Bapatla District Latest News
-
బాపట్ల
సోమవారం శ్రీ 2 శ్రీ జూన్ శ్రీ 2025నేడు వల్లభేశ్వరుడి వార్షికోత్సవం రొంపిచర్ల: మండలంలోని విప్పర్లలో గల వల్లభేశ్వరస్వామి ఆలయ ఏడో వార్షికోత్సవం సోమవారం నిర్వహించనున్నారు. ఉదయం నుంచి విశేష పూజలు, హోమాలు జరుగుతాయి. అలరించిన వేణుగాన కచేరీ నగరంపాలెం: బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వర స్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై ఆదివారం వల్లూరు కృష్ణకిషోర్, ఆర్.శశాంక్, జనార్దన్ల వేణుగాన కచేరీ అలరించింది.సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 512.30 అడుగుల వద్ద ఉంది. కుడి కాలువకు 5,598 క్యూసెక్కులు విడుదలవుతోంది. 7 -
నాడు సంక్షేమం.. నేడు సంక్షోభం
కూటమి ఏడాది పాలనలో అన్నివర్గాలకు తీరని అన్యాయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో సంక్షేమ జాతర సాగింది. అభివృద్ధికి కూడా గత ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. కరోనా వంటి కష్టకాలంలోనూ సంక్షేమాన్ని కొనసాగించింది. సంక్షేమ పథకాలతో నాడు ఇంటింటా పండగ చేసుకున్న ప్రజానీకానికి నేడు కూటమి ప్రభుత్వం షాకులు మీద షాకులిస్తోంది. అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ప్రజలను దారుణంగా మోసగించింది. చంద్రబాబు కేవలం మాటలకే పరిమితం అయ్యారు. బాపట్ల టౌన్ : కూటమి అధికారంలోకి వస్తే రెట్టింపు సంక్షేమాన్ని అందిస్తామని, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇస్తున్న పథకాలను కొనసాగిస్తూ, సూపర్–6 పథకాలను అమలు చేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ఊకదంపుడు ప్రసంగాలు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా అవేమీ అమలుకు నోచుకోలేదు. ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలెండర్ల పథకం ప్రారంభమైనప్పటికీ అరకొరగానే అమలు జరిగిందనే విమర్శలు అధికంగానే వినిపిస్తున్నాయి. పింఛన్లు పెంచి ఇస్తున్నా.. లబ్ధిదారుల సంఖ్యను దారుణంగా తగ్గిస్తున్నారు. దీంతో కూటమి సర్కార్ తీరుపై ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. మహిళలు అయితే దుమ్మెత్తిపోస్తున్నారు. పథకాలు అమలు కాకపోవడంపై అంతా చర్చించుకుంటూ గత పాలనను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. నాడు విప్లవాత్మక పథకాలు ప్రజా సంకల్పయాత్రలో ప్రజల కష్టాలను చూసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక సీఎంగా పలు విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుట్టారు. తర్వాత ప్రభుత్వ సేవలను ఇంటి ముంగిటకే అందించాలని సంకల్పించారు. ఇందుకోసం సచివాలయ వ్యవస్థ, వలంటీర్ వ్యవస్థలను తీసుకొచ్చారు. వీరి ద్వారా పింఛన్లు, ధ్రువీకరణ పత్రాలు, సంక్షేమ పథకాలు, కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యవసర సేవలు, మందులు ఇలా ఎన్నో సేవలను అందించారు. వైఎస్సార్సీపీ మార్క్ సుపరిపాలనకు కూటమి ప్రభుత్వ ఏడాదిలోనే స్వస్తి పలికింది. పేదలపై కక్ష కట్టి వలంటీర్ లాంటి వ్యవస్థను తొలగించింది. ప్రజలను ఇబ్బందుల పాలుచేసింది. నాడు ప్రగతి పరుగులు చీరాల ఓడరేవు నుంచి పల్నాడు జిల్లా చిలకలూరిపేట వరకు రూ.900 కోట్లతో నాలుగు లేన్ల రహదారిని నిర్మిస్తున్నారు. ఇప్పటికే పనులు సగానికి పైగా పూర్తయ్యాయి. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే జిల్లాలో పర్యాటకం మరింత అభివృద్ది చెందనుంది. రేపల్లె నియోజకవర్గంలోని నిజాంపట్నం వద్ద రూ. 451 కోట్లతో వేగంగా హార్బర్ రెండవ ఫేజ్ పనులు జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే 500 బోట్లు నిలిపే అవకాశం ఉంటుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక జిల్లాలో 705 సూక్ష్మ, చిన్న పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వీటికి ప్రోత్సాహకరంగా ప్రభుత్వం గడచిన నాలుగేళ్లలో రూ.110.69 కోట్లు రాయితీ అందించింది. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలలో గడపగడపకు మన ప్రభుత్వం కింద రూ.12 కోట్లతో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టారు. రూ.15 కోట్ల ఎంపీ నిధులతో ప్రభుత్వం సిమెంట్రోడ్లు, కమ్యూనిటీ భవనాలను నిర్మించింది. రూ.885 కోట్లతో 4,750 గృహాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటివరకు 2 వేలకుపైగా పూర్తయ్యాయి. రూ.6 కోట్లు వెచ్చించి రైతులకు రాయితీపై విత్తనాలను అందించారు. రూ.10 కోట్లతో ట్రాక్టర్లు, ఇతర యంత్ర పరికరాలు అందించారు. ఉద్యాన పంటలకు రూ.11 కోట్లు రాయితీలు, మత్స్యకార భరోసా కింద రూ.100 కోట్లు ఇచ్చారు. మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ కింద రూ. 20 కోట్లు, పశుగ్రాసం రాయితీ కింద రూ. 6 కోట్లు, జల్జీవన్ మిషన్ కింద రెండు విడతల్లో రూ.1,040 కోట్లు కేటాయించి ఇప్పటివరకు 1,43,497 కుళాయిల ద్వారా నీరు అందించారు. పథకం లబ్ధిదారుల అందించిన సంఖ్య మొత్తం (రూ.కోట్లలో) ఆసరా 2,76,290 953.37 అమ్మఒడి 1,16,019 489 వైఎస్సార్ చేయూత 85,846 439.13 జగనన్న వసతి దీవెన 30,611 29.16 జగనన్న విద్యా దీవెన 31,046 92.28 పింఛను కానుక 2,35,791 2,668 రైతు భరోసా 1,92,037 1,181 ఇన్పుట్ సబ్సిడీ 1,71,415 406.62 ఉచిత పంట బీమా 99,580 179.23 తుపాన్ పరిహారం 1,23,056 115.85 వైఎస్సార్ ఆరోగ్య ఆసరా 62,170 33.15 ఆరోగ్యశ్రీ 1,37,421 331.83 వైఎస్సార్ బీమా 2,376 31.52 సున్నా వడ్డీ (మహిళలు) 31,764 166.60 మత్స్యకార భరోసా 21,726 21.72 మత్స్యకార డీజిల్ సబ్సిడీ 2,663 4.54 ఆక్వాకు విద్యుత్ సబ్సిడీ 2,620 76 గోరుముద్ద 76,975 0.31 జగనన్న విద్యాకానుక 1,11,520 26.77 వైఎస్సార్ సంపూర్ణ పోషణ 77,718 1.26 సంపూర్ణ మిశ్రమ దాణా 5,924 1.11 పశుగ్రాస విత్తనాల సరఫరా 10,768 2.27 పశుగ్రాస యంత్రాల పంపిణీ 111 15.8 పశువుల పంపిణీ 9,214 69.10 భవనం పేరు సంఖ్య వ్యయం (రూ.కోట్లలో) గ్రామ సచివాలయాలు 401 160.04 రైతు భరోసా కేంద్రాలు 315 66.40 వైఎస్సార్ హెల్త్ క్లినిక్లు 343 58.48 బల్క్మిల్క్ సెంటర్లు 40 7.20 డిజిటల్ లైబ్రరీలు 128 20.49 నేడు వైద్యానికి నోచుకోని పేదలు పేదలకు ఉచితంగా వైద్యం అందించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెద్ద పీట వేసింది. అందులో భాగంగా వైద్య సేవలను మరింత మెరుగు పరిచింది. జిల్లాలో రూ. 15 కోట్లు వెచ్చించి 7 కొత్త పీహెచ్సీలను నిర్మించింది. మరో రూ. 10 కోట్లు ఖర్చు చేసి 34 పీహెచ్సీలను ఆధునికీకరించింది. గడిచిన అయిదేళ్లలో 60 మంది కొత్త డాక్టర్లను, 43 మంది ఏఎన్ఎంలను రిక్రూట్ చేసింది. 343 డాక్టర్ వైఎస్సార్ హెల్త్ సెంటర్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. జిల్లాలోని బాపట్ల, చీరాల ఏరియా అసుపత్రులలో జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా రెండు విడతల్లో వైద్య శిబిరాలు నిర్వహించి పేదలకు వైద్య సేవలు అందించారు. రెండు ఫేజ్లలో 2,69,495 మందికి పరీక్షలు నిర్వహించారు. 4,223 మందికి వైద్యసేవలు అందించారు. జగనన్న కంటి వెలుగు ద్వారా 300 మందికి సర్జరీలు చేసి 29 వేల మందికి కంటి అద్దాలు అందజేశారు. జిల్లాలో 3,49,767 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చారు. ప్రభుత్వం రూ.550 కోట్లతో బాపట్లకు మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీలను మంజూరు చేసింది. 55 ఎకరాల విస్తీర్ణంలో వీటిని నిర్మిస్తున్నారు. ఇప్పటికే 30 శాతం పనులు పూర్తయ్యాయి. నేడు వైద్యానికి కూటమి ప్రభుత్వం మొండిచేయి చూపింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.312.61 కోట్లు వెచ్చించి నిర్మించిన భవనాల వివరాలువైఎస్సార్సీపీ పాలనలో జిల్లాలో సంక్షేమ పథకాల కింద అందించిన మొత్తం వివరాలు నాడు పథకాలతో కళకళ... నేడు లబ్ధి అందక ప్రజలకు కష్టాలు దారుణంగా మోసపోయామని జిల్లా ప్రజల ఆవేదన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ సేవలను ఇప్పటికీ మరువని జనం రూ. వేల కోట్లతో నాడు జిల్లాలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు ప్రస్తుతం ఏ చిన్న పని కావాలన్నా కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన దుస్థితి పెట్టుబడి సాయం, గిట్టుబాటు ధరలు లేక కన్నీరు కారుస్తున్న రైతులు చేతిలో చిల్లిగవ్వ లేదంటున్న మహిళలు కూటమి సర్కారు ఏడాది పాలనపై భగ్గుమంటున్న సామాన్యులు -
యోగాతో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం
నరసరావుపేట: యోగాతో శారీరక దృఢత్వంతోపాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని కలెక్టర్ పి.అరుణ్బాబు పేర్కొన్నారు. యోగాంధ్రలో భాగంగా ఆదివారం నరసరావుపేటలోని పల్నాడు బస్టాండ్, పెద్ద చెరువు రోడ్డు వద్ద కార్యక్రమాలను పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ యోగా అనేది ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగస్వామ్యం కావాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోజూ 30 నిమిషాల నుంచి గంట వరకు యోగాభ్యాసం చేయాలని సూచించారు. యోగాతో శారీరక రుగ్మతలు దూరమవుతాయని పేర్కొన్నారు. యోగా అనేది చాలా ప్రాచీనమైనదని, వందల ఏళ్ల నుంచి గుర్తింపు పొందిందని అన్నారు. జూన్ 21 వరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. -
బాబు నోరు తెరిస్తే అబద్ధాలే
అద్దంకి: చంద్రబాబు ఎప్పటిలాగానే గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో ఆయన చెప్పేవన్నీ అబద్ధాలేనని ప్రజలంతా తెలుసుకున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ‘వెన్నుపోటు దిన’ సమాయత్త సమావేశంలో ముఖ్య అతిథిగా మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెరవేర్చలేని హామీలు ఎప్పుడూ ఇవ్వలేదని గుర్తు చేశారు. అందుకు విరుద్ధంగా చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. మరో వైపు కూటమి ప్రభుత్వ పాలనలో విద్య, వైద్యానికి భరోసా లేకుండా పోయిందని విమర్శించారు. నాడు వ్యవసాయం పండుగగా సాగితే నేడు పంటలను కొనేవారు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు పొగాకు, మిరప రైతులకు వెన్నుదన్నుగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉందన్నారు. నేడు ఒక్క పొగాకు కాడ కూడా కొనుగోలు చేసే స్థితిలో ఈ ప్రభుత్వం లేదన్నారు. నల్లబర్లీ, తెల్లబర్లీ రైతులు పూర్తిగా పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రతి రైతుకు గిట్టుబాటు ధర లభించిందని గుర్తు చేశారు. పార్టీలతో సంబంధం లేకుండా రైతన్నలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. చంద్రబాబు మోసపూరిత హామీలు, చేతగానితనాన్ని ఎండగట్టి ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసమే ఈ నెల 4న వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించి స్థానిక తహసీల్దార్కు మోమోరాండం అందజేస్తామని చెప్పారు. మండల పార్టీ నాయకుడు నరసింహారెడ్డి, శ్రీనివాసరెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి, వివిధ మండలాల అధ్యక్షులు గుజ్జుల జగన్మోహన్రెడ్డి, కృష్ణ, నాగేశ్వరరావు, బీసీ సెల్ నాయకుడు గోలి రమణబాబు, కొల్లా భువనేశ్వరి, అవిశెన ప్రభాకర్రెడ్డి, వివిధ మండలాల నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు పాల్గొన్నారు. పావులూరు: సభలో ప్రసంగిస్తున్న మేరుగ నాగార్జున మాయమాటలు చెప్పి ప్రజలను మోసగిస్తున్న సీఎం వెన్నుపోటు దిన ఏర్పాట్లపై సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున ధ్వజంఇంకొల్లు(చినగంజాం): ఎన్నికల్లో నెరవేర్చలేని హామీలిచ్చి రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని మాజీ మంత్రి, బాపట్ల జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మేరుగ నాగార్జున అన్నారు. జూన్ 4న వైఎస్సార్సీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమం సన్నాహాల్లో భాగంగా ఆదివారం ఇంకొల్లు మండలం పావులూరు గ్రామంలో నిర్వహించిన సభలో మాట్లాడారు. సమాజంలో అసమానతలు పోయేలా నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన అందించారన్నారు. రూ. 2 లక్షల 78 వేల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసి తాను ఇచ్చిన హామీలకు మించి అమలు చేసిన ఘనత ఆయనదన్నారు. ఏడాది తిరగకుండానే చంద్రబాబు పాలన అవినీతిమయంగా మారిందని విమర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్ 4 నాటికి ఏడాది అవుతుందని, ఈ కాలంలో తల్లికి వందనం, విద్యార్థులకు విద్య, రైతు భరోసా, ఆరోగ్య శ్రీ వంటి పలు పథకాలను తొలగించి రాష్ట్రంలో అన్ని వర్గాల వారిని దారుణంగా మోసం చేశారన్నారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను తొలగించి లక్షల మందిని వీధులపాలు చేశారన్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో జూన్ 4వ తేదీన చేపట్టిన వెన్నుపోటు దినాన్ని పర్చూరులో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలు, రైతులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పర్చూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి గాదె మధుసూదన రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతులందరికీ మేలు జరిగేలా ఐక్యంగా పోరాటం చేద్దామన్నారు. జిల్లా అధికార ప్రతినిధి బంజారు ప్రభాకరరావు పుట్టినరోజు కార్యక్రమాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో పర్చూరు నియోజకవర్గ పరిధిలోని మండలాల కన్వీనర్లు జంపని వీరయ్య చౌదరి, మున్నం నాగేశ్వరరెడ్డి, కఠారి అప్పారావు, జువ్వా శివరాం ప్రసాద్, చిన్ని పూర్ణారావు, జిల్లా అధికార ప్రతినిధి బండారు ప్రభాకరరావు, ఎస్సీ సెల్ కన్వీనర్ కె. బాబురావు, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు నూతలపాటి బలరాం, సోషల్ మీడియా అధ్యక్షుడు కుమ్మరి చందు, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి బిల్లాలి డేవిడ్, అనుబంధ విభాగాల అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
మాదకద్రవ్యాల వినియోగం సమాజానికి హానికరం
గుంటూరు వెస్ట్ : మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తులకే కాదు దేశానికి కూడా తీవ్ర హానికరమని ఇన్చార్జ్ జిల్లా కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ అన్నారు. ఆదివారం స్థానిక కలెక్టరేట్ నుంచి ఎస్పీ సతీష్కుమార్తో కలిసి మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేక ర్యాలీని ప్రారంభించారు. ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నాషా ముక్త్ భారత్ అభియాన్ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. న్నారు. ఈ నెల 26న అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ 26 రోజులపాటు ర్యాలీలు, సభలు, సమావేశాలతో ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఎస్పీ సతీష్కుమార్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం 2020 నుంచి నాషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గుర్తుచేశారు. ప్రజలకు ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించడమే దీని ధ్యేయమన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని నిరంతరం గమనిస్తుండాలని సూచించారు. అనంతరం జరిగిన ర్యాలీలో ఇన్చార్జి జిల్లా కలెక్టర్తోపాటు, ఎస్పీ, ఎకై ్సజ్ సూపరిండెంట్ అరుణ కుమారి, డీఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ సువార్త, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పూర్ణాహుతితో ముగిసిన హనుమత్ జయంత్యుత్సవాలు తెనాలి: షరాఫ్బజార్లోని శ్రీసువర్చలా సమేత శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దేవస్థానంలో వార్షిక శ్రీహనుమత్ జయంతి, 17వ లక్ష శ్రీహనుమాన్ చాలీసా పారాయణ మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. మే 22వ తేదీన ప్రారంభమైన ఉత్సవాలను ఆదివారం ఉదయం పూర్ణాహుతి కార్యక్రమంతో ముగించారు. తొలుత లక్ష హనుమాన్ చాలీసా పారాయణ పత్రికలకు ఆలయ వంశపారంపర్య అర్చకుడు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో వైఖానస ఆగమ పండితుడు నాగ మారుతి బృందం విశేష పూజలు నిర్వహించింది. సాయంత్రం ఊంజల సేవ, పండిత ఆశీర్వచనం జరిగాయి. ఉత్సవాల పూర్ణాహుతి సందర్భంగా నిర్వహించిన అన్న సమారాధనలో సుమారు 1500 మంది భక్తులు పాల్గొన్నారు. ఆలయ ఈవో అవుతు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 11 రోజుల పాటు జరిగిన ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అర్చకులు కిరణ్కుమార్, సురేష్, గ్రూప్–2 దేవాలయాల కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్, కౌన్సిలర్లు పి.త్రిమూర్తి, దేసు యుగంధర్, గొడవర్తి సాయిహరేరామ్, శ్రీవిఖనస శ్రీనివాస ట్రస్ట్ సభ్యులు గుడివాడ బాల కృష్ణ, మడుపల్లి చంద్రశేఖర్, బచ్చు లీలా ప్రసాద్ రావు, మాజేటి వెంకటేష్, సంకా శివప్రసాద్, మద్దు హరీష్ వెంకట మణిసాయి, బిట్రా రఘు, గోలి సోమశేఖర్, వెచ్చా కిషోర్, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సభ్యులు పాల్గొన్నారు. వీలున్నప్పుడే రేషన్ సరుకులు తీసుకోండి – ఇన్చార్జి జిల్లా కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ గుంటూరు వెస్ట్ : వీలున్న సమయంలోనే రేషన్ సరుకులు తీసుకోవచ్చని ఇన్చార్జి జిల్లా కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ తెలిపారు. ఆదివారం స్థానిక వసంతరాయపురంలోని షాప్ నెంబర్ 61లో సరకుల పంపిణీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి నెల 1– 15వ తేదీ వరకు ఉదయం 8 – 12, సాయంత్రం 4– 8 గంటల మధ్య సరుకులు పంపిణీ చేస్తారన్నారు. లబ్ధిదారులు వీలున్న సమయంలోనే దుకాణానికి రావచ్చన్నారు. ఈ–పోస్ మిషన్లు, వేయింగ్ మిషన్లు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. దుకాణదారులు ఇబ్బందులకు గురిచేస్తే అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. రేషన్ పంపిణీ విధానాన్ని కూడా ఆయన పరిశీలించారు. కార్డుదారులతో మాట్లాడారు. కార్యక్రమంలో ఇన్చార్జి డీఎస్ఓ చంద్రముని, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
కార్డుదారులకు సరుకులు సక్రమంగా అందించాలి
చీరాల టౌన్: కార్డుదారులకు రేషన్ సరుకులు సక్రమంగా అందించాలని చీరాల ఆర్డీఓ తూమాటి చంద్రశేఖరనాయుడు సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నూతనంగా మండలంలోని ఈపురుపాలెం, తోటవారిపాలెం, పట్టణంలోని పలు వార్డుల్లోని రేషన్ దుకాణాల ద్వారా కార్డుదారులకు సరుకులు పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ప్రతి డీలర్ విధిగా ప్రతి నెలా 15వ తేదీలోగా కార్డుదారులకు సరుకులు అందించాలని ఆదేశించారు. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దుకాణాలు తెరచి ఉంచాలని తెలిపారు. ప్రతి డీలర్ విధిగా స్టాక్ రికార్డులు, బోర్డుల్లో సరుకుల కేటాయింపులు, నిల్వలను తెలియజేయాలని చెప్పారు. సరుకుల పంపిణీలో వ్యత్యాసాలు, అధిక ధరలకు అమ్మకాలు, బియ్యాన్ని ఇవ్వకుండా డబ్బులకు కొనుగోలు చేయడం నేరమని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ కుర్రా గోపీకృష్ణ, వీఆర్వోలు, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. -
అండర్పాస్లో ఇరుక్కుపోయిన లారీ
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని ఎన్టీఆర్ కరకట్ట నుంచి సీతానగరం వచ్చే మార్గంలో బకింగ్హామ్ కెనాల్ వద్ద ఉన్న రైల్వే అండర్పాస్లో మరో సారి భారీ వాహనం ఆదివారం ఇరుక్కుపోయింది. సీతానగరం నుంచి ఎన్టీఆర్ కరకట్ట వైపు వెళుతున్న లారీ రైల్వేబ్రిడ్జి సేఫ్టీ కోసం ఏర్పాటు చేసిన గడ్డర్ను దాటి ముందుకు వచ్చేసింది. బ్రిడ్జి కిందకు రాగానే లారీపై ఉన్న లోడ్ తగిలి ఇరుక్కుపోవడంలో డ్రైవర్ నిలిపివేశాడు. చివరకు టైర్లలో గాలి తీసి ముందుకు తీసుకువెళ్లారు. రైల్వే బ్రిడ్జి కింద తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతుండడంతో పెను ప్రమాదం జరిగే అవకాశముందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. రైల్వే అధికారులు స్పందించి రైల్వే బ్రిడ్జికి ప్రమాదం కలగకుండా సమాంతరంగా గడ్డర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ సంఘటనపై తెనాలి రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నారులతో మైదానాలు కళకళలాడాలి గుంటూరు వెస్ట్ (క్రీడలు): చిన్నారులతో క్రీడా మైదానాలు కళకళలాడాలని, ఆ విధంగా స్టేడియాన్ని తీర్చిదిద్దుతామని తూర్పు శాసన సభ్యుడు మొహమ్మద్ నసీర్ అహ్మద్ తెలిపారు. మూడు రోజల నుంచి స్థానిక బీఆర్ స్టేడియంలో జరుగుతున్న అండర్–16 బాలబాలికల ఓపెన్ టెన్నిస్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుతూ రూ.100 కోట్లతో స్టేడియాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. పోటీల నిర్వాహకుడు, టెన్నిస్ కోచ్ షేక్ అహ్మద్ మాట్లాడుతూ అండర్–16 బాలుర విజేతగా కె.విన్సెంట్, రన్నర్గా జయ సాయి కుమార్ నిలిచాడన్నారు. బాలికల్లో గోలి జోషిత విజేత కాగా తనిక్షరెడ్డి రన్నర్గా నిలిచిందని చెప్పారు. విజేతలకు బహుమతులను నసీర్ అహ్మద్, టోర్నమెంట్ స్పాన్సర్ డాక్టర్ రామకృష్ణ, రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వెంకటేశ్వరరావు అందజేశారు. -
రోడ్డు ప్రమాదంలో కార్మికుడి మృతి
నాదెండ్ల: జాతీయ రహదారి డివైడర్ను ఢీకొని ఒడిశా రాష్ట్రానికి చెందిన కార్మికుడు మృతి చెందిన సంఘటన శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తిమ్మాపురం గ్రామ పరిధిలోని తిరుమల స్పిన్నింగ్ మిల్లులో పనిచేసే ప్రీతమ్ మాలిక్ (24) సోదరుడు శ్రీతమ్ మాలిక్ కుటుంబంతో కలిసి స్థానిక స్పిన్నింగ్ మిల్లు క్వార్టర్స్లో నివాసం ఉంటున్నారు. రెండేళ్లుగా క్వార్టర్స్లో ఉంటూ కూలి పనులు చేసుకుని జీవిస్తున్నారు. రెండు నెలల కిందట ప్రీతమ్ మాలిక్ ఒడిశా నుంచి వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. శనివారం రాత్రి మిత్రుడు లిట్టూతో కలిసి ప్రీతమ్మాలిక్ ద్విచక్రవాహనంపై చిలకలూరిపేట వెళ్లి తిరిగి వస్తున్నాడు. ప్రసన్న వంశీ స్పిన్నింగ్మిల్లు వద్దకు రాగానే ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రీతమ్మాలిక్ అక్కడికక్కడే మృతి చెందాడు. లిట్టూకు గాయాలు కావటంతో గుంటూరు జీజీహెచ్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాహనం ఢీకొని వ్యక్తి మృతి దాచేపల్లి: అతివేగంగా వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని ఇందిరాకాలనీకి చెందిన కొమ్మా విజయ్కుమార్(58)తన ఇంటి నుంచి హైవే రోడ్డు దాటుతున్నాడు. ఈ క్రమంలో పిడుగురాళ్ల వైపు నుంచి అతివేగంగా వస్తున్న వాహనం అతనిని ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై జీ. పాపారావు సంఘటన స్థలాన్ని పరిశీలన చేశారు. ఢీకొట్టిన వాహనం కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి భార్య భార్య విమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై పాపారావు తెలిపారు. పొస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
దుర్గమ్మ సన్నిధిలో భక్తుల తాకిడి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. వేసవి సెలవులు ముగియ నుండటంతో, వివాహ ముహుర్తాల నేపథ్యంలో నూత న వధూవరులు, భక్తులు, యాత్రికులతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి కనిపించగా, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా దేవస్థాన అధికారులు ఏర్పాట్లు చేశారు. పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు దేవస్థాన కేశకండనశాలలో తలనీలాలు సమర్పించారు. ఘాట్రోడ్డు, మహామండపం లిప్టు, మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకున్నారు. సర్వదర్శనంతో పాటు రూ. 100, రూ. 300, రూ. 500 టికెట్ల క్యూలైన్ ద్వారా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సర్వదర్శనం క్యూలైన్లో అమ్మవారి దర్శనానికి రెండున్నర గంటలు, రూ.100, రూ.300 టికెట్పై దర్శనానికి గంటన్నరకు పైగా సమయం పట్టింది. వీఐపీ దర్శనాలను బ్రేక్ ఉదయం 11–30 గంటల నుంచి మధ్యాహ్నం 1–30 గంట వరకు వీఐపీ దర్శనాలను దేవస్థాన అధికారులు నిలిపివేశారు. అమ్మవారికి మహానివేదన నిమిత్తం ఉ దయం 11–45 గంటల నుంచి 12–15 గంటల వరకు అన్ని దర్శనాలు నిలిపివేశారు. దీంతో అన్ని క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. మహానివేదన అనంతరం రూ. 500టికెట్ల విక్రయాలను నిలిపివేసి, రూ. 300 టి కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు బంగారువాకిలి దర్శ నం కల్పించారు. మధ్యాహ్నం 2గంటలవరకు ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీసేవలో పలువు రు ఉభయదాతలు, భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం ఏడు గంటలనుంచి భక్తుల తాకిడి కనిపించింది. మహానివేదన తర్వాత వీఐపీ దర్శనాలకు బ్రేక్ అంతరాలయ దర్శనం రద్దు -
‘గ్రీన్లైట్ ఏరియా’ కథా సంపుటి ఆవిష్కరణ
అద్దంకి రూరల్: వడలి రాధాకృష్ణ (చీరాల) రచించిన కథా సంపుటి ‘గ్రీన్ లైట్ ఏరియా’ ఆవిష్కరణ ఆదివారం రాత్రి స్థానిక కమఠేశ్వరస్వామి ఆలయంలో సృజన, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. శతావధాని నారాయణం బాలసుబ్రహ్మణ్యం ఆవిష్కరించి తొలి ప్రతిని చెన్నుపాటి రామాంజనేయులుకు అందజేశారు. రోటరీ క్లబ్ అధ్యక్షుడు చప్పిడి వీరయ్య అధ్యక్షత వహించారు. కథా రచయిత్రి పాలపర్తి జ్యోతిష్మతి మాట్లాడుతూ రాధాకృష్ణ కథలు ప్రత్యేకమైన శైలిలో సమాజంలోని సమస్యల పరిష్కారం దిశగా సాగుతాయని తెలిపారు. అనంతరం ఇటీవల ఉగాది పురస్కారం పొందిన వడవల్లి రాధాకృష్ణ, ఎన్టీఆర్ జాతీయ కీర్తి పురస్కారాన్ని అందుకున్న నాగనేని రామకృష్ణ, ఎన్టీఆర్ పురస్కారాన్ని అందుకున్న మన్నం త్రిమూర్తులు, పెద్దినేని సురేంద్రబాబు, రక్తదాన ప్రోత్సాహకులు చుండూరి మురళీ సుధాకర్లను సృజన, రోటరీ క్లబ్ సభ్యులు దుశ్శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సృజన అధ్యక్షుడు గాడేపల్లి దివాకరదత్తు, వీరవల్లి రుద్రయ్య, కోట అంజమ్మ, కొల్లా భువనేశ్వరి, జ్యోతి చంద్రమౌళి, కృష్ణమోహన్, పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి, షేక్ మస్తాన్, రావూరి రంగయ్య, లెవీ ప్రసాద్ పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి ఈత పోటీలు ప్రారంభం
నరసరావుపేట ఈస్ట్: ఈత అత్యుత్తమ వ్యాయామమని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ ఆక్వాటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల స్విమ్మింగ్ పూల్లో 11వ సీనియర్ అంతర్ జిల్లాల స్విమింగ్ ఛాంపియన్షిప్– 2025 పోటీలను నిర్వహించారు. పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ అరవిందబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించేందుకు పలు ప్రణాళికలు రూపొందించిందని వివరించారు. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి 105 మంది క్రీడాకారులు పోటీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు కపలవాయి విజయకుమార్, ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ ఆక్వాటిక్ అసోసియేషన్ ఛైర్మన్ డాక్టర్ కె.రవికాంత్, అధ్యక్షుడు ఓబుల్రెడ్డి, కార్యదర్శి మోహనవెంకటరామ్, కోశాధికారి రమేష్, పల్నాడు జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి వై.వి.సుబ్బారెడ్డి, జాయింట్ సెక్రటరీ సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్యానికి సైక్లింగ్
నరసరావుపేట ఈస్ట్: ఆరోగ్యకర జీవనానికి సైక్లింగ్ ఉత్తమ వ్యాయామంగా దోహదపడుతుందని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి తెలిపారు. కేంద్ర యువజన సర్వీసులు, క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా ఆదివారం ఎర్త్ హీరో ఫౌండేషన్ భాగస్వామ్యంతో హ్యాండ్స్ ఆఫ్ కంపాషన్ స్వచ్ఛంద సేవా సంస్థ సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం నిర్వహించారు. సతైనపల్లిరోడ్డులోని డీఎస్ఏ స్టేడియంలో సైకిల్ ర్యాలీని ప్రారంభించిన డీఎస్ఓ నరసింహారెడ్డి మాట్లాడుతూ కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ ప్రపంచ సైకిల్ దినోత్సవంతో పాటు సండేస్ ఆన్ సైకిల్ నిర్వహించాలని ఆదేశించినట్టు వివరించా రు. శరీరానికి వ్యాయామాన్ని అందించే సైక్లింగ్ను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని సూ చించారు. హ్యాండ్స్ ఆఫ్ కంపాషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టి.ఆనంద్ బెంజిమెన్ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పర్యావరణ రక్షణ, ఆరోగ్యవంతమైన జీవనశైలిని పౌరులకు పరిచయం చేసేందుకే సండేస్ ఆన్ సైకిల్ నిర్వహిస్తున్నట్టు వివరించారు. కార్యక్రమంలో స్టేడియం కోచ్లు చావా శ్రీనివాసరావు, మద్దాలి సైదారావు, ఖేలో ఇండియా పీఈ టీ ఇజ్రాయిల్ ప్రసాద్, విద్యార్థులు పాల్గొన్నారు. డీఎస్ఓ నరసింహారెడ్డి -
కూటమి ప్రభుత్వంలో చేనేత వ్యవస్థ నిర్వీర్యం
చీరాల: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేనేత వ్యవస్థ నిర్వీర్యమైందని దేవాంగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీరక సురేంద్ర ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. చేనేత సహకార సంఘాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వ్యవస్థ నిర్వీర్యమైందని, ప్రభుత్వం వెంటనే ఎన్నికలు, పాలక మండలి నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నేతన్న నేస్తం ద్వారా మగ్గం ఉన్న వారికి ఏడాదికి రూ.24 వేలు ఇచ్చి ఆదుకున్నారని గుర్తు చేశారు. ఈ పథకాన్ని కూడా కూటమి ప్రభుత్వం అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. 200 యూనిట్లు విద్యుత్ జీఓకే పరిమితం అయిందని, వెంటనే అమలు పరచాలని ఆయన కోరారు. ఆప్కోకు చైర్మన్ను నామినేట్ చేసి ఇప్పటి వరకు జీఓ ఇవ్వకపోవడం దారుణమని తెలిపారు. చేనేత వర్గం మద్దతుతో గెలిచిన నారా లోకేష్ దీనిపై స్పందించాలని కోరారు. ఎన్నికల్లో జీఎస్టీ గురించి హామీ ఇచ్చిన ఆయన ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని తెలిపారు. చేనేతలు అభివృద్ధితో పాటు ఆకలి చావులు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. అభివృద్ధి పేరిట కొంగ జపం చేస్తున్న కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమం పట్టించుకోకపోవడంతో ప్రజల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో చేనేతలకు అందిన లబ్ధి శూన్యమని పేర్కొన్నారు.దేవాంగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీరక సురేంద్ర -
క్రీడాకారులను తీర్చిదిద్దడం గొప్ప విషయం
చినగంజాం: క్రీడాకారులను ప్రతిభావంతులుగా తీర్చి దిద్దడం గొప్ప విషయం అని హైదరాబాద్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అన్ను వేణుగోపాల్ అన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక ఎంఎస్ఆర్ జూనియర్ కాలేజీ ఆవరణలో 40 రోజులుగా నిర్వహిస్తున్న వేసవి కబడ్డీ శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వేసవి శిక్షణ శిబిరానికి శిక్షకుడుగా అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారులు గిరిబాబు వ్యవహరించి ప్రతి రోజూ శిక్షణ అందించారని, అనేక మంది యువ క్రీడాకారులు ప్రేరణ పొందారన్నారు. ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కుర్రా భాస్కరరావు మాట్లాడుతూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 20 నుంచి జూన్ 1వ తేదీ వరకు గ్రామీణ యువతకు కబడ్డీపై శిక్షణ ఇచ్చే కార్యక్రమం నిర్వహించామని.. శిబిరం విజయవంతంగా ముగిసిందన్నారు. కోచ్ గిరిబాబు మాట్లాడుతూ శిబిరంలో మొత్తం 150 మంది బాలలకు శిక్షణ ఇచ్చామని, శిక్షణ శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు డాక్టర్ నల్లూరి సుబ్బారావు రూ.లక్ష విరాళంగా అందజేశారని తెలిపారు. దీంతో క్రీడాకారులకు పౌష్టికాహారం, కబడ్డీ కిట్లు అందజేశామన్నారు. శిబిరంలో సీనియర్ క్రీడాకారులు బి.నాగాంజనేయులు, వెంకటేశ్, కె.సతీష్రెడ్డి, బి.శివారెడ్డి, డి.సుబ్బారెడ్డి, వి. వెంకటేశ్, జీటీ అంకిరెడ్డి, ఎం.భాను ప్రకాష్రెడ్డి తదిరులు పాల్గొనగా వారి సలహాలు సూచనల మేరకు శిక్షణ పూర్తి చేసినట్లు తెలిపారు. ముగింపు కార్యక్రమానికి క్రీడాకారులకు భోజన వసతి కల్పించేందుకు అన్ను వేణుగోపాల్ రూ.40 వేలు ఆర్థిక సాయమందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మచిలీ పట్నం జిల్లా అదనపు పోలీస్ అధికారి సత్యం, ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ దాత డాక్టర్ నల్లూరి సుబ్బారావు, అసోసియేషన్ చైర్మన్ చంద్రమోహనరెడ్డి, అసోసియేషన్ కార్యదర్శి వై.పూర్ణచంద్రరావు, డి.రమేష్, డాక్టర్ రవిప్రకాష్ రెడ్డి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సిరిగిరి రంగారావు తదితరులు పాల్గొన్నారు. -
‘వెన్నుపోటు దినం’ విజయవంతం చేయాలి
చీరాల అర్బన్: కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పరచకుండా అన్యాయం చేస్తోందని వైఎస్సార్సీపీ చీరాల నియోజకవర్గ ఇన్చార్జి కరణం వెంకటేష్ అన్నారు. శుక్రవారం రామకృష్ణాపురంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున హాజరయ్యారు. కరణం వెంకటేష్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అవుతోందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వైఎస్సార్సీపీ నాయకులను టార్గెట్గా పెట్టుకుని అక్రమ కేసులు, అరెస్ట్లతో కాలం వెళ్లదీస్తోందన్నారు. నాయకులను, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తూ సాగిస్తున్న అరాచక పాలనపై వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు జూన్ 4న రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలన్నారు. కార్యకర్తలకు ఎప్పుడూ తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అన్ని వర్గాలకు అన్యాయమే పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనను ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చమని అడిగితే దాటవేత ధోరణితో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయమే జరుగుతోందన్నారు. నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులకు న్యాయం జరగడం లేదని తెలిపారు. కౌలు రైతులు, పొగాకు రైతులు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఏడాది కాలంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి శూన్యమని, ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను సుపరిపాలన అందించాలన్నారు. ఆరాచక పాలనపై వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందన్నారు. వెన్నుపోటు దినం నిరసన ర్యాలీని అందరూ విజయవంతం చేయాలన్నారు. పార్టీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కర్నేటి వెంకటప్రసాద్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వాసిమళ్ళ వాసు, మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు బత్తుల అనిల్, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి షేక్ కబీర్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు గవిని శ్రీనివాసరావు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బొనిగల జైసన్బాబు, పట్టణ అధ్యక్షుడు యాతం మేరిబాబు, మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ చీరాల నియోజకవర్గ ఇన్చార్జి కరణం వెంకటేష్ -
ప్రకృతి వనరులను కాపాడుకోవాలి
గుంటూరు వెస్ట్: ప్రకృతి పంచిన అరుదైన వనరులను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో నిర్వహించిన చిత్తడి నేలల పరిరక్షణ కమిటీ సమావేశంలో ఇన్చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ వన్యప్రాణి చట్టం 1972 ప్రకారం జిల్లాలోని ఉప్పలపాడు పక్షుల కేంద్రాన్ని కన్జర్వేటివ్ రిజర్వ్గానూ, మేడికొండూరు మండలం, సిరిపురం గ్రామంలోని మంచినీటి చెరువును చిత్తడి నేలగానూ మార్గదర్శకాల ప్రకారం ప్రతిపాదనలు పంపామన్నారు. వీటిని గ్రామ సభల ద్వారానూ సంబంధిత శాఖాధికారుల ద్వారా ఆమోదం లభించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపాల్సి ఉందని తెలిపారు. సమావేశంలో డీపీఓ సాయి కుమార్, పశుసంవర్ధక శాఖ జేడీఏ సత్యనారాయణ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈఈ నజీమా బేగం, అధికారులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ -
ప్రధానోపాధ్యాయులకు ఉద్యోగోన్నతి ధ్రువపత్రాలు అందజేత
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని జెడ్పీ, మున్సిపల్, నగరపాలకసంస్థ పాఠశాలల్లో ఉద్యోగోన్నతులపై నియమితులైన ప్రధానోపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక ధ్రువపత్రాలు అందజేశారు. శుక్రవారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ నుంచి జనరేట్ అయిన ఉద్యోగోన్నతుల ధ్రువపత్రాలను హెచ్ఎంలకు అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ హెచ్ఎం ఏ.తిరుమలేష్, హెచ్ఎంగా ఉద్యోగోన్నతి పొందిన షేక్ మొహ్మద్ ఖాసిం పాల్గొన్నారు. -
ప్రతి మహిళ లక్షాధికారి కావాలి
డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసరావుకర్లపాలెం: డ్వాక్రా స్వయం సహాయక సంఘాలలోని ప్రతి మహిళ లక్షాధికారి కావాలని డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసరావు అన్నారు. మండల సమాఖ్య కార్యాలయంలో శుక్రవారం మండల సమాఖ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన పీడీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి మహిళను లక్షాధికారిని చేసేందుకు ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేస్తుందని చెప్పారు. మహిళలను వ్యాపార, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు వారికి కావాల్సిన రుణాలు మంజూరు చేసేందుకు సూక్ష్మరుణ ప్రణాళికలను తయారు చేసినట్లు చెప్పారు. మహిళలు వ్యాపారం, వ్యవసాయం, సేవా రంగాలతో పాటు కుటుంబ అవసరాలకు వారు కోరినంత రుణాలను బ్యాంకుల ద్వారా శ్రీ నిధి ఉన్నతి, సీఐఎఫ్ల ద్వారానే కాక ఇతర ప్రభుత్వ శాఖల నుంచి సబ్సిడీ రుణాలను మంజూరు చేస్తారని చెప్పారు. మహిళలు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించి సిబిల్ స్కోర్ పెంచుకునే విధంగా కృషి చేయాలన్నారు. సిబిల్ స్కోర్ సక్రమంగా ఉంటే గ్రూపు రుణాలతోపాటు ఉమెన్ లెడ్ ఎంటర్ ప్రైజస్ కింద కోరినంత రుణాలివ్వటానికి బ్యాంకర్లు అనుకూలంగా ఉన్నారని పీడీ చెప్పారు. ఏపీఎం శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ మహిళలకు ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకంలో తమ ఇళ్లపై సోలార్ ప్యానల్ ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం రూ.2.10లక్షల రుణం మంజూరు చేస్తుందని దీనిలో రూ.78వేలు సబ్సిడీ పోగా రూ.1.32లక్షలు ఐదు సంవత్సరాలపాటు వాయిదాల పద్ధతిలో చెల్లించవచ్చని తెలిపారు. సోలార్ ప్యానల్ ఏర్పాటు చేసుకోవటం వలన గృహ విద్యుత్ వినియోగంలో తక్కువ బిల్లు వస్తుందని మన దగ్గర ఉత్పత్తి అయ్యే విద్యుత్ను ప్రభుత్వానికి విక్రయించటం ద్వారా అదనపు ఆదాయం వస్తుందని తెలిపారు. సమావేశంలో మండల సమైఖ్య అధ్యక్షురాలు ధనలక్ష్మి, సమైఖ్య ప్రతినిధులు నసీమా, శివలీలా, ఎంపీడీవో అద్దూరి శ్రీనివాసరావు, ఇండియన్ బ్యాంక్ డీజీఎం గౌరీశంకర్, బ్యాంకు మేనేజర్లు, యూనియన్ బ్యాంక్ మానస, ఇండియన్ బ్యాంక్ మేనేజర్ రత్నజ్యోతి, సీసీలు శివప్రభ, రాఘవ, డ్వాక్రా సమైఖ్య సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
తల్లిదండ్రుల చేతుల్లోనే పిల్లల ఆరోగ్యం
గుంటూరు వెస్ట్ (క్రీడలు): పిల్లలు శారీరకంగా, ఽమానసికంగా ధృఢంగా ఉండాలంటే క్రీడా సాధన ఎంతో కీలకమని ఏసీబీ డైరెక్టర్ ఆర్.జయలక్ష్మి తెలిపారు. ఇది పూర్తిగా తల్లిదండ్రుల చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక బీఆర్ స్టేడియం సింథటిక్ కోర్టులో అండర్–16 ఓపెన్ బాలబాలికల టెన్నిస్ పోటీలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జయలక్ష్మి మాట్లాడుతూ కొందరు తల్లిదండ్రులు చదువులకిచ్చే ప్రాధాన్యత పిల్లల ఆరోగ్యానికి ఇవ్వడం లేదన్నారు. దీంతో పిల్లల్లో అధిక శాతం ఊబకాయ సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. జంక్ ఫుడ్తోపాటు మొబైల్స్, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వీలైనంత వరకు వారికి దూరంగా ఉంచాలని సూచించారు. టెన్నిస్ విలువ తెలిసిన సీనియర్ ఆటగాడు ఎస్.రామకృష్ణ ఈ టోర్నమెంట్ను స్పాన్సర్ చేయడం అభినందనీయం అన్నారు. పోటీల నిర్వాహకుడు షేక్ అహ్మద్ మాట్లాడుతూ పోటీలు మూడు రోజులపాటు జరుగుతాయన్నారు. మొత్తం 36 మంది చిన్నారులు పాల్గొంటున్నట్లు తెలిపారు. అనంతరం పోటీలను జయలక్ష్మి,, రామకృష్ణ ప్రారంభించారు. కార్యక్రమంలో చీఫ్ కన్సర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ బీఎన్ఎన్ మూర్తి, రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ పి.శామ్యూల్ జొనాథన్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి, ఎన్.సాంబశివరావు, జీవీఎస్ ప్రసాద్ పాల్గొన్నారు.జీజీహెచ్లో అరుదైన శస్త్రచికిత్సగుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో అరుదైన శస్త్రచికిత్స చేసి వృద్ధుడి ప్రాణాలు కాపాడినట్లు జనరల్ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ ఏకుల కిరణ్కుమార్ చెప్పారు. శుక్రవారం జీజీహెచ్ జనరల్ సర్జరీ విభాగంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం మాదారం గ్రామానికి చెందిన పాలిపోగు ప్రసాద్ (62) రెండు నెలలుగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. తీవ్రమైన కడుపునొప్పి, కామెర్లు, చలిజ్వరం రావడంతో ఒంగోలులో 25 రోజులు చికిత్స తర్వాత గుంటూరు జీజీహెచ్కు వచ్చాడు. హైడాటిడ్ సిస్ట్ వ్యాధి (కాలేయంలో నీటిబుడ్డ)తో బాధపడుతున్నట్లు నిర్ధారించామన్నారు. కుక్కల వల్ల, కలుషిత నీటిని తాగడం వల్ల వ్యాధి వస్తుందన్నారు. కొన్నిసార్లు మాంసం పూర్తిగా ఉడకకుండా తినడం వల్ల కూడా వస్తుందని చెప్పారు. ప్రసాద్ కాలేయం, ఇతర అవయవాలకు ఇబ్బంది ఉండటంతో సర్జరీ చేశామని, దీనికి నాలుగు గంటల సమయం పట్టిందన్నారు. సుమారు 40 రోజులపాటు వార్డులో చికిత్స అందించి డిశ్చార్జి చేశామన్నారు. సుమారు రూ.10 లక్షల ఖరీదైన ఆపరేషన్ను ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా ఉచితంగా చేశామని తెలిపారు. ఆపరేషన్ ప్రక్రియలో వైద్యులు నాగ సంతోష్కుమార్, సాదిక్ బాషా, వేణుగోపాల్, మేఘన, అవిన్, హరి, పోలయ్య, శ్యాంసన్, శ్వేత, ప్రసాద్, హనుమంతరావు, నర్సింగ్ సిబ్బంది రాజ్యలక్ష్మి, స్రవంతి, అనిత, ఉష, నంద పాల్గొన్నట్లు వెల్లడించారు. వృద్ధుడి ప్రాణాలు కాపాడిన వైద్య బృందాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వీ రమణ అభినందించారు.పోలీసులపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్తెనాలి రూరల్: లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నిరాటంకంగా అమలు చేస్తూ దళిత, మైనార్టీ యువకులపై విచక్షణారహితంగా దాడి చేసిన సీఐలు, ఇతర పోలీసు సిబ్బందిపై క్రిమినల్ కేసులు పెట్టాలని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కె.కృష్ణ, షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి అందే శ్యాం డిమాండ్ చేశారు. తెనాలి ఐతానగర్లో బాధిత కుటుంబాలను పరామర్శించిన అనంతరం వారు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. -
ఎన్కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలే
సజ్జా వెంకట నాగేశ్వరరావు సంస్మరణ సభలో ప్రజా సంఘాల ఆరోపణ చీరాల రూరల్: అటవీ సంపదను విదేశీ కంపెనీలకు దోచిపెట్టడం కోసం దేశ పౌరులను కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా హత్యలు చేయిస్తోందని అమరుల బంధుమిత్రుల సంఘం, ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు. అందులో భాగంగానే సజ్జా వెంకట నాగేశ్వరరావు హత్యకు గురయ్యారని పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని జాండ్రపేట చౌడేశ్వరి దేవాంగ కల్యాణ మండపం ప్రాంగణంలో కుటుంబ సభ్యులు, అమరుల బంధుమిత్రుల సంఘం ఆధ్వర్యంలో సజ్జా వెంకట నాగేశ్వరరావు సంస్మరణ సభను అంజమ్మ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు సోదరుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. నాగేశ్వరరావు విద్యాభ్యాసం చేసే రోజుల్లోనే రాడికల్ ఉద్యమానికి ఆకర్షితుడై ప్రజల కోసం ఉద్యమ బాట పట్టినట్లు చెప్పారు. తన ఊపిరి ఉన్నంత వరకు ప్రజలకు కోసం పోరాడి ప్రాణత్యాగం చేసినట్లు పేర్కొన్నారు. పౌర హక్కుల సంఘం నాయకుడు చిలకా చంద్రశేఖర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఒకపక్క ఇతర దేశాలతో శాంతి చర్చలు జరుపుతూ మరోపక్క మన దేశంలోని పౌరులను ఎటువంటి చర్చలు జరపకుండా ఆపరేషన్ కగార్ పేరుతో నరహత్య చేస్తోందని మండిపడ్డారు. కగార్ పేరుతో అనేకమందిని పొట్టనపెట్టుకున్న కేంద్రం 1,27,000 చెట్లను నరికివేసేందుకు పర్యావరణ అనుమతులు పొందడం అందులో భాగమేనని ఆయన ఆరోపించారు. హైకోర్టు న్యాయవాది యూడీ భీమ్రావ్ మాట్లాడుతూ ఎదురు కాల్పుల పేరుతో చంపిన దేశ పౌరుల మృత దేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలని అత్యున్నత న్యాయస్థానాలను ఆశ్రయించామన్నారు. కనీసం కుటుంబ మృతదేహాలను చూపకుండా కేంద్రం నిరంకుశత్వంగా వ్యవహరిస్తూ కోర్టు ధిక్కారానికి కూడా పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చీరాల సాధన సమితి నాయకుడు శీలం రవికుమార్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై గొంతెత్తి ప్రశ్నించినవారు అర్బన్ నక్సలైట్, మావోయిస్టులయితే తాము కూడా అలాంటి వారిమేనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర చేనేత జన సమాఖ్య నాయకుడు దేవన వీర నాగేశ్వరరావు, బీసీ ఫెడరేషన్ నాయకుడు ఊటుకూరి వెంకటేశ్వర్లు, సీపీఎం న్యూడెమోక్రసీ మేకల ప్రసాద్, దేశభక్తి ప్రజాతంత్ర ఉద్యమం నాయకుడు వై. వెంకటేశ్వర్లు, నిర్బంధ వ్యతిరేక పోరాట కమిటీ రవిచంద్ర, భారత్ బచావో నవజ్యోతి, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందుగా ర్యాలీ నిర్వహించారు. -
పొగాకు.. ఆరోగ్యానికి చేటు
