జాతీయస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్లో పతకాలు
బాపట్ల: రాజస్థాన్లో జనవరి 30 నుంచి ఈనెల 2వ తేదీ వరకు జరిగిన జాతీయస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్లో బాపట్ల క్రీడాకారులకు పతకాలు సాధించారని బాపట్ల అసోసియేషన్ కార్యదర్శి షేక్ నజీర్ పేర్కొన్నారు. ఈ మేరకు క్రీడాకారులను సోమ వారం స్థానిక ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అభినందించారు. 60 ఏళ్లు పైబడిన గ్రూపులో బత్తుల సాంబశివరావు హైజంప్లో సిల్వర్ మెడల్, 50 ఏళ్లు పైబడిన గ్రూపులో ఎం.మురళీకృష్ణారెడ్డి పోల్వాల్ట్లో సిల్వర్ మెడల్, 75 ఏళ్లు పైబడిన విభాగంలో 5 కిలోమీటర్లు వాకింగ్లో ముప్పలనేని రామారావు బ్రాంజ్మెడల్ సాధించారు. ఈ మేరకు క్రీడాకారులను బాపట్లలో పలువురు సన్మానించారు.


