breaking news
Bapatla District Latest News
-
సైబర్ నేరాలపై అవగాహన తప్పనిసరి
సీడీపీవో సుచిత్రరేపల్లె: సమాజంలో సైబర్ నేరాలు పెచ్చుమీరుతున్నాయని, వీటిపై అవగాహన తప్పనిసరని సీడీపీవో ఎం.సుచిత్ర చెప్పారు. మిషన్ శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళలకు, విద్యార్థులకు సైబర్ నేరాలు, ఆర్థిక సాధికారత అంశాలపై పట్టణంలోని ఆంధ్ర రత్న హైస్కూల్, శివాజీ స్కూల్లోని అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థులు, స్వయం సహాయక సంఘాల సభ్యులకు బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సుల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. సోషల్ మీడియా వినియోగంలో అనుమానాస్పద లింక్లకు, అపరిచిత వ్యక్తులకు దూరంగా ఉండాలని సూచించారు. వ్యక్తిగత సమాచారం అపరిచితులతో పంచుకోరాదన్నారు. సాంకేతికతను తమ అభివృద్ధికి వినియోగించాలేగాని, దుర్వినియోగానికి కాదన్నారు. మహిళలు ఆర్థిక సాధికారత దిశగా పయనించాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సిహెచ్ హిమబిందు, ఇన్చార్జి హెచ్ఎం రాము, ఉపాధ్యాయులు కౌసల్య, శైలజ, అనూష, అంగన్వాడీలు నాగలక్ష్మి, బాజీ, నసీమ, మల్లీశ్వరి, ఆర్పీలు పర్విన్, సుమీనా, తదితరులు పాల్గొన్నారు. -
భావదేవునికి సామూహిక హారతులు
బాపట్ల: పౌర్ణమిని పురస్కరించుకొని బాపట్ల భావన్నారాయణ స్వామి దేవాలయంలో బుధవారం సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘సామూహిక దీపోత్సవ హారతి‘ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ధర్మ ప్రచారక్ జంజనం హేమశంకరరావు మాట్లాడుతూ సామూహిక హారతులు స్వామి వారికి ఇవ్వడం వల్ల మన దోషాలు తొలగి శుభాలు కలుగుతాయని తెలియజేశారు. స్వామి వారి ఆలయంలో దీపపూజ కార్యక్రమం, నగర సంకీర్తన కార్యక్రమం, సామూహిక హారతి నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ధర్మ విస్తారక్ మోదడుగు సూరిబాబు, మహిళా కన్వీనర్ కోట్రా పద్మ ,గౌరి, వేముల రోజారాణి, నాగవరపు వెంకటలక్ష్మి, లక్ష్మీ సుజాత, గృహలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. -
నేడు ఆశ కార్యకర్తల ధర్నా
సీఐటీయూ జిల్లా కోశాధికారి మణిలాల్రేపల్ల: ఆశ కార్యకర్తల సమస్యల పరిష్కారం కోరుతూ గురువారం విజయవాడలో నిర్వహించే నిరసన కార్యక్రమంలో ఆశలు పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి మణిలాల్ పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమం సందర్భంగా ఆశ కార్యకర్తలు రేపల్లె మండలంలోని మోళ్ళగుంట, విశ్వేశ్వరం పీహెచ్సీలలో సీఐటీయు ఆధ్వర్యంలో మెడికల్ ఆఫీసర్లకు బుధవారం వినతిపత్రాలు అందజేసి మాట్లాడారు. పనికి తగిన కనీస వేతనాలు అమలుచేయాలన్నారు. అన్ని రకాల సెలవులు ఇవ్వాలని, శిక్షణ పొందిన ఏఎన్ఎం, జిఎన్ఎంలకు పర్మినెంట్ పోస్టులు భర్తీచేయాలన్నారు. మృతి చెందిన వారికి దహన సంస్కారాల ఖర్చులు అందించాలన్నారు. నియామకాలు, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆశా వర్కర్ల సంఖ్యను పెంచాలన్నారు. ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయాలన్నారు. సీహెచ్సీకి వెళ్లిన ప్రతి సందర్భంలో టీఏలు, డీఏలు ఇవ్వాలన్నారు. రూ.10లక్షల ఇన్సూరెన్న్స్ సౌకర్యం కల్పించి, నాణ్యమైన మొబైల్స్, యూనిఫామ్ అందించాలన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు దానమ్మ, గ్లోరీ, బుజ్జి, దేవి తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి ఏఎన్యూలో విద్య సమ్మేళనం
రెక్టార్ ఆచార్య ఆర్.శివరాంప్రసాద్ ఏఎన్యూ (పెదకాకాని): పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు విద్య, పరిశ్రమల సమ్మేళనం–2026ను ఈ నెల 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం రెక్టార్ ఆచార్య ఆర్.శివరాంప్రసాద్ వెల్లడించారు. ఏఎన్యూలో కమిటీ హాలులో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆచార్య శివరాంప్రసాద్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలోని డైక్మన్ ఆడిటోరియంలో గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమ్మేళనంకు ఏర్పాట్లు అన్ని పూర్తి చేశామని పేర్కొన్నారు. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు సిలబస్ను రూపొందించడం, విద్యార్థులకు ఇంటర్నషిప్ సదుపాయం కల్పించడంతో పాటు నాలెడ్జి పెంపకం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ సమ్మేళనం దోహదపడుతుందన్నారు. సమ్మేళనంలో పాల్గొనేందుకు 100కు పైగా పరిశ్రమలు ముందుకు వచ్చాయని తెలిపారు. -
నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు
కర్లపాలెం: పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వేంచేసియున్న చెన్నకేశవస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారంతో ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం స్వామివారికి శాంతి కళ్యాణం నిర్వహించారు. బుధవారం స్వామివారి ఆలయ ప్రాంగణంలో నిత్యహోమం, బలిహరణ పూజలు జరిపించి స్వామివారి ఉత్సవ విగ్రహాలకు చక్రస్నానం చేయించారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి నగరోత్సవం చేశారు. రాత్రికి ధ్వజారోహణం, పూర్ణాహుతి, శాంతిహోమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. పూజా కార్యక్రమాలలో ఆలయ ట్రస్టు బోర్డు అధ్యక్షుడు ఎండూరి సాయిగుప్తా, ఆలయ అర్చకులు వేదాంతం కృష్ణమాచార్యులు, వరదాచార్యులు, చెన్నకేశవ, కేశవ రామానుజులు, ఈవో నరసింహమూర్తి, భక్తులు పాల్గొన్నారు. -
ఎస్ఐ బైక్పై పెట్రోలు పోసి దహనం
భట్టిప్రోలు: పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్కు చెందిన బైక్పై పెట్రోలు పోసి దహనం చేసిన సంఘటన ఇది. భట్టిప్రోలు హెడ్ కానిస్టేబుల్ వివరాల మేరకు, ఈ నెల 2వ తేదీ రాత్రి భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి రథోత్సవంలో హెడ్ కానిస్టేబుల్ కృష్ణ, ఎస్ఐ శివయ్య, సిబ్బంది బందోబస్తు విధులలో ఉన్నారు. ఊరేగింపు అద్దేపల్లి మసీదు వద్దకు వచ్చేసరికి భట్టిప్రోలు గ్రామానికి చెందిన బట్టు లీలాసాయికుమార్ మద్యం తాగి రథం చప్టా వేసే వారితో గొడవ పడుతున్నాడు. ఈ సమయంలో ఎస్ఐ, స్టేషన్ సిబ్బందితో కూడా దురుసుగా ప్రవర్తించాడు. దీంతో పోలీసులు ఆ యువకుడిని మందలించి పంపించారు. రథోత్సవం ముగిసిన తరువాత బట్టు లీలాసాయి కుమార్, మరి కొంతమంది ఆదిన గౌతమ్ సాయి, సిరిబోయిన శ్రీనివాసరావు, ఆదిన నాగ సాయి శ్రీనివాసరావులతో కలిసి వచ్చి తమ వెంట తెచ్చుకున్న పెట్రోల్ను ఎస్ఐ శివయ్య ఇంటిముందు పార్క్ చేసిన బైక్పైపోసి నిప్పు అంటించారు. ఎస్ఐ శివయ్య ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూడగా వారందరూ కలసి స్కూటీపై పారిపోయారు. నిందితులను అదుపులోకి తీసుకుని ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వేమూరు: పేద ప్రజలకు సామాజిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని జిల్లా కో–ఆర్డినేటర్ ఆసుపత్రి సర్వీసు అధికారి విజయలక్ష్మి తెలిపారు. సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆమె పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సామాజిక ఆరోగ్య కేంద్రంలోని సీనియరు డాక్టర్లు వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్య సేవలు అందించడంలో ముందు ఉందని చెప్పారు. రోగులకు 24 గంటలు వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సామాజి ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సయ్యద్ జెరినా పర్విన్, డాక్టర్లు బుల్లా భరత్, అనిల్ కుమార్, ఫాతి మునీస్సా, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
బాపట్ల
గురువారం శ్రీ 5 శ్రీ మార్చి శ్రీ 2026గుడారాల పండుగకు సర్వం సిద్ధం ఇఫ్తార్ సహరి (గురు) (శుక్ర) బాపట్ల 6.21 5.06 గుంటూరు 6.21 5.06 నరసరావుపేట 6.23 5.08 తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో బుధవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.8,400, గరిష్ట ధర రూ.10,000, మోడల్ ధర రూ.9,200 వరకు పలికింది.విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ మట్టం బుధవారం 539.10 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 19,324 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.సూర్యఘర్ పథకానికి ఐదు గ్రామాలను ఆదర్శంగా తీసుకోవాలి7జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ -
వైభవంగా శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం
నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : అరండల్పేటలోని శ్రీ అష్టలక్ష్మీ సమేత లక్ష్మీనారాయణస్వామి దేవస్థానం 31వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం వైభవంగా నిర్వహించారు. పలు రకాల పుష్పాలు, సుగంధ ద్రవ్యాలు, ప్రత్యేకంగా కనకాంబరాలు, మల్లెలు, తులసి మాలలతో కల్యాణమూర్తులను అలంకరించారు. విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు విద్యారణ్యభారతి స్వామి పుష్పాభిషేకం నిర్వహించి, ప్రత్యేక హారతులతో కల్యాణమూర్తులను సేవించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. అమరావతి: అమరావతిలోని అమరేశ్వరాలయంలో చంద్రగ్రహణానంతరం బుధవారం అమరేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున ఆలయశుద్ధి అనంతరం ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖర శర్మ ఆధ్వర్యంలో సంప్రోక్షణ కార్యక్రమంలో భాగంగా విఘ్నేశ్వర పూజ, నవగ్రహ మంటపారాధన, పుణ్యహావాచన నిర్వహించి అనంతరం జలాలతో అమరేశ్వరునికి అభిషేకం చేశారు. బాలచాముండేశ్వరి అమ్మ వారికి, ఉపాలయాలలో అభిషేకం నిర్వహించారు. ఉదయం 8 గంటలకు భక్తులకు దర్శనం కల్పించారు. అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతిలో వేంచేసియున్న బాలచాముండికా సమేత అమరేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. మహాశివరాత్రి అనంతరం హుండీల లెక్కింపును దేవదాయశాఖ ప్రత్యేక అధికారి దాసరి చంద్రశేఖర్ సమక్షంలో దేవాలయంలో ఉన్న 10 హుండీలతో పాటు తాత్కాలిక హూండీలను తెరచి భక్తులచే లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి రేఖ మాట్లాడుతూ హుండీల ఆదాయం మొత్తం రూ.41,42,621వచ్చినట్లు తెలిపారు. మంగళగిరి టౌన్: శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి చూర్ణోత్సవం, వసంతోత్సవం నిర్వహించారు. కై ంకర్యపరులుగా నిడమర్రుకు చెందిన కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి, ఛాయాదేవి దంపతులు వ్యవహరించారు. బుధవారం రాత్రి స్వామి వారికి ధ్వజారోహణం, కేళిగుర్రంపై విహారం, దొంగల దోపిడీ నిర్వహించారు. ఉదయం జరిగిన స్వామివారి చూర్ణోత్సవం అనంతరం స్వామి వసంతోత్సవం జరుపుకొంటూ పురవీధుల్లో విహరించారు. ఉత్సవాన్ని ఆలయ ఈవో కె. సునీల్కుమార్ పర్యవేక్షించారు. -
ఇఫ్తార్ దావత్ ఏర్పాట్ల పరిశీలన
గుంటూరు రూరల్: రంజాన్ మాసం సందర్భంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన నిర్వహించనున్న ‘ఇఫ్తార్ దావత్’ కార్యక్రమానికి పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి గుంటూరు విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని ఇన్నర్ రింగ్ రోడ్డులో ఉన్న శ్రీ కన్వెన్షన్ హాల్ను బుధవారం రాష్ట్ర మైనారిటీ అధ్యక్షులు, వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ షేక్ ఖాదర్బాషా, గుంటూరు నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా, కదిరి ఇన్చార్జి షేక్ మగ్బూల్బాషా, జిల్లా మైనారిటీ అధ్యక్షులు పఠాన్ సైదాఖాన్, లియాఖత్, షేక్ సలీం, ఘనికా ఝాన్సీ తదితరులు పరిశీలించారు. చేయవలసిన ఏర్పాట్లపై చర్చించారు. గుంటూరుకు వైఎస్ జగన్ రాక -
అక్రమ అరెస్టులపై ఆగ్రహం
బాపట్లబుధవారం శ్రీ 4 శ్రీ మార్చి శ్రీ 2026 ఇఫ్తార్ సహరి (బుధ) (గురు) బాపట్ల 6.21 5.07 నరసరావుపేట 6.23 5.09 గుంటూరు 6.21 5.07 ● చీరాలలో మోకాళ్లపై కూర్చుని అంగన్వాడీల నిరసన ● వేమూరులో రాస్తారోకో ● అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని అడ్డుకోలేరంటున్న అంగన్వాడీలు అంగన్వాడీల అక్రమ అరెస్ట్లకు నిరసన చీరాలలో మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్న అంగన్వాడీలు తాడేపల్లి రూరల్ : మంగళగిరి రూరల్ పరిధిలోని ఆత్మకూరు అండర్పాస్ వద్ద మంగళవారం జేసీబీ అదుపుతప్పి డ్రైన్లో బోల్తాపడింది. డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. -
సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు
కలెక్టరేట్ ఎదుట ఏపీటీఎఫ్ ధర్నా గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారంలో కాలయాపన చేయడం తగదని, తక్షణమే సమస్యల పరిష్కారానికి రూట్మ్యాప్ ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్ 1938) జిల్లా ప్రధాన కార్యదర్శి కె.నరసింహారావు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీటీఎఫ్–1938 రాష్ట్రవ్యాప్త ఉద్యమ కార్యాచరణలో భాగంగా మంగళవారం గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన ధర్నా నిర్వహించారు. ధర్నాలో సంఘ జిల్లా గౌరవాధ్యక్షుడు వి.సూర్యం, సహాధ్యక్షులు ఓ.నాగార్జున, జిల్లా అదనపు కార్యదర్శి సాయన్న, జిల్లా ఉపాధ్యక్షులు ఆనంగి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి జీఎస్ఎస్ ప్రసాద్, నగర నాయకులు వై.మనోజ్ కుమార్, ఎన్.మీనాక్షి, వివిధ మండలాల ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
జంతు సంరక్షణ కోసమే హనుమాన్ ప్రాజెక్ట్
సాక్షి, అమరావతి/మంగళగిరి టౌన్: వన్యప్రాణుల సంరక్షణ కోసం హనుమాన్ ఫౌండేషన్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో మంగళవారం ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ప్రాజెక్ట్ కోసం పూర్తి సాంకేతికతతో కూడిన 100 ప్రత్యేక ర్యాపిడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ వాహనాలను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇటీవల వన్యప్రాణుల వల్ల పంట, పశు సంపదకు నష్టంతో పాటు మానవ భద్రతకు ముప్పు కలిగించే సంఘటనలు జరుగుతున్నాయని, వాటిని నివారించేందుకే ఈ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలకు రక్షణ, వారి జీవనోపాధికి భద్రత కల్పించడం, వన్యప్రాణుల సంరక్షణ చర్యలు కట్టుదిట్టం చేస్తున్నామని పేర్కొన్నారు. జంతువుల దాడిలో మనిషి చనిపోతే ఇచ్చే పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచామన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, అధికారులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ -
నృసింహుని ఆలయం ద్వారబంధనం
మంగళగిరి టౌన్ : సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా మంగళగిరిలోని లక్ష్మీనరసింహస్వామి దేవస్ధానం తలుపులకు మంగళవారం ద్వారబంధనం చేశారు. ఎగువ, దిగువ, ఉపాలయాలను రథోత్సవం అనంతరం ఉదయం 9 గంటలకు ఆలయ అధికారి సునీల్కుమార్ ఆధ్వర్యంలో దేవస్థాన పురోహితులు తలుపులు మూసివేశారు. గ్రహణ శుద్ధి అనంతరం బుధవారం ఉదయం 7 గంటల నుంచి ఎగువ, దిగువ సన్నిధుల్లో స్వామివార్లు భక్తులకు దర్శనమివ్వనున్నారని ఆలయ అధికారులు తెలిపారు. నరసరావుపేట రూరల్: చంద్ర గ్రహణాన్ని పురస్కరించుకుని కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి దేవస్థానాన్ని మంగళవారం మూసివేశారు. స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించిన అనంతరం ఉదయం 6 గంటలకు ఆలయాన్ని సిబ్బంది మూసివేశారు. శైవాగమ ప్రకారం సంప్రోక్షణ కార్యక్రామాన్ని నిర్వహించిన అనంతరం బుధవారం ఉదయం 8 గంటల నుంచి భక్తులకు స్వామి వారి దర్శనాన్ని కల్పిస్తామని ఆలయ ఈవో డి.చంద్రశేఖర్ తెలిపారు. -
9న కలెక్టరేట్ వద్ద ధర్నా
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్) : అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కోసం భూములు కోల్పోతున్న రైతులు కలెక్టరేట్ వద్ద 9వ తేదీన జరిగే ధర్నాను జయప్రదం చేయాల్సిందిగా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య పిలుపు నిచ్చారు. గుంటూరు బ్రాడిపేటలోని రైతు సంఘం జిల్లా కార్యాలయంలో రాష్ట్ర రైతు, కౌలు, వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశం మంగళవారం అప్పారావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్, రైతు సంఘం నాయకులు శివసాంబిరెడ్డి, వి.భారతి,బి. శ్రీనివాసరావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బి.రామరృష్ణ, జిల్లా నాయకులు పాశం రామారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు బి.కోటేశ్వరి ,సిఐటియు జిల్లా నాయకులు వై. నేతాజీ, కె. నళినీకాంత్, ఎన్.భావనారాయణ, తదితరులు పాల్గొన్నారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య -
పోలీసుల సహకారంతోనే అంబటి ఇంటిపై దాడి
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): పోలీసుల సహకారంతోనే మాజీ మంత్రి అంబటి రాంబాబు కార్యాలయం, ఇంటిపై దాడి జరిగిందని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి ఆరోపించారు. గుంటూరు సిద్ధార్థనగర్లోని మాజీ మంత్రి అంబటి రాంబాబుని మంగళవారం సాయంత్రం శ్రీకాంత్రెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాంబాబు నోటి వెంట అనుకోని మాట ఒకటి వచ్చిందని, తప్పుగా వచ్చిన పదాన్ని ఆసరా చేసుకుని దాదాపు ఏడెనిమిది గంటలకుపైగా విధ్వంసకాండ జరపడం దారుణమని అన్నారు. పొరపాటున నోరు జారిన మాటకు వెంటనే క్షమాపణ చెప్పారని తెలిపారు. అయినప్పటికీ అప్పటికప్పుడే ఫోన్ కాల్స్ చేసుకుని, విడతల వారీగా వచ్చేసి దాడి చేయడం ప్రజాస్వామ్య దేశంలో ఎప్పుడైనా చూశామా అని ప్రశ్నించారు. ఇంట్లోని మహిళలు, చిన్నారులను చూడకుండా ఇల్లు, కార్యాలయాన్ని ధ్వంసం చేయడం బాధాకరమని అన్నారు. దీనిని పోలీసులు నిలువరించకపోవడం దారుణమని అన్నారు. పోలీస్ వ్యవస్థ దాడులకు తెగబడిన వారిని ప్రోత్సహించడం ఎక్కడా చూడలేదన్నారు. గుంటూరు –2 ఎమ్మెల్యే గళ్లా మాధవి, ఆమె భర్త స్వయంగా వచ్చి దాడుల్లో పాల్గొనడం దారుణమని మండిపడ్డారు. వారిపై ఎక్కడా కేసులు నమోదు చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరిఫాతిమా, రాష్ట్ర నాయకులు నిమ్మకాయల రాజనారాయణ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి -
● యువకుడు మృతి ● ఆటోలో ఎనిమిది మంది కూలీలు
ఆటోను ఢీకొట్టిన లారీ ఇంకొల్లు(చినగంజాం): ఆటోను లారీ ఢీ కొన్న ఘటనలో ఒక యువకుడు మృతి చెందాడు. ఘటన ఇంకొల్లు మండలంలోని దుద్దుకూరు గ్రామ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన 8 మంది వ్యవసాయ కూలీలు దుద్దుకూరు ఉత్తరపు పొలాల్లో శనగ కోసే పనులు పూర్తి చేసుకొని ఒకే ఆటోలో ఇంటికి తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో వారికి సమాంతరంగా వస్తున్న సిమెంట్ లోడు లారీ ఆటోను కుడివైపున బలంగా ఢీ కొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోలో కుడివైపును కూర్చొన్న ఇరువురు దునిమిద్దుల తిమోతి (25), గుంటూరు గౌరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని దుద్దుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్కు తరలించారు. గాయాలపాలైన వారిలో తిమోతికి అతనికి ఎడమ వైపున మెడ వద్ద పుట్టుకతో వచ్చిన గడ్డ పగలడంతో తీవ్ర రక్తస్రావమై చికిత్స పొందుతూ మృతి చెందాడు. గుంటూరు గౌరి కుడి కాలు, కుడి చేయి విరిగింది. ప్రమాదస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ జీ సురేష్ తెలిపారు. -
ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి
నరసరావుపేట ఈస్ట్: ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారికి టెట్ ఉత్తీర్ణత నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు. టెట్ విధానం రాకముందు ఎంపికై న ఉపాధ్యాయులను మినహాయించాలని కోరారు. టెట్ నిబంధన తొలగించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 10వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. ఈమేరకు ఛలో ఢిల్లీ వాల్పోస్టర్ను మంగళవారం ఏపీటీఎఫ్ కార్యాలయంలో ఆవిష్కరించారు. 8న టెన్నిస్, బ్యాడ్మింటన్ పోటీలు నరసరావుపేట ఈస్ట్: సత్తెనపల్లిరోడ్డులోని డీఎస్ఏ స్టేడియంలో ఈనెల 8వ తేదీన శాప్ లీగ్ పోటీల్లో భాగంగా టెన్నిస్, బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహిస్తున్నట్టు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి మంగళవారం తెలిపారు. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ, జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొన్నారు. పోటీల్లో భాగంగా 40 సంవత్సరాల వయస్సు పైబడిన మహిళలు, పురుషులకు టెన్నిస్, 35 సంవత్సరాలు వయస్సు పైబడిన మహిళలు, పురుషులకు బ్యాడ్మింటన్ పోటీలు జరుగుతాయని తెలిపారు. ఆయా క్రీడల్లో సింగిల్, డబుల్స్, మిక్సడ్ డబుల్ విభాగాలలో నిర్వహిస్తామని వివరించారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు శాప్ వెబ్సైట్లో తమ ఆధార్ కార్డు ద్వారా రిజిస్టర్ కావాలని తెలిపారు. రిజిస్టర్ అయిన క్రీడాకారులను మాత్రమే పోటీలను అనుమతిస్తామని స్పష్టం చేశారు. వివరాలకు 8712622574 నెంబరులో సంప్రదించాలని తెలిపారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలపై ప్రచార కార్యక్రమాలు చేపట్టాలి
యూటీఎఫ్ పిలుపు గుంటూరు ఎడ్యుకేషన్ : రానున్న విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు అడ్మిషన్ క్యాంపెయిన్ చేపట్టాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. మంగళవారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో సంఘ జిల్లా కార్యావర్గ సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకటేశ్వర్లు యూటీఎఫ్ నాయకులతో కలసి ప్రభుత్వ బడిలో విద్యార్థులను చేర్పించాలని రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించారు. సమావేశంలో సంఘ జిల్లా గౌరవాధ్యక్షుడు పీవీ శ్రీనివాస్, జిల్లా సహాధ్యక్షుడు జి.వెంకటేశ్వర్లు, ఎండీ షకీలా బేగం, కోశాధికారి ఎండీ గయాసుద్దౌలా, జిల్లా కార్యదర్శులు సీహెచ్ ఆదినారాయణ, కె.సాంబశివరావు, జి.వెంకటేశ్వరరావు, ఎం.గోవింద్, టి.ఆంజనేయులు, కె.రంగారావు, బి.ప్రసాదు, కె.కేదార్నాథ్, ఎం.కోటిరెడ్డి పాల్గొన్నారు. -
పీఠా నాగమోహన్ కృష్ణ
వైఎస్సార్ సీపీ రేపలె ్లసమన్వయకర్తగారేపల్లె: రేపల్లె నియోజకవర్గం నగరం మండలం కారంకివారిపాలెం పంచాయతీ పీటవారి పాలెంకు చెందిన చెందిన పీఠా నాగమోహన్ కృష్ణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి మంగళవారం రాత్రి అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్పటివరకు నాగమోహన్ కృష్ణ పార్టీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన తన తాత పీఠా పోతురాజు స్మారకార్థం మెమోరియల్ ట్రస్ట్ను స్థాపించి, నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరయ్యారు. నాగమోహన్ కృష్ణ నియామకంపై నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాగమోహన్ కృష్ణ మాట్లాడుతూ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో సమన్వయం సాధిస్తూ రానున్న ఎన్నికల్లో రేపల్లె నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
అంగన్వాడీ వర్కర్స్ ధర్నా శిబిరంపై దాడి హేయం
● శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారి అరెస్టును ఖండిస్తున్నాం ● వైఎస్సార్ సీపీ అంగన్వాడీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెల్డా ఫ్లారెన్స్ నరసరావుపేట: అంగన్వాడీ వర్కర్ల ధర్నా శిబిరంపై దాడి హేయమని వైఎస్సార్సీపీ అంగన్వాడీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెల్డా ఫ్లారెన్స్ పేర్కొన్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న అంగన్వాడీల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. అంగన్ వాడీలకు వేతనాలు పెంచుతామని టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఒక్క్డటీ నెరవేర్చలేదని అన్నారు. ● అంగన్వాడీలుగా పనిచేస్తున్న వారందరూ పేద కుటుంబాల వారని, వారికి అరకొర వేతనాలతో జీవించడం దుర్లభంగా ఉందన్నారు. ప్రభుత్వం సమస్యను పరిష్కరించకుండా టెంటులోని వారిని అరెస్టులు చేయడం దుర్మార్గమన్నారు. ● తమ పార్టీ అధికారంలో ఉండగా అంగన్వాడీలు 42 రోజులు సమ్మెను శాంతియుతంగా చేశారన్నారు. వారి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని 42 రోజులకు సంబంధించి జీతాలు కూడా ఇవ్వటం జరిగిందన్నారు. ● అడిగిన తొమ్మిది డిమాండ్లు కూడా ఆ రోజున తమ ప్రభుత్వం జీవోలతో సహా హామీ ఇవ్వటం జరిగిందన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన 22 నెలల్లో ఎన్నిసార్లు ధర్నా చేస్తే అన్నిసార్లు జీతాలు కట్ చేయటం హేయం అన్నారు. -
సీనియారిటీ జాబితా విడుదల చేయాలి
చిలకలూరిపేట: మున్సిపల్ ఉపాధ్యాయుల సీనియారిటీ లిస్టులు వెంటనే విడుదల చేయాలని ఎస్టీయూ రాష్ట్ర డైరీ కమిటీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పట్టణంలోని ఎస్టీయూ ప్రాంతీయ కార్యాలయంలో మంగళవారం సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఉపాధ్యాయుల సీనియారిటీ లిస్టులు విడుదల చేయడంలో జాప్యం చేయడాన్ని ఎస్టీయూ తీవ్రంగా విమర్శిస్తుందని వెల్లడించారు. 13 వేల మంది ఉపాధ్యాయులు 59 అర్బన్ లోకల్ బాడిలలో పనిచేస్తున్నారని చెప్పారు. వీరిని 2022లో విద్యాశాఖలో విలీనం చేసినా నేటికీ సీనియారిటీ జాబితాను విద్యాశాఖ అధికారులు తయారు చేయకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియారిటీ లిస్టు లేని కారణంగా పదోన్నతులు, బదిలీల సమయంలో తీవ్ర అసౌకర్యం ఏర్పడుతుందని విమర్శించారు. రాష్ట్ర విద్యాశాఖ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 2025 నాటికే ఈ జాబితా విడుదల చేయాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం, విద్యాశాఖ తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు వి అక్కయ్య, షేక్ జమీర్బాష, ఎం కోటేశ్వరరావు, వి జయప్రకాశ్, కాలేషా పాల్గొన్నారు. -
13, 14 తేదీల్లో కిట్స్ అక్షర్లో ‘గాల–2026’
ప్రత్తిపాడు: ప్రత్తిపాడు మండలం యనమదల కిట్స్ అక్షర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ నెల 13, 14 తేదీల్లో ‘గాల 2026’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కళాశాల చైర్మన్ డాక్టర్ కోయి సుబ్బారావు తెలిపారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్ను మంగళవారం స్థానిక కళాశాలలో చైర్మన్ సుబ్బారావు, సెక్రటరీ కోయి శేఖర్, డైరెక్టర్ గోగినేని సాంబశివరావులతో కలిసి ఆవిష్కరించారు. రెండు రోజుల పాటు విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న ప్రతిభ ప్రతిబింబించేలా టెక్నికల్ ఈవెంట్లు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నామని చెప్పారు. బ్రోచర్లో కార్యక్రమాల పూర్తి షెడ్యూల్తో పాటు ఈవెంట్ వివరాలు, నమోదు విధానం, బహుమతుల సమాచారం ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు ఈవెంట్లో పాల్గొని ప్రతిభను ప్రదర్శించి విజేతలుగా నిలవాలని చైర్మన్ ఆకాంక్షించారన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రామకోటయ్య, ఆయా విభాగాల అధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు. కళాశాల చైర్మన్ డాక్టర్ కోయి సుబ్బారావు -
బాణసంచా గోదాములపై మెరుపు దాడులు
చిలకలూరిపేటటౌన్: ఇటీవల సామర్లకోట వేట్లపాలెంలో జరిగిన బాణసంచా దుకాణాల్లో జరిగిన ఘోర ప్రమాదం నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. డీజీపీ, పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆదివారం అర్ధరాత్రి చిలకలూరిపేట పరిధిలోని బొప్పూడి, చినపసుమర్రు ప్రాంతాల్లోని పలు బాణసంచా హోల్సేల్ దుకాణాలు, గోదాములపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. పల్నాడు ట్రైనీ ఎస్పీ నిరంజన్, డీఎస్పీ ఎం.హనుమంతరావు నేతృత్వంలో సుమారు 8 దుకాణాలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రూ.2లక్షల విలువైన బాణసంచా నిల్వ ఉంచుకోవడానికి మాత్రమే అనుమతి ఉండగా, మెజారిటీ గోదాముల్లో అంతకు మించి భారీగా నిల్వలు ఉన్నట్లు ప్రాథమికంగా అధికారులు గుర్తించామన్నారు. అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీల అనంతరం ఆయా దుకాణాలకు తాళాలు వేశారు. వీటికి సంబంధించిన మిగిలిన శాఖల జిల్లా అధికారులు, బాణసంచాకు సంబంధించిన నిపుణులను తీసుకువచ్చి నిల్వలను లెక్కించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా ట్రైనీ డీఎస్పీ నిరంజన్, డీఎస్పీ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ సాధారణ తనిఖీల్లో భాగంగా బాణసంచా దుకాణాలు పరిశీలించామని, అనుమతి పత్రాలను పరిశీలిస్తున్నామని, నిబంధనలకు విరుద్ధంగా, అనుమతికి మించి అక్రమంగా నిల్వలు ఉంచితే వాటిని వెంటనే ప్రభుత్వానికి స్వాధీనం చేస్తామని తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది, ఆర్డీఓల సమక్షంలో సమగ్ర తనిఖీలు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇకపై ఈ తనిఖీలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేలా నిల్వలు ఉంచనివ్వబోమని హెచ్చరించారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో అర్బన్ సీఐ పి.రమేష్, రూరల్ ఎస్ఐ జి.అనిల్ కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
లైంగిక దాడికి యత్నించిన వ్యక్తిపై కేసు
మాజీ మంత్రి అంబటికి పరామర్శ పట్నంబజారు(గుంటూరు ఈస్ట్) : గుంటూరు సిద్ధార్థనగర్లోని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబును పలువురు నేతలు పరామర్శించారు. అంబటితో మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వైఎస్సార్ సీపీ చింతలపూడి నియోజకవర్గం సమన్వయకర్త కంభం విజయరాజుతో పాటు ఆ నియోజకవర్గ మండల అధ్యక్షులు, పలువురు ఎంపీటీసీలు రాయకుల సత్యన్నారాయణ, శాంతారావు, తమ్మిశెట్టి గిరిజ, బొల్లు వెంకట సత్యన్నారాయణలతో పాటు పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు అంబటి నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త కంభం విజయరాజు మాట్లాడుతూ టీడీపీ గూండాలు రాజకీయంగా అంబటిని ఎదుర్కోలేక భౌతిక దాడులకు తెగబడ్డారని మండిపడ్డారు. కచ్చితంగా రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని స్పష్టం చేశారు. దివ్యాంగుల విభాగం నేతల పరామర్శ వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బందెల కిరణ్రాజు, నాయకులు కొమ్మిరెడ్డి శివారెడ్డి, శంకర్, కొండరాజు, షేక్ బాబ్జీ, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి తదితరులు రాంబాబును పరామర్శించారు. హైకోర్టు ఉత్తర్వులు పట్నంబజారు (గుంటూరు ఈస్ట్) : గుంటూరు జిల్లాలో వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణపై పోలీసులు మోపిన అక్రమ కేసులో ఎలాంటి అరెస్టు చేయవద్దని సూచిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సోమవారం అందాయి. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జనవరి 31వ తేదీన గుంటూరు సిద్ధార్థనగర్లోని వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు చెందిన ఇల్లు, కార్యాలయంపైనా, ఆయనపైనా టీడీపీ గూండాలు దాడి చేశారు. అనంతరం పోలీసులు రాంబాబుపైనే కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫిబ్రవరి 4వ తేదీన గుంటూరు నగరానికి విచ్చేశారు. ఆ పర్యటనలో పాల్గొన్న వైఎస్సార్సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పోలీసు యాక్ట్ 30ను అతిక్రమించారని, నిబంధనలకు విరుద్ధంగా జనాన్ని సమీకరించారని, రోడ్డు దిగ్బంధం చేశారని గుంటూరు పట్టాభిపురం పోలీసులు అభియోగం మోపుతూ అక్రమ కేసు నమోదు చేశారు. దీనిపై స్పందించిన మురళీకృష్ణ హైకోర్టును ఆశ్రయించి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై.లక్ష్మణరావు ఉత్తర్వులు జారీ చేశారన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఏడు సంవత్సరాల లోపు శిక్ష ఉన్న ఏ కేసులోనూ అరెస్ట్ చేయడానికి వీలులేదని, నోటీసు ఇచ్చి విచారణ జరుపుకోవచ్చని తేల్చి చెప్పారు. ఎటువంటి అరెస్ట్లు చేయవద్దని స్పష్టంగా పేర్కొన్నారు. -
అంతర జిల్లాల దొంగలు అరెస్ట్
బాపట్లటౌన్: ఒంటరిగా వెళుతున్న మహిళలనే లక్ష్యంగా చేసుకొని చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఎస్పీ వివరాలు వెల్లడించారు. బాపట్ల మండలం ముత్తాయపాలెంలో మహిళా పోలీస్ కర్రి లక్ష్మి ప్రసన్న 2025 అక్టోబర్ 29న స్కూటీపై పోతనకట్టవారిపాలెం వెళ్తుండగా దుండగులు మెడలోని చైన్ లాక్కెళ్ళారు. కేసు నమోదుచేసుకొని దర్యాప్తు నిర్వహించగా గుంటూరు జిల్లా నల్లపాడులోని చల్లావారిపాలెం గ్రామానికి చెందిన పట్నాల వెంకట దుర్గాప్రభు అలియాస్ అఖిల్, గుంటూరులోని శారద కాలనీకు చెందిన షేక్ రాజాలను గుర్తించి అదుపులోకి విచారించామని చెప్పారు. విలాసాల కోసమే నేరాలు .. నిందితుడు అఖిల్ ఎంబీఏ పూర్తిచేసి గుంటూరు పట్టణంలో జిమ్ సెంటర్ నిర్వహిస్తుండేవారు. వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో రాజాతో కలిసి మహిళలనే టార్గెట్ చేసుకొని మెడలో గొలుసులు దొంగలించారు. వీరి నుంచి మొత్తం 129.57 గ్రాముల బంగారం వస్తువులును, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. చైన్ స్నాచర్లను పట్టుకొనడంలో ప్రతిభ చూపించిన బాపట్ల డీఎస్పీ పి.జగదీష్ నాయక్, బాపట్ల రూరల్ సిఐ బి.హరిక్రిష్ణ, సిసిఎస్ సీఐ పి.ప్రేమయ్య, ఎస్.ఐ బాబురావు, కర్లపాలెం ఎస్.ఐ ఎస్.రవీంద్ర, కానిస్టేబుల్ వి.శివ శంకర్, ఐటి కోర్ కానిస్టేబుల్ లు యు.రాజేష్, కె.రాము, కర్లపాలెం హోంగార్డ్ ఎం.రమేష్ లను అభినందించారు. అనంతరం నగదు బహుమతి అందించారు. -