● నేడు నో టుబాకో డే ● బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం ● పొగాకు వినియోగంతో అనేక నష్టాలు గుంటూరు మెడికల్: యవ్వనంలో సరదా కోసం మొదలుపెట్టే ధూమపానం చివరకు ప్రాణాలనే హరిస్తుంది. సిగరెట్, బీడీ, చుట్ట తాగే అలవాటు వ్యసనంలా మారి మనిషిని బానిసను చేసుకుంటుంది. స్మోకింగ్, పొగాకు ఉత్పత్తుల మోజులో పడి యువత భవిష్యత్తును అంధకారం చేసుకుంటోంది. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులలో 40 శాతం మంది పొగతాగటం, పొగాకు ఉత్పత్తులు వాడటం ద్వారానే వ్యాధి బారిన పడి మరణిస్తున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ధూమపానంతో కలిగే అనర్థాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని ప్రపంచ వ్యాప్తంగా మే 31వ తేదీన నో టుబాకో డేను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా‘ సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది. జిల్లాలో బాధితులు అధికమే... జిల్లా వైద్య ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం 35 శాతం మంది యువత ధూమపానం చేస్తున్నారు. వివిధ రోగాలతో 30 – 39 ఏళ్ల వయస్సు వారిలో చనిపోతున్న ప్రతి ఐదుగిరిలో ఒకరు పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్లేనని తేలింది. గుంటూరు జీజీహెచ్లో ప్రతి నెలా 1,200 మంది పురుషులు, 2 వేల మంది మహిళలు వివిధ రకాల క్యాన్సర్లతో చికిత్స పొందుతున్నారు. వీరిలో 40 శాతం మంది కేవలం పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల క్యాన్సర్ బారిన పడ్డారు. జిల్లాలో క్యాన్సర్ రోగులకు వైద్యసేవలు అందించేందుకు 15 ఆస్పత్రులు, క్లీనిక్లు ఉన్నాయి. వీటిల్లో రోజూ 400 మంది వరకు క్యాన్సర్ చికిత్స పొందుతున్నారు. చట్టం ఏం చెబుతోందంటే.. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధిస్తూ ప్రభుత్వం చట్టం చేసింది. ఈ చట్ట ప్రకారం రైల్వే స్టేషన్లు, సినిమా హాల్స్, బస్ స్టేషన్లు, జనసంచారం ఉండే మార్కెట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రాంతాల్లో ధూమపానం చేయకూడదు. ముఖ్యంగా పాఠశాలలు, గుడులకు సమీపంలో పొగాకు ఉత్పత్తులు అమ్మటం చట్టరీత్యా నేరం. 18 ఏళ్లలోపు పిల్లలకు పొగాకు ఉత్పత్తులు చట్టరీత్యా విక్రయించకూడదు. చట్టాన్ని అతిక్రమించిన వారికి జరిమానా విధిస్తారు. ప్రత్యేకంగా స్మోకింగ్ జోన్ ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో మాత్రమే ధూమపానం చేసేందుకు అనుమతించాలి. పొగాకు వినియోగంతో క్యాన్సర్ క్యాన్సర్ చికిత్స కోసం వచ్చే వారిలో 40 శాతం మంది పొగాకు, దాని ఉత్పత్తుల వాడకం వల్ల క్యాన్సర్కు గురవుతున్నవారే. పొగతాగటం, పొగాకు ఉత్పత్తులైన ఖైనీ, గుట్కా, పాన్పరాగ్ వంటి వాటిని వినియోగించటం వల్ల నోరు, గొంతు, అన్నవాహిక, ఊపిరితిత్తులు, జీర్ణాశయం, మూత్రాశయ క్యాన్సర్ల బారిన పడుతున్నారు. ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు నేడు ఆధునిక వైద్య పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. చికిత్స తీసుకుని త్వరితగతిన వ్యాధి నుంచి కోలుకోవచ్చు. – డాక్టర్ ఎం.జి.నాగకిషోర్, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్, గుంటూరు ధూమపానంతో గుండెజబ్బులు పొగతాగే వారిలో రక్తపోటు, గుండెపోటు, పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పొగాకులో 400 రకాల విషపదార్థాలు ఉంటాయి. కార్బన్ మోనాకై ్సడ్ వల్ల గుండెపోటు, టార్ వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది. నపుంసకత్వం, పక్షవాతం పొగరాయుళ్లను వదలవు. పొగతాగే వారికి చుట్టుపక్కల ఉన్నవారిపై కూడా పొగాకు ప్రభావం ఉంటుంది. గుండె జబ్బులతో బాధపడుతూ వైద్యం కోసం వచ్చే వారిలో 70 శాతం మంది ధూమపానం చేసేవారే. – డాక్టర్ బొర్రా విజయ్చైతన్య, ఇంట్రవెన్షనల్ కార్డియాలజిస్ట్, గుంటూరు జీజీహెచ్ జీజీహెచ్లో ఉచిత కౌన్సెలింగ్ గుంటూరు జీజీహెచ్ మానసిక వ్యాధుల వైద్య విభాగంలో పొగాకు ఉత్పత్తుల అలవాటు మానేయాలనుకునే వారికి ఉచితంగా కౌన్సెలింగ్ చేసి, ఔషధాలు ఇస్తున్నారు. 2019 నుంచి డీ అడిక్షన్ సెంటర్లో చికిత్స అందిస్తున్నారు. గత ఏడాది 1,263 మందికి చికిత్స అందించడం ద్వారా కొంత మంది స్మోకింగ్ అలవాటు మానేశారు. స్మోకింగ్ అలవాటు ఉన్నవారికి ఛాతీ ముందు భాగంలో, భుజానికి, తొడకు.. ఇలా ఏదైనా ఒక ప్రదేశంలో వెంట్రుకలు లేని చోట నికోటిన్ ట్రాన్స్థర్మల్ ప్యాచ్ను అంటిస్తారు. ఈ ప్యాచ్ అంటించి కౌన్సెలింగ్ చేయడం ద్వారా ప్రతి నెలా పది మందికి పైగా పొగాకు వినియోగాన్ని పూర్తిగా మానివేస్తున్నట్లు గుర్తించామని సెంటర్ ఇన్చార్జి డాక్టర్ వడ్డాది వెంకట కిరణ్ తెలిపారు. -
వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చందన్ నాగ్
రేపల్లె: వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాపట్ల జిల్లా వేమూరుకు చెందిన మేరుగ చందన్ నాగ్ నియమితులయ్యారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఈ ఉత్తర్వులను విడుదల చేసింది. వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున తనయుడు చందన్ నాగ్ ఇప్పటివరకు వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా యువజన విభాగం అధ్యక్షులుగా ఉన్నారు. రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులుగా నియమితులు కావడంతో పలువురు నాయకులు అభినందనలు తెలిపారు. రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీలలో చోటు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియమించిన పార్టీ అనుబంధ విభాగ కమిటీలలో బాపట్ల జిల్లాకు చెందిన పలువురు నేతలకు చోటు లభించింది. రాష్ట్ర యువజన విభాగ జనరల్ సెక్రటరీగా బాపట్లకు చెందిన నక్క వీరారెడ్డి, రాష్ట్ర యువజన విభాగ సెక్రటరీగా బాపట్లకు చెందిన దొంతిబోయిన జయ భరత్ రెడ్డి, రాష్ట్ర యువజన విభాగ అధికార ప్రతినిధిగా రేపల్లెకు చెందిన నీలం వీరేంద్రనాథ్ , రాష్ట్ర యువజన విభాగ జాయింట్ సెక్రటరీలుగా అద్దంకికి చెందిన సి.రాజ్ కుమార్, వేమూరుకు చెందిన జల్లి జోషికాంత్, పరుచూరికి చెందిన ఉప్పలపాటి అనిల్ చౌదరి, రాష్ట్ర వలంటీర్స్ వింగ్ సెక్రటరీగా అద్దంకికి చెందిన కొల్లి వెంకటరావు, రాష్ట్ర వాణిజ్య విభాగ జాయింట్ సెక్రటరీగా వేమూరుకు చెందిన మద్దుల గిరిధర్లను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులను జారీ చేసింది. -
జవహర్ నవోదయ కోసం స్థల పరిశీలన
బల్లికురవ: కేంద్ర ప్రభుత్వం అద్దంకి నియోజకవర్గానికి జవహర్ నవోదయ విద్యాలయాన్ని మంజూరు చేసింది. విద్యాలయం ఏర్పాటుకు సంబంధించి రెవెన్యూ అధికారులు శుక్రవారం అద్దంకి, బల్లికురవ, సంతమాగులూరు మండలాల్లో ప్రభుత్వ భూమిని పరిశీలించారు. విద్యాలయం ఏర్పాటుకు సంబంధించి 25 ఎకరాల భూమి కావాల్సి ఉంది. బల్లికురవ తహసీల్దార్ రవినాయక్ వల్లాపల్లి గ్రామంలోని పేరంటాళ్ల తల్లి ఆలయం సమీపంలో, గుంటుపల్లి గ్రామంలోని సచివాలయం సమీపవంలో భూములను పరిశీలించారు. జిల్లా అధికారులకు నివేదించన్నుట్లు తహసీల్దార్ వివరించారు.కోన నీరజకు టైమ్స్ పవర్ ఉమెన్ అవార్డుబాపట్ల: సినీ ఇండస్ట్రీలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్గా, దర్శకురాలుగా పనిచేస్తున్న మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కుమార్తె కోన నీరజకి ది టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రతిష్టాత్మకమైన టైమ్స్ పవర్ ఉమెన్ అవార్డు దక్కింది. ఈమేరకు గురువారం హైదరాబాదులో జరిగిన బహుమతుల ప్రదానోత్సవంలో ఈ అవార్డును ఆమె అందుకున్నారు. సినీ ఇండస్ట్రీలో వెలుగొందడంతో పాటు పుస్తక రచయితగా, దర్శకురాలుగా ఆమె శక్తివంతమైన మహిళగా రూపుదిద్దుకుంటున్నారని ది టైమ్స్ ఆఫ్ ఇండియా సంస్థ కొనియాడింది. ఈ సందర్భంగా కోన రఘుపతి తన కుమార్తె కోన నీరజకు శుభాకాంక్షలు తెలియజేశారు. నీరజ అవార్డు అందుకోవడం బాపట్ల ప్రాంతానికి ఎంతో గర్వకారణమన్నారు.నేటి నుంచి రైల్వే గేటు మూసివేతఫిరంగిపురం: ఫిరంగిపురం నుంచి సత్తెనపల్లి వెళ్లే మార్గంలోని అల్లంవారిపాలెం వద్ద ఉన్న రైల్వేగేటు ఎల్సీ 298కి శనివారం నుంచి అత్యవసర మరమ్మతులు నిర్వహించనున్నట్లు రైల్వే శాఖ నల్లపాడు సీనియర్ సెక్షన్ ఇంజినీర్ పి. ఉమామహేశ్వరరావు శుక్రవారం ఒక ప్రటనలో పేర్కొన్నారు. మరమ్మతు పనుల్లో భాగంగా శనివారం నుంచి జూన్ మూడో తేదీ వరకు గేటు మూసివేస్తామన్నారు. ప్రత్యామ్నాయంగా ఆరోగ్యనగర్ వద్ద ఉన్న అండర్ పాస్ను వాహనదారులు వినియోగించుకోవాలని సూచించారు.రైల్వే గడ్డర్ను ఢీకొన్న భారీ వాహనంతాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం రైల్వే ట్రాక్ వద్ద ఏర్పాటుచేసిన రైల్వే గడ్డర్ను ఓ భారీ వాహనం ఢీకొట్టిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం రైల్వేట్రాక్ అండర్పాస్ వద్ద భారీ వాహనాల రాకపోకల నిషేధానికి ఏర్పాటు చేసిన రైల్వే గడ్డర్ను చూసుకోకుండా వాహన డ్రైవర్ ఢీకొట్టాడు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఈ రైల్వే గడ్డర్ను తరచూ భారీ వాహనాలు ఢీకొంటున్నాయని, ఆ గడ్డర్ వద్ద సరైన సూచిక బోర్డులు లేకపోవడం వల్ల వాహనాల డ్రైవర్లకు అంచనా లేకపోవడంతో ఇటువంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని స్ధానికులు చెబుతున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేలా రైల్వే అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు, వాహన దారులు కోరుతున్నారు.యోగాతో సంపూర్ణ ఆరోగ్యంవీసీ ఆచార్య కె గంగాధరరావుఏఎన్యూ: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని వీసీ ఆచార్య కె గంగాధరరావు అన్నారు. యోగాంధ్రలో భాగంగా శుక్రవారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అధికారులు, సిబ్బంది, పరిశోధకులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం యూనివర్సిటీ యోగా సెంటర్లో యోగా సాధన చేశారు. వీసీ ఆచార్య కె గంగాధరరావు యోగా ఆవశ్యకతను తెలియజేశారు. ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. యోగా ఆవశ్యకతను మనం గుర్తించడంతోపాటు, సమాజానికి అవగాహన కల్పించాలని సూచించారు. రిజిస్ట్రార్ ఆచార్య జి సింహాచలం, ప్రిన్సిపాల్స్ ఆచార్య పీపీఎస్ పాల్ కుమార్, ఆచార్య పి సిద్దయ్య, దూరవిద్యా కేంద్రం డైరెక్టర్ ఆచార్య వి వెంకటేశ్వర్లు, డిగ్రీ పరీక్షల కోఆర్డినేటర్ ఆచార్య ఎన్వీ కృష్ణారావు, బాలుర వసతి గృహాల చీఫ్ వార్డెన్ ఆచార్య కె మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. -
సేవల్లో ‘ఫ్లోరెన్స్ నైటింగేల్’
తెనాలి: పవిత్రమైన వైద్యవృత్తిలో నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తే వృత్తిజీవితంలో సంతృప్తినే కాదు... ఏకంగా రాష్ట్ర, జాతీయ అవార్డులు కూడా వరిస్తాయి. దేశ రాజధాని ఢిల్లీలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా శుక్రవారం జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డును స్వీకరించిన వలివేటి శుభావతి ఇందుకు చక్కని నిదర్శనం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్నుంచి ఈ అవార్డును అందుకున్న ఏకై క మహిళ కూడా శుభావతినే. ఏఎన్ఎం విధుల్లో వైద్యవృత్తి ప్రాధాన్యతను గుర్తెరిగి, అంకితభావంతో నిర్వహిస్తూనే ఉన్నత కోర్సులు చేస్తూ, వరుస పదోన్నతులతో మేనేజ్మెంట్ ఇన్స్ట్రక్టర్ హోదాకు ఎదిగారు. ఇప్పుడు ఏకంగా జాతీయ అవార్డునే దక్కించుకున్నారు. సంగం జాగర్లమూడి స్వస్థలం తెనాలి రూరల్ మండల గ్రామం సంగంజాగర్లమూడి వలివేటి శుభావతి స్వస్థలం. తల్లిదండ్రులు సీతారావమ్మ, సుబ్రహ్మణ్యం. వైద్యరంగంలో తొలిగా ఉమ్మడి గుంటూరు జిల్లా నాదెండ్ల పీహెచ్సీ పరిధిలోని చందవరం సబ్సెంటర్లో ఏఎన్ఎంగా శుభావతి వృత్తిజీవితం ఆరంభమైంది. ఉద్యోగ బాధ్యతల్లో ఉంటూనే పీజీ కోర్సులు చేస్తూ వచ్చారు. 13 ఏళ్ల సర్వీసులో మూడు పీజీలు చేశారు. ఫలితంగా పదోన్నతిపై ఇదే జిల్లాలోని నకిరేకల్లో హెల్త్ ఎడ్యుకేటర్గా నియమితులయ్యారు. అక్కడ 12 ఏళ్లపాటు పనిచేశారు. కర్నూలులోని రీజినల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ట్రైనింగ్ సెంటర్ (మేల్)కు మేనేజ్మెంట్ ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తూ గత జనవరిలో ఉద్యోగ విరమణ చేశారు. పేద రోగులకు సేవలు వైద్యరంగంలో తన 39 ఏళ్ల సర్వీసులో శుభావతి పేద ప్రజలు, అవసరమైన వారికి తగిన సేవలను అందిస్తూ వచ్చారు. తన సమర్థత, నిబద్ధతను గుర్తించిన ఉన్నతాధికారులు అప్పగించిన అన్ని బాధ్యతలను ఆమె సక్రమంగా నిర్వర్తించారు. అనేక అవార్డులను అందుకున్నారు. నకిరేకల్లో ఉండగా, హెచ్ఐవీ/ఎయిడ్స్ ప్రాజెక్టుపై శుభావతిని నాటి జిల్లా కలెక్టర్ ప్రత్యేక శిక్షణకని ఢిల్లీ పంపారు. అదే ప్రాజెక్టుపై జిల్లాలోని ఆర్ఎంపీ/పీఎంపీలతో సహా ప్రభుత్వ యంత్రాంగంలోని అన్ని డిపార్టుమెంటు ఉద్యోగులకు శుభావతి హెచ్ఐవీపై అవగాహన కల్పించారు. ఆ కృషికి గుర్తింపుగానే అప్పటి రాష్ట్రమంత్రి కొణిజేటి రోశయ్య నుంచి అవార్డును అందుకున్నానని శుభావతి చెప్పారు. ఎక్కడ పనిచేసినా నాతోటి సిబ్బంది, ప్రజలు ఎంతో ప్రేమను చూపటం నాకు గుర్తుండి పోతుందని అంటారు శుభావతి, ‘ఎంతో కష్టపడి పనిచేశాను. అందరి మన్ననలు పొందాను. డబ్బు కోసం ఆశపడలేదు. స్వచ్ఛందంగా బాధ్యతలను నిర్వర్తించాను. ఇప్పుడు జాతీయ అవార్డు లభించిందంటే నా వృత్తి జీవితం మొత్తానికి అందిన గౌరవంగా భావిస్తున్నాను అన్నారు శుభావతి. భారత రాష్ట్రపతి చేతులమీదుగా జాతీయస్థాయి ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు అందుకున్న వలివేటి శుభావతి ఉభయ తెలుగు రాష్ట్రాల్నుంచి అవార్డు దక్కించుకున్న ఏకై క మహిళగా గుర్తింపు ఎన్నో అవార్డులు.. రివార్డులు ఆకాశవాణి, విజయవాడ కేంద్రం ఆహ్వానంపై బాల్య వివాహాలు, మాతాశిశు మరణాలు, బాలికా శిశు సంరక్షణ వంటి కార్యక్రమాలపై ప్రత్యేక ప్రసంగాలు చేశారు. గుంటూరు జిల్లాలో బాల్య వివాహాల నిరోధంపై రిసోర్స్ పర్సన్గానూ వ్యవహరించారు. దీనిపై పలు పాటలు రాసి, స్వయంగా గానం చేశారు. అప్పట్లో నెల్లూరు జిల్లా కలెక్టర్లనుంచి అవార్డులను అందుకున్నారు. 2014 ఎన్నికల్లో నెల్లూరు జిల్లా కలెక్టర్ సూచనపై ఓటరు అవగాహనపై పాట రాశారు. చైన్నెలో సినీ సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్తో స్వరకల్పన చేయించారు. ఈ సందర్భంగా నాటి కలెక్టర్ రేఖారాణి ప్రశంసాపత్రం అందించారు. రక్తహీనతపై అవగాహన కోసం పాట రాశారు. శ్రీకాకుళంలో కోవిడ్ విపత్కర పరిస్థితుల్లోనూ నిర్వహించిన సేవలకు అవార్డులు దక్కాయి. గత ప్రభుత్వ హయాంలో శానిటేషన్, న్యూట్రిషన్పై శుభావతి రాసిన పాట పాపులరైంది. ప్రతి అర్బన్ హెల్త్ సెంటర్లోనూ ఏఎన్ఎంల పుస్తకంలో తొలి పేజీలోనే ఆ పాటను ముద్రింపజేశారు. ఏపీ కల్చరల్ అవేర్నెస్ రాష్ట్రస్థాయి ఉత్తమ పౌరురాలి అవార్డు, శ్రీకాకుళంలో ఆంధ్రరత్న అవార్డు వంటివెన్నో తనకు అలంకారాలుగా మారాయి. భర్త ప్రైవేటు ఉద్యోగి, ఏకై క కుమారుడు హైదరాబాద్లోని ప్రముఖ కార్పొరేట్ హాస్పటల్లో పని చేస్తున్నారు. రిటైరయ్యాక సొంత జిల్లా గుంటూరులోనే స్థిరపడ్డారు. -
బాలలకూ విచ్చలవిడిగా మద్యం సరఫరా
ఆదాయమే పరమావధి నరసరావుపేట టౌన్: ఉజ్వలంగా వెలగాల్సిన విద్యార్థుల జీవితాలు కూటమి ప్రభుత్వ ధనదాహం, అధికారుల మామూళ్ల మత్తులో చిత్తవుతున్నాయి. వైన్ షాపు నిర్వాహకులు కక్కుర్తితో టీనేజ్ కూడా దాటని పిల్లలతో బహిరంగంగా మద్యం తాగిస్తున్నారు. పర్మిట్ రూములకు అనుమతులు లేకపోయినా.. ఏకంగా కుర్చీలు, బల్లలు వేసి పిల్లలకు మద్యం సరఫరా చేస్తూ వారి జీవితాలను చీకట్లోకి నెట్టేస్తున్నారు. జీవితాలతో చెలగాటం.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం విధానాన్ని ప్రైవేటు వ్యక్తులు చేతుల్లోకి తీసుకెళ్లింది. వారికి టార్గెట్లు ఇచ్చి మరీ మద్యం అమ్మకాలకు తెరతీసింది. ఈ క్రమంలో వైన్స్ నిర్వాహకులు ఇష్టం వచ్చినట్లు మద్యం విక్రయాలు చేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. అనుమతులు లేకుండానే పర్మిట్ రూములు ఏర్పాటు చేస్తున్నారు. వేళాపాళా లేకుండా మద్యం విక్రయిస్తున్నారు. ఇవన్నీ తెలిసినా ఎక్సైజ్ శాఖ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు యథేచ్ఛగా పర్మిట్ రూముల ఏర్పాటు మైనర్లకు మద్యం సరఫరా చేస్తున్న వైనం మామూళ్ల మత్తులో ఎకై ్సజ్ అధికారులు కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం దుకాణాలను సర్కారే నిర్వహించేది. ఆ క్రమంలో ప్రజలను మద్యానికి దూరం చేసేందుకు ప్రయత్నించింది. తద్వారా యువత మద్యం జోలికి వెళ్లకుండా కట్టడి చేయగలిగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చివరకు మైనర్లకు కూడా మద్యం అందుబాటులోకి తీసుకొచ్చింది. నరసరావుపేట రావిపాడు రోడ్డులోని ఓ వైన్ షాపులో అనుమతులు లేకుండానే పర్మిట్ రూము ఏర్పాటు చేశారు. ఇక్కడ 18 ఏళ్లు కూడా నిండని బాలలు మద్యం తాగుతూ కనిపించారు. మైనర్లకు మద్యం విక్రయించరాదనే నిబంధనలను నిర్వాహకులు తుంగలో తొక్కారు. వీటిపై ఎకై ్సజ్ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
గాలిలో దీపంలా వ్యవసాయం
జె.పంగులూరు: దేశంలో రైతాంగ సంక్షోభానికి, వ్యవసాయ సంక్షోభానికి ప్రభుత్వ విధానాలేనని, ప్రభుత్వం వ్యవసాయాన్ని గాలిలో దీపంగా మార్చిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. శుక్రవారం మండలంలోని జనకవరం గ్రామంలో జరిగిన నల్లబర్లీ పొగాకు కౌలు రైతుల సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడారు. రైతాంగాన్ని ప్రోత్సహించిన ఐటీసీ, జీపీఐ కంపెనీలు నల్ల బర్లీ పొగాకును సాగు చేయించాయన్నారు. అయితే ప్రస్తుతం కంటికి కనిపించకుండా, కొనుగోలు చేయకుండా రైతులను మోసం చేస్తున్నాయన్నారు. రైతులది అత్యాశ అని వ్యవసాయ శాఖ మంత్రి అనడం సరైంది కాదన్నారు. మూడు నెలల కాలంలో షేర్ మార్కెట్లో ఐటీసీ, జీపీఐ షేర్లు నాలుగు శాతం పెరిగాయని, కానీ రైతుల ఆదాయం 40 శాతానికి పడిపోయిందన్నారు. మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తామని వ్యవసాయ శాఖమంత్రి చెప్పినా ఇంతవరకు కొన్న దిక్కులేదన్నారు. కౌలు రైతుల కోసం పనిచేస్తామని ప్రగల్భాలు పలికిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అడ్రస్ లేడన్నారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలు రైతులకు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి గంగయ్య, రైతు సంఘం బాపట్ల జిల్లా కార్యదర్శి తలపనేని రామారావు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాయిణి వినోద్బాబు, రైతు సంఘం సీనియర్ నాయకులు కందిమల్ల రామకోటేశ్వరరావు, రైతు పాల్గొన్నారు. శ్రీనాథ్ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి అప్పుల బాధ భరించలేక పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న నల్లబర్లీ పొగాకు కౌలు రైతు తల్లపనేని శ్రీనాఽథ్ కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని జనకవరం గ్రామానికి చెందిన నల్లబర్లీ పొగాకు కౌలు రైతు తలనేని శ్రీనాఽథ్ ఈ నెల 24వ తేదీని పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం పాఠక విధితమే. దీంతో మృతుని కుటుంబాన్ని శ్రీనివాసరావు శుక్రవారం పరామర్శించారు. ఆయన భార్య వందన, తల్లిదండ్రులు నరసమ్మ, హరిబాబుకు ధైర్యం చెప్పారు. కంపెనీల చేతుల్లో ప్రభుత్వం ప్రతి ఏటా కంపెనీల లాభాలు పెరుగుదల రైతుల ఆదాయం తగ్గుదల నల్ల బర్లీ పొగాకు కౌలు రైతులు సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు -
ఏడాదిగా ప్రజలకు వెన్నుపోటు
చీరాల అర్బన్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తికావస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏ వర్గానికి న్యాయం చేయలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి మేరుగ నాగార్జున అన్నారు. శుక్రవారం చీరాల రామకృష్ణాపురంలోని పార్టీ కార్యాలయంలో చీరాల ఇన్చార్జి కరణం వెంకటేష్ అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు. మేరుగ నాగార్జున మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అమలు కాని ఎన్నో హామీలను ప్రజలకు చెప్పి అధికారం చేపట్టిందన్నారు. సంవత్సర కాలం పూర్తవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. హామీలను అమలు చేయాలని ప్రశ్నిస్తే అక్రమ కేసులు, అరెస్ట్లతో రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వైఎస్సార్ సీపీ నేతలు, నాయకులపై కేసులు బనాయించి అరెస్ట్ల పర్వానికి తెర తీశారన్నారు. ప్రగల్భాలు చెప్పుకునేందుకే మహానాడు తెలుగుదేశం పార్టీ కడపలో నిర్వహించిన మహానాడు కార్యక్రమాన్ని చూస్తే ప్రగల్భాలు చెప్పుకునేందుకే నిర్వహించినట్లుగా ఉందన్నారు. ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకునేలా మహానాడు నిర్వహించారా అని ప్రశ్నించారు. సంవత్సర కాలంలో ప్రజలకు ఏం చేశామో చెప్పాలి గాని.. వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించడంతో చేయడంతోనే సరిపెట్టడం ఏంటన్నారు. నిరుద్యోగులకు ఎటువంటి రిక్రూట్మెంట్ ఇవ్వలేదని, రైతుల కన్నీటి గోడు కూడా వినలేని విమర్శించారు. రాష్ట్రంలో పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుందని కనిపించడంలేదా అని ప్రశ్నించారు. పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు ప్రాంతాల్లో పొగాకు రైతులు పడుతున్న కష్టాల కన్నీళ్ల గోడు ఈ ప్రభుత్వానికి వినిపించడం లేదన్నారు. గత ప్రభుత్వం పొగాకును ఎంతకు కొనుగోలు చేసిందో చూడాలన్నారు. కౌలు రైతులు, మిర్చి రైతుల గోడును మహానాడులో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. మంత్రి అచ్చెన్నాయుడు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. రైతుల సమస్యలపై బహిరంగ చర్చకు సిద్ధమేనా అని, పొగాకు రైతుల వద్దకు వెళితే వారు చెప్పే సమస్యలు వింటే ఎంతగా నష్టపోతున్నారో తెలుస్తుందన్నారు. హామీలు గాలికి.. కుట్రలు బయటకు.. చెరుకుపల్లి: ప్రజలకు గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారని, అయితే బూటకపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి అయినా ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మేరుగ నాగార్జున పేర్కొన్నారు. శుక్రవారం గుళ్ళపల్లిలోని డాక్టర్ ఈవూరి గణేష్ క్యాంపు కార్యాలయంలో పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు జూన్ 4వ తేదీన రేపల్లె ఆర్డీఓ కార్యలయం వద్ద నిర్వహించనున్న వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని కోరుతూ నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన నాయకులు, కార్యకర్తల సమావేశంలో డాక్టర్ మేరుగ పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి నేతలు ఏడాది కాలంగా ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికొదిలి, తమ జేబులు నింపుకొనేందుకే వెచ్చించారన్నారు. కూటమి ఏడాది పాలనలో చిన్నారులను, మహిళలను, విద్యారంగాన్ని, వైద్యరంగాన్ని, చివరకు శాంతిభధ్రతలను పట్టించుకోకుండా రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందన్నారు. అనంతరం డాక్టర్ గణేష్ మాట్లాడేతూ 4వ తేదీ జరిగే వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్లు దుండి వెంకట రామిరెడ్డి, ఇంకొల్లు రామకృష్ణ, కరేటి శేషగిరిరావు, యార్లగడ్డ వెంకట రాంబాబు, నాయకులు డాక్టర్ హతిక్, పట్టెం శ్రీనివాసరావు, లుక్కా బాపనియ్య, నిజాంపట్నం కోటేశ్వరరావు, ఉల్లంగుంట శ్రీరాంమూర్తి, పాగోలు వెంకటేశ్వరరావు, కందుల సురేష్, చదలవాడ శ్రీనివాసరావు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. హామీలు నెరవేర్చకుండా ప్రగల్భాలతోనే సరి అక్రమ కేసులు, అరెస్టులే తప్ప అభివృద్ధి శూన్యం జూన్ 4న వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేయాలి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున జూన్ 4న వెన్నుపోటు దినం కూటమి ప్రభుత్వం చేసిన మోసాలు, అరాచకాలు, అన్యాయాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జూన్ 4న వెన్నుపోటు దినం నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో వినతిపత్రం ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి కరణం వెంకటేష్ మాట్లాడుతూ నియోజవర్గ ప్రజలకు తాను ఎప్పుడూ అండగా ఉంటారన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ సంవత్సర కాలం వేచి చూశామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందన్నారు. పార్టీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కర్నేటి వెంకటప్రసాద్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వాసిమళ్ళ వాసు, మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు బత్తుల అనిల్, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి షేక్ కబీర్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు గవిని శ్రీనివాసరావు, మాజీ మున్సిపల్ వైస్చైర్మన్ బొనిగల జైసన్బాబు, పట్టణ అధ్యక్షుడు యాతం మేరిబాబు, మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
బిల్లుల్లోనూ పచ్చపాతం
నెహ్రూనగర్: జనవరి 10వ తేదీన గుంటూరులో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు వచ్చారు. ఆయన పర్యటించే ప్రాంతం ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి చేబ్రోలు హనుమయ్య కంపెనీ వరకు రోడ్లు అందంగా కనిపించేందుకు షో మొక్కలు తూర్పుగోదావరి జిల్లా కడియం నుంచి రూ.35 లక్షలు వెచ్చించి తెప్పించారు. ఎన్ని తెప్పించారో.. ఎన్ని ఉన్నాయో నేటికీ నగరపాలక సంస్థ అధికారుల వద్ద లెక్క లేదు. అధికారులు చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ మొక్కలు ఎక్కడున్నాయో ఎవరికి తెలియదు. కొన్ని మొక్కలు ఎండిపోయాయి. దీనిపై సాక్షిలో ఏప్రిల్ 13వ తేదీన ‘ఎండిన మొక్కలు..తేలని లెక్కలు’ పేరిట కథనం ప్రచురితమైంది. సోషల్ మీడియాలో కూడా ఈ విషయం వైరల్గా మారింది. దీంతో ఎక్కడ ఈ బిల్లు ఆపితే ఎటువంటి ఇబ్బందులు వస్తాయో అని అప్పుడు ఏడీహెచ్గా పనిచేసిన శ్రీనివాస్ను సరెండర్ చేసి మరీ సదరు బిల్లు రూ.35లక్షలు ప్రాసెస్ చేసినట్లు సమాచారం. ఖర్చుల బిల్లు వస్తే ఒట్టు 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎలక్షన్ రోజు పోలింగ్, తర్వాత కౌంటింగ్ కేంద్రాల వద్ద టెంట్లు, బ్యారికేడింగ్, డిపార్ట్మెంట్ సిబ్బందికి సంబంధించిన భోజనాలు, టీ, కాఫీలు, స్నాక్స్, ఇతర స్టేషనరీ వంటి పనులు కాంట్రాక్టర్లు సుమారు 1.50 కోట్ల వర్కులు ఇంజినీరింగ్ అధికారుల హాహీతో చేపట్టారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ బిల్లులను అధికారులు ప్రాసెస్ చేయకుండా పక్కన పెట్టారని పలువురు కాంట్రాక్టర్లు వాపోతున్నారు. వడ్డీలకు తీసుకొచ్చి... కొంతమంది కాంట్రాక్టర్లు బ్యాంకుల్లో స్థలాలు, ఇళ్లు తనాఖాలు పెట్టి పనులు చేశారు. ఆ వర్కులకు బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో బ్యాంకుల్లో తీసుకున్న రుణానికి వడ్డీ పడుతోంది. మరికొంత మంది కాంట్రాక్టర్లు బయట వ్యక్తుల వద్ద నుంచి వడ్డీ కట్టాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. దీని వలన తాము అప్పుల్లో కూరుకుపోతున్నామని బహిరంగంగానే వాపోతున్నారు. ఏదో విధంగా బిల్లు ప్రాసెస్ చేయించాలని ఇంజినీరింగ్ అధికారులను వేడుకుంటున్నారు. సిఫార్సులు.. పర్సంటేజీలు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత సర్కారు హయాంలో చేసిన వర్కుల బిల్లులు ప్రాసెస్ చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత చేసిన వర్కులకు మాత్రమే బిల్లులు ప్రాసెస్ అవుతున్నట్లు కాంట్రాక్టర్లు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఎవరైపా వడ్డీలు కట్టుకోలేక ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఎంతకొంత ముట్టజెప్పి సిఫార్సు చేయించుకుంటున్నారు. ఇక్కడ నగరపాలక సంస్థ అధికారులు కూడా పర్సంటేజీ ఇస్తేనే బిల్లు ప్రాసెస్ చేస్తామని చెబుతున్నారు. చేసేదేమీ లేక అధికారులు అడిగినంత ఇచ్చుకుని ప్రాసెస్ చేయించుకుంటున్నారు కాంట్రాక్టర్లు. బిల్లుల ప్రాసెసింగ్లో మున్సిపల్ అధికారుల తీరిది తమ అనుకునే వారికి మాత్రమే అత్యధిక ప్రాధాన్యత అవసరం లేదనుకున్న వారికై తే నెలల తరబడి పెండింగ్ ఇటీవల సీఎం పర్యటనకు రూ.35 లక్షల విలువైన మొక్కలు ఎక్కడున్నాయో.. ఏమైపోయాయో కూడా తెలియని దుస్థితి రూ.35 లక్షల బిల్లుకు ఆగమేఘాలపై ప్రాసెస్ పూర్తి ఇంకా పెండింగ్లోనే ఏడాది క్రితం నాటి ఎన్నికల ఖర్చు బిల్లులు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారు. తమ అనుకునే కాంట్రాక్టర్ల బిల్లులు ప్రాసెస్ చేయడంలో చూపుతున్న ఉత్సాహం మాటల్లో చెప్పలేనిది. మిగతా కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుల్లో మొండి చేయి చూపుతున్నారనేది జగమెరిగిన సత్యం.. గత ప్రభుత్వంలో రూ.కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లలో కొంత మందికి బిల్లులు చెల్లింపులు జరపకుండా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులకు పర్సంటేజ్ రూపంలో ముడుపులు సమర్పించుకుంటే ఎప్పటి బిల్లు అయినా ప్రాసెస్ చేస్తున్నారని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. కమిషనర్ ఆదేశాల మేరకే చెల్లింపులు ఎవరైనా కాంట్రాక్టర్ అత్యవసరం అని అడిగితే సదరు బిల్లుల చెల్లింపులు కమిషనర్ ఆదేశాల మేరకు ప్రాసెస్ చేస్తున్నాం. – నమ్రత్కుమార్, అకౌంటెంట్ -
అధైర్య పడొద్దు .. అండగా ఉంటాం..
సత్తెనపల్లి: ‘‘మీరేమీ ఇబ్బంది పడవద్దు, భయపడ వద్దు. వైఎస్ జగన్మోహన్రెడ్డి మీకు అండగా ఉన్నారు. మేమందరం మీకు తోడుగా ఉన్నాం..’’ అంటూ ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి విడదల రజిని, నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ్రెడ్డి అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో వారు గురువారం పర్యటించారు. ఏడాది క్రితం టీడీపీ, జనసేన నేతల దాడులు, పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న రెంటపాళ్ల ఉపసర్పంచ్, వైఎస్సార్ సీపీ క్రియాశీలక నాయకుడు కొర్లకుంట శివనాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యా న్ని కలిగించారు. మృతుడు తండ్రి, పాకాలపాడు పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు కొర్లకుంట వెంకటేశ్వర్లుతో మాట్లాడారు. అనంత రం వారు మాట్లాడుతూ.. జూన్ 3న మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రెంటపాళ్ల గ్రామా న్ని సందర్శిస్తారని చెప్పారు. కొర్లకుంట శివనాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించి, నివాళులర్పిస్తారన్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారని పేర్కొన్నారు. ఈ క్రమంలో రూట్ మ్యాప్ను పరిశీలించారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు పడాల శివారెడ్డి, డాక్టర్ గజ్జల నాగభూషణ్ రెడ్డి, డీఆర్యూసీసీ మెంబర్ చల్లంచర్ల సాంబశివరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ నాగుర్ మీరాన్, సత్తెనపల్లి మండల పార్టీ అధ్యక్షుడు రాయపాటి పురుషోత్తమరావు, ఎంజే ఎం రామలింగారెడ్డి, రెండెద్దుల వెంకటేశ్వర రెడ్డి, ఇందూరి నరసింహారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు షేక్ మౌలాలి(సత్తెనపల్లి టౌన్), వేపూరి శ్రీనివాసరావు (రాజుపాలెం), భవనం రాఘవరెడ్డి (నకరికల్లు), నక్కా శ్రీను(ముప్పాళ్ల), వైఎస్సార్ సీపీ నాయకులు బండి కోటినాగిరెడ్డి, ఏకుల మత్తయ్య, పల్లె గాబ్రియేలు, కోట ఆంజనేయులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, లేళ్ళ అప్పిరెడ్డి, నేతల బృందం రెంటపాళ్ళ ఉపసర్పంచ్ నాగమల్లేశ్వరరావు కుటుంబానికి పరామర్శ జూన్ 3న రెంటపాళ్ళకు వైఎస్ జగన్ రాక నేపథ్యంలో రూట్మ్యాప్ పరిశీలన -
పరిశుభ్రతతోనే ఆరోగ్య పదిలం
కర్లపాలెం: పరిశుభ్రతతోనే ప్రజల ఆరోగ్య పదిలంగా ఉంటుందని బాపట్ల జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి చెప్పారు. దమ్మనవారిపాలెం సంపద సృష్టి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ గురువారం తనిఖీ చేశారు. గ్రామంలోని చెత్త తీసుకువచ్చి ఒక చోట గుట్టగా వేయటాన్ని చూసిన కలెక్టర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంపద సృష్టి కేంద్రానికి తీసుకువస్తున్న చెత్తను ఎందుకు ప్రాసెసింగ్ చేయటం లేదని అఽధికారులను నిలదీశారు. తక్షణమే ప్రాసెసింగ్ పనులు చేపట్టాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ 350 గృహాలు ఉన్న గ్రామంలో చెత్తను తొలగించేందుకు క్లాప్మిత్రలు ఇద్దరే ఉండటం ఏమిటని జనాభా సంఖ్యను బట్టి క్లాప్మిత్రలను ఏర్పాటు చేసుకోవాలని డీపీవో ప్రభాకర్కు సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాలు వేరుగా, ఇనుప వస్తువులు వేరుగా, గాజు వస్తువులు వేరుగా భూమిలో కుళ్లిపోయే పదార్థాలు వేరుచేసి సంపద సృష్టించేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ గురపసాల వెంకటేశ్వరమ్మ, ఎంపీడీవో శ్రీనివాసరావు, తహసీల్దార్ సుందరమ్మ, ఈవోపీఆర్డీ శ్రీనివాసరావు, కార్యదర్శి సునీత తదితరులు ఉన్నారు. కాలువల మరమ్మతులు సక్రమంగా చేయాలి పంట కాలువల పూడికతీత, మరమ్మతు పనులు సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ జె.వెంకటమురళి జల వనరుల శాఖాధికారులను ఆదేశించారు. కర్లపాలెం మండలంలో రూ.12లక్షలతో చేపట్టిన పీటీ చానల్ మరమ్మతు పనులను గురువారం కలెక్టర్ ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలోని పంట కాలువల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని చెప్పారు. వర్షాలు కురవకముందే పూర్తి చేయాలని తెలిపారు. జలవనరుల శాఖ ఎస్ఈ డి.వెంకటరత్నం, డీఈ జాకీర్, తహసీల్దార్ సుందరమ్మ, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఇన్చార్జి ఆర్డీవో లవన్న తదితరులు ఉన్నారు. పర్యావరణాన్ని కాపాడుతూ పరిశ్రమలను నిర్వహించుకోవాలి జిల్లాలో పర్యావరణాన్ని కాపాడుతూ పరిశ్రమలను నిర్వహించుకోవాలని కలెక్టర్ జె.వెంకట మురళి సూచించారు. గురువారం కలెక్టరేట్లో ఆక్వా పరిశ్రమలు, రిసార్డ్స్ యజమానులు, హోట ల్ యజమానులతో పర్యావరణ పరిరక్షణపై తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆక్వా పరిశ్రమల్లో విడుదల చేసిన వ్యర్థ పదార్థాలను నిల్వ చేయడానికి తప్పనిసరిగా అర ఎకరా భూమిని కేటాయించాలని చెప్పారు. ఆక్వా పరిశ్రమల్లో విడుదల చేసిన వ్యర్ధ పదార్థాలను పంట కాలువలోకి విడుదల చేయకుండా కట్టడి చేయాలని చెప్పారు. ఇరిగేషన్ వనరులు దెబ్బతినకుండా పర్యావర ణా న్ని కాపాడాలని యజమానులను కలెక్టర్ కోరారు. రొయ్య ప్రాసెసింగ్ యూనిట్లు ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని యాజమాన్యానికి సూచించారు. రొయ్య ప్రాసెసింగ్ యూనిట్లు 45 రోజుల్లోగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పారు. జిల్లాలో ఆక్వా యాచరీలు 20 ఉన్నాయని, వీటిలో ఏడింటికి లైసెన్న్స్లు లేవని అన్నారు. నెలరోజుల్లోగా లైసెన్సులు తీసుకోవాలని ఆదేశించారు. రిసార్డ్స్ యజమానులు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి గాజు ప్లేట్లను, బాటిల్స్ వినియోగించాలని సూచించారు. జిల్లా పంచాయతీ అధికారి, మత్స్య శాఖ జేడీ, జిల్లా పర్యాటక శాఖఅధికారి, పొల్యూషన్ బోర్డ్ అధికారులు పరిశ్రమలను, రిసార్డ్స్ను, హోటళ్లను జాయింట్గా పరిశీలన చేయా లని కలెక్టర్ ఆదేశించారు. డీపీఓ ప్రభాకర్, గ్రామీణ నీటి సరఫరాశాఖ ఎస్ఈ అనంతరాజు, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ రామకృష్ణ, పొల్యూషన్ బోర్డ్ ఈఈ రాఘవరెడ్డి,ఆర్డీవోలు పి.గ్లోరియా, చంద్రశేఖర్ ఉన్నారు. జిల్లా కలెక్టర్ జె.వెంకటమురళి సంపద సృష్టి కేంద్రం సందర్శన సిబ్బంది తీరుపై ఆగ్రహం -
తప్పిపోయిన చిన్నారి
మంగళగిరి టౌన్: ఇంటి వద్ద ఆడుకుంటూ తప్పిపోయిన ఓ చిన్నారిని కేవలం గంట వ్యవధిలోనే తల్లిదండ్రులకు అప్పగించిన ఘటన మంగళగిరిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంగళగిరి అజయ్నగర్కు చెందిన తేజస్విని అనే పాప ఇంటి వద్ద ఆడుకుంటూ తప్పిపోయి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏడుస్తూ కనిపించింది. అదే సమయంలో విధుల్లో ఉన్న సీఐ వినోద్ కుమార్ కంటపడింది. వెంటనే చిన్నారి వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. అజయ్నగర్ అని, తండ్రి పేరు విజయ్ అని చెప్పడంతో ఆ చిన్నారిని తీసుకుని అజయ్నగర్లోని పాప నివాసానికి వెళ్లి తేజస్విని తండ్రికి అప్పగించారు. తప్పిపోయిన చిన్నారి సురక్షితంగా ఇంటికి రావడంతో ’ఠీఐ వినోద్కుమార్కు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. గంట వ్యవధిలో తల్లిదండ్రులకు అప్పగింత -
జీఎస్టీతో వేగంగా ఆర్థికాభివృద్ధి
లక్ష్మీపురం: వస్తు సేవల పన్నుతో దేశం వేగంగా ఆర్థికంగా ముందుకు వెళుతుందని, పన్ను వ్యవస్థ పూర్తిగా చక్కబడిందని సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ సుజిత్ మల్లిక్ అన్నారు. గురువారం గుంటూరు కన్నవారితోటలోని జీఎస్టీ భవన్లో ప్రీ జీఎస్టీ డే వేడుక నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ జీఎస్టీతో పన్నులను అంగీకరించే సమాజం ఏర్పడిందన్నారు. పన్ను చట్టాల్లో పారదర్శకత పెరగటమే కాకుండా, పన్ను అధికారులకు, పన్ను చెల్లింపుదారుల మధ్య స్నేహభావం ఏర్పడిందన్నారు. ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడం, పన్ను చెల్లింపులు పెంచడం వంటి అంశాలలో జీఎస్టీ ప్రాధాన్యతను వివరించారు. జీఎస్టీ విజయవంతంగా అమలు కావడంలో పరిశ్రమ భాగస్వాముల సహకారాన్ని అభినందించారు. జీఎస్టీ అడిషనల్ కమిషనర్ బి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జీఎస్టీ ప్రయాణాన్ని గుర్తుచేసే ఒక ముఖ్యమైన కార్యక్రమంగా ఈ వేడుక నిర్వహిస్తున్నామన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కరరావు మాట్లాడుతూ జీఎస్టీ ప్రారంభంలో తెలియక చాలా మంది వ్యాపారులు తమ రిటన్స్లో తప్పుడు వివరాలు నమోదు చేశారని, ప్రస్తుతం జీఎస్టీ ఆడిట్లో అవన్నీ పట్టుబడుతున్నాయన్నారు. అవి కావాలని చేసిన తప్పులు కావన్నారు. నేషనల్ కనూ్స్య్మర్స్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు చదలవాడ హరిబాబు మాట్లాడుతూ ప్రాణ రక్షణ కోసం వాడే మందులపై జీఎస్టీని తక్షణమే తీసివేయాలన్నారు. చేనేత మగ్గాలపై విధించే ఐదు శాతం పన్నును కూడా రద్దు చేయాలన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షుడు యేల్చూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జీఎస్టీపై వ్యాపారుల ఇబ్బందులను ప్రతి మూడు నెలలకొకసారి అధికారులు సమీక్ష చేయాలన్నారు. ఇండియన్ టెక్స్టైల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి మాట్లాడుతూ జీఎస్టీ రేట్లలో రెండు స్లాబులే ఉండాలని సూచించారు. పలువురు పరిశ్రమ ప్రతినిధులు జీఎస్టీ అంశాలపై తమ అభిప్రాయాలను తెలిపారు. కమిషనర్ సుజిత్ మల్లిక్ను ట్రేడ్ వర్గాల వారు సన్మానించారు. కార్యక్రమంలో జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్లు ఎం.నాగరాజు, బి.రవికుమార్, వి. వెంకటేశ్వరరావు, మనోజ్ కుమార్, మరియదాసు, రాయలు, ఆనందరావు, చాంబర్ మాజీ అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ సుజిత్ మల్లిక్ -
తోడికోడళ్ల మృతితో తెనాలిలో విషాదం
తెనాలిరూరల్: అరుణాచలేశ్వరుని దర్శనం కోసం బయలుదేరిన తోడికోడళ్లు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తెనాలిలో విషాదం అలముకుంది. ఎంతో ఆప్యాయంగా ఉండే తోడికోడళ్ల బంధం మరణంలోనూ వీడలేదు. పట్టణానికి చెందిన కన్నెగంటి సూర్యకుమారి, కన్నెగంటి సరస్వతి కుమారి, కన్నెగంటి ఝాన్సీరాణిలు తోడికోడళ్లు. ఝాన్సీరాణి కుమారుడు నాగార్జున, ఆడపడుచు పార్వతితో కలిసి వీరు ముగ్గురు గురువారం అరుణాచలానికి కారులో పయనమయ్యారు. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలోని మేదరమెట్ల సమీపంలోని జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవడంతో ఝాన్సీరాణి అక్కడికక్కడే మృతి చెందింది. గాయాలపాలైన నలుగురిని ఒంగోలు వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సూర్యకుమారి, సరస్వతికుమారి కూడా ప్రాణాలు కోల్పోయారు. సూర్యకుమారి తన భర్త నరసింహారావుతో కలిసి ఇక్కడి కవిరాజపార్కు రోడ్డులో అక్షర గీత విద్యానికేతన్ను స్థాపించారు. సరస్వతికుమారి భర్త వెంకటేశ్వరరావు ఆర్మీలో పనిచేసి రిటైరై తెనాలిలో రెడీమేడ్ దుస్తుల వ్యాపారం ప్రారంభించారు. ఝాన్సీరాణి భర్త నాగేశ్వరరావు గాంధీచౌక్లో పారగాన్ వాచ్ కంపెనీ నిర్వహించేవారు. ముగ్గురు అన్నదమ్ములు గతంలోనే మృతి చెందారు. ఆప్యాయంగా ఉండే తోడి కోడళ్లు అరుణాచలం దర్శనం కోసం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తమ ఆడపడుచు పార్వతిని వెంటబెట్టుకుని ఝాన్సీరాణి కుమారుడు నాగార్జునతో కలిసి తమకు తెలిసిన వారి కారు తీసుకుని బయలుదేరారు. రోడ్డుప్రమాదం రూపంలో వీరి కుటుంబాలను మృత్యువు కబళించింది. సూర్యకుమారికి ఇద్దరు కుమారులు ఉండగా. తెనాలి ప్రభుత్వ వైద్యశాల సమీపంలో తన కుటుంబంతో నివాసం ఉంటోంది. సరస్వతికుమారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కవిరాజపార్కు రోడ్డు లో నివసిస్తున్నారు. ఝాన్సీరాణి పెద్దకుమారుడు గతంలో మృతి చెందగా, ప్రస్తుతం సుల్తానాబాద్ ఆలపాటి నగర్లోని సాయిబాబా ఆలయం వద్ద సాయి పథం అపార్ట్మెంట్లో చిన్న కుమారుడు నాగార్జున కుటుంబంతో కలసి నివసిస్తున్నారు. ముగ్గురు తోడి కోడళ్లు మృతి చెందారన్న వార్త తెలియడంతో తెనాలిలో విషాదఛాయలు అలముకున్నాయి. బాపట్ల జిల్లాలో కారు ప్రమాదం ముగ్గురు మృత్యువాత -
కూటమి ప్రభుత్వం ఏడాది పాలన తీరు
ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పిన మాటలు.. సాక్షి ప్రతినిధి,బాపట్ల: ఎన్నికల ముందు నిరుద్యోగులకు చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. అధికారం చేపట్టాక వారితో కన్నీరు పెట్టిస్తున్నారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న వాటికి పీకేసి ఉపాధిని దెబ్బతీస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి జూన్ 12 నాటికి ఏడాది పూర్తి కావస్తోంది. నిరుద్యోగులకు ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన బాటలో నిరుద్యోగులు కూటమి ప్రభుత్వం ఏడాది పాలన ముగుస్తున్నా మాట నిలబెట్టుకోకపోవడంతో మోసపోయిన యువత ఆందోళన బాట పడుతోంది. మెగా డీఎస్సీ ప్రకటించాలని నిరుద్యోగులు పలుమార్లు ఆందోళనకు దిగారు. చిరకు అరకొర పోస్టులతో ప్రకటన చేసింది. వలంటీర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. విధుల నుంచి తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతోపాటు కోర్టులను ఆశ్రయించారు. ఊసేలేని భృతి ఎన్నికల సమయంలో ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం వచ్చేవరకూ నెలకు రూ.3 వేలు భృతి ఇస్తానని ప్రకటించిన చంద్రబాబు గద్దెనెక్కి ఏడాదైనా దాని ఊసే ఎత్తడంలేదు. ఇంటికొకరికి నిరుద్యోగ భృతి అనుకుంటే నెలకు రూ.149.10 కోట్ల చొప్పున చెల్లించాల్సి వుంది. కానీ పైసా ఇవ్వలేదు. 2014లోనూ చంద్రబాబు ఇంటికొక ఉద్యోగం, లేకుంటే నిరుద్యోగ భృతి ఇస్తానని నమ్మబలికి అధికారంలోకి వచ్చాక ఎగనామం పెట్టారు. ఇంటికొక నిరుద్యోగి జిల్లాలో జిల్లాలో 459 గ్రామపంచాయతీల పరిధిలో 944 గ్రామాలు ఉండగా వాటి పరిధిలో 4,97,000 గృహాలు ఉన్నాయి. ఈ లెక్కన ఇంటికొకరు అనుకున్నా జిల్లా వ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వారంతా ఉద్యోగాలకోసం ఎదురుచూపులు చూస్తున్నారు. వైఎస్.జగన్మోహన్రెడ్డి పాలనలో ఇలా.... వైఎస్.జగన్మోహన్రెడ్డి పాలనలో ప్రభుత్వం చదువుకున్న యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించింది. జిల్లాలో 477 గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటుచేసి 5,247 ఉద్యోగాలు కల్పించింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల పరిధిలో వేలాది మందికి వలంటీర్ ఉద్యోగాలు ఇచ్చింది. 348 హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేసి 348 ఎంఎల్హెచ్పీ ఉద్యోగాలు కల్పించింది. ఇవికాకుండా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చింది. ఇక ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చింది. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెంచి వారి శ్రమను గుర్తించింది. ఇవి కాకుండా ఎంఎస్ఎంఈల ద్వారా జిల్లాలో 705 యూనిట్లు ఏర్పాటు చేసి వారికి రూ.110.69 కోట్ల మేర రాయితీలు కల్పించింది.‘‘అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం... ఉద్యోగావకాశాలు రానివారికి నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి అందజేస్తాం...వలంటీర్లకు నెలకు రూ.10 వేలు వేతనం ఇస్తాం...ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం...కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తాం’’ అంటూ చంద్రబాబుతోపాటు కూటమి నేతలు ఊదరగొట్టారు. నిరుద్యోగ భృతికి ఎగనామం ఎన్నికలప్పుడు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న చంద్రబాబు గద్దెనెక్కాక ఒక్క ఉద్యోగం కల్పించని వైనం డీఎస్సీ పేరుతో దగా ఇంటికొకరు అనుకున్నా జిల్లాలో 5 లక్షల మంది నిరుద్యోగులు ఆందోళనలో యువత వైఎస్.జగన్మోహన్రెడ్డి పాలనలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూటమి పాలన తీరుపై యువత ఆగ్రహం ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా కూటమి పభుత్వం చదువుకున్న యువతకు తక్షణం ఉద్యోగాలు కల్పించాలి. 20 లక్షల ఉద్యోగాలిస్తామన్న మాట నిలబెట్టుకోవాలి. మాటలు చెప్పి ఓట్లేయించుకున్న ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చి ఆ మాట నిలబెట్టుకోవాలి. జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలి. – మాచవరపు రవికుమార్, రాష్ట్రకార్యదర్శి, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం -
పవిత్ర పూజాక్షేత్రంగా ఓంకారాశ్రమం
తెనాలి: ఆంధ్యా ప్యారిస్ తెనాలిలోని బుర్రిపాలెంరోడ్డులో తొమ్మిది దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన ఓంకారాశ్రమం ఇప్పుడు పవిత్ర పూజాక్షేత్రంగా భక్తులకు అందుబాటులోకి వచ్చింది. రూ.కోట్ల విలువైన ఆస్తులున్నా స్వార్థపరుల కారణంగా కునారిల్లుతూ వచ్చిన ఆశ్రమమిది. ఆశ్రమ స్థలాన్ని పవిత్ర సందర్శనీయ స్థలంగా చేయాలని గత ప్రభుత్వ హయాంలో దేవదాయశాఖ సంకల్పించింది. అప్పటి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చొరవతో నిధులు మంజూరయ్యాయి. ఫలితంగానే ఇప్పుడు ఆశ్రమ స్థలంలో పరివార దేవతా, శిఖర, ధ్వజస్తంభ, శ్రీశరభ సాళ్వేశ్వరస్వామి, శ్రీపార్వతీ సమేత శ్రీఓంకారేశ్వరస్వామి వార్ల ఆలయం నిర్మించారు. ప్రతిష్టా మహోత్సవాలు గురువారం నుంచి ఆరంభించారు. తెనాలి బుర్రిపాలెంరోడ్డులోని ఓంకారాశ్రమం 1932లో ఏర్పాటైంది. కాకుమాను శ్రీరాములు అనే ఆధ్యాత్మిక చింతనాపరుడు ఆశ్రమాన్ని స్థాపించారు. సాధువులు ధ్యానం చేసుకునేందుకు, వారి పోషణ కోసమనే భావనతో ఏర్పాటైన ఆశ్రమానికి అప్పట్లో శ్రీవ్యాస ఆశ్రమ నిర్వాహకుడు మలయాళస్వామి శంకుస్థాపన చేశారు. ఆశ్రమం తరపున పేదలకు వైద్యం, విద్యార్థులకు విద్య కోసమని దాతలు 12.83 ఎకరాల మాగాణి భూమిని సమకూర్చారు. దాతల లక్ష్యం నిర్విఘ్నంగా నెరవేరింది. యజ్ఞయాగాది క్రతువులు వైభవంగా జరిగాయి. అప్పట్లో ఆశ్రమానికి స్వామీజీలు ట్రస్టీలుగా ఉండేవారు. 1947–1963 మధ్య ఆశ్రమానికి గల మాగాణి భూమిని విక్రయించారు. ఆ డబ్బుతో గంగానమ్మపేటలో ఉన్న శ్రీవేణుగోపాలస్వామి గుడి వీధిలో రెండు ఇళ్లు, చెంచుపేటలోని గోడౌన్ కొనుగోలు చేశారు. ట్రస్టీల వ్యవహారంలో వివాదాలు మలయాళస్వామి మరణంతో ఆశ్రమ ట్రస్టీల వ్యవహారంలో వివాదాలు మొదలయ్యాయి. 1980 వరకు పరంపరగా సాగాయి. అనంతరం ట్రస్టీలు ఏర్పాటైనా 1996లో ఆశ్రమ నిర్వహణ దేవదాయ, ధర్మదాయశాఖ పరిధిలోకి వెళ్లింది. అప్పట్నుంచి అభివృద్ధి శూన్యమైంది. పైగా 1983లో ఆశ్రమంలో గల ధ్యానమందిరాన్ని కూల్చారు. 1998లో ఆశ్రమ స్థలంలోని 80 సెంట్ల స్థలాన్ని ఓ ప్రైవేటు విద్యాసంస్థకు లీజుకిచ్చారు. కోర్టు వివాదంతో ప్రైవేటు విద్యాసంస్థకు లీజు ఆగిపోయింది. లాడ్జికి అద్దెకు ఇచ్చిన భవనం శ్రీవేణుగోపాలస్వామి గుడి వీధిలోని భవనాన్ని గతంలో కొంతకాలం లాడ్జికి అద్దెకిచ్చారు. కొన్ని నెలలు రిక్రియేషన్ క్లబ్ కూడా నడిచింది. దేవదాయశాఖ చర్యలతో ఏడాదికి రూ.5.23 లక్షల వరకు ఆదాయం సమకూరుతోంది. ఆశ్రమానికి 2022లో అవుతు శ్రీనివాసరెడ్డి ఈవోగా వచ్చారు. వేలం ఆదాయం పెరిగేలా చూశారు. అప్పట్నుంచి ఏడాదికి రూ.7 లక్షలకు పైగా ఆదాయం లభిస్తోంది. నిరుపయోగంగా ఉన్న ఆశ్రమ స్థలాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చేందుకు చేసిన కృషి ఫలించింది. 1.40 ఎకరాల ఆశ్రమం స్థలం ముందుభాగంలో ఆలయం నిర్మాణానికి 2023 డిసెంబరులో శంకుస్థాపన చేశారు. దేవదాయశాఖ రూ.26.66 లక్షలు, ఆశ్రమ నిధులు రూ.13.34 లక్షలు, దాతల సహకారంతో నిర్మాణం పూర్తయింది. రేపు ప్రతిష్టా మహోత్సవం ఈనెల 31వ తేదీన ఉదయం 8.19 గంటలకు ప్రతిష్టా మహోత్సవం జరగనుంది. గురువారం వేదస్వస్తి పూర్వకంగా యాగశాల ప్రవేశం చేసి, సంప్రదాయ పూజలను ఆరంభించారు. రెండురోజుల పూజల అనంతరం 31న యంత్రబింబ, ధ్వజ ప్రతిష్టలు, కళాన్యాసము, ప్రాణప్రతిష్ట జరుగుతాయి. ప్రతిష్టా కార్యక్రమాల్లో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, దేవదాయశాఖ డీసీ కె.బసవ శ్రీనివాసరావు పాల్గొంటారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుందని ఈఓ అవుతు శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆశ్రమంలో ఓంకారేశ్వరస్వామి ఆలయం ఆరంభమైన ప్రతిష్టా మహోత్సవాలు -
