breaking news
Bapatla District Latest News
-
తుళ్లూరు సీడ్ యాక్సిస్ రోడ్డుపై ప్రమాదం
తాడికొండ: తుళ్లూరు మండలం రాయపూడి జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై భార్యను ఎక్కించుకొని వెళుతున్న సొంగా కృష్ణ (40)ని లారీ వెనుక నుంచి ఢీకొట్టడంతో అదుపుతప్పి వెనుక చక్రాల కింద పడి నలిగి ప్రాణాలొదిలాడు. భార్య పక్కకు పడటంతో ప్రమాదం తప్పింది, కళ్లేదుటే భర్త లారీ చక్రాల కింద నలిగి మృతి చెందడంతో భార్య రోదన మిన్నంటింది. కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆగ్రహించిన స్థానికులు, బంధువులు వాహనాలు అడ్డుగా పెట్టి లారీలను నిలిపివేయడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. అనుభవం లేని డ్రైవర్లు, యువకులను పెట్టి పరిమితికి మించిన లోడుతో రాజధాని నిర్మాణ పనులకు గ్రావెల్, మట్టి, ఇసుక తరలిస్తుండటంతో ప్రమాదాలకు నిలయంగా మారుతుందని, ఇకనైనా సంబంధిత పోలీసు, రవాణా శాఖాధికారులు స్పందించి నిబంధనలకు విరుద్దంగా తిరుగుతున్న వాహనాలపై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
‘ఉత్త మా’ పురస్కారాలు
● అవార్డు పొందిన ముగ్గురు అధ్యాపకులూ సీఎం సామాజిక వర్గమే ● రాష్ట్ర స్థాయి ఎంపిక తీరు చూసి విస్తుపోతున్న విద్యావేత్తలు ● ఇతర సామాజిక వర్గాలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపణలు సాక్షి ప్రతినిధి, గుంటూరు : అధ్యాపకుల విద్యాపరమైన రికార్డుతోపాటు విద్య, పరిశోధన అంశాలనూ లెక్కలోనికి తీసుకోలేదు. వారు వ్యక్తిగతంగా కనబరిచిన ప్రతిభ, అందుకున్న పురస్కారాలు పట్టించుకున్న పాపాన పోలేదు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వారు సమర్పించిన పరిశోధనా పత్రాలు, వాటి ప్రమాణాలు తదితర అంశాలను పరిశీలించలేదు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డుకు ఎంపికై న వారి జాబితా చూస్తే ఇవేమీ కనిపించవు. దీంతో విద్యావేత్తలు విస్తుపోతున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిపాలన, వ్యవస్థాపరమైన అన్ని పదవులు, నియామకాలన్నింటిలోనూ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు సామాజిక వర్గానికే అగ్రతాంబూలం అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూటమిలో భాగస్వాములమైనప్పటికీ తమకు కనీస ప్రాధాన్యత కూడా ఉండటం లేదని కొన్ని సామాజిక వర్గాలు గతంలో అసంతృప్తి కూడా వ్యక్తం చేశాయి. కానీ అవేమీ పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ, ఏఎన్యూ నుంచి రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డుకు ముగ్గురూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని ఎంపిక చేయడం పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తోంది. ఆదర్శంగా నిలవాల్సిన అవార్డుల ప్రక్రియను కూడా ఒక సామాజిక వర్గానికే పరిమితం చేయడం, ముగ్గురూ సైన్స్ కళాశాలకు చెందిన వారే కావడం టీడీపీ ప్రభుత్వ విపరీత ధోరణికి అద్దం పడుతోందని విద్యావంతులు మండిపడుతున్నారు. ఆరోపణలున్నా పట్టింపేదీ? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత యూనివర్సిటీలో కీలకమైన పరీక్షల నిర్వహణ పదవిని ‘ఉత్తమ’ అవార్డుకు ఎంపికై న ఓ అధ్యాపకుడు నిర్వర్తించేవారు. ఆయన హయాంలో యూనివర్సిటీ పరిధిలో గత ఏడాది పరీక్ష ప్రారంభానికి ముందే బీఈడీ ప్రశ్నపత్రం లీక్ కావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ లీకేజీ ఘటనపై అప్పట్లో పెదకాకాని పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. ఓ బీఈడీ కళాశాల క్లర్క్ను, కొందరు ఒడిశా విద్యార్థులను నామమాత్రంగా బాధ్యులను చేసి చేతులు దులుపుకొన్నారు. పేపర్ లీకేజీ వంటి ఘటనలు చోటుచేసుకుంటే గతంలో ఆ పదవిలో ఉన్న వారిని యూనివర్సిటీ తొలగించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆ అధికారికి మరింత అగ్రపీఠం వేసినట్లు వ్యవహరించారు. ఆ తరువాత కూడా పీజీ ప్రశ్నపత్రాల్లో ప్రశ్నలు తప్పుగా రావడం, చేతిరాతతో ఉన్న ప్రశ్నపత్రాలను జిరాక్స్ తీసి విద్యార్థులకు ఇవ్వడం వంటి అనేక ఘటనలు ఈ అధికారి హయాంలో చోటుచేసుకున్నాయి. ఇక బోధన, పరిశోధన అంశాల్లో ఈ అధ్యాపకుడు కనబరిచిన ప్రత్యేక ప్రతిభ ఏంటని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. బీఈడీ పేపర్ లీక్ జరిగిన సమయంలో విద్యాశాఖ మంత్రి కార్యాలయం చాలా సీరియస్ అయ్యిందని, ఏఎన్యూ ఉన్నతాధికారులను నివేదిక కూడా అడిగిందని అప్పట్లో ప్రచారం చేశారు. కానీ ఆ ఘటన చోటుచేసుకున్న విభాగానికి చెందిన అధికారికి ఇప్పుడు అదే శాఖ నుంచి ఉత్తమ అవార్డును ప్రదానం చేయడం.. లోకేశ్, చంద్రబాబులకు ఉన్న సామాజిక ప్రేమను చాటి చెబుతోందని పలువురు పేర్కొంటున్నారు. -
11న బ్యాంకు ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె
కొరిటెపాడు(గుంటూరు): గ్రామీణ బ్యాంకుల బలోపేతానికి ఐక్య పోరాటం నిర్వహించనున్నట్లు అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం(ఏఐబీఈఏ) అధ్యక్షుడు బీఎస్ రాంబాబు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల సంఘం ఏఐబీఈఏ అనుబంధ సంస్థగా ఏర్పడిన అనంతరం తొలి జనరల్ బాడీ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకుల మేనేజ్మెంట్లతో జరిగిన ఒప్పందాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11వ తేదీన దేశ వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేపడుతున్నట్లు తెలిపారు. అప్పటికీ సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 26, 27, 28 తేదీల్లో మూడు రోజుల సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. అప్పటికీ స్పందన లేకుంటే అక్టోబర్ 26వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టే అన్ని పోరాటాలకు ఏఐబీఈఏ సంపూర్ణ సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ రుణాల ఎగవేతపై ఆందోళన.. కొన్ని కార్పొరేట్ సంస్థలు తీసుకున్న భారీ రుణాలను ఎగవేయడం వలన ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభనష్టాల ఒడిదుడుకులకు గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద మొత్తంలో రుణాలు తీసుకున్న సంస్థలకు తక్కువ మొత్తానికి సెటిల్మెంట్లు చేయడం వలన బ్యాంకులపై ఆర్థిక భారం పడుతోందని వెల్లడించారు. ప్రైవేటీకరణను అడ్డుకుంటాం.. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించే ప్రయత్నాలను బ్యాంకు ఉద్యోగులంతా ఐక్యంగా ఉద్యమాల ద్వారా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు దేశ ఆర్ధిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్నాయని, వాటిని ప్రైవేటు సంస్థలకు అప్పగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తెలిపారు. సమావేశంలో మూర్తి, రాధాకృష్ణమూర్తి, నాగపావని, రవిచంద్రారెడ్డి, రామకృష్ణ, వెంకటేష్ తదితర నాయకులు ప్రసంగించారు. నూతన కార్యవర్గం.. అనంతరం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం జిల్లా చైర్మన్గా పీవీ రాఘవరావు, అధ్యక్షుడుగా టి.హరనాథరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా డి.షణ్ముఖరావు, కోశాధికారిగా ఎం.నరహరి ఎన్నికయ్యారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, గ్రామీణ బ్యాంకుల బలోపేతం లక్ష్యంగా సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని నూతన కార్యవర్గం నిర్ణయించింది. -
సాఫ్ట్బాల్ జూనియర్ బాలబాలికల జట్లు ఎంపిక
పెదకాకాని: అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉన్న పది క్వింటాళ్ల రేషన్ బియ్యం బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెదకాకాని ఏకలవ్య నగర్లోని రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆ మేరకు శనివారం రాత్రి తనిఖీలు చేసిన పోలీసులు సుమారు పది క్వింటాళ్ల బరువు కలిగిన 23 రేషన్ బియ్యం బస్తాలను సీజ్ చేశారు. స్థానికంగా నివసించే మేడా కుమారి ఇళ్ల వెంట తిరిగి తక్కువ ధరకు బియ్యం కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నిందితురాలిని పోలీసు స్టేషన్కు తరలించారు. తనిఖీల్లో పోలీసులు నాగేశ్వరరావు, మల్లేశ్వరరావు, ఇర్ఫాన్లు పాల్గొన్నారు. 15లోపు పేరు నమోదుకు అవకాశం మధురానగర్(విజయవాడ సెంట్రల్): అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకుని వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన ఈనెల 27వ తేదీ నిర్వహించనున్న శతాధిక వృద్ధుల సన్మానోత్సవానికి అర్హులు ఈ నెల 15వ తేదీలోపు పేర్లు నమోదు చేసుకోవాలని ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ చల్లా హరికుమార్, వైస్ చైర్మన్ తేజ్రాజ్ సోలంకి కోరారు. విజయవాడ దుర్గాపురం విజయ్ నర్సింగ్ కళాశాలలో ఆదివారం నిర్వహించిన మీడిమా సమావేశంలో వారు మాట్లాడారు. తాము ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన శతాధిక వృద్ధులను గుర్తించి సత్కారం చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 15వ తేదీలోపు 93475 72766, 98481 11138 ఫోన్ నంబర్లలో సంప్రదించాల్సిందిగా వారు కోరారు. ఎంపిక చేసిన శతాధిక వృద్ధులను ట్రస్ట్ ఖర్చులతో విజయవాడ తీసుకువచ్చి సత్కారం చేస్తామన్నారు. తిరిగి వారి ఇంటి వద్ద దింపివేయనున్నట్లు తెలిపారు. -
పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవ సమ్మేళనం
బాపట్ల: బాపట్ల ఆర్ట్స్ అండ్ సైనన్స్ కళాశాలలో బీకాం 1973–76 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవ ఆత్మీయ సమ్మేళనం బాపట్లలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. సుదీర్ఘ విరామం అనంతరం పూర్వ విద్యార్థులు ఒకరినొకరు కలుసుకుని నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను సన్మానించి, వారి ఆశీస్సులు పొందారు. అనంతరం అలనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ స్నేహితులతో ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ ఆనందంగా గడిపారు. ఉపాధ్యాయులు వీవీ సుబ్బారావు, పీఎం రాజు, జి. శాంతారావు, పి.సాంబశివరావు, ఏ.మధుసూదన్రావు, శ్రీనివాసరావు, డబ్ల్యూజీకే మూర్తి, బీసీ సాయిబాబు, జీవీ సుబ్రహ్మణ్యం తదితరులను పూర్వ విద్యార్థులు సత్కరించారు. కార్యక్రమానికి బందా బాబు అధ్యక్షత వహించగా, పూర్వ విద్యార్థులు గోపాలం శ్రీహరి, నూరుభాష ప్రసాద్, ఎం.రాఘవరావు, భుజేగేంద్ర మౌళి, గోపాలరావు, లక్ష్మణ్రెడ్డి, డి. పుండరీకాక్షయ్య, వి.చంద్రశేఖరరావు పాల్గొన్నారు. -
బల్కర్ డ్రైవర్ నిర్లక్ష్యం
ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ మృతి నెల్లూరు(క్రైమ్): నెల్లూరు జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మినీ ఐచర్ వ్యాన్ డ్రైవర్ మృతిచెందాడు. ట్రాఫిక్ పోలీసుల కథనం మేరకు.. బాపట్ల జిల్లా నగరం మండలం వెనిగల్లవారిపాళేనికి చెందిన వి.నాగమల్లీశ్వరరావు (41) లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం మినీ ఐచర్ వ్యాన్లో రొయ్యల లోడుతో చైన్నెకి బయలుదేరాడు. అర్ధరాత్రి నెల్లూరు జాతీయ రహదారిపై మయూరి రెస్టారెంట్ సమీపంలోకి రాగానే రోడ్డుపక్కన నిలిపి ఉంచిన బల్కర్ వాహనం ఎలాంటి సిగ్నల్ ఇవ్వకుండా ఒక్కసారిగా రహదారిపైకి వచ్చి కుడివైపునకు మళ్లింది. నాగమల్లీశ్వరరావు వ్యాన్ను అదుపు చేయలేక బల్కర్ వాహనం వెనుక భాగాన్ని ఢీకొన్నాడు. ప్రమాదంలో వ్యాన్ క్యాబిన్ పూర్తిగా ధ్వంసంకాగా, తీవ్రగాయాలతో నాగమల్లీశ్వరరావు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న నార్త్ ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలాకి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. మృతుడికి వరుసకు సోదరుడైన సుధీర్కుమార్ ఫిర్యాదు మేరకు ఆదివారం నార్త్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై అబ్దుల్ రహీమ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చీకటి గోపిది ముమ్మాటికి పోలీసు హత్యే
లక్ష్మీపురం: చీకటి గోపిది ముమ్మాటికి పోలీసుల హత్యేనని, బాధ్యులపై చర్య తీసుకోవాలని దళిత ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గుంటూరు బ్రాడీపేటలోని సీపీఎం కార్యాలయంలో బహుజన ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, న్యాయవాదులతో కలిసి పోలీసులపై చర్య తీసుకోవాలని రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి జొన్నకూటి నవీన్కుమార్ మాట్లాడుతూ పోలీసుల చర్యల వలనే గోపి మృతి చెందాడనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపాలని కోరారు. పోలీసులపై ఆరోపణలు ఉన్న ఘటనలో అదే పోలీసు శాఖకు చెందిన అధికారులు విచారణ చేయడం వల్ల విచారణ నిష్పక్షపాతంపై అనుమానాలు ఏర్పడే అవకాశం ఉందని అందువల్ల ఈ ఘటనపై స్వతంత్ర, నిష్పక్షపాత విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. చీకటి గోపి ఘటన ఒక్కటే కాదు రాష్ట్రంలో గత కొంతకాలంగా పోలీసుల కస్టడీ, విచారణ లేదా పోలీసుల చర్యల అనంతరం వ్యక్తులు మృతి చెందిన ఘటనలపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయని ఆరోపించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ మాట్లాడుతూ ఇది ఒక్క గోపి కుటుంబం సమస్య కాదని, చీకటి గోపి మరణాన్ని ఒక కుటుంబానికి జరిగిన విషాదంగా మాత్రమే చూడకూడదన్నారు. పోలీసు స్టేషన్కు విచారణ కోసం పిలిపించిన వ్యక్తి సురక్షితంగా ఇంటికి తిరిగి వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ పేరుతో హింస, అక్రమ నిర్బంధం, బెదిరింపులు, మానవ హక్కుల ఉల్లంఘనలకు ఎలాంటి అవకాశం ఉండకూడదన్నారు. ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ అని ప్రభుత్వం చెబుతున్న సమయంలో ఇలాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. ఈ అంశాలపై రౌండ్టేబుల్ సమావేశంలో పాల్గొన్న దళిత, గిరిజన, బహుజన, ప్రజా సంఘాల ప్రతినిధులు, న్యాయవాదులు, మానవ హక్కుల కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులు తమ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తెలియచేస్తూ పోలీసుల దుర్మార్గంపై, సీఐడీ ఎస్పీ చెప్పే అబద్ధాలపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలను ప్రత్యేకంగా కలిసి సమస్య తీవ్రతను వివరించాలని, డీజీపీని కలిసి వినతిపత్రం సమర్పించాలని, సమస్య పరిష్కారం కాకపోతే చలో గుంటూరు నిర్వహించాలని నిర్ణయించినట్లు నేతలు ప్రకటించారు. -
ప్రజా ఆస్తి.. పచ్చ నేతల పరం
● ఏకంగా 27 సెంట్ల మున్సిపల్ స్థలం రిజిస్ట్రేషన్ ● ఆక్రమిత భూమి విలువల దాదాపు రూ.పది కోట్లపైనే ● ఏఎంజీకి అప్పగించిన స్థలం ఏడుగురి పేరిట రిజిస్ట్రేషన్ యడ్లపాడు: చిలకలూరిపేట పురపాలక సంఘానికి ఆనుకుని ఉన్న పరిధిలోని ప్రజాప్రయోజనాల కోసం నిర్దేశించిన రిజర్వ్డ్ స్థలం అది. కార్మికుల కుటుంబాల పిల్లల విద్య, మధ్యాహ్న భోజనం కోసం ఏఎంజీ స్వచ్ఛంద సంస్థకు అధికారులు అప్పగించారు. కొంతకాలం డే–కేర్ సెంటర్గా కొనసాగిన రూ. పది కోట్ల విలువైన ఆ భూమి ఇప్పుడు యాజమాన్య హక్కుల వివాదంలో చిక్కుకుంది. మున్సిపల్ ఆస్తిగా అధికారులు చెబుతున్న ఈ స్థలం ఏడుగురు వ్యక్తుల పేర్లతో రిజిస్ట్రేషన్ అయినట్లు పత్రాలు వెలుగులోకి రావడం చర్చనీయాంశమైంది. అధికార పార్టీ నేతలదే ఇందులో కీలక పాత్రగా ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి ఏంఎజీకి అప్పగించిన ఈ భూమిలోని భవనాన్ని తొలగించి స్థలాన్ని చదును చేయడంతో విషయం మున్సిపల్ అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో సెప్టెంబర్ 4న అధికారికంగా అక్కడ హెచ్చరిక బోర్డు పెట్టి, స్థలం రక్షణ గేటుకు తాళంతో పాటు మున్సిపల్ అధికారులు సీల్ వేశారు. స్థానిక ప్రజాప్రతినిధి అండదండలతోనే అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు ఈ స్థలాన్ని తమ పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉన్నప్పటికీ.. మున్సిపల్ ఆస్తిగా అధికారులు స్పష్టం చేస్తున్న భూమికి ప్రైవేటు హక్కులు ఎలా వచ్చాయన్న ప్రశ్నకు రాజకీయ కోణం కూడా తోడవుతోంది. అయితే ఈ స్థలం వాస్తవంగా ఎవరిది? మున్సిపల్ ఆస్తి అయితే ప్రైవేటు వ్యక్తుల పేర్లతో రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది? ఒకవేళ స్వచ్ఛంద సంస్థకు గుత్తాధిపత్యం ఉంటే మున్సిపల్ అధికారులు సీజ్ చేయాల్సిన అవసరం ఏంటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రూ.కోట్ల విలువైన ఈ ఆస్తి వివాదంలో చిక్కుకోవడంపై బాధ్యులెవరనే విషయంపైనే ఇప్పుడు ప్రజల్లో హాట్టాపిక్గా మారింది. ఏఎంజీకి స్థలం అప్పగింత ఇలా... హెచ్హెచ్ డైక్మెన్ నగర్ నివాసితుల కమ్యూనిటీ అవసరాల కోసం ఉద్దేశించిన ఈ రిజర్వ్డ్ స్థలాన్ని 1998లో పురపాలకశాఖ ఏఎంజీ సంస్థకు అప్పగించింది. పారిశుధ్య కార్మికుల పిల్లలకు విద్య, మధ్యాహ్న భోజనం అందించేందుకు అక్కడ డే–కేర్ సెంటర్ నిర్వహించారు. ఏఎంజీ ప్రధాన దాత జర్మనీకి చెందిన డాక్టర్ హెచ్హెచ్ డైక్మెన్ మరణం తర్వాత ఆ కేంద్రం కార్యకలాపాలు నిలిచిపోయాయి. అయితే మున్సిపాలిటీ ఆ స్థలాన్ని ఏ ప్రాతిపదికన ఏఎంజీకి అప్పగించింది? లీజా.. వినియోగానికి అనుమతా.. లేక ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారమా? అనే వివరాలను నిర్ధారించే పాత రికార్డులేవీ దొరకలేదని, వాటి కోసం వెతుకుతున్నట్లు అధికారులు చెప్పడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. అందుబాటులో ఉన్న రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం.. డోర్ నంబర్ 80/1, సర్వే నంబర్ 138/1గా పేర్కొంటూ ఈ ఏడాది ఆగస్టు 11న స్థలం ఏడుగురి పేర్లతో రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది. మున్సిపల్ పన్ను అసెస్మెంట్ నంబర్ 1020025573 కూడా పత్రాల్లో ఉన్నట్లు సమాచారం. ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్ సంస్థకు అందించిన సేవలకు ప్రతిఫలంగా సంస్థ డైరెక్టర్ డాక్టర్ అరుణ్కుమార్ కంటి మహంతి తరఫున వారికి స్థలాన్ని కానుకగా ఇచ్చినట్లు దస్తావేజుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అంతేకాక, రిజిస్ట్రేషన్ సమయంలో అక్కడ డే–కేర్ భవనం ఉన్నప్పటికీ ఖాళీ స్థలంగా చూపించినట్లు సమాచారం. మున్సిపల్ ఆస్తిగా అధికారులు చెబుతున్న భూమి విషయంలోనే యాజమాన్య హక్కులపై ఇంతటి వివాదం తలెత్తడం ఇప్పుడు అధికారుల పాత్రపైనా అనుమానాలకు తావిస్తోంది. మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబును దీనిపై ‘సాక్షి’ వివరణ కోరగా.. వివాదాస్పద స్థలం సర్వే నంబర్ 88లోని 27 సెంట్లు మున్సిపల్ ఆస్తిగా స్పష్టం చేశారు. పన్ను అసెస్మెంట్ ఇటీవలే ఇచ్చారన్న ప్రచారం అవాస్తవమని తెలిపారు. గతం నుంచే అసెస్మెంట్ నంబర్ ఉందన్నారు. సదరు స్థలం ఏఎంజీకి ఏ ప్రాతిపదికన అప్పట్లో ఇచ్చారనే విషయంపై రికార్డులు పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. తమ స్థలంలోని భవనం తొలగించారని తెలిసి స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారు ఎలా రిజిస్ట్రేషన్లు చేసుకున్నా అది పక్కా మున్సిపల్ ఆస్తి అని, ఆ రిజిస్ట్రేషన్ ఎట్టి పరిస్థితుల్లో చెల్లదని పేర్కొన్నారు. వారికి ఆ ఆస్తిపై ఎలాంటి హక్కూ లభించదని తేల్చి చెప్పారు. -
ఉమ్మడి జెడ్పీ
మూడుగా మారిన పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు ● 25 నుంచి మొదలుకానున్న కార్యకలాపాలు ● ఉమ్మడి గుంటూరు జిల్లాలో 57 మండలాలతో జెడ్పీ ● ఇప్పుడు 17 మండలాలకు గుంటూరు పరిమితం ● పల్నాడులో 28, బాపట్ల పరిధిలో 20 మండలాలు గుంటూరు ఎడ్యుకేషన్ : ఉమ్మడి గుంటూరు జిల్లాలో 57 మండలాలు ఉండేవి. కొత్తగా పల్నాడు, బాపట్ల జెడ్పీలు ఏర్పడనుండగా.. మిగిలిన గుంటూరు జిల్లాకు ప్రస్తుతమున్న జెడ్పీ పరిమితం కానుంది. ప్రస్తుత పాలకవర్గ పదవీ కాలం సెప్టెంబర్ 24న ముగియనుంది. మరుసటి రోజు నుంచి పల్నాడు, బాపట్ల జిల్లా పరిషత్ల కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఆయా జిల్లాల్లోని జెడ్పీలకు అవసరమైన ఉద్యోగుల విభజనపైనా కసరత్తు సాగుతోంది. కొత్త జిల్లాల జెడ్పీలకు సీఈవో, డిప్యూటీ సీఈవో పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. పల్నాడు, బాపట్ల జిల్లాల్లో జెడ్పీ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 57 మండలాలతో కొనసాగిన జిల్లా ప్రజా పరిషత్ రాష్ట్రంలోని పెద్ద జిల్లాల్లో ఒకటిగా ఉంది. ప్రస్తుతం మూడు జిల్లాలుగా విడిపోయిన నేపథ్యంలో గుంటూరు జిల్లా 17 మండలాలకు పరిమితం కానుంది. అదే విధంగా పల్నాడులో 28, బాపట్లలో కొత్తగా కలిసిన వాటితో కలిపి 20 మండలాలు ఉన్నాయి. ఈ విధంగా చూస్తే పల్నాడు జిల్లాలోనే అధికంగా మండలాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 57 మండలాల నుంచి 57 మంది జెడ్పీటీసీ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తుండగా, కొత్త జిల్లాల ప్రాతిపదికగా గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఆయా జిల్లాల పరిధిలోని మండలాల వారీగా కొత్తగా జెడ్పీటీసీలను, చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకుంటారు. స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి నిధులు విడుదల చేయాలంటే పాలకవర్గాలు తప్పనిసరిగా ఉండాల్సిన పరిస్థితి. ప్రస్తుతమున్న పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 24న ముగియనున్న దృష్ట్యా, త్వరలోనే ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. 1959లో అమల్లోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ పంచాయత్ సమితి, జిల్లా ప్రజా పరిషత్ చట్టం ప్రకారం జిల్లా ప్రజా పరిషత్ ఏర్పడింది. అంతకు ముందు బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేసిన జిల్లా బోర్డు వ్యవస్థలో 1921 నుంచి 1959 వరకు పలువురు ప్రముఖులు అధ్యక్షులుగా కొనసాగారు. 1921 నుంచి 1927 వరకు మొదటి జిల్లా బోర్డు అధ్యక్షుడిగా పీజీఎన్ యతిరాజుల నాయుడు పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ విధంగా 1921 నుంచి 1959 వరకు తొమ్మిది మంది జిల్లా బోర్డు అధ్యక్షులుగా పదవిలో కొనసాగారు. మూడు సార్లు జిల్లా కలెక్టర్లు ప్రత్యేకాధికారులుగా వ్యవహరించారు. 1959లో అమల్లోకి వచ్చిన చట్టం ఆధారంగా డిసెంబర్ ఒకటో తేదీన మేడూరి నాగేశ్వరరావు ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ప్రస్తుత చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా వరకు గత 66 ఏళ్ల కాలంలో 36 మంది చైర్మన్లుగా వ్యవహరించారు. వీరిలో నాలుగు సార్లు ఇన్చార్జ్ చైర్మన్లు, 18 సార్లు జిల్లా కలెక్టర్లు ప్రత్యేకాధికారులుగా కొనసాగారు. జెడ్పీకి 16 మంది చైర్మన్లు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నికయ్యారు. చైర్మన్లుగా పదవీ బాధ్యతలు నిర్వర్తించిన వారిలో కాసు వెంగళరెడ్డి, రాయపాటి శ్రీనివాస్, మాజీ ఎంపీ యడ్లపాటి వెంకట్రావు తదితర ప్రముఖులు ఉన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందిన మోహన్ కందా గుంటూరు జిల్లా కలెక్టర్గా పని చేసిన కాలంలో జెడ్పీ ప్రత్యేకాధికారిగా వ్యవహరించారు. ప్రస్తుతమున్న జెడ్పీ పరిపాలన భవనాన్ని 1964 జూలై 15న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. గుంటూరు జిల్లాలో చేబ్రోలు, దుగ్గిరాల, గుంటూరు, కాకుమాను, కొల్లిపర, మంగళగిరి, మేడికొండూరు, పెదకాకాని, పెదనందిపాడు, ఫిరంగిపురం, పొన్నూరు, ప్రత్తిపాడు, తాడేపల్లి, తాడికొండ, తెనాలి, తుళ్లూరు, వట్టిచెరుకూరు ఉన్నాయి. బాపట్ల జిల్లాలో అమృతలూరు, బాపట్ల, భట్టిప్రోలు, చెరుకుపల్లి, చినగంజాం, చీరాల, ఇంకొల్లు, కారంచేడు, కర్లపాలెం, కొల్లూరు, మార్టూరు, నగరం, నిజాంపట్నం, పర్చూరు, పిట్టలవానిపాలెం, రేపల్లె, చుండూరు, వేమూరు, వేటపాలెం, యద్దనపూడి మండలాలు ఉన్నాయి. పల్నాడు జిల్లాలో అమరావతి, అచ్చంపేట, బెల్లంకొండ, బొల్లాపల్లి, చిలకలూరిపేట, దాచేపల్లి, దుర్గి, యడ్లపాడు, గురజాల, ఈపూరు, కారంపూడి, క్రోసూరు, మాచవరం, మాచర్ల, ముప్పాళ్ల, నాదెండ్ల, నరసరావుపేట, నకరికల్లు, నూజెండ్ల, పెదకూరపాడు, పిడుగురాళ్ల, రాజుపాలెం, రెంటచింతల, రొంపిచర్ల, సత్తెనపల్లి, శావల్యాపురం, వెల్దుర్తి, వినుకొండ ఉన్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ స్వరూపం మారింది. కొత్త జిల్లాల ప్రాతిపదికన గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల వారీగా జెడ్పీలు ఏర్పడనున్నాయి. ఇందుకు సంబంధించి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జిల్లాల వారీగా పరిషత్లను ఏర్పాటు చేస్తూ జీవో 114 ద్వారా మార్గదర్శకాలు జారీ చేసింది. దశాబ్దాల తరబడి ఉమ్మడి గుంటూరుగా కొనసాగుతున్న జెడ్పీ ఇక నుంచి మూడు జిల్లాల వారీగా విడిపోనుంది. -
త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
● లారీని ఢీకొన్న కారు ● మంటలు చెలరేగి కారు దగ్ధం ● ప్రయాణికులు సురక్షితంపిడుగురాళ్ల: ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో కారులో మంటలు చెలరేగాయి. కారు పూర్తిగా దగ్ధమైంది. పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామ సమీపంలో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ ఎం.మోహన్ తెలిపిన వివరాల మేరకు.. నరసరావుపేట వైపు నుంచి కారంపూడి వైపునకు ఓ లారీ వెళుతోంది. ఇంతలో కారంపూడి వైపు నుంచి గుత్తికొండ వైపు వస్తున్న కారు వేగంగా ఢీకొంది. గుత్తికొండ గ్రామ సమీపంలోని ఆంజనేయస్వామి విగ్రహం వద్ద చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు భయాందోళనలకు గురయ్యారు. స్థానికులు కారు అద్దాలు పగలగొట్టి కారులో ఉన్న నలుగురు వ్యక్తులను క్షేమంగా కాపాడారు. అదృష్టశాత్తు వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
లలిత పీవీఎస్లో వైద్య విద్యకు ప్రాధాన్యం
గుంటూరు మెడికల్: లలిత పీవీఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రారంభమైన నాటి నుంచి అకాడమిక్స్, వైద్య వృత్తిపరమైన విద్యకు ఎంతో ప్రాధాన్యమిస్తుందని సంస్థ చైర్మన్, సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పీవీ రాఘవ శర్మ అన్నారు. ఆదివారం గుంటూరు తక్కెళ్లపాడులోని లలిత పీవీఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో లలిత సీఎంఈ సిరీస్ లో తొలి కార్యక్రమంలో పెరిఫెరల్ న్యూరోపతిలో ఆధునిక పరిణామాలు అనే అంశంపై సైంటిఫిక్ సీఎంఈ నిర్వహించారు. లలితా పీవీఎస్ ఇనిస్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ ఆడిటోరియంలో ప్రారంభించారు. ముంబై బాంబే హాస్పిటల్కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ ఖాదిల్కర్ గౌరవ అతిథిగా , లలితా పీవీఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డీన్ డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు పాల్గొన్నారు. డాక్టర్ రాఘవ శర్మ మాట్లాడుతూ వైద్యులు పీజీ వైద్య విద్యార్థుల కోసం లలిత పీవీఎస్ ఇనిస్టిట్యూట్లో క్రమం తప్పకుండా అకాడమిక్ సెషన్లు, క్లినికల్ మీటింగ్స్, నిరంతర వైద్య విద్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, న్యూరో సైన్సెస్ విభాగాధిపతి డాక్టర్ పమిడిముక్కల విజయ మాట్లాడుతూ పెరిఫెరల్ న్యూరోపతి వ్యాధుల ప్రాబల్యం నానాటికి పెరిగిపోతుందని చెప్పారు. వ్యాధులను ఏవిధంగా గుర్తించి చికిత్స అందించే విషయాలను వివరించారు. సంస్థ డైరెక్టర్, న్యూరాలజిస్ట్ డాక్టర్ పోలవరపు నరేన్ సమన్వయకర్తగా వ్యవహరించారు. బాంబే హాస్పిటల్ కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ ఖాదిల్కర్ ‘ఎమర్జింగ్ ల్యాండ్ స్కేప్ ఆఫ్ ఇమ్యూనో– మీడియేటెడ్ న్యూరోపతిస్’ అనే అంశంపై ప్రసంగించారు. హైదరాబాద్కు చెందిన డాక్టర్ ఆర్ మురళీధర్ రెడ్డి ‘రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ డయాబెటిక్ న్యూరోపతిస్ అనే అంశంపై ప్రసంగించారు. హైదరాబాద్ నిమ్స్కు చెందిన డాక్టర్ వై.శిరీష ప్రాక్టికల్ అప్రోచ్ టు పెరిఫెరల్ న్యూరోపతి అనే అంశంపై ప్రసంగించారు. బెంగళూరుకు చెందిన డాక్టర్ మధు నాగప్ప ఇన్ఫెక్షయస్ న్యూరోపతిస్ అనే అంశంపై మాట్లాడారు. ముంబైకి చెందిన డాక్టర్ విన్నీ విల్సన్ ఆధ్వర్యంలో పెరిఫెరల్ న్యూరోపతి పై క్విజ్ నిర్వహించారు. సీఎం ఈ కార్యక్రమానికి 200 మంది ప్రతినిధులు హాజరయ్యారు. డాక్టర్ తారక్నాథ్, డాక్టర్ యు.వీరమ్మ, డాక్టర్ బి.సాయికృష్ణ, డాక్టర్ గాజుల రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లోని వివిధ ప్రాంతాలు నుంచి వచ్చిన వైద్యులు, న్యూరాలజిస్టులు, పీజీ వైద్య విద్యార్థులు, వివిధ మెడికల్ కాలేజీలు టీచింగ్ హాస్పిటల్కి చెందిన పి.జి వైద్య విద్యార్థులు, ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొన్నారు. -
ఆమ్యామ్యాల తడాఖా
అమాత్యుని ఇలాకా.. జిల్లా ఇన్చార్జి మంత్రి అంటే.. ఆ జిల్లాలోని పరిపాలన మొత్తానికి ఆయనే కీలకం. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలపైనా పర్యవేక్షణ ఆయనదే. కానీ గొట్టిపాటి రవికుమార్ ఇన్చార్జి మంత్రిగా ఉన్న పల్నాడు జిల్లాలో సాక్షాత్తూ ఆయన శాఖలోనే పెద్ద ఎత్తున అవినీతి రాజ్యమేలుతున్నా చోద్యం చూస్తున్నారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడుపుతున్నామంటూ ఉపన్యాసాలకే ఆయన పరిమితం అయ్యారు. మరోవైపు ఆయన శాఖకు చెందిన అధికారులు ప్రతి పనికో రేటు కట్టి వినియోగదారుల నుంచి దొరికినకాడికి దోచుకుంటున్నారు. నరసరావుపేట టౌన్: జిల్లా కేంద్రం నరసరావుపేటలో విద్యుత్ శాఖ అధికారులపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడం చర్చనీయాంశంగా మారింది. ప్రజలకు నిరంతర విద్యుత్ సేవలు అందించాల్సిన శాఖలో ప్రతి పనికీ ‘రేటు’ నిర్ణయించారని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కావాలన్నా.. కొత్త విద్యుత్ కనెక్షన్ పొందాలన్నా.. లోడ్ పెంచుకోవాలన్నా.. లైన్ మార్పులు, ఇతర సాంకేతిక అనుమతులు పొందాలన్నా మామూళ్లు లేకుండా పని జరగడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కింది స్థాయి సిబ్బంది నుంచి పైస్థాయి అధికారుల వరకు ముడుపుల వ్యవహారం సాగుతోందని ఆరోపిస్తున్నారు. అక్రమాలను అరికట్టాల్సిన విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం నిద్రావస్థలో ఉండటం అవినీతిపరులకు వరంగా మారింది. అవినీతి అధికారికి అందలం.. విద్యుత్ శాఖకు చెడ్డపేరు తెస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి, వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత ఉన్నతాధికారులతో పాటు ప్రభుత్వంపైనా ఉందని ప్రజలు అంటున్నారు. గతంలో నరసరావుపేట విద్యుత్ శాఖలో ఏఈగా పనిచేసిన అధికారిపై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఒక్కో ట్రాన్స్ఫార్మర్కు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు కెపాసిటీని బట్టి వసూలు చేశాడు. ఆయనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిపోయి పదోన్నతి కల్పించి మరో నియోజకవర్గానికి బదిలీ చేయటం ఉద్యోగ వర్గాలతో పాటు వినియోగదారులకు విస్మయానికి గురిచేసింది. ఇప్పటివరకు అధికారులపై వచ్చిన ఆరోపణలపై ఎలాంటి సమగ్ర విచారణ జరిగిందే లేదు. ప్రభుత్వ పెద్దల పర్యవేక్షణపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆరోపణలపై మంత్రి నేరుగా దృష్టి సారించి, నరసరావుపేట విద్యుత్ శాఖలో పారదర్శక విచారణకు ఆదేశిస్తారా లేక ఈ ‘అవినీతి చీకట్లు’ ఇలాగే కొనసాగుతాయా అనేది వేచి చూడాలి.విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పల్నాడు జిల్లా ఇన్చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి కీలక బాధ్యతల్లో ఉన్న మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కేంద్రం నరసరావుపేటలో విద్యుత్ శాఖ అధికారులపై ఇంత తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు రావడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అని వినియోగదారులు చర్చించుకుంటున్నారు. ఇకనైనా దృష్టి సారించి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. -
‘స్థానిక’ ఎన్నికలకు సిద్ధం కావాలి
బాపట్ల: వైఎస్సార్ సీపీ కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్కరికీ మంచి భవిష్యత్ కల్పించేందుకు అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధంగా ఉన్నారని శాసనమండలి ఉపసభాపతి తూమాటి మాధవరావు పేర్కొన్నారు. క్రమశిక్షణతో ప్రతి ఒక్కరూ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. బాపట్లలోని సూర్యకాళి ఫంక్షన్ హాలులో జిల్లా పార్టీ సమావేశం, గుర్తింపు కార్డుల పంపిణీ శనివారం జరిగింది. ఈ సమావేశంలో తూమాటి మాధవరావు మాట్లాడుతూ కూటమి సర్కారుపై ప్రజల్లో నమ్మకం పోయిందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఘోరంగా విఫలమైందని తెలిపారు. పొగాకు రైతులు ఇటీవల మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి కన్నీటి పర్యంతమయ్యారని గుర్తు చేశారు. రైతే రాజుగా సాగిన జగనన్న పాలన చూసిన వారు టీడీపీ ప్రభుత్వంలో మరోసారి మోసపోయామని చెప్పారన్నారు. బాపట్ల జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉంటే, ఒకరు 22ఏ ఉన్న భూములకు విముక్తి కల్పించలేకపోగా, మరో మంత్రి రెండుగంటలు విద్యుత్ కోతలు అంటూ తన వైఫల్యాన్ని ప్రకటించుకుంటున్నారని పేర్కొన్నారు. సొంత వ్యాపారాలపై చూపుతున్న శ్రద్ధను ప్రజల సమస్యలపై వారు చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికీ గుర్తింపు పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున మాట్లాడుతూ... పార్టీ కోసం కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికీ మంచి గుర్తింపు ఉంటుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని సూచించారు. పార్టీలో ప్రతి సభ్యునికి గుర్తింపు ఇస్తూ కార్డులు ఇవ్వడం స్వాగతించదగిన విషయంగా ఆయన పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో బలమైన నాయకులను గెలిపించుకునే వరకు అందరిపై బాధ్యత ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలు వివరించాలి మాజీ డిప్యూటీ స్పీకర్ కోన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి ఏవిధంగా కుంటుపడిందో ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు. ఓటు హక్కు విలువైనదని, దానిని కాపాడుకోవాలని తెలిపారు. ఓటుకు సంబంధించిన నోటీసు ఇస్తే దానికి తగిన సమాధానం చెప్పాలని సూచించారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై గట్టిగా నిలదీద్దామని అన్నారు. కూటమి అక్రమాలను గట్టిగా ప్రతిఘటిద్దామని చెప్పారు. ఎదురు తిరిగిన వారిపై టీడీపీ ప్రభుత్వం కేసులు పెడుతోందని, వాటికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చాక వారికి తిరిగి ఏవిధంగా సమాధానం చెప్పాలో తెలుసునన్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేయాలని కోరారు. ఈ సమావేశంలో టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, చీరాల, పర్చూరు, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్తలు కరణం వెంకటేష్ బాబు, గాదె మధుసూదన రెడ్డి, వరికూటి అశోక్బాబు, రాష్ట్ర కార్యదర్శి చేజర్ల నారాయణరెడ్డి, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు కాగిత సుధీర్బాబు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, ఉయ్యూరు లీలా శ్రీనివాసరెడ్డి, యల్లావుల ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. -
గుంటూరు జిల్లాకు హెడ్ కానిస్టేబుళ్లు బదిలీ
నగరంపాలెం: ప్రతి ఒక్కరూ అంకితభావంతో విధులు నిర్వర్తించి, పోలీస్శాఖకు మంచి పేరు తేవాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. పల్నాడు జిల్లా నుంచి గుంటూరు జిల్లాకు బదిలీ అయిన తొమ్మిది మంది హెడ్ కానిస్టేబుళ్లు శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ను మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నిజాయతీ, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని అన్నారు. గుంటూరు వెస్ట్ (క్రీడలు): గ్లోబల్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియం టెన్నిస్ కోర్టులో అండర్–10, అండర్–14, మిక్స్డ్ టెన్నిస్ ఓపెన్ టోర్నమెంట్ నిర్వహిస్తామని ఫౌండేషన్ కార్యదర్శి జీఎస్ ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఉదయం ఏడు గంటలకు స్టేడియం టెన్నిస్ కోర్టులో రిపోర్ట్ చేయాలని కోరారు. వయస్సు ధ్రువీకరణ పత్రంతోపాటు ఆధార్ కార్డు కూడా తీసుకురావాలన్నారు. మేడికొండూరు: మండలంలోని పేరేచర్ల గ్రామంలోని ఒక రేషన్ దుకాణం నుంచి బియ్యం అక్రమ తరలింపును గ్రామస్తులు అడ్డుకున్నారు. డీలర్ దుకాణం మూసివేసి వెళ్లిపోగా, లారీ డ్రైవర్ వాహనం వదిలి పరారయ్యాడు. రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చిన గ్రామస్తులు.. వారి కోసం ఎదురు చూస్తుండగా బియ్యం అక్రమ వ్యాపారి తన అనుచరులతో వచ్చి దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. అనంతరం మినీ లారీని వేగంగా డ్రైవ్ చేస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాడు. గ్రామస్తులు పక్కకు తప్పుకోవడంతో లారీ తీసుకెళ్లిపోయాడు. ఇప్పటికే పలుమార్లు రేషన్ బియ్యం తరలించారని గ్రామస్తులు చెబుతున్నారు. రెవెన్యూ, పోలీసులకు సమాచారం ఇచ్చినా స్పందించడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయంలో నీటిమట్టం శనివారం 535.70 అడుగులకు చేరింది. ఇది 179.4878 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు 6,553, ఎడమ కాలువకు 8,022, ఎస్ఎల్బీసీకి 2,000, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 16,875 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్కు 16,875 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. నెహ్రూనగర్: పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఈ వినాయక చవితిని కాలుష్య రహితంగా జరుపుకొందామని జీఎంసీ కమిషనర్ కె.మయూర్ అశోక్ పిలుపునిచ్చారు. అందులో భాగంగా 11వ తేదీన నగరంలోని సుమారు 25 వేల మంది విద్యార్థులతో మట్టి వినాయక ప్రతిమలను తయారు చేయించే బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. శనివారం జీఎంసీ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ‘ఎకో ఫ్రెండ్లీ వినాయక చవితి’ నిర్వహణపై ఆయన సమీక్ష నిర్వహించారు. -
రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్లో పతకాల పంట
● 36 పతకాలు సాధించిన జిల్లా పోలీసులు ● జాగిలాల పోటీల్లో సత్తాచాటిన షాడో జాగిలం ● మెడల్స్ సాధించిన సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ సత్తాచాటిన పోలీస్ జాగిలం షోడోను అభినందిస్తున్న జిల్లా ఎస్పీ అవార్డులు సాధించిన సిబ్బందిని అభినందిస్తున్న జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ -
బాపట్ల
ఆదివారం శ్రీ 6 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026రైతుల కష్టాలపై సర్కారు నిర్లక్ష్యం నగరంపాలెం: స్థానిక బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర ఆలయం అన్నమయ్య కళావేదికపై తెలుగు కళావైభవం ఉత్సవాల్లో భాగంగా శనివారం విష్ణు సహస్రనామ పారాయణం చేశారు.రేపల్లె: రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడం అత్యంత సిగ్గుచేటు అని వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. వైఎస్సార్ సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త పీటా నాగమోహన్కృష్ణ చేపట్టిన వైఎస్సార్ రైతు భరోసా పాదయాత్ర ముగింపు సందర్భంగా చెరుకుపల్లి మండలం తుమ్మలపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో నాగార్జున పాల్గొని సంఘీభావం ప్రకటించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి రాష్ట్రంలోని రైతులకు కష్టాలు, నష్టాలు, కన్నీళ్లు తప్పడం లేదని విమర్శించారు. వ్యవసాయం దండగ అని చెప్పిన చంద్రబాబు రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి, వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. రైతుల కష్టసుఖాలను పట్టించుకోకుండా పాలన సాగించడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో రైతులు ఆనందంగా వ్యవసాయం చేసుకుంటూ పండుగ వాతావరణంలో జీవించారని గుర్తుచేశారు. ఆ కాలంలో రైతులకు పలు సంక్షేమ పథకాలు అమలు చేసి వ్యవసాయానికి ప్రాధాన్యం ఇచ్చారని వివరించారు. సాగునీటికి దిక్కేది? ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కాలువల ద్వారా నీటి సరఫరా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మేరుగ ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు ఎండిపోతున్నాయని, రైతులు అప్పుల బారిన పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నీటి వసతి కల్పించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు పార్టీ కట్టుబడి ఉందని, ఈ నేపథ్యంలో నియోజకవర్గ సమన్వయకర్త నాగమోహన్కృష్ణ దీక్షతో ప్రారంభించిన రైతు భరోసా పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేయడం అభినందనీయం అన్నారు. ఈ పాదయాత్ర ద్వారా రైతుల బాధలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసులను వినియోగించడం, నాయకులపై అక్రమ కేసులు నమోదు చేయించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని తీవ్రంగా విమర్శించారు. డెల్టా ప్రాంతంలోని చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాటాలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. అనంతరం తుమ్మలపాలెంలో ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త పీటా నాగమోహన్కృష్ణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి యార్లగడ్డ మదన్మోహన్, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ బొర్రా వెంకటసుబ్బయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున -
బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీలు ఏర్పాటు చేయాలి
బాపట్ల: బయో డైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర జీవ వైవిధ్య మండలి ఆంధ్రప్రదేశ్ దేశీయవైద్య సంఘానికి ప్రత్యేకమైన ఉత్తర్వులు జారీ చేశారని ఆంధ్రప్రదేశ్ జీవవైవిద్య మండలి మెంబర్ సెక్రటరీ పి.రామకృష్ణ అన్నారు. బాపట్ల పట్టణంలోని ఎన్జీఓ హోంలో ఆంధ్రప్రదేశ్ జీవవైవిద్య మండలి ఆంధ్రప్రదేశ్ దేశీయ వైద్య సంఘం సంయుక్తంగా శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 1326 గ్రామ పంచాయతీల్లో బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా చేస్తున్న ఈ కార్యక్రమంలో సాంప్రదాయ దేశీయ వైద్య సంఘానికి ఈ బాధ్యత అప్పగించినట్లుగా సెక్రటరీ రామకృష్ణ తెలిపారు. పీఎంసీ కమిటీల ద్వారా సాంప్రదాయ వైద్యులకు అధికారిక గుర్తింపు వస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ సాంప్రదాయ వైద్యులు ఈ కమిటీల్లో చేరాలని, దేశీయ సంఘం వారి తరఫున అప్లికేషన్లు సిద్ధం చేసి పంపడం జరుగుతుందని, సాంప్రదాయ వైద్యాన్ని కాపాడటమే ఏపీ దేశీ వైద్య సంఘం లక్ష్యమన్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి నామాల శ్రీనివాసరావు జీవవైవిద్యాన్ని కాపాడుదామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా కార్యదర్శి వీఎల్పీ కుమార్ పాల్గొన్నారు. -
ముగిసిన రైతు భరోసా పాదయాత్ర
● రెండు రోజుల్లో 40 కి.మీ. పూర్తిచేసిన పీటా నాగమోహన్కృష్ణ, పార్టీ శ్రేణులు ● మూడు మండలాల్లోని 15 గ్రామాల్లో అన్నదాతల సమస్యలపై ఆరా రేపల్లె: రైతు సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన వైఎస్సార్ రైతు భరోసా పాదయాత్ర శనివారం రాత్రి చెరుకుపల్లి మండలం తుమ్మలపాలెంతో ముగిసింది. నియోజకవర్గంలోని నాలుగు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని, రైతు రుణాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పీటా నాగమోహన్కృష్ణ నిజాంపట్నం మండలం అడవులదీవి నుంచి ఈ పాదయాత్రను ప్రారంభించారు. మొదటి రోజు ఎనిమిది గ్రామాల మీదుగా సుమారు 20 కిలోమీటర్లు యాత్ర సాగింది. నగరం మండలం చిన్నమట్లపూడిలో ముగిసింది. రెండో రోజు పాదయాత్ర పెదగొల్లపాలెం, పరిశావారిపాలెం, సిరిపూడిల మీదుగా చెరుకుపల్లి మండలంలోని బలుసులపాలెం, మెట్టగౌడపాలెం చేరుకుంది. తర్వాత తుమ్మలపాలెం వరకు కొనసాగింది. ఈ రెండు రోజులలో మొత్తం 15 గ్రామాల్లో సుమారు 40 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయ్యింది. మోహన్కృష్ణ రైతుల పొలాలను సందర్శించి, వారి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ రైతుల వాస్తవ పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకుని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ పాదయాత్ర నిర్వహించామని తెలిపారు. గుర్తించిన సమస్యలను నివేదికగా తయారు చేసి జిల్లా కలెక్టర్కు సమర్పిస్తామన్నారు. పరిష్కారం కోసం కోరతామని, లేదంటే పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు. రెండవ రోజు పాదయాత్రలో పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త గాదె మధుసూదనరెడ్డి పాదయాత్రలో పాల్గొని నాగమోహన్కృష్ణకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
సీఎం చేతులమీదుగా రాష్ట్రస్థాయి అవార్డులు
చీరాల: పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో ఇంగ్లిష్ అధ్యాపకుడిగా పనిచేస్తున్న కె.మధుసూదనరావు రాష్ట్ర ఉత్తమ అధ్యాపకుడిగా అవార్డును అందుకున్నారు. గురుపూజోత్సవం సందర్భంగా శనివారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఆయన రాష్ట్ర అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.స్నేహలత, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది ఆయనను ప్రత్యేక అభినందనలు తెలిపారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న సాల్మన్.. గురుపూజోత్సవం ప్రభుత్వం అందించిన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును చీరాల ఎన్ఆర్పీఎం హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు బి.సాల్మన్ అందుకున్నారు. శనివారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ చేతుల మీదగా అవార్డును అందుకున్నారు. 36 సంవత్సరాల పాటు ఉపాధ్యాయ వృత్తిని చేస్తూ ఎంతో మంది విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందించిన ఆయన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకోవడంపై ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది అభినందనలు తెలిపారు. -
సమస్యలు పరిష్కరించేంతవరకు ఉద్యమిస్తాం
బాపట్లటౌన్: ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు నిరసనలు ఆగవని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీ సభ్యుడు కూరపాటి సత్యంరాజు తెలిపరు. కాంట్రాక్ట్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ శనివారం కాంట్రాక్ట్ ఉద్యోగులతో కలిసి బాపట్ల ఏరియా వైద్యశాల ప్రాంగణంలోని అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహం ముందు మానవహారంగా ఏర్పడి నిరసన కార్యక్రమం నిర్వహించారు. సత్యంరాజు మాట్లాడుతూ రెగ్యులర్ అయ్యేంతవరకు 100 శాతం గ్రాస్ జీతాన్ని అందజేయాలన్నారు. ఎక్కడా రోగులకు ఇసుమంతైనా అసౌకర్యం కలగకుండా వైద్య సేవలను నిరాటంకంగా నిర్విరామంగా కొనసాగిస్తున్నామన్నారు. స్టాఫ్నర్స్లు తబిత, కల్పన, ఫార్మసిస్టులు సుధా పరిమళ, శాంతి మనోజ, ల్యాబ్ టెక్నీషియన్లు నీలిమ, కంచర్ల రత్నకుమార్(నిజాంపట్నం ), సునీత, కిరణ్(చినమ్మట్లపూడి )రేడియోగ్రాఫర్ వెంకటలక్ష్మి (నిజాం పట్నం) పాల్గొన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీ సభ్యుడు కూరపాటి -
విద్యార్థులను ఉపాధ్యాయులే తీర్చిదిద్దాలి
బాపట్ల టౌన్: విద్యార్థులను అన్నివిధాలుగా తీర్చిదిద్ది సమాజానికి అందించే బాధ్యత ఉపాధ్యాయులదేనని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్కుమార్ తెలిపారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని సాయి గార్డెన్స్ కన్వెన్షన్ హాల్లో శనివారం ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత ఎమ్మెల్యేలు, ఉపాధ్యాయులతో జిల్లా కలెక్టర్ కలిసి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతిప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్నారులను మంచి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఐఏఎస్కు ఎంపికై న తర్వాత మొదటిసారిగా తనకు శిక్షణ ఇచ్చిన ఓ సీనియర్ ఐఏఎస్ అధికారికి తాను ఫోన్ ద్వారానే శనివారం శుభాకాంక్షలు తెలిపానన్నారు. తాను ఇంజినీరింగ్ చదవాలనుకున్నా.. బయాలజీలో 98 మార్కులు రావడంతో సదరు ఉపాధ్యాయురాలు అనూరాధ, ఇంగ్లిష్ ఉపాధ్యాయురాలు సురేఖ ప్రోత్సహించడంతో డాక్టర్ అయ్యానన్నారు. మెడిసిన్లో కర్ణాటక రాష్ట్రంలోనే 53వ ర్యాంకు సాధించానని మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ మాట్లాడుతూ సమాజంలో మంచి వ్యవస్థను రూపుదిద్దే బాధ్యత ఉపాధ్యాయులకే సాధ్యమన్నారు. చీరాల ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్య మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవలు మరువలేనివన్నారు. అనంతరం జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న 60 మందిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ సింగ్, ఆర్డీవో హరికుమార్, కార్పొరేషన్ డైరెక్టర్ చివుకుల దుర్గాప్రసాద్, సగర కార్పొరేషన్ డైరెక్టర్ సుబ్బారావు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్కుమార్ బాపట్ల: ప్రత్యేక సంక్షిప్త ఓటర్ల సవరణ ప్రక్రియలో భాగంగా ఏఈఆర్ఓ వద్ద హియరింగ్ పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ పేర్కొన్నారు. సర్ నిర్వహణపై శనివారం స్థానిక కలెక్టరేట్లోని న్యూ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఆర్ఓలు, ఏఈఆర్ఓలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, బీఎల్ఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... జాబితా ముసాయిదా తయారీ, నాణ్యత గల ఫొటోలను అప్లోడ్ చేసే ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. మండలాలవారీగా పెండింగ్ ముసాయిదా జాబితా తయారీ వివరాలను సంబంధిత అధికారులకు చూపించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఫారం 6, 7, 8 పెండింగ్ లేకుండా చూడాలన్నారు. 6న ఆదివారం ప్రత్యేక క్యాంపెయిన్ జరుగుతుందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లవన్న, జిల్లా పంచాయతీ అధికారి ఎల్. ప్రభాకర్రావు, ఎన్నికల విభాగ పర్యవేక్షకుడు షఫీ తదితరులు పాల్గొన్నారు. -
స్వాతంత్య్ర సమరయోధుల వారసుల ఇళ్ల నిర్మాణాలు నిలిపివేత
గుంటూరు రూరల్: స్వాతంత్య్ర సమరయోధుల వారసులు చేపట్టిన ఇంటి నిర్మాణాలను అధికారులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ చర్యను లబ్ధిదారులు తీవ్రంగా ప్రతిఘటించారు. వివరాలు.. అడవితక్కెళ్ళపాడులోని నల్లపాడు పోలీస్ స్టేషన్ సమీపంలో స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు 2010లో అప్పటి ఉన్నతాధికారులు సుమారు 70–80 మందికి ఇళ్ల స్థలాలను కేటాయించారు. అదే స్థలాలు గతంలో 1985లో వేరే వారికి కేటాయించగా వాళ్లు ఆ స్థలాల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకపోవటంతో 2010లో ఉన్నతాధికారులు విచారించి గతంలో 1985లో ఇచ్చిన వారికి రద్దు చేసి 2010లో స్వాతంత్య్ర సమరయోధులకు కేటాయించి ఇళ్ల పట్టాలను మంజూరు చేసి అందజేశారు. అప్పటి నుంచి కొందరు చిన్నపాటి నిర్మాణాలు చేపట్టి వదిలేయగా మిగిలిన వారు అక్కడ ఎటువంటి మౌలిక వసుతులు లేకపోవటంతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేకపోయారు. ఇటీవల కాలంలో స్వాతంత్య్ర సమరయోధుల వారసుల సంఘం ప్రతినిధులు జిల్లా కలెక్టర్ను కలిసి తమకు కేటాయించిన స్థలాలకు డ్రెయినేజీ, తాగునీరు వసతులు కల్పించాలని తాము ఇళ్ళు నిర్మించుకుంటామని అభ్యర్థించారు. దీంతో కలెక్టర్ ఉన్నతాధికారులు ముందు ఇళ్లు నిర్మాణాలు చేస్తే మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇవ్వడంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. టౌన్ ప్లానింగ్ అధికారుల రాకతో.. అనుమతి లేదని టౌన్ ప్లానింగ్ అధికారులు పోలీసుల అండతో పొక్లెయిన్తో నిర్మాణాలు కూల్చేందుకు వెళ్లారు. దీంతో నిర్మాణాలు కూల్చే ప్రయత్నం చేస్తే ఊరుకునేదిలేదని, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తమ స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు చేసుకుంటున్నామని లబ్ధిదారులు ఎదురుతిరిగారు. సర్దిచెప్పిన పోలీసులు దీంతో పోలీసులు ఇరువురికి సమన్వయ పరిచి ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చే వరకూ కనీసం నిర్మాణాలు నిలిపేయాలని లబ్ధిదారులకు సూచించారు. ఉన్నతాధికారుల అనుమతులతోపాటు టౌన్ ప్లానింగ్ అనుమతులు తీసుకోవాలని అధికారులు చెప్పటంతో లబ్ధిదారులు స్వాతంత్య్ర సమరయోధులకు ప్లానింగ్ అనుమతులు అధికారులే ఉచితంగా ఇవ్వాలని చట్టాలే చెబుతున్నాయని సూచించారు. దీంతో అధికారులు చేసేది లేక కనీసం అర్జీలైనా పెట్టుకోవాలని అనుమతులు ఉచితంగానే ఇస్తామని, చెప్పి అనుమతులు వచ్చే దాకా ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదని చెప్పి వెళ్లారు. ఉన్నతాదికారులు విచారించి తమ స్థలాల్లో తాము ఇళ్లు నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతులు ఇవ్వాలని లబ్ధిదారులు కోరారు. -
7వ తేదీ లోగా వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోండి
గుంటూరు ఎడ్యుకేషన్: బ్రాడీపేటలోని శ్రీమేధ విద్యాసంస్థల్లో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకున్నారు. ఈసందర్భంగా సంస్థ డైరెక్టర్ నందకిషోర్, కరస్పాండెంట్ అన్నా శ్రీలక్ష్మి శ్రీకృష్ణునికి పూజ నిర్వహించారు. క్యాంపస్ ఎదుట ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు. నందకిషోర్ మాట్లాడుతూ అధర్మం వృద్ధి చెందినప్పుడు ధర్మ సంస్థాపన కోసం భగవంతుడు శ్రీకృష్ణావతారాన్ని దాల్చారని అన్నారు. భగవద్గీత ద్వారా సామాన్య జీవితాన్ని ఏ విధంగా జీవించాలో, ధర్మాన్ని పాటించే విధానం, సంక్లిష్ట పరిస్థితుల్లో సరైన నిర్ణయాలను తీసుకునేందుకు కావాల్సిన ధైర్యాన్ని బోధించారని అన్నారు. ఈసందర్భంగా విద్యార్థులు ఉట్టి కొట్టే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. నగరంపాలెం: ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ (2026)లో జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, పతకాలు సాధించారు. ఈనెల 1–4 వరకు రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడా పోటీలు మంగళగిరి ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ ప్రాంగణంలో నిర్వహించారు. ఫైరింగ్ విభాగంలో ఎస్బీ సీఐ ఏ.మల్లికార్జునరావు స్టెన్ గన్ ఈవెంట్లో ద్వితీయ, కార్బైన్ ఈవెంట్లో తృతీయ స్థానంలో, వెయిట్ లిఫ్టింగ్్ 85 కిలోల విభాగంలో ఎస్బీ హెడ్ కానిస్టేబుల్ మల్లికార్జునరావు గోల్డ్ మెడల్, కబడ్డీలో ఎస్బీ మహిళా కానిస్టేబుల్ క్రాంతికుమారి, పట్టాభిపురం పీఎస్ మహిళా కానిస్టేబుల్ తిరుపతమ్మ గుంటూరు రేంజ్ నుంచి రెండో స్థానం సాధించారు. హ్యాండ్ రైజింగ్లో ఎస్బీ మహిళా కానిస్టేబుల్ క్రాంతికుమారి సిల్వర్ మెడల్, కె.వేణుబాబు ఆధ్వర్యంలో గుంటూరు డాగ్ స్క్వాడ్కు చెందిన ‘సింబా’ నార్కోటిక్ టెస్ట్ విభాగంలో రెండో స్థానం సాధించారు. ఆయా పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు. గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ అండ్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పలువురు వైద్య సిబ్బంది సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట నిలబడి ప్లకార్డులు చేతపట్టుకుని, నల్లబ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు. ప్రభుత్వం తమ న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించని పక్షంలో ఈనెల 8 నుంచి విధులు బహిష్కరిస్తామని యూనియన్ నేతలు తెలిపారు. 30 రోజుల్లో సమస్యలు పరిష్కరించకపోతే మళ్లీ విధులు బహిష్కరించి నిరసన కొనసాగిస్తామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, ఉద్యోగాలు రెగ్యులర్ అయ్యే వరకు నూరు శాతం గ్రాస్ శాలరీ చెల్లించాలని కాంట్రాక్టు ఉద్యోగులకు బదిలీ అవకాశం కల్పించాలని యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో పలువురు స్టాఫ్నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాశిస్టులు, ఇతర పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. -
‘రణభేరి–ఇక సమరమే’ సదస్సులో పాల్గొనండి