రేషన్ బియ్యం పట్టివేత
సత్తెనపల్లి: అప్పుల బాధలు తాళలేక ఫొటోగ్రాఫర్ ఆత్మహత్య చేసుకుని చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కట్టమూరు గ్రామంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. సత్తెనపల్లి మండలం కట్టమూరు గ్రామానికి చెందిన మల్లెల రాజు (37) ఫొటోగ్రాఫర్గా పని చేస్తూ జీవనం వెళ్లదీస్తున్నాడు. రాజుకు భార్య శ్రీనిధి, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తెకు ఫిట్స్ వస్తుండటంతో గత రెండు సంవత్సరాలుగా నెలకు రూ. 5 వేల వరకు ఖర్చు చేస్తున్నాడు. అంతేకాక కుమారుడికి కూడా నిత్యం జ్వరం వస్తుండడంతో కొంత అప్పులు అయ్యాయి. వీటికి తోడు బ్యాంకులో గృహ నిర్మాణ లోన్ రూ. 10 లక్షలు తీసుకోవడంతో ప్రతి నెల ఈఎంఐ చెల్లించాల్సి ఉంది. ఈక్రమంలో రెండు ఈఎంఐలు పెండింగ్లో ఉండడంతో ఈ అప్పుల నుంచి బయటపడేందుకు ఆత్మహత్య శరణ్యమంటూ భావించాడు. గత నెల 27న ఊరి చివర పురుగుల మందు సేవించి ఇంటికి వచ్చాక వాంతులు చేసుకోవడంతో భార్య ప్రశ్నించింది. దీంతో అప్పులు ఎలా తీరుతాయో తెలియటం లేదని, దీనికి తోడు కుమార్తె, కుమారుడు అనారోగ్యం అర్ధంకాక గడ్డి మందు సేవించానని భార్య శ్రీనిధికి చెప్పి విలపించాడు. ఆమె హుటాహుటిన చికిత్స నిమిత్తం సత్తెనపల్లి తరలించగా ప్రాథమిక చికిత్స అనంతరం గుంటూరు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. దీనిపై మృతుడి భార్య శ్రీనిధి ఫిర్యాదు మేరకు సత్తెనపల్లి రూరల్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గోవుల అక్రమ రవాణా అడ్డగింత
యడ్లపాడు: జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న గోవులను బీజేపీ నాయకులు సోమవారం అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు లేకుండా వాహనాల్లో తరలిస్తున్న ఆవులను గుర్తించి పోలీసులకు అప్పగించారు. తుని నుంచి ఎ. ప్రతాపరెడ్డి, హెచ్ నాగేంద్ర అనే వ్యక్తులు మినీ లారీల్లో ఆవులను లోడ్ చేసుకుని వెళ్తున్నారనే సమాచారం అందుకున్న బీజేపీ నాయకులు, స్థానిక ఎరక్రొండ వద్ద జాతీయ రహదారిపై ఆ వాహనాలను నిలిపివేసి తనిఖీ చేశారు. గోవుల తరలింపుపై వాహన చోదకులను ఆరా తీయగా, వారు ఎటువంటి అధికారిక అనుమతి పత్రాలను చూపలేకపోయారు. వాహనాలను స్థానిక పోలీస్ స్టేషన్న్కు తరలించారు. ఈ మేరకు అక్రమ రవాణాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు, యడ్లపాడు మండల అధ్యక్షుడు తులాబందుల సత్యనారాయణ నేతృత్వం వహించగా, వంకాయలపాటి వంశీధర్, వి. నాగేశ్వరరావు, పి. మహేష్, బందెల శ్రీనివాసరావు, నక్క శ్రీనివాసరావు, నేలటూరి ఏసురత్నం, షేక్ సుభాని, తోట చందు, శ్రీరామ్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నాయకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, వాహన యజమానులు మరియు డ్రైవర్లపై విచారణ చేపట్టారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): పికిల్ బాల్ అసోసియేషన్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన గోరంటల్లోని నెక్ట్స్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్లో గుంటూరు ఓపెన్ ఉమెన్ పికిల్ బాల్ చాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తామని జిల్లా పికిల్ బాల్ సంఘం సంయుక్త కార్యదర్శి కె.అరుణ్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీలకు సంబంధించిన పోస్టర్ను స్కూల్ ఆవరణలో వైజయంతి డెంటల్ కేర్ అధినేత డాక్టర్ వైజయంతి, శశిధర్, నెక్ట్స్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ అధినేత కె.శ్రీకాంత్ బాబు, కె.శ్రీవిద్య, జిల్లా పికిల్ బాల్ సంఘం కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్లు ఆవిష్కరించారన్నారు. మార్చి ఎనిమిదో తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించి ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో అండర్–15 బాలికలు, ఓపెన్ కేటగిరి, సింగిల్స్, ఓపెన్ డబుల్ ఈవెంట్లు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో ఎస్కే మన్సూర్ వలి, ఆనంద్ కుమార్, స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ జి.జె.కిషోర్ తదితరులు పాల్గొన్నారన్నారు. గుంటూరు ఎడ్యుకేషన్: వైజాగ్లో ఆదివారం జరిగిన ఏపీ ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్రస్థాయి సమావేశంలో భాగంగా గుంటూరుకు చెందిన మాంటిస్సోరి ఇంగ్లిషు మీడియం పాఠశాల కరస్పాండెంట్ మంజు సెబాస్టియన్కు రాష్ట్రస్థాయిలో ఉత్తమ మహిళా పురస్కారాన్ని ప్రదానం చేసినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ కేవీ సెబాస్టియన్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా వైజాగ్ పోక్సో కోర్టు న్యాయమూర్తి టి.మంగాకుమారి, వైజాగ్ ఆర్జేడీ విజయకుమార్ సమక్షంలో మంజు సెబాస్టియన్ను పురస్కారంతో సత్కరించినట్లు తెలిపారు. నగరంపాలెం (గుంటూరు వెస్ట్): స్థానిక బృందావన్గార్డెన్న్స్లోని పద్మావతి గోదా సమేత వేంకటేశ్వరస్వామివారి 27వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం నిత్యపూజలు, వేంకటేశ్వర సహస్రనామ హోమం నిర్వహించారు. భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతుల ఆధ్వర్యంలో తిరుప్పావై అమృతవర్షిణి డాక్టర్ కోగంటి వెంకట రంగనాయకి గోష్టి బృందం చేపట్టారు. సుమారు 400 మందికిపైగా సువాసినులతో విష్ణుసహస్ర నామపారాయణం, లలితా సహస్ర నామ పారాయణం, లక్ష్మీ అష్టతోత్తర పారాయణం చేయించి పుష్పాలతో సత్కరించారు. భక్తులకు అన్నసంతర్పణ చేయగా, సువాసినులకు చీరల పంపిణి చేశారు. శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వార్ల రథోత్సవం వైభవంగా చేపట్టారు. ఆధ్యాత్మిక సభలో భాగంగా విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు (హంపి) విద్యారణ్య భారతిస్వామి, శృంగేరి విరూపాక్ష పీఠం నుంచి పరమశివానంద భారతీస్వామి, మాత శివచైతన్యానంద స్వామి (తపోవనం నులకపేట) నిర్వికల్పానందస్వామిలు అనుగ్రహభాషణం చేశారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ డి.ఎన్.దీక్షితులు, ముప్పవరపు సింహాచలశాస్త్రి ఉపన్యాసించారు. కార్యక్రమంలో భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ కె.జి.శంకర్, పూర్వ ఆచార్యులు డాక్టర్ ఆరేటి కృష్ణకుమారి, సీఐడీ డీఎస్పీ గోలి లక్ష్మయ్య, ఆలయ కమిటీ అధ్యక్షులు సీహెచ్.మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, ఉపాధ్యక్షులు లంక విజయబాబు, సూర్యదేవర వెంకటేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, కన్నెగంటి బుచ్చయ్యచౌదరి, పుట్టగుంట ప్రభాకరరావు పాల్గొన్నారు. ఎస్పీ బి. ఉమామహేశ్వర్ బాపట్ల టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 37 మంది అర్జీదారులు ఎస్పీ కార్యాలయానికి చేరుకొని తమ సమస్యలను వివరించారు. బాధితుల సమస్యలు తెలుసుకున్న ఎస్పీ వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లాలోని పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అర్జీదారుల సమస్యలను చట్ట పరిధిలో విచారించి నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలన్నారు. -
అర్జీలు పునరావృతం కాకూడదు
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ బాపట్ల: పీజీఆర్ఎస్ అర్జీలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. పీజీఆర్ఎస్ కార్యక్రమం కలెక్టర్ అధ్యక్షతన సోమవారం స్థానిక కలెక్టరేట్లో జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 135 మంది అర్జీదారులు తమ వినతిపత్రాలను కలెక్టర్కు అందజేశారు. కొన్ని పరిష్కరించగా, మిగతావి పరిశీలిస్తున్నారు. అర్జీలను అదే రోజు 24 గంటల్లోగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. అదే రోజు అధికారులు క్షేత్ర పరిశీలన చేయాలని సూచించారు. ప్రజలకు తక్షణమే ఊరట లభించాలంటే వేగంగా పరిష్కారం చూపాలన్నారు. రిజిస్ట్రేషన్ శాఖలో 127 అర్జీలు పునరావృతం కావడంపై ప్రశ్నించారు. అలాగే మరికొన్ని శాఖలలోనూ ఇదే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఐజీఓటీ ఆన్లైన్ శిక్షణలు ప్రతి ఉద్యోగి పూర్తి చేయాలని పేర్కొన్నారు. శ్మశానాలకు వెంటనే భూములు కేటాయించాలన్నారు. ఎన్నికలకు సంబంధించిన దరఖాస్తులు తక్షణమే పరిష్కరించాలన్నారు. నూతన ఓటర్లు నమోదు, తొలగింపులపై వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ట, డీఆర్ఓ జి.గంగాధర్ గౌడ్, ఉప కలెక్టర్ లవన్న, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా బేతపూడమ్మ వారి తిరునాళ్ల
రేపల్లె: బేతపూడి గ్రామంలో వేంచేసియున్న బేతపూడమ్మ అమ్మవారి తిరునాళ్ళ మహోత్సవం సోమవారం వైభవంగా జరిగింది. అమ్మవారికి వేకువ జామునే సుప్రభాత సేవలతో అభిషేక మహోత్సవాలు నిర్వహించి పట్టువస్త్రాలు, పువ్వులతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు మేళతాళాల నడుమ అమ్మవారికి సారె సమర్పించారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, పండ్లు, నూతన వస్త్రాలతో కూడిన సారెతో పాటు చద్ది నైవేద్యాలు సమర్పించి మొక్కుబడులు తీర్చుకున్నారు. ఆలయ ఆవరణంలోని పోతురాజు స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నాగేంద్ర స్వామి పుట్టలో స్వామివారికి భక్తి శ్రద్ధలతో పాలు, గుడ్లు, చలిమిడి సమర్పించారు. ఆలయానికి గ్రామంతో పాటు సమీప గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి రావటంతో ఆలయమంతా సందడి వాతావరణం నెలకొంది. ఆలయం ఆవరణంలో నెలకొల్పిన ప్రభలు పలువురిని ఆకట్టుకున్నాయి. -
బాపట్ల
మంగళవారం శ్రీ 3 శ్రీ మార్చి శ్రీ 2026నేత్రపర్వం.. మల్లేశ్వరుని రథోత్సవం నరసరావుపేట: జిల్లాలో యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్న నలుగురు ఎస్సీ విద్యార్థులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా సోమవారం ట్యాబ్లు పంపిణీ చేశారు.మంగళగిరి టౌన్: స్థానికం పలు బడులను డీఈవో డాక్టర్ షేక్ సలీం బాషా సోమవారం సందర్శించారు. వీవర్స్ కాలనీ ప్రైమరీ హెల్త్ స్కూల్లో విద్యార్థులతో మాట్లాడారు.భట్టిప్రోలు: హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు తన్మయత్వంతో శివనామస్మరణ చేస్తుంటే భట్టిప్రోలులో సోమవారం భ్రమరాంబ మల్లేశ్వరస్వామి రథం ముందుకు కదిలింది. తండోప తండాలుగా తరలి వచ్చిన వేలాది మంది భక్తులు స్వామివారి రఽథాన్ని ఉత్సాహంగా లాగుతుంటే భక్తులు మిద్దెలు, గోడలు ఎక్కి ఆ సుందర దృశ్యాన్ని తిలకించేందుకు ఆరాట పడ్డారు. పురవీధులన్నీ జనంతో నిండిపోయాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలలో కీలక ఘట్టమైన రథోత్సవం సోమవారం నేత్ర పర్వంగా కొనసాగింది. రథోత్సవానికి ముందు ఆలయ ప్రధాన అర్చకులు దండిభొట్ల రాజేంద్ర ప్రసాద్, యాజ్ఞీకులు కౌతా సత్య వెంకట నాగరాజేష్ శర్మ రథాంగ హోమం నిర్వహించారు. పూజా కార్యక్రమంలో దండిభొట్ల ఛాయనాథ సాయి ఆధ్వర్యంలో జొన్నాదుల వెంకట వరప్రసాద్–పద్మజ దంపతులు పాల్గొన్నారు. రథం దేవాలయం వద్ద నుంచి బయలు దేరి పురవీధుల గుండా స్వామి వారి అత్తారిల్లు అయిన అద్దేపల్లి అమ్మవారి చెట్టు వద్ద కు వెళ్లి తిరిగి ఆలయానికి చేరుకుంది. రథాన్ని లాగటం పుణ్యంగా భావించడంతో భక్త జన సందోహం పోటీ పడ్డారు. రథంపై పూలతో అలంకరించిన స్వామి వారిని చూసి భక్తులు పులకించి పోయారు. ఈ రథోత్సవాన్ని తిలకించేందుకు పరిసర ప్రాంతాల నుంచే కాక కష్ణాజిల్లా నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. కార్యక్రమాలను వంశపారంపర్య ధర్మకర్తలు, అద్దేపల్లి–భట్టిప్రోలు పద్మశాలీయ బహుత్తమ సంఘీయులు, దేవదాయ శాఖ మేనేజర్ ఎం. శ్రీనివాసరావు జెడ్పీటీసీ సభ్యురాలు తిరువీధుల ఉదయభాస్కరి పర్యవేక్షించారు. నిర్వాహకులు విశ్రాంత ఉపాధ్యాయులు బొలిశెట్టి శ్రీనివాసరావు పర్యవేక్షణలో అమ్మవారి చెట్టు వద్ద అన్న ప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో పీఎస్సార్ ప్రసాద్, ఎస్బీఐ విశ్రాంత ఉద్యోగి చీదెళ్ల ఉమామహేశ్వరరావు, మాస్టర్ జిలానీ తదితరులు పాల్గొన్నారు. రథోత్సవంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తిరునాళ్ల సందర్భంగా వైద్య ఆరోగ్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వేమూరు సీఐ పి.వీరాంజనేయులు పర్యవేక్షణలో భట్టిప్రోలు, నగరం ఎస్ఐలు శివయ్య, భార్గవ్ల ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ సిబ్బంది 46 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. 7 భ్రమరాంబ మల్లేశ్వరస్వామి -
చూచిన కనులదే భాగ్యం
మంగళగిరి టౌన్ : గుంటూరు జిల్లా మంగళగిరిలో వేంచేసి యున్న లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టం నృసింహుని దివ్య కళ్యాణ మహోత్సవం సోమవారం అర్ధరాత్రి అట్టహాసంగా జరిగింది. సోమవారం ఉదయం అశ్వవాహనంపై విహరిస్తూ నారసింహుడు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకుని తరించారు. అశ్వవాహనంపై స్వామిని దర్శించినవారికి జ్ఞానవృద్ధి, విద్యాభివృద్ధి కలుగుతుందని భక్తులకు అర్చకులు వాహన విశిష్టతను వివరించారు. కొబ్బరి కాయలు కొట్టి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం స్వామివారు కళ్యాణ వేదిక వద్దకు వచ్చే సమయంలో ఎదురుకోలు ఉత్సవం నిర్వహించారు. రంగురంగుల పూలతో కళ్యాణ వేదికను అలంకరించి స్వామివారిని అధిష్టింపజేశారు. అర్చకులు స్వామి దివ్య కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా కనుల విందుగా జరిపించారు. స్వామి కళ్యాణాన్ని భక్తులు కనులారా వీక్షించి పరవశించారు. అశ్వవాహన ఉత్సవానికి నిడమర్రు గ్రామానికి చెందిన మండేపూడి పానకాల రావు, రూపకళ కై ంకర్య పరులుగా వ్యవహరించగా, కళ్యాణమహోత్సవానికి శాశ్వత కై ంకర్యపరులుగా దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామానికి చెందిన వాసిరెడ్డి నాగేంద్ర ప్రసాద్ వ్యవహరించారు. పట్టణ పద్మశాలీయ బహుత్తమ సంఘం తరఫునన అవ్వారు వాచ్ కంపెనీ అధినేత శరత్బాబు మధుపర్కాలు, మంగళ ద్రవ్యాలు సమర్పించారు. ఉత్సవాలకు ఆలయ ఈవో కె. సునీల్కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించగా మంగళగిరి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మంగళగిరి టౌన్ : గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో వేంచేసి యున్న లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం 9 గంటలకు మూసివేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కె. సునీల్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎగువ, దిగువ సన్నిధితో పాటు ఉపాలయాలను కూడా ద్వారబంధనం చేయనున్నామని, తిరిగి బుధవారం గ్రహణ శుద్ధి అనంతరం ఉదయం 7 గంటలకు స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నట్లు ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
వీరబ్రహ్మేంద్ర స్వామి వారి తిరునాళ్ల
రొంపిచర్ల: మండలంలోని సుబ్బయ్యపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి తిరునాళ్లను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం ఆలయం చుట్టూ రైతులు తమ పశుసంపదను ప్రదక్షణలు చేయించారు. భక్తులు పొంగళ్లు నిర్వహించి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. స్వామి వారికి గ్రామోత్సవం నిర్వహించారు. వీరబ్రహ్మేద్రస్వామి వారి భజన కార్యక్రమాలు చేశారు. రాత్రికి గ్రామస్తులు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు బండి మల్లేశం నిర్వహించారు. పోలీసులు శాంతిభద్రతలను పర్యవేక్షించారు. పెదపులివర్రు(భట్టిప్రోలు): శ్రీ భూ–నీళా సమేత శ్రీ వరద రాజ స్వామి దేవస్థానంలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. సోమవారం స్వామి వార్లకు విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, నిత్య హోమం, బలిహరణ జరిగింది. రాత్రి మూజు వాణి కార్యక్రమం నిర్వహించారు. రాత్రి కార్యక్రమంలో భాగంగా దివ్య రథోత్సవం జరిగింది. తెనాలి: స్థానిక బాలాజీరావుపేటలోని అయ్యప్పపురం ప్రధాన అయ్యప్ప దేవాలయం వార్షికోత్సవాలు, ఫాల్గుణ పౌర్ణమి దుర్గమ్మ తిరునాళ్ల సోమవారం ఘనంగా నిర్వహించారు. గత రెండురోజులుగా దుర్గమ్మ అమ్మవారు పసుపుగౌరి అలంకారంతో నగర సంచారం జరిగింది. ఈ క్రమంలో తిరునాళ్ల రోజు ఉదయం భక్తులు పాలపొంగళ్లు చేసి అమ్మవారికి సమర్పించి, పసుపు గౌరీ దర్శనం చేసుకున్నారు కళ్యాణ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవ కళ్యాణం నిర్వహించారు. దోగిపర్తి వారి కుటుంబసభ్యులు ఆధ్వర్యంలో ఏటా జరిగినట్టే ఈసారీ జరిపారు. అనంతరం నృత్యప్రదర్శనలు జరిగాయి. గుంటూరు రూరల్: గుంటూరు జిల్లా జొన్నలగడ్డ గ్రామంలో నవగ్రహ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని సోమవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మహా అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజలు, భక్తులు దాదాపు ఐదు వేల మందికిపైగా పాల్గొని ప్రతిష్ఠామహోత్సవ తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. -
చీరాలలో రోడ్డు ప్రమాదం
చీరాల: చీరాల మండలం విజయనగర్కాలనీ సమీపంలో 167ఏ జాతీయ రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టాటా ఏస్ వాహనం రోడ్డుపై వెళుతున్న గేదెలను బలంగా ఢీకొనడంతో ఐదు గేదెలతో పాటు ఒక మహిళ మృతి చెందింది. ఆ వివరాల్లోకి వెళితే... ఈపూరుపాలెంలోని సావరపాలేనికి చెందిన సుబ్బమ్మ (64) సోమవారం పశువులను మేపుకునేందుకు విజయనగర్కాలనీ సమీపానికి వెళ్లింది. 167ఏ జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న టాటా ఏస్ వాహనం రోడ్డుపై ఉన్న గేదెలను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ సుబ్బమ్మతో పాటు ఐదు గేదెలు తీవ్రగాయాలతో సంఘటన స్థలంలోనే మరణించాయి. వాహనం నడుపుతున్న వ్యక్తికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. మినీ వాహనం ఢీకొంటేనే ఐదు గేదెలు మరణించాయంటే ఆ వాహనం ఎంత స్పీడుగా వచ్చిందో అర్థమవుతోంది. ఈ ప్రమాదంలో గేదెలు మేపుకునేందుకు వచ్చిన సుబ్బమ్మ మృతదేహం కూడా నుజ్జయింది. మృతురాలి కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
పోలేరమ్మ దేవస్థానంలో చోరీ
డబ్బు తీసుకుని హుండీని పొలాల్లో పడేసిన దొంగలు చీరాల టౌన్: చీరాల మండలం తోటవారిపాలెం పోలేరమ్మ అమ్మవారి దేవస్థానంలో దొంగలు పడ్డారు. హుండీలో డబ్బులు తీసుకుని హుండీని పొలాల్లో పడేసి వెళ్లిపోయారు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. రూరల్ ఎస్సై అంబటి చంద్రశేఖర్ తెలిపిన వివరాల మేరకు... తోటవారిపాలెం పోలేరమ్మ అమ్మవారి గుడిలో దొంగలు పడి హుండీని అపహరించారు. అందులోని నగదు తీసుకెళ్లి ఖాళీ హుండీని పొలాల్లో పడేశారనే సమాచారంతో రూరల్ సీఐ శేషగిరిరావు, రూరల్ ఎస్సై చంద్రశేఖర్, వారి సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని విచారించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్తో గుడి, చుట్టుపక్కల ప్రదేశాల్లో గాలించారు. అమ్మవారి హుండీలో భక్తులు సమర్పించిన కానుకలు సుమారు రూ.60 వేల వరకు అపహరణ జరిగిందని కమిటీ ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. సీసీ కెమెరాల్లో రికార్డయిన దొంగతనం... ఆదివారం అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ముసుగు ధరించిన దొంగ చేతికి గ్లౌజులు ధరించి గడ్డపార తీసుకొచ్చి అమ్మవారి విగ్రహం ఉన్న గుడి రెండు తలుపులను పగలకొట్టాడు. శఠారి పల్లెంలో ఉన్న నగదు తీసుకుని పక్కనే ఉన్న హుండీ ఎత్తుకెళ్లడం సీసీ కెమెరాల్లో రికార్డయింది. సోమవారం ఉదయం దేవాలయానికి వచ్చిన పూజారి అమ్మవారి గుడి తలుపులు పగలకొట్టి ఉండటం, హుండీ కనిపించకపోవడంతో కమిటీ సభ్యులకు సమాచారం అందించారు. కమిటీ ప్రతినిధులు పోలీసులకు సమాచారం అందించగా ఘటన స్థలానికి రూరల్ సీఐ శేషగిరిరావు, ఎస్సై చంద్రశేఖర్, సిబ్బంది వచ్చి దేవస్థానం సమీప ప్రాంతాలను పరిశీలించారు. సమీపంలోని పొలంలో అమ్మవారి ఖాళీ హుండీ కనిపించడంతో హుండీలోని నగదు తీసుకుని దొంగలు పరారయ్యాడని నిర్ధారించుకుని ఆ దిశగా విచారణ ప్రారంభించారు. ఇదే ఆలయంలో నాలుగేళ్ల క్రితం దొంగలు పడి అమ్మవారి వస్తువులు, హుండీ దోచుకెళ్లారు. అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు.. దొంగలను గుర్తించి జైలుకు కూడా పంపించారు. -
ఢిల్లీని ఫిదా చేసిన గుంటూరు ఆతిథ్యం
● ‘వేదిక’ అంకితభావానికి దక్కిన అభినందన ●నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ప్రశంసల జల్లు యడ్లపాడు: తెలుగు నాటక రంగానికి.. గుంటూరు ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో యడ్లపాడుకు చెందిన ‘వేదిక’ (తెలుగు నాటక పరిషత్తుల సమ్మేళన సంఘం) అసాధారణ విజయాన్ని సాధించింది. గుంటూరులో 25వ భారత్రంగ్ మహోత్సవ్–2026 అంతర్జాతీయ నాటకోత్సవం దిగ్విజయ నిర్వహణకు దేశ రాజధాని ఢిల్లీ ఫిదా అయింది. ఈ వేడుకల విజయవంతంపై న్యూఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వేదిక అధ్యక్షుడు డాక్టర్ ముత్తవరపు సురేష్బాబుపై ప్రశంసలు కురిపిస్తూ ఎన్ఎస్డీ డైరెక్టర్ చిత్తరంజన్ త్రిపాఠి ప్రత్యేక అభినందన పత్రాన్ని పంపించారు. ఆ విషయాలను ఆదివారం ముత్తవరపు మీడియాతో పంచుకున్నారు. కళాకారుల గుండెల్లో చెరగని ముద్ర... గత ఫిబ్రవరి 6 నుంచి 10వ తేదీవరకు గుంటూరు శ్రీవెంకటేశ్వర విజ్ఞానమందిరంలో జరిగిన ఈ అంతర్జాతీయ నాటకోత్సవాలు కేవలం ప్రదర్శనలకే పరిమితం కాకుండా, ఒక గొప్ప సాంస్కృతిక పండుగలా సాగాయని ఎన్.ఎస్.డి కొనియాడిందని సురేష్బాబు తెలిపారు. ముఖ్యంగా దేశ, విదేశీ కళాకారులకు కల్పించిన వసతులు, సాంకేతిక తోడ్పాటు ఉత్సవం నిర్వహణలో ప్రదర్శించిన క్రమశిక్షణ అద్భుతమని ప్రశంసించిందన్నారు. ఈ గౌరవం ‘వేదిక’ బృందం అంకితభావానికి, రెండు తెలుగు రాష్ట్రాల నాటక రంగ పెద్దలకు, గుంటూరు నగరవాసుల సహకారానికి దక్కిన ప్రతిఫలమన్నారు. దేశ, విదేశీ నాటక బృందాల మధ్య వేదిక ఒక వారధిగా నిలిచిందన్నారు. ఐదు రోజుల పాటు ఎక్కడా ఆటంకాలు లేకుండా పండుగ వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించడం గొప్ప అనుభూతినిచ్చిందని తెలిపారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా సహకారంతో వేదిక కలిసి వేసిన ఈ తొలి అడుగును సుదీర్ఘ ప్రయాణంగా కొనసాగిస్తామని సురేష్ బాబు ధీమా వ్యక్తం చేశారు. -
న్యాయ విచారణ చేపట్టాలి
గడిచిన మూడు నెలల్లో సుమారు 40 మందికిపైగా సచివాలయ ఉద్యోగులు మరణించారు. వీరిలో ఎక్కువ మంది 40 ఏళ్ల వయస్సు గలవారే. ఈ మరణాలకు కారణం తీవ్రమైన పని ఒత్తిడే. సచివాలయ శాఖలో సుమారు 15 వేల మందికిపైగా ఉద్యోగులు వివిధ శాఖలకు, అధికారుల వద్ద డెప్యూటేషన్పై పనిచేస్తున్నారు. వీరందరి భారం మిగిలిన వారిపైనే పడి వారు తీవ్రమైన పని ఒత్తిడితో మరణిస్తున్నారు. సర్వేలను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించడంతోపాటు సచివాలయ ఉద్యోగుల మరణాలపై జ్యూడీషియల్ విచారణ చేపట్టాలి. – షేక్ అబ్దుల్ రజాక్, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం -
కారుకు నిప్పు పెట్టిన దుండగులు
దుగ్గిరాల: శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దుగ్గిరాలకు చెందిన దార్ల రవి కారు ను ఇంటి ముందు పార్క్ చేసి ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి ఒంటి గంట దాటిన తరువాత పెద్ద శబ్దం రావటంతో బయటకు వచ్చి చూడగా మంటలలో కాలుతున్న కారును గమనించిన స్థానికులు నీరు పోసి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే వెనుక వైపు పూర్తిగా కాలిపోయింది. గుంటూరు నుంచి క్లూస్ టీం వచ్చి ఉన్న ఆధారాలు సేకరించింది. కేసు నమోదు చేసి ఎస్ఐ వెంకట రవి దర్యాప్తు చేస్తున్నారు. రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం తెనాలిరూరల్: పిల్లలకు టిఫిన్ తీసుకువద్దామని వెళ్లిన తండ్రి రైలుఢీకొని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన తెనాలిలో ఆదివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. పట్టణ పినపాడుకు చెందిన కరేటి సురేష్(50) కలప వ్యాపారం చేసేవాడు. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆదివారం కావడంతో పిల్లలకు టిఫిన్ తీసుకువచ్చేందుకు ఇంటి నుంచి వెళ్లాడు. పినపాడు సమీపంలోని మద్రాసు గేటు వేసి ఉండడంతో పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. ఇటీవల నిర్మించిన నూతన రైలు మార్గం(మూడో లైను)లో ఓ రైలు వెళుతుండడంతో మరో పట్టాల వద్ద నిలచి ఉన్నాడు. ఆ పట్టాలపై మరో రైలు వచ్చి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనాస్థలాన్ని ఇన్చార్జి జీఆర్పీ ఎస్ఐ ఎల్.సరస్వతి పరిశీలించారు. మృతదేహాన్ని జిల్లా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముప్పాళ్ల: మద్యం మత్తులో యువకుడిపై కత్తితో దాడికి దిగిన సంఘటన ముప్పాళ్ల పెదనందిపాడు బ్రాంచి కాలువ పక్కనే ఉన్న వైన్షాపులో శనివారం రాత్రి జరిగింది. సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ముప్పాళ్లకు చెందిన జానకిరెడ్డి కొంత కాలంగా కాల్వ వద్ద నున్న వైన్షాపు వద్ద ఫుడ్కోర్టు నిర్వహిస్తున్నాడు. లంకెలకూరపాడు గ్రామానికి చెందిన యువకుడు, నరసరావుపేట మండలంలోని సాతులూరు కు చెందిన మరో యువకుడు దుకాణానికి వచ్చి ఫుడ్కోర్టు నిర్వాహకుడైన జానకిరెడ్డితో ఘర్షణ పడ్డారు. అనంతరం వారి వద్ద నున్న కత్తితో జానకిరెడ్డిపై దాడికి దిగారు. దాడిలో జానకిరెడ్డి తలపైన, కాలిపైన తీవ్ర గాయమైంది. ఘర్షణను అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో యువకుడి చేతిపైన కత్తి గాయమైంది. గాయపడిన యువకుడ్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వారిపై గతంలోను అనేక కేసులు ఉన్నట్లు సమాచారం. -
మంచంపై ఉన్న వారిని పీజీఆర్ఎస్కు తీసుకురావొద్దు
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ బాపట్ల: నడవలేని, మంచాలకు పరిమితం అయిన, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఎవ్వరూ పీజీఆర్ఎస్కు తీసుకురావద్దని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించే పీజీఆర్ఎస్లో ప్రజలు సమస్యలపై అర్జీలను ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు స్వీకరిస్తామని చెప్పారు. ఇక్కడికి రాలేని పరిస్థితిలో ఉన్నవారికి సమస్యలు ఉంటే వారి తరఫున వారు వచ్చి అర్జీలను అందించవచ్చని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనంపై వచ్చే వారు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలన్నారు. రెవెన్యూ డివిజన్లో, మండల తహసీల్దారు కార్యాలయాలలో అర్జీలను స్వీకరిస్తామని తెలిపారు. తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణం సీతానగరంలోని విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ఈనెల 6 నుంచి 8వ తేదీ వరకు విఘ్న విమోచక హనుమాన్ ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి స్వీయ పర్యవేక్షణలో ఈ మహోత్సవం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమాల్లో భాగంగా 5వ తేదీ సాయంత్రం విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, రక్షా బంధనం, అంకురారోపణ, 6వ తేదీ ఉదయం అరణిమథనం, అగ్నిప్రతిష్ఠ, మన్యుసూక్త హవనం, పంచగవ్య శుద్ధి, పూర్ణాహుతి ఉంటాయన్నారు. -
ఐదుగురికి నూతన జీవితాలను ప్రసాదించిన చైతన్య
గుంటూరు మెడికల్: పెళ్లీడుకొచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ కళ్లెదుటే చనిపోయాడు. ఉద్యోగం చేస్తూ కుటుంబ సభ్యులకు తన వంతు ఆర్థిక సహకారం అందిస్తున్న బిడ్డ ఏ అచ్చటా ముచ్చట తీరకుండానే అకాల మృత్యువుకు లోనయ్యాడు. యువకుడైన బిడ్డ చనిపోయి గుండెలు పిండేసే బాధలో ఉన్న తల్లిదండ్రులు తమ బాధను దిగమింగుకుంటూ ప్రాణపాయ స్థితిలో ఉన్నవారికి నూతన జీవితాలను ప్రసాదించేందుకు అవయవ దానం చేశారు. తల్లిదండ్రుల గొప్ప నిర్ణయంతో ఓ యువకుడి అవయవాలతో ప్రాణాపాయస్థితిలో ఉండి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఐదుగురికి నూతన జీవితాలను ప్రసాదించారు. ఆదివారం గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పటల్స్లో జరిగిన మహత్కర సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన నల్లపనేని వెంకటశివ, ఆదిలక్ష్మిల దంపతుల కొడుకు చైతన్య (25) శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. డ్యూటీలో భాగంగా ఫిబ్రవరి 27న ద్విచక్రవాహనంపై వెళ్తున్న సమయంలో తాటపూడి గ్రామం సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. చైత్యన్య మెదడుకు తీవ్ర గాయాలు అవ్వటంతో కుటుంబ సభ్యులు అతడిని గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పటల్స్లో చికిత్స కోసం చేర్పించారు. చైతన్యకు ఆసుపత్రిలో వైద్యుల బృందం చికిత్స అందించినా ఫలితం లేకపోయేసరికి 28న బ్రెయిన్ డెడ్గా ప్రకటించారు. ఆస్టర్ రమేష్ హాస్పటల్స్ జీవన్దాన్ చీఫ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ యలవర్తి కార్తిక్ చౌదరి, ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్లు కొడాలి అనూష, చింతమనేని అఖిలేష్లు చైతన్య తల్లిదండ్రులకు అవయవదానం ప్రాముఖ్యత గురించి వివరించారు. దీంతో యవకుడి తల్లిదండ్రులు బిడ్డను పొగొట్టుకున్న బాధలో ఉండి కూడా తమ బిడ్డ అవయవాలు వేరొకరికి నూతన జీవితాన్ని ఇస్తాయని తెలుసుకుని ముందుకొచ్చి అవయవదానం చేశారు. తల్లిదండ్రుల పెద్దమనస్సుకు.... చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు గుంటూరు హాస్పటల్లో చైతన్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. చిన్నవయస్సులోనే రోడ్డు ప్రమాదంలో చైతన్య చనిపోవటం చాలా బాధాకరమని పేర్కొన్నారు. పెంచి పెద్దచేసిన బిడ్డను కోల్పోయిన బాధలో ఉండి కూడా వెంకటశివ, ఆదిలక్ష్మి దంపతులు అవయవదానం చేయటం చాలా మంచి పని అని, వారి మంచి మనసుకు అభినందనలు తెలిపారు. ఆస్టర్ రమేష్ హాస్పటల్స్ చీఫ్ కార్డియాలజిస్ట్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు చైతన్య కుటుంబ సభ్యులను అభినందించి, వారి కుటుంబానికి తన సానుభూతిని తెలియజేశారు. చైతన్య అవయవదానంతో గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పటల్స్లో తీవ్ర అనారోగ్యంలో ప్రాణాపాయస్థితిలో ఉండి చికిత్స పొందుతున్న ఇరువురు బాధితులకు ఆస్పత్రి వైద్య బృందం లివర్, కిడ్నీ అవయవాలు అమర్చి నూతన జీవితాన్ని ప్రసాదించారు. మరో కిడ్నీని విజయవాడ, రెండు నేత్రాలు ఎల్వి ప్రసాద్ కంటి ఆస్పత్రికి తరలించారు. -
వర్సిటీ మహిళా ఖోఖో జట్టులో కృష్ణవేణి విద్యార్థినులు
నరసరావుపేట ఈస్ట్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మహిళా ఖోఖో జట్టుకు కృష్ణవేణి డిగ్రీ కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థినులు ఎంపికై నట్టు కళాశాల ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు తెలిపారు. కళాశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వర్సిటీ అంతర్ కళాశాలల మహిళా ఖోఖో టోర్నమెంట్లో తమ కళాశాల చాంపియన్గా నిలవటంతోపాటు తమ విద్యార్థినిలు ఎం.శిరీష, ఎం.హేమలత, బి.అలేఖ్య, మడకా చౌడేశ్వరి, కె.అనుషాబాయిలు వర్సిటీ జట్టుకు ఎంపికయ్యారని వివరించారు. ఎంపికై న క్రీడాకారిణిలు త్వరలో కర్నాటక రాష్ట్రం దావణగేరిలో జరగనున్న సౌత్జోన్ అంతర్ విశ్వవిద్యాలయాల మహిళా ఖోఖో టోర్నమెంట్లో ఏఎన్యూ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. కళాశాల వైస్ప్రిన్సిపల్ ఎంఆర్కె సతీష్బాబు, తిరుపతయ్య, వ్యాయామ అధ్యాపకుడు ఈదర ఆదిబాబు, కోచ్లు సయ్యద్ మహమ్మద్, షేక్ షకీలా, అధ్యాపకులు అభినందించారు. విక్టరీ కళాశాల విద్యార్థినిలు... ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మహిళా ఖోఖో జట్టుకు విక్టరీ కళాశాల చెందిన ముగ్గురు విద్యార్థినిలు ఎంపికై నట్టు కళాశాల ప్రిన్సిపల్ పి.వేణుగోపాల్ ఆదివారం తెలిపారు. వర్సిటీ అంతర్ కళాశాలల టోర్నమెంట్లో తమ కళాశాల జట్టు రన్నర్స్గా నిలవటంతో పాటు జట్టులోని శ్రీలక్ష్మీ, కృష్ణవేణి, తిరుపతమ్మలు వర్సీటీ జట్టుకు ఎంపికయ్యారని వివరించారు. విద్యార్థినిలను కళాశాల కార్యదర్శి ఒద్దుల సుబ్బారెడ్డి, చైర్మన్ మైనీడి శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ వేణుగోపాల్, పీడీ శ్యాంసన్, అధ్యాపకులు అభినందించారు. -
ప్రతి పల్లెలో వైఎస్సార్ సీపీ జెండాను ఎగురవేయాలి
