breaking news
Bapatla District Latest News
-
కక్షపూరితంగా తొలగించారు
పెదకూరపాడు : తనను కక్షపూరితంగా తొలగించారని శ్రీ సత్యసాయి స్వయం సహాయక సంఘ సభ్యురాలు మైనేని స్రవంతి వాపోయారు. తన భర్త మైనేని ప్రతాప్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. పల్నాడు జిల్లా పార్టీ యువజన విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నారని కక్షపూరితంగా తనను శ్రీ సత్య సాయి స్వయం సహాయక సంఘం నుంచి అన్యాయంగా తొలగించారని వాపోయారు. ఈ మేరకు మండలంలోని లగడపాడు గ్రామానికి చెందిన మైనేని స్రవంతి తహసీల్దార్ ధనలక్ష్మికి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. గత పది సంవత్సరాల నుంచి సంఘం సభ్యురాలుగా నిబద్ధతతో వ్యవహరించానని తెలిపారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను క్రమం తప్పకుండా చెల్లింపులు చేశానని, తాము వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నామని తొలగించడం దారుణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. స్వయం సహాయక సంఘాలపై కూడా రాజకీయాలు ఏమిటని ఆమె ప్రశ్నించారు. సంబంధిత అధికారులు విచారణ చేపట్టి న్యాయం చేయాలని స్రవంతి కోరారు. శ్రీ సత్యసాయి స్వయం సహాయక సంఘ సభ్యురాలు మైనేని స్రవంతి వైఎస్సార్ సీపీలో క్రియాశీలకంగా భర్త వ్యవహరిస్తున్నారని కక్ష -
గ్రానైట్ లారీలు స్వాధీనం
కారెంపూడి: గ్రానైట్ లోడ్తో వెళ్తున్న ఎనిమిది లారీలను వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తనిఖీలు చేసి సరైన బిల్లులు లేకపోవడంతో వాటిని కారెంపూడి పోలీస్స్టేషన్ అధికారులకు ఆదివారం రాత్రి అప్పగించారు. ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా అక్రమంగా గ్రానైట్ను తరలిస్తున్నారని గుర్తించిన అధికారులు లారీలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా చీమకుర్తి నుంచి గ్రానైట్తో లారీలు మహారాష్ట్రకు వెళ్తున్నాయి. వాటిలో సరుకు విలువను బట్టి ఒక్కొక్క లారీకి రూ.2.5 లక్షల దాకా జరిమానా విధించే అవకాశం ఉందని ఆ శాఖ అధికారి ఒకరు తెలిపారు. నరసరావుపేట రహదారిలో జూలకల్లు సమీపంలోను, కారెంపూడి సమీపంలోను కొన్ని లారీలను అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.జీజీహెచ్లో నకిలీ డాక్టర్ హల్చల్పోలీసులకు పట్టించిన సూపరింటెండెంట్గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ పిల్లల వైద్య విభాగంలో డాక్టర్ మాదిరిగా ఓ మహిళ యాప్రాన్, సెతస్కోప్ ధరించి చికిత్సలు చేసేందుకు హడావుడి చేయడంతో పట్టుపడిపోయింది. గుంటూరుకు చెందిన జ్యోతి గతంలో పిల్లల విభాగంలో తన పిల్లలకు చికిత్స చేయించేందుకు కొన్ని రోజులపాటు ఉంది. రెండు రోజులుగా ఆసుపత్రిలో డాక్టర్ మాదిరిగా రౌండ్స్ వేస్తూ పిల్లలకు చికిత్స చేసేందుకు హడావుడి చేస్తుండటంతో వార్డుల్లో తనిఖీలు చేస్తున్న ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణకు అనుమానం వచ్చి ఆరా తీశారు. ఆమో పొంతనలేని సమాధానాలు చెప్పడంతో తక్షణమే పోలీసులకు అప్పజెప్పారు. ఆమె వెంట మరో వ్యక్తి ఉండి అచ్చం డాక్టర్ మాదిరిగా వార్డులో హడావుడి చేస్తున్నాడని, ఆకృత్యాలకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉండటంతో తక్షణమే పోలీసులకు అప్పగించినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ రమణ తెలిపారు.రూ.లక్షల్లో యూనివర్సిటీ ఫీజులుమంగళగిరి టౌన్: అమరావతి రాజధాని పరిధిలో వున్న పలు యూనివర్సిటీల్లో ఫీజులు రూ.లక్షల్లో ఉంటున్నాయని, కానీ వసతులు అంతంతమాత్రంగా ఉన్నాయని, పేరు గొప్ప.. ఊరు దిబ్బగా అవి ఉంటున్నాయని సీపీఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వై.నేతాజీ ఎద్దేవా చేశారు. మంగళగిరి నగర పరిధిలోని సీపీఎం కార్యాలయంలో సోమవారం రాత్రి పట్టణ కమిటీ సమావేశం నిర్వహించారు. నేతాజీ మాట్లాడుతూ అమరావతి రాజధాని పరిధిలో విట్, ఎస్ఆర్ఎం, ఇతర యూనివర్సిటీలలో విద్యార్థులు రూ.లక్షలు ఫీజులు చెల్లించి చదువుకుంటున్నారని, వారికి మాత్రం నాణ్యత లేని అపరిశుభ్రమైన ఆహారాన్ని అందిస్తున్నారని విమర్శించారు. 15 రోజుల క్రితం విట్ యూనివర్సిటీలో ఆహారం సరిగా లేదంటూ విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళన చేశారని, అది మరువక ముందే ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారంటూ విద్యార్థులు ఆందోళనకు దిగడం యాజమాన్యాల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆహార పదార్థాలను తనిఖీ చేసే అధికారులను నియమించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పూలింగ్ చట్టంలో ఉన్న విధంగా రాజధానిలో నిర్మించిన విశ్వవిద్యాలయాల్లో ఆ ప్రాంత విద్యార్థులకు రాయితీలు అమలు చేయాల్సి ఉన్నప్పటికీ అమలు కావడం లేదని విమర్శించారు. ఇప్పటికై నా ఆయా యూనివర్సిటీల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని నేతాజీ డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా నాయకులు ఎస్ఎస్ చెంగయ్య, పట్టణ కార్యదర్శి వీవీ జవహల్ లాల్, సీనియర్ నాయకులు జేవీ రాఘవులు, పట్టణ కార్యదర్శివర్గ సభ్యులు కమలాకర్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం
బాపట్ల: ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించే దిశగా అధికారులు బాధ్యతతో పని చేయాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. కొన్నింటికి తక్షణమే పరిష్కార మార్గం చూపించారు. కొన్నింటిని సంబంధిత శాఖ అధికారులకు అందించారు. ప్రతి సమస్యను చిత్తశుద్ధితో తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పత్రికల్లో వచ్చిన వార్తలపై ఆరా పత్రికల్లో ప్రచురితమైన ప్రతికూల వార్తలపై జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ప్రశ్నించారు. వాటిపై వారు వివరణ ఇచ్చారు. ప్రతి గురువారం ఐవీఆర్ఎస్ ద్వారా సేకరించిన ప్రజాభిప్రాయాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీక్షణ సమావేశం నిర్వహిస్తారన్నారు. దీనికి సంబంధిత అధికారులంతా నివేదికలతో హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజాభిప్రాయ సేకరణలో జిల్లాను ప్రథమ స్థానంలో ఉంచే విధంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. చెత్తను తగలబెడితే చర్యలు గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను డంపింగ్ యార్డులకు పంపకుండా వాటిని తగలబెట్టి పర్యావరణాన్ని కాలుష్యం చేస్తున్నారని కలెక్టర్ తెలిపారు. సేకరించిన తడి, పొడి చెత్తలను డంపింగ్ యార్డ్లో మాత్రమే ఉంచాలని, వాటిని ఎప్పటికప్పుడు జిందాల్ పరిశ్రమకు తరలించాలని ఆదేశించారు. చెత్తను రోడ్లకు ఇరువైపులా వేయడం, కాల్వలలో, కుంటల్లో పడవేయడం, తగులబెట్టడం చేస్తున్న గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కౌలు రైతులకు సహకరించాలి జిల్లాలో కౌలు రైతులందరికీ సీసీఆర్సీ కార్డులు ఇచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. కార్డులు పొందిన రైతులకు రుణాల మంజూరులో బ్యాంకర్లు సహకరించడం లేదని పేర్కొన్నారు. గ్రామ, మండల, జిల్లాస్థాయిలో బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహించి రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలని ఆయన డీఏఓ, ఆర్డీఓ, ఎంఏఓలను ఆదేశించారు. డ్రోన్ల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని, దాన్నుంచి మాత్రమే కొనుగోలు చేయాలని, రాయితీ కూడా లభిస్తుందని తెలిపారు. ఇతర కంపెనీల నుంచి కొనుగోలు చేయకూడదని స్పష్టం చేశారు. డ్రోన్లు అవసరమైన ప్రభుత్వ శాఖలు ప్రతిపాదనలను తయారు చేసి జేసీకి అందజేయాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఇన్చార్జి సంయుక్త కలెక్టర్ జి. గంగాధర్గౌడ్, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, బాపట్ల రెవెన్యూ డివిజన్ అధికారి గ్లోరియా, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అధికారులకు కలెక్టర్ జె.వెంకట మురళి ఆదేశం -
బాధితుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
బాపట్లటౌన్: బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా ఎస్పీ తుషార్డూడీ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 57 మంది బాధితులు వచ్చి తమ సమస్యలను ఎస్పీకి వివరించారు. ఎస్పీ మాట్లాడుతూ అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సత్వరమే పరిష్కరించాలన్నారు. అర్జీలను చట్ట పరిధిలో వేగవంతంగా విచారించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. అర్జీదారుల సమస్యను పరిష్కరించడానికి తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి పంపాలన్నారు. ఈ కార్యక్రమంలో సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్ నాయక్, పి.జి.ఆర్.ఎస్ సెల్ ఎస్ఐ ఏ.నాగేశ్వరరావు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ తుషార్డూడీ 57 మంది బాధితుల నుంచి అర్జీల స్వీకరణ -
మంత్రి ఎదుటే తమ్ముళ్ల బాహాబాహి
జే.పంగులూరు: నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. మంత్రిగారి ఇలాఖాలో పార్టీని ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఏకంగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ముందే బాహాబాహికి దిగారు. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం పంగులూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ చేశారు. కార్యక్రమం జరుగుతుండగా నూజిళ్లపల్లి గ్రామానికి చెందిన రెండు తెలుగుదేశం పార్టీ గ్రూపులు మంత్రి ఎదుట బాహాబాహీకి దిగాయి. గ్రామంలో ఆధిపత్యం కోసం గొడవడ్డారు. ఈ క్రమంలో ఒకరినొకరు తోసుకుంటుండగా మంత్రి కలుగజేసుకొని, సర్ది చెప్పారు. అయినా కూడా నేతలు వినలేదు. కార్యక్రమం అనంతరం మంత్రి వెళ్లగానే మళ్లీ గొడవకు దిగారు. ఈ తతంగాన్ని చూసి అక్కడ ఉన్న ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామపెద్దలు నివ్వెరపోయారు. ఆఖరుకు పాఠశాలలో కూడా పార్టీ గోల ఏమిటని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉన్న నాయకులు కల్పించుకొని సర్ది చెప్పారు. పులిచింతలకు 3,41,297 క్యూసెక్కులు విడుదల సత్రశాల(రెంటచింతల): మండలంలోని సత్రశాల వద్ద నున్న నాగార్జునసాగర్ టెయిల్పాండ్ విద్యుత్ ప్రాజెక్టు రిజర్వాయర్ నుంచి 19 క్రస్ట్గేట్లు ద్వారా 3,41,297 క్యూసెక్కులు పులిచింతలకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఎస్ఈ వెంకటరమణ, ఈఈ సుబ్రమణ్యం సోమవారం తెలిపారు. టెయిల్పాండ్ రిజర్వాయర్ నిండుకుండలా ఉందన్నారు. టెయిల్పాండ్ ప్రాజెక్టు రిజర్వాయర్ 19 క్రస్ట్గేట్లు 3.50 మీటర్లు ఎత్తు ఎత్తి 3,41,297 క్యూసెక్కులు దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్కు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు నీటి మట్టం 75.50 మీటర్లకు గాను 74.47 మీటర్లకు నీరు చేరుకుందన్నారు. రిజర్వాయర్ గరిష్ట సామర్థ్యం 7.080 టీఎంసీలకుగాను ప్రస్తుతం 6.389 టీఎంసీలు ఉందన్నారు. టీఆర్సీ లెవల్ 62.08 మీటర్లకు చేరుకుందన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోని రెండు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు వెల్లడించారు. నాగార్జునసాగర్ నుంచి వచ్చే వరదను బట్టి దిగువనున్న పులిచింతలకు నీటిని విడుదల చేస్తామని తెలిపారు. సత్తెనపల్లి: అత్యంత పురాతన ప్రభుత్వ రంగ సంస్థ పోస్టల్. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ప్రారంభమైన తపాలా వ్యవస్థ ఇప్పటికీ పటిష్టంగా కొనసాగుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్త పుంతలు తొక్కుతోంది. సంస్కరణల్లో భాగంగా ‘రిజిస్టర్ పోస్టు’ సర్వీసుకు స్వస్తి పలికింది. 171 ఏళ్లు సేవలందిస్తున్న రిజిస్టర్ పోస్టు సర్వీసును ఆగస్టు 30తో నిలిపివేశారు. దీనిని స్పీడ్ పోస్ట్లో విలీనం చేశారు. దేశవ్యాప్తంగా నడుస్తున్న పోస్టల్ కార్యాలయాల్లో ఈ విధానం అమల్లోకి వచింది. ఇప్పటికే పోస్టల్ వినియోగదారులకు నాణ్యమైన సులభతరమైన సేవలు అందించ టానికి నూతన సాఫ్ట్వేర్ను అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే రిజిస్టర్ పోస్టు సేవలకు సెలవు ప్రకటించారు. ఈ సేవలను రద్దుచేసి స్పీడ్ పోస్ట్ ద్వారా స్థానికంగా అయితే అదే రోజు, ఇతర ప్రాంతాలకు మరుసటి రోజు చేరే విధంగా చర్యలు చేపడు తున్నారు. దీంతో పౌర సేవలు వేగవంతం సులభతరం అవుతాయని తపాలా శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ ఒకటి నుంచి స్పీడ్ పోస్ట్ విధానం మాత్రమే అందుబాటులోకి రానుంది. -
రాష్ట్రస్థాయి ఫెన్సింగ్లో పందిళ్లపల్లి విద్యార్థి ప్రతిభ
వేటపాలెం: రాష్ట్రస్థాయి ఫెన్సింగ్లో పందిళ్లపల్లి విద్యార్థి ప్రతిభ చాటాడు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎం యతిన్ కార్తికేయ రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి కాంస్య పతకం సాధించాడని హెచ్ఎం తలమల దీప్తి సోమవారం తెలిపారు. ఈ నెల 29, 30వ తేదీల్లో భీమవరంలో 11వ రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీలు నిర్వహించారని పేర్కొన్నారు. హెచ్ఎం మాట్లాడుతూ విద్యార్థులు చదువులతోపాటు క్రీడల్లో రాణిస్తున్నారన్నారు. భవిష్యత్లో ఇదే స్ఫూర్తితో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కర్ణ నాగేశ్వరరావు, తోట వెంకటేశ్వర్లు, స్టాఫ్ సెక్రటరీ బుద్ధి మోహన్రావు, లలితా పరమేశ్వరి, శ్రీనివాసరావు, భవానీ దేవి, సూర్యనారాయణ, బ్రహ్మయ్య, ప్రసన్నాంజనేయులు, రాజా పాల్గొన్నారు. -
భర్త నుంచి ప్రాణహాని
నాకు తొమ్మిదేళ్ల కిందట కాకుమాను మండలం కొండపాటూరు గ్రామానికి చెందిన మామిడి పవన్తో వివాహం జరిగింది. నాకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెళ్లి సమయంలో మా తల్లిదండ్రులు కట్నం, బంగారం ఇచ్చారు. పెళ్లి అయిన తర్వాత బిజినెస్ చేస్తానంటే భర్త మాటలు నమ్మాను. నా పేరుతో ఉన్న దస్తావేజులను బ్యాంకులో పెట్టి రూ.5 లక్షలు అప్పు తీసుకొచ్చి ఇచ్చాను. డబ్బులు తీసుకొని వెళ్లిపోయాడు. ప్రతినెలా బ్యాంకుకు ఈఎంఐ చెల్లిస్తానని చెప్పి చెల్లించడం లేదు. ఇదేమని అడిగితే నిన్ను చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడు. నాకు భర్త వల్ల ప్రాణహాని ఉంది. రక్షణ కల్పించాలి. – మామిడి దీపిక, పేరలి, కర్లపాలెం మండలంమా గ్రామానికి చెందిన కారంపూడి శివనాగమల్లేశ్వరరావు, ఆయన భార్య దుర్గామల్లీశ్వరి, కారంపూడి ఈశ్వర్కుమార్, ఆయన భార్య కరుణలు నాపై అకారణంగా తరచూ దాడులు చేస్తూ నిత్యం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీనిపై ఆధారాల సహా ఆగస్టు 19న భట్టిప్రోలు ఎస్ఐకి ఫిర్యాదు చేశాను. పది రోజులైనా ఎస్ఐ నా కేసు గురించి పట్టించుకోవడం లేదు. స్టేషన్కు వెళితే అసలు సమాధానం చెప్పడం లేదు. – చిలకాల సాంబ్రాజ్యం, భట్టిప్రోలు ● -
ఎయిడెడ్ అధ్యాపకుల జీవితాల్లో వెలుగులు నింపిన మాణిక్యరావు
చిలకలూరిపేట: ఎయిడెడ్ అధ్యాపకుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత దివంగత ఎంజే మాణిక్యరావుకు దక్కుతుందని మాజీ ఎమెల్సీ కేఎస్ లక్ష్మణరావు చెప్పారు. పూర్వ ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుడు, ఆక్టా నాయకుడు దివంగత ఎంజే మాణిక్యరావు శతజయంతిని పట్టణంలోని రోటరీ కమ్యూనిటీ హాలులో రిటైర్డ్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఉద్యోగభద్రత లేక బానిసల మాదిరి జీవితాలు గడుపుతున్న ఎయిడెడ్ కళాశాల లెక్చరర్ల జీవితాలను చూసి 1972లో రాష్ట్ర వ్యాప్త సమ్మె పిలుపునిచ్చారని తెలిపారు. సమ్మె ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎయిడెడ్ కళాశాలల అధ్యాపకులకు ఉద్యోగభద్రత, పెన్షన్ విధానం గవర్నమెంట్ లెక్చరర్లతో సమానంగా లభించాయని తెలిపారు. కార్యక్రమంలో ఎంజే మాణిక్యరావు మెమో రియల్ కమిటీ కార్యదర్శి డాక్టర్ మోజస్, రిటైర్డ్ కాలేజ్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శు లు కేవీ కృప్ణారావు, జీఆర్కే రెడ్డి, జీవీ రాఘవులు, తోటకూర వెంకటనారాయణ, టి వెంకటేశ్వరరావు, ఎం లక్ష్మీనారాయణ, పీఎస్వీ ప్రసాద్, కె రామారావు, ఆళ్ల వేమనరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు -
పొదుపు మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యం
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి బాపట్ల: పొదుపు మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. డీఆర్డీఏ ద్వారా పాడి గేదెల పెంపకం యూనిట్ల అమలు తీరుపై సోమవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పొదుపు మహిళలకు పాడి గేదెలు ఇవ్వడం ద్వారా పాల ఉత్పత్తి పెరిగి, ఆర్థిక అభివృద్ధిలోకి పయనిస్తారని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 70 వేల కుటుంబాలకు జీవనోపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 16వేల పొదుపు సంఘాలకు గేదెలు, మేకలు, గొర్రెలు యూనిట్లు స్థాపించాలన్నారు. మిగిలిన వారికి పౌల్ట్రీ, గడ్డి నాటడం వంటి యూనిట్లు మంజూరు చేయాలని ఆదేశించారు. డ్వాక్రా మహిళలు స్వయం ఉపాధితో లక్షాధికారులను చేయాలని ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వీటిల్లో ప్రధానంగా 12,500 గేదెల పెంపకం యూనిట్లు స్థాపించాలని చెప్పారు. ఈ యూనిట్లను స్థాపించడానికి సామాజిక పెట్టుబడి నిధి, శ్రీనిధి, ఉన్నతి పథకం, బ్యాంకు లింకేజీ ద్వారా రుణ సదుపాయం కల్పించాలని తెలిపారు. శ్రీనిధి కింద ఇప్పటికే రూ.260 కోట్ల రుణాలు జిల్లాకు కేటాయించినట్లు వివరించారు. ఇప్పటివరకు 72 గేదెల యూనిట్లను లబ్ధిదారులకు అందించామన్నారు. 25 అరకు కాఫీ సెంటర్లు జిల్లాలో ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. అద్దంకి నియోజకవర్గంలో 2,500 గేదెల యూనిట్లు, పర్చూరులో మూడువేల యూనిట్లు, చీరాలలో వెయ్యి యూనిట్లు, బాపట్లలో 1500, రేపల్లెలో 2000, వేమూరులో 2500 యూనిట్లు సమర్పించాలని లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. డిసెంబర్ చివరి నాటికి లక్ష్యాలు పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వేణుగోపాల్, ఎల్డీఎం శివకృష్ణ పాల్గొన్నారు. పింఛన్ల పంపిణీ సక్రమంగా చేపట్టాలి పింఛన్లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అన్నారు. బాపట్ల మండలం ఈతేరు గ్రామంలో ఆయన సోమవారం పింఛన్లు పంపిణీ చేశారు. సిబ్బంది సక్రమంగా పంపిణీ చేస్తున్నారా.. లేదా ?అంటూ లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. పింఛన్ల పంపిణీపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఇద్దరు వితంతు, వృద్ధులు, మంచం పట్టిన వారికి కలెక్టర్ చేతుల మీదుగా పింఛన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, ఆర్డీవో గ్లోరియా, తహసీల్దార్ సలీమా, తదితరులు పాల్గొన్నారు. -
ఎకై ్సజ్ అధికారిపై వేటు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: జిల్లాకు కేటాయించిన 19 బార్లకు మద్యం వ్యాపారులతో దరఖాస్తులు వేయించలేదన్న సాకుతో ఎకై ్సజ్ ఉన్నతాధికారులు బాపట్ల జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి వెంకటేశ్వర్లుపై వేటు వేశారు. కమిషనరేట్లో రిపోర్టు చేయాలంటూ సోమవారం ఆదేశించారు. దీంతో ఆయన హుటాహుటిన కమిషనరేట్లో రిపోర్టు చేశారు. ఆయన స్థానంలో ప్రకాశం జిల్లా ఎకై ్సజ్ అధికారి ఎస్కే. ఆయేషా బేగంను బాపట్ల ఇన్చార్జి ఎకై ్సజ్ అధికారిగా నియమించారు. దీంతో ఆమె సోమవారమే విధుల్లో చేరారు. ఈ వ్యవహారం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. ఎకై ్సజ్ అధికారిపై వేటు వేయడంపై ఆ శాఖ ఉద్యోగుల్లో ఆందోళనతో పాటు ఆగ్రహం వ్యక్తమవుతోంది. సిండికేట్గా మారిన వ్యాపారులు పచ్చ బ్యాచ్తో కూడిన మద్యం వ్యాపారులు సిండికేట్గా మారారు. బార్ల లైసెన్సు, దరఖాస్తు ఫీజులను తగ్గించుకునేందుకు దరఖాస్తులు వేయకుండా బెదిరింపులకు దిగారు. ఎకై ్సజ్ అధికారులు మొరపెట్టుకున్నా కనికరించలేదు. దీంతో బాపట్ల జిల్లాలోని బార్లకు నామమాత్రంగా కూడా దరఖాస్తులు పడలేదు. జిల్లాలో 17 జనరల్ కేటగిరీలో బార్లను మంజూరు చేయగా గీత కార్మికులకు మరో రెండు బార్లు కేటాయించారు. మొత్తం 19 బార్లకు గాను గీత కార్మికుల రెండు బార్లతోపాటు చీరాల, అద్దంకిల పరిధిలోని మరో రెండు బార్లకు మాత్రమే పూర్తిస్థాయిలో దరఖాస్తులు వేశారు. మిగిలిన 15 బార్లకు ఒక్క దరఖాస్తు కూడా పడలేదు. దీంతో ఆగ్రహం చెందిన ఎకై ్సజ్ కమిషనరేట్ బాపట్ల జిల్లా ఎకై ్సజ్ అధికారి విఫలమయ్యాడన్న సాకుతో ఆయన్ను సోమవారం కమిషనరేట్లో రిపోర్టు చేయాలని ఆదేశించినట్లు సమాచారం. మద్యం వ్యాపారులు బార్లకు దరఖాస్తులు వేయకపోతే ఉన్నతాధికారులు జిల్లా ఎకై ్సజ్ అధికారిపై వేటు వేయడంపై సిబ్బంది నుంచి విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. -
దివంగత వైఎస్ పాలనలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: ప్రత్యర్థులు సైతం శభాష్ అనిపించేలా పాలన సాగించిన దివంగత మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి 2009 సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. భౌతికంగా దూరమైనా ఆయన ఇప్పటికీ తెలుగుజనం గుండెల్లో గుడి కట్టుకొన్నారు. ఆయన వారసుడిగా వైఎస్.జగన్మోహన్రెడ్డి గడచిన అయిదేళ్లు జనరంజక పాలన సాగించారు. అమ్మ ఒడి, రైతు భరోసా, ఉచిత పంటల బీమా, గిట్టుబాటు ధరలతో పాటు వందలాది సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందించి జనం మన్ననలు పొందారు. పేదల గుండెల్లో గూడు కట్టుకున్న దేవుడు పేదల గుండెల్లో గూడుకట్టుకున్న దేవుడు దివంగత వైఎస్.రాజశేఖరరెడ్డి వర్థింతి వేడుకలు మంగళవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరగనున్నాయి. ఇందుకోసం వైఎస్సార్ సీపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఈ సందర్భంగా అన్ని నియోజకవర్గాల్లో దివంగతనేత విగ్రహాలకు క్షీరాభిషేకాలు నిర్వహించి పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నారు. అన్నదానాలు, రక్తదాన శిబిరాలను నిర్వహిస్తారు. ఆస్పత్రుల్లో రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేయనున్నారు. వాడవాడలా వైఎస్ వర్థంతి కార్యక్రమాలు ఘనంగా జరగనున్నాయి. వైఎస్సార్ కాంగ్రె స్పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలతోపాటు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున పాల్గొననున్నారు. బాపట్ల జిల్లా అభివృద్ధికి కృషి జిల్లాకు వైఎస్ చేసిన మేలును జనం మరోమారు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన పాలనలో బాపట్ల ప్రాంత అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలు చేపట్టారు. అద్దంకి ప్రాంత అభివృద్ధి కోసం పెద్దఎత్తున పనులు చేపట్టారు. జలయజ్ఞంలో భాగంగా రూ. 70 కోట్లతో భవనాశి రిజర్వాయర్, రూ. 175 కోట్లతో ఎర్రం చినపోలిరెడ్డి పథకంతో పాటు కొరిశపాడు ఎత్తిపోతల పథకాలను చేపట్టారు. రూ. 1100 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో మేదరమెట్ల నుంచి నార్కెట్పల్లి వరకూ జాతీయరహదారిని నిర్మించారు. ఒంగోలు ప్రాంతంనుంచి హైదరాబాద్కు దగ్గర దారిని ఏర్పాటు చేసిన ఘనత దివంగత నేత వైఎస్దే. -
నిమజ్జనంలోనూ కూటమి రాజకీయ కుట్ర
చుండూరు(వేమూరు) : కూటమి నేతలు రాజకీయ కుట్రతో వినాయకుడి నిమజ్జనంలోనూ వైఎస్సార్ సీపీ సానుభూతిపరులపై దాడి చేశారు. చుండూరు మండలంలోని కేన్పల్లిలో ఆదివారం నిర్వహించిన విగ్రహాం ఊరేగింపులో కూటమి నాయకులు రోడ్డు వద్ద కాపు కాసి దాడులకు పాల్పడ్డారు. కూటమి నాయకుల నుంచి తమకు ప్రాణ రక్షణ కల్పించాలని బాధితులు సోమవారం రేపల్లె డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. కూటమి నాయకులకు చుండూరు సీఐ శ్రీనివాసరావు పూర్తిగా కొమ్ము కాయడంతో దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దాడుల్లో నష్టపోయామంటూ ఏడు కుటుంబాలు కలసి సీఐ, కూటమి నాయకులపై సోమవారం ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలని కోరారు. సర్పంచ్ హత్యకు కుట్ర గ్రామ సర్పంచ్ అంగిరేకుల నాగేశ్వరరావు మాట్లాడుతూ కేన్పల్లిలో వైఎస్సార్ సీపీ ప్రాబల్యం ఎక్కువుగా ఉందని, పార్టీ లేకుండా చేసేందుకు తనను హత్య చేసేందుకు కూటమి నాయకులు కుట్రలో భాగంగా దాడి చేసినట్లు ఆరోపించారు. విగ్రహం వద్ద వైఎస్సార్ సీపీ జెండాలు ఉండటంతో సీఐ శ్రీనివాసరావు పిలిపించారని, జెండాలు, పాటలు పెట్టితే బెయిల్ రాకుండా కేసులు నమోదు చేస్తామని భయభ్రాంతులకు గురి చేశారని తెలిపారు. విగ్రహం తీసుకొని వెళుతుండగా కొత్తపల్లి గ్రామం వద్ద గుమ్మ రఘు వర్గీయులు రోడ్డుకు అడ్డంగా బైక్లు పెట్టారని వివరించారు. బైక్ తీయాలని అడిగితే రఘు వర్గీయులు చుండూరు గ్రామానికి చెందిన బాలకోటిరెడ్డికి ఫోన్ చేసి చెప్పారని తెలిపారు. ఆయన మూడు కారుల్లో కొంత మంది వ్యక్తులను తీసుకొని వచ్చి ట్రాక్టరులో ఉన్న మహిళలపై దాడులు చేశారని నాగేశ్వరరావు ఆరోపించారు. మెడలో ఉన్న బంగారం కూడా లాక్కొన్నారని చెప్పారు. సీఐ శ్రీనివాసరావు కూటమి నాయకులకు వత్తాసు పలకడంతో బాలకోటిరెడ్డి తనను హత్య చేసేందుకు ప్రయత్నం చేశారని, దాన్నుంచి తప్పించుకున్నట్లు ఆరోపించారు. సీఐ వల్ల వైఎస్సార్ సీపీ నాయకులకు ప్రాణ హాని ఉందని, రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు బాధితులు పాల్గొన్నారు.వైఎస్సార్ సీపీ సానుభూతిపరులపై దాడి -
గోవా సంస్కృతి బాపట్లకు తేవద్దు !
బాపట్ల టౌన్: పర్యాటకం, అధ్యాత్మికంగా ఎంతో ప్రసిద్ధి చెందిన సూర్యలంక తీరంలో గోవా తరహాలో విష సంస్కృతి తీసుకు వస్తే చూస్తూ ఊరుకునేది లేదని శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామిజీ తెలిపారు. పట్టణంలోని విశ్వహిందూ పరిషత్ స భ్యుడు ప్రతాప్కుమార్ నివాసంలో సోమవారం వి లేకరులతో మాట్లాడారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ నెల 14న హిందూ న్యాయవాదుల ధర్మ సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హిందూ న్యాయవాదులను ఆహ్వానించే కార్యక్రమంలో భాగంగా సోమవారం బాపట్లకు వచ్చారు. శివ స్వామీజీ మాట్లాడుతూ ఇటీవల వార్తల్లో బాపట్ల సూర్యలంక సముద్రతీరాన్ని మినీ గోవా తరహాలో అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటనలు వచ్చాయని, వాటిని చూసి చాలా బాధ కలిగిందని తెలిపారు. సహజసిద్ధంగా ఏర్పడిన సూర్యలంక తీరం అటు పర్యాటకంగా, ఇటు అధ్యాత్మికంగా ఎంతో అభివృద్ధి చెందిన ప్రాంతమని పేర్కొన్నారు. కార్తిక మాసంలో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తీరానికి లక్షల్లో తరలి వస్తున్నారని పేర్కొన్నారు. పుణ్య స్నానాలు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు వీలుగా తీరంలో తారకేశ్వరస్వామి, ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆధ్యాత్మికంగా ఉన్న ప్రాంతంలో విష సంస్కృతికి బీజాలు నాటే నిర్ణయాలను తిప్పికొడుతామని చెప్పారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, తీరంలో చెడు సంస్కృతి అవకాశం లేకుండా చేస్తామని తెలిపారు. అప్పటికీ మారకపోతే న్యాయపోరాటం చేయటానికై నా వెనుకాడేది లేదని స్వామీజీ స్పష్టం చేశారు. సమావేశంలో విశాఖపట్టణం అడ్వకేట్ కె. రవిశంకర్, బాపట్ల బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు విన్నకోట సత్యప్రసాద్ పాల్గొన్నారు. శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ సూర్యలంక తీరం అధ్యాత్మికం, పర్యాటకంగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం విష సంస్కృతికి బీజాలు అడ్డుకునేందుకు పోరాటం -
దారుణ పాశం..!
అప్పు సులభంగా ఇస్తున్నారని యాప్లతో మోసపోతున్న యువత జె.పంగులూరు: అవసరాలు కావచ్చు.. జల్సాలు చేయడానికి కావచ్చు.. కారణమేదైనా లోన్ యాప్ల ట్రాప్లో పడుతున్న యువత జీవితాలను నాశనం చేసుకుంటోంది. ఎలాంటి దస్తావేజులతో పనిలేదు... ప్రాంశరీ నోట్లపై సంతకాలు కూడా అవసరం లేదు... యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో వివరాలు నమోదు చేస్తే చాలు... చిటికెలో అప్పు చేతికి అందుతోంది. నగదు అత్యవసరమైన వారికి ఇది చాలా తేలిక. కొందరు గూగుల్ పే, ఫోన్ పేల్లో వచ్చిన ప్రకటనలు చూసి, ప్లేస్టోర్లో ఆన్లైన్ మనీ యాప్లను గాలించి డౌన్లోడ్ చేసుకుంటున్నారు. వారు అడిగిన అనుమతులన్నీ ఇచ్చేస్తున్నారు. గుర్తింపు, చిరునామాల కోసం ఆధార్ కార్డు, పాన్ కార్డుల వివరాలు అప్లోడ్ చేస్తున్నారు. అనంతరం లోన్ యాప్ నిర్వాహకుల ట్రాప్లో చిక్కుకుని విలవిల్లాడిపోతున్నారు. సిబిల్ స్కోర్ కోసం... అత్యవసరం నిమిత్తం కొంతమంది ఆన్లైన్ మనీ యాప్లు వినియోగిస్తున్నారు. మరికొంత మంది సిబిల్ స్కోర్ను పెంచుకోవడాలని యాప్ల ద్వారా రుణాలు తీసుకుంటున్నారు. బ్యాంక్లు క్రెడిట్ కార్డులు ఇవ్వాలన్నా, ఏదైనా వస్తువును ఈఎంఐ పద్ధతిపై కొనాలన్నా సిబిల్ స్కోర్ తప్పనిసరి. చివరికి బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలన్నా ఇదే ఆధారం. ఈ స్కోర్ తక్కువగా ఉన్న వారందరూ ఈ యాప్ల ద్వారా రుణాలు తీసుకుంటున్నారు. సాధారణంగా సిబిల్ స్కోర్ ప్రతి ఆరు నెలలకోసారి అప్డేట్ అవుతుంది. ఆన్లైన్ మనీ యాప్ల ద్వారా అప్పులు తీసుకుంటే తక్కువ రోజుల్లోనే తిరిగి చెల్లించాలి. అంతా అనుకున్నట్లు జరిగితే సిబిల్ స్కోర్ పెరుగుతుంది. తక్కువ మొత్తంలో అప్పు తీసుకొని సిబిల్ స్కోర్ను పెంచుకుందామనే ఆలోచనలో చాలా మంది యాప్ల మాయలో చిక్కుతున్నారు. తద్వారా సిబిల్ స్కోర్ పెంచుకోలేక, తీసుకున్న అప్పు తీర్చలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. విలాసాల కోసం ట్రాప్లో విద్యార్థులు డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్థులు విలాసాలకు అలవాటు పడుతున్నారు. పార్టీలు, ఎంజాయ్మెంట్లకు ఆర్థిక అవసరాలు పెరుగుతున్నాయి. ఇళ్లలో తల్లిదండ్రులు ఇచ్చే డబ్బులు ఈ అవసరాలను తీర్చలేకపోతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి యువకుడి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండటంతో అవసరమైనప్పుడల్లా డబ్బులు యాప్ల ద్వారా అప్పుగా తీసుకుంటున్నారు. ఇలా తీసుకున్న డబ్బుతో అవసరాలను తీర్చుకుంటున్నారు. యాప్లలో రుణాలు అసలు, వారు వేసే అధిక వడ్డీ చెల్లించలేకపోతున్నారు. తీవ్ర వేధింపులు యాప్ల నిర్వాహకులు విధించే వడ్డీ అడ్డూఅదుపు లేకుండా పోతోంది. రూ. 7 వేలు తీసుకున్న బాధితుడిని పది రోజుల్లోనే రూ. 12 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అసలు కన్నా వడ్డీ దాదాపుగా రెట్టింపు వసూలు చేశారు. వాస్తవానికి జాతీయ బ్యాంకులు సిబిల్ స్కోర్ను బట్టి వడ్డీలు ఉంటాయి. పక్కాగా ఈఎంఐలు చెల్లిస్తే ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. వాటిని కాదని ఒక్కసారి ఈ యాప్ల వలలో చిక్కితే తీవ్ర ఇబ్బందులు తప్పవు.మార్ఫింగ్ చిత్రాలతో బెదిరింపులు లోన్ మంజూరు చేసే సమయంలో యాప్లో నమోదు ప్రారంభించగానే ఫోన్లోని సమాచారం అంటే కాంటాక్ట్ లిస్ట్, ఫొటోలు వంటి వాటిపై నిర్వాహకులకు పర్మిషన్ లభిస్తుంది. వారడిగినట్లుగా డబ్బు చెల్లించకపోతే మొదట బంధువులు, స్నేహితులకు ఫోన్ చేసి ఫలానా వ్యక్తి లోన్ చెల్లించడం లేదని చెబుతారు. రెండోసారి... లోన్ తీసుకున్న వ్యక్తి ఫొటోలను మార్ఫింగ్ చేస్తామని బెదిరిస్తారు. సెల్ఫోన్లో ఉన్న మహిళల నఫోను ెనంబర్లకు అశ్లీల చిత్రాలను పంపిస్తామని హెచ్చరిస్తుంటారు. అసలు తీసుకున్న లోన్తో సంబంధం లేకుండా వాళ్లడిగినంత ఇచ్చినప్పటికీ ఇంకా కావాలని వేధిస్తారు. ఫోన్ అంటుకోవాలంటే భయపడేలా మాటల దాడిని పెంచుతారు. చివరకు జీవితంపై విరక్తి వచ్చేలా చేస్తారు. ఒక్క సారి ఈ యాప్లు డౌన్లోడ్ చేసుకొని అన్ని వివరాలు ఇచ్చారంటే వారి వలలో చిక్కినట్టే. -
ముగిసిన క్యారమ్ పోటీలు
ఆంధ్ర స్టేట్ క్యారమ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోటీలు ప్రథమ బహుమతి అందుకుంటున్న సీహెచ్ జనార్దనరెడ్డి, ఎ.భవాని చిలకలూరిపేట: ఏపీ స్టేట్ క్యారమ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్టేట్ ర్యాంకింగ్ క్యారమ్ పోటీలు సీఆర్ క్లబ్లో రెండో రోజైన ఆదివారం ముగిశాయి. పురుషులు, మహిళల విభాగంలో విడివిడిగా నిర్వహించిన ఈ పోటీలలో రాష్ట్ర నలుమూలల నుంచి 150 మంది పురుషులు, 20 మంది మహిళలు పాల్గొన్నారు. పురుషుల విభాగంలో తొలి నాలుగు స్థానాల్లో సీహెచ్ జనార్దనరెడ్డి (విశాఖపట్నం), ఎన్.వెంకయ్య (నెల్లూరు), బి.జయకుమార్(గుంటూరు), బి.పవన్కుమార్ (అనంతపురం) నిలిచారు. మహిళల విభాగంలో ఎ.భవాని, ఎల్.హరిప్రియ, ఎంఎస్కే హారిక, ఎస్కే హుస్నా సమీర బహుమతులు సాధించారు. ఈ నలుగురు విశాఖపట్నం వారే కావడం విశేషం. సీహెచ్ జనార్దనరెడ్డి ఏడో ప్రపంచ కప్ క్యారమ్ పోటీలలో పాలొనేందుకు సీఆర్ క్లబ్ తరఫున రూ.లక్ష సహాయం అందించారు. ఏపీ స్టేట్ క్యారమ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ జలీల్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ పోటీలకు చీఫ్ రిఫరీగా డాక్టర్ షేక్ సాజిదా, అసిస్టెంట్ చీఫ్ రిఫరీగా ఎండీ సిరాజ్ బాషా వ్యవహరించారు. కార్యక్రమంలో సీఆర్ క్లబ్ అధ్యక్షుడు చెరుకూరి కాంతయ్య, కార్యదర్శి పావులూరి శ్రీనివాసరావు, కోశాధికారి ఎం.నరసింహారావు, క్లబ్ కల్చరల్ ఇన్చార్జి గోరంట్ల నారాయణ, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్వీ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులకు అండగా ఉంటాం వన్టౌన్(విజయవాడ పశ్చిమ): వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులకు ఏపీ ఎన్జీఓ సంఘం అండగా ఉంటుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ తెలిపారు. కమర్షియల్ ట్యాక్సెస్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ స్టేట్ జనరల్ బాడీ మీటింగ్ విజయవాడలోని సంఘ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు భవనారి వెంకటేష్బాబు ఆధ్వర్యంలో ఆదివారం జరిగింది. 15 డివిజన్ల అధ్యక్ష, కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. -
పుష్టిగా పశు సంపద సృష్టి!