గోళ్లమూడి చెరువును మోడల్గా అభివృద్ధి చేయాలి
పెదకాకాని: గోళ్లమూడి తాగునీటి చెరువును మోడల్గా అభివృద్ధి చేయాలని ఉపాధి హామీ పథకం రాష్ట్ర సంచాలకులు వైవీ షణ్ముఖకుమార్ అన్నారు. పెదకాకాని మండలం గోళ్లమూడి, ఉప్పలపాడు గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఎస్ పథకం నిర్వహణ పరిశీలన కోసం గురువారం రాష్ట్ర బృందం పర్యటించింది. షణ్ముఖ కుమార్ మాట్లాడుతూ గోళ్లమూడి గ్రామంలోని తాగునీటి చెరువును పల్లె పుష్కరిణి కింద చేపట్టి అభివృద్ధి చేయాలని సూచించారు. తాగునీటి అవసరాలపై గ్రామస్తులతో మాట్లాడారు. అనంతరం ఉప్పలపాడు గ్రామంలో పంట కుంట(ఫాం పాంట్స్) తవ్వుతున్న తీరును పరిశీలించారు. ఈ పనులపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. శ్రామికులకు రోజువారి వేతనం కనీసం రూ.290 ఉండేలా చూడాలన్నారు. పంట కుంట నిర్మాణం చేపట్టిన రైతులతో మాట్లాడి సూచన చేశారు. అనంతరం లాలుపురం గ్రామంలో పర్యటించారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ వి శంకర్, ఎంపీడీఓ రమావత్ శ్రీనివాసనాయక్ పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం రాష్ట్ర సంచాలకులు షణ్ముఖకుమార్ గోళ్లమూడి, ఉప్పలపాడు గ్రామాల్లో పర్యటన -
రెండు బైక్లను ఢీకొట్టిన ఆటో
అద్దంకి: ముందు వెళ్తున్న రెండు మోటారు బైక్లను ఆటో ఢీ కొట్టిన ఘటనలో ఒక వ్యక్తి దుర్మణం చెందగా, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని శింగరకొండ సమీపంలో అద్దంకి నార్కెట్పల్లి రాష్ట్రీయ రహదారిలో బుధవారం జరిగింది. అందిన సమాచారం మేరకు.. కొరిశపాడు మండలం తమ్మవరం గ్రామానికి చెందిన వెంకట్రావు (35) అద్దంకిలోని భవానీ సెంటర్లో చేపలు దుకాణం నడుపుతుంటాడు. శింగరకొండ భవనాశి చెరువులో చేపలు పడుతున్నారని తెలిసి బెక్పై వెళ్లాడు. అదే విధంగా మండలంలోని కలవకూరు గ్రామానికి చెందిన లక్ష్మీపతి కూడా మరో బైక్పై వెళ్లాడు. పరిచయస్తులైన వీరిద్దరూ అక్కడి నుంచి తిరిగి వస్తుండగా, శింగరకొండ సమీపంలో వెనుక నుంచి వస్తున్న ఆటో ఢీ కొట్టింది. దాంతో వెంకట్రావు బైక్ మీద నుంచి కిందపడి తల పగలడంతో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. లక్ష్మీ పతి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. స్వల్పగాయాలైన వ్యక్తిని 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
కేశవకుమార్ సాహిత్యంలో ధిక్కార స్వరం
కవితా సంపుటాల ఆవిష్కరణలో వక్తలు తెనాలి: గత మూడున్నర దశాబ్దాల తెలుగు కవిత్వంలో కేశవకుమార్ది ముఖ్యమైన గొంతుక అని, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విప్లవాత్మక భావజాలం ద్వారా ప్రేరణ పొందిన కవి అని ప్రముఖ సాహితీ విమర్శకుడు, ప్రొఫెసర్ బి.తిరుపతిరావు ప్రశంసించారు. ఆయన కవిత్వం సామాజిక– రాజకీయ విమర్శ, తాత్విక అన్వేషణల శక్తిమంతమైన సమ్మేళనాన్ని సూచిస్తుందని అన్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం తత్వశాస్త్ర ప్రొఫెసర్, తెనాలి సమీపంలోని మండల కేంద్రం అమృతలూరుకు చెందిన కేశవకుమార్ రచించిన కవితలతో తీసుకొచ్చిన రెండు కవితా సంపుటాలను బుధవారం సాయంత్రం హోటల్ గౌతమ్ గ్రాండ్ హోటల్లో ఆవిష్కరించారు. ‘భిన్నస్వరాలు’ ఆధ్వర్యంలో ఏర్పాటైన సభకు జీఎస్ నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. కేశవకుమార్ కవితా సంపుటి ‘ఆదిమ పౌరుడు’ను బి.తిరుపతిరావు, ‘ఎగిరే పళ్లెం నడిచే మంచం ఓ కూనిరాగం’ సంపుటిని ప్రముఖ కవి సీతారాం ఆవిష్కరించారు. తిరుపతిరావు మాట్లాడుతూ అమృతలూరులో పుట్టి, దళిత ఉద్యమాలు, దళితుల ఆర్థిక, సామాజిక, రాజకీయ ఎదుగుదలను చూస్తూ పెరిగిన క్రమంలో కేశవకుమార్ వాటిని సొంతం చేసుకున్నారని చెప్పారు. ఆయన భావాలన్నీ అంబేడ్కర్ ఆలోచనల చుట్టూ తిరుగుతుంటాయన్నారు. రాడికల్గా సమీక్షించటం, విమర్శించటం ఆయన రచనల్లో గోచరిస్తుందని చెప్పారు. విస్తృతంగా రాస్తున్న కవితలు, వ్యాసాల్లో వ్యంగ్యాన్ని జోడించి విమర్శనాత్మకంగా రాయటం కేశవకుమార్ శైలి అన్నారు. సమకాలీన విషయాలపై తక్షణం స్పందించి రాయటం ఆయన ప్రత్యేకతగా చెప్పారు. కవి సీతారాం మాట్లాడుతూ, సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన విద్యార్థుల ప్రతిఘటన, నిరసన ఉద్యమాల్లో కేశవకుమార్ ముందుండి గొంతెత్తారని చెప్పారు. అంబేడ్కర్, పూలే భావధారలో తనను తాను రూపుదిద్దుకున్న కేశవకుమార్ రచనలు, తెలుగునాట దళితవాద సాహిత్యానికి ప్రోత్సాహాన్ని, ప్రేరణను ఇస్తాయని చెప్పారు. ప్రముఖ దళిత సీ్త్రవాద రచయిత్రి చల్లపల్లి స్వరూపరాణి తన ప్రసంగంలో విప్లవ సాహిత్యానికి కేంద్రబిందువుగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ నుంచి వచ్చిన కేశవకుమార్ కవితా సంపుటాల్లో దళిత, బహుజన సాహిత్యంలో వచ్చిన ధోరణులు ప్రతిబింబిస్తాయని చెప్పారు. కత్తి కళ్యాణ్ మాట్లాడుతూ కేశవకుమార్ కవిత్వంలో నిరసన, ధిక్కారం, వ్యంగ్యం ప్రదర్శిస్తూ సమాజానికి అనేక ప్రశ్నలు సంధించారని చెప్పారు. సభలో శిఖా–ఆకాష్, నూకతోటి రవికుమార్, ఎన్జే విద్యాసాగర్, శ్రీశ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వరరావు, తంగిరాల సోని మాట్లాడారు. కేశవకుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. భిన్నస్వరాలు బాధ్యులు జుగాష్విలి, ఉమ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా వినియోగదారుల ఫోరం చైర్మన్గా విజయలక్ష్మి
గుంటూరు లీగల్: గుంటూరు జిల్లా వినియోగదారుల ఫోరం చైర్మన్గా కుమ్మమూరు విజయలక్ష్మి నియమితులయ్యారు. విజయలక్ష్మి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బీకాం చేశారు. గుల్బర్గా యూనివర్సిటీలో 1991లో న్యాయ శాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. 1992లో న్యాయవాదిగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఎన్రోల్ అయ్యారు. సోదరుడు కృష్ణకిషోర్ వద్ద న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. బుధవారం గుంటూరు జిల్లా కన్జ్యూమర్ ఫోరం చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు అభినందనలు తెలిపారు. ఒకటిన జిల్లా క్రికెట్ జట్లు ఎంపిక గుంటూరు వెస్ట్ ( క్రీడలు ): జిల్లా క్రికెట్ సంఘం త్రీమెన్ కమిటీ ఆధ్వర్యంలో జూన్ 1వ తేదీన స్థానిక అరండల్పేటలోని పిచ్చుకులగుంటలో జిల్లా జట్ల ఎంపిక నిర్వహిస్తామని సభ్యులు యు.మహతి శంకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–19 యువకులు జట్టుకు ఉదయం 8 గంటలకు, అండర్–19 యువతులకు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహిస్తారు. నవంబర్ 1,2006 తర్వాత జన్మించినవారై ఉండాలి. అండర్–15 బాలికలకు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహిస్తారు. నవంబర్ 1, 2010 తర్వాత జన్మించిన వారై ఉండాలి. అండర్–23 ఉమెన్స్కు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహిస్తారు. వీరు నవంబర్ 1,2001 తర్వాత జన్మించినవారై ఉండాలి. పోటీలకు హాజరయ్యే క్రికెటర్లు వైట్ డ్రెస్తోపాటు సొంత కిట్ కలిగి ఉండాలి. వయస్సు ధ్రువీకరణ పత్రంతోపాటు ఆధార్ను తీసుకురావాలన్నారు. మరిన్ని వివరాలకు మహతి శంకర్ను 98491 50249 నంబరులో సంప్రదించాలన్నారు. నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష గుంటూరు లీగల్: అత్యాచార యత్నం కేసులో నిందితుడికి జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. 86 సంవత్సరాల వృద్ధురాలిపై లైంగిక దాడికి యత్నించిన పాలపర్తి మంజు అనే 21 సంవత్సరాల యువకుడిపై పెదనందిపాడు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ఈ మేరకు తీర్పు వచ్చింది. నిందితుడికి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష, రూ. 5 వేలు జరిమానా విధిస్తూ గుంటూరు ఐదో జిల్లా కోర్టు న్యాయమూర్తి బుధవారం తీర్పు వెలువరించారు. బాధితురాలి తరఫున ప్రాసిక్యూషన్ న్యాయవాదిగా పల్లపు కృష్ణ వాదనలు వినిపించారు. 11 నెలలుగా అందని జీతాలు ఏపీజీఏఈ జిల్లా అధ్యక్షుడు చాంద్ బాషా గుంటూరు వెస్ట్: స్థానిక బీఆర్ స్టేడియంలో ఔట్ సోర్సింగ్లో పనిచేస్తున్న ఉద్యోగులకు 11 నెలలుగా జీతాలు అందడం లేదని ఏపీజీఏఈ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ చాంద్ బాషా తెలిపారు. ఈ మేరకు బుధవారం స్థానిక కలెక్టరేట్లోని ఇన్చార్జి జిల్లా కలెక్టర్ ఎ.భార్గవ్ తేజను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చాంద్ బాషా మాట్లాడుతూ అంతంత మాత్రపు జీతాలతో నెట్టుకొచ్చే చిరుద్యోగులకు నెలవారీ జీతాలు అందకపోతే చాలా ఇబ్బందులు పడతారన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో అప్పులు చేస్తున్నారని తెలిపారు. తక్షణం ఉద్యోగులకు జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అసోసియేషన్ నాయకులు లక్ష్మీనారాయణ, వై.నాగేశ్వరరావు, కోటా సాహెబ్, పెదరత్తయ్య, జాన్ పాల్గొన్నారు. -
ప్రజా పాలనపై ఎన్టీఆర్ చెరగని ముద్ర
గుంటూరు వెస్ట్: సంక్షేమ పాలనతో ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేసిన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావును ఎప్పటికీ మరచిపోలేమని ఇన్చార్జి జిల్లా కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ కొనియాడారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో ఇన్చార్జి కలెక్టర్తోపాటు శాసన మండలి సభ్యులు చంద్రగిరి ఏసురత్నం, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, డీఆర్వో షేక్ ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ఎ.భార్గవ్ తేజ మాట్లాడుతూ ప్రభుత్వ పాలనలో విప్లవాత్మకమైన మార్పులకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. ఎన్టీఆర్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో స్టెప్ సీఈఓ చంద్రముని, మెప్మా పీడీ విజయలక్ష్మి, కలెక్టరేట్ ఏఓ పూర్ణచంద్రరావు, కార్పొరేటర్లు స్మిత పద్మజ, వెంకట రమణ, చిష్టీ, మీరావలి, పాల్గొన్నారు. తెలుగు వారి ఖ్యాతి చాటిన ఎన్టీఆర్ నగరంపాలెం: తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు అని జిల్లా ఎస్పీ సతీష్కుమార్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో బుధవారం దివంగత సీఎం నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు రాజకీయాల్లో అరంగేట్రం చేసి సీఎంగా పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీ (పరిపాలన) రమణమూర్తి, ఏఆర్ డీఎస్పీ ఏడుకొండలురెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎకై ్సజ్ కార్యాలయంలో... నెహ్రూనగర్: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బుధవారం గుంటూరు జిల్లా ఎకై ్సజ్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎకై ్సజ్ శాఖ డెప్యూటీ కమిషనర్ డాక్టర్ కె. శ్రీనివాసులు, అసిస్టెంట్ కమిషనర్ రవికుమార్రెడ్డి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ అరుణకుమారి, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఇ.మారయ్య బాబు పాల్గొన్నారు. ఇన్చార్జి జిల్లా కలెక్టర్ -
బీచ్ కబడ్డీ పురుషుల రాష్ట్ర జట్టుకు శిక్షణ
చెరుకుపల్లి: జూన్ 5 నుంచి 8వ తేదీ వరకు మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్లో నిర్వహించనున్న 12వ జాతీయ బీచ్ కబడ్డీ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర పురుషుల జట్టుకు శిక్షణ ఇస్తున్నట్టు ఏపీ కబడ్డీ అసోసియేషన్ కోశాధికారి, జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి ఎం.సుబ్బరాజు తెలిపారు. జట్టుకు మండలంలోని పొన్నపల్లి గ్రామంలో శిక్షణ శిబిరాన్ని బుధవారం సుబ్బరాజు ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 3వ తేదీ వరకు శిక్షణ కొనసాగనున్నట్లు తెలిపారు. ఇదే గ్రామానికి చెందిన కుంచల శ్రీనివాసరెడ్డి స్పాన్సర్గా వ్యవహరించనున్నట్టు చెప్పారు. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ వై.శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించన్ను పోటీలకు పురుషుల జట్టుకు పర్యవేక్షకులుగా విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయులు వైఎస్సార్ ప్రసాద్, రాధాకృష్ణమూర్తి వ్యవహరిస్తారని తెలిపారు. శిబిరానికి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఈస్ట్ గోదావరి జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరు అయ్యారని పేర్కొన్నారు. శిక్షణ అనంతరం తుది జట్టును ఎంపిక చేయనున్న వివరించారు. -
లోక్ అదాలత్లో ఎక్కువ కేసుల పరిష్కారానికి కృషి
గుంటూరు లీగల్: లోక్ అదాలత్లో ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయికళ్యాణ్చక్రవర్తి పేర్కొన్నారు. బుధవారం కోర్టు ప్రాంగణంలో ఈ నెల 28 నుంచి జూన్ 7వ తేదీ వరకు జరుగనున్న లోక్ అదాలత్పై కంపెనీ సభ్యులు, కౌన్సిలర్లు, ఇన్స్యూరెన్స్ కంపెనీల న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ కేసుల సత్వర పరిష్కారానికి తీసుకోవలసిన చర్యల గురించి వివరించారు. అందరూ సహకరించాలని సూచించారు. సమావేశంలో ఒకటో అదనపు జిల్లా జడ్జి వి.ఎ.ఎల్.సత్యవతి, గుంటూరు ఫ్యామిలీ కోర్టు జడ్జి జి. చక్రపాణి, నాలుగో అదనపు జిల్లా జడ్జి ఆర్. శరత్ బాబు, ఐదో అదనపు జిల్లా జడ్జి కె. నీలిమ, మూడో అదనపు జిల్లా జడ్జి సి.హెచ్.వి.ఎన్. శ్రీనివాసరావు, పోక్సో కోర్ట్ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి షమీ పర్వీన్ సుల్తానా బేగం, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ సయ్యద్ జియావుద్దీన్, బార్ అధ్యక్షుడు వై.సూర్య నారాయణ పాల్గొన్నారు. -
జీజీహెచ్లో కరోనా వైద్య సేవలు
గుంటూరు మెడికల్: కొన్నేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ మరోసారి వెలుగులోకి వచ్చింది. పలువురు బాధితులు కరోనాతో బాధపడుతుండటంతో గుంటూరు జీజీహెచ్లో కరోనా బాధితుల కోసం ప్రత్యేకంగా 15 పడకలతో వార్డు ఏర్పాటు చేశారు. ఇన్పేషెంట్ విభాగంలో బీ క్లాస్ రూములో కూడా బాధితుల కోసం సిద్ధం చేసి ఉంచారు. అత్యవసర విభాగం వల్ల నూతనంగా నిర్మించిన స్టెప్ డౌన్ ఐసీయూ గదిని కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ తెలిపారు. ఇప్పటికే కరోనా అనుమానంతో వచ్చిన ఐదుగురికి వైద్య పరీక్షలు చేశామని, రిపోర్టు నెగిటివ్ వచ్చిందని వెల్లడించారు. జీజీహెచ్లో కరోనా బాధితులకు ప్రత్యేకంగా ఓపీని ప్రారంభించామన్నారు. ఆక్సిజన్ కాన్సెట్రేటర్స్, సీక్యాప్ మిషన్లు, వెంటిలేటర్లు అందుబాటులో ఉంచామన్నారు. జనరల్ మెడిసిన్ వైద్యులు ప్రత్యేకంగా బృందాలుగా ఏర్పడి కరోనా వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. వైద్య సేవలకు సిద్ధంగా ఉండండి రాష్ట్రవ్యాప్తంగా టీచింగ్ ఆసుపత్రుల్లో కరోనా వైద్య సేవలు అందించేందుకు ఆయా టీచింగ్ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు సిద్ధంగా ఉండాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డీఎంఈ ఆదేశించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా టీచింగ్ ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో జూమ్ కాన్ఫరెన్సు నిర్వహించారు. సమావేశంలో డీఈఓ డాక్టర్ నరసింహం మాట్లాడుతూ గుంటూరు జీజీహెచ్లో ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో ఎక్కువ మంది చికిత్స పొందేలా చూడాలన్నారు. ఈ – హాస్పిటల్ వైద్య సేవలు పెంచాలన్నారు. సమావేశానికి హాజరు కాని జీజీహెచ్ వైద్యులకు మెమో జారీ చేయాలని ఆదేశించారు. సమీక్షలో గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణతోపాటు పలు వైద్య విభాగాధిపతులు, ఆయా టీచింగ్ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. -
‘యోగాంధ్ర’ లక్ష్యాలను చేరుకోవాలి
బాపట్ల: యోగాంధ్రలో సభ్యత్వ నమోదు లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమాలు, సభ్యత్వ నమోదుపై జిల్లా మండల స్థాయి అధికారులతో బుధవారం ఆయన వీడియో సమావేశం నిర్వహించారు. యోగాంధ్ర కార్యక్రమాలు బాపట్ల జిల్లాలో జయప్రదంగా నిర్వహించడానికి ట్రైనర్లకు సమర్థంగా శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ చెప్పారు. జూన్ 21వ తేదీన మెగా డే నిర్వహిస్తున్న నేపథ్యంలో జిల్లాలో 6,31,435 మందిని సభ్యులుగా చేర్చాల్సి ఉండగా ప్రస్తుతం 1,21,213 మంది సభ్యులయ్యారన్నారు. మాస్టర్ ట్రైనర్లకు ఈ నెల 29 నుంచి జూన్ రెండో తేదీ వరకు శిక్షణ కొనసాగుతుందన్నారు. జాతీయస్థాయి కార్యక్రమం విశాఖపట్నంలో నిర్వహిస్తున్నందున అక్కడకు వెళ్లే వారిని ఎంపిక చేసి శిక్షణ ఇవ్వాలన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ నగదు పంపిణీ ప్రక్రియను ఈనెల 31వ తేదీన ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ చెప్పారు. డీఆర్డీఏ పి.డి. శ్రీనివాసరావు, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.విజయమ్మ, డీపీఓ ప్రభాకర్ రావు, డీటీసీ పరంధామరెడ్డి, ఎస్ఎస్ఏ ఏపీసీ నాగిరెడ్డి, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి కె.పాల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. చిన్నారుల సంరక్షణకు చర్యలు బాపట్ల: బాలల ఆశ్రమాలు, సంరక్షణ కేంద్రాలు చట్ట ప్రకారం నడిచేలా అధికారులు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి తెలిపారు. సీసీఐఆర్సీ జిల్లా కమిటీ సమావేశం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగింది. బాలల సంరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. జిల్లాలో 23 బాలల ఆశ్రమాలు, సంరక్షణ కేంద్రాల లైసెన్సుల పునరుద్ధరణకు సంబంధించిన దస్త్రాలను పునఃపరిశీలన చేయాలన్నారు. ఆ సంస్థల పనితీరుపై క్షేత్రస్థాయిలో విచారించిన అధికారులు కమిటీకి నివేదించారు. కమిటీ నివేదికను కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. అనాధలకు ఆశ్రయం కల్పించే సంస్థలలో మౌలిక సదుపాయాలు, కనీస వసతులు, సిబ్బంది పనితీరు, అందిస్తున్న సేవలు, సంబంధిత దస్త్రాలను పరిశీలించిన తదుపరి లైసెన్సులు ఇవ్వాలన్నారు. జువెనల్ జస్టిస్ సంక్షేమ ప్రొబిషన్ అధికారి సౌందర్య, సీ్త్ర శిశు సంక్షేమశాఖ పీడీ రాధా మాధవి, వివిధ శాఖల జిల్లా అధికారులు, డీసీపీఓ పురుషోత్తమరావు, బాలల సంరక్షణ, సంక్షేమ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తడి భూములను సంరక్షించాలి.. జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి బాపట్ల: జల వనరుల సమీపంలోని భూములు, పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి చెప్పారు. తడి భూమి సంరక్షణ జిల్లాస్థాయి కమిటీ సమావేశం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ తడి భూమి సంరక్షణపై కమిటీలోని అధికారులు బాధ్యత వహించాలన్నారు. జిల్లాలో 601 తడి భూములు ఉన్నాయన్నారు. ఈ భూములను వాణిజ్య అవసరాలకు వినియోగించరాదని, భూముల చుట్టూ రసాయనాల వినియోగం నిషేధమన్నారు. ఈ భూములపై సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాలను అధికారులు పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. అటవీశాఖ అధికారి వినోద్ కుమార్, కమిటీలోని సభ్యులైన వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
పచ్చిరొట్ట పైరుతో ప్రయోజనాలు
తెనాలి టౌన్: ఖరీఫ్ సాగుకు ముందు పచ్చిరొట్ట పైరు సాగు చేసుకోవాలని వ్యవసాయశాఖ రాష్ట్ర సంచాలకులు ఎస్.ఢిల్లీరావు రైతులకు సూచించారు. రూరల్ మండలం ఎరుకలపూడి గ్రామంలో రైతు ముళ్ళపూడి రంగయ్య ప్రయోగాత్మకంగా చేపట్టిన పీఎండీఎస్ క్షేత్రాన్ని బుధవారం ఎస్.ఢిల్లీరావు పలువురు అధికారులతో కలిసి పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ సంస్థ 7, 8 సంవత్సరాలుగా పరిశోధించి 32 రకాల పచ్చిరొట్ట విత్తనాలను రైతులకు అందిస్తున్నట్లు చెప్పారు. వీటిని వేసుకోవడం వలన సేంద్రియ కర్బనం పెరుగుతుందని తెలిపారు. ఎరువుల మోతాదు తగ్గించుకోవచ్చని వివరించారు. జనుము, జీలుగ, పిల్లి పెసర విత్తనాలను వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీపై పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఈ విధానం వలన కాంప్లెక్స్ ఎరువులు, పురుగు మందుల ఖర్చు భారీగా తగ్గించుకోవచ్చని అన్నారు. భూమి గుల్లబారి ఆరోగ్యంగా ఉంటుందని, సూక్ష్మపోషకాలు త్వరగా లభ్యమవుతాయని అన్నారు. ప్రతి రైతును చైతన్యపరచి పచ్చిరొట్ట విత్తనాలు వేసుకోనేలా అధికారులు పనిచేయాలని ఆదేశించారు. గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి ఎన్.వెంకటేశ్వర్లు, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె.రాజకుమారి, ఏడీఏ ఎన్.ఉషారాణి, ఏవో జి.ప్రేమ్సాగర్, ఏఈవోలు, వీఏఏలు, పలువురు రైతులు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ రాష్ట్ర సంచాలకులు -
గుంటుపల్లిలో ధాన్యం కొనుగోళ్లు
బల్లికురవ: బల్లికురవ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ద్వారా బుధవారం గుంటుపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టారు. ఈనెల 19న సాక్షిలో ‘ధాన్యం.. కలవరం’ అన్న శీర్షికతో ప్రచురించిన కథనానికి జిల్లా కలెక్టర్ జె. వెంకటమురళి, వ్యవసాయ శాఖాధికారులు, సొసైటీ అధికారులు తక్షణమే స్పందించారు. గ్రామాల వారీగా ఈ–పంట నమోదుతో రైతులు పండించిన ధాన్యాన్ని తక్షణమే వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా కొనుగోళ్లు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. మండల వ్యవసాయాధికారి ఎస్వీపీ కుమారి రైతు సేవా కేంద్రాల్లోని వీఏఏలు గ్రామాల వారీగా రైతుల వద్ద నిల్వ ఉన్న ధాన్యం వివరాలు సేకరించి జిల్లా అధికారులకు నివేదించారు. నెల్లూరు సన్నాలు కొనుగోళ్లకు అనుమతులు లభించటంతో గుంటుపల్లి గ్రామంలోని రైతుల వద్ద సుమారు 300 బస్తాలు నిల్వ ఉన్నట్లు సొసైటీ పర్సన్ ఇన్చార్జి బ్రహ్మయ్య గుర్తించి 75 కేజీల బస్తా రూ. 1740 లెక్కన కాటాలు వేసి ట్రాక్టర్ ద్వారా మిల్లుకు చేర్చారు. స్థానిక వ్యాపారులు బస్తా రూ. 1200 లకు కొనుగోళ్లు చేస్తూ కాటాలో నిలువుదోపిడి చేస్తున్న పరిస్థితులను ‘సాక్షి’లో కథనం ప్రచురించి సొసైటీ ద్వారా కొనుగోళ్లు జరిగేలా చేసి తమను ఆదుకోవటం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్, వ్యవసాయశాఖ, సొసైటీ అధికారులకు రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు. ట్రాక్టర్కు లోడ్ చేస్తున్న కూలీలు కలెక్టర్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం నెల్లూరు సన్నాలు కొనుగోళ్లు ప్రారంభం ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపిన రైతులు -
తీరనున్న రహదారిద్య్రం!
పర్చూరు(చినగంజాం): ఇంకొల్లు – పర్చూరు(పాత మద్రాస్) రోడ్డుకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ 23.88 కోట్లు మంజూరు చేసింది. ‘సాక్షి’ వరుస కథనాలతో ఆర్ అండ్బీ అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రోడ్డు నిర్మాణానికి రూ 22 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా ఇంకొల్లు సినిమా హాలు సెంటర్ నుంచి పర్చూరు బొమ్మల సెంటర్ వరకు 19 కి.మీ పొడవు, 7 మీటర్ల వెడల్పు పెంచే విధంగా బీటీ రోడ్డు నిర్మాణం పూర్తి చేసేందుకు మిత్రా కంపెనీ 2021 డిసెంబర్ 31న అగ్రిమెంట్ చేసుకుంది. ఇంకొల్లులో సిమెంట్ రోడ్డు నిర్మాణంతో పాటు రహదారిలోని కల్వర్టు పనులను దాదాపు పూర్తి చేశారు. మొత్తం రూ.4.50 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. అప్పటి వరకు జరిగిన పనులకు బిల్లులు చెల్లించే విషయంలో జాప్యం జరగడంతో కాంట్రాక్టర్ పనులను నిలిపి వేశారు. దాంతో రోడ్డు నిర్మాణానికి బ్రేక్ పడింది. కొత్త అంచనాలతో నిధులు మంజూరు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మంజూరు చేసిన రూ 22 కోట్ల నిధులకు సంబంధించి పనులు నిలిచి పోవడం, కాలం గడవడంతో నిర్మాణ వ్యయం పెరిగింది. దాంతో ఆర్అండ్బీ అధికారులు కొత్త అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపి నిధులు మంజూరు అయ్యేందుకు చర్యలు తీసుకున్నారు. రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ పర్చూరు– ఇంకొల్లు పాత మద్రాస్ రోడ్డుకు బుధవారం భూమి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్అండ్బీ అధికారులు డీఈ నళిని, జేఈ శ్రీకాంత్, మండల పార్టీ టీడీపీ అధ్యక్షుడు షంషుద్దీన్, పర్చూరు ఏఎంసీ చైర్మన్ గుంజి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. అన్నీ గుంతలే.. అక్కడక్కడ రోడ్డు.. రహదారి దుస్థితిరహదారి దుస్థితిపై సాక్షిలో ప్రచురితమైన కథనం ‘సాక్షి’ వరుస కథనాలతో స్పందించిన అధికారులు, ప్రజా ప్రతినిధులు రోడ్డు నిర్మాణానికి రూ 23.88 కోట్లు మంజూరు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే రూ.22 కోట్లు మంజూరు పనులు మొదలు పెట్టి రూ 4.50 కోట్ల మేర పూర్తయిన వైనం బిల్లులు అందక నిర్మాణ పనులు నిలిపేసిన కాంట్రాక్టర్ ఇంకొల్లు పర్చూరు రోడ్డు అధ్వానంగా ఉండటంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. రోడ్డుపై ప్రయాణం తీవ్ర అసౌకర్యంగా ఉండడంతో పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. కనీసం ద్విచక్రవాహనాలు వెళ్లేందుకు కూడా చాలా కష్టంగా మారింది. ఈ రోడ్డుపై జరిగిన ప్రమాదాల్లో పలువురు వాహన చోదకులు ప్రాణాలు సైతం కోల్పోయారు. ఈ మార్గంలో సరైన వంతెనలు, చప్టాలు లేక పోవడంతో వర్షాల సమయంలో వాగులు పొంగి రోడ్డుకు అడ్డంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు పూర్తిగా స్తంభించి పోతుంటాయి. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పై నుంచి వస్తున్న వర్షపు నీటితో కప్పల వాగు పొంగి ప్రవహిస్తుండటంతో ద్విచక్రవాహనదారులు సైతం ఇబ్బంది పడ్డారు. పర్చూరు నుంచి చిలకలూరి పేట, గుంటూరు, విజయవాడ, పల్నాడు మీదుగా హైదరాబాద్కు, ఇంకొల్లు నుంచి ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చైన్నెలకు వెళ్లేందుకు ఈ మార్గం అనువైనది. కాగా గతంలో జాతీయ రహదారులు పూర్తి స్థాయిలో నిర్మాణం జరక్క మునుపు ఇదే మార్గాన్ని వినియోగించేవారు. దాంతో ఈ మార్గానికి పాత మద్రాస్ రోడ్డు అనే పేరు స్థిర పడిపోయింది. రహదారి అధ్వాన పరిస్థితి, వాహనచోదకుల వెతలపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. -
చట్టవిరుద్ధంగా వ్యవహరించిన పోలీసులు
తెనాలి: నిందితుల అరెస్టు విషయంలో తెనాలి పోలీసులు చట్టవిరుద్ధంగా, అమానుషంగా వ్యవహరించారని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వై.నేతాజీ పేర్కొన్నారు. వారిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కానిస్టేబుల్పై దాడి ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసే క్రమంలో నడిరోడ్డుపై లాఠీలతో జులుం ప్రదర్శించటాన్ని ఖండించారు. బాధిత కుటుంబాన్ని ఈ మేరకు మంగళవారం సీపీఎం జిల్లా కమిటీ పరామర్శించింది. అయితానగర్కు చెందిన నిందితుల్లో ఒకరైన దోమ రాకేష్ నివాసానికి వెళ్లి, ఆయన తండ్రిని కలిసింది. కుటుంబ నేపథ్యాన్ని, ఘటన వివరాలను సభ్యులు తెలుసుకున్నారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అనంతరం చెంచుపేటలోని ప్రజాసంఘాల కార్యాలయంలో నేతాజీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెనాలిలో పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమన్నారు. పోలీసుల వైఖరిని ఖండిస్తున్నామని చెప్పారు. గత నెల 24వ తేదీన రాత్రి వేళలో కానిస్టేబుల్ కన్నా చిరంజీవిపై నిందితులు దాడి చేశారని, ఆ క్రమంలో దాడికి గురైన కానిస్టేబుల్ను వెంటపెట్టుకొని పోలీసులు 25న నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. 27న మధ్యాహ్నం వరకు పోలీస్ కస్టడీలో ఉన్న నిందితులను చిత్రహింసలకు గురి చేశారని బాధిత కుటుంబికులు చెప్పారని తెలిపారు. దానికి తోడు బహిరంగంగా నిందితులపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడిన వీడియో వారి నిరంకుశ ధోరణికి అద్దం పడుతోందన్నారు. దళితులు, మైనారిటీలు అనే కోణంలోనే పోలీసులు దాడి చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. నిందితులపై విచక్షణారహితంగా దాడి చేయాలని ఏ చట్టంలోనూ చెప్పలేదన్నారు. అయినా పోలీసులు చట్ట విరుద్ధంగా వ్యవహరించారని, ఇలాంటి చర్యలతో ప్రజాస్వామ్యంలో పోలీస్ వ్యవస్థ పై నమ్మకం సన్నగిల్లుతుందన్నారు. కానిస్టేబుల్పై యువకులు దాడికి పాల్పడిన ఘటన వెనుకనున్న ఆంతర్యాన్ని పోలీస్ ఉన్నతాధికారులు వెలికితీయాలన్నారు. కానిస్టేబుల్ కన్నా చిరంజీవి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పలు అభియోగాలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, అమానుషంగా వ్యవహరించిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు భావన్నారాయణ, తెనాలి ఏరియా కార్యదర్శి కె. బాబుప్రసాద్, ములకా శివసాంబిరెడ్డి పాల్గొన్నారు. నిందితులను చిత్రహింసలకు గురిచేశారు కానిస్టేబుల్ చిరంజీవిపైనా పలు అభియోగాలు సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ ఆరోపణ బాధిత కుటుంబానికి సీపీఎం బృందం పరామర్శ -
కర్రసాములో జిల్లా క్రీడాకారుల ప్రతిభ
గుంటూరు వెస్ట్ (క్రీడలు): కర్రసాము అంతర్జాతీయ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచినట్లు కాశీనాథ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ నిర్వాహకుడు కాశీనాథ్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహించిన పోటీల్లో వారు ప్రతిభ చూపారన్నారు. అంతర్జాతీయ కర్రసాము సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో 9 బంగారు, 5 రజత, 3 కాంస్య పతకాలు సహా మొత్తం 17 పతకాలను చిన్నారులు సాధించారని పేర్కొన్నారు. సాయి సుబ్రహ్మణ్యం, విజయ్ శిక్షణలో చిన్నారులు ఈ విజయం సాధించారని తెలిపారు. -
ఉద్యోగోన్నతులకు ధ్రువపత్రాల పరిశీలన
గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ఉపాధ్యాయులు హాజరు గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు జోన్–3 పరిధిలోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్, తత్సమాన కేడర్లలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు గ్రేడ్–2 హెచ్ఎంలుగా ఉద్యోగోన్నతి కల్పించేందుకు మంగళవారం గుంటూరులోని ఆర్జేడీ కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లాలో ఆరు, ప్రకాశం జిల్లాలో ఏడు, నెల్లూరు జిల్లాలో నాలుగు హెచ్ఎం పోస్టులను భర్తీ చేసేందుకు ఒక్కో పోస్టుకు ముగ్గురేసి చొప్పున స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను పిలిచారు. సీనియార్టీ జాబితాలో పొందుపర్చిన ఉపాధ్యాయులు తమ ధ్రువపత్రాలతో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి పర్యవేక్షణలో సీనియర్ హెచ్ఎంలు, ఉద్యోగులు ధ్రువపత్రాలను పరిశీలించారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలోని ప్రభుత్వ స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు సర్వీసు రిజిస్టర్, సామాజిక ధ్రువీకరణ పత్రం ఒరిజినల్, విద్యార్హతల సర్టిఫికెట్లను పరిశీలించారు. ఉపాధ్యాయ బదిలీలతో ఏర్పడే ఖాళీల్లో సంబంధిత స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతులు కల్పించనున్నారు. అర్హత లేని వారికి ప్రాధాన్యం గ్రేడ్–2 హెచ్ఎం పోస్టుల్లో ఉద్యోగోన్నతులు కల్పించేందుకు రూపొందించిన సీనియార్టీ జాబితాలో అర్హత లేని వారికి ముందు వరుసలో స్థానం కల్పించినట్లు పలువురు ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. మెరిట్, రోస్టర్ను పాటించకుండా యథేచ్ఛగా అర్హత లేని వారికి ప్రాధాన్యతను ఇచ్చి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఉపాధ్యాయులు విమర్శిస్తున్నారు. తద్వారా అర్హులైన ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతోందని, ఆర్జేడీ కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. జెడ్పీ, మున్సిపల్ హెచ్ఎం పోస్టులకు... గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని జెడ్పీ, నగరపాలక సంస్థ, మున్సిపల్ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయ పోస్టులకు అర్హులైన స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ మంగళవారం పాత బస్టాండ్ సెంటర్లోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని జిల్లా పరీక్షా భవన్లో నిర్వహించారు. జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక పర్యవేక్షణలో సీనియార్టీ జాబితాలో పొందుపర్చిన ఉపాధ్యాయులు విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలను పరిశీలించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉద్యోగోన్నతుల ద్వారా భర్తీ చేయనున్న హెచ్ఎం పోస్టుల్లో జెడ్పీ–59, మున్సిపల్–8, కార్పొరేషన్–9 చొప్పున ఉన్నాయి. ఆయా పోస్టుల వారీగా అర్హులైన ఉపాధ్యాయులను ఒక్కో పోస్టుకు ముగ్గురేసి చొప్పున సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారు. బదిలీల ప్రక్రియ అనంతరం ఖాళీల ఆధారంగా సంబంధిత స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు హెచ్ఎంలుగా ఉద్యోగోన్నతి కల్పించనున్నారు. సీనియర్ హెచ్ఎంలు, ఉద్యోగులు ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియలో పాల్గొన్నారు. -
నైపుణ్యాభివృద్ధి తరగతులు ప్రారంభం
తాడికొండ: మహిళలు, యువతకు నైపుణ్యాభివృద్ధి, సెన్సిటైజేషనుకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాల ద్వారా సాధికారత సాధించవచ్చని ఏపీ సీఆర్డీఏ నైపుణ్యాభివృద్ధి అధికారులు తెలిపారు. అమరావతి ప్రాంతంలో మహిళలకు సాధికారత కల్పించడం, యువతకు నైపుణ్యాలను అందించేందుకు తుళ్ళూరులో ఈ కార్యక్రమాలను ప్రారంభించామన్నారు. నిర్మాణ స్థలాల వద్ద కార్మికుల రాకను దృష్టిలో ఉంచుకొని జెండర్ కమిటీల సభ్యులైన 368 స్వయం సహాయక బృంద మహిళలకు లింగ ఆధారిత హింసపై సెన్సిటైజేషన్ శిక్షణ ఇస్తున్నారు. వీరు సంబంధిత ఫిర్యాదులపై పని చేస్తారని అధికారులు తెలిపారు. ఏపీ సీఆర్డీఏ స్కిల్ హబ్ తుళ్ళూరులో పెయింటింగ్ కోర్సులో 22 మంది, డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సు 30 మంది, ఫ్రంట్ ఆఫీస్ మేనేజ్మెంట్ కోర్సులో 29 మందికి శిక్షణ ప్రారంభమైందన్నారు. -
దురాచారాల నిర్మూలనలో పరిషత్ల కృషి ఎనలేనిది
నాదెండ్ల: నేటి సమాజంలో సాంఘిక దురాచారాలను నిర్మూలించేందుకు నాటికల ద్వారా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసేందుకు కళాపరిషత్లు చేస్తున్న కృషి అభినందనీయమని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు చెప్పారు. నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో ఎన్టీఆర్ కళాపరిషత్ తృతీయ జాతీయస్థాయి నాటికల పోటీలు నాలుగోరోజు మంగళవారం కొనసాగాయి. సభాధ్యక్షులుగా హైకోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వ్యవహరించారు. అతిథులుగా అనంతవరం ఎన్టీఆర్ కళాపరిషత్ అధ్యక్షుడు గూదే పాండురంగారావు, సినీ హీరో సందేశ్ హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా హాజరైన ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఏటా రాష్ట్రంలో వేల కళాపరిషత్ నాటికలు సమాజంలో నెలకొన్న దురాచారాలు, మూఢ నమ్మకాల నిర్మూలనకు విశేష కృషి చేస్తున్నాయన్నారు. అనంతరం దర్శకుడు, రచయిత సుంకర కోటేశ్వరరావు, నాటక రూపశిల్పి కె.థామస్లను కళాపరిషత్ సభ్యులు శాలువాలు, మెమొంటోలతో సత్కరించారు. కార్యక్రమాలను కళాపరిషత్ అధ్యక్షుడు నడింపల్లి వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు. ఆకట్టుకున్న ప్రదర్శనలు... హైదరాబాద్ గోవాడ క్రియేషన్స్ వారి జ్యోతిరాజ్ రచనలో, వెంకట గోవాడ దర్శకత్వం వహించిన ‘అమ్మచెక్కిన బొమ్మ’ నాటిక ఆకట్టుకుంది. న్యూఢిల్లీ వారి అనశ్వరం నాటిక, చిలకలూరిపేట మద్దుకూరి ఆర్ట్స్ వారి ‘మా ఇంట్లో మహాభారతం’ నాటికలు ఆకట్టుకున్నాయి. నేటి ప్రదర్శనలు... తాడేపల్లి అరవింద ఆర్ట్స్ ‘విడాకులు కావాలి’, తెనాలి అద్దేపల్లి ఆరాధ్యుల ఆర్ట్స్ ‘ఎవరు’, కాట్రపాడు ఉషోదయ కళానికేతన్ ‘కిడ్నాప్’ నాటికలు బుధవారం ప్రదర్శించనున్నారు.కొనసాగుతున్న జాతీయస్థాయి నాటిక పోటీలు -
ట్రాక్టర్ కింద పడి బాలిక దుర్మరణం
బెల్లంకొండ: ట్రాక్టర్ కింద పడి బాలిక మృతి చెందిన ఘటన మండలంలోని న్యూ చిట్యాల సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో న్యూ చిట్యాలకు చెందిన అడావత్ సంధ్య భాయి (13) అనే బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యూ చిట్యాలకు చెందిన సంధ్య భాయి మంచినీళ్ల కోసం బంధువుల బైక్పై బెల్లంకొండలోని వాటర్ ప్లాంట్ వద్దకు వెళ్తుంది. కాగా కొండ సమీపంలోకి రాగానే బెల్లంకొండ నుంచి మన్నెసుల్తాన్పాలెం వైపు వెళ్తున్న మరో బైక్ వీరిని ఢీకొంది. ఈ క్రమంలో సంధ్య భాయి బైక్ పై నుంచి రోడ్డు మీద పడిపోయింది. ఈ క్రమంలో వారి వెనకగా వేగంగా వస్తున్న ట్రాక్టర్ సంధ్య భాయిని తొక్కుకుంటూ వెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడిన బాలిక అక్కడికక్కడే మృతి చెందిందని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పూర్తి వివరాలు సేకరించి కేసు నమోదు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. కాగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
విద్యుత్ ఉద్యోగుల అభ్యున్నతికి కృషి చేయాలి
తెనాలి టౌన్: విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేయాలని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఏపీసీపీడీసీఎల్ టెక్నికల్ డైరెక్టర్ ఆవుల మురళీకృష్ణ యాదవ్ను ఎనర్జీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అందె రాజేష్ కోరారు. మంగళవారం విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో సీఎండీ పుల్లారెడ్డి, టెక్నికల్ డైరెక్టర్ ఆవుల మురళీకృష్ణ యాదవ్ను యూనియన్ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. యూనియన్ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. సర్వీసు కండీషన్లు, పదోన్నతులపై చర్చించినట్లు రాజేష్ తెలిపారు. అలవెన్స్ ఆర్డర్ కాపీ ఇవ్వాలని కోరారు. లీవ్ ఎన్క్యాష్మెంట్కు సంబంధించిన ఆర్డర్ను కూడా త్వరలో ఇస్తామని డైరెక్టర్ చెప్పినట్లు వివరించారు. కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్వలీ, ఎగ్జిక్యూటివ్ మెంబరు బీటీ కృష్ణ తదితరులు ఉన్నారు. -
కొరిశపాడు రిజర్వాయర్ పనులు వేగవంతం చేయాలి
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి బాపట్ల: కొరిశపాడు రిజర్వాయర్ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జె.వెంకటమురళి అధికారులను ఆదేశించారు. యర్రం చినపోలిరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పురోగతిపై మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని వీక్షణ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గుండ్లకమ్మ రిజర్వాయర్ నుంచి 1.33 టీఎంసీలతో బాపట్లలో 20వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే లక్ష్యంతో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కొరిశపాడు రిజర్వాయర్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్దేశించిందని, వాటికి సంబంధించిన పనులపై సంబంధిత ఇంజినీర్లను ఆరా తీశారు. రిజర్వాయర్ పనులలో మిగిలిన పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు కలెక్టర్కు వివరించారు. కొరిశపాడు రిజర్వాయర్లో మిగిలిన పనులను పూర్తి చేసేందుకు అవసరమైన నిధుల కోసం ప్రతిపాదన పంపామని చెప్పారు. భూ సేకరణకు రూ.6.65 కోట్లు మంజూరు చేశారని ఈఈ చెప్పారు. ఆ మొత్తం ఫీడర్ కెనాల్ పనులకు అవసరమైన 41 ఎకరాల భూమి కొనుగోలుకు సరిపోతాయని అన్నారు. భూ సేకరణకు సంబంధించిన బకాయి బిల్లుల చెల్లింపునకు సత్వర చర్యలు తీసుకోవాలని గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్ట్ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ను కలెక్టర్ ఆదేశించారు. రిజర్వాయర్ పనుల కోసం ప్రభుత్వం రెండు కోట్ల నిధులు మంజూరు చేసిందని, ఈ పనులు చేసేందుకు తూర్పుపాలెం, పెద్దూరు గ్రామస్తులు నిరాకరిస్తున్నారని జిల్లా కలెక్టర్ దృష్టికి ఇంజినీర్లు తీసుకువచ్చారు. ఆయా గ్రామాల ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి రిజర్వాయర్ వలన కలిగే ప్రయోజనాలను వివరించి ఒప్పించాలని కలెక్టర్ చీరాల ఆర్డీఓను ఆదేశించారు. ముంపు ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరించాలి కందుల ఓబుల్రెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్ ముంపు ప్రాంత ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జె.వెంకటమురళి అధికారులను ఆదేశించారు. రిజర్వాయర్ ముంపు ప్రాంతాల గురించి జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆరా తీశారు. పూర్తిగా ఒక గ్రామం పాక్షికంగా ఐదు గ్రామాలు ముంపునకు గురయ్యాయని అధికారులు వివరించారు. ముంపు గ్రామ ప్రజలందరూ ఆయా గ్రామాలను ఖాళీ చేసి వారికి కేటాయించిన ప్రదేశానికి తరలి వెళ్లారా లేదా అనే విషయంపై కలెక్టర్ ఆరా తీశారు. వారిలో కొంతమంది అదే ప్రాంతంలో ఉన్నారని, మరి కొంతమంది కొత్త ప్రాంతానికి తరలివెళ్లారని అధికారులు చెప్పారు. కొత్త ప్రాంతాలకు తరలి వెళ్లిన ప్రజలకు మౌలిక వసతుల కల్పనపై చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇచ్చిన భూములపై పూర్తి హక్కు కల్పించే విధంగా ప్రతిపాదనలు తయారు చేయాలని కలెక్టర్ కందుల ఓబుల్రెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రత్యేక ఉప కలెక్టర్ను ఆదేశించారు. కార్యక్రమంలో కందుల ఓబుల్ రెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్టు ప్రత్యేక ఉప కలెక్టర్ సీహెచ్ విజయ జ్యోతికుమారి, చీరాల రెవెన్యూ డివిజన్ అధికారి చంద్రశేఖర్, గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు జె.శ్రీహరి, ఎం రవి, డీఈలు ఏఈలు పాల్గొన్నారు. పక్కా గృహాల నిర్మాణ లక్ష్యాలను చేరుకోవాలి పక్కా గృహాల నిర్మాణంలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అధికారులు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి ఆదేశించారు. పక్కా గృహ నిర్మాణాల లక్ష్యాలపై జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందితో మంగళవారం ఆయన కలెక్టరేట్ నుంచి సమీక్ష నిర్వహించారు. గృహ నిర్మాణాలలో పురోగతి కనిపించాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూన్ 10వ తేదీన మెగా గృహప్రవేశాల కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందన్నారు. బాపట్ల జిల్లాలోనూ నిర్మాణాలు పూర్తిచేసిన వాటిని ప్రారంభించాలన్నారు. సమావేశంలో జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, మండల ప్రత్యేక అధికారులు, ఈఈలు, డీఈలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు. దైనందిన జీవితంలో యోగా భాగం కావాలి మనిషి దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని, యోగా చేయడం వల్ల ఆరోగ్యంతోపాటు మానసిక ఉల్లాసం లభిస్తుందని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అన్నారు. మంగళవారం ఉదయం యోగాంధ్ర క్యాంపెయిన్లో భాగంగా భావనారాయణస్వామి గుడి ఎదురు రథం బజారులో యోగా కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో డీఆర్వో జి గంగాధర్గౌడ్, డీఆర్డిఏ పీడీ శ్రీనివాసరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, పర్యాటక శాఖ అధికారి నాగిరెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి ఇన్చార్జి లవన్న, బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, బాపట్ల తహసీల్దార్ సలీమా పాల్గొన్నారు. -
ముగిసిన ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు
గుంటూరుఎడ్యుకేషన్: ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఏపీ ఈఏపీసెట్–2025 ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్టు లు (సీబీటీ) మంగళవారంతో ముగిశాయి. ఈ నెల 19న ప్రారంభమైన పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా జరిగాయి. ఈ నెల 19, 20వ తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. 21 నుంచి 27వ తేదీ వరకు ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశ పరీక్షలకు విద్యార్థులు హాజరయ్యారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 22 కేంద్రాల పరిధిలో అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజినీరింగ్ పరీక్షలకు దరఖాస్తు చేసిన 41,384 మంది విద్యార్థుల్లో 39,693 మంది హాజరయ్యారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే... ● గుంటూరు జిల్లాలోని 15 కేంద్రాల పరిధిలో దరఖాస్తు చేసుకున్న 25,731 మందిలో 24,607 మంది హాజరయ్యారు. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షకు 21,590 మందికిగాను 20,765 మంది, అగ్రిల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశ పరీక్షకు 4,141 మందికిగాను 3,842 మంది హాజరయ్యారు. ● పల్నాడు జిల్లాలోని 5 కేంద్రాల పరిధిలో దరఖాస్తు చేసిన 11,142 మందికిగాను 10,746 మంది హాజరయ్యారు. వీరిలో ఇంజినీరింగ్కు 9,214 మందికిగాను 8,944 మంది, అగ్రిల్చర్, ఫార్మసీ పరీక్షకు 1,928 మందికిగా ను 1,802మంది విద్యార్థులు హాజరయ్యారు. ● బాపట్ల జిల్లాలో బాపట్ల, చీరాలలో ఏర్పాటు చేసిన 2 కేంద్రాల పరిధిలో దరఖాస్తు చేసుకున్న 4,511 మందికిగాను 4,340 మంది హాజరయ్యారు. వీరిలో ఇంజినీరింగ్కు 3,409 మందికిగాను 3,304; అగ్రిల్చర్, ఫార్మసీ పరీక్షకు 1,102 మందికిగాను 1,036 చొప్పున హాజరయ్యారు. -
సారూ..డబ్బులు ఎప్పుడిస్తారు!