లక్ష్మీపురం: కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, ఏపీసీఓఎస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 13న గుంటూరులోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో జరిగే ‘రణభేరి–ఇక సమరమే’ సదస్సులో ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్, టీచర్స్ అండ్ వర్కర్స్ జేఏసీ చైర్మన్ బి లక్ష్మణరావు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక బ్రాడీపేటలోని సీఐటీయూ నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సదస్సు పోస్టర్ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఏళ్ల తరబడి ప్రభుత్వ శాఖల్లో, వివిధ ప్రభుత్వ సంస్థల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రభుత్వ సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారికి ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం, మెరుగైన వేతనాలు, సామాజిక భద్రత లేదని పేర్కొన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని పేర్కొన్నారు. శాశ్వత ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, ఆప్కాస్ ఉద్యోగుల సమస్యలను కూటమి ప్రభుత్వం పట్టించుకోని కారణంగానే పోరుబాటకు సిద్ధం కావలసిన సమయం ఆసన్నమైందన్నారు. కార్యక్రమంలో ఏపీ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, టీచర్స్ అండ్ వర్కర్స్ జేఏసీ సెక్రటరీ జనరల్ బి ముత్యాలరావు, సీఐటీయూ కోశాధికారి ఎం.సాంబశివరావు, వివిధ విభాగాల రాష్ట్ర జిల్లా నాయకులు ఎస్ శ్యామ్, వి రమేష్బాబు, సీహెచ్ గోపాలకృష్ణ, పి శ్రీనివాసరావు, రామకృష్ణలు పాల్గొన్నారు. -
పోలీసుల అడ్డంకులు
రైతు భరోసా పాదయాత్రకు రేపల్లె: అడవులదీవి గ్రామం నుంచి వైఎస్ఆర్ రైతు భరోసా పాదయాత్ర ప్రారంభమైన వెంటనే పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అడవులదీవి ఎస్ఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో శుక్రవారం పోలీసులు మోహరించి పాదయాత్రకు అనుమతులు లేవంటూ వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పీటా నాగమోహన్కృష్ణతో పాటు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పాదయాత్రను నిలిపివేయాలని పోలీసులు పట్టుబడడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రైతుల సమస్యలను తెలుసుకోవడానికి చేపట్టిన పాదయాత్రకు కూడా అనుమతులు కావాలా.. ప్రజల బాధలు వినడానికే వస్తే అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం.. అని వైఎస్సార్ సీపీ నాయకులు నిలదీశారు. ప్రభుత్వ తీరుపై ప్రశ్నలు లేవనెత్తే కార్యక్రమాలన్నింటినీ అణచివేయాలనే ఉద్దేశంతోనే ఈ అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా నాగ మోహన్కృష్ణ మాట్లాడుతూ రైతు కష్టాలను తెలుసుకోవడానికి చేపట్టిన పాదయాత్రను కూడా అడ్డుకోవడం చూస్తే చంద్రబాబు ప్రభుత్వానికి ఎంత భయంగా ఉందో తేలుతోందన్నారు. కరువు పరిస్థితులపై నిజాలు బయటపడకుండా చేయడానికే పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యానికి మచ్చ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఆత్మహత్యల అంచుకు చేరుతున్నా వారి కోసం ఒక్క అడుగు కూడా వేయని ప్రభుత్వం తీరును ఖండించారు. రైతుల సమస్యలను వెలుగులోకి తీసుకురావాలనే ప్రయత్నాన్ని అడ్డుకోవడం దారుణమని ధ్వజమెత్తారు. పోలీసులు అనుమతులు లేవంటూ పదేపదే హెచ్చరికలు జారీ చేయడంతో వైఎస్సార్ సీపీ శ్రేణులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోలీసులకు, పార్టీ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు డీజే బాక్స్ను సీజ్ చేయడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఎట్టకేలకు ముందుకు... వైఎస్సార్ సీపీ నాయకులు ఎట్టి పరిస్థితుల్లోనూ పాదయాత్రను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పరిస్థితి నియంత్రణలోకి వచ్చిన తర్వాత పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో మోహన్కృష్ణ ఆధ్వర్యంలో రైతు భరోసా పాదయాత్ర ముందుకు సాగింది. అడవులదీవి నుంచి ప్రారంభమైన పాదయాత్ర గరువుపాలెం, కూచినపూడి గ్రామాల మీదగా బొర్రావారిపాలెం, కేసనవారిపాలెం, అచ్యుతపురం, పెదమట్లపూడి మీదగా చినమట్లపూడికి చేరుకుంది. చినమట్లపూడిలో రాత్రికి బస చేశారు. పాదయాత్రకు పార్టీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు మేరుగ చందన్నాగ్, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
పేద రోగుల మృత్యుఘోష
సాక్షి ప్రతినిధి, గుంటూరు : వెంటిలేటర్పై ఉన్న పసికందును ఎలుకలు పీక్కుతిన్నాయి.. బతికున్న పసికందు చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారిస్తే శ్మశానం వద్ద కదలాడినట్లు గమనించి కుటుంబ సభ్యులు వెనక్కు తెచ్చారు. డబ్బు కోసం బిడ్డల్ని మార్చారంటూ ఆరోపణలు.. బాలింత చనిపోతే పది గంటల వరకూ చూడనేలేదు.. స్కానింగ్ కోసం వెళ్లిన గర్భిణి అక్కడ వైద్యులు లేక గంటలకొద్దీ నిరీక్షించి స్కానింగ్ కేంద్రం వద్దే కిందపడిపోయి అక్కడే ప్రసవించిన హృదయ విదారకమైన ఘటన.. ఆ నెత్తుటి మరకలను గర్భిణి తల్లితోనే తుడిపించిన దారుణం.. బతికుండగానే స్ట్రెచర్ సహా ఓ వృద్ధుడిని బయటకు గెంటేసిన వైనం.. సూదిమందు డ్యూటీ తమది కాదంటే తమది కాదంటూ వైద్యులు, స్టాఫ్ నర్సులు ఓ రోజంతా రోగికి ఇంజెక్షన్ ఇవ్వని ఘటన.. ఇవన్నీ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గుంటూరు జీజీహెచ్లో జరిగిన ఘటనలు. మళ్లీ చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చాక ఆ నిర్లక్ష్యం మరింత పెరిగింది. అత్యవసర వేళ వెటకారం తాజాగా ఈ నెల ఒకటో తేదీన తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన చీకటి గోపి(30) తీవ్ర అస్వస్థతతో అత్యవసర విభాగంలో చేరాడు. ఆక్సిజన్ అందక ఇబ్బంది పడుతున్నాడంటూ బంధువులు ఎంత వేడుకున్నా అక్కడి వైద్య సిబ్బంది చలించలేదు. పైగా ‘ఎవరి ఆక్సిజన్ మాస్క్ అయినా పీక్కుని వచ్చి మాకు ఇవ్వండి.. పెడతామంటూ’ వెటకారంగా మాట్లాడారు. కొద్ది సేపటికే ఊపిరి అందక గోపి మృతి చెందాడు. మానవత్వానికే మచ్చ తెచ్చేలా ఉన్న ఇలాంటి దారుణ ఘటనలు నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని నగరంగా ఉన్న గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జీజీహెచ్)లో కోకొల్లలు. ఎంతో కీలక ఆసుపత్రి జీజీహెచ్కు గుంటూరుతో పాటు చుట్టుపక్కలనున్న ఆరు జిల్లాల ప్రజలు వైద్యం కోసం వస్తారు. రోజుకు దాదాపు 3,500 నుంచి 4 వేల మంది వరకు అవుట్ పేషెంట్లు వచ్చి వైద్యుల వద్ద పరీక్షలు చేయించుకుని వెళ్తుంటారు. ఆస్పత్రిలోని వివిధ వార్డుల్లోకి రోగులు, వారి వెంట సహాయకులు కలిపి మొత్తం రోజుకు 10 వేల మంది వస్తుంటారు. ఇటీవల ఆస్పత్రి వైద్యులు, వారు అందజేస్తున్న వైద్య సేవలపై ఉన్నతాధికారులకు భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. సాక్షాత్తు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ గిరిజవోలు దుర్గాప్రసాద్ వారంలో రెండు రోజులు సెలవులు పెట్టి మరీ హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్కు పరుగులు పెడుతున్నారు. సీఎస్ఆర్ఎం వెంకటేశ్వరరావు సైతం రాత్రివేళ అందుబాటులో ఉండకుండా వెళ్లిపోతున్నారు. కీలక పోస్టుల్లో ఉన్న ఇద్దరు అధికారులు సక్రమంగా అందుబాటులో ఉండకపోవడంతో మిగతా వారు కూడా దీన్ని ఆసరాగా తీసుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. గాల్లో కలుస్తున్న ప్రాణాలు జీజీహెచ్లో గత తొమ్మిది నెలలుగా నమోదవుతున్న మరణాల రేటును పరిశీలిస్తే.. గుండెలు పగిలే నిజాలు వెలుగులోకొచ్చాయి. జీజీహెచ్లో 2024లో 7,846 మంది మృతి చెందినట్లు అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది. 2025లో 6,529 మంది చనిపోయారు. 2026లో సైతం వారానికి వంద మంది చొప్పున మృత్యువాత పడుతున్న దయనీయ పరిస్థితి. ఇంకా ఇక్కడ సరైన వైద్యం అందక వేరే ఆసుపత్రులకు తరలిస్తున్న సమయంలో జరిగిన మరణాలు చాలానే ఉన్నాయి. తీరు మార్చుకోని అఽధికారులు ఆస్పత్రిలో అత్యవసర వైద్యచికిత్సల తీరును నిత్యం పర్యవేక్షించాల్సిన సీఎస్ఆర్ఎంఓ, సూపరింటెండెంట్లు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగాన్ని వైఎస్సార్ సీపీ హయాంలో నూతనంగా ప్రారంభించారు. అయితే ఎమెర్జెన్సీ వైద్యులు సరిగా డ్యూటీలు చేయకుండా సొంత ప్రాక్టీసు చేసుకుంటూ ఈ విభాగాన్ని గాలికొదిలేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో అత్యవసర వార్డుల్లోనే మరణాల సంఖ్య అధికంగా నమోదవుతోంది. ఇంత జరుగుతున్నా వైద్యులు మాత్రం తీరు మార్చుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీజీహెచ్ సూపరింటెండెంట్ పోస్టును సీనియర్లకు ఇవ్వకుండా రాజకీయ ఒత్తిళ్లతో తమకు ఇష్టమొచ్చిన వారికి ఇవ్వడంతో సీనియర్ వైద్యులెవరూ వారి మాట లెక్కచేయని పరిస్థితి. ఇన్చార్జులు కావడంతో వారు సైతం వైద్యులు, సిబ్బందిపై సీరియస్గా దృష్టి సారించలేకపోతున్నారు. దీంతో జీజీహెచ్లో మరణాల సంఖ్య తగ్గడం లేదు. అధికారికంగా 1,250 ... అనధికారికంగా మరో వెయ్యికిపైగా పడకలతో అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రిగా పేరొందిన గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి పరిస్థితి ఊరు గొప్ప పేరు దిబ్బలా తయారైంది. అత్యవసర వైద్యసేవలు పొందాలంటే రోగులకు కష్టంగా ఉంది. ఫలితంగా, ఈ ఆసుపత్రిలో మరణాల రేటు రోజురోజుకూ పెరుగుతోంది. వైద్య ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆస్పత్రిలో అందుబాటులో ఉండటం లేదు. ప్రైవేటు క్లినిక్లకు కేటాయిస్తున్న సమయం ప్రభుత్వ ఆసుపత్రిలో విధులకు ఇవ్వడం లేదు. ప్రధానంగా క్యాజువాల్టీ, ట్రామాకేర్, ఐసీయూ, ఇతర ఎమెర్జెన్సీ వార్డులు, గైనిక్, పిల్లల వార్డుల్లో రోగులకు సకాలంలో వైద్యసేవలందక మరణాలు పెరుగుతున్నాయి. కొందరు వైద్యాధికారుల తప్పిదాల కారణంగా ఆస్పత్రి మొత్తానికి చెడ్డపేరు వస్తోంది. -
నృసింహుని ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు
మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారికి సామూహిక వరలక్ష్మీ వ్రతాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మంగళగిరి పట్టణంతోపాటు పరిసర ప్రాంతాల నుంచి మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి వ్రతంలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా భక్తులు సాంప్రదాయబద్ధంగా పూజా సామాగ్రితో హాజరై అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించారు. దేవస్థాన ప్రధాన అర్చకులు అనంత పద్మనాభాచార్యులు, మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు ఆధ్వర్యంలో అర్చక బృందం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి వరలక్ష్మీదేవికి ప్రత్యేక అలంకరణ చేశారు. పుష్పాలు, పసుపు, కుంకుమ తదితర సామాగ్రితో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్కుమార్ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ మంగళగిరి టౌన్: నేటి యువతరం క్రీడలను జీవితంలో భాగంగా చేసుకోవాలని ఐజీపీ, ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ పేర్కొన్నారు. మంగళగిరి పట్టణంలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్లో నిర్వహించిన ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2026 ముగింపు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. రవికృష్ణ మాట్లాడుతూ వివిధ క్రీడాంశాల్లో ప్రతిభ కనబర్చి ఎనిమిది పతకాలు సాధించానని తెలిపారు. టేబుల్ టెన్నిస్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, షటిల్ బ్యాడ్మింటన్, స్విమ్మింగ్లో పతకాలు సాధించి ఆల్రౌండర్గా నిలిచినట్లు పేర్కొన్నారు. ఈగల్ టీం టేబుల్ టెన్నిస్లో 40 ఫ్లస్ సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్లో రజత పతకాలు, 50 ఫ్లస్ సింగిల్స్, 50 ఫ్లస్ మెన్స్ డబుల్స్లో కాంస్య పతకాలు సాధించారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో రజత పతకం, షటిల్ బ్యాడ్మింటన్లో 50 ఫ్లస్ మెన్స్ డబుల్స్లో స్వర్ణం, మిక్స్డ్ డబుల్స్లో రజతం, స్విమ్మింగ్లో 25 మీటర్ల బ్రెస్ట్స్ట్రోక్లో స్వర్ణ పతకం సాధించారని వెల్లడించారు. ఈగల్ విభాగం మొత్తంగా 40 పతకాలు సాధించడం విశేషమని పేర్కొన్నారు. యువత డ్రగ్స్కు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన, క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. మచిలీపట్నం–తిరుచానూరు మధ్య ప్రత్యేక రైళ్లు రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): రైళ్లలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా మచిలీపట్నం – తిరుచానూరు మధ్య వారానికి రెండు రోజులు నడిచేలా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే అధికారులు శుక్రవారం ప్రకటించారు. మచిలీపట్నం – తిరుచానూరు (07440) ప్రత్యేక రైలు ఈ నెల 11, 12, 18, 19 తేదీలలో సాయంత్రం 4.55 గంటలకు మచిలీపట్నంలో బయలుదేరి, మరుసటి రోజు తెల్లవారు జామున 2 గంటలకు తిరుచానూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07439) ఈ నెల 12, 13, 19, 20 తేదీలలో తెల్లవారు జామున 3.30 గంటలకు తిరుచానూరులో బయలుదేరుతుంది. అదేరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. రెండు మార్గాలలో ఈ రైళ్లు గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి. -
నీటి ప్రవాహం మృత్యుపాశమై..
సంగం: ఆ యువకుడు పొట్టకూటి కోసం వచ్చాడు. ఈ క్రమంలో సరదాగా కాలువలో స్నానానికి దిగాడు. కానీ నీటి ప్రవాహం రూపంలో మృత్యువు కబళించింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. గుంటూరుకు చెందిన మోహన్ (30), ఇబ్రహీం నేమ్బోర్డులు బిగించే పనుల నిమిత్తం వచ్చారు. పనులు ముగించుకుని తిరిగెళ్తూ శుక్రవారం సంగం కావలి కాలువ వద్ద స్నానానికి దిగారు. కొద్దిసేపటికే మోహన్ నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. అప్రమత్తమైన ఇబ్రహీం ఈత కొట్టి ఒడ్డుకు చేరుకున్నాడు. మోహన్ మాత్రం నీటిలో కొట్టుకుపోయి కనిపించలేదు. సమాచారం అందుకున్న ఎస్సై భోజ్యానాయక్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఎంత వెతికినా మోహన్ ఆచూకీ లభించలేదు. చివరకు గల్లంతైన ప్రాంతానికి సమీపంలోనే అతని మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం తరలించారు. -
రైతులకు కన్నీటి కష్టాలు
ఏటా ఈ సీజన్లో పొలాలను దమ్ముచేసి నాట్లు వేసుకునే పనిలో నిమగ్నమయ్యే అన్నదాతలు ఈ ఏడాది డీజిల్ ఇంజిన్లు ఉన్న వ్యక్తుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రతి ఏడాది పొలం ఈనే తరుణంలో, గింజ పాలు పోసుకునే దశలో నీటి ఎద్దడి ఏర్పడేది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా అన్నదాతలకు ఆదిలోనే అగచాట్లు ప్రారంభమయ్యాయి. కాలువలకు సాగునీరు రాకపోవడంతో పొలాలను తడిపేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాపట్ల: ప్రతి ఏడాది జూన్, జూలై మాసంలోనే నాట్లు వేసుకునే అన్నదాతలు ఈ ఏడాది సెప్టెంబర్ మాసం వచ్చినప్పటికీ కాలువలకు చుక్కనీరు రాకపోవడంతో నిరాశలో కూరుకుపోయారు. ఏటా జూలై ముగిసేంతవరకు వర్షపాతం సరిపడా నమోదై ఉండేది. అలాంటిది సెప్టెంబర్ వచ్చినా కనీస వర్షపాతం నమోదు కాకపోవడంతో రైతులు భగీరథ యత్నాలు చేస్తున్నారు. మండలంలోని న్యూ ముత్తాయపాలెం చానల్, పడమర బాపట్ల చానల్, పీటీ చానల్ పరిధిలోని పిన్నిబోయినవారిపాలెం బ్రాంచ్ కాలువలకు సాగునీరు విడుదల కాలేదు. దీంతో ఆ పరిధిలోని పిన్నిబోయినవారిపాలెం, వల్లువారిపాలెం, మచ్చావారిపాలెం, చింతావారిపాలెం, ముత్తాయపాలెం, ఇమ్మడిశెట్టివారిపాలెం, మద్దిబోయినవారి పాలెం, కొత్తమద్దిబోయినవారిపాలెం గ్రామాల్లోని రైతులు పొలాలను బీడులుగా వదిలిపెట్టడం ఇష్టంలేక డీజిల్ ఇంజిన్లను ఆశ్రయించి పొలాలను తడిపి నాట్లు వేస్తున్నారు. ఎండతీవ్రత ఎక్కువగా ఉండటంతో రోజంతా కష్టపడినా ఎకరం పొలం కూడా తడవడం లేదు. రోజుకు ఇంజిన్కు రూ. వెయ్యి, డీజిల్కు రూ.500, పైపుల అద్దెకు రూ. 500 చొప్పున ఎకరం తడిపేందుకు అదనంగా రూ. 2,000 భరించాల్సి వస్తోంది. నాటుకు ఎకరాకు రూ. వెయ్యి చొప్పున కూలీలు పెంచారు. ఆయా గ్రామాల్లోని రైతులు సుమారు 50 ఎకరాలు బీడు భూములుగా వదిలేశారు. నగరం: పంట కాలువలో ఆశించిన స్థాయిలో సాగునీరు లేకపోవడంతో పాటు తీవ్ర వర్షాభావ పరిస్థితులు వెంటాడుతుండటంతో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రత్యేకంగా బోర్లను సైతం వేస్తున్నారు. ఒక్కో బోరు, విద్యుత్ మోటార్లు, ట్యూబులకు సుమారు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేసి నీటిని పెడుతున్నారు. దీంతో రైతులపై అదనపు భారం పడుతోంది. పంట కాలువల్లో ఉన్న అరకొర నీటిని డీజిల్ ఇంజిన్లు, ట్రాక్టర్లకు ఇంజిన్లు ఏర్పాటు చేసి పైపుల సహాయంతో పెడుతున్నారు. ఇలా ఎకరాకు ఒకసారి నీరు తడిపేందుకు సుమారు రూ.2 వేలకుపైగా ఖర్చు చేస్తున్నారు. -
ఎస్టీయూ కార్యాలయం ఉద్యమ కేంద్రం
మంగళగిరి టౌన్: ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం, ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం కోసం ఎస్టీయూ నిరంతరం పోరాటాలు కొనసాగిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. మంగళగిరి మండలం ఎర్రబాలెంలో ఎస్టీయూ–ఏపీ రాష్ట్ర నూతన కార్యాలయ భవన నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన నిర్వహించారు. ఈశ్వరయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను కేవలం సంఘపరమైన అంశాలుగా కాకుండా విద్యారంగ అభివృద్ధికి సంబంధించిన అంశాలుగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. నూతన కార్యాలయం ఉపాధ్యాయులకు అందుబాటులో ఉండి, సమస్యలపై చర్చించి పరిష్కార మార్గాలను అన్వేషించే వేదికగా నిలవాలని ఆకాంక్షించారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల హక్కుల సాధన, విద్యారంగ పరిరక్షణ కోసం ఎస్టీయూ ఎన్నో ఏళ్లుగా చేస్తున్న పోరాటాలు ప్రశంసనీయమన్నారు. మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఎస్టీయూ నిర్వహించిన ఉద్యమాలు స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో ఎస్టీయూ– ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు మల్లు రఘునాథరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎల్. సాయిశ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ, ఏఐఎస్టీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ కత్తి నరసింహారెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి జి.సదానందం గౌడ్, జాతీయ ఆర్థిక కార్యదర్శి సి.హెచ్.జోసెఫ్ సుధీర్బాబు, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె.కోటేశ్వరరావు, ఉపాధ్యాయ వాణి కన్వీనర్ కె.వి.శేఖర్, మాజీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షణ్ముర్తి, గాజుల నాగేశ్వరరావు, తిమ్మన్న, రమేష్ పాల్గొన్నారు. -
రిమాండ్ ఖైదీకి సకల సౌకర్యాలు
సాక్షి ప్రతినిధి నెల్లూరు: అధికారం మత్తులో టీడీపీ నేత ఏకంగా పోలీస్స్టేషన్పైనే దాడికి తెగబడి.. అడ్డుకున్న సీఐను కులం పేరుతో దూషించిన కేసులో నిందితుడిని న్యాయస్థానం రిమాండ్కు ఆదేశించింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనారోగ్యం పేరుతో పెద్దాస్పత్రిలోని వార్డులో రిసార్ట్స్ వసతులు కల్పించుకుని, సకల భోగాలు అనుభవిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. ఈ నిందితుడికి కల్పిస్తున్న వసతులు బయటకు రాకూడదనే ఏకంగా పెద్దాస్పత్రిలోని ఒక వార్డును ఖాళీ చేయించారు. ఇద్దరు కానిస్టేబుళ్లను సెక్యూరిటీ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. వివరాలు ఇలా ఉన్నాయి.. బాపట్ల జిల్లా చుండూరుకు చెందిన టీడీపీ నేత జి.బాలకోటిరెడ్డి చుండూరు పోలీసుస్టేషన్పై దాడి చేసి అక్కడి సీఐను కులం పేరుతో దూషించిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. గత నెల 23న పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను నెల్లూరులోని జిల్లా కేంద్ర కారాగారానికి తరలించారు. అరెస్ట్, రిమాండ్, జైలుకు తరలింపు వరకు నిబంధనల ప్రకారమే జరిగినా.. మూడు రోజులకే 26వ తేదీ నుంచి చర్మ వ్యాధి పేరుతో నెల్లూరు జీజీహెచ్లో చేరాడు. జైల్లోనే చికిత్స అందించాల్సి ఉన్నా.. సాధారణంగా రిమాండ్ లేదా శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు అనారోగ్యానికి గురైతే జైల్లో వైద్యుల పర్యవేక్షణలో అక్కడే ప్రత్యేక వార్డులో చికిత్స అందించడం సాధారణ ప్రక్రియ. తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో మాత్రమే మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ప్రధానాస్పత్రులకు తరలించి అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రిజనర్స్ వార్డులో చికిత్స అందించాలి. ఇందుకు భిన్నంగా ప్రత్యేక గది ఏర్పాటు చేసి, ఆయన కోసం ఒక నర్సుకు, ఇద్దరు కానిస్టేబుళ్లకు డ్యూటీలు వేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరి ప్రత్యేక గది ఎలా? అయితే సాధారణ చర్మ వ్యాధి పేరుతో జీజీహెచ్కు తరలించడంలో జైలు అధికారులపై అధికార పార్టీ నేతల ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. బాలకోటిరెడ్డిని ప్రిజనర్స్ వార్డులో కాకుండా ఆస్పత్రిలోని ప్రత్యేక గదిలో ఉంచారనే ఆరోపణలున్నాయి. సాధారణ ఖైదీలకు ఒక నిబంధన, రాజకీయ పలుకుబడి కలిగిన వారికి మరో నిబంధనా? అనే చర్చ మొదలైంది. వాస్తవానికి అతనికి ఎలాంటి వ్యాధులు లేవని తెలుస్తోంది. అరెస్ట్ చేసినప్పుడే నిందితుడికి వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరుపరుస్తారు. అయితే రిమాండ్కు తరలించిన మూడు రోజుల్లోనే చర్మ వ్యాధి ప్రాణాంతకం కాకపోయినా.. ప్రత్యేక వైద్యం పేరుతో ఆస్పత్రిలో చేరడంపైనే విమర్వలు వినిపిస్తున్నాయి. న్యాయస్థానం అనుమతి లేకుండానే.. నిబంధనల ప్రకారం ఖైదీని పేరూమ్స్ లేదా ప్రత్యేక గదిలో ఉంచాలంటే న్యాయస్థానం నుంచి ప్రత్యేక అనుమతి అవసరమని సంబంధిత న్యాయవర్గాలు చెబుతున్నాయి. అయితే బాలకోటిరెడ్డికి అలాంటి అనుమతి లేకుండానే ఇలా ప్రత్యేక వైద్యం పేరుతో ప్రత్యేక గదిలో పెట్టి రిసార్ట్స్ తరహాలో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో కోర్టు ఉత్తర్వులు లేకుండా జైలు అధికారులు ఏ అధికారాలతో ప్రత్యేక వసతులు కల్పించారో చెప్పాలని డిమాండ్ వినిపిస్తోంది. కోర్టు నుంచి అనుమతులు లేకుండానే తనకున్న రాజకీయ పరపతిని ఉపయోగించుకుని ప్రత్యేక గదిలో ఉంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని వెనుక ఎవరి ప్రమేయం ఉందన్న ప్రశ్న తలెత్తుతోంది. -
ప్రత్యేక సమగ్ర సవరణ జాబితాలో ఓటర్ల పరిశీలన
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ బాపట్ల: ప్రత్యేక సమగ్ర సవరణ జాబితాలో ఓటర్ల పరిశీలన, అభ్యంతరాలపై దరఖాస్తుల స్వీకరణ, పరిష్కార ప్రక్రియ గడువు ఈనెల 10వ తేదీ వరకు ఎన్నికల కమిషన్ పొడిగించిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ పేర్కొన్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ తుది జాబితాను అక్టోబర్ 9వ తేదీన ముద్రిస్తామని కలెక్టర్ తెలిపారు. ఆ మేరకు ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను జారీ చేసిందన్నారు. అభ్యంతరాలపై దరఖాస్తుల పరిశీలన, పరిష్కరించే ప్రక్రియ గడువు ముగిసినప్పటికీ ఈనెల 10వ తేదీ వరకు ఎన్నికల కమిషన్ పొడిగించిందన్నారు. అలాగే నోటీసులు జారీ చేసిన తదుపరి అభ్యంతరాలపై ఓటర్ల నుంచి ఈనెల 5వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించడానికి ఎన్నికల కమిషన్ అనుమతించిందన్నారు. ఓటర్లు గుర్తించి తక్షణమే దరఖాస్తులను సదరు అధికారులకు అందించాలన్నారు. గడువు పొడిగించిన నేపథ్యంలో ఈనెల ఐదు, ఆరు తేదీలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఓటర్లు ఈ విషయాలను గుర్తించి సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఓట్లను వేగంగా పరిశీలించుకోవాలి ప్రత్యేక సమగ్ర సవరణ జాబితా కోసం ఓట్లపై నమోదైన దరఖాస్తులను వేగంగా పరిశీలిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో తొమ్మిది లక్షల మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు ఆరు లక్షలకు పైగా ఓటర్లను సమగ్రంగా పరిశీలించి, తుది జాబితాలో ముద్రణకు సిద్ధం చేశామన్నారు. మిగిలిన రెండున్నర లక్షల మంది ఓటర్ల వివరాల పరిశీలన ప్రక్రియ సాగుతుందన్నారు. ప్రస్తుతం ఫారం–6 కింద నమోదైన 5,287 దరఖాస్తులు, ఫారం–7 కింద నమోదైన 63 దరఖాస్తులు, ఫారం–8 కింద నమోదైన 3,583 దరఖాస్తులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయన్నారు. అదనంగా ఏఈఆర్ఓలను నియమించడం ద్వారా ఓటర్ల దరఖాస్తులు పరిశీలన, విచారణ ప్రక్రియ వేగంగా సాగుతుందన్నారు. తాజాగా పొడిగించిన గడువులోగా ఓటర్ల పరిశీలన, పరిష్కార ప్రక్రియ ముగిస్తామని తెలిపారు. -
రేపు జిల్లాస్థాయి గురుపూజోత్సవం
80 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కార ప్రదానోత్సవం గుంటూరు ఎడ్యుకేషన్: మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా శనివారం ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టరేట్లోని శంకరన్ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి గురుపూజోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న 80 మంది ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. వీరిలో ఇద్దరు ప్రిన్సిపాల్స్, ఇద్దరు హెచ్ఎంలు, స్కూల్ అసెస్టెంట్ కేటగిరీలో 32 మంది, ఎస్జీటీలు 44 మందిని ఎంపిక చేశామని తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న వారందరూ శనివారం ఉదయం 8.00 గంటలకు హాజరు కావాలని సూచించారు. కొనసాగుతున్న సీనియర్ వైద్యుల నిరసన గుంటూరు మెడికల్: గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ఏపీ ఆధ్వర్యంలో ఆగస్టు 19 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా గుంటూరు మెడికల్ కాలేజ్, ప్రొఫెసర్లు గురువారం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ధర్నా చేపట్టారు. అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ డాక్టర్ టి.స్వరూప్కాంత్ మాట్లాడుతూ 2016 నుంచి రావాల్సిన జీతం బకాయిలు చెల్లించాలని, 2026 జనవరి నుంచి ఇవ్వాల్సిన 8వ యూజీసీ వేతనాల సవరణ, ఇతర డిగ్రీ కాలేజ్ బోధకులకు ఇచ్చినట్లే, యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరు జీజీహెచ్ అధ్యక్షుడు డాక్టర్ బి.దేవకుమార్, యూనియన్ నేతలు రాజాకుమార్, శివరామ్, ఉషారాణి, కమల, సునీత, శ్రీదేవి, వినయ్, రవీంద్ర, శివగోపాల్, గాజుల రామకృష్ణ, టి.వి.శివరామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ డ్రామాయాజాలం
రేపల్లె: డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో చోటుచేసుకున్న అవకతవకలపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు మిన్నంటుతున్న వేళ అసలు అంశంపై సమాధానం చెప్పాల్సిన టీడీపీ ప్రభుత్వం మాత్రం రాజకీయ నాటకాలతో ప్రజల దృష్టిని మరల్చే యత్నం చేస్తోంది. నిజమైన అర్హత కలిగిన అభ్యర్థులకు జరిగిన అన్యాయంపై స్పష్టత ఇవ్వాల్సిన ప్రభుత్వం స్కిట్ల రూపంలో ప్రచార హంగామాకు దిగడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక జనరల్ కోటాలో ఎంపికై న అభ్యర్థులను రంగంలోకి దించిన టీడీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పించే ప్రయత్నం జరుగుతోందని రాజకీయ వర్గాలు మండిపడుతున్నాయి. అసలు వివాదం స్పోర్ట్స్ కోటానే కదా! అసలు వివాదం స్పోర్ట్స్ కోటా చుట్టూనే తిరుగుతుండగా పరీక్షల ప్రక్రియ లేకుండానే స్కూల్ గేమ్స్, కాలేజీ గేమ్స్, బ్రిడ్జ్ గేమ్స్ వంటి సర్టిఫికెట్ల ఆధారంగా ఉద్యోగాలు ఎలా కేటాయించారో వెల్లడించాలన్న డిమాండ్లు ప్రజల్లో రోజురోజుకీ ఉధృతమవుతున్నాయి. కష్టపడి చదివి, పరీక్షలు రాసి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులపై ఎలాంటి విమర్శలు లేవని, అలాంటి వారిని కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం దారుణమని విద్యావేత్తలు మండిపడుతున్నారు. అర్హత ఉన్నవారిని కవచంగా పెట్టి అక్రమాలను కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. ప్రజా సమస్యలపై సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం స్కిట్లు, స్టేజ్ షోలు, ప్రచార డ్రామాలతో నిజాలను దాచిపెట్టాలని చూస్తోందన్న విమర్శలు మరింత తీవ్రతరం అవుతున్నాయి. స్కిట్లు వేసి సత్యాన్ని దాచగలమా అనే ప్రశ్న ఇప్పుడు సామాన్య ప్రజల నోట వినిపిస్తోంది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే స్పోట్స్ కోటాలో ఎలాంటి పరీక్షలు లేకుండానే ఉద్యోగాలు పొందిన వారి పూర్తి వివరాలు బహిర్గతం చేయాలని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేకపోతే ఈ వ్యవహారం ప్రభుత్వంపై మరింత మచ్చగా మిగిలిపోతుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రేపల్లె శాసనసభ్యుడు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్వయంగా స్కిట్లకు ప్రోత్సాహం ఇవ్వడం ప్రజల్లో వ్యంగ్యానికి కారణమైంది. సమస్యల నుంచి తప్పించుకోవడానికి స్కిట్ల రాజకీయమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. డీఎస్సీ జనరల్ కోటాలో ఎంపికై న టీచర్ అభ్యర్థులను రేపల్లె పట్టణంలో ఇటీవల అనగాని సత్యప్రసాద్ స్వయంగా కలసి కూటమి ప్రభుత్వాన్ని పొగిడిస్తూ చేసిన స్కిట్లు ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమస్యల నుంచి తప్పించుకోవడానికి స్కిట్ల రాజకీయమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా సాల్మన్ ఎంపిక
చీరాల: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు చీరాల ఎన్ఆర్పీఎం హైస్కూల్లో ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్న బేతాళ సాల్మన్ ఎంపికయ్యారు. పట్టణంలోని పేరాలకు చెందిన బేతాళ సాల్మన్ 1990 సంవత్సరంలో స్కూల్ అసిస్టెంట్గా పేరాలలోని ఆంధ్రరత్న మున్సిపల్ హైస్కూల్లో చేరారు. విద్యాబుద్ధులు నేర్చుకున్న పాఠశాలలోనే ఉపాధ్యాయుడిగా అడుగుపెట్టి 29 సంవత్సరాల పాటు గణిత ఉపాధ్యాయుడిగా పని చేశారు. అనంతరం ఆరు సంవత్సరాల పాటు ప్రధానోపాధ్యాయుడిగా అదే పాఠశాలలో పనిచేశారు. ప్రస్తుతం చీరాలలోని ఎన్ఆర్పీఎం హైస్కూల్లో ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. 36 సంవత్సరాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఆయన ఉద్యోగంలో చేరిన ఎనిమిది సంవత్సరాల్లోనే అంటే 1998లో జిల్లా ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. చదువుకున్న పాఠశాలలోనే ఉపాధ్యాయుడిగా అవకాశం రావడం, అదే పాఠశాలలో 35 సంవత్సరాల పాటు పనిచేశారు. 112 సంవత్సరాల చరిత్ర ఉన్న చీరాల ఎన్ఆర్పీఎం హైస్కూల్లో ప్రధానోపాధ్యాయుడిగా పాఠశాలకు అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశారు. పాఠశాలను అందంగా తీర్చిదిద్దడంతో పాటు పదో తరగతి ఫలితాల్లోనూ మంచి మార్కులు సాధించేలా విద్యార్థులకు తర్ఫీదు ఇచ్చారు. ఎంతో మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పడం అదృష్టంగా భావిస్తున్నానని, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందని అయన అన్నారు. అలానే ఎన్సీసీలోనూ ప్రతిభను చాటారు. ఎన్సీసీ బెస్ట్ ఆఫీసర్గా అవార్డులు అందుకోవడంతో పాటు ఎంతో మంది విద్యార్థులను ఎన్సీసీ పరేడ్లకు పంపి వారికి ఉన్నత భవిష్యత్తును అందించారు. ఎన్సీసీలో అందించిన సేవలకు గాను ఆయనకు ఎయిర్ గన్ రైఫిల్ను ఎన్సీసీ ఉన్నతాధికారులు అందించడం విశేషం. బేతాళ సాల్మన్ను పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు. -
నిర్లక్ష్యం ఖరీదు..!
బాలిక మిస్సింగ్ ఉదంతంలో పోలీసుల నిర్లక్ష్య వైఖరి సాక్షిప్రతినిధి, గుంటూరు: తమ చిన్నారిని రక్షించాల్సిన పోలీసులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆ తండ్రి మూడు నెలలుగా అధికారులు, అధికారపార్టీ నాయకులు అందరి చుట్టూ కాళ్లరిగేలా తిరిగి కూతురి ఆచూకీ కోసం హైకోర్టు మెట్లు ఎక్కిన సంఘటన అందరికీ తెలిసిందే. ప్రజల మాన, ధన, ప్రాణాలను కాపాడాల్సిన పోలీసులు ఆ బాధ్యతను మరిచిపోయి అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతూ ప్రతిపక్ష పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి వేధించడం, సోషల్ మీడియా పోస్టులు పెట్టినవారిపై అత్యుత్సాహం చూపి అరెస్టు చేయడం వంటి వాటికి పరిమితమై పోయారు. లా అండ్ ఆర్డర్ గాలికొదిలేశారు. రక్షక భటులే భక్షకులుగా మారి జనాన్ని పీక్కుతింటూ పోలీసు శాఖ ప్రతిష్టను కొందరు అవినీతి ఖాకీలు దిగజారస్తున్నారు. గుంటూరు నగరంలో జరిగిన సంఘటనపై హైకోర్టు సీరియస్గా స్పందించి పోలీసులను చీవాట్లు పెట్టడంతో ఇప్పుడు హడావుడిగా సిట్ ఏర్పాటు చేసి వెతుకులాట ప్రారంభించారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... మూడు నెలలు దాటుతున్నా ఆచూకీ లేదు గుంటూరు నగరానికి చెందిన పదో తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలిక జూన్ 9వ తేదీన ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తండ్రి అదే రోజు సాయంత్రం నగరంలోని పట్టాభిపురం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు అనగా జూన్ 10వ తేదీన కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాలికను గంజాయి తాగే ఓ యువకుడు (22 ఏళ్లు) కిడ్నాప్ చేశాడనే విషయం బయట పడడంతో తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. కిడ్నాపర్ నెల్లూరు మొబైల్ షాపులో మొబైల్ కొన్నట్లు సీసీ టీవీ ఫుటేజీలో గమనించిన తండ్రి అతని మొబైల్ ఈఎంఐ నంబరుతో సహా పోలీసులకు అందించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి వదిలేశారు.. మైనర్ బాలికను గంజాయి తాగుతూ కత్తి పెట్టుకుని తిరిగే ఓ జులాయి కిడ్నాప్ చేశాడని జూన్ నెల 11వ తేదీన పోలీసులకు తెలిసినప్పటికీ మిస్సింగ్ కేసుగానే ఉంచి దర్యాప్తు చేశారే తప్ప, కనీసం కిడ్నాప్, పోక్సో చట్టం కింద సెక్షన్లు మార్పు చేయని పరిస్థితి. మైనర్ బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన నిందితుడు షేక్ జాన్ సైదా అలియాస్ రబ్బానీ అలియాస్ పండుగా పోలీసులు గుర్తించారు. అతనికి ఇన్స్ర్ట్రాగామ్లో 300 నుంచి 400 మంది వరకు కాంటాక్ట్ ఉన్నట్లు గుర్తించారు. వీరిలో కొందరిని పిలిచి విచారించిన పోలీసులు ఆతరువాత ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో చేతులెత్తేశారు. పోలీసులు, బాలిక తండ్రి, వారి బంధువులు కోయంబత్తూరు, పాల్గాడ్, సికింద్రాబాద్ వంటి ప్రాంతాల్లో లాడ్జిల్లో వెతికారు. అయితే వీరి ఆచూకీ ముందుగానే ఎలా తెలుసుకున్నాడో తెలియదు గాని నిందితుడు వీరు అక్కడికి చేరుకునే రోజు లాడ్జిలు ఖాళీచేసి వెళ్లిపోతున్నాడు. అయితే పోలీసుల నిర్లక్ష్యంపై హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడడం, ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ఏం చేయాలో తెలియక హడావుడిగా గురువారం కిడ్నాప్, పోక్సో యాక్ట్ కింద కేసు మార్పు చేసి హైకోర్టుకు నివేదించేందుకు నానా తంటాలు పడ్డారు. పోలీసుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా తీసుకున్న నిందితుడు సికింద్రాబాద్లో ఉండే తన మేనత్త ఫోన్ నుంచి జూలై 13వ తేదీన ఇన్స్ర్ట్రాగామ్ ఓపెన్ చేసి ‘దమ్ముంటే పట్టుకోరా షెకావత్’ అంటూ పోలీసులకు సవాల్ విసిరాడు. అయినా పోలీసుల్లో చలనం లేకపోవడం దారుణమైన విషయం. జూన్ 21వ తేదీన సికింద్రాబాద్లో వెతికిన పోలీసులు ఇక ఆ తరువాత నిందితుడి ఫోన్ ఆన్ చేస్తే తప్ప, తాము ఏమీ చేయలేమని చేతులెత్తేశారు. చిన్న చిన్న సోషల్ మీడియా కేసుల్లో రాష్ట్రాలు దాటి వెళ్లి అమాయకులను అర్ధరాత్రి పూట ఎత్తుకొస్తున్న పోలీసులకు ఓ మైనర్ బాలిక కిడ్నాప్ అయి మూడు నెలలు దాటుతున్నా చలనం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అప్పటి నుంచి మూడు నెలలుగా పోలీసు అధికారులు, అధికార పార్టీ నేతల చుట్టూ తిరిగి విసిగిపోయిన బాలిక తండ్రి చివరకు హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో పోలీసులపై హైకోర్టు సీరియస్ అయిన విషయం అందరికి తెలిసిందే. బాలిక ఇంటి నుంచి వెళుతూ లక్ష రూపాయల నగదు, బంగారం తీసుకెళ్లినట్లు సమాచారం. -
● అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన తాడికొండ పోలీసులు ● కేసు విచారణాధికారిగా మేడికొండూరు సీఐ మధుసూదనరావు
చీకటి గోపి మృతిపై కేసు నమోదు తాడికొండ: తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన చీకటి గోపిని కేసు విచారణలో భాగంగా తాడికొండ పోలీస్స్టేషన్కు తీసుకొచ్చి కొట్టినట్లు ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాడికొండ పోలీస్స్టేషన్లో మంగళవారం రాత్రి కేసు నమోదు చేశారు. కేసు విచారణాధికారిగా మేడికొండూరు సీఐ మధుసూధనరావును నియమించడంతో ఆయన పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం విచారణలో భాగంగా బుధవారం సాయంత్రం ఆయన తాడికొండ పోలీస్స్టేషన్ను సందర్శించారు. ఈ కేసులో పోస్టుమార్టం నివేదిక అనంతరం మృతుడి ఒంటిపై ఉన్న గాయాలకు కారణాలు ఏంటి అనే విషయాలు గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే పోలీస్ స్టేషన్లోని సీసీ టీవీ పుటేజీలను స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాగా తెనాలిలో అవినీతి ఆరోపణలు ఎదుక్కొని వీఆర్లో ఉంటూ తాడికొండకు పోస్టింగ్పై వచ్చిన ఓ కానిస్టేబుల్తో పాటు తాడికొండలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న మరో కానిస్టేబుల్ కేసు విచారణలో భాగంగా మృతుడిని కొట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోస్టుమార్టం పూర్తి నివేదిక అంది విచారణ జరిగితే కానీ విషయాలు బయటకు వచ్చే అవకాశం లేదు. పోస్టుమార్టం ప్రక్రియ వీడియో రికార్డింగ్.. గుంటూరు మెడికల్: చోరీ కేసులో విచారణ నిమిత్తం పోలీసు స్టేషన్కు వెళ్లిన తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన చీకటి గోపి గుంటూరు జీజీహెచ్లో మంగళవారం మృతిచెందడంతో కుటుంబ సభ్యులు గుంటూరు జీజీహెచ్లో ఆందోళన చేసిన విషయం విధితమే. పోలీసుల లాఠీ చార్జి వల్లే గోపి చనిపోయాడంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించడంతో బుధవారం గోపి పోస్టుమార్టం ప్రక్రియను వీడియో రికార్డింగ్ ద్వారా పూర్తి చేశారు. కొనసాగుతున్న సీనియర్ వైద్యుల నిరసన గుంటూరు మెడికల్: గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ ఆధ్వర్యంలో ఆగస్టు 19 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా గుంటూరు మెడికల్ కాలేజ్, ప్రొఫెసర్లు బుధవారం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా గుంటూరు మెడికల్ కాలేజీ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ దేవ కుమార్ మాట్లాడుతూ 2016 నుంచి రావాల్సిన జీతం బకాయిలు చెల్లించాలని, 2026 జనవరి నుంచి ఇవ్వాల్సిన 8వ యూజీసీ వేతనాల సవరణ, ఇతర డిగ్రీ కాలేజ్ బోధకులకు ఇచ్చినట్లే, యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ రాజా కుమార్, డాక్టర్ గాజుల రామకృష్ణ, డాక్టర్ స్వరూప్ కాంత్, డాక్టర్ ఉషారాణి, డాక్టర్ కమల రాజేశ్వరి, సునీత పాల్గొన్నారు. -
సత్తా చాటిన క్రీడాకారులకు జేసీ అభినందనలు
గుంటూరు వెస్ట్: అమరావతి చాంపియన్షిప్ రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా చాటిన గుంటూరు జిల్లా క్రీడాకారులను జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అభినందించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పఠాన్ అఫ్రోజ్ ఖాన్ ఆధ్వర్యంలో జేసీని కలిసి పతకాలతోపాటు సాధించిన కప్ను చూపించారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడలను తమ లక్ష్యంగా మార్చుకోవచ్చన్నారు. క్రీడా కోటా కింద ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. అప్రోజ్ ఖాన్కు ఉత్తమ క్రీడాభివృద్ధి అధికారి అవార్డు లభించడం పట్ల జేసి ప్రత్యేకంగా అభినందించారు. అఫ్రోజ్ ఖాన్ మాట్లాడుతూ తిరుపతిలో ఆగస్టు 24 నుంచి 27 వరకు నిర్వహించిన అమరావతి చాంపియన్ రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో గుంటూరు జిల్లా క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పలు విభాగాల్లో విజేతలుగా నిలిచారన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో గుంటూరు జిల్లా క్రీడాకారులు 10 బంగారు పతకాలు, 9 వెండి పతకాలు సాధించారు. బాస్కెట్బాల్ అండర్ – 23 పురుషులు, వాలీబాల్ అండర్ – 23 మహిళల విభాగాల్లో ప్రథమ స్థానాన్ని సాధించి విజేతలుగా నిలిచారన్నారన్నారు. డీఆర్ఓ షేక్ ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాస రావు, బాక్సింగ్ కోచ్ రామిశెట్టి విశ్వనాధ్, క్రీడాకారులు, కోచ్లు పాల్గొన్నారు. -
చేనేత సహకార సంఘాలపై సర్కారు నిర్లక్ష్యం
మంగళగిరి టౌన్: చేనేత సహకార సంఘాల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరితో సహకార రంగం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని, మనుగడ సాగించడమే కష్టంగా మారిందని ఆంధ్రప్రదేశ్ చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ, చేనేత సహకార సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా చేనేత కార్మికులు, నాయకులను సమాయత్తం చేసి తీవ్రస్థాయి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. మంగళగిరి పట్టణంలోని శ్రీ మార్కండేయ కళ్యాణ మండపంలో బుధవారం చేనేత సహకార సంఘాల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘాల సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఎన్నికల ఊసేది? ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, 2013 నుంచి చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల ప్రజాస్వామ్య పాలనకు దూరమయ్యాయని అన్నారు. రాజకీయ పదవులకు కాలపరిమితి పూర్తయిన వెంటనే ఎన్నికలు నిర్వహిస్తున్న విధంగానే సహకార సంఘాలకు కూడా ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గత ఎనిమిదేళ్లుగా చేనేత రంగానికి సంబంధించిన ట్రిఫ్ట్ ఫండ్, యార్న్ సబ్సిడీ, మార్కెట్ ఇన్సెంటివ్, పావలా వడ్డీ, రిబేట్ తదితర ఐదు సంక్షేమ పథకాల కింద సుమారు రూ.203 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఆ నిధులను విడుదల చేసి చేనేత కార్మికులు, సహకార సంఘాలను ఆదుకోవాలని కోరారు. కేడీసీసీ బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన చేనేత సహకార సంఘాలకు సంబంధించిన రూ.46.19 కోట్ల రుణమాఫీ ఫైలు గత ప్రభుత్వ హయాం నుంచి పెండింగ్లో ఉందని, ప్రభుత్వం తక్షణమే ఫైలుకు ఆమోదముద్ర వేసి రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే 1985 హ్యాండ్లూమ్ రిజర్వేషన్ యాక్ట్ ప్రకారం చేనేత రంగానికి రిజర్వు చేసిన వస్తువుల తయారీ, విక్రయాలపై నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కోరారు. ఎన్నికల సమయంలో చేనేత దుస్తులపై జీఎస్టీ రీఇంబర్స్మెంట్ చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయాలని అన్నారు. ప్రభుత్వంలోని వివిధ శాఖలు ఆప్కో నుంచి కొనుగోలు చేసిన వస్త్రాలకు సంబంధించి చెల్లించాల్సిన రూ.97 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేసి ఆప్కోను ఆర్థికంగా బలోపేతం చేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికి పైగా ఉన్న చేనేత సహకార సంఘాల్లో ఇప్పటికే సుమారు 300 సంఘాలు మూతపడ్డాయని, మిగిలిన సంఘాలు కూడా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని నాయకులు తెలిపారు. చేనేత సహకార సంఘాలకు, ఆప్కోకు తక్షణమే ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్య పాలనను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ కోకన్వీనర్లు పిల్లలమర్రి నాగేశ్వరరావు, బండారు ఆనంద ప్రసాద్, పిల్లలమర్రి బాలకృష్ణ, సభ్యులు రామనాథం పూర్ణచంద్రరావు, దామర్ల మోహన్, దొంతంశెట్టి సత్యప్రకాష్, గొట్టుముక్కల బాలాజీ, ఏ. నారాయణ, డోగిపర్తి రామారావు, పచ్చల థామస్, బండారు మస్తాన్, ఉట్ల సాంబశివరావు, వాసు, విజయ్కుమార్, కట్టా హేమసుందర్రావు, జ్ఞాన శంకరరావు, చింత వీరభద్రేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బకాయిలు విడుదల చేయండి -
సమగ్ర దర్యాప్తు చేపట్టాలి
వెల్ఫేర్ బిల్డింగ్ అండ్ ఎస్టేట్ సంస్థపై తాడేపల్లి రూరల్: వెల్ఫేర్ బిల్డింగ్ అండ్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చేతిలో తాము మోసపోయామని ఆరోపిస్తూ, సదరు సంస్థపై సమగ్ర దర్యాప్తు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బాధితులు బుధవారం తాడేపల్లి ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితుల తరఫున నెల్లూరు నుంచి వచ్చిన ఏజెంట్లు మాట్లాడుతూ విశాఖపట్నానికి చెందిన మళ్లా విజయ్ ప్రసాద్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న సంస్థలో తాము కష్టార్జితాన్ని పెట్టుబడిగా పెట్టామని తెలిపారు. మెచ్యూరిటీ గడువు పూర్తయినప్పటికీ చాలామందికి ఒప్పందాల ప్రకారం రావాల్సిన మొత్తాలు, ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థ కార్యకలాపాలు, మెచ్యూరిటీ బకాయిలకు సంబంధించి గతంలో వివిధ రాష్ట్రాల్లో కేసులు నమోదయినట్లు, సంస్థ వ్యవహారాలు కేంద్ర దర్యాప్తు సంస్థల పరిశీలనకు వెళ్లినట్లు తమకు తెలిసిందన్నారు. బెయిల్పై విడుదలైన తర్వాత కూడా సంవత్సరాలు గడుస్తున్నా బాధితుల బకాయిలు చెల్లించలేదని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి సంస్థ వ్యవహారాలపై సమగ్ర, నిష్పాక్షిక దర్యాప్తు చేపట్టాలని కోరారు. సంస్థకు సంబంధించిన ఆస్తుల పూర్తి వివరాలను గుర్తించి, వాటి విక్రయం ద్వారా వచ్చే మొత్తాలను బాధితుల బకాయిల చెల్లింపులకే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బినామీ ఆస్తులపై కూడా విచారణ జరిపి, ఆస్తుల బదిలీలను అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని, బాధితుల క్లెయిమ్ల కోసం ప్రత్యేక హెల్ప్డెస్క్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. మధుసూదనరావు, సుభాషిణి, బిల్లా లక్ష్మి దేవి, నాగేంద్ర కుమార్, ప్రసాద్, పద్మమ్మ, షరీఫ్, శ్రీనివాసులు, సుభాషిణి, లక్ష్మీదేవి, ఎస్.శ్రీనివాసులు, బ్రహ్మయ్య, చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు. ముగిసిన మహిళల క్రికెట్ టోర్నీ పెదకాకాని: వీవీఐటీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎంఎస్కే ప్రసాద్ గ్రౌండ్స్లో మూడు రోజుల పాటు నిర్వహించిన మహిళల క్రికెట్ టోర్నమెంట్ బుధవారం ముగిసింది. ఈ టోర్నమెంట్లో ఆతిథ్య వీవీఐటీయూ జట్టు అత్యుత్తమ ప్రదర్శనతో విజేతగా నిలిచి ట్రోఫీని కై వసం చేసుకుంది. మొత్తం 8 కళాశాలల జట్లు పాల్గొన్న ఈ పోటీలు క్రీడాభిమానులను అలరించాయి. ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ పోరులో వీవీఐటీ వర్సిటీ జట్టు, విష్ణు వర్సిటీ జట్లు తలపడ్డాయి. చివరి వరకు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో వీవీఐటీయూ జట్టు విజయం సాధించగా, విష్ణు విశ్వవిద్యాలయం జట్టు రన్నరప్గా నిలిచింది. పోటీల ముగింపు కార్యక్రమంలో చాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ ముఖ్యఅతిథిగా హాజరై విజేతగా నిలిచిన వీవీఐటీయూ జట్టుకు, రన్నరప్గా నిలిచిన విష్ణు విశ్వవిద్యాలయం జట్టుకు ట్రోఫీలు, మెమొంటోలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. రిజిస్ట్రార్ డాక్టర్ వై.మల్లికార్జునరెడ్డి, అకాడమిక్ డీన్ డాక్టర్ కె.గిరిబాబు, ఫిజికల్ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్.అరుణ్ కుమార్, ప్రకాష్ పాల్గొన్నారు. -
వెళుతున్న బైక్పై నుంచి దూకిన యువకుడు మృతి
గుంటూరు రూరల్: ద్విచక్రవాహనంపై వెళుతూ ద్విచక్రవాహనంపైనుంచి దూకే క్రమంలో యువకుడు మృతి చెందిన సంఘటన నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. సీఐ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం వెంగళాయపాలెం గ్రామానికి చెందిన చల్లా నాగవర్థన్రెడ్డి (25), అదే గ్రామానికి చెందిన మస్తాన్లు ఇద్దరు నల్లపాడులోని ఒక బార్లో మద్యం సేవించారు. అనంతరం గుంటూరువైపు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. ఈ క్రమంలో వాహనం నడుపుతున్న మస్తాన్ వాహనాన్ని అతి వేగంగా నడిపిస్తుండగా వెనుక కూర్చున్న నాగవర్థన్రెడ్డి భయపడి ద్విచక్రవాహనంపై నుంచి ఒక్కసారిగా కిందకు దూకాడు. వేగంగా వెళుతున్న ద్విచక్రవాహనంపై నుంచి దూకటంతో స్పీడుకు తట్టుకోలేక రోడ్డుపక్కనే ఉన్న చెట్టుకు ఢీకొన్నాడు, అక్కడినుంచి పక్కనే ఉన్న పంచర్షాపులోని గాలి సిలెండర్కు ఢీకొన్నాడు. దీంతో తలకు తీవ్రగాయాలై అక్కడిక్కడే మృతి చెందాడు. మస్తాన్ అదేవిధంగా స్పీడు గా వెళుతూ రోడ్డుపక్కన నిలిపి ఉన్న లారీని ఢీకొన్నాడు. మస్తాన్కు గాయాలయ్యాయి. స్థానికులు మస్తాన్ను చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తరలించగా, నాగవర్థన్రెడ్డి మృతదేహాన్ని పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసి మృతుని బంధువులకు సమాచారం అందించి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
ఫార్మసీ విద్యార్థులు కెరీర్పై దృష్టి సారించాలి
● ఏపీ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డెప్యూటీ డైరెక్టర్ అనిల్ కుమార్ ● చలపతిలో 2026–27 విద్యా సంవత్సరానికి ఓరియంటేషన్ గుంటూరు రూరల్: ఫార్మసీ రంగంలో విద్యార్థులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని, ఔషధ నాణ్యత, భద్రత, తయారీ, పంపిణీ నియంత్రణ వ్యవస్థల్లో ఫార్మసిస్టుల పాత్ర అత్యంత కీలకమని ఏపీ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ డైరెక్టర్ కె.అనిల్ కుమార్ పేర్కొన్నారు. నగర శివారుల్లోని లాంలో చలపతి ఫార్మసీ కళాశాలలో బుధవారం 2026–27 విద్యా సంవత్సరానికి బీ ఫార్మసీ, ఫార్మా డీ ఎం.ఫార్మసీ తరగతుల ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఔషధం తయారీ దశ నుంచి రోగికి చేరే వరకు అనేక నాణ్యతా ప్రమాణాలు, నియంత్రణ నిబంధనలు పాటించాల్సి ఉంటుందని, అందువల్ల విద్యార్థులు డ్రగ్ రెగ్యులేషన్, క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అస్యూరెన్స్, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ వంటి అంశాలపై లోతైన అవగాహన పెంచుకోవాలని సూచించారు. గవర్నమెంట్ ఉమెన్న్స్ కాలేజ్ రిటైర్డ్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ బి.వరలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో కళాశాల దశ అత్యంత కీలకమైనదని, ఈ దశలో సంపాదించే జ్ఞానంతో పాటు వ్యక్తిత్వం, ఆలోచనా విధానం విలువలు భవిష్యత్తును నిర్ణయిస్తాయన్నారు. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ డి.లక్ష్మణ్ మాట్లాడుతూ ఫార్మసీ విద్యార్థులు భవిష్యత్తులో ప్రజల ఆరోగ్యంతో నేరుగా సంబంధం కలిగిన బాధ్యతాయుతమైన వత్తిలోకి ప్రవేశించబోతున్నారన్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రీజినల్ ఆఫీస్, గుంటూరు సీనియర్ మేనేజర్ కిరణ్ విక్టర్, చలపతి యూనివర్సిటీ ప్రో–చాన్సలర్ వై.సుజిత్కుమార్, కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ నాదెండ్ల రామారావు మాట్లాడారు. -
బకాయిలు ఇవ్వకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం
తాడికొండ: తమకు రావాల్సిన బకాయిలు ఇవ్వకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేయాల్సి వస్తుందని ఏపీ జేఏసీ అమరావతి యూనిట్ అధ్యక్షుడు బెజ్జం అశోక్ బాబు అన్నారు. బుధవారం అమరావతి యూనిట్ జేఏసీ సమావేశం తాడికొండ రూరల్ హెల్త్ సెంటర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బెజ్జం అశోక్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ఏపీ ఎన్జీవో జేఏసీ పిలుపు మేరకు జిల్లాలోని అన్ని తాలూకా యూనిట్లలో ఉద్యోగుల సమస్యలపై సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో మండల అధ్యక్షుడు దిబ్బయ్య, యూటీఎఫ్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, ఏపీటీఎఫ్ మండల అధ్యక్షుడు గౌస్ తదితరులు పాల్గొన్నారు. రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు తాడికొండ: రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన నెక్కల్లు, తుళ్లూరు, శాఖమూరు, కొండమరాజుపాలెం, లింగాయపాలెం గ్రామాలకు చెందిన రైతులకు బుధవారంరాయపూడిలోని ఏపీ సీఆర్డీఏ కార్యాలయంలో ఈ– లాటరీ విధానం ద్వారా 37 రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించారు. రాజధాని నిర్మాణానికై ఇటీవల భూములు ఇచ్చిన రైతులకు, అలాగే గతంలో ప్లాట్లు పొంది, ఆ ప్లాట్లు వీధి పోటు, కోర్ట్ కేసులు, భూసేకరణ చేయాల్సిన స్థలాలలో ప్లాట్లు పొందిన వారు తెలియజేసిన విజ్ఞప్తులను పరిశీలించి అర్హులైన రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లను ఈ– లాటరీ ద్వారా కేటాయిస్తున్నట్లు సీఆర్డీఏ అధికారులు తెలిపారు. కార్యక్రమానికి హాజరైన రైతుల సమక్షంలో ఆన్లైన్ ర్యాండమ్ సిస్టం ద్వారా నివాస, వాణిజ్య ప్లాట్లకు ముందుగా ట్రైల్ రన్ వేసిన అనంతరం ప్రత్యక్ష లాటరీ ప్రక్రియ చేపట్టారు. రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతులకు సీఆర్డీఏ డైరెక్టర్– ల్యాండ్స్(క్యాపిటల్ సిటీ) కెఎస్ భాగ్యరేఖ, సంబంధిత స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ముఖ్య అధికారులతో కలసి ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందజేశారు. మొత్తంగా 17 మంది రైతులకు 37 ప్లాట్లను కేటాయించారు. వీటిలో 24 రెసిడెన్షియల్ ప్లాట్లు కాగా, 13 కమర్షియల్ ప్లాట్లు. ఈ సందర్భంగా డైరెక్టర్ కెఎస్ భాగ్యరేఖ మాట్లాడుతూ రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరతిగతిన పూర్తి చేసుకోవాలన్నారు. ప్లాట్లు పొందిన రైతులకు భౌగోళికంగా వారికి ప్లాట్లు ఎక్కడ కేటాయించబడ్డాయో వివరించడానికి జీఐఎస్ సిబ్బంది గ్రామ సర్వేయర్లు సహకరిస్తారన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ ల్యాండ్స్(క్యాపిటల్ రీజియన్) బి.గాయత్రీ దేవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు పి.పద్మావతి, బి.సాయి శ్రీనివాస నాయక్, జి.మురళీధర్, ప్లానింగ్, ల్యాండ్స్, జీఐఎస్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు. -
పేదల గుండెల్లో వైఎస్సార్ పదిలం
గుంటూరు ఎడ్యుకేషన్/గుంటూరు లీగల్: పేదల కన్నీళ్లు తుడిచేవాడే నిజమైన పాలకుడని మనసా వాచా కర్మణా విశ్వసించిన మహానేత డాక్టర్ వైఎస్సార్ జనం గుండెల్లో సంక్షేమ శ్రామికుడిగా నిలిచారని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి అన్నారు. వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు పోలూరి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కోర్టులో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సభ జరిగింది. ఈసందర్భంగా లేళ్ళ అప్పిరెడ్డి మహానేత వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ పేదవాడి గుండె చప్పుడు వినగలిగితే చాలు, నా జన్మ ధన్యమైనట్టే అని భావించి, ఆ దిశగా ప్రజలను కన్నబిడ్డల్లా పాలించి, తన సంక్షేమ సంతకంతో చెరిగిపోని జ్ఞాపకం మిగిల్చిన మరణం లేని మహానాయకుడిగా డాక్టర్ వైఎస్సార్ నిలిచారని కొనియాడారు. దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో సరికొత్త సంక్షేమ అధ్యాయాన్ని లిఖించిన ఘనత వైఎస్సార్కే దక్కుతుందని తెలిపారు. అందుకే సంక్షేమ పాలన గురించి ఎక్కడ ప్రస్తావించాల్సి వచ్చినా వైఎస్సార్కు ముందు, ఆ తరువాత అని చెప్పుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రజలకు ఉపయోగపడే ఎన్నో పనులతో ప్రజల గుండెల్లో కొలువైన వైఎస్సార్ ఆశయ సాధనకై మేము సైతం అంటూ జగనన్న అడుగులో అడుగేస్తామని ప్రతినబూనడం ద్వారా ప్రతి ఒక్కరూ రాజన్నకు నిజమైన నివాళి అర్పించాలని పిలుపునిచ్చారు. -
అభివృద్ధిలో పూర్వ విద్యార్థులు భాగస్వాములు కావాలి
ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూ అభివృద్ధిలో పూర్వ విద్యార్థులు భాగస్వాములు కావాలని వర్సిటీ వీసీ ఆచార్య కె. గంగాధరరావు అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో స్వర్ణోత్సవాలలో భాగంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం బుధవారం వర్సిటీ ప్రాంగణంలో ఘనంగా జరిగింది. దేశ, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో వర్సిటీ ప్రాంగణం సందడిగా మారింది. పాత మిత్రులను కలుసుకుని, నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ పూర్వ విద్యార్థులు ఆనందోత్సాహాలతో గడిపారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ జస్టిస్ జి. రామకృష్ణ ప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్య, పరిశోధన, మౌలిక వసతులు, విద్యార్థుల సంక్షేమానికి పూర్వ విద్యార్థులు సహకారం అందించాలన్నారు. మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. మాజీ ఎమ్మెల్సీ టి. జనార్దన్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయం విద్యార్థులకు కేవలం డిగ్రీలు మాత్రమే కాకుండా జీవితానికి అవసరమైన ఎన్నో విలువలను అందించిందన్నారు. రాష్ట్ర సీఐడీ డీజీపీ డాక్టర్ ఎస్. రవిశంకర్ అయ్యనార్, రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్పర్సన్ ప్రొఫెసర్ కె. రత్న షీలామణి, కార్యదర్శి ప్రొఫెసర్ బి. తిరుపతిరావు, మాజీ డీజీపీ బండి మరియాకుమార్, ప్రముఖ పారిశ్రామికవేత్త ఎం. ప్రేమ్కుమార్, వర్సిటీ రెక్టర్ ప్రొఫెసర్ ఆర్. శివరామ్ ప్రసాద్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. సింహాచలం తదితరులు ప్రసంగించారు. -
ఇదేం ‘మాయ’రోగం?