సరోగసి ద్వారా 20కుపైగా దూడలు మార్టూరు: బాపట్ల జిల్లా మార్టూరు మండలం బొల్లాపల్లి గ్రామంలో సరోగసి విధానంతో జన్మించిన ఒంగోలు జాతి గిత్త నరసింహతో జిల్లాలో పశువులలో సరోగసి విధానాన్ని మొదటిసారిగా దాదాపు రెండేళ్ల క్రితం ప్రారంభించారు. జన్యు సంరక్షణ పశువులలో సరోగసి విధానం ద్వారా మేలైన పశుసంపద సృష్టించడానికి ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ, తిరుపతిలోని వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం సంయుక్త కార్యాచరణ రాష్ట్రీయ గోకుల్ మిషన్లో భాగంగా శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ప్రకాశం జిల్లా దర్శి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ లీలాకృష్ణ, చదలవాడ పశు ఉత్పత్తి కేంద్రం ఏడీఏ డాక్టర్ బీ రవి, డాక్టర్ సోమశేఖర్తోపాటు మార్టూరు ఏడీఏ పద్మావతి, మార్టూరు మండలం కోలలపూడి పశు వైద్యురాలు మాధవీలతల బృందం కృషి ఎంతో ఉంది. మేలు జాతి కోసం సాధారణంగా ఒక ఆవు తన జీవితకాలంలో 8 నుంచి 10 దూడలను ఈనగలదు. మేలు జాతి ఆవు నుంచి సేకరించిన అండాలతో ఫలదీకరించిన 150 పిండాల ద్వారా సరోగసి విధానంలో 50 నుంచి 60 వరకు మేలు జాతి దూడలను పొందవచ్చు. ఈ పద్ధతి ద్వారా వయసు మీరిన, గాయపడిన, సహజ పద్ధతిలో సంతానోత్పత్తి చేయలేని ఆవుల నుంచి సైతం పిండాలను అభివృద్ధి చేయటం ద్వారా దూడలను పొందవచ్చు. ఈ విధానానికి సహజంగా తక్కువ పాల దిగుబడి ఉన్న ఆవుల గర్భాలను వైద్యులు ఎంచుకుంటారు. పాల దిగుబడి ఎక్కువగా ఇచ్చే మేలు రకపు ఆవుల నుంచి సేకరించిన అండాలతో మరో మేలు జాతి కోడెదూడల వీర్యంతో ఫలదీకరణ చేయబడిన పిండాలను ఈ ఎంపిక చేయబడిన ఆవుల గర్భంలో ప్రవేశపెడతారు. తద్వారా మేలురకపు పశు సంపద ఉత్పత్తి జరుగుతుంది. సరోగసి విధానం వలన అంతరించిపోతున్న పుంగనూరు, ఒంగోలు జాతి గిత్తలను గణనీయంగా ఉత్పత్తి చేసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. గతంలో బ్రెజిల్కు ఎగుమతి చేయబడిన ఒంగోలు జాతి గిత్త మూలాలు కలిగిన కోడె దూడ ఇటీవల అదే దేశంలో అక్షరాల రూ.41 కోట్ల ధర పలికిన విషయం తెలిసిందే. ప్రయోజనాలు ఎన్నో.. సరోగసి విధానం ద్వారా అధిక పాల ఉత్పత్తిని ఇచ్చే సామర్థ్యం గల ఆవులను సృష్టించవచ్చు. తద్వారా గణనీయమైన పాల ఉత్పత్తిని సాధించటంతోపాటు ఎగుమతులు చేయవచ్చు. మేలు జాతి కోడెదూడలను ఉత్పత్తి చేయడం ద్వారా వ్యవసాయంలో వినియోగించుకునే అవకాశం ఉంది. ఒంగోలు జాతి కోడె దూడల వీర్యానికి ప్రపంచస్థాయిలో ఉన్న డిమాండ్, పేరు ప్రఖ్యాతులు దృష్ట్యా ఇతర దేశాలకు ఎగుమతులు సైతం చేసుకొనే వాణిజ్యపరమైన అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం విస్తరిస్తున్న ప్రకృతి సేద్యంలో భాగంగా గో వ్యర్థాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. తదద్వారా ఆరోగ్యకరమైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పెంపకాలకు ఎంతో అవకాశం ఉంది. ఒరవడితో ఎన్నో ప్రయోజనాలు సరోగసి (అద్దె గర్భం) విధానం మనుషుల్లోనేకాక పశువులలో కూడా అభివృద్ధి చేయడం ద్వారా వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఒంగోలు జాతి గిత్తలను సరోగసి విధానంతో ఉత్పత్తి పెంచడం ద్వారా వ్యవసాయ పరంగానే కాకుండా పాల ఉత్పత్తి, పశువుల ఎగుమతి ద్వారా వాణిజ్యపరంగా కూడా అభివృద్ధి సాధ్యపడనుందని శాస్త్రవేత్తలు, వైద్యులు చెబుతున్నారు. పశు ఉత్పత్తి పెంపుతో ప్రయోజనాలు సరోగసి విధానం ద్వారా మేలు జాతి పశు ఉత్పత్తి పెరగడం వల్ల పాల దిగుబడి అధికం కానుంది. రైతులకు ఆదాయం చేకూరుతుంది. పంటల గిట్టుబాటు ధరలు ఒడిదొడుకులను ఎదుర్కొంటున్న వేళ పాల ఉత్పత్తి ద్వారా రైతులు నికరాదాయాన్ని పొందగలుగుతారు. ప్రకృతి సేద్యంలో నేడు వినియోగిస్తున్న అన్ని రకాల కషాయాల తయారీకి గో ఆధారిత వ్యర్థాలనే వినియోగిస్తున్నారు. ఆరోగ్యకరమైన పంటలను పండించగలుగుతున్నారు. – వీరవల్లి కృష్ణమూర్తి, మార్టూరు మండల రైతు సంఘం అధ్యక్షుడు -
నిమజ్జనం వేడుకల్లో నిబంధనలు తప్పనిసరి
జిల్లా అడిషనల్ ఎస్పీ సంతోష్ శావల్యాపురం: వినాయక విగ్రహాల నిమజ్జనం వేడుకల్లో పోలీసు నిబంధనలు అందరూ పాటించాలని జిల్లా అడిషనల్ ఎస్పీ జి.సంతోష్ అన్నారు. ఆదివారం మండలంలోని పొట్లూరు, వేల్పూరు గ్రామాల్లో జరుగుతున్న వినాయక విగ్రహాల నిమజ్జనం వేడుకలు సందర్భంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వినుకొండ నియోజకవర్గంలో శావల్యాపురం, బొల్లాపల్లి, నూజెండ్ల మండలాల్లో పలు గ్రామాల్లో పర్యటించామన్నారు. వినాయక విగ్రహాలు నిమజ్జనం సమయంలో శాంతిభద్రతలు విఘాతం కల్గుకుండా ఉండటానికి ముందుస్తులో భాగంగా పర్యవేక్షణ చేస్తున్నట్లు వెల్లడించారు. సమస్యాత్మక గ్రామాలుగా ఉండే వాటిపై ప్రత్యేకంగా పోలీసు నిఘా ఉంచామన్నారు. ఐదో రోజు నరసరావుపేట డివిజన్ 397 విగ్రహాలు నిమజ్జనం జరుగుతున్నాయన్నారు. ఈ క్రమంలో అల్లర్లు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామని నిబంధనలు అతిక్రమిస్తే అటువంటి వారిపై కమిటీ సభ్యులను బాధ్యులను చేస్తూ కేసులు నమోదు చేస్తామన్నారు. అనంతరం ఆయా గ్రామాల్లోని విగ్రహాలు నిమజ్జనం చేసే ఏరియాను పరిశీలించి పోలీసు అధికారులకు సూచనలు చేశారు. ఆయనతోపాటు సీఐ గోపి, ఎస్సై లేళ్ల లోకేశ్వరరావు, ఎస్బి కానిస్టేబుల్ రమేష్, స్టేషన్ రైటరు బాషా పాల్గొన్నారు. -
బీసీలపై వివక్ష చూపుతున్న కూటమి ప్రభుత్వం
నెహ్రూనగర్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బీసీలపై వివక్ష చూపుతుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుమ్మర క్రాంతికుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం చుట్టుగుంటలోని సంఘ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో బీసీలంతా కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచారన్నారు. బీసీలకు ఇస్తామన్నా హామీలను నెరవేర్చడానికి చిత్తశుద్ధి లేదన్నారు. బీసీలపై కపట ప్రేమ చూపిస్తూ వారిని మభ్య పెట్టాలని చూస్తుందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో బీసీలపై అనేక దాడులు జరిగాయన్నారు. వీటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏడాదిన్నర పాలనలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్కు ఒక్క రూపాయి నిధులు ఇచ్చిన పాపాన పోలేదని విమర్మించారు. ఎన్నికల సమయంలో చెప్పిన బీసీల రక్షణ చట్టం తెస్తామన్నారు..దానిని గాల్లో పెట్టారన్నారు. కులగణన చేస్తామన్నారు..దానికి అతిగతి లేదన్నారు. తక్షణమే కుల గణన చేపట్టి, బీసీల రక్షణ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాలు ముట్టడి, రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి కొల్లూరి హనుమంతరావు, గుంటూరు యువజన అధ్యక్షులు తురక రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కోలా మణికంఠ పాల్గొన్నారు. బీసీలపై వివక్ష చూపుతున్న కూటమి ప్రభుత్వం -
విద్యతోపాటు క్రీడల్లోనూ రాణించాలి
సత్తెనపల్లి: విద్యతోపాటు క్రీడల్లోనూ రాణించాలని లయోలా ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్ వంశీకృష్ణారెడ్డి అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళ్ళిపాళ్ల సమీపంలోని లయోలా ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న 12వ అంతర్ రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళల సాఫ్ట్బాల్ చాంపియన్షిప్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే క్రీడల్లోనూ రాణించాలన్నారు. క్రమం తప్పని సాధన ముందుకు తీసుకు వెళుతుందన్నారు. రిటైర్డ్ పీడీ దాసరి కోటేశ్వరరావు, సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఏపీ రాష్ట్ర కన్వీనర్ ఎంవీ రమణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ పి.నరసింహారెడ్డి, గుంటూరు జిల్లా సెక్రెటరీ పి. సామంతరెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ తిరుపతి, ట్రెజరర్ జనార్దన్ యాదవ్, లయోలా ఇంజినీరింగ్ కళాశాల కరస్పాండెంట్ శ్రీనివాస్ తదితరులు ప్రసంగించారు. అనంతరం విజేతలను అభినందించి, బహుమతులు అందించారు. హోరాహోరీగా పోటీలు... సెమీఫైనల్స్లో వైఎస్సాఆర్ కడప, గుంటూరు జట్లు తలపడ్డాయి. 0–5తో గుంటూరు విజయం సాధించింది. విజయనగరం, కృష్ణా జట్లు పోటీ పడగా, 11–2తో విజయనగరం విజేతగా నిలిచింది. ప్రీ ఫైనల్స్లో గుంటూరు, విజయనగరం తలపడ్డాయి. గుంటూరు 3–2తో గెలిచింది. వైఎస్సాఆర్ కడప, కృష్ణా జట్లు తలపడిన పోటీలో 4–2తో వైఎస్సాఆర్ కడప జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్స్లో విజయనగరం, వైఎస్సాఆర్ కడప జట్లు తలపడ్డాయి. 8–2తో విజయనగరం విజయం సాధించింది. గ్రాండ్ ఫైనల్లో గుంటూరుపై విజయనగరం 5–4తో గెలిచింది. చాంపియన్గా విజయనగరం, రన్నర్స్గా గుంటూరు, తృతీయ స్థానం వైఎస్సాఆర్ కడప, నాలుగవ స్థానం కృష్ణా జిల్లా జట్టు కై వసం చేసుకున్నాయి. -
సౌత్ ఇండియా జోనల్ కరాటే పోటీల్లో సత్తెనపల్లి విద్యార్థుల ప్రతిభ
సత్తెనపల్లి: సౌత్ ఇండియా జోనల్ కరాటే పోటీల్లో పల్నాడు జిల్లా సత్తెనపల్లి విద్యార్థులు ప్రతిభ చూపారు. బెంగళూరులోని కోరమంగళ ఇండోర్ స్టేడియంలో ఈనెల 30,31న జరిగిన సౌత్ ఇండియా జోనల్ కరాటే పోటీల్లో సత్తెనపల్లికి చెందిన షికోకాయ్ షిటోరియో కరాటే ఇనిస్టిట్యూట్ విద్యార్థినీ విద్యార్థులు ప్రతిభ చూపి ఐదు గోల్డ్ మెడల్, ఒక బ్రాంజ్ మెడల్ను కై వసం చేసుకుని సత్తెనపల్లి పట్టణానికి గుర్తింపు తీసుకొచ్చినట్లు కరాటే మాస్టర్ అనుముల రామయ్య ఆదివారం తెలిపారు. బాలికల కటా విభాగంలో బి అక్షయ్రెడ్డి గోల్డ్ మెడల్, బాలుర కటా విభాగంలో బి.టిష్యంత్, ఎంవీ.బాలాజీ, ఎల్ కిరీట్, ఎల్ గెష్ణ్ఆషిత్లు గోల్డ్మెడల్స్ సాధించగా .. బి.సత్యనారాయణ బ్రాంజ్ మెడల్ సాధించాడు. ప్రతిభ చూపిన విద్యార్థులను అకాడమీ ఆర్గనైజర్ ఏ.వీరబ్రహ్మం, అడ్వైజర్ ఏ.రాంబాబులు ప్రత్యేకంగా అభినందించారు. -
పారదర్శకత కోల్పోతున్న ఎన్నికల కమిషన్
గుంటూరు ఎడ్యుకేషన్: భారత ఎన్నికల సంఘం గత దశాబ్ద కాలంగా స్వయం ప్రతిపత్తిని కోల్పోవడంతో పాటు పారదర్శకంగా, జవాబు దారీతనంతో వ్యవహరించడం లేదని సిద్ధార్థ లా కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్. దివాకర్ బాబు పేర్కొన్నారు. బ్రాడీపేటలోని బాలానంద కేంద్రంలో ఆదివారం రాజ్యాంగ చర్చా వేదిక అధ్యక్షుడు నడింపల్లి గురుదత్ అధ్యక్షతన ‘‘రాజ్యాంగం – భారత ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తి’’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య వక్త దివాకర్బాబు మాట్లాడుతూ రాజ్యాంగంపై నమ్మ కం, విశ్వాసం లేని వాళ్లు పాలకులుగా కొనసాగు తూ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని తెలిపారు. భారత ఎన్నికల కమిషన్ సభ్యుల ఎంపిక ప్రక్రియ త్రిసభ్య కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించి, ఆ స్థానంలో కేంద్ర మంత్రిని పెట్టడం సబబు కాదని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ స్వతంత్రను కోల్పోయే విధంగా కేంద్ర ప్రభు త్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. బిహార్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ హడావుడిగా ప్రత్యేక సమగ్ర సవరణ ద్వారా 65 లక్షల ఓట్లను తొలగించడం, ఆధార్ కార్డును పరిగణన లోకి తీసుకోకుండా జనన ధ్రువీకరణ పత్రాలను కోరడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. అత్యధికులు బిహార్ నుంచి వలస కార్మికులుగా పలు రాష్ట్రాలకు పోతున్న స్థితిని ఎన్నికల కమిషన్ పరిగణలోకి తీసుకోక పోవడం విచారకరమని తెలిపారు. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల కమిషన్కు దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో సొంత సిబ్బంది ఉండాలని అభిప్రాయపడ్డారు. ఓటర్ల జాబితా సక్రమంగా ఉంటే ప్రజా స్వామ్యం వికసిస్తుందని, దాని రూపకల్పనలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రాజ్యాంగ చర్చా వేదిక అధ్యక్షుడు నడింపల్లి గురుదత్ మాట్లాడుతూ రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలగకుండా దాన్ని కాపాడుకోవాలని కోరారు. రాజ్యాంగ చర్చా వేదిక కార్యదర్శి అవధానుల హరి మాట్లాడుతూ కాగ్, యూపీఎస్సీ, ఎన్నికల కమిషన్ వంటి రాజ్యాంగబద్ధ సంస్థల్లో అధికార పార్టీల జోక్యం ఉండరాదని తెలిపారు. రాజ్యాంగ చర్చా వేదిక సంయుక్త కార్యదర్శి డాక్టర్ టి. సేవా కుమార్, ప్రోగ్రెసివ్ ఫోరమ్ అధ్యక్షు డు పి. మల్లికార్జునరావు, అవగాహన కార్యదర్శి కొండా శివరామిరెడ్డి, సీపీఎం నేత నళినీ కాంత్, సామాజిక విశ్లేషకులు టి. ధనుంజయ రెడ్డి ప్రసంగించారు. -
రోడ్డు ప్రమాదంలో రైతు మృతి
కర్లపాలెం: రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై ఓ రైతు మృతి చెందిన సంఘటన శనివారం రాత్రి మండలంలో చోటు చేసుకుంది. కర్లపాలెం ఎస్ఐ రవీందర్ తెలిపిన వివరాల మేరకు... కాకుమానుకు చెందిన దొప్పలపూడి చంద్రపాల్(61) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం వరినారు కోసం ద్విచక్రవాహనంపై బాపట్ల మీదుగా కర్లపాలెం వస్తున్నాడు. కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం సమీపంలో వెనుక నుంచి వచ్చిన ట్రక్ ఆటో ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ సంఘటనలో చంద్రపాల్ తీవ్రంగా గాయపడటంతో అతనిని మొదటిగా బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలిస్తుండగా మార్గంమధ్యలో చంద్రపాల్ మృతిచెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుని కుమారుడు అశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రవీందర్ తెలిపారు. కొల్లూరు : వేగంగా దూసుకొచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఓ చిరు వ్యాపారి తీవ్రంగా గాయపడి ఆదివారం అర్ధరాత్రి మృతి చెందాడు. మండలంలోని బొద్దులూరుపాడుకు చెందిన కొల్లూరు వెంకట నరసయ్య (68) గ్రామంలో కిరాణా షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం కొల్లూరులో సామగ్రిని కొనుగోలు చేసుకొని, మోపెడ్పై గాంధీనగర్లో నివసిస్తున్న కుమార్తెను చూసేందుకు వెళుతున్నారు. ఈ సమయంలో తెనాలి వైపు నుంచి అతి వేగంగా దూసుకొచ్చిన ఓ ద్విచక్ర వాహనదారుడు నరసయ్య వాహనాన్ని ఢీకొట్టాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన్ను కుమార్తె 108 వాహనంలో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించింది. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సూచనల మేరకు గుంటూరు జీజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి నరసయ్య మృతి చెందాడు. వైద్యశాల నుంచి వచ్చిన నివేదిక మేరకు కొల్లూరు పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ జానకీ అమరవర్ధన్ తెలిపారు. కారంచేడు: మార్టూరు నుంచి చీరాలకు సరిహద్దు రాళ్ల లోడుతో వస్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ నష్టం జరగలేదు. ఆదివారం వాడరేవు–పిడుగురాళ్ల ప్రధాన రహదారిలో.. కారంచేడు అంబేడ్కర్ నగర్ కాలనీ సమీపంలో ఈ ఘటన జరిగింది. ట్రాక్టర్ ట్రక్కు వెనుక టైర్లకు బేరింగ్లు ఊడిపోవడంతో ఒక్క సారిగా తిరగబడింది. ఆ సమయంలో ఇతర వాహనాలు అక్కడ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ట్రాక్టర్ కూడా నిదానంగా ప్రయాణిస్తుండటంతో కేవలం ట్రక్కు మాత్రమే బోల్తా పడింది. దీంతో రాళ్లు ప్రధాన రహదారిలో పడటంతో వాహన ప్రయాణాలకు కొంతసేపు అంతరాయం ఏర్పడింది. స్థానిక ఏఎస్ఐ శేషసాయి సిబ్బందితో అక్కడకు చేరుకొని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. తెనాలి రూరల్: విద్యుదాఘాతంతో బిహార్కు చెందిన కూలీ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బిహార్కు చెందిన ఓం ప్రకాష్(41) నాలుగేళ్లుగా మండలంలోని ఖాజీపేటలోని ప్లాస్టిక్ రీసైక్లింగ్ కంపెనీలో పని చేస్తున్నాడు. శనివారం సాయంత్రం కంపెనీలోని డ్రయ్యర్ను శుభ్రం చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై వెనక్కు పడడంతో తలకు తీవ్ర గాయమైంది. తెనాలిలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దుర్గమ్మకు పలువురు విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు ఆదివారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. గుంటూరు జిల్లా కొత్తూరుకు చెందిన మండవ శ్రీనివాసరావు, ఆదిలక్ష్మి దంపతులు నిత్యాన్నదానానికి రూ. 1,00,001 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. ఉచిత ప్రసాద వితరణకు .. గుంటూరుకు చెందిన తేగెల రవీంద్రబాబు, డాక్టర్ నాగేశ్వరమ్మలు తమ కుమార్తె మమత శ్రీరంగ పేరిట రూ.1,00,001 విరాళంగా ఇచ్చారు. అనంతరం దాతలకు అధికారులు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. -
అలా ‘నరసింహ’కు ఊపిరి పోసి...
వీరి ప్రయత్నంతోనే మండలంలోని బొల్లాపల్లి గ్రామంలోని లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం గోశాలలోని ఆవు గర్భంలో ఫలదీకరించబడిన వేరే ఆవు పిండాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ‘నరసింహ‘ అనే ఒంగోలు జాతి కోడెదూడ 2023 సెప్టెంబర్ 12వ తేదీన పుట్టింది. వాస్తవానికి ఈ కోడె దూడ తాలూకు జన్యుపరమైన తల్లి ఆవు వయోభారంతో 2022 జూన్ నెలలోనే మరణించింది. అప్పటికే అంటే 2022 ఏప్రిల్ నెలలోనే ఈ ఆవు నుంచి సేకరించిన అండాల నుంచి అభివృద్ధి చేసిన పిండాన్ని అతి శీతలీకరణ పద్ధతిలో ద్రవ నత్రజనిలో భద్రపరిచారు. తల్లి మరణించిన సంవత్సరం తర్వాత కూడా అద్దె గర్భం ద్వారా పుట్టిన దూడగా నరసింహ రికార్డు సృష్టించటం గమనార్హం. -
పులిచింతలకు 2,32,037 క్యూసెక్కులు విడుదల
సత్రశాల(రెంటచింతల): మండలంలోని సత్రశాల వద్ద నున్న నాగార్జునసాగర్ టెయిల్పాండ్ విద్యుత్ ప్రాజెక్టు రిజర్వాయర్ 17 క్రస్ట్ గేట్ల ద్వారా 2,32,037 క్యూసెక్కులు పులిచింతలకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఎస్ఈ వెంకటరమణ, ఈఈ సుబ్రమణ్యం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టెయిల్పాండ్ ప్రాజెక్టు రిజర్వాయర్ తొమ్మిది క్రస్ట్గేట్లు మూడు మీటర్లు, ఎనిమిది క్రస్ట్గేట్లు 2.5 మీటర్లు ఎత్తు ఎత్తి 2,32,037 క్యూసెక్కుల వరదనీటిని దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్కు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు నీటిమట్టం 75.50 మీటర్లకుగాను 74.58 మీటర్లకు చేరుకుందన్నారు. రిజర్వాయర్ గరిష్ట నీటి సామర్ధ్యం 7.080 టీఎంసీలకుగాను ప్రస్తుతం 6.462 టీఎంసీలు నీరు నిల్వ ఉందన్నారు. టీఆర్సీ లెవల్ 60.54 మీటర్లకు చేరుకుందన్నారు. ఎగువ నున్న నాగార్జునసాగర్ నుంచి 2,89,876 క్యూసెక్కుల వరదనీరు ఇక్కడ ప్రాజెక్టుకు చేరుకుంటుందన్నారు. ప్రస్తుతం విద్యుత్ ప్రాజెక్టులోని రెండు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు వెల్లడించారు. నాగార్జునసాగర్ నుంచి వచ్చే వరదను బట్టి దిగువనున్న పులిచింతలకు నీటిని విడుదల చేస్తామని తెలిపారు. -
స్వీయ జాగ్రత్తలే రక్ష
ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ఫోన్లో అనవసరమైన లింక్లపై క్లిక్ చేసి మోసపోవద్దు. ప్రస్తుత యువత ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడి అవసరాల కోసం లోన్ యాప్లను ఆశ్రయిస్తున్నారు. ఎంతటి ఆర్థిక అవసరమైనా యాప్ల ద్వారా లోన్ తీసుకోకూడదు. తల్లిదండ్రులకు తెలియకుండా యాప్లను ఆశ్రయిస్తున్న యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఒక వేళ లోన్ యాప్లో ఇప్పటికే తీసుకున్న బాధితులుంటే 1930 సహాయక నంబరుకు ఫిర్యాదు చేయాలి. వారి సూచనలతో సంబంధిత పోలీసులను సంప్రదించాలి. – వినోద్బాబు, ఎస్సై, రేణింగవరం -
కుమ్మరి శాలివాహన సంఘం జిల్లా కమిటీ ఎన్నిక
నరసరావుపేట ఈస్ట్: రాష్ట్రంలో కుమ్మరి శాలివాహన సంఘీయుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్టు రాష్ట్ర కుమ్మరి శాలివాహన సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పేరేసి ఈశ్వర్ తెలిపారు. పాలపాడురోడ్డులోని కల్యాణ మండపంలో ఆదివారం పల్నాడు జిల్లా కుమ్మరి శాలివాహన సంఘం కార్యవర్గం ఎన్నిక నిర్వహించారు. సంఘం నూతన అధ్యక్షునిగా తొర్లకొండ చినఅంజయ్య, కార్యదర్శిగా వీరబ్రహ్మంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా యూత్ అధ్యక్షునిగా బాడిశ మస్తాన్రావు (పిడుగురాళ్ల) నియమితులయ్యారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఐలాపురం భాస్కర శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజవరపు ఏడుకొండలు, సంఘం నాయకులు టి.మంగమ్మ, రంగయ్య, బి.రోశయ్య, సిహెచ్.వెంకటఅప్పారావు తదితరులు పాల్గొన్నారు. నూతన అధ్యక్షుడు చినఅంజయ్య మాట్లాడుతూ త్వరలో జిల్లాలో నియోజకవర్గాల వారీగా పర్యటించి సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. -
104 వాహన సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి
లక్ష్మీపురం: 104 మొబైల్ మెడికల్ యూనిట్ ఉద్యోగుల (ఎంఎంయూ) సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళన చేపడుతామని జిల్లా గౌరవాధ్యక్షులు బి. లక్ష్మణరావు తెలిపారు. స్థానిక పాత గుంటూరు సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ఆదివారం కె. సత్యరాజు అధ్యక్షతన జరిగిన యూనియన్ విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం తగ్గించిన వేతనాల సహా ఉద్యోగులకు చెల్లించాలని కోరారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. గత యాజమాన్యం అరబిందో నుంచి రావాల్సిన అన్ని బకాయిలను చెల్లించే విధంగా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని కోరారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు అమలయ్యే లీవులు, పబ్లిక్ హాలిడేలు, గుర్తింపు కార్డులు, పే స్లిప్పులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వాహనాలకు సరిపడా సిబ్బందిని నియమించాలని, అవసరమైన చోట బఫర్ జోన్ ఉద్యోగులను నియమించాలని కోరారు. వాహనాలకు ఏళ్ల తరబడి మరమ్మతులు చేయక పోవడంతో సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని, వెంటనే చేయించాలని ఆయన కోరారు. రూ. 10 లక్షల బీమా సౌకర్యాన్ని ప్రతి ఉద్యోగికి కల్పించాలని విన్నవించారు. ఈపీఎఫ్, ఈఎస్ఐ పూర్తిస్థాయిలో అమలు చేయాలని, ఈఎస్ఐ పరిధి దాటిన వారికి హెల్త్ కార్డులు ఇవ్వాలని లక్ష్మణరావు కోరారు. డిమాండ్ల సాధనకు నిర్వహించనున్న ఆందోళనలో ఉద్యోగులంతా పాల్గొనాలని ఆయన కోరారు. నూతన కార్యవర్గం ఎన్నిక నూతన అధ్యక్ష, కార్యదర్శిగా గోరంట్ల సురేష్, ఆలూరి శ్రీహర్ష, కోశాధికారిగా ఐ. నాగులు, ఉపాధ్యక్షులుగా కె. సత్తిరాజు, సహాయ కార్యదర్శిగా బి. బాలకృష్ణ, కమిటీ సభ్యులుగా విజయ్ కుమార్, ఏడుకొండలు, సురేష్, సాయిరాం, విజయ్ నియమితులయ్యారు. జిల్లా గౌరవ అధ్యక్షుడు బి.లక్ష్మణరావు -
పోలీస్గా ఉద్యోగంలో చేరడం అదృష్టం
జిల్లా ఎస్పీ తుషార్ డూడీ బాపట్లటౌన్: పోలీస్శాఖలో 30 సంవత్సరాలకు పైగా సుదీర్ఘ సేవలు అందించడం హర్షనీయమని జిల్లా ఎస్పీ తుషార్ డూడీ అన్నారు. జిల్లా పోలీస్ విభాగంలో పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేసిన పీజీఆర్ఎస్ సెల్ ఎస్ఐ డి.వి. డేవిడ్, స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ ఎన్.రామకోటేశ్వరరావులను ఆదివారం సన్మానించారు. ఎస్పీ మాట్లాడుతూ పోలీసు ఉద్యోగం చాలా ఒత్తిడితో కూడుకున్నదన్నారు. ప్రజలకు నేరుగా సేవలు అందించడం పోలీసు ఉద్యోగంలోనే జరుగుతుందన్నారు. అలాంటి ఉద్యోగంలో మనం చేరడం చాలా గొప్ప అదృష్టంగా భావించాలన్నారు. పోలీస్ శాఖకు సుదీర్ఘకాలంపాటు విశేషసేవలు అందించడం ఎంతో గొప్ప విషయమన్నారు. పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా గడపాలని, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఎటు వంటి సమస్య వచ్చిన నేరుగా తమను కలవవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు ఏఆర్ డీఎస్పీ పి.విజయసారథి, వెల్ఫేర్ ఆర్ఐ మౌలిద్దీన్, పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులుపాల్గొన్నారు. -
ఉపాధి నిధులు బొక్కేశారు..!
సాక్షి ప్రతినిధి,బాపట్ల: అద్దంకి నియోజకవర్గం బల్లికురవ మండలంలో గడచిన ఏడాదిలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రూ.11,96,76,824 మేర పనులు జరిగినట్లు అధికారిక గణాంకాలు చెబుతుండగా.. ఇందులో రూ.5,69,41,282 అవినీతి జరిగినట్లు ఆగస్టు మొదటి వారంలో జరిగిన సామాజిక తనిఖీ వెల్లడించింది. దీనిని కప్పిపుచ్చేందుకు మండల ప్రిసైడింగ్ అధికారి హోదాలో జిల్లా డ్వామా అధికారి ప్రయత్నించినట్లు జరిగిన తతంగం పరిశీలిస్తే అర్థమవుతుంది. సామాజిక తనిఖీ చూపిన దాంట్లో రూ.3,89,46,581 మొత్తాన్ని అక్రమాల కింద అంగీకరించిన మండల ప్రిసైడింగ్ అధికారి ఇందులో రూ.2,36,03,181 మొత్తాన్ని రికవరీ కింద రాసి మిగిలిన రూ.1,16,66,909 మొత్తా న్ని రిఫర్డ్(మళ్లీవిచారణ) కింద, రూ.36,91,856 మొత్తాన్ని రిక్టిఫైడ్ (సరిచే సుకోండి) కింద చూపి రూ.1.79,79,336 మొత్తాన్ని డ్రాప్డ్ అమౌంట్ కింద చూపెట్టి చేతులు దులుపుకున్నారు. సామాజిక తనిఖీ చూపెట్టిన అవినీతి రూ.5.69 కోట్లలో రికవరీ రూ. 2.36 కోట్లు మినహా మిగిలిన రూ.3.33 కోట్ల మొత్తాన్ని మాఫీ చేశారు. దీనివెనుక పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు డ్వామావర్గాల్లోనే గుసగుసలువినిపిస్తున్నాయి. జిల్లాలో రూ.140 కోట్ల అవినీతి జిల్లాలో గడచిన ఆర్థిక సంవత్సరంలో రూ.261 కోట్ల పనులు జరిగినట్లు అధికారిక గణాంకాలు చెబుతుండగా.. ఉద్యాన పంటలు, సేద్యపు నీటికుంటలు, పశువుల తాగునీటి తొట్లతోపాటు పలురకాల కాంక్రీట్ పనులు చేపట్టారు. ఇందులో రూ.199.56 కోట్ల మేర వేతనాల పనులు కల్పించినట్లు చూపారు. ఇందులో 70 శాతం అక్రమాలు అనుకున్నా రూ.140 కోట్ల మేర అవినీతి జరిగినట్లు ఆరోపణలున్నాయి. జిల్లా మొత్తంగా జరిగిన ఉపాధి పనులపై ఉన్నతాధికారితో సమగ్ర విచారణ జరిపిస్తే అవినీతి బట్టబయలయ్యే అవకాశముంది. సాగునీటి మాటున ఉపాధి అవినీతి వాస్తవానికి ఉపాధి పనులు నవంబర్, డిసెంబర్, జనవరిలో 20 శాతం మాత్రమే జరుగుతుండగా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో మిగిలిన 80 శాతం జరుగుతున్నాయి. ఆ తర్వాత వర్షాలు కురవడం, సాగునీటి పథకాల ద్వారా కాలువలకు నీటిని విడుదల చేస్తుండడంతో పనులు చేయకపోయినా అధికారులకు చేసినట్లు రికార్డు చేసి నిధులు కొల్లగొడుతున్నారు. ఉపాధి పనులను ప్రతి మూడు నెలలకొకసారి సామాజిక తనిఖీ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అమలు చేస్తే అక్రమాలను కంట్రోల్ చేసే అవకాశముంటుంది. కానీ డ్వామా అధికారులు ఏడాదికి ఒకసారి మాత్రమే సామాజిక తనిఖీలు పెట్టి అవినీతి బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. సామాజిక తనిఖీల్లో షాట్, డ్వామా కుమ్మక్కు నిబంధనల మేరకు పంచాయతీరాజ్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ‘షాట్’, డ్వామా అధికారులు కలిసి ఉపాధి పనులపై సామాజిక తనిఖీ నిర్వహిస్తారు. వాస్తవానికి సామాజిక తనిఖీ తొలుత గ్రామస్థాయిలో జరుగుతుండగా ఇందులో గ్రామస్థాయిలో ప్రిసైడింగ్ అధికారిగా మండలానికి చెందిన కొందరు గెజిటెడ్ అధికారులను నియమిస్తారు. గ్రామస్థాయి సామాజిక తనిఖీల్లో వీరిది జడ్జి పాత్ర. తప్పు జరిగితే ఎత్తిచూపే అవకాశం ఉంటుంది. కానీ గ్రామస్థాయి తనిఖీలకు వీరిని ఆహ్వానించకుండానే షాట్, డ్వామా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల వీరి నియామకమే జరగకపోగా మరికొన్ని మండలాల్లో వీరిని నియమించినా.. డ్వామా అధికారులు తనిఖీలకు పిలవడంలేదు. దీంతో అటు షాట్, ఇటు డ్వామా అధికారులు కుమ్మకై ్క పది శాతం అక్రమాలు చూపించి 90 శాతం అక్రమాలను మాఫీ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. -
ఇచ్చేదెన్నడో!