మేడికొండూరు: ప్రతి పల్లెలోనూ వైఎస్సార్ సీపీ జెండాను ఎగురవేయాలని తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు అన్నారు. మండలంలోని సిరిపురం గ్రామంలో వివిధ విభాగాల కమిటీ అభ్యర్థులతో నిర్వహించిన నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరై మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను నిండా ముంచిందని విమర్శించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీకి పునాదులని వివరించారు. పార్టీ కోసం పనిచేసే గ్రామ, మండలస్థాయిలోని వివిధ విభాగాల కమిటీ సభ్యులు, కార్యకర్తలకు మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. పార్టీని మరింత పటిష్టం చేసేందుకు ప్రతి గ్రామంలోని నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లోని టీడీపీ దౌర్జన్యాలు, అవినీతిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. మరోసారి జగనన్నను ముఖ్యమంత్రి చేసుకునేందుకు అందరూ కంకణ బద్దులుగా కావాలన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తాళ్లూరు వంశీకృష్ణ, సిరిపురం గ్రామ పార్టీ అధ్యక్షులు కంకణాల పరమేశ్వరరావు, జోసఫ్ రెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు కాసు విజయమ్మ రాయప్ప రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ సాంబశివరావు, స్టేట్ ఐటీ వింగ్ ప్రధాన కార్యదర్శి గుంటుపల్లి ప్రదీప్ గొంది రవి, మిరియాల శివరామకృష్ణ, ఏరా బాబు, కన్నయ్య, అబ్దుల్లా, హబీబుల్లా, ఇక్బాల్, కరిముల్లా, విద్యాసాగర్, తదితర గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వజ్రబాబు -
సచివాలయాల్లో నిత్య నరకం
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జాబ్చార్ట్ ప్రకారం ఉద్యోగులు కార్యకలాపాలు నిర్వహించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన కొద్ది రోజులపాటు సచివాలయ ఉద్యోగులకు ఎలాంటి పనులు అప్పగించలేదు. ఆ తర్వాత నుంచి క్షణం తీరిక లేకుండా పనులు అప్పగించి తీవ్ర మానసిక ఒత్తిడి పెంచుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ సర్వే జరిగినా అది సచివాలయ ఉద్యోగులే చేయాలనే దుస్థితి నెలకొంది. నెహ్రూనగర్: ఏపీ ఏకీకృత కుటుంబ సర్వే–2025, పీ–4 సర్వే (పేదరిక నిర్మూలన), అక్షరాంధ్ర, ఈకేవైసీ, పల్స్ సర్వే.. ఇలా ప్రతిదీ సచివాలయ ఉద్యోగుల నెత్తినే పడుతోంది. ఉదయం 6 గంటలకే పారిశుద్ధ్య పనుల పరిశీలన, పింఛన్ల పంపిణీకి వెళ్లాల్సి వస్తోంది. వీటితోపాటు ట్యాప్ కనెక్షన్లు, బాత్రూమ్ ఫొటోలు తీయడం, ఇళ్లకు స్టిక్కర్లు అంటించడం వంటి పనులు అప్పగిస్తున్నారు. వార్డు కార్యదర్శులకై తే సర్వేలతోపాటు ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యాలు విధించి, సమీక్షల పేరుతో తీవ్రంగా వేధిస్తున్నారు. ఓ వైపు సర్వేల ఒత్తిడి, మరో వైపు విధుల నిర్వహణతో సతమతమవుతున్నారు. ఎప్పటికప్పుడు ప్రగతి నివేదికలను అందిస్తున్నా చిన్నపాటి కారణాలు చూపిస్తూ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారు. రాజకీయ విమర్శలు అధికార కూటమి నేతలు సచివాలయాలను ’దరిద్రాలయాలు’ అని, ఉద్యోగులను ‘ఎందుకూ పనికిరారు’ అని దుర్భాషలాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ తీరా చూస్తే ప్రభుత్వ ప్రచారాలకు, ప్రతి నెలా సర్వేలకు సచివాలయ ఉద్యోగుల సేవలను ప్రభుత్వం వాడుకుంటోంది. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అని పేర్లు మార్చి ఉద్యోగుల విధులను మాత్రం అస్తవ్యస్తం చేసింది. జిల్లాలో 568 సచివాలయాలు ప్రజలకు ప్రభుత్వ సేవలను, సంక్షేమ పథకాలను చేరువ చేసే ఉద్దేశంతో 2019 ఏడాదిలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. 29 ప్రభుత్వ శాఖలకు చెందిన సుమారు 543 రకాల ఈ– సేవలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. గుంటూరు జిల్లాలో 568 సచివాలయాలు సేవలు అందిస్తున్నాయి. ఇందులో 5,563 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అగమ్యగోచరం గ్రామ, పట్టణ స్థాయిల్లో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తున్న సచివాలయ ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంప్లాయి ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు దానికి విరుద్ధంగా ఉన్నాయి. సంబంధం లేని పనులన్నీ సచివాలయ సిబ్బంది నెత్తిన రుద్దుతుండటంతో పనిభారంతో వారు అల్లాడిపోతున్నారు. ఒక వైపు గతంలో వలంటీర్లు చేసిన పనులు, మరో వైపు రోజుకో కొత్త సర్వేతో సిబ్బంది తీవ్ర మానసిక, శారీరక ఒత్తిడికి గురవుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం కక్షసాధింపు ధోరణి మార్చుకోవాలని కోరారు. సర్వీసుపరంగా ఏడో ఏట అడుగుపెడుతున్నా సచివాలయ ఉద్యోగులకు నేటికీ ఎలాంటి పదోన్నతులు లేవు. జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ ఇవ్వాలన్న డిమాండ్ నెరవేరలేదు. కనీసం సెలవు రోజుల్లో కూడా విశ్రాంతి లేకుండా పనులు పురమాయిస్తున్నారు. సాయంత్రం 6.30 గంటలు దాటిన తర్వాత కూడా డిప్యూటీ కమిషనర్లు, తహసీల్దార్లు గంటల తరబడి మీటింగులు పెడుతుండటంతో మహిళా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైగా ఏ ప్రభుత్వ శాఖలో లేని విధంగా వీరికి మాత్రమే బయోమెట్రిక్ హాజరును జీతాలతో ముడిపెట్టడం గమనార్హం. రాష్ట్రంలో 75 శాఖలు ఉండగా, అత్యధికంగా సచివాలయ శాఖలోనే ఆకస్మిక మరణాలు సంభవిస్తున్నాయి. లక్ష్యాలు చేరుకోలేక, అధికారుల చీవాట్లు పడలేక కొందరు రాజీనామా చేస్తుంటే, మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సచివాలయ ఉద్యోగుల సంఘం ట్విట్టర్ క్యాంపెయిన్ ప్రకారం.. ఒత్తిడి తట్టుకోలేక సుమారు 40 మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. పని ఒత్తిడి తగ్గించాలని కోరుతూ ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. ఒక సమయంలో ఒకే పని ఇవ్వాలని, సీనియారిటీ జాబితా రూపొందించి ప్రశాంతంగా పనిచేసుకునే వాతావరణం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. -
సమస్యలను మానవతా దృక్పథంతో పరిష్కరించాలి
లక్ష్మీపురం: కేంద్ర ప్రభుత్వం పోస్టల్ ఉద్యోగుల సమస్యలను మానతా దృక్పథంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని నేషనల్ యూనియన్ పోస్టల్ ఎంప్లాయీస్ సంఘం ఆల్ ఇండియా సెక్రటరీ జనరల్ వాసిరెడ్డి శివాజీ అన్నారు. గుంటూరు పోస్టల్ డివిజన్లో ఆదివారం నేషనల్ యూనియన్ పోస్టల్ ఉద్యోగుల ద్వైవార్షిక సమావేశం జరిగింది. వాసిరెడ్డి శివాజీ మాట్లాడుతూ 8వపే కమిషన్లో జీడీఎస్ ఉద్యోగులను కూడా చేర్చాలని డిమాండ్ చేశారు. డిపార్ట్మెంట్లో ఉన్న సేవల్లో కొన్ని ప్రజల అవసరాలకు తగ్గట్టుగా మార్పులు చెంది కొత్తవి రావాలని, ఇంకా వెల్ఫేర్ విషయంలో ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ప్రైవేటైజేషన్ కి అనుకూలంగా ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలని ఖండించారు. ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ప్రెసిడెంట్ కృష్ణ ప్రసాద్, సర్కిల్ సెక్రటరీ డేవిడ్ రాజు, పోస్ట్మెన్ అండ్ ఎంటీఎస్ యూనియన్ సర్కిల్ సెక్రటరీ లక్ష్మీ నారాయణ, డిప్యూటీ సర్కిల్ సెక్రెటరీ నవీన్ కుమార్, రిటైర్డ్ ఎంప్లాయిస్, జీడీఎస్ యూనియన్ సర్కిల్ సెక్రటరీ యోగేశ్వరరావు పాల్గొన్నారు. నేషనల్ యూనియన్ పోస్టల్ ఎంప్లాయీస్ ఆల్ ఇండియా సెక్రటరీ జనరల్ శివాజీ -
అశ్లీల ఓటీటీలను నిషేధించిన కేంద్రం
తెనాలిటౌన్: అసభ్యకర, అశ్లీల కంటెంటులను ప్రదర్శిస్తున్న 18 ఓటీటీ ప్లాట్ఫారమ్లు ఇకపై భారతదేశంలో కనిపించకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధించినదని మా– ఏపీ వ్యవస్థాపకులు, సినీదర్శకుడు దిలీప్ రాజా తెలిపారు. వీటికి సంబంధించిన 57 సోషల్ మీడియా ఖాతాలు, 10 యాప్లు, 19 వెబ్సైట్లను భారత ప్రభుత్వం బ్లాక్ చేసిందన్నారు. స్థానిక మా–ఏపీ కార్యాలయంలో ఆదివా రం విలేకరులతో మాట్లాడారు. సామాజిక మాధ్యమాల్లో 13 సంవత్సరాల్లోపు బాలబాలికలు ఉంకూడదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. శృంగార కంటెంటులను 16 ఏళ్ళ లోపు పిల్లలకు దూరంగా ఉంచేలా చట్టం చేయవలసిందిగా ప్రభు త్వానికి ఆయన సూచించారు. ఇక రోగుల ప్రాణాలతో సోషల్ మీడియ చెలగాటం ఆడుతుందని ఆరోపించారు. ఒకరు తినగూడదని చెపితే మరొకరు తినొచ్చు అని వీడియోలు పెట్టడం వలన ప్రజలు లేని రోగాలను తెచ్చుకుంటున్నారని దిలీప్ రాజా వాపోయారు. శాశ్వత నివారణ లేని వ్యాధుల ను సైతం తగ్గిస్తామని వైద్యశాస్త్రం చదవని వ్యక్తులు సోషల్ మీడియాలో చెప్పటం వలన ప్రజలకు ఎంత ప్రాణాంతకమో ప్రభుత్వాలు ఆలోచించాల్సిందిగా ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మనవి చేశారు. సమావేశంలో పినపాటి సురేష్ బాబు, అసిస్టెంట్ డైరెక్టర్ గాజులపల్లి రాముడు పాల్గొన్నారు. మా – ఏపీ వ్యవస్థాపకుడు, సినీదర్శకుడు దిలీప్ రాజా -
కల్పవృక్ష వాహనంపై నారసింహుడు
మంగళగిరి టౌన్: మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం కల్పవృక్ష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారు గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేదీప్యమానంగా వెలుగొందుతూ మాడ వీధుల్లో విహరించారు. స్వామి వారిని దర్శించుకున్న భక్తులు పరవశించారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి సునీల్కుమార్ పర్యవేక్షించగా, ఉత్సవ కై ంకర్యపరులుగా తిరుపతికి చెందిన గొంటుముక్కల రమణయ్య, సుగుణ దంపతులు వ్యవహరించారు. రాత్రి పొన్న వాహన సేవ వైభవంగా జరిగింది. ఈ సమయంలో స్వామిని దర్శించిన వారికి దేహాభిమానం తొలగి స్వామి కృపకు పాత్రులు అవుతారని భక్తుల నమ్మకం. పొన్న వాహన కై ంకపర్యపరులుగా మంగళగిరి పట్టణ పద్మశాలీయ బహుత్తమ సంఘం వ్యవహరించింది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. నేడు కల్యాణ వేడుక బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన స్వామి వారి కల్యాణ మహోత్సవం సోమవారం అర్ధరాత్రి నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు. ఉదయం అశ్వ వాహనంపై స్వామివారు దర్శనమిస్తారని, రాత్రి ఎదురుకోలు ఉత్సవం జరగనుందన్నారు. -
ఆది పరాశక్తిగా బగళాముఖి
చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో కొలువై ఉన్న బగళాముఖి అమ్మవారు ఆదివారం ఆదిపరాశక్తి అలంకరణలో పూజలు అందుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి ఆలయానికి విచ్చేసి ప్రదక్షిణలు చేసి పూజలు నిర్వహించారు. అమ్మవారికి అర్చనలు, విశేష పూజలు జరిగాయి. అనంతరం భక్తులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. భక్తులు అధిక సంఖ్యలో రావటంతో ఆలయం వద్ద సందడి నెలకొంది. పెదకాకాని: శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి ఆలయాన్ని మార్చి 3వ తేదీన చంద్రగ్రహణం కారణంగా మూసివేయనున్నట్లు ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్, ధర్మకర్తల మండలి చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు తెలిపారు. శివాలయంలో చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని మంగళవారం ఉదయం 9 నుంచి ఆలయం తలుపులు మూసివేయనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 5.30 నుంచి 9 గంటలలోపు మాత్రమే భక్తులకు స్వామి వారి దర్శనం, అభిషేకాలు, వాహన పూజలు, రాహుకేతు పూజలు, ఇతర అన్ని ఆర్జిత సేవలకు అనుమతి ఉంటుందన్నారు. అన్నప్రసాదం నిలుపుదల చేయనున్నట్లు తెలిపారు. మార్చి 4న బుధవారం ఉదయం ఆలయ ప్రోక్షణ తర్వాత భక్తులకు ఉదయం 7 నుంచి స్వామివారి దర్శనం, ఇతర అన్ని ఆర్జిత సేవలకు యథావిధిగా అనుమతి ఉంటుందని తెలిపారు. రేపల్లె: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ తన ఇద్దరు చిన్నారులతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. పోలీసులు కథనం ప్రకారం.. మండలంలోని మైనేనివారిపాలెం గ్రామానికి చెందిన చంద్రకళ తన భర్తతో గొడవల కారణంగా మనస్తాపానికి గురైంది. ఆదివారం రాత్రి పిల్లలతో కలిసి పెనుమూడి పులిగడ్డ వారధి వద్దకు చేరుకుంది. వారధిపై నిలబడి రోదిస్తూ కృష్ణా నదిలోకి దూకేందుకు ప్రయత్నించింది. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ఆమెను అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న ఎస్ఐ రాజశేఖర్ ఘటన స్థలానికి చేరుకుని తల్లి, పిల్లలను సురక్షితంగా స్టేషన్కు తరలించారు. కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. -
వాడరేవులో కార్డన్ సెర్చ్
సరైన పత్రాలు లేని 16 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలు సీజ్ చీరాల: ఆపరేషన్ వజ్రపహార్లో భాగంగా సమాజంలో మత్తు పదార్థాలు నివారించేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చీరాల డీఎస్పీ ఎండీ మోయిన్ పర్యవేక్షణలో చీరాల రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని వాడరేవులో ఆదివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వాడరేవులోని వైఎస్సార్ కాలనీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సరైన పత్రాలు లేని 16 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలను సీజ్ చేశారు. గతంలో ఈ ప్రాంతంలో ఎక్కువగా నాటుసారా ప్రభావం ఉండేదని, ఈ క్రమంలో పాత నేరస్తుల ఇళ్లను తనిఖీ చేసి కౌన్సెలింగ్ ఇచ్చామని పోలీసులు తెలిపారు. ఎవరైనా మత్తు పదార్థాలు విక్రయించినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రూరల్ సీఐ పి.శేషగిరిరావు, ఈపూరుపాలెం ఎస్సై ఎ.చంద్రశేఖర్, వేటపాలెం ఎస్సై జనార్దన్, సిబ్బంది పాల్గొన్నారు. సాక్షి నరసరావుపేట: హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను గురజాల పోలీసులు బేఖాతరు చేసిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం... గురజాల మండలంలోని తేలుకుట్ల గ్రామానికి చెందిన ఒక పార్టీ నాయకుడిపై కొంతమంది దాడి చేసిన సంఘటనలో గురజాల పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. వారిని ఆదివారం ఉదయం విలేకరుల సమావేశం నిర్వహించి వారిని పోలీసులు రోడ్డుపై నడిపిస్తూ కోర్టుకు హాజరుపరిచారు. ఏదైనా కేసులో నిందితులుగా ఉన్న వారిని పోలీసులు రోడ్డుపై నడిపించకూడదనే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ గురజాల పోలీసులు నిందితులను రోడ్డుపై నడిపించి తీసుకువెళ్లడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కూటమి నాయకులకు ఒక న్యాయం మరొకరికి ఒక న్యాయమా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పలువురు రాజకీయ ప్రముఖులువారి ఆభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. -
అన్ని రంగాలపై ఏఐ ప్రభావం
జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ లక్ష్మణరావు గుంటూరు రూరల్: ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలపై ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రభావం ఉందని, దానిని మానవ జాతి సంక్షేమానికి ఉపయోగించే విధంగా చర్యలు ఉండాలని ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ నిపుణుడు, వాల్మార్ట్ ఇండియా సైబర్ సెక్యూరిటీ లీడ్ ఎస్ దిలీప్కుమార్ తెలిపారు. ఆదివారం జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నగర శివారు లాంలోని చలపతి ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన జెనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నో వర్క్షాప్లో ఆయన పాల్గొన్నారు. ఆయన వివిధ రంగాలలో ఏఐ పాత్రను వివరించారు. జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రపంచంలో మూడు శతాబ్దాలుగా పారిశ్రామిక విప్లవం, సాంకేతిక విప్లవం జరిగాయన్నారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ విప్లవం జరగబోతున్నదని, విద్యార్థులు దానికి అనుగుణంగా నైపూణ్యాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. టెక్నాలజీకి సంబంధించిన ఏ మార్పులు అయినా మానవజాతి పురోగతికి, ఉపాదికల్పనకు దోహదపడాలని, కానీ కార్పొరేట్ కంపెనీల దృక్పథం ఆలోచనలకు, ప్రజా సంక్షేమానికి అనుగుణంగా ఉండవని చెప్పారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తవ్వా సురేష్ మాట్లాడుతూ జనవిజ్ఞాన వేదిక పాఠశాల స్థాయిలో చెకుముకి సైన్స్ సంబరాలను నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచేందుకు కృషిచేస్తుందన్నారు. భవిష్యత్తులో ఇంజినీరింగ్, మెడిసిన్, మెడికల్, న్యాయ విద్యా వ్యవస్థ కోసం కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు లైఫ్ స్కిల్స్ సామాజిక స్కిల్స్ నేర్చుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో నిర్వాహకులు కె యశ్వంత్, ప్రొఫెసర్ ప్రితిదాయ్, నిహారిక, జన విజ్ఞాన వేదిక నాయకుడు కె.శ్రీనివాస్, మురళీధర్, చాందిని, రమేష్, బాలాజి పాల్గొన్నారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): ఆర్మా డ్రాగన్స్ షోటోకాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నేషనల్ లెవెల్ ఓపెన్ కారటే, కుంగ్ఫూ తైక్వాండో చాంపియన్షిప్–2026 పోటీలు ముగిశాయి. ఆదివారం స్థానిక గుంటూరులోని టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహించిన పోటీలకు ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాసరావు, ఉగ్గిరాల సీతారామయ్య పాల్గొన్నారు. పోటీల నిర్వహకుడు పి.రాంబాబు మాట్లాడుతూ అన్ని రాష్ట్రాల నుంచి సుమారు 620 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారన్నారు. క్రీడాకారులు చక్కని క్రీడా స్ఫూర్తి చాటి పోటీల్లో తలపడ్డారన్నారు. అనంతరం విజేతలకు ముఖ్య అతిథులు బహుమతులు ప్రధానం చేశారని చెప్పారు. కార్యక్రమంలో పి.సరస్వతి, ఆలపాటి రవికుమార్, అంబటి నవ కుమార్, ఏ.సాయిరామ్, తదితరులు పాల్గొన్నారు. నెహ్రూనగర్: నగరపాలక సంస్థ ఎన్టీఆర్ మున్సిపల్ క్రీడా ప్రాంగణం, స్విమ్మింగ్ పూల్ సొసైటీ పాలకవర్గ సెక్రెటరీగా వజ్జా రామకృష్ణ ఎన్నికై నట్లు డిప్యూటీ కమిషనర్, ఎన్టీఆర్ స్టేడియం ఎక్స్ అఫిషియో జాయింట్ సెక్రటరీ, ఎన్టీఆర్ స్టేడియం పాలకవర్గ ఎన్నికల అధికారి సీహెచ్.శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం జరిగిన ఎన్టీఆర్ స్టేడియం పాలకవర్గ ఎన్నికలు నిర్వహించి, గెలిచిన అభ్యర్థులకు డిక్లరేషన్ పత్రాలను అందజేశామని తెలిపారు. స్టేడియంలో మొత్తం 2,160 మంది ఓటు హక్కు కలిగి ఉండగా, వారిలో 1267 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. 20 ఓట్లు చెల్లలేదన్నారు. సెక్రటరీ పోస్టుకు పోటీ పడిన అభ్యర్థుల్లో వజ్జా రామకృష్ణకు 851 ఓట్లు పోల్ కాగా, దొడ్డపనేని రాజేంద్రకుమార్కు 396 ఓట్లు పోలయ్యాయన్నారు. వజ్జా రామకృష్ణకు 455 ఓట్లు మెజారిటీ రావడంతో ఆయన్ను సెక్రటరీగా గెలుపొందినట్లు డిక్లేర్ చేశామన్నారు. వైస్ ప్రెసిడెంట్ పోస్ట్కు దామా మహేశ్వరరావు, జాయింట్ సెక్రెటరీ పోస్టుకు పాకనాటి ఉమామహేశ్వరరావు, ట్రెజరర్ పోస్టుకు కండె కాంతారావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కి పురుషులలో ఇంకొల్లు వెంకటరత్తయ్య, జి.హనుమంతరావు, మహిళల్లో గుంటుపల్లి యామిని శివ జ్యోతి, లగడపాటి అంజలిలు గెలుపొందగా వారికి డిక్లరేషన్ పత్రాలను అందజేశామన్నారు. -
ఎర్ర బుక్లు.. పసుపు బుక్లకు ఎవ్వరూ భయపడరు
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్)/ నగరంపాలెం: నారా లోకేష్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎర్ర బుక్ పాలనకు.. పసుపు బుక్ పాలనకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భయపడే రోజులు పోయాయని మాజీ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. ఆదివారం గుంటూరు నగరంలోని సిద్ధార్థనగర్లో మాజీ మంత్రి అంబటి రాంబాబును మాజీ మంత్రులు కొడాలి నాని, కురసాల కన్నబాబు, మేకతోటి సుచరిత, దాడిశెట్టి రాజా, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, నంబూరు శంకర రావులు పరామర్శించారు. కొడాలి నాని మాట్లాడుతూ అంబటి రాంబాబు ఇంటిపై, కార్యాలయంపై, కార్లను ధ్వంసం చేసి ఇంట్లో ఆడపిల్లలను భయభ్రాంతులకు గురిచేసిన వారిని వదిలేశారని మండిపడ్డారు. కానీ అంబటి రాంబాబును 18 రోజులు జైల్లో పెట్టి ఇబ్బందులు గురిచేశారని ధ్వజమెత్తారు. అంబటిని రెచ్చగొట్టినప్పుడు నోరు జారి ఒక మాట మాట్లాడారని, దానికి ఆయన క్షమాపణ చెప్పినప్పటికీ కావాలనే టీడీపీ వారు ఇలా దాడి చేయించారని అన్నారు. జగన్తో పెట్టుకుంటే లోకేష్కే ప్రమాదం రెడ్బుక్లో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరు ఉందో లేదో మీకు త్వరలో తెలుస్తుందని మంత్రి నారా లోకేష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆ బుక్లో వైఎస్ జగన్ పేరు రాస్తే లోకేష్కే ప్రమాదమని, వైఎస్ జగన్ ఏదైనా బుక్లో లోక్ష్ పేరు రాసినా లోకేష్కే ప్రమాదమని హెచ్చరించారు. సిగ్గు ఉంటే ప్రజల ఇబ్బందులను పరిష్కరించడంపై పాలకులు దృష్టి సారించాలన్నారు. అరెస్టులతో మరింత పట్టుదల అంబటి రాంబాబు అరెస్టు తర్వాత వైఎస్సార్ సీపీలోని అన్ని స్థాయిల నాయకుల్లో మరింత పట్టుదల పెరిగిందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ఇంట్లో మహిళలు ఉన్నారనే ఇంగితజ్ఞానం లేకుండా స్థానిక ఎమ్మెల్యే జనాలను వేసుకొచ్చి ఇలా దాడులు చేస్తే వాళ్లకి మద్దతు ఇస్తున్నారంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం దుస్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు. 2014–19 మధ్య కాపు నాయకులు ముద్రగడ పద్మనాభంపై దాడి చేశారని, వారి కుటుంబ సభ్యుల్ని హింసించారని, ఇప్పుడు కాపు నాయకుడైన అంబటిపై దాడికి తెగబడ్డారని మండిపడ్డారు. ఒక సామాజిక వర్గాన్ని అణగదొక్కాలనే ప్రయత్నం కొందరికి అలవాటుగా మారిపోయిందని స్పష్టం అవుతోందన్నారు. కక్ష సాధింపు మానుకోకుంటే ఇబ్బందులే ఎవరైనా కూటమి ప్రభుత్వం తప్పుల్ని ఎత్తి చూపితే వారి గొంతు నొక్కేయాలని చూస్తున్నారని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చెప్పారు. కేసులు పెట్టినప్పటికీ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళతామన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోని ప్రజాప్రయోజనాలపై దృష్టి సారించాలని హితవు పలికారు. గుంటూరు సిద్ధార్థనగర్లో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఆదివారం ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన కాపు నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి మద్దతు పలికారు. జై జగన్, జై అంబటి, కాపుల ఐక్యత వర్థిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ర్యాలీగా అంబటి నివాసానికి తరలివచ్చారు. -
దళితులపై దాడులు అరికట్టడంలో ప్రభుత్వం విఫలం
●బాణసంచా ప్రమాద బాధితులకు కోటి పరిహారం చెల్లించాలి ●కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల్యాద్రి డిమాండ్ చీరాల రూరల్: రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి విమర్శించారు. ఆదివారం పేరాలలోని సీఐటీయూ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాష్ట్రంలో కులాంతర వివాహాలు చేసుకున్న వారికి రక్షణ లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కులాంతర వివాహాలకు ప్రత్యేక చట్టాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కులాంతర వివాహాల ద్వారానే కుల నిర్మూలన జరుగుతుందని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చెప్పారని, ఆయన ఆశయాలకు ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయని మండిపడ్డారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. కాకినాడ జిల్లాలోని వేట్లపాలెం గ్రామంలో జరిగిన బాణసంచా ప్రమాదంలో 20 మంది వరకు కార్మికులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్ణకరమని అన్నారు. ఆ ఘటనలో అశువులు బాసిన కార్మికులకు ప్రభుత్వం నామమాత్రంగా ఒక్కొక్కరికి రూ.10 లక్షలు ప్రకటించిందని, అవి ఏమాత్రం సరిపోవని, ఒక్కొక్కరికి కోటి రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫైర్ ఇంజిన్ కూడా వెళ్లలేని చోట ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసి ప్రజల ప్రాణాలు తీసేందుకు పరోక్షంగా దోహదపడిందని ఆరోపించారు. ఆడ పిల్లల విషయంలోగానీ, కల్తీ పాల విషయంలోగానీ, బాణసంచా విషయంలోగానీ ఏదైనా ప్రమాదం జరిగితే తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం స్వతహాగా అటువంటి అక్రమార్కులపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. మార్చి 14 నుంచి 16వ తేదీ వరకు రాష్ట్రస్థాయి సామాజిక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నాయకులు లింగం జయరాజు, కోలా శరత్, నలతోటి బాబూరావు పాల్గొన్నారు. -
బాపట్ల
ఆదివారం శ్రీ 1 శ్రీ మార్చి శ్రీ 2026పేరుకు ప్రజాప్రభుత్వం... ప్రచారాల్లో భారీ ఆర్భాటాలు... ప్రజా సమస్యల పరిష్కారంలో మాత్రం వెనకడుగు... ఇదీ చంద్రబాబు పాలన తీరు అంటూ ప్రజలు మండిపడుతున్నారు. చీరాల మున్సిపాలిటీ పరిధిలోటీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలు ప్రజా సమస్యల పరిష్కారాన్ని గాలికి వదిలేశారు. అభివృద్ధి అనేదే మర్చిపోయారు. వరుసగా రెండు నెలలపాటు కౌన్సిల్ సమావేశాలను కూడా జరపని పాలకవర్గం తీరుపై పురప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇఫ్తార్ సహరి (ఆది) (సోమ) నరసరావుపేట 6.22 5.11 గుంటూరు 6.20 5.09 బాపట్ల 6.20 5.09సమావేశాలే మార్చిపోయారే! సాగర్ నీటిమట్టం విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 539.50 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 19,411 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.పశ్చిమ డెల్టాకు నీటి విడుదల దుగ్గిరాల: విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ నుంచి పశ్చిమ డెల్టాకు 2,618 క్యూసెక్కులు విడుదల చేసినట్లు, 12 అడుగుల నీటి మట్టం స్థిరంగా ఉందని అధికారులు తెలిపారు. నరసరావుపేట ఈస్ట్: బరంపేటలో వేంచేసియున్న లీలా వేంకటేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం శ్రీవారి కల్యాణం వైభవంగా నిర్వహించారు. 7 -
రైతులకు న్యాయం చేయాలి
భూములు కోల్పోతున్నఅమరావతి: తరతరాలుగా భూమిని నమ్ముకున్న రైతులకు న్యాయం చేయాలని, భూసేకరణ విధానాలపై రైతులకున్న సందేహాలకు సహేతుకమైన విధానంలో వివరించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య అన్నారు. శనివారం మండల పరిధిలోని లింగాపురం, ధరణికోట గ్రామాలలో ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా భూములు కోల్పోతున్న రైతుల అభిప్రాయసేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ రైతు సంఘాలతో ప్రభుత్వం అవగాహన కార్యక్రమం నిర్వహించి స్పష్టమైన విధానాన్ని తెలియపరచాలన్నారు. ఆయా గ్రామాల్లో భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు అభిప్రాయాలు వెల్లడిస్తున్నారన్నారు. ఇప్పటికి ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా భూములు కోల్పోతున్న రైతులకి ప్రభుత్వం నష్టపరిహారం స్పష్టంగా ప్రకటించలేదని, భూములు కోల్పోతున్న రైతుల పేర్లు, సర్వే నెంబర్లు ఇప్పటికీ వెల్లడించలేదన్నారు. తమ భూమి ఎంతపోతుందో అని ఆందోళనలో రైతులు ఉన్నారన్నారు. అమరావతి, పెదకూరపాడు మండలాల్లో ఔటర్ రింగ్ రోడ్ లో భూములు కోల్పోతున్న రైతులతో ఆరు నెలలు కిందట అధికారులు వచ్చి మాట్లాడటమే తప్ప మళ్లీ ఇంతవరకు సమాచారం ఇవ్వలేదన్నారు. ధరణికోట, లింగాపురం గ్రామాల్లో రైతులతో అభిప్రాయ సేకరణ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి జి.రవిబాబు, వెంకటేశ్వరరాజు, రైతు సంఘం నాయకుడు దర్శి శేషారావు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బి.సూరిబాబు, మొహద్దీన్ వలి పాల్గొన్నారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య -
అమరేశ్వరస్వామి సేవలో ఇస్రో మాజీ చైర్మన్
అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతిలోని అమరేశ్వరస్వామిని శనివారం ఇస్రో మాజీ చైర్మన్ కిరణ్కుమార్ దర్శించుకున్నారు. తొలుత ఆలయ అధికారులు, అర్చకులు ఇస్రో మాజీ చైర్మన్ కిరణ్కుమార్ను దేవా లయంలోకి ఆహ్వానించారు. అమరేశ్వర స్వామి, ,బాలచాముండేశ్వరీదేవికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం ఆలయఅర్చకులు ఇస్రో మాజీ చైర్మన్ కిరణ్కుమార్కు వేదాశీర్వచనం చేసి స్వామివారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలు అందించారు. వైద్య కళాశాలకు ‘భాష్యం’ రూ. 4.50 లక్షల విరాళం గుంటూరు ఎడ్యుకేషన్: భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ జన్మదినం సందర్భంగా భాష్యం పేరమ్మ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గుంటూరు మెడికల్ కళాశాలకు రూ.4.50 లక్షల విరాళాన్ని అందజేశారు. శనివారం సంబంఽధిత మొత్తాన్ని చెక్కు రూపంలో భాష్యం రామకృష్ణ కుమార్తె భాష్యం జనని, భాష్యం మెడెక్స్ ప్రిన్సిపాల్ బి.హరిబాబు చేతుల మీదుగా గుంటూరు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్వీ సుందరాచారికి అందజేశారు. గతేడాది సైతం ఇదే ఇదే విధంగా ట్రస్టు ఆధ్వర్యంలో జీజీహెచ్కు ఐదు శీతలీకరణ యంత్రాలను అందజేసినట్లు హరిబాబు తెలిపారు. సేవా భావంతో భాష్యం పేరమ్మ చారిటబుల్ ట్రస్టు నిర్వహిస్తున్న అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. కార్యక్రమంలో ట్రస్టు ప్రతినిధులు, భాష్యం పూర్వ వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. ఏఎన్యూ నూతన డైరీ ఆవిష్కరణ ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నూతనంగా ముద్రించిన విశ్వవిద్యాలయం డైరీ–2026ను ఉపకులపతి ఆచార్య కె.గంగాధరరావు, రిజిస్టార్ ఆచార్య సింహాచలంలు శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వర్సిటీ వీసీ మాట్లాడుతూ నాగార్జున విశ్వవిద్యాలయంలోని విభాగాల్లో పనిచేస్తున్న అధ్యాపకుల సమాచారాన్ని డైరీ రూపంలో అందుబాటులోకి తెచ్చామన్నారు. రిజిస్టార్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయం సొంతగా ముద్రించిన డైరీ ద్వారా పూర్తి సమాచారం అందుబాటులోకి వస్తుందన్నారు. డైరీ ముద్రణ కమిటీ కన్వీనర్ ఆచార్య పద్మావతి మాట్లాడుతూ ఎంతో విలువైన సమాచారంతో అధ్యాపకులకు ఉపయోగపడే విధంగా ముద్రించామన్నారు. -
చంద్రబాబు, లోకేష్ డైరక్షన్లోనే విధ్వంసకాండ
నగరంపాలెం(గుంటూరు వెస్ట్)/నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్) : నాలుగు వారాల క్రితం తన ఇల్లు, కార్యాలయం, కారు అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం అంతా చంద్రబాబు, లోకేష్ల డైరక్షన్లోనే జరిగిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. గుంటూరు సిద్ధార్థనగర్లోని ఆయన కార్యాలయం వద్ద శనివారం మీడియాతో మాట్లాడారు. అంబటి రాంబాబుకు పరామర్శ.... ● రాష్ట్రంలో నారా లోకేష్ రెడ్ బుక్ ఎర్రి పరిపాలన ఆపి ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలని ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్, కనిగిరి సమన్వయకర్త దద్దాల నారాయణయాదవ్లు పేర్కొన్నారు. -
కట్న నిషేధ చట్టం కట్టుదిట్టంగా అమలు చేయాలి
కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ బాపట్ల: కట్న నిషేధ చట్టం అమలు కట్టుదిట్టం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టరేట్ బోర్డు రూమ్లో జరిగిన జిల్లా సలహా మండలి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. మహిళలపై వేధింపులను అరికట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. చట్టంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, నమోదైన కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని అధికారులకు తెలిపారు. జాయింట్ కలెక్టర్ భావన, ఐసీడీఎస్ పీడీ రాధ మాధవి, డీఎస్పీ జగదీష్ నాయక్, ఎన్జీవో సభ్యులు పార్థసారథి, రవి ప్రదీప్, పద్మ తదితరులు పాల్గొన్నారు. ఈవీఎం గోదాములకు భద్రత ముఖ్యం ఈవీఎం గోదాములకు నిరంతరం భద్రత కల్పించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. గోదాముల సాధారణ తనిఖీల్లో భాగంగా కలెక్టర్ శనివారం వాటిని పరిశీలించారు. భద్రత కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పని తీరును తెలుసుకున్నారు. పింఛన్ పంపిణీ బాపట్ల పట్టణం చిల్లర గొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద లబ్ధిదారులైన బోయన ముసలయ్య, యశోదలకు నగదును కలెక్టర్ చేతుల మీదుగా శనివారం పంపిణీ చేశారు. మార్చి ఒకటో తేదీన ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు నగదును అందజేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. జిల్లాలో 1,82,897 మందికి పింఛన్ మంజూరు కాగా, రూ.78,31,96,500 నగదు విడుదల అయ్యిందన్నారు. వారధిగా జర్నలిస్టు పనిచేయాలి జర్నలిస్టులు నాణ్యత, స్పష్టత ఉన్న వార్తలను సమాజానికి అందివ్వాలని, వారధిగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులను ఆయన పంపిణీ చేశారు. -
బొక్కేస్తారో.. ఇచ్చేస్తారో?
