్రజలందరికీ తెలిసేలా అవగాహన కల్పించాలన్నారు. అలాగే ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఆర్డీఓ పి.గ్లోరియా, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. పార్టీల ప్రతినిధులకు ఆర్డీఓ సూచన అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2900 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 2000 క్యూసెక్కులు వదులుతున్నారు. నీటి నిల్వ 42.1600 టీఎంసీలు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశ య నీటిమట్టం శుక్రవారం 581.50 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 48,929 క్యూసెక్కుల వచ్చి చేరుతోంది. ఫిరంగిపురం: రేపూడి వ్యవసాయ మార్కెట్లో భద్రపరిచిన ఈవీఎం, వీవీ ప్యాట్స్ను ఆర్డీవో శ్రీనివాసరావు శుక్రవారం తనిఖీ చేశారు. -
వైఎస్సార్సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరి గణేష్
నగరం: కూటమి ప్రభుత్వ పాలనలో అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వైద్య విద్య ప్రైవేటీకరణతో పేదలు నష్టపోతారని వైఎస్సార్సీపీ రేపల్లె నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ఈవూరి గణేష్ పేర్కొన్నారు. మండలంలోని పూడివాడ గ్రామంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో శుక్రవారం రాత్రి డాక్టర్ ఈవూరి గణేష్ మాట్లాడారు. అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు అమలుకు నోచుకోని హామీలు ఇచ్చారన్నారు. ఇప్పడు వాటిని అమలు చేయకుండా ప్రజలను నట్టేట ముంచారని దుయ్యబట్టారు. మోసం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావాలని 7 మెడికల్ కళాశాలలను తీసుకొచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే చెందుతుందని పేర్కొన్నారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వలన పేదలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ పేరుతో పేద విద్యార్థులకు వైద్య విద్యను, పేదలకు వైద్య సేవలను దూరం చేస్తోందన్నారు. అయినవారికి దోచిపెట్టడానికి కుట్రలో భాగంగా ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇకనైనా ప్రభుత్వం తీరును మార్చుకుని కళాశాలల నిర్మాణం, నిర్వహణ బాధ్యత చేపట్టాలని డిమాండ్ చేశారు. పేదలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు సర్కారు తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ ఇంకోల్లు రామకృష్ణ, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి నిజాంపట్నం కోటేశ్వరరావు, నియోజకవర్గ బీసీ సెల్, దివ్యాంగుల విభాగం అధ్యక్షులు పాగోలు వెంకటేశ్వర రావు, బాలకృష్ణ, నాయకులు పృథ్వీ, జాలాది సునీల్, పోలిరెడ్డి, రవీంద్ర, సుబ్బారావు, రామిరెడ్డి, రామకృష్ణారెడ్డి, ప్రసన్న తేజ, సువర్ణరాజు తదితరులు పాల్గొన్నారు. -
నాసిరకం స్ప్రేయర్లు అంటగట్టి మోసం
జె.పంగులూరు: తమ కంపెనీ ఇచ్చే తైవాన్ స్ప్రేయర్లు నాణ్యమైనవని, చాలాకాలం మన్నికగా పనిచేస్తాయని, ధర కూడా తక్కువగా ఉంటాయని రైతులను నమ్మబలికి నాసిరకం అంటగట్టారు. అటు తరువాత రైతులకు కనబడకుండా, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా జై కిసాన్ ఆగ్రో పోడక్ట్స్ కంపెనీ వారు మోసం చేశారని రైతులు వాపోతున్నారు. రైతులకు నాణ్యమైన పట్టలు ఇస్తామని ఒక్కో పట్టకు రూ. 6 వేల చొప్పున ముందుగానే డబ్బు తీసుకొని ఉడాయించారని పేర్కొన్నారు. మండలంలోని అలవలపాడు గ్రామంలో సదరు కంపెనీ ప్రతినిధులు ఆరుగురు రైతుల వద్ద రూ.1,56,000 దోచుకొని వెళ్లిపోయారు. ఒక్కో తైవాన్ స్ప్రేయర్ రూ. 14 వేల చొప్పున రూ. 84 వేలు తీసుకొని నాశి రకానివి ఇవ్వడం వల్ల సరిగా పనిచేయడం లేదని రైతులు తెలిపారు. వీరి వద్దే ఒక్కో పట్టకు రూ. 6 వేల చొప్పున అందరి నుంచి రూ. 72 వేలు తీసుకున్నారు. మూడు నెలలు కావస్తున్నా ఇంతవరకు రైతులకు పట్టలు ఇవ్వలేదు. వారు ఇచ్చిన ఫోన్ నెంబర్లు ప్రకారం కంపెనీ మేనేజర్కు, టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోందని వాపోయారు. కంపెనీ వారు ఎక్కడ ఉన్నారో, వారిని ఎలా పట్టుకోవాలో అర్థంకాక ఆవేదన చెందుతున్నారు. ఒకవైపు పంటలు సక్రమంగా పండక.. పండిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఇలా కంపెనీల వారు మోసం చేయడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. నిందితులను శిక్షించాలని రైతులు, రైతు సంఘం బాపట్ల జిల్లా కార్యదర్శి తలపనేని రామారావు డిమాండ్ చేశారు. -
పోచంపల్లిని సందర్శించిన బాపట్ల చేనేత కార్మికులు
భూదాన్పోచంపల్లి: పోచంపల్లి ఇక్కత్ వస్త్ర తయారీ విధానాలు తెలుసుకునేందుకు ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాకు చెందిన 50 మంది చేనేత కార్మికులు శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిని సందర్శించారు. చేనేత సహకార సంఘం, కళా పునర్వీ హ్యాండ్లూమ్ యూనిట్ సందర్శించి మగ్గాలపై తయారవుతున్న వస్త్రాలు, టై అండ్ డై ఇక్కత్ డిజైన్లు, మార్కెటింగ్ వంటివి అడిగి తెలుసుకున్నారు. క్షేత్రపరిశీలనలో భాగంగా పోచంపల్లిని సందర్శించినట్లు బాపట్ల జిల్లా జౌళి శాఖ ఏడీ వెంకట్రావు, క్లస్టర్ డెవలప్మెంట్ ఆఫీసర్ వెంకటేశ్వర్రావు తెలిపారు. చేనేత వస్త్రాలను పరిశీలిస్తున్న కార్మికులు మగ్గాలను పరిశీలిస్తున్న చేనేత కార్మికులు -
ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడి మృతి
పిడుగురాళ్ల: అర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ ఓ ప్రయాణికుడు శుక్రవారం గుండెపోటుతో మృతి చెందాడు. గుంటూరు నుంచి మాచర్ల వెళ్తున్న ఆర్టీసీ అద్దె బస్సులో ప్రయాణిస్తున్న కాండ్రు శివప్రసాద్(69) పిడుగురాళ్ల పట్టణ సమీపానికి రాగానే ఒక్కసారిగా గుండెపోటుతో పడిపోయాడు. గమనించిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ పిడుగురాళ్ల పట్టణంలోని కళ్లం టౌన్షిప్ సమీపంలో బస్సు ఆపి చూసే సరికి అప్పటికే పరిస్థితి విషమించటంతో అంబులెన్స్కు సమాచారం అందించి బంధువులు హుటాహుటిన పట్టణంలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అప్పటికే శివప్రసాద్ మృతి చెందినట్లు తెలిపారు. ఈ సంఘటనపై పిడుగురాళ్ల ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటేశ్వర్లును వివరణ కోరగా పిడుగురాళ్ల బస్సు కాదని, మాచర్ల డిపోకు చెందిన అద్దె బస్సు గుంటూరు నుంచి మాచర్ల వెళుతుండగా ఈ సంఘటన జరిగినట్లు సమాచారం తెలిసిందన్నారు. -
పలు బ్యాంక్ ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన
నెహ్రూనగర్: అమరావతిలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం సీఎం చంద్రబాబునాయుడు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా బ్యాంక్ చైర్మన్ కె.ప్రమోద్కుమార్రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ బ్యాంక్కు రాష్ట్ర వ్యాప్తంగా 1,351 శాఖల ద్వారా ఒక కోటి ముఫ్పై లక్షల ఖాతాదారులకు నాణ్యతతో కూడిన బ్యాంకింగ్ సేవలను అందిస్తూ, రాష్ట్రంలో అగ్రగామి బ్యాంకుగా ఎదుగుతోందన్నారు. ప్రస్తుతం ప్రధాన కార్యాలయం గుంటూరు బ్రాడీపేటలో పనిచేస్తోందని, అమరావతిలో కేటాయించిన స్థలానికి నిర్మాణ అనుమతులు రాగానే నూతన భవన నిర్మాన పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అమరావతిలో సెంట్రల్ బ్యాంకు కార్యాలయానికి..తాడికొండ: అమరావతిలో సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా కోసం కేటాయించిన స్థలంలో భూమిపూజ, నిర్మాణానికి పనులు శుక్రవారం నిర్వహించారు. ఏపీ సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భూమి పూజ నిర్వహించారు. అనంతరం అమరావతిలో సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా కోసం కేటాయించిన భూమిలో బ్యాంకు ఎండీ, సీఈఓ కళ్యాణ్కుమార్, జోనల్హెడ్ దారా సింగ్నాయక్ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా వేద పండితులు భూమి పూజ నిర్వహించిన అనంతరం శంకుస్థాపన శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా అమరావతిలో మరింత విస్తరణకు, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఇది ఒక ప్రధాన అడుగుగా అభివర్ణించారు. కార్యక్రమంలో రీజనల్ హెడ్ విజయవాడ పి.సతీష్బాబు, కడప రీజనల్హెడ్ ఈ.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
గణపవరం మున్సిపాలిటీనా... పంచాయతీనా ?
నాదెండ్ల: పారిశ్రామిక కేంద్రంగా పేరొందిన గణపవరం మున్సిపాలిటీలో ఉన్నదా..గ్రామ పంచాయతీగా ఉన్నది తెలియక గ్రామస్తులు అయోమయంలో ఉన్నారు. . చిలకలూరిపేట పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గణపవరాన్ని మున్సిపాలిటీలో విలీనం చేస్తూ 2019లో గజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. న్యాయపరమైన, సాంకేతిక కారణాలతో అటు మున్సిపాలిటీలో విలీనం కాక, ఇటు పంచాయతీలో కొనసాగకపోవటంతో అభివృద్ధి నిలిచిపోయింది. పన్నుల రూపంలో వచ్చే నామమాత్రపు ఆదాయంతోనే గ్రామంలో పారిశుద్ధ్యం, తాగునీటి నిర్వహణ, పంచాయతీ సిబ్బంది జీతభత్యాలు చెల్లింపులు చేసుకుంటూ నెట్టుకొస్తున్నారు. విలీన ప్రక్రియను త్వరగా ఓ కొలిక్కి తేవాలని ప్రజలు కోరుతున్నారు. ఆరేళ్లుగా నిలిచిపోయిన నిధులు 1958లో గణపవరం గ్రామ పంచాయతీ ఏర్పడింది. 2019లో చిలకలూరిపేట మున్సిపాలిటీలో విలీనమైన అనంతరం కొన్ని నెలలు పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా మున్సిపల్ నిధులతో జరిగాయి. న్యాయస్థానం విలీన ప్రక్రియపై స్టే విధించటంతో మున్సిపాలిటీ నుండి రికార్డులు తిరిగి పంచాయతీకి చేరాయి. అప్పటి నుండి పంచాయతీకి రావలసిన ఆర్థిక సంఘం నిధులు, గ్రాంట్లు విడుదల కాలేదు. మున్సిపాలిటీ పరిధిలో నిధులు సైతం నిలిచిపోయాయి. ఆరేళ్లుగా 15వ ఆర్థికసంఘం నిధులు ఏడాదికి రూ.80 లక్షల చొప్పున, పాపులేషన్ గ్రాంట్ రూ.1.68 లక్షలు, వృత్తి పన్నులు రూ.2 లక్షలు, స్టాంపు డ్యూటీ రూ.25–30 లక్షలు నిలిచిపోయాయి. ఉపాధి సైతం ఆగిపోయాయి. తగ్గిన ఆదాయం గ్రామంలో సుమారు నలభై వరకూ చిన్న, పెద్ద తరహా పరిశ్రమలున్నాయి. ఏటా పంచాయతీకి ఆస్తి పన్ను రూపంలో భారీగా ఆదాయం సమకూరేది. ఏడాదికి రూ.82 లక్షలు ఆస్తి పన్ను డిమాండ్ ఉండగా, ఇందులో ఇంటిపన్ను రూ.27 లక్షలు, పరిశ్రమల పన్ను రూ.55 లక్షలుగా ఉంది. కరోనా అనంతరం పలు పరిశ్రమలు మూతపడటంతో పన్నుల చెల్లింపులో ఒడుదుడుకులు నెలకొన్నాయి. రూ.55 లక్షల డిమాండ్కుగాను రూ.30లక్షలు మాత్రమే వసూలు అవుతున్నాయి. ఏడాదికి రూ.57 లక్షలు ఆస్తి పన్నులు, నీటి కుళాయిల ఫీజు రూ.10 లక్షలు మాత్రమే పంచాయతీకి జమ అవుతున్నాయి. సిబ్బంది జీతభత్యాలకే ఏడాదికి రూ.78 లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. వీధిలైట్లు, బోరు రిపేర్లు, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, గ్రామసభల నిర్వహణ తదితర పనులకు పంచాయతీ నిధులు సరిపోవటం లేదు. నెలలు గడుస్తున్నా తేలని విలీన ప్రక్రియ ప్రభుత్వం నుంచి నిధులు బంద్ -
జాతీయ స్విమ్మింగ్ పోటీలకు ఎస్ఎస్ అండ్ ఎన్ విద్యార్థులు
నరసరావుపేట ఈస్ట్: జాతీయస్థాయి స్కూల్ గేమ్స్ అండర్–19 స్విమ్మింగ్ పోటీలకు శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల విద్యార్థులు కె.శివసాకేత్, కె.రుద్రపతాప్ సైదులురెడ్డి ఎంపికైనట్టు కళాశాల ప్రిన్సిపాల్ ఎం.ఎస్.సుధీర్, వ్యాయామ అధ్యాపకుడు యక్కల మధుసూదనరావు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విశాఖలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల స్విమ్మింగ్ పోటీలో శివసాకేత్ 200 మీటర్లు బటర్ఫై,్లరుద్రప్రతాప్ 4–100 మీటర్లు విభాగంలో ప్రతిభ చూపి రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారని వివరించారు. ఢిల్లీలో ఈనెల 30 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు జరగనున్న 69వ అండర్–19 జాతీయ స్కూల్గేమ్స్ స్విమ్మింగ్ చాంపియన్షిప్– 2025 పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. విద్యార్థులకు కళాశాల పాలకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు కపలవాయి విజయకుమార్, నాగసరపు సుబ్బరాయగుప్త, జాయింట్ సెక్రటరీ ఊటుకూరి వెంకట అప్పారావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.శ్రీనివాససాయి అభినందించారు. -
జాతీయ ఫెన్సింగ్ పోటీలకు కార్తికేయ ఎంపిక
వేటపాలెం: అంతర్ జిల్లాల ఫెన్సిలింగ్ పోటీలకు పందిళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి మేకపోతుల యతిన్ శ్రీ కార్తికేయ ఎంపికై నట్లు హెచ్ఎం దీప్తి శుక్రవారం తెలిపారు. కొనసీమ జిల్లాలో ఈ నెల 24, 25, 26 తేదీల్లో జరిగిన ఫాయిల్ వ్యక్తిగత విభాగంలో కార్తికేయ రాష్ట్రస్థాయిలో తృతీయ స్థానం సాధించాడని పేర్కొన్నారు. మహారాష్ట్రలో డిసెంబర్లో జరగనున్న ఎస్జీఎఫ్ నేషనల్ ఫెన్సింగ్ టీం ఈవెంట్కు రాష్ట్రం తరఫున అడనున్నాడని తెలిపారు. విద్యార్థిని కోచ్ చిరంజీవి, పీడీ నాగేశ్వరరవు, పీడీ వెంకటేశ్వర్లు, సెక్రటరీ బి. మోహన్రావు అభినందించారు. కొత్త గోరంట్ల దేవాలయంలో చోరీ సత్తెనపల్లి: దేవాలయంలో చోరీ జరిగిన సంఘటన సత్తెనపల్లి మండలం కొత్త గోరంట్ల గ్రామంలో శుక్రవారం వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. కొత్త గోరంట్ల గ్రామంలోని శివారున పొలాల సమీపంలో ఉన్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య దేవస్థానంలో గుర్తు తెలియని దుండగులు తలుపు పగలగొట్టి రెండు పంచలోహ విగ్రహాలను, రూ.10 వేల నగదు అపహరించుకుపోయారు. ప్రతి శుక్రవారం, ఆదివారం దేవాలయాన్ని శుభ్రపరిచేందుకు వచ్చిన నంబూరు ఏడుకొండలు తలుపు పగలగొట్టి ఉండడాన్ని గమనించి లోపల పరిశీలించాడు. రెండు పంచలోహ విగ్రహాలు, రూ.10 వేలు నగదు అపహరణకు గురైనట్లుగా గుర్తించి సత్తెనపల్లి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆటో ఢీకొని వృద్ధురాలి మృతి రేపల్లె: ఆటో ఢీకొని వృద్ధురాలు మృతి చెందిన సంఘటన మండలంలోని రుద్రవరం వద్ద చోటు చేసుకుంది. పట్టణ సీఐ మల్లికార్జునరావు వివరాల మేరకు.. తోమాటి సామ్రాజ్యం (80) రుద్రవరం వద్ద పండ్లు అమ్ముకుంటూ రహదారిపై వస్తుండగా ఎదురుగా వస్తున్న ఆటో శుక్రవారం ఢీకొంది. దీంతో ఆమె కుప్పకూలిపోయింది. రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. -
పోలీస్ సిబ్బంది సమస్యలకు తక్షణ పరిష్కారం
నగరంపాలెం (గుంటూరు వెస్ట్) : పోలీస్ సిబ్బంది సమస్యలకు నిర్ణీత వేళల్లో పరిష్కారం చూపుతామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయం (డీపీఓ) శుక్రవారం పోలీస్ సిబ్బంది గ్రీవెన్స్ డే నిర్వహించారు. వ్యక్తిగత, సర్వీస్, బదిలీలు, పరిపాలనా సమస్యలపై వినతులు అందించారు. పదిహేను మంది వినతులు అందించగా, వారి సమస్యలను జిల్లా ఎస్పీ అలకించారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదు నిర్ణీత వేళలో పరిష్కారమయ్యేలా దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. పోలీస్ సిబ్బంది సంక్షేమం కోసం అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన చెప్పారు. -
వర్సిటీ పురుషుల వాలీబాల్ జట్టు ఎంపిక
నరసరావుపేట ఈస్ట్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పురుషుల వాలీబాల్ జట్టు ఎంపిక చేసినట్టు కృష్ణవేణి కళాశాల ప్రిన్సిపాల్, వర్సిటీ అంతర్ కళాశా లల పురుషుల వాలీబాల్ టోర్నమెంట్ చైర్మన్ నాతాని వెంకటేశ్వర్లు తెలిపారు. కళాశాలలో శుక్రవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూడు రోజులుగా కళాశాలలో నిర్వహించిన టోర్నమెంట్లో క్రీడాకారుల ఆట తీరు, ఫిట్నెస్, నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకొని 14 మందితో జట్టును సెలక్షన్ కమిటీ ఎంపిక చేసినట్టు వివరించారు. జట్టులో ఐ.కళ్యాణ్కుమార్, ఏ.ఉమామహేశ్వరరావు, ఎం.మణికంఠ, జె.నితిన్కుమార్ (కృష్ణవేణి డిగ్రీ కళా శాల, నరసరావుపేట), బి.మనోజ్, పి.శ్రీను, సీహెచ్.కోటి, వి.శంకర్ (వర్సిటీ వ్యాయామ కళాశాల, ఏఎన్యూ), బి.విజయ్కుమార్రెడ్డి, డి.బాలరెడ్డి (బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, బాపట్ల), షేక్.ఉస్మాన్ (ధనలక్ష్మీ వ్యాయామ కళాశాల, ముప్పాళ్ల), కె.శేఖరబాబు ( ఏిపీఆర్డీసీ, నాగార్జునసాగర్), బి.వెంకటేష్ (కేబీఆర్ కళాశాల, నరసరావుపేట), వై.అశోక్బాబు, (వేద ఫార్మసీ కళాశాల) ఎంపికయ్యారు. స్టాండ్బైగా వై.కుమార్, ఎన్.సబీర్, సయ్యద్ అబ్బాస్, కె.భానుప్రకాష్ను ఎంపిక చేసినట్టు తెలిపారు. ఎంపికై న జట్టు డిసెంబర్ 10 నుంచి 14వ తేదీ వరకు జేఎన్టీయూ కాకినాడలో నిర్వహించనున్న సౌత్ జోన్ అంతర్ విశ్వవిద్యాలయాల టోర్నమెంట్లో ఏఎన్యూ కు ప్రాతినిధ్యం వహిస్తుందని వివరించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ కోమటినేని నాసరయ్య, సెలక్షన్ కమిటీ సభ్యులు డాక్టర్ పి.గౌరీశంకర్, డాక్టర్ పి.శ్రీనివాసరావు, జె.ప్రేమ్కుమార్, వర్సిటీ పరిశీలకుడు డాక్టర్ డి.సూర్యనారాయణరావు, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఎంఆర్కే సతీష్బాబు, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈదర ఆదిబాబు పాల్గొన్నారు. -
జాతీయ స్థాయి సైక్లింగ్ పోటీలకు ఐదుగురు ఎంపిక
తూములూరు(కొల్లిపర): ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విజయవాడ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల నున్నలో అండర్– 19, 14 విభాగాల్లో రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలు నిర్వహించారు. తూములూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు ప్రధానోపాధ్యాయురాలు కె.నాగలక్ష్మి శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా గెలుపొందిన విద్యార్థ్ధులను పాఠశాలలో పీడీ ఎస్.సాంబశివరావు, పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్, ఉపాధ్యాయులు అభినందించారు. -
24 గంటలు అందుబాటులో ఉంటాం
గుంటూరు మెడికల్: ప్రభుత్వ వైద్యుల సమస్యల పరిష్కారం కోసం 24 గంటలు అందుబాటులో ఉంటానని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘం (ఏపీజీడీఏ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ డి.జయధీర్బాబు చెప్పారు. శుక్రవారం గుంటూరు కన్నావారితోట 4వ లైనులో ఏపీజీడీఏ సెంట్రల్ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, కర్నూలు మెడికల్ కాలేజ్ ఈఎన్టీ రిటైర్డ్ హెచ్ఓడీ డాక్టర్ మహేంద్ర ముఖ్య అతిథులుగా పాల్గొని, కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ జయధీర్బాబు మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయాక పదేళ్ల అనంతరం గుంటూరులో సంఘ కార్యాలయాన్ని నూతనంగా ఏర్పాటు చేశామన్నారు. వైద్యుల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తున్నామని వివరించారు. ● ముఖ్య అతిథి బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ డాక్టర్ జయధీర్ వైద్యుల సమస్యలపై చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్నారని తెలిపారు. వైద్యుల సమస్యలపై పోరాటానికి తమ జేఏసీ అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బి.రమేష్కుమార్, కోశాధికారి డాక్టర్ పి.జె.శ్రీనివాస్, పలు జిల్లాలకు చెందిన నేతలు, గుంటూరు జిల్లా నేతలు పాల్గొన్నారు. -
డిసెంబర్ 7న భౌతికశాస్త్ర ఉపాధ్యాయులకు శిక్షణ
గుంటూరు ఎడ్యుకేషన్: జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న భౌతికశాస్త్ర ఉపాధ్యాయులకు డిసెంబర్ 7న శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ లక్ష్మణరావు తెలిపారు. శుక్రవారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో శిక్షణ తరగతుల పోస్టర్లు ఆవిష్కరించారు. ఈసందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ బ్రాడీపేట 2/6లోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఉదయం 9.30 గంటల నుంచి జరగనున్న శిక్షణ తరగతులకు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని భౌతికశాస్త్ర ఉపాధ్యాయులు హాజరు కావాలని కోరారు. రాష్ట్ర స్థాయి సబ్జెక్టు నిపుణులైన ఆర్.శివనాగేశ్వరరావు, కె.కృష్ణసాయి, బుద్దా శ్రీనివాస్, ఆగస్థ్య ఫౌండేషన్ ప్రతినిధి నరేష్బాబు రీసోర్స్ పర్సన్లుగా వ్యవహరిస్తారని తెలిపారు. శిక్షణ తరగతులకు హాజరు కానున్న ఉపాధ్యాయులు 83099 65083, 90004 53600, 97035 79996 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో జేవీవీ ప్రతినిధులు టి.జాన్బాబు, బి.ప్రసాద్, టీఆర్ రమేష్, ఎస్ఎం సుభానీ, గురవయ్య, ఇ. అనిల్కుమార్, షేక్ రెహ్మాన్, జి.శివపూర్ణయ్య పాల్గొన్నారు. -
డ్వాక్రా నిధుల గోల్మాల్పై విచారణ
తెనాలి రూరల్: డ్వాక్రా గ్రూపునకు సంబంధించి బ్యాంకులో నెల నెలా చెల్లించాల్సిన నగదు పూర్తిగా జమ కాకపోవడం, సుమారు రూ. 8 లక్షలు పైగా అవకతవకలు జరగడంపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తెనాలి నందులపేట కవిరాజ పార్కు ప్రాంతంలోని ఓ డ్వాక్రా గ్రూపునకు మూడేళ్లగా క్రితం రూ. 15 లక్షల రుణం మంజూరైంది. సభ్యులందరూ ప్రతి నెల క్రమం తప్పకుండా 36 నెలల పాటు వాయిదాలు చెల్లించుకుంటూ వచ్చారు. అక్టోబరుతో వాయిదాల గడువు ముగియడంతో తమకు రావాల్సిన పొదుపు మొత్తం గురించి వాకబు చేయగా బ్యాంకుకు ఇంకా రూ.8 లక్షలు చెల్లించాల్సి ఉందని సభ్యులకు తెలిసింది. దీంతో అవాకై ్కన సభ్యులు జిల్లా కలెక్టరుకు, డీఎస్పీకి, సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై బుధవారం రాత్రి టూ టౌన్ పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు విచారిస్తున్నారు. మేడికొండూరు: జాతీయస్థాయి హాకీ పోటీలకు మేడికొండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థిని చిరతనగండ్ల అనూష ఎంపికై నట్లు పాఠశాల హెచ్ఎం కె.జయప్రద తెలిపారు. ఈనెల 22 నుంచి 24 వరకు చిత్తూరు జిల్లా చంద్రగిరిలో జరిగిన స్కూల్ గేమ్స్లో అండర్–14 రాష్ట్రస్థాయి పోటీలలో ఉమ్మడి గుంటూరు జిల్లా తరఫున హాకీ పోటీలలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ంది. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జరిగే జాతీయస్థాయి హాకీ పోటీలలో విద్యార్థిని పాల్గొంటారని వ్యాయామ ఉపాధ్యాయులు టి.వాణి సునీల, కె.బాలకృష్ణ తెలిపారు. అనూషను గ్రామ సర్పంచ్ పూల నాగమణి, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ షేక్ ఆదాం ఉపాధ్యాయులు అభినందించారు. -
బైక్ను ఢీ కొన్న లారీ.. ఒకరి మృతి
మేదరమెట్ల: తిమ్మనపాలెం గ్రోత్ సెంటర్ నుంచి బల్లికురవకు వెళుతున్న లారీ ముందు వెళుతున్న మోటారు బైక్ను ఢీ కొన్న సంఘటన కొరిశపాడు మండలంలోని మేదరమెట్ల కొండసమీపంలో జాతీయ రహదారిపై గురువారం చోటు చేసుకుంది. ముందు వెళుతున్న బైక్ను వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొనడంతో బైక్పై ఉన్న ఒకరు రోడ్డుపై పడిపోయాడు. దీంతో రోడ్డుపై పడిన వ్యక్తిపై నుంచి లారీ వెనుక చక్రాలు వెళ్లడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్పై ఉన్న మరో వ్యక్తి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. సమాచారం తెలుసుకున్న మేదరమెట్ల ఎస్సై మహ్మద్ రఫీ సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలను సేకరించి లారీని అదుపులోకి తీసుకున్నారు. మృతుడి వయస్సు సుమారు 25 సంవత్సరాలు ఉంటుందని వివరాలు తెలియరాలేదని, కేసు నమోదు చేసి మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. -
బాపట్ల
శుక్రవారం శ్రీ 28 శ్రీ నవంబర్ శ్రీ 2025గీతా జ్ఞాన కర్పూర యజ్ఞం భట్టిప్రోలు: బ్రహ్మ విద్యాశ్రమంలో 51వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం గీతా జ్ఞాన కర్పూర యజ్ఞం నిర్వహిస్తున్నట్లు అధ్యక్షురాలు బూర్లె అరుణ కుమారి తెలిపారు. పులిచింతల సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2100 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, దిగువకు రెండు వేల క్యూసెక్కులు వదులుతున్నారు. సాగర్ నీటిమట్టం విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటి మట్టం గురువారం 582.00 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 15,272 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. 7 -
మెరుగైన వైద్య సేవలందించాలి
కర్లపాలెం: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య ఆరోగ్య జిల్లా డేటా మేనేజర్ ఎన్.లక్ష్మణ్ చెప్పారు. గురువారం వైద్య ఆరోగ్య శాఖ టాస్క్ఫోర్స్ బృందం పెదపులుగువారిపాలెంలోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని, స్థానిక ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ గ్రామస్తులకు అంటువ్యాధులపై అవగాహన కల్పించాలని చెప్పారు. విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై పౌష్టికాహార ఆవశ్యకతను తెలియజేయాలన్నారు. గ్రామంలో ఎంతమంది గర్భిణులు ఉన్నారు, వారికి అందుతున్న వైద్య సేవలను ఆరోగ్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా డేటా సర్వేలెన్స్ ఆఫీసర్ డాక్టర్ లోకేష్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మల్లికార్జున్, సీహెచ్వో స్వరూపారాణి, ఏఎన్ఎం తిరుపతమ్మ, ఆశా కార్యకర్తలు తదితరులు ఉన్నారు. బల్లికురవ: అగ్రహారం భూములు సాగు చేస్తున్న రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా చేయూతనిచ్చినట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. గురువారం సాయంత్రం చెన్నుపల్లి, అంబడిపూడి, మల్లాయపాలెం, కొప్పరపాలెం గ్రామాల్లో రైతన్న మీకోసం కార్యక్రమంలో మాట్లాడారు. వ్యవసాయానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి వివరించారు. కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు స్థానిక నేతలు పాల్గొన్నారు. నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణకు సంబంధించిన దరఖాస్తులు డిసెంబర్ 3వ తేదీ వరకు పొడిగించడం జరిగిందని ఏపీ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె.మయూరి గురువారం ఓ ప్రకటనలో తెలియజేశారు. అర్హత కలిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన అభ్యర్థులు ఈ నెల 3వ తేదీలోగా రాజాగారితోట, గుంటూరులోని కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. -
ధాన్యం సేకరణ ప్రక్రియలో వేగం పెంచాలి
49.56 శాతం పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ రాష్ట్ర సచివాలయంలోని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి గురువారం ఎలక్టోరల్ రోల్స్, ఓటర్ మ్యాపింగ్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – 2026 కోసం సన్నాహక కార్యకలాపాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ 49.56 శాతం పూర్తి చేశామన్నారు. డీఆర్ఓ జి.గంగాధర్ గౌడ్ పాల్గొన్నారు. నేడు దివ్యాంగులకు పీజీఆర్ఎస్ జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులు, గిరిజనులకు ప్రత్యేకంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రతి నెల చివరి శుక్రవారం ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. యర్రం చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకం వినియోగంలోకి రావాలంటే భూ సేకరణ తప్పనిసరిగా జరగాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశం హాల్లో రైతులతో ఆయన సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నిబంధనలు అనుసరించి రైతులకు మేలు చేయడానికే యంత్రాంగం ఉందన్నారు. 340.23 ఎకరాల భూ సేకరణ పెండింగ్లో ఉందన్నారు. కొరిశపాడు మండలం పమిడిపాడు గ్రామం పరిధిలో భూ సేకరణకు 2011లోనే అధికారికంగా ప్రకటన జారీ అయ్యిందన్నారు. 2013 భూ సేకరణ చట్టం ఆధారంగా నష్ట పరిహారం ఇవ్వాలని రైతులు కోర్టును ఆశ్రయించడంతోనే పెండింగ్లో ఉందన్నారు. రైతుల అభిప్రాయాలను సేకరించి నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించిందన్నారు. ఆ మేరకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. సబ్కలెక్టర్ విజయ జ్యోతికుమారి, రైతులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ -
‘కొమ్మోజీ’కి స్వల్ప గాయాలు
కారంచేడు: యూటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొమ్మోజీ శ్రీనివాసరావుకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. గురువారం ఆయన ఒంగోలు నుంచి కారంచేడు మండలంలోని స్వగ్రామమైన జరుబులవారిపాలెంలో తల్లిదండ్రుల వద్దకు వచ్చారు. అక్కడి నుంచి ఆయన తన కారులో బాపట్లలో జరగనున్న జిల్లా కౌన్సిల్ సమావేశానికి హాజరవుతున్న తరుణంలో ప్రమాదం జరిగింది. ఆయన కారు కేశవరప్పాడు–స్వర్ణ గ్రామా ల మధ్య నాలుగు రోడ్ల కూడలి దాటిన తరువాత అదుపుతప్పి రోడ్డు పక్కన కాలువలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఆయన పక్కటెముకలకు గాయాలయ్యాయి. కారు పూర్తిగా దెబ్బతింది. స్థానిక యూటీఎఫ్ నాయకులు భవనం శ్రీనివాసరెడ్డి, పావులూరి శ్రీనివాసరావు, రావి పద్మావతి మరికొంత మంది సహకారంతో ఆయనను చీరాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేసిన వైద్యులు ప్రమాదం లేదని చెప్పారు. విషయం తెలిసిన వెంటనే యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు, జనవిజ్ఞానవేదిక రాష్ట్ర కార్యదర్శి కుర్రా రామారావు, చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లోని పలువురు ఉపాధ్యాయులు వచ్చి పరామర్శించారు. అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన కారు -
ఇక కౌలుకోలేం..!