కొత్త పింఛన్ వేటపాలెం: పేదలకు సంక్షేమం అందించడంలో కూటమి ఘోరంగా విఫలమైంది. ఏడాదిన్నర కాలంలో ఆవేదన తప్ప మిగిలిందేమీ కనిపించడంలేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా నేటికీ ఒక్క సంక్షేమ పథకం కూడా సమర్థవంతంగా అమలు చేసిన దాఖలాల్లేవు. చివరకు ఏ దిక్కూ లేని వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు కూడా పింఛన్లు మంజూరు చేయడం లేదు. దీంతో పలువురు అర్హులు ఎప్పుడు పింఛన్ మంజూరు చేస్తారంటూ సచివాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఇటీవల స్పౌజ్ కేటగిరీలో పింఛన్ల మంజూరు చేసింది. పింఛన్ పొందుతున్న భర్త చనిపోతేనే భార్యకు ఆ పింఛన్ను బదిలీ చేస్తున్నారు. అసలు ఇప్పటికీ పింఛన్ రాని వ్యక్తి చనిపోతే వితంతు పింఛన్ ఇవ్వకుండా మొండి చేయి చూపిస్తున్నారు. అలాగే ఇతర సామాజిక పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారిని పట్టించుకోవడం లేదు. బాపట్ల జిల్లాలో ప్రస్తుతం 2,27,868 మంది సామాజిక పెన్షన్ దారులున్నారు. చీరాల నియోజకవర్గ పరిధిలో 30,239 మంది ఉండగా వీరిలో చీరాల అర్బన్ పరిధిలో 8.093 మంది, రూరల్ పరిధిలో 11,438 మంది, వేటపాలెం మండలం పరిదిలో 10,718 మంది సామాజిక పింఛన్లు పొందుతున్నారు. అమలు కాని ఎన్నికల హామీ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన వారికి 50 ఏళ్లకే పింఛన్ అందజేస్తామని హామీ ఇచ్చింది. ఇంత వరకు దీనిని ఆచరణలో పెట్టలేదు. ఎప్పటి నుంచి అమలు చేస్తారో కూడా ప్రకటించ లేదు. జిల్లాలో అర్హులైన వితంతువులు, దివ్యాంగులు, వృద్ధులు, కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతిరోజూ సామాజిక పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి సచివాలయానికి వస్తున్నారు. ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదని వారికి సచివాలయ సిబ్బంది సమాధానం చెబుతుండటంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న ఆరు నెలల్లోనే కొత్త పింఛన్లు మంజూరయ్యేవి. ఈ ప్రక్రయ నిరంతరం కొనసాగేది. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేకుండా ప్రస్తుత ప్రభుత్వం పెన్షకు సంబంధించి వెబ్సైట్ నిలిపివేయడంతో అర్హులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అర్హులైన వారు నిత్యం గ్రామ, వార్డు సచివాలయాల చుట్టూ తిరగలేక ఇబ్బంది పడుతున్నారు. పింఛన్ల మంజూరులో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమనసరించిన విధానమే సరైందని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. వలంటీర్ వ్యవస్థ ద్వారా పింఛన్దారులకు ఇంటి వద్దే పింఛను అందించేవారు. భర్త చనిపోయిన వారికి వితంతు పింఛన్లు మరుసటి నెలలోనే మంజూరు చేసేలా చర్యలు తీసుకునేవారు. ఏడాదికి రెండు సార్లు కొత్త పింఛన్లు మంజూరుకు అవకాశం కల్పించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేకపోవడంతో అర్హులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎక్కువ శాతం పింఛన్ మంజూరు చేయాలని అర్జీలు అందిస్తున్నారు. కొత్తగా పింఛన్లు కోసం నమోదు చేసుకోవడానికి ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి ఆదేశాలు రాలేదు. అందుకు సంబంధించిన వెబ్సైట్లు ఓపెన్ కావడం లేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే కొత్త పింఛన్లు నమోదు చేసుకుంటాం. –రాజేష్ ఎంపీడీఓ, వేటపాలెం -
స్వామిత్వ సర్వే పకడ్బందీగా చేయాలి
బల్లికురవ: గ్రామాల వారీగా జరుగుతున్న స్వామిత్వ సర్వేలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకరరావు అన్నారు. బల్లికురవ మండలంలో జరుగుతున్న సర్వేపై శనివారం స్థానిక పరిషత్ కార్యాలయంలో వెక్టరైజేషన్లో భాగంగా పంచాయతీ సెక్రటరీలు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు పలు సూచనలు చేశారు. గ్రామాల్లోని ప్రజలకు సంబంధించిన ఆస్తులను గుర్తించి హద్దులు ఏర్పాటు చేయాలన్నారు. సర్వేలో మోసాలు తలెత్తకూడదని.. 2 నెలల ముందు సర్వే పూర్తిచేసి ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. వర్షాలు కురుస్తున్నందున సీజనల్ జ్వరాలు వ్యాధులు సోకకుండా నవంబర్ వరకు పారిశుద్ధ్య కార్యక్రమాలు స్పెషల్ డ్రైవ్గా చేపట్టాలన్నారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్య వంతమైన సమాజం సాధ్యమన్నారు. ఎంపీడీవో కుసుమకుమారి, కార్యాలయ ఏవో పాండురంగస్వామి పాల్గొన్నారు. -
పొగాకు రైతులకు అండగా ఉంటాం
పర్చూరు(చినగంజాం): సంక్షోభం నుంచి రైతులను బయటకు తెచ్చేలా పొగాకు కొనుగోలు చేపట్టాలని ఏపీ వ్యవసాయం, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్, ఎస్డబ్ల్యూసీ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.విజయ సునీత తెలిపారు. జిల్లాకు వచ్చిన ఆమె కలెక్టర్ జె. వెంకటమురళితో కలసి పర్చూరు మండలంలో శనివారం పర్యటించారు. పర్చూరు మండలం మార్కెట్ యార్డులోని గోదాముల్లో నిల్వ చేసిన పొగాకు బేళ్లను ఎండీ విజయ సునీత, కలెక్టర్ జె.వెంకట మురళి పరిశీలించారు. వాటి నాణ్యత ప్రమాణాలను పరిశీలించిన అనంతరం కొనుగోలు తీరుపై ఆరా తీశారు. జిల్లా పర్యటనలో భాగంగా బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు, గోదాముల్లో నిల్వ, ప్రాసెసింగ్ ప్రక్రియ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో పర్చూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో సమావేశం అయ్యారు. పొగాకు ప్రాసెసింగ్ కోసం సిద్ధం చేసిన డబ్ల్యూబీఆర్, డబ్ల్యూబీఎల్, డబ్ల్యూబీఎక్స్ రకాల నమూనాలను పరిశీలించారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన పొగాకును ప్రాసెసింగ్ చేయడానికి ప్రణాళిక రూపొందించాలన్నారు. రైతుల బ్యాంకు ఖాతాల పరిశీలన పూర్తయితే తక్షణమే వారికి నగదు పంపుతామన్నారు. బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు సెప్టెంబర్లోగా పూర్తి చేయాలని కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. బాపట్ల జిల్లాలో 9,900 టన్నుల బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు చేశామని చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో ఆరు కొనుగోలు కేంద్రాలు కొనసాగుతాన్నాయన్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన బ్లాక్ బర్లీ పొగాకు నిల్వ చేయడానికి 18 వ్యవసాయ మార్కెటింగ్ శాఖ గోదాములను గుర్తించామని తెలిపారు. మరో 11 ప్రైవేట్ గోదాములు ఖాళీగా ఉన్నట్లు గుర్తించామన్నారు. మార్కెటింగ్ శాఖ ఆర్జేడీ కె.శ్రీనివాసరావు, ఆర్డీ డీఎం దివాకర్, మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారి కె.రమేష్ బాబు, మార్క్ఫెడ్ డీఎం కరుణశ్రీ, ఆర్డీఓ పి.గ్లోరియా తదతరులున్నారు. -
ప్లాస్టిక్ను తరిమికొడదాం
బాపట్ల మున్సిపల్ కమిషనర్ జి రఘునాథరెడ్డి బాపట్ల అర్బన్: బాపట్ల సూర్యలంక తీరంలో వాడి పారేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను తిని ఆవు ప్రాణాపాయ పరిస్థితిలో ఉండడం చాలా బాధాకరమని మునిసిపల్ కమిషనర్ జి.రఘునాథరెడ్డి అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మన అవసరాల నిమిత్తం బహిరంగ మార్కెట్లో సులభంగా, ఉచితంగా లభించే ప్రమాదకర ప్లాస్టిక్ను ఉపయోగించడం వలనే మూగ జీవాలు ప్రమాదాలకు గురౌవుతున్నాయని చెప్పారు. ఆవుల యజమానులు పట్టణ వీధుల్లో సూర్యలంక తీరంలోకి ఆవులు వదిలేయడంతో అనేకమైనటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలు తిని అనారోగ్యానికి గురవుతున్నాయని తెలిపారు. ఈ ప్రమాదకర సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు వాడకం వలన మానవాళితోపాటు మూగ జీవాలు కూడా ప్రమాదం బారిన పడుతున్నాయన్నారు. వీటిని నివారించేందుకు ప్రతి ఒక్కరూ పూనుకోవాలని సూచించారు. -
అత్యధిక కేసులు పరిష్కారమయ్యేలా కృషి చేయాలి
సీనియర్ సివిల్ జడ్జి వెన్నెల రేపల్లె: పెండింగ్ కేసుల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహించతలబెట్టిన జాతీయ లోక్అదాలత్లో అత్యధిక కేసులు పరిష్కారమయ్యేలా పోలీసులు, న్యాయవాదులు కృషి చేయాలని మండల న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి ఎస్పీడీ వెన్నెల కోరారు. సెప్టెంబర్ 13వ తేదీన జరిగే జాతీయ లోక్అదాలత్పై స్థానిక కోర్టు హాలులో శనివారం పోలీసులు, న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ లోక్అదాలత్ ద్వారా కేసులు త్వరగా పరిష్కారం అవ్వటంతోపాటు కక్షిదారులకు సత్వర న్యాయం లభిస్తుందన్నారు. లోక్అదాలత్లో క్రిమినల్, సివిల్, ప్రిలిటిగేషన్లతోపాటు బీఎస్ఎన్ఎల్, బ్యాంక్లకు సంబంధించిన కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు. సమావేశంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి దివ్యసాయి శ్రీవాణి, సీనియర్ న్యాయవాదులు పీఎన్బీ శర్మ, జీ.వెంకటేశ్వరరావు, కే.నాగాంజనేయలు, పోలీసు, రెవెన్యూ, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ మహిళా కూలీ మృతి
బల్లికురవ: పొట్ట కూటి కోసం సుబాబుల్ కర్ర కొట్టి ట్రాక్టర్కు లోడ్ చేస్తుండగా వెనుక నుంచి గ్రానైట్ లారీ ఢీకొన్న ఘటనలో మహిళ కూలీ జొన్నలగడ్డ మేరమ్మ (53) మృతి చెందింది. శుక్రవారం రాత్రి బల్లికురవ–సంతమాగులూరు ఆర్అండ్బీ రోడ్డులోని కొత్తమల్లాయపాలెం బస్టాప్ సమీపంలో ప్రమాదం జరిగిన విషయం పాఠకులకు విదితమే. బల్లికురవ ఎస్సీ కాలనీకి చెందిన జొన్నలగడ్డ మీరమ్మ(53) పందిరి చిన సుబ్బయ్య, కొత్తపల్లి యేసమ్మ, గంధం మీరమ్మ, కొత్తపల్లి చినకోటి, పందిరి సుబ్బారావు సుబాబుల్ కర్రకొట్టి ట్రాక్టర్కు రోడ్ మార్జిన్లో లోడింగ్ చేస్తున్నారు. ఈ సమయంలో పాతమల్లాయపాలెం గ్రామానికి చెందిన గ్రానైట్ లారీ ఈర్ల కొండకు వద్దకు వెళుతూ ట్రాక్టర్ను ఢీకొట్టింది. కొత్తపల్లి చినకోటి, పందిరి సుబ్బారావు మినహా మగిలిన నలుగురు గాయాల పాలయ్యారు. నరసరావుపేటలో చికిత్స పొందుతూ మీరమ్మ మృతి చెందింది. కూలీ కొత్తపల్లి యేసమ్మ ఫిర్యాదు మేరకు బల్లికురవ ఎస్సై వై.నాగరాజు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం తదుపరి భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలికి భర్త ఇరువురు కుమారులున్నారు. బల్లికురవ ఎస్సీలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి. -
ముగిసిన జాతీయస్థాయి యోగా పోటీలు
చిలకలూరిపేటటౌన్/యడ్లపాడు: ఉన్నత లక్ష్యాలను సాధించాలంటే ప్రతి అంశాన్ని ఛాలెంజ్గా తీసుకుని పట్టుదలతో కృషి చేయాలని మద్దిరాల జేఎన్వీ పూర్వ విద్యార్థి, తమిళనాడు రాష్ట్ర లేబర్ వెల్ఫేర్, స్కిల్స్ డెవలప్మెంట్ కార్యదర్శి కె.వీరరాఘవరావు పేర్కొన్నారు. నవోదయ విద్యాలయ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి యోగా క్రీడా ప్రదర్శన పోటీల ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిలకలూరిపేట మండలం మద్దిరాలలోని పీఎంశ్రీ జేఎన్వీలో హైదరాబాద్ జేఎన్వీ రీజియన్ పరిధిలో మూడు రోజులు యోగా ప్రదర్శన పోటీలు జరిగాయి. గ్రూప్ ఆసనాలు, రిథమిక్, ఆర్టిస్టిక్ యోగా విభాగాల్లో అండర్–14, అండర్–17, అండర్–19 విభాగాల్లో బాలురు, బాలికలకు వేర్వేరుగా ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ పోటీలు శనివారంతో ముగిశాయి. విద్యాలయ ప్రిన్సిపాల్ నల్లూరి నరసింహారావు అధ్యక్షత వహించగా, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు పరిచయ, మూడు రోజుల యోగా పోటీల నిర్వహణ సారాన్ని వివరించారు. మరో అతిథి హైదరాబాద్ రీజియన్ అసిస్టెంట్ కమిషనర్ డి.చక్రపాణి మాట్లాడుతూ జేఎన్వీల్లో చదివిన ఎందరో ఉన్నతస్థానాల్లో ఉంటూ అందరికీ రోల్మోడల్గా నిలుస్తున్నారని చెప్పారు. విజేతలు వీరే.. ఓవరాల్ ఛాంపియన్ షిప్ టైటిల్ను నవోదయ భోపాల్ రీజియన్ సాధించగా, ఛాంపియన్షిప్ రన్నర్స్గా హైదరాబాద్ రీజియన్ నిలిచింది. యోగాసనాల్లోని అన్ని రీజియన్లలో బాలికల విభాగంలో బెస్ట్యోగిని అవార్డును సుస్మితాదాస్ (భోపాల్), బాలుర విభాగంలో బెస్ట్యోగి అవార్డును సోహమ్ సుమన్(జైపూర్)కు దక్కాయి. -
హోరాహోరీగా సాఫ్ట్బాల్ పోటీలు
సత్తెనపల్లి: సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల సమీపంలోని లయోలా ఇంజినీరింగ్ కళాశాలలో 12వ అంతరాష్ట్ర స్థాయి మహిళల సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పోటీలు ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 12 సీనియర్ సాఫ్ట్బాల్ మహిళల జట్లు హాజరయ్యా యి. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో పోటీలు నిర్వహించారు. మహిళల సాఫ్ట్బాల్ పోటీల్లో పోటీపడిన జట్లలో గెలుపొందిన జట్లు వరుసగా ... శ్రీకాకుళం–ప్రకాశం జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో 10–0తో శ్రీకాకుళం, కర్నూలు–కృష్ణ 1–2తో కృష్ణా, గుంటూరు–ఈస్ట్ గోదావరి 10–0 తో గుంటూరు, అనంతపురం – వైఎస్సార్ కడప 3–4తో వైఎస్సార్ కడప, విజయనగరం–శ్రీకాకుళం 9–3తో విజయనగరం, కర్నూలు–చిత్తూరు 9–8తో కర్నూలు, గుంటూరు–విశాఖపట్నం 10–0తో గుంటూరు, అనంతపురం–నెల్లూరు 11–1 తో అనంతపురం, విజయనగరం–ప్రకాశం 10–0తో విజయనగరం, కృష్ణ–చిత్తూరు 8–1తో కృష్ణా, ఈస్ట్ గోదావరి–విశాఖపట్నం 3–2తో ఈస్ట్ గోదావరి, వైఎస్సార్ కడప – నెల్లూరు 5–2 జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో వైఎస్సార్ కడప జట్లు గెలుపొందాయి. క్వార్టర్ ఫైనల్ పోటీల్లో ... వైఎస్సార్ కడప – కర్నూలు మధ్య జరిగిన మ్యాచ్లో 10–0తో వైఎస్సార్ కడప, కృష్ణ–అనంతపురం 3–2తో కృష్ణా, గుంటూరు – శ్రీకాకుళం 6–2తో గుంటూరు, విజయనగరం – ఈస్ట్ గోదావరి 10–0తో విజయనగరం గెలుపొందాయి. వైఎస్సార్ కడప, కృష్ణా, గుంటూరు, విజయ నగరం జట్లు సెమీఫైనల్కు చేరుకున్నాయి. ఆదివారం సెమీ ఫైనల్స్లో మొదటిగా వైఎస్సార్ కడప – గుంటూరు, రెండవదిగా కృష్ణ – విజయనగరం జట్లు పోటీపడనున్నాయి. – ప్రారంభ కార్యక్రమంలో డీఎన్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ దరువురి నాగేశ్వరరావు, రిటైర్డ్ పీడీ దాసరి కోటేశ్వరరావు, లయోలా ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్ వంశీకృష్ణారెడ్డి, చైర్మన్ రాజారెడ్డి, సెక్రటరీ సామంతరెడ్డి, ట్రెజరర్ జనార్దన్ యాదవ్, ఏపీ సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పుణ్యాల నరసింహారెడ్డి, కన్వీనర్ ఎంవీ రమణ, క్రీడాకారిణిలు, క్రీడాభిమానులు పాల్గొన్నారు. -
పీహెచ్సీల్లో జ్వర పీడితుల పడిగాపులు
కొల్లూరు: ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్యులు అందుబాటులో ఉండడం లేదు. జ్వర పీడితులు, ఇతర అనారోగ్య సమస్యలతో వచ్చిన రోగులు గంటల కొద్దీ పడిగాపులు పడుతున్నారు. ఊరూర జ్వరాలు ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వస్తున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పీహెచ్సీల్లో అందుబాటులో ఉండాల్సిన వైద్యులు ఇష్టానుసారం విధులకు హాజరవుతున్నారు. దీంతో రోగులు అవస్థలు పడుతున్నారు. కొల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న వైద్యాధికారిణితోపాటు, అదనపు వైద్యులు వైద్య సేవలు అందించడానికి సమయానికి అందుబాటులో ఉండని కారణంగా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం జ్వరపీడితులతోపాటు, ఇతర రోగులు వైద్య పరీక్షల కోసం వైద్యశాలకు వచ్చి వైద్యుల కోసం 10 గంటల వరకు వేచి చూసినా పత్తా లేకపోవడంతో జ్వర పీడితులు నీరసించి కూలబడ్డారు. జ్వరంతో బాధపడుతున్న ఓ చిన్నారిని తండ్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నీరసించిన చిన్నారిని ఓపీ విభాగం కోసం నిర్మించిన గోడపై పడుకోపెట్టి నిరీక్షించాల్చి వచ్చింది. వైద్యులు సమయానికి అందుబాటులో లేని కారణంగా కొంత మంది జ్వర బాధితులు వేచి ఉండే ఓపిక లేక ప్రైవేటు వైద్యశాలలకు తరలివెళుతున్నారు. -
అవసరం మేరకే యూరియా తీసుకోవాలి
కర్లపాలెం: ఈ ఖరీఫ్ సీజన్కు వరి సాగు చేసిన రైతులు అవసరం మేరకే యూరియా తీసుకోవాలని కర్లపాలెం మండల వ్యవసాయాధికారి సుమంత్కుమార్ సూచించారు. మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామంలో శనివారం రైతుసేవా కేంద్రం ద్వారా 20 టన్నుల యూరియా పోలీసు బందోబస్తు మధ్య రైతులకు పంపిణీ చేశారు. ఏవో మాట్లాడుతూ కర్లపాలెం మండలంలో మొత్తం 15వేల ఎకరాలకుగాను సుమారు 12వేల ఎకరాలకు పైగా వరినాట్లు వేశారని తెలిపారు. మొత్తం విస్తీర్ణానికి 980 మెట్రిక్ టన్నుల యూరియా కావలసి ఉండగా ఇప్పటి వరకు 850 మెట్రిక్ టన్నుల యూరియా మండలంలోని పలు గ్రామాలలో రైతులకు పంపిణీ చేశామని తెలిపారు. యాజలి రైతు ఉత్పత్తిదారుల సేవా సంస్థ ద్వారా 20 టన్నులు, తుమ్మలపల్లి రైతు సేవా కేంద్రం ద్వారా 20 టన్నుల యూరియా రైతులకు పంపిణీ చేశామన్నారు. మార్క్ఫెడ్ ద్వారా రైతు సేవా కేంద్రాలకు విడతల వారీగా యూరియా వస్తుందని రైతులు ఆందోళన పడవద్దని ఏవో తెలిపారు. కొన్నిచోట్ల యూరియా దొరకదనే భయంతో కొంతమంది రైతులు అవసరానికి మించి యూరియా తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. ఇలా చేయటం వలన అవసరం ఉన్న రైతులకు అందకపోవచ్చునని రైతులు అవసరం మేరకే తీసుకోవాలని ఏవో రైతులను కోరారు. -
దేశ భాషలందు తెలుగు లెస్స
బాపట్ల: దేశ భాషలందు తెలుగు లెస్స, తెలుగు భాషను బతకనిద్దాం, గౌరవిద్దామని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. గిడుగు రామ్మూర్తి జయంతి, తెలుగు భాషా దినోత్సవం శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో నిర్వహించారు. గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి కలెక్టర్ పూలమాలవేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ వ్యవహారిక తెలుగు భాష మరింత వినియోగంలోకి తీసుకురావాలని ఉద్యమం చేసిన గొప్ప చారిత్రాత్మక వ్యక్తి రామ్మూర్తి అని ప్రశంసించారు. తెలుగు భాషకు బాపట్ల జిల్లా పుట్టినిల్లు అని పేర్కొన్నారు. తెలుగు భాష కోసం గిడుగు రామ్మూర్తి చేసిన త్యాగాలు మరువలేనివని ఇన్చార్జి సంయుక్త కలెక్టర్, డీఆర్ఓ జి.గంగాధర్ గౌడ్ అన్నారు. తెలుగు భాషకు వెలుగు లాంటి వ్యక్తి గిడుగు రామ్మూర్తి అని బెటర్ ఫర్ బాపట్ల కార్యదర్శి పి సి సాయిబాబు అన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ మల్లికార్జునరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. బాపట్ల అర్బన్: ప్రపంచ భాషలన్నింటిలోకెల్లా తెలుగు అత్యంత మధురమైనదని బాపట్ల ఆర్డీఓ పీ గ్లోరియా అన్నారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత తెలుగు తల్లి విగ్రహానికి, గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మోదుగుల శ్రీరామ్రెడ్డి డిగ్రీ కళాశాల విద్యార్థులు ‘తెలుగు తల్లి’ గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో ఫోరం కార్యదర్శి డాక్టర్ పి సి సాయిబాబు, తహసీల్దార్ షేక్ సలీమా, మున్సిపల్ డీఈ కృష్ణారెడ్డి, చిత్రకారుడు జీవి, కళాశాల అధ్యాపకుడు హనుమాన్జి, నాయకులు కర్పూరపు రామారావు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి -
పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం
బాపట్ల: ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని వీక్షణ సమావేశ మందిరంలో రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవ సందర్భంగా బాపట్లలోని సూర్యలంక బీచ్లో సెప్టెంబర్ 26, 27, 28 తేదీలలో బీచ్ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకలను తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉందని అన్నారు. తెలుగుదనం ఉట్టిపడేలా మూడు రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రతిరోజూ వివిధ రకాల కార్యక్రమాలు ఉండే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమాలు ప్రతి రోజూ ఉదయం తొమ్మిది నుంచి రాత్రి 9:30 గంటల వరకు నిర్వహిస్తారని తెలిపారు. బాపట్ల పట్టణంలోనూ, సూర్యలంక బీచ్ పరిసర ప్రాంతాలలో రద్దీ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. రామాపురం బీచ్లో కూడా మూడు రోజులపాటు సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. సెప్టెంబర్ 27వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సూర్యలంక బీచ్కు వస్తారని తెలిపారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పోలీసులకు సూచించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అనంతరం వేడుకల ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్ స్థలాలను కలెక్టర్ జె వెంకట మురళి, ఎస్పీ తుషార్ డూడీ, రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు పరిశీలించారు. సమావేశంలో ఇన్చార్జి సంయుక్త కలెక్టర్ జి గంగాధర్గౌడ్, రాష్ట్ర పర్యాటక శాఖ డిప్యూటీ సీఈఓ శ్రీనివాసరావు, పర్యాటక శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు లక్ష్మీప్రసన్న, బాపట్ల పర్యాటక శాఖ అధికారి నాగిరెడ్డి, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, డీపీఓ ప్రభాకర్, బాపట్ల ఆర్డీఓ గ్లోరియా, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీకొట్టిన లారీ
బల్లికురవ: సుబాబుల్ కర్ర లోడ్ ట్రాక్టర్ను వెనుక నుంచి గ్రానైట్ లారీ ఢీకొట్టడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శుక్రవారం రాత్రి బల్లికురవ– సంతమాగులూరు ఆర్అండ్బీ రోడ్డులోని కొత్త మల్లాయపాలెం బస్స్టాప్ సమీపంలో జరిగింది. బల్లికురవ ఎస్సీ కాలనీకి చెందిన బత్తిని చిన సుబ్బయ్య కూలీలతో మల్లాయపాలెం గ్రామ సమీపంలో సుబాబుల్ కర్ర కొట్టించుకుని ట్రాక్టర్కు లోడ్ చేసుకుని రోడ్ మార్జిన్లో ఆగాడు. కూలీలు ట్రాక్టర్కు లోడ్ ఎత్తుతుండగా వెనుక నుంచి ఈర్లకొండ క్వారీలకు వెళుతున్న గ్రానైట్ లారీ ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ మార్జిన్లోకి వెళ్లగా సుబాబుల్ కర్ర రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న బల్లికురవ ఎస్సై వై.నాగరాజు హుటాహుటిన ఘటనా ప్రదేశానికి సిబ్బందితో వెళ్లారు. సుబాబుల్ కర్రలను పక్కకు తీయించి ట్రాఫిక్కు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. ఇంటికి వెళ్లే సమయానికి.. పొట్ట కూటి కోసం సుబాబుల్ కర్ర కొట్టేందుకు కూలి పనులకు వెళ్లి అరగంటలో ఇంటికి చేరేలోపే నలుగురు గాయాల పాలయ్యారు. జొన్నలగడ్డ మేరమ్మ, పందిరి చినసుబ్బయ్య, కొత్తపల్లి యేసమ్మ, గంధం మేరమ్మలను చికిత్స నిమిత్తం నరసరావుపేటలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. నలుగురు కూలీలకు తీవ్ర గాయాలు -
ఏఎన్యూ దూరవిద్య పీజీ కోర్సులకు నోటిఫికేషన్
అక్టోబర్ 10 వరకు దరఖాస్తుల స్వీకరణ పెదకాకాని(ఏఎన్యూ): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ డిస్టెన్న్స్ ఎడ్యుకేషన్ (సీడీఈ) పీజీ దూర విద్య ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు సీడీఈ డైరెక్టర్ ప్రొఫెసర్ వంకాయలపాటి వెంకటేశ్వర్లు తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరానికి సెమిస్టర్ విధానంలో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ), డెబ్ (డిస్టెనన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో) నుంచి 23 పీజీ కోర్సులకు అనుమతి లభించిందన్నారు. దరఖాస్తుల స్వీకరణ గడువు అక్టోబర్ 10వ తేదీతో ముగుస్తుందన్నారు. కోర్సుల కాల వ్యవధి, విద్యార్హతలు, ఫీజులు తదితర వివరాలను ఏఎన్యూసీడీఈ. ఇన్ఫో అనే వెబ్సైట్లో గానీ, 0863 – 2346222, 98484 77441 ఫోను నెంబర్లను సంప్రదించడం ద్వారాగానీ తెలుసుకోవచ్చు. ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలు కూడా... ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు కూడా షెడ్యూల్ విడుదలైంది. దీని ద్వారా రెండేళ్ల కాలపరిమితితో కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ వివరాలను దూర విద్య కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ వంకాయలపాటి వెంకటేశ్వర్లు వెల్లడించారు. -
ముగిసిన డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన
గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరులోని ఏసీ కళాశాలలో రెండు రోజులపాటు జరిగిన డీఎస్సీ–2025 సెలెక్టెడ్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్ పాఠశాలల్లో భర్తీ చేసేందుకు నిర్ణయించిన 1,143 పోస్టులతోపాటు జోనల్ స్థాయిలో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో ఉన్న మోడల్, ఆశ్రమ, సాంఘిక సంక్షేమ పాఠశాలల్లోని 572 పీటీజీ, టీజీటీ, పీడీ, పీఈటీ పోస్టులవారీగా అభ్యర్థులకు సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలన ముగిసింది. గురువారం 930 మందికి సంబంధించి పరిశీలన పూర్తి కాగా, శుక్రవారం జోనల్స్థాయి పోస్టులకు ఎంపికై న అభ్యర్థులవి పరిశీలించారు. రెండు రోజుల వ్యవధిలో 1,650 మందికి పైగా అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది. ఈ ప్రక్రియను ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి, పరిశీలకురాలు పి.శైలజ, డీఈవోలు సీవీ రేణుక, చంద్రకళ, పురుషోత్తంలు పర్యవేక్షించారు.డీడీగా విధుల్లో చేరిన పాల్ సుధాకర్ గుంటూరు మెడికల్: గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ) కార్యాలయం డెప్యూటీ డైరెక్టర్గా బండి పాల్ సుధాకర్ శుక్రవారం విధుల్లో చేరారు. గుంటూరు ఆర్డీగా పనిచేస్తున్న గుర్రం శ్రీనివాసులురెడ్డి జేడీగా పదోన్నతి పొంది విజయవాడ డీఎంఈ కార్యాలయానికి బదిలీ కావడంతో ప్రభుత్వం పాల్ సుధాకర్ను డీడీగా నియమించింది. విధుల్లో చేరిన పాల్ సుధాకర్ ఆర్డీ డాక్టర్ శోభారాణిని కలిసి జాయినింగ్ రిపోర్టు అందజేశారు. డీడీగా విధుల్లో చేరిన పాల్ సుధాకర్ను కార్యాలయం సూపరింటెండెంట్లు సత్యం, రామకృష్ణ, సీనియర్ అసిస్టెంట్లు, పలువురు కార్యాలయ ఉద్యోగులు, పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది అభినందించారు. ఏషియన్ షూటింగ్ పోటీల్లో ముఖేష్కు పతకాల పంట గుంటూరువెస్ట్ (క్రీడలు): కజకిస్తాన్లోని షెమ్కెంట్లో జరుగుతున్న ఏషియన్ షూటింగ్ చాంపియన్ షిప్లో గుంటూరుకు చెందిన షూటర్ నేలవల్లి ముఖేష్ పతకాల పంట పండించాడు. శుక్రవారం జరిగిన ఫైనల్లో 50 మీటర్ల ఫ్రీ పిస్టల్, 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ , 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ టీమ్ విభాగాల్లో 3 బంగారు పతకాలు, 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం సాధించాడు. భారత్ జూనియర్ జట్టులో సభ్యుడైన ముఖేష్ కొన్ని సంవత్సరాలుగా జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో నిలకడగా రాణిస్తున్నాడు. రాష్ట్రంలో ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా అరుదైన రికార్డును సైతం నెలకొల్పాడు. ఈ సందర్భంగా ముఖేష్ను రైఫిల్ అసోసియేషన్ ఇండియా అధ్యక్ష, కార్యదర్శులు సలలిత్, రాజ్ కుమార్తోపాటు కేఎల్ యూనివర్సిటీ స్పోర్ట్స్ డీన్ హరికిషోర్లు అభినందించారు.ఆలయ నిర్మాణానికి రూ.లక్ష విరాళంనరసరావుపేట ఈస్ట్: సతైనపల్లి రోడ్డు కోటబజార్లో పునర్నిర్మాణం జరుపుకుంటున్న వీరాంజనేయ సహిత యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి పట్టణానికి చెందిన కొండేపాటి మంగేశ్వరరావు, సామ్రాజ్యం దంపతులు రూ.లక్ష విరాళంగా అందించారు. ఆలయంలో శుక్రవారం పూజలు నిర్వహించిన మంగేశ్వరరావు దంపతులు విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందించారు. కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు కోవూరి శివశ్రీనుబాబు, వనమా సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. -
రెవెన్యూ సేవలు సత్వరం అందించండి
చీరాల టౌన్: రెవెన్యూ సమస్యల పరిష్కారంలో అశ్రద్ధ వద్దని.. వచ్చిన ప్రతి అర్జీని నిశితంగా విచారణ చేయించాలని చీరాల ఆర్డీవో తూమాటి చంద్రశేఖర నాయుడు సూచించారు. శుక్రవారం చీరాల ఆర్డీవో కార్యాలయంలో చీరాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, రీ సర్వే డీటీలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. డివిజన్ పరిధిలోని మండలాల వారీగా పెండింగ్లో ఉన్న రెవెన్యూ సమస్యలు, రీ సర్వే, పీజీఆర్ఎస్ అర్జీలు, ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన అర్జీలు, ల్యాండ్ కన్వర్షన్, నీటి తీరువా వసూళ్లపై మాట్లాడి పలు సూచనలు చేశారు. ఈ సందర్బంగా ఆర్డీఓ మాట్లాడుతూ మండలాల వారీగా అర్హత ఉండి నివేశన స్థలాలు రాని వారి వివరాల నివేదికలు అందించడంతో పాటు కావాల్సిన భూమి వివరాలు అందించాలన్నారు. మండలాల్లో నీటి తీరువా వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేసి రైతుల నుంచి విధిగా నీటి తీరువా వసూళ్లు చేయాలన్నారు. రీ సర్వే పకడ్బందీగా చేసి రికార్డుల ప్రకారమే వివరాలను ఆన్లైన్ చేయాలన్నారు. రెవెన్యూ సమస్యలను సత్వరంగా పరిష్కరించాలని సూచించారు. అర్జీదారులకు నిర్ణీత సమయంలోగా అర్జీలు విచారించి పరిష్కారం చూపాలన్నారు. అర్జీదారులను కార్యాలయాల చుట్ట తిప్పుకోవద్దని ప్రజలకు సత్వరంగా సేవలందిస్తే మంచి అధికారులుగా గుర్తింపు వస్తుందన్నారు. ప్రజలకు జవాబుదారీతనంగా రెవెన్యూ ఉద్యోగులు పనిచేయాలని, విధుల్లో అలసత్వం వహించిన వారిపై శాఖా పరమైన చర్యలు తప్పవన్నారు. గ్రామాల వారీగా పెండింగ్లో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలను త్వరగా అందించడంతో పాటు గ్రామాల్లో ఎక్కడా కూడా అనధికార లే అవుట్లు వేయకుండా కట్టడి చేయాలన్నారు. ఓటీసీలను త్వరగా మంజూరు చేయాలన్నారు. సమావేశంలో డివిజనల్ సర్వే ఇన్స్పెక్టర్ ముసలయ్య, తహసీల్దార్లు గోపికృష్ణ, ప్రభాకరరావు, నాగరాజు, రీసర్వే డీటీలు, మండలాల సర్వేయర్లు బసవాచారి, శ్రీను. లోకేష్, ఇతర రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చీరాల ఆర్డీవో తూమాటి చంద్రశేఖర నాయుడు -
రూ. 6.40 లక్షలు పలికిన ఆనంద్పేట లడ్డూ
రెంటచింతల: స్థానిక ఆనంద్పేట కాలనీలో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపం వద్ద 90 కేజీల లడ్డూను, 30 గ్రాముల వినాయక స్వామి వారి బంగారు లాకెట్ను ఇగుటూరి రాజశేఖర్రెడ్డి రూ. 6.40 లక్షలకు వేలంపాటలో దక్కించుకున్నారు. సుమారు రెండు గంటల పాటు ఊరేగింపు కొనసాగింది. ప్రధాన రహదారిపై ఆనంద్పేట యువత కేరింతలు పెట్టారు. వందల మంది భక్తులు తరలివచ్చారు. గత ఏడాది లడ్డూను గొంటు ఆదిరెడ్డి రూ. 7.10 లక్షలకు దక్కించుకున్నారు. రూ. మూడు లక్షలకు పైగా ధర పలికిన లడ్డూ పెదకాకాని: మండలంలోని వెనిగండ్ల గ్రామంలో గురువారం రాత్రి వినాయక లడ్డూ వేలం నిర్వహించారు. వేమారెడ్డి గుడి సెంటర్లో రెడ్డి యూత్ ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి బుర్రముక్కుల శ్రీనివాసరెడ్డి 25 కిలోల లడ్డూ, తియ్యగూర శ్రీ ప్రియాంక రెడ్డి 20 కిలోల లడ్డూ, పులగం వేమారెడ్డి 11 కిలోల లడ్డూ సమర్పించారు. వేలంలో అబ్బులు(ఆత్మకూరి శేషిరెడ్డి) యువసేన 25 కిలోల లడ్డూను రూ.3,01,116లకు దక్కించుకుంది. 20 కిలోల లడ్డూ రూ.40 వేలకు, 11 కిలోల లడ్డూ రూ.40 వేలకు భక్తులు దక్కించుకున్నారు. అనంతరం వినాయక విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించారు. -
రెండు టన్నుల శివ లింగాకారంలో ప్రసాదం
తెనాలిరూరల్: వినాయక చవితి వేడుకల్లో భాగంగా భక్తులు తెనాలిలో శివ లింగాకారంలో ప్రసాదం తయారు చేయించారు. విశాఖపట్నం గాజువాకలోని లంకా గ్రౌండ్స్లో లక్ష చీరలతో ఏర్పాటు చేసిన 90 అడుగుల శ్రీ సుదర వస్త్ర మహా గణపతి కమిటీ సభ్యులు తెనాలిలోని మిర్చి స్నాక్స్లో భారీ లడ్డూ ప్రసాదం చేయించాలని నిర్ణయించారు. ఇందుకు మిర్చి స్నాక్స్ నిర్వాహకుడు వి.కిషోర్ అంగీకరించి రెండు టన్నుల శివలింగాకార లడ్డూ ప్రసాదాన్ని తయారు చేసి ఇచ్చారు. ఈ ప్రసాదాన్ని శుక్రవారం రాత్రి ఇక్కడ నుంచి గాజువాకకు తరలించారు. 91 మందికి ఉద్యోగ కల్పన తాడికొండ: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి – శిక్షణ శాఖ సౌజన్యంతో తుళ్లూరులోని సీఆర్డీఏ స్కిల్ హబ్ ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన జాబ్ మేళాను పలువురు సద్వినియోగం చేసుకున్నారు. 300కి పైగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు జాబ్ మేళా నిర్వహించగా 301 మంది హాజరయ్యారు. వీరిలో 91 మందికి ఉద్యోగాలు లభించాయని సీఆర్డీఏ అధికారులు తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికై న పలువురు అభ్యర్థులకు ఆయా కంపెనీల హెచ్ఆర్ విభాగ ప్రతినిధులతో కలసి సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఆఫర్ లెటర్లు అందజేశారు. కార్యక్రమంలో ఏపీ ఎస్ఎస్డీసీ ప్లేస్మెంట్ అధికారి అరుణ కుమారి, సీఆర్డీఏ డీసీడీవోఓ బి. శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి
గుంటూరు ఎడ్యుకేషన్ : ఆలిండియా పెన్షనర్స్ కో–ఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు శుక్రవారం గుంటూరు కృష్ణనగర్ లోని ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్) ప్రాంతీయ కార్యాలయం వద్ద పెన్షనర్స్ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ గుంటూరు జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పి. శేషగిరిరావు మాట్లాడుతూ కనీస పెన్షన్ రూ. 9వేలు ఇచ్చి, డీఏ జతపరచాలని డిమాండ్ చేశారు. ఈఎస్ఐ ద్వారా వైద్య సదుపాయం కల్పించి, హయ్యర్ పెన్షన్ కోసం హయ్యర్ వేజెస్ దరఖాస్తులను పరిష్కరించాలని కోరారు. రైల్వేలో రాయితీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఏపీ ఆర్పీఏ గుంటూరు జిల్లా కార్యదర్శి కే.బాబు ప్రసాద్ మాట్లాడుతూ 1995లో ప్రారంభించిన ఈ పీ ఎఫ్ పెన్షన్ ఇప్పటికీ సవరించలేదన్నారు. అనంతరం పీఎఫ్ రీజనల్ కమిషనర్ ప్రభుదత్తా ప్రుష్టిని కలిసి వినతి పత్రం అందజేశారు. సభలో ఎన్ఏ శాస్త్రి రాష్ట్ర ఏపీఆర్పిఏ అధ్యక్షుడు కే. గంగాధరరావు, ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ సభ్యులతో పాటు పోరాటానికి మద్దతు తెలియజేసేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే గుంటూరు అధ్యక్షుడు రామచంద్రయ్య, ప్రధాన కార్యదర్శి నరసయ్య , బ్యాంక్ ఎంప్లాయీస్ నాయకులు వి. సాంబశివరావు , జూట్ మిల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఏ నికల్స్ , ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ జిల్లా కార్యదర్శి బి. నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. కార్మికులకు న్యాయ విజ్ఞాన సదస్సు గుంటూరు లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు అసంఘటిత రంగ కార్మికులకు న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సయ్యద్ జియావుద్దీన్ మాట్లాడుతూ.. అసంఘటిత రంగంలోని కార్మికులందరూ ఈ– శ్రమ కార్డును కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్డు వలన అత్యవసర సమయంలో వైద్య, ప్రభుత్వ పథకాలకు అర్హులుగా గుర్తించబడి సహాయం పొందుతారని తెలిపారు. ఆన్లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకొని, పొందవచ్చని వెల్లడించారు. న్యాయపరమైన సూచనలు చేశారు. తాపీ మేసీ్త్రలు, పెయింటర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, ఆటో డ్రైవర్లు, మెకానిక్లు, వీధి వ్యాపారులు కార్డుకు అర్హులన్నారు. కార్యక్రమంలో కట్ట కాళిదాసు ప్యానల్ అడ్వకేట్లు, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ హనుమత్ సాయి తదితరులు పాల్గొన్నారు. -
కారు ఢీకొని సైకిలిస్ట్ మృతి
భట్టిప్రోలు: అతి వేగంగా వస్తున్న కారు ఢీ కొట్టడంతో సైకిలిస్ట్ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శుక్రవారం భట్టిప్రోలు వద్ద జాతీయ రహదారిపై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. భట్టిప్రోలు పంచాయతీ పరిధిలోని అద్దేపల్లికి చెందిన రంగిశెట్టి జయచంద్రరావు (55) వేమవరం సమీపంలోని ఎన్హెచ్ 216/ఎ జాతీయ రహదారి వెంబడి ఉన్న పొలం కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. పొలంలో శుక్రవారం నాట్లు వేస్తున్నారు. కూలీలకు తాగు నీరు తీసుకువచ్చేందుకు ఉదయం 10 గంటల సమయంలో సైకిల్పై బయలుదేరాడు. వెనుక నుంచి కారు అతి వేగంగా వచ్చిన కారు సైకిల్పై వెళుతున్న జయచంద్రరావును ఢీ కొట్టింది. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, చుట్టుపక్కల వారు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. అక్కడికి చేరుకున్న ఎస్ఐ ఎం. శివయ్య ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తామని తెలపడంతో ఆందోళన విరమించారు. గుంటూరుకు చెందిన కారు డ్రైవర్ నక్కా సురేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడికి భార్య, ఇరువురు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలు వివాహాలు అయ్యాయి. భార్య అన్నపూర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
రసవత్తరంగా జాతీయ యోగా పోటీలు
చిలకలూరిపేటటౌన్/యడ్లపాడు: నవోదయ విద్యాలయ సమితి(ఎన్వీఎస్) ఆధ్వర్యంలో చిలకలూరిపేట రూరల్ మండలం మద్దిరాల పీఎంశ్రీ జవహర్ నవోదయ విద్యాలయం వేదికగా జరుగుతున్న జాతీయస్థాయి యోగా విన్యాసాల ప్రదర్శన పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. భోపాల్, చండీఘర్, జైపూర్, హైదరాబాద్, లక్నో, పూనే, పాట్నా, షిల్లాంగ్ జేఎన్వీ రీజియన్ల పరిధిలోని ఒక్కొక్క రీజియన్ నుంచి బాలురు, బాలికలు 42 మంది చొప్పున 336 యోగాసాధకులు, టీంలీడర్, సంరక్షకులు హాజరయ్యారు. శుక్రవారం హైదరాబాద్ నవోదయ విద్యాలయ సమితి అసిస్టెంట్ కమిషనర్ డి చక్రపాణి రెండోరోజు పోటీల నిర్వహణను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. వివిధ విభాగాల్లో ఉత్సాహంగా పోటీలు అండర్–14, అండర్–17, అండర్–19 విభాగాల్లో బాలురు, బాలికలకు వేర్వేరుగా జాతీయస్థాయి యోగా పోటీలు నిర్వహిస్తున్నారు. వీటిలో యోగ ఆసనాలు, ఆర్టిస్టిక్ యోగా, రిథమిక్ యోగా వంటి కేటగిరీలతో పాటు, ఉత్తమ యోగి (బెస్ట్ యోగి), ఉత్తమ యోగిని (బెస్ట్ యోగినీ) వంటి ప్రత్యేక విభాగాల్లోనూ తీవ్రపోటీ నెలకొంది. తొలిరోజున బాలబాలికలు వివిధ ఆయా విభాగాల్లో అబ్బురపరిచే యోగా ప్రదర్శనలతో మెప్పించారు. రెండోరోజైన శుక్రవారం ఆర్టిస్టిక్ విభాగంలో అండర్–14, అండర్–17, అండర్–19 విభాగాల పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి. పోటీలకు రాష్ట్ర ప్రభుత్వ, వివిధ అసోసియేట్స్కు చెందిన యోగా అఫీషియల్స్ 15 మంది వ్యవహరిస్తున్నారు. పోటీలను మద్దిరాల పీఎంశ్రీ జేఎన్వీ విద్యాలయ ప్రిన్సిపల్ నల్లూరి నరసింహరావు పర్యవేక్షణలో వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, పీఈటీలు ఆర్ పాండురంగారావు, జి గోవిందమ్మ, అధ్యాపకులు సహకారం అందించారు. జాతీయస్థాయి యోగా పోటీల ముగింపు సభ శనివారం మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించనున్నారు. -
పుష్కర ఘాట్లో మహిళ ఆత్మహత్యాయత్నం
కాపాడిన మత్స్యకారులు తాడేపల్లి రూరల్: ప్రకాశం బ్యారేజ్ కృష్ణానది దిగువ ప్రాంతంలోని సీతానగరం పుష్కర ఘాట్ల వద్ద ఓ మహిళ కృష్ణానది వరద నీటిలోకి దిగి శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గమనించిన మత్స్యకారులు ఆమెను కాపాడి తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సేకరించిన వివరాల ప్రకారం.. విజయవాడ భవానీపురంనకు చెందిన నరేంద్రతో ఏడాదిన్నర క్రితం యామినికి వివాహమైంది. గత ఆరు నెలలుగా వారి మధ్య మనస్పర్థలు రావడంతో యామిని భవానీపురంలోని తల్లిదండ్రులు వద్ద ఉంటోంది. భర్త దగ్గరకు వెళ్లగా ఇంట్లో నుంచి బయటకు నెట్టడంతో మనస్తాపం చెంది సీతానగరం పుష్కర ఘాట్ల వద్దకు వచ్చింది. చనిపోవడానికి వరదనీటిలోకి దూకింది. పక్కనే పడవలను భద్రపరుస్తున్న మత్స్యకారులు గమనించి నీటిలోకి దిగి ఆమెను కాపాడారు. సమాచారం అందుకున్న తాడేపల్లి మహిళా పీఎస్ఐ అపర్ణ సంఘటనా స్థలానికి వెళ్లి యామిని తండ్రి శ్రీనివాసరావును పిలిపించారు. ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. -
ప్రతి కుటుంబానికి బ్యాంకింగ్ సౌకర్యాలు
భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ రీజినల్ ఆఫీస్ జనరల్ మేనేజర్ మహానా వేటపాలెం: ప్రజలందరికీ ఆర్థిక సేవలు చేరేలా ప్రభుత్వం కృషి చేస్తుందని భారతీయ రిజర్వ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ రీజనల్ ఆఫీస్ జనరల్ మేనేజర్ మహానా పేర్కొన్నారు. స్థానిక వెలుగు కార్యాలయంలో జిల్లా లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో మూడు నెలల ఆర్థిక కేంద్ర ప్రయత్న శిబిరం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రతి కుటుంబం బ్యాంక్ ఖాతా, డిజిటల్ లావాదేవీలు, బీమా, పెన్షన్, రుణ సౌకర్యాలు పొందేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. డిజటల్ మోసాల నుంచి ఎలా రక్షించుకోవాలో తెలిపారు. క్రెడిట్ విభాగం చీఫ్ మేనేజర్ ఎం. సంపత్, పైనాన్షియల్ ఇన్క్లూజన్ నోడల్ ఆఫీసర్ మహేంద్ర, వెలుగు సీసీలు, యానిమేటర్లు పాల్గొన్నారు. గొర్రెలను ఢీ కొన్న లారీ రెండు మృతి.. మరికొన్నింటికి గాయాలు మేదరమెట్ల: లారీ డ్రైవర్ మద్యం మత్తులో .. లారీని గొర్రెల మందపైకి నడపడంతో రెండు గొర్రెలు మృతి చెందగా మరో పది గొర్రెలకు కాళ్లు విరిగినట్లు బాధితుడు తెలిపాడు. హైదరాబాద్ నుంచి చైన్నెకు వెళుతున్న లారీ డ్రైవర్ మద్యం మత్తులో రోడ్డు మార్జిన్లో వెళుతున్న గొర్రెల మందపైకి నడిపాడు. కొరిశపాడు మండలంలోని మేదరమెట్ల పోలీసు స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం శుక్రవారం చోటు చేసుకుంది. మొత్తం రూ.2.50 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు వెంకటరామయ్య తెలిపారు. చింతాయపాలెం పాఠశాలకు స్పోర్ట్స్ ఎక్స్లెన్స్ అవార్డుకర్లపాలెం: మండల పరిధిలోని చింతాయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2024–25 సంవత్సరానికి స్పోర్ట్స్ ఎక్స్లెన్స్ అవార్డుకు ఎంపికై ంది. చింతాయపాలెం పాఠశాల విద్యార్థులు 2024–25 సంవత్సరంలో సుమారు 50 మంది రాష్ట్రస్థాయిలో జరిగిన ఆటల పోటీలలో పాల్గొని బంగారు, రజత పతకాలు సాధించారు. ఈ మేరకు కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం బాపట్ల విద్యాశాఖ కార్యాలయంలో చింతాయపాలెం పీఈటీ ఎం గోపీని డీఈవో ఎస్ పురుషోత్తం శాలువా కప్పి మెమోంటో అందజేసి సన్మానం చేశారు. పీఈటీ గోపీ మాట్లాడుతూ ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో విద్యార్థులు క్రమ శిక్షణతో ఆటలు ఆడి విజేతలుగా నిలవటం వలన పాఠశాలకు అవార్డు వచ్చిందని తెలిపారు. అవార్డు అందుకున్న పీఈటీ గోపీని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు. ఏఎన్యూ డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల పెదకాకాని (ఏఎన్యూ): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో జూన్, జూలై నెలల్లో నిర్వహించిన డిగ్రీ 5, 6వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను ఇన్చార్జి వీసీ ఆచార్య కె.గంగాధరరావు శుక్రవారం విడుదల చేశారు. 5,454 మంది పరీక్షలు రాయగా 4,292 మంది ఉత్తీర్ణత సాధించారు. రీ వాల్యూయేషన్కు సెప్టెంబరు 12లోగా ఒక్కో పేవర్కు రూ.1,490 చెల్లించాలని ఏసీఈ వెంకటేశ్వరరావు తెలిపారు. రెక్టార్ ఆచార్య కె రత్నషీలామణి, రిజిస్ట్రార్ ఆచార్య సింహాచలం, డిగ్రీ పరీక్షల కోఆర్డినేటర్ ఆచార్య ఎన్వీ కృష్ణారావు, ఎ.రాధాకృష్ణ, డాక్టర్ జ్ఞానేశ్వర్రెడ్డి, సీఈ శివప్రసాదరావు, నోడల్ ఆఫీసర్ రెడ్డి ప్రకాశరావు, ఏఆర్బీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
30 నుంచి రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలు
సత్తెనపల్లి: ఈ నెల 30, 31వ తేదీలలో మహిళలకు రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ పోటీలను సత్తెనపల్లి మండలం ధూళ్ళిపాళ్ల సమీపంలోని లయోలా ఇంజినీరింగ్ కళాశాలలో ఈ నెల 30, 31వ తేదీలలో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉమ్మడి గుంటూరు జిల్లా అమోచ్యూర్ సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఇ. వంశీకృష్ణారెడ్డి, పి.సామంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆహ్వానపత్రాన్ని డీఎన్ఆర్ ఫౌండేషన్ ఛైర్మన్ దరువూరి నాగేశ్వరరావు తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ పోటీలకు ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, సాఫ్ట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కోన రవి కుమార్, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఎ.రవి నాయుడు హజరవుతారన్నారు. 13 జిల్లాల టీములు పాల్గొంటాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో సహాయ కార్యదర్శి నర్రా శ్రీనివాసరావు, అడ్మిషన్ డైరెక్టర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
అమరుల స్ఫూర్తితో పోరాటం
సీపీఎం ప్రాంతీయ కార్యదర్శి బాబూరావు చీరాల అర్బన్: బషీర్బాగ్ కాల్పుల్లో ఆశువులు బాసిన విద్యుత్ అమర వీరుల స్ఫూర్తితో నేడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలకు వామపక్షాలు, ప్రజా సంఘాలు పూనుకున్నాయని సీపీఎం ప్రాంతీయ కార్యదర్శి ఎన్.బాబూరావు అన్నారు. 2000 ఆగస్టు 28న హైదరాబాద్ బషీర్బాగ్లో జరిగిన విద్యుత్ వ్యతిరేక ఉద్యమంపై చంద్రబాబు ప్రభుత్వం పోలీసు కాల్పుల దమనకాండలో విష్ణువర్దన్ రెడ్డి, రామకృష్ణ, బాలస్వామి అనే ముగ్గురు కార్యకర్తలు అశువులు బాసి నేటికీ 25 సంవత్సరాలు పూర్తయిందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విద్యుత్ అమరవీరుల సంస్మరణ ప్రతిజ్ఞ దినం కార్యక్రమంలో భాగంగా విద్యుత్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ గురువారం స్థానిక గడియార స్తంభం సెంటర్లో వామపక్ష, ప్రజాసంఘాల నాయకులు ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ పేద ప్రజలను దోపిడీకి గురిచేసి ప్రభుత్వ విధానాలను అందరూ కలిసి ఐక్యంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యుత్ పంపిణీ, నిర్వహణ వ్యవస్థలను ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అప్పగించడాన్ని తీవ్రంగా ఖండించారు. కేంద్రం, ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలో ఉన్నా ప్రపంచ బ్యాంకు ఆదేశిత సంస్కరణలనే అమలు చేస్తున్నారని, దీనిలో భాగంగానే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాలు విద్యుత్ రంగాన్ని మొత్తం అదాని వంటి కార్పొరేట్లకు కట్ట బెడుతుందన్నారు. దీని ఫలితంగా ప్రజలపై భారాలు పడుతున్నాయన్నారు. ప్రజా పోరాటం ద్వారా ఈ సంస్కరణలకు పాతర వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తమకు అధికారం ఇస్తే స్మార్ట్ మీటర్ల చార్జీలు.. అదనపు చార్జీలు, సర్దుబాటు చార్జీలు రద్దు చేస్తామని హామీ ఇచ్చి.. అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం మాట మార్చిందన్నారు. అవే స్మార్ట్ మీటర్లు, విద్యుత్ భారాలను యథావిధిగా ప్రజలపై వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఎం.వసంతరావు, డి.నారపరెడ్డి, ఎల్.జయరాజు, ఐవీ ప్రసాద్, బి.సుబ్బారావు, ఇమ్మానియేలు, సీపీఐ నాయకులు బత్తుల సామేలు, పైడియ్య, ప్రజాసంఘాల నాయకులు మాచర్ల మోహనరావు, చుండూరి వాసు, బలహీనవర్గాల సమాఖ్య నాయకులు గోసాల ఆశీర్వాదం, తాటిబోయిన లక్ష్మీప్రసాద్, శీలం వెంకటేశ్వర్లు, ఎన్.మోహన్కుమార్ ధర్మా తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి వినియోగిస్తున్న ఐదుగురి అరెస్ట్
1.15 కేజీల గంజాయి స్వాధీనం తెనాలి రూరల్: త్రీ టౌన్ పోలీసులు దాడులు నిర్వహించి గంజాయి వినియోగిస్తున్న ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్లో సీఐ ఎస్. రమేష్బాబు వెల్లడించిన వివరాల ప్రకారం.... బాలాజీరావుపేటలో డాక్టర్ మస్తానమ్మకు చెందిన ఖాళీ స్థలంలో కొందరు గంజాయి వినియోగిస్తున్నట్లు సమాచారం రావడంతో సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఘటనా స్థలంలో మహేంద్రదేవ్ కాలనీకి చెందిన పాలడుగు బాలకృష్ణ, గంగానమ్మపేటకు చెందిన సయ్యద్ ముజాయిద్, వేమూరు మండలం పెరవలి గ్రామానికి చెందిన పోతార్లంక కార్తీక్, బాలాజీరావుపేటకు చెందిన యలవర్తి శివకుమార్, చెంచుపేటకు చెందిన షేక్ సమీర్ హుస్సేన్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 1.15 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పాలడుగు బాలకృష్ణ, సయ్యద్ ముజాయిద్ ఒడిశా నుంచి గంజాయి తెచ్చి మిగిలిన నిందితులతో కలిసి తెనాలి పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు తెలిపారు. గంజాయికి బానిసలైనట్లు తెలిస్తే తల్లిదండ్రులు వెంటనే పోలీసుల దృష్టికి విషయాన్ని తీసుకొస్తే కౌన్సెలింగ్ నిర్వహించి, అవసరమైతే రిహాబిలిటేషన్ సెంటర్లకు పంపనున్నట్లు చెప్పారు. సమావేశంలో ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
శ్రీశైల గాయత్రి పీఠాఽధిపతిగా రామారావు
వేటపాలెం: శ్రీశైల గాయత్రి పీఠాధిపతులుగా రావూరిపేటకు చెందిన జ్యోతిర్విద్వాస్.. దేవాంగ పురోహిత పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు, విశ్రాంత ఉపాధ్యాయుడు చల్లా రామారావు ఎంపికయ్యారు. దేవాంగ కుల ద్వితీయ గురు పీఠం శ్రీశైలం గాయత్రి పీఠం అని, పీఠం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 26న చీరాల్లో పూర్తి చేసినట్లు ప్రధాన కార్యదర్శి అంబాబత్తుల అండకొండ రాముడు గురువారం వెల్లడించారు. ప్రస్తుతం తాత్కాలికంగా ఈ పీఠాన్ని రావూరిపేటలో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత శ్రీశైలంలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. పీఠం సభ్యులు చల్లా లక్ష్మణరావు, పన్నెం బాలశఽంకరరావు, సజ్జా విశ్వనాఽథ్ పాల్గొన్నారు. ఐదుగురు జూదరుల అరెస్ట్ కారంచేడు: మండలంలోని స్వర్ణ గ్రామంలో ఐదుగురు జూదరులను పోలీస్లు అరెస్ట్ చేశారు. గురువారం గ్రామంలోని సమీప పశువుల కొష్టాల వద్ద పేకాడుతున్నట్లు వచ్చిన సమాచారంతో తమ సిబ్బందితో దాడి చేసినట్లు ఎస్ఐ షేక్ ఖాదర్బాషా తెలిపారు. పేక ముక్కలతో పాటు, సెల్ఫోన్లు, రూ. 1120 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. 31న జిల్లాస్థాయి టెన్నికాయిట్ పోటీలు నరసరావుపేట రూరల్: ఉమ్మడి గుంటూరు జిల్లా టెన్నికాయిట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు లింగంగుంట్ల శంకరభారతీపురం జెడ్పీ హైస్కూల్లో జూనియర్, సబ్ జూనియర్, సీనియర్ టెన్నికాయిట్ ఆటల పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్షుడు నిడికొండ జానకిరామయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలలో ప్రతిభావంతులైన క్రీడాకారులను ఎంపిక చేసి సెప్టెంబర్ 13, 14వ తేదీలలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలో జరిగే రాష్ట్ర స్థాయి సీనియర్ పోటీలకు పంపనున్నట్లు పేర్కొన్నారు. సబ్ జూనియర్ విభాగంలో క్రీడాకారులు 01–01–2011, జూనియర్ విభాగంలో పాల్గొనే వారు 01–01–2007 తరువాత పుట్టిన వారై ఉండాలని తెలిపారు. పోటీలకు హాజరయ్యే వారు వయసు ధ్రువీకరణపత్రంతో రావాలని సూచించారు. పూర్తి వివరాలకు పి.తిరుపతిరావు – 97016 18000, ఝాన్సీరాణి – 99495 33234 ఫోను నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. -
స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ఎదుర్కొందాం
బాపట్ల: విద్యుత్ ఛార్జీల వ్యతిరేక పోరాటంలో 2000 సంవత్సరంలో హైదరాబాదులో బషీర్ బాగ్ వద్ద అమరులై రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామిల స్ఫూర్తితో స్మార్ట్ మీటర్లును రద్దు చేసేంతవరకు పోరాటం కొనసాగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సిహెచ్ గంగయ్య అన్నారు. గురువారం వామపక్ష పార్టీలు ఇతర ప్రజా సంఘాల నాయకులతో కలిసి బాపట్ల పాత బస్టాండ్ సెంటర్లో స్మార్ట్ మీటర్లు రద్దు అయ్యే వరకు పోరాటం ఆగదని ప్రతిజ్ఞ చేశారు. గంగయ్య మాట్లాడుతూ ఈ విద్యుత్ చార్జీల నిలువు దోపిడీని అరికట్టడానికి ప్రజల్ని పెద్ద సంఖ్యలో కదిలించాలని అందుకు వామపక్ష పార్టీలు ఇతర ప్రజా సంఘాలను కలుపుకొని ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. ఒక్కో మీటర్కు రూ. 30వేలు ఖర్చుపెట్టి మీటర్ల బిగించిన అనంతరం ఆ సొమ్ము మన వద్దే వాయిదాల పద్ధతిలో వసూలు చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు మజుందార్, కొండయ్య, శరత్, కోటేశ్వరరావు, నాగేశ్వరరావు, భాస్కర్ రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రవి, బీఎస్పీ నాయకులు రాజారావు, సమాజ్వాది పార్టీ నాయకులు శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ఆచార్య నాగార్జునుడి బోధనలు ఆచరణీయం
చికాగో బౌద్ధాలయం సందర్శనలో శివనాగిరెడ్డి విజయపురి సౌత్: ఆచార్య నాగార్జునుడి బోధనలు నేటికీ ఆచరణీయమని ప్రముఖ బౌద్ధ పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. ఈ మేరకు మిడ్ వెస్ట్ బౌద్ధాలయాన్ని గురువారం సందర్శించిన సందర్భంగా ఆయన ప్రసంగించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఆచార్య నాగార్జునుడి మధ్యమమార్గం, శూన్యవాదం, నైతిక వర్తన, సచ్ఛీలత, వివేకం, శాశ్వతానందాన్నిచ్చే బుద్ధుని చతురార్య సత్యాలు, ఆర్య అష్టాంగిక మార్గాలను ఆచరిస్తే ప్రస్తుత సమాజంలోని రుగ్మతలను నిర్మూలించవచ్చని తన ప్రసంగంలో ఆయన వివరించారు. బౌద్ధ సంస్కృతిని పరిరక్షించటానికి తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జునసాగర్ హిల్ కాలనీలో బుద్ధవనాన్ని నిర్మించారని గుర్తుచేశారు. అనంతరం ఆలయ ప్రధానాచార్యులు పూజ్య గ్యాదో కోనో వారి ప్రచురణలను శివనాగిరెడ్డికి బహూకరించారు. ఈ కార్యక్రమంలో చికాగో సాహితీ మిత్రులు, సంస్థ కార్యదర్శి జయదేవ్ మెట్టుపల్లి పాల్గొన్నారు. -
వినాయకునికి ప్రత్యేక పూజలు చేసిన ఎస్పీ దంపతులు
బాపట్లటౌన్: పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ తుషార్డూడీ తెలిపా రు. జిల్లా ఏఆర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుని పూజా కార్యక్రమంలో బుధవారం ఎస్పీ దంపతులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఎస్పీ తుషార్డూడీ మాట్లాడుతూ పండుగలను ఒక కుటుంబ వాతావరణంలో జరుపుకోవడంతో పోలీస్ సిబ్బంది మధ్య స్నేహభావం, ఐక్యత మరింతగా పెంపొందుతాయన్నారు. ప్రజల రక్షణ, భద్రత కోసం నిరంతరం విధుల్లో నిమగ్నమై ఉన్న పోలీస్ సిబ్బంది పండుగలను ఉత్సాహభరితంగా జరుపుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమన్నారు. వినాయక చవితి వంటి పండుగలు మన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకలుగా నిలుస్తాయన్నారు. జిల్లాలో వినాయక చవితి పందిర్లు/మండపాలను ఏర్పాటు చేసుకున్న ఉత్సవ కమిటీ సభ్యులు పోలీస్ వారి సూచనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఎక్కడైనా ఏవైనా అవాంఛనీయ ఘటనలు తలెత్తితే డయల్ 100, 112 నెంబర్లకు కాల్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ పి.విజయ సారథి, ఎస్బి సీఐ నారాయణ, రిజర్వ్ సీఐ మౌలుద్దీన్, బాపట్ల టౌన్ సీఐ ఆర్.రాంబాబు, రూరల్ సీఐ కె.శ్రీనివాసరావు, సర్కిల్ సీఐ బి.హరికృష్ణ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
తెగి పడిన హై టెన్షన్ విద్యుత్ వైరు
చుండూరు (కొల్లూరు): వైఎస్సార్ సీపీ రాష్ట్ర వలంటీర్ వింగ్ సెక్రటరీగా చుండూరు మండలం చిన్నగాదెలవర్రుకు చెందిన గాదెలవర్తి సుధీర్ను నియమిస్తూ గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి నియామక ఉత్తర్వులు వెలువడ్డాయి. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీగా కొల్లూరు మండల మాజీ ఎంపీపీ పెరికల పద్మారావును నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు గురువారం వెలువడ్డాయి. గుంటూరు ఎడ్యుకేషన్: డీఎస్సీ–2025 సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు ఈనెల 29న జీజీహెచ్ మెడికల్ బోర్డులో పరీక్షలు నిర్వహించనున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వైకల్య నిర్ధారణ పరీక్షల నిమిత్తం జీజీహెచ్ మెడికల్ బోర్డుకు రూ.1500 చెల్లించాలని సూచించారు. -
జామ్..జామ్ జామాయిల్!