● ఏప్రిల్ 1న కొత్తగొల్లపాలెంలో చంద్రబాబు పింఛన్ల పంపిణీ ● సీఎం వస్తున్నారని మార్చి 28న రైతుల ధాన్యాన్ని తీసుకెళ్లిన అధికారులు ● ఏడు రైస్ మిల్లులకు మూడు వేల బస్తాల ధాన్యం తరలింపు ● రెండునెలలు దాటినా రైతుల ఖాతాలకు డబ్బులు జమచేయని ప్రభుత్వం ● కలెక్టరేట్ చుట్టూ అన్నదాతల ప్రదక్షిణ ● రేపు, మాపు అంటూ దాటవేస్తున్న అధికారులు ● రూ.50 లక్షలు ఆగిపోవడంతో లబోదిబోమంటున్న అన్నదాతలు సాక్షి ప్రతినిధి,బాపట్ల: ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చింది అనేది పాత సామెత. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన అన్నదాతలను నిలువునా ముంచింది. బాబుగారు వస్తున్నారని కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని హడావుడిగా ఎత్తుకెళ్లారు. ధాన్యం తీసుకున్న 48 గంటల్లోనే డబ్బులు జమచేస్తామని చెప్పిన అధికారులు 1440 గంటలు (60 రోజులు) దాటుతున్నా ఒక్క రూపాయి కూడా జమచేయలేదు. ఇప్పటికి పలుమార్లు జిల్లా కలెక్టర్ను కలిసి మొరపెట్టుకున్నా వారి సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. అదిగో వేస్తాం ఇదిగో వేస్తామంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా డబ్బులు ఇవ్వాలని వేడుకుంటున్నారు. జరిగింది ఇలా.. ఏప్రిల్ ఒకటో తేదీన పింఛన్ల పంపిణీ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు చినగంజాం మండలం కొత్త గొల్లపాలెం గ్రామానికి వచ్చారు. అప్పటికే రైతులు హార్వెస్టింగ్ పూర్తిచేసుకొని కల్లాల్లో ధాన్యం ఆరబెట్టుకున్నారు. ఇళ్లల్లో వసతి లేక కొందరు ఆరిన ధాన్యాన్ని ఆరు బయటనే నిల్వ చేశారు. ధాన్యాన్ని మద్దతు ధరకు కొనలేదని రైతులు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తే.. మొట్టికాయలు పడతాయని భయపడ్డ పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, కలెక్టర్ వెంకట మురళి, అప్పటి జేసీ ప్రఖర్జైన్, పౌరసరఫరాల అధికారి విలియమ్స్లు ధాన్యాన్ని ఇళ్లలో దాచుకోవాలని రైతులకు సూచించారు. వసతి లేదని వారు నిరాకరించారు. బెంబేలెత్తిన అధికారులు హుటాహుటిన 60 మంది రైతులకు చెందిన 3,000 బస్తాల ధాన్యాన్ని తూకాలు వేచించి ట్రాక్టర్ల ద్వారా చీరాల, వేటపాలెం, ఈపురుపాలెంల పరిధిలోని రాధాకృష్ణ, చెక్కబాబు, మారుతీట్రేడర్స్, బాలాజీ, వసంతలక్ష్మి, సుబ్రమణ్యం ట్రేడర్స్, సత్యనారాయణ రైస్మిల్లులకు తరలించారు. 48 గంటల్లో మద్దతు ధర ప్రకారం బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేస్తామని రైతులతో నమ్మబలికారు. ధాన్యం మిల్లులకు చేరడంతో కనీసం వారంలో డబ్బులు పడతాయని ఆశగా ఎదురు చూసిన రైతులకు నిరాశ తప్పలేదు. నెలలు దాటుతున్నా రైతుల ఖాతాల్లో పైసా జమకాలేదు. కొంపముంచిన అధికారుల హడావుడి రైతులు ధాన్యాన్ని అమ్మాలంటే వ్యవసాయ సహాయకులు ఇచ్చే ఈ క్రాప్ వివరాలతోపాటు షెడ్యూలింగ్, డేటా ఎంట్రీ, ఆర్ఎస్కె ఇచ్చే ట్రాక్ షీట్, జీపీఎస్ వెహికల్, ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్, మిల్లు నుంచి ఎక్నాలెడ్జిమెంట్లు అవసరం. ఇవన్నీ లేకుండా రైతు ధాన్యం కొనడం, డబ్బులు ఖాతాల్లో వేయడం జరగదు. సీఎం సభలో రైతులు గొడవచేయకూడదన్న అజెండాతో అధికారులు నిబంధన లు పాటించక ధాన్యాన్ని మిల్లులకు తరలించడంతో సాంకేతిక సమస్యలతో రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయలేని పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. 48 గంటల్లో ఇస్తామన్నారు... 1440 గంటలు గడిచిపోయింది.. లక్ష బస్తాల దిగుబడి.. కొన్నది మూడు వేల బస్తాలే.. నమ్మించి మోసగించారు పది ఎకరాల్లో వరి సాగు చేశాను. ముఖ్యమంత్రి వచ్చేముందు వరకు కల్లాల్లోనే ధాన్యం ఉంది. అధికారులు వచ్చి ధాన్యం మిల్లులకు తరలిస్తామన్నారు. ట్రాక్టర్ బాడుగలు, కాటా కూళ్లు మా చేతే పెట్టించారు. 200 బస్తాల ధాన్యం ఈపురిపాలెం చెక్కా బాబు మిల్లుకు తోలాం. తేమశాతం లేకపోయినా క్వింటాకు 12 కేజీలు కోత పెట్టారు. ప్రభుత్వం ధాన్యం డబ్బులు ఒక్క రూపాయి ఇవ్వలేదు. అధికారులు పలకడంలేదు. – వడ్లమూడి హరిబాబు, రైతు, కొత్తగొల్లపాలెం మాడబ్బులు మాకివ్వాలి నాలుగు ఎకరాల్లో వరి సాగు చేశాను. 112 బస్తాల ధాన్యం మిల్లులకు తోలాం. ఈ క్రాప్ వివరాలతోపాటు పద్ధతి ప్రకారం ధాన్యం కొనడంలేదని అనుమానించాం. అయినా కలెక్టర్, జిల్లా అధికారులు వచ్చి దగ్గరుండి ధాన్యం మిల్లులకు పంపిస్తుంటే డబ్బులు ఇస్తారని అనుకున్నాం. ఇంతలా మోసగిస్తారని అనుకోలేదు. రెండునెలలు దాటినా పైసా ఇవ్వలేదు. వెంటనే డబ్బులు ఇవ్వాలి. – ఎల్లవల సురేష్, రైతు, కొత్త గొల్లపాలెం ఆవులదొడ్డి కొత్తగొల్లపాలెం గ్రామంలో ఖరీఫ్ సీజన్లో 1500 ఎకరాల్లో వరి సాగుచేయగా ఎకరాకు 30 నుంచి 35 బస్తాల చొప్పున 45 వేల బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది. రబీలో దాదాపు 2 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా సుమారు 60 వేల బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది. ఖరీఫ్లో 90 వేల మెట్రిక్ టన్నులు, రబీలో 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం ముఖ్యమంత్రి పర్యటన నాటికి కొత్త గొల్లపాలెంలో ఒక్క బస్తా ధాన్యాన్నికూడా కొనలేదు. ముఖ్యమంత్రి పర్యటన పుణ్యమాని 3 వేల బస్తాలైనా కొన్నారు. వాస్తవానికి ట్రాక్టర్ బాడుగలు, ధాన్యం కాటాల డబ్బులను సైతం మాతోనే పెట్టించారని రైతులు వడ్లమూడి హరిబాబు, మల్లయ్య, అంజయ్య, సోమయ్య, సురేష్, నాగరాజు, రమేష్, గోపి, వెంకటేశ్వర్లు, గడ్డం సూరి ‘సాక్షి’తో వాపోయారు. ఇప్పటికై నా ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలని వారు కోరుతున్నారు. -
విజయకీలాద్రిపై సుదర్శన హోమం
తాడేపల్లిరూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై మంగళవారం సుదర్శన హోమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి వారి మంగళాశాసనాలతో అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం 9 గంటల నుంచి సర్వ రక్షాకర సుదర్శన హోమాన్ని నిర్వహించామని తెలిపారు. అమావాస్య రోజున హోమం, పారాయణం, శాంతులు, దానాలు చేయడం ఎంతో ఉన్నత ఫలితాలను ఇస్తాయని వివరించారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని ఆయన తెలిపారు. ఆర్జిత సేవలకు డిమాండ్ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వైశాఖ అమావాస్య నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించిన ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున ప్రధాన ఆలయంలోని మూలవిరాట్ వద్ద నిర్వహించిన ఖడ్గమాలార్చనలో ఆలయ ఈవో శీనానాయక్ దంపతులతో పాటు 27 మంది ఉభయదాతలు పాల్గొన్నారు. ఇక మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాలలో నిర్వహించిన చండీహోమంలో 183 మంది ఉభయదాతలు పాల్గొన్నారు. ఆలయ యాగశాలలో కూర్చునేందుకు వీలు లేకపోవడంతో యాగశాల ఆరు బయట కూర్చుని భక్తులు యాగంలో పాల్గొన్నారు. ఆర్జిత సేవల్లో పాల్గొన్న ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ మార్గం ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. -
కొండవీడుకోటలో ఉద్రిక్తత
యడ్లపాడు: పర్యాటక కొండవీడుకోట ప్రాంతంలో సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. గుంటూరు మిర్చి యార్డు సమీపంలోని సాయినగర్కు చెందిన లక్ష్మీప్రియ, భర్త ముని కోటేశ్వరరావు, కుమార్తె, మేనల్లుడు సోమవారం సాయంత్రం సందర్శనకు రాగా, కొండవద్ద ఉన్న స్ట్రైకర్ల (ఔట్సోర్సింగ్)తో వాగ్వాదం జరిగింది. స్ట్రైకర్ల సమాచారంతో గ్రామస్తులు సందర్శకుల కారును ఆపి దాడిచేసి, కారు అద్దాన్ని ధ్వంసం చేశారంటూ ఘటన స్థలం నుంచి బాధితులు పోలీసులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం పోలీసులు ఈ సంఘటనపై విచారణ ప్రారంభించారు. చిలకలూరిపేట రూరల్ సీఐ బి.సుబ్బానాయుడు, యడ్లపాడు ఎస్ఐ టి శివరామకృష్ణతో కలిసి పర్యాటక కేంద్రాన్ని సందర్శించారు. కొత్తపాలెం ఘాట్రోడ్డుకు చేరుకొని అటవీశాఖ ఆధీనంలో విధులు నిర్వహిస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బందితోపాటు గ్రామస్తులను కలిశారు. ఘటన సమయంలో విధుల్లో ఉన్న స్ట్రైకర్లు, అటవీశాఖ అధికారులు, గ్రామ పెద్దలతో మాట్లాడి ఉద్రిక్తతకు దారితీసిన పరిస్థితుల్ని తెలుసుకున్నారు. సమగ్ర విచారణ అనంతరంకేసులు నమోదు సోమవారం రాత్రి జరిగిన సంఘటనపై సమగ్ర విచారణ తర్వాత కేసు నమోదు చేయనున్నట్లు సీఐ సుబ్బానాయుడు చెప్పారు. కొండవీడుకోటకు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఘాట్రోడ్డుపై విధుల్లో ఉన్న స్ట్రైకర్లు యూనిఫారమ్, గుర్తింపు కార్డులు లేకుండా విధులు నిర్వహించడమే ప్రధానంగా సందర్శకుల్లో అపోహలు కలగడానికి దారితీసినట్టు ప్రాథమికంగా గుర్తించామన్నారు. స్ట్రైకర్లు సహనం పాటించకపోవడం, గ్రామస్తులకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతోనే స్థానికులు కారును అడ్డగించి దాడికి పాల్పడినట్లు తెలిసిందని వివరించారు. సోమవారం రాత్రి యడ్లపాడు పోలీసులకు ఘటన సమాచారం అందగానే కానిస్టేబుల్ కొత్తపాలెం గ్రామానికి చేరుకునేలోపు వారు అక్కడి నుంచి వెళ్లిపోయారని చెప్పారు. సందర్శకుల కారు నంబర్ ఆధారంగా వారి ఫోన్ నెంబర్లను సేకరించి, వ్యక్తులతో మాట్లాడి వాస్తవాలను తెలుసుకుంటామన్నారు. మంగళవారం సాయంత్రం వరకు బాధితుల నుంచి ఎలాంటి సమాచారం అందలేదన్నారు. సమగ్ర సమాచారం వెలుగులోకి వచ్చిన అనంతరం ఘటనకు కారణమైన వారిపై కేసులు నమోదు చేస్తామని సీఐ బి సుబ్బానాయుడు స్పష్టం చేశారు. -
వ్యక్తి అనుమానాస్పద మృతి
క్రోసూరు: మండలంలోని విప్పర్ల, ఊటుకూరు గ్రామాల ప్రధాన రహదారిపై ఒంటిపై తీవ్ర గాయాలపై వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెంది ఉండడం కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు అచ్చంపేట సీఐ శ్రీనివాసరావు, క్రోసూరు ఎస్ఐ పి.రవిబాబులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు జరిపారు. మృతుడు క్రోసూరు మండలంలోని అనంతవరం గ్రామానికి చెందిన కుంభా సాంబశివరావు(35)గా గుర్తించారు. తన ద్విచక్రవాహనం పక్కన ఒంటిపై తీవ్ర గాయాలతో చొక్కా లేకుండా పడి ఉండటాన్ని గమనించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. క్లూస్టీం, డ్వాగ్ స్క్వాడ్ను తెప్పించారు. కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. మృతుడు పెదకూరపాడు మండలం 75 త్యాళ్లూరుకు చెందిన వాడు. క్రోసూరు మండలంలోని అనంతవరం గ్రామానికి చెందిన అనంతమ్మను వివాహం చేసుకుని సుమారు 10 సంవత్సరాల నుంచి అనంతవరంలోనే ఉంటున్నట్లు తెలిపారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. -
పొగాకు రైతుకు అండగా వైఎస్సార్ సీపీ
అద్దంకి: పొగాకు రైతుకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని ఆ పార్టీ అద్దంకి నియోజకవర్గ ఇన్చార్జి పానెం చిన హనిమిరెడ్డి చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 28న పొగాకు రైతుల సమస్యలు తెలుసుకోవడం కోసం పొదిలి వస్తున్నారని చెప్పారు. దీనికి సంబంధించి బాపట్ల జిల్లాలోని స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం పోరుబాట పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న రైతులు, నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం నల్ల బర్లీ సాగు చేసిన రైతు పరిస్థితి జీవన్మరణ స్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వైపు దిగుబడులు పడిపోవడం, మరో వైపు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోవడం రైతుల పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తోందన్నారు. ఆదుకోవాలని ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా స్పందించలేదన్నారు. అందుకే పొగాకు రైతుల తరఫున పోరాటం చేసేందుకు, వారికి ధైర్యం కల్పించేందుకు జగన్ పొదిలి రానున్నట్లు చెప్పారు. అయితే టీడీపీ నాయకులు, అక్కడ హడావుడి చేసే పరిస్థితి కనిపిస్తోందన్నారు. కానీ తమ నేత అనుకున్న కార్యక్రమం పూర్తి చేస్తారని స్పష్టం చేశారు. చేతనైతే రైతులకు సాయం చేసే విధంగా ఉండాలే తప్ప వారికి మేలు జరిగే పనిని అడ్డుకోవాలనుకుంటే ప్రజలు బుద్ధి చెప్పి తీరుతారన్నారు. తమ పార్టీ తరఫున ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు జ్యోతి హనుమంతరావు, పట్టణ అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి, రాష్ట్ర బూత్ కమిటీ జాయింట్ సెక్రటరీ పులికం కోటిరెడ్డి, ప్రచార కమిటీ జాయింట్ సెక్రటరీ కోయి అంకారావు, వాణిజ్య విభాగం అధ్యక్షుడు జి.రఘురామగుప్తా, కొల్లా భువనేశ్వరి, మండల కన్వీనర్లు కృష్ణబాబు, నాగేశ్వరరావు, వివిధ మండలాల నాయకులు, కౌన్సిలర్లు, వివిధ హోదాల్లో ఉన్న మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కీటక జనిత వ్యాధులపై అప్రమత్తత అవసరం
డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి గుంటూరు మెడికల్: వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో దోమలు వృద్ధి చెంది వ్యాధులు వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి సూచించారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో సోమవారం మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్, అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్లతో కీటక జనిత వ్యాధుల నివారణపై సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డీఎంహెచ్ఓ మాట్లాడుతూ దోమలు వృద్ధి చెందకుండా యాంటీ లార్వా మెజర్స్ అమలు చేయాలన్నారు. అడల్డ్ మస్కిటో మెజర్స్పై అప్రమత్తంగా ఉండాలన్నారు. డెంగీ, మలేరియా వంటి దోమ కాటు వ్యాధులను గణనీయంగా తగ్గించేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలన్నారు. పరిసరాల పరిశుభ్రత వల్ల దోమలు దరిచేరవని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతోపాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేలా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి సుబ్బరాయణం, అసిస్టెంట్ మలేరియా అధికారి రాజునాయక్, ఏఎంఓ ప్రభాకర్రెడ్డి, ఘంటసాల శ్రీనివాసరావు, నరేంద్రబాబు, ప్రశాంత్, సబ్ యూనిట్ ఆఫీసర్లు శేషగిరిరాజు, శ్రీమన్నారాయణ, శిగణేష్ పాల్గొన్నారు. -
బహిర్భూమికి వెళ్లి ప్రాణాలు వదిలాడు
పర్చూరు(చినగంజాం): బహిర్భూమికి వెళ్లి వాగులో ప్రమాదవశాత్తూ జారిపడి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన సంఘటన సోమవారం పర్చూరు గ్రామంలోని ఇందిరా కాలనీలో చోటుచేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం మేరకు.. జొన్నలగడ్డ మోహన్కుమార్(24) సోమవారం ఉదయం ఏడు గంటల సమయంలో తన ద్విచక్ర వాహనంపై బహిర్భూమికి వెళ్లాడు. ఆదివారం రాత్రి వర్షం కురవడంతో ప్రమాదవశాత్తూ జారిపడి వాగులో మునిగి పోయాడు. ఈ విషయాన్ని ఎవరూ గమనించలేదు. బహిర్భూమికి వెళ్లిన తన కుమారుడు ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో తండ్రి నాగరాజు అతని స్నేహితులను ఆరా తీశారు. అతడు తీసుకెళ్లిన ద్విచక్రవాహనం వాగు వద్ద ఉందని తెలియడంతో అక్కడికి వెళ్లి పరిసక ప్రాంతాలను గమనించినప్పటికీ కుమారుని జాడ కన్పించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించాడు. పర్చూరు ఎస్ఐ మాల్యాద్రి తన సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించి వాగులో మునిగి ఉంటాడనే అనుమానంతో చీరాల అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి వెతికించాడు. ఏడీఎఫ్ఓ రామకృష్ణ ఆధ్వర్యంలో మూడు గంటలపాటు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది చంద్రశేఖర్రెడ్డి, వెంకట సుబ్బయ్య, షేక్ షారూఖ్, వెంకట శివాజీ, శ్రీను.. వాగులో నుంచి మృతదేహాన్ని వెలికి తీశారు. మృతదేహాన్ని చూసిన వెంటనే తల్లిదండ్రులు, బంధువులు, కాలనీ వాసులు ఒక్కసారిగా బోరున విలపించారు. శవపంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పర్చూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దృష్టి సారించారు. చీరాల ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న జొన్నలగడ్డ నాగరాజుకు ఇద్దరు కుమారులు కాగా మోహన్కుమార్ పెద్ద కుమారుడు. డిగ్రీ చదువుకున్న అతనికి ఇంకా వివాహం కాలేదు. -
పోరాటానికి సిద్ధమవుతున్నాం
ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమవుతున్నాం. రేషన్ వాహనాలు తిప్పడానికి ఫిబ్రవరి 2027 వరకు గడువు ఉంది. అయినా ముందే ఆపేశారు. ప్రతి నెలా రూ.3 వేలు బ్యాంకుకు కిస్తీ చెల్లించాలి. వాహనం తీసుకునే సమయంలో రూ.68 వేలు అప్పు చేసి కట్టాం. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 90 శాతం సబ్సిడీతో వాహనం ఇచ్చారు. ప్రభుత్వం ఆ మొత్తం చెల్లించకపోతే తామే చెల్లించాలి. మా బాధలు అర్థం చేసుకోవాలి. –పులివర్తి రవీంద్రబాబు, యూనియన్ అధ్యక్షులు, భట్టిప్రోలు ● -
‘సాతి’పై అవగాహన కార్యక్రమం
గుంటూరు లీగల్: హైకోర్ట్ ఆదేశాల మేరకు నాల్గో అదనపు జిల్లా జడ్జి ఆర్.శరత్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం స్టేక్ హోల్డర్స్కు సాతి (సర్వే ఫర్ ఆధార్ అండ్ యాక్సిస్ త్రూ ట్రాకింగ్, హాలిస్టిక్ ఇంక్లూషన్) పై ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ పాల్గొని సాతి డిస్ట్రిక్ట్ కమిటీ విధి, విధానాల గురించి వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు, ఆధార్ నమోదు, న్యాయ సహాయం, సంక్షేమ పథకాలతో అనుసంధానం ద్వారా అనాథ పిల్లలను గుర్తించి, వారికి సహాయం చేయడానికి సాతి కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఏ ఒక్క బిడ్డ గుర్తింపు లేకుండా, వారి హక్కులు, అర్హతలకు దూరంగా ఉండకుండా చూసుకోవడమే దీని ప్రధాన లక్ష్యమన్నారు. వీధి బాలలు, అనాథలు, రక్షించబడిన పిల్లలు వంటి 18 సంవత్సరాల లోపు నిరాశ్రయులైన పిల్లలందరికీ చట్టపరమైన గుర్తింపును అందించడం, వారికి ప్రభుత్వ పథకాలు, విద్య, ఆరోగ్యం, రక్షణ సేవలను అందించడం జరుగుతుందన్నారు. ఈ కమిటీలో సెక్రటరీ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, చైర్ పర్సన్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి యూఐడీఏఐ ప్రతినిధి, ప్రతి తాలూకా తహసీల్దార్లు, జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా ఆరోగ్య అధికారి, సివిల్ సర్జన్, జిల్లా శిశు అభివృద్ధిశాఖ అధికారి, జువైనెల్ యూనిట్ నుంచి పోలీస్ అధికారి, అనాధ శరణాలయాలు, బాలల సంరక్షణ సంస్థల ప్రతినిధులు ఐదుగురు, ప్యానల్ లాయర్లు నలుగురు, పారా లీగల్ వలంటీర్లు నలుగురు సభ్యులుగా ఉంటారన్నారు. -
విద్యాశాఖ బదిలీలలు
గుంటూరు ఎడ్యుకేషన్: బదిలీలకు తెరలేచిందనే ఆనందం ఉపాధ్యాయుల్లో ఎక్కువ కాలం నిలిచేలా లేదు. ఎందుకంటే బదిలీకి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ప్రభుత్వం విధించిన కఠిన నిబంధనలతో కోరుకున్న పాఠశాలకు వెళ్లడం గగనమవుతోంది. ఒకవైపు బదిలీలు చేపడుతున్నామంటూనే మరోవైపు గతంలో ఎన్నడూ లేని రీతిలో విధించిన నిబంధనలతో ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో భాగంగా ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ మంగళవారం ముగియనుంది. ఇందుకు సంబంధించి జీఓ 22 ద్వారా విడుదల చేసిన మార్గదర్శకాలతో ఉపాధ్యాయులు బెంబేలెత్తుతున్నారు. పుట్టుకతో శారీరక వైకల్యానికి గురైన ఉపాధ్యాయులకు ప్రిఫరెన్షియల్ కేటగిరీ ద్వారా వారు కోరుకున్న పాఠశాలకు వెళ్లే సదుపాయంపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. శారీరక వైకల్యం 70శాతం లోపు ఉంటే ప్రాధాన్యత క్రమంలో పాయింట్లు, 70 శాతానికి పైగా ఉంటే ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రిఫరెన్షి యల్ కేటగిరీలో సంబంధిత ఉపాధ్యాయులు వారు పనిచేస్తున్న పాఠశాలలకు బదిలీపై వెళ్లవచ్చు. గత 25 ఏళ్లకు పైగా అమల్లో ఉన్న ఈ విధానాన్ని మార్చివేసి ఎస్జీటీలకు 40 శాతం, స్కూల్ అసిస్టెంట్లకు 50 శాతం సీలింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. కక్షపూరితంగానే..! శారీరక వైకల్యంతో బాధపడుతున్న వారిపై కనీస మానవత్వం లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. బదిలీల ప్రక్రియలో భాగంగా ఒకే పాఠశాలలు ఐదు విద్యాసంవత్సరాలు పూర్తి చేసుకున్న గ్రేడ్–2 హెచ్ఎం, ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులకు బదిలీ తప్పనిసరి. ● ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం ఒకరు లేక ఇద్దరు ఎస్జీటీలు ఉన్న ప్రాథమిక పాఠశాలలకు లాంగ్ స్టాండింగ్ విధానంలో బదిలీపై వెళ్లేందుకు పీహెచ్ కేటగిరీ ఉపాధ్యాయులకు అవకాశం లేదు. ముగ్గురి కంటే ఎక్కువ ఉపాధ్యాయులు ఉంటేనే సదరు పాఠశాలలను కోరుకోవాలని లేకుంటే మరో పాఠశాలకు వెళ్లాలంటూ ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వం, సీలింగ్ పరిధికి మించిన పాఠశాలలను బ్లాక్ చేసింది. ● పుట్టుకతో అంధత్వం, వినికిడి లోపంతో పాటు నడవలేని స్థితిలో ఉన్న ఉపాధ్యాయులకు గతంలో తాము పని చేస్తున్న పాఠశాలల్లోనే బదిలీ కాకుండా ఉండటంతో పాటు కోరుకున్న చోటకు బదిలీపై వెళ్లే అవకాశం ఉండేది. అయితే ప్రస్తుతం ఈ సదుపాయం లేకుండా ప్రిఫరెన్షియల్ కేటగిరీకి ప్రభుత్వం కొత్త భాష్యం చెబుతోంది. ● శారీరక వైకల్యంతోపాటు దీర్ఘకాలిక జబ్బులు, కేన్సర్, గుండె జబ్బులతో బాధపడుతున్న ఉపాధ్యాయులు హైస్కూళ్లలో సింగిల్ సబ్జెక్టు టీచర్లుగా బదిలీపై వెళ్లేందుకు అవకాశం లేకుండా చేశారు. అంధ, వినికిడి లోపం, నడవలేని స్థితిలో ఉన్నవారికి సైతం కోరుకున్న పాఠశాలలకు వెళ్లే అవకాశం లేకుండా కఠిన నిబంధనలు విధించారు. ప్రతి మండలంలో 15 వరకు ఖాళీలు ఉండగా, వాటిలో కేవలం ఐదు స్థానాలు మాత్రమే కోరుకునే విధంగా ఉంచి, మిగిలిన వాటిని బ్లాక్ చేశారు. ● దూరప్రాంతాల్లో మగ్గుతూ వైద్య సదుపాయాల కోసం పట్టణ ప్రాంతాలకు వెళ్లాలని ఆశపడుతు న్న టీచర్లకు మొండిచెయ్యి చూపారు. భర్త చనిపోయిన మహిళా ఉపాధ్యాయులకు విడాకులు తీసుకున్న ఉపాధ్యాయినులకు సైతం నిరాశే ఎదురవుతోంది. అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలు ఉన్న ఉపాధ్యాయులకు సైతం అన్యాయానికి గురవుతున్నారని ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఆర్థికంగా భారం లేని బదిలీల ప్రక్రియపై ప్రభుత్వం ఎందుకింత కఠినంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంఘాలతో జరిపిన చర్చలకు, మార్గదర్శకాలకు పొంతన లేదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. బదిలీలకు అవకాశం.. కఠిన నిబంధనలతో మెకాలొడ్డి.. శారీరక వైకల్యంతో బాధపడుతున్న వారిపై కనీస మానవత్వం కరవు 25 ఏళ్లుగా అమలులో ఉన్న ప్రిఫరెన్షియల్ కేటగిరీపై ఆంక్షలు ఉపాధ్యాయ బదిలీలకు నేటితో ముగియనున్న గడువు ఉమ్మడి గుంటూరు జిల్లాలో దాఖలైన దరఖాస్తులు 6,870 లాంగ్ స్టాండింగ్లో తప్పనిసరి బదిలీ కావాల్సిన హెచ్ఎంలు, టీచర్లు 4,143 మంది ఉమ్మడి జిల్లాలో 6,870 దరఖాస్తులు ఉపాధ్యాయ బదిలీల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మంగళవారం ముగియనుండగా, సోమవారం నాటికి ఉమ్మడి గుంటూరు జిల్లాలో 6,870 మంది ఉపాధ్యాయులకు బదిలీలకు దరఖాస్తు చేశారు. వీరిలో లాంగ్ స్టాండింగ్లో తప్పనిసరి బదిలీ కావాల్సిన హెచ్ఎంలు, టీచర్లు 4,143 మంది ఉన్నారు. మానవత్వం లేకుండా మార్గదర్శకాలు బదిలీల మార్గదర్శకాల్లో విద్యాశాఖాధికారులు ఇష్టారాజ్యంగా నిబంధనలు విధించారు. పీహెచ్ కేటగిరీతోపాటు ప్రిఫరెన్షియల్ కేటగిరీకి చెందిన ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం చేస్తూ పాఠశాలల్లో ఖాళీలను బ్లాక్ చేశారు. శారీరక వైకల్యానికి గురైన ఉపాధ్యాయుల కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పీడబ్ల్యూడీ చట్టానికి వ్యతిరేకంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. వైకల్యాన్ని అధిగమించి, ఎంతో కష్టపడి చదువుకుని ఉద్యోగం పొందిన వారిపై మానవత్వంతో వ్యవహరించాల్సినదిపోయి ఈ విధంగా కఠిన నిబంధనలు విధించడం దుర్మార్గం. – కె.బసవలింగారావు, జిల్లా అధ్యక్షుడు, ఏపీటీఎఫ్ వైకల్యంతో పుట్టడం మా తప్పా ? నేను గుంటూరు రూరల్ ఓబులనాయుడుపాలెంలోని ఎంపీయూపీఎస్లో పని చేస్తున్నాను. 70 శాతానికి పైగా శారీరక వైకల్యానికి గురైన నేను బదిలీల్లో గుంటూరుకు సమీపంలోని పాఠశాలలకు వెళ్లేందుకు అవకాశం లేకుండా చేశారు. ఉపాధ్యాయ బదిలీల చట్టంలో లేని విధంగా జీఓలో అనేక కఠిన నిబంధనలు విధించారు. శారీరక వైకల్యంతో జన్మించడం నా తప్పిదమా ? మానవత్వాన్ని చూపాల్సిన ప్రభుత్వం, అధికారులు ఈ విధంగా నిబంధలు విధించి పీహెచ్ కేటగిరీ ఉపాధ్యాయులకు అన్యాయం చేయడం తగదు. – పి.నాగశివన్నారాయణ, ఎస్జీటీ, గుంటూరు -
సూర్య ఘర్ ముప్త్ బిజ్లీ యోజన లక్ష్యాలను చేరుకోవాలి
బాపట్ల: ప్రధానమంత్రి సూర్య ఘర్ ముప్త్ బిజ్లీ యోజన పథకం అమలులో స్వయం సహాయక గ్రూపులకు బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి బ్యాంకర్లకు సూచించారు. సోమవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ బ్యాంకులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్య ఘర్ ముప్త్ బిజ్లీ యోజన పథకం కింద బాపట్ల జిల్లాలో 60 వేల కుటుంబాలకు సోలార్ సిస్టం ఏర్పాటు చేయాలని నిర్దేశించారని తెలిపారు. డిసెంబర్ నాటికి 47 వేల కనెక్షన్లు ఏర్పాటు చేయాలని నిర్దేశించినట్లు తెలిపారు. 2027 నాటికి మొత్తం లక్ష్యాన్ని పూర్తి చేయాలని తెలిపారు. ప్రతి ఇంటికి 3 కిలోవాట్స్ సోలార్ ప్లేట్లు అమర్చేందుకు నిర్ణయించడమైనదని తెలిపారు. ఈ పథకంకు సంబంధించి ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ మొదలు పెట్టడం జరిగిందన్నారు. దరఖాస్తు దారులు రూ.20 వేలు చెల్లించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు వచ్చిన తరువాత వాటిని తిరస్కరించకుండా రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్స్కు సూచించారు. స్వయం సహాయక గ్రూపుల నుంచి లోన్ రికవరీ మొత్తం చెల్లించే బాధ్యత మాదేనని కలెక్టర్ బ్యాంకులకు భరోసా ఇచ్చారు. సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె శ్రీనివాసరావు, ఏపీ ఎస్పీడీసీఎల్ ఎస్ఈ ఆంజనేయులు, ఎల్డీఎం శివకృష్ణ, బ్యాంకు మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు. బ్లాక్ బర్లీ వేగంగా కొనుగోలు చేయాలి బ్లాక్ బర్లీ పొగాకు పంటను కంపెనీలు వేగంగా కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జె.వెంకట మురళి తెలిపారు. సంక్షేమ పథకాల అమలు తీరు, అభివృద్ధి కార్యక్రమాలపై సోమవారం జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. పొగాకు కొనుగోలులో సమస్య ల పరిష్కారం కోసం పర్చూరులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తీసుకురావాలన్నారు. బ్లాక్ బర్లీ పొగాకు సంక్షోభంలో ఉన్నందున ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. పొగాకు కొనుగోలుపై ప్రజా ప్రతినిధుల పర్యవేక్షణ ఉంటుందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొగాకు కొనుగోలు తర్వాత పంట నిల్వ చేయడానికి అవసరమైన గోదాములు గుర్తించి, సిద్ధంగా ఉంచాలన్నారు. ధాన్యం సేకరణ వేగం పుంజుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి27నుంచి యోగాంధ్ర కార్యక్రమాలు ఈనెల 27వ తేదీన బాపట్లలోని భావపురి దేవాలయం ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై జిల్లా స్థాయి యోగా కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ వెంకట మురళి చెప్పారు. జిల్లా అధికారులు, వారి సిబ్బంది మొత్తం హాజరు కావాలన్నారు. అదే మాదిరిగా ఈనెల 31వ తేదీన సూర్యలంక సమీపంలోని అటవీ శాఖ నగర వనంలో భారీ స్థాయిలో యోగాసనాల కార్యక్రమం జరపాలన్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా లబ్ధిదారులకు నేరుగా నగదు పంపిణీ చేసే కార్యక్రమంపై మాట్లాడారు. జూన్ 22వ తేదీ తర్వాత గ్రామీణ ప్రాంతాలలోని రహదారుల వెంట చెత్త కనిపించరాదన్నారు. ప్లాస్టిక్ విక్రయా లు, వినియోగంపై ప్రజలకు విస్తృతమైన అవగాహన కల్పించాలన్నారు. డీఆర్వో జి గంగాధర్గౌడ్, ఉప కలెక్టర్ లవన్న, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
అర్జీలను తక్షణమే పరిష్కరించండి
బాపట్లటౌన్: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను చీరాల డీఎస్పీ మొయిన్కు వివరించారు. ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు ఆయన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం సంబంధిత పోలీస్స్టేషన్ సీఐలు, ఎస్ఐలతో మాట్లాడి సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. కొడుకు, కోడలు చంపాలని చూస్తున్నారు.. నాకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఆరేళ్ల కిందట నా దగ్గరున్న రూ.5 లక్షల నగదు నా పెద్దకుమారుడు నాగేశ్వరరావు తీసుకున్నారు. వాటిని తిరిగి ఇవ్వమని అడిగినందుకుగాను నా కొడుకు, కోడలు లక్ష్మీప్రసన్నలు నన్ను చంపాలని చూస్తున్నారు. వారు ఏ క్షణంలో ఏం చేస్తారోనని భయంగా ఉంది. నా కుమార్తె బంగారం కూడా బలవంతంగా తీసుకొని మమ్ములను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. –కరేటి పద్మ, యడవూరు, వేమూరు మండలంనరకం అనుభవిస్తున్నా .. నాకు ఐదేళ్ల కిందట గ్రామానికి చెందిన అక్కల మణికంఠరెడ్డితో వివాహం జరిగింది. నాకు ముగ్గురు ఆడపిల్లలు. నా భర్త ఏడాది కిందట చనిపోయాడు. అప్పటి నుంచి అత్త నాంచారమ్మ, మామ శివసుందర్రెడ్డిలు నన్ను ఇంటి నుంచి పంపించారు. నేను ప్రస్తుతం నా పుట్టింట్లోనే ఉంటున్నా. ముగ్గురు ఆడపిల్లలను పెట్టుకొని నరకం అనుభవిస్తున్నా, కనీసం నన్ను అత్త, మామలు పట్టించుకోవడం లేదు. ఇదేమని అడిగితే నీతో, నీ పిల్లలతో మాకు సంబంధం లేదని చెబుతున్నారు. పిల్లల భవిష్యత్తు ఊహించుకుంటేనే భయమేస్తుంది. –అక్కల కుసుమకుమారి, కొత్తపాలెం, చీరాల మండలం చీరాల డీఎస్పీ మొయిన్ అర్జీలు స్వీకరణ -
ఉమ్మడి గుంటూరు జిల్లాల ఎంయూఎఫ్ ముఖ్యనేతల నిర్ణయం
ముస్లింల చైతన్యానికి రాజకీయ వేదిక తెనాలి: ప్రస్తుత పరిస్థితుల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ (ఎంయూఎఫ్)ను బలోపేతం చేసుకుంటూ అనుబంధంగా రాజకీయ చైతన్య వేదికను ఏర్పాటు చేయాలని ఎంయూఎఫ్ ముఖ్యనేతల సమావేశం తీర్మానించింది. ఉమ్మడి గుంటూరు జిల్లా ఎంయూఎఫ్ ముఖ్యనేతల సమావేశం ఆదివారం స్థానిక చినరావూరులోని సీనియర్ నేత షేక్ ఖలీల్ అధ్యక్షతన జరిగింది. ప్రస్తుత రోజుల్లో ఎంయూఎఫ్ ఆవశ్యకత అనే అంశంపై జరిగిన సమావేశానికి ఆ సంస్థ అధ్యక్షుడు ఎండీ కలీం ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ గత 28 ఏళ్లుగా పార్లమెంట్ వ్యవస్థను విశ్వసిస్తూ, ప్రజాస్వామ్య లౌకికవాద విధానాలను అవలంభిస్తూ, ఎన్నో కార్యక్రమాలతో ముస్లింల న్యాయమైన హక్కులను సాధించేందుకు కృషిచేసినట్టు గుర్తుచేశారు. అధ్యక్షత వహించిన షేక్ ఖలీల్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఎంయూఎఫ్ను గుంటూరు ఉమ్మడిజిల్లాలో బలోపేతం చేసేందుకు 17 నియోజకవర్గాల్లో కమిటీల ఏర్పాటుకు ముఖ్యనేతలంతా కృషిచేయాలని కోరారు. ముస్లింలను రాజకీయంగా చైతన్యపరచాల్సిన అవసరం ఉన్నందున ముస్లిం యునైటెడ్ ఫ్రంట్కు అనుబంధంగా రాజకీయ చైతన్య వేదిక ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను సమావేశంలో ప్రవేశపెట్టారు. సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించటంతో తీర్మానం చేశారు. అన్ని నియోజకవర్గాల్లో ముఖ్య నాయకులు పర్యటించి నియోజకవర్గస్థాయి సమావేశాల నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో గుంటూరు జిల్లా ముఖ్య నాయకులు షేక్ కరీముల్లా (ప్రత్తిపాడు), ఎంఏ సాలార్ (వినుకొండ), షేక్ ఇబ్రహీం (పెదకూరపాడు), మెమన్ బాష, సయ్యద్ జాఫర్ (పొన్నూరు), సయ్యద్ జాకీర్ హుస్సేన్ (తాడికొండ ), సయ్యద్ ఆదమ్ సాహెబ్ (గుంటూరు వెస్ట్), సయ్యద్ గౌస్ బాషా, షేక్ వహీద్ (గుంటూరు ఈస్ట్)తోపాటు తెనాలి నియోజవర్గంలోని మండలాల నాయకులు పాల్గొన్నారు. నేడు రైతుల నిరసన దీక్ష చిలకలూరిపేట: నల్లబర్లీ పాగాకును వెంటనే కొనుగోలు చేయాలని మంగళవారం ఉదయం 10 గంటలకు ఐటీసీ కంపెనీ వద్ద రైతుల నిరసన దీక్ష నిర్వహిస్తున్నట్లు రైతు సంఘాల సమన్వయ సమితి సభ్యులు తెలిపారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సమక్షంలో పొగాకు కంపెనీలు అంగీకరించిన విధంగా కొనుగోళ్లు చేయకపోవడంతో ఈ దీక్ష చేపట్టినట్లు వెల్లడించారు. క్వింటా ఒక్కింటికి గత ఏడాది కొన్న రూ.15 వేలకు తక్కువ కాకుండా బర్లీ పొగాకు కంపెనీల చేత ప్రభుత్వం కొనిపించాలన్నారు. పొగాకు కంపెనీలు న్యాయమైన ధరకు కొనుగోలు చేయకపోతే మార్కెఫెడ్ ద్వారా కొని రైతులను ఆదుకోవాలన్నారు. పొగాకు బోర్డు పరిధిలోకి బర్లీ పొగాకును చేర్చాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం పొగాకు కంపెనీలకు పెద్దన్నగా వ్యవహరిస్తున్న ఐటీసీ కంపెనీ ముందు నిర్వహిస్తున్న నిరసన దీక్షలో రైతులు, రైతు సంఘాల నాయకులు, ప్రజలు, ప్రజాస్వామిక వాదులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. -
అర్జీలను వెంటనే పరిష్కరించాలి
బాపట్ల: పీజీఆర్ఎస్లో నమోదయ్యే అర్జీలను అధికారులు తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. పీజీఆర్ఎస్ కార్యక్రమం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సోమవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి కలెక్టర్ 177 అర్జీలు స్వీకరించారు. తన పరిధిలో ఉన్న వాటికి ఆయన తక్షణమే పరిష్కార మార్గం చూపారు. కొన్నింటిని పరిశీలన చేశారు. మరికొన్నిటిని విచారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తన పరిధిలో లేని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామని చెప్పారు. అర్జీల పరిష్కారంపై ప్రజల సంతృప్తిస్థాయి పెరిగేలా అధికారులు పనిచేయాలని చెప్పారు. అధికారులు నిర్లిప్తంగా ఉండరాదన్నారు. ప్రజలు సుభిక్షంగా ఉండడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. 22 క్యాటగిరీలో పెండింగ్లో ఉన్న 108 అర్జీలను తక్షణమే పరిష్కరించాలని ఆర్డీవోలకు సూచించారు. సాధారణ బదిలీల్లో అధికారులు పారదర్శకత పాటించాలన్నారు. బాపట్ల జిల్లాలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను ఇతర జిల్లాలకు బదిలీ చేయరాదన్నారు. ఆ స్థానంలో పొరుగు జిల్లాల నుంచి అదే హోదాలో వచ్చే వారు ఉంటేనే అనుమతి కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్గౌడ్, ఉప కలెక్టర్ లవన్న, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి -
రాజకీయ కుట్రతోనే రేషన్ వాహనాలు రద్దు
బాపట్లటౌన్: రాజకీయ కుట్రతోనే కూటమి సర్కార్ పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసే వాహనాలను రద్దుచేసిందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మజుందార్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా సోమవారం జిల్లాలోని ఎండీయూ వాహనాల ఆపరేటర్లు, హెల్పర్లు, ఎండీయూ వాహనాలతో పట్ణణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. తొలుత పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ కలెక్టరేట్ వరకు సాగింది. పోలీసులు అడ్డుకునే ప్రయత్నంచేసినప్పటికీ ఎండీయూ వాహనాల ఆపరేటర్లు ముందుకు సాగించారు. కలెక్టరేట్ ప్రాంగణంలోనికి వాహనాలను అనుమతించకపోవడంతో కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద వాహనాలను నిలుపుదల చేసి ఆపరేటర్లు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఎండీయూ వాహనాల ఆపరేటర్లకు సంఘీభావంగా సీఐటీయూ నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మజుందార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం పేదల అభ్యున్నతి కోసం నిత్యావసర సరుకులను డోర్ డెలివరీ చేస్తే ప్రస్తుతం ప్రభుత్వం వాటిని నిలుపుదల చేయటం సమంజసం కాదన్నారు. వాహనాలను నిలుపుదల చేయటం వలన జిల్లాలో 18,520 కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి పేద ప్రజలకు ఉపయోగకరంగా ఉండే ఈ విధానాన్ని కొనసాగించాలని, లోపాలు ఉంటే సరిచేసుకోవాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ బాపట్ల పట్టణ నాయకులు కే శరత్, ఎండీయూ వాహనాల జిల్లా నాయకులు ధార దేవసహాయం, గోపి, పేర్ని రమేష్, మేకల రాజేష్, రాఘవ పాల్గొన్నారు. ప్రభుత్వ చర్యను నిరసిస్తూ ఎండీయూ వాహనదారుల ఆందోళన ఎండీయూ వాహనాలతో బాపట్లలో భారీ ర్యాలీ అడ్డుకునేందుకు పోలీసుల యత్నం ఎట్టకేలకు కలెక్టర్కు వినతిపత్రం అందజేత -
కళల తెనాలికి ఆభరణం కాటూరి శిల్పకళ
తెనాలి: వంశ పారంపర్యంగా వస్తున్న శిల్పకళను కొనసాగిస్తూ అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొస్తున్న శిల్పకళాకారులు కాటూరి వెంకటేశ్వరరావు, ఆయన కుమారులు రవిచంద్ర, శ్రీహర్షలు తెనాలికి గర్వకారణమని పలువురు వక్తలు అభినందించారు. ప్రముఖ స్వచ్ఛంద సేవాసంస్థ మానవత తెనాలి శాఖ సర్వసభ్య సమావేశం ఆదివారం స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజి లైబ్రరీ హాలులో జరిగింది. సంస్థ తెనాలి చైర్మన్ డాక్టర్ కొలసాని రామ్చంద్ అధ్యక్షత వహించారు. రాష్ట్రప్రభుత్వ ‘కళారత్న’ అవార్డు గ్రహీత కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్షను ఈ వేదికపై సత్కరించారు. తెనాలిలో తొలిసారిగా శిల్పకళపై నిర్వహిస్తున్న కాటూరి ఆర్ట్ గ్యాలరీ, తండ్రీకొడుకుల శిల్పకళానైపుణ్యానికి నిదర్శనమని డాక్టర్ రామ్చంద్ అన్నారు. శిల్పకళలో తెనాలి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన శిల్పకారులను సత్కరించిన మానవత విధిగా భావించినట్టు తెలిపారు. సత్కారగ్రహీత కాటూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తండ్రీకొడుకులు ముగ్గురికీ ఒకే వేదికపై అభినందన గౌరవం మరచిపోలేనిదని చెప్పారు. తండ్రి కోటేశ్వరరావు నుండి వచ్చిన శిల్పకళను గురువు అంచే రాధాకృష్ణమూర్తి శిక్షణలో మెరుగుపరచుకున్నట్టు సోదాహరణంగా చెప్పారు. బీఎఫ్ఏలో పీజీ చేసిన రవిచంద్ర ఇనుప వ్యర్థాలకు శిల్పకళా సోయగాలు కల్పిస్తుంటే, శ్రీహర్ష త్రీడీ, ఏఐ టెక్నాలజీని జోడిస్తూ కళాత్మక ఉట్టిపడేలా చేస్తుండటం తమ అదృష్టమన్నారు. ఎన్ఎస్ఎస్ మున్సిపల్ హైస్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయుడు బెల్లంకొండ వెంకట్ నేతృత్వంలో ప్రదర్శించిన ‘తల్లికి వందనం’ కార్యక్రమం ఆకట్టుకుంది. ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడు ఓంకార్ ప్రసాద్, కార్యదర్శి పి.వెంకట్, డీవీ సోమయ్యశాస్త్రి, కూరపాటి కల్యాణి, మొవ్వా సత్యనారాయణ, ముత్తేవి రవీంద్రనాధ్, అయినాల మల్లేశ్వరరావు, వెంపటి సత్యనారాయణ పాల్గొన్నారు. సత్కార సభలో ప్రముఖుల అభినందన -
తిరునాళ్లలో ‘మైక్ అనుమతి’ నిరాకరణ
చెరుకుపల్లి: పొన్నపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ కార్మూరమ్మ వారి తిరునాళ్లకు మైక్ అనుమతి ఇవ్వకుండా స్థానిక పోలీసులు అడ్డుకున్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది. మండలంలోని పొన్నపల్లి గ్రామంలో ఎక్కువ శాతం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. 95 శాతం మంది వైఎస్సార్సీపీ సానుభూతిపరులు ఉన్నారు. పది రోజులు క్రితం మైక్ అనుమతి కోసం గ్రామ పెద్దలు మీ–సేవ ద్వారా చలానా తీశారు. స్థానిక ఎస్ఐ అనిల్కుమార్ను నాలుగు రోజులుగా పొన్నపల్లి గ్రామస్తులు సంప్రదిస్తూనే ఉన్నారు. గ్రామంలో గొడవలు జరుగుతాయనే సమాచారం ఉందని, అందుకే మైక్ పర్మిషన్ ఇవ్వలేమని చెప్పడం గమనార్హం. దీంతో ఆదివారం వైఎస్సార్సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరి గణేష్ నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లారు. రేపల్లె రూరల్ సీఐ సురేష్బాబును, ఎస్ఐ అనిల్ కుమార్ను దీనిపై సంప్రదించినా అనుమతికి ససేమిరా అన్నారు. వైఎస్సార్సీపీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు, డాక్టర్ ఈవూరి గణేష్ తదితరులు గ్రామస్తులతో కలిసి రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. దీంతో కొంతసేపు పోలీసులకు, నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ ఈవూరి గణేష్ మాట్లాడుతూ.. గ్రామంలోని వారు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నారని, కూటమి నేతల ఆదేశాల మేరకే స్థానిక పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారని తెలిపారు. ఇది మంచి సంప్రదాయం కాదన్నారు. ఇప్పటికై నా పోలీసు అధికారులు స్పందించి తిరునాళ్ల సంతోషంగా జరుపుకోవటానికి మైక్ అనుమతి ఇవ్వాలని కోరారు. సమాచారం తెలుసుకున్న రేపల్లె డీఎస్పీ అవల శ్రీనివాసరావు వచ్చి డాక్టర్ ఈవూరి గణేష్తో చర్చించారు. దీంతో మైక్ పర్మిషన్ వచ్చింది. దీనిపై గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం వరుకూటి అశోక్ బాబు, డాక్టర్ ఈవూరి గణేష్లు అమ్మవారిని కార్యకర్తలతో కలిసి దర్శించుకున్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ దుండి వెంకటరామిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. వెఎస్సార్సీపీకి గ్రామస్తులు అనుకూలమని పక్షపాతం రేపల్లె రూరల్ పోలీసుల అత్యుత్సాహం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరి గణేష్ ఆగ్రహం నిరసన తెలిపిన తర్వాత ఎట్టకేలకు డీఎస్పీ ఆదేశాలతో మైక్ అనుమతి -
వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కారుమూరు
వేమూరు: వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గానికి చెందిన కారుమూరు వెంకట రెడ్డిని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించినట్లు కేంద్ర పార్టీ కార్యాలయం ఆదివారం ప్రకటన జారీ చేసింది. చుండూరు మండలంలోని కారుమూరు పాలెం గ్రామానికి చెందిన కారుమూరు వెంకట రెడ్డి డిబేట్స్ విశ్లేషకులుగా, పార్టీలోనూ అనేక పదవులు చేపట్టారు. వైఎస్సార్సీపీ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పని చేశారు. నియోజకవర్గంలో కేవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కారుమూరు వెంకట రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు ప్రోత్సాహంతో తనకు పదవి లభించిందని తెలిపారు. ట్రాక్టర్ కింద పడి వ్యక్తి మృతి వేటపాలెం: ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని దేశాయిపేట పంచాయతీ పరిధి విఘ్నేశ్వర కాలనీ దగ్గర ఇసుక క్వారీలో ఆదివారం చోటు చేసుకుంది. కొత్తపేటలోని మూడు రోడ్లు దగ్గలో నివాసం ఉండే పిగిలి వాసు (38) తన ట్రాక్టర్తో ఇసుక క్వారీ వద్దకు వెళ్లాడు. ట్రాక్టర్ను క్వారీ వద్ద నిలిపి ఇసుక లోడ్ చేసుకునే సమయంలో కిందికి దిగాడు. ట్రాక్టర్ ఓ కుప్ప నుంచి ముందుకు దొర్లుకుంటూ పోతుండటంతో వాసు ట్రాక్టర్పైకి ఎక్కి దానిని ఆపేందుకు ప్రయత్నించాడు. ప్రమాదవ శాత్తు జారి ట్రాక్టర్ టైరు కింద పడిపోయాడు. వెంటనే అక్కడ ఉన్న వారు గమనించి చీరాల ఏరియా వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై వెంకటేశ్వర్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నాలుగు పర్యాటక ప్రదేశాల్లో యోగా ప్రదర్శన
నరసరావుపేట: యోగాంధ్ర కార్యక్రమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ప్రతి ఒక్కరికీ యోగా గొప్పతనాన్ని వివరించి వారితో ఆసనాలను వేయించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా ఇప్పటికే జిల్లాలో ఎంపిక చేసిన మాస్టర్ ట్రైనీలు, టీఓటీలకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెండో రోజు ఆదివారం కూడా శిక్షణ కొనసాగింది. ఆన్లైన్ ద్వారా జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహించారు. ఇందులో యోగా గురువులు, టీఓటీలు ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లాలో నాలుగు పర్యాటక ప్రాంతాల్లో భారీస్థాయిలో యోగా ప్రదర్శించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది. దీని ప్రకారం ఈనెల 28న కోటప్పకొండ, జూన్ 5న నాగార్జునసాగర్, 11న కొండవీడు కోట, 18న అమరావతి వద్ద ప్రదర్శనలు నిర్వహించనున్నారు. అంశాల ప్రాతిపదికగా ప్రతి జిల్లాకు ఒక థీమ్ను ప్రభుత్వం కేటాయించింది. దీనిలో భాగంగా జిల్లాలో వేలాది మంది ఏఎన్ఎం, ఆశా వర్కర్లు వర్కర్లతో జూన్ ఐదున యోగా ప్రదర్శనను నిర్వహించడానికి అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. శిక్షణ పొందినవారితో బాటు, సామాన్య ప్రజలు సైతం ఈ యోగా స్ట్రీట్కి వచ్చి ఆసనాలను అభ్యాసం చెయ్యవచ్చు. పోలీసు శాఖ అధ్వర్యంలో సోమవారం ఉదయం నరసరావుపేటలోని కలెక్టర్ బంగ్లా రోడ్డు వద్ద ప్రధాన రహదారిపై యోగా ప్రదర్శన నిర్వహించడానికి ఏర్పాటు చేశారు. 5న రాష్ట్ర స్థాయి కార్యక్రమం కొనసాగుతున్న శిక్షణ -
ముగిసిన ప్రసన్నాంజనేయుడి జయంత్యుత్సవాలు
బెల్లంకొండ: మండలంలోని బెల్లంకొండ క్రాస్ రోడ్ వద్ద గల శ్రీ కోళ్లూరు ప్రసన్నాంజనేయ స్వామి జయంతి, కల్యాణ ఉత్సవాలు ఆదివారం వైభవంగా ముగిశాయి. చివరి రోజున స్వామికి విశేష పూజలు జరిగాయి. ఉదయాన్నే ఆలయ ప్రధాన అర్చకులు బొర్రా వెంకట అనంతాచార్యులు స్వామికి సుప్రభాత సేవలతో పూజలు ప్రారంభించారు. అనంతరం లక్ష మల్లె పూలతో విశేష పూజలను నిర్వహించారు. చివరి రోజు భక్తులు పెద్దఎత్తున హాజరై స్వామికి పొంగళ్లు చేసి, నైవేద్యాలను సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. రాత్రి రాజుపాలెం గ్రామానికి చెందిన శ్రీ అంకమ్మ తల్లి కళా నాట్యమండలి వారి శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి పౌరాణిక నాటకాన్ని ప్రదర్శించారు. ఆదివారం ఆలయంలో హుండీని లెక్కించగా జనవరి నుంచి ఈ నెల 25 వరకూ హుండీ ద్వారా రూ. 3,28,366 ఆదాయం వచ్చినట్లు ఈవో పేర్కొన్నారు. ఐదు రోజుల పాటు ఉత్సవాల నిర్వహణకు సహకరించిన అందరికీ ఆలయ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తలిపారు. ఉత్సవాల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. చివరి రోజు లక్ష మల్లెలతో స్వామికి అభిషేకం -
మది దోచిన సంగీత, నాట్య కళారూపాలు
