అంగన్వాడీల సమర శంఖారావం
విజయవాడలో సోమవారం నిర్వహించనున్న మహాధర్నాను జయప్రదం చేయాలంటూ కలెక్టరేట్ వద్ద ఆందోళనను ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు శేషమ్మ మాట్లాడారు. అంగన్వాడీలకు కనీస వేతనాన్ని రూ.26 వేలకు పెంచడంతో పాటు గ్రాట్యుటీ అమలుకు మార్గదర్శకాలను రూపొందించాలని డిమాండ్ చేశారు. మే నెలకు సంబంధించి వేసవి సెలవుల జీఓను అమలు చేయాలని పేర్కొన్నారు. గౌరవాధ్యక్షురాలు రెహనాబేగం, ప్రధాన కార్యదర్శి సుజాత తదితరులు పాల్గొన్నారు. – నెల్లూరు(దర్గామిట్ట)