రాష్ట్రంలో కౌలుదారు కార్డుల జారీలో సమస్యల వలన అసలైన రైతులకు న్యాయం జరగటం లేదు. కార్డుల జారీని ప్రభుత్వం సరళతరం చేయాలి. పంట బీమా రైతులకు అదనపు భారంగా మారకుండా ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలి. పభుత్వం కౌలు రైతులను ఆదుకోవాలి. – పి. కొండయ్య, బాపట్ల జిల్లా కౌలు రైతు సంఘం కార్యదర్శి మార్టూరు: ‘కౌలు రైతుకు మొదటి విడత అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ యోజన పథకం కింద రూ.7 వేలు ఇవ్వలేకపోతున్నాం. రెండో విడత పంపిణీలో రెండు కిస్తీలు కలిపి రూ.14 వేలు రాష్ట్రంలోని ప్రతి కౌలు రైతు బ్యాంకు ఖాతాలో జమ చేస్తా...’ – ఇదీ మొదటి విడత నగదు పంపిణీ సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మాట. ఈ ప్రకటన వింటే కౌలు రైతులపై చంద్రబాబుకు ఎంత ప్రేమో అనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఆయన ఏం చెప్పినా మాటల్లోనే తప్ప చేతల్లో శూన్యమని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే తెలుస్తుంది. పెట్టుబడి సాయంతోపాటు మోంథా తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన కౌలు రైతులకు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. పంట బీమాలోనూ మొండిచేయి గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 85 లక్షల మంది రైతులకు ప్రభుత్వమే బీమా కంపెనీలకు ప్రీమియం చెల్లించి పంట బీమా చేయించింది. ఈ కారణంగా ప్రకృతి వైపరీత్యాల వలన నష్టపోయిన వారు పరిహారంతో ఊపిరి పీల్చుకోగలిగారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చంద్రబాబు ప్రభుత్వం బీమా మొత్తాన్ని రైతులే చెల్లించుకోవాలని పేర్కొంది. గత సంవత్సరం వచ్చిన తుఫాన్ కారణంగా ఇవ్వాల్సిన నష్టపరిహారమే ఇంతవరకు అందలేదు. అలాంటి సమయంలో రైతులకు బీమా ప్రీమియం అదనపు భారమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఏడు వేల మంది రైతులు మాత్రమే బీమా చేసుకోగలిగారు. ఇటీవల తుఫాన్ వలన తీవ్రంగా నష్టపోయిన రైతులకు బీమా పరిహారం అందే పరిస్థితి లేదు. కన్నీటి పాలైన శ్రమ బాపట్ల జిల్లాలో సుమారు రెండు లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. ప్రతి నియోజకవర్గానికి 30 వేల మందికి కాగా, వీరికి కౌలుదారు కార్డుల జారీలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. లక్ష మందికి కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నా జిల్లాలోని 25 మండలాలకుగాను ఓ మండలానికి సగటున 300 కార్డులు కూడా ఇవ్వలేదు. మార్టూరు మండలంలో 3,200 కార్డులు లక్ష్యం కాగా, 796 మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. అవీ ఎక్కువగా పచ్చ పార్టీ వారికే ఇవ్వడం గమనార్హం. కార్డుల్లేని రైతులు ఈ– క్రాప్ బుకింగ్ చేయలేక పంట బీమాకు దూరమయ్యారు. సంక్షేమ పథకాలూ అందడం లేదు. బ్యాంకు రుణాలు ఇవ్వడం లేదు. ఇటీవల మార్టూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ పర్చూరు నియోజకవర్గంలోని 37,861 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.25.83 కోట్లు జమ చేశానని ఆర్భాటంగా ప్రచారం చేసుకోవటం గమనార్హం. 70 శాతం భూములు కౌలు రైతులే సాగు చేస్తున్న పరిస్థితిలో నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరగలేదని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. కౌలు రైతుల బ్యాంకు ఖాతాలో రెండు విడతల నగదు జమ చేస్తానని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ఏమైందని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం కౌలు రైతులను ఆదుకోవాలన్నారు. సొంతమైన 60 సెంట్లతోపాటు గ్రామానికి చెందిన ఓ రైతు నుంచి రెండు ఎకరాలు కౌలుకు తీసుకున్నాం. మినుము పంట సాగు చేశా. తుఫాన్ కారణంగా రూ.30 వేల వరకు నష్టం వాటిల్లింది. కౌలుదారు కార్డు ఉన్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనం అందలేదు. ప్రభుత్వం కౌలు రైతులను ఆదుకోవాలి. ఇచ్చిన హామీలను నిలుపుకోవాల్సిన అవసరం ఉంది. – కుక్కపల్లి లీలావతి, రైతు, బొల్లాపల్లితొమ్మిది ఎకరాలు కౌలుకు తీసుకొని ఆరు ఎకరాల్లో మినుము సాగు చేశా. తుఫాన్ కారణంగా రూ.1.20 లక్షలు నష్టం వాటిల్లింది. కౌలుదారు కార్డు అధికారులు ఇచ్చారు. ప్రభుత్వపరంగా ప్రయోజనం అందలేదు. కౌలు రైతుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపకూడదు. పథకాలన్నీ అందరికీ అందించాలి. ముఖ్యంగా కౌలురైతులను ఆదుకోవాలి. – జీడిమళ్ల ఆంజనేయులు, కౌలు రైతు, బొల్లాపల్లి రైతుల సంక్షేమం కోసం ఎంతో చేస్తున్నట్లు ఇటీవల రైతన్నా.. నీకోసం అంటూ చంద్రబాబు ప్రభుత్వం కొత్త ప్రచారం మొదలుపెట్టింది. రైతులకు ఏదో చెప్పాలని చేస్తున్న ప్రయత్నం ఆదిలోనే బెడిసికొట్టడం గమనార్హం. రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ గత సోమవారం సంతమాగులూరు మండలం కొమ్మాలపాడులో నిర్వహించిన కార్యక్రమంలో రైతులు తమకు అన్నదాత సుఖీభవ వంటి సాయం అందటం లేదంటూ ప్రశ్నించారు. మండలాల్లో అధికారులు, వ్యవసాయ శాఖ సిబ్బంది పరిస్థితి కూడా ఇదేవిధంగా ఉంది. మొక్కుబడిగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అధికారులే చెప్పటం గమనార్హం. -
నేడు కేంద్ర ఆర్థిక మంత్రి రాక
తాడికొండ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం రాజధానికి రానున్నారు. ఈ నేపథ్యంలో భద్రత, బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్లు తెలిపారు. తుళ్లూరు పరిధిలోని నేలపాడు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం 15 జాతీయ బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిర్మాణం కోసం కేటాయించిన భూమిలో శంకుస్థాపన కార్యక్రమం శుక్రవారం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ ఏర్పాట్లను వారు పరిశీలించారు. కేంద్ర మంత్రి శంకుస్థాపన కార్యక్రమం అనంతరం ఏపీ సీఆర్డీఏ కాన్ఫరెన్స్ హాల్లో పలు శాఖల అధికారులతో నిర్వహించనున్న ఉన్నత స్థాయి సమీక్షా సమావేశానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో కలిసి హాజరు కానున్నారని అధికారులు తెలిపారు. తెలుగు మహాసభలకు ఆహ్వానం గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరు నగరంలో జరగనున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహను ఆహ్వానించినట్లు పరిషత్తు అధ్యక్షుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ తెలిపారు. గురువారం జస్టిస్ శ్రీ నరసింహను ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిసిన గజల్ శ్రీనివాస్ ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాసభల ప్రారంభోత్సవానికి సతీసమేతంగా వచ్చేందుకు న్యాయమూర్తి అంగీకరించారని తెలిపారు. పీజీ పరీక్షల షెడ్యూల్లో మార్పులు ఏఎన్యూ (పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరీక్షల విభాగం ఆధ్వర్యంలో జరగనున్న పీజీ పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేపట్టినట్లు గురువారం పరీక్షల నిర్వహణ అధికారి శివప్రసాదరావు తెలిపారు. ఏఎన్యూలో స్పాట్ అడ్మిషన్లు జరగకుండానే మొదటి సెమిస్టర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ ప్రకటించిన సీఈఓ పేరుతో ఈ నెల 26వ తేదీన సాక్షిలో కథనం వెలువడింది. దీంతో సీఈఓ ఆలపాటి మాట్లాడుతూ అన్ని పరీక్ష పేపర్లకు ఫీజు రూ.980 చొప్పున డిసెంబర్ 1వ తేదీలోగా చెల్లించాలన్నారు. పరీక్షలు డిసెంబర్ 8వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ప్రకటించిన నోటిఫికేషన్ రద్దు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సూచన మేరకు పీజీ పరీక్షలు జరిగే తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. ఫైరింగ్ సమయంలో వేటకు వెళ్లొద్దు బాపట్ల టౌన్: ఎయిర్ఫోర్స్ అధికారులు ఫైరింగ్ చేసే సమయంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని బాపట్ల డీఎస్పీ జి.రామాంజనేయులు తెలిపారు. గురువారం బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... బాపట్ల మండలం సూర్యలంక, పాండురంగాపురం గ్రామాల్లో మత్స్యకారులు ఈ నెల 28 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు వేటకు వెళ్లరాదన్నారు. సూర్యలంక ఎయిర్ఫోర్స్ నుంచి మిసైల్ ఆపరేషన్ జరుగుతుందని వివరించారు. -
రాష్ట్రస్థాయి జూడో పోటీలకు ఎంపిక
కారంచేడు: ఈ నెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సత్యసాయి జిల్లా చిగిచెర్లలో జరగనున్న రాష్ట్ర స్థాయి జూడో పోటీలకు కారంచేడు విద్యార్థులు ముగ్గురు ఎంపికై నట్లు పీడీ షేక్ మస్తానీ పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రమైన కారంచేడులోని యార్లగడ్డ నాయుడమ్మ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో వివరాలను తెలిపారు. పాఠశాలకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థులు కె. వెంకటలక్ష్మి, కె. మహేశ్వరితో పాటు, ఆరో తరగతి చదువుతున్న కె. మానస అండర్ 14 బాలికల విభాగంలో ఎంపికయ్యారన్నారు. కొత్తపట్నం గమల్లపాలెం ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో వీరు విజయం సాధించారని తెలిపారు. అలాగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికకావడంపై ఎంఈఓ ఎంవీ సత్యన్నారాయణ, మొలబంటి వెంకటేశ్వర్లు, హెచ్ఎం ఎం. సాంమ్రాంజ్య అభినందించారు. రాష్ట్రస్థాయిలో విజయం సాధించి పాఠశాలకు, కారంచేడు గ్రామానికి కూడా పేరు తీసుకురావాలని ఉపాధ్యాయులు ఆకాంక్షించారు. గుంటూరు మెడికల్: బీజేపీ కిసాన్ మోర్చా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వై.వి.సుబ్బారావును నియమిస్తూ పార్టీ రాష్ట్రకార్యవర్గం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీలో 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న తనను గుర్తించి, తనకు కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించిన కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కుమార స్వామికి సుబ్బారావు కృతజ్ఞతలు తెలిపారు నిబద్ధత, నిజాయితీతో నిర్వర్తించి రైతుల సమస్యల పరిష్కారానికి అంకితంమవుతానని తెలిపారు. -
యూనివర్సిటీ గేమ్స్ టెక్నికల్ అఫీషియల్గా శ్రావణి
వేటపాలెం: ఖేలో ఇండియా యూనివర్శిటీ గేమ్స్కు టెక్నికల్ అఫీషియల్గా వేటపాలెం హైస్కూల్ పీఈటీ శ్రావణి ఎంపికై నట్లు ఇన్చార్జి హెచ్ఎం ఉమ్మిటి వేణుగోపాలరావు గురువారం తెలిపారు. హెచ్ఎం మాట్లాడుతూ విశ్వ విద్యాలయ క్రీడలను ప్రోత్సహించే నిమిత్తం భారత ప్రభుత్వం 2020 నుంచి దేశంలోని యూనివర్శిటీ క్రీడాకారులకు వివిధ జాయతీ స్థాయి ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐదో ఖేలో ఇండియా యూనివర్శిటీ గేమ్స్ ఈ నెల 24 నుంచి డిసెంబరు 25 వరకు రాజస్థాన్ రాష్ట్రంలో నిర్వహించనున్నారని తెలిపారు. అందులో భాగంగా డిసెంబర్ 1 నుంచి 5వ వరకు రాజస్థాన్లోని బికనీర్లో నిర్వహించే విశ్వవిద్యాలయ స్థాయి కబడ్డీ పోటీలకు పీఈటీ జరుబుల శ్రావణి టెక్నికల్ అఫిషయల్గా ఎంపికై నట్లు తెలిపారు. పీఈటీ సహా ఉపాధ్యాయులు అభినందించారు. -
వైద్య ఆరోగ్య శాఖ విధులకు హాజరుకారు
సచివాలయ ఏఎన్ఎంలు గుంటూరు మెడికల్: సచివాలయ ఏఎన్ఎంలకు కేవలం వైద్య ఆరోగ్య శాఖ విధులకు పరిమితం చేసేవరకు వారు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి విధులకు హాజరుకారని ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు తెలిపారు. పలువురు సచివాలయ ఏఎన్ఎంలు ఏపీ ఎన్జీఓ నేతలను కలిసి తమ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా ఘంటసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించిన ఏఎన్ఎంలకు ఇతర విధులు అప్పజెప్పకూడదనే స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ వాటి అమలులో విఫలమవుతున్నట్లు వెల్లడించారు. ఏఎన్ఎంల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు తాము అండగా ఉంటామన్నారు. గుంటూరు అర్బన్ సచివాలయాల పరిధిలోని ఏఎన్ఎంలు వారి విభాగంలోని విధులనే కాకుండా, మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన అనేక సర్వేలు నిర్వహించాలని మున్సిపల్ అధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు వెల్లడించారు. ఏఎన్ఎంలపై ఒత్తిడి తగ్గించడానికి డీఎంహెచ్ఓ జోక్యం చేసుకుని కేవలం వైద్య ఆరోగ్య శాఖకు చెందిన విధులు మాత్రమే ఏఎన్ఎంలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని పలుమార్లు విన్నపా లు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఈనేపథ్యంలో శుక్రవారం నుంచి సచివాలయ ఏఎన్ఎంలు వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించిన విధులకు హాజరు కారని ఘంటసాల శ్రీనివాసరావు వెల్లడించారు. అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఆరాధ్యుల శ్యామ్సుందర శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ నాగూర్ షరీఫ్, నగర అధ్యక్షుడు ఎస్.పి.ఎస్.సూరి, కార్యదర్శి సి.హెచ్.కళ్యాణ్కుమార్, శ్రీధర్రెడ్డి, కృష్ణకిషోర్, అబ్దుల్ కరీం, శేషగిరిరాజు, పలువురు ఏఎన్ఎంలు పాల్గొన్నారు. పీఆర్సీ కమిటీ త్వరగా ఏర్పాటు చేయాలి గుంటూరు మెడికల్: పీఆర్సీ కమిటీ త్వరగా ఏర్పాటు చేయాలని ఈహెచ్ఎస్ ద్వారా క్యాష్లెస్ ట్రీట్మెంట్ జరగాలని ఏపీ ఎన్జీజీవో కార్యవర్గం తీర్మానించింది. ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు -
తూకం... మోసం.. !
నరసరావుపేట టౌన్: వంట గదిలో ఉప్పు, పప్పు, కూరగాయలు ఇలా ఏ సరుకులు కావాలన్నా పక్కనే ఉన్న చిల్లర దుకాణం నుంచి లేదా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో కొనుగోలు చేస్తుంటాం. కొందరు పావు కిలో, కిలో ఇలా స్థోమత మేరకు సరుకులు తెచ్చుకుంటారు. ఇంకాస్త ఆర్థిక వెసులుబాటు ఉన్న వారు ఒకేసారి నెలకు సరిపడా సరుకులు కొనుగోలు చేస్తారు. ఇలా ప్రతి నెలా మధ్య తరగతి కుటుంబానికి సుమారు రూ.3 వేలు నుంచి రూ.5 వేలు ఖర్చవుతుంది. అయితే ఇలా మనం తెచ్చుకునే సరుకుల కొలత కళ్లతో చూసిందే నిజం అని నమ్ముతుంటాం. కానీ మన కళ్లను ఏమార్చి తూకాన్ని మార్చి జేబులు గుల్ల చేస్తున్నారు. 5 కిలోల సరుకు 7.50 కిలోలట.. నరసరావుపేటలో తూనికలు, కొలతల శాఖ అధికారి జె. సాయి శ్రీకర్ గత ఆదివారం స్థానిక చేపల మార్కెట్ను తనిఖీ చేశారు. అక్కడ ఐదు కేజీల చేపలు తూకం వేస్తే 7.50 కేజీలు చూపించాయి. దీంతో వచ్చిన అధికారులతోపాటు ప్రజలు కూడా అవాక్కయ్యారు. మార్కెట్ మొత్తం తనిఖీ చేసిన అధికారులు ఏడుగురు వ్యాపారుల వద్ద మోసాలను గుర్తించారు. దీంతో వారికి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు జరిమానా విధించి అధికారులు చేతులు దులుపుకున్నారు. నిలువు దోపిడీ.. ఆదివారం వచ్చిందంటే మాంసం ప్రియులు మార్కెట్కు క్యూ కడతారు. అక్కడ రద్దీ కారణంగా త్వరగా ఇంటికి వెళ్లేందుకు తొందర పడుతుంటారు. ఇదే అదనుగా మార్కెట్లో వ్యాపారులు.. ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఒక్క ఆదివారమే మార్కెట్లో లక్షల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఎలక్ట్రికల్ కాటాల్లో సైతం మోసాలకు పాల్పడుతున్నారు. సాంకేతికతలో లోపాలను గుర్తించిన వ్యాపారులు తూకంలో దగా చేస్తున్నారు. కేజీకి సుమారు 200 నుంచి 250 గ్రాముల వరకు వ్యత్యాసం ఉండేలా ఎలక్ట్రికల్ కాటాలో అమర్చుతున్నారు. కాటా పెట్టే సమయంలో జీరో చూపించటంతో వినియోగదారులు తూకం విషయంలో అనుమానించటం లేదు. -
బాపట్ల
గురువారం శ్రీ 27 శ్రీ నవంబర్ శ్రీ 2025గుంటూరు లీగల్ : ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి బుధవారం గుంటూరు జిల్లా కోర్టులో న్యాయవాదులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. కౌన్సిల్ మెంబర్గా పోటీ చేస్తున్న హైకోర్టు అడ్వకేట్ కొమ్మసాని శ్రీనివాసరెడ్డి గుంటూరు విచ్చేశారు. జిల్లా కోర్టులో న్యాయవాదులను కలిసి తన అభ్యర్థిత్వాన్ని బలపరిచి గెలిపించాలని కోరారు. న్యాయవాదులు పెద్ద సంఖ్యలో ఆయన వెంట ఉన్నారు. తెనాలి: జనబాహుళ్యం వైదిక మార్గాన్ని అనుసరించినప్పుడే లోకానికి హితం చేకూరుతుందని జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠాధిపతులు శ్రీవిద్యాశంకర భారతీస్వామి స్పష్టం చేశారు. పట్టణ నాజరుపేటలోని విద్యాశంకర భారతి నృసింహ సదనాన్ని బుధవారం భారతీస్వామి సందర్శించారు. వేదిక్ బ్రాహ్మణ సేవాసమాఖ్య పర్యవేక్షణలో నిర్మించిన నృసింహ సదనాన్ని సందర్శించాక, సంతోషం వ్యక్తం చేశారు. భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణ చేశారు. ధార్మిక ప్రచారకర్త అబ్బూరి వెంకాయమ్మ పీఠానికి రాసిచ్చిన స్థలాన్ని నృసింహ సదనానికి ఇచ్చినట్టు తెలిపారు. సమాఖ్య అధ్యక్షులు అమ్మన్ని సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి తాడేపల్లి సూర్యనారాయణమూర్తి, తాడేపల్లి నాగ సుబ్రహ్మణ్యం, కుందేటి సుబ్రహ్మణ్యం కామేశ్వరరావు, తాడేపల్లి శివకుమార్, నందివెలుగు విజయసారథి, మేడూరి శ్రీనివాసమూర్తి, దీవి లక్ష్మీ నరసింహాచార్యులు, దీవి జీవన్కుమార్ పాల్గొన్నారు.7 బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం ఆరు రోజులుగా జిల్లాలో మబ్బులు వేమూరు, రేపల్లెల్లో 40 వేల ఎకరాల్లో కోతలు రోడ్లపైనే ధాన్యం ఆరబెడుతున్న రైతులు మొక్కుబడిగా కూడా ధాన్యం కొనని చంద్రబాబు ప్రభుత్వం వర్షం వస్తే తీవ్ర నష్టం తప్పదని అన్నదాతల ఆందోళన ఇప్పటికే మోంథా తుపానుతో నష్టపోయిన రైతులు జెడ్పీటీసీల ప్రమేయం లేకుండా రూపొందించిన ఆర్థిక సంవత్సర బడ్జెట్ ఆమోదం పొందకుండా తాము ఆరు నెలలపాటు అడ్డుకున్నామని తెలిపారు. అయితే జెడ్పీటీసీలకు తెలియకుండా ఎటువంటి పనులు ఆమోదం పొందవని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఇచ్చిన హామీతో తాము సర్వసభ్య సమావేశపు అజెండాను ఆమోదించామని తెలిపారు. కానీ ఇప్పుడు మళ్లీ పాత పద్ధతిలోనే ఏకపక్షంగా పనులు ఆమోదింప చేసుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తమకు సమాధానం చెప్పాలన్నారు. కమీషన్లు తీసుకుని పనులు ఆమోదిస్తూ అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. జెడ్పీని సొంత జాగీరుగా మార్చుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. జెడ్పీలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా పరిపాలన కొనసాగుతోందని ఆరోపించారు. ఈ సమావేశంలో కందుల సిద్ధయ్య, సంకటి నాగమల్లేశ్వరి, షేక్ గుల్జార్ బేగం, మూలగొండ్ల కృష్ణకుమారి, తుమ్మల సుబ్బారావు, తుమ్మా విజయప్రతాప్రెడ్డి పాల్గొన్నారు. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 582.20 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 11,856 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2వేల క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు అంతే వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 42.1600 టీఎంసీలు. దుగ్గిరాల: విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ నుంచి పశ్చిమ డెల్టాకు 3,422 క్యూసెక్కులు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.బ్యారేజీ వద్ద 12 అడుగుల నీటి మట్టం ఉంది. వాన రూపంలో పొంచి ఉన్న ప్రమాదంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వరి కోతలు మొదలై ధాన్యం ఆరబెట్టుకుంటున్న ఈ తరుణంలో చినుకు ఎప్పుడు పడుతుందోనని వణుకుతున్నారు. చంద్రబాబు సర్కారు ధాన్యం సరిగా సేకరించకపోవడం, కొన్న కొద్ది ధాన్యం విషయంలోనూ అడ్డగోలు కొర్రీలు పెట్టడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గుంటూరు మెడికల్: గుంటూరు జిల్లాలోని కాటూరి మెడికల్ కాలేజ్ సామాజిక వైద్య విభాగం పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ వేమూరి కీర్తికి పరీక్ష ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ లభించింది. ఈ మేరకు బుధవారం కళాశాల యాజమాన్యం ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించింది. పీజీ పరీక్షా ఫలితాల్లో 800 మార్కులకుగాను డాక్టర్ వి.కీర్తికి 594 మార్కులు వచ్చాయని కళాశాల యాజమాన్యం తెలిపింది. కమ్యూనిటీ మెడిసిన్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన డాక్టర్ కీర్తికి కళాశాల చైర్మన్ కాటూరి సుబ్బారావు, డైరెక్టర్ డాక్టర్ స్వైరారావు, డీన్ డాక్టర్ సి.హెచ్.మోహన్రావు, ప్రిన్సిపాల్ డాక్టర్ జి.చైతన్యలు అభినందనలు తెలిపారు. -
హామీలు నెరవేర్చాలి
ఎన్నికల ముందు చేనేతలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు సర్కారు అమలు చేయాలి. నేతన్న నేస్తం వలన ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా లబ్ధిపొందాయి. అలాంటి నేతన్న నేస్తం అందకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. రెండు సంవత్సరాలుగా నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో చంద్రబాబు సర్కారు నేతన్నలకు ఆర్థిక సహాయం అందిస్తామని చెబుతుందే గానీ అమలు చేయలేదు. ప్రభుత్వం చెప్పిన హామీలనే నెరవేర్చాలని కోరుతున్నాం. –– గద్దె హేమసుందర్, ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు -
పక్షపాతంపై నిరసన గళం
గుంటూరు ఎడ్యుకేషన్ : జెడ్పీలో అవలంబిస్తున్న పక్షపాత ధోరణి, ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకోవడం ద్వారా వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలు జెడ్పీ పాలకులు, అధికార యంత్రాంగానికి తిరుగులేని గుణపాఠం చెప్పారు. జెడ్పీ కార్యాలయంలో ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం బుధవారం ఆరు స్థాయీ సంఘాలు భేటీ అయ్యి, అజెండాలో పొందుపర్చిన అంశాలపై చర్చించి ఆమోదించాల్సి ఉంది. అయితే జెడ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన ఆమె చాంబర్లో నిర్వహించాల్సిన ప్రణాళిక–ఆర్థిక అంశాలతో కూడిన 1వ స్థాయీ సంఘం, గ్రామీణాభివృద్ధిపై 2వ స్థాయీ సంఘం, విద్యం–వైద్యంపై 4వ స్థాయీ సంఘం, పనుల ఆమోదంపై 7వ స్థాయీ సంఘ సమావేశాలను వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. 1వ, 7వ సమావేశాలకు హాజరైన సభ్యులు తాము అజెండాలను తిరస్కరిస్తున్నామని, తమ ప్రాతినిధ్యం లేకుండా ఏకపక్షంగా ఆమోదిస్తున్న వైఖరిని ఖండిస్తున్నామని చెప్పి బయటకు వెళ్లిపోయారు. వైస్ చైర్మన్ శొంటి నర్సిరెడ్డి అధ్యక్షతన వ్యవసాయంపై జరగాల్సిన 3వ స్థాయీ సంఘం కోరం లేక వాయిదా పడింది. నామమాత్రంగా సమావేశాలా? సమావేశాలను బహిష్కరించిన అనంతరం వైఎస్సార్ సీపీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. నాదెండ్ల, నరసరావుపేట జెడ్పీటీసీలు సభ్యులు కాట్రగడ్డ మస్తాన్రావు, పి. చిట్టిబాబులు మాట్లాడుతూ.. జెడ్పీటీసీల ప్రమేయం లేకుండా ఏకపక్షంగా పనులు ఆమోదిస్తున్నారని ఆరోపించారు. స్థాయీ సంఘ సభ్యులకు తెలియకుండా తయారు చేసిన అజెండాను రద్దు పర్చి, సభ్యుల నుంచి ప్రతిపాదనలు తీసుకుని, అజెండాను సిద్దం చేసిన తరువాతే మరలా సమావేశాలను నిర్వహించాలిన డిమాండ్ చేశారు. మాచవరం జెడ్పీటీసీ జె.వెంకట శివయ్య మాట్లాడుతూ ప్రజాప్రతినిధులుగా గెలిచిన తాము నాలుగేళ్లుగా సంత మండలంలో పనులు చేయించుకోలేకపోతున్నామని, ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని అన్నారు. చైర్పర్సన్, సీఈవోకు మధ్య సరైన అవగాహన లేకపోవడంతో జెడ్పీటీసీలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జెడ్పీటీలకు తెలియకుండా చేర్చిన పనులను రద్దు పర్చాలని డిమాండ్ చేశారు. నిధులు తెచ్చుకోలేని పరిస్థితి రొంపిచర్ల జెడ్పీటీసీ పిల్లి ఓబుల్రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు పార్టీ మారిన చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా కూటమి ప్రభుత్వం నుంచి జెడ్పీకి రావాల్సిన నిధులను తీసుకురావడంలో విఫలమయ్యారని ఆరోపించారు. 15వ ఆర్థిక సంఘం నుంచి రావల్సిన నిధులు రూ.23 కోట్లకు కేవలం రూ.తొమ్మిది కోట్లే వచ్చాయని చెప్పారు. స్టాంప్ డ్యూటీ కింద రూ.35 కోట్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో రూ.40 లక్షలు వచ్చిన పరిస్థితుల్లో నిధులు తెచ్చుకోలేని స్థితిలో ఉన్నారు. రెవెన్యూ మంత్రి జిల్లాకు చెందిన వ్యక్తే అయినప్పటికీ చైర్పర్సన్ చేతకానితనంతో నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారని విమర్శించారు. జెడ్పీటీసీల ప్రమేయం లేకుండా రూపొందించిన ఆర్థిక సంవత్సర బడ్జెట్ ఆమోదం పొందకుండా తాము ఆరు నెలలపాటు అడ్డుకున్నామని తెలిపారు. అయితే జెడ్పీటీసీలకు తెలియకుండా ఎటువంటి పనులు ఆమోదం పొందవని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఇచ్చిన హామీతో తాము సర్వసభ్య సమావేశపు అజెండాను ఆమోదించామని తెలిపారు. కానీ ఇప్పుడు మళ్లీ పాత పద్ధతిలోనే ఏకపక్షంగా పనులు ఆమోదింప చేసుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తమకు సమాధానం చెప్పాలన్నారు. కమీషన్లు తీసుకుని పనులు ఆమోదిస్తూ అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. జెడ్పీని సొంత జాగీరుగా మార్చుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. జెడ్పీలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా పరిపాలన కొనసాగుతోందని ఆరోపించారు. ఈ సమావేశంలో కందుల సిద్ధయ్య, సంకటి నాగమల్లేశ్వరి, షేక్ గుల్జార్ బేగం, మూలగొండ్ల కృష్ణకుమారి, తుమ్మల సుబ్బారావు, తుమ్మా విజయప్రతాప్రెడ్డి పాల్గొన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్లో కొనసాగుతున్న వ్యవహారాలను వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు నిరసన గళం వినిపించారు. ప్రభుత్వ, జెడ్పీ యంత్రాంగం ఏకపక్ష వైఖరిపై మండిపడ్డారు. బుధవారం ఏర్పాటు చేసిన స్థాయీ సంఘ సమావేశాలను ఆయా సంఘాల్లో సభ్యులుగా ఉన్న జెడ్పీటీసీలు బహిష్కరించారు. జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా పక్షపాత ధోరణి, ఏకపక్ష విధానాలను నిరసిస్తూ మొత్తం ఆరు సమావేశాలకుగానూ మూడు స్థాయీ సంఘ సమావేశాలను బహిష్కరించారు. జెడ్పీటీసీలకు తెలియకుండా, వారి ప్రమేయం లేకుండా తయారు చేసిన అజెండాలను తిరస్కరించారు. జెడ్పీలో పనులన్నీ మీరే కేటాయించుకుంటే ఇక ప్రజాప్రతినిధులుగా మేమెందుకు? జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలను బహిష్కరించిన వైఎస్సార్సీపీ రాజ్యాంగ దినోత్సవం రోజు జెడ్పీటీసీలకు అవమానం ప్రణాళిక–ఆర్థిక, పనుల ఆమోదానికి సంబంధించిన కమిటీలు బహిష్కరణ తమ మండలాలకు పనులు కేటాయించలేదని మండిపాటు ఏకపక్షంగా వ్యవహరిస్తున్న చైర్పర్సన్ వైఖరిపై ఆగ్రహం ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోలేని పరిస్థితుల్లో చైర్పర్సన్ -