చిలకలూరిపేట: కన్నుల పండువగా సంప్రదాయ నృత్యాలు, వీనుల విందుగా సుమధుర సంగీత కీర్తనలు, నాట్య కళాకారుల ఉత్సాహపూరిత ప్ర దర్శనల మధ్య కళా నిలయం 40వ జాతీయ స్థా యి నవరస శాసీ్త్రయ, జానపద, సంగీత నాట్య కళా రూపాల పోటీలు ఆదివారం రెండో రోజు కొనసాగాయి. పోటీలకు వేదికై న పట్టణంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆర్యవైశ్య కల్యాణ మండపంలో భరతనాట్యం, కూచిపూడి పోటీలు సూర్య, చంద్ర విభాగాల్లో రసవత్తరంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు కాళ్లకు గజ్జెలు కట్టి ,చక్కటి హావభావాలతో నాట్యకళ ప్రదర్శించి, నటరాజ వారసులమని నిరూపించారు. కీర్తన, మూషిక వాహన, గణపతి కౌతం, వినాయక కౌతం, ముద్దుగారే యశోద, బాలగోపాల తరంగం, బ్రహ్మాంజలి, దశావతార శబ్దం,జనుత శబ్దం,కొండలలో నెలకొన్న, భామాకలాపం, నరసింహ వైభవం, హిమగిరి తనయ, అలవేల్ మంగ వంటి కీర్తనలకు లయబద్ధంగా నర్తించారు. రసజ్ఞులైన ప్రేక్షకులను రంజింపచేసి వారి ప్రశంసలను అందుకున్నారు. ఒకవైపు పోటీలు కొనసాగిస్తూనే మరోవైపు నాట్యకళ బోధించిన నాట్యాచార్యులకు సన్మానాలు నిర్వహించి వారి ఆశీస్సులు పొందారు. ముందుగా కళానిలయం నిర్వాహకుడు ప్రగడ రాజమోహనరావు సతీమణి శివసత్యనారాయణమ్మ జ్యోతి ప్రజ్వలన చేసి పూజ నిర్వహించారు. నేటి కార్యక్రమాలు సూర్య, చంద్ర విభాగాల్లో జానపద నృత్య పోటీలతో పాటు శాసీ్త్రయ జంట నాట్యాలు, అశాసీ్త్రయం జంట నాట్యాలు, శాసీ్త్రయ బృంద నాట్యాలు, అశాసీ్త్రయ బృంద నాట్యాలు, శాసీ్త్రయ నృత్యనాటికల పోటీలు సోమవారం నిర్వహిస్తారు. వీటితో పాటు నాట్యాచార్యులకు సన్మానాలు ఉంటాయి. ఆకట్టుకున్న నాటికలు నాదెండ్ల: మండలంలోని సాతులూరులో నటరత్న ఎన్టీఆర్ కళాపరిషత్ తృతీయ జాతీయ నాటికల పోటీలు ఆదివారం రెండో రోజు ప్రారంభమయ్యాయి. శనివారం రాత్రి కురిసిన వర్షంతో గుంటూరు ఆరాధన ఆర్ట్స్ ఆధ్వర్యంలో జరగాల్సిన ‘మరీ అంతొద్దు’ నాటిక ప్రదర్శన నిలిచిపోయింది. ఆదివారం తొలిగా ప్రదర్శించారు. అనంతరం కొలకలూరి శ్రీసాయి ఆర్ట్స్ ఆధ్వర్యంలో ‘జనరల్ బోగీలు’ నాటికను ప్రదర్శించారు. పీటీ మాధవ్ రచనకు గోపరాజు విజయ్ దర్శకత్వం వహించారు. విశాఖపట్నం భద్రం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘దొందూ దొందే’ నాటిక ప్రదర్శించారు. రచనా దర్శకత్వం డేవిడ్రాజు వహించారు. ఏలూరు హేలాపురి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘సారీ రాంగ్ నంబర్’ నాటికకు రచయితగా చింతల మల్లేశ్వరరావు, దర్శకుడిగా మహమ్మద్ ఖాజావలి వ్యవహరించారు. సామాజిక రుగ్మతలు, సందేశాలను నాటికలు ప్రస్ఫుటించాయి. జ్యోతి ప్రజ్వలన బండారుపల్లి మస్తాన్రావు, సభా పరిచయం నడింపల్లి వెంకటేశ్వరరావు చేయగా, సభాధ్యక్షత గరికపాటి వెంకట రామారావు వహించారు. నేటి ప్రదర్శనలు: బాపట్ల సహృదయ ద్రోణాదుల వారి ‘వర్క్ఫ్రం హోమ్’, సాతులూరు వజ్జా రామనాథం ఆర్ట్స్ ‘రారాజు సుయోధన’, వరంగల్ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక ‘ఏకాకి’ ప్రదర్శనలు నిర్వహించనున్నారు. రెండో రోజు కొనసాగిన కళానిలయం జాతీయస్థాయి పోటీలు -
జిల్లాస్థాయి ఫుట్బాల్ జట్ల ఎంపిక
చీరాల రూరల్: బాపట్ల జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎన్ఆర్ అండ్ పీఎంఏ హైస్కూలు క్రీడా మైదానంలో సబ్ జూనియర్స్, జూనియర్స్ విభాగాలలో జిల్లా స్థాయి జట్లను ఎంపిక చేశారు. ప్రతిభభ ఆధారంగా వీరిని ఎంపిక చేసినట్లు బాపట్ల జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు వి. విజయకుమార్, కోఆర్డినేటర్ ఎన్. దేవదాసు, సమ్మర్ క్యాంప్ ఇన్చార్జి బి.ప్రేమయ్య, కోచ్ ప్రసన్నకుమార్ తెలిపారు. బాలురకు సంబంధించి అండర్–13, అండర్–15లలో 22 మంది చొప్పున ఎంపికై నట్లు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని చెప్పారు. సీనియర్ క్రీడాకారుడు ఎన్. నరేష్, రమ్మికుమార్, ఎన్.బాలశౌరి, క్రీడాకారులు పాల్గొన్నారు. -
మాటల్లోనే ఇంపు.. ఊరంతా కంపు
కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో అధ్వానంగా పారిశుద్ధ్యం నెహ్రూనగర్: నగరంలో ఎక్కడా గార్బేజ్ పాయింట్లు ఉండటానికి వీల్లేదని.. అవి కనిపిస్తే సంబంధిత శానిటరీ ఇన్స్పెక్టర్, సెక్రటరీలే బాధ్యత వహించాలని కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. కానీ నగరంలోని పలు చోట్ల గార్బేజ్ పాయింట్లు కనిపిస్తూనే ఉన్నాయి. సకాలంలో ఇంటింటి చెత్త సేకరణ జరగకపోవడంతోపాటు పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానం ఉంది. ఎక్కడ చూసినా వ్యర్థాల కుప్పలే దర్శనమిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో చెత్తను రోడ్లపై వేయకుండా గ్రీన్ పట్టాలు కట్టించారు. దీనివల్ల కూడా ఉపయోగం కనిపించడం లేదు. ఫిర్యాదులు రావడంతో కమిషనర్ పులి శ్రీనివాసులు చెత్త వేసే వారిని గుర్తించి వారికి జరిమానా విధించాలని ఆదేశించారు. పేరుకుపోయిన చెత్తను మాత్రం తొలగించే మార్గాలు అన్వేషించడం లేదు. నామమాత్రంగా పర్యవేక్షణ నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగు కోసం ప్రత్యేకంగా అధికారులను కేటాయించారు. శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ సెక్రటరీలతోపాటు ఇంజినీరింగ్, ఇతర విభాగాల అధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమించారు. ఇంత చేసినా ఆశించిన స్థాయిలో పారిశుద్ధ్యం మెరుగు పడటం లేదు. పర్యవేక్షణ నామమాత్రంగా మారడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం సుమారు 2 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. నెల రోజుల క్రితం అప్కాస్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న కార్మికుల వయస్సు 60 ఏళ్లు దాటిందనే సాకుతో వారిని విధుల నుంచి తొలగించారు. వారి స్థానంలో కొత్త వారిని తీసుకోకపోవడంతో మిగిలిన వారిపై పని భారం పడుతోంది. దీంతో పారిశుద్ధ్యం ఆశించిన స్థాయిలో లేదు. స్వచ్ఛభారత్ – స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్లో నగరానికి మెరుగైన స్థానం సాధించేందుకు డంపర్ బిన్లను తొలగించిన విషయం తెలిసిందే. దీంతో చెత్తను సకాలంలో తరలించేందుకు నగర పరిధిలో 39 ట్రాక్టర్లు, 18 కంప్యాక్టర్ బిన్లను వినియోగిస్తున్నారు. అవసరం పేరుతో అదనంగా కొన్ని ట్రాక్టర్లు అద్దెకు కూడా తీసుకున్నారు. నగరంలో ఉత్పన్నమయ్యే చెత్తను రోడ్ల మీద వేయకుండా ఎప్పటికప్పుడు తరలించాలని కమిషనర్ ఆదేశాలకే పరిమితం అయ్యారు. చెత్త మాత్రం రోడ్డు మీద కనిపిస్తూనే ఉంది. దీనిపై ప్రజారోగ్యధికారులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. శాశ్వత చర్యలు తీసుకుంటేనే.. 2011 లెక్కల ప్రకారం నగరంలోని 7.50 లక్షల జనాభాకు అనుగుణంగా ప్రస్తుతం కార్మికులు పనిచేస్తున్నారు. 2012లో 10 గ్రామ పంచాయతీలను నగరపాలక సంస్థలో విలీనం చేశారు. దీంతో జనాభా మరింత పెరిగింది. ఇప్పుడు నగరంలో సుమారు 11 లక్షల మంది ఉన్నారని అంచనా. ఇళ్ల సంఖ్య సుమారు 3 లక్షల వరకు ఉంది. 2011 జనాభాకు తగ్గట్లుగా 2 వేల మంది మాత్రమే కార్మికులు ప్రస్తుతం పనిచేస్తున్నారు. గతంలో నగరంలో రోజుకు 400 మెట్రిక్ టన్నుల చెత్త వచ్చేది. ప్రస్తుతం 470 మెట్రిక్ టన్నులకు ఇది పెరిగింది. ఇంత చెత్తను బయటకు తీసుకెళ్లేందుకు కార్మికులు చాలా అవస్థలు పడాల్సి వస్తోంది. ప్రజల నుంచి చెత్త సమస్యలపై తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. కమిషనర్ పులి శ్రీనివాసులు అదనంగా 225 మంది కార్మికులను నిత్యం రూ.500 చొప్పున ఇచ్చేలా నియమించారు. వీరిలో ఎక్కువమంది నామమాత్రంగా పనులు చేసుకుంటూ వెళ్లిపోతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ప్రధానమైన ప్రాంతాల్లోనే పారిశుద్ధ్యం మెరుగ్గా చూపించి, ఇతర కాలనీల్లో గాలికొదిలేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించేలా చూడకుండా ౖపైపెన అధికారుల స్థాయిలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ప్రయోజనం కనిపించదని నగరవాసులు పేర్కొంటున్నారు. తగినంతమంది సిబ్బందిని నియమించి, పర్యవేక్షణ సక్రమంగా చేస్తేనే చెత్త సమస్యల నుంచి ప్రజలకు ఉపశమనం లభించే అవకాశం ఉంది.గృహాల సంఖ్య : సుమారు 3 లక్షలు శానిటరీ డివిజన్లు : 32 మైక్రో ప్యాకెట్లు : 802 నిత్యం వచ్చే చెత్త : 470 మెట్రిక్ టన్నులు వార్డు సచివాలయాలు : 207 పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య : 2,000 ట్రాక్టర్లు : 39 చెత్త తొలగింపులో మున్సిపల్ యంత్రాంగం దారుణంగా విఫలం అదనంగా కార్మికులను పెట్టామని చెబుతున్నా ఫలితం అంతంతే ఎక్కడ చూసినా గుట్టలుగా పేరుకుపోతున్న వ్యర్థాలతో ప్రజలకు నానా కష్టాలు రోజుకు రూ.లక్షలు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నా మెరుగుపడని పరిస్థితి ప్రజారోగ్యంపై ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో రోజురోజుకూ పెరుగుతున్న చెత్త సమస్యగుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్యం పడకేసింది. పాలకుల మాటలు చూస్తే ఎంతో ఇంపుగా ఉంటున్నాయి. ఆచరణలో చూస్తే మాత్రం నగరమంతా దుర్వాసన వచ్చేలా ఎక్కడి చెత్త అక్కడే కుప్పలుగా కనిపిస్తోంది. అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా ఫలితం మాత్రం దక్కడం లేదు. ప్రజల ఇబ్బందులు తొలగించాలనే ఆలోచన నిజంగానే ఉంటే శాశ్వత చర్యలు తీసుకుంటేనే సమస్య పరిష్కారం అయ్యే వీలుంటుందని నగరవాసులు పేర్కొంటున్నారు. గుంటూరు నగరపాలక సంస్థ సమాచారం -
అమ్మసన్నిధి.. భక్తజన సందడి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వేసవి సెలవులు, పెద్ద సంఖ్యలో వివాహాల నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగింది. ఆదివారం తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన భక్తులు రద్దీ సాయంత్రం వరకు కొనసాగింది. దీంతో క్యూలు కిటకిటలాడుతూ కనిపించాయి. మహా మండపం రెండో అంతస్తులో దేవస్థానం ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాన్ని భక్తులు స్వీకరించారు. ఉదయం 11 గంటల నుంచి భక్తుల రద్దీ మరింత పెరగడంతో ఘాట్రోడ్డు పైకి కార్లను అనుమతించలేదు. మధ్యాహ్నం మహా నివేదన నిమిత్తం 11.40 నుంచి 12.15 గంటల వరకు అన్ని దర్శనాలు నిలిపివేశారు. భక్తుల రద్దీ ఉండే సమయాల్లో వీఐపీ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో శీనానాయక్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యలో ఆదివారం ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు వీఐపీ దర్శనాలు నిలివేశారు. ప్రముఖులు, అధికారుల పేరిట వచ్చిన వారికి ఈవో ఆదేశాలను వివరించారు. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత వీఐపీ దర్శనాలకు అనుమతించారు. టికెటు ఉంటేనే అంతరాలయ దర్శనం రూ. 500 టికెటు ఉన్న వారికి మాత్రమే అంతరాలయంలోకి అనుమతించారు. ఆదివారం ఉదయం ఈవో శీనానాయక్ పలుమార్లు టికెట్ల స్కానింగ్, చెకింగ్ పాయింట్లను తనిఖీ చేశారు. ప్రముఖుల సిఫార్సులతో దర్శనానికి విచ్చేసిన వారిని ప్రొటోకాల్ కార్యాలయానికి వెళ్లి టికెట్లు కొనుగోలు చేసుకోవాలని సూచించారు. రద్దీ నేపథ్యంలో వృద్ధులు, వికలాంగులు, చిన్న పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక సమయం కేటాయింపు దిశగా ఈవో చర్యలు చేపట్టారు. అమ్మవారి దర్శనం పూర్తయిన భక్తులు నటరాజ స్వామి ఆలయం, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం వద్ద సేద తీరగా ఈవో శీనానాయక్ వారిని కలిసి మాట్లాడారు. దుర్గగుడిలో ఉదయం 11.30 నుంచి వీఐపీ దర్శనాలు నిలిపివేత -
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
బాపట్ల: ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, ఆ ప్రభావంతో ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రభావంతో తీర ప్రాంతాలలో 40 నుంచి 60 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు. నృసింహస్వామి సేవలో దేవదాయ శాఖ కమిషనర్ మంగళగిరి: మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ దంపతులు దర్శించుకున్నారు. ఆదివారం ఆలయానికి విచ్చేసిన కమిషనర్ దంపతులకు ఈవో అన్నపురెడ్డి రామకోటిరెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం స్వామి వారి చిత్రపటాన్ని బహూకరించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశ్వీరచనాలు అందజేశారు. ముగిసిన హనుమాన్ దీక్షలు నగరంపాలెం: స్థానిక మారుతీనగర్లోని శ్రీ కంచి కామకోటి పీఠ శ్రీమారుతీ దేవాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న హనుమజ్జయంతి మహోత్సవాల్లో భాగంగా హనుమాన్ మండల వ్రత దీక్షలు ఆదివారంతో ముగిశాయి. హనుమత్ హవనము మన్యుసూక్త హోమం, గణపతి హోమం నిర్వహించారు. దీక్షాధారులు ఇరుముడులు ధరించి ఆలయ ప్రదక్షిణలు అనంతరం మాల విరమణ చేశారు. సాయంత్రం కార్యక్రమాల్లో భాగంగా మాస శివరాత్రి గంగా గౌరీ సమేత శంకరునికి ప్రదోషకాల అభిషేకం, కల్యాణ వేడుక నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ పాలకమండలి సభ్యులు కొరపాటి రామారావు, ఆలయ కార్యదర్శి తంగిరాల శ్రీనివాస్, జిల్లా దేవాలయ పరిరక్షణ సమితి కార్యదర్శి నరేంద్రగౌతమ్, తదితరులు పాల్గొన్నారు. వైభవంగా శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణం తెనాలి: పట్టణ నాజరుపేటలో వేంచేసియున్న శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి వార్షిక కల్యాణోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. శ్రీ శృంగేరీ శ్రీవిరూపాక్ష శ్రీపీఠం శ్రీసదనం శ్రీపరశివానంద భారతీస్వామి ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ కె.చంద్రశేఖరరెడ్డి పర్యవేక్షణలో స్వామివారి కార్యక్రమాన్ని నిర్వహించారు. వేడుక అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. గేట్ మేన్పై సస్పెన్షన్ వేటు నాదెండ్ల: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సాతులూరు రైల్వే గేట్మేన్పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ నెల 23న ఉదయం 5 గంటల సమయంలో గుంటూరు నుంచి హుబ్లీ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు 15 నిమిషాలు ఆలస్యమైంది. సాతులూరు సమీపంలో మూడు రైల్వే గేట్లుండగా, 290–291 చందవరం–బుక్కాపురం రోడ్డు వద్ద గేట్లు వేశారు. 289 కనపర్రు రోడ్డు వద్ద వేయకపోవడంతో గూడ్స్ రైలు 15 నిమిషాలు నిలిచిపోయింది. గేట్మేన్ నిర్లక్ష్యంపై లోకో పైలట్ గుంటూరు స్టేషన్ మాస్టర్కు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు గేట్మేన్ ఆర్. కోటేశ్వరరావును రైల్వే అధికారులు సస్పెండ్ చేశారు. దీనిపై ముగ్గురు సభ్యుల కమిటీని విచారణకు నియమించారు. -
స్టువర్టుపురం.. శోకసంద్రం
బాపట్లటౌన్: ఘోర రోడ్డు ప్రమాదంలో బాపట్ల మండలం, స్టువర్టుపురం గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు మృతిచెందిన ఘటన తెలిసిందే. ఆరుగురు మృతదేహాలు ప్రకాశం జిల్లా, గిద్దలూరు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం శనివారం మధ్యాహ్నం స్వగ్రామమైన స్టువర్టుపురం గ్రామానికి తరలించారు. ఆరుగురు మృతదేహాలు గ్రామానికి తరలిరావడంతో శనివారం గ్రామంలో ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు మృతదేహాల వద్దకు చేరుకొని విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. మిన్నంటిన రోదనలు ‘నేడో, రేపో పెళ్లి చేద్దామనుకుంటున్న తరుణంలో మీరు శవాలై కనిపిస్తారని మేము కలలో కూడా ఊహించలేదయ్యా’... ‘మీపైనే ఆశలు పెట్టుకొని బతుకుతున్నాం...ఇంకా మాకు దిక్కెవరూ’... ‘మాకు తలకొరివి పెట్టాల్సింది పోయి...మీకే మేము పెట్టాల్సి వస్తోంది...మేమేమి పాపం చేశాము దేవుడా’ అంటూ గజ్జల జనార్ధన్, బొచ్చు సన్నీ, కర్రెద్దుల దివాకర్ల తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్న తీరు స్థానికులకు కంటతడి పెట్టించింది. ‘సాయంత్రానికి తిరిగొస్తామని చెప్పి శవాలై వచ్చారా’ అంటూ గజ్జల అంకాలు కుటుంబ సభ్యులు, ‘మా అమ్మ నా కళ్లముందే చనిపోయిందంటూ’ మొగిలి భవానీ కుమార్తె, కొడుకు సిరి, సిద్దూ చెబుతున్న మాటలకు కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు గుండెలు పగిలేలా రోధించారు. లేకలేక పుట్టిన ఒక్కగానోక్క బిడ్డను, నన్ను ఒంటరిని చేసి కానరాని లోకాలకు వెళ్లిపోయావా దేవుడా అంటూ గజ్జల నరసింహ భార్య జాబిల్లి విలపిస్తున్న తీరు చూపరులను సైతం కంటతడి పెట్టించింది. అశ్రునయనాలతో అంత్యక్రియలు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన స్టువర్టుపురం గ్రామం, న్యూ గ్యాంగ్కు చెందిన గజ్జల నరసింహ (23), గజ్జల అంకాలు (45), పెద్ద గ్యాంగ్కు చెందిన గజ్జల జోసఫ్ అలియాస్ బబ్బులు (25), కర్రెద్దు దివాకర్(24), 6వ గ్యాంగ్కు చెందిన బొచ్చు సన్నీ(27), 1వ గ్యాంగ్కు చెందిన మొగిలి చిన్న భవానీ (23)ల అంత్యక్రియలు శనివారం సాయంత్రం స్టువార్టుపురం–ఈపూరుపాలెం మధ్యలోని ఆటోనగర్ శ్మశానవాటికలో నిర్వహించారు. మృతదేహాలు స్వగ్రామమైన స్టువర్టుపురం చేరుకోవడంతో బాపట్ల ఎంపీపీ చిన్నపోతుల హరిబాబు మృతుల గృహాలకు చేరుకొని మృతదేహాలకు పూలమాలలేసి నివాళులర్పించారు. మృతిచెందిన ప్రతి ఒక్కరికి రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియో ప్రకటించి, నిరుపేదలైన కుటుంబసభ్యులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ ఆటోనగర్లోని శ్మశానవాటికకు చేరుకొని మృతదేహాలకు పూలమాలలేసి నివాళులర్పించారు. మృతుల కుటుంబీకులకు ప్రభుత్వం తరఫున అందించాల్సిన అన్నిరకాల సహాయసహకారాలు అందించేలా కృషిచేస్తామన్నారు. ముగిసిన పోస్టుమార్టం కొమరోలు: మండలంలోని తాటిచెర్లమోటు సమీపంలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా ఇద్దరు చిన్నారులు తీవ్ర గాయాలతో బయటపడిన విషయం తెలిసిందే. బాపట్ల జిల్లా స్టూవర్టుపురం గ్రామానికి చెందిన ఆరుగురు మృతి చెందగా మృతదేహాలను పోస్టుమార్టం కోసం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదం విషయం తెలుసుకున్న మృతుల బంధువులు స్టూవర్టుపురం నుంచి గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు చేరుకున్నారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం ఉదయం వైద్యులు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం అనంతరం ఆరు మృతదేహాలను బంధువులకు అప్పగించారు. చిన్నారులకు మెరుగైన వైద్యం ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. మృతి చెందిన వారితో పాటు జీతన్, శిరీషలు ఆ కారులోనే ప్రయాణిస్తున్నారు. గాయపడిన వీరికి గిద్దలూరు వైద్యశాలలో ప్రథమ చికిత్స అందించి అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు వైద్యశాలకు తరలించినట్లు స్థానిక ఎస్ఐ నాగరాజు తెలిపారు. స్వగ్రామానికి చేరుకున్న ఆరుగురి మృతదేహాలు ఆటోనగర్లోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణం వెల్లడించిన మార్కాపురం డీఎస్పీ నాగరాజు కొమరోలు: తాటిచెర్లమోటు కారు ప్రమాదానికి మితిమీరిన వేగమే కారణమని మార్కాపురం డీఎస్పీ నాగరాజు వెల్లడించారు. ఆర్టీఓ అల్లం మాధవరావుతో కలిసి శనివారం ఆయన ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గురైన కారును క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం డీఎస్పీ నాగరాజు మాట్లాడుతూ ప్రమాదం జరిగిన సమయంలో కారు వేగం 120 కిలోమీటర్లు ఉందని స్పష్టం చేశారు. కారు వేగంగా వెళ్లి లారీని ఢీకొనడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగిందని చెప్పారు. వాహనాలను నిర్లక్ష్యంగా, వేగంగా ఎవరూ నడపొద్దని సూచించారు. నేషనల్ హైవే ప్రాజెక్టు మేనేజర్ మల్లికార్జునరెడ్డి, ఆర్అండ్బీ డీఈ ఎం.నరసింహులు, గిద్దలూరు, కంభం సీఐలు రామకోటయ్య, మల్లికార్జున, ఎస్ఐలు రవీంద్రరెడ్డి, నాగరాజు, కోటేశ్వరరావు, సుదర్శన్ పాల్గొన్నారు. -
దేశంలో నరహంతక పాలన
లక్ష్మీపురం: దేశంలో బీజేపీ నరహంతక పాలన కొనసాగిస్తోందని, మతాల మధ్య చిచ్చు పెడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. బీజేపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. గుంటూరు కొత్తపేటలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో మల్లయ్య లింగం భవన్లో శనివారం ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర స్థాయి పాటలు, కళా రూపాల శిక్షణ శిబిరం శనివారం రెండో రోజు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ రంగాలకు అన్నీ అప్పగిస్తోందన్నారు. కమ్యూనిస్టు భావజాలాన్ని అంతం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని ఆరోపించారు. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులతోపాటు ఆదివాసీలను దారుణంగా హతమార్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చలకు వస్తామని చెప్పినప్పటికీ కేంద్రం వారిని చంపే కార్యక్రమం చేయడం సరికాదన్నారు. తక్షణమే ఆపరేషన్ కగార్ను కేంద్రం ఆపాలని డిమాండ్ చేశారు. ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో సరికొత్త నాటకానికి ప్రధాని నరేంద్ర మోదీ తెర తీశారన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు భయపడి మోదీ పాక్పై యుద్ధాన్ని ఆపేశారని తెలిపారు. విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ప్రజా సమస్యలపై పోరాటానికి సన్నద్ధం అవుతామన్నారు. మహాసభలకు ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలు, మావోయిస్టులను హతమార్చుతున్న కేంద్రం విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ -
ఉచిత న్యాయ సహాయం పొందండి
నరసరావుపేటటౌన్: లైంగిక వేధింపులకు గురైన బాధితులు మండల న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించి ఉచిత న్యాయ సహాయం పొందాలని 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ ఎన్.సత్యశ్రీ అన్నారు. శనివారం కోర్టు ప్రాంగణంలో పారా లీగల్ వలంటీర్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. పని ప్రదేశంలో లైంగిక వేధింపులకు గురయితే జాతీయ న్యాయసేవాధికార సంస్థ ప్రవేశ పెట్టిన హెల్ప్లైన్ నెం. 15100కు ఫిర్యాదు చేయాలన్నారు. అదే విధంగా జాతీయ మహిళా హెల్ప్లైన్ 7827170170 నంబర్ను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. లైంగిక వేధింపుల చట్టం గురించి అవగాహన కల్పించారు. మండల న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందే విధివిధానాలను తెలియజేశారు. కార్యక్రమంలో ప్యానల్ న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.31న జెడ్పీస్థాయీ సంఘ సమావేశాలుగుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజాపరిషత్ స్థాయీ సంఘ సమావేశాలను ఈనెల 31న నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు శనివారం ఓప్రకటనలో పేర్కొన్నారు. ప్రణాళిక–ఆర్థిక, గ్రామీణాభివృద్ధి, విద్య–వైద్యం, అభివృద్ధి పనులకు సంబంధించిన 1, 2, 4, 7వ స్థాయీ సంఘ సమావేశాలు జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షతన జరగనున్నాయి. వ్యవసాయంపై 3వ స్థాయి సంఘం జెడ్పీ వైస్ చైర్మన్ శొంటిరెడ్డి నర్సిరెడ్డి, సీ్త్ర–శిశు సంక్షేమంపై 5వ స్థాయీ సంఘం తెనాలి జెడ్పీటీసీ పిల్లి ఉమా ప్రణతి, సాంఘిక సంక్షేమంపై 6వ స్థాయీ సంఘం జెడ్పీ వైస్ చైర్పర్సన్ బత్తుల అనురాధ అధ్యక్షతన జరగనున్నాయి. స్థాయీ సంఘ సమావేశాలకు ఆయా సంఘాల సభ్యులతో పాటు మూడు జిల్లాల పరిధిలోని ప్రభుత్వ శాఖల అధికారులు హాజరు కావాలని సీఈవో జ్యోతిబసు సూచించారు.యోగాంధ్రపై విస్తృత ప్రచారంనరసరావుపేట: యోగాంధ్రలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే అధికారులకు సూచించారు. యోగాంధ్ర కార్యక్రమంపై శనివారం కలెక్టరేట్ నుంచి జిల్లా, మండలస్థాయి అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ జూన్ 21 వరకు యోగా ప్రాముఖ్యతను విస్తృత ప్రచారం ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించాలన్నారు. యోగా ప్రాముఖ్యతను తెలిపేలా విద్యార్థులకు, ఆయా రంగాల్లోని వారికి వివిధ పోటీలు నిర్వహించాలన్నారు. కార్యక్రమం విజయవంతం చేసేందుకు మండల, గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి మండలంలో యోగా శిక్షకులను గుర్తించి అభ్యాస కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లాలో ఎక్కువ సంఖ్యలో యోగా అభ్యాసకులకు ప్రజలను నమోదుచేసేందుకు కృషిచేయాలన్నారు. ప్రతిరోజూ నరసరావుపేటతో పాటు మున్సిపాల్టీలు, మండలస్థాయిలో యోగా ప్రాముఖ్యతను తెలిపే కార్యక్రమాలను నిర్వహించాలని ఎంపీడీఓలను ఆదేశించారు. డీఆర్ఓ ఏకా మురళి పాల్గొన్నారు.పిల్లలకు ఎంఆర్ వ్యాక్సిన్ వేయించండిడీఎంహెచ్ఓ డాక్టర్ బి.రవినరసరావుపేట: జిల్లాలో పిల్లలకు ఆటలమ్మ, రూబెల్లా వ్యాధులు సంక్రమించకుండా ఎంఆర్ వ్యాక్సిన్ కోసం తల్లిదండ్రులు సమీపంలోని ఆరోగ్య కార్యకర్తలు, ఆశాలు, అంగన్వాడీ కార్యకర్తలను సంప్రదించాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రవి కోరారు. శనివారం ఆయన తన కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. జిల్లాలో మీజిల్స్ రుబెల్లా నిర్మూలన కార్యక్రమంలో భాగంగా మూడు విడతలుగా ప్రత్యేక ఎంఆర్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈనెల 26వ తేదీ నుంచి 31వరకు, జూన్ 23 నుంచి 28వరకు, జూలై నెలలో 21 నుంచి 26వ తేదీ వరకు జరుగుతుందన్నారు. ఈ వ్యాక్సినేషన్ మొదటి డోసు తొమ్మది నుంచి 12 నెలల మధ్య, రెండో డోసు 16 నెలల నుంచి 24 నెలల మధ్య వేయాలని పిల్లలకు వేయించాలని కోరారు. ఐదేళ్ల లోపు పిల్లల్లో ఎంఆర్ వ్యాక్సిన్ మొదటి, రెండో డోసులు వేయించుకోని పిల్లలకు కూడా వ్యాక్సిన్ వేస్తారన్నారు. -
కోవిడ్–19.. ఈ పేరు వింటేనే చాలా మంది చిగురుటాకుల్లా వణికిపోతారు. నాటి హృదయ విదారక ఘటనలు జ్ఞప్తికి తెచ్చుకోవడానికి సైతం భయపడతారు. ఆస్పత్రుల్లో వేలాది మంది ప్రాణాల కోసం పోరాడడం.. శ్మశానాలు కోవిడ్ మృతులతో నిండిపోవడం.. కోవిడ్ సోకి క్వారంటైన్ పేరిట తల్లీ,
చీరాల రూరల్: కోవిడ్తో వేలాది మంది ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతున్న సమయంలో నాటి ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధీశాలిగా నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో యుద్ధప్రాతిపదికన రూ.కోట్లు వెచ్చించి ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పి లక్షలాదిమంది ప్రాణాలను కాపాడారు. ఇలా చీరాల ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో రూ.కోటిపైగా వెచ్చించి అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని), ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణమూర్తి చేతుల మీదుగా ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటు చేశారు. ఆక్సిజన్ ప్లాంటుకు అనుసంధానంగా ఆస్పత్రి ప్రాంగణంలోనే భారీసైజులో టెంట్లు వేసి.. అదనంగా బెడ్లువేసి నిరంతరాయంగా ఆక్సిజన్ను సరఫరా చేయించిన ఘనత నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదే. మళ్లీ మహమ్మారి విజృంభణ! ప్రస్తుతం కొన్ని దేశాల్లో కోవిడ్ విజృంభిస్తోంది. ఆయా దేశాల్లో మాస్కులు, శానిటైజర్లు వంటివి వాడుతూ తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు. దేశంలోని కేరళ, మహారాష్ట్రలో కూడా ఇప్పటివరకు 270కి పైగా కేసులు నమోదయ్యాయి. విశాఖలో కూడా కేసులు వెలుగుచూస్తుండటం గమనార్హం. ఈ తరుణంలో చీరాల ప్రభుత్వాసుపత్రిలోని ఆక్సిజన్ ప్లాంటు ఏడాదిన్నరగా మూలన పడడం స్థానికులను కలవర పరుస్తోంది. ఫొటో తీసేస్తే సరిపోతుందా? టెక్నీషియన్ లేడన్న సాకుతో ఆస్పత్రి నిర్వాహకులు రూ.కోటిపైగా వెచ్చించి నిర్మించిన ఆక్సిజన్ ప్లాంటుకు తాళాలేసి మూలనపెట్టారు. అంతేకాక సెన్సార్ పనిచేయడంలేదని, కంప్రెషర్ పనిచేయడంలేదని సిబ్బంది చెబుతున్నారు. మరికొద్దికాలం గడిస్తే ప్లాంటులోని ముఖ్యమైన పరికరాలు ఎందుకు పనికిరాకుండా పాడై పోతాయని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం ప్లాంటుపై ఉన్న నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటోను, ఆయన పేరును మాత్రం తొలగించడంతో సరిపెట్టారు కానీ.. మరమ్మతులు చేయలేదు. అత్యవసర సమయాల్లో ఎలా? ఆక్సిజన్ ఒక్క కోవిడ్ రోగులకే కాకుండా, తల్లీ బిడ్డల వార్డుల్లో చేరిన గర్భిణులు, గాయాలపాలై ఆస్పత్రిలో చేరిన క్షతగాత్రులకు, పురుగుమందులు తాగిన వారు, ఆపరేషన్లు చేయించుకునే రోగులు, ఆస్తమా పేషెంట్లు, హైరిస్క్ పేషెంట్లకు కూడా అవసరమవుతుంది. 108 అంబులెన్స్లో తప్పనిసరి. ఈ క్రమంలో ప్రభుత్వాసుపత్రిలో నెలకు సరాసరి ఏడు నుంచి పది వరకు ఆక్సిజన్ సిలిండర్లు అవసరం అవుతాయి. ఒకవేళ ఆక్సిజన్ ప్లాంట్ పనిచేస్తే సిలిండర్లు కొనే అవసరం ఉండదు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో ఆక్సిజన్ సిలిండర్ల కొరత అధికంగా ఉన్నట్లు రోగులు చెబుతున్నారు. చీరాల ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్కు మరమ్మతులు కోవిడ్ సమయంలో రూ.1.06 కోట్లతో ఏర్పాటు చేసిన నాటి సీఎం జగన్ టెక్నీషియన్ లేడన్న సాకుతో నేడు ప్లాంటుకు తాళం తుప్పుపట్టిపోతున్న జనరేటర్, పరికరాలు మళ్లీ కోవిడ్ భయాల నేపథ్యంలో మరమ్మతులు చేయాలంటున్న ప్రజలు ఉన్నతాధికారులకు నివేదించాం ఆక్సిజన్ ప్లాంటు మరమ్మతులకు గురైన విషయం ఉన్నతాధికారులకు నివేదించాం. కొద్ది రోజుల్లోనే మరమ్మతులు చేయించి రోగులకు అందుబాటులోకి తీసుకువస్తాం. ప్లాంటుకు ప్రత్యేకంగా టెక్నీషియన్ను ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రస్తుతం రోగులకు ఆక్సిజన్ కొరతలేకుండా కాన్సన్ట్రేషన్లు పెడుతున్నాం. – డాక్టర్ శ్రీకాంత్, ఆస్పత్రి సూపరింటెండెంట్ -
నల్లబర్లీ కొనుగోలు చేయిస్తాం
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు మార్టూరు: నల్లబర్లీ పొగాకు సాగు చేసి కొనుగోలు జరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు అండగా ఉంటామని పొగాకు కంపెనీలచే రైతుల నుంచి పొగాకు కొనుగోలు చేయిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. స్థానిక ఇసుక దర్శిలోని ఎమ్మెల్యే ఏలూరి క్యాంపు కార్యాలయంలో శనివారం నల్ల బర్లీ పొగాకు సాగు చేసిన రైతులు, పొగాకు కంపెనీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. సమావేశంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, కలెక్టర్ కె.వెంకట మురళి, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, పొగాకు బోర్డు, కంపెనీల ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. మంత్రుల పర్యటన సాగిందిలా... మొదట యద్దనపూడి మండలం సూరవరపు పల్లె గ్రామ పరిధిలోని కోల్డ్ స్టోరేజ్ వద్ద నిల్వచేసి ఉన్న నల్ల బర్లీ పొగాకును మంత్రి అచ్చెన్నాయుడు బృందం పరిశీలించి రైతులను అడిగి వివరాలు తెలుసుకుంది. అనంతరం మార్టూరులోని మద్ది లక్ష్మయ్య ఆగ్రో ప్రోడక్ట్ (ఎంఎల్ఏపీ) పొగాకు కంపెనీని పరిశీలించి పొగాకును ప్రాసెసింగ్ చేసే విధానాన్ని పరిశీలించి సంస్థ ప్రతినిధులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం స్థానిక ఇసుక దర్శి ఏలూరి క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి మాట్లాడారు. నల్ల బర్లీ పొగాకును గత సంవత్సరం కొనుగోలు చేసినట్లే కంపెనీలు ఈ సంవత్సరం కూడా కొనుగోలు చేయాలని, కొనుగోలు చేయించి రైతులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఈ సంవత్సరం నల్ల బర్లీ పొగాకు మొత్తం 80 మిలియన్ కిలోల ఉత్పత్తి జరిగిందని కంపెనీలు మొత్తం కొనుగోలు చేయవలసిందేనన్నారు. కంపెనీలు కొనుగోళ్లు తక్షణమే ప్రారంభించాలన్నారు. ప్రాసెసింగ్ కోసం అయ్యే ఖర్చు రూ.150 కోట్లు ముఖ్యమంత్రితో మాట్లాడి కంపెనీలకు ఇప్పిస్తానని మంత్రి తెలిపారు. ప్రస్తుతం రైతుల వద్ద ఉన్న పొగాకును రెండు గ్రేడులుగా విభజించి నాణ్యత కలిగిన పొగాకు క్వింటా రూ.12 వేలకు, రెండో రకం రూ.5వేల నుంచి 6వేలకు తగ్గకుండా శనివారం నుంచి కొనుగోలు చేయాలని మంత్రి అన్నారు. -
దుగ్గిరాలలో 58.6 మి.మీ. వర్షపాతం
సగటున 25.3 మి.మీ. వర్షపాతం కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు అత్యధికంగా దుగ్గిరాల మండలంలో 58.6 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా పొన్నూరు మండలంలో 8.6 మి.మీ. పడింది. సగటున 25.3 మి.మీ.గా నమోదైంది. మే నెల 24వ తేదీ వరకు జిల్లా సాధారణ వర్షపాతం 48.2 మి.మీ. కాగా.. ఇప్పటి వరకు 166.8 మి.మీ. పడింది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. చేబ్రోలు మండలంలో 52.2, తుళ్ళూరు 40.6, మేడికొండూరు 38.4, ప్రత్తిపాడు 35.2, కాకుమాను 30.2, కొల్లిపర 27.4, తాడికొండ 26.8, మంగళగిరి 23.6, తాడేపల్లి 21.6, ఫిరంగిపురం 19.8, వట్టిచెరుకూరు 19, పెదకాకాని 17.2, గుంటూరు తూర్పు 14.2, గుంటూరు పశ్చిమ 12.2, తెనాలి మండలంలో 9.8 మి.మీ. చొప్పున వర్షపాతం పడింది. రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య నరసరావుపేటటౌన్: గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్ఐ శ్రీనివాసరావు నాయక్ శనివారం తెలిపారు. నరసరావుపేట రైల్వేస్టేషన్ వద్ద కొండవీడు ఎక్స్ప్రెస్ రైలు క్రింద శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. స్టేషన్ మాస్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించామన్నారు. మృతుడు పింక్ కలర్ చొక్కా, నలుపు రంగు ఫ్యాంట్ ధరించి ఉన్నాడు. మృతుడి ఆనవాళ్లు తెలిసిన వారు నరసరావుపేట రైల్వే పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని రైల్వే ఎస్ఐ కోరారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం నాదెండ్ల: కారు, బైకు ఢీకొన్న ఘటనలో యువకుడు దుర్మరణం పాలైన సంఘటన శనివారం చోటు చేసుకుంది. ఎస్సై జి. పుల్లారావు తెలిపిన వివరాల మేరకు... గుంటూరు–కర్నూలు జాతీయ రహదారిపై గొరిజవోలు గ్రామ పరిధిలోని నుదురుపాడు పైవంతెన వద్ద ప్రమాదం జరిగింది. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామానికి చెందిన తరిమెళ్ళ బోయేసు (30) తన ద్విచక్రవాహనంపై గుంటూరు నుంచి నరసరావుపేట వైపు వెళ్తున్నాడు. నుదురుపాడు పైవంతెన సమీపంలో బైకు, కారు ఢీకొన్నాయి. బోయేసు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోలీసులు నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో సమావేశం
పిల్లలను సురక్షితంగా ఉంచే బాధ్యత తల్లిదండ్రులదే చీరాల అర్బన్: ఆర్టీసీ డిపో పరిధిలోని చీరాల, పర్చూరు, ఇంకొల్లు, వేటపాలెం బస్స్టేషన్లలో ఓపెన్ ప్రదేశాల్లో 15 సంవత్సరాలకు లీజుకు ఇచ్చేందుకుగాను శనివారం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి బాపట్ల జిల్లా ఇన్చార్జి ఆర్ఎం ఎం.రవికాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీరాల ఆర్టీసీ డిపో పరిధిలోని చీరాల, పర్చూరు, ఇంకొల్లు, వేటపాలెం బస్స్టేషన్లలో ఓపెన్ ప్రదేశాల్లో 15 సంవత్సరాలకు లీజుకు ఇచ్చేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 28వ తేదీ వరకు అప్లికేషన్లను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చని, దరఖాస్తుదారులు 29వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల్లోపు నెల్లూరులోని ఈడీ కార్యాలయంలోని టెండర్ బాక్సులో వేయాలన్నారు. చీరాల ఆర్టీసీ బస్టాండ్లో ఇప్పటికే ఖాళీ స్థలంలో హోటల్ నిర్మాణం జరిగిందని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపి వ్యాపారాభివృద్ధి చేసుకోవాలన్నారు. అనంతరం ఆయన చీరాల ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణాన్ని పరిశీలించారు. కార్గో పాయింట్, రిజర్వేషన్ కౌంటర్, ఖాళీ ప్రదేశాలను పరిశీలన చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఆర్టీసీ డిపో మేనేజర్ జె.శ్యామల, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది ఉన్నారు. -
సూసైడ్ నోట్ రాసి ఇంట్లోంచి వెళ్లిపోయిన భార్య
మేదరమెట్ల: సూసైడ్ నోట్ రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన భార్యను పోలీసులు అత్యంత వేగంగా వెదికి తిరిగి భర్తకు అప్పగించిన ఘటన శనివారం మేదరమెట్లలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మేదరమెట్ల గ్రామానికి చెందిన వెల్లంకి వెంకట కీర్తి తనకున్న అనారోగ్య సమస్యల వల్ల సూసైడ్ నోట్ రాసి ఈనెల 23వ తేదీ సాయంత్రం ఇంట్లో ఉంచింది. తన ఫోన్ను కూడా ఇంట్లోనే పెట్టి వాకింగ్కు వెళ్లి వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లింది. ఎంతకీ రాకపోడంతో కుటుంబ సభ్యులు ఆ లేఖ గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శనివారం చీరాల, కొత్తపట్నం, చిన్నగంజాం సముద్ర తీరాలకు వెళ్లి వెతుకుతుండగా వెంకటకీర్తి కొత్తపట్నం సముద్రతీరం వద్ద కనిపించింది. ఆమెను ఎంతో చాకచక్యంగా పట్టుకొని మేదరమెట్ల పోలీసు స్టేషన్కు తీసుకు వచ్చి ఆమె భర్త నిఖిల్కు అప్పగించారు. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన వ్యక్తిని తక్కువ సమయంలోనే పట్టుకొని కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు. కొత్తపట్నం సముద్రతీరం వద్ద కనుగొని భర్తకు అప్పగించిన పోలీసులు -
బూత్ కమిటీ జిల్లా అధ్యక్షులుగా శ్రీనివాసరెడ్డి
బాపట్ల టౌన్: బాపట్ల నియోజకవర్గానికి చెందిన మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లా బూత్ కమిటీల విభాగం అధ్యక్షులుగా నియమిస్తూ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. బాపట్ల జిల్లాలో బూత్ కమిటీలను సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తనను ఈ పదవిలో నియమించినందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడి అరెస్టు యడ్లపాడు: బాలికపై లైంగిక దాడి ఘటనలో పొక్సో కేసు నమోదైన యువకుడిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. కోర్టుకు హాజరు పరచగా రిమాండ్ విధించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం హౌస్ గణేష్పాడు గ్రామ నివాసి ఆళ్ల కొండలు, మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ బాలికను ఆసక్తికరమైన మాటలతో ఆకర్షించాడు. సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన గత నెల 15న జరిగింది. ఈ మేరకు బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా యడ్లపాడు పోలీస్ స్టేషన్న్లో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నరసరావుపేట డీఎస్పీ పర్యవేక్షణలో విచారణ చేపట్టిన పోలీసులు, సాంకేతిక ఆధారాలతో పాటు వాంగ్మూలాలు సేకరించారు. నిందితుడిని ఈ నెల 22న పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం బోయపాలెంలోని హైవే వంతెన వద్ద పట్టుకున్నారు. చిలకలూరిపేట అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు హాజరు పరుచగా, జూన్ 5వ తేదీ వరకు రిమాండ్ విధించినట్లు యడ్లపాడు ఎస్ఐ టి. శివరామకృష్ణ తెలిపారు. బదిలీల దరఖాస్తులో జాగ్రత్తలు అవసరం నరసరావుపేట ఈస్ట్: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు దరఖాస్తు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు సూచించారు. ఉపాధ్యాయుల బదిలీలపై శుక్రవారం యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దరఖాస్తు చేసే సమయంలో సమస్యలు తలెత్తితే తమ దృష్టికి తీసుకరావాలని తెలిపారు. ప్రభుత్వం దాదాపు 770 ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా అప్గ్రేడ్ చేయటం మంచి పరిణామమని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచటంలోనూ, విద్యార్థుల నమోదు, హాజరు పెంచటంలోనూ కార్యకర్తలు ముందుండాలని సూచించారు. -
పేదల అభివృద్ధే సహకార బ్యాంక్ లక్ష్యం
బాపట్ల: పేద ప్రజల అభివృద్ధే లక్ష్యంగా విశాఖ కో ఆపరేటివ్ బ్యాంక్ తన సేవలను కొనసాగిస్తూ ఖాతాదారుల మన్ననలు పొందుతోందని బ్యాంక్ డైరెక్టర్ జేవీ సత్యనారాయణమూర్తి అన్నారు. బాపట్ల బ్రాంచ్ సభ్యుల మహాసభ శుక్రవారం బ్రాంచి ఆవరణలో జరిగింది. బ్యాంక్ వైస్ చైర్మన్ ముదివర్తి రాఘవరావు అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యఅతిథిగా సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ సభ్యులకు సంక్షేమ పథకాలను బ్యాంకు అమలు చేస్తోందన్నారు. దేశ పురోభివృద్ధిలో సహకార బ్యాంకులు కీలకపాత్ర పోషిస్తున్నాయని గుర్తుచేశారు. నిబంధనల పేరుతో రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు విధించడం సరికాదన్నారు. ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి సామాన్యులకు రుణాలు అందిస్తూ లాభాపేక్ష లేకుండా సభ్యులకే లాభాలు పంచుకున్న ఘనత విశాఖ బ్యాంకుకే దక్కుతుందని చెప్పారు. బ్యాంక్ డైరెక్టర్ నన్నపనేని అంజయ్య, జోనల్ మేనేజర్ ఎఎస్ఆర్ మూర్తి, బ్రాంచ్ మేనేజర్ అర్జునరావు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి
చీరాల: రోడ్డు ప్రమాదంలో చీరాలకు చెందిన కానిస్టేబుల్ మృతి చెందారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా పెదనందిపాడు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. పట్టణంలోని పేరాల గొల్లపాలెంలో నివాసముంటున్న కీర్తి వెంకటరాజు (45) బాపట్ల జిల్లా కేంద్రంలో ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్నారు. గురువారం ఆయన తన స్నేహితుడు డీవీఎస్ గుప్తాతో కలిసి గుంటూరు నుంచి చీరాలకు కారులో వస్తుండగా పెదనందిపాడు సమీపంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకటరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. గుప్తాకు తీవ్ర గాయాలు కావడంతో గుంటూరు తరలించారు. వెంకటరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. చీరాల సబ్ డివిజన్లో పలు పోలీసుస్టేషన్లలో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తించి ప్రస్తుతం జిల్లా స్పెషల్ బ్రాంచిలో ఆయన పనిచేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. వెంకటరాజుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కానిస్టేబుల్ మరణవార్త తెలుసుకున్న పోలీస్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్ ఐజీ రామకృష్ణ నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యుల రోదనలు అందర్నీ కలచివేశాయి. అనంతరం పోలీసు లాంఛనాలతో వెంకటరాజు అంత్యక్రియలు నిర్వహించారు. -
సుమోటో కేసు నమోదు చేయాలి
చీరాల: ప్రజా ఉద్యమంలో అమరులైన వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందజేయకపోడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. నారాయణపూర్ జిల్లా మాడ్ అటవీ ప్రాంతంలో జరిగినట్లుగా చెబుతున్న ఎన్కౌంటర్పై న్యాయ విచారణ జరపాలని, సుప్రీంకోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశాయి. అమరులైన వారి బంధుమిత్రుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం చీరాల మండలం జాండ్రపేటలో సజ్జా నాగేశ్వరరావు సోదరుడు సజ్జా శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. సంఘ నాయకులు అంజమ్మ మాట్లాడుతూ ఈ నెల 20న మరణించిన అమరుల మృతదేహాలను భద్రపరచకుండా కాలయాపన చేస్తూ మృతదేహాలు కుళ్లిపోయే విధంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం.. శవాలపై కూడా హింసను ప్రయోగిస్తోందన్నారు. అంతిమ సంస్కారాల కోసం మృతదేహాలను అప్పగించకపోవడం హిందూ సంప్రదాయానికి విరుద్ధమన్నారు. విప్లవ రచయితల సంఘం నేత అరసవల్లి కృష్ణ, రాష్ట్ర చేనేత జనసమాఖ్య వ్యవస్థాపకులు మాచర్ల మోహనరావు మాట్లాడుతూ మధ్య భారతదేశంలో జరుగుతున్న ఆపరేషన్ కగార్ను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలపై కొనసాగుతున్న సైనిక చర్యల ద్వారా మానవహననం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిస్టు పార్టీ ప్రతినిధులు పలుమార్లు శాంతి చర్చలకు సిద్ధమని, అందులో భాగంగా కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ ఏకపక్షంగా సైనిక చర్యలకు పాల్పడుతూ దేశంలో భయానక పరిస్థితులను కేంద్రం సృష్టిస్తోందన్నారు. సజ్జా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి తమ సోదరుడు మరణించిన విషయం గానీ, మృతదేహాన్ని తీసుకువెళ్లాలనిగానీ సమాచారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మానవత్వంతో ఆలోచించి నాగేశ్వరరావు మృతదేహాన్ని అందజేయాలన్నారు. వారి వెంట ప్రగతిశీల కార్మిక సమాఖ్య కొండారెడ్డి, దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమ నాయకులు వై.వెంకటేశ్వరరావు, బహుజన సమాజ్ పార్టీ నేత పి.పుల్లయ్య, రాష్ట్ర చేనేత జన సమాఖ్య నాయకులు దేవన వీరనాగేశ్వరరావు, బీసీ ఫెడరేషన్ నాయకులు ఊటుకూరి వెంకటేశ్వర్లు, జ్యోతిర్మయి దేవాంగ సమితి బీరక పరమేష్ తదితరులున్నారు. నారాయణపూర్ అమరులకు చెందిన బంధుమిత్రుల సంఘం డిమాండ్ -
చాలా ప్రయత్నాలు చేస్తున్నాం
నేను భారత హాకీ జట్టు క్యాంపులో సాధన చేశాను. అంతర్జాతీయ రిఫరీగా పనిచేస్తున్నాను. జిల్లాలో హాకీకి గ్రహణం పట్టిందా అనిపిస్తుంది. ఎవర్ని అడిగినా చేద్దామంటారేగాని ముందుకు రారు. ప్రస్తుతం కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ క్రీడలపట్ల చొరవ చూపిస్తున్నారు. ఆయనను కలిసి వివరిస్తాను. జాతీయ క్రీడలకు కనీసం మైదానం లేకపోవడమంటే ఇది అవమానమే. గ్రౌండ్ ఇస్తే చాలు మా అసోసియేషన్ నుంచి క్రీడాకారులను, కిట్స్ను ఇతర అంశాలకు పూర్తి సహకారమందిస్తాం. మైదానం ఏర్పాటు చేసి, ఒక శాప్ హాకీ కోచ్ను ఇవ్వండి. కేవలం రెండు సంవత్సరాలు చూడండి ఎన్ని రిజల్ట్స్ గుంటూరు జిల్లాకు వస్తాయో. హాకీలో రాణిస్తే ప్రభుత్వ ఉద్యోగాలు కూడా పొందే వీలుంటుంది. – జి.హర్షవర్ధన్, హాకీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్. -
జాతీయ క్రీడకు గ్రహణం
ఒలింపిక్స్లో వరుసగా బంగారు పతకాలు సాధించిన క్రీడ. ప్రపంచం మెచ్చిన ధ్యాన్చంద్లాంటి అద్భుత క్రీడాకారులను అందించిన క్రీడ. ఘన చరిత్రను సొంతం చేసుకోవడంతోపాటు జాతీయ క్రీడ హోదాను దక్కించుకున్న హాకీకి జిల్లాలో చోటులేకుండా పోయింది. ● వేసవి శిక్షణలో కూడా లేని హాకీ ● కనీస మైదానం లేక అవస్థలు ● పట్టించుకోని నాయకులు, అధికారులు ● ఇతర ప్రాంతాలకు తరలిపోతున్న క్రీడాకారులు గుంటూరు వెస్ట్ (క్రీడలు): దశాబ్దకాలం నుంచి జిల్లాలో హాకీకి క్రీడా మైదానం లేదు. గుంటూరు నగరంలో సుమారు 18 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బీఆర్ స్టేడియంలో కూడా హాకీకి చోటుక ల్పించకపోవడం దారుణమని సీనియర్ క్రీడాకారులు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం వేసవి శిక్షణ శిబిరాలు జిల్లా వ్యాప్తంగా నడుస్తున్నాయి. దాదాపు 20 క్రీడల్లో చిన్నారులు ఉత్సాహంగా శిక్షణ తీసుకుంటున్నారు. అయితే ఇందులో హాకీ లేకపోవడం గమనార్హం. హాకీ సీనియర్ క్రీడాకారులు పలుమార్లు స్థానిక ప్రజాప్రతినిధులను, జిల్లా కలెక్టర్లను కలిసినా ఫలితం శూన్యం. ఓ ప్రైవేటు స్కూల్ యాజమాన్యం తమ పిల్లలకు సొంతంగా హాకీ టర్ప్ను ఏర్పాటు చేసుకుంది. జిల్లా క్రీడాభివృద్ధి శాఖాధికారులు కనీసం ఆ దిశగా చర్యలు కూడా తీసుకోకపోవడం ఏంటని కొందరు క్రీడా సంఘ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన క్రీడా పాలసీ ఏమయ్యిందో ఎవరికీ తెలీయదు. 3 ఎకరాలు సరిపోతుంది హాకీ మైదానం కావాలంటే కనీసం మూడు ఎకరాలుంటే సరిపోయేది. పాలకులు మాత్రం కనీస చొరవ చూపడంలేదు. ప్రస్తుతం నగరంలో క్రీడాకారులు బాక్స్ క్రికెట్ గ్రౌండ్లో గంటకు రూ.1000 చెల్లించి సాధన చేస్తున్నారు. దీంతోపాటు కొన్ని కళాశాలల్లో ఖాళీ స్థలాలను తీసుకుని వారే బాగుచేసుకుని సాధన చేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 50 నుంచి 75 మంది వరకు రాష్ట్ర, జాతీయ స్థాయి హాకీ క్రీడాకారులున్నారు. ప్రస్తుతం కొందరు జాతీయ సీనియర్ నేషనల్స్ ఆడుతున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా స్కీమ్ను ప్రవేశపెట్టింది. దీనిలో ఒక ఎంపీ, జిల్లా కలెక్టర్ కలిసి కొంచెం పనిచేస్తే హాకీ టర్ఫ్ వికెట్కు రూ.8 కోట్లు కేటాయిస్తుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ అనంతపురంలో ప్రారంభమయ్యింది. కలెక్టర్ 3 నుంచి 5 ఎకరాల స్థలం కేటాయించి స్థానిక ఎంపీ సిఫార్సు ఉంటే ఈ నిధి విడుదల చేస్తున్నారు. -
వృద్ధులకు శుభవార్త!