నల్లబజారుకు తరలుతున్న రేషన్ బియ్యం చీరాల అర్బన్: రపజా పంపిణీ వ్యవస్థ గాడి తప్పింది. చౌక ధరల దుకాణాల్లో కార్డుదారులకు అందాల్సిన బియ్యం పక్కదారి పడుతున్నాయి. కొందరు డీలర్లు బియ్యం బదులు, డబ్బులు ఇచ్చి కార్డుదారుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. కొందరు డీలర్లు బియ్యం బదులు డబ్బులు తీసుకోవాలని కార్డుదారులను ఒత్తిడి చేస్తున్నారు. అలా సేకరించిన రేషన్ బియ్యం ఎక్కువ ధరకు నల్లబజారు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వారు మరికొంత లాభం చూసుకుని ఇతర ప్రాంతాల్లోని మిల్లులకు, జిల్లాల సరిహద్దులను దాటించి పోర్టులకు తరలించి దేశ ఎల్లలు దాటించి భారీ మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. అందులో తిలా పాపం, తలా పిడికెడు. పలు సందర్భాల్లో రేషన్ బియ్యం నల్లబజారుకు తరలుతూ పట్టుబడటం, గత నెలలో చీరాలలో పలువురు మహిళలు (కార్డుదారులు) తమకు డీలర్లు ఇచ్చే డబ్బులు వద్దని, బియ్యం ఇవ్వాలని ఆందోళనకు దిగటం దీనికి సాక్ష్యం. ఇక మార్చి నెలకు సంబంధించి ఆదివారం నుంచి రేషన్ పంపిణీ కానుంది. మాల్ తీసుకుంటాడు.. డబ్బులు ఇస్తాడు.. మనకేం ఇబ్బంది లేదు రేషన్ మాఫియాగా గుర్తింపు పొంది, ఒంగోలులో షాడో ప్రజాప్రతినిధిగా అధికారం చెలాయిస్తున్న వ్యక్తి గురించి ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. కొందరు డీలర్లు తమ ఆంతరంగిక సమావేశాల్లో మాల్ (రేషన్ బియ్యం)తీసుకుంటాడు. మనకు డబ్బులు ఇస్తాడు. మనకేం ఇబ్బంది లేదు. అంతా అతనే చూసుకుంటాడని చర్చించుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అతనికి ఏమేర అండ ఉంటే ఆ స్థాయిలో డీలర్లు చర్చించుకుంటున్నారోనని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. బియ్యం బదులు నగదు బదిలీ చేస్తే మేలు! ప్రభుత్వం పేదల ఆహార భద్రతనే కోణంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరుకులను తక్కువ ధరలకు ఇవ్వడం మంచిదే. అయితే ఆ ప్రక్రియ సక్రమంగా జరగటం లేదని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్డుదారులకు అత్యంత నాణ్యమైన బియ్యం అందిస్తున్నామని అందుకు కేజీకి సుమారు రూ.40 వరకు ప్రభుత్వంపై భారం పడుతుందని చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో కార్డుదారులకు బియ్యం బదులు ఎవరికి ఎన్ని కేజీలు వస్తాయో, ఆ మేరకు కేజీకి రూ.40 చొప్పున వారి బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేస్తే బాగుంటుందని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. ఎవరూ కంగారు పడాల్సిన పని లేదు. మీ కేం కాదు. మేమున్నాం. అంటూ నల్లబజారు వ్యాపారులు డీలర్లుకు అభయం ఇస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కలెక్టర్ వి.వినోద్ కుమార్ ప్రత్యేకంగా దృష్టి సారించి రేషన్ బియ్యం నల్లబజారుకు తరలకుండా తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
కొమ్మమూరు కాలువలో గుర్తు తెలియని మృతదేహం
కారంచేడు: కొమ్మమూరు కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకు వచ్చిందని ఎస్ఐ షేక్ ఖాదర్బాషా తెలిపారు. ఆయన అందించిన సమాచారం మేరకు.. శనివారం మండలంలోని కుంకలమర్రు వంతెన సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు వచ్చిన సమాచారంతో తమ సిబ్బందికి ఘటనా స్థలానికి చేరుకున్నామని, మృతదేహంను బయటకు తీయించారన్నారు. సుమారు 35 నుంచి 40 సంవత్సరాల పురుషుడు, మృతుడు చామానఛాయ కలిగి ఉన్నాడని, ఎరుపు–నలుపు ఉన్న గళ్ల చొక్కా, గోధుమ రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడన్నారు. మృతదేహం ఉన్న తీరును బట్టి ఎగువ ప్రాంతమైన నరసాయిపాలెం లాకుల నుంచి దిగువకు నీటి ప్రవాహానికి కొట్టుకు వచ్చిందన్నారు. చనిపోయి నాలుగైదు రోజులు అయ్యింటుందన్నారు. ఈ ఆనవాళ్ళు కలిగిన వ్యక్తి సమాచారం తెలిసిన వారు వెంటనే ఇంకొల్లు సీఐ 91211 02147, కారంచేడు ఎస్ఐ 91211 02145 నంబర్లకు సంప్రదించాలని ఆయన కోరారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి పంపించామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంబించామని ఎస్ఐ పేర్కొన్నారు. నెహ్రూనగర్: భవన నిర్మాణ కార్మికులకు ఆగిపోయిన సంక్షేమ పథకాలు మార్చి 1వ తేదీ నుంచి తిరిగి పునఃప్రారంభించేందుకు సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారని కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ ఎ.గాయత్రిదేవి శనివారం ఓ ప్రకటనలో తెలియజేశారు. వివాహ కానుక, ప్రసూతి సహాయం(కాన్పు), సహజ మరణం, అంత్యక్రియలకు సంబంధించిన నాలుగు పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని భవన నిర్మాణ కార్మికులు తప్పనిసరిగా కార్మిక భవన నిర్మాణ గుర్తింపు కార్డు కలిగి ఉండాలని, అల్రెడీ ఉన్న కార్డులను ఆప్డేట్ చేయించుకోవాలని సూచించారు. తెనాలిరూరల్: రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన తెనాలి పినపాడు గేటు సమీపంలో శనివారం జరిగింది. సుమారు 55 ఏళ్ల వ్యక్తి పట్టాలు దాటుతుండగా హౌరా – బెంగళూరు ఎక్స్ప్రెస్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న జీఆర్పీ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని తెనాలి వైద్యశాల మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా నరసరావుపేట: జిల్లాలో పరిశ్రమలు స్థాపించేందుకు ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకున్న యజ మానులను సమాయత్తం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా పరిశ్రమల శాఖ, ఏపీఐఐసీ, రెవెన్యూ, సంబంధిత అధి కారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 2025 భాగస్వామ్య సదస్సులో కృష్ణా ఆగ్రో ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్, మైహోం సిమెంట్స్ ప్రయివేట్ లిమిటెడ్, ఇందన ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి భారీ, మెగా ప్రాజెక్టులు స్థాపించేందుకు ముందుకొచ్చాయన్నారు. యజమానులకు ఉన్న సమస్యల పరిష్కారానికి. అధికారులు వేగవంతంగా పనిచేయాలని సూచించారు. నిబంధనల మేరకే పశు ఔషధి విక్రయ కేంద్రాలు పశు ఔషధి విక్రయ కేంద్రాలను నిబంధనల ప్రకారం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శనివారం పశుసంవర్ధక శాఖపై వర్చువల్గా కలెక్టర్ జిల్లా పశు వైద్య శాఖ అధికారి, మండల వైద్య అధికారులతో సమీక్ష సమావేశం. శాఖకు చెందిన మండల పశు వైద్యాధికారులకు నిర్దేశించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. -
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి నిండుప్రాణం బలి
నాదెండ్ల: విద్యుత్ షాక్కు గురైన మహిళ తీవ్రగాయాలపాలై గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందింది. అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... స్థానిక శివాలయం వీధిలో నివాసం ఉండే షేక్ ఫకీరమ్మ (31), బాజి దంపతులు. కూలి పనులు చేసుకుంటూ ఫకీరమ్మ జీవనం సాగిస్తోంది. జనవరి 28న ఇంట్లో దుస్తులు ఉతికి డాబాపై ఆరేసేందుకు వెళ్లింది. దుస్తులు ఆరేస్తుండగా ఇంటి పక్కనుంచి వెళ్లే విద్యుత్ లైనుకు తగిలి షాక్కు గురై డాబాపై నుంచి కిందపడింది. తీవ్రగాయాలతో అపస్మారకస్థితిలో ఉన్న ఆమెను 108 వాహనంలో చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్కు తీసుకెళ్లారు. 50 శాతం కాలినగాయాలతో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. అప్పట్లో పోలీసులకు భర్త బాజి ఫిర్యాదు చేశాడు. మృతదేహాన్ని చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. బాజి దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిండుప్రాణం గాల్లో కలిసింది. షేక్ ఫకీరమ్మ విద్యుత్షాక్కు గురైందన్న సమాచారం తెలుసుకున్న ఆ శాఖ అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. డాబా మీదుగా ఓ లైను వెళ్తుండడంతో అదనంగా మరో స్తంభం ఏర్పాటు చేసి అటుగా వెళ్లే వైరును తొలగించారు. తమ కుటుంబానికి విద్యుత్శాఖ అధికారులు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. షాక్కు గురై చికిత్స పొందుతూ మహిళ మృతి -
ఏపీజేఏసీ చైర్మన్ గా ఘంటసాల శ్రీనివాసరావు
గుంటూరు మెడికల్: గుంటూరు నగరంలోని ఏపీ ఎన్జీజీవో సంఘ కార్యాలయంలో శనివారం జేఏసీ భాగస్వామ్య సంఘాలన్నీ కలిసి గుంటూరు జిల్లా ఏపీ జేఏసీ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లాలోని వివిధ ఉద్యోగ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో సంఘ ఐక్యత, ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, భవిష్యత్ కార్యాచరణపై చర్చించిన అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్మన్గా ఘంటసాల శ్రీనివాసరావు.. గుంటూరు జిల్లా జేఏసీ చైర్మన్గా ఘంటసాల శ్రీనివాసరావు (ఏపీ ఎన్జీజీవో గుంటూరు జిల్లా అధ్యక్షుడు) ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, జేఏసీ సెక్రటరీ జనరల్గా మహమ్మద్ ఖలీద్ (ఏిపీటీఎఫ్–257 జిల్లా అధ్యక్షుడు) ఎంపికయ్యారు. సమావేశంలో కో–చైర్మన్లు గా ఎం.శ్రీనివాసరెడ్డి (ఆర్టీసీ సంఘం), షేక్ బాజీ (ఎస్టీయూ ), ఎస్వీ రమణారావు ( కమర్షియల్ టాక్స్ సంఘం) వైస్ చైర్మన్ లుగా ఎం.కళాధర్ ( యూటీఎఫ్), కె.నరసింహారావు(ఇరిగేషన్ సంఘం) యశోదర దేవి (ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్) కె.పిచ్చయ్య ( పెన్షనర్స్ సంఘం), జె.పూర్ణచంద్రారెడ్డి ( ఏపీ పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ సంఘం), జాయింట్ సెక్రటరీలుగా టి.మహేష్ (స్వర్ణ వార్డ్ స్వర్ణ గ్రామ ఎంప్లాయ్ అసోసియేషన్), ఎం వెంకయ్య ( ఆర్ అండ్ బీ సంఘం ), పి.సుజాత ( ఏపీ ట్రెజరీ అసోసియేషన్ ), కె.రాంబాబు ( వెటర్నరీ సంఘం), చింతల కళ్యాణ్ కుమార్ (కమర్షియల్ టాక్స్ సంఘం), వెల్లంపల్లి పద్మజ (నర్సింగ్ అసోసియేషన్), జి. సుకుమార్ (సీపీఎస్ ఎంప్లాయిస్ సంఘం), కె. సాంబశివరావు (పంచాయతీ సెక్రటరీ సంఘం ), ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎ.శ్యాంసుందర్ శ్రీనివాస్ ( ఏపీ ఎన్జీజీవో జిల్లా కార్యదర్శి ), ట్రెజరర్ గా ఎల్.శ్రీధర్ రెడ్డి( ఏపీ ఎన్జీజీఓ ) ఎన్నికయ్యారు. ఈసీ మెంబర్లుగా జి.వేళాంగిణి రాజు (ఏపీటీఎఫ్ 1938 ), డి.శ్రీనివాసరెడ్డి (పిఆర్టియు ), టీవీ మోహన్ రాజు (రెసిడెన్షియల్ టీచర్స్ సంఘం), సిహెచ్.అంజనీ దేవి (పే అండ్ అకౌంట్స్), వై సి హెచ్ కోటేశ్వరరావు (స్టాటిటిక్స్ సంఘం), ఎం శ్రీనివాసరావు (అగ్రికల్చరల్ మినిస్ట్రీయల్ సంఘం), జె.వెంకటేశ్వరరావు(గ్రంథాలయాల శాఖ), ఎం కోటయ్య(ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ), ఎం శ్రీనివాసరావు (డీఈఓ ఆఫీస్), పి కోటేశ్వరరావు(క్లాస్ ఫోర్ అసోసియేషన్) నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
రేపల్లె ఇన్చార్జి ఆర్డీఓగా గ్లోరియా
రేపల్లె: రేపల్లె రెవెన్యూ డివిజనల్ ఇన్చార్జి అధికారిగా గ్లోరియా నియమితులయ్యారు. బాపట్ల ఆర్డీవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమె రేపల్లె ఆర్డీవోగా అదనపు బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆర్డీవోగా పనిచేసిన నేలపు రామలక్ష్మి 2018 గ్రూప్ –2 ఫలితాల కోర్టు వివాదాల నేపథ్యంలో బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో గ్లోరియా నియమితులయ్యారు. ఢిల్లీలో అవార్డు అందుకున్న శరత్బాబు మార్టూరు: మండలంలోని బబ్బేపల్లి గ్రామానికి చెందిన యువరైతు పెంట్యాల శరత్బాబు శుక్రవారం ఢిల్లీలో అరుదైన పురస్కారం అందుకున్నారు. ఆధునిక సాంకేతిక పద్ధతులు, ప్రకృతి సేద్యం ద్వారా వ్యవసాయం చేస్తున్న ఔత్సాహిక రైతులను ఢిల్లీకి చెందిన కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సంస్థ (ఐసీఏఆర్) దేశవ్యాప్తంగా 35 మంది రైతులను ఎంపిక చేశారు. అందులో భాగంగా రాష్ట్రానికి చెందిన మండలంలోని బబ్బేపల్లి గ్రామానికి చెందిన పెంట్యాల శరత్బాబును గుర్తించారు. 11 ఏళ్లుగా వ్యవసాయంలో చేస్తున్న నిరంతర కృషిని గుర్తించి అవార్డు(2026)కు ఎంపిక చేశారు. ఢిల్లీలో ఫిబ్రవరి 25 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించిన పూస కృషి విజ్ఞాన్ మేళాలో డాక్టర్ ఆర్ఎస్ పరోడా, డాక్టర్ శ్రీనివాసరావు, డైరెక్టర్ ఆఫ్ ఐఆర్ఏఐ ఆర్యన్ పడారియ చేతుల మీదగా శరత్ బాబు అవార్డు అందుకున్నారు. బాపట్ల: రైతులకు అందిస్తున్న హైడ్రోఫోనిక్స్ కిట్లను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాల డీన్ డాక్టర్ డీడీ స్మిత్ పేర్కొన్నారు. కళాశాలలో 30 మంది రైతులకు హైడ్రోఫోనిక్స్ యూనిట్లు పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. రైతులను ఉద్దేశించి డాక్టర్ స్మిత్ మాట్లాడుతూ రైతులని ఉద్దేశించి మట్టి లేకుండా కేవలం పోషకాలు కలిపిన నీటిని ఉపయోగించి మొక్కలను పెంచే ఆధునిక వ్యవసాయ పద్ధతిని అందించటం సంతోషకరమని పేర్కొన్నారు. నేలకి బదులుగా మొక్కల వేర్లను అవసరమైన పోషకాలను నేరుగా నీటిని అందిస్తారు. ఇది తక్కువ స్థానంలో తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి ఇచ్చే ఏడాది పొడవునా సాగు చేయగల పద్ధతిని వివరించారు. కార్యక్రమంలో డాక్టర్ జి.రవి బాబు, కె.ధనరాజ్, విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ పి.రమేష్, డాక్టర్ విష్ణు పాల్గొన్నారు. -
ప్రజల మనోభావాలు దెబ్బ తీసిన చంద్రబాబు
యద్దనపూడి: రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసే చర్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఇకనైనా మానుకొని పాలనపై పూర్తి దృష్టి సారించాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలెపోగు రాంబాబు పేర్కొన్నారు. మండల కేంద్రం యద్దనపూడిలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. బీజేపీ పొత్తులో ఉన్న దృష్ట్యా సీఎం చంద్రబాబు వారి మెప్పుకోసం హిందువులపై ప్రత్యేక ప్రేమ కనబరుస్తున్నట్లుగా నటిస్తూ కలియుగ దైవం పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు, చేప కొవ్వు కలిసిందని ఆరోపణలు చేశారన్నారు. రాష్ట్ర జనాభాలో 40 శాతం ఓటింగ్ కలిగి ఉన్న వైఎస్ జగన్ మోహన్రెడ్డిని హిందూ సమాజానికి దూరం చేయాలనే దురుద్దేశంతో ముఖ్యమంత్రి హోదాలో ఎటువంటి ఆధారాలు లేకుండా నిందలు వేయడం దారుణమన్నారు. అందుకు వంత పాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష లడ్డులూ అయోధ్యకు పంపించారంటూ ఆరోపించడం ఎంతవరకు సమంజమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లి అంజనీ ప్రసాదరెడ్డి,వైస్ ఎంపీపీ ఐమాల శాంసన్, పార్టీ సీనియర్ నాయకులు జంపాని కోటి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాంబాబు -
ముగిసిన ఆయేషా మీరా అవశేషాల అంత్యక్రియలు
తెనాలిరూరల్: తెనాలికి చెందిన ఆయేషామీరా హత్య కేసును మూసివేసిన సీబీఐ కోర్టు దర్యాప్తు కోసం తన దగ్గరున్న ఆమె అవశేషాలను శుక్రవారం విజయవాడలో తల్లిదండ్రులకు అందజేశారు. అనంతరం అవశేషాలను తెనాలిలోని ఈద్గాలో గల ఆయేషా మీరా సమాధిలో అంత్యక్రియలు చేశారు. కార్యక్రమంలో వందలాదిగా ప్రజలు పాల్గొన్నారు. అవశేషాలు తీసుకువస్తున్న కాన్వాయ్ను వీఎస్సార్ కళాశాల వద్ద నుంచి తోడ్కొని ఈద్గా మైదానానికి తీసుకువచ్చి వారి మతాచారం ప్రకారం అంత్యక్రియలు జరిపించారు. ఆయేషా మీరా హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు ఆమె మృతదేహానికి 2019లో రెండో సారి పోస్టుమార్టం నిర్వహించిన సంగతి తెలిసిందే. తెనాలి చెంచుపేటలోని కబరస్తాన్లోని ఆయేషా సమాధిని తవ్వించి, కేసు దర్యాప్తుకు అవసరమవుతాయన్న భావనతో కింది దవడ ఎముక, ఉరోస్థి(స్టెర్నమ్), మోచేతి పైఎముక(హుమెరస్), పుర్రె ఎముకలను సేకరించి సీల్డు కవర్లు, బాక్సుల్లో భద్రపరచి, పరీక్షల కోసం హైదరాబాద్లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ(సీఎఫ్ఎస్ఎల్)కి అప్పట్లో తరలించారు. హైదరాబాద్ గాంధీ వైద్యశాల ఫోరెన్సిక్ నిపుణుల అభిప్రాయం తీసుకున్న అనంతరం ఆమె అవశేషాలను సీబీఐ కోర్టు ముందు ఉంచారు. అనంతరం ఈనెల 20న కేసును మూసివేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. సీబీఐ దర్యాప్తు అధికారి, మృతురాలి తల్లిదండ్రులు కోర్టుకు హాజరుకావాలని ఆదేశించారు. ఆ ప్రకారం విజయవాడలోని సీబీఐ కోర్టుకు వెళ్లిన ఆయేషా మీరా తల్లిదండ్రులు షంషద్ బేగం, ఇక్బాల్ బాషాలకు వారి కుమార్తె అవశేషాలను అప్పగించారు. కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అధికారుల బృందం భారీ భద్రత నడుమ తెనాలికి తరలించారు. వీఎస్సార్ కాలేజి దగ్గర నుండి ప్రజలు, ఆయేషా బంధువులు, ముస్లింలు ర్యాలీగా అవశేషాలను చెంచుపేటలోని ఈద్గా మైదానానికి తీసుకువచ్చారు. ముస్లింల ఆచారం ప్రకారం మత పెద్దలు దువా నిర్వహించిన అనంతరం కబరస్తాన్లో అప్పటికే తవ్వించి ఉంచిన ఆయేషా సమాధిలో అవశేషాలను సీబీఐ, రెవిన్యూ అధికారుల సమక్షంలో ఖననం చేశారు. దారి పొడవునా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. డీఎస్పీ బి.జనార్ధనరావు, త్రీ టౌన్ సీఐ ఎస్.సాంబశివరావు, వన్ టౌన్ సీఐ వి.మల్లికార్జునరావు బందోబస్తును పర్యవేక్షించారు. తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ పంచనామా నిర్వహించారు. మేం బతికుండగా ఆయేషా కేసు ముగియదు.. ఆయేషా అవశేషాలను ఖననం చేసిన అనంతరం ఆమె తండ్రి ఇక్బాల్ బాషా మీడియాతో మాట్లాడారు. ఆయేషా కేసు ముగిసిందంటున్నారని, తల్లిదండ్రులమైన తాము బతికి ఉన్నంత వరకు కేసు ముగియదన్నారు. ఆయేషాకు సీబీఐ, సిట్ అధికారులు అన్యాయం చేశారని ఆరోపించారు. కేసులో ఆధారాలు లేవంటున్నారని, దర్యాప్తు చేసిన అధికారులే ఆధారాలన్నారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ ఎంక్వయిరీ వేయించాలని డిమాండ్ చేశారు. త్వరలో సీఎం చంద్రబాబునాయుడును కలుస్తామని, ఆయన ఇచ్చిన హామీ మేరకు తమకు న్యాయం చేయాలన్నారు. నిందితులకు శిక్ష పడినప్పుడే ఆయేషా మీరా ఆత్మకు శాంతి కలుగుదుందని స్పష్టం చేశారు. -
విద్యుదాఘాతంతో ఉప్పు రైతు మృతి
చినగంజాం: విద్యుదాఘాతంతో ఓ ఉప్పు రైతు మృతి చెందిన ఘటన శుక్రవారం సాయంత్రం చినగంజాంలోని ఉప్పు కొఠారు భూముల్లో చోటు చేసుకుంది. బంధువులు అందించిన వివరాలు.. మండలంలోని సోపిరాల గ్రామానికి చెందిన పల్లపోలు శ్రీకాంత్(40) తన ఉప్పు కొఠారు భూముల్లో పనులు కోసం వెళ్లాడు. ఆ సమయంలో కొఠారు భూమిలోని విద్యుత్ మోటారుకు సంబంధించిన సర్వీసు వైరు జాయింట్ ఉన్న ప్రాంతం తన మెడకు చుట్టుకోవడం, తన కాలి కింద నీటి తడి ఉండటంతో షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఒక బాబు, పాప ఉన్నారు. శ్రీకాంత్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. -
రైతులకు పుట్టగొడుగుల సాగుపై శిక్షణ
బాపట్ల: మాంసాహారాన్ని మించిన ప్రోటీన్లు పుట్టగొడుగులలో పుష్కలంగా ఉన్నాయని, మారుతున్న పర్యావరణానికి అనుగుణంగా పుట్టగొడుగులను ఆహారంగా తీసుకోవడం శ్రేయోదాయకమని బాపట్ల వ్యవసాయ కళాశాల మొక్కల తెగుళ్ల విభాగాధిపతి డాక్టర్ వి.ప్రసన్నకుమారి వివరించారు. తోటమాలపల్లి గ్రామంలో పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు.పుట్టగొడుగుల ప్రాధాన్యాన్ని, దానిలోని పోషక విలువలను గురించి రైతులకు తెలియజేశారు. పుట్టగొడుగుల పెంపకంపై వారికి పూర్తి అవగాహనను కల్పించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ షేక్ అబ్దుల్ సలాం పుట్టగొడుగుల పెంపక విధానాన్ని రైతులకు సమగ్రంగా వివరించారు. వ్యవసాయ కళాశాల నాలుగవ సంవత్సరం ఈ.ఎల్.పి. విద్యార్థులు ఈ పుట్టగొడుగుల పెంపక విధానాన్ని రైతులకు ప్రత్యక్షంగా చూపించారు. యువ రైతులు చురుగ్గా పాల్గొన్న ఈ కార్యక్రమంలో రైతులకు వరిగడ్డి సంచి, విత్తనములు, భావిష్టిన్ బ్యాగు, పుట్టగొడుగులను సాగు చేసే విధానం గురించిన పుస్తకాన్ని అందించారు. -
గ్లోబల్ లాజిస్టిక్స్కు ఏఐ ఊతం
లక్ష్మీపురం: పెద్ద స్థాయి లాజిస్టిక్స్ నెట్వర్క్లకు ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఊతం అందిస్తోందని, ఇందులో అమెజాన్ సంస్థ ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు సం ఏఐ సప్లై చైన్ మేనేజర్ తేజా భరత్ నెల్లూరి అన్నారు. గ్లోబల్ సప్లై చైన్ ఎలా పునఃనిర్మిస్తుందో, భవిష్యత్తులో ఇది ఎటువంటి ప్రభావం చూపబోతోందో తన అభిప్రాయాలను శుక్రవారం వెల్లడించారు. సంప్రదాయ వ్యవస్థలను ఏఐ మించిపోతుందన్నారు. ముందస్తు హెచ్చరికలు కంపెనీలకు రీరూటింగ్, రీషెడ్యూలింగ్, ఇన్వెంటరీ బ్యాలెన్సింగ్ లాంటి చర్యలు తీసుకునే అవకాశం కల్పిస్తాయన్నారు. -
కల్యాణం.. వైభోగం...
రేపల్లె: ఉప్పూడి రోడ్డులో వేంచేసియున్న శ్రీలక్ష్మీ గోదా సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం ఆలయ అర్చకులు శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయాన్నే స్వామివారికి, దేవేర్లుకు మంగళస్నానాలు చేయించి పట్టువస్త్రాలు, పువ్వులతో వధువరులుగా అలంకరించారు. వేదమంత్రాలు, మేళతాళాల నడుమ స్వామివారి కల్యాణం చేశారు. స్వామివారి పరిణయ ఘట్టాలను భక్తులకు వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు. అనంతరం అన్న సంతర్పణ చేశారు. భక్తులకు ఆలయ కమిటీ సభ్యులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. టీడీపీ నాయకులు అనగాని శివప్రసాద్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అదేవిధంగా స్వామివారిని మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు, నాయకులు పంతగాని సాయికుమార్, కొలసాని రాము, తదితరులు దర్శనం చేసుకున్నారు. -
జాగా పేరిట బాబు దగా
చంద్రబాబు మార్క్ రాజకీయం మరోసారి రుజువైంది. ఎన్నికల ముందు ఒక మాట... అధికారంలోకి వచ్చాక మరో మాట అనే విషయం మళ్లీ తేలిపోయింది. ఎన్నికల వేళ పేదలకు రెండు సెంట్ల స్థలం ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఆ సంగతి పట్టించుకోవడం లేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలంగా ఒక సెంటు ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక రెండు సెంట్లు ఇచ్చి ఇళ్లు కట్టిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి నేడు తుంగలో తొక్కారు. చీరాల అర్బన్: గత ప్రభుత్వంలో సీఎం జగన్మోహన్రెడ్డి హయాంలో ఒక్కొక్కరికి సెంటు స్థలం కేటాయించారు. అందులో గృహ నిర్మాణాలకు నిధులు మంజూరు చేశారు. వాటికి జగనన్న కాలనీలుగా నామకరణం చేశారు. లబ్ధిదారులలో సింహభాగం గృహనిర్మాణాలు పూర్తిచేసుకుని గృహ ప్రవేశాలు చేశారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా ఇళ్ల స్థలం ఒక్కరికీ ఇవ్వలేదు. కళ్లు కాయలు కాస్తున్నాయని అర్హులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ ఆ మాట బహిరంగంగా చెప్తే ఏం సమస్య వస్తుందోనని మౌనంగా ఉంటున్నారు. స్థల సేకరణ పేరుతో కాలయాపన అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాల కోసం సేకరణ పేరుతో పాలకులు, అధికారులు కాలయాపన చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టి సుమారు రెండు సంవత్సరాలు అవుతోంది. ఇప్పటికీ స్థల సేకరణ జరగలేదు. ఇంకెన్ని సంవత్సరాల సమయం కావాలో వారే చెప్పాలి. చీరాలలో ఎస్టీ సామాజిక వర్గంలో నక్కల సామాజిక వర్గం వారికి అద్దె చెల్లించే స్థోమత కూడా ఉండదు. దీంతో వారు ఎక్కడ పడితే అక్కడ డేరాలు వేసుకుని జీవిస్తున్నారు. వీధుల వెంట తిరిగి దువ్వెనలు, పిన్నీసులు, అద్దాలు తదితరాలు విక్రయిస్తూ నాలుగు రూపాయలు సంపాదించుకుంటారు. వాటితో పొట్ట పోసుకుంటారు. వారి ఓట్లు మాత్రం కావాలి కానీ వారి అవసరాలు తీర్చేందుకు పాలకులు ముందుకు రావడం లేదు. వారికి ఆధార్కార్డు, రేషన్ కార్డు, ఓటు కార్డులున్నాయి. తమకు ఇళ్ల స్థలాలు ఇచ్చి గృహాలు నిర్మిస్తారని ఎదురు చూస్తున్నారు. నాకు ఆరు పదుల వయస్సు. సొంతింటి కల తీరుతుందో లేదో. ఇళ్లకు జాగాలిచ్చి కట్టిస్తామని చెప్పారు. ఎప్పుడని అడిగితే ఎవరూ కచ్చితంగా చెప్పటం లేదు. మా పని మాకు తప్పదు. కానీ గూడు ఉంటే అదో ధైర్యం. సున్నా ఖాతాలను బ్యాంకులో పుస్తకాలు తీసుకోమన్నారు. అందుకు రెండు, మూడొందలు ఖర్చయ్యాయి. రూ.1500 పడతాయన్నారు. అయితే ఖాతాల్లో కూడా డబ్బులు పడటం లేదు. – పి.ప్రమీల, చీరాల -
ఏఐ రాకతో చిత్ర పరిశ్రమకు కష్టాలు
చిత్ర దర్శకుడు దిలీప్ రాజా నగరంపాలెం: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ (ఏఐ) రాకతో చిత్ర పరిశ్రమకు కష్టాలు తప్పవని మా–ఏపీ వ్యవస్థాపకులు, చిత్ర దర్శకుడు దిలీప్రాజా అన్నా రు. గురువారం అరండల్పేటలోని ఓ హోటల్లో మా–ఏపీ 24 విభాగాల యూనియన్ సభ్యులు సమావేశం నిర్వహించారు. సమావేశానికి దర్శకుడు అచ్చన శ్రీనివాస్యాదవ్ అధ్యక్షత వహించారు. దిలీప్రాజా మాట్లాడుతూ సాంకేతిక వర్గం అవసరం లేకుండా ఏఐతో చిత్రాలను రూపొందించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే సంగీత దర్శకులు లేకుండానే కృత్రిమ మేధ పాటలకు ట్యూన్లు వస్తు న్నాయని అన్నారు. సన్నివేశాలు చెబితే సంగీతం వస్తుందని చెప్పారు. భవిష్యత్లో సాంకేతిక వర్గం అవసరం లేకుండానే చిత్రాలు విడుదలవుతాయ న్నారు. ఇటీవల సోషల్ మీడియాలో మహేష్బాబు, దర్శకుడు రాజమౌళి ఫైటింగ్ దృశ్యాలు హల్చల్ చేస్తున్నాయని చెప్పారు. దీన్ని ఏఐ రూపొందించిందని తెలిసి సంబరపడాలా? లేదా ఎవరి ప్రమేయం లేకుండా వచ్చిన వీడియోతో భవిష్యత్ ప్రమాదకరమో ముందస్తుగా ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని హెచ్చరించారు. ఏ చిత్రంలో అయినా ఏఐ దృశ్యాలుంటే సెన్సార్ చేయకుండా నిర్దిష్టమైన నియమాలను ఆచరణలోకి తేవాలన్నారు. సహాయ దర్శకులు గాజులపల్లి రాముడు, 24 విభాగాల సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. -
వేర్వేరు కేసుల్లో ఇద్దరు చోరుల అరెస్టు
సుమారు రూ.38 లక్షల విలువైన బంగారం, వెండి స్వాధీనం నగరంపాలెం (గుంటూరు వె స్ట్): చోరీ కేసుల్లో ఇద్దరు పాత నేరస్తులను దుగ్గిరాల పోలీసులు అరెస్ట్ చేసి, సుమారు రూ.38 లక్షల విలులైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం... దుగ్గిరాల గ్రామం బ్రాహ్మణబజార్కు చెందిన తిరుపతి అనే వ్యక్తి ఇంట్లో బంగారం చోరీ జరిగిందన్నారు. దీనిపై దుగ్గిరాల పీఎస్లో ఫిర్యాదు చేయగా, ఎస్ఐ వెంకటరవి కేసు దర్యాప్తు చేపట్టారని తెలిపారు. ఉత్తర డీఎస్పీ మురళీకృష్ణ పర్యవేక్షణలో మంగళగిరి రూరల్ పీఎస్ సీఐ ఏవీ బ్రహ్మం దర్యాప్తు ముమ్మరం చేశారని చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్, వేలిముద్రలు, సాంకేతిక ఆధారంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు వాసి పాత నేరస్తుడైన చిప్పాడ కేదారేశ్వరరావు(40)ని అదుపులోకి తీసుకుని విచారించారన్నారు. ఐదు కేసులకు సంబంధించి రూ.16.32 లక్షల ఖరీదు చేసే బంగారు ఆభరణాలు, రూ.వెయ్యి నగదు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. అతనిపై నలభైకిపైగా చోరీ కేసులు ఉన్నాయని అన్నారు. మరో ఘటనలో... చింతలపూడి గ్రామానికి చెందిన కుటుంబం బయటకు వెళ్లిన సమయంలో వారింట్లో సుమారు రూ.20 లక్షల ఖరీదైన బంగారు, వెండి వస్తువులు దొంగతనానికి గురయ్యాయని తెలిపారు. బాధితుడి ఫిర్యాదుతో నెహ్రూనగర్ వాసి ఇమడాబత్తిని గోపి (38)ని మంగళగిరి షరాఫ్బజార్లో అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. విచారణలో నేరం రుజువుకావడంతో రూ.20.40 లక్షల విలువైన బంగారం, రూ.1.11 లక్షల ఖరీదైన వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. గోపీ కార్పెంటర్ అని, అతనిపై కొత్తపేట పీఎస్లో ఒక కేసు ఉందని తెలిపారు. కేసులను త్వరగా ఛేదించిన మంగళగిరి రూరల్ పీఎస్ సీఐ బ్రహ్మం, దుగ్గిరాల పీఎస్ ఎస్ఐ వెంకటరవి, బృందాన్ని జిల్లా ఎస్పీ అభినందించారు. ప్రశంసాపత్రాలు అందించారు. -
ట్రాఫిక్ పోలీసులకు రక్షణ కళ్లద్దాలు పంపిణీ
నగరంపాలెం: సమాజ సేవాభావనతో ముందుకు రావడం అభినందనీయమని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. గుంటూరు ట్రాఫిక్ పోలీసుల సౌకర్యార్థం డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ అందించిన 150 రక్షణ కళ్లద్దాలను గురువారం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని సమావేశ మందిరంలో ట్రాఫిక్ పోలీస్ అధికారులు, సిబ్బందికి అందించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఎండలో, అధిక వేడి, ధూళిలో బహిరంగ ప్రదేశాల్లో విధులు నిర్వర్తించే ట్రాఫిక్ పోలీసు సిబ్బందికి రక్షణకు గ్లాసులను అందించడం అభినందనీయమని అన్నారు. డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ ఉపాధ్యక్షుడు (ఆపరేషన్స్) శ్రీకాంత్ మాట్లాడుతూ సాంకేతిక సదుపాయాలతో సమగ్ర నేత్ర వైద్య సేవలన్నీ ఒకేచోట అందిస్తున్నామని అన్నారు. ప్రతి ఆరు నెలలకు ఓసారి పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకై ఉచిత నేత్ర పరీక్ష శిబిరాలు నిర్వహించే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. రెటినా వైద్య నిపుణురాలు కల్పనారెడ్డి, వైద్యులు సులోచన, శివాని, ప్రసన్న, బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ జయకుమార్ పాల్గొన్నారు. -
విద్యాశాఖ ఏకపక్ష విచారణపై నిరసన
నరసరావుపేట ఈస్ట్: పట్టణంలోని ప్రకాష్నగర్లోని ఆక్స్ఫర్డ్ పాఠశాల 10వ తరగతి విద్యార్థినిపై పాఠశాల ప్రిన్సిపాల్ దాడి చేసిన ఘటనపై విద్యాశాఖ ఏకపక్షంగా విచారణ జరిపి నివేదిక ఇవ్వటాన్ని నిరసిస్తూ విద్యార్థిని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు గురువారం జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. కేవలం పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడిన విచారణాధికారి (డిప్యూటీ డీఈఓ) బాధితురాలిని జరిగిన ఘటనపై వివరాలు అడగకుండానే నివేదిక ఏలా సమర్పిస్తారని ధ్వజమెత్తారు. నివేదికలో ఇచ్చిన ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ అని రాశారనీ, అసలు సదరు నెంబరు ఎవరిచ్చారని ప్రశ్నించారు. తాము విడతల వారీగా ఫీజులు చెల్లిస్తున్నా అసలు ఫీజులే చెల్లించటం లేదని యాజమాన్యం చెప్పటం సరికాదన్నారు. తమ కుమార్తైపె జరిగిన దాడిని ప్రశ్నిస్తే పోలీసులను పిలిపించి బెదిరించారని ఆరోపించారు. కేవలం డబ్బు, పలుకుబడి ఉందని తమను ఎవరూ ఏమీ చేయలేరనే అహంకారంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కార్యాలయం వద్ద ఆందోళన సమాచారం అందుకున్న డీఈఓ పివిజే రామారావు అక్కడికి చేరుకొని వారితో మాట్లాడారు. ఘటన జరిగిన విషయం తెలుసుకొని ఎంఈఓను విచారణకు పంపామనీ, అయితే ఎవరూ అందుబాటులో లేకపోవటంతో మరుసటి రోజు డిప్యూటీ డిఈఓను విచారణకు పంపామన్నారు. ప్రస్తుతం ఇచ్చిన నివేదిక కేవలం ప్రాథమిక నివేదిక మాత్రమేనని పూర్తిస్థాయిలో విచారించి సమగ్ర నివేదిక అందిస్తామన్నారు. ఈసందర్భంగా బాధిత విద్యార్థిని, తల్లిదండ్రులతో తన ఛాంబర్లో వ్యక్తిగతంగా విచారణ చేపట్టారు. ఘటనపై అన్ని కోణాల్లో విచారించి సమగ్ర నివేదిక రూపొందిస్తామని డిఈఓ రామారావు స్పష్టం చేసారు. ఆక్స్ఫర్డ్ ఘటనపై డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా -
రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థిని మృతి
చీరాల: రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థిని మృతి చెందిన సంఘటన గురువారం 167ఏ వాడరేవు– పిడుగురాళ్ళ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. హైదరాబాద్ సమీపంలోని అనంతపూర్కు చెందిన బోయ సహస్ర (21) గుంటూరులోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. గురువారం బోయ సహస్ర మరో యువకుడు అఖిల్ ద్విచక్రవాహనంపై గుంటూరు నుంచి చీరాల వస్తున్నారు. నూతనంగా నిర్మించిన 167 ఏ జాతీయ రహదారిపై విజయనగర్కాలనీ సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ద్విచక్రవాహనం బలంగా ఢీకొంది. దీంతో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలం సమీపంలోని వారు చూసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి టూటౌన్ సీఐ నాగభూషణం, సిబ్బంది చేరుకుని తీవ్రగాయాలైన సహస్ర, అఖిల్ను చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో సహస్ర మరణించింది. తీవ్రగాయాలైన అఖిల్ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం గుంటూరు తరలించారు. విద్యార్థిని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే గుంటూరు నుంచి చీరాలకు రావడానికి కారణాలు, అసలు ప్రమాదానికి గల కారణాలను తెలియరావాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆగి ఉన్న లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం -
ఐసీడీఎస్కు బడ్జెట్ పెంచాలి
లక్ష్మీపురం: ఐసీడీఎస్కు బడ్జెట్ పెంచి, అంగన్వాడీల కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని కోరుతూ గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం రెండో రోజు కొనసాగాయి. దీక్ష శిబిరాన్ని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కే బాబు ప్రసాద్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ వ్యవస్థ ప్రారంభమై 50 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటికీ అంగన్వాడీలను కార్మికులుగా గుర్తించలేదన్నారు. కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సామాజిక భద్రత చట్టాలు అమలు చేయకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఐసీడీఎస్కి బడ్జెట్లో నిధులు కేటాయించకపోతే పేద పిల్లలు, గర్భిణుల ఆరోగ్యం పై దుష్ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు కూటమి నాయకులు ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని కోరారు. అంగన్వాడీ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు జి రమణ మాట్లాడుతూ అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోతే మార్చి 2న విజయవాడలో మహాధర్నా చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కే శ్రీనివాసరావు, షేక్ హుస్సేన్ వలి, సీఐటీయూ జిల్లా ప్రధానకార్యదర్శి దండా లక్ష్మీనారాయణ, లాయర్స్ యూనియన్ నాయకులు శేషగిరిరావు, డీవీఆర్సీ నాయకులు సురేష్, అంగన్వాడీ యూనియన్ నాయకులు జయ శ్రీలక్ష్మి, సుభాషిణి, స్వర్ణలత, రోజమ్మ, యాసిన్ తదితరులు పాల్గొన్నారు. -
ఫిమేల్ ట్రైనింగ్ సెంటర్ ఏఓగా రామకృష్ణ
గుంటూరు మెడికల్: గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వెనుక ఉన్న ప్రాంతీయ శిక్షణ కేంద్రం (ఫిమేల్) పరిపాలనా అధికారిగా సూరె రామకృష్ణ గురువారం విధుల్లో చేరారు. నూతనంగా ఏఓగా విధుల్లో చేరిన రామకృష్ణను గుంటూరు జీజీహెచ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కోటేశ్వరరావు, సభ్యులు టి.శ్రీనివాసరావు, తిరుపతిరావు, సీనియర్ అసిస్టెంట్ సురేష్, మనోజ్, రఫిక్, తదితరులు బొకే అందజేసి శాలువా కప్పి అభినందనలు తెలిపారు. గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ) కార్యాలయంలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న రామకృష్ణకు ఈనెల 13న పరిపాలనా అధికారిగా పదోన్నతి లభించింది. ఫిమేల్ ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపల్ డాక్టర్ విజయలక్ష్మిని కలిసి రామకృష్ణ జాయినింగ్ రిపోర్ట్ అందజేశారు. నూతనంగా ఏఓగా విధుల్లో చేరిన రామకృష్ణకు శిక్షణా కేంద్రం సిబ్బంది అభినందనలు తెలిపారు. -
గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
గుంటూరు వెస్ట్: ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ మేరకు గురువారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవతో కలసి పోస్టర్ విడుదల చేశారు. 5వ తరగతిలో ప్రవేశానికి, 6,7,8 తరగతలలో మిగిలి ఉన్న సీట్లలో ప్రవేశానికి, ఇంటర్మీడియెట్, డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తుందని జిల్లా కలెక్టర్ చెప్పారు. మార్చి 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేయవచ్చని, ఏప్రిల్ 24న రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ప్రవేశ పరీక్షల కన్వీనర్, గుంటూరు ఏపీ ఆర్.జె.సి (ఉర్దూ బాలురు) కళాశాల ప్రిన్సిపాల్ పి.సాంబశివరావు మాట్లాడుతూ ఏపీ గురుకుల విద్యాలయ సంస్థ సొసైటీ ఆధ్వర్వంలోని పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. ప్రామాణిక విద్య, వసతి సౌకర్యాలు కలిగిన ఈ విద్యాసంస్థల్లో ముస్లిం మైనారిటీ విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ–బీ, బీసీ–సీ విద్యార్థులు అర్హులన్నారు. ఇంటర్మీడియెట్, డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఏపీఆర్జేసీ సెట్, డీసీ సెట్ 2026 పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మార్చి 31 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. -
మాతాశిశు మరణాలను అరికట్టాలి
బాపట్ల: మాతాశిశు మరణాలను అరికట్టేందుకు వైద్యాధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. స్వస్థ కార్యక్రమంలో భాగంగా మాతాశిశు మరణాలు అరికట్టడంపై వైద్యాధికారులతో గురువారం ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. రక్తహీనతతో హై రిస్క్ ఉన్న గర్భిణులపై వైద్యులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. గర్భిణుల్లో రక్తహీనత లేకుండా, సాధారణ కాన్పులు జరిగేలా డాక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఆపరేషన్ అరికట్టగలిగితే మాతాశిశు మరణాలను నియంత్రించగలమన్నారు. వైద్యులకు అవగాహన కల్పించి సాధారణ కాన్పులకే ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి ప్రధానమంత్రి సూర్య ఘర్ ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. పథకం జిల్లా స్థాయి కమిటీ సమావేశం గురువారం స్థానిక కలెక్టరేట్లో జరిగింది. సౌర విద్యుత్ ఉత్పత్తి, వినియోగం పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో ఆరు గ్రామాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. నూరు శాతం సౌర విద్యుత్ ఉత్పత్తి, వినియోగం అక్కడ ఉండేలా చూడాలన్నారు. బాపట్ల నియోజకవర్గంలోని పిట్టలవానిపాలెం మండలం పిట్టలవానిపాలెం గ్రామంలో 12,036 , చీరాల నియోజకవర్గంలో వేటపాలెం మండలం కొత్తపేట గ్రామంలో 16,931, పర్చూరు నియోజకవర్గంలో కారంచేడు మండలం కారంచేడు గ్రామంలో 11,667, రేపల్లె నియోజకవర్గంలో చెరుకుపల్లి మండలం కనగాల గ్రామంలో 7,192, వేమూరు నియోజకవర్గంలో చుండూరు మండలం యడ్లపల్లి గ్రామంలో 8,300 గృహాలకు సూర్యఘర్ యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు. వయోజనుల్లో డిజిటల్ అక్షరాస్యత పెంచాలి వయోజనుల్లో డిజిటల్ అక్షరాస్యత పెంచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. అక్షరాంధ్ర కార్యక్రమాల అమలుపై అనుబంధ శాఖల అధికారులతో గురువారం ఆయన హైబ్రిడ్ మోడ్ లో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 65,158 మంది వయోజనులకు అక్షరాభ్యాసం చేయడం లక్ష్యమన్నారు. మార్చి 15వ తేదీన పరీక్షలు ఉంటాయన్నారు. కేంద్రాలు ఏర్పాటు చేయాలని, పరీక్షలు సమర్థంగా నిర్వహించాలన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ -
నేడు ఆయేషామీరా అవశేషాలకు అంత్యక్రియలు
తెనాలిరూరల్: సంచలనం సృష్టించిన ఆయేషామీరా హత్యకేసును సీబీఐ కోర్టు ఇటీవల మూసివేయడంతో ఆమె అవశేషాలకు శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు ఆయేషా మీరా మృతదేహానికి 2019లో రెండోసారి పోస్టుమార్టం నిర్వహించారు. వైద్యుల అభిప్రాయం తీసుకున్న అనంతరం ఆమె అవశేషాలను సీబీఐ కోర్టు ముందు ఉంచారు. ఈ నెల 20న కేసు మూసివేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కాగా తమ కుమార్తె అవశేషాలను అప్పగించాలని ఆయేషా తల్లిదండ్రులు షంషద్బేగం, ఇక్బాల్బాషా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 27న ఉదయం తల్లిదండ్రులు, సీబీఐ దర్యాప్తు అధికారి కోర్టు ముందు హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు. భద్రత నడుమ గౌరవప్రదంగా అంత్యక్రియలు జరిగేలా చూడాలని సూచించారు. ఆమేరకు శుక్రవారం కోర్టులో పంచనామా జరిపిన అనంతరం అవశేషాలను స్వస్థలమైన తెనాలికి తరలించనున్నారు. చెంచుపేటలోని ఖబరిస్తాన్లో అవశేషాలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇందుకోసం పోలీసులు భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. -
రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోంది
అంబటిని పరామర్శించిన పలువురు ఎమ్మెల్సీలు నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగానికి బదులు నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు పేర్కొన్నారు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబును గురువారం ఎమ్మెల్సీలు కల్పలతా రెడ్డి, టి.మాధవరావు, బొమ్మి ఇజ్రాయేల్, రామచంద్రారెడ్డి, రామసుబ్బారెడ్డి, ఇస్సాక్ బాషా, వంకా రవీంద్రనాథ్, మాజీ ఎమ్మెల్యేలు సింహాద్రి రమేష్బాబు, కాసు మహేష్ రెడ్డి, తాడికొండ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు(డైమండ్బాబు), వినుకొండ, పెదకూరపాడు పార్టీ పరిశీలకులు యెనుమల మురళీధర్రెడ్డిలు పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇజ్రాయేల్ మాట్లాడుతూ రాష్ట్రంలో నారా లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. ఒక మాజీ మంత్రికే రక్షణ లేకపోతే..సామాన్యుడి పరిస్థితి ఏంటని ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ బిహార్ రాష్ట్రం కంటే దిగజార్చి చంద్రబాబు పాలన చేస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ అంబటి ఇంటిపై దాడిని దేశం అంతా చూసిందన్నారు. ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ మాట్లాడుతూ అంబటిపై కావాలనే చంద్రబాబు ప్రభుత్వం దాడి చేయించిందన్నారు. -
యార్డులో రైతులకు ఉచిత భోజనం ప్రారంభం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డులో రైతులకు ఉచిత భోజన కార్యక్రమాన్ని యార్డు చైర్మన్ కుర్రా అప్పారావు, ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎం.చంద్రికలు గురువారం ప్రారంభించారు. వారు మాట్లాడుతూ నాణ్యతతో కూడిన రుచికరమైన భోజనాన్ని రైతులకు అందించనున్నట్లు వెల్లడించారు. ఉచిత భోజనంతోపాటు ఉదయం అల్పాహారం కూడా రైతులకు అందిస్తామని తెలిపారు. ప్రతి రోజూ మెనూ ప్రకారం సోనా మసూరి రైస్, పప్పు, స్వీటు, గుడ్డు, వేపుడు, సాంబారు, ఇగురు కూర, గడ్డ పెరుగు, అప్పడాలతో కూడిన భోజనాన్ని రైతులకు పెట్టడం జరుగుతుందన్నారు. ఉదయం అల్పాహారంలో ఇడ్లీ రెండు, చెట్నీ, కారంపొడితోపాటు సోమ, బుధ, శుక్రవారాల్లో సాంబారుతో కట్టె పొంగలి, మంగళ, గురువారాల్లో టమాటా బాత్, ప్రతి రోజూ ఒక టీ కప్పు అందిస్తారని తెలిపారు. ప్రతి రోజూ నాణ్యతను పర్యవేక్షించనున్నట్లు వారు వివరించారు. యార్డు వైస్ చైర్మన్ బిట్రగుంట మల్లిక, పాలకవర్గ సభ్యులు, యార్డు ఇన్చార్జి సుబ్రహ్మణ్యం, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చీరాల టౌన్: జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్న ఇంటర్ పరీక్షలను అవాంతరాలు లేకుండా పకడ్బందీగా నిర్వహిస్తున్నామని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ తెలిపారు. గురువారం స్థానిక వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రంలోని ప్రతి గదినీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ను విధించడంతో పాటుగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులకు తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించామని తెలిపారు. మాస్ కాపీయింగ్కు పాల్పడకుండా చూడాలన్నారు. వేటపాలెం: శ్రీశైలం ద్వితీయ పీఠానికి పీఠాధిపతిగా వేటపాలేనికి చెందిన చల్లా రామారావుకు పట్టాభిషేకం చేశారు. శుక్రవారం శ్రీశైలంలో ఉమా రామలింగేశ్వర దేవాంగ నిత్య అన్నదాన సత్రంలో పడవీడు గాయత్రీ పీఠం పీఠాధిపతులు చెన్న కోటిలింగమూర్తి ద్వితీయ పీఠాధిపతికి పట్టాభిషేకం చేయించి కిరీటం, నంది ధ్వజం ఏర్పాటు చేశారు. ద్వితీయ పీఠాధిపతులుగా పట్టాభిషేకం చేసిన చల్లా రామారావుకు దేవాలయ పరబ్రహ్మ స్వామిగా నామకరణం చేశారు. కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి దేవాంగ ప్రతినిధులు, కుల సేనాధిపతులు పాల్గొన్నారు. వేమూరు: అమర్తలూరు గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు అంబటి వెంకట సుబ్బమ్మ (108) గురువారం మృతిచెందారు. సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆమె కష్టపడి కుటుంబాన్ని అభివృద్ధిలోకి తెచ్చారు. ఆమెకు కుమారుడు అంబటి రామమోహన్రావు, కోడలు, మనవరాళ్లు ఉన్నారు. అంబటి రామమోహన్రావు వైఎస్సార్సీపీలో ఉన్నారు. వెంకటసుబ్బమ్మ భౌతికాయాన్ని పలువురు రాజకీయ ప్రముఖులు, గ్రామస్తులు, పెద్దలు సందర్శించి నివాళులు అర్పించారు. -
బ్యాంకు ఖాతాదారుడికి రూ. కోటి బీమా పరిహారం అందజేత
కొరిటెపాడు: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ యడ్లపల్లి బ్రాంచ్కు చెందిన ఖాతాదారుడు పి. కామేశ్వరరావు డిసెంబర్ 2022లో ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు. కామేశ్వరరావు అకస్మాత్తుగా మృతిచెందాడు. మృతుని భార్య పి.శివకు ఖాతాదారుడి పాలసీకి సంబంధించిన రూ.కోటి బీమా పరిహారాన్ని గురువారం బ్యాంకు చైర్మన్ కె.ప్రమోద్ అందజేశారు. ప్రమోద్ మాట్లాడుతూ ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ తక్కువ ప్రీమియంతో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే బీమా పథకాలను అందిస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో బ్యాంక్ జనరల్ మేనేజర్లు రాజశేఖర్, జనార్ధన్ రావు, రఘునాథ్ రెడ్డి, ఇండియా ఫస్ట్ లైఫ్ ఆర్బిహెచ్ మదన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రగతి.. తీరని కలే!