లిమ్కా రికార్డులో అఖిల్కు చోటు
సంతమాగులూరు (అద్దంకి రూరల్): కరాటే కిక్స్లో సత్తా చాటి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో సంతమాగులూరు మండలం వెల్లల చెరువు గ్రామానికి చెందిన గంటెనపాటి అఖిల్ చోటు దక్కించుకున్నారు. ఈ నెల 23న సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన లిమ్కా బుక్ రికార్డులో అత్యధికంగా మాష్గిరి కిక్స్ 30 నిమిషాలు ఆపకుండా కిక్స్ కొట్టి రికార్డు సాధించినట్లు ఆర్గనైజర్ మిట్టల్ జయంత్ బుధవారం తెలిపారు. విశేష ప్రతిభ కనబర్చి లిమ్కా బుక్లో స్థానం పొందిన అఖిల్ను గ్రామస్తులు అభినందించారు. -
పత్తి రైతుకు కొనుగోలు కష్టాలు
సత్తెనపల్లి: జిల్లాలో ఏడు వ్యవసాయ మార్కెట్ యార్డుల పరిధిలో 11 జిన్నింగ్ మిల్లులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. 10 కేంద్రాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. చిలకలూరిపేటలో మరో కేంద్రాన్ని ఇంకా ప్రారంభించలేదు. కేవలం 20,224 క్వింటాళ్లు మాత్రమే సీసీఐ కొనుగోలు చేసింది. సగం మాత్రమే రైతుల నుంచి కొనుగోలు చేశారని, మిగిలిన సగం దళారులే కొనుగోలు చేసి సీసీఐ కేంద్రాల్లో విక్రయాలు జరిపారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. జిల్లాలో జిన్నింగ్ మిల్లులు అనేకం ఉన్నా చంద్రబాబు సర్కార్ నామమాత్రంగా 11 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. జిల్లాలోని అన్ని మార్కెట్ యార్డుల్లో పత్తి కొనుగోలు చేపట్టవచ్చు. దక్కని మద్దతు ధర... సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర క్వింటా రూ. 8,110 ప్రకారం కొనుగోలు చేస్తామని చెప్పడంతో రైతులు ఆశపడ్డారు. అయితే సీసీఐ నిబంధనలు రైతులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ముఖ్యంగా తేమ శాతం 12 వరకు మాత్రమే ఉండాలని, 8 నుంచి పెరిగిన ప్రతి ఒక్క శాతం చొప్పున మద్దతు ధర తగ్గిస్తున్నారు. బన్నీ లేదా బ్రహ్మరకం పత్తికి పింజ పొడవు 29.50 నుంచి 30.50 ఎంఎం వరకు, మైక్రోనైర్ 3.50 నుంచి 4.30 మధ్య ఉండి 8 శాతం తేమ ఉంటే క్వింటా రూ. 8,110 ప్రకారం కొనుగోలు చేస్తున్నారు. తేమ 9 శాతం ఉంటే రూ. 8,028.90, తేమ 10 శాతం ఉంటే రూ. 7,947.80, తేమ 11 శాతం ఉంటే రూ. 7,866.70, తేమ 12 శాతం ఉంటే రూ. 7,785.60 చొప్పున క్వింటా పత్తిని కొనుగోలు చేస్తున్నారు. ఇదే విధంగా బ్రహ్మ స్పెషల్, ఎంఈసీహెచ్ రకాలకు కూడా ధరలు నిర్ణయించారు. దుమ్ము, ధూళి, చెత్తాచెదారం, గుడ్డిపత్తికాయలు, రంగుమారినా, పురుగుపట్టిన, కౌడిపతి, ముడుచుకు పోయిన పత్తి కాయలను వేరు చేసి తెస్తేనే కొనుగోలు చేస్తామనే నిబంధనలు విధించారు. ఈ–క్రాప్లో నమోదు చేసుకున్న రైతులు మాత్రమే పత్తి కొనుగోలు కేంద్రానికి రావాలని నిబంధన పెట్టారు. పత్తి కొనుగోళ్లలో చంద్రబాబు సర్కార్ ఉదాసీనత నామమాత్రంగా 11 కేంద్రాలు ఏర్పాటు జిల్లా వ్యాప్తంగా పత్తి సాగు 2.60 లక్షల ఎకరాలు దిగుబడుల అంచనా 12.28 లక్షల క్వింటాళ్లు జిల్లాలో ఇప్పటి వరకు 20,224 క్వింటాలే కొనుగోలు జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 1,02,400 మంది రైతులు 2.60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. 10–14 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని భావించారు. సగటున 12 క్వింటాళ్ల చొప్పున 12,28,800 క్వింటాళ్లు పత్తి దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అధికారులు 11 కేంద్రాలను జిన్నింగ్ మిల్లులో ఏర్పాటు చేశారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం వరకు జిల్లాలో 537 మంది రైతులకు చెందిన 20,224 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. -
చేనేతకు దక్కని చేయూత
●మగ్గం గుంతల్లోనే తెల్లారిపోతున్న జీవనం ●చంద్రబాబు సర్కారు హామీలేవీ..? ●వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నేతన్న నేస్తంతో ఊరట చీరాల: వరుస అల్పపీడనాలు, తుఫాన్ల కారణంగా చేనేత మగ్గం మూగబోతోంది. చంద్రబాబు సర్కారు చేనేతలకు తుఫాన్ నష్టపరిహారం ప్రకటించినా అది కూడా కొందరికే అంటూ ప్రకటనలు చేశారు. జిల్లాలో 33,184 వేల మగ్గాల వరకు ఉండగా 24,000 చేనేత కుటుంబాల వారు ఉన్నారు. వీరిలో మొత్తం 50 వేల మంది చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. వరుస వర్షాలతో చేనేత కార్మికులు అవస్థలు పడుతున్నారు. ఇటీవల మోంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు మగ్గం గుంతల్లోకి నీరు చేరింది. మగ్గం గుంతల్లోకి నీరు చేరి ఇబ్బందులు పడినా ప్రభుత్వం ఎటువంటి సహాయం అందించలేదు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఇప్పటి వరకు ఏ ఒక్కరికీ రూ.5వేల ఆర్థిక సహాయం అందించలేదు. దెబ్బతిన్న పడుగులు, యారన్ తీసుకువస్తే వాటిని పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక అందించి పరిహారం అందించేలా చూస్తామనే మెలిక పెట్టారు. చేనేత కాలనీలు నీటమునిగి నేత పనికి అడ్డంకి ఏర్పడితే ఇప్పటి వరకు సంబంధిత అధికారులు ఆ వైపునకు రాలేదని చేనేత కార్మికులు వాపోతున్నారు. చీరాల నియోజకవర్గంలోని మండలాల్లో వర్షం వలన మగ్గం గుంతల్లోకి నీరు చేరింది. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కరణం వెంకటేష్బాబు వేటపాలెం మండలంలోని చేనేత మగ్గాలను పరిశీలించి చేనేతలతో మాట్లాడారు. అలానే ప్రభుత్వపరంగా సహాయం అందించాలని కోరుతూ ఆర్డీఓకు వినతిపత్రం అందించారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేనేతను ఆదుకున్నారు. వర్షాల కారణంగా చేనేతలు ఇబ్బందులు పడితే అధికారులతో నివేదిక తెప్పించుకుని వారికి తక్షణ సహాయం అందించారు. అలానే ఇచ్చిన హామీ ప్రకారం నేతన్న నేస్తం పేరుతో ప్రతి చేనేత కార్మికుడికి రూ.24 వేల నేరుగా లబ్ధిదారుని అకౌంట్కు జమ చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రూ.24 వేలు ఇస్తే అందుకు దీటుగా రూ.25వేలు అందిస్తామని ఆర్భాటంగా ప్రకటించినా అది ప్రకటనలకే పరిమితమైంది. చంద్రబాబు సర్కారు అధికారం చేపట్టిన తర్వాత చేనేతలకు జరిగిన మేలు ఏమీ లేదు. వరుస వర్షాలు, ప్రభుత్వం చేయూత లేక చేనేతలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. చీరాల రూరల్ గ్రామాల్లో ఎక్కువగా చేనేత కుటుంబాలే ఉన్నాయి. భారీ వర్షాలు కురిస్తే వర్షం నీరు కాలనీలను చుట్టుముడుతోంది. వేమూరు నియోజకవర్గంలో నీటి ఊట ఊరడంతో మగ్గం పనులు నిలిచిపోతున్నాయి. కాలనీల చుట్టూ నీరు నిలిచిపోవడంతో మగ్గం గుంతల్లోకి నీరు చేరుతోంది. ఫలితంగా మగ్గం నేయలేని పరిస్థితి నెలకొంది. కొందరు మగ్గం నీటి ఊటను మోటార్లుతో తోడుకుంటున్నారు. నీరు తోడినా మళ్లీ నీరు ఊరడంతో చీరలు నేసేందుకు వీలుండటం లేదు. దోమలు వ్యాప్తి కూడా ఎక్కువగా ఉండటంతో మగ్గం గుంతలోకి వెళ్లే పరిస్థితి లేదు. వర్షం నీరు వెళ్లే వరకు మగ్గం మూగబోవాల్సిందే. -
బైక్ను ఢీ కొన్న కారు..ఇద్దరికి తీవ్రగాయాలు
మేదరమెట్ల: రోడ్డు క్రాస్ చేస్తున్న మోటారు బైక్ను కారు ఢీకొనడంతో బైక్పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన కొరిశపాడు జాతీయరహదారి ఎమర్జెన్సీ ల్యాండింగ్పై బుధవారం చోటుచేసుకుంది. చిలకలూరిపేట మండలం గణపవరానికి చెందిన రోశయ్య మరో వ్యక్తితో కలిసి మోటారు బైక్పై వెళుతూ కొరిశపాడు మండలంలోని పి.గుడిపాడు సమీపంలో గల గాజు ఫ్యాక్టరీ వద్ద బైకును రోడ్డు క్రాస్ చేస్తున్నాడు. అదే సమయంలో విజయవాడ వైపు నుంచి బద్వేల్కు వెళుతున్న కారు మోటారు బైకును ఢీకొంది. ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా హైవే అంబులెన్స్లో ఒంగోలు కిమ్స్కు తరలించారు. మేదరమెట్ల ఎస్ఐ మహ్మద్ రఫీ ప్రమాద వివరాలను తెలుసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
దేశాభివృద్ధికి రాజ్యాంగం కీలకం
బాపట్ల టౌన్: దేశాభివృద్ధికి రాజ్యాంగం ఎంతో కీలకమైనదని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్కుమార్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు సంతోషం, స్వేచ్ఛగా జీవించడానికి ప్రాథమిక హక్కులను రాజ్యాంగం కల్పించిందన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే అతిపెద్ద రాజ్యాంగం కలిగిన భిన్నమై దేశం మనదని పేర్కొన్నారు. స్వేచ్ఛ, సమానత్వంతో ప్రతి పౌరుడు ముందుకు సాగాలన్నారు. రాజ్యాంగం విలువలను గుర్తించి పాటించడం శుభ పరిణామమని జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం తెలిపారు. మాక్ అసెంబ్లీకి ఎంపికై న 10 మంది విద్యార్థులను పతకాలు, అవార్డులతో కలెక్టర్ సత్కరించారు. ఉపాధ్యాయుడు సాదిక్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ శాఖ పాత్ర ముఖ్యం రాజ్యాంగ పరిరక్షణలో పోలీస్ శాఖ పాత్ర కీలకమైనదని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. తొలుత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వేచ్ఛకు, రక్షణకు, ప్రజా హక్కులను లిఖితపూర్వకంగా నిర్ధారిస్తూ, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ద్వారా ‘‘ప్రజలే సార్వభౌములు’’ అనే సూత్రాన్ని రాజ్యాంగం ప్రకటించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ వి. శ్రీనివాసరావు, ఏఆర్ డీఎస్పీ పి. విజయసారథి, సీసీఎస్ డీఎస్పీ పి. జగదీష్ నాయక్, ఎ.రేపల్లె డీఎస్పీ ఎ. శ్రీనివాసరావు, ఎస్బీ ఇన్స్పెక్టర్ జి. నారాయణ, డీసీసీఆర్బీ ఇన్స్పెపక్టర్ ఆర్. అహ్మద్ జానీ, అద్దంకి టౌన్ సీఐ ఎ. సుబ్బరాజు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాలను పూర్తిస్థాయిలో నివారించాలి
బాపట్లటౌన్: రోడ్డు ప్రమాదాలను పూర్తిస్థాయిలో నివారించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ అన్నారు. ఎస్పీ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం జిల్లాలోని హైవే, రోడ్డు ట్రాన్స్పోర్ట్, ఆర్ అండ్ బీ అధికారులతోపాటు జిల్లాలోని డీఎస్పీలు, హైవేల పరిధిలోని పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తొలుత మూడు సంవత్సరాల్లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన నివేదికను, ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్న బ్లాక్ స్పాట్స్ను పీపీటీ ద్వారా తెరపై ప్రదర్శిస్తూ రాబోయే రోజుల్లో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఆ ప్రదేశాల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదం వలన సంభవించే మరణాల వలన ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయన్నారు. జిల్లా పరిధిలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు పోలీస్, ఆర్టీవో, ఆర్ అండ్ బీ, హైవే అధికారులు సంయుక్త కార్యచరణ రూపొందించాలన్నారు. సమావేశంలో డిస్టిక్ ట్రాన్స్ఫోర్ట్ ఆఫీసర్ టి.కే.పరంథామరెడ్డి, ఆర్ అండ్ బీ ఈఈ డి.ప్రసాదరావు, రేపల్లె, బాపట్ల, చీరాల, సీసీఎస్ డీఎస్పీలు ఏ.శ్రీనివాసరావు, జి.రామాంజనేయులు, ఎం.డి.మోయిన్, పి.జగదీష్నాయక్, నాన్ హైవే, జాతీయ రహదారి 16, జాతీయ రహదారి 216, జాతీయ రహదారి 167(ఎ)ల అధికారులు, జాతీయ రహదారులు ఉన్న సంబంధిత సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
డిపాజిట్దారులను మోసం చేసిన వ్యక్తులు అరెస్ట్
వేమూరు: ఖాతాదారులను మోసం చేసిన మణికంఠ కోపరేటివ్ బ్యాంక్ నిర్వాహకులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించారని, దీంతో వారిని రేపల్లె సబ్ జైలుకు తరలించినట్లు సీఐ పీవీ ఆంజనేయులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు... తెనాలి పట్టణానికి చెందిన కొల్లూరు ఉదయ వెంకటేశ్వరరావు 2018వ సంవత్సరంలో చావలి గ్రామంలో శ్రీ మణికంఠ మ్యూచవల్ ఎయిడెడ్ కోపరేటివ్ బ్యాంక్, త్రిఫ్ట్ క్రెడిట్ సొసైటీ ప్రారంభించారు. బ్యాంక్ ద్వారా గోల్డ్లోన్, ఆర్డీ, ఫిక్స్డ్ డిపాజిట్, మనీ ఇన్కామ్ స్కీమ్ రూపంలలో చావలి, చుట్టు పక్కల గ్రామాల ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బు, బంగారం తీసుకొని పరారయ్యాడు. చావలి గ్రామానికి చెందిన దేవరకొండ వెంకటేశ్వరమ్మ మే 6వ తేదీన పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అప్పటి నుంచి ఉదయ వెంకటేశ్వరరావు అందుబాటులో లేకుండా వెళ్లిపోయాడు. ఉదయ వెంకటేశ్వరరావు, అతనికి సహకరించిన తమ్ముడు కొల్లూరు మురళీకృష్ణలను మంగళవారం అరెస్ట్ చేసి తెనాలి కోర్టులో హాజరు పర్చారు. న్యాయమూర్తి రిమాండ్ విధించగా ఇద్దరిని రేపల్లె సబ్ జైలుకు పంపించడం జరిగిందని తెలిపారు. ఎస్ఐ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
చీరాల: నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్పై నుంచి ద్విచక్ర వాహనంతో సహా కిందపడిన యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మంగళవారం అర్ధరాత్రి చీరాలలో చోటు చేసుకుంది. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దానవాయిపేటకు చెందిన వాసిపల్లి మోషే (25) మంగళవారం రాత్రి చీరాల వచ్చేందుకు నిర్మాణంలో ఉన్న వాడరేవు–పిడుగురాళ్ళ జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంపై వెళుతున్నాడు. ఈపూరుపాలెం స్ట్రయిట్కట్ వద్ద ఫ్ల్రైఓవర్ నిర్మాణం సగం మాత్రమే పూర్తయింది. ముందు రోడ్డు ఉందని రహదారిపై అవగాహన లేకపోవడంతో అదుపుతప్పి కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న టూటౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుని వివరాలు సేకరించారు. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్పై హెచ్చరిక బోర్డులు లేవంటూ మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ ఎస్సై రాంబాబు తెలిపారు. -
రాజధానిలో నిర్మాణ కంపెనీ వాహనం ఢీకొని వృద్ధుడు మృతి
శాఖమూరు(తాడికొండ): రాజధాని ప్రాంతంలో నిర్మాణ కంపెనీకి చెందిన వాహనం ఢీ కొట్టడంతో ఓ వృద్ధుడు దుర్మరణం పాలైన ఘటన తుళ్ళూరు మండలం శాఖమూరు గ్రామంలో జరిగింది. వివరాల ప్రకారం.. ఓ నిర్మాణ కంపెనీకి చెందిన వ్యాను శాఖమూరు గ్రామం మీదుగా వెళుతూ అదుపుతప్పి రోడ్డు పక్కన కూర్చున్న కూకట్లపల్లి సుందరరావు (70) అనే వృద్ధుడిని బలంగా ఢీకొట్టి తొక్కించుకొని ముందుకు వెళ్లడంతో వృద్దుడు ఘటనా స్థలంలోనే ప్రాణాలొదిలాడు. స్థానికులు డ్రైవర్ను, డ్రైవర్ పక్కన కూర్చుని ఉన్న వ్యక్తిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. డ్రైవర్ తన సీటు వదిలి గ్యాస్ వెల్డింగ్ చేసే నిర్మాణ కార్మికుడికి డ్రైవింగ్ ఇవ్వడంతోనే ఘటన జరిగిందని ఒప్పుకోవడంతో స్థానికులు తమదైన శైలిలో దేహశుద్ధి చేసి ఇచ్చి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించి డిమాండ్ చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సర్ధిచెప్పేందుకు యత్నించినా ఫలితం లేకుండా పోయింది. నిర్మాణ కంపెనీకి చెందిన లారీలు, వాహనాలు అధిక వేగంతో రోడ్లపై తిరుగుతుండటంతో నిత్యం ప్రమాదాలకు కారణంగా మారుతుందని, గ్రామాల్లో ఇకపై వాహనాలు తిరగనివ్వమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో నుంచి సరుకు రవాణా చేయకుండా ప్రత్యామ్నాయ రహదారులు ఏర్పాటు చేసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. నిర్మాణ కంపెనీ ప్రతినిధులు ఎవరూ ఘటనా స్థలానికి చేరుకోకపోవడంతో ఆందోళన కొనసాగుతూనే ఉంది. డ్రైవర్ సీటు వదిలి పక్కన ఉన్న వ్యక్తికి డ్రైవింగ్ ఇవ్వడంతో ఘటన -
లీగ్ దశకు వాలీబాల్ పోటీలు
నరసరావుపేట ఈస్ట్: కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల పురుషుల వాలీబాల్ పోటీలు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. వర్సిటీ పరిధిలోని కళాశాలల నుంచి 20 జట్లు పాల్గొనగా, రెండవ రోజు బుధవారం పోటీలు లీగ్ దశకు చేరుకున్నాయి. నాకౌట్ దశలో వర్సిటీ వ్యాయామ కళాశాల జట్టు 52–10, 25–14 తేడాతో చలపతి ఇంజినీరింగ్ కళాశాలపై గెలుపొంది లీగ్ దశకు చేరుకుంది. ధనలక్ష్మి వ్యాయామ కళాశాల (ముప్పాళ్ల), ఆర్వీఆర్ అండ్ జేసీ కళాశాల జట్లు మధ్య జరిగిన హోరాహోరీ పోరులో 25–24, 25–12, 17–15 తేడాతో ధనలక్ష్మి కళాశాల జట్టు విజయం సాధించింది. మరో మ్యాచ్లో కృష్ణవేణి డిగ్రీ కళాశాల జట్టు 25–20, 25–16 తేడాతో వరుస సెట్లతో ఏపీఆర్డీసీ నాగార్జునసాగర్ జట్టుపై విజయం సాధించింది. బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల జట్టుపై బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల జట్టు 15–25, 25–21, 06–15 తేడాతో గెలుపొంది లీగ్ దశకు చేరుకొంది. లీగ్ దశకు చేరుకున్న కళాశాలల జట్లు గురువారం పోటీ పడతాయని టోర్నమెంట్ చైర్మన్, కళాశాల ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈదర ఆదిబాబు తెలిపారు. వర్సిటీ జట్టును ఎంపిక చేస్తారని వివరించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ కోమటినేని నాసరయ్య, వైస్ ప్రిన్సిపాల్ ఎంఆర్కే సతీష్బాబు, లక్ష్య కళాశాల డైరెక్టర్ హరిబాబు, ప్రిన్సిపాల్ కె.శ్రీనివాసరావు, శ్రీ చైతన్య కళాశాల డీన్ కృష్ణ, వివిధ కళాశాలల వ్యాయామ అధ్యాపకులు పాల్గొన్నారు. -
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై తీవ్ర వ్యతిరేకత
పిడుగురాళ్ల రూరల్: ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణపై రాష్ట్ర ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు తెలిపారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం కామేపల్లి బైపాస్ పక్కన నిర్మిస్తున్న మెడికల్ వైద్య కళాశాలను ఆయన బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అటు పీపీపీ పద్ధతిలో కాకుండా ఇటు ప్రభుత్వం ప్రారంభించకుండా డోలాయమానంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వానికి ఇది ఒక చాలెంజ్ అని కళాశాలను పూర్తిచేసి నిబద్ధత, నిజాయతీ నిరూపించుకోవడానికి ఒక పరీక్ష అని పేర్కొన్నారు. నిర్మాణం పూర్తి చేసి, రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన మెడికల్ సీట్లు తీసుకువస్తే వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో విద్యార్థులకు వైద్య, విద్య దక్కుతుందని వివరించారు. పల్నాడు ప్రాంత ప్రజలకు మెడికల్ కళాశాల వర ప్రసాదమని తెలిపారు. విద్యార్థులతో కళకళలాడాల్సిన కళాశాల సంవత్సర కాలంగా ఆగిపోయి ఎడారిలాగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఎం సీనియర్ నాయకులు గద్దె చలమయ్య, పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ్కుమార్, జిల్లా కార్యదర్శ వర్గ సభ్యులు అనుముల లక్ష్మీశ్వర్రెడ్డి, మహిళా సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గద్దె ఉమశ్రీ, నాయకులు తెలకపల్లి శ్రీనివాసరావు, భక్తులు వెంకటేశ్వర్లు, సంపత్ వెంకటకృష్ణ, మద్దిరాల నాగేశ్వరరావు, షేక్ బాషా పాల్గొన్నారు. -
కోటి సంతకాల సేకరణకు తరలిన విద్యార్థి లోకం
పర్చూరు(చినగంజాం): వైద్యవిద్యను పేద విద్యార్థులకు దూరం చేసే చంద్రబాబు సర్కార్ చర్యలను విద్యార్థి లోకం ఖండించింది. కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంలో భాగంగా బుధవారం పర్చూరు గ్రామంలో భవనం అంజిరెడ్డి తులబందుల అర్జునయ్య జూనియర్ కళాశాల విద్యార్థిని, విద్యార్థులు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి మాచవరపు రవికుమార్ మాట్లాడుతూ పేదలకు వైద్య విద్యను దూరం చేస్తున్న చంద్రబాబు సర్కార్ కుట్రలు బద్దలు కొట్టే రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు విద్యార్థులు పెద్ద ఎత్తున కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంలో భాగస్వామ్యులై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి ఆదిపూడి వంశీ రామశర్మ, చల్లా శివారెడ్డి, అయ్యప్పరెడ్డి, షేక్ బాషా తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర హ్యాండ్ బాల్ పోటీల విజేతలుగా కడప, శ్రీకాకుళం
క్వార్టర్ ఫైనల్స్లోనే వెనుదిరిగిన ప్రకాశం బాల, బాలికల జట్లు సింగరాయకొండ: ప్రకాశం జిల్లా సింగరాయకొండ ఏఆర్సీ అండ్ జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన అండర్–19 బాల బాలికల హ్యాండ్ బాల్ పోటీల ఫైనల్స్లో బాలుర విభాగంలో కడప జిల్లా, బాలికల విభాగంలో శ్రీకాకుళం జిల్లా జట్లు విజేతలుగా నిలిచాయి. ఈ పోటీల్లో ప్రకాశం జిల్లా బాలబాలికల జట్లు రెండూ క్వార్టర్ ఫైనల్స్లోనే పేలవమైన ప్రదర్శనతో వెనుదిరిగాయి. ● మూడు రోజుల పాటు పోటీలు ఆద్యంతం హోరాహోరీగా జరిగాయి. చివరిరోజు సెమీ ఫైనల్స్లో బాలుర విభాగంలో కడప, చిత్తూరు, వైజాగ్, కర్నూలు జట్లు, బాలికల విభాగంలో శ్రీకాకుళం, గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం జట్లు పోటీ పడ్డాయి. ● ఫైనల్స్కు బాలుర విభాగంలో కడప, చిత్తూరు జట్లు, బాలికల విభాగంలో శ్రీకాకుళం, గుంటూరు జట్లు చేరుకున్నాయి. ఫైనల్ పోటీలో బాలుర విభాగంలో కడప, చిత్తూరు జట్ల మధ్య జరిగిన పోటీలో చిత్తూరు జట్టు గట్టి పోటీ ఇచ్చినా చివరికి కడప జట్టు విజేతగా నిలిచింది. కడప 8 పాయింట్లు, చిత్తూరు 5 పాయింట్లు సాధించాయి. ● మూడో స్థానానికి వైజాగ్, కర్నూలు జట్ల మధ్య పోటీ హోరాహోరీగా జరగగా చివరికి వైజాగ్ 11 పాయింట్లతో మూడో స్థానంలో, కర్నూలు 9 పాయింట్లతో నాల్గవ స్థానంతో సరిపెట్టుకుంది. ● బాలికల విభాగంలో జరిగిన ఫైనల్ పోటీలో శ్రీకాకుళం, గుంటూరు జట్లు తలపడగా రెండు జట్ల మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. 6 పాయింట్లతో శ్రీకాకుళం జట్టు విజేతగా నిలిచి మొదటి స్థానాన్ని కై వసం చేసుకోగా గుంటూరు జట్టు 4 పాయింట్లతో రన్నర్ గా నిలిచింది. మూడో స్థానం కోసం జరిగిన పోటీలో కృష్ణా జట్టు 7 పాయింట్లతో మూడవ స్థానంలో, వైజాగ్ జట్టు 5 పాయింట్లతో నాల్గవ స్థానంలో నిలిచాయి. ● చివరి రోజు బాలబాలికల జట్ల విజేతలకు మెడల్స్, కప్పు అందజేశారు. పోటీలు స్నేహపూర్వక వాతావరణంలో జరిగాయని అన్ని జట్లు మంచి ప్రతిభ కనబరిచాయని కాలేజి ప్రిన్సిపాల్ సౌజన్య ప్రశంసించారు. పోటీల ఆర్గనైజింగ్ సెక్రటరీ కే శంకర్రావును ఆమె ప్రత్యేకంగా అభినందించారు. ● అండర్–19 సెక్రటరీ చింపారెడ్డి, జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ సెక్రటరీ పీ విజయకుమార్, మలినేని పెరుమాళ్లు, దేవీ సీఫుడ్స్ కంపెనీ మేనేజర్ మూర్తి, లారీ యూనియన్ అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్ శేషగిరి, సెక్రటరీ షేక్ పటేల్, పీఈటీలు ఎస్డీ జంషీర్, ఎన్టీ ప్రసాద్, షేక్ నౌషాద్, విద్యార్థులు పాల్గొన్నారు. -
దేశ సమైక్యతకు నాంది పలికిన మహోన్నత వ్యక్తి సర్దార్
బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ నగరం: దేశ సమైక్యతకు నాంది పలికిన మహోన్నత వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ కొనియాడారు. స్థానిక ఎస్వీఆర్ఎం కళాశాలలో మంగళవారం భారత ప్రభుత్వం, యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వశాఖ, శ్రీ వెలగపూడి రామకృష్ణ స్మాకర కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో సర్దార్ ఐక్యతా పాదయాత్రలో ఎంపీ పాల్గొని మాట్లాడారు. ఉక్కు మనిషిగా చరిత్రకెక్కిన సర్దార్ వల్లభాయ్ పటేల్ సాహసోపేతమైన నిర్ణయాల వల్లే దేశాన్ని ఐక్యం చేశాయన్నారు. దేశ తొలి హోంశాఖ మంత్రిగా 565 సంస్థానాలను విలీనం చేసిన గొప్పనాయకుడు అని ప్రశంసించారు. దేశ ఐక్యతకు చిహ్నం వల్లభాయ్ పటేల్ అన్నారు. తొలుత వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. అనంతరం పాదయాత్ర ర్యాలీని ఎంపీ ప్రారంభించారు. కార్యక్రమంలో మేరా యువ భారత్ గుంటూరు జిల్లా ఉపసంచాలకులు దేవిరెడ్డి కిరణ్మయి, కరస్పాడెంట్ బుచ్చియ్యచౌదరి, ప్రిన్సిపాల్ డాక్టర్ అనగాని హరికృష్ణ, తహసీల్దార్ నాంచారయ్య, మత్తి భాస్కరరావు పాల్గొన్నారు. -
డిసెంబర్ 2 వరకు సముద్రంలో వేట నిషేధం