గుంటూరు మెడికల్ : దాతలు పెద్ద మనస్సు చేసుకుని రూ.100 కోట్లు విరాళాలు ఇచ్చి, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గర్భిణులు, బాలింతలు, మహిళలు, చిన్నారులు, పసికందులకు సూపర్స్పెషాలిటీ వైద్యం అందించేందుకు ఐదు అంతస్తుల్లో 600 పడకలతో భవన నిర్మాణం చేయించారు. దాతలకు తోడుగా ప్రభుత్వం రూ.27 కోట్ల విలువైన వైద్య పరికరాలు అందజేసింది. అందులోని కొన్ని మాయమైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.100 కోట్లు ఇచ్చిన పూర్వ విద్యార్థులు.... రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు జీజీహెచ్లో చదువుకున్న పూర్వ వైద్య విద్యార్థులు పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించేందుకు రూ.100 కోట్లు విరాళం ఇచ్చారు. గుంటూరు జీజీహెచ్కు ఆరు జిల్లాల నుంచి వస్తున్న గర్భిణులు, బాలింతలు, సీ్త్రలు, పిల్లలకు పడకలు సరిపోక, నాణ్యమైన వైద్యం కోసం పడుతున్న అగచాట్లు పడుతున్నారు. వారి ఇబ్బందులు తొలగించేలా ఈ భవన నిర్మాణం చేయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఏడాది జనవరిలో కానూరి–జింకానా మాతా–శిశు సంరక్షణ సూపర్స్పెషాలిటీ బ్లాక్ను ప్రారంభించారు. కానీ నేటి వరకు సదరు వైద్య విభాగంలో పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందుబాటులోకి రాకపోవడం విమర్శలకు తావిస్తోంది. డాక్టర్ యశస్వి రమణ సూపరింటెండెంట్గా ఉన్న సమయంలో ఈ ఏడాది మే నెలలో పాత భవనంలో ఉన్న కాన్పుల విభాగం, పిల్లల వైద్య విభాగాలను ఎంసీహెచ్లోకి మార్చారు. కొన్ని రకాల వైద్య పరికరాలు, ఆపరేషన్ థియేటర్లను సైతం ప్రారంభించారు. పూర్తిస్థాయిలో పరికరాలను వినియోగంలోకి తీసుకురాకుండా బాక్సుల్లోనే ఉంచారు. తీవ్ర ఆరోపణలు.... ప్రభుత్వం రూ.27 కోట్ల విలువైన వైద్య పరికరాలను ఎంసీహెచ్ వార్డుకు పంపిణీ చేసింది. వాటిల్లో ఎన్ని వార్డుల్లో ఉన్నాయి, ఎన్ని మెడికల్ స్టోర్స్లో ఉన్నాయి, ఎన్ని వినియోగంలో ఉన్నాయి, ఎన్ని మూలన పడి ఉన్నాయనే లెక్కలు ఆస్పత్రి అధికారుల్లో ఎవరికీ తెలియకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం వైద్య పరికరాలను తొలుత మెడికల్ స్టోర్స్లో స్టాక్ ఎంట్రీ చేసుకుని నిల్వ చేస్తారు. వార్డుల నుంచి వైద్య పరికరాలు కావాలని ఇండెంట్ పెడితే, స్టాక్ రిజిస్టర్లో ఎంట్రీ చేసుకుని సదరు వార్డుకు పంపిస్తారు. వార్డులో వైద్య పరికరాలు స్టాఫ్ నర్సుల పర్యవేక్షణలో ఉంటాయి. ఏయే వైద్య పరికరాలు వార్డులో ఉన్నాయి, వాటిల్లో ఎన్ని పనిచేస్తున్నాయి, ఏమైనా రిపేర్లకు గురైతే వాటిని వర్క్షాప్కు లేదా బయోమెడికల్ ఇంజినీర్ల వద్దకు పంపి రిపేర్లు చేయించడం వంటి పనులను నర్సింగ్ సిబ్బంది చూస్తారు. నూతన వైద్య పరికరాల గురించి ఎంసీహెచ్ వార్డుల్లో నర్సింగ్ సిబ్బందికి, మెడికల్ స్టోర్స్ ఇన్చార్జ్లకు తెలియకపోవడం పరిపాలనా తీరుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. జీజీహెచ్లో కాంట్రాక్ట్ బయోమెడికల్ ఇంజినీర్లతోపాటుగా ప్రైవేటు కంపెనీ బయోమెడికల్ ఇంజినీర్లు కూడా ఉన్నారు. కానీ సదరు కాంట్రాక్టర్ వైద్య పరికరాలను వినియోగంలోకి తీసుకురావడంలో నిర్లక్ష్యంగా ఉన్నారు. జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ స్పందించాలని బాధితులు కోరుతున్నారు. అన్ని వినియోగంలోకి తీసుకొస్తాం జీజీహెచ్లో కొన్ని వైద్య పరికరాలను కాంట్రాక్టర్ వినియోగంలోకి తీసుకురాకుండా వదిలివెళ్లిన విషయం తన దృష్టికి వచ్చినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ గిరజవోలు దుర్గాప్రసాద్ తెలిపారు. కాంట్రాక్టర్తో మాట్లాడి వినియోగంలోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
న్యాయవాదుల రక్షణ చట్టం తేవాలి
బాపట్ల టౌన్: న్యాయవాదుల వృత్తి నిర్వహణలో ఎదురవుతున్న సమస్యల నుంచి రక్షణ కల్పించేందుకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ (న్యాయవాదుల రక్షణ చట్టం)ను తక్షణమే తీసుకురావాలని బాపట్ల జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విన్నకోట సత్యప్రసాద్ డిమాండ్ చేశారు. రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం న్యాయవాదులు బాపట్ల సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా విన్నకోట సత్యప్రసాద్ మాట్లాడుతూ.. న్యాయవాదుల వృత్తి నిర్వహణలో ఎదురవుతున్న సమస్యల నుంచి రక్షణ కల్పించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమానికి బాపట్ల న్యాయవాదులు కూడా మద్దతుగా ఉద్యమాలు నిర్వహిస్తారని తెలిపారు. రెండు రోజుల పాటు న్యాయవాదులు విధులను బహిష్కరించి, బాపట్ల కోర్టు సముదాయం ప్రధాన గేటు వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ టి. రామకృష్ణ, ట్రెజరర్ నాగమోహిని, లైబ్రరీ సెక్రటరీ కారుమూరి సురేంద్రనాథ్, న్యాయవాదులు ప్రవీణ్ కుమార్, శ్యామలాదేవి తదితరులు పాల్గొన్నారు. ఆందోళనకు దిగిన న్యాయవాదులు -
కాంట్రాక్ట్ పారా మెడికల్ ఉద్యోగుల నిరసన
నరసరావుపేట ఈస్ట్: కాంట్రాక్ట్ పారా మెడికల్ ఉద్యోగుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం జిల్లాల ఆసుపత్రుల సమన్వయ అధికారి (డీసీహెచ్ఎస్) కార్యాలయం ఎదుట ఉద్యోగులు ‘టీమ్ పల్నాడు– ఏపీ పారా మెడికల్ జేఏసీ’ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాలలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర పారా మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు మానవహారంగా ఏర్పడ్డారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయాలని, వంద శాతం గ్రాస్ జీతాలు చెల్లించాలని, హెల్త్ కార్డులు, పరస్పర బదిలీలు కల్పించాలన్నారు. అనంతరం కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ పీజీసెట్–2026 నోటిఫికేషన్లో పొందుపర్చిన విధంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ గురువారం ప్రారంభం కానుందని ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.కల్యాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు వెబ్ ఆధారిత కౌన్సెలింగ్, సర్టిఫికెట్ల పరిశీలన, రిజిస్ట్రేషన్ ప్రక్రియలను ఈనెల 8వ తేదీలోగా ఆన్లైన్లో పూర్తి చేయాలని సూచించారు. ఏపీ పీజీసెట్లో ఉత్తీర్ణులై, ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకే ఫీజు రీయింబర్స్మెంట్ వర్తిస్తుందని తెలిపారు. ప్రభుత్వ మహిళా కళాశాలలో పీజీలో ఎమ్మెస్సీ జువాలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని, ఏపీ పీజీసెట్లో ఉత్తీర్ణులైన విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. తెనాలి: దుబాయ్లో జరగనున్న సీపీఎల్ టీ20 క్రికెట్ లీగ్ పోటీలకు తెనాలికి చెందిన పల్నాటి నాగరాజు ఎంపికయ్యారు. చాంపియన్ స్పోర్ట్స్ అకాడమీ డైరెక్టర్ పిల్ల శరత్ ఈ మేరకు సమాచారం పంపారు. గత ఆగస్టు నెలలో తునిలో సీపీఎల్ టీ20 క్రికెట్ లీగ్ నిర్వహించారు. తొలి సీజనులో ప్రతిభ చాటిన 24 మందిని దుబాయ్లో జరిగే టీ 20, వన్డే మ్యాచ్లకు ఎంపిక చేశామని తెలిపారు. ఐద్వా ఏపీ రాష్ట్ర కార్యదర్శి రమాదేవి ప్రత్తిపాడు: మహిళల హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని ఐద్వా ఏపీ రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి అన్నారు. వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట మలినేని లక్ష్మయ్య మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో ఇండక్షన్ కార్యక్రమాలు 15వ రోజుకు చేరాయి. బుధవారం మధ్యాహ్నం రమాదేవి విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. హక్కులపై అవగాహన పెంపొందించుకుని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. చుండి రంగనాయకులు కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ టి.వెంకట నారాయణ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని, క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలన్నారు. నగరంపాలెం: ప్రజలు, ప్రభుత్వ అధికారులకు కొంత మంది వ్యక్తులు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారుల పేర్లు, హోదాలను ఫోన్ కాల్ ద్వారా తెలియజేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసిందని ఉమ్మడి గుంటూరు జిల్లా ఏసీబీ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అటువంటి నకిలీ ఫోన్ కాల్స్ను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని సూచించారు. వ్యక్తిగత/ బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీలు, పీన్లు, ఇతరత్రా రహస్య సమాచారాన్ని తెలియజేయవద్దని తెలిపారు. అనుమానాస్పద ఫోన్ కాల్స్ లేదా మెసేజ్లు వస్తే స్థానిక పోలీస్స్టేషన్లోగానీ ఏసీబీ టోల్ఫ్రీ నంబర్ 1064, ఏఎస్పీ 94913 05638, డీఎస్పీ 92465 37807 ఫోన్ నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. -
ఉద్యోగుల సమస్యలపై ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధం
బాపట్ల: ఉద్యోగుల సమస్యలపై ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమని ఏపీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు పి. నాగేశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక ఎన్జీవో హోమ్లో జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు పి. నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉద్యోగులకు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో జేఏసీ తీసుకునే ప్రతి నిర్ణయానికి అందరం కట్టుబడి ఉన్నామని సూచించారు. ఈ మేరకు మండల, జిల్లా స్థాయిలలో తీసుకోవాల్సిన చర్యల గురించి విస్తృతంగా చర్చించామన్నారు. ఈ నెల 5వ తేదీన జరగనున్న ఏపీ జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం తీసుకోబోయే నిర్ణయంపై పూర్తి స్థాయిలో కార్యాచరణను అమలు చేయటానికి సంసిద్ధంగా ఉండాల్సిందిగా అన్ని మండలాల కార్యవర్గాలను సమాయత్తం చేయాలని ఈ సమావేశం నిర్ణయించిందన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి ఏపీ జేఏసీ బాపట్ల జిల్లా సెక్రటరీ వినయ్, ఎస్టీయూ బాపట్ల జిల్లా అధ్యక్షుడు బడుగు శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ బాపట్ల సిటీ చైర్మన్ జి. ఇస్సాకు, అసోసియేషన్ బాపట్ల జిల్లా కార్యదర్శి బి. ప్రసాదరావు, ఏపీ ఎన్జీవో అసోసియేషన్ బాపట్ల జిల్లా కోశాధికారి నాగేశ్వరరావు, బాపట్ల జిల్లా ఉమెన్ వైస్ చైర్మన్ వెంకటేశ్వరమ్మ, జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు హాజరయ్యారు. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 27.9907 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజీ ద్వారా వెళుతోంది. -
స్కాలర్షిప్ పేరుతో సైబర్ మోసాలు
అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సూచన బాపట్ల టౌన్: స్కాలర్షిప్ పేరుతో జరిగే సైబర్ మోసాలపై విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం సాంకేతికత ఆధారంగా సైబర్ నేరగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారన్నారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన స్కాలర్షిప్లకు దరఖాస్తు చేసుకునే సందర్భాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి, తాము స్కాలర్షిప్ విభాగం, విద్యాసంస్థ, ప్రభుత్వ శాఖ నుంచి మాట్లాడుతున్నట్లు పరిచయం చేసుకుని, స్కాలర్షిప్ మంజూరైందని, స్కాలర్షిప్ మొత్తాన్ని ఖాతాలో జమ చేయడానికి కొన్ని వివరాలు అవసరమని చెబుతున్నారన్నారు. ఈ క్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం/డెబిట్ కార్డు వివరాలు, పాస్వర్డ్లు, ఓటీపీ వంటి వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని సేకరించి మోసాలకు పాల్పడుతున్నారన్నారు. కొంతమంది సైబర్ నేరగాళ్లు స్కాలర్షిప్ దరఖాస్తు, ధ్రువీకరణ పేరుతో అనుమానాస్పద లింకులు పంపి, ఆ లింకులను క్లిక్ చేయడం ద్వారా నకిలీ వెబ్సైట్లకు తీసుకెళ్లి వ్యక్తిగత వివరాలను నమోదు చేయించడం, హానికరమైన యాప్లను డౌన్లోడ్ చేయించడం, బ్యాంకు సంబంధిత సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చన్నారు. స్కాలర్షిప్ పొందేందుకు ముందుగా కొంత మొత్తాన్ని చెల్లించాలని, రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు పేరుతో డబ్బులు పంపాలని కోరినా అప్రమత్తంగా ఉండాలన్నారు. స్కాలర్షిప్కు సంబంధించిన సమాచారం కోసం ఎవరైనా ఫోన్ చేసినప్పుడు వారి మాటలను మాత్రమే నమ్మకుండా, సంబంధిత విద్యాసంస్థ, అధికారిక ప్రభుత్వ వెబ్సైట్, సంబంధిత శాఖ ద్వారా సమాచారం నిజమో కాదో నిర్ధారించుకోవాలన్నారు. గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్, మెసేజ్లు, వాట్సాప్ సందేశాలు, అనుమానాస్పద లింకుల విషయంలో తొందరపడి స్పందించవద్దన్నారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం/డెబిట్ కార్డు వివరాలు, పిన్, పాస్వర్డ్, ఓటీపీ వంటి రహస్య సమాచారాన్ని ఫోన్ ద్వారా ఎవరైనా అడిగినా ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించవద్దన్నారు. -
ఓటుకు వేటు!
పొన్నూరు: పొన్నూరు నియోజకవర్గాన్ని దశాబ్దాలుగా శాసిస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలకు అత్యంత ప్రజాదరణ కలిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భయం వెంటాడుతోంది. పొన్నూరులో రెండేళ్ల పాలనలో టీడీపీ చేస్తున్న దౌర్జన్యాలు, అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు. సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో టీడీపీపై అసంతృప్తి భారీగా పెరిగిపోగా.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమాన్ని చూసిన ప్రజలు వైఎస్సార్ సీపీ పాలనను కోరుకుంటున్నారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్ సీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమనే ఆందోళన టీడీపీ నేతలను వెంటాడుతోంది. ఈ నేపధ్యంలో వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ‘సర్’ను అనుకూలంగా మార్చుకుని.. నియోజకవర్గంలో పట్టుకోసం గ్రామాలు, పొన్నూరు పట్టణంలో వైఎస్సార్ సీపీకి చెందినవారి ఓట్లను తొలగించడమే లక్ష్యంగా కూటమి నేతలు పావులు కదుపుతున్నారు. ఈ నేపధ్యంలో సర్ ప్రక్రియను తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు. కొందరు అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వివిధ కారణాలతో ఫిర్యాదులు చేస్తూ వైఎస్సార్ సీపీ ఓట్ల తొలగింపునకు శ్రీకారం చుట్టారు. తమకు అనుకూలంగా లేని ఓట్లను తీసేయాలంటూ ఎన్నికల అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం పలు కారణాలతో నోటీసులు తీసుకున్న వారు తమ ఓటును నిలబెట్టుకునేందుకు అన్ని పత్రాలను సమర్పించినా అధికారుల లాగిన్లో నుంచి ముందుకు కదలడం లేదు. తమకు జరుగుతున్న అన్యాయంపై గుంటూరు కలెక్టరేట్లో జరిగే పీజీఆర్ఎస్లో ఓటర్లు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. నాయకుల ప్రమేయంతో ఓటును రిజెక్టు చేస్తే ఓటర్లకు సమాధానం చెప్పుకోవాల్సి రావడం.. ఓటు ఉంచితే అధికార పార్టీ నాయకుల నుంచి వచ్చే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని.. అధికారులు ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సర్ ప్రక్రియకు సమయం తక్కువగా ఉన్న నేపధ్యంలో ఉన్నతాధికారులు స్పందించి సమస్యాత్మక గ్రామాలు, వార్డుల్లో ప్రత్యేక సభలు నిర్వహించి తమ ఓటు హక్కును కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. పొన్నూరు నియోజకవర్గంలో టీడీపీ నీఛ రాజకీయాలు వైఎస్సార్ సీపీ ఓట్ల తొలగింపే లక్ష్యంగా కుట్రలు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు -
రావెల ఆరోపణలు నిరాధారం
గుంటూరు రూరల్: మాజీ మంత్రి రావెల కిషోర్బాబు ఇటీవల చేసిన ఆరోపణలను రిజిస్ట్రేషన్ శాఖ మాజీ డీఐజీ చావలి బాలస్వామి, అడ్వకేట్ రాయపూడి మాణిక్యారావు, కాకుమాను పున్నారావు ఖండించారు. మంగళవారం అమరావతిరోడ్డులోని ఒక ప్రైవేటు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బాలస్వామిపై నిరాధారమైన ఆరోపణలు రావెల కిషోర్ చేశారని చెప్పారు. ఎలాంటి అగ్రిమెంట్ లేకుండా నాలుగున్నర కోట్ల రూపాయలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. నిరాధారమైన ఆరోపణలు చేసిన కిషోర్బాబుపై పరువు నష్టం దావా వేస్తామని చెప్పారు. ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి అసైన్డ్ భూములు ఎలా కొనుగోలు చేశారని ప్రశ్నించారు. ఆయన ఎన్నికల సమయంలో బాలస్వామి ద్వారా డబ్బులు కూడా తీసుకున్నారని ఆరోపించారు. ఆర్థిక నేరాలకు పాల్పడిన కిషోర్ బాబుపై సమగ్రంగా దర్యాప్తు జరిపి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. -
నేడు ఏఎన్యూలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం బుధవారం అట్టహాసంగా నిర్వహించనున్నట్లు వర్సిటీ వీసీ ఆచార్య కె.గంగాధరరావు తెలిపారు. ఏఎన్యూలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న ఈ సమ్మేళనానికి 1976 నుంచి 2026 వరకు వివిధ సంవత్సరాల్లో వర్సిటీలో విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారని చెప్పారు. గత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ వర్తమానాన్ని అనుసంధానిస్తూ భవిష్యత్కు బలమైన బాటలు వేయడమే పూర్వ విద్యార్థుల సమ్మేళనం ప్రధాన ఉద్దేశమన్నారు. స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని పలు దఫాలుగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఉపకులపతి తెలిపారు. సెప్టెంబరు 8న నడక కార్యక్రమం, మ్యూజికల్ నైట్ నిర్వహించనున్నట్లు చెప్పారు. సెప్టెంబరు 11న నిర్వహించనున్న వర్సిటీ ఫౌండేషన్ డే కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ను ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఇప్పటికే సుమారు 3,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, వారిలో సుమారు 1,500 మంది ప్రత్యక్షంగా హాజరయ్యే అవకాశం ఉందని వీసీ తెలిపారు. విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాల అభివృద్ధి తదితర అంశాలపై చర్చించి, ప్రస్తుత విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలకు రూపకల్పన చేయనున్నట్లు వివరించారు. విశిష్ట పూర్వ విద్యార్థుల హాజరు.. సమ్మేళనానికి పలువురు ప్రముఖులు, విశిష్ట పూర్వ విద్యార్థులు హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్, సీఐడీ డీజీపీ డాక్టర్ ఏఎస్ రవిశంకర్ అయ్యన్నార్, ఏపీఎస్సీహెచ్ఈ చైర్పర్సన్ ప్రొఫెసర్ కె.రత్నషీలామణి, హెటెరో డ్రగ్స్ లిమిటెడ్ డైరెక్టర్ డాక్టర్ ఏఎస్కే రత్నాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్, మాజీ డీజీపీ బండి మరియా కుమార్, ఏపీఎస్సీహెచ్ఈ ముఖ్య కార్యదర్శి ప్రొఫెసర్ బి.తిరుపతిరావు, ప్రముఖ పారిశ్రామికవేత్త ఎం.ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొననున్నారని వీసీ వివరించారు. సమావేశంలో వర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ ఆర్.శివరామ్ ప్రసాద్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.సింహాచలం, పాలక మండలి సభ్యులు ఆచార్య త్రిమూరి రావు, పూర్వ విద్యార్థుల కమిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.చంద్రశేఖర్రావు, ప్రొఫెసర్ జి.చెన్నారెడ్డి పాల్గొన్నారు. -
రాహుల్కుమార్రెడ్డికి బంగారు పతకం
తాడికొండ: ఏపీ సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ టి.రాహుల్కుమార్రెడ్డికు రాష్ట్ర గవర్నవర్ అబ్దుల్ నజీర్ గోల్డ్ మెడల్ను మంగళవారం అందజేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా రాహుల్ కుమార్రెడ్డి మెడల్ అందుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో విధులు నిర్వహించిన సమయంలో రెడ్క్రాస్ సేవల విస్తరణ, నిధుల సమీకరణ, జూనియర్, యూత్ రెడ్క్రాస్ సభ్యత్వ నమోదులో విశేష కృషి చేసినందుకుగాను, రెడ్క్రాస్ సేవల్లో విశేష కృషికి గుర్తింపుగా రాహుల్ కుమార్రెడ్డికు ఈ పురస్కారం లభిందించారు. గవర్నర్ గోల్డ్ మెడల్ అందుకున్న రాహుల్కుమార్రెడ్డికి అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. ఫిట్నెస్తోనే సమర్థ పోలీసింగ్ మంగళగిరి రూరల్: ఫిట్నెస్, క్రీడలను పోలీసు సిబ్బంది వృత్తి జీవితంలో భాగం చేసుకోవాలని డీజీపీ హరీష్కుమార్ గుప్తా సూచించారు. శారీరక దృఢత్వం, మానసిక అప్రమత్తత పోలీసు విధుల్లో కీలకమన్నారు. మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్న్ మైదానంలో మంగళవారం తొలి ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026ను ప్రారంభించారు. శాంతి కపోతాలు, బెలూన్లను గాలిలోకి ఎగురవేసి క్రీడా పోటీలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని వివిధ పోలీసు రేంజ్లు, యూనిట్లకు చెందిన 16 జట్ల నుంచి సుమారు 1,900 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటున్నారని తెలిపారు. సెప్టెంబరు 1 నుంచి 4వ తేదీ వరకు నాలుగు రోజులపాటు జరిగే ఈ క్రీడా పోటీలకు వీఐటీ– ఏపీ విశ్వవిద్యాలయం, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మైదానాలు వేదికలుగా నిలుస్తున్నాయి. కార్యక్రమంలో పలువురు అదనపు డీజీపీలు మధుసూదన్రెడ్డి, ఆకే రవికృష్ణ,, బి.రాజకుమారి, సీహెచ్ శ్రీకాంత్, కేవీ మోహన్రావు, డీఐజీలు అన్బురాజన్, అమ్మిరెడ్డి, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొన్నారు. ఈ నెల నుంచి నిత్యావసరాలు పంపిణీ బాపట్ల: ఈ నెల నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి జగన్మోహన్రావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో 3,87,898 మంది కార్డుదారులకుగాను 5016 మెట్రిక్ టన్నుల పోర్టిఫైడ్ బియ్యం, 191 టన్నుల పంచదారను కేటాయించినట్లు తెలిపారు. కార్డుదారులు తమ సమీప చౌకధరల దుకాణంలో సరుకులు తీసుకోవచ్చని తెలిపారు. బాపట్ల జిల్లాలోని 904 చౌక ధరల దుకాణాలను ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో షాపులు తెరిచి ఎలాంటి ఫిర్యాదులు లేకుండా సరుకులు పంపిణీ చేయాలని సూచించారు. బోనబోయిన కేసులో నిందితుడి అరెస్టు గుంటూరు రూరల్: తనను ఇన్నర్ రింగ్రోడ్డు రెడ్డిపాలేనికి కు చెందిన కొందరు హత్య చేయాలని ప్రయత్నిస్తున్నారని బోనబోయిన శ్రీనివాసరావు యాదవ్ చేసిన ఫిర్యాదు మేరకు నిందితులను నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం నగరంలోని సౌత్ సబ్డివిజన్ డీఎస్పీ పూర్ణచంద్రరావు తెలిపిన వివరాల ప్రకారం బోనబోయిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన నల్లపాడు పోలీసులు ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారన్నారు. మరో నిందితుడు కంకర నరేంద్రరెడ్డిని మంగళవారం అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నరేంద్రను కోర్టులో హాజరుపరచగా ఈనెల 11వ తేదీ వరకూ రిమాండ్ విధించినట్లు తెలిపారు. అనంతరం నిందితుడిని నెల్లూరు జైలుకు తరలించామన్నారు. కేసు ఛేదనలో ప్రతిభ చూపిన నల్లపాడు పోలీసులను డీఎస్పీ అభినందించారు. సంతకాలు సేకరించి నిరసన తెలిపిన కాంట్రాక్టు వైద్య సిబ్బంది గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం గుంటూరు జీజీహెచ్లో సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట పలువురు వైద్య సిబ్బంది సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టి వినూత్న తరహాలో నిరసన తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, ఉద్యోగాలు రెగ్యులరయ్యే వరకు నూరు శాతం గ్రాస్ శాలరీ చెల్లించాలని, కాంట్రాక్టు ఉద్యోగులకు బదిలీ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. సంతకాల సేకరణ కార్యక్రమంలో స్టాఫ్నర్సులు రమాదేవి, రేణుక, భార్గవి, శ్రీలక్ష్మి, ల్యాబ్ టెక్నీషియన్లు చారి, సుధ, రమేష్, సుధాకర్, శివలక్ష్మి, ఖాసీం, ఫార్మాసిస్టులు సుజాత, చంద్రకళ, శ్రీలక్ష్మి, సౌజన్యం, నాగుల్మీరా, ఇతర పారా మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఇంటిపై దాడికి కారణం భూవివాదమే!