అద్దంకి: వరితో పాటు వాణిజ్య పంటలూ నష్టాలను తెస్తున్న తరుణంలో అన్నదాతలు వణికిపోతున్నారు. ఇక చౌడు భూములున్నా లేనట్లే. అయితే ఇలాంటి నేలలున్న రైతులకు యూకలిప్టస్ (జామాయిల్) సాగు అనుకూలంగా ఉంటుంది. కాగితం పరిశ్రమతో పాటు, రేయాన్ పరిశ్రమ, మెడికల్ రంగాల్లో దీనిని విరివిగా వాడుతుండటంతో జామాయిల్ కర్రకు గిరాకీ పెరిగింది. జిల్లాలో 2 వేల ఎకరాల్లో జామాయిల్ సాగు చేసిన రైతులకు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కో మొక్క రూ.1 నుంచి రూ. 3 సంవత్సరానికి 400 మిల్లీ మీటర్ల నుంచి 12 వేల మిల్లీ మీటర్ల వర్షపాతం ఉన్న ప్రాంతాల్లోని చౌడు, బీడు భూములతో పాటు, సారవంతమైన భూముల్లోనూ జామాయిల్ సాగు చేసుకోవచ్చు. జూన్, జూలై, ఆగస్టు నెలలు అనుకూలం. 400కు పైగా రకాలున్నప్పటికీ 3, 7, 316, 413 రకాల క్లోన్లను నాటుకోవచ్చు. ఎకరాకు 888 మొక్కలు అవసరం అవుతాయి. 25 నుంచి 30 అడుగుల ఎత్తు పెరుగుతాయి. ఈ మొక్కలు ఖమ్మం జిల్లాలో విరివిగా దొరుకుతుండగా.. రవాణా ఖర్చులతో కలుపుకుని మొక్క రూ.1 నుంచి 3 రూపాయల వరకు వ్యయం అవుతుంది. నాలుగవ సంవత్సరం నుంచి కర్ర దిగుబడి.. నాటిన నాలుగో సంవత్సరం నుంచి కర్ర దిగుబడి వస్తుంది. ఎకరాకు సాధారణ భూముల్లో నీటి తడులు, ఎరువులు అందించిన తోటల్లో అయితే 40 నుంచి 60 టన్నుల మేర వస్తుంది. చౌడు భూములు, బీడు భూములు అయితే 30 నుంచి 40 టన్నుల వరకు కర్ర దిగుబడినిస్తుంది. అంటే ఎకరాకు అన్ని ఖర్చులు పోను రూ.1.5 లక్షల నుంచి రూ.2లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉన్నట్లే. తరువాత నాలుగు సంవత్సరాలకు ఒక సారి మొత్తం మూడు సార్లు కర్ర దిగుబడితో ఆదాయాన్ని ఇస్తుంది. మార్కెట్ ఎలా ? రైతు నేరుగా పేపర్ కంపెనీలకు లేదా, లైసెన్సు పొందిన కర్ర కొనుగోలు దారులకు కర్రను విక్రయించుకోవచ్చు. కర్రను కాగజ్ నగర్, భద్రాచలం, జేకే పేపర్ మిల్ వారు కొనుగోలు చేస్తున్నారు. చౌడు భూములు, బీడు భూముల్లో సాగు చేసుకోవడం ఉత్తతమని అధికారులు చెబుతున్నారు. సాధారణ పంటలు వేసి ఆదాయం లేక విసుగెత్తి జామాయిల్ సాగు చేశా. తెల్ల నేల కావడంతో మూడు సంవత్సరాలకే కొట్టుడు వస్తుంది. గతంలో ధర తక్కువగా ఉన్నా.. ఈ సంవత్సరం కర్ర ధర బాగుండడంతో టన్న ధర రూ.6 వేలు పలికింది. మంచి ఆదాయం వచ్చింది. – హనుమంతరావు, రైతు -
యూరియా కోసం రైతులు అగచాట్లు
నగరం: ఖరీఫ్ సీజన్ ఆరంభంలోనే రైతులు యూరియా కష్టాలను ఎదుర్కొంటున్నారు. బయ ట మార్కెట్లో బస్తా రూ.450 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నారు. పీఏసీఎస్లు, రైతు భరో సా కేంద్రాలలో బస్తా రూ.267కే అందిస్తున్నారు. దీంతో రైతులు సొసైటీలు, ఆర్బీకేలకు వెళుతున్నా రు. పెదపల్లి గొల్లపాలెం సొసైటీకి గురువారం యూరియా వచ్చిందని తెలియడంతో ఒక్కసారిగా రైతులు పెద్దసంఖ్యలో రావడంతో గందరగోళం నెలకొంది. టీడీపీ నాయకుల సిఫార్సులకే యూరియా ఇస్తున్నారని రైతులు వాపోతున్నారు. కొల్లూరు: గాజుల్లంక సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు ఎగబడ్డారు. గురువారం గాజుల్లంక పీఏసీఎస్కు 16.50 టన్నుల యూరియా సరఫరా అయ్యిందని తెలియడంతో కొల్లూరు, గాజుల్లంక, ఆవులవారిపాలెం, పెసర్లంక, పెదలంక, చింతర్లంక, సుగ్గునలంక, ఈపూరులంక గ్రామాల నుంచి రైతులు తరలివచ్చారు. రైతుల తాకిడి అధికమవడంతో పీఏసీఎస్ సిబ్బంది పాస్బుక్కు ఒక బస్తా చొప్పున పంపిణీ చేపట్టి చేతులు దులుపుకున్నారు. -
తీర గ్రామాలకు మళ్లీ వరద ముప్పు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కొల్లూరు: మండలంలోని చింతర్లంక, పోతార్లంక ప్రాంతాల్లోని పొలాల్లోకి తిరిగి వరద నీరు చేరుతుంది. దోనేపూడి కరకట్ట దిగువున లోలెవల్ వంతె నపైకి వరనీరు చేరే సూచనలు ఉండడంతో ఈ మార్గంలోని పోతార్లంక, తిప్పలకట్ట, తోకలవారి పాలెం, కిష్కింధపాలెం, జువ్వలపాలెం, తడికల పూడి గ్రామాల ప్రజలు మండలంలోని గాజుల్లంక, భట్టిప్రోలు మండలం వెల్లటూరు మీదుగా చుట్టు మార్గంలో రాకపోకలు సాగించాల్చి వస్తుంది. వరద తీవ్రత పెరిగితే పంటలకు నష్టం వాటిల్లుతుందన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. -
అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పింఛన్ అందించాలి
బాపట్ల: జిల్లాలో అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుడికి ఎన్టీఆర్ భరోసా పింఛన్ అందజేయాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి పేర్కొన్నారు. సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పలు అంశాలపై జిల్లా కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీఎం కుసుమ్ పథకం కింద జిల్లాలోని 22 ఫీడర్లకు ఏడు సబ్స్టేషన్ల పరిధిలో 17 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి 82.5 ఎకరాల భూమిని రైతుల వద్ద నుంచి తీసుకుంటున్నట్లు తెలిపారు. సూర్యలంక బీచ్ దగ్గర ఉన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కేంద్రానికి నీటి సరఫరాలో ఇబ్బందులు లేవని, 2015 సంవత్సరంలో మంజూరు చేసిన పనులలో 70 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన 30 శాతం త్వరలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సదరం ధ్రువీకరణ పత్రాల పునఃపరిశీలనలో భాగంగా అర్హత ఉండి పింఛన్ నిలుపుదల అయిన లబ్ధిదారులు ఎంపీడీవోలకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారికి పింఛన్ ఇస్తామని తెలిపారు. వారి ధ్రువీకరణ పత్రాలను మరోసారి పునః పరిశీలన చేస్తామని తెలిపారు. అనర్హులుగా తేలితే పింఛన్ నిలుపుదల చేస్తామని తెలిపారు. దరఖాస్తు చేయని వారికి పింఛన్ నిలుపుదల చేస్తామన్నారు. మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల మరమ్మతులు మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల మరమ్మతులు, కాలువలలో పూడికతీత పనులను ఎప్పటికప్పుడు చేపట్టా లని కలెక్టర్ అధికారులకు సూచించారు. భూగర్భ జలాలు పెంచేందుకు నీటి సంరక్షణ పనులను విరి విగా చేపట్టాలన్నారు. ఇన్చార్జి జేసీ జి.గంగాధర్ గౌడ్, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, ఏపీ సీపీడీసీఎల్ ఎస్ఈ ఆంజనేయులు, హౌసింగ్ పీడీ వెంకటేశ్వరరావు, మార్క్ఫెడ్ డీఎం కరుణశ్రీ ఉన్నారు.జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి -
మెరిట్ లేని డీఎస్సీ!
గుంటూరు ఎడ్యుకేషన్: డీఎస్సీ–2025 నోటిఫికేషన్ ఆధారంగా పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్, సబ్జెక్టుల వారీగా స్కూల్ అసిస్టెంట్లు, ఫిజికల్ డైరెక్టర్ తదితర పోస్టులకు పలువురు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల్లో మంచి మార్కులను సాధించి, పోస్టు ఖాయం అనుకున్న అభ్యర్థులు సైతం విద్యాశాఖ విధించిన నిబంధనలతో అయోమయంలో పడ్డారు. పోస్టింగ్ వస్తుందా, లేదా అనే సందేహాలతో సతమతం అవుతున్నారు. కాల్ లెటర్ వస్తేనే ఉద్యోగం, లేకుంటే కొలువు గల్లంతే అనే విధంగా కూటమి ప్రభుత్వం తీరు ఉంది. 19 బృందాలతో పరిశీలన ఉమ్మడి గుంటూరు జిల్లాలో డీఎస్సీ–2025 ద్వారా ఎంపికై న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను గురువారం గుంటూరు నగరంలోని ఆంధ్ర క్రైస్తవ (ఏసీ) కళాశాలలో చేపట్టారు. మొత్తం 1,143 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో చూపించారు. సర్టిఫికెట్ల పరిశీలనకు 19 టీమ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో టీంకు కళాశాలలోని ఆడిటోరియంతోపాటు వేర్వేరు గదుల్లో 50 మంది చొప్పున అభ్యర్థులను కేటాయించారు. పాఠశాల విద్యాశాఖ నుంచి కాల్ లెటర్ అందుకున్న అభ్యర్థుల వారీగా డీఎస్సీ సైట్లో సర్టిఫికెట్లను విజయవంతంగా అప్లోడ్ చేసుకున్న వారినే వెరిఫికేషన్కు పిలిచారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల డీఈవోలు సీవీ రేణుక, చంద్రకళ, పురుషోత్తం పర్యవేక్షణలో టీమ్ల వారీగా నియమించిన అధికారులు సర్టిఫికెట్ల పరిశీలన జరిపారు. పరిశీలకురాలిగా కమిషనరేట్ నుంచి పి.శైలజ హాజరు కాగా, డీఆర్వో ఖాజావలి వెరిఫికేషన్ సెంటర్ను తనిఖీ చేశారు.కాల్ లెటర్ వస్తేనే... విద్యాశాఖ నుంచి కాల్ లెటర్ పొందిన అభ్యర్థులకే పోస్టింగ్ అని, లేదంటే రాదనే కోణంలో నియామక ప్రక్రియ మారిపోయింది. పోస్టులకు మెరిట్ కం రోస్టర్ ప్రకారం జాబితాను బహిరంగంగా ప్రదర్శిస్తే అభ్యర్థులు సాధారణమైన సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉండేది. కాల్ లెటర్లు అందుకున్న అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారు. మరికొంత మంది తమకు కాల్ లెటర్లు రాకపోవడానికి కారణాలు తెలుసుకునేందుకు వచ్చా రు. ప్రతి పోస్టుకు మెరిట్ ప్రకారం ఇద్దరేసి అభ్యర్థులను ఎంపికచేసిన అధికారులు వెరిఫికేషన్ సెంటర్కు వచ్చిన వారి సర్టిఫికెట్లను పరిశీలన జరిపారు. 930 మంది సర్టిఫికెట్ల పరిశీలన గురువారం రాత్రికి పూర్తిచేసేందుకు నిర్ణయించారు. -
ప్రభుత్వ రాబడికి గండి
గత ప్రభుత్వంలో పర్చూరు నియోజకవర్గంలోని బొబ్బేపల్లి, కోలలపూడి, వలపర్ల, బొల్లాపల్లి ప్రాంతాల్లో పదుల సంఖ్యలో గ్రావెల్ లీజులు ఉండేవి. సదరు లీజుల నుంచి గ్రావెల్ తరలించి అవసరమున్న చోటుకు అమ్మేవారు. దీనివల్ల అటు ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం వచ్చేది. తద్వారా జిల్లాకు, మైనింగ్ పరిధిలోని గ్రామపంచాయతీలకు నిధులు సమకూరేవి. వాటితో అభివృద్ధి పనులు చేపట్టేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే లీజు క్వారీల్లో మైనింగ్ జరగకుండా నిలిపి వేయించారు. కూటమి సర్కారు కొలువు దీరే వరకూ పచ్చగా ఉన్న కొండలు పచ్చనేతల గ్రావెల్ దందాతో ఇప్పడు తరిగిపోయి బోళ్లుగా మారిపోయాయి. గ్రావెల్ తరలింపుతో కొన్ని ప్రాంతాలు దాదాపు కనుమరుగయ్యాయి. అక్రమ గ్రావెల్ దందాతో ప్రభుత్వ రాబడికి రూ.కోట్లలో గండి పడుతోంది. అయినా సంబంధిత శాఖలు అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కొండలను పిండిచేస్తున్నా స్థానిక రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడంలేదు. నెల మామూళ్లు పుచ్చుకుంటూ మైనింగ్ అధికారులు పట్టించుకోవడంలేదన్న ఆరోపణలున్నాయి. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఏఆర్ కానిస్టేబుల్
ఆత్మహత్యాయత్నం వీడియో కలకలం మాచర్ల రూరల్: మాచర్ల రూరల్ పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ షరీఫ్ ఆత్మహత్యాయత్నం వీడియో మంగళవారం కలకలం సృష్టించింది. వీడియో వివరాలు ఇలాఉన్నాయి..న్య.. తన వద్ద ఓ మహిళ రూ. లక్ష, ఆ తరువాత రూ. 75వేలు తీసుకుందని, ఆ డబ్బులు తిరిగి చెల్లించమని అడిగితే ఆమె, ఆమె భర్త తన పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని వీడియోలో వాపోయాడు. తన భార్యకు అన్యాయం చేసి ఈ మహిళ విషయంలో సన్నిహితంగా ఉండి కుటుంబాన్ని దూరం చేసుకున్నానని సదరు కానిస్టేబుల్ వాపోయాడు. ఆ యువతితో తనకు వివాహేతర సంబంధం ఉందని, తమకు ఒక బిడ్డ కూడా ఉందని చెప్పాడు. పట్టణ శివారులోని ఎంఎస్ఆర్ టౌన్ షిప్లో నివాసముంటున్నామని వీడియోలో పేర్కొ న్నాడు. తన తల్లిదండ్రులు ఇష్టం లేని పెళ్లి చేసి తన గొంతు కోశారంటూ మాయమాటలు చెప్పి ఆమె తనకు దగ్గరైనట్లు వీడియోలో వెల్లడించాడు. నగదు విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు రావటంతో తనపై డీఎస్పీ, ఎస్పీలకు ఫిర్యాదు చేసిందని, ఈ నేపథ్యంలో తనకు ఆత్మహత్యే శరణ్యమని, తన చావుకు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న నా తల్లిదండ్రుల చావుకు కూడా వారిదే బాధ్యతని వాపోయాడు. తను చనిపోయాక తన శవాన్ని భార్య, పిల్లలు చూడాలని కోరాడు. మహిళ చేతిలో మోసపోయానని, ఆత్మహత్యే శరణ్యమంటూ సెల్ఫీ వీడియో -
కక్షతోనే దాడి మాజీ ఎమ్మెల్యే బొల్లా
రాష్ట్రంలో నారా లోకేష్ ఆద్వర్యంలో రెడ్ బుక్ రాజ్యాంగం పక్కాగా అమలు జరుగుతోందని, దాని డైరెక్షన్లోనే టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీ నేతలపై దాడులకు తెగబుతున్నారని వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో వెంకట ప్రసాద్ వైఎస్సార్ సీపీ ఏజెంట్గా పని చేశాడనే కక్షతోనే స్థానిక టీడీపీ గూండాలు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయుల ప్రోద్బలంతో అతన్ని చంపేందుకు ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యే ఆకృత్యాలపై పోలీసులు న్యాయబద్ధంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. -
కుందేరు ఆక్రమణలను సహించం
చీరాలటౌన్: కుందేరు ఆక్రమణలను తొలగించడంతోపాటు పూర్వపు స్థితి కొనసాగించేలా కృషి చేస్తున్నామని చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య తెలిపారు. మంగళవారం చీరాల ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో తూమాటి చంద్రశేఖర నాయుడు ఆధ్వర్యాన కుందేరు పరిరక్షణ, కుందేరు ఆక్రమణలను తెలుసుకునేందుకు డివిజన్ స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో మురుగునీటిని కుందేరు ద్వారా స్ట్రయిట్ కట్ నుంచి సముద్రంలో కలిపేందుకు ముఖ్యమైన కుందేరు ఆక్రమణలకు గురవ్వడం, కుంచించుకుపోవడం దారుణమన్నారు. కుందేరుకు సంబంధించిన విస్తీర్ణం, వైశాల్యం, పొడవు, ఏయే ఊర్ల నుంచి ఎంత విస్తీర్ణం వ్యాప్తి చెందిందో పూర్తి వివరాలను అధికారులకు త్వరగా అందించాలన్నారు. ఆక్రమణలకు గురైన కుందేరును కాపాడుకోవడం కర్తవ్యమని, కుందేరును అభివృద్ధి చేస్తే రానున్న కాలంలో ఎలాంటి భారీ వర్షాలకై నా మురుగునీటి పారుదలకు ఇబ్బందులు ఉండవన్నారు. ఈపురుపాలెం, వేటపాలెం స్ట్రయిట్ కట్ల నుంచి కుందేరును మూసివేసి ఆక్రమణలకు పాల్పడ్డారని.. అలాంటి వారిని వదలబోమన్నారు. అనంతరం నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. సమావేశంలో తహసీల్దార్లు కె.గోపికృష్ణ, జె.ప్రభాకరరావు, ఎంపీడీవోలు శివన్నారాయణ, రాజేష్, మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్, డ్రైనేజీ, ఇరిగేషన్, సర్వే ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పంచాయతీలకు నిధులు విడుదల చేయాలి
కలెక్టర్ను కోరిన ఏపీ సర్పంచుల సంఘం ముఖ్య సలహాదారు నరసరావుపేట: జిల్లాలో గ్రామ పంచాయతీలకు తొమ్మిది నెలల నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘ నిధులు, రిజిస్ట్రేషన్ సర్ఛార్జి నిధులను విడుదల చేయాలని అఖిల భారత పంచాయతీ పరిషత్ (న్యూఢిల్లీ) జాతీయ ఉపాధ్యక్షుడు, ఏపీ సర్పంచుల సంక్షేమ సంఘ ముఖ్యసలహాదారు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు విజ్ఞప్తి చేసారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అరుణ్బాబును కలిసి వినతిపత్రం సమర్పించారు. రిజిస్ట్రేషన్ సర్ చార్జి నిధులు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయన్నారు. వాటిని గ్రామ పంచాయతీలకు బదిలీ అయ్యేవిధంగా కృషిచేయాలని, రిజిస్ట్రేషన్ ఐజీతో మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 526 గ్రామ పంచాయతీలలో రిజిస్ట్రేషన్ సర్చార్జి, 15వ ఆర్థిక సంఘం నిధులు వస్తే సర్పంచులు, గ్రామ పంచాయతీలకు ఊరటగా ఉంటుందన్నారు. గ్రామాలలో నీటి సరఫరాకు, బ్లీచింగ్కు, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు, విద్యుత్ బకాయిలు ఇచ్చేందుకు వెసులుబాటుగా ఉంటుందన్నారు. ప్రస్తుతం చాలా గ్రామ పంచాయతీల్లో వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా బ్లీచింగ్ కొనేందుకు, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇచ్చేందుకు కూడా నిధులు లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టి సారించి నిధులు విడుదలకు కృషిచేయాలని కోరారు. ఈ నిధులు విడుదల చేయకపోతే గత నెలలోనే కేంద్రం నుంచి రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు రావలసిన రూ.1000కోట్లు ఆగిపోయే ప్రమాదం ఉందన్నారు. దీనికి కలెక్టర్ స్పందించి సమస్యను ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషిచేస్తానని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. -
చెరువులో గల్లంతైన యువకుడు మృతి
కొల్లూరు: చెరువులో పడి గల్లంతైన యువకుడి మృతదేహాన్ని గజ ఈతగాళ్ల సాయంతో పోలీసులు వెలికి తీయించారు. సోమవారం రాత్రి కొల్లూరు శివారు బోస్నగర్లో సభావత్తు గోపినాయక్ (34) గ్రామాన్ని అనుకొని ఉన్న చెరువులో పడి గల్లంతైన విషయం విదితమే. అతని పెద్దమ్మ ఇంటికి వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో చెరువులో పడిన వ్యక్తిని గమనించిన మహిళ స్థానికులను అప్రమత్తం చేసింది. స్థానికులు అతని కోసం గాలించినా ప్రయోజనం లేకపోవడంతో కొల్లూరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సోమవారం రాత్రి గజ ఈతగాళ్లను చెరువులోకి దింపి గల్లంతైన యువకుడి కోసం గాలించారు. అర్ధరాత్రి సమయంలో మృతదేహం లభ్యమైంది. మృతుడి తల్లి దుర్గమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు ఎస్ఐ జానకి అమరవర్ధన్ తెలిపారు. -
ముగిసిన జిల్లా ఫెన్సింగ్ పోటీలు
గుంటూరు వెస్ట్ (క్రీడలు): ఉమ్మడి గుంటూరు జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక బీఆర్ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి అండర్–17 బాలబాలికల పోటీలు ముగిశాయి. జిల్లా కార్యదర్శి డి.అశోక్ బాబు మాట్లాడుతూ ఈ పోటీల్లో ప్రతిభకనబరచిన వారిని ఈ నెల 30న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరగనున్న అంతర్ జిల్లాల పోటీలకు పంపిస్తామని తెలిపారు. పోటీలను ఖేలో ఇండియా కోచ్ చిరంజీవి, డీఎస్ఏ కోచ్ కె.సంగీత బాబు ఆధ్వర్యంలో నిర్వహించామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ చైర్మన్ డి.ఎస్. క్రిష్టోఫర్, కోచ్లు పాల్గొన్నారు. గుంటూరు వెస్ట్: జిల్లాలో రైతుల నుంచి పొగాకు కొనుగోలు ప్రక్రియ నిరంతరం జరగాలని జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్తేజ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయనన మాట్లాడారు. ప్రభుత్వంతోపాటు, ప్రైవేటు కంపెనీలు కూడా రైతుల నుంచి కొనుగోలు చేయాలని ఆయన తెలిపారు. జిల్లాలో 3,895 మంది రైతులు పొగాకు సాగు చేయగా, 3,370 మంది రైతులు ప్రభుత్వానికి విక్రయించేందుకు సీఎం యాప్లో నమోదు చేసుకున్నారని జేసీ వెల్లడించారు. కొనుగోలు కోసం ఇప్పటి వరకు 1,614 మంది రైతులకు షెడ్యూల్ ఇచ్చారని తెలిపారు. ఏపీ మార్కెట్మార్క్ఫెడ్ ద్వారా 1063 మంది రైతుల నుంచి ప్రభుత్వం 2,200 టన్నులు కొనుగోలు చేసిందని చెప్పారు. ప్రైవేటు కంపెనీలు కూడా 3,500 టన్నులు కొనుగోలు చేశాయని తెలిపారు. ప్రభుత్వం జిల్లాకు కేటాయించిన 2,800 టన్నుల పొగాకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ ఇచ్చారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అయితా నాగేశ్వరరావు, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ టి.నరసింహారెడ్డి, పొగాకు రైతులు, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో రెడ్బుక్ అరాచక పాలన
నెహ్రూనగర్(గుంటూరుఈస్ట్): రాష్ట్రంలో నారా లోకేష్ రెడ్ బుక్ అరాచక పాలన నడుస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. అక్రమ అరెస్టులతో వైఎస్సార్ సీపీ నేతలు ఆసుపత్రులు, జైళ్లు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం సరిపోతోందని తెలిపారు. వినుకొండ నియోజకవర్గం టి. అన్నవరంలో టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడి, గుంటూరులోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వైఎస్సార్ సీపీ నేత వెంకట ప్రసాద్ను మంగళవారం పార్టీ పల్నాడు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో కలిసి పరామర్శించారు. దాడిలో వెంకట ప్రసాద్ సోదరు డు వెంకటేశ్వర్లుకు అయిన గాయాలను పరిశీలించారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఏజెంట్గా వెంకట ప్రసాద్ పని చేయడంతో అతడిని అంతం చేయాలని ప్లాన్ చేశారని ఆరోపించారు. ఈ కేసులో పోలీసులు సింపుల్గా 324 కేసు వేశారని తెలిపారు. రాజీపడమని నోటీసులు తీసుకునే సింపుల్ కేసు నమోదు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ కూటమి ప్రభుత్వానికి తొత్తుగా పని చేస్తోందని విమర్శించారు. న్యూట్రల్గా ఉండాల్సిన పోలీసులు అధికార పార్టీకి ఏకపక్షంగా పని చేస్తున్నారని ఆరోపించారు. నారా లోకేష్ రెడ్ బుక్ ఎల్లకాలం ఉండడదని, రానున్న రోజుల్లో వేరే బుక్కులు వసాయనే విషయాన్ని ఆయన గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. మాచర్లలో రెండు టీడీపీ ముఠాలు కొట్టుకొని హత్యలు చేసుకుంటే, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అక్రమ కేసు నమోదు చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదట్లోనే వినుకొండలో రషీద్ అనే వైఎస్సార్ సీపీ కార్యకర్తను అతి కిరాతకంగా నరికి చంపారని తెలిపారు. రాష్ట్రంలో ఇంత అరాచకాలు జరుగుతున్నా డీజీపీ, ఎస్పీలు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై పెట్టే అక్రమ కేసులపై న్యాయస్థానాల ద్వారా పోరాటం చేస్తామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడిన వైఎస్సార్ సీపీ నేత వెంకట ప్రసాద్ ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉంటే అతడి పైనే కేసు నమోదు చేయడం దారుణమని ఖండించారు. హత్యాయత్నానికి గురైన బాధితుడుపైనే తిరిగి పోలీసులు కేసు నమోదు చేయడం చూస్తే రెడ్ బుక్ రాజ్యాంగం ఎంత బలంగా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ హత్య జరిగిందంటూ వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. -
స్వార్థానికి కూలుతున్న మహా వృక్షాలు
కొల్లూరు: దశాబ్దాల చరిత్ర ఉన్న మహావృక్షాలు రంపపు కోతకు గురై నేలకొరిగాయి. కొల్లూరు పశ్చిమ బ్యాంక్ కెనాల్ అంచుల వెంబడి పెరిగిన భారీ వృక్షాలు కొందరి స్వార్థానికి మనుగడ కోల్పోయాయి. కొల్లూరు–ఈపూరు మార్గంలో కాలువ అంచుల వెంబడి ఉన్న భారీ వృక్షాలలో ఓ వృక్షం ఇటీవల వీచిన పెనుగాలులకు కూలి కాలువలోకి వాలిపోయింది. ఆ వృక్షాన్ని తొలగించే పేరుతో సజీవంగా ఉన్న వృక్షాలను సైతం కోసి కలపగా మార్చి ట్రాక్టర్లలో తరలించడం విమర్శలకు దారితీస్తుంది. కూలిన వృక్షాన్ని తొలగించడానికి అయ్యే ఖర్చుల కోసం సజీవంగా ఉన్న వృక్షాలను కూల్చడానికి నీటిపారుదల శాఖ అధికారులు తెగించడంపై స్థానికంగా ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఆహ్లాదకర వాతావరణాన్ని అందించే భారీ చెట్ల నరికివేతలో నగదు లావాదేవీలు భారీగా జరిగాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
మారథాన్లో పతకాలు అభినందనీయం
జిల్లా ఎస్పీ సతీష్కుమార్ నగరంపాలెం: అసాధారణమైన 42 కి.మీ మారథాన్ పరుగును కేవలం ఐదు గంటల్లోనే పూర్తి చేసి, పతకాలు సాధించడం అభినందనీయమని జిల్లా ఎస్పీ సతీష్కుమార్ ప్రశంసించారు. హైదరాబాద్లో ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ పరుగు పందెం (2025) పోటీలను ఈనెల 23, 24వ తేదీల్లో నిర్వహించారు. ఇందులో నల్లపాడు పీఎస్ ఏఎస్ఐ కె.రాజశేఖర్ బాబు (4.42 గంటలు), జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) హోంగార్డు జి.కృష్ణకిషోర్ (4.59 గంటలు) పతకాలు సాధించారు. నగరంపాలెంలోని డీపీఓలో మంగళవారం జిల్లా ఎస్పీ సతీష్కుమార్ను ఏఎస్ఐ, హోంగార్డు మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయన వారిద్దరిని అభినందించారు. భవిష్యత్లో మరెన్నో పతకాలు సాధించాలని సూచించారు. చవితి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి: ఎస్పీ నగరంపాలెం: జిల్లాలో వినాయక చవితి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ సతీష్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గణపతి వేడుకలు, నిమజ్జనం కార్యక్రమాల్లో అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఉత్సవ నిర్వాహకులకు సూచించారు. జిల్లా ప్రజలకు సకల శుభాలు కలగాలని, అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగిపోయి విజయాలు సిద్ధించాలని ఆయన తెలిపారు. గణనాథుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో అభివృద్ధిలో ముందడుగు వేయాలని ఎస్పీ ఆకాంక్షించారు. -
అక్రమ కేసులతో బీసీల అణచివేతకు కుట్ర
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్) : కూటమి ఏడాదిన్నర పాలనలో బీసీలు అన్ని రకాలుగా అణచివేతకు గురవుతున్నారని..వారిపై అక్రమ కేసులు పెట్టి గొంతు నొక్కేయాలని చూస్తున్నారని వైఎస్సార్ సీపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. గుంటూరులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణతో కలిసి ఆయన మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ జలకళ కార్యక్రమంలో భాగంగా ఎంబుక్లో ఫోర్జరీ సంతకాలు చేశారని అభాండాలతో వైఎస్సార్ సీపీకి చెందిన పెదకాకాని ఎంపీపీ శ్రీనివాసరావుపై పొన్నూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అక్రమ కేసు పెట్టి జైలుకు పంపించారని తెలిపారు. యాదవులు అంటే మంచితనానికి మారుపేరని..వారు మాట ఇచ్చారంటే దాని మీద నిలబడతారన్నారు. అటువంటి వారిపై అక్రమ కేసులు పెట్టి తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం సమంజసం కాదని సూచించారు. గత వైఎస్సార్సీపీ పాలనలో బీసీలకు అన్ని రంగాల్లో ప్రథమ స్థానం కల్పించి పైకి తీసుకువస్తే, కూటమి ప్రభుత్వం ఈవీఎంలతో అధికారంలోకి వచ్చి అక్రమ కేసులు పెట్టి వారిని అణగదొక్కాలని చూస్తోందని మండిపడ్డారు. ఎంపీపీ శ్రీనివాసరావు శ్రీకృష్ణుడి విగ్రహం ఏర్పాటు చేయిస్తే దాన్ని కూల్చివేయించిన ఎమ్మెల్యే దూళిపాళ్ల..అదే పొన్నూరు నియోజకవర్గం తక్కెళ్లపాడులో పెద్దఎత్తున వసూళ్లు చేసి శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేశారని వివరించారు. దీన్ని తీవ్రంగా ఖండించిన తెలుగు రాష్ట్రాల్లోని యాదవులంతా ఏకమై హెచ్చరికలు చేశారన్నారు. అక్కడ విగ్రహాన్ని తొలగించి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. అరాచకంతో, అధికారం ఉందని ఏదైనా చేయగలమని చూస్తే ప్రజలు చూస్తు ఊరుకోరని కారుమూరి చెప్పారు. పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ నియోజకవర్గంలో బీసీలపై ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినప్పటికి భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అక్రమాలకు చెక్ పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలిపారు. -
అమెరికా సుంకాలతో ఆక్వాకు ముప్పు
వేటపాలెం: అమెరికా.. భారత్పై విధించిన సుంకాలు ఆక్వా రంగానికి పెను ముప్పుగా తయారయ్యాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ‘ట్రంప్ సుంకాలు– ఆక్వా రంగంపై ప్రభావం’ అనే అంశంపై రామన్నపేట పంచాయతీ.. రావూరిపేట శివారులోగల ఆక్వా అసోసియేషన్ కార్యాలయంలో ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యాన మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆక్వా అసోసియేషన్ అధ్యక్షుడు తేళ్ల రామయ్య అధ్యక్షత వహించారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమెరికా ఆంక్షలను తిప్పి కొట్టాలని డిమాండ్ చేశారు. సుంకాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ప్రస్తుతం ఆక్వా రంగం కష్టకాలంలో ఉందన్నారు. ఆక్వా రంగాన్ని, వ్యవసాయ రంగంగా గుర్తించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమెరికా మన దేశ ఎగుమతులపై భారీ సుంకాలు విధించడం వల్ల వ్యవసాయం, అనుబంధ రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. మరోవైపు సుంకాలు అమలు ప్రారంభం కాకపోయినా రాష్ట్రంలో వ్యాపారులు అన్ని కౌంట్ రొయ్యల ధరలు తగ్గించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ బాధ్యతలు సక్రమంగా నిర్వహించడం లేదని విమర్శించారు. అసోసియేషన్ అధ్యక్షుడు తేళ్ల రామయ్య మాట్లాడుతూ రొయ్యల కొనుగోలు, ఫీడ్ తయారీ.. పిల్ల సప్లై కంపెనీలు వివిధ రాజకీయ నాయకుల కనుసన్నల్లో నడుస్తున్నాయన్నారు. ప్రభుత్వాలు వారితోనే చర్చలు, సంప్రదింపులు జరిపి సామాన్య రైతులకు గిట్టుబాటు ధరలు రాకుండా చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమంచి స్వాములు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా రైతులకు విద్యుత్ యూనిట్ ధర రూపాయిన్నర తగ్గించాలని, ఈ రంగంపై వేస్తున్న భారాలను తగ్గించాలని, ఫీడ్ ముడి పదార్థ ధరలు తగ్గించాలని కోరారు. రొయ్యల ధరలు నిర్దిష్టంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉందన్నారు. ఆక్వా రైతు పల్లపోలు శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశీయ మార్కెట్ను పెంచుకునే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. మధ్మాహ్న భోజనం పథకం, హాస్టల్స్ మిలిటర్ మెనూలో రొయ్యలను చేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు సూర్యనారాయణ, ప్రకాశం జిల్లా సంఘం అధ్యక్షుడు జె.జయంతిబాబు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తలపల రామారావు, కౌలు రైతు సంఘం కార్యదర్శి పి.కొండయ్య, చీరాల డివిజన్ సీఐటీయూ నాయకులు నలతోటి బాబూరావు, మండల నాయకులు మచ్చా అయ్యప్పరెడ్డి, రొయ్యల రైతులు రాంబాబు, జరుగు రమేష్, జగదీష్, ముంగర వెంకటరామయ్య, మోటుపల్లి శంకర్, మద్దినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. రౌండ్ టేబుల్ సమావేశంలో రైతుల ఆవేదన -
గణేషుని నిమజ్జనాలు పకడ్బందీగా చేయాలి
చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ చీరాల టౌన్: వినాయక చవితి పురస్కరించుకుని నియోజకవర్గంలోని వాడరేవు, రామాపురం సముద్ర తీర ప్రాంతాల్లో జరిగే గణపతి నిమజ్జనోత్సవాల్లో అపశ్రుతులు జరగకుండా ప్రశాంతంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని చీరాల ఆర్డీఓ తూమాటి చంద్రశేఖర నాయుడు సూచించారు. మంగళవారం ఆర్డీఓ కార్యాలయంలో పోలీస్, రెవెన్యూ, ఫైర్, మెడికల్, పంచాయతీరాజ్, మత్య్సశాఖ, మైరెన్, మున్సిపల్ అధికారులతో ఆర్డీఓ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆర్డీఓ మాట్లాడుతూ చీరాల నియోజకవర్గంతోపాటు పర్చూరు, అద్దంకి, చిలకలూరిపేట, నరసరావుపేట ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణనాథులను.. నిమజ్జనం కోసం వాడరేవు, రామాపురం సముద్ర తీర ప్రాంతాలకు తీసుకువస్తారన్నారు. విగ్రహాల తోపాటు అధిక సంఖ్యలో భక్తులు వాడరేవులో స్నానాలు చేస్తారన్నారు. సముద్రంలో లోతుకు వెళ్లి గల్లంతు కావడం, ప్రాణ నష్టం జరగకుండా కఠినంగా వ్యవహరించాలని సూచించారు. తీరం ఒడ్డున ప్రత్యేక అవుట్ పోస్టు, పోలీసులు, గజ ఈతగాళ్లు, మెడికల్ కిట్లు, 108 అంబులెన్స్, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని తెలిపారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేసేందుకు ట్రాఫిక్ సిబ్బందిని, బారికేడ్లు, విద్యుత్ లైట్లు, తాగునీరు, టెంట్లు ఏర్పాటు చేయాలన్నారు. తీరప్రాంతంలో పారిశుద్ధ్య పనులు నిరంతరం చేయడంతోపాటు బ్లీచింగ్ చల్లించి చెట్లు తొలగించాలన్నారు. నిమజ్జనా ల్లో ప్రాణ, ధన, ఆస్తి నష్టాలు జరగకుండా పనిచేయాలని కోరారు. ఉన్నతాఽధికారుల ఆదేశాలు విధిగా పాటించి నిమజ్జనాలు ప్రశాంతంగా జరిపించాలని తెలిపారు. చీరాల డీఎస్పీ మహ్మద్ మొయిన్, తహసీల్దార్ కె.గోపికృష్ణ, మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్, ఎంపీడీవోలు శివన్నారాయణ, రాజేష్, సీఐలు, ఎస్సైలు, మెడికల్ ఆఫీసర్లు పాల్గొన్నారు. -
ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు పొగాకు కొనుగోలు
కర్లపాలెం: ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు పొగాకు కొనుగోలు చేస్తామని, రైతులు అధైర్య పడవద్దని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అన్నారు. జిల్లా కలెక్టర్ వెంకట మురళి అధికారులతో కలసి మంగళవారం కర్లపాలెం మండలంలో విస్తృతంగా పర్యటించారు. తొలుత జిల్లా కలెక్టర్ కర్లపాలెంలోని ఎఫ్సీఐ గోదాముల్లో ఏర్పాటుచేసిన పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతులు అమ్మకానికి తీసుకువచ్చిన పొగాకును పరిశీలించారు. పొగాకు రైతులు మాట్లాడుతూ నాణ్యతగా ఉన్న పొగాకుకు కూడా నాసిరకం పొగాకుకు ఇచ్చే ధర నిర్ణయించి కొనుగోలు చేస్తున్నారని, దీని వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన కలెక్టర్ పొగాకు ధరలు నిర్ణయించేందుకు అనుభవం ఉన్న బయ్యర్లను నియమించి రైతులకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మార్క్ఫెడ్ అధికారులను ఆదేశించారు. పొగాకు నాణ్యత, కొనుగోళ్లకు సంబంధించి బయ్యర్లను అవసరం మేరకు శిక్షణకు పంపించాలని కలెక్టర్ ఆదేశించారు. అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రైతులకు హామీ ఇచ్చారు. ఎరువులు సిద్ధంగా ఉంచాలి. ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు అవసరమైన ఎరువులు సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ వ్యవసాయాధికారులను ఆదేశించారు. రైతులు ఆందోళన చెందవద్దని అన్నారు. కర్లపాలెం సెంటర్లో ఉన్న మన గ్రోమోర్ కేంద్రాన్ని, యాజలి గ్రామంలోని రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘం కార్యాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. మన గ్రోమోర్ సెంటర్లో రికార్డులు పరిశీలించారు. అనంతరం గోదాములో ఉన్న ఎరువుల నిల్వలను తనిఖీ చేశారు. రసాయనిక ఎరువులు, పురుగుమందుల వినియోగం తగ్గించి సేంద్రియ ఎరువుల వినియోగం పెంచాలని కలెక్టర్ రైతులకు సూచించారు. -
నేను రాను బాస్ చుండూరు స్టేషన్కు..