చీరాల టౌన్: అండమాన్ నికోబార్ దీవుల్లో వాయుగుండం తుఫాన్గా మారడంతో వాతావరణ శాఖల హెచ్చరికల నేపథ్యంలో మండలంలోని వాడరేవు గ్రామంలో మత్స్యకారులు డిసెంబర్ 2 వరకు సముద్రంలో వేట నిషేధించామని తహసీల్దార్ కె.గోపీకృష్ణ తెలిపారు. తుఫాన్ కారణంగా భారీ వర్షాలు, ఈదురుగాలులు వీస్తాయని మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఉండాలని, వేట సామగ్రిని సురక్షిత ప్రాంతంలో భద్రపరుచుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అలానే ఇతర ప్రాంతాలకు వేటకు వెళ్లిన మత్స్యకారులను తిరిగి వాడరేవుకు రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. తాడేపల్లిరూరల్: ప్రతి విద్యార్థి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనపరచాలని ఆర్జేడీ పద్మ అన్నారు. ఇంటర్మీడియెట్ పరీక్షలలో విద్యార్థు ల ఉత్తీర్ణత శాతాన్ని పెంచటానికి ఇంటర్ బోర్డు ప్రవేశపెట్టిన సంకల్ప్–2026 అమలును పర్య వేక్షించటానికి మంగళవారం పెనుమాక ప్రభు త్వ జూనియర్ కళాశాలను ఆర్జేడీ ఆకస్మికంగా సందర్శించారు. ప్రతి తరగతిని పర్యవేక్షించి సంతృప్తి వ్యక్తంచేశారు. ఎస్ఆర్కేవీఎం పథ కం ద్వారా విద్యార్థులకు ఉచిత నీట్, జేఈఈ మెటీరియల్ అందజేశారు. అనంతరం అధ్యాపకులతో సమావేశమై ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కళా శాల ప్రిన్సిపాల్ ఎం.శ్రీనివాసరావు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది ఆర్జేడీ పద్మను శాలువాతో సత్కరించి మెమోంటో అందజేశారు. అచ్చంపేట: తాడువాయిలో కంది పంటను క్రోసూరు వ్యవసాయ సహాయ సంచాలకులు పి.మస్తానమ్మ, ఏవో పి.వెంకటేశ్వర్లుతో కలసి మంగళవారం పరిశీలించారు. కంది పంటను ఆకుచుట్టు పురుగు, పూత పురుగులు ఆశించే అవకాశం ఎక్కువగా ఉందని, ఈ పురుగు లేత ఆకులను, పూతను కలిపి గూడుగా చేసుకుని పంటకు తీవ్ర నష్టాన్ని కలగజేస్తాయన్నారు. నివారణకు క్లోరిపైరిఫోస్, నోవల్యూరోన్, తయోదికార్బ్ నీటితో కలిపి మొక్క పూర్తిగా తడిసే వరకు పిచికారి చేయాలన్నారు. పురుగు ఉధృతి బాగా ఉన్నప్పుడు లామిడా సైహలోత్రిన్ మందును నీటితో కలిపి పిచికారి చేసుకోవాలన్నారు. గుంటూరు ఎడ్యుకేషన్ : గుంటూరులోని అమరావతి రోడ్డు భారత్పేట ఐదవ లైనులో విని యోగంలో ఉన్న బోరింగ్ పంపు కార్పొరేషన్ సిబ్బంది నిర్లక్ష్యంతో మూలన పడింది. స్థానికుల నీటి అవసరాలకు ఉపయోగకరంగా ఉన్న చేతిపంపు ఆర్నెల్ల క్రితం మరమ్మతుకు గురికావడంతో స్థానికుల ఫిర్యాదు మేరకు వచ్చి తీసుకెళ్లిన సిబ్బంది తిరిగి బిగించడం మరిచారు. అప్పటి నుంచి బోరును ఓపెన్గా అలాగే వదిలివేయడంతో చిన్నారులు ఎవరైనా అటువైపు వెళితే ప్రమాదం బారిన పడే పరిస్థితులు ఉన్నా యి. అధికారులు స్పందించి తక్షణమే చేతి పంపును బిగించాలని స్థానికులు కోరుతున్నారు. నరసరావుపేట: సాతులూరు–నరసరావుపేట రైల్వే స్టేషన్ల మార్గంలో లెవల్ క్రాసింగ్ గేట్ వద్ద ఈనెల 26వ తేదీ నుంచి 28 వరకు అత్యవసరంగా పట్టాలు మరమ్మతులు నిర్వహిస్తున్నట్లు గుంటూరు రైల్వే డివిజన్ పీఆర్వో వినయ్కాంత్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీని కారణంగా ఆ మూడు రోజులు రైల్వేగేటు మూసివేయటం జరుగుతుందన్నారు. ప్రయాణికులు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని కోరారు. -
బాపట్ల
బుధవారం శ్రీ 26 శ్రీ నవంబర్ శ్రీ 2025రైతులను వెన్నాడుతున్న తుపాను భయం దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజ్ నుంచి పశ్చిమ డెల్టాకు 3,711 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజి వద్ద 12 అడుగుల నీటిమట్టం ఉంది.అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 3600 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 2000 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 43.0610 టీఎంసీలు.సాక్షి ప్రతినిధి,బాపట్ల: చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం పుణ్యమా అని జిల్లాలో ధాన్యం సేకరణ ముందుకు సాగడంలేదు. వరికోతలు మొదలై పది రోజులు దాటుతున్నా.. ప్రభుత్వం పట్టుమని పది టన్నుల ధాన్యం కూడా సేకరించలేదు. ఫలితంగా రైతులు ధాన్యాన్ని తక్కువ ధరకు దళారులకు అమ్ముకొని నష్టపోతున్నారు. ధాన్యం సేకరణపై వివరాలు చెప్పేందుకు పౌరసరఫరాల విభాగం మేనేజరు ససేమిరా అంటున్నారు. ఎన్ని కేంద్రాల్లో ధాన్యం కొంటున్నారు? ఎంతమంది మిల్లర్ల నుంచి బ్యాంకు గ్యారంటీలు సేకరించారన్న విషయంపై అధికారులు స్పందించడంలేదు. రైతుల నుంచి శాంపిల్స్ తీసుకునేవారు లేరు, మిగిలిన ప్రాసెస్ పూర్తిచేసేవారు కరువయ్యారు. గోతాలు సకాలంలో అందించడం లేదు. టార్ఫాలిన్ పట్టలు లేవని అధికారులు తప్పించుకుంటున్నారు. ధాన్యం సేకరణ వ్యవహారాన్ని సజావుగా జరిగేలా చూడాల్సిన ప్రభుత్వం దానిపై దృష్టి పెట్టకపోవడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమవుతోంది. ధాన్యం సేకరణ బాధ్యతలు చూస్తున్న జిల్లా జాయింట్ కలెక్టర్ భావన, మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించాల్సిన కలెక్టర్ వి.వినోద్ కుమార్లు శ్రద్ధ పెట్టడం లేదన్న విమర్శలు వినవస్తున్నాయి. మొత్తం వ్యవహారాన్ని పౌర సరఫరాల డీఎం, ఇతర అధికారులపై నెట్టడంతో వారు ధాన్యం సేకరణపై దృష్టి పెట్టడంలేదు. పది రోజులుగా వరికోతలు జరుగుతున్నా మిల్లర్ల నుంచి బ్యాంకు గ్యారంటీలు సేకరించక పోవడం చూస్తే అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. 20 రోజుల నుంచి ధాన్యాం సేకరణ కేంద్రాలు పెడుతున్నామని ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం కోతలు పది రోజుల కిందట మొదలైనా ఇప్పటికీ పట్టుమని పది టన్నుల ధాన్యం సేకరించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు వర్షం వచ్చే సూచనలు ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వేమూరులో యాభై శాతం కోతలు పూర్తి వేమూరు నియోజకవర్గంలో వ్యవసాయశాఖ గణాంకాల ప్రకారం 78,099 ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. అనధికారికంగా 95వేల ఎకరాల్లో వరి సాగైనట్లు సమాచారం. మొత్తం వరి కోత దశ లో ఉండగా, గడచిన పది రోజుల్లో సుమారు 50 శాతం వరి కోతలు పూర్తయ్యాయి. రేపల్లె నియోజకవర్గంలో అధికారికంగా 83,623 ఎకరాల్లో వరి సా గు కాగా, చెరుకుపల్లి మండలంలో వరి కోత దశలో వుంది. వారం రోజుల నుంచి కోతలు కోస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం ధాన్యం సేకరణలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. నెలరోజుల ముందునుంచే ధాన్యం సేకరణ ప్రక్రియ మొదలు పెడుతున్నామంటూ జిల్లా అధికారులు ఆర్భాటం చేశారు. కానీ కిందిస్థాయి అధికారులు, రైతు సేవా కేంద్రాల్లో సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు లేదు. కోతలు మొదలయ్యే నాటికి బ్యాంకు గ్యారెంటీల తంతు ముగించి మిల్లులను సిద్ధంగా ఉంచుకునే వ్యవహారం పూర్తిచేయలేదు. కలెక్టర్ వి.వినోద్ కుమార్, జేసీ భావనలు హడావుడి చేయడం తప్ప ధాన్యం సేకరణ ప్రక్రియ సక్రమంగా జరిగేందు కు సరైన ప్రణాళిక సిద్ధం చేయలేదు. వరికోతలు మొదలైన పదిరోజులకు కూడా ధాన్యం సేకరణ ప్రా రంభించలేదు. దీనివల్ల రైతులు ఎకరాకు రూ.12 వేల కు తగ్గకుండా నష్టపోవాల్సి వస్తోంది. తక్కువ ధరకు ధాన్యం అమ్మితే కౌలు, పెట్టుబడి ఖర్చులు కూడా రా వని అన్నదాతలు వాపోతున్నారు. కలెక్టర్, జేసీలు స్పందించి ధాన్యం కొనుగోలు జరిగేలా చూడాలన్నారు.7జిల్లా వ్యవసాయ అధికారిణి అన్నపూర్ణఅల్పపీడన ప్రభావంతో ఐదు రోజులుగా ఆకాశం మేఘావృతమై ఉంది. వర్షం కురిస్తే నష్టపోతామని ఆందోళన చెందిన రైతులు వరి కోతలు ప్రారంభించారు. ప్రభుత్వం ఽకొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో రైతులు తక్కువ ధరకు దళారులకు ధాన్యం విక్రయిస్తున్నారు. సోమవారం వరకూ గోతంతో కలిపి 76 కిలోల ధాన్యం బస్తా రూ.1400 నుంచి 1460 వరకూ కొన్న మిల్లర్లు మంగళవారం నుంచి బస్తా ధాన్యం రూ.1300లకు అడుగుతున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనకపోవడం, వర్షం వచ్చే సూచనలు ఉండడంతో ఇదే అవకాశంగా దళారులు తక్కువ ధరకు ధాన్యం కొట్టేసేందుకు సిద్ధమయ్యారు. -
రైతులు పొలం బడిని సద్వినియోగం చేసుకోవాలి
చెరుకుపల్లి: రైతులు పంటలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పొలం బడి కార్యక్రమం దోహదపడుతుందని జిల్లా వ్యవసాయ అధికారిణి కె.అన్నపూర్ణ అన్నారు. మండలంలోని రాజవోలు గ్రామంలో పొలం బడి కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అన్నపూర్ణ రైతులతో మాట్లాడారు. ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతి మండలంలోని వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో ప్రతి రైతు ఇంటికి వెళ్లి ముఖ్యమంత్రి సందేశంతోపాటు ప్రభుత్వ పంచ సూత్రాలైన నీటి భద్రత, డిమాండు ఉన్న పంటల సాగు, వ్యవసాయంలో సాంకేతికత వాడుట, పండించిన పంటను ప్రాసెసింగ్ చేయుట, రైతులకు ప్రభుత్వం ద్వారా లభించే రాయితీలను వివరించాలని పేర్కొన్నారు. అనంతరం డీఏఏటీసీసీ కోఆర్డీనేటర్ (ఏరువాక) అచ్యతరాజు మాట్లాడుతూ రబీలో సాగు చేసుకోవాల్సిన అపసరాల గురించి వివరించారు. అనంతరం ఏడీఏ లక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల కోసం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఎండీ ఫరూక్, వ్యవసాయ విస్తరణ అధికారి కె.ప్రియాంక, గ్రామ వ్యసాయ సహాయకులు లక్ష్మీదుర్గ, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయ అధికారిణి అన్నపూర్ణ -
పేదలకు రుణాలు అందేనా!
నేడు జెడ్పీ స్థాయీ సంఘ సమావేశం నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు, కార్పొరేషన్ల పట్ల చిన్న చూపుచూపుతోంది. కొద్ది నెలల కిందట ఇదిగో రుణాలు ఇస్తున్నాం..వెంటనే దరఖాస్తు చేసుకోండి అని ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన ప్రజలను నమ్మించి మాట మార్చింది. ఎస్సీ రుణాలకు యూనిట్లు మారుస్తున్నామని, తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు రుణాలకు సంబంధించిన ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. బీసీ రుణాలకు సంబంధించి కూడా ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు జరపరాదని ఉత్తర్వులు ఇచ్చింది. ఎస్టీలకు కనీసం దరఖాస్తు చేసుకోమని చెప్పిన పాపన పోలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బుధవారం జెడ్పీ స్టాయీ సంఘ సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలపై సమీక్షించనున్నారు. ఆయా వర్గాల ప్రజలు ప్రభుత్వ అసమర్థ పాలనపై గుర్రుగా ఉన్నారు. ఎస్సీల ఆశలకు తెర జిల్లా షెడ్యూల్డు కులాల ఆర్థిక సహకార సంస్థ ఆధ్వర్యంలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో గుంటూరు జిల్లాకు రూ.990 యూనిట్లు కింద రూ.41.33 కోట్లు, పల్నాడు జిల్లాకు రూ.992 యూనిట్లు కింద రూ.38.56 కోట్లు మేర సబ్సిడీ రుణాలు అందిస్తున్నట్లు ఏప్రిల్ నెల మొదటి వారంలో ప్రకటించారు. రూ.3 లక్షల నుంచి రూ.10లక్షల వరకు(40 నుంచి 60శాతం వరకు సబ్సిడీ) రుణాలు అందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో వేల సంఖ్యలో నిరుద్యోగులు తమకు అనుభవం ఉన్న రంగాల్లో యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు సమ యం ఉన్నా యూనిట్లను మారుస్తున్నామంటూ సైట్ను ప్రభుత్వం మూసివేసింది. దీంతో వివిధ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. సంక్షేమ హాస్టల్స్పై శీతకన్ను గుంటూరు జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్లలపై ప్రభుత్వం శీతకన్ను చూపుతుంది. ఎస్టీ హాస్టల్లో భోజనం సరిగా లేకపోవడంతో, హాస్టల్ నిర్వహణ సక్రమంగా లేకపోవడంపై ఎస్టీ నాయకులు మండిపడుతున్నారు. నెల రోజుల కిందట పెదనందిపాడు, అనపర్రు బీసీ హాస్టల్లో పుడ్ పాయిజన్ అయి 56 మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో హాస్టల్స్లో విద్యార్థులు ఉండాలంటే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. బాలికల హాస్టల్స్పై నియంత్రణ లేకుండా పోయింది. బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందిస్తున్నట్లు ప్రచారాన్ని హోరెత్తించారు. అదే స్థాయిలో అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రచారం చేశారు. జిల్లాలోని బీసీ, కాపు, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన వారు వేలల్లో దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మండలాలు, మున్సిపాలిటీల వారీగా ఎంపికలు(క్రెడిట్ క్యాంపులు) జరిగాయి. తీరా రుణాలు అందుతాయనే సమయంలో సైట్ క్లోజ్ చేసి రుణాలకు సంబంధించిన ప్రక్రియను నిలుపుదల చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. మండలాలు, మున్సిపాలిటీల నుంచి కూడా ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు జరపరాదని తేల్చేశారు. దీంతో బీసీ రుణాల కోసం ఆశించిన పేద వర్గాలకు నిరాశే మిగిలింది. -
క్రిస్మస్ వేడుకలు ప్రారంభం
భట్టిప్రోలు: జిల్లాలో సోమవారం అర్ధరాత్రి నుంచి క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. భట్టిప్రోలుకు చెందిన స్థానిక క్రీస్తు లూథరన్ దేవాలయంలో అడ్వెంట్ కాలధ్యానములు నెల రోజుల పాటు ప్రతి రోజూ ఉదయం 4 గంటలకు ప్రారంభమవుతాయని ప్యారిష్ బాధ్యులు రెవరెండ్ దాసరి రవీంద్ర వర్మ తెలిపారు. మండలంలోని ఆళ్లమూడిలో పాస్టర్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రిస్మస్కు స్వాగతం పలుకుతూ కేక్ కట్ చేశారు. వెల్లటూరు క్రీస్తు లూథరన్ దేవాలయంలో క్రిస్మస్ కాల ఆరాధనలు ప్రారంభమయ్యాయి. పాస్టర్ రెవరెండ్ దేవరపల్లి నాగేశ్వరరావు, సంఘ పెద్దలు పాల్గొన్నారు. -
మహిళల హక్కులపై అవగాహన ముఖ్యం
నరసరావుపేట ఈస్ట్ : మహిళలు తమ హక్కులతోపాటు చట్టాల గురించి తెలుసుకుంటే సమస్యల నుంచి తేలికగా బయటపడే అవకాశం ఉంటుందని పల్నాడు జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి ఎం.ఉమాదేవి పేర్కొన్నారు. మంగళవారం సీ్త్ర హక్కుల పరిరక్షణ, సీ్త్ర హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హెల్ప్ ఫౌండేషన్ (సత్తెనపల్లి) ఆధ్వర్యంలో కరపత్రాలను ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ.. స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఇలా కరపత్రాలను ముద్రించటం శుభ పరిణామం అన్నారు. సమస్య వచ్చినప్పుడు ఆత్మవిశ్వాసం, ధైర్యంతో ఎదుర్కోవాలని పేర్కొన్నారు. మహిళ శిశు సంక్షేమ శాఖ కార్యాలయ నోడల్ అధికారి అరుణ, హెల్ప్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కంచర్ల బుల్లిబాబు, సభ్యులు మురళీకృష్ణ, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
స్పాట్ అడ్మిషన్లు జరగకుండానే షెడ్యూల్ ప్రకటనపై విద్యార్థుల విస్మయం
ఏఎన్యూ పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షల ఫీజు షెడ్యూలు ప్రకటన ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూ అధికారుల వింత ధోరణికి విద్యార్థులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకు పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తికాలేదు. పీజీ కౌన్సెలింగ్లో రెండు విడతల్లో అడ్మిషన్లు నిర్వహించిన నిర్వాహకులు స్పాట్ అడ్మిషన్లపై ఇప్పటి వరకూ ఏ నిర్ణయం తీసుకోలేదు. యూనివర్సిటీ అధికారులు స్పాట్ అడ్మిషన్ల వ్యవహారంపై ఉన్నత విద్యామండలి, విద్యాశాఖ మంత్రి నుంచి అనుమతి కోసం వేచి చూస్తున్నారు. వర్సిటీలోని పలు విభాగాల్లో స్పాట్ అడ్మిషన్ల వల్ల సీట్లు భర్తీ అయ్యే అవకాశాలు ఉంటాయి. అనివార్య కారణాల వల్ల సకాలంలో దరఖాస్తు చేసుకోలేని వారి కోసం ప్రతి ఏడాది స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తారు. స్కాలర్షిప్ రాకపోయినా పర్వాలేదు, సంవత్సరం వృథా కాకూడదనే భావనతో విద్యార్థులు స్పాట్ అడ్మిషన్ ద్వారా ఆయా కోర్సుల్లో చేరుతూ ఉంటారు. ఈ సారి స్పాట్ అడ్మిషన్ జరగకుండానే ఫీజుల షెడ్యూల్ ప్రకటించడం గందగోళానికి దారి తీసింది. వర్సిటీ అధికారుల నిర్ణయంతో తమకు ఏడాది కాలం వృథా అవుతుందని స్పాట్ అడ్మిషన్ల కోసం ఎదురు చూస్తున్న పలువురు విద్యార్థులు వాపోయారు. దీనిపై సీఈఓ ఆలపాటి శివప్రసాద్ను వివరణ కోరగా అడ్మిషన్లకు తనకు సంబంధం లేదని, అకడమిక్ క్యాలండర్ ప్రకారం మంగళవారం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. జాతీయ సైక్లింగ్ పోటీలకు విద్యార్థుల ఎంపిక నరసరావుపేట రూరల్: జాతీయ స్థాయి సైక్లింగ్ పోటీలకు ఎనిమిది మంది విద్యార్థులు ఎంపికై నట్టు జొన్నలగడ్డ జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు బి.మల్లికార్జునరావు తెలిపారు. 69వ రాష్ట్ర స్థాయి స్కూల్గేమ్స్ పోటీలు ఎన్టీఆర్ జిల్లా నున్నా జెడ్పీ హైస్కూల్ నిర్వహించారు. జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చి జాతీయ జట్టుకు ఎంపికయ్యారని హెచ్ఎం పేర్కొన్నారు. ట్రాక్ విభాగంలో సీహెచ్ విజయలక్ష్మి, ఎన్.పరమాత్మలు ప్రథమ స్థానం, రోడ్ విభాగంలో ఎస్కే నబీర్ (అండర్–17), వై.తేజస్విని (అండర్–14), ఎన్.సింధు (అండర్–14)లు ప్రథమస్ధానం, ఎన్.బింధుశ్రీ (అండర్–17), జి.నరేంద్ర (అండర్–14), ఎస్కే ఆమన్ (అండర్–14) ద్వితీయ స్థానం, జి.మణికంఠ (అండర్–17), ఎ.లావణ్య (అండర్–14)లు తృతీయ స్థానాలు సాధించినట్టు పేర్కొన్నారు. -
మేలు జాతి పశువులతో అధిక ఆదాయం
కర్లపాలెం: రైతులు మేలుజాతి పశువులను పెంచుకోవటం వల్ల అధిక ఆదాయం పొందవచ్చునని బాపట్ల జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ వేణుగోపాల్ చెప్పారు. కర్లపాలెం మండలంలోని యాజలి గ్రామంలో సత్యసాయిబాబా శతజయంతి సందర్భంగా రాష్ట్రీయ గోకుల్ మిషన్, ఏపీ పశు గణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత పశు వైద్య శిబిరం, లేగ దూడల అందాల పోటీలను నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని పశు సంవర్థక శాఖ జాయింట్ డైరక్టర్ టివి.సుధాకర్, యాజలి గ్రామ సర్పంచ్ నాదెండ్ల భానుప్రసాద్లు రిబ్బను కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ డైరక్టర్ సుధాకర్ మాట్లాడుతూ రైతులు మేలు జాతి పశువులను పెంచుకోవటంతో పాటుగా పోషక విలువలు ఉన్న దాణా అందించాలని చెప్పారు. పశువులలో వచ్చే వ్యాధులకు సకాలంలో వైద్యం చేయించాలన్నారు. ఈ వైద్య శిబిరంలో 115 పశువులకు గర్భకోశ వైద్య చికిత్సలు, 800ల పశువులకు సాధారణ వైద్య పరీక్షలు చేశారు. 200ల దూడలకు నట్టల నివారణ మందు వేశారు. అందాల పోటీలలో ఎంపికై న లేగ దూడల యజమానులకు బహుమతులతో పాటు మామిడి మొక్కలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పశువైద్యులు డాక్టర్ తహ అన్సారీ, రేచల్ దివ్య, తిరుమల తేజ, సాహిత్య, నాగార్జున, శివకుమారి, సత్యసాయి సేవా సమితి కర్లపాలెం మండల అధ్యక్షుడు తుమ్మల.శ్రీనివాసరావు, నా జన్మభూమి ప్రతినిధి గుండ్రెడ్డి సత్యనారాయణ, రామకృష్ణ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు మంతెన నాగరాజు, రైతులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ వేణుగోపాల్ -
వ్యవసాయం అభివృద్ధి సాధించడానికి కృషి చేయాలి
భట్టిప్రోలు: ప్రతి రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయించుకునేలా ఏర్పాట్లు చేయాలని బాపట్ల జిల్లా వ్యవసాయ శాఖాధికారి అన్నపూర్ణ పేర్కొన్నారు. మండలం కోనేటిపురం, సూరేపల్లి గ్రామాలలో నేల ఆరోగ్యం, సారవంతమైన నేల పథకం, పొలం పిలుస్తోందిపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. రైతులందరూ ప్రభుత్వ మద్దతు ధరకు రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం అమ్ముకోవాలని కోరారు. ప్రభుత్వం రైతుల కోసం ప్రారంభించిన రైతన్న మీకోసం కార్యక్రమం గూర్చి మాట్లాడారు. ప్రతి రైతు ఇంటి దగ్గరకు తీసుకెళ్లాలని సూచించారు. రైతులకు సాంకేతిక నైపుణ్యం అందించే విధంగా రూపొందించిన యాప్ను తప్పని సరిగా రైతులందరూ ఉపయోగించుకునేలా వారికి వివరించి చెప్పాలని అన్నారు. సంప్రదాయ వ్యవసాయానికి ఆధునికీకరణ జోడించి వ్యవసాయ రంగంలో మరింత అభివృద్ధి సాధించడానికి అవరమైన అన్ని రకాల పరిజ్ఞానం ఏపీ ఎయిమ్స్ యాప్లో ఉందని... అందరూ రైతులు సద్వినియోగపరచుకోవాలని కోరారు. సైలెన్ వాటర్ స్కీమ్ శాస్త్రవేత్త మధువాణి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన నేల ఆవశ్యకతను తెలియజేశారు. నేల సారవంతం చేయడానికి ఆర్గానిక్ ఎరువుల వాడకంతో పాటుగా అందరూ తప్పని సరిగా పచ్చిరొట్ట ఎరువులు సాగుచేసుకోవాలని కోరారు. ప్రతి రైతు ఏడాది మట్టి, నీటి పరీక్షలు చేయించుకుని సదరు రిపోర్టుకు అనుగుణంగా ఎరువుల వాడటం ద్వారా నేల ఆరోగ్యం మెరుగుపడుతుందని సూచించారు. ఈ యాప్ పని తీరును మండలంలో రైతన్న మీకోసం కార్యక్రమం పురోగతి కార్యక్రమానికి పర్యటించారు. కార్యక్రమంలో ఏరువాక కేంద్రం కో–ఆర్డినేటర్ అచ్చుతరాజు, రేపల్లె ఏడీ లక్ష్మి, మండల వ్యవసాయ శాఖాధికారి బి.బ్రహ్మరెడ్డి పాల్గొన్నారు. -
జాతీయ రహదారిపై స్థానికుల నిరసన
మార్టూరు: స్థానికజాతీయ రహదారిపై జొన్నతాళి వద్ద మంగళవారం ఉదయం స్థానికులు చేపట్టిన నిరసనతో వందలాది వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మార్టూరు కేంద్రంగా గ్రానైట్ అక్రమ రవాణా వ్యాపారం గతంలో జోరుగా సాగిన సంగతి తెలిసిందే. ఈ దందా ఆపడం కోసమంటూ ప్రభుత్వం ఏఎంఆర్ అనే సంస్థకు బాధ్యతలు అప్పగించింది. అందులో భాగంగా ఏఎంఆర్ సంస్థ జాతీయ రహదారికి ఇరువైపులా సర్వీస్ రోడ్లతో పాటు మండలంలోని పలు గ్రామాలకు వెళ్లే మార్గాలలో సైతం తమ సిబ్బందిని నియమించుకొని వసూలు చేసుకుంటున్నారు. అయితే గతంలో మార్టూరు కేంద్రం నుంచి గ్రానైట్ శ్లాబులు మాత్రమే ఎటువంటి బిల్లులు లేకుండా ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలి వెళ్లేవి. అయితే వసూళ్ల బాధ్యతను ఏఎంఆర్ సంస్థ చేపట్టాక గ్రానైట్ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే విషయం ఏమో కానీ స్థానికంగా ఇతర సమస్యలు పెరిగాయి. ఈ కారణంగా గ్రానైట్ వ్యాపారులతో పాటు ఆ పరిశ్రమపై ఆధారపడి జీవించే వారి పరిస్థితి దుర్భరంగా మారింది. అందువలన గ్రానైట్ పరిశ్రమల యాజమాన్యంతో పాటు వాటిపై ఆధారపడి జీవించే వారు తరచూ ఏఎంఆర్ సంస్థ చర్యలకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. ఈ క్రమంలో గ్రానైట్ పరిశ్రమపై ఆధారపడి జీవించేవారు కొందరు సహనం నశించి మంగళవారం జొన్నతాళి సమీపంలో గ్రానైట్ పరిశ్రమ నుంచి డస్ట్ తరలించే ట్రాక్టర్లు విషయమై ఏంఆర్ సిబ్బందితో వివాదం ప్రారంభమైంది. ఇది పెరిగి పెద్దది కావటంతో స్థానికులు రహదారిపై వాహనాలను ఆపి తమ నిరసనను తెలియజేశారు. ఈ కారణంగా రహదారిపై వందలాదిగా వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు సుమారు అరగంట సేపు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరుపక్షాలకు సర్దిచెప్పి పంపించడంతో సమస్య తాత్కాలికంగా సద్దుమణిగింది. వందలాదిగా నిలిచిపోయిన వాహనాలు -
మహిళల రక్షణకు బలమైన చట్టాలు
గుంటూరు లీగల్: మహిళల రక్షణ కోసం మన చట్టాలు బలంగా ఉన్నాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ అన్నారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళా హింస నిర్మూలన వ్యతిరేక దినోత్సవాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ అధ్యక్షత వహించి మాట్లాడారు. మహిళలపై జరిగే శారీరక, లైంగిక, మానసిక, ఆర్థిక, హింసలు, సైబర్ హింసల గురించి వివరించారు. వాటి ద్వారా మహిళలు ఎదుర్కొనే సమస్యలను తెలిపారు. ఆర్టికల్ 14 (సమానత్వం), ఆర్టికల్ 15 (లింగ వివక్ష నిరాకరణ), ఆర్టికల్ 21(జీవించే హక్కు) ద్వారా మహిళల హక్కులకు పూర్తి రక్షణ కల్పిస్తుందన్నారు. గృహ హింస, మెయింటెనెన్సు వంటి చట్టాల గురించి సమాజంలో, ఇంట్లో, పనిచేసే చోట మహిళలకు జరిగే శారీరక, మానసిక హింసలపై అవగాహన కల్పించారు. మీడియేషన్ అడ్వకేట్ వసుమతి పూర్ణిమ మాట్లాడుతూ మహిళలకు ఉన్న చట్టపరమైన హక్కుల గురించి వివరించారు. న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ప్రజలకు, మహిళలకు అందే హక్కుల గురించి వివరించారు. ప్యానెల్ అడ్వకేట్ కట్టా కాళిదాసు మాట్లాడుతూ సోషల్ మీడియా, వాట్సాప్, యూట్యూబ్, ఫేస్బుక్ ద్వారా డిజిటలైజ్డ్ క్రైమ్స్ ఎక్కువగా జరగడానికి అవకాశం ఉందన్నారు. మహిళలను కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉందని తెలిపారు. హక్కుల దుర్వినియోగం, పని చేసేచోట, ఇంట్లో వేధింపులకు గురి అవ్వడం, మహిళలకు ఉన్న ఇష్టాలు, అభిప్రాయాలను నియంత్రించడం ద్వారా ఎక్కువగా హింసలకు గురవుతున్నారని తెలిపారు. మహిళలకు జరిగే హింసల నియంత్రణకు తగిన సలహాలు, సూచనలు ఇచ్చారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ -
పందిళ్లపల్లి విద్యార్థినికి కాంస్య పతకం
వేటపాలెం: రాష్ట్ర స్థాయి హేమర్ త్రో పోటీల్లో పందిళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠ శాల విద్యార్థిని పూజిత ప్రతిభ కనపర్చి కాంస్య పతకం సాధించినట్లు హెచ్ఎం తలమల దీప్తి మంగళవారం తెలిపారు. వినుకొండలో ఈ నెల 24, 25 తేదీల్లో అండర్–17 బాల, బాలికల రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు జరిగాయని తెలిపారు. ఈ పోటీల్లో విద్యార్థిని అబ్బు పూజిత హేమర్ త్రోలో మంచి ప్రతిభ కనపర్చి కాంస్య పతకం సాధించిందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించడం అభినందనీయమన్నారు. పీఈటీ తోట వెంకటేశ్వరరావు, కర్ణ నాగేశ్వరరావు, బుద్ధి మోహహనరావు, శంఖం లలితా పరమేశ్వరి అభినందించారు. జాతీయ కబడ్డీ పోటీలకు విద్యార్థిని ఎంపిక చీరాల: జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు చీరాల వాడరేవు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని పిక్కి ఝాన్సీ ఎంపికయింది. ఇటీవల మచిలీపట్నంలో నిర్వహించిన అండర్–14 విభాగం కబడ్డీ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి వాడరేవు జెడ్పీ ఉన్నత పాఠశాలలో 9 వ తరగతి విద్యార్థిని జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డి.రత్నకుమారి, ఉపాధ్యాయులు కె. శ్రీనివాసరావు, వ్యాయామ ఉపాధ్యాయులు సుమన్, సుమలతలు ఝాన్సీని అభినందించారు. సమగ్ర పోషక యాజమాన్యంపై సర్టిఫికెట్ కోర్సు గుంటూరు రూరల్: గుంటూరులోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానం నందున్న ఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో సమగ్ర యాజమాన్యంపై 15 రోజుల సర్టిఫికెట్ కోర్సును మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ జి.శివనారాయణ పాల్గొని మాట్లాడుతూ అభ్యర్థులకు విచక్షణ రహితంగా ఎరువులను వినియోగించడం వలన నేలలో సేంద్రియ కర్బనం తగ్గి భూమి సారాన్ని కోల్పోయి పంట దిగుబడులు తగ్గుతాయని తెలిపారు. సమగ్ర పోషక యాజమాన్యంపై విజ్ఞానాన్ని పెంచుకోవాలని తద్వారా రైతులు అవగాహన కల్పించాలన్నారు. ఏరువాక కేంద్రం కో–ఆర్డినేటర్ డాక్టర్ ఎ.మనోజ్, వివిధ జిల్లాల నుంచి పాల్గొన్న 30 మంది జిల్లాస్థాయి వెస్టీస్ స్టోర్ ఇన్చార్జిలు రావేప్ విద్యార్థులు పాల్గొన్నారు. -
అమరావతి జిల్లా ఏమైంది?