చీరాల: వేటపాలెం మండలంలోని కొత్తపేట ఐఎల్టీడీ కాలనీలో నివాసం ఉంటున్న ఆక్వా రైతు చెరుకూరి లక్ష్మీనారాయణ ఇంటిపై జరిగిన దాడి.. భూవివాదం నేపథ్యంలో జరిగిందని, ఈ ఘటనలో ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేశామని డీఎస్పీ ఎండీ మోయిన్ అన్నారు. మంగళ వారం చీరాల టూటౌన్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. చీరాల టూటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో గత నెల 28వ తేదీ రాత్రి 7 గంటల సమయంలో కొత్తపేట ఐఎల్టీడీ కాలనీలో నివాసం ఉంటున్న ఆక్వా రైతు చెరుకూరి లక్ష్మీనారాయణ ఇంటిపై ఇద్దరు వ్యక్తులు కర్రలతో దాడులకు పాల్పడ్డారు. 2022 సంవత్సరంలో వేటపాలెం మండలం అక్కాయిపాలెం పంచాయతీ సర్వే నెంబర్ 767లో ఉన్న సుమారు 4.51 ఎకరాల పొలాన్ని కొనుగోలు చేయడానికి సదరు భూయజమానులు అయిన చీరాలకు చెందిన నేరెళ్ల రాధికతో కొనుగోలు విషయమై ఏ1 కొండూరి శ్రీనివాసరావు సంప్రదింపులు జరిపాడు. అయితే అతని వద్ద తగినంత డబ్బు లేకపోకపోవడంతో భూమిని కొనుగోలు చేయలేకపోయాడు. అనంతరం కొత్తపేటకు చెందిన చెరుకూరి లక్ష్మీనారాయణ ఆ భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ప్రస్తుతం ఆ భూమి విలువ గణనీయంగా పెరిగింది. తాను కొనుగోలు చేయాల్సిన భూమిని లక్ష్మీనారాయణ కొనుగోలు చేయడం వలన తాను చాలా నష్టపోయానని భావించి ఎలాగైనా లక్ష్మీనారాయణను బెదిరించి అతని వద్ద తక్కువ ధరకు పొలాన్ని పొందాలని కొండూరి శ్రీనివాసరావు పన్నాగం పన్నాడు. అందుకు చెరుకూరి లక్ష్మీనారాయణ అంగీకరించకపోతే అతనిపై దాడి చేయాలనే ఉద్దేశంతో ఏ2 ఐనంపూడి పద్మారావును సంప్రదించాడు. కొండూరు శ్రీనివాసరావు.. ఐనంపూడి పద్మారావుకు కొంత మొత్తం ఇస్తానని మాట్లాడుకుని మొదటగా లక్ష రూపాయలు ఇచ్చి ఏ5 అయిన ప్రీతమ్కు రూ.76 వేలు ఇచ్చాడు. ఈ క్రమంలోనే కొండూరు శ్రీనివాసరావు, ఐనంపూడి పద్మారావు, దోనేపూడి విజయకుమార్, ఇతరులు కలిసి గత నెల 28న కొత్తపేట నారాయణ స్కూల్ సమీపంలో సమావేశమై ముందస్తు ప్రణాళికలో భాగంగా ముఖానికి మాస్క్లు ధరించి జామాయిల్ కర్రలతో లక్ష్మీనారాయణ ఇంటిపై దాడి చేశారు. తలుపులు, కిటికీల అద్దాలు, ఇంటిలో పార్కింగ్ చేసిన కారు అద్దాలు ధ్వంసం చేశారు. అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారై బాపట్ల వైపు వెళ్లిపోయారు. ఈ మేరకు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సోమవారం ఉదయం 216 జాతీయ రహదారిపై మన్నం ప్రైడ్ అపార్టుమెంట్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఏపీ39ఎన్జె 6179 నంబర్ కారులో వస్తూ పోలీసులను చూసి పరారయ్యేందుకు ప్రయత్నించగా నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి కారు, సెల్ఫోన్లు, దాడికి ఉపయోగించిన ఐదు జామాయిల్ కర్రలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇతర వ్యక్తుల ప్రమేయం, నేరానికి సంబంధించిన కుట్ర, వారు ఉపయోగించిన వాహనాల గురించి దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులపై రౌడీషీట్ తెరవనున్నారు. కేసు దర్యాప్తులో ప్రతిభ కనబరచిన పోలీసు సిబ్బందికి ఎస్పీ బి.ఉమామహేశ్వర్ రివార్డులు ప్రకటించి అభినందించారు. సమావేశంలో టూటౌన్ సీఐ శశికుమార్, ఎస్ఐ రవీందర్, సిబ్బంది పాల్గొన్నారు. -
అమరావతిలో డెన్మార్క్ బృందం పర్యటన
తాడికొండ: భారత్–డెన్మార్క్ ఇంధన భాగస్వామ్య (ఐఎన్డీఈపీ) అమలులో భాగంగా రాజధానిలో మంగళవారం డెన్మార్క్ బృందం పర్యటించింది. రాజధానిలో విద్యుత్ సరఫరా వ్యవస్థను పటిష్టంగా అభివృద్ధి చేసే అంశాలపై ఏపీసీఆర్డీఏ అధికారులు, డెన్మార్క్ ప్రతినిధులు చర్చలు జరిపారు. అనంతరం అడిషనల్ కమిషనర్ టి.రాహుల్ కుమార్రెడ్డి రాయపూడి ప్రధాన కార్యాలయం గ్రౌండ్ ఫ్లోర్లోని అమరావతి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(ఏఐసీసీ)లో డిజిటల్ ట్విన్ ద్వారా అమరావతి అభివృద్ధిని విజువల్ సిమ్యులేషన్ రూపంలో డెన్మార్క్ ప్రతినిధులకు వివరించారు. కార్యక్రమంలో ఏపీసీఆర్డీఏ ఆఫీస్ మేనేజ్మెంట్ డైరెక్టర్ వల్లభనేని శ్రీనివాస రావు, ఎకనామిక్ డెవలప్మెంట్ విభాగ జాయింట్ డైరెక్టర్ అంజనా జేమ్స్, జనరల్ మేనేజర్ ఎస్.జె.ఎస్.స్టీఫెన్, ఐటీ విభాగ అడిషనల్ డైరెక్టర్ కుశ్వంత్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఎల్) ఏ.జెస్సికా రాజేశ్వరి పాల్గొన్నారు. -
గోపి మృతిపై న్యాయపోరాటం
పోలీసులపై చర్యలు తీసుకోవాలి న్యాయం జరిగేంత వరకు పోరాటం ● విచారణ నిమిత్తం పోలీసు స్టేషన్కు వెళ్లి.. అనంతరం జీజీహెచ్లో చికిత్స పొందుతూ మృతిచెందిన గోపి ● మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన వైఎస్సార్ సీపీ నేతలు ● బాధితులకు అండగా ఉంటామని హామీ గుంటూరు మెడికల్: చోరీ కేసులో విచారణ నిమిత్తం పోలీస్స్టేషన్కు వెళ్లిన తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన చీకటి గోపి (30) గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందిన వైనంపై కుటుంబ సభ్యులు ఆస్పత్రి గేటు వద్ద మృతదేహం పెట్టుకుని ఆందోళన చేశారు. గోపి భౌతికకాయాన్ని వైఎస్సార్ సీపీ తాడికొండ నియోజకవర్గ ఇన్చార్జి వనమా బాలవజ్రబాబు, వేమూరు నియోజకవర్గ ఇన్చార్జి వరికూటి అశోక్బాబులు సందర్శించి నివాళుల ర్పించారు. గోపి మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు జ్వరంతో ఉన్న గోపీని వీపుపై, కాళ్లపై బాగా కొట్టారని, జీజీహెచ్లో వైద్యులు, వైద్య సిబ్బంది ఆక్సిజన్ పెట్టాలని బతిమిలాడినా నిర్లక్ష్యంగా ఉండటం వల్లే గోపి చనిపోయాడని కుటుంబ సభ్యులు వైఎస్సార్సీపీ నేతల వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. బాధితులకు అన్ని విధాల అండగా ఉంటామని, పోలీసులపై కేసు నమోదు చేసేవరకు న్యాయపోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జ్వరంతో ఉన్న గోపిని పోలీసులు భయపెట్టి పోలీసు స్టేషన్కు పిలిపించి చోరీతో సంబంధం లేకపోయినా చావగొట్టారు. పోలీసులు కొట్టారనడానికి వంటి మీద గాయాలే సాక్ష్యం. కొట్టిన అనంతరం అనారోగ్యంతో ఉన్న గోపికి చికిత్స చేయించకుండా ఏమీ కొట్టనట్లుగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈసంఘటన చూస్తుంటే ఆంధ్ర రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంత దుర్మార్గంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. దళితుడు, చిన్న కుటుంబానికి చెందిన గోపి పట్ల పోలీసులు విచక్షణా రహితంగా ప్రవర్తించారు. దిక్కులేని వ్యక్తిని చూసినట్లుగా గోపిని పోలీసులు చూడడం చాలా బాధాకరం. చోరీతో సంబంధం లేని వ్యక్తిని చావగొట్టి, నడుము కింది భాగం, కాళ్లు పూర్తిగా పనిచేయకపోయినా పట్టించుకోకుండా ఆసుపత్రిలో చేర్పించకుండా కనీస జాలి, దయ చూపించకుండా కుటుంబ సభ్యులకు వదిలేయడం చాలా బాధాకరం. గోపికి మృతికి కారణమైన పోలీసులను తక్షణమే సస్పెండ్చేయాలి. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. విజయవాడ లాకప్ డెత్ సంఘటన మరువకముందే మళ్లీ గుంటూరులో పోలీసులు ఇలా ప్రవర్తించడం దారుణం. గోపి కుటుంబానికి వైఎస్సార్ సీపీ అండగా ఉంటుంది. గోపి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుంది. దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తాం. – వనమా బాలవజ్రబాబు, వైఎస్సార్ సీపీ తాడికొండ నియోజకవర్గ ఇన్చార్జి గోపిపై పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేయకుండా పోలీసులు ఎందుకు తీసుకెళ్లి విచారణ చేసి చావగొట్టారు. పార్టీలకతీతంగా గోపికి అండగా ఉండి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. – వరికూటి అశోక్బాబు, వైఎస్సార్ సీపీ వేమూరు ఇన్చార్జి -
రాజముద్ర
అభివృద్ధిపై రాజన్నా.. నిను మరువలేమన్నా సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాజకీయ ఖిల్లా గుంటూరు జిల్లాపై దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చెరగని ముద్ర వేశారు. గుంటూరు జిల్లాతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది. సుదీర్ఘకాలంగా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న జిల్లాలో ఆపార్టీకి అడ్రస్సే గల్లంతయ్యేలా చేశారు. 2004లో దివంగత వైఎస్సార్ కర్త, కర్మ, క్రియ అన్నీ తానై వ్యవహరించి జిల్లాలో 19 నియోజకవర్గాల్లో పర్యటించి 18 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందేలా చేశారు. ప్రభుత్వ కూర్పులోనూ జిల్లాకు పెద్ద పీట వేసి నలుగురికి మంత్రి పదవులు ఇచ్చి జిల్లాను మినీ కేబినెట్గా మార్చారు. 2009 ఎన్నికల్లోనూ అదే ప్రభంజనం కొనసాగించారు. అయితే దురదృష్ట పరిణామాల నేపథ్యంలో ఆయన మరణించడంతో జిల్లాలో రాజకీయ పరిస్థితి ఒక్కసారిగా తల్లకిందులైంది. రాజకీయ నాయకుల సంగతి పక్కనపెడితే ప్రజలు మాత్రం మహానేతను గుండెల్లో గూడుకట్టుకుని దైవంగా ఆరాధిస్తున్నారు. ఆయన మరణాన్ని తట్టుకోలేక ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎన్నో గుండెలు ఆగిపోయాయి. బుధవారం దివంగత వైఎస్సార్ వర్ధంతి నేపథ్యంలో జిల్లాలో వాడవాడలా కార్యక్రమాలు నిర్దహించేందుకు ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు. అనేక పథకాలకు జిల్లా నుంచే శ్రీకారం ముఖ్యమంత్రి హోదాలో దివంత మహానేత వైఎస్సార్ ఉమ్మడి జిల్లాలో 57 సార్లు పర్యటించడం విశేషం. వివిధ గొప్ప పథకాలకు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టారు. రాజీవ్ పల్లెబాట, ఇందిర ప్రభ, పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ఇలా అనేక కార్యక్రమాల్లో భాగంగా జిల్లాకు వచ్చారు. ఏడాదికి సగటున పది సార్లు మహానేత జిల్లాలో పర్యటించారు. ఇందిరప్రభ, ఇందిరమ్మ ఇళ్లు లాంటి సంక్షేమ కార్యక్రమాలను జిల్లా నుంచే ప్రారంభించారు. జిల్లాలో వందలాది మంది కార్యకర్తలను నేతలుగా తీర్చిదిద్దిన ఘనత దివంగత మహానేతదే. దాదాపుగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అభిమానులు, అనుచరులు ఉన్న ఏకై క నేతగా, నిత్యం ప్రజల సంక్షేమం కోసం పరితపించిన నేతగా, జిల్లా ప్రజల మదిలో ఆ మహానేత ఎప్పటికీ చిరస్మరణీయుడు. నిరుపేదల పాలిట అపర సంజీవనిగా పేరొందిన ఆరోగ్యశ్రీ పథకాన్ని 2008లో గుంటూరు నుంచే దివంగత మహానేత డాక్టర్ వైఎస్సార్ ప్రారంభించడం ఆనందించదగ్గ విషయం. గుంటూరు నగరంలోని సాయిభాస్కర్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలను మొట్టమొదటగా ప్రారంభించి అప్రతిహతంగా కొనసాగించారు. అలాగే జిల్లాలో ప్రారంభమైన రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 2010 చివరి వరకు 14 లక్షల పై చిలుకు ఆపరేషన్లు జరుగ్గా ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వైద్య సేవలు అందక నిరుపేద రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లాకు రాజకీయ ఉన్నతి కల్పించిన మహానేత డాక్టర్ వైఎస్సార్ రాజన్న మరణంతో జిల్లాలో ఆగిన గుండెలెన్నో అనేక రాష్ట్రస్థాయి పథకాలకు జిల్లా నుంచే శ్రీకారం పులిచింతల ప్రాజెక్ట్ వైఎస్సార్ పుణ్యమే జిల్లా నుంచే ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభం జిల్లాతో దివంగత మహానేతకు విడదీయరాని అనుబంధం మహానేత వర్ధంతికి భారీ ఏర్పాట్లు చేసిన అభిమానులు జిల్లా ప్రజలకు చిరకాల స్వప్నంగా నిలిచిన పులిచింతల ప్రాజెక్టును సాకారం చేసింది మహానేత వైఎస్సారే. అనేక అడ్డంకులు, అవరోధాలు దాటుకుని ముఖ్యమంత్రి అయిన వెంటనే 2004 అక్టోబరు 15న రూ. 682 కోట్ల వ్యయంతో పులిచింతల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. తనదనంతరం పర్యావరణ అనుమతులు లేక ప్రాజెక్టు నిలిచిపోతే ప్రత్యేకదృష్టి నిలిపి, పర్యావరణ అనుమతులు సాధించి 2005 జూన్లో పనులను ప్రారంభించి ప్రతినెలా అభివృద్ధిపై సమీక్షించారు. ఆయన మరణంతో పులిచింతల పనులు నత్తనడకన ఏళ్ల తరబడి కొనసాగాయి. అందుకే పులిచింతల పేరు వినగానే జిల్లా వాసులకు మహానేతే గుర్తుకువస్తారు. -
రైతు బజార్లలో తగ్గింపు ధరలతో బియ్యం విక్రయాలు
జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ గుంటూరు వెస్ట్: జిల్లా రైతు బజార్లలో తగ్గింపు ధరలతో బియ్యం విక్రయాలు జరుగుతున్నాయని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. ధరల పర్యవేక్షక కమిటీ సమావేశం మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ రైతు బజార్లలో తగ్గింపు ధరలతో రెండు రకాల బీపీటీ రకం బియ్యం –స్టీమ్, పచ్చి బియ్యం విక్రయించడం జరుగుతుందన్నారు. ఆధార్ కార్డు కానీ లేదా రేషన్ కార్డు కానీ చూపించి 10 కిలోల వరకు పొందవచ్చని తెలిపారు. ఆయిల్ ఫెడ్ ద్వారా వంట నూనెలు తగ్గింపు ధరలలో రైతు బజార్లలో అందుబాటులో తెచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా పౌర సరఫరాల అధికారిని ఆదేశించారు. ఉల్లిపాయల విక్రయాలు విక్రయాలు పట్ల పౌరసరఫరాల కమిషనర్ ను కోరతామని తెలిపారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎం.పద్మావతి, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు పి.సత్యనారాయణ చౌదరి, డీఎస్ఓ కోమలి పద్మ, ఆహార సలహా సంఘం సభ్యులు హరిబాబు పాల్గొన్నారు. గురుకులాల్లో విద్యార్థినులకు రక్షణ కరువు ఐద్వా ఆందోళన తాడేపల్లి రూరల్: పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన, దళిత బాలికల గురుకులాలు, ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లో వరసగా బాలికలు గర్భిణి దాల్చుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని అత్యంత తీవ్రమైన విషయమని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శ్రీదేవి, సావిత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు తాడేపల్లి రూరల్ కొలనుకొండలోని ఐద్వా కార్యాలయం నుంచి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తమ పరిశీలనలో ఎక్కువ శాతం ఇటువంటి ఘటనలు గిరిజన, దళిత బాలికల హాస్టళ్లలోనే జరుగుతున్నాయని, దీనికి ప్రధాన కారణం హాస్టల్, కళాశాలల యాజామాన్యలు, గిరిజన సంక్షేమ శాఖ అధికారుల పర్యవేక్షణ పూర్తి విఫలమవ్వడమేనని తెలిపారు. విద్యార్థినుల భద్రత, ఆరోగ్యం, సంక్షేమంపై నిరంత పర్యవేక్షణ ఉండాల్సిన వ్యవస్థ కాగితాలకే పరిమితమైందని విమర్శించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి నెల బాలికలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, రుతుక్రమం, పోషకాహారం, శారీరక మార్పులు తదితర అంశాలను నమోదు చేయాల్సి ఉన్నప్పటికీ చాలా హాస్టళ్లలో ఈ నిబంధనలు అమలు కావడం లేదని ఆరోపించారు. రెడ్బుక్ నిర్వహణ, నెలవారీ హెల్త్ చెకప్లు, కౌన్సెలింగ్ వంటి ప్రక్రియలు సక్రమంగా లేకపోవడం వలనే ఇలాంటి ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నా బాధ్యులపై కఠిన చర్యలు లేకపోవడం వలన నిర్లక్ష్యం కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇప్పటికై నా జిల్లా కలెక్టర్, ఐటీడనే, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు స్పందించి గురుకులాల్లో బాలికల భద్రతకు ప్రత్యే కార్యాచరణ రూపొందించాలని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా శాశ్వత పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆ ప్రకటనలో డిమాండ్ చేశారు. క్రెడిట్ కార్డు ద్వారా రూ.4.46 లక్షలు నగదు చోరీ లక్ష్మీపురం: క్రెడిట్ కార్డు ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు రూ.4.46 లక్షలు నగదు బదిలీ చేసుకున్న ఘటనపై అరండల్పేట పోలీసులు మంగళవారం రాత్రి కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనగర్కి చెందిన తిరువీధి చెన్నగిరిరావు వ్యాపారం చేస్తూ జీవిస్తుంటాడు. చెన్నగిరిరావుకు ఆర్బీఎల్ బ్యాంకులో క్రెడిట్ కార్డు ఉంది. ఆగస్టు 17న క్రెడిట్ కార్డు నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఎలాంటి ప్రమేయం లేకుండానే రూ.4.46 లక్షల నగదును బదిలీ చేసుకున్నారు. దీన్ని గమనించిన బాధితుడు చెన్నగిరిరావు దిక్కుతోచక అరండల్పేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యార్థులను ఇన్స్పైర్ చేసి బాల శాస్త్రవేత్తలుగా మార్చండి
డీఈఓ సలీమ్ బాషా గుంటూరు ఎడ్యుకేషన్: ఇన్స్పైర్ మానక్ వేదికను ఉపయోగించుకుని అన్వేషణాత్మక ఆలోచనలు కలిగిన విద్యార్థులను ఇన్స్పైర్ చేసి బాల శాస్త్రవేత్తలుగా ఎదిగే విధంగా ప్రోత్సహించాలని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీమ్ బాషా ఉపాధ్యాయులకు సూచించారు. మంగళవారం పాత బస్టాండ్ సెంటర్లోని జిల్లా పరీక్ష భవన్లో ఇన్స్పైర్ మానక్పై ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమావేశానికి జిల్లా సైన్స్ అధికారి షేక్ గౌసుల్ మీరా అధ్యక్షత వహించారు. డీఈఓ మాట్లాడుతూ ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల్లో గట్టి ఆలోచనలు ఉంటాయని, వాటికి పదును పెడితే బాల శాస్త్రవేత్తలు తయారవుతారని అన్నారు. స్థానిక సమస్యలకు పరిష్కారాన్ని చూపే వినూత్నమైన ప్రాజెక్టులను నామినేషన్లలో చోటు కల్పించాలని కోరారు. గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల నుంచి మూడు, ఉన్నత పాఠశాలలు, హైస్కూల్ ప్లస్ పాఠశాలల నుంచి ఐదు నామినేషన్లు తప్పనిసరిగా సమర్పించాలన్నారు. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ వినూత్న ప్రాజెక్టులనే ఎంపిక చేసి ప్రాజెక్టు తయారీకి రూ.10 వేలు చొప్పున అవార్డును ప్రకటిస్తారన్నారు. గుంటూరు ఉప విద్యాశాఖాధికారి జి.ఏసురత్నం మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం విద్యార్థుల్లో శాసీ్త్రయ విజ్ఞానాన్ని పెంపొందించాలని అన్నారు. కార్యక్రమంలో రీసోర్సు పర్సన్లు అప్పారావు, శివ శంకరరావు, మల్లికార్జునరావు, గంగాధర్, వెంకటేశ్వరరావు, భాస్కరరావు, గుంటూరు, తెనాలి డివిజన్ల నుంచి 200 మంది సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
టెట్ రద్దు డిమాండ్తో చలో విజయవాడ రేపు
గుంటూరు ఎడ్యుకేషన్: ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ రద్దు, నిబంధనల సడలింపు డిమాండ్లతో ఈనెల 3న చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. మంగళవారం చలో విజయవాడ విజయవంతం కోరుతూ మార్కెట్ సెంటర్లోని శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి ఉపాధ్యాయుల బైక్ ర్యాలీని ప్రారంభించారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ టెట్ను రద్దు, నిబంధనల సవరణ కోరుతూ జిల్లా, తాలూకా కేంద్రాల్లో నిరసనల ద్వారా ప్రభుత్వానికి నిరసన తెలియజేసినా, ఎటువంటి స్పందన లేదన్నారు. ఉపాధ్యాయును తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న ప్రత్యేక్ టెట్కు వ్యతిరేకంగా చలో విజయవాడకు పిలుపు ఇచ్చినట్లు చెప్పారు. ఉపాధ్యాయ వర్గం పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వం కళ్లు తెరిపించాలని పిలుపునిచ్చారు. తమిళనాడు రాష్ట్రం ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ అవసరం లేదని తీర్మానం చేసిన విషయం గుర్తు చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణ కమిటీ చైర్మన్, పీడీఎఫ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎం.హనుమంతరావు మాట్లాడుతూ సెప్టెంబర్ ఒకటి ఉద్యోగుల జీవితాల్లో చీకటి రోజు అని, పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి సీపీఎస్ అమల్లోకి తెచ్చిన రోజు అన్నారు. అధికారంలోకి రాకముందు సీపీఎస్ రద్దు చేస్తామని, అధికారంలోకి వచ్చాక హామీని తుంగలో తొక్కుతున్నారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం సీపీఎస్ రద్దుతో పాటు ఇన్ సర్వీసు టీచర్లకు టెట్ పరీక్ష రద్దుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. ర్యాలీలో రాష్ట్ర సహాధ్యక్షురాలు ఏఎన్ కుసుమ కుమారి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజ శేఖరరావు, ఎం.కళాధర్, జిల్లా సహాధ్యక్షులు జి.వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శులు జి.ఆదినారాయణ, గోవిందు, ప్రసాదు, రంగారావు, కోటిరెడ్డి, ప్రేమ్ కుమార్, వినోద్ పాల్గొన్నారు. -
గ్రంథాలయంలో తనిఖీలు
తాడేపల్లి రూరల్: తాడేపల్లిలోని శాఖా గ్రంథాలయాన్ని ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భీమనేని వందనాదేవి మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. గ్రంథాలయం పనితీరు, అందుబాటులో ఉన్న పుస్తకాలు, సౌకర్యాలపై పాఠకులతో ఆరా తీశారు. పాఠకులకు అవసరమైన పుస్తకాలను రీడర్స్ ఆన్ డిమాండ్ రిజిస్టర్లో నమోదు చేయాలని గ్రంథాలయ అధికారి షేక్ నాగుర్ బాషాకు సూచించారు. గ్రంథాలయానికి ఎక్కువ మంది పాఠకులు వచ్చేటట్లు, ఎక్కువ మంది సభ్యత్వం తీసుకునేటట్లు, చదువరులను ప్రోత్సహించాలని నాగుర్ బాషాకు ఆదేశించారు. రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూ స్వర్ణోత్సవాల సందర్భంగా 1976 నుంచి 2026 వరకు విశ్వవిద్యాలయం సాగించిన 50 ఏళ్ల ప్రస్థానాన్ని ప్రతిబింబించేలా ఫొటో ఎగ్జిబిషన్న్ను వర్సిటీ డైక్మన్ ఆడిటోరియంలో ఏర్పాటు చేశారు. ఏఎన్యూలో మంగళవారం ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్ను వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ కంచర్ల గంగాధరరావు, రెక్టార్ ప్రొఫెసర్ ఆర్ శివరాంప్రసాద్, ప్రొఫెసర్ జి సింహాచలం తదితరులు ప్రారంభించారు. వర్సిటీ ఆవిర్భావం నుంచి నేటి వరకూ సాధించిన ప్రగతి, విద్యా, పరిశోధన, క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో నమోదైన విజయాలు, ప్రముఖుల సందర్శనలు, ముఖ్యమైన కార్యక్రమాలు, విశ్వవిద్యాలయ అభివృద్ధికి సంబంధించిన కీలక ఘట్టాలను అరుదైన ఛాయాచిత్రాల రూపంలో ప్రదర్శనలో పొందుపరిచారు. పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది, ప్రస్తుత విద్యార్థులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. కార్యక్రమంలో ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ తేజోమూర్తి, ఫొటోగ్రాఫర్ సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అమరావతి: ప్రసిద్ధ శైవ క్షేత్రమైన అమరావతి అమరేశ్వరాలయంలో మూడు రోజులపాటు నిర్వహించే పవిత్రోత్సవాలను అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా మంగళవారం ప్రారంభించారు. మంగళవారం ఉదయం ఐదు గంటల నుంచి ఆలయ అవరణను శుద్ధిచేసి భక్తులకు ఎనిమిది గంటలకు స్వామివారి అభిషేకం అనంతరం దర్శనాన్ని కల్పించారు. అనంతరం అర్చకులు ప్రధాన, ఉపాలయాల మూర్తులకు స్నపనాభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. వేదపండితులు నవగ్రహామండ పారాధనతో దేవతలను అవాహన చేసి అగ్నిమదనంతో దీక్షాహోమాలు నిర్వహించారు. గురువారం పవిత్రోత్సవాలలో మండప పూజలు, దీక్షాహోమాలు, మూలమంత్ర హవన ములు, రుద్రహోమం, పవిత్రారోపణం, చండీహోమం నిర్వహిస్తామని ఆలయఅర్చకులు తెలిపారు. మంగళగిరి రూరల్: శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని హరేకృష్ణ గోకుల క్షేత్రం ఉపాధ్యక్షుడు విలాస దాస తెలిపారు. మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలోని అక్షయపాత్ర ఆవరణలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. తాడేపల్లి మండలం కొలనుకొండ గ్రామంలోని హరేకృష్ణ గోకుల క్షేత్రంలో ఈనెల 4వ తేదీ ఉదయం 8 గంటల నుంచి రోజంతా ప్రత్యేక దర్శనం, సంకల్ప అర్చన, మహాఅ భిషేకం, హరినామ సంకీర్తనం, భజనలు, కీర్తనలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, ఉట్టి ఉత్సవ్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్ధరాత్రి ప్రత్యేక అభిషేకం ప్రధాన ఆకర్షణగా నిలవనుందని తెలిపారు. -
బాపట్ల
బుధవారం శ్రీ 2 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026వైఎస్ఆర్.. ఆ పేరే ఒక ప్రభంజనం ఎవరూ చెరపలేని, మరువలేని, మరపురాని సజీవ సంక్షేమ సంతకం పేదింటి గుండె కోవెలలో నేటికీ ఆయన సజీవం అన్నదాతల చిక్కటి చిరునవ్వుల్లో ఆయన చిరునామా శాశ్వతం వైద్యులుగా, ఇంజినీర్లుగా మారిన పేదింటి బిడ్డల హృదయాల్లో ఆయన స్థానం చిరస్మరణీయం.. ఆయనంటే నమ్మకం.. ఆయనుంటే జనసందోహం ఉమ్మడి జిల్లాపై మహానేత మమకారం అనిర్వచనీయం.. జిల్లా అభివృద్ధిపై ఆయన ముద్ర అపురూపం నేడు మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం -
గోల్ షాట్బాల్ విజేతలకు సత్కారం
తెనాలి: భూటాన్లో జరిగిన ఇంటర్నేషనల్ గోల్ షాట్బాల్ సబ్–జూనియర్స్ బాయ్స్–గర్ల్స్ చాంపియన్షిప్లో భారత జట్లు రెండూ విజయం సాధించాయి. ఆగస్టు 24 నుంచి 27 వరకు నిర్వహించిన ఈ పోటీల్లో ఫైనల్స్లో రెండు విభాగాల్లోనూ భూటాన్ జట్లతో తలపడిన భారత జట్లు విన్నర్స్గా నిలిచాయి. స్థానిక సుల్తానాబాద్లోని సెయింట్ ఆన్స్ స్కూల్కు చెందిన నలుగురు బాలికలు, ముగ్గురు బాలురు చొప్పున రెండు జట్లలోనూ ఏడుగురు క్రీడాకారులు దేశం తరఫున ఆడారు. రెండు జట్లు విన్నర్స్గా నిలిచినందున ఆయా జట్లలో ఆడిన చిల్కా రుత్విక్ కిరణ్, పెదపల్లి సుహాస్, చుండూరు హర్షద్ గౌతమ్ దేవరకొండ అమూల్య, చుండూరు జెస్విత, దాసరి జెన్సినా జాయల్, చిలకా ప్రజ్ఞను సోమవారం సెయింట్ ఆన్స్ స్కూల్ యాజమాన్యం సత్కరించింది. అంతర్జాతీయ పోటీల్లో ఇంటర్నేషనల్ కోచ్గా స్కూల్ పీఈటీ ఎన్.వినోద్ కుమార్ మార్గనిర్దేశం చేశారు. విద్యార్థుల విజయానికి నిరంతరం ప్రోత్సాహం, సహకారం అందించిన తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. వీరి విజయం మరెందరో విద్యార్థులకు స్ఫూర్తి కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సిస్టర్ సౌమ్య, కరస్పాండెంట్ సిస్టర్ లీసా జార్జ్, పీఈటీలు వినోద్కుమార్, శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చందోలు(కర్లపాలెం): బాపట్ల జిల్లా చందోలు గ్రామంలో ప్రసిద్ధిగాంచిన బగళాముఖి అమ్మవారి ఆలయ హుండీ ఆదాయం రూ.9,69,418 వచ్చినట్లు ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కలకోట చక్రధర్రెడ్డి, ఈవో నరసింహమూర్తి తెలిపారు. సోమవారం అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు బాపట్ల దేవదాయ శాఖ డివిజన్ ఇన్స్పెక్టర్ గోపి ఆధ్వర్యంలో నిర్వహించారు. లెక్కింపులో ట్రస్ట్ బోర్డు సభ్యులు, భక్తులు, పలు భజన సమాజం సభ్యులు పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు చక్రధర్రెడ్డి, ఈవో నరసింహమూర్తి మాట్లాడుతూ 99 రోజుల తరువాత అమ్మవారి హుండీ లెక్కించినట్లు తెలిపారు. గతంలో కంటే ఈసారి రూ.2,03,834 అదనంగా వచ్చినట్లు తెలిపారు. అమరావతి: అమరేశ్వర ఆలయంలో మంగళవారం నుంచి మూడు రోజులపాటు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖరశర్మ సోమవారం పేర్కొన్నారు. యార్లగడ్డ ఉపేంద్ర, విజయలక్ష్మి దంపతుల నేతృత్వంలో జరిగే ఉత్సవాలలో మొదటి రోజైన మంగళవారం వేద పండితులచే ఉదకశాంతి, ఆలయ శుద్ధి, ప్రధాన ఉపాలయాల మూర్తులకు స్నపనాభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. రెండో రోజు బుధవారం మండప పూజలు, దీక్షా హోమాలు, మూలమంత్ర హవనములు, రుద్రహోమం, పవిత్రారోపణం, చండీహోమం మూడో రోజు గురువారం ప్రాయశ్చిత్తహోమం, పూర్ణాహుతి, మహదాశీర్వచనం ఉంటాయన్నారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 536.80 అడుగులకు చేరింది. కుడి కాలువకు 6,660, ఎడమ కాలువకు 7,029, ఎస్ఎల్బీసీకి 2 వేల క్యూసెక్కులు విడుదలవుతోంది. మొత్తం ఔట్ఫ్లోగా 15,689 క్యూసెక్కులు వెళుతోంది. శ్రీశైలం నుంచి సాగర్కు 1,259 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
నేటి నుంచి ఓపీ సేవలకు అరగంట విరామం
ప్రభుత్వ వైద్యుల సంఘం నేతలుగుంటూరు మెడికల్: రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నుంచి ప్రభుత్వ టీచింగ్ ఆసుపత్రుల్లో ఓపీ వైద్య సేవలకు అరగంటసేపు విరామం ఇచ్చి నిరసన తెలియజేస్తామని ప్రభుత్వ వైద్యుల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బాబ్జి శ్యామ్కుమార్, జనరల్ సెక్రటరీ డాక్టర్ స్వరూప్కాంత్లు తెలిపారు. తమ నిరసనలో భాగంగా సోమవారం గుంటూరు వైద్య కళాశాలలో ప్రభుత్వ వైద్యుల సంఘం నేతలు నల్లబ్యాడ్జీలు ధరించారు. ఫ్లెక్సీలు చేతపట్టుకుని నినాదాలు చేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విడతల వారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టినా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో సోమవారం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ను కలిసి సమ్మె నోటీసు అందజేశామన్నారు. అందులో భాగంగా మంగళవారం నుంచి వారం పాటు రోజూ అరగంటసేపు ఓపీ వైద్య సేవలకు విరామం ప్రకటిస్తామన్నారు. సెప్టెంబరు 8 నుంచి మధ్యాహ్నం ఓపీ సేవలు నిలిపి వేస్తామని, సెప్టెంబరు 15 నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో దశల వారీగా నిరసనలు తీవ్రం చేస్తామని వైద్యుల సంఘం నేతలు హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో జిల్లా సంఘం నేతలు డాక్టర్ అజయ్, డాక్టర్ రాజా, డాక్టర్ శివగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
మా గూడు కూల్చాలని చూస్తున్నారు
బాపట్లటౌన్: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కారవేదిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 54 మంది బాధితులు హాజరై తమ సమస్యలను నేరుగా ఎస్పీ, అడిషనల్ ఎస్పీకి విన్నవించుకున్నారు. బాధితుల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించిన ఎస్పీ బి.ఉమామహేశ్వర్, అడిషనల్ ఎస్పీ ఎల్. సుధాకర్ వెంటనే సంబంధిత సీఐ, ఎస్ఐలతో మాట్లాడి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదని బాధితులు వాపోతున్నారు. అర్జీలు స్వీకరించిన వారిలో రేపల్లె డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్, పీజీఆర్ఎస్ సెల్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు, ఎస్ఐ లక్ష్మీరాజ్యం పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
రేపల్లె: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందగా మరో ఇరువురు తీవ్ర గాయాలపాలైన సంఘటన పెనుమూడి రోడ్డులో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు కృష్ణాజిల్లా అవనిగడ్డకు చెందిన నడకుదుటి సాయిచరణ్ (22) తన ద్విచక్రవాహనంపై రేపల్లె నుంచి అవనిగడ్డ వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ట్రావెల్స్ బస్సును తప్పించబోయాడు. ఈ క్రమంలో అదుపు తప్పి ముందున్న కారును ఢీకొన్నాడు. ఢీకొన్న వేగంతో సాయిచరణ్ వెనుక నుంచి వస్తున్న మరో ద్విచక్ర వాహనంపై పడిపోయాడు. ఆ వాహనంపై ప్రయాణిస్తున్న దేవరపల్లి నాగయ్య, మోళ్లగుంట పీహెచ్సీలో సూపర్వైజర్గా పనిచేస్తున్న పార్వతికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్న్స్లో బాధితులను రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాయిచరణ్ మృతి చెందగా తీవ్రంగా గాయపడిన నాగయ్య, పార్వతిలకు ప్రథమ చికిత్సలు నిర్వహించి మెరుగైన చికిత్స కోసం గుంటూరు ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అశోక్కుమార్ చెప్పారు. ఇరువురికి తీవ్ర గాయాలు -
రెడ్ క్రాస్ సేవలకు స్వర్ణ పతకం
బాపట్ల: చిన్నతనంలో కన్న కలలు నేడు సాకారం కావడం ఎంతో సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ మండలాల నుంచి వచ్చిన వారి నుంచి జిల్లా కలెక్టర్ అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను చిన్నతనంలో చదువుకునే రోజుల్లో జిల్లా కలెక్టర్లు గవర్నర్ చేతుల మీదుగా అవార్డులు అందుకుంటున్న దృశ్యాలను టీవీలో చూసేవాడినని గుర్తుచేసుకున్నారు. తాను కూడా భవిష్యత్తులో అలా అవార్డు అందుకోవాలని కలలు కన్నానని చెప్పారు. ఆ కల నేడు సాకారం కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ సంవత్సరం బాపట్ల జిల్లాలో అత్యధిక సంఖ్యలో రెడ్క్రాస్ సభ్యులను చేర్పించడంలో జిల్లా అధికారులు, సిబ్బంది కృషికి గుర్తింపుగా మరో గోల్డ్ మెడల్ అందుకున్నట్లు తెలిపారు. గత సంవత్సరం జిల్లా ఫ్లాగ్ డే ఫండ్కు అధిక మొత్తంలో నిధులు సేకరించినందుకు స్వర్ణ పతకం లభించిందన్నారు. తిరుపతిలోని ఎస్వీఆర్ఆర్ ఆసుపత్రికి సంబంధించిన అన్ని రకాల ఫైళ్లను సకాలంలో క్లియర్ చేయడంలో చేసిన కృషికి కూడా గవర్నర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లవన్న, జిల్లా పంచాయతీ అధికారి ఎల్. ప్రభాకర్ రావు, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్. విజయమ్మ, డీఎఫ్ఓ పి. సౌజన్య తదితరులు పాల్గొన్నారు. పీజీఆర్ఎస్కు 152 అర్జీలు పీజీఆర్ఎస్లో అర్జీదారులు అందజేసిన సమస్యలకు పరిష్కారంచూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. మొత్తం 152 మంది తమ సమస్యలను తమ దృష్టికి తెచ్చారని తెలిపారు. అర్జీలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గత వారంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించిన భట్టిప్రోలు మండల తహసీల్దార్ నాగరాజును ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లవన్న, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్. విజయమ్మ, డీపీఓ ఎల్. ప్రభాకర్ రావు, సీపీఓ ఎ.ఎస్. రాజు, పీడీలు బి. సింగయ్య, విజయలక్ష్మి, ఆనంద్ సత్యపాల్, వెంకటేశ్వరరావు, రాధామాధవి, డీఈఓ శ్రీనివాస్, మార్క్ఫెడ్ డీఎం కరుణశ్రీ, డీసీహెచ్ఎస్ పద్మావతి, డీటీసీ పరంధామ రెడ్డి, ఆర్టీసీ ఆర్ఎం విమల, జీఎం డీఐసీ రామకృష్ణ, జిల్లా ఖజానా అధికారిణి పద్మావతి, జిల్లా పౌర సరఫరాల శాఖ డీఎస్ఓ జగన్మోహన్, గ్రామ వార్డు సచివాలయాల జిల్లా కోఆర్డినేటర్ యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. భూముల క్షేత్రస్థాయి సర్వేలో ఎదురయ్యే సమస్యలను అధిగమించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఆర్డీవోలు, మండల తహసీల్దార్లు, సర్వేయర్లతో సోమవారం ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయి సర్వే పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలను ఇబ్బంది పెట్టడం, కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. ప్రజా అభిప్రాయ సేకరణలో ఫిర్యాదులపై ఆయన ఆరా తీశారు. వేమూరు పెరవల్లి గ్రామం సర్వేయర్ ఎం. శిరీష, బాపట్ల మండలం మూలపాలెం సర్వేయర్ ఎన్. బాలాజీ, అనంతవరం సర్వేయర్ అన్వర్ బాషా, రేపల్లె సర్వేయర్పై అత్యధికంగా ఫిర్యాదులు రావడంతో నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో విచారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శేషగిరిరావు, అల్తాఫ్, బాపట్ల, చీరాల, రేపల్లె ఆర్డీవోలు హరికుమార్, నరసింహారావు, శ్రీదేవి, తహసీల్దార్లు, సర్వేయర్లు, తదితరులు పాల్గొన్నారు. -
గుంటూరు చానల్ను పొడిగించాలి
పర్చూరు (చినగంజాం): గుంటూరు చానల్ను పర్చూరు వరకు పొడిగించేందుకు ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టి పర్చూరు ప్రాంత గ్రామాల ప్రజలకు సాగు, తాగునీటికి శాశ్వత పరిష్కారం చూపాలని వైఎస్సార్ సీపీ ప్రకాశం, బాపట్ల జిల్లాల టాస్క్ఫోర్స్ పరిశీలకుడు, ప్రకాశం జిల్లా పార్టీ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. గుంటూరు చానల్ పొడిగించాలని కోరుతూ పర్చూరులో 15 రోజుల నుంచి రిలే నిరాహార నిరసన దీక్ష చేస్తున్న రైతుల శిబిరాన్ని ఆయన సోమవారం సందర్శించి రైతులకు సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దగ్గుబాడు చానల్ను అన్యాయంగా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తన పార్లమెంట్ పరిధి వరకు మాత్రమే అభివృద్ధి చేస్తున్నామని ముక్కలు చేయడం అన్యాయమన్నారు. దాని మొదట నామకరణమే దగ్గుబాడు చానల్ అని, పత్తిపాడు, పర్చూరు, దగ్గుబాడు వరకు ఏర్పాటు చేయాలన్నదే ముఖ్య ఉద్దేశమని, ఆ ఆలోచన ఇప్పటిది కాదని 50 సంవత్సరాల క్రితమే అన్ని పార్టీలకు సంబంధించిన ప్రజానాయకులు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకొని పర్చూరు ప్రాంత భూములు మెట్ట భూములుగా పరిగణించి దాన్ని దగ్గుబాడు వరకు పొడిగించాలని ప్రతిపాదించారని గుర్తు చేశారు. దగ్గుబాడు చానల్గానే అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసినట్లు చెప్పారు. దాన్ని ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ నందిపాడు వరకు 45 కిమీ ఆయన పార్లమెంట్ వరకే పరిమితం చేయడం ద్వారా పర్చూరు ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని, తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. పర్చూరు ప్రాంతాన్ని ముంపు బారి నుంచి తప్పించేందుకు నల్లమడ అభివృద్ధికి కొల్లా వెంకయ్య కృషి చేశారని, వారితో కలిసి భాగస్వామ్యులుగా నల్లమడ వాగు అభివృద్ధికి కృషి చేశామన్నారు. తాను పర్చూరు ఇన్చార్జ్గా ఉండి సాకి వాగు, నక్కల వాగు, డక్కుల వాగు, ఆలేరు వాగు, కొణికి వాగుల నుంచి వెల్లువ ఏర్పడి మునిగి పోతుండటంతో రూ.3 కోట్ల ఖర్చుతో కాపాడినట్లు చెప్పారు. వైఎస్సార్ సీపీ హయాంలో చానల్ను సర్వే చేయించి ఇంకొల్లు వరకు పొడిగించాలని అంచనాలను కూడా తయారు చేయించామని, అయితే బడ్జెట్ అదనంగా పెరుగుతుండటంతో అమలుకు నోచుకోలేదన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ ఇప్పటికై నా పర్చూరు ప్రాంత శాశ్వత పరిష్కార దిశగా దగ్గుబాడు చానల్ను పూర్తి స్థాయిలో నిర్మించాలని డిమాండ్ చేస్తున్నట్లు బత్తుల తెలిపారు. రైతుల దీక్షకు సంఘీభావం గంటూరు చానల్ను పర్చూరు వరకు పొడిగించాలని డిమాండ్ చేస్తూ నల్లమడ ప్రాంత రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష నిరసన కార్యక్రమం 16వ రోజుకు చేరింది. దీక్షా శిబిరాన్ని మాజీ ఎంపీ జేడీశీలం సోమవారం సందర్శించి దీక్ష చేస్తున్న రైతలకు సంఘీభావాన్ని తెలిపారు. పర్చూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ నల్లగొర్ల నాగజ్యోతి దీక్ష చేస్తున్న రైతులకు తన సంఘీభావాన్ని తెలియజేస్తూ పర్చూరు ప్రాంత ప్రజలు, రైతులు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సాగు, తాగునీటి పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. దీక్షలో పాల్గొన్న వారిలో డాక్టర్ కొల్లా రాజమోహనరావు, సింహదాటి సీతారామయ్య, తులసి శివనాగేశ్వరరావు, ఎం. గౌస్బాషా, జిలానీబాషా, ఎన్.శ్రీనివాసు, టి.జయరావు, దొప్పలపూడి నాగయ్య, చెన్నుపాటి సూర్యప్రకాశరావు, గోరంట్ల రంగారావు, ఎల్.వీరాంజనేయులు, రాంబాబు, తులసి సాంబశివరావు, తులసి శ్రీనివాసరావు, కృష్ణ, డి.మల్లికార్జునరావు, ఏ.సుందరరావు, గోరంట్ల భాస్కరరావు, తులసి శివనాగేశ్వరరావు, మత్తే డేవిడ్, తులసి శంకర్, సీహెచ్ శ్రీను, వనమా పేతురు, సయ్యద్ బాజీ, జి.రవిబాబు, ఎం.నూర్ద్దీన్ తదితరులు దీక్షలో పాల్గొన్నారు. అనంతరం తహసీల్దార్ పి.బ్రహ్మయ్యకు రైతులు వినతి పత్రం అందజేశారు. -
చలపతి యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ బీవీ చౌదరి బాధ్యతల స్వీకారం
తాడికొండ: చలపతి యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్గా ప్రొఫెసర్ బీవీ చౌదరి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. యూనివర్సిటీ చాన్స్లర్ డాక్టర్ వైవీ ఆంజనేయులు మాట్లాడుతూ ప్రొఫెసర్ బీవీ చౌదరికి విద్య, పరిశోధన, పరిపాలనా రంగాల్లో 30 ఏళ్లకుపైగా అనుభవం ఉందని, ఆయన ఐఐటీ న్యూఢిల్లీ నుంచి ఎంటెక్, పీహెచ్డీ పట్టాలను పొందారన్నారు. వెస్ట్ ఇండీస్లో సుమారు 25 సంవత్సరాల పాటు డీన్ ప్రొఫెసర్గా సేవలందించారని, నెదర్లాండ్స్, అమెరికా తదితర దేశాలను సందర్శించారని, పరిశోధనా రంగంలో విశేష కృషి చేసి 175 పరిశోధనా పత్రాలను ప్రచురించడంతోపాటు 15 మంది పీహెచ్డీ విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించారన్నారు. ఎస్టీసీ సభ్యుడిగా కూడా సేవలందించారని తెలిపారు. ప్రొఫెసర్ బీవీ చౌదరి మాట్లాడుతూ చలపతి యూనివర్సిటీని విద్యా, పరిశోధన, ఆవిష్కరణ రంగాల్లో మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. నాణ్యమైన విద్య, మెరుగైన పరిశోధనా అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ వై సుజిత్ కుమార్ వీసీకి అభినందనలు తెలిపారు. యూనివర్సిటీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని అన్నారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నాదెండ్ల రామారావు, డైరెక్టర్ డి వినయ్కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ కె నాగ శ్రీనివాసరావు, డీన్ డాక్టర్ కె కిరణ్కుమార్లు వైస్ ఛాన్స్లర్ను అభినందించారు. -
బొప్పరాజుపై వ్యాఖ్యలకు జేఏసీ ఖండన
బాపట్ల: ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతున్న బొప్పరాజుపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఏపీ జేఏసీ జిల్లా చైర్మన్ సి.హెచ్. సురేష్ బాబు అన్నారు. ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి ఉద్యమ కార్యాచరణ నోటీసును వందలాది మంది ఉద్యోగులతో కలిసి సోమవారం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్కు అందజేశారు. ఉద్యోగులను ఉద్దేశించి సురేష్ బాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లుపై మంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఉద్యోగ సంఘాల నాయకులపై విమర్శలు చేయడం వల్ల సమస్యలు పరిష్కారం కావన్నారు. బొప్పరాజు రాజకీయ అజెండాతో ఉద్యమం చేస్తున్నారనే వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం ఏదైనా ఉద్యోగుల సమస్యలు వినిపించడం ఆయన బాధ్యతగా నిర్వహిస్తున్నారన్నారు. బొప్పరాజుపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం ద్వారా ఉద్యోగుల సమస్యలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేయకూడదన్నారు. ప్రధానంగా మంత్రివర్గ ఉపసంఘం ముందు ఉద్యోగ సంఘాల తరఫున బొప్పరాజు ఉద్యోగుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని అనేక న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం ముందుంచిన విషయం తెలిసిందేనన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందనే ఆశతో తొలి దశ ఉద్యమ కార్యాచరణను మాత్రమే ప్రకటించి, స్పందన కోసం వేచి చూస్తున్న విషయాన్ని పాలకులు గుర్తించాలన్నారు. పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేయకుండా, చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం చూపించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళా విభాగం చైర్పర్సన్ పి. రజిని, కార్యదర్శి షేక్ హాజరాబేగం, జేఏసీ కో చైర్మన్లు బి. ఓంకార్, కె. మురళి మోహన్ రెడ్డి, డి. శ్రీకాంత్, హెచ్ఎంల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎ. కృష్ణారావు, ఆర్డబ్ల్యూఎస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బత్తుల బ్రహ్మారెడ్డి, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పి. రమేష్, ఆర్టీసీ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి. పెంచలయ్య, పి. కమలాకర్, రాజేంద్రప్రసాద్, కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి యు. శకుంతల తదితరులు పాల్గొన్నారు. -
బాపట్ల
మంగళవారం శ్రీ 1 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026పంచేయ్తీ నిధులకు రెక్కలు అడ్డగోలుగా వినియోగిస్తున్నారని ఆరోపణలుతాడికొండ: తుళ్లూరు మండలంలోని వేంకటపాలెంలో వేంకటేశ్వర ఆలయ నిర్మాణ పనులను టీటీడీ జేఈవో డాక్టర్ ఎ.శరత్ సోమవారం పరిశీలించారు. పంచాయతీల నిధులకు రెక్కలు వస్తున్నాయి. అటు నేతలు, ఇటు ప్రత్యేక అధికారులు అడ్డగోలుగా వినియోగిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. సాక్షి టాస్క్ఫోర్స్: కంచే నేను మేసిన చందంగా చీరాల ప్రాంతానికి చెందిన ఓ ముఖ్య నేత వ్యవహారం మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంచాయతీ కార్యాలయంలో విధులు నిర్వహించాల్సిన కొందరు సిబ్బంది రెండేళ్లుగా హాజరు కావడం లేదు. అదే సమయంలో సదరు ముఖ్యనేత కార్యాలయంలో పని చేస్తున్నారు. జీతాలను పంచాయతీ నిధుల నుంచే చెల్లిస్తున్నారనే ఆరోపణ స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇదీ అసలు సంగతి... వేటపాలెం మండలంలోని కొత్తపేట పంచాయతీ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ విధానంలో ఐదుగురు పనిచేస్తున్నట్లు రికార్డులో ఉంది. వీరు గ్రామ పంచాయతీలో విధులు నిర్వహించకపోయినా ప్రతి నెలా సుమారు రూ.15 వేల చొప్పున జీతాలు చెల్లిస్తున్నట్లు సమాచారం. పంచాయతీ రికార్డుల్లో వెండర్ ఐడీ నంబర్లు 10097 01033, 10970 0918 నమోదై ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ ఇద్దరితోపాటు మరో ముగ్గురుకి జీతాలు అందుతున్నాయి. రికార్డుల్లో జీతాలు డ్రా చేసినట్లు నమోదైన నేపథ్యంలో వాస్తవంగా వారు పంచాయతీ కార్యాలయంలో విధులు నిర్వహిసున్నారా.. లేక ఇతర కార్యాలయాలలో పని చేస్తున్నారా.. అనేది ఉన్నతాధికారులు తేల్చాల్సి ఉంది. కొంతకాలంగా పంచాయతీ నిధుల నుంచి జీతాల రూపంలో భారీ మొత్తాలు చెల్లించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారం అధికారిక రికార్డులను పరిశీలించి వాస్తవాలను నిర్ధారించాల్సిన అవసరం ఉంది. గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమానికి వినియోగించాల్సిన పంచాయతీ నిధులు నిబంధనలకు విరుద్ధంగా వినియోగించబడ్డాయా అనే దానిపై సమగ్ర ఆడిట్తోపాటు ఉన్నతస్థాయి విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు. జిల్లా అధికారి పాత్రపై ఆరోపణలు.. ఈ వ్యవహారానికి సంబంధించి జిల్లా స్థాయి అధికారుల సహకారం ఉందన్న అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ సిబ్బంది విధులకు హాజరు కాకుండా ఇతర కార్యాలయాల్లో పనిచేస్తున్నారనే విషయం అధికారుల దృష్టికి వచ్చినప్పటికీ చర్యలు తీసుకోలేదని తెలిసింది. జిల్లాలో పలు గ్రామ పంచాయతీలకు ఎన్నికై న పాలకవర్గాలు లేకపోవడంతో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. ఈ పరిస్థితిని కొందరు అధికారులు అనుకూలంగా మలుచుకుని ఆదాయ వనరులు అధికంగా ఉన్న పంచాయతీలపై పెత్తనం చెలాయిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మార్టూరు, కొత్తపేట వంటి పంచాయతీల్లో అధికారుల నుంచి జిల్లా అధికారికి ప్రతి నెలా భారీగా పర్సంటేజీలు వసూలు చేస్తున్నారని సమాచారం. ఇటీవల మార్టూరులో పంచాయతీ అధికారిపై ఫిర్యాదులు వెళ్లడంతో ఆయనను బదిలీ చేసినట్లు సమాచారం. ఇదే తరహాలో పలు ఆరోపణలు కొత్తపేట పంచాయతీపై కూడా వస్తున్నాయి. దీనిపై ఉన్నత అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కొత్తపేట పంచాయతీలో కొన్నేళ్లుగా జరిగిన ఉద్యోగుల హాజరు, జీతాల చెల్లింపులు, అవుట్ సోర్సింగ్ రిజిస్టర్లు, బ్యాంకు లావాదేవీలు, మస్టర్ రోల్స్, విధుల కేటాయింపులు, సంబంధిత అధికారులు ఆమోదాలను సమగ్రంగా పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే పంచాయతీ ఆదాయవ్యయాలపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించి వాస్తవాలను వెలుగులోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత అధికారులు, నిధులు పొందిన వ్యక్తులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
ఉద్యోగులు నా కుటుంబ సభ్యులు
బాపట్ల: ప్రభుత్వ ఉద్యోగులు తన కుటుంబ సభ్యులేనని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ అన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు ఎన్నో ఏళ్లుగా సేవలందించి ఉద్యోగ విరమణ చేస్తున్న ఉద్యోగుల సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ఆగస్టు నెలలో ఉద్యోగ విరమణ చేస్తున్న 53 మంది ఉద్యోగులను సోమవారం బాపట్ల కలెక్టరేట్లోని ఈటీసీ హాల్లో కుటుంబ సభ్యుల సమక్షంలో సన్మానించారు. కలెక్టర్ ఉద్యోగులను సత్కరించి, జ్ఞాపికలు అందజేసి వారి సేవలను కొనియాడారు. ఉద్యోగ విరమణ అనంతరం ప్రతి ఒక్కరూ ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఉద్యోగ జీవితంలో ఎదురైన అనుభవాలను గుర్తుచేసుకుంటూ ఇకపై కుటుంబం, ఆరోగ్యం, వ్యక్తిగత ఆసక్తులకు ఎక్కువ సమయం కేటాయించాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్వో లవన్న, డీఈవో శ్రీనివాస్ సింగ్, డీఎంహెచ్వో విజయమ్మ, మెప్మా పీడీ ఆనంద్ పాల్, కలెక్టరేట్ ఏవో మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ విరమణ చేస్తున్న 53 మందికి ఘన సన్మానం -
విజ్ఞాన్ చాన్సలర్కు ‘డిస్టింగ్విష్డ్ ఫెలో’ గౌరవం
చేబ్రోలు: మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ చాన్సలర్ పావులూరి సుబ్బారావుకు ప్రతిష్టాత్మకమైన ‘డిస్టింగ్విష్డ్ ఫెలో’ గౌరవం లభించింది. అంతరిక్ష రంగం, ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధికి ఆయన అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తిస్తూ ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) ఈ ప్రతిష్టాత్మక గౌరవాన్ని ప్రదానం చేసింది. చైర్మన్ లావు రత్తయ్య, వైస్ చైర్మన్ శ్రీకృష్ణదేవరాయలు, సీఈఓ మేఘన, వైస్ చాన్స్లర్ కేవీ క్రిష్ణకిషోర్ అభినందనలు తెలిపారు. ‘డిస్టింగ్విష్డ్ ఫెలో’ గౌరవం అందుకున్న డాక్టర్ పావులూరి సుబ్బారావు మాట్లాడుతూ, అంతరిక్ష, ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలకు తాను అందిస్తున్న సేవలను గుర్తించి ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఈ ప్రతిష్ఠాత్మక గౌరవాన్ని అందించడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందన్నారు. దాడి కేసులో నిందితుడికి ఏడేళ్ల జైలు గుంటూరు రూరల్: కత్తులు, చేతులతో దాడిచేసి మనిషిని గాయపరిచిన సంఘటనలో నిందితుడికి ఏడు సంవత్సరాల సాధారణ జైలు శిక్ష, రూ.10వేలు జరిమానా విధిస్తూ ప్రిన్సిపల్ అసిస్టెంట్స్ స్పెషన్ కోర్టు న్యాయమూర్తి టి.వి.రాజకుమార్ సోమవారం తీర్పు చెప్పారు. గోరంట్ల గ్రామానికి చెందిన పెండ్యాల సతీష్కుమార్పై అదే గ్రామానికి గోపినాధ్ కత్తి, చేతులతో దాడిచేసి విచక్షణా రహితంగా గాయపరిచాడు. సంఘటనపై 2022 ఆగస్టు 3న అప్పటి నల్లపాడు పోలీసు స్టేషన్ ఎస్ఐ జత్యానాయక్ కేసు నమోదు చేసి చార్జిషీట్ దాఖలు చేశారు. అనంతరం కోర్టులో వాదోపవాదాలు జరిగిన అనంతరం నిందితుడికి ఏడేళ్ల సాధారణ జైలు శిక్ష, రూ.10వేలు జరిమానా విధించారు. జరిమానా చెల్లించలేనిచో 30 రోజులపాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. కోర్టులో నేరం రుజువు చేయడంతో కృషి చేసిన ఇన్వెస్టిగేషన్ అధికారి అశోక్వాణి, పోలిసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. నిందితులకు ఆరు నెలల జైలు గుంటూరు లీగల్: గుంటూరు అమరావతి రోడ్డులోని ఇంటి ముందు నిలిపి ఉంచిన మోటార్ సైకిల్ను దొంగతనం చేసిన కేసులో నిందితులు ఇంజేపల్లి మేరిబాబు, యద్దనపూడి దీన భాస్కర్, బడుగు ప్రభుకుమార్లకు ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తూ ఆరవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి కె.లత సోమవారం తీర్పు చెప్పారు. కేసు విచారణాధికారి ఓ.ఆరోగ్యరాజు, అరండల్పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ని, కోర్టు మానిటరింగ్ సెల్ సీఐ ధర్మేంద్ర బాబుని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎ.ఆర్.పవన్కుమార్ని అధికారులు ప్రసంశించారు. గుంటూరు రూరల్: సరదాగా ఈతకు వెళ్లి కాలువలో ఊపిరాడక విద్యార్థి మృతి చెందిన సంఘటన నల్లపాడు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నల్లపాడు పోలీస్స్టేషన్ ఏఎస్ఐ మొహిద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. మేడికొండూరు మండలం పేరేచర్లకు చెందిన పోలుదాసు ప్రభాస్ (24) ఆరవ మైలు సమీపంలోని ఇండియన్ ఐటీఐ కళాశాలలో ఎలక్ట్రీషియన్ కోర్సు చదువుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం కళాశాల అనంతరం తోటి స్నేహితులు పది మందితో కలిసి కళాశాల సమీపంలో కాలువలో ఈతకు వెళ్లారు. స్నేహితులు అందరూ కాలువ కట్టపై ఆడుకుంటుండగా ప్రభాస్ కాలువలోకి ఈతకోసం దూకాడు. ఎంతసేపటికి పైకిరాకపోవటంతో స్నేహితులు కాపాడే ప్రయత్నం చేయగా కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు ప్రభాస్ మృతదేహాన్ని గజ ఈతగాళ్లతో వెతికించి వెలికి తీశారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
హత్య కేసులో నిందితుడి అరెస్టు
వేమూరు: మద్యం మత్తులో వ్యక్తిని హత్య చేసిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు రేపల్లె డీఎస్పీ అబ్దుల్ అజీజ్ వెల్లడించారు. వేమూరు పోలీసుస్టేషన్లో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. వేమూరు మండలం వెల్లబాడు గ్రామానికి చెందిన ఈపూరు యోహాన్, అదే గ్రామానికి చెందిన చరణ్ తేజకు లైబ్రరీ వద్ద శుక్రవారం వివాదం నెలకొంది. ఈ వివాదం తీవ్రతరం కావడంతో చరణ్ తేజ లైబ్రరీ ప్రక్కన ఉన్న ఇంటిలోకి వెళ్లి చాకు తీసుకొని వచ్చి యోహాన్ ఛాతీ వెనుక భాగంలో పొడిచాడు. దీంతో 108 వాహనం ద్వారా తెనాలి ప్రభుత్వం వైద్యశాలకు తీసుకొని వెళుతుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. 108 వాహనం తెనాలి ప్రభుత్వం వైద్యశాలకు తీసుకెళ్లారు. ప్రభుత్వం వైద్యశాల సిబ్బందికి ఈపూరు యోహాన్ శవం అప్పగించడం జరిగిందన్నారు. పోలీసులు పోస్టుమార్టం అనంతరం యోహాన్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. చరణ్తేజపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. సమావేశంలో వేమూరు రూరల్ సీఐ నఫీజ్ బాషా, ఎస్ఐ శ్రీనివాసరావు, హెడ్ కానిస్టేబులు బుల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరిటౌన్: క్వాంట మ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) రంగాల్లో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు అమరావతి క్వాంటమ్ వ్యాలీ మిషన్ చేస్తున్న కృషి అభినందనీయమని ముఖ్యమంత్రి కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్న పేర్కొన్నారు. మంగళగిరి మండలం నీరుకొండలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో సోమవారం అమరావతి క్వాంటమ్ వ్యాలీ మిషన్ ఆధ్వర్యంలో ‘మెంటార్ మ్యాపింగ్– క్వాంటమ్ ఇన్నోవేషన్ సెంటర్ బృందం ఏర్పాటు’ అంశంపై క్వాంటమ్, ఏఐ ఇన్నోవేషన్ వర్క్షాప్ నిర్వహించారు. వర్క్షాప్కు రాష్ట్రంలోని 21 జిల్లాల నుంచి 300 మందికి పైగా టెక్నాలజీ నిపుణులు, స్టార్టప్ సంస్థల ప్రతినిధులు, పరిశ్రమల భాగస్వాములు, కళాశాలల అధ్యాపకులు హాజరయ్యారు. పీఎస్ ప్రద్యుమ్న మాట్లాడుతూ టెక్నాలజీ రంగంలో అత్యంత వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో వాటికి అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని రంగాల్లోనూ ఏఐ కీలకంగా మారుతున్నందున పరిశోధనలను మరింత విస్తృతం చేయాలని సూచించారు. ఆంధ్రా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఆచార్య జీపీ రాజశేఖర్ మాట్లాడుతూ క్వాంటమ్ టెక్నాలజీ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఆంధ్రా వర్సిటీలో ఈ ఏడాది వీఎల్ఎస్ఐ డిజైన్ కోర్సు ప్రారంభించినట్లు తెలిపారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చ... అమరావతి క్వాంటమ్ వ్యాలీ మిషన్ డైరెక్టర్ సీవీ శ్రీధర్ పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మిషన్ లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణ, క్వాంటమ్ టెక్నా లజీ అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. కార్యక్రమంలో వర్సిటీ వైస్ చాన్సలర్ ఆచార్య సీహెచ్ సతీష్కుమార్, క్వాంటమ్ వ్యాలీ మిషన్ ప్రతినిధి తాడికొండ వెంకటస్వామి, క్వాంటమ్ ఇండియా–ఐబీఎం లీడ్ శేషరఘునాథన్, క్వాంటమ్ ఇండియా–టీసీఎస్ లీడ్ గ్రాడ్ఫ్రేమతాల్స్ పాల్గొన్నారు. రిటైల్ ఎకై ్సజ్ టాక్స్ను సర్దుబాటు చేయాలి గౌడ సంఘం వినతి మంగళగిరి టౌన్: మద్యం దుకాణాల లైసెన్స్దారులు వ్యాపారం నిర్వహించని రోజులకు ఎకై ్సజ్ శాఖకు చెల్లించిన ఆర్ఈటీ (రిటైల్ ఎకై ్సజ్ ట్యాక్స్) మొత్తాన్ని తదుపరి వాయిదా చెల్లింపుల్లో సర్దుబాటు చేయాలని గౌడ సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు మంగళగిరి ఆటోనగర్లోని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కార్యాలయంలో రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డైరెక్టర్ చామకూరి శ్రీధర్ను కలిసి సోమవారం వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ 2025లో మద్యం దుకాణాల కేటాయింపు కోసం నిర్వహించిన డ్రా సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కొన్ని జిల్లాల్లో డ్రా ప్రక్రియ 35 రోజుల పాటు వాయిదా పడిందని పేర్కొన్నారు. లెసెన్స్ పొందిన దుకాణదారులు వ్యాపారం ప్రారంభించకముందే ఆ 35 రోజులకు సంబంధించిన ఆర్ఈటీని చెల్లించి ప్రొవిజనల్ లైసెన్స్లు పొందాల్సి వచ్చిందన్నారు. వ్యాపారం నిర్వహించని కాలానికి చెల్లించిన మొత్తాన్ని దుకాణదారులు ప్రస్తుతం ఎకై ్సజ్ శాఖకు చెల్లిస్తున్న వాయిదాల్లో సర్దుబాటు చేయాలని, లేదా ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని వారు కోరారు. దీనివల్ల దుకాణదారులకు ఆర్థిక భారం తగ్గుతుందని తెలిపారు. జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు తుళ్లూరు శ్రీనివాసరావు, మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షుడు వాకా మాధవరావు గౌడ్, దుగ్గిరాల మండల అధ్యక్షుడు జూపల్లి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల నిరసన
బాపట్లటౌన్: వైద్యశాఖలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటాలు ఆగవని జిల్లా జేఏసీ సభ్యుడు కూరపాటి సత్యంరాజు తెలిపారు. శాంతియుత నిరసన కార్యక్రమంలో భాగంగా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సోమవారం భోజన విరామ సమయంలో బాపట్ల ఏరియా వైద్యశాల ఆవరణంలో నేలపై కూర్చొని నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కూరపాటి సత్యంరాజు మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం త్వరగా పరిశీలించి ఉద్యోగులకు న్యాయం చేయాలన్నారు. నిరసనలు శాంతియుతంగా సమస్యను పరిష్కరించేంతవరకు కొనసాగుతూనే ఉంటాయన్నారు. కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ అనూరాధ, ఫార్మాసిస్ట్ నళిని, శాంతి మనోజ, ల్యాబ్ టెక్నీషియన్ నీలిమా, బయోమెడికల్ ఇంజినీర్ నళినీకుమారి పాల్గొన్నారు. -
వెట్టి చాకిరి నుంచి బాలుడికి విముక్తి
చీరాల రూరల్: వెట్టిచాకిరీతో ఇబ్బందులు పడుతున్న ఓ బాలుడు ఆర్డీవో చొరవతో కార్మికశాఖ, షాడోస్ సంస్థ సహకారంతో విముక్తి పొందాడు. వివరాల్లోకి వెళ్తే.. వేటపాలెంలో ఓ బాలుడు గొర్రెల కాపరిగా గత కొన్నేళ్లుగా అనేక ఇబ్బందులు పడుతూ పనిచేస్తున్నాడని షాడోస్ సంస్థ నిర్వహకులు రాజా సాల్మన్ తెలిపారు. అయితే అతడు పడుతున్న కష్టాలను చూసిన సాల్మన్ అతడి కుటుంబ సభ్యులతో కలసి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేశాడు. స్పందించిన జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి ఆర్డీవోను పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. సోమవారం వేటపాలెంలో బాధిత బాలుడు పనిచేస్తున్న ప్రదేశానికి చీరాల కార్మికశాఖ అధికారి సుజాత, సాల్మన్, వేటపాలెం ఎస్సై జనార్దన్లు ఆర్డీవో నరసింహారావును తీసుకెళ్లారు. అక్కడ జరుగుతున్న వాస్తవ పరిస్థితులను పరిశీలించిన ఆర్డీవో విచారం వ్యక్తం చేశారు. తాను ప్రతిరోజు ఈ పనులు చేయలేకపోతున్నానని కాళ్ల వాపులు వచ్చాయని, అనారోగ్యానికి గురయ్యానని ఆ బాలుడు కన్నీళ్ల పర్యంతం అయ్యాడు. చలించిన ఆర్డీవో బాలుడు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా గుర్తించి తక్షణమే అతడిని అక్కడ నుంచి విముక్తి చేస్తున్నట్లు విడుదల ధ్రువపత్రాన్ని అందజేశారు. ఇకపై జాగ్రత్తగా ఉండాలని ఆర్డీవో బాలునికి సూచించారు. బాలునికి ప్రభుత్వం నుంచి అందివచ్చే వివిధ పథకాలను గురించి వివరించారు. బాలునికి తక్షణమే ప్రభుత్వ పధకాలను అందజేయాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. బాలునికి విముక్తి కల్పించడంలో ప్రత్యేక చొరవ చూపిన షాడోస్ నిర్వహకులు రాజా సాల్మన్ను ఆర్డీవో అభినందించారు. బాలునికి విడుదల ధ్రువపత్రం అందజేసిన ఆర్డీవో నరసింహారావు -
మాజీ మంత్రి అంబటిని పరామర్శించిన పిన్నెల్లి
మాచర్ల: ఇటీవల అస్వస్థతకు గురైన మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబును హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆదివారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అంబటి త్వరగా పూర్తిస్థాయిలో కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజా సేవలో పాల్గొనాలని ఆకాంక్షించారు. ఉత్సాహంగా కూడో జిల్లా స్థాయి పోటీలుగుంటూరు వెస్ట్(క్రీడలు): గుంటూరు జిల్లా కూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి టోర్నమెంట్ స్థానిక బీఆర్ స్టేడియంలో ఆదివారం నిర్వహించారు. అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఆర్.సిద్ధార్థ వర్మ మాట్లాడుతూ టోర్నమెంట్లో పతకాలు సాధించిన క్రీడాకారులను విశాఖపట్నంలో సెప్టెంబర్ 18, 19, 20 తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కోచ్ బ్లాక్ బెల్ట్ 7వ డాన్ డి.ప్రభాకర్ పాల్గొన్నారు. కరాటేతో క్రమశిక్షణ, ఆత్మరక్షణ మంగళగిరి టౌన్: కరాటేతో క్రమశిక్షణతోపాటు ఆత్మరక్షణ కూడా అలవాటు అవుతుందని ఎయిమ్స్(అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్)కు చెందిన డాక్టర్ శుభోదీప్ మిత్ర తెలిపారు. మంగళగిరి పట్టణంలోని స్వేచ్ఛ బుద్ధ విహార్లో ఆదివారం జపాన్ కరాటే అసోసియేషన్(జేకేఏ) క్యూ లెవల్ బెల్డ్ గ్రేడింగ్ టెస్ట్ పోటీలు నిర్వహించారు. శుభోదీప్ మిత్ర మాట్లాడుతూ కరాటే నేర్చుకుంటే విద్యార్థులకు శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం పెరుగుతాయని పేర్కొన్నారు జేకేఏ ఏపీ చీఫ్ ఇన్స్ట్రక్టర్ రవిబాబు, జోనల్ చీఫ్ ఇన్స్ట్రక్టర్ సాగరిక పాల్గొన్నారు. అమ్మవారి నగల కోసం చెత్తలో వెతుకులాట పెదకాకాని: శివాలయంలో మాయమైన భ్రమరాంబ వారి ఆభరణాల కోసం డంపింగ్ యార్డులో వెతకడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆగస్టు 14వ తేదీన పెదకాకాని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూలతోపాటు బంగారు ఆభరణాలు అలంకరించారు. 18న అమ్మవారి మంగళసూత్రం, నాన్తాడు కనిపించడం లేదని ఆలయ అర్చకులు అధికారుల దృష్టికి తెచ్చారు. అర్చకులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఐదుగుర్ని సస్పెండ్ కూడా చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు 17 రోజులు గడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం పోలీసులు, ఆలయ సిబ్బంది పర్యవేక్షణలో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు ఆభరణాల కోసం సంబంధిత చెత్త వేసే ప్రదేశంలో వెతికారు. నేడు జిల్లా కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ బాపట్ల: స్థానిక జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) సోమవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అర్జీలను స్వీకరించడం జరుగుతుందని చెప్పారు. ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్కు కాల్ చేయవచ్చునన్నారు. -
చెట్టును ఆటో ఢీకొని డ్రైవర్ మృతి
రేపల్లె: ఉదయం వెలుతురు పడకముందే ఒక ఇంటి దీపం ఆరిపోయింది. కొత్త జీవితానికి శ్రీకారం చుట్టిన యువకుడి ప్రయాణం ఒక్క క్షణంలో ముగిసిన విషాద ఘటన రేపల్లె మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని పెనుమూడి సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ యేమినేని నాగమహేష్ (32) మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. వాకావారిపాలెం గ్రామానికి చెందిన నాగమహేష్ రోజు మాదిరిగానే ఆదివారం తెల్లవారుజామున ప్రయాణికులను రేపల్లెలో దింపి ఆటోలో స్వగ్రామానికి బయలుదేరాడు. ఈ క్రమంలో పెనుమూడి సమీపంలో గంగడిపాలెం వెళ్లే రహదారి వైపు మర్రిచెట్టును ఢీకొన్నాడు. అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. నాగమహేష్కు ఆరు నెలల క్రితమే నిజాంపట్నం మండలం మహిళతో వివాహమైంది. వారి దాంపత్య జీవితం ఇలా మధ్యలోనే ముగియడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ‘ఇప్పుడే జీవితం మొదలుపెట్టాం.. ఇంత త్వరగా ఇలా జరుగుతుందని ఊహించలేదు’ అంటూ భార్య కన్నీరుమున్నీరుగా విలపించింది. కుటుంబసభ్యులు, బంధువుల విషాదం చూసిన చూపరులు సైతం కంటతడిపెట్టారు. నిద్రమత్తుగానీ, అలసట కారణంగాగానీ అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అశోక్కుమార్ తెలిపారు. -
భవిత భళా..!
