అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో గల్ప్ ప్రాంతం కూడా తీవ్ర దాడులతో దద్దరిల్లుతోంది. దుబాయ్లోని అల్ బదా ప్రాంతంలో డ్రోన్ ఒకటి క్రాష్ అయిన ఘటన కలకలం రేపింది.
గల్ఫ్లో ఇరాన్ దాడులను తీవ్రతరం చేస్తుండటంతో 13వ రోజు దుబాయ్లో భారీ పేలుళ్లు సంభవించాయి. దుబాయ్ క్రీక్ హార్బర్ సమీపంలోని భవనంపై డ్రోన్ పడిందని, స్వల్ప మంటలు చెలరేగాయని అధికారులు నిర్ధారించారు. అయితే దీనిని త్వరగా అదుపులోకి తేవడంతో ప్రమాదం తప్పింది. దుబాయ్ మీడియా ఆఫీస్ ప్రకారం, ఒక చిన్న డ్రోన్ కూలిన ఘటనలో ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు గురువారం ప్రకటించారు.
(ఉచిత బస్సు, వ్యాపారాలు తుస్సు : మడిగెలు ఢమాల్)
సివిల్ డిఫెన్స్, ఇతర సంబంధిత బృందాలు వేగంగా స్పందించి మంటల్ని అదుపు చేశాయి. భవనంలోని నివాసితులకు ఎలాంటి ముప్పూ లేదన్నారు.