డాక్టర్ జాస్తి వీరాంజనేయులు అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఏర్పడి పదకొండేళ్లు దాటినా జిల్లా ఏర్పాటు చేయకపోగా కనీసం అమరావతిలో రెవెన్యూ డివిజన్ కూడా లేదని అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు మంగళవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని ప్రజలు తమ అవసరాలకు గుంటూరుకు, అమరావతి టెంపుల్ సిటీ వారు సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న నరసరావుపేటకు వెళ్లాల్సి వస్తోందన్నారు. కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న దృష్ట్యా అమరావతిని రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని ఈ ప్రాంత ప్రజలు చిరకాల కోరిక అని గుర్తుచేశారు. సీఎం చంద్రబాబు, మంత్రుల కమిటీకి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అమరావతిని కొత్త జిల్లా కేంద్రంగా, రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని వినతిపత్రాలు ఇచ్చినట్లు తెలిపారు. ఇకనైనా వీటిపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. పాముకాటుకు రైతు మృతి నాదెండ్ల: పాముకాటుకు గురై వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో జరిగింది. వివరాలు.. మండలంలోని కనపర్రు గ్రామానికి చెందిన రైతు నరిశెట్టి చిన్నయ్య (55) సోమవారం సాయంత్రం పొలం నుంచి ఇంటికి వచ్చే క్రమంలో పాముకాటుకు గురయ్యాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం మాచర్ల రూరల్: మండల పరిధిలోని కంభంపాడు గ్రామ సమీపంలోని సాగర్ కుడి కాలువలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్లు మాచర్ల రూరల్ ఎస్ఐ సంధ్యారాణి తెలిపారు. వయస్సు సుమారు 50 – 55 ఏళ్లు ఉంటుందన్నారు. ఒంటిపై ఆకుపచ్చ జాకెట్, నీలి రంగు చీర ధరించి ఉన్నట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. బాలుడి మృతదేహం.. తాడేపల్లిరూరల్: విజయవాడ కృష్ణానది నీటిలో సీతమ్మవారి పాదాల వద్ద కృష్ణలంక పోలీసులు మంగళవారం గుర్తు తెలియని ఓ బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహం సీతానగరం నుంచి విజయవాడ వైపు వచ్చి ఉండవచ్చని భావించి తాడేపల్లి చుట్టు పక్కల ప్రాంతాల్లో విచారణ చేపట్టారు. బాలుడి వయస్సు సుమారు 14 సంవత్సరాలు ఉండవచ్చని గుర్తించిన వారు తాడేపల్లి, కృష్ణలంక పోలీసుస్టేషన్లకు సమాచారం ఇవ్వాలని విజయవాడ పోలీసులు కోరారు. రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి తెనాలి రూరల్: రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన కొలకలూరు రైల్వే స్టేషన్ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సుమారు 50 ఏళ్ల వ్యక్తి పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న తెనాలి జీఆర్పీ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని తెనాలి వైద్యశాలకు తరలించారు. డివైడర్ను ఢీకొట్టిన కళాశాల బస్సు తెనాలి రూరల్: ఇంజినీరింగ్ కళాశాల బస్సు డివైడర్ను ఢీకొట్టిన ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. చేబ్రోలు మండలంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాల బస్సు ప్రకాశం రోడ్డులో పెట్రోలు బంకు వద్ద డివైడర్ను ఢీకొట్టింది. విద్యార్థులు అద్దాలపై పడడంతో అవి పగిలి పలువురు గాయపడ్డారు. -
ముగిసిన రాష్ట్ర స్థాయి యోగా పోటీలు
జె.పంగులూరు: మండల పరిధిలోని చందలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత మూడు రోజుల నుంచి అండర్ 14,17,19 విభాగాల్లో బాలబాలికలకు నిర్వహించిన 69వ రాష్ట్ర స్థాయి యోగా పోటీలు మంగళవారంతో ముగిశాయి. 13 ఉమ్మడి జిల్లాల నుంచి 400 మంది పైగా క్రీడాకారులు వచ్చారు. బాలురు చందలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వసతి పొందారు. బాలికలకు గ్రామంలో గ్రామస్తులు వారికి ఆతిథ్యం ఇచ్చి వారిని ప్రోత్సహించారు. చివరి రోజు అండర్–19 విభాగంలో యోగా పోటీలు జరిగాయి. ఈ పోటీలకు గెలిచిన క్రీడాకారులకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గిరిజ అధ్యక్షత బహుమతులు అందజేశారు. విజేతలు వివరాలు: -
ఐఎంఏ గుంటూరు శాఖకు అవార్డులు
గుంటూరు మెడికల్ : ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) గుంటూరు శాఖకు వివిధ రంగాల్లో అందించిన సేవలకు లభించిన అవార్డులను ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ దిలీప్ బన్సాలి నుంచి గుంటూరు ఐఎంఏ శాఖ కార్యనిర్వహకవర్గం అందుకుంది. ఇటీవల అన్నమయ్య జిల్లా రాజంపేటలో నిర్వహించిన ఐఎంఏ రాష్ట్ర సదస్సులో ఈ అవార్డులను ప్రదానం చేశారు. అవార్డులను ఐఎంఏ గుంటూరు శాఖ అధ్యక్షులు డాక్టర్ టి.సేవకుమార్, కార్యదర్శి డాక్టర్ బి.సాయికష్ణ, డాక్టర్ వి.మహేష్ డాక్టర్ డి.అమరలింగేశ్వరరావు, డాక్టర్ ఎన్.కిషోర్, డాక్టర్ ఎం.పర్నికుమార్ తదితరులు డాక్టర్ బన్సాలి నుంచి అందుకున్నారు. గుంటూరు శాఖకు ఐదు అవార్డులు దక్కటం పట్ల పలువురు వైద్య ప్రముఖులు అభినందనలు తెలిపారు . ఆలయ పునర్నిర్మాణానికి విరాళాలు బొల్లాపల్లి : వెల్లటూరులోని సోమేశ్వరస్వామి దేవాలయం పునర్నిర్మాణానికి దాతలు విరాళాలు అందజేసినట్లు దేవదాయ శాఖ అధికారి సీహెచ్ శివనాగిరెడ్డి సోమవారం తెలిపారు. గ్రామానికి చెందిన బేతపూడి వెంకటేశ్వర్లు, అడక లింగరాజులు రూ.2 లక్షల విరాళం అందజేశారు. ఇప్పటికీ వేణుగోపాలస్వామి ఆలయానికి రూ.33.18 లక్షలు, సోమేశ్వరస్వామి ఆలయానికి రూ.78.39 లక్షలు దాతల నుంచి విరాళాలు అందాయన్నారు. స్వర్ణ కుటీరం నిర్మాణానికి భూమి పూజ వినుకొండ : స్థానిక కొండమెట్ల వద్ద ఉన్న అతి పురాతన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం విశ్వమాత గో సంరక్షణ ఆశ్రమం నందు స్వర్ణ కుటీర నిర్మాణానికి సోమవారం భూమి పూజ నిర్వహించారు. మాజీ ఏజీపీ పోట్లూరి సైదారావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణ కుటీర కాశీ వజ్ర వారాహి అమ్మవారి మందిర నిర్మాణ కార్యక్రమంలో పాలుపంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఐదుగురు దాతలు ఒక్కొక్కరు రూ.1.08 లక్షల చొప్పున మొత్తం రూ.5.40 లక్షలు మందిరం నిర్మాణానికి విరాళాలు ప్రకటించారు. కార్యక్రమంలో మేలిశెట్టి ఉషారాణి, ఏటుకూరి కృష్ణవేణి, వి.రమ, పత్తి భ్రమరాంబ, బుర్ర సుజాత పాల్గొన్నారు. పునీత శౌరి మహోత్సవాలకు జెండా ప్రతిష్ట ప్రత్తిపాడు: గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో పునీత శౌరి మహోత్సవాలకు జెండా ప్రతిష్టా కార్యక్రమం సోమవారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ నెల 24వ తేదీ నుంచి డిసెంబరు మూడవ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో తొలి రోజు మేత్రాసన ప్రొక్యురేటర్, ఛాన్సలర్ గురుశ్రీ దాసరి కిరణ్, ఫాదర్లు దిలీప్కుమార్, బాలశౌరి, కన్నీ థామస్లతో కలిసి జెండాను ప్రతిష్టించారు. ఏసును స్తుతిస్తూ ఆరాధించారు. డిసెంబర్ 3న గురువులతో సమిష్టి పండుగ దివ్యబలి జరుగుతుందని ఫాదర్ దిలీప్ కుమార్ చెప్పారు. రేపు ప్రభుత్వ ఐటీఐలో జాబ్ మేళా గుంటూరుఎడ్యుకేషన్: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 26న ఉదయం 10 గంటలకు గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉన్న ప్రభుత్వ ఐటీఐలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ సాయి వరప్రసాద్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులు జాబ్మేళా సద్వినియోగంచేసుకోవాలన్నారు. 98663 66187, 95817 94605 నంబర్లలో సంప్రదించాలన్నారు. -
భూ సేకరణ వేగవంతం చేయండి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ బాపట్లటౌన్: జాతీయ రహదారుల ప్రాజెక్ట్ పనులకు భూ సేకరణ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. సోమవారం జాతీయ రహదారుల పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వెళ్లే జాతీయ రహదారులు 544జి, 167ఎ, 16, 544డి ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు కావాల్సిన భూసేకరణలో ఉండే కోర్టు సమస్యలను త్వరితగతిన పరిష్కరించి జాతీయ రహదారుల పురోగతిని మెరుగుపరిచే విధంగా అధికారులు పనిచేయాలన్నారు. బాపట్లలో రైల్వే ట్రాక్ ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణకు రెవెన్యూ, రైల్వే అధికారులు సంయుక్తంగా స్థల పరిశీలన చేసి నివేదిక అందజేయాలన్నారు. ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ ఏర్పాటుకు అదనంగా 2.53 ఎకరాల భూమి కోసం ప్రతిపాదన పంపాలని జిల్లా కలెక్టర్ రైల్వే అధికారులకు సూచించారు. చుండూరు మండలం మోదుకూరు, చుండూరు వద్ద లెవెల్ క్రాసింగ్ పనులను వేగవంతం చేయాలన్నారు. బాపట్లలో రైల్వేస్టేషన్ పరిసరాల అభివృద్ధికి స్థల సేకరణ విషయంలో పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. జిల్లాలో ప్రవహించే ఈస్ట్ తుంగభద్ర డ్రెయిన్, రొంపెరు రైట్ ఆర్మ్, సాఖీ డ్రెయిన్, గుంటూరు ఛానల్, గణపవరం స్వామి డ్రెయిన్, నల్లమడ డ్రెయిన్ ఆధునికీకరణ పనుల్లో సమస్యలను అధిగమించి పనులు వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్నటువంటి లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు స్థల సేకరణలో తగు చర్యలు తీసుకోవాలని ల్యాండ్ సెక్షన్ సూపరింటెండెంట్కు తగు సూచనలు చేశారు. బాపట్ల, చీరాల, అద్దంకి, రేపల్లె మండలాల్లో ప్లాంట్ ఏర్పాటుకు స్థల సేకరణకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్, ల్యాండ్ ఎక్విజిషన్ సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీలక్ష్మి, బాపట్ల, చీరాల రెవెన్యూ డివిజన్ అధికారులు గ్లోరియా, చంద్రశేఖర్, అద్దంకి, జే పంగులూరు, చీరాల, పర్చూరు, కారంచేడు తహసీల్దార్లు, జాతీయ రహదారులు, రైల్వే అధికారులు పాల్గొన్నారు. -
ఆందోళనలతో దద్దరిల్లిన కలెక్టరేట్
బాపట్లటౌన్: వివిధ వర్గాల ప్రజల ఆందోళనలతో బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం దద్దరిల్లింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తమ గోడు చెప్పుకునేందుకు జిల్లా నలుమూలల నుంచి వందలాది ప్రజలు హాజరయ్యారు. వారాలు...నెలల తరబడి కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ బాధితులు కలెక్టరేట్ ముందు ఆందోళన వ్యక్తం చేశారు. ఇళ్లు కూల్చేయవద్దంటూ ఆందోళన బాపట్ల మండలం సూర్యలంక సముద్రతీరంలో 50 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్న పేదలు ఇళ్లు కూల్చి వేయవద్దంటూ కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ మేమంతా రెక్కాడితే కానీ డొక్కాడని బడుగు జీవులమని, తీరంలో ఏర్పాటుచేసుకున్న గృహాలకు పంచాయతీ అధికారులు 20 ఏళ్ల కిందటే ఇంటి పన్నులు, విద్యుత్ మీటర్లు అమర్చారని తెలిపారు. చిన్న వ్యాపారాలు చేసుకుని జీవనం సాగిస్తున్నామని తెలిపారు. ఇప్పటికిప్పుడే ఇళ్లు ఖాళీచేసి ఇక్కడ నుంచి వెళ్లిపోమంటున్నారు. ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక అల్లాడిపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. మా గృహాలు పీకేస్తే మాకు ఆత్మహత్యలే శరణ్యమని పేర్కొన్నారు. మా ఇళ్లు కూల్చి మమ్ములను రోడ్డుపాలు చేయోద్దంటూ కలెక్టర్ను కోరారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి కూటమి ప్రభుత్వ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం బీసీల జనాభా దామాషా మేరకు రిజర్వేషన్లు, ఏబీసీడీ లుగా వర్గీకరించి చట్టబద్ధంగా అమలు జరపాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బాపట్ల రవికుమార్ కోరారు. బీసీ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు చట్టసభల్లో 33 శాతం, స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు జరపాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు మద్దిబోయిన తాతయ్య, యువజన కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివకుమార్, జిల్లా కార్యదర్శి మారం రవి కుమార్ పాల్గొన్నారు. బాపట్ల పట్టణం మూడో వార్డు పరిధిలోని రెల్లి కాలనీ వాసులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. వారు మాట్లాడుతూ తరతరాలుగా పారిశుద్ధ్య కార్మికులుగా జీవనం సాగిస్తున్నామని, మాకు కనీసం నివసించేందుకు గృహాలు కూడా లేకపోవడంతో అద్దె ఇళ్లల్లో, ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నామని తెలిపారు. మోంథా తుఫాన్కు కురిసిన వర్షాలకు గృహాలలోకి నీరు వచ్చిందని, నిలువనీడ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. రెండు సెంట్లు స్థలం ఇచ్చి, గృహాలు నిర్మించి ఇవ్వాలని కోరారు. -
ఎకరాకు రూ.10 వేలు నష్టం
దిగుబడితోపాటు ధర తగ్గించి అమ్మాల్సి రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎకరాకు కౌలు రూ.15 వేల నుంచి రూ.18 వేలు ఉండగా పెట్టుబడి రూ.25 నుంచి రూ.30 వేలు అవుతోంది. ఈ లెక్కన మొత్తం ఖర్చు రూ.50 వేలకు తగ్గడం లేదు. గతంలో ఎకరాకు 35 నుంచి 40 బస్తాలు దిగుబడి రాగా ఈ ఏడాది యూరియా కొరతతోపాటు అకాల వర్షాలతో 30 బస్తాలు మాత్రమే వస్తోంది. ప్రైవేటు వ్యాపారులకు రూ.1450 ప్రకారం అమ్ముకుంటే 30 బస్తాలకు రూ. 43,500 మాత్రమే వస్తోంది. పెట్టుబడి ఖర్చులు చూస్తే ఎకరాకు రూ.10 వేలకు తగ్గకుండా నష్టం వస్తుంది. బస్తా రూ.1792 చొప్పున ప్రభుత్వ మద్దతు ధరకు అమ్మితే ఎకరాకు రూ. 53,310 వస్తుంది. ప్రభుత్వ మద్దతు ధరకు అమ్మినా పెట్టుబడులు కూడా రావని కౌలు రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ధాన్యం తడవకుండా ప్లాస్టిక్ పట్టలు అందించి, ఆరబోసుకునేందుకు అవకాశం కల్పించడంతోపాటు, తక్కువ సమయంలో కొనేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంటున్నారు. -
హోరాహోరీగా రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలు
సింగరాయకొండ: ఏఆర్సీ అండ్ జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్–19 బాలబాలికల హ్యాండ్ బా ల్ పోటీలు సోమవారం హోరాహోరీగా జరిగాయి. ఈ పోటీల్లో 13 జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు. లీగ్ దశలో జరిగిన 30 మ్యాచ్ల్లో బాలబాలికలు పోటాపోటీగా పాల్గొన్నారు. లీగ్ మ్యాచ్లలో బాలు ర విభాగంలో పూల్ ‘సి’లో విన్నర్స్గా విశాఖపట్నం, రన్నర్స్గా కర్నూలు, పూల్ ‘డి’లో విన్నర్గా కడప, రన్నర్గా చిత్తూరు, బాలికల విభాగంలో పూల్ ‘బి’లో విన్నర్గా కడప, రన్నర్గా ప్రకాశం, పూల్ ‘సి’లో విన్నర్గా పశ్చిమ గోదావరి, రన్నర్గా విజయనగరం, పూల్ ‘డి’లో విన్నర్గా కృష్ణా, రన్నర్గా గుంటూరు జట్లు నిలిచాయి. ● మిగిలిన పూల్ విభాగాల్లో జరగాల్సిన పోటీలను మంగళవారం ఉదయం నిర్వహించి క్వార్టర్ ఫైన ల్స్, సెమీ ఫైనల్స్ను మధ్యాహ్నానికి పూర్తి చేసి సా యంత్రానికి ఫైనల్స్ నిర్వహించనున్నట్లు టోర్న మెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.శంకర్రావు, అండర్–19 కార్యదర్శి చింపారెడ్డి తెలిపారు. ఎస్సై బీ మహేంద్ర, డీఐఈఓ కే ఆంజనేయులు ఉన్నారు. -
అండర్–14 యోగా రాష్ట్రస్థాయి విజేత ప్రకాశం
జె.పంగులూరు: మండల పరిధిలోని చందలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు రోజుల నుంచి 69వ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ అండర్–14, అండర్–17, అండర్–19 విభాగాల్లో యోగా పోటీలు జరుగుతున్నాయి. రెండో రోజు సోమవారం అండర్ 14,17 విభాగాల్లో బాలబాలికలకు సంబంధించి యోగా పోటీల విజేతలను ప్రకటించారు. మరో రెండు రోజుల పాటు అండర్–19 విభాగంలో యోగా పోటీలు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పాఠశాల హెచ్ఎం గిరిజ ఆధ్వర్యంలో విజేతలు బహుమతులు అందజేశారు. విజేతల వివరాలు.. ● అండర్–14 ట్రెడిషనల్ యోగా బాలికలు విభాగంలో ఎన్.శృతి (ప్రకాశం) మొదటి స్థానం సాధించి జాతీయ స్థాయి యోగా పోటీలకు ఎంపికై ంది. కృష్ణా జిల్లాకు చెందిన జి.శ్రావణి రెండో స్థానం, చిత్తూరు జిల్లాకు చెందిన కె.తేజశ్రీ మూడో స్థానం సాధించారు. ● అండర్–14 ట్రెడిషనల్ యోగా విభాగంలో బాలురకు సంబంధించి కృష్ణా జిల్లాకు చెందిన సురేంద్ర మొదటి స్థానం సాధించి జాతీయ స్థాయి యోగా పోటీలకు ఆర్హత సాధించాడు. గుంటూరు జిల్లాకు చెందిన కౌషిక్ రెండో స్థానం, పశ్చిమ గోదావరికి చెందిన ఆర్. విక్రమాధిత్య మూడో స్థానం సాధించాడు. ● అండర్–17 ట్రెడిషనల్ బాలుర విభాగంలో తూర్పు గోదావరికి చెందిన క్రాతిక్ రామ్ మొదటి స్థానం, గుంటూరుకు చెందిన కె.సంపత్ రెండో స్థానం, వైజాగ్కు చెందిన పి.దేవాష్ మూడో స్థానం సాధించారు. ● అండర్–14 ఆర్టిస్టిక్ యోగా ఫైర్ బాలికల విభాగంలో ప్రకాశం జిల్లాకు చెందిన కుంచాల హెప్సిబా, నాయపాము శృతి మొదటి స్థానం, తూర్పు గోదావరికి చెందిన పి.హసిని, ఎం.శ్రీవల్లి రెండో స్థానం, అనంతపురానికి చెందిన కె.మోక్షిత, కె.మోహిత మూడో స్థానం సాధించారు. ● అండర్–17 రిథమిక్ యోగా ఫైర్ బాలికల విభాగంలో విశాఖపట్నంకు చెందిన వాసవి, కౌశల్య మొదటి స్థానం, ప్రకాశానికి చెందిన భవ్యశ్రీ, లిఖిత రెండో స్థానం, తూర్పు గోదావరికి చెందిన జంగీలాబీ, పావని మూడవ స్థానం సాధించారు. ● అండర్–17 రిథమిక్ యోగా ఫైర్ బాలుర విభాగంలో కర్నూల్కు చెందిన తులసి సాయి, షాహిద్ అప్రిద్ మొదటి స్థానం, కడపకు చెందిన ప్రశాంత్, లక్ష్మణ్ రెండో స్థానం, ప్రకాశానికి చెందిన మహేష్, మిల్టన్ మూడో స్థానం సాధించారు. ● అండర్–17 ట్రేడిషనల్ యోగా బాలికల విభాగంలో పశ్చిమ గోదావరికి చెందిన భవాని చౌదరి, తూర్పు గోదావరికి చెందిన ఛైత్రశివ వాసుకి రెండవ స్థానం, అనంతపురానికి చెందిన భరణి మూడో స్థానం సాధించారు. విజేతలకు అధికారులు, ప్రజాప్రతినిధులు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ సింగారావు, ఎంపీడీఓ స్వరూపారాణి, ఎస్సై వినోద్బాబు, ఎంఈఓ వీరాంజనేయులు, గ్రామస్తులు కె.హనుమంతురావు, పూర్ణచంద్రరావు, రాజకుమార్, రామలింగస్వామి, ఉర్మిళదేవి, సుబ్బయ్య పాల్గొన్నారు. -
కారుణ్య మరణం కోరిన శేషగిరమ్మ ఇంటికి వైద్యుల బృందం
తాడికొండ: రాజధానిలో కారుణ్య మరణం కోరిన నెల్లూరి శేషగిరమ్మ ఇంటికి సోమవారం 10 మంది వైద్యుల బృందం వెళళళ్లి ఆమెను పరిశీలించారు. శేషగిరమ్మ మనవరాలు చెరుకూరి శ్యామల శాశ్వత అంగవైకల్యంతో బాధపడుతుండటంతో ఆమెకు గత నెల 90 శాతం అంగవైకల్యం ఉన్నట్లు ధ్రువీకరణ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ క్రమంలోనే ఆమెకు రూ.6 వేల పింఛన్ అందజేశారు. దీనిపై వైద్యుడిని నేరుగా తమ ఎదుట హాజరుకావాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే జీజీహెచ్ వైద్య బృందం సోమవారం వృద్ధురాలి గృహాన్ని సందర్శించారు. -
ఉత్సాహంగా అస్మిత అథ్లెటిక్స్
పెదకాకాని: క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనపరచడం ద్వారా జీవితంలో ఉన్నత శిఖరాలను అదిరోహించవచ్చని మంగళగిరి రూరల్ ఎస్ఐ సీహెచ్ వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సోమవారం అండర్ 14, 16 బాలికలకు అస్మిత అథ్లెటిక్స్ లీగ్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా క్రీడాభివృద్ధి అధికారి అఫ్రోజ్ఖాన్, ఎస్ఐ వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ క్రీడలు క్రమశిక్షణ కూడిన జీవితాన్ని ఇస్తాయన్నారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి అప్రోజ్ఖాన్ మాట్లాడుతూ అథెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సహకారంతో జిల్లాలో అథ్లెటిక్స్ లీగ్ నిర్వహించటం ఆనందదాయకమన్నారు. క్రీడల్లో బాలికలు అధిక సంఖ్యలో పాల్గొనేవిధంగా ప్రభుత్వం ఈ లీగ్లు నిర్వహించి బాలికలను ప్రోత్సహిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బాలికలు ముందంజలో ఉండాలని కోరారు. గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో అథ్లెటిక్ అసోసియేషన్ గుంటూరు జిల్లా కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్, అంతర్జాతీయ క్రీడాకారుడు కె.కృష్ణమోహన్, జిల్లా అథ్లెటిక్స్ సంఘం చైర్మన్ జి.శేషయ్య, కోచ్లు ఎస్ శివారెడ్డి, వెంకటేశ్వర్లు కె.రవి, కె.అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏఎన్యూలో ముగిసిన ఒక్కరోజు క్రీడా పోటీలు -
తక్కువ ధరకే బంగారమంటూ మోసం
నగరంపాలెం: తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామని మోసగించారంటూ ఓ టీడీపీ ఎంపీటీసీతో సహా పలువురు బాధితులు జిల్లా ఏఎస్పీ వద్ద వాపోయారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించారు. బాధితుల నుంచి జిల్లా ఏఎస్పీ (పరిపాలన) జీవీ రమణమూర్తి అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదిదారుల సమస్యలను ఆలకించిన పోలీసు ఉన్నతాధికారులు సంబంధిత స్టేషన్ ఆఫీసర్లతో మాట్లాడారు. చట్ట పరిధిలో బాధితుల సమస్యలకు పరిష్కారం చూపాలని ఆదేశించారు. డీఎస్పీలు బెల్లం శ్రీనివాసరావు (ట్రాఫిక్), శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్), మధుసూదనరావు (సీసీఎస్)లు అర్జీలు స్వీకరించారు. పీజీఆర్ఎస్లో బాధితుల ఫిర్యాదు అర్జీలు స్వీకరించిన జిల్లా ఏఎస్పీ రమణమూర్తి -
కమిషన్తో సమగ్ర కులగణన చేపట్టాలి
నరసరావుపేట: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల జనాభా దామాషా మేరకు చట్టబద్ధ రిజర్వేషన్లు అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం ముందుగా డెడికేటెడ్ కమిషన్ ద్వారా సమగ్ర కుల గణన జరిపించాలని బీసీ సంక్షేమ సంఘ నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ వరకు ప్రదర్శన చేసి, పీజీఆర్ఎస్లో కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నల శ్రీను మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల వాగ్దానం మేరకు బీసీలకు చట్టసభలలో 33 శాతం, స్థానిక సంస్థలలో 34 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేయాలన్నా, ముందుగా డెడికేటెడ్ కమిషన్ ద్వారా సమగ్రంగా బీసీ కులాల జనగణన జరిపించాలని ఆయన కోరారు. 139 బీసీ కులాల్లో ఎవరెంతో తెలియకుండా రిజర్వేషన్లు అమలు జరుపుతారని ఆయన ప్రశ్నించారు. బీసీల జనాభా దామాషా మేరకు రిజర్వేషన్లు అమలు జరిపి సామాజిక న్యాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు నాగారపు గురు ఆంజనేయులు, యువజన అధ్యక్షులు సుతారం విశ్వేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు సరికొండ తిమ్మరాజు, తన్నీరు వెంకట్, ముదిరాజ్, జిల్లా నాయకులు బి.శ్రీనివాసరావు, శీలం వెంకట్రావు పాల్గొన్నారు. -
10న సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయం ముట్టడి
గుంటూరు ఎడ్యుకేషన్: సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలని ఏపీ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు ఎస్.ప్రకాష్, కోశాధికారి ఎం.గంగరాజు డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం గుంటూరు జిల్లా సమగ్రశిక్ష జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు జిల్లా కలెక్టరేట్ ఎదుట పోరాట దీక్ష పేరుతో ధర్నా నిర్వహించారు. ఎస్.ప్రకాష్, ఎం.గంగరాజు, ఉపాధ్యక్షుడు కె.కిరణ్కుమార్ మాట్లాడుతూ 21 రోజుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం రాసి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 10న సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చినట్లు తెలిపారు. పెరిగిన ధరలకు అనుగుణంగా అన్ని కేటగిరీల్లో ఉద్యోగులకు వేతన పెంపుతోపాటు ఎంటీఎస్, హెచ్ఆర్ పాలసీ అమలు, ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. ఒడిశా, పంజాబ్, కేరళ ప్రభుత్వాల మాదిరిగా మన రాష్ట్రంలోనూ సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలన్నారు. గతంలో జోవో 3 ప్రకారం పీఆర్సీ ఆఖరి స్కేల్ వేతనాలు చెల్లించిన విధంగా ప్రస్తుత పీఆర్సీ ప్రకారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్షా పథకానికి కేటాయించాల్సిన 40 శాతం నిధులను బడ్జెట్లో కేటాయించాలని డిమాండ్ చేశారు. పార్ట్ టైం ఉద్యోగులను ఫుల్ టైమ్గా మార్చి, ఇతర జిల్లాల్లో సీఆర్పీలను వందల కిలోమీటర్ల దూర ప్రాంతాలకు బదిలీ చేయడాన్ని నిలిపివేయాలని, లేని పక్షంలో పోరాటాలకు సిద్ధపడతామని హెచ్చరించారు. జాబ్ చార్ట్ ప్రకారం సాయంత్రం 5.00 గంటల తరువాత వెబినార్ల పేరుతో వేధింపులు మానుకోవాలన్నారు. అనంతరం గ్రీవెన్స్లో వినతిపత్రం సమర్పించారు. ఉద్యోగుల ధర్నాకు యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు యు.రాజశేఖర్ మద్దతు తెలిపారు. ధర్నాలో జిల్లా నాయకులు సంధ్య, అరుణ్, మాబు సుభానీ, మాధురి, మణి, పార్వతి, వినోద్, సుజిత్, చలపతి, చంద్ర, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
28న ప్రభుత్వ వైద్యుల సంఘ కార్యాలయం ప్రారంభం
గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘం (ఏపీ జీడీఏ) కేంద్ర కార్యాలయాన్ని ఈనెల 28న గుంటూరు కన్నావారితోట 4వ లైనులో ప్రారంభిస్తున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ డి.జయధీర్బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బి.రమేష్కుమార్లు తెలిపారు. కేంద్ర కార్యాలయాన్ని కర్నూలు మెడికల్ కాలేజ్ రిటైర్డ్ ఈఎన్టీ ప్రొఫెసర్ డాక్టర్ మహేంద్ర, అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభిస్తారన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమానికి సంఘ సభ్యులంతా హాజరు కావాలని రాష్ట్ర కోశాధికారి డాక్టర్ పి.జె.శ్రీనివాస్ కోరారు. కత్తిపోట్లకు గురైన మహిళ మృతి తెనాలిరూరల్: సహజీవనం చేస్తున్న వ్యక్తి చేతిలో కత్తి పోట్లకు గురైన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. తెనాలి రామలింగేశ్వరపేట రైస్ కాలనీలో ఈ నెల 21వ తేదీన కూరగాయల వ్యాపారం చేసే కందుకూరి ఉషపై ఆమెతో సహజీవనం చేస్తున్న విజయ్ కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన సంగతి తెలిసిందే. తీవ్రంగా గాయపడిన ఉష గుంటూరు సమగ్ర వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వైద్యశాల నుంచి సోమవారం వచ్చిన సమాచారం మేరకు హత్యాయత్నం కేసును హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేస్తున్నట్టు తెనాలి పోలీసులు తెలిపారు. లింగాపురంలో ఘర్షణ ఇద్దరికి గాయాలు మాచర్ల రూరల్: మండలంలో పరస్పర దాడిలో ఇద్దరు వ్యక్తులు గాయపడిన సంఘటన మండలంలోని లింగాపురంలో సోమవారం చోటుచేసుకుంది. రూరల్ పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జింకల వెంకటేశ్వర్లు, రాగి నాగేశ్వరరావు మధ్య చిన్న ఘర్షణ ఏర్పడి, ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇద్దరికీ గాయాలయ్యాయి. వీరిని మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. ఈ మేరకు రూరల్ ఎస్ఐ సంధ్యారాణి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు ఢీకొని మహిళకు గాయాలు.. వేగంగా వెళ్తున్న కారు ఢీకొని పశువుల కాపరి తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని కంభంపాడులో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కె. రమణమ్మ పొలం నుంచి పశువులను తోలుకొని ఇంటికి వెళ్తుండగా, గ్రామ శివారులో వేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టింది. దీంతో రమణ తల, కాలుకు గాయాలయ్యాయి. మాచర్ల ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించి, మెరుగైన చికిత్స కోసం నర్సరావుపేటకు తరలించారు. ఈ మేరకు రూరల్ ఎస్ఐ సంధ్యారాణి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పరిశ్రమలకే ‘కొమ్ము’మూరు లిఫ్ట్
● దిగువ రైతుల ప్రయోజనాలకు గండి ● ఫిర్యాదులు అందినా మారని చంద్రబాబు ప్రభుత్వం ● అంచనాలను సర్కారు ముందుంచిన అధికారులు ● 6 లక్షల మందికి తాగునీటి కష్టాలు తలెత్తే అవకాశం కొమ్మమూరు కాలువపై గుంటూరు జిల్లా చినకాకుమాను వద్ద రూ. 22.88 కోట్లతో ఎత్తిపోతల పథకం నిర్మించాలన్న చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయం మరింత వివాదాస్పదంగా మారుతోంది. ఈ పథకం రైతుల అవసరాల కోసం కాకుండా అక్కడ ఏర్పాటు చేయబోయే పరిశ్రమలకు నీటిని తరలించేందుకేనన్న ప్రచారం జోరుగా సాగుతోంది. చంద్రబాబు ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలున్న కొందరు పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసమే ఇలా చేస్తున్నట్లు అధికారవర్గాల నుంచే సమాచారం వస్తోంది. -
బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్కు అదనపు బాధ్యతలు
ఏఎన్యూ(పెదకాకాని): అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో సోమవారం నుంచి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం క్రీడా మైదానంలో గుంటూరు జిల్లా అస్మిత అథ్లెటిక్స్ లీగ్ అండర్ 14, అండర్ 16 బాలికల విభాగంలో ఎంపికలు జరుగుతాయని సంఘం కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్ తెలిపారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన బాలికలను ఎంపిక చేసి దేశవ్యాప్తంగా జరిగే పోటీలకు ఎంపిక చేస్తారన్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఉదయం 9 గంటలకు వయసు ధ్రువీకరణ పత్రంతోపాటు ఆధార్ కార్డు తీసుకొని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సింథటిక్ ట్రాక్లో రిపోర్ట్ చేయాలని తెలిపారు. మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆదివారం రూ. 8,93,575 ఆదాయం వచ్చినట్లు డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని కానుకలు చెల్లించుకున్నారు. వివిధ సేవా టికెట్ల రూపంలో వచ్చిన ఆదాయ వివరాలను డీసీ వివరించారు. స్వామివారికి సేవా టికెట్ల ద్వారా రూ. 4,79,552, లడ్డూ ప్రసాదం ద్వారా రూ. 1,85,725, నిత్యాన్నదాన పథకంలో రూ. 1,04,456, శాశ్వత అన్నదానం ద్వారా రూ. 50,812, స్వామివారి కల్యాణ కట్ట టికెట్ల ద్వారా రూ. 37,040, స్వామివారి దర్శనం ద్వారా రూ. 34,850 కలిపి మొత్తం ఆదాయం రూ. 8,93,552 వచ్చినట్లు ఆయన చెప్పారు. -
యంత్రాల కోతవైపే రైతుల మొగ్గు
చెరుకుపల్లి: ఈ ఏడాది ఖరీఫ్ వరి సేద్యం చివరి అంకానికి చేరుకుంది. దీంతో పలు గ్రామాల్లో వరి కోతలు ఊపందుకున్నాయి. కొద్ది రోజులుగా రైతులు హార్వెస్టర్, యంత్రాలతో కోతలు కోస్తున్నారు. వరి కోత పనులు యంత్రాలతో చేయటం ద్వారా సమయంతోపాటు కూలీల ఖర్చు కూడా తగ్గుతుందని రైతులు చెబుతున్నారు. కూలీలతో కోతకు ఎకరాకు రూ.4 వేలు, ఓదెలకు రూ.800, కుప్ప వేసేందుకు రూ.4 వేలు, నూర్పిడికి రూ. 6 వేలు వంతున ఖర్చు అవుతుంది. అదే యంత్రంతో కోతకు సుమారు రూ. 4 వేల వరకు ఖర్చు అవుతుందని రైతులు చెబుతున్నారు. ధాన్యం వెంటనే విక్రయించే వీలుంటుందని, అందుకే ఎక్కువ శాతం మంది ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. హెచ్చరికతో ముమ్మరం గతంలో ఎన్నడు లేని విధంగా రైతులు ఎక్కువ శాతం వరికోత యంత్రాల వైపే మొగ్గు చూపుతున్నారు. పంట చేతికందే ప్రస్తుత దశలో వరుస వాయుగుండ హెచ్చరికలతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. అందుకే వెంటనే యంత్రాలతో కోసి ధాన్యాన్ని విక్రయించేస్తున్నారు. పశుగ్రాసానికి కొరత యంత్రాలతో కోత వల్ల రానున్న రోజుల్లో పశుగ్రాసానికి కొరత ఏర్పడుతుందని పశు పోషకులు అంటున్నారు. వరి దుబ్బులను సగానికి పైగా వదిలేసి యంత్రాలు కోస్తాయి. దీంతో ఎండు గడ్డి పరిమాణం బాగా తగ్గుతుంది. దీనికి తోడు ధాన్యం నూర్చటం వల్ల గడ్డి పూర్తిగా నలిగి బయటకు వస్తుంది. కోసిన గడ్డి యంత్రాల చక్రాల కింద నలిగిపోయి బురద అంటుకుంటుంది. ఈ గడ్డిని తినటానికి పశువులు ఆసక్తి చూపవు. చేను పూర్తిగా ఆరిపోతే మిషన్తో కోసిన గడ్డిని కూడా కొంతమంది యంత్రాయ సాయంతోనే ఉండలుగా చుట్టించి నిల్వ చేసుకుంటున్నారు. పశువుల మేతకు వాడుతున్నారు. -
రసవత్తరంగా కోడిపోరు
కారెంపూడి: పల్నాటి రణక్షేత్రం కారెంపూడిలో జరుగుతున్న పల్నాటి వీరారాధన ఉత్సవాలలో భాగంగా శనివారం వీరుల గుడి ఆవరణలో కోడిపోరు నిర్వహించారు. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సినీ నిర్మాత బండ్ల గణేష్ పాల్గొన్నారు. ముందుగా వీర విద్యావంతులు కోడిపోరు కథాగానం చేశారు. తర్వాత బండ్ల గణేష్ ఒక పుంజును మరొకరు మరో పుంజును బరిలోకి వదిలారు. ఒకటి బ్రహ్మనాయుడు పుంజు చిట్టిమల్లుగా, మరొకటి నాగమ్మ పుంజు శివంగిడేగగా వీరవిద్యావంతులు అభివర్ణించారు. రెండు పందేలలో బ్రహ్మనాయుడు పుంజు గెలిచిందని మూడో పందెంలో బ్రహ్మనాయుడు పుంజు ఓడిందని ప్రకటించారు. పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ బ్రహ్మనాయుడు పాత్రలో మరో ఆచారవంతుడు నాయకురాలు నాగమ్మ పాత్రను పోషించారు. రణక్షేత్రంలో గ్రామోత్సవాల సందడి వీరుల ఆయుధాలతో వీరాచారులు పౌరుషంతో ఊగిపోయారు. అలనాటి వీరుల ఆయుధాలతో వీరంగమాడారు. కత్తులతో విన్యాసాలు చేశారు. కత్తులతో గుండెలపై బాదుకుంటూ రగిలిపోయారు. మహిళలు పూనకాలతో ఊగిపోయారు. వీరుల ఆయుధాలను వారిపై వాల్చి వారి ఆవేశాన్ని తగ్గించారు. పాత కారెంపూడి బజార్లన్నింటిలో గ్రామోత్సవాలు కొనసాగాయి. గ్రామస్తులంతా ప్రతి ఇంటి వద్ద వారు పోసి కొబ్బరికాయలు కొట్టి పూల దండలు వేసి వీరులకు నీరాజనాలు పలికారు. వీరాచారులు ఆయుధాలను వారిపై వాల్చి ఆశీర్వాదం అందించారు. ఉదయాన్నే వీరుల గుడి నుంచి గ్రామోత్సవాలు ప్రారంభమయ్యాయి. చెన్నకేశవస్వామిని దర్శించుకుని అనంతరం ఆలయం బయట ఉన్న బ్రహ్మనాయుడు విగ్రహం వద్ద కత్తి సేవలు చేసుకున్నారు. తర్వాత వీర్ల అంకాలమ్మ తల్లిని దర్శించుకుని అక్కడ కూడా కత్తి సేవలు కొనసాగించారు. తర్వాత నుంచి గ్రామోత్సవానికి వీరుల ఆయుధాలు బయలుదేరాయి. మొదట తోట బజారులో ఉన్న బ్రహ్మనాయుడు మేడ వద్దకు ఆయుధాలన్నీ తరలివెళ్లాయి. అక్కడ కూడా సంప్రదాయ కత్తి విన్యాసాలు చేశారు. ఆ ప్రాంత వాసులంతా పల్నాటి వీరులకు నీరాజనాలు పట్టారు. రాత్రి వరకు ఆ బజారులోనే వీరుల ఆయుధాలు ప్రతి గడప నుంచి పూజలందుకున్నాయి. గ్రామోత్సవం పూర్తయ్యే సరికి అర్థరాత్రి దాటే అవకాశం కన్పిస్తోంది. కోట బురుజు సమీపంలో ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి హారతులిచ్చారు. ఉదయాన్నే వీరాచారులు పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ ఆశీర్వాదం తీసుకుని ఆ తర్వాత నుంచి గ్రామోత్సవాలు నిర్వహించారు. ఇదిలా ఉంటే మహిళలు పెద్ద ఎత్తున పొంగళ్లు చేసుకుని అంకాలమ్మ తల్లి చెన్నకేశవస్వామిలకు నైవేద్యం అర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వీరాచారులతో పాటు ప్రజలు కూడా వేలాదిగా ఉత్సవానికి తరలివచ్చారు. ఉత్సవాల్లో పాల్గొన్న ఎంపీ పల్నాటి ఉత్సవాలలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ పాల్గొన్నారు. వీరుల గుడిలో ఆయుధాలకు పూజలు చేశారు. కోడిపోరు ప్రదర్శన ముగిసిన అనంతరం ఎడ్ల పోటీలను వారు ప్రారంభించారు.ఐదు రోజులుగా జరుగుతున్న పల్నాటి వీరారాధన ఉత్సవాలు ఆదివారంతో ముగియనున్నాయి. కళ్లిపాడు నాడు వీరుల ఆయుధాలు కళ్లి పోతురాజు మండపం వద్ద కళ్లికి ఒరగడంతో ఉత్సవాలను ముగించి వీరాచారులు స్వగ్రామాలకు పయనం కానున్నారు. -
మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు
చెరుకుపల్లి: రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో విక్రయించి మద్దతు ధర పొందాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వి.వినోద్ కుమార్ పేర్కొన్నారు. మండల పరిధిలోని గూడవల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం అధికారులతో కలిసి కలెక్టర్ సందర్శించారు. అనంతరం రైతు సేవ కేంద్రంలో గోనె సంచులు, టార్పాలిన్ పట్టల అందుబాటుపై ఆరా తీశారు. మండల వ్యవసాయ అధికారి ఫరూఖ్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ చెరుకుపల్లి మండలంలో 7 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. తేమ శాతాన్ని పరీక్షించి బాగుంటే వెంటనే రిజిస్టేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారని తెలిపారు. దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రోషన్ జమీర్ బాషా, డీఎం కె.శివపార్వతి, తహసీల్దార్ సీహెచ్ పద్మావతి, ఎంపీడీవో షేక్ మహబూబ్ సుభాని, గూడవల్లి పీఏసీఎస్ చైర్మన్ ఆలపాటి నరేంద్ర బాబు, రేపల్లె మార్కెట్ యార్డు డైరెక్టర్ గోగినేని సురేష్, మల్లాది రామకృష్ణ, గడ్డిపాటి వెంకట్, పంచాయతీ కార్యదర్శి సురేష్ బాబు, కేజీఏ శ్రీనివాసన్, ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు. రైతులను ఇబ్బంది పెట్టొద్దు ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బంది లేకుండా పారదర్శకతతో కొనుగోలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. శనివారం స్థానిక కలెక్టరేట్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... జిల్లాలో 2.91 లక్షల ఎకరాలలో 1.66 లక్షల మంది రైతులు వరి సాగు చేశారన్నారు. 2 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. ఆన్లైన్ ద్వారా మిల్లులు, రైతులను అనుసంధానిస్తున్నట్లు చెప్పారు. 117 కొనుగోలు కేంద్రాలను ఆర్ఎస్కేలలో ఇప్పటికే ప్రారంభించామన్నారు. గతేడాదిలో 90 వేల టన్నులు మాత్రమే రైతుల నుంచి కొనుగోలు చేశామన్నారు. 73373 59375 వాట్సాప్ నెంబర్కు హాయ్ అని పంపితే స్లాట్ బుక్ చేస్తారన్నారు. 17 శాతం కంటే తక్కువ తేమ ఉండేలా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. వరకట్న వేధింపులు నేరం వరకట్నం కొరకు వేధించినా, నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. వరకట్న వేధింపుల నిరోధక చట్టం అమలు తీరుపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం శనివారం స్థానిక కలెక్టరేట్లో జరిగింది. 2025లో ఇప్పటివరకు 201 కేసులు నమోదు కాగా, ఇద్దరు హత్యకు గురయ్యారని తెలిపారు. మూడేళ్లలో మొత్తంగా 655 కేసులు నమోదయ్యాయన్నారు. వీటిలో ఏడుగురు మృతి చెందగా, 9 మంది హత్యకు గురయ్యారన్నారు. సాధారణ అంగన్వాడీలుగా మినీ కేంద్రాలు మినీ అంగన్వాడీ కేంద్రాలను ఇక సాధారణ కేంద్రాలుగా మార్పు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల విలీనంపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం శనివారం స్థానిక కలెక్టరేట్లో జరిగింది. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు మరిన్ని సేవలు అందించే క్రమంలో మినీ అగన్వాడీ కేంద్రాలను ఇలా మార్పు చేస్తున్నామని కలెక్టర్ అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 16 కేంద్రాలను అప్గ్రేడ్ చేస్తున్నామన్నారు. మినీ కేంద్రాల కార్యకర్తలకు గౌరవ వేతనం రూ.ఏడు వేలు ఇస్తుండగా, మార్పు తర్వాత రూ.11,500 అందుకుంటారని తెలిపారు. మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ రాధామాధవి, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.విజయమ్మ, డీఈఓ పురుషోత్తం, బాపట్ల ఆర్డీవో పి.గ్లోరియా తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ -
చట్టాలపై అవగాహన అవసరం
చేబ్రోలు: విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంపొందించుకుని, దేశానికి బలమైన స్తంభాలుగా ఎదగాలని గుంటూరు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. సంవిధాన దివాస్ సందర్భంగా ‘కాన్ట్సిట్యూషన్ వీక్ సెలబ్రేషన్స్–2025’లో భాగంగా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలోని విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లా, గుంటూరులోని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీల సంయుక్త ఆధ్వర్యంలో ఎన్ఏఎల్ఎస్ఏ నూతన మాడ్యూల్ – అవగాహన శిబిరంను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసంఘటిత రంగ కార్మికుల హక్కులు, డ్రగ్ దుర్వినియోగ నివారణ, మోటార్ వాహనాల చట్టం–1988, యాంటీ ర్యాగింగ్ వంటి సామాజిక మరియు న్యాయ సంబంధిత కీలక అంశాలపై నిపుణులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ చట్టాల మీద ప్రతి పౌరుడికి అవగాహన ఉండటం అత్యంత ముఖ్యమన్నారు. చట్టాలను తెలుసుకోవడం వల్లే తమ హక్కులు, బాధ్యతలు ఏంటో ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకోగలరని చెప్పారు. ప్రతి భారతీయుడికి భారత రాజ్యాంగం మన హక్కులు, స్వేచ్ఛలు, విలువలను కాపాడే జీవనశైలిని నేర్పుతుందని వివరించారు. -
సూర్యలంకలోని హరిత రిసార్ట్స్ను అభివృద్ధి చేస్తాం
చైర్మన్ డాక్టర్ నూకసాని బాపట్ల: సూర్యలంకలోని హరిత రిసార్ట్స్ను ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ శనివారం పరిశీలించారు. రిసార్ట్స్లో లభ్యమయ్యే వసతి సదుపాయాలు, బీచ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలు, పర్యాటకులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన సూర్యలంకను ఆకర్షణీయమైన పర్యాటక గమ్యస్థానంగా అభివృద్ధి చేయడానికి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. రిసార్ట్స్ సౌకర్యాల విస్తరణ, భద్రతా ఏర్పాట్ల మెరుగుదల, పర్యాటకులను ఆకట్టుకునే ప్రత్యేక ప్యాకేజీల రూపకల్పనపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. వారాంతాలు, సెలవుదినాల్లో పెరిగే పర్యాటక రద్దీ దృష్ట్యా సేవల నాణ్యత, పరిశుభ్రత, జనసంచారం నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పేర్కొన్నారు. పరిశీలన కార్యక్రమంలో టూరిజం శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. టోల్ వసూలుపై అసంతృప్తి సూర్యలంక రిసార్ట్స్కు వెళ్తున్న చైర్మన్ వాహనాన్ని టోల్ వసూలు పేరుతో నిలిపివేయడంపై అసంతృప్తికి వ్యక్తం చేశారు. టూరిజం ప్రాంతానికి వచ్చే వాహనాలపై టోల్ వసూలు చేయడం సరికాదని, ఈ అంశంపై జిల్లా కలెక్టర్తో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. పంచాయతీ సిబ్బంది టోల్ వసూలు చేస్తున్నారన్న విషయంపై ఎలా వసూలు చేస్తున్నారు, దానికి ఆధారం ఏమిటో తెలుసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. -
బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో ధర్మతేజకు పట్టా
మార్టూరు: గత దశాబ్దకాలంగా వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు సాధించిన మండలంలోని ద్రోణాదుల గ్రామానికి చెందిన పెంట్యాల ధర్మతేజ మరో అరుదైన ఘనత సాధించారు. అమెరికాకు చెందిన అట్లాంటా యూనివర్సిటీ నుంచి ధర్మ తేజ ఈనెల 21వ తేదీ డాక్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పట్టా అందుకున్నారు. ఈ సందర్భంగా ధర్మతేజ విలేకరులతో మాట్లాడుతూ.. అంతర్జాతీయ వ్యాపార ధోరణులు, వ్యాపార వ్యూహాలు, సృజనాత్మక నాయకత్వాన్ని సమ్మేళనం చేస్తూ తాను సమర్పించిన వ్యాసాలకుగాను అడ్మినిస్ట్రేషన్ పట్టా అందుకున్నట్లు తెలిపారు. అట్లాంటా కాలేజ్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఆన్లైన్లో నిర్వహించిన కార్యక్రమంలో తనకు ప్రదానం చేసినట్లు వివరించారు. అట్లాంటా యూనివర్సిటీ నుంచి అందుకున్న ద్రోణాదుల యువకుడు -
కార్టూనిస్ట్ సుభానీకి అరుదైన గౌరవం
కారంచేడు: పొలిటికల్ కార్టూనిస్టు సుభాని షేక్కి అరుదైన గౌరవం దక్కింది. హైదరాబాద్లోని(ఆత్రేయపురం) బాపు రమణ అకాడమీ వారు సుభానీ ప్రతిభను గుర్తించి బాపు అవార్డును ప్రకటించింది. వివరాలు.. కారంచేడు గ్రామంలో 1961లో జన్మించారు. ప్రాథమిక విద్యను కారంచేడులోను, కాలేజ్ విద్యను సమీపంలోని చీరాలలో పూర్తి చేశారు. మాస్టర్స్ డిగ్రీని గుజరాత్లో పూర్తి చేశారు. చిన్నతనం నుంచి కార్టూన్లపై ఉన్న మక్కువతో ఆయన హైదరాబాద్లోని ఆంధ్ర భూమి వారపత్రికలో 1985లో జాయిన్ అయ్యారు. 1988 వరకు అక్కడే ఉన్న ఆయనను 1991లో వరకు పొలిటికల్ కార్టూనిస్ట్గా విధులు నిర్వహించారు. అక్కడ నుంచి సౌత్ ఇండియాలోనే ఎక్కువ సర్క్యులేషన్ కలిగిన దక్కన్ క్రానికల్ దినపత్రికలో కార్టూనిస్ట్గాను, తరువాత కార్టూన్ ఎడిటర్గాను అంచలంచలుగా ఎదిగారు. 40 సంవత్సరాల తన సర్వీస్లో ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. డిసెంబర్ 15వ తేదీన హైదరాబాద్లోని నాంపల్లి తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో ఈ అవార్డును ఆయన అందుకోనున్నారు. -
ఆన్లైన్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు
ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు మంగళగిరి టౌన్: ఆన్లైన్ యాప్ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టురట్టయింది. మంగళగిరిలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్లో బెట్టింగ్లకు పాల్పడుతున్న ఐదుగురు ముఠా సభ్యులను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 5 ల్యాప్టాప్లు, 32 సెల్ఫోన్లు, 22 బ్యాంక్ ఖాతా పుస్తకాలు, 11 చెక్ బుక్కులు, 30 ఏటీఎం కార్డులతో పాటు కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నార్త్ సబ్డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ శనివారం వెల్లడించారు. మంగళగిరి మండల పరిధిలోని చినకాకాని గ్రామం ఎన్ఆర్ఐ ఆసుపత్రి వెనుక ఉన్న ఎస్వీఎన్ రెసిడెన్సీలోని ఓ ఫ్లాట్లో ఆన్లైన్ బెట్టింగ్ జరుగుతోందంటూ సమాచారం రావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్ఐ వెంకట్ తన సిబ్బందితో 17వ తేదీ సాయంత్రం దాడిచేశారు. ఫ్లాట్లో ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ చేస్తున్న కొక్కిలిగడ్డ యేసన్నను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అక్కడేఉన్న బాలు, ప్రవీణ్, సూర్య అనే ముగ్గురు పారిపోయారు. ఈ ముగ్గురితో పాటు మనో (మనోహర్)ను మంగళగిరి ఎన్ఆర్ఐ వై.జంక్షన్ వద్ద శనివారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. భారీగా ఫేక్ బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేస్తూ బెట్టింగ్ వెబ్సైట్కు లింక్ చేసి క్రికెట్ బెట్టింగ్ద్వారా ఆర్ధిక నేరాలకు బెట్టింగ్ ముఠా సభ్యులు పాల్పడుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ కేసులో మనో (మనోహర్)ను ప్రధాన నిందితుడిగా గుర్తించారు. అతడు పలువురి ఆధార్ కార్డులు సేకరించి, వారిపేరుపై సిమ్ కార్డులు తీసుకుని, పలు బ్యాంకుల్లో సుమారు 30 ఖాతాలు ఓపెన్ చేశాడు. ఈ పని చేయడం కోసం ఎన్ఆర్ఐ వెనుక ప్లాట్ను అద్దెకు తీసుకుని సూర్యప్రకాష్, ప్రవీణ్, బాలు, యేసన్నలను తన దగ్గర జాబ్ ఉందంటూ పెట్టుకున్నాడు. ఈ వ్యవహారాన్ని నడిపే క్రమంలో పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు నిఘా పెట్టి చాకచక్యంగా తొలుత ఒకరిని అదుపులోకి తీసుకుని విచారించి మిగిలిన వారిని అరెస్ట్ చేశారు. వారి బ్యాంకులావాదేవీల నుంచి రూ.6.30లక్షలను బ్లాక్ చేశారు. కేసును చాకచక్యంగా ఛేదించిన ఎస్ఐ వెంకట్, పోలీస్ సిబ్బందిని అభినందించారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ ఏవీ బ్రహ్మం, ఎస్ఐ సిహెచ్ వెంకట్, సిబ్బంది పాల్గొన్నారు. -
భార్యను హత్యచేసిన భర్త అరెస్ట్
మంగళగిరి టౌన్: వివాహేత సంబంధం నేపఽథ్యంలో భార్యను హతమార్చిన భర్తను మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్ట్చేశారు. మంగళగిరి రూరల్ పోలీస్స్టేషన్లో శనివారం నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ వివరాలు వెల్లడించారు. పిఠాపురానికి చెందిన శివశంకర్రెడ్డి విజయవాడ పెనమలూరుకు చెందిన శివపార్వతి (29)ని ఐదు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకుని కొద్దికాలం విజయవాడలో కాపురం ఉన్నారు. అప్పటికే వ్యాపారంలో నష్టం రావడంతో భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈక్రమంలో శివపార్వతికి మంగళగిరి చినకాకాని గ్రామానికి చెందిన ఓ ఎలక్ట్రీషియన్తో పరిచయం ఏర్పడింది. భార్యాభర్తలు విడిపోగా ఐదునెలల క్రితం ఎలక్ట్రీషియన్తో కలసి మంగళగిరి మండల పరిధిలోని యర్రబాలెంలో ఇల్లు అద్దెకు తీసుకుని జీవిస్తోంది. భార్య కోసం వెతికే క్రమంలో యర్రబాలెంలో ఉంటోందన్న సమాచారం తెలుసుకున్న శివశంకర్రెడ్డి ఎవరూ లేని సమయంలో నేరుగా ఇంట్లోకి వెళ్లి శివపార్వతి గొంతు నులిపి హత్యచేసి పరారయ్యాడు. ఈ ఘటనపై మృతురాలి బంధువులు ఫిర్యాదు చేయగా రూరల్ సీఐ ఏవీ బ్రహ్మం దర్యాప్తు ప్రారంభించి శనివారం నిందితుడు శివ శంకర్రెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ సమావేశంలో ఎస్ఐ వెంకట్ పాల్గొన్నారు. -
ఐఏఎల్ మోడల్ పరీక్ష విజయవంతం
గుంటూరు లీగల్: ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ (ఐఏఎల్) గుంటూరు జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో గుంటూరు బార్ అసోసియేషన్లోని జస్టిస్ లావు నాగేశ్వరరావు మీటింగ్ హాల్లో ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ మోడల్ పరీక్ష శనివారం నిర్వహించారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం1.30 గంటల వరకు జరిగింది. మోడల్ పరీక్ష పత్రాలను గుంటూరు బార్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ మోతుకూరి శ్రీనివాసరావు, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నరసింహారావు, రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి పర్చూరు కుమారి నంద, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిద్ధ సత్యనారాయణ, సీనియర్ న్యాయవాదులు కొండవీటి శ్రీనివాసరావు, మంత్రి బాలకృష్ణ, న్యాయవాది కె.శ్రీలక్ష్మీ తిరుపతమ్మల చేతుల మీదుగా అభ్యర్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఐ.ఏ.ఎల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నరసింహారావు మాట్లాడుతూ జూనియర్ న్యాయవాదులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో మోడల్ పరీక్షను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ నెల 30న జరగనున్న ఏఐబీఈ పరీక్ష రాయడానికి ఇది ఉపయోగపడుతుందని వెల్లడించారు. న్యాయవాదులు కె.నరసింహం, హేమ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 25 నుంచి అంతర్ కళాశాలల పురుషుల వాలీబాల్ పోటీలు నరసరావుపేట ఈస్ట్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల పురుషుల వాలీబాల్ పోటీలు ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకు కృష్ణవేణి డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు, వ్యాయామ అధ్యాపకుడు ఈదర ఆదిబాబు చెప్పారు. పోటీల కరపత్రాలను శనివారం వారు విడుదల చేశారు. పోటీలలో భాగంగా వర్సిటీ టీమ్ను ఎంపిక చేస్తారని వివరించారు. పోటీలు నాకౌట్ కమ్ లీగ్ పద్ధతిలో నిర్వహించనున్నట్టు తెలిపారు. పోటీలను ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు (చిలకలూరిపేట), డాక్టర్ చదలవాడ అరవిందబాబు (నరసరావుపేట), వర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ రామినేని శివరామప్రసాద్ ప్రారంభిస్తారని పేర్కొన్నారు. వర్సిటీ పరిధిలోని అన్ని అనుబంధ కళాశాలల జట్లు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి రెంటచింతల: మండల పరిధిలోని గోలి గ్రామ శివారులో ఉన్న నాగమయ్యస్వామి దేవస్థానం సమీపంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం హాలియాకు చెందిన కంటోజు పరిపూర్ణాచారి(42) తన అన్న శ్రీనివాసచారితో కలిసి గురజాల మండలం గొట్టిముక్కల గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న చెల్లెలు భర్త గోవిందాచారిని పరామర్శించారు. వారు తిరిగి ద్విచక్రవాహనంపై స్వగ్రామం హాలియా వెళ్తున్న సమయంలో నాగమయ్య దేవస్థానం సమీపంలో సమాధానపేటకు చెందిన వేల్పుల నరేంద్ర, జొన్నలగడ్డ సంతోస్, గుంజరి వెంకటేష్ ముగ్గురు మరో ద్విచక్రవాహనంపై వేగంగా వస్తూ బలంగా ఢీకొనడంతో రెండు వాహనాలపై నున్న ఐదుగురు కిందపడ్డారు. ప్రమాదంలో పరిపూర్ణాచారి తల బలంగా రోడ్డుకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వారిని ఏపీ జన్కో అంబులెన్స్ వాహనంలో మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వారిని నరసరావుపేటకు తరలించారు. పరిపూర్ణాచారికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎస్ఐ సీహెచ్ నాగార్జున కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
జాతీయ కబడ్డీ, వాలీబాల్ పోటీలకు శ్రావణి ఎంపిక
వేటపాలెం: స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల పీఈటీ జరుబుల శ్రావణి జాతీయ స్థాయి కబడ్డీ, వాలీబాల్ పోటీలకు ఎంపికై నట్లు హెచ్ఎం దేవరకొండ సరోజిని శనివారం తెలిపారు. ఈ నెల 20, 21వ తేదీన విజవాయడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్రస్థాయి సివిల్ సర్వీసెస్ గేమ్స్ నిర్వహించారని తెలిపారు. ఈ పోటీల్లో శ్రావణి ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు చెప్పారు. త్వరలో జరిగే సివిల్ సర్వీసెస్ గేమ్స్లో రాష్ట్రం తరఫున పాల్గొంటారన్నారు. శ్రావణిని హెచ్ఎం, సహఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. జాతీయ పోటీల్లో కూడా రాణించాలని వారు ఆకాంక్షించారు. పది పరీక్షల షెడ్యూల్ విడుదల నరసరావుపేట ఈస్ట్: పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ శనివారం తెలిపారు. మార్చి 16వ తేదీన ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకండ్ లాంగ్వేజ్, 20న ఇంగ్లిష్, 23న గణితం, 25న ఫిజిక్స్, 28న బయోలజీ, 30న సాంఘికశాస్త్రం, 31న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–2, ఏప్రిల్ 1న ఒకేషనల్ కోర్సు పరీక్ష ఉంటుందని వివరించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ వివరాలను యుడైస్ వెబ్సైట్లో సరిచూసుకోవాలని తెలిపారు. ఏవైనా తప్పులు ఉన్నట్లయితే వెంటనే ప్రధానోపాధ్యాయుని దృష్టికి తీసుకు వెళ్లి సరిచేసుకోవాలని సూచించారు. పరీక్ష ఫీజును ఆన్లైన్ ద్వారానే చెల్లించాలని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు కంటే అధికంగా వసూలు చేసే పాఠశాలలపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. శ్రీసత్యసాయి అన్నప్రసాద వితరణ నరసరావుపేట ఈస్ట్: శ్రీసత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని శనివారం శ్రీసత్యసాయి భజన మండలి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ నిర్వహించారు. బస్టాండ్ సెంటర్, సతైనపల్లిరోడ్డు మహాలక్ష్మమ్మ చెట్టు, పల్నాడు బస్టాండ్ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన అన్న ప్రసాద కేంద్రాలలో దాదాపు 8వేల మందికి ప్రసాదం అందించారు. శ్రీసత్యసాయి భజన మండలి కన్వీనర్ కూనిశెట్టి సత్యసాయి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మండలి సభ్యులు, సీ్త్ర సేవాదళ్ సభ్యులు సేవలు అందించారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయగుప్త, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు వనమా సాంబశివరావు పాల్గొన్నారు. -
రెండు పళ్ల విభాగం విజేత కేసానుపల్లి ఎడ్ల జత
కారెంపూడి: పల్నాటి ఉత్సవాల సందర్భంగా కారెంపూడిలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి ఎడ్ల బండ లాగుడు పోటీలలో భాగంగా శనివారం రెండు పళ్ల విభాగంలో పోటీలు నిర్వహించారు. పోటీలను మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ తదితరులు ప్రారంభించారు. ప్రథమ బహుమతిని దాచేపల్లి మండలం కేసానుపల్లికి చెందిన నెల్లూరి రామకోటయ్య ఎడ్ల జత కై వసం చేసుకుంది. ద్వితీయ బహుమతిని పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదలకు చెందిన పొన్నబోయిన విష్ణుభరత్ యాదవ్ జత, తృతీయ బహుమతిని బాపట్ల జిల్లా సంతమాగులూరుకు చెందిన వజ్రాల తేజశ్రీరెడ్డి, ప్రకాశం జిల్లా కంభం మండలం యర్రబాలెంకు చెందిన వెంకటగిరి హేమలతా నాయుడు కంబైన్డ్ జత గెలుచుకున్నాయి. నాల్గవ బహుమతిని నరసరావుపేట మండలం దొండపాడుకు చెందిన యర్రం రాజశేఖర్, యశ్వంత్ ఎడ్ల జత, ఐదో బహుమతిని బెల్లంకొండ మండలం మాచాయపాలెంకు చెందిన గౌరు కార్తికేయ, అమరావతి మండలం గిడుగుకు చెందిన భూపతి శ్రీనివాసరావు కంబైన్డ్ జత కై వసం చేసుకున్నాయి. ఆరో బహుమతిని పల్నాడు జిల్లా మాచవరం మండలం మల్లవోలుకు చెందిన ఘంటా రమ్య నాయుడు ఎడ్ల జత గెలుచుకున్నాయి. ఈ ఆరు బహుమతులను కారెంపూడికి చెందిన టీడీపీ నాయకుడు సంగినేడి ధనుంజయ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు సంగినేడి బాలకృష్ణ ప్రదానం చేశారు. పోటీలలో పాల్గొన్న మిగిలిన రెండు జతలకు కూడా నగదు బహుమతులను ప్రదానం చేశారు. బహుమతి ప్రదానంలో పంగులూరి అంజయ్య, చప్పిడి రాము కారెంపూడి రైతు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. -
జీజీహెచ్లో ఆక్సిజన్ అందక రోగి మృతి..!