తరగతి గదిలో ఉపాధ్యాయుడు బోధిస్తున్న పాఠంలో సందేహాలను నివృత్తి చేసుకోవడం సాధారణంగా విద్యార్థుల్లో కనిపించే లక్షణం. అదే తరహాలో చెట్టు నుంచి ఆపిల్ కింద పడితే అది ఎందుకు కింద పడిందని తనలో తాను ప్రశ్నించుకోవడం ద్వారా భూమికి ఆకర్షణ శక్తి ఉందని కనుగొన్న న్యూటన్ గొప్ప భౌతిక శాస్త్రవేత్తగా ఎదిగారు. శాస్త్ర, సాంకేతిక పరిశోధనలు, ఆవిష్కరణలతో ప్రపంచం గర్వించే శాస్త్రవేత్తగా నిలిచారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. సీవీ రామన్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య వంటి ఎంతో మంది ఈ జాబితాలో ఉన్నారు. ఇదంతా గతంగా మారుతోంది. సమాజంలో ప్రస్తుతం శాస్త్రవేత్తలు కనుమరుగు అవుతున్నారు. ఇంజినీరింగ్, మెడిసిన్ కోర్సులు తప్ప ఇక ఏవీ లేవనే ధోరణి పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో భావి శాస్త్రవేత్తలను సిద్ధం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. బాల మేధ..ఆసక్తి ఉండాలే కానీ వేల మంది శాస్త్రవేత్తలను తీర్చిదిద్దే విశ్వవిద్యాలయాలు, ప్రోత్సాహకాలు మన దేశంలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 22 ఐఐటీల్లో 10,250 సీట్లు భావి శాస్త్రవేత్తలకు ఉన్నాయి. 31 ఎన్ఐటీల్లో 18,750 సీట్లు ఉన్నాయి. ఇస్రో, నాసాల ద్వారా ఏటా వెయ్యి మందికి 15 రోజులపాటు ఉచిత శిక్షణ ఇస్తున్నాయి. దేశంలో పరిశోధనా రంగంలోనూ అనేక అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం రోబోటిక్ సైన్స్కు విశేష ఆదరణ ఉంది. మరోవైపు శాస్త్రవేత్తల కొరత తీవ్రంగా ఉంది. అది ఎంతగా అంటే దేశ జనాభాలో కేవలం నాలుగు శాతమే శాస్త్రవేత్తలు ఉన్నారు. నేటి విద్యార్థులు బంగారు భవిష్యత్తు సాధించడంతోపాటు దేశానికి మేలు చేయడానికి ఈ చక్కని అవకాశాలను ఉపయోగించుకోవచ్చు. గుంటూరు ఎడ్యుకేషన్: పాఠశాల స్థాయి విద్యార్థుల్లో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించి నూతన ఆవిష్కరణల దిశగా ప్రోత్సహించేందుకు కేంద్రం కృషి చేస్తోంది. శాసీ్త్రయ దృక్పథాన్ని పెంచి భవిష్యత్ శాస్త్రవేత్తలను తయారు చేసే లక్ష్యంగా విభిన్న కార్యక్రమాలను అమలు పరుస్తోంది. సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లు, వివిధ సమస్యలకు తమ మేధస్సుతో పరిష్కారం చూపగలిగే చిట్టిబుర్రల కోసం అన్వేషిస్తోంది. అలాంటి బాల మేధావులకు నేషనల్ సైన్స్ కాంగ్రెస్ చక్కటి వేదికగా మారుతోంది. దీని ద్వారా ఏటా అందించే నినాదంపై విద్యార్థులు తమ మేధస్సుతో చూపే పరిష్కార మార్గాన్ని నివేదిక రూపంలో తయారు చేసుకుని జిల్లాస్థాయిలో జరిగే సెమినార్లో దానిని న్యాయనిర్ణేతల ఎదుట చెప్పాలి. ఇందుకు గాను నేషనల్ సైన్స్ కాంగ్రెస్కు రిజిస్ట్రేషన్ గడువు సోమవారం ముగియనుంది. యువికా యువ శాస్త్రవేత్త యువికా పేరుతో యువ శాస్త్రవేత్తలను తీర్చిదిద్దేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. 9వ తరగతి స్థాయిలో విద్యార్థుల్లో అంతరిక్ష పరిశోధనపై ఆసక్తిని పెంపొందించడమే లక్ష్యంగా వివిధ ఇస్రో కేంద్రాల్లో రెండు వారాల రెసిడెన్షియల్ శిక్షణ నిర్వహిస్తున్నారు. విద్యార్థులు మోడల్ రాకెట్రీని నిర్మించడం, రోబోటిక్ కోడింగ్, డ్రోన్ ప్రదర్శనలు, అంతరిక్ష శాస్త్రవేత్తలతో నేరుగా సంభాషించడం ద్వారా ప్రత్యక్ష అనుభవాన్ని పొందుతారు. యువికా యంగ్ సైంటిస్ట్ కార్యక్రమానికి అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. విద్యార్థులకు ప్రయాణ, భోజన, వసతి ఖర్చులకు నిధులు కేటాయిస్తోంది. కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ సైట్లో యువికా యంగ్ సైంటిస్ట్కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఆవిష్కరణల కేంద్రంగా ఇన్స్పైర్ మానక్ కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం ఆధ్వర్యంలో ఏటా జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలలో ఇన్స్పైర్ మానక్ వైజ్ఞానిక ప్రదర్శనలు జరుగుతున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఏటా వేలాది చిట్టిబుర్రల్లో నూతన ఆలోచనలను రేకెత్తించి, భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు నిర్వహిస్తున్న భారీ కార్యక్రమంగా దీనిని చెప్పుకోవచ్చు. పాఠశాల స్థాయిలో ఇలాంటి ఆలోచనలకు బీజం వేసే బాధ్యతను ప్రధానోపాధ్యాయులతోపాటు సైన్స్ ఉపాధ్యాయులకు అప్పగించింది. తాజాగా 2026–27 విద్యాసంవత్సరానికి ఇన్స్పైర్ మానక్ రిజిస్ట్రేషన్లను ప్రారంభించిన కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం (డీఎస్టీ) ఆన్లైన్లో ప్రాజెక్టు నివేదికలను ఆహ్వానిస్తోంది. విద్యా, వైజ్ఞానిక, శాస్త్ర, సాంకేతిక, పర్యావరణ, అంతరిక్ష, వైద్య, ఆరోగ్య, వ్యవసాయ రంగాల వారీగా నూతన ఆవిష్కరణలకు దోహదం చేసే సమగ్ర నివేదికను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంది. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సెప్టెంబర్ 15వ తేదీ వరకు గడువు ఉంది. ప్రభుత్వ, జెడ్పీ, కేజీబీవీ, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్, సాంఘిక, సంక్షేమ పాఠశాలలు, హాస్టళ్లతో పాటు గుర్తింపు పొందిన ప్రైవేటు ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఆరు నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. తాము ఎంచుకున్న ప్రాజెక్టు పేరు, దాని వలన సమాజానికి జరిగే మేలు వంటి అంశాలతో ప్రాజెక్టు నివేదికను గైడ్ టీచర్ సహాయంతో సిద్ధం చేసుకుని ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. ప్రాజెక్టు తయారీకి రూ.10 వేల చొప్పున నిధులను కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తుంది. ఓ ఎగ్జిబిషన్లో తాము తయారు చేసిన ప్రాజెక్టులతో విద్యార్థులు (ఫైల్) బడుల్లోనే ల్యాబ్లు ఏర్పాటు చేసి ప్రయోగాలు నిర్వహించడం లక్ష్యంగా అటల్ టింకరింగ్ లాబొరేటరీస్ (ఏటీఎల్)ను అటల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా అమలు చేస్తున్నారు. ఇన్నోవేషన్ ల్యాబ్ల ఏర్పాటుకు పాఠశాలలకు గ్రాంట్లను అందిస్తుంది. విద్యార్థులు భావనాత్మక సిద్ధాంతాలను ఆచరణాత్మక ఆవిష్కరణలుగా మార్చడానికి త్రీడీ ప్రింటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, మైక్రో కంట్రోలర్లు, అధునాతన శాసీ్త్రయ కిట్ల గురించి తెలుసుకుంటారు. విద్యార్థినుల్లో శాసీ్త్రయ ఆలోచనలు రేకెత్తించి, ప్రతిభావంతులైన బాలికలను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన కార్యక్రమమైన విజ్ఞాన్ జ్యోతి. ఈ పథకం ద్వారా 9 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న ప్రతిభావంతులైన బాలికలు అర్హులు. శాసీ్త్రయ కౌన్సెలింగ్, నిపుణుల ఉపన్యాసాలు, మహిళా శాస్త్రవేత్తలతో ప్రత్యక్ష సంభాషణ, బాలికల్లో పరిశోధనాసక్తిని ప్రోత్సహించడం, సైన్స్ ల్యాబ్లు, రక్షణ అకాడమీలు, టెక్నాలజీ హబ్లకు పూర్తి నిధులతో కూడిన సందర్శనలు ఇందులో ఉన్నాయి. -
దళిత రైతుల సొసైటీ డొంక రోడ్డు అధ్వానం
భట్టిప్రోలు: మండల పరిధిలోని వెల్లటూరు పంచాయతీకి చెందిన ఉత్తర సంఘం కాలనీలో దళితులకు ప్రభుత్వం ఇచ్చిన సొసైటీ భూములకు వెళ్లే డొంకరోడ్డు అభివృద్ధి చేయడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ సీపీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర అధికార ప్రతినిధి వరికూటి అశోక్బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం రైతులతో కలసి డొంక రోడ్డును కాలినడకన పరిశీలించారు. తర్వాత అశోక్బాబు మాట్లాడుతూ ఉత్తర సంఘం దళిత రైతులకు ఇది జీవనాధారమని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఈ డొంక రోడ్డుకు మెరక పోయకపోవడంతో వర్షం వస్తే మోకాలి లోతు బురదలో పంటను మోసుకుని వెళ్లాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ట్రాక్టర్లు, వాహనాలు వెళ్లలేక పండించిన పంటను చేతులతో మోసుకుని మెయిన్ రోడ్డుకు చేర్చుతున్నారని చెప్పారు. మూడుసార్లు గెలిచానని చెప్పుకొనే ఎమ్మెల్యే నక్కా ఆనందబాబుకు ఈ పేద దళితుల కష్టం కనిపించడం లేదా.. అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏళ్లు గడుస్తున్నా ఒక్క డొంక రోడ్డును కూడా సరి చేయలేని దుస్థితిలో ఉందన్నారు. రైతు సంక్షేమం అంటూ గొప్పలు చెప్పుకొనే వారికి క్షేత్రస్థాయిలో రైతుల కష్టం తెలియడం లేదా అని అసంతృప్తి వ్యక్తం చేశారు. సొసైటీ డొంక రోడ్డు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో రైతులతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. -
రొయ్యయ్యో రైతులు
చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఆక్వా రైతులకు కష్టాలు రెట్టింపు అయ్యాయి. ఒకవైపు మేత ధరలు... మరోవైపు రొయ్యల కొనుగోలు ధరల మధ్య డాలర్ల పంటగా పిలుచుకునే ఆక్వా రైతులు నష్టాల్లో మునిగిపోతున్నారు. పంట చేతికొచ్చే సమయానికి కొనుగోలుదారులు సిండికేట్గా మారి ధరలను తగ్గించేస్తున్నారు. పెట్టుబడులు పెంచేలా చేసి, రాబడి తగ్గించే విధంగా కంపెనీలు చేస్తున్నప్పటికీ ఆక్వా రైతులు అప్పులు చేసి పంట సాగుకు పాట్లు పడుతున్నారు. రెండేళ్లుగా వరుస సంక్షోభాలతో గిట్టుబాటు కాక నష్టాల్లో మునిగిపోతున్నారు. వేటపాలెం: బాపట్ల జిల్లా పరిధిలో బాపట్ల, వేటపాలెం, చిన్నగంజాం మండలాల పరిధిలో 23,868 ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నారు. వీటిలో ఎక్కువగా రైతులు 70 శాతం టైగర్ రొయ్య, 30 శాతం వనామా రకం రొయ్యల సాగు చేస్తున్నారు. వనామా రకం రొయ్యలు ఎక్కువగా తెగుళ్ల బారిన పడుతుండటంతో గత ఏడాది నుంచి రైతులు టైగర్ రొయ్యలు సాగు చేస్తున్నారు. ఈ రకం రొయ్యలకు ధరలు పెరగడంతో ఎక్కువ మంది రైతులు దీని సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఈ రెండు రకాల సాగుతో స్థానిక రైతులు ఏటా రూ.వందల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తున్నారు. రెండోసారి పెంపు తాజాగా రొయ్యల మేత ధరలను ఆయా కంపెనీలు పెంచేశాయి. ఈసారి ఏకంగా వనామీ రొయ్యల మేత టన్నుకు రూ.5,700, టైగర్ మేతకు రూ.3,850 చొప్పున ధర పెంచుతూ ఆయా కంపెనీలు తమ డీలర్లకు లేఖలు రాశాయి. పెంచిన ధరలు సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీలు ప్రచారం చేస్తున్నాయి. దీంతో ఇప్పటికే పెరిగిన ధరలకు మరోసారి భారం తోడైంది. గత ఆరు నెలల కాలంలో మేత ధరలను పెంచడం ఇది మూడోసారి. సుమారు రూ.16 వేల తాజా పెంపుతో టన్ను ధర రూ.21,500కు చేరిందని రైతులు చెబుతున్నారు. ఆరు నెలల్లోనే మేత ధరలను మూడుసార్లు పెంచడంపై రైతులు మండిపడుతున్నారు. ఇంకా పెంచే యత్నం.. కంపెనీలే టన్నుకు రూ.15 వేల వరకు పెంచేందుకు సిద్ధంగా ఉన్నాయని ప్రతినిధులు చెబుతున్నారు. రైతుల నుంచి వ్యతిరేకత రాకుండా ముందుగా రూ.5,700 పెంచినట్లు చెబుతున్నారు. తరువాత దశలవారీగా ధరలు పెంచనున్నట్లు సమాచారం. వనామీ రొయ్యల మేత ధరలను కంపెనీలు ఇష్టానుసారంగా పెంచేస్తున్నా ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. ధరల పెంపుపై జిల్లాకు చెందిన రైతులు ఆందోళనలు చేస్తున్నా ఫలితం లేకుండా పోయింది. మేత కంపెనీలకు, కొనుగోలుదారుల సిండికేట్కు అడ్డుకట్ట వేయాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. మేత కంపెనీలకు చంద్రబాబు ప్రభుత్వం పరోక్షంగా అనుకూలంగా మారిందని రైతులు మండిపడుతున్నారు. రెండేళ్లుగా వరుస నష్టాలు ఇంత భారం మోస్తున్నా తమకు పంట అమ్మకంలోనూ ఊరట లభించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది అమెరికా సుంకాల ప్రభావం, తెగుళ్లతో నష్టపోయిన రైతులకు ఈ ఏడాది యుద్ధం పేరుతో కొనుగోలుదారులు కేజీ కౌంట్కు రూ.35 నుంచి రూ.40 వరకు ధరలు తగ్గించారు. తరువాత ధరలు పెంచినా, అది రైతుల వద్ద రొయ్యలు లేప్పుడు మాత్రమే.. అమెరికా, యూరప్లకు 30 నుంచి 70 కౌంట్ వరకు రొయ్యలు ఎగుమతి అవుతున్నప్పటికీ యుద్ధాన్ని సాకుగా చూపి ధరలు తగ్గించడం అన్యాయమంటున్నారు. రూ.100 కౌంట్ నుంచి 69 కౌంట్ వరకు ధరలు తగ్గించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజా పెంపుతో టన్నుకు రూ.5,700 అదనంగా చెల్లించాల్సి రావడంతో ఎకరాకు రూ.91,200 అదనపు భారం పడుతోంది. ఆరు నెలల్లో మొత్తం మేత ధర పెరుగుదల ప్రభావాన్ని లెక్కిస్తే ఎకరాకు సుమారు రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి రావడం గమనార్హం. -
చివరికి నష్టాలేనా..
తాడికొండలో ఎండిపోయిన వరి పైరువర్షాకాలం సీజన్ ప్రారంభమైనా చినుకు జాడ లేకపోవడంతో అన్నదాతలు ఆశలు ఆవిరవుతున్నాయి. తాడికొండ ఆయకట్టు ప్రాంతంలో వరి ఈ ఏడాది 700 ఎకరాల్లో సాగవుతోంది. రైతులు వెద పద్ధతిలో సాగు చేశారు. రెండు నెలలుగా వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం పైరు ఎండిపోతోంది. దీంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పెట్టుబడులు పెట్టి సాగుకు సన్నద్ధమైతే ఎల్నినో ప్రభావం తమ కొంప ముంచిందని వాపోతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇకనైనా స్పందించి ఆదుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు. – తాడికొండ -
భార్య అన్నం వండలేదని వృద్ధుడి ఆత్మహత్య
చీరాల: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన సంఘటన శనివారం స్థానిక ప్రసాద్ థియేటర్ సమీపంలో చోటుచేసుకుంది. వేటపాలెం నుంచి చీరాలకు వస్తున్న ఆటో.. ప్రసాద్ థియేటర్ సమీపంలోకి రాగా.. అదే సమయంలో రోడ్డుపైకి వస్తున్న జేసీబీ ముందు భాగం ఆటోకు బలంగా తగిలింది. ఆటోలో ప్రయాణిస్తున్న వేటపాలేనికి చెందిన షేక్ షమీమ్ (56)కు, ఆటోడ్రైవర్ సురేష్కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించగా తీవ్రగాయాలైన షేక్ షమీమ్ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆటోడ్రైవర్కు గాయాలు కావడంతో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు ఒన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎస్ఐఆర్ స్పెషల్ డ్రైవ్పై సమీక్ష
వేటపాలెం: స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి ఎస్ఐఆర్ఐ స్పెషన్ డ్రైవ్పై కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ విడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం సమీక్ష నిర్వహించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ప్రతి పోలింగ్ బూత్ సర్ ప్రక్రియపై నిర్వహిస్తున్న పకబ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఓటర్ల వివరాల పరిశీలన, 2002 ఓటర్ల జాబితాతో మ్యాపింగ్, నోటీసుల జారీ, విచారణ, ఫారం–6,7,8 దరఖాస్తుల పరిష్కారం తదితర అంశాలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జేసీ భావన, డీఆర్ఓ లవన్న తోపాటు, ఈఆర్ఓలు, ఏఆఆర్ఓలు, అదనపు ఏఈఆర్ఓలు, బీఎల్ఓలు, డీపీఓ, మున్సిపల్ కమిషనర్లు, ప్లానింగ్ సెక్రటరీ, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
స్పెషల్ టెట్ నిర్వహణపై స్పష్టత ఇవ్వాలి
రేపల్లె: స్పెషల్ టెట్ పేరుతో సాధారణ టెట్ నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్న్ (యూటీఎఫ్) చేపట్టిన ఆందోళనలో భాగంగా రేపల్లెలో ఉపాధ్యాయులు శనివారం బైక్ ర్యాలీ నిర్వహించారు. రేపల్లె ఏబీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ తాలూకా, రింగ్ రోడ్డు మీదుగా సాగింది. యుటిఎఫ్తో పాటు సీఐటీయూ, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని మద్దతు తెలిపారు. యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి శాంతారావు మాట్లాడుతూ టెట్లో అర్హత మార్కులను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు బోధించే సబ్జెక్టులకే పరీక్ష నిర్వహించాలని, పరీక్షను ఆఫ్లైనన్ విధానంలో నిర్వహించాలన్నారు. విద్యాశాఖలో అనేక సంవత్సరాలుగా సేవలందిస్తున్న సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షులు ఎం.బి.సుబ్రహ్మణ్యం, రేపల్లె మండల అధ్యక్షులు జి.సుబ్రహ్మణ్యం, సీఐటీయూ జిల్లా కోశాధికారి సీహెచ్.మణిలాల్, కార్యదర్శి వి.సుబ్బారావు, నాయకులు చుక్క కోటేశ్వరరావు, కే.రాంబాబు, గణపయ్య, రవీంద్ర, రాజుభూషణం తదితరులు పాల్గొన్నారు. మార్టూరు: హై టెన్షన్ విద్యుత్ వైరు తగిలి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని ఇసుక దర్శిలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన అవి వాహితుడు ఉయ్యూరు సురేష్ (31) కు తల్లిదండ్రులు లేకపోవడంతో అన్న, వదినతో కలిసి వడ్రంగం పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఉదయం ఐదు గంటల ప్రాంతంలో సురేష్ నిద్రలేచి సమీపంలోని వాగు వద్దకు బహిర్భూమి కోసం వెళుతున్నాడు. ఈ క్రమంలో స్థానిక డొంక రోడ్డు వద్ద తెగిపడి ఉన్న 11 కేవీ హై టెన్షన్ విద్యుత్ వైరును గమనించకుండా దానిపై కాలు వేయడంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్కు గురైన అక్కడికక్కడే మృతి చెందాడు. కొంతసేపటికి సురేష్ మృతదేహాన్ని గమనించిన స్థానికులు బంధువులకు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని సురేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్టూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతికి కారణం సుబాబుల్ కడ్డీల వాహనం గ్రామ సరిహద్దులోని డొంక రోడ్డు మరమ్మతుల్లో భాగంగా ఇటీవల గ్రావెల్తో ఎత్తు లేపారు. ఈ కారణంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న హై టెన్షన్ విద్యుత్ వైరు ఎత్తు తగ్గింది. సమీపంలోని పొలాల్లో సుబాబుల్ కర్రను లోడ్ చేసుకుని ఈ మార్గంలో వాహనం వెళ్లే క్రమంలో సుబాబుల్ కర్రలు తగిలి హై టెన్షన్ విద్యుత్ వైరు తెగి రోడ్డు పక్కన పడిపోయింది. శుక్రవారం రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగి కొంతసేపు విద్యుత్ ప్రసారం ఆగిపోయినప్పటికీ సంబంధిత శాఖ అధికారులు ఏం జరిగిందనే విషయం పరిశీలించకుండా తిరిగి విద్యుత్ ప్రసారాన్ని పునరుద్ధరించినట్లు స్థానికుల సమాచారం. విషయం తెలియని సురేష్ తన దారిన తాను వెళుతూ ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్ పై కాలు వేసి మృతి చెందాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గతవారం ఇదే ప్రదేశంలో సుబాబుల్ లోడు వల్ల విద్యుత్ వైరు ఇదే విధంగా తెగిపడటంతో ఆ శాఖ అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. గ్రామానికి లైన్ మెన్ లేకపోవడం మార్టూరుకు చెందిన లైన్మెన్కు అదనపు బాధ్యతలు అప్పగించడంతో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నట్లు స్థానికులు విమర్శిస్తున్నారు. -
అగ్గి పెట్టె కోసం ఘర్షణ
కత్తితో దాడి–వ్యక్తి మృతి వేమూరు: అగ్గి పెట్టె అడిగితే ఇవ్వలేదని కత్తితో దాడి చేయగా ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాలు.. వేమూరు మండలం వెల్లబాడు గ్రామానికి చెందిన ఈపూరు యోహాన్(46) శుక్రవారం రాత్రి 10 గంటలకు మద్యం తాగి లైబ్రరీ వద్ద ఉన్నాడు. అదే గ్రామానికి చెందిన చెదుర్తి చరణ్తేజ లైబ్రరీ వద్దకు వచ్చాడు. యోహాన్, చరణ్ తేజను అగ్గి పెట్టె అడిగాడు. ఇద్దరు మధ్య గొడవ జరిగింది. యోహాన్ తరపున కొంత మంది వచ్చి చరణతేజను కొట్టారు. చరణ్ తేజ పక్కన ఉన్న ఇంటిలోకి వెళ్లి చాకు తీసుకొని వచ్చి యోహాన్ ఛాతీ వెనుక భాగంలో పొడిచాడు. గ్రామస్తులు 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. 108 వాహనంలో యోహాన్ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. గ్రామస్తులు సమాచారం మేరకు పోలీసులు గ్రామానికి వెళ్లి వివరాలు సేకరించారు. చరణ్తేజ తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. మృతుడి భార్య, కుమారుడు దివ్యాంగులన్నారు. -
మాతృ భాషాభివృద్ధితోనే రాష్ట్ర ప్రగతి సాధ్యం
సంఘం అధ్యక్షులు తిమ్మన శ్యామ్ సుందర్ బాపట్ల: దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ లో తెలుగు భాషాభివృద్ధిలో వెనకబాటుతనం కనిపిస్తుందని, ముఖ్యంగా 11వ శతాబ్దం వరకు ఒకే లిపితో కొనసాగిన తెలుగు, కన్నడ భాషలలో ఈ వైరుధ్యం స్పష్టంగా కనిపిస్తుందని బాపట్ల జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు తిమ్మన శ్యామ్ సుందర్ అన్నారు. స్థానిక జిల్లా గ్రంథాలయంలో తెలుగు భాష దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కన్నడ భాషాభివృద్ధికి అక్కడి ప్రభుత్వం ప్రముఖ స్థానాన్ని ఇవ్వటమే కాకుండా అభివృద్ధికి ప్రత్యేకంగా దోహదపడుతుందని పేర్కొన్నారు. తెలుగువారికి ఆంగ్ల భాష మీద ఉన్న వ్యామోహం తెలుగు భాషాభివృద్ధికి ప్రతిబంధకమవుతుందని, ప్రాథమిక విద్య నుంచి బాలలకు తెలుగు భాషపై అవగాహన కల్పిస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందని సూచించారు. తెలుగు అకాడమీ, తెలుగు సారస్వత పరిషత్తులను పునరుద్ధరించి ఆ సంస్థలకు తగిన నిధులను సమకూర్చడం తక్షణ అవసరమని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశలో ఇతర రాష్ట్రాల కంటే ముందంజలో ఉన్నప్పటికీ మాతృభాష అభివృద్ధిపై కూడా దృష్టి సారిస్తే రాష్ట్రం సాంస్కృతికంగా ఎదిగి త్వరితగతిన అభివృద్ధికి చేరుకుంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కవి సమ్మేళనంలో ప్రముఖ కవులు ఎం.మాల్యాద్రిరావు, సంగాని శ్రీరాములును ఘనంగా సత్కరించారు. తొలుత వ్యవహారిక తెలుగు భాష ఉద్యమ నేత గిడుగు రామమూర్తికి ఘన నివాళులర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ విమర్శకులు రచయిత లక్కాకుల వెంకటరావు పాల్గొనగా గ్రంథాలయ అధికారి శివాజీ గణేషన్, పోలాసం వీరాంజనేయులు, షేక్ బాబావలి, ఆక్సి పాల్గొన్నారు. -
అప్పుల ఒత్తిడి.. ఉద్యోగి బలవన్మరణం
చిలకలూరిపేటటౌన్:అప్పుల ఒత్తిడితో అపార్టుమెంట్ లో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన పట్టణంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం..ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం గురిజేపల్లి గ్రామానికి చెందిన నేరెళ్ల ఏడుకొండలు(32) కుటుంబంతో ఉపాధి నిమిత్తం నాలుగేళ్ల కిందట చిలకలూరిపేట వచ్చారు. ఆర్టీసీ బస్స్టాండ్ వెనుక ఎన్వీ నారాయణపురంలోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. నాటి నుంచి గ్రానైట్ కంపెనీలో పనిచేస్తున్న ఏడుకొండలకు సుమారు రూ.20 లక్షల వరకు అప్పులు ఉన్నట్లు సమాచారం. తీవ్ర మనస్తాపానికి గురవుతున్న ఆయన రెండు నెలలుగా విధులకు వెళ్లడం లేదు. శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో వారు అక్కడికి చేరుకున్నారు. ఏడుకొండలుకు భార్య సాగరికతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. -
క్రీడాస్ఫూర్తితో యువత ముందుకు సాగాలి
బాపట్ల: యువత క్రీడా స్ఫూర్తితో ముందుకుపోవాలని డాక్టర్ ఎన్టీఆర్ వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం.సర్దార్ బేగ్ పేర్కొన్నారు. హాకీ క్రీడాకారుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత మేజర్ ధ్యాన్చంద్ జయంతి కార్యక్రమం స్థానిక కళాశాలలో శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మేజర్ ధ్యాన్చంద్ భారత హాకీకి అందించిన విశిష్ట సేవలు, ఆయన అద్భుతమైన క్రీడా ప్రతిభ, క్రమశిక్షణ, దేశభక్తి నేటి యువతకు గొప్ప స్ఫూర్తిదాయకమని అన్నారు. క్రీడలు కేవలం శారీరక దృఢత్వాన్ని పెంపొందించడమే కాకుండా, విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సమష్టి కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసం, క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తాయని తెలిపారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతిరోజూ కొంత సమయాన్ని శారీరక వ్యాయామం, క్రీడలకు కేటాయించాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ అశోక్ కుమార్, బోధన సిబ్బంది డాక్టర్ రవిబాబు, డాక్టర్ రామిరెడ్డి, డాక్టర్ శ్రీనివాసులరెడ్డి, డాక్టర్ విష్ణువర్ధన్, డాక్టర్ రాజ్కిరణ్, బోధనేతర సిబ్బంది విజయ కుమారి, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. యడ్లపల్లిలో... చుండూరు(వేమూరు): ప్రతి పాఠశాలల్లో మాతృ భాషకు ప్రాధాన్యమివ్వాలని జిల్లా విద్యా శాఖ అధికారి డి.శ్రీనివాస్ తెలిపారు. చుండూరు మండలం యడ్లపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం తెలుగు భాష, జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహించారు. తల్లిదండ్రులను వృద్దాశ్రమాల్లో చేర్చవద్దని, సెల్ఫోన్ వల్ల కలిగే నష్టాలు స్కిట్ని విద్యార్థులు ప్రదర్శంచారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్బంగా పాఠశాలలో పోటీలు నిర్వహించి విజేతలకు సర్టిఫికెట్, మెడల్స్ అందజేశారు. డీఈఓ మాట్లాడుతూ పాఠశాల అన్ని రంగాల్లో ముందు ఉంటుందన్నారు. జిల్లా బెస్ట్ పాఠశాలగా గుర్తింపు పొందడం జరిగిందన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కుర్రా శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు బిట్రా వెంకటసుబ్బారావు, ఐ సామ్రాజ్యం, డి నాగరాజు, ప్రసాద్బాబు, అప్పారావు, నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, ఇందిరాదేవి, వాణి, శుభ్రశ్రీ, విజయనిర్మల, రాంబాబు, నవీన్, వంశీ, తిరుపతిరావు, శాండీ వసంత, జాన్వెస్లీ, విద్యార్థులు పాల్గొన్నారు. వ్యవసాయ కళాశాలలో... శారీరక దృఢత్వంతోపాటు మానసిక స్థైర్యాన్ని నింపే ఏకై క రంగం క్రీడా రంగమని, ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం ఒక గంటపాటు క్రీడా మైదానంలో తమకు నచ్చిన క్రీడను సాధన చేయడం ద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలని బాపట్ల వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పి.ప్రసూన రాణి అన్నారు. వ్యవసాయ కళాశాలలో శనివారం జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
వేగ గణితం.. విద్యార్థులకు వరం
గుంటూరు ఎడ్యుకేషన్: వేద గణిత విజ్ఞాన శాస్త్రం శాసీ్త్రయ నామం వేదిక్ మ్యాథ్స్. కఠినమైన లెక్కలను సులువుగా పరిష్కరించగలిగే ప్రాచీన విధానం. పాఠశాల స్థాయి నుంచి పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇది ఒక అస్త్రం. తల్లిదండ్రులు శిక్షణ సంస్థల కోసం అన్వేషిస్తున్నారు. పదో తరగతి తరువాత ఇంటర్తోపాటే విభిన్నమైన పోటీ పరీక్షలకు ఏకకాలంలో సన్నద్ధం కావాల్సిన పరిస్థితి నేడు నెలకొంది. గణితం ఆధారంగా ప్రతిభ చూపాల్సిన విద్యార్థులకు వేద గణితశాస్త్రం ఆయుధంగా మారింది. వేదిక్ మ్యాథ్స్ అంటే.. పూరి పీఠాధిపతి జగద్గురు భారతీకృష్ణ తీర్థస్వామి 1957లో రాసిన వేదిక్ మ్యాథ్స్ పుస్తకం ద్వారా వేద గణితశాస్త్రాన్ని వెలుగులోకి తెచ్చారు. వేదాల్లోని పలు సూత్రాలు, సిద్ధాంతాల ఆధారంగా ఆయన రూపొందించిన గణిత పద్ధతులు ఇందులో ఉన్నాయి. పుస్తకంపై ముద్రణా హక్కులు పొందిన ఢిల్లీకి చెందిన మోతీలాల్ బనారసీ దాస్ పబ్లిషర్స్ ఈ పుస్తకం ప్రచురించింది. ప్రస్తుతం మార్కెట్లోని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాల్లో ఒరిజినల్ ఎడిషన్ దొరుకుతోంది. వేదాల నుంచి ... వేద గణితం అంటే వేదాల నుంచి ఆవిర్భవించిన విజ్ఞానం. ఇందులో 16 సూత్రాలు, 13 ఉప సూత్రాలు ఉన్నాయి. వీటి ద్వారా గుణాకారాలు, భాగాహారాలు, కారణాంక విభజన, దశాంశ భిన్నాలు, పాక్షిక భిన్నాలు, ఆవర్తన దశాంశాలు, వర్గాలు, ఘనాలు, ఘనమూలాలు, బీజగణిత సమస్యలకు సులువుగా సమాధానం చెప్పవచ్చు. సింగిల్ లైన్ జవాబుగా మౌఖికంగా చేసే పద్ధతులు, కాలిక్యులస్, త్రికోణమితి వంటి పరిశోధనాంశాలు ఉన్నాయి. విదేశాల్లో ఒక సబ్జెక్టు మనదేశంలో పుట్టిన వేద గణితశాస్త్రం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. లండన్, హాలెండ్ దేశాల్లో ఇది తప్పనిసరి సబ్జెక్టు. విద్యార్థుల ఆసక్తి మేరకు స్వల్పకాలిక వ్యవధిలో శిక్షణ కల్పిస్తుండగా, పూర్తిస్థాయిలో సబ్జెక్టుగా బోధించాలని గణిత మేధావులు కోరుతున్నారు. వేద గణితం అనగానే ఒక మతానికి సంబంధించిన విషయం అనుకుంటారు. అది తప్పు. భారతీకృష్ణ తీర్థస్వామి తన పుస్తకానికి పెట్టుకున్న పేరే తప్ప, ఇందులో ఉన్నదంతా గణిత విజ్ఞానమే. అసలు వేద గణిత శాస్త్రాన్ని బోధించగలిగే ఉపాధ్యాయులు సైతం వేళ్లపై లెక్కించే స్థాయిలోనే ఉన్నారు. వేద గణితంలో కఠిన లెక్కలను సైతం సులభంగా చేయగల నేర్పరితనం అలవడుతుంది. చిరు ప్రాయంలోనే శిక్షణ పొందితే, ఎదిగే కొద్దీ వేద గణితంపై పట్టు నిలుపుకుని అద్భుతాలు ఆవిష్కరించగలరు. వేద గణితశాస్త్రాన్ని సాధన చేయడం ద్వారా మేధస్సు వృద్ధి చెందుతుంది. క్లిష్టమైన లెక్కలను సులువుగా పరిష్కరించగలిగే నైపుణ్యం అలవడుతుంది. పోటీ పరీక్షలు, ఉద్యోగ అర్హత పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఉపయోగకరం. గణితంలో అవధానాలు చేయాలనుకునే వారికి వేద గణితం తప్పనిసరి. వేదిక్ మ్యాథ్స్ను పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలని గణితశాస్త్ర మేధావులు కోరుతున్నారు. అబాకస్ శిక్షణ కల్పిస్తున్న పలు సంస్థలు వేదిక్ మ్యాథ్స్ను కూడా బోధిస్తున్నాయి. విశ్వ పునర్నిర్మాణ్ సంఘ్, రాష్ట్రీయ వేద ప్రతిష్ఠాన్, స్పిరిట్యువల్ స్టడీస్ గ్రూప్, విద్యాభారతి, వేద భారతి మొదలైన సంస్థలు దేశవ్యాప్త శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాయి. వేద భారతి ఇంటర్నెట్ ద్వారా శిక్షణ ఇస్తోంది. ఒరిజినల్ పుస్తకాన్ని ముద్రించిన సంస్థ పాఠశాల స్థాయిలో విద్యార్థులకు అర్థమయ్యే విధంగా బోధించేందుకు వీలుగా పలు పుస్తకాలను అందుబాటులోకి తెచ్చింది. -
‘నీట్ పీజీ’ పకడ్బందీగా నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ బాపట్ల: నీట్ పీజీ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. పరీక్ష పర్యవేక్షణ జిల్లా స్థాయి కమిటీ సమావేశం శనివారం స్థానిక కలెక్టరేట్లో జరిగింది. సమగ్ర ప్రణాళిక, నిబద్ధతతో విధులు నిర్వహించాలని కలెక్టర్ చెప్పారు. 30వ తేదీన ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. వేటపాలెంలోని సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కళాశాలలోని రెండు కేంద్రాలలో పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 496 మంది అభ్యర్థులు హాజరు అవుతారన్నారు. పరీక్ష కేంద్రాలకు జిల్లా నోడల్ అధికారిగా చీరాల ఆర్డీవో నరసింహారావును నియమించినట్లు తెలిపారు. ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం నుంచి ఇద్దరు సీనియర్ అధికారులు పరీక్షను పర్యవేక్షిస్తారని చెప్పారు. చీరాల ఆర్డీవో నరసింహారావు, సీపీడీసీఎల్ ఎస్ఈ ఆంజనేయులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇన్చార్జి అధికారి సోమల నాయక్, కలెక్టరేట్ ఏవో మల్లికార్జునరావు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
విద్యారంగ పరిరక్షణకు ఉద్యమించాలి
● సీఐటీయూ పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ్ కుమార్ సత్తెనపల్లి: విద్యారంగ పరిరక్షణకు భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఉద్యమించాలని సీఐటీయూ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు గుంటూరు విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. పట్టణంలోని పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం జరిగిన ఎస్ఎఫ్ఐ సత్తెనపల్లి నియోజకవర్గ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. మహాసభకు అధ్యక్ష వర్గంగా ఎస్ఎఫ్ఐ నాయకులు రియాజ్, డి. అమూల్య, వెంకీలు వ్యవహరించారు. విజయ్ కుమార్ మాట్లాడుతూ విద్యారంగ ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు పాలకులు చదువును దూరం చేస్తున్నారన్నారు. క్రీడలకు ప్రైవేట్ విద్యాసంస్థలు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. ఎస్ఎఫ్ఐ పల్నాడు జిల్లా కో కన్వీనర్ డి. అమూల్య గత కార్యకలాపాల నివేదికను మహాసభలో ప్రవేశపెట్టారు. ప్రతినిధులు చర్చలు జరిపి ఏకగ్రీవంగా ఆమోదించారు. కార్యచరణ ప్రణాళికను రూపొందించారు. పలు తీర్మానాలను భువనేశ్వరి, నవీన్లు ప్రవేశపెట్టగా, అమతవర్షిణి బలపరిచారు. మహాసభ ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు. 22 మందితో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్ష, కార్యదర్శులుగా షేక్ రియాజ్, జె. సాయికుమార్, ఉపాధ్యక్షులుగా భువనేశ్వరి, అమృతవర్షిణి, సహాయ కార్యదర్శులుగా జానీ శంకర్, ఆగస్టిన్, వెంకీ, కమిటీ సభ్యులుగా నవీన్, దిలీప్, వెంకటేష్, సుధాకర్, లక్ష్మయ్య, ప్రశాంత్, లిఖిత, శ్రీవిద్య, ఆంజనేయులు, భార్గవి, దావీదు, నవీన్, బాషా, దిలీప్, అల్తాఫ్, సంజయ్ మనోహర్లను ఎన్నుకున్నారు. పరిశీలకులుగా ఎస్ఎఫ్ఐ పల్నాడు జిల్లా కన్వీనర్ సాయి హాజరయ్యారు. కౌలు రైతు సంఘం సత్తెనపల్లి మండల కార్యదర్శి పి. మహేష్, ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు నీరుకొండ కృష్ణ, ఐద్వా జిల్లా ఉపాధ్యక్షులు గద్దె ఉమాశ్రీలు సందేశం ఇచ్చారు. ముందుగా ఎస్ఎఫ్ఐ జెండాను షేక్ రియాజ్ ఆవిష్కరించారు. నాయకులు అభిలాష్, ఆసిఫ్, సీఐటీయూ సత్తెనపల్లి పట్టణ కన్వీనర్ జె. రాజకుమార్ నాయకత్వం వహించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
నీట్ పీజీ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
నగరంపాలెం: జిల్లాలోని ఆరు కేంద్రాల్లో ఈ నెల 30వ తేదీన నీట్ పీజీ దృష్ట్యా పటిష్ట పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనున్న పరీక్షకు హాజరయ్యే 784 మంది అభ్యర్థులు నిర్ణీత వేళకు చేరుకోవాలని సూచించారు. ఉదయం 8.30 గంటల తర్వాత కేంద్రాల్లోకి అనుమతించరని చెప్పారు. ఆయా కేంద్రాల వద్ద ప్రత్యేక బందోబస్త్తోపాటు నిరంతర నిఘా ఉంటుందని పేర్కొన్నారు. కేంద్రాల సమీపాన జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని సూచించారు. పరీక్షకు సంబంధించి తప్పుడు వార్తలు, వదంతులు సోషల్ మీడియాలో ప్రచారం చేసినా, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడినా, పరీక్షల నిర్వహణకు ఆటంకం కలిగించినా సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. ప్రశాంతంగా నిర్వహించాలి గుంటూరు వెస్ట్: నీట్ పీజీ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి షేక్ ఖాజావలి అన్నారు. పరీక్షకు సంబంధించి అన్ని శాఖల అధికారులతో శనివారం స్థానిక కలెక్టరేట్ నుంచి వీసీ ద్వారా సమీక్షించారు. అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత తహసీల్దార్లకు సూచించారు. -
ఇసుకలోనూ అదే దోపిడీ!