వేమూరు: చుండూరు పోలీసు స్టేషన్ పేరు చెబితే జిల్లాలోని ఎస్ఐలు భయపడుతున్నారు. అక్కడ విధి నిర్వహణ కత్తిమీద సాములా మారింది. రేషన్ బియ్యం మాఫీయా, గంజాయి ముఠా పోలీసులను శాసిస్తున్నారు. తమకు అనుకూలంగా నడుచుకోవాలని లేకుంటే బదిలీ తప్పదని హెచ్చరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 14 నెలల కాలంలో నలుగురు ఎస్ఐలు బదిలీ అయ్యారు. దీంతో ఈ స్టేషన్లో పనిచేసేందుకు ఎవ్వరూ ముందుకు రావడంలేదు. నాలుగు నెలలుగా ఎస్ఐ పోస్టు ఖాళీగా ఉంది. స్టేషన్ పరిధిలో శాంతిభద్రత నిర్వహణ కష్టతరంగా మారింది. వేమూరు నియోజకవర్గం పరిధిలో వేమూరు, కొల్లూరు, భట్టిప్రోలు, అమర్తలూరు, చుండూరు పోలీసుస్టేషన్లు ఉన్నాయి. వేమూరు, కొల్లూరు, భట్టిప్రోలు, అమర్తలూరు పోలీసుస్టేషన్లుకు ఎస్ఐ ఉన్నారు. చుండూరు స్టేషన్ ఎస్ఐ పోస్టు మాత్రం ఖాళీగా ఉంది. మాఫియాకు ఎదురు తిరిగితే బదిలీయే.. చుండూరు మండలంలో రేషన్ మాఫియా, గంజాయి అమ్మకాలు, పేకాట జోరుగా సాగుతుంది. చుండూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఆధ్వర్యంలో రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం జోరుగా సాగిస్తున్నాడు. నియోజకవర్గంలోని వేమూరు, కొల్లూరు, భట్టిప్రోలు, అమర్తలూరు మండలాల్లో రేషన్ బియ్యం కొనుగోలు చేసి నడిగడ్డవారిపాలెంలో ఉన్న రైస్ మిల్లుకు తరలిస్తున్నారు. అక్కడ పాలిష్ చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. గంజాయి వ్యాపారం జోరుగా సాగుతుంది. కూటమి నాయకుల ఆధ్వర్యంలో నిమ్మ తోటల్లో పేకాట జోరుగా నిర్వహిస్తున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఓ ఎస్ఐ గంజాయి, పేకాట నిర్వహణపై ఉక్కపాదం మోపారు. దీంతో కూటమి నేతలు ఆగ్రహించారు. ఆ ఎస్ఐపై బదిలీ వేటు పడింది. ఆ తర్వాత వచ్చిన ఎస్ఐ కూడా పేకాట నిర్వాహకులపై దృష్టి సారించారు. మే నెల 19వ తేదీన నిమ్మ తోటలో పేకాట ఆడుతున్న వ్యక్తులను గుర్తించేందుకు డ్రోన్లు ఉపయోగించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. కూటమి నేతల ఆగ్రహానికి గురయ్యారు. ఎస్ఐని బదిలీ చేయించారు. అప్పటి నుంచి చుండూరు పోలీసుస్టేషన్కు రావాలంటే ఎస్ఐలు భయపడుతున్నారు. దీంతో ఎస్ఐ పోస్టు నాలుగు నెలలుగా ఖాళీగా ఉంది. అక్రమ రేషన్ బియ్యం జోలికి వెళ్ల వద్దని తహసీల్దార్కు కూటమి నేతలు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో తహసీల్దార్ అటు కన్నెత్తి చూడడం లేదు. అక్రమ రేషన్ బియ్యం పట్టుకున్న దాఖలాలు లేవు. దీనిపై చుండూరు సీఐ శ్రీనివాసరావును వివరణ కోరగా పలువురు శిక్షణ పొందుతున్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత ఎస్ఐలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అప్పటి వరకు శాంతిభద్రతలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నామని చెప్పారు. -
మధ్యాహ్న భోజనం పరిశీలన
యాజలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమలు జరుగుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. విద్యార్థులతో కలసి కలెక్టర్ భోజనం చేశారు. భవిష్యత్లో ఏం కావాలనుకుంటున్నారని కలెక్టర్ విద్యార్థులను ప్రశ్నించారు. ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా చదివి కలలు నెరవేర్చుకోవాలని ఆయన చెప్పారు. అధికారులపై అసహనం యాజలి గ్రామంలో జరుగుతున్న స్వామిత్వ సర్వేను పరిశీలించిన కలెక్టర్ క్షేత్రస్ధాయిలో పనిచేసే సర్వే సిబ్బంది పనితీరు సరిగా లేదని అధికారుల మధ్య సమన్వయం లేకపోతే ఎలా అని అసహనం వ్యక్తం చేశారు. కర్లపాలెం పంచాయతీ పరిఽధిలోని ఎంవిరాజుపాలెంలోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ఫ్రీ స్కూల్ నిర్వహణపై ఆరా తీశారు. చిన్నారులందరికీ పౌష్టికాహరం సక్రమంగా అందించాలని చెప్పారు. అడిగిన ప్రశ్నలకు చిన్నారులు సరిగా స్పందించకపోటంతో కలెక్టర్ కార్యకర్తపై అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమాలలో బాపట్ల ఆర్డీవో పి.గ్లోరియా, వ్యవసాయశాఖ ఏడీ అన్నపూర్ణ, డీపీవో ప్రభాకర్రావు, మార్క్ఫెడ్ ఏడీ కరుణశ్రీ, సీడీపీవో రాధామాధవి, డీఎంఅండ్ హెచ్వో విజయమ్మ, తహసీల్దార్ షాకీర్ పాషా, ఇన్చార్జి ఎంపీడీవో అయినంపూడి శ్రీనివాసరావు, ట్రైనింగ్ ఎస్ఐ నజీమా తదితరులు ఉన్నారు. -
పూజలందుకో.. వి(శ్వ)నాయకా
బాపట్ల అర్బన్: సకల లోకాలకు ఆది పూజ్యుడైన వినాయకుడు వాడవాడలా ఠీవిగా కొలువుదీరారు. జై వినాయకా.. జైజై విశ్వనాయకా అంటూ గణనాథుడ్ని ఆరాధించేందుకు జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. స్వామి వారికి ప్రీతిపాత్రమైన పత్రి, ఇతర పూజాసామగ్రి కొనుగోలుతో బాపట్ల పట్టణం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. గణనాథుడి పూజకు అవసరమైన పూజా ద్రవ్యాల సేకరణలో భక్తులు నిమగ్నమయ్యారు. వినాయకచవితి సందర్భంగా బాపట్ల జిల్లా కేంద్రంలో పండుగ వాతావరణం నెలకొంది. జిల్లా వ్యాప్తంగా వాడవాడలా గణనాథుడి మండపాలు ఏర్పాటు చేశారు. ఆ మండపాల్లో ఇప్పటికే వినాయకుడి విగ్రహాలను కొలువుదీర్చారు. భక్తిశ్రద్ధలతో స్వామి వారిని పూజించేందుకు సకల ఏర్పాట్లు చేసుకున్నారు. వినాయక చవితి పండుగ ఆధ్యాత్మికతతోపాటు సమైక్యతకు చిహ్నంగా నిలుస్తుంది. వివిధ ఆకృతుల్లో విగ్రహాల ఏర్పాట్లు బాపట్ల పట్టణంలోని ప్రతి వీధిలో ఒకటి, అంతుకు మించి వినాయకుని విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఆయా వీధుల్లోని ప్రజలకు చందాలు వేసుకుని విగ్రహాలు ఏర్పాటు చేసుకుని ఆరాధించేందుక సిద్ధమయ్యారు. ప్రజలు వారి వారి స్థోమతను బట్టి విగ్రహాలు కొనుగోలు చేశారు,. వీటిని పందిళ్లలోకి తరలిస్తుండడంతో పట్టణంలో రద్దీ నెలకొంది. పూజా సామగ్రికి డిమాండ్ వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని బాపట్ల పట్టణంలోని రథం బజార్ సెంటర్, మార్కెట్ సెంటర్, చీలు రోడ్డు, బస్టాండ్ ప్రాంతాల్లో గణేశుని పూజా సామగ్రి విక్రయాలు ప్రారంభించారు. పత్రికి అవసరమైన వెలగపండు, అరటి బోదెలు, పండ్లు వంటివి విక్రయిస్తున్నారు. ఈ ఏడాది పూజా సామగ్రి ధరలు అధికంగా ఉన్నాయని భక్తులు చెబుతున్నారు. గతంలోకంటే 50 శాతం ధరలు పెరిగాయని అంటున్నారు. భక్తుల కొనుగోలుతో ఆయా ప్రాంతాలు రద్దీగా మారాయి. గ్రామాల్లో చవితి సందడి రేపల్లె: పట్టణాలు, గ్రామాల్లో వినాయక చవితి సందడి నెలకొంది. పలు ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన మండపాలలో గణనాథులు కొలువుదీరుతున్నారు. వినాయక ప్రతిమలు, పూజా సామగ్రి కొనుగోలు చేసేందుకు భక్తులు రావడంతో పట్టణాలలో వీధులన్నీ రద్దీగా మారాయి. పర్యావరణ పరిరక్షణ నేపథ్యంలో వినాయకుని మట్టి ప్రతిమలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. రేపల్లె పట్టణంలోని పెదకూరగాయల మార్కెట్, రాజ్యలక్ష్మి థియేటర్ సెంటర్, నెహ్రూ బొమ్మ సెంటర్లలో ఏర్పాటుచేసిన వినాయకుడు, పూజా సామాగ్రి స్టాల్స్ ప్రజలతో కళకళలాడాయి. బాపట్ల పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో వినాయక మట్టి ప్రతిమలు విక్రయిస్తున్నారు. ప్రొడిజి విద్యాలయంలో విద్యార్థులతో మట్టివినాయకులను తయారు చేయించి పంపిణి చేశారు. విద్యార్థులు అధిక శాతం మట్టి విగ్రహాల కొనుగోలుకు ప్రాధాన్యమిస్తున్నారు. మట్టి విగ్రహాల ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని కాపాడుకోవచ్చని అంటున్నారు. -
దివ్యాంగులకు అండగా వైఎస్సార్సీపీ
బాపట్ల: దివ్యాంగులకు అండగా వైఎస్సార్సీపీ ఉంటుందని మాజీ డెప్యూటీ స్పీకర్, పార్టీ బాపట్ల సమన్వయకర్త కోన రఘుపతి పేర్కొన్నారు. దివ్యాంగుల పింఛన్లు తొలగించటంపై సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళికి ఆయన వినతి పత్రం అందించారు. వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు. అర్హులైన వారికీ పింఛన్లు తొలగించారని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం విలేకరుల సమావేశంలో కోన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది లక్షల మంది దివ్యాంగులకు పింఛన్లు ఉంటే వాటిలో లక్ష మందికి తొలగిస్తూ నోటీసులు జారీ చేయటం తగదన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చే సమయంలో అన్ని రకాల పింఛనుదారుల సంఖ్య 33 లక్షలు ఉండగా.. దానిని రెట్టింపు చేసినట్లు వివరించారు. అర్హులైన వారందరికీ పెన్షన్ ఇచ్చేలా ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేశారని తెలిపారు. సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా తొలగింపునకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. విచారణ పేరుతో అన్ని పథకాలు తొలగిపోతాయని తెలిపారు. దివ్యాంగులకు అండగా ఉండేందుకు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు చల్లా రామయ్య ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉద్యమం చేపడితే తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని సూచించారు. అలాంటి కేసులకు భయపడేదే లేదన్నారు. చల్లా రామయ్యను ఓదార్చి సెల్ టవర్ నుంచి దించే ప్రయత్నం చేసేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నాయకులపై కూడా అక్రమ కేసులు పెట్టారన్నారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేస్తామని కోన చెప్పారు. దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు చల్లా రామయ్య, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి చేజర్ల నారాయణరెడ్డి, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు కాగిత సుధీర్బాబు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, జిల్లా యువజన విభాగ అధ్యక్షులు కొక్కిలిగడ్డ చెంచయ్య, తన్నీరు అంకమ్మరావు, జోగి రాజా పాల్గొన్నారు. జగనన్న కాలనీని గ్రామంలో కలపొద్దు ఉప్పరపాలెం సమీపంలోని జగనన్న కాలనీని మూలపాలెం లో చేర్చేలా కూటమి ప్రభుత్వం ప్రయత్నించటం సరికాదని కోన రఘుపతి సూచించారు. మూలపాలెం ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన గ్రామమని, దీంతో ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు కూడా వస్తున్నాయని గుర్తుచేశారు. ఈ మేరకు సర్పంచ్ బి.అనిల్ ఆధ్వర్యంలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపారని తెలిపారు. -
విద్యా పురోగతికి ఉపాధ్యాయుల కృషి కీలకం
చీరాల అర్బన్: ప్రత్యేక అవసరాల పిల్లల విద్యా పురోగతికి సహిత విద్య ఉపాధ్యాయులు కృషి చేయాలని సహిత విద్య జిల్లా సమన్వయకర్త జ్యోత్స్న పేర్కొన్నారు. సోమవారం ఆమె ఈపురుపాలెంలోని భవిత కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి పిల్లల విద్యా ఉన్నతిని ప్రత్యక్షంగా పరిశీలించారు. విద్యా పురోగతికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. భవిత కేంద్రం ద్వారా ప్రత్యేక అవసరాల పిల్లలకు ప్రత్యేకంగా స్పీచ్ థెరపీ, హియరింగ్, విద్య అందిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక అవసరాల పిల్లలను గుర్తించి భవిత కేంద్రానికి తీసుకువచ్చేలా తల్లిదండ్రులతో మాట్లాడాలన్నారు. కార్యక్రమంలో భావానారుషిపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం హేమంత్కుమార్, ఐఈఆర్టీ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సహిత విద్య జిల్లా సమన్వయకర్త జ్యోత్స్న -
పండుగ తరువాతే డీఎస్సీ నియామక ప్రక్రియ
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామక ప్రక్రియ వినాయకచవితి పండుగ తరువాతే ప్రారంభం కానుంది. ఇటీవల ప్రకటించిన డీఎస్సీ–2025 ఫలితాల్లో అర్హత సాధించిన అభ్యర్థులతో వివిధ కేటగిరీల వారీగా ఆయా పోస్టులకు ఎంపికై న వారికి పాఠశాల విద్యాశాఖ సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను ఈనెల 28 నుంచి చేపట్టనుంది. విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం ప్రారంభం కావాల్సిన సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను మంగళవారానికి వాయిదా వేసిన అధికారులు వినాయకచవితి పండుగ సెలవు దృష్ట్యా మరోసారి వాయిదా వేశారు. సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను గురువారం నుంచి చేపట్టేందుకు షెడ్యూల్లో మార్పులు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక సోమవారం ‘సాక్షి’కి తెలిపారు. ఏసీ కళాశాల వేదిక ఉమ్మడి గుంటూరు జిల్లాలో భర్తీ చేయనున్నట్లు డీఎస్సీ నోటిఫికేషన్లో పొందుపర్చిన 1,143 పోస్టులకు గతంలో 25,067 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆన్లైన్లో మొత్తం 43,570 దరఖాస్తులు అందాయి పురుషులు 8,431, మహిళలు 16,636 మంది ఉన్నారు. పరీక్షల ఫలితాలను ఇటీవల విడుదల చేశారు. ఎంపికై న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనను గురువారం నుంచి గుంటూరులోని ఏసీ కళాశాలలో చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యాశాఖ కార్యాలయం ద్వారా నేరుగా సమాచారాన్ని పంపుతారని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తగు చర్యలు చేపడతామని డీఈఓ సీవీ రేణుక చెప్పారు. -
ఆటోను ఢీకొన్న కారు.. వ్యక్తి మృతి
నలుగురికి గాయాలు సంతమాగులూరు (అద్దంకి రూరల్): ముందు వెళ్తున్న ఆటోను వెనకగా కారు ఢీకొనగా.. ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం సంతమాగులూరు మండలంలోని పుట్టావారిపాలెం జంక్షన్ సమీపంలో చోటుచేసుకుంది. ఎస్ఐ పట్టాభిరామయ్య తెలిపిన వివరాల మేరకు.. వినుకొండ మండలంలోని పొట్లూరు గ్రామం నుంచి సంతమాగులూరు మండలంలోని సజ్జాపురం వెళ్తున్న ఆటోలో డ్రైవర్తో సహా ఆరుగురు ప్రయాణిస్తున్నారు. ఈక్రమంలో మార్గమధ్యంలోని పుట్టావారిపాలెం జంక్షన్ దాటిన తరువాత పెట్రోలు బంకు ముందు ఉన్న బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి కారు అతి వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టింది. ఆటోలో డ్రైవర్ పక్కన కూర్చున్న ప్రయాణికుడు సజ్జాపురం గ్రామానికి చెందిన నంబూరి దావీదు (62) ఎగిరి బ్రిడ్జి పక్కన పడి తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న మరో నలుగురికి గాయాలయ్యాయి. వారిని స్థానిక వైద్యశాలకు తరలించారు. ఎస్ఐ పట్టాభిరామయ్య ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
‘ఉపాధి’కి అవినీతి తూట్లు!
బల్లికురవ: ఉపాధి హామీ పథకం మండలంలో అపహాస్యం పాలైంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి మండంలోని 21 గ్రామ పంచాయతీల్లో 645 పనులను రూ.12 కోట్లతో చేపట్టినట్లు అధికారులు ప్రకటించారు. మస్టర్లు, కొలతల్లో వ్యత్యాసాలు, మొక్కలు నాటని వైనం, చేసిన పనులే మళ్లీ చూపుతూ రూ.కోట్ల ప్రజాధనం అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లింది. జిల్లా, మండల స్థాయి అధికారులు పర్సంటేజీలకు అలవాటు పడి ఇవేమీ పట్టించుకోలేదు. గ్రామాల వారీగా సామాజిక తనిఖీల్లో అవినీతి జరిగినట్లు నిర్ధారించాయి. బల్లికురవలో ఈ నెల 6, 7వ తేదీల్లో జరిగిన బహిరంగ ప్రజావేదికలో ఈ మేరకు వెల్లడించారు. ఇది జరిగి 20 రోజులైనా అక్రమార్కులపై చర్యలు లేవని కూలీలు, ప్రజలు ఆరోపిస్తున్నారు. ౖపైపెనే విచారణ నక్కబొక్కలపాడు, కొమ్మినేనివారిపాలెం, వేమవరం, అంబడిపూడి, కొణిదెన, చెన్నుపల్లి, గొర్రెపాడు, వల్లాపల్లి, కె.రాజుపాలెం, కూకట్లపల్లి, వెలమవారిపాలెం గ్రామాల్లో రూ. 1.5 కోట్ల మేర పనులకు క్వాలిటీ కంట్రోల్ బృందం నివేదికలు ఇవ్వాల్సి ఉంది. మల్లాయపాలెం గ్రామంలో సాఫ్ట్వేర్, ప్రభుత్వ ఉద్యోగులు, 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులు 70 మందికి బోగస్ మస్టర్లు వేసి రూ. 20 లక్షలు వరకు స్వాహా చేశారని జిల్లా కలెక్టర్ వెంకట మురళికి, డ్వామా పీడీ విజయలక్ష్మికి ఆధారాలతో మల్లాయపాలెం మాజీ సర్పంచ్ అబ్బారెడ్డి బాలకృష్ణ ఫిర్యాదు చేశారు. విచారణను గతంలో ఎంపీడీవో పాండురంగస్వామికి కలెక్టర్ అప్పగించారు. ఆయన స్థానిక ఏపీవో జి. రమాదేవికి ఆ బాధ్యత అప్పగించారు. ఏపీవో భాగస్వామ్యం ఉన్నా అధికారులు ఆమెకే విచారణ బాధ్యతలు అప్పగించడంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఊరు పేరు అవినీతి మొత్తం (రూ.లక్షల్లో) వి.కొప్పరపాడు 50 ఉప్పుమాగులూరు 39.67 అంబడిపూడి 49.33 ముక్తేశ్వరం 35 బల్లికురవ 12 వల్లాపల్లి 1.57 మల్లాయపాలెంలో 8 వెలమవారి పాలెం 1.04 వైదన 3.78 కొప్పరపాలెం 8.3 కొమ్మినేనివారి పాలెం 0.96 వేమవరం 0.80 గుంటుపల్లి 0.65 కొణిదెన 0.16 చెన్నుపల్లి 0.16 గొర్రెపాడు 0.04 ఉపాధి పనుల్లో అవినీతిపై తగిన ఆధారాలతో ఫిర్యాదు చేశా. విచారణకు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్థానిక ఏపీవోను పంపడమేంటి? ఆమె ఫీల్డ్ అసిస్టెంట్ను వెంటబెట్టుకుని విచారణ ఎలా చేస్తారు? అక్రమాలను కప్పిపుచ్చి అధికారులు తప్పుడు నివేదికలు సమర్పించారు. తగిన ఆధారాలతో పంచాయతీ రాజ్ కమిషనర్కు ఫిర్యాదు చేస్తాం. ఇతర మండలాల అధికారుల విషయంలో మళ్లీ విచారణ చేపట్టాలి. – అబ్బారెడ్డి బాలకృష్ణ, మాజీ సర్పంచ్ -
శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న విగ్రహం తొలగింపు
పెదకాకాని: శ్రీకృష్ణుని రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ వివాదానికి దారి తీయడంతో నిర్వాహకులు స్వచ్ఛందంగా రాత్రికి రాత్రే ఆ విగ్రహాన్ని తొలగించి వేరే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలోని తక్కెళ్ళపాడులో ఈనెల 24వ తేదీన శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేస్తున్నట్లు టీడీపీ నాయకులు ప్రకటించారు. సమాచారం అందుకున్న యాదవ సంఘం నేతలు, బీసీవై పార్టీ నేతలు 23వ తేదీన తక్కెళ్ళపాడులో విగ్రహావిష్కరణ వద్దకు చేరుకుని, ఎన్టీఆర్ను శ్రీకృష్ణుని రూపంలో ఆవిష్కరించడం అంటే శ్రీకృష్ణుడికి ప్రతి ఇంటా పూజలు చేసే యాదవ కులాన్ని, హిందువులను అవమానించడమేనని ఈ విగ్రహావిష్కరణ నిలిపివేయాలని స్థానికులను కోరారు. అయినప్పటికీ ఆదివారం మండల టీడీపీ, గ్రామ పెద్దలు శ్రీకృష్ణుని రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ విగ్రహం నుంచి పిల్లనగ్రోవి, నెమలి పింఛం తొలగించారు. మరోసారి అదే విగ్రహం చేతిలో కత్తి పెట్టారు. అదే రోజు సాయంత్రం నిరసన తెలియజేసేందుకు అక్కడికి చేరుకున్న యాదవ సంఘం నాయకులు, బీసీవై పార్టీ ప్రతినిధులకు టీడీపీ నాయకులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అప్పటికే బీసీవై పార్టీ అధినేత సోమవారం ఛలో తక్కెళ్ళపాడు కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ పిలుపులో భాగంగా యాదవసంఘ ప్రముఖులు గుంటూరు నగరంలో సమావేశమయ్యారు. అలాగే తక్కెళ్ళపాడు గ్రామంలో టీడీపీ నాయకులు, విగ్రహావిష్కరణ కమిటీ సమావేశం నిర్వహించారు. వివాదాస్పద విగ్రహావిష్కరణ కులాలు, మతాల మధ్య సమస్యగా మారుతుందని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు.. ఆదివారం రాత్రి నిర్వాహకులు శ్రీకృష్ణుని రూపంలో ఉన్న విగ్రహాన్ని స్వచ్ఛందంగా తొలగించారు. అదే స్థానంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడంతో వివాదాలకు తెరపడటంతో పాటు శాంతియుత వాతావరణం నెలకొంది. ఎటువంటి వివాదాలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
బెల్టు షాపులను ప్రోత్సహిస్తే చర్యలు
వేమూరు: బెల్టు షాపులను ప్రోత్సహించే మద్యం షాపు నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని ఒంగోలు ప్రొహిబిషన్, ఎకై ్సజ్ ఎన్ఫోర్సుమెంట్ అధికారి విజయ తెలిపారు. మండల కేంద్రంలోని ప్రొహిబిషన్ ఎకై ్సజ్ కార్యాలయంలో నమోదైన మద్యం కేసులను సోమవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మద్యం షాపుల నిర్వాహకులు ప్రభుత్వం నిబంధనల ప్రకారం విక్రయాలు చేయాలన్నారు. ప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేకంగా మద్యం విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటి వరకు నమోదైన మద్యం కేసులు గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రొహిబిషన్ ఎకై ్సజ్ సీఐ రవి కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 28న నిధి ఆప్కే నికత్ గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరులోని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్) ప్రాంతీయ కార్యాలయ ఆధ్వర్యంలో ఈనెల 28న నిధి ఆప్కే నికత్ కార్యక్రమాన్ని ఆరు జిల్లాల్లో నిర్వహిస్తున్నట్లు సహాయ పీఎఫ్ కమిషనర్ పి.గోపాల్సింగ్ సోమవారం ఓప్రకటనలో తెలిపారు. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో ఉదయం 9.30 గంటల నుంచి జరగనున్న సమావేశాల్లో యజమానులు, ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు ఇతర వాటాదారులు, లబ్ధిదారులతో పరస్పరం ముఖా ముఖిగా చర్చలు జరుగుతాయని తెలిపారు. గుంటూరు అరండల్పేటలోని సెయింట్ ఇగ్నేషియస్ ఇంగ్లిష్ మీడియం పాఠశాల, ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని పెర్ల్ డిస్టలరీస్, బాపట్లలోని లిటిల్ ఏంజెల్స్ స్కూల్, సత్తెనపల్లిలోని శ్రీరాఘవేంద్ర బాలకుటీర్లో నిర్వహించనున్న నిధి ఆప్కే నికత్లో పాల్గొని ఫిర్యాదులు, సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. -
‘వర్రీ’ నారు!