● వాడరేవులో ప్రారంభానికి ముందే శిథిలమవుతున్న ప్రభుత్వ అతిథి గృహం ● వాడరేవు, పొట్టిసుబ్బయ్యపాలెం మధ్య కనుమరుగవుతున్న చెట్లు ● రామాపురం రోడ్డులో సా...గుతున్న కల్వర్టులు, తారు రోడ్డు నిర్మాణ పనులు చీరాల అర్బన్: చంద్రబాబు ప్రభుత్వంలో తీరప్రాంత అభివృద్ధికి, పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నామని పాలకులు, అధికారులు పదే పదే చెబున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఎం.ఎం కొండయ్య కూడా పలు సందర్భాల్లో తీరంలో పర్యాటరంగం అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. ఇది ఒక కోణం. అయితే తీరప్రాంతంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని పర్యాటకులు, ప్రజలు అంటున్నారు. ఉన్న వనరులను వినియోగించుకోలేకపోవటం. మొంథా తుఫాన్ సమయంలో దెబ్బతిన్న రోడ్డు, కల్వర్టుల నిర్మాణ పనులు నత్తకు పోటీపడుతూ సా..గుతుండటం అందుకు నిదర్శనమంటున్నారు. కనుమరుగవుతున్న మడ చెట్లు సముద్రతీరంలో రక్షణ కోసం ఉండే మడచెట్లు క్రమేణా కనుమరుగవుతున్నాయి. వాస్తవానికి తీరంలో మత్స్యకారులకు సంధికాలం సమయంలో భృతికి కొంత ప్రాంతాన్ని అప్పట్లో ప్రభుత్వం కేటాయించింది. అందులో సర్వి, యూకలిప్టస్ వంటి చెట్లు పెంచుకుని వాటిపై వచ్చే ఫలసాయంతో జీవించేందుకు. తుఫాన్లు, వరదలు, సునామీ లాంటి విపత్తుల సమయంలో సముద్రపు అలల తాకిడిని నియంత్రించేందకు మడచెట్లు ఉండేవి. అయితే అటు మత్స్యకారులకు కేటాయించిన ప్రాంతాల్లోను, సహజసిద్ధంగా ఉన్న మడచెట్లు క్రమేణా కనుమరుగవుతున్నాయి. రెండు దశాబ్దాల క్రితం సునామీ వచ్చింది. అప్పట్లో పొట్టిసుబ్బయ్యపాలెం తీరంలో సుమారు 10 మంది మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలో క్రమేణా మడచెట్లు పూర్తిగా మాయమైతే సునామీ లాంటి విపత్తులు ఏర్పడితే జరిగే దుష్పరిణామాలను ఊహించలేమంటున్నారు. వాటి సంరక్షణపై పాలకులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రజలు సూచిస్తున్నారు. మోంథా తుఫాన్ నేపథ్యంలో కురిసిన వర్షాలకు వాడరేవు, రామాపురం మధ్య పలుచోట్ల కల్వర్టులు, కొంతమేర రోడ్డు, లో లెవల్ బ్రిడ్జి దెబ్బతిన్నాయి. తుఫాన్ ప్రభావం పోయి నెలలు అవుతోంది. తిరిగి వాటి నిర్మాణ పనులు మాత్రం సా..గుతూనే ఉన్నాయి. చీరాల మండలం వాడరేవు సముద్ర తీరంలో ఓ అతిథి గృహం ఉంది. ఆ గృహం ప్రారంభానికి ముందే ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. అందులోని కలప, ఇతర విలువైన సామాను చోరుల పాలయ్యింది. ఈ క్రమంలో దానిని వినియోగంలోకి తెస్తే ఒక వైపు పలు శాఖల అధికారులకు, మరో వైపు పర్యాటకులకు తక్కువ ఖర్చుతో గదులు అద్దెకు ఇవ్వొచ్చు. ఇప్పటి వరకు దీనిపై ఎవరూ దృష్టి పెట్టలేదని, ఇది వైఫల్యం కాదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయండి
– గుంటూరు వెస్ట్, సౌత్ డీఎస్పీలకు ఆదేశాలు నగరంపాలెం (గుంటూరు వెస్ట్): గుంటూరు వెస్ట్ డీఎస్పీ కె.అరవింద్, గుంటూరు సౌత్ డీఎస్పీ జి. భానోదయలను డీజీపీ ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని బుధవారం ఆదేశాలు వెలువడ్డాయి. ఏపీ హైకోర్టు ఉత్తర్వుల మేరకు 2018 గ్రూప్–1లో సెలెక్టయిన డీఎస్పీలు రాష్ట్రంలోని పలు చోట్ల విధులు నిర్వహిస్తున్న 25 మందిని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దానిలో భాగంగా జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు డీఎస్పీలను రిపోర్టు చేయాలని సూచించారు. కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డులో గురువారం నుంచి రైతులకు ఉచిత భోజన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉచిత భోజనానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఉచిత భోజనంతో పాటు ఉదయం అల్పాహారం కూడా రైతులకు అందించడం జరుగుతోందని ఆమె వెల్లడించారు. గుంటూరు ఎడ్యుకేషన్: కోడింగ్ ట్యూటర్ ఆధ్వర్యంలో ఐటీ రంగంలో ఉద్యోగాలను సాధించేందుకు అవసరమైన గైడెన్స్తో పాటు జాబ్ మేళాను ఈనెల 28న నిర్వహించనున్నట్లు సంస్థ సీఈఓ ఫణిరాజ్ జాలిగామ బుధవారం ఓప్రకటనలో తెలిపారు. అరండల్పేటలోని హోటల్ వీ రాయల్ పార్క్లో జరిగే కెరీర్ గైడెన్స్లో పాల్గొనేందుకు సెల్ నంబరు 96979 89788 లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకుని హాజరు కావాలని సూచించారు. -
బాపట్ల
గురువారం శ్రీ 26 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20267మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజైన బుధవారం స్వామి వారు రాజాధిరాజ వాహనంపై గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాన్ని తిలకించిన వారు సుఖ సంతోషాలతో వెలుగొందుతారని నమ్మకం. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి కె. సునీల్కుమార్ పర్యవేక్షించారు. ఉత్సవ కైంకర్యపరులుగా దుగ్గిరాల మండలం పెదపాలెం గ్రామానికి చెందిన పెమ్మసాని శైలేంద్ర వ్యవహరించారు. నేడు యాలి వాహనంపై..... బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు గురువారం రాత్రి యాలివాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉత్సవాలను భక్తులు తిలకించి స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ అధికారులు కోరారు. – మంగళగిరి టౌన్ చరిత్రకు దర్పణం భట్టిప్రోలు తిరునాళ్ల తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో బుధవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.5500, గరిష్ట ధర రూ.7000, మోడల్ ధర రూ.6200 వరకు పలికింది. విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 538.60 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 40,593 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. దుగ్గిరాల: రైలుపేట కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ తృతీయ వార్షికోత్సవాలలో బుధవారం హనుమంతుని హోమం ఘనంగా నిర్వహించారు. -
వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి
బాపట్ల: వుహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని మార్కెట్ యార్డు సమీపంలోని జాతీయ రహదారిలో ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు కోకి రాఘవరెడ్డి కోరారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ను వైఎస్సార్సీపీ నాయకులు బుధవారం కలిశారు. మార్కెట్ యార్డు వద్ద వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు శంకుస్థాపన కూడా చేపట్టామని వివరించారు. దీంతోపాటు తవ్వకాలువ సర్కిల్ వద్ద ఉన్న విగ్రహాన్ని రోడ్డు విస్తరణ సమయంలో తొలగించినప్పుడు మహానేత పేరుతో సర్కిల్ ఏర్పాటు చేసేందుకు కౌన్సిల్ తీర్మానం కూడా చేశారని గుర్తుచేశారు. ఈ రెండు చోట్ల విగ్రహాలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కూడా వినతిపత్రాలు ఇవ్వటంతోపాటు పలు అనుమతులు కూడా తీసుకొచ్చారని తెలిపారు. జిల్లా కలెక్టర్ను కలిసిన వారిలో ఎంపీపీ చిన్న పోతుల హరిబాబు, మండల పార్టీ అధ్యక్షులు మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కొక్కిలిగడ్డ చెంచయ్య, దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షులు చల్లా రామయ్య, నాయకులు మచ్చా శ్రీనివాస్రెడ్డి, పిన్నిబోయిన ప్రసాదరావు, కటికల యోహోషువా, ఆట్ల ప్రసాదరెడ్డి, రంగయ్య, మోషే తదితరులు ఉన్నారు. ‘సౌర’ యూనిట్లలో ముందంజ అవసరం సూర్య ఘర్ యూనిట్ల స్థాపనలో బాపట్ల జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సంబంధిత శాఖల అధికారులతో బుధవారం ఆయన సమీక్షించారు. 24,620 యూనిట్లు స్థాపించాలని పేర్కొన్నారు. జిల్లాకు 45 గోదాములు మంజూరు కాగా, అందులో 20 ఇప్పటికే పూర్తి చేశామన్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. బాపట్ల జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఓపెన్ స్కూల్ విద్యార్థులకు ఆయా కేంద్రాలలోనే పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. వెంట బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, తహసీల్దార్ షాలీమా ఉన్నారు. -
జవాబు కాదు
విమర్శలకు దాడి నగరంపాలెం (గుంటూరు వెస్ట్)/ నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): గుంటూరు సిద్ధార్థనగర్లో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబును బుధవారం వైఎస్సార్సీపీ రాష్ట్ర పీఏసీ సభ్యులు సాకే శైలజానాఽథ్, పార్టీనేత వంగవీటి నరేంద్ర, ఎమ్మెల్సీలు పాలవలస విక్రాంత్, పీవీవీ సూర్యనారాయణ, అనంతబాబు, రేపల్లె సమన్వయకర్త ఈవూరు గణేష్, సినీ నటుడు జోగినాయుడు పరామర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ● సాకే శైలజానాఽథ్ మాట్లాడుతూ, రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు ఉండాలి కానీ, దాడులు చేయడం మంచి విధానం కాదని అన్నారు. పోలీసుల సమక్షంలో ఏడు గంటలకు పైగా అంబటి ఇల్లు, కార్యాలయంపై దాడి జరగడం బాధాకరమని చెప్పారు. అన్యాయాన్ని ఎదురించేందుకు ఉన్నానని అంబటి వ్యాఖ్యానించడం మంచి మాటగా భావిస్తున్నానని పేర్కొన్నారు. అసెంబ్లీలో చంద్రబాబు నోట్ఫైల్ ప్రకారం పచ్చి అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు. లడ్డూలో అసలు కల్తీలేదని, అయినప్పటికి దుర్మార్గంగా మాట్లాడేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ● వైఎస్సార్ సీపీ నేత వంగవీటి నరేంద్ర మాట్లాడుతూ ఒక అన్యాయాన్ని ప్రశ్నిస్తే టీడీపీ ప్రభుత్వం అడ్డగోలు అరెస్ట్లు, శిక్షలు జరుగుతాయనేది స్పష్టంగా తెలుస్తుందని అన్నారు. అయినా మేమంతా కలిసి కట్టుగా ఉన్నామని, టీడీపీ చేసిన తప్పులను, అక్రమాలను ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు. ● మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఇల్లు, కార్యాలయంపై దాడి గురించి చెప్పేందుకు రాష్ట్ర డీజీపీ, ఏడీజీపీ, గుంటూరు జిల్లా ఎస్పీకి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అనేకసార్లు ఫోన్ చేసినా ఎవరూ ఫోన్ లిఫ్ట్ చేయలేదన్నారు. దాడికి పాల్పడిన వారు క్రిమినల్స్ కాదని, చంద్రబాబు, లోకేష్, డీజీపీ, ఐజీ, గుంటూరు జిల్లా ఎస్పీ క్రిమినల్స్ అని మండిపడ్డారు. ఆ రోజు మా ఇంటి దగ్గర వరకు జిల్లా ఎస్పీ వచ్చి వెనక్కి వెళ్లారని అన్నారు. చంద్రబాబుకి టచ్లో ఉండే పనిలో జిల్లా ఎస్పీ ఉన్నారని ఆరోపించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని ఆరోపించారు. ● రేపల్లె సమన్వయకర్త ఈవూరు గణేష్ మాట్లాడుతూ తిరుపతి లడ్డూ అంశాన్ని డైవర్ట్ చేయడానికే చంద్రబాబు ప్రభుత్వం అంబటి రాంబాబుపై దాడి చేయించారనీ, ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమేనని, ప్రజలు దీనిని గమనించాలన్నారు. -
విజయకీలాద్రిపై ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలు
మంగళగిరి టౌన్: గుంటూరు జిల్లా సీతా నగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ప్రతిష్ఠా మహోత్సవాలు బుధవారం ఐదవ రోజుకు చేరుకున్నాయి. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్నజీయర్స్వామి స్వీయ పర్యవేక్షణలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి, శ్రీ భూనీళా సమేత వైకుంఠనాథ్ పెరుమాళ్, శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి వారు, శ్రీ యోగాంజేయ స్వామి వార్ల ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నాయని తెలిపారు. బుధవారం ఉదయం శ్రీ నారసింహ హవనం, పూర్ణాహుతి, తీర్థ ప్రసాద గోష్టి కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి, స్వామివారి మంగళ శాసనాలు అందుకున్నారన్నారు. గుంటూరు ఎడ్యుకేషన్ : జెడ్పీ ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న జిల్లా పంచాయతీ రిసోర్స్ సెంటర్ (డీపీఆర్సీ) భవనాన్ని కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సుశీల్ కుమార్ లోహాని బుధవారం పరిశీలించారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు గుంటూరు జిల్లాకు వచ్చిన సుశీల్ కుమార్ లోహాని డీపీఆర్సీ నిర్మాణ పనుల ప్రగతి, నిర్మాణ వ్యయం తదితర అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు జెడ్పీ చైర్ పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా పుష్పగుచ్ఛం అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు, పీఆర్ ఎస్ఈ శ్రీనివాసరావు, డీపీవో నాగ సాయి కుమార్, డ్వామా పీడీ వి.శంకర్ పాల్గొన్నారు. గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా బుధవారం ప్రథమ సంవత్సర ఇంగ్లిష్ పేపర్–1కు గుంటూరు జిల్లా వ్యాప్తంగా 87 కేంద్రాల పరిధిలో 35,306 మంది హాజరయ్యారు. గుంటూరు బృందావన్గార్డెన్స్లోని ఎస్ఆర్ కళాశాల, అయ్యప్పస్వామి గుడి ఎదుట ఉన్న నారాయణ జూనియర్ కళాశాల కేంద్రాలను జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తనిఖీ చేసి పరీక్షలు జరుగుతున్న తీరును గమనించారు. ఆయా కేంద్రాలలో వసతులు పరిశీలించారు. ఆయన వెంట ఆర్ఐవో జి.సునీత ఉన్నారు. నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : స్థానిక మారుతీనగర్లోని కంచి కామకోటి పీఠ మారుతీ దేవాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న 40వ వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం ఏడవ రోజుకు చేరాయి. శ్రీబ్రహ్మానంద సరస్వతి స్వామి (విజయవాడ) జ్యోతిప్రజ్వలనతో వేడుకలు ప్రారంభించారు. సామూహిక తులసి పూజలు చేపట్టారు. శ్రీరుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి కల్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
భట్టిప్రోలు జుమ్మా మసీదుకు 160 ఏళ్లు
భట్టిప్రోలు: భట్టిప్రోలు గర్డర్ బ్రిడ్జి రహదారిలోని జుమ్మా మసీదుకు ఎంతో ఘన చరిత్ర ఉంది. సుమారు 165 సంవత్సరాల క్రితం జమాలుద్దీన్ ఈ మసీదును నిర్మించారు. ఆ కాలంలో ఉమ్మడి జిల్లాలో గుంటూరు తర్వాత ఒక్క భట్టిప్రోలులోనే మసీదు ఉండేది. చుట్టు ప్రక్కల ప్రాంతాల నుంచి ముస్లింలు నమాజు చేసుకునేందుకు ఇక్కడకు గుర్రాలపై తరలి వచ్చేవారని పెద్దలు చెబుతున్నారు. నమాజుకు వచ్చిన వారికి భోజన వసతి కూడా ఏర్పాటు చేసేవారని ముస్లిం పెద్దలు తెలిపారు. జుమ్మా మసీదుకు ఎదురుగా ఉన్న గదులు ప్రార్థన చేసేందుకు వచ్చేవారికి ఒకప్పుడు విశ్రాంతి భవనంగా ఉండేవి. గుర్రాలు నిలుపుదల చేసేందుకు ఈ భవనం కిందగా దారి ఉండేది. ఇప్పుడు అక్కడ దుకాణాలు వెలిశాయి. ఈ మసీదు ఏర్పడ్డాకే ఆయా జిల్లాలోని అన్ని ప్రాంతాలలో మసీదులు నెలకొల్పారు. నాటి నుంచి క్రమం తప్పకుండా ఐదు పుటలా నమాజులు, ప్రత్యేక ప్రార్థనలు జరుగుతూ వస్తున్నాయి. రంజాన్ మాసంలో ఉపవాసాలతో పాటు తరాబే నమాజులు జరుగుతాయి. ప్రత్యేకతను సంతరించుకుంటున్న ఈద్గాలు. – ముస్లింలు ప్రత్యేక నమాజులు చేసుకునేందుకు ఈద్గాల ప్రదేశం ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి. కఠోర ఉపవాస దీక్షలను నిర్వహిస్తున్న ముస్లింలు ప్రతి నిత్యం మసీదులకు చేరుకుని పూర్తి సమయాన్ని ప్రార్థనలతో గడుపుతూ ఆధ్యాత్మిక లోకంలో గడుపుతారు. ప్రతి ఏడాది ఈద్గాల వద్ద పండుగ రోజున ప్రత్యేక నమాజు చేసే సందర్భంగా ముస్లింలు ఎంతో వ్యయాన్ని వెచ్చించి ఈద్గా ప్రాంతాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. రంజాన్ మాసాన్ని ముస్లింలు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. మండలంలోని అద్దేపల్లి, భట్టిప్రోలు, పల్లెకోన, వేమవరం, వెల్లటూరులోని మసీదులు ఉన్నాయి. ఆ కాలంలో ఉమ్మడి జిల్లాలో గుంటూరు తర్వాత ఒక్క భట్టిప్రోలులోనే మసీదు -
ఆటో పల్టీ.. పలువురికి గాయాలు
నాగాయలంక: మండలంలోని నాగాయలంక – అవనిగడ్డ మెయిన్ రోడ్డుపై వక్కపట్లవారి పాలెం సమీపంలో బుధవారం ప్రయాణికులతో వస్తున్న ఆటోలో సాంకేతిక లోపాల కారణంగా ఆకస్మికంగా పల్టీ కొట్టిందని ఎస్ఐ కలిదిండి రాజేష్ తెలిపారు. బాపట్ల జిల్లా అల్లపర్రు గ్రామం నుంచి నాగాయలంక మండలంలోని పర్రచివర గ్రామంలో ఓ కార్యక్రమానికి వెళ్తున్న క్రమంలో పాలెం సమీపంలోని ఐస్ ఫ్యాక్టరీ వద్ద రోడ్డుపై పంటకాలువ వైపు బోల్తా పడింది. ఆ సమయంలో ఆటోలో పది మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో వర్రే శివయ్య(60)కు కాలు విరిగిందని, బండ్రెడ్డి రాఘవమ్మ(60) మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయని ఎస్ఐ చెప్పారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆటోలో ప్రయాణిస్తున్న వారందరూ అలపర్రుకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన బంధువులని, ఆటో కూడా ఆ సభ్యుల్లో ఒకరిదని కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఎస్ఐ పేర్కొన్నారు. వక్కపట్లవారిపాలెం వద్ద ఘటన -
ఆంధ్రా అబ్బాయి.. సింగపూర్ అమ్మాయి..!
చీరాల: ఆంధ్రా అబ్బాయి.. సింగపూర్ అమ్మాయి ఇద్దరూ పెళ్లి పీటలెక్కారు. బాపట్ల మండలం కంకటపాలేనికి చెందిన యార్లగడ్డ వెంకట సుబ్బారావు కుమారుడు సాయి సూర్య, సింగపూర్ దేశానికి చెందిన ఎన్జీ షా చ్యూ–వాంగ్ క్వీయిన్ దంపతుల కుమార్తె రోయని ఎన్జీలువో యాన్ ప్రేమించుకున్నారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చీరాల్లో వివాహం చేసుకున్నారు. బుధవారం ఉదయం తెలుగు సంప్రదాయంలో వివాహం జరిగింది. సింగపూర్ నుంచి వచ్చిన అమ్మాయి తరుఫున వారందరూ సంప్రదాయబద్ధంగా చీరలు ధరించి వేడుకకు హాజరయ్యారు. -
అంగన్వాడీల వినూత్న నిరసన
రేపల్లె: అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సీఐటీయు బాపట్ల జిల్లా అధ్యక్షురాలు కె.ఝాన్సీ హెచ్చరించారు. సమస్యల సాధనకై పట్టణంలోని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయు), అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ (ఏఐటీయుసీ) సంఘాల పిలుపు మేరకు ఐసీడీఎస్ కార్యాలయ ఆవరణంలో ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు మంగళవారం నిర్వహించిన రిలేనిరాహారదీక్షా శిబిరంలో ఆమె పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో సీఐటీయు, ఏఐటీయుసీ అనుబంధ సంఘాల అంగన్వాడీ వర్కర్స్ నాయకులు ఎస్.నిర్మల జ్యోతి, ఎన్.కృష్ణకుమారి, డి.జ్యోతి, సువర్ణ తదితరులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాలు తప్పవు -
ఇంటి స్థలం దరఖాస్తుదారులతో కలెక్టర్ ముఖాముఖీ
చినగంజాం: నాకు భర్త లేడు.. బంధువుల ఇంట్లో తలదాచుకుంటున్నాని ఓ మహిళ కలెక్టర్ ముందు వాపోయింది. మంగళవారం ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులతో కలెక్టర్ వినోద్ కుమార్ ముఖాముఖీ నిర్వహించారు. చినగంజాం మండలం గొనసపూడి గ్రామంలో ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తు దారుల స్థితిగతులను ఆయన స్వయంగా కలిసి పరిశీలించారు. మండలంలో మొత్తం 70 మంది దరఖాస్తు చేసుకోగా ఒక్క గొనసపూడి గ్రామంలో 12 మంది దరఖాస్తు చేసుకున్నారు. గ్రామానికి చెందిన మెడబలిమి దానమ్మ దరఖాస్తు చేసుకోవడంతో కలెక్టర్ వారిని స్వయంగా కలిసి మాట్లాడారు. దరఖాస్తు చేసుకున్న విధానం, ఎవరికి చేశారనే విషయం, ఎక్కడ చేశారనే విషయాలను గురించి ఆయన వారిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తనకు భర్త లేడని, నివాసానికి గృహం లేదని, తనమామ ఇంటిలో తలదాచుకుంటున్నానని, ఎటువంటి ఆస్థిపాస్తులు కూడా లేవని దాంతో ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఆమె కలెక్టర్ వివరించారు. గ్రామంలో ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్న 12 మందికి ఒక్కొక్కరికి 3 సెంట్లు చొప్పున ఇచ్చేందుకు సిద్ధం చేయడంతో కలెక్టర్ వాటిని పరిశీలించారు. గ్రామంలో ఇంటి స్థలం కోసం కేటాయించిన ఎల్పీఎం సంఖ్య 1179లో భూములు విషయమై ఆర్డీవో టి.చంద్రశేఖర్ నాయుడుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ జీవిగుంట ప్రభాకరరావు, హౌసింగ్ ఏఈ రాజశేఖర్, వీఆర్వో నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఏప్రిల్ 7న కొండపాటూరు పోలేరమ్మ తిరునాళ్ల
ప్రత్తిపాడు/గుంటూరు రూరల్: కాకుమాను మండలం కొండపాటూరులో కొలువుదీరిన పోలేరమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాన్ని ఏప్రిల్ 7వ తేదీన వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి జె.శ్రీనివాసరావు తెలిపారు. కొండపాటూరు లోని పోలేరమ్మ తల్లి ఆలయంలో మంగళవారం తిరునాళ్ల ఏర్పాట్లుపై తహసీల్దార్ వెంకటస్వామి అధ్యక్షతన తొలి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మార్చి 31వ తేదీన మల్లెపూల పూజ, ఏప్రిల్ 3న కుంకుమ పూజ, ఏప్రిల్ 7వ తేదీన తిరునాళ్లతో పాటు సిడిమాను ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై దేవదాయ శాఖ, రెవెన్యూ, పంచాయతీ, విద్యుత్, పోలీస్, వైద్య, ఆరోగ్యశాఖలతో పాటు ఆయా శాఖల అధికారులతో ఆలయ కమిటీ సభ్యులు, పోలీస్, రెవెన్యూ అధికారులు చర్చించారు. ఉత్సవాల సందర్భంగా గ్రామంలో ఎదురువనున్న రోడ్డు, విద్యుత్, ట్రాఫిక్ సమస్యలను గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. తిరునాళ్లకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులంతా సమన్వయంతో పని చేయా లని సూచించారు. సమావేశంలో ప్రత్తిపాడు సీఐ జి.శ్రీనివాసరావు తదితరులుపాల్గొన్నారు. వైభవంగా గోపుర కలశ స్థాపన తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ప్రతిష్ఠా మహోత్సవాలు మంగళవారం నాల్గవ రోజుకు చేరుకున్నాయి. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్నజీయర్స్వామి స్వీయ పర్యవేక్షణలో లక్ష్మీ నరసింహస్వామి, భూనీళా సమేత వైకుంఠ నాధ పెరుమాళ్, లక్ష్మీ హయగ్రీమస్వామివారు,యోగాంజేయస్వామి వార్ల ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయని తెలిపా రు. మంగళవారం ఉదయం మృత్తికా స్నపనం, నయనోన్మీలనం, మన్యుసూక్త హవనం, శయ్యాధివాసం, త్రిదండి అహోబిల రామా నుజ జీయర్స్వామి వార్ల వారి చేతుల మీదుగా గోపురం కలశ స్థాపన, అనంతం పూర్ణాహుతి, తీర్థ ప్రసాద గోష్టి కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ముఖ్య అతిథిగా మంత్రి కొల్లు రవీంద్ర విచ్చేసి ప్రతిష్ఠా మహోత్సవాల్లో పాల్గొని పెరుమాళ్ల అనుగ్రహాన్ని పొందారని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారని తెలిపారు. ఈలపాట రఘురామయ్యకు ఘన నివాళి సుద్దపల్లి(చేబ్రోలు): ఈలపాట ద్వారా ప్రజల మన్ననలు పొందిన రఘురామయ్య అందరికి ఆదర్శనీయమని ఈలపాట రఘురామయ్య కమిటీ అధ్యక్షులు కల్యాణం సత్యనారాయణ అన్నారు. చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామంలో మంగళవారం ఈలపాట రఘురామయ్య వర్థంతి సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. కల్యాణ మండపం సమీపంలోని ఆయన విగ్రహానికి గ్రామస్తులు, పెద్దలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుద్దపల్లి గ్రామానికి చెందిన కల్యాణం రఘురామయ్య ఈలపాటనే ఇంటిపేరుగా చేసుకున్న గొప్ప కళాకారుడని, వెండితర నటుడుగా కూడా ఖ్యాతి గాంచారని నేతలు తెలిపారు. పద్మశ్రీ అవార్డుతో మరింత గౌరవం పొందారన్నారు. గోవాడ మోహనరావు, మట్టుపల్లి పోతురాజు పాల్గొన్నారు. -
గల్లంతైన ఇద్దరు యువకులు మృతి
మృతదేహాలను ఏరియావైద్యశాలకు తరలించిన పోలీసులు బాపట్లటౌన్: యార కాలువలో గల్లంతైన ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన మండలంలోని అప్పికట్ల సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... మండలంలోని మత్స్యపురి కాలనీకి చెందిన వేటగిరి చందు (22), పిట్టలవానిపాలెం మండలం పోతనకట్టవారిపాలెం గ్రామానికి చెందిన పీటా వంశీలు ఈతకొట్టేందుకు సోమవారం యారకాలువలో దిగిన విషయం తెలిసిందే. ఈత కొడుతూ ఇరువురు యువకులు గల్లంతయ్యారు. వీరి ఆచూకీ కోసం సోమవారం రాత్రి వరకు గాలించినా ఫలితం లేకపోవడంతో జిల్లా అగ్నిమాపక అధికారి కె.వినయ్ ఆదేశాల మేరకు అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో రెస్క్యూబోటు, గత ఈతగాళ్లు మంగళవారం ఉదయం నుంచి కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం సాయంత్రానికి ఇరువురు మృతదేహాలు కాలువ అడుగుభాగంలోని బురదలో కూరుకుపోయినట్లు గుర్తించి బయటకు తీశారు. అనంతరం ఇరువురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రూరల్ పోలీసులు బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించి కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పరిశీలించిన వారిలో తహసీల్దార్ షేక్. సలీమా, రూరల్ సీఐ కె.శ్రీనివాసరావు, రూరల్ ఎస్ఐ ఎం.శ్రీనివాసరావు ఉన్నారు. -
హనుమంత వాహనంపై నృసింహుడు
మంగళగిరిటౌన్:మంగళాద్రిలో వేంచేసి యున్న శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు మంగళవారం రాత్రి స్వామివారిని హనుమంత వాహనంపై గ్రామోత్సం నిర్వహించారు. అభయ ప్రదాత అయిన హనుమంతుని భుజ స్కందాలపై లక్ష్మీ నరసింహస్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామోత్సవంలో మహిళల కోలాట ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. ఈ ఉత్సవానికి తిలకించి, సేవించిన వారందరికీ సత్బుద్ధిని, అభయా న్ని ప్రసాదిస్తారని భక్తుల నమ్మకం. ఆలయ ఈవో కె.సునీల్కుమార్ ఉత్సవాన్ని పర్యవేక్షించగా దుగ్గిరాల మండలం పెదపాలెం గ్రామానికి చెందిన వాసిరెడ్డి మల్లేశ్వరరావు (రాజేష్) కై ంకర్యపరులుగా వ్యవహరించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి 7 గంటలకు శ్రీవారు రాజాధిరాజ వాహనంపై గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. -
పచ్చమూకల పైశాచికం
పిడుగురాళ్ల రూరల్/పిడుగురాళ్ల: అధికారం అండతో పచ్చమూకలు రెచ్చిపోతున్నాయి. వైఎస్సార్సీపీ నాయకులను టార్గెట్ చేసి.. విచ్చలవిడిగా హత్యాయత్నాలు, హత్యలకు పాల్పడుతూ రక్త దాహం తీర్చుకుంటున్నాయి. తాజాగా పల్నాడు జిల్లా జూలకల్లులో ఓ వైఎస్సార్సీపీ నాయకుడిపై టీడీపీ గూండాలు హత్యాయత్నం చేశారు. ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేయడంతో.. ఆయన తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు తెలిపిన వివరాలు.. జూలకల్లు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు బీరవల్లి రామిరెడ్డి వర్షం పడేలా ఉండటంతో సోమవారం అర్ధరాత్రి పొలానికి వెళ్లాడు. మొక్కజొన్న కండెలపై పట్టాలు కప్పి ఇంటికి బయల్దేరాడు. అప్పటికే ఆయనపై నిఘా పెట్టిన టీడీపీ గూండాలు ఇనుముక్కల సామేలు, షేక్ దాదాసాహెబ్, చల్లా మోజెస్, సింహాద్రి మరికొందరు ఒక్కసారిగా రామిరెడ్డిపై విరుచుకుపడ్డారు. ఇనుప రాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. రామిరెడ్డి స్పృహ కోల్పోవడంతో.. వారంతా వెళ్లిపోయారు. అనంతరం కొద్దిసేపటికి అటుగా వెళ్లిన కొందరు.. రామిరెడ్డిని చూసి కుటుంబసభ్యులకు, బంధువులకు సమాచారమిచ్చారు. కుటుంబసభ్యులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని రామిరెడ్డిని పిడుగురాళ్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. రామిరెడ్డి కాళ్లు, ఎడం చేయి విరిగినట్లు తెలిపారు. దీంతో కుటుంబసభ్యులు పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా, బీరవల్లి రామిరెడ్డిని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత కాసు మహేష్రెడ్డి పరామర్శించారు. గురజాల నియోజకవర్గంలో గూండా రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. జూలకల్లులో ఇప్పటికే ఆరుగురిపై టీడీపీ గూండాలు దాడి చేశారని చెప్పారు. ఇంకా మూడేళ్లు మాత్రమే ఉందని.. దాడులు చేసే వారు, చేయించే వాళ్లు ఇంతకింతా అనుభవించే రోజులు వస్తాయన్నారు. చట్టపరంగా శిక్షలు పడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. గురజాలలో రౌడీ రాజ్యం పిడుగురాళ్ల: పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో రౌడీ రాజ్యం నడుస్తుందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి అన్నారు. టీడీపీ గూండాల దాడిలో గాయపడి పట్టణంలోని పల్నాడు హాస్పటల్లో చికిత్స పొందుతున్న బీరవల్లి రామిరెడ్డిని ఆయన పరామర్శించారు. మహేష్రెడ్డి మాట్లాడుతూ పాపం పండే రోజు త్వరలోనే వస్తుందన్నారు. జూలకల్లు గ్రామంలో ఇప్పటికే ఆరుగురిపై విచక్షణా రహితంగా దాడి చేశారని, ఏ కారణం లేకపోయినా కేవలం బెదిరించటానికి ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారన్నారు. చేసిన వాళ్లు, చేయించిన వాళ్లు గుర్తు పెట్టుకోవాలని, ఇంకా మూడేళ్లు మాత్రమే ఉంటుందని, మూడేళ్ల తర్వాత పాకిస్తాన్ వెళ్తారా, ఆప్ఘనిస్తాన్కు వెళ్తారా, భారతదేశంలోనే కదా ఉండేది, ఇంతకంతకు అనుభవించే రోజులు వస్తాయని, చట్టపరంగా శిక్షలు పడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. కావాలని కాపు కాచి కొడుతున్నారని, పోలీసుల అండ చూసుకొని, ప్రభుత్వం మారిన రోజున ఎలాంటి పరిస్థితులు ఉంటాయో, దీనికి రెట్టింపు పునరావృతం అవుతాయని, ఆ రోజు మీకే తెలుస్తుందని పేర్కొ న్నారు. అభివృద్ధి గురించి పట్టించుకోకుండా ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గూండాయిజం చేస్తున్నారని అన్నారు.వైఎస్సార్ సీపీ పట్టణ, మండల అధ్యక్షులు మాదాల కిరణ్కుమార్, చింతా సుబ్బారెడ్డి, మాజీ ఎంపీపీ అలుప పిచ్చిరెడ్డి, జూలకల్లు సర్పంచ్ లంజపల్లి అంకారావు, ఎంపీటీసీ రాంబాబు పాల్గొన్నారు. -
కౌలు రైతులందరికీ రుణాలివ్వాలి
లక్ష్మీపురం: భూ యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులిచ్చి, వెంటనే పంట రుణాలు మంజూరు చేయాలని, అన్నదాత సుఖీభవ కౌలు రైతులందరికీ వర్తింపచేసి రూ.20 వేలు ప్రతి కౌలు రైతుకు ఇవ్వాలని, లేకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని కౌలు రైతుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పాశం రామారావు హెచ్చరించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రైతు, కౌలురైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు బొట్ల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ సాగు భూమిలో 70 శాతం భూమిని కౌలు రైతులే సాగు చేస్తున్నారని, ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు పలు హామీలు ఇచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా పట్టించుకోలేదని విమర్శించారు. ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో కౌలురైతుల ప్రస్తావనే లేదని అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కేంద్ర ప్రభుత్వ కుట్రను తిప్పికొట్టాలని, జిల్లాలోని లంక భూములను సాగు చేసుకుంటున్న పేదలకు పట్టాలివ్వాలని కోరారు. కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి మన్నవ మల్లేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా భూ సేకరణ చేస్తోందని పేర్కొన్నారు. 2013 భూ సేకరణ చట్టం, ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతుల సంఘం నాయకులు ప్రకాశరావు, రాజేంద్ర, పల్లె కృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బాలరాజు, బి.కోటేశ్వరి, భద్రయ్య, రైతు సంఘం నాయకులు సాంబిరెడ్డి, కొత్తా శివరావు, కాకుమాను నాగేశ్వరరావు, సీఐటీయూ నాయకులు ఎన్. శివాజి తదితరులు పాల్గొన్నారు. కౌలు రైతు సంఘం గుంటూరు జిల్లా ఉపాధ్యక్షుడు పాశం రామారావు -
వలపర్ల వాసికి బంగారు నంది అవార్డు
మార్టూరు: రెండున్నర దశాబ్దాలుగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకుగాను మండలంలోని వలపర్ల గ్రామానికి చెందిన సయ్యద్ కరీముల్లా ఆదివారం రాత్రి హైదరాబాద్లో విశిష్ట బంగారు నంది పురస్కారం అందుకున్నారు. 1988లో గ్రామంలో నేతాజీ విద్యాసంస్థను స్థాపించిన కరీముల్లా వందలాది మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్నారు. నెహ్రూ యువ కేంద్రం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి రెండుసార్లు ఉమ్మడి ప్రకాశం జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ సేవా అవార్డులు అందుకున్నారు. కరిముల్లా సేవలను గుర్తించిన ఆదర్శ కళానిలయం హైదరాబాద్ వారు జూబ్లీహిల్స్ ప్రసాద్ ఫిలిం ల్యాబ్ ఆవరణలో ఆదివారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో బంగారు నంది పురస్కారం అందుకున్నారు. ఆదర్శ కళా నిలయం ఫౌండర్ చీరాల ప్రకాష్ ఆధ్వర్యంలో ప్రముఖ టెలివిజన్ నటులు, డైరెక్టర్ అశోక్రావు, డాక్టర్ రోజా భారతి, టీవీ ఆర్టిస్ట్ నికిత చౌదరిలు కరిముల్లాను సత్కరించి సన్మానించి పురస్కారం అందజేశారు. కరిముల్లాను వలపర్లకు చెందిన పలువురు అభినందించారు రంగస్థల నటుడు ఏడుకొండలుకు నంది అవార్డు చినగంజాం: మండలంలోని పెదగంజాం పంచాయతీ ఆవులదొడ్డి గొల్లపాలేనికి చెందిన రంగస్థల నటుడు మద్దిన ఏడుకొండలు యాదవ్కు స్వర్ణ నంది 2026 అవార్డు దక్కింది. 22వ తేదీ ఆదివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్స్లో ఆనంద కళానిలయం ఆధ్వర్యంలో తెలుగు టెలివిజన్ స్వర్ణ నంది అవార్డ్స్ 2026 ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయనకు అందజేశారు. ఇందులో భాగంగా ఆయనను సత్కరించి స్వర్ణ నంది ప్రతిమ, ప్రశంసాపత్రం అందించారు. ఆవులదొడ్డి గొల్లపాలేనికి చెందిన ఏడుకొండలు యాదవ్ రంగస్థల నటుడుగా కొనసాగుతున్నారు. ఆయన ఇప్పటి వరకు బ్రహ్మంగారి నాటకంలో సిద్ధయ్య, వీర బ్రహ్మంగా 150 ప్రదర్శనలు, సత్యహరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్రుడిగా 50 ప్రదర్శనలు, రామాంజనేయ యుద్ధంలో రాముడుగా, కృష్ణుడుగా, చింతామణి నాటకంలో భవానీగా పలు ప్రదర్శనలు ఇచ్చారు. ఏడుకొండల యాదవ్ అవార్డు సాధించడం పట్ల పలు నాటక సంఘాలు, మండల, గ్రామ పెద్దలు, అభిమానులు అభినందనలు తెలియజేశారు. -
గుర్తింపు సంఖ్య ఉంటేనే ప్రభుత్వ పథకాలు
వేటపాలెం: అన్నదాతలకు గుర్తిపు ఐడీ నంబరు ఉంటేనే ఇక నుంచి ప్రభుత్వ పథకాలు అందుతాయి. ప్రస్తుతం ఉన్న ఆధార్ కార్డుల తరహాలోనే ఫార్మర్ రిజస్ట్రీ కార్డులను ప్రభుత్వ యంత్రాంగం జారీ చేస్తుంది. ఫార్మర్ రిజిస్ట్రీ పేరిట ప్రత్యేక యాప్ ద్వారా చేపడుతున్న నమోదు ప్రక్రియ ద్వారా 11 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్యను ప్రతి రైతుకు జారీ చేస్తారు. సాగుచేసే ప్రతి రైతు ఈ గుర్తింపు నంబర్ను కలిగి ఉండటం ద్వారా భవిష్యత్తులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పీఎం కిసాన్ ఆర్థిక సహాయం, పంట బీమా, వ్యవసాయ పరికరాల డ్రోన్లు పెట్టుబడి సాయం, బ్యాంకు రుణాలు ఎరువులు, విత్తనాలు రాయితీలు, పంటలు అమ్మేటప్పుడు సౌలభ్యం తదితర ఇతర వ్యవసాయ సంక్షేమ పథకాలను పొందడానికి అర్హుడు అవుతారు. అంతే కాకుండా ఈకేవైసీ పథకానికి ఫార్మర్ రిజిస్ట్రీ విశిష్ట సంఖ్య అవసరం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించడంతో విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ ప్రక్రియను క్షేత్ర స్థాయిలో వేగవంతం చేశారు. చీరాల రూరల్, వేటపాలెం మండల పరిధిలో దాదాపు 1000 హెక్టార్లులో ప్రస్తుతం వరి పంట కొంత మంద కోతలు కోసి ఉండగా మరి కొంత మంది కోతలు కోయాడానికి సిద్ధంగా ఉన్నారు. తీర ప్రాంత ఇసుక భూముల్లో వేరుశనగ మొక్కజొన్న పంటలు సాగు చేసి ఉన్నాయి. భూమి కలిగిన రైతులు అందరికి విశిష్ట నంబరు తప్పని సరిగా తీసుకోవాల్సి ఉంది. నమోదు చేసే విధానం.. భూమి కలిగిన రైతులు తమ పట్టాదారు పాస్ పుస్తకం, 1 బీ అడంగళ్ల, ఆధార్ కార్డు కాపీలతో పాటు ఆధార్ కార్డుకు లింక్ అయి ఉన్న ఫోన్ నంబరు వారి గ్రామంలోని సచివాలయానికి అనుబంధంగా ఉన్న రైతు సేవా కేంద్రానికి తీసుకు వెళ్లాలి. అక్కడ గ్రామ వ్యవసాయ సహాయకులు (వీఏఏ) సంబంధిత పోర్టల్లో ఫార్మర్ నమోదు ప్రక్రియను చేపడతారు. ఈ క్రమంలో ఫోన్ నంబర్కు వచ్చే మూడు ఓటీపీలు చెప్పాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ విజయవంతం అయినట్లు ఫోన్కు సమాచారం వస్తుంది. దీంతో నమోదు ప్రక్రియ పూర్తియినట్లు భావించాలి. ఇలా నమోదు చేసుకుంటేనే ప్రభుత్వ పథకాలు పక్కాగా అందుతాయి. విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే రైతు సంక్షేమ కార్యక్రమాలు అర్హులుగా అందించేందుకు వీలవుతుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. నమోదు ప్రక్రియ పూర్తయిన తరువాత రైతులకు జారీ చేసిన విశిష్ట గుర్తింపు సంఖ్యను భద్రపరచుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ గుర్తింపు సంఖ్యను మర్చిపోయినా రైతు సేవా కేంద్రానికి వెళ్లి, తమ భూమి వివరాలు ఇచ్చి సదరు నెంబరు సంఖ్యన తెలుసుకొనే అవకాశం ఉంటుంది. అన్నదాతకు విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ చేస్తున్న కేంద్రం -
సుబ్రమణ్యేశ్వరునికి వెండి నెమలి తొడుగు ఆభరణం
అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేతమైన అమరావతి అమరేశ్వరాలయంలో సుబ్రమణ్యేశ్వరస్వామికి దాతలు సోమవారం వెండి నెమలి తొడుగు ఆభరణం సమర్పించారు. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన యార్లగడ్డ పవన్కుమార్, పూర్ణిమ సౌభాగ్యలక్ష్మి దంపతులు ఈ ఆభరణం సమర్పించారు. సుమారు ఎనిమిది లక్షల రూపాయల విలువైన వెండి నెమలి తొడుగు ఆభరణానికి అర్చకులు సంప్రోక్షణ అనంతరం ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి అలంకరించారు. తొలుత దాతలు అమరేశ్వరునికి అభిషేకం, బాలచాముండేశ్వరి, అమ్మవార్లకు కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రేఖ, అర్చకులు శంకరమంచి రాజశేఖర్ పాల్గొన్నారు. తాడేపల్లిరూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ప్రతిష్ఠా మహోత్సవాలు సోమవారంతో మూడవ రోజుకు చేరుకున్నాయి. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూత్రిదండి చిన్నజీయర్స్వామి, త్రిదండి అహోబిల రామానుజ జీయర్స్వామి వార్ల స్వీయ పర్యవేక్షణలో ఈనెల 21వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ప్రతిష్ఠా మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సోమవారం ఉదయం ఛాయాధివాసం, శ్రీ హయగ్రీవ ఇష్టి, జలాధివాసం, పూర్ణాహుతి, తీర్థ ప్రసాద గోష్టి కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. తెనాలి: పట్టణానికి చెందిన శ్రీవిఖనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక బాలాజీరావుపేట లోనీ కోట బద్రీనాథ్ గుప్తా స్థలంలో జరుగుతున్న శ్రీ మహా సుదర్శన హోమం సోమవారం పూర్ణాహుతితో ముగిసింది. తొలుత స్వామివారికి విశేష తులసి దళార్చనను వైఖానస పండితులు ఆగమోక్తంగా నిర్వహించారు. ట్రస్టు నిర్వాహకులు ఆర్వీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి గానామృతం అయిదో పర్యాయం ముగింపు సందర్భంగా శ్రీమహా సుదర్శన హోమం నిర్వహించినట్టు తెలిపారు. ట్రస్ట్ కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో ట్రస్టు ఆధ్వర్యంలో నారాయణ అష్టాక్షరి దివ్య క్షేత్రం నిర్మిస్తామని తెలిపారు. వైఖానస పండితులు మేడూరి శ్రీనివాసమూర్తి భూదాన విశిష్టతను భక్తులకు వివరించారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, జంజం రామారావు, గుడివాడ బాలకృష్ణ ,రొంపిచర్ల సురేష్, మాజేటి వెంకటేష్, గోలి సోమశేఖర్, బచ్చు లీలా ప్రసాదరావు, మద్దు హరీష్, గార్లపాటి అశోక్, కోట రవిశంకర్, సంకీర్తన బృందం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. -
ఎన్ని రోజులు జైలులో పెట్టారు..?