గుంటూరు మెడికల్: పేదల పెద్ద ఆసుపత్రి గుంటూరు జీజీహెచ్లో గురువారం రాత్రి ఆక్సిజన్ అందక ఓ రోగి మృతిచెందినట్లు మృతుడి బంధువులు ఆరోపించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన 50 ఏళ్ల వ్యక్తి మధుమేహంతో బాధపడుతూ కాలికి రక్తనాళాల సమస్య ఏర్పడి తీవ్ర ఇబ్బందితో ఈనెల 12న గుంటూరు జీజీహెచ్లో చికిత్స కోసం అడ్మిట్ అయ్యాడు. జనరల్ సర్జరీ వైద్యులు ఈనెల 16న ఆపరేషన్ చేసి కాలు తొలగించారు. ఆపరేషన్ అనంతరం ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. గురువారం ఐసీయూ నుంచి వార్డుకు తరలించగా, వార్డులో ఆరోగ్యం విషమించి ఆక్సిజన్ పెట్టాలని వైద్యులు సూచించారు. అయితే ఆక్సిజన్ పెట్టేందుకు కావాల్సిన మాస్క్ను బయట నుంచి కొని తెచ్చుకోమని బంధువులకు సూచించడంతో వారు రాత్రి కొనుగోలు చేసి వార్డుకు వెళ్లేసరికి సదరు వ్యక్తి మృతిచెందాడు. తక్షణమే మళ్లీ ఐసీయూకు తరలించి కొంతసేపు ఉంచి, చనిపోయినట్లు నిర్ధారించి తమకు అప్పగించారని మృతుడి బంధువులు వాపోయారు. వార్డులో వైద్యులు ఎవరూ అందుబాటులో లేరని, రాత్రి సమయంలో మహాప్రస్తానం వాహనం కూడా అందుబాటులో లేకపోవడంతో సొంత వాహనంలో గ్రామానికి తరలించినట్లు చెబుతున్నారు. ఆక్సిజన్ మాస్క్లు అందుబాటులో ఉంటే సకాలంలో ఆక్సిజన్ పెట్టి ఉంటే చనిపోయేవాడు కాదని, నిర్లక్ష్యంతోని చనిపోయాడని ఆరోపించారు. కాగా ఈ ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణను ‘సాక్షి’ వివరణ కోరగా వార్డులో ఆక్సిజన్ మాస్క్లు అందుబాటులో ఉన్నాయన్నారు. అయినప్పటికీ బయట రోగి బంధువులతో కొనుగోలు చేయించిన వారికి మెమో జారీ చేస్తామని వెల్లడించారు. 24న ఏఎన్యూలో అస్మిత అథ్లెటిక్స్ లీగ్ గుంటూరు ఎడ్యుకేషన్: అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో ఈనెల 24న ఏఎన్యూ క్రీడా మైదానంలో గుంటూరు జిల్లా అస్మిత అథ్లెటిక్స్ లీగ్ నిర్వహించనున్నట్లు హిందూ ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్ పీఎం ప్రసాద్ తెలిపారు. శుక్రవారం అమరావతిరోడ్డులోని కళాశాలలో అండర్–14, అండర్ 16 బాలికల ఈవెంట్లకు సంబంధించిన పోస్టర్లను ప్రిన్సిపాల్ సీహెచ్ సుబ్బారావు, వైస్ ప్రిన్సిపాల్ వి.నర్సిరెడ్డిలతో కలసి ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్ సౌజన్యంతో అస్మిత్ అథ్లెటిక్స్ లీగ్ నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన బాలికలను దేశవ్యాప్తంగా ఉన్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలకు ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్, విభాగాధిపతులు సుస్మితా చౌదరి, నాగాంజనేయులు, ఫిజికల్ డైరెక్టర్ కె.రవి పాల్గొన్నారు. ఫుడ్ టెక్నాలజీలో ప్రవేశాలకు కౌన్సెలింగ్ గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో ఏపీ ఈఏపీసెట్ 2025 ర్యాంకుల ద్వారా బీఎస్సీ అగ్రికల్చర్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ ప్రవేశాలకు చివరి విడత మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎంవీ రమణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో 2025–26 విద్యాసంవత్సరానికి గానూ బైపీసీ విభాగంలో ఏపీ ఈఏపీసెట్ 2025 ర్యాంకుల ద్వారా బీఎస్సీ అగ్రికల్చర్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ ప్రవేశాలకు ఈనెల 24 నుంచి 30వ తేదీ వరకు చివరి విడత మాన్యవల్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్సైట్ ఏఎన్జీఆర్ఏయూ.ఏసీ.ఇన్ను సంప్రదించాలని కోరారు. -
రోడ్డు మీద నోట్లను వెదజల్లి వృద్ధుడికి టోకరా
రూ.1,64,00 చోరీ సింగపూర్ పర్యటనకు అద్దంకి ఉపాధ్యాయిని అద్దంకి: పట్టణంలోని సత్రం బడి ఉపాధ్యాయిని ధనలక్ష్మి సింగపూర్ పర్యటనకు ఎంపికయ్యారు. కాకానిపాలేనికి చెందిన ఆమె రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డు గ్రహీత. విద్యా విధానంలో నూతన సంస్కరణలు తీసుకొచ్చేందుకు పరిశీలన నిమిత్తం ఈనెల 27న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి ఎనమిది రోజులు సింగపూర్లో పర్యటించనున్నట్లు శుక్రవారం తెలిపారు. ఆమెకు తోటి ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు. కాలుకు తీవ్ర గాయాలు సత్రశాల దేవస్థానం ఆదాయం రూ.1,43,440 సత్రశాల(రెంటచింతల): మండలంలోని సత్రశాల వద్ద వేంచేసిన అతి ప్రాచీన శైవక్షేత్రంగా పేరు పొందిన శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి దేవస్థానానికి కార్తిక మాసం సందర్భంగా రూ.1,43,440 ఆదాయం వచ్చినట్లు సత్తెనపల్లికి చెందిన ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ వి.లీలావతి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కార్తిక మాసం నెల హుండీ ఆదాయం రూ.66,980 వచ్చిందని, 2024 కన్నా ఈ సంవత్సరం రూ.3,402 ఆదాయం తగ్గిందన్నారు. టికెట్ల ద్వారా రూ.76,460 ఆదాయం వచ్చిందన్నారు. రెంటచింతల శివాలయం ఆదాయం లెక్కించడం వాయిదా పడినట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో మండల ఎండోమెంట్ అధికారి గాదె రామిరెడ్డి, సత్రశాల దేవస్థానం ట్రస్ట్బోర్డు చైర్మన్ గుండా వెంకట శివయ్య, దేవస్థానం ప్రధాన అర్చకులు చిట్టేలా శివశర్మ, ట్రస్ట్ బోర్డు సభ్యులు బ్రహ్మచారి, చంద్రశేఖర్రెడ్డి, అనంతరాములు, సిబ్బంది తదితరులున్నారు. -
విజ్ఞాన్ను సందర్శించిన అమెరికా వర్సిటీ బృందం
చేబ్రోలు: మండలంలోని వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీని యూఎస్ఏ– ఓహియోలోని బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీ(బీజీఎస్యూ) ప్రతినిధుల బృందం శుక్రవారం సందర్శించింది. బీజీఎస్యూ ప్రెసిడెంట్ డాక్టర్ రోడ్నే కే. రోజర్స్, అడ్వకేట్ డాక్టర్ సాండ్రా బీ.ఎర్లే, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రవి క్రోవి, అకడమిక్ అఫైర్స్ వైస్ ప్రొవోస్ట్ డాక్టర్ రోడ్నే కే. రోజర్స్, కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్– ఇన్నోవేషన్ డీన్ డాక్టర్ వేల్ మోక్తర్ సందర్శించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా వైస్ చాన్సలర్ పి.నాగభూషణ్ మాట్లాడుతూ విజ్ఞాన్– బీజీఎస్యూ మధ్య ఉన్న అవగాహన ఒప్పందం కేవలం విద్యార్థి మార్పిడికి మాత్రమే కాకుండా అంతర్జాతీయ విద్యా– పరిశోధనా సహకారం అని తెలిపారు. రెండు యూనివర్సిటీల అధ్యాపకులు ఒకరికొకరు వర్సిటీల్లో తాత్కాలికంగా బోధించే అవకాశం ఉంటుందని చెప్పారు. రెండు వర్సిటీల మధ్య సంయుక్త ఇన్నోవేషన్ సెంటర్లు, ల్యాబ్లు, శిక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. విమానయాన రంగానికి గ్లోబల్ ప్రమాణాలతో కూడిన మేనేజ్మెంట్ కోర్సులను సంయుక్తంగా రూపొందిస్తామని వివరించారు. డ్రోన్ మాన్యుఫాక్చరింగ్, వ్యవసాయం– సర్వేయింగ్, డిఫెన్స్ అప్లికేషన్లపై రీసెర్చ్ ల్యాబ్లను కలిసి అభివృద్ధి చేయనున్నట్టు పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో డ్రోన్లు, ఐవోటీ సెన్సర్లు, స్మార్ట్ ఇరిగేషన్ వంటి టెక్నాలజీల అభివృద్ధిపై రెండు వర్సిటీలు కలిసి పనిచేయనున్నట్టు తెలిపారు. బీజీఎస్యూ ప్రెసిడెంట్ డాక్టర్ రోడ్నే కే. రొజర్స్ మాట్లాడుతూ విజ్ఞాన్ యూనివర్సిటీతో మా భాగస్వామ్యం కేవలం విద్యా మార్పిడికే పరిమితం కాదు, రాబోయే టెక్నాలజీ ప్రపంచానికి భారత– అమెరికా విద్యార్థులను సిద్ధం చేసే సమగ్ర అకడమిక్ మిషన్ అని అన్నారు. కార్యక్రమంలో విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య, సీఈఓ మేఘన కూరపాటి, రిజిస్ట్రార్ పీఎంవీ రావు పాల్గొన్నారు. -
ప్రభుత్వ నిర్వాకంతో చేనేత పరిశ్రమ కుదేలు
30న రాష్ట్ర సదస్సు చీరాల రూరల్: దేశ సంస్కృతీ, సంప్రదాయాలకు గతంలో నిలయంగా ఉన్న చేనేత పరిశ్రమ పవర్ లూమ్స్ రాకతో నేడు కుదేలైపోతోందని.. పట్టించుకోవాల్సిన ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. స్థానిక గోలి సదాశివరావు కల్యాణ మండపంలో శుక్రవారం చేనేత నాయకుడు దామర్ల శ్రీకృష్ణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈనెల 30న అక్కడే నిర్వహించనున్న రాష్ట్ర చేనేత సదస్సు కరపత్రాలను నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆహ్వాన కమిటీ కన్వీనర్ బక్కా పరంజ్యోతి, అధ్యక్షుడు దామర్ల శ్రీకృష్ణ, గోశాల ఆశీర్వాదం, చుండూరి వాసు, దుడ్డు భాస్కరరావు, మేడా వెంకటరావు, ధరణికోట లక్ష్మీనారాయణ, ఇమంది పరమేశ్వరి మాట్లాడారు. చేనేత పరిశ్రమకు ఎంతో కృషి చేసిన దివంగత ప్రగడ కోటయ్య వర్ధంతి పురస్కరించుకుని రాష్ట్ర సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అధిక ఉత్పత్తితో చవక ధరలతో వస్త్రాలను అందించగల బట్టల మిల్లులు వ్యాపారాన్ని ఆక్రమించాయని వివరించారు. ఆ తరువాత వచ్చిన పవర్ లూమ్స్ చేనేత పరిశ్రమను మరింత కోలుకోలేని దెబ్బతీశాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ నాణ్యత, మన్నికను బట్టి దేశ, అంతర్జాతీయ మార్కెట్లో చేనేత వస్త్రాల స్థానాన్ని నిలబెట్టుకోగలుతున్నాయని తెలిపారు. ఆనాటి నాయకులు ప్రగడ కోటయ్య చేనేత సొసైటీలను ఏర్పాటుచేసి చేనేత పరిశ్రమకు భరోసా కల్పించారని తెలిపారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వాలు చేనేత రక్షణ చట్టాలను సక్రమంగా అమలు చేయకపోవడంతో కార్మికులు పనులులేక ఆకలి చావులకు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. చేనేతల డిమాండ్లు ప్రభుత్వానికి తెలియజేసేందుకు ఈనెల 30న రాష్ట్ర సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మాజీ డీజీపీ జె. పూర్ణచంద్రరావు, హైకోర్టు న్యాయవాది వైకే, మాచర్ల మోహనరావు, విశ్రాంత కలెక్టర్ చిరంజీవు హాజరుకానున్నారని చెప్పారు. సదస్సులో వేలాదిగా చేనేత కార్మికులు పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గొర్రెపాటి రవికుమార్, వెంకటేశ్వరమ్మ, కాటి మార్కు, ఎం. శేషు, దానియేలు, కలామ్, పుల్లయ్య, సుధాకర్ పాల్గొన్నారు. -
బరువెక్కిన హృదయాలతో అంతిమ యాత్ర
కారంచేడు: తన కాళ్లపై తాను నిలబడుతూ.. తమకు కూడా అండగా ఉంటుందని భావించిన తల్లిదండ్రులకు ఆ కన్నకూతురు విగతజీవిగా ఇంటికి చేరింది. ఆ దృశ్యాన్ని చూసిన తల్లిదండ్రులు, తోబుట్టువు గండెలవిసేలా రోదించారు. బరువెక్కిన గుండెలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. బాపట్ల జిల్లా కారంచేడు స్టేట్బ్యాంక్ ఎదురు బజారుకు చెందిన యార్లగడ్డ రామకృష్ణ, వీణాకుమారిలకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కేవలం రెండు ఎకరాల సాగుభూమితో కష్టపడి కుటుంబాన్ని పోషించుకోవడంతో పాటు, బిడ్డలకు మంచి విద్యాబుద్ధులు నేర్పించడానికి రామకృష్ణ శ్రమించారు. కుమారుడు చిన్న ఉద్యోగం సంపాదించుకుంటే.. కుమార్తె యార్లగడ్డ రాజ్యలక్ష్మి (23)ని బీటెక్ పూర్తి అయిన తరువాత అప్పులు చేసి ఉన్నత చదువుల కోసం అమెరికాకు పంపారు. అక్కడ ఎంఎస్ పూర్తి చేసింది. ఉద్యోగ ప్రయత్నంలో ఉండగా ఈ నెల 7న ఛాతీలో నొప్పి, కొద్దిగా దగ్గు రావడంతో సాధారణమని భావించి చికిత్స తీసుకోలేదు. ఎప్పటిమాదిరిగానే నిద్రపోయిన ఆమె మరుసటి రోజు తిరిగి లేవలేదు. విషయం గమనించిన స్నేహితులు వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని ఇండియాకు పంపడానికి వారు చాలా కష్టపడి నిధులు సేకరించారు. ఎట్టకేలకు 14 రోజుల శుక్రవారం మృతదేహాన్ని స్వగ్రామమైన కారంచేడులోని ఇంటికి తీసుకొచ్చారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు విగతజీవిగా ఇంటికి చేరడంతో ఆ తల్లితండ్రులు, సోదరుడు తల్లడిల్లిపోయారు. కదలివచ్చిన ఊరు రాజ్యలక్ష్మి మృతదేహం గ్రామానికి వచ్చిందని తెలుసుకున్న గ్రామస్తులు, ఆమె బంధువులు పెద్దఎత్తున తరలివచ్చారు. కడసారిగా ఆమె చివరి చూపును సూసేందుకు వచ్చిన గ్రామస్తులతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. ప్రతి ఒక్కరూ రాజ్యలక్ష్మికి కన్నీటి వీడ్కోలు పలికారు. -
ఖోఖో పోటీలకు తొమ్మిది మంది ఎంపిక
జె.పంగులూరు: స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 18న అండర్–17 విభాగంలో ఖోఖో జట్టు ఎంపికలు సింగరాయకొండ మండలం పాకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగాయి. 12 మంది జట్టులో స్థానిక మాగుంట సుబ్బరామిరెడ్డి, బాచిన నారాయణమ్మ జూనియర్ కళాశాల నుంచి తొమ్మిది మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. ఎస్ఆర్ఆర్ పంగులూరు ఖోఖో అకాడమీలో గత మూడు నెలలుగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ క్రీడాకారులు ఈ నెల 22 నుంచి 24 వరకు కాకినాడలో జరిగే స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగే రాష్ట్ర స్థాయి అండర్–17ఖోఖో పోటీల్లో పాల్గొంటారని ప్రకాశం జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ చెక్కా వెంకటేశ్వర్లు తెలిపారు. -
నెల్లూరు జిల్లాలో పట్టుబడిన గంజాయి ధ్వంసం
యడ్లపాడు: ప్రజా ఆరోగ్య భద్రత కోసం మాదక ద్రవ్యాల అక్రమ రవాణపై ఉక్కుపాదం మోపుతున్నట్లు నెల్లూరు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ ఎం శంకరయ్య తెలిపారు. నెల్లూరు జిల్లాలో భారీగా పట్టుబడిని గంజాయి, నిషేధిత మాదక ద్రవ్యాలను శుక్రవారం అధికారులు ధ్వంసం చేశారు. యడ్లపాడు మండలం కొండవీడు రెవెన్యూ పరిధిలో జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ పవర్ ప్లాంట్లో మాదక ద్రవ్యాలను ధ్వంసం చేసిన తర్వాత డిప్యూటీ కమిషనర్ ఎం శంకరయ్య వివరాలను తెలిపారు. నెల్లూరు జిల్లాలో 61 కేసులు ద్వారా ఎకై ్సజ్శాఖ స్వాధీనం చేసుకున్న నిషేధిత మాదక ద్రవ్యాలను ఈ ఏడాది జులై 9న నిర్వహించిన డీడీసీ సమావేశంలో వీటిని ధ్వంసం చేయాలని తీర్మానించినట్లు తెలిపారు. ఈ మేరకు తాము స్వాధీనం చేసుకున్న డ్రై గంజాయి 751.586 కిలోలు, 3.2 మీటర్ల పొడవు 1 మీటర్ వెడల్పు కలిగిన గంజాయి మొక్కలు, 950 గ్రాములు హషీష్ ఆయిల్ ప్లాంట్కు తరలించి ధ్వంసం చేశారు. పర్యావరణ ప్రమాణాలు పాటిస్తూ విజయవాడలోని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సూచనల మేరకు వీటిని శాసీ్త్రయ పద్ధతిలో నాశనం చేసినట్లు అధికారులు తెలిపారు. డ్రగ్ డిస్పోజిల్ కమిటీ సభ్యులుగా నెల్లూరు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ ఎం శంకరయ్య, అసిస్టెంట్ కమిషనర్ పి దయాసాగర్, ఒంగోలు అసిస్టెంట్ కమిషనర్ కె విజయ్ వ్యవహరించారు. ఏపీపీసీబీ పర్యావరణ ఇంజినీర్ ఎం అజీనాబేగం, నెల్లూరు అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జె రమేష్, అదే జిల్లాలోని తొమ్మిది ఎకై ్సజ్ స్టేషన్ల హౌస్ ఆఫీసర్లు, సిబ్బంది, ఏపీ ఆపరేషన్ టీం ప్రెసిడెంట్ ఎంవీ చారి, సిబ్బంది, కొండవీడు వీఆర్వో దండా కృష్ణ చైతన్యం, వీఆర్ఏ కూచిపూడి గోపిచంద్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా కోర్టులో న్యాయదేవత విగ్రహావిష్కరణ
నరసరావుపేట ఈస్ట్: సత్తెనపల్లి రోడ్డు పులపులవారి వీధిలో వేంచేసియున్న శ్రీ వీరాంజనేయ సహిత శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ రాతి నిర్మాణానికి వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయ కమిటీ కార్యదర్శి కొత్తమాసు వెంకటప్పయ్య, ప్రేమలత దంపతులు రూ.2,01,116 విరాళంగా అందించారు. ఆలయంలో శుక్రవారం పూజలు నిర్వహించిన దాతలు విరాళాన్ని ఆలయ కమిటీ ప్రతినిధులు వనమా సాంబశివరావు, కోవూరి శివశ్రీనుబాబు, గజవల్లి మురళిలకు అందించారు. మోదుగుల చంద్రం రూ.11,116 విరాళంగా అందించారు. కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు వనమా కృష్ణ, రాచూరి వెంక టేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నరసరావుపేట రూరల్: కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవస్థానానికి కార్తిక మాసంలో రూ.2.18 కోట్లు ఆదాయం లభించినట్టు ఆలయ ఈవో డి.చంద్రశేఖర్ తెలిపారు. ఆలయంలో శుక్రవారం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆదాయ వివరాలను ఈవో వెల్లడించారు. ఆస్ట్రేలియా డాలర్స్ 10, సింగపూర్ డాలర్స్ 10, అమెరికా డాలర్, 28 గ్రాముల బంగారం, 115 గ్రాముల వెండి హుండీల ద్వారా లభించినట్టు తెలిపారు. యడ్లపాడు: గ్రావెల్ అక్రమ తవ్వకాలను ఉప్పరపాలెం గ్రామస్తులు శుక్రవారం అడ్డుకున్నారు. వంకాయలపాడు రెవెన్యూ పరిధిలో గురుకుల పాఠశాల సమీపంలో తవ్వకాలు నిర్వహిస్తున్న ప్రాంతానికి చేరుకుని గ్రావెల్ లోడుతో వెళ్తున్న వాహనాలను నిలుపుదల చేశారు. తమ గ్రామం పరిధిలోని ప్రభుత్వ భూముల్లో మట్టి తవ్వకాలు చేస్తే సహించబోమంటూ ఆగ్రహించారు. అడ్డుకున్న వారిలో గ్రామస్తులు పల్లపు వీర్ల అంకమ్మ, పల్లపు వెంకట్రావు, గుంజి శ్రీనివాసరావు, వల్లెపు అంకమ్మబాబు ఉన్నారు. -
పక్కాగా ధాన్యం సేకరణ ప్రక్రియ ఉండాలి
బాపట్ల: ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తి ప్రణాళికతో చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. జిల్లా, మండల, సచివాలయాల స్థాయి అధికారులతో శుక్రవారం స్థానిక కలెక్టరేట్ నుంచి ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. వ్యవసాయ శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో రైతుల ఇళ్లకు వెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో 2.16 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేశారని ప్రాథమిక సమాచారం ఉందన్నారు. 117 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ఆదేశించారు. టార్పాలిన్ పట్టలు, గోనె సంచులు సిద్ధం చేసుకోవాలన్నారు. రైస్ మిల్లులు వివరాలు అందుబాటులో ఉండాలన్నారు. రైతులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట మాట్లాడుతూ.. ధాన్యం సేకరణ బృందాలు సిద్ధంగా ఉండాలని తెలిపారు. 60 తేమ యంత్రాలు సిద్ధంగా ఉంచామని, 73 మిల్లులను ఎంపిక చేశామన్నారు. అవసరమైతే గోనెసంచులు సమకూర్చుకోవాలని సూచించారు. ధాన్యం తరలించే వాహనాలకు జీపీఎస్ అనుసంధానించాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారి అమీర్ బాషా, సంస్థ జీఎం శివపార్వతి, వ్యవసాయ శాఖ డీడీ అన్నపూర్ణ, సచివాలయాల కోఆర్డినేటర్ యశ్వంత్, ఆర్డీఓలు, మండల తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు. నాయకత్వం, నిర్వహణ బాధ్యతలు కీలకం నాయకత్వం, నిర్వహణ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తేనే జీవితంలో విజయాలు సొంతం అవుతాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. బాపట్ల వ్యవసాయ కళాశాల విద్యార్థులతో జిల్లా కలెక్టర్ ముఖాముఖి కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. విద్యార్థులు నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని, బృందంతో కలిసి పనిచేయడం నేర్చుకోవాలన్నారు. మొదట శాస్త్రవేత్తను కావాలనుకున్నా... వైద్యుడిగా పట్టభద్రుడనై... తర్వాత ఐఏఎస్ అధికారిగా నిలిచానని తెలిపారు. వైద్యుడిగా ఉన్నప్పుడు మారుమూల గ్రామీణ ప్రాంతంలో పోస్టింగ్ ఇచ్చారని, సామర్థ్యం ఉన్నప్పటికీ నెల రోజులు ఎలాంటి ఆపరేషన్లు చేయకుండా ఉండడం బాధ కలిగించిందని పేర్కొన్నారు. దీంతో వెంటనే సివిల్స్కు సిద్ధమయ్యానని చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పి. ప్రసన్నారాణి, అధ్యాపకులు, అధ్యాపకేతరులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బాల్య వివాహాల రహిత జిల్లాగా బాపట్లను తీర్చిదిద్దాల్సిన బాధ్యత విద్యార్థినులపై ఉందని జిల్లా కలెక్టర్ తెలిపారు. అంతర్జాతీయ బాలల హక్కుల వారోత్సవాల ముగింపు కార్యక్రమం స్థానిక బాపట్ల పట్టణంలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో శుక్రవారం జరిగింది. ‘ప్రతి బిడ్డకు–ప్రతి హక్కు‘ అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమాన్ని కలెక్టర్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. విద్యార్థినుల నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాల్య వివాహాలు అడ్డుకున్న అంగన్వాడీ కార్యకర్తలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... విద్యార్థినులు భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాలంటే బాగా చదవాలన్నారు. బాలల హక్కులను పరిరక్షించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయన్నారు. తాను కూడా ప్రభుత్వ వసతి గృహంలోనే ఉంటూ ప్రభుత్వ కళాశాలలోనే చదువుకున్నానని మననం చేసుకున్నారు. బాగా చదువుకోవాలని నా తల్లిదండ్రులు నిత్యం చెబుతూ ఉండే వారన్నారు. తల్లిదండ్రులే జీవితాలకు స్పూర్తి కావాలి, ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మంచి స్థాయికి ఎదగాలని కోరారు. బాలల హక్కుల సంరక్షణ కోసం పనిచేస్తున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ రాధామాధవి అన్నారు. కార్యక్రమంలో డీఈవో పురుషోత్తం, ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారిణి రాజదిబోరా, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.విజయమ్మ, తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ -
మద్దతు మమ.. కొనుగోలు భ్రమ!