బాపట్ల టౌన్: అతివృష్టి... అనావృష్టి... పరిస్థితుల మధ్య ఈ ఏడాది అన్నదాత కొట్టుమిట్టాడుతున్నాడు. మొన్నటి వరకు కాలువల ద్వారా నీరు విడుదల కాకపోవడం, వరుణుడు కరుణించకపోవడంతో అసలు సాగు చేస్తామో లేదోనన్న సందిగ్ధంలో రైతన్నలు ఉండేవారు. నార్లు పోసుకునేందుకు కూడా ముందుకు రాలేదు. నాటు వేసిన తర్వాత ఇటీవల భారీ వర్షాలకు ముంపునకు గురై నిండా మునిగారు. ఇప్పుడు మళ్లీ నాట్లు వేయాలంటే అదనపు భారం తప్పడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో అత్యధికంగా ఈ ఏడాది వెద పద్ధతిలో సాగు చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో రికార్డు స్థాయిలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరుణుడికి తోడు కాలువలు పొంగిపొర్లడంతో జిల్లాలోని లంకగ్రామాలు, తీరప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. జిల్లాలోని బాపట్ల, రేపల్లె, కొల్లూరు, నిజాంపట్నం, నగరం, కర్లపాలెం, పిట్టలవానిపాలెం, చీరాల, చినగంజాం, వేటపాలెం ప్రాంతాల్లో సుమారు 40 వేల హెక్టార్లలో వెద పద్ధతిలో, నాట్లు రూపంలో వరి సాగు చేశారు. భారీ వర్షాల కారణంగా పొలంలో నిలిచిన నీరు 10 రోజులకుపైగా నిలిచి ఉండటంతో పైర్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. తిరిగి మరోసారి వెద పెట్టేందుకు అవకాశం లేకపోవడంతో రైతులు తప్పనిపరిస్థితిలో నార్లు కొనుగోలు చేసి నాటేందుకు సిద్ధమయ్యారు. డిమాండ్ పెరిగిందిలా... నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండటంతో పొలాలు ఉరకెక్కే అవకాశం ఉండటంతో రైతులు సూదూర ప్రాంతాల నుంచి నారు కొనుగోలు చేసి నాట్లు వేసే పనిలో నిమగ్నం అయ్యారు. రైతుల అవసరాలను అవకాశంగా భావించిన వ్యాపారులు నారు ధరలను ఒక్కసారిగా అమాంతం పెంచేశారు. జిల్లా నలుమూలల నుంచి నార్లు కొనుగోలు చేసేందుకు కర్లపాలెం, బాపట్ల మండలాల్లోని మెరక ప్రాంతాల రైతులు అధిక సంఖ్యలో రావడంతో ధరలు కొండెక్కాయి. సాధారణంగా గతంలో నారు ధరలు సెంటు రూ. 450 నుంచి రూ.600 వరకు మాత్రమే ఉండేంది. డిమాండ్ పెరగడంతో సెంటు నారు రూ. 2000 దాటింది. గత్యంతరం లేని పరిస్థితిలో రైతులు కొనుగోలు చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో విక్రయం బాపట్ల మండలంలోని దరివాదకొత్తపాలెం, వెదుళ్లపల్లి, నందిరాజుతోట, కొండుబోట్లవారిపాలెం, చిల్లరగొల్లపాలెం, కర్లపాలెం మండలంలోని నందాయపాలెం, నల్లమోతువారిపాలెం, కర్లపాలెం, చీరాల మండలంలోని ఈపూరుపాలెం, బోయినవారిపాలెం, తోటవారిపాలెం ప్రాంతాల్లో నారు లభ్యం అవుతోంది. గరువు నేలలు కావటంతో ఇక్కడ నారుకు మంచి డిమాండ్ ఉంది. ఆయా గ్రామాల్లో రైతులు నారును విక్రయిస్తున్నారు. కొండెక్కిన ధరలతో కర్షకులు విలవిల పెరిగిన ఖర్చుల భారం నేను ఈ ఏడాది నాలుగు ఎకరాలు వెద పద్ధతిలో సాగు చేశా. ఇప్పటికే రెండుసార్లు వెద పెట్టినందుకు ఒక్కో ఎకరాకు రూ. 12 వేల చొప్పున ఖర్చు పెట్టాను. ప్రస్తుతం సెంటు నారు రూ. 2 వేల చొప్పున నాలుగు ఎకరాలకు కొనుగోలు చేశా. ఎరువులు, పురుగుమందులు సబ్సిడీపై అందజేయాలి. – గేరా శ్యామ్యూల్, ఈతేరు ఈ ఏడాది అన్నీ నష్టాలే ఈ సంవత్సరం ఏ గడియలో వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టామో కానీ అన్ని నష్టాలే వెంటాడుతున్నాయి. ప్రస్తుతం సెంటు నారు రూ. 2 వేలకు పైగా పలుకుతోంది. కౌలు చెల్లించుకుంటూ అప్పులు తీసుకొచ్చి వ్యవసాయం చేయాల్సిన పరిస్థితికి వచ్చాం. మాలాంటి చిన్న, సన్నకారు రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి. – కోటేశ్వరరావు, పూండ్ల -
టెండర్ల వాయిదాల పర్వం
బాపట్లఅయినవారి కోసమేనా ఎరువుల నిల్వల పరిశీలన నాదెండ్ల: సాతులూరులోని ఎరువుల రైల్వే రేక్ పాయింట్ను డీఏఓ ఎం.జగ్గారావు సోమవారం సందర్శించారు. సరుకు నిల్వల రికార్డులను ఆయన పరిశీలించారు. మంగళవారం శ్రీ 26 శ్రీ ఆగస్టు శ్రీ 20257పెనమలూరు: మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం కృష్ణా జిల్లా పోరంకిలో జేసీ గీతాంజలి శర్మతో కలిసి స్మార్ట్ రేషన్కార్డులను పంపిణీ చేశారు.సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ఏపీ సీఆర్డీఏ ఆహ్వానించిన టెండర్లను నిర్ణీత సమయంలో తెరవకుండా మీనమేషాలు లెక్కిస్తూ తమకు అనుకూలురైన కాంట్రాక్టర్ల కోసం ఎదురుచూస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టెండర్కు బిడ్లు దాఖలైనప్పటికీ సహేతుక కారణాలేవీ లేకుండానే ఫైనాన్షియల్ బిడ్ తెరవకుండా వాయిదా వేస్తుండగా, కొన్ని టెండర్లకు సంబంధించి సాంకేతిక బిడ్లను కూడా ఓపెన్ చేయడం లేదని టెండరుదారులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తమకు అనుకూలురైన బడా కాంట్రాక్టర్లకు పనుకట్టబెట్టడానికే వాయిదాల వ్యవహారాలను ఏపీసీఆర్డీఏ ఉన్నతాధికారుల ద్వారా కూటమిలోని పెద్దలు కొనసాగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చిన్న, మధ్యతరహా కాంట్రాక్టర్లను పక్కన పెట్టి అన్ని పనులను ఒకటిగా చేసి పెద్దమొత్తంతో టెండరు పిలిచి బడా కంపెనీలకు అప్పజెప్పి భారీస్థాయిలో పర్సంటేజీలు రాబట్టుకోవచ్చనే వ్యూహంలో భాగంగానే వాయిదాల పర్వమని స్పష్టమవుతోంది. పది పనులకు టెండర్లు -
జాతీయస్థాయి వాటర్రేస్ పోటీల్లో ద్వితీయ స్థానం
నగరం: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని కళాశాల కరస్పాడెంట్ వల్లభనేని బుచ్చియ్యచౌదరి చెప్పారు. స్థానిక ఎస్వీఆర్ఎం కళాశాలలో సోమవారం వాటర్రేస్లో జాతీయస్థాయిలో ద్వితీయ స్థానం సాధించిన పాగిడి గాయత్రికి అభినందన సభ నిర్వహించారు. బుచ్చియ్యచౌదరి మాట్లాడుతూ జమ్మూ కశ్మీర్లో ఈనెల 21 నుంచి 23 వరకు జరిగిన వాటర్ రేస్ పోటీల్లో గాయత్రి ప్రతిభ కనబర్చి ద్వితీయ స్థానం సాధించిందన్నారు. కృషి, పట్టుదల, అంకిత భావంతో పనిచేస్తే విజయాలు సుళువుగా సాధించవచ్చునన్నారు. అనంతరం గాయత్రిని కళాశాల పాలకవర్గ సభ్యులు, అధ్యాపకేతర సిబ్బంది ఘనంగా సన్మానించారు. ప్రిన్సిపాల్ అనగాని హరికృష్ణ, వ్యాయామ ఉపాధ్యాయుడు సాంబమూర్తి పాల్గొన్నారు. -
‘బార్’లకు నేటితో ముగియనున్న గడువు
రేపల్లె: ప్రభుత్వం నూతనంగా విడుదల చేసిన బార్ పాలసీలో భాగంగా బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వహణ అనుమతులు పొందేందుకు నేడు 26వ తేదీ సాయంత్రం 5 గంటలకు దరఖాస్తు గడువు ముగుస్తున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ కె.విజయ తెలియజేశారు. స్థానిక ప్రొహిబిషన్ కార్యాలయంలో సోమవారం రెస్టారెంట్ల ఏర్పాటుకు ఆసక్తి చూపే వారితో సమావేశం నిర్వహించారు. మూడు సంవత్సరాల పాటు బార్ అండ్ రెస్టారెంట్ నడుపుకొనేందుకు అనుమతులు లభిస్తాయన్నారు. రేపల్లెలో నాలుగు బార్ అండ్ రెస్టారెంట్ల ఏర్పాటుకు అనుమతులు లభించాయన్నారు. 2025 అక్టోబర్ 1 నుంచి 2028 ఆగస్టు 31వ తేదీవరకు మూడు సంవత్సరాల పాటు బార్ల నిర్వహణకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందన్నారు. దరఖాస్తులు చేసుకునేవారు రూ.5 లక్షలు నాన్ రిఫండబుల్ ఫీజు, రూ 10,000 అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని తెలియజేశారు. బార్లకు అందిన దరఖాస్తులను ఈ నెల 28వ తేదీ ఉదయం 8 గంటలకు జిల్లా కలెక్టర్ సమక్షంలో బాపట్లలో లాటరీ విధానంలో ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. బార్ పాలసీ విధి విధానాలను తెలియజేశారు. సమావేశంలో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ దివాకర్ పాల్గొన్నారు. చీరాల అర్బన్: రెస్టారెంట్ అండ్ బార్ల నిర్వహణకు సంబంధించిన నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిందని ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ కె.హేమంత నాగరాజు తెలిపారు. నోటిఫికేషన్ను అనుసరించి సోమవారం స్థానిక ఎకై ్సజ్ స్టేషన్లో ఔత్సాహికులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి మద్యం షాపుల యజమానులు, రియల్ ఎస్టేట్, రిసార్ట్స్ నిర్వాహకులు, బెల్లం అసోసియేషన్ సభ్యులు హాజరయ్యారు. హాజరైన వారితో ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్పై మాట్లాడారు. ఆసక్తి ఉన్న వారు టెండర్లు వేయాలని, లాటరీ పద్ధతిలో ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు. రెస్టారెంట్ అండ్ బార్ల కోసం దరఖాస్తులు ఔత్సాహికులు ప్రతి ఒక్కరూ వేయాలన్నారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ సీఐ పి.నాగేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ కె.విజయ -
చెరువులో పడి యువకుడు గల్లంతు
కొల్లూరు: చెరువులో పడి ఓ యువకుడు గల్లంతైన సంఘటన కొల్లూరు శివారు బోస్నగర్లో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. బోస్ నగర్కు చెందిన సభావత్తు గోపీనాయక్ (34) రోజువారి కూలిపనులు చేసుకుంటూ తల్లితో కలసి జీవనం సాగిస్తున్నాడు. అతని తల్లి అతని కుమార్తె వద్దకు పొన్నూరు వెళ్లడంతో సోమవారం రాత్రి సమీపంలోని తన పెద్దమ్మ ఇంటికి వెళ్లాడు. తన పెద్దమ్మ ఇంటి వద్ద నుంచి తిరిగి వచ్చే క్రమంలో గ్రామాన్ని ఆనుకొని ఉన్న చెరువు వద్దకు వెళ్లాడు. ఈక్రమంలో చెరువు పక్కనే నివసిస్తున్న ఓగృహిణి చీకట్లో చెరువు నీళ్లలో పడి గోపీనాయక్ కొట్టుమిట్టాడుతున్నట్లు గమనించి స్థానికులను అప్రమత్తం చేసింది. వారు టార్చ్లైట్ల సాయంతో వెతికేందుకు ప్రయత్నించినప్పటికీ అతని ఆచూకీ లభ్యం కాలేదు. యువకుడు గల్లంతైన సమాచారం అందుకున్న కొల్లూరు ఏఎస్ఐ వెంకటేశ్వర్లు సంఘటనా ప్రాంతానికి చేరుకొని స్థానికుల నుంచి సమాచారం సేకరించారు. రాత్రి సమయం కావడంతో యువకుడి కోసం గాలించే అవకాశాలు లేకపోవడంతో గజ ఈతగాళ్ల సాయంతో వెతికించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. యువకుడు చెరువులో గల్లంతవడానికి గల కారణాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడవ్వాల్సి ఉంది. -
పండుగ తరువాతే పరిశీలన
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామక ప్రక్రియ వినాయకచవితి పండుగ తరువాతే ప్రారంభం కానుంది. ఇటీవల ప్రకటించిన డీఎస్సీ–2025 ఫలితాల్లో అర్హత సాధించిన అభ్యర్థులతో వివిధ కేటగిరీల వారీగా ఆయా పోస్టులకు ఎంపికై న వారికి పాఠశాల విద్యాశాఖ సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను ఈనెల 28 నుంచి చేపట్టనుంది. విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం ప్రారంభం కావాల్సిన సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను మంగళవారానికి వాయిదా వేసిన అధికారులు వినాయకచవితి పండుగ సెలవు దృష్ట్యా మరోసారి వాయిదా వేశారు. సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను గురువారం నుంచి చేపట్టేందుకు షెడ్యూల్లో మార్పులు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక సోమవారం ‘సాక్షి’కి తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 1,143 పోస్టులు డీఎస్సీ–2025 ద్వారా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో 1,143 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటిలో స్కూల్ అసిస్టెంట్ 622, ఎస్జీటీ 521 ఉన్నాయి. వీటితో పాటు గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో మరో 16 పోస్టులు భర్తీ చేయనున్నారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో సబ్జెక్టుల వారీగా తెలుగు 42, హిందీ 57, ఇంగ్లిష్ 69, మ్యాథ్స్ 35, ఫిజికల్ సైన్స్ 58, బయాలాజికల్ సైన్స్ 86, సోషల్ 109, ఫిజికల్ ఎడ్యుకేషన్ 166తో పాటు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 521 ఉన్నాయి. ఏసీ కళాశాల వేదిక ఉమ్మడి గుంటూరు జిల్లాలో భర్తీ చేయనున్నట్లు డీఎస్సీ నోటిఫికేషన్లో పొందుపర్చిన 1,143 పోస్టులకు గతంలో 25,067 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఉపాధ్యాయ పోస్టులకు గల అర్హత ప్రాతిపదికన సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఒక దరఖాస్తు దాఖలు చేసిన అభ్యర్థులతో పాటు రెండు పోస్టులకు కలిపి దాఖలు చేసిన దరఖాస్తులతో కలుపుకొని ఆన్లైన్లో మొత్తం 43,570 దరఖాస్తులు అందాయి. దరఖాస్తు చేసిన అభ్యర్థుల్లో పురుషులు 8,431, మహిళా అభ్యర్థులు 16,636 మంది ఉన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూన్ 6వ తేదీ నుంచి జరిగిన ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పరీక్షల ఫలితాలను ఇటీవల విడుదల చేశారు. వీరిలో ఆయా పోస్టులకు ఎంపికై న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనను గురువారం నుంచి గుంటూరులోని ఏసీ కళాశాలలో చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఆయా పోస్టులకు ఎంపికై న అభ్యర్థులకు విద్యాశాఖ కార్యాలయం ద్వారా నేరుగా సమాచారాన్ని పంపుతారని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తగు చర్యలు చేపడతామని డీఈఓ సీవీ రేణుక చెప్పారు. -
ప్రజల సమస్యలను బాధ్యతగా పరిష్కరించాలి
బాపట్ల: ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. వినతి పత్రాలను స్వయంగా స్వీకరించి, కొన్నింటికి తక్షణమే పరిష్కారం చూపించారు. కొన్నింటిని సంబంధిత శాఖ అధికారులకు అందించారు. త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మొత్తం 190 వినతులు అందాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ భూములను కాపాడాలి ప్రభుత్వ భూములను ఆక్రమించి భవనాలు నిర్మిస్తే కూల్చివేయాలని, కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని బాపట్ల డీఎల్డీవోకు ఆదేశించారు. స్వామిత్వ సర్వే పురోగతిపై ఎంపీడీవోలతో ఆయన సమీక్షించారు. ప్రతిరోజు ఈ తరహా సమీక్ష నిర్వహిస్తానని, అధికారులందరూ నివేదికలతో సిద్ధంగా ఉండాలని తెలిపారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రతి గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీక్షణ సమావేశం నిర్వహిస్తారని, అందుకు అధికారులందరూ నివేదికలతో రావాలని పేర్కొన్నారు. పీ4 కార్యక్రమంలో నీడ్ బేస్డ్ సర్వేను వందశాతం పూర్తి చేయాలని ఆయన ముఖ్య ప్రణాళిక అధికారిని ఆదేశించారు. తల్లికి వందనం పథకంలో ఈకేవైసీ పూర్తి చేయాలని ఎంపీడీవోలను ఆదేశించారు. కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించి ఆపరేషన్లు చేసిన డాక్టర్లకు, ఏఎన్ఎంలకు ప్రోత్సాహక నగదు అందజేశారు. ఇన్చార్జి సంయుక్త కలెక్టర్ జి.గంగాధర్ గౌడ్, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, బాపట్ల ఆర్డీవో గ్లోరియా పాల్గొన్నారు. -
కౌలు రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి హరిబాబు కొల్లూరు: కృష్ణా నది వరదల కారణంగా పంటలు మునకకు గురై ఏర్పడిన పంట నష్టానికి తోడు, అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి హరిబాబు డిమాండ్ చేశారు. ఆదివారం కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆండ్రా మాల్యాద్రితో కలసి ఆయన మండలంలోని పోతార్లంకకు చెందిన కౌలు రైతు కుటుంబాన్ని పరామర్శించారు. కృష్ణా నదికి వచ్చిన వరదల వల్ల కౌలు రైతు ఈడ్పుగంటి మురళీకృష్ణ 5.85 ఎకరాలలో సాగు చేసిన అరటి, పసుపు, కంద పంటలు ముంపు బారిన పడ్డాయని తెలిపారు. దీనికి తోడు పంటల పెట్టుబడుల కోసం రూ.15 లక్షల పైబడి బ్యాంక్లు, స్థానిక వ్యక్తుల వద్ద అప్పులు చేయడంతో, అవి తీర్చే మార్గం కనిపించక మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. పంటల సాగు అధిక శాతం కౌలు రైతులే చేస్తున్నారన్నారు. అటువంటి కౌలు రైతులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు జారీ చేయడంలో, ఇచ్చిన కార్డులకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నందునే అధిక వడ్డీలకు ప్రైవేటు వ్యక్తుల వద్ద రుణాలు తీసుకొని అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని పేర్కొన్నారు. కౌలు రైతులు, రైతుల ఆత్మహత్యలకు పరోక్షంగా బ్యాంక్లు, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే కారణమని అన్నారు. ప్రభుత్వం నుంచి మృతుడి కుటుంబానికి అందాల్చిన రూ.ఏడు లక్షల పరిహారం కుంటి సాకులు చూపకుండా పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేశారు. మృతుడి పిల్లలను కార్పొరేట్ పాఠశాలల్లో చేర్పించి ఉచిత విద్యా బోధనతోపాటు, పీ–4 ద్వారా ఆ కుటుంబాన్ని దత్తత తీసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గోళ్ల నాగరాజు, ప్రజాసంఘాల నాయకులు తోడేటి సురేష్, బి.సుబ్బారావు, పి.నాగమల్లేశ్వరరావు, పిల్లి మరియారావు పాల్గొన్నారు. -
నాగిరెడ్డికి మదర్ థెరెస్సా జాతీయ పురస్కారం
కారంచేడు: మండలంలోని యర్రంవారిపాలెం గ్రామానికి చెందిన మదర్ సర్వీస్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు మున్నంగి నాగిరెడ్డికి మదర్ థెరెస్సా జాతీయ ప్రతిభా పురస్కారం లభించింది. ఆదివారం అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం సీఆర్సీ కన్వెన్షన్ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు ఈ అవార్డు ప్రదానం చేసినట్లు నాగిరెడ్డి తెలిపారు. మదర్ థెరెస్సా ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ దిండ్ల కిషోర్ సారథ్యంలో జరిగిన కార్యక్రమంలో తమ ట్రస్ట్ ద్వారా చేసిన అనేక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేశారని పేర్కొన్నారు. 16 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో చేసిన సంక్షేమ, అభివృద్ధి, సేవా కార్యక్రమాలను ప్రదర్శించామన్నారు. సీఆర్సీ వ్యవస్థాపక అధ్యక్షుడు విక్టరీ వెంకటరెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్ రమణమ్మ, శివకుమార్, చంద్ర సుబ్బారెడ్డి, నరేష్కుమార్రెడ్డి, డాక్టర్ వడియార్, వీరరాఘవరెడ్డి చేతుల మీదుగా తనకు అవార్డును అందించామని నాగిరెడ్డి తెలిపారు. -
చీరాల రైల్వే స్టేషన్లో భారీగా గంజాయి పట్టివేత
చీరాల రూరల్: చీరాల రైల్వేస్టేషన్లో ఆదివారం ఈగల్ టీమ్, రైల్వే జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన తనిఖీల్లో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. జీఆర్పీ ఎస్సై సీహెచ్. కొండయ్య, ఆర్పీఎఫ్ ఎస్సై శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల మేరకు.. చీరాల రైల్వే స్టేషన్లో పూరీ నుంచి తిరుపతి వెళ్లే బిలాస్పూర్ ఎక్స్ప్రెస్ రైల్లో ఈ తనిఖీలు చేపట్టారు. జనరల్ బోగీలో లగేజీని తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న పార్సిళ్లు కనిపించడంతో పరిశీలించారు. సుమారు 8 కేజీల గంజాయి వాటిలో ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. తర్వాత జీఆర్పీ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సైలు తెలిపారు. గంజాయి, మాదక ద్రవ్యాలు రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాపట్ల ఆర్పీఎఫ్ ఎస్సై మనోజ్కుమార్ రెడ్డి, చీరాల ఏఎస్సై కె. శ్రీనివాసరావు, బాపట్ల పట్టణ ఏఎస్సై నరసింహమూర్తి, పోతురాజు, చంద్రమౌళి, తిరుపతమ్మ, ఈగల్ టీమ్ దుర్గాప్రసాద్, సతీష్, డాగ్స్క్వాడ్ పాల్గొన్నారు. పూరీ నుంచి తిరుపతి వెళ్లే రైల్లో 8 కేజీలు స్వాధీనం -
పల్నాడు జిల్లాకు గుర్రం జాషువా పేరు పెట్టాలి
పిడుగురాళ్ల: పల్నాడు జిల్లాకు గుర్రం జాషువా పేరు పెట్టాలని అంబేడ్కర్ ప్రచార సేవా సమితి డేగల అబ్రహం డిమాండ్ చేశారు. ఆదివారం దళిత సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు తాళ్లూరి అమర్ నాథ్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దళిత మహాసభ పల్నాడు జిల్లా అధ్యక్షులు పిల్లి చెన్నారావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కూడా మేము ప్రభుత్వానికి అర్జీలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. జాషువా కళా సమితి అధ్యక్షుడు బత్తుల దాసు మాట్లాడుతూ గుర్రం జాషువా జిల్లా పెట్టాలని దళితుల కోరిక అన్నారు. గబ్బిలం అనే రచన ద్వారా జాషువా ప్రజలను చైతన్యం చేసినట్లు కొనియాడారు. 85 శాతం ప్రజల ఆకాంక్ష పల్నాడు జిల్లాకు జాషువా పేరు పెట్టాలని చెప్పారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా బలహీన వర్గాల ఐక్యవేదిక అధ్యక్షులు నల్లబోతుల రాజు, హ్యూమన్ రైట్స్ పల్నాడు జిల్లా వైస్ చైర్మన్ బి.జీవరత్నం, మాలమహానాడు పాశం శ్యామ్, బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధ్యక్షులు జక్కుల కృష్ణయాదవ్, దళిత సేవా దళ్ తళ్లూరి సురేంద్ర పాల్గొన్నారు. గుంటూరు రూరల్: అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా వస్తున్నాడని ప్రియుడితో కలిసి హత్య చేసిన సంఘటనలో నిందితులను నల్లపాడు పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. నగరంలోని సౌత్ డీఎస్పీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ జి. భానోదయ వివరాలు వెల్లడించారు. రూరల్ మండలం గోరంట్ల పరిధిలోని మేరీప్రియనగర్కు చెందిన మున్నంగి ప్రదీప్ (43) కనిపించటంలేదని అతని తల్లి రెజీనా గత వారం నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో ప్రదీప్ భార్య మరియమ్మ పెదకాకాని మండలం వెనిగళ్ల గ్రామానికి చెందిన యాదాల సాంబశివరావుతో కలసి ఉంటోందని కనుగొన్నారు. దీనిపై ప్రదీప్ భార్యను పలు మార్లు మందలించాడని కూడా తెలిసింది. ఆ కోణంలో విచారించగా మరియమ్మ తన ప్రియుడు సాంబశివరావుతో భర్తను హత్య చేయాలని పథకం రచించిందని తేలింది. ఈనెల 23న మరియమ్మ ప్రియుడు యాదాల సాంబశివరావు స్నేహపూర్వకంగా మద్యం తాగుదామని ప్రదీప్ను ఆటోలో తీసుకెళ్లాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ప్రదీప్తో ఎక్కువ మొత్తంలో మద్యం తాగించి, అతడిని బొల్లాపల్లి మండలం నెహ్రూనగర తండా మార్గంలో గల మట్టిరోడ్డు వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ నిర్జన ప్రదేశంలో ప్రదీప్ను కర్చీఫ్తో ముక్కు, నోరు మూసి, లుంగీ ముక్కను మెడకు చుట్టి హత్య చేశాడు. ప్రదీప్ మరణించిన సమాచారాన్ని మరియమ్మకు తెలుపగా, ఆమె జాగ్రత్తగా ఆధారాలు లేకుండా చేసి రావాలని చెప్పినట్లు నిందితుడు విచారణలో తెలిపాడు. విచారణలో నిందితులు ఇద్దరు హత్యానేరాన్ని ఒప్పుకోవడంతో పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టుకు అప్పగించగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. నిందితులిద్దరిని 14 గంటల్లోనే అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. కేసును చాకచక్యంగా పరిష్కరించిన నల్లపాడు పోలీస్ స్టేషన్ ఎస్ఐ రామకృష్ణ, సిబ్బంది యానాది, మస్తాన్, భిక్షాలు నాయక్లను జిల్లా ఎస్పీ అభినందించినట్లు ఆయన చెప్పారు. -
‘జిల్లా కేంద్రం’పై రాజకీయాలు తగదు
బాపట్ల టౌన్: బాపట్ల జిల్లా కేంద్రం మార్పు అంటూ రాజకీయాలు చేయటం సరికాదని మాజీ డిప్యూటీ స్పీకర్ కోనరఘుపతి తెలిపారు. బాపట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా కేంద్రాన్ని మారిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానని ఎమ్మెల్యే మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. మార్పు చేసిన తర్వాత ఆయన రాజకీయాల్లో ఉంటే ఏంటి... వైదొలిగితే ఏంటి? అంటూ ఘాటుగా విమర్శించారు. ఇలాంటి నిర్ణయాలు బాపట్లకు తలమానికంగా నిలిచిన మెడికల్ కళాశాల విషయంలో ఎందుకు తీసుకోలేదో వివరణ ఇవ్వాలన్నారు. రూ. 510 కోట్లతో చేపట్టిన మెడికల్ కళాశాలను పూర్తి చేయకుండా ప్రస్తుతం ప్రైవేటుపరం చేసేందుకు కూటమి సర్కార్ ప్రయత్నిస్తుంటే ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల పూర్తయితే జిల్లాలోని యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయన్నారు. కళాశాల వస్తువులు దొంగలు దోచుకెళ్తున్నారని, రక్షణ కల్పించడంలో కూడా కూటమి సర్కార్ విఫలమైందని పేర్కొన్నారు. జిల్లాను ఇచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసే ముందు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. దివ్యాంగులపై కనికరమేదీ? దివ్యాంగులకు పింఛను తొలగించడంతోపాటు వారు ఆందోళన చేస్తుంటే కనీసం సమస్యలు పరిష్కరించిన దాఖలాలు లేవన్నారు. అధికారులు, పాలకులు వారిపై కనికరం కూడా చూపడం లేదని మండిపడ్డారు. బాధితుల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షులు చల్లా రామయ్య సెల్ టవర్ ఎక్కి నిరసన తెలియజేస్తే కిందకు దించేందుకు వెళ్లిన పార్టీ నాయకులపై పోలీసులు వారిపై అక్రమ కేసులు బనాయించడం సరికాదన్నారు. ఆ కేసులను ఎత్తివేయాలన్నారు. దివ్యాంగులకు నోటీసులు జారీ చేసిన అధికారులను సస్పెండ్ చేయాలని పేర్కొన్నారు. ఎరువుల పంపిణీలోనూ పక్షపాతం కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్నివర్గాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను యూరియా అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఎరువులు బ్లాక్ మార్కెట్కు తరలిపోతున్నా పట్టించుకోవడం లేదని తెలిపారు. యూరియా బస్తాల పంపిణీలో కూడా టీడీపీ నాయకులు రాజకీయాలు చేయటం సిగ్గుచేటన్నారు. రాజకీయాలకు అతీతంగా రైతులకు ఎరువులు అందించాలని తెలిపారు. పర్యాటకాభివృద్ధిపై స్పష్టత ఇవ్వాలి పర్యాటకంగా జిల్లాను అభివృద్ధి చేసేందుకు రూ.98 కోట్లు కేటాయించామని పాలకులు చెబుతున్నారని గుర్తుచేశారు. ఆ నిధులతో తీరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో, తీరంలో గతంలో లేని విధంగా ఏ సౌకర్యాలు కల్పిస్తున్నారో ప్రజలకు వివరించాలన్నారు. చిలకలూరి పేట నుంచి ఓడరేవుకు వెళ్లాల్సిన జాతీయ రహదారి రామాపురంనకు ఎందుకు తరలిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి, రాష్ట్ర నాయకులు చేజర్ల నారాయణరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు కాగిత సుధీర్బాబు, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గవిని కృష్ణమూర్తి, నర్రావుల వెంకట్రావు, జోగి రాజా, యల్లావుల సోహిత్, ఇమ్మడిశెట్టి శ్రీనివాసరావు, సుమన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దమ్ము చక్రాల ట్రాక్టర్లు రోడ్లపైకి వస్తే కేసులు
●బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు హెచ్చరిక ●చెన్నుపల్లిలో ట్రాక్టర్ యజమానులకు అవగాహన సదస్సు బల్లికురవ: దమ్ము చక్రాల ట్రాక్టర్లు రబ్బరు తొడుగులు లేకుండా రహదారుల పైకి వస్తే కేసులు నమోదు చేస్తామని బాపట్ల డీఎస్పీ జి. రామాంజనేయులు హెచ్చరించారు. ఆదివారం చెన్నుపల్లిలో ట్రాక్టర్ యజమానులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంలో డీఎస్పీ మాట్లాడుతూ దమ్ము చక్రాలతో రోడ్లపైకి రావడం వల్ల కోట్లాది రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్న రోడ్లు గాడులు పడుతూ మార్జిన్లు దెబ్బతింటూ గోతులు ఏర్పడుతున్నాయని తెలిపారు. దీనివల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని చెప్పారు. టైర్లతో పొలాల వద్దకు వెళ్లి అక్కడే దమ్ము చక్రాలు అమర్చుకోవాలని, లేకపోతే రబ్బరు తొడుగుతో రోడ్లపైకి రావాలని సూచించారు.ట్రాక్టర్ యజమానులు ప్రభుత్వానికి ట్యాక్స్లు సకాలంలో చెల్లిస్తూ ధ్రువీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాలని తెలిపారు. మైనర్లను డ్రైవర్లుగా నియమించుకోవద్దని చెప్పారు. డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని, నిబంధనలు పాటించని యజమానులపై చర్యలు తప్పవని తెలిపారు. సదస్సులో సంతమాగులూరు సీఐ కె.వెంకటరావు బల్లికురవ, సంతమాగులూరు ఎస్ఐలు వై. నాగరాజు, పట్టాభిరామయ్య ఆర్ అండ్ బీ జేఈ బాబ్జి పాల్గొన్నారు. -
పీఆర్సీ బకాయిలు వెంటనే విడుదల చేయాలి
రేపల్లె: రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ బకాయిలు వెంటనే విడుదల చేసి ఉపాధ్యాయులకు చేయూతనివ్వాలని ఏపీటీఎఫ్ బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి పీడీ సోషలిజం డిమాండ్ చేశారు. పట్టణంలోని ప్రైవేటు ట్యుటోరియల్స్లో ఆదివారం జరిగిన ఉపాధ్యాయ ఉద్యమ అధ్యయన తరగతుల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయ, ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు విడుదల చేయటంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందన్నారు. ఉపాధ్యాయ సమస్యలకు పరిష్కారం చూపుతూ వెంటనే పీఆర్సీ కమిటీని నియమించి 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలన్నారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చాంద్బాషా, నాయకులు రాజారత్నం, సుబ్బారావు, హరిప్రసాద్,ౖ వె నేతాంజనేయప్రసాద్, వై చెన్నకేశవులు, డి.మల్లికార్జునరావు, కే వెంకటరత్నం, ఎంవీవీ సత్యనారాయణ, ఎం రాంబాబు, పి.శేషుబాబు తదితరులు పాల్గొన్నారు. ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సోషలిజం -
రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో భానోజీకి తృతీయ స్థానం
సత్తెనపల్లి: రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన మాజీ కౌన్సిలర్ పులహరి భానోజి ప్రతిభ చూపారు. సత్తెనపల్లి శక్తి యోగ నిర్వాహకుడు రమేష్ ఆధ్వర్యంలో 6వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ యోగ ఆసనం స్పోర్ట్స్ చాంపియన్షిప్– 2025 పోటీలు తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించారు. పోటీలకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ పోటీల్లో సీనియర్ విభాగం 45–55 సంవ్సరాల విభాగంలో స్టేట్ లెవెల్ లో లెగ్ బ్యాలెన్స్ లో సత్తెనపల్లికి చెందిన పులహరి భానోజీ ప్రతిభ కనబరిచి తృతీయ స్థానం దక్కించుకొని బహుమతి, మెడల్తో పాటు మెరిట్ సర్టిఫికెట్ అందుకున్నారు. ఫార్వర్డ్బెండ్ విభాగంలో సత్తెనపల్లికి చెందిన వల్లూరి శ్రీనివాసరావు, సుపైని విభాగంలో సత్తెనపల్లికి చెందిన పులికొండ శ్రీనివాసరావు చతుర్థ స్థానం దక్కించుకున్నారు. టెస్టింగ్ విభాగంలో ధనేకుల సాంబశివరావు ఐదో స్థానం కై వసం చేసుకున్నారు. 35–45 సంవత్సరాల విభాగంలో ఫార్వర్డ్బెండులో ఎం.సునీల్ కుమార్ నాలుగో బహుమతి సాధించారు. ఈ సందర్భంగా విజేతలను పలువురు ప్రముఖులు, యోగ అభ్యాసకులు ఆదివారం ప్రత్యేకంగా అభినందించారు.ఉమ్మడి గుంటూరు జిల్లాలో 30వేల మంది ప్లాన్లో చేరికనరసరావుపేట: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఈ నెల ఒకటవ తేదీ నుంచి ప్రారంభించిన సరికొత్త ఫ్రీడం ప్లాన్ విజయవంతంగా నడుస్తుందని ఆ సంస్థ గుంటూరు బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ సప్పరపు శ్రీధర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాము ఊహించిన దాని కన్నా అద్భుతమైన ప్రతిస్పందన ప్రజల నుంచి వస్తోందన్నారు. ఈ నెల 23వ తేదీ వరకూ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ముప్పై వేల మందికి పైగా నూతన వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. ఈ ప్లాను కింద రూ.1తో 30 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత కాలింగ్, రోజుకి రెండు జీబీ డేటా, రోజుకు 100 మెసేజిలు, ఉచిత సిమ్ కార్డు అందిస్తోందన్నారు. ఏంఎన్పీ ద్వారా బీఎస్ఎన్ఎల్కు వచ్చే వినియోగదారులకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందన్నారు. ప్రస్తుతం గుంటూరు బిజినెస్ ఏరియా పరిధిలో 700పైగా ఫోర్జి టవర్లు పనిచేస్తున్నాయని, తద్వారా తమ వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన డేటా, వాయిస్ కాల్స్ సేవలను అందించటానికి కృషిచేస్తున్నామని తెలిపారు. ఈ ఆఫరు అగస్టు 31తేదీతో ముగుస్తుందని, కావున ప్రజలందరూ మిగిలిన రోజులలో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, సిమ్ కార్డు కావలసిన వారు దగ్గరలోని బీఎస్ఎన్ఎల్ సేవా కేంద్రాన్ని సంప్రదించాలని ఆయన సూచించారు. -
255 ల్యాప్టాప్లు చోరీ
మేదరమెట్ల: దాబా వద్ద నిలిపి ఉన్న కంటైనర్ నుంచి ల్యాప్టాప్లు దొంగిలించినట్లు బాధితుల ఫిర్యాదు మేరకు మేదరమెట్ల పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. హైదరాబాద్ నుంచి చైన్నెకు ల్యాప్టాప్ల లోడుతో వెళుతున్న కంటైనర్ను శనివారం మేదరమెట్ల కొండ సమీపంలోని ఓ దాబా వద్ద నిలిపారు. కంటైనర్ డ్రైవర్, క్లీనర్ అక్కడ నుంచి విశ్రాంతి కోసం వెళ్లిపోయిన వెంటనే.. దొంగలు కంటైనర్ను పగుల గొట్టి దానిలోని హెచ్పీ కంపెనీకి చెందిన 255 ల్యాప్టాప్లు, ఒక మానిటర్, ఒక టోనర్ను దొంగిలించుకుపోయినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం డ్రైవరు, క్లీనరు వచ్చి చూడగా విషయం తెలిసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చీరాల డీఎస్పీ మొయిన్ స్థానికుల నుంచి వివరాలను సేకరించారు. -
కూటమి పాలనలో రాక్షసత్వం
వినుకొండ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తపై హత్యాయత్నం వెంకటప్రసాద్ భార్య శ్రావణితో మాట్లాడుతున్న వైఎస్సార్సీపీ నేతలు అంబటి మురళీకృష్ణ, వనమా బాలవజ్రబాబు, నూరిఫాతిమా మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నగరంపాలెం (గుంటూరు వెస్ట్): కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు పెరిగాయని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎన్నడూ లేని విధంగా దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం టి.అన్నవరం గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త వెంకట ప్రసాద్, ఆయన కుటుంబసభ్యులపై హత్యాయత్నాన్ని ఖండించారు. జిల్లాలో ఇలాంటి దారుణాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ సానుభూతి పరులపై కూడా రాక్షసత్వం చూపుతున్నారని ఆరోపించారు. కొనసాగుతున్న చికిత్స పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం టి.అన్నవరం గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త వెంకటప్రసాద్, ఆయన కుటుంబసభ్యులపై శనివారం రాత్రి టీడీపీ మూకలు మరణాయుధాలు, కర్రలతో విచక్షణరహితంగా దాడులకు తెగబడ్డాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయాలపాలైన ఆయన్ను మెరుగైన వైద్యసేవల నిమిత్తం గుంటూరు నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్సీపీ నియోజకవర్గాల సమన్వయకర్తలు అంబటి మురళీకృష్ణ (పొన్నూరు), షేక్ నూరి ఫాతిమా(గుంటూరు తూర్పు), వనమా బాల వజ్రబాబు (తాడికొండ), నాయకులు ఆదివారం ఆరా తీశారు. వెంకటప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులను కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం మారాక సమాధానం ఇస్తాం గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా మాట్లాడుతూ వినుకొండలో ఇలాంటి ఘటన రెండోదని చెప్పారు. గతంలో రషీద్ను ఎలా హత్య చేశారో అందరికీ తెలుసన్నారు. వెంకటప్రసాద్పై హత్యాయత్నం దారుణం అన్నారు. మహిళలని కూడా చూడకుండా విద్యుత్ సరఫరాను నిలిపివేసి మరీ విచక్షణరహితంగా దాడులకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఐదేళ్ల తర్వాత ప్రభుత్వం మారుతుందని, అప్పుడు గిఫ్ట్ రూపంలో సమాధానం ఇస్తామని హెచ్చరించారు. ‘కూటమి’వి హత్యారాజకీయాలు పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ వెంకట ప్రసాద్ ఎన్నికల్లో పార్టీ ఏజెంట్గా పనిచేశారని పేర్కొన్నారు. అప్పటి నుంచి ఆయన కుటుంబాన్ని బెదిరించడం టీడీపీ సాధారణమైందన్నారు. కూటమి ప్రభుత్వం హత్యా రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. వెంకటప్రసాద్పై హత్యాయత్నం విషయాన్ని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. వారికి పార్టీ అండగా ఉంటుందని ఆయన చెప్పారన్నారు. నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.బీసీ కుటుంబంపై కక్షసాధింపు తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు (డైమండ్ బాబు) మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అరాచక పాలనకు శ్రీకారం చుట్టిందని ఆరోపించారు. వెంకటప్రసాద్ పార్టీ ఏజెంట్గా కూర్చోవడం పాపమా అని ప్రశ్నించారు. బీసీ కుటుంబంపై కక్షసాధింపు చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే వీటిని ప్రోత్సహించడం సరికాదన్నారు. ఇప్పటికై నా టీడీపీ సక్రమ పద్ధతిలో నడవాలన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై దాడులు సహించబోమన్నారు. దాడులను ప్రోత్సహిస్తున్న సర్కార్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ వెంకటప్రసాద్పై హత్యాయత్నాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని అన్నారు. ఇటువంటి దాడులను కూటమి ప్రభుత్వం ప్రోత్సహించడం సరికాదని చెప్పారు. అధికారం శాశ్వతం కాదని, ప్రభుత్వాలు మారుతుంటాయనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు. అనంతరం వెంకటప్రసాద్ భార్య శ్రావణి, సోదరి మాధవి, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. -
ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో రభస
పెదకాకాని: శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ వివాదానికి దారి తీసింది. పెదకాకాని మండలంలోని తక్కెళ్లపాడులో చెరువు కట్టపై శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం విగ్రహావిష్కరణ నేపథ్యంలో భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) వ్యవస్థాపక అధ్యక్షుడు రామచంద్రయాదవ్ శనివారం అక్కడకు చేరుకున్నారు. యాదవులు, హిందువులు ఆరాధ్యదైవంగా భావించి పూజలు చేసుకునే శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేయడం అవమానించడమేనని తెలిపారు. దీనిపై పెదకాకాని పోలీసుస్టేషన్లో బీసీవై పార్టీ ప్రతినిధులు, అఖిల భారత యాదవ మహాసభ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. దీంతో నిర్వాహకులు రాత్రి 12 గంటల వరకూ చర్చలు జరిపారు. అదే విగ్రహం చేతిలో ప్లూటు, కిరీటంలో నెమలి పింఛం లేకుండా టీడీపీ మండల స్థాయి నాయకులు ఆవిష్కరించారు. దీంతో ఫిర్యాదుకు సంబంధించి రశీదు పొందేందుకు ఆదివారం సాయంత్రం పోలీసుస్టేషన్కు చేరుకున్న బీసీవై పార్టీ ప్రతినిధులు అక్కడ నుంచి తక్కెళ్లపాడు వెళుతున్నట్లు పోలీసులకు సమాచారం అందించారు. గ్రామంలో విగ్రహావిష్కరణ సమయంలో ఏర్పాటు చేసిన మైక్ ద్వారా తక్కెళ్లపాడు విగ్రహావిష్కరణ వద్దకు కరాటే కల్యాణి వస్తుందని చెప్పడంతో 300 మంది దాకా అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న బీసీవై పార్టీ నాయకులకు, విగ్రహావిష్కరణ కమిటీ ప్రతినిధులకు వాదోపవాదనలు జరిగాయి. విగ్రహం వద్దకు రాకుండా స్థానికులు, టీడీపీ నాయకులు బీసీవై నాయకులను అడ్డుకోవడంతో వివాదం చోటు చేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని బీసీవై ప్రతినిధులను అక్కడి నుంచి పంపించి వేశారు. దేవుని రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం హిందువులను, యాదవులను అవమానించడమేనని బీసీవై నాయకులు తెలిపారు. విగ్రహాన్ని అదే చెరువులో సోమవారం 11 గంటలకు నిమజ్జనం చేద్దామని భారత చైతన్య యువజన పార్టీ అధినేత ‘చలో తక్కెళ్లపాడు’కు పిలుపునివ్వడంతో విగ్రహావిష్కరణ వివాదం మరింత చర్చనీయాంశంగా మారింది. తక్కెళ్లపాడులో ఘటన విగ్రహం వద్దకు చేరుకున్న బీసీవై పార్టీ ప్రతినిధులు ప్రతిఘటించిన నిర్వాహకులు పోలీసులు రంగ ప్రవేశం -
సాగు పనుల్లో అన్నదాతలు
భట్టిప్రోలు: మందకొడిగా సాగుతున్న వరి నాట్లు ఇప్పుడిప్పుడే ఊపు అందుకుంటున్నాయి. మండలంలోని భట్టిప్రోలు, వెల్లటూరు, పెదపులివర్రు, ఐలవరం తదితర గ్రామాలలోని పొలాల్లో వరినాట్లకు రైతులు సిద్ధమయ్యారు. మండలంలో 15 వేల ఎకరాల్లో వరి సాగవుతున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రకటించారు. వెద పద్ధతిలో సాగు చేపట్టాలని అధికారులు సూచన చేయడంతో మండలంలో సూరేపల్లి, అక్కివారిపాలెం, భట్టిప్రోలు, అద్దేపల్లి తదితర ప్రాంతాల్లో సుమారు 1000 ఎకరాల్లో ఆ మేరకు చేపట్టారు. ప్రస్తుతం ముదురు నారు ఏతకు రావడంతో రైతులు నాట్లు వేసేందుకు సిద్ధమయ్యారు. ప్రధానంగా ఇంజిన్ల ద్వారా నీరు పెడుతూ దమ్ము చేస్తూ రైతులు బిజీగా ఉన్నారు. గత 2, 3 రోజులుగా వరినాట్లు వేస్తున్నారు. ఏటా ఆగస్టు నాటికి మండలంలో వరినాట్లు పూర్తయ్యేవి. తీవ్ర వర్షాభావ పరిస్థితులు, అక్విడెక్ట్ ఏర్పాటుకు తోడు కాలువలకు నీరు విడుదల చేయడంలో జాప్యంతో ఖరీఫ్ వరి సాగు ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం పరిస్థితి అనుకూలంగా మారడంతో నాట్లు వేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో వారం క్రితమే నారుమడులు ముమ్మరంగా పోశారు. ఇవి ఏతకు వచ్చే సరికి మరో వారం పట్టవచ్చునని అంటున్నారు. మండలంలో ప్రస్తుతం 2 వేల ఎకరాలలో నాట్లు పూర్తికాగా మరో 3 వేల ఎకరాలు వెద పద్ధతిలో సాగవుతున్నాయి. ఇంకా 10 వేల ఎకరాల్లో నాట్లు పడాల్సి ఉంది. ఊపందుకున్న వరి నాట్లు -
శారీరక దారుఢ్యానికి సైక్లింగ్ దోహదం
జిల్లా ఎస్పీ తుషార్డూడీ బాపట్ల టౌన్: శారీరక దారుఢ్యానికి సైక్లింగ్ దోహదపడుతుందని జిల్లా ఎస్పీ తుషార్డూడీ తెలిపారు. ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ‘సండే ఆన్ సైకిల్ ర్యాలీ’ని ఆదివారం జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ సైక్లింగ్తో శారీరక, మానసిక ఆరోగ్యం పెరుగుతుందన్నారు. పోలీస్ ఉద్యోగం నిత్యం ఒత్తిడితో కూడుకుందన్నారు. అలాంటి పనిలో సైక్లింగ్ వంటి వ్యాయామాలు మేలు చేస్తాయన్నారు. సమూహాలుగా సైక్లింగ్ చేయటం వలన సంబంధాలు మెరుగవుతాయన్నారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రతి ఆదివారం ఈ తరహా ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. ఏఆర్ డీఎస్పీ పి.విజయ సారథి, బాపట్ల డీఎస్పీ జి.రామాంజనేయులు, సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్ నాయక్, రిజర్వ్ సీఐ శ్రీకాంత్, ఎస్బీ సీఐ నారాయణ, బాపట్ల టౌన్ సీఐ రాంబాబు, రూరల్ సీఐ శ్రీనివాసరావు, రూరల్ సర్కిల్ సీఐ హరికృష్ణ పాల్గొన్నారు. -
మానవ రహిత భారత్ అమిత్షా లక్ష్యం
సత్తెనపల్లి: వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మావోయిస్టు రహిత భారత్గా మారుస్తానని కేంద్ర హోం మంత్రి అమిత్ షా జోస్యం చెబుతున్నారని, వాస్తవానికి మానవ రహిత భారత దేశంగా మారుస్తారని ఏపీ పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీనియర్ న్యాయవాది చిలుకా చంద్రశేఖర్ ఎద్దేవా చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని పీఎం రెడ్డి గార్డెన్స్లో మావోయిస్టు పార్టీ అమరుడు, మంజీరా పై వచ్చిన వివా కామ్రేడ్ రవి పుస్తకావిష్కరణ సభ ఆదివారం నిర్వహించారు. ఈ సభకు విరసం కార్యదర్శి రివేరా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా చిలుకా చంద్రశేఖర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అంబానీ, అదానీల వంటి గుప్పెడు మంది కార్పొరేట్ ప్రయోజనాల కోసం మధ్య భారతంలో ఖనిజ వనరులను కొల్లగొట్టడానికి అడవులను నరికేసి పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నారని పేర్కొన్నారు. అందుకోసం ఆదివాసీ ప్రజా ప్రతిఘటన పోరాటాలకు నాయకత్వం వహిస్తున్న మావోయిస్టులను చంపేస్తామని ప్రకటించడం ప్రపంచ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ లేదని చెప్పారు. విప్లవ రచయితల సంఘం నాయకులు పాణి మాట్లాడుతూ మావోయిస్టు అమర వీరుడు, విప్లవ రచయిత మంజీరా సాహిత్యం, జీవితం త్యాగపూరితమని వివరించారు. తొలుత ప్రజా కళామండలి కళాకారులు ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. మంజీరా జీవన సహచరి తాయమ్మ కరుణ వివా కామ్రేడ్ రవి పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.కృష్ణ, పీడీఎం రాష్ట్ర నాయకులు వై.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఏపీ పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ -
పట్టుబట్టి... ‘కొలువు’ కొట్టి..!