నా ఇల్లు, కార్యాలయంపై దాడి చేసి వారినిగుంటూరు ఎడ్యుకేషన్ : సీఎం చంద్రబాబును దూషించాననే ఆరోపణలతో తనను 18 రోజులు జైలులో పెట్టించిన టీడీపీ ప్రభుత్వం, తన ఇంటిపైనా, కార్యాలయంపైనా దాడి చేసిన వారిని ఎన్ని రోజులు జైలులో పెట్టించారో చెప్పాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ప్రశ్నించారు. గుంటూరులోని తన నివాసం వద్ద సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలను సీఎంకు సంధించారు. ● తన ఇంటిపై దాడికి సీఎం చంద్రబాబు, నారా లోకేష్ స్థాయిలో కుట్రలు జరిగాయన్నారు. పోలీసుల ప్రేక్షక పాత్రకు కారణం చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలు కావా అని ప్రశ్నించారు? ఈ దాడికి సీఎం బాధ్యత వహించాలన్నారు. ● తమ ఆదేశాలతో పంపిన టీడీపీ రౌడీ మూకలు ఏం చేసినా మౌనంగా ఉండాలని చెప్పడం వలనే దాడి జరిగిందని తాను చేస్తున్న ఆరోపణలకు చంద్రబాబు లేదా ఆయన కుమారుడు లోకేష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ● సీఎంను దూషించానని తనను అక్రమ కేసులతో జైలుకు పంపిన ప్రభుత్వం, తన ఇంటిపై దాడికి పాల్పడిన వారిని ఎన్ని రోజులు జైల్లో ఉంచారో చెప్పాలన్నారు. ● తాను కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించానని, రిమాండ్ రిపోర్టులో తనపై అభాండాలు వేశారన్నారు. సీఎం సామాజిక వర్గాన్ని తాను దూషించానని రిపోర్టులో పొందుపర్చారని, అందు వలనే సీఎం కులానికి చెందిన వారిని తన ఇంటిపైకి పంపించారా అని ప్రశ్నించారు ? ● రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా పాలన జరుగుతుంటే, తన ప్రశ్నలకు ఖచ్చితంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు, లోకేష్ ప్రోద్బలంతో వారు పోలీసు శాఖకు ఇచ్చిన ఆదేశాలతోనే తన ఇల్లు, కార్యాలయాలపై దాడి జరిగిందని తాను చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాలని, లేకుంటే తన ఆరోపణలు నిజమని ఒప్పుకున్నట్లే భావించాల్సి వస్తుందన్నారు. కూటమి నేతలు ఫోన్లో పరామర్శించారు ● తన ఇల్లు, కార్యాలయాలపై దాడులు జరిగి, తనను అక్రమంగా జైల్లో పెట్టించిన తరువాత వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారని అన్నారు. తాను జైల్లో ఉన్న రోజుల్లో ఎంతో మంది వైఎస్సార్సీపీ నేతలు ఇంటికి వచ్చి తన కుటుంబ సభ్యుల్లో నింపిన ధైర్యం, వారు ఇచ్చిన ఓదార్పును మర్చిపోలేమని చెబుతూ వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. ● తనపై మోపిన అక్రమ కేసులను టీడీపీ, జనసేన నేతలు తప్పుపట్టారని చెప్పారు. టీడీపీ, జనసేనలో రాజ్యాంగాన్ని గౌరవించే పలువురు నేతలు తనకు ఫోన్ చేసి పరామర్శించారన్నారు. ● దేశంలోని 10 రాష్ట్రాల్లో శాంతి, భద్రతలు, పరిపాలనలో కేంద్రం ఇచ్చిన ర్యాంకింగ్స్లో ఏపీ చివరిస్థానంలో ఉందని, భవిష్యత్తులో 29 రాష్ట్రాలస్థాయిలో సర్వే చేసినా టీడీపీ ప్రభుత్వ తీరుతో మన రాష్ట్రానికి చివరి స్థానం వస్తుందని అంబటి రాంబాబు చెప్పారు. ● వైఎస్సార్ సీపీ రైతు విభాగ నేత ఎంవీఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ గత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో రాజకీయ దాడులు, కక్ష సాధింపు చర్యలు లేవన్నారు. ఈ 20 నెలల కాలంలో ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలు, పోలీసు కేసులు, భౌతిక దాడులు పెరిగిపోయాయని ఆరోపించారు. -
లెక్క వీక్... ప్రచారం పీక్
చీరాల అర్బన్: అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే కొండయ్య చీరాల నియోజకవర్గంలోని చేనేతల గణాంకాలకు సంబంధించి కాకి లెక్కలు చెప్పడం, అందుకు మంత్రి సవిత ఆత్మస్తుతి, పరనిందలకు ప్రాధాన్యం ఇవ్వడం పరిపాటిగా మారింది. మొక్కుబడి సమాధానాలు ఇవ్వడం, నేతన్నలకు ఏడాదికి రూ.25వేలు ఇస్తామన్న హామీ ఎప్పటి నుంచి అమలు చేస్తారనేది అటు ఎమ్మెల్యే నోటి నుంచి, ఇటు మంత్రి నోటి నుంచి ప్రస్తావించక పోవటం నిదర్శనమని చేనేత కార్మికులు మండిపడుతున్నారు. ఏడాదికి రూ.25 వేలు ఎప్పటి నుంచి ఇస్తారు? ఒక వేళ ఇస్తే గడిచిన ఏడాది, ఈ ఏడాదికి కూడా కలిపి ఇస్తారా, అది ఎప్పటి నుంచి అనేది స్పష్టంగా చంద్రబాబు సర్కార్ చెప్పాలని నేతన్నలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. వేలాది మంది కార్మికులు చీరాల నియోజకవర్గంలో చేనేత సామాజిక వర్గానికి చెందిన వారు సుమారు 50 వేల మంది ఉంటారు. అయితే ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య శాసనసభలో మాట్లాడుతూ చీరాల నియోజకవర్గంలో చేనేతలు 5,214 మంది ఉన్నారని చెప్పారు. అందులో 3,900 మంది మగ్గం పని చేస్తారు. 1,314 మంది చేనేత ఉపవృత్తుల్లో పని చేస్తారని చెప్పారు. చేనేత సొసైటీల సంఖ్య చెప్తూ తడబడ్డారు. బాపట్లలో 71 ఉంటే ..చీరాలలో 41 సొసైటీల ఉన్నాయని చెప్పారు. ఈ క్రమంలో చేనేత రంగ ప్రతినిధులు, సగటు చేనేత కార్మికులు నిరంతరం అడుగుతున్న ఏడాదికి రూ.25వేలు ఎప్పటి నుంచి లబ్ధిదారులకు అందజేస్తారనే మాటను ఎమ్మెల్యే కొండయ్య ప్రస్తావించలేదు. దీనిపై నేతన్నలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే కొండయ్య నియోజకవర్గంలో చేనేతలు 5,214 మంది ఉన్నారని చెప్పటం హాస్యాస్పదం. నియోజకవర్గంలో కనీసం చేనేతలు ఎంత మంది ఉన్నారనేది కూడా చెప్పలేని వ్యక్తి తమకు ఎమ్మెల్యేగా న్యాయం చేస్తారనుకోవడం తమ అవివేకం అవుతుందని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. శాలువాలు చేనేతల దరిచేరేనా? వేంకటేశ్వరస్వామి ఆలయానికి అవసరమైన శాలువాల తయారీ చేనేతలకు అప్పగించటంపై ఎమ్మెల్యే కొండయ్య హర్షం వ్యక్తం చేశారు. అయితే ఆ పని చీరాల చేనేతల దరిచేరుతుందా అని స్థానిక నేతన్నలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ శాలువాల తయారీ రాయలసీమ ప్రాంతానికే పూర్తిగా సరిపోదని విషయం తెలిసిన వారు అంటున్నారు. ఈ క్రమంలో ఆ అంశం చెప్పి స్థానిక నేతన్నలను మభ్యపెట్టడమేనని పలువురు విమర్శిస్తున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ పథకం లేనట్లే.. ఇదిలా ఉంటే ఎప్పటి నుంచి ఏడాదికి రూ.25వేలు నేతన్నలకు అందజేస్తారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. నేతన్నల ఆరోగ్య బీమాకు సంబంధించిన అంశంపై మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు సంబంధించిన అందరికి సమగ్ర హెల్త్ ఇన్సూరెన్స్ పథకానికి చంద్రబాబు అమలు పరుస్తారని చెప్పారే కాని, అది ఎప్పటి నుంచి అమలు చేస్తారనేది చెప్పలేదు. దీంతో చేనేతలకు ప్రత్యేకంగా హెల్త్ ఇన్సూరెన్స్ పథకం లేనట్లేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద అసెంబ్లీలో చేనేత సమస్యలు, పరిష్కారంపై ప్రశ్నలు, సమాధానాల తీరు తూతూ మంత్రంగా, నాటకీయంగా ఉందని పలువురు మండిపడుతున్నారు. చీరాల నియోజకవర్గ పరిధిలో సుమారు 4,500 మగ్గాలు ఉంటాయి. ఈ సంఖ్య కాస్త అటు,ఇటుగా ఉండొచ్చు. చేనేత ఉపవృత్తులపై ఆధారపడ్డ వారి సంఖ్య డైయింగ్తో కలిపి సుమారు 1500 మంది ఉండొచ్చు. – రఘనంద, హ్యాండ్లూమ్స్ ఏడీ, చీరాల -
బాపట్ల
మంగళవారం శ్రీ 24 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026తెనాలి:తెనాలి మార్కెట్యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.6,000, గరిష్ట ధర రూ.7,600, మోడల్ ధర రూ.7,000 వరకు పలికింది.విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 539.80 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 24,222 క్యూసెక్కు లు వచ్చి చేరుతోంది.అర్జీలను వెంటనే పరిష్కరించాలి జిల్లా జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట బాపట్ల: ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో నమోదైన అర్జీలను గడువులోగా పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట తెలిపారు. పీజీఆర్ఎస్ కార్యక్రమం సోమవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు సమస్యలు పరిష్కరించాలంటూ అర్జీలు అందజేశారు. తన పరిధిలోని వాటికి తక్షణమే ఆమె పరిష్కార మార్గం చూపారు. కొన్నింటిని పరిశీలనకు, మరికొన్నింటిని విచారించించాలని సంబంధిత అధికారులకు బదలాయించారు. అన్ని మండలాల తహసీల్దార్లతో వీక్షణ సమావేశం నిర్వహించి సమస్యల పరిష్కారంపై అడిగి తెలుసుకున్నారు. తన పరిధిలో లేని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామని హామీ ఇచ్చారు. పీజీఆర్ఎస్లో 197 అర్జీలు నమోదయ్యాయి. నమోదైన అర్జీలను నిశితంగా పరిశీలించిన తదుపరి పరిష్కరించాలన్నారు. గడువు తీరిన అర్జీలు పెండింగ్లో లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజలకు మేలు జరగాలంటే అధికారులంతా చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. అధికారుల పనితీరుతోనే ప్రజల సంతృప్తి స్థాయి పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి డీఆర్వో లవన్న, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ విజయమ్మ, గుంటూరు జెడ్పీ డిప్యూటీ సీఈవో కృష్ణ, తదితరులు పాల్గొన్నారు. చీరాల అర్బన్: జిల్లాలో తీరప్రాంత అభివృద్ధికి, పర్యాటక రంగాన్ని విస్తరించేందుకు కలెక్టర్ వి.వినోద్కుమార్ బృందం గోవాలో అధ్యయన పర్యటన చేసి వచ్చారు. అభివృద్ధికి చేపట్టిన ఆ చర్యలను స్వాగతించాల్సిందే. అయితే, పలుచోట్ల తీరం పరాధీనం అవుతోంది. ఆక్రమణదారులు ఒకరిని చూసి మరొకరు ఆక్రమణలకు తెగబడుతున్నారు. ఈపూరుపాలెం స్ట్రయిట్కట్ నుంచి వేటపాలెం స్ట్రయిట్కట్ వరకు పలుచోట్ల తీరప్రాంతాన్ని కబ్జా చేసి తమ వ్యాపారాలను విస్తరించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్ మనుషులుగా గుర్తింపు పొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఓ ఎమ్మెల్యే సోదరుడు, రాజ్యసభ రేసులో ఉన్న ఓ నాయకుడు, హైదరాబాద్కు చెందిన ఓ రియల్ వ్యాపారి తదితరులు కలిసి తీరం వెంట ఆక్రమణకు అనువైన ప్రాంతాన్ని గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగా భారీ స్థాయిలో లావాదేవీలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో కబ్జాలకు తెరదించేందుకు కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రజలు అంటున్నారు. తీరంలో ఆక్రమణలు సాగేది ఇలా... కలెక్టర్ దృష్టి సారిస్తే కబ్జాలకు కళ్లెం... తీరప్రాంతంలో జరుగుతున్న కబ్జాలపై కలెక్టర్ వి.వినోద్కుమార్ దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. అప్పుడే కబ్జాలకు కళ్లెం పడుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి నుంచి నెలకొన్న లోపాలను ప్రక్షాళన చేయాలి. పారదర్శకంగా చర్యలు చేపట్టాలి. అప్పుడే కోట్ల రూపాయల విలువచేసే ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా ఉంటుంది. తద్వారా తీరప్రాంత అభివృద్ధి సక్రమంగా సాగుతుందని ప్రజలు సూచిస్తున్నారు. 7 -
అ‘పూర్వ’ కలయిక
బాపట్ల: బాపట్ల వ్యవసాయ కళాశాల విజయ పరంపరను కొనసాగించడం తమకు గర్వకారణంగా ఉందని పూర్వ విద్యార్థి, రిటైర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ అఫ్ అగ్రికల్చర్ డి.పాపిరెడ్డి అన్నారు. వ్యవసాయ కళాశాలలో 1965 – 69 బ్యాచ్కి చెందిన పూర్వ విద్యార్థి సంఘం నిర్వహించిన ఆత్మీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ తాము ఈ తరహా వేడుకలను ఐదవసారి నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్య అతిథిగా కళాశాల అసోసియేట్ డీన్ డా. పి. ప్రసూన రాణి మాట్లాడుతూ కళాశాల అభివృద్ధిని వివరించారు. ఈ విషయంలో పూర్వ విద్యార్థులు పాత్ర చిరస్మరణీయం అన్నారు. కార్యక్రమంలో కెనరా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఎంబీ నాగేశ్వరరావు, యూకో బ్యాంక్ చైర్మన్ వై.వేణుగోపాల రావు, సీనియర్ మేనేజర్ కె.కోటేశ్వర రావు, పి.వెంకటేశ్వర రావు, మస్తాన్ రెడ్డిలతో పాటు మొత్తం 30 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. పాపిరెడ్డి, జి.వెంకయ్య తమ సమ్మేళన లక్ష్యాలను వివరించారు. అందరూ కుటుంబ సభ్యులతో పాల్గొనడం ఈ కార్యక్రమ విశేషం. 90 సంవత్సరాల వయసుగల పట్టాభిరామయ్య ఈ ఆత్మీయ సమ్మేళనంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పూర్వ విద్యార్థులు ఆత్మీయంగా పరస్పరం జ్ఞాపికలతో అభినందించుకొన్నారు. కళాశాల యూజీ చివరి సంవత్సరం అగ్రికల్చరల్ జర్నలిజం విద్యార్థులు వీరితో మాట్లాడి స్ఫూర్తి పొందారు. -
అటవీ రాయబారులుగా వెలుగొందాలి
బాపట్ల: వ్యవసాయ విద్యార్థులు స్థిరమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని నిబద్ధతతో సాగితే వ్యవసాయ అటవీ రాయబారులుగా వెలుగొందుతారని ఐసీఏఆర్ సీఏఎఫ్ఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ ఎ.అరుణాచలం అన్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో ‘‘స్థిరత్వం కోసం వ్యవసాయ అభివృద్ధిని ప్రోత్సహించే అడవుల పెంపకం’’పై అతిథి ఉపన్యాసకులుగా ఆయన ప్రసంగించారు. పీజీ, పీహెచ్డీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. అర్బన్, రూరల్ ప్రాంతాల్లోని అటవీరహిత ప్రదేశాలలో చెట్లను పెంచడం ద్వారా 33% అటవీ విస్తీర్ణతను పెంపొందించవచ్చన్నారు. ప్రపంచ వృక్ష గణాంకాల గురించి వివరించారు. కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పి.ప్రసూన రాణి మాట్లాడుతూ పాఠాలను విద్యార్థులు శ్రద్ధగా అనుసరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ విశ్వవిద్యాలయ వృక్షశాస్త్ర నిపుణులు డాక్టర్ కె.ఎస్.రావు, డీన్ ఆఫ్ పీజీ స్టడీస్ డాక్టర్ ఏవీ రమణ, సేద్య విభాగ ప్రొఫెసర్ డాక్టర్ కె.శ్రీనివాసరావు, విద్యార్థులు పాల్గొన్నారు. డైరెక్టర్ డాక్టర్ ఏ.అరుణాచలం -
అర్జీలు పునరావృతమైతే చర్యలు తప్పవు
ఎస్పీ బి. ఉమామహేశ్వర్ బాపట్ల టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అర్జీలు పునరావృతమైతే చర్యలు తప్పవని ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 70 మంది ఎస్పీ కార్యాలయానికి చేరుకొని తమ సమస్యలను వివరించారు. బాధితుల సమస్యలు తెలుసుకున్న ఎస్పీ వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లాలోని పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అర్జీదారుల సమస్యలను చట్ట పరిధిలో విచారించి నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలన్నారు. వివిధ సమస్యలతో పోలీస్ కార్యాలయాలకు వచ్చే బాధితులకు భరోసాగా పోలీస్ శాఖ ఉండాలన్నా రు. అర్జీలను పూర్తిస్థాయిలో విచారించి శాశ్వతంగా పరిష్కారం చూపాలన్నారు. సీసీఎస్ డీఎస్పీ పి. జగదీష్నాయక్, పీజీఆర్ఎస్ సెల్ సీఐ పి. ప్రభాకర్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రైలు కింద పడి మహిళ బలవన్మరణం
గురజాల: రైలు కింద పడి మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం... గురజాలలో నివాసం ఉంటున్న వీరిశెట్టి వైష్ణవి (39) స్థానికంగా ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంటుంది. భర్త కిషోర్ లెక్చరర్గా పనిచేస్తాడు. ఈక్రమంలో తెల్లవారు జామున మాచర్ల నుంచి గుంటూరు వెళ్లే ప్యాసింజర్ రైలు కింద పడి వైష్ణవి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనలో వైష్ణవి కొన ఊపిరితో ఉండటంతో స్థానికులు 108 సహాయంతో గురజాలలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యశాలలో వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు తెలిపారు. మృతురాలికి భర్త, ఏడు సంవత్సరాల కుమారుడు ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఉంచారు. రైల్వే పోలీసులు సమాచారం సేకరించి విచారణ చేపడుతున్నారు. వైద్యశాల ఎదుట బంధువుల ఆందోళన.. సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద వైష్ణవి బంధువులు ఆందోళన చేపట్టారు. వైష్ణవి మృతికి భర్త కిషోర్ కారణమని కిషోర్ వైష్ణవిని ఎప్పుడు కట్నం కోసం వేధిస్తుండేవాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. వైష్ణవిని పక్కంటి ఆడవాళ్లతో మాట్లాడినా అనుమానించి, అవమానించేవాడని.. గత కొంత కాలంగా చిత్రహింసలు పెడుతూ ఇబ్బందులకు గురిచేసేవాడని ఆరోపించారు. భర్త వేధింపులు తాళలేకనే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపించారు. వైద్యశాల వద్ద వైష్ణవి కుమారుడు విలపించిన తీరు పలువురిచే కంట తడి పెట్టించింది. -
వైభవం... ధ్వజారోహణం
మంగళగిరిటౌన్: మంగళాద్రిలో వేంచేసిన యున్న లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో అతి ప్రధానమైన ఘట్టం ధృజారోహణం. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవరోజు సోమవారం రాత్రి ఋత్వికరణ, అంకురారోపణాది కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి కళ్యాణోత్సవానికి భక్త జనులను, దేవతలను ఆహ్వానానికి భక్తాగ్రేస్వరుడైన గరుత్మంతుని ధ్వజంపై ప్రతిష్టించారు. అష్టాంగాధిపతి అయిన గరుత్మంతునికి నివేదన చేసిన ప్రసాదాన్ని గరుడముద్దలు అన్న పేరుతో సంతానం లేని దంపతులు ప్రసాదంగా స్వీకరిస్తే సంతాన ఫలితం కలుగుతుందని భక్తుల నమ్మకం. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి ద్వజారోహణం తిలకించి, గరుడ ముద్దలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ వేడుకలను ఆలయ కార్యనిర్వహణాధికారి కె. సునీల్ కుమార్ పర్యవేక్షించగా కై ంకర్య పరులుగా మంగళగిరి మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ వ్యవహరించారు. నేడు హనుమంత వాహనంపై... లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజైన మంగళవారం రాత్రి శ్రీవారు హనుమంత వాహనంపై గ్రామోత్సవంలో దర్శనమివ్వనున్నారు. భక్తులు పాల్గొని ఉత్సవాన్ని తిలకించి స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ అధికారులు కోరారు. -
ఏపీ జేఏసీ పల్నాడు జిల్లా కార్యవర్గం ఎన్నిక
నరసరావుపేట ఈస్ట్: ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కార్మిక సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (ఏపీ జేఏసీ) పల్నాడు జిల్లా కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రకాష్నగర్లోని ఎన్జీఓ హోమ్లో నిర్వహించిన సమావేశంలో జిల్లా చైర్మన్గా మర్లపాటి రామకృష్ణ, కో–చైర్మన్లుగా ఎస్.మురారి, కెఎస్కె షరీష్, బి.సంపత్బాబు, ఏ.ఏమండీ, వైస్ చైర్మన్లుగా ఎస్.సుబ్బారావు, ఉబేద్ బేగ్, పిఐజే మరియరాజు, ఎం.రామయ్య, జనరల్ సెక్రటరీగా ఎం.మోహనరావు, జాయింట్ సెట్రరీలుగా కె.ప్రతాప్కుమార్, సి.సి.ఆదెయ్య, ఎస్ కొండయ్య, ఏ.ఆంజనేయులు షేక్.కమల్బాషా, కె.బ్రహ్మాయ్య, కోశాధికారిగా కె.నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎన్జీఓ సంఘం ఉపాధ్యక్షుడు ఎస్.రాజశేఖర్ పాల్గొన్నారు. పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయాలని, 30 శాతం డీఏ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే పెన్షనర్ల అడిషనల్ క్వాంటం పెంచాలని కోరారు. ఉద్యోగ, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర జేఏసీ చేపట్టే కార్యాచరణను విజయవంతం చేస్తామని జిల్లా కమిటీ ప్రకటించింది. -
బాల్ బ్యాడ్మింటన్ విజేత దుర్గి
నగరం: గుంటూరు జిల్లా బాల్బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరం బాల ఏసు ఇంగ్లిష్ మీడియం హైస్కూల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం నిర్వహించారు. పోటీల్లో దుర్గి జడ్పీహైస్కూల్ విద్యార్థులు విజేతలుగా నిలవగా, నగరం బాల ఏసు ఇంగ్లిష్ మీడియం స్కూల్ రన్నర్స్గా నిలిచింది. దూళిపాళ్ళ జడ్పీహైస్కూల్, శేకూరు జడ్పీహైస్కూల్ టీమ్లు వరుసగా మూడవ, నాల్గవ స్థానాలలో నిలిచాయి. విజేతలకు బహుమతులు అందజేశారు. ఏపీ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ ఇ.శివశంకర్, గుంటూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సెక్రటరీ వై.శ్రీనివాసరావు, నంబూరు స్టేట్ బాల్ బ్యాడ్మింటన్ సెలక్షన్ కమిటీ సభ్యుడు బి.నర్సయ్య, స్కూల్ కరస్పాండెంట్ సిస్టర్ సునా, ప్రిన్సిపాల్ సిస్టర్ సజీవా, పలు పాఽఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మృతుడిది గుంటూరు జిల్లా నందివెలుగు సింగరాయకొండ: ముందు వెళ్తున్న కంటైనర్ లారీ ఒక్కసారిగా నెమ్మది కావడంతో ఆ వెనుకాల వేగంగా పుచ్చకాయ లోడుతో వచ్చిన లారీ బలంగా ఢీకొంది. దీంతో మినీ వ్యాన్ డ్రైవర్ ఇగ్గోలు వెంకట సుబ్బారావు (35) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ సంఘటన ఆదివారం తెల్లవారు జామున జాతీయ రహదారి కందుకూరు ఫ్లయి ఓవర్పై జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మినీ లారీ ముందు భాగం పూర్తిగా ధ్వంసం కావడంతో పాటు పుచ్చకాయలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. మృతి చెందిన సుబ్బారావుది గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని నందివెలుగు. సంఘటన స్థలాన్ని ఎస్సై మహేంద్ర పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. చెరుకుపల్లి: గుర్తు తెలియని వాహనం ఢీకొనటంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం సాయంత్రం కావూరులో చోటుచేసుకుంది. మండలంలోని జొన్నలగడ్డవారిపాలెంకు చెందిన మొవ్వ ముత్యాలరావు(45) తన ద్విచక్ర వాహనంపై చందోలు వైపు నుంచి స్వగ్రామానికి వస్తున్న క్రమంలో జొన్నలగడ్డ వారిపాలెం వద్ద రోడ్డు దాటుతున్న సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో తీవ్ర గాయాల పాలైన ముత్యాలరావు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న చెరుకుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెనాలిరూరల్: మ్యాట్రిమోని వెబ్సైట్ ద్వారా పరిచయమై వివాహం చేసుకుంటానని నమ్మబలికి పెద్ద మొత్తంలో నగదు కాజేసి మోసం చేసిన నిందితుడిని తెనాలి త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఆదివారం సీఐ ఎస్.సాంబశివరావు వెల్లడించిన వివరాల ప్రకారం.. పట్టణంలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న మహిళకు కొల్లిపర మండలం కొత్తూరులంక గ్రామానికి చెందిన అరవపల్లి వంశీ మ్యాట్రిమోనీ సైట్ ద్వారా ఈనెల 2వ తేదీన పరిచయమయ్యాడు. తనకు వివాహమై విడాకులు తీసుకున్నానని తిరిగి వివాహం చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు ఆమెను నమ్మించాడు. మహిళ ఇంటికి కూడా వచ్చి ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి వివాహానికి ఒప్పించాడు. తదుపరి టిప్పర్ కొనుగోలుకు నగదు కావాలని నమ్మించి, వివిధ మార్గాలలో లోను తీసుకునేలా ప్రేరేపించి ఆమె నుంచి రూ. 12.20 లక్షలు వసూలు చేశాడు. వివాహం చేసుకోనున్నట్లు నమ్మించి ఈనెల 8న శారీరకంగా లోబరుచుకున్నాడు. మరింత నగదు కావాలంటూ ఆమైపె ఒత్తిడి పెంచడంతో ఇవ్వలేనని తేల్చి చెప్పింది. దీంతో ఆమెను కొట్టి, చంపుతానని బెదిరించి, వివాహానికి నిరాకరించినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. సమావేశంలో స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. -
లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
మంగళగిరి టౌన్: మంగళాద్రిలోని శ్రీ లక్ష్మీ నరసింహుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు ఆదివారం శ్రీ స్వామి వారు పెండ్లికుమారుని అలంకారంలో దర్శనమిచ్చారు. వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున స్వామివారి తీర్థ బిందె తీసుకురావడం, ప్రాతఃకాలార్చన, స్వామివారు, అమ్మవార్లను పెండ్లికుమారుడు, పెండ్లికుమార్తెను చేశారు. అనంతరం తీర్థగోష్టి పూజలు నిర్వహించారు. రాత్రి స్వామి వారి గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఉత్సవాన్ని ఆలయ ఈవో కె. సునీల్కుమార్ పర్యవేక్షించారు. పెండ్లికుమారుడి ఉత్సవానికి పట్టణ పద్మశాలీయ బహుత్తమ సంఘం ప్రతినిధులు కై ంకర్యపరులుగా వ్యవహరించారు. గాలిగోపురంతోపాటు పరిసర ప్రాంతాలు విద్యుత్ దీపాలతో విరాజిల్లుతున్నాయి. -
తొలి తెలుగు సమరయోధుడు ఉయ్యాలవాడ
బాపట్ల: బ్రిటిష్ వారి నిరంకుశ విధానాన్ని ఎదిరించిన తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు మున్నం భోగేశ్వరరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి చేజర్ల నారాయణరెడ్డి తెలిపారు. ఆదివారం ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి సందర్భంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాపట్ల ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్న రోగులకు భోజనం పొట్లాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బ్రిటీష్ వారిపై సాయుధ పోరాటం చేసిన ధీశాలి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని కొనియాడారు. బ్రిటీష్ వారు విధించిన నిరంకుశ పన్ను విధానాలను వ్యతిరేకించి వారి ఖజానాలపై దాడులు చేశారని తెలిపారు. వైఎస్సార్ సీపీ బాపట్ల మండల అధ్యక్షుడు మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి, యూత్ విభాగం కార్యదర్శి నక్కా వీరారెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు వారి లక్ష్మి, కార్యదర్శి కావూరి సుబ్రమణ్యంరెడ్డి, నాయకులు శ్రీనివాసరెడ్డి, జాలిరెడ్డి, పోలిరెడ్డి తదితరులు ఉన్నారు. సాయుధపోరాట ధీరుడు ఉయ్యాలవాడ బాపట్లటౌన్: బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా రాయలసీమలో సాయుధపోరాటం సాగించిన ధీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని జిల్లా జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. ఉయ్యాలవాడ వర్ధంతిను పురస్కరించుకొని ఆదివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఉయ్యాలవాడ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఎస్పీ బి.ఉమామహేశ్వర్ మాట్లాడుతూ తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అన్నారు. 1857 సిపాయిల తిరుగుబాటుకు పదేళ్ల ముందే 1846–47 కాలంలోనే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా రాయలసీమలో సాయుధ పోరాటం చేసిన ధీశాలి నరసింహారెడ్డి అన్నారు. నిరంకుశ పన్ను విధానాలకు వ్యతిరేకంగా సుమారు 5000 మంది రైతులతో సైన్యాన్ని నిర్మించి, కోయిల్కుంట్ల, ఎం.ఎం. కడప జిల్లాలోని బ్రిటిష్ ఖజానాలపై దాడులు చేసి వారిని గజగజలాడించారన్నారు. బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన కొత్త భూసేకరణ విధానాలు, పాలెగాళ్ల వ్యవస్థ రద్దు వంటి చర్యలు రైతులపై భారం వేయడంతో నరసింహారెడ్డి తిరుగుబాటు బావుటా ఎగురవేశారన్నారు. వడ్డే ఓబన్న వంటి నమ్మకమైన అనుచరులతో కలిసి కెప్టెన్ వాట్సన్ నాయకత్వంలోని బ్రిటిష్ సైన్యాన్ని గిద్దలూరు వద్ద ఓడించారన్నారు. 1847 ఫిబ్రవరి 22న కోయిల్కుంట్లలోని రాళ్ల బురుజు వద్ద వందలాది మంది ప్రజల సమక్షంలో బ్రిటిష్ వారు ఆయన్ను ఉరితీశారని, ఆ రోజున ఆయన వీరమరణం పొందారన్నారు. నరసింహారెడ్డి అపురూప త్యాగానికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2017లో ఆయన చిత్రపటంతో తపాలా స్టాంప్ను విడుదల చేసిందని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టడం గర్వకారణమన్నారు. ఎస్బీ సీఐ నారాయణ, ఆర్ఐ మౌలుద్దీన్, చుండూరు సీఐ ఆనందరావు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు మున్నం భోగేశ్వరరెడ్డి -
మీ సేవల మనుగడ కాపాడాలి
●ఏపీ మీసేవ నిర్వాహకుల వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాము ●జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక నరసరావుపేట: మీ సేవల మనుగడను కాపాడాలని ఏపీ మీసేవ ఆపరేటర్ల వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పోరుమామిళ్ల రాము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం పాతూరులోని గీతామందిర్లో నిర్వహించిన అసోసియేషన్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. గత 25ఏళ్లుగా ప్రజలకు మీసేవల ద్వారా ప్రభుత్వసేవలు అందిస్తూ చాలీచాలని ఆదాయంతో బతుకుతున్న ఆపరేటర్లకు భరోసానిస్తూ ప్రభుత్వం మీ సేవల మనుగడును కాపాడాలని కోరారు. విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అప్పటి యువగళం పాదయాత్రలో సమస్యలను వివరించగా తాము అధికారంలోకి రాగానే మీ సేవలకు మళ్లీ పూర్వవైభవం తీసుకొస్తామని, ఆపరేటర్ల సమస్యలు పరిష్కరిస్తామని మాట ఇచ్చారని, ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లవుతున్నా మీ సేవ కేంద్రాల మనుగడ ప్రశ్నార్థకంగానే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక అనంతరం ఏపీ మీసేవ నిర్వాహకుల వెల్ఫేర్ అసోసియేషన్ పల్నాడు జిల్లా నూతన కమిటీని స్టేట్ అధ్యక్షులు పోరుమామిళ్ల రాము ప్రకటించారు. నూతన అధ్యక్షుడిగా గట్టుపల్లి మహేష్, ఉపాధ్యక్షులుగా కొత్త శేషగిరిరావు గౌరవ అధ్యక్షులుగా కొమ్ము ప్రకాష్, దాసరి రాజశేఖర్, వేల్పూరు గణపతి, ప్రధాన కార్యదర్శిగా జలసూత్రం హరిబాబు, కార్యదర్శిగా రాయుడు సతీష్, నూలి శ్రీను, కాట్ల రామాంజనేయులు, మహిళా కార్యదర్శి గాదె శాంత కుమారి ఎన్నికయ్యారు. స్టేట్ కమిటీ సెక్రటరీ బుచ్చిబాబు, యాసిన్ పాల్గొన్నారు. -
హక్కుల సాధనలో రాజీలేని పోరాటం
పల్నాడు ఏపీ జేఏసీ కో–ౖచైర్మన్ బెజ్జం సంపత్బాబు యడ్లపాడు: ఏడు దశాబ్దాల ఐక్య పోరాట స్ఫూర్తితో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సమస్యలపై పల్నాడు గడ్డపై నుంచి ఉద్యమిస్తామని ఏపీ జేఏసీ కో–చైర్మన్ బెజ్జం సంపత్బాబు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం తక్షణమే సీపీఎస్ రద్దు చేసి పాతపెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, అలాగే మెమో 57ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. 12వ పీఆర్సీ కమిటీని వేయకపోవడం దారుణమని, వెంటనే 30శాతం ఐఆర్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. గత ఏడేళ్లుగా నిలిచిపోయిన కారుణ్య నియామకాలపై ఆయన ప్రత్యేకంగా స్పందిస్తూ, సుమారు 900 ఉపాధ్యాయ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన చెందారు. అర్థరహితమైన జీవోలను పక్కనపెట్టి, ప్రభుత్వం స్పెషల్డ్రైవ్ ద్వారా కలెక్టర్ పూల్లో తక్షణమే వారికి నియామకాలు జరిపి ఆదుకోవాలని తన ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసిన బ్యాంకు మేనేజర్ తాడికొండ: బ్యాంక్ సేఫ్ లాకర్లో పెట్టిన బంగారు నగలు మాయమైన ఘటన తుళ్లూరు మండలం వెంకటపాలెం యూనియన్ బ్యాంకులో జరిగింది. దీనిపై బ్యాంకు మేనేజర్ భూక్యా వీరాంజనేయులు నాయక్ ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు వివరాల ప్రకారం .02.02.2026 న బ్యాంక్ సేఫ్ లాకర్లో ఉంచిన బంగారు నగల ప్యాకెట్లను తనిఖీ చేయగా 2 పౌచ్లలో ఉన్న బంగారు నగలు కనిపించలేదనీ, వాటి మొత్తం నికర బరువు 328 గ్రాములు కలిగి ఉన్నట్లు, ప్రాథమిక అంతర్గత తనిఖీ, సీసీటీవీ ఫుటేజ్ పరిశీలనలో, అదే బ్రాంచ్లో పనిచేసే బ్యాంక్ ఉద్యోగి అనుమతి లేకుండా సేఫ్ లాకర్ తాళం చెవి తీసుకొని లాకర్ ఉన్న పై రెండు బంగారు పౌచ్లు తీసుకెళ్లినట్లు నిర్ధారించుకున్నారు. అనంతరం 21.02.2026న తుళ్ళూరు పోలీస్స్టేషన్లో పిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (అపుస్మా), ఈ–అభ్యాస్ అకాడమీ సంయుక్తంగా రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ‘సైంటిఫిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (శాట్) – లెవెల్ టు ఒలింపియాడ్‘ ప్రతిభా పరీక్షలకు విశేష స్పందన లభించినట్లు అపుస్మా రాష్ట్ర అధ్యక్షుడు కొలసాని తులసి విష్ణు ప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం అరండల్పేటలోని కెనడీ హైస్కూల్లో పరీక్ష పత్రాలను ఆవిష్కరించారు. విష్ణుప్రసాద్ మాట్లాడుతూ ఈ–అభ్యాస్ అకాడమీ సహకారంతో ’శాట్’ ఒలింపియాడ్ ప్రతిభ పరీక్ష రెండు దశల్లో నిర్వహిస్తున్నామని చెప్పారు. హైస్కూల్ స్థాయిలో విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం, విశ్లేషణాత్మక నైపుణ్యం, తార్కిక ఆలోచనలను ప్రోత్సహిస్తూ గ్లోబల్ విద్యార్థులుగా రాణించేందుకు అపుస్మా జాతీయస్థాయిలో కృషి చేస్తోందని తెలిపారు. ఈ–అభ్యాస్ అకాడమీ చైర్మన్ డాక్టర్ భువనగిరి ఫణి పవన్శాస్త్రి, సీఈఓ బి.సాయి రామకృష్ణ మాట్లాడుతూ జనవరి 18న రాష్ట్రంలోని 125కు పైగా అపుస్మా అనుబంధ పాఠశాల్లో నిర్వహించిన శాట్ ఒలింపియాడ్ తొలి దశ పరీక్షకు 15వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థుల్లో 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రతి తరగతి నుంచి 1,2,3 ర్యాంకులు సాధించిన విద్యార్థులకు రెండవ దశ ప్రతిభ పరీక్ష నిర్వహించామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 కేంద్రాల్లో ఆరువేల మందికి పైగా విద్యార్థులకు శాట్ ఒలింపియాడ్ పరీక్షను ‘ఓఎంఆర్’ విధానంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రెండవ దశలో రాష్ట్రస్థాయిలో 1,2,3 ర్యాంకులు సాధించిన విద్యార్థులకు మార్చి 8న గుంటూరులో జరగనున్న బహుమతి ప్రదానోత్సవంలో నగదు, ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేయనున్నట్లు వివరించారు. అపస్మా రాష్ట్ర నాయకులు కె.శ్రీకాంత్బాబు, విజ్డమ్ రవి, చైతన్య సాంబిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు నాయుడు చక్రనాగ్ పాల్గొన్నారు. కొరిటెపాడు(గుంటూరు): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడుగా వేంపాటి పాపారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘం జిల్లా కార్యాలయంలో ఆదివారం సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశంలో నామినేషన్లు దాఖలు చేసిన నలుగురు సభ్యులతో సంఘం సభ్యులు చర్చలు జరిపారు. దీంతో బీసీహెచ్ నాగులు, కె.నాగేశ్వరరావు, ఎ.కోటయ్యలు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో సంఘం జిల్లా అధ్యక్షుడుగా పాపారావు ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అలాగే సంఘం అసోసియేట్ అధ్యక్షుడుగా జె.మునిబాబు, గౌరవాధ్యక్షుడుగా బీసీహెచ్ నాగులు, కార్యవర్గ సభ్యులుగా కె.నాగేశ్వరరావు, ఎ.కోటయ్య, జె.ఏడుకొండలు, పి.నరసింహనాయుడు, ఎస్.భాస్కరబాబు, షాదిక్ బాషా, షేక్ మహబూబ్ సుభానిలు ఎన్నికయ్యారు. కార్యక్రమానికి ఎన్నికల అధికారిగా సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు డీఎస్ కోటయ్య వ్యవహరించారు. నూతన అధ్యక్షుడు పాపారావు మాట్లాడుతూ ప్రభుత్వ డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు. పూర్తిస్థాయి కమిటీని త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకులు బి.శ్రీనివాసరావు, వి.ప్రసన్నాంజనేయ కుమార్, ప్రభుత్వ వాహన డ్రైవర్లు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికై న పాపారావును పలువురు ప్రభుత్వ వాహన డ్రైవర్లు కలిసి అభినందనలు తెలిపారు. -