బాపట్లఆదివారం శ్రీ 30 శ్రీ ఆగస్టు శ్రీ 2026బాపట్ల: బాపట్లలోని ఈవీఎం గోదాములను బాపట్ల కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ శనివారం పరిశీలించారు. ఆయన వెంట బాపట్ల ఆర్డీఓ, తహసీల్దార్ ఉన్నారు.నిబంధనలకు విరుద్ధంగా ఇసుక దందా నిర్వహిస్తున్న అక్రమార్కులు జేబులు నింపుకొంటున్నారు. అధికార పార్టీ ముఖ్యనేత అండదండలు ఉండటంతో యథేచ్ఛగా ఈ అక్రమం కొనసాగిస్తున్నారు. మామూళ్లతో అధికారులను ప్రసన్నం చేసుకుని వారి సహకారంతో అందినకాడికి ప్రజాధనాన్ని దోచేస్తున్నారు. చీరాల టౌన్: ఇసుక ధరలు పెరగటంతో దందా చేసేందుకు అధికార పార్టీ ముఖ్యనేత అండగా నిలిచాడు. అతని బృందం, మరికొందరు కొత్తవారు రంగంలోకి దిగారు. స్థానిక పోలీసు, రెవెన్యూ, మైనింగ్, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులపై కూడా రాజకీయ నాయకుల ఒత్తిళ్లు రావటంతో అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్నారు. కళ్లముందే ఇసుక తరలిపోతున్నా.. భారీ గోతులు ఏర్పడుతున్నా పట్టించుకోవడం లేదు. అధికారులకు నెలవారీ మామూళ్లు.. ఉద్యోగులకు ఆమ్యామ్యాలు ఇచ్చి పనిని చక్కబెడుతున్నారు. ప్రధానంగా చీరాల మండలంలోని సముద్ర తీర ప్రాంతంతో పాటుగా ఈపూరుపాలెం, విజయనగర్కాలనీ, సావరపాలెం, బోయినవారిపాలెం, తోటవారిపాలెం, స్టూవార్టుపురానికి వెళ్లే 216 జాతీయ రహదారి, విజయనగర్కాలనీ, పాతచీరాల తదితర ప్రాంతాల్లో ఇసుక తోడేస్తూ రూ. కోట్లు కొల్లగొడుతున్నారు. రోజూ వంద ట్రాక్టర్లలో.. అక్రమార్కులకు అన్నీతానై ఓ వ్యక్తి నేతృత్వం వహిస్తుండగా.. రోజుకు వంద ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తూ భారీగానే వెనుకేసుకుంటున్నారు. ఈపురుపాలెం, బోయినవారిపాలెం, తోటవారిపాలెం, జాతీయ రహదారిలోని అక్రమ తవ్వకాలతో రెచ్చిపోతున్నారు. శివారు కాలనీలు, ప్రధాన రోడ్డుపై వెళితే చాలు.. ఎక్కడ చూసినా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు కనిపిస్తూనే ఉన్నాయి. మైనింగ్, విజిలెన్స్, రెవెన్యూ, పోలీసు అధికారులు మాత్రం అసలు ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా పొక్లెయిన్లు పెట్టి తవ్వుతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా ట్రాక్టర్లు, టైరుబండ్ల ద్వారా ఇతర ప్రాంతాలకు ఇసుక తరలిస్తున్నా అధికారులు కనీసం స్పందించడం లేదు. అక్రమ ఇసుక క్వారీల నుంచి ట్రాక్టర్ల ద్వారా ప్రధాన రోడ్ల మీదుగా తరలిస్తున్నారు. ఈ తతంగం అంతా చీరాల రూరల్ పోలీసు స్టేషన్కు కూతవేటు దూరంలోనే జరుగుతున్నా.. ఒక్క ట్రాక్టర్ కూడా పట్టుకున్న దాఖలాలు లేవు. చీరాల పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఇందులో ఎక్కువ మందికి అధికార పార్టీ ముఖ్యనేత అండతో రెచ్చిపోతున్నారు. మరికొంత మందికి మాత్రం పలు శాఖల అధికారుల సహకారం అందిస్తున్నట్లు సమాచారం. భారీగానే వసూళ్లు గతంలో అర్ధరాత్రిళ్లు టైరుబండితో ఇసుకను తరలించే అక్రమార్కులు.. నేడు ఇరవై నాలుగు గంటలు ట్రాక్టర్లతో ఇసుకను సరఫరా చేస్తున్నారు. టైరు బండి ఇసుకను రూ.2 వేల వరకు, ట్రాక్టర్ లోడు ఇసుకను రూ.4 వేలకు విక్రయిస్తున్నారు. అనుమతులు లేకుండానే దర్జాగా ఇసుక దందాను కొనసాగిస్తున్నారు. చీరాల మండలంలోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈపురుపాలెం, బోయినవారిపాలెం, తోటవారిపాలెం, గవినివారిపాలెం, కావూరివారిపాలెం, విజయనగర్కాలనీ, పాతచీరాల, కొత్తపాలెం తదితర గ్రామాల్లో అధికార పార్టీ ముఖ్యనేత అండతో చోటా రాజకీయ నాయకులతోపాటు పలువురు ఇసుక అక్రమ వ్యాపారంలోకి దిగారు. అక్రమ రవాణా అరికడతాం చీరాల మండలంలోని గ్రామ పంచాయతీల్లో ఇసుక అక్రమ రవాణా, అనధికారంగా ఇసుక క్వారీల నిర్వహణపై మండల తహసీల్దార్ కుర్రా గోపీకృష్ణ వివరణ కోరగా.. గ్రామాల్లో అక్రమంగా ఇసుక అక్రమ రవాణా చేస్తే ఉపేక్షించమన్నారు. గ్రామాల్లో రెవెన్యూ సిబ్బందితో తనిఖీలు చేయిస్తున్నామని చెప్పారు. ఈపురుపాలెం, బోయినవారిపాలెం, పాతచీరాల, తీర ప్రాంత గ్రామాల్లో అక్రమంగా ఇసుక క్వారీలు నిర్వహించినా, అమ్మకాలు చేసినా చట్టపరమైన కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామన్నారు. -
వేగంగా ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్–3 నిర్మాణం
కేంద్ర మంత్రి పెమ్మసానిగుంటూరు రూరల్: నగర పరిధిలోని శిల్పారామం – పెదపలకలూరు వరకు చేపడుతున్న మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్–3 రహదారి అభివృద్ధి పనులను కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, జీఎంసీ కమిషనర్ కె.మయూర్ అశోక్లతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రూ.48 కోట్లతో సుమారు 4.25 కిలోమీటర్ల పొడవైన ఈ రోడ్డు పనులను వేగంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అదనంగా సుమారు రూ. 2–3 కోట్ల వ్యయం అయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఎన్ఎస్పీ కెనాల్స్ క్రాసింగ్స్ వద్ద భవిష్యత్తులో నీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా అదనపు కల్వర్టులు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక్కో కల్వర్టుకు సుమారు రూ.10 లక్షలు– రూ.15 లక్షల వరకు అదనపు వ్యయం అవుతుందని తెలిపారు. త్వరలో నిర్మించనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి మీదుగా పేరేచర్ల జంక్షన్ వరకు ఈ రోడ్డును విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇది పూర్తయితే పల్నాడు ప్రాంతం నుంచి వచ్చే వారికి ఇన్నర్ రింగ్ రోడ్ ద్వారా నేరుగా అమరావతికి మెరుగైన అనుసంధానం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఈ అదనపు విస్తరణకు సుమారు రూ.15 కోట్లు– రూ.20 కోట్ల అదనపు వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. ఇందుకు ముఖ్యమంత్రికి ఇప్పటికే లేఖ రాసినట్లు చెప్పారు. ఆమోదం లభించలేదన్నారు. డ్రైనేజ్ కవర్లు, సెంటర్ లైటింగ్ వంటి అదనపు సదుపాయాలకు కూడా మరన్ని నిధులు అవసరం అవుతాయని పేర్కొన్నారు. -
బీసీల ఇళ్లకూ ‘సౌర పథకం’
ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి తెనాలిటౌన్: బీసీల ఇళ్లకు కూడా ఉచిత సోలార్ రూఫ్టాప్ల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ఏపీసీపీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పి.పుల్లారెడ్డి వెల్లడించారు. తెనాలిలోని విద్యుత్ ఆపరేషన్ డివిజన్ కార్యాలయాన్ని శనివారం ఆయన సందర్శించారు. అక్కడ కార్యక్రమాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 200 యూనిట్లలోపు విద్యుత్ను వినియోగించే ఎస్సీలకు ప్రభుత్వమే ఉచితంగా సోలార్ రూఫ్టాప్లను ఏర్పాటు చేస్తున్నట్టు గుర్తుచేశారు. ఇందులో భాగంగా తెనాలి డివిజన్కు 9 వేల యూనిట్లు మంజూరు కాగా, మెటీరియల్ కొరత కారణంగా 1,500 మాత్రమే పూర్తి చేయగలిగినట్టు తెలిపారు. బీసీలకు కూడా పథకం వర్తింపజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ఇందుకుగాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.60 వేలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 వేలను సబ్సిడీగా సమకూరుస్తుందని చెప్పారు. మూడు నెలల్లోనే సాగు కనెక్షన్లు వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల విద్యుత్ సరఫరాకు అవసరమైన చర్యలను తీసుకుంటున్నట్టు వివరించారు. తెనాలి డివిజన్ పరిధిలో శేకూరు, పట్టణ కొత్తపేటలో రెండు నూతన విద్యుత్ సబ్స్టేషన్లు మంజూరైనట్లు తెలిపారు. వ్యవసాయ కనెక్షన్లకు దరఖాస్తు ఇచ్చిన మూడు నెలల్లోనే మంజూరు చేస్తున్నట్లు వివరించారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున వేసవి కాలం మాదిరిగానే విద్యుత్ వినియోగం ఉందని అన్నారు. ఓవర్లోడ్ ప్రాంతాలను గుర్తించి ట్రాన్స్ఫార్మర్లను మార్చుతున్నట్లు తెలిపారు. సంవత్సరం క్రితం వ్యవసాయ కనెక్షన్లు 150 పెండింగ్లో ఉన్నాయని, వీటిని త్వరితగతిన మంజూరు చేసేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 285 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతున్నట్లు తెలిపారు. రైతులకు పగలు 9 గంటల కరెంటు ఇవ్వాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చిందని వెల్లడించారు. సమావేశంలో టెక్నికల్ డైరెక్టర్ ఆవుల మురళీకృష్ణయాదవ్, గుంటూరు జిల్లా ఎస్ఈ చల్లా రమేష్, తెనాలి డివిజన్ ఈఈ అక్కల సత్యనారాయణ, డీఈఈ బోరుగడ్డ అశోక్కుమార్, టి.విశ్వనాథం, ఏఈలు బి.సుధీర్, దుర్గారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఇళ్ల నిర్మాణాలు పరిశీలన
మాచర్ల: పట్టణంలోని ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం కింద నిర్మితమవుతున్న ఇళ్ల పనులను రాష్ట్ర స్పెషల్ సెక్రెటరీ, హౌసింగ్ ఎండీ కొర్లపాటి హెప్సీబారాణి శనివారం ఆకస్మికంగా పరిశీలించారు. మాచర్ల వచ్చిన ఆమె ఆయా ప్రాంతాలలో నిర్మాణ దశలోని ఇళ వద్దకు వెళ్లారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడారు. సీఈ టి.వేణుగోపాల్, పల్నాడు స్పెషలాఫీసర్ శంకరరావు, జిల్లా హౌసింగ్ పీడీ పి.ప్రసాద్, హౌసింగ్ మాచర్ల డీఈ బాలాజీ నాయక్, పల్నాడు జిల్లా డీఈలు శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరరావు, ఏఈలు తదితరులు ఉన్నారు. పిడుగురాళ్ల రూరల్: జాతీయ వైద్య పరిశోధన మండలికి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ – చైన్నె ఆధ్వర్యంలో ‘ట్రామా – బర్న్ ఇన్జ్యురి– ఆపరేషనల్ రీసెర్చ్ ప్రోగ్రామ్’కు పిడుగురాళ్ల మెడికల్ వైద్య కళాశాల చెందిన డాక్టర్ కోమేరా శివ రామ ప్రసాద్ ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన జనరల్ సర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఈ అధ్యయనానికి జాతీయ స్థాయిలో ఎంపికై న ఎనిమిది మందిలో ఆయన ఒకరు. రోడ్డు ప్రమాద బాధితులపై తాము పరిశోధన చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ను ప్రభుత్వ వైద్యశాల వైద్యులు, సిబ్బంది అభినందించారు. మంగళగిరి రూరల్: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని ఎయిమ్స్లో ఫిట్నెస్ అండ్ వెల్నెస్ సెంటర్ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ ప్రొఫెసర్ అహంతేం శాంతా సింగ్ శనివారం ప్రారంభించారు. ఎయిమ్స్ సిబ్బంది, విద్యార్థుల ఆరోగ్యం, ఫిట్నెస్, శ్రేయస్సును ప్రోత్సహించేలా కేంద్రంలో పురుషులు, మహిళలకు ప్రత్యేక వ్యాయామశాలలు అందుబాటులో ఉంచారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ (పరిపాలన) కల్నల్ శశికాంత్ తుమ్మ, విభాగాధిపతులు, క్రీడా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గుంటూరు ఎడ్యుకేషన్: ఇన్సర్వీస్ ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్ అర్హత సాధించాలని విద్యాహక్కు చట్టంలో ఉన్న నిబంధనల సవరణ కోసం పాఠశాల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకోవాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 3వ తేదీన తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం పోస్టర్లను శనివారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఆవిష్కరించారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఉపాధ్యాయులు తీవ్ర మానసిక ఆందోళనతో ఉన్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని కేంద్ర విద్యా శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి, విద్యాహక్కు చట్టంలోని సవరణ చేయాలని డిమాండ్ చేశారు. టెట్ రద్దు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులందరూ బైక్ ర్యాలీలు చేస్తున్నప్పటికీ, ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో చలో విజయవాడ కార్యక్రమానికి తరలి రానున్నారని చెప్పారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల విభాగ చైర్మన్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 60 వేల మంది ఉపాధ్యాయుల ఆవేదనను విద్యాశాఖ అధికారులు, విద్యాశాఖ మంత్రి లోకేష్ అర్థం చేసుకోవాలని, టెట్లో సవరణకు ప్రయత్నించాలని కోరారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్ రావు, ఎం. కళాధర్, జిల్లా సహాధ్యక్షులు వెంకటేశ్వర్లు, ఎండీ షకీలా బేగం, ఆది నారాయణ, రంగారావు, ప్రసాద్, ఎం.కోటిరెడ్డి, గఫార్ తదితరులు పాల్గొన్నారు. -
నిరవధిక ఆందోళనకు తాత్కాలిక విరామం
చిలకలూరిపేట(యడ్లపాడు): రోడ్డు ప్రమాద బాధితుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ ఎమ్మార్పీఎస్ చేపట్టిన నిరవధిక ఆందోళనకు శుక్రవారం తాత్కాలిక విరామం లభించింది. అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే మళ్లీ ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈనెల 26న అర్ధరాత్రి చిలకలూరిపేట అడ్డరోడ్డు సెంటర్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొట్టిన ఘటనలో యడ్లపాడు మండలం వేలూరుకు చెందిన ఏడుగురు మృతి చెందిన విషయం విధితమే. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలంటూ గురువారం పట్టణ ఏరియా ఆస్పత్రి ఎదుట ప్రారంభమైన ఆందోళన.. ఎన్ఆర్టీ సెంటర్ హైవే కూడలికి చేరింది. బాధితులతో కలిసి నాయకులు అక్కడే బైఠాయించారు. సుమారు 20 గంటల పాటు చీకట్లో హైవేపైనే ఎమ్మార్పీఎస్ నాయకులు, బాధిత కుటుంబాలు ఆహారం సైతం తీసుకోకుండా నిరసన కొనసాగించారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగి 24 గంటలు గడిచినా.. వేగంగా పోస్టుమార్టం నిర్వహించినా ఏడు మృతదేహాలు శవాగారంలోనే ఉన్నాయి. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి పరిహారం, రెండెకరాల భూమి, ఇంటి స్థలం, పిల్లల విద్యకు చేయూత, గాయపడిన వారికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే స్వయంగా వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేవరకు మృతదేహాలను ఖననం చేయమంటూ.. నిరసన వీడమంటూ పట్టుబట్టారు. ఏడుసార్లు చర్చలు.. ఫలితం శూన్యం ఆందోళన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. సీఐలు, ఆర్డీఓ, డీఎస్పీ తదితరులు నాయకులతో ఏడుసార్లు చర్చించారు. స్థానిక ఎమ్మెల్యే, జిల్లా యంత్రాంగంతో మాట్లాడామని, కొంత పరిహారం ఇప్పించే బాధ్యత తమదని హామీ ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయినా చర్చలు ఫలించలేదు. తెల్లవారుజామున నిరసనకారులను ముందస్తుగా అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారని నాయకులు ఆరోపించారు. అరెస్టులు చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. హామీ అమలు కాకుంటే మళ్లీ పోరు బాధితుల అంత్యక్రియల కోసం శుక్రవారం మధ్యాహ్నం ఆందోళనకు తాత్కాలిక విరామం ప్రకటించామని, తమ డిమాండ్లపై ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సానుకూలంగా స్పందిస్తున్నారని ఎమ్మార్పీస్ నాయకులు తెలిపారు. అయితే బాధిత కుటుంబాలకు వెంటనే న్యాయం చేయకుంటే తిరిగి నిరవధిక ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజు, రాష్ట్ర అధ్యక్షుడు రుద్రపోగు సురేష్, జాతీయ మహిళా అధ్యక్షురాలు తబిత, మహిళా ప్రతినిధి కరుణ తదితరులు పాల్గొన్నారు. నరసరావుపేట: ఎన్నికల సందర్భంగా గిరిజన ప్రజలను ఆర్థికంగా, సామాజికంగా, అన్ని విధాల ఆదుకుంటామని చేసిన వాగ్దానాలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకుండా టీడీపీ ప్రభుత్వం మోసం చేసిందని గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.శ్రీను నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసన చేపట్టారు. కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందన్నారు. భూక్యా సూర్య నాయక్, కోయ శ్రీను, రాంబాబు నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఏడు’పొక్కటే మిగిలింది
చిలకలూరిపేట(యడ్లపాడు): చిలకలూరి పేట మండలం వేలూరు గ్రామాన్ని శుక్రవారం విషాదం చుట్టుముట్టింది. ఎస్సీ కాలనీలోని నాలుగు వీధుల్లో ఎటు చూసినా కన్నీటి దృశ్యాలే. ఒక ఇంట్లో తల్లిదండ్రుల కోసం బిడ్డలు విలపిస్తుంటే.. మరోచోట అక్కచెల్లెళ్ల కోసం తమ్ముళ్ల రోదనలు. ఇంకో ఇంట్లో భార్యను కోల్పోయిన భర్త.. అత్తను కోల్పోయిన కోడలు..అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యలు ఇకరారని తెలిసి మనవళ్లు, మనవరాళ్లు గుండెలవిసేలా రోదించారు. తమ వారిని శాశ్వతంగా కోల్పోయిన ఆ కుటుంబాల వేదన చూపరులను కదిలించింది. ఈనెల 26న బాపట్ల జిల్లా జె.పంగులూరు మండలం కొండమంజులూరులో సమీప బంధువుల ఇంట్లో ఓ వేడుకకు వెళ్లిన వారు తిరుగు ప్రయాణమయ్యారు. జాతీయ రహదారిపై మార్టూరు వైపు నుంచి వస్తున్న ఆటో..కళామందిర్ సెంటర్ వైపు మళ్లుతుండగా విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఆటోలో 15 మంది ఉన్నారు. ఎనిమిది మంది గాయపడ్డారు. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఘటన స్థలంలోనే నలుగురు మృతి చెందారు. చిలకలూరిపేట ఆస్పత్రిలో ఒకరు..గుంటూరు జీజీహెచ్లో ఇద్దరు కన్నుమూశారు. ఒకే గ్రామం నుంచి ఒక్కసారిగా ఏడుగురిని మృత్యువు కబళించింది. 20 గంటల నిరీక్షణ.. ప్రమాదం జరిగిన మరుసటి రోజు గుంటూరులో పోస్టుమార్టం పూర్తయిన ఇద్దరి మృతదేహాలను చిలకలూరిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ అప్పటికే ఐదు పోస్టుమార్టం చేసిన మృతదేహాలు ఉన్నాయి. పంచనామా పూర్తయినా.. అంతిమ ప్రయాణానికి మాత్రం ఆలస్యమైంది. 20 గంటలకు పైగా మృతదేహాలు ప్రభుత్వ ఆస్పత్రి శవాగారంలోనే ఉండిపోయాయి. న్యాయం కోసం ఆందోళన.. ఆస్పత్రి వద్ద కొందరు బాధిత కొందరు బాధిత కుటుంబ సభ్యులు పడిగాపులు కాస్తుండగా, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ ఎమ్మార్పీఎస్ నాయకులు ఎన్ఆర్టీ సెంటర్లో ధర్నా చేపట్టారు. మృతదేహాలను ఖననం చేసేందుకు ఆందోళనకు తాత్కాలిక విరామం ఇచ్చారు. అందరూ కలిసి ఆస్పత్రికి చేరుకున్నారు. ఒక్కో మృతదేహాన్ని ఒక్కో ఆటోలోకి ఎక్కించారు. వేడుకకు వెళ్లిన వారిని..విగతజీవులుగా వేలూరుకు తీసుకొచ్చారు. భౌతిక కాయాలను చూసేందుకు వచ్చిన నాయకులు, బంధువులతో వీధులు కిటకిటలాడాయి. చివరిచూపు కోసం బారులు మృతదేహాలు ఇళ్లకు చేరగానే రోదనలు మిన్నంటాయి. నాలుగు వీధుల్లోని ఏడు ఇళ్ల ముందు చివరి చూపు కోసం జనం బారులు తీరారు. ఒకేసారి ఏడు కుటుంబాల్లో విషాదం నిండడంతో.. ఎవరిని ఓదార్చాలో బంధుమిత్రులకే అర్థం కాలేదు. మృతదేహాలున్న ప్రతి ఇంటికీ దైవ సేవకులు చేరుకుని, మృతుల ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చేకూరాలని కన్నీటితో వేడుకున్నారు. ఒకే రోజు ఏడుగురి ఖననం విషాదం మధ్య అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు జరిగాయి. గ్రామంలోని ఎస్సీ శ్మశానవాటికలో ఏడు సమాధులు సిద్ధమయ్యాయి. ఒకరి కోసం కాదు..ఇద్దరి కోసం కాదు..ఒకేసారి ఏడుగురి కోసం. నిన్నటి వరకు ఒకరినొకరు పలకరించిన ఆ వీధుల్లో.. నేడు చివరి చూపు కోసం జనం వరుసలో నిలబడ్డారు. వేలూరు విషాదం ఏడు కుటుంబాలకే పరిమితం కాలేదు. గ్రామానికే శోకసంద్రంగా మారింది. -
టెక్స్టైల్ పరిశ్రమకు గ్రీన్ ఎనర్జీ పాలసీ అమలు చేయాలి
కొరిటెపాడు(గుంటూరు): రాష్ట్రంలో టెక్స్టైల్ పరిశ్రమను మరింత బలోపేతం చేసి, పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక గ్రీన్ ఎనర్జీ పాలసీని అమలు చేయాలని ఏపీ టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్(ఏపీటీఎంఏ) కోరింది. పరిశ్రమకు పోటీ విద్యుత్ ధరలు, పెట్టుబడి ప్రోత్సాహకాలు, ఆధునికీకరణకు రాయితీలు, మౌలిక వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు అసోసియేషన్ చైర్మన్ సామినేని కోటేశ్వరరావు ఆధ్వర్యంలో గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు చెందిన సుమారు 50 మంది టైక్స్టైల్ మిల్లుల యజమానులు, ప్రతినిధులు శుక్రవారం బృందావన్ గార్డెన్స్లోని నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు గృహంలో కలసి పలు అంశాలపై చర్చించారు. అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల నుంచి అన్ని చార్జీలతో కలిపి యూనిట్ విద్యుత్ను సుమారు రూ.5 కే అందించే విధంగా చర్యలు తీసుకుంటే రాష్ట్రంలోని టైక్స్టైల్ మిల్లులు సమష్టిగా 100 నుంచి 150 మెగావాట్ల విద్యుత్ను దీర్ఘకాలికంగా కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. 2024–29 పారిశ్రామిక విధానాన్ని టెక్స్టైల్ రంగానికి అనుగుణంగా సమీక్షించి, కొత్త పరిశ్రమల ఏర్పాటుతోపాటు ఇప్పటికే ఉన్న మిల్లుల ఆధునీకరణకు ప్రత్యేక పెట్టుబడి ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలో అమలు చేసిన టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఫండ్ స్కీమ్ తరహాలో పథకాన్ని పునఃప్రవేశపెట్టి, ఆధునిక టెక్స్టైల్ యంత్రాలపై పెట్టుబడి వ్యయంలో 20 శాతం వరకు ఇన్వెస్ట్మెంట్ ఇన్సెంటివ్ ఇవ్వాలని సూచించారు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్(ఎన్టీటీఎం) పథకాన్ని సద్వినియోగం చేసుకుని భవ్య పార్క్తో పెట్టుబడులను ఆకర్షించాలని సూచించారు. టెక్నికల్ టెక్స్టైల్ రంగంలో ఆధునిక సాంకేతిక, అధిక విలువ కలిగిన ఉత్పత్తులు, కొత్త పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఎన్టీటీఎం అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు. ఎంపీని కలసిన వారిలో అసోసియేషన్ నాయకులు డి.బ్రహ్మానందం, ఆర్.సత్యనారాయణ, రాఘవరెడ్డి, కేవీ ప్రసాద్, బి.రామకృష్ణ, జి.కోటేశ్వరరావు, కె.రమేష్, దానారెడ్డి తదితరులున్నారు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుకు ఏపీ టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్ వినతి -
సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్
పిట్టలవానిపాలెం(కర్లపాలెం): ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మరాజు చెప్పారు. ఒకనెల– ఒక నియోజకవర్గం–నాలుగు పర్యటనలు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పిట్టలవానిపాలెం మండల పరిషత్ కార్యాలయం వద్ద ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట, ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మరాజు ఆర్డీవో హరికుమార్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజా దర్బార్ కార్యక్రమానికి మొత్తం 23 అర్జీలు అందినట్లు అధికారులు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు ప్రజల వద్దకే వచ్చి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వరరావు, ఎంపీడీవో శేఖర్బాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. బాపట్లటౌన్: రోడ్డు ప్రమాధంలో ఇరువురికి తీవ్రగాయాలైన ఘటన శుక్రవారం రాత్రి పట్టణంలోని కమ్మ కల్యాణ మండపం సమీపంలో జీబీసీరోడ్డుపై జరిగింది. బాపట్ల పట్టణం, గులాంహుస్సేన్ తోటకు చెందిన కాసాని యశ్వంత్ చీరాలవైపు నుంచి ద్విచక్రవాహనంపై బాపట్ల వస్తున్నారు. అదే సమయంలో బాపట్ల నుంచి వెదుళ్లపల్లి వైపు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో కాసాని యశ్వంత్తోపాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఇరువురిని ప్రథమ చికిత్స కోసం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం గుంటూరు, చీరాల తరలించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య చిలకలూరిపేట: ఒకే గ్రామానికి చెందిన ఏడుగురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం మాటలకు అందని మహావిషాదమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం వేలూరులో అశ్రునయనాల మధ్య జరిగిన అంతిమ సంస్కారాలకు హాజరై మృతులకు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, పార్టీ తరఫున తక్షణ ఆర్థిక సాయం అందించారు. బాధిత కుటుంబాలు నిరుపేదలని, ప్రభుత్వం వెంటనే భారీ ఎక్స్గ్రేషియా ప్రకటించి, కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావులతో ఫోన్లో ఈశ్వరయ్య కోరారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందా కృష్ణమాదిగ సైతం వేలూరులో మృతుల కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎ.మారుతి వరప్రసాద్, ఏరియా కార్యదర్శి తాళ్లూరి బాబురావు, జిల్లా కార్యవర్గ సభ్యులు బుదాల శ్రీనివాసరావు, ఉలవలపూడి రాము, ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి షేక్ సుభాని, గ్రామ కార్యదర్శి ఎలికా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నరసరావుపేట: ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వేలూరు గ్రామానికి చెందిన దళిత మహిళా వ్యవసాయ కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రవిబాబు డిమాండ్ చేశారు. స్థానిక కోటప్పకొండరోడ్డులోని విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ చిలకలూరిపేట అడ్డరోడ్డు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ వాహనం ఢీకొన్న ఘటనలో రెండు కుటుంబాలకు చెందిన ఆరుగురు మృతి చెందడం తీవ్ర విషాదకరమన్నారు. ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి నష్టపరిహారం ప్రకటించకపోవడం అన్యాయమన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఎమ్మార్పీఎస్, ప్రజా సంఘాలు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. ప్రమాదంలో మృతి చెందిన ఒక్కో కుటుంబానికి రూ 10 లక్షల ఎక్స్గ్రేషియా వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. -
ఇసుక మాఫియా బరితెగింపు
సిలికా ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్న జీడిమామిడి రైతుపై దాడి చినగంజాం: సిలికా ఇసుకను అక్రమంగా తవ్వుతుండడంతో తమ భూములు దెబ్బతింటున్నాయని అడ్డుకున్న రైతుపై ఇసుకమాఫియా దాడికి తెగబడిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. బాధితుడు బత్తిన వెంకట సుబ్బారావు కథనం ప్రకారం.. చినగంజాం మండలం మోటుపల్లి సర్వే నంబర్ 114, 115లో అనుమతులు లేకుండా కొందరు సిలికా ఇసుక తవ్వకాలు జరిపి, అక్రమంగా రవాణా చేస్తూ అడిగిన వారిని బెదిరిస్తూ దాడులకు పాల్పడుతున్నారు. దీనివల్ల భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయి. వ్యవసాయ భూముల్లో సాగుకు నీరు అందక పంటలు దెబ్బతింటున్నాయి. దీంతో రైతు బత్తిన వెంకటసుబ్బారావు సిలికా తవ్వకాల వల్ల తన భూములకు నీరు అందక 30 ఏళ్లుగా పెంచుకున్న మామిడి, జీడిమామిడి చెట్లు ఎండిపోయాయని పోలీసులకు గురువారం సమాచారం ఇచ్చాడు. అయితే పోలీసులు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఇసుక రవాణా చేస్తున్న వాహనాలను రైతు గురువారం రాత్రి అడ్డుకున్నాడు. ఇతనే పోలీసులకు సమాచారం ఇచ్చాడని తెలుసుకున్న ఇసుక మాఫియా రైతుపై దాడికి పాల్పడింది. తీవ్రంగా గాయపరిచింది. తనపై దాడి చేసిన వారిలో గతంలో రౌడీషీట్లు ఉన్న వ్యక్తులు ఉన్నారని రైతు చెబుతున్నాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన సుబ్బారావును స్థానికులు 108 వాహనం ద్వారా చీరాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆగస్టు 9న కూడా ఇసుక ట్రాక్టర్ను అడ్డుకున్న నిలిపివేసి పోలీసులకు సమాచారం ఇచ్చిన తనను ఇసుకమాఫియా వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించారని సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇసుక అక్రమాలపై ఆగస్టు పదిన తహసీల్దార్ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశానని వివరించాడు. దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గుంటూరు ఎడ్యుకేషన్: పెదకూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జంపని నరేష్బాబుపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు. రాజశేఖర్ రావు, ఎం.కళాధర్ శుక్రవారం ఓప్రకటనలో డిమాండ్ చేశారు. కారు రాష్ డ్రైవింగ్ చేసి ప్రమాదానికి కారణమైనది కాకుండా, తిరిగి ఉపాధ్యాయుడిపై దాడి చేయడం కారు ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. యాక్సిడెంట్ ఎలా జరిగిందని, ఎవరు బాధ్యులనేది లేకుండాఉపాధ్యాయుడిపై భౌతిక దాడి చేయడం తగదని, తక్షణమే పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం సైతం ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని, ఉపాధ్యాయుడు నరేష్ బాబుకు పూర్తి సంఘీభావం తెలిపారు. -
ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారం
గుంటూరు మెడికల్: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) రద్దుచేసి ఓల్డ్ పెన్షన్ స్కీం (ఓపీఎస్) అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏపీసీపీఎస్ఈఏ) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినం నాడు విజయవాడ ధర్నా చౌక్ వద్ద భారీ నిరసన ర్యాలీ సభ జరగనుందని ఏపీ ఎన్జీజీవోస్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు పేర్కొన్నారు. గుంటూరు జిల్లాస్థాయిలో ఎన్జీవో హోంలో అన్ని సంఘాల నాయకుల ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ, సన్నాక సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఘంటసాల శ్రీనివాసరావు, సెక్రెటరీ శ్యామ్ సుందర్ శ్రీనివాసరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.కె నాగుల్ షరీఫ్లు మాట్లాడుతూ ఏపీసీపీఎస్ఈఏ నిర్వహించ తలపెట్టిన సెప్టెంబర్ 1 ర్యాలీ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఏపీసీపీఎస్ఈఏ గుంటూరు జిల్లా తాత్కాలిక అధ్యక్షుడు కొమ్మనబోయిన సుకుమార్, సెక్రటరీ రవితేజ మాట్లాడుతూ ఐక్య ఉద్యమాలే ఫలితాలనిస్తాయని పాత పెన్షన్ విధానం కోసం నిర్వహిస్తున్న ఈ ధర్నా కార్యక్రమానికి అని సంఘాలు మద్దతు పలకాలని, వేలాది సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. గుంటూరు నగర అధ్యక్షుడు సీహెచ్ కళ్యాణ్ కుమార్, సిటీ కార్యదర్శి జీవీ కోటేశ్వరరావు మాట్లాడుతూ ధర్నాకు తమ శాఖల కార్యకర్తలు వేలాదిగా పాల్గొంటారని తెలిపారు. సీనియర్ సీపీ ఉద్యమ నాయకులు తిరుమలరెడ్డి, దయాసాగర్, ఎస్టీయూ గుంటూరు జిల్లా అధ్యక్షుడు బాజీ, యూటీఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు కాలిద్, ఏపీసీపీఎస్ఈఏ పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఉబేదుల్లా బేగ్ మాట్లాడారు. కార్యక్రమంలో ఏపీ ఎన్జీజీవోస్, ఏపీజేఏసీ సభ్య సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, ఇతర సంఘాల నాయకులు, నాయకులు కిషోర్, చంద్రమోహన్, రామచంద్రరావు పాల్గొన్నారు. -
తండ్రికి తలకొరివి పెట్టిన కుమార్తె
బాపట్ల: కంటే కూతురినే కనాలి అనిపించేలా తండ్రి పట్ల ప్రేమ, బాధ్యతను చాటుకున్న కుమార్తె డా. ఎడ్ల సునీత నేటి సమాజానికి ఆదర్శంగా నిలిచారు. తండ్రి చివరి కోరిక మేరకు కుమార్తె స్వయంగా తలకొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించడం బాపట్లలో పలువురిని భావోద్వేగానికి గురిచేసింది. పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరులోని పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్లో సూపరింటెండెంట్గా పనిచేసిన ఎడ్ల అచ్యుతరావు 30.06.2003న ఉద్యోగ విరమణ పొందారు. ఆయన కుమార్తె డా. ఎడ్ల సునీత ప్రస్తుతం రీజినల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్, మార్టేరులో సీనియర్ సైంటిస్ట్గా పనిచేస్తున్నారు. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు నుంచి బాపట్ల వ్యవసాయ కళాశాలకు బదిలీపై వచ్చిన డా. సునీత బాపట్లలోనే నివాసం ఉంటున్నారు. గత ఐదేళ్లుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న తండ్రి అచ్యుతరావు ఆలనా పాలనా, ఆరోగ్యం, అవసరాలు, మంచి చెడులను చూసుకుంటూ సునీత సేవలందించారు. ఉద్యోగరీత్యా దూరంగా ఉన్న సమయంలో కూడా తండ్రి యోగక్షేమాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేసేవారు. అచ్యుతరావు అనారోగ్యానికి గురైన సమయంలో విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న ఆయన కుమారుడు ఎడ్ల శ్రీనివాస్ సెలవుపై బాపట్లకు చేరుకుని తండ్రికి వైద్య సేవలు అందించారు. కుటుంబ సభ్యులు తమ వంతు బాధ్యతలు నిర్వర్తించినప్పటికీ, కుమార్తె సునీత తండ్రికి అందించిన నిరంతర సేవ ప్రత్యేకంగా నిలిచింది. ఈ నేపథ్యంలో తన చివరి కోరికగా కుమార్తె సునీత చేత తలకొరివి పెట్టించుకోవాలని అచ్యుతరావు కోరినట్లు సమీప బంధువులు తెలిపారు. గురువారం అచ్యుతరావు మతి చెందడంతో శుక్రవారం బాపట్లలో నిర్వహించిన అంత్యక్రియల్లో సునీత తండ్రి చివరి కోరికను నెరవేర్చారు. సాధారణంగా హిందూ సంప్రదాయంలో పురుషులే అంత్యక్రియలు నిర్వహించే ఆనవాయితీ ఉన్నప్పటికీ, తండ్రి కోరికను గౌరవిస్తూ సునీత ముందుకు వచ్చి తలకొరివి పెట్టడం పలువురి ప్రశంసలు అందుకుంది. అందుబాటులో ఉన్న తన తమ్ముడి సమక్షంలో తండ్రి చివరి కోరికను నెరవేర్చిన సునీత నిర్ణయం అచ్యుతరావు ఆత్మకు శాంతి చేకూర్చేలా ఉందని బంధువులు పేర్కొన్నారు. అంతేకాకుండా, కుమార్తె తీసుకున్న ఈ నిర్ణయానికి ఆమె భర్త అంగీకారం తెలిపి ప్రోత్సహించడం అభినందనీయమని బంధువులు తెలిపారు. తల్లిదండ్రుల పట్ల ప్రేమ, బాధ్యతలకు ఆడ – మగ అనే తేడా లేదని, తండ్రి చివరి కోరికను గౌరవించి సునీత చూపిన ఆప్యాయత నేటి సమాజానికి ఆదర్శంగా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు. -
బాపట్ల
శనివారం శ్రీ 29 శ్రీ ఆగస్టు శ్రీ 2026రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు ● బ్లాక్స్పాట్లు, ప్రమాదకర ప్రాంతాలపై దృష్టి పెట్టండి ● జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన ఎస్సీ,ఎస్టీల సమస్యలు పరిష్కరించాలి రోజూ 250 హియరింగ్లు పూర్తిచేయాలి ఏసీబీ దాడి చేసినా అదే తీరు బాపట్ల జిల్లాను గంజాయి, మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం నార్కోటిక్ కోఆర్డినేషన్న్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో మాదకద్రవ్యాల ప్రభావం లేకుండా చూడాల్సిన బాధ్యత అన్ని శాఖలపై ఉందన్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై నిరంతర తనిఖీలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీ సుధాకర్, చీరాల, బాపట్ల, రేపల్లె డీఎస్పీలు మొయిద్దీన్న్, చంద్రమౌళి, అజీజ్, జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస సింగ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పద్మావతి, జిల్లా రవాణాశాఖ అధికారి పరంధామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాకుమాను: కొండపాటూరులోని పోలేరమ్మ దేవస్థానంలో శుక్రవారం ఉదయం సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. -
నిబంధనలన్నీ ఇసుకలో పాతర
● ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా యథేచ్ఛగా తవ్వకాలు ● పెద్ద లారీలలో బహిరంగంగానే రవాణా ● కనీసం కన్నెత్తి కూడా చూడని స్థానిక అధికారులు చింతపల్లి వద్ద శుక్రవారం ఉదయం కృష్ణానదిలో యంత్రాలతో ఇసుక తవ్వకాలు సాక్షి, నరసరావుపేట: ఉచిత ఇసుక ముసుగులో కృష్ణానదిలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు ఇసుకాసురులు తిలోదకాలు వదిలారు. పలు శాఖల అధికారులకు ముడుపులు చెల్లించి దందా కొనసాగిస్తున్నట్లు సమాచారం. రోజుకు 50 నుంచి 100 లారీల వరకు తరలిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ప్రకృతి వనరుల పరిరక్షణ కాగితాలకే పరిమితమైంది. ఈ ప్రాంతాల్లో తవ్వకాలు... పల్నాడు జిల్లాలోని అచ్చంపేట మండలం పరిధి చింతపల్లి, కొత్తపల్లి సరిహద్దుల్లో కృష్ణానదిలో రాత్రింబవళ్లు తేడా లేకుండా ఇసుకాసురులు తవ్వకాలు నిర్వహిస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఆరు పొక్లెయినర్లతో నది లోతుల్లో నుంచి తవ్వకాలు చేపట్టారు. నేరుగా పెద్ద ట్విన్ టైర్ లారీలకు ఎత్తుతున్నారు. ప్రస్తుతం పర్యావరణ నిబంధనల మేరకు మాన్సూన్ హాలిడే అమలులో ఉంది. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో వర్షాకాలం దృష్ట్యా జూన్ 1 నుంచి అక్టోబరు 15 వరకు నదిలో ఎలాంటి తవ్వకాలు నిర్వహించకూడదు. ముందుగా నది ఒడ్డున డంప్ చేసుకున్న ఇసుకను మాత్రమే అవసరాలకు తరలించుకోవాల్సి ఉంటుంది. కానీ అక్రమార్కులు నదిలో తవ్వకాలు నిర్వహిస్తున్నట్లు ఎవరికీ అనుమానాలు రాకుండా జూన్ 1 నాటికి డంప్ చేసుకున్న కుప్ప నుంచి మాత్రమే ఇసుక రవాణా చేసుకుంటున్నట్లు చూపిస్తున్నారు. నేరుగా తరలింపు... రోజూ నది గర్భంలో పెద్ద పొక్లెయినర్లతో తవ్వకాలు నిర్వహిస్తున్నారు. నేరుగా భారీ లారీలకు ఓవర్లోడ్ చేస్తున్నారు. ఇసుకను అచ్చంపేట, క్రోసూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల తదితర ప్రాంతాల నుంచి నేరుగా హైదరాబాద్కు తరలిస్తున్నారు. ప్రతి రోజు 50 నుంచి 100 లారీల వరకు ఇసుక తరలి వెళుతున్నా పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు. అక్రమార్కులు ఒక్కొక్క లారీకి ఇసుకను ఓవర్లోడ్ చేసినందుకు రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు వసూలు చేసి తమ జేబులు నింపుకొంటున్నారు. ట్రాక్టర్లను అసలు నదిలోకి అనుమతించడం లేదు. వీరికి బడా ప్రజాప్రతినిధుల అండదండలున్నట్లు విశ్వసనీయ సమాచారం. మైనింగ్, విజిలెన్స్ అధికారులకు తెలిసినా మామూళ్లతో ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఇసుక లోడ్తో వెళుతున్న లారీజూన్ 1 నుంచి అక్టోబరు 15 వరకు మాన్సూన్ హాలిడే అమలులో ఉంది. దీని ప్రకారం కృష్ణానదిలో యంత్రాలతో గానీ, మాన్యువల్గా గానీ ఎలాంటి తవ్వకాలు నిర్వహించకూడదు. నదికి సమీపంలోనే అంతకు ముందు డంప్ చేసుకున్న ఇసుకను ట్రాక్టర్లు, లారీలలో రవాణా చేసుకునే అవకాశం ఉంది. నిబంధనల మేరకు మాత్రమే లోడ్ చేసుకోవాలి. ప్రస్తుతం కృష్ణానదిలో ఎలాంటి తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారం లేదు. ఎవరైనా ఇలా చేస్తే మా సిబ్బందిని పంపి పనులు నిలిపివేయిస్తాం. సంబంధితులపై తగిన చర్యలు తీసుకుంటాం. – నాగయ్య, మైనింగ్ ఏడీ, నరసరావుపేట. -
బాలచాముండేశ్వరికి శ్రావణ లక్ష్మి అలంకారం
చందోలు(కర్లపాలెం): శ్రావణమాసం మూడవ శుక్రవారం చందోలు గ్రామంలోని బగళాముఖి అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. దేవస్థానం ఆధ్వర్యంలో తొలిసారిగా అమ్మవారికి నిర్వహించిన సామూహిక కుంకుమార్చన పూజా కార్యక్రమాలలో మహిళా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారు శ్రీ మహాల క్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. కుంకుమార్చన పూజలో పాల్గొన్న మహిళలకు దేవస్థానం తరఫున అమ్మవారి చిత్రపటం, పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, పూలు, పండ్లు, పూజా ద్రవ్యాలు ఉచితంగా అందజేసినట్లు ట్రస్ట్ బోర్డు అధ్యక్షుడు చక్రధర్రెడ్డి, సభ్యుడు వరప్రసాద్ తెలిపారు. అమ్మవారి పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఈవో నరసింహమూర్తి, ట్రస్టు బోర్డు సభ్యులు పాల్గొన్నారు. చీరాల: పట్టణంలోని వైఏ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో జరుగుతున్న డిగ్రీ రెండో సెమిస్టర్ పేపర్ వాల్యూయేషన్ను శుక్రవారం అధ్యాపకులు నిలిపివేశారు. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల అధ్యాపకులు మాట్లాడుతూ 2025–26లో ఆంధ్రకేసరి యూనివర్సిటీ 1,3,4,5 సెమిస్టర్ యూజీ పేపర్ల వాల్యూయేషన్ను పూర్తి చేశామన్నారు. పరీక్ష ఫలితాలు వచ్చినా వాల్యూయేషన్ పారితోషకం ఇప్పటి వరకు చెల్లించలేదన్నారు. ఈ ఏడాది మే నెలలో 47 డిగ్రీల మేర ఎండలు ఉన్నా పేపర్ వాల్యూయేషన్ను పూర్తి చేశామని పేర్కొన్నారు. రావల్సిన పారితోషకం చెల్లించని కారణంగా శుక్రవారం రెండో సెమిస్టర్ పేపర్ మూల్యాంకనం నిలిపివేస్తున్నట్లు తెలిపారు. పారితోషకాన్ని త్వరగా విడుదల చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రిన్సిపాల్, యూజీ పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్కు వినతిపత్రం అందించారు. నాదెండ్ల: జూనియర్ డివిజన్ సివిల్ జడ్జిల ఎంపికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గురువారం ర్యాంకుల జాబితాను విడుదల చేసింది. రాష్ట్ర న్యాయశాఖ ప్రకటించిన మేరకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చెందిన 41 మంది అభ్యర్థులు ఎంపిక అయ్యారు. ఈ జాబితాలో గణపవరం గ్రామానికి చెందిన కాట్రు అప్పయ్య, వెంకటసుబ్బమ్మల మనుమరాలైన నల్లూరి గౌతమి 200 మార్కులకు గాను 189.67 మార్కులతో మూడో ర్యాంకులో నిలిచారు. గతేడాది అక్టోబర్లో రాత పరీక్ష జరగ్గా, ఈ ఏడాది మార్చిలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. త్వరలో ప్రభుత్వం వీరికి జూనియర్ సివిల్ జడ్జిగా పోస్టింగ్లు ఖరారు చేయనుంది. గౌతమి తల్లిదండ్రులు శ్రీనివాసరావు, ఉదయలక్ష్మి ఉపాధ్యాయులు. వృత్తిరీత్యా ఒంగోలులో నివాసం ఉంటుండగా, గౌతమి విశాఖపట్నంలోని దామోదర సంజీవయ్య జాతీయ న్యాయ కళాశాలలో ఎల్ఎల్బీ పూర్తి చేశారు. -
పోక్సో కేసులో యువకుడి అరెస్టు
లక్ష్మీపురం: ఓ బాలికను హాస్టల్ నుంచి తీసుకెళ్లిన యువకుడిని అరెస్ట్ చేశారు. పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. పెదకూరపాడు మండలంలోని ఓ ప్రాంతానికి చెందిన కంచర్ల వెంకటేష్ ఫొటోగ్రాఫర్. అదే ప్రాంతానికి చెందిన ఓ బాలిక ప్రస్తుతం గుంటూరులోని ఓ హాస్టల్లో ఉంటూ విద్యాభ్యాసం చేస్తోంది. జూలై 29వ తేదీన అదృశ్యమైనట్లు వచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఆమెకు మాయమాటలు చెప్పి వెంకటేష్ తీసుకెళ్లినట్లు తేలింది. గతంలో కూడా వేధించినట్లు ఇచ్చిన ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు చేశారు. గురువారం రాత్రి వెంకటేష్ను అరెస్టు చేశారు. శుక్రవారం కోర్టులో హాజరు పరచగా, 14 రోజులు రిమాండ్ విధించారు. -
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం భరోసానివ్వాలి
చిలకలూరిపేటటౌన్: ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించి, వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచి తగిన సహాయం అందించాలని మాజీ మంత్రి విడదల రజిని కోరారు. చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ప్రమాద మృతుల భౌతికకాయాలను ఆమె సందర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆమె పరామర్శించారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. వేలూరు గ్రామానికి చెందిన ఏడుగురు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం రజిని మీడియాతో మాట్లాడుతూ ప్రమాదంపై వేగంగా దర్యాప్తు చేసి భవిష్యత్తులో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మృతుల కుటుంబాలను పరామర్శించిన వారిలో పల్నాడు జిల్లా ఏఎస్పీ రోహిత్కుమార్ చౌదరి, షేక్ జాన్సైదా, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, జనసేన నాయకులు మండలనేని చరణ్తేజ్, తోటా రాజా రమేష్, నిడ్క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు, సీపీఐ నాయకులు తాళ్లూరి బాబూరావు, షేక్ సుభాని, చెరుకుపల్లి నిర్మల తదితరులు ఉన్నారు. -
అంతులేని విషాదం
బయలుదేరిన గంటలోనే ఆనందం ఆవిరి జె.పంగులూరు: అప్పటివరకు కొండమంజులూరు గ్రామంలోని బంధువుల ఇంట్లో పుట్టిన రోజు వేడుకల్లో అందరూ ఆడిపాడారు. ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. సొంత ఊరు బయలు దేరిన గంటలోపే ఆ ఆనందం ఆవిరైపోయింది. ఒక్కసారిగా కుటుంబాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రైవేట్ బస్సు రూపంలో వచ్చి ఏడుగురు మృత్యువాత పడడంతో కొండమంజులూరు విషాదంతో నిండిపోయింది. ప్రకాశం జిల్లా జే పంగులూరు మండలం కొండమంజులూరు గ్రామానికి చెందిన సందిపోగు నవమ్మ మనవరాలు మొదటి పుట్టినరోజు బుధవారం రాత్రి జరిగింది. ఈ వేడుకలకు ఏలూరులో ఉన్న నవమ్మ బంధువులు 11 మంది ఒకే ఆటోలో బుధవారం సాయంత్రం 4 గంటలకు వచ్చారు. అందరూ ఎంతో సంతోషంగా గడిపారు. సాయంత్రం ప్రార్థన చేసుకుని పుట్టినరోజు జరుపుకొంటున్న పాపను ఆశీర్వదించారు. రాత్రి 10 గంటల సమయంలో భోజనం ముగించుకుని కొంత సమయం బంధువులతో గడిపారు. తిరిగి అదే ఆటోలో పయనమయ్యారు. బయలుదేరిన గంటలోపే వారికి ప్రమాదం జరిగిందని, చనిపోయారనే వార్త తెలియగానే కొండమంజులూరు దళిత కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. అప్పటి వరకు తమతో సంతోషంగా గడిపిన వారు ఇంతలోనే విగతజీవులుగా మారడంతో జీర్ణించుకోలేకపోయారు. చిలకలూరిపేట టౌన్/ యడ్లపాడు: చిలకలూరిపేట పట్టణంలోని అడ్డరోడ్డు సెంటర్లో బుధవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఏడుగుర్ని బలిగొంది. రోడ్డు దాటుతున్న ఆటోను విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారు మృత్యువాత పడ్డారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. మృతులు వేలూరు ఎస్సీ కాలనీకి చెందినవారు. ఈ విషాదంతో కాలనీలో ఎవరిని కదిలించినా కన్నీళ్లే వచ్చాయి. మరోవైపు బాధితులకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోకపోవడంతో పోస్టుమార్టం వేగంగా జరిగినా చిలకలూరిపేటలోని మార్చురీలోనే మృతదేహాలు ఉంచారు. ఆ ఇంటికి ఇక పెద్ద దిక్కెవరు? బొంతా బాబూరావు, మణెమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమార్తెలకు వివాహాలు అయ్యాయి. ఒక్కగానొక్క కుమారుడు భాగ్యరాజుతోనే వారు ఉంటున్నారు. భాగ్యరాజు పట్టణంలో ఏఎంసీలో ముఠా కూలీగా పనిచేస్తున్నాడు. రెక్కాడితే గానీ డొక్కాడని జీవితం వారిది. తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకుంటున్న వేళ.. విధి ఆ కుటుంబాన్ని కాటేసింది. బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఆ కుమారుడి వేదన వర్ణనాతీతం. నిన్నటి వరకు తనతో మాట్లాడిన అమ్మానాన్నలు ఇక లేరన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకేసారి ముగ్గురు దూరం.. 75 ఏళ్ల లక్ష్మమ్మ కొన్నేళ్ల క్రితమే భర్త బసవయ్యను కోల్పోయింది. లక్ష్మమ్మకు ముగ్గురు సంతానం. అందరికీ వివాహాలు జరిగాయి. మొదటి కుమార్తె కొన్నేళ్ల క్రితం భర్తను కోల్పోయిన సుబ్బులమ్మకు సంతానం కూడా లేకపోవడంతో ఒంటరిగా మిగిలింది. దీంతో తల్లి లక్ష్మమ్మను ఆశ్రయించింది. వీరిద్దరూ లక్ష్మమ్మ కుమారుడు ఏసు వద్దనే ఉంటున్నారు. లక్ష్మమ్మ రెండో కుమార్తె గంగమ్మ లారీ డ్రైవర్ అయిన భర్త నటరాజ్తో కలిసి అదే గ్రామంలో ఉంటోంది. కష్టాల్లో ఒకరికి ఒకరు తోడుగా నిలుస్తూ జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. పెద్దగా ఆస్తులు లేకపోయినా.. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమే వారికి కొండంత అండ. ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. లక్ష్మమ్మ.. గంగమ్మ.. ఏసు భార్య సువార్త.. ఒకేసారి మృత్యువాత పడ్డారు. ఆ ఇంట విషాదం మాటలకు అందడం లేదు. ఒకే రాత్రిలో మూడు బంధాలు తెగిపోవడంతో ఆ కుటుంబ సభ్యుల రోదన చూసేవారి గుండెలను పిండేస్తోంది. నిన్నటి వరకు మనుషులతో కళకళలాడిన ఆ ఇల్లు.. ఇప్పుడు జ్ఞాపకాలతో, కన్నీళ్లతో నిండిపోయింది. అనారోగ్యంతో ఉన్న భర్తకు భార్య దూరం.. బొంత సంపూర్ణమ్మ(70) భర్త పెద్ద ఏసు ఆర్మీ రిటైర్డ్ అధికారి. వీరికి కుమారుడు ధనరాజ్, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అందరికీ వివాహాలు అయ్యాయి. పెద్ద ఏసును ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఇటీవలే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇంటికి చేరుకున్నారు. మరోవైపు ధనరాజ్కు ముగ్గురు పిల్లలు. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆయనకు భారంగా మారకూడదని పెన్షన్తోనే దంపతులు జీవనం సాగిస్తున్నారు. ప్రమాదంలో సంపూర్ణమ్మ మృతి విషయం తెలిసి షాక్తో భర్త కుప్పకూలడంతో ఐసీయూలో చేర్చారు. ఇల్లాలిని కోల్పోయి... బొంతా మరియమ్మ, సుబ్బారావు దంపతులు తమ ముగ్గురు కుమార్తెలకు వివాహాలు చేశారు. అవివాహితుడైన చిట్టిబాబు తల్లిదండ్రుల వద్దనే ఉంటున్నాడు. సుబ్బారావు వీఆర్ఏగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రస్తుతం ఆ కుటుంబంలో భర్తకు భార్య దూరమైంది. చిట్టిబాబుకు తల్లి లేకపోవడంతో ఆ ఇంట విషాదం నెలకొంది.చికిత్స పొందుతున్న చౌటుపల్లి ధనమ్మ, చౌటుపల్లి సుబ్బులు, బొంతా అరుణ్కుమార్, బొంతా అభిరామ్గుంటూరు మెడికల్: ప్రమాద స్థలంలో ఐదుగురు మృతి చెందగా.. జీజీహెచ్లో చికిత్స కోసం తరలిస్తుండగా వేలూరు గ్రామానికి చెందిన టి. సువార్తమ్మ (55), ఎమర్జెన్సీ విభాగంలో చికిత్స పొందుతూ బొంత మరియమ్మ (47) కూడా ప్రాణాలు కోల్పోయారు. 12 ఏళ్ల బొంతాపల్లి, ఆరేళ్ల శ్యామూల్ కొద్దిపాటి గాయాలు కావడంతో చికిత్స అందించి డిశ్చార్జి చేశారు. ఎస్.సుబ్బాయమ్మ (60)కు పొత్తికడుపు కింది భాగంలో గాయమై రక్తస్రావం కావడంతో ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లో సర్జరీ చేస్తున్నారు. మరో బాధితుడు బొంతా అరుణ్కుమార్ (30)కు పక్కటెముకల్లో గాయాలు కావడంతో పీటీవీఎస్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. వీరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని సూపరింటెండెంట్ డాక్టర్ గిరిజవోలు దుర్గాప్రసాద్ తెలిపారు. -
2న జాతీయ లోక్ అదాలత్
గుంటూరు లీగల్: జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టు ప్రాంగణాల్లో సెప్టెంబర్ 12వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ్ చక్రవర్తి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా లోక్ అదాలత్ బెంచెస్ ఏర్పాటు చేస్తారని తెలిపారు. ఈ బెంచెస్ ద్వారా సివిల్ కేసులు, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వారు ఇచ్చిన సర్క్యులర్ ప్రకారం కొన్ని రాజీ పడదగ్గ ఎకై ్సజ్ కేసులు, మోటార్ వాహన ప్రమాద బీమా కేసులు, చెక్కు బౌన్స్ కేసులు, ఎల్ఏఓపీ కేసులు, ప్రీ–లిటిగేషన్ కేసులు పరిష్కరించనున్నట్లు తెలిపారు. లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేందుకు కక్షిదారులు, పోలీసు, స్టేక్ హోల్డర్స్ సహకరించాలని కోరారు. లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణం సీతానగరంలోని విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై గురువారం లక్ష్మీ హయగ్రీవ స్వామివారి తిరునక్షత్ర మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి మంగళాశాసనములతో ఉదయం లక్ష్మీ హయగ్రీవ స్వామివారికి అభిషేకం, అలంకరణ, వివిధ రకాల పుష్పాలతో అష్టోత్తర శతనామార్చన చేశారు. అనంతరం హోమం తదితర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, స్వామి వారిని దర్శించుకున్నారు. పట్నంబజారు: రవాణా శాఖలో పూర్తిస్థాయిలో ఆన్లైన్లో ఉన్న సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా రవాణా శాఖ అధికారి కె.సీతారామిరెడ్డి చెప్పారు. గుంటూరు స్వర్ణభారతినగర్లోని ఆర్టీఏ కార్యాలయంలో గురువారం మీడియాతో ఆయన మాట్లాడారు. సారథి.పరివాహన్.జీవోవీ.ఇన్ వెబ్సైట్లో 83 సేవలు పౌరులకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మెడికల్ సర్టిఫికెట్, గ్రీన్ట్యాక్స్, ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపు, డ్రైవింగ్ లైసెన్సు, తదితర పలు సేవలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్లైన్ చేసిన నేపథ్యంలో వారిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వాహన డీలర్లు నంబరు ప్లేట్ల కేటాయింపులో తాత్సారం లేకుండా వెంటనే కస్టమర్లకు అందజేయాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం గురువారం 536.90 అడుగులకు చేరింది. ఇది 181.9292 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు 6,926, ఎడమ కాలువకు 2,067, ఎస్ఎల్బీసీకి 2 వేల చొప్పున క్యూసెక్కులు విడుదలవుతోంది. దీంతో జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 10,933 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్కు 10,933 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
క్షతగాత్రులకు నూరిఫాతిమా పరామర్శ
నెహ్రూనగర్: చిలకలూరిపేట సమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గురువారం ఉదయం జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారి బంధువులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. ప్రమాదానికి కారణాలను కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవరు మితిమీరిన వేగం, నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘోరం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఫోర్ లైన్ రోడ్లు, ప్రధాన జంక్షన్ల వద్ద కనీస భద్రతా చర్యలు పాటించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించే ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు, డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపట్టాలని, బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె కోరారు. వైఎస్సార్ సీపీ డివిజన్ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, అనుబంధ విభాగాల సభ్యులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ -
ప్రైవేటు ప్రయాణం.. ప్రాణాలే పణం
రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఒక చోట ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రమాదానికి గురికావడం ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తోంది. తెలంగాణలోని కోదాడలో జరిగిన ఘటన కళ్ల ముందు నుంచి తొలగకముందే.. చిలకలూరిపేటలో ఆటోను ఓ ప్రైవేటు బస్సు ఢీకొట్టిన ఘటన పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అతి వేగం.. మద్యం మత్తులో వాహనాలు నడపటం, దూర ప్రాంతాలకు వెళ్తున్న బస్సుల్లో సైతం రెండో డ్రైవర్ లేకపోవటం.. అధికారుల నిర్లక్ష్యం.. వెరసి ప్రయాణికుల ప్రాణాలు బలవుతున్నాయి. కాసులే పరమావధిగా ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. అటు టీడీపీ సర్కారు కూడా ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేసింది. పట్నంబజారు: కోదాడలో ప్రైవేట్ బస్సు డ్రైవరు అతివేగంతో వెళ్లి ప్రయాణికులను బలిగొన్నాడు. ఈ దుర్ఘటన జరిగి 24 గంటలు గడిచేలోపే.. చిలకలూరిపేటలో అతివేగంతో ప్రైవేట్ బస్సు వెళ్లి ఆటోను ఢీ కొంది. ఈ ఘటన చూపరులను సైతం గగుర్పాటు కలిగించింది. శుభకార్యానికి వెళ్లొస్తూ.. ఏడుగురు మంది మృతి చెందారు. ఈ నెల 26వ తేదీ రాత్రి పట్టాభిపురంలోని ఇంటర్సీటీ స్మార్ట్ బస్సు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్కు వెళ్తున్న బస్సు డ్రైవర్ శ్రీనివాసరావు ఫూటుగా మద్యం తాగి బస్సును ఇష్టానుసారంగా నడిపి పలువురు వాహనదారులను ఢీకొట్టాడు. దీంతో వాహనదారులు ఆ బస్సును నిలువరించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెస్ట్ ట్రాఫిక్ పోలీసులు చేరుకుని.. బ్రీత్ ఎనలైజర్తో పరీక్షించి మద్యం తాగినట్లు నిర్ధారించారు. ఆ ఇంటర్ సిటీ స్మార్ట్ బస్సే చిలకలూరిపేటలో ఆటోను ఢీకొట్టింది. దీని యజమానులు మాత్రం చైన్నెలో ఉంటారని ఇక్కడి కార్యాలయం సిబ్బంది తెలిపారు. కనీసం సరైన సమాధానం కూడా చెప్పకుండా ‘కేసు పెట్టుకోండి, పోండి అంటూ..’ వాహనదారులతో మాట్లాడుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఇలాంటి ఘటనలతో ప్రైవేటు బస్సుల్లో ప్రయాణం ఎంత వరకు సురక్షితమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ తరుణంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాల్సిన రవాణాశాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మొద్దు నిద్ర వీడటం లేదనే విమర్శలు వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. అంత దూరమూ ఒక డ్రైవర్తోనే .. దూర ప్రాంత ప్రయాణాల్లో డ్రైవర్ అలసటే ప్రమాదాలకు ప్రధాన కారణాల్లో ఒకటి. డ్రైవింగ్ గంటలపై చట్టపరమైన పరిమితులు, విశ్రాంతి వంటి అంశాలను రవాణా సంస్థలు పాటించాల్సిన అవసరం ఉంది. మోటారు వాహనాల చట్టంలో డ్రైవర్ల పని గంటలను నియంత్రించేందుకు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. ఆచరణలో ఒకే డ్రైవర్తో సుదీర్ఘ ప్రయాణాలు సాగుతున్నాయి. ప్రతి సుదూర మార్గానికి తప్పనిసరిగా ఇద్దరు డ్రైవర్లు ఉండాలి. సంబంధిత పర్మిట్, మార్గం, రాష్ట్ర నిబంధనలు, డ్రైవింగ్ గంటల పరిమితులకు అనుగుణంగా సిబ్బంది ఏర్పాట్లు ఉండాలి. ఈ అంశాన్ని రవాణా అధికారులు తనిఖీల్లో స్పష్టంగా పరిశీలించాలి. కానీ ఆ దిశగా చర్యలు శూన్యం. స్పందించని యాజమాన్యాలు తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన ట్రావెల్స్ సంస్థలు అంతర్ రాష్ట్ర మార్గాల్లో బస్సులు నడుపుతున్నాయి. కొన్ని సంస్థల ప్రధాన కార్యాలయాలు ఒక ప్రాంతంలో ఉండగా... బస్సుల నిర్వహణ మరో ప్రాంతం నుంచి సాగుతుంది. ప్రమాదం జరిగినప్పుడు స్థానికంగా డ్రైవర్, సిబ్బంది మాత్రమే కనిపిస్తారు. అసలు యజమానులు స్పందించడం కూడా మానేశారు. ప్రమాదం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే ముందస్తు తనిఖీలు నిర్వహించడం ముఖ్యం. వాహనాల రికార్డులు, డ్రైవర్ల వివరాలు, ఫిట్నెస్, పర్మిట్లు, బీమా, మార్గ నిబంధనలు, వేగ నియంత్రణ, డ్రైవర్ పని గంటలు తదితర అంశాలపై రవాణా శాఖ పర్యవేక్షణ ఉండాలి. కానీ తనిఖీలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. బస్సు నడిపే వ్యక్తి మద్యం తాగి ఉంటే అది కేవలం ట్రాఫిక్ ఉల్లంఘన కాదు.. ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే చర్య. రాత్రి వేళల్లో బస్సులను తనిఖీ చేసే సమయంలో డ్రైవర్లకు ఆల్కహాల్ పరీక్షలు నిర్వహించడం అత్యంత కీలకం. ముఖ్యంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే మార్గాలు, రాత్రి సమయాల్లో ప్రయాణించే సుదూర బస్సులపై ప్రత్యేక నిఘా అవసరం. ఇంత జరుగుతున్నా.. అధికారులు మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. చట్టపరంగా రవాణా వాహనం పబ్లిక్ ప్లేస్లో నడవాలంటే సంబంధిత పర్మిట్ ఉండాలి. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 66 ప్రకారం పబ్లిక్ వాహనాలకు పర్మిట్ ఉండాలి. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు యాజమాన్యం వద్ద సరైన పర్మిట్ ఉందా? ఆ ప్రకారం వాహనం నడుస్తోందా? అంతర్ రాష్ట్ర ప్రయాణానికి అవసరమైన అనుమతులు ఉన్నాయా? పర్మిట్ షరతులు ఉల్లంఘిస్తున్నారా? వంటి అంశాలను ఆర్టీఏ అధికారులు నిరంతరం పరిశీలించాలి. కానీ అధికారులు ఇవేమీ పట్టించుకోవడం లేదు. ఇకనైనా నిబంధనలను పక్కాగా అమలు చేసి ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కూడా స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. -
గుంటూరు చానల్పై ప్రభుత్వ స్పందన నిరాశజనకం
పర్చూరు(చినగంజాం): గుంటూరు చానల్ను పర్చూరు వరకు పొడిగించే విషయంలో ప్రభుత్వ స్పందన సక్రమంగా లేదని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వీ కృష్ణయ్య అన్నారు. గుంటూరు చానల్ను పర్చూరు వరకు పొడిగించాలని డిమాండ్ చేస్తూ పర్చూరులో 10 రోజులుగా జరుగుతున్న రైతుల ఉద్యమానికి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వీ కృష్ణయ్య మద్దతు తెలిపారు. రైతుల నిరాహార దీక్షా శిబిరాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఆయన మాట్లాడుతూ పర్చూరు ప్రాంత చిరకాల వాంఛ గుంటూరు చానల్ను పర్చూరు వరకు పొడిగించాలని, అది నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, కానీ ప్రభుత్వ స్పందన సక్రమంగా లేదన్నారు. నందిపాడు వరకు వచ్చిన చానల్ను పర్చూరు వరకు పొడిగించాలని, అందుకు రూ.10 కోట్లు మాత్రమే ఖర్చవుతుందన్నారు. అంత తక్కువ మొత్తాన్ని రైతుల కోసం ఖర్చు చేయడానికి ప్రభుత్వం తాత్సారం చేయడం సరైన పద్ధతి కాదన్నారు. సాగునీరు, తాగునీరు అందించడంతో పాటు ఈ ప్రాంతంలోని కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు ఈ ప్రాజెక్టు ఎంతో ఊరటనిస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం పర్చూరు వరకు ఛానల్ పొడిగించడానికి నోటిఫికేషన్ విడుదల చేయాలని, అప్పటి వరకు ఆందోళన కొనసాగించాలని అందుకు తమ ఏపీ రైతు సంఘం, కౌలు రైతు సంఘం అన్ని దశల్లో పోరాటానికి అండదండలు ఇస్తుందని తెలిపారు. పర్చూరులో 11వ రోజు కొనసాగిన రైతుల నిరాహార దీక్ష గుంటూరు ఛానల్ను పర్చూరు వరకు పొడిగించే విషయమై 10 రోజులుగా సాగుతున్న రైతులు నిరాహార దీక్ష బుధవారం 11 వ రోజు కూడా కొనసాగింది. మండలంలోని తిమ్మరాజుపాలెం గ్రామానికి చెందిన 10 మంది రైతులు నిరాహార దీక్ష శిబిరంలో పాల్గొన్నారు. బుధవారం నాటి దీక్షలో డాక్టర్ కొల్లా రాజమోహనరావు, చెన్నుపాటి సూర్య ప్రకాశరావు, చెన్నుపాటి రాధాకృష్ణ, చాగంటి కృష్ణ, గోరంట్ల సీతారామాంజనేయులు, గోరంట్ల రంగారావు, బండి రాంబాబు, చెన్నుపాటి రామ్మోహనరావు, నాయుడు సుబ్బారావు, బండి శంకరయ్య, గోరంట్ల అరవింద్ కూర్చొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షుడు వీ కృష్ణయ్య నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి దీక్షకు తమ పూర్తి మద్దతును తెలియజేసి రైతులకు అండగా నిలిచారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి హనుమంతరావు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పీ కొండయ్య, రైతు సంఘం నాయకులు బండి శంకరయ్య, కొమ్మినేని శ్రీనివాసరావు, డేవిడ్, శ్రీనివాసరెడ్డి, అంచా సుబ్బారావు, కృష్ణంశెట్టి రామకోటేశ్వరరావు, మన్నే మురహరి, మువ్వల రాంబాబు, ఒగ్గిశెట్టి గోవిందరాజులు, పేర్ని హరిబాబు, లగడపాటి వీరాంజనేయులు, దేవరపు లక్ష్మీనారాయణ, లంకా శివ, కోట శ్రీనివాసరావు, తులసి శివనాగేశ్వరరావు, తోకల కృష్ణమోహన్, మల్లాది హనుమంతరావు, తులసి శ్రీనివాసరావు, గోరంట్ల భాస్కరరావు, దొడ్డా వెంకట్రావు, రావూరి ప్రసాద్, గోగుల పూర్ణచంద్రరావు, లంకా రాఘవులు తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వీ కృష్ణయ్య -
మెడికల్ కాలేజీ భవనంపై నుంచి పడి కార్మికుడు మృతి
పిడుగురాళ్ల: మెడికల్ కాలేజీ భవనంపై నుంచి కింద పడి భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందిన సంఘటన బుధవారం పిడుగురాళ్ల మెడికల్ కళాశాల నూతన భవనం వద్ద జరిగింది. సంఘటనకు సబంధించి ఎస్ఐ ఎం.మోహన్ తెలిపిన వివరాల మేరకు... బీహార్ రాష్ట్రానికి చెందిన రమాకాంత్ భష్వాన్ (35) రోజు మాదిరిగానే భవన నిర్మాణ పనులలో పాల్గొని మంగళవారం రాత్రి నూతనంగా నిర్మిస్తున్న ఐదంతస్తుల మెడికల్ కళాశాల భవనంపై నిద్రించాడు బుధవారం తెల్లవారుజామున నిద్ర లేస్తూ కాలుజారి ఐదో అంతస్తు నుంచి క్రింద పడ్డాడు. సంఘటనా స్థలంలోనే అక్కడక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య పిల్లలు ఉన్నట్లు తెలిపారు. తోటి కార్మికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
సాగర్ కుడి కాలువకు నీటి విడుదల
విజయపురి సౌత్: తాగునీటి అవసరాల నిమిత్తం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కుడి కాలువకు అధికారులు బుధవారం నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఈఈ రమేష్తోపాటు జెన్ కో అధికారులు మొదటి యూనిట్ ద్వారా 2 వేల క్యూసెక్కులు దిగువకు వదిలారు. ఈఈ రమేష్ మాట్లాడుతూ.. ఈ నీటిని సాగు అవసరాలకు వినియోగించరాదని పేర్కొన్నారు. కుడి కాలువ పరిధిలోని 442 చెరువులను నింపుకోవాలని, నీటిని వృథా చేయవద్దని సూచించారు. మొత్తం 8 టీఎంసీలు కుడి కాలువకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. తాగునీటి అవసరాలను బట్టి నీటి పరిమాణం పెంచనున్నట్లు వివరించారు. నీటి విడుదలతో నాగార్జున సాగర్ కుడి జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. కార్యక్రమంలో సాగర్ ప్రాజెక్ట్ గేట్స్ డీఈ శ్రీకాంత్, సిబ్బంది గొల్లా వెంకటేశ్వర్లు, యాంపల్లి వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు. రైతులు, ప్రజలు సహకరించాలి నరసరావుపేట: ప్రభుత్వ ఆదేశాల మేరకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలోని ఐదు జిల్లాల ప్రజల తాగునీటి అవసరాల కోసం కుడి కాలువ ద్వారా విడుదల చేసే నీటిని కేవలం తాగునీటి చెరువులను నింపడానికి మాత్రమే వినియోగించాలని లింగంగుంట్ల నాగార్జునసాగర్ సర్కిల్ ఎస్ఈ డి.వెంకటరత్నం బుధవారం పేర్కొన్నారు. సాగర్ పరిధిలోని పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో మొత్తం 442 తాగునీటి చెరువులను 3.31 టీఎంసీలతో నింపనున్నట్లు పేర్కొన్నారు. ఈ నీటిని సాగు అవసరాలకు మళ్లించకుండా జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ప్రత్యేక గస్తీ బృందాలను ఏర్పాటు చేశారని చెప్పారు. ఐదు ప్రత్యేక బృందాలు కాలువ జీరో కి.మీ. నుంచి 137 కి.మీ. వరకు నిరంతరం గస్తీ కాస్తాయని తెలిపారు. రైతులు, ప్రజలు సహకరించాలని కోరారు. కేఆర్ఎంబీ అనుమతులు లేకుండానే.. విజయపురిసౌత్: తాగునీటి అవసరాల నిమిత్తం నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి అధికారులు కుడికాలువకు నీటిని బుధవారం విడుదల చేశారు. దీంతో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అనుమతులు లేకుండానే సాగర్ కుడి కాలువకు ఆంధ్రా అధికారులు నీటిని విడుదల చేశారని ఆరోపిస్తూ తెలంగాణ అధికారులు ఎడమ కాలువకు తాగునీటిని విడుదల చేశారు. -
పంట పండినట్టే..!