● జిల్లాలో 2,91,106 ఎకరాల్లో వరి సాగు ● ధాన్యం దిగుబడి అంచనా 6.55 లక్షల టన్నులు ● చంద్రబాబు ప్రభుత్వం కొంటానని చెప్పింది 2 లక్షల టన్నులే ● బయట బస్తా ధాన్యం ధర రూ.1,420 మాత్రమే ● రూ. 2 వేలకు విక్రయిస్తే తప్ప గిట్టుబాటు కాని పరిస్థితి ● మద్దతు ధరకు మొత్తం ధాన్యం కొనాలంటున్న రైతులు -
తాకట్టు బంగారం బాధితులకు పరిష్కారం
దొడ్లేరు(క్రోసూరు): రెండు సంవత్సరాల క్రితం దొడ్లేరు చైతన్యగోదావరి గ్రామీణ బ్యాంకు నందు ఖాతాదారులు తాకట్టు పెట్టుకున్న బంగారు ఆభరణాలు గోల్మాల్ కాగా విచారణ అనంతరం సమస్యను పరిష్కరించినట్లు బ్యాంకు రీజనల్ మేనేజర్ గురువారం తెలిపారు. 2023ఆగస్టులో బ్యాంకులో 505 మంది ఖాతాదారులకు చెందిన తాకట్టు బంగారు ఆభరణాలలో అవతవకలు జరిగాయి. బాధితులు అనేకమార్లు బ్యాంకు ఎదుట ఆందోళన చేయటం జరిగింది. దీనిపై సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు, క్రోసూరు సీఐ సురేష్, ఎస్ఐ రవిబాబు గోల్మాల్ అయిన ఆభరణాల విషయంలో కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. 505 మంది ఖాతాదారులకు సంబంధించిన ఆభరాణాలపై విచారణ చేపట్టిన ప్రక్రియలో గత ఏడాది 401 మంది బాధితులందరికీ రూ.2.5 కోట్లు పరిష్కరించినట్లు బ్యాంకు రీజనల్ మేనేజరు పి.సుభాష్, బ్యాంకు మేనేజరు శివశంకర్ నాయక్ వివరించారు. అదేవిధంగా మరో 104 మంది ఖాతాదారులకు రూ.కోటి రూపాయలు చెల్లించి సమస్య గురువారం పరిష్కరించినట్లు తెలిపారు. మొత్తం 505 మంది ఖాతాదారులకు రూ.3.5 కోట్లు బ్యాంకు అందచేసి పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు. బ్యాంకులో లావాదేవీలు జరగని ఖాతాదారులకు... ఈ సందర్భంగా రీజనల్ మేనేజరు విలేకరులతో మాట్లాడుతూ ఆర్బీఐ ఆదేశాల మేరకు తమ బ్యాంకు లో గత పది సంవత్సరాలుగా 1818 ఖాతాదారులకు చెందిన నగదు రూ.23 లక్షలు ఉండిపోయాయన్నారు. వారు లేదా వారి వారసులు వచ్చి తమ జాబితా చూసుకుని వారి నగదు తీసుకెళ్లాలని కోరారు. -
ఇంకుడు గుంతల ఆవశ్యకతను తెలియజేయండి
చేబ్రోలు: ఇంకుడు గుంతల ఆవశ్యకతను ప్రతి ఒక్కరికీ వివరించి చైత న్య పరచాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి. జ్యోతిబసు అన్నారు. చేబ్రోలు మండలం నారాకోడూరు గ్రామంలో గురువారం ఆయన పర్యటించారు. గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో తిరిగి పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించిన అంశాలను పరిశీలించారు. ఇంటింటి చెత్త సేకరణను పరిశీలించి చెత్త సంపద తయారీ కోసం సిబ్బంది సమర్ధవంతంగా పనిచేయాలని సూచించారు. ఎంపీడీఓ టి.ఊహారాణి, డిప్యూటీ ఎంపీడీఓ రవిశంకర్, సర్పంచ్ సాంబశివరావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
న్యాయస్థానం, ప్రభుత్వ నిర్ణయాలే శిరోధార్యం
యడ్లపాడు: న్యాయస్థానం, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల ప్రకారమే యడ్ల పాడు లూథరన్ పాఠశాల భవిష్యత్ కార్యాచరణ ముందుకు సాగుతుందని రాష్ట్ర మైనారిటీ కమిషన్ వైస్ చైర్మన్, యాక్టింగ్ చైర్మన్ డాక్టర్ జాషువా డానియల్ తెలిపారు. రిటైర్డ్ కేరళ హైకోర్టు జడ్జి జస్టిస్, ఏఈఎల్సీ అడ్మినిస్ట్రేటర్ జోసఫ్ పీఎస్, రిటైర్డ్ జిల్లా జడ్జి, ఏఈఎల్సీ సెక్రటరీ కంట్రోలర్ జేసు రత్న కుమార్, ఏఈఎల్సీ అసిస్టెంట్ ప్రాపర్టీ ఆఫీసర్ డి లెనిన్ గురువారం స్థానిక లూథరన్ హైస్కూల్ను సందర్శించారు. పాఠశాల సమస్యలను జేసు రత్నకుమార్, హెచ్ఎం బీఎస్ పద్మలత వారికి వివరించారు. జిల్లా డీఈవో ఎల్ చంద్రకళ, పాఠశాల విద్య జిల్లా ఏడీ–2 ఉదయభాస్కర్, యడ్లపాడు తహసీల్దార్ జెట్టి విజయశ్రీ నుంచి పాఠశాలకు సంబంధించిన చట్టపరమైన అంశాలను తెలుసుకు న్నారు. విద్యా, రెవెన్యూశాఖ అధికారులతో కలిసి పాఠశాల భవనం, ఆట స్థలం, వెనుక ఉన్న ఖాళీ స్థలాలను స్వయంగా పరిశీలించి సంబంధిత వివరాలు సేకరించారు. అనంతరం మీడియాతో డాక్టర్ జాషువా డానియేల్ మాట్లాడుతూ పునరుజ్జీవనానికి అవసరమైన చర్యలపై సమగ్ర ప్రణాళిక అవసరముందని కమిటీకి సూచించారు. పాఠశాల బలోపేతానికి విద్యార్థుల చేరిక కీలకమని, విద్యార్థులు లేకపోతే విద్యాశాఖ, ప్రభుత్వం నుంచి చట్టపరమైన సహాయం అందించే అవకాశాలు తగ్గుతాయని అన్నారు. తాను కూడా లూథరన్ విద్యాసంస్థలో చదివిన విద్యార్థిగా, పాఠశాల అభివృద్ధికి వ్యక్తిగతంగా, మైనారిటీ కమిషన్ ద్వారా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థుల చేరికల ప్రక్రియను చేపడితే పాఠశాల తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందనే నమ్మకం వ్యక్తం చేశారు. ఆ దిశగా చర్యలు తీసుకునేందుకు కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో డీవైఈవో ఎస్ఎం సుభాని, సర్వేయర్ గేరా సురేంద్రనాథ్, వీఆర్వోలు, ఉపాధ్యాయులు ఉన్నారు. రాష్ట్ర మైనారిటీ కమిషన్ వైస్ చైర్మన్ డాక్టర్ జాషువాడానియల్ లూథరన్ హైస్కూల్ సందర్శన -
చలికాలం .. జర భద్రం
●గత వారం రోజులుగా పెరిగిన చలి తీవ్రత ● జిల్లాలో పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు ● ప్రజల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం ●జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు సత్తెనపల్లి: చలి పంజా విసురుతున్న పరిస్థితి జిల్లా అంతటా కనిపిస్తోంది. గత వారం రోజులుగా ఉదయం, రాత్రి చల్లటి గాలులు వీస్తున్నాయి. వాతావరణం చల్లబడి శీతాకాలం పూర్తి స్థాయిలో ఆవరించింది. జిల్లాలో రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. ఉదయం ఎనిమిది గంటలు దాటినా మంచు తెరలు వీడకపోవడం, సాయంత్రం ఐద గంటలకే చీకటి పడటం కనిపిస్తోంది. రాత్రి వేళ ఉష్ణోగ్రతల మార్పుతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. తెల్లవారుజామునే పొలాలకు వెళ్లే రైతులు, పాలు, కూరగాయలు, ఆకు కూరలు విక్రయించేవారు, పేపర్లు వేసేవారు, టీ, అల్పాహార దుకాణదారులు రక్షణ కవచాలు ధరించి కూడా వణుకుతూనే జీవన పోరాటానికి వెళుతున్నారు. పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు... చలి కారణంగా జలుబు, దగ్గు, ఆస్తమా, బ్రాంకై టిస్ వంటి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయి. వృద్ధులలో కీళ్ల నొప్పులు, రుమటాయిడ్ అర్థరైటిస్ సమస్యలు తీవ్రమవుతున్నాయి. అలాగే చర్మం పగలడం, పొడిబారడం వంటి సమస్య లు కనిపిస్తున్నాయి. అతి తక్కువ ఉష్ణోగ్రతల వల్ల శరీర ఉష్ణోగ్రత పడిపోయి, ప్రాణాంతకమైన హైపోథెర్మియాకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తు న్నారు. పాటించాల్సిన జాగ్రత్తలు... చలితీవ్రత పెరిగిన దృష్ట్యా, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రజలకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తున్నారు. ● ఉదయం, సాయంత్రం వేళల్లో ఉన్ని దుస్తులు, మఫ్లర్లు, చేతి తొడుగులు ధరించడం తప్పనిసరి. ● బయటకు వెళ్లేటప్పుడు శరీరమంతా కప్పి ఉంచేలా చూసుకోవాలి. ● శరీరానికి వేడినిచ్చే పోషకాహారం తీసుకోవాలి. ముఖ్యంగా వేడి పాలు, సూప్లు, హెర్బల్ టీలు తాగటం మంచిది. ● చలిమంటలు కాచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చిన్నారులను అగ్రి ప్రమాదాల నుంచి దూరంగా ఉంచాలి. ● రాత్రి పడుకునేటప్పుడు గదిని వెచ్చగా ఉంచుకోవాలి. వృద్ధులు, చిన్నారులు ఎక్కువగా చలికి గురికాకుండా చూడాలి. ● శరీరంలో తేమ నిలిచి ఉండేందుకు మాయిశ్చరైజర్ వాడాలి. ● గోరువెచ్చని నీరు తాగడం ద్వారా డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండొచ్చు. ● చలి కారణంగా శరీరం గట్టిపడకుండా ఉండటానికి తేలికై న వ్యాయామాలు, నడక వంటివి చేయడం మంచిది. ● చలి సమయంలో దాహం తక్కువగా ఉన్నా కూడా రోజంతా నీటివి తాగడం అవసరం. ఇది శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది. ● వెంటనే చల్లని వాతావరణంలో నుంచి వేడిగదిలోకి రావడం లేదా వేడి నుంచి ఒక్కసారిగా చల్లని వాతావరణంలోకి వెళ్లడం నివారించాలి. ● దమ్ము, గుండె సంబంధిత వ్యాధులు, రక్తపోటు ఉన్నవారు చలి సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైన మందులు దగ్గర ఉంచుకుని, బయటకు వెళ్లడం తగ్గించాలి. శీతాకాలంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలను పాటించాలి. చలి నుంచి శరీరాన్ని రక్షించు కోవాలి. గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. శ్వాస కోశ సమస్యతో ఇబ్బందులు వస్తే వెంటనే వైద్యశాలలను సందర్శించాలి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు చలిలో తిరగకుండా చూసుకోవాలి. ప్రజలు బయటికి వచ్చే సమయంలో టోపీ, కండువా, చేతి తొడుగులు ధరించాలి. చర్మాన్ని కవర్ చేస్తూ .. జల నిరోధిత బూట్లు ధరించాలి. చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులు అవసరమైతేనే బయటుకు రావాలి. రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనాలపై ప్రయాణించవద్దు. చలి కారణంగా వైరల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. చిన్నపాటి అనారోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయవద్దు. – డాక్టర్ బి.రవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, పల్నాడు -
నాగాభరణం బహూకరణ
నకరికల్లు: నర్సింగపాడు గ్రామంలోని గంగా అన్నపూర్ణా సమేత మరకతలింగ చంద్రమౌళీశ్వర స్వామికి నకరికల్లుకు చెందిన తిరువీధుల శ్రీనివాసరావు దంపతులు వెండి నాగాభరణాన్ని గురువారం సమర్పించారు. రూ.7.50 లక్షల విలువైన వెండి నాగాభరణాన్ని ఆలయ అర్చకులు పమిడిమర్రు శ్రీనివాసరావు చేతుల మీదుగా అందజేశారు. అనంతరం విశేష పూజలు నిర్వహించారు. శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు. కర్లపాలెం: చందోలు గ్రామంలో కొలువై ఉన్న బగళాముఖి అమ్మవారి ఆలయంలో అమావాస్య సందర్భంగా దివ్య హోమ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. 9 మంది వేద పండితులచే ఘనంగా హోమం జరిపించారు. కార్తికమాసం ఆఖరి రోజును పురస్కరించుకుని అమ్మవారికి శక్తి స్వరూపిణి అలంకారం చేశారు. మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. బాపట్లకు చెందిన విజయలక్ష్మి నాదస్వర బృందం మంగళవాయిద్యాలతో పూజా కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమంలో తెనాలికి చెందిన రంగిశెట్టి రమేష్ రంచించిన రావమ్మ రావమ్మా బగళాముఖి అనే పాటను పృఽథ్వీ మనోజ్ చేత పాడించి, ఆవిష్కరింపచేశారు. ఈవో నరసింహమూర్తి అభివృద్ధి కమిటీ చైర్మన్ కలకోట చక్రధర్ రెడ్డి, సభ్యులు పట్టాభి రామరావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పెదకూరపాడు: రైల్వే ట్రాక్ మరమ్మతుల్లో భాగంగా అమరావతి – సత్తెనపల్లి మార్గమధ్యలో ఉన్న పెదకూరపాడు రైల్వే గేటును 21, 22, 23 తేదీల్లో మూసివేయనున్నట్లు సీనియర్ సెక్షన్ ఇంజినీర్ శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 24వ తేదీ సాయంత్రం 6 గంటలకు పునరుద్ధరిస్తారని చెప్పారు. ప్రయాణికులు వేరే మార్గాల్లో రాకపోకలు సాగించాలని కోరారు. నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్) : నిర్మాణ దారులు, వెండర్ల మధ్య అనుసంధానం కోసం నారెడ్కో యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని నారెడ్కో రాష్ట్ర కార్యదర్శి మామిడి సీతారామయ్య తెలియజేశారు. గురువారం నగరంలోని ఓ హోటల్లో యాప్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ దారులు, వెండర్ల మధ్య పరస్పర సహకారం, కమ్యూనికేషన్ను మరింత బలపరిచేందుకు ఈ యాప్ ఎంతో దోహద పడుతుందన్నారు. రానున్న రోజుల్లో నారెడ్కో ద్వారా నిర్మాణదారులకు, వినియోగదారులకు ఆధునిక నిర్మాణ రంగానికి అవసరమైన అన్ని రకాల సేవలను అందించేందుకు కృషి చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మధుసూదనరెడ్డి, చుక్కపల్లి రమేష్, క్యాపిటల్ జోన్ ప్రెసిడెంట్ అంకారావు, సెక్రటరీ మాదాల శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ వి. శ్రీనాథ్, ట్రెజరర్ సీహెచ్ తిరుపతయ్య, అడ్వైజరీ కమిటీ సభ్యులు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. -
రణక్షేత్రంలో కొలువుదీరిన అలనాటి ఆయుధాలు
కారెంపూడి: పల్నాటి వీరారాధన ఉత్సవాలలో భాగంగా గురువారం రాయబారం ఉత్సవం వైభవంగా జరిగింది. వీరుల గుడి నిండుగా పల్నాటి వీరుల ఆయుధాలు కొలువుదీరాయి. వందలాదిగా భక్తజనం ఆయుధాల(దైవాలు)కు పూజలు చేశారు. ఉత్సవ ప్రారంభ ఘట్టం రాచగావు బుధవారం తెల్లవారుజాము 4 గంటల వరకు కొనసాగింది. బ్రహ్మనాయుడు ఆయుధం నృసింహకుంతం సమక్షంలో వీర విద్యావంతులు రాచగావు కథాగానం చేశారు. పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవ మండపంలో ఆశీనులు కాగా, వీరాచారులు కంటి మీద కునుకు లేకుండా తెల్లవార్లూ కథాగానం విన్నారు. అనంతరం రాచగావు క్రతువు ముగించి వీరాచారులకు తాంబూలాలిచ్చి కంకణధారణ చేశారు. తర్వాత సేద దీరిన అనంతరం ఉదయం 10 గంటలకు వీరుల గుడిలో కొలువుదీరిన ఆయుధాలను గ్రామోత్సవానికి సిద్ధం చేశారు. వీరుల గుడిలో ఒక్కొక్కరుగా కత్తిసేవలు పూర్తి చేసుకుని తర్వాత అంతా కలసి ఊరేగింపుగా చెన్నకేశవస్వామి దర్శనానికి బయలుదేరారు. ఆయుధాల వెనుక అంకమ్మ బుట్టలతో భక్తులు నిల్చున్నారు. అంతా గ్రామోత్సవంగా బయలుదేరి చెన్నకేశవుని ఆలయానికి చేరుకున్నారు. తర్వాత ఆలయం బయట ఉన్న బ్రహ్మనాయుడు విగ్రహం వద్దకు తరలివచ్చి విగ్రహానికి పూలమాలలు, ధూపం వేసి నివాళులర్పించారు. తర్వాత వీర్ల అంకాలమ్మ తల్లిని దర్శించుకుని అమ్మవారి ఎదుట ఆయుధాలన్నీ శిరస్సు వంచి మొక్కాయి. తర్వాత కోట బురుజు మీదుగా పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ ఇంటికి తరలివెళ్లి ఆయనను తోడ్కొని వీరుల గుడికి చేరుకున్నారు. గుడిలో ఆయుధాలను కొలువుదీర్చి ఆ రోజు గ్రామోత్సవాన్ని ముగించారు. ఇదిలా ఉంటే నూతనంగా వచ్చిన వీరాచారులు నాగులేరు గంగధారిలో స్నానాలు చేసి తమ ఆయుధాలను శుభ్రం చేసుకుని పూజ కట్టుకున్నారు. అనంతరం వారు చెన్నకేశవస్వామి, అంకాలమ్మలను దర్శించుకుని వీరారాధనలో పాల్గొన్నారు. రెండవ రోజు కూడా వీరాచారుల రాక కొనసాగుతోంది. రాయబారం కథాగానం గురువారం రాత్రి వీర విద్యావంతులు రాయబారం చారిత్రక ఘట్టం కథాగానాన్ని చేశారు. కోడి పందేలలో ఓడిన బ్రహ్మనాయుడు, మలిదేవుడు పరివారం అరణ్యవాసం పూర్తి చేసిన తర్వాత తన బావ మలిదేవుడుకు రాజ్యభాగం ఇవ్వాలని మామను అడగడానికి అలరాజును రాయబారిగా బ్రహ్మనాయుడు గురజాలకు పంపాడు. రాయబారం విఫలమై తిరుగు ప్రయాణంలో చర్లగుడిపాడు వద్ద సేద తీరుతున్న సమయంలో విషప్రయోగానికి గురై అలరాజు మృతి చెందడం ఆ తర్వాత దాయాదుల మధ్య కక్షలు పతాకస్థాయికి చేరి పల్నాటి యుద్ధానికి దారి తీస్తుందనే కథాగానం చేస్తారు. దాయాదుల మధ్య జరిగిన విషాదభరిత ఇతివృత్తం కావడంతో కథకులు కన్నీరు తెప్పించే విధంగా విపులంగా రాయబారం కథను గానం చేశారు. -
జూనియర్స్ విజేత హైదరాబాద్ ఎడ్ల జత
కారెంపూడి: పల్నాటి వీరారాధన ఉత్సవాల సందర్భంగా కారెంపూడిలో జరుగుతున్న రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలలో భాగంగా గురువారం జూనియర్స్ విభాగంలో పోటీలు ఆసక్తికరంగా సాగాయి. హైదరాబాదుకు చెందిన మేకా రామకృష్ణ, ప్రతీక్ ఎడ్ల జత 3,195 అడుగుల దూరం లాగి ప్రథమ బహుమతిని కై వసం చేసుకున్నాయి. ద్వితీయ బహుమతిని ప్రకాశం జిల్లా నాగులుప్పాడు మండలం మద్దిరాల ముప్పాళ్లకు చెందిన పుచ్చకాయల శేషాద్రి చౌదరి ఎడ్ల జత, తృతీయ బహుమతిని బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెంకు చెందిన అత్తోట శిరీషాచౌదరి, శివకృష్ణ చౌదరి ఎడ్ల జత, నాలుగవ బహుమతిని గుంటూరు జిల్లా లింగాయపాలేనికి చెందిన యల్లం సాంబశివరావు ఎడ్ల జత, ఐదో బహుమతిని గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరుకు చెందిన పోతిన లక్షిత్ చౌదరి ఎడ్ల జత, ఆరో బహుమతిని బాపట్ల జిల్లా రేపల్లెకి చెందిన సుఖవాసి సతీష్బాబు ఎడ్ల జత కై వసం చేసుకున్నాయి. బహుమతులను దాతలు పంగులూరి అంజయ్య, శిరిగిరి గోపాలరావు, గుండా వెంకట నరసింహారావు, నర్సింగ నాగేశ్వరరావు, చిరుమామిళ్ల రామలక్ష్మయ్య, పిన్నెల్లి అనంత రామయ్య, నాగారపు సుబ్బారావు సన్స్ రామకృష్ణ, పలిశెట్టి కోటేశ్వరరావు (మునసబు), నాగెండ్ల రామారావులు ప్రదానం చేశారు. -
హెల్మెట్ ధరించిన వారికి స్వీట్లు
కర్లపాలెం: రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు రోడ్డు నిబంధనలపై వినూత్న పద్ధతిలో వాహన చోదకులకు అవగాహన కల్పిస్తున్నామని బాపట్ల రూరల్ సీఐ హరికృష్ణ, కర్లపాలెం ఎస్ఐ రవీంద్ర తెలిపారు. గురువారం కర్లపాలెం పంచాయతీ పరిధిలోని సత్యవతీపేట గ్రామం వద్ద జాతీయ రహదారిపై కర్లపాలెం ఎస్ఐ రవీంద్ర ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టి రోడ్డు నిబందనలపై వాహన చోదకులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించి ద్విచక్ర మోటారు వాహనాలు నడుపుథఉన్న వారికి సీఐ హరికృష్ణ, ఎస్ఐ రవీంద్రలు స్వీట్లు పంపిణీ చేశా రు. హెల్మెట్ లేనివారికి జరిమానా విధించారు. ఈ సందర్భంగా సీఐ, ఎస్ఐ మాట్లాడుతూ ప్రయాణికులందరూ సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరుకోవాలనే లక్ష్యంతోనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. -
విద్యార్థులు గ్రంథాలయాన్ని సందర్శించాలి
నరసరావుపేట ఈస్ట్: విద్యార్థులు ప్రతి రోజూ కొంత సమయాన్ని గ్రంథాలయానికి కేటాయించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ సూచించారు. పల్నాడురోడ్డులోని శాఖా గ్రంథాలయంలో గురువారం ఏర్పాటు చేసిన 58వ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సమావేశంలో డీఈఓ చంద్రకళ పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు కథలు, సాంస్కృతిక, చరిత్ర పుస్తకాలను చదవటం వలన పాఠ్యపుస్తకాలలో లేని ఎన్నో విజ్ఞాన అంశాలను తెలుసుకోవచ్చని వివరించారు. కథల పుస్తకాలు చదవటం ద్వారా నీతి తెలుసుకుంటారని వివరించారు. పుస్తకాలు చదువుతున్నప్పుడు జీవితంలో ఏదో సాధించాలనే కోరిక కలుగుతుందని తెలిపారు. గ్రంథాలయంలో సభ్యత్వం పొంది నచ్చిన పుస్తకాన్ని ఇంటికి తీసుకవెళ్లి చదవాలని సూచించారు. గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు చదవటం ద్వారా ప్రేరణ పొందుతారని తెలిపారు. జిల్లా ఔషధ నియంత్రణ అధికారి డి.సునీత మాట్లాడుతూ గ్రంథాలయాల ప్రాధాన్యతను వివరించారు. విద్యార్థులు మొబైల్ ఫోన్లు వాడకం తగ్గించి గ్రంథాలయాన్ని సందర్శించి పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవటం ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని వివరించారు. వారోత్సవాల లో భాగంగా నిర్వహించిన క్రీడా, సాంస్కృతిక, విజ్ఞాన పోటీలలో విజేతలకు బహుమతులు అందించా రు. గ్రంథాలయాధికారి యడ్లపాటి రాధ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో అభ్యుదయ భారతి అధ్యక్షుడు రత్నాకరం రాము, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
శ్రీరామ సైనిక్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
కొల్లూరు : గుజరాత్లోని పఠాన్ జిల్లాలో ఈ నెల 14 నుంచి 17 వరకు జరిగిన 10వ సబ్ జూనియర్ డాడ్జ్ బాల్ జాతీయ స్థాయి పోటీలలో ద్వితీయ స్థానం సాధించిన రాష్ట్ర జట్టులో కొల్లూరు మండలం శ్రీరామ సైనిక్ స్కూల్ విద్యార్థులు 8 మంది ప్రాతినిధ్యం వహించి విజయంలో కీలక పాత్ర పోషించారని పాఠశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కొలసాని శ్రీకాంత్ తెలిపారు. జట్టు గెలుపులో శ్రీరామ విద్యార్థులు కె. లిఖిత్, డి. జస్వంత్, యు. జస్వంత్, జి. విహాన్, కె. ధీరజ్, జి. నితిన్రామ్ చౌదరి, ఎస్కె. మాఖిల్ షోయబ్, ఎం. విఠల్ అదిత్యలను ఈ సందర్భంగా అభినందించారు. డాడ్జ్ బాల్ జాతీయ స్థాయి పోటీలలో రాష్ట్ర జట్టు రాణించడంలో కీలకంగా వ్యవహరించిన కోచ్లు ఎస్కే అప్రోజ్, ఎం. సుబ్బారావు, వి. విష్ణులను రాష్ట్ర డాడ్జ్ బాల్ అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు. -
ఫెన్సింగ్ పోటీల జిల్లా జట్టుకు విద్యార్థుల ఎంపిక
కర్లపాలెం: తమ పాఠశాల విద్యార్థులు జిల్లా ఫెన్సింగ్ జట్టుకు ఎంపికయ్యారని హైవెండ్ హైస్కూల్ ఎండీ బొడ్డు సాయి మహేంద్రబాబు గురువారం తెలిపారు. గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 18వ తేదీన జరిగిన జిల్లా జట్టు ఎంపిక పోటీలలో తమ పాఠశాల విద్యార్థులు భానుచంద్రారెడ్డి, చరవాణి మెరుగైన ప్రతిభ కనబరిచి జిల్లా జట్టుకు ఎంపికయ్యారని ఆయన వివరించారు. ఈనెల 24, 25, 26 తేదీల్లో కోనసీమ జిల్లా మోరి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలలో తమ విద్యార్థులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల చైర్మన్ ఉదయ్చంద్రరావు, డైరెక్టర్లు వెంకటజ్యోతి, చాందినీ, ఉపాధ్యాయులు అభినందించారు. బాపట్ల: వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షులు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ విభాగ అధికార ప్రతినిధిగా డాక్టర్ విలియం జాన్ హైబెల్స్ బోడా(నాని)ని నియమించారు. బాపట్ల నియోజకవర్గానికి చెందిన విలియం జాన్ హైబెల్స్ బోడా(నాని)కి ఈ పదవి దక్కటంతో పలువురు అభినందించారు. -
కొత్తపాలెం పోలేరమ్మ ఆలయంలో చోరీ
బల్లికురవ: బల్లికురవకు కూతవేటు దూరంలో ఉన్న కొత్తపాలెం పోలేరమ్మ ఆలయంలో మంగళవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. బల్లికురవ నుంచి అద్దంకి వెళ్లే ఆర్ అండ్ బీ రోడ్డుకు పడమర భాగంలో ఇటీవల పోలేరమ్మ ఆలయాన్ని నిర్మించారు. మంగళవారం రాత్రి అర్చకులు పూజాది కార్యక్రమాల అనంతరం ఆలయం తలుపులు మూసివేశారు. బుధవారం ఉదయం ఆలయంలోకి అర్చకుడు వెళ్లగా తలుపులు తెరచి ఉన్నాయి. ఈ విషయాన్ని ఆలయ కమిటీకి తెలియజేశాడు. వారు వచ్చి హుండీ, రెండు గంటలు చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ వై. నాగరాజు సిబ్బందితో వచ్చి ఆలయాన్ని, స్థానిక నాలుగు రోడ్ల కూడలిలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. చంద్రమౌళీశ్వరునికి విశేషాభిషేకాలు నకరికల్లు: నర్శింగపాడులోని శ్రీ గంగా అన్నపూర్ణా సమేత మరకతలింగ చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలో లక్ష బిళ్వార్చన వేడుకలు బుధవారం కనుల పండువలా సాగాయి. అర్చకులు పమిడిమర్రు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పూజాధికాలు జరిపించారు. వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అభిషేకాలు చేశారు. చండీపారాయణం, రుద్రహోమం, చండీహోమం, అమ్మవారికి కుంకుమపూజలు చేశారు. భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి విశేష పూజల్లో పాల్గొన్నారు. బగళాముఖి ఆలయానికి ఐఎస్ఓ 9001 అవార్డు చందోలు(కర్లపాలెం): చందోలు బగళాముఖి అమ్మవారి ఆలయానికి హైమ్ ఇంటర్నేషనల్ ఐఎస్వో 9001 అవార్డు రావటం బాపట్ల జిల్లాకే తలమానికమని ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ అన్నారు. హైమ్ ఇంటర్నేషనల్ సంస్థ మేనేజింగ్ డైరక్టర్ ఆలపాటి శివయ్య ఆధ్వర్యంలో బుధవారం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో హైమ్ ఇంటర్నేషనల్ ఐఎస్వో 9001 అవార్డును ఆలయ మేనేజర్ నరసింహమూర్తికి ఎమ్మెల్యే నరేంద్రవర్మ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా హైమ్ ఇంటర్నేషనల్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆలపాటి శివయ్య మాట్లాడుతూ చందోలు బగళాముఖి అమ్మవారి చరిత్ర తెలుసుకుని అవార్డు అందజేశామని తెలిపారు. అనంతరం శాసనసభ్యులు నరేంద్రవర్మరాజు, ఆలపాటి శివయ్యలను ఆలయ మేనేజర్, అభివృద్ధి కమిటీ సభ్యులు సన్మానించారు. ఆలయ పాలకమండలి చైర్మన్ కలకోట చక్రధర్రెడ్డి, సభ్యులు పట్టాభిరామారావు, ప్రసాద్, ఆలయ అర్చకులు ఉన్నారు. నువ్వులు, వేరుశనగల దిగుబడి పెంపునకు శిక్షణ గుంటూరు రూరల్: ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నూనె గింజల పరిశోధన స్థానం హైదరాబాద్ ఆర్థిక సహకారంతో బుధవారం లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానం ఆడిటోరియంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ ఆర్. శారదజయలక్ష్మి మాట్లాడుతూ నువ్వులు, వేరుశనగ పంటల్లో దిగుబడిని పెంచే దిశగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలి పారు. రైతులు నూనె గింజల పంటలను విరివిగా చేపట్టి భారతదేశ వంటనూనెల దిగుమతులను తగ్గించాలని కోరారు. విస్తరణ సంచాలకులు డాక్టర్ శివన్నారాయణ వేరుశనగలో మేలైన యాజమాన్య పద్ధతులు వివరించారు. పలువురు శాస్త్రవేత్తలు పురుగులు, తెగుళ్లు , యాజమాన్యం గురించి వివరించారు.