పిడుగురాళ్ల రూరల్: ఒక లక్ష్యం పెట్టుకొని దానికోసం నిరంతరం కష్టపడి విజయం సాధించడానికి కొంతమంది మాత్రమే ముందుకు వెళ్తారు. గమ్యం చేరతారు. ఆ కోవకు చెందిన వారే వీరు. పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు గ్రామానికి చెందిన నాగిరెడ్డి, ఉదయశ్రీ దంపతులు ఈ ఏడాది డీఎస్సీ పరీక్షలు రాశారు. వెలువడిన ఫలితాలలో ఇద్దరూ ఉద్యోగాలు సాధించారు. నాగిరెడ్డి పదో తరగతి తర్వాత ఇంటర్, డిగ్రీ దూర విద్యలో పూర్తి చేశారు. అంతటితో ఆగకుండా బీఈడీ కూడా చదివారు. సచివాలయ ఉద్యోగాలకు పరీక్ష రాసి ఉద్యోగం సాధించారు. అయినా అంతటితో ఆగలేదు. డీఎస్సీకి ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. తనతోపాటు భార్యను కూడా విద్య వైపు నడిపించి డిగ్రీ, బీఈడీ పూర్తి చేయించారు. ఇద్దరు ఇటీవల డీఎస్సీ పరీక్షలు రాశారు. స్కూల్ అసిస్టెంట్గా సోషల్లో 73.72 మార్కులతో నాగిరెడ్డి జిల్లా స్థాయిలో 67వ ర్యాంకును, ఉదయశ్రీ కూడా 74.55 మార్కులతో జిల్లా స్థాయి 50వ ర్యాంక్ సాధించారు. ఒకేసారి నాలుగు పోస్టులకు అర్హత పిడుగురాళ్ల పట్టణానికి చెందిన షేక్ జాకీర్ హుస్సేన్ కూడా డీఎస్సీ పరీక్షలు రాశారు. తాజాగా ప్రకటించిన ఫలితాలలో నాలుగు కేటగిరీలలో ఉద్యోగాలకు అర్హత సాధించారు. ఎస్జీటీలో 90.74 మార్కులతో గుంటూరు జిల్లా స్థాయిలో నాలుగవ ర్యాంకు కైవసం చేసుకున్నారు. స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్లో 77.22 మార్కులతో గుంటూరు జిల్లా 27వ ర్యాంకు, టీజీటీ సోషల్లో 73.35 మార్కులతో జోన్ 3లో 16 ర్యాంకు, స్కూల్ అసిస్టెంట్గా తెలుగులో 67.07 మార్కులతో జిల్లా స్థాయి 71వ ర్యాంకు సాధించారు. 2012–13 విద్యా సంవత్సరంలో మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసిన హస్సేన్ ఒకేసారి నాలుగు ఉద్యోగాలకు అర్హత సాధించారు. పాఠశాల ఉపాధ్యాయులు, నాటి తరగతి స్నేహితులు ఆయన్ను అభినందించారు. మూడు పోస్టులకు... ఫిరంగిపురం: డీఎస్సీ ఫలితాల్లో మండలంలోని వేములూరిపాడు గ్రామానికి చెందిన జూపల్లి రత్నబాబు మూడు పోస్టులకు అర్హత సాధించారు. ఎంపీపీ పాఠశాలలో ఐదవ తరగతి వరకు చదివారు. ఆరు నుంచి పది వరకు అమీనాబాద్లోని బీఆర్ హైస్కూలులో, ఇంటర్, డిగ్రీ గుంటూరులోని హిందూ కళాశాలలో, బీఈడీ నరసరావుపేటలో పూర్తి చేశారు. ప్రస్తుతం తెలంగాణలోని వరంగల్ ఎస్ఆర్ కళాశాలలో ప్రైవేటు లెక్చరర్గా పని చేస్తున్నారు. డీఎస్సీ పరీక్షల్లో ఎస్ఏ ఇంగ్లిష్లో 5వ ర్యాంకు, పీజీటీలో 6వ ర్యాంకు, టీజీటీలో 17వ ర్యాంకు సాధించి యువతకు ప్రేరణగా నిలిచారు. -
నవోదయలో జాతీయ యోగా పోటీలు
●28 నుంచి ప్రారంభం ●నవోదయ విద్యాలయంలో మూడురోజుల ఆతిథ్యం ●దేశవ్యాప్తంగా ఎంపికై న ప్రతిభావంతుల రాక ●యోగా సాధకులు, అభిమానులకు పండుగే చిలకలూరిపేటటౌన్/యడ్లపాడు: మొట్టమొదటిసారిగా జాతీయస్థాయి యోగా ప్రదర్శన పోటీలు పల్నాడు జిల్లాలో జరగనున్నాయి. ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు జవహర్ నవోదయ విద్యాసమితి షెడ్యూల్ ఖరారైంది. జేఎన్వీల పరిధిలో జరిగే ఈ పోటీలకు చిలకలూరిపేట రూరల్ మండలం మద్దిరాల పీఎంశ్రీ జేఎన్వీ ఇందుకు వేదికగా మారనుంది. ఈనెల 28, 29, 30 తేదీల్లో వరుసగా మూడు రోజులు మద్దిరాల గ్రామంలో సందడి నెలకొననుంది. యోగా సాధకులు, గురువులు, యోగాభిమానులకు పెద్ద పండుగే కానుంది. భారత్లోని అన్ని రాష్ట్రాల నుంచి... భారతదేశంలోని నవోదయ విద్యాలయ సమితి 8 రీజియన్లకు చెందిన జేఎన్వీ విద్యార్థులు హాజరుకానున్నారు. భూపాల్, చండీఘర్, జైపూర్, హైదరాబాద్, లక్నో, పూనే, పాట్నా, షిల్లాంగ్ జేఎన్వీ రీజియన్ల పరిధిలో గతనెలలో ప్రాంతీయ స్థాయి యోగా ప్రదర్శన పోటీలు నిర్వహించాయి. అత్యుత్తమ ప్రతిభను కనపరిచి విజేతలైన 336 మంది యోగా సాధకులు ఈ నేషనల్ యోగా మీట్లో భాగస్వాములు కానున్నారు. పోటీల్లో పాల్గొనేందుకు ఈనెల 26 నుంచి ఒక్క తమిళనాడు రాష్ట్రం మినహా దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన యోగా జట్లు మద్దిరాల జేఎన్వీకు రానున్నాయి. ఏఏ విభాగాలు..జట్ల వివరాలు.. పోటీలలో అండర్ –14, అండర్ –17, అండర్ –19 విభాగాల్లో వ్యక్తిగత, బృందాలుగా సాధకులు యోగా ప్రదర్శన కళను ప్రదర్శించానున్నారు. శారీరక సామర్థ్యాన్ని, ఏకాగ్రతను చాటే ‘గ్రూప్ ఆసనయోగా’, సంగీతానికి అనుగుణంగా చేసే కళాత్మక ‘రిథమిక్ యోగ’, యోగాసనాలతో కూడిన కళాప్రదర్శన ‘ఆర్టిస్టిక్ యోగా’ పోటీలు ఉంటాయి. యోగా సాధకులైన జేఎన్వీల విద్యార్థులు ఈ మూడు రకాల విన్యాసాలను మూడు వేదికపై కళాత్మకంగా ప్రదర్శించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నారు. దేశంలోని 8 రీజియన్ల నుంచి 8 టీంలుగా వచ్చే 336 మంది యోగాసాధకులు ఆర్టిస్టిక్యోగాలో –6, రిథమిక్యోగా –6, గ్రూప్ ఆసనయోగా –48 విభాగాల్లో తమ యోగా విన్యాసా పాటవాలను పోటీల్లో ప్రదర్శించనున్నారు. ఈ పోటీల్లో విజేతలైన వారు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పోటీలకు ఎంపికవుతారు. నిర్వహణకు సన్నాహాలు విద్యాలయంలో పోటీల నిర్వహణ ఏర్పాట్లపై ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలయ్యాయి. పోటీల నిర్వహణ ప్రక్రియ విజయవంతం చేసేందుకు విద్యాలయ ప్రిన్సిపాల్ నల్లూరి నరసింహరావు పర్యవేక్షణలో వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, పీఈటీలు ఆర్ పాండురంగారావు, జి గోవిందమ్మ, అధ్యాపకులు సమన్వయంతో కృషి చేస్తున్నారు. ఇందుకోసం మూడు ప్రత్యేక వేదికలు సిద్ధమయ్యాయి. విద్యాలయంలోని ఇండోర్ ఆడిటోరియం ఒకటి కాగా, క్రీడామైదానంలో మరో రెండు వేదికలను పోటీల నిర్వహణ కోసం ఏర్పాటు చేశారు. ఆయా వేదికలపై ఒకేసారి యోగా ప్రదర్శన పోటీలు నిర్వహించనున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, సాయంత్రం 4 నుండి రాత్రి 8.30 గంటలకు నిర్విరామంగా కొనసాగేలా విద్యాలయ పీడీలు షెడ్యూల్ను రూపొందించారు. జాతీయస్థాయి పోటీల నిర్వహణ ప్రారంభం, ముగింపు సభల్లో మద్దిరాల జేఎన్వీ విద్యార్థులు ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఇందుకు హైదరాబాద్ నుంచి బ్యాండ్ మాస్టర్, చిలకలూరిపేట నుండి డ్యాన్స్ మాస్టర్ను అధ్యాపకులు పిలిపించి తమ విద్యార్థులకు తర్ఫీదు ఇప్పిస్తున్నారు. ప్రధానంగా మానవ వ్యవస్థను అర్థం చేసుకునే విజ్ఞానశాస్త్రం యోగా ప్రక్రియ అని ఈ పోటీల ద్వారా విద్యార్థుల్లో అవగాహన కల్పించడమే అంతిమ లక్ష్యం. ఇది కేవలం జాతీయస్థాయి యోగా పోటీ మాత్రమే కాదు, భారతదేశంలోని వివిధ ప్రాంతాల విద్యార్థులు తమ కళను ప్రదర్శించడానికి, వివిధ సంస్కృతులను తెలుసుకోవడానికి లభించిన ఒక గొప్ప అవకాశమేనని చెప్పొచ్చు. –ఎన్ నరసింహారావు, ప్రిన్సిపల్, మద్దిరాల పీఎంశ్రీ జేఎన్వీ -
నిషేధం పెట్టడం సరికాదు
రైతులు సాగు చేసే పొగాకు పంటను గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేయకుండా అసలు పంటే సాగుచేయవద్దని ప్రభుత్వం చెప్పడం సరికాదు. గత ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి పొగాకు కొన్నారు. తెగుళ్లు తక్కువని, గిట్టుబాటు అవుతుందని పొగాకు వేస్తే కొనకుండా కంపెనీలు మోసం చేశాయి. ప్రభుత్వమన్నా పొగాకు కొని ఆదుకుంటుందనుకుంటే ఆపని చేయకుండా పంటే సాగుచేయొద్దని చెప్పడం దుర్మార్గం. – బొల్లా రామాంజనేయులు, పొగాకు రైతు, పంగులూరు ● -
● తగ్గని వరద ఉధృతి
అమరావతి: కృష్ణా నదిలో వరద ఉధృతి ఇంకా తగ్గలేదు. అమరావతి వద్ద శనివారం కూడా కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలలో నిలిచిన నీరు కృష్ణానదిలోకి చేరాల్సి ఉంది. కానీ నదీ ప్రవాహం ఉధృతంగా ఉండటంతో ఎక్కడికక్కడే నీరు నిలిచిపోయింది. అమరావతి–విజయవాడ రోడ్డులో పెదమద్దూరు వద్ద వాగు చప్టాపై ఇంకా రెండు అడుగుల మేర నీరు ప్రవాహిస్తోంది. చప్టా శిథిలావస్థలో ఉండటం వల్ల అధికారులు రాకపోకలు నిలిపివేశారు. అమరావతి నుంచి విజయవాడ వెళ్లే బస్సులు పెదమద్దూరు వరకు నడుపుతున్నారు. విజయవాడ వెళ్లాలంటే ఆటోలో నరుకుళ్లపాడు ఎండ్రాయి, చావపాడు గ్రామాల మీదుగా సుమారు 10 కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సి వస్తుండటంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. -
అద్దె దుకాణాల కూల్చివేతపై ఆవేదన
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): ప్రతి నెల అద్దెలు చెల్లిస్తూ వస్తున్న వారిపై దుకాణ యజమాని మనవరాలు దౌర్జన్యానికి దిగారు. షాపులను ఖాళీ చేయాలంటూ రౌడీమూకతో కలిసి ఏకంగా జేసీబీ తీసుకొచ్చి షాపులను కూల్చివేయించారు. ఈ ఘటన శనివారం ఎస్.వి.ఎన్. కాలనీలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీ 4వ లైను ప్రధాన రహదారి మార్గంలో విజయవాడకు చెందిన వెంకటయ్య చౌదరి అనే వ్యక్తికి 778 గజాల స్థలంలో ముందు భాగంలో షాపులు, వెనుక ఇళ్లు ఉన్నాయి. ఇక్కడ 35 సంవత్సరాల క్రితం కాలనీకి చెందిన రామచంద్రరావు షాపు అద్దెకు తీసుకుని సూపర్ మార్కెట్ ఏర్పాటు చేశారు. దీంతోపాటు బ్యాటరీ దుకాణం, సెలూన్ ఏర్పాటు అయ్యాయి. మూడు కుటుంబాలు ఇక్కడే ఉంటున్నాయి. వెంకయ్య చౌదరికి నెలకు వీరందరూ రూ.35 వేల చొప్పున అద్దె చెల్లిస్తూ వచ్చారు. వీటికి కరెంటు బిల్లులు, మున్సిపాలిటీ పన్నులు తదితరాలను రామచంద్రరావు చెల్లిస్తున్నారు. వెంకయ్య చౌదరికి సంతానం లేకపోవడంతో తూమాటి కృష్ణవేణిని దత్తత తీసుకున్నారు. కృష్ణవేణికి వివాహమై, ఇద్దరు సంతానం ఉన్నారు. వెంకయ్య చౌదరి తన స్నేహితుడైన శ్రీనివాస్, పద్మజలను ఈ ఆస్తికి గార్డియన్లుగా పెట్టారు. 2017లో వెంకయ్య చౌదరి మృతి చెందారు. అప్పటి నుంచి శ్రీనివాస్కే అద్దెలు చెల్లిస్తున్నారు. గత జనవరిలో కృష్ణవేణి వచ్చి అద్దెల నగదు తనకు ఇవ్వాలని చెప్పడంతో వారు అదే విధంగా చేస్తున్నారు. సమయం అడిగినా.. రెండు నెలల క్రితం కృష్ణవేణి వచ్చినప్పుడు దుకాణాలు ఖాళీ చేయాలని, ఈ స్థలం విక్రయించామని చెప్పారు. రెండు నెలల్లో ఖాళీ చేయడం కష్టమని, కనీసం ఏడాదైనా టైం కావాలని చెప్పారు. అవేమీ పట్టించుకోకుండా ఎలాగైనా ఖాళీ చేయాలని హుకుం జారీ చేసి వెళ్లారు. అద్దెదారులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. స్థలం విలువ ఎంతో చెబితే తామే కొనుగోలు చేసుకుంటామని వారందరూ కోరారు. ఆలోచించుకుని చెబుతామని కృష్ణవేణి వెళ్లిపోయారు. ఈ నెల 17వ తేదీన మళ్లీ వచ్చి దౌర్జన్యంగా షాపులకు తాళాలు వేశారు. బాధితులు పట్టాభిపురం పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకుండాపోయింది. అద్దెకు ఉన్నవారు ఖాళీ చేయాలని స్టేషన్ అధికారి చెప్పారని బాధితులు వాపోయారు. ఈ నెల 18వ తేదీన జిల్లా ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్లోనూ వారు ఫిర్యాదు చేశారు. పట్టాభిపురం పోలీసులు కనీసం స్పందించలేదు. శనివారం మధ్యాహ్నం కృష్ణవేణి కుమార్తెనంటూ భూమిక అనే యువతి మరి కొంత మందితో వచ్చారు. జేసీబీతో షాపులు కూల్చివేయించారు. అడ్డుకునే యత్నం చేసే వారిపై మహిళలు, చిన్నారులు ఉన్నారని కూడా చూడకుండా బెదిరింపులకు దిగారు. బాధితులు ఫోన్ చేయగా పట్టాభిపురం హెడ్ కానిస్టేబుల్ వచ్చి గొడవ జరగలేదుగా అంటూ తిరిగి వెళ్లిపోయారని వారు తెలిపారు. కుటుంబాలతో రోడ్డున పడ్డామని ఆవేదన చెందుతున్నారు. -
ఆర్జిత సేవలకు డిమాండ్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రావణ అమావాస్య నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన, శ్రీచక్ర నవార్చన, శాంతి కల్యాణం, చండీహోమాలలో ఉభయదాతలు అధిక సంఖ్యలో పాల్గొని తమ నామగోత్రాలతో పూజ లు జరిపించుకున్నారు. ఇక శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని నెల రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక కుంకుమార్చనలు శనివారంతో ముగిశాయి. శనివారం కూడా పెద్ద ఎత్తున భక్తు లు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక కుంకుమా ర్చనలు జరిపించుకున్నారు. సాయంత్రం పంచహారతుల సేవ, పల్లకీ సేవలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులతో క్యూలైన్లు కిటకిటలాడాయి. నూతన అన్నదాన భవన పరిశీలన రాజగోపురం ఎదుట నూతనంగా నిర్మిస్తున్న అన్నదాన భవనాన్ని ఈవో శీనానాయక్ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. దసరా ఉత్సవాల నాటికి అన్నదాన భవనం అందుబాటులోకి తీసుకురావాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. క్లోక్రూమ్, సెల్ఫోన్ కౌంటర్ను తనిఖీ చేసిన ఈవో సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. కనకదుర్గనగర్లో నిర్మిస్తున్న సమాచార కేంద్రాన్ని పరిశీలించారు. ఈవో వెంట ఈఈ రాంబాబు, ఏఈ మస్తాన్, సునీల్ పాల్గొన్నారు. దుగ్గిరాల: విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి ఆదివారం 7,508 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద 12 అడుగులు నీటి మట్టం ఉంది. దుగ్గిరాల సబ్ డివిజన్ హైలెవెల్కు 306, బ్యాంక్ కెనాల్ 1,861, తూర్పు కాలువకు 728, పశ్చిమ కాలువకు 302, నిజాపట్నం కాలువకు 486, కొమ్మూరు కాలువకు 2,960 క్యూసెక్కులు విడుదల చేశారు. -
స్వచ్ఛ ఆంధ్రలో ప్రజలు భాగస్వామ్యం కావాలి
బాపట్ల: స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి, బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం పరిసరాల పరిశుభ్రత కోసం స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. కలెక్టరేట్ ప్రాంగణం 57 ఎకరాల మేర భూమి ఉందని ఈ ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి చర్యలు చేపట్టామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర దిశగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయని అన్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టిన సంస్థలకు అవార్డుల ప్రదానోత్సవం చేస్తామని చెప్పారు. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠశాలల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో, హాస్టల్లో స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ చూపిన వారికి రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ప్రదానం చేస్తుందని చెప్పారు. కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ వెయ్యి మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్గౌడ్, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి విజయమ్మ, జిల్లా రవాణాశాఖ అధికారి పరంథామరెడ్డి, ఎకై ్సజ్ అధికారి ఎస్ వెంకటేశ్వరరావు, గృహనిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటేశ్వరావు, జిల్లా ప్రణాళిక అధికారి షాలేం రాజు, బాపట్ల ఆర్డీఓ గ్లోరియా, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్వామిత్వ సర్వే పనులను శరవేగంగా పూర్తి చేయాలి స్వామిత్వ సర్వే పనులను అధికారులు శరవేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి ఆదేశించారు. స్వామిత్వ సర్వే, పి 4 అమలు, ప్రభుత్వ సేవలపై ప్రజాభిప్రాయం వంటి అంశాలపై డివిజన్, మండల స్థాయి అధికారులతో శనివారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఆయన వీక్షణ సమావేశం ద్వారా మాట్లాడారు. చీరాల, వేటపాలెం, ఇంకొల్లు, చిన్నగంజాం, రేపల్లె, కర్లపాలెం, పి.వి పాలెం, పర్చూరు, మార్టూరు, చెరుకుపల్లి, రేపల్లె, నగరం, చుండూరు మండలాల్లో స్వామిత్వ సర్వే ఆశించిన స్థాయిలో జరగడంలేదని అసహనం వ్యక్తం చేశారు. ఆ ప్రాంతాలలో సిబ్బంది పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. సర్వే పురోగతికి డీఎల్డీఓలు బాధ్యులని స్పష్టం చేశారు. స్వామిత్వ సర్వేపై ప్రతిరోజూ మండల స్థాయిలో సమీక్షలు జరగాలన్నారు. జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళిపర్యాటక దినోత్సవాన్ని వైభవంగా జరపడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకట మురళి చెప్పారు. జిల్లాలో సూర్యలంక బీచ్ లో బీచ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహిస్తున్న విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. సమావేశంలో ఇన్చార్జి సంయుక్త కలెక్టర్ జి.గంగాధర్ గౌడ్, సర్వే ల్యాండ్స్ రికార్డ్స్ ఏడీ కనక ప్రసాద్, ఆర్డీవోలు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
పొగాకు సాగును అడ్డుకునేందుకు టాస్క్ఫోర్స్
సాక్షి ప్రతినిధి, బాపట్ల : బాపట్ల జిల్లాలో సాగుచేసే బ్లాక్, వైట్ బర్లీ పొగాకుపై కూటమి ప్రభుత్వం నిషేధం విధించింది. ఆదేశాలు ఉల్లంఘిస్తే పంటను ట్రాక్టర్లు పెట్టి దున్నేస్తామని హెచ్చరించింది. తాజాగా నిషేధం అమలుకు అధికారులతో ఏకంగా టాస్క్ఫోర్సులు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్, ఎస్పీతోపాటు వ్యవసాయశాఖ అధికారి కమిటీలో ఉండగా, డివిజనల్ స్థాయిలో ఆర్డీవో, డీఎస్పీ, ఏడీ స్థాయి అధికారులు, మండల స్థాయిలో తహసీల్దారు, సీఐ, వ్యవసాయాధికారులతోపాటు ఇతర అధికారులు టాస్క్ఫోర్సులో సభ్యులుగా ఉండి సాగును అడ్డుకుంటారు. ఎట్టి పరిస్థితిలోనూ ఈ ఏడాది సాగు చేయకూడదని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. -
కౌలు రైతులకూ అన్నదాత సుఖీభవ వర్తింపచేయాలి
లక్ష్మీపురం (గుంటూరు): రాష్ట్రంలో 60 నుంచి 70 శాతం కౌలు రైతులే ఉన్నా గుర్తింపు కార్డులు, పంట రుణాలు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయిందని కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.హరిబాబు ఆరోపించారు. వారికి అన్నదాత సుఖీభవ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. గుంటూరు బ్రాడిపేటలోని సంఘం జిల్లా కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కౌలు రైతులకు గుర్తింపు కార్డు ఇవ్వాలంటే భూ యజమాని సంతకం చేయాలనే నిబంధన వల్ల కార్డులు రాలేదన్నారు. పంట రుణాలు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలం అయిందన్నారు. స్పందించి వారి సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. సమావేశంలో కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం. నాగమల్లేశ్వరరావు, కౌలు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పాశం రామారావు, కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు ఎం.సాంబిరెడ్డి, పి.కృష్ణ, అమ్మిరెడ్డి, వై.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
యూరియా కొరత లేదనడం హాస్యాస్పదం
ఫిరంగిపురం: వ్యవసాయ పనులు ప్రారంభమైనప్పటికీ రైతులకు యూరియా అందుబాటులోకి రాలేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు పేర్కొ న్నారు. మండల కేంద్రంలో శనివారం వ్యవసాయ కార్మికసంఘం సమావేశం నిర్వహించారు. అప్పారావు మాట్లాడుతూ యూరియా కొరతతో రైతులు ఇక్కట్లు పడుతుంటే అధికారులు మాత్రం కొరత లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉపాధి హామీ కూలీలకు బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలన్నారు. పనులు నిర్వహించి రెండు నెలలు గడుస్తున్నా ఇంతవరకు వేతనాలు ఇవ్వలేదని తెలిపారు. వ్యవసాయ పనులు లేక వారు నానా ఇక్కట్లు పడుతున్నారని చెప్పారు. సీఐటీయూ మండల కార్యదర్శి షేక్, మస్తాన్వలి, ఎ.అంకారావు, నాయకులు, రైతులు పాల్గొన్నారు. కృష్ణానదిలోకి దూకి మహిళ ఆత్మహత్య తాడేపల్లి రూరల్: తాడేపల్లి సీతానగరం ప్రకాశం బ్యారేజ్ వద్ద ఓ మహిళ కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం చోటుచేసుకుంది. తాడేపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీతానగరం ఘాట్ వద్దకు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు విజయభార్గవి (28) అనే మహిళ తన కుమార్తె అనేక్యతో కలసి వచ్చింది. భార్గవి కృష్ణానదిలోకి దూకడంతో స్థానికులు గమనించి సమాచారం అందించారని తెలిపారు. పోలీసులు వెళ్లి మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్మార్టం నిమిత్తం మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. పాప తన తండ్రి పేరు నరేష్ అని మాత్రమే చెబుతోందని, ఊరు పేరు చెప్పలేకపోయిందని తెలిపారు. ఎవరికై నా వివరాలు తెలిస్తే తాడేపల్లి పోలీస్స్టేషన్ ఫోను నంబర్లు 86888 31361, 81438 73409, 97034 52206లకు సమాచారం ఇవ్వాలని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సతీష్ పేర్కొన్నారు. అనేక్యను విజయవాడలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించినట్లు తెలిపారు. -
ఇన్స్పైర్ నామినేషన్లు పెంచండి
డీఈఓ పురుషోత్తం బాపట్ల అర్బన్: ఇన్స్పైర్ అవార్డుల కోసం నామినేషన్ తప్పనిసరిగా ఉండాలని డీఈఓ పురుషోత్తం తెలిపారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కోసం మండల నోడల్ సైన్స్ ఉపాధ్యాయులకు బాపట్ల జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ... ప్రతి ప్రాథమికోన్నత పాఠశాల నుంచి మూడు, ఉన్నత పాఠశాల నుంచి ఐదు ప్రాజెక్టులు రిజిస్ట్రేషన్ చేయించాలని అన్నారు. అన్ని యాజమాన్య పాఠశాలలు విద్యార్థులను ప్రోత్సహించాలని సూచించారు. ప్రాజెక్టులు నూతన ఆవిష్కరణలకు దారి తీసేలా ఉండాలని, పేటెంట్ హక్కులు పొందే స్థాయి వరకు వెళ్లే విధంగా విద్యార్థులకు తగిన తర్ఫీదు ఇవ్వాలన్నారు. మట్టిలోని మాణిక్యాలను వెలికి తీయడమే ఉపాధ్యాయుల కర్తవ్యం కావాలని పేర్కొన్నారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సెప్టెంబర్ 15వ తేదీలోపు బాపట్ల జిల్లా నుంచి గరిష్టంగా నామినేషన్లు నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశానికి హాజరైన నోడల్ సైన్స్ ఉపాధ్యాయులు వెంటనే తమ మండలాల్లోని అన్ని పాఠశాలలు రిజిస్టర్ అయ్యేట్లు చూడవలసినదిగా ఆదేశించారు. జిల్లా సైన్స్ అధికారి మహమ్మద్ సాదిక్, నోడల్ టీచర్లు పాల్గొన్నారు. -
మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు వెస్ట్: మైనార్టీల అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తున్నట్లు కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ మినీ సమావేశ మందిరంలో పీఎంజేబీకే, సూర్యఘర్, టూరిజం అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్, జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ పీఎంజేబీకే పథకం 25 శాతం మైనార్టీలున్న ప్రాంతాల్లోనే సాధ్యమన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం దీనికి ఎంపికై ందని తెలిపారు. సూర్యఘర్ పథకం కింద గుంటూరు పార్లమెంటు పరిధిలో 1.16 లక్షల మంది నమోదు అయ్యారన్నారు. 3,600 మంది ఉపయోగించుకుని లబ్ధి పొందారని పేర్కొన్నారు. జిల్లాలో టూరిజం అభి వృద్ధిపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఎన్టీఆర్ మానస సరోవరం, పేరేచర్ల వద్ద ఉన్న నందనవనం, ఉండవల్లి గుహలు, ఉప్పలపాడు విదేశీ పక్షుల కేంద్రం తదితరాల అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు కోరుతామన్నారు. సమావేశంలో డీఆర్వో షేక్ ఖాజావలి, సీపీఓ శేషశ్రీ, జిల్లా టూరిజం అధికారి శ్రీరమ్య, ఎల్డీఎం మహిపాల్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు. -
ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్ తనిఖీలు
దుగ్గిరాల: ఎరువుల కొరత ఏర్పడుతుందని అనే అపోహతో రైతులు ఒకేసారి ఎరువులు అధిక సంఖ్యలో తీసుకెళ్లడం ద్వారా కొరత ఏర్పడుతుందని విజిలెన్స్ ఈఓ ఆర్.విజయ బాబు అన్నారు. శనివారం దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో విజిలెన్స్, అగ్రికల్చర్, ఎన్ఫోర్స్మెంట్ శాఖల అధికారులు సంయుక్తంగా ఎరువుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. విజయబాబు మాట్లాడుతూ యూరియా 58 మెట్రిక్ టన్నులు, డీఏపీ 49 మెట్రిక్ టన్నులు సొసైటీలు, ప్రైవేటు డీలర్స్ వద్ద అందుబాటులో ఉందని గుర్తించామని తెలిపారు. విజిలెన్స్ ఇన్స్పెక్టర్స్ కె.చంద్రశేఖర్, వై.శివన్నారాయణ, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు. బాపట్ల అర్బన్: సెప్టెంబరు 13వ తేదీన జరిగే జాతీయ లోక్అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని మండల న్యాయ సేవాధికార కమిటీ చైర్మన్ కే శ్యాంబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాపట్ల కోర్టుల సముదాయంలో మండల న్యాయ సేవా కమిటీ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కోర్టులలో పెండింగ్లో ఉన్న అన్ని రకాల సివిల్ కేసులు, భరణం కేసులు, గృహ హింస కేసులు, మోటార్ ప్రమాద కేసులు, రెవెన్యూ కేసులు, బ్యాంకు కేసులు, చెక్ బౌనన్స్ కేసులు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, ముందస్తు రాజీ చేసుకోదలచిన కేసులు ఇరుపక్షాల మధ్య సామరస్యపూర్వకంగా రాజీ చేసి పరిష్కరించుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం పరుచుకుని తమ వివాదాలను శాంతియుతంగా రాజీచేసుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. -
వైభవంగా కోటి కుంకుమార్చన
అమృతలూరు(భట్టిప్రోలు): అమృతలూరు మండలం గోవాడ శైవ క్షేత్రమైన శ్రీ గంగాపార్వతి సమేత శ్రీ బాలకోటేశ్వరస్వామి దేవస్థానంలో శ్రావణ బహుళ అమావాస్యను పురస్కరించుకుని శనివారం కోటి కుంకుమార్చన, సామూహిక లలిత పారాయణ మహోత్సవం జరిగింది. కార్యనిర్వాహణాధికారి బి. అశోక్ కుమార్ ఆధ్వర్యంలో వీటిని నిర్వహించారు. ప్రధాన అర్చకుడు స్వర్ణ వెంకట శ్రీనివాస శర్మ పూజా కార్యక్రమాలు జరిపారు. 10 లక్షల పారాయణ, కుంకుమార్చన, అమ్మవారికి శ్రీ సూక్త సహిత దేవి ఉపనిషత్తులతో అభిషేకం, కుంకుమార్చన, దేవీ హోమం, కుష్మాండ పూజ, కూష్మాండ బలి పూజా కార్యక్రమాలు జరిగాయి. పైనం రంగారెడ్డి దంపతులు అమ్మవారి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో చావలి శ్రీధర్శర్మ, మండవ రమేష్, పావులూరి రమేష్, పావులూరి సుబ్బారావు, వరలక్ష్మి, పొన్నపల్లి సత్యన్నారాయణ, జంజనం హేమశంకరరావు, కూచిబొట్ల శ్రీనివాసశర్మ, కళ్యాణ చక్రవర్తి స్వామి, పసుపులేటి కొండలస్వామి, పడమట వెంకటేశ్వరరావు, చింతల మురళీకృష్ణ, మండవ మల్లేశ్వరి, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలను కోటి కుంకుమార్చన కమిటీ, సహాయకులు పర్యవేక్షించారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
సంతమాగులూరు(అద్దంకి రూరల్): బైకు మీద వెళ్తున్న భార్యాభర్తలను వెనకు నుంచి లారీ ఢీకొట్టటంతో మహిళ మృతి చెందింది. ఈ ఘటన సంతమాగులూరు మండలం రామిరెడ్డిపాలెం గ్రామం వద్ద శనివారం జరిగింది. సంతమాగులూరు ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు.. వినుకొండ మండలం గోకనకొండ గ్రామానికి చెందిన గద్దల తిరుపతయ్య, అతని భార్య కోటేశ్వరమ్మ (44) బైక్పై కొమ్మాలపాడు నుంచి సంతమాగులూరు వైపు వస్తున్నారు. రామిరెడ్డిపాలెంలోని రామాలయం వద్దకు రాగానే వెనుక నుంచి లారీ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. కోటేశ్వరమ్మకు గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. గాయాలైన తిరుపతయ్యను 108 వాహనంలో నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య చీరాల అర్బన్: ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం బాపట్ల జిల్లా చీరాల ఐక్యనగర్లో చోటుచేసుకుంది. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఐక్యనగర్కు చెందిన డి.వెంకటేశ్వర్లు (36) ఎమ్మెస్సీ బయోకెమిస్ట్రీ చేశాడు. హైదరాబాద్లో శిక్షణ తీసుకుని గ్రూప్స్, కానిస్టేబుల్ పోస్టులకు ప్రయత్నించినా ఉద్యోగం రాలేదు. ఉద్యోగం రాలేదని మనస్తాపానికి గురై శనివారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు టూటౌన్ ఎస్ఐ నాగశ్రీను తెలిపారు. యువకుడి అదృశ్యంపై ఫిర్యాదు చౌటుప్పల్: ఆఫీసుకు వెళ్లిన యువకుడు ఇంటికి తిరిగిరాకుండా అదృశ్యమయ్యాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో శనివారం వెలుగులోకి వచ్చింది. చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా మాచవరం మండలం మోర్జంపాడు గ్రామానికి చెందిన గడిపూడి మురారి(30) హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. మూడేళ్ల క్రితం వివాహమైంది. మూడు నెలల క్రితం గొడవ జరిగడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మురారి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని విద్యానగర్కాలనీలో నివాసముంటున్న తన అక్క కాంచన వద్దకు వచ్చాడు. రోజూ హైదరాబాద్లో ఆఫీస్కి వెళ్లి తిరిగి రాత్రికి వస్తుండేవాడు. 18న మురారి ఆఫీస్కి వెళ్లాడు. అదేరోజు రాత్రి అక్క ఫోన్ చేయగా.. ‘బస్టాండ్ వద్ద ఉన్నాను.. ఇంటికి వస్తున్నా’ అని చెప్పాడు. కానీ ఇంటికి వెళ్లలేదు. రెండు రోజులు అతడి ఫోన్ ఆన్లో ఉన్నప్పటికీ.. సమాధానం ఇవ్వలేదు. ఏదైనా పనిమీద ఉన్నాడేమోనని, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని భావించిన కాంచన అంతగా పట్టించుకోలేదు. 21వ తేదీ నుంచి మురారి సెల్ఫోన్ స్విచ్చాఫ్ అయిపోయింది. ఎంత ప్రయత్నించినా మురారి గురించిన సమాచారం తెలియరాలేదు. దీంతో శనివారం మురారి అక్క కాంచన చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ పేర్కొన్నారు. -
అపూర్వ ధైర్యశాలి టంగుటూరి
నగరంపాలెం: స్వాతంత్య్ర సమరంలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అపూర్వ ధైర్యసాహసాలతో బ్రిటిష్ వారి దౌర్జన్యాలకు ఎదురు నిలబడ్డారని జిల్లా ఎస్పీ సతీష్కుమార్ అన్నారు. ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా శనివారం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఆంధ్రుల ఆత్మ గౌరవ పతాకదారుడు టంగుటూరి అన్నారు. ఆంధ్ర రాష్ట్ర తొలి సీఎంగా ప్రజాస్వామ్య పరిపాలనకు బలమైన పునాదులేసి, విశేష సేవలందించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ ఏడుకొండల రెడ్డి, ఎస్బీ సీఐలు అళహరి శ్రీనివాస్, సీహెచ్ రాంబాబు, ఆర్ఐలు సురేష్, శ్రీహరిరెడ్డి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. స్ఫూర్తి ప్రదాత ప్రకాశం పంతులు గుంటూరు ఎడ్యుకేషన్: స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటిషు పాలకుల తుపాకీకి ఎదురొడ్డి నిలిచిన టంగుటూరి ప్రకాశం పంతులు తరతరాలకు స్ఫూర్తి ప్రదాత అని జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు అన్నారు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జ్యోతిబసు మాట్లాడుతూ పేద కుటుంబంలో పుట్టినా రాష్ట్రానికి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని వివరించారు. అత్యంత సాధారణ జీవనాన్ని సాగించిన ఆయన దేశభక్తి నేటి యువతకు మార్గదర్శకం కావాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఈవో సీహెచ్ కృష్ణ, పరిపాలనాధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. టంగుటూరి ప్రకాశం చిత్రపటానికి నివాళులర్పిస్తున్న జిల్లా ఎస్పీ సతీష్కుమార్ ప్రకాశం పంతులు చిత్రపటానికి నివాళులర్పిస్తున్న జెడ్పీ సీఈవో జ్యోతిబసు, డిప్యూటీ సీఈవో కృష్ణ, ఉద్యోగులు -
సీనియార్టీ జాబితా రూపకల్పనకు వినతి
నెహ్రూనగర్: గుంటూరు జోనల్ పరిధిలోని ఉద్యోగుల సీనియార్టీ జాబితాను రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రజాక్ కోరారు. ఈ మేరకు శనివారం బ్రాడిపేటలోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ రీజినల్ డైరెక్టర్ ఎస్. హరికృష్ణను ఆయన చాంబర్లో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వార్డు సచివాలయ ఉద్యోగులందరి సీనియార్టీ జాబితాను జూలై 31వ తేదీ లోపు రూపొందించాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ఆదేశాలు ఇచ్చినట్లు గుర్తుచేశారు. అనేకచోట్ల ఇది అమలు కాలేదని చెప్పారు. పారదర్శకంగా జాబితాను సిద్ధం చేయాలని కోరారు. వచ్చే పది రోజుల్లోపు గుంటూరు రీజియన్లోని ఉమ్మడి గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో పనిచేస్తున్న వారి జాబితాను రూపొందించి, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటామని ఆర్డీ పేర్కొన్నట్లు రజాక్ తెలిపారు. తుది సీనియార్టీ జాబితాను రూపొందించి మున్సిపల్ డైరెక్టర్ కార్యాలయానికి, ఉద్యోగులకు అందిస్తామని చెప్పినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పార్షా మధు, సంఘ నగర నాయకులు అంకారావు, సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
అంతర్ జిల్లాల దొంగ అరెస్ట్
రూ. 16 లక్షలకు పైగా సొత్తు స్వాధీనం బల్లికురవ: పథకం ప్రకారం నివాస గృహాల్లో బంగారం, వెండి బైక్లు చోరీకి పాల్పడ్డ అంతర్ జిల్లాల దొంగను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. మేదరమెట్ల–నార్కెట్పల్లి నామ్ రహదారిలో బల్లికురవ మండలంలోని గొర్రెపాడు క్రాస్ రోడ్డు వద్ద గుర్తించి పట్టుకున్నారు. అనంతరం స్థానిక పోలీస్స్టేషన్లో వివరాలు తెలియజేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన కత్తి రవికుమార్ 18వ సంవత్సరం నుంచే చెడు వ్యవసనాలకు బానిసై దొంగతనాలకు పాల్పడుతూ జైలుకు వెళ్లడం, బెయిల్పై రావటం.. మరలా చోరీలకు పాల్పడటం చేస్తున్నాడు. ఈనెల 5వ తేదీ అర్ధరాత్రి మేదరమెట్ల–నార్కెట్పల్లి నామ్ రహదారిలోని మండలంలోని రామాంజనేయపురంలో గుంటుపల్లి గురుమూర్తి ఇంట్లోకి ప్రవేశించి 32 గ్రాముల బంగారం, 30 తులాల వెండి చోరీకి పాల్పడ్డాడు. ఘటనా స్థలాన్ని సంతమాగులూరు సీఐ వెంకటరావు, ఎస్సై వై నాగరాజు పరిశీలించి కేసు నమోదు చేశారు. బాపట్ల డీఎస్పీ జి.రామాంజనేయులు పర్యవేక్షణలో సీఐ సారథ్యంలో బల్లికురవ, సంతమాగులూరు ఎస్సైలు నాగరాజు, పట్టాభిరామయ్య రెండు టీంలుగా పక్కా వ్యూహంతో ముద్దాయిని అదుపులోకి తీసుకున్నారు. బాపట్ల, పల్నాడు, తూర్పు గోదావరి, కర్నూలు జిల్లాలో చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారు. 102 గ్రాముల బంగారం, 230 గ్రాముల వెండి, రెండు బైక్లు స్వాధీనం చేసుకున్నారు. బల్లికురవ, పల్నాడు జిల్లా నాదెండ్ల, దాచేపల్లి పోలీస్స్టేషన్ల పరిధిలో జరిగిన చోరీలకు సంబంధించి రికవరీ చేసినట్లు వివరించారు. విశేష ప్రతిభతో నిందితుడిని అదుపులోకి తీసుకుని రికవరీ చేయటం పట్ల బాపట్ల ఎస్పీ తుషార్డూడీ, డీఎస్పీ రామాజంనేయులు, సీఐ వెంకటరావు, ఎస్సైలు వై.నాగరాజు పట్టాభిరామయ్యను అభినందించి రివార్డులు ప్రకటించారు. -
నగదు కోసం యాచకుడి హత్య
నిందితుడి అరెస్ట్ తెనాలి రూరల్: నగదు కోసం యాచకుడైన వృద్ధుడిని హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక త్రీ టౌన్ పోలీస్స్టేషన్లో శుక్రవారం సీఐ ఎస్. రమేష్ బాబు వెల్లడించిన వివరాల ప్రకారం.. పట్టణ త్రీ టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో యాచకుడు వెంకటనారాయణ(70) జూన్ 8న రాత్రివేళ మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం హత్యకు గురైనట్లు నిర్ధారించి, కేసు నమోదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా దర్యాప్తు చేపట్టారు. అవనిగడ్డ మండలం లంకమాన్యం ప్రాంతానికి చెందిన నిందితుడు కొల్లి రాజేష్ను అరెస్టు చేశారు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులోని సాయిబాబా గుడి వెనుక ఓ టింబర్ డిపో వద్ద నిద్రించిన వృద్ధుడి వద్ద రూ.3 వేల నగదు ఉంది. ఈ విషయం గమనించిన రాజేష్ అతడిపై దాడి చేసి హతమార్చి నగదుతో పారిపోయాడు. దీంతో అతడిని అరెస్టు చేశారు. సమావేశంలో ఎస్ఐలు ప్రకాశరావు, కరిముల్లా, కానిస్టేబుళ్లు మురళి, జయకర్ బాబు, సురేష్ పాల్గొన్నారు. -
అక్రమార్కులకు అడ్డా తహసీల్దార్ కార్యాలయం
మార్టూరు: మార్టూరు తహసీల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారింది. ఇటీవల అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తికి చెందిన ఇంట్లో ముగ్గురి పేరుతో ప్రభుత్వ భూమికి సంబంధించి మూడు పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చినట్లు తెలిసింది. ఈ విషయంలో సుమారు రెండు లక్షల రూపాయలు చేతులు మారినట్లు ఆ పార్టీ నాయకులే మీడియాకు వివరాలు అందజేయడం గమనార్హం. ఇదే విషయాన్ని విలేకరులు అధికారిని వివరణ కోరగా తాను డబ్బు తీసుకోలేదని చెప్పారు. కానీ ఆ తర్వాత అదే విలేకరికి ఫోన్ చేసి తాను పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చిన పట్టా నకలు తనకు వాట్సాప్ ద్వారా పంపమని కోరడం గమనార్హం. ఫారెస్ట్ అధికారుల ఆదేశాలు బేఖాతర్ బబ్బేపల్లి కొండ.. రెవెన్యూ పరిధి నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పరిధిలోకి వచ్చిందని సదరు భూమిలో ఎలాంటి ఆక్రమణలు కానీ, తవ్వకాలు కానీ జరపవద్దని జిల్లా ఫారెస్ట్ అధికారులు ఎల్.భీమన్న, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రమేష్బాబు గత సంవత్సర కాలంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. అయితే బబ్బేపల్లి శివారు గ్రామమైన రాజుగారిపాలెం గ్రామానికి చెందిన ఓ అధికార పార్టీ నాయకుడి కుమార్తె పేరుపై ఈ ఫారెస్ట్ భూమిలో ఓ ఎకరాకు పాస్ బుక్ మంజూరు చేయడం గమనార్హం. తోటి అధికారులకు తెలియకుండా.. భూ సంతర్పణలకు సంబంధించి సమాచార హక్కు చట్టం ద్వారా కొందరు వివరాలు అడగగా నేటికీ సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. తహసీల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలో పది కోట్ల రూపాయల విలువైన మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రస్తుతం ఓ అధికార పార్టీకి చెందిన నాయకుడికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ జోరుగా జరుగుతోంది. ఫారెస్ట్ భూమిపై ప్రైవేటు వ్యక్తుల పెత్తనం సాగదు బబ్బేపల్లి రాజుగారిపాలెం గ్రామం ఫారెస్ట్ భూములను ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకోవడంపై పలుమార్లు హెచ్చరించాం. రెవెన్యూ అధికారులకు ఈ భూమిలో పట్టాలు పాస్ పుస్తకాలు ఇచ్చే అధికారం లేదు. ఫారెస్ట్ భూమిని ఆక్రమించుకున్నా, అనధికార నిర్మాణాలు చేపట్టినా తగు చర్యలు తీసుకుంటాం. –రమేష్, కూకట్లపల్లి రేంజ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ -
ఏబీసీ దాటేదెలా? ప్రయాణం సాగేదెలా?