‘సమర శంఖారావం’ జయప్రదం చేయండి
ఎస్టీయూ పిలుపు నరసరావుపేట ఈస్ట్: కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చాలని కోరుతూ ఎస్టీయూ చేపట్టిన దశల వారీ ఆందోళనలో భాగంగా ఈనెల 25వ తేదీన చేపట్టిన చలో విజయవాడ సమర శంఖారావం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐఎస్టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి సీహెచ్ జోసఫ్ సుధీర్బాబు, ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె.కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం ఎస్టీయూ కార్యాలయంలో సమర శంఖారావం పోస్టర్ను ఆవిష్కరించారు. జిల్లా అధ్యక్షుడు ఎల్.వి.రామిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ పీఆర్సీ కమిటీని వెంటనే నియమించాలని, అప్పటి వరకు 30 శాతం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న రూ.34వేల కోట్లతో పాటు నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలని కోరారు. సమావేశంలో ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు యు.చంద్రజిత్యాదవ్, ఎం.వెంకటకోటయ్య, రాష్ట్ర కార్యదర్శి సీహెచ్.అనిల్, రాష్ట్ర మహిళా కన్వీనర్ పి.సుశీల, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.ఏమండీ, ఆర్థిక కార్యదర్శి షేక్.మహబూబ్ సుభాని తదితరులు పాల్గొన్నారు. -
మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిరస్మరణీయుడు
నరసరావుపేట: దివంగత మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వాతంత్రోద్యమ స్ఫూర్తి ప్రదాత అని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కొనియాడారు. ఆదివారం గుంటూరు రోడ్డులోని పార్టీ కార్యాలయంలో ఆజాద్ వర్ధంతి నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా సేవలందించిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ తన రచనల ద్వారా యువతలో స్వాతంత్య్ర ఉద్యమ చైతన్య స్ఫూర్తిని కలిగించారని అన్నారు. ఆయన మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూలతో కలిసి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని తన పుస్తకాలు, రచనల ద్వారా యువతను చైతన్యపరిచి స్వాతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించారని వెల్లడించారు. పార్టీ పట్టణ అధ్యక్షులు షేక్ కరిముల్లా, వర్కింగ్ అధ్యక్షులు అచ్చి శివకోటి, మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు సయ్యద్ మహబూబ్ బాషా, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి నెలటూరి సురేష్, మాజీ కౌన్సిలర్ షేక్ మీరావలి, బీసీ సెల్ అధ్యక్షులు మర్రిపూడి రాంబాబు, విద్యార్ది విభాగ అధ్యక్షులు మనీంద్రరెడ్డి, బాదుగున్నల శ్రీను, చందు పాల్గొన్నారు. -
25న చలో విజయవాడను విజయవంతం చేయాలి
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లకు గత ఎన్నికల్లో కూటమి నాయకులు ఇచ్చిన హామీల అమలు కోరుతూ ఎస్టీయూ చేపట్టిన దశలవారీ ఉద్యమ కార్యచరణలో భాగంగా ఈ నెల 25వ తేదీన తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐఎస్టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి సీహెచ్ జోసఫ్ సుధీర్బాబు పిలుపునిచ్చారు. ఆదివారం కంకరగుంటలోని ఎస్టీయూ భవన్లో చలో విజయవాడ పోస్టర్లు విడుదల చేశారు. సుధీర్బాబు మాట్లాడుతూ 12వ వేతన సవరణ సంఘాన్ని నియమించడంతోపాటు పీఆర్సీ నివేదిక వచ్చేలోపు 30 శాతం మధ్యంతర భృతి కల్పించాలని డిమాండ్ చేశారు. ధర్నాకు జిల్లాలోని ఉపాధ్యాయులందరూ పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. -
పాల డెయిరీల్లో తనిఖీలు నిర్వహించాలి
పెనమలూరు: బాలికను లైంగికంగా వేధించిన నిందితుడికి జైలు శిక్ష పడిందని సీఐ వెంకటరమణ తెలిపారు. శనివారం ఈ కేసు వివరాలను సీఐ తెలిపారు. 2021 సంవత్సరంలో వణుకూరు గ్రామంలో 11 ఏళ్ల బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అదే గ్రామానికి చెందిన 60 ఏళ్ల కలపాల స్వామియేలు ఆమెను తాగడానికి నీళ్లు అడిగి, ఆమెను తాకి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ కేసులో ఎనిమిది మంది సాక్షలను విచారించిన న్యాయమూర్తి వేల్పుల భవాని ఈ నెల 20వ తేదీన తుది తీర్పు ఇచ్చారు. నిందితుడికి ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.2 వేల జరిమానా విధించారు. -
బాపట్ల
ఆదివారం శ్రీ 22 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026గోళ్లపాడు(ముప్పాళ్ల): మండలంలోని గోళ్లపాడు గ్రామంలో వేంచేసియున్న ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవంలో భాగంగా శనివారం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అఖండ నామసంకీర్తనం అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు.విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 540.80 అడుగులకు చేరింది. కుడి కాలువకు 8,831, ఎడమ కాలువకు 9,076 క్యూసెక్కులు వదిలారు.తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.8000, గరిష్ట ధర రూ.9000, మోడల్ ధర రూ.8500 వరకు పలికింది.ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. ఆర్థిక సంవత్సర బడ్జెట్ను ఆమోదించేందుకు శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా వైఖరితో విభేదించిన వైఎస్సార్ సీపీకి చెందిన జెడ్పీటీసీ సభ్యులు అర్ధాంతరంగా వెళ్లిపోయారు. అజెండాను ఆమోదింపజేసుకునేందుకు తగిన బలం లేకపోవడంతో చివరికి సమావేశాన్ని వాయిదా వేశారు. గుంటూరు ఎడ్యుకేషన్: జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షతన జెడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశానికి జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియాతోపాటు ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, సీఈవో వి.జ్యోతిబసు, ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన జెడ్పీటీసీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. నిధులు లేకుండా కేటాయింపులా? సమావేశపు అజెండాలో పొందుపర్చిన అంశాల్లో ఆర్థిక సంవత్సర బడ్జెట్తో అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు, చైర్పర్సన్ ముందస్తుగా ఇచ్చిన అనుమతులను ఆమోదించాల్సిందిగా సభ్యుల ముందు ఉంచారు. దీనిపై వైఎస్సార్ సీపీకి చెందిన రొంపిచర్ల జెడ్పీటీసీ సభ్యుడు పిల్లి ఓబుల్రెడ్డి మాట్లాడుతూ అజెండాలో పొందుపర్చిన అంశాల్లో బడ్జెట్ మినహా, చైర్పర్సన్ ముందస్తుగా ఇచ్చిన అనుమతులను వైఎస్సార్ సీపీ పరంగా తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. జెడ్పీ ఆదాయ వనరులను దృష్టిలో ఉంచుకోకుండా ఏకపక్షంగా రూ.కోట్లాది పనులకు అనుమతులు ఇచ్చేస్తే, పనులు పూర్తయ్యాక బిల్లులు ఏ విధంగా చెల్లిస్తారో చెప్పాలన్నారు. జెడ్పీ సాధారణ బడ్జెట్ నిధుల నుంచి రూ.8.84 కోట్లు ఉన్నట్లు చూపారని, 15వ ఆర్థిక సంఘ నిధులను దృష్టిలో ఉంచుకుని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సదుపాయానికి రూ.31.25 కోట్లకు అదనంగా మరో రూ.5.22 కోట్లు కేటాయింపులు జరిపారని చెప్పారు. అయితే జెడ్పీకి వచ్చే ఆదాయాన్ని, గ్రాంట్లను పరిగణనలోకి తీసుకోకుండా రూ.30 కోట్లకు పైగా పనులకు అనుమతులు ఇచ్చేశారని పేర్కొన్నారు. సంబంధిత పనులకు చైర్పర్సన్ హెనీ క్రిస్టినా ఏకపక్షంగా ఇచ్చిన అనుమతులను జెడ్పీటీసీలుగా తాము గుడ్డిగా ఆమోదిస్తే. కాంట్రాక్టర్లకు బిల్లులు ఏ విధంగా చెల్లిస్తారని ప్రశ్నించారు. స్టాంప్ డ్యూటీ సర్చార్జి రూపంలో ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.18 కోట్లలో రూ.1.40 కోట్ల మినహా మిగిలిన నిధులు తెచ్చుకోలేకపోయారని అన్నారు. మరో ఆర్నెల్లలో జెడ్పీ పాలకవర్గ పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో రూ. కోట్లాది విలువైన పనులకు ఇనుమతులు ఇవ్వడం సమంజసం కాదని, భవిష్యత్తులో బిల్లులు చెల్లించే బాధ్యతను అధికారులు తీసుకుంటారా? అని నిలదీశారు. దీనిపై చైర్పర్సన్తోపాటు సీఈవో సూటిగా సమాధానం చెప్పలేకపోయారు. పక్కన పెట్టేస్తున్నారు.. గుంటూరు జిల్లా ప్రజా పరిషత్కు రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు ఉందని, ప్రజల ఓట్లతో గెలిచిన జెడ్పీటీసీ సభ్యులకు జెడ్పీలో సముచిత గౌరవం దక్కడం లేదని ఆరోపించారు. సభ్యులతో చర్చించి, ఆమోదం తెలపాల్సిన పనులను ఏకపక్షంగా ఆమోదించేస్తూ జెడ్పీటీసీలను ఉత్సవ విగ్రహాలుగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేమిటని ప్రశ్నిస్తే, తమపై ఎదురుదాడికి దిగుతున్నారని అన్నారు. 2025–26, 2026–27 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన బడ్జెట్ను ఆమోదించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే నిధులు లేకుండా ముందస్తు అనుమతులు ఇచ్చిన పనులకు ఎట్టి పరిస్థితుల్లోనే అంగీకారం తెలిపేది లేదని స్పష్టం చేశారు. ● ఇదే అంశంపై పిడుగురాళ్ల జెడ్పీటీసీ సభ్యుడు జంగా వెంకట కోటయ్య మాట్లాడుతూ జెడ్పీకి వచ్చే నిధులకు, కేటాయిస్తున్న పనులకు మధ్య పొంతన ఉండటం లేదన్నారు. జెడ్పీటీసీలకు తెలియకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. జెడ్పీటీసీలనూ కలుపుకొని పోవాలి ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలతో నిత్యం మమేకమై ఉంటున్న జెడ్పీటీసీలను తమ గ్రామాల్లో అభివృద్ధి పనులు జరగడం లేదని ప్రజలు నిలదీస్తున్న పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. వారి అంగీకారం లేకుండా ఏకపక్షంగా పనుల ఆమోదం వద్దని, అజెండాలోని అంశాలపై సమగ్రంగా చర్చించేందుకు జెడ్పీటీసీలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. జెడ్పీటీసీలకు తెలియకుండా, వారి ఆమోదం పొందకుండా అజెండాలను ఆమోదించేందుకు తాము సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ 15వ ఆర్థిక సంఘ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి అవసరాలు తీర్చేందుకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలు మూకుమ్మడిగా ప్రశ్నలు సంధించడంతో ఇరకాటంలో పడిన చైర్పర్సన్ హెనీ క్రిస్టినా నేరుగా సమాధానం చెప్పకుండా, తనకు వ్యతిరేకంగా పత్రికల్లో వార్తలు రాయిస్తున్నారని ఎదురుదాడికి దిగారు. ఇందులో తమ ప్రమేయం లేదని జెడ్పీటీసీలు సమాధానం ఇచ్చారు. చైర్పర్సన్ తీరును తీవ్రంగా వ్యతిరేకించిన పిల్లి ఓబుల్రెడ్డి, బత్తుల అనూరాధ, శొంటిరెడ్డి నర్సిరెడ్డి, ఈడ్పుగంటి కరుణకుమారి, తుమ్మా విజయప్రతాప్, తుర్లపాటి చౌడయ్య, ఎం.పెదమల్లుస్వామి, జంగా వెంకట కోటయ్య, కాట్రగడ్డ మస్తాన్రావు, పదముత్తం చిట్టిబాబు, జున్నెబెయిన హరీష్, కంకణాల స్వర్ణకుమారి, కో ఆప్షన్ సభ్యుడు షేక్ సర్దార్ హష్మి తదితరులు సమావేశంలో నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో అజెండాలోని అంశాలను ఆమోదించేందుకు కోరం లేకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు హెనీ క్రిస్టినా ప్రకటించారు. 7 -
వలస వేదన
● నిషేధానికి ముందే వలసలు పోతున్న మత్స్యకారులు ● సాయం కోసం ఎదురుచూసినా ఫలితం శూన్యం ● ఉమ్మడి గుంటూరు జిల్లాలో 11,500 మందికి ఉపాధి కరువు వేట నిషేధానికి ముందే మత్స్యకారులు వలసబాట పట్టారు. గత ఏడాది వేట నిషేధ సమయంలో అందించాల్సిన సాయం మళ్లీ నిషేధం సమీపిస్తున్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం ఒక్కపైసా ఇవ్వలేదు. కనీసం ఆ విషయం పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు. బాపట్ల : ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో 11, 500 మంది, ఇప్పుడు చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాల పరిధిలో మరో 5 వేల మంది సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఏటా వేట నిషేధ కాలానికి సంబంధించి మత్స్యకారులకు రూ.10 వేలు వారి ఖాతాల్లో జమ చేసేవారు. కూటమి ప్రభుత్వంలో మత్స్యకారుల గురించి పట్టించుకునే నాథుడే కనిపించలేదు. దీంతో ఈ ఏడాది ఎక్కువ మంది వలస వెళుతున్నారు. పరిస్థితి ఇదీ... రాష్ట్రంలో ఏప్రిల్ 15 నుంచి మే 31వ తేదీ వరకు వేట నిషేధం ఉంటుంది. దీంతో పలు రాష్ట్రాలకు వేట నిమిత్తం ఈ ప్రాంతం మత్స్యకారులు వెళుతుంటారు. ఈ ఏడాది ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మత్స్యకారులు చెబుతున్నారు. బెంగళూరు, గోవా వెళ్లేందుకు మత్స్యకారులు సిద్ధం అవుతున్నారు. సముద్ర జీవరాశులు ఏప్రిల్ 15 నుంచి మే 31వ తేదీ వరకు గుడ్లు ఉత్పత్తి చేసే దశ కావటంతో వేట నిషేధం విధిస్తారు. తరువాత జూన్ ఒకటో తేదీ నుంచి వేటకు గ్రీన్సిగ్నల్ ఇస్తారు. సాధారణంగా ఈ ప్రాంతంలో వేట నిషేధ సమయంలోనే ఇతర రాష్ట్రాలకు వేట కోసం వెళ్లే మత్స్యకారులు ఈ ఏడాది ముందే వెళుతున్నారు. ఇతర రాష్ట్రాలకు పయనం ఉపాధి కోసం బెంగళూరు, గోవా ప్రాంతాల్లో వేటకు సాధారణంగా ఇక్కడి వారు వెళుతుంటారు. ముందుగా రెండు నెలలు కలుపుకొని మొత్తం నాలుగు నెలలుపాటు ఇతర రాష్ట్రాల్లో ఉండిపోతున్నారు. బాపట్ల నియోజకవర్గంలోనే ఎక్కువ తీరప్రాంతం ఉంది. ఏనిమిది వేల మంది మత్స్యకారులు ఉన్నారు. అడవిపల్లిపాలెం, దానవాయిపేట, కృపానగర్, రామచంద్రపురం, పాండురంగాపురం, సూర్యలంక, రామానగర్, ముత్తాయిపాలెం, హనుమాన్నగర్ వంటి గ్రామాల్లో సుమారు ఐదు వేల మందికిపైగా మత్స్యకారులు జీవనం సాగిస్తుంటారు. వీరిలో ఎక్కువ శాతం మంది ఇతర రాష్ట్రాలకు వేటకు వెళుతుంటారు. మత్స్యకారులను గత ప్రభుత్వం ఆదుకుంది. గతంలో వేట నిషేధానికి సంబంధించిన భత్యం కూడా ఈపాటికే అందించారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక మత్స్యకారుల సంక్షేమాన్ని పట్టించుకోలేదు. రేపల్లె ప్రాంతంలో ఉన్న సబ్సిడీ డీజిల్ను కూడా వైఎస్సార్సీపీ బాపట్లకు తెచ్చి మేలు చేసింది. – కొక్కిలిగడ్డ చెంచయ్య, మత్స్యకార కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ బాపట్ల ప్రాంతానికి చెందిన మత్స్యకారులకు ఎంతో డిమాండ్ ఉంటుంది. మన రాష్ట్రంలో వేట నిషేధం సమయంలో ఇతర రాష్ట్రాలకు వేట నిమిత్తం వెళ్లటం సహజం. ఈ నెలాఖారు నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నాం. –బాలచంద్ర, మత్స్యకారుడు -
పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం
చీరాల టౌన్: ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతతో పాటుగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వలన సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ భావన వశిష్ట సూచించారు. శనివారం పట్టణంలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చీరాల ఆర్డీఓ తూమాటి చంద్రశేఖరనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. చీరాల రైల్వేస్టేషన్ నుంచి ఎన్ఆర్ అండ్ పీఎం హైస్కూల్ వరకు ప్రభుత్వ అధికారులు, కళాశాలలు, హైస్కూళ్ల విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. వీధుల్లో వ్యర్థాలు లేకుండా పరిశుభ్రంగా ఉంచడం వలన కలిగే ఫలితాలపై ప్లకార్డులతో విద్యార్థులతో కలిసి ప్రదర్శన నిర్వహించారు. అనంతరం విద్యార్థులు, ప్రభుత్వ అధికారులు, ప్రజలతో కలిసి ప్రజలను చైతన్యవంతులుగా చేస్తూ మానవహారం ఏర్పాటు చేయడంతో పాటు ‘నాఇంటిని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతానంటూ కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. అలానే ఈనెల 26న రేపల్లెలో నిర్వహిస్తున్న జాబ్మేళాకు సంబంధించి పోస్టర్లను ఆవిష్కరించారు. డీఆర్డీఏ, మెప్మా ఆధ్వర్యంలో పొదుపు మహిళలు ఏర్పాటు చేసిన వివిధ రకాల ఉత్పత్తుల స్టాళ్లతో పాటుగా చేనేత వస్త్రాల స్టాల్ను ప్రత్యేకంగా సందర్శించి చేనేత వస్త్రాల గొప్పతనం గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఇన్చార్జి కలెక్టర్ భావన వశిష్ట మాట్లాడుతూ అభివృద్ధి చెందే దేశాల సరసన భారత దేశం నిలిచిందని.. అభివృద్ధి, ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయన్నారు. ప్రజలంతా దీనిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చీరాల ఆర్డీఓ చంద్రశేఖర నాయుడు మాట్లాడుతూ వ్యర్థ రహిత పాలనకు ప్రజలంతా సహకరించాలన్నారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ను నిషేధించాలని.. అందుకు అధికారులు కూడా పూర్తి సహకారం అందించాలన్నారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వినియోగాలను నిషేధించి గుడ్డ సంచులు, జూట్ బ్యాగులు వాడాలన్నారు. మున్సిపల్ కమిషనర్ డానియేల్ జోసఫ్, సీపీఓ షాలేమ్రాజ్, నైపుణ్యాభివృద్ధి మేనేజర్ మాధవి, ఆర్టీసీ డీఎం శ్యామల, సర్వే ఏడీ ముసలయ్య, మున్సిపల్ డీఈ రఘురామ్, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిద శాఖల అధికారులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. -
జెడ్పీలో టీడీపీ నేత మంతనాలు
గుంటూరు ఎడ్యుకేషన్ : ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ రాజకీయాలకు వేదికగా మారింది. ప్రభుత్వ పాలకవర్గంలో భాగస్వాములైన జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు అధికారులకు సంబంధించిన ప్రభుత్వ కార్యకలాపాలకే పరిమితం కావాల్సిన జెడ్పీ కార్యాలయంలో టీడీపీ నేత హల్చల్ చేశారు. చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా ఏకపక్షతీరును వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీకి చెందిన జెడ్పీటీసీ సభ్యులు ఇటీవల స్థాయీ సంఘ సమావేశాన్ని బహిష్కరించడంతో శనివారం మరలా ఒకటో స్థాయీ సంఘ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రణాళిక–ఆర్థిక అంశాలపై సదరు స్థాయీ సంఘ ఆమోదం పొందిన తరువాతే, సర్వసభ్య సమావేశంలో ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉండటంతో స్థాయీ సంఘ సభ్యుల అంగీకారం కీలకంగా మారింది. దీంతో శనివారం ఉదయం జెడ్పీ కార్యాలయానికి వచ్చిన పల్నాడు జిల్లాకు చెందిన టీడీపీ నేత జాన్సైదా ఒకటోస్థాయీ సంఘంలో సభ్యులుగా ఉన్న జిల్లాకు చెందిన వైసీపీ సభ్యులు కాట్రగడ్డ మస్తాన్రావు, పదముత్తం చిట్టిబాబు, పిట్ల వేణుగోపాల్రెడ్డి, తుమ్మా విజయప్రతాప్రెడ్డితో స్టేషనరీ రూమ్లో మాట్లాడారు. అజెండా ఆమోదానికి సహకరించాలని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయితే తమ అంగీకారం లేకుండా ప్రవేశపెట్టిన అంశాలను తాము వ్యతిరేకిస్తున్నామని జెడ్పీటీసీ సభ్యులు తేల్చి చెప్పారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్ చాంబర్కు వెళ్లిన జాన్సైదా అక్కడ కొద్దిసేపు ఉన్నారు. సమావేశంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, సభ్యులు ఈడ్పుగంటి కరుణకుమారి, జంగా వెంకట కోటయ్య, కందుల సిద్దయ్య పాల్గొన్నారు. స్థాయీ సంఘ అజెండా ఆమోదానికి వైసీపీ సభ్యులపై ఒత్తిడి -
నకరికల్లు– వాడరేవు జాతీయ రహదారి పనులు కొలిక్కి
నరసరావుపేట: నకరికల్లు– వాడరేవు జాతీయ రహదారి(167ఏ) పనులు నరసరావుపేట నియోజకవర్గంలో మొదలు కాబోతున్నాయి. దీనికి సంబంధించిన సర్వేను అధికారులు దాదాపుగా పూర్తి చేసి హద్దు రాళ్లు వేశారు. నేషనల్ హైవే చీరాల, చిలకలూరిపేట, నరసరావుపేట, నకరికల్లు మండలాల మీదుగా నాలుగు వరుసల్లో 45 మీటర్ల వెడల్పున 107 కి.మీ దూరం సాగుతుంది. ఇది నరసరావుపేట నియోజకవర్గంలో రైతుల వ్యతిరేకత కారణంగా కొంతకాలం పాటు సర్వే పనులు సాగలేదు. హైవే కేసానుపల్లి, నరసరావుపేట రూరల్, నకరికల్లు మండలాల మీదుగా 1.89 కిలోమీటర్ల దూరం సాగుతుంది. దీని వలన పట్టా భూమి 17.49 ఎకరాలు, ప్రభుత్వ భూమి 1.65 ఎకరాలను రైతులు కోల్పోతున్నారు. 42 మంది చేతిలో పట్టాభూమి ఉండగా 15 మంది చేతిలో ప్రభుత్వ భూమి ఉంది. దీంతో పాటు తొమ్మిది లే అవుట్లు కూడా హైవేలో కలవటం వలన 148 మంది ప్లాటుదారులు నష్టపోతున్నారు. వీరందరూ తమకు ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం పెంచి ఇవ్వాలని కోరుతూ కోర్టు కెక్కారు. తాత్కాలిక స్టే మంజూరు కావటం, ప్రభుత్వాధికారుల వివరణతో ఆ స్టేను కోర్టు తొలగించటం జరిగింది. ఇటీవల జాయింట్ కలెక్టర్ సంజనా సింహా సర్వే పనులను పరిశీలించి బాధిత రైతులతో కూడా మాట్లాడారు. వారికి అందాల్సిన నష్టపరిహారంపై ధైర్యం చెప్పారు. ఎట్టకేలకు జిల్లా కేంద్రంలో పనులు ప్రారంభమవుతుండడంతో ఆ రహదారి చుట్టుపక్కలనున్న భూములకు ధరలకు రెక్కలు వచ్చాయి. ఇప్పటికే ఎకరా రూ.2 నుంచి రూ.5 కోట్లు వరకు ధర పలుకుతున్నాయి. వెంచర్లు వేసి ప్లాట్లు అమ్ముకొని చేతులు దులుపుకునే పనిలో రియల్టర్లు ఉన్నారు. సర్వే దాదాపుగా పూర్తిచేసిన అధికారులు -
నిత్యాన్నదాన పథకానికి రూ.1.02 లక్షల విరాళం
మోపిదేవి: మోపిదేవిలో కొలువైన శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి గుంటూరు వాస్తవ్యులు చెన్నంశెట్టి వెంకటేశ్వరావు రూ. 1,02,555 విరాళంగా అందజేశారు. శనివారం ఉదయం స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావుకు ఈ విరాళాన్ని అందచేశారు. దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు. అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఎగువ సన్నిధిలోని పానకాల స్వామి వారి ముఖ మండపంలో శనివారం భక్తులు నృసింహుని ఏకాదశ మాలధారణ దీక్ష స్వీకరణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దేవస్థాన ప్రధాన అర్చకులు గురుస్వామి మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు భక్తులకు మాల వేసి దీక్షలు ఇచ్చారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వార్ల సేవ ట్రస్ట్ చైర్మన్ తోట శ్రీనివాసరావు సుమారు 250 మంది భక్తులకు ఉచితంగా భక్తులకు దీక్షా వస్త్రాలు అందజేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు వీరేంద్ర, రాఘవేంద్ర, భక్త బృందం ప్రతినిధులు కృష్ణ, రుద్రువినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నగరంపాలెం: గుంటూరు నగరంలోని జిల్లా జైలును శనివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి కల్యాణ్చక్రవర్తి, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు సందర్శించారు. జైలు పరిపాలన, భద్రత చర్యలు, ఖైదీలకు సదుపాయాలు, సంక్షేమ పథకాల అమలు, పారిశుద్ధ్య ప్రమాణాలు, జైల్లో కుల వివక్షకు సంబంధించి అంశాలపై సమీక్ష చేపట్టారు. జైలు బ్యారక్స్, వంటశాల, ఆసుపత్రి విభాగం, బేకరీ యూనిట్, సందర్శకుల గది, ఇతర విభాగాలను పరిశీలించారు. ఖైదీలతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా కలెక్టర్లు మాట్లాడారు. వారి అభిప్రాయాలు, అభ్యర్థనలు, సూచనలు నమోదు చేసుకున్నారు. జిల్లా జైలు సూపరింటెండెంట్ ఎ.బి.కాంతరాజ్ తదితరులు ఉన్నారు. దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజ్ నుంచి 2,212 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజి వద్ద 12 అడుగుల నీటిమట్టం స్థిరంగా ఉంది. దుగ్గిరాల బ్యాంక్ కెనాల్ 146, తూర్పు కాలువకు 265, పశ్చిమ కాలువకు 115, నిజాంపట్నం కాలువకు 20, కొమ్మూరు కాలువకు 1,231 క్యూసెక్కులు విడుదల చేశారు. -
ఫుడ్ బాస్కెట్తో సమతుల ఆహారం
మార్టూరు: సామాన్య కుటుంబాలకు సైతం సమతుల పోషకాహారాన్ని అందించటమే లక్ష్యంగా ఫుడ్ బాస్కెట్ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు డీఆర్డీఏ బాపట్ల జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ బత్తిన సింగయ్య అన్నారు. స్థానిక వెలుగు కార్యాలయంలో గురువారం గ్రామైక్య సంఘ ప్రతినిధులు, వెలుగు, ప్రకృతి సేద్య సిబ్బందితో గత రెండు రోజులుగా నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రకృతి సేద్య సిబ్బంది, రైతుల ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించడంతో పాటు సామాన్య, పేద కుటుంబాలకు అవసరమైన పోషక విలువలు కలిగిన నిత్యావసర సరుకులను ఇంటింటికీ అందించటమే ఫుడ్ బాస్కెట్ పథకం లక్ష్యమన్నారు. ఈ పథకాన్ని జిల్లాలో మార్టూరు మండలం ప్రకాశం జిల్లాలోని అద్దంకి, కొరిశపాడు మండలాల్లో మొదటిసారిగా ప్రయోగాత్మకంగా డీఆర్డీఏ, వెలుగు, రైతు సాధికార సంస్థల ఆధ్వర్యంలో ప్రారంభిస్తున్నట్లు సింగయ్య తెలిపారు. గ్రామైక్య సంఘాల ఆధ్వర్యంలో పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను సేకరించి స్వయం సహాయక సభ్యులకు అందిస్తారన్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులను దృష్టిలో పెట్టుకొని ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. ప్రతి ఇంట్లో కిచెన్ గార్డెన్, న్యూట్రి గార్డెన్లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆరోగ్యస్థాయిలు మెరుగు పరుచుకోవాలన్నారు. వెలుగు డీపీఎం సనిత గ్రూపు సభ్యులకు ఫుడ్ బాస్కెట్ గురించి అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయ శాఖ ఏపీడీ జే.మోహన్ రసాయన రహిత కూరగాయలు పండించే విధానం గురించి సభ్యులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మార్టూరు, కొరిశపాడు ఏపీఎంలు సురేంద్ర, మాణిక్యరావు, ఎంటీఎల్ రాజశేఖర్, సోనియా, శశికళ, నూతనశ్రీ, వెలుగు సీసీలు మండల సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు. డీఆర్డీఏ జిల్లా పీడీ సింగయ్య -
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా క్రీడా పోటీలు
గుంటూరు మెడికల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 8న ఏపీ ఎన్జీజీవోస్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో జిల్లాలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు మార్చి 3, 4 తేదీలలో ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు ఏపీ ఎన్జీజీవోస్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. స్థానిక ఏపీ ఎన్జీజీవోస్ కార్యాలయంలో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. జిల్లాలోని మహిళ ఉద్యోగులందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి శ్యాంసుందర్ శ్రీనివాస్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ షేక్ నాగూల్ షరీఫ్, జిల్లా ఉమెన్ వింగ్ చైర్ పర్సన్ ఎస్ కె తాజున్నీసా, కన్వీనర్ ఎం విజయలక్ష్మీ, మహిళా విభాగం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
వీరాంజనేయస్వామికి 60 సవర్ల బంగారు కిరీటం
చీరాల: స్థానిక బోస్నగర్లో వేంచేసియున్న వీరాంజనేయస్వామి దేవాలయంలో మహాకుంభాభిషేక కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం స్వామివారి సుప్రభాతసేవ, విశేష అలంకరణ, పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి భక్తుల సహకారంతో 60 సవర్ల బంగారంతో కిరీటాన్ని చేయించారు. సంప్రోక్షణ చేయించి కిరీటాన్ని ఊరేగింపుగా ప్రదక్షణ చేయించి పూజలు నిర్వహించారు. శనివారం జరిగే మహాకుంభాభిషేకం కార్యక్రమం రోజున స్వామివారికి అలంకరించనున్నారు. కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తలు, అర్చకులు భక్తులు పాల్గొన్నారు. -
బాపట్ల తీరానికి ‘గోవా’ మోడల్
బాపట్ల: బాపట్ల తీరాన్ని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ నేతృత్వంలోని బృందం గోవాలో రెండో రోజు అధ్యయన పర్యటన నిర్వహించింది. సముద్రం తీర పరిరక్షణ నిబంధనలు, పర్యావరణ సమతుల్యత, పర్యాటక నిర్వహణ విధానాలపై అక్కడి ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించి అమలవుతున్న విధానాలను అవగాహన చేసుకుంది. పర్యటనలో భాగంగా గోవా తీర పరిరక్షణ ప్రాధికార సంస్థ అధికారులను కలిసి వ్యర్థాల నిర్వహణ, మురుగునీటి శుద్ధి, తీర సంరక్షణ చర్యలను పరిశీలించింది. గోవా పర్యాటక ప్రతినిధులతో సమావేశమై సముద్రతీర పర్యాటకంతోపాటు సాహస, సాంస్కృతిక, వారసత్వ ఆధారిత పర్యాటక అభివృద్ధి అవకాశాలను సమీక్షించింది. రవాణా, వసతి, పారిశుధ్య సదుపాయాలను దశలవారీగా మెరుగుపరిస్తే పర్యాటకులను ఆకర్షించవచ్చని అధికారులు సూచించారు.క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా బృందం కాండోలిమ్ సముద్రతీరం,కలంగూట్ సముద్రతీరం, బాగా సముద్రతీరం, మిరమార్ సముద్రతీరం, కొల్వా సముద్రతీరం ప్రాంతాలను సందర్శించి మౌలిక సదుపాయాలు, ఆదాయ భాగస్వామ్య విధానంలో నిర్వహణ తీరును పరిశీలించింది. చారిత్రక ప్రాధాన్యంగల అగువాడ జైలు మ్యూజియంను దర్శించి పాత కట్టడాలను పర్యాటక ఆకర్షణలుగా అభివృద్ధి చేసిన నమూనాను అధ్యయనం చేసింది. బాపట్ల తీరాభివృద్ధికి అవసరమైన కీలక అంశాలపై సంబంధిత అధికారులకు కలెక్టర్ స్పష్టమైన మార్గనిర్దేశం చేసినట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఉపాధి అవకాశాలు పెంపొందేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయనున్నట్లు పేర్కొన్నారు. పర్యటనలో మున్సిపల్ కమిషనర్ జి. రఘునాథరెడ్డి, తహసీల్దార్ కె.గోపికృష్ణ, మండల అభివృద్ధి అధికారి ఎం.రాజేష్ బాబు, జిల్లా పర్యాటక అధికారి షేక్ అలీ అస్గర్ తదితరులు పాల్గొన్నారు. రెండు రోజుల అధ్యయన పర్యటన -
గ్రామీణ డాక్ సేవకులు కీలకం
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): ఈ నెల 22 వ తేదీన ‘గ్రామీణ డాక్ సేవక్ సమ్మేళనం’ నిర్వహించనున్నట్లు చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీదేవి తెలిపారు. గుంటూరు నగర శివారులో గల బొమ్మిడాల నగర్లో ఉన్న శ్రీ సత్య సాయి స్పిరిచువల్ సొసైటీలో ఆదివారం జరగబోవు కార్యక్రమం ఏర్పాట్లను ఆమె శుక్రవారం పరిశీలించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న వేలాది గ్రామీణ డాక్ సేవకులను ఒకే వేదికపైకి తెచ్చి సేవలకు గుర్తింపు ద్వారా ప్రోత్సహించడం ఈ సమ్మేళనం లక్ష్యం అన్నారు. ఉత్తమంగా పనిచేసిన 10 మంది గ్రామీణ డాక్ సేవకులను సత్కరించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సూపరిండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ (గుంటూరు డివిజన్) యలమందయ్య , అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ (విజయవాడ) ఎస్. వీర నారాయణ, సూపరింటెండెంట్ పోస్టల్ స్టోర్స్ (విజయవాడ) రవిశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
డబ్బులిస్తారట!