● సీనియర్ సిటిజన్ కార్డు దరఖాస్తులకు ఆహ్వానం ● గ్రామ సచివాలయంలోనే చేసుకునే అవకాశం ● రెండు రోజుల్లోనే పొందేలా చర్యలు ● కార్డు ద్వారా పలు ప్రయోజనాలు యడ్లపాడు: కేంద్ర ప్రభుత్వం 60 సంవత్సరాలు నిండిన వృద్ధులకు ప్రత్యేకంగా ‘సీనియర్ సిటిజన్ కార్డు’లను జారీ చేయాలని నిర్ణయించింది. వీటిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక వెబ్సైట్ను రూపొందించింది. ఈ సేవకోసం దూరంగా వెళ్లాల్సిన అవసరం లేదు. గ్రామ/వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. దరఖాస్తు ప్రక్రియ కూడా చాలా సులభం. ఆధార్, వయసును నిర్ధారించే గుర్తింపు పత్రం, బ్లడ్గ్రూప్ వివరాలు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోతో పాటు రూ. 40 చెల్లిస్తే రెండు రోజుల్లోనే కార్డును అందజేస్తారు. అయితే ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి. ఇవి ప్రయోజనాలు ఈ కార్డుతో వృద్ధులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పలు రకాల ప్రయోజనాలు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో 25శాతం రాయితీ, ప్రత్యేక సీట్లు, రైల్వే స్టేషన్లలో కౌంటర్ల వద్ద ప్రాధాన్యత, వరుసలో నిలబడి ఉండాల్సిన అవసరం ఉండదు. బ్యాంకుల్లో ఫిక్సడ్ డిపాజిట్లపై అఽధిక వడ్డీ, ఆదాయపు పన్ను మినహాయింపు కోసం, పాస్పోర్ట్ ఫీజులో తగ్గింపు వంటి లాభాలు ఉన్నాయి. ఆయుష్మాన్ భార త్కార్డ్, వయో వందన హెల్త్ కార్డు పొందడానికి ఉపయోగపడుతుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల కేటాయింపులతో పాటు కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ రాయితీపై ఆరోగ్య సేవలు లభించనున్నాయి. ఇంకా దేవాలయాలలో ప్రాధాన్యత దర్శనం పొందడానికి ఈ కార్డు దోహదం కానుంది. 25వేల మందికి జారీ గుంటూరు, పల్నాడు జిల్లాల పరిధిలో ఈ ఏడాది మార్చి వరకు ఆఫ్లైన్లో 26,575 దరఖాస్తులను సీనియర్ సిటిజన్స్ సమర్పించారు. ఏప్రిల్ ఒకటి నుంచి ఈ ప్రక్రియను ఆన్లైన్ చేయడంతో 1438 మంది నేరుగా దరఖాస్తు చేసుకున్నారు. ఆయా అర్జీలను పరిశీలించి 25వేల మందికి పైగా కార్డులను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. -
లారీ ఢీకొని బాలుడి మృతి
తాడికొండ: లారీ ఢీకొని 12 సంవత్సరాల బాబు మృతి చెందిన ఘటన తుళ్ళూరు మండలం రాయపూడి గ్రామ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం తుళ్లూరు గ్రామానికి చెందిన అంకం అభి (12) అనే యువకుడు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా రాయపూడి పెట్రోల్ బంక్ వద్ద వేగంగా వస్తున్న లారీని ఢీకొట్టి బాలుడిని ఈడ్చుకు వెళ్లడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మైనర్ బాలుడు ద్విచక్ర వాహనం నడుపుకొని వెళుతుండటంతో ఈ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు రోడ్డుపై బైటాయించి న్యాయం చేయాలంటూ నిరసనకు దిగారు. రాత్రి 10 గంటల వరకు కూడా నిరసన ముగించక పోవడంతో పోలీసులు సర్థి చెప్పేందుకు యత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తుళ్లూరు పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్ వాహనం వదిలి పరారీలో ఉండటంతో పోలీసులు గాలిస్తున్నారు. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు, రాజధానిలో కూలీ పనులు లేకపోవడంతో గేదెలు మేపుకొని జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె కాగా కుమారుడి అకాల మరణంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. తల్లిదండ్రులతో పాటు స్థానికులు అందరూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేస్తుండటంతో ట్రాఫిక్ స్తంభించింది. -
దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి
బాపట్ల: గిరిజన, దివ్యాంగుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లాలోని గిరిజన, దివ్యాంగుల కోసం ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన, దివ్యాంగుల సమస్యలను సత్వరమే పరిష్కరించడానికి అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. వేటపాలెంలో 60 మంది యానాది కులానికి చెందిన వారికి ఆలస్యంగా జనన ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారని, ఆధార్ కోసం పత్రాలు కోరుతూ వచ్చిన ఫిర్యాదునకు ఆయన స్పందించారు. వెంటనే పత్రాలు జారీ చేయాలని వేటపాలెం తహసీల్దార్ను ఆదేశించారు. అక్కయ్యపాలెం పంచాయతీలో 300 యానాదుల కుటుంబాలకు శ్మశానం కోసం స్థల సేకరణ చేసి నివేదిక అందించాలని కూడా ఆదేశాలిచ్చారు. జిల్లాలో దివ్యాంగుల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం వారంలో సోమ, మంగళ, బుధవారాల్లో బాపట్ల జిల్లాలో విధులు నిర్వహించాలని సహాయ సంచాలకులు, వికలాంగుల సంక్షేమ శాఖ అధికారిని ఆయన ఆదేశించారు. వారి కోసం స్థానిక కలెక్టరేట్లో కార్యాలయం ఏర్పాటు చేశామన్నారు. మిగిలిన 3 రోజులు ప్రకాశం జిల్లాలో విధులు నిర్వహించాలని ఆయన దివ్యాంగుల శాఖ అధికారిని ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో 5% కోటా అమలు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో కూడా 5% ఉద్యోగ కల్పనకు చర్యలు తీసుకోవాలని ఆయన ఏడీని ఆదేశించారు. జిల్లాలో దివ్యాంగుల కొరకు మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లో 5% షాపులు కేటాయింపునకు చర్యలు తీసుకోవాలని బాపట్ల మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. 16 మంది ట్రానన్స్ జెండర్లకు గుర్తింపు ధ్రువీకరణ పత్రాలను జిల్లా కలెక్టర్ అందజేశారు. యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ను వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో 42 వేల మంది ఉద్యోగులు ఉండగా, ఇప్పటివరకు కేవలం 6 వేల మంది మాత్రమే రిజిస్ట్రేషన్ పూర్తి చేశారన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి. గంగాధర్ గౌడ్, బాపట్ల రెవెన్యూ డివిజన్ అధికారి గ్లోరియా, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ప్రకాష్ రావు, వికలాంగుల సంక్షేమ శాఖ అధికారి అర్చన తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి -
ప్రభుత్వం కొనాల్సిందే
పొగాకు మొత్తం సాక్షి ప్రతినిధి, బాపట్ల: ప్రభుత్వం డొంకతిరుగుడు ప్రకటనలతో రైతులను మభ్యపెట్టడం మాని వారి నుంచి బ్లాక్బర్లీ పొగాకును తక్షణం కొనుగోలు చేయాలని వైఎస్సార్సీపీ పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త గాదె మధుసూదన్రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పొగాకు కంపెనీల మెడలు వంచి సరకు కొనిపించాలన్నారు. లేదంటే ప్రభుత్వమే టుబాకో బోర్డు లేదా మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. తద్వారా రైతులను ఆదుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం పాము చావక, కట్టె ఇరగక అనే చందంగా వ్యవహరిస్తోందన్నారు. రైతులను మభ్యపెట్టేలా ప్రకటనలతో సరిపెట్టకుండా వారిని చిత్తశుద్ధితో ఆదుకోవాలన్నారు. జిల్లాలో 99 శాతం బ్లాక్బర్లీని పర్చూరు నియోజకవర్గ రైతులు సాగుచేశారన్నారు. మొత్తం కొనుగోలు చేస్తామని ఆశపెట్టి తీరా పంట చేతికొచ్చాక కంపెనీలు మోసగించాయన్నారు. పొలాల్లో పొగాకు పెట్టుకొని వానకు తడుస్తుంటే అన్నదాతలు తీవ్ర ఆవేదన చెందుతున్నట్లు పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతుకంట కన్నీరు చూడలేదన్నారు. రైతులకు అన్నివిధాలా సహాయం అందించేందుకు రైతుభరోసా కేంద్రాలు, సచివాలయాలు నెలకొల్పారన్నారు. వలంటీర్లు నిత్యం అందుబాటులో ఉండి ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా నిలిచారని తెలిపారు. ఇప్పుడు అన్ని వ్యవస్థలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసి ప్రజల ఉసురు పోసుకుంటోందని గాదె విమర్శించారు. ప్రభుత్వం కేవలం ప్రకటనలతో ప్రజలను వంచించకుండా తక్షణం పొగాకు కొని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకునేది లేదన్నారు. రైతులతో కలిసి పోరాటానికి సిద్ధ పడతామన్నారు. కంపెనీల మెడలు వంచి బ్లాక్బర్లీ కొనిపించండి లేదంటే ప్రభుత్వమే పొగాకు బోర్డు లేదా మార్క్ఫెడ్ ద్వారా కొనాలి రైతులను మభ్యపెట్టే చర్యలు ఆపాలి పొగాకు కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలి వ్యవసాయశాఖ వద్ద అన్ని లెక్కలూ ఉన్నాయి పర్చూరు వైఎస్సార్సీపీ సమన్వయకర్త గాదె మధుసూదన్ రెడ్డి -
ఎగసి పడుతున్న అలలు
నిలిచిన వేట గత నెల రోజులుగా వేట నిషేధం కావటంతో మరో వారంలో ఎత్తివేసేందుకు అవకాశం ఉండగా వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ఇప్పటికీ అనుమతి రాలేదు. వేట మినహా మిగిలిన ఉపాధి అవకాశాలు కూడా లేకపోవటంతో సముద్రానికి దగ్గరగా ఉన్న రామ్నగర్ పెద్దకాలువలో మత్స్యకారులు చేపలు పడుతూ పొట్ట నింపుకొంటున్నారు. బాపట్ల: వాతావరణంలో వచ్చిన మార్పు కారణంగా మూడు రోజులుగా సముద్రతీరం నిర్మానుష్యంగా మారింది. మరోపక్కన అలలు ఎగసి పడుతున్నాయి. ఆకాశం మేఘావృతం కావటంతోపాటు సాయంత్రానికి చిమ్మచీకట్లు కమ్ముకొంటున్నాయి. ఈదురుగాలులు ఎక్కువగా రావటంతో పాటు రాకాసి అలలు ఎగిసి పడుతుండటంతో తీరానికి వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. తీరం ఇంత నిర్మానుష్యంగా మారటం ఇటీవల కాలంలో ఎప్పుడు చూడలేదని స్థానికులు చెబుతున్నారు. కరువుభత్యం అంతంత మాత్రమే సముద్రం వేట నిషేధం సందర్భంగా 45 రోజులపాటు ప్రభుత్వం కరువుభత్యం ఇస్తోంది. బాపట్ల జిల్లాలో 5 వేల మందికిపైగానే మత్స్యకారులు ఉన్నప్పటికీ సగం మందికి కూడా అందలేదు. ఈ ఏడాది కూడా ఆకలికేకలు తప్పటంలేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరువ్యాపారులలో అలజడి వాతావరణంలో వచ్చిన మార్పు కారణంగా సూర్యలంకకు పర్యాటకులు సంఖ్య తగ్గిపోవటంతో తీరంలోని చిరువ్యాపారులు కనీసం బోణీలు కూడా లేకపోవటంతో ఇబ్బంది పడుతున్నారు. కనీసం రోజుకు 50 మంది పర్యాటకులు కూడా రాకపోవటంతో ఆవేదన చెందుతున్నారు. నిర్మానుష్యంగా మారిన సముద్ర తీరం వేట లేక అల్లాడుతున్న మత్స్యకారులు -
5న ‘చలో విజయవాడ’ కార్యక్రమం
మంగళగిరి: జూన్ 5వ తేదీన రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయాలని ఏపీజీఈఏ గుంటూరు జిల్లా అధ్యక్షుడు చాంద్ బాషా పిలుపునిచ్చారు. గురువారం తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చాంద్ బాషా మాట్లాడుతూ.. జూన్ 5వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు విజయవంతం చేయాలన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేసే సంఘానికి మద్దతు తెలపాలని కోరారు. అనంతరం వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి లక్ష్మీనారాయణ, మంగళగిరి తాలూకా యూనిట్ అధ్యక్షుడు మురళి, కార్యదర్శి మాధవరావు, ఉపాధ్యక్షురాలు సుభాషిణి, ఆర్గనైజింగ్ కార్యదర్శి గంగాభవాని తదితరులు పాల్గొన్నారు. అందరూ మొక్కలు నాటి సంరక్షించాలి కాజ (మంగళగిరి): ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని మెప్మా డైరెక్టర్ తేజ్ భరత్ తెలిపారు. మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలోని కాజలో గురువారం ఉమెన్ ఫర్ ట్రీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మెప్మా డైరెక్టర్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలు, మహిళా సంఘాలు సభ్యులు తొలుత కనీసం ఒక్క మొక్క నాటి దానిని సంరక్షించాలని కోరారు. మొక్కలు నాటడంపై మహిళలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం మహిళలకు కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంటీఎంసీ కమిషనర్ అలీంబాషా, అడిషనల్ కమిషనర్ శకుంతల, మెప్మా పి.డి. విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తొలిరోజే విద్యామిత్ర కిట్లు అందిస్తాం ప్రత్తిపాడు: పాఠశాలలు పునఃప్రారంభమైన తొలిరోజే విద్యార్థులకు విద్యామిత్ర కిట్లు అందించడం జరుగుతుందని సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఐ. పద్మావతి అన్నారు. ప్రత్తిపాడులోని భవనం వెంకటరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని మండల స్థాయి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర స్టాక్ పాయింట్ను గురువారం ఏపీసీ పరిశీలించారు. క్వాలిటీ వాల్తోపాటు బ్యాగుల నాణ్యతను పరిశీలించారు. స్టాక్ పాయింట్కు చేరిన పుస్తకాల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన కిట్లు అందించడం జరుగుతుందన్నారు. వెంట ఎంఈవో–2 జి. లీలారాణి, సిబ్బంది పాల్గొన్నారు. ఇకపై వజ్ర కిరీటంతో దుర్గమ్మ దర్శనం ప్రతి పౌర్ణమి రోజున అలంకరించాలన్న ఈవో శీనానాయక్ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ప్రతి పౌర్ణమిన అమ్మవారికి స్వర్ణకవచంతో పాటు వజ్ర కిరీటాన్ని అలంకరించాలని దుర్గగుడి ఈవో శీనానాయక్ ఆలయ వైదిక కమిటీకి సూచించారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన వైదిక కమిటీ, ముఖ్య అర్చకులతో ఈవో శీనానాయక్ గురువారం సమావేశమయ్యారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఈవో చాంబర్లో ఏర్పాటు చేసిన సమావేశానికి వైదిక కమిటీ సభ్యులు, ఆలయ ప్రధాన అర్చకులు ఎల్డీ ప్రసాద్, మల్లేశ్వర శాస్త్రి, సుందరంబాబులతో పాటు ఇతర అర్చకులు పాల్గొన్నారు. ఈవో శీనానాయక్ మాట్లాడుతూ అమ్మవారి సన్నిధిలో జరిగే వైదిక కార్యక్రమాలను మరింత వైభవంగా నిర్వహించాలని, నిత్యపూజలు శాస్త్రోక్తంగా నిర్వహించాలని సూచించారు. దేవతామూర్తుల అలంకరణ, వస్త్రాలు వైభవంగా ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో ఆలయ ఉప ప్రధాన అర్చకులు శంకర శాండిల్య, కోట రవికుమార్, ముఖ్య అర్చకులు రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి, ఏఈవోలు పాల్గొన్నారు. -
గంజాయి,మాదకద్రవ్యాలను సంపూర్ణంగా నిర్మూలించాలి
బాపట్ల : రేషన్ సరుకుల పంపిణీలో అవకతవకలకు పాల్పడకుండా జాగ్రత్త వహించాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి రేషన్ డీలర్లకు సూచించారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో రేషన్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శులతో ఆయన సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రేషన్ సరుకులు షాపుల ద్వారా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఈ విధానం జూన్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు. ఒకటో తేదీన షాపులను ప్రజాప్రతినిధులతో ఘనంగా ప్రారంభించాలని తెలిపారు. ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు షాపులు తెరచి ఉంచాలన్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది గంటల వరకు సరుకులను పంపిణీ చేయాలన్నారు. ప్రతి కార్డుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. 65 సంవత్సరాలు పైబడిన వారికి, వికలాంగులకు ఇంటి వద్దకు వెళ్లి సరుకులను అందజేయాలన్నారు. ఎవరైనా అవకతవకలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించే వారికి ప్రోత్సాహం ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల ఇన్చార్జి అధికారి లవన్న, పౌర సరఫరాల మేనేజర్ శ్రీనివాసరావు, రేపల్లె, చీరాల రెవెన్యూ డివిజన్ అధికారులు రామలక్ష్మి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. యోగాంధ్రను విజయవంతం చేయాలి ఈనెల 21 నుంచి జూన్ 21వ తేదీ వరకు జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని వీక్షణ సమావేశ మందిరం నుంచి యోగాంధ్ర క్యాంపెయిన్ అంశంపై ఎంపీడీవోలు, గ్రామస్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్న్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ బాపట్ల జిల్లాలో 8 లక్షల మందిని రిజిస్ట్రేషన్ చేయించాలన్నారు. ఒక్కో మండలంలో 30 వేల మందిని రిజిస్ట్రేషన్ చేయించాలన్నారు. ప్రతి సచివాలయం ఉద్యోగి 300 మందిని రిజిస్ట్రేషన్ చేయించాలన్నారు. ఈ కార్యక్రమాన్ని ఈనెల 28వ తేదీలోపు పూర్తి చేయాలన్నారు. జూన్ 21న సూర్యలంక, రామాపురం బీచ్లో 2500 నుంచి 5000 మందితో కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. సమావేశంలో జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, డ్వామా పీడీ విజయలక్ష్మి, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దాలి ప్రజలు నివాసం ఉండే గ్రామాలను అధికారులు సుందరంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు. పంచాయతీశాఖలో చెత్త సంపద కేంద్రాల నిర్వహణ, గ్రామాల పరిశుభ్రతపై స్థానిక సాయిరామ్ గ్రాండ్ కన్వెన్షన్ హాలులో గురువారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత పంచాయతీ అధికారులపై ఉందని అన్నారు. ఇప్పటివరకు గ్రీన్ అంబాసిడర్లు, గ్రామ కార్యదర్శులు, పంచాయతీ అధికారులు నిర్లిప్తంగా వ్యవహరించడంతోనే గ్రామాలు అపరిశుభ్రంగా మారాయని అసహనం వ్యక్తం చేశారు. గ్రామాలలో ప్రక్షాళన జరగాలి, ఇందుకోసం జూన్ 21వ తేదీ వరకు సమయం ఇస్తామని, ఆ తర్వాత గ్రామాలలో రహదారుల వెంట చెత్త కనిపిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్ మాట్లాడుతూ చెత్త సంపద కేంద్రాలు సమర్థంగా నిర్వహించాలని తెలిపారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. గంజాయి, మాదకద్రవ్యాలను సంపూర్ణంగా నిర్మూలించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అన్నారు. గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలన జిల్లా స్థాయి కమిటీ సమావేశం గురువారం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించారు. నషా ముక్త్ భారత్ అభయాన్ కార్యక్రమంలో భాగంగా విభిన్న ప్రతిభావంతులు, వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన మాదక ద్రవ్యాల నిర్మూలన–మత్తు రహిత సమాజం మన లక్ష్యం వాల్పోస్టర్లు, కరపత్రాలను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. అదనపు ఎస్పీ విఠలేశ్వర్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల ఉత్పత్తి, విక్రయాలను అరికట్టడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. కళాశాలల్లో ప్రత్యేక సదస్సులు నిర్వహించనున్నట్లు వివరించారు. సమావేశంలో జిల్లా స్థాయి కమిటీ సభ్యులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
బాపట్ల జిల్లాలో రోడ్లు అధ్వానం
సాక్షి ప్రతినిధి, బాపట్ల: ఇంకొల్లు–పర్చూరు (పాత మద్రాసు) రోడ్డు ఆధునికీకరణ పనులకు గత ప్రభుత్వం రూ.22 కోట్ల నిధులు మంజూరు చేసి 19 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ రోడ్డు పనుల్లో 28 శాతం పూర్తి చేసింది. ఇంకొల్లులో సిమెంట్ రోడ్డు నిర్మాణంతోపాటు రహదారిలో ఉన్న కల్వర్టు పనులను దాదాపుగా పూర్తిచేశారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది ముగుస్తున్నా రోడ్డుపై తట్టమట్టి పోయలేదు. ఇటీవల వర్షాలు కురవడంతో మరింత అధ్వానంగా తయారైంది. తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు మృత్యువాత పడ్డారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ దారిలో ఇంకొల్లు మొదలు ఇడుపులపాడు, వంకాయలపాడు, దగ్గుపాడు, నూతలపాడు, ఎర్రగుంటపాలెం, పర్చూరుతోపాటు పలు గ్రామాలున్నాయి.ఈ దారిగుండా అటు పర్చూరు నుంచి చిలుకలూరిపేట, గుంటూరు, విజయవాడతో పాటు పల్నాడు జిల్లా మీదుగా హైదరాబాద్కు ఇటు ఇంకొల్లు నుంచి చైన్నె– కోల్కతా జాతీయరహదారి మీదుగా ప్రకాశం, నెల్లూరు, చైన్నె, తిరుపతి జిల్లాకు వెళ్లవచ్చు. మండలానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు భవనం శ్రీనివాసరెడ్డి పలుమార్లు రోడ్లు భవనాల శాఖ డీఈ, కాంట్రాక్టర్తో మాట్లాడి నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలని కోరారు. ఆ శాఖ సీఈ రోడ్డును పరిశీలిస్తారని, ఆయన సూచన మేరకు నిర్ణయం తీసుకుంటామని జేఈ శ్రీకాంత్ ఆరునెలల కిందట చెప్పినా ఇప్పటికీ పురోగతి లేదు.శ్రద్ధ చూపని పచ్చనేత ...నూతలపాడు–మార్టూరు, పర్చూరు యద్దనపూడి, ఇంకొల్లు, నాగట్లతో పాటు పలు రహదారులు ఇప్పటికే గుంతలమయంగా మారాయి. వర్షాలు పెరిగితే పూర్తిగా రాకపోకలు స్తంభించే అవకాశముంది. ఇప్పటికే ఈ రోడ్లలో పది కిలోమీటర్ల ప్రయాణానికి అరగంట సమయం పడుతోందని ప్రయాణికులు వాపోతున్నారు. ఎన్నికల్లో ఓట్లేయించుకొన్న నియోజకవర్గ పచ్చనేత ప్రకృతి వనరులను కొల్లగొట్టడంలో చూపిస్తున్న శ్రద్ధ ఇక్కడి రోడ్లను మరమ్మతు చేయించడంలో చూపడం లేదన్న విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.‘గత ప్రభుత్వంలో రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి. ప్రభుత్వం ఒక్క రోడ్డును రిపేరు చేయలేదు. మేము అధికారంలోకి రాగానే రోడ్లను అద్దంలా మారుస్తామని ఎన్నికల్లో ప్రచారం చేసిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక కొత్త రోడ్ల నిర్మాణం సంగతి దేవుడెరుగు ఉన్న రోడ్ల గుంతలను పూడ్చకుండా గాలికి వదిలేశారు. అధికారం దక్కాక బోడిమల్లన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండిఇంకొల్లు– పర్చూరు రోడ్డు అధ్వానంగా మారి ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. రోడ్డు ప్రమాదాలతో ఇప్పటికే చాలామంది ప్రాణాలు కోల్పోయారు. నియోజకవర్గంలోని నూతలపాడు–మార్టూరు, పర్చూరు యద్దనపూడి, ఇంకొల్లు, నాగట్లతోపాటు పలు రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. తక్షణం ప్రభుత్వం స్పందించి రోడ్లు మరమ్మతులు చేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి.– గాదె మధుసూదన్రెడ్డి, వైఎస్సార్సీపీ పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్తపనులు వెంటనే మొదలు పెట్టాలిఇంకొల్లు– పర్చూరు రోడ్డు నిర్మాణ పనులను ప్రభుత్వం వెంటనే పూర్తిచేయాలి. వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రోడ్డు నిర్మాణానికి రూ.22 కోట్లు ఇచ్చింది. 28 శాతం పనులు పూర్తయ్యాయి. అధికారులు, కాంట్రాక్టర్తో సకాలంలో పనులు పూర్తి చేయించలేక పోయారు. రోడ్డు మరింతగా దెబ్బతినడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాలు జరుగుతున్నాయి. వర్షాలు పడడంతో రోడ్డు మరింత గుంతలమయంగా మారుతోంది.– భవనం శ్రీలక్ష్మి, జెడ్పీటీసీ, ఇంకొల్లు -
పీజీ వైద్యులకు పరిశోధనలపై దృష్టి ముఖ్యం
గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్ నాగార్జునకొండ వెంకటసుందరాచారి గుంటూరు మెడికల్: పీజీ వైద్య విద్యార్థులు అకడమిక్ కార్యక్రమాలతోపాటు పరిశోధనలపై దృష్టి సారించడం ద్వారా రోగులకు మెరుగైన సేవలు అందించవచ్చని గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్ నాగార్జునకొండ వెంకటసుందరాచారి అన్నారు. గుంటూరు మెడికల్ కాలేజ్లో పీజీ వైద్య విద్యార్థుల కోసం రెండురోజుల పరిశోధన శిక్షణ శిబిరం గురువారం మొదలైంది. తొలి ఏడాది పీజీ వైద్య విద్యార్థులకు ‘రీసెర్చ్ మెథడాలజీ – థీసిస్ ప్రిపరేషన్’పై కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో వర్క్షాప్ నిర్వహించారు. వివిధ వైద్య విభాగాల నుంచి 180 మందికిపైగా పీజీ వైద్యులు పాల్గొన్నారు. వర్క్షాప్ను ప్రారంభించిన కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ సీతారామ మాట్లాడుతూ, పరిశోధన పట్ల ఆసక్తిని పెంపొందించడానికి, గుణాత్మక థీసిస్ రూపొందించేందుకు వర్క్షాప్ ఉపయోగపడుతుందన్నారు. ముఖ్య అతిథిగా కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి మాట్లాడుతూ ఇలాంటి శిక్షణలు విద్యార్థులకు పరిశోధన పట్ల అవగాహనను పెంచడమే కాకుండా, మెరుగైన ఫలితాలు సాధించేందుకు దోహదపడతాయన్నారు. గైనకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ జయంతి, డాక్టర్ పి.అనిల్, పలువురు అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు తరగతులు నిర్వహించి, పీజీ విద్యార్థుల థీసిస్ ప్రోటోకాల్ను వివరించారు. -
సమావేశాలతో మమ అనిపించారు
పట్నంబజారు: గుంటూరు నగరంలో అర్ధరాత్రి పూట మద్యం విక్రయాలపై ‘సాక్షి’లో గురువారం ప్రచురితమైన ‘నిశీధిలోనూ అదే నిషా’ కథనానికి అధికారులు స్పందించారు. బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి మద్యం విక్రయాలపై చర్చించారు. అయితే ఇప్పటి వరకు అర్ధరాత్రి పూట మద్యం అమ్మకాలు చేపట్టిన దుకాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం కాలక్షేపంగా సమావేశం నిర్వహించి, జాగ్రత్త పడాలంటూ అధికారులే సూచనలు చేశారని విమర్శలు వస్తున్నాయి. స్పష్టంగా సాక్ష్యాధారాలతో ‘సాక్షి’తో కథనం ప్రచురితమైనప్పటికీ అధికారులు నోటి మాటలతోనే సరిపెట్టారు. అర్ధరాత్రి వేళ అమ్మకాలు జరిగినా బార్ అండ్ రెస్టారెంట్లపై కనీస నిబంధనల ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతోపాటు పోలీసులు సైతం సమావేశం ఏర్పాటు చేసి యాక్షన్ తీసుకుంటామని ‘యాక్షన్’ చేశారు తప్ప, ఎటువంటి చర్యలు చేపట్టలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రత్యేక టీమ్ను ఏర్పాటు చేస్తామని చెబుతున్నారుగానీ, ఏడాది కాలంలో ఏ ఒక్కరోజూ ఇది అమలు కాలేదు. గతంలో సైతం బహిరంగ మద్యపానం, ఎమ్మార్పీ ధరలు, అర్ధరాత్రి అమ్మకాల విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ చర్యలు చేపడతామని చెప్పారేగానీ, చేతల్లో మాత్రం ఆ విషయం చూపలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూడు నెలలు మాత్రమే వ్యవధి ఉందని, అధికారులకు అన్ని విధాలా సహాయంగానే ఉంటున్నామని, ప్రతినెలా మామూళ్లు చెల్లిస్తున్నామని, చూసీచూడనట్లు పోవాలని ఎకై ్సజ్, పోలీసు అధికారులతో వ్యాపారులు విన్నవించినట్లు సమాచారం. కొద్దిరోజులు పేరుకు తాము తనిఖీలు నిర్వహిస్తామని, ఆ సమయంలో కొద్దిరోజులపాటు నియమాలు పాటించాలని పోలీసు అధికారులు సూచించినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి మద్యం అమ్మకాలపై చర్యలు శూన్యం -
యోగాపై అవగాహన పెంపునకు చర్యలు
జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ గుంటూరు వెస్ట్: యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని, దీనిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని మినీ శంకరన్ హాలులో జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులుతో కలిసి నిర్వహించిన అధికారుల వీడియో సమావేశంలో ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడారు. వచ్చే నెల 21వ తేదీ వరకు జరుగనున్న యోగాంధ్ర క్యాంపెయిన్ను అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. ప్రతి మండల, డివిజనల్ స్థాయి కేంద్రాల్లోనూ యోగా మాస్టర్ ట్రైనర్లను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలోని పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో యోగా ప్రచారం విస్తృతంగా చేపట్టాలని పేర్కొన్నారు. ప్రతి మండల, గ్రామ, డివిజనల్ స్థాయిలో ట్రైనర్ల ద్వారా యోగా సాధన వల్ల వచ్చే ప్రయోజనాలను తెలియజేయాలన్నారు. గ్రామ, మండలాల్లో వంద నుంచి 150 మంది యోగా చేసేందుకు వీలున్న విద్యాసంస్థలు, గోదాములు, గుర్తించాలని తెలిపారు. సచివాలయ కార్యదర్శుల ద్వారా యోగా సాధనకు పేర్లు నమోదు చేయించాలన్నారు. యోగాంధ్రలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకొక బృందాన్ని ప్రకటించిందని పేర్కొన్నారు. గుంటూరు జిల్లాకు సంబంధించి కల్చరల్ టీం ఈ బాధ్యతలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో షేక్ ఖాజావలి, ఆర్డీవో కె.శ్రీనివాసరావు, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ గంగరాజు, లక్ష్మీకుమారి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
పట్టపగలే రూ.6.25 లక్షలు చోరీ
సుద్దపల్లి (చేబ్రోలు): చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామంలో పట్టపగలే ఇంటిలోని బీరువా తాళాలు పగలకొట్టిన దొంగలు భారీగా నగదు చోరీ చేసిన ఘటన గురువారం జరిగింది. సుద్దపల్లి గ్రామానికి చెందిన ఆలకుంట శ్రీనుకు చెందిన ఇంటిలో మధ్యాహ్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటిలోని బీరువా తాళాలు పగలకొట్టారు. అందులోని రూ.6.25 లక్షల నగదును చోరీ చేశారు. వీటితో పాటు బంగారు వస్తువులు కూడా చోరీ అయినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల క్రితం ఇంటిలో వివాహ వేడుక జరిగింది. వడ్లమూడిలో జరిగే శుభకార్యానికి అందరూ వెళ్లటంతో గమనించిన దొంగలు చోరీకి పాల్పడినట్లు తెలిసింది. పొన్నూరు రూరల్ సీఐ వై. కోటేశ్వరరావు, చేబ్రోలు ఎస్సై డి. వెంకట కృష్ణ సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలను సేకరించింది. చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
జిల్లా భద్రతా విభాగం పోలీసుల మాక్ డ్రిల్
తాడికొండ: తుళ్ళూరు మండలంలో భద్రతా పోలీసు విభాగం పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. తుళ్ళూరు డీఎస్పీ మురళీ కృష్ణ ఆధ్వర్యంలో డీఎస్డబ్ల్యూ ఆర్ఐ సురేష్ కుమార్ సమక్షంలో గురువారం నిర్వహించిన ఈ మాక్ డ్రిల్లో భాగంగా భద్రతా విభాగం అధికారులు, సిబ్బంది తమవద్ద ఉన్న అత్యాధునిక సాంకేతిక పరికరాలు, శిక్షణ పొందిన పోలీసు జాగిలాలతో సీడ్ యాక్సిస్ రోడ్డు నుంచి మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం వరకు తనిఖీలు నిర్వహించారు. కచ్చితత్వాన్ని పరీక్షించి జాగిలాల పనితీరును అంచనా వేసేందుకు సీడ్ యాక్సిస్ రోడ్డులో ఓ చోట పేలుడు పదార్థం గోప్యంగా పెట్టారు. బాంబు డిస్పోజల్ విభాగానికి చెందిన జాగిలం దాన్ని కనిపెట్టింది. ఈ సందర్బంగా అదనపు ఎస్పీ (ఏఆర్) హనుమంతు మాట్లాడుతూ.. వీవీఐపీలు ప్రయాణించే సీడ్ యాక్సిస్ రోడ్డులో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. తుళ్ళూరు డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ ఈ రోడ్డుపై ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి నిర్మాణ పనులకు వచ్చిన కార్మికుల వివరాలను సేకరిస్తున్నామని, భద్రతను కట్టుదిట్టం చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో తుళ్ళూరు సీఐ కొంకా శ్రీనివాసరావు, ట్రాఫిక్ సీఐ కోటేశ్వరరావు, ఎస్బీ విభాగం శ్రీహరి, జిల్లా భద్రతా విభాగం ఆర్ఐ సురేష్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రజాయుద్ధ నేతగా సజ్జా నాగేశ్వరరావు
చీరాల: మావోయిస్టు పార్టీ మిలిటరీ విభాగంలో అవామ్–ఇ–జంగ్ ఎడిటోరియల్ చీఫ్గా బాధ్యతలు నిర్వహిస్తున్న సజ్జా నాగేశ్వరరావు అలియాస్ రాజన్న అలియాస్ ఏసన్న అలియాస్ నవీన్ నారాయణపూర్లో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఆయన స్వస్థలం బాపట్ల జిల్లా చీరాల మండలం జాండ్రపేట. జాండ్రపేటలో సాధారణ చేనేత కుటుంబంలో జన్మించిన ఆయన 36 సంవత్సరాలుగా విప్లవోద్యమంలో అజ్ఞాత జీవితం గడుపుతున్నారు. బాల గంగాధరరావు, సుబ్బరావమ్మ దంపతులకు ముగ్గురు సంతానం కాగా ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. తండ్రి బాలగంగాధరరావు ఇరిగేషన్ శాఖ లో ఉద్యోగిగా పలు ప్రాంతాలలో పనిచేశారు. రెండో సంతానంగా నాగేశ్వరరావు జాండ్రపేట హైస్కూల్లో విద్యాభ్యా సం పూర్తి చేసి గుంటూరు జిల్లా నల్లపాడులోని పాలిటెక్నిక్ కాలేజీలో చదివారు. 17 ఏళ్ల వయస్సులోనే రాడికల్ విద్యార్థి సంఘం పరిచయంతో విప్లవోద్యంలోకి జీవితకాలం కార్యకర్తగా వెళ్లిన నాగేశ్వరరావు అరెస్ట్ అయి జైలు జీవితం గడిపారు. సోదరి వివాహానికి పెరోల్పై విడుదలైన ఆయన అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గుంటూరు జిల్లా ఉద్యమంలో ‘ఏసన్న’గా పేరు... గుంటూరు జిల్లాలో జరిగిన ఉద్యమంలో నాగేశ్వరరావుకు ఏసన్నగా పేరుంది. ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ప్రజా యుద్ధ సైనికుడిగా నల్లమల, ఆంధ్ర ఒడిశా బోర్డర్ ప్రాంతంలో జరిగిన వివిధ రైతాంగ, దళిత, గిరిజన పోరాటాలకు నాయకత్వం వహించారు. టెక్నికల్ రంగంలో ప్రావీణ్యం పొందిన నాగేశ్వరరావు అనతి కాలంలోనే అప్పటి పీపుల్స్ వార్ నిర్వహించిన మిలటరీ పత్రిక జంగ్ సంపాదకునిగా వ్యవహరించారు. విప్లవోద్యమ అవసరాలలో భాగంగా ప్రస్తుత మావోయిస్ట్ పార్టీ మిలటరీ విభాగంలో అవామ్–ఇ–జంగ్ ఎడిటోరియల్ చీఫ్ బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. నారాయణపూర్ ఎదురు కాల్పుల్లో సజ్జా నాగేశ్వరరావు మరణించారని మీడియాలో రావడంతో ఆయన సోదరుడు సజ్జా శ్రీనివాసరావు గురువారం మీడియాతో మాట్లాడారు. తమ్ముడి మృతదేహానికి స్వగ్రామంలో అంత్యక్రియలు కుటుంబ సభ్యుల సమక్షంలో చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించాలని ప్రభుత్వం కోరారు. నారాయణపూర్ ఎన్కౌంటర్లో సజ్జా మృతి 36 సంవత్సరాలుగా విప్లవోద్యమంలో అజ్ఞాత జీవితం -
ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలి
యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గుంటూరు ఎడ్యుకేషన్: బదిలీలు, ఉద్యోగోన్నతుల్లో ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో గురువారం ఉపాధ్యాయ బదిలీలు, ఉద్యోగోన్నతులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ జిల్లా అధ్యక్షుడు యు. రాజశేఖర్రావు అధ్యక్షతన జరిగిన సదస్సులో ముఖ్య అతిథిగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... దరఖాస్తు ప్రక్రియతో ఎన్నో అంశాలు ముడి పడి ఉన్నాయని అన్నారు. ఉపాధ్యాయులు గతంలో టీఐఎస్లో స్వయంగా అప్లోడ్ చేసిన సమాచారమే ఆన్లైన్ పోర్టల్లో ఉంటుందని, దానిలో ఎటువంటి మార్పు ఉండబోదని చెప్పారు. ఆన్లైన్ దరఖాస్తులో ప్రత్యేక పాయింట్లు, రేషనలైజేషన్, ప్రిఫరెన్షియల్ పాయింట్లు ఇతర వివరాలను పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు. దరఖాస్తు సబ్మిట్ చేసే ముందుగా పరిశీలన చేసుకోవాలని, దరఖాస్తు ప్రింటవుట్ రెండు కాపీలను డీడీవోకు సమర్పించాలని సూచించారు. జూన్ 12న పాఠశాలలు పునః ప్రారంభమైన తరువాత అదనంగా గంట బోధించడంతోపాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల విభాగ చైర్మన్ ఎం. హనుమంతరావు మాట్లాడుతూ బదిలీల చట్టం, ఉపాధ్యాయులకు పాయింట్ల కేటాయింపు, పాఠశాలల స్ట్రక్చర్ వెనుక యూటీఎఫ్ పోరాటం ఉందని తెలిపారు. సదస్సులో సంఘ నాయకులు జి.వెంకటేశ్వర్లు, సీహెచ్ ఆదినారాయణ, కె. సాంబశివరావు, బి. రంగారావు, ఎం.గోవిందు, బి.ప్రసాద్, ఎం.కోటిరెడ్డి, ఎం. చిన్నయ్య, కె.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
సాగర్ కుడి కాలువకు తాగునీటి విడుదల
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి కాలువకు గురువారం అధికారులు తాగునీటిని విడుదల చేశారు. కృష్ణానది యాజమాన్య బోర్డు ఆదేశాలతో కుడి కాలువ 2, 3వ గేట్లు ద్వారా 5,500 క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. తాగునీటి అవసరాల నిమిత్తం 4 టీఎంసీలను రోజుకు 5,500 వేల క్యూసెక్కుల చొప్పున విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కుడి కాలువ పరిధిలోని చెరువులు, కుంటలు నింపుకొని తాగునీటి అవసరాలకు వాడుకోవాలని అధికారులు సూచించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడికాలువ నుంచి విడుదలవుతున్న నీరు -
అర్హులైన వైద్యులనే గర్భిణులు సంప్రదించాలి
పల్నాడు డీఎంహెచ్ఓ డాక్టర్ రవి నరసరావుపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జిల్లాలోని గర్భిణులు, బాలింతలు వైద్య సేవలకు అర్హులైన వైద్యులనే సంప్రదించాలని, నాటు వైద్యుల దగ్గరకు వెళ్లవద్దని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ బి.రవి సూచించారు. గురువారం తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గర్భిణులు, బాలింతలు క్రమం తప్పకుండా వైద్యుల సలహాల మీరకు ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం పొందటం వల్ల మాతాశిశు మరణాలు నియంత్రించవచ్చని అన్నారు. తొమ్మిది నెలల గర్భకాలంలో కనీసం రెండు సార్లు స్కానింగ్ తప్పని సరిగా చేయించాలని సూచించారు. దీని వలన గర్భస్థ శిశువు పెరుగుదల తెలుసుకునేందుకు, జన్యుపరమైన వ్యాధులు, అంగవైకల్యాలు నిర్ధారించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ఏరియా హాస్పిటల్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటళ్లలో ఉచితంగా ఆల్ట్రాసౌండ్ స్కానింగ్లు చేస్తున్నారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లు లింగ నిర్ధారణ గురించి ఎటువంటి వాణిజ్య ప్రకటనలు చేయరాదని తెలిపారు. ఈ పరీక్షలు చేసిన వారికి, దానిని ప్రోత్సహించిన వారికీ మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు జైలుశిక్ష, రూ.50 వేలు నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు. జిల్లాలో రిజిస్టర్ కాకుండా ఏ హాస్పిటల్, డయాగ్నస్టిక్ సెంటర్ నిర్వహిస్తే చట్టప్రకారం శిక్షార్హులవుతారన్నారు. ఇటువంటి వారి గురించి తెలిస్తే టోల్ఫ్రీ నంబరు 18004253365 ద్వారా తెలియజేయాలని ప్రజలకు సూచించారు. మెమో కె.సాంబశివరావు పాల్గొన్నారు. -
వైభవంగా ప్రసన్నాంజనేయుని కల్యాణ వేడుకలు
బెల్లంకొండ: మండలంలోని బెల్లంకొండ క్రాస్ రోడ్ వద్ద గల శ్రీ కోళ్లూరు ప్రసన్నాంజనేయ స్వామి వారి జయంతి, కల్యాణ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో శోభాయమానంగా సాగుతున్నాయి. ఐదు రోజులపాటు జరిగే ఉత్సవాల్లో గురువారం రెండో రోజు కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఉదయాన్నే స్వామి వారికి సుప్రభాత సేవ, విశేష అలంకరణలను ఆలయ అర్చకులు బొర్రా వెంకట అనంతాచార్యులు నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, మహిళలు స్వామి వారికి పొంగళ్లను చేసి, నైవేద్యాన్ని సమర్పించారు. స్వామి వారికి విశేష ఆకు పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రసన్నాంజనేయుని మాలదారులకు గురుస్వామి వెంకట నరసింహాచార్యులు ఇరుముడి కార్యక్రమాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం మహానివేదన, నీరాజనం, మంత్రపుష్పాన్ని స్వామివారికి సమర్పించారు. రాత్రి 7 గంటలకు శ్రీ సువర్చలా సహిత ప్రసన్నాంజనేయ స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
ప్రభుత్వ మహిళా కళాశాలకు నాక్ ‘ఏ’ గ్రేడ్
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ మహిళా కళాశాలకు నాక్ ‘ఏ’ గ్రేడ్ గుర్తింపు దక్కినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వీఆర్ జ్యోత్స్నకుమారి చెప్పారు. సాంబశివపేటలోని కళాశాలలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ... 82 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన కళాశాల నాక్ నుంచి తాజాగా నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు దక్కించుకున్నట్లు వివరించారు. పేద, మధ్య తరగతి విద్యార్థినులకు ఆధునిక, సాంకేతిక విద్యను అందిస్తున్నట్లు చెప్పారు. కాలానుగుణంగా ఉద్యోగం, ఉపాధి కల్పించే కోర్సులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. స్వయంప్రతిపత్తి హోదా కలిగిన కళాశాల తాజాగా పొందిన నాక్ ఏ గ్రేడ్ గుర్తింపుతో మరో పదేళ్లపాటు స్వయం ప్రతిపత్తితో ముందుకు వెళుతుందని చెప్పారు. సంప్రదాయ డిగ్రీ కోర్సులతోపాటు ఇంజినీరింగ్, ఫార్మసీ వంటి కోర్సులకు తీసిపోని విధంగా వాటికి సమాంతరంగా బీఎస్సీలో డేటాసైన్స్, ఏఐ, బయోకెమిస్ట్రీ వంటి ఆధునిక కోర్సులను నిర్వహిస్తున్నామని చెప్పారు. సమావేశంలో నాక్ కో ఆర్డినేటర్ డాక్టర్ డి. మధుసూదనరావు, అధ్యాపకులు ఎం. సంతోషికుమారి, కె. అపర్ణ సీతారామ్, కె. సుబ్బరత్నమ్మ, జి.శేషు పాల్గొన్నారు. -
నంబాల ఎన్కౌంటర్ నాటకమే
ఏపీ పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ సత్తెనపల్లి: మావోయిస్ట్ కీలక నేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మృతి చెందారనేది నాటకమేనని ఏపీ పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నంబాల కేశవరావు మృతి చెందారనే వార్తను తాము నమ్మడం లేదన్నారు. ఎన్కౌంటర్ జరిగిన తరువాత రోజుల తరబడి మృతదేహాలను మార్చురీలో పెట్టుకుని, అవి కుళ్లిపోయిన తరువాత ప్రధాన నాయకుడు చనిపోయాడని అంటున్నారని పేర్కొన్నారు. కానీ అవి ఆదివాసీలు, మిలీషియా సభ్యుల మృతదేహాలని వార్తలు వస్తున్నాయన్నారు. నంబాల చనిపోయారని చెబితే కేడర్ నిరాశ, నిస్పృహలతో ఉంటారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకం ఆడుతున్నాయని భావిస్తున్నామన్నారు. ఇలా ప్రజా ఉద్యమాలను అణచివేయాలనుకోవడం దురదృష్టకరమన్నారు. శాంతి చర్చలను ముందుకు తీసుకెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. -
సమష్టి కృషితోనే జిల్లా అభివృద్ధి