ప్లాటు అంటగడితే చెలరేగిపోతున్న రియల్ ఎస్టేట్ అక్రమార్కులు చీరాల టౌన్: చీరాల రెవెన్యూ, పంచాయతీ అధికారులకు చేతులు తడిపితే చాలు.. ఎటువంటి అనుమతులు లేకుండా ప్లాట్లు వేయవచ్చు. కళ్లెదుటే అక్రమంగా వెంచర్లు వేస్తున్నా వారు అటువైపు చూడటం లేదు. తమకు ఆదాయ వనరుగా మారడంతో అక్రమ లే అవుట్లపై ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. చీరాల ప్రాంతంలో జనాభా పెరుగుతుండటంతో నివాస ప్రాంతాలు కూడా పెరుగుతున్నాయి. దీంతో గ్రామాల్లో 50 సెంట్ల వ్యవసాయ భూమిని కూడా వెంచర్లుగా వేస్తున్నారు. భూములకు డిమాండ్ పెరగడంతో పంట పొలాలను కొనుగోలు చేసి వాటిని ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. అసైన్డ్ భూములను సైతం దర్జాగా ప్లాట్లు వేసి అమ్మకాలు చేస్తున్నారు. మండలంలోని ఈపూరుపాలెం, తోటవారిపాలెం 216 బైపాస్ రోడ్డు, పాత ఎస్సీ కాలనీ రోడ్డు, కుందేరు ఒడ్డు తదితర ప్రాంతాల్లోని పంట పొలాలన్నీ ఇప్పుడు ప్లాట్లుగా మారాయి. వాడరేవు తీరానికి వెళ్లే రోడ్డులో, జాండ్రపేట కుందేరు సమీపంలో, అలానే చీరాల పట్టణానికి దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీల్లో సైతం ఇష్టానుసారంగా ప్లాట్లు వేసి అమ్మకాలు చేస్తున్నారు. గవినివారిపాలెం, విజయలక్ష్మీపురం, చేనేత కాలనీ, కొత్తపాలెం, చీరాలనగర్, వాడరేవు, పిట్టువారిపాలెం, బుర్లవారిపాలెం, పెర్లవారిపాలెం తదితర గ్రామాల్లో ఎక్కువగా పొలాలు పాట్లుగా మారుతున్నాయి. తాజాగా వాడరేవు తీరం ఒడ్డునే నాలుగు ఎకరాల్లో నూతన వెంచర్ను సిద్ధం చేస్తున్నారు. సీఆర్జెడ్ నిబంధనలను పట్టించుకోకుండా ఒడ్డును కూడా శుభ్రం చేసేశారు. ప్రభుత్వ ఆదాయానికి గండి సర్కారుకు చెల్లించాల్సిన పన్నును కూడా రియల్టర్లు ఎగవేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పంట పొలాలను ప్లాట్లుగా మార్చి లేఅవుట్లు వేయాలంటే ఆ పొలం మార్కెట్ విలువలో పదో వంతు కన్వర్షన్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత విస్తీర్ణంలో పదో వంతు స్థలం పార్కులకు, రోడ్లు, ఇతర అవసరాలకు వదలాలి. మిగిలిన స్థలంలోనే ప్లాట్లు వేసుకొని విక్రయించుకొనే అవకాశం ఉంటుంది. లేఅవుట్కు కూడా ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా అనుమతి ఉండాలి. ఇందుకు రియల్టర్ ప్రభుత్వానికి సెక్యూరిటీ డిపాజిట్ కూడా కొంత చెల్లించాలి. గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో ప్రత్యేకాధికారుల పాలన వచ్చింది. దీంతో రియల్టర్లు పేట్రేగిపోతున్నారు. టౌన్ప్లానింగ్ అధికారులు కూడా కన్నెత్తి చూడటం లేదు. అక్రమార్కులకు కొందరు రాజకీయ నేతలు, ఉద్యోగులు అండగా నిలవడంతో అసైన్డ్ భూములను కూడా ఆక్రమించుకుని రూ.కోట్లు సంపాదిస్తున్నారు. భూముల విలువకు అమాంతం రెక్కలు రావడంతో పంట పొలాలు కాస్తా ప్లాట్లుగా మారిపోతున్నాయి. రియల్టర్లు జేబులు నింపుకొనేందుకు కనీస అనుమతులు కూడా తీసుకోకుండా పొలాలను కొని ఇష్టానుసారంగా ప్లాట్లు వేసి ప్రజలకు అంటగడుతున్నారు. నిబంధనలకు పాతర వేస్తున్నారు. తీరా అనుమతులు లేని ప్లాట్లు కొనుగోలు చేసి ప్రజలు మోసపోతున్నారు. మరోవైపు ప్రభుత్వ ఆదాయానికి కూడా చిల్లు పడుతోంది. ఈ అక్రమ లేఅవుట్లపై తహసీల్దార్ కుర్రా గోపీకృష్ణను వివరణ కోరగా మండలంలో వేసిన లేఅవుట్లకు అనుమతులు ఉన్నాయో లేవో పరిశీలిస్తామన్నారు. గ్రామాల్లో అనుమతులు లేకుండా వేసిన వెంచర్లు, వాటి వివరాలను సేకరించడంతోపాటు అనుమతులు లేకుండా ప్లాట్లు వేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అసైన్డ్ భూములను ఆక్రమిస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎన్వోసీలు లేకపోయినా అధికార పార్టీ ఆమోదం ఉంటే చాలు.. కన్వెర్షన్ కోసం పంచాయతీ అనుమతి లేకుండానే ప్లాట్లు వేసి భూముల అమ్మకాలు చేస్తున్నారు. కనీసం నివాస యోగ్యమైన ప్రాంతమా? సౌకర్యాలు ఉన్నాయా? వంటివి కూడా పరిశీలించడం లేదు. చీరాల ప్రాంతంలో వేస్తున్న మూడొంతుల లేఅవుట్లు కనీస అనుమతి కూడా తీసుకోనివే. అవగాహన లేని చాలామంది ప్లాట్లయితే కొనుగోలు చేస్తున్నారేగానీ, ఆ తర్వాత మున్సిపాలిటీతో పాటు పంచాయతీల నుంచి అనుమతులు రాకపోవడంతోపాటు బ్యాంక్లు ఇళ్లు కట్టుకోవడానికి రుణ సౌకర్యం కూడా కల్పించక పోవడంతో లబోదిబోఅంటున్నారు. -
ఏపీటీఎఫ్ డిమాండ్
గుంటూరు ఎడ్యుకేషన్: ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రత్యేక టెట్ నోటిఫికేషన్లో ఉపాధ్యాయులకు ఎటువంటి మినహాయింపులు లేని దృష్ట్యా ఆ నోటిఫికేషన్ను సవరించాలని ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మేకల సుబ్బారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏపీటీఎఫ్ (1938) ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి కె. నరసింహారావు మాట్లాడుతూ ప్రత్యేక టెట్ నోటిఫికేషన్లో ఉపాధ్యాయులందరికీ అర్హత మార్కులు 40 శాతంగా, పరీక్ష ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో నిర్వహించాలని డిమాండ్ చేశారు. బోధన సబ్జెక్టుల ప్రామాణికంగా పరీక్షలు నిర్వహించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ పట్ల సానుకూల దృక్పథంతో ప్రత్యేక మినహాయింపుల కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని కోరారు. సీనియర్ నాయకులు ఏవీ రామారావు మాట్లాడుతూ ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించామని తెలియజేశారు. నిరసన ప్రదర్శనలో సంఘ రాష్ట్ర కౌన్సిలర్లు జి. వేళాంగిణి రాజు, భాస్కరరావు, జిల్లా సహాధ్యక్షుడు ఎం. సాయన్న, అదనపు కార్యదర్శి ఒ.నాగార్జున, ఉపాధ్యక్షులు ఆనంగి శ్రీనివాస్, ఎ. జోజప్ప, జిల్లా కార్యదర్శి వై. నాగమల్లేశ్వరరావు, నగర సహాధ్యక్షుడు ఎన్. ప్రసాద్, సీనియర్ నాయకులు ఎ.వి.రామారావు, ఎం. భాను, జె. సూర్యప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు. -
గణనీయంగా పెరిగిన బాజీ బాబా దర్గా ఆదాయం
పెదకాకాని: గుంటూరు జిల్లా పెదకాకానిలోని బాజీ బాబా దర్గాకు రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరినట్లు దర్గా ఈఓ షేక్ ఖాజా మస్తాన్ తెలిపారు. రెండు రోజులుగా నిర్వహిస్తున్న హుండీల కానుకల లెక్కింపు మంగళవారం రాత్రి 11.30 గంటల వరకూ కొనసాగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా హుండీల కానుకల లెక్కింపును నేరుగా వక్ఫ్బోర్డు అధికారులు తిలకించేలా ఏర్పాట్లు చేయడంతోపాటు దర్గా ప్రాంగణంలో పెద్ద ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. దర్గాలో 17 నెలల కాలంగా ఉన్న ఏడు హుండీల కానుకల లెక్కింపులో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర వక్ఫ్బోర్డు సూపరింటెండెంట్ షేక్ హైదర్బాషా, కస్మూర్ దర్గా ఈఓ షేక్ షరీఫ్, వక్ఫ్బోర్డు అకౌంట్స్ అధికారి సయ్యద్ ఆదంషఫీ, పెదకాకాని దర్గా ఈఓ షేక్ ఖాజామస్తాన్లు తెలిపారు. రెండు రోజులపాటు లెక్కించిన హుండీల ద్వారా ఎన్నడూ లేని విధంగా రూ. 39,64,440 ఆదాయం లభించిందన్నారు. 29 గ్రాముల బంగారం, 182 గ్రాముల వెండి లభ్యమైందన్నారు. ఎన్నడూ లేని విధంగా చిల్లర నాణేల రూపంలో రూ.5,60,800 కూడా బ్యాంక్లో జమ చేయడం జరుగుతుందన్నారు. బాబా వారి ఆదాయం పెరగడం పట్ల బుధవారం వక్ఫ్బోర్డు అధికారులు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు. తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై మూడు రోజుల నుంచి ఎంతో వైభవంగా నిర్వహిస్తున్న భూ వరాహ జయంతి మహోత్సవాలు బుధవారంతో ముగిశాయి. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి మంగళాశాసనాలతో ఈ నెల 24వ తేదీ నుంచి భూ వరాహ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తునామన్నారు. 26వ తేదీ ఉదయం భూ వరాహస్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించామని తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని ఆయన తెలిపారు. నాదెండ్ల: ఆంధ్రప్రదేశ్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో సాతులూరు గ్రామానికి చెందిన గమ్మిడి రాగచౌదరి సత్తా చాటింది. విజయవాడలో మంగళవారం జరిగిన ఆక్షన్లో ఆల్రౌండర్ రాగచౌదరిని గోదావరి గోల్డెన్ జట్టు రూ.30 వేలకు దక్కించుకుంది. సెప్టెంబర్ 15న మంగళగిరిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రారంభమయ్యే టోర్నమెంట్లో బరిలో దిగనుంది. గ్రామానికి చెందిన గమ్మిడి శ్రీనివాస్, సీతామహాలక్ష్మి దంపతుల కుమార్తె, హైకోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు మేనకోడలైన రాగచౌదరి చిన్నతనం నుంచే క్రికెట్లో రాణించింది. విజయవాడ వీజే కాలేజ్లో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. 2023–24లో అండర్ 15, అండర్ 19 విభాగాల్లో ఏపీ తరపున నేషనల్స్ స్థాయిలో పాల్గొంది. 2025లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీల్లో రాణించింది. ఈ ఏడాది అండర్ 19 విభాగంలో పాల్గొనేందుకు సిద్ధమవుతోంది. రాయల్ క్రికెట్ అకాడమీలో కోచ్ ఎం. సురేంద్రబాబు వద్ద శిక్షణ పొందుతోంది. నరసరావుపేట: కలెక్టరేట్లో ఎస్సీ కమిషన్ చైర్మన్, ఐదుగురు సభ్యులు శుక్రవారం జిల్లా, మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారని జిల్లా ఎస్సీ సంక్షేమం, సాధికారిత అధికారి దుర్గాభాయి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ ప్రారంభం
నగరంపాలెం: నగరంలోని లక్ష్మీపురం మూడో లైన్న్లో నూతనంగా ఏర్పాటుచేసిన కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ వస్త్ర దుకాణాన్ని బుధవారం పరిపూర్ణానంద స్వామీజీ ప్రారంభించారు. సినిమా నటి కుమారి ఐశ్వర్య రాజేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ యజమానులు బయ్యా శ్రీనివాసులు, బయ్యా రవికుమార్ మాట్లాడుతూ గుంటూరు ప్రజలకు అత్యుత్తమైన, నాణ్యతతో కూడిన పట్టు వస్త్రాలు, సంప్రదాయ చీరలు, ఆధునిక డిజైన్లతో కూడిన వస్త్ర కలెక్షన్ను అందించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతి వినియోగదారుడికి నాణ్యత, విశ్వసనీయత, ప్రత్యేకమైన షాపింగ్ అనుభూతిని అందించేందుకు కృషి చేస్తామన్నారు. భవిష్యత్తులోనూ గుంటూరు ప్రజల ఆదరణ, ఆశీర్వాదాలు అందించాలని కోరారు. ప్రారంభోత్సవంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, నసీర్అహ్మద్, మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర(నాని) పాల్గొన్నారు. తెనాలిరూరల్: యువకుడిపై బీరు సీసాతో దాడి చేసి గాయపర్చిన ఘటన తెనాలి చెంచుపేటలో జరిగింది. వినాయక చవితి చందాలు వసూలు చేసే విషయంలో వివాదం జరగగా ఓ యువకుడు మరో యువకుడిపై బీరు సీసాతో దాడి చేసి తీవ్రంగా గాయర్చాడని సమాచారం. బాధితుడు ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులకు ఫిర్యాదు అందలేదు. సమాచారం రావడంతో విచారిస్తున్నారు. -
మేధోశక్తిని పెంచేందుకే చెకుముకి పోటీలు
జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకుడు కోట వెంకటేశ్వరరెడ్డి బాపట్లటౌన్: విద్యార్థుల్లో దాగివున్న మేధోశక్తిని పెంపొందించేందుకే చెకుముకి పోటీలు నిర్వహిస్తున్నట్లు జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు కోట వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. మండలంలోని వెదుళ్లపల్లి చైతన్యభవన్లో బుధవారం చెకుముకి పోటీల పోస్టర్ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ మొదటిదశ ఈనెల 27న జరుగుతున్నాయన్నారు. రెండో దశ సెప్టెంబర్ 11 జిల్లా స్థాయిలో, మూడో దశ పోటీలు నవంబర్ 1, 2, 3 తేదీల్లో రాష్ట్రస్థాయిలో జరుగుతాయన్నారు. నేటి ఆధునిక సమాజంలో మానవుల జీవితమంతా సైన్సు ఆధారంగానే నడుస్తుందన్నారు. అయితే చాలా విషయాల్లో సైనన్స్కు భిన్నంగా ప్రజల ఆలోచన విధానం వెనకబడి ఉందన్నారు. జనవిజ్ఞాన వేదిక గత నాలుగు దశాబ్దాలుగా రకరకాల విభిన్నమైన కార్యక్రమాలతో ప్రజల్లో శాసీ్త్రయ ఆలోచన పెంపొందించేందుకు కృషి చేస్తుందన్నారు. అందులో భాగంగానే విద్యార్థులకు చిన్ననాటి నుండి శాసీ్త్రయ ఆలోచన పెంపొందించుటకు గత 38 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాలలో 4 లక్షల మంది హైస్కూల్ స్థాయి 8, 9,10 తరగతుల్లోని విద్యార్థులకు ఈ చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హరిబాబు, జిల్లా జన విజ్ఞాన వేదిక నాయకులు కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.నరసరావుపేట ఈస్ట్: సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు విడుదల చేసిన టెట్ పరీక్ష నోటిఫికేషన్ను ప్రభుత్వం పునఃసమీక్షించాలని ఏఐఎస్టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి సిహెచ్.జోసఫ్ సుధీర్బాబు కోరారు. రామిరెడ్డిపేటలోని ఎస్టీయూ జిల్లా కార్యాలయంలో బుధవారం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న జోసఫ్ సుధీర్బాబు మాట్లాడుతూ, కేంద్రంలోనూ ఎన్డీయే కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉన్నందున రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు మేలు చేకూరేలా టెట్పై నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రస్తుతం విడుదల చేసిన టెట్ నోటిఫికేషన్లో ఉపాధ్యాయులకు అనుకూలంగా ఎటువంటి ప్రత్యేకతలు లేవని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పుకు లోబడినందున ఎటువంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోరాదని సాకులు చెబుతున్న ప్రభుత్వం ఇతర రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయాలు పరిశీలించాలన్నారు. బిహార్ రాష్ట్ర ప్రభుత్వం అర్హత మార్కులు 40 శాతం తగ్గించిందని, తమిళనాడు ప్రభుత్వం 2010 సంవత్సరానికి ముందు నియమితులైన ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయిస్తూ అసెంబ్లీ తీర్మానం చేసి పంపిందని గుర్తు చేశారు. ఉపాధ్యాయుల వయసు, ఆరోగ్య పరిస్థితులను దృష్ట్యా కంప్యూటర్ బేస్డ్ పరీక్ష రాయటం వారిని మానసిక ఆందోళనకు గురి చేస్తుందన్నారు. వీటన్నీంటినీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే టెట్ నోటిఫికేషన్ను మార్చాలని కోరారు. టెట్ పరీక్షను ఆఫ్లైన్లో నిర్వహించాలని, అందరికీ 40 శాతం మార్కులు అర్హతగా పరిగణించాలనీ, సిలబస్ తగ్గించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. ఎస్టీయూ నేతలు షేక్ కరిముల్లా, ఎ.ఏమండీ, షేక్ మహబూబ్ సుభానీ, పీవీ భీష్మారావు, టి.ఆంజనేయులు పాల్గొన్నారు. -
మోదీకి మోకరిల్లిన టీడీపీ
● తెలుగువారి ఆత్మగౌరవానికి తూట్లు ● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ● వేలూరు సభలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఘాటు వ్యాఖ్యలు చిలకలూరిపేట(యడ్లపాడు): హామీలు గాలిలో.. ప్రజల బతుకులు నేలపై.. ఇదే మోదీ పాలనలో దేశ పరిస్థితి అని, రాష్ట్రంలోని టీడీపీ సైతం మోదీకి మోకరిల్లిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విమర్శించారు. సీపీఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా నిర్వహించిన మార్పు కోసం ప్రజాయాత్ర పల్నాడు జిల్లా ముగింపు సభ మంగళవారం రాత్రి వేలూరులో జరిగింది. చిలకలూరిపేట ఏరియా కార్యదర్శి తాళ్లూరి బాబురావు అధ్యక్షతన జరిగిన సభలో ఈశ్వరయ్య మాట్లాడారు. దేశ సంపదను కాపాడాల్సిన ప్రధాని నరేంద్ర మోదీ.. చౌకీదార్ అంటూ..దాన్ని కొల్లగొట్టేవారికి కాపలాదారుగా మారారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ఓటు హక్కును కాపాడేందుకు ప్రజలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. నోచుకోలేదన్నారు. అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగం అణగారిన వర్గాలు, మహిళలు, రైతులు, పేదలకు హక్కులు కల్పించిందని ఈశ్వరయ్య అన్నారు. దాన్ని మార్చి మనుధర్మాన్ని అమలు చేయాలనే ఆలోచనలు ప్రజాస్వామ్యానికి ముప్పన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు ప్రజాస్వామ్య శక్తులు సమన్వయంతో ఉద్యమించాలని కోరారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని గుర్తుచేసిన ఈశ్వరయ్య.. చంద్రబాబు మోదీ ముందు మోకరిల్లి అదే ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. పవన్ కల్యాణ్ కూడా ప్రజా, విద్యార్థి సమస్యలపై ప్రశ్నించడం లేదన్నారు. సెప్టెంబరు 1న ఢిల్లీలో సీపీఐ చేపట్టే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. ఓటు హక్కుపై దాడి... సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ మాట్లాడుతూ ఓటర్ల జాబితాల్లో అవకతవకలు, ఓట్ల తొలగింపుపై ఆందోళన వ్యక్తం చేశారు. యువత సంఖ్య పెరుగుతున్నా ఓటర్ల సంఖ్య తగ్గడంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సభకు ముందు చిలకలూరిపేట నుంచి వేలూరు వరకు ర్యాలీ నిర్వహించారు. పలువురు యువతకు ఈశ్వరయ్య పార్టీ సభ్యత్వాలు అందజేశారు. పల్నాడు జిల్లా సీపీఐ కార్యదర్శి ఎ.మారుతీ వరప్రసాద్, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ సుభాని, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు చంద్రనాయక్, నాయకులు చెరుకుపల్లి నిర్మల, బుదాల శ్రీనివాసరావు, షేక్ హుస్సేన్, ఉలవలపూడి రాము, బొంతా తిరుపతయ్య, దాసరి వరహాలు, వెంకట్, ధన్రాజ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
గురువులకు టెట్ గుబులు
వారందరు ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో అర్హత సాధించి, అత్యంత క్లిష్టమైన వడపోతలను దాటుకుని ఉపాధ్యాయ కొలువులు పొందారు. ఏళ్ల తరబడి విద్యాబోధనలో సుదీర్ఘమైన అనుభవం గడించిన వారే. ప్రస్తుతం టెట్ ఓ గుదిబంగా మారింది. వృత్తిపరమైన అర్హతలు నిరూపించుకోవాలని ప్రభుత్వం చెప్పడంతో భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కనీస మినహాయింపులు కూడా ఇవ్వకుండా టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్పై మండిపడుతున్నారు. గుంటూరు ఎడ్యుకేషన్: టీడీపీ సర్కారు రెండు రోజుల క్రితం విడుదల చేసిన స్పెషల్ టెట్ నోటిఫికేషన్ ఇన్ సర్వీసు టీచర్లను తీవ్ర నిరాశకు గురి చేసింది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు పోరాటానికి సిద్ధమవుతున్నాయి. సాధారణ డిగ్రీలతో వత్తిపరమైన డీఎడ్, బీఎడ్ వంటి కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించే ముందు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)లో ఉత్తీర్ణత సాధించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పటికే సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు సైతం టెట్ ఉత్తీర్ణులు కావాల్సిందేనని పేర్కొంది. ఉద్యోగ విరమణకు ఐదేళ్లలోపు వ్యవధి ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపునిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఆందోళనకు గురైన ఉపాధ్యాయులు విద్యాహక్కు చట్టంలో సవరణలు చేయాలని వివిధ ఆందోళనలు, నిరసనలు ద్వారా ప్రభుత్వానికి తమ గళం వినిపించారు. 2009లో అమల్లోకి వచ్చిన విద్యాహక్కు చట్టం ప్రకారం దేశంలో టెట్ తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో 2011 నుంచి నిర్వహిస్తున్నారు. అంతకు ముందు ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించిన వారు సైతం టెట్ రాయాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఐదేళ్లకుపైగా సర్వీసు ఉన్న వారు 2028 ఆగస్టు ఒకటో తేదీలోపు టెట్లో ఉత్తీర్ణత కావాల్సి ఉంది. టీడీపీ సర్కారు నిర్లక్ష్యం కేంద్రంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ సర్కారు ఈ మేరకు ఒత్తిడి తెచ్చి టెట్ నుంచి ఇన్ సర్వీసు టీచర్లకు మినహాయింపు కల్పించేలా చట్ట సవరణకు చేయించాలని ఉపాధ్యాయ సంఘాలు వివిధ రూపాల్లో విజ్ఞప్తులు చేశాయి. పార్లమెంటులో చట్ట సవరణ ద్వారా సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నుంచి మినహాయింపు సాధ్యపడుతుంది. అయితే టీడీపీ సర్కారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ ఇవేమీ పట్టించుకోకుండా ఏకపక్షంగా టెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యాహక్కు చట్టం–2009 సెక్షన్ 23(1)ను సవరించేలా కేంద్రంపై చంద్రబాబు ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి, టెట్ నుంచి మినహాయింపు కల్పించాలని కోరినా పట్టించుకోలేదని మండిపడుతున్నాయి. ఆ విధంగా సాధ్యం కాని పరిస్థితుల్లో ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ సామాజిక వర్గం, కేటగిరీలతో సంబంధం లేకుండా అందరికీ సమానంగా 40 శాతం మార్కులతో ఉత్తీర్ణత కల్పించాలని డిమాండ్ చేస్తున్నా పట్టించుకున్న పాపాన పోలేదని వాపోతున్నారు. ఉపాధ్యాయులపై కక్ష సాధింపు 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి, ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేయడంతోపాటు గత పీఆర్సీ, డీఏ బకాయిల చెల్లింపులు, యాప్ల భారం నుంచి విముక్తి కల్పించాలని ఆందోళనలు, ధర్నాల ద్వారా నిరసన తెలుపుతున్నారు. దీంతో వారిపై ప్రభుత్వం కక్ష గట్టింది. అందుకే ఉపాధ్యాయులు ప్రతిపాదించిన విధంగా ఏ ఒక్క అంశానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే ఈ నెల 5 నుంచి 16 వ తేదీ వరకు సాధారణ టెట్ నిర్వహించారు. సెప్టెంబర్ 15న ఫలితాలను ప్రకటించాల్సి ఉండగా, ఈలోపు స్పెషల్ టెట్ పేరుతో మరో నోటిఫికేషన్ను టీడీపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటికే టెట్ రాసిన ఇన్ సర్వీస్ టీచర్లు మళ్లీ దీనికి దరఖాస్తు చేయాలా, పరీక్ష ఫీజు చెల్లించాలా, లేదంటే గత టెట్ ఫలితం వచ్చే వరకూ వేచి ఉండాలా అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. సాధారణ టెట్ మాదిరిగానే అర్హత మార్కులు, వెయిటేజీ, పరీక్ష విధానంలో సైతం ఎటువంటి మార్పులు లేకుండా విడుదల చేసిన దీనిని ప్రత్యేక టెట్ అని ఎలా అంటారు, అసలు దీని లక్ష్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేక టెట్ను కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహిస్తామని నోటిఫికేషన్లో పేర్కొనడంతో ఏళ్ల కిందట ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించిన వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఆన్లైన్ సాధ్యం కాదని, రాత విధానంలో నిర్వహించాలని సంఘాలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. వేల మందికి కష్టాలు సర్కారు తీరుతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో దాదాపు 8 వేల మంది ఉపాధ్యాయులపై ప్రభావం పడనుంది. జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలల్లో 12,180 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. అదే విధంగా ప్రభుత్వ యాజమాన్యంతోపాటు నగరపాలక, పురపాలక, సంక్షేమ గురుకుల పాఠశాలల్లో మరో మూడు వేల మంది ఉన్నారు. జిల్లాల వారీగా జెడ్పీ, మండల పరిషత్ ఉపాధ్యాయుల సంఖ్య పరిశీలిస్తే గుంటూరులో 3,382, పల్నాడులో 6,695, బాపట్లలో 2,103 మంది ఉన్నారు.దైనందిన వృత్తిలో అనేక ఒత్తిళ్ల మధ్య పని చేస్తున్న ఉపాధ్యాయులకు ప్రశాంతంగా చదివే సమయం ఎక్కడ ఉందో ప్రభుత్వమే చెప్పాలి. స్పెషల్ టెట్ ఆఫ్లైన్లో నిర్వహించాలి. ఏ సబ్జెక్టు బోధిస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు అదే సబ్జెక్టుకు పరిమితం చేసే విధంగా మార్పులు చేయాలి. లేని పక్షంలో ఉద్యమబాట పడతాం. తమిళనాడు ప్రభుత్వం ఇన్ సర్వీస్ టీచర్లను టెట్ నుంచి మినహాయిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసినట్లుగా ఇక్కడా చేయాలి. – ఎం. కళాధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్ సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న టెట్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి, టెట్ నుంచి మినహాయింపు కల్పించాలి. సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ నాయకులను సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉపాధ్యాయుల తమ ఉద్యోగ భద్రత, భవిష్యత్తుకు సంబంధించిన సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం తప్పు కాదు. ఉపాధ్యాయ సమస్యలపై ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రాతినిధ్యం చేసే హక్కు మాకూ ఉంది. – టి. శేషిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ -
జీఎంసీ ఆదాయానికి రూ.కోట్లలో గండి
నెహ్రూనగర్ గుంటూరు నగరపాలక సంస్థలోని ఇంజినీరింగ్ విభాగంలో 2017 – 25 వరకు జరిగిన అభివృద్ది పనులకు సంబంధించి టెండరింగ్ విషయంలో జరిగిన గోల్మాల్ను ‘సాక్షి’ పలు దఫాలుగా కథనాల రూపంలో వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. దొంగ టెండర్లు, లెస్ టెండర్లు వేయించి కార్పొరేషన్ ఆదాయానికి రూ.కోట్లలో నష్టం జరిగేలా చేశారని ఏసీబీ డీఎస్పీ టీవీవీ ప్రతాప్ కుమార్ మీడియాకు తెలిపారు. ఆ కాలంలో 152 వర్కుల్లో అక్రమాలు జరిగాయని.. వాటికి సంబంధించిన టెండర్ ఫైళ్లను తీసుకువెళ్లి పరిశీలించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామని డీఎస్పీ చెప్పారు. అర్ధరాత్రి వరకు విచారణ వాస్తవానికి 156 వర్కుల్లో టెండర్లకు సంబంధించి అవకతవకలు జరిగాయని, దీనిపై పూర్తి స్తాయి విచారణ చేపట్టాలని ఇటీవల నగర కమిషనర్ మయూర్ అశోక్ ప్రభుత్వానికి నివేదించారు. దీనిపై ఏసీబీ అధికారులు సదరు 156 వర్కులకు సంబంధించిన వివరాలతో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు కార్పొరేషన్ కార్యాలయంలోని ఇంజినీరింగ్ విభాగంలో ఆకస్మిక తనీఖీలు చేపట్టారు. ఈ విచారణ సోమవారం అర్ధరాత్రి ఒంటి గంట వరకు కొనసాగింది. దీంతోపాటు మంగళవారం రాత్రి 8 గంటల తనిఖీలు చేశారు. రెండు రోజులపాటు సాగిన విచారణలో గతంలో 156 పనులని పేర్కొన్నప్పటికీ, జాబితాలో 4 పనులు రెండుసార్లు నమోదవ్వడంతో మొత్తం పనుల సంఖ్య 152గా నిర్ధారించామని ఏసీబీ డీఎస్పీ చెప్పారు. పూర్తిస్థాయి నష్టాన్ని లెక్కించేందుకు రికార్డులను పరిశీలిస్తున్నారు. టెండర్లే వేయకుండా పనులు గుంటూరు నగరపాలక సంస్థలో అధికారులను అడ్డం పెట్టుకుని కొంతమంది కాంట్రాక్టర్లు ఫేక్ కాంట్రాక్టర్ ఐడీలు సృష్టించి వాటితోనే ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్లో పాల్గొని పదుల సంఖ్యలో వర్కులు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. వీటికి సంబంధించి కొన్ని బిల్లులు ఆగిపోయినా మరికొన్ని చెల్లించినట్లుగా గుర్తించారు. దీంతోపాటు 135 వర్కులకుపైగా పనులకు లెస్ టెండర్ల మాయాజాలం సృష్టించి కార్పొరేషన్కు రూ.కోట్లల్లో నష్టం కలిగించారని తేలింది. అంటే 20 శాతం లెస్ టెండర్ వేస్తే దానిని అధికారుల సహకారంతో కింది స్థాయి సిబ్బంది దానిని 2.0 గా మార్చి వర్క్ ఆర్డర్ ఇవ్వడంతోపాటు బిల్లులు కూడా చేసేశారు. అధికారులకు తప్పని ఆందోళన 2017–25 సమయంలో పనిచేసిన ఇంజినీరింగ్ విభాగ అధికారులు (జేటీవో, ఏఈఈ, డీఈఈ, ఈఈ, ఎస్ఈ స్థాయి అధికారులు), సుమారు 40 నుంచి 50 మంది వరకు కాంట్రాక్టర్ల పాత్రపై లోతుగా విచారణ కొనసాగిస్తున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు. రెండు రోజులుగా స్వాధీనం చేసుకున్న కీలక ఫైళ్లను సమగ్రంగా పరిశీలించిన తర్వాత పూర్తిస్థాయి నివేదిక సమర్పిస్తామని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. ఎవరి పేర్లు బయటకు వస్తాయో అని 2017–25 వరకు పనిచేసిన అధికారులు ఆందోళన చెందుతున్నారు. -
నేడు సాగర్ కుడి కాలువకు నీరు
నరసరావుపేట: నాగార్జున సాగర్ కుడి కాలువకు బుధవారం ఉదయం 10 గంటలకు రెండు వేల క్యూసెక్కులు విడుదల చేయనున్న నేపథ్యంలో తాగు అవసరాలకే వినియోగించేలా చూసేందుకు పలు విభాగాల అధికారులకు నిఘా విధులు కేటాయించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేవలం తాగునీటి చెరువులకు మాత్రమే ఆ నీటిని వినియోగించాలని, సాగుకు ఎటువంటి పరిస్థితుల్లో ఉపయోగించకుండా రైతులను నియంత్రించేందుకు అధికారులు చూడాలని ఆదేశించారు. నరసరావుపేట: సాగర్ కుడి కాలువకు నీరు విడుదల చేస్తున్నందున పల్నాడు జిల్లాలోని కాలువ పక్కన గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంయుక్త కలెక్టర్ సంజనా సింహ మంగళవారం పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని మండల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, నీటి పారుదల అధికారులతో జేసీ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాగర్ నుంచి విడుదలయ్యే తాగు నీటితో గ్రామాల్లోని ఎస్ఎస్ ట్యాంకులు నింపాలని ఆదేశించారు. ఆ నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సాగుకు వినియోగించరాదని తెలిపారు. అధికారులు, సిబ్బంది నిరంతరం కాలువ వెంబడి పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. కాలువ పక్కన ఉన్న గ్రామ ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. నీటి ప్రవాహం ఉధృతంగా ఉంటుందని హెచ్చరించారు. పిల్లలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
కొనసాగిన జూడాల సమ్మె
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మె మంగళవారానికి 16వ రోజుకు చేరుకుంది. సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన కొనసాగించారు. ఈ సందర్భంగా కోర్టు స్కిట్ను జూడాలు ప్రదర్శించారు. జీజీహెచ్ జూడా సంఘం నేతలు సమ్మె విరమణపై అధికారిక ప్రకటన చేయలేదు. సమ్మెలో గుంటూరు మెడికల్ కాలేజ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యు.ఈశ్వర్శంకర్, వైస్ ప్రెసిడెంట్స్ ఎ.వి.కృష్ణచౌదరి, కె.ప్రసన్న ఆదిలక్ష్మి, షేక్ సోహిల్ అలీ, జనరల్ సెక్రటరీలు జగదీష్ గాదె, డాక్టర్ పి.ఎస్.వి.కల్యాణి, విఘ్నేష్ ఆపతి, కోశాధికారులు జేత్ర మర్రిపాటి, అనురాగ్, జాయింట్ సెక్రటరీలు బి.వంశీకష్ణ, బి.స్నేహసాహిత్య, జి.రాధిక, కునపవర్ కార్తీక్, నిషిరాగ్ బికుంతె, పి.సందీప్కుమార్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఎన్.సాయిప్రదీప్, ఉదయ్సాగర్, సాయిప్రదీప్, తరుణ్కుమార్, హేమంత్నాయక్ పాల్గొన్నారు. -
టెట్పై యూటీఎఫ్ నిరసన
గుంటూరు ఎడ్యుకేషన్ విద్యాహక్కు చట్టం రాక ముందే ఉపాధ్యాయ వృత్తి చేపట్టిన వారిని టెట్ నుంచి మినహాయించాలని యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం. హనుమంతరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్పెషల్ టెట్లో వయోభారం రీత్యా కొన్ని మార్పులు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినా పట్టించుకోకపోవడం వల్ల ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సివచ్చిందని అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో టెట్ను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్ రావు, ఎం.కళాధర్లు మాట్లాడుతూ స్పెషల్ టెట్లో పాస్ మార్కులు 60గా ఉండాలని, ఆఫ్ లైన్లో పరీక్ష నిర్వహించాలని, స్కూల్ అసిస్టెంట్లు ఎవరి సబ్జెక్టుకు వారిని పరిమితం చేసేలా మార్పులు చేయాలని అన్నారు. లేని పక్షంలో ఉద్యమం తీవ్రం చేస్తామని హెచ్చరించారు. జిల్లా సహాధ్యక్షురాలు ఎండీ షకీలా బేగం మాట్లాడుతూ కార్పొరేట్ల కోసం క్షణాలలో చట్టాలను మార్చే ప్రభుత్వాలు న్యాయమైన ఉపాధ్యాయుల సమస్య పరిష్కారం కోసం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. కలెక్టరేట్లో డీఆర్వో ఖాజావలీకి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు సీహెచ్ ఆదినారాయణ, జి.వెంకటేశ్వరరావు, ఎం.గోవిందయ్య, కె.రంగారావు, బి.ప్రసాదు, ఎం.కోటిరెడ్డి, ఆడిట్ కమిటీ సభ్యులు కె.ప్రేమ్ కుమార్, ఎన్. ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఎస్ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలి
కలెక్టర్ వినోద్కుమార్ చీరాల: సంక్షిప్త ఓటర్ల సవరణ జాబితా ప్రక్రియలో చివరి దశను వేగవంతం చేయాలని కలెక్టర్ వి.వినోద్కుమార్ సూచించారు. మంగళవారం చీరాల మున్సిపల్ కార్యాలయంలో వీడియా కాన్ఫరెన్స్ హాలులో ఎన్నికలు, 22 ఎ, ప్రజాభిప్రాయ సేకరణ నివేదికలపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ను నిర్వహించారు. జిల్లాలో 48 మంది ఈఆర్ఓ, ఏఈఆర్వోలు ఉన్నారన్నారు. వారి లాగిన్లో ఉన్న దరఖాస్తులను పూర్తి చేసేందుకు ఉదయం, రాత్రి ఇద్దరు చొప్పున విధులు కేటాయిస్తూ వారికి శిక్షణ ఇచ్చి లాగిన్లో ఉన్న దరఖాస్తులను పూర్తి చేయాలన్నారు. కులం, జన్మస్థలం, పుట్టుక ధ్రువీకరణ పత్రాలు బాగా ఉపయోగపడతాయని, దరఖాస్తుదారుల వద్ద నుంచి వాటిని సేకరించాలన్నారు. నోటీసులు జారీ, హియరింగ్లకు సంబంధించి ఏఈఆర్ఓలు, బీఎల్ఓల వారీగా పెండింగ్ వివరాలను నివేదికల ద్వారా పరిశీలించారు. పెండింగ్కు గల కారణాలపై ఆయన సంబంధిత అధికారులను ఆరా తీశారు. ఫారాల పంపిణీలో పెండింగ్కు గల కారణాలపై ఆయన పరిశీలన చేశారు. ఓటర్ల సవరణలో ఏమైనా సందేహాలు, సమస్యలు ఉంటే వాటిని వెంటనే నివృత్తి చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఆర్ఓఆర్ సర్వేపై నిర్వహించిన ఐవీఆర్ఎస్ ప్రజాభిప్రాయ సేకరణ నివేదికపై కలెక్టర్ వినోద్కుమార్ మండలాల వారీగా సమీక్ష నిర్వహించారు. ఆర్ఓఆర్ సర్వేపై రాష్ట్ర ప్రభుత్వం ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించిందన్నారు. సేకరణలో ఫోన్ కాల్స్ ద్వారా ప్రజలను నాలుగు అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణ చేసినట్లు ఆయన తెలిపారు. ప్రజాభిప్రాయంలో వంద శాతం ప్రతికూలత వ్యక్తపరచిన ఆయా గ్రామాల వీఆర్వోలను ఆయన ఆరా తీశారు. మండలాల వారీగా ఆర్డీఓలను పర్యవేక్షణ చేయాలని అన్నారు. ఎక్కడైతే తేడా ఉంటుందో ఆ గ్రామాల్లో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రం పరిశీలన... మంగళవారం పేరాల హరిప్రసాద్నగర్లోని ఆర్కే ఓరియంటల్ స్కూల్లోని 95వ పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ వినోద్కుమార్ పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓటరు జాబితా పరిశీలించారు. పోలింగ్ కేంద్రం పరిధిలో గైర్హాజరు, ఇల్లు మారడం, మరణాల జాబితా, నోటీసుల జారీ, హియరింగ్ దరఖాస్తులపై బీఎల్ఓను ఆరా తీశారు. హియరింగ్ ప్రక్రియను ఒక ప్రణాళిక ప్రకారం వేగంగా పూర్తి చేయాలని ఏఈఆర్ఓ, బీఎల్ఓకు సూచించారు. చీరాల ఆర్డీఓ నరసింహారావు, మున్సిపల్ కమిషనర్ డేనియల్ జోసఫ్, తహసీల్దార్ గోపీకృష్ణ, వీడియో కాన్ఫరెన్స్లో ఇన్చార్జి జిల్లా రెవెన్యూ అధికారి లవన్న, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, వీఆర్వోలు, బీఎల్ఓలు పాల్గొన్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు -
మండలి డెప్యూటీ చైర్మన్ మాధవరావుకు సన్మానం
పెదకూరపాడు: ప్రజా సమస్యలపై గళం వినిపించే నేతను మండలి డెప్యూటీ చైర్మన్గా నియమించడం అభినందనీయం అని మాజీ శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు. మంగళవారం గుంటూరులోని మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు స్వగహంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి మండలి డిప్యూటీ చైర్మన్ మాధవరావుని ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు ఘనంగా సత్కరించారు. వారు మాట్లాడుతూ శాసనమండలి సభ్యుడిగా వైఎస్సార్ సీపీ తరుపున ప్రజా సమస్యలపై తన గళం వినిపించి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లిన తుమాటి మాధవరావుని మండలి డెప్యూటీ చైర్మన్గా ఎంపిక చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఆయన ప్రజా మన్ననలు పొంది మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, చీరాల నియోజకవర్గ సమన్వయకర్త కరణం వెంకటేష్, అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర చింతలపూడి అశోక్కుమార్, ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు, పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి, విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్, జగ్గయ్యపేట నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరావు పాల్గొన్నారు. -
ఐజీని కలిసిన ఏపీ రిటైర్డ్ పోలీస్ అధికారుల సంఘం నేతలు
నగరంపాలెం: విశ్రాంత పోలీస్ అధికారుల సంక్షేమం, ప్రయోజనాల కోసం సమర్థంగా పనిచేయాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట్రతిపాఠి అన్నారు. మంగళవారం గుంటూరు కలెక్టర్ బంగ్లా రోడ్లోని గుంటూరు రేంజ్ ఐజీ కార్యాలయంలో ఐజీని ఇటీవల ఎన్నికై న ఏపీ రిటైర్డ్ పోలీస్ అధికారుల సంఘం గుంటూరు యూనిట్ అధ్యక్షుడు (విశ్రాంత డీఎస్పీ) వి.పోతురాజు, కార్యదర్శి (విశ్రాంత ఎస్పీ) మేక రమేష్కుమార్, సంయక్త కార్యదర్శి (విశ్రాంత డీఎస్పీ) బీరం నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సత్యనారాయణ, కోశాధికారి కేవీ నారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఐజీని సత్కరించారు. రిటైర్డ్ పోలీస్ అధికారుల వేతన వ్యత్యాసాలు, ఇతర సంక్షేమ అంశాలను పరిశీలించి సమస్యలు పరిష్కారిస్తామని ఐజీ చెప్పారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలిపారు. పాత పోలీస్ భవనం కేటాయించాలి.. జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ను ఏపీ రిటైర్డ్ పోలీస్ అధికారుల సంఘం గుంటూరు యూనిట్ నూతన కార్యవర్గం మర్యాదపూర్వకంగా కలిసింది. అనంతరం జిల్లా ఎస్పీకి ప్రతినిధులు పుష్పగుచ్ఛం అందించి, సత్కరించారు. గుంటూరు యూనిట్ కార్యాలయం ఏర్పాటుకు పాత పోలీస్ భవనం లేదా అనువైన వసతిని కేటాయించాలని జిల్లా ఎస్పీని కోరారు. వసతి కల్పిస్తామని జిల్లా ఎస్పీ హామీ ఇచ్చారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలిపారు. పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారని పేర్కొన్నారు. గుంటూరు వైద్య కళాశాలకు ఎన్ఏబీఎల్ గుర్తింపు గుంటూరు మెడికల్: గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల మైక్రోబయాలజీ విభాగంలోని హెచ్ఐవీ టెస్టింగ్ లాబొరేటరీకి ప్రతిష్టాత్మక ఎన్ఏబీఎల్ గుర్తింపు లభించింది. మంగళవారం కళాశాలలో సిబ్బందిని అభినందించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన పరీక్షలు, ఖచ్చితమైన ఫలితాలు అందిస్తున్నందుకుగాను ఈ గుర్తింపు లభించిందని, ఇది గుంటూరు వైద్య కళాశాలకే గర్వకారణమని కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీధర్, డాక్టర్ మాధవి, మైక్రోబయాలజీ విభాగాధిపతి డాక్టర్ బి.వి.శవమ్మ, ల్యాబ్ టెక్నీషియన్స్ ముస్తఫా, మేరికుమారి, తదితర సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. నగరంపాలెం: గుంటూరు అరండల్పేటలోని అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో శ్రావణ మాస రెండో మంగళవారం 108 కిలోల పసుపుతో అమ్మవార్లకు, మంగళగౌరికి అభిషేకార్చన విశేషంగా నిర్వహించారు. కోటి కుంకుమార్చనలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. సువాసినులతో మంగళ గౌరీ వ్రతం చేశారు. తొలుత విశేష నిత్య పూజలు, శ్రీచక్ర మహామేరుకు అభిషేకార్చనలు జరిగాయి. హారతి, మంత్రపుష్పం అనంతరం తీర్థ ప్రసాదాలను అందించారు. ప్రధాన పూజారి మర్రిపాటి ప్రసాద్ తదితరులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. భక్తిశ్రద్ధలతో మంగళగౌరీ వ్రతాలు స్థానిక సిద్ధార్థనగర్ కనక మహాలక్ష్మి దేవాలయంలో సువాసినులతో శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. విశేష హారతి, మంత్రపుష్పం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. మూలవిరాట్ను ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ వ్యవస్థాపకుడు ఘంటసాల విజయస్వామి పాల్గొన్నారు. ఫిరంగిపురం: మండలంలోని రేపూడి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉన్న ఈవీఎంలు, వీవీ ప్యాట్స్ గోదామును జేసీ అశుతోష్ శ్రీవాస్తవ మంగళవారం పరిశీలించారు. గోడౌన్ వద్ద భద్రత తనిఖీ చేశారు. రికార్డులు, సీసీ కెమెరాల పనితీరు పరిశీలించారు. డీఆర్వో శ్రీనివాసరావు, తహసీల్దార్ ప్రసాద రావు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. -
11 కిలోల గంజాయి పట్టివేత
● పోలీసుల తనిఖీల్లో చైన్నెకి చెందిన ఇద్దరు యువకులు అరెస్ట్ ● వివరాలు వెల్లడించిన డిఎస్పీ ఎండీ మోయిన్ చీరాల: రైలులో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులకు సోమవారం రాత్రి చీరాల ఒన్టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 11 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం రాత్రి చీరాల ఒన్టౌన్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ ఎండీ మోయిన్ కేసు వివరాలను వెల్లడించారు. చైన్నె పెరంబూర్కు చెందిన బాల శ్యాంప్రశాంత్, చైన్నె ఎగ్మోర్కు చెందిన అరవిందన్ శంకర్లు మరో వ్యక్తితో కలిసి ఒక గ్రూపుగా ఏర్పడ్డారు. పార్వతీపురంలో 11 కేజీల గంజాయిని కొనుగోలు చేసి చైన్నెకు తరలించేందుకు ధన్బాద్–అలెప్పి ఎక్స్ప్రెస్ ఎక్కారు. చీరాల ఒన్టౌన్ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు బాపట్ల–చీరాల మధ్య ఒన్టౌన్ పోలీసులు, స్పెషల్ ఎస్బీ పోలీసులు రైలులో తనిఖీలు చేపట్టారు. గమనించిన నిందితులు సోమవారం రాత్రి చీరాల రైల్వేస్టేషన్లో దిగిపోయారు. నిందితుల కదలికలపై అందిన పక్కా సమాచారం మేరకు చీరాల డీఎస్పీ సూచనలతో పోలీసులు దండుబాట రోడ్డులో నిఘా ఉంచారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు నిందితులును అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా వారి వద్ద 11 కేజీల గంజాయి లభించింది. దీంతో చీరాల ఒన్టౌన్ పోలీసులు ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. గంజాయిని ఎవరి వద్ద నుంచి కొనుగోలు చేశారు, ఎవరికి అమ్మేందుకు తరలిస్తున్నారనే విషయాలపై ఒన్టౌన్ సీఐ జి.సోమశేఖర్ ఆధ్వర్యంలో సమగ్ర దర్యాప్తు చేపట్టారు. ఒన్టౌన్ ఎస్సై హరిబాబు, తులసి శ్రీనివాసరావు, జి.వాణిశ్రీ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
డాక్టర్ కిషోర్ కుమార్కు అవార్డు
మార్టూరు: మార్టూరులోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో జనరల్ సర్జన్గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ గారపాటి కిషోర్కుమార్ బెస్ట్ సర్జన్గా మంగళవారం బాపట్లలో కలెక్టర్ వి.వినోద్కుమార్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. గత రెండు సంవత్సరాల కాలంలో స్థానిక ప్రభుత్వాసుపత్రిలో 900కు పైగా శస్త్ర చికిత్సలు చేసి అరుదైన ఘనత సాధించిన సందర్భంగా కిషోర్ కుమార్ ఈ పురస్కారం అందుకున్నారు. కలెక్టర్ వినోద్కుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు రికార్డు స్థాయిలో శస్త్ర చికిత్సలు నిర్వహించి వైద్య సేవలు అందించడం అభినందనీయమని కొనియాడారు. ఇలాంటి వైద్యుల వలన ప్రభుత్వాసుపత్రులపై రోగులకు మరింత నమ్మకం పెరుగుతుందన్నారు. కిషోర్ కుమార్తో పాటు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో సీనియర్ ఫార్మసిస్ట్ విధులు నిర్వహిస్తున్న ఎన్.జ్యోతిర్మయి కూడా ప్రతిభా పురస్కారం అందుకున్నారు. చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య, డీఎంఅండ్హెచ్ఓ పద్మావతి పాల్గొన్నారు. ఘంటసాల: ఎల్నినో ప్రభావంతో సాగు చేస్తున్న రైతులు అప్రమత్తంగా ఉండాలని కేవీకే సమన్వయకర్త డాక్టర్ డి.సుధారాణి అన్నారు. వ్యవసాయ శాఖ విజ్ఞాన యాత్రలో భాగంగా గుంటూరు జిల్లాకు చెందిన రైతులు ఘంటసాలలోని కృషి విజ్ఞాన కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, శాసీ్త్రయ పద్ధతులు, వివిధ వ్యవసాయ అనుంబంధ కార్యకలాపాలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. అనంతరం డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ కేవీకే విధులు, పనితీరు, విత్తన ఉత్పత్తి, శిక్షణ కార్యక్రమాలు, క్షేత్ర స్థాయి పరిశోధనలు, ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రాల గురించి, ఎల్నినో ప్రభావం వలన సాగులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తదితర అంశాలపై తెలిపారు. కేవీకే శాస్త్రవేత్తలు వెంకటలక్ష్మి, రేవతి, నవీన్, యశ్వంత్ కుమార్, గుంటూరు మండల ఏవో కిశోర్, పెదకాకాని ఏఈవో శివరామ్, రైతులు పాల్గొన్నారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): శ్రీకాకుళం జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి నిర్వహించిన అంతర్ జిల్లాల తైక్వాండో చాంపియన్షిప్ 2026 పోటీల్లో గుంటూరు జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరచారని న్యూ ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బి కాశీనాథ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. న్యూ ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్(నాప్తా) నిర్వహించిందన్నారు. కాశీనాథ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీకి చెందిన క్రీడాకారులు మూడు బంగారు, ఐదు రజత, 17 కాంస్యలతో సహా మొత్తం 25 పతకాలు సాధించారన్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులను న్యూ ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షులు అచ్చం నాయుడు, ప్రధాన కార్యదర్శి సీహెచ్ వేణుగోపాలరావు, కోచ్లు బి విజయ్, బి వెంకట సాయి సుబ్రహ్మణ్యం లను అసోసియేషన్ నాయకులు అభినందించి జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందించారన్నారు. గుంటూరు ఎడ్యుకేషన్: పేద, మధ్య తరగతి వర్గాలకు అండగా ఉంటూ సమాజంలో విద్యాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్న బడ్జెట్ పాఠశాలలు మనుగడ సాగించే విధంగా ప్రభుత్వం చేయూత అందించాలని ఏపీ ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ (అప్సా) రాష్ట్ర కో చైర్మన్ మేకల్ రవీంద్రబాబు, రాష్ట్ర కోశాధికారి చెరుకూరి శ్రీహరి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంగా శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. మంగళవారం అప్సా ఆధ్వర్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అప్సా భాగస్వామ్య ప్రైవేటు పాఠశాలలను బైక్ ర్యాలీగా వెళ్లి సందర్శించారు. ఈసందర్భంగా ఆయా పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఈసందర్భంగా అప్సా రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ బడ్జెట్ స్కూల్స్ రక్షణకై సంఘటితం కావాలని, ప్రభుత్వాల నుంచి ఎటువంటి సహాయం పొందకుండా, స్వయంకృషితో డిగ్రీలు చేత పట్టుకుని ఎన్నో ఏళ్లుగా చిన్న పాఠశాలలను ఏర్పాటు చేసుకుని, అర్హత గల ఉపాధ్యాయులతో పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు పాటించి, పాఠశాలలను నడుపుతున్న పలువురు బడ్జెట్ స్కూల్స్ నిర్వాహకులు దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారని, వారికి భరోసా కల్పించి, ఐక్యంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించామన్నారు. కార్పొరేట్కు దూరంగా తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందిస్తూ పేద, బడుగు, బలహీనవర్గాలకు అండగా నిలుస్తున్న సంఘ జిల్లా నాయకులు రాజేష్ నాయుడు, భాను ప్రసాద్, వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు. -
ఇన్ సర్వీసు టీచర్లకు ఆఫ్లైన్ విధానంలో టెట్ నిర్వహించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వం విడుదల చేసిన టెట్ను 40 శాతం పాస్ మార్కులతో ఆఫ్లైన్ విధానంలో నిర్వహించాలని ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శలు గుడిపాటి దాస్, మహమ్మద్ ఖాలీద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం కన్నావారితోటలోని ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. దాస్ మాట్లాడుతూ ఉపాధ్యాయులందరికీ టెట్ నుంచి మినహాయింపు నివ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రాసిన టెట్కు కనీసం ఫైనల్ కీ ఇవ్వకుండానే మరో టెట్ నోటిఫికేషన్ ఇవ్వడమే కాక, ఇచ్చిన స్పెషల్ టెట్లో ఎలాంటి సడలింపులు ఇవ్వకపోవడం సరైనది కాదన్నారు. క్వాలిఫైయింగ్ మార్కులు 90, 75, 60 స్థాయిలో కాకుండా, అందరికీ సమానంగా 40 శాతం పాస్ మార్కులుగా ఉంచాలన్నారు. మహ్మద్ ఖాలీద్ మాట్లాడుతూ లెక్కలు, సైన్సు సబ్జెక్టులు వారు సబ్జెక్టులు కాకుండా వేరే సబ్జెక్టులు చదివి టెట్లో ఉత్తీర్ణులు కావాలనడం ఉపాధ్యాయులను వేధింపులకు గురిచేయడమేనని అన్నారు. సమావేశంలో సంఘ జిల్లా కార్యదర్శులు పి.లక్ష్మీ నారాయణ, పి. శివరామకృష్ణ, వట్టిచెరుకూరు ప్రధాన కార్యదర్శి బి.గురుమూర్తి, సీనియర్ కార్యకర్త సాధనాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో తొలిసారిగా 10 కిలోల సిలెండర్ ఆవిష్కరణ
మంగళగిరి రూరల్: హెచ్పీసీఎల్ నూతనంగా ప్రవేశపెట్టిన 10 కిలోల హెచ్పీ నవ్య కాంపొజిట్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ను ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా మంగళగిరి పట్టణం లో సోమవారం ఆవిష్కరించారు. మంగళగిరిలోని రాయల్ గ్యాస్ ఏజెన్సీలో జరిగిన కార్యక్రమంలో హెచ్పీసీఎల్ దక్షిణ మధ్య జోన్ చీఫ్ జనరల్ మేనేజర్ దేబేష్ పురోహిత్ సిలిండర్ను లాంఛనంగా విడుదల చేశారు. అనంతరం తాడేపల్లి హెచ్పీ పెట్రోల్ బంక్లో పీవోఎస్ను లాంచ్ చేశారు. కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రాంతాన్ని బట్టి సిలిండర్ ధర రూ.4,909 వరకు రీఫిల్ ధర రూ. 1723 వరకు ఉంటుందని వెల్లడించారు. కార్యక్రమంలో ఏపీ రాష్ట్రస్థాయి సమన్వయకర్త వి.రవీంద్ర కుమార్, దక్షిణ మధ్య జోన్ డీజీఎం (సేల్స్) ఆర్.ఉమాపతి, డీజీఎం (ఎన్డీ సేల్) ఆశిష్ సింఘాల్, డీజీఎం (ఆపరేషన్్స్) ఉదయ్ కృష్ణ, విజయవాడ డీజీఎం (ఎల్పీజీ ఆర్వో) కొమర శ్రీనివాసు, విజయవాడ రిటైల్ ఆర్వో అభిషేక్ సింగ్తో పాటు హెచ్పీ గ్యాస్ డీలర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
రంగంలోకి ఏసీబీ అధికారులు
‘సాక్షి’ చెప్పింది అక్షర సత్యం ● ‘తమ్ముళ్ల స్వాహా... నాటకాలు వహ్వా’ కథనానికి స్పందించిన ఏసీబీ ● ‘సాక్షి’ కథనం తరువాత కమిటీలో సభ్యులను నియమించిన వైనం ● ఏసీబీ తనిఖీ చేసేవరకు కనీస విచారణ చేయని కమిటీ ● ఇంజినీరింగ్ విభాగం డ్రాయింగ్ బ్రాంచ్లో అవినీతి బట్టబయలు ● 156 వర్కుల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు సాక్షి ప్రతినిధి, గుంటూరు: ‘సాక్షి’ చెప్పింది అక్షర సత్యమైంది. గుంటూరు నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ విభాగంలో జరుగుతున్న అవినీతిపై ‘సాక్షి’ ప్రచురించిన వరుస కథనాలతో లెస్ టెండర్ల ద్వారా పనులు దక్కించుకుని బిల్లులు చేయించుకునే సమయంలో వాటిని ట్యాంపరింగ్ చేసి అధిక మొత్తంలో డబ్బులు కాజేసిన వైనాన్ని వెలికి తీసింది. దీని వల్ల కార్పొరేషన్ ఆదాయానికి రూ. కోట్లలో గండి పడిందనే విషయాన్ని ‘సాక్షి’ గత ఏడాది ‘రూ. కోట్లలో తమ్ముళ్ల లూటీ’ అనే కథనాన్ని ప్రచురించడంతో ఇంజినీరింగ్ విభాగం డ్రాయింగ్ బ్రాంచ్లో జరుగుతున్న అవినీతిని బయటకు తీసుకొచ్చింది. 2017 నుంచి ఇప్పటి వరకు సుమారు 70 మంది కాంట్రాక్టర్లు లెస్ టెండర్ల పేరుతో రూ. 50కోట్లకు పైగా కార్పొరేషన్ నిధులను కాజేశారనే విషయం బయటపడడంతో అధికారులు తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని చేతులు దులుపుకొన్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంటే ఉదాహరణకు 15 శాతం లెస్ టెండర్కు పనులు దక్కించుకున్న వారికి వర్క్ ఆర్డర్లో మాత్రం 1.5 శాతం లెస్కు టెండర్ వేసినట్లుగా చూపిస్తారు. దీంతో నగరపాలక సంస్థకు టెండర్ దరను బట్టి 13.5 శాతం నష్టం జరుగుతోందన్నమాట. దీన్ని ప్రశ్నిస్తూ ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. దీంతో ఇద్దరు చీఫ్ ఇంజినీర్లతో కమిటీని ఏర్పాటు చేయడంతోపాటు, 70 మందికి పైగా కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని అప్పటి జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. అయితే ఇది జరిగి ఏడాది దాటుతున్నా ఇప్పటి వరకు విచారణ కమిటీనే నియమించలేదని, పాత కాంట్రాక్టర్లే కొత్తపేర్లతో పనులు దక్కించుకుని తిరిగి యధేచ్చగా దోపిడీకి పాల్పడుతున్నారనే వైనంపై ‘తమ్ముళ్ల స్వాహా... నాటకాలు వాహ్వా‘ అనే కథనాన్ని గత నెల 22వ తేదీన ‘సాక్షి’ ప్రచురించింది. దీంతో హడావుడిగా కమిటీని అయితే నియమించారు గాని, విచారణ మాత్రం కనీసం మొదలు కాకపోవడం చూస్తుంటే అధికార పార్టీ నేతల ఒత్తిడి ఏస్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టిన కార్పొరేషన్ ఉన్నతాధికారులు లెస్ టెండర్లను ట్యాంపరింగ్ చేసి ఎక్కువ లెస్ను కాస్త తక్కువ లెస్గా మార్చి కార్పొరేషన్ ఆదాయానికి రూ.కోట్లలో గండి కొట్టిన ఇంజినీరింగ్ అధికారులపై మాత్రం చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. వెలుగులోకి భారీస్థాయి అవినీతి గుంటూరు నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ విభాగంలో జరిగిన అవకతవకలపై పూర్తి స్థాయిలో సమాచారం సేకరించిన ఏసీబీ అధికారులు సోమవారం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భారీ స్థాయిలో అవినీతి జరిగినట్లు గుర్తించినట్లు సమాచారం. ‘సాక్షి’ లో ప్రచురితమైన విధంగా సుమారు 156 పనుల్లో లెస్ టెండర్లు కోడ్ చేసి ఆ తరువాత వాటిని ట్యాంపరింగ్ చేసి ఎక్కువ లెస్ను కాస్త తక్కువ లెస్గా మార్చి భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డట్లు ఏసీబీ అధికారులు అధికారికంగా ప్రకటించారు. అసలు టెండరు వేయకుండానే టెండర్లు వేసినట్లు డాక్యుమెంట్లు సృష్టించి పనులు చేసుకున్నట్లు ఏసీబీ విచారణలో తేలినట్లు సమాచారం. అంతేకాకుండా ఒకసారి వేసిన రోడ్డుకు రెండు సార్లు బిల్లులు చేసి డబ్బులు స్వాహా చేసినట్లు గుర్తించినట్లు తెలిసింది. అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు ఇంజినీరింగ్ విభాగంలో జరిగిన అవినీతిపై ఏసీబీ అధికారులు రైడ్ చేసి పూర్తి స్థాయిలో విచారణ జరుపుతుండటంతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తమ చేత అవినీతి చేయించిన అధికార పార్టీ నేతలకు ఫోన్లు చేసి తమను బయటపడేయాలంటూ వేడుకుంటున్నట్లు సమాచారం. ఇంజినీరింగ్ విభాగంలో ఏసీబీ అధికారుల తనిఖీతో టౌన్ ప్లానింగ్ విభాగం, రెవెన్యూ, ప్రజారోగ్య విభాగం ఇలా అన్ని విభాగాలకు చెందిన అధికారులు ఎక్కడ తమ శాఖాలపై కూడా ఏసీబీ కన్ను పడుతుందోననే భయంతో వణికి పోతున్నారు. సోమవారం అర్ధరాత్రి వరకు ఏసీబీ సోదాలు జరుగుతుండటంతో ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్ అన్నట్లుగా అవినీతి అధికారులు వ్యవహరిస్తున్నారు. నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): గుంటూరు నగర పాలక సంస్థ (జీఎంసీ) ఇంజినీరింగ్ విభాగంలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రంగంలోకి దిగారు. ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ ఆదేశాల మేరకు గుంటూరు ఏసీబీ డీఎస్పీ టీవీవీ ప్రతాప్ కుమార్, సీఐలు బి.నాగరాజు, జీఎల్ శ్రీనివాసరావు, కె.శ్రీనివాసరావు, బీవీవీ సుబ్బారావు, కె.శ్రీనివాసరావు, వి.సురేష్, ఎస్ఐలు ఊరుకుందా, సుబ్బయ్యతో పాటు మరో పది మందితో కూడిన బృందం సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో జీఎంసీ కార్యాలయంలోని ఇంజినీరింగ్ విభాగంపై ఆకస్మిక దాడులు నిర్వహించింది. 2017 నుంచి 2025 వరకు చేపట్టిన పలు ఇంజినీరింగ్ పనుల్లో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ తనిఖీలు చేపట్టారు. నగర పరిధిలో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, తాగునీటి పైప్లైన్ పనులకు సంబంధించిన ఈ–ప్రొక్యూర్మెంట్ టెండర్లలో కాంట్రాక్టర్లు తక్కువ శాతం (లెస్ పర్సంటేజ్) కోడ్ చేసినప్పటికీ, అధికారులతో కుమ్మకై ్క రికార్డులను ట్యాంపర్ చేసినట్లు అధికారులు గుర్తించారు. కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరించి కార్పొరేషన్ ఖజానాకు భారీగా ఆర్థిక నష్టం చేకూర్చినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. గుంటూరు నగర పరిధిలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన దాదాపు 156 పనుల్లో ఈ తరహా నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు ఏసీబీ అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం సంబంధిత ఫైళ్లను, దస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ తనిఖీలు మంగళవారం సాయంత్రం వరకు కొనసాగుతాయని, పూర్తిస్థాయి పరిశీలన అనంతరం కార్పొరేషన్కు ఎంత మొత్తంలో నష్టం వాటిల్లిందనే వివరాలను అధికారికంగా వెల్లడిస్తామని ఏసీబీ డీఎస్పీ ప్రతాప్కుమార్ మీడియాకు తెలిపారు. ఇదిలా ఉండగా ఇంజినీరింగ్ విభాగంలో కుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో ఏసీబీ అధికారులకు ఓ డెస్క్ సొరుగులో రూ.40వేలు గుర్తించారు. ఈ సీటులో గతంలో డీఈఈ హానీఫ్ కూర్చునేవారు ప్రస్తుతం ఆయన వారం రోజులు సెలవులో ఉండటంతో ఈ సీటులో వేరే అధికారులు కూడా కూర్చున్నట్లు సమాచారం. ఏసీబీ అధికారులు వచ్చారని భయపడి ఎవరైనా సొరుగులో నగదు పెట్టి వెళ్లిపోయారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నగదు పై కూడా పూర్తిస్థాయిలో విచారిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. -
అమంగళం..ఇప్పుడేం చేద్దాం?