బాపట్లశనివారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026బియ్యం ఇవ్వరట.. చీరాల 23వ వార్డుకు చెందిన మహిళల నిరసన● చీరాలలో రేషన్ మాఫియాతో పలువురు డీలర్లు మిలాఖత్ ● చీరాలలో రేషన్ బియ్యం అక్రమ దందాకు పరాకాష్ట ● కీలక నేత, యువనేత అండతోనే రేషన్ బియ్యం అక్రమ రవాణా ● బాఽధితులకు మద్దతుగా ఓ తెలుగుదేశం పార్టీ నాయకుడు నగరంపాలెం(గుంటూరు): స్థానిక కృష్ణనగర్ ఒకటో వీధిలోని లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారం స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. -
అక్షరాల అద్భుతం...ప్రకృతి సందేశం
● సామరస్య రమజాన్..భక్తిమయ లెంట్ ● భిన్నమతాల ఉపవాస దీక్షల సంగమం యడ్లపాడు: విశ్వాసాల బాటలు వేరైనా పరమాత్మను చేరుకోవాలనే తపన ఒక్కటేనని చాటిచెబుతూ.. కాలచక్రం ఈ ఏడాది ఒక అరుదైన ఆధ్యాత్మిక అద్భుతాన్ని ఆవిష్కరించింది. గగనతలంలో సూర్యచంద్రుల గమనాలు వేరైనా రెండు వేర్వేరు ధర్మాల ఉపవాస దీక్షలను ఒకే వేదికపైకి తీసుకువచ్చాయి. చాంద్రమాన గణనతో ఏటా 11 రోజులు ముందుకు జరిగే రమజాన్ మాసం, సూర్యమాన ఆధారిత లెంట్ దీక్షలతో అరుదైన ఖగోళ వింత కారణంగా, హిజ్రీ 1447 నెలవంక దర్శనం, క్రైస్తవుల యాష్ వెడ్నెస్ డే ఒకే రోజైన ఫిబ్రవరి 18న ప్రారంభమయ్యాయి. గ్రెగోరియన్, హిజ్రీ కాలచక్రాల అద్భుత కలయికతో రెండు భిన్న ధర్మాలు తమ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఏకకాలంలో మొదలుపెట్టడం విశేషం. 1993 నాటి ఆ అరుదైన స్మృతి, మళ్ళీ 2026లో మళ్లీ పునరావృతమైంది. సరిగ్గా 33 ఏళ్ల తర్వాత ప్రకృతి ప్రసాదించిన ఈ మౌన సందేశం సర్వమత సామరస్యానికి, ఐక్యతకు పతాక చిహ్నంగా నిలుస్తోంది. రెండు ధర్మాలు..ఒకే లక్ష్యం మార్గాలు వేరైనా, ఈ రెండు మతాల ఉపవాస దీక్షల అంతిమ లక్ష్యం ఒక్కటే. వాటి మధ్య ఉన్న పోలికలు అద్భుతమైన మానవీయ విలువలను చాటిచెబుతున్నాయి. రమజాన్లో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నీరు కూడా ముట్టకుండా ముస్లింలు కఠినమైన రోజా పాటిస్తే, లెంటెల్ కాలంలో 40 రోజుల పాటు భోజనాన్ని త్యాగం చేస్తూ, ఇష్టమైన ఆహారాలకు దూరంగా ఉంటూ క్రైస్తవులు ప్రార్థనలు చేస్తారు. ముస్లింలు జకాత్ రూపంలో పేదలకు సంపదను పంచుతుంటే, క్రైస్తవులు తమ పొదుపును ధర్మకార్యాల ద్వారా ఆర్తులకు అందజేస్తారు. ఈ రెండింటిలోనూ భక్తులు ప్రాపంచిక సుఖాలను వీడి, దానధర్మాలను చేస్తూ దేవుని దగ్గరయ్యేందుకు ఆయన ఆజ్ఞలను పాటించడమే. ఒకే సమయంలో మసీదుల నుంచి అజాన్ వినబడటం, చర్చిల నుంచి ప్రార్థనా గీతాలు ఆలపించడం సమాజంలో ఐక్యతకు పతాక చిహ్నంగా మారుతోంది. రెండు మతాల్లో వేర్వేరు నమ్మకాలు ఉన్నప్పటికీ, అందరూ ఒకేసారి ఉపవాస దీక్షల్లో ఉండటం వల్ల పరస్పర గౌరవం, శాంతి పెంపొందుతాయని మత పెద్దలు ఆకాంక్షిస్తున్నారు. ఈ 33 ఏళ్ల అరుదైన సమయం భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పేలా ఈ దీక్షల్లోని తొలి శుక్రవారం ముస్లింలతో మసీదులు, క్రైస్తవులతో చర్చీలు నిండి కళకళలాడాయి. నిజంగా ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సందర్భమని ఇరుమతాలకు చెందిన పెద్దలు చెబుతున్నారు. -
సాయినాథ్రెడ్డికి అంతర్జాతీయ గుర్తింపు
నగరం: మండలంలోని పూడివాడ గ్రామానికి చెందిన యువ ప్రతిభావంతుడు అక్కల సాయినాథ్ రెడ్డి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. సుబ్బారెడ్డి – నాగలక్ష్మి దంపతుల కుమారుడు సాయినాథ్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ హాల్ ఆఫ్ ఫేమ్లో అధికారికంగా చేర్చారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థ డిజిటల్ వ్యవస్థలను భద్రపరచడం, సున్నితమైన ఆరోగ్య సమాచారాన్ని రక్షించడంలో చేసిన విశిష్ట సేవలకు ఈ గుర్తింపు లభించింది. ది ఐడియా జెన్ టెక్నాలజీస్ సంస్థ స్థాపకుడు, ముఖ్య కార్యనిర్వాహక అధికారి సాయినాథ్ సైబర్ భద్రత రంగంలో విశేష ప్రతిభ కనబరిచారు. ప్రపంచంలోని ప్రముఖ సంస్థల్లో 50కుపైగా భద్రతా లోపాలను గుర్తించి వాటి సవరణకు సహకరించారు. ఎస్ఏపీ ఇండియా హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవం, ఎల్జీ సంస్థ నుంచి ప్రశంసా పత్రం అందుకోవడంతో పాటు, భారత ప్రభుత్వానికి చెందిన సైబర్ సెక్యూరిటీ, క్రిటికల్ ఇన్ ఫ్రా ప్రొటెక్షన్ వారి ద్వారా రెండు సార్లు సత్కారం పొందారు. దేశ డిజిటల్ మౌలిక వసతుల భద్రతకు ఆయన చేసిన సేవలను పలువురు తీరప్రాంతవాసులు కొనియాడుతున్నారు. ప్రస్తుతం సాయినాథ్ ఐఐటీ హైదరాబాద్లోని అస్ట్రామ్ ప్రయోగశాలలో ప్రాజెక్టు సిబ్బందిగా పనిచేస్తున్నారు. 2025లో నిర్వహించిన ఐకేఎంసీ సదస్సులో తన వినూత్న ఆవిష్కరణ ‘మ్రినాళ్’కు ప్రత్యేక ప్రస్తావన పురస్కారం అందుకున్నారు. వెబ్, సైబర్, డ్రోన్ భద్రత, మార్గనిర్దేశక వ్యవస్థలపై నాలుగు పరిశోధనా పత్రాలను ఐఈఈఈ అంతర్జాతీయ సదస్సుల్లో ప్రవేశపెట్టారు. అదనంగా ఐఐటీ మద్రాస్ , ఐఐటీ కాన్పూర్, ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ తిరుపతి వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో వర్క్షాప్ శిక్షణకర్తగా సేవలందించారు. ఇప్పటివరకు 5 వేల మందికి పైగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చి, దేశ సైబర్ భద్రత రంగానికి నూతన శక్తిని అందిస్తున్నారు. -
డిపోలు, గ్యారేజీల ప్రైవేటీకరణ విరమించాలి
చీరాల: డిపోలు, గ్యారేజీల ప్రైవేటీకరణను విరమించాలని కోరుతూ ఎస్డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ధర్నానుద్దేశించి ఎస్డబ్ల్యూఎఫ్ డిపో కార్యదర్శి బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండులు, గ్యారేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న విద్యుత్ బస్సులను ఆర్టీసీ ద్వారా నిర్వహించాలని డిమాండ్ చేశారు. గ్యారేజీలు, డిపోలు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం ద్వారా ఆర్టీసీ ఆస్తులను కోల్పోవడంతో పాటు వేల మంది కార్మికుల ఉపాధి, ప్రజల సౌకర్యం దెబ్బతింటుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినప్పటికీ అందుకు తగిన బస్సులు, సిబ్బందిని పెంచకుండా ఉన్న సిబ్బందిపై భారం మోపిందన్నారు. పెరుగుతున్న ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొత్త బస్సులను ఆర్టీసీ యాజమాన్య నిర్వహణలో నడపాలని కోరారు. వేల పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ భర్తీ చేయకుండా ఔట్సోర్సింగ్ పద్ధతిలో సిబ్బందిని తీసుకునేందుకు ప్రయత్నం చేయడమే కాకుండా ప్రైవేటీకరించాలని చూడడం ప్రజల ప్రయాణ సౌకర్యాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టడమేనన్నారు. జీఓ నెం. 88ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ప్రమాదాల తీవ్రత పెరుగుతుందని, ప్రయాణికుల భద్రత ఉండదన్నారు. చార్జీల భారం ప్రయాణికులపై పడుతుందన్నారు. ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలన్నారు. నాయకులు కేబీకే రెడ్డి, తులసిరావు, వైవీ రావు, వెంకటేశ్వర్లు, జయరావు, బాష, ఎస్ఆర్ఎం రావు, కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎం.మాణిక్యరావు, సీఐటీయూ అధ్యక్ష, కార్యదర్శులు ఎన్.బాబూరావు, ఎం.వసంతరావు, జేవీవీ నాయకులు నారపరెడ్డి, బీఎస్ఎన్ఎల్ యూనియన్ నాయకులు బట్టు సుబ్బారావు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి.కొండయ్య తదితరులు పాల్గొన్నారు. ఎస్డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ధర్నా -
ఇండోనేషియా బాల్బ్యాడ్మింటిన్ పోటీల్లో లిఖిత విజయం
శావల్యాపురం: అంతర్జాతీయ స్థాయి బాల్బ్యాడ్మింటన్ క్రీడా పోటీల్లో ముక్కపాటి లిఖిత విజయం సాధించినట్లు కోచ్ రాగుల రాధా కృష్ణమూర్తి శుక్రవారం తెలిపారు. ఈ నెల 14 నుంచి 19 వరకు ఇండోనేషియా దేశంలో జరిగిన అంతర్జాతీయ ఇండియా బాల్బ్యాడ్మింటన్ టెస్టు సిరిస్లో సీనియర్ విభాగంలో బాలికల పోటీల్లో విజయం సాధించి ప్రశంసా పత్రం, గోల్డ్ పతకం అందుకొని దేశ కీర్తి ప్రతిష్టలు పెంచిందన్నారు. కనమర్లపూడి గ్రామానికి చెందిన ముక్కపాటి లిఖిత శావల్యాపురం జడ్పీ ఉన్నత పాఠశాల్లో 10 తరగతి వరకు విద్యాభ్యాసం చేసింది. ప్రాథమిక దశ నుంచి విద్యతో పాటు అంచెంచెలుగా క్రీడల్లో రాణిస్తూ మండలస్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎదిగింది. పల్నాడు జిల్లా నుంచి ఏకై క యువతిగా గుర్తింపు పొందింది. ఇండోనేషియా దేశం వెళ్లడానికి ఖర్చుల నిమిత్తం 1991–92 పదో పూర్వ విద్యార్థుల వ్యాయామ ఉపాధ్యాయులు పురిమెట్ల అజీం, కొర్నేమల్లి సాంబశివరావు గ్రామస్తులు, దాతలు, తన స్నేహితులు ప్రోత్సాహంతో ప్రవాసా భారతీయులు పోట్లూరు వాసి పూర్వ విద్యార్థి నన్నూరి రాఘవ తనవంతు సాయం అందజేశారు. తండ్రి కోటయ్య అనారోగ్యంతో మృతి చెందిగా, తల్లి మంచానికి పరిమితమైంది. తాతాయ్య–నాయనమ్మ తన అక్కయ్య కుటుంబ సభ్యులు ప్రోత్సాహంతో తాను అనుకున్న లక్ష్యాలను సాధిస్తోంది లిఖిత. -
అంబటికి ఎమ్మెల్సీ తోట పరామర్శ
నగరంపాలెం (గుంటూరు వెస్ట్) : మాజీ మంత్రి అంబటి రాంబాబు కార్యాలయం, ఇంటి వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు స్పష్టించిన దమనకాండను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. టీడీపీ మూకల విధ్వంస కాండలో ధ్వంసమైన గుంటూరు సిద్ధార్థనగర్లోని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇల్లు, కార్యాలయాన్ని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, కాపు నాయకులు దాసరి రాము శుక్రవారం సందర్శించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. -
మిర్చి యార్డు చైర్మన్గా అప్పారావు బాధ్యతల స్వీకరణ
గోళ్ళపాడు (ముప్పాళ్ల): గోళ్లపాడు గ్రామంలో వేంచేసియున్న ప్రసన్నాంజనేయస్వామి 34వ జయంతి తిరునాళ్ల ఈ నెల 23వ తేదీన జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు శుక్రవారం తెలిపారు. తిరునాళ్ళలో భాగంగా 21వ తేదీ తెల్లవారుజాము నుంచి ఆలయంలో హరే రామ నామ సంకీర్తన ఏకాహం, ప్రసన్నాంజనేయ స్వామి వారి గ్రామోత్సవం, 22న స్వామి వారికి సకల నదీజల పంచామృత స్నపన, ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం జరుగుతుందన్నారు. సాయంత్రం లక్ష్మీనృసింహస్వామి కల్యాణ మహోత్సవం జరుగుతుందన్నారు. 23న హనుమద్దీక్ష విరమణ, సామూహిక ఆకు పూజలు, పొంగళ్ళు సమర్పణ, సాయంత్రం హనుమత్జ్యోతి దర్శనం, తిరునాళ్ల జరుగుతుందన్నారు. -
ఇంజినీరింగ్ కాలేజీకి వైఎస్సార్ పేరును పునరుద్ధరించాలి
ఏఎన్యూ (పెదకాకాని): ఏఎన్యూలోని ఇంజినీరింగ్ కళాశాలకు మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజ శేఖరరెడ్డి పేరు తొలగించడం అన్యాయమని, తక్షణమే వైఎస్సార్ పేరును పునరుద్ధరించాలని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో గురువారం ఇంజినీరింగ్ కళాశాలపై ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును తొలగించిన సంగతి తెలిసిందే. దీనిపై వైఎస్సార్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నాయకులు వర్సిటీ వీసీ ఆచార్య కె.గంగాధరరావు, రిజిస్ట్రార్ ఆచార్య సింహాచలంలకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎ. రవిచంద్ర మాట్లాడుతూ... ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ కళాశాలకు 2009 లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టారన్నారు. అప్పటి వీసీ హరగోపాల్రెడ్డి ఆధ్వర్యంలో 11 మందితో కమిటీ వేశారన్నారు. యూనివర్సిటీ పాలకమండలి సమావేశంలో, అకడమిక్ సెనెట్లోనూ ఏకగ్రీవ తీర్మానం చేసి ఇంజినీరింగ్ కాలేజీకి వైఎస్సార్ పేరు పెట్టారని గుర్తు చేశారు. పాలకమండలి తీర్మానం లేకుండా ఆ పేరు ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి వైఎస్సార్ పేరు తొలిగించాలని చెప్పిందని వీసీ, రిజిస్ట్రార్ లు ఇరువురూ అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటన్నారు. వైఎస్సార్ పేరుంటే వెబ్ ఆప్షనన్స్లో విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారని ఉన్నతాధికారులు చెప్పడం వింతగా ఉందన్నారు. కళాశాల కోడ్, లాండ్ మార్క్ రెండూ ఉంటాయని వీసీని ప్రశ్నించారు. పదేహేనేళ్లుగా లేని ఇబ్బంది ఇప్పుడు ఎలా వచ్చిందో చెప్పాలన్నారు. టీఎన్ఎస్ఎఫ్ నేతలు వినతి పత్రం ఇవ్వగానే వైఎస్సార్ పేరు ఎందుకు తొలిగించారన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఇంజినీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కళాశాలలకు అనుమతులు ఇవ్వడంతోపాటు ఆయన స్వహస్తాలతో ప్రారంభించడంతో పాటు వాటి అభివృద్ధికి ప్రత్యేక సహకారం అందజేశారని గుర్తు చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్ అరాచక పాలన చివరికి యూనివర్సిటీల్లో కూడా యథేచ్ఛగా కొనసాగుతోందని విమర్శించారు. వైఎస్సార్ పేరు ఇంజినీరింగ్ కాలేజీతోపాటు విద్యార్థులకు ఇచ్చే రీసెర్చ్ ఫెలోషిప్కి కూడా వైఎస్సార్ పేరు పెట్టారని గుర్తు చేశారు. తొలగించిన పేరుని తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఏఎన్యూ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ పంతగాని రమేష్, యూనివర్సిటీ అధ్యక్షులు ఆసిఫ్ ఖాన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శివారెడ్డి, నాయకులు భాను కిరణ్, చందు, శ్రీనివాస్, అరుణ్, మదన్ తదితరులు పాల్గొన్నారు. ఏఎన్యూ వీసీకి వైఎస్సార్ విద్యార్థి విభాగం వినతిపత్రం -
సమాన అవకాశాలతో సామాజిక న్యాయం
రౌండ్ టేబుల్ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్) : కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం చెబుతున్న వికసిత్ భారత్లో రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన పథకాలలో సామాజిక న్యాయం, పేదలకు స్థానం ఎక్కడుందో చూపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని సీపీఐ, ఏఐటీయూసీ జిల్లా సమితుల ఆధ్వర్యంలో గుంటూరు కొత్తపేటలోని మల్లయ్య లింగంభవన్లో సంపద పునఃపంపిణీతో సామాజిక, ఆర్థిక న్యాయం’పై శుక్రవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. -
సెపక్ తక్రా విజేత యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల
సత్తెనపల్లి: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ అంతర్ కళాశాలల పురుషుల సెపక్ తక్రా పోటీలు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని విద్యాకేంద్రం డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించారు.ఈ టోర్నమెంట్ లో మొత్తం 8 జట్లు పాల్గొనగా నాకౌట్ కమ్ లీగ్ పద్ధతిలో పోటీలు జరిగాయి. విజేతగా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సాధించగా ద్వితీయ స్థానాన్ని వాసవీ డిగ్రీ కళాశాల నరసరావుపేట సాదించింది అదే విధంగా తృతీయ స్థానాన్ని ప్రగతి డిగ్రీ కళాశాల సత్తెనపల్లి సాధించింది. విజేతలకు ఆచార్య నాగార్జున యూనివర్శిటీ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పి.పి.యస్పాల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని బహుమతులు అందజేశారు. వారితో పాటుగా ఏజీకేఎం కళాశాల రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ దాసరి కోటేశ్వర రావు, సెలక్షన్ కమిటీ మెంబర్స్ ధనలక్ష్మీ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సి.హెచ్.వెంకట్రావు, వై వేలంగిని రెడ్డి, కళాశాల డైరెక్టర్ షేక్ జానీ భాష, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి,ఆర్గనైజ్ సెక్రెటరీ పుచ్చకాయల శివరామకృష్ణ, క్రీడాకారులు, పాల్గొన్నారు. 25న మాచర్లలో జాబ్ మేళా మాచర్ల: ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో ఎస్కేబీఆర్ డిగ్రీ కళాశాలలో ఈనెల 25న పల్నాడు జిల్లా అధికారుల ఆధ్వర్యంలో జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఆర్.కిరణ్నాయక్, శ్రీక్రాంత్ శుక్రవారం తెలిపారు. 18 నుంచి 30 సంవత్సరాల వయస్సు ఉన్న నిరుద్యోగ యువకులు ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు. స్టడీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, పాస్పోర్టు ఫొటోలతో నేరు గా హాజరు కావాలన్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. ప్రతి ఒక్కరూ వెబ్సైట్లో రిజిస్టరు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 78427 47682, 94921 58153 నంబర్లకు సంప్రదించాలన్నారు. -
ఏఎన్యూ దూరవిద్యలో నూతన డిప్లమో కోర్సులు
ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం నూతనంగా ఐదు డిప్లమో కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు సీడీఈ డైరెక్టర్ ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లు తెలిపారు. ఏఎన్యూలో గురువారం ఆయన మాట్లాడుతూ అమెరికా కేంద్రంగా ఉన్న కనెక్ట్ కన్సల్టెంట్ ఐటీ ప్రైవేట్ లిమిటెడ్తో అవగాహన ఒప్పందం కుదిరిందన్నారు. సంబంధిత పత్రాలపై వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య జి. సింహాచలం, కంపెనీ సీఈవో ఎం. సుకుమార్ సంతకాలు చేశారు. డిప్లమా ఇన్ అడ్వాన్స్డ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, డిప్లమో ఇన్ డేటా ఇంజినీరింగ్, డిప్లమో ఇన్ ఏఐ ఇంజినీరింగ్, డిప్లమో ఇన్ మిషన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిప్లమో ఇన్ క్లౌడ్ అండ్ డెవలప్మెంట్ ఆపరేషన్ ఇంజినీరింగ్ కోర్సులను కొత్తగా ప్రకటించారు. సంవత్సరం కాల వ్యవధిలో వీటిని పూర్తి చేయవచ్చన్నారు. ప్రవేశానికి ఏదైనా డిగ్రీ అర్హతగా నిర్ణయించారు. అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియెట్లో గణితశాస్త్రం చదివి ఉండాలని స్పష్టం చేశారు. వర్సిటీ ఉపకులపతి ఆచార్య కె. గంగాధరరావు తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్ బృందం గోవా పర్యటన
బాపట్ల: తీర ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా గోవా పర్యటనలో ఉన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ బృందం అక్కడి గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజును మర్యాదపూర్వకంగా గురువారం కలిసింది. ఈ సందర్భంగా తీర పర్యాటక అభివృద్ధి, బీచ్ నిర్వహణ, భద్రత చర్యలు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై వారు చర్చించారు. బాపట్ల తీరాన్ని సమగ్ర పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి గోవా నమూనాలను అనుసరించాలనే సంకల్పాన్ని కలెక్టర్ తెలియజేశారు. మద్దతు ధరతో కొనుగోలు చేయాలి శనగలు, మినుములు, పెసలను ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ భావన వశిష్ట తెలిపారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం గురువారం స్థానిక కలెక్టరేట్లో జరిగింది. శనగల కొనుగోలు కేంద్రాలను మార్చి ఒకటో తేదీ నుంచి జిల్లాలో ప్రారంభించాలని ఆమె చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 20 రైతు సేవ కేంద్రాలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. రైతుల నుంచి 12,116 క్వింటాళ్ల శనగలను మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించిందన్నారు. అధికారులు ప్రణాళికతో చర్యలు తీసుకోవాలన్నారు. ఒక రైతు 40 క్వింటాళ్ల శనగలను ఒక రోజులోనే కొనుగోలు కేంద్రం వద్ద అమ్ముకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిందన్నారు. ఈ సమావేశంలో మార్క్ఫెడ్ ఏడీ కరుణశ్రీ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని విజయనిర్మల, పౌర సరఫరాల సంస్థ జీఎం శ్రీలక్ష్మి, జిల్లా రవాణా అధికారి పరంధామరెడ్డి, కమిటీలను సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
చిన్నారిని చిదిమేసిన టాటా ఏస్ వాహనం
తీవ్రగాయాలతో మృతిచీరాల: ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని మృత్యురూపంలో వచ్చిన టాటా ఏస్ వాహనం చిదిమేసింది. ఏం జరిగిందో తెలిసేలోపే తీవ్రగాయాలతో మృతి చెందింది. ఈ విషాద సంఘటన గురువారం రాత్రి చీరాల మండలం కొత్తపాలెంలో చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు... చీరాల మండలం కొత్తపాలెంలో నివాసముంటున్న కొమరగిరి పూజ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తోంది. ఆమెకు రెండు సంవత్సరాల సాయిదుర్గ అనే పాప ఉంది. గురువారం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలను దించేందుకు వచ్చిన టాటా ఏస్ వాహనం అదుపుతప్పి ఇంటి సమీపంలో ఆడుకుంటున్న సాయిదుర్గను బలంగా ఢీకొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. పాప తలకు తీవ్రగాయం కావడంతో చిన్నారి తల్లిదండ్రులు హుటాహుటిన చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తీసుకెళ్లారు. వైద్యులు చిన్నారిని పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. అల్లారుముద్దుగా చూసుకుంటున్న చిన్నారి మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న చీరాల వన్టౌన్ పోలీస్స్టేషన్ ఎస్సై జి.రాజ్యలక్ష్మి సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అనంతరం హాస్పిటల్లో చిన్నారి తల్లితో మాట్లాడి వివరాలు నమోదు చేసుకున్నారు. అయితే వాహనం డ్రైవర్ సంఘటన స్థలంలోనే వాహనాన్ని వదిలి పరారయ్యాడు. చిన్నారి మృతదేహాన్ని మార్చురీకి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సాగునీటిపై ఆందోళన వద్దు
నరసరావుపేట రూరల్: పంట పొలాలకు ఈనెల 25వ తేదీ వరకు నీటి సరఫరా ఉంటుందని ఎన్ఎస్పీ డీఈ ఎం.ఉమాశంకర్ తెలిపారు. పల్నాడు జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావు, ఏడీఏ కేవీ శ్రీనివాసరావుతో కలిసి గురువారం కేఎం అగ్రహరంలో పర్యటించారు. మొక్కజొన్న పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. నీటి కోసం ఆందోళన చెందవద్దని అధికారులు తెలిపారు. పంటలకు సరిపడా నీటి సరఫరా ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మొక్కజొన్న కండే దశలో ఉన్నందున అంతరాయం లేకుండా నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. -
అన్నదాతలకు మళ్లీ వెన్నుపోటు!
మోంథా తుఫాన్ పంటలను నిండా ముంచింది. వరి పొలాలు పూర్తిగా నీట మునిగి రైతులు నష్టపోయారు. ఎకరాకు ఒక్కో రైతు సుమారు రూ.25 వేలపైగా నష్టపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం అందజేస్తామని చంద్రబాబు సర్కార్ ఆర్భాటంగా ప్రకటించింది. తరువాత పంట సాగుకు ఆ మొత్తం వస్తుందని రైతులు ఆశపడ్డారు. వారి ఆశలు అడియాశలు అయ్యాయి. ఇప్పటికీ పంట నష్టపరిహారం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు. చీరాల అర్బన్: చీరాల మండలంలో మోంథా తుఫాన్ నేపథ్యంలో సుమారు 3 వేల ఎకరాల పైచిలుకు వరి పొలాలు నీట మునిగాయి. అయితే అందులో 1,750 ఎకరాలకు మాత్రమే పంట నష్టపరిహారానికి అర్హత ఉన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు జాబితా తయారు చేశారు. చీరాల నగర్, బోయినవారిపాలెం, వాద తదితర ప్రాంతాల్లో అసైన్డ్, డీకే, పీఓటీ జాబితాలో ఉన్న భూములు పంట నష్టపరిహారం అర్హత లేదని తేల్చారు. అర్హత ఉన్న రైతులకు కూడా ఆ పరిహారం నేటికీ అందలేదు.పాలకుల చిన్నచూపుతుఫాన్ నేపథ్యంలో పర్చూరు నియోజకవర్గంలో కేంద్ర బృందం పర్యటించింది. పంట నష్టాన్ని అంచనా వేసింది. అయితే కేంద్ర బృందం చీరాలలో పర్యటించలేదు. అప్పుడే రైతులు చీరాలపై అంత చిన్నచూపు ఎందుకని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. పాలకులు పట్టించుకోక పోవటమే అందుకు కారణమని మండిపడ్డారు. వర్షాలకు ముంపునకు గురైన వరి పొలాల్లో మరలా వరి సాగు చేశారు. తొలి సారి సాగుకు ఎకరాకు రూ.25వేలకు పైగా ఖర్చు చేశారు. తిరిగి పెట్టుబడులకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రకటించిన పంట నష్టపరిహారం ఎకరాకు రూ.10వేలు తమ ఖాతాల్లో జమవుతాయని ఆశపడ్డారు. ఇప్పటికీ ఆ పరిహారం అందలేదు. ఎప్పటికి అందుతుందో కూడా స్పష్టత లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మాటల్లోనే రైతు ప్రయోజనాలుచంద్రబాబుకు రైతులు, వ్యవసాయం అంటే ఎప్పుడూ చిన్నచూపే. రైతు ప్రయోజనాల విషయంలో ఆయన మాటలకే పరిమితం అని, అరచేతిలో వైకుంఠం చూపుడంలో ఆయనను మించిన వారు లేరని పలువురు రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం తక్షణం స్పందించి యుద్ధప్రాతిపదికన పంట నష్టపరిహారాన్ని తమ ఖాతాల్లో జమ చేయాలని రైతులు కోరుతున్నారు.జమ అవుతుందిపంట నష్టపరిహారానికి సంబంధించి అర్హత ఉన్న రైతుల జాబితాను సిద్ధం చేసి పంపాం. ఎకరాకు రూ.10 వేల వంతున నష్టపరిహారం ప్రకటించారు. ఆ పరిహారం రైతుల ఖాతాల్లో నేరుగా జమ అవుతుంది.– నిర్మలాదేవి, ఏఓ, చీరాల -
టీడీపీలో గౌరవం లేదు.. అందుకే రాజీనామా
పార్లమెంట్ జిల్లా టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంగన్న చీమకుర్తి: ‘టీడీపీ విజయాలలో ఎంతో కృషి చేశాను. 2014 ఎన్నికల నుంచి ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్ వెంటే నడిచి ఆయన గెలుపునకు అహర్నిశలు పనిచేశా. కానీ పార్టీలో నాకు ఏ మాత్రం గౌరవం, విలువ లేవు...’ అంటూ బాపట్ల పార్లమెంట్ టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అవశనేని వెంగన్న ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ఇమడలేకనే ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు వెంగన్న తన రాజీనామా లేఖను శుక్రవారం చీమకుర్తిలో మీడియాకు విడుదల చేశారు. ఈ సందర్భంగా వెంగన్న సాక్షితో మాట్లాడుతూ... 2014 మున్సిపల్ ఎన్నికలలో టీడీపీ గెలుపుకోసం పనిచేశాను కాబట్టే అప్పటి మున్సిపల్ ఎన్నికలలో గెలిచిందని గుర్తు చేశారు. చీమకుర్తి మున్సిపాలిటీ పరిధిలో కాపు సామాజిక వర్గానికి చెందిన అవిశనేని వెంగన్న మొదట కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాలు ప్రారంభించారు. అనంతరం ప్రజారాజ్యంలో చేరారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం కావడంతో 2014 ఎన్నికలకు ముందు అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న బీఎన్ విజయకుమార్ వెంట తన వర్గంతో టీడీపీలో చేరి నడిచారు. తాజాగా టీడీపీలో కుల రాజకీయాల ఆధిపత్యంలో తనకు, తన సామాజిక వర్గానికి ఏమాత్రం గౌరవం లేని ఇమడలేకపోయారు. ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా ఆయన పట్టీపట్టనట్లుగా వ్యవహరించటంతో పార్టీకి రాజీనామా చేశారు. అవిశనేని వెంగన్న రాజీనామా ప్రభావంతో రానున్న మున్సిపాలిటీ ఎన్నికలలో టీడీపీకి నష్టం తప్పదని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. -
22న రాష్ట్ర ముఖ్యమంత్రి గుంటూరు రాక
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్) : ఈనెల 22న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా గుంటూరు రానున్నారు. బొమ్మిడాల నగర్లోని సత్యసాయి స్పిరిట్యువల్ సొసైటీ ట్రస్ట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తపాలా శాఖ ఉద్యోగుల సత్కార కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ప్రాంగణాన్ని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా , గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్లు తపాలా శాఖ అధికారులతో కలసి గురువారం పరిశీలించారు. రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 8 వేల మంది తపాలా శాఖ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారని, ఆ మేరకు అన్ని సౌకర్యాలు పక్కాగా ఉండాలని అన్నారు.గోవాడ కోటయ్య స్వామికి మహాశివరాత్రి ఆదాయంవేమూరు: గోవాడ గంగా పార్వతి సమేత బాల కోటేశ్వర స్వామి మహాశివరాత్రి తిరునాళ్లకు రూ.53,04,785 ఆదాయం వచ్చినట్లు దేవస్థానం ఈవో శ్రీనివాస్ వర్మ గురువారం వెల్లడించారు. అమర్తలూరు మండలం గోవాడ బాల కోటేశ్వర స్వామి దేవస్థానంలో మహా శివరాత్రి హుండీ లెక్కింపు గురువారం నిర్వహించారు. హుండీ ద్వారా రూ.16,33,235, అభిషేకం ద్వారా రూ.8,85,100, దర్శనం ద్వారా రూ.10,46,450, ఖాళీ స్థలం, కొబ్బరి కాయలు, కొబ్బరి చిప్పల విక్రయం ద్వారా రూ. 18,40,000 ఆదాయం వచ్చిందని ఆయన తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో చీఫ్ ఫెస్టివల్ అధికారి వి.అనుపమ, ఎంపీడీవో మారుతీ శేషాంబ, గ్రామ సర్పంచ్ మండవ విజయలక్ష్మి, దేవస్థానం చైర్మన్ పావులూరు రమేష్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.ముగిసిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలుపెదకాకాని: గంగ భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో మహా శివరాత్రి కల్యాణ బ్రహ్మోత్సవంలో చివరిరోజు గురువారం భ్రమరాంబ అమ్మవారు పుష్పశయ్య అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. పెదకాకాని శివాలయంలో సుప్రభాతసేవ, హారతులు, మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మహా నివేదన జరిగాయి. సాయంత్రం పంచహారతులు, ద్వాదశ ప్రదక్షిణలు, పుష్ప శయనోత్సవం, ఫలప్రదానాలు, దంపతులకు తాంబూలాలు, పవళింపు సేవలతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాయని ఆలయ ఉప కమిషనరు గోగినేని లీలాకుమార్, పాలకమండలి చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు, ధర్మకర్తల మండలి సభ్యులు తెలిపారు.రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగ కార్యదర్శిగా గోపిదేశితాడికొండ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగం సంయుక్త కార్య దర్శిగా తాడికొండ నియోజకవర్గం మేడికొండూరు మండలానికి చెందిన గోపిదేశి శివ నాగేంద్ర శ్రీనివాస్ను నియమిస్తూ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్రస్థాయి పదవిని అప్పగించినందుకు నియోజకవర్గ ఇన్చార్జి వనమా బాల వజ్రబాబు(డైమండ్)కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ విజయానికి కృషి చేస్తానని చెప్పారు. -
భావితరాల కోసం తాళపత్ర గ్రంథాల డిజిటలైజేషన్
ప్రముఖ నాడీ వైద్యుడు శశిధర్ చీరాల రూరల్: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించేందుకే పురాతన తాళపత్ర గ్రంథాలను తెలుగులోకి తర్జుమాచేసి డిజిటలైజేషన్ చేస్తున్నట్లు సనాతన జీవన్ ట్రస్టు చైర్మన్, నాడీ వైద్య నిపుణుడు జి. శశిధర్ అన్నారు. గురువారం చీరాల కొత్తపేటలోని సనాతన జీవన్ ట్రస్టు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇలాంటి బృహుత్తర కార్యక్రమం ఇంతవరకు ఏ రాష్ట్రంలో జరగలేదని తెలిపారు. రాగిరేకులు, తాటాకులు ఇతర వాటిపై పురాతన దేవ నాగరి లిపి, దేవ లిపి, సంస్కృతంలో రాసేవారని గుర్తుచేశారు. ప్రస్తుతం వాటన్నింటిని సేకరించి రుసుం తీసుకోకుండా ఆర్గానిక్ వంటి రసాయనాలతో శుద్ధిచేసి తెలుగులోకి తర్జుమాచేసి డిటిలైజేషన్ చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 12 లక్షలకుపైగా తాళపత్ర గ్రంథాలను రూ.కోట్లాది రూపాయలు సొంత నిధులు వెచ్చించి డిటిలైజేషన్ చేసినట్లు చెప్పారు. చీరాల, తిరుపతిలో మాత్రమే ఈ డిటిలైజేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
సత్వర పరిష్కారమే లోక్ అదాలత్ లక్ష్యం
న్యాయవాదుల సమావేశంలో జిల్లా జడ్జి బాపట్ల : ప్రజలు, కక్షిదారులు, కోర్ట్ కేసులు సత్వర పరిష్కారం చేసుకోవడానికి జాతీయ లోక్ అదాలత్ దోహదపడుతుందని, కక్షిదారులు ఈ అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్, జిల్లా జడ్జి కె. శ్యాంబాబు పేర్కొన్నారు. బాపట్ల జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ ఆసోసియేషన్ హాల్లో గురువారం జరిగిన న్యాయవాదుల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మార్చి 14వ తేదీ నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్పై ప్రజలకు అవగాహన కలిగించి, కేసుల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. న్యాయవాదులు వారి వద్ద ఉన్న కక్షిదారులకు విషయం చెప్పాలని కోరారు. గతంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా రాష్ట్రంలో ఉమ్మడి గుంటూరు జిల్లా కేసుల పరిష్కారంలో రెండుసార్లు ప్రథమ స్థానం సాధించిందని గుర్తుచేశారు. ఈసారి కూడా అత్యధిక కేసులు పరిష్కరించుకొని హ్యాట్రిక్ సాధించాలని కోరారు. గతంలో జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా 1085 కేసులు జిల్లాలోని ఆయా కోర్టులలో పరిష్కారం అయ్యాయని గుర్తు చేశారు. సీనియర్ డివిజన్ ప్రిన్సిపల్ సివిల్ జడ్జి వాణి, అడిషనల్ సివిల్ జడ్జి ఎం. పవన్ కుమార్, జూనియర్ డివిజన్ ప్రిన్సిపల్ సివిల్ జడ్జి ఎం. కల్యాణి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.అవినాష్, ఏజీపీ గవిని శ్రీనివాసరావు, న్యాయవాదులు ఆర్. వెంకటేశ్వరరావు, నంబూరి నరసింహారావు, నల్లమోతు సుబ్బారావు, దుద్దుకూరు భాస్కరరావు, భీమా లీలా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
కాలుదువ్వితే బహుమతి కొట్టేస్తాయి!
నాదెండ్ల: ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీల్లో పల్నాడు జిల్లా ఎడ్ల జత తెలంగాణలోనూ సత్తాచాటాయి. మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మేళ్ళచెరువులో ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించారు. బుధవారం న్యూకేటగిరి విభాగంలో జరిగిన పోటీల్లో 13 ఎడ్ల జతలు పాల్గొనగా, పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం ఇర్లపాడు గ్రామ సర్పంచ్ మంగు రమాదేవి ఎడ్ల జత 5,367 అడుగుల దూరం లాగి ప్రథమ స్థానం కై వసం చేసుకున్నాయి. ఎడ్ల యజమానులు రమాదేవి, ఏడుకొండలు రూ.90 వేలు నగదు, షీల్డును నిర్వాహకుల నుండి అందుకున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ జరిగిన పోటీల్లో పాల్గొన్న ప్రతిసారి ప్రథమస్థానం సాధిస్తూ విజయపరంపర కొనసాగించింది. ఇప్పటి వరకూ రెంటచింతల, దుర్గి, నాదెండ్లలో జరిగిన పోటీల్లో న్యూకేటగిరి విభాగంలో ప్రథమస్థానంలో నిలిచాయి. గురువారం తెలంగాణ మంచిర్యాలలో జరుగుతున్న న్యూకేటగిరి విభాగంలో పాల్గొననున్నాయి. తెలంగాణలో బలంచూపిన పల్నాడు ్ల ఎడ్లజత -
నేటి ప్రగతికి దారి !
బాపట్లగురువారం శ్రీ 19 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026నాటి చొరవ..● వాడరేవు – పిడుగురాళ్ల జాతీయ రహదారితో మారనున్న ముఖ చిత్రం ● బాపట్ల జిల్లాకు మహర్దశ తీసుకువచ్చేలా ముమ్మరంగా రోడ్డు నిర్మాణ పనులు ● రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రాంతాల మధ్య భారీగా తగ్గనున్న దూరం ● గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షం Iగత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వాడరేవు–పిడుగురాళ్ల జాతీయ రహదారి ఏర్పాటుకు ఆమోదం తెలపడంతో పాటుగా రూ.667 కోట్లు నిధులను కూడా విడుదల చేయించారు. ఈ రోడ్డు వాడరేవు నుంచి పర్చూరు, చిలకలూరిపేట, నరసరావుపేట మీదుగా నకరికల్లు అడ్డరోడ్డు వరకు 81.5 కిమీ మేర రహదారిని వెడల్పు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. నాటి సీఎం వైఎస్ జగన్ తీసుకున్న చొరవపై , ఆయన ముందుచూపుతో నేడు అభివృద్ధి కొనసాగుతోందని సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో బుధవారం క్వింటా నిమ్మ కాయలు కనిష్ట ధర రూ.7000, గరిష్ట ధర రూ.8600, మోడల్ ధర రూ.8000 వరకు పలికింది. విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ మట్టం బుధవారం 539.60 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 20,207 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. మంగళగిరి టౌన్ : ఈ నెల 21న జరగనున్న మంగళగిరి భద్రావతి సమేత భావనాఋషి స్వామివార్ల కల్యాణ మహోత్సవం ఆహ్వాన పత్రికను బుధవారం ఆవిష్కరించారు. -
డ్రగ్స్ మహమ్మారిని తరిమికొడదాం
తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ జాయింట్ కమిషనర్ శ్రీ లీల తెనాలి టౌన్: మాదకద్రవ్యరహిత సమాజ నిర్మాణంలో ప్రభుత్వం చేస్తున్న కృషిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ జాయింట్ కమిషనర్ యడ్ల శ్రీలీల సూచించారు. రూరల్ మండలం కొలకలూరు గ్రామంలో శ్రీ భారత్ ఫౌండేషన్, ఎకై ్సజ్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత గ్రామంలో విద్యార్థులతో కలిసి ర్యాలీని నిర్వహించారు. అనంతరం గ్రామ పురవేదిక వద్ద ఏర్పాటు చేసిన సభలో జీఎస్టీ జాయింట్ కమిషనర్ యడ్ల శ్రీలీల మాట్లాడారు. డ్రగ్స్ మహమ్మారి దేశ యువతను నిర్వీర్యం చేస్తుందని అన్నారు. వాటి నిర్మూలనకే ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. ఎకై ్సజ్ సూపరిండెంట్ వి.అరుణ కుమారి మాట్లాడుతూ, ప్రజా చైతన్యం తోనే మత్తు పదార్ధ రహిత సమాజాన్ని నిర్మించుకోగలమని అన్నారు. ఏఈఎస్ మారయబాబు మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి విక్రయాలు, సేవనం వివరాలు తెలిస్తే 1972 టోల్ ఫ్రీ నెంబర్కు తక్షణమే సమాచారం ఇవ్వాలని కోరారు. పొన్నెకంటి చక్రవర్తి వ్యాఖ్యాతగా వ్యవహరించిన సభలో తెనాలి ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ కె.వి.చలం, ఎకై ్సజ్ ఈగల్ ఎస్ఐ సునీల్, ఏపీ అసోసియేషన్ సైకాలజిస్ట్ డాక్టర్ కె.శ్రీనివాస్, తన్నీరు కళ్యాణ్ కుమార్, నవజీవన్ బాల భవన్ నిర్వాహకురాలు కవిత, స్క్వేర్డ్ ఇన్స్పెక్టర్ నారాయణ తార, యడ్ల శ్రీధర్, గూడూరు చంద్రం, వల్లూరు అజయ్, గ్రామ మాజీ సర్పంచ్ వల్లూరు వరప్రసాద్, విశ్రాంత ఉపాధ్యాయులు తన్నీరు సుబ్బారావు, ‘చిన్నారి స్నేహం‘ మిత్ర మండలి సభ్యులు పాల్గొన్నారు.