బల్లికురవ: కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యం ప్రయాణికులు శాపంగా మారింది. వంతెన నిర్మాణం పేరుతో ప్రజలను అవస్థలకు గురి చేస్తున్నారు. బల్లికురవ–అద్దంకి ఆర్అండ్బీ రోడ్డులో వారం రోజులుగా రాకపోకలు స్తంభించిపోయాయి. వల్లాపల్లి–ధర్మవరం గ్రామాల మధ్య అద్దంకి బ్రాంచ్ కాలువ దాటే చోట శిథిలాస్థకు చేరిన బ్రిడ్జి స్థానంలో హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం రెండు నెలల కిందట చేపట్టారు. నిర్మాణ పనుల్లో భాగంగా ఏబీసీకి నీరు నిలుపుదల చేయాలని ఆర్అండ్బీ అధికారులు ఎన్నెస్పీ అధికారులకు విన్నవించారు. అయితే ఆగస్టు 1వ తేదీ ప్రవాహ ఉధృతికి నీరు దిగువకు రావటంతో పనులకు ఆటంకం ఏర్పడింది. బంకమట్టితో డైవర్షన్ రోడ్డు.. ఏబీసీ కాలువల్లోని బంకమట్టితో డైవర్షన్ రోడ్డు ఏర్పాటు చేశారు. ఆ రోడ్డులోనే గ్రానైట్ లారీలు, ఇతర వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో రోడ్డు జారుడు బల్లలా మారింది. ఈ సమస్యపై పత్రికల్లో కథనాలు వచ్చినా.. సమస్య పరిష్కరించకపోగా.. డైవర్షన్ రోడ్డును పూర్తిగా తొలగించారు. దీంతో రాకపోకలు స్తంభించిపోయాయి. బల్లికురవ మండలంలో 12 గ్రామాలు, సంతమాగులూరు మండలంలోని 10 గ్రామాలు, అద్దంకి మండలంలోని 9 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 20 కిలోమీటర్ల అదనపు ప్రయాణం ఈ సమస్య వల్ల అద్దంకి ప్రాంతవాసులు కొమ్మినేనివారి పాలెం, వైదన, కొమ్మాలపాడు మీదుగా నరసరావుపేట వైపు వెళ్లాల్సి వస్తోంది. సుమారు 20 కిలోమీటర్ల అదనపు ప్రయాణం చేస్తున్నారు. బల్లికురవ, సంతమాగులూరు మండల వాసులు అద్దంకి చేరాలంటే కొమ్మాలపాడు, కొప్పరపాడు మీదుగా 20 కిలోమీటర్లు అదనంగా ప్రయాణం చేయాల్సి వస్తోంది. 40 రోజులపాటు అవస్థలే.. హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులు కప్పు దశకు చేరాయి. దీంతోపాటు క్యూరింగ్ పూర్తి కావాలంటే మరో 40 రోజులు పట్టే అవకాశం ఉంది. వ్యవసాయ పనులకు కూలీలను తీపుకెళ్లాలన్నా పంట ఉత్పత్తులను మార్కెట్కు తరలించాలన్నా ఇబ్బందులు పడుతున్నట్లు రైతులు వివరించారు. వేసవికాలంలో చేపట్టాల్సిన బ్రిడ్జి నిర్మాణ పనులు వ్యవసాయ పనుల సీజన్లో చేపట్టారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. డైవర్షన్ రోడ్డును తొలగిస్తున్న దృశ్యం అద్దంకి బ్రాంచ్ కాల్వను దాటే చోట నిర్మిస్తున్న హైలెవల్ బ్రిడ్జి వేసవికాలంలో నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. సాగర్ కాలువకు నీటి విడుదల చేసే సమయంలో బ్రిడ్జి నిర్మాణం చేపట్టి అందరిని ఇబ్బందుల పాలు చేస్తున్నారు. సక్రమంగా రాకపోకలు జరగాలంటే 40 రోజులు పడుతుంది. కనీసం బైకులు, బాటసారులు, రైతులు వ్యవసాయకూలీలు రాకపోకలు సాగించేలా డైవర్షన్ రోడ్డు ఏర్పాటు చేయాలి. –దేవినేని కృష్ణబాబు, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ -
అసెస్మెంట్ బుక్స్ విధానాన్ని రద్దు చేయాలి
డీఈవో కార్యాలయం ఎదుట ఏపీటీఎఫ్ నిరసన గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో అమల్లోకి తెచ్చిన అసెస్మెంట్ బుక్స్ విధానాన్ని రద్దు చేయాలని ఏపీటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శుక్రవారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ జిల్లా అధ్యక్షుడు కె. బసవ లింగారావు మాట్లాడుతూ.. ఈ విధానం కారణంగా విద్యార్థులు 50 నుంచి 70 గంటల బోధనా పీరియడ్స్ నష్టపోతున్నారని, ఆగస్టు నెలలో సిలబస్ పూర్తవ్వకపోవడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయని తెలిపారు. ఈ విధానం తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖాలీద్ మాట్లాడుతూ ఒకటో తరగతి విద్యార్థికి ఓఎంఆర్ షీట్ ఇవ్వడం పనికి రాని చర్య అన్నారు. ప్రాథమిక, సెకండరీ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యాంశాల నుంచి ఒక్క ప్రశ్న సైతం ఇవ్వకుండా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తురని పేర్కొన్నారు. ఒక్కో పరీక్షకు ఎనిమిది పేపర్లతో ప్రశ్నపత్రాలను సిద్ధం చేయడం చేయడం ఉపాధ్యాయులకు పెద్ద పరీక్షలా ఉందన్నారు. విద్యార్థుల మార్కులు ఐదు చోట్ల నమోదు చేయాలనడం తగదన్నారు. అనంతరం డీఈవో సీవీ రేణుక, ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా శాఖ నాయకులు పి.లక్ష్మీనారాయణ, పి.పార్వతి, ఎస్ఎస్ఎన్ మూర్తి, జి.దాస్, బి.సాయిలక్ష్మి, వెంకటేశ్వరావు, కిషోర్ షా, రాంమోహన్, శివరామకృష్ణ, రమాదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
కదులుతున్న రైలుపైకి భార్యను నెట్టిన భర్త
తాడేపల్లిరూరల్: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను రన్నింగ్లో ఉన్న ట్రైన్పైకి తోసివేసిన ఘటన శుక్రవారం తాడేపల్లి గేటు సెంటర్లో చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం... నూజివీడుకు చెందిన వెంకటేశ్వరరావు, అతని భార్య అంజలి కొంతకాలంగా తాడేపల్లిలో నివసిస్తున్నారు. నాలుగేళ్ల కిందట విడాకులు తీసుకుని వేర్వేరుగా ఉంటున్నారు. ఇటీవల కలసి జీవనం కొనసాగిస్తున్నారు. అంజలి తాడేపల్లి సలాం సెంటర్ నుంచి శుక్రవారం ఉదయం బైపాస్రోడ్లో ఉన్న ఓ హోటల్లో పని చేసేందుకు వెళుతోంది. గేటు సమీపంలో భర్త వెంకటేశ్వరరావు తారస పడ్డాడు. అదే సమయంలో రైలు వెళుతుండగా భర్త ఆమె జుట్టు పట్టుకుని వేగంగా వెళుతున్న రైలు మీదకు నెట్టాడు. రైలు ఢీకొనడంతో అంజలి తీవ్ర గాయాలతో అక్కడే కుప్పకూలిపోయింది. స్థానికులు 108కు ఫోన్చేసి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పారిపోతున్న వెంకటేశ్వరరావును పట్టుకుని తాడేపల్లి పోలీస్ స్టేషన్లో అప్పగించారు. తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
అంధుల క్రికెట్ టోర్నీ విజేతగా ‘ఆంధ్రా గ్రీన్’
గుంటూరువెస్ట్ (క్రీడలు): ఏపీ రాష్ట్ర అంధుల క్రికెట్ జట్టు కోసం గత మూడు రోజులుగా స్థానిక అరండల్పేటలోని ఏసీఏ క్రీడా మైదానంలో క్రికెట్ అసోసి యేషన్ ఆఫ్ ది బ్లైండ్ ఏపీ, విజువల్లీ బ్లైండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్, డిఫరెంట్ డిసేబుల్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన పోటీలు శుక్రవారంతో ముగిశాయి. విజేతగా ఆంధ్రా గ్రీన్స్ జట్టు నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిభ కనబరిచిన 42 మందిని ఎంపిక చేసి ఆంధ్రా బ్లూ, ఆంధ్రా ఎల్లో, ఆంధ్రా గ్రీన్ పేరుతో పోటీలు నిర్వహించారు. ఆంధ్రా గ్రీన్ విజేతగా నిలిచింది. వీసీఈఏ అధ్యక్షుడు జి.రవీంద్రబాబు ముఖ్యఅతిథిగా జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో క్రికెట్కు అండగా నిలుస్తున్న రామకృష్ణ పరమహంస, మోటివేషనల్ స్పీకర్ శ్రీధర్బాబు, మాజీ బ్లైండ్ క్రికెటర్, అర్జున అవార్డు గ్రహీత అజయ్కుమార్ రెడ్డి విజేతలకు ట్రోఫీని అందించారు. అజయ్కుమార్రెడ్డి మాట్లాడుతూ క్రికెటర్లను ప్రోత్సహించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు. ఉత్తమ ప్రతిభ చాటిన వారిని జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తామని తెలిపారు. -
బార్ అండ్ రెస్టారెంట్ల అనుమతులకు దరఖాస్తు చేసుకోవాలి
రేపల్లె: ప్రభుత్వం నూతనంగా విడుదల చేసిన బార్ పాలసీకి రేపల్లె పట్టణంలో నాలుగు బార్ అండ్ రెస్టారెంట్ల ఏర్పాటుకు అనుమతులు లభించాయని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు చెప్పారు. స్థానిక ప్రొహిబిషన్ కార్యాలయంలో శుక్రవారం రెస్టారెంట్ల ఏర్పాటుకు ఆసక్తి చూపే వారితో సమావేశం నిర్వహించారు. 2025 అక్టోబర్ 1 నుంచి 2028 ఆగస్టు 31వ తేదీ వరకు మూడు సంవత్సరాలపాటు బార్ల నిర్వహణకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందన్నారు. ఈనెల 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు చేసుకునేవారు రూ.5 లక్షలు నాన్ రిఫండబుల్ ఫీజు, రూ.10,000 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని తెలిపారు. బార్లకు అందిన దరఖాస్తులను ఈ నెల 28వ తేదీ ఉదయం 8 గంటలకు జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి సమక్షంలో బాపట్లలో లాటరీ విధానంలో ఎంపిక చేస్తారని తెలిపారు. బార్ పాలసీ విధి విధానాలను తెలియజేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ జిల్లా అధికారి బి.వెంకటేశ్వర్లు, సీఐ దివాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు -
దివ్యాంగుల తిప్పలు
రేపల్లె: ప్రభుత్వం రీ వెరిఫికేషన్ పేరుతో దివ్యాంగులను ఇబ్బందులకు గురిచేస్తుంది. ఏ పని చేసుకోలేని కదలలేని స్థితిలో ఉన్న దివ్యాంగుల పింఛన్లు తొలగించాలనే కుట్రతో ప్రభుత్వం ఇటీవల బాపట్ల జిల్లాలో 3829 మంది పింఛన్దారులకు నోటీసులు జారీ చేసింది. సదరం క్యాంపునకు వెళ్లి వికలాంగుల శాతాన్ని ధృవీకరించే సర్టిఫికెట్ పొందాలని నోటీసులో పేర్కొంది. కదలలేని స్థితిలో ఉన్న దివ్యాంగులు అష్ట కష్టాలు పడుతూ తమకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం నిర్దేశించిన క్యాంపునకు హాజరైతే మీకు ఇక్కడ చూడడం కుదరదని సదరం క్యాంపు సిబ్బంది తెలియజేస్తున్నారు. దీంతో వికలాంగులు నిరాశగా వెనుక తిరుగుతున్నారు. మాకు ఇచ్చిన షెడ్యూల్లో ఇదే హాస్పిటల్ ఈ రోజే హాజరు కావాలని ఉంది కదా సార్ అని దివ్యాంగులు అడిగితే రిపీట్ డాక్టర్ చూడకూడదు సాంకేతిక లోపాల కారణంగా మండల పరిషత్ అధికారులు మీ షెడ్యూల్ ఖరారు చేశారు, వెళ్లి వారిని కలవండి మరలా షెడ్యూల్ ఇస్తారంటూ సమాధానం చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో దివ్యాంగులు వెనుదిరుగుతున్నారు. రేపల్లె పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో శుక్రవారం జరిగిన సదరం క్యాంపునకు రేపల్లె, వేమూరు నియోజకవర్గాలలోని వివిధ గ్రామాల నుంచి 45 మంది దివ్యాంగులు హాజరయ్యారు. వారిలో ఆరుగురు దివ్యాంగులకు రిపీట్ డాక్టర్ కారణాలు చెబుతూ తిప్పి పంపడంతో నిరాశగా వెనుదిరిగారు. దివ్యాంగులమని చూడకుండా ఇష్టానుసారంగా తిప్పుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేమూరు మండలం చంపాడు గ్రామానికి చెందిన బందెల ముసలయ్య కన్నీటి పర్యంతమయ్యాడు. 30 కిలోమీటర్ల దూరం నుంచి వస్తే తమ షెడ్యూల్ ఇది కాదని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను కొన్నేళ్లుగా పింఛన్ పొందుతున్నానని 80 శాతం వికలాంగత్వం ఉన్నా రీ వెరిఫికేషన్ చేయించుకోవాలని నోటీస్ ఇవ్వడంతో తప్పక ఇక్కడికి వచ్చానన్నారు. వెరిఫికేషన్ కాకపోతే పింఛన్ రాదని అధికారులు చెబుతున్నారని తనకు పింఛన్ వస్తుందా లేదా అని బాధ వ్యక్తం చేశాడు. ప్రభుత్వం, అధికారులు ఏ ఆధారం లేని దివ్యాంగులను ఇబ్బందులు గురి చేయకుండా సమస్యను పరిష్కరించాలని వేడుకున్నాడు. -
అర్జీలను వెంటనే పరిష్కరించాలి
బాపట్ల: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, విభిన్న ప్రతిభవంతుల సమస్యలు పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి చెప్పారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో ఎస్సీ, ఎస్టీ, విభిన్న ప్రతిభావంతుల కోసం జిల్లా కలెక్టర్ ప్రత్యేక గ్రీవెనన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వెరిఫికేషనన్్లో తొలగించిన వికలాంగుల పింఛన్దారులకు మరో అవకాశం కల్పిస్తామన్నారు. విభిన్న ప్రతిభావంతులు పెన్షన్ల కోసం ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్ల దగ్గర అప్పీల్ చేసుకోవచ్చన్నారు. విభిన్న ప్రతిభావంతులకు తిరిగి వెరిఫికేషనన్ ద్వారా పింఛన్లు మంజూరు అయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్గౌడ్, బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి గ్లోరియా, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయమ్మ, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి రాధామాధవి, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటేశ్వరావు, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్వామిత్వ సర్వే వేగం పెంచండి జిల్లాలో స్వామిత్వ సర్వేపై కలెక్టర్ జె.వెంకట మురళి శుక్రవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో డ్రోన్ సర్వే పనులను వేగవంతం చేయాలని, పూర్తయిన గ్రామాల్లో హక్కు పత్రాలను త్వరితగతిన పంపిణీ చేయాలని ఆదేశించారు. సర్వేలో తలెత్తే వివాదాలు, అభ్యంతరాలను పారదర్శకంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ సర్వే ద్వారా ప్రజలకు తమ ఆస్తులపై స్పష్టమైన హక్కులు లభిస్తాయని, తద్వారా వారు బ్యాంకుల నుంచి సులభంగా రుణాలు పొందవచ్చని కలెక్టర్ వివరించారు. పంచాయతీలకు సొంత ఆదాయాన్ని పెంచుతుందని తెలిపారు. సమావేశంలో సర్వే ల్యాండ్స్ రికార్డ్స్ ఏడీ కనకప్రసాద్, బాపట్ల, చీరాల, రేపల్లె ఆర్డీవోలు గ్లోరియ, చంద్రశేఖర్, రామలక్ష్మి, డీపీవో ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి లక్ష్యాలు, సాధించిన పురోగతి నిక్షిప్తం చేయాలి అభివృద్ధి లక్ష్యాలు, సాధించిన పురోగతిపై ఎప్పటికప్పుడు కేపీఐసీలో నిక్షిప్తం చేయాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. సంబంధిత శాఖల అధికారులతో శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అధికారులు చేరుకోవాలని చెప్పారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలలో భాగంగా కలెక్టరేట్ ఆవరణలో వెయ్యి మొక్కలు నాటాలని కలెక్టర్ తెలిపారు. అటవీ శాఖ అధికారులు, డ్వామా అధికారులు సమన్వయంతో మొక్కలు నాటాలని సూచించారు. సమావేశంలో సీపీఓ షాలేమ్ రాజు, డీపీఓ ప్రభాకరరావు, డ్వామా పీడీ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. భూగర్భ జలమట్టం పెరిగేలా ప్రణాళికలు తయారు చేయాలి భూగర్భ జల మట్టం జిల్లాలో మరింత పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి ఆదేశించారు. జల వనరులు, భూగర్భ జలశాఖ అధికారులతో శుక్రవారం స్థానిక కలెక్టర్ ఛాంబర్లో ఆయన సమావేశం నిర్వహించారు. గ్రానైట్ క్వారీలు, మట్టి, కంకర తవ్వకాల ప్రభావంతో పర్యావరణం సమతుల్యత కోల్పోయి భూగర్భ జలాలు అడుగంటుతున్నాయన్నారు. వాటిని పెంచడానికి సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లోని మండలాలలో పంట కాల్వల మధ్యలో బోర్లు వేసి భూగర్భ జలాలు పెరగడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. కొల్లూరు మండలంలోనూ భూగర్భ జలమట్టం తగ్గడంపై ఆరా తీశారు. ఇసుక తవ్వకాలతో భూగర్భ జలమట్టం తగ్గుతుందని ఇంజినీరింగ్ అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. వాటిని అరికడుతూనే భూగర్భ జలాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాపట్ల పట్టణం తాగునీటి చెరువు కట్ట బలోపేతం, పూడికతీత పనులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రూ.ఎనిమిది కోట్ల నిధులతో తయారుచేసిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి తక్షణమే పంపాలన్నారు. సమావేశంలో జల వనరులశాఖ ఎస్ఈ అబూతలీమ్, భూగర్భ జల శాఖ ఏడీ సురేష్, డ్వామా పీడీ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, ఇంజినీర్లు, తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి -
నీరందక ఎండుతున్న పంటలు
రేపల్లె: కృష్ణా పరీవాహక ప్రాంతంలోని పంట పొలాలను వరదలు ముంచెత్తుతుండగా..మరో వైపు నీరు అందక వెద పద్ధతిలో సాగు చేసిన వరి పంట ఎండిపోతుంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రేపల్లె నియోజకవర్గం పరిధిలోని రేపల్లె, నగరం, నిజాంపట్నం, చెరుకుపల్లి మండలాలలో 85 వేల ఎకరాల్లో వరి పంట సాగు చేస్తుంటారు. వెద పద్ధతిలో ఇప్పటి వరకు 50 శాతం మాత్రమే సాగుచేసినట్లు వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. కాలువలకు నీరు విడుదల చేయలేదు. దీంతో పంటలకు నీరు అందకపోవటంతో ఎండిపోతున్నాయి. చివరకు ఇంజిన్ల ద్వారా నీరు పెడుతున్నారు. తక్కువ ఖర్చు అవుతుందని వెద పద్ధతిలో సాగు చేస్తే చివరకు తడిసిమోపెడు అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని పెనుమూడి, చాటగడ్డ, మైనేనివారిపాలెం, చోడాయపాలెం, కై తేపల్లి, పోటుమేరక, నగరం, ఈదుపల్లి, పెద్దమట్టపూడి, చిన్నమట్లపూడి, సిరిపుడి, ముత్తుపల్లి, ఆరేపల్లి తదితర గ్రామాలలో ఇప్పటికే సాగు చేస్తున్న పంట ఎండుముఖం పట్టడంతో రైతులు విలవిలలాడుతున్నారు. అధికారులు స్పందించి కాలువలకు నీరు విడుదల చేసి పంటను కాపాడాలని కోరుతున్నారు. -
శాంతించిన కృష్ణమ్మ
ఊపిరి పీల్చుకుంటున్న లంక గ్రామాల రైతులు భట్టిప్రోలు: కృష్ణమ్మ శాంతించింది. దీంతో లంక గ్రామాల రైతులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద దిగువకు శుక్రవారం మధ్యాహ్నం 4.32 లక్షల క్యూసెక్కులు విడుదల చేశారు. మండలంలోని ఓలేరు, పల్లెపాలెం, పెదలంక కాకుల డొంక వద్ద వరద తగ్గుముఖం పట్టింది. పొలాల్లో నిలిచిన నీరు వెనక్కి వెళుతుండడంతో పంటలను కాపాడుకునేందుకు రైతులు చర్యలు చేపట్టారు. చప్టాలపై నీటి ప్రవాహం తగ్గడంతో రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. ముందస్తు జాగ్రత్తగా గజ ఈతగాళ్లను, నాటు పడవలను అందుబాటులో ఉంచారు. వీఆర్వోలు, ఇన్చార్జి ఆర్ఐ శివరామకృష్ణ, మండ్రు జక్రయ్య, ఎల్.సురేష్లు విధులు నిర్వర్తిస్తున్నారు. -
అడిగినంత ఇస్తే రికవరీలు తగ్గిస్తాం
సాక్షి ప్రతినిధి,బాపట్ల: జిల్లా ఉపాధి హామీలో అక్రమాల వ్యవహారం నీకింత..నాకింత అనే చందంగా మారింది. ఫేక్ మస్టర్లు, పనిచేయకుండానే బిల్లులతో కొందరు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. జిల్లా అధికారి నేను అడిగినంత ఇస్తే .. అక్రమాలను కప్పిపుచ్చుతానంటూ బేరం పెడుతున్నారు. జిల్లా అధికారి ముడుపులిచ్చిన వారి అక్రమాలను మరుగునపెడుతున్నారు. వాటా ఇవ్వని వారిని రికవరీ పేరుతో బుక్ చేస్తున్నట్లు కార్యాలయ సిబ్బంది చర్చించుకుంటున్నారు. ఉపాధిలో అక్రమాలు, అవినీతి వ్యవహారం కుప్పలు తెప్పలుగా వెలుగు చూస్తున్నా.. ఉన్నతాధికారులు మాత్రం చర్యలకు మీనమేషాలు లెక్కించడం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. అద్దంకి మండలంలో అక్రమాలు వెల్లువ ఉపాధి హామీ పనుల్లో అద్దంకి మండలంలో జూన్లో జరిగిన సామాజిక తనిఖీల్లో ఈ విషయం తేటతెల్లమైనట్లు సమాచారం. మండలంలోని 26 గ్రామ పంచాయతీల పరిధిలో 2024–2025 ఆర్థిక సంవత్సరంలో రూ.8,52,33,219 మేర ఉపాధి హామీ పనులు జరగ్గా 336 పనులకు సంబంధించి రూ.82,74,327 మేర పనుల్లో అవినీతి జరిగిందని కమిటీ తేల్చింది. కానీ 124 పనులకు సంబంధించి రూ.29,25,256లు మాత్రమే డీవియేషన్ ఉందని ప్రొసీడింగ్ అధికారి హోదాలో డ్వామా పీడీ అంగీకరించినా... 82 పనులకు చెందిన రూ.1,69,106 మాత్రమే రికవరీ పెట్టినట్లు సమాచారం. మిగిలిన రూ.19.34 లక్షలకు సంబంధించిన పనులను రిఫర్డ్ కింద రాసిన పీవో రూ.8,21,426లకు చెందిన పనులను రెక్టిఫికేషన్, మిగిలిన రూ.53.49 లక్షలకు చెందిన పనుల్లో అవినీతి జరగలేదని డ్రాప్డ్ రాశారు. నగరంలో మాత్రం రూ.48 లక్షల రికవరీ అద్దంకి, చీరాల మండలాల్లో పెద్దఎత్తున అవినీతి జరిగిందని 17వ విడత సామాజిక తనిఖీ తేల్చగా దానిని తోసిపుచ్చి మొక్కుబడిగా మాత్రమే రికవరీలు విధించిన డ్వామా అధికారి నగరం మండలంలో జరిగిన అవినీతి విషయంలో భిన్నంగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. నగరం మండలంలోని 27 గ్రామ పంచాయతీల పరిధిలో రూ.9,56,57,239 పనులు జరగ్గా రూ.1,08,60,208 అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీల్లో తేల్చారు. రూ.48,01,833 డీవియేషన్ ఉన్నట్లు అంగీకరించిన డ్వామా అధికారి రూ.48,01,833 మొత్తాన్ని పూర్తిగా రికవరీ కింద చూపడం గమనార్హం. నగరం మండలానికి చెందిన కొందరు ఫీల్డ్, టెక్నికల్, ఇంజినీరింగ్ అసిస్టెంట్లతోపాటు ఏపీవో ఇతర అధికారులు ముడుపులు చెల్లించేందుకు ససేమిరా అనగా కొందరు మాత్రమే అరకొరగా ముట్టజెప్పడంతో ఆగ్రహించిన జిల్లా అధికారి డీవియేషన్ చూపిన మొత్తాన్ని రికవరీ కింద రాశారన్న ఆరోపణలున్నాయి. ఉపాధి హామీలో పెద్దఎత్తున అక్రమాలు వెలుగు చూస్తున్నా.. ఉన్నతాధికారులు స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. చీరాలలో రూ.48.51 లక్షలకు రూ.1.19 లక్షలే రికవరీ చీరాల మండలంలో 14 గ్రామ పంచాయతీల పరిధిలో రూ.9,16,80,215 పనులు జరగ్గా 246 పనులకు సంబంధించి రూ.48,51,541 మాత్రమే అవినీతి జరిగినట్లు 17వ విడత సామాజిక తనిఖీ తేల్చగా డ్వామా పీడీ మాత్రం రూ.29,30,909 డీవియేషన్ ఉందని అంగీకరించారు. కానీ రూ.1,19,915 మాత్రమే అవినీతి జరిగిందని రికవరీ పెట్టారు. మిగిలిన రూ.21,53,707 మొత్తాన్ని రిఫర్డ్ కింద, రూ.19,20,632 డ్రాప్డ్ అమౌంట్గా, రూ.6,57,289 మొత్తాన్ని రిక్టిఫికేషన్ కింద చూపి సామాజిక తనిఖీలో తేలిన అవినీతిని మాఫీచేశారు. అద్దంకి, చీరాల రెండు మండలాల్లో పెద్దమొత్తంలో అవినీతి జరిగిందని సామాజిక తనిఖీ తేల్చగా తక్కువ రికవరీలు చూపడం వెనుక లక్షల్లో డబ్బులు చేతులు మారినట్లు డ్వామాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. -
మైక్రో ఫైనాన్స్ సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా
రేపల్లె: రేపల్లె పట్టణంలో అధిక వడ్డీలు కట్టాలని వేధింపులకు గురిచేస్తున్న మైక్రోఫైనానన్స్ సంస్థల నుంచి బాధితులకు రక్షణ కల్పించాలని బాధిత మహిళలు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా), సీపీఎం ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని మైక్రో ఫైనానన్స్ సంస్థ ఆఫీసుల ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీపీఎం రేపల్లె పట్టణ కార్యదర్శి సీహెచ్.మణిలాల్ మాట్లాడుతూ పట్టణంలోని ప్రైవేట్ ఫైనానన్స్ సంస్థలు ఇళ్ల పట్టాల మీద లోన్ ఇస్తామని పేదలను నమ్మించి ఇంగ్లీషులో ఉన్న అగ్రిమెంట్ పేపర్లపై సంతకాలు చేయించుకొని అధిక మొత్తంలో వడ్డీలు వసూలు చేస్తూ ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు గురిచేస్తున్నారని విమర్శించారు. 12 శాతానికి మించి వడ్డీ వసూలు చేయరాదని నిబంధనలు ఉన్నప్పటికీ 30 శాతం వరకు వసూలు చేస్తూ పేదలను పీడిస్తున్నారన్నారు. రాత్రి ఆరు గంటల తర్వాత లోన్ రికవరీ పేరుతో మహిళలకు ఫోన్ చేసి వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బాధిత మహిళలు సింధు దేవి, తిరుపతమ్మ, కృష్ణంరాజు, దుర్గాప్రసాద్, మోషే, తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు. -
పింఛన్లు ఇవ్వకుండా ప్రభుత్వం మోసం
నెహ్రూనగర్: కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కొత్త పింఛన్లు ఇవ్వకపోగా... ఉన్న దివ్యాంగ పింఛన్లను రీ వెరిఫికేషన్ పేరుతో తొలగించడం దుర్మార్గమైన చర్య అని వైఎస్సార్సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు బోక్క అగస్టీన్ పేర్కొన్నారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో దివ్యాంగ విభాగం ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి తర్వాత రాష్ట్ర ప్రజలను ఎన్నో రకాలుగా ఇబ్బందులు గురిచేస్తోందన్నారు. ఎన్నికల హామీలో మాత్రం రూ.6 వేలు పింఛను ఇస్తామని చెబితే సంబరపడ్డామని.. ఇప్పుడు నిర్దయగా తీసేస్తున్నారని మండిపడ్డారు. గతంలో 80 శాతం వైకల్యం ఉంటే ఇప్పుడు 40 శాతం ఉన్నట్లు చూపించి పింఛన్లు తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హత కలిగిన వారికి కూడా మొండిచేయి చూపడం ఎంతవరకు సమంజసం అన్నారు. రీ వెరిఫికేషన్ పేరుతో ఆసుపత్రులకు, ఇతర కార్యాలయాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. దీని వల్ల దివ్యాంగులు కార్యాలయాల మెట్లు ఎక్కలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. నాడు అండగా వైఎస్ జగన్ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దివ్యాంగులకు అండగా నిలిచారు. 50 ఇళ్లకు ఒక వలంటీర్ను ఏర్పాటు చేసి తమ కష్టాలను తీర్చారని దివ్యాంగులు పేర్కొన్నారు. ఇప్పుడు వలంటీర్ వ్యవస్థ తీసేయడంతో ఏ పని కావాలన్నా కార్యాలయాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. వారి కోసం సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. తొలగించిన పింఛన్లను పునరుద్ధరించాలని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులతో కలిసి నిరసన చేపడతామన్నారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన విధంగానే దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు దాసరి గణేష్బాబు, కొమ్మా లింగరావు, శంకర్, జె కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
కబడ్డీ పోటీల్లో ఈపూరు విద్యుత్ సిబ్బంది సత్తా
ఈపూరు(శావల్యాపురం): రాష్ట్రస్థాయిలో జరిగిన కబడ్డీ పోటీల్లో ఈపూరు మండల విద్యుత్ సిబ్బంది పల్నాడు జిల్లా టీం తరఫున ప్రథమ బహుమతి సాధించడం అభినందనీయమని నరసరావుపేట ఎస్ఈ ప్రత్తిపాటి విజయ్కుమార్ తెలిపారు. కార్యాలయంలో గురువారం పోటీల్లోని విజేతలు పిన్నిబోయిన వెంకటేశ్వరరావు, కంచర్ల ఏడుకొండలు, సన్నిబోయిన రామాంజినేయులు, అచ్యుత్, మల్లికార్జున్లను అభినందించారు. ఎస్ఈ మాట్లాడుతూ అంకితభావంతో విధుల నిర్వహణతో పాటు క్రీడల్లోనూ రాణించటం ప్రశంసనీయమని తెలిపారు. మానసిక వికాసం, శారీరక దృఢత్వానికి క్రీడలు దోహదపడతాయని పేర్కొన్నారు. జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన పిన్నబోయిన వెంకటేశ్వరరావును ప్రత్యేకంగా అభినందించారు. విజేతలకు క్రీడా దుస్తులు అందజేశారు. -
పొగాకు పంటకు ప్రత్యామ్నాయం అపరాలు
అద్దంకి: పొగాకుకు ప్రత్యామ్నాయంగా అపరాలు సాగు చేసుకోవాలని ఆత్మ డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయనిర్మల సూచించారు. ‘ఆత్మ’ ప్రకాశం జిల్లా సౌజన్యంతో కొంగపాడులో వివిధ పంటల్లో సమగ్ర యాజమాన్య పద్ధతులపై గురువారం శిక్షణ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ పొగాకుకు ప్రత్యామ్నాయంగా అపరాలు, మొక్కజొన్న, జొన్న పంటలు సాగు చేయాలని సూచించారు. ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ మురళీధర్ నాయక్ మాట్లాడుతూ మినుము, కంది, పెసర, శనగ పంటల సాగు, ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం, సస్యరక్షణ చర్యల గురించి వివరించారు. ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త ఎం.ఉష మాట్లాడుతూ అపరాల పంటలో విత్తనశుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలని.. రసం పీల్చే పురుగుల నివారణ కోసం విత్తన శుద్ధి చేయాలని సూచించారు. ఉప్పునీటి యాజమాన్యం శాస్త్రవేత్త కె. మృదుల మాట్లాడుతూ అపరాలు.. మొక్కజొన్నలో కలుపు నివారణ చర్యలు గురించి తెలియజేశారు. సహాయ వ్యవసాయ సంచాలకులు బి.ఎఫ్రాయిం మాట్లాడుతూ కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం బర్లీ పొగాకు సాగు చేయవద్దని సూచించారు. మండల వ్యవసాయాధికారి కొర్రపాటి వెంకటకృష్ణ మాట్లాడుతూ ప్రతి రైతు ఈ–పంట నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆత్మ బ్లాక్ టెక్నాలజీ మేనేజర్ శేషారావు, అసిస్టెంట్ టెక్నాలజీ మేనేజర్ రామిరెడ్డి, గ్రామ వ్యవసాయ సహాయకులు సాయిబాబు, వ్యవసాయ విస్తరణ అధికారి కోటేశ్వరరావు, మణికేశ్వరం సొసైటీ అధ్యక్షుడు నర్రా బ్రహ్మానందం, గుడిపూడి బ్రహ్మయ్య, పంచాయతీ కార్యదర్శి ప్రిస్కిల్ల, మస్తాన్ వలి తదితరులు పాల్గొన్నారు. ఆత్మ డిప్యూటీ డైరెక్టర్ విజయనిర్మల -
వినాయకచవితి ఉత్సవాలకు అనుమతి తప్పనిసరి
బాపట్లటౌన్: వినాయకచవతి ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం ఎస్పీ తుషార్ డూడీ విలేకరులతో మాట్లాడారు. ఉత్సవాలకు, మండపాల ఏర్పాటుకు ఆన్లైన్లో అనుమతులు తీసుకోవాలన్నారు. ఎటువంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. పబ్లిక్ ప్రదేశాల్లో మండపాలు, పందిళ్లు ఏర్పాటు చేసి వినాయక విగ్రహాలు ప్రతిష్టించుకునే భక్తుల సౌకర్యార్థం సులభంగా అనుమతులు పొందేందుకు సింగిల్విండో విధానాన్ని పోలీస్ శాఖ ప్రవేశపెట్టిందన్నారు. http://fanerhutrav.net అనే వెబ్సైట్ను పోలీస్ శాఖ ప్రారంభించిందన్నారు. మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా ఈ వెబ్సైట్ ద్వారా సింగిల్ విండో విధానంలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని అనుమతులు పొందాలన్నారు. దరఖాస్తుదారుడు పోలీస్ స్టేషన్లు, కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. సంబంధిత పోలీస్ అధికారి స్వయంగా పందిరి, మండప స్థలాన్ని తనిఖీ చేస్తారన్నారు. నిబంధనల ప్రకారం ఉంటే క్యూఆర్ కోడ్తో కూడిన నిరభ్యంతర పత్రాన్ని (ఎన్ఓసీ) జారీ చేస్తారన్నారు. వినాయక ఉత్సవాలను శాంతియుతంగా, భద్రతాపరమైన నియమ నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలన్నారు. పబ్లిక్ ప్రదేశాల్లో అనుమతి లేకుండా వినాయక మండపాలు, పందిళ్లు ఏర్పాటు చేయరాదన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం ఇలా... http://fanerhutrav.net వెబ్సైట్ను ఓపెన్ చేసి దరఖాస్తుదారుడు అతడి ఫోన్ నెంబర్ నమోదు చేయాలి. -
బీసీల రక్షణ కోసం చట్టం అవసరం
నరసరావుపేట: వెనకబడిన తరగతుల(బీసీ)పై రోజురోజుకూ దాడులు, వివక్ష, దౌర్జన్యం, సామాజిక బహిష్కరణకు గురవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రక్షణ చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని ఏపీ బీసీ సంక్షేమ సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్, జాతీయ ప్రధాన కార్యదర్శి కుమ్మర క్రాంతికుమార్ పేర్కొన్నారు. ట్రయాండ్ సిటీ హోటల్లో గురువారం నిర్వహించిన బీసీ సంక్షేమ సంఘం నాయకుల కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రత్యేక చట్టం వల్ల బీసీలకు రక్షణతో పాటు వారిపై వివక్షను సమూలంగా అరికట్టగలదని నమ్మకం వ్యక్తం చేశారు. సంఘ రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నల శ్రీను మాట్లాడుతూ ఎన్నికల వాగ్దానం మేరకు బీసీలకు రక్షణ చట్టం అమలు చేయాలని కోరారు. చట్టసభల్లో 33 శాతం, స్థానిక సంస్థలు, నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ పనుల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీల సంక్షేమం, అభ్యున్నతి కోసం నియమించిన అన్ని కమిషన్లు రాష్ట్రంలో 52 శాతంగా ఉన్న బీసీలు సామాజికం, ఆర్థికం, రాజకీయంగా వెనకబాటులో ఉన్నారని పేర్కొన్నాయని తెలిపారు. బీసీ నిరుద్యోగుల కోసం ఎస్సీ, ఎస్టీల మాదిరి బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. ఉద్యోగుల ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీ గురుకుల విద్యాలయాలు, స్టడీ సర్కిళ్లు, వసతి గృహాలను సకల సౌకర్యాలతో నిర్మించాలని కోరారు. ప్రభుత్వం పట్టించుకోని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా నిరసనలు, ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొల్లిపర బాలాజీ, యువజన అధ్యక్షులు సుతారం విశ్వేశ్వరరావు పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని కోరిన సంఘ నాయకులు -
పొగాకు రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది
పర్చూరు(చినగంజాం): పొగాకు రైతులు అధైర్య పడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం రైతులందరినీ ఆదుకుంటుందని ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు అన్నారు. పర్చూరు మార్కెట్ యార్డు పరిధిలోని నల్లబర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని గురువారం సందర్శించారు. గోదాముల్లో నిలువ ఉంచిన పొగాకు పరిశీలించారు. పొగాకు రైతులకు బహిరంగ మార్కెట్లో గిట్టుబాటు ధరలేక ఇబ్బంది పడుతున్న సమయంలో కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మార్క్ఫెడ్ సంస్థ ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించి పొగాకును కొనుగోలు చేస్తోందన్నారు. పొగాకు నాణ్యతను బట్టి మూడు గ్రేడులుగా విభజించి రైతులకు గిట్టుబాటు ధలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో 7754 మంది రైతుల వద్ద మార్క్ఫెడ్ సంస్థ సుమారు రూ.100 కోట్లతో 13100 మెట్రిక్ టన్నులు పొగాకు కొనుగోలు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో ఏపీ మార్క్ఫెడ్ జనరల్ మేనేజర్ సీహెచ్ స్రీనివాసరావు, జిల్లా మేనేజర్లు నరసింహ, రమేష, పర్చూరు మార్కెట్ యార్డు చైర్మన్ గుంజి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యాన పంటల సాగుతో రైతులకు మేలు
మాచవరం : ఉద్యాన పంటల సాగుతో రైతులకు మేలు జరుగుతుందని జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఐ. వెంకట్రావు తెలిపారు. మండలంలోని గంగిరెడ్డిపాలెం, పిన్నెల్లి, వేమవరం గ్రామాల్లో ఆయన పర్యటించారు. మిరప, జామ, డ్రాగన్ ఫ్రూట్ పంటలను పరిశీలించారు. రైతులందరూ పంట నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.మిరప, కూరగాయలు, ఆయిల్ పామ్ పంటల్లో తీసుకోవాల్సిన సస్యరక్షణ, యాజమాన్యం పద్ధతుల గురించి రైతులకు తెలియజేశారు. ఎండు తెగులు ఆశించిన జామ చెట్లకు 1గ్రా. కార్బెన్డజిమ్ లేదా 3గ్రా.కాపర్ ఆక్సిక్లోరైడ్ లీటర్ నీటికి కలిపి చెట్టు మొదట్లో పోయాలని తెలిపారు. జింక్, మెగ్నీషియం ధాతు లోప నివారణకు 2గ్రా. జింక్ సల్ఫేట్, 2గ్రా. మెగ్నీషియం సల్ఫేట్, 10 గ్రా. యూరియా లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలని సూచించారు. అనంతరం పంట నమోదు ప్రక్రియను పరిశీలించారు. కార్యక్రమంలో పిడుగురాళ్ల హార్టీకల్చర్ ఆఫీసర్ అంజలి బాయి, విలేజ్ హార్టీకల్చర్ అసిస్టెంట్ కరుణ కుమారి, ప్రభాకర్ రెడ్డి, సాగర్ బాబు, గ్రామ రైతులు పాల్గొన్నారు. -
నీట్ పీజీలో మెరిసిన పూనూరు విద్యార్థి
యద్దనపూడి: మెడికల్ విభాగంలో బుధవారం ప్రకటించిన నీట్ పీజీ పరీక్ష ఫలితాల్లో యద్దనపూడి మండలం పూనూరు గ్రామానికి చెందిన డాక్టర్ ఐలవరపు శృతి జాతీయ స్థాయిలో 3716వ ర్యాంకును సాధించారు. మొత్తం 2,42,000 మంది అభ్యర్థులు రాసిన నీట్ పీజీ ఎంట్రన్స్ పరీక్షలో శృతి 3716వ ర్యాంక్ సాధించారు. పూనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తిచేసిన శృతి మొదటి నుంచి చదువులో అగ్రగామిగా ఉండేవారు. 2018 నీట్ యూజీ ఎంట్రన్స్ పరీక్షలో రాష్ట్ర స్థాయి మొదటి పది మంది విజేతల్లో ఒకరుగా నిలిచి గుంటూరు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. గైనకాలజీ పూర్తి చేయటం ద్వారా పేద ప్రజలకు సేవలు అందించటం తన లక్ష్యమని శృతి తెలిపారు. శృతి తండ్రి హనుమంతరావు ఆరోగ్య శాఖలో ఉద్యోగి కాగా తల్లి హిమబిందు ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. తల్లిదండ్రులు, సోదరి ప్రణయ, పూనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.నీట్ పీజీలో 5850 ర్యాంక్ సాధించిన రాచూరు వాసిభట్టిప్రోలు: భట్టిప్రోలు మండలం రాచూరు గ్రామానికి చెందిన దీవి శ్రీసాయి హేమంత్ నీట్ పీజీ 2025లో 578 మార్కులు 5850 (ఆల్ ఇండియా) ర్యాంక్ సాధించారు. 2018లో నీట్ ఎంట్రన్స్ పరీక్షలో నేషనల్ 20 వేలు, రాష్ట్రంలో 1011 ర్యాంక్ సాధించాడు. గుంటూరు కాటూరి మెడికల్ కాలేజీలో ఉచిత సీట్ పొంది 2018–2024లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. హేమంత్ తండ్రి శ్రీనివాస హరికుమార్ న్యాయవాదిగా, తల్లి అనంత శైలజ సచివాలయ మహిళా పోలీస్గా పనిచేస్తున్నారు. హేమంత్ను తాత విశ్రాంత తెలుగు పండిట్ దీవి వేంకట లక్ష్మీ నరసింహాచార్యులు, కుటుంబ సభ్యులు అభినందించారు.