డీఆర్సీ సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థసారథి సాక్షి ప్రతినిధి, బాపట్ల /బాపట్ల టౌన్: అధికారులు, ప్రజాప్రతినిధుల సమష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యమని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. జిల్లా అభివృద్ధి మండలి సమీక్ష సమావేశం బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. జల వనరులు, వ్యవసాయ, జాతీయ ఉపాధి పథకం, పర్యాటక రంగం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ప్రజలకు మేలు చేయడమనే లక్ష్యంతో అధికారులు పని చేయాలని చెప్పారు. వేసవి కాలం ముగిసే వరకు తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. నీటి తీరువాకు వడ్డీని ప్రభుత్వం రద్దు చేసిందని, ఆ మేరకు డీఆర్సీలో కమిటీ ఆమోదించి తీర్మానం చేసినట్లు మంత్రి ప్రకటించారు. వర్షాలు రాకముందే పంట కాల్వల పూడికతీత, మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ఏడాది వర్షాలు ముందుగా వచ్చే అవకాశం ఉందని, దీనికి అనుగుణంగా పంటల సాగుకు రైతులను సమాయత్తం చేయాలని చెప్పారు. ఉపాధి హామీ పథకం కింద గత ఏడాది రూ.20 కోట్ల నిధులు మురిగిపోవడంపై అధికారులను నిలదీశారు. పొగాకు పంట అధికంగా సాగు చేయాలని కంపెనీలు ఒత్తిడి చేసి, దిగుబడి వచ్చిన తర్వాత రైతులను వదిలేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. బ్లాక్ బర్లీ పొగాకును కొనిపించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. చెరువుల కట్టలను బలోపేతం చేయాలి రైతుల నుంచి నీటి తీరువాకు వడ్డీని వసూలు చేయరాదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. చెరువుల పూడికతీత పనుల్లో భాగంగా కట్టలను బలోపేతం చేయాలని తెలిపారు. గుండ్లకమ్మ నదిపై మల్లవరం ప్రాజెక్ట్ గేట్లు పూర్తిగా మరమ్మతులు చేయాలని, నిధులు తెప్పించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. పమిడిమర్రు ఎత్తిపోతల పథకం అంచనాలను రూపొందించాలని ఆదేశించారు. కాలువల మరమ్మతులు వెంటనే చేపట్టాలి ఎత్తిపోతల పథకాలు, కాలువల మరమ్మతు పనులు త్వరితగతిన పూర్తిచేయాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ చెప్పారు. నీటి తీరువా వసూలులో భూమి అమ్మినవారి పేర్లు కూడా ఆన్లైన్లో చూపిస్తున్నాయన్నారు. తద్వారా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, వాటిని నివారించాలని అధికారులకు సూచించారు. మురిగి పోయిన జల జీవన్ మిషన్ నిధులు జల జీవన్ మిషన్ కింద రూ.532.39 కోట్లు పనులు చేయకపోవడంతోనే నిధులు మురిగిపోయాయని బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్ అన్నారు. 1,080 పనులు నిలిచిపోవడంపై ఆయన అధికారుల్ని ప్రశ్నించారు. చిత్తశుద్ధితో పని చేస్తున్న యంత్రాంగం ప్రభుత్వ లక్ష్యాలను పూర్తి చేయడానికి యంత్రాంగం చిత్తశుద్ధితో పని చేస్తోందని కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. స్వదేశీ దర్శి– 2 కింద సూర్యలంక బీచ్ని అభివృద్ధి చేస్తామని, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.97 కోట్లు పర్యాటకానికి నిధులు విడుదలయ్యాయని తెలిపారు. పొగాకు రైతులను ఆదుకోవాలి పొగాకు పంటను రైతుల వద్ద నుంచి కంపెనీలు కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు కోరారు. సమావేశంలో గుంటూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ హెనీ క్రిస్టీనా, బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్రవర్మ, వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు, చీరాల ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్య, జిల్లా రెవెన్యూ అధికారి జి. గంగాధర్ గౌడ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ఇసుకాసురుల పైసాచికం
సాక్షి ప్రతినిధి, బాపట్ల: చీరాల ప్రాంతంలో పచ్చ నేతల ఇసుక దందా యథేఛ్ఛగా సాగుతోంది. ఓడ రేవు, పిడుగురాళ్ల జాతీయ రహదారి పేరుతో అనుమతులు పుట్టించారు. దీని మాటున ఇసుకను బ్లాక్ మార్కెట్కు తరలించి అధిక ధరలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఉచిత ఇసుక ఇస్తామని కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నా.. పచ్చనేతలు సామాన్యులను ఒక్క ట్రాక్టర్ను కూడా తీసుకు వెళ్లనీయడం లేదు. అవసరమైన వారు పచ్చ నేతలకు ఆర్డర్ పెట్టుకొని అధిక ధరలకు కొనుక్కోవాల్సి వస్తోంది బుసకతో మస్కా స్థానికంగా ట్రాక్టర్ ఇసుకను రూ.2 వేలకు విక్రయిస్తున్న నేతలు పర్చూరు, బాపట్ల నియోజకవర్గాల్లో రూ. 4 నుంచి రూ.5 వేల వరకూ విక్రయిస్తున్నారు. ఇంటి నిర్మాణాలతో పాటు పునాదులు పూడ్చుకునేందుకు పలువురు గత్యంతరం లేక అధిక ధరలకు కొంటున్నారు. ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్న రియల్ వెంచర్లకు రియల్టర్లు పచ్చ నేతల వద్దే కొనుక్కోవాల్సి వస్తోంది. ఇదే అవకాశంగా ధరలు పెంచి అమ్ముతున్నారు. మరోవైపు పచ్చనేతలు బుసక, సముద్ర తీరం ఇసుకను కూడా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. వాస్తవానికి ఇది నిర్మాణాలకు పనికి రాదు. కానీ పచ్చనేతలు మాత్రం ఆ రెండింటిని విక్రయించి అక్రమార్జనకు పాల్పడుతున్నారు. కాలువ గట్లు మాయం వేటపాలెం మండలం పందిళ్లపల్లి వద్ద రహదారి నిర్మాణం పేరుతో అనుమతులు తీసుకున్న పచ్చ నేతలు ఇక్కడి నుంచే కాకుండా ఈపూరిపాలెం ప్రాంతంలో ఉన్న స్ట్రెయిట్ కట్ కాలువ గట్ల నుంచి అక్రమంగా ఇసుకను తరలించి అమ్ముకుంటున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలోని ప్రధాన సాగునీరు, మురికి నీటి కాలువల గట్లు కొల్లగొడుతున్నారు. పచ్చనేతల ఇసుక తరలింపుతో వేటపాలెం, ఈపూరిపాలెం ప్రాంతాల్లోని కాలువ గట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. అధికారులు కూడా భయపడి నోరు మెదపడంలేదన్న విమర్శలున్నాయి. ఉచితం మాట ఉత్తిదే.. ప్రజలకు ఉచితంగా ఇసుక ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే చెప్పినా పచ్చనేతలు మాత్రం తీసుకు వెళ్లనివ్వడంలేదు. తామే సరఫరా చేస్తామంటూ అధిక ధరలకు విక్రయిస్తున్నారు. మరోవైపు అందుబాటులో ఉన్న ఇసుకను తీసుక వెళ్లేందుకు కొందరు ప్రయత్నించినా పచ్చనేతలు అడ్డు పడుతున్నారు. పోలీసులకు చెప్పి వాహనాలను పట్టించి కేసులు పెట్టిస్తున్నారు. దీంతో ప్రజలు నేరుగా ఇసుక తీసుక వెళ్లేందుకు సాహసించడం లేదు. పచ్చ నేతల వద్ద అధిక ధరలకు కొని నష్టపోతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వ జోక్యం చేసుకొని పచ్చనేతల ఇసుక దందాను కట్టడిచేసి ఇసుక అందేలా చూడాలని పలువురు కోరుతున్నారు. పచ్చనేతకు కప్పం చీరాల ప్రాంతంలో ఇసుక దందా వ్యవహారంలో ఈ ప్రాంత పచ్చనేతకు ట్రిప్పులవారీ కప్పం చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఇసుక ట్రాక్టర్కు రూ. 900 చెలిస్తున్నట్లు సమాచారం. ఈ లెక్కన నిత్యం తరలించే వందలాది ఇసుక తరలింపు వాహనాలకు సంబంధించి రోజుకు రూ. లక్షల్లోనే పచ్చనేతకు కప్పం చెల్లిస్తున్నట్లు సమాచారం. పందిళ్లపల్లి, ఈపూరిపాలెం నుంచి ఇసుక అక్రమ రవాణా జాతీయ రహదారి పేరుతో అనుమతులు బ్లాక్ మార్కెట్కు తరలించి అధిక ధరలకు అమ్మకం అసైన్డ్, ప్రభుత్వ, అటవీ భూముల్లో తవ్వకాలు నియోజకవర్గంలో అసైన్డ్, ప్రభుత్వ, అటవీ భూముల నుంచి పచ్చనేతలు పెద్ద ఎత్తున ఇసుకను తరలించి అక్రమార్జనకు పాల్పడుతున్నారు. గతంలో చీరాల ఎమ్మెల్యే, బాపట్ల ఎంపీ అనుచరుల మధ్య ఇసుక అక్రమ రవాణా విషయంలో గొడవలు తలెత్తాయి. ఏకంగా ఎంపీ వర్గీయుల జేసీబీని ఎమ్మెల్యే అనుచరులు తగల బెట్టారు. దీనిపై కేసులు కూడా నమోదు కావడంతో కొందరు క్షేత్రస్థాయి అధికారులను కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఇంత జరిగినా తవ్వకాలు ఆగలేదు. -
జర్నలిస్టులపై దాడులు గర్హనీయం
చిలకలూరిపేట: జర్నలిస్టులపై దాడులకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ పుల్లగూర భక్తవత్సలరావు డిమాండ్ చేశారు. సాక్షి టీవీ ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రతినిధి అశోక్వర్ధ్దన్పై కారెంపూడిలో టీడీపీ వర్గీయులు దాడి చేయడాన్ని నిరసిస్తూ ఏపీయూడబ్ల్యూజే అనుబంధ చిలకలూరిపేట ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తవత్సలరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో నాల్గో స్తంభంగా పరిగణించే మీడియా స్వేచ్ఛపై దాడులు జరగడాన్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలని కోరారు. జర్నలిస్టులు వ్యక్తిగత అభిప్రాయంతో పని చేయరని, వారు ఏ పార్టీకి అనుకూలం లేదా వ్యతిరేకం కాదని వెల్లడించారు. నిజాలు మాత్రమే వెలికితీసే పనిని జర్నలిస్టులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు తప్పులు చేయకుంటే జర్నలిస్టులు వారి గురించి తప్పుగా రాయాల్సిన అవసరం ఉండదని, తప్పు చేసిన వారే దాడులకు పాల్పడటం అన్యాయమని ఆందోళన వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధులపై దాడి జరిగిన వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కావన్నారు. ప్రభుత్వం, పోలీసులు జర్నలిస్టులపై దాడికి పాల్పడేవారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఏపీయూడబ్ల్యూజే స్టేట్ కౌన్సిల్ మెంబర్ షేక్ జిలాని, చిలకలూరిపేట ప్రెస్క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు అన్నలదాసు శేషగిరి, షేక్ అబ్దుల్ సత్తార్, సభ్యులు షేక్ అల్లాబక్షు, కాట్రు శ్రీనివాసరావు, షేక్ హసన్వలి, షేక్ కరిముల్లా, దార్ల బుజ్జిబాబు, మలాల కోటేశ్వరరావు పాల్గొన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలి ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ భక్తవత్సలరావు -
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
మంత్రి అనగాని సత్యప్రసాద్ రేపల్లె: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. బాపట్ల జిల్లా రేపల్లెలో బుధవారం జరిగిన నియోజకవర్గస్థాయి మహానాడులో ఆయన మాట్లాడారు. ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం తప్పకుండా అమలు చేస్తుందని చెప్పారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే ధ్యేయంగా పని చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో బాపట్ల ఎంపీ టి. కృష్ణప్రసాద్ పాల్గొన్నారు ఇబ్బంది లేకుండా రేషన్ పంపిణీ వీడియో కాన్ఫరెన్సులో మంత్రి మనోహర్ తెనాలి: రాష్ట్ర ప్రభుత్వం ఎండీయూ వాహనాల ద్వారా నిత్యావసర సరకుల పంపిణీ నిలిపివేతకు తీసుకున్న నిర్ణయం సున్నితమైనందున లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా రేషను పంపిణీ నిర్వహించాలని రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. బుధవారం సాయంత్రం తెనాలి క్యాంప్ కార్యాలయం నుంచి రాష్ట్రంలోని జాయింట్ కలెక్టర్లు, జిల్లా పౌర సరఫరాల అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూన్ ఒకటో తేదీ నుంచి సరకుల పంపిణీ సంబంధిత చౌకధరల దుకాణాల వద్దే జరుగుతుందని చెప్పారు. అరవై అయిదేళ్లు పైబడిన కార్డుదారులు, అంగవైకల్యం కలిగిన లబ్ధిదారులకు మాత్రం ఇంటి వద్దే పంపిణీ చేస్తారని తెలిపారు. రేషన్ కార్డు దరఖాస్తుల దాఖలు ప్రక్రియలో ప్రజలు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యల కారణంగా కొంత వెసులుబాటు ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. ఆటోను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు ముగ్గురికి గాయాలు నాదెండ్ల: ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను వెనుక నుంచి ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయాలపాలైన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఎస్ఐ జి.పుల్లారావు తెలిపిన వివరాల మేరకు.. గణపవరం పరిధిలో జాతీయ రహదారిపై భారత్గ్యాస్ గోడౌన్ వద్ద గణపవరం నుంచి ప్రయాణికులతో చిలకలూరిపేట వైపు వెళ్తున్న ఆటోను ట్రావెల్స్ బస్సు ఢీకొంది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న కారసాల సుబ్బారావు, నాగజ్యోతి, ఆటోడ్రైవర్ పల్లపు వెంకటేశ్వర్లు గాయాలపాలయ్యారు. నాగజ్యోతిని గుంటూరు జీజీహెచ్కు తరలించగా, మిగతా ఇద్దరిని చిలకలూరిపేట ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
వైభవంగా ఆంజనేయ స్వామి శోభాయాత్ర
తెనాలి: హనుమత్ జయంతి సందర్భంగా స్థానిక షరాఫ్బజార్లోని శ్రీసువర్చలా సమేత శ్రీపంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక శ్రీహనుమజ్జయంతి మహోత్సవాలు ప్రారంభం కానున్నందున బుధవారం పట్టణంలో స్వామి వారి శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై స్వామి వారిని కొలువుదీర్చి, పూజలు చేశారు. శ్రీపంచముఖ ఆంజనేయస్వామి సంకీర్తన బృందం, శ్రీ విఖనస శ్రీనివాస ట్రస్టు సభ్యులు, భక్తులు ఆంజనేయ స్వామి పతాకాన్ని చేతపట్టుకుని రామనామ స్మరణ చేస్తూ శోభాయాత్రలో పాల్గొన్నారు. ఆలయ ఈవో అవుతు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 22 నుండి జూన్ ఒకటో తేదీ వరకు వార్షిక శ్రీ హనుమజ్జయంతి మహోత్సవాలు, 17వ లక్ష శ్రీహనుమాన్ చాలీసా పారాయణ ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు. ప్రతి రోజు విశేష పూజలు, హోమాలు ఉంటాయని తెలిపారు. 30వ తేదీన శ్రీ సీతారామ కల్యాణం, 31న శ్రీ సువర్చలా హనుమత్ కల్యాణం ఉంటాయన్నారు. జూన్ ఒకటో తేదీన పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయని వివరించారు. ఈ ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. కార్యక్రమంలో వంశ పారంపర్య అర్చకులు శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్, సురేష్, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనూరాధ, ట్రస్టు సభ్యులు గుడివాడ బాలకృష్ణ, మూర్తి వెంకటేశ్వరరావు, ముడుపల్లి చంద్రశేఖర్, గాజుల రాజేంద్రప్రసాద్, వెంకటేష్, మద్దు హరీష్ తదితరులు పాల్గొన్నారు. -
అర్హులైన ప్రతి ఒక్కరికీ నివేశన స్థలాలు మంజూరు
కలెక్టర్ జె. వెంకట మురళి బాపట్ల టౌన్: అర్హులైన ప్రతి ఒక్కరికీ నివేశన స్థలాలు అందజేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి ఆదేశించారు. రెవెన్యూ అంశాలపై బుధవారం రాష్ట్ర సీసీఎల్ఏ ప్రత్యేక కార్యదర్శి జయలక్ష్మి జిల్లా కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బాపట్ల జిల్లాలో ఇంటి స్థలాలు కావాలని పేదల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలించి, సమగ్ర నివేదికను ఆన్లైన్లో పొందుపరిచామని తెలిపారు. అనంతరం ఆయన కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఆర్డీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బాపట్లలో 50,484 పాట్లు ఉండగా, అందులో 24,241 ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హుల జాబితా పరిశీలించాలని ఆయన చెప్పారు. బాపట్ల జిల్లాలో నమోదైన 22–ఏ కేసుల వివరాలను తెలుసుకుని, సంబంధిత దస్త్రాలను పరిశీలించాలని ఆదేశించారు. ప్రస్తుతం గుర్తించిన 108 కేసులను పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని తెలిపారు. పెండింగ్ కేసులను తక్షణమే పరిష్కరించాలని చెప్పారు. రెవెన్యూ రికార్డు రూములు లేని ప్రాంతాల్లో వాటి నిర్మాణానికి తక్షణమే ప్రతిపాదనను పంపాలని ఆదేశించారు. ఇంటి స్థలం కోసం వచ్చిన దరఖాస్తులు, అర్హులు, అనర్హులు, ప్రభుత్వ ఖాళీ భూములను గుర్తించి నివేదిక ఇవ్వాలని చెప్పారు. ముందస్తుగా ప్రభుత్వ ఖాళీ భూములను గుర్తించే ప్రక్రియకు ప్రాధాన్యతనివ్వాలని ఆయన సూచించారు. ఖాళీ ప్లాట్లపై క్షేత్రస్థాయి పరిశీలించి, తదుపరి నివేదికలో పొందుపరచాలని తెలిపారు. రూ. 97.52 కోట్లతో సూర్యలంక బీచ్ అభివృద్ధిసూర్యలంక బీచ్ను రూ. 97.52 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద బీచ్ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని తెలిపారు. బీచ్ అభివృద్ధికి గానూ టూరిజం కార్పొరేషన్కు 25 ఎకరాలు కేటాయించినట్లు చెప్పారు. జిల్లా రెవెన్యూ అధికారి జి. గంగాధర్ గౌడ్, సర్వే ల్యాండ్స్ ఏడీ కనకరాజు, బాపట్ల, చీరాల, రేపల్లె ఆర్డీఓలు గ్లోరియా, చంద్రశేఖర్ రామలక్ష్మి, కలెక్టరేట్ ఏవో సీతారత్నం, టూరిజం కార్పొరేషన్ డీఈ శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. -
వైభవంగా ప్రసన్నాంజనేయ జయంత్యుత్సవాలు
బెల్లంకొండ: మండలంలోని బెల్లంకొండ క్రాస్ రోడ్డు వద్ద గల శ్రీ కోళ్లూరు ప్రసన్నాంజనేయ స్వామి జయంత్యుత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజులపాటు జరిగే ఉత్సవాల్లో మొదటి రోజు బుధవారం ఉదయం 6 గంటల నుంచి రామనామ సంకీర్తనతో పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను ఆలయ పండితులు బొర్రా వెంకట అనంతచార్యులు నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రసన్నాంజనేయుని మాలధారులు వారి ఇళ్ల వద్ద నుంచి భజన కార్యక్రమాలతో గ్రామోత్సవాలు నిర్వహించారు. అనంతరం ప్రసన్నాంజనేయుని ఆలయం వద్దకు వచ్చి ఇరుముడులు కట్టుకునేందుకు సిద్ధమయ్యారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవదాయ శాఖ ఈఓ అవుడూరి వెంకటేశ్వరరెడ్డి అన్ని ఏర్పాట్లు చేశారు. -
రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలు
సత్తెనపల్లి: కారు, ఆటో ఢీకొన్న ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సేకరించిన వివరాల ప్రకారం.. సత్తెనపల్లికి చెందిన సీపీఎం రాష్ట్ర కమిటీ మాజీ సభ్యుడు గద్దె చలమయ్య, ఆయన భార్య ఐద్వా రాష్ట్ర నాయకురాలు గద్దె ఉమశ్రీ కారులో బుధవారం గుంటూరు వెళ్లి తిరిగి సత్తెనపల్లి వస్తున్నారు. అదే సమయంలో సత్తెనపల్లి నుంచి ఆటోలో పరుచూరి రాధ, పరుచూరి ఉషశ్రీ, శ్యాం సాయి, ఆటో డ్రైవర్ బలుసు పాటి సాంబశివరావులు గుంటూరు వెళుతున్నారు. ఈక్రమంలో మండలంలోని కంటెపూడి రిథమ్ హోటల్ సమీపంలో రెండు వాహనాలు ఢీ కొన్నాయి. ఆటో పూర్తిగా రోడ్డు పక్కన కంపలోకి పల్టీకొట్టింది. కారు ముందు భాగం ధ్వసమైంది. కారులోని ఇద్దరికి, ఆటోలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గద్దె చలమయ్య, ఉమాశ్రీలను చికిత్స నిమిత్తం సత్తెనపల్లికి, మిగిలిన నలుగురిని గుంటూరు తరలించారు. సత్తెనపల్లి రూరల్ పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు. -
పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపకల్పన
గుంటూరు వెస్ట్: తుది ఓటర్ల జాబితాను అత్యంత పారదర్శకంగా తయారు చేసుకోవడానికి అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకారం అందించాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్తేజ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని ఎస్.ఆర్.ఎన్.శంకరన్ మినీ సమావేశ మందిరంలో ఓటర్ల జాబితాపై అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెలా నిర్వహించే ఈ సమావేశంలో స్వీకరించే సూచనలు, సలహాలను అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ పాలసీలకు సంబంధించిన అంశాలపై వారికే ఫిర్యాదులు పంపిస్తున్నామని పేర్కొన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ గత ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసిన వారిపై పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు చేశారన్నారు. వాటిపై చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లోపు ఓటరు, ఆధార్ కార్డుల అనుసంధానం చేయించాలని తెలిపారు. పోలింగ్ బూత్లను పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. బీఎల్వోలు క్లయిమ్స్ వెరిఫికేషన్కు వెళ్లేటప్పుడు వారితోపాటు బీఎల్ఏలను కూడా తీసుకెళ్లాలని పేర్కొన్నారు. పై సమస్యలపై స్పందించిన ఇన్చార్జి కలెక్టర్.. ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానం గురించి ఏ నిర్ణయమైనా ఎన్నికల సంఘం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. తుది ఓటర్ల జాబితా 2026 జనవరి 5న రూపొందిస్తామని తెలిపారు. సమావేశంలో డీఆర్వో షేక్ ఖాజావలి, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు గంగరాజు, లక్ష్మీకుమారి, ఆర్డీవో కె.శ్రీనివాసరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. గుంటూరు ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్తేజ -
యోగా మన దేశ అపూర్వ సంపద
గుంటూరు వెస్ట్: వేల సంవత్సరాల క్రితం రుషుల కృషి ఫలితంగా యోగా అనే అపూర్వ సంపద మన దేశానికి దక్కిందని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ పేర్కొన్నారు. యోగా మాసంలో భాగంగా బుధవారం స్థానిక ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ.. యోగాపై విస్తృత అవగాహనలో భాగంగా ఈ కార్యక్రమాలు నెల రోజులపాటు జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేశామన్నారు. యోగాంధ్ర థీమ్తో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో యోగా ప్రాముఖ్యతను, ఉపయోగాలను వివరిస్తారన్నారు. ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా రంగోలి, ర్యాలీ, మారథాన్, పరుగు, విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. యోగా సాధన నిర్వహించనున్న ప్రాంతాల్లో ట్రైనర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. చిన్నారులు ప్రదర్శించిన యోగా విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ, డీఆర్వో షేక్ ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం
బాపట్ల టౌన్: యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని జిల్లా ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. పోలీస్ పేరెడ్ గ్రౌండ్లో బుధవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి 69వ సమావేశంలో 2014 సెప్టెంబర్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూన్ 21వ తేదీని అంతర్జాతీయ దినోత్సవం జరపాల్సిందిగా ప్రతిపాదించారని గుర్తు చేశారు. దీన్ని 177 దేశాలు ఆమోదించాయని తెలిపారు. 2015 నుంచి ఏటా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని వివరించారు. యోగా వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలపై నెల రోజుల పాటు విస్తృతంగా అవగాహన కల్పిస్తామని చెప్పారు. జూన్ 21వ తేదీన వైజాగ్లో ఐదు లక్షల మందితో జరిగే యోగా కార్యక్రమంలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పాల్గొంటారని వెల్లడించారు. యోగాంధ్ర క్యాంపెయిన్లో భాగంగా పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీల్లో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యోగా వల్ల శారీరక, మానసిక ధైర్యం వస్తుందని చెప్పారు. జిల్లాలోని 17 లక్షల మందికి యోగాంధ్ర చేరే విధంగా ప్రణాళిక రూపొందించామన్నారు. జూన్ 21న సూర్యలంక, రామాపురం బీచ్లో యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ వారి జీవన శైలిలో యోగా ఒకటిగా చేర్చుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్, బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు, పర్చూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు, చీరాల శాసనసభ్యులు ఎం. ఎం. కొండయ్య పాల్గొన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థసారథి -
వీరాంజనేయునికి మామిడి ఫలార్చన
తెనాలి: పట్టణ మారీసుపేటలోని శ్రీబాలాత్రిపుర సుందరీ సమేత శ్రీచంద్రమౌళీశ్వరస్వామి దేవస్థానంలో గల వీరాంజనేయ స్వామికి ఈ నెల 22వ తేదీన హనుమజ్జయంతిని పురస్కరించుకుని లక్ష ప్రదక్షిణముల మహాయజ్ఞం కొనసాగుతోంది. ఈ నెల 12వ తేదీ నుంచి ఆరంభమైన కార్యక్రమంలో భాగంగా రోజూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుపుతున్నారు. భక్తులు తమ శక్తిని అనుసరించి ప్రదక్షిణములు చేస్తున్నారు. హనుమాన్ చాలీసా పారాయణంలోనూ సామూహికంగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం స్వామి వారికి మామిడి ఫలార్చన చేశారు. తదుపరి హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ జరిగాయి. లలితా గోష్టి వారిచే హనుమాన్ చాలీసా పారాయణ జరిగింది. 22న హనుమజ్జంతి వేడుకను నిర్వహిస్తారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు గ్రంధి సేతుమాధవరావు, కార్యదర్శి పొన్నూరు నాగసూర్య శశిధరరావు, కోశాధికారి వరదా వెంకట శేషగిరిరావు, పేరుబోయిన అంకమ్మరాజు, తాడిపర్తి హరిప్రసాద్ పర్యవేక్షించారు. కిల్కారి కాల్ సర్వీస్ను సద్వినియోగం చేసుకోవాలి గుంటూరు మెడికల్: గుంటూరు డీఎంహెచ్ఓ కార్యాలయాన్ని బుధవారం ఆర్మ్ సెంట్రల్ బృందం విజిట్ చేసింది. ఈ సందర్భంగా కిల్కారి కార్యక్రమం అమలు గురించి జిల్లా అధికారులను అడిగి తెలుసుకుంది. పనితీరును అభినందించింది. అనంతరం సంగం జాగర్లమూడి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని బృంద సభ్యులు సందర్శించారు. ఆరోగ్యకేంద్రం స్థాయిలో కిల్కారి కార్యక్రమం అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఆశా, ఆరోగ్య కార్యకర్తల పని తీరుపై ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో గర్భిణులు, బాలింతలతో ముచ్చటించారు. కిల్కారి కాల్ సర్వీస్ను కేంద్ర ప్రభుత్వం వారికోసం ప్రవేశం పెట్టినట్లు వివరించారు. మాతాశిశు మరణాలు తగ్గించటానికి ఇది ఎంతో ఉపయోగపడుతోందని, 01244451660 అనే నంబర్ నుంచి కాల్ రావడం ద్వారా ఆరోగ్య సమాచారాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ అమర్తలూరి శ్రావణ్బాబు, ఇన్చార్జి డీపీహెచ్ఎన్ఓ డాక్టర్ ప్రియాంక, ప్రోగ్రాం కోఆర్డినేటర్ రాజు, డీసీఎం సురేష్ పాల్గొన్నారు. 17 మండలాల్లో తేలికపాటి వర్షం కొరిటెపాడు (గుంటూరు): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గుంటూరు జిల్లావ్యాప్తంగా ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 17 మండలాల్లో వర్షం పడింది. అత్యధికంగా పొన్నూరు మండలంలో 8 మిల్లీ మీటర్లు నమోదుకాగా, అత్యల్పంగా తాడికొండ మండలంలో 0.8 మి.మీ. కురిసింది. సగటు వర్షపాతం 4.3 మి.మీ.గా నమోదైంది. మే నెల 21వ తేదీ వరకు జిల్లా సాధారణ వర్షపాతం 42.2 మి.మీ కాగా, ఇప్పటి వరకు 106.2 మి.మీ. కురిసింది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు.. చేబ్రోలు మండలంలో 7.8, ప్రత్తిపాడు 6.6, గుంటూరు పశ్చిమ 6.2, కొల్లిపర 6.2, ఫిరంగిపురం 5.6, కాకుమాను 5.4, పెదనందిపాడు 5.4, తాడేపల్లి 5.4, మంగళగిరి 5.2, తెనాలి 4.4, దుగ్గిరాల 2.8, పెదకాకాని 2.2, గుంటూరు తూర్పు 2, మేడికొండూరు 1.8, తుళ్ళూరు మండలంలో 1.2 మి.మీ. చొప్పున వర్షపాతం పడింది. -
పొట్టకూటి కోసం వచ్చి అనంతలోకాలకు..
సత్తెనపల్లి: పొట్టకూటి కోసం కూలి పనులకు వచ్చిన ఓ వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన పట్టణంలోని గడియారస్తంభం వద్ద బుధవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. సత్తెనపల్లి మండలం గుడిపూడి గ్రామానికి చెందిన ఉప్పుతల శ్రీనివాసరావు (48), బి.జోసెఫ్ అలియాస్ శ్రీనివాసరావు ఇద్దరు కూలి పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై సత్తెనపల్లి వస్తున్నారు. అదే సమయంలో దామచర్లకు చెందిన ఓ వ్యక్తి కారులో హైదరాబాద్ నుంచి గుంటూరు వెళుతున్నారు. ఈక్రమంలో గడియార స్తంభం వద్ద రెండు వాహనాలు ఢీకొన్నాయి. దీంతో ద్విచక్ర వాహనం నడుపుతున్న ఉప్పుతల శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందగా జోసెఫ్కు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన బాధితుడిని చికిత్స నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. శ్రీనివాసరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు శ్రీనివాసరావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పొట్టకూటి కోసం కూలి పనులకు వచ్చి ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కారు ఢీకొని కూలీ మృతి.. మరొక వ్యక్తికి తీవ్ర గాయాలు -
అమ్మవారి హుండీ కానుకల లెక్కింపు
దుర్గి: శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మీ అమ్మవారి దేవస్థానం హుండీ కానుకల లెక్కింపు బుధవారం నిర్వహించారు. అమ్మవారికి రూ. 31,30,423 ఆదాయం వచ్చినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్, కార్యనిర్వహణాధికారి సైదమ్మ తెలిపారు. దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్త యాగంటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన లెక్కింపులో పేట సన్నెగండ్ల గ్రూప్ టెంపుల్స్ కార్యనిర్వహణ అధికారి శివనాగిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో స్వామి కల్యాణం మాచర్ల: పట్టణంలోని వేంకటేశ్వరస్వామి దేవాలయంలో స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి కల్యాణం జరిపారు. అమ్మవారి జన్మదినమైన శ్రవణా నక్షత్రం పురస్కరించుకుని ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు బి.వెంకటేశ్వర్లు, బి.రఘురామిరెడ్డి, కార్యవర్గ సభ్యులు రాధ, రమణారెడ్డి, కమిటీ నిర్వాహకులు కె.బ్రహ్మారావు, కె.గురవయ్య, పిచ్చయ్యల ఆధ్వర్యంలో కల్యాణం నిర్వహించారు. భక్తులకు తీర్థపసాదం అందించారు. డీఆర్ఎం కార్యాలయంలో ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం లక్ష్మీపురం: గుంటూరు పట్టాభిపురంలోని డీఆర్ఎం కార్యాలయంలో బుధవారం ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని డీఆర్ఎం సుధేష్ట సేన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా డీఆర్ఎం కార్యాలయ అధికారులు సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. డీఆర్ఎం సుధేష్ట సేన్ మాట్లాడుతూ ప్రతి ఏటా మే 21న ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటిస్తారన్నారు. అహింస, శాంతిపైమన నిబద్ధతను పునరుద్ఘాటించడానికి ప్రతిజ్ఞ చేశామని తెలిపారు. నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం పెదకాకాని: గ్రామానికి చెందిన గరికపాటి వరుణ్దేవ్ పెదకాకాని భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో నిత్యాన్నదాన పథకానికి రూ.1,00,116ను అందజేసినట్లు ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలా కుమార్ బుధవారం తెలిపారు. గరికపాటి లక్ష్మీకాంతం, ఉయ్యూరు మాసమ్మ జ్ఞాపకార్థం గరికపాటి వరుణ్ దేవ్ పై నగదుతో పాటు వెండి బిందె, వెండి గిన్నెలు విరాళంగా అందించినట్లు ఆలయ ఉప కమిషనర్ తెలిపారు. దాతలకు ప్రత్యేక దర్శనం, వేద ఆశీర్వచనం చేయించారు. స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి చిత్రపటం అందజేశారు. ఎండీయూ వాహనదారులను కాపాడండి గుంటూరు వెస్ట్: రాష్ట్ర ప్రభుత్వం ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ సరఫరా విధానాన్ని రద్దు చేయడంతో జిల్లావ్యాప్తంగా సుమారు వెయ్యి మంది సిబ్బంది రోడ్డున పడ్డారని ఎండీయూ వాహనాల అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు షేక్ మహబూబ్ బాషా ఆవేదన వ్యక్తం చేసారు. ఈ మేరకు బుధవారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాషా మాట్లాడుతూ గత నాలుగున్నరేళ్లుగా ఎన్నో ఆటుపోట్లును ఎదుర్కొని ప్రజలకు రేషన్ పంపిణీ చేస్తున్నామని, ఇప్పుడు ఎండీయూ వాహనాలు రేషన్ పంపిణీకి తప్ప దేనికీ పనికిరావని తెలిపారు. తమకు ఉపాధి చూపించాలని కోరారు. సంఘం జిల్లా కార్యదర్శి బి.తిరుపతి రామారావు, కోశాధికారి కె.డానీ, నాయకులు పాల్గొన్నారు. -
సాక్షి టీవీ జిల్లా ప్రతినిధిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
బాపట్ల : సాక్షి టీవీ గుంటూరు జిల్లా ప్రతినిధి అశోక్పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాపట్ల జర్నలిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. కలెక్టర్ వద్ద మంగళవారం కొద్ది సేపు నిరసన వ్యక్తం చేసి జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్గౌడ్, ఎస్బీ సీఐ నారాయణకు వినతిపత్రం అందించారు. అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ ప్రతికా విలేకరులపై దాడులు హేయమైన చర్యగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి గొడలిపెట్టుగా భావించాలని సూచించారు. సమాచారాన్ని సేకరించేందుకు వెళ్లిన అశోక్పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో సాక్షి బాపట్ల ప్రతినిధి, బి.రమణారెడ్డి అసోసియేషన్ నాయకులు గోపిశెట్టి రాఘవ, వేజండ్ల శ్రీనివాసరావు, సృజన్పాల్, వెంకట్, అంజయ్య, దాసు, మరియదాసు, బత్తుల సురేష్, చీమలదిన్నె నారాయణ, షాజహాన్, చంటి, చెన్నకేశవరెడ్డి, వీరేష్, యాసిన్, పొటికలపూడి జయరామ్, వాసు, బొగ్గవరపు శివ, శీలం సాగర్ తదితరులు ఉన్నారు. -
డ్రెయిన్ల నిర్వహణ పనులు వేగవంతం చేయాలి
బాపట్ల: నీటిపారుదల, డ్రెయినేజీ శాఖల పరిధిలో నిర్వహించే ఆపరేషన్, నిర్వహణ పనులను తనిఖీ చేసే అధికారులకు జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి పలు సూచనలు చేశారు. బాపట్ల జిల్లాలో నీటిపారుదల, డ్రెయినేజీ శాఖలు నిర్వహించే మరమ్మతుల పనులను జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి, బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మలు మంగళవారం తనిఖీ చేశారు. తొలుత జిల్లెలమూడి గ్రామంలోని నల్లమడ వాగులో కోతకు గురైన కరకట్ట ప్రాంతాన్ని పరిశీలించారు. నల్లమడ వాగులో పేరుకుపోయిన మట్టిని తొలగించాలని, వాగు విస్తీర్ణం పెంచాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. నల్లమడ వాగు విస్తరణకు కావలసిన భూమి కోసం ప్రతిపాదనలు తయారు చేయాలని బాపట్ల రెవెన్యూ డివిజన్ అధికారిని ఆదేశించారు. బాపట్ల జిల్లాకు నీటి సరఫరా చేసే పీటీ ఛానల్ను తనిఖీ చేశారు. ఛానల్లోని ఇసుక మేటలను తొలగించాలని తెలిపారు. బాపట్లకు చెందిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లోని పూడికలను తొలగించి, ట్యాంక్ విస్తీర్ణాన్ని పెంచి, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలన్నారు. అందుకుగాను తగిన ప్రతిపాదనలు తయారు చేయాలని నీటిపారుదల శాఖ ఎస్ఈని కలెక్టర్ ఆదేశించారు. నరసాయపాలెంలోని చెరుకూరు ట్యాంక్ చానల్లోని గుర్రపు డెక్క, తూటుకాడ తొలగింపు పనులను కలెక్టర్, బాపట్ల ఎమ్మెల్యే ప్రారంభించారు. నర్సాయపాలెం పంచాయతీలో చెత్త సేకరణ విషయమై స్థానికులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై పంచాయతీ సెక్రెటరీ రాజును కలెక్టర్ ప్రశ్నించారు. సేకరించిన చెత్తను సమాధుల్లో పడవేయటానికి గల కారణా లపై పంచాయతీ సెక్రటరీని విచారించారు. పంచాయతీకి ఎస్డబ్ల్యూ పీసీ ల్యాండ్ కోసం జిల్లా రెవెన్యూ అధికారికి ప్రతిపాదన పంపాలని కలెక్టర్ పంచాయతీ సెక్రటరీకి సూచించారు. అనంతరం నల్లమడ వాగు లాకులను పరిశీలించారు. నల్లమడ వాగు లాకుల వివరాలను నీటిపారుల శాఖ ఎస్ఈని అడిగి తెలుసుకున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం అక్కడ మొక్కలు నాటారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఎస్ఈ వెంకటరత్నం, డ్రెయినేజీ శాఖ ఈఈ మురళీకృష్ణ, బాపట్ల రెవెన్యూ డివిజన్ అధికారి గ్లోరియా, బాపట్ల తహసీల్దార్ సలీమా, నీటిపారుదల, డ్రెయినేజీ శాఖలకు చెందిన డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను నివారించాలి ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై ఉక్కుపాదం మోపాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం మంగళవారం స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా జూన్ నెల నుంచి ఇసుక తవ్వకాల నిషేధం అమలులోకి వస్తోందన్నారు. ఈ నేపథ్యంలో రేవు నుంచి వాహనాలు వెళ్లే రహదారులను తొలగించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి -
బాపట్ల
బుధవారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2025శిథిలావస్థలో సాగునీటి కాలువలుకర్లపాలెం: వ్యవసాయ భూములకు సాగునీరు అందించే ప్రధాన కాలువలు శిథిలావస్థకు చేరాయి. మండల ప్రజలు ప్రధానంగా వ్యవసాయమే జీవనాధారంగా జీవిస్తున్నారు. వర్షాలు కురవక, సాగునీరు సక్రమంగా అందక సాగు అనుకూలంగా లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి కాలువలు శిథిలావస్థకు చేరటంతో ఖరీఫ్ సాగుకు నీరు అందుతాయా అని రైతులు సందిగ్ధంలో ఉన్నారు. సాగునీటి పంట కాలువలను మరమ్మతులు చేసి సాగునీరు సక్రమంగా అందించాలని రైతులు కోరుతున్నారు. మండలంలో 17వేల ఎకరాల సాగుభూమి. కర్లపాలెం మండలంలోని 20 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 17వేల ఎకరాలు సాగుభూమి ఉంది. ఈ భూమిని ఆధారంగా చేసుకుని రైతులు, రైతు కూలీలు ఉపాధి పొందుతున్నారు. ఈ భూములకు కాలువల ద్వారానే కృష్ణానది నుంచి నీరు వస్తుంది. సాగునీరు అందించేందుకు ప్రధానంగా పేరలి తిమ్మరాజు చానల్, ఆర్మండ చానల్లు ఉన్నాయి. పేరలి తిమ్మరాజు చానల్ పరిధిలో 13,500 ఎకరాలు, ఆర్మండ చానల్ పరిధిలో 3,500 ఎకరాలకు సాగునీరు వస్తుంది. పంట కాలువల్లో నీరు పారేనా? పేరలి తిమ్మరాజు చానల్ పరిధిలోని తిమ్మరాజు చానల్, కర్లపాలెం చానల్, లంక చానల్, ఇసుక చానల్, పేరలి చానల్, తుమ్మలపల్లి చానల్, తుమ్మలశాఖ చానల్ పంట కాలువల సిమెంట్ లైనింగ్ శిథిలమై కాలువ కట్టలకు గండ్లు పడ్డాయి. దీంతో సాగునీరు భూములకు సరిగా అందటం లేదు. ఆర్మండ్ చానల్ పరిధిలోని ఇసుక చానల్, పరకాలువ, యాజలి చానల్, బుద్ధాం చానల్ కాలువల కట్టలు శిథిలమవటంతోపాటు పూడిక పెరిగి సాగునీరు పారేందుకు అసౌకర్యంగా మారాయి. ఈ కాలువలను పూడిక తీయించటంతోపాటు, కట్టలను పటిష్టం చేయాలని రైతులు కోరుతున్నారు. శిథిలావస్థలో పేరలి తిమ్మరాజు చానల్ పేరలి తిమ్మరాజు చానల్ పరిధిలో మొత్తం 13,500 ఎకరాల సాగుభూమి ఉంది. ఈ భూమికి పేరలి తిమ్మరాజు చానల్ పరిధిలో ఉన్న మరో ఏడు పంట కాలువలు ఉన్నాయి. అవి శిథిలావస్థకు చేరటంతో సాగునీరు సక్రమంగా అందే అవకాశం లేదు. తిమ్మరాజు చానల్ పరిధిలో 2700 ఎకరాలు, కర్లపాలెం చానల్ పరిధిలో 1100 ఎకరాలు, లంక చానల్ పరిధిలో 2వేల ఎకరాలు, ఇసుక చానల్ పరిధిలో 400 ఎకరాలు, పేరలి చానల్ పరిధిలో 1285 ఎకరాలు, తుమ్మలపల్లి చానల్ పరిధిలో 4800 ఎకరాలు, తుమ్మల శాఖ చానల్ పరిధిలో 1215 ఎకరాల భూమి సాగవుతుంది. మరమ్మతులకు నోచని ఆర్మండ చానల్ ఆర్మండ చానల్ పరిధిలోని ఇసుక చానల్, పరకాలువ, యాజలి చానల్, బుద్ధాం చానల్ కాలువల పరిధిలో 3,500 ఎకరాల భూమి ఉంది. కాలువలకు ఈ వేసవి కాలంలో మరమ్మతులు చేయించాలని రైతాంగం కోరుతున్నారు.న్యూస్రీల్ మరమ్మతులకు నోచుకోని పీటీ చానల్ 13,500 వేల ఎకరాల సాగు ఈ ఏడాది నీరు సక్రమంగా అందేనా! మరమ్మతులు చేయాలిపీటీ చానల్కు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయించాలి. ఉపాధి హామీ పథకంలో కాలువలోని మట్టిని మాత్రమే తీస్తున్నారు. కాలువ గోడలన్నీ పగిలిపోయి గండ్లు పడుతున్నాయి. పంట చేలకు నీరు అందడం కష్టమే అవుతుంది. –యల్లావుల ఏడుకొండలు, నర్రావారిపాలెం. కాలువ చివరి భూములకు నీరందించాలిపెదగొల్లపాలెం, నర్రావారిపాలెం, పెదపులుగువారిపాలెం, తుమ్మలపల్లి పంచాయతీల పరిధిలోని కాలువ చివరి భూములకు సాగునీరందించాలి. గత సంవత్సరం సాగునీరు రాక కొందరు రైతులు నాట్లు వేయలేదు. తిండి గింజలు పండించుకునేందుకు సాగునీరందించాలి. – పందరబోయిన సుబ్బారావు, రైతు నక్కలవానిపాలెం. ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం కాలువలో తూటికాడ తొలగించి కాలువ కట్టలు పటిష్ట పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పంట కాలువల మరమ్మతులకు, గండ్లు పూడ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాం. –వెంకటరమణ, ఏఈ, ఇరిగేషన్ -
ఐసెట్లో సత్తా చాటిన మనోళ్లు
గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీ ఐసెట్–2025 ఫలితాల్లో గుంటూరు జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో 96 శాతం ఉత్తీర్ణత నమోదైంది. తాడికొండ మండలం లాం గ్రామానికి చెందిన రావూరి మాధుర్య రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు సాధించింది. గుంటూరు జిల్లా నుంచి ఐసెట్కు హాజరైన 1,528 మంది విద్యార్థుల్లో 1,485 మంది ఉత్తీర్ణులయ్యారు. బాపట్ల, చీరాల నుంచి పరీక్షలు రాసిన 354 మంది విద్యార్థుల్లో 338 మంది ఉత్తీర్ణత సాధించారు. పల్నాడు జిల్లాలో పరీక్షకు హాజరైన 725 మంది విద్యార్థుల్లో 678 మంది ఉత్తీర్ణులయ్యారు. కోచింగ్ లేకుండానే 5వ ర్యాంకు ఐసెట్లో రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు సాధించిన విద్యార్థిని రావూరి మాధుర్య ఎటువంటి కోచింగ్ తీసుకోలేదు. మాధుర్య 2022లో కాకినాడ జేఎన్టీయూ నుంచి బీటెక్ పూర్తి చేసింది. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాన్ని సాధించాలనే లక్ష్యంతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) నిర్వహించే పరీక్షలకు సన్నద్ధమవుతోంది. ప్రామాణిక పుస్తకాలను చదువుతూ సొంతంగా ప్రిపేర్ అవుతోంది. పరీక్షలకు వ్యవధి ఉండటంతో ఏపీ ఐసెట్కు దరఖాస్తు చేసి, కోచింగ్ లేకుండా నేరుగా పరీక్ష రాసి రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు సాధించింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 96 శాతం ఉత్తీర్ణత లాం విద్యార్థినికి రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు -
దైవ సన్నిధి నుంచి తిరిగి వస్తూ..
ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు మేదరమెట్ల: కారులో తిరుపతి వెళ్లి తిరుగు ప్రయాణమైన అనంతరం కారు బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇరువురికి గాయాలయ్యాయి. కొరిశపాడు మండలం మేదరమెట్ల ఉత్తర బైపాస్ ప్రాంతంలో మంగళవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. ఏలూరు జిల్లా దెందులూరు మండలం కొవ్వలి గ్రామానికి చెందిన ఏడుగురు కారులో తిరుపతి వెళ్లారు. తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా మేదరమెట్ల ఉత్తర బైపాస్ సమీపానికి రాగానే అతివేగంగా వెళుతున్న కారు అదుపు తప్పి రోడ్డు మార్జిన్లోకి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుంకర నాగరాజు (21) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలు కాగా.. వారిని వైద్యశాలకు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు మేదరమెట్ల ఎస్ఐ మహ్మద్ రఫీ తెలిపారు. వ్యవసాయ శాఖలో బదిలీల కోలాహలం కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లా వ్యవసాయ శాఖలో బదిలీల కోలాహలం మొదలైంది. జూన్ 2వ తేదీ లోపు వ్యవసాయ శాఖలోని అన్ని విభాగాల్లో బదిలీలు పూర్తి చేయాలని తాజాగా ఆ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనల మేరకు ఒక ప్రాంతంలో ఐదు సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకున్న వారు తప్పనిసరిగా బదిలీ కావాలి. మిగిలిన వారు కూడా రిక్వస్ట్, అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ కింద బదిలీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.మండల వ్యవసాయ విస్తరణ అధికారులు(ఏఈఓ), మండల వ్యవసాయ అధికారులు(ఏఓ), ఏడీఏ, డీడీఏ, మినిస్టీరియల్ స్టాఫ్, వాచ్మెన్, అటెండర్స్ తదితర అన్ని విభాగాల్లోనూ బదిలీల ప్రక్రియ ఉండటంతో ఎవరికి వారు కోరుకున్న ప్రాంతాలకు వెళ్లడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో కొందరు ఉద్యోగులు ప్రజాప్రతినిధుల సిఫారసుల కోసం పాకులాడుతున్నట్లు తెలిసింది. కొన్ని స్థానాలకు ఉద్యోగుల మధ్య పెద్ద ఎత్తున పోటీ ఉండటంతో డబ్బు ఖర్చు చేయడానికి సైతం వెనకాడటం లేదని చెబుతున్నారు. ఇదే అదునుగా ఆ శాఖ ఉన్నతాధికారులు, అసోసియేషన్ నాయకులు, అధికార పార్టీకి చెందిన చోటామోటా నేతలు అంతో ఇంతో వెనుకేసుకునేందుకు ఉద్యోగులకు వల విసురుతున్నట్లు సమాచారం. శ్రీవారికి వైభవంగా శ్రీచక్రస్నానం తెనాలి: పట్టణంలో చిన్నతిరుపతిగా ప్రసిద్ధి చెందిన వైకుంఠపురంలోని శ్రీలక్ష్మీపద్మావతి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆరో రోజైన మంగళవారం ఉదయం నిత్య హోమం, ఆలయ బలిహరణ అనంతరం స్వామివారికి వసంతోత్సవం, శ్రీచక్రస్నానం సంప్రదాయబద్ధంగా జరిపించారు. రాత్రి 7.30 గంటలకు ధ్వజావరోహణం, పూర్ణాహుతి జరిపించారు. ఆలయ అర్చకులు కార్యక్రమాలను నిర్వహించగా, ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి మంతెన అనుపమ పర్యవేక్షించారు. మహంకాళీ దేవస్థానంలో చండీ హోమం దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళీ అమ్మవారి దేవస్థానంలో 48వ పునఃప్రతిష్ట వార్షికోత్సవం సందర్భంగా నాల్గవ రోజు మంగళవారం చండీ హోమం నిర్వహించారు. పోసాని నాగేశ్వరరావు దంపతులు హోమంలో పాల్గొన్నారు. భక్తులకు అమ్మవారు ధనలక్ష్మీ దేవి అలంకరణలో దర్శనం ఇచ్చారు. భక్తులు పాల్గొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. -
ప్రాణం తీసిన ఇనుప గేటు
విద్యుత్ షాక్తో మహిళ మృతి యద్దనపూడి: నిండు ప్రాణాన్ని ఇనుప గేటు బలితీసుకుంది. విద్యుత్షాక్ కొట్టడంతో మహిళ మృతి చెందిన ఘటన యద్దనపూడి మండలంలోని యనమదల గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై రత్నకుమారి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యద్దనపూడి పంచాయతీలోని కటారివారిపాలెం గ్రామానికి చెందిన మేడిశెట్టి సుబ్బాయమ్మ (60) గత 8 సంవత్సరాలుగా యనమదల గ్రామంలో రైస్మిల్లును లీజుకు తీసుకొని అక్కడే ఉంటోంది. మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో సుబ్బాయమ్మ మిల్లు నుంచి బయటకు వస్తున్న క్రమంలో ఇనప గేటును పట్టుకుంది. ఆ గేటు పైన ఎలుకలు విద్యుత్వైర్లను కొరకటంతో ఆ గేటుకు విద్యుత్ సరఫరా జరిగి సుబ్బాయమ్మ పడిపోయింది. గమనించిన స్థానికులు విద్యుత్ సరఫరా నిలిపి 108కు సమాచారం అందించారు. సిబ్బంది పరిశీలించి అప్పటికే మృతి చెందిందని తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్సై రత్నకుమారి సంఘటనా స్థలికి చేరుకొని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్టూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
గుర్తుతెలియని మృతదేహానికి పోస్టుమార్టం
మార్టూరు: గుర్తుతెలియని మృతదేహానికి మార్టూరు పోలీసులు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో పోస్ట్మార్టం చేయించిన సంఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. మార్టూరు ఏఎస్ఐ మహబూబ్ బాషా మరో కానిస్టేబుల్తో కలిసి ఓ మృతదేహాన్ని ఆటోలో మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో మృతదేహం ఉన్న విషయం తెలుసుకున్న కొంతమంది విలేకరులు అక్కడికి చేరుకునేసరికి .. దహన సంస్కారాలు చేసేందుకు పంచాయతీ సిబ్బంది మృతదేహాన్ని ఆటోలో ఎక్కిస్తూ కనిపించారు. వివరాల కోసం ప్రయత్నించిన విలేకరులకు పోలీసులు సమాచా రం ఇవ్వకుండా తీసుకొని వెళ్లారు. శవ పంచనామాలో పాల్గొన్న ఆసుపత్రి సిబ్బందికి పోలీసులు ఫోన్చేసి మీడియాకు సమాచారం చెప్పవద్దని ఆదేశించినట్లు తెలిసింది. కొంతసేపటికి ఎస్ఐ సైదా విలేకరులకు ఫోన్చేసి ఆ మృతదేహం ఓ బిచ్చగాడి దని మీరు రాయటానికిఏమీ లేదన్నారు. -
మద్యం మత్తులో వివాదం.. యువకుడికి కత్తిపోట్లు
లక్ష్మీపురం: మద్యం మత్తులో స్నేహితుల మధ్య వాగ్వివాదం కత్తిపోట్లకు దారితీసిన ఘటన మంగళవారం అరండల్పేట 8వ లైన్లో చోటు చేసుకుంది. అరండల్పేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కోబాల్డ్పేట 4వ లైన్ ప్రాంతానికి చెందిన షేక్ అబ్దుల్ రహ్మన్ అలియాస్ అబ్బులు అనే యువకుడు స్థానికంగా చికెన్ షాపులో పని చేస్తుంటాడు. మంగళవారం అబ్బులు తన స్నేహితుడైన కృష్ణతో కలిసి అరండల్పేట 8వలైన్లోని మయూరి బార్ అండ్ రెస్టారెంట్లో మద్యం తాగేందుకు వెళ్లారు. ఈక్రమంలో శ్రీనగర్కు చెందిన మాలిక్ అనే వ్యక్తికి అబ్బులు ఫోన్ చేయగా, ఫోన్లో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో కొద్ది సేపటికి మాలిక్ తనతో పాటు కోబాల్డ్పేటకు చెందిన నన్నె, రఫీలను వెంటబెట్టుకుని మయూరి బార్ అండ్ రెస్టారెంట్కు వచ్చి అబ్బులుతో ఘర్షణ పడ్డాడు. మాలిక్ జేబులో ఉన్న చిన్నపాటి కత్తితో అబ్బులు వీపుపై విచక్షణారహితంగా దాడి చేశాడు దీన్ని గమనించిన ఇరువురి స్నేహితులు ఇద్దరిని వేరు చేసి బయటకు తీసుకు వచ్చారు. మాలిక్ బయటకు వెళుతుండగా అబ్బులు అతనిపై దాడికి పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న అరండల్పేట సీఐ ఆరోగ్యరాజు సిబ్బందితో ఘటనా స్థలంకు చేరుకుని కత్తిపోట్లకు గురైన అబ్బులును జీజీహెచ్కు తరలించి మాలిక్, నన్నెలను అదుపులో తీసుకుని స్టేషన్కు తరలించారు. -
జీవనోపాధి మెరుగుపరుచుకోవాలి
డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు కర్లపాలెం: స్వయం సహాయక సంఘాలలోని మహిళలు తమ జీవనోపాధులు మెరుగుపరుచుకోవాలని డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసరావు చెప్పారు. కర్లపాలెంలోని భవిత గ్రామ సమైఖ్య సంఘం సభ్యులతో డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు మంగళవారం రాత్రి సమావేశమై సూక్ష్మ రుణ ప్రణాళికపై చర్చించారు. పీడీ మాట్లాడుతూ మహిళలు బ్యాంకుల ద్వారా తీసుకునే రుణాలను వినియోగించుకుని చిరు వ్యాపారాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. కుటీర పరిశ్రమల లాంటివి స్థాపించుకుని వాటిని అభివృద్ధి చేయటం ద్వారా ఆర్థికంగా లబ్ధిపొందాలని చెప్పారు. 2025–26 సంవత్సరానికి సంబంధించిన సూక్ష్మ ప్రణాళికలను సంసిద్ధం చేసుకోవాలని చెప్పారు. గ్రామ సమైఖ్య సంఘాల ద్వారా తీసుకున్న రుణాలను సకాలంలో బ్యాంకులకు తిరిగి చెల్లించాలని చెప్పారు. కార్యక్రమంలో సీసీ రాఘవ, వీవోఏలు రాజ్యలక్ష్మి, శ్రీలక్ష్మి, నూరా, డ్వాక్రా మహిళలు తదితరులు ఉన్నారు. -
తుఫాన్ షెల్టర్లను సిద్ధంగా ఉంచాలి
ఎంపీడీవో శ్రీనివాసరావు కర్లపాలెం: తుఫాన్ ప్రమాదం పొంచి ఉన్నందున తీరప్రాంత గ్రామాలలో ఉన్న షెల్టర్లను ప్రజలు ఉండేందుకు అనుకూలంగా సిద్ధం చేయాలని ఎంపీడీవో అద్దూరి శ్రీనివాసరావు సిబ్బందిని ఆదేశించారు. కర్లపాలెం మండల పరిధిలోని సముద్రతీర గ్రామాలైన పేరలి, కట్టావాద, తుమ్మలపల్లి, పెదగొల్లపాలెం గ్రామాలలో ఉన్న తుఫాన్ షెల్టర్లను మంగళవారం ఎంపీడీవో శ్రీనివాసరావు స్థానిక గ్రామ సచివాలయ సిబ్బందితో కలసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల సమయంలో గిరిజనులు, పూరి గృహాలలో ఉండే వారు తలదాచుకునేందుకు తుఫాన్ షెల్టర్లను సిద్ధంగా ఉంచాలని అన్నారు. తాగునీరు, విద్యుత్ సౌకర్యాలను కల్పించాలని సచివాలయం సిబ్బందిని ఆదేశించారు. అనంతరం తుమ్మలపల్లి, పెదగొల్లపాలెం గ్రామ సచివాలయాలను ఎంపీడీవో సందర్శించి రికార్డులు పరిశీలించారు. -
సీపీఎస్ను రద్దు చేయాల్సిందే
గుంటూరు వెస్ట్: సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాల్సిందేనని సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బాజీ పఠాన్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో సీపీఎస్ ఉద్యోగుల సంఘం చైతన్య ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా పఠాన్ మాట్లాడుతూ 2004 తర్వాత ఉద్యోగంలోకి వచ్చిన వారి సంఖ్య 3.5 లక్షలు ఉందన్నారు. ఈ ఉద్యోగుల భవిష్యత్తును నూతన పెన్షన్ స్కీం ద్వారా ప్రభుత్వాలు కొలిమిలోకి నెట్టేసినట్లు అయ్యిందన్నారు. తమ పోరాటాల ఫలితంగా 2017లో గ్యాట్యూటీ, ఫ్యామిలీ పెన్షన్లు సాధించామని చెప్పారు. ఏపీఈఏఈ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ చాంద్ బాషా మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగుల కనీస సమస్యలు కూడా పరిష్కరించకపోవడం శోచనీయమన్నారు. ఉద్యోగులు, ప్రభుత్వం వేరుకాదనే విషయాన్ని గుర్తించాలని కోరారు. అనంతంర జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజకు వినతిపత్రం అందజేశారు. సమావేశంలో కార్యదర్శి లక్ష్మీనారాయణ, సుబ్బారావు, పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. -
క్రీస్తు చూపిన మార్గంలో నడుద్దాం
● వజ్రోత్సవ జూబిలీ ముగింపు వేడుకలలో విశ్రాంత బిషప్ గాలిబాలి ● 8 జిల్లాలనుంచి వచ్చిన మేత్రాసన పీఠాధిపతులు ● తరలి వచ్చిన భక్తులు ● ప్రత్యేక ఆకర్షణగా తేరు ఊరేగింపుఅచ్చంపేట: ప్రతి ఒక్కరూ ఏసుక్రీస్తు చూపిన మార్గంలో నడిచి గౌరవ ప్రదమైన జీవితాన్ని పొందాలని, ఏసు క్రీస్తుపై నమ్మకం ఉంచాలని గుంటూరు, వైఎస్సార్ జిల్లాల విశ్రాంత బిషప్ గాలిబాలి అన్నారు. మండలంలోని తాళ్లచెరువులో బాలఏసు దేవాలయం నిర్మాణం జరిగి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా గత మూడు రోజులుగా జరుగుతున్న జూబిలి వేడుకలు సోమవారం రాత్రితో ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో 8 జిల్లాల నుంచి వచ్చిన మేత్రాసన పీఠాధిపతులు, 100 మంది కన్యాసీ్త్రలు, 50 మంది విచారణ గురువులు పాల్గొని తమ సందేశాన్ని ఇచ్చారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న గుంటూరు, వైఎస్సార్ జిల్లాల విశ్రాంత పీఠాధిపతి గాలిబాలి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పరస్పర ప్రేమాభిమానాలు కలిగి ఉండాలన్నారు. వైభవంగా తేరు ప్రదక్షిణ విశాఖపట్నం అగ్రిపీఠాధిపతులు ఉడముల బాల, నల్గొండ జిల్లా విశ్రాంత పీఠాధిపతి గోవిందుజోజి, ఏలురు పీఠాధిపతి పొలిమేర జయరావు, శ్రీకాకుళం పీఠాధిపతులు రాయరాల విజయకుమార్, నెల్లూరు మేత్రాసన కోఆజ్యుటర్ పీఠాధిపతులు పిల్లి అంథోనిదాస్, వరంగల్ మేత్రాసన పరిపాలాధికారి విజయపాలేరెడ్డిలతో పాటు అనేమంది విచారణ గురువులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. స్థానిక విచారణ గురువులు పుట్టి అంతోనిరాజు, సహాయ విచారణ గురువులు శ్యామ్కుమార్ ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా బాలికలు ప్రదర్శించిన నృత్యరీతులు ఆహుతులను ఆకట్టుకున్నాయి. పలు ప్రాంతాలనుంచి క్రైస్తవులు తండోప తండాలుగా తరలి వచ్చారు. రాత్రి 10 గంటలకు నిర్వహించిన తేరు ఊరేగింపు ఎంతో ఆకట్టుకుంది. రంగురంగుల కాంతులతో బాణసంచా కాలుస్తూ గ్రామ వీధులలో తేరు (రథం)పై బాలఏసును అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. వివిధ ప్రాంతాలనుంచి, గ్రామాలనుంచి తరలి వచ్చిన భక్తుల కోసం ప్రత్యేక కౌంటర్స్ ద్వారా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. -
నల్ల బర్లీ పొగాకు కొనుగోలు చేయాలి
ధర్నాలో రైతుల డిమాండ్ జె.పంగులూరు: నల్లబర్లీ పొగాకును మార్కెఫెడ్ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు, గిట్టుబాటు ధరకు రైతుల వద్ద ఉన్న పొగాకు మొత్తం కొనాలని కౌలు రైతు సంఘం, రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం పంగులూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులు ధర్నా చేశారు. పొగాకు కొనుగోలు చేయకపోతే తాము వ్యవసాయం చేయలేమని స్పష్టం చేశారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి నాగబోయిన రంగారావు మాట్లాడుతూ నల్ల బర్లీ సమస్య నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, తక్షణమే రైతుల వద్ద ఉన్న పొగాకు మొత్తాన్ని ప్రభుత్వం మార్కెఫెడ్ ద్వారా గానీ, కంపెనీల ద్వారా గానీ కొనుగోలు చేయాలన్నారు. కంపెనీల మోసం మాటలు నమ్మి రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేశారని, ప్రస్తుతం రైతుల వద్ద ఉన్న పొగాకుకు డిమాండ్ ఉన్నప్పటికీ, కొనకుండా కాలయాపన చేస్తే రైతులు తక్కువ ధరకు ఇస్తారని కంపెనీలు కొనుగోలు చేయడం లేదన్నారు. ఈ విషయం ప్రభుత్వం తీవ్రంగా తీసుకొని కంపెనీల ద్వారా కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు. బర్లీ పొగాకు ద్వారా ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి రూ.70 వేల కోట్ల ఆదాయం వస్తుందని, అదే మాదిరిగా కంపెనీలకు కూడా వేల కోట్ల ఆదాయం వస్తోందని అన్నారు. అలాంటి పొగాకు పండించే రైతుల గురించి ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. పొగాకు పంట కొనుగోలు చేసే వరకు రైతులు ఐక్యంగా పోరాడాలని, పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. రైతు సంఘం బాపట్ల జిల్లా కార్యదర్శి తల్లపనేని రామారావు మాట్లాడుతూ పొగాకు కంపెనీలు మాటలు నమ్మి రైతులు పూర్తిగా మోసపోయారని, మోసపు మాటలు చెప్పిన కంపెనీలు ఇప్పుడు ముఖ్యం చాటేశాయని, పొగాకు మొత్తం కొనుగోలు చేసేవరకు రైతులంతా నిలబడి పోరాడాలన్నారు. కార్యక్రమానికి ముందు జీపీఐ కంపెనీ ఏజెంటు దొంగచాటుగా వచ్చి రహస్యంగా రైతులు ఫొటోలు తీసి వారికి గేట్ పాస్లు ఇవ్వకుండా ఉండేందుకు ప్రయత్నించగా, రైతులు గమనించి ఏజెంట్ హర్షను పట్టుకొని నాయకుల ముందు ఉంచారు. అతని ద్వారా చిలకలూరిపేట కంపెనీ మేనేజర్ ప్రసాద్తో తహసీల్దార్ సింగారావు, నాగబోయిన రంగారావు, రామారావు ఫోన్లో మాట్లాడారు. రైతుల వద్ద ఉన్న నల్లబర్లీ పొగాకు తక్షణమే కొనుగోలు చేయాలని, ఇంకొల్లు, పంగులూరు పరిసర ప్రాంతాల్లో ఒక కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమానికి ముందు తహసీల్దార్ సింగారావు తడిచిన నల్లబర్లీ పొగాకు చూపించారు. అనంతరం తహసీల్దార్ సింగారావుకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం బాపట్ల జిల్లా అధ్యక్షుడు రాయిణి వినోద్బాబు, నాయకులు గుడిపూడి మల్లారెడ్డి, తలపనేని సుబ్బారావు, పోతుగంటి ఆదుసాహెబ్, నాయపాము ప్రభాకర్, అద్దంకి సుబ్బారావు, మద్దినేని సుబ్బరామయ్య, నాయపాము జాన్, ఉన్నం అంజయ్య, మాగులూరి చంద్రశేఖర్, వీరాంజనేయులు, గొర్రె వేణుబాబు, గోగుమళ్ల సింగయ్య, బాచిన శేషగిరి పాల్గొన్నారు. -
యోగాంధ్రలో ప్రజలంతా పాల్గొనేలా చూడాలి
అధికారులను ఆదేశించిన పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్బాబు నరసరావుపేట: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెల రోజుల ముందు నుంచే యోగాపై కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. జూన్ 21న ప్రధాని మోదీ విశాఖపట్నంలో పాల్గొనే కార్యక్రమం లైవ్ ద్వారా ప్రసారం జరుగుతుందని, ప్రజలంతా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ యోగా చేసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. మంగళవారం జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. యోగాపై ప్రజలల్లో చైతన్యం కలిగించి, ప్రతి ఒక్కరూ యోగాభ్యసనంలో పాల్గొనేలా చేయాలన్నారు. ముందుగా మండలానికి ఇద్దరేసి యోగా శిక్షకులను గుర్తించి వారి ద్వారా టీఓటీలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, వారి ద్వారా మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. టీఓటీ కోసం ప్రతి గ్రామం, వార్డ్ నుంచి ఒకరి చొప్పున ఎంపిక చేసి ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లు వారి వివరాలను పంపాలని తెలిపారు. ఈ నెల 22 నుంచి 27 వరకు వరకు టీఓటీ శిక్షణ ఉంటుందన్నారు. జూన్ 16 నుంచి ప్రత్యేక కార్యక్రమాలు.. మాస్టర్ ట్రైనర్లకు ఐదు రోజులు, యోగా నేర్చుకునే వారికీ మూడు రోజుల పాటు శిక్షణ ఉంటుందన్నారు. వీరందరికీ యోగా పూర్తిచేసినట్లు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. జూన్ 16 నుంచి 19 వరకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, రిజిస్టర్ అయిన ప్రతి ఒక్కరూ తప్పక యోగాభ్యాసన చేయాలనీ తెలిపారు. జూన్ 16న ఫ్యామిలీ యోగా పేరుతో నాలుగు తరాల కుటుంబ సభ్యులంతా పాల్గొనేలా చూడాలని, 17న సీనియర్ సిటిజన్స్ కోసం స్పెషల్ యోగా కార్యక్రమాలు ఉంటాయని, 18, 19 తేదీలలో గ్రామ, మండల, జిల్లా స్థాయిలలో యోగా పోటీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలు ఈ కార్యక్రమాలను ఆయా స్థాయిలలో నిర్వహిస్తారని తెలిపారు. మండల, నియోజకవర్గ ప్రత్యేకాధికారులు ఈ కార్యక్రమాలను పర్యవేక్షించాలని అన్నారు. ఈ నెల 21న నాలుగు గంటలకు కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణంలో కర్టెన్ రైజర్ కార్యక్రమం జరుగుతుందని, జిల్లా ప్రజలు, విద్యార్థులు, యువత, మహిళలు, అధికారులంతా ఈ కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు. అంతర్జాతీయ ఎగుమతిదారుల సమావేశం కొరిటెపాడు(గుంటూరు): స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుంటూరు బ్రాంచి ఆధ్వర్యంలో స్థానిక బృందావన్ గార్డెన్స్లోని ఓ హోటల్లో మంగళవారం ఎగుమతిదారుల సమావేశం జరిగింది. సమావేశానికి ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ కృష్ణకుమార్ బి.ప్రభు అధ్యక్షత వహించారు. ఎగుమతిదారులకు బ్యాంక్ అందిస్తున్న వివిధ రకాల రుణాలు, విదేశీ మారక ద్రవ్య లావాదేవీల పద్ధతులు, అంతర్జాతీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో ఎస్బీఐ ఏజీఎంలు రామ్ప్రసాద్, రమేష్బాబు, విజయ రాఘవయ్య, సూర్యశేఖర్, మేనేజర్ శ్రీను నాయక్, ఈసీజీసీ అధికారులు, పలువురు ఎగుమతిదారులు పాల్గొన్నారు. -
పీజీఆర్ఎస్కు వచ్చే అర్జీలు పరిష్కరించాలి
బాపట్ల: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలపై ఆడిట్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు అర్జీల ద్వారా తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. 170 అర్జీలు స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను కలెక్టర్ సావధానంగా విన్నారు. వాటికి అక్కడికక్కడే ఆయన పరిష్కార మార్గం చూపారు. తన పరిధిలో లేని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. కొన్నింటిని క్షేత్రస్థాయి పరిశీలనకు, మరికొన్నింటిని విచారించాలని అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్లో నమోదయ్యే ప్రతి అర్జీని అధికారులు నిశితంగా పరిశీలించి, పరిష్కరించాలని కలెక్టర్ చెప్పారు. పరిష్కరించిన అనంతరం అర్జీదారుని ఇంటి వద్దకు వెళ్లి ఫొటో అప్లోడ్ చేయాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్గౌడ్, బాపట్ల ఆర్డీఓ పి గ్లోరియా, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి 170 అర్జీలు స్వీకరణ -
రైతు ఊపిరితీస్తున్న బ్లాక్ బర్లీ
● పేరుకుపోయిన పొగాలు నిల్వలు ● కొనుగోలుకు ఆసక్తి చూపని టుబాకో కంపెనీలు ● పట్టించుకోని కూటమి ప్రభుత్వం ● బాధ తట్టుకోలేక ఓ రైతు ఆత్మహత్య ● ప్రభుత్వం ఆదుకోకుంటే అందరిది అదే బాట అంటున్న రైతులు సాక్షి ప్రతినిధి,బాపట్ల: పండించిన పొగాకు పంట మొత్తాన్ని కొంటామని హామీ ఇచ్చిన టుబాకో కంపెనీలు ఈ ఏడాది ఒక్క క్వింటా కూడా కొనక అన్నదాతలను వంచించాయి. రైతులను ఆదుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం ముఖం చాటేసింది. ఇప్పటికే పర్చూరు మండలం వీరన్నపాలెంకు చెందిన రైతు ఉప్పుటూరి సాంబశివరావు ఆత్మహత్య చేసుకోగా మరికొందరు అదేబాటలో ఉన్నారు. వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం క్వింటా పొగాకుకు రూ.15 నుంచి రూ.18 వేల ధర ఇచ్చి రైతులను ఆదుకోగా కూటమి ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసింది. బయట మార్కెట్లో క్వింటా రూ.5 వేలకు అమ్ముకోలేక రైతులు విలపిస్తున్నారు. అప్పులోళ్ల ఒత్తిళ్లు పెరగడంతో ఆందోళన చెందుతున్నారు. పొగాకు రైతుల కష్టాలు తెలుసుకునేందుకు ‘సాక్షి’ ఇంకొల్లు మండలం వంకాయలపాడు, సుబ్బారెడ్డిపాలెం, పర్చూరు మండలం ఉప్పు టూరు, వీరన్నపాలెం గ్రామాల్లో పర్యటించింది. కష్టమంతా వర్షార్పణం ఇంకొల్లు మండలం వంకాయలపాడు చేరుకోగా ముందు రోజు రాత్రి కురిసిన వర్షానికి పొగాకు తడిసిపోయింది. కొందరు రైతులు తడిసిన పొగాకును ఆరబెట్టుకుంటున్నారు. మరికొందరు ప్లాస్టిక్ పట్టలు కప్పి కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. రైతు రామలింగారెడ్డి రూ.12 లక్షలు పెట్టుబడులు పెట్టి 8 ఎకరాలలో సాగు చేసిన బ్లాక్ బర్లీ పొగాకు మొత్తం వర్షానికి తడిసిపోయింది. ఇంటి మనుషులతోపాటు కూలీలను పెట్టి రోడ్డుపైనే ఆరబెట్టుకుంటున్నాడు. పొగాకు కొంటామని చెప్పి జీపీఐతోపాటు మిగిలిన టుబాకో కంపెనీలు మోసం చేశాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో బ్లాక్బర్లీ సాగు ఇలా.... బాపట్ల జిల్లాలోని పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల్లో బ్లాక్బర్లీ, వైట్ బర్లీ, ఎఫ్సీవీ పొగాకు కలిపి 63,471 ఎకరాల్లో సాగుకాగా ఒక్క బ్లాక్ బర్లీ 53,067 ఎకరాల్లో సాగైంది. పర్చూరు నియోజకవర్గంలోనే 52,989 ఎకరాల్లో సాగుచేశారు. ఇప్పటివరకూ 5.60 లక్షల క్వింటాళ్లకు పైగా పొగాకు రైతుల వద్దే ఉండిపోయింది. ఊరంతా పొగాకు గుట్టలే... ప్రభుత్వం ఆదుకోవాలి పర్చూరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో వేలాది మంది రైతులు బ్లాక్ బర్లీ సాగుచేశారు. పంట చేతికొచ్చి నెల అవుతున్నా కంపెనీలు క్వింటా కూడా కొనలేదు. కంపెనీలు ఇచ్చిన హామీతోనే రైతులు పొగాకు సాగుచేశారు. తక్షణం ప్రభుత్వం స్పందించి రైతుల వద్ద ఉన్న పొగాకు వెంటనే గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలి. లేకపోతే రైతులతో కలిసి ఆందోళనకు దిగుతాం. –గాదె మధుసూదనరెడ్డి, వైఎస్సార్ సీపీ పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త ఇంత దుస్థితి ఎన్నడూ లేదు గత ప్రభుత్వంలో క్వింటా బ్లాక్ బర్లీ రూ.18 వేలకు తగ్గకుండా కొన్నారు. గుళ్లాకు సైతం రూ.9 వేలకు కొన్నారు. ఇప్పడు రూ.6 వేలకు కూడా కొనేవారు లేరు. నేను ఐదెకరాలు సాగుచేస్తే దాదాపు రూ.8 లక్షలు పెట్టుబడి పెట్టాను. కూలీలకు కూడా డబ్బులు కట్టలేకున్నాం. వంకాయలపాటి సాంబశివరావు, రైతు, వంకాయలపాడు, ఇంకొల్లు మండలంవంకాయలపాడు గ్రామంలో 100 మంది రైతులు 400 ఎకరాల్లో బ్లాక్ బర్లీ సాగుచేశారు. సుబ్బారెడ్డిపాలెం గ్రామంలో 120 మంది రైతులు 500 ఎకరాల్లో పొగాకు సాగుచేశారు. ప్రభు త్వం వెంటనే పొగాకు కొనిపించకపోతే చాలామంది రైతులు ప్రాణాలు బలిపెట్టుకుంటారని రైతు సంజీవరెడ్డితోపాటు మిగిలినవారు వాపోయారు. ఉప్పుటూరు చెరువు పక్కన రోడ్డుపైన ఉన్న ఖాళీ స్థలంలో వందలాది కౌలు రైతు ల పొగాకు గుట్టలుగా కనిపించాయి. 10 ఎకరాలు సాగుచేసిన సుధాకర్, 15 ఎకరాలు పండించిన అబ్దుల్ రజాక్, 20 ఎకరాలు వేసిన కోట య్య, 10 ఎకరాలు వేసిన బాల కోట య్య, 30 ఎకరాలు సాగు చేసిన షేక్ మొహిద్దీన్, 5 ఎకరాల షేక్ హషన్ బాషా, 14 ఎకరాల అప్పారావుతోపాటు అందరూ కష్టాలు ఏకరువు పెట్టారు. ఒక్క ఉప్పుటూరులోనే ప్రస్తుతం వెయ్యిలారీల పొగాకు సిద్ధంగా ఉందన్నారు.క్వింటా కూడా కొనలేదు 10 ఎకరాలు కౌలుకు తీసుకొని రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టి పంట సాగు చేశా. కంపెనీలు ఒక్క క్వింటా కూడా కొనలేదు. గత ప్రభుత్వంలో మాదిరి ధర ఉండి ఉంటే రూ.21.60 లక్షలు వచ్చేదని, ప్రస్తుత ధరకు అమ్మితే రూ.6 లక్షలు కూడా రాదు. –వంకాయలపాటి రఘుబాబు -
జై శ్రీరామ్ నామస్మరణతో మార్మోగిన శింగరకొండ
అద్దంకి/అద్దంకిరూరల్: జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రం శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ప్రాంగణం ‘జై శ్రీరామ్.. జై ఆంజనేయం, ప్రసన్నాంజనేయం’ నామస్మరణతో మార్మోగిపోయింది. సోమవారం మహా కుంభాభిషేక నూతన ఆలయ ప్రారంభం, విమాన శిఖర కలశ ప్రతిష్ట, జీవ ధ్వజ స్తంభ ప్రతిష్ట కార్యక్రమాలు దేవదాయశాఖ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ నెల 14న ప్రారంభమైన కార్యక్రమాలు సోమవారంతో ముగిశాయి. కుంభాభిషేకంలో భాగంగా విమాన శిఖర కలశ ప్రతిష్ట, నూతన ఆలయ ధ్వజ స్తంభ ప్రతిష్ట నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా 3 వేల మంది మహిళా భక్తులతో ఉదయాన్నే అద్దంకి పట్టణానికి సమీపంలో ఉన్న గుండ్లకమ్మ నది నుంచి మూడు వేల కళశాలతో జలాన్ని తీసుకుని ‘జై శ్రీరామ్.. జైశ్రీరామ్’ నామస్మరణ చేసుకుంటూ శింగరకొండ వరకు శోభాయాత్ర నిర్వహించారు. కేరళ వాయిద్యాలు, ప్రత్యేక నృత్యాలతో, దేవతా వేషధా రణల విన్యాసాలతో కన్నుల పండువగా సాగింది. కిక్కిరిసిన క్యూలైన్ల్లు.. కుంభాభిషేక కార్యక్రమాన్ని శృంగేరీ శారదాపీఠం ఉత్తరాధికారి విధుశేఖర భారతిస్వామి నిర్వహించారు. కుంభాభిషేకానికి హాజరైన భక్తులతో క్షేత్రంలోని ప్రత్యేక క్యూలైన్లు కిక్కిరిశాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వివిధ సామాజిక వర్గాల్లోని సత్రాల్లో అన్నదానంతోపాటు, దేవాలయ అధికారుల ఆధ్వర్యంలో 30 వేల మందికి అన్న సంతర్పణ చేశారు. అద్దంకి బస్టాండ్ నుంచి భవిష్య పాఠశాలకు చెందిన రెండు బస్సులు భక్తులను ఉచితంగా చేరవేశాయి. కోటా శ్రీనివాసకుమార్ భక్తులకు తాగునీరు సరఫరా చేశారు. పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి గొట్టిపాటి ప్రసన్నాంజనేయ స్వామికి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పట్టువస్త్రాలు సమర్పించా రు. మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యుత్శాఖ మంత్రి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమాన్ని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎం తిమ్మనాయుడు, సిబ్బంది పర్యవేక్షించారు. బందోబస్తును చీరాల డీఎస్పీ మొయిన్, అద్దంకి సీఐ సుబ్బరాజు పర్యవేక్షించారు.మహిమాన్వితుడు ఆంజనేయస్వామి వైభవంగా మహా కుంభాభిషేకం 3 వేల మంది మహిళలతో శోభాయాత్ర గుండ్లకమ్మ నది నుంచి శింగరకొండ వరకు శోభాయాత్ర శోభాయాత్రలో నడిచిన మేనక (ఏనుగు) రపత్యేక అతిథిగా హాజరైన శృంగేరీ శారదాపీఠం ఉత్తరాధికారి విధుశేఖర భారతిస్వామి లక్షల డబ్బు ఖర్చు పెట్టే పని లేకుండా 108 సార్లు రామనామ జపం చేస్తే చాలా ఎక్కువ ఫలితం పొందవచ్చని శృంగేరీ శారదాపీఠం ఉత్తరాధికారి విధుశేఖర భారతిస్వామి అన్నారు. మహా కుంభాభిషేకం అనంతరం ఆయన భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. రామాయణంలోని సుందరకాండలో, కిష్కింధకాండలో ఆంజనేయస్వామి దివ్యమైన చరిత్ర మనకు తెలుస్తుందని చెప్పారు. అనాది కాలం నుంచి ఆంజనేయస్వామి ఆరాధనను చేయడం సంప్రదాయంగా వస్తుందని, ఆయన మహిమ అపారమైనదన్నారు. శింగరకొండలో ఒకే దేవతను రెండు రూపాల్లో కొండపైన లక్ష్మీ నరసింహాస్వామి గానూ, కొండ కింద ఆంజనేయస్వామిగానూ మనకు దర్శనం ఇస్తున్నారన్నారు. శింగరకొండ దివ్య క్షేత్రమని చెప్పారు. అటువంటి క్షేత్రంలో ఆ స్వామికి నూతనాలయం, నూతన విమాన గోపుర, కలశ ప్రతిష్ఠ, ధ్వజ స్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాల్లో పాల్గొన్న వారంతా భగవత్ అనుగ్రహానికి పాత్రులు అయ్యారన్నారు. ఏదో పూర్వజన్మ పుణ్యం ఉంటేనే ఇటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారని చెప్పారు. -
భగవద్గీత అవగాహన అంశంలో పుష్పలతకు గోల్డ్ మెడల్
చీరాల: రోటరీ క్లబ్ క్షీరపురి మాజీ అధ్యక్షురాలు నన్నపనేని రామకృష్ణ సతీమణి నన్నపనేని పుష్పలత మైసూరు గణపతి సచ్చిదానంద స్వామిజీ నిర్వహించిన భగవద్గీత అవగాహన అంశంలో గోల్డ్ మెడల్ సాధించారు. ఆదివారం రాత్రి మైసూరులోని స్వామిజీ ఆశ్రమంలో జరిగిన కార్యక్రమంలో ఆమెకు స్వామిజీ గోల్డ్ మెడల్ అందించారు. ఈనెల 2న ఆన్లైన్ వీడియో కాల్లో పీఠానికి చెందిన ఐదుగురు గురువులు భగవద్గీతపై 90 నిమిషాలపాటు పలు రకాల ప్రశ్నలు వేశారు. వీడియోకాల్ నిర్వహణలో కళ్లు మూసుకుని మాత్రమే సమాధానం చెప్పాలన్నారు. ఆన్లైన్లో వివిధ పీఠాలకు సంబంధించిన 20 మంది పరిశీలిస్తుంటారని ఆమె తెలిపారు. స్వామిజీ చేతుల మీదగా గోల్డ్ మెడల్తో పాటు ఆయన ఆశీర్వచనాలు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆర్టీసీ స్థలాల లీజుపై 22న సమావేశం పట్నంబజారు: గుంటూరు జిల్లా పరిధిలోని పెదకాకాని, తెనాలి, పెదనందిపాడు బస్సు స్టేషన్ల పరిధిలో ఖాళీగా ఉన్న ఆర్టీసీ స్థలాలను లీజు ప్రాతిపదికన ఇచ్చేందుకు ఈనెల 22న గుంటూరు ఆర్టీసీ బస్టాండ్లో ఉదయం 10 గంటలకు సమావేశం ఏర్పాటు చేసినట్లు రీజియన్ మేనేజర్ ఎం.రవికాంత్ తెలిపారు. ఆసక్తి గల వారు ఆ రోజు సమావేశానికి హాజరుకావాలని ఆయన సూచించారు. మరిన్ని వివరాల కోసం ఏపీఎస్ ఆర్టీసీ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఎస్ఆర్టీసీ.ఏపీ.జీవోవి.ఇన్లో లేదా 9959225412 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. గరుడ వాహనంపై గ్రామోత్సవం తెనాలి టౌన్: వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీపద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఏడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు సోమవారం ఉదయం 7.30 గంటలకు నిత్య హోమం, బలిహరణ, ఉదయం 8గంటలకు గరుడ వాహనంపై పురవీధుల్లో స్వామి గ్రామోత్సవం నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు దివ్య రథోత్సవం, ప్రత్యేక పుష్పాలంకరణ, మేళతాళాలు, విద్యుత్ దీప కాంతుల నడుమ స్వామి గ్రామోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. పట్టణ ప్రజలంతా తిలకించి తరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమాలను ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి మంతెన అనుపమ పర్యవేక్షించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు నరసరావుపేట: మాదక ద్రవ్యాలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు కోరారు. సోమవారం కార్యాలయంలో నష ముక్త్ భారత్ అభియాన్ 2.0లో భాగంగా మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలను తెలియచేసే పోస్టర్లను ఆవిష్కరించారు. డీఆర్ఓ ఏకా మురళి, డీఈఓ చంద్రకళ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సీఎస్ వీడియో కాన్ఫరెన్స్.. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏర్పాట్లు, స్టేట్ ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు తదితర అంశాలపై సోమవారం జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పి.అరుణ్బాబు, జేసీ సూరజ్ గనోరే హాజరయ్యారు. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 512.70 అడుగుల వద్ద ఉంది. ఇది 136.3003 టీఎంసీలకు సమానం. -
వైఎస్సార్ సీపీదే విజయం
● వైస్ ఎంపీపీగా దొంతిరెడ్డి సింధు ఏకగ్రీవం ● అభినందనలు తెలిపిన వైఎస్సార్ సీపీ నాయకులుపిట్టలవానిపాలెం(కర్లపాలెం): పిట్టలవానిపాలెం మండల ప్రజాపరిషత్ ఉపాధ్యక్షురాలిగా వైఎస్సార్ సీపీ అభ్యర్థి, భవనంవారిపాలెం ఎంపీటీసీ సభ్యురాలు దొంతిరెడ్డి సింధు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం వైస్ ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. మండలంలో మొత్తం 11మంది ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. వీరిలో 10మంది వైఎస్సార్ సీపీ సభ్యులు ఉన్నారు. ఒకరు టీడీపీ ఎంపీటీసీ సభ్యుడు ఉన్నాడు. గతంలో వైస్ ఎంపీపీగా పనిచేసిన పిట్టువారిపాలెం ఎంపీటీసీ సభ్యుడు దెందుకూరి సీతారామరాజు మార్చినెలలో జరిగిన ఎన్నికలో ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో వైస్ ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. ఎన్నికల అధికారి, డ్వామా పీడీ ఎ.విజయలక్ష్మి పర్యవేక్షణలో ఎన్నిక నిర్వహించారు. సోమవారం ఉదయం 10.45 గంటలకు వైఎస్సార్ సీపీకి చెందిన 9 మంది ఎంపీటీసీ సభ్యులు మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు. చందోలు–1 ఎంపీటీసీ సభ్యుడు షేక్ బాజీ భవనంవారిపాలెం ఎంపీటీసీ సభ్యురాలు దొంతిరెడ్డి సింధు పేరును వైస్ ఎంపీపీ పదవికి ప్రతిపాదించారు. అల్లూరు ఎంపీటీసీ సభ్యురాలు వాలి కుమారి బలపరిచారు. ఎన్నిక నిర్ణీత సమయానికి వైస్ ఎంపీపీ పదవికి దొంతిరెడ్డి సింధు ఒక్కరే పోటీలో ఉండటంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి విజయలక్ష్మి ప్రకటించారు. అనంతరం ఎన్నికల అధికారి విజయలక్ష్మి దొంతిరెడ్డి సింధుకు ధృవీకరణ పత్రం అందజేసి ప్రమాణస్వీకారం చేయించారు. వైస్ ఎంపీపీగా ఎన్నికై న సింధుకి ఎన్నికల అఽధికారి విజయలక్ష్మి, ఎంపీటీసీ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. చందోలు ఎస్ఐ మర్రి వెంకట శివకుమార్ యాదవ్ తమ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియలో తహసీల్దార్ డి.వెంకటేశ్వర్లు, ఇన్చార్జ్ ఎంపీడీవో ఎలీషాబాబు, సూపరిటెండెంట్ మధుసూదన్రెడ్డి పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి మండలంలోని ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తూ, వైఎస్సార్ సీపీ బలోపేతానికి పనిచేస్తానని వైస్ ఎంపీపీ సింధు చెప్పారు. వైఎస్సార్ సీపీ బాపట్ల నియోజకవర్గం ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశీస్సులతో తనకు ఉపాధ్యక్ష పదవి లభించినట్లు తెలిపారు. తనను ఎన్నుకున్న ఎంపీటీసీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. అభినందనలు వైస్ ఎంపీపీగా ఎన్నికై న డి.సింధును ఎంపీపీ దెందుకూరి సీతారామరాజు, వైస్ ఎంపీపీ చేబ్రోలు కృపానందం, ఎంపీటీసీ సభ్యులు, వైఎస్సార్ సీపీ నాయకులు వాలి శివారెడ్డి, మండే విజయ్కుమార్, కుంటం ప్రసన్నరాజు, దోమా వెంకటేశ్వరరెడ్డి, దొంతిరెడ్డి కోటిరెడ్డి, తిరుమలరెడ్డి, బడుగు మాధవి, ఆరేపల్లి శివయ్య అభినందించారు. -
నిర్ణీత గడువులోపు అర్జీలు పరిష్కరించాలి
బాపట్ల: అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడీ పేర్కొన్నారు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులు వారి సమస్యలను స్వేచ్ఛగా ఎస్పీకి విన్నవించుకున్నారు. కుటుంబ కలహాలు, భర్త, అత్తారింటి వేధింపులు, భూ–ఆస్తి వివాదాలు, ఇతర సమస్యలపై వచ్చిన 50 అర్జీలను ఎస్పీ పరిశీలించారు. సంబంధిత పోలీసు అధికారులతో స్వయంగా ఫోన్లో మాట్లాడి అర్జీలను చట్ట పరిధిలో విచారించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీల పరిష్కరానికి తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి పంపాలని తెలిపారు. పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమని పోలీస్ అధికారులను హెచ్చరించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ టి.పి.విఠలేశ్వర్, పీజీఆర్ఎస్ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, ఎస్ఐ శ్రీనివాస్ ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ తుషార్ డూడీ -
అదే.. ఆ తల్లి ప్రత్యేకత
● మానసిక పరిణితి లేని ఆడపిల్ల నీహారిక ● కంటిపాపలా చూసుకున్న తల్లిదండ్రులు ● ఆనందాన్నీ, అవసరాలను వదులుకున్నారు ● బిడ్డ కోసం టీచరుగా మారిందా తల్లి ● ఇష్టమైన సైక్లింగ్లోనూ శిక్షణనిచ్చింది ● స్పెషల్ ఒలింపిక్స్లో పతకాలు నెగ్గేలా చూశారు ● ఇప్పుడా బిడ్డలాంటి మరికొందరికోసం ఏకంగా అలాంటి పాఠశాలనే నడుపుతోందా తల్లి తెనాలి: ‘‘అది 2019 సంవత్సరం మార్చి నెల. 14–21 తేదీల్లో దుబాయ్లో స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ సమ్మర్ గేమ్స్. 25 గేమ్స్లో 170 పైగా దేశాలకు చెందిన ఏడు వేల క్రీడాకారులు పాల్గొన్నారు. మనదేశం నుంచి 280 మంది వివిధ పోటీల్లో తలపడ్డారు. ఇందులో సైక్లింగ్లో 16 మంది పాల్గొంటే, ఆంధ్రప్రదేశ్ నుంచి ఓ యువతి ఆ పోటీలో పాల్గొంది. ఆ పోటీల్లో యువతి 500 మీటర్లు, కిలోమీటరు పోటీలు రెండింటిలోనూ ద్వితీయ స్థానం సాధించి రజత పతకాలను కై వసం చేసుకుంది. రెండు కి.మీ పోటీల్లో ఆరోస్థానంలో నిలిచింది. ఆ యువతే 2018లో రాంచీలో నిర్వహించిన జాతీయ ఓపెన్ చాంపియన్షిప్ పోటీల్లో కిలోమీటరు సైక్లింగ్లో బంగారు పతకం, రెండు కి.మీ విభాగంలో రజత పతకం గెలిచి, స్పెషల్ ఒలింపిక్స్కు అర్హత సాధించింది.’’ మానసిక పరిపక్వత లేదని సమాజం ఈసడించింది. తనపై డబ్బు ఖర్చుచేసినా, శ్రమ వెచ్చించినా ఎలాంటి ప్రయోజనం లేదు... తిండి, బట్ట ఇస్తే సరిపోతుందని తలిదండ్రులకు జాగ్రత్తలు చెప్పింది. అయితే సమాజం మాటవిని ఆ పాపను తల్లిదండ్రులు వదిలేయలేదు. తనకోసం తమ ఆనందాల్నీ, అవసరాలనూ వదులుకున్నారు. మానసిక వికలాంగురాలైన తమ కూతురు నీహారికను తన కాళ్లపై తాను నిలబడేలా చేయాలని కంకణం కట్టుకున్నారు. విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక పాఠశాలలో చదివిస్తూ తనకెంతో ఇష్టమైన సైక్లింగ్లో శిక్షణనిస్తూ వచ్చిందా తల్లి భార్గవి. తద్ఫలితమే.. నీహారిక సాధించిన విజయాలు. భార్గవి సొంతూరు చినపరిమి భార్గవి సొంతూరు తెనాలి సమీపంలోని చినపరిమి. భర్త ఆర్మీ ఉద్యోగి ముక్కామల శివరామకృష్ణ. 2001లో తొలి కాన్పులో లక్ష్మీదేవి పుట్టిందని సంబరపడ్డారు. ఏడాదిన్నర వచ్చినా నడక రాకపోవటంతో అనుమానం వేసింది. ఉద్యోగరీత్యా అప్పుడు జమ్మూకశ్మీర్లో ఉన్నారు. ‘ఒకసారి న్యూమోనియాకు ఇచ్చిన మందు ఓవర్డోస్ అయి, నాలుగురోజులు పాప కోమాలో ఉంది... తెలివొచ్చేసరికి మాటలు బాగా తగ్గిపోయాయి..చెప్పిందీ అర్థం చేసుకోవటం తగ్గింది. డ్రమ్స్ మోగినా, బాణసంచా పేలుళ్లు విన్నా, భయంతో వణికేది...పెరిగేకొద్దీ ఆ భయం ఎక్కువైంది’ అని భార్గవి గుర్తుచేసుకున్నారు. అయిదో ఏడు వచ్చేసరికి ఆగ్రాకు వెళ్లారు. అక్కడి డాక్టర్లు ‘ఇంటలెక్చువల్ డిసేబిలిటీ’ అన్నారు. ‘పిల్లలతో విపరీతంగా ప్రవర్తించేది అప్పుడే...డ్రమ్స్, బాణసంచా మోతకు భయపడిపోయేది. ఎవరినీ దగ్గరకు రానిచ్చేదికాదు...తనొక్కతే ఏదొక వస్తువుతో ఆడుకుంటూ ఉండేది...ఆ క్రమంలో సైకిల్ తనను బాగా ఆకర్షించింది...చిన్న సైకిల్ నడిపేది. పాడైపోతే కొత్తది కొనేదాకా ఊరుకునేది కాదు...ఆ ఆసక్తిని గమనించి ప్రోత్సహించాను’ అన్నారు భార్గవి. అప్పటికి తనకు మరో బాబు కలిగాడు. కుమార్తె కోసం త్యాగాలు.. పాప ఆరోగ్యం కారణంగా హైదరాబాద్కు బదిలీ చేయించుకున్నారు. ప్రత్యేక అవసరాల పిల్లల పాఠశాలలో చేర్పించారు. కొడుక్కి హోం వర్క్ చేయించేటపుడు, నీహారికను దగ్గరుంచారు. స్పీచ్ థెరపీనీ ఇప్పించారు. 2013లో విజయవాడకు వచ్చేశారు. 2013 నవంబరులో ఇలాంటి పిల్లల కోసం ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతాయని తెలుసుకున్నారు. 2014లో పార్టిసిపేట్ చేసేలా చూశారు. ప్రతిరోజూ తెల్లవారుజామున 4 గంటలకు పాపను నిద్రలేపటం, హైవేపై 10 కి.మీ ప్రాక్టీస్ చేయించి, ఇంటికి తీసుకొచ్చేవారు. తర్వాత ‘ఆటిజమ్ రీసెర్చ్ అండ్ మల్టీ డిసిప్లిన్ స్కూలు’కు తీసుకెళ్తారు. నీహారిక కోసం తనుకూడా అదే స్కూలులో ఉద్యోగం చేశారు భార్గవి. శివరామకృష్ణ కూడా వలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. విభిన్న ప్రతిభావంతులకు తల్లిలా.. తన బిడ్డ నీహారిక లాంటి మరికొందరి కోసం ఇప్పుడా తల్లి ఏకంగా స్కూలునే నడుపుతోంది. 2020లో ప్రజ్ఞ వెల్ఫేర్ సొసైటీని రిజిస్టరు చేశారు. 2022 నుంచి ఆ సొసైటీ తరఫున సాయి అంకుర్ స్పెషల్ స్కూల్ను ఆరంభించారు. 2019లో స్పెషల్ ఒలింపిక్స్లో పతకాల సాధనతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రైజ్మనీతో మొదలుపెట్టిన స్కూలుకు ఇప్పుడు సొంత డబ్బులు పడుతున్నాయి. పిల్లల తల్లిదండ్రుల మద్దతు తోడవుతోంది. పిల్లలు తమ పనులు తాము చేసుకోవటం, అవసరాలను తీర్చుకోవటం, వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడేలా శిక్షణనివ్వటం తమ ఆశయమని చెప్పారు భార్గవి. తెనాలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డులోని ‘సాయి అంకుర్ స్పెషల్ స్కూల్’ ఇప్పుడు భార్గవి ప్రపంచం. 24 ఏళ్ల కుమార్తె నీహారికతో సహా పదిహేనుమంది విభిన్న ప్రతిభావంతులు అక్కడ ఉన్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు అక్కడ పిల్లలకు రకరకాల యాక్టివిటీస్, ఆటలతో బోధన ఉంటుంది. రోజువారీ స్కూలుకు వెళుతూ రెమిడియల్ క్లాసుకు వచ్చేవారూ ఉన్నారని భార్గవి చెప్పారు. తనతోపాటు అక్కడ ముగ్గురు టీచర్లు, ఇద్దరు సపోర్టింగ్ స్టాఫ్ పనిచేస్తున్నారు. పాప కోసం ‘ఆటిజమ్ రీసెర్చ్ అండ్ మల్టీ డిసిప్లిన్ స్కూలు’ టీచరుగా పనిచేసిన భార్గవి, ఇప్పుడు ఏకంగా అలాంటి స్కూలునే నడుపుతూ ఎందరికో తల్లిలా మారింది.