మంగళవారం శ్రీ 25 శ్రీ ఆగస్టు శ్రీ 2026సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడనే నానుడిని పెదకాకాని మల్లేశ్వర స్వామి దేవస్థాన అధికారులు, పూజారులు నిజం చేస్తున్నారు సాక్షాత్తు భ్రమరాంబ అమ్మవారి పవిత్ర మంగళసూత్రం అపహరణకు గురైనా దేవదాయ శాఖ అధికారులు గానీ, పోలీసులకు గానీ చీమకుట్టినట్లయినా లేకపోవడం దారుణం. హిందూ ధర్మ పరిరక్షణ... సనాతనీ.. అని హిందుత్వ ముసుగు వేసుకున్న ప్రభుత్వ పెద్దలు సైతం దీనిపై నోరు మెదపని పరిస్థితి. పైగా విషయం బయటకు పొక్కితే ఎక్కడ పరువు పోతుందోననే భయంతో అమ్మవారి మంగళసూత్రం అపహరణకు గురైన వారం రోజుల వరకు కనీసం కేసు కూడా నమోదు చేయని పరిస్థితి. పోలీసులు సైతం కేసు నమోదు చేయకుండా దొంగతనానికి సంబంధించిన దర్యాప్తును ప్రారంభించడం చూస్తుంటే ఏస్థాయిలో నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. దీనిపై హిందూ సంఘాల ప్రతినిధులు ఆలయ అధికారులకు ఫిర్యాదు చేసినా తరువాత మాత్రమే అమ్మవారి నగల అదృశ్యంపై ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమ్మవారి ఆభరణాలు అదృశ్యంపై సీరియస్గా విచారణ జరిపి దొంగలు ఎవరో తేల్చాల్సిన పోలీసులు అధికార పార్టీ నేతల ఒత్తిడితో కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా సంఘటన వెలుగులోకి వచ్చిన నాలుగు రోజుల వరకు కనీసం కేసు కూడా నమోదు చేయకుండా ఆలయ పూజారులను పోలీసు స్టేషన్కు పిలిచి విచారించారు. ఆలయానికి సంబంధించి 25 మంది పూజారులు, సిబ్బంది ద్వారా తలా రూ. 50వేలు చొప్పున నగదు సమీకరించి అమ్మవారికి కొత్త ఆభరణాలు కొని అలంకరించాలంటూ అధికార పార్టీ ముఖ్య నేత హుకుం జారీ చేసినట్లు సమాచారం. ఆయన ఆదేశంతో డబ్బులు వసూలు చేయడం, తెనాలిలో ఆభరణాలు తయారు చేయడం చకచకా జరిగినట్లు భోగట్టా. అంటే అమ్మవారి ఆభరణాలు అపహరణకు గురయ్యాయని బయటకు తెలిస్తే వ్యతిరేకత వ్యక్తమవుతుందనే భయంతో దీన్ని కప్పి పుచ్చే ప్రయత్నం చేసినట్లు సమాచారం. అయితే వీరిలో కొందరు తాము తప్పు చేయకుండా డబ్బులు ఎందుకు ఇవ్వాలంటూ అడ్డం తిరగడంతో విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పోలీసు స్టేషన్కు వెళ్లి నిలదీయడంతో ఎట్టకేలకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మల్లేశ్వర స్వామి దేవస్థానంలో గత కొంతకాలంగా జరుగుతున్న వ్యవహారాలపై హిందూ సంఘాలు, భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారి నగలు అపహరణకు గురికావడం ఇది మొదటిసారి కాదని, గతంలో ఇలా జరిగినా సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఈఓ గోగినేని లీలాకుమార్కు హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు, భక్తులు ఫిర్యాదులు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో నిరసన ర్యాలీ చేస్తున్న వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, నేతలు (ఫైల్) అయితే ఆలయ పవిత్రత పేరుతో ఈ విషయాన్ని ఇంతటితో ముగించాలని, ఇప్పటికే చేయించిన కొత్త బంగారు ఆభరణాన్ని అమ్మవారికి అలంకరించేందుకు అనుమతి ఇవ్వాలంటూ పూజారులు అధికారులను అనుమతి కోరినట్లు సమాచారం. అయితే కొత్త ఆభరణం అలంకరించామంటే విమర్శలు వస్తాయని, పోయిన ఆభరణమే దొరికిందని ఎలా నమ్మించాలనే దానిపై పథకరచన చేస్తున్నట్లు భోగట్టా. ఆరు నెలల క్రితం అమ్మవారికి అలంకరించే వడ్రాణం గొలుసులు మాయమైనట్లు మొదట చెప్పి, ఆతరువాత బీరువాలో వెతకగా దొరికాయంటూ కొత్త బంగారపు వస్తువులు సిద్ధం చేయించి దొంగతనానికి పాల్పడిన సిబ్బందిని ఆలయ అధికారులు కాపాడారనే ఆరోపణలు ఉన్నాయి. అమ్మవారి ఆభరణాల విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉండటంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలోనూ రాజకీయాలను జొప్పించి పవిత్రతను దెబ్బతీస్తున్నారని అధికారపార్టీ నేతలపై భక్తులు, హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఈనెల 14వ తేదీన అమ్మవారి మెడలో ఆభరణాలు అలంకరించారు. ఈనెల 18వ తేదీన అర్చకులు చూసి అమ్మవారి మంగళసూత్రం, నాన్తాడు కనిపించడం లేదని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈవిషయంపై ఆలయ అధికారులు ఈనెల 19వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఈనెల 21వ తేదీ శుక్రవారం వరకు కేసు నమోదు కాకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. అధికార పార్టీ ఎమ్మెల్యే ఒత్తిడి వల్లే కేసు నమోదుకాలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే తాము ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని ఆలయ అధికారులు, తమకు ఫిర్యాదే అందలేదని పోలీసులు ఒకరిపై ఒకరు చెప్పుకోవడం చూస్తుంటే అధికారుల నిర్లక్ష్యం ఏస్థాయిలో ఉందో అర్ధమవుతోంది. అమ్మవారి ఆభరణాల అదృశ్యంపై కేసు నమోదు చేయాలంటూ ఈనెల 21న వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. దీంతో పోలీసులు అదేరోజు రాత్రి కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈనెల 19వ తేదీన వైఎస్సార్ సీపీ పెదకాకాని మండల అధ్యక్షుడు ముడియాల మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ నేతలు అమ్మవారి ఆభరణాల అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయకుండానే పోలీసులు దర్యాప్తు చేపట్టడం విశేషం. పెదకాకాని మల్లేశ్వరస్వామి దేవస్థానంలో చోరీ జరిగి వారం దాటుతున్నా పట్టించుకోని అధికారులు, పోలీసులు గుడిలో 25 మంది పూజారులతో కొత్త ఆభరణం కొనిపించే యత్నం! అందుకోసం ఒక్కొక్కరు రూ. 50 వేలు చెల్లించాలని హుకుం మొదట ఒప్పుకోకపోయినా చివరకు కొత్త నగ చేయించిన వైనం! పోయింది దొరికిందని ఎలా నమ్మించాలనే దానిపైనే పథక రచన! -
ఘనంగా భూ వరాహ జయంతి మహోత్సవాలు
చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో వేంచేసియున్న బగళాముఖి అమ్మవారికి సోమవారం వరుణ కలశాభిషేక మహోత్సవం వైభవంగా నిర్వహించారు. వరుణుని అనుగ్రహంతో వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షిస్తూ భక్తులు బగళాముఖి అమ్మవారికి వరుణ కలశాభిషేకం, పూజలు చేశారు. తొలుత 108 లీటర్ల ఆవుపాలు, ఆవు పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, సుగంథ ద్రవ్యాలు, పసుపు, కుంకుమలతో అమ్మవారికి అభిషేకాలు చేశారు. పవిత్ర జలాలు తీసుకువచ్చి కలశాలలో నింపి భక్తులు శిరస్సుపై ధరించి శోభాయమానంగా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. వేద పండితులు ధర్మకర్తల మండలి సభ్యులు భక్తుల సమక్షంలో అమ్మవారికి సమర్పించారు. తొలుత ఆలయ ట్రస్ట్బోర్డు చైర్మన్ కలకోట చక్రధర్రెడ్డి దంపతులు గణపతి పూజ చేసి అమ్మవారికి పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. వరుణ కలశాభిషేక అనంతరం అమ్మవారికి శీతల పరమేశ్వరి దివ్య అలంకరణ చేశారు. కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు. నరసరావుపేట టౌన్: మండలంలోని రావిపాడు గ్రామంలో సోమవారం మధ్యవర్తిత్వంపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయ అధికారి జి.కల్యాణ చక్రవర్తి ఆదేశాలతో న్యాయాధికారి జియావుద్దీన్ న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సమాజంలోని వ్యక్తులు, సమూహాల మధ్య వచ్చే చిన్నపాటి వివాదాలపై న్యాయస్థానాలకు వెళ్లకుండా శాంతియుతంగా రాజీమార్గంలో పరిష్కరించే ఒక ప్రక్రియ అన్నారు. శిక్షణ పొందిన మధ్యవర్తులు ఇరువర్గాల వారితో మాట్లాడి వారి పరస్పర అంగీకారంతో సమస్యను పరిష్కరిస్తారన్నారు. ఎలాంటి ఖర్చు లేకుండా సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. కార్యక్రమంలో రూరల్ ఎస్ఐ కిషోర్, కమ్యూనిటీ మీడియేటర్లు, స్థానిక ప్రజలు, రెవెన్యూ, పోలీస్, న్యాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు. తెనాలిరూరల్: వ్యావహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని జరుపుకునే తెలుగు భాషా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా తెనాలిలోని ప్రధాన పౌర కనిష్ఠ న్యాయస్థానం ద్వారా తుది తీర్పులను తెలుగు భాషలో వెలువరించేందుకు వారం రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాన్ని న్యాయమూర్తి పవన్కుమార్ ఏకా సోమవారం ప్రారంభించారు. అందులో భాగంగా మూడు పౌర దావాలలో తీర్పులు తెలుగులోనే చెప్పినట్టు తెలిపారు. -
బాజీబాబా దర్గాలో హుండీ కానుకల లెక్కింపు
● తొలిరోజు నాలుగు హుండీల ద్వారా రూ.20,19,241 నగదు, 52 గ్రాములు వెండి, 23 గ్రాముల బంగారం లభ్యం ● లెక్కింపును లైవ్ ద్వారా పరిశీలించిన వక్ఫ్బోర్డు చైర్మన్, అధికారులు పెదకాకాని: బాజీ బాబా దర్గాలో హుండీల కానుకలు లెక్కింపు ప్రక్రియ పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వక్ఫ్బోర్డు సూపరింటెండెంట్ షేక్ హైదర్ బాషా తెలిపారు. పెదకాకాని హజరత్ సయ్యద్ బాజీ షహీద్ అవులియా బాబా దర్గాలో సోమవారం హుండీ లెక్కింపు ప్రారంభమైంది. లెక్కింపు కార్యక్రమం రాష్ట్ర వక్ఫ్ బోర్డు అధికారుల ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీసుల సమక్షంలో లెక్కింపు చేపట్టినట్లు వక్ఫ్బోర్డు అకౌంట్స్ అధికారి, హుండీల లెక్కింపు డిప్యూటీ టీం ఇన్చార్జి సయ్యద్ ఆదం షఫీ తెలిపారు. దర్గాలో 17 నెలల హుండీల కానుకలు లెక్కింపు సందర్భంగా ఎటువంటి అవకతవకలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గతంలో హుండీల లెక్కింపులో చేతివాటం జరిగిన నేపథ్యంలో సీసీ కెమెరాల ఏర్పాటు, హుండీల లెక్కింపు వీడియో ప్రక్కనే ఏర్పాటు చేసిన ఎల్ఈడీలో కనిపించడంతోపాటు నేరుగా లైవ్లో వక్ఫ్బోర్డు చైర్మన్, అధికారులు పరిశీలించారు. దర్గాలో మొత్తం ఏడు హుండీలు ఉండగా సోమవారం నాలుగు హుండీలు తెరచి అందులోని కానుకులు లెక్కించారు. ఈ హుండీల ద్వారా బాజీబాబాకు రూ.20,19,241 నగదు, 52 గ్రాములు వెండి, 23 గ్రామలు బంగారు లభించాయని దర్గా ఈఓ షేక్ ఖాజా మస్తాన్ తెలిపారు. మిగిలిన హుండీల్లోని కానుకల లెక్కింపు కార్యక్రమం మంగళవారం ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. -
ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలి
బాపట్ల: ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. జిల్లా పరిశ్రమల ఎగుమతులు ప్రోత్సాహక కమిటీ సమావేశం సోమవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన వనరుల లభ్యతపై నివేదిక సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వ్యవసాయ ఉత్పత్తులు, పర్యాటక రంగ ప్రాంతాలలో పరిశ్రమల స్థాపనకు అనుకూలతపై నివేదిక ఇవ్వాలన్నారు. నూతనంగా పరిశ్రమల స్థాపన, పరిశ్రమల పునరుద్ధరణ కోసం నమోదైన దరఖాస్తులను వేగంగా అనుమతులు ఇవ్వాలని కోరారు. 34 యూనిట్లకు గాను 31 యూనిట్లకు వివిధ శాఖల నుంచిసింగల్ డెస్క్ పాలసీ ద్వారా అనుమతులు జారీ చేశామన్నారు. మిగిలిన యూనిట్లకు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఫ్యాక్టరీస్ డిపార్టుమెంట్ను ఆదేశించారు. ఏపీ పారిశ్రామిక అభివృద్ధి విధానం 2024–29 ద్వారా జిల్లా పరిశ్రమల శాఖ నుంచి ఎనిమిది యూనిట్లకు రూ.92 లక్షల రాయితీలు మంజూరు కోసం చేసిన సిఫార్స్లను కలెక్టర్ ఆమోదించారు. తద్వారా 65 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఏపీఐఐసీ ద్వారా భూముల కేటాయింపు పరిశ్రమల స్థాపనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాణిజ్య పన్నుల శాఖ ద్వారా ఏడాదిలో రూ.17.3 కోట్లు వసూలు అయ్యిందని కలెక్టర్ చెప్పారు. ప్రొఫెషనల్ పన్నుల కింద రూ.65.30 లక్షలు వసూలు చేశామన్నారు. బాపట్ల, చీరాల డివిజన్ కింద జీఎస్టీ వసూలు లక్ష్యాలను చేరుకోవడంపై అధికారులను కలెక్టర్ అభినందించారు. సమావేశంలో కన్వీనర్ జిల్లా పరిశ్రమల అధికారి వై.రామకృష్ణ, వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ కనికిరెడ్డి, లీడ్ బ్యాంకు మేనేజర్ శివకృష్ణ, నాబార్డ్ డీడీఎం జె.రవి, డెప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆర్.త్రినాథరావు, డెప్యూటీ జోనల్ మేనేజర్ ఎం.సువర్ణ ఫణి, జిల్లా టూరిజం అధికారి కె.బెనహర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి పోలింగ్ స్టేషన్ల పరిధిలో హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ సంబంధిత అధికారులకు తెలిపారు. సోమవారం బాపట్ల ఆర్ట్స్, సైన్స్ కళాశాలలోని 140వ పోలింగ్ స్టేషన్ను కలెక్టర్ పరిశీలించారు. పోలింగ్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ఓటర్ జాబితాను ఆయన పరిశీలించారు. పోలింగ్ స్టేషన్ పరిధిలో గైర్హాజరు, ఇల్లు మారటం, మరణాల జాబితా, నోటీసుల జారీ, హియరింగ్ దరఖాస్తుల పై ఆయన బి.ఎల్.వో.ను ఆరా తీశారు. హియరింగ్ కోసం మొత్తం 69 దరఖాస్తులు వచ్చాయని బీఎల్ఓ కలెక్టర్కు వివరించారు. ఈ దరఖాస్తులకు సంబంధించి హియరింగ్ ప్రక్రియను ఒక ప్రణాళిక ప్రకారం వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్నికల మాడ్యూలను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి కే ప్రభాకర్, బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ హరికుమార్, తహసీల్దార్ సలీమా, మున్సిపల్ కమిషనర్ హాసిని, ఎంపీడీఓ బాబురావు, ఏఈ ఆర్ ఓ మల్లికార్జునరావు, బీఎల్వో చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. తొలగించే ఓటర్ల వివరాలు పక్కాగా నమోదు చేయాలి ఓటర్ల జాబితా సవరణ, గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యల పరిష్కారంపై జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ సోమవారం కలెక్టరేట్లోని న్యూ వీడియో కాన్ఫరెన్న్స్ హాలులో అధికారులతో వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఓటర్ల జాబితా సవరణ, మ్యాపింగ్ ప్రక్రియపై ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, బీఎల్ఓలు, డీపీఓ, ఎంపీసీలు, ఎంపీడీఓలతో సమీక్షించారు. ఓటర్ల జాబితా నుంచి తొలగించే ప్రతి ఓటరుకు జారీ చేసిన నోటీసుల వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి లవన్న, ఎలక్షన్ సూపరింటెండెంట్ షఫి తదితరులు పాల్గొన్నారు. తాగునీటి సరఫరాపై.. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులపై కలెక్టర్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని ఏ గ్రామంలోనూ తాగునీటి సమస్య ఉండకూడదని స్పష్టం చేశారు. తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాలను వెంటనే గుర్తించి, తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ డీఈ మాధవి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ -
పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు
మార్టూరు: ఓ హత్య కేసులో అజ్ఞాతంలో ఉన్న నిందితులు పారిపోతుండగా మార్టూరు పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్లో ఆదివారం రహస్యంగా నిర్వహించిన ఆపరేషన్ తాలూకు వివరాలు సోమవారం విడుదల చేశారు. వివరాలు.. తెలంగాణ ప్రభుత్వంలో అధికార పార్టీలోని రెండు వర్గాల మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరులో భాగంగా ఓ వర్గానికి చెందిన హత్య కేసులో నిందితులుగా అనుమానిస్తున్న ముగ్గురిని ఆదివారం ఉదయం 10 గంటలకు హైవే పెట్రోలింగ్ సిబ్బంది రవి తదితరుల సాయంతో స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసులో నిందితులుగా భావిస్తున్న ఈ ముగ్గురు వ్యక్తులు ముందస్తు బెయిలు కోసం అప్పీలు చేసుకొని ప్రస్తుతం అజ్ఞాతంలో సంచరిస్తున్నారు. పక్కా సమాచారంతో మాటు వేసి.. సదరు వ్యక్తులు బెంగళూరు, కడప, నెల్లూరు పట్టణాల మీదుగా ప్రయాణిస్తూ కారులో మార్టూరు వైపు వస్తున్నట్లు తెలుసుకున్న తెలంగాణ పోలీసులు కారు నంబరు వివరాలను స్థానిక పోలీసులకు, హైవే పెట్రోలింగ్ సిబ్బందికి పంపించి అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం పది గంటల ప్రాంతంలో బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద అనుమానిత వ్యక్తుల కారును గమనించిన హైవే పెట్రోలింగ్ సిబ్బంది రవి, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు అడ్డగించారు. సమాచారం అందుకున్న సీఐ వై.శ్రీనివాసరావు నిందితులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. సాయంత్రం తెలంగాణ నుంచి వచ్చిన పోలీసు అధికారులు నిందితులను తీసుకుని హైదరాబాద్ తరలించారు. అధికారులు అదుపులోకి తీసుకొన్న ముగ్గురు వ్యక్తుల్లో హైదరాబాద్లోని మాదాపూర్ ప్రాంతానికి చెందిన ముత్యాల మహేందర్రెడ్డి, బత్తిని అరుణ్ కుమార్రెడ్డి, ఉప్పల్కు చెందిన పసుపులేటి కార్తిక్లుగా సమాచారం. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించి సహకరించిన హైవే పెట్రోలింగ్ సిబ్బంది రవి, హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులకు పోలీస్ అధికారులు నగదు రివార్డులు అందజేశారు. -
అర్జీలు పునరావృతం అయితే కఠిన చర్యలు
ఎస్పీ బి.ఉమామహేశ్వర్ బాపట్లటౌన్: పీజీఆర్ఎస్కు వచ్చే అర్జీలు పునరావృతం కాకుండా చూడాలని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు ఎస్పీ కార్యాలయానికి చేరుకొని తమ సమస్యలను వివరించారు. బాధితుల సమస్యలు తెలుసుకున్న ఎస్పీ బి.ఉమామహేశ్వర్ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లాలోని పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అర్జీదారుల సమస్యలను చట్ట పరిధిలో విచారించి నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలని ఆదేశించారు. వివిధ సమస్యలతో పోలీస్ కార్యాలయాలకు వచ్చే బాధితులకు భరోసాగా పోలీస్ శాఖ ఉండాలని చెప్పారు. అర్జీలను పూర్తి స్థాయిలో విచారించి శాశ్వతంగా పరిష్కారం చూపాలన్నారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అధికంగా కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఆస్తి తగాదాలు, భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీ మోసాలకు సంబంధించిన అర్జీలే అధికంగా వస్తున్నాయని పోలీసు అధికారులు ఎస్పీకు వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎల్.సుధాకర్, బాపట్ల సీసీఎస్ డీఎస్పీ పి. జగదీష్నాయక్, పీజీఆర్ఎస్ సెల్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
భక్తుల మనోభావాలు గౌరవించాలి
బాపట్ల: మాకర్లవారి రామానుజ కూటమికి సంబంధించి గతంలో తీసుకున్న అమాల్గమేషన్(భావనారాయణస్వామి దేవాలయం, మాకర్లవారి రామానుజ కూటమిన్ని కలిపి అభివృద్ధికి ఆర్డర్స్) రద్దుపై పునఃపరిశీలన చేయాలని మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పేర్కొన్నారు. సోమవారం స్థానిక కోన చాంబర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. దశాబ్దాలుగా రామానుజ కూటమి ఏ విధంగా క్షీణదశకు చేరుకుందో బాపట్ల ప్రజలందరికీ తెలుసని ఆయన పేర్కొన్నారు. మాకర్లవారు ఏర్పాటు చేసిన కూటమి ఆశయాలను కొనసాగించడంతో పాటు, బాపట్ల క్షేత్రపాలకుడైన శ్రీ భావనారాయణ స్వామి దేవస్థానం అభివృద్ధికి శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో గతంలో చర్యలు చేపట్టినట్లు తెలిపారు. తాను డెప్యూటీ స్పీకర్గా ఉన్న సమయంలో ఎండోమెంట్ శాఖ అధికారులతో సంప్రదించడంతో పాటు, బాపట్లకు చెందిన మాకర్లవారి కుటుంబాలకు, కూటమితో అనుబంధం ఉన్నవారికి, భక్తులకు సంబంధించిన వర్గాలతో చర్చించి ఒక శాశ్వత పరిష్కారం కోసం అమాల్గమేషన్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లినట్లు కోన రఘుపతి వివరించారు. శిథిలావస్థకు చేరిన పాత రామానుజ కూటమి స్థానంలో టీటీడీ ఆలయ సత్రాలను తలపించే విధంగా ఆధునిక సౌకర్యాలతో ఒక అద్భుతమైన భవనాన్ని నిర్మించామని తెలిపారు. ఆ భవన నిర్మాణంలో భావనారాయణ స్వామికి సంబంధించిన భక్తుల విరాళాలు కూడా ఉన్నాయన్న సంగతి మనము మరువకూడదని చెప్పారు. ఆ భవనాన్ని బ్యాంకుకు అద్దెకు ఇవ్వడం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఒకవైపు భావనారాయణ స్వామి దేవస్థానం అభివృద్ధికి, మరోవైపు మాకర్లవారి ఆశయాల సాధనకు ఉపయోగపడేలా శాశ్వత ఆదాయ వనరుగా రూపొందించినట్లు చెప్పారు. ఇటువంటి నిర్ణయాలు ఏ ఒక్కరివో కొంతమంది ఓ కాకుండా, బాపట్ల వాసులు, భక్తుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని చేయాల్సిన నిర్ణయంగా ఆయన పేర్కొన్నారు. గతంతో పోలిస్తే మెరుగ్గా ఆలోచించి, ఆ సత్ర నిర్వహణలో లోటుపాట్లు ఉంటే ఎండోమెంట్ శాఖ వారితో కూడా చర్చించి అదే విధంగా భక్తులు, కమిటీలతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని ఇటువంటి ఆర్డర్ల ద్వారా మొత్తం దేవాలయ నిర్వహణలో మాకర్ల వారే ఆశయాలను డోలాయమానంలో పడేయకూడదని హితవు పలికారు. ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ చర్చించినట్లు చెప్పారు. ఆలయాల నిర్మాణం పూర్తి చేయాలి బాపట్లలో భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న శివాలయం, ఆంజనేయ స్వామి దేవాలయాల నిర్మాణాన్ని కూడా పూర్తి చేసే విధంగా ప్రభుత్వం, అధికారులు చొరవ తీసుకోవాలని కోన రఘుపతి కోరారు. ‘మనం అభివృద్ధి చేయాలనుకోవడమే కాదు.. అభివృద్ధి చేతల్లో కనిపించాలి’ అని ఆయన అన్నారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనకు ఇప్పటికే రెండున్నర సంవత్సరాలు గడిచాయని, ఇకనైనా భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ అంశాలను త్వరితగతిన పరిష్కరించి, ఆలయాల నిర్మాణాలను పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సూర్యలంకలోనే బాపట్ల ఎయిర్పోర్టు ఏర్పాటు చేయాలి బాపట్ల పర్యాటక రంగం అభివృద్ధికి అత్యంత కీలకమైన అంశంగా విమానాశ్రయం ఏర్పాటును పరిగణించాలని కోన రఘుపతి అన్నారు. తమ హయాంలో ప్రతిపాదించిన విధంగానే బాపట్ల సూర్యలంకలో ఎయిర్పోర్టు ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ప్రతిపాదనను కేవలం రాజకీయ అంశంగా కాకుండా బాపట్ల భవిష్యత్ అభివృద్ధి, పర్యాటక రంగం, ఆర్థికాభివృద్ధికి సంబంధించిన ముఖ్యమైన అంశంగా చూడాలని అన్నారు. ‘బాపట్ల అభివృద్ధి కోసం పార్టీలు, రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బాపట్ల అభివృద్ధి కోసం అవసరమైన ప్రతి అంశంలో సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం’ అని కోన రఘుపతి స్పష్టం చేశారు. సమావేశంలో ఎంపీపీ చిన్నపోతుల హరిబాబు, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు కాగిత సుధీర్బాబు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, ఉయ్యూరు లీలా శ్రీనివాసరెడ్డి, పార్టీ నాయకులు కోకి రాఘవరెడ్డి, వడిముక్కల డేవిడ్, కొక్కిలిగడ్డ చెంచయ్య, ఇనగలూరి మాల్యాద్రి, పీటా వేణుగోపాల్,మోర్ల సముద్రాలగౌడ్,గంగిశెట్టి రత్తయ్య, జోగి రాజా,ఆట్ల ప్రసాద్రెడ్డి,జాలిరామిరెడ్డి,పిన్నిబోయిన ప్రసాద్ తదితరులున్నారు. -
కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
బాపట్ల: వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు సత్యంరాజు కూరపాటి పేర్కొన్నారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు, అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ను సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదికలో కలిశారు. న్యాయమైన కోర్కెల పరిష్కారం కోరుతూ దశలవారీగా చేపట్టిన ఆందోళనలో చేపట్టడం జరిగిందని తెలిపారు. సమానపనికి సమానమైన వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ఆందోళన చేపట్టినట్లు కూరపాటి తెలిపారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో స్టాఫ్ నర్స్ల విభాగం నుంచి కల్పన, గోపి, ఉష, ప్రభాకర్, ఫార్మాసిస్టులు నళిని, శాంతి, సుధా, ల్యాబ్ టెక్నీషియన్లు నీలిమ, సునీత, శివాజీ బడుగు, చంద్రశేఖర్, శివచంద్ర, రేడియోగ్రాఫర్లు సుకన్య, బయో మెడికల్ ఇంజనీర్ నళిని తదితరులు పాల్గొన్నారు. 28న సంస్కృత భాషా దినోత్సవం బాపట్ల: ఆంధ్రప్రదేశ్ తెలుగు, సంస్కృత అకాడమీ ఆధ్వర్యంలో ఈనెల 28వ తేదీన సంస్కృత భాషా దినోత్సవం సందర్భంగా జిల్లెళ్లమూడిలోని మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ మెరుగుమల్లి వెంకటేశ్వరరావు తెలిపారు. అకాడమీ చైర్మన్ ఆర్డీ శరత్చంద్ర ఆధ్వర్యంలో కళాశాలలోని తిరుపతి, తిరుమల దేవస్థానం కల్యాణ మండపంలో ఈ వేడుకలు జరుగుతాయని తెలిపారు. సంస్కృత భాష గొప్పతనాన్ని చాటి చెప్పేలా ఈ కార్యక్రమం ఉండబోతున్నదనీ ఈ కార్యక్రమంలో పలు సంస్కృత భాషా పండితులు, అభిమానులు పెద్దలు పాల్గొనబోతున్నారని తెలిపారు. ఓరియంటల్ కళాశాలల వైభవాన్ని చాటి చెప్పేలా భగవద్గీత కంఠస్థ పోటీలు, అదేవిధంగా నృత్య ప్రదర్శనలు, శ్రీ కృష్ణార్జున సంవాదం వంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈ కార్యక్రమంలో అందరినీ అలరించబోతున్నాయని తెలిపారు. కొల్లూరు: ఇండియా తరపున స్కేటింగ్ పోటీలలో పాల్గొని పతకాలు సాధించిన క్రీడాకారులకు స్థానికంగా అపూర్వ స్వాగతం లభించింది. కొల్లూరుకు చెందిన గరిక రిత్విక్, మునిపల్లి పునీత్లు ఇండో–నేపాల్ చాంపియన్ షిప్ పోటీలలో భాగంగా నేపాల్లోని పోక్రాలో జరిగిన స్కేటింగ్ పోటీలలో ఇండియా జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఈనెల 19 నుంచి 21 వరకు నిర్వహించిన అండర్–14 ఏరో స్కేట్ బాల్ పోటీలతోపాటు, వ్యక్తిగత స్కేటింగ్ పోటీలలో రిత్విక్ రెండు గోల్డ్ మెడల్స్, రెండు సిల్వర్ మెడల్స్ సాధించగా, పునీత్ గోల్డ్ మెడల్ పొందాడు. పోటీలలో పాల్గొని సోమవారం స్వగ్రామమైన కొల్లూరు వచ్చిన ఆటగాళ్లను స్థానికులు ఘనంగా స్వాగతించారు. కొల్లూరు ఎంపీపీ కమ్మెల నాంచారమ్మ పూలమాలలతో సత్కరించి భవిష్యత్తులో మరిన్ని పోటీలలో రాణించాలని ఆకాంక్షించారు. ఇరువురు క్రీడాకారులను కొల్లూరు శివారు గాంధి నగర్ నుంచి వారు విద్యను అభ్యసిస్తున్న ఫోర్ ప్రంట్ పాఠశాల వరకు వారు సాధించిన పతకాలు, షీల్డ్స్తో ఓపెన్ టాప్ కారులో ఊరేగింపుగా తరలించారు. ఇరువురు క్రీడాకారులను పలువురు అభినందించారు. పోక్సో కేసులో నిందితుడికి జైలు కొల్లూరు: పోక్సో కేసులో నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించినట్లు కొల్లూరు పోలీసులు సోమవారం వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... గతేడాది జనవరిలో కొల్లూరు ఎస్సీ కాలనీకి చెందిన 2వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అదే ప్రాంతానికి చెందిన ఉదరగుడి లక్ష్మయ్య (లచ్చిగాడు) అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ జి. ఏడుకొండలు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. తెనాలి పోక్సో కోర్టులో విచారణలో ఉన్న కేసులో సోమవారం న్యాయమూర్తి ఎం.ఇందిరా ప్రియదర్శిని సాక్ష్యాలు, దర్యాప్తు అధికారి సేకరించిన భౌతిక ఆధారాలను పరిగణలోకి తీసుకొని నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. అత్యాచారయత్నానికి యత్నించిన నిందితుడుకి ఏడేళ్లు కారాగార శిక్ష, రూ.7 వేలు జరిమానా విధించారు. బాధిత బాలికకు రూ.లక్ష పరిహారం అందజేయనున్నట్లు న్యాయమూర్తి తన తీర్పులో వెల్లడించారు. పోక్సో కేసులో నిందితుడికి నేరం రుజువై జైలు శిక్ష పడేందుకు నిర్భయంగా సాక్ష్యం చేప్పే విధంగా సాక్షులకు ధైర్యమిచ్చిన పోలీసు సిబ్బందిని, కోర్టు మానిటరింగ్ సిబ్బందిని, ప్రత్యేక పీపీ వి. రాఘవయ్యను అభినందించినట్లు పోలీసులు తెలిపారు. -
వైఎస్సార్ సీపీలో చేరిన ఎస్టీ కుటుంబాలు
చెరుకుపల్లి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనకు ప్రస్తుత కూటమి పాలనకు ఎంతో వ్యత్యాసం ఉందని పొన్నపల్లి ఎస్టీ కాలనీ మహిళలు పేర్కొన్నారు. చెరుకుపల్లి మండలం పొన్నపల్లి గ్రామానికి చెందిన 15 ఎస్టీ కుటుంబాల సభ్యులు సోమవారం వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పీటా నాగమోహన్కృష్ణ సమక్షంలో పార్టీలో చేరారు. వారిని పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాగమోహన్కృష్ణ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందని అన్నారు. కూటమి పాలనలో కార్పొరేట్ వ్యవస్థలకు మాత్రమే మేలు చేకూరిందని చెప్పారు. రానున్న కాలంలో ప్రతి ఒక్కరూ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చూసేందుకు సిద్ధంగా ఉన్నారని, పార్టీలో చేరిన ప్రతి ఒక్క కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం మండల అధ్యక్షడు దుండి శ్రీనివాసరెడ్డి, పార్టీ గ్రామ అధ్యక్షుడు బక్కా సుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
తప్పిపోయిన బాలుడి తల్లిదండ్రులకు అప్పగింత
ఇంకొల్లు(చినగంజాం): తప్పిపోయిన బాలుడిని పోలీసులు సాంకేతిక సాయంతో చాకచక్యంగా పట్టుకొని తల్లిదండ్రులకు అప్పగించారు. సోమవారం ఇంకొల్లు ఎస్ఐ జీ సురేష్ మాట్లాడుతూ.. ఇంకొల్లు మండలంలోని సూదివారిపాలెం గ్రామానికి చెందిన పాలపర్తి నాగచైతన్య అనే 17 ఏళ్ల బాలుడు ఈ నెల 22న తేదీ శనివారం ఉదయం కాలేజీకి వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరాడు. మార్గమధ్యంలో పూసపాడు క్రాస్ రోడ్డు వద్ద బస్సుదిగి అనంతరం కనిపించకుండా పోయాడు. బాలుడు కాలేజీకి వెళ్లి ఇంటికి తిరిగిరాక పోవడంతో కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లలోను పరిసర ప్రాంతాల్లోను గాలించినప్పటికి ఆచూకీ లభించలేదు. దాంతో తల్లి పాలపర్తి నాగమణి 23 వతేదీ ఆదివారం పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. పోలీసుల గాలింపులో సీసీటీవీ 360 ప్రాజెక్ట్ ద్వారా బాలుడి కదలికలను ప్రతి రెండు గంటలకు ఒకసారి సాంకేతికంగా పరిశీలించారు. 23 వతేదీ సాయంత్రం నిర్వహించిన పరిశీలనలో సాయంత్రం 6.50 గంటలకు బాలుడు ఒంగోలు బస్టాండ్ పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాల్లో గుర్తించబడ్డాడు. వెంటనే ఇంకొల్లు పోలీస్ స్టేషన్ సిబ్బంది అక్కడికి చేరుకొని బాలుడిని క్షేమంగా గుర్తించి తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సీసీటీవీ 360 ప్రాజెక్ట్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తక్కువ సమయంలో బాలుడ్ని గుర్తించడం సాధ్యమైందని ఎస్ఐ తెలిపారు. గుంటూరు జిల్లాలో సగటు వర్షపాతం 7.8 మి.మీటర్లు కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 13 మండలాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా చేబ్రోలు మండలంలో 26.4 మిల్లీ మీటర్లు వర్షం కురవగా, అత్యల్పంగా ఫిరంగిపురం మండలంలో 1.8 మి.మీ వర్షం కురిసింది. సగటున 7.8 మి.మీ వర్షపాతం నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. పెదకాకాని మండలంలో 20.4 మి.మీ., దుగ్గిరాల 18.4, తెనాలి 17.6, పెదనందిపాడు 10.2, కొల్లిపర 8.8, కాకుమాను 8.6, వట్టిచెరుకూరు 7.2, పొన్నూరు 6.4, గుంటూరు తూర్పు 6.4, గుంటూరు పశ్చిమ 5.4, ప్రత్తిపాడు మండలంలో 2.8 మి.మీ చొప్పున వర్షం పడింది. -
సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి లేని ప్రభుత్వం
బాపట్ల: రాష్ట్రవ్యాప్తంగా దళితులు ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలు పరిష్కరించాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు డి.రమాదేవి విమర్శించారు. దళితవాడల్లో సమస్యల పరిష్కారం కోసం వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ధర్నాకు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి టి.కృష్ణమోహన్ అధ్యక్షత వహించారు. రమాదేవి మాట్లాడుతూ దళితవాడల్లోని ప్రజలకు కనీసం తాగేందుకు నీళ్లు ఇవ్వలేకపోవడం, జీవో నెంబర్ 1235 ప్రకారం ప్రతి దళిత గ్రామానికి రెండు ఎకరాలు శ్మశానస్థలం కేటాయించాల్సి ఉందని కానీ ఆ పరిస్థితి లేదన్నారు. బాపట్ల జిల్లాలో అనేక ఏళ్లుగా దళితులు సాగు చేసుకుంటున్న సొసైటీ, పోరంబోకు, లంక భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళితులు సాగు చేస్తున్న భూములకు తక్షణమే ఎరువు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ కార్మికులు చేసిన ఉపాధి పనికి డబ్బులు మూడు వారాలుగా బకాయి ఉన్నాయని, వాటిని తక్షణమే చెల్లించాలని కోరారు. కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్.గంగయ్య మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు సమస్యలు పరిష్కరించకుండా మోసం చేస్తున్నారని అన్నారు. ధర్నా శిబిరం వద్దకు వచ్చిన జిల్లా కలెక్టర్ వినోద్కుమార్కు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. సమస్యలను పరిష్కారం చేస్తామని జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ధర్నాలో కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ నాయకులు జయరాజు, ఎన్.బాబురావు, సిహెచ్.మణిలాల్, పి.కొండయ్య, బి.అగస్టీన్, కే.శరత్బాబు, ఎం.కిరణ్, పి.మనోజ్, బి సుబ్బారావు, ఎం.వసంతరావు, పి. శ్రీనివాసరావు, కె.నాగేశ్వరావు, నూతలపాటి కోటేశ్వరరావు పాల్గొన్నారు. -
ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించాలి
కర్లపాలెం: ప్రభుత్వం ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా రైతుల సంఘం అధ్యక్షుడు గొట్టిముక్కల గాంధీ భగవాన్రాజు కోరారు. కర్లపాలెం గ్రామదేవత పెద్దింటమ్మ అమ్మవారి కల్యాణ మండపంలో ఆదివారం బాపట్ల జిల్లా స్థాయి ఆక్వా రైతుల సమావేశం నిర్వహించారు. భగవాన్రాజు మాట్లాడుతూ ఆక్వా రైతులకు కరెంటు యూనిట్కి రూ.1.50లకు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. ఎన్నో కష్టాలకోర్చి రైతులు పెంచిన రొయ్యలకు ప్రభుత్వం కౌంటుల వారీగా సరైన గిట్టుబాటు ధర అందించాలని, మేత ధరలు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆక్వా రైతులు సంఘాలుగా ఏర్పడి సొసైటీల ద్వారా సబ్సిడీ రుణాలు తీసుకుని వినియోగించు కోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, మండలాలలో ఆక్వా రైతుల యూనియన్లు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఆక్వా రైతులందరూ ఐకమత్యంగా ఉండి తమ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ఆయన చెప్పారు. సమావేశంలో ఆక్వా రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈదర కుమార్, సభ్యులు రామలింగరాజు, సత్తిబాబురాజు, ఆనందగజపతి రాజు, రైతులు మోపిదేవి శ్రీనివాసరావు, ఐజాక్, కాకర్లపూడి భాస్కరరాజు, హరనాధరాజు, చుక్కా శ్రీనివాసరావు, అక్కల రమణారెడ్డి, పల్లప్రోలు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఆక్వా రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భగవాన్రాజు -
టీడీపీ మాజీ నాయకుడు బాటకోటిరెడ్డి అరెస్టు
చుండూరు(వేమూరు): ీసఐని కులం పేరుతో ధూషించిన కేసులో టీడీపీ మాజీ నాయకుడు కుదేటి బాల కోటిరెడ్డిని శనివారం రాత్రి అరెస్ట్ చేసి తెనాలి కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్ఐ అనిల్కుమార్ తెలిపారు. చుండూరు గ్రామానికి చెందిన కుదేటి బాలకోటిరెడ్డి, మరి కొందరు ఈ నెల 3వ తేదీ అర్థరాత్రి చుండూరు పోలీసుస్టేషన్పై దాడి చేసి దళిత సామాజిక వర్గానికి చెందిన చుండూరు సీఐ ఆనందరావును కులంతో ఇష్టారాజ్యంగా ధూషించినట్లు ఎస్ఐ తెలిపారు. బాల కోటిరెడ్డి, మరి కొందరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసీటి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అప్పటి నుంచి బాలకోటిరెడ్డి పరారీలో ఉన్నాడు. ఎస్ఐ నాగేశ్వరరావు, మరికొందరు కానిస్టేబుళ్లు బృందంగా ఏర్పడి రంగారెడ్డి జిల్లాలో శనివారం రాత్రి అరెస్ట్ చేసి చుండూరు పోలీసు స్టేషన్కు తీసుకువచ్చారు. బాల కోటిరెడ్డి, ఉదయ్కుమార్ రెడ్డి, గుణపవన్, ఎలిషాలను తెనాలి రెండవ అదనపు జడ్జి ముందు హాజరు పర్చారు. బాల కోటిరెడ్డిని రిమాండ్పై నెల్లూరు సబ్ జైలుకి, ఉదయ్కుమార్ రెడ్డి, గుణ పవన్, ఎలిషాలను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. బాల కోటిరెడ్డిని ఇటీవల టీడీపీ నుంచి సస్పెండ్ చేసిన విషయం విదితమే. డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న బాపట్ల: రాష్ట్రంలో నిరుద్యోగులు, యువకుల సమస్యలు ప్రభుత్వానికి పట్టడం లేదని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న విమర్శించారు. పుచ్చలపల్లి సుందరయ్య ప్రజాసంఘాల జిల్లా కార్యాలయంలో డీవైఎఫ్ఐ జిల్లా విస్త్తృతస్థాయి సమావేశం ఆదివారం నిర్వహించారు. కేవీ లక్ష్మణరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రామన్న మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ కంటితుడుపు మాత్రమేనన్నారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు రూ.3000 భృతి ఇస్తామన్న హామీ అమలు చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే జాబ్ క్యాలెండర్లో కేవలం 10,060 పోస్టులు భర్తీ చేయడం ఎమీటని ప్రశ్నించారు. ఒక్క పోలీస్ శాఖలోనే 19,996 పోస్టులు ఖాళీలు ఉంటే 2265 మాత్రమే భర్తీ చేయడం అన్యాయమన్నారు. మరో డీఎస్సీ అని మంత్రి లోకేష్ ప్రకటించారని, అందులో ఎన్ని పోస్టులు ఉంటాయో ప్రకటించకపోవడం మరో మోసమే అన్నారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడవద్దని అన్నారు. తక్షణమే జాబ్ క్యాలెండర్ను సవరించి పోస్టుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1,2,3 తేదీల్లో నెల్లూరులో జరిగే డీవైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. డీవైఎఫ్ఐ జిల్లా కార్యవర్గం ఎన్నిక డీవైఎఫ్ఐ నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నికున్నారు. కార్యదర్శిగా సీహెచ్.ప్రకాష్, అధ్యక్షుడిగా జి.యేసుబాబు, కోశాధికారి కేవీ.లక్ష్మణరావు, ఉపాధ్యక్షుడుగా వి.సుధీర్, సహాయకార్యదర్శిగా డి.దినేష్ ఎన్నికయ్యారు. సమావేశంలో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ మాజీ నాయకులు సిహెచ్.మణిలాల్, ఎం.కిరణ్ పాల్గొన్నారు. -
స్కేటింగ్లో కొల్లూరు క్రీడాకారుల ప్రతిభ
కొల్లూరు: ఇండో–నేపాల్ అంతర్జాతీయ చాంపియన్షిప్ పోటీలలో కొల్లూరు విద్యార్థులు దేశం తరపున ప్రాతినిధ్యం వహించి పతకాలు పంట పండించారు. ఈనెల 19 నుంచి 21 వరకు నేపాల్లోని పోక్రాలో స్కేటింగ్లో ఆరు విభాగాలలో నిర్వహించిన పోటీలలో కొల్లూరు ఫోర్ ప్రంట్ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. దేశ వ్యాప్తంగా 12 మంది క్రీడాకారులు దేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం దక్కగా, వారిలో కొల్లూరుకు చెందిన గరిక రిత్విక్, మునిపల్లి పునీత్లు ఎంపికయ్యారు. అండర్–14 విభాగంలో నిర్వహించిన ఏరో స్కేట్బాల్ పోటీలలో కొల్లూరుకు చెందిన గరిక రిత్విక్, మునిపల్లి పునీత్లు రాణించి గోల్డ్ మెడల్స్ సాధించారు. వ్యక్తిగత విభాగంలో నిర్వహించిన పోటీలలో రిత్విక్ మెరుగైన ప్రతిభను కనబర్చి జిగ్జాగ్ స్కేటింగ్లో గోల్డ్ మెడల్, స్కేట్ వాక్లో సిల్వర్, 1 మినిట్ స్కేటింగ్ రేస్లో సిల్వర్ పతకాలతో మెరిశాడు. కొల్లూరుకు చెందిన రిత్విక్, పునీత్లు ఐదు పతకాలను సాధించగా, వ్యక్తిగతంగా పునీత్కు గోల్డ్ మెడల్, రిత్విక్కు రెండు బంగారు, రెండు వెండి పతకాలు లభించాయి. అరకొర వసతుల నడుమే అంకిత దీక్షతో స్కేటింగ్ నేర్చుకొని దేశానికి ప్రాతినిధ్యం వహించి పతకాలు సాధించిన క్రీడాకారులను, వారి తల్లిదండ్రులను పలువురు అభినందించారు